breaking news
Kurnool
-
254 ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలే లక్ష్యంగా కార్యాచరణ
● జెడ్పీ సీఈఓ, డీపీఓకర్నూలు(అర్బన్): జిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 254 గ్రామాలను ఓడీఎఫ్ ప్లస్ (బహిరంగ మల విసర్జన రహిత )గా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు జిల్లా పరిషత్ సీఈఓ జీ నాసరరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి జి. భాస్కర్ చెప్పారు. శుక్రవారం జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో సమావేశమై జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించి సంబంధిత ఎంపీడీఓలకు కార్యాచరణను సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ... మొత్తం 484 గ్రామ పంచాయతీల్లో 351 గ్రామ పంచాయతీల్లో వెరిఫికేషన్ జరుగుతుందన్నారు. అలాగే వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకు సంబంధించి స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ కింద 4271, ప్రధానమంత్రి ఆవాజ్ మోజన గ్రామీణ్ కింద 16,106 వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించాల్సి ఉందన్నారు. ఈ మేరకు ఆయా గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పించి మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు కార్యోణ్ముఖులు చేయాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారుల సమన్వయంతో 277 కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్లను నిర్మించాలన్నారు. జిల్లాలోని 484 గ్రామ పంచాయతీల్లో ఇప్పటి వరకు 409 సాలీడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్లను నిర్మించామని, మిగిలిన వాటిని ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి పూర్తి చేయాలన్నారు. ఇందుకు సంబంధిత ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అలాగే 208 గ్రామాల్లో లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్లను ఏర్పాటు చేయాలన్నారు. -
పోలూరు వంకాయకు త్వరలో దేశవ్యాప్త గుర్తింపు
మహానంది: నంద్యాల జిల్లా పోలూరులో సాగయ్యే వంకాయకు త్వరలోనే దేశవ్యాప్త గుర్తింపు వస్తుందని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ ఠాగూర్ నాయక్, డాక్టర్ సీహెచ్ కిషోర్కుమార్, డాక్టర్ తమ్మాలి హేమాద్రి తెలిపారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. అనేక జిల్లాల నుంచి వ్యాపారులు పోలూరు వంకాయల కోసం వస్తుంటారన్నారు. ఇక్కడ పండించే వంకాయ ఓ కూరగాయగానే కాకుండా ప్రాచీన సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాలతో పాటు అనంతపురం, ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల్లోనూ ఈ పంట సాగవుతుందన్నారు. ఇంతటి ప్రసిద్ధి చెందిన పోలూరు వంకాయకు వ్యవసాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్(జీఐ) ట్యాగ్ పొందితే దేశవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందన్నారు. అప్పుడు ఈ వంకాయలు ప్రీమియం కస్టమర్ల మార్కెట్లోకి ప్రవేశించి సరైన ధర చెల్లించేందుకు సిద్ధంగా ఉన్న వినియోగదారులను ఆకర్షిస్తుందన్నారు. తద్వారా మార్కెట్లో మంచి ధరలు లభించడంతో రైతులకు మేలైన లాభా లు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పోలూరు వంకాయ ప్రత్యేకతపై పరిశోధనలు చేసి యూనివర్సిటీకి సమర్పించనున్నట్లు వారు వివరించారు. వంకాయ మొక్కను, కాయలనుపరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు -
శతాధిక వృద్ధురాలు మృతి
కృష్ణగిరి: మండలంలోని రామకృష్ణాపురం గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు బోయ వల్లె మాదమ్మ(115) శుక్రవారం మృతి చెందారు. ఈమె భర్త ఓబన్న కొన్నేళ్ల క్రితమే మృత్యువాతపడ్డారు. మాదమ్మకు ఐదుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు కాగా, మనవళ్లు, మనవరాళ్లకు కూడా వివాహాలయ్యాయి. అంతా కలిపి దాదాపుగా 80 మంది సభ్యులుంటారు. అందరి పెళ్లిళ్లు కళ్లారా చూసిన మాదమ్మ మునిమనవళ్లతో ఆనందంగా గడిపేది. అనారోగ్య సమస్యలతోడు వయోభారం పెరగడంతో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కొన్నేళ్ల క్రితమే పాలపళ్లు కూడా వచ్చాయని వారు తెలిపారు. 48 సెల్ ఫోన్లు రికవరీ డోన్ టౌన్: చోరీకి గురైన 48 సెల్ ఫోన్లను డోన్ పోలీసులు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. శుక్రవారం పట్టణ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సీఐలు ఇంతియాజ్బాషా, సీఎం రాకేష్ మాట్లాడుతూ ఎవరైనా సెల్ ఫోన్లు పోగొంటుకుంటే వెంటనే స్థానిక పోలీసు స్టేషన్లో ఫోన్ ఐఎంఈఐ నంబరుతో లేదా వాట్సాప్ ద్వార ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐలు శరత్కుమార్ రెడ్డి, నరేంద్రకుమార్, ట్రైనింగ్ ఎస్ఐ రవ్రికాష్, సిబ్బంది ఉన్నారు. జ్వరంతో చిన్నారి మృతి హాలహర్వి: గూళ్యం గ్రామంలో ఓ మూడేళ్ల చిన్నారి జ్వరంతో బాధపడుతూ మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గాదిలింగ, పవిత్ర దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె దీవెన (03)కు జ్వరం ఎక్కువ కావడంతో గ్రామంలో వైద్యుల వద్ద చూపించినా తగ్గలేదు. దీంతో శుక్ర వారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో జ్వరం తీవ్రత మరింత పెరగడంతో కర్ణాటక రాష్ట్రం బళ్లారి ఆసుపత్రికి తీసుకెళ్లే లోపు చిన్నారి మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. 11 వేల జనాభా ఉన్న తమ గ్రామంలో సరైన ఆసుపత్రి ఉంటే మా పాప బతికేదని తండ్రి గాదిలింగ రోదిస్తున్నాడు. గ్రామానికి సమీపంలోని వేదావతి నదిపై బ్రిడ్జిని నిర్మించి ఉంటే కేవలం 20 కి.మీ. దూరంలో బళ్లారి జిల్లా కేంద్రానికి సకాలంలో తీసుకెళ్లే వారమన్నారు. వంతెన లేకపోవడంతో గూళ్యం–హాలహర్వి–బళ్లారికి వెళ్లేందుకు 45 కి.మీ. పైగా దూరం ఉండటంతో ఆలస్యమై వైద్యం అందక బిడ్డ చనిపోయిందన్నారు. 29న కవి సమ్మేళనం కర్నూలు కల్చరల్: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఈ నెల 29న సాయంత్రం 6 గంటలకు టీజీవీ కళాక్షేత్రం సాహితీ వేదికలో తెలుగు కవుల సమ్మేళనం ఏర్పాటు చేసినట్లు అధ్యక్షుడు పత్తి ఓబులయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో పాల్గొనే కవులు తెలుగు భాషలో పద్యం, గేయం, కవిత్వంను మూడు నిమిషాల వ్యవధిలో చెప్పాల్సి ఉంటుందన్నారు. ఆసక్తి ఉన్న వారు 9989265632 నంబర్కు వాట్సాప్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవచ్చన్నారు. -
రాయలసీమ ల్యాబ్కు రాసిన వాటిలో కొన్ని...
● ప్రభుత్వ సర్వజన వైద్యశాల నుంచి ఈ నెల 17న పద్మావతి (35) అనే రోగికి సీరమ్ ఎలక్ట్రోలైట్స్, థైరాయిడ్ ప్రొఫైల్, సీరమ్ క్రియాటినిన్ పరీక్షలు రాశారు. ఇందుకు రూ.1100 ఛార్జి చేశారు. ఈమెకే పాప్ స్మియర్ పరీక్ష రాయగా రూ.600 వసూలు చేశారు. ● ప్రభుత్వ ఆసుపత్రి నుంచి భవాని(25) అనే మహిళకు 7వ తేదిన యాంటీ సీసీపీ పరీక్ష రాయగా రూ.1,500 వసూలు చేశారు. ● అలాగే విజయ అనే మహిళకు సీరమ్ ఫెర్రిటిన్ పరీక్ష రాశారు. ● దేవమ్మ(65) అనే వృద్ధురాలికి 12వ తేదీన ఎంఎస్–6 నుంచి పీటీ ఐఎన్ఆర్ పరీక్ష రాయగా రూ.400 వసూలు చేశారు. ● స్వరూప అనే శిశువుకు చిన్నపిల్లల విభాగం వారు ఏబీజీ కిట్ పరీక్ష రాశారు. ● చర్మవ్యాధుల విభాగం(డీవీఎల్) నుంచి కాలమ్మ(44) అనే మహిళకు ఇటీవల ఏఎన్ఏ ప్రొఫైల్ పరీక్ష రాశారు. ● రేష్మి(34) అనే మహిళకు పీటీ ఐఎన్ఆర్ పరీక్ష చేయించారు. ● జనరల్ మెడిసిన్ విభాగం నుంచి అశోక్కుమార్ అనే వ్యక్తికి పీటీ ఐఎన్ఆర్ పరీక్ష రాశారు. -
డాక్టరు గారూ..ఇదేం రోగం!
ప్రైవేట్లో డబ్బులు ఖర్చు పెట్టి చూపించుకునే ఆర్థిక స్థోమత లేకనే పేదలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వస్తారు. అలాంటి వారికి పైసా ఖర్చు ఖర్చుకాకుండా చూడాల్సిన వైద్యులే అకారణంగా మందులు, వైద్య పరీక్షలు బయటకు రాస్తున్నారు. ఇందుకు ఇక్కడ వైద్యపరీక్షలు త్వరగా ఇవ్వరని, మరికొన్ని లేవన్న సాకులు చెబుతున్నారు. దీంతో తప్పని పరిస్థితిలో పేదలు ఎండనక వాననక కాయకష్టం చేసి సంపాదించి దాచుకున్న డబ్బును వైద్య పరీక్షలకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ముఖ్యంగా ఆసుపత్రి ఎదురుగా ఉండే ఒక ల్యాబ్పై కొందరు వైద్యులు వల్లమాలిన అభిమానం చూపుతూ వైద్య పరీక్షలన్నీ అక్కడికే రాస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, రాయచోటి జిల్లాల నుంచే గాక పక్క రాష్ట్రాలైన కర్నాటక, తెలంగాణాలోని పలు జిల్లాల నుంచి సైతం రోగులు చికిత్స నిమిత్తం వస్తున్నారు. ప్రతిరోజూ ఓపీ రోగుల సంఖ్య 2500 నుంచి 3వేల దాకా, ఇన్పేషంట్ల సంఖ్య 1200 నుంచి 1500ల దాకా ఉంటుంది. వీరిలో 70 శాతంకు పైగా రోగులకు పలు వైద్యపరీక్షలు అవసరం అవుతుంటాయి. రక్తపరీక్షలు, మూత్రపరీక్షలు, ఎక్స్రే, సీటిస్కాన్, ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్ వంటి పరీక్షలు ఆసుపత్రినే నిర్వహించేందుకు అవసరమైన వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా డయాగ్నోస్టిక్ బ్లాక్ను నిర్మించారు. రోగులు ఆసుపత్రిలో అటు ఇటు తిరగకుండా అన్ని పరీక్షలు ఒకేచోట నిర్వహించేలా ఏర్పాటు చేశారు. ఇక్కడ దాదాపు అన్ని రకాల పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన రసాయనాలు, వైద్యపరికరాలు ఉన్నాయి. ఆ ల్యాబ్ అంటే మక్కువ ఎక్కువ...! ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉండే రాయలసీమ డయాగ్నోస్టిక్ ల్యాబ్ అంటే ప్రభుత్వ వైద్యులకు మక్కువ ఎక్కువలా కనిపిస్తోంది. వైద్యులు ప్రైవేట్కు రాసే వైద్యపరీక్షల్లో 80 శాతానికి పైగా పరీక్షలు అక్కడే నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది. వైద్యపరీక్షలు రాసే వైద్యులకు ఈ ల్యాబ్ వారు భారీగా కానుకలు, కమీషన్లు ముట్టజెబుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్కడికి వెళ్లిన రోగులకు ఒక్కొక్కరికి రూ.వెయ్యి తక్కువ గాకుండా బిల్లు అవుతోంది. ఆసుపత్రిలో పరీక్షలు చేయిస్తే త్వరగా చేయరని, రిపోర్టులు ఆలస్యంగా వస్తాయని, అర్జెంటుగా వైద్యం చేయాలంటే బయట చేయించుకుని రావాలని పేర్కొంటూ పలువురు వైద్యులు రాయలసీమ ల్యాబ్కు వైద్యపరీక్షలు రాస్తున్నారు. ఇందులో అధికంగా గైనకాలజి, చిన్నపిల్లల విభాగం, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, చర్మవ్యాధుల విభాగం, పలు సూపర్స్పెషాలిటీ విభాగాలు ఉన్నాయి. డయాగ్నోస్టిక్ బ్లాక్లో తీవ్ర జాప్యం ఆసుపత్రిలోని డయాగ్నోస్టిక్ బ్లాక్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలంటే ఒక యుద్ధమే చేయాల్సి వస్తోందని రోగులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ ఉదయం రక్తపరీక్షకు ఇస్తే అందరికీ కలిపి మధ్యాహ్నం 2 గంటలకు రిపోర్టు ఇస్తున్నారు. ఆ రిపోర్టు తీసుకుని ఓపీకి వెళితే అప్పటికే వైద్యులు ఉండటం లేదు. మధ్యాహ్నం ఓపీలలో పీజీలు మాత్రమే వైద్యం చేస్తున్నారు. ఎక్స్రే పరీక్ష చేసినా రిపోర్టును మరుసటి రోజు ఇస్తున్నారు. అలాగే అల్ట్రాసౌండ్ పరీక్ష చేయించుకోవాలంటే కనీసం మూడు, నాలుగు గంటలు వేచి ఉండాలి. రోజుకు 400 రోగులకు పైగా వైద్యులు ఈ పరీక్ష చేస్తున్నారు. ఇక్కడ కూడా ఎక్కువ శాతం పీజీలే నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం నుంచి మరునాడు ఉదయం వరకు అత్యవసర రోగులకు పరీక్ష చేయించుకోవాలంటే వైద్యులు త్వరగా అందుబాటులో ఉండటం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఆసుపత్రిలో చెప్పుకోవడానికి మూడు సీటీ స్కాన్లు ఉన్నా పనిచేసేది రెండు మాత్రమే. పవర్గ్రిడ్ కార్పొరేషన్ వారు ఇచ్చిన సీటీ స్కాన్ నిర్వహించేందుకు సిబ్బంది లేరని ప్రారంభించలేదు. పీపీపీ కింద నిర్వహించే దానిలో అత్యవసర కేసులు, ప్రభుత్వ సీటీ స్కాన్లో ఇన్పేషంట్లకు పరీక్షలు చేస్తున్నారు. వీటి రిపోర్టులు ఇవ్వడానికి కొన్నిసార్లు రోజుకు పైగా పడుతోంది. ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోవాలంటే రోజుల తరబడి వేచి ఉండాలి. అది కూడా ఇన్పేషంట్ అయితేనే ఈ పరీక్ష చేస్తారు. ఈ పరిస్థితులను ఆసరాగా చేసుకున్న కొందరు వైద్యులు ప్రత్యేకంగా రాయలసీమ ల్యాబ్కు మాత్రమే ఎక్కువగా రాయడం విమర్శలకు తావిస్తోంది. ఆసుపత్రిలోని డయాగ్నోస్టిక్ బ్లాక్లోనే అన్ని రకాల పరీక్షలు ఉన్నాయి. ఓపీ, ఐపీ రోగులకు ప్రైవేటు ల్యాబ్లకు పరీక్షలు రాయొద్దని వైద్యులకు చెబుతూనే ఉన్నాము. కొందరు అత్యవసరం పేరుతో రాస్తున్నట్లు ఉన్నారు. ఆసుపత్రిలో లేని కొన్ని మాత్రమే బయటకు రాస్తున్నారని తెలిసింది. ఆసుపత్రిలో ఉన్నా బయటకు రాసే వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాము. –డాక్టర్ శ్రీరాములు, ఇన్చార్జ్ సూపరింటెండెంట్, జీజీహెచ్, కర్నూలు వైద్యపరీక్షలు ప్రైవేటు ల్యాబ్లకు ఇందులోనూ రాయలసీమ ల్యాబ్కు అధిక శాతం కర్నూలు ప్రభుత్వాసుపత్రిలోని అన్ని విభాగాల వైద్యులు సిఫారసు వైద్యపరీక్ష రాసిన వారికి 30 శాతం దాకా కమీషన్ ఆసుపత్రిలో ఉన్న పరీక్షలు కూడా బయటకే! -
ప్రభుత్వ స్థలాల అమ్మకాలు!
● మోసపోతున్న ప్రజలు సాక్షి టాస్క్ఫోర్స్: ప్రభుత్వ భూమి ఖాళీ కనిపిస్తే చాలు అంగట్లో వస్తువుల్లాగా లక్షలాది రూపాయలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. స్థలాలు వస్తాయనే ఆశతో చాలా మంది అమాయకులు మోసగాళ్ల మాయ మాటల్లో పడి లక్షలాది రూపాయలు ముట్టజెప్పుతున్నారు. కొలిమిగుండ్లలో కస్తూర్బా పాఠశాల ఎదురుగా ఉన్న జగనన్న కాలనీ వెనుక భాగం, మోడల్ స్కూల్ సమీపంలో 112, 322 తదితర సర్వే నంబర్లలో ప్రభుత్వ భూమి ఉంది. కొంత మంది గ్రూపుగా ఏర్పడి వివిధ గ్రామాల ప్రజలకు మూడు, ఐదు, ఆరు సెంట్ల చొప్పున విక్రయించి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. గతంలో ఈ గ్రూపు సభ్యులే పదుల సంఖ్యలో బోగస్ పట్టాలు ప్రజలకు ఇచ్చి ఏకంగా రిజిస్ట్రేషన్లు చేయించారు. అప్పట్లో ఉన్నతాధికారులు వీటిపై విచారణ చేపట్టారు. ఓ వీఆర్వో ప్రమేయం ఉండటంతో సస్పెన్సన్ చేశారు. కొద్ది రోజుల నుంచి ఆగ్రూపు సభ్యులే మళ్లీ ప్రభుత్వ భూమిని ఇష్టానుసారంగా అమ్మకాలు చేయడం మొదలు పెట్టారు. ఇంత జరుగుతున్నా తెలియదా? ప్రభుత్వ స్థలాన్ని ఇళ్ల స్థలాలు, తదితర వాటికి ఇవ్వాలంటే చాలా నిబంధనలు ఉంటాయి. రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలించాకే స్థలాన్ని మంజూరు చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం ముఠా సభ్యులు అన్నీ తామై వ్యవహరించి వారి స్వంత ఆస్తులు అన్నట్లుగా ఇష్టానుసారంగా అమ్మకాలు చేస్తున్నారు. ప్రభుత్వ భూమిని యథేచ్ఛగా అమ్మకాలు చేస్తున్నా రెవెన్యూ అధికారులకు తెలియదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వాళ్ల అండదండలతోనే ఈ తంతు జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ స్థలాలు విక్రయిస్తున్న ముఠా సభ్యులు రెవెన్యూ సిబ్బంది సంతకాలు, సీళ్లను సైతం పోర్జరీ చేస్తున్నట్లు సమాచారం. అన్నీ వాళ్లే తయారు చేసి బోగస్ అనుబంద పట్టాలను ఇచ్చి ప్రజలతో డబ్బులు వసూలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే పదుల సంఖ్యలో సెంట్ల ప్రకారం అమ్మకాలు చేసినట్లు తెలుస్తుంది. లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన జనం చాలా మంది నిర్మాణాలు మొదలు పెట్డడం శోచనీయం. ముఠా సభ్యుల ఆగడాలకు అడ్డుకట్ట వేయకపోతే ప్రభుత్వ భూమి కనుమరుగై పోయే ప్రమాదముందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకొని అమాయక ప్రజలు మోసపోకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల వద్ద బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం. మాయ మాటలు చెప్పి ప్రభుత్వ స్థలాలు కొంటే ఏమాత్రం చెల్లుబాటు కావు. ప్రజలు ఎవరూ మోసపోవద్దు. ఇప్పటికే గ్రామాల్లో కొన్ని చోట్ల అడ్డుకట్ట వేశాం. మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాసులు, తహసీల్దార్ -
అయ్యో పాపం!
● సీసీ కెమెరాలో విద్యార్థుల దృశ్యాలు ఆస్పరి: మండలంలోని చిగిళి గ్రామంలో బుధవారం ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుచున్న 6 మంది విద్యార్థులు నీటి కుంటలో పడి మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆరోజు పాఠశాల వదిలిన వెంటనే ఇళ్ల దగ్గర బ్యాగులు పెట్టి నీటి కుంట దగ్గరకు పరిగెడుతు వెళ్తున్న దృశ్యాలు గ్రామానికి చెందిన వలిబాషా సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలు వైరల్ అయ్యాయి. చూసిన వారు ‘అయ్యో పాపం చిన్నారులు’ అని అంటున్నారు. వలిబాష అనే వ్యక్తి మెకానిక్ షాపు పెట్టారు. షాపు దగ్గర ఈయన సీసీ కెమెరాలను అమర్చుకున్నారు. విద్యార్థులు వెళ్లిన దృశ్యాలను ఆయన గ్రామస్తులకు చూపించారు.మొదటి నలుగురు విద్యార్థులు వెళ్తున్న దృశ్యం తరువాత మరో ముగ్గురు విద్యార్థులు వెళ్తున్న దృశ్యం -
పారిశుద్ధ్య కార్మికులుగా హాస్టల్ బాలికలు
చెత్త వాహనం వద్దకు చెత్త బుట్టలను తీసుకువెళ్తున్న విద్యార్థినులుకర్నూలు(అర్బన్): ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలకు చెందిన విద్యార్థినులు పారిశుద్ధ్య కార్మికులుగా మారిన ఘటన శుక్రవారం కర్నూలులో చోటు చేసుకుంది. చెత్త సేకరణలో భాగంగా కర్నూలు నగర పాలక సంస్థకు చెందిన వాహనం స్థానిక కలెక్టరేట్ సమీపంలోని హాస్టళ్ల వద్దకు వచ్చింది. కలెక్టరేట్ సమీపంలో ఎస్సీ, బీసీ బాలికల వసతి గృహాలు మూడు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయా వసతి గృహాల్లో వర్కర్లు ఉన్నారో, లేదో తెలియదు కాని, విద్యార్థినులే తమ వసతి గృహాల్లోని చెత్త బుట్టల్లోని చెత్తను వాహనంలోకి వేసేందుకు తీసుకురావడం చర్చనీయాంశం అయ్యింది. కాగా, రాయలసీమ పరిధిలోని నాలుగు ఉమ్మడి జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, వసతి గృహ సంక్షేమాధికారులందరితో సంబంధిత మంత్రి తిరుపతిలో సమావేశం ఏర్పాటు చేసిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా సాంఘీక సంక్షేమ శాఖకు చెందిన అధికారులందరు తిరుపతికి వెళ్లడం గమనార్హం. -
దివ్యాంగులంటే కనికరం లేదా?
కర్నూలు (టౌన్): పింఛన్లపై ఆధారపడి జీవిస్తున్న దివ్యాంగులంటే రాష్ట్ర ప్రభుత్వానికి కనికరం లేదా అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఏడాదిలో రాష్ట్రంలో 4.30 లక్షల పింఛన్లు తొలగించడం దారుణమన్నారు. తొలగించిన పింఛన్లను వెంటనే పునరుద్ధరించాలన్నారు. లేదంటే దివ్యాంగుల తరఫున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్లో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలు అమలు చేయడం చేతకాక రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లలో కోత విధిస్తోందన్నారు. దివ్యాంగులు ఆందోళనలు చేస్తున్నారని, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అయినా పాలకులు స్పందించడం లేదన్నారు. ఏళ్ల తరబడి పింఛన్ తీసుకున్న దివ్యాంగులకు మళ్లీ సదరం సర్టిఫికెట్ తీసుకురావాలని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. నిబంధనల పేరుతో కోత విధించాలని సదరం వైద్యులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందన్నారు. మోసం.. బాబు నైజం హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడం టీడీపీ అధినేత చంద్రబాబు నైజమని ఎస్వీ మోహన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో 85 లక్షల మంది తల్లులకుగాను 54 లక్షల మందికి మాత్రమే తల్లికి వందనం ఇచ్చారన్నారు. మూడు సిలిండర్లకు గాను ఒక్కదానికే మాత్రమే నిధులు విడుదల చేస్తున్నారన్నారు. ఆడబిడ్డ నిధి పథకం కింద 18 సంవత్సరాలు దాటిన మహిళలకు రూ.1500 ఇవ్వలేదన్నారు. 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రూ.4 వేలు పింఛన్, నిరుద్యోగులకు రూ. 3 వేల నిరుద్యోగ భృతి, పీ–4 పథకం అంతా మోసమే అన్నారు. ఎన్నికల సమయంలో ఉద్యోగులకు వరాలు జల్లులు కురిపించిన చంద్రబాబు ఏ ఒక్క హామీ అమలు చేయలేదన్నారు. ఇప్పటి వరకు డీఏ, ఐఆర్, పీఆర్సీ, సీపీఎస్ అమలు చేయలేదన్నారు. 16 నెలల వ్యవధిలో రూ.1.70 లక్షల కోట్లు అప్పులు చేసిన ఘనత చంద్రబాబుదే అన్నారు. డీఎస్సీ మెరిట్ లిస్టులో గోప్యత ఎందుకు? డీఎస్సీ మెరిట్ లిస్టులో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గోప్యత పాటిస్తుందని ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. ఎంపికై న వారి జాబితా పారదర్శకంగా ప్రకటించకుండా లోపాయికారీ ఒప్పందం కుదిరిందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలకు అడ్డూఅదుపు లేకుండా పోయిందన్నారు. బియ్యం స్కామ్, శాండ్, ల్యాండ్, వైన్, మైనింగ్లో టీడీపీ ఎమ్మెల్యేలు దోపీడీ చేస్తున్నారని విమర్శించారు. పార్టీ నాయకులు షరీఫ్, ఖలీల్, పాటిల్ హనుమంత రెడ్డి, రాఘవేంద్ర నాయుడు, కిషన్, ఫిరోజ్,ప్రభాకర్, తిరుమలేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 4.30 లక్షల పింఛన్లు తొలగించడం దారుణం తొలగించిన పింఛన్లు వెంటనే పునరుద్ధరించాలి లేదంటే దివ్యాంగుల తరఫున పోరాటం చేస్తాం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి -
విదేశీ ఎగుమతులకు తపాలా సహకారం
● పోస్టల్ బిజినెస్ అసిస్టెంట్ డైరెక్టర్స్కర్నూలు(అర్బన్): చిన్న వ్యాపారవేత్తలు, ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసేందుకు తక్కువ వ్యయంతో తపాలా శాఖ పూర్తి సహకారాన్ని అందిస్తుందని ఆ శాఖ బిజినెస్ డెవలప్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్స్ చెప్పారు. శుక్రవారం స్థానిక ప్రధాన తపాలా కార్యాలయంలో డాక్ ఘర్ నిర్యాత్ కేంద్ర (డీఎన్కే ) సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ సర్కిల్ కార్యాలయం, రీజినల్ కార్యాలయం బిజినెస్ డెవలప్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్లు వై రామకృష్ణ, బీ నాగనాయక్, కర్నూలు పోస్టల్ సూపరింటెండెంట్ జీ జనార్దన్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తక్కువ వ్యయంతో పాటు వేగంగా కూడా ఉత్పత్తులను ఆయా దేశాలకు పోస్టల్ శాఖ ద్వారా పంపుకునేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలోనే ఎగుమతి విధానాలు, అవసరమైన ఐఈసీ వివరాలు, తపాలా శాఖ అందిస్తున్న సౌకర్యాల గురించి వ్యాపారవేత్తలకు అవగాహన కల్పించారు. విదేశీ మార్కెట్లకు ఎగుమతి అవకాశాలపై తమకు ఉన్న సందేహాలను ఎంఎస్ఎంఈ ఎగుమతిదారులు నివృత్తి చేసుకున్నామన్నారు. పోస్టల్ శాఖలో ఉన్న డీఎన్కే అవకాశాలను వినియోగించుకుంటామన్నారు. కార్యక్రమంలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గరీబ్భాషతో పాటు వ్యాపారస్థులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
దగా చేసిన కూటమి ప్రభుత్వం
● దివ్యాంగుల పింఛన్లు తొలగించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రి పార్థసారథి చెప్పడం దారుణం ● ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఆలూరు రూరల్: దివ్యాంగుల పింఛన్లు తొలగించి కూటమి ప్రభుత్వం దగా చేసిందని ఎమ్మెల్యే విరూపాక్షి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు రామాంజినేయులు ఆధ్వర్యంలో శుక్రవారం ఆలూరులోని అంబేడ్కర్ సర్కిల్లో ధర్నా నిర్వహించారు. దివ్యాంగులు భారీ ఎత్తున తరలివచ్చి ‘ముఖ్యమంత్రి చంద్రబాబు డౌన్డౌన్’ అంటూ నినాదాలు చేశారు. ధర్నాకు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి మద్దతు తెలిపారు. ధర్నాలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతి రోజూ ప్రజలు రోడ్డెక్కి నిరసనలు చేపట్టాల్సి పరిస్థితి ఏర్పడిందన్నారు. దివ్యాంగుల పింఛన్లు తొలగించాలని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రి పార్థసారథి విలేకరుల సమావేశంలో చెప్పడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4.62 లక్షల దివ్యాంగుల పింఛన్లు రద్దు చేసి ప్రతి నెలా రూ.280 కోట్లు ఆదా చేసుకునే పనిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. పింఛన్లు పునరుద్ధరించే వరకు పోరాటం ఆగబోదన్నారు. వైఎస్సార్సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు రామాంజినేయులు మాట్లాడుతూ..రాష్ట్ర వ్యాప్తంగా తొలగించిన దివ్యాంగుల పింఛన్లు పునరుద్ధరించే వరకు ఉద్యమాలు చేస్తామన్నారు. వైఎస్సార్సీపీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు ఆరు మండలాల దివ్యాంగులు పాల్గొన్నారు. -
శ్రీమఠంలో కన్నడ సాహిత్య సమ్మేళనం
మంత్రాలయం: శ్రీరాఘవేంద్ర స్వామి మఠంలోని గురురాజ్యాంగన భవన్లో మొట్టమొదటి సారిగా కర్ణాటక అంతర్రాష్ట్ర కన్నడ సాహిత్య సమ్మేళనం శుక్రవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ.. సాహిత్యంతో మన మూలాలు సంప్రదాయ, సంస్కృత మూలాలు మూడి ఉన్నాయన్నారు. మేధావుల రచనలతో ప్రజా చైతన్యం కూడా సాధ్యపడుతుందన్నారు. అనంతరం పీఠాధిపతికి జ్ఞాపికలు ఇచ్చి సాహిత్య నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. జీఎన్ఎం సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కర్నూలు(హాస్పిటల్): జనరల్ నర్సింగ్ మిడ్వైఫరి(జీఎన్ఎం) సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం కర్నూలు మెడికల్ కాలేజీలోని ఎగ్జామినేషన్ హాలులో ప్రారంభమయ్యాయి. వచ్చే నెల ఒకటో తేది వరకు కొనసాగే ఈ పరీక్షలకు జిల్లాలోని 13 నర్సింగ్ స్కూళ్ల నుంచి 346 విద్యార్థినీ విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. మొదటి రోజు ఇందులో 56 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలకు చీఫ్ ఎగ్జామినర్గా ప్రభుత్వ ఆసుపత్రి ఇన్ఛార్జి సీఎస్ఆర్ఎంఓ డాక్టర్ వెంకటరమణ, ఎగ్జామినర్లుగా డిప్యూటీ సీఎస్ఆర్ఎంఓ డాక్టర్ పద్మజ, డాక్టర్ శివబాల వ్యవహరిస్తున్నారు. ముగ్గురు మెడికల్ ఆఫీసర్లు, 14 మంది హెడ్నర్సులు, స్టాఫ్నర్సులు పరీక్షలను పర్యవేక్షిస్తున్నారు. ఉరుకుంద హుండీ ఆదాయం రూ.1.08 కోట్లు కౌతాళం: ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయంలో చివరి సోమ, గురువారం హుండీలో భక్తులు సమర్పించిన కానుకలకు శుక్రవారం లెక్కించారు. నగదు రూపంలో రూ.1,08,04,708 వచ్చినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ వాణి తెలిపారు. వెండి 22 కేజీల 500 గ్రాములు, బంగారం 1గ్రాముల 950 మిల్లీ గ్రాములు వచ్చినట్లు చెప్పారు. పర్యవేక్షణ అధికారులుగా అసిస్టెంట్ కమిషనర్ కర్నూలు సుధాకర్రెడ్డి, ప్రధాన అర్చకుడు ఈరప్పస్వామి వ్యవహరించారు. మద్యం తరలిస్తున్న వాహనం దగ్ధం ఆలూరు రూరల్/ఆస్పరి: మద్యం దుకాణానికి మద్యం సరఫరా చేస్తున్న జైలో వాహనంలో మంటలు చెలరేగి దగ్ధమైంది. శుక్రవారం సాయంత్రం 8 గంటలకు ఆస్పరి మండలం ముత్తుకూరు గ్రామ బస్టాండు వద్ద ప్రమాదం జరిగింది. ఆస్పరి సీఐ గంగాధర్ తెలిపిన వివరాలు.. హొళగుంద మండలం రాజేంద్ర గౌడ్కు చెందిన విజయ దుర్గ వైన్స్కు మద్యాన్ని జైలో వాహనం నంబర్ కేఏ 35ఎం 8656 లో మద్యం తరలిస్తుండగా ముత్తుకూరు గ్రామ సమీపంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి దగ్ధమైంది. ప్రమాదంలో వాహనం పూర్తిగా కాలిపోయింది. ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గంగాధర్ విలేకరులకు తెలిపారు. కాలిపోయిన మద్యంపై ఎకై ్సజ్ సీఐ లలితా దేవికి అడగ్గా వాహనంలో తరలిస్తున్న మద్యం విలువ రూ.3.20 లక్షల వరకు ఉందని తెలిపారు. -
తుంగభద్ర దిగువ కాలువ కింద వరి నాట్లు పడుతున్నాయి. పత్తి, మిర్చి, మొక్కజొన్న తదితర పంటలు ఎదుగుదల దశలో ఉన్నాయి. రైతులకు యూరియా అత్యవసరం అయ్యింది. అయితే జిల్లాలో ప్రైవేటు డీలర్ల వద్ద, రైతు సేవా కేంద్రాలు, పీఏసీఎస్లు, డీసీఎంఎస్ల్లో ఒక్క బస్తా కూడా లభించని ద
యూరియా కోసం ఎదురు చూస్తున్న రైతులు కర్నూలు(అగ్రికల్చర్): డిమాండ్కు తగ్గట్లు యూరియాను సరఫరా చేయడంలో కూటమి ప్రభుత్వం చేతులెత్తేసింది. కొరత ఎక్కడ కావడం, బ్లాక్ మార్కెటింగ్, ఇతర రాష్ట్రాలకు తరలిపోవడం, టీడీపీ నేతలు దక్కించుకోవడంతో రైతులకు కష్టాలు తప్పడం లేదు. జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు 4.22 లక్షల హెక్టార్లు ఉండగా ఇప్పటి వరకు 3.38 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 39,514 టన్నుల యూరియా అవసరం అవుతుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ సరఫరా ప్రణాళిక కూడా ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు వచ్చిన యూరియా 23,302 టన్నులు మాత్రమే. ప్రస్తుతం జిల్లాలో 2,429 టన్నుల యూరియా ఉందని, మార్క్ఫెడ్లోనే 1,376 టన్నులు ఉందని చెబుతున్నారు. ఇంత యూరియా ఉంటే రైతులకు రైతు సేవా కేంద్రాల్లోనో, ప్రయివేటు డీలర్ల దగ్గరనో, పీఏసీఎస్లు, డీసీఎంఎస్ల్లో లభించాలి. రోజుల తరబడి తిరుతున్నా ఒక్క బస్తా యూరియా కూడా ఇవ్వడం లేదు. బ్లాక్లోనే విక్రయం! జిల్లాకు వచ్చిన యూరియాను సద్వినియోగం చేసుకుంటే సమస్య తీవ్రత తగ్గుతుంది. అయితే హోల్సేల్, రీటైల్ డీలర్లు డిమాండ్ ఉన్న ప్రాంతాలకు గుట్టుచప్పుడు కాకుండా తరలించినట్లు తెలుస్తోంది. కొందరు బ్లాక్లో బస్తా రూ.450 ప్రకారం విక్రయిస్తున్నారు. గూడూరు, సి.బెళగల్, ఆదోని, కౌతాళం, హొళగుంద, ఎమ్మిగనూరు, పెద్దకడుబూరు, మంత్రాలయం మండలాల్లో డీలర్లు, పీఏసీఎస్లు, డీసీఎంఎస్ల్లో యూరియా సాధారణ రైతులకు ఇవ్వడం లేదు. అమ్మకాలన్నీ బ్లాక్లోనే జరిగిపోతున్నాయి. హోల్సేల్, రీటైల్ డీలర్లు కుమ్మకై ్క కావడంతోనే బ్లాక్ మార్కెటింగ్ జోరుగా సాగుతున్నట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మార్క్ఫెడ్కు కేటాయిస్తున్న యూరియాను పథకం ప్రకారం ఆర్ఎస్కేలు, పీఏసీఎస్లు, డీసీఎంఎస్ల పేర్లతో బయటికి తరలించడం.. దానిని టీడీపీ నేతలు స్వాధీనం చేసుకోవడం జరుగుతోంది. సాధారణ, మధ్య తరగతి రైతులు యూరియా కోసం 25 రోజులుగా తిరుగుతున్నా అందడం లేదు. పట్టించుకోని టీడీపీ ఎమ్మెల్యేలు యూరియా కోసం రైతులు ఇబ్బంది పడుతున్నా టీడీపీ ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదు. ఒక్కరు కూడా జిల్లా కలెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారితో చర్చించిన దాఖలాలు లేవు. యూరియా సమస్యపై వ్యవసాయ మంత్రి, ముఖ్యమంత్రిలతో మాట్లాడితే కొంత వరకు ప్రయోజనం ఉంటుంది. కాని ఒక్కరూ కూడా రైతుల పక్షాన మాట్లాడలేదు. హోల్సేల్, రీటైల్ డీలర్లు అక్రమాలను టీడీపీ ఎమ్మెల్యేలు ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పత్తికొండ నియోజకవర్గంలో యూరియాతో సహా ఇతర ఎరువులను భారీ ఎత్తున అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు విజిలెన్స్ అధికారుల దాడుల్లో నిర్ధారణ అయింది. మాకు సొంత భూమి 14 ఎకరాలు ఉంది. మరో 10 ఎకరాలు కౌలుకు తీసుకున్నాం. ఈ సారి పత్తి, వరి, వేరుశనగ, కంది, మిర్చి సాగు చేశాం. వరి, మిర్చికి యూరియా వేయడం అత్యవసరం అయ్యింది. 25 రోజులుగా యూరియా కోసం ప్రయివేటు డీలర్లు, రైతు సేవా కేంద్రాల చుట్టు తిరుగుతున్నాం. ఒక్క బస్తా కూడా లభించలేదు. ఇప్పుడు యూరియా వేయకపోతే వరి, మిర్చి పంటల్లో ఎదుగుదల కోల్పోయే ప్రమాదం ఉంది. వ్యవసాయ అధికారులు చొరువ తీసుకోవాలి. – గొల్ల వెంకటేష్, ముద్దటమాగి, హొళగుంద మండలం నెల జిల్లాకు వచ్చింది ఏప్రిల్ 1,562 2,549 మే 3,871 821 జూన్ 6,095 3,216 జూలై 13,419 10,070 ఆగస్టు 14,576 6,644 మొత్తం 39,523 23,302 కర్నూలు ర్యాక్ పాయింట్కు ఈ నెల 13న రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్ కంపెనీ యూరియా 2,600 టన్నులు వచ్చింది. ఇందులో 1,315 టన్నులు మార్క్ఫెడ్కు, 1,285 టన్నులు ప్రయివేటు డీలర్లకు ఇచ్చారు. ఈ నెల 15న ఇదే కంపెనీ యూరియా 563 టన్నులు రాగా.. 280 టన్నులు మార్క్ఫెడ్కు, 283 టన్నులు ప్రయివేటు డీలర్లకు ఇచ్చారు. అయితే మార్క్ఫెడ్కు ఇచ్చిన యూరియా ఏమైందో తెలియడం లేదు. ప్రయివేటు డీలర్లకు ఇచ్చిన యూరియా ఎక్కడా రైతులకు పంపిణీ చేసిన దాఖలాలు లేవు. జిల్లాకు రావాల్సింది 39,523 టన్నులు వచ్చింది 23,302 టన్నులు మాత్రమే వచ్చిన యూరియా బ్లాక్ మార్కెట్లో విక్రయం జిల్లా సరిహద్దులు దాటిస్తున్న హోల్సేల్ డీలర్లు టీడీపీ నేతలు సిఫార్సు చేసిన వారికే పంపిణీ సామాన్య, మధ్యతరగతి రైతులకు అందని యూరియాయూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ప్రాంతీయ అధికారి కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎరువులు, ఫర్టిలైజర్స్ దుకాణదారులు యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే ఈసీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ప్రాంతీయ అధికారి చౌడేశ్వరి వ్యాపారులను హెచ్చరించారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో రైతులకు యూరియాను అధిక ధరలకు విక్రయించినా, ఇతర ఎరువులకు లింకు పెట్టి వాటిని కొనుగోలు చేస్తేనే యూరియాను విక్రయిస్తామని రైతులను ఇబ్బంది పెట్టినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తారన్నారు. ఇప్పటికే ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారని, రైతుల నుంచి ఫిర్యాదులు అందితే ఈసీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తారన్నారు. -
పరిశ్రమలతో యువతకు ఉపాధి
● జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషాకర్నూలు(సెంట్రల్): జిల్లాలో రిలయన్స్, అగస్త్యా, డ్రోన్స్హబ్ తదితర కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని, ఈపరిశ్రమల ద్వారా వేలాది మంది యువతీ, యువకులకు ఉపాధి దొరుకుతుందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా తెలిపారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్–2024కు సంబంధించి యాజమాన్యాలతో సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓర్వకల్లులో పారిశ్రామిక పురోగతి కనిపిస్తోందన్నారు. ఇప్పటికే 5 వేల ఎకరాల్లో జయరాజ్ ఇస్పాత్ స్టీలు ఫ్యాక్టరీ నిర్మాణాన్ని పూర్తి కావొచ్చిందన్నారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు సింగిల్డెస్కు పోర్టల్ ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. జిల్లా పరిశ్రమల అధికారి జవహర్బాబు, డీడీ హరినాథ్రెడ్డి, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నారాయణరెడ్డి, భూగర్భ జలాల శాఖ డీడీ శ్రీనివాసులు, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ విజయ్కుమార్రెడ్డి పాల్గొన్నారు. లక్ష్యాలను సాధించాలి శాఖల వారీగా ప్రభుత్వం నిర్దేశించిన కీలక నిర్వహణ సూచికల లక్ష్యాల సాధన కోసం కృషి చే యాలని అధికారులను జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆదేశించారు. వ్యవసాయం, హార్టికల్చర్ శాఖల లక్ష్యాలపై సమీక్షించారు. -
శ్రీశైలం ఫారెస్ట్ సిబ్బందిపై దాడి కేసులో ట్విస్ట్
సాక్షి, ప్రకాశం జిల్లా: అటవీ శాఖ సిబ్బందిపై టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి దాడి చేసిన కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుల జాబితాను పోలీసులు విడుదల చేశారు. అయితే అందులో శ్రీశైలం జనసేన ఇంఛార్జి అశోక్ రౌత్ను A1 నిందితుడిగా చేర్చడం చర్చనీయాంశమైంది. ఆగస్టు 19 మంగళవారం.. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం సమీపంలో అటవీ శాఖ సిబ్బందిని కిడ్నాప్ చేసి మరీ బుడ్డా రాజశేఖర్రెడ్డి, ఆయన అనుచరులు దాడి చేశారు. తమ పార్టీ అధికారంలో ఉన్నా.. ఫారెస్ట్ సిబ్బంది తమకు అనుకూలంగా పని చేయడం లేదని దూషించారు. పైగా సీసీకెమెరాల్లోనూ సిబ్బందిపై ఎమ్మెల్యే బుడ్డా దాడి చేసినట్లు స్పష్టంగా కనిపించింది. అయితే.. అనూహ్యంగా.. జనసేన నేత పేరును ఈ కేసులో ఏ1గా చేర్చి, దాడి చేసిన ఎమ్మెల్యే బుడ్డాను మాత్రం A2 గా చేర్చారు. పైగా ఇద్దరి పైనా బెయిలబుల్ కేసులే పెట్టారు. ఫారెస్ట్ అధికారులు చెప్పింది ఏంటంటే.. శ్రీశైలం శిఖరం చెక్పోస్ట్ దగ్గర ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్, ఆయన అనుచరులు అటవీశాఖ సిబ్బందిని అడ్డుకుని వారిని దుర్భాషలాడడం ప్రారంభించారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఉద్యోగులు తమకు అనుకూలంగా పనిచేయడం లేదని దూషించారు. అటవీ శాఖ వాహనంలోకి బలవంతంగా ఎక్కించి శ్రీశైలం అడవుల వైపు అర్ధరాత్రి తీసుకెళ్లారు. పైగా ఎమ్మెల్యే తన మనుషులను సిబ్బందిపై శారీరకంగా దాడి చేయమని ఆదేశించాడు. అంతేకాదు.. నలుగురు సిబ్బందిని గెస్ట్ హౌస్లో బంధించి వేధించాడు. ఇదీ చదవండి: అరాచకాలకు కేరాఫ్ ‘బుడ్డా’ఈ సంఘటనపై అటవీ శాఖ సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తరువాత శ్రీశైలం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాడిని నిరసిస్తూ చెంచు, ఇతర గిరిజన సంఘాల సభ్యులు సున్నిపెంట, శ్రీశైలం, దోర్నాల, యర్రగొండపాలెంలో నిరసన చేపట్టారు. ఉద్యోగ సంఘాలు ఈ దాడికి తీవ్రంగా ఖండించాయి. చివరకు అటవీశాఖ సిబ్బంది,అసోషియేషన్ నాయకులు ఉపముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్కు కలిసి ఫిర్యాదు చేశారు. పవన్ ఆదేశాల మేరకు.. ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో జనసేన ఇంఛార్జి అశోక్ రౌత్ , ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి లపై 115(2),127(2),351(2),132 r/w ,3(5) BNS act సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే టీడీపీ ఎమ్మెల్యేని పక్కనపెట్టి అటవీ శాఖ మంత్రిగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీకి చెందిన వ్యక్తికే కేసును అంట గట్టడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. ”ఇదేమీ బానిసత్వం రా దేవుడా.. ఇన్నాళ్లూ జెండాలే అనుకుంటే.. ఇప్పుడు వాళ్ల కేసులు కూడా మోయాలా..?” అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. -
చిన్నారులకు కన్నీటి వీడ్కోలు
