Kurnool
-
డబ్బు తీసిస్తానని..
నందికొట్కూరు: పట్టణంలోని చౌడేశ్వరిదేవి ఆయలం ఎదుట ఉన్న ఎస్బీఐ ఏటీఎం వద్ద ఓ కేటుగాడు వృద్ధుడిని మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణానికి చెందిన శ్రీనివాసులు ఆచారి ఏటీఎంలో డబ్బు డ్రా చేసుకోవడానికి వెళ్లిగా అక్కడే కాపుకాసిన కేటుగాడు డబ్బు డ్రా చేసి ఇస్తానని మాయమాటలు చెప్పి మొదట అకౌంట్లోని బ్యాలెన్స్ చెక్ చేసి డబ్బు ఉన్నాయని నిర్ధారించుకున్నాడు. అనంతరం తెలివిగా ఏటీఎంను మార్చి మరో ఏటీఎంను వృద్ధుడికి ఇచ్చి చిన్నగా అక్కడ నుంచి తప్పించుకున్నాడు. పట్టణంలోని ఆత్మకూరు రోడ్డులో ఉన్న హెచ్డీఎఫ్ ఏటీఎం వద్దకు వెళ్లి అకౌంట్లోని రూ.25 వేల నగదును డ్రాచేసుకుని ఉడాయించాడు. డబ్బు డ్రా అయినట్లు ఫోన్కు మెసేజ్ రావడంతో ఏటీఎంను చెక్ చేసుకోగా అది తన ఏటీఎం కాదని గుర్తించిన బాధితుడు స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. గతంలోనూ పట్టణంలోని ఏటీఎం సెంటర్ల వద్ద సదరు నిందితుడు వృద్ధులను మోసం చేసినట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు తెలిపారు. ● ఏటీఎం వద్ద వృద్ధులను టార్గెట్ చేస్తున్న కేటుగాళ్లు ● ఏటీఎం మార్పు చేసి రూ.25 వేలు చోరీ -
బలిజ విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు
కర్నూలు (అర్బన్): ఈ విద్యా సంవత్సరం 10వ తరగతి, ఇంటర్లో 90 శాతం మార్కులు సాధించిన కర్నూలు జిల్లా బలిజ విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందజేయనున్నట్లు బలిజ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మన్న, రవికుమార్ మంగళవారం సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. మార్కుల జాబితా, చిరునామా, ఫోన్ నంబర్లను సంఘం ప్రధాన కార్యదర్శి 9000009440 నంబర్కు ఈనెల 30వ తేదీ లోపు వాట్సాప్ ద్వారా పంపాలన్నారు. జూన్ 1న ప్రతిభ పురస్కారాల ప్రదాన కార్యక్రమం కర్నూలులో ఉంటుందన్నారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు వరుసగా రూ.5 వేలు, రూ.3 వేలు, రూ.2 వేల నగదు బహుమతులు అందజేస్తామని, మిగిలిన మెరిట్ విద్యార్థులందరికీ మొమెంటో, ఎగ్జిక్యూటివ్ ఫైల్, ప్రతిభ పురస్కార పత్రం ఇవ్వనున్నామన్నారు. సమావేశంలో సంఘం గౌరవాధ్యక్షులు పత్తి ఓబులయ్య, ప్రధాన సలహాదారులు డాక్టర్ సింగం శెట్టి సోమశేఖర్, ఉపాధ్యక్షుడు ఈశ్వర్ కుమార్, కోశాధికారి శైలేష్ పాల్గొన్నారు. కొనసాగుతున్న ఏపీఆర్జేసీ ప్రవేశాల కౌన్సెలింగ్ ఎమ్మిగనూరురూరల్: ఏపీఆర్జేసీ ప్రవేశాల కౌన్సెలింగ్ కొనసాగుతోంది. మంగళవారం మండల పరిఽధిలోని బనవాసి ఏపీ గురుకుల జూనియర్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎంట్రెన్స్ టెస్ట్ రాసిన అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూర్ జిల్లాల విద్యార్థినులకు ర్యాంక్ ఆధారంగా మొదటి విడతలో ఎంపీసీ, బైపీసీ విభాగాలకు కౌన్సెలింగ్ చేపట్టినట్లు ప్రిన్సిపాల్ గిర్వానీ తెలిపారు. మొదటి విడత పూర్తయిన తర్వాత మిగిలిన సీట్లకు మరోసారి కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. మూల్యాంకనానికి ఏర్పాట్లు కర్నూలు సిటీ: ఈ నెల 19వ తేదీ నుంచి మొదలైన పదో తరగతి సప్లమెంటరీ ప్రధాన పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. మైనర్ మీడియంకు చెందిన పరీక్ష బుధవారం జరగనుంది. పరీక్షలు ముగియడంతో మూల్యాంకనానికి ప్రభుత్వ పరీక్షల విభాగం ఏర్పాట్లు చేస్తోంది. సప్లమెంటరీ పరీక్షలకు సంబంధించిన సమాధాన పత్రాలు జిల్లాకు సుమారుగా 20 వేలు రానున్నాయి. ఈ నెల 31, జూన్ 1, 2 తేదీల్లో మూల్యాంకనం జరుగనుంది. ప్రస్తుతం పేపర్ కోడింగ్ జరుగుతోంది. మహిళ అదృశ్యం కోసిగి: మండల కేంద్రం కోసిగిలోని సిద్దప్ప పాళెం దుర్గానగర్లో నివాసముంటున్న ఆదోని ప్రమీలమ్మ అనే మహిళ ఈనెల 20వ తేదీ నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఆదోని శ్రీనివాసులు, దుబ్బన్న, వీరేష్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమె వయస్సు 50 సంవత్సరాలు ఉంటుందన్నారు. ఆమె భర్త ఆదోని ఈరన్న కొద్ది కాలం క్రితం హత్యకు గురై మృతి చెందాడు. ఆనాటి నుంచి ఆమె మానసికంగా బాధపడుతూ మనోవేదనకు గురైందన్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 20వ తేదీన హోటల్లో టీ తీసుకొస్తానని చెప్పి బయటకు వెళ్లి తిరిగి రాలేదన్నారు. బంధువులు, తెలిసిన వారి వద్ద గాలించినా ఆచూకి లభించలేదని తెలిపారు. ఆచూకి తెలిసిన వారు ఫోన్ నెంబర్ 99853 28667, 91001 39827లకు సమాచారం ఇవ్వాలని వారు కోరారు. -
అక్రమ మద్యం విక్రేతల అరెస్టు
కర్నూలు: కల్లూరు ఎస్టేట్లో అక్రమ మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో ఎకై ్సజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కల్లూరు ఎస్టేట్కు చెందిన జక్కల మునయ్య వద్ద 22 మద్యం బాటిళ్లు, దేవర ఆంజనేయులు వద్ద 15 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని ఇరువురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అలాగే బంగారుపేటలో నాటుసారా స్థావరాలపై దాడులు చేసి సారా విక్రయాలు జరుపుతున్న నీలిషికారి ఆనరి వద్ద 20 లీటర్లు, నీలి షికారి లక్ష్మి వద్ద 30 లీటర్లు నాటుసారాను స్వాధీనం చేసుకుని ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు పంపినట్లు కర్నూలు ఎకై ్సజ్ సీఐ చంద్రహాస్ తెలిపారు. ఈ దాడుల్లో ఎస్ఐలు నవీన్ బాబు, రెహనా బేగం, కానిస్టేబుళ్లు మధు, సూర్యనారాయణ, రామలింగయ్య, ఈరన్న, సువర్ణమ్మ తదితరులు పాల్గొన్నారు. -
భావితరాలకు బషీర్ గురుతులు
జూపాడుబంగ్లా: పాణ్యం మండలం సిమెంట్ నగర్ గ్రామానికి చెందిన షేక్ బషీర్ స్థానిక హైస్కూల్లో ఆరోతరగతి విద్యనభ్యశించే సమయంలోనే వైరెటీగా కనిపించే నాణేలను దాచుకునేవాడు. ఐదు, పది, ఇరవై పైసల నాణేలతో పాటు రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయల నోట్లను భద్రపరుచుకునేవారు. కాక్రమేణా కాయిన్స్, నోట్లు, స్టాంపుల సేకరణను అలవాటుగా చేసుకున్నారు. బాల్యంలో ప్రారంభమైన హాబీ.. చదువు పూర్తయి ప్రస్తుతం కర్నూలులో నివాసం ఉంటూ జూపాడుబంగ్లాలో పంచాయతీరాజ్ ఏఈగా విధులు నిర్వర్తిస్తున్నా కొనసాగిస్తున్నారు. టూర్లకు వెళ్లినప్పుడు అక్కడ విక్రయించే పలు దేశాల నాణేలు, కరెన్సీనోట్లు, స్టాంపులను పరిశీలించి తన వద్దలేని వాటిని కొనుగోలు చేసేవారు. ఇప్పటిదాకా రూ.50 వేలు ఖర్చు చేసి పలు దేశాల కాయిన్స్, నోట్లు, స్టాంపులు సేకరించి వాటిని ఇంట్లో గోడలకు అతికించి ఫ్రేమ్ కట్టించినట్లు బషీర్ తెలిపారు. జ్ఞాపకాల దొంతర.. బషీర్ పాతకాలం నాటి గ్రాంఫోన్రికార్డు, టేప్రికార్డర్, కెమెరాలు, ఆడియో కేసెట్లు, డీవీడీ ప్లేయర్లు సేకరించి భద్రపరిచారు. ఇంటికి వచ్చిన వారు వాటిని చూసి తమ జ్ఞాపకాలను నెమరేసుకుంటూ బషీర్ను అభినందిస్తున్నారు. అలాగే శ్రీకృష్ణదేవరాయలు, విక్టోరియా మహారాణి కాలం నాటి కాయిన్స్ కూడా ఉన్నాయి. 1947 స్వాతంత్య్రం వచ్చాక ఇండియా గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉన్న అర్ధ ఆణ, ఆణ, పైస, రెండుపైసలు, ఐదుపైసలు, 10 పైసలు, 20 పైసలు, పావలా, ఐదు రూపాయలు, పదిరూపాయల కాయిన్స్ సేకరించారు. ఒమన్, మస్కట్, సౌదీ, దుబాయ్, మలేషియా, సింగపూర్, అమెరికా, పాకిస్తాన్ తదితర 20 దేశాలకు చెందిన ప్లాస్టిక్స్ కరెన్సీ నోట్లు, కాగితపు కరెన్సీనోట్లను సేకరించారు. ఇంగ్లాండ్, ఒమన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, కేఎస్ఏ, శ్రీలంక, యునైటెడ్ అరబ్ ఎమిరేటెడ్, కువైట్, బంగ్లాదేశ్, ఇండియాకు చెందిన రాణాప్రతాప్సింగ్, నెహ్రూ, మొట్టమొదటి రైలు ఇంజిన్ స్టాంపు, ఆయిల్ఎక్స్ప్రోషన్, టెక్నాలజీడే స్టాంపు, నహర్సింగ్, వంటి అనేక చిత్రాలతో కూడిన పోస్టల్ స్టాంపులున్నాయి. పురాతన కాలం నాటి కెమెరాలు, గ్రామ్ఫోన్, కేసెట్లు సేకరించి భద్రపరుస్తున్న పంచాయతీ రాజ్ ఏఈ బషీర్ 20 ఏళ్లుగా పలు దేశాల కరెన్సీ, స్టాంపుల సేకరణ పంచాయతీ రాజ్ శాఖలో ఏఈగా విధులు నిర్వహించే బషీర్.. పురాతన వస్తువులు, వివిధ దేశాల కరెన్సీ సేకరించి భావితరాలకు తెలియజేసేందుకు భద్రపరుస్తున్నాడు. ఇప్పటి వర కు ఏకంగా 20 దేశాల కరెన్సీతో పాటు పాతకాలపు గ్రామ్ఫోన్, రేడియో, కేసెట్లు, కెమెరా లు తన అల్మారాలో ఆకర్షణీయంగా దాచి ఉంచాడు. ఆరో తరగతిలో ప్రారంభమైన కరెన్సీ సేకరణ ఆరు పదుల వయస్సు వచ్చినా కొనసాగిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. -
ఇసుక రీచ్లు వద్దే వద్దు
నందవరం: ఇసుక రీచ్లు ఏర్పాటు చేయవద్దంటూ నాగలదిన్నె, గంగవరం, జొహరాపురం గ్రామాల ప్రజలు అధికారులకు తెగేసి చెప్పారు. మంగళవారం సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, కాలుష్య నియంత్రణ మండలి జిల్లా అధికారి కిశోర్ రెడ్డి నేతృత్వంలో మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో నాగలదిన్నె, జొహరాపురం గ్రామాల్లో ఇసుక రీచ్ల ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, మాట్లాడుతూ నాగలదిన్నె గ్రామంలోని సర్వే నంబర్ 154లో తుంగభద్ర నదిలో 5.363 హెకార్టర్లలో ఏడాదికి 53,630 క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలు చేపట్టనున్నట్లు వివరించారు. గంగవరం, జొహరాపురం గ్రామ సర్వే నంబర్లు 1,258లో తుంగభద్ర నదిలో 82,500 క్యూబిక్ మీటర్లు ఏడాదికి సాధారణ ఇసుక తవ్వకాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఆయా గ్రామాల ప్రజలు మాట్లాడుతూ నదిలో ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలు ఇంకిపోతాయని, తాగునీటి ఎద్దడి ఏర్పడుతుందని వివరించారు. రైతులు రూ.లక్షలు వెచ్చించి నది నుంచి వేసుకున్న పైపులైన్లు పగలి పోతాయని, కోతకు గురవుతాయని పెద్దకొత్తిలి ఎంపీటీసీ సభ్యుడు విజయమోహన్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రీచ్లు ఏర్పాటు చేయవద్దని ఆయా గ్రామాల ప్రజలు వేడుకున్నారు. కాగా నది ఒడ్డున వాటర్ గ్రిడ్లు ఏర్పాటు చేసి నీటి సమస్య పరిష్కరించి ఇసుక రీచ్ ఏర్పాటు చేయాలని నాగలదిన్నె సర్పంచ్ బోయ లక్ష్మి అధికారులకు సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసులు, జిల్లా మైనింగ్, జియాలజీ విభాగం అధికారి రవిచందు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మూర్తి, సీఐ మధుసూదన్రావు, మండల సర్వేయర్ అక్బర్బాషా పాల్గొన్నారు. అధికారులకు విన్నవించుకున్న ప్రజలు -
2న మండల కేంద్రాల్లో ధర్నాలు
కర్నూలు(అర్బన్): పేదలకు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలాన్ని ఇవ్వాలనే డిమాండ్పై సీపీఐ ప్రజా పోరాటాలకు సిద్ధమవుతున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. మంగళవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ జూన్ 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు అనేక ప్రాంతాల్లో రైతులు పండించిన ధాన్యం తడిచిపోతున్నా, టార్పాలిన్లు కూడా అందించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ ప్రధాని నరేంద్రమోదీ భజనలో మునిగి తేలుతున్నారన్నారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రపంచంలోని చిన్న దేశాలతో కాకుండా చైనాతో మన దేశం పోటీ పడాలన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కె.గిడ్డయ్య, రాష్ట్ర నాయకులు పి.రామచంద్రయ్య, కె.జగన్నాథం, ఎస్.మునెప్ప తదితరులు పాల్గొన్నారు. -
భవితనివ్వని ‘ఉన్నత విద్య’
ప్రశ్నార్థకంగా యూనివర్సిటీలు ● గత ఏడాది భారీగా పడిపోయిన పీజీ అడ్మిషన్లు ● 35 కోర్సులకు అందుబాటులో 2,017 సీట్లు ● 759 సీట్లు మాత్రమే భర్తీ ● ఉపాధి చూపే కోర్సులతోనే వర్సిటీలకు భవిష్యత్తు ● గత ప్రభుత్వం దిద్దుబాటు చర్యలను తొక్కిపెట్టిన కూటమి ప్రభుత్వం కర్నూలు కల్చరల్: యూనివర్సిటీల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. కాలం తీరిన కోర్సులు.. ఉపాధి చూపని కోర్సులతో వర్సిటీల్లో సీట్ల భర్తీ గగనమవుతోంది. ఉన్న సీట్లలో సగం కూడా భర్తీకాకపోవడం విద్యార్థుల్లో అనాసక్తికి నిదర్శనం. గత ఏడాది గణాంకాలను పరిశీలిస్తే మూడు విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ పీజీ కళాశాలల్లో 35 కోర్సులుంటే 37.63 శాతం సీట్లు మాత్రమే భర్తీ కావడం గమనార్హం. చదివే సబ్జెక్టుకి, అవకాశాలకు పొంతన లేకపోవడంతో ఉన్నత విద్యా రంగం భవిష్యత్ అగమ్యగోచరం అవుతోంది. గత ప్రభుత్వం ఉన్నత విద్యా విధానంలో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినా కూటమి ప్రభుత్వం తొక్కి పెట్టింది. వర్సిటీలకు పరిశ్రమలను అనుసంధాన చేయడం, హానర్స్ కోర్సుల రూపకల్పన తదితర చర్యలు చేపట్టినా ప్రస్తుతం ఆ ఊసే కరువైంది. ఉన్నత విద్యా మండలి ఈ ఏడాది జూన్ 9వ తేదీ నుంచి పీజీ ప్రవేశాలకు పీజీసెట్–2025 నిర్వహిస్తోంది. అయితే నూతన కోర్సుల రూపకల్పన, ఉపాధినిచ్చే కోర్సుల్లో అప్గ్రేడేషన్ చర్యలు చేపట్టిన దాఖలాల్లేవు. ఫలితంగా ఈ ఏడాది కూడా 40 శాతం సీట్లు కూడా భర్తీ అయ్యే పరిస్థితి లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇవీ లోపాలు.. జీఓ 77తో ప్రైవేట్ కళాశాలల్లో పీజీ చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ తొలగించడం. డిగ్రీలో సింగిల్ మేజర్ సబ్జెక్ట్ కోర్సులను ప్రవేశ పెట్టడం. థియరిటికల్ పార్ట్ అధికంగా ఉండి ప్రాక్టికల్ పార్ట్ తక్కువగా ఉండటం. అడ్మిషన్ల ప్రక్రియలో తీవ్ర జాప్యం. జోనల్ సిస్టమ్ ఉన్న రాష్ట్రంలో కామన్ పీజీ సెట్ నిర్వహించడం. మారుతున్న కాలానికి అనుగుణంగా కోర్సుల్లో అప్గ్రేడేషన్ లేకపోవడం. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే కోర్సులకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం. వర్సిటీల్లో వేల సంఖ్యలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయకపోవడం. ఆన్ డిమాండ్ కోర్సులను ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం. రీసెర్చ్ ఫెసిలిటీస్ లేకపోవడం. ప్లేస్మెంట్ సెల్స్ను పటిష్టం చేయాలి యూనివర్సిటీల్లో ప్లేస్మెంట్ సెల్స్ను పటిష్టం చేయాలి. పరిశ్రమలు, వివిధ కంపెనీల భాగస్వామ్యం లేకపోవడంతో పీజీ విద్యార్థులకు ఉద్యోగాలు రాని పరిస్థితి నెలకొంది. రాష్ట్రం మొత్తం కామన్ పీజీ సెట్ కాకుండా వర్సిటీలు సొంతంగా ప్రవేశ పరీక్షలను నిర్వహించుకోవాలి. సింగిల్ మేజర్, మైనర్ సబ్జెక్టుల గందరగోళ వ్యవస్థకు బదులుగా మూడు సంవత్సరాల యూజీ పోగ్రామ్ను కొనసాగించడం ఉత్తమం. – ఎస్.మన్సూర్ రహమాన్, విశ్రాంత ప్రొఫెసర్, కర్నూలు -
వైద్యపరికరాల కొనుగోలుకు ఆమోదం
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పలు వైద్యపరికరాల కొనుగోలుకు పర్చేజ్ కమిటీ ఆమోదించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన తన ఛాంబర్లో పలు వైద్యపరికరాల కొనుగోలుకు కమిటీ సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆటో క్లియర్, ఎయిర్ కంప్రెషర్, ఏఎంసీలో ఆక్సిజన్ ప్యానెల్, రెండు హీమోడయాలసిస్ మిషన్లు కొనుగోలు చేయడానికి కమిటీ ఆమోదించిందన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఇవి ఎంతగానో తోడ్పడతాయన్నారు. సమావేశంలో కమిటీ సభ్యులు జనరల్ సర్జరీ హెచ్ఓడి డాక్టర్ పి.హరిచరణ్, ఆర్థోపెడిక్ హెచ్వోడి డాక్టర్ కె.శ్రీనివాసులు, ఎండోక్రైనాలజి హెచ్వోడి డాక్టర్ పి.శ్రీనివాసులు, అనెస్తీషియా హెచ్వోడి డా క్టర్ జి.విశాల, మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.లక్ష్మిబాయి, సీఎస్ఆర్ఎంవో డాక్టర్ బి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
నెట్టింటి వైద్యం రెట్టింపు రోగం
కర్నూలు(హాస్పిటల్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో 3వేల దాకా రిటైల్ మెడికల్ షాపులు, ఏజెన్సీలు ఉన్నాయి. దీంతో పాటు 12వేల దాకా ఎంబీబీఎస్, స్పెషాలిటీ, సూపర్స్పెషాలిటీ కోర్సులు అభ్యసించిన వైద్యులూ ఉన్నారు. వీరితో పాటు వైద్యవిద్యను అభ్యసిస్తున్న వారు మరో 3వేల మంది దాకా ఉంటారు. ఇక ఫార్మాసిస్టులు, నర్సులు, ఏఎన్ఎంలు, ఆర్ఎంపీలు మరో 15వేల దాకా ఉంటారు. వీరందరూ అల్లోపతి వైద్యంపై ఆధారపడి రోగులకు వైద్యసేవలు అందిస్తున్నారు. ఆరోగ్య సమస్యలు వచ్చిన ప్రజలు వీరిలో ఎవరో ఒకరిని సంప్రదించి అవసరమైన చికిత్స తీసుకుంటున్నారు.ఇటీవల ఇంటర్నెట్ సదుపాయం అందరికీ అందుబాటులోకి రావడం, విద్యావంతులు పెరగడం, ముఖ్యంగా సాఫ్ట్వేర్, ఇంటర్నెట్పై యువతకు పట్టురావడం వంటి విషయాల కారణంగా ఆన్లైన్లో తమకు వచ్చిన ఆరోగ్య సమస్యలకు పరిష్కారాన్ని వెతకడం అధికమైంది. క్షణాల్లో వచ్చే సమాచారం ఆధారంగా తమకు ఈ కారణంగానే ఆరోగ్య సమస్య వచ్చిందని భావించి మెడికల్ షాపులకు వెళ్లి మందులు తీసుకుని వాడే వారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది. భౌతికంగా పరీక్షిస్తేనే.. మంచి పేరున్న వైద్యుని వద్దకు వందల కిలోమీటర్లు ప్రయాణించి రోగులు చికిత్స కోసం వెళ్తుంటారు. అలా వెళ్లిన వారు అవసరమైతే గంటల తరబడి క్యూలో ఉండి చికిత్స తీసుకుని వెళ్తుంటారు. ఫలానా డాక్టర్ చేయి తగిలితేనే(హస్తవాసి) సగం రోగం నయం అవుతుందన్న నమ్మకంతో ఉన్న వారూ ఉన్నారు. ఈ నమ్మకంతోనే ఇప్పటికీ చాలా మంది వారికి ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా నమ్ముకున్న వైద్యుల వద్దే చికిత్స తీసుకుంటారు.సదరు డాక్టర్ భౌతికంగా రోగిని పరిశీలించడమే గాక వారి యోగక్షేమాలు అడగడం, నవ్వుతూ మాట్లాడటం, ఏమీ కాదులే అని ధైర్యం చెప్పడంతో వారికి సగం రోగం నయమవుతుంది. కొందరు సీనియర్ వైద్యులు ఇప్పటికీ రోగిని భౌతికంగా ముట్టుకుని చేతులు, కాళ్లు కదిపి, పొట్టను ఒత్తి చూసి, నాడి పట్టుకుని పరీక్షించి వైద్యం చేస్తుంటారు. ఇలాంటివన్నీ ఆన్లైన్లో లభించవని పెద్దలు చెబుతుంటారు. ఎంతగా ఆన్లైన్ సేవలు అభివృద్ధిలోకి వచ్చినా మనిíÙని చూసి వైద్యం ఇచ్చి ధైర్యం చెబితేనే తగ్గుతుందని వారు భావిస్తున్నారు. ఇవీ నష్టాలు.. ⇒ ఆరోగ్య సమస్య కొంతైతే ఆన్లైన్లో వివరాలు కొండంత ఉంటాయి. దానిని చూసి రోగి మరింత ఆందోళనకు గురవుతారు. ఫలితంగా మానసికంగా మరింత కృంగిపోతాడు. ⇒ ఆందోళనకు గురైతే శారీరకంగా మరిన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ⇒ కొందరు ఆన్లైన్లో తమ ఆరోగ్య సమస్యలు వెతికి ముందుగానే అ్రల్టాసౌండ్ స్కానింగ్ చేయించుకుని డాక్టర్ వద్దకు వెళ్తున్నారు. ముందుగానే పరీక్షలు చేయించుకోవద్దని వైద్యులు చెబుతున్నారు. ⇒ ఒక్కో వ్యక్తికీ ఒక్కో శరరీతత్వం ఉంటుంది. వారి జన్యువులు, వారి ఆరోగ్యాన్ని బట్టి రోగ లక్షణాలు ఉంటాయి. అందరినీ ఒకే విధంగా చూడలే మని వైద్యులు చెబుతున్నారు. ఒక్కొక్కరికీ ఒక్కో విధమైన చికిత్స ఉంటుందని, ఆన్లైన్ వైద్యాన్ని గుడ్డిగా నమ్మొద్దని సూచిస్తున్నారు. ⇒ కర్నూలుకు చెందిన రాజ్కుమార్ ఓ ప్రైవేటు సంస్థలో ఎగ్జిక్యూటివ్. రోజూ వందల కిలోమీటర్లు తిరగడంతో అతనికి ఏదో ఒక అనారోగ్య సమస్య వేధిస్తుంటుంది. దీంతో తరచూ డాక్టర్ వద్దకు వెళ్లడం దేనికని ఆన్లైన్లో తనకు వచ్చిన ఆరోగ్య సమస్యకు పరిష్కారాన్ని వెతికి మెడికల్ షాపులో మందులు కొని వాడుతున్నాడు. ఓ రోజు మందు లు వికటించి ఆసుపత్రికి వెళితే ఎలా పడితే అలా మందులు వాడకూడదని వైద్యులు చికిత్స చేసి పంపించారు. ⇒ కర్నూలుకు చెందిన ఓ బి.ఫార్మసి విద్యార్థిని తనకు ఇటీవల ఛాతీలో నొప్పి ఉంటే ఆన్లైన్లో టైప్ చేసి చూసుకుంటే హార్ట్ ఎటాక్ అని చూపించింది. దీంతో ఆమె తీవ్ర ఆందోళనతో సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి వైద్యులను కలిసింది. పరీక్షించిన వైద్యులు వచ్చింది హార్ట్ ఎటాక్ కాదని, కండరాల నొప్పిగా నిర్ధారించారు.⇒ నంద్యాలకు చెందిన రామాంజనేయులు ప్రభుత్వ ఉద్యోగి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చుని పనిచేయాల్సిందే. ఇంటర్నెట్పై మంచి పట్టు ఉంది. దీంతో తనతో పాటు ఇంట్లో ఎవరికి అనారోగ్య సమస్యలువచ్చినా ఆన్లైన్లో వెతికి పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో ఆయన తల్లికి ఒకసారి మందులు వికటించి ఇబ్బంది రావడంతో వైద్యుని వద్దకు తీసుకెళ్లారు. ఆన్లైన్ పరిష్కారం ప్రతిసారీ మంచిది కాదని వైద్యులు హితవు పలికారు. -
మల్లన్న సేవలో సినీ హీరో అర్జున్
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను ప్రముఖ సినీ హీరో అర్జున్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. సోమవారం శ్రీశైలం చేరుకుని వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో మల్లికార్జున స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అలాగే ఆలయంలో గోసేవ నిర్వహించుకున్నారు. సినీ హీరో అర్జున్తో కరచాలనం చేసేందుకు భక్తులు పోటీపడ్డారు. ఆయనతో పలువురు సెల్పీలు, ఫొటోలు దిగారు. చిన్నారులకు ఎంఆర్ వ్యాక్సిన్ కర్నూలు(హాస్పిటల్): చిన్నారుల్లో తట్టు, పొంగు, రూబెల్లా వ్యాధుల నివారణే లక్ష్యంగా ఎంఆర్ వ్యాక్సిన్ ఆరు రోజుల పాటు వేసేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ నాగప్రసాద్ చెప్పారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం నుంచి ఎంఆర్ వ్యాక్సిన్పై స్పెషల్ ప్రారంభించామన్నారు. జిల్లాలో ఎంఆర్–1 వ్యాక్సిన్ను 33 మంది, ఎంఆర్–2 వ్యాక్సిన్ను 36 మంది వేయించుకోలేదని ప్రాథమికంగా తాము గుర్తించినట్లు తెలిపారు. వీరితో పాటు ఇంకా ఎవ్వరైనా వేయించుకోకపోయినా, ఇతర ప్రాంతాల వారున్నా సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో, అంగన్వాడీ కేంద్రంలో, సచివాలయంలో వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. -
ఎండీయూ ఆపరేటర్లను కొనసాగించాలి
కర్నూలు(సెంట్రల్): పేదలకు ఇంటి వద్దనే రేషన్ సరుకులు అందిస్తున్న ఎండీయూ ఆపరేటర్లను కొనసాగించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పీఎస్ రాధాకృష్ణ కోరారు. ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం మేరకు 2027 జనవరి వరకు ఎండీయూ వాహనాలను కొనసాగించాలన్నారు. ఆటో కార్మిక యూనియన్ ఆధ్వర్యంలో ఎండీయూ ఆపరేటర్లు రాజ్విహార్ నుంచి కలెక్టరేట్ వరకు సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ గాంధీ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఆటో కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్, ఎండీయూ ఆపరేటర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎస్. కేశవయ్య, కార్యదర్శి అక్బర్వలి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేవలం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఉన్న కోపంతోనే చంద్రబాబు ప్రభుత్వం ఎండీయూ వాహనాలను తొలగిస్తోందన్నారు. ప్రభుత్వం తమతో చేసుకున్న గడువు వరకు కొనసాగించాలని, తరువాత కూడా ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉపాధిని చూపాలని ఎండీయూ ఆపరేటర్ల కోరారు. ఎండీయూ ఆపరేటర్లు అక్బర్వలి, కేశవ్, మహ్మద్రఫీ, వీరేష్, శీను, మద్దిలేటి పాల్గొన్నారు. కర్నూలులో రాజ్విహార్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ, నిరసన -
పొగాకు రైతుకు ‘ధరా’ఘాతం
నష్టమే మిగిలింది ఈ ఏడాది రైతులు పండించిన కంది, పత్తి, పొగాకు మిరప పంటలకు ధర పూర్తిగా తగ్గిపోయింది. బ్యాంక్ అధికారులు మాత్రం రుణాలు కట్టమంటూ ఒత్తిడి చేస్తున్నారు. అప్పులు ఇచ్చే వాడే లేడు. రైతన్నకు ఏంచేయాలో అర్థంకాని రోజులు ఎదురయ్యాయి. వ్యవసాయం చేయాలంటేనే రైతులు భయపడే రోజులు వచ్చాయి. – షేక్ హుసేన్, యు.కొత్తపల్లి, కష్టంగా ఉంది రైతులు పండించిన ఏ పంటకూ గిట్టుబాటు ధరలేదు. నేను మూడు ఎకరాలలో పోగాకు నాటా. కింటా రూ.15వేల నుంచి రూ. 18వేల వరకు అమ్ముకున్నాం. ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేదు. వచ్చే ఏడాది పెట్టుబడికి కష్టంగా ఉంది. – కోయికొండ చిన్నమద్దయ్య, ఉడుములపాడు డోన్: పొగాకు పండించిన రైతుకు కన్నీరే మిగులుతోంది. మార్కెట్లో ధర లేకపోవడంతో నష్టాలు వస్తున్నాయి. పంటకు పెట్టిన పెట్టుబడి రాకపోయినా బ్యాంక్లు రుణాలు చెల్లించాలని ఒత్తిడి తేవడంతో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. డోన్ నియోజకవర్గంలో 258 ఎకరాల్లో పొగాకు సాగు చేశారు. ప్యాపిలి మండలంలో రాచర్ల, బూరుగుల, ప్యాపిలి, బేతంచెర్ల మండలంలో బుగ్గానిపల్లి, అంబాపురం, బేతంచెర్ల, డోన్ మండలంలో వెంకటాపురం, చిన్నమల్కాపురం, ఉడుములపాడు, వెంకటనాయునిపల్లి గ్రామాలలో ఎక్కువగా పొగాకు పంటను పండించారు. గత ఏడాది క్వింటా రూ.15వేల నుంచి రూ.18వేల ధర పలికింది. ప్రస్తుతం రూ.5వేల నుంచి రూ.7వేలకు పడిపోయింది. పంట సాగులో ఎకరాకు రూ.70వేల నుంచి రూ.80వేల ఖర్చు వచ్చింది. పండించిన పొగాకు చెక్కులు తీసుకెళ్తే ఐటీసీ, జీపీఐ, ఎలైన్ కంపెనీ నిర్వాహకులు తేమ శాతం ఎక్కువ ఉందని వెనక్కి పంపిస్తున్నారు. దీంతో రైతులు పొగాకు అమ్ముకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ఒక్కో రైతు 10 నుంచి 15 చెక్కులు తీసుకెళ్తే అందులో తేమ శాతం రేటు ఎక్కువ ఉందని చెప్పుతున్నారు. దళారులు వచ్చి ‘రూ. 5వేలకు ఇస్తావా? 4వేలకు ఇస్తావా?’ అని అడుగుతున్నారని రైతులు వాపోతున్నారు. రైతులు ఇబ్బంది పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు. మార్కెట్లో పొగాకు పంటకు పడిపోయిన ధరలు తీవ్రంగా నష్టపోతున్న రైతులు రుణాలు చెల్లించాలని బ్యాంక్ల ఒత్తిడి పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం -
నేటితో ముగియనున్న సప్లిమెంటరీ పరీక్షలు
కర్నూలు సిటీ: జిల్లాలోని 69 కేంద్రాల్లో జరుగుతున్న పది సప్లమెంటరీ పరీక్షలు నేటి(మంగళవారం)తో ముగియనున్నారు. సోమవారం జరిగిన పరీక్షలకు 1265 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. 4962 మంది విద్యార్థులకుగాను 3697 మంది హాజరైయ్యారు. ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు మొత్తం 13 కేంద్రాలను తనిఖీ చేశారు. వృద్ధుడి ప్రాణం తీసిన కరెంట్ ఆదోని అర్బన్: మంచినీళ్ల కోసం మోటార్ను ఆన్ చేస్తూ ఓ వృద్ధుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఈ దుర్ఘటన విరుపాపురం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామంలో కూలీ పనులు చేసుకుంటూ గొల్ల ముద్దయ్య(60) అనే వృద్ధుడు జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు భార్య రాగమ్మ, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఉదయం మంచినీరు వస్తున్నాయని తెలుసుకుని గొల్ల ముద్దయ్య మోటార్ ఆన్ చేస్తూ విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతిచెందాడు. స్విచ్ ఆన్లో ఉన్నా కూడా ప్లగ్ను పెట్టబోయాడని, దీంతో విద్యుత్ షాక్కు గురైనట్లు బంధువులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తాలూకా పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి వెలుగోడు: బోయరేవుల గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శాబోలు నరసింహుడు (70) మృతి చెందాడు. ఏఎస్ఐ హుస్సేన్ వివరాల మేరకు.. బోయరేవుల గ్రామానికి చెందిన శాబోలు నరసింహుడు బోయరేవుల బస్ స్టాండ్ వద్ద రోడ్డుకు ఎడమ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా డ్రైవర్ జంబి రాజేంద్ర కారును అతివేగంగా నడుపుతూ వెనుకవైపు నుంచి ఢీకొట్టాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నరసింహుడిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ హుస్సేన్ తెలిపారు. పోలీసులు లేక.. వేలం పాటలు వాయిదా శిరివెళ్ల: మండలంలోని గుండంపాడు, శిరివెళ్లలోని ఆలయాల మాన్యం భూముల కౌలు బహిరంగ వేలం పాటలు వాయిదా పడ్డాయి. ముందుగా ప్రకటించిన మేరకు ఈనెల 26వ తేది వేలం పాట జరగాల్సి ఉంది. అయితే కడపలో జరిగే మహానాడుకు స్థానిక పోలీసులు బందోబస్తు విధులకు వెళ్లారు. దీంతో వేలం పాట నిర్వహణకు పోలీసులు రాలేని పరిస్థితి ఉందని ఎస్ఐ చిన్న పీరయ్య పేర్కొనడంతో ఆయన సూచన మేరకు జూన్ 4వ తేదీకి వేలం పాటలు వాయిదా వేశామని ఆయల ఈఓ రామాంజనేయ శర్మ తెలిపారు. ఈ మార్పును రైతులు గమనించాలని సోమవారం ఓ ప్రకటనలో కోరారు. రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి కర్నూలు: కర్నూలు శివారులోని డోన్ హైవేలో మానస ఢాబా ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుడి వయస్సు సుమారు 45 నుంచి 50 ఏళ్లు ఉంటుంది. ప్రమాద విషయం తెలిసిన వెంటనే కర్నూలు అర్బన్ తాలూకా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి ఆచూకీ తెలిసినవారు 91211 01063 లేదా 91211 01064 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని కర్నూలు అర్బన్ తాలూకా పోలీసులు విజ్ఞప్తి చేశారు. -
చందా ఇస్తేనే పంటలకు నీరు!
చాటింపు వాస్తవమే మా ఊరి కాలువ పిచ్చిమొక్కలు, కంపచెట్లతో కూరుకుపోయింది. సాగునీరు సరఫరా చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాలువ బాగు చేసుకునేందుకు నేనే ఊర్లో చాటింపు వేయించాను. కాలువ నుంచి నేరుగా నీళ్లు పెట్టుకునే వారికి ఎకరానికి రూ.1000, మోటార్ల ద్వారా నీళ్లు పెట్టుకునే రైతులు ఎకరానికి రూ.500 ఇవ్వాలని దండోరా కొట్టించాను. ప్రభుత్వం నుంచి డబ్బులు రాకపోవడంతో ఇలా చేయాలని నిర్ణయించాం. –అబ్దుల్లా, గ్రామ టీడీపీ నాయకుడు డబ్బులు ఇవ్వాలంటే కష్టమే కాలువ పనులు చేయడానికి గ్రామంలో దండోరా వేయించారు. కాలువ పనులకు ఎకరానికి రూ.1000 ఇవ్వాలని చెప్పారు. కాలువ పరిధిలో నాకు మూడు ఎకరాలు ఉంది. రూ.3 వేలు భరించాలంటే ఇబ్బందే. ప్రభుత్వం నుంచి పైసా సాయం లేదు. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో రైతులు డబ్బులు ఇవ్వాలంటే కష్టమే. ప్రభుత్వం నిధులు మంజూరు చేసి మా కాలువను బాగు చేసింటే బాగుండు. –చిన్న ఉసేని, గ్రామ రైతు ● రైతుల నుంచి టీడీపీ నాయకుడి బలవంతపు వసూళ్లు ● పంట కాలువ బాగు కోసం దండోరా ● ఎకరానికి రూ.1000 ఇవ్వాలంటూ చాటింపు ● రాష్ట్ర ప్రభుత్వం పని చేయాల్సి ఉన్నా.. విరుద్ధంగా వ్యవహారం మంత్రాలయం: ‘‘వినండహో.. ఇందు మూలంగా రైతులకు తెలియజేయడం ఏమనగా .. మన ఊరి పంట కాలువ పిచ్చిమొక్కలు, కంపచెట్లతో కూరుకుపోయింది. పంట కాలువను బాగు చేసుకునేందుకు చందాలు ఇవ్వాలని నిర్ణయం. కావున రైతులంతా చందా లు ఇచ్చుకోగలరు.. లేదంటే మీ చేనుకు నీళ్లు రావు.. వినండహో..’’ అని మంత్రాలయం మండలంలోని వగరూరు గ్రామంలో టీడీపీ నాయకుడు దండోరా వేయిస్తున్నాడు. వాస్తవంగా పంట కాలువలను బాగు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇక్కడ టీడీపీ నాయకుడు అందుకు విరుద్ధంగా వ్యహరిస్తున్నాడు. కాలువ ఏర్పాటు ఇలా.. మంత్రాలయం మండలంలోని వగరూరు గ్రామం పైభాగంలో గురురాఘవేంద్ర ప్రాజెక్టు కింద సూగూరు మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టు నెలకొల్పారు. 2006లో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. పథకం కింద 2,700 ఎకరాల ఆయకట్టు నిర్ణయించారు. బూదూరు, సూగూరు, వగరూరు, వి.తిమ్మాపురం గ్రామాలకు నీరందించాల్సి ఉంది. అయితే పంట కాలువల నిర్వహణ గాలికి వదిలేయడంతో పూర్తిస్థాయిలో సాగునీరు అందని వైనం. ప్రస్తుతం వగరూరు, వి.తిమ్మాపురం గ్రామాల పరిధిలో 1,500 ఎకరాలకు సాగునీరు ఇస్తున్నారు. అందులో వగరూరు గ్రామంలో 1,000 ఎకరాలకు సాగునీరు పారుతోంది. జలాశయంలో వరద నీరు పుష్కలంగా ఉంటే రెండు కారుల పంటలు ఇక్కడి రైతులు తీస్తున్నారు. టీడీపీ నాయకుడి దాష్టీకం.. రాష్ట్ర ప్రభుత్వం పంట కాలువ మరమ్మతులకు నయాపైసా కేటాయించలేదు. ఇదే అదునుగా చేసుకున్న గ్రామ టీడీపీ నాయకుడు పంట కాలువ బాగు కోసం సరికొత్త పథాన్ని ఎంచుకున్నాడు. సోమవారం గ్రామంలో కాలువ రిపేరీ పేరుతో ఏకంగా దండోరా వేయించారు. కాలువ పరిధిలోని ఆయకట్టు రైతులు ఎకరానికి రూ.వెయ్యి, మోటార్లతో నీరు తోడుకునే రైతులు ఎకరానికి రూ.500 ఇచ్చుకోవాలని చాటింపు వేయించారు. ఇచ్చుకోని రైతుల పొలాలకు నీరు పెట్టుకోవడానికి లేదంటూ ఊరి వీధుల్లో దండోరా కొట్టించారు. గ్రామ టీడీపీ నాయకుడు అబ్దుల్లా ఆజ్ఞ మేరకు చాటింపు వేయించారు. మునుపటికి భిన్నంగా ప్రాజెక్టు పరిధిలో పంట కాలువ బాగు కోసం మునుపెన్నడూ దండోరా వేయించలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిధులతో పంట కాలువను బాగు చేయించింది. కూటమి ప్రభుత్వం పుణ్యమా అని ఈ ఏడాది రైతులపై భారం పడేలా చేసింది. కాలువను బాగు చేయడానికి పైసలు ఇవ్వకపోవడంతో రైతుల నుంచి వసూళ్లు చేసేందుకు టీడీపీ నాయకుడు ముందుకు రావడం చర్చనీయాంశమైంది. దండోరాను చూసి రైతులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదే దరిద్య్రమని వాపోతున్నారు. ప్రభుత్వానికి సిగ్గుచేటని దుమ్మెత్తిపోస్తున్నారు. -
సచివాలయంలో ఇంటర్నెట్ ఇక్కట్లు
వెలుగోడు: గ్రామస్థాయిలోనే ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించాలనే ఉద్దేశంతో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాలను కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. కనీసం ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడంలో అధికారులు విఫలం కావడంతో ప్రజలకు సకాలంలో సేవలు అందడం లేదు. పట్టణంలోని సచివాలయం–2లో రెండు నెలలుగా ఫైబర్ నెట్ ఇంటర్ నెట్ సేవలు నిలిచిపోయాయి. ఏపీ ఫైబర్ నెట్ పని చేయడం లేదని ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథడు లేడు. దీంతో ఉద్యోగులు తమ సెల్ ఫోన్ హాట్ స్పాట్ను కంప్యూటర్కు కనెక్ట్ చేసుకొని విధులు నిర్వహిస్తున్నారు. సెల్ నెట్ సరిగా అందకపోవడంతో సర్వర్ సరిగా పని చేయక ప్రజలు గంటల తరబడి సచివాలయం వద్ద వేచి ఉండాల్సి వస్తోంది. సచివాలయ వ్యవస్థ లేనప్పుడు గతంలో మండల కేంద్రానికి లేదా జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేదని, కానీ స్థానికంగానే సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు చేయడం ద్వారా గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని వైఎస్ జగన్ తీసుకొచ్చారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేస్తూ సేవలన్నింటినీ వారి చెంతకే తీసుకొచ్చారు. గతంలో 35 విభాగాలకు సంబంధించి 545 ప్రభుత్వ సేవలను అందించేవారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక గ్రామ సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది. మూడు ఆధార్ కేంద్రాలే దిక్కు కూటమి ప్రభుత్వం ఈ నెల ఏడో తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్త రేషనన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. కాగా.. పౌరసరఫరాల శాఖ వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు ఏర్పడటం.. ఒకేసారి వందలాది మంది సచివాలయాల్లో దరఖాస్తు చేసుకునేందుకు రావడంతో సర్వర్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో రోజుల తరబడి సచివాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. మండలంలో కేవలం మూడు సచివాలయాల్లో మాత్రమే ఆధార్ నమోదు కేంద్రాలు ఉన్నాయి. వెలుగోడు పట్టణంలోని సచివాలయం–2లో ఇంటర్ నెట్ సౌకర్యం లేక ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేల్పనూరు, గుంతకందాల సచివాలయాల్లో మాత్రమే ఆధార్ నమోదు కేంద్రాలు పని చేస్తుండగా, వేల్పనూరులో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వివరాలను అప్లోడ్ చేస్తుండటంతో తంబ్ వేసే అవకాశం లేకుండా పోయింది. సరిగా వేలిముద్రలు పడనవి ప్రస్తుతం పెండింగ్గా చూపడంతో పాటు కొత్త రేషన్ కార్డులు జారీ చేయడంతో సమస్యలు తలెత్తాయి. కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో పిల్లలు, పెద్దలవి ఈకేవైసీ పూర్తిచేయాలని భావించింది. ఈ మేరకు పెండింగ్ కార్డుదారుల జాబితాలను సిద్ధం చేసి డీలర్లకు అందించారు. ప్రస్తుతం ఈకేవైసీ పూర్తికాకపోతే స్మార్ట్ కార్డులు అందవనే ఆందోళన లబ్ధిదారుల్లో నెలకొంది. దీంతో రేషన్ కార్డుదారులు సచివాలయాల వద్దకు పరుగులు తీస్తూ ఈకేవైసీ చేయించుకునేందుకు పడిగాపులు కాస్తున్నారు. సకాలంలో ఈకేవైసీ పూర్తి చేసుకునేలా అన్ని సచివాలయాల్లో ఆధార్ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. సెల్ఫోన్ హాట్స్పాట్తో రెండు నెలలుగా సేవలు రేషన్ కార్డు దరఖాస్తులకు తప్పని అవస్థలు ఈకేవైసీ కోసం లబ్ధిదారుల పడిగాపులు -
రెండురోజుల శిశువుకు అరుదైన ఆపరేషన్
కర్నూలు(హాస్పిటల్): రెండురోజుల శిశువుకు అరుదైన ఆపరేషన్ నిర్వహించినట్లు కర్నూలు పెద్దాసుపత్రి చిన్నపిల్లల శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ ఎం.కృష్ణనాయక్ చెప్పారు. ఆపరేషన్ వివరాలను సోమవారం ఆయన వివరించారు. ఆలూరు మండలం హాలహర్వి గ్రామానికి చెందిన రాజమ్మ, రాజశేఖర్ల రెండు రోజుల మగ శిశువుకు పుట్టుకతోనే పేగు అభివృద్ధి కాలేదన్నారు. దీనిని వైద్యపరిభాషలో జజునల్ ఆట్రిసియాక్ అంటారని తెలిపారు. ఇది చాలా అరుదుగా జరుగుతుందన్నారు. పేగుకు నిరంతరంగా కనెక్షన్ లేకుండా మధ్యలో తెగిపోయి ఉంటుందన్నారు. ఇలాంటి శిశువుకు ఈ నెల 17న ఆపరేషన్ చేసి సమస్యను పరిష్కరించామన్నారు. ఇప్పుడు శిశువు నోటి ద్వారా పాలు తాగుతూ ఆరోగ్యంగా ఉందన్నారు. ఆపరేషన్ తనతో పాటు అనెస్తీషియా వైద్యులు డాక్టర్ శాంతిరాజు, పిల్లల వైద్యులు డాక్టర్ రచన, పీజీ వైద్యులు పవన్కృష్ణ, సింధూర నిర్వహించినట్లు వివరించారు. -
అర్జీలు చూడని అధికారులపై చర్యలు
కర్నూలు(సెంట్రల్): పీజీఆర్ఎస్(పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్) లాగిన్లో వచ్చిన అర్జీలను కొన్ని శాఖల అధికారులు వారం రోజులైనా చూడడంలేదని, వారిపై చర్యలు తీసుకోవాలని డీఆర్వో, ఆర్డీఓలను జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆదేశించారు. అర్జీలను చూడకుండా ఉండడం క్రమశిక్షణ రహితమన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, జేసీ డాక్టర్ బి.నవ్య, డీఆర్వో సి.వెంకట నారాయణమ్మ వినతులు స్వీకరించారు. సీఎంఓ నుంచి వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కాగా.. ఖరీఫ్లో నకిలీ విత్తనాలను అరికట్టాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి.రామకృష్ణ వినతిపత్రం సమర్పించారు. కల్లూరు మండలం గోకులపాడు పొలిమేరలో ఉన్న పొలాలకు వెళ్లే రహదారిని ఆక్రమించుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని గోపినాథ్, యేసురాజు, బీమన్న కోరారు. కర్నూలు నగరంలో ఎస్సీ, బీసీ చిన్న పిల్లల హాస్టళ్లను వెంటనే పునః ప్రారంభించాలని వినతిపత్రం సమర్పించారు. జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా -
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
ఓర్వకల్లు: యోగా మనిషి జీవితంలో భాగం కావాలని, సంపూర్ణ ఆరోగ్యం యోగాతోనే సాధ్యమని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య అన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం సోమయాజులపల్లెలోని బ్రహ్మకుమారీ మ్యూజియంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జేసీతో పాటు ఆర్డీఓ సందీప్కుమార్, జిల్లా పర్యాటక శాఖ అధికారి విజయ, సెట్కూర్ సీఈఓ వేణుగోపాల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ యోగా సాధనతో మానసిక సమస్యలు, శారీరక రుగ్మతల నుంచి విముక్తి లభిస్తుందన్నారు. ప్రతి గ్రామంలో యోగా కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అనంతరం యోగా ట్రైనర్లు ప్రొటోకాల్ ప్రకారం యోగాసనాలు చేయించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ విద్యాసాగర్, రాష్ట్ర యోగా సంఘం కార్యదర్శి అవినాష్శెట్టి పాల్గొన్నారు. -
నామమాత్రంగా విత్తన కేటాయింపు
కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్కు నామమాత్రంగా వేరుశనగ విత్తనాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. 2024–25లో ఉమ్మడి జిల్లాలో 17,457.50 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు పంపిణీ అయ్యాయి. అయితే ఈ ఏడాది 6449.5 క్వింటాళ్లు కోత కోసి 11,108 క్వింటాళ్లు మాత్రమే కేటాయించడం పట్ల ఆందోళన వెల్లువెత్తుతోంది. ఉమ్మడికర్నూలు జిల్లాలో దాదాపు దాదాపు 63 వేలకు పైగా హెక్టార్లలో సాగు చేస్తారు. కర్నూలు జిల్లాకు 9099, నంద్యాల జిల్లాకు 2009 క్వింటాళ్ల ప్రకారం కేటాయించింది. దీంతో వేరుశనగ కోసం రైతులు పెద్ద ఎత్తున రోడ్డెక్కే అవకాశం ఏర్పడింది. అలాట్మెంటు భారీగా తగ్గించిన ప్రభుత్వం కిలో వేరుశనగ పూర్తి ధరను రూ.93 నిర్ణయించింది. సబ్సిడీ 40 శాతం ప్రకటించింది. క్వింటాలుకు సబ్సిడీ రూ.37.20 ఉంటుంది. రైతులు కిలోకు సబ్సిడీ పోనూ.. రూ.55.80 చెల్లించాలి. ఈ సారి వర్షాలు ఆశాజనకంగా పడుతున్నందున వేరుశనగకు డిమాండ్ ఏర్పడుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. నామమాత్రంగా కేటాయించిన వేరుశనగను ఎలా పంపిణీ చేయాలనే ఆందోళనలో వ్యవసాయ అధికారులు ఉన్నారు. ఇప్పటి వరకు 200 వరకు మాత్రమే వేరుశనగ విత్తన ప్యాకెట్లు సిద్ధమయ్యాయి. గోరుకల్లు మరమ్మతులకు టెండర్లు పాణ్యం: గోరుకల్లు జలాశయ కట్ట మరమ్మతులకు టెండర్లు ఆహ్వానించినట్లు ఈఈ సుభకుమార్ సోమవారం తెలిపారు. ఇటీవల కట్ట కుంగిపోవడంతో మరమ్మతులకు ప్రతిపాదనలు పంపామని, ఈ మేరకు ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయన్నారు. దీంతో సోమవారం టెండర్ నోటిఫికేషన్ విడుదలైనట్లు తెలిపారు. రూ. 2.50 కోట్లతో చేపట్టే మరమ్మతు పనులు టెండర్ ప్రక్రియ పూర్తయిన వెంటనే ప్రారంభిస్తామన్నారు. ప్రస్తుతం రిజర్వాయర్లో 3.50 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు. శ్రీశైలం కిటకిట శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు మల్లన్న దర్శనానికి భారీగా తరలివచ్చారు. భక్తుల రద్దీతో ఆలయ క్యూలైన్లు నిండిపోయాయి. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మూడు స్లాట్లలో పలువురు భక్తులు స్వామివారి స్పర్శదర్శనం చేసుకున్నారు. -
కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్
కర్నూలు(సెంట్రల్): రానున్న రెండురోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏదైనా అవసరం ఉంటే ప్రజలు 08518–277305కు ఫోన్ చేసి తెలిపితే తగు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని సూచించారు. ‘ఉత్కర్ష్’కు ఏడు గ్రామాల ఎంపిక కర్నూలు(సెంట్రల్): గిరిజన వర్గాల సామాజిక–ఆర్థిక పరిస్థితులను మెరుగు పరచేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘అబా జన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్’కు జిల్లాలో ఏడు గ్రామాలు ఎంపికయ్యాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మంత్రాలయం మండలం పరమాన్దొడ్డి, నెరణికి, హొళగుంద మండలంలోని హొళగుంద, కోగిలతోట, మద్దికెర మండలంలోని పెరవళి, మద్దికెర(తూర్పు), హంప గ్రామాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఆయా గ్రామాల్లో 17 శాఖల ద్వారా వివిధ సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. పీజీఆర్ఎస్కు 101 ఫిర్యాదులు కర్నూలు: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 101 ఫిర్యాదులు వచ్చాయి. ఎస్పీ విక్రాంత్ పాటిల్ మహానాడు బందోబస్తులో విధుల నిమిత్తం కడపకు వెళ్లడంతో ఆయన ఆదేశాల మేరకు కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ పీజేఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి వినతులను స్వీకరించారు. చట్ట పరిధిలో విచారణ జరిపి త్వరితగతిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. డీసీఆర్బీ సీఐ గుణశేఖర్ బాబు, సీఐలు కేశవరెడ్డి, తేజామూర్తి తదితరులు కూడా పీజేఆర్ఎస్లో పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. కుటుంబ కలహాలు, వ్యక్తిగత సమస్యలు, నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసుకుని మోసం చేసిన ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయి. ఈ ఏడాదే బీసీ, డీఎన్టీ హాస్టళ్ల పునః ప్రారంభం ● డీబీసీడబ్ల్యూఓ కే ప్రసూన కర్నూలు(అర్బన్): జిల్లా కేంద్రంలో మూతకు గురైన బీసీ, డీఎన్టీ బాలుర వసతి గృహాలను ఈ విద్యా సంవత్సరం నుంచి పునః ప్రారంభించేందుకు చర్యలు చేపట్టినట్లు జిల్లా బీసీ సంక్షేమ సాధికారత అధికారిణి కే ప్రసూన తెలిపారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. కర్నూలు బీ క్యాంప్లోని ఆర్అండ్బీ క్వార్టర్స్లో కొనసాగుతున్న ఈ రెండు వసతి గృహాలకు చెందిన భవనాలు పూర్తి శిధిలావస్థకు చేరాయన్నారు. తాత్కాలికంగా ఈ వసతి గృహాలను 2023 ఏప్రిల్ నెలలో మూత వేశామన్నారు. కల్లూరులోని పాత ఏపీ ఉర్దూ రెసిడెన్షియల్ స్కూల్ భవనంలో ఈ వసతి గృహాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఈ రెండు వసతి గృహాలకు సమీపంలోనే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కూడా ఉన్నందున విద్యార్థులకు అనుకూలంగా ఉంటుందన్నారు. ఫీజు వివరాలు యాప్లో నమోదు చేయండి కర్నూలు(అర్బన్): జిల్లాలో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, మెడికల్ తదితర కోర్సులు చదువుతున్న ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ వర్గాలకు చెందిన విద్యార్థుల ఫీజు వివరాలను జ్ఞానభూమి యాప్లో నమోదు చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు కె.తులసీదేవి కోరారు. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి కళాశాలలకు మంజూరైన ఉపకార వేతనాలను 2024 మార్చి 1వ తేదిన మొదటి విడతగా విద్యార్థుల జాయింట్ ఖాతాలో జమ చేసినట్లు ఆమె సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే ఎస్సీ విద్యార్థుల ఖాతాలకు నాలుగు విడతల ఫీజును విడుదల చేశారన్నారు. ప్రభుత్వం జమ చేసిన నగదును ఆయా కళాశాలల ఖాతాలకు జమ చేశారా ? లేదా ? అనే విషయంపై జిల్లాలోని వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు/వార్డు ఎడ్యుకేషన్ డాటా ప్రాసెసింగ్ సెక్రటరీలు తమ పరిధిలో సర్వే నిర్వహించి సమాచారాన్ని జ్ఞానభూమి యాప్లో అప్లోడ్ చేయాలన్నారు. అలాగే ప్రభుత్వం జమ చేసిన ఫీజు మొత్తాలను కాక మిగిలిన ఫీజును విద్యార్థులు చెల్లించి ఉంటే, రసీదులను ఈ నెల 28లోగా జ్ఞానభూమి పోర్టల్లో అప్లోడ్ చేయాలన్నారు. సర్వే పూర్తయిన అనంతరం ఫీజు బకాయిలను విడుదలవుతాయని డీడీ వెల్లడించారు. -
ఏపీటీఎస్ఏ రాష్ట్ర కార్యవర్గంలో ముగ్గురికి చోటు
కర్నూలు కల్చరల్: ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ సర్వీస్ అసోసియేషన్ (ఏపీటీఎస్ఏ) రాష్ట్ర కార్యవర్గంలో జిల్లా నుంచి ముగ్గురు సబ్ ట్రెజరీ ఆఫీసర్స్ (ఎస్టీవో)లకు స్థానం లభించింది. ఆదివారం విజయవాడలో ఏపీఎస్టీఏ రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. ఏపీ ఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వీహెచ్ వెంగళ్ రెడ్డి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. జిల్లా ట్రెజరీలో ఎస్టీవోగా పనిచేస్తున్న మురళీధర్ నాయుడు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, జిల్లా ట్రెజరీ ఎస్టీవో కరుణాకర్, డోన్ ఎస్టీవో రఘునందన్ కార్యదర్శులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర కార్యవర్గంలో స్థానాలు దక్కించుకున్న ఎస్టీవోలకు ట్రోజరీ ఉద్యోగులు అభినందనలు తెలిపారు. -
ఆ ముగ్గురు డిస్మిస్కు రంగం సిద్ధం!
కర్నూలు: పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో నిబంధనలు సక్రమంగా అమలు జరిగేలా చూడాల్సిన పోలీసులే మద్యం మత్తులో హంగామా చేసిన సంఘటనను పోలీస్ ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించి ఆ ముగ్గురిని సర్వీస్ నుంచి తొలగించాలని (డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్ ) ఆదేశించినట్లు కర్నూలు ఏపీఎస్పీ 2వ పటాలంలో చర్చ జరుగుతోంది. కర్నూలు 2వ పటాలానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ ఓంకార్నాయక్, కానిస్టేబుళ్లు రాజశేఖర్, సిరాజుద్దీన్ను క్రమశిక్షణ ఉల్లంఘన చర్యల కింద రెండు రోజుల క్రితం పటాలం కమాండెంట్ సస్పెండ్ చేశారు. పవిత్ర పుణ్యక్షేత్రంలో మద్యం సేవించడం నిషిద్ధం, నిషేధిత వస్తువులు కూడా తీసుకువెళ్లకుండా రెండు చోట్ల తనిఖీ కేంద్రాల్లో పరిశీలన జరుగుతుంది. ఆ పైనే తిరుమలకు అనుమతి ఉంటుంది. ఇంత పటిష్ట భద్రత ఉన్నా, తీవ్ర మద్యం మత్తులో ఆ ముగ్గురు తిరుమల వరకు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ వెళ్లడంతో రాష్ట్ర పోలీస్ బాస్ సీరియస్గా భావించి బెటాలియన్ ఐజీ రాజకుమారితో చర్చించి సర్వీస్ నుంచి వారిని తొలగించాలని మౌఖికంగా ఆదేశాలు జారీ చేసినట్లు పటాలం సిబ్బంది చర్చించుకుంటున్నారు. సంఘటన జరిగిన మరుసటి రోజే ఐజీ కర్నూలు పటాలం కమాండెంట్తో విచారణకు ఆదేశించినట్లు సమాచారం. మద్యం తాగి తిరుమలకు చేరుకున్న ముగ్గురిలో ఇద్దరిని తిరుమల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలం నుంచి ఒకరు పారిపోయారు. ఈ సంఘటనపై తిరుమల పోలీసులు కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఆ ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు కూడా రంగం సిద్ధమైనట్లు సమాచారం. మూడు నెలల పాటు శ్రీవారి ఆలయం ముందు గార్డ్ డ్యూటీ నిర్వహించేందుకు ఆ ముగ్గురు కానిస్టేబుళ్లు తిరుమలకు వెళ్లారు. అయితే, మూడు రోజుల క్రితం ఇన్చార్జ్ ఆర్ఐకి సమాచారం లేకుండా పోలీసు వాహనంలో తిరుపతికి వెళ్లి మద్యం తాగి రావడాన్ని ఆ శాఖ ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ముస్లిం వ్యక్తి తిరుమలలో నమాజ్ చేసిన ఘటన జరిగిన మరుసటి రోజే కర్నూలు పోలీసులు మద్యం సేవించి హల్చల్ చేసిన నేపథ్యంలో ఉన్నతాధికారులు సంఘటనను సీరియస్గా తీసుకొని విచారణకు ఆదేశించారు. వీరు ముగ్గురు 2013లో ఏపీఎస్పీ 2వ పటాలంలో కానిస్టేబుళ్లుగా విధుల్లో చేరారు. సిరాజుద్దీన్ గతంలో కూడా తెలంగాణ నుంచి మద్యం తీసుకొని పటాలంలోకి వెళ్తూ పోలీసులకు పట్టుబడి ఆరు మాసాల పాటు సస్పెండ్ అయ్యారు. ఈ నేపథ్యంలో మిగిలిన ఇద్దరిపై కూడా గతంలో ఏవైనా రిమార్కులు ఉన్నాయా, అనే కోణంలో ఆ శాఖ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.కంపెనీ ఇన్చార్జీలతో కమాండెంట్టెలి కాన్ఫరెన్స్ఏపీఎస్పీ పటాలంలో పనిచేస్తున్న సిబ్బంది రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బందోబస్తు విధులు నిర్వహిస్తుంటారు. విజయవాడ కనకదుర్గమ్మ, తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంతో పాటు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే క్వార్టర్స్ బందోబస్తు విధులకు వెళ్తుంటారు. వీఐపీలకు భద్రత ( గన్మెన్ ) విధులకు కూడా వెళ్తుంటారు. తిరుమల సంఘటన నేపథ్యంలో పటాలంలో పనిచేస్తున్న మొత్తం సిబ్బందిలో ఎంతమందికి మద్యం సేవించే అలవాటు ఉంది, విధుల పట్ల అలసత్వం వహిస్తున్న వారు, గతంలో క్రమశిక్షణ చర్యలకు గురైన వారు, తదితర విషయాలపై జాబితా సిద్ధం చేయాలని కమాండెంట్ కంపెనీ ఇన్చార్జీలకు టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు ఇచ్చినట్లు సిబ్బందిలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మద్యం అలవాటు ఉన్న పోలీస్ సిబ్బంది గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ సంఘటనపై గత మూడు రోజులుగా పటాలంలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఆత్మకూరులో పోలీస్ స్టేషన్పై గతంలో దాడి జరిగిన సంఘటనలో ఇదే పటాలానికి చెందిన ఓ కానిస్టేబుల్ పాత్ర ఉన్నట్లు తేలడంతో అతడిని సర్వీస్ నుంచి తొలగించారు. ఇప్పుడు కూడా ఆ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తిరుమలలో మద్యం మత్తులో హంగామా చేసిన ఆ ముగ్గురిని కూడా సర్వీస్ నుంచి తొలగించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు పటాలం సిబ్బందిలో చర్చ జోరుగా సాగుతోంది. -
కృష్ణయ్యకు మధుర నివేదన
కర్నూలు కల్చరల్: ఆధ్యాత్మిక సేవా గుణం కలిగి ఉండాలని ఇస్కాన్ కర్నూలు బాధ్యులు రఘునందన సేవక్ ప్రభు సూచించారు. ఆదివారం స్థానిక భగీరథ కాంప్లెక్స్లోని జగన్నాథ మందిరంలో మామిడి పండ్ల ఉత్సవం, శీల ప్రభు పాదుల ప్రేమ విందు, భగవద్గీత తరగతులు నిర్వహించారు. జగన్నాథ్, సుభద్ర, బలదేవ్లను ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. భక్తులు తెచ్చిన మామిడి పండ్లతో జగన్నాథ్కు రాజ భోగ నివేదన చేశారు. అనంతరం ఆయన సందేశమిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. భగవద్గీత పఠనం, శ్రవణంతో సమస్యలకు పరిష్కార మార్గాలు దొరుకుతాయన్నారు. చిన్నారులకు చదువుతో పాటు సంస్కారం, నైతిక విలువలు, కుటుంబ విలువలు నేర్పాల్సిన అవసరం ఉందన్నారు. ఇస్కాన్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ దుర్మరణం
ఆళ్లగడ్డ: పట్టణ శివారులోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. రూరల్ సీఐ మురళీధర్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. కోవెలకుంట్ల పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న శేఖర్ (30) అదనపు విధుల్లో భాగంగా శనివారం రాత్రి క్యూఆర్టీంతో కలిసి చాగలమర్రి టోల్ప్లాజా దగ్గర విధులు పూర్తి చేసుకుని ఆదివారం తెల్లవారు జామున కోవెలకుంట్లకు వెళ్లేందుకు హైవే పెట్రోలింగ్ వాహనంలో ఆళ్లగడ్డ హైవే డాబా దగ్గరకు వచ్చాడు. అక్కడి నుంచి ఆళ్లగడ్డకు వచ్చేందుకు అటుగా వస్తున్న మోటర్ సైకిల్ను ఆపి ఎక్కి వస్తుండగా కొంచెం దూరం వచ్చేసరికి వెనుక వైపునుంచి వస్తున్న పాల లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగ గాయపడ్డ కానిస్టేబుల్ శేఖర్ను స్థానిక వైద్యశాలకు తరలించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం నంద్యాల వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. మృతుడికి భార్య ప్రవళిక, నాలుగు సంవత్సరాల కొడుకు, ఏడాది వయస్సున్న కూతురు ఉన్నారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు కానిస్టేబుల్ శేఖర్ అంత్యక్రియలు ఆదివారం చాగలమర్రి మండలం మద్దూరు గ్రామంలోని శ్మశాన వాటికలో పోలీసు లాంఛనాలతో నిర్వహించారు. డీఎస్పీ ప్రమోద్, సీఐ మురళీధర్రెడ్డి పర్యవేక్షణలో ఏఆర్, సివిల్ పోలీసులు గౌరవ వందనం చేశారు. ఆళ్లగడ్డ పట్టణ శివారులోని హైవేపై ఘటన అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు -
వలస బాటలో విప్లవ అడుగులు
నేడు అంత్యక్రియలు మావోయిస్టు సంగీత అంత్యక్రియలను ప్రజాస్వామ్య సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు పౌర హక్కుల సంఘం జిల్లా కార్యదర్శి అల్లాబకాష్ విలేకరుల సమావేశంలో వివరించారు. ఈ సమావేశంలో ఎస్డీపీఐ నాయకులు జహంగీర్, రాయలసీమ విద్యావంతుల వేదిక కన్వీనర్ భాస్కరరెడ్డి, విరసం బాధ్యులు నాగేశ్వర ఆచారి పాల్గొన్నారు.కర్నూలు(సెంట్రల్)/ఆత్మకూరురూరల్: ఛత్తీస్ఘడ్ రాష్ట్రం నారాయణ్పూర్ జిల్లా ఆంబూజ్ మాడ్లో ఈనెల 21న జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టుల్లో ఆస్పరి మండలం ములుగుంద గ్రామానికి చెందిన మహిళ ఉంది. గ్రామానికి చెందిన మాదిగ దుబ్బన్న, ఎస్తేరమ్మ దంపతులకు ఐదుగురు సంతానం కాగా వారిలో పెద్ద కుమార్తె లలిత అలియాస్ సంగీత ఒకరు. కుటుంబ పోషణ కోసం 20 ఏళ్ల క్రితం హైదరాబాద్ వలస వెళ్లిన లలిత మావోయిస్టు ఉద్యమానికి ఆకర్షితురాలైంది. మొదట ఆమె బతుకు దెరువు కోసం హైదరబాద్కు వెళ్లి అక్కడే కుల నిర్మూలన పోరాట సమితిలో పనిచేసింది. ఆ తరువాత సంగీతగా పేరు మార్చుకొని మావోయిస్టు ఉద్యమంతో పరిచయమై పూర్తిస్థాయి పార్టీ కార్యకర్తగా ఛత్తీస్గఢ్ అడవుల్లోకి వెళ్లిపోయి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసింది. ఈ క్రమంలో చీరాలకు చెందిన సజ్జా నాగేశ్వరావు సహచరిగా ఆమె మారినట్లు తెలుస్తోంది. సంగీత నర్సింగ్లో శిక్షణ పొంది పార్టీ కార్యకర్తలు, ఆదివాసీలకు వైద్య సేవలు అందించినట్లు సమాచారం. ఈమె మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్ నంబాల కేశవరావు కార్యాలయ (మొబైల్) సిబ్బందిలో ఒకరుగా పని చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎన్కౌంటర్లో మృతి చెందడంతో పోలీసులు ఆరా తీయగా కర్నూలు జిల్లా ఆస్పరి మండలం ములుగుంద గ్రామానికి చెందిన మహిళగా శనివారం గుర్తించారు. 20 ఏళ్ల క్రితం వలస వెళ్లిన మహిళ చివరకు విగతజీవిగా తిరిగి వస్తుండటంతో గ్రామంలో కొందరు విషాదంలో మునిగారు. -
గిరిజన ఉత్పత్తులను విస్తరింపజేయండి
కర్నూలు(అర్బన్): గిరిజనులు తయారు చేసిన ఉత్పత్తులను రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విస్తరింపజేసేలా చర్యలు చేపట్టాలని గిరిజన సంఘాల నాయకులు కోరారు. ఆదివారం ఇక్కడకు వచ్చిన గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ కిడారి శ్రావణ్కుమార్ స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో వైహెచ్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎరుకల రాజు, బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరమణనాయక్ తదితరులు కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజనులు తయారు చేస్తున్న అరకు కాఫీ ఉత్పత్తులను అన్ని జిల్లాల్లోని మార్కెట్లు, రైతు బజార్లలో గిరిజన కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీల ద్వారా విక్రయించేందుఉ చర్యలు చేపట్టాలన్నారు. చైర్మన్ను కలిసిన వారిలో జీసీసీ రాష్ట్ర డైరెక్టర్ ఎస్ అరుణ్నాయక్, గిరిజన ఉద్యోగుల సంఘం చైర్మన్ బద్దు నాయక్, ఫ్యాప్టో చైర్మన్ సేవాలాల్, రామునాయక్, ఎరుకల హరి, చంద్రనాయక్ తదితరులు ఉన్నారు. మద్యం దుకాణంలో చోరీ బేతంచెర్ల: స్థానిక కొత్త బస్టాండు సమీపంలోని రమ్య మద్యం దుకాణంలో చోరీకి జరిగినట్లు సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు దుకాణం వెనక భాగం నుంచి వచ్చిన దొంగలు రేకును కట్ చేసిలోపలికి ప్రవేశించారు. క్యాష్ కౌంటర్లో ఉన్న రూ. 3.99 లక్షలు అపహరించారు. శనివారం బ్యాంక్ సెలవు కావడంతో నిర్వాహకులు ఆ రోజు కలెక్షన్ డబ్బులు కౌంటర్లోనే ఉంచి వెళ్లడంతో రాత్రి చోరీకి గురైంది. సమాచారం తెలుసుకున్న క్లూస్ టీం పోలీసులు మద్యం దుకాణాన్ని పరిశీలించారు. మద్యం దుకాణం నిర్వాహకుడు భూపాల్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు. నేడు కర్నూలులో ర్యాలీ కర్నూలు(సెంట్రల్): రేషన్ సరుకులను ఎండీయూ వాహనాల ద్వారానే సరఫరా చేయాలని, ఎండీయూ ఆపరేటర్లను కొనసాగించాలని కోరుతూ సోమవారం ఏపీ ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా కార్యదర్శి కె.ప్రభాకర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు రాజ్విహార్ నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించే ర్యాలీలో ఎండీయూ ఆపరేటర్లతోపాటు కార్మికులు పాల్గొనాలని కోరారు. -
టీడీపీ నాయకుడిపై పోలీసులకు ఫిర్యాదు
పాణ్యం: మండల పరిధిలోని భూపనపాడు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు హనమంతుపై పోలీసుల స్టేషన్లో గ్రామ కార్యదర్శి శ్రీనివాసులు ఫిర్యాదు చేసినట్లు ఈఓఆర్డి చంద్రమౌళేశ్వర్గౌడ్ ఆదివారం విలేకరులకు తెలిపారు. భూపనపాడు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న చెరువులో అక్రమంగా చేపలు అమ్ముకున్నారని, దీంతో గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో గ్రామ కార్యదర్శి శ్రీనివాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. జాతీయ స్థాయి ఉషూ పోటీలకు ఎంపిక కర్నూలు (టౌన్): ఈనెల 26 నుంచి 31 వరకు తమిళనాడు రాష్ట్రంలోని ఈ–రోడ్డులో నిర్వహిస్తున్న 25 వ జాతీయ స్థాయి సబ్ జూనియర్ ఉషూ పోటీలకు కర్నూలు విద్యార్థులు ఎంపికయ్యారు. ఆదివారం స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఎంపికై న సాయిదామిని, సాయి తన్మయ్, షేక్ షాజిదా, యశిత రెడ్డి, ఉదయశ్రీ, రిషీ మహేందర్, సాధిక్, సాయి ఆరవింద్ను జిల్లా ఉషూ సంఘం కార్యదర్శి శ్రీనివాసులు, కోచ్ చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గం ఎన్నిక కర్నూలు(హాస్పిటల్): చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంస్థ అధ్యక్షులు ఐ.విజయ్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో ఆదివారం 59వ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ చైర్మన్గా టీజీ వెంకటేష్, ఆడిటర్గా బుచ్చన్న, కోశాధికారిగా కె.మురళీధర్, ఆర్గనైజింగ్ సెక్రటరిగా ఎస్.నరేంద్రలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం వర్తకుల సమస్యలను సమావేశంలో చర్చించారు. కార్యక్రమంలో ఓంప్రకాష్, గురుస్వామి, టీవీ రత్నప్రసాద్, డివి.రమణ, జగదీష్, మారం అనిల్, జగన్నాథగుప్త, సుబ్రహ్మణ్యం, బదరినారాయణ పాల్గొన్నారు. ముగిసిన క్రెడాయ్ ప్రాపర్టీ షో కర్నూలు (టౌన్): నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న క్రెడాయ్ ప్రాపర్టీ షో ఆదివారం సాయంత్రం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్. రవీంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి క్రెడాయ్ నిర్వహిస్తున్న ప్రదర్శన ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఆస్తి కోనుగోలు చేయాలనుకోనే వారికి చక్కని వేదిక క్రేడాయ్ ఏర్పాటు చేసిందన్నారు. ఇలాంటి ప్రదర్శనలు కర్నూలు పరిసర ప్రాంతాల అభివృద్ధికి దోహదం చేస్తాయన్నారు. క్రెడాయ్ ప్రాపర్టీ ప్రదర్శన పురస్కరించుకొని నిర్వహించిన లక్కీ డిప్ విజేతలకు బంగారు నాణం, ఇతర వస్తువులు అందజేశారు. క్రెడాయ్ సంస్థ అధ్యక్షులు సురేష్కుమార్ రెడ్డి, కన్వీనర్ శ్రీనివాసరావులు మాట్లాడుతూ.. ప్రాపర్టీ ప్రదర్శనకు మంచి ఆదరణ లభించిందన్నారు. గణనీయమైన వ్యాపార లావాదేవీలు జరిగాయన్నారు. ప్రతి ఒక్కరి ఇంటి కలను క్రెడాయ్ కల్పించేందుకు ఎంతో కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ సంస్థ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. -
రైతుకు లంచాల ‘షాక్’
కర్నూలు(అగ్రికల్చర్): విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని కోరిన రైతుల నుంచి కొందరు విద్యుత్ శాఖ అధికారులు మామూళ్లు వసూళ్లు చేస్తున్నారు. ఇటీవల నంద్యాల జిల్లాలో ఒక రైతుకు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసేందుకు రూ.30 వేలు లంచం డిమాండ్ చేసి అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికిపోయారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వ్యవసాయ విద్యుత్ కోసం రైతులు మీసేవ కేంద్రాలు, గ్రామ సచివాలయాల్లో ముమ్మరంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు 11,500 మంది వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. ముందుగా విద్యుత్ అధికారులు వెళ్లి బోరు పాయింట్ నుంచి విద్యుత్ పోల్ ఉన్న ప్రాంతం వరకు ఎన్ని పోల్స్ పడుతాయో తెలుసుకోవాలి. అలాగే ట్రాన్స్ఫార్మర్లు ఎన్ని పడుతాయో అంచనా వేయాలి. ఇందుకోసం రైతులు వేలాది రూపాయల ముడుపులు సమర్పించుకోవాల్సి వస్తోంది. అలాగే ఎస్టిమేట్లు వేయడానికి విద్యుత్ అధికారులు వెళ్లడానికి రైతులు ప్రత్యేకంగా వాహనం ఏర్పాటు చేయాల్సి దుస్థితి నెలకొంది. ఎస్టిమేట్లు తయారు చేసిన తర్వాత డిమాండ్ నోటీసు ఇస్తే దాని ప్రకారం రైతు వాటా మొత్తాన్ని డీడీ చెల్లించాల్సి ఉంది. అయితే మండలస్థాయిలోనే మంజూరు అయితే ఒక రేటు, సబ్ డివిజన్ స్థాయిలో మంజూరు అయితే ఇంకో రేటు, డివిజన్ స్థాయిలో మంజూరు అయితే మరో రేటు ఉంటుంది. వెరసి ముడుపుల భారం రైతులపై గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు ఉంటుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మెటీరియల్ ఇవ్వాలన్నా ముడుపులే! రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన రైతులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా స్పందించరు. ‘‘ మీకు ఇంకా మెటీరియల్ రాలేదు.. రావడానికి మరో నెల రోజులు ఆలస్యం కావచ్చు.. కాకపోతే ఖర్చు అవుతుంది’’ అని బేరం పెట్టడం గమానార్హం. నిబంధనల ప్రకారం మెటీరియల్ను డిపార్టుమెంటు వాహనాల్లోనే తరలించాల్సి ఉంది. అయితే వాహనాలు రిపేరీలో ఉన్నాయని, డ్రైవర్ లేడని రవాణా భారాన్ని రైతులపైనే వేస్తున్నారు. అధికారులు మాత్రం డిపార్టుమెంటు వాహనాలతో ట్రాన్స్పోర్టు చేశామని రికార్డు చేసుకొని డీజిల్ కాజేస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. చుక్కలు చూడాల్సిందే! ఎస్టిమేట్లు వేయించుకోవడం ఒక ఎత్తు అయితే లైన్ వేయించుకోవడం మరో ఎత్తుగా మారింది. డిమాండ్ నోటీసుకు అనుగుణంగా రైతులు తమ వాటా మొత్తాన్ని చెల్లించిన తర్వాత పోల్స్ సరఫరా చేస్తారు. పోల్స్ ఇవ్వాలంటే ముడుపులు ఇచ్చుకోవాల్సిందే. పోల్స్ సంఖ్యను బట్టి ముడుపుల రేటు పెట్టినట్లు సమాచారం. పోల్స్ వచ్చిన తర్వాత ట్రాన్స్ఫార్మర్, కేబుల్, కండక్టర్ విద్యుత్ శాఖ స్టోర్ నుంచి డ్రా చేస్తారు. అయితే రైతుకు ఇవ్వరు. మళ్లీ ముడుపులు ముడితేనే పోల్స్ పాతి, లైన్ వేస్తారు. విద్యుత్ లైన్ నుంచి బోరు పాయింటు దగ్గరకు లైన్ వేయడానికి 180 మీటర్ల వరకు ప్రభుత్వం భరిస్తుంది. 11 కేవీ లైన్ వేస్తే 180 మీటర్లకు దాదాపు రూ.60 వేలు, ఎల్టీ(లోటెన్షన్) లైన్ వేస్తే రూ.45 వేలు వరకు ఖర్చు వస్తుంది. అవసరాన్ని బట్టి 11 కేవీ లేదా ఎల్టీ లైన్ వేస్తారు. 180 మీటర్లు దాటితే ఆ ఖర్చు రైతు భరించాల్సి ఉంది. లైన్ దూరాన్ని, ఎస్టిమేట్ మొత్తాన్ని బట్టి ముడుపుల రేటు ఉంటుంది. లైన్ వేయాలంటే కనీసం రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు మామూళ్లు ఇచ్చుకోవాల్సిందే. ముడుపులు ఇస్తేనే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకూ మామూళ్లు ఇవ్వాల్సిందే ఇటీవల ఏసీబీకి పట్టుబడిన విద్యుత్ శాఖ అధికారి -
శ్రీమఠంలో భక్తుల రద్దీ
మంత్రాలయం: శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో ఆదివారం భక్తుల రద్దీ కనిపించింది. శ్రీమఠం తలుపులు తెరకముందే వేకువజాము నుంచే దర్శనానికి వేలాది మంది బారులు తీరారు. అత్యధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో శ్రీమఠం వీధులన్నీ కిక్కిరిశాయి. రాఘవేంద్రస్వామి మూల బృందావన దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది. మంచాలమ్మ, అన్నపూర్ణ భోజనశాల, పరిమళ ప్రసాదం కౌంటర్లు భక్తులతో కిక్కిరిశాయి. సుంకేసులకు ఇన్ఫ్లో కర్నూలు సిటీ: తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో సుంకేసుల జలాశయానికి ఇన్ఫ్లో వస్తోంది. ఆదివారం బ్యారేజీకి ఎగువ నుంచి 8,908 క్యుసెక్కులు ఇన్ఫ్లో ఉండగా దిగువకు 8,749 క్యుసెక్కుల విడుదల చేస్తున్నారు. కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో తాగునీటి అవసరాల కోసం కేసీ కాలువకు 159 క్యుసెక్కుల నీరు వదిలారు. రేషన్ బియ్యం పట్టివేత గోనెగండ్ల: ఆదోని నుంచి లారీలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని గోనెగండ్లలో ఆదివారం పట్టుకున్నారు. విజిలెన్స్ ఎస్ఐ నరేంద్ర భూపతి, సివిల్సప్లై డీప్యూటీ తహసీల్దార్ మహేష్ తెలిపిన వివరాల మేరకు.. ఆదోనికి చెందిన రామ్ యాదవ్ గ్రామాల నుంచి 240 ప్యాకెట్ల రేషన్ బియ్యంను సేకరించారు. లారీలో ఆదోని నుంచి కర్నూలుకు తరలిస్తున్నట్లు సమాచారం గోనెగండ్లలో పట్టుకున్నామని తెలిపారు. పోలీస్ స్టేషన్కు తరలించినట్లు చెప్పారు. రామ్ యాదవ్తో పాటు డ్రైవర్ వీరేష్పై గోనెగండ్ల పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. శ్రీశైలంలో 39.5 టీఎంసీలు శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయంలో ఆదివారం సాయంత్రానికి 39.4936 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 818.20 అడుగులకు చేరుకుంది. శనివారం నుంచి ఆదివారం వరకు ఎగువ సుంకేసుల ప్రాజెక్ట్, లోకల్ క్యాచ్మెంట్ నుంచి 8,942 క్యూసెక్కుల నీరు జలాశయంలోకి వచ్చి చేరింది. జలాశయం నుంచి భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో ఉత్పాదన అనంతరం 7,259 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్కు వదిలారు. బ్యాక్ వాటర్ నుంచి కల్వకుర్తి ఎత్తిపోతలకు 800 క్యూసెక్కుల నీటిని విడిచి పెట్టారు. భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో 3.366 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశారు. డ్యాం పరిసర ప్రాంతాలలో 2 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. శాస్త్రోక్తంగా పల్లకీ సేవ శ్రీశైలంటెంపుల్: శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల ఉత్సవమూర్తులకు ఆదివారం సందర్భంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో పల్లకీ సేవ నిర్వహించారు. ముందుగా ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో ఉత్సవమూర్తులను ఉంచి వేదమంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు చేసి, మేళతాళాలతో ఆలయ ప్రదక్షిణ చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో దేవస్థాన అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. కొండ నిండా భక్తులు శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు మల్లన్న దర్శనానికి భారీగా తరలివచ్చారు. వేకువజాము నుంచి పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లికార్జునస్వామివారి దర్శనానికి క్యూలైన్ వద్దకు చేరుకున్నారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తుల రద్దీతో ఆలయ క్యూలైన్లు నిండిపోయాయి. పలువురు భక్తులు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ప్రత్యేక సమయాల్లో స్వామివారి స్పర్శదర్శనం నిర్వహించుకున్నారు. -
వక్ఫ్ను రక్షించుకుందాం
మానహారంలో నిర్వహిస్తున్న ముస్లింలు, చిత్రంలో మాజీ ఎమ్మెల్యే హఫీజ్ఖాన్కర్నూలు (టౌన్): ‘వక్ఫ్ను రక్షించుకుందాం.. రాజ్యాంగాన్ని కాపాడుకుందాం’ అని కర్నూలు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యులు హఫీజ్ఖాన్ పిలుపు నిచ్చారు. ఆదివారం స్థానిక పాతబస్తీలోని కుబ్ సూరత్ మసీదు వద్ద ముస్లింలు మౌన మానవహారం నిర్వహించారు. వక్ఫ్ను రక్షించాలని నినాదాలు చేశారు. మౌన మానవహారానికి భారీగా మహిళలు, పురుషులు, పిల్లలు తరలి వచ్చారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వక్ఫ్ సవరణ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలన్నారు. రాజ్యాంగం కల్పించిన మౌలిక హక్కులను ఈ చట్టం కాలరాస్తుందని, అందుకే ముస్లింలు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ముస్లింల మనోభావాలకు దెబ్బతినకుండా సుప్రీంకోర్టు ఈ చట్టాన్ని రద్దు చేస్తుందని ఆశిస్తున్నామన్నారు. ప్రజలు శాంతియుతంగా పోరాటాన్ని కొనసాగించాలన్నారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు మౌలానా జకీర్ , జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కర్నూలులో ముస్లింల మౌన మానవహారం -
స్వయం ఉపాధికి రుణాలు ఇస్తామని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రకటన ఇచ్చింది. వేల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, కాపు వర్గాల ప్రజలు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆయా కార్పొరేషన్ల ద్వారా అర్హులైన వారికి సబ్సిడీ రుణాలు అందిస్తామని ఆర్భాటం చేసింద
● ఎస్సీలకు రూ.40.73 కోట్లు అంటూ ఆర్భాటాలు ● బీసీలను ఊరించిన రూ.41.23 కోట్ల రుణాలు ● నేటికి జమ కాని ఫూలే జయంతి రోజున ఇచ్చిన రూ.11.73 కోట్ల మెగా చెక్కు ● అదే దారిలో మైనారిటీ, గిరిజన కార్పొరేషన్ల రుణాలు కర్నూలు(అర్బన్): రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, కాపు తదితర పేద వర్గాలకు సబ్సిడీ రుణాలు ఇవ్వకుండా పంగనామాలు పెట్టేందుకు సిద్ధమైంది. ‘ఇదిగో రుణాలు ఇస్తున్నాం .. వెంటనే దరఖాస్తు చేసుకోండి’ అని ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన ప్రజలకు నమ్మించి మాట మార్చింది. ఎస్సీ రుణాలకు యూనిట్లు మారుస్తున్నామని, తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు రుణాలకు సంబంధించిన ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. బీసీ రుణాలకు సంబంధించి కూడా ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు జరపరాదని ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగ యువత, పేద వర్గాలు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి. ఆశలకు ‘మూత’ వేసి జిల్లా షెడ్యూల్డు కులాల ఆర్థిక సహకార సంస్థ ఆధ్వర్యంలో 2025–26 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో మొత్తం 973 మందికి రూ.40.73 కోట్ల మేర సబ్సిడీ రుణాలను అందిస్తున్నట్లు ఏప్రిల్ నెల మొదటి వారంలో ప్రకటించారు. రూ. 3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ( 40 నుంచి 60 శాతం వరకు సబ్సిడీ ) రుణాలను అందిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో వేల సంఖ్యలో నిరుద్యోగులు తమకు అనుభవం ఉన్న రంగాల్లో యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా దరఖాస్తు చేసుకునేందుకు సమయం ఉన్నా యూనిట్లను మారుస్తున్నామంటూ దరఖాస్తు చేసుకునే సైట్కు ప్రభుత్వం మూత వేసింది. దీంతో వివిధ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. నిరాశే మిగిలింది! అన్ని కార్పొరేషన్ల కంటే ముందుగా బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందిస్తున్నట్లు ప్రచారాన్ని హోరెత్తించారు. అదే స్థాయిలో అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ప్రచారాలను కూడా ముమ్మరం చేశారు. జిల్లాలోని బీసీ, కాపు, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన 2,034 మందికి రూ.41.23 కోట్ల మేర రుణాలు అందిస్తున్నట్లు ప్రభుత్వం ఊరించింది. దీంతో జిల్లాలో బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు పొందేందుకు 27,140 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మండలాలు, మున్సిపాలిటీల వారీగా ఎంపికలు కూడా జరిగాయి. తీరా రుణాలు అందుతాయనే సమయంలో సైట్ క్లోజ్ చేసి రుణాలకు సంబంధించిన ప్రక్రియను నిలుపుదల చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. మండలాలు, మున్సిపాలిటీల నుంచి కూడా ఎలాంటి ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుకోరాదని తేల్చేశారు. దీంతో బీసీ రుణాల కోసం ఆశించిన పేద వర్గాలకు నిరాశే మిగులుతోంది. జమ ఎప్పుడో? బీసీలను నమ్మించేందుకు గత నెల 11వ తేదీ మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి రోజున జిల్లాలో బీసీ కార్పొరేషన్ ద్వారా 508 మంది లబ్ధిదారులు ఎంపికయ్యారని ప్రకటించారు. వారికి రూ.11.73 కోట్ల మెగా చెక్కును అందించారు. అయితే నేటికీ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో సబ్సిడీ రుణం జమ కాలేదు. అదే దారిలో మైనారిటీ, గిరిజన రుణాలు ... బీసీ, ఎస్సీ కార్పొరేషన్ల ద్వారా అందించాల్సిన రుణాల్లో జాప్యం చోటు చేసుకోగా, మైనారిటీ కార్పొరేషన్లో దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే గిరిజన కార్పొరేషన్ ద్వారా అందించాల్సిన రుణాలకు సంబంధించిన వార్షిక ప్రణాళిక కూడా రూపొందించనట్లు తెలుస్తోంది. -
గృహ నిర్మాణాల్లో పురోగతి సాధించాలి
నందవరం/గోనెగండ్ల: వివిధ దశలో పెండింగ్లో ఉన్న గృహ నిర్మాణాల్లో పురోగతి సాధించాలని హౌసింగ్ పీడీ చిరంజీవి ఆదేశించారు. శనివారం నాగలదిన్నె, హాలహర్వి గ్రామాల్లో వివిధ దశలో ఉన్న ఇళ్ల నిర్మాణాలను పీడీ పరిశీలించారు. అనంతరం హౌసింగ్ లబ్ధిదారులు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మండలంలో 192 ఇళ్లు వివిధ దశల్లో పెండింగ్ ఉన్నాయని, అందులో 82 గృహలు పూర్తి చేశారని, మిగిలినవి బీఎల్, ఎల్ఎల్, ఆర్ఎల్, ఆర్పీ లెవల్ ఉన్నాయని వివరించారు. వివిధ దశల్లో ఉన్న గృహ నిర్మాణాలను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే థర్డ్ పార్టీ నిర్మించిన ఇళ్లను కూడా త్వరగా పూర్తి చేయాలన్నారు. వివిధ దశలో పూర్తి నిర్మాణాలు పూర్తి చేసిన లబ్ధిదారులకు సకాలంలో బిల్లు చెల్లిస్తామని తెలిపారు. అలాగే గోనెగండ్ల మండలంలోని కులుమాల, హెచ్. కై రవాడి, చిన్న నేలటూరు, అలువాల గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలను హౌసింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఇళ్ల లబ్ధిదారులతో సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓలు పుల్లయ్య, మణిమంజరి, హౌసింగ్ డీఈ ప్రసాద్, ఏఈలు వెంకటేష్, షేక్షావలి, డిప్యూటీ ఎంపీడీఓ సందీప్ ఉన్నారు. -
తోడుకున్నోడికి తోడుకున్నంత!
కూటమి నేతల ఆశీస్సులు ఉంటే చాలు.. అనుమతులతో పనిలేదు. చలానాలు అసలే అక్కర్లేదు. తోడుకున్నోడికి తోడుకున్నంత. ఇదీ కౌతాళం మండలం గుడికంబాళి గ్రామ సమీపంలో ప్రభుత్వ ఇసుక రీచ్లోని దుస్థితి. ఇటీవల నదికి వరద నీరు రావడంతో అక్కడ అధికారికంగా ఇసుక రవాణాకు అనుమతులిచ్చారు. ఇదే అదునుగా చేసుకున్న కూటమి అనుకూల ట్రాక్టర్ల యజమానులు నదిలో వాలిపోయారు. తోడేళ్లుగా మారి ఇసుకనంతా తరలిస్తున్నారు. తమ ఆదాయ వనరుగా మార్చుకుని రీచ్లో అడ్డంకులకు తావు లేకుండా ఇసుకను దాటిస్తున్నారు. శనివారం గుడికంబాళి రీచ్ నుంచి వందలాది ట్రాక్టర్ల ఇసుక అక్రమంగా తరలిపోతున్నా ఏ ఒక్క అధికారి అటు వైపు తొంగి చూడలేదు. – మంత్రాలయం -
స్వచ్ఛందంగా దాహం తీర్చుతూ..
గోనెగండ్ల: తీవ్ర తాగునీటి సమస్య నెలకొన్న పెద్దమరివీడు ప్రజల దాహార్తి తీర్చడంలో అధికారు లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గ్రామంలో ఐదు రోజులకు ఒకసారి కుళాయిలకు నీరు వస్తున్నందున తాగునీటి సమస్య తీవ్రమయింది. గ్రామంలో తాగునీటి సమస్య ఉందని గ్రామ వైఎస్సార్సీపీ నాయ కులు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ బుట్టా రేణుక దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆమె పెద్దమరివీడు గ్రామంలో మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం మంచినీటి ట్యాంకర్ను ఏర్పాటు చేసి గ్రామస్తులకు నీటిని సరఫరా చేపట్టారు. దీంతో గ్రామ ఉప సర్పంచ్ నరసన్న ఆచారి, వైఎస్సార్సీపీ నాయకులు నాగేష్, చిన్న యంకన్న గౌడ్, గజేంద్ర, నరసింహుడు, గ్రామస్తులు బుట్టా ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. -
ఉమ్మడి కర్నూలు జిల్లాలో చాలా మంది ఇప్పుడు ఆన్లైన్లో వైద్యం గురించి ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా ఏఐ, చాట్ జీపీటీ లాంటి సైట్లలో ఏ విషయం అడిగినా ఒక్క క్షణంలోనే సమాచారం వస్తోంది. వాటినే నమ్మి వైద్యులను అనుమానించే వారూ ఎక్కువయ్యారు. ఫలానా వైద్యుడు తమను మోసం
● కర్నూలుకు చెందిన రాజ్కుమార్ ఓ ప్రైవేటు సంస్థలో ఎగ్జిక్యూటివ్. రోజూ వందల కిలోమీటర్లు తిరగడంతో అతనికి ఏదో ఒక అనారోగ్య సమస్య వేధిస్తుంటుంది. దీంతో తరచూ డాక్టర్ వద్దకు వెళ్లడం దేనికని ఆన్లైన్లో తనకు వచ్చిన ఆరోగ్య సమస్యకు పరిష్కారాన్ని వెతికి మెడికల్ షాపులో మందులు కొని వాడుతున్నాడు. ఓ రోజు మందు లు వికటించి ఆసుపత్రికి వెళితే ఎలా పడితే అలా మందులు వాడకూడదని వైద్యులు చికిత్స చేసి పంపించారు. ● కర్నూలుకు చెందిన ఓ బి.ఫార్మసి విద్యార్థిని తనకు ఇటీవల ఛాతీలో నొప్పి ఉంటే ఆన్లైన్లో టైప్ చేసి చూసుకుంటే హార్ట్ ఎటాక్ అని చూపించింది. దీంతో ఆమె తీవ్ర ఆందోళనతో సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి వైద్యులను కలిసింది. పరీక్షించిన వైద్యులు వచ్చింది హార్ట్ ఎటాక్ కాదని, కండరాల నొప్పిగా నిర్ధారించారు. ● నంద్యాలకు చెందిన రామాంజనేయులు ప్రభుత్వ ఉద్యోగి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చుని పనిచేయాల్సిందే. ఇంటర్నెట్పై మంచి పట్టు ఉంది. దీంతో తనతో పాటు ఇంట్లో ఎవరికి అనారోగ్య సమస్యలువచ్చినా ఆన్లైన్లో వెతికి పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో ఆయన తల్లికి ఒకసారి మందులు వికటించి ఇబ్బంది రావడంతో వైద్యుని వద్దకు తీసుకెళ్లారు. ఆన్లైన్ పరిష్కారం ప్రతిసారీ మంచిది కాదని వైద్యులు హితవు పలికారు. ఇవీ నష్టాలు.. ఆరోగ్య సమస్య కొంతైతే ఆన్లైన్లో వివరాలు కొండంత ఉంటాయి. దానిని చూసి రోగి మరింత ఆందోళనకు గురవుతారు. ఫలితంగా మానసికంగా మరింత కృంగిపోతాడు. ఆందోళనకు గురైతే శారీరకంగా మరిన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొందరు ఆన్లైన్లో తమ ఆరోగ్య సమస్యలు వెతికి ముందుగానే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకుని డాక్టర్ వద్దకు వెళ్తున్నారు. ముందుగానే పరీక్షలు చేయించుకోవద్దని వైద్యులు చెబుతున్నారు. ఒక్కో వ్యక్తికీ ఒక్కో శరరీతత్వం ఉంటుంది. వారి జన్యువులు, వారి ఆరోగ్యాన్ని బట్టి రోగ లక్షణాలు ఉంటాయి. అందరినీ ఒకే విధంగా చూడలే మని వైద్యులు చెబుతున్నారు. ఒక్కొక్కరికీ ఒక్కో విధమైన చికిత్స ఉంటుందని, ఆన్లైన్ వైద్యాన్ని గుడ్డిగా నమ్మొద్దని సూచిస్తున్నారు. -
రైల్వే ప్రాజెక్టుల భూసేకరణ త్వరగా పూర్తి చేయాలి
● కలెక్టర్ రంజిత్బాషా కర్నూలు(సెంట్రల్): జిల్లాలో రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ పనులను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి.రంజిత్బాషా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో మూడు రెవెన్యూ డివిజన్లలో జరుగుతున్న రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ పురోగతిపై ఆర్డీఓలు, తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ..రైల్వే బ్రిడ్జిలకు సంబంధించిన ప్రాజెక్టుల భూసేకరణను ముందుగా పూర్తి చేయాలన్నారు. ఇందుకోసం జేసీ, సబ్ కలెక్టర్, ఆర్డీఓలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ల్యాండ్ అక్విటేషన్, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు, లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్సీలపై త్వరగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆదోని డివిజన్లో మూడు ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి భూసేకరణ జరుగుతున్నట్లు సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ తెలిపారు. కర్నూలు డివిజన్లో 12 గ్రామాల్లో డబుల్ ట్రాక్ లైన్, రోడ్డు అండర్ బ్రిడ్జిల నిర్మాణాలకు సంబంధించిన భూసేకరణ పురోగతిలో ఉన్నట్లు కర్నూలