Kurnool
-
ఆళ్లగడ్డలో హైటెన్షన్.. ఏవీ సుబ్బారెడ్డి ఇంటి చుట్టూ పోలీసుల మోహరింపు
సాక్షి, నంద్యాల జిల్లా: ఆళ్లగడ్డలో హైటెన్షన్ వాతావరణ నెలకొంది. ఏవీ సుబ్బారెడ్డి ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారు. ఏవీ సుబ్బారెడ్డి ఇంటి వెనుక ఉన్న మోహన్ రెడ్డి నివాసంలో ఎమ్మెల్యే అఖిల ప్రియ తిష్ట వేసింది. మోహన్రెడ్డి నివాసంలో సాయంత్రం కార్యకర్తల సమావేశానికి రావాలంటూ అఖిల ప్రియ పిలుపు నిచ్చింది. పెద్ద ఎత్తున కార్యకర్తలు వస్తే ఏవీ సుబ్బారెడ్డికి ,అఖిల ప్రియ మధ్య గొడవ జరిగే అవకాశం ఉందని పోలీసులు ముందుగానే మోహరించారు. సంఘటన స్థలంలో పరిస్థితిని డీఎస్పీ ప్రమోద్ పర్యవేక్షిస్తున్నారు. -
యూట్యూబ్ చానల్ విలేకరి అదృశ్యం
మద్దికెర: ఇంటి నుంచి పొలానికి ద్విచక్రవాహనంపై బయల్దేరిన యూట్యూబ్ చానల్ విలేకరి, మద్దికెర గ్రామానికి చెందిన బోగోలు తిరుమలరెడ్డి (45) బుగ్గ సంగాల వద్ద అదృశ్యమయ్యాడు. ఘటనా స్థలంలో మొబైల్, చెప్పులు పడి ఉన్నాయి. బైక్పై బండరాళ్లతో దాడిచేసిన ఆనవాళ్లున్నాయి. ఎవరో పథకం ప్రకారం దాడిచేసి.. కిడ్నాప్ చేశారా.. లేక హత్య చేసి కాలువలో పడేశారా అనేది తెలియడం లేదు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. గ్రామానికి చెందిన బోగోలు వెంకటరెడ్డి, సౌభాగ్యలక్ష్మి కుమారుడైన బోగోలు తిరుమలరెడ్డి గుంతకల్లులో నివాసం ఉంటూ బీవీఆర్ టుడే న్యూస్ అనే యూట్యూబ్ చానల్కు విలేకరిగా ఉంటూనే బుగ్గ సమీపంలోని తన తోటలో వ్యవసాయ పనులు చేసేవాడు. రోజు మాదిరిగానే సోమవారం తోటకు వెళ్లాడు. కాలువ వెంబడి తోటకు వెళ్లే రస్తాలో పడివున్న బైకును చూసి రైతులు పోలీసులకు సమాచారం అందించడంతో డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ ప్రవీణ్కుమార్రెడ్డి విచారణ చేపట్టారు. భార్య కావ్య ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కారు – ఆర్టీసీ బస్సు ఢీ శ్రీశైలం: శ్రీశైలం సమీపంలోని రామయ్య టర్నింగ్ వద్ద కారు – తెలంగాణ ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. బాధితులు తెలిపిన వివరాలు.. హైదరాబాద్కు చెందిన ప్రతిక్ మిశ్రా, రష్మీ మిశ్రా దంపతులు కారులో శ్రీశైలం బయలుదేరారు. రామయ్య టర్నింగ్ వద్ద ఎదురుగా వస్తున్న తెలంగాణ ఆర్టీసీ బస్సు – కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రతీక్ మిశ్రా, డ్రైవర్ వాసులకు స్వల్ప గాయాలు కాగా స్థానికులు ప్రథమ చికిత్స చేయించారు. రష్మీ మిశ్రా షాక్కు గురి కావడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాదుకు తరలించారు. 20 గడ్డివాముల దగ్ధం మద్దికెర: మద్దికెర గ్రామ శివారులోని కొత్తపల్లి రహదారిలో ఉన్న స్వామి, చిన్న రంగస్వామి, ఈరన్న, రాముడు, హనుమంతు, ప్రసాద్, మాణిక్యం, నాగప్ప, మల్లికార్జున అనే రైతులకు చెందిన 20 గడ్డివాములు సోమవారం తెల్లవారుజామున కాలిబూడిదయ్యాయి. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ వాములుకు నిప్పు పెట్టడంతో తమకు దాదాపు రూ.10 లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధిత రైతులు వాపోయారు. -
విజ్ఞాన మేళా.. విద్యార్థులు భళా!
కర్నూలు కల్చరల్: విద్యార్థులు తమ మేధస్సుకు పదును పెట్టి అద్భుత ఆవిష్కరణలు ఆవిష్కరించారు. ఇందుకు కర్నూలులోని జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల వేదిక అయ్యింది. కళాశాల ఏర్పాటు చేసి 40 సంవత్సరాల పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సోమవారం నుంచి శనివారం రూబీ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుకుంటున్నారు. అందులో భాగంగా మూడురోజుల పాటు నిర్వహించనున్న విజ్ఞాన మేళా 4.ఓ సోమవారం ప్రారంభమైంది. విజ్ఞాన మేళాను కళాశాల పూర్వ విద్యార్థి, ఏఐఎస్ అధికారి, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి. మురళీధర్ రెడ్డి, కళాశాల చైర్మన్ సుబ్బారెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన వివిధ ప్రదర్శనలను వీరు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. విజ్ఙాన మేళాలో మొత్తం 110 ప్రాజెక్ట్లు ఏర్పాటు చేశామన్నారు. జీపీఆర్ఈసీ నుంచి 58, జిల్లాలోని 15 పాఠశాలల నుంచి 33, చైన్నె ట్రిపుల్ ఐటీ, కర్నూలు ఐఐటీ డీఎం నుంచి ఒకటి, సీఎంఆర్ కళాశాల నుంచి 15 ప్రదర్శనలు వచ్చాయన్నారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ మేళాను అందరూ సందర్శించి, విజ్ఞానం పెంచుకోవచ్చన్నారు. ప్రదర్శనలో సోలార్ పవర్డ్ హైబ్రిడ్ ఈ బైసైకిల్, మిషన్ అన్వేషన్, స్మార్ట్ గ్లాసెస్ ఫర్ బ్లైండ్ పీపుల్, రోబోటిక్ సిస్టమ్ ఫర్ బోర్వెల్ రెస్క్యూ ఆపరేషన్, ప్రోటో టైప్ డ్యామ్ ఆకట్టుకున్నాయి. -
రేపు ఉమ్మడి జిల్లాలహ్యాండ్బాల్ ఎంపిక పోటీలు
కర్నూలు (టౌన్): ఈనెల 19వ తేది ఉదయం 10 గంటలకు నంద్యాల పట్టణంలోని ఆర్జీఎం కళాశాల క్రీడా మైదానంలో సీనియర్ మహిళలు, జూనియర్స్ విభాగంలో బాలురకు ఉమ్మడి జిల్లా స్థాయి హ్యాండ్బాల్ ఎంపిక పోటీలు జరుగనున్నాయి. జూనియర్స్ విభాగం పోటీల్లో పాల్గొనే బాలురు 2005 సంవత్సరం జనవరి 1 వ తేదీ తరువాత జన్మించి ఉండాలని జిల్లా హ్యాండ్బాల్ సంఘం కార్యదర్శి డాక్టర్ రుద్రా రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు 99402–22232 సెల్ నంబర్ను సంప్రదించాలని సూచించారు. నేడు మాల కార్పొరేషన్ చైర్మన్ రాక కర్నూలు(అర్బన్): రాష్ట్ర మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయకుమార్ ఈ నెల 18న కర్నూలుకు వస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కె. తులసీదేవి తెలిపారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని ఐదు జిల్లాల పర్యటనలో భాగంగా 17న రాత్రి కర్నూలుకు వస్తున్నట్లు చెప్పారు. 18న ఉదయం స్థానిక ఎస్సీ కార్పొరేషన్లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి తర్వాత అనంతపురానికి వెళ్తారన్నారు. కొనసాగుతున్న డిగ్రీ, బీఈడీ స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షలు కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ, బీఈడీ స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షలు కొనసాగుతున్నాయి. సోమవారం జరిగిన పరీక్షలకు 47 మంది గైర్హాజరయ్యారు. డిగ్రీ పరీక్షలు 11, బీఈడీ పరీక్షలు 8 కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. డిగ్రీ పరీక్షలకు 365 మందికి 319 మంది హాజరు కాగా 46 మంది గైర్హాజరయ్యారని వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. బీఈడీ పరీక్షలకు ముగ్గురికి గాను ఇద్దరు హాజరు కాగా ఒకరు గైర్హాజరయ్యారని తెలిపారు. నూర్పిడి యంత్రం బోల్తా.. కూలీ మృతి పాములపాడు: మినుము పంట నూర్పిడి మిషన్ బోల్తా పడిన ఘటనలో మండల పరిధిలోని ఇస్కాల గ్రామానికి చెందిన మిద్దె వెంకటరమణ(40) మృతిచెందాడు. ఎస్ఐ సురేష్బాబు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన రైతు పుల్లయ్య పొలానికి ఆదివారం తోటి కూలీలతో కలిసి మిద్దె వెంకటరమణ మినుము నూర్పిడి పనులకు వెళ్లాడు. నూర్పిడి యంత్రం పొలంలోకి వెళ్తుండగా పొలం గట్టుపై అదుపు తప్పి మిషన్ బోల్తా పడింది. ప్రమాదంలో యంత్రంపై కూర్చున్న వెంకటరమణ కింద పడి గాయాల పాలయ్యాడు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కోలుకోలేక సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతదేహానికి పంచనామా నిర్వహించి బంధువులకు అప్పగించారు. మృతునికి భార్య మరియమ్మ, కుమారుడు, కూతురు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు డ్రైవర్ తప్పెట రమేష్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
28 నుంచి రోజా దర్గా ఉరుసు
కర్నూలు (టౌన్): తుంగభద్ర నది తీరంలో వెలసిన రోజా దర్గా ఉరుసు ఈనెల 28 నుంచి ప్రారంభమవుతుందని ఆ దర్గా పీఠాధిపతి సయ్యద్ దాదా బాషా ఖాద్రీ తెలిపారు. సోమవారం ఆ దర్గాలో ఉరుసుకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం పీఠాధిపతి మాట్లాడుతూ ప్రతి ఏడాది రంజాన్ మాసంలో నెలవంక రోజు గంథోత్సవం నిర్వహించడం అనవాయితీగా వస్తుందన్నారు. ఈ నెల 28 న గంథోత్సవం, మార్చి 1వ తేదీన ఉరుసు, 2 వ తేదీ జియారత్ ఫాతెహాలు ఉంటాయన్నారు. మూడురోజుల పాటు జరిగే ఈ వేడుకలకు ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచే కాకుండా బళ్లారి, మహబూబ్ నగర్, అనంతపురం బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారన్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్గాలో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఉరుసు రోజు రాత్రి ఖవ్వాలి ఉంటుందన్నారు. పోస్టర్ల ఆవిష్కరణలో రోజా దర్గా జాన్ నసీన్ ఇషాఖియా సయ్యద్ జావీద్ పాషా ఖాద్రీ, సయ్యద్ నూరుల్లా హస్సైనీ సాహెబ్, సయ్యద్ మాసుంపీర్ సాహెబ్, సయ్యద్ గౌస్ ఖాద్రీ, ఎస్.కరీమ్ పాల్గొన్నారు. -
‘దేవ’ చిత్రం.. అపు‘రూపం’
కర్నూలు(అగ్రికల్చర్): దేవుళ్ల చిత్రాలను రూపొందించడం.. జాతీయ నాయకుల రూపాన్ని తన చిత్రాల్లో చూపించడం.. ప్రకృతి రమణీయతను అపురూపంగా చిత్రీకరించడం... పత్తికొండ పట్టణానికి చెందిన దూపం దేవదాసు ప్రత్యేకత. చిత్రలేఖనంపై ఎనిమిదో తరగతి నుంచే మక్కువ పెంచుకొని డిగ్రీలో కూడా లలిత కళలకు సంబంధించిన కోర్సును అభ్యసిస్తున్నాడు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు, బహుమతులు పొందుతూ... అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. ప్రస్తుతం కడపలోని యోగి వేమన యూనివర్సిటీలో బీఎఫ్ఏ(బ్యాచలర్ ఆఫ్ ఫైన్స్ ఆర్ట్స్) మూడో సంవత్సరం చదువుతున్నాడు. ప్రఖ్యాత చిత్రకారుడిగా గుర్తింపు పొందాలనేది తన లక్ష్యమని విద్యార్ధి దూపం దేవదాసు తెలిపారు. బీఎఫ్ఏ పూర్తయిన తర్వాత పీజీలో ఇందుకు సంబంధించిన కోర్సునే తీసుకొని మరింత నైపుణ్యాలను పెంచుకుంటానని చెప్పారు. ఇదీ ప్రత్యేకత.. ● ఎడమ చేతితో రాయడం, చిత్రాలు గీయడం దేవదాసు ప్రత్యేకత. ● కళ్ల ముందే నిమిషాల వ్యవధిలో చిత్రాన్ని గీస్తాడు. ● యోగి వేమన యూనివర్సిటీలో బీఎఫ్ఏ రెండో సంవత్సరం చదువుతున్న సమయంలో జాతీయ స్థాయి ఇంటర్ యూనివర్సిటీల యూత్ ఫెస్టివల్లో ఈ యువకుడికి రజత పతకం లభించింది. ● భారతదేశంలో ప్రముఖ వేడుకను తన చిత్రంలో ఆవిష్కరించినందుకు జాతీయ స్థాయిలో సిల్వర్ మెడల్ లభించింది. ● తిరుపతి విజ్ఞాన కేంద్రం, తిరుపతి శ్రీ కళాక్షేత్ర సంయుక్తంగా నిర్వహించిన వేమన పద్య భావన చిత్ర కళా పోటీల్లో మూడో కేటగిరిలో మొదటి బహుమతి అందుకున్నారు. ● జిల్లా స్థాయిలో ఒకసారి మొదటి, మరోసారి రెండో బహుమతి అందుకున్నారు. చిత్ర లేఖనంలో రాణిస్తున్న పత్తికొండ విద్యార్ధి జాతీయ స్థాయిలో పతకాలు, ప్రశంసాపత్రాలు -
జర్నలిస్టుల రక్షణకు చట్టాన్ని తీసుకురావాలి
కర్నూలు(సెంట్రల్): జర్నలిస్టులపై దాడులు చేస్తే తక్షణమే అరెస్టు చేసేలా రక్షణ చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి మద్దిలేటి, నాయకులు గోరంట్లప్ప, కేబీ శ్రీనివాసులు, జిల్లా కన్వీనర్ నాగేంద్ర కోరారు. పార్వతీమన్యం జిల్లా మక్కువ మండలం ప్రజాశక్తి మండల రిపోర్టర్ రామారావుపై దాడి చేసిన టీడీపీ మండలాధ్యక్షుడు గుల్ల వేణుగోపాల్ నాయుడును తక్షణమే అరెస్టు చేయాలన్నారు. లేదంటే ధర్నాలు, రాస్తారోకోలకు దిగుతామని హెచ్చరించారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట జర్నస్టులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో జర్నలిస్టులపై దాడులు పెరిగిపోతున్నాయన్నారు. గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం.. ‘తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే రైలు పట్టాలపై పండుకోబెడతాను’ అని బెదిరించినా ఎలాంటి చర్యలు లేవన్నారు. జర్నలిస్టులపై దాడుల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ జేసీ డాక్టర్ బి.నవ్యకు ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు సునీల్కుమార్, బ్రహ్మయ్య, శ్రీనివాసులు, నగర ప్రధాన కార్యదర్శి ఎర్రమల పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ నాయకులు -
విజ్ఞాన మేళా.. విద్యార్థులు భళా!
కర్నూలు కల్చరల్: విద్యార్థులు తమ మేధస్సుకు పదును పెట్టి అద్భుత ఆవిష్కరణలు ఆవిష్కరించారు. ఇందుకు కర్నూలులోని జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల వేదిక అయ్యింది. కళాశాల ఏర్పాటు చేసి 40 సంవత్సరాల పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సోమవారం నుంచి శనివారం రూబీ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుకుంటున్నారు. అందులో భాగంగా మూడురోజుల పాటు నిర్వహించనున్న విజ్ఞాన మేళా 4.ఓ సోమవారం ప్రారంభమైంది. విజ్ఞాన మేళాను కళాశాల పూర్వ విద్యార్థి, ఏఐఎస్ అధికారి, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి. మురళీధర్ రెడ్డి, కళాశాల చైర్మన్ సుబ్బారెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన వివిధ ప్రదర్శనలను వీరు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. విజ్ఙాన మేళాలో మొత్తం 110 ప్రాజెక్ట్లు ఏర్పాటు చేశామన్నారు. జీపీఆర్ఈసీ నుంచి 58, జిల్లాలోని 15 పాఠశాలల నుంచి 33, చైన్నె ట్రిపుల్ ఐటీ, కర్నూలు ఐఐటీ డీఎం నుంచి ఒకటి, సీఎంఆర్ కళాశాల నుంచి 15 ప్రదర్శనలు వచ్చాయన్నారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ మేళాను అందరూ సందర్శించి, విజ్ఞానం పెంచుకోవచ్చన్నారు. ప్రదర్శనలో సోలార్ పవర్డ్ హైబ్రిడ్ ఈ బైసైకిల్, మిషన్ అన్వేషన్, స్మార్ట్ గ్లాసెస్ ఫర్ బ్లైండ్ పీపుల్, రోబోటిక్ సిస్టమ్ ఫర్ బోర్వెల్ రెస్క్యూ ఆపరేషన్, ప్రోటో టైప్ డ్యామ్ ఆకట్టుకున్నాయి. -
నంద్యాల జిల్లాలో మొత్తం అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య 1300
కర్నూలు జిల్లాలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వివరాలు ప్రభుత్వ ఉద్యోగుల కార్యాలయాలు సంఖ్య కర్నూలు నగర పాలక సంస్థ 1,116 ప్రభుత్వ సర్వజన వైద్య శాల 53 గృహ నిర్మాణ సంస్థ 105 రెవెన్యూ 150 డ్వామా 120 డీఆర్డీఏ 06 ఇతర ప్రభుత్వ శాఖలు 350ఉద్యోగులకు తీవ్ర నష్టం ఆప్కాస్ వ్యవస్థ సజావుగా సాగుతోంది. తిరిగి పాత పద్ధతిపై కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉంది. గతంలో ఏజెన్సీలు ఉన్న సమయంలో వేతనాలను సక్రమంగా అందించేవారు కాదు. పీఎఫ్, ఈఎస్ఐ జమ చేయక కోట్లాది రూపాయలను దిగమింగారు. ప్రతి ఏడాది రెన్యూవల్ కోసం కమీషన్లు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వెళ్తే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు సిద్ధమవుతాం. – ఎండీ అంజిబాబు, సీఐటీయూ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆప్కాస్ విధానాన్ని కొనసాగించాలి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు బాసటగా ఉన్న ఆప్కాస్ను విధానాన్ని కొనసాగించాలి. పాత ద్ధతిలో ఏజెన్సీలను తీసుకురావాలని చేస్తున్న ప్రయత్నాన్ని విరమించుకోవాలి. ఏజెన్సీలు వస్తే ఉద్యోగులకు కష్టాలు ప్రారంభమవుతాయి. మొత్తం వ్యవస్థ అంతా అధికార పార్టీ నేతల గుప్పిట్లోకి పోతుంది. వారు చెప్పిందే వేదంగా ఉద్యోగులు పనిచేయాల్సి వస్తుంది. ఆప్కాస్ను రద్దు చేయాలని చూస్తే ఉద్యమాలు చేపడతాం. – మునెప్ప, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి -
పదిపై పర్యవేక్షణ కరువు
పర్యవేక్షణ చేయాలని ఆదేశాలు ఇచ్చాం ఉమ్మడి కర్నూలు జిల్లాలో డిప్యూటీ డీఈఓలుగా ఎంఈఓ–1లు ఇన్చార్జ్లుగా ఉన్నారు. ఉన్నత పాఠశాలలను పర్యవేక్షణ చేయాలని ఆదేశాలు ఇచ్చాం. పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పాం. ఎంఈఓలుగా ఖాళీగా ఉన్న అర్హులైన హెచ్ఎంకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించాం. రివిజన్ టెస్ట్లు నిర్వహించి, ఇందులో వచ్చిన ఫలితాల ఆధారంగా వెనుకబడిన విద్యార్థులకు మరో సారి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని చెప్పాం. – ఎస్.శామ్యూపాల్, డీఈఓ కర్నూలు సిటీ: పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలు నామమాత్రమే అన్న విమర్శలు వస్తున్నాయి. పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టిసారించడంలో డిప్యూటీ డీఈఓలు, ఎంఈఓలు, హెచ్ఎంలది కీలక పాత్ర. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నత పాఠశాలలను పర్యవేక్షణ చేయాల్సిన డిప్యూటీ డీఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇవీ సమస్యలు.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం 1,022 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ ఏడాది మార్చి 17 నుంచి మొదలు కానున్న పదవ తరగతి పరీక్షలకు రెగ్యులర్ విద్యార్థులు 64,099 మంది హాజరుకానున్నారు. మొత్తం 17 ఎంఈఓ, 4 డిప్యూటీ డీఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొత్తగా ఏర్పాటైన ఆత్మకూరు, పత్తికొండ డివిజన్లకు సైతం డిప్యూటీ డీఈఓలు లేరు. అలాగే 40 జెడ్పీ హైస్కూళ్లలో రెగ్యులర్ ప్రధానోపాధ్యాయులు లేరు. ఉన్నత పాఠశాలలపై డిప్యూటీ డీఈఓల పర్యవేక్షణ కీలకం. ప్రస్తుతం ఎంఈఓ–1లకు ఇన్చార్జ్ డిప్యూటీ డీఈఓ బాధ్యతలు అప్పగించారు. ● ప్రస్తుతం క్లస్టర్ విధానం, అపార్, టీఐఎస్(టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్)లతో రెగ్యులర్ పోస్టుల పనితోనే సమయం సరిపోని పరిస్థితి. ఇన్చార్జ్ బాధ్యతలతో ఉన్నత పాఠశాలలను తనిఖీలు చేయలేకపోతున్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో రోజుకొక ఫార్మాట్లలో సమాచారం ఇవ్వాలని చెప్పడంతో డివిజనల్, మండల అధికారులపై పని భారం పెరిగిపోయింది. ● గతంలో ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులను ఉపాధ్యాయులు దత్తత తీసుకునేవారు. విద్యార్థులను చదివించే బాధ్యత వారికి అప్పగించే వారు. పర్యవేక్షణకు మండలాల ప్రత్యేకాధికారులకు సైతం ఉండేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి ఎక్కడా అగుపించడం లేదు. ● డీఈఓలకు ప్రతి రోజు నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు వీడియో కాన్ఫరెన్స్, వెబెక్స్, టెలీ కాన్ఫరెన్స్లతోనే సమయం సరిపోతోంది. ● సబ్జెక్టు నిపుణులు ఉన్నప్పటికీ ఈ–లెర్నింగ్ తరగతులకే పరిమితం అవుతున్నారు. ఆలస్యంలో ‘ప్రత్యేక’ం పదవ తరగతి పరీక్షలు నెల రోజుల్లో మొదలు కానున్నాయి. గతంలో కంటే ఫలితాలను పెంచాలని లక్ష్యంతో విద్యాశాఖ ఉన్నతాఽధికారులు ప్రత్యేకంగా వంద రోజుల ప్రణాళికను తయారు చేయించారు. అన్ని జిల్లాల్లో అదే ప్రణాళికను అమలు చేసేలా చర్యలు తీసుకున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సబ్జెక్టు టీచర్ పోస్టులు ఖాళీగా ఉండడంతో ఆయా సబ్జెక్టుల్లో 100 శాతం ఫలితాలు సాధించేలా వర్చువల్ ల్యాబ్ను ఏర్పాటు చేయించి ఈ–లెర్నింగ్కు చర్యలు చేపట్టారు. అయితే ఆ చర్యలు ఆలస్యంగా మొదలయ్యాయి. గతంలో సీ, డీ క్యాటగిరీలకు చెందిన పదవ తరగతి విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటిరియల్ ఇచ్చే వారు. ప్రస్తుత ప్రభుత్వం పరీక్షల విభాగం తయారు చేసిన మోడల్ ప్రశ్న పత్రాలు, బిట్ బ్యాంకును పీడీఎఫ్ రూపంలో హైస్కూళ్ల హెచ్ఎంలకు పంపించారు. కానీ విద్యార్థులకు ఇప్పటి వరకు ఇవ్వకపోవడంతో ఈ ఏడాది ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికై నా ఉన్నత పాఠశాలలపై పర్యవేక్షణ పెంచితే మంచి ఫలితాలు వస్తాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. వచ్చే నెల 17 నుంచి మొదలు కానున్న పదో తరగతి పరీక్షలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆరు డిప్యూటీ డీఈఓ పోస్టులు ఖాళీ 17 మండలాలకు ఇన్చార్జ్ ఎంఈఓలు 40 ఉన్నత పాఠశాలల్లో హెచ్ఎం పోస్టులు ఖాళీ ఆలస్యంగా మొదలైన ఈ–లెర్నింగ్ -
పోక్సో కేసుపై విచారణ
పాణ్యం: మండల పరిధిలోని ఆలమూరు ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎం బి.మల్లేశ్వర్పై నమోదైన పోక్సో కేసుపై నంద్యాల ఎస్డీపీఓ జావళి విచారణ చేపట్టారు. బాధిత విద్యార్థినులను, వారి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తానని ఆమె తెలిపారు. కాగా హెచ్ఎంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ఎస్సీ, ఎస్పీ మానిటరింగ్ సెల్ సభ్యుడు పి.దానం డిమాండ్ చేశారు. ఎస్డీపీఓ వెంట ఎంఈఓ సుబ్రహ్మణ్యం ఉన్నారు. పొలాల్లోకి దూసుకెళ్లిన కారు ఆలూరు రూరల్: కారు అదుపు తప్పి పొలాల్లో దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. మండలంలోని మొలగవల్లి రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం ఉదయం ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.. మొలగవల్లి గ్రామానికి చెందిన శివరామి రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం కోసిగి గ్రామానికి బయలు దేరారు. మొలగవల్లి రైల్వే స్టేషన్ సమీపంలో కుక్క అడ్డురావడంతో కారు ఆదుపుతప్పి పొలాల్లో దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో శివరామి రెడ్డి, నర్సిరెడ్డి, లక్ష్మీదేవి, సంజీవ రెడ్డి, మహిపాల్ రెడ్డికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం గుంతకల్లు ఆసుపత్రికి తరలించారు. వివాహిత ఆత్మహత్య హొళగుంద: మండలంలోని పెద్దహ్యాట గ్రామానికి చెందిన చలవాది యశోద (32) అనే వివాహిత ఆదివారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడింది. ఈమె గత కొన్నేళ్లుగా కడుపునొప్పితో బాధ పడుతుంది. ఆదివారం నొప్పి మరింత తీవ్రం కావడంతో భరించ లేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి ఇనుప గరాండకు చీరతో ఉరి వేసుకున్నట్లు హెడ్ కానిస్టేబుల్ లక్ష్మిరాం నాయక్ సోమవారం విలేకరులకు తెలిపారు. మృతురాలికి కుమారుడు, కూతురు సంతానం. మృతురాలి తండ్రి తిప్పేస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అగ్నిప్రమాదంలో పొట్టేళ్ల సజీవ దహనం ఆత్మకూరు: పట్టణంలోని కిషన్సింగ్ వీధిలో సోమవారం వేకువజామున జరిగిన అగ్నిప్రమాదంలో పది పొట్టేళ్లు సజీవ దహనమయ్యాయి. ఖాదర్వలికి చెందిన రేకుల షెడ్డులో మంటలు గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. రేకుల షెడ్డులో ఉన్న పది పొట్టేళ్లు మృతిచెందాయి. సీసీ కెమెరాలు, ఇంటి సామగ్రి సర్వం కాలి బూడిదైంది. ప్రమాదంలో రూ.3 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు వాపోయాడు. కాగా ప్రమాదం ఎలా జరిగిందనేది తెలియాల్సి ఉంది. ఆర్ఎంపీపై కేసు నమోదుబండి ఆత్మకూరు: మండల పరిధిలోని కడమల కాలువ గ్రామంలో ఆర్ఎంపీ సుబ్బరాయుడిపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జగన్మోహన్ సోమవారం తెలిపారు. ఆర్ఎంపీ సుబ్బరాయుడు కడమల కాలువ గ్రామంలో ఓ మహిళను కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు సుబ్బరాయుడిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. మద్యం బాటిళ్ల స్వాధీనం శ్రీశైలం: దేవస్థానం టోల్గేట్ వద్ద సోమవారం నిర్వహించిన వాహనాల తనిఖీలో మద్య బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ప్రసాద్రావు తెలిపారు. ఎస్టీ కాలనీకి చెందిన ముదావత్ తిరుపతి నాయక్, మూడవత్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 30 కేరళ మాల్టెడ్ ఫైన్ విస్కీ బాటిళ్లతోపాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తనిఖీల్లో వన్ టౌన్ పోలీసులు రాజేంద్ర కుమార్, రఘునాథుడు, మహేష్, వెంకటనారాయణ, నాను నాయక్ పాల్గొన్నారు. -
అవగాహనతోనే సైబర్ నేరాల కట్టడి
కర్నూలు: అవగాహనతోనే సైబర్ నేరాలను కట్టడి చేయవచ్చని ఏపీ పరిశ్రమల మంత్రి టీజీ భరత్ అన్నారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో సోమవారం ఆర్ఎస్ రోడ్డులోని కేవీఆర్ కళాశాలలో విద్యార్ధినులకు ‘నేను సైబర్ స్మార్ట్’ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మంత్రి టీజీ భరత్ కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరై సైబర్ నేరాల నివారణకు, అవగాహనకు పోస్టర్లు, వీడియోలు ఆవిష్కరించి మాట్లాడారు. ఇటీవల సమాజంలో పెరుగుతున్న సైబర్ నేరాల నివారణకు అవగాహన కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. ఎస్పీ మాట్లాడుతూ... ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే వెంటనే టోల్ఫ్రీ నంబరు 1930కి కాల్ చేసి సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో కేవీఆర్ కళాశాల ప్రిన్స్పాల్ వీవీ సుబ్రహ్మణ్యకుమార్, క్లస్టర్ యూనివర్సిటీ వీసీ డీవీఆర్ సాయిగోపాల్, రిజిస్ట్రార్ కట్టా వెంకటేశ్వర్లు, అడ్మిన్ అడిషన్ ఎస్పీ హుసేన్పీరా, కర్నూలు డీఎస్పీ బాబుప్రసాద్, పాల్గొన్నారు. ‘నేను సైబర్ స్మార్ట్’ అవగాహన కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ -
మకర తోరణం, అఖండ దీపం విరాళం
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానానికి భక్తులు మకర తోరణం, అఖండ దీపం విరాళంగా అందించారు. కృష్ణా జిల్లాకు చెందిన యం.రామచంద్రరావు, కుటుంబ సభ్యులు రూ.24,45,000 ఖర్చు చేసి బంగారు పూతతో తయారు చేయించిన మకరతోరణాన్ని, తెనాలికి చెందిన కొడాలి కృష్ణ చైతన్య రూ.8,46,000 ఖర్చు చేసి 8 కేజీల వెండితో తయారు చేయించిన అఖండ దీపాన్ని సోమవారం ప్రధానార్చకులు కె.శివప్రసాదస్వామి, యం.ఉమానాగేశ్వరశాస్త్రి, పర్యవేక్షకులు సి.మధుసూదన్రెడ్డి, కె.అయ్యన్న, ఆలయ ఇన్స్పెక్టర్ మల్లికార్జునరెడ్డికి అందజేశారు. దాతలకు స్వామివార్ల శేషవస్త్రం, ప్రసాదాలు అందజేశారు. -
జిల్లా ట్రెజరీలో ఏజీ ఆడిట్కు శ్రీకారం
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా ట్రెజరీ కార్యాలయం, సబ్ ట్రెజరీల్లో 2023–24 సంవత్సరంలో చేపట్టిన కార్యక్రమాలపై అకౌంటెంటు జనరల్ (ఏజీ) ఆడిట్కు సోమవారం శ్రీకారం చుట్టారు. సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ జి.రాజశేఖర్, అసిస్టెంటు అకౌంట్స్ ఆఫీసర్ డి.లక్ష్మణ్ కుమార్, అసిస్టెంట్ సూపర్ వైజర్ మోహన్రావులతో కూడిన బృందం ఈ నెల 17 నుంచి 2 వరకు జిల్లా ట్రెజరీ, కర్నూలు డివిజన్ సబ్ ట్రెజరీ కార్యాలయాలు, ఈ నెల 22 నుంచి 25 వరకు ఆదోని డివిజన్ సబ్ ట్రెజరీ కార్యాలయాల్లో ఆడిట్ చేపడుతుంది. పెన్షన్ చెల్లింపులు, స్ట్రాంగ్ రూము, చెల్లింపులు, జమలు తదితర వాటిని ఏజీ టీమ్ ఆడిట్ చేసుందని జిల్లా ట్రెజరీ అధికారులు తెలిపారు. -
కిడ్నాప్ చేసి ప్రాంసరీ నోటు రాయించుకున్నారు
● జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితుడు కర్నూలు: పాత కక్షలను దృష్టిలో ఉంచుకొని పోల్కల్ గ్రామానికి చెందిన సుంకన్న, శాంసన్ మరికొందరు కలసి తనను కిడ్నాప్ చేసి రూ.1.50 లక్షలకు కర్నూలు కొత్త బస్టాండు దగ్గర ప్రాంసరీ నోటు రాయించుకొని వదిలేశారని, ఈ సంఘటనపై విచారణ జరిపి తగు న్యాయం చేయాల్సిందిగా కర్నూలు సోమిశెట్టి నగర్కు చెందిన రాజు ఎస్పీ విక్రాంత్ పాటిల్కు ఫిర్యాదు చేశారు. కర్నూలు టూటౌన్ పోలీసు స్టేషన్ పక్కన ఉన్న క్యాంపు కార్యాలయంలో సోమవారం ఎస్పీ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 102 ఫిర్యాదులొచ్చాయని, వీటిపై విచారణ జరిపి చట్టపరిధిలో త్వరితగతిన న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్పీరా, ట్రైనీ డీఎస్పీ ఉషశ్రీ, సీఐలు శ్రీనివాసనాయక్, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని... ● వ్యవసాయ శాఖలోని కో–ఆపరేటివ్ సొసైటీలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి వెంకటాపురం గ్రామానికి చెందిన శేఖర్,సుధాకర్ రూ.3.50 లక్షలు తీసుకొని మోసం చేశారని దేవనకొండ మండలం బేతాపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్రెడ్డి ఎస్పీ ఎదుట వాపోయాడు ● హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామని కర్నూలుకు చెందిన వీరస్వామి రూ.8 లక్షలు నగదు, 5 తులాల బంగారం తీసుకొని మోసం చేశారని కర్నూలు ఆర్కే స్ట్రీట్కు చెందిన నాగరాజు ఫిర్యాదు చేశాడు. -
కూటమి ప్రభుత్వంలో నిబంధనలకు తూట్లు
కర్నూలు(సెంట్రల్): కూటమి ప్రభుత్వం నిబంధనలకు తూట్లు పొడుస్తోందని, తమను ఉత్సవ విగ్రహాలుగా మార్చి టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కార్యకర్తలకే వివిధ అభివృద్ధి పనులు అప్పగిస్తుందని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) కార్యక్రమం జరిగింది. కలెక్టర్ పి.రంజిత్బాషా, జేసీ డాక్టర్ బి.నవ్య, డీఆర్వో సత్యనారాయణమ్మతో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరైన ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కలిసి ఉపాధి హామీ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులను గ్రామ, మండల పరిషత్లు, పురపాలక సంఘాల అనుమతులతో జరిగేలా చూడాలని కోరారు. కూటమి నాయకుల తీరుపై తాము హైకోర్టును ఆశ్రయించగా నిబంధనలు ప్రకారం చేపట్టాలని ఆదేశాలు ఇచ్చిందని, అయితే, స్థానిక అధికారులు పట్టించుకోవడంలేదని వాపోయారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు కలగజేసుకోవాలని గూడూరు మునిసిపల్ వైస్ చైర్మన్ అస్లాం కోరారు. లేకపోతే తాము మరోసారి కోర్టును ఆశ్రయిస్తామన్నారు. వినతుల్లో మరి కొన్ని... ●వికలాంగులకు ఉపాధి హామీ పథకంలో 150 రోజులపాటు పనులు కల్పించి 30 శాతం అలవెన్స్ ఇవ్వాలని కల్లూరు మండలం పర్లకు చెందిన 40 మంది దివ్యాంగులు వినతిపత్రం అందించారు. ● తనకు చెందిన 25 సెంట్ల భూమిని కురువ లక్ష్మన్న కుమారులైన పంపన్న, కేశవ, నాగేంద్ర దౌర్జన్యంగా ఆక్రమించుకొని సాగు చేసుకుంటు న్నారని పెద్దకడబూరు మండలం కంబలదిన్నెకు చెందిన బింగి నరసన్న అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ● 2013వ సంవత్సరంలో కల్లూరు మండలం బి.తాండ్రపాడు, మారుతీ నివాస్ కాలనీలకు నీటి కుళాయిల కోసం రూ. 90వేలు చెల్లించామని, అయితే ఇంతవరకు అధికారులు పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాలకు చెందిన 30 మంది ప్రజలు కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. పీజీఆర్ఎస్లో అధికారులకు విన్నవించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు గ్రామ, మండల పరిషత్ల అనుమతులతోనే ఉపాధి పనులు చేపట్టాలని విజ్ఞప్తి -
కూటమి ప్రభుత్వంలో రాయలసీమకు అన్యాయం
కర్నూలు (సెంట్రల్): కూటమి ప్రభుత్వంలో రాయలసీయ, ఉత్తరాంధ్రకు తీవ్ర అన్యాయం జరుగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. సోమవారం కర్నూలులోని సీపీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. నిధులన్నీ అమరావతి, పోలవరంలకే కేటాయించి సీమ, ఉత్తరాంధ్రకు సీఎం చంద్రబాబు ద్రోహం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ ప్రాంతాల్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి వచ్చే బడ్జెట్లోరూ.30 వేలకోట్లను కేటాయించాలన్నారు. కృష్ణానది బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని కోరారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర సమస్యల పరిష్కారం కోసం ఈనెల 19న వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య, నాయకులు రామాంజనేయులు, రామకృష్ణ పాల్గొన్నారు. -
వీఆర్ఏపై టీడీపీ నాయకుల దాడి
అవుకు: కొండమనాయునిపల్లె వీఆర్ఏ ఎమ్. మాబాషాపై సోమవారం టీడీపీ నాయకులు దాడి చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. కొండమనాయునిపల్లె గ్రామంలో పెద్దల కాలం నుంచి వీఆర్ఏ ఎం. మాబాషాకు సాగు భూమి ఉంది. ఆ భూమిలో మట్టిని తవ్వుకోవాలనే దురుద్దేశ్యంతో కొంతకాలంగా తేదేపా నాయకుడు ఆకుల నాగిరెడ్డి ఇబ్బందులకు గురిచేస్తున్నారని మాబాషా తెలిపారు. గ్రామ సచివాలయ సమీపంలో టీడీపీ నాయకుడు ఉండటంతో ఎందుకు ఇలా చేస్తున్నారని అడగటంతో అతనితోపాటు టీడీపీ కార్యకర్తలు ముకుమ్మడిగా తనపై దాడి చేశారన్నారు. విడిపించటానికి వచ్చిన తన సోదరి అయిన మీరాంబీపై కూడా దాడి చేశారని తెలిపారు. దెబ్బలు అధికంగా తగలటంతో చికిత్స నిమిత్తం అవుకు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చానన్నారు. అవుకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని, పోలీసులు విచారణ చేస్తున్నట్లు చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన వీఆర్ఏ -
ఉపాధి నిధుల వినియోగంపై ఆడిట్
కర్నూలు(అగ్రికల్చర్): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల వినియోగంపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆడిట్ విభాగం బృందం తనిఖీలు చేపట్టింది. సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ రాజేష్కుమార్ నేతృత్వంలో సోమవారం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 2021–22, 2022–23, 2023–24 సంవత్సరాల్లో మెటీరియల్, లేబర్ కాపోనెంటు కింద చేపట్టిన నిధుల వినియోగంపై ఈ టీమ్ ఆడిట్ నిర్వహిస్తోంది. కేంద్రం నుంచి వచ్చిన ఆడిట్ బృందాన్ని హోటల్ త్రిగుణలో జిల్లా నీటియాజమాన్య సంస్థ ప్రజెక్టు డైరెక్టర్ వెంకటరమణయ్య, అదనపు పీడీ మాధవీలత, పరిపాలన అధికారి విజయలక్ష్మి, ఫైనాన్స్ మేనేజర్ అదెయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్ఆర్ఈజీఎస్ నామ్స్ ప్రకారం ఉపాధి నిధులు వినియోగించారా లేదా అనే దానిని ఈ టీమ్ పరిశీలిస్తుంది. సోషల్ ఆడిట్, దుర్వినియోగం అయిన నిధుల రికవరీ తదితర వాటిని పరిశీలించనున్నట్లు అధికారులు తెలిపారు. బోదకాల బాధితులకు కిట్ల పంపిణీ కర్నూలు(హాస్పిటల్): బోదకాలుతో బాధపడుతున్న ముగ్గురికి మార్బిడిటీ మానిటరింగ్ కిట్(టబ్, మగ్, సబ్బు, ఆయింట్మెంట్, టవల్)ను, అవసరమైన మాత్రలను అధికారులు అందజేశారు. సోమవారం స్థానిక జొహరాపురంలోని యూపీహెచ్సీలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ డాక్టర్ పి. శాంతికళ మాట్లాడుతూ జిల్లాలో 22 మంది బోధకాలు వ్యాధిగ్రస్తులు ఉన్నారని, వీరు తరచుగా వ్యాధిసోకిన కాలును టబ్లో ఉంచి సబ్బు నీటితో శుభ్రంగా కడిగి టవల్తో తుడిచిన తర్వాత ఆయింట్మెంట్ పట్టించాలని సూచించారు. ఈ వ్యాధి ఆడ క్యూలెక్స్ దోమకాటుతో వ్యాపిస్తుందని, నివారణ చర్యల్లో భాగంగా దోమకాటుకు గురిగాకుండా దోమతెరలు వాడాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి నూకరాజు, యుపీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మౌనిక, ఏఎంవో చంద్రశేఖర్, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. గ్రూపు–2 మెయిన్స్కు పకడ్బందీ ఏర్పాట్లు కర్నూలు(సెంట్రల్): ఈనెల 23వ తేదీన గ్రూపు–2 మెయిన్స్కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఏపీపీఎస్సీ జిల్లా కోఆర్డినేటర్, జేసీ డాక్టర్ బి.నవ్య అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో గ్రూపు–2 పరీక్షలపై జిల్లా అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా పరీక్షకు ఏర్పాట్లు చేయాలన్నారు. లైజెన్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ఏర్పాట్లలో లోటుపాట్లు లేకుండా చూడాలని ఆదేశించారు. నేటి నుంచి అంగన్వాడీ టీచర్లకు శిక్షణ కర్నూలు కల్చరల్: సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు జిల్లాలోని అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ఇస్తున్నట్లు సమగ్ర శిక్ష ఏపీసీ శ్రీనివాసులు తెలిపారు. సోమవారం వాటి కి సంబంధించిన కిట్లను అంగన్వాడీలకు పంపిణీ చేసి మాట్లాడారు. జ్ఞాన జ్యోతి కార్యక్రమం ద్వా రా పూర్వ ప్రాథమిక విద్య ప్రాముఖ్యతను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. శిక్షణకు సంబంధించి జిల్లాకు వచ్చిన 1,882 కిట్ల ను ఇప్పటికే మండలాలకు సరఫరా చేశామన్నారు 25 నుంచి యాగంటిలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు బనగానపల్లె: యాగంటిలో ఈనెల 25 నుంచి మార్చి 1 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ చంద్రుడు సోమవారం తెలిపారు. 25న ధ్వజారోహణంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. 26న ఉదయం మహాన్యాస పూర్వ క రుద్రాభిషేకం, రాత్రి లింగోద్భవ కాల పూజ , 27న నందికోల , 28 సాయంత్రం రథోత్సవం, మార్చి 1న రుద్రాభిషేకం ఉంటాయన్నారు. -
ఉద్యోగులకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఉద్యోగ భద్రత లేకుండా ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్సింగ్ (అప్కాస్)ను రద్దు చేయడంపై వ్యతిరేకత వస్తోంది. ఏజెన్సీల పరిధిలోకి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తీసుకురావడంపై నిరసన పెల్లుబ
కర్నూలు(అర్బన్)/నంద్యాల(న్యూటౌన్): ‘ఆప్కాస్’ను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. తిరిగి పాత విధానం అమలైతే తమ పరిస్థితి ఏమిటనే ప్రశ్న వారిని తొలచివేస్తోంది. ఇప్పటికే పలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలపై టీడీపీ నేతలు ఆరా తీస్తున్నారు. తమ వారికి ఆయా ఉద్యోగాలు కట్టబెట్టేందుకుమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఆప్కాస్ పరిధిలో ఉన్న ఉద్యోగులను తొలగించేందుకు వీలు లేని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో తమకు అనుకూలమైన ఏజెన్సీల విధానాన్ని తీసుకువచ్చేందుకు కుట్రలు పన్నుతున్నారు. గతంలోఅవినీతి, అక్రమాలు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తూ వచ్చారు. ఇందులో మితిమీరిన రాజకీయ జోక్యంతో అర్హులకు న్యాయం జరిగేది కాదు. అడ్డగోలుగా మంత్రులు, ఎమ్మెల్యేల సిఫారసులతో నియామకాలు జరిగేవి. ప్రజాప్రతినిధుల సిఫారసులతో పాటు ప్రతి ఉద్యోగానికి ఒక రేటు ప్రకారం రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకు ఆయా ఏజెన్సీలు నిరుద్యోగుల నుంచి భారీగానే డబ్బులు వసూలు చేశారు. అయినా అప్పట్లో ఆయా ఏజెన్సీలు తమ ఖాతాలోకి జమ అయిన వేతనాలను సకాలంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు చెల్లించకపోవడం, ఈపీఎఫ్ను సక్రమంగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయకపోవడం వల్ల అనేక మంది పలు రకాల ఇబ్బందులకు గురయ్యారు. అవినీతి, అక్రమాలకు తావులేకుండా, విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించిన చిరుద్యోగులను కూడా రాజకీయ జోక్యంతో తొలగించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. వైఎస్సార్సీపీ హయాంలో ఇలా చేశారు.. అనేక ఇబ్బందులు, ఒడిదుడుకుల మధ్య జీవితాలను వెళ్లదీస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ‘ఆప్కాస్’ను ఏర్పాటు చేసింది. ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు భిన్నంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీనే వేతనాలను వారి ఖాతాల్లో జమ చేసేందుకు నిర్ణయం తీసుకొని, అమలు చేసింది. అలాగే వేతనానికి ముందే ఈపీఎఫ్ సక్రమంగా జమ చేసే ప్రక్రియకు కూడా శ్రీకారం చుట్టింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ పూర్తి స్థాయిలో న్యాయం జరిగింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం తిరిగి ఆప్కాస్ విధానాన్ని రద్దు చేసి పాత విధానంలో ఏజెన్సీలకు పగ్గాలు అప్పగించేందుకు పూ నుకోవడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఉద్యోగులు నష్టపోతారు ఆప్కాస్ను రద్దు చేసి ఏజెన్సీల విధానం అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం మంచిది కాదు. దీనివల్ల అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు నష్టపోతారు. మితిమీరిన రాజకీయ జోక్యంతో ఉద్యోగ భద్రత ఉండదు. ఈపీఎఫ్ డబ్బులు గతంలో ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయకుండా ఏజెన్సీలు కాజేసిన ఘటనలు ఉన్నాయి. ప్రభుత్వం పునరాలోచించి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కాంట్రాక్టు పరిధిలోకి తీసుకురావాలి. నేరుగా ఆయా శాఖాధిపతులతో జీతాలు చెల్లించాలి. – నాగరాజు, సీఐటీయూ నంద్యాల జిల్లా కార్యదర్శిచిరుద్యోగుల జీవితాలు చిన్నాభిన్నంకూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడు నెలల్లో అనేక రూపాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలకు పలు రకాల ఆదాయ వనరులు కల్పించారు. తాజాగా అవుట్ సోర్సింగ్ పద్ధతిన విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులపై పడింది. గతంలో ప్రతి ఉద్యోగానికి ఒక ధర ఫిక్స్ చేసి మరీ వసూలు చేసిన ఏజెన్సీలను తిరిగి తెరపైకి తీసుకువచ్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎంతో పారదర్శకంగా కొనసాగుతున్న ఈ వ్యవస్థపై పాత విధానాన్ని రుద్దేందుకు పూనుకుంటోంది. ఇదే జరిగితే ప్రతి జిల్లాలో వందల మంది చిరుద్యోగుల జీవితాలు చిన్నాభిన్నం అయ్యే పరిస్థితులు ఏర్పడవచ్చు. తక్కువ వేతనంతో ఎక్కువ పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఆర్థికంగా చేయూతను అందించాల్సింది పోయి, వారి ఉద్యోగాల్లో వేలు పెట్టడం సరైన చర్య కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘ఆప్కాస్’ రద్దుపై ఉద్యోగుల్లో వ్యతిరేకత రాష్ట్ర ప్రభుత్వ చర్యలపై ఆందోళన సజావుగా సాగుతున్న వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్ర ఏజెన్సీల పరిధిలోకి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తెచ్చేందుకు కసరత్తు టీడీపీ కార్యకర్తలకు మేలు చేసేందుకు పన్నాగం ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలపై టీడీపీ నేతల ఆరా పాత విధానం వద్దంటున్న చిరుద్యోగులు -
మల్లన్నకు శఠగోపం
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలంలో నకిలీ టికెట్ల వ్యవహరం బట్టబయలైంది. శ్రీశైల దేవస్థాన కంపార్ట్మెంట్ల వద్ద విధులు నిర్వహించే ఓ వ్యక్తి దర్శనానికి వచ్చిన వారితో మాటమాట కలిపి స్వామి వారి స్పర్శదర్శనానికి పంపిస్తానని, టికెట్కు ఇంత ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు. వారికి గత సంవత్సరం టికెట్లలో తేదీ, సమయం ఎడిటింగ్ చేసి టికెట్లు ఇచ్చాడు. ఇందుకుగాను ఒక టికెట్కు రూ.900 వసూలు చేశాడు. మాములుగా అయితే రూ.500 టికెట్ ప్రవేశ ద్వారం నుంచి ఆలయం క్యూలైన్లలోకి ప్రవేశించాలి. అయితే వీరిని ఉచిత దర్శనం క్యూలైన్ నుంచి ఆలయంలోకి తీసుకువెళ్లి, అక్కడ వెయిట్ చేయించి స్పర్శదర్శన సమయంలో పంపించారు. మనోహర గుండం వద్ద టికెట్లు, ఆధార్ తనిఖీ చేస్తుండగా టికెట్టులో ఉన్న ఆధార్, వారు తీసుకువచి్చన ఆధార్కు వ్యత్యాసం ఉంది. దీంతో వారిని పర్యవేక్షకుల వద్దకు తీసుకువచ్చారు. వారిని విచారించగా జరిగిన తతంగం బయట పడింది. నకిలీ దేవస్థాన స్టాంప్ సైతం తయారీ మల్లన్న స్పర్శదర్శనానికి ఆన్లైన్లోనే టికెట్ పొందాలి. అలా టికెట్ పొందిన భక్తులు, టికెట్ జిరాక్స్ కాపీ, దానితో పాటు ఆధార్ కార్డులను తీసుకురావల్సి ఉంటుంది. రూ.500 ప్రవేశ ద్వారం వద్ద టికెట్లో ఉన్న ఆధార్ నంబర్, వారు తీసుకువచ్చిన ఆధార్తో సరిపొల్చుకుని దర్శనానికి అనుమతిస్తారు. టికెట్ స్కానింగ్ సెంటర్ వద్ద టికెట్లను స్కానింగ్ చేసి అక్కడే టికెట్లపై స్కానింగ్ చేసిన వ్యక్తి సంతకం చేసి దేవస్థానం స్టాంప్ వేస్తారు. నకిలీ టికెట్లు తయారు చేసిన వ్యక్తి రూ.500 ప్రవేశ ద్వారంలో వెళితే స్కానింగ్ వద్ద తన తప్పులు బయటపడతాయని, అలా వెళ్లకుండా ఉచిత ప్రవేశ ద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించేటట్లు ఏర్పాటు చేసుకున్నాడు. సదరు టికెట్పై దేవస్థానం స్టాంప్ సైతం నకిలీది తయారు చేసి ముద్రించినట్లు తెలుస్తోంది. సంతకం కూడా చేశారు. గర్భాలయం సమీపంలోని మనోహరగుండం వద్ద డ్యూటీ నిర్వహించే వ్యక్తి తనిఖీ చేయడంతో నకిలీ టికెట్ల వ్యవహారం బయటకువచ్చింది. విచారణకు ఆదేశించిన ఈఓ.. నకిలీ టికెట్ల వ్యవహరంపై క్యూలైన్ పర్యవేక్షకులు ఈవో శ్రీనివాసరావు దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంపై అసలు టికెట్ ఎప్పటిది, టికెట్పై తేదీ, సమయం ఎలా ఎడిటింగ్ చేశారు? ఆ టికెట్లను ఎవరు భక్తులకు అందించారు? ఎక్కడ తయారు చేశారు? దేవస్థాన స్టాంప్ ఎక్కడిది? అనే విషయాలపై విచారించి నివేదిక ఇవ్వాలని చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, క్యూలైన్ పర్యవేక్షకులను ఆదేశించారు. -
రాగిముద్ద, జొన్న సంకటితో అందరికీ ఆరోగ్యం
కర్నూలు (హాస్పిటల్): ‘ఇటీవలి కాలంలో చాలా మంది యువత అర్ధాంతరంగా మరణిస్తున్నారు. కొందరు నడుస్తూ.. మరికొందరు ఆడుతూ పాడుతూ, ఇంకొందరు జిమ్ చేస్తూ తనువు చాలిస్తున్నారు. దీనికంతటికీ కారణం వారిలో అంతర్లీనంగా కొవ్వు నిల్వలు పెరిగి పోవడమే. వారికి తెలియకుండానే బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) పెరిగిపోతోంది.దీనికి చెక్ పెట్టకపోతే దేశంలో అధిక శాతం బీపీ, షుగర్, గుండె జబ్బులతో బాధపడే వారే కనిపిస్తారు’ అని హైదరాబాద్ గచ్చిబౌలిలోని కోమా హెల్త్కేర్ సెంటర్ ఇంటర్నల్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.సురేంద్ర నెహ్రూ చెప్పారు. కర్నూలు మెడికల్ కాలేజి పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎంఈ, ఆలుమ్ని మీట్కు హాజరైన ఆయన ఆదివారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..తెలియకుండానే కొవ్వు నిల్వలుసాధారణంగా మనిషి బరువెక్కితే పొట్ట భాగంతో పాటు కాళ్లు, చేతులు కూడా లావు కావాలి. కానీ పొట్ట మాత్రమే లావుగా ఉండి, కాళ్లూ.. చేతులు సన్నగా ఉంటున్నాయి. దీని కారణంగా పొట్ట చుట్టు కొలత పెరిగిపోతోంది. సాధారణంగా మనిషి బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 18 లోపు ఉంటే తక్కువగా ఉన్నట్లు. 35 పైన ఉంటే హై, 45 పైన ఉంటే సివియర్ హైగా ఉన్నట్లు గుర్తించాలి. మన దేశంలో ఎక్కువ మంది 60–80 కిలోల బరువు ఉంటున్నారు. సగటు ఎత్తు 5.5 అడుగులు.ఈ ఎత్తుకు ఆ బరువు ఎక్కువ. మన దేశంలో 1977కు ముందు ప్రతి వెయ్యి మందిలో ఇద్దరు మాత్రమే స్థూలకాయులుండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య వంద మందిలో 20కి చేరింది. పొట్ట చుట్టు కొలత 33 ఇంచులు దాటితే వారికి భవిష్యత్లో బీపీ, షుగర్, గుండెపోటు వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. స్వాతంత్య్రానికి ముందు కూడా మనవాళ్లు బియ్యమే అన్నం వండుకుని తిన్నా ఆరోగ్యంగా ఉన్నారు. అప్పట్లో దంపుడు బియ్యం ఎక్కువగా తినేవారు.వరికి దిగుబడి తక్కువగా వచ్చేది. వరికి జీన్ మార్పిడి చేయడం వల్ల దిగుబడి పెరిగింది. ఇప్పుడు యంత్రాల ద్వారా పాలిష్ పట్టుకుని తింటున్నారు. దీనివల్ల బియ్యంలో నాణ్యత దెబ్బతింటోంది. దీనివల్లే స్థూలకాయుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ కారణంగా ఒంట్లో కొవ్వు నిల్వలు పెరిగిపోయి భవిష్యత్లో బీపీ, షుగర్, గుండె జబ్బులు అధికం అవుతున్నాయి.మందుల కంటే ఆహారమే ముఖ్యంస్వాతంత్య్రానికి పూర్వం మనవాళ్లు రోజుకు వెయ్యి గ్రాముల ఫైబర్ తినేవారు. కానీ ఇప్పుడు 100 గ్రాములు కూడా తినడం లేదు. ఇప్పటి అవసరాలకు రోజుకు కనీసం 500 గ్రాములైనా ఫైబర్ తినాలి. ఒకప్పుడు రాయలసీమలో తినే ఆహారపు అలవాట్లు ఇప్పుడు ఎంతో మేలు చేస్తాయి. రాగుల ద్వారా చేసే సంకటి (రాగిముద్ద), సజ్జలు, కొర్ర బియ్యం, దంపుడు బియ్యం, దొడ్డు బియ్యంతో చేసిన ఆహారాలు వ్యాధులను తగ్గిస్తాయి. రోజుకు 7–8 గంటల నిద్రతోపాటు కనీసం నాలుగైదు కిలోమీటర్లు నడవాలి.మోకాళ్ల నొప్పులున్న వారు స్విమ్మింగ్ ఫూల్లో నడిచినా, ఈత కొట్టినా సరిపోతుంది. ఇసుకలో చెప్పులు లేకుండా నడిస్తే మోకాళ్ల నొప్పులు గణనీయంగా తగ్గుముఖం పడతాయి. షుగర్కు ఇప్పుడు కొత్త కొత్త మందులంటూ ఎక్కువగా వాడుతున్నారు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అధికం అవుతాయి. ముఖ్యంగా హోమియో స్టాసిస్ ఆఫ్ ఇన్సులిన్ అసెస్మెంట్ టెస్ట్ (హోమా) చేయించుకోవాలి. దీనివల్ల భవిష్యత్లో వచ్చే బీపీ, షుగర్, గుండె జబ్బుల గురించి ముందే తెలుసుకోవచ్చు. -
18 నుంచి లాంగ్వేజ్ ఫెస్టివల్స్
కర్నూలు కల్చరల్: జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఈ నెల 18 నుంచి 21వ తేదీ వరకు లాంగ్వేజ్ ఫెస్టివల్స్ నిర్వహించాలని డీఈఓ శామ్యూ ల్ పాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీఎస్ఎస్ రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 18న ఇంగ్లిష్, 19న సంస్కృతం, హిందీ, ఉర్దూ, 20న గిరిజన బాషా, కన్నడ, తమిళం, ఒరియా, 21న తెలుగు బాషా ఉత్సవాలను నిర్వహించాలని తెలిపారు. ఆదోని డివిజన్ పరిధిలో కన్నడ భాషాకృత్యాలను నిర్వహించాలని పేర్కొన్నారు. విద్యార్థులకు పఠన పోటీలు, కథ చెప్పడం లాంటి కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ఈ నెల 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ కార్యక్రమాలు పండుగలా నిర్వహించాలని పేర్కొన్నారు. మల్లన్నకు నృత్యనీరాజనం శ్రీశైలంటెంపుల్: శ్రీశైల ఆలయ నిత్యకళావేదికపై ఆది వారం విజయవాడకు చెందిన నర్తన డ్యాన్స్ అకాడమీ వారి సంప్రదాయ నృత్యప్రదర్శన ఆకట్టుకుంది. గణపతి ప్రార్థన, శివాష్టకం, శివోహం, శంకర శ్రీగిరివాసా తదితర గీతాలకు, అష్టకాలకు.. సత్యశ్రీ, భవ్య, లహరి తదితరులు నృత్యం ప్రదర్శించారు. -
పేకాట.. కాసుల వేట!
జూద గృహాల వైపు కన్నెత్తి చూడని పోలీసులు ఆదోని పట్టణంలో గత రెండు నెలలుగా ఎక్కడ చూసినా పేకాట స్థావరాల చర్చ జరుగుతోంది. కూటమి నేతనే ఈ స్థావరాలను నడుపుతున్నట్లు పోలీసులకు తెలిసినా అటువైపు ఎందుకు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు ఉన్నాయి. సంబంధిత కూటమి నేత ఓ పోలీసు అధికారితో నెల మామూళ్లు ఇచ్చేలా డీల్ చేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో జూద స్థావరాలపై ఎవరూ దాడులు చేయడం లేదు.ఆదోని అర్బన్: ‘రండి బాబూ రండి.. ఆటాడుకోండి.. మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి’ అంటూ పేకాటరాయుళ్లకు కూటమి నేత ఆఫర్ ప్రకటిస్తున్నాడు. అధికారం మాదే.. అడ్డుకునేదెవరంటూ దర్జాగా పట్టణ నడిబొడ్డున జూద స్థావరాలు నిర్వహిస్తూ రూ. లక్షలు ఆర్జిస్తున్నాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదోని పట్టణంలో మూడు పార్టీల నేతలు అక్రమార్జనపై దృష్టి సారించారు. ఇప్పటికే కొందరు నాయకులు డీలర్షిప్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితర కాంట్రాక్ట్ పోస్టులు ఇప్పిస్తామని రూ. లక్షలు వసూలు చేయగా, ఇందులో ఒక నేత అందరి కంటే ఒక అడుగు ముందుకేశాడు. పట్టణంలో పేకాట స్థావరాలను నిర్వహిస్తూ నా రూటే సపరేటు అంటున్నాడు. పట్టణంలోని ఓ పోలీస్స్టేషన్ పరిధిలో నాలుగుచోట్ల ప్రాంతాలు మార్చి గ్యాంబ్లింగ్ (అందర్బహర్) ఆడిస్తున్నట్లు తెలిసింది. రోజుకు రూ. లక్షలు చేతులు మారుతున్నాయి. ఉదయం పూట ఆట ఆడిస్తే రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో అందరికీ తెలుస్తుందని మధ్యాహ్నం 3 గంటలకు ఒక షో ప్రారంభించి సాయంత్రం 5 నుంచి 6 గంటల్లో ముగిస్తారు. రెండో షో రాత్రి 8 నుంచి 9 గంటలకు మొదలెట్టి 11 గంటలలోపు ముగిస్తున్నారు. ఆట ఆడాలంటే ముందుగా ఎంట్రెన్స్ రుసుం రూ.2 వేలు కట్టాల్సిందే. ఒక షోకు ఇలా 15 నుంచి 20 మంది వరకు ఆటగాళ్లు వస్తున్నారు. ఇలా రోజుకు రెండు షోలు కలపి మొత్తం రూ. 80 వేల వరకు కూటమి నేత జూద నిర్వహణలో సొమ్ము చేసుకుంటున్నాడు. రూ. వేలు తీసుకుని పేకాటరాయుళ్లకు కేవలం ‘గ్లాసు’ నీళ్లు, పేకాట కార్డులు సమకూర్చుతున్నట్లు తెలుస్తోంది. ఓ లాడ్జిలో నిర్వహించే స్థావరం పోలీస్స్టేషన్కు కూతవేటు దూరంలోనే ఉంది. మరో ప్రాంతం బైపాస్ రహదారి వద్ద, ఇంకోటి కూటమి నేత స్వగృహం వద్ద, మరొకటి నిర్మాణంలో ఉన్న భవనంలో ఆడిస్తున్నారు. అక్కడికక్కడే అధిక వడ్డీకి అప్పులు.. పేకాట స్థావరాల వద్ద డబ్బులు పోగొట్టుకున్న వారికి మళ్లీ అదృష్టాన్ని పరీక్షించుకోండి అంటూ అక్కడే వడ్డీ వ్యాపారులు డబ్బులు చేతపట్టుకుని ఆశ పెడతారు. అప్పటికప్పుడు రూ. 30 వేల నుంచి రూ. 50 వేల వరకు అప్పులిచ్చే వ్యక్తులే అక్కడే ఉంటున్నారు. వీరి వద్ద కొందరు ఇప్పటికే రూ. లక్షల్లో అప్పు చేసినట్లు తెలుస్తోంది. అధిక వడ్డీలకు అప్పులు తీసుకున్న పేకాట రాయుళ్లు తిరిగి చెల్లించేందుకు ఆస్తులు తాకట్టు పెడుతు న్నారు. ఈ జూద కూపంలో మునిగిన వారిలో కొందరు బంగారు నగలు, ఇళ్ల స్థలాలు అమ్ముకు న్నట్లు తెలుస్తోంది. దర్జాగా కూటమి నేత జూదం నిర్వహణ అనుమానం రాకుండా స్థావరాల మార్పు ఎంట్రీ ఫీజు రూ. 2 వేలు ‘గ్లాసు’ మంచినీళ్లు, కార్డులు మాత్రమే ఉచితం అప్పులు ఇచ్చేందుకు వడ్డీ వ్యాపారులు అక్కడే తిష్ట జూద కూపంలో మునిగి సర్వం కోల్పోతున్న వ్యసనపరులు -
ఏ కొమ్మ రెమ్మనో!
నవ మాసాలు గర్భంలో నన్ను భద్రంగా చూసుకుంటే సంతోష పడితిని.. కానీ ప్రపంచానికి అనాథగా పరిచయం చేస్తావునుకోలేదు. పుట్టిన క్షణమే నీ వెచ్చని ఒడిలో లాలిస్తావని ఆనందపడితిని.. కానీ రక్తపు మరకలు ఆరక ముందే తల్లి ప్రేమకు దూరం చేస్తావనుకోలేదు. భూమి మీదికి చేరగానే మీ బంధుత్వాన్ని చూపిస్తావని సంబరపడితిని.. కానీ బతికుండగానే కన్నపేగును తెంచుకుంటావనుకోలేదు. ఆడ బిడ్డగా పుట్టాననో, లేక ఏ కష్టమొచ్చి నన్ను దూరం చేసుకున్నావో తెలియదు.. ఆ దేవుడి దయతో నేను క్షేమమే అమ్మా! అది జీనేపల్లె ఎస్సీ కాలనీ. ఆదివారం తెల్లవారుజామున అప్పుడ ప్పుడే జనం నిద్ర లేచి పనుల్లోకి వెళ్తున్నారు. చర్చి సమీపంలోని ఖాళీ ప్రదేశంలో ఓ శిశువు ఏడుపు వినిపించడంతో స్థానిక మహిళలు వెళ్లి చూశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆడ శిశువును అక్కడ వదిలేసినట్లు గుర్తించారు. శిశువు శరీరంపై రక్తపు మరకలు ఉండటంతో అప్పుడే పుట్టిన బిడ్డగా నిర్ధారించారు. గ్రామ ఆశా కార్యకర్తలు వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వడంతో యర్రగుంట్ల పీహెచ్సీ సీహెచ్ఓ నాగార్జునరెడ్డి గ్రామానికి చేరుకుని శిశువును పరిశీలించారు. వెంటనే 108లో నంద్యాల వైద్యశాలకు తరలించారు. వైద్య పరీక్షలు అనంతరం శిశువును నంద్యాలలోని శిశు గృహం సిబ్బందికి అప్పగించారు. – శిరివెళ్ల -
రక్షిత నీటిని అందించాలి
కర్నూలు(అర్బన్): గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు నీటి ట్యాంకుల ద్వారా రక్షిత మంచి నీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి జీ భాస్కర్ కోరారు. ఆదివారం కర్నూలు మండలం గార్గేయపురం ఎస్ఎస్ ట్యాంకును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీరు కలుషితమైతే ప్రజలు అనేక రకాల వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి 15 రోజులకు ఒకసారి ఖచ్చితంగా ఓహెచ్ఎస్ఆర్, జీఎల్ఎస్ఆర్లను శుభ్రం చేయాలన్నారు. అనుమానం వచ్చిన నీటిని తాగకుండా ప్రజలకు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు ఆ నీటిని టెస్టింగ్ కోసం ల్యాబ్కు పంపాల్సి ఉందన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లను సమన్వయం చేసుకొని నీటి సరఫరాపై అప్రమత్తంగా ఉండాలన్నారు. భూ సంరక్షణకురూ.2.70 కోట్లు మంజూరు కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ శాఖ భూసంరక్షణ విభాగానికి నిధులు విడుదల అయ్యాయి. ఉమ్మడి జిల్లాకు రూ.2.70 కోట్లు మంజూరు కాగా.. ప్రస్తుతం రూ.1.34 కోట్లు విడుదల అయ్యాయి. కర్నూలు జిల్లాకు రూ.1.50 కోట్లు మంజూరు కాగా.. మొదటి విడత కింద రూ.74.53 లక్షలు మంజూరు అయ్యాయి. నంద్యాల జిల్లాకు రూ.1.20 కోట్లు మంజూరు కాగా మొదటి విడతలో రూ.59.60 లక్షలు విడుదల అయ్యాయి. ఈ నిధుల్లో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం భరిస్తాయి. ఆర్కేవీవై కింద వర్షాధార ప్రాంతం (ఆర్ఏడీ) అభివృద్ధికి ఈ నిధులు వినియోగిస్తున్నట్లుగా భూసంరక్షణ డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. వ్యవసాయంలో రైతుల సామర్ాధ్యలను పెంచడం, భూమి అభివృద్ది తదితర వాటికి ఈ నిధులు వినియోగించడం జరుగుతుందన్నారు. కర్నూలు డివిజన్ కల్లూరు మండలం బొల్లవరం, కే.మార్కాపురం గ్రామాలు, ఆదోని డివిజన్లో బైచిగేరి, బసలదొడ్డి గ్రామాలు, నంద్యాల జిల్లా డోన్ మండలం యు.కొత్తపల్లి, ఎర్రగుంట్ల గ్రామాల్లో ఆర్ఏడీ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఒక రైతుకు ఆర్కేవీవై కింద రూ.30 వేల విలువ ఇన్పుట్స్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయా గ్రామాల్లో రైతుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. -
పునర్జన్మ నమ్మకాలపై ఆధారం
● ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి కర్నూలు(హాస్పిటల్): మనిషికి పునర్జన్మలు ఉన్నాయా లేదా అనేది వ్యక్తుల నమ్మకాలపై ఆధార పడి ఉంటాయని, ఆ నమ్మకం మనిషిలో తృప్తి మిగిలిస్తుందని, అదే లేకపోతే మనిషిలో అసంతృప్తి పెరిగిపోయి జీవించినంత కాలం కుంగుబాటుకు గురవుతారని విజయవాడకు చెందిన ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి చెప్పారు. కర్నూలు మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘం(అలుమ్ని) ఆధ్వ ర్యంలో రెండురోజుల పాటు నిర్వహించిన నిరంతర వైద్య విజ్ఞాన సదస్సు, అలుమ్ని మీట్ ఆదివారం ముగిశాయి. ఈ కళాశాలలో చదివి దేశ,విదేశాల్లో స్థిరపడిన ప్రముఖ వైద్యులు స్పెషాలిటీ, సూపర్స్పెషాలిటీ అంశాలపై సబ్జెక్టుల్లో ఆధునిక వైద్యవిధానాలు, అభివృద్ధి గురించి వివరించారు. పునర్జన్మలు – నమ్మకాల గురించి డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి మాట్లాడారు. పునర్జన్మలపై కొన్నేళ్లుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నా సరైన ఫలితాలు కనిపించడం లేదన్నారు. పునర్జన్మలపై తీసిన సినిమాలు మాత్రం సూపర్హిట్ అవుతున్నాయని, దీనిని బట్టి మనుషులకు వాటిపై ఎంతటి నమ్మకం ఉందో అర్థం అవుతుందన్నారు. కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు మల్లికార్జున గోఖలే, సదాశివారెడ్డి, సంపత్, ప్రసాద్బాబు, గణేష్, చందనారెడ్డి, డాక్టర్ కేజీ గోవిందరెడ్డి, డాక్టర్ నరసింహులు, ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కుమారస్వామిరెడ్డి, సెక్రటరి డాక్టర్ బాలమద్దయ్య, ట్రెజరర్ డాక్టర్ మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు. -
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇప్పటివరకు రబీ సాగు 2,45,466 హెక్టార్లు
ప్రభుత్వ సరఫరా చేసింది 61,985 టన్నులు మాత్రమే● అధికారపార్టీ నేతల చేతుల్లో యూరియా ● అనుకూలమైన వారికి, టీడీపీ కార్యకర్తలకే పంపిణీ ● వైఎస్సార్సీపీ ముద్రతో సామాన్య రైతులకు మొండిచేయి ● నంద్యాల జిల్లాలో 14 టన్నుల యూరియా కేవలం 15 మందికే పంపిణీ ● ప్రశ్నించే వారిపై కేసులతో వేధింపులు ● యూరియా సరఫరాలో కూటమి ప్రభుత్వం విఫలం అవసరమైన యూరియా 1,47,279 టన్నులు ఇక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రైతు పేరు చిన్న పుల్లయ్య. బండిఆత్మకూరు మండలం చిన్నదేవళాపురం. ఇతను 16 ఎకరాల్లో వరిసాగు చేశాడు. ఈనెల 14వ తేదీన రైతు భరోసా కేంద్రం వద్ద యూరియా కోసం వెళ్లి క్యూలో నిలబడ్డాడు. టీడీపీకి చెందిన కొందరు నేరుగా వెళ్లి ఎరువులు తీసుకుంటుండడంతో ఇదేమి న్యాయమని ప్రశ్నించగా దాడి చేశారు. తరువాత వారే పోలీసులకు ఫిర్యాదు చేసి పుల్లయ్యపై కేసు పెట్టించారు. అరెస్టు చేసేందుకు పోలీసులు ఏకంగా గ్రామానికి వెళ్లారు. పొలంలో ఉన్న పుల్లయ్యకు ఈ విషయం తెలిసి తీవ్ర ఆందోళనకు గురై పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు.కర్నూలు(అగ్రికల్చర్)/బండిఆత్మకూరు: ఉమ్మడి కర్నూలు జిల్లాలో రబీ సాధారణ సాగు 2,82,247 హెక్టార్లు కాగా ఇందులో కర్నూలు జిల్లాలో 1,10,386, నంద్యాల జిల్లాలో 1,71,861 హెక్టార్లు. ఇప్పటి వరకు ఈ రెండు జిల్లాలో 2,45,466 హెక్టార్లు సాగైంది. కేసీ కెనాల్, తెలుగు గంగ కాల్వలకు నీరు సమృద్ధిగా వస్తుండటంతో నంద్యాల జిల్లాలో 1,61187 హెక్టార్లలో పంటలు వేశారు. ఇందులో వరి సాధారణ సాగు 27,908 హెక్టార్లు ఉండగా.. ఇప్పటికే 34,940 హెక్టార్లలో సాగు అయింది. అంటే 7 వేల హెక్టార్లకుపైగా అదనంగా సాగు అయింది. మరో ఆరేడు వేల హెక్టార్లలో సాగు అయ్యే అవకాశం ఉంది. అయితే, ఈ సాగు విస్తీర్ణాన్ని అంచనా వేయడంలో వ్యవసాయ యంత్రాంగం విఫలమైంది. దీనికితోడు డిమాండ్కు అనుగుణంగా యూరియా సరఫరా చేయడంలో కూటమి ప్రభుత్వం చేతులెత్తేసింది. అంతంత మాత్రంగానే యూరియా సరఫరా నంద్యాల జిల్లాలో ఖరీఫ్ సీజన్కు సంబంధించి 63,911 టన్నుల యూరియా వచ్చింది. అయితే, 53,417 టన్నుల యూరియా అమ్మకాలు జరిగాయి. రబీ సీజన్కు సంబంధించి యూరియా ఓపెనింగ్ బ్యాలెన్స్ 10 వేల టన్నులు ఉంది. ప్రస్తుతం నంద్యాల జిల్లాకు 37,483 టన్నులు మాత్రమే వచ్చింది. ఓపెనింగ్ బ్యాలెన్స్తో కలిపితే రబీ సీజన్కు మొత్తం 47 వేల టన్నుల యూనియా వచ్చినట్లు అవుతోంది. అయితే, నీటిపారుదల సదుపాయం ఉండటంతో ఇక్కడ సాధారణం కంటే 15 వేల హెక్టార్ల వరకు ఎక్కువగా పంట సాగు అవుతోంది. దీనిని అధికారులు అంచనా వేయకపోవడంతో బండిఆత్మకూరు, వెలుగోడు, నంద్యాల, ఆత్మకూరు, నందికొట్కూరు, శిరువెళ్ల, కోవెలకుంట్ల, అవుకు మండలాల్లో యూరియా కొరత తీవ్రంగా వేధిస్తోంది. హైజాక్ చేస్తున్న అధికార పార్టీ నేతలు యూరియా కొరతను టీడీపీ నేతలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ప్రస్తుతం నంద్యాల జిల్లాకు వచ్చే యూరియాలో 50 శాతం మార్క్ఫెడ్కు, మిగిలిన 50 శాతం ప్రైవేటు డీలర్లకు ఇస్తున్నారు. మార్క్ఫెడ్ నుంచి రైతుసేవా కేంద్రాలు, పీఏసీఎస్లకు వెలుతున్న యూరియా మొత్తాన్ని టీడీపీ నేతలే హైజాక్ చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 45 కిలోల బస్తా ధర రూ.267 ఉండగా.. టీడీపీ నేతలు తమ కంట్రోల్లో ఉంచుకొని రూ.400 వరకు అమ్మకాలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితి ప్రధానంగా బండిఆత్మకూరు, వెలుగోడు, మహానంది, ఆత్మకూరు మండలాల్లో ఎక్కువగా ఉంది. డిమాండ్ ఉన్నప్పుడు మార్క్ఫెడ్ ప్రైవేటు డీలర్లకు యూరియా ఇవ్వరాదు. అయితే రాజకీయంగా ఒత్తిడి చేసి మార్క్ఫెడ్ నుంచి ప్రైవేట్ డీలర్లకు కూడా యూరియా ఇస్తున్నారు. తర్వాత ఆ ఎరువు కూడా టీడీపీ నేతల పరం అవుతోంది. కర్నూలు జిల్లాకు అరకొరనే... జిల్లాలో నీటిపారుదల సదుపాయం అంతంతమాత్రంగా ఉండటంతో లేట్ రబీ సీజన్ కింద వరి సాగు తక్కువగా ఉంది. హాలహర్వి, కౌతాళం, హొళగుంద, ఎమ్మిగనూరు, మంత్రాలయం, పెద్దకడబూరు తదితర మండలాల్లో ఎల్లెల్సీ కింద వరి సాగు ఉంది. జిల్లాలో 84,279 హెక్టార్లలో వివిధ పంటలు సాగయ్యాయి. 29,517 టన్నుల యూరియా అవసరం కాగా 24.502 వేల టన్నులు వచ్చింది. ప్రస్తుతం జిల్లాలోని ప్రైవేట్ డీలర్ల దగ్గర యూరియా లభించని పరిస్థితి. మార్క్ఫెడ్లో కూడా 500 టన్నులు మాత్రమే అందుబాటులో ఉంది. ఆదోని, ఎమ్మిగనూరు, పెద్దకడబూరు, కౌతాళం, మంత్రాలయం ప్రాంతాల్లో బస్తా యూరియా ధర రూ.350 పైనే అమ్మకాలు సాగిస్తున్నారు. పీఏసీఎస్లు, రైతు సేవా కేంద్రాల ద్వారా కూడా అధిక ధరలకు విక్రయిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో కొందరు రైతులు కర్ణాటకకు వెళ్లి తెచ్చుకుంటున్నట్లు సమాచారం. అధికార పార్టీ బరితెగింపు14టన్నుల యూరియా 15 మందికే... నంద్యాల జిల్లాలోని ఒక ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘానికి నాలుగైదు రోజుల క్రితం 30 టన్నుల యూరియా ఇచ్చారు. ఇందులో 14 టన్నులు 15 మందికే పంపిణీ అయింది. ఈ యూరియా పొందిన వారికి భూములు కూడా పెద్దగా లేవు. ప్రస్తుతం సాగు చేస్తున్న దాఖలాలు కూడా లేవు. డిమాండ్కు తగ్గ సప్లై లేని సమయంలో 14 టన్నుల యూరియా 15 మంది టీడీపీ నేతల వశం కావడం పలు విమర్శలు తావు ఇస్తోంది. ఇదిలా ఉంటే నంద్యాల జిల్లాలో ఒకే ఒక్క ర్యాక్ పాయింట్ ఉండగా అక్కడ టీడీపీ నేతలే ఉంటున్నారు. దీనిని బట్టి ర్యాక్ పాయింట్ మొదలు గ్రామస్థాయి వరకు పచ్చపార్టీ నేతలదే పెత్తనం సాగుతుందని చెప్పవచ్చు. -
తండ్రిని హతమార్చిన తనయుడు
ఓర్వకల్లు: మద్యం మత్తులో ఓ యువకుడు సొంత తండ్రినే హతమార్చిన ఘటన మండలంలోని నన్నూరు గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామంలోని దళిత కాలనీకి చెందిన గార్ధుల రాములమ్మ, నారాయణ(50)కు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. కూతురికి పెళ్లి చేశారు. కాగా తమకు ఉన్న 3 ఎకరాల భూమిని విక్రయించాలని పెద్ద కుమారుడు నవీణ్ కొంతకాలంగా తండ్రిపై ఒత్తిడి తెస్తున్నాడు. సరైన ధర రాకపోవడంతో తండ్రి విక్రయించకుండా కాలయాపన చేస్తూ వస్తున్నాడు. ఈక్రమంలో కుటుంబంలో గొడవలు ఏర్పడ్డాయి. దీంతో గత ఏడాది నవీణ్ తన తండ్రి నారాయణ చెవిని కొరికి గాయపరిచాడు. అప్పటి నుంచి తండ్రి, కుమారిడికి తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. సాయంత్రం పూటుగా మద్యం తాగిన నవీణ్.. తండ్రితో గొడవకు దిగాడు. మద్యం మత్తులో కర్రతో తలపై మోది, బండరాయితో ముఖంపై కొట్టడంతో నారాయణ అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న సీఐ చంద్రబాబునాయుడు, ఎస్ఐ సునీల్ కుమార్, ట్రైనీ డీఎస్పీ ఉషశ్రీ ఘటనా స్థలానికి చేరుకొని విచారించారు. నారాయణ మృదేహాన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని భార్య రాములమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సనీల్ కుమార్ తెలిపారు. -
తపాలా ఉద్యోగుల సంఘం జాతీయ కార్యదర్శిగా చంద్రశేఖర్
కోసిగి: ఆల్ ఇండియా గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం జాతీయ కార్యదర్శిగా కోసిగికి చెందిన చంద్రశేఖర్ ఎన్నికయ్యారు. ఆదివారం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మధురలో జరిగిన ఆల్ ఇండియా గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం మహా సభల్లో తనను జాతీయ కార్యదర్శిగా ఎన్నుకున్నట్లు కోసిగికి చెందిన సీనియర్ తపాలా ఉద్యోగి డి.చంద్రశేఖర్ తెలిపారు. రాష్ట్రస్థాయికి 22 మంది క్రీడాకారుల ఎంపిక నంద్యాల(న్యూటౌన్): స్థానిక నంది ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఉమ్మడి కర్నూలు జిల్లా స్థాయి మాస్టర్స్ బ్యాడ్మింటన్ పోటీల్లో 22 మంది క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు బ్యాడ్మింటన్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.వంశీధర్ తెలిపారు. విజేతలకు ఆదివారం బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీరు ఈనెల 21న విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. అనంతరం క్రీడాకారులకు దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బ్యాడ్మింటన్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శేషిరెడ్డి, కోచ్ నాగార్జున పాల్గొన్నారు. -
అధిక ధర చెల్లించి తెచ్చుకున్నాం
యూరియా కోసం అనేక ఇబ్బందులు పడుతున్నాం. మాకు సొంత భూమి 5 ఎకరాలు ఉండగా.. 20 ఎకరాలు కౌలుకు తీసుకున్నాం. మొత్తం వరి సాగు చేశాం. ప్రస్తుతం వరి పొట్ట, కంకిదశలో ఉంది. యూరియా వాడితే బాగా వస్తుంది. కాని ఎక్కడా యూరియా బస్తా కూడా లభ్యం కావడం లేదు. చివరికి నందికొట్కూరులో బస్తా రూ.380 ప్రకారం తెచ్చుకున్నాం. బస్తాకు రూ.400 ఇస్తామన్నా లభించడం లేదు. కొంతమంది మాత్రం అవసరమైన స్థాయిలో తెచ్చుకుంటున్నారు. అదే స్థాయిలో సామాన్య రైతులకు అందని పరిస్ధితి ఉంది. యూరియా బంగారం అయింది. రానున్న రోజుల్లో బస్తా రూ.500 ప్రకారం అమ్ముతారనే ఆందోళన ఉంది. – మురళీకృష్ణ, రైతు, బండి ఆత్మకూరు సాగు పెరగడంతోనే యూరియా కొరత నంద్యాల జిల్లాలో రబీలో వరిసాగు భారీగా పెరిగింది. సాధారణ సాగు కంటే దాదాపు 15 వేల హెక్టార్లు అధికంగా వరి సాగు అవుతోంది. దీంతో కొరత తీవ్రమైంది. నిబంధనల ప్రకారం ఎకరాకు రెండు.. రెండున్నర బస్తాల వరకు మాత్రమే యూరియా ఇవ్వాల్సి ఉంది. కాని చాలా ఎక్కువ తీసుకుంటున్నారు. 14 టన్నుల యూరియా 15 మంది రైతులు తీసుకున్నట్లు సమాచారం ఉంది. వీరికి భూములు ఉన్నా యా లేదా అనే దానిని చూస్తున్నాం. మరి కొద్ది రోజుల్లో 3,000 టన్నుల యూరియా వస్తుంది. అప్పుడు కొరత నుంచి బయటపడతాం. – మురళీకృష్ణ, డీఏఓ, నంద్యాల -
ఎస్టీ రిజర్వేషన్ కోసం పోరాడతాం
● ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ కర్నూలు న్యూసిటీ: వాల్మీకుల ఎస్టీ రిజర్వేషన్ కోసం పార్టీలకు అతీతంగా పోరాడతామని ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ తెలిపారు. బళ్లారి చౌరస్తాలోని ఓ హోటల్లో న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళం–ప్రజాపతినిధుల సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మధుసూదన్ మాట్లాడుతూ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని 70 ఏళ్లుగా పోరాడుతున్నామన్నారు. వాల్మీకుల బలగం వల్లే తమకు ఈ రాజకీయ పదవులు లభించాయన్నారు. కులానికి న్యాయం చేయాలనేదే తమ జీవిత ఆశయమన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాలలో శాసన మండలిలో వాల్మీకుల ఎస్టీ రిజర్వేషన్లపై చర్చించేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, ఆదోని ఎమ్మెల్యే పార్ధసారధి మాట్లాడుతూ ప్రస్తుతం వాల్మీకులు నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉండడం గర్వకారణమన్నారు. రాబోయే రోజుల్లో మరింత మంది రాజకీయంగా ఎదిగేలా కృషి చేయాలన్నారు. 13 టిప్పర్లు స్వాధీనం బనగానపల్లె రూరల్: బనగానపల్లె ప్రాంతం నుంచి పలు చోట్లకు అధిక మోతాదులో సుద్ద పౌడర్ను రవాణా చేస్తున్న 13 టిప్పర్లను స్వాధీనం చేసుకునట్లు ఎస్ఐ దుగ్గిరెడ్డి ఆదివారం తెలిపారు. బేతంచర్ల రోడ్డు, యాగంటిపల్లె రోడ్లపై వాహనాలను తనిఖీ చేస్తుండగా సుద్ద పౌడర్ టిప్పర్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నామని, వీటిని మైనింగ్ అఽధికారులకు అప్పగించనున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
భార్య డబ్బులివ్వలేదని భర్త బలవన్మరణం
నందికొట్కూరు: మద్యం తాగేందుకు భార్య డబ్బులివ్వలేదని బైరెడ్డి నగర్కు చెందిన బోయ నాగన్న(37) ఇంట్లో ఉరేసుకుని బలవనర్మరణానికి పాల్పడ్డాడు. రామచంద్ర తెలిపిన వివరాలు.. నాగన్న కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈక్రమంలో ఆదివారం మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వాలని భార్య వరలక్ష్మిని కోరగా లేవని చెప్పి ఆమె బయటకు వెళ్లింది. తిరిగి వచ్చేలోపే ఉరికి వేళాడుతూ కనిపించాడు. కుటుంబ సభ్యులు కిందకు దించి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ తెలిపారు. ఆటో చోరీ డోన్ టౌన్: పట్టణంలోని తారకరామనగర్కు చెందిన తిక్కయ్య తన ఆటోను ఇంటి బయట పార్కు చేసి ఉంచగా గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాత్రి అపహరించుకెళ్లారు. ఆదివారం ఉదయం బాధితుడు నిద్ర లేచి చూడగా ఇంటి బయట ఆటో కన్పించక పోవడంతో చుట్టుపక్కల గాలించాడు. ఎలాంటి సమాచారం లభించకపోవడంతో చోరీకి గురైనట్లు నిర్ధారించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తిక్కయ్య తెలిపారు. వ్యక్తి ఆత్మహత్య కొలిమిగుండ్ల: మండల పరిధిలోని ఎస్.చెన్నంపల్లెలో బోయ అంజి(39) ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐ రమేష్బాబు తెలిపిన వివరాలు.. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న అంజి కుటుంబ పోషణ భారం కావడంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య మధుసుప్రియ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. 190 కోళ్లు మృతి గడివేముల: మండల కేంద్రంలోని పలు చికెన్ దుకాణల్లో ఆదివారం కోళ్లు మృతి చెందాయి. నాలుగు చికెన్ సెంటర్లు ఉండగా రెండు రోజుల క్రితం ఓ చికెన్ సెంటర్లో 120 కోళ్లు, మరో చికెన్ సెంటర్లో 70 కోళ్ల దాకా మృతి చెందడంతో ఆ సెంటర్లను మూసివేశారు. బర్డ్ఫ్లూ భయంతో చికెన్ తినేవారి సంఖ్య తగ్గడంతో మిగతా దుకాణాలు కూడా బోసిపోయాయి. దళితులను విడగొట్టేందుకు కుట్ర కర్నూలు(అర్బన్): దేశంలో ఓటు బ్యాంకు రాజకీయాలు, దళితులను విడగొట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని మాల మహానాడు వ్యవస్థాపకులు, స్వర్గీయ పీవీ రావు సోదరుడు, మాజీ ఐడీఏఎస్ అధికారి పీఎస్ఎన్ మూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక ఓ హోటల్లో మాల జేఏసీ ముఖ్య నేతలతో ఆయన సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతేడాది ఆగస్టు 1న ఎస్సీ ఉప వర్గీకరణకు సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు రాజ్యాంగబద్ధత లేదన్నారు. దేశంలోని ఏపీ, తెలంగాణ, పంజాబ్, హర్యాణ, తమిళనాడు రాష్ట్రాలు మినహా మిగిలిన 24 రాష్ట్రాలు ఈ తీర్పును వ్యతిరేకిస్తున్నాయన్నారు. సుప్రీం తీర్పు అనంతరం ప్రాంతీయ సమస్యగా ఉన్న ఈ అంశం ప్రస్తుతం జాతీయ సమస్యగా మారిందన్నారు. ఈ తీర్పు వల్ల దేశ వ్యాప్తంగా 30 లక్షల మంది దళితులు రోడ్డు పైకి వచ్చారన్నారు. ఒక కులాన్ని జాబితాలో చేర్చాలన్నా, తొలగించాలన్నా కేవలం పార్లమెంట్కు మాత్రమే అధికారం ఉందన్నారు. వర్గీకరణకు వ్యతిరేకంగా ఈనెల 23న కర్నూలులో, మార్చి 23న తిరుపతిలో రాయలసీమ మాలల యుద్ధ గర్జన సభలు నిర్వహిస్తున్నారన్నారు. మాలలు పెద్ద ఎత్తున తరలివచ్చి సభలను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం యుద్ధ గర్జన కరపత్రాలను విడుదల చేశారు. సమావేశంలో మాల జేఏసీ నేతలు గోన నాగరాజు, మాధవస్వామి, పి.రాజీవ్కుమార్, నరసప్ప తదితరులు పాల్గొన్నారు. -
కేఆర్ఎంబీ ఏర్పాటుపై సీఎం నిర్లక్ష్యం
కర్నూలు న్యూసిటీ: కర్నూలులో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) ఏర్పాటుపై సీఎం చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యం వహిస్తున్నారని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు విమర్శించారు. కర్నూలు నగరం బళ్లారి చౌరస్తాలోని ఒక హోటల్లో రాయలసీమ సాగునీటి సాధన సమితి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాయలసీమలో ఉపాధిలేక పేద ప్రజలు వలస పోతుంటే సీఎం చంద్రబాబు అమరావతిలో 47 అంతస్తుల ఐకానిక్ భవనా లు నిర్మించి ఎన్ఆర్ఐలకు అమ్ముతామని చెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. 2018లో గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణానికి పాలన అనుమతులు ఇచ్చిన బాబు ఇప్పుడు దానే ఊసే ఎత్తక పోవ డం దారుణమన్నారు. అనంతరం రాయలసీమ సాధ న సమితి నాయకులు బొజ్జా దశరథ రామిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో చంద్రబాబు నియంత పాలన సాగిస్తూ రైతుల హక్కులను కాలరాస్తున్నారన్నారు. రాయలసీమ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణను విస్మరించి వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమొత్తారు. సాగునీటి ప్రాజెక్టులపై అఖిలపక్షాలతో చర్చించకుండా ప్రభుత్వం సొంత నిర్ణయాలతో స్వలాభం కోసం అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో కర్నూలు ఏర్పాటైన జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం, లోకాయుక్త, మానవ హక్కుల సంఘం కార్యాలయాలను అమరావతికి తరలిస్తుండటం సీమకు ద్రోహ ం చేయడమేన్నారు. వాటిని ఇక్కడే కొనసాగించాలని డిమాండ్ చేశారు. కడపలో ఉన్న ఆంధ్ర ప్రగతి గ్రామీ ణ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని అక్కడే కొనసాగించాలని అన్నారు. కార్యక్రమంలో రాయలసీమ సాగునీ టి సాధన సమితి అనంతపురం జిల్లా నాయకులు రాంకుమార్, రైతు సంఘం నాయకులు, రామకృష్ణ, రామచంద్రారెడ్డి, మందా జగన్నాథం పాల్గొన్నారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు -
అ‘పూర్వ’ సమ్మేళనం
వెల్దుర్తి: రామళ్లకోట జిల్లా పరిషత్ హైస్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. పాఠశాల 1981–82 పదవ తరగతి బ్యాచ్తోపాటు 1977 నుంచి 82 వరకు చదువుకున్న చుట్టుపక్కల గ్రామాల వారు సమావేశానికి హాజరయ్యారు. 42 ఏళ్ల తర్వాత కలుసుకున్న బాల్య స్నేహితులందరూ ఒకరినొకరు చూసుకుని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. విద్య, వైవాహిక, ఉద్యోగ జీవిత విశేషాలు, కుటుంబ నేపథ్యాల గురించి ఒకరికొకరు తెలుసుకుంటూ ఆత్మీయంగా గడిపారు. తమకు చదువు చెప్పిన నాటి ఉపాధ్యాయురాలు సుశీలమ్మను సన్మానించారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు. నిర్వాహకులుగా సురేంద్రనాథ్, రాముడు, చిన్నయ్య, దస్తగిరి, మియ్యబాష, లలిత, రామస్వామి వ్యవహరించారు. -
చికెన్ సెంటర్లు వెలవెల!
కర్నూలు(అగ్రికల్చర్): బర్డ్ప్లూ ఎఫెక్ట్తో చికెన్ సెంటర్లు వెలవెలబోతున్నాయి. కర్నూలులో ఒక్క ఎన్ఆర్పేటలోనే కాదు.. నగరమంతా చికెన్ విక్రయాలు 10 శాతానికి పడిపోయాయి. కర్నూలు నగరంలో దాదాపు 200 వరకు చికెన్ సెంటర్లు ఉన్నాయి. సగటున ఒక్కో చికెన్ సెంటరు ద్వారా 200– 300 కిలోల వరకు అమ్మకాలు జరుగుతాయి. ఈ ప్రకారం నగరం మొత్తం మీద దాదాపు 6,000 కిలోల వరకు చికెన్ అమ్మకాలు ఉంటాయి. అయితే బర్డ్ప్లూ వెలుగు చూసిన తర్వాత ఆదివారం చికెన్ అమ్మకాలు 10 శాతానికి పడిపోయాయి. దీంతో పౌల్ట్రీ రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. చికెన్/గుడ్లను 100 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఉడికించి తినవచ్చని అధికారులు ప్రచారం చేస్తున్నప్పటికీ వినియోగదారుల్లో బర్డ్ప్లూ భయం పోవడం లేదు. కర్నూలులో చికెన్ కిలో ధర రూ.200/220 ఉండగా.. ఇతర ప్రాంతాల్లో రూ.150–180కి తగ్గించారు. అయినా వినియోగదారులు ఆసక్తి చూపడంలేదు. ఈక్రమంలో మాంసం, చేపలకు డిమాండ్ పెరిగింది. మటన్ కిలో ధర రూ.800/840 ఉండగా.. తాజాగా రూ.900/1000 పెంచేశారు. అయినా మటన్ అమ్మకాలు మూడు రెట్లు పెరిగాయి. చేపల అమ్మకాలు నాలుగైదు రెట్లు పెరిగాయి. 6 కిలోలే విక్రయించాం గత ఆదివారం 220 కిలోల చికెన్ విక్రయించాం. ఈ ఆదివారం చికెన్ అడిగే వారే లేరు. కేవలం మూడు కోళ్లు మాత్రమే కోసి ఆరు కిలోల చికెన్ విక్రయించాం. ఇంత దయనీయమైన అమ్మకాలు ఎపుడూ లేవు. కర్నూలులో బాతులకు మాత్రమే బర్డ్ప్లూ వచ్చింది. కోళ్లకు ఎలాంటి బర్డ్ప్లూ లేదు. కోళ్లలో మరణాలు కూడా లేవు. తగిన జాగ్రత్తలతో చికెన్ నిర్భయంగా తినొచ్చు. కానీ వినియోగదారులు మాత్రం భయపడుతున్నారు. – కిశోర్ యాదవ్, చికెన్ సెంటర్ నిర్వాహకుడు వెంకటరమణ కాలనీ, కర్నూలు 10 శాతానికి పడిపోయిన చికెన్ విక్రయాలు ధరలు తగ్గించినప్పటికీ చికెన్పై ఆసక్తి చూపని వినియోగదారులు మటన్, చేపలకు భారీగా పెరిగిన డిమాండ్ అడ్డగోలుగా మటన్ ధరల పెంపు -
రైలు ప్రయాణం రయ్..రయ్
చార్జీలు తక్కువనో, క్షేమంగా గమ్యం చేరుకోవచ్చనో ఏమో కానీ రైళ్ల ప్రయాణానికే ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దీంతో నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వే మార్గంలో ప్రయాణికుల రద్దీ పెరిగిపోతోంది. రోజూ నడిచే డెమో కిక్కిరిసిపోతోంది. ఫలితంగా బోగీలు పెంచాలనే డిమాండ్ ప్రయాణికుల నుంచి రోజురోజుకూ పెరిగిపోతోంది. మరిన్ని రైళ్లు నడపాలి నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వే మార్గంలో ప్రస్తుతం ప్రతి రోజు ఒక డెమో, రెండు ఎక్స్ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. డెమో రైలు ఉదయం, ఎక్స్ప్రెస్ రైళ్లు రాత్రి వేళ్లల్లో రోజులో ఒకసారి మాత్రమే తిరుగుతున్నాయి. బస్సు ప్రయాణాలకంటే రైలు ప్రయాణం చేసేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆయా జిల్లాల ప్రయాణికుల సౌకర్యార్థం ఎక్స్ప్రెస్ రైళ్లు పగటి వేళల్లో నడపటంతోపాటు మరిన్ని రైలు సర్వీసులను ఏర్పాటు చేయాలి. డెమో రైలుకు కూడా అదనపు బోగీలు ఏర్పాటు చేయాలి – దస్తగిరి, సౌదరదిన్నె, కోవెలకుంట్ల మండలంకోవెలకుంట్ల: ఉమ్మడి కర్నూలు– వైఎస్సార్ జిల్లాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు నంద్యాల నుంచి వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల వరకు 130 కిలోమీటర్ల రైల్వేలైన్ ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, ఉప్పలపాడు, నొస్సం, సంజామల, కోవెలకుంట్ల, బనగానపల్లె, మద్దూరు ప్రాంతాల్లో రైల్వేస్టేషన్లు ఉన్నాయి. రెండు జిల్లాల ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని 2016 ఆగస్టు నుంచి ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. నంద్యాల నుంచి చిత్తూరు జిల్లా రేణిగుంట వరకు డెమో, అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి రాష్ట్ర రాజధాని అమరావతి మీదుగా మచిలీపట్నం వరకు, గుంటూరు నుంచి తిరుపతికి ప్రతి రోజు ఎక్స్ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లతో పాటు ఆయా జిల్లాల పారిశ్రామిక అభివృద్ధికి గూడ్స్ రైళ్లు తిరుగుతున్నాయి. ప్రయాణికులకు రైలు ప్రయాణం మరింత సులభతరం చేసేందుకు రూ.50 కోట్లతో విద్యుత్ లైన్ ఏర్పాటు చేశారు. 2023 మార్చి 29 నుంచి ఈ మార్గంలో విద్యుత్ రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. డీజిల్ ద్వారా నడిచే రైలు ప్రయాణం కంటే విద్యుత్ రైళ్లతో ప్రయాణం వల్ల సమయం ఆదా అయి త్వరగా గమ్యస్థానాలు చేరుకుంటుండటంతో ప్రజలు రైలు ప్రయాణం వైపు మొగ్గు చూపుతున్నారు. కిక్కిరిసిపోతున్న డెమో రైలు నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వే మార్గంలో మొదట్లో నంద్యాల ఉంచి కడప వరకు డెమో రైలు నడిచేది. రైలు రాకపోకలు ప్రారంభమైన కొన్ని నెలలకు రైలును కడప నుంచి అదే జిల్లా పెండ్లిమర్రి వరకు పొడగించారు. ప్రయాణికుల సౌకర్యార్థం గత ఏడాది నుంచి చిత్తూరు జిల్లా రేణిగుంట వరకు రైలు సేవలను విస్తరించారు. నంద్యాల నుంచి ప్రతి రోజు ఉదయం 6.30 గంటలకు రైలు బయలుదేరుతుండటంతో నంద్యాల, బనగానపల్లె, కోవెలకుంట్ల, సంజామల, వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, కడప, ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట తదితర ప్రాంతాల ప్రజలకు రైలు ప్రయాణం సులభతరంగా మారింది. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు అనువైన సమయం కావడంతో రైలు ద్వారానే రాకపోకలు సాగిస్తున్నారు. ఉదయం వెళ్లేందుకు సాయంత్రం తిరిగి ఇళ్లకు చేరుకునేలా రైలు నడుస్తుండటంతో ప్రతి రోజు డెమో రైలు ప్రయాణికులతో కిక్కిరిసి పోతోంది. నంద్యాల మొదలుకుని చిత్తూరు జిల్లా రేణిగుంట వరకు రైలు బోగీలు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. విద్యార్థులు, ఉద్యోగులతోపాటు ఆయా జిల్లాల్లోని వివిధ ముఖ్య పట్టణాలకు బస్సు ప్రయాణం కంటే రైలు ప్రయాణం దగ్గరి మార్గం కావడంతో ఆయా పట్టణాల్లో బంగారు ఆభరణాలు, వస్త్ర వ్యాపారాల నిమిత్తం ప్రజలు, వ్యాపారాలు రైలు ప్రయాణం సాగిస్తున్నారు. ప్రతి రోజు బోగీల్లో సీట్లు నిండిపోయి నిలబడి ప్రయాణాలు సాగిస్తున్నారు. డెమో రైలుకు కనీసం రెండు బోగీలు అదనంగా ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. మరికొన్ని రైళ్లు నడపాలని ప్రతిపాదన కేంద్ర మాజీ హోం సహాయ మంత్రి, బిహార్, కర్ణాటక రాష్ట్రాల గవర్నర్గా పనిచేసిన సంజామల వాసి దివంగత పెండేకంటి వెంకటసుబ్బయ్య కలల సాకారమైన నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వే మార్గంలో రైళ్ల రాకపోకలు క్రమంగా పెరుగుతున్నాయి. రాకపోకలు ప్రారంభమైన మొదట్లో నంద్యాల నుంచి కడప వరకు వారంలో ఆరు రోజులు డెమో రైలు నడిచేది. తర్వాత ఆరు నెలలకు ధర్మవరం నుంచి రాష్ట్ర రాజధాని అమరావతికి వారంలో మూడు రోజుల మాత్రమే ఎక్స్ప్రెస్ రైలు తిరిగేది. 2018 నుంచి డెమో రైలును వైఎస్సార్ జిల్లా పెండ్లిమర్రి వరకు పొడిగించడంతోపాటు ఎక్స్ప్రెస్ రైలుతో సహా రెండు రైళ్లు ప్రతి రోజు నడిచేలా రైల్వే అధికారులు చర్యలు తీసుకున్నారు. వీటితో పాటు రెండేళ్ల నుంచి తిరుపతికి ఎక్స్ప్రెస్ రైలు నడుస్తోంది. అలాగే ఉత్తర భారదేశానికి రైలు కనెక్టివిటిని విస్తరించేందుకు 2020వ సంవత్సరం నుంచి ఈ మార్గంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైలు నడపాలని ప్రతిపాదన ఉండేది. ఆ ఏడాది కరోనా వైరస్ విజృంభించడంతో ఆ ప్రాతిపాదనను రైల్వే అధికారులు రద్దు చేశారు. తిరిగి ఈ ప్రతిపాదనపై రైల్వే శాఖ దృష్టి సారించింది. రాబోయే రోజుల్లో ఈ రైలు పట్టాలెక్కితే నంద్యాల, ఉమ్మడి వైఎస్సార్ జిల్లాల ప్రజలకు రైలు ప్రయాణం మరింత చేరువకానుంది. ఈ రైలుతోపాటు నంద్యాల–ఎర్రగుంట్ల మార్గంలో మరిన్ని రైళ్లను నడిపేందుకు కేంద్ర రైల్వేశాఖ కసరత్తు చేస్తుండటంతో ఆయా జిల్లాల ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తిరుపతి రైలుకు తగ్గని రద్దీ నంద్యాల–ఎర్రగుంట్ల మార్గంలో 2022 ఆగస్టు 18 నుంచి గుంటూరు నుంచి తిరుపతికి ఎక్స్ప్రెస్ రైలు నడుస్తోంది. గుంటూరు, నరసరావుపేట, వినుకొండ, మార్కాపురం, గిద్దలూరు, నంద్యాల, బనగానపల్లె, ప్రొద్దుటూరు, కడప, రాజంపేట, రేణిగుంట రైల్వేస్టేషన్లలో మాత్రమే ఎక్స్ప్రెస్ రైలు ఆగేది. రెండు జిల్లాల ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల అభ్యర్థన మేరకు నంద్యాల జిల్లా కోవెలకుంట్ల, వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు రైల్వేస్టేషన్లలో స్టాపింగ్ ఏర్పాటు చేశారు. తిరుపతి వెంకన్నస్వామి దర్శనానికి రైలు ప్రయాణం దగ్గరి మార్గం కావడంతో అదనంగా జనరల్ బోగీలు ఏర్పాటు చేయాలని ఆయా జిల్లాల ప్రయాణికులు రైల్వేశాఖ అధికారులను కోరుతున్నారు రైలు ప్రయాణానికే ప్రయాణికుల మొగ్గు నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వే మార్గంలో తగ్గని రద్దీ ప్రతి రోజు డెమో హౌస్ఫుల్ బోగీలు పెంచాలని బలపడుతున్న డిమాండ్ -
ప్రశాంతంగా ఎన్సీసీ ‘సీ’ సర్టిఫికెట్ పరీక్ష
కర్నూలు కల్చరల్: ఎన్సీసీ ‘సీ’ సర్టిఫికెట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. కర్నూలు గ్రూప్లోని 9 ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్, 28 ఆంధ్ర బెటాలియన్ కేడెట్స్కు ఆదివారం మెడికల్ కళాశాలలోని పరీక్ష కేంద్రంలో సీ సర్టిఫికెట్కు సంబంధించి థియరీ, ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించారు. 322 మంది బాయ్స్ కేడెట్స్, 340 గర్ల్స్ కేడెట్స్ పరీక్షకు హాజరయ్యారు. కర్నూలు ఎన్సీసీ గ్రూప్ కమాండర్ కల్నల్ అలోక్ త్రిపాఠి పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీ సర్టిఫికెట్ కలిగిన వారు మిగతా వారి కంటే ఎక్కువ ప్రయోజనాలు పొందుతారన్నారు. అన్ని యూనిఫాం సర్వీసుల్లో చేరేందుకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. సాఫ్ట్వేర్, మెడిసిన్, ఐటీ, సివిల్ సర్వీసెస్లకు సంబంధించి కానీ ఏదైనా కంపెనీ ఇంటర్వ్యూలకు వెళ్లినప్పుడు ఎన్సీసీ హోల్డర్కు ప్రాధాన్యత ఇస్తారన్నారు. ఆయనతో పాటు 9 ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ గ్రూప్ కమాండింగ్ ఆఫీసర్ జోబి ఫిలిప్, 28 ఆంధ్ర బెటాలియన్ లెఫ్ట్నెంట్ కల్నల్ ప్రసాద్, సెంట్రల్ అబ్జర్వర్ కల్నల్ పార్మర్ ఉన్నారు. -
సమాజ హితానికి రచనలు దోహద పడాలి
కర్నూలు కల్చరల్: సమాజ హితానికి రచనలు దోహద పడాలని, యువ రచయిత్రులు, కవయిత్రులు సాహిత్య రచన చేసేందుకు ముందుకు రావాలని పలువురు సాహితీ వేత్తలు, వక్తలు అభిప్రాయపడ్డారు. ఆదివారం సీక్యాంప్ టీజీవీ కళాక్షేత్రంలో నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం (నరసం) వార్షికోత్సవంలో ప్రముఖ భాషా వేత్త డాక్టర్ జీవీ పూర్ణచంద్, సాహితీ వేత్త కురాడి చంద్రశేఖర కల్కూర, క్లస్టర్ యూనివర్సిటీ వైస్చాన్సలర్ ఆచార్య డీవీఆర్ సాయిగోపాల్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, నరసం రాష్ట్ర అధ్యక్షరాలు లక్ష్మీకళావతి, కార్యదర్శి పాతూరి అన్నపూర్ణ, ఒరిస్సా బరంపురం సాహితీ వేత్త తుర్లపాటి రాజేశ్వరి మాట్లాడారు. రచయిత్రులు సమకాలీన అంశాలపై రచనలు చేసి సమాజానికి ఇతోధికంగా సేవలందించాలన్నారు. నరసం ఏర్పాటు అయ్యాక అనేక సాహితీ కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలుగు భాషకు, సాహిత్యానికి విశేష కృషి చేయడం అభినందనీయమన్నారు. కుటుంబం బాగుంటేనే సమాజం బాగుంటుదన్నారు. కుటుంబంలో ప్రతి ఒక్కరు ఒకరికొకరు గౌరవించుకుంటూ సీ్త్ర పురుషులు సమానంగా ఎదగాలన్నారు.టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య, రవీంద్ర విద్యా సంస్థల అధినేత జి.పుల్లయ్య, తెలుగు భాషా వికాస ఉద్యమం కార్యదర్శి జేఎస్ఆర్కే శర్మ మాట్లాడారు. కవి సమ్మేళనాలు అలరించాయి. పలువురు రచయిత్రులు రచించిన పుస్తకాలను అతిథులు ఆవిష్కరించారు. వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో విజేతలకు బహుతులను అందజేశారు. నరసం జిల్లా అధ్యక్షులు కా.వెం. సుబ్బలక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ దండెబోయిన పార్వతీ దేవి, సభ్యులు పసుపులేటి నీలిమ, చంద్రమౌళిని, హైమావతి, కవులు, రయితలు హరికిషన్, అజీజ్, లక్ష్మయ్య, గౌరెడ్డి హరిశ్చంద్రారెడ్డి, ఎలమర్తిరమణయ్య పాల్గొన్నారు. -
పేరుకుపోతున్న గుడ్ల నిల్వలు
బర్డ్ఫ్లూ వెలుగు చూసిన తర్వాత గుడ్ల వినియోగం భారీగా పడిపోయింది. జనవరి నెల చివరి వరకు 100 గుడ్ల ధర రూ.500 పైబడి ఉంది. బర్డ్ఫ్లూ ప్రచారం మొదలైన తర్వాత గుడ్లకు డిమాండ్ ఒక్కసారిగా పడిపోయింది. కోడుమూరు మండలం ప్యాలకుర్తిలో గుడ్ల ఫారాలు ఉన్నాయి. ఇక్కడి ఫారంలో రెండు లక్షల కోళ్లు ఉన్నాయి. రోజుకు 40 వేల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. గుడ్లను అడిగే వారు లేరు. బాగా ఉడికించి తినే అవకాశం ఉన్నప్పటికీ వినియోగదారులు భయపడుతుండటంతో డిమాండ్ పడిపోయింది. నేడు 100 గుడ్ల ధర రైతు దగ్గర రూ.370కి పడిపోయింది. జిల్లా నుంచి గుడ్లు బయటికి వెళ్లకుండా చెక్పోస్టులు పెట్టడంతో నిల్వలు పేరుకపోతున్నాయి. -
స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దుదాం
గోనెగండ్ల: అందరి భాగస్వామ్యంతో స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దుదామని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా అన్నారు. శనివారం మండల కేంద్రం గోనెగండ్లలో నిర్వహించిన స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి ఎంపీడీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం లక్ష్మీపేటలో ఆయన అధికారులతో కలసి చీపురు చేతపట్టి చెత్తను ఊడ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నెల మూడవ శనివారం స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందన్నారు. తడి, పొడి చెత్తను వేరు చేయడంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. మన ఊరు.. మన ఇళ్లు.. వీధి శుభ్రంగా ఉంచుకోవాలనే సంకల్పం ప్రజల్లో ఉండాలన్నారు. స్వచ్ఛ గోనెగండ్లగా తీర్చిదిద్ది అవార్డు పొందాలన్నారు. చెత్త సంపద తయారీ కేంద్రాలు గ్రామ పంచాయతీలకు ఆదాయ వనరులుగా మారాలని సూచించారు. గ్రామస్తులకు సొంత స్థలాలు ఉంటే వాటిలో కంపోస్టు పిట్లు తవ్వుకుని వర్మీకంపోస్టు తయారు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం క్లాప్ మిత్రలను శాలువతో సత్కరించారు. చెత్త సంపద తయారీ కేంద్రంలో కలెక్టర్ కొబ్బరి మొక్కలను నాటారు. కార్యక్రమంలో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారిణి వరలక్ష్మి, డీపీఓ భాస్కర్, డీఎల్పీఓ నూర్జహాన్, తహసీల్దార్ కుమారస్వామి, ఈఓఆర్డీ అనంతసేన, సర్పంచ్ హైమావతి తదితరులు పాల్గొన్నారు. తడి, పొడి చెత్త వేరుపై అవగాహన కల్పించాలి జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా -
ఐకమత్యంతో నగరాభివృద్ధికి పాటుపడదాం
కర్నూలు (టౌన్): ‘నగర పాలక సంస్థ ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. పాలకవర్గ సభ్యులందరూ ఐకమత్యంతో నగరాభివృద్ధికి పాటుపడదాం’ అని వైఎస్సార్సీపీ కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి పిలుపు నిచ్చారు. శనివారం సాయంత్రం గుత్తి పెట్రోల్ బంకు సమీపంలోని ఓ హోటల్లో ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు, మాజీ జిల్లా అధ్యక్షు రాలు సిట్రా సత్యనారాయణమ్మ కలిసి కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో సుదీర్ఘంగా పలు సమస్యలపై చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈనెల 18వ తేదీన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు, నగర మేయర్, డిప్యూటీ మేయర్లు, స్టాండింగ్ కమిటీ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, కార్పొ రేటర్లతో ప్రత్యేక సమావేశం కానున్నారని వెల్లడించారు. ఈ సమావేశంలో రాజకీయ అంశాలు, నగరాభివృద్ధి, అధికార పార్టీ కుట్రలు, కుతాంత్రాల ను దీటుగా ఎదుర్కోవడంపై చర్చించనున్నట్లు తెలి పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కర్నూ లు నగరంలో నాలుగేళ్లుగా రూ. 720 కోట్లతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి చూపించామన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో నగరంలో అభివృద్ధి పనులు అటకెక్కాయన్నారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం కింద ఆయా వార్డుల్లో రూ.34 కోట్లతో చేపట్టాల్సిన 160 పనులను కూటమి ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. ఇంకా ఏడాది పాటు వైఎస్సార్సీపీ పాలకవర్గానికి గడువు ఉందని, అందరూ కలిసి కట్టుగా పనిచేసి ప్రజలకు అండగా నిలుద్దామన్నారు. సమావేశంలో నగరపాలక వర్గ సంస్థ స్టాండింగ్ కమిటీ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. 18న మాజీ సీఎం జగన్తో పాలక వర్గ సభ్యుల భేటీ వైఎస్సార్సీపీ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు ఎస్వీ, కాటసాని -
రేపు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
కర్నూలు కల్చరల్: కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించనున్నట్లు కలెక్టర్ పి.రంజిత్బాషా శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులు అందజేయాలన్నారు. కార్యక్రమాన్ని కలెక్టరేట్తో పాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లో నిర్వహిస్తున్నామని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం వెల్దుర్తి: సూక్ష్మ, ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహం అందిస్తున్నాయని ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఉమాదేవి అన్నారు. శనివారం ఆమె మండల కేంద్రంలో పీఎమ్ఎఫ్ఎమ్ఈ స్కీం కింద ఏర్పాటు చేసుకున్న దాల్ మిల్, మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లను పరిశీలించారు. లబ్ధిదారులతో మార్కెటింగ్ అవకాశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యవసాయం, పాడి, మత్స్య సంపదలకు అనుబంధంగా ఆహార ఉత్పత్తి పరిశ్రమల ఏర్పాటుతో అనేక మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. 18 నుంచి 55 ఏళ్లలోపు వారికి సబ్సిడీతోపాటు యూనిట్ కాస్ట్లో కేవ లం 10 శాతం పెట్టుబడితో బ్యాంకుల ద్వారా 90 శాతం రుణ సదుపాయం కల్పిస్తున్నామన్నారు. ఆసక్తి ఉన్న వారికి సాంకేతిక శిక్షణ అందించడంతోపాటు, వారి ఉత్పత్తులకు తగిన మార్కెటింగ్, బ్రాండింగ్ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఇంటింటి ఫీవర్ సర్వే కర్నూలు(హాస్పిటల్): బాతులకు బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో కర్నూలు నగరంలోని ఎన్ఆర్ పేటలోని ఒక కిలోమీటర్ పరిధిలో వైద్య ఆరోగ్యశాఖ వైద్య సిబ్బంది శనివారం ఇంటింటి ఫీవర్ సర్వే చేపట్టింది. ఎన్ఆర్ పేటలోని 47, 47ఏ, 48 వార్డుల్లోని 89 గృహాల్లో 320 మందికి ఎనిమిది బృందాలు ఈ సర్వేలో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ నాగప్రసాద్ బాబు మాట్లాడుతూ ఇప్పటి వరకు నిర్వహించిన సర్వేలో జ్వర లక్షణాలు కలిగిన వారు లేరన్నారు. కాలానుగుణంగా వచ్చే శ్వాసకోశ వ్యాధులు, సురక్షిత తాగునీటి ప్రాముఖ్యత, ఆహార శుభ్రత , చేతుల శుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే సమీప పట్టణ/ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి వద్ద, అర్హతగల వైద్యుల మాత్రమే చికిత్స చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీపీఎంవో డాక్టర్ ఉమా, వైద్యాధికారులు డాక్టర్ ఫాతి మా, డాక్టర్ నందిని, ఎపిడమాలజిస్టు వేణుగోపాల్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఇంగళదహాళ్ పాఠశాలను స్కూల్ కాంప్లెక్స్గా కొనసాగించాలి హొళగుంద: ఇంగళదహాళ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను స్కూల్ కాంప్లెక్స్గా యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పలు గ్రామాల ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. శనివారం హెబ్బటం గ్రామంలో జరిగే స్కూల్ కాంప్లెక్స్ సమా వేశానికి హెచ్ఎంలు వెళ్లకుండా ఇంగళదహాళ్, ఎండీ హళ్లి, పెద్దగోనెహాళ్ గ్రామాల పరిధిలో వచ్చే పాఠశాలల హెచ్ఎంలను ఆయా గ్రామాల సర్పంచ్లు, పాఠశాలల విద్యా కమిటీ చైర్మన్లు, గ్రామస్తులు అడ్డుకున్నారు. సర్పంచ్లు ప్రమిదావతమ్మ, వెంకటరెడ్డి, వెంకట్రామిరెడ్డి, ఎంపీటీసీ మల్లికార్జున, ఎస్సెమ్సీ చైర్మన్లు, విద్యార్థుల తల్లిదండ్రులు.. తమ గ్రామాల్లోని పాఠశాలల హెచ్ఎంలకు వినతి పత్రాలు అందజేశారు. కాంప్లెక్స్ సమావేశానికి వెళ్లవద్దని హెచ్ఎంలను కోరారు. పెద్దగోనెహాళ్లో సర్పంచ్ కొత్తింటి వెంకటరెడ్డి, వెంకట్రామిరెడ్డి, గ్రామస్తులు పాఠశాల గేటుకు తాళం వేసి హెచ్ఎం, టీచర్లు సమావేశానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న హొళగుంద ఎస్ఐ బాల నరసింహులు ఆ గ్రామానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. చాలా కాలంగా స్కూల్ కాంప్లెక్స్గా ఉన్న ఇంగళదహాళ్ పాఠశాలను తొలగించారని, దాన్ని తిరిగి యథావిధిగా కొనసాగించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామన్నారు. సమస్యను డీఈఓ దృష్టికి తీసుకెళ్తామని గ్రామస్తులకు ఎస్ఐ నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు. అనంతరం హెచ్ఎంలు సమావేశానికి వెళ్లారు. -
కేఎంసీ మానవతా విలువలు నేర్పింది
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కళాశాల ఎంతో మందికి మానవతా విలువలు నేర్పిందని రిటైర్డ్ డీజీపీ డాక్టర్ డీటీ నాయక్ అన్నారు. కర్నూలు మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘం(అలుమ్ని) ఆధ్వర్యంలో రెండురోజుల పాటు నిర్వహించే నిరంతర వైద్యవిజ్ఞాన సదస్సు, అలుమ్ని మీట్ శనివారం కళాశాలలో ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా హాజరైన కేఎంసీ పూర్వ విద్యార్థి డాక్టర్ డీటీ నాయక్ మాట్లాడుతూ తాను ఈ జిల్లాకు చెందినవాడినేనని, అందుకే ఈ ప్రాంతమంటే తనకు ప్రత్యేక అభిమానముందన్నారు. త్యాగమంటే ఈ ప్రాంతం వారిదేనన్నారు. ఏకంగా రాజధానినే ఈ ప్రాంతం త్యాగం చేసిందని, అందుకే ప్రతిఫలంగా కేఎంసీ దక్కిందన్నారు. ఇక్కడ చదివిన విద్యార్థులు దేశ విదేశాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారని, ఎక్కడికి వెళ్లినా కేఎంసీ పేరు వినిపిస్తుందని తెలిపారు. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ సాధించిన డాక్టర్ నాగేశ్వరరెడ్డి కూడా ఈ కళాశాల పూర్వ విద్యార్థి కావడం తనకు ఎంతో గర్వంగా ఉంటుందన్నారు. ● మాజీ ఎంపీ డాక్టర్ ఎంవీ మైసూరారెడ్డి మాట్లాడుతూ తాను నాలుగు దశాబ్దాల క్రితం 1966 బ్యాచ్ ఎంబీబీఎస్ విద్యార్థిగా ఈ కాలేజీలో చదివాననన్నారు. అప్పట్లో వైద్యవిద్యార్థి సంఘం నాయకునిగా తాను ఎన్నికై నట్లు గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ఎన్నో నాయకత్వ విలువలు నేర్చుకున్నట్లు పేర్కొన్నారు. ● అమెరికాలో స్థిరపడిన పూర్వ విద్యార్థి, గైనకాలజిస్టు డాక్టర్ గురురాజ మాట్లాడుతూ ఈ కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు సహకరించాలని, ఒక్కరు ఇవ్వడం మొదలు పెడితే అందరూ ముందుకు వస్తారని సూచించారు. ● కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ మాట్లాడుతూ ఈ కళాశాల 50 సీట్ల నుంచి 250 ఎంబీబీఎస్ సీట్లకు చేరుకుందని, పీజీ సీట్లు కూడా ప్రస్తుతం స్పెషాలిటీ 175, సూపర్స్పెషాలిటీ 19 సీట్లు ఉన్నాయన్నారు. ● ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మంచి వైద్యసేవలు అందించడం పట్ల అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా వ్యాధినిర్ధారణ పరీక్షలపై ఎక్కువ దృష్టిసారించామన్నారు. ● అనంతరం దేశ, విదేశాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులచే నిరంతర వైద్య విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఆయా రంగాల్లో వారు సాధించిన ప్రగతి, ఆధునిక వైద్యవిజ్ఞానం గురించి వివరించారు. ● కార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ పి. శాంతికళ, ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ బి.కుమారస్వామిరెడ్డి, సెక్రటరి డాక్టర్ జి. బాలమద్దయ్య, సైంటిఫిక్ కమిటి మెంబర్ డాక్టర్ విక్రమకుమార్రెడ్డి, అలుమ్ని చైర్మన్ డాక్టర్ సదాశివారెడ్డి, అలుమ్ని పూర్వ ప్రెసిడెంట్ డాక్టర్ నరసింహులు, ట్రెజరర్ డాక్టర్ మహేశ్వరరెడ్డి, డాక్టర్ ఐ. రమేష్, డాక్టర్ సి. ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు. రిటైర్డ్ డీజీపీ డాక్టర్ డీటీ నాయక్ అట్టహాసంగా అలుమ్ని మీట్ ప్రారంభం -
మేలుజాతి దూడల ప్రదర్శన
డోన్: సీసంగుంతల గ్రామంలో మేలు జాతి గేదె, ఆవు దూడల ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనను ఉమ్మడి కర్నూలు జిల్లా పశువైద్యశాఖ కార్యనిర్వాహక ముఖ్య అధికారి డాక్టర్ రాజశేఖర్ పరిశీలించారు. ప్రాంతీయ పశువైద్యశాల వైద్యులు డాక్టర్ నాగరాజు, శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ.. మేలుజాతి పాడి పశువులకు కృత్రిమ గర్భధారణతో పశుపోషకులు లబ్ధి పొందవచ్చన్నారు. ఈతకు ఈతకు మధ్య దూరం తగ్గించాలన్నారు. పాడిరైతులకు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. పశువైద్యులు ఉసేన్బాషా, డాక్టర్ హరీష్, డాక్టర్ భాను, సిబ్బంది రఫి, కృష్ణా, నవ్య, డాక్టర్ సాయికీర్తి తదితరులు పాల్గొన్నారు. -
బాలల్లో నేర స్వభావాన్ని నియంత్రించాలి
● జిల్లా జడ్జి కబర్ధి కర్నూలు: బాల నేరస్తుల్లో ఉండే నేర స్వభావాన్ని ప్రాథమిక దశలోనే గుర్తించి వారికి కౌన్సెలింగ్, విద్యాబోధన ద్వారా మార్పు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా జడ్జి కబర్ధి అన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ కబర్ధి, కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి శనివారం జిల్లా కోర్టులోని న్యాయ సేవా సదన్లో బాలుల న్యాయ చట్టం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కబర్ధి మాట్లాడుతూ అంతర్జాతీయ బాలల ఒడంబడిక ప్రకారం రాజ్యాంగంలో పొందుపరచిన ప్రత్యేక నిబంధనలపై పోలీసు అధికారులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కర్నూలు డీసీపీఓ శారద, నంద్యాల డీసీపీఓ స్వప్న ప్రియదర్శిని, జేజేబీ మెంబర్లు మాధవి, సునిత, ఉమ్మడి జిల్లాల ప్రత్యేక జ్యువైనల్ పోలీసు యూనిట్ సిబ్బంది పాల్గొన్నారు. -
కోళ్లు, గుడ్ల సరఫరా నిలిపివేత
నందవరం: బర్డ్ఫ్లూ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో కోళ్లు, గుడ్ల సరఫరాను నిలిపివేసినట్లు వెటర్నరీ డాక్టర్ వరలక్ష్మి, ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. నాగలదిన్నె గ్రామంలోని ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటు చేసిన చెక్పోస్టులో శనివారం వాహనా ల తనిఖీ చేపట్టారు. ఎమ్మిగనూరు నుంచి ఎలాంటి అనుమతులు లేని 30 వేల గుడ్లతో వచ్చి బొలెరో వాహనాన్ని తనిఖీ చేసి వెనక్కి పంపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతానికి సరఫరా చేయాలంటే తప్పనిసరిగా ఉన్నతాధికారుల అనుమతి పత్రాలు చూపించాలన్నారు. ఎలాంటి అనుమతులు లేని గుడ్లు, కోళ్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు వెటర్నరీ డాక్టర్ వెల్లడించారు. తనిఖీలో వెటర్నరీ అసిస్టెంట్ సుధాకర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
ధర పడిపోతోంది
మా గ్రామంలో 40 మంది రైతులు పౌల్ట్రీపై ఆధారపడి ఉన్నారు. మేం ప్రతి బ్యాచ్లో 5 వేల కోళ్లు పెంచుతాం. ఇవి 40 రోజుల్లో అమ్మకం కావాలి. బర్డ్ఫ్లూ కారణంగా కోడి లైవ్ కిలో ధర రూ.87కు పడిపోయింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా నష్టాలు వస్తున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కోళ్లలో ఎలాంటి బర్డ్ఫ్లూ లేదు. ప్రభుత్వం చొరవ తీసుకొని రైతులకు న్యాయం చేయాలి. చికెన్, గుడ్ల వినియోగం పెంచే దిశగా చర్యలు తీసుకోవాలి. – మధు, తులశాపురం, కర్నూలు మండలం పరిహారం ఇవ్వాలి బర్డ్ఫ్లూతో కోలుకోలేని విధంగా నష్టపోయాం. మా దగ్గర 10 వేల కోళ్లు ఉన్నాయి. కిలో లైవ్పై దాదాపు రూ.50 వరకు నష్టం వస్తోంది. ఈ ప్రకారం మాకు 8 లక్షల రూపాయల నష్టం వస్తోంది. కంపెనీలు చికెన్ ధరను గంట గంటకు తగ్గిస్తున్నాయి. బర్డ్ఫ్లూతో నష్టపోతున్న రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి. నష్టపోయిన రైతులకు తగిన పరిహారం ఇవ్వాలి. చికెన్, గుడ్లు తినడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని ప్రచారం చేయాలి. – చంద్రశేఖర్రెడ్డి, జి.సింగవరం, కర్నూలు మండలం కోలుకోలేని దెబ్బ బర్డ్ఫ్లూ ప్రభావంతో పౌల్ట్రీ పరిశ్రమకు కోలుకోలేని దెబ్బ తగిలింది. నంద్యాల జిల్లాలో ఈ ప్రభావం ఏమాత్రం లేకపోయినా కంపెనీలు ధర తగ్గించాయి. పెద్ద ఎత్తున నష్టపోవాల్సి వచ్చింది. మేం కొన్నేళ్లుగా పౌల్ట్రీ రంగంలో రాణిస్తున్నాం. ప్రస్తుతం ఐదు వేలకు పైగా కోళ్లు ఉన్నాయి. చికెన్కు డిమాండ్ తగ్గింది. ధరలు తగ్గాయి. ప్రభుత్వం చొరవ తీసుకుని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. – రవికుమార్, కరివేముల, జూపాడుబంగ్లా మండలం -
వేసవిలో తాగునీటి సమస్య తలెత్తనివ్వొద్దు
గోనెగండ్ల: వేసవిలో జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూసుకోవాలని గాజులదిన్నె ప్రాజెక్టు (జీడీపీ) డీఈ విజయ్కుమార్ను జిల్లా కలెక్టర్ రంజిత్బాషా ఆదేశించారు. శనివారం మండలంలోని జీడీపీని కలెక్టర్ పరిశీలించారు. ప్రస్తుతం ప్రాజెక్టులో ఎన్ని టీఎంసీల నీరు ఉంది.. ఎన్ని ఎకరాల ఆయకట్టు ఉంది, హెచ్ఎన్ఎస్ నుంచి ప్రాజెక్టుకు వచ్చే నీరు తదితర వివరాలను డీఈని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, ఏఈ మహమ్మద్ ఆలీ, తహసీల్దార్ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. రేపు ఉద్యోగ మేళా కోడుమూరు రూరల్: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 17వ తేదీన ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆనంజ్కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్ఎస్సీ ఆపై విద్యార్హత కలిగిన యువతీయువకులు ఈ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హాజరయ్యే వారు వెంట విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు తెచ్చుకోవాలని సూచించారు. -
ఆత్మకూరులో 18న జాబ్మేళా
ఆత్మకూరు: ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఈనెల 18వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీకాంత్, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తెలిపారు. జాబ్మేళాకు సంబంధించిన వాల్ పోస్టర్లను స్థానిక కళాశాలలో వారు శనివారం వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ జాబ్మేళాకు ఐదు ప్రయివేట్ కంపెనీలు (అరబిందో ఫార్మసీ, గ్రీటెక్ ఇండస్ట్రీస్ ప్రయివేట్ లిమిటెడ్, రాయ్స్ డైరెక్ట్ సర్వీసెస్, టాటా కాపిటర్, నవత రోడ్ ట్రాన్స్పోర్ట్) పాల్గొంటాయన్నారు. ఈ జాబ్మేళాలలో పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ, బీటెక్ మెకానికల్, పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు 6303244165, 7673902328 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు. -
వెలుగోడు వీఆర్ఓ మృతి
బండ ఆత్మకూరు: మండల పరిధిలోని నారాయణాపురం గ్రామానికి చెందిన వెలుగోడు వీఆర్వో ఎండూరి.అనంతసేనా రెడ్డి (60 ) శనివారం సాయంత్రం మృతి చెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ శనివారం కోలుకోలేక మృతి చెందాడు. మృతుడికి భార్య సత్యాదేవి, ఇద్దరు కుమారులు ఉన్నారు. విషయం తెలుసుకున్న శ్రీ శైలం మాజీ శాసన సభ్యులు శిల్పా చక్రపాణిరెడ్డి మృతుడి కుటుంబ సభ్యులను ఫోనులో పరామర్శించారు. గూడ్స్ రైలు కింద పడి.. డోన్ టౌన్: పట్టణ సమీపంలోని కొత్తబుగ్గ వద్ద గూడ్స్ రైలు కింద పడి కోట్లవారిపల్లెకి చెందిన చిన్నన్న(85) అనే వృద్ధుడు మరణించాడు. గూడ్స్ రైలు గార్డు సమాచారంతో రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడు కోట్లవారి పల్లెకి చెందిన చిన్నన్నగా గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఆత్మహత్యనా అనే కోణంలో విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వివాహిత బలవన్మరణం బనగానపల్లె రూరల్: మండలం పరిధిలోని యనకండ్ల గ్రామానికి చెందిన టి. శివమ్మ(35)అనే వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. శనివారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు స్థానికులు తెలిపిన మేరకు.. యనకండ్ల గ్రామానికి చెందిన బాలుడు,శివమ్మ దంపతులు కూలీ పనులు చేసుకొని జీవిస్తున్నారు. అయితే, కుటుంబంలో నెలకొన్న సమస్యల కారణంగా ఇంట్లో ఎవరులేని సమయంలో ఆమె సిలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు కుటుంబసభ్యుల ఫిర్యాదుతో బనగానపల్లె పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. -
హోరాహోరీగా పోలీసు క్రీడాపోటీలు
పాణ్యం: నంద్యాల జిల్లా పోలీసు క్రీడా పోటీలు హోరాహోరీగా సాగాయి. నెరవాడ మెట్ట వద్ద ఉన్న ఆర్జీఎం ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన క్రికెట్ ఫైనల్ పోటీల్లో శనివారం ఆత్మకూరు డివిజన్పై నంద్యాల ఏఆర్ డివిజన్ జట్టు విజయం సాధించింది. విజేత జట్టుకు ఏఆర్ ఆడిషినల్ ఎస్పీ చంద్రబాబు, ఏఆర్ డీఎస్పీ రాజసింహరెడ్డి, సీఐ చాంద్బాషా, మంజునాథ తదితరులు ప్రత్యేకంగా అభినందించారు. బాలుడి మృతదేహం లభ్యం పత్తికొండ రూరల్: మండల పరిధిలోని పందికోన గ్రామ సమీపంలో గల్లంతైన బాలుడు తులసీగౌడు(12) మృతదేహం శనివారం లభ్యమైంది. డోన్కు చెందిన దామోదర్గౌడు, రాజేశ్వరి దంపతుల కుమారుడైన తులసీగౌడ్ రెండు రోజుల క్రితం ప్రమాదవశాత్తు హంద్రీవాగులో పడి గల్లంతైన సంగతి తెలిసిందే. బాలుడి ఆచూకీ కోసం ఏపీఎస్డీఆర్ఎఫ్కు చెందిన 15 మంది సిబ్బంది శుక్రవారం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో మృతదేహం కొట్టుకుని పోయి శనివారం మద్దికెర మండలం హంప గ్రామ సమీపంలోని వాగులో తేలింది. గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
డ్రైవర్లు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి
కర్నూలు (సిటీ): బస్సు డ్రైవర్లు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని డీటీసీ ఎస్.శాంతకుమారి, ఆర్టీఓ ఎల్ భరత్ చౌహాన్, ట్రాఫిక్ సీఐ మన్సురుద్దీన్, ఎంవీఐ కె.రవీంద్ర కుమార్ సూచించారు. కర్నూలు 1,2 డిపో మేనేజర్ల ఆధ్వర్యంలో శనివారం కర్నూలు–2 డిపో గ్యారేజ్లో రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వారు హాజరై మాట్లాడారు. ప్రతి డ్రైవర్ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. అలాగే రోడ్డుపై ఉన్న సూచనల బోర్డులను గమనించి, ఇతర వాహనదారులకు ఇబ్బంది లేకుండా డ్రైవింగ్ చేయాలన్నారు. అనంతరం కర్నూలు రీజియన్లో ప్రమాద రహిత డ్రైవర్లను ప్రోత్సాహక బహుమతులు అందజేసి సన్మానించారు. -
లెనోవా ల్యాప్ట్యాప్స్ షోరూం ప్రారంభం
కర్నూలు (టౌన్): నగరంలోని స్థానిక అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్లో శుక్రవారం సాయంత్రం లెనోవా అథరైజ్డ్ కంపెనీ ల్యాప్ట్యాప్స్ షోరూం ప్రారంభమైంది. మాజీ రాజ్య సభ సభ్యులు టీజీ వెంకటేష్ అతిథిగా హాజరై ఈ షోరూంను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో సాఫ్ట్వేర్ రంగం దినదినాభివృద్ధి చెందుతుందన్నారు. కంప్యూటర్లు, ల్యాప్ట్యాప్స్, డెస్క్టాప్స్, ట్యాబ్స్ ప్రాధాన్యత ఎంతో పెరిగిందన్నారు. జేఎం కంప్యూటర్స్ సంస్థ అధినేత షేక్ అబ్దుల్ నబీ, షేక్ షాకీర్ బాషా మాట్లాడుతూ కంప్యూటర్ రంగంలో 23 సంవత్సరాల అనుభవం ఉందని, తమ లెనోవా షోరూంలో లాప్ట్యాప్స్తో పాటు గేమింగ్ లాప్ట్యాప్స్, మానిటర్స్, ట్యాబ్స్ అన్ని రకాల నాణ్యమైన ఉత్పత్తులు ఆన్లైన్ ధరల కన్నా 5 శాతం తక్కువకు అందిస్తున్నట్లు చెప్పారు. షోరూంలో సర్వీస్ సెంటర్ ఉందని, మూడేళ్ల వారంటీ ఫ్రీ సర్వీసు ఇస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో ఆ సంస్థ ప్రతినిధులు పరదేశ్, కార్తీక్, జస్ప్రీత్సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
హామీల అమలులో చంద్రబాబు విఫలం
ఆలూరు: ఎన్నికల హామీలను అమలు చేయడంలో సీఎం చంద్రబాబు విఫలమయ్యారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేంద్రరెడ్డి విమర్శించారు. ఆలూరులోని ఓ హోటల్లో ఆయన శనివారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. అధికారం కోసం ఎన్నికల ముందు కూటమి నాయకులు అనేక హామీలు ఇచ్చారన్నారు. ప్రజలు నమ్మి ఓటేసి గెలిపించాక వాటిని అమలు చేయకపోగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేదని సాకులు చెబుతున్నారన్నారు. తొలి నుంచి ప్రజలను మోసం చేయడం బాబు నైజమన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట ఇస్తే తప్పరని, అందుకు ఆయన ఐదేళ్ల పాలనే నిదర్శనమన్నారు. కరోనా సమయంలో కూడా సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత ఆయనదని చెప్పారు. సచివాలయ, ఆర్బీకేల ద్వారా గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని వైఎస్ జగన్ తీసుకొచ్చారన్నారు. నేడు వాటిని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు.ప్రశ్నించే వారిపై దాడులు, కేసులతో బెదిరిస్తోందని చెప్పారు. అన్యాయంగా వైఎస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేస్తుందని..కూటమి అరాచక పాలనను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు. సమావేశంలో దేవనకొండ మండలం సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు అరుణకుమార్, అలిగేరు గ్రామ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి, ఎల్లార్తి అశోక్రెడ్డి కొత్తకాపు శేషాద్రిరెడ్డి, మోహిద్దీన్, రాఘవేంద్రరెడ్డి, రంగస్వామి, మల్లికార్జునరెడ్డి, తిక్కన్న, ప్రకాష్రెడ్డి ,రామాంజనేయులు, ప్రవీణ్, పులి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేంద్రరెడ్డి -
ఆసక్తి చదివిస్తోంది!
వీరు తువ్వపల్లె తిప్ప మీదున్న ఆదర్శ పాఠశాల విద్యార్థులు. ఇంగ్లిషు భాషపై పట్టు పెంచుకునేందుకు ప్రతి రోజు కొంత సమయం కేటాయిస్తారు. గ్రూపులుగా ఏర్పడి వివిధ అంశాల గురించి ఇంగ్లిషులో రాయడం, చదవడం, మాట్లాడటం, చర్చించడం వంటివి చేస్తుంటారు. ఈ క్రమంలో శుక్రవారం ఇలా రౌండ్గా కూర్చోని ఇంగ్లిషు పత్రికలను చదువుతూ కనిపించారు. బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు, వివిధ అంశాలపై అవగాహన పెంచుకునేందుకు విద్యార్థులకు దినపత్రికలు చదవడం అలవాటు చేసినట్లు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ సంగెపు నాగేశ్వరరావు తెలిపారు. – రుద్రవరం -
16న నరసం రాష్ట్ర సదస్సు
కర్నూలు కల్చరల్: నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం (నరసం) సాహితీ సదస్సు సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 16వ తేదీ సీక్యాంప్ టీజీవీ కళాక్షేత్రంలో నరసం 7వ వార్షికోత్సవ రాష్ట్ర సదస్సును నిర్వహిస్తున్నట్లు నరసం జిల్లా అధ్యక్షురాలు సుబ్బలక్ష్మి పేర్కొన్నారు. శుక్రవారం కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సదస్సుకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రచయిత్రులు అందరూ ఒక వేదికపైకి రావాలి, రచనా సామర్థ్యాన్ని మెరుగు పరుచుకోవాలి, సమకాలీన సమస్యలపై స్పందించి రచనలు చేసి మంచి సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో నరసం ముందుకు సాగుతుందన్నారు. విద్యార్థుల్లో రచనా శక్తిని, సృజనాత్మకతను పెంచేలా నరసం పనిచేస్తుందన్నారు. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు ప్రారంభ సభ ఉంటుందన్నారు. ఐదు సెషన్లు కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. కవిసమ్మేళనాలు, పుస్తకావిష్కరణ కార్యక్రమాలు ఉంటాయన్నారు. సుమారు 40 మంది ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు చెందిన కయిత్రులు, రచయిత్రులు కవిసమ్మేళనాల్లో పాల్గొంటారన్నారు. సమావేశంలో టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య, తెలుగు భాషా వికాస ఉద్యమం కార్యదర్శి జేఎస్ఆర్కే శర్మ, నరసం జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ దండెబోయిన పార్వతీ దేవి, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
బ్యాంకుల సమ్మెను విజయవంతం చేద్దాం
కర్నూలు (అగ్రికల్చర్): వచ్చే నెల 24, 25 తేదీల్లో చేపట్టే ఆలిండియా బ్యాంకుల సమ్మెను విజయవంతం చేయాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్బీయూ) నేతలు పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం కర్నూలు గాయత్రి ఎస్టేట్లోని ఎస్బీఐ బ్రాంచ్ ఎదుట ముందస్తుగా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా యూఎఫ్బీయూ జిల్లా కన్వీనర్ నాగరాజు మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. పలు దఫాలుగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దృష్టికి సమస్యలు తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో విధి లేని పరిస్థితుల్లో సమ్మెకు దిగినట్లు పేర్కొన్నారు. అన్ని బ్యాంకుల్లో పని ఒత్తిడి తగ్గించేందుకు తగిన స్థాయిలో నియామకాలు చేపట్టాలని, ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న వివిధ సమస్యలను తక్షణం పరిష్కరించాలని, ఔట్ సోర్సింగ్పై ఉద్యోగ నియామకాలను బంద్ చేయాలని కోరారు. వివిధ డిమాండ్లను సాధించుకునేందుకు చేపట్టిన రెండు రోజుల బ్యాంకుల సమ్మెను అన్ని బ్యాంకుల ఉద్యోగ సంఘాలు కలిసికట్టుగా పనిచేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐబీఈఏ నాయకులు శివకృష్ణ, ఎల్లయ్య, అనిల్రెడ్డి, ఏఐబీఓసీ నాయకులు రహిమాన్, మురళీకృష్ణ, అనిల్, ఎన్సీబీఈ నాయకులు విద్యాసాగర్, శ్రీకాంత్, ఏపీజీబీ యూనియన్ నాయకులు హనుమంతురెడ్డి తదితరులు పాల్గొన్నారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ డిమాండ్ -
రూపాయి ఖర్చు లేకుండా కేసుల పరిష్కారం
● శాశ్వత లోక్ అదాలత్ అధ్యక్షులు ఎం.వెంకటహరినాథ్ కర్నూలు: శాశ్వత లోక్ అదాలత్తో ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ప్రజా వినియోగ సేవలకు సంబంధించి ఏవైనా కేసులను పరిష్కరించుకోవచ్చని శాశ్వత లోక్ అదాలత్ అధ్యక్షులు ఎం.వెంకటహరినాథ్ అన్నారు. సత్వరంగా, సామరస్యపూర్వకంగా పరిష్కరించిన కేసు వివరాలను శుక్రవారం ఆయన వెల్లడించారు. కర్నూలు జిల్లాకు చెందిన జి.మల్లికార్జున రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ(వాది)కి అనంతపూర్లో ఇండస్ ఇండ్ బ్యాంకు(ప్రతివాది)లో అకౌంట్ ఉందని తెలిపారు. తన ఎల్ఐసీ బాండ్ను ఇండస్ ఇండ్ బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం పొంది, తిరిగి చెల్లించారన్నారు. ఎల్ఐసీ బాండ్ 2023 సెప్టెంబర్లో మెచ్యూర్ కాగా.. మొత్తం చెల్లింపు కోసం అసలు ఎల్ఐసీ బాండ్ను సమర్పించాలని అధికారులు కోరారన్నారు. ఎల్ఐసీ బాండ్ ఇవ్వాలని బ్యాంకును అడగగా తిరిగి ఇవ్వకపోవడంతో శాశ్వత లోక్ అదాలత్ను ఆశ్రయించారని తెలిపారు. ప్రతివాదులకు నోటీసులు ఇచ్చి ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని సూచించామన్నారు. ఇండస్ ఇండ్ బ్యాంకు (ప్రతివాది) డీడీ ద్వారా రూ.10 వేల మొత్తాన్ని శాశ్వత లోక్ అదాలత్ సభ్యులు టి.శివశంకర్రెడ్డి, డి.రాజు బాబు ఆధ్వర్యంలో న్యాయవాదులు జి.నాగేశ్వరయ్య, సి.లోకేశ్వరయ్య సమక్షంలో వాది జి.మల్లికార్జునకు అందజేశారని తెలిపారు. శాశ్వత లోక్ అదాలత్లో కేసు పరిష్కారం జరిగితే అటువంటి తీర్పుపై అప్పీలు లేదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. -
మోటార్ సైకిళ్లు ఢీ.. ఒకరు మృతి
రుద్రవరం: మండల పరిధిలోని చిన్నకంబలూరు గ్రామ సమీపంలో శుక్రవారం రెండు మోటార్ సైకిళ్లు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలపాలయ్యాడు. పోలీసు లు తెలిపిన వివరాల మేరకు.. శిరివెళ్ల మండలం బోయలకుంట్లకు చెందిన నాగేశ్వరరావు (56) ఓ పంచాయితీ నిమిత్తం మండల కేంద్రమైన రుద్రవరానికి వెళ్లాడు. అక్కడ పనులు పూర్తి కాగానే తిరిగి మోటార్ సైకిల్పై స్వగ్రామానికి బయలు దేరాడు. శిరివెళ్లకు చెందిన నూర్బాషా చిన్నకంబలూరు వైపు తాపీ మేసీ్త్ర పనులు ముగించుకొని మోటార్ సైకిల్పై స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఆ క్రమంలో చిన్నకంబలూరు గ్రామ సమీపంలోకి రాగానే ప్రమాదవశాత్తు ఆ రెడు బైక్లు ఎదురెదురై ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షత గా త్రులను చికిత్స నిమిత్తం 108వాహనంలో నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ నాగేశ్వరరావు మృతి చెంది నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసుమోదు చేసి విచారణ చేపట్టినట్లు వారు తెలిపారు. లభించని బాలుడి ఆచూకీ పత్తికొండ రూరల్: హంద్రీ–నీవా కాలువలో గురువారం గల్లంతైన 12 ఏళ్ల బాలుడు తులసీగౌడు ఆచూకీ శుక్రవారం కూడా దొరకలేదు. ఎపీఎస్డీఆర్ఎఫ్కు చెందిన 15 మంది సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టినట్లు సీఐ జయన్న తెలిపారు. డోన్కు చెందిన దామోదర్గౌడు, రాజేశ్వరి దంపతుల కుమారుడు తులసీగౌడ్.. పందికోన సమీపంలోని హంద్రీ–నీవా కాలువలో గల్లంతైన విషయం తెలిసిందే. నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో బాలుడి ఆచూకీ శుక్రవారం సాయంత్రం వరకు లభించలేదు. హుండీ చోరీ యత్నం వెల్దుర్తి: గుడిలో హుండీని దొంగలు ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. హైవే పోలీసుల పహారాతో హుండీ, బైక్ వదిలి పారిపోయారు. వివరాలు ఇవీ.. గురువారం రాత్రి ఇద్దరు యువకులైన దొంగలు మండల పరిధిలోని హైవే 44ను ఆనుకుని ఉన్న మదార్పురం గ్రామ శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామి గుడి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువా ఇతరత్రా అల్మారాలు తెరిచి విలువైన వస్తువుల కోసం వెతికారు. గుడిలో హుండీ తాళం పగులగొట్టి తెరిచే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. బయటకు తీసుకెళ్లి దూరంగా వెళ్లి తెరుచుకునే ప్రయత్నం చేద్దామన్న ఆలోచనతో బైక్పై హుండీతో బయలుదేరారు. అదే సమయంలో పహారాలో ఉన్న హైవే పోలీసుల కంట పడ్డారు. హైవే కానిస్టేబుల్ శేఖర్, సిబ్బంది తమ వాహనంలో దొంగల వెంట పడ్డారు. దీంతో దొంగలు హుండీని, బైక్ను బొమ్మిరెడ్డిపల్లె వద్ద వదిలేసి పరారయ్యారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ అశోక్, సిబ్బంది హుటాహుటిన బయలుదేరి దొంగల కోసం గాలించారు. హుండీని, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. గుడిలోపలి సీసీ కెవెరాలో దొంగలు హుండీ తెరిచే ప్రయత్నం, ఎత్తుకెళ్లడం రికార్డయ్యాయి. సీసీ ఫుటేజీ సేకరించి విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం
● ఎస్పీ విక్రాంత్ పాటిల్ కర్నూలు (టౌన్): నిజాయితీకి, నిరాడంబరత్వానికి దామోదరం సంజీవయ్య నిలువెత్తు నిదర్శనం అని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. శుక్రవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి ఎస్పీ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రిగా, ఆంధ్ర రారష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా సేవలు అందించారన్నారు. చిన్న వయస్సులోనే ముఖ్యమంత్రి పదవిని అలంకరించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ప్రజా సంక్షేమం అమలులో అందరి మన్ననలు పొందారన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆడ్మిన్ హుస్సేన్ పీరా, ఎఆర్ ఆడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు. -
నేడు, రేపు వైద్య విజ్ఞాన సదస్సు
కర్నూలు (హాస్పిటల్): కర్నూలు మెడికల్ కళాశాల అలుమ్ని అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 15, 16వ తేదీన వైద్య విజ్ఞాన సదస్సు, అలుమ్ని మీట్ నిర్వహించనున్నట్లు ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ బి.కుమారస్వామి రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మొదటి రోజు పూర్వ వైద్య విద్యార్థులు, సీనియర్ పార్లమెంటేరియన్ డాక్టర్ ఎం.వి.మైసూరా రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ బి.ఎల్.రవీంద్రారెడ్డి, రిటైర్డ్ డీజీపీ డాక్టర్ టి.నాయక్ తదితరులు హాజరవుతున్నారన్నారు. రెండు రోజులు కర్నూలు మెడికల్ కళాశాలలో చదివి ప్రస్తుతం దేశ విదేశాల్లో ఆయా స్పెషాలిటీల్లో పేరు, ప్రఖ్యాతలు గడించిన స్పెషలిస్టులు వస్తున్నారని, వారు వారి స్పెషాలిటీలో వచ్చిన నూతన వైద్య విధానాలను వైద్యులకు వివరిస్తారని తెలిపారు. హౌసింగ్ ఈఈగా వెంకటదాసు కర్నూలు(అర్బన్): జిల్లా గృహ నిర్మాణ సంస్థ కర్నూలు ఈఈగా పీ వెంకటదాసు శుక్రవారం హౌసింగ్ జిల్లా అధికారి అజయ్కుమార్ను కలిసి బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీల్లో భాగంగా చిత్తూరు జిల్లా మదనపల్లె నుంచి ఆయన ఇక్కడకు వచ్చారు. గత ఏడాదిన్నర కాలంగా రెగ్యులర్ ఈఈ లేకపోవడం వల్ల కర్నూలు అర్బన్ డీఈఈ ప్రభాకర్ ఇప్పటి వరకు ఇన్చార్జ్ ఈఈగా బాధ్యతలు నిర్వహిస్తు వచ్చారు. ప్రత్యేక ప్యాకేజీతో కుంభమేళా టూర్ కర్నూలు కల్చరల్: ఏపీ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాకు ప్రత్యేక ప్యాకేజీతో టూర్ ఏర్పాటు చేశారు. ఈనెల 17వ తేదీన తిరుపతి నుంచి ఏసీ వోల్వో (45 సీటర్స్) బస్సు బయలు దేరుతుంది. తిరుపతి, ఒంటిమిట్ట, ఓర్వకల్లు, కర్నూలు, హైదరాబాద్, బాసర, వారణాశి, ప్రయాగరాజ్ చేరుకుంటుంది. తిరిగి జబల్పూర్, హైదరాబాద్, కర్నూలు, మహానంది మీదుగా బస్సు తిరుపతి చేరుకుంటుంది. ఈ బస్సు 17వ తేదీ మధ్యాహ్నం 1.15 గంటలకు ఓర్వకల్లు, 2.15 గంటలకు కర్నూలు నుంచి బయలు దేరుతుంది. వారం రోజుల పాటు ఈ టూర్ ఉంటుంది. పెద్దలకు (10 సంవత్సరాలు పైబడిన వారు) రూ.20 వేలు, 3 నుంచి 9 సంవత్సరాల వయస్సు పిల్లలకు రూ.17, 200 టికెట్ ధర నిర్ణయించారు. వివరాలకు 90101 77055ను సంప్రదించవచ్చు. ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్గా రమణ సాక్షి, అమరావతి: ఇంధన శాఖలోని డైరెక్టరేట్ ఆఫ్ ఎలక్ట్రికల్ సేఫ్టీ విభాగానికి కర్నూలు ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్గా వై. వెంకట రమణను ప్రభుత్వం నియమించింది. ఆయన ప్రస్తుతం కాకినాడ విద్యుత్ భద్రత విభాగంలో డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్గా ఉన్నారు. పదోన్నతిపై రమణను బదిలీ చేస్తూ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీఈడబ్ల్యూఐడీసీ నంద్యాల ఈఈగా నాగరాజు కర్నూలు(అర్బన్): ఆంధ్రప్రదేశ్ విద్య, సంక్షేమం మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (ఏపీఈడబ్ల్యూఐడీసీ ) నంద్యాల ఈఈగా గోన నాగరాజు నియమితులయ్యారు. కర్నూలు డీఈఈగా ఉన్న ఈయనకు నంద్యాల ఈఈగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సంస్థ ఎండీ దీవన్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు కర్నూలు ఈఈ లక్ష్మీనారాయణ నంద్యాల ఈఈగా అదనపు బాధ్యతలు నిర్వహించారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో నంద్యాల ఈఈగా బాధ్యతలు స్వీకరించనున్న నాగరాజును పలువురు ఉద్యోగులు అభినందించారు. కార్యక్రమంలో కార్యాలయ డీఈఈ వీరయ్య, ఏఈలు మధు, హరీష్, సురేంద్ర, ప్రవీణ్, మోయిద్దీన్ఖాన్, ప్రభాకర్రావు, డీపీఓ షబానా, డీఈఓ నాగేంద్ర, సిబ్బంది బాలయ్య, సుబ్బడు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థిని దుర్మరణం
పాణ్యం: మండల పరిధిలోని బలపనూరు గ్రామం వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థిని మృతిచెందగా..మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్ఐ నరేంద్రకుమార్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. బలపనూరు గ్రామానికి చెందిన బి. మేహేశ్వరరెడ్డి, కుమార్తె వైష్ణవి, అదే గ్రామానికి చెందిన రాజశేఖర్రెడ్డి పెద్ద కుమార్తె వై. రామ పూజిత(16) నంద్యాల సమీపంలోని ఓ ప్రయివేట్ జూనియర్ కళాశాలో చదువుతున్నారు. వై. పూజిత హాస్టల్లో ఉంటుండగా వైష్ణవి రెగ్యులర్గా కాలేజీకి వెళ్లి వస్తుంటుంది. పూజిత బంధువుల ఇంట్లో శుభకార్యం ఉంది. దీంతో శుక్రవారం రాత్రి మహేశ్వరరెడ్డి స్కూటీపై వైష్ణవితో కలిసి ఆబాలిక కాలేజీ నుంచి బయలుదేరింది.బలపనూరు గ్రామం వద్ద యూటర్న్ తీసుకుంటుండగా కర్నూల్ వైపు వెళ్తున్న మినీట్రాలీ వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే చికిత్స నిమిత్త స్థానికులు శాంతిరామ్ ఆసుపత్రికి తరలించగా పూజిత కోలుకోలేక మృతి చెందారు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
మద్యం షాపు తొలగించకపోతే ఉద్యమిస్తాం
నందికొట్కూరు: తాలూకా ఆఫీస్ రోడ్డులో ఇళ్ల మధ్య ఏర్పాటు చేసిన మద్యం షాపును వెంటనే తొలగించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని 28వ వార్డు ప్రజలు, సీపీఐ నాయకులు హెచ్చరించారు. శుక్రవారం పట్టణంలోని ఎకై ్సజ్ శాఖ, రెవెన్యూ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నివాసాల మధ్య మద్యం దుకాణం ఏర్పాటుతో మహిళలు, బాలికలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలన్నారు. అనంతరం ఎకై ్సజ్ శాఖ సీఐ రామాంజనేయులు నాయక్కు, తహసీల్దార్ శ్రీనివాసులుకు మద్యం దుకాణం తొలగించాలంటూ వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకులు రఘురామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
పోలీస్ లాంఛనాలతో డీఎస్పీ అంత్యక్రియలు
ఆస్పరి: రాజమహేంద్ర వరంలో మృతి చెందిన సీఐడీ డీఎస్పీ బి. నాగరాజు అంత్యక్రియలు శుక్రవారం స్వగ్రామమైన ఆస్పరిలో పోలీసు లాంఛనాలతో నిర్వహించారు. ఈయనకు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. డీఎస్పీ మృతదేహనికి డీఎస్పీలు నరిసిరెడ్డి, నాగరాజుయాదవ్, దైవప్రసాద్, ఉపేంద్ర, ఆస్పరి సీఐ మస్తాన్వలి, పోలీసులు, బంధువులు, మిత్రులు అధిక సంఖ్యలో వచ్చి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మృతదేహన్ని మేళతాళాలతో ఊరేగించారు. డీఎస్పీ సొంత పొలంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా కర్నూలు ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఈశ్వరయ్య ఆధ్వర్యంలో పోలీసులు తుపాలకులతో గౌరవ వందనం చేసి రెండు నిమిషాలు మౌనం పాటించారు. -
మహిళకు అరుదైన గుర్రపునాడా కిడ్నీ సమస్య
కర్నూలు(హాస్పిటల్): సాధారణంగా అందరికీ రెండు కిడ్నీలు విడివిడిగా ఉంటాయి. కానీ అత్యంత అరుదుగా కొందరికి మాత్రం రెండు కిడ్నీలు గుర్రపు నాడా ఆకారంలో ఉండి, కింది భాగం కలిసిపోయి ఉంటాయి. కర్నూలులోని ఓ మహిహిళకు అలాంటి కిడ్నీలు ఉండి ఒక కిడ్నీ పూర్తిగా దెబ్బతింది. దీంతో దానిని వైద్యులు ల్యాప్కోస్కోపిక్ విధానంలో ఆపరేషన్ చేసి తొలగించారు. శుక్రవారం వివరాలను కర్నూలులోని కిమ్స్ హాస్పిటల్లో యురాలజిస్టు డాక్టర్ వై. మనోజ్కుమార్ వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే... ‘కర్నూలు మండలం పడిదెంపాడు గ్రామానికి చెందిన ఎం. లక్ష్మీదేవి(50)కి పుట్టుకతో కిడ్నీలు గుర్రపునాడా ఆకారంలో ఏర్పడ్డాయి. ఇంతకాలం వాటితో ఎలాంటి ఇబ్బంది రాలేదు. కానీ కొంత కాలంగా ఆమె తీవ్రమైన కడుపునొప్పి, మధ్యమధ్యలో జ్వరం లాంటి లక్షణాలతో బాధపడ్డారు. ఈ సమస్యలతో గత జనవరి 21వ తేదీన ఆమె కిమ్స్ హాస్పిటల్కు వచ్చారు. పరీక్షించగా ఆమెకు గుర్రపునాడా కిడ్నీలలో కుడివైపుది బాగా వాపు వచ్చి పాడైపోయి, కిడ్నీసైజు పెద్దగా మారినట్లు గుర్తించాం. ఆమెకు మరుసటి రోజు న ల్యాప్రోస్కోపిక్ పద్దతిలో పాడైన కిడ్నీని జాగ్రత్తగా తొలగించాం. దాదాపు రెండున్నర గంటల సమయం పట్టింది. ఎలాంటి ఇబ్బందులు లేకపోవడం, రక్తస్రా వం కూడా వీలైనంత తక్కువగా ఉండటంతో ఆమె త్వ రగా కోలుకుంది. దీంతో ఆమెను అదే నెల 26న డిశ్చార్జ్ చేశాం. తిరిగి ఆమె వైద్యసేవల కోసం శుక్రవా రం రాగా పరీక్షించి ఆపరేషన్ విజయవంతం అయ్యిందని నిర్ధారించుకున్నాం’ అని డాక్టర్ వివరించారు. -
హోరాహోరీగా రాష్ట్రస్థాయి ఎద్దుల పోటీలు
మద్దికెర: శ్రీ మద్దమాంబ రథోత్సవం సందర్భంగా మండల కేంద్రమైన మద్దికెరలో శుక్రవారం రాష్ట్రస్థాయి ఎద్దుల పోటీలు నిర్వహించారు. పోటీలను ఎస్ఐ విజయ్కుమార్ నాయక్, ఎంపీపీ అనిత, సర్పంచ్ సుహాసిని ప్రారంభించారు. గుంతకల్లు రహదారిలో ఉన్న మైదానంలో నిర్వహించిన పోటీలు ఉదయం నుంచి ఉత్కంఠ భరితంగా సాగాయి. అనంతపురం జిల్లా ఎ. నారాయణపురం గ్రామానికి చెందిన షేక్ మహుద్ బాషా ఎద్దులు మొదటి, నంద్యాల జిల్లా పీఆర్ ఎం.నాగయ్య ఎద్దులు రెండో, అనంతపురం జిల్లా మెడికాలపల్లె తిరుపాల్ రెడ్డి ఎద్దులు మూడో, నంద్యాల జిల్లా సయ్యద్ కాలామ్ బాషా ఎద్దులు నాల్గో, నంద్యాల జిల్లా పీఆర్పల్లెకు చెందిన ఎద్దులు ఐదో స్థానంలో నిలిచాయి. వృషభాల యజమానులకు బహుమతులను నిర్వాహకులు మాజీ ఎంపీటీసీ శ్రీనివాసులు, కిట్టి, ఖాజావలి అందజేశారు. పోస్టల్ ఆర్డీ సొమ్ము స్వాహా పోస్టుమాస్టర్పై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు ఆత్మకూరు: మండలంలోని వడ్లరామాపురం గ్రామస్తులకు పోస్టుమాస్టర్ టోకరా వేసి నగదు స్వాహా చేశాడు. ఆలస్యంగా తెలుసుకున్న ఖాతాదారులు పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే..వడ్లరామాపురం పోస్టుమాస్టర్గా ముస్తఫా విధులు నిర్వహిస్తున్నాడు. గ్రామంలో పలువురు పోస్టల్ ఖాతా తెరిచి ఆర్డీలు, ఇన్సూరెన్స్ చేశారు. నెలనెలా వారు చెల్లించే సొమ్మును పోస్టుమాస్టర్ ఖాతాలో జమ చేయకుండా స్వాహా చేశాడు. ఖాతాదారులకు అనుమానం రాకుండా వారి పుస్తకంలో నమోదు చేశాడు. ఐదేళ్ల దాటడంతో తమ పొదుపు సొమ్ము ఇవ్వాలని ఖాతాదారులు అడగగా పోస్టుమాస్టర్ ఇవ్వకుండా నేడు..రేపు అనుకుంటూ వస్తున్నాడు. తమ డబ్బు ముస్తఫా కాజేశాడని తెలుసుకొని పలువురు శుక్రవారం ఆత్మకూరు ఎస్ఐ వెంకటనారాయణరెడ్డికి కలిసి ఫిర్యాదు చేశారు. సుగులూరు సుబ్బన్న రూ.70 వేలు, రత్నస్వామి రూ.2.20 లక్షలు, సముద్రం భాగ్యమ్మ రూ.50 వేలు, చెంచెన్న రూ.లక్ష, దేవరాజు రూ.90 వేలు, లలితమ్మ రూ.40 వేలు, వసుంధర రూ.20 వేలు, సీతమ్మ రూ.90 వేలు, చెన్నారెడ్డిగారి సుబ్బమ్మ రూ.2.14 లక్ష లు, గుర్రం సావిత్రమ్మ రూ.1.20 లక్షలు, శేషిరెడ్డి రూ. 80 వేలు, ప్రశాంతి రూ.32 వేలు, దేవరాజు రూ.10 వేలు, సుంకన్న రూ.43 వేలు చెల్లించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోస్టుమాస్టర్ను విచారిస్తున్నామని త్వరలో వివరాలు వెల్లడిస్తామని ఎస్ఐ తెలిపారు. అనంతపురం, నంద్యాల జిల్లాల వృషభాలకు మొదటి, ద్వితీయ బహుమతి -
ఇంట్లో చెట్టు... బయట కొమ్మలు
ఎప్పుడో ఆరు దశాబ్దాల క్రితం కోస్తా ప్రాంతం నుంచి కొందరు దొర్నిపాడు మండలానికి వలస వచ్చి ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రామచంద్రాపురం గ్రామంలో చాలా మంది సువిశాలమైన స్థలాల్లో గుడిసెలు, ఇంటి నిర్మాణాలు చేసుకున్నారు. బబ్బూరి వెంకటస్వామి అనే ఓ వ్యక్తి స్థలంలో పెద్ద వేప చెట్టు ఉంది. దానిని తొలగించడం ఇష్టం లేని సదరు వ్యక్తి కుటుంబం గృహ నిర్మాణాన్ని సైతం ఆ చెట్టు చుట్టే చేపట్టింది. లోపల చెట్టు మొదలు, బయట కొమ్మలు కనిపించేలా నిర్మించిన ఈ గూడు గ్రామంలో ప్రత్యేకంగా కనిపిస్తోంది. చెట్లపై మక్కువతోనే తాము ఇలా చేశామని, కొమ్మలు పైన ఉండటంతో వేసవిలో వేడి నుంచి ఉపశమనం లభిస్తుందని ఇంటి యజమాని పేర్కొన్నారు. – దొర్నిపాడు -
రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు
ఆలూరు రూరల్: టీడీపీ నేత, మంత్రి నారా లోకేష్ చెప్పిన విధంగా రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతోందని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి విమర్శించారు. వైఎస్సార్సీపీ నేతలను జైలుకు పంపడమే టీడీపీ నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. చిప్పగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొన్ని రోజుల క్రితం రాష్ట్ర మంత్రి లోకేష్ దావోస్ పర్యటన లో రెడ్బుక్ పూర్తిగా తెరవలేదని చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు రెండేళ్ల క్రితం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై అక్రమ కేసులు నమోదు చేసి రెడ్బుక్ తెరిచారా అన్ని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. వైఎస్సార్సీపీ నేతల పై కక్ష సాధింపు కోసమే పనిచేస్తున్నారని విమర్శించారు. సత్యవర్ధన్ అనే వ్యక్తి టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన రోజు తాను కార్యాలయంలో లేనని కోర్టులో న్యాయమూర్తి ఎదుట ఒప్పుకుని కేసు వాపసు తీసుకున్నా.. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం అన్యాయమన్నారు. పోలీసులు ముందస్తు నోటీసు ఇవ్వకుండానే బలవంతంగా అరెస్టు చేయడం, 8 గంటల వరకు స్టేషన్లో పెట్టుకుని జైలుకు పంపించడం దారుణమన్నారు. ‘సూపర్ సిక్స్’ను నమ్మి ప్రజలు ఓటు వేస్తే అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు.. వైఎస్సార్సీపీ నాయకులను జైలుకు పంపడ మే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించడం మంచిది కాదన్నారు. త్వరలోనే జగన్ 2.0 పాలన వస్తుందన్నారు. వైఎస్సార్సీపీ నేతలను జైలుకు పంపడమే టీడీపీ నేతల లక్ష్యం వల్లభనేని అక్రమ అరెస్టుపై మండిపడిన ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి -
సాంకేతిక పరిజ్ఞానంతో నేర నివారణ
కర్నూలు (టౌన్): నేరాల నివారణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. విజిబుల్ పోలీసింగ్కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో సీఐడీ ఫింగర్ ప్రింట్స్ బ్యూరో విభాగం నుంచి వచ్చిన ఫింగర్ ప్రింట్ లైవ్ స్కానర్లు, 8 మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైజ్ పరికరాలను ఎస్పీ సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు, ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు సబ్ డివిజన్లలో పోలీసులు వీటిని వినియోగించే విధంగా అందుబాటులోకి తెస్తామన్నారు. ఆధునిక పరికరాలతో నేరస్తులు, అనుమానితుల వేలి ముద్రలను వేగంగా కచ్చితత్వంతో సేకరిస్తామన్నారు. విజిబుల్ పోలీసింగ్లో భాగంగా జాతర లు, ఉత్సవాలు, బందోబస్తులో అనుమానిత ప్రాంతాల్లో నేరస్తులను గుర్తించేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తామన్నారు. కార్యక్రమంలో స్పెషల్బ్రాంచ్ సీఐ తేజో మూర్తి, ఫింగర్ ప్రింట్ సీఐ పవన్కుమార్ రెడ్డి, పత్తికొండ, ఎమ్మిగనూరు, ఆలూరు సీఐలు జయన్న, శ్రీనివాసులు, వెంకటాచలపతి పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ -
ఆందోళన అవసరం లేదు
బర్డ్ప్లూ నిర్ధారణ అయినప్పటికీ జిల్లా ప్రజలు ఆందోళన చెందాల్సి న అవసరం లేదు. రెడ్ జోన్గా గుర్తించిన కర్నూలులోని ఎన్ఆర్ పేటలో చికెన్, గుడ్ల అమ్మకాలను బంద్ చేశాం. మిగిలిన ప్రాంతాల్లో చికెన్, గుడ్లను తినవచ్చు. అయితే 100 డిగ్రీల వేడిలో ఉడికించి తినాలి. 50 డిగ్రీల్లో ఉడికిస్తే వైరస్ మొత్తం చనిపోతుంది. 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికిస్తే ఎలాంటి ప్రమాదం లేదు. పాజిటివ్ కేసు వచ్చినందున బయో సెక్యూరిటీ మెజర్స్ను పాటిస్తున్నాం. కోళ్లు, బాతులు మృతిచెందితే అధికారులకు సమాచారం ఇవ్వాలి. –జి.శ్రీనివాస్, జాయింట్ డైరెక్టర్, పశుసంవర్ధక శాఖ -
ముమ్మరంగా రైతుల రిజిస్ట్రేషన్
● కర్నూలు జిల్లాలో 39,373, నంద్యాల జిల్లాలో 35,598 నమోదు కర్నూలు(అగ్రికల్చర్): కేంద్రప్రభుత్వం దేశ వ్యాప్తంగా రైతులకు ఆధార్ తరహాలో 11 అంకెల తో కూడిన ప్రత్యేక నెంబరును కేటాయించే ప్రక్రియ ఊపందుకుంది. కర్నూలు, నంద్యాల జిల్లాలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ పోర్టల్ (ఏపీఎఫ్ఆర్)లో రైతులను రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమం శరవేగంగా సాగుతోంది. కర్నూలు జిల్లాలో 2,52,624 మంది రైతులు ఉండగా...రైతు సేవా కేంద్రాల ఇన్చార్జీలు 39,373 మందిని ఎన్రోల్మెంటు చేశారు. నంద్యాల జిల్లాలో 2,03,291 మంది రైతులు ఉండగా.. 35,598 మంది రైతులను నమోదు చేశారు. ఆధార్లో పేర్ల వివరాలు, ఆర్వోఆర్లోని వివరాలు 80 శాతం వరకు సరిపోతే రైతు సేవా కేంద్రం ఇన్చార్జి పరిధిలోనే 11 అంకెల యూనిక్ ఐడీ నెంబరు జారీ అవుతోంది. ఆధార్, ఆర్వోఆర్లోని వివరాలు 80 శాతం వరకు సరిపోకపోతే అటువంటి వాటిని వీఆర్వో లాగిన్కు అప్లోడ్ చేస్తారు. వీఆర్వోలు రెవెన్యూ రికార్డులు, ఆర్వోఆర్లోని వివరాలు పరిశీలిస్తారు. ఆర్వోఆర్ వివరాల్లో తేడాలు ఉంటే వెబ్ల్యాండ్లో సరిచేస్తారు. ఆ తర్వాతనే యూనిక్ ఐడీ వస్తుంది. కర్నూలు జిల్లాలో 29,441 మంది, నంద్యాల జిల్లాలో 25,237 మంది రైతుల ఆధార్ వివరాలతో ఆర్వోఆర్ వివరాల్లో తేడాలు ఉండటంతో వీఆర్వో లాగిన్కు పంపారు. రైతులు సంబంధిత రైతు సేవా కేంద్రాల ఇన్చార్జీలను సంప్రదించి ఏపీఎఫ్ఆర్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి సూచించారు. -
రీసర్వే పారదర్శకంగా చేపట్టాలి
● జేసీ డాక్టర్ నవ్య కృష్ణగిరి: రీ సర్వే ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి. నవ్య అధికారులను ఆదేశించారు. ఎరుకలచెరువు గ్రామ రెవిన్యూ పరిధిలో జరుగుతున్న సర్వేను శుక్రవారం ఆమె పరిశీలించారు. రీ సర్వే ఎంత మంది చేస్తున్నారు, ఎన్ని ఎకరాల్లో పూర్తి చేశారు.. తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రీ సర్వే చేసే భూముల్లో ముందుగా రైతులకు నోటీసులు ద్వారా తెలియజేయాలన్నారు. ఎక్కడ తప్పులు లేకుండా రీ సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. చనిపోయిన వారికి వారి వారసుల పేరు మీద మ్యుటేషన్ చేయాలన్నారు. రైతులకు తెలియకుండా సర్వే చేస్తే చర్యలు తప్పవన్నారు. గ్రామ, బ్లాక్, ప్రభుత్వ సరిహద్దులను పక్కాగా నిర్ధారించాలన్నారు. గ్రామ ప్రజల సమక్షంలోనే సర్వే చేపట్టాలని సూచించారు. అనంతరం కృష్ణగిరి తహసీల్దార్ కార్యాలయంలో సర్వేపై వీఆర్వోలు, సర్వేయర్లకు పలు సూచనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఈమె వెంట పత్తికొండ ఆర్డీఓ భరత్నాయక్, తహసీల్దార్ దేవ. చంద్రశేఖర్, డీటీ లక్ష్మిరాజు, వీఆర్వోలు, సర్వేయర్లు ఉన్నారు. శ్రీమఠానికి రూ.40 లక్షలు విరాళం మంత్రాలయం: రాఘవేంద్ర స్వామి శ్రీమఠానికి యూఎస్ఏలో స్థిరపడిన బెంగళూరుకు చెందిన సింధుప్రియ అనే భక్తురాలు రూ.40 లక్షలు విరాళం అందజేశారు. శుక్రవారం రాత్రి ఆమె మంత్రాలయం వచ్చి ముందుగా మంచాలమ్మ దర్శించుకున్నారు. అనంతరం రాఘవేంద్ర స్వామి మూలబృందావనం చేరుకు ని పూజలు చేసుకుని మొక్కులు చెల్లించారు. ఆమెను శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు శాలువాతో సత్కరించి మంత్రాక్షింతలతో ఆశీర్వదించారు. విరాళాన్ని అన్నదానం, గోశాల, మఠం అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించాలని దాత కోరినట్లు మేనేజర్ వెంకటేష్ జోషి, ఏఏఓ మాధవ శెట్టి తెలిపారు. -
క్రమశిక్షణకు మారుపేరు నవోదయ విద్యాలయాలు
ఎమ్మిగనూరురూరల్: క్రమ శిక్షణకు మారుపేరు జవహార్ నవోదయ విద్యాలయాలని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్యభరద్వాజ్ అన్నారు. శుక్రవారం బనవాసి జవహార్ నవోదయ విద్యాలయంలో ప్రిన్సిపాల్ ఇ. పద్మావతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాజపురస్కార్ టెస్టింగ్ క్యాంప్ ముగింపు కార్యాక్రమానికి సబ్ కలెక్టర్ ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ రాజపురస్కార్ టెస్టింగ్ క్యాంప్కు వచ్చిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదేచ్చేరి రాష్ట్రాల నుంచి 16 నవోదయ విద్యాలయాల భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు ఇది ఒక సువర్ణ అవకాశమని చెప్పారు. ఈ క్యాంప్ సర్టిఫికెట్ భవిష్యత్లో ఉద్యోగాలకు చాలా ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ చందిరన్, తహసీల్దార్ శేషఫణి, ఎల్ఓసీ స్కౌట్స్ బాబురావు నింబూరె, ఎల్ఓసీ గైడ్స్ మల్లేశ్వరి, శిక్షణ పరిశీలకులు అనిల్శాస్త్రి, రమేష్, శివకుమార్, విద్యాలయ స్కౌట్స్, గైడ్స్ మాస్టర్లు శశికిరణ్, మీనాచంద్రన్ తదితరులు పాల్గొన్నారు. జనరిక్ మెడికల్ షాపుల ఏర్పాటుకు రుణాలు కర్నూలు(అర్బన్): జిల్లాలోని బీసీ, ఈబీసీ, కమ్మ, రెడ్డి, ఆర్యవైశ్య, బ్రాహ్మణ సామాజిక వర్గాలకు చెందిన వారికి జనరిక్ మెడికల్ షాపులు ఏర్పాటు చేసుకునేందుకు సబ్సిడీపై రుణాలను అందించనున్నట్లు బీసీ కార్పొరేషన్ ఈడీ ఎస్ జాకీర్హుసేన్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు 21 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు వారై, రేషన్ కార్డు, ఆధార్కార్డు, కుల ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలన్నారు. బీ ఫార్మసీ/ ఎం ఫార్మసీ సర్టిఫికెట్లు ఉండాలన్నారు. అర్హత కలిగిన వారు https://apobmms.apcfss.inలో దరఖాస్తు చేసుకోవాలని ఈడీ కోరారు. తపాలా శాఖనుప్రైవేటు పరం కానివ్వం కర్నూలు(అర్బన్): కేంద్ర ప్రభుత్వం తపాలా శాఖను మూడు ముక్కలుగా చీల్చి ప్రైవేటు పరం చేసే ప్రయత్నాలను తిప్పికొడతామని పోస్టల్ జేఏసీ నేతలు ఈశ్వరయ్య, గిరిబాబు అన్నారు. కేంద్ర ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ శుక్రవారం స్థానిక తపాలా శాఖ ప్రధాన కార్యాలయం ఎదు ట ఉద్యోగులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తపాలా శాఖను ముక్క లు చేసేందుకు కుట్ర పన్నారన్నారు. తపాలా శాఖను ఐపీపీబీలోకి మెర్జ్ చేసి అమెజాన్ లాంటి ప్రైవేటు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని 150 సంవత్సరాల చరిత్ర ఉన్న తపాలా శాఖను కనుమరుగు చేయాలని చూస్తున్నారన్నారు. ఈ కుట్రలను ముక్త కంఠంతో ఎదుర్కోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఆందోళనలో జేఏసీ నేతలు శమంతకరెడ్డి, మోహమ్మద్ జానీ, విజయ్, శివకుమార్రెడ్డి, మురళీ, లక్ష్మీకాంత్, రమేష్బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ–క్రాప్ నమోదు వంద శాతం చేయాలి కర్నూలు(అగ్రికల్చర్): రబీ సీజన్లో సాగు చేసిన ఉద్యాన పంటలు వంద శాతం ఈ–క్రాప్లో నమోదు చేయడంపై దృష్టి సారించాలని జిల్లా ఉద్యాన అధికారి పి.రామాంజనేయులు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని ఉద్యాన శాఖ కార్యాలయంలో జిల్లాలోని అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంప్రదాయ పంటల సాగుకు ప్రత్యామ్నాయంగా ఉద్యాన పంటలను ప్రోత్సహించాలన్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు వస్తున్నందున ఎంఐడీహెచ్, ఆర్కేవీవై లక్ష్యాలను వంద శాతం సాధించడంపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. బోర్లలో భూగర్భ జలాలు ఆశాజనకంగా ఉన్న రైతులతో ఆయిల్ఫామ్ సాగును ప్రోత్సహించాలని సూచించారు. ఈ ఏడాది మామిడిలో పూత ఆశాజనకంగా వచ్చిందని, పూత, పిందె రాలిపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన పెంచాలన్నారు. సమావేశంలో సాంకేతిక ఉద్యాన అధికారి వి. అనూష, ఉద్యాన అధికారులు మదన్మోహన్ గౌడు తదితరులు పాల్గొన్నారు. -
ఆదర్శప్రాయులు దామోదరం సంజీవయ్య
కర్నూలు(అర్బన్): నేటి యువతరానికి మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఆదర్శప్రాయులని జిల్లా కలెక్టర్ రంజిత్బాషా అన్నారు. శుక్రవారం దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా స్థానిక నంద్యాల చెక్పోస్టు కూడలిలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారన్నారు. సమాజానికి స్ఫూర్తి ప్రదాత అయిన సంజీవయ్య జిల్లాలోని పెద్దపాడు గ్రామంలో 1921 ఫిబ్రవరి 14వ తేదీన నిరుపేద కుటుంబంలో జన్మించారన్నారు. కార్మిక శాఖా మంత్రిగా ఉన్న సమయంలో ఆయన బోనస్లు ప్రకటించారని, వృద్ధాప్య పెన్షన్ను ప్రవేశ పెట్టారన్నారు. కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరును పెట్టాలని, నన్నూరు సమీపంలో కేటాయించిన స్థలంలో ఆయన స్మృతివనం ఏర్పాటు చేసే అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి హోదాలో సంజీవయ్య ఆరు లక్షల ఎకరాల బంజరు భూములను పేదలకు పంచారన్నారు. గాజులదిన్నె ప్రాజెక్టును ఏర్పాటు చేసి సాగు, తాగు నీటి ఇబ్బందులను తొలగించారన్నారు. సభలో సంజీవయ్య అన్న కుమారుడు దామోదరం రాధాకృష్ణను జిల్లా కలెక్టర్ ఘనంగా సన్మానించారు. అలాగే వివిధ పాఠశాలల్లో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలైన విద్యార్థినులకు బహుమతులు అందించారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దామోదరం సంజీవయ్య చిత్ర పటానికి కలెక్టర్ రంజిత్బాషా పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో పాణ్యం, కోడుమూరు ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, బొగ్గుల దస్తగిరి, కర్నూలు ఆర్డీఓ కిడారి సందీప్కుమార్, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ తులసీదేవి, బీసీ కార్పొరేషన్ ఈడీ జాకీర్హుసేన్, దూరదర్శన్ డైరెక్టర్ రంగస్వామి, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ మంజునాథ్, పలు దళిత, ప్రజా సంఘాల నాయకులు కాసారపు వెంకటేష్, ధరూర్ జేమ్స్, ఆర్ చంద్రప్ప, వై రాజు, నాయకల్లు సోమసుందరం, ఆర్ రాజ్కుమార్, చిటికెల సామేల్, వీ త్యాగరాజు, ఆర్ కై లాస్నాయక్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ రంజిత్బాషా -
జాగ్రత్తలు ఇవీ..
● కర్నూలులో ఈనెల 3,4 తేదీల్లో బాతులు మృతి ● ఆలస్యంగా స్పందించిన పశుసంవర్ధకశాఖ అధికారులు ● రెడ్జోన్లో చికెన్, గుడ్ల అమ్మకాల నిషేధం ● 35 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ల ఏర్పాటు ● జిల్లాలోని కోళ్ల ఫారాల్లో తనిఖీలు బర్డ్ఫ్లూ నియంత్రణలో పశుసంవర్ధకశాఖ అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. కర్నూలులో పది రోజుల క్రితం ఉన్నట్టుండి 15 బాతులు మృతిచెందాయి. బర్డ్ఫ్లూ లక్షణాలు కనిపించాయి. రక్త నమూనాలు, శీరం తదితర శ్యాంపుల్ సేకరించి భోపాల్లోని హైసెక్యూరిటీ ల్యాబ్కు పంపి మౌనంగా ఉండిపోయారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కోళ్లు పెద్ద ఎత్తున మరణించినప్పటికీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో అధికారులు చర్యలు తీసుకోలేదు. ‘బర్డ్ఫ్లూ’ వెలుగు చూడటంతో ప్రజలు భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా కేంద్రమైన కర్నూలులో బర్డ్ఫ్లూతో బాతులు మృతిచెందడం కలకలం రేపింది. అధికారుల్లో హడావుడి మొదలైంది. పశుసంవర్ధక శాఖతో పాటు రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖలు కూడా రంగంలోకి దిగాయి. బయో సెక్యూరిటీ మెజర్స్ అమలుపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. అంతర్ రాష్ట్ర చెక్పోస్టుల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కోళ్లు, బాతులు, ఇతర జాతి పక్షులు జిల్లాలోకి రవాణా కాకుండా నిఘా పెంచారు. పశు వైద్యాధికారులతో కర్నూలు డివిజన్లో 14, ఆదోని డివిజన్లో 21 ప్రకారం మొత్తం 35 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్లు ఏర్పాటయ్యాయి. కనిపించని మందులు బర్డ్ఫ్లూతో బాతులు మృతిచెందడంతో కర్నూలులోని ఎన్ఆర్పేట చుట్టూ కిలోమీటరు పరిధిని రెడ్ అలర్ట్ జోన్గా అధికారులు ప్రకటించారు. ఈ ప్రాంతంలో కోళ్లు, గుడ్ల అమ్మకాలపై నిషేధం విధించారు. ఎన్ఆర్ పేటకే ఐదు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్లు ఏర్పాటయ్యా యి. ఈ టీమ్ల్లోని పశువైద్య అధికారులు ఈ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. దుకాణాల్లో కోళ్లు, గుడ్లు అనేవి కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మున్సిపల్ అధికారులు పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరం చేశారు. అయితే పది రోజుల క్రితమే బాతులు బర్డ్ఫ్లూతో మృతి చెందాయి కదా.. అది ఏ స్థాయికి విస్తరించిందో అన్న భయాందోళనలు ప్రజల ను వెంటాడుతున్నాయి. బర్డ్ఫ్లూ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి మందులు సరఫరా చేయలేదు. అయితే ఓ ప్రజా ప్రతినిధి నివాసంలోనే బాతులు మృతి చెందాయనే ప్రచారం జరుగుతోంది. తనిఖీలు ముమ్మరం కర్నూలు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఎనిమిది కోళ్లఫారాలు ఉన్నాయి. వగరూరు, వెల్దుర్తి, కోడుమూరు మండలం ప్యాలకుర్తి, కృష్ణగిరి మండలం కోయిలకొండ, కర్నూలు మండలం గార్గేయపురం, దేవనకొండ మండలం నేలతలమర్రి, కుంకనూరు, దేవనకొండలో ఈ ఫారాలు ఉన్నాయి. వీటిల్లో 5,84,911 కోళ్లు ఉన్నాయి. కోళ్లఫారాలను ర్యాపిడ్ రెస్పాన్స్ బృంద సభ్యులు తనిఖీలు చేశారు. అనుమానాస్పద స్థితిలో కోళ్లు మృతిచెందితే వెంటనే సమాచారం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. కాగా.. కర్నూలులో ‘బర్డ్ఫ్లూ’ వెలుగు చూడటంతో ఒక్కసారిగా చికెన్, గుడ్ల అమ్మకాలు 50 శాతంపైగా పడిపోయినట్లు తెలుస్తోంది.● బర్డ్ప్లూ వెలుగు చూడటంతో జిల్లా యంత్రాంగం బయో సెక్యూటరీ మెజర్స్పై దృష్టి సారించింది. ● కోళ్ల ఫారాల్లోకి ప్రజలను అనుమతించరు. ● కోళ్ల ఫారాల నిర్వాహకులు, డాక్టర్లు సైతం డెటాల్ నీళ్లలో కాళ్లు ముంచి వెళ్లాలి. ● పశువైద్యులు ఒక ఫారాన్ని తనిఖీ చేసిన తర్వాత మరో ఫారానికి వెళ్లరాదు. ● చికెన్, గుడ్లను 100 డిగ్రీల టెంపరేచర్లో ఉడికించి తినాలి. ● కోళ్లు, బాతులు, ఇతర జాతి పక్షులు మృతి చెందితే పశువైద్యులకు సమాచారం ఇవ్వాలి. ● పెరటి కోళ్ల పెంపకందారులు అధికారుల సూచనలు పాటించాలి. ● షెడ్డులో, పెరట్లో కోళ్ల ఆరోగ్యంలో తేడాలు ఎక్కువ శాతం ఉంటే పశువైద్య అధికారులకు సమాచారం ఇవ్వాలి. ● కోడి మాంసం, గుడ్లను తిన్న వారికి జలుబు, దగ్గు, కండరాల నొప్పులు, గొంతునొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చమటలు పట్టడం, వాంతులు విరేచనాలు అవడం వంటి లక్షణాలు కనిపిస్తే డాక్టర్ను సంప్రదించాలి. ● మనుషుల నుంచి మనుషులకు బర్డ్ప్లూ వ్యాధి వ్యాప్తి చెందదు. కోళ్లలో బర్డ్ఫ్లూ లక్షణాలు ఇవీ.. ముక్కు, కళ్ల వెంబడి నీరు కారుతుంది. మెడ వాల్చడం, నీరసంగా ఉండడం కనిపిస్త్తుంది. మచ్చలు ఏర్పడటం, విరేచనాలు ఎక్కువ కావడం గమనించవచ్చు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు 24–48 గంటలలో కోళ్లు మృతిచెందుతాయి. -
వీర జవాన్లకు జోహార్లు
పుల్వామా దాడిలో అశువులు బాసిన భారత వీర జవాన్లకు శుక్రవారం పత్తికొండలో నివాళులర్పించారు. స్థానిక నాలుగు స్తంభాల కూడలిలో అమరవీరుల చిత్రపటాలను ప్రదర్శించి కొవ్వొత్తులు వెలిగించి జోహార్లు అర్పించారు. ఆరేళ్ల క్రితం 2019 ఫిబ్రవరి 14వ తేదీన దేశ సరిహద్దులోని జమ్మూ కాశ్మీర్ పుల్వామా జిల్లాలో భారత సైనికుల వాహనంపై ఉగ్రదాడి జరగడంతో 40 మంది జవాన్లు మృతి చెందారు. నివాళులర్పించిన వారిలో ఎస్ఐ గోపాల్, స్థానికులు ప్రతాప్, కరణం నరేష్ తదితరులు ఉన్నారు. – పత్తికొండ రూరల్ -
చిన్నారుల అభ్యున్నతికే ఇంటింటి సర్వే
కర్నూలు: చిన్నారులకు సంబంధించి శారీరక, మానసిక, వినికిడి, గ్రహణమొర్రి, మాట ఉచ్ఛారణ వంటి సమస్యలను డీఈఐసీ సెంటర్ ద్వారా ఉచితంగా పరి ష్కరించి చిన్నారుల జీవనాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి తెలిపారు. గురువారం నగరంలోని ఇల్లూరు నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి ఇందిరాగాంధీ నగర్ వరకు ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లీగల్ సర్వీసెస్ వారు ఇంటింటి సర్వే నిర్వహించడానికి న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లచే బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఈనెల 10 నుంచి 24వ తేదీ వరకు జరిగే సర్వేలో ప్రాథమిక దశలో గుర్తించగలిగిన వైకల్యాలను ప్రభుత్వ ఆసుపత్రిలోని డీఈఐసీ సెంటర్కు పంపించడం జరుగుతుందన్నారు. న్యాయవాదులు నిర్మల, శివసుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. -
మద్దమాంబా.. చల్లగా చూడమ్మా!
అశేష జనవాహిని మధ్య మద్దికెర మద్దమాంబ రథోత్సవం కనులపండువగా సాగింది. ఆచార సంప్రదాయాన్ని కొనసాగిస్తూ పెద్దనగరి, చిన్ననగరి యాదవ కుటుంబీకులు ప్రత్యేక దుస్తులతో ఇంటి నుంచి మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయానికి వచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రథంపై కొలువుంచగా కళాకారులు నృత్యం చేస్తుండగా.. పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చుతుండగా భక్తులు రథాన్ని ముందుకు కదిలించారు. భక్తులు ‘మద్దమాంబకు జై’.. అంటూ రథం పైకి అరటిపళ్లు విసిరి భక్తిని చాటుకున్నారు. – మద్దికెర ఆలయంలో ప్రత్యేక ఆలంకరణలో మద్దమాంబ -
బర్డ్ఫ్లూ రెడ్ అలర్ట్
కర్నూలు (అగ్రికల్చర్): కర్నూలు నగరంలో బర్డ్ఫ్లూ సోకి బాతులు మృతిచెందిన నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తమయ్యింది. నగరంలోని ఎన్ఆర్పేటను జిల్లా యంత్రాంగం రెడ్ అలర్ట్ జోన్గా ప్రకటించారు. స్థానిక బెస్త రాజుకు చెందిన 15 బాతులు మృతి చెందడం, అందుకు బర్డ్ఫ్లూ కారణమని ల్యాబ్ నుంచి నివేదిక రావడంతో చుట్టూ కిలోమీటర్ మేర రెడ్ అలర్ట్ జోన్గా ప్రకటించారు. ఈ ప్రాంతంలో చికెన్, గుడ్లు అమ్మకాలు చేపట్టకుండా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆరుగురు పశుసంవర్థక శాఖ అధికారులతో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. కోళ్లు, బాతులు, ఇతర పక్షులు అకస్మాత్తుగా మరణిస్తుంటే వెంటనే తగిన సమాచారం ఇవ్వాలని పశుసంవర్థక శాఖ అధికారులు కోళ్లు, బర్డ్స్ పెంపకందారులకు సూచించారు. అప్రమత్తంగా ఉండండి కర్నూలు (హాస్పిటల్): కోళ్లకు వ్యాపిస్తున్న బర్డ్ఫ్లూ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆదేశించారు. గురువారం ఆయన రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో రెండు మూడు జిల్లాల్లో కోళ్లకు బర్డ్ఫ్లూ వ్యాధి వ్యాపించిందన్నారు. ఇతర జిల్లాల్లోనూ ఈ వ్యాధి వ్యాపిస్తే అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఈ వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, చనిపోయిన కోళ్లను సక్రమంగా పూడ్చిపెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలిచ్చారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా డీఎంహెచ్ఓ డాక్టర్ పి.శాంతికళ, ట్రైనీ కలెక్టర్ చల్లా కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. కర్నూలు ఎన్ఆర్పేటను రెడ్ అలర్ట్ జోన్గా ప్రకటన ఈ ప్రాంతంలో చికెన్, గుడ్ల అమ్మకాలు నిషేధం