● చిగిళిలో మిన్నంటిన రోదనలు ● ముగిసిన విద్యార్థుల అంత్యక్రియలు ● నివాళులర్పించిన ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిఆలూరు రూరల్/ఆస్పరి: ఆడుతూ పాడుతూ అందరినీ నవ్వించే విద్యార్థులు ఆకస్మికంగా మృతి చెందడం.. వారి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించాల్సి రావడంతో చిగిళి గ్రామంలో ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమయ్యారు. కన్నీళ్లతోనే చిన్నారులకు తుది వీడ్కోలు పలికారు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా అంత్యక్రియల్లో అందరూ పాల్గొన్నారు. విద్యార్థుల మృతదేహాలకు ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి నివాళులర్పించారు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు మౌనం పాటించారు. విషాద ఛాయలు చిగిళి గ్రామ చరిత్రలో ఎన్నుడూ లేని విధంగా బుధవారం సాయంత్రం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న వినయ్, గొల్ల భీమేష్, మహబూబ్ బాషా, సాయి కిరణ్, శశి కుమార్, కిన్నెర సాయి, దుర్గా ప్రసాద్ బుధవారం సాయంత్రం ఎర్రకొండ వద్ద ఉన్న గరుసు కుంటకు వెళ్లారు. దుర్గా ప్రసాద్ తప్ప మిగతా అందరూ ఈతకు కుంటలో దిగి నీటిలో మునిగి మృతిచెందారు. దుర్గా ప్రసాద్ విషయాన్ని గ్రామస్తులకు తెలపడంతో విద్యార్థుల మృతదేహాలను వెలికి తీశారు. ఆరుగురు విద్యార్థులు ఈతకు వెళ్లి మృతిచెండంతో గ్రామం అంతా ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. గురువారం రోజు గ్రామస్తులంతా తమ పనులకు సెలవు తీసుకున్నారు. ప్రతి విద్యార్థి దహన సంస్కారాలకు హాజరయ్యారు. మహిళలు రోదనలతో గ్రామం దద్దరిల్లింది. విద్యార్థుల మృతితో గ్రామంలో జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు సెలవు ప్రకటించారు. బుధవారం రాత్రి కర్నూలు డీఈఓ శామ్యూల్ పాల్ గ్రామానికి వెళ్లి ఆరుగురు విద్యార్థుల మృతదేహాలకు నివాళులర్పించారు. పత్తికొండ డీఎస్పీ వెంటకరామయ్య రాత్రి గ్రామానికి వెళ్లి జరిగిన సంఘటనపై విచారణ చేశారు. ఉపాధ్యాయులతో కలిసి ఎంఈఓ రాజేంద్ర ప్రసాద్, తిరుమల రావు, ప్రైమరీ పాఠశాల హెచ్ఎం సత్యనారాయణ, జడ్పీహెచ్ స్కూల్ హెచ్ఎం రంగప్ప.. పాఠశాలలో ఐదు నిమిషాలు మౌనం పాటించి విద్యార్థులకు సంతాపాన్ని తెలియజేశారు. కుంటలో విద్యార్థులు మృతిచెందడంపై అసహజ మరణం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆస్పరి సీఐ గంగాధర్ తెలిపారు. -
రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి
నీటి కుంటలో మునిగి చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ఎమ్మెల్యే విరూపాక్షి ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థులు మృతిచెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విరూపాక్షి బుధవారం రాత్రి చిగిళి గ్రామానికి వెళ్లి విద్యార్థుల మృతదేహాలకు నివాళులర్పించా రు. విద్యార్థుల తల్లిదండ్రులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఒకే గ్రామానికి చెందిన, ఒకే తరగతికి చెందిన ఆరుగురు విద్యార్థులు ఒకే చోటకు చేరి మృతిచెందడం తనను కలచివేసిందన్నారు. ఇలాంటి సంఘటనలు ము న్ముందు జరగరాదన్నారు. బాధిత కుంటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఒక్కో విద్యార్థి కుంటుంబానికి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలన్నారు. -
పంట నష్టాన్ని అంచనా వేయండి
● అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాకృష్ణగిరి/వెల్దుర్తి: ఇటీవల కురిసిన వర్షాలతో పంటలకు నష్టం ఎంత జరిగిందో అంచనా చేయాలని వ్యవసాయాధికారులను జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. కృష్ణగిరి, వెల్దుర్తి మండలాల్లో గురువారం జిల్లా కలెక్టర్ పర్యటించారు. కృష్ణగిరిలోని ఆముదం, ఆయిల్పామ్ పంటల సాగును పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ క్రాప్ వేగవంతం చేయాలని, రైతులు నానో యూరియా వాడేలా అవగాహన పెంచాలని, హార్టికల్చర్, ఆయిల్ ఫామ్ పంటలను ప్రోత్సహించాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు. అనంతరం హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం (హెచ్ఎన్ఎస్ఎస్) కాలువను పరిశీలించారు. పక్కనే ఉన్న మోడల్ స్కూల్ను తనిఖీ చేశారు. పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. బాగా చదువుకుని మంచి మార్కులు సాధించాలని ప్రోత్సహించారు. గ్రామ సచివాలయం రికార్డులను పరిశీలించి ప్రజలకు చిత్తశుద్ధితో సేవలందించాలని సిబ్బందిని ఆదేశించారు. వెల్దుర్తి మండలంలోని బొమ్మిరెడ్డిపల్లె ఆర్ఎస్కేను తనిఖీ చేసి యూరియా పక్కదారి పట్టకుండా చూడాలంటూ ఆదేశించారు. డీఏఓ వరలక్ష్మి, తహసీల్దార్ చంద్రశేఖర్ వర్మ తదితరులు పాల్గొన్నారు. -
ఉరుకుందలో భక్తుల రద్దీ
కౌతాళం: శ్రావణమాస ఉత్సవాల్లో చివరి గురువారం కావడంతో ఉరుకుంద ఈరన్న స్వామి క్షేత్రంలో భక్తుల రద్దీ కనిపించింది. ఉదయం నుంచే స్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ పరిసరాలల్లో ప్రత్యేక వంటకాలను వండి స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు. ఈరన్న స్వామికి తెల్లవారుజామున 4 గంటలకు సుప్రభాతసేవ, మహామంగళహారతి, ఆకుపూజ, బిందుసేవ, పంచామృతాభిషేకం తదితర ప్రత్యేక పూజలను అర్చకులు నిర్వహించారు. కాగా.. ఈరన్నస్వామి ఆలయం ట్రస్టుబోర్డు చైర్మన్ పదవి కోసం మాజీ చైర్మన్ చెన్నబసప్ప తన నామినేషన్ను గురువారం దాఖలు చేశారు. 25లోపు చౌకదుణాలకు సరుకులు కర్నూలు(సెంట్రల్): చౌకదుణాలకు ప్రతి నెలా 25వ తేదీలోపు సరుకులను చేర్చేలా చర్యలు తీసుకోవాలని ఎంఎల్ఎస్ పాయింట్ అధికారులను జేసీ డాక్టర్ బి. నవ్య ఆదేశించారు. గురువారం ఆమె కలెక్టరేట్ వెనుక ఉన్న ఎంఎల్ఎస్ పాయింట్ను తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనానికి పంపిణీ చేసే నాణ్యమైన 25 కేజీల బియ్యాన్ని పాఠశాలలకు చేర్చాలని ఆదేశించారు. అంతకుముందు హమాలీలకు మంజూరైన యూనిఫాంలను ఆమె అందజేశారు. కార్యక్రమంలో డీఎం వెంకటరాముడు పాల్గొన్నారు. 2,000 హెక్టార్లలో పంటలకు నష్టం కర్నూలు(అగ్రికల్చర్): అధిక వర్షాలతో జిల్లాలో 2,000 హెక్టార్లలో పత్తి, వేరుశనగ, కంది, ఆముదం, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు దేవనకొండ, పత్తికొండ, వెల్దుర్తి, క్రిష్ణగిరి, మద్దికెర, ఓర్వకల్లులో తేలికపాటి వర్షాలు కురిశాయి. ఆగస్టు నెల సాధారణ వర్షపాతం 116.2 మి.మీ. ఉండగా... ఇప్పటి వరకు 184 మి.మీ.వర్షపాతం నమోదు అయింది. కాగా.. రానున్న నాలుగైదు రోజుల్లో జిల్లాలో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు ప్రకటించారు. యూరియా కష్టాలు నందవరం: కూటమి ప్రభుత్వంలో రైతులకు యూరియా కష్టాలు తొలగడం లేదు. మండల కేంద్రంలోని గ్రామ సచివాలయానికి గురజాల, రాయచోటి, మిట్టపోమపురం రైతులు గురువారం యూరియా కోసం వచ్చారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు క్యూలైన్లో నిలిచి అలసిపోయారు. అయితే వ్యవసాయ అధికారులు కేవలం గురజాల గ్రామాల రైతులకు మాత్రమే యూరియా పంపిణీ చేశారు. దీంతో మిగతా రైతులు ఆందోళన చేశారు. యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలం చెందిందని రైతులు విమర్శించారు. వ్యవసాయ అధికారులు కూడా టీడీపీ నాయకులకు మాత్రమే అందిస్తున్నారని ఆరోపించారు. విషయం తెలుసుకుని తహసీల్దార్ శ్రీనివాసులు అక్కడికి చేరుకున్నాపరు. రాయచోటి, మిట్టసోమపురం గ్రామాల రైతులందరికీ యూరియా అందిస్తామని హామీ ఇచ్చారు. -
తీవ్ర నేరాలకు పాల్పడితే జిల్లా బహిష్కరణ
● నేర సమీక్షలో ఎస్పీ విక్రాంత్ పాటిల్కర్నూలు: శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిని, తీవ్రమైన నేరాలకు పాల్పడే హిస్టరీ షీట్స్ ఉన్నవారిని జిల్లా బహిష్కరణ చేయాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. ఇందు కోసం సబ్ డివిజన్ల వారీగా పీడీ యాక్ట్ సిద్ధం చేయాలన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో గురువారం జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కొత్తగా విధుల్లో చేరిన ప్రొబేషనరీ ఎస్ఐలు ప్రతి క్రైం మీటింగ్కు తప్పనిసరిగా హాజరయ్యే విధంగా డీఎస్పీలు చూసుకోవాలన్నారు. ఖైదీల ఎస్కార్ట్కు వెళ్లినప్పుడు పోలీసులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే డిస్మిస్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా ట్రయల్కు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ స్టేషన్లో నిర్వహించే కౌన్సెలింగ్లకు హాజరుకాని రౌడీషీటర్ల వివరాలను పైఅధికారులకు తెలియజేయాలన్నారు. సమస్యాత్మక కాలనీల్లో నిర్బంధ తనిఖీలు, నిరంతర వాహన తనిఖీలు చేపట్టాలని సూచించారు. నేర నివారణే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు విజిబుల్ పోలీసింగ్ చేపట్టాలన్నారు. కిరాయి హంతకులు, రౌడీషీటర్లను ప్రతి ఆదివారం స్టేషన్లకు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించాలని, సమస్యాత్మక వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు. వాట్సప్లో తీవ్రమైన ఫిర్యాదులు వస్తే కేసు మెయిల్ ఐడీ, వాట్సాప్, రిజిస్టర్ పోస్టు ద్వారా వచ్చే ఫిర్యాదులు తీవ్రమైనవని భావిస్తే విచారించి తక్షణమే కేసు నమోదుకు చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. ప్రతి పోలీస్ సబ్ డివిజన్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ టీమ్, క్రైం స్పాట్ వాహనాలు త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గత నెలలో వివిధ కేసుల్లో ప్రతిభ కనపరచిన పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు, డీఎస్పీలు వెంకటరామయ్య, ఉపేంద్ర బాబు, హేమలత, భార్గవితో పాటు సీఐలు, ఎస్ఐలు సమావేశంలో పాల్గొన్నారు. -
కొర్ర సాగు తగ్గింది
ఈ ఏడాది కొర్రసాగుపై రైతులు ఆసక్తి చూపలేదు. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి కొర్ర సాగు తగ్గింది. సబ్సిడీపై పంపిణీ చేసేందుకు కొర్ర విత్తనాలను రైతులకు అందుబాటులో పెట్టినప్పటికీ తీసుకునేందుకు ముందుకు రాలేదు. – పీఎల్ వరలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి, కర్నూలు మేం రాయలసీమ విత్తన సేవా సంఘాన్ని ఏర్పాటు చేసి చిరుధాన్యాల సాగును ప్రత్యేకంగా చేపట్టాం. మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఉంది. 2023–24 వరకు చిరుధాన్యాలను విదేశాలకు ఎగుమతులకు అవకాశం ఉండేది. మేం ప్రతి నెలా 2–4 క్వింటాళ్ల వరకు విదేశాలకు ఎగుమతి చేశాం. అయితే 2024–25 నుంచి విదేశాలకు ఒక్క కిలో కూడా ఎగుమతి చేయలేని పరిస్థితి ఏర్పడింది. చిరుధాన్యాలకు సిరిధాన్యాలుగా ప్రత్యేకంగా గుర్తింపు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సహకాలు లేవు. ఇప్పటికై న రాయితీలు ఇవ్వాలి. – వేణుబాబు, మిల్లెట్ రైతు, కర్నూలు -
22న డీఎన్కే అవగాహన సమావేశం
కర్నూలు(అర్బన్): కర్నూలు ప్రధాన తపాలా సూపరింటెండెంట్ కార్యాలయంలో ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు డాక్ ఘర్ నిర్యాత్ కేంద్ర్ (డీఎన్కే ) అవగాహన సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు కర్నూలు తపాలా అధికారి జీ జనార్దన్రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాలకు సంబంధించిన వ్యాపారులకు సంబంధించి పోస్టల్ శాఖ అందిస్తున్న సేవలను ఈ సమావేశంలో వివరించనున్నట్లు చెప్పారు. విదేశాలకు తమ ఉత్పత్తులను/వస్తువులను ఎగుమతి చేయాలనుకునే చిన్న వ్యాపారులు, ఉత్పత్తిదారులు, ఐఈసీ హోల్డర్లకు ఇది ఒక మంచి అవకాశమన్నారు. సమావేశంలో ఎగుమతుల విధానాలను నిపుణులు వివరిస్తారన్నారు. మరిన్ని వివరాలకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ హెచ్ గరీబ్బాషాను 8919286405 నంబర్లో సంప్రదించాలన్నారు. పోస్ట్ప్యాక్ ద్వారా జిల్లా ప్రజలు తమ ఉత్పత్తులను ప్రధాన కార్యాలయంలో పార్సెల్ ప్యాకింగ్ చేసుకునే సౌకర్యం కూడా ఉందని ఆయన తెలిపారు. -
యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు
ఆదోని రూరల్: మండలంలోని పెద్దహరివాణం గ్రామంలో యూరియా కోసం రైతు లు రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం పెద్దహరివాణం రైతు సేవాకేంద్రం వద్ద, ఆదోని–సిరుగుప్ప రహదారిపై బైఠాయించి నిరసన తెలియజేశారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కె.వెంకటేశులు మాట్లాడుతూ ప్రభుత్వం ఎక్కడ యూరియా కొరత లేదని రైతులందరికీ అందిస్తున్నామని కల్లిబుల్లి మాటలు చెబుతోందన్నారు. రైతులకు సరిపడా యూరియా మాత్రం అందించడం లేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే మాత్రం నాలుగు రైళ్లలో యూరియా తెప్పిస్తామని మాటలు చెప్పి నెలరోజులయ్యిందని, కానీ రైతులకు సరిపడేంత యూరియా మాత్రం అందించలేకపోయారన్నారు. తక్షణమే రైతులకు సరిపడినంత యూరియాను అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె.లింగన్న, వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు లక్ష్మన్న, రైతుసంఘం మండల నాయకులు అబ్బాస్, పెద్దహరివాణం గ్రామ రైతులు పాల్గొన్నారు. -
ఓబులేసుకు పింఛన్ పాయె..
ఇక్కడ కుర్చీలో కూర్చున్న అంధుడు పేరు గుడిశ ఓబులేసు (గుడ్డి ఓబులేసు) ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల గ్రామానికి చెందిన ఇతను పుట్టుకతోనే అంధుడు. దీంతో పాటు శరీరంలోని మరి కొన్ని అవయవాలు కూడా సక్రమంగా పనిచేయక అనారోగ్యంతో ఉంటాడు. దీంతో 2004లో పింఛన్ మంజూరు చేయడం జరిగింది. అనంతరం సదరన్ క్యాంపులో వంద శాతం వైకల్యం ఉన్నట్లు సర్టిఫికెట్ మంజూరు చేయడంతో 6 సంవత్సరాల నుంచి దివ్యాంగ పింఛన్ పొందుతున్నాడు. అయితే గత మూడు రోజుల క్రితం ఇతనికి ఎలాంటి వైకల్యం లేదని పింఛన్ తొలగిస్తున్నట్లు నోటీసులు ఇవ్వడంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు సైతం ఆశ్చర్య పోతున్నారు. ఒంటరి వాడైన ఇతన్ని చూసుకునేందుకు ఇంటి దగ్గర ఉంటూ పింఛన్ సొమ్ముతో కాలం గడపుతున్నామని ఇప్పుడు ఎలా బతికేదని అతని తల్లి సుబ్బమ్మ ఆవేదన వ్యక్తం చేస్తోంది. – ఆళ్లగడ్డ -
ఆశలు గల్లంతు
రాజు, మారుతమ్మలకు ముగ్గురు కుమారులు సంతానం. రాజు ఆటో డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మొదటి కుమారుడు సంపత్ కుమార్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. రెండో కుమారుడు కారుణ్య కుమార్ 7వ తరగతి చదువుతున్నాడు. కిన్నెర సాయి (10) ఐదో తరగతి చదువుతున్నాడు. చిన్న కుమారుడిపై తండ్రి రాజు ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు. అయితే కిన్నెర సాయి మృతిచెందడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగారు. మాకు ఎవరు దిక్కు? మమత, మహారాజు దంపతులకు ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు సాయి కిరణ్ (10) ఐదో తరగతి, కుమార్తె అశ్రిత ఒకటో తరగతి చదువుతోంది. మమత, మహారాజు బెల్దారు కూలీగా పనిచేస్తూ బిడ్డలను చదివించుకుంటున్నారు. అయితే సాయి కిరణ్ నీటి కుంటలో మునిగి మృతిచెందాడు. ‘ఉన్న ఒక్క కొడుకును బాగా చదివించాలని కలలుగన్నాం. మాకు ఎవరు దిక్కు’ అంటూ వారు రోదించారు. -
ఉచిత బస్సులు లేక మహిళలకు తప్పని తిప్పలు
పత్తికొండ: గంటల తరబడి ఎదురు చూసినా ఉచిత బస్సు ఒక్కటి కూడా రాదు. బస్టాండ్లో నిరీక్షించలేక మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పత్తికొండ నుంచి గుంతకల్, గుత్తి, ఆదోని వైపు వెళ్లడానికి బస్సుల కొరత ఉంది. కొన్ని బస్సులకు మాత్రమే ఉచితం అనుమతి ఇచ్చారు. ఐదు గంటల వరకు ఒక్క బస్సూ రాకపోవడంతో బుధవారం పత్తికొండ బస్టాండ్ మహిళలతో కిక్కిరిసి కనిపించింది.శ్రీశైల ఆలయంలో ఇద్దరిపై వేటుశ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలో కాంట్రాక్ట్ పద్ధతిపై పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులపై శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు కొరఢా ఝలిపించారు. స్వర్ణరథోత్సవం నిర్వహణలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్ట్ సహాయ ఇంజినీర్ జి.రాజారావు, టెక్నికల్ అసిస్టెంట్ ఐ.శ్రీనివాసును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 19న నిర్వహించిన స్వర్ణరథోత్సవం కార్యక్రమంలో విధుల్లో ఉండాల్సిన రాజారావు, శ్రీనివాసులు గైర్హాజరైనట్లు ఈఓ గుర్తించారు. ఇంజినీరింగ్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఆపరేటర్ షెడ్ హైడ్రాలిక్ షట్టర్ను పాక్షికంగా తెరవడంతో స్వర్ణరథోత్సవం పైభాగం చామరము నొక్కుకు పోయింది. ఈ క్రమంలో ఇద్దరిని సస్పెండ్ చేస్తూ ఈఓ ఉత్తర్వులు జారీ చేశారు.నన్నారి ప్రాసెసింగ్ కేంద్రం ప్రారంభంఆత్మకూరు/శ్రీశైలం టెంపుల్: పట్టణంలోని అర్బన్ కాలనీలో నన్నారి ప్రాసెసింగ్ సెంటర్ను బుధవారం రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఆత్మకూరు ప్రాంత గిరిజనులు స్వయం ఉపాధి లో రాణించేందుకు ఈ కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటికే ఆత్మకూరు ప్రాంతంలో 18 ఎకరాల్లో నన్నారి నర్సరీలను ఏర్పాటు చేశామన్నారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో 7 కేంద్రాల్లో గిరిజనులకు మార్కెటింగ్ ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో కేంద్రానికి రూ.కోటి కేటాయించామన్నారు. వీటి ద్వారా ఉత్పత్తులు పెంచుకుని గిరిజనులు ఉపాధి పొందాలన్నారు. అనంతరం ఆత్మకూరు పట్టణంలో చెంచుల కోసం ఏర్పాటు చేసిన కుట్టుమిషన్, మినరల్ వాటర్ ప్లాంట్లను ప్రారంభించారు. శ్రీశైలంలోని చెంచు మ్యూజి యం వద్ద గిరిజన బహుళ ప్రయోజన మార్కెటింగ్ కేంద్రం నిర్మాణానికి బుధవారం మంత్రి సంధ్యారాణి శంకుస్థాపన చేశారు. ఆయా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్రెడ్డి, గిత్త జయసూర్య, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ భార్గవి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి శివప్రసాద్, ఆర్డీఓ నాగజ్యోతి, తహసీల్దార్ రత్నరాధిక, తదితరులు పాల్గొన్నారు.నందీశ్వరుడికి పరోక్షసేవ శ్రీశైలంటెంపుల్: శ్రీశైల ఆలయ ప్రాంగణంలోని శనగల బసవన్నగా పేరుపొందిన నందీశ్వరునికి శాస్త్రోక్తంగా అర్చకులు విశేషపూజలు నిర్వహించారు. శుద్ధ త్రయోదశి, బహుళ త్రయోదశి రోజుల్లో నందీశ్వరస్వామి పూజను భక్తులు పరోక్షంగా నిర్వహించుకునే అవకాశం దేవస్థానం కల్పించింది. బుధవారం 28 మంది భక్తులు పరోక్షసేవగా నందీశ్వరస్వామి విశేషపూజను జరిపించుకున్నారు. నందీశ్వర స్వామికి శాస్త్రోక్తంగా పంచామృతాలు, ఫలోదకాలతో అలాగే మల్లికాగుండంలోని శుద్ధజలంతో అభిషేకం నిర్వహించారు. అనంతరం నూతన వస్త్రసమర్పణ విశేషార్చనలను, నానపెట్టిన శనగలను, క్షేత్రపాలకునికి ప్రత్యేక నైవేద్యాన్ని సమర్పించి కర్పూర నీరాజనాలు అర్పించారు. -
పేదలపై చిన్న ‘చూపు’
కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోత ఎంత దారుణంగా ఉందో చెప్పేందుకు ఈ కుటుంబానిదే నిదర్శనం. మిడుతూరు మండలం అలగనూరు గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలో నలుగురు అంధులు ఉన్నారు. గొల్ల రమణమ్మ, ఆమె ఇద్దరు కుమారులు పెద్ద మద్దిలేటి, నడిపి మద్దిలేటి, కుమార్తె మద్దమ్మ అంధులు. రమణమ్మ భర్త సుబ్బన్ననే భార్యా, పిల్లలను ఇప్పటికీ కంటికి రెప్పలా కాపాడుకుంటూ సేవలు అందిస్తున్నారు. పింఛన్పై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న ఈ కుటుంబానికి కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. అనర్హుల ఏరివేత పేరుతో అర్హులను సైతం లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిస్తుండటంతో దివ్యాంగుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఈ నలుగురికి వంద శాతం వైకల్యం ఉన్నా వికలత్వ శాతం పునః పరిశీలన పేరుతో డాక్టర్లు 40 శాతంగా నిర్ధారించడంతో అధికారులు వచ్చే నెల నుంచి పింఛన్ నిలిపేస్తామని నోటీసులు ఇచ్చారు. దీంతో ఆ నలుగురు ఆందోళన చెందుతున్నారు. తూతూ మంత్రంగా వైద్య పరీక్షలు నిర్వహించి కంటి చూపులేని మా కడుపులు కొట్టడం దారుణమని, ఫించన్ రాకపోతే ఆత్మహత్యే శరణ్యం తప్ప మరే మార్గం కనిపించడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. జిల్లా కలెక్టర్ రాజ్కుమారి, ఎమ్మెల్యే జయసూర్య స్పందించి తమ కుటుంబానికి న్యాయం చేసి, పింఛన్ ఇప్పించాలని కోరుతున్నారు. – నందికొట్కూరు -
శ్రీమఠం హుండీ ఆదాయం రూ.3.35 కోట్లు
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం మంత్రాలయం రాఘవేంద్రస్వామి హుండీ ఆదాయం రూ.3,35,31,756 వచ్చింది. బుధవారం స్థానిక రాజాంగణ భవనంలో శ్రీమఠం హుండీ కానుకలు లెక్కగట్టారు. 20 రోజులకుగానూ హుండీల్లో కానుకలను లెక్కించగా నగదు రూ.3,24,52,256, నాణేలా రూపంలో రూ.10,79,500 సమకూరింది. అంతేగాక 1140 గ్రాముల వెండి, 74 గ్రాముల బంగారు వచ్చినట్లు మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. ‘యూరియా’ తనిఖీలకు ప్రత్యేక బృందం కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయేతర అవసరాలకు యూరియా వినియోగిస్తున్నారా అనే దానిని గుర్తించేందుకు జిల్లా అధికారులతో ప్రత్యేక బృందం ఏర్పాటు అయ్యింది. ఈ బృందం సభ్యులు కల్లూరు, కర్నూలు, ఆదోని, కోడుమూరు, వెల్దుర్తి, నందవరం, హొళగొంద, ఆస్పరి మండలాల్లోని పౌల్టీ, మిల్క్, ఇతర పరిశ్రమల్లో యూరియా వినియోగంపై తనిఖీలు చేపడతారు. వారం రోజుల పాటు తనిఖీలు జరుగుతాయి. ఎట్టకేలకు డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ ● సెప్టెంబర్ 1 నుంచి డిగ్రీ మొదటి సంవత్సరం తరగతులు కర్నూలు కల్చరల్: డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఎట్టకేలకు నోటిఫికేషన్ విడుదలైంది. నెలలుగా నిరీక్షిస్తున్న విద్యార్థులు ఆలస్యంగా డిగ్రీ కళాశాలల్లో చేరబోతున్నారు. కూటమి ప్రభుత్వం ఉన్నత విద్యపై పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలకు జాప్యం జరిగినట్లు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. 2025–26 విద్యా సంవత్సరానికి డిగ్రీలో చేరేందుకు బుధవారం ఉన్నత విద్యా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్ అడ్మిషన్స్ మోడ్యూల్ ఫర్ డిగ్రీ కాలేజేస్ (ఓఏఎమ్డీసీ) ద్వారా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. ఈనెల 20 నుంచి 26వ తేదీ వరకు విద్యార్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, 25 నుంచి 28వ తేదీ వరకు స్పెషల్ క్యాటగిరీ విద్యార్థులకు వెరిఫికేషన్, 24 నుంచి 28వ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం, 29న వెబ్ ఆప్షన్లలో మార్పు చేసుకోవడం, 31వ తేదీ కళాశాలలో సీట్ల కేటాయింపు, సెప్టెంబర్ 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. రాయలసీమ యూనివర్సిటీ పరిఽధిలో మొత్తం 82 డిగ్రీ కళాశాలలు ఉండగా అందులో 14 ప్రభుత్వ, 68 ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. నీటిని విడుదల చేయాలి కర్నూలు సిటీ: కల్లూరు మండలం కె.మార్కాపురం గ్రామం వద్ద ఉన్న చెన్నరాయునితిప్ప రిజర్వాయర్ను గాజులదిన్నె ప్రాజెక్టు నీటిని నింపి, ఆయకట్టుకు నీరు అందించేందుకు పంట కాలువలు తవ్వాలని కోరుతూ ఏపీ రైతు సంఘం నాయకులు బుధవారం జల వనరుల శాఖ కర్నూలు సర్కిల్ డిప్యూటీ ఎస్.ఈ డి. మల్లికార్జున రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామకృష్ణ మాట్లాడుతూ.. చాలా ఏళ్ల క్రితం రిజర్వాయర్ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని, కానీ నీటి సదుపాయం కల్పించలేదన్నారు. రిజర్వాయర్ నిర్మించినప్పటి నుంచి ఇప్పటివరకు చుక్క నీరు కూడా ఇవ్వలేదని, ఈ ఏడాది భారీగా వర్షాలు కురుస్తున్నాయని, వరద నీరంతా సముద్రంలో కలుస్తుందన్నారు. గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి రిజర్వాయర్కు నీటిని అందించాలని, ఆ నీరు ఆయకట్టుకు అందించేందుకు పంట కాలువలను తవ్వాలని కోరారు. శ్రీశైలంప్రాజెక్ట్: కృష్ణానది ఉరకలు వేస్తూ నాగార్జున సాగర్పై వైపు బిరబిర సాగుతోంది. శ్రీశైలం జలాశయానికి ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. గంటగంటకు వరద ఉధృతి భారీగా పెరుగుతోంది. దీంతో తెరచి ఉంచిన 10 రేడియల్ క్రస్ట్గేట్లను బుధవారం 18 అడుగులకు పెంచారు. స్పిల్వే ద్వారా 4,22,100 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్కు వదులుతున్నారు. మంగళవారం నుంచి బుధవారం వరకు జూరాల, సుంకేసుల, హంద్రీల నుంచి శ్రీశైలంకు 4,53,858 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. జలాశయం నుంచి దిగువ ప్రాజెక్ట్లకు 4,27,466 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. క్రస్ట్గేట్ల ద్వారా 3,25,237, విద్యుత్ ఉత్పాదన అనంతరం 69,411 క్యూసెక్కుల నీ టిని నాగార్జునసాగర్కు వదిలారు. పోతిరెడ్డిపా డు ద్వారా 30,000, హంద్రీనీవా సుజలస్రవంతికి 2,818 క్యూసెక్కుల నీరు వదిలారు. -
దివ్యాంగుల ఆగ్రహం
● ఎంపీడీఓ కార్యాలయం గేటు మూసి నిరసన కోసిగి: వికలాంగత్వం తక్కువ చూపి పింఛన్ తొలగించేందుకు కుట్ర పన్నుతున్న కూటమి ప్రభుత్వంపై దివ్యాంగులు కన్నెర్రజేశారు. ఇదెక్కడి న్యాయమంటూ నిరసనగళం వినిపిస్తున్నారు. కోసిగి మండలంలో నోటీసులు అందుకున్న పలువురు తమ గోడు వినిపించేందుకు బుధవారం ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే, అక్కడ అటెండర్ తప్ప అధికారులెవ్వరూ లేకపోవడంతో కార్యాలయం గేటు మూసి వేసి ఆందోళనకు దిగారు. దాదాపు రెండు గంటల పాటు కార్యాలయం ఎదుట కూర్చొని ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో వచ్చిన ఎంపీడీఓ ఈశ్వరయ్య దివ్యాంగులతో మాట్లాడకుండా కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారు. మా ఆవేదన పట్టదా అంటూ నిలదీశారు. ఎన్నో ఏళ్ల నుంచి తమకు పింఛన్ వస్తుందని, ఇప్పుడెందుకు నోటీసులు పంపించారని ప్రశ్నించారు. ఈక్రమంలో ఎంపీడీఓ, దివ్యాంగుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని, అలాగే మరోసారి రీవెరిఫికేషన్ చేయిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
పుట్టుకతో దివ్యాంగుడికి వైకల్యమే లేదట..
ఇక్కడ బండపై పడుకుని అమాయకంగా నవ్వుతున్న దివ్యాంగ బాలుడి పేరు లీలాధర్. ఆళ్లగడ్డ మండలం కోట కందుకూరు గ్రామానికి చెందిన ఈ బాలుడు పుట్టకతోనే దివ్యాంగుడు. ఎదుగుదల లేదు, నడవలేడు.. కూర్చో లేడు.. మాటలు రావు.. కళ్లు కూడా సరిగా కనిపించవు. ఈ బాలుడికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వంద శాతం వైకల్యం ఉన్నట్లు సర్టిఫికెట్ ఇచ్చి దివ్యాంగ పింఛన్ మంజూరు చేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఈ బాలుడికి అసలు వికలత్వం లేదని, అందువల్ల పింఛన్ నిలిపివేస్తున్నట్లు నోటీసులు ఇచ్చింది. అప్పటి నుంచి ఏం చేయాలో అర్థంకావడం లేదని బాలుడి తండ్రి శివ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. – ఆళ్లగడ్డ -
‘రెవెన్యూ’ సమస్యలపై ప్రత్యేక దృష్టి
కర్నూలు(సెంట్రల్): రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి, వాటి పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా ఆదేశించారు. కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో రెవెన్యూ, సర్వే అంశాలపై సబ్ కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్లు, మండల సర్వేయర్లతో బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పీజీఆర్ఎస్లో వచ్చే అర్జీల్లో 80 నుంచి 85 శాతం వరకు రెవెన్యూకు సంబంధించినవే ఉన్నాయన్నారు. రీసర్వే సమస్యలతోపాటు సర్వేయర్లు ఫీల్డ్కు వెళ్లడంలేదని, చెప్పకుండా సర్వే చేస్తున్నారని, డబ్బులు అడుతుతున్నారని అనే ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. కర్నూలు ఆర్డీఓ కార్యాలయం, సీ బెళగల్, గోనెగండ్ల, కోడుమూరు తహసీల్దార్ కార్యాలయాల్లో అధికారుల నుంచి సంతృప్తికరమైన పరిష్కా రాలు లభించడంలేదని ప్రజలు ఐవీఆర్ఎస్లో ఫీడ్ బ్యాక్ ఇచ్చారన్నారు. ప్రతి శుక్రవారం ఓ మండలంలో గ్రీవెన్స్ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి శనివారం ఆర్ఓఆర్ కోర్టులను నిర్వహించి 20 కేసులను పరిష్కరించాలని సబ్ కలెక్టర్, ఆర్డీఓలను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల బాధితులకు జాప్యం లేకుండా ప్రయోజనాలు కల్పించాలన్నారు. దలకు ఇచ్చే స్థలాల కోసం భూములను గుర్తించాలని ఆదేశించారు. జేసీ డాక్టర్ బి.నవ్య ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, డీఆర్ఓ సి.వెంకటనారాయణమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు వెంకటేశ్వర్లు, అజయ్కుమార్, కర్నూలు, పత్తికొండ ఆర్డీఓలు సందీప్కుమార్, భరత్నాయక్ పాల్గొన్నారు. వచ్చే వారం నుంచి ‘పల్లెకుపోదాం’ గ్రామాల్లోని సమస్యల పరిష్కారం కోసం వచ్చే వారం నుంచి పల్లెకుపోదాం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు కలెక్టర్ పి.రంజిత్బాషా తెలిపారు. సునయన ఆడిటోరియంలో బుధవారం ఉదయం స్పెషల్ ఆఫీసర్లు, తహసీల్దార్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతి నెలలో ఒకసారి పల్లెకు పోదాం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు 80 మంది జిల్లా అధికారులను గుర్తించి ప్రత్యేకాధికారులుగా నియమించామన్నారు. ముందు రాత్రి మాత్రమే ఏ గ్రామానికి వెళ్లాలి అనే సమాచారాన్ని అధికారులకు తెలియజేస్తామన్నారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు తమ బృందాలతో ప్రత్యేకాధికారి వెంట వెళ్లాల్సి ఉంటుందన్నారు. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా -
వచ్చే నెల 13న అన్ని కోర్టుల్లో జాతీయ లోక్అదాలత్
కర్నూలు(సెంట్రల్): జిల్లాలోని అన్ని కోర్టుల్లో సెప్టెంబర్ 13వ తేదీన జాతీయ లోక్అదాలత్ను నిర్వహించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి ఆదేశించారు. బుధవారం జిల్లా న్యాయ సేవాసదన్లో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్పై పోలీసులు, రెవెన్యూ, బ్యాంకు అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోర్టుల్లో పెండింగ్లో ఉండి రాజీ కాగల్సిన సివిల్, క్రిమినల్, ఎకై ్సజ్, మోటార్ యాక్సిడెంట్, భూసేకరణ కేసులను జాతీయ లోక్అదాలత్లో త్వరగా పరిష్కరించుకోవచ్చన్నారు. ఆందులో ఎక్కువ కేసులు పరిష్కారయ్యేలా పోలీసులు, న్యాయవాదులు చూడాలని సూచించారు. -
పదోన్నతులకు గ్రహణం
కర్నూలు(సెంట్రల్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో 150 మంది గ్రేడు–2 వీఆర్వోల పదోన్నతి ప్రక్రియ ఏడాదిగా నిలిచిపోయింది. గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పడిన తొలినాళ్లలో రెండు జిల్లాల పరిధిలో 469 మంది గ్రేడు–2 వీఆర్వోలను నియమించారు. వీరికి 2023 ఆఖరిలోనే గ్రేడు–1 వీఆర్వోలుగా పదోన్నతి కల్పించాలని అప్పటి ప్రభుత్వం యోచించింది. అయితే ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక 2023 ఏప్రిల్ 3వ తేదీన పదోన్నతుల ప్రక్రియకు సంబంధించి గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని 2024 ఆక్టోబర్ 10వ తేదీన జిల్లా కలెక్టర్ ఆదేశాలు వచ్చాయి. మే 9న తుది జాబితా పదోన్నతుల కోసం సీనియారిటీ జాబితాను తయారు చేసేందుకు రెండు నెలలు, తుది జాబితా తయారీకి మరో నెల సమయం పట్టింది. మొత్తంగా 2025 జనవరి ఏడో తేదీ నాటికి పదోన్నతులకు అర్హత ఉన్న జాబితాను తయారు చేశారు. ఆ జాబితా ప్రకారం 150 ఖాళీలకు రోస్టర్ రూపొందించడానికి మార్చి 25వ తేదీ వరకు సమయం పట్టగా...దానిపై అభ్యంతరాలను స్వీకరించడానికి ఏప్రిల్ 3వ తేదీ వరకు గడువు విధించారు. అయితే తరువాత ఏప్రిల్ 19వ తేదీ వరకు ఆలస్యం చేయడంతో ఎస్సీ వర్గీకరణ ఉత్తర్వులు రావడంతో దాని ప్రకారం రోస్టర్ తయారు చేయడానికి ఏప్రిల్ 30వ తేదీ వరకు సమయం తీసుకుని మే 9వ తే దీన పూర్తి స్థాయి తుది జాబితాను రూపొందించారు. అధికారుల అలసత్వం ఉమ్మడి కర్నూలు జిల్లాలో అధికారుల అలసత్వంతోనే గ్రేడు–2 వీఆర్వోల పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయిందని ఆశావాహక ఉద్యోగులు పేర్కొంటున్నారు. కలెక్టర్ ఆగస్టులో ఆదేశాలు ఇచ్చినా రోస్టర్తో కూడిన అర్హుల జాబితాను తయారు చేయడానికి 8 నెలలు తీసుకోవడం..అదే సమయంలో ఎస్సీ వర్గీకరణ రావడంతో ప్రక్రియకు తీవ్ర ఆటంకం కలిగినట్లు తెలుస్తోంది. ఎస్సీ వర్గీకరణ ఏప్రిల్ 19వ తేదన విడుదలైంది. అయితే ఏప్రిల్ మొదటి వారంలోనే కృష్ణ, శ్రీకాకుళం జిల్లాల్లో గ్రేడు–2 వీఆర్వోల పదోన్నతులను పూర్తి చేశారు. అయితే జిల్లా అధికారులు మాత్రం తమ నిర్లక్ష్యంతో తుది అర్హత జాబితాను రూపొందించకపోవడమే ఈపరిస్థితికి కారణంగా తెలుస్తోంది. ఏడాదిగా ముందుకు సాగని ప్రక్రియ ఎదురు చూస్తున్న 150 మంది గ్రేడు–2 వీఆర్వోలు కొందరు డబ్బులు వసూలు చేసిన వైనం! పదోన్నతుల పేరిట వసూళ్లు 2024 ఆగస్టు నుంచి గ్రేడు–2 వీఆర్వోల పదోన్నతుల ప్రక్రియ మొదలు కావడంతో అప్పట్లో పనిచేసిన కొందరు ఉన్నతాధికారులు ఆశావాహుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. జాబితాలో పేరు ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని కలెక్టరేట్లో పని చేసే కొందరు ఉద్యోగులు డిమాండ్ చేశారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో కొందరు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేశారు. అయితే డబ్బులు ఇచ్చినా పదోన్నతి రాకపోవడం..ఇటు డబ్బులు వసూలు చేసిన అధికారులు బదిలీపై వెళ్లడంతో వారికి దిక్కుతోచడంలేదు. తాము ఇచ్చిన డబ్బు వెనక్కి ఇవ్వాలని అడుగుతున్నా వసూలు చేసిన అధికారులు ఇవ్వడంలేదనే వాదన ఉంది. -
దివ్యాంగుల పింఛన్ల తొలగింపు దారుణం
ఆలూరు: అడ్డగోలు నిబంధనలతో కూటమి సర్కారు దివ్యాంగుల పింఛన్లు తొలగించడం దారుణమని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి మండిపడ్డారు. సర్కారుకు తప్పనిసరిగా దివ్యాంగుల ఉసురు తగులుతుందన్నారు. ఆలూరులో ఆర్అండ్బీ అతిథి గృహం ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో కులమతాలు, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ మంజూరైందన్నారు. వీరందరికి తాము అధికారంలోకి వస్తే అధిక పింఛన్ ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. నమ్మి ఓట్లేసిన దివ్యాంగులకు ఇప్పుడు నోటీసులు జారీ చేసి పింఛన్ ఎత్తివేస్తున్నారన్నారు. కొత్త పింఛన్లు దేవుడెరుగు ఉన్న పింఛన్లకు కూడా కోత పెడుతుండటంతో పేదలకు దిక్కుతోచడం లేదన్నారు. సమావేశంలో ఆలూరు ఎంపీపీ రంగమ్మ, ఎంపీటీసీలు బోయ ఎల్లమ్మ, జీరా నాగమ్మ, దేవరాజ్, జిల్లా వైఎస్సార్సీపీ బీసీ సెల్ కార్యదర్శి భాస్కర్, మండల కో ఆప్షన్ మెంబర్ బాషా, అరికెర వెంకటేశ్వర్లు, మండల కో–కన్వీనర్ వీ రేష్, నాయకులు నాగప్ప, బాబ, జాన్ పాల్గొన్నారు. అటవీ ఉద్యోగులపై టీడీపీ ఎమ్మెల్యే దాడి హేయం కర్నూలు కల్చరల్: విధులు నిర్వహిస్తున్న అటవీ శాఖ ఉద్యోగులపై శ్రీశైలం శాసన సభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి, అతని అనుచరులు దాడి చేయడం హేయమైన చర్య అని ఏపీ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ అసోసియేషన్ నాయకులు అన్నారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటనను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. మంగళవారం రాత్రి శ్రీశైలం శిఖరం చెక్పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న ఉప అటవీ క్షేత్రాధికారి, ఇద్దరు బీట్ ఆఫీసర్లను, ఇతర సిబ్బందిని కిడ్నాప్ చేసి వాహనంలో బంధించి ఎమ్మెల్యే దౌర్జన్యానికి పాల్పడుతూ, అసభ్య పదజాలంతో దూషిస్తూ, భౌతిక దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు. ఉద్యోగుల వాకీటాకీలు, సెల్ఫోన్లు ఇతర వస్తువులను తీసుకొని వాహనంలో శ్రీశైలం, సున్నిపెంట రోడ్లన్నీ తిప్పుకుంటూ దాడిచేశారని పేర్కొన్నారు. గెస్ట్హౌస్లో బంధించి ఇబ్బంది పెట్టి రాత్రి రెండు గంటలకు వదలి పెట్టారని తెలిపారు. సిబ్బంది కొరతతో ఇబ్బందులు పడుతున్న అటవీ ఉద్యోగ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ అసోసియేషన్ ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షులు జి.కిరణ్కుమార్, ఉపాధ్యక్షులు ఎస్.అబ్దుల్ కలాం, రాయలసీమ జోనల్ సెక్రటరీ డి.మౌలాలి, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం. రతీదేవి, జాయింట్ సెక్రటరీ ఆర్. కాసిదాసు, కోశాధికారి సి. అనురాధ పేర్కొన్నారు. ఉపముఖ్య మంత్రి, అటవీ శాఖ మంత్రి స్పందించి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
చెప్పుకోలేని వ్యథ
గతంలో అధికారులు ఇచ్చిన 55 శాతం అంగవైకల్యం సర్టిఫికెట్ చూపుతున్న వ్యక్తి పేరు మాల చిన్న తిమ్మప్ప. మండల కేంద్రం నందవరం సొంతూరు. పుట్టుకతోనే చెవిటి, మూగ. ఎవరు ఎమి మాట్లాడుతున్నారో అర్థం కాదు. వినిపించని పరిస్థితి. గతంలో ఇచ్చే దివ్యాంగుల పింఛన్ కూటమి ప్రభుత్వం ఇప్పుడు నిలిపేస్తామని నోటీసులు ఇవ్వడంతో ఆందోళన చెందుతున్నాడు. ప్రభుత్వం, అధికారులు అనుసరిస్తున్న తీరుపై మూగ సైగలతో ఆవేదన వ్యక్తం చేశాడు. రీ వెరిఫికేషన్లో తాత్కాలిక వైకల్యం ఉందని తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని..తమలాంటి వారికి సాయం చేసి ఆదుకోవాలని కోరుతూ వేడుకున్నాడు. – నందవరం -
రైతు ఆత్మహత్యాయత్నం
కోవెలకుంట్ల: మండలంలోని ఎం. గోవిందిన్నెకు చెందిన ఓ రైతు బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధిత రైతు వెంకటరమణ ఆచారి అందించిన సమాచారం మేరకు.. గ్రామ శివారులోని 420 సర్వేనంబర్లో గ్రామానికి చెందిన మునెమ్మకు 47 సెంట్లు భూమి ఉంది. ఆమెకు వెంకటరమణ ఆచారి, రామచంద్ర ఆచారి, సుబ్బరాయుడు ముగ్గురు సంతానం. ఇటీవల అనారోగ్యంతో మునెమ్మ మృతి చెందింది. ముగ్గురు కుమారులు ఆ భూమిని సమాన భాగాలుగా పంచుకోవాల్సి ఉంది. ప్రస్తుతం పొలం వెంకటరమణ ఆచారి ఆధీనంలో ఉంది. అదే గ్రామానికి చెందిన నాగరత్నం ఆచారికి పక్కనే పొలం ఉంది. చిన్నకొప్పెర్లకు చెందిన కొందరు వ్యక్తుల ప్రోద్బలంతో నాగరత్నం ఆచారి దౌర్జన్యంగా పొలంలోకి దిగి ట్రాక్టర్తో దున్ని ఆక్రమించుకున్నాడు. దీంతో మనస్తాపం చెందిన వెంకట రమణ ఆచారి క్రిమి సంహారక మందు తాగి ఆపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. రైతు ఆత్మహత్యయత్న సంఘటనపై రేవనూరు పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
మాకెందుకు ఈ కష్టాలు!
ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న పింఛన్ను ఒక్క సారిగా కూటమి ప్రభుత్వం తొలగించడంతో దివ్యాంగులు అష్టకష్టాలు పడుతున్నారు. బుధవారం వివిధ గ్రామాలకు చెందిన దివ్యాంగులు మండల పరిషత్ కార్యాలయానికి చేరుకొని దరఖాస్తులు పూర్తి చేసి అధికారులు అందజేశారు. మండలంలో 194 మంది లబ్ధిదారులను అనర్హత పేరుతో తొలగించారు. పింఛన్, సదరం సర్టిఫికెట్ పునరుద్ధరించేందుకు మరో సారి దరఖాస్తు చేయాల్సి రావడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వస్తున్న పింఛన్ను తొలగించి మాకెందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నారని వాపోయారు. లబ్దిదారుల వివరాలు ఆన్లైన్ నమోదు చేస్తే విడతల వారీగా దివ్యాంగులకు మళ్లీ రీవెరిఫికేషన్కు హాజరు కావాల్సి ఉంటుంది. వైద్యులు పరీక్షలు చేశాక వైకల్యాన్ని నిర్ధారిస్తారు. 40 శాతం కంటే తక్కువగా ఉంటే పింఛన్ మంజూరు కాదు. ప్రస్తుతం తొలగించిన వాళ్లలో ఎక్కువ భాగం అర్హత ఉన్న వారి పేర్లు గల్లంతయ్యాయి. గతంలో వైద్యులే పరిశీలించి సదరం సర్టిఫికెట్లు మంజూరు చేశారని ఇప్పుడు కొత్తగా ఈ పరీక్షలు ఎందుకని దివ్యాంగులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. – కొలిమిగుండ్ల -
ఈ బాలుడు అనర్హుడట..
ఈ చిత్రంలోని బాలుడి పేరు షేక్ షాషా..కర్నూలులోని గనిగల్లీకి చెందిన ఈ బాలుడి వయస్సు 15 ఏళ్లు. ఈ బాలుడిని చూస్తే.. ఎవ్వరైనా అయ్యో పాపం అంటారు. పుట్టుకతోనే పోలియో కారణంగా రెండు కాళ్లు పనిచేయవు. లేపడానికి, కూర్చొబెట్టడానికి సహకారం తప్పనిసరి. మామూలుగా అయితే ఈ బాలుడికి హెల్త్ పింఛన్ మంజూరు కావాలి. 2015 సెప్టెంబరు 14న టీడీపీ ప్రభుత్వం హయాంలోనే సదరం క్యాంపునకు వీరి తల్లిదండ్రులు తీసుకపోగా.. 100 శాతం వికలత్వం ఉన్నట్లు నిర్ధారించి సర్టిఫికెట్ ఇచ్చారు. రీ వెరిఫికేషన్లో భాగంగా సదరం క్యాంపునకు వెళ్లిన డాక్టర్లకు పోలియోతో పోయిన షేక్ షాషా కాళ్లు గమనించకుండా.. వికలత్వం తాత్కాలికమేనంటూ.. 40 శాతం లోపే వికలత్వ శాతం ఇచ్చారు. దీంతో పింఛన్ రద్దు అయిందంటూ మున్సిపల్ కమిషనర్ నోటీసు ఇచ్చారు. డాక్టర్లు కళ్లుండి చూసే సదరం సర్టిిఫికెట్ ఇచ్చారా అనే ప్రశ్న ఉత్పన్నమైంది. సదరం క్యాంపుల్లో డాక్టర్లు నిజాయితీ, చిత్తశుద్ధితో వ్యవహరించారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. – కర్నూలు(అగ్రికల్చర్) -
హాస్టళ్లలో విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండి
కర్నూలు(అర్బన్): జిల్లాలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థుల భద్రతను మొదటి ప్రాధాన్యతగా స్వీకరించి విధులు నిర్వహించాలని ఆ శాఖ సాధికారత అధికారిణి బి. రాధిక కోరారు. బుధవారం ఉదయం స్థానిక సంక్షేమ భవన్లోని తన చాంబర్లో ఏఎస్డబ్ల్యూఓ, హెచ్డబ్ల్యూలతో ఆమె సమావేశం నిర్వహిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని, ముఖ్యంగా కొనుగోలు చేస్తున్న వస్తువులపై ఎక్స్పైరీ తేది చూసుకోవాలన్నారు. ఇప్పటి వరకు కొత్తగా హాస్టళ్లలో ప్రవేశం పొందిన విద్యార్థుల, ట్యూటర్ల జాబితాలను కూడా పంపలేదని ఆమె అసహనం వ్యక్తం చేశారు. పలు హాస్టళ్లలో మెనూ సక్రమంగా పాటించడం లేదని, కోడిగుడ్లు కూడా విద్యార్థులకు పెట్టడం లేదనే ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. ఇప్పటి నుంచి ప్రతి వసతి గృహ సంక్షేమాధికారి రోజుకు రెండు పర్యాయాలు ఎఫ్ఆర్ఎస్ వేయాల్సి ఉందన్నారు. సెలవు రోజుల్లో మూడు సార్లు ఎఫ్ఆర్ఎస్ నమోదు చేయాలన్నారు. ఇందుకు విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని వసతి గృహాల్లో టాయ్లెట్లను శుభ్రంగా ఉంచుకోవాలని, బహిరంగ మూత్ర, మల విసర్జనకు అనుమతించరాదన్నారు. సహాయ సంక్షేమాధికారులు ఆయా వసతి గృహాలను తనిఖీ చేసిన రిపోర్టులను పక్కాగా నిర్వహించాలన్నారు. సమావేశంలో సహాయ సంక్షేమాధికారులు కె. బాబు, ఎస్. లీలావతి, బి.మద్దిలేటి పాల్గొన్నారు. ప్రస్తుత సీజన్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి సాంఘిక సంక్షేమ సాధికారత అధికారిణి రాధిక -
తప్పతాగిన శ్రీశైలం ఎమ్మెల్యే..అటవీ సిబ్బందిపై దాడి
సాక్షి ప్రతినిధి, కర్నూలు/యర్రగొండపాలెం/పెద్దదోర్నాల: శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి మద్యం మత్తులో అరాచకం సృష్టించారు. తాను ఎక్కడ ఉన్నానో, ఏం చేస్తున్నానో అనే కనీస స్పృహ లేకుండా అటవీ సిబ్బందిని కిడ్నాప్ చేసి, వారిపై దాడికి దిగారు. మద్యం సేవించి పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలం అతిథి గృహంలో బసచేసి దిగజారి ప్రవర్తించారు. దీనికి సంబంధించి సీసీ కెమెరా దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. దోర్నాల–శ్రీశైలం ఘాట్రోడ్డు రాత్రి 9 గంటలకు మూసేస్తారు. ఉదయం 6 గంటలకు తిరిగి వాహనాలను అనుమతిస్తారు. శ్రీశైలంలోని శిఖరం వద్ద కూడా ఇదే సమయాన్ని అటవీ అధికారులు పాటిస్తారు. మంగళవారం రాత్రి ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రామానాయక్, బీట్ఆఫీసర్లు మోహన్కుమార్, గురవయ్య, డ్రైవర్ కరీం రాత్రి గస్తీ చేపట్టారు. చిన్నారుట్ల బీట్ సమీపంలో శిఖరం చెక్పోస్టు సమీపంలో రెండు వాహనాలు రోడ్డుపై ఆగి ఉండటాన్ని గమనించి హారన్ కొడుతూ వాటివద్దకు వెళ్లినా వాహనాలు కదల్లేదు. ఆ వాహనాల్లో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి తన అనుచరులతో ఉండటాన్ని చూసి ఎమ్మెల్యేకు సెల్యూట్ చేశారు. మద్యం మత్తులో ఊగిపోతున్న ఎమ్మెల్యే తన వాహనాల వద్దకు వచ్చి హారన్ కొట్టడంపై అటవీ సిబ్బందిపై బూతులతో రెచి్చపోయారు. ‘మీరంతా ప్రకాశం జిల్లా ఫారెస్టోళ్లు. శ్రీశైలం నా పరిధి. ఇక్కడ సిబ్బంది వద్దకు వచ్చి డబ్బులు తీసుకుని వాహనాలు పంపిస్తూ నాకు చెడ్డపేరు తెస్తారా?’ అంటూ పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. గడువు దాటిన తర్వాత కూడా శిఖరం చెక్పోస్టు నుంచి వాహనాలను ఎమ్మెల్యే ముందుకు పంపించారు. ‘ఇది టైగర్ జోన్. వాహనాలను పంపకూడదు’ అని అటవీ సిబ్బంది చెబుతున్నా ఎమ్మెల్యే వినిపించుకోలేదు. శిఖరం తమ పరిధిలోకి రాదని, ఆత్మకూరు రేంజ్ పరిధిలోకి వస్తుందని, తమకు సంబంధం లేదని చెబుతున్నా వినిపించుకోకుండా వారిపై చేయి చేసుకున్నారు. అటవీ సిబ్బంది ఐడీ, ఆధార్ కార్డులు, పర్సులను ఎమ్మెల్యే అనుచరులు లాగేసుకున్నారు. అటవీ అధికారుల వాహనంలో ఇద్దరు సిబ్బందిని, తన వాహనంలో మరో ఇద్దరు అటవీ సిబ్బందిని బలవంతంగా కూర్చోబెట్టారు. అటవీ వాహనాన్ని తానే డ్రైవ్ చేసుకుని సిబ్బందిని కిడ్నాప్ చేసి శ్రీశైలంలోని ఓ అతిథి గృహంలో నిర్బంధించారు. అక్కడికి జనసేన నాయకుడు అశోక్కుమార్, ఎమ్మెల్యే అనుచరుడు రవుత్ చేరుకుని అటవీ అధికారులు, సిబ్బందిపై దాడికి దిగారు. అర్ధరాత్రి తర్వాత వారిని విడిచిపెట్టారు.ఎమ్మెల్యేపై కేసు నమోదు ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు మార్కాపురం డీఎఫ్ఓకు వివరించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేతోపాటు దాడి చేసిన వారిలో జనసేన నాయకుడు ఉన్నారని చెప్పారు. దీనిపై అటవీశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్కు ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అని తొలుత భయపడ్డారు. చివరకు ఎమ్మెల్యే దాడి చేసిన దృశ్యాలతో పాటు ఘటన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రభుత్వ పెద్దల సూచనతో శ్రీశైలం వన్టౌన్ పోలీసు స్టేషన్లో అటవీ శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, జనసేన నేత అశోక్పై కేసు నమోదు చేశారు.మద్యం సేవించి శ్రీశైలంలో బస! శ్రీశైలంలో మద్యపానం పూర్తిగా నిషేధం. కానీ.. ఎమ్మెల్యే, వారి అనుచరులు పూటుగా మద్యం సేవించి అటవీ సిబ్బందిపై బూతులతో విరుచుకుపడి, దాడి చేయడమే కాకుండా శ్రీశైలంలోని ఓ అతిథిగృహంలో బస చేశారు. ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే, అదీ తన సొంత నియోజకవర్గం శ్రీశైలంలో మద్యం మత్తులో బస చేయడాన్ని భక్తులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. సనాతన ధర్మాన్ని రక్షిస్తానని చెప్పే అటవీశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ తన సిబ్బందిపై ఎమ్మెల్యే దాడి చేయడం, మద్యం సేవించి శ్రీశైలంలో బస చేయడంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారోననే చర్చ జరుగుతోంది. ఉపేక్షించేది లేదు: అటవీశాఖ డీడీతమ సిబ్బందిపై దాడి చేసిన వారు ఎవరైనా ఉపేక్షించేది లేదని ప్రకాశం జిల్లా మార్కాపురం అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సందీప్ కృపాకర్ పేర్కొన్నారు. తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. మంగళవారం రాత్రి శ్రీశైలంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి, ఆయన అనుచరులు అటవీశాఖ సిబ్బందిపై దాడి ఘటనను ఆయన ఖండించారు. ఇటువంటి దాడులకు పాల్పడటం సరైన పద్ధతి కాదన్నారు. బాధిత సిబ్బంది శ్రీశైలం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నారని, ఆ ఫిర్యాదుతో పాటు తాము శాఖాపరంగా విచారణ జరుపుతామన్నారు. బాధితుల్లో ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు చెందిన వారున్నారని, దోషులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులతోపాటు దాడులు, కిడ్నాప్, దోపిడీ లాంటి కేసులు నమోదయ్యే అవకాశాలు ఉంటాయన్నారు.తక్షణం చర్యలు తీసుకోవాలి: ఫారెస్ట్ అధికారుల సంఘంఅటవీ శాఖాధికారిపైన, సిబ్బందిపైన దాడికి పాల్పడిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి, ఆయన అనుచరులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఏపీ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ మార్కాపురం ప్రాంత అధ్యక్షుడు పి.కరీముల్లా డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఫారెస్ట్ అధికారి కార్యాలయంలో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. మంగళవారం రాత్రి విధులు నిర్వర్తిస్తున్న అటవీ శాఖ నెక్కంటి డిప్యూటీ రేంజ్ అధికారి డి.రామానాయక్, ఎఫ్ఎస్ఓ జె.మోహన్కుమార్, ఎఫ్బీఓ టీకే గురువయ్య, డ్రైవర్ షేక్ కరీముల్లాను శ్రీశైలం శిఖరం వద్ద అటకాయించి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి, దాదాపు 30 మంది అనుచరులు దాడి చేశారన్నారు. సిబ్బందిని వాహనంలో కిడ్నాప్ చేసి తీవ్ర హింసలకు గురిచేశారని ఆరోపించారు. సిబ్బంది వద్ద ఉన్న వాకీటాకీలు, మొబైల్ ఫోన్లు, నగదు, వ్యక్తిగత వస్తువులు కూడా అపహరించారని వివరించారు. తెల్లవారుజామున 4 గంటలకు ఫారెస్ట్ సిబ్బందిని విడిచి పెట్టారని, దాడికి గురైన వారంతా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారేనని ఆయన తెలిపారు. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్కళ్యాణ్ తక్షణమే స్పందించాలని, సీఎం చంద్రబాబు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రాజశేఖర్రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని, దాడికి పాల్పడిన వారు తమ సిబ్బందికి క్షమాపణ చెప్పాలని, వారికి చట్టపరమైన శిక్ష పడేవరకు తాము విధులను బహిష్కరిస్తామని ఆయన హెచ్చరించారు. సమావేశంలో సంఘం సభ్యులు డి.శివశంకర్, జె.ఫిలిప్, జి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
కర్నూలు జిల్లాలో విషాదంపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
సాక్షి, తాడేపల్లి: కర్నూలు జిల్లాలో నీటికుంటలో పడి ఆరుగురు విద్యార్థులు మృతి చెందటం పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్ర్భాంతి చెందారు. ఉజ్వల భవిష్యత్ను పొందాల్సిన విద్యార్థులు ఇలా ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమన్నారు.‘‘మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. వారి కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
కర్నూలు జిల్లాలో విషాదం.. ఆరుగురు విద్యార్థుల మృతి
సాక్షి, కర్నూలు జిల్లా: ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. నీటి కుంటలో పడి ఆరుగురు విద్యార్థులు మృతి చెందారు. మృతి చెందిన వారంతా ఐదవ తరగతి చెందిన విద్యార్థులే. ఈత కోసం వెళ్లిన విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు.చిగలి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న ఏడుగురు విద్యార్థులు స్కూల్ ముగిసిన అనంతరం.. గ్రామ శివారులోని నీటి కుంటలో సరదాగా ఈత కొట్టడానికి వెళ్లారు. అయితే, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కుంటలో భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో కుంటలో ఈతకు దిగిన విద్యార్థుల్లో ఆరుగురు చెరువులో మృత్యువాత పడ్డారు. మరో విద్యార్థి గ్రామస్థులకు ప్రమాదం గురించి సమాచారం ఇచ్చాడు. ఆరుగురు చిన్నారులు మృతి చెందడంతో చిగలిలో విషాదం నెలకొంది. -
రెచ్చిపోయిన మరో టీడీపీ ఎమ్మెల్యే.. ఫారెస్ట్ వాహనాన్ని లాక్కుని..
సాక్షి, నంద్యాల జిల్లా: అధికార పార్టీ ఎమ్మెల్యేలు వరుస వివాదాలతో వార్తల్లో కెక్కుతున్నారు. ఉపేక్షించబోనని ఆ పార్టీ అధినేత చంద్రబాబు హెచ్చరిస్తున్నా.. నారా లోకేష్ అండతో చెలరేగిపోతున్నారు. తాజాగా.. శ్రీశైలం శిఖరం చెక్ పోస్ట్ వద్ద ఫారెస్ట్ వాహనాన్ని ఆపి తమపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి, ఆయన అనుచరులు దాడి చేశారంటూ ఫారెస్ట్ సిబ్బంది ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.ఎమ్మెల్యే దాడి విషయాన్ని ఫారెస్ట్ సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఫారెస్ట్ వాహనాన్ని ఎమ్మెల్యే తానే నడుపుతూ.. సిబ్బందిని వాహనంలో ఎక్కించుకెళ్లినట్లు సమాచారం. అర్ధరాత్రి 2 గంటల వరకు ఫారెస్ట్ సిబ్బందిని ఎమ్మెల్యే, ఆయన అనుచరులు తిప్పినట్లు తెలిసింది.ఫారెస్ట్ గార్డ్ గురవయ్యపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి అనుచరులు దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మేం చెప్పినట్టు వినడం లేదని ఎమ్మెల్యే దాడి చేశారంటున్న ఫారెస్ట్ సిబ్బంది.. డిపార్ట్మెంట్ వాహనాన్ని కూడా ఎమ్మెల్యే లాక్కున్నారంటూ ఆరోపిస్తున్నారు. అటవీ శాఖ సిబ్బందిపై బుడ్డా రాజశేఖర్రెడ్డి, అనుచరుల దాడిపై ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. -
మిగిలిన స్థానాలకే ఆప్షన్లు
కూటమి ప్రభుత్వంలో చేయి తడపనిదే ఏ పనీ జరగని పరిస్థితి. సామాన్య ప్రజలే కాదు, అధికారులు సైతం తమ పని కావాలంటే నేతల వద్ద చేతులు కట్టుకోవాల్సిందే. ఇక బదిలీల విషయానికొస్తే సిఫారసు లేఖలు లేనిదే ఉన్నతాధికారులు సంబంధిత ఉద్యోగులనుపరిగణనలోకి తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఈ లేఖల కోసం నాయకుల చుట్టూ పనులు వదలుకొని ప్రదక్షిణ చేయాల్సి వస్తోంది. అంతేకాదు.. కొందరైనా లేఖల కోసం పోస్టును బట్టి డబ్బు వసూలు చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇలా అంతోఇంతో ఇచ్చి కోరుకున్న పోస్టులు దక్కించుకున్న అధికారుల్లో నిజాయితీ ఎంతమాత్రం ఉంటుందో ఇట్టే అర్థమవుతుంది. కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని గ్రామ సచివాలయాల్లో గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శులుగా విధులు నిర్వహిస్తున్న వారిలో అర్హతలను అనుసరించి గ్రేడ్–4 పంచాయతీ కార్యదర్శులుగా పదోన్నతి కల్పించారు. పదోన్నతి పొందిన వీరు తాము కోరుకున్న ప్రాంతానికి పోస్టింగ్ ఇప్పించుకునేందుకు స్థానిక ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. నాయకులు ఇచ్చే సిఫారసు లేఖలకే బదిలీలు ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. పచ్చ నేతల సిఫారసు లేఖలు ఉంటే కోరుకున్న చోటుకు, లేదంటే జిల్లా సరిహద్దులకు బదిలీ చేస్తున్నట్లు కొందరు ఉద్యోగులు వాపోతున్నారు. ఎలాంటి రాజకీయ పరిచయాలు లేని వారు, సిఫారసు లేఖలు తెచ్చుకోని వారిని నంద్యాల జిల్లా నల్లమల సరిహద్దు ప్రాంతాలకు, కర్నూలు జిల్లాలోని కర్ణాటక రాష్ట్ర సరిహద్దు గ్రామాలకు పోస్టింగ్స్ ఇస్తున్నట్లు పదోన్నతి పొందిన సచివాలయ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో చేపట్టిన పదోన్నతుల పోస్టింగ్స్కు రెండు జిల్లాల నుంచి వందల సంఖ్యలో గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శులు హాజరయ్యారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం 403 మంది గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శులు విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఖాళీగా ఉన్న 120 గ్రేడ్ –4 పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేసేందుకు 120 మంది గ్రేడ్ –5 పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు కల్పించారు. గతంలో వారికి వచ్చిన మార్కులు (ర్యాంకింగ్), రోస్టర్, రిజర్వేషన్ ప్రకారం పదోన్నతులు కల్పించినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా, పోస్టింగ్స్ విషయంలో ర్యాంకింగ్, రిజర్వేషన్ ఉన్నా.. పచ్చనేతల సిఫారసు లేని కారణంగా వారు కోరుకున్న ప్రాంతానికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు జారీ చేసి న సిఫారసు లేఖల ఆధారంగా ఖాళీలను భర్తీ చేసి, మిగిలిన ఖాళీల్లో ఎక్కడికి వెళ్తారో మీరే నిర్ణయించుకోండని పదోన్నతి పొందిన వారి నుంచి ఆప్షన్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. సిఫారసు లేఖలతో కోరుకున్న ప్రాంతానికి పోస్టింగ్స్ ఇప్పించుకున్న వారు సంతోషంగా ఉండగా, ఎలాంటి రాజకీయ సిఫారసు లేకపోవడ ంతో సరిహద్దు ప్రాంతాల గ్రామాలకు పోస్టింగ్స్ అందుకున్న వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన కార్యక్రమాలకు అసోసియేషన్ నేతలను ఆహ్వానించే వారని, ప్రస్తుతం ఆ సంప్రదాయం కొనసాగడం లేదనే అభిప్రాయాన్ని పలువురు నేతలు వ్యక్తం చేస్తున్నారు. సిఫారసులకే పెద్దపీట -
నేత్ర పర్వం..
స్వర్ణ రథోత్సవం స్వర్ణరథోత్సవ పూజల్లో పాల్గొన్న దేవస్థాన ఈఓ, అర్చకులు, అధికారులు భక్తజనం మధ్య స్వర్ణరథోత్సవ దృశ్యం శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలోమంగళవారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు స్వర్ణరథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని వేకువజామున స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు అర్చకస్వాములు జరిపించారు. స్వర్ణరథోత్సవంలో ముందుగా అర్చకులు లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. అనంతరం రథారూఢులైన స్వామిఅమ్మవార్లకు విశేషపూజలు చేశారు. ఉదయం 7.30 గంటలకు స్వర్థరథోత్సవం ప్రారంభమైంది. ఆలయ మహాద్వారం ముందుభాగం గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు రథోత్సవం కొనసాగింది. రథోత్సవంలో కోలాటం, చెక్కభజన మొదలైన జానపద కళారూపాలు ఆకట్టుకున్నాయి. స్వర్ణ రథోత్సవంలో ఈఓ శ్రీనివాసరెడ్డి, ఏఈవో హరిదాసు, అర్చకులు, వేదపండితులు, పలు విభాగాల అధికారులు, పర్యవేక్షకులు, ఇతర సిబ్బంది, శివసేవకులు, అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
యాటకల్ బ్రిడ్జిని వెంటనే నిర్మించండి
కర్నూలు(సెంట్రల్): వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో యాటకల్లు సమీపంలో ఉన్న బ్రిడ్జి కూలిపోవడంతో 20 గ్రామాలకు మండల కేంద్రమైన ఆస్పరికి రాకపోకలు నిలిచిపోయాయని, వెంటనే చర్యలు తీసుకోవాలని ఆలూరు ఎమ్మెల్యే బి.విరూపాక్షి కలెక్టర్ పి.రంజిత్బాషాకు విన్నవించారు. మంగళవారం ఆయన కలెక్టర్ను ఆయన కార్యాలయంలో కలసి రోడ్డును యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..యాటకల్ బ్రిడ్జి కూలిపోవడంతో తంగరడోణ, తురువగల్లు, తోగలగళ్లు,దొడకొండ, కళ్లపరి, కై రు ప్పల, కారుమంచి తదితర గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నట్లు చెప్పారు. వెంటనే బ్రిడ్జిని నిర్మించాలని కలెక్టర్ను కోరానన్నారు. నేటి నుంచి పెద్దరాజుస్వామి ఉరుసు బేతంచెర్ల: మతసామరస్యానికి ప్రతీకగా వెలసిన గూటుపల్లె పెద్దరాజు స్వామి దర్గా ఉరుసు బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో దర్గాను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఉరుసు సందర్భంగా బుధవారం గంధం, గురు వారం ఉరుసు, శుక్రవారం జియారత్ వేడుకలు నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు దర్గా పీఠాధిపతి గురు సయ్యద్ అక్బర్ బాషా ఖాద్రి తెలిపారు. డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం కర్నూలు(హాస్పిటల్): ఏపీ స్టేట్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ సర్వీసెస్ డిప్లొమా కోర్సులకు ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దర ఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కర్నూలు మెడికల్ కాలే జి ఇన్చార్జ్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ సాయిసుధీర్ మంగళవారం తెలిపారు. అభ్యర్థులు పూరించిన దరఖాస్తులను సెప్టెంబర్ 8వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు కర్నూలు మెడికల్ కాలేజిలో రూ.100 రుసుం చెల్లించి పేర్లను నమోదు చేసుకోవాలన్నా రు. దరఖాస్తులు apsahpc.in వెబ్సైట్లో లభిస్తాయన్నారు. సెప్టెంబర్ 19న కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. ఇంటర్ బైపీసీ చదివిన విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు. అమ్మకానికి పొట్టిరకం జొన్న సిద్ధం నంద్యాల(అర్బన్): నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఎన్టీజే–5 పొట్టి రకమైన జొన్న అమ్మకానికి సిద్ధంగా ఉందని ఏడీఆర్ విల్సన్ మంగళవారం తెలిపారు. జిల్లాలో మాఘీ సీజన్ (సెప్టెంబర్ నుంచి లేట్ రబీ నవంబర్)కు ఈ రకాన్ని విత్తుకోవచ్చని చెప్పారు. ఈ రకం నాణ్యమైన విత్తనం 100 క్వింటాళ్లు (పునాది విత్తనం) అందుబాటులో ఉందని, కిలో రూ.90 ప్రకారం అమ్మకాలకు సిద్ధంగా ఉంచామన్నారు. -
ఆ వీఆర్ఓ రూటే సపరేటు
● ఒక్కో డీ పట్టాకు రూ.50 వేలు ● జాయింట్ ఎల్పీ నంబరు విడగొడితే రూ.20 వేలు ● పైసలిస్తే చాలు ప్రభుత్వ భూములైనా ఆన్లైన్లో ఎక్కిచ్చేస్తాడు నంద్యాల(అర్బన్): స్థానిక రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో ఓ ద్వితీయ శ్రేణి అఽధికారి వీఆర్ఓ లంచావతారమెత్తాడు. జాయింట్ ఎల్పీ నంబరును విడగొట్టేందుకు రూ.20 వేలు, ఒక్కో డీ పట్టాకు రూ.50 వేలు, చిన్నచిన్న పనులకు రూ.10 వేలు గుంజుతున్నాడు. పైసలిస్తే చాలు ప్రభుత్వ భూములైనా పట్టా భూములైనా ఇతరులకు ఆన్లైన్ చేస్తాడు. ఏడాది క్రితం సాధారణ బదిలీల్లో భాగంగా గాజులపల్లె గ్రామ వీఆర్ఓగా విధులు నిర్వహిస్తూ నంద్యాల రూరల్ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. జాతీయ రహదారి సమీపంలో ఉన్న గ్రామ వీఆర్ఓగా ఉంటూ అసైన్డ్ భూముల్లో అవినీతి పొజిషన్ సర్టిఫికెట్ల పేరుతో విక్రయాలు, ఉద్దేశపూర్వకంగా తప్పులు సృష్టించి రైతుల వద్ద నుంచి డబ్బులు గుంజడం, సమస్యలపై సచివాలయానికి వచ్చే రైతుల నుంచి దలారుల ద్వారా డబ్బులు వసూలు చేయడం అత్యవసరమంటే ఇప్పుడు కాదు.. టైం పడుతుందంటూ అమౌంట్లను సెటిల్ చేసుకోవడం అలవాటుగా మారింది. ఇటీవల జాయింట్ ఎల్పీ నంబర్లను విడగొట్టేందుకు స్థానిక కో–ఆప్షన్ మెంబర్ వద్ద నుంచి రూ.15 వేలు తీసుకున్నట్లు తెలిసింది. సర్వే నంబర్ 21/1లోని 1.99 ఎకరాల వంక పోరంబోకు భూము ల్లో ఇళ్ల స్థలాల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చేందుకు, సర్వే నంబర్ 109/1లోని 1.84 ఎకరాల సీలింగ్ ల్యాండ్ భూములకు సంబంధించి ల్యాండ్ కన్వర్షన్ చేయకుండా ప్లాట్ల ఏర్పాటుకు పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు సమాచారం. అగ్రికల్చర్ ల్యాండ్ను నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా మార్పు చేయడం, భూమిని చేతులు మార్చడంలో ఆయనకు ఆయనే సాటి. పొలాలకు సంబంధించి మ్యూటేషన్ పనులు పూర్తి చేస్తామంటూ ఓ రైతు వద్ద నుంచి రూ.20 వేలు వసూలు చేసినట్లు సమాచారం. ఇలా ఒకటేమిటి అన్ని పనులకు చేయి తడపాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. ప్రధాన జాతీయ రహదారి సమీపంలోని వాగు పోరంబోకు, సీలింగ్ ల్యాండ్, ఇనాం భూముల్లో పట్టాల ఏర్పాటులో వీఆర్ఓకు రూ.లక్షల్లో చేతులు మారాయన్న ఆరోపణలు వినబడుతున్నాయి. పొలాలకు సంబంధించి మ్యూటేషన్ పూర్తి చేసే ఏర్పాటులో భాగంగా రైతులు సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ వద్దకు వెళితే వీఆర్ఓను కలిసిన తర్వాతనే మ్యూటేషన్ పనులు పూర్తవుతాయంటూ చెబుతుండటం, రైతులను ఆందోళనలకు గురి చేస్తోంది. పది సెంట్ల చొప్పున తేడాలు వచ్చే భూముల కొలతలను సరిచేసేందుకు వేలకు వేలు ముక్కుపిండి వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. డబ్బు ముట్టనిదే ఆయన ఏపని చేయరని బహిరంగ విమర్శలు వినబడుతున్నాయి. డీపట్టాలు కొన్న వారి పేర్లను సైతం రికార్డుల్లో ఎక్కించే ప్రయత్నాలు చేస్తున్నారని, ఆయన అనుకుంటే రికార్డులను సైతం తారుమారు చేస్తారన్న విమర్శలున్నాయి. భూములను సైతం ఆన్లైన్లో ఎక్కిస్తానంటూ వాటికి ఆనుకొని ఉన్న రైతులకు సమాచారం ఇచ్చి ముడుపులు దన్నుకుంటున్నాడని తెలుస్తోంది. 1431, 32, 33, 34, 35 పసిలీలకు పన్నులు వేసి రైతుల వద్ద నుంచి ముక్కుపిండి వసూలు చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా జిల్లా అధికారులు దృష్టి సారించి ఇలాంటి అవినీతి తిమింగాలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని రైతులు, గ్రామస్తులు కోరుతున్నారు. -
అంబులెన్స్ డ్రైవర్ దుర్మరణం
● లారీ, అంబులెన్స్ ఢీకొనడంతో ప్రమాదం గోనెగండ్ల: మండల కేంద్రం సమీపంలో భారత్ గ్యాస్ గోడౌన్ వద్ద మంగళవారం ఉదయం అంబులెన్స్, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఎమ్మిగనూరుకు చెందిన అంబులెన్స్ డ్రైవర్ ఖతాల్ షేక్ హుసేన్ (30) మృతిచెందినట్లు సీఐ విజయభాస్కర్ తెలిపారు. వివరాలు.. ఎమ్మిగనూరుకు చెందిన ఖతాల్ షేక్ హుసేన్కు భార్య హసీనా ఉంది. హుసేన్ సొంతంగా అంబులెన్స్ వాహనం నడుపుతున్నాడు. ఎమ్మిగనూరులోని ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి రోగులను కర్నూలు ఆస్పత్రులకు తరలించేవాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఎమ్మిగనూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి నుంచి రోగిని అంబులెన్స్ (ఏపీ 21 టీజెడ్ 6342)లో కర్నూలు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. మంగళవారం తెల్లవారుజామున తిరిగి వస్తుండగా ఉదయం 6 గంటల సమయంలో గోనెగండ్లలోని భారత్ గ్యాస్ గోడౌన్ వద్ద ఎదురుగా ఉల్లి గడ్డల లోడ్తో కర్నూలుకు వెళుతున్న లారీ(ఎంహెచ్ 13 డీక్యూ 9693) ఢీకొట్టింది. ప్రమాదంలో అంబులెన్స్ నుజ్జునుజ్జుకాగా హుసేన్ తీవ్రగాయాలతో అందులోనే ఇరుక్కుపోయాడు. అటుగా వెళుతున్న ప్రయాణికులు హుసేన్ను బయటకు తీసి చికి త్స నిమిత్తం ఎమ్మిగనూరుకు తరలిస్తుండగా మా ర్గం మధ్యలోనే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచార ణ చేపట్టారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. లారీని పోలీసులు సీజ్ చేసి స్టేషన్కు తీసుకెళ్లారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
దివ్యాంగులను ఏడి‘పింఛెన్’
కర్నూలు(అగ్రికల్చర్): పింఛన్ల అడ్డగోలు తొలగింపులపై దివ్యాంగులు పెద్దఎత్తున ఆందోళనలకు దిగుతున్నారు. మాకు అర్హత ఉంది అయినా పింఛన్ తొలగించారంటూ శారీరక దివ్యాంగులు, అంధులు, చెవిటి – మూగ వారు ఒకవైపు మండల పరిషత్ కార్యాలయాలు, మరోవైపు జిల్లా కలెక్టర్, డీఆర్డీఏ కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. ఇంకా వందలాది మంది దివ్యాంగులు నోటీసులు అందుకోలేదు. దీంతో రానున్న రోజుల్లో ఆందోళనలు వెళ్లువెత్తే అవకాశం ఉంది. డోన్, మద్దికెర, ఆదోని, తుగ్గలి తదితర మండలాల్లో దివ్యాంగులు ఉద్యమ బాట పట్టారు. కూటమి ప్రభుత్వం నోటి దగ్గరి ముద్ద లాగేసుకోవడంపై వేలాది మంది కన్నీరుమున్నీరవుతున్నారు. పింఛన్ రద్దు కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన దివ్యాంగుడొకరు పురుగు మందు తాగడం సంచలనం సృష్టిస్తోంది. నంద్యాల జిల్లా చాగలమర్రిలో మహబూబ్బాషా అనే దివ్యాంగుడు పింఛన్ రద్దు కావడంతో జీర్ణించుకోలేక పురుగు మందు తాగారు. గతంలో ఇచ్చిన సదరం ధృవపత్రంలో వికలత్వం 72 శాతం ఉండగా ఇప్పుడు రీ అనాలసిస్లో 40 కంటే తక్కువకు పడిపోయింది. దీంతో సచివాలయ ఉద్యోగులు పింఛన్ రద్దయ్యిదంటూ నోటీసు చేతిలో పెట్టారు. నోటి దగ్గరి ముద్దను లాగేసుకున్నట్లుగా జీవనాధారమైన పింఛన్ రద్దు కావడంతో తట్టుకోలేక పురుగు మందు తాగడం కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కలకలం రేపింది. ఈయన పరిస్థితి విషమంగా ఉండటంతో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కూటమి ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో 8830 దివ్యాంగుల కుటుంబాల్లో చిచ్చు పెట్టింది. జీవనాధారమైన పింఛన్ రద్దు కావడంతో దివ్యాంగుల్లో ఆందోళన వెల్లువెత్తుతోంది. ● కర్నూలు జిల్లాలో 4731 దివ్యాంగ పింఛన్లలపై ప్రభుత్వం అనర్హత వేటు వేసింది. కర్నూలు జిల్లాలో దివ్యాంగ పింఛన్ తీసుకుంటున్న 674 మందిని వృద్ధాప్య పింఛన్లుగా మార్పు చేశారు. రూ.15 వేలు హెల్త్ పించన్లు తీసుకుంటున్న వారిలో 17 మందికి అనర్హత వేటు వేశారు. ● నంద్యాల జిల్లాలో 4099 దివ్యాంగ పింఛన్లపై అనర్హత వేటు పడింది. నంద్యాల జిల్లాలో దివ్యాంగ పింఛన్లు 25,256 ఉండగా 22,411 మంది పింఛన్దారులను రీ వెరిఫికేషన్ చేశారు. ఇందులో 4099 పింఛన్దారులను అనర్హులుగా తేల్చారు. 719 దివ్యాంగుల పింఛన్లను వృద్ధాప్య పింఛన్లుగా మార్పు చేశారు. నంద్యాల జిల్లాలో హెల్త్ పింఛన్లు 873 ఉండగా అన్నింటినీ వెరిఫై చేశారు. ఇందులో 64 హెల్త్ పింఛన్లకు అనర్హత ఉన్నట్లు తేల్చారు. 323 హెల్త్ పింఛన్లను దివ్యాంగ పింఛన్లుగా మార్పు చేశారు. మరో 20 హెల్త్ పింఛన్లను వృద్ధాప్యం కిందకు మార్చారు. ● హెల్త్ పింఛన్లకు రూ.15 వేలు ఇవ్వాల్సి ఉండగా దివ్యాంగ పింఛన్లకు మార్చడం వల్ల కేవలం రూ.6 వేలు మాత్రమే ఇస్తారు. తద్వారా ఒకరి పింఛన్ నుంచి ప్రభుత్వం రూ.9 వేలు కోత పెడుతుంది. ● దివ్యాంగ పింఛన్లకు రూ.6 వేలు ఇవ్వాల్సి ఉండగా వృద్ధాప్యం కిందకు మార్చడంతో రూ.4 వేలు మాత్రమే ఇస్తారు. తద్వారా ఒకరి పింఛన్ సొమ్ములో రూ.2 వేలు కోత పడుతుంది. పింఛన్ లబ్ధిదారుల సంఖ్య, వారికిచ్చే సొమ్మును తగ్గించేందుకు ప్రభుత్వం ఇలాంటి కుట్రలు పన్నుతున్నట్లు పింఛనుదారులు వాపోతున్నారు. డోన్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ధర్నా చేస్తున్న దివ్యాంగులు -
విరిగిపడిన బస్సు చక్రం
ఆత్మకూరు: పట్టణ సమీపంలోని కె.జి.రోడ్డులో కర్నూలు నుంచి ఆత్మకూరుకు వస్తున్న ఆర్టీసీ హైర్ బస్సు (ఏపీ 39 యూకే 2407)కు తృటిలో ప్రమాదం తప్పింది. బస్సు కె.జి.రోడ్డులో వస్తుండగా ముందు టైర్ అకస్మాత్తుగా పగిలింది. దీంతో యాక్సిల్ నుంచి ఊడిపోయి దొర్లుతూ ముందుకు వెళ్లి పడింది. డ్రైవర్ అప్రమత్తమై బస్సును నిలిపివేశాడు. బస్సులో 16 మంది ప్రయాణికులు ఆత్మకూరు బస్టాండుకు చేరుకోవాల్సి ఉంది. బస్సు నెమ్మదిగా వస్తుండటంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. వేగం ఎక్కువైతే డివైడర్ను ఢీకొట్టి ఫల్టీ కొట్టే ప్రమాదం ఉండేది. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయంపై ఆర్టీసీ డీఎం వినయ్కుమార్ మాట్లాడుతూ.. ఘటనా స్థలాన్ని సందర్శించానని, తమ పరిధిలో బస్సులు కండీషన్లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. హైర్ బస్సు ఓనర్తో మాట్లాడామని, బస్సులు కండీషన్ లేకపోతే రద్దు చేస్తామన్నారు. ‘సీ్త్ర శక్తి’కి అదనంగా బస్సులు కేటాయించాలి కర్నూలు సిటీ: ‘సీ్త్ర శక్తి’ పథకానికి అదనంగా బస్సులు కేటాయించాలని ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అరుణ, అలివేలు, ఉపాధ్యక్షురాలు సుజాత డిమాండ్ చేశారు. మంగళవారం ఐద్వా ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్లో వేచి ఉన్న మహిళా ప్రయాణికులతో వారు మాట్లాడారు. ప్రయాణికులకు తగిన సదుపాయాలు కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం అవేవీ లేకుండానే హడావుడిగా మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేశారన్నారు. ఆదోని నుంచి ఆత్మకూరుకు ప్రయాణం చేయాలంటే రెండు బస్సులు మారాలని, ఇలా ప్రయాణించాలంటే అదనపు సమయం పడుతుందన్నారు. తిరుపతి, అన్నవరం, విజయవాడ వంటి ఆధ్యాత్మిక కేంద్రాలకు ఉచితంగా ప్రయాణం చేయొచ్చని కూటమి నేతలు ప్రచారం చేశారని, కానీ ఆచరణలో ఎక్కడా అమలు కావడం లేదన్నారు. తగినన్నీ బస్సులు లేకపోవడంతో కిక్కిరిసిన ప్రయాణికుల మధ్య మహిళలు అవస్థలు పడుతూ నుంచొని ప్రయాణించాల్సి వస్తోందని వాపోయారు. -
విద్యార్థిని అదృశ్యం
సంజామల: మండల పరిధిలోని ముదిగేడు గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని అదృశ్యమైంది. ఎస్ఐ రమణయ్య తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కుంటి గోపాల్, లక్ష్మిదేవి దంపతుల కుమార్తె పవిత్ర సంజామల ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. సోమవారం వర్షం కారణంగా అధికారులు పాఠశాలకు సెలవు ప్రకటించారు. దీంతో బాలిక ఇంటి వద్దనే ఉంది. తల్లిదండ్రులు పశువులను మేపేందుకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే సరికి బాలిక కనపడక పోవడంతో బంధువులు, స్నేహితుల వద్ద విచారించినా ఆచూకీ తెలియలేదు. దీంతో మంగళవారం పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. కారు ఢీకొని వ్యక్తికి గాయాలు పాణ్యం: మండల కేంద్రంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒద్దరికి గాయాలైనట్లు హైవే పోలీసులు మంగళవారం తెలిపారు. వివరాలు.. కేఆర్ఆర్ తాండాకు చెందిన బాబునాయక్ వ్యక్తిగత పని నిమిత్తం బైక్పై పాణ్యంకు వెళ్లి తిరిగి వస్తుండగా తండా సమీపంలో వెనక వచ్చిన ఏపీ 39 జీఈ 1683 నంబర్ గల కారు ఢీకొట్టింది. ఈ కారు కరీంనగర్ నుంచి రాయచోటికి వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాబునాయక్ను హైవే అంబులెన్స్లో నంద్యాలకు తరలించారు. అలాగే పాణ్యం ఫ్లైఓవర్పై సోమవారం అర్ధరాత్రి నంద్యాలకు చెందిన కారు బేతంచెర్ల నుంచి నంద్యాలకు వెళ్తుండగా కారు టైర్ బరస్టు కావడంతో అదుపుతప్పి బోల్తా పడిందన్నారు. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు క్షేమంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న హైవే పోలీసులు ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా వాహనాలను తొలగించారు. పాము కాటుకు మహిళ మృతి కౌతాళం: పాము కాటుకు మహిళ మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని అగసలదిన్నె గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గంగమ్మ (54) పశువులకు గడ్డి తీసుకొచ్చేందుకు గడ్డివాముకు పోతుండగా పాము కాటు వేసింది. గమనించిన కుటుంబ సభ్యులు స్థానికంగా చికిత్స చేయించి ఆదోనికి తరలించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక ఆమె రాత్రి మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. మృతురాలికి భర్త హనుమేష్, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి.. మంత్రాలయం రూరల్: మండల కేంద్రానికి చెందిన ఎం.అబ్దుల్బాషా (48) గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందాడు. మంగళవారం పోలీసులు తెలిపిన వివరాలు ఇవి.. మంత్రాలయంకు చెందిన అబ్దుల్బాషా మూడేళ్లుగా మతిస్థిమితం లేక తిరుగుతుండేవాడు. డాక్టర్లకు చూపించినా వ్యాధి న యం కాలేదు. ఈ స్థితిలో సోమవారం రాత్రి ఇంటి వద్ద భోజనం చేసిన తరువాత మండలంలోని చిలకడోణ– కల్లుదేవకుంట గ్రామాల మధ్యలోని 167వ జాతీయ రహదారిలోని నారాయణరెడ్డి పొలం వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అబ్దుల్బాషా అక్కడిక్కడే మృత్యువాత పడ్డాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి కుమారుడు జాఫర్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ శివాంజల్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు వెల్లడించారు. -
బెస్త కార్పొరేషన్ చైర్మన్ను తొలగించాలి
నంద్యాల(అర్బన్): నకిలీ సర్టిఫికెట్తో బెస్త కార్పొరేషన్ చైర్మన్ పదవి పొందిన బొమ్మన శ్రీధర్ను వెంటనే తొలగించాలని బెస్త సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షుడు రమణ, ఏపీ ఫిషర్మెన్ జేఏసీ చైర్మ న్ రాజశేఖర్ డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం స్థానిక ఉదయానంద్ ఫంక్షన్హాల్లో రాయలసీమ జిల్లాల వ్యాప్తంగా మత్స్యకార, బెస్త కులాలకు చెందిన నేతల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. సీమ జిల్లాల్లో బెస్తలు అధికంగా ఉన్నారని, అయితేకార్పొరేషన్ చైర్మన్ పదవిని బెస్త కులం కాని వారైన బొమ్మన శ్రీధర్కు ఇవ్వడం సమంజసం కాదన్నారు. ఇది బెస్త వర్గాలను మోసం చేయడమేనని మండిపడ్డారు. మత్స్య కులాల మధ్య చిచ్చు రేపేందుకే కూటమి ప్రభుత్వం ఇలాంటి చర్యలకు ఒడిగట్టిందన్నారు. వెంటనే శ్రీధర్ను తొలగించి బెస్త సంఘం నాయకులకు పదవి ఇవ్వాలని లేకుంటే భారీ ఎత్తున ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. జాతీయ మత్స్యకార సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అప్పలరాజు, బెస్త కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ గిరిబోయిన చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
గిరిజన సంక్షేమానికి కృషి
శ్రీశైలం టెంపుల్: రాష్ట్రంలోని గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నామని గిరిజన, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. మంగళవారం శ్రీశైల దేవస్థాన పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో గిరిజన సంక్షేమం, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎస్.భార్గవి, జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి, శ్రీశైలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి శివప్రసాద్, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. అనంతరం పలువురు గిరిజన నాయకులు, సంఘాల నాయకుల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. సమీక్ష అనంతరం మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఐటీడీఏల వద్ద రూ.కోటి నిధులతో గిరిజన ఉత్పత్తుల మార్కెట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా శ్రీశైలంలో గిరిజన ఉత్పత్తుల మార్కెట్కు శంకుస్థాపన చేస్తానన్నారు. అలాగే ఆత్మకూరు వద్ద బైర్లూటీలో 1500 మంది గిరిజనుల కోసం నన్నారి జ్యూస్ పరిశ్రమను ప్రారంభించనున్నట్లు తెలిపారు. శ్రీశైల దేవస్థానంలో చెంచు, గిరిజనులకు దుకాణాలు ఉన్నాయని, వాటి సంఖ్య పెంచడంతో పాటు మినిమం అద్దె చెల్లించే విధంగా ఈఓకు సూచించామన్నారు. అలాగే ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా గిరిజన ప్రాంతాల్లో రోడ్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అనంతరం జిల్లా కలెక్టర్తో కలిసి శ్రీశైలం ఐటీడీఏ ప్రచార వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. -
వైఎస్సార్సీపీలో నియామకాలు
కర్నూలు (టౌన్): వైఎస్సార్సీపీ జిల్లా ఎంప్లాయీస్, పెన్షనర్ల విభాగ కమిటీలో పలువురిని నియమించారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నాయకులను నియమిస్తున్నట్లు మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. హోదా పేరు నియోజకవర్గం ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ఆలూరు ఉపాధ్యక్షుడు సీఎల్ఎన్ వర్మ మంత్రాలయం ప్రధాన కార్యదర్శి డి.ఆగస్టీన్ పత్తికొండ ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి కోడుమూరు ప్రధాన కార్యదర్శి జె.కురువ పట్టాబి ఆదోని కార్యదర్శి ఎస్.వెంకటరాముడు పత్తికొండ కార్యదర్శి సురేంద్ర ఆలూరు కార్యదర్శి కె.ఆర్.నర్సి రెడ్డి మంత్రాలయం కార్యదర్శి జె.హనుమంతారెడ్డి ఆదోని కార్య నిర్వహణ సభ్యులు జి.రాచప్ప పత్తికొండ కార్య నిర్వహణ సభ్యులు రంగన్న ఆలూరు కార్య నిర్వహణ సభ్యులు ఎం.ఎల్.కుమార్ మంత్రాలయం కార్య నిర్వహణ సభ్యులు జె.మునిస్వామి ఆదోని -
ఆలయాల అభివృద్ధికి కృషి చేయండి
మహానంది: ఆలయాల భూముల అన్యాక్రాంతం అంశంపై డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, ఈఓలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని దేవదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర ఆజాద్ ఆదేశించారు. మహానందిలోని టీటీడీ కల్యాణ మండపంలో కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లోని దేవస్థానాల నిర్వాహకులతో ఆయన మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆర్జేసీ మాట్లాడుతూ.. బాధ్యతాయుతంగా పనిచేయని వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్యాక్రాంతం అయిన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడంలో నిర్లక్ష్యం వహించే వారికి మెమోలు జారీ చేస్తామని స్పష్టం చేశారు. దేవుళ్లకు ఆధార్ ఉంటుందా? ఆలయ భూముల అన్యాక్రాంతం విషయంపై ఆర్జేసీ ఆజాద్ ఓ ఈఓను వివరాలు కోరగా రెవెన్యూ కార్యాలయాలకు వెళ్తే ఆధార్ కార్డులు అడుగుతున్నారని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుళ్లకు ఆధార్ కార్డు ఉంటుందా అని ప్రశ్నించారు. మిగతా దేవస్థానాలకు చెందిన భూముల విషయంలో వర్తించని నిబంధనలు మీకే ఎలా వర్తిస్తుందన్నారు. వివిధ జిల్లాల్లో ఉన్న దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్లు, డిస్ట్రిక్ట్ ఎండోమెంట్ ఆఫీసర్లు తరచూ వెళ్తూ పరిశీలించాలని కోరారు. ఆలయాల స్థల పురాణాలపై ఈవోలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ప్రధాన ముఖ ద్వారాల వద్ద భక్తులకు కనిపించేలా ఏర్పాటు చేయాలని సూచించారు. సాధారణ భక్తుడిలా వెళ్లి పరిశీలన ఆర్జేసీ చంద్రశేఖర ఆజాద్ ముందుగా మహానందీశ్వర స్వామి దర్శనానికి ఓ సాధారణ భక్తుడిలా వెళ్లారు. అక్కడక్కడ లోపాలు ఉండడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత దర్శనం బోర్డు స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. టికెట్లు తీసుకోవాలని చెప్పే సిబ్బంది ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద ఉండడంపై మండిపడ్డారు. సమావేశంలో మహానంది ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి, జిల్లా డీసీ గురుప్రసాద్, మద్దిలేటి స్వామి ఆలయ డిప్యూటీ కమిషనర్ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ ఉత్తమ ఫొటోగ్రాఫర్గా డి.హుస్సేన్
కర్నూలు(సెంట్రల్): ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్టు అసోసియేషన్ నిర్వహించిన కాంటెస్టులో కర్నూలు సాక్షి అసిస్టెంట్ చీఫ్ ఫొటోగ్రాఫర్ దూదేకుల హుస్సేన్ అచీవ్మెంట్ విభాగంలో జాతీయ స్థాయి ఉత్తమ ఫొటోగ్రాఫర్గా అవార్డు అందుకున్నారు. మంగళవారం విజయవాడలోని గాంధీనగర్ ప్రెస్క్లబ్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ అలపాటి సురేష్కుమార్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. డి.హుస్సేన్ ఇప్పటి వరకు 9 జాతీయ, 12 రాష్ట్ర స్థాయి ఉత్తమ ఫొటోగ్రాఫర్ అవార్డులు అందుకోవడం విశేషం. -
కూటమి మోసం.. దివ్యాంగులకు శాపం
కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చకుండా కోతలకు సిద్ధమైంది. సామాజిక పింఛన్ లబ్ధిదారుల జాబితాలో అనర్హుల ఏరివేత పేరుతో అర్హులను తొలగిస్తుండటంతో అందరిలో ఆందోళన మొదలైంది. ఎన్నికల ముందు కూటమి నేతలు ఇంటింటికీ వెళ్లి హామీలు గుప్పించారు. దివ్యాంగులకు పింఛన్ రూ. 6 వేలు, ఇంట్లో మంచం మీద ఉన్న వాళ్లకు రూ.. 15 వేలు’, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ. 10 వేలు అంటూ ఊరించారు. ఏరివేతలో భాగంగా వికలత్వ పరీక్షలు నిర్వహించి వైకల్య శాతం తగ్గించి నోటీసులు ఇవ్వడంతో లబ్ధిదారుల్లో గుబులు మొదలైంది. వచ్చే నెల నుంచి పింఛన్ రాదని తెలుసుకుని లబోదిబోమంటున్నారు. – సాక్షి, నెట్వర్క్ మాటలకందని ఆవేదన.. ● గతంలో అధికారులు ఇచ్చిన 98 శాతం వికలత్వం సర్టిఫికెట్ చూపుతున్న ఈ మహిళ పేరు గొల్ల అరుణ. కోసిగి మండలం వందగల్లు సొంతూరు. పుట్టుకపోతోనే చెవిటి, మూగ. తన బాధ, సంతోషాన్ని ఇతరులతో పంచుకునే భాగ్యం లేదు. ఎవరు ఏమి మాట్లాడుతున్నారో వినిపించలేని పరిస్థితి. గతంలో ఇచ్చే దివ్యాంగుల పింఛన్ను కూటమి ప్రభుత్వం ఇప్పుడు నిలిపేస్తామని నోటీసు ఇవ్వడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ప్రభుత్వం, అధికారులు అనుసరిస్తున్న తీరుపై ఆవేదన వ్యక్తం చేసింది. తమలాంటి వారికి సాయం చేసి ఆదుకోవాలే తప్ప.. ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం ఎంతవరకు సబబు అంటూ గొల్ల అరుణ మూగ సైగలతో వాపోతోంది. -
ప్రభుత్వానికి కనికరమేదీ?
● ఈ చిత్రంలో మంచంపై పిల్లాడిలా కనిపిస్తున్న దివ్యాంగుడు పేరు సూరపురెడ్డి వెంకటరమణారెడ్డి. స్వగ్రామం కొలిమిగుండ్ల మండలం రాఘవరాజుపల్లె. వయస్సు 34 ఏళ్లు. పుట్టుకతోనే దివ్యాంగుడు. మూడు పదుల వయసున్నా చిన్న పిల్లాడి తరహాలో చూసుకోవాల్సి వస్తుంది. రెండు కాళ్లు పూర్తిగా సహకరించవు. గతంలో సదరం క్యాంపుకు వెళ్లినపుడు 90 శాతం ఉన్నట్లు గుర్తించి సర్టిఫికెట్ ఇచ్చారు. ఆరు నెలల క్రితం ప్రభుత్వం రీవెరిఫికేషన్ నిర్వహించింది. ఇటీవల గ్రామ సచివాలయంలో ఇచ్చిన సర్టిఫికెట్లో 74 శాతం ఉన్నట్లు ఇచ్చారు. ఇది ఎంత వరకు సమంజసమని రమణారెడ్డి ప్రశ్నిస్తున్నాడు. 90 శాతం వైకల్యం ఉంటే రూ.15వేల పింఛన్ సొమ్ము ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఆదిశగా లేకుండా ఏకంగా దివ్యాంగుల వైకల్యంలోనూ మార్పులు చేయడం గమనార్హం -
జిల్లాలో తేలికపాటి వర్షాలు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలోని వివిధ మండలాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. అధిక వర్షాల కారణంగా జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉద యం వరకు చిప్పగిరి, హాలహర్వి, హొళగుంద మండలాలు మినహా మిగిలిన అన్ని మండలాల్లో వర్షపాతం నమోదైంది. గూడూరులో 21 మి.మీ, ఆదోని లో 17.6, మంత్రాలయంలో 16, సి.బెలగల్లో 14.6, ఎమ్మిగనూరులో 12.4, ఓర్వకల్లో 11.6, గోనెగండ్లలో 10 మి.మీ ప్రకారం వర్షాలు కురిశాయి. జిల్లా మొత్తం సగటున 7.1 మి.మీ వర్షపాతం నమోదైంది. బుధవారం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. తర్వాత జిల్లాలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందన్నారు. 1676 హెక్టార్లలో పంట నష్టం కర్నూలు(అగ్రికల్చర్):అధిక వర్షాల వల్ల జిల్లా లో 1,676 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. తుగ్గలి, పెద్దకడుబూరు, ఆస్పరి, కౌతాళం, ఆదోని, దేవన కొండ, మద్దికెర మండలాల్లోని 36 గ్రామాల్లో అధిక వర్షాల ప్రభావం ఉన్నట్లు వ్యవసాయ అధికారులు నిర్ధారించారు. పత్తి 984 హెక్టార్లు, కంది 357 హెక్టా ర్లు, వేరుశనగ 107 హెక్టార్లు, ఆముదం 98 హెక్టా ర్లు, సజ్జ 148 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. ఉద్యాన పంటలు మరో 20 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. నది తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మంత్రాలయం: తుంగభద్ర నదితీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శ్రీమఠం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు సూచించారు. మంగళవారం మంత్రాలయం మఠం సమీపంలోని నదీ తీరాన్ని సీఐ రామాంజులు, ఎస్ఐ శివాంజల్లతో కలిసి పీఠాధిపత్రి పర్యవేక్షించారు. తుంగభద్ర నది ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తోందన్నారు. వరద నీరు గంగమ్మ గుడి, పుష్కర ఘాట్లను తాకినట్లు గుర్తించారు. భక్తులు నదిలో స్నానాలు చేయకుండా నిలిపి వేయాలని, షవర్ల వద్ద స్నానాలు చేసేలా చూడాలని అధికారులకు సూచించారు. నది తీరం వద్ద భద్రత కట్టుదిట్టం చేయాలని పోలీసులను కోరారు. -
25 ఏళ్ల చంటి బిడ్డ.. అయినా అనర్హుడే
● మంచంపై కూర్చున్న యువకుడికి 25 ఏళ్లు. పేరు షమీవుల్లా. అతడికి అన్నం తినిపిస్తున్నది తల్లి జమాల్బీ. పాతికేళ్ల వయస్సులో కూడా చంటి బిడ్డలా తల్లి దగ్గరుండి అన్నీ చూసుకోవాల్సిన పరిస్థితి. పుట్టుకతోనే మానసిక వికలాంగుడు, కుడి చేయి, కుడి కాలు పని చేయవు, ప్రతి క్షణం వెంట ఓ మనిషి ఉండాల్సిందే. స్వతహాగా ఏ పని చేసుకోలేడు. 2011లో వంద శాతం వికలత్వ సర్టిఫికెట్ ఇచ్చారు. రూ.200 నుంచి ఇప్పటి వరకు పింఛన్ తీసుకుంటున్నాడు. అన్నం కూడా వేరే వారే తినిపించాలి. ఎప్పుడు పడితే అప్పుడు ఫిట్స్ వస్తుంటాయి. ఇలాంటి పింఛన్దారుడికి ఇటీవల నంద్యాలలో నిర్వహించిన సదరం క్యాంపులో 40 శాతం కంటే తక్కువ వికలత్వం ఉందని, ఇక నుంచి పింఛన్ తొలగిస్తున్నట్లు అధికారులు నోటీసు అందజేశారు. చూసిన వారంతా ‘ఇతనికి పింఛన్ తొలగించడమేమిటీ’ అని చర్చించుకుంటున్నారు. -
90 శాతాన్ని 50కి తగ్గించారు
● మంచానికి పరిమితమైన 88 ఏళ్ల షేక్ అబ్దుల్గఫార్ పక్షవాతం బాధితుడు. బనగానపల్లె పట్టణం ఈద్గా నగర్లో నివాసముంటున్నాడు. 2014 నుంచి పక్షవాతంతో ఇతను మాట్లాడలేడు, జ్ఞాపక శక్తి కూడాలేదు. నంద్యాల సదరన్ క్యాంప్లో 2014 ఫిబ్రవరి 14న 90 శాతం వికలాంగుడిగా సర్టిఫికెట్ పొందారు. కూటమి ప్రభుత్వంలో ఏడాది రూ.15వేల పింఛన్ ఇచ్చారు. ఇటీవల జరిగిన సదరన్ క్యాంపులో వికలాంగుడిగా 50 శాతం మాత్రమే ఉన్నట్లు సచివాలయ అధికారులు అతనికి రెండు రోజుల క్రితం నోటీసు ఇచ్చారు. ఇక నుంచి రూ.6వేలు మాత్రమే పింఛన్ వస్తుందని చెప్పడంతో కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. కదలలేని స్థితిలో ఉన్న వృద్ధుడికి 50 శాతం మాత్రమే వికలత్వ సర్టిఫికెట్ ఇవ్వడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
మాదకద్రవ్యాల రవాణాను పూర్తిగా అరికట్టాలి
కర్నూలు(సెంట్రల్): జిల్లాలో గంజాయి, కొకైన్ సహా అన్ని రకాల మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో నార్కోటిక్స్ కోఆర్డినేషన్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నిర్మూలనకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. యూనివర్సిటీలు, కాలేజీల్లో మత్తు పదార్థాల వినియోగంపై వర్కుషాపులు, ర్యాలీలు తదితర అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. కర్నూలు మెడికల్ కాలేజీలో కూడా విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగంతో కలిగే లాభనష్టాలపై అవగాహన కల్పించాలన్నారు. కర్నూలు, ఆదోని, పత్తికొండ డివిజన్లలో మాదక ద్రవ్యాల నివారణకు తీసుకుంటున్న చర్యలను కలెక్టర్ ఆయా ఆర్డీఓలను అడిగి తెలుసుకున్నారు. మత్తు బానిసలకు రీహ్యాబిలిటేషన్ సెంటర్లో కౌన్సెలింగ్ ఇప్పించేందుకు చర్యలు డీఎంహెచ్ఓను డాక్టర్ శాంతికళను ఆదేశించారు. జిల్లా ఎస్పీ విక్రాంత్పాటిల్ మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం, సాగును పూర్తిగా నియంత్రించేందుకు అన్ని శాఖల అధికారులు పోలీసులకు సహకరించాలన్నారు. కర్నూలు నగరంలో కేసీ కెనాల్, బస్టాండ్, రైల్వే స్టేషన్, పార్కులు, ఖాళీ ప్రదేశాలు, ఫ్లైఓవర్ల కింద మత్తు పదార్థాలను సేవించే వారిని గుర్తించి కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు చెప్పారు. అనంతరం మత్తు పదార్థాల నిర్మూలనకు సంబంధించి ముద్రించిన పోస్టర్లను కలెక్టర్, ఎస్పీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, కర్నూలు మునిసిపల్ కమిషనర్ పి.విశ్వనాథ్, డీటీసీ శాంతకుమారి, ఆర్టీసీ ఆర్ఎం శ్రీనివాసులు, జిల్లా వ్యవసాయాధికారి పీఎల్ వరలక్ష్మీ, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సుధీర్బాబు పాల్గొన్నారు. -
బనగానపల్లెలో మంత్రి అరాచకాలు.. కాటసాని రామిరెడ్డి ఫైర్
సాక్షి, నంద్యాల: జిల్లాలో మంత్రి బీసీ జనార్ధన్రెడ్డి అరాచకాలకు అంతులేకుండా పోతోంది. బనగానపల్లె వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కన్వీనర్పై మంత్రి అనుచరులు దాడికి పాల్పడ్డారు. మంత్రి కాంపౌండ్లోకి తీసుకెళ్లి కర్రలు, రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. బనగానపల్లె ఏరియా ఆసుపత్రిలో చంద్రమౌళి చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రికిలో చంద్రమౌళిని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బనగానపల్లె నియోజకవర్గంలో రౌడీ రాజ్యం నడుస్తుందని మండిపడ్డారు.మంత్రి బీసీ జనార్ధన్రెడ్డి రౌడీ మాదిరిగా వ్యవహరిస్తున్నాడంటూ కాటసాని దుయ్యబట్టారు. జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేసినా కానీ పట్టించుకోవడంలేదు. తాము ఫ్యాక్షన్కు చరమగీతం పాడి సాధారణ జీవితం సాగిస్తుంటే.. మాసిపోయిన ఫ్యాక్షన్ను మంత్రి బీసీ ప్రేరేపిస్తున్నారు. తమకు సహనం నశిస్తే మాత్రం ఎంతవరకైనా వెళ్తామంటూ కాటసాని రామిరెడ్డి హెచ్చరించారు. -
నా బిడ్డ కేసును పవన్ కల్యాణ్ గాలికొదిలేశారు: సుగాలి పార్వతి
సాక్షి, కర్నూలు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిష్కరించే మొదటి కేసు సుగాలి ప్రీతిదే.. జనసేన అధినేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గతంలో చెప్పినమాట. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఆయన ఈ కేసు ఊసెత్తలేదని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో ప్రీతి తల్లి పార్వతి కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుగాలి ప్రీతి కేసును గాలికి వదిలేశారు. డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్, హోం మినిష్టర్ అనితను కలిసిన తమకు న్యాయం జరగలేదు. అందుకే తాను న్యాయం కోసం వీల్ చైర్ యాత్ర ను ప్రారంభించాను. కానీ, యాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. అందుకే హైకోర్టును ఆశ్రయించా. ఈనెల 22వ తేదీన కోర్టు ఆదేశాలు జారీ చేయవచ్చు. ఆ వెంటనే యాత్ర మొదలుపెడతా అని అన్నారామె. అదే సమయంలో.. నిందితులకు అధికార పార్టీ నేతలు కొమ్ము కాస్తున్నారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. హత్య , అత్యాచారం చేసిన ఆధారాలు స్పష్టంగా ఉన్న ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడిందని వాపోయారామె.ఇదిలా ఉంటే.. సుగాలి ప్రీతి కేసులో న్యాయం కోరుతూ ఆమె తల్లి పార్వతి కర్నూల్ నుంచి విజయవాడకు వీల్చైర్ యాత్ర ప్రారంభించాలనుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర కావొస్తున్నా కేసు ముందుకు కదలడం లేదని.. న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేకనే తాను న్యాయపోరాటానికి సిద్ధమయ్యాయని చెబుతున్నారామె. అయితే.. ఈ యాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. వీల్ చైర్ యాత్రకు అనుమతి లేదని అంటున్నారు. యాత్రను చేపట్టవద్దంటూ కర్నూలు పోలీసులు బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో పార్వతి హైకోర్టును ఇవాళ ఆశ్రయించారు.‘‘నా కూతురు అత్యాచారం,హత్యకు గురై 8 సంవత్సరాలు అవుతోంది. ఇప్పటికీ మాకు న్యాయం జరుగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిష్కరించే మొదటి కేసు సుగాలి ప్రీతిదే అని హామి ఇచ్చారు. కాని కేసు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండి పోయింది. తానే న్యాయపోరాటం చేస్తానని హామీ ఇచ్చిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు పట్టించుకోవడం లేదు. అందుకే న్యాయం కోసం పోరాటానికి దిగుతున్నా. అడ్డుకోవడం ఎవరి వల్ల కాదు’’ అని అంటున్నారామె.కేసు నేపథ్యం..కర్నూలు నగర శివార్లలోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్లో పదో తరగతి చదువుతున్న సుగాలి ప్రీతీబాయ్ 2017 ఆగస్టు 19న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఫ్యాన్కి ఉరేసుకుని చనిపోయినట్లు పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులకు చెప్పింది. తమ కుమార్తె ఉరి వేసుకుని చనిపోలేదని, స్కూల్ యజమాని కొడుకులు లైంగిక దాడి చేసి చంపేశారని తల్లిదండ్రులు సుగాలి రాజు నాయక్, పార్వతిదేవి ఆరోపించారు.బాబు హయాంలో ముందుకు సాగని కేసుఅయితే ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ‘జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి’ పేరుతో సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమే జరిగింది. అదే రోజు కర్నూలు పోలీసులు ఎస్సీ, ఎస్టీ చట్టంతో పాటు పోక్సో చట్ట నిబంధనల కింద కూడా కేసు పెట్టినా, అప్పటి ప్రభుత్వ పెద్దల తీరుతో తూతూ మంత్రంగా దర్యాప్తు జరిపారు. అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో ఆ స్కూలు కరస్పాండెంట్, ఆయన కుమారులను అరెస్ట్ చేశారు. తరువాత కొద్ది రోజులకే వారు బెయిల్పై బయటకు వచ్చేశారు. చంద్రబాబు హయాంలో కేసు దర్యాప్తు ముందుకు సాగలేదు.అయితే.. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని తల్లిదండ్రులు కోరగా, ఆమేరకు ఆయన ఉత్తర్వులిచ్చారు. అంతేకాక 2021లో ప్రీతి తల్లిదండ్రులకు రూ. 8 లక్షల నగదు, 5 సెంట్ల ఇంటి స్థలం, ఐదెకరాల పొలాన్ని అందించారు. ప్రీతి తండ్రి రాజు నాయక్కు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చారు. అయితే ప్రభుత్వం కోరుతున్నా.. సీబీఐ దర్యాప్తు చేపట్టకపోవడంతో తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు సీబీఐ ఎస్పీ రఘురామ రాజన్ ఈ ఏడాది ఫిబ్రవరి 13న హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ప్రీతి మృతి కేసులో అంతర్రాష్ట్ర పర్యవసానాలు, తాము జోక్యం చేసుకోవాల్సినంత చట్టపరమైన సంక్లిష్టత లేవని అందులో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని సీబీఐ ప్రధాన కార్యాలయానికి కూడా తెలిపామన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు, సుప్రీంకోర్టు, హైకోర్టుల ఆదేశాల మేరకు పలు ముఖ్యమైన, సున్నిత కేసుల్లో దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. ఈ కేసులో అంత సంక్లిష్టత లేదని హైకోర్టుకు తెలిపింది. వనరుల కొరత కారణంగా చూపుతూ తాము దర్యాప్తు చేయలేమని తేల్చి చెప్పింది. ప్రీతి తల్లిదండ్రుల పిటిషన్ను కొట్టేయాలని హైకోర్టును కోరింది. అలా గత బాబు హయాంలో నత్తనడకన సాగిన కేసు.. ఇప్పుడు మళ్లీ ఆయన ప్రభుత్వం రావడంతో పూర్తిగా యూటర్న్ తీసుకుంది. మరోవైపు.. ప్రీతి మృతి కేసును అప్పట్లో రాజకీయంగా వాడుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఏం చేయలేకపోతున్నారే అనే విమర్శలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. -
పుట్టుకతో చెవిటి, మూగ.. ఆపై మెదడులో సమస్య
తుగ్గలి ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న దివ్యాంగులుఈ బాలిక పేరు ఎస్.మెహతాజ్. కర్నూలు నగరంలోని చిత్తారివీధి. పుట్టుకతోనే చెవిటి, మూగ. 2011లో సదరం క్యాంపునకు హాజరు కాగా వైద్యులు పరీక్షలు నిర్వహించి 100 శాతం వైకల్యం ఉన్నట్లు సరిఫికెట్ జారీ చేశారు. ఆ తర్వాత బాలికకు మెదడులోనూ సమస్య మొదలైంది. ఇటీవల సదరం రీ వెరిఫికేషన్కు హాజరు కాగా.. 40శాతం లోపే సమస్య ఉన్నట్లు నిర్ధారించారు. అది కూడా తాత్కాలికమేనంటూ పింఛనుకు అనర్హురాలిగా తేల్చారు. ఈ చిత్రంలోని వ్యక్తి పేరు శివరామ్ మధు. ఓర్వకల్ మండలం లొద్దిపల్లి గ్రామం. కొన్నేళ్ల కిత్రమే పక్షవాతంతో ఎడమ చేయి, కాలు పడిపోయాయి. 2010లో సదరం క్యాంపునకు హాజరు కాగా 94 శాతం వికలత్వం ఉన్నట్లు ధ్రువీకరించారు. ఇప్పటికీ ఒకరి సహాయం లేనిదే కదల్లేని పరిస్థితి. ఇటీవల నిర్వహించిన రీవెరిఫికేషన్లో అసలు వికలత్వమే లేనట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో పింఛనుకు అనర్హుడిగా నోటీసు అందించారు. ఈమె పేరు ఉప్పరి వెంకటలక్ష్మి. తుగ్గలి మండలం అమీనాబాద్ గ్రామం. చిన్నతనంలోనే పోలియో బారిన పడింది. దీనికి తోడు కింద పడటంతో కాలు విరిగి రాడ్ వేయించుకుంది. సొంతంగా కూర్చోలేదు, నిలబడలేదు. గతంలో 72 శాతం వికలత్వం ఉన్నట్లు సదరం సర్టిఫికెట్ జారీ చేశారు. ఇటీవల రీవెరిఫికేషన్కు హాజరు కాగా అసలు వికలత్వమే లేనట్లు పేర్కొనడం గమనార్హం. ఈ కారణంగా ఆమె పింఛను కోల్పోయింది. కర్నూలు(అగ్రికల్చర్): కూటమి ప్రభుత్వం దివ్యాంగులను వీధిన పడేసింది. ఉన్న కాస్త ఆసరాను కూడా దూరం చేసి నిర్దయగా వ్యవహరిస్తోంది. ఊహించినట్లుగానే అనర్హత పేరిట పెద్ద ఎత్తున పింఛన్లను తొలగించడంతో దివ్యాంగులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో చాలాచోట్ల రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. వంద కాదు.. రెండు వందలు కాదు.. ఏకంగా వేలాది పింఛన్లను అనర్హత ముసుగులో అడ్డంగా తొలగించడం విమర్శలకు తావిస్తోంది. సదరం సర్టిఫికెట్ల జారీ 2009–2010లో మొదలైంది. అప్పట్లో 100 శాతం వికలత్వం ఉంటే నేడు రీ వెరిఫికేషన్లో 40 శాతంలోపునకు తగ్గిపోయి పింఛను లేకుండా పోతోంది. సదరం క్యాంపుల్లో బేరసారాలు, రాజకీయ సిఫారసులకు పెద్దపీట వేసినట్లు చర్చ జరుగుతోంది. సోమవారం జరిగిన గ్రీవెన్స్కు పింఛన్లు పోయిన దివ్యాంగులు క్యూ కట్టారు. గతంలో వెరిఫై చేసి సర్టిఫికెట్లు ఇచ్చింది డాక్టర్లే.. అప్పుడు 85, 90, 100 శాతం వికలత్వం ఉంటే ఇప్పుడు 40 లోపు ఎలా తగ్గుతోందంటూ బాధితులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే బయటపడుతున్న తొలగింపులు దివ్యాంగుల పింఛను తొలగింపులు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో సచివాలయాలు తెరుచుకోలేదు. సోమవారం వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులు దివ్యాంగులకు రీ వెరిఫికేషన్ సదరం సర్టిఫికెట్, నోటీసులు ఇస్తున్నారు. నోటీసులు అందుకున్న వారిలో ఎక్కువ మందికి పింఛనుకు అనర్హత ఉన్నట్లు తేలడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. దిక్కుతోచని స్థితిలో కలెక్టరేట్కు, మండలాల్లో ఎంపీడీఓల వద్దకు చేరుకొని తమ గోడు వినిపిస్తున్నారు. అనధికార సమాచారం మేరకు ఉమ్మడి జిల్లాలో 10,050 పింఛన్లను తొలగించారు. ఈ నెల 27వ తేదీ వరకు సదరం రీ వెరిఫికేషన్ సర్టిఫికెట్లు, నోటీసులు ఇచ్చేందుకు అవకాశం ఉంది. రోజురోజుకు పింఛన్లు కోల్పోయే వారి సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తొలగింపులకు గురైన వారిలో చెవిటి, మూగ, శారీరక వికలాంగులు, అంధులే అధికంగా ఉంటున్నారు. సిఫారసులకు పెద్దపీట సరదం రీవెరిఫికేషన్లో రాజకీయాలు, సిపారసులు జోరుగా సాగినట్లు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. సిపారసులు ఉన్న వారికి రూ.15వేల పింఛను వచ్చే విధంగా 85 నుంచి 100 శాతం వరకు వికలత్వం సమోదు చేయడం గమనార్హం. సదరం రీ వెరిఫికేషన్ జరిగే చోటుకు ఇతరులను అనుమతించడం లేదనేది ఉత్తుత్తిదేనని స్పష్టమవుతోంది. కుట్రపూరితంగానే తొలగింపులు తుగ్గలి: ఎన్నికల ముందు సంక్షేమ పథకాలతో ఊరించిన చంద్రబాబు గద్దెనెక్కిన తర్వాత కోతలు మొదలుపెట్టారు. దివ్యాంగులపై కనీస కనికరం లేకుండా అనర్హుల పేరిట ఎడాపెడా తొలగింపులకు పాల్పడుతుండటం విమర్శలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో బాధిత దివ్యాంగులు ప్రసన్న, రామాంజినేయులు, గోవిందరాజులు, వీరాంజినేయులు సీపీఎం మండల కార్యదర్శి శ్రీరాములుతో కలిసి సోమవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. 20 ఏళ్లుగా వస్తున్న తమ పింఛన్లను తొలగించడం అన్యాయమని వాపోయారు. కాళ్లు లేని వారు, మాటలు రాని వారు, కళ్లులేని వారు సర్కారుకు కనిపించడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెరిఫికేషన్లో 70 శాతం వికలత్వం ఉన్నా పింఛన్లు తొలగించడం ఏంటని ప్రశ్నించారు. అర్హుల పింఛన్లను వెంటనే పునరుద్ధరించాలని, లేనిపక్షంలో కార్యాలయాలు, రహదారులను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. అనంతరం డిప్యూటీ ఎంపీడీఓ శ్రీహరికి వినతిపత్రం అందజేశారు. కోడుమూరులోని 5వ సచివాలయం పరిధిలో ఓ వ్యక్తికి అన్ని అవయవాలు సవ్యంగానే ఉన్నాయి. అయితే రెండు వేళ్లు దెబ్బతిన్నాయి. ఇది వరకు ఈయనకు 50 శాతం వరకే వికలత్వం ఉంది. రూ.6వేల పింఛను తీసుకుంటున్నాడు. కాళ్లు, చేతులు బాగున్న ఇతను అన్ని పనులు సొంతంగానే చేసుకుంటున్నాడు. ఈయనకు సదరం రీ వెరిఫికేషన్లో ఏకంగా 90 శాతం వికలత్వం నమోదు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రీ వెరిఫికేషన్ ‘లోప’భూయిష్టం! -
వైభవంగా ఈరన్న స్వామి పల్లకీ మహోత్సవం
కౌతాళం/కోసిగి: ఉరుకుంద ఈరన్న స్వామి పల్లకీ మహోత్సవం సోమవారం కనుల పండువగా సాగింది. తెల్లవారుజామున 4 గంటలకు ఉరుకుంద గ్రామంలోని ఈరన్నగౌడు ఇంటి వద్ద ఉన్న స్వామివారి పల్లకీకి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి పల్లకీని పాదయాత్రతో కోసిగి మండలం కందుకూరు వద్ద ఉన్న తంగభద్ర నదికి చేర్చారు. స్వామి విగ్రహానికి నదిలో జలాభిషేకాన్ని నిర్వహించి నది ఒడ్డున ప్రత్యేక పూజలు చేశారు. కోసిగి, మంత్రాలయం మండలాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి పల్లకీ మహోత్సవంలో పాల్గొన్నారు. కందుకూరు నుంచి పల్లకీ బయలుదేరి కామనదొడ్డి, తిప్పలదొడ్డి, కరణి, మల్లనహట్టి, చిరుతపల్లి గ్రామాల మీదుగా అడుగడుగాన పూజలందుకుంటూ ఉరుకుందకు పోలిమేరకు రాత్రి 7గంటలకు చేరుకుంది. అక్కడ స్వామి వారి పల్లకీకి మేళతాళలతో, బాణసంచలతో ఆలయ డిప్యూటీ కమిషనర్ వాణి, ప్రధాన, ఉపప్రధాన అర్చకులు, గ్రామపెద్దలు స్వాగతం పలకారు. పొలిమేర నుంచి దేవాలయానికి పల్లకీ చేరుకునేంత వరకు అడుగడుగునా టెంకాయాలను కొట్టారు. భక్తుల కోసం దేవాలయ అధికారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పల్లకీ దేవాలయంలో ప్రవేశించిన తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైఎస్సార్సీపీ కోసిగి మండల కన్వీనర్ బెట్టన్నగౌడ్, ఉరుకుంద ట్రస్టుబోర్డు మాజీ చైర్మన్ చెన్నబసప్ప, పలువురు నాయకులు పాల్గొన్నారు. -
కళ్లుంటే ఈమెకేసి చూడండి..
బండి ఆత్మకూరు: ఈమె పేరు అంబటి చాముండేశ్వరి. బండిఆత్మకూరు మండలంలోని లింగాపురం గ్రామం. 8 సంవత్సరాల క్రితం చిగురు కోసమని చింత చెట్టెక్కడంతో కాలుజారి కిందపడటంతో వెన్నుపూస విరిగింది. రెండు కాళ్లు పనిచేయక మంచానికే పరిమితమైంది. వైద్యులు .... వైకల్యం ఉన్నట్లు నిర్ధారించడంతో పింఛను అందుతోంది. అలనాపాలన చూసుకుంటున్న భర్త గోపాల్రెడ్డి(55) రెండేళ్ల క్రితం కాలం చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో రీవెరిఫికేషన్ పేరిట ఈమె కు వికలత్వం 40శాతం లోపు ఉన్నట్లుగా నిర్ధా రించి పింఛను తొలగించారు. కనీసం కదల్లేని స్థితిలో ఉన్న ఈమె ప్రభుత్వ నిర్ణయం పట్ల కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. -
ఉద్యోగాల పేరుతో మోసం
● ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితులు ● పీజీఆర్ఎస్కు 83 ఫిర్యాదులు కర్నూలు: ప్రభుత్వ పాఠశాలల్లో ఫిజికల్ ట్రైనర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి విజయవాడకు చెందిన శివ, కోవెలకుంట్లకు చెందిన రామకృష్ణలు కలసి ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షల చొప్పున డబ్బులు తీసుకుని మోసం చేశారని ఎస్పీ విక్రాంత్ పాటిల్కు పత్తికొండ మండలం పులికొండ గ్రామానికి చెందిన రాజశేఖర్, నరేష్, లింగరాజు, పీటర్పాల్, చైతన్యలు ఫిర్యాదు చేశారు. ఆదోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్, అటెండర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి దేవదానం, జ్యోతి కలసి రూ.5 లక్షలు తీసుకుని మోసం చేశారని కౌతాళం మండలం చింతపల్లి గ్రామానికి చెందిన రాజు, మునిస్వామిలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పక్కనున్న క్యాంప్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఎస్పీ ఎస్పీ విక్రాంత్ పాటిల్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించి నేరుగా వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పీజీఆర్ఎస్కు మొత్తం 83 ఫిర్యాదులు వచ్చాయి. వాటిపై చట్ట పరిధిలో విచారణ జరిపి త్వరితగతిన పరిష్కారమయ్యేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా కూడా కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. పీజీఆర్ఎస్కు వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని... ● కోడలు, ఆమె బంధువులు తన కుమారుడిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని గణేష్ నగర్కు చెందిన అజ్మత్ ఖాన్ ఫిర్యాదు చేశారు. ● కొడుకు, కోడలు తమపై దాడి చేసి పొదుపులో వచ్చిన డబ్బులు లాక్కున్నారని తుగ్గలి మండలం గుండాలతండాకు చెందిన దానమ్మ, రాముడు నాయక్ దంపతులు ఫిర్యాదు చేశారు. ● తమ్ముడు శివరాజు మద్యానికి బానిసై తల్లిదండ్రులు తనకు ఇచ్చిన ఆస్తి భాగాన్ని వేరేవాళ్లకు అమ్ముకున్నాడని, విచారణ జరిపి న్యాయం చేయాల్సిందిగా ఆదోని స్వామిరెడ్డి నగర్కు చెందిన తిరుపాల్ ఫిర్యాదు చేశారు. -
గడువులోపు అర్జీలను పరిష్కరించకపోతే చర్యలు
కర్నూలు(సెంట్రల్): నిర్ణీత గడువులోపు అర్జీలను పరిష్కరించకపోతే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా అధికారులను హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో(పీజీఆర్ఎస్) కలెక్టర్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడువు దాటినా అర్జీలను పరిష్కరించని ఆదోని మునిసిపల్ కమిషనర్, జిల్లా రిజిస్ట్రార్, వక్ఫ్బోర్డు ఇన్స్పెక్టర్లపై చర్యలు తీసుకోవాలని డీఆర్వో సి.వెంకటనారాయణమ్మను ఆదేశించారు. అదేవిధంగా అర్జీలను పెండింగ్లో పెట్టిన అధికారులందరిపైనా చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. అధికారులకు కేవలం మెమోలు ఇవ్వడం కాదని, వారి ప్రవర్తనలో మార్పు రాకుంటే సస్పెండ్ చేయాలన్నారు. కార్యక్రమంలో జేసీ డాక్టర్ బి.నవ్య, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, హౌసింగ్పీడీ చిరంజీవి, స్పెషల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
జీడీపీకి కొనసాగుతున్న వరద
గోనెగండ్ల: గాజులదిన్నె ప్రాజెక్టుకు గత వారం రోజులుగా వరద నీటి చేరిక కొనసాగుతోంది. మండలంలో పది రోజులుగా తెలికపాటి నుంచి మోసరు వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి సోమవారం 300 క్యూసెక్కుల వరద నీరు జీడీపీలోకి చేరినట్లు ప్రాజెక్టు ఏఈ మహమ్మద్ ఆలీ తెలిపారు. అలాగే హంద్రీనీవా నుంచి 160 క్యూసెక్కుల నీరు, ఎల్లెల్సీ నుంచి 60 క్యూసె క్కుల నీరు జీడీపీలోకి వస్తుంది. జీడీపీ నిల్వ సామర్థ్యం 4.5 టీఎంసీలు కాగా.. సోమవారం సాయంత్రానికి 2.6 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు కర్నూలు: వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు చేస్తూ విధి నిర్వహణలో మృతిచెందిన బాధిత కుటుంబాలకు ఎకై ్సజ్ శాఖలో జూనియర్ అసిస్టెంట్లుగా నియమిస్తూ నియామక పత్రాలను జిల్లా అధికారి సుధీర్ బాబు అందజేశారు. ఈ మేరకు హైమావతి, సౌమ్యలకు కారుణ్య నియామకాల కింద ఎకై ్సజ్ శాఖలో ఉద్యోగాలిస్తూ కలెక్టర్ రంజిత్ బాషా ఉత్తర్వులిచ్చారు. వీరికి జిల్లా ఎకై ్సజ్ అధికారి సుధీర్ బాబు సోమవారం తన కార్యాలయంలో నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్లు రాజేంద్రప్రసాద్, చంద్రహాస్ తదితరులు పాల్గొన్నారు. క్లస్టర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్గా జి. శ్రీనివాస్ కర్నూలు సిటీ: క్లస్టర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్గా సిల్వర్జూబ్లీ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్గా పని చేస్తున్న డాక్టర్.జి శ్రీనివాస్కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ వర్సిటీ ఇన్చార్జి వీసీ ఆచార్య వి.వెంకట బసవరావు ఉత్తర్వులు జారీ చే శారు. ఈ మేరకు ఆయన సోమవారం రిజిస్ట్రా ర్గా బాధ్యతలు స్వీకరించారు. డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు డిప్యూటేషన్పై రిజిస్ట్రార్గా గత ఏడాది నుంచి పని చేస్తున్నారు. ఆయన పదవీ కాలం ముగియడంతో సిల్వర్జూబ్లీ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. బాఽ ద్యతలు స్వీకరించిన అనంతరం డాక్టర్ జి.శ్రీనివాస్ను వర్సిటీ వీసీ, ఇప్పటి వరకు రిజిస్ట్రార్గా పని చేసిన కె.వెంకటేశ్వర్లు, ఆర్యూ రిజిస్ట్రార్ విజయ్కుమార్ శాలువ కప్పి అభినందించారు. 20, 21 తేదీల్లో రీవెరిఫికేషన్కు మరో అవకాశం కర్నూలు(అగ్రికల్చర్): దివ్యాంగుల పింఛను తీసుకుంటూ రీ వెరిఫికేషన్కు హాజరుకాని వారికి డీఆర్డీఏ మరో అవకాశం కల్పించింది. సదరం రీ వెరిఫికేషన్కు హాజరు కాలేదనే కారణంలో జిల్లాలో 461 మంది దివ్యాంగుల పింఛన్లను ప్రభుత్వం హోల్డ్లో పెట్టింది. వీరికి ఆగస్టు నెల పింఛను పంపిణీ చేయలేదు. రీ వెరిఫికేషన్కు హాజరు కాని 461 మందికి ఈ నెల 20, 21 తేదీల్లో సంబంధిత ఆసుపత్రుల్లో డాక్టర్లు రీ వెరిఫికేషన్ చేస్తారని డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ వైపి రమణారెడ్డి తెలిపారు. -
కాలనీ సమస్యలపై ‘ఫ్లెక్సీ’
వెల్దుర్తి: పట్టణంలోని రాణితోట కాలనీవాసులు స్థానిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. కాలనీ ముఖద్వారంలో ఓ ఫ్లెకీని ఏర్పాటు చేసి అందులో సమస్యలను ప్రస్తావించారు. ఈ ఫ్లెక్సీ పాలకులు, అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. స్థానిక మేజర్ పంచాయతీ పరిధిలోని రాణితోట వీధిలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. కుళాయిల పైప్లైన్ వేసిన తర్వాత కంకర, సిమెంట్తో మూయకపోవడం, కాలువలు కాదని దారిలోకి ఇళ్ల నిర్మాణాలు ముందుకురావడంతో గుంతలు తోడు దారి సమస్య తీవ్రమైంది. కొన్ని చోట్ల మురుగు కాలువులు లేవు. ఈ సమస్యలను తాము ఎంతమంది దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడం వల్లే ఇలా ఫ్లెక్సీ వేసి నిరసన తెలిపినట్లు కాలనీవాసులు తెలిపారు. -
యువకుడి ఆత్మహత్య
ఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని సోమప్ప నగర్లో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదోనికి చెందిన ఈరన్న, రాజేశ్వరి దంపతులు పదేళ్ల క్రితం ఎమ్మిగనూరుకు వలస వచ్చి సోమప్ప నగర్లో నివాసముంటున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఈరన్న గౌండ పని చేస్తుండగా, రాజేశ్వరి పెళ్లిళ్ల లో వంట పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నా రు. కుమార్తెలకు వివాహాలు అయ్యాయి. కుమారుడు లలిత్కుమార్ (19) ఆదోని భీమా ఇంజినీరింగ్ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతూ మధ్యలోనే మానేసి కారు మెకానిక్గా పని చేస్తున్నాడు. కాగా కొన్ని రోజులుగా మద్యానికి బానిసై పనికి వెళ్లడం లేదు. అయితే ఏమి జరిగిందో తెలియది కానీ ఆదివారం రాత్రి ఇంట్లో భోజనం చేసి గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని పడుకున్నాడు. సోమవారం ఉదయం ఎంతకీ తలుపులు తీయకపోవటంతో కుటుంబీకులు అనుమానంతో కిటికీలోంచి చూడగా ఉరేసుకుని కనిపించాడు. తలుపులు బద్దలుకొట్టి కిందకు దించి ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుమారుడి ఆత్మహత్యతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడి తండ్రి ఈరన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సీఐ వి. శ్రీనివాసులు తెలిపారు. హెల్మెట్ లేకుంటే రూ.వెయ్యి జరిమానా రూ.1.50 లక్షల అపరాధ రుసుం కర్నూలు: హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనంపై రోడ్డెక్కితే ఇక జేబుకు చిల్లే. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ ఆధ్వర్యంలో సోమవారం నగరంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. వాహన రికార్డులు లేకపోయినా, హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని అడ్డగించి భారీగా జరిమానాలు విధించారు. దాదాపు 150 మంది హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతూ పోలీసుల తనిఖీల్లో పట్టుబడగా ఒక్కొక్కరికి రూ.వెయ్యి చొప్పు న రూ.1.50 లక్షల అపరాధ రుసుం విధించారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వ్యక్తులను ఆపి అరగంట పాటు సమయమిచ్చి హెల్మెట్ తెచ్చుకున్న తర్వాత వారికి రోజా పుష్పం ఇచ్చి వాహనాలను అప్పగించారు. ఇకపై హెల్మెట్ లేకుండా నడిపే వ్యక్తులను ఉపేక్షించేది లేదని సీఐ మన్సూరుద్దీన్ హెచ్చరించారు. జీవితంపై విరక్తి చెంది.. గడివేముల: పెసరవాయి గ్రామానికి చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ నాగార్జున రెడ్డి తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన బెలుం గాయత్రి (30) తెలంగాణ రాష్ట్రం నల్గొండలో కెనరా బ్యాంక్లో ఫీల్డ్ ఆఫీసర్గా పనిచేస్తుంది. కొన్ని రోజుల నుంచి పెళ్లి సంబంధాలు కుదరకపోవడంతో మానసికంగా బాధపడుతూ సోమవా రం ఉదయం పెసర వాయి గ్రామంలో ఉరివేసుకుంది. కుటుంబ సభ్యులు గమనించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుంచగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతు రాలి తల్లి లక్ష్మీ నాగేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. -
వన్టౌన్ సీఐపై చర్యలు తీసుకోవాలి
ఆదోని రూరల్: ఆదోని పట్టణంలోని అంబేడ్కర్నగర్కు చెందిన దళితుడు నంచర్ల రమేష్పై దాడి చేసిన వన్టౌన్ సీఐ శ్రీరామ్తో పాటు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నాయకులు, మానవ హక్కుల వేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం స్థానిక సబ్కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు యు.జి.శ్రీనివాసులు, ఐఎఫ్టీయూ నాయకులు నరసన్న, మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.నరసన్న మాట్లాడుతూ.. గత జూలై నెల 30వ తేదీన రాత్రి 9 గంటల సమయంలో ప్రభాకర్ టాకీస్ వద్ద తోటి స్నేహితులతో కలిసి మాట్లాడుతున్న రమేష్ను సీఐ శ్రీరాములు బూతులు తిడుతూ, వాహనంలో స్టేషన్కు తరలించారన్నారు. స్టేషన్లో దారుణంగా హింసించి దాడి చేశారన్నారు. తీవ్ర గాయాలపాలైన రమేష్ను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించి, పోలీసులపై ఎదురు తిరిగాడని జూలై 31వ తేదీన రమేష్పై అక్రమ కేసు నమోదు చేసి రిమాండ్కు పంపారన్నారు. దళితుడిపై దాడికి పాల్పడిన వన్టౌన్ సీఐ శ్రీరామ్పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం సబ్కలెక్టర్ మౌర్యభరద్వాజ్కు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు వెంకటేష్, ప్రగతి శీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సుజ్ఞానమ్మ, నాయకులు నేతప్ప, నౌనేపాటి, ప్రసాద్, గిరి, ఆనంద్, యేసోబు, దేవేంద్ర, ఆనందరాజు తదితరులు పాల్గొన్నారు. -
హాస్టళ్లలో ప్రవేశాన్ని నిషేధించడం నిరంకుశత్వం
కర్నూలు (టౌన్): స్కూల్స్, హాస్టళ్లు, కళాశాలల్లో విద్యార్థి సంఘాల ప్రవేశాన్ని నిషేధించడం కూటమి ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి కటారు కొండ సాయి కుమార్ అన్నారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం కర్నూలు పాతబస్టాండ్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. జీవో ప్రతులను ద హనం చేశారు. ఈ సందర్భంగా సాయి కుమార్ మా ట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికై నా జీవోను రద్దు చేయాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామన్నా రు.స్కూళ్లు, హాస్టళ్లు సమస్యలతో సతమతమవుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులు బబ్లు, చి న్నరాజు,మహేష్,వేణు,రాజుతదితరులు పాల్గొన్నారు. -
గుర్తుతెలియని వ్యక్తికి ప్రాణం పోశారు!
కర్నూలు(హాస్పిటల్): ఓ హోటల్పై నుంచి కింద పడి తీవ్ర గాయాలతో అర్ధరాత్రి ఆసుపత్రిలో చేరాడు. అతను ఎవరో తెలియదు. ఎక్కడి వాడో వివరాలు లేవు. అతని వద్ద ఎవ్వరూ తోడు లేరు. ఇలాంటి పరిస్థితుల్లో డ్యూటీలో ఉన్న వైద్యులు అత్యవసరంగా అతనికి ఆపరేషన్ చేసి ప్రాణం పోశారు. కర్నూలు బస్టాండ్ సమీపంలో ఉండే నిర్మల హోటల్లో పనిచేసే రవి స్వస్థలం ఒంగోలు. కొంత కాలంగా ఒక్కడే హోటల్లో పనిచేస్తూ ఒంటరిగా అక్కడే నిద్రించేవాడు. ఆదివారం అర్ధరాత్రి హోటల్పై నుంచి అదుపు తప్పి కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని స్థానికులు తీసుకొచ్చి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేర్పించారు. క్యాజువాలిటీలో డ్యూటీలో ఉన్న వైద్యులు అతన్ని పరీక్షించి ప్లీహంకు తీవ్ర గాయమైనట్లు గుర్తించారు. ఇలాంటి సమయంలో అతని ప్లీహంను తొలగించాల్సి ఉంటుంది. సాధారణంగా గుర్తుతెలియని వ్యక్తులకు ఏదైనా అవయవం తొలగించాల్సి వస్తే కుటుంబసభ్యుల అనుమతి తీసుకోవాలి. కానీ అతని వద్ద ఎవ్వరూ లేకపోవడంతో ఆసుపత్రి ఇన్చార్జ్ సీఎస్ఆర్ఎంఓ డాక్టర్ వెంకటరమణకు వైద్యులు ఫోన్ చేసి విషయం తెలిపారు. వెంటనే ఆయన అత్యవసర ఆపరేషన్కు అనుమతి ఇచ్చారు. ఆ వెంటనే జనరల్ సర్జరీ హెచ్ఓడీ, మొదటి యూనిట్ చీఫ్ డాక్టర్ హరిచరణ్ ఫోన్ చేసి ఆయన సూచనలతో సర్జరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అబ్దుల్ అహద్ అత్యవసరంగా అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఆపరేషన్ చేసి ప్లీహం తొలగించి ఆయన ప్రాణాన్ని కాపాడారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఏఎంసీలోని ఎస్యుసీఐలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. సోమవారం ఉదయం హోటల్కు చెందిన పలువురు వ్యక్తులు ఆయన వద్దకు వచ్చారు. -
దంపతులను రక్షించిన పోలీసులు
బనగానపల్లె రూరల్: అప్పుల భారంతో ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమైన దంపతులను పోలీసులు రక్షించారు. సమాచారం అందుకున్న పోలీసులు సకాలంలో స్పందించడంతో ఇద్దరిని కాపాడారు. బనగానపల్లె సీఐ ప్రవీణ్కుమార్ సోమవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అవుకు మండలం రామాపురం గ్రామానికి చెందిన మద్ది లేటి ఆయన భార్య శశికళ కూలీ పనులు చేసుకొని జీవిస్తున్నారు. అయితే వారికి రూ.3 లక్షల అప్పులు ఉండడంతో, అప్పును తీర్చలేక మానసికంగా కుంగిపోయారు. ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బనగానపల్లెకు వచ్చారు. కుటుంబీకులు అనుమానంతో బనగానపల్లె పోలీసులకు సమాచారం ఇచ్చారు. సాంకేతిక పరిజ్ఞానంతో వారి వద్ద ఉన్న ఫోన్ ఆధారంగా రవ్వలకొండ సమీపంలోని ఎస్ఆర్బీసీ కాల్వ వద్ద ఆత్మహత్య కు యత్నించేందుకు సిద్ధంగా ఉన్న దంపతులను ఎస్ఐ దుగ్గిరెడ్డితో పాటు పోలీసు సిబ్బంది గుర్తించారు. వారిని స్టేషన్కు తీసుకొచ్చి కౌన్సెలింగ్ ఇచ్చి ఆత్మహత్య చేసుకునే ఆలోచన నుంచి విరమింపచేసినట్లు సీఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. జీవితం చాలా అమూల్యమైందని, చిన్నచిన్న విషయాలకు ఆత్మహత్య చేసుకోరాదని సీఐ సూచించారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మనోధైర్యంతో ఎదుర్కోవాలన్నారు. దంపతులను రక్షించిన ఎస్ఐ దుగ్గిరెడ్డితో పాటు పోలీసులను ఉన్నతాధికారులతో పాటు పలువురు అభినందించారు. -
భళా.. కర్ణ
యూరియా కోసం రైతుల ఆందోళన కౌతాళం: యూరియా కోసం నెల క్రితం డబ్బులు చెల్లించినా ఇవ్వకపోవడంతో రైతులు సోమవారం టోకెన్లు చూపిస్తూ ఆందోళన నిర్వహించారు. సహకార పరపతి సంఘానికి ఐదు లోడ్లలో 1400 వందల సంచులు యూరియా వచ్చింది. డబ్బులు తీసుకుని టోకన్లు ఇచ్చిన రైతులకు కాదని మిగితా రైతులకు ఆధార్కార్డు తీసుకుని రెండు సంచుల ప్రకారం యూరియా ఇస్తున్నారు. ఇదేమని వ్యవసాయాధికారిని ప్రశ్నించగా ‘మీకు ఐదు నుంచి పది సంచుల వరకు ఇచ్చేది ఉంది. మిగిలితే ఇస్తాం’ అని సమాధానం ఇచాచరు. దీంతో టోకన్లు ఉన్న రైతులు ఆందోళనకు దిగారు. తమ కళ్ల ముందే యూరియా నాయకులకు, భూస్వాములకు ఇస్తున్నారని రైతులు ఖాదరయ్య, నర్సయ్య, వీరేష్, లింగన్న, సుకేంద్ర, గొట్టయ్య, రామచంద్ర, వెంకన్న ఆరోపించారు. యూరియా ఇస్తామని చెప్పడంతో పొలాలకు వెళ్లకుండా ఉదయం నుంచి సహకార పరపతి సంఘం వద్ద వేచి ఉన్నా వ్యవసాయాధికారి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నడని, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోసిగి: గుండెత్తు పోటీల్లో కర్ణాటకకు చెందిన కప్పగల్ కర్ణ సత్తా చాటాడు. ఉరుకుంద ఈరన్న స్వామి పల్లకోత్సవం సందర్భంగా సోమవారం కందు కూరులో గుండెత్తుట, ఇసుక సంచి ఎత్తుట, పరుగు పందెం, ట్రిపుట్ జంప్ పోటీలు నిర్వహించారు. ఇందులో 175 కేజీల గుండును కర్ణాటక రాష్ట్రానికి చెందిన కప్పగల్ కర్ణ అనే వ్యక్తి మూడు సార్లు అవలీలగా ఎత్తి ప్రథమ బహుమతి గెలుపొందారు. వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి పి. మురళీ మోహన్ రెడ్డి రూ.5100 నగదును అందజేశారు. శారదళ్లి సక్కీరప్ప అనే వ్యక్తి రెండు సార్లు ఎత్తి ద్వితీయ బహుమతి గెలుపొందగా ఈయనకు వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బెట్టన గౌడ రూ.5000ను అందించారు. అలాగే 220 కేజీల ఇసుక సంచి మడినాళ్ల ఎళ్లలింగా అనే వ్యక్తి ఎత్తి ప్రథమ స్థానంలో నిలిచాడు. ఈయనకు టీడీపీ ఇన్చార్జ్ రాఘవేంద్ర రెడ్డి రూ.7,100 నగదును అందించారు. ద్వితీయ స్థానంలో నిలిచిన శారదళ్లి మరియప్పకు రూ.4100 ముత్తురెడ్డి అందజేశారు. 5 కిలో మీటర్లు పరుగు పందెం పోటీల్లో పెద్దతుంబళం ఈరన్న, తిమ్మప్ప ద్వితీయ ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. -
ఆర్యూసీఈలో తగ్గిన ఇంజినీరింగ్ ప్రవేశాలు
● సీఎస్ఈలో పూర్తిగా భర్తీ కానీ సీట్లు ● ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నిల్ అడ్మిషన్లు ● మెకానికల్లో ఒక్క సీటు భర్తీ కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (ఆర్యూసీఈ)లో ఇంజినీరింగ్ అడ్మిషన్లు భారీగా తగ్గిపోయాయి. ఏపీఈఏపీ సెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ అడ్మిషన్ల రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ సైతం ముగిసింది. ఆర్యూసీఈ అడ్మిషన్ల వివరాలను పరిశీలిస్తే గత ఏడాది కంటే ఈ ఏడాది 89 సీట్లు మిగిలిపోయాయి. వర్సిటీ అడ్మినిస్ట్రేషన్లో సమస్యలు, హాస్టల్ నిర్వహణలో లోపాలు, ఇంజినీరింగ్ కళాశాలకు రెగ్యులర్ అధ్యాపకులు లేకపోవడం, కాంట్రాక్ట్, గెస్ట్ ఫ్యాకల్టీతో తరగతులు నిర్వహించడం, మరీ ముఖ్యంగా నాలుగు నెలల నుంచి కళాశాల పరిపాలన, అకడమిక్ వ్యవహారాలు చూసేందుకు ప్రిన్సిపాల్ లేకపోవడం కారణాలుగా ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఆర్యూసీఈకి వర్సిటీ రిజిస్ట్రార్ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్గా ఉన్నారు. కళాశాలకు ప్రత్యేకంగా మౌలిక వసతులు లేవు. ల్యాబ్ సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు ప్రాక్టికల్స్ చేసుకోలేని పరిస్థితి నెలకొంది. ఏఐసీటీ అనుమతితో ఏర్పడిన మొదటి ఇంజినీరింగ్ కళాశాల ఆర్యూసీఈ అయినప్పటికీ అడ్మిషన్లు తగ్గాయి. సీఎస్ఈలో సైతం తగ్గిన ప్రవేశాలు.. అన్ని కళాశాలల్లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్లో అన్ని సీట్లు భర్తీ అయ్యాయి. ఆర్యూసీఈలో సైతం గత ఏడాది 132 సీట్టకు 132 సీట్లు భర్తీ అయ్యాయి. ఈ ఏడాది మాత్రం 132 సీట్లకు 125 భర్తీ కాగా 7 సీట్లు మిగిలిపోయాయి. ఏఐలో గత ఏడాది 66 సీట్లకు 62 భర్తీ కాగా ఏడాది ఒక్క అడ్మిషన్ కూడా కాలేదు. మెకానికల్ ఇంజినీరింగ్లో గత ఏడాది రెండు, ఈ ఏడాది ఒక్క అడ్మిషన్ మాత్రం వచ్చిది. కళాశాలకు రెగ్యులర్ ప్రిన్సిపాల్, ఫ్యాకల్టీని నియమించి, ల్యాబ్ వసతి కల్పిస్తేనే కళాశాల మనుగడ ఉంటుందని, పలువురు మేధావులు సూచిస్తున్నారు. -
47 నూతన మద్యం బార్లకు నోటిఫికేషన్
కర్నూలు: మూడేళ్ల కాల పరిమితితో నూతన మద్యం బార్ పాలసీ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి 2028 ఆగస్టు 31వ తేదీ వరకు నూతన పాలసీ అమలులో ఉంటుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి 47 నూతన మద్యం బార్లకు కలెక్టర్ల అనుమతితో ఉమ్మడి జిల్లాల ఎకై ్సజ్ అధికారులు సుధీర్ బాబు, రవికుమార్ సోమవారం గజిట్ విడుదల చేశారు. ఈనెల 26వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నూతన బార్లకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఆన్లైన్, ఆఫ్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈనెల 28న కర్నూలుకు సంబంధించి జిల్లాపరిషత్ సమావేశ భవనం, నంద్యాలకు సంబంధించి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో లాటరీ పద్ధతిలో ఆయా జిల్లాల కలెక్టర్ల సమక్షంలో బార్లను కేటాయించనున్నారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కొత్త బార్లు అందుబాటులోకి రానున్నాయి. ఒక్కొక్క దరఖాస్తు విలువ రూ.5 లక్షలు నాన్ రీఫండబుల్ ఫీజు, రూ.10 వేలు ప్రాసెసింగ్ ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది. నూతన మద్యం బార్ల దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి ఎకై ్సజ్ అధికారులు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జనాభా ప్రాతిపదికన ఒకే స్లాబ్లో లైసెన్స్ దారుల నుంచి సెక్యూరిటీ డిపాజిట్ వసూలు చేయనున్నారు. 55 లక్షల జనాభా లోపు ఉన్న ప్రాంతంలో రిటైల్ ఎకై ్సజ్ రుసుం రూ.35 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే గూడూరు నగర పంచాయతీలో మాత్రం 50 వేల లోపు జనాభా ఉన్నందున రూ.35 లక్షలు రిటైల్ ఎకై ్సజ్ రుసుం చెల్లించాలి. ● ఏ ప్రాంతం, ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయినా నూతన మద్యం బార్కు దరఖాస్తు చేసుకోవచ్చు. ● ఒకే వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా కొనుగోలు చేయవచ్చు. ఎన్ని బార్లకై నా దరఖాస్తు చేసుకోవచ్చు. ● అందిన దరఖాస్తుల్లో ఒక్కొక్క బార్ను లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు. వీటితో పాటు గౌడ కులాలకు కర్నూలు కార్పొరేషన్ పరిధిలో 2, ఆదోని మున్సిపాలిటీలో 1, నంద్యాల మున్సిపాలిటీలో 1, డోన్ మున్సిపాలిటీ పరిధిలో 1 చొప్పున రిజర్వేషన్ ప్రాతిపదికన బార్లను కేటాయించనున్నారు. ● ఇందుకోసం గౌడ్, ఈడిగ కులాలకు సంబంధించిన వారు రిజర్వేషన్ ప్రాతిపదికన కేటాయించిన దుకాణాలకు దరఖాస్తులు చేసుకోవచ్చు. పొడిగించిన వ్యాపార సమయాలు... బార్లు ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు (14 గంటలు) అనుమతించబడతాయి. గతంలో 11 గంటల వరకే అనుమతి ఉండేది. అయితే ఒక గంట సమయాన్ని పెంచుతూ మందుబాబులకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. లైసెన్స్ రుసుం ఆరు సమాన వాయిదాలలో చెల్లించాల్సి ఉంటుంది. ఇన్స్టాల్మెంట్కు సరిపడ బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాలనే నిబంధన విధించారు. బార్లకు కూడా ఏ4 దుకాణాల మాదిరిగానే ఏపీఎస్డీసీఎల్ నుంచి మద్యం స్టాక్ కొనుగోలు చేసుకోవచ్చు. లైసెన్స్ పొందినవారు 15 రోజుల లోపు రెస్టారెంట్ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. పట్టణ, సెమీ అర్బన్ ప్రాంతాలు, కార్పొరేషన్ పరిధిలో 10 కిలోమీటర్లు నిడివిలో, మున్సిపల్ ఏరియాలో మూడు కిలోమీటర్ల దూరం ఉండేలా బార్లు ఏర్పాటు చేసుకోవాలి. కర్నూలు జిల్లాలో బార్ల ఏర్పాటు ప్రాంతాలు... కర్నూలు కార్పొరేషన్లో 16 జనరల్ కేటగిరీ 2 గీత కులాలకు, ఆదోని మున్సిపాలిటీలో 4 జనరల్ కేటగిరీ 1 గీత కార్మికులకు కేటాయించారు. ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో 2, గూడూరు నగర పంచాయతీలో 1 బార్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించింది. నంద్యాల జిల్లాలో.... నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో 14 జనరల్ కేటగిరీ 1 గీత కులాలకు, డోన్ మున్సిపాలిటీలో 1 జనరల్ కేటగిరీ మరొకటి గీత కులాలకు కేటాయించారు. నందికొట్కూరు, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, బేతంచెర్లలో ఒక్కొక్కటి చొప్పున బార్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించింది. -
AP: వీఏఏల బదిలీ వ్యవహారంపై హైకోర్టు విస్మయం
విజయవాడ: కృష్ణా, కర్నూలు జిల్లాల గ్రామ వ్యవసాయ సహాయకులు బదిలీలు రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. వీఏఏల బదిలీ వ్యవహారంపై హైకోర్టు విస్మయం వ్యకతం చేసింది. ఆ రెండు జిల్లాల్లో తిరిగి కౌన్సిలింగ్ నిర్వహించి బదిలీలు చేపట్టాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నిబంధనలకు పాతరేసి ప్రజాప్రతినిధుల సిఫార్సులకు అధికారులు పట్టంకట్టి బదిలీలు చేయడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇవి ప్రజా ప్రతినిధుల సిఫార్సు మేరకే జరిగాయని, దీన్ని ప్రజా ప్రయోజనంగా పరిగణించలేమని హైకోర్టు పేర్కొంది. బదిలీల అమల్లో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘన జరుగుతున్నా కలెక్టర్ మౌనంగా ఉండిపోయారని, బదిలీల్లో పారదర్శకత లోపించిందని హైకోర్టు తేల్చి చెప్పింది. -
కృష్ణుడి కోసం రైల్వే స్టేషన్!
బేతంచెర్ల: రాజుల కాలం నుంచి ఇప్పటి వరకు చాలా మంది దేవుడి కోసం ఆలయాలు నిర్మించడం తెలుసుకానీ.. ఇక్కడ శ్రీకృష్ణ భగవాన్ కోసం రైల్వే స్టేషన్ నిర్మించారంటే ఆశ్చర్యపోతున్నారా.. ప్రయాణికుల కోసం స్టేషన్ ఏర్పాటు చేసి ఉంటారే అని కొట్టిపారేసుందుకు చుట్టు పక్కల పల్లెలు కూడా లేవు. స్టేషన్ చుట్టూ కొండ ప్రాంతం. గుంటూరు – గుంతకల్లు రైల్వే మార్గంలో పాణ్యం – సిమెంట్నగర్ రైల్వే స్టేషన్ల మధ్య ఉన్న కృష్ణమ్మ కోన రైల్వే స్టేషన్కు ఎంతో చరిత్ర ఉంది. బ్రిటీష్ పరిపాలనలో ఏర్పాటు చేసిన ఈ రైలు మార్గంలో వెళ్లే రైళ్లు, గూడ్స్ కృష్ణమ్మ కోన ప్రాంతానికి రాగానే ఆగిపోయేవి. కారణం తెలియక చాలా మంది రైల్వే అధికారులు ఈ ప్రాంతం గురించి ఆరా తీశారు. స్వయంగా ఉన్నతాధికారులు అక్కడికి చేరుకొని పరిశీలించారు. సమీపంలోని ఆవుల కాపరి దగ్గరకు వెళ్లి ఇక్కడ ఏవైనా దేవాలయాలు ఉన్నాయా? అని అడగటంతో సమీపంలో కృష్ణుని విగ్రహం చూపించారు. స్వామి దర్శనం చేసుకున్న రైల్వే అధికారులు ‘కృష్ణమ్మ కోన’పేరుతో రైల్వే స్టేషన్ ఏర్పాటుతో పాటు గుడి నిర్మాణం చేపడతామన్నారు. అనుకున్న ప్రకారం బ్రిటిష్ పాలనలోకృష్ణమ్మ కోన పేరుతో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేశారు. తదనంతరం అక్కడ గుడి నిర్మాణం కూడా వారు చేపట్టారు. రైల్వే స్టేషన్ ఏర్పాటుతో పాణ్యం, బేతంచెర్ల, నంద్యాలతో పాటు గుంటూరు, గుంతకల్ , కర్నూలు ప్రాంత భక్తులే కాకుండా బనగానపల్లె మండలం రామతీర్థం, నందివర్గం నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ప్రతి ఏకాదశితోపాటు శనివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు. ప్రతి శనివారం కందికాయపల్లె, సిమెంట్ నగర్ గ్రామాలే భక్తులే కాకుండా పాణ్యం, నంద్యాల నుంచి వచ్చిన భక్తులు భజనలు చేస్తుంటారు. మహావిష్ణువు జగన్మోహిని అవతారం ఇక్కడే.. కొండ కోనలు, పచ్చని ప్రకృతి అందాల మధ్య ఉన్న కృష్ణమ్మ కోనలో రుక్మిణి సత్యభామ సమేత కృష్ణుడు వెలిసి భక్తుల చేతల పూజలు అందుకుంటున్నారు. ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న కథనం మేరకు.. మహావిష్ణువు జగన్మోహినిగా ఇక్కడే అవతరించారని తెలుస్తోంది. కృతయుగంలో తపస్సుతో శివుడిని మెప్పించి ఎవరిపైనా సరే తలపై చేయి పెడితే భస్మమయ్యే వరం పొందిన భస్మాసురుడే చివరకు ఇక్కడే భస్మం అయ్యారని తెలుస్తోంది. దేవతలను సైతం భస్మాసురుడు సంహరించే ప్రయత్నం చేస్తుండగా మహావిష్ణువు కృష్ణమ్మ కోన సమీపంలో జగన్మోహిని అవతారం ఎత్తి భస్మాసురుని ఆకర్షిస్తాడు. భస్మారుడు కామంతో జగన్మోహిని పొందాలనుకుంటాడు. అప్పుడు విష్ణువు కొలనులో శుద్ధిగా స్నానం చేసి రావాలనే నిబంధన పెడతాడు. కొద్దిపాటి నీరు ఉన్న కొలనులోకి భస్మాసురుడు వెళ్లి స్నానం చేస్తూ తలపైన నీళ్లు చల్లుకుంటూ చేతులు తన తలపైనే పెట్టుకోవడంతో భస్మం అవుతాడు. భస్మాసురుడిని అంతం చేయడానికి శ్రీమహావిష్ణువు జగన్మోహిని అవతారం ఎత్తడంతోనే ఈ ప్రాంతాన్ని కృష్ణమ్మ కోనగా పిలుస్తారనే కథ ప్రాచుర్యంలో ఉంది. రుక్మిణి సత్యభామ, సమేత శ్రీ కృష్ణుడు కృష్ణమ్మ కోన రైల్వే స్టేషన్ ప్రత్యేకం రైల్వే అధికారులు కృష్ణుడికి గుడి, స్టేషన్ నిర్మించారని ప్రతీతి -
సుళువాయిలో దాహం..దాహం!
హొళగుంద: వర్షాలు కురుస్తూ వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నా సుళువాయి గ్రామంలో మాత్రం తాగునీటి ఎద్దడి నెలకొంది. విరుపాపురం వాటర్ స్కీం నుంచి వారానికో, రెండు వారాలకో మంచినీరు వస్తుండగా అవి సరిపోక గ్రామ ప్రజల దాహంతో అల్లాడుతున్నారు. విరుపాపురం నీటి పథకం నుంచి మంచినీరు సక్రమంగా వదలటం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తమ గ్రామానికి సక్రమంగా నీరు అందడం లేదని ఆర్డబ్ల్యూఎస్ అధికారుల దృష్టికి సర్పంచ్ మౌలాలి తీసుకెళ్లినా ఫలితం కనబడటం లేదు. దీంతో గ్రామంలో చాలా వరకు ఇంటికి ఒక తోపుడు బండిని పెట్టుకుని బోర్ల ద్వారా మినీట్యాంకులకు ఎక్కించే నీటిని తీసుకెళ్తున్నారు. ఆ నీటిని తాగేందుకు, వాడుకకు ఉపయోగిస్తున్నారు. అందుబాటులో ఉన్న ఒకటి రెండు బోరు, చేతి పంపుల వద్ద నీటి కోసం యుద్ధానికి దిగుతున్నారు. అధికారులు స్పందించి విరుపాపురం వాటర్ స్కీం నుంచి నీటి సరఫరాను సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవా లని గ్రామస్తులు కోరుతున్నారు. విరుపాపురం స్కీం నుంచి అందని తాగునీరు ఇక్కడ ఇంటికో తోపుడు బండ్లు -
నొప్పిని తగ్గించే వైద్యమేదీ!
పెయిన్ క్లినిక్లకు ఇప్పుడు ఆదరణ పెరుగుతోంది. అన్ని రకాల నొప్పులను తగ్గిస్తామని ప్రకటనలు ఇచ్చే వైద్యుల సంఖ్య బాగా అధికమైంది. ఈ ప్రకటనలు చూసి వివిధ రకాల నొప్పులతో బాధపడే వారు డాక్టర్లను వెతుక్కుంటూ వెళ్తున్నారు. పెరిగిన ఆదరణలో మత్తుమందు వైద్యుల్లో అధిక భాగం ఇప్పుడు పెయిన్ క్లినిక్లు ఏర్పాటు చేస్తున్నారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పదుల సంఖ్యలో మత్తుమందు డాక్టర్లున్నా ఈ విభాగం ఏర్పాటుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు. కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో గత ప్రభుత్వ హయాంలో రెండు కొత్త విభాగాలు ఏర్పాటయ్యాయి. అందులో ఎమర్జెన్సీ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాలు. వీటిలో క్యాజువాలిటీ స్థానంలోనే ఎమర్జెన్సీ మెడిసిన్ పేరిట వైద్యసేవలు కొనసాగుతున్నాయి. ఇందులో ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు వైద్యసేవలు అందించాలి. ఈ విభాగానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఏవీ లేకుండా కొనసాగిస్తున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మాత్రమే ఈ విభాగంలోని ఇద్దరు వైద్యులు ఉండి సేవలందిస్తున్నారు. మధ్యాహ్నం రెండు నుంచి మరునాడు ఉదయం 9 గంటల వరకు ఈ విభాగం వైద్యులు కనిపించరు. అలాగే హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ పేరుతో ఒక విభాగం ఏర్పాటైంది. ఈ విభాగానికి ఇద్దరు వైద్యులు గతంలో నియమితులయ్యారు. ఈ విభాగం ఏర్పాటు కూడా ఎక్కడా చేయలేదు. అలాగే పెయిన్ క్లినిక్ ఏర్పాటు చేస్తామని అధికారులు కొన్నేళ్లుగా చెబుతూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు. వైద్యంలో కర్నూలు కంటే వెనుకబడ్డ అనంతపురం ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోనూ పెయిన్ క్లినిక్ను ఐదేళ్లుగా కొనసాగిస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం ప్రారంభించేందుకు అధికారులు ముందుకు రావడం లేదు. 23 మంది డాక్టర్లు...45 మంది పీజీలున్నా.. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని అనెస్తీషియా విభాగంలో మూడు యూనిట్లు ఉన్నాయి. ప్రతి యూనిట్కు ఒక్కో ప్రొఫెసర్ చొప్పున ముగ్గురు ప్రొఫెసర్లు, నలుగురు అసోసియేట్, 16 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు విధులు నిర్వహిస్తున్నారు. వీరితో పాటు ఏడాదికి 15 మంది పీజీలతో కలుపుకుని మూడేళ్లకు మొత్తం 45 మంది పీజీలు ఇక్కడ చదువుకుంటూ వైద్యసేవలందిస్తూ ఉన్నారు. ఈ ఆసుపత్రిలో 12 ఆపరేషన్లు థియేటర్లతో పాటు ఎంఆర్ఐ, సీటీ స్కాన్, కేథలాబ్ విభాగాల్లో అనెస్తీషియా వైద్యులు సేవలందిస్తున్నారు. 23 మంది వైద్యులు, 45 మంది పీజీలున్నా ఇక్కడ పెయిన్ క్లినిక్ ఏర్పాటు కావడం లేదు. ఎక్కువ మందికి నొప్పులే సమస్య...! సాధారణంగా ప్రతి పీహెచ్సీ, సీహెచ్సీ, యూపీహెచ్సీలకు వెళ్లే రోగుల్లో ఎక్కువ శాతం మంది వివిధ రకాల నొప్పులతోనే వెళ్తున్నారు. అక్కడి వైద్యులు ఇచ్చిన మందులు, పెయిన్ కిల్లర్లకు నొప్పులు తగ్గకపోతే స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ వద్దకు వెళ్తున్నారు. వీరు స్టెరాయిడ్, పెయిన్ కిల్లర్ మందులను ఇవ్వడంతో నొప్పుల నుంచి వారికి ఉపశమనం లభిస్తోంది. దీంతో ఎక్కువ శాతం మంది ఆర్ఎంపీలనే ఆశ్రయిస్తున్నారు. ఎక్కువ భాగం ఇలాంటి మందులు వాడటంతో దీర్ఘకాలంలో వారికి కాలేయం, కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. నొప్పి నివారణ మందులు వాడి కిడ్నీలు దెబ్బతిని డయాలసిస్కు వచ్చే వారి సంఖ్య ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి ఏటా పెరుగుతోంది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో త్వరలో పెయిన్ క్లినిక్ను ఏర్పాటు చేస్తాము. ఇందులో నిపుణులైన అనెస్తెటిస్ట్లు సైతం మా వద్ద ఉన్నారు. అనెస్తీషియా విభాగంతో చర్చించి త్వరలో పెయిన్క్లినిక్ను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాము. –డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్, జీజీహెచ్, కర్నూలు పెద్దాసుపత్రిలో కానరాని పెయిన్క్లినిక్ ప్రైవేటు ఆసుపత్రుల్లో అధికంగా ఏర్పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులున్నా ఏర్పాటుకాని వైనం -
రైళ్లు ఆగిపోయేవట
బ్రిటిష్ కాలంలో గుంటూరు– గుంతకల్ రైల్వే లైన్ ఏర్పాటు చేశాక వచ్చి పోయే రైళ్లు, గూడ్స్ బండ్లు ఆగిపోయేవట. ఏమి చేయాలో తోచక సిబ్బంది ఉన్నతాధికార్లకు సమాచారం ఇవ్వడంతో ఇక్కడకు వచ్చి ఆలయాన్ని సందర్శించి కృష్ణమ కోన పేరు మీదుగా స్టేషన్ ఏర్పాటు చేసినట్లు మా పెద్దలు చెప్పేవారు. – రామసుబ్బయ్య, సిమెంట్ నగర్ గ్రామం స్వామి వారు భక్తుల కల్పతరువు. సంతాన వర ప్రదాయుడిగా ఖ్యాతి పొందారు. ఎంతో విశిష్టత ఉన్న ఆలయాన్ని దర్శిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని నమ్మకం భక్తుల్లో ఉంది. పండుగ పర్వదినాలు శనివారం రుక్మిణి, సత్యభామ సమేత కృష్ణుడిని దర్శించుకుంటారు. సంతానం లేని వారు స్వామి వారిని సేవిస్తే ఫలితం ఉంటుంది. – ఆలయ పూజారి కిట్టన్న -
ఆధ్యాత్మిక గురువు శివైక్యం
ఆదోని అర్బన్: పట్టణంలోని హనుమాన్నగర్లో వెలిసిన శ్రీ రాజరాజేశ్వరి దేవస్థాన ఆస్థానవాసులు, ఆధ్యాత్మిక గురువు రాజరాజేశ్వరి ఆదివారం తెల్లవారుజామున శివైక్యమయ్యారు. ఈమె1983 సంవత్సరంలో నెల్లూరు నుంచి మంత్రాలయానికి, అక్కడి నుంచి ఆదోనికి వచ్చారు.స్థానిక హనుమాన్నగర్లో ఓ చిన్న గుడిసెలో ఉంటూ ఆధ్యాత్మిక, ధార్మిక చింతనతో గడుపుతూ 1987లో రాజరాజేశ్వరి దేవస్థానాన్ని నిర్మించారు. ఆ తర్వాత పేదల కోసం కళ్యాణ మండపం ఏర్పాటు చేశారు. అయితే, ఆదివారం తెల్లవారుజామున ఆయాసం అధికం కావడంతో ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలోనే రాజరాజేశ్వరి తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యేలు సాయిప్రసాద్రెడ్డి, మీనాక్షినాయుడు, ఎమ్మెల్యే డా.పార్థసారథితో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాయంత్రం అమ్మవారి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. పొలాల్లోకి దూసుకెళ్లిన కారు ● ఇద్దరికి గాయాలు పాణ్యం: మండల కేంద్రం పాణ్యంలోని జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. హైవే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కరీంనగర్ నుంచి రాయచోటికి వెళ్తున్న కారు సాయిబాబా గుడి వద్ద పొలాల్లోకి దూసుకెళ్లింది. డ్రైవర్ శివ తెల్లవారుజామున నిద్రలోకి జారుకోవడంతో జరిగిన ఈ ఘటనలో ఇద్దరికి స్వల్ప గాయాల య్యాయి. సమాచారం తెలుసుకున్న హైవే పోలీసులు కారును బయటకు తీశారు. రైల్వే ట్రాక్పై గుర్తు తెలియని మృతదేహం మహానంది: నంద్యాల నుంచి గిద్దలూరు వెళ్లే నల్లమల రైలు మార్గంలో గాజులపల్లె రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. నంద్యాల రైల్వే ఎస్ఐ కుమారి తెలిపిన వివరాల మేరకు గాజులపల్లె రైల్వే స్టేషన్ సమీపంలోని గేటు దాటిన తర్వాత ఉన్న మార్గంలో సుమారు 30 నుంచి 35 ఏళ్ల వయసున్న వ్యక్తి మృతదేహం గుర్తించామన్నారు. మృతి చెందిన వ్యక్తి మెడలో ఎరట్రి తాయత్తు ఉందని, నల్లటి రంగు టీ షర్టు ధరించినట్లు తెలిపారు. మృతదేహాన్ని ఎవరైనా గుర్తిస్తే రైల్వే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఉద్యోగం ఇప్పిస్తామని మోసం అవుకు(కొలిమిగుండ్ల): ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి మోసం చేశాడని బాధితురాలి ఫిర్యాదు మేరకు అవుకు మండలంలో మెట్టుపల్లె గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అవుకు కస్తూర్బా పాఠశాలలో పోస్టు ఇప్పిస్తామని అదే మండలానికి చెంది న ఓ మహిళతో డబ్బులు వసూలు చేశాడు. పోస్టు విషయంపై బాధితురాలు అతన్ని ప్రశ్నించడంతో జాబ్కు సంబంధించిన ఓ లెటర్ వాట్సాప్లో పెట్టి కొద్ది సేపటికే తొలగించాడు. ఈ విషయంపై ఇద్దరు ఫోన్లో మాట్లాడుతున్న సమయంలో ఓ ప్రజాప్రతినిధితోపాటు, టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేను కించపరిచేలా మాట్లాడాడు. దీనికి సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బాధితురాలు అవుకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మోసానికి పాల్పడిన వ్యక్తి ఓ యూట్యూబ్ చానల్లో పని చేస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. -
రిటైర్మెంట్ బకాయిలు ఇప్పించండి
కర్నూలు(అర్బన్): సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు సంబంధించిన బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల రిటైర్డు ఉద్యోగుల అసోసియేషన్ నేతలు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక బీ క్యాంప్లోని ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఆ అసోసియేషన్ నేతలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి. చంద్రశేఖర్ మాట్లాడుతూ గురుకులాల్లో రిటైర్డు అయిన ఉద్యోగులకు నేటి వరకు ఈఎల్ చెల్లించలేదన్నారు. అలాగే మెడికల్ బిల్స్ను మంజూరు చేయడం లేదని, ప్రభుత్వం రిలీజ్ చేసిన డీఏ అరియర్స్ కూడా చెల్లించలేదన్నారు. పీఆర్సీ అరియర్స్, హాఫ్పే లీవ్స్, వన్ మంత్ ఎర్న్డ్ లీవ్స్, యాన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ అరియర్స్, స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్స్ కూడా రిటైర్డు అయిన ఉద్యోగులకు చెల్లించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసిన అన్ని బిల్లులను ప్రభుత్వం ఆమోదించాలన్నారు. జోనల్ కోఆర్డినేటర్ డాక్టర్ జె. రంగస్వామి మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 450 మంది రిటైర్డు అయ్యారన్నారు. పదవీ విరమణ అయ్యాక వచ్చే డబ్బుతో ఏమి చేయాలనే ప్రణాళికలు ఉద్యోగులకు ఉంటాయని, తాము దాచుకున్న సొమ్మును ఇవ్వడంలో కూడా ప్రభుత్వాలు జాప్యం చేయడం ద్వారా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామన్నారు. సకాలంలో ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్ అందక తీవ్ర మానసిక క్షోభకు గురై పలువురు ఉద్యోగులు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో తమ సమస్యలను పరిష్కరించాలని ఇప్పటికే పలుమార్లు చీఫ్ సెక్రెటరీ, సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, గురుకులాల సొసైటీ కార్యదర్శిని ప్రత్యక్షంగా కలిసి విన్నవించినా, నేటికి ఎలాంటి ఫలితం కనిపించడం లేదని చెప్పారు. సమావేశంలో అసోసియేషన్ నేతలు బాలభాస్కర్, వాసుదేవరెడ్డి, గంగాధర్, వీర ప్రసాద్, తిరుపాలయ్య, సత్యన్న, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సాంఘిక సంక్షేమ గురుకులాల రిటైర్డు ఉద్యోగుల ఆందోళన -
మాల ఉద్యోగుల ఐక్యతే మాల్గోవ ధ్యేయం
కర్నూలు(అర్బన్): మాల ఉద్యోగుల ఐక్యతే ధ్యేయంగా మాల గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (మాల్గోవ ) పనిచేస్తుందని మాల్గోవ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విజయానంద్, రామకృష్ణ అన్నారు. ఆదివారం రాత్రి స్థానిక జెడ్పీలోని ఎంపీపీ హాల్లో మాల గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గం ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాల ఉద్యోగులకు మాల్గోవ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గోన నాగరాజు, అడిషనల్ సెక్రెటరీ హెచ్డీ ఈరన్న , అరవింద్, ఉమామహేశ్వర్ పాల్గొన్నారు. ఏకగ్రీవంగా జిల్లా నూతన కార్యవర్గం .... మాల్గోవ జిల్లా అధ్యక్షుడిగా వీపీ సోమన్న, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ వై రాజశేఖర్, కోశాధికారిగా రాము డు, అసోసియేట్ ప్రెసిడెంట్గా చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడిగా నాగన్న, సుధాకర్బాబు, డాక్టర్ సృజన్, డాక్టర్ రాజేష్, అడిషనల్ జనరల్ సెక్రెటరీలుగా ఓబులేసు, పుల్లయ్య, సంయుక్త కార్యదర్శిగా మైలా బాబు రాజేంద్రప్రసాద్, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా వీరేష్, నారాయణ, మహిళా వింగ్ కార్యదర్శులుగా సుష్మ, జ్యోతి, విజయకుమారి, లీగల్ అడ్వైజర్గా జయరాజ్, గౌరవ సలహాదారులుగా రిటైర్డు డీఎస్పీలు దేవదానం, వేల్పుల జయచంద్ర, రిటైర్డు ఈఈ రాగప్ప, గౌరవాధ్యక్షుడిగా పాండురంగయ్య, చిరంజీవిని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నూతనంగా ఎన్నికై న వారిని సభ్యులను సన్మానించారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా వైపీ సోమన్న, డా.వై రాజశేఖర్ -
షెడ్లతో ‘కూటమి’ వ్యాపారం!
కర్నూలు(అగ్రికల్చర్): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా అభివృద్ధి పనులు లేవు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో పాలన అస్తవ్యస్తంగా మారింది. ఇక్కడ ‘కూటమి’ నేతల వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా రూ.లక్షల వ్యయంతో నిర్మించిన షెడ్లను కమీషన్ ఏజెంట్లకు కాకుండా వ్యాపారులకు కేటాయిస్తున్నారు. మార్కెట్లో గతంలో కూరగాయల వ్యాపారం నిమిత్తం షెడ్లు నిర్మాంచారు. కాని వ్యాపారులు షెడ్లలో వ్యాపారం చేయడం వల్ల వినియోగదారులు లోపలికి రావడం లేదనే కారణంతో బయటనే వ్యాపారం చేస్తున్నారు. షెడ్లలోనే కూర్చొని కూరగాయలు అమ్ముకునే విధంగా చూడాల్సిన బాధ్యత మార్కెట్ కమిటీపై ఉంది. షెడ్లలోనే కూరగాయల వ్యాపారం చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటే ట్రాఫిక్ సమస్య ఉండదు. పరిశుభ్రత పెంపొందుతుంది. కాని ఇదేమీ పట్టించుకోని మార్కెట్ కమిటీ ఏకంగా 1వ నంబరు షెడ్ను మిర్చి వ్యాపారులకు స్వాధీనం చేసింది. మార్కెట్ యార్డుల్లో సాధారణంగా కమీషన్ ఏజెంట్లకు షాపులు కేటాయిస్తారు. రైతులకు, వ్యాపారులకు మధ్యన ఉండి రైతులు తెచ్చిన సరుకును అమ్మిస్తుంటారు. ఎక్కడైనా కమీషన్ ఏజెంట్లకు షాపులు ఇవ్వడం సర్వసాధారణం. కర్నూలు మార్కెట్లో మాత్రం మొదటి విడతలో మిర్చి వ్యాపారులకు 1వ షెడ్డు అప్పగించడం మార్కెట్ యార్డులో కొంతకాలంగా జోరుగా చర్చ సాగుతోంది. చేతులు మారిన ముడుపులు.. మిర్చి వ్యాపారులకు షాపుల నిమిత్తం షెడ్డును కేటాయించడం ద్వారా పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారినట్లు విరమ్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారాన్ని ఒక ఉన్నతాధికారి నేతృత్వంలోనే జరిగినట్లు తెలుస్తోంది. మిర్చి వ్యాపారులకు ఒక షెడ్డు అప్పగించడంతో తమకు షాపులకు షెడ్ ఇవ్వండి, స్థలం చూపాలని మిగిలిన వ్యవసాయ ఉత్పత్తులుకొనే వ్యాపారులు కోరుతున్నట్లు సమాచారం. మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించే రైతులకు నేరుగా వ్యాపారులు పేమెంటు చేయడం జరుగదు. కమీషన్ ఏజెంటు తన కమీషన్ పట్టుకొని రైతుకు పేమెంటు చేస్తారు. సరుకు కొనుగోలు చేసిన వ్యాపారులు నిర్ణీత గడువులోపు కమీషన్ ఏజెంటుకు పేపెంటు చేస్తారు. వ్యాపారులకు ఒక షెడ్ అప్పగించి షాపులు నిర్మించునేందుకు అవకాశం ఇవ్వడం వల్ల పెద్ద ప్రయోజనం సిద్ధించినట్లు తెలుస్తోంది. షెడ్లో బయటికి, లోపలికి 20కిపైగా షాపులు నిర్మించడం గమనార్హం. మిర్చి వ్యాపారులు అతి తక్కువ మంది ఉన్నారు. వీరికి ఒక షెడ్డు ఇవ్వడాన్ని బట్టి చూస్తే రానున్న రోజుల్లో ఇటువంటి షెడ్లు మరిన్ని అప్పగించినా అశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారులకు కేటాయింపు కర్నూలు వ్యవసాయ మార్కెట్లో అస్తవ్యస్త పాలన -
ఆనాటి హృదయాల ఆనంద గీతం
కల్లూరు: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 25 ఏళ్ల తర్వాత వారు ఒక చోటికి చేరారు. చిన్నప్పుడు తమ పాఠశాల అందించిన అనుభవాలను గుర్తు చేస్తున్నారు. అప్పటి విద్యాబోధనపై ముచ్చటించుకున్నారు. బాల్యం జ్ఞాపకాల్లో మునిగి తేలారు. కల్లూరు మండలం పర్ల గ్రామ జెడ్పీ హైస్కూల్లో 1999–200 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆ విద్యా సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసిన 75 మంది విద్యార్థుల్లో పలువురు ఉన్నత చదువులు చదివి దేశ, విదేశాల్లోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. వారంతా ఆత్మీయ సమావేశానికి హాజరై అప్పట్లో చదువు చెప్పిన గురువులు రిటైర్డ్ హెచ్ఎం చంద్రశేఖర్రెడ్డి, ఉపాధ్యాయులు చిన్నయ్య, ద్వారకనాథ శాస్త్రి, మీనాక్షినాయుడు, తైమూర్ బాషా, సంపత్, జి. నగేష్, అన్వర్ బాషా, గోదాదేవి, కల్పన, జ్యోతితో పాటు ప్రస్తుత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణను మెమోంటోలు అందజేసి శాలువ కప్పి సత్కరించారు. నాడు వారు బోధించిన చదువు, క్రమశిక్షణతోనే ఉన్నత శిఖరాలను అధిరోహించామని చెబుతూ పాదాభివందనం చేశారు. విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాలకు ఎప్పుడూ తమవంత సహాయ సహకారాలు అందజేస్తామని ప్రకటించారు. -
మంత్రాలయంలో జిల్లా న్యాయమూర్తులు
మంత్రాలయం రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో శ్రీరాఘవేంద్రస్వామిని ఆదివారం జిల్లా జడ్జి కబర్ది, ఆదోని రెండవ ఆదనపు జిల్లా జడ్జి సుధ, ఆదోని సబ్ జడ్జి నారాయణ దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు, ఆలయ సిబ్బంది స్వాగతం పలికి స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేయించారు. న్యాయమూర్తులకు పూలమాల శాలువతో సన్మానించి తీర్థప్రసాదాలను అందజేశారు. అంతకు ముందు మంచాలమ్మ అమ్మ వారిని దర్శించుకుని పూజలు చేశారు. ఉరుకుందలో..కౌతాళం: ఉరుకుంద ఈరన్నస్వామిని ఆదివారం జిల్లా జడ్జి కబర్ది, ఆదోని రెండో ఆదనపు జిల్లా జడ్జి సుధ, ఆదోని సబ్ జడ్జి నారాయణ దర్శించుకున్నారు. వీరికి ఆలయ డిప్యూటీ కమిషనర్ వాణి, అర్చకులు, ఆలయ సిబ్బంది స్వాగతం పలికారు. స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేయించి న్యాయమూర్తులకు పూలమాలలు, శాలువతో సన్మానించి తీర్థప్రసాదాలను అందజేశారు. శ్రావణమాస ఉత్సవాలపై ఈఓ వాణిని అడిగి జిల్లా న్యా యమూర్తులు తెలుసుకున్నారు. -
బడ్జెట్ ల్యాప్స్ ప్రమాదాన్ని హెచ్చరిస్తున్నాం
ఇయర్ మార్క్డ్ ఫండ్ కింద ఎస్సీ, ఎస్టీ, మహిళా శిశు సంక్షేమ శాఖలకు సంబంధించిన పనులను ఈ నెలాఖరుకు పూ ర్తి చేయకుంటే కేటాయించిన బడ్జెట్ ల్యాప్స్ అయ్యే ప్రమా దం ఉంది. ఈ విషయమై ఇప్పటికే సంబంధిత ఇంజనీరింగ్ శాఖలను హెచ్చరించాం. ఇదే విషయాన్ని స్థాయీ సంఘ సమావేశాల్లో జెడ్పీ చైర్మన్ ప్రత్యేకంగా సమీక్షించారు. పురోగతిలో ఉన్న పనులను వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను కోరుతున్నాం. – జి.నాసరరెడ్డి, జెడ్పీ సీఈఓ జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో ఇయర్ మార్క్డ్ ఫండ్ కింద చేపట్టిన పనులను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే జిల్లాలోని ఆయా ప్రాంతాలకు చెందిన డీఈఈలతో మాట్లాడి ఆయా పనులను పూర్తి చేయాలని కోరాం. నిధులు ల్యాప్స్ అయ్యే ప్రమాదాన్ని వారికి గుర్తు చేసి పనులను పూర్తి చేయాలని చెబుతున్నాం. బిల్లుల జాప్యం కారణంగా ముందుకు రాని కాంట్రాక్టర్లతో కూడా ప్రత్యేకంగా మాట్లాడుతున్నాం. – ఎస్ఈసీ మద్దన్న, పీఆర్ ఇన్చార్జి ఎస్ఈ -
పెన్షనర్ల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు
● జిల్లా ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్ రామచంద్రరావు కర్నూలు(అగ్రికల్చర్): పెన్షనర్ల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్ రామచంద్రరావు తెలిపారు. ఆదివారం సి.క్యాంపు సెంటరులోని కర్నూలు డివిజన్ సబ్ ట్రెజరీ కార్యాలయంలో డాక్టర్ మోహన్స్ డయాబెటీస్ స్పెషిలిటీస్ సెంటరు ఆధ్వర్యంలో ప్రత్యేక మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ట్రెజరీ అధికారులు, సిబ్బందికి, పెన్షనర్లకు లివర్ స్కానింగ్, ప్యాట్ స్థాయి, ఈసీజీ తదితర పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ట్రెజరీ డీడీ రామచంద్రరావు మాట్లాడుతూ..పెన్షనర్లందరూ వయోవృద్ధులే అయినందున వారి ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకొని మెడికల్ క్యాంపు నిర్వహించినట్లు తెలిపారు. డాక్టర్ మోహన్స్ డయాబెటీస్ స్పెషిలిటీస్ సెంటరు డాక్టర్లతో పాటు ఏటీవో రఘువీర్, ఎస్టీవో విక్రాంత్, కర్నూలు పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కర్నూలు(అర్బన్): రాష్ట్రంలో విద్యార్థి, ప్రజా సంఘాల హక్కులను కూటమి ప్రభుత్వం హరిస్తోందని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి ఆరోపించారు. ఆదివారం స్థానిక కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. విద్యాసంస్థల ఆవరణలోకి విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల ప్రవేశాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. పాఠశాలల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు బయటి ప్రపంచానికి తెలియకూడదనే కుట్రతో ప్రభుత్వం ఇలాంటి నియంతృత్వ పోకడలతో ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఎన్నికలకు ముందు ప్రజా సంఘాల ప్రతినిధులతో మాట్లాడుతూ.. సమస్యలపై గట్టిగా పోరాడాలని చెిప్పిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేడు ఇలాంటి జీఓలు ఇవ్వడం దారుణమన్నారు. జీఓను రద్దు చేయకపోతే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. మహిళా నేతలు ఈడిగ భారతమ్మ, పాలెం రాధ, హుస్సేన్బీ, ఎలీషమ్మ, ఈరమ్మ, ఖాసీంబీ తదితరులు పాల్గొన్నారు. -
వంద పడకల ఆసుపత్రికి తాళం
ఎమ్మిగనూరుటౌన్: పట్టణంలోని వంద పడకల ఏరియా ఆస్పత్రి ప్రారంభించిన మూడు నెలలకే మూతపడింది. ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల రోగులకు వైద్య సేవలు అందడం లేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నిధులు మంజురు చేయగా నిర్మాణ పనులు చివరి దశలో కేవలం అయిదు శాతం ఉండగా ఎన్నికల కారణంగా నిలిచిపోయాయి. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆయా పనులు పూర్తి చేసి ఎంతో అట్టహాసంగా మే నెల 20వ తేదీ వంద పడకల ఏరియా ఆస్పత్రి భవన సముదాయాన్ని ప్రారంభించింది. అయితే ఆస్పత్రి ఆదివారం మూత పడింది. ఆస్పత్రికి భవనానికి రెండు వైపుల తాళం వేసి ఉంచారు. దీంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పాత ఆస్పత్రిలోనే వైద్య సేవలు అందుకున్నారు. -
నేడు ఈరన్నస్వామి పల్లకోత్సవం
కౌతాళం/కోసిగి: శ్రావణమాస ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఈరన్నస్వామి పల్లకోత్సవాన్ని నిర్వహించనున్నారు. సోమవారం తెల్లవారుజామున స్వామి వారి పల్లకోత్సవం కోసిగి మండలంలోని కందుకూరు వద్ద తుంగభ్రనది వద్దకు చేరుకుని జలాభిషేకం చేసుకుని సాయంత్రం ఉరుకుంద గ్రామానికి చేరుకుంటుందని ఆలయ డిప్యూటీ కమిషనర్ వాణి తెలిపారు. ఉత్సవాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. కాగా.. పల్లకోత్సవాన్ని పురస్కరించుకొని కోసిగి మండలం కందుకూరు గ్రామంలో ప్రజలు పండుగ జరుపుకుంటారు. క్రీడా పోటీలు నిర్వహిస్తారు. ఉత్సవాల్లో స్వామివారి దర్శనార్థం వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వై.ప్రదీప్రెడ్డి, జిల్లా కార్యదర్శి బి.మురళీమోహన్రెడ్డి పాల్గొననున్నారు. ఉప్పొంగిన వేదావతి నది హాలహర్వి: మండలంలోని గూళ్యం గ్రామం వద్ద వేదావతి నది ఉప్పొంగింది. దీంతో ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల ప్రజలకు రాకపోకలకు ఇబ్బందిగా మారింది. కర్ణాటక రాష్ట్రంలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వేదావతి నదికి పెద్ద ఎత్తున వరదనీరు వచ్చి చేరింది. అతి కష్టంపై నదిలో పుట్టి ప్రయాణం చేస్తూ ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలోని గూళ్యం గ్రామానికి చేరుకుంటున్నారు. నదిపై బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. కూలిపోయిన బ్రిడ్జి ఆస్పరి: యాటకల్లు గ్రామ సమీపంలో పెద్ద వాగుపై నిర్మించిన బ్రిడ్జి ఆదివారం సాయంత్రం కూలిపోయింది. ఆ సమయంలో రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని యాటకల్లు, తొగలుగల్లు, దొదగొండ, ఐనకల్లు గ్రామాల ప్రజలు తెలిపారు. ఈ గ్రామాల నుంచి ప్రతి రోజూ ఆస్పరిలోని ప్రైవేట్ పాఠశాలలకు 200 మంది విద్యార్థులను బస్సుల్లో వెళ్తుంటారు. ఆదివారం పాఠశాలలకు సెలవు అయినందున బస్సులు తిరగలేదు. ముప్ఫై ఏళ్ల క్రితం నిర్మించిన బ్రిడ్జి పడిపోయే స్థితిలో ఉందని మూడు నెలలు నుంచి మండల అధికారులకు ఆయా గ్రామాల ప్రజలు విన్నవించినా పట్టించుకోలేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బ్రిడ్జికి రక్షణగా ఉన్న గోడలు కొట్టుకుపోయాయి. ఈ బ్రిడ్జి మీదుగా రాత్రి వేళల్లో ఆస్పరి నుంచి ఎమ్మిగనూరుకు వాహనాలు వెళ్తుంటాయి. ప్రాణాపాయం జరగకముందే ఆధికారులు బ్రిడ్జి దగ్గర ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేసి, నూతన బ్రిడ్జిని నిర్మించాల్సి ఉంది. మూడు గేట్ల నుంచి నీటి విడుదల శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గుతుండడంతో తెరిచిన గేట్లను ఒక్కొక్కటిగా మూసివేస్తున్నారు. ఆదివారం సాయంత్రం నాటికి మూడు రేడియల్ క్రస్ట్గేట్ల ద్వారా నాగార్జున సాగర్కు 79,269 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆదివారం సాయంత్రానికి జలాశయంలో 195.6605 టీఎంసీల నీరు నిల్వ ఉంది. -
కర్నూలులో ఉద్రికత్త.. ఎన్టీఆర్ అభిమానుల నిరసన
సాక్షి, కర్నూలు: కర్నూలు కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్కు వ్యతిరేకంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు నిరసనకు దిగారు. తక్షణమే టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే దగ్గుబాటికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనలు తెలుపుతున్నారు.ఈ నేపథ్యంలో కలెక్టరేట్ వద్ద ఎన్టీఆర్ అభిమానులు నిరసనలను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం, నిరసనకారులను బలవంతంగా త్రీటౌన్ పోలీసు స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో జూనియర్ అభిమానులు త్రీటౌన్ పోలీసు స్టేషన్ వద్దకు భారీ సంఖ్యలో చేరుకుని పీఎస్ ఎదుటే ఆందోళనకు దిగారు. పోలీసులు, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి వ్యాఖ్యలు వైరల్..అంతకుముందు.. అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నోరు పారేసుకున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్.. ఎన్టీఆర్ అభిమాన సంఘం నేతకు ఫోన్ చేసి.. ‘ఈ సినిమాకు ఎన్ని థియేటర్లు అనుమతించారు.. ఎవరు అనుమతి ఇచ్చారు.. ఎలా ఆడనిస్తారు? ఆ సినిమాను ఆడనిచ్చేదే లేదు.. వాడు బుడ్డా ఫకీర్.. లోకేష్ను తిట్టిన వాడి సినిమాలు ఎలా ఆడనిస్తాను.. వానెమ్మ.. లం..కొడుకు ఈ టైమ్లో వాని సినిమాలు ఆడనిస్తానా.. మీరెలా ఆడనిస్తార్రా గాడిదల్లారా? నా పర్మిషన్ లేకుండా వేయిస్తారా? ఈ సినిమా ఆడదు.. వాడు బుడ్డా ఫకీర్ గాడు లోకేశ్ గురించి మాట్లాడతాడా? ఈ సినిమా ఆడదు. నాకు తెలియకుండా సినిమా ఎట్లా ఆడుతుంది.. నేను అనంతపురం ఎమ్మెల్యే.. బుడ్డా ఫకీర్ నా కొడుకు.. సార్ గురించి మాట్లాడతాడా? గాడ్ ప్రామిస్గా చెబుతున్నా.. ఈ సినిమా ఆడదు.. ఆపేయిస్తున్నా.. నేను ఊరుకుంటానా.. పంపించేయండి అందరినీ’ అని హుకుం జారీ చేశారు’ ఈ ఫోన్ కాల్ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. లోకేష్, చంద్రబాబు ప్రోద్భలంతోనే ఎన్టీఆర్ సినిమాను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఎమ్మెల్యే ప్రసాద్ వ్యాఖ్యలు అందులో భాగమేనని నందమూరి, ఎన్టీఆర్ అభిమానుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.వాయిస్ రికార్డ్ బయట పెట్టిన ధనుంజయ నాయుడుసోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో తనది కాదని ఎమ్మెల్యే ప్రసాద్ వివరణ ఇవ్వబోగా జూ.ఎన్టీఆర్ అభిమాని, టీఎన్ఎస్ఎఫ్ నేత గుత్తా ధనుంజయ నాయుడు ఆయన వాయిస్ రికార్డు బయట పెట్టారు. జూ.ఎన్టీఆర్ను తిడుతూ.. తనను ఎమ్మెల్యే ఫోన్లో బెదిరించిన అనంతరం ఆయన ఒక ఆడియోను రికార్డు చేసి ఎమ్మెల్యేకు పంపినట్లు తెలుస్తోంది. ‘అన్నా.. మీరంటే గౌరవం ఉంది. దయచేసి చెబుతున్నా.. ఎవరో చెప్పిన మాటలు విని అలా మాట్లాడవద్దు. జూ.ఎన్టీఆర్కు సినిమా పరంగా ముందు నుంచీ అభిమానిని. ఈ విషయాన్ని నారా లోకేశ్ ముందు చెప్పమన్నా చెబుతా. అంతేగానీ ఎవరి కోసమో పని చేయలేదు నేను. దయచేసి నన్ను కాంట్రవర్సీలోకి లాగొద్దు.సినిమా మీద కాంట్రవర్సీ ఎందుకు? నన్నెందుకు మీరు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు? అసభ్యంగా మాట్లాడితే నేను పడను. నాకు ఫోన్ చేసి బెదిరించడం తప్పు. ఎన్టీఆర్ గాడు.. గీడు అని మాట్లాడవద్దు. మీరు నాతో మాట్లాడిన ప్రతిదీ వాయిస్ రికార్డు చేశాను. ఈ రికార్డులన్నీ నారా రోహిత్ అన్నకు పంపినా. నాకు నీవు ఏమైనా అర్ధ రూపాయి ఇచ్చినావా? ఏడాది దాటింది. ఒక్క పని ఇచ్చావా? చిన్న సహాయం చేశావా? నా మీద నీకేం హక్కుంది మాట్లాడేందుకు? నన్ను చంపుతావా.. చంపు. నన్ను చంపావంటే మా వాళ్లు ఊరికే ఉండరు. నువ్వు నోరు జారినావంటే బాగుండదు’ అని గుత్తా ధనుంజయ నాయుడు ఎమ్మెల్యేకు పంపిన వాయిస్ రికార్డులో పేర్కొన్నారు. దీంతో జూ.ఎన్టీఆర్ అభిమానులు మరింతగా రగిలిపోతున్నారు. -
రమణీయం.. ఉట్లోత్సవం
● శ్రీమఠంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు మంత్రాలయం రూరల్: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన శ్రీరాఘవేంద్ర స్వామి మఠంలో శనివారం ఉట్లోత్సవాన్ని రమణీయంగా నిర్వహించారు. శ్రీ మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల స్వయంగా ఉట్టి కొట్టి అందరిలో భక్తిభావాన్ని నింపారు. ఉత్సవాల సందర్భంగా శ్రీకృష్ణుడి మూలవిరాట్కు పీఠాధిపతి విశిష్ట పూజలు చేశారు. సాయంత్రం శ్రీ మఠం మధ్వ కారిడార్లో ఉట్లోత్సవం కార్యక్రమం చేపట్టారు. రంగు నీళ్లు చల్లుకుంటూ వైభవంగా ఉట్లోత్సవం కొనసాగింది. ఘనంగా నిర్వహించిన కృష్ణాష్టమి ఉత్సవాలు భక్తులను ఆకట్టుకున్నాయి. -
శ్రీశైలంలో భక్తుల రద్దీ
శ్రీశైలంటెంపుల్: వరుస సెలవుల నేపథ్యంలో శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి శనివారం భక్తులు పోటెత్తారు. వేకువజామునే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి దర్శనానికి క్యూలైన్ వద్దకు చేరుకున్నారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. శాస్త్రోక్తంగా గోపూజ శ్రీశైలంటెంపుల్: కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైల దేవస్థానంలోని శ్రీగోకులంలో శాస్త్రోక్తంగా గోపూజను నిర్వహించారు. ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకులు, పండితులు పూజా సంకల్పాన్ని పఠించారు. అనంతరం శ్రీసూక్తంతోనూ, గో అష్టోత్తర మంత్రంతోనూ, గోవులకు షోడశ ఉపచారాలతో పూజాదికాలు జరిపించారు. గోవులకు నివేదన, నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. దేవస్థాన గోసంరక్షణశాలలో కూడా శ్రీకృష్ణుని పూజ, గోపూజ జరిపించారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు పాల్గొన్నారు. 14 మండలాల్లో తేలికపాటి వర్షాలు కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు 14 మండలాల్లో వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం జిల్లాలో కనిపించలేదు. ఈ నెల 13 నుంచి జిల్లాలో ఆకాశం మేఘావృతం అవుతున్నా వర్షాలు తేలికపాటికే పరిమితం అవుతున్నాయి. ఆలూరులో 12.4 మి.మీ, ఆస్పరిలో 10.4, పత్తికొండలో 5.8, హొళగుందలో 5.2, హాలహర్విలో 4.8 మి.మీ ప్రకారం వానలు కురిశాయి. జిల్లా మొత్తం మీద సగటున 2.1 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. రానున్న రెండు మూడు రోజుల్లో కూడా జిల్లాలోని వివిధ మండలాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శ్రీశైలం డ్యాం నీటిమట్టం 882.10 అడుగులు శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయం నుంచి శనివారం సాయంత్రం నాటికి 5 రేడియల్ క్రస్ట్గేట్ల ద్వారా నాగార్జునసాగర్కు 1,33,720 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శుక్రవారం నుంచి శనివారం వరకు జూరాల, సుంకేసుల, హంద్రీల నుంచి శ్రీశైలానికి 2,05,212 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. దిగువ ప్రాంతాలకు జలాశయం నుంచి 1,89,111 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. స్పిల్వే ద్వారా 91,270 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పాదన అనంతరం 70,082 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్కు వదిలారు. బ్యాక్వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ ద్వారా 25,333 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 2,426 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. డ్యాం పరిసర ప్రాంతాల్లో 0.40 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కుడిగట్టు కేంద్రంలో 15.357 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 16.956 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశారు. శనివారం సాయంత్రం సమయానికి జలాశయంలో 199.7354 టిఎంసీల నీరు నిల్వ ఉండగా.. డ్యాం నీటిమట్టం 882.10 అడుగులకు చేరుకుంది. పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదల పెంపు జూపాడుబంగ్లా: పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ నుంచి నీటి విడుదలను 26వేల నుంచి 30 వేల క్యూసెక్కులకు పెంచినట్లు ఏఈ విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ గేట్లను 0.05 అడుగు మేర ఎత్తి నీటినిఎస్సారెమ్సీ కాల్వలోకి విడుదల చేస్తున్నామన్నారు. ఈ నీటిని బానకచర్ల నీటినియంత్రణ వ్యవస్థ నుంచి తెలుగుగంగ కాల్వకు 12వేల క్యూసెక్కులు, ఎస్సార్బీసీ(జీఎన్ఎస్ఎస్)కాల్వకు 10వేలు, కేసీ ఎస్కేప్ కాల్వకు 8వేల క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. -
విప్లవ జోహార్లతో చిన్నన్న అంత్యక్రియలు
ఆత్మకూరురూరల్: విప్లవ జోహార్లతో సుగులూరి చిన్నన్న అంత్యక్రియలు శనివారం నిర్వహించారు. నాలుగురోజుల కిందట మహారాష్ట్ర –ఛత్తీస్ఘడ్ సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో కామ్రేడ్ సుగులూరి చిన్నన్న మృతిచెందారు. ఆత్మకూరు మండలం వడ్లరామాపురం గ్రామానికి శనివారం ఉదయం 10 గంటలకు మృతదేహం వచ్చింది. ఆయన అంత్యక్రియల్లో పాల్గొనేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచే కాకుండా తెలుగు రాష్ట్రాల రెండింటి నుంచి పలువురు వడ్ల రామాపురం చేరుకున్నారు. అమరుల బంధుమిత్రుల కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ చిన్నన్న అలియాస్ శంకర్, అలియాస్ విజయ్ అంత్యక్రియలు విప్లవ సంప్రదాయానికి అనుగుణంగా నిర్వహించారు. చిన్నన్న పార్థివ దేహంపై ఎర్రజెండా కప్పి ‘అమర వీరుల ఆశయాలను సాధిద్దాం ... కామ్రేడ్ చిన్నన్న అమర్ రహే’ అని నినదించారు. చిన్నన్న మృతదేహాన్ని ట్రాక్టర్పై ఉంచి గ్రామ వీధుల గుండా భారీ ర్యాలీతో ఆయన కుటుంబ పొలంలోకి తీసుకు వెళ్లారు. అక్కడ ఆయన మృతదేహాన్ని విప్లవ సంప్రదాయాలతో ఖననం చేశారు. అమరుల బంధుమిత్రుల కమిటీకి చెందిన పద్మ, భవాని, శోభ, అంజమ్మ, విరసం సభ్యులు పినాకపాణి, ఏపీ పౌరహక్కుల సంఘం నాయకులు అల్లాబకాష్, కరీంబాషా, తెలంగాణ పౌరహక్కుల సంఘం నాయకులు ఆర్.రాజానందం సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి నర్సింహయ్య, ిసీపీఐ ఎంఎల్ జనశక్తికి చెందిన సుంకన్న, ప్రముఖ వైద్యులు డాక్టర్ నాగన్న, డాక్టర్ గౌరీనాఽథ్, వివిధ దళిత సంఘాల నాయకులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ప్రజాఉద్యమాలను నిర్మూలించడం అసాధ్యం మావోయిస్టు పార్టీ సభ్యులను కాల్చి చంపడం ద్వారా ప్రజా ఉద్యమాలను నిర్మూలించడం ప్రభుత్వాలకు సాధ్యం కాదని విప్లవ రచయితల సంఘం పూర్వ కార్యదర్శి పాణి అన్నారు. శనివారం చిన్నన్న అంత్యక్రియలకు హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దండకారణ్యంలో అత్యంత పాశవికంగా ‘కగార్ ఆపరేషన్’ జరుపుతోందన్నారు. అక్కడ ఉన్న అపార ఖనిజ నిక్షేపాలను కార్పొరేట్లకు అప్పగించేందుకు గిరిజనులకు అండగా నిలుస్తున్న మావోయిస్టులను హతం చేస్తున్నారని ఆరోపించారు. -
గుట్టుగా కెమికల్ ఫ్యాక్టరీ నిర్మాణం
జూపాడుబంగ్లా: తంగడంచ గ్రామరెవెన్యూ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా ఓ కెమికల్ ఫ్యాక్టరీ నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. తంగడంచ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 358, 359, 368లో ఆద్యా అగ్రిక్రాప్ సైన్సెస్ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో కెమికల్ ఫ్యాక్టరీ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఈ విషయం ఇప్పటిదాకా తంగడంచ గ్రామస్తులకెవ్వరికీ తెలియక పోవడం గమనార్హం. ఫ్యాక్టరీ నిర్మాణానికి గ్రామపంచాయతీ తీర్మానంతో పాటు గ్రామస్తుల అభిప్రాయసేకరణ, మండల రెవెన్యూ, అభివృద్ధి అధికారుల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. గ్రామస్తుల అభిప్రాయసేకరణ తీసుకోకుండానే కెమికల్ ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతున్నట్లు గ్రామస్తులు వాపోతున్నారు. ఫ్యాక్టరీ నిర్మాణం పనులు చూసేందుకు కూడా అక్కడున్న వారు లోపలికి వెళ్లనివ్వటం లేదంటే ఎంత పకడ్బందీగా ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. మండల, జిల్లా స్థాయి అధికారులు తంగడంచ వద్ద జరుగుతున్న ఫ్యాక్టరీలో భవిష్యత్లో ఎలాంటి ఉత్పత్తుల్తు చేస్తారో, స్థానిక నిరుద్యోగులకు ఎంత మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తారో అనే విషయాలు బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయమై తహసీల్దార్ చంద్రశేఖర్నాయక్ను వివ రణ కోరగా తంగడంచ భూములు ఏపీఐఐసీ వారికి అప్పగించినందున ఫ్యాక్టరీలకు రెవెన్యూ అధికారుల అనుమతి అవసరం ఉండదని, ఏపీఐఐసీ అధికారులే కంపెనీల నిర్మాణం ప్రక్రియకు సంబంధించిన అన్ని అనుమతులు పర్యవేక్షిస్తుంటారని తెలిపారు. -
వివాహిత ఆత్మహత్య
ఉయ్యాలవాడ: తుడుమలదిన్నె గ్రామానికి చెందిన ఓ వివాహిత శనివారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన వేములపాటి సురేంద్రకు అవుకు మండలం రామాపురం గ్రామానికి చెందిన మహేశ్వరి(28)తో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. అయితే గత కొద్ది రోజులుగా మహేశ్వరి అనారోగ్యానికి మానసికంగా కుంగిపోయింది. మనస్తాపంతో చెందిన ఆమె శనివారం ఉదయం ఇంటిలో ఎవ్వరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఎద్దులను శుభ్రం చేసేందుకు వెళ్లి..
రైతు మృత్యువాత రుద్రవరం: చెరువులో అక్రమ తవ్వకాలతో ఏర్పడిన గుంతలు ఓ రైతుతో పాటు రెండు ఎద్దుల ప్రాణం తీశాయి. ఆలమూరు గ్రామంలో శనివారం ఈ విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గోవిందిన్నె వుశేన్బాషా (42) అనే రైతు కొద్దిగా ఉన్న సొంత పొలంతో పాటు వ్యవసాయ కూలీ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన భార్య పర్వీన్ కూడా మేసీ్త్రగా ఉంటూ వ్యవసాయ కూలీ పనులు చేయిస్తోంది. రోజులాగే వుశేన్బాషా శనివారం శీల బోయిన చెరువు వైపు సేద్యపు పనులకు వెళ్లాడు. పనులు పూర్తయిన తర్వాత ఎద్దుల బండిపై ఇంటికి వస్తూ మార్గమధ్యలో ఎద్దులను శుభ్రం చేసేందుకు చెరువు లోపలికి దింపాడు. రైతు ఎద్దులను నీటితో శుభ్రం చేస్తుండగా పక్కనే ఉన్న గుంతలో బండి పోవడంతో ఎద్దులతో పాటు రైతు మునిగిపోయాడు. పక్కనే ఉన్న రైతులు గమనించి బయటకు తీయగా వుశేన్బాషా అప్పటికే మృత్యుఒడి చేరాడు. ఎద్దులు సైతం నీట మునిగి మృతి చెందాయి. రుద్రవరం ఎస్ఐ మహమ్మద్ రఫి సిబ్బందితో చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. మృతుడి భార్య పర్విన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రైతు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్యతో ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మట్టి తవ్వకాల వల్లే.. ఆలమూరు శీలబోయిన చెరువులో శనివారం జరిగిన ప్రమాదానికి చెరువులో అక్రమ మట్టి తవ్వకాలే కారణమని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంలో కొందరు చెరువులో అక్రమంగా మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అలుగు పక్కనే కట్ట మీదుగా వ్యవసాయ పనుల నిమిత్తం ఎద్దుల బండ్లు, ట్రాక్టర్ రాకపోకలు సాగేవి. అయితే అది దారి అని తెలిసినప్పటికీ పట్టించుకోకుండా కట్టకు కొద్ది దూరంలోనే పెద్ద గుంతలు తవ్వారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో చెరువులోకి భారీగా నీరు చేరింది. ఆ నీటితో పెద్ద గుంతలు సైతం నిండి పోయాయి. గుంతలు గమనించక పోవడంతో ప్రమాదం జరిగి రైతుతో పాటు ఎద్దులు మృత్యువాత పడినట్లు గ్రామస్తులు వాపోతున్నారు. -
నేత్రదానంపై అపోహలు తొలగిపోవాలి
కర్నూలు(హాస్పిటల్): నేత్రదానంపై ప్రజల్లో ఉన్న అపోహలు తొలగిపోవాలని డీఎంహెచ్ఓ డాక్టర్ పి.శాంతికళ అన్నారు. శుక్రవారం రాత్రి స్థానిక పెద్దమార్కెట్ ప్రాంతంలో జయలక్ష్మి(77) అనే మహిళ గుండెపోటుతో మరణించారు. మానవత స్వచ్ఛంద సేవా సంస్థ వారు అక్కడికి వెళ్లి నేత్రదానానికి ఆమె కుటుంబసభ్యులను ఒప్పించారు. వారి సమాచారంతో స్థానిక బుధవారపేటలోని సుశీల నేత్రాలయ సిబ్బంది వెళ్లి ఆమె నేత్రాలను సేకరించారు. శనివారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ పి.శాంతికళ మాట్లాడుతూ నేత్రదానంపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఇందుకు ఇండియన్ రెడ్క్రాస్ సంస్థ సహకారం కూడా తీసుకుంటున్నట్లు చెప్పారు. సుశీల నేత్రాలయ కంటి వైద్యులు డాక్టర్ పి.సుధాకర్రావు మాట్లాడుతూ ఒకరి నేత్రదానం వల్ల ఇద్దరికి చూపు వస్తుందని, అందుకే తమ ఆసుపత్రిలో నేత్ర సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, రెండేళ్ల కాలంలో 110కి పైగా కార్నియా ఆపరేషన్లు నిర్వహించి చూపు ప్రసాదించినట్లు తెలిపారు. నేత్రదానం చేయదలచిన వారు 8886306308ను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో గైనకాలజిస్టు డాక్టర్ సావిత్రి, కంటి వైద్యులు డాక్టర్ నేహ సుధాకర్, డాక్టర్ రాఘవప్రీతమ్ పాల్గొన్నారు. -
సెవెన్ సీటర్ ఆటోలు నగరంలోకి నిషేధం
● నగరంలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరికర్నూలు: గ్రామీణ ప్రాంతాల నుంచి కర్నూలుకు వచ్చే సెవెన్ సీటర్ ఆటోలను నగరంలోకి అనుమతించేది లేదని ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఆటోలు నడుపుతూ జీవనం సాగిస్తున్న డ్రైవర్లు తమ ఆటోలను కర్నూలు నగర శివారులోనే నిలుపుకోవాలని సూచించారు. నంద్యాల చెక్పోస్టు, గుత్తి పెట్రోల్ బంకు, బళ్లారి చౌరస్తా, సెయింట్జోసెఫ్ కాలేజీ వరకు మాత్రమే ఆటోలకు అనుమతి ఉంటుందని, పోలీసు ఆదేశాలను ఖాతరు చేయకుండా నగరంలోకి ప్రవేశిస్తే కేసులతో పాటు భారీగా చలానాలు విధిస్తామని హెచ్చరించారు. కర్నూలు నగరంలోని పాతబస్తీలో రాధాకృష్ణ టాకీస్ నుంచి నెహ్రూ రోడ్డు మీదుగా (బొంగుల బజార్), మించిన్ బజార్ రూట్లలో ఒకవైపు ప్రయాణం మాత్రమే (వన్వే) అనుమతిస్తామన్నారు. మించిన్ బజార్ రూట్ ద్వారా వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు నెహ్రూ రోడ్డు (బొంగుల బజార్) మీదుగా రావాల్సి ఉంటుందని.. వాహనదారులు, నగర ప్రజలు గమనించి సహకరించాలని సీఐ కోరారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, లేని పక్షంలో మోటార్ వాహన చట్టం ప్రకారం కేసులతో పాటు చలానా విధిస్తామన్నారు. రేపు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులను సమర్పించుకోవాలని సూచించారు. కలెక్టరేట్తో పాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ ప్రజల నుంచి ఫిర్యాదు స్వీకరిస్తామన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకునేందుకు కాల్ సెంటర్ నంబర్ 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. అలాగే meekosam.ap.gov.in అనే వెబ్సైట్లో కూడా అర్జీలను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. -
నీటి కష్టాలు
ఓ వైపు భారీ వర్షాలు కురుస్తున్నాయి.. వంకలు, వాగులు పొర్లుతున్నాయి. అయినా.. ఆస్పరి మండలం ములుగుందం గ్రామంలో మంచినీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వారంలో రెండు సార్లు మాత్రమే బోరు నీటిని సరఫరా చేస్తున్నారు. బోరు చెడిపోయినా, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినా నీటి కోసం ట్యాంక్లు, కుళాయిల వద్ద కుస్తీలు పట్టక తప్పని పరిస్థితి. కొందరు వ్యవసాయ బోర్లను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు నీటి సమస్యకు పరిష్కారం చూపాలని గ్రామస్తులు ఈరన్న, మారెన్న, లక్ష్మన్న తదితరులు కోరారు. – ఆలూరు -
నడుచుకుంటూ వెళ్తుంటే కొరికింది
నేను టైర్ల పనిచేస్తూ జీవనం సాగిస్తుంటా. ఈ నెల 10న పని ముగించుకుని ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంటే కుక్క వెంటపడి మరీ కరిచింది. దీంతో భయమేసి ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నా. టౌన్లో ఏ వీధి చూసినా కుక్కల భయమే. కొత్తవాళ్లను చూస్తే వెంటపడుతున్నాయి. వాటి నుంచి తప్పించుకుని జాగ్రత్తగా వెళ్లాల్సి వస్తోంది. – పవన్కుమార్, పాతబస్టాండ్, కర్నూలు మా కుమారుడు దేవాన్స్కు ఐదేళ్లు. ఈనెల 8న వీధిలో ఆడుకుంటుండగా కుక్క కరిచింది. వెంటనే ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా ఇంజెక్షన్ వేశారు. ఆ తర్వాత రెండో డోసు కూడా వేయించాం. మా వీధిలో కుక్కలు చాలా ఎక్కువ ఉన్నాయి. చూస్తేనే గుండె జారుతోంది. పిల్లలు కనిపిస్తే చాలు మీదకొస్తున్నాయి. – దేవరాజు, ఎన్టీఆర్ కాలనీ, కర్నూలు -
27 నుంచి గణేశ్ ఉత్సవాలు
కర్నూలు కల్చరల్: గణేశ్ ఉత్సవాలు ఈనెల 27 నుంచి ప్రారంభభమవుతాయని గణేశ్ మహోత్సవ కేంద్ర సమితి రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్ తెలిపారు. కర్నూలులోని వినాయక ఘాట్ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం సమావేశ మందిరంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. గణేశ్ ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు, పత్తికొండ, గూడూరు, ఇతర పట్టణాల్లో 27 నుంచి 31వ తేదీ వరకు వినాయక చవితి ఉత్సవాలు ఐదు రోజుల పాటు జరుగుతాయన్నారు. కర్నూలు నగరంలో సెప్టెంబర్ 4వ తేదీ నిమజ్జనోత్సవం ఉంటుందన్నారు. గణేశ్ మహోత్సవ కేంద్ర సమితి జిల్లా కార్యదర్శి గోరంట్ల రమణ మాట్లాడుతూ.. మట్టివినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలన్నారు. నగర అధ్యక్షుడు రంగస్వామి మాట్లాడుతూ.. విగ్రహాల ఎత్తులో కాకుండా సంప్రదాయ పద్ధతిలో ఉత్సవాల నిర్వహణకు పోటీ పడాలన్నారు. మండపాల నిర్వాహకులతో ఆదివారం సమావేశం నిర్వహిస్తామన్నారు. క్రెడో స్కూల్లో విద్యార్థులకు 24న వ్యాసరచన, చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో ఉత్సవ సమితి నగర కార్యదర్శి గురిరాజవర్మ, సభ్యులు కొట్టే చెన్నయ్య, భాను ప్రకాష్, అక్కెం విశ్వనాథ్ పాల్గొన్నారు. వచ్చే నెల 4న కర్నూలులో నిమజ్జనోత్సవం -
ఇంకా నీటిలోనే నల్ల బంగారం
● నిలచిపోయిన కోత పనులు ● ఆందోళనలో రైతన్నలు దొర్నిపాడు: తొలిపంటగా సాగుచేసిన నల్లబంగారం చేతికిరాని పరిస్థితి నెలకొంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు పంట పూర్తిగా దెబ్బతినింది. కేవలం 90 రోజుల్లో చేతికి వస్తుందని రైతులు విస్తారంగా మినుము పంట వేశారు. ఒక్క దొర్నిపాడు మండలంలోనే దాదాపు 700 హెక్టార్లకు పైగా ఈ పంట సాగైంది. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. తీరా కోత సమయంలో రైతుల ఆశలపై వర్షం నీళ్లు చల్లింది. గత పది రోజులుగా కురుస్తున్న వానలకు మినుము పంటంతా నీటిలోనే ఉంది. దీంతో కోత పనులు ఎక్కడికక్కడే నిలచిపోయాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కోతమిషన్లు పనులు లేక గ్రామంలో నిలబడిపోయాయి. రోజు ఏదో ఒక సమయంలో వర్షం కురుస్తుండటంతో కోతకు నేల అనుకూలించక రైతులు దిగాలు చెందుతున్నారు. కాసిన అరకొర గింజలు సైత నేల రాలుతున్నాయని వాపోతున్నారు. -
కర్నూలు పటాలంకు రాష్ట్రస్థాయి అవార్డు
కర్నూలు: విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో ఏపీఎస్పీ కర్నూలు రెండో బెటాలియన్కు కవాతు ప్రదర్శనలో (పెరేడ్) రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి లభించింది. రాష్ట్రస్థాయిలో 8 బెటాలియన్లకు సంబంధించిన సిబ్బంది పరేడ్లో పాల్గొనగా కర్నూలు రెండవ బెటాలియన్కు సంబంధించి ఆర్ఐ అనిల్ కుమార్, ఆర్ఎస్ఐలు సర్దార్, మునాఫ్ల ఆధ్వర్యంలో చక్కటి కవాతు ప్రదర్శన(పెరేడ్) నిర్వహించారు. దీంతో రాష్ట్రస్థాయిలో కంటింజెంట్ అవార్డు లభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా రెండో బెటాలియన్ సిబ్బంది ఈ అవార్డును అందుకున్నారు. రాష్ట్రస్థాయి పెరేడ్లో చక్కటి నైపుణ్యత ప్రదర్శించి కంటింజెంట్ అవార్డును అందుకున్నందుకు పటాలం సిబ్బందిని కమాండెంట్ దీపిక పాటిల్ ప్రత్యేకంగా అభినందించారు. రుద్రవరం రేంజర్గా ముర్తుజావలి రుద్రవరం: రుద్రవరం రేంజ్ అధికారిగా ముర్తుజావలి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈయన 2023లో రుద్రవరం రేంజ్ అహోబిలం సెక్షన్ డీఆర్వోగా విధుల్లో చేరాడు. ఇటీవలె రేంజి అధికారిగా ఉన్న శ్రీపతినాయుడు బదిలీపై వెళ్లడంతో ఇక్కడ ఖాళీ ఏర్పడింది. దీంతో అటవీ శాఖ ఉన్నతాధికారులు డీఆర్వోగా ఉన్న ముర్తుజా వలికి రేంజర్గా పదోన్నతి కల్పించి రుద్రవరానికి నియమించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. -
వేర్వేరు చోట్ల ముగ్గురు బలవన్మరణం
ఓర్వకల్లు/బనగానపల్లె/నందికొట్కూరు: వివిధ కారణాలతో వేర్వేరు చోట్ల ముగ్గురు వ్యక్తులు బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరిలో ఒకరు రైతు కాగా మరో ఇద్దరు మహిళలు ఉన్నారు. పోలీసులు, స్థానికులు తె లిపిన వివరాల మేరకు.. ఓర్వకల్లు గ్రామం పెండేకంటినగర్లో నివాసముంటున్న సుబ్బరాయుడు కొడు కు భానుప్రకాష్కు, అదే గ్రామానికి చెందిన రెడ్డిపోగు మాదన్న కూతురు భారతి(31)కి మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి పాప,బాబు సంతానం. అయితే ఆటో నడిపే భాను ప్రకాష్ మద్యానికి అలవాటుపడి సంపాదనంతా మందుకే ఖర్చు చేసేవాడు. దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. ఈ క్రమంలోనే ఈ నెల 14వ తేదీన మధ్యాహ్నం మద్యం తాగి ఇంటికి వెళ్లడంతో భార్య భారతి తీవ్ర మనస్థాపానికి గురై ఇంట్లోని ఫ్యాన్కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు తండ్రి మాద న్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సునీల్కుమార్ పేర్కొన్నారు. అప్పులబాధతో.. బనగానపల్లె మండలం నందివర్గం పోలీసు స్టేషన్ పరిధిలోని కై ప గ్రామానికి చెందిన రైతు వెంకటరమణరెడ్డి(37) అనే వ్యక్తి అప్పుల బాధతో శుక్రవారం ఉదయం చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన గతేడాది రెండు ఎకరాల సొంత పొలంతో పాటు మరో 25 ఎకరాలు కౌలుకు తీసుకొని మిరప సాగు చేశాడు. ఇందుకు దాదాపు రూ. 20 లక్షల వరకు ఖర్చు చేశాడు. అయితే, పంట పండక తీవ్రనష్టం వచ్చింది. దీంతో చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈమేరకు మృతుడి భార్య మల్లేశ్వరి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటసుబ్బయ్య తెలిపారు. మృతుడికి కుమారుడు, కుమార్తె సంతానం. జీవితంపై విరక్తి చెంది.. మిడుతూరు మండలం అలగనూర్ గ్రామానికి చెందిన షేక్ జుబేదాబేగం (20) అనే యువతి గురువారం రాత్రి బలవన్మరణం చేసుకుంది. అనారోగ్యంతో పాటు, కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉరి వేసుకుంది. ఈ మేరకు తండ్రి ఉసేన్బాషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ సుబ్బయ్య తెలిపారు. -
మత్స్యకారుల మధ్య కూటమి ప్రభుత్వం చిచ్చు
● వైఎస్సార్సీపీ బెస్త సాధికారిత సమితి రాష్ట్ర అధ్యక్షుడు తెలుగు అనిల్ కుమార్ కర్నూలు(టౌన్): కార్పొరేషన్ పదవుల పేరుతో కూటమి ప్రభుత్వం మత్స్యకార కులాల మధ్య చిచ్చు పెడుతుందని వైఎస్సార్సీపీ బెస్త సాధికారిత సమితి రాష్ట్ర అధ్యక్షుడు తెలుగు అనిల్ కుమార్ అన్నారు. శుక్రవారం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇటీవల 31 కార్పొరేషన్ పదవులను ప్రకటించిందన్నారు. అయితే, నిజమైన కులాలకు కాకుండా బెస్తయేతర వారికి ఆ పదవులు కట్టబెట్టి చిచ్చురాజేసిందన్నారు. బెస్త సంక్షేమ, అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్గా పట్టపు సామాజిక వర్గానికి చెందిన బొమ్మన శ్రీధర్ను ప్రకటించి నిజమైన బెస్త సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. పట్టపు రాజు లేదా పట్టపు కాపు సామాజిక వర్గానికి చెందిన ఆయ నకు బెస్త కార్పొరేషన్ చైర్మన్గా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. సీమలో ఫ్యాక్షన్కు బలి అవుతున్న బెస్తలకు కనీసం కుల కార్పొరేషన్ పదవుల కేటాయింపులో కూడా న్యాయం జరగలేదన్నారు. అలాగే గత జులై నెల 7 వ తేదీ న జీవో 81 ప్రకారం కొల్లు పెద్దిరాజును మత్య్సకార కార్పొరేషన్ చైర్మన్గా ప్రకటించారన్నారు. పదవుల విషయంలోనే కాకుండా మత్స్య కార సమస్యలు పరిష్కారంలోనూ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి బెస్తలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని లేకపోతే భవిష్యత్తులో వారి ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
కల్లూరు: 44వ జాతీయ రహదారి చిన్నటేకూరు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామానికి చెందిన వి. రాజు (31 ) దుర్మరణం చెందాడు. ఉలిందకొండ పోలీసులు తెలిపిన వివరాల మేరకు... కల్లూరు మండలం తడకపల్లె గ్రామంలో జరుగుతున్న మొహర్రం 40 రోజుల జార్తాలకు భార్య దుర్గ, మరో ఇద్దరితో కలిసి బైక్పై రాజు గురువారం వెళ్లాడు. మొక్కులు చెల్లించుకొని శుక్రవారం స్వగ్రామానికి బయలుదేరాడు. తడకనపల్లె క్రాస్ రోడ్డులో మోటర్ సైకిల్ ప్రమాదవశాత్తు అదుపు తప్పి రైలింగ్ను ఢీ కొంది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న రాజు అక్కడికక్కడే మృతి చెందగా.. మిగతా ముగ్గురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న నేషనల్ హైవే పెట్రోలింగ్ హెడ్ కానిస్టేబుల్ నూర్ అహమ్మద్, పోలీసులు వారిని 108లో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గ్రానైట్ దుకాణంలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు నందికొట్కూరు: పట్టణ సమీపంలోని మై హోమ్ గ్రానైట్ దుకాణంలోకి శుక్రవారం నందికొట్కూరు డిపోకు చెందిన ఆర్టీసీ బెంగళూరు సర్వీస్ దూసుకెళ్లింది. అయితే, ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బెంగళూరు నుంచి వస్తున్న ఈ బస్సులో డ్రైవర్ కలిముల్లాకు బీపీ డౌన్ అయింది. దీంతో స్టీరింగ్ పట్టు తప్పడంతో బస్సు గ్రానైట్ దుకాణంలోకి వెళ్లి బండలను ఢీకొట్టినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయలు కాలేదని వెల్లడించారు. కాగా బస్సు ఢీకొనంతో సుమారు రూ. 9 లక్షల విలువ చేసే గ్రానైట్ బండలు పగిలిపోయినట్లు గ్రానైట్ యజమాని సద్దాం తెలిపారు. కుక్కల దాడిలో 15 గొర్రె పిల్లలు మృతి కర్నూలు(రూరల్): కుక్కల దాడి లో 15 గొర్రె పిల్లలు మృతి చెందాయి. మండల పరిధిలోని జి.సింగవరం గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన బైరి పెద్ద మద్దిలేటి జీవాలు పెంచుతుంటాడు. శుక్రవారం గ్రామ సమీపాన కేసీ కెనాల్ వంతెన దగ్గర ఉన్న దొడ్డిలో గొర్రె పిల్లలను ఉంచి మందను మేతకు తీసుకెళ్లాడు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో దాదాపు 6 కుక్కలు దొడ్డిలొకి దూకి గొర్రె పిల్లలపై దాడికి తెగబడ్డా యి. ఈ ఘటనలో 15 పిల్లలు అక్కడికక్కడే మృతి చెందాయి. తర్వాత దొడ్డికి వచ్చి చూడగా గొర్రె పిల్లలు చనిపోయి చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ ఘటనతో రూ.90 వేలకు పైగా నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు. బైక్ అదుపు తప్పి.. ఆళ్లగడ్డ: అహోబిలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంతియాజ్ బాషా (24) అనే యువకుడు శుక్రవారం మృతి చెందాడు. నంద్యాల రూరల్ మండలం కానాల గ్రామానికి చెందిన ఇంతియాస్ బాషా ఓ శుభకార్యానికి అహోబిలం వచ్చాడు. మధ్యాహ్న సమయంలో దిగువ అహోబిలం నుంచి ఎగువ అహోబిలం వెళ్తుండగా మార్గమధ్యంలో మోటర్ సైకిల్ అదుపు తప్పి రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభానికి ఢీ కొట్టింది. ఈఘటనలో ఇంతియాజ్ బాషా అక్కడికక్కడే మృతి చెందగా బైక్ వెనుక కూర్చున్న వెంకట సునీల్కు స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వరప్రసాద్ తెలిపారు. -
మహానుభావుల త్యాగఫలమే స్వాతంత్య్రం
కర్నూలు(టౌన్): ఎందరో మహానుభావుల త్యాగఫలమే స్వాతంత్య్రం అని, ప్రతి ఒక్కరూ వారిని స్మరించుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి అన్నారు. స్థానిక ఎస్వీ కాంప్లెక్స్లోని వైఎస్సార్సీపీ కార్యాలయ ప్రాంగణంలో శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి, నగర మేయర్ బీవై రామయ్య, మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వీ విజయమనోహరి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అహ్మద్ అలీఖాన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్వీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాకారం చేశారన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. పాలనను గ్రామస్థాయికి చేర్చి ప్రజలకు ఎంతో మేలు చేశారన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
వడ్లరామాపురంలో నేడు చిన్నన్న అంత్యక్రియలు
ఆత్మకూరురూరల్: మహారాష్ట్ర – ఛత్తీస్ఘడ్ రాష్ట్రాల సరిహద్దులో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు సుగులూరు చిన్నన్న అలియాస్ విజయ్, అలియాస్ భవనాశి శంక ర్ అంత్యక్రియలు శనివారం ఆయ న స్వగ్రామం వడ్లరామాపురంలో జరగనున్నట్లు కుటుంబ సభ్యులు శుక్రవారం తెలిపారు. మహారాష్ట్ర రాజ్నంద్ గావ్ జిల్లాలోని మొహాలా ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నన్న మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మహారాష్ట్ర పోలీసులు మృతదేహాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించారు. శనివారం తెల్లవారే సరికి చిన్నన్న మృతదేహం గ్రామానికి చేరుకోవచ్చని భావిస్తున్నారు. 30 ఏళ్లుగా అజ్ఞాత జీవితంలో ఉన్న వ్యక్తి విగతజీవిగా గ్రామానికి చేరుకోనుండడంతో గ్రామస్తులు ఆఖరి చూపు కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. -
స్వాగతం
కర్నూలు(సెంట్రల్): ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ ఎన్.హరినాథ్ కర్నూలుకు వచ్చారు. ఆయనను రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో కలెక్టర్ పి.రంజిత్బాషా కలసి పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం జిల్లా పరిస్థితులపై చర్చించుకున్నారు. మిత్రుల మానవత్వంకర్నూలు(అగ్రికల్చర్): 2022 సంవత్సరం డిసెంబర్ 2న క్యాన్సర్తో మరణించిన మిత్రుడి కుటుంబం పట్ల చిన్ననాటి స్నేహితులు మానవత్వం చూపారు. కర్నూలు మండ లం చిన్నబాపురం గ్రామానికి చెందిన రామకృష్ణ 2002–03లో బ్రాహ్మణకొట్కూరులో 10వ తరగతి చదివారు. ఈయన మొబైల్ షాపులో మెకానిక్గా పనిచేస్తూ క్యాన్సర్ బారిన పడి మరణించారు. భార్య, ముగ్గురు కూతుళ్లు సంతానం. మరణించిన మిత్రుడి కుటుంబానికి 10వ తరగతి బ్యాచ్ స్నేహితులు చందాల ద్వారా రూ.54 వేలు పోగుచేశారు. ఈ మొత్తాన్ని కర్నూలులోని కింగ్మార్కెట్ సమీపంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు శాఖలో మరణించిన రామకృష్ణ భార్య పేరిట డిపాజిట్ చేశారు. శుక్రవారం మిత్ర బృందం చిన్నబాపురం గ్రామానికి వెళ్లి తమ స్నేహితుని పిల్లలకు బట్టలు అందచేశారు. మిత్రుడి పట్ల మానవత్వం చూపడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. బానకచర్ల నుంచి 26 వేల క్యూసెక్కులు విడుదల పాములపాడు: బానకచెర్ల క్రాస్ రెగ్యులేటరు నుంచి శుక్రవారం 26,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈ దేవేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరు నుంచి ఎస్ఆర్ఎంసీ ద్వారా 26,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉందన్నారు. తెలుగుగంగ(వీబీఆర్)కు 11,000, జీఎన్ఎస్ఎస్కు 12,000, కేసీసీ ఎస్కేప్ చానల్కు 3,000 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నట్లు వివరించారు. మహానందిలో మహాలక్ష్మీ హోమాలు మహానంది: శ్రావణమాసం మూడవ శుక్రవారం పురస్కరించుకుని మహానంది క్షేత్రంలో మహాలక్ష్మి హోమాలు నిర్వహించారు. ఆలయ వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని ఆధ్వర్యంలో పండితులు, అర్చకులు స్థానిక యాగశాలలో మహాలక్ష్మీ హోమాలు నిర్వహించారు. పలు ప్రాంతాల భక్తులు ఆర్జిత సేవా టికెట్ల ద్వారా హోమంలో పాల్గొన్నారు. హోమాల అనంతరం భక్తులకు శ్రీ కామేశ్వరీదేవి, శ్రీ మహానందీశ్వరస్వామి వారి ప్రసాదా లు అందించారు. శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారికి నెమలి పింఛములతో అలంకరణ చేశారు. ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పండితులు, అర్చకులు అమ్మవారికి అలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేశారు. మహానందీశ్వరస్వామి దర్శనానికి వచ్చిన భక్తులు అమ్మవారి అలంకరణ చూసి మంత్రముగ్ధుల య్యారు. శ్రావణమాసం సందర్భంగా భక్తుల రద్దీ కొనసాగింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వేలాది సంఖ్యలో ఆలయానికి వచ్చారు. స్వామి అమ్మ వార్లను దర్శించుకుని పూజలు చేపట్టారు. స్థానిక కల్యాణ మండపంలో స్వామి అమ్మవార్ల నిత్య కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. రాత్రి యాగశాలలో మహానందీశ్వరుని దంపతులకు ఏకాంత సేవ పూజలతో దర్శనం సేవలు ముగిశాయి. -
అంగట్లో సెక్యూరిటీ గార్డు పోస్టులు
● పోస్టుకు రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకు వసూళ్లు ● కర్నూలు పెద్దాసుపత్రిలో దందా కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సెక్యూరిటీ గార్డుల పోస్టుల భర్తీలో అక్రమాలు జరుగుతున్నాయి. కొందరు దళారులు ఒక్కో పోస్టుకు రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకు ఆశావహుల నుంచి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆసుపత్రిలో సెక్యూరిటీ సేవలను ఈగల్ హంటర్ సొల్యూషన్స్ అనే సంస్థ దక్కించుకుంది. ఈ సంస్థ గత జూన్ 1వ తేదీ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ సంస్థ ద్వారా కర్నూలు మెడికల్ కాలేజీలో 40 మంది, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో 200 మంది, ప్రాంతీయ ప్రభుత్వ కంటి ఆసుపత్రిలో 11 మంది, స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో 60 మంది సెక్యూరిటీ గార్డులతో సేవలందించేందుకు ఎంఓయూ చేసుకున్నారు. ప్రతి సెక్యూరిటీ గార్డుకు టోకుగా రూ.16 వేలకు పైగా జీతం వస్తుందని అధికారులకు చెప్పారు. ఒక్కో సెక్యూరిటీ గార్డు రోజుకు ఒక షిఫ్ట్ చొప్పున మూడు షిఫ్ట్లలో పనిచేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం పనిచేస్తున్న వారిని కొనసాగిస్తూనే ఖాళీగా ఉన్న సెక్యూరిటీ గార్డు పోస్టులను భర్తీ చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ పోస్టుకు అభ్యర్థి కనీసం టెన్త్ చదివి ఉండాలని, 45 ఏళ్లలోపు వయస్సు కలిగి ఉండాలని, శారీరక ధృడత్వం ఉండాలని చెప్పుకొచ్చారు. ఇదే క్రమంలో తమకు సబ్లీజుకు ఇవ్వాలని కేడీసీసీ బ్యాంకు చైర్మన్, కోడుమూరు నియోజకవర్గ ఇన్చార్జ్ విష్ణువర్దన్రెడ్డి అనుచరులు, రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అనుచరులుగా చెప్పుకునే కొందరు పంతం పట్టారు. ఈ మేరకు ఈగల్ హంటర్ సంస్థ ప్రతినిధులతో పలుమార్లు ఒత్తిడి తెచ్చి పంతం నెగ్గించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు విష్ణువర్దన్రెడ్డి అనుచరులుగా చెప్పుకునే వారు ఈ సంస్థను సబ్లీజుకు తీసుకున్నట్లు ఆసుపత్రిలో చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో వీరు ఖాళీగా ఉన్న సెక్యూరిటీ గార్డు పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇప్పటికే 25 మందికి పైగానే భర్తీ చేశారు. ఇందులో ఒక్కో పోస్టుకు రూ.లక్షకు పైగా చేతుల మారినట్లు చర్చ నడుస్తోంది. కొందరు దళారులు రంగప్రవేశం చేసి మనం చెప్పినట్లే నడుస్తుందని చెప్పి అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో తమకూ పోస్టులు కావాలని మంత్రి టీజీ భరత్ అనుచరులుగా చెప్పుకునే కొందరు వ్యక్తులు మూడు రోజుల క్రితం ఆసుపత్రిలోని సెక్యూరిటీ కార్యాలయం వద్దకు వచ్చి గొడవ చేశారు. దాదాపు గంటపాటు జరిగిన ఈ ఘర్షణ వాతావరణం ఆసుపత్రిలో ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ క్రమంలో ఇంకా ఖాళీగా ఉన్న వందకు పైగా సెక్యూరిటీ గార్డు పోస్టులను ఎలాగైనా దక్కించుకోవాలని ఇరువర్గాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. వీరి మధ్యలో దళారులు సైతం చక్రం తిప్పుతున్నారు. తాము చెప్పిన వారికి పోస్టులు ఇవ్వాలని మరోవైపు కొందరు ప్రజాప్రతినిదులు సైతం ఆసుపత్రి అధికారులకు ఫోన్ చేసి చెబుతున్నట్లు సమాచారం. జీతంలోనూ భారీ కోత ఎంఓయూ ప్రకారం ఒక్కో సెక్యూరిటీ గార్డుకు రూ.16 వేలకు పైగా జీతం ఇవ్వాల్సి ఉంది. కానీ ఈ నెలలో సెక్యూరిటీ గార్డులకు రూ.12,100 మాత్రమే ఇచ్చారు. కొత్త ఏజెన్సీ వచ్చినా పాత జీతాలేనా అని సెక్యూరిటీ గార్డులు నిట్టూరుస్తున్నారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
కర్నూలు: నగరంలోని కృష్ణానగర్లో నివాసముంటున్న ఇ.విశ్వనాథ్ గౌడ్ (35) అనుమానాస్పద స్థితి లో మృతి చెందాడు. బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామానికి చెందిన విశ్వనాథ్ గౌడ్ ఉపాధి నిమిత్తం కొన్నేళ్ల క్రితం కర్నూలుకు చేరుకున్నాడు. ఓ ప్రైవేటు సంస్థలో డీటీపీ ఆపరేటర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఈ నెల 11వ తేదీన దుకాణానికి వెళ్తున్నట్లు చెప్పి తిరిగి ఇంటికి రాలేదు. 12వ తేదీ తన భర్త కనిపించడం లేదని భార్య నాగమణి నాల్గవ పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా గురువారం ఉదయం కోడుమూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రామాపురం గ్రామం వద్ద హంద్రీనీవా కాలువలో శవమై తేలాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమివ్వడంతో కోడుమూరు పోలీసులు అక్కడికి చేరుకుని నీళ్లలో తేలియాడుతున్న మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడి జేబులో ఉన్న పర్సులో ఆధార్ కార్డు లభించంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అప్పటికే నాల్గవ పట్టణ పోలీస్స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదై ఉండటంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈయనకు కొడుకు, కూతురు సంతానం. భార్య నాగమణి ఫిర్యాదు మేరకు నాల్గవ పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టగా సఫా ఇంజినీరింగ్ కళాశాల వద్ద హెచ్ఎన్ఎస్ఎస్ కాల్వ గట్టుపై విశ్వనాథ్ గౌడ్ ద్విచక్ర వాహనం లభించింది. దీంతో ప్రమాదవశాత్తూ నీటిలో పడి చనిపోయాడా.. లేక ఎవరైనా హత్య చేసి పడేశారా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
చోరీకి పాల్పడిన కేర్ టేకర్ అరెస్ట్
● రూ. 6.90 లక్షల విలువ చేసే ఆభరణాలు స్వాఽధీనంఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని గాంధీనగర్లో ఓ వ్యక్తి ఇంట్లో కేర్ టేకర్గా ఉంటూ చోరీకి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు రూ. 6.90 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాఽధీనం చేసుకున్నారు. గురువారం పట్టణ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ శ్రీనివాసులు కేసు వివరాలను వెల్లడించారు. గాంధీనగర్కు చెందిన కుమారస్వామి అనే వ్యక్తి తండ్రి ధనుంజయుడు రిటైర్డ్ ఉద్యోగి. కుమారస్వామి ఉపాధ్యాయుడుగా పనిచేస్తూ తండ్రికి కొంత దూరంగా నివాసముంటున్నాడు. తండ్రి బాగోగులు చూసుకోవటానికి హైదరాబాద్లోని ఓ సంస్థ నుంచి అనంతపురం టౌన్కు చెందిన నిమ్మగంటి చరణ్సాయి అనే వ్యక్తిని ఈ ఏడాది జూన్ నెలలో కేర్ టేకర్గా నియమించుకున్నాడు. అయితే ఇంట్లో నగలు భద్ర పరిచిన చోటును పసిగట్టిన చరణ్సాయి పనిలో చేరిన 15 రోజుల్లోనే ఇంటికి కన్నం వేశాడు. అల్మారా తాళం పగలగొట్టి అందులో ఉన్న నాలుగు బంగారు గాజులు, రెండు పొరల బంగారు చైన్, రెండు ఉంగరాలు, జత కమ్మలతో పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసు లు కేసు నమోదు చేశారు. డీఎస్పీ ఎంఎన్ భార్గవి ఆధ్వర్యంలో సీఐ శ్రీనివాసులు, ఎస్ఐలు మధుసూదన్రెడ్డి, శ్రీనివాసులు, హెచ్సీ మద్దిలేటి, క్రైం పార్టీ పోలీసులు ఉసేని, రఘునాథ్, సుధాకర్, గోపాల్ బృందాలుగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడి చరణ్ సాయిని అనంతపురం టౌన్ తన ఇంటి సమీపంలోని అన్న క్యాంటీన్ దగ్గర ఉండగా అరెస్ట్ చేశారు. కాగా దొంగలించిన బంగారు ఆభరణాలను ఒక గోల్డ్ ఫైనాన్స్లో తనఖా పెట్టి లోన్ తీసుకున్నాడు. దీంతో ఆ సంస్థకు నోటీసు జారీ చేసి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ చెప్పారు. స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలను బాధితులకు అప్పగించినట్లు తెలిపారు. కేసును త్వరగా ఛేదించినందుకు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ టౌన్ సీఐ, ఎస్ఐలు, సిబ్బందిని అభినందించారు. ప్రజలు తమ ఇళ్లలో కొత్తవారిని పనిలో తీసుకోవాల్సి వస్తే పూర్తిగా విచారించాలన్నారు. ప్రజలు బంగారు ఆభరణాలను బ్యాంక్ లాకర్లో భద్రపరుచుకోవాలన్నారు. సమావేశంలో టౌన్ ఎస్ఐ–2 శ్రీనివాసులు తదితరులు ఉన్నారు. -
దేశభక్తి ప్రతిబింబించేలా..
జెండా పండుగకు పిల్లలూ.. పెద్దలూ ఉత్సాహంగా.. ఉల్లాసంగా సన్నద్ధమ వుతున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దేశభక్తి, జాతీయ భావం ఉట్టిపడేలా ఏర్పాట్లలో అందరూ నిమగ్నమ య్యారు. ఓ వైపు జెండా ప్రదర్శనలు, మరో వైపు మూడు రంగుల జెండాలు, ఆకట్టుకునే అలంకరణ సామగ్రి తదితర వస్తువుల అమ్మకాలతో కర్నూలు నగరంలో సందడి నెలకొంది. – సాక్షిఫొటోగ్రాఫర్, కర్నూలుజాతీయ పతకాలు, అలంకరణ సామగ్రి కొనుగోలు చేస్తున్న దృశ్యందుకాణం వద్ద త్రివర్ణ రంగుల వస్తువుల అమ్మకాలుకలెక్టరేట్ వద్ద మాంటిస్సోరి విద్యార్థుల ప్రదర్శన -
ఎస్సీ, ఎస్టీ మెరిట్ విద్యార్థినులకు కెనరా విద్యా జ్యోతి
కర్నూలు(అర్బన్): కెనరా విద్యా జ్యోతి పథకం పేరుతో ప్రతి ఏడాది 5 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న ఎస్సీ, ఎస్టీ మెరిట్ విద్యార్థినులను ఎంపిక చేసి ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు కెనరా బ్యాంకు కర్నూలు రీజినల్ మేనేజర్ సుశాంత్కుమార్ తెలిపారు. గురువారం స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీ బ్రాంచ్లో విద్యాజ్యోతి పథకం కింద ఎంపికై న విద్యార్థినులకు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని కెనరా బ్యాంకు శాఖల ద్వారా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బాలికల విద్యాభివృద్ది దేశ ప్రాధాన్యత అయితే ఈ లక్ష్యాన్ని సాధించేందుకు కెనరా బ్యాంకు కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కే తులసీదేవి మాట్లాడుతూ.. కెనరా విద్యాజ్యోతి పథకం ద్వారా విద్యార్థినులను విద్యాపరంగా మరింత ప్రోత్సహించడంతో పాటు అమ్మాయిల భవిష్యత్తు నిర్మాణానికి తోడ్పడుతుందన్నారు. గతంలో పేద ప్రతిభావంతురాలైన ఎస్సీ విద్యార్థినికి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక లాప్టాప్ను కూడా కెనరా బ్యాంకు అందించిందన్నారు. కార్యక్రమంలో డివిజినల్ మేనేజర్ సురేష్కుమార్, బ్రాంచ్ మేనేజర్ శంకర్, చైతన్య శివరాజ్ పాల్గొన్నారు. -
ముగిసిన సప్తరాత్రోత్సవాలు
మంత్రాలయం: సద్గురు రాఘవేంద్రస్వామి 354వ ఆరాధన సప్తరాత్రోత్సవాలు గురువారంతో ముగిశాయి. వేడుకల్లో భాగంగా శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు నేతృత్వంలో చివరిరోజు సంబరాలు కనుల పండువగా జరిగాయి. ఉదయం మండలంలోని అను మంత్రాలయం (తుంగభద్ర)లోని మఠంలో రాఘవేంద్రస్వామి రథోత్సవం చేపట్టారు. ముందుగా ఉత్సమూర్తి ప్రహ్లాదరాయలకు చామర్ల సేవతో హారతులు పట్టారు. అనంతరం రథంపై కొలువుంచి గ్రామ పుర వీధుల్లో వైభవంగా ఊరేగించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి ఆరాధన ఉత్సవాల విశిష్టతను భక్తులకు వివరించారు. రాత్రి శ్రీమఠం ప్రాంగణ వీధుల్లో ఉత్సవమూర్తికి పంచ వాహనాలతో రథయాత్ర చేపట్టారు. ఈ వేడుకలు ఏడు రోజుల పాటు భక్తులను ఆధ్యాత్మిక చింతనలో ముంచెత్తాయి. -
ప్రజాస్వామ్యంలో పులివెందుల ఎన్నికలు అపహాస్యం
కర్నూలు (టౌన్): బూత్లను ఆక్రమించి, దాడులకు తెగబడి, దౌర్జన్యాలు చేసి, అక్రమ కేసులు నమోదు చేసి, గృహనిర్బంధాలకు పాల్పడి పులివెందులలో ఎన్నికలు నిర్వహించి రాష్ట్రప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి విమర్శించారు. కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్లో గురువారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పులివెందులలో ప్రజలు తమ ఓట్లు తాము వేసుకుంటామని పోలీసుల కాళ్లు పట్టుకున్నా కనికరించలేదన్నారు. ఓటర్లను భయాభ్రాంతులకు గురిచేసిన టీడీపీ గుండాలు బూ త్లను ఆక్రమించుకొని రిగ్గింగ్కు పాల్పడ్డారన్నారు. అన్ని పత్రికలు, టీవీ చానళ్లలో, సోషల్ మీడియాలో టీడీపీ ఆగడాలు స్పష్టంగా కనిపించాయన్నారు. అంతటా టీడీపీ గూండాల దౌర్జన్యం వైఎస్సార్ జిల్లాకు సంబంధం లేని మంత్రి పులివెందుల బూత్లలో ఏం పని అని ఎస్వీ మోహన్రెడ్డి ప్రశ్నించారు. దగ్గరుండి స్లిప్పులు లాక్కొని టీడీపీకి ఓట్లు వేయించారని ఆరోపించారు. మంత్రి సమక్షంలోనే వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్ను బట్టలు చించి దాడులకు తెగబడలేదా అని ప్రశ్నించారు. ఓటు ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డిని ఉదయం 5 గంటలకే పోలీసులు అరెస్టు చేశారన్నారు. పులివెందులలో టీడీపీకి 6 వేలకు పైగా ఓట్లు, వైసీపీకి 600 ఓట్లు రావడం వింతగా ఉందన్నారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులను ఓట్లు వేయకుండా టీడీపీ గూండాలు కట్టెలు పట్టుకొని కాపాలా కాయలేదా అని ప్రశ్నించారు. అసలు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగలేదన్నారు. దౌర్జన్యాలకు పాల్పడిన టీడీపీ గుండాలు పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలిచినట్లు సంకలు గుద్దుకోవడం సిగ్గుచేటన్నారు. ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం అరాచాకాలకు, దౌర్జన్యాలకు పాల్పడిందన్న విషయం ప్రజలందరికీ అర్థమైందన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో భయానక వాతావరణం రాష్ట్రంలోనే పోలీసు వ్యవస్థ చచ్చిపోయిందని రెండు నిముషాలు సమావేశంలో మౌనం పాటించారు. ప్రజల పన్నులతో జీతాలు తీసుకుంటున్న పోలీసులు ప్రజలకు భరోసాగా ఉండాలింది పోయి లా అండ్ ఆర్డర్ను మరచిపోయి కూటమి ప్రభుత్వానికి ఏకపక్షంగా వ్యవహరించారని ఎస్వీ మోహన్రెడ్డి ఆరోపించారు. ప్రజలను చంపేందుకేనా డీఎస్పీకి తుపాకీ ఇచ్చిందని ప్రశ్నించారు. కాల్చేస్తానని డీఎస్పీ స్థాయి అధికారి బెదిరించడం పోలీసు ప్రతిష్టకే మచ్చ అన్నారు. కురు క్షేత్ర యుద్దంలో శిఖండిలను అడ్డు పెట్టుకొని గెలవడం సిగ్గుచేటైన విషయమన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో భయానక వాతవరణంలో ఎన్నికల నిర్వహించడం కన్నా .. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అడిగి ఉంటే రెండు జెడ్పీటీసీలను ఇచ్చే వాడు కదా అన్నారు. స్వతంత్ర సంస్థ ఎన్నికల కమిషన్కు అరాచాకాలను, దాడులను ఫొటోలు, వీడియోలతో సహా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోకపొవడం దారుణమన్నారు. సుమోటోగా తీసుకుని ఎన్నికలు రద్దు చేయాలి కూటమి ప్రభుత్వ ఆగడాలను కోర్టులు సుమోటోగా తీసుకుని పులివెందుల ఎన్నికలను రద్దు చేయాలని కోడుమూరు వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ ఆదిమూలపు సతీష్ డిమాండ్ చేశారు. ఓటుకు నోటు, ఈవీఎంల టాంపరింగ్లో టీడీపీ అధినేత సిద్ధహస్తుడని ఆరోపించారు. అదే తరహాలోనే పులివెందుల ఎన్నికల్లో అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడి గెలిచారన్నారు. పులివెందులలో రాక్షస కాండను ప్రజలు గమనించారన్నారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్, కార్పొరేటర్లు కృష్ణకాంత్ రెడ్డి, విక్రమసింహారెడ్డి, షాషావలీ, పార్టీ నాయకులు కిషన్, రైల్వే ప్రసాద్, ఫిరోజ్లు పాల్గొన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ చచ్చిపోయింది! మంత్రి సమక్షంలో వైఎస్సార్సీపీ ఏజెంట్లపై దాడులు చేశారు కోర్టులు సుమోటోగా తీసుకుని ఎన్నికలను రద్దు చేయాలి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీమోహన్ రెడ్డి -
వేడుకలకు ముస్తాబైన పోలీసు పరేడ్ మైదానం
కర్నూలు/కర్నూలు(సెంట్రల్): స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు నగరంలోని పోలీస్ పరేడ్ మైదానం ముస్తాబైంది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మైదానమంతా చిత్తడిగా మారింది. శుక్రవారం కూడా వర్షం కొనసాగితే అధికారులకు ఇబ్బంది లేకుండా రెయిన్ప్రూఫ్ షామియానాలు ఏర్పాటు చేశారు. కొండారెడ్డి బురుజు విద్యుద్దీపకాంతుల నడుమ వెలిగిపోతోంది. ఉదయం 9.05 గంటలకు మంత్రి టీజీ భరత్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా, ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఇతర అధికారులు పాల్గొంటారు. పరేడ్ మైదానంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల రిహార్సల్స్ను గురువారం ఉదయం ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. వేడుకల నేపథ్యంలో నగరంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఇకపోతే వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ప్రదర్శనకు శకటాలు ముస్తాబవుతుండగా.. పలు స్టాళ్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన సుమారు 400 మంది ఉద్యోగులు ప్రశంసా పత్రాలు అందుకోనున్నారు. -
కూటమి ప్రభుత్వం మోసం చేసింది
దివ్యాంగులను కూటమి ప్రభుత్వం మోసం చేసింది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని తుంగలో తొక్కింది. వెరిఫికేషన్ పేరిట వికలత్వం శాతం తగ్గించింది. పింఛన్ల రద్దుకు కుట్ర పన్నింది. వంద నుంచి 80 శాతం వికలత్వం సర్టిపికెట్ ఉన్న వారికి నెలకు రూ.15 వేల పింఛన్ ఇస్తున్నారు. ఇప్పుడు వికలత్వం 60 నుంచి 70 శాతానికి కుదించి రూ. 6 వేల పింఛన్ ఇవ్వడానికి కుట్ర చేశారు. గతంలో డాక్టర్లు శాశ్వత సర్థిఫికెట్లు జారీ చేశారు. అప్పుడు ఇచ్చిన డాక్టర్, ఇప్పుడు ఇచిన డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్కు తేడా ఏమిటో ప్రభుత్వమే చెప్పాలి. దివ్యాంగులకు న్యాయం చేయాలి. లేదంటే ఉద్యమం చేస్తాం. – మరియదాసు, దివ్యాంగుల ఆదరణ సేవా సమితి అధ్యక్షుడు -
ఆళ్లగడ్డలో ఢీకొన్న రెండు బస్సులు.. పలువురు మృతి
సాక్షి, ఆళ్లగడ్డ: నంద్యాల-తిరుపతి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రెండు ప్రైవేటు బస్సులు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో సుమారు 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న రెండు ప్రైవేటు ట్రావెట్స్ బస్సులు శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో మార్గ మధ్యలో ఆళ్లగడ్డ వద్ద ఆల్ఫా ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో ఢీకొన్నాయి. ముందు వెళ్తున్న ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది.ఈ ఘటనలో శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సులో ఉన్న ఇద్దరు, మరో ట్రావెల్స్ బస్సులో ఉన్న ఒకరు మృతిచెందారు. మృతదేహాలు ఇరుక్కుపోవడంతో పొక్లెయిన్ సాయంతో బయటకు తీశారు. మరణించిన వారు ఎవరనేది తెలియాల్సి ఉంది. సుమారు 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న 108 సిబ్బంది గాయపడిన వారిని చికిత్స నిమిత్తం నంద్యాలలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
స్కూటీని ఢీకొన్న కారు
● దంపతులు, బాలుడికి తీవ్ర గాయాలు ఎమ్మిగనూరురూరల్: ఆదోని – కర్నూలు రహదారిలో బనవాసి జవహార్ నవోదయ విద్యాలయం సమీపంలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడితో పాటు దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. గోనెగండ్ల మండలం హెచ్.కై రవాడికి చెందిన గంగన్న, భార్య భాగ్యలక్ష్మీ కుమారుడు ఉపేంద్రలు ఉదయం స్కూటీపై దేవబెట్ట గ్రామానికి కొత్త బట్టలు పెట్టుకునేందుకు బంధువుల ఇంటికి వెళ్లారు. బట్టలు పెట్టుకొని సాయంత్రం తిరిగి స్వగ్రామానికి స్కూటీపై వస్తున్నారు. కర్నూలుకు చెందిన దినేష్రెడ్డికి కొత్తగా పెళ్లి అయ్యింది. భార్య ఆదోనిలో ఉపాధ్యాయురాలు పని చేస్తోంది. ఆ స్కూల్లో సెలవు పెట్టి తిరిగి కర్నూలుకు బయలు దేరారు. బనవాసి నవోదయ దగ్గర ముందు వెళ్తున్న స్కూటీని వెనక నుంచి అతి వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టడంతో బైక్పై ఉన్న గంగన్న, భాగ్యలక్ష్మీ, బాలుడు ఉపేంద్రలు ఎగిరి పక్కనే కాలువలో పడిపోయారు. ప్రమాదానికి గురైన కారు రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభానికి ఢీ కొట్టి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. అదృష్ణవశాత్తు విద్యుత్ స్తంబం విరిగి కింద పడకపోవటంతో అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ప్రమాదంలో దంపతులతో పాటు కుమారుడికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం 108లో ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం కేసు నమోదు చేసుకున్నట్లు రూరల్ ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. -
నాల్గోసారి ఉత్తమ స్కూల్గా..
కర్నూలు సిటీ: నగరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ మున్సిపల్ హైస్కూల్ రాష్ట్రస్థాయిలో ఉత్తమ స్కూల్కు ఎంపికై ంది. విజయవాడలో శుక్రవారం సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అవార్డును ప్రధానోపాధ్యాయుడు కె.శివప్రసాద్ అందుకోనున్నారు. ఈ పాఠశాల 2018లో అడ్వాన్స్ ఫౌండేషన్ స్కూల్గా ఎంపికై ంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో (2020లో) భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజీ అబ్దుల్ కలాం పేరుతో స్కూల్ ఏర్పాటుకు కర్నూలు నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. ఈ తీర్మానం మేరకు 6 నుంచి 10వ తరగతి వరకు తరగతికి 60 సీట్ల చొప్పున అనుమతులు ఇస్తూ 2021 మార్చి 10న విద్యావాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.రాజశేఖర్ జీఓ ఎం.ఎస్ నంబరు 20ని జారీ చేశారు. ప్రవేశ పరీక్ష ద్వారా సీట్లు భర్తీ చేస్తున్నారు. తొలుత 2021–22లో , తర్వాత 2022–23లో, 2023–24లో పదో తరగతి విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణులు అయ్యారు. 2024–25 విద్యా సంవత్సరంలో 43 మంది పరీక్షలు రాస్తే 43 మంది పాసయ్యారు. ఈ స్కూల్కి చెందిన టి.సాయి లఖిత 595 మార్కులు సాధించింది. దీంతో వరుసగా నాల్గోసారి రాష్ట్ర స్ధాయిలో ఉత్తమ స్కూల్గా ఎంపికై ంది. ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ దాడులు వెల్దుర్తి: పట్టణంలోని ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ పవన్కిశోర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడుల్లో భాగంగా ముందుగా విజిలెన్స్ సిబ్బంది రైతుల రూపంలో అన్ని దుకాణాలకు వెళ్లి ధరలను విచారించారు. ఇందులో నాలుగు దుకాణాల్లో అధిక ధరలకు అమ్ముతున్నట్లు తెలుసుకున్నారు. ఆయా దుకాణాలపై వెంటనే విజిలెన్స్ సీఐ, ఆ శాఖ ఏఓ విశ్వనాథ్, స్థానిక ఏఓ అక్బర్ బాషా దాడులు చేసి ముందుగా లైసెన్స్, రికార్డులు, స్టాకు పరిశీలించారు. ఎంఆర్పీ కంటే ఎక్కువగా అమ్ముతున్నారని గుర్తించి నాలుగు దుకాణాలలోని 390 బస్తాల రూ.3,74,407ల విలువైన ఎరువుల అమ్మకాల నిలిపివేస్తూ, నిత్యావసరాల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఏఓ తెలిపారు. పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదల తగ్గింపు జూపాడుబంగ్లా: పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ నుంచి నీటి విడుదలను 32 వేల నుంచి 22 వేల క్యూసెక్కులకు తగ్గించినట్లు ఏఈ విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు. ఐదు రోజుల నుంచి నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతో దిగువప్రాంతాల్లోని కాల్వలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ముందు జాగ్రత్త చర్యగా నీటి విడుదలను తగ్గించామన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ గేట్లను కిందికి దించి 22 వేల క్యూసెక్కుల నీటిని ఎస్సారెమ్సీ కాల్వలోకి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ నీటిని తెలుగుగంగ క్వాకు 8వేల క్యూసెక్కులు, ఎస్సార్బీసీ నుంచి జీఎన్ఎస్ఎస్కి 9వేలు, కేసీ ఎస్కేప్ కాల్వకు 5వేల క్యూసెక్కులు సరఫరా చేస్తున్నట్లు బానకచర్ల ఏఈ దేవేంద్ర తెలిపారు. -
ఉప్పలపాడులో యువకుడి ఆత్మహత్య
ఓర్వకల్లు: ఉప్పలపాడు గ్రామంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని గ్రామానికి చెందిన శ్రీనివాసులు భార్య చనిపోవడంతో రెండో వివాహం చేసుకున్నాడు. కాగా మొదటి భార్య కూతురు నందిని బేతంచెర్ల నుంచి వచ్చి ఉప్పలపాడులో నివాసముంటున్న తలారి సునీల్కుమార్ (21)తో ఏడాది క్రితం ప్రేమించి పెళ్లిచేసుకోంది. సునీల్ కొంతకాలంగా జులాయిగా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో అతని భార్య నందిని కాన్పు కోసం పుట్టింటికి వెళ్లింది. అయితే మూడు రోజుల క్రితం సునీల్ భార్య వద్దకు వెళ్లగా మామ, అల్లుడి మధ్య ఘర్షణ జరిగి శ్రీనివాసులు అల్లుడిపై దాడికి పాల్పడినట్లు తెలిసింది. దీంతో మనస్తాపం చెందిన సునీల్ గురువారం తన సొంతింటిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని తల్లి మహాలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సునీల్ కుమార్ తెలిపారు. -
నీట మునిగిన ఆశలు
పంటలకు అధిక వర్షాల గండం ● దాదాపు 2వేల హెక్టార్లలో పత్తి పంటకు నష్టం ● దెబ్బతింటున్న కంది, ఉల్లి, వేరుశనగ, సజ్జ పంటలు మండలం వర్షపాతం(మి.మీ) కర్నూలు అర్బన్ 41.4 కర్నూలు రూరల్ 39.2 కల్లూరు 36.2 చిప్పగిరి 28.4 హాలహర్వి 11.4కర్నూలు(అగ్రికల్చర్): కొద్ది రోజులుగా కురుస్తున్న అధిక వర్షాలతో రైతుల ఆశలు నీరుగారుతున్నాయి. రెండు, మూడు రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి బుధవారం వరకు 21 మండలాల్లో వర్షపాతం నమోదైంది. వర్షాలు అతివృష్టిగా మారడంతో పత్తి, ఉల్లి, మొక్కజొన్న, కంది, టమాట రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పంటలు నీట మునిగి కుళ్లిపోతుండటంతో కన్నీరు పెట్టుకుంటున్నారు. ఆగస్టు నెల సాధారణ వర్షపాతం 116.2 మి.మీ ఉండగా.. ఇప్పటి వరకు 132 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ కారణంగా ఆదోని, తుగ్గలి, ఆస్పరి, ఆలూరు, పెద్దకడుబూరు, కర్నూలు రూరల్ తదితర మండలాల్లో వేలాది హెక్టార్లలో పత్తి, కంది, ఉల్లి, వేరుశనగ, సజ్జ తదితర పంటలు దెబ్బతిన్నాయి. ఈ సారి పశ్చిమ ప్రాంతంలో 2.14 లక్షల హెక్టార్లలో పత్తి సాగయింది. అధిక వర్షాల వల్ల ఒక్క పత్తి మాత్రమే దాదాపు 2వేల హెక్టార్లలో దెబ్బతినింది. అధికార యంత్రాంగం మాత్రం వ్యవసాయ, ఉద్యాన పంటలు కలిపి 658.7 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా తేల్చారు. ఉద్యాన పంటలకు రూ.2.94 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఉల్లి పంట ఇప్పుడిప్పుడే చేతికి వస్తోంది. వందలాది హెక్టార్లలో ఉల్లి పంట కోశారు. వరుసగా అధిక వర్షాలు పడుతుండటంతో నీళ్లలో మునిగి ఉల్లిగడ్డలు కుళ్లిపోతున్నాయి. ఆలూరు, ఆస్పరి, పత్తికొండ, తుగ్గలి తదితర మండలాల్లో ఉల్లి రైతులు లబోదిబోమంటున్నారు. రానున్న రోజుల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నెల 14న కర్నూలు జిల్లాకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. అల్పపీడనం ప్రభావం వల్ల పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు వెల్లడించారు. -
రంగంలోకి అమాత్యుడు.. దోచేస్తున్న స్నేహితుడు!
‘క్లాస్మేట్ల’ బియ్యం దందా! ● వ్యాపారులు, రేషన్ డీలర్లతో సమావేశం ● తన స్నేహితునికే విక్రయించాలని హుకుం ● కొందరు నిరాకరించడంతో విజిలెన్స్ దాడులు ● ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా పేదల బియ్యం స్నేహితునికే అమ్మకం ● కర్నూలులో రెండు గోదాములు ● రాత్రిళ్లు సరిహద్దులు దాటిస్తున్న వైనం కర్నూలు(సెంట్రల్): పేదల అవసరాలను ఆసరాగా చేసుకొని అక్రమార్కులు యథేచ్ఛగా తక్కువ ధరతో బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఇతర ప్రాంతాలకు తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఓ అమాత్యుడు నేరుగా తన స్నేహితుడితో(క్లాస్మేట్తో) అక్రమ బియ్యం వ్యాపారం చేయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో అధికార యంత్రాంగం అటువైపు చూడడం లేదని, కనీసం తనిఖీలు చేయడం లేదని తెలుస్తోంది. ఫలితంగా అక్రమ బియ్యం జిల్లా సరిహద్దులు దాటిపోతోంది. జిల్లాలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ నేతల అండతో కొందరు వ్యాపారులు అక్రమ బియ్యం వ్యాపారాన్ని చేసేవారు. పేదల నుంచి కొనుగోలు చేసిన బియ్యాన్ని యథేచ్ఛగా జిల్లా దాటించేవారు. అయితే పరిస్థితి మారిపోయింది. తన స్నేహితుడి కోసం ఓ అమాత్యుడు రంగంలో దిగాడు. ఆయనే నేరుగా జిల్లాలో అక్రమ బియ్యం వ్యాపారం చేసే వ్యాపారులు, రేషన్ డీలర్లు, ఇతరులను పిలిపించి మాట్లాడి.. తన స్నేహితుడు, టీడీపీ నాయకుడైన ‘ఖాన్’కు అమ్మాలని సూచించాడు. ఇందుకు ఒప్పుకోకపోతే ఎవరూ వ్యాపారం చేసుకోలేరని భయపెట్టాడు. అయితే కొందరు ఒప్పుకోకపోతే విజిలెన్స్ దాడులు చేయించి వారిపై కేసులు నమోదు చేయించినట్లు సమాచారం. అంతేకాక వారి వ్యాపారంపై నిఘా ఉంచి ఇబ్బందులకు గురి చేసినట్లు తెలుస్తోంది. చివరకు అక్రమ బియ్యం వ్యాపారం చేసే వారంతా అమాత్యుడి స్నేహితుని కింద వ్యాపారం చేసేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం జిల్లా మొత్తం అమాత్యుడి క్లాస్మేట్ కనుసన్నల్లోనే అక్రమ బియ్యం వ్యాపారం కొనసాగుతోంది. ప్రతి నెలా సమీక్ష అక్రమ బియ్యం వ్యాపారంపై ప్రతి నెలా సదరు అమాత్యుడు సమీక్ష చేస్తున్నట్లు సమాచారం. జిల్లా మొత్తానికి తన స్నేహితుడే వ్యాపారం చూసుకుంటున్నా వచ్చే లాభాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. కర్నూలులో రెండుచోట్ల అక్రమ బియ్యానికి సంబంధించి గోదాములు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. అక్కడి నుంచి నేరుగా రాత్రిళ్లు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు తరలిపోతోంది. నిద్దరోతున్న నిఘా పేదల బియ్యాన్ని అమ్మడానికి వీలు లేదు. కొనుగోలు చేయడానికి ఎవరూ సాహసించకూడదు. అయినా అమ్మేవాళ్లు అమ్ముతున్నారు.. కొనుగోలు చేసేవాళ్లు చేస్తూ వ్యాపారం సాగిస్తున్నా పౌర సరఫరాల అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే పోలీసులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు సమాచారం. విజిలెన్స్ నిఘా ఉన్నా అమాత్యుడు, అతని స్నేహితుడు రంగంలో ఉండడంతో వారు కూడా అటువైపు చూడడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో జిల్లాలో అక్రమ బియ్యం వ్యాపారం జోరుగా సాగుతోంది. ఎన్ని నిబంధనలు ఉన్నా పేదల బియ్యం మాత్రం జిల్లా సరిహద్దులు దాటిపోతోంది.ఇదీ దోపిడీ..కర్నూలు జిల్లాలో 6,52,452 రేషన్ కార్డులు ఉన్నాయి. ఆయా కార్డుల్లో దాదాపు 12 లక్షల మంది కార్డుదారులు ఉన్నారు. వీరికి ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వం 12 వేల టన్నుల బియ్యం కేటాయిస్తోంది. ఇంటి ఖర్చులు ఎక్కువ కావడంతో కొన్ని సందర్భాల్లా పేదలు అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వ్యాపారులు దీన్నే ఆసరగా చేసుకొని ‘ ప్రభుత్వం ఇచ్చే బియ్యం ఏమీ బాగుండవని.. తమకు అమ్మాలి’ అని ఒత్తిడి చేస్తారు. బహిరంగ మార్కెట్లో రేషన్ బియ్యానికి బాగానే ధర ఉండగా వీరు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. కేజీ రూ.10 ప్రకారం కొనుగోలు చేసి ఆ బియ్యాన్ని అమాత్యుడి క్లాస్మేట్కు కేజీ రూ.13 ప్రకారం అమ్ముతున్నాడు. పేదల బియ్యాన్ని జిల్లా సరిహద్దులు దాటించి సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. -
రూ.82.79 కోట్ల ఉచిత పంటల బీమా విడుదల
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకం ● కేంద్రం వాటా బీమా నిధులు విడుదల ● చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం కర్నూలు(అగ్రికల్చర్): వైఎస్సార్సీపీ ప్రభు త్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకం కింద ఒక్క రూపాయి ప్రీమియం చెల్లించకుండానే మరోసారి రూ.82.79 కోట్ల ప్రయోజనం కలిగింది. 2022 ఖరీఫ్, 2023 ఖరీఫ్, 2023–24 రబీ, 2024 ఖరీఫ్ పంటలకు సంబంధించి ఉచిత పంటల బీమా ద్వారా రైతుల బ్యాంకు ఖాతాలకు ఈ మొత్తం గత రెండు రోజులుగా విడుదలవుతోంది. ఈ పరిహారం కేవలం కేంద్ర ప్రభుత్వ వాటా మాత్రమే. కేంద్రం ద్వారా ఒక్కో రైతుకు రూ.5 వేల నుంచి రూ.30 వేల వరకు ప్రయోజనం చేకూరుతోంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతుల నుంచి ప్రీమియం రూపంలో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచిత పంటల బీమాను అమలు చేసింది. నోటిఫై చేసిన పంటలు ఈ–క్రాప్లో నమోదైతే చాలు బీమా వర్తింపజేయడంతో లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతోంది. ఉచిత పంటల బీమాను మరచిపోయిన రైతుల బ్యాంకు ఖాతాలకు బీమా పరిహారం విడుదలవుతుండటంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన మేలును గుర్తు చేసుకుంటున్నారు. ఇదిలాఉంటే రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా పరిహారం విడుదల చేయడంలో చేతులెత్తేసింది. దీన్నిబట్టి చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రైతులపై ఉన్న అభిమానం ఏపాటిదో అర్థమవుతోంది. -
బాల్య వివాహాలతో అనేక అనర్థాలు
కర్నూలు(అర్బన్): బాల్య వివాహాలతో అనేక అనర్థాలు ఉన్నాయని, వాటిని తల్లిదండ్రులకు వివరించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బీ లీలా వెంకట శేషాద్రి కోరారు. రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థల ఆదేశాలు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీ కబర్థి సూచనల మేరకు స్థానిక న్యాయ సేవాసదన్లో బుధవారం జిల్లాలోని ప్రభుత్వ లైన్ డిపార్టుమెంట్లకు సంబంధించిన అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో చిన్నతనంలోనే ప్రెగ్నెన్సీ, ఎస్సీ, ఎస్టీ, పౌర హక్కుల రక్షణ తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన హక్కుల రక్షణ, అమలు పథకం 2015, ఆదివాసీలు, సంచార తెగలకు న్యాయం పొందే అవకాశాన్ని బలోపేతం చేసే పథకం 2025పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సదస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లాకు చెందిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు డా.శాంతికళ, ఆర్ వెంకటరమణ, ఐసీడీఎస్ పీడీ పీ విజయ, డీసీపీఓ శారద, జిల్లా సాంఘీక సంక్షేమం, సాధికారత అధికారిణి బీ రాధిక, నంద్యాల ఏటీడబ్ల్యూఓ హుసేనయ్య, నంద్యాల జిల్లా సీఐ పీ గౌతమి, రెండు జిల్లాలకు చెందిన రెవెన్యూ, దేవాదాయ శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బీ లీలా వెంకట శేషాద్రి -
రూ. 5లక్షల నగదు అపహరణ
ఆలూరు రూరల్: బ్యాంకు నుంచి డ్రా చేసుకొని వెళ్తున్న రూ.5 లక్షల నగదుతో పాటు 5 గ్రాముల బంగారు కమ్మలను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. స్థానిక బళ్లారి రోడ్డులోని పాండురంగ స్వామి ఆలయ సమీపంలో కట్టెల మిషన్ వద్ద బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితుడు గోపాల్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. హాలహర్వి మండలం మల్లికార్జున పల్లి గ్రామానికి చెందిన గోపాల్ రెడ్డి నెల క్రితం గాలిమరల సంస్థకు పొలం విక్రయించాడు. ఆ నగదు తన ఖాతాలో జమ కావడంతో బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఆలూరు స్టేట్ బ్యాంకు నుంచి రూ.5 లక్షల నగదు డ్రా చేసుకున్నాడు. నగల దుకాణం నుంచి కొనుగోలు చేసిన 5 గ్రాముల బంగారు, డ్రా చేసుకున్న నగదు సంచిలో ఉంచి తన అల్లుడుతో కలిసి స్కూటర్పై స్వగ్రామానికి బయలుదేరాడు. ఆలూరు సమీపంలోని పాండురంగ స్వామి ఆలయం వద్ద కట్టెల మిషన్ ముందు స్కూటర్ నిలిపి నగదు, ఆభరణాలు ఉన్న సంచిని దానిపై ఉంచి మూత్ర విసర్జనకు వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి బ్యాగు మాయమైంది. గుర్తుతెలియని వ్యక్తులు తన నగదు,బంగారు అపహరించారని ఆలూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులకు ఆశ్రయించిన బాధితుడు -
శుభకార్యానికి వచ్చి..అనంతలోకాలకు
● రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం ఎమ్మిగనూరురూరల్: బంధువుల ఇంట్లో వివాహానికి వచ్చాడు. అర్ధరాత్రి వరకు సంబరాల్లో పాల్గొన్న ఆ యువకుడు ఆదోనికి వెళ్లి వస్తానని బైక్పై బయలుదేరి మృత్యుఒడికి చేరాడు. మంగళవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. ఆదోని పట్టణంలోని ఇంద్రానగర్ ఎరుకుల కాలనీకి చెందిన మారెన్న కుమారుడు ఎరుకుల లక్ష్మన్న(28) కొంత కాలంగా హైదరాబాద్లో వెంట్రుకల వ్యాపారం, ఆదోనిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. మంగళవారం ఎమ్మిగనూరు పట్టణంలోని తమ బంధువుల పెళ్లికి భార్య మాధవితో కలిసి వచ్చాడు. రాత్రి పెళ్లి కుమారుడి ఇంటి దగ్గర డీజే పాటలకు నృత్యం చేస్తూ అందరితో సంతోషంగా గడిపాడు. భార్య, బంధువులు వద్దని వారించినా అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆదోనికి వెళ్లి ఉదయం వస్తానని బుల్లెట్ బైక్పై బయలుదేరాడు. మండల పరిధిలోని కోటేకల్ – ఆరేకల్ గ్రామాల మధ్య ఉన్న కోళ్ల ఫారం దగ్గర బైక్ అదుపుతప్పడంతో రోడ్డు పక్కన ఉన్న ముళ్లపొదల్లో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. బుధవారం ఉదయం అటుగా వెళ్తున్న వారు గమనించి విషయాన్ని రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలికి చేరుకొని మృతుడి దగ్గర ఉన్న సెల్ ఫోన్ ఆధారంగా కుటుంబసభ్యుల సమాచారం తెలుసుకుని ప్రమాదం విషయం తెలియజేశారు. లక్ష్మన్న మృతదేహాన్ని చూసి బంధువులు బోరున విలపించారు. మృతదేహాన్ని రూరల్ పోలీసులు పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో పెళ్లి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. ప్రమాదవశాత్తూ కుందూలో పడి.. బండి ఆత్మకూరు: ప్రమాదవశాత్తూ కుందూనదిలో పడి దివ్యాంగుడు మృతిచెందాడు. మండల కేంద్రం బండిఆత్మకూరులో బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రానికి చెందిన సగిలే రమణ రెడ్డి (59) తన ట్రైసైకిల్పై బస్టాండ్ నుంచి ఊరిలోకి వెళ్తున్నాడు. స్థానిక కుందూనది వంతెనపై వెళ్తుండగా ట్రైసైకిల్ అదుపు తప్పి నదిలో పడిపోయింది. స్థానికులు గమనించేలోపే నీటి ప్రవాహంలో కొట్టుకోపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో గాలించి నంద్యాల నందమూరి నగర్ వద్ద ఉన్న కుందూ బ్రిడ్జ్ వద్ద మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడికి భార్య లక్ష్మిదేవి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా కుందూనది వంతెనకు ఎలాంటి రక్షణ గోడలు లేకపోవడంతో తరచు ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. -
మన పండు బ్రహ్మాండం!
డ్రాగన్ ఫ్రూట్. ఇటీవల కాలంలో విచ్చలవిడిగా లభిస్తున్న పండు. ఇదివరలో చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నా.. ఇప్పుడు మనపక్క జిల్లా అనంతపురంతో పాటు పలు జిల్లాల్లో విరివిగా సాగవుతోంది. అయితే ఇంతకు వెయ్యి రెట్లు బీ12, ఏ, సీ విటమిన్లు లభించే మొక్క మన దేశంలోనే ఉన్న బ్రహ్మజెముడు(పాపిచ్చి కాయ)ను విస్మరిస్తున్నాం. చైనాకు, మన పండుకు ఉన్నా తేడా ఒక్క ముళ్లు మాత్రమే. కేవలం ఈ ఒక్క కారణంతో ముళ్లు తీసుకునే సమయం లేక చైనా పండ్లను ప్రోత్సహిస్తున్నాం. పైగా ఈ పండ్లు గ్రామీణ ప్రాంతాల్లోని కొండ ప్రాంతాల్లో ఎవరూ పెంచకుండానే మొండిగా బతికేస్తుంది. అయితే చైనా పండు(డ్రాగన్ ఫ్రూట్)ను మాత్రం కేజీ రూ.100 చొప్పున కొనుగోలు చేస్తున్నాం. ఇక్కడే ఫ్రీగా లభిస్తున్న, డ్రాగన్ ఫ్రూట్ను మించి పోషకాలను అందిస్తున్న మన బ్రహ్మజెముడును పట్టించుకోకపోవడం గమనార్హం. కార్పొరేట్, కాంక్రీట్ జంగిల్స్లో విద్యను అభ్యసిస్తున్న పిల్లలకు వీటి గురించి అవగాహన లేకపోయినా.. గ్రామీణ ప్రాంతాల్లో సర్కారు పాఠశాలల్లో చదివే పిల్లలకు ఈ పాపాసికాయలు తెలియనివి కావు. పండును బండరాయికేసి రుద్దితే ముళ్లు విరిగిపోతాయి, ఆ తర్వాత తోలు తీసి గుజ్జును తినేయడమే. చివరగా వచ్చే విత్తనాలను మాత్రం పడేయటం విస్మరించొద్దు. ఈ పండ్లు తిన్నామంటే ఎట్టే గర్తుపట్టేయొచ్చు. చేతులు, నాలుక కొద్ది సమయం వరకు ఎరుపు, గులాబి రంగులోకి మారిపోవడం చూస్తే పాపాసికాయలు తిన్నావా అని అడగాల్సిందే. ఔషధ గుణాలు కలిగిన బ్రహ్మజెముడు పండ్లతో కాలేయ, క్యాన్సర్ వ్యాధులను సైతం నయం చేస్తోంది. అంతేకాదు.. స్థూలకాయం, మధుమేహం, గ్యాస్ట్రిక్ సమస్యలను కూడా తగ్గించే గుణం ఉండటం విశేషం. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు -
టీడీపీ గూండాగిరీకి పోలీసుల వత్తాసు
● ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి ఆలూరు: అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నాయకులు చేస్తున్న గూండాగిరీకి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని, ఇందుకు జెడ్పీటీసీ ఉప ఎన్నికలే నిదర్శనమని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అన్నారు. కూటమి సర్కారు ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని మండిపడ్డారు. బుధవారం ఆలూరు ఆర్అండ్బీ అతిథి గృహ ఆవరణలో నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలు స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఇవ్వలేదన్నారు. దౌర్జన్యాలు చేస్తూ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారన్నారు. ఈ ఆగడాలను అడ్డుకోవాల్సిన పోలీసు వ్యవస్థ, ఎన్నికల కమిషన్ ప్రేక్షక పాత్ర పోషించిందన్నారు. రాష్ట్రంలో రౌడీరాజ్యం ఎన్నాళ్లు ఉండదని, ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్సీపీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి భాస్కర్, పార్టీ ఆలూరు మండలం అధ్యక్షుడు మల్లికార్జున, ఎంపీపీ రంగమ్మ, వైస్ ఎంపీపీ శ్రీరాములు, నాయకులు పాల్గొన్నారు. రైల్లో నుంచి పడి వ్యక్తి మృతి నంద్యాల: స్థానిక రైల్వే స్టేషన్ పరిధిలోని గుడిమెట్ట వద్ద మద్దయ్య(42) అనే వ్యక్తి రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఈయన ఈనెల 11న కర్నూలు నుంచి విజయవాడకు వెళ్లారు. అక్కడ అమ్మవారిని దర్శించుకొని మంగళవారం రాత్రి రైలులో తిరిగి వస్తుండగా మార్గమధ్యలో గుడిమెట్ట వద్ద రైలు నుంచి జారి కింద పడి మృతి చెందినట్లు బుధవారం రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడి కుటుంబానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. -
సూక్ష్మ సేద్యం పరికరాల ఏర్పాటులో జాప్యం చేయొద్దు
కర్నూలు(అగ్రికల్చర్): సూక్ష్మ సేద్యం మంజూరు చేసిన రైతులకు సత్వరం మెటీరియల్ సరఫరా చేయడంతో పాటు వారి పొలాల్లో అమర్చాలని, ఈవిషయంలో జాప్యం చేయొద్దని ఏపీఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్ కె.శ్రీనివాసులు డ్రిప్ కంపెనీల ప్రతినిధులను ఆదేశించారు. బుధవారం తన కార్యాలయంలో డ్రిప్ కంపెనీల జిల్లా కో–ఆర్డినేటర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రైతులు బిందు, తుంపర్ల సేద్యం కోసం పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకుంటున్నారని, నాన్ సబ్సిడీ కూడా చెల్లిస్తున్నారని తెలిపారు. 2025–26లో 7000 హెక్టార్లకు సూక్ష్మ సేద్యం మంజూరు చేయాలనేది లక్ష్యం కాగా.. ఇప్పటికే 1,450 హెక్టార్లకు సూక్ష్మ సేద్యం కల్పించేందుకు పరిపాలన అనుమతులు లభించాయని తెలిపారు. పరిపాలన అనుమతులు వేగంగా లభిస్తున్నాయని, కంపెనీలు కూడా పైపులు, ఇతర పరికరాలు జాప్యం లేకుండా సరఫరా చేయాలని పేర్కొన్నారు. పరికరాల నాణ్యతలో ఏవైన తేడాలు వస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో పత్తి, మిర్చి, ఉల్లి, ఆయిల్పామ్ పెద్ద ఎత్తున సాగు అవుతున్నాయని, ఈ పంటలకు డ్రిప్ సదుపాయం కల్పించుకునేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. పరికరాలు అమర్చడం ద్వారా డ్రిప్ సదుపాయాన్ని వెంటనే సద్వినియోగం చేసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంఐపీ అదనపు పీడీ పిరోజ్ ఖాన్ పాల్గొన్నారు. కంపెనీల ప్రతినిధులకు ఏపీఎంఐపీ పీడీ ఆదేశం -
మద్యం బార్లకు అధిక దరఖాస్తులొచ్చేలా చూడండి
కర్నూలు: మద్యం బార్ల పాలసీ నెలాఖరుకు ముగుస్తున్నందున కొత్త పాలసీ గురించి వ్యాపారులకు వివరించి అధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చేలా చర్యలు తీసుకుని ప్రభుత్వానికి ఆదాయం సమకూరేలా చూడాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ నోడల్ డిప్యూటీ కమిషనర్ పి.శ్రీదేవి ఎకై ్సజ్ క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. స్థానిక డీసీ కార్యాలయంలో బుధవారం కర్నూలు, నంద్యాల జిల్లాల ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్లతో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూమ్లు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినందున ఇందుకు సంబంధించి మద్యం వ్యాపారుల నుంచి రుసుం వసూలు చేయాలన్నారు. లైసెన్స్ ఫీజు రూ.55 లక్షలు ఉన్న దుకాణాల నుంచి రూ.5 లక్షలు, రూ.65 లక్షలకు పైగా లైసెన్స్ ఫీజు ఉన్న దుకాణాల నుంచి ఏడాదికి రూ.7.50 లక్షలు పర్మిట్ రూమ్లకు రుసుం వసూలు చేయాలన్నారు. అలాగే నాటుసారాను సమూలంగా నిర్మూలించడానికి ప్రవేశపెట్టిన నవోదయం 2.0 కార్యక్రమంపై చర్చించారు. కర్నూలును సారా రహిత జిల్లాగా నెలాఖరుకు ప్రకటించాల్సి ఉన్నందున ఆ దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అసిస్టెంట్ కమిషనర్ రావిపాటి హనుమంతరావు, ఎకై ్సజ్ కర్నూలు, నంద్యాల జిల్లా అధికారులు మచ్చ సుధీర్ బాబు, రవికుమార్, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్లు రామకృష్ణా రెడ్డి, రాముడు, రాజశేఖర్ గౌడు, సీఐలు చంద్రహాస్, రాజేంద్ర ప్రసాద్, జాన్ సైదులు మంజుల, రమేష్ రెడ్డి, లలితా దేవి, స్వర్ణలత, రామాంజినేయులు, మోహన్ రెడ్డి, విజయ్ కుమార్, వరలక్ష్మి, సతీష్ తదితరులు సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఎకై ్సజ్ నేర సమీక్ష సమావేశంలో నోడల్ డిప్యూటీ కమిషనర్ -
ఒకే యాప్ ప్రవేశ పెట్టాలి
అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి ప్రస్తుతం అమల్లో ఉన్న బాల సంజీవిని, పోషణ్ ట్రాకర్ యాప్లలో ఏదో ఒకదాన్ని మాత్రమే అమలు చేయాలి. రెండు యాప్ల వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. బాల సంజీవిని యాప్తో ఒకే సారి దాదాపు 200 మంది ఫేస్ రికగ్నైజ్ చేయలంటే చాలా సమయం పడుతుంది. నాలుగైదు పర్యాయాలు లబ్ధిదారుల నుంచి ఓటీపీ కోరాల్సి ఉంది. నిరక్షరాస్యులైన మహిళల నుంచి ఓటీపీ చెప్పించుకోవడం కష్టసాధ్యంగా ఉంది. ఈ నేపథ్యంలోనే అధికారుల ఒత్తిడి తీవ్రంగా ఉంది. సెల్ఫోన్ సామర్థ్యాన్ని పెంచడంలో భాగంగా 5జీ సెల్ఫోన్స్ అందించాలి. – కే వెంకటమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ( సీఐటీయూ ) -
మళ్లీ మొదటికొచ్చిన వీఏఏల బదిలీలు
కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ శాఖలో గ్రామ వ్యవసాయ సహాయకుల(వీఏఏ) బదిలీల వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. బదిలీల్లో అన్యాయంపై సుమారు 40 మంది వీఏఏలు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు మూడు వారాల క్రితం ఎక్కడి వారిని అక్కడే కొనసాగించాలని స్టేటస్ కో ఉత్తర్వులు ఇచ్చింది. ఆరు జిల్లాల నుంచి కోర్టును ఆశ్రయించగా.. ఉమ్మడి కర్నూలు, కృష్ణా జిల్లాల బదిలీల్లో అక్రమాలు జరిగినట్లు హైకోర్టు నిర్ధారించింది. ఈ రెండు ఉమ్మడి జిల్లాల్లో బదిలీల కౌన్సెలింగ్ తిరిగి చేపట్టాలని ఈనెల 11న ఆదేశించడం గమనార్హం. చేతులు మారిన రూ.16లక్షలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో 474 మంది వీఏఏలు ఉండగా 447 మందిని బదిలీ చేశారు. రేషనలైజేషన్ వల్ల ఉమ్మడి జిల్లాలో 188 రైతుభరోసా కేంద్రాలు మూత పడ్డాయి. ప్రధానంగా నంద్యాల జిల్లాలో 117 ఆర్బీకేలు మూతపడ్డాయి. ఈ కారణంగా చాలామంది వీఏఏలు కర్నూలు జిల్లాకు అలాట్ అయ్యారు. అయితే బదిలీల్లో ముడుపులకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.16లక్షలు చేతులు మారినట్లు వ్యవసాయ శాఖలో చర్చ జరుగుతోంది. బదిలీలకు సంబంధించి విడుదల చేసిన జీఓ(23, 5)లను ఏమాత్రం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. చిన్న ఉద్యోగులనూ దోచుకున్నారు గ్రామ వ్యవసాయ సహాయకుల(వీఏఏ) బదిలీల్లో రాజకీయ సిఫారసులకే పెద్దపీట వేశారని తెలుస్తోంది. కూటమి పార్టీల నేతలు చిన్న ఉద్యోగులను కూడా వదలకుండా అందిన కాడికి వసూలు చేసుకొని సిఫారసు లేఖలు ఇచ్చినట్లు సమాచారం. ఒక్కొక్కరి నుంచి రూ.20 వేలు ప్రకారం వసూలు చేసినట్లు చర్చ జరుగుతోంది. ఏకంగా 115 మంది వీఏఏలు ప్రజాప్రతినిధుల సిఫారుసుతో కోరుకున్న చోటుకు బదిలీ అయినట్లు హైకోర్టు గుర్తించింది. సిఫారసులు లేకుండానే కొరుకున్న చోటుకు బదిలీ చేసినందుకు కొందరు అధికారులు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేసినట్లు తెలిసింది. ముడుపుల వసూళ్లలో జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో పనిచేసే టెక్నికల్ ఏఓల్లో ఒకరు కీలకంగా వ్యవహరించినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బదిలీలను రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు 115 మందికి ప్రజా ప్రతినిధుల సిపారసు లేఖలు రూ.16లక్షల వరకు వసూలు చేసిన కూటమి నేతలు ప్రత్యేక కౌంటర్ తెరిచిన కొందరు అధికారులు నిబంధనలకు లోబడి బదిలీలు చేపట్టాలని హైకోర్టు ఆదేశం అభాసుపాలైన వ్యవసాయ శాఖ ముడుపులు ఇచ్చుకొని కోరుకున్న చోటుకు బదిలీ చేయించుకున్నాం.. మళ్లీ కౌన్సెలింగ్ నిర్వహిస్తే తమ పరిస్థితి ఏమిటని వీఏఏల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. డబ్బులు పోయి, తిరిగి పోస్టింగ్ ఆ ప్రాంతానికే వస్తుందో రాదోననే కొందరు వీఏఏలు సతమతం అవుతున్నారు. ఇటీవల చేపట్టిన మండల వ్యవసాయ అధికారులు, ఏడీఏలు, డీడీఏల బదిలీలతో వ్యవసాయ శాఖ అభాసుపాలైంది. గ్రామస్థాయిలోని వీఏఏల బదిలీల్లో సైతం ముడుపుల వ్యవహారం ఈ శాఖ పరువును బజారున పడేసింది. -
శోభాయమానం.. ఆరాధనోత్సవం
మంత్రాలయం: శ్రీరాఘవేంద్రస్వామి 354వ ఆరాధన సప్తరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల నేతృత్వంలో 6వ రోజు బుధవారం ఉత్సవాలు రమణీయంగా సాగాయి. వేకువ జామున 5.30కు సుప్రభాత సేవతో వేడుకలు ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా రాఘవేంద్రుల మూల బృందావనానికి విశేష పూజలు, రాయరు పాదపూజ, మూలదేవర సంస్థాన పూజ, శ్రీరాఘవేంద్రస్వామి మఠం 13వ పీఠాధిపతి సుజ్ఞానేంద్రతీర్థుల ఆరాధనలు కనుల పండువగా సాగాయి. ఈ ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. అశ్వ వాహనంపై విశ్వ మోహనుడు బుధవారం రాత్రి 10 గంటలకు ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయులు అశ్వ వాహనంపై కడు వైభవంగా ఊరే గారు. మంగళ వాయిద్యాలు, దాస సాహిత్య మండలి మహిళల భజనలు, అశేష భక్త జనం హర్ష ధ్వానాల మధ్య శ్రీమఠం ప్రాంగణ వీధుల్లో విహరించారు. అనంతరం చెక్క, వెండి, అంబారి, స్వర్ణ రథాలపై ఉత్సవమూర్తికి రథయాత్రలు నిర్వహించారు. ఈ వేడు కలో మఠం ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతిఆచార్, ధార్మిక సహాయకాధికారి వ్యాసరాజాచార్, ద్వారపాలక అనంతస్వా మి, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వై.ప్రదీప్ కుమా ర్రెడ్డి, సర్పంచ్ తెల్లబండ్ల బీమయ్య పాల్గొన్నారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు ఆరాధన సప్తరాత్రోత్సవాలు సందర్భంగా యోగీంద్ర మండపంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. బెంగళూరుకు చెంది న విదూషి సంగీత కులకర్ణి దాసవాణి, సుధా స్కూలు బృందం హరిదర్శన నృత్య రూపకం భక్తులను మంత్రముగ్దులు చేసింది. నేడు సర్వ సమర్పణోత్సవం ఉత్సవాల ఆఖరిరోజు అయిన గురువారం సర్వ సమర్పణోత్సవం జరుగనుంది. ఏక కాలంలో పంచ వాహనాలపై ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయులు, రాఘవేంద్రులను శ్రీమఠం మాడ వీధుల్లో ఊరేగిస్తారు. ఉద యం అనుమంత్రాలయం తుంగభద్ర గ్రామం మృత్తిక బృందావన క్షేత్రంలో ఆరాధన వేడుకలు, రథయాత్ర నిర్వహిస్తారు. అశ్వ వాహనంపై ఊరేగిన ప్రహ్లాదరాయులు వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు -
యువకుడి అనుమానాస్పద మృతి
నంద్యాల: ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. పాణ్యం మండలం కౌలూరు గ్రామ సమీపంలోని రైలు పట్టాల మధ్య మృతదేహం లభించింది. రైల్వే పోలీసులు, గ్రామస్తుల వివరాల మేరకు.. గడివేముల మండలం కొర్రపోలూరుకు చెందిన రామసుబ్బయ్య కుమారుడు సూర్య (23) డిగ్రీ చదివి ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్కెళ్లాడు. ఇటీవలే అక్కడి నుంచి స్వగ్రామానికి వచ్చిన ఆ యువకుడు పని ఉందంటూ రెండు రోజుల క్రితం నంద్యాలకు వచ్చారు. ఏమైందో ఏమో తెలియదు కానీ కౌలూరు సమీపంలో రైల్వే పట్టాలపై శవమై కనిపించాడు. రైల్వే పోలీసులు గుర్తించి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఇదిలా ఉండగా మృతుడు ఓ యువతిని ప్రేమించాడని..అయితే ఇరువురి కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదని సమాచారం. ఈ క్రమంలో యువకుడి మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. ఎవరైనా చంపేసి అక్కడ పారవేశా రా లేక ప్రేమ విఫలమై యువకుడే ఆత్మహత్య చేసుకున్నాడా అన్నది పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. తమ కుమారుడిది హత్యేననివిచారించి న్యాయం చేయాలని సూర్యతల్లిదండ్రులు కోరుతున్నారు. -
పని ఒత్తిడి పెరిగిపోయింది
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల యాప్లతో అంగన్వాడీ కార్యకర్తలు చాలా ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో సిగ్నల్స్ పనిచేయకపోవడం, యాప్స్ సపోర్టు చేయడం లేదు. 2జీ సెల్ ఫోన్ స్థానంలో 5 జీ సెల్ ఫోన్లు అందించాలని కోరుతూనే ఉన్నాం. అలాగే వర్కర్లకు నెలకు రూ.26 వేలు, సహాయకులకు రూ.13 వేలు ఇవ్వాలని అనేక రూపాల్లో ఆందోళనలు చేస్తూనే ఉన్నాం. అయినా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ యాప్ వల్ల ఇటీవలి కాలంలో పని ఒత్తిడి పెరిగిపోయింది. ఫేస్ క్చాప్చర్ చేసేందుకే కనీసం గంట సమయం పడుతోంది. – బీ రేణుకమ్మ, జిల్లా అధ్యక్షురాలు, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ (సీఐటీయూ) -
యువకుని అవయవ దానం
● ముగ్గురికి కొత్త జీవితం కర్నూలు (హాస్పిటల్): ఒక యువకుడు చేసిన అవయవ దానం ముగ్గురికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం పెద్దకొప్పెర్ల గ్రామానికి చెందిన టి.శివరామ సుబ్బయ్య (39)కు భార్య రామసుబ్బమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈయన ఈనెల 10న స్నేహితులతో కలసి దగ్గర్లోని నదికి చేపలు పట్టడానికి వెళ్లాడు. అక్కడ జారిపడటంతో తలకు పెద్ద రాయి తగిలి తీవ్ర గాయమైంది. వెంటనే అతను జమ్మలమడుగు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరిస్థితి బాగోలేదని చెప్పి కర్నూలుకు పంపారు. అదే రోజు ఓమ్నీ హాస్పిటల్లో చేర్చి వెంటిలేటర్పై ఉంచారు. మెరుగైన చికిత్స కోసం మరుసటి రోజు మెడికవర్ హాస్పిటల్కు తీసుకువచ్చారు. కానీ అతనిని బ్రెయిన్డెడ్గా వైద్యులు ప్రకటించారు. ఆసుపత్రిలోని జీవన్దాన్ ట్రస్టు వారు అవయవ దానం గురించి శివరామ సుబ్బయ్య కుటుంబానికి చెప్పగా వారు అంగీకరించారు. కర్నూలు మెడికల్ కళాశాల ఫోరెన్సిక్ మెడిసిన్ హెచ్ఓడీ డాక్టర్ సాయిసుధీర్ నేతృత్వంలో డాక్టర్ అబ్దుల్ సమద్, డాక్టర్ సిద్ధార్థ హెరూర్, డాక్టర్ బి.ప్రవీణ్, డాక్టర్ శరత్ తదితరులు అవయవాలను సేకరించారు. సేకరించిన అవయవాల్లో ఒక కిడ్నీని నెల్లూరు అపోలో హాస్పిటల్కు, మరో కిడ్నీని మెడి కవర్ హాస్పిటల్లోనే ఒక రోగికి, కాలేయాన్ని కర్నూలు కిమ్స్ హాస్పిటల్కు తరలించారు. అనంతరం అవయవదానం చేసిన వ్యక్తి కుటుంబాన్ని ఆసుపత్రి యాజమాన్యం ఘనంగా సన్మానించింది. కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ క్లస్టర్ హెడ్ మహేశ్వర్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
భువనమోహనుడికి బ్రహ్మరథం
● అశేష జనవాహిని మధ్య సాగిన రాఘవేంద్రుల రథయాత్ర ● అలరించిన కళాకారుల నీరాజనాలు అశేష భక్తజన వాహిని మధ్య రాయరు రథోత్సవ దృశ్యం మంత్రాలయం: భువనమోహనుడు మహారథంపై ఊరేగిన వేళ.. తుంగభద్రమ్మ మది పులకించిపోయింది. వేదభూమి పరవశించి ఆధ్యాత్మిక పరిమళాలతో శోభిల్లింది. భక్తజనం హర్షధ్వానాలతో జపించింది. రాఘవేంద్రస్వామి 354వ సప్తరాత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం మహారథోత్సవం కనులపండువగా సాగింది. ఉత్తరారాధనలో భాగంగా ముందుగా ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయులు వేద పాఠశాలకు మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా చేరుకున్నారు. అక్క డ పాఠశాల విద్యార్థులు ఉత్సవమూర్తికి వేద పఠనం గావించి దర్శించుకున్నారు. అనంతరం శ్రీమఠం మూల బృందావనం చేరుకోగా స్వామి వారికి విశేష పూజలు గావించి వసంతోత్సవానికి శ్రీకారం పలికారు. గర్భాలయంలో అర్చకులు, పండితులు, పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు గులాలు చల్లుకుని ఆచార వైభవాన్ని స్పృశింపజేశారు. అనంతరం ఉత్సవమూర్తిని మహారథంపై కొలువుంచగా.. భక్తజనులు గోవిందా.. గోవిందా.. అంటూ ప్రణమిల్లుతూ దర్శించుకు న్నారు. పీఠాధిపతి ప్రవచనం ముగియగానే భక్తులను ఆశీర్వచనం చేస్తూ 12.15 గంటలకు రథయాత్రకు అంకురార్పణ పలికారు. మధ్వ కారిడార్ చేరుకోగానే స్వామిజీ హెలికాప్టర్తో పుష్పవృష్టి కురిపించారు. మంగళ వాయిద్యాలు, డోలు దరువులు, రంగుల ఆటలు, యువతుల సంప్రదాయ నృత్య ప్రదర్శనలు, కోలాటాల మధ్య మహారథం ముందుకు కదిలింది. రాఘవేంద్ర సర్కిల్ వద్ద స్వామిజీ పూర్వాశ్రమ కుటుంబ సభ్యులు ఉత్సవమూర్తికి పూజలు చేసుకుని మొక్కు లు తీర్చుకున్నారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ రథోత్సవంలో పాల్గొన్నారు. డీఎస్పీ వెంకటరామయ్య ఆధ్వర్యంలో సీఐలు, ఎస్ఐలు సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రూ.250 కోట్లతో జలాశయం మంత్రాలయం క్షేత్రం సౌకర్యార్థం రూ.250 కోట్లతో జలాశయాన్ని నిర్మిస్తున్నట్లు పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు తెలిపారు. వేడుకలో స్వామిజీ ప్రసంగిస్తూ క్షేత్రంలో అంతర్గత రహదారులతో పాటు రింగ్ రోడ్డు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. రాఘవేంద్ర సర్కిల్ వరకు కారిడార్ నిర్మిస్తామ న్నారు. శ్రీమఠం దినదినాభివృద్ధికి అంతరంగిక భక్తుల సహకారం ఎంతో ఉందన్నారు. వేడుకల్లో పండిత కేసరి రాజా ఎస్. గిరియాచార్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ రాఘవేంద్రరెడ్డి, తహసీల్దార్ రమాదేవి, శ్రీమఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్–1 శ్రీనివాసరావు, మేనేజర్–2 వెంకటేష్జోషి, మేనేజర్–3 శ్రీపతి ఆచార్ తదితరులు పాల్గొన్నారు. -
బ్యాంకులు రుణాలివ్వవు.. ప్రభుత్వ పథకాలు వర్తించవు
కర్నూలు(అగ్రికల్చర్): కౌలుదారుల అభ్యున్నతికి చర్యలు తీసుకోవడంలో కూటమి ప్రభుత్వం చేతులెత్తేసింది. ఉమ్మడి జిల్లాలో ఆగస్టు 4వ తేదీ వరకు 34,258 మంది కౌలుదారులకు సీసీఆర్సీ కార్డులు జారీ చేసినా ఒక్కరికీ మేలు జరిగిన దాఖలాలు లేవు. సీసీఆర్సీ కార్డులు పొందిన సాగుదారుల్లో ఒక్కరికి కూడా అన్నదాత సుఖీభవ సాయం అందకపోవడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సాగుదారులకు అండగా నిలిస్తే.. కూటమి ప్రభుత్వం కౌలు రైతుల సంక్షేమానికి తూట్లు పొడుస్తోంది. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా తయరవుతోంది. 2025–26 సంవత్సరానికి సంబంధించి వ్యవసాయ, రెవెన్యూ అధికారులు గ్రామాల వారీగా గ్రామ సభలు నిర్వహించి కౌలుదారుల నుంచి దరఖాస్తులు తీసుకొని సీసీఆర్సీ(ప్రస్తుతానికి) కార్డులు జారీ చేస్తున్నా ఫలితం లేకపోతోంది. కౌలుదారులకు రుణాలు ఇవ్వాలని కోరుతూ వ్యవసాయ అధికారులు ఈ కార్డుల వివరాలను సంబంధిత బ్యాంకులకు ఎప్పటికప్పుడు పంపుతున్నా వీటిని బ్యాంకర్లు పరిగణనలోకి తీసుకోని పరిస్థితి.సీసీఆర్సీ కార్డుల జారీలో సైతం ముడుపులే..కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయి. చివరికి కౌలుదారులకు జారీ చేసే సీసీఆర్సీ కార్డుల జారీకి కూడా కొందరు వీఆర్వోలు ముడుపులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సీసీఆర్సీ కార్డు జారీ కావాలంటే రూ.10 స్టాంపుపై రాసుకున్న అగ్రిమెంట్ భూ యజమాని, కౌలుదారు ఇద్దరూ సంతకాలు చేయాల్సి ఉంది. అయితే వీఆర్ఓలు మేము క్షేత్రస్థాయికి వచ్చి విచారణ జరుపుతామని నాణ్చివేత ధోరణికి పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో అవన్నీ ఎందుకు అన్నట్లుగా రూ.1,000 వరకు డబ్బులిచ్చి కార్డులు పొందుతున్నట్లు సమాచారం.బ్యాంకర్లు చెబుతన్న కారణాలు ఇవీ..● కౌలుదారులకు రుణాలు ఇవ్వలేమని వివిధ బ్యాంకులు స్పష్టంగా ప్రకటించాయి.● ఇప్పటికే కౌలుదారులు సాగు చేసుకుంటున్న భూ ములపై యజమానులు రుణాలు తీసుకున్నారు.● ఒకే భూమిపై ఇటు యజమానికి, అటు కౌలుదారులకు రుణాలు ఇవ్వలేం.● ఒకవేళ భూముల యజమానులు రుణాలు తిరిగి చెల్లిస్తే.. ఆ స్థానంలో కౌలుదారులకు రుణాలు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తాం.తడిసి మోపెడవుతున్న కౌలుమెట్ట భూమి అయితే ఒక ఎకరా కౌలు కనీసం రూ.5వేల నుంచి 10 వేల వరకు ఉంటోంది. నీటి పారుదల సదుపాయం ఉంటే ఎకరాకు రూ.30 వేల వరకు కౌలు తీసుకుంటున్నారు. సెంటు భూమి కూడా లేని వారు భూములను కౌలుకు తీసుకొని వ్యవసాయంలో రాణిస్తున్నారు. కౌలు, పెట్టుబడి మొత్తం కలిపి ఎకరాకు పంటను బట్టి రూ.50 వేల నుంచి రూ.75 వేల వరకు వస్తోంది. సీసీఆర్సీ కార్డులు పొందినప్పటికీ బ్యాంకులు సహకరించకపోవడంతో పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. మరికొందరు భార్యల బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకుంటున్న పరిస్థితి నెలకొంది.కౌలుదారులకు అండగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంగత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 11 నెలల కాలపరిమితితో సీసీఆర్సీ కార్డులు జారీ చేసింది. ఈ రైతులకు పెట్టుబడి సాయంగా వైఎస్ఆర్ రైతుభరోసా కింద రూ.13,500 పూర్తిగా అందించింది. కౌలుదారులతో పాటు ఆర్ఓఎఫ్ఆర్ రైతులు, దేవదాయ భూములు అనుభవిస్తున్న వారికి సీసీఆర్సీ కార్డులు జారీ చేసి రైతు భరోసాను వర్తింపజేసింది. 2023–24లో భారీ ఎత్తున సీసీఆర్సీ కార్డులు జారీ కావడంతో వైఎస్ఆర్ రైతుభరోసా కింద ఎక్కువ మంది రైతులకు ప్రయోజనం లభించింది. ఒక్క ఏడాదే కాదు ఐదేళ్లూ కౌలుదారులకు పెట్టుబడిసాయం అందింది. మొత్తం 28,600 మంది సాగుదారులు వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతు భరోసాతో లబ్ధి పొందడం విశేషం.కౌలు రైతులు ఎలా బతికేదిఐదు ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేస్తున్నా. కౌలు కింద కరెంట్ మోటార్ ఉంటే ఎకరాకు 22 బస్తాలు, లేకపోతే 18 బస్తాలు ధాన్యం ఇవ్వాల్సి ఉంది. 2024–25లో ప్రభుత్వం సీసీఆర్సీ కార్డు మంజూరు చేసింది. ఈ కార్డు 2025–26 సంవత్సరానికి రెన్యూవల్ అయ్యింది. కూటమి ప్రభుత్వం ప్రకటించిన అన్నదాత సుఖీభవ కింద ఒక్క రూపాయి కూడా అందలేదు. బ్యాంకులకు పోతే రుణాలు ఇవ్వం అంటున్నారు. సంక్షేమ పథకాలు వర్తించకపోతే ఎలా బతికేది. – గడ్డం నరసింహుడు, పార్నపల్లి, బండిఆత్మకూరు మండలంతూతూ మంత్రంగా సీసీఆర్సీ కార్డులుఉమ్మడి జిల్లాలో 7 లక్షల మంది రైతులు ఉన్నారు. అనావృష్టి, అతివృష్టి వల్ల ఏటా పంటలు దెబ్బతింటుండటం వల్ల కొన్నేళ్లుగా రైతులు భూములను కౌలుకు ఇస్తూ వలస వెళ్తున్నారు. అనధికారికంగా జిల్లాలో కౌలు రైతులు దాదాపు 2.50 లక్షల వరకు ఉన్నారు. భూమి యజమాని సమ్మతితోనే సీసీఆర్సీ కార్డులు జారీ చేస్తారు. ఈ ప్రకారం 2025–26లో కర్నూలు జిల్లాలో 25 వేలు, నంద్యాల జిల్లాలో 30 వేల ప్రకారం సీసీఆర్సీ కార్డులు జారీ చేయాలనేది లక్ష్యం. ఖరీఫ్ సీజన్ మొదలై రెండు నెలలు గడిచినా ఇప్పటి వరకు 11 నెలల కాలపరిమితితో కర్నూలు జిల్లాలో 21,799, నంద్యాల జిల్లాలో 12,459 కార్డులు మాత్రమే జారీ అయ్యాయి. -
టోకెన్లు ఇచ్చారు.. యూరియా లేదంటారు!
కౌతాళం: అధికారుల ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో పరిస్థితికి పొంతన లేదని చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనం. ఓ వైపు ఎరువుల కొరత లేదని అధికారులు చెబుతుంటే.. నెల రోజులుగా నిరీక్షిస్తున్నామని రైతులు రోడ్డెక్కారు. రెండు నెలల నుంచి రైతులకు రైతు సేవా కేంద్రాల చుట్టూ తిప్పకుంటున్నారే తప్ప యూరియా ఇవ్వడం లేదు. దీంతో అధికారుల తీరును నిరసిస్తూ మంగళవారం కౌతాళంలో రైతులు రోడ్డెక్కా రు. గత నెల 15వ తేదీన కొందరికి, 17వ తేదీన మరి కొంత మంది రైతులకు యూరియా కోసం డబ్బులు తీసుకుని టోకెన్లు ఇచ్చారు. ఇప్పటికే 28 రోజులు గడిచినా యూరి యా లేక పోవడంతో ఆందోళన చెందారు. మంగళవారం రైతు సేవా కేంద్రానికి యూరియా లోడ్ వచ్చిందన్న విషయం తెలుసుకున్న రైతులు తరలివచ్చారు. అయితే డబ్బులు తీసుకుని టోకెన్లు రాసి ఇచ్చిన వారికే యూరియా తక్కువ వస్తుందని, మిగతా వారికే ఎలా ఇవ్వాలని ఎంపీఈఓ కార్తీక్ రైతులను సముదాయించారు. అందరికీ యూరి యా ఇవ్వాలని, వ్యవసాయాధికారి శేషాద్రిని పిలిపించాలని రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఏఓ అక్కడికి చేరుకుని నెల క్రితమే టోకెన్లు తీసుకున్న వారికి మూడు బస్తాల చొప్పున యూరి యా ఇచ్చి మిగితాది వేరే రైతులకు ఇస్తామని చెప్పా రు. అయితే నెల రోజుల క్రితం డబ్బులు కట్టి నిరీక్షిస్తున్న తమ యూరియా ఇవ్వక పోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రైతులను కూటమి ప్రభుత్వం ఇక్కట్లకు గురి చేస్తుందని విమర్శించారు. -
జెండా.. గుండెల నిండా!
● 1.1 కిలోమీటర్ల పొడవు జాతీయ జెండా ప్రదర్శన కర్నూలు(సెంట్రల్): ఆజాదీకి అమృత్ మహోత్సవంలో భాగంగా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కర్నూలులో 1.1 కిలోమీటర్ల జాతీయ జెండాను విద్యార్థులు, యువతీ, యువకులు ప్రదర్శించారు. సుంకేసుల రోడ్డులో ఉన్న సెయింట్ జోసెఫ్ కళాశాల నుంచి కొండారెడ్డి బురుజు వరకు దాదాపు 2,800 మంది విద్యార్థులు మువ్వన్నెల తిరంగా ప్రదర్శించగా కలెక్టర్ పి.రంజిత్బాషా వీక్షించారు. గ్లోబల్ టౌన్షిప్ మేనేజింగ్ డైరక్టర్ ఖాజా మాలిక్, సెయింట్ జోసెఫ్ కళాశాల విద్యార్థులు, ఐ అముజయ యునైటెడ్ యంగ్ స్టార్ అసోసియేషన్ యూత్ బిగ్రేడు–2025 సహకారంతో 1.1 కిలోమీటర్ల పొడవు జాతీ య జెండాను రూపొందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి.రంజిత్బాషా మాట్లాడుతూ ఇలాంటి మువ్వన్నెల జెండాల ప్రదర్శన ద్వారా ప్రజల్లో జాతీయ సమైక్యత భావాలు కలుగుతాయని, ఆగస్టు 15వ తేదీ వరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని సూచించారు. కాగా, ఈ కార్యక్రమాన్ని వరల్డ్ రికార్డ్స్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు వచ్చి రికార్డు చేశారు. కార్యక్రమంలో డీఈఓ శామ్యూల్పాల్, గ్లోబల్ టౌన్షిప్ ఎండీ పవన్ సోలంకి, సెయింట్ జోసెప్ కళాశాలకు చెందిన డీన్ శౌరీలు రెడ్డి, ప్రిన్సిపాల్ శాంత పాల్గొన్నారు. -
రానున్న మూడు రోజులూ వర్షాలే..
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు కోసిగి, తుగ్గలి మండలాల్లో మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. అయితే వర్షాలు తేలికపాటి నుంచి ఒక మోస్తరుకే పరిమితం అయ్యాయి. వెల్దుర్తిలో 32.8, హాలహర్విలో 24.8, మద్దికెరలో 23.8, చిప్పగిరిలో 22.6, క్రిష్ణగిరిలో 18.8, ఆలూరులో 18.6, ఆస్పరిలో 15, గోనెగండ్లలో 14.2, ఓర్వకల్లో 11.2, హొళగుందలో 9.2, కల్లూరులో 7.8 మి.మీ ప్రకారం వర్షాలు కురిశాయి. జిల్లా మొత్తం మీద సగటున 9.5 మి.మీ వర్షపాతం నమోదైంది. ఆగస్టు నెల సాధారణ వర్షపాతం 116.2 మి.మీ ఉండగా.. ఇప్పటి వరకు 124.4 మి.మీ వర్షపాతం నమోదు కావడం గమనార్హం. కాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. ఒకటి, రెండు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ట్రిపుల్ ఐటీడీఎం రిజిస్ట్రార్ బాధ్యతల స్వీకరణ కర్నూలు సిటీ: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ డిజైన్ మ్యాను ఫ్యాక్చరింగ్(ట్రిపుల్డీఎం) రిజిస్ట్రార్గా రాజ్ కుమార్ మాంఝీవాల్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర విద్యాశాఖతో సమన్వయం చేసుకొని ట్రిపుల్ఐటీడీఎం క్యాంపస్ రెండో దశ పనులను ప్రారంభిస్తామన్నారు. క్యాంపస్ కాంపౌండ్ వాల్ను పూర్తి చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. దేశంలోని అగ్రశ్రేణి సాంకేతిక సంస్థలతో ట్రిపుల్ఐడీ పోటీ పడేలా తీర్చిదిద్దుతామన్నారు. ఇటీవల బదిలీ అయిన గురుమూర్తి స్థానంలో జైపూర్లోని మాలవ్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో డిప్యూటీ రిజిస్ట్రార్గా పని చేస్తున్న రాజస్థాన్కి చెందిన రాజ్కుమార్ మాంఝీవాల్ను నియమించారు. ఈయన ఐఐటీ జమ్మూకశ్మీర్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్లో పని చేశారు. నూతన రిజిస్ట్రార్కు క్యాంపస్ అధ్యాపకులు స్వాగతం పలికారు. 22న మాజీ సైనికుల సమస్యలకు పరిష్కారం కర్నూలు(అర్బన్): మాజీ సైనికులు, ఆయా కుటుంబాల వితంతువుల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ఈ నెల 22న మద్రాసు రెజిమెంట్కు చెందిన అధికారులు ఇక్కడకు వస్తున్నట్లు జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఎస్.ఆర్.రత్నరూత్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయంలో ఆ రోజున ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంబంధిత అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. మద్రాస్ రెజిమెంట్కు సంబధించిన వారు తమ సమస్యల పరిష్కారానికి పెన్షన్ పేమెంట్ ఆర్డర్, డిశ్చార్జి బుక్, అప్డేట్ బ్యాంకు పెన్షన్ పాస్ బుక్తో పాటు అవసరమైన ధృవపత్రాలతో స్వయంగా హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు సైనిక సంక్షేమ కార్యాలయ పనివేళల్లో 08518– 229445 నెంబర్ను సంప్రదించాలని పేర్కొన్నారు. -
దేవుడికి పూజారి శఠగోపం
● మట్కా ఆడి అప్పులపాలైన పూజారి ● దేవుడి వెండి ఆభరణాలు విక్రయించేందుకు యత్నం ● ఆభరణాలు తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్న పోలీసులుఆదోని అర్బన్: దేవుడి సేవలో తరించాల్సిన పూజారి మట్కాకు బానిసై అప్పులపాలయ్యాడు. అప్పుల బాధ నుంచి బయటపడేందుకు ఏకంగా దేవుడి ఆభరణాలపై కన్నేశాడు. వాటిని గుట్టుగా అపహరించి విక్రయించేందుకు తరలిస్తుండగా పోలీసులు రంగ ప్రవేశం చేసి అరెస్ట్ చేశారు. ఆదోని డీఎస్పీ హేమలత తెలిపిన వివరాల మేరకు.. ఆదోని మండలం నారాయణపురం గ్రామంలో వెలిసిన శ్రీ వసిగేరప్ప దేవాలయంలో పూజారిగా పనిచేస్తున్న గొర్రెల వసిగేరప్ప మట్కా ఆడుతూ అప్పులపాలయ్యాడు. బెంగళూరులో ఉంటూ మట్కా ఆడి అప్పులపాలయ్యాడు. ఈ క్రమంలో దేవుడి ఆభరణాలు అమ్మేసి బయటపడాలని భావించాడు. దీంతో గుడిలో ఉన్న విగ్రహాలను పది రోజుల క్రితం ఇంట్లో దాచి పెట్టాడు. అయితే ఆలయంలో 4.386 కేజీల వెండి ఆభరణాలు, 10 గ్రాముల బంగారు బాసింగం కనిపించడం లేదని ఆ గ్రామానికి చెందిన కురి చంద్ర ఈనెల 10వ తేదీన ఇస్వీ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో పూజారి వసిగేరప్ప తన ఇంట్లో దాచిన ఆభరణాలను కర్ణాటక రాష్ట్రం బళ్లారిలో విక్రయించేందుకు సోమవారం తరలిస్తుండగా చాగి గ్రామం శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వ ముఖద్వారం సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆభరణాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. కేసు వివరాలను స్థానిక డీఎస్పీ బంగ్లాలో డీఎస్పీ హేమలత మీడియాకు వివరించారు. స్వాధీనం చేసుకున్న ఆభరణాలను ప్రదర్శించారు. కేసును ఛేదించిన ఆదోని రూరల్ సీఐ నల్లప్ప, ఇస్వీ ఎస్ఐ డాక్టర్ నాయక్, హెడ్కానిస్టేబుల్ రామయ్య, కానిస్టేబుళ్లు సుదర్శన్, ఖాసీంను డీఎస్పీ అభినందించారు. -
స్వర్ణ రథంపై దివ్యతేజం
● శ్రీమఠంలో వైభవంగా శ్రీరాఘవేంద్రుల మధ్యారాధనమంత్రాలయం: సద్గురు శ్రీరాఘవేంద్రులు సశరీరంగా బృందావన ప్రవేశం చేసిన శుభదినం.. పరమగురుడి 354వ ఆరాధన పర్వదినం.. వేదభూమి పులకించి తుంగభద్రమ్మ పరవశించిన తరుణం.. చూసిన కనులదే మహాభాగ్యం. విశ్వమోహనుడి ఆరాధన సప్తరాత్రోత్సవాల్లో భాగంగా నిర్వహించిన మధ్యారాధన మహా మంగళకరం. సోమవారం శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల ఆశీస్సులతో మధ్యారాధన దేదీప్యమానంగా సాగింది. వేడుకల్లో భాగంగా రాఘవేంద్రుల మూల బృందావనానికి మహా పంచామృతాభిషేకం చేశారు. అభిషేకం వేళ భక్తజన వాహిని శ్రీమఠం ప్రాంగణ వీధుల్లో కిక్కిరిసింది. రెండు గంటల పాటు మంత్రోచ్ఛారణలు, భక్తజన హర్షధ్వానాల మధ్య అత్యంత పవిత్రంగా చేపట్టారు. భక్తజనుల కోసం ప్రత్యక్ష ప్రసారం, ఎల్ఈడీ తెరల ద్వారా వీక్షణ సదుపాయం కల్పించారు. రమణీయంగా రథయాత్ర మధ్యారాధన సందర్భంగా మధ్యాహ్నం శ్రీరాఘవేంద్రుడిని బంగారు రథంపై ఊరేగించారు. రాయరు బంగారు ప్రతిమను స్వర్ణ రథంపై కొలువుంచగా పీఠాధిపతి నారికేళ సమర్పణతో మంగళ హారతులు పట్టి రథయాత్రకు అంకురార్పణ పలికారు. పండితుల వేదఘోష, మంగళ వాయిద్యాలు మధ్య శ్రీమఠం ప్రాంగణ వీధుల్లో రథయాత్ర రమణీయంగా సాగింది. వేడుకలో మేళతాళాలు, నృత్య ప్రదర్శనలు, సంకీర్తనాలాపనలు భక్తులను మైమరిపించాయి. రాఘవేంద్రస్వామి బృందావన ప్రవేశం చేసిన శుభదినం కావడంతో భక్తులు అత్యధిక సంఖ్యలో తరలి వచ్చారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి వేలకుపైగా భక్తులు తరలివచ్చినట్లు అంచనా. అలాగే రాత్రి పరిమళ తీర్థం పుష్కరిణిలో ఉత్సవమూర్తి తెప్పోత్సవం ఎంతో రమణీయంగా సాగింది. వేడుక భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. తెప్పోత్సవం అనంతరం ప్రహాదరాయలను గజవాహనంపై కడు వైభవంగా ఊరేగించారు. అలరించిన నృత్య ప్రదర్శనలుఉత్సవాల్లో భాగంగా యోగీంద్ర సభా మంటపంలో నృత్య ప్రదర్శనలకు అలరించాయి. వేడుకలో పండితకేసరి గిరియాచార్, ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్–1 శ్రీనివాసరావు, మేనేజర్–2 వెంకటేష్జోషి, జోనల్ మేనేజర్ శ్రీపతిఆచార్, ధార్మిక సహాయకాధికారి వ్యాసరాజాచార్, సంస్కృత గురుకులం ఉపకులపతి పంచముఖి, ద్వారపాలక అనంతస్వామి, వేద పాఠశాల మాజీ ప్రిన్స్పాల్ వాదిరాజాచార్, సీఐ రామాంజులు, ఎస్ఐ శివాంజులు పాల్గొన్నారు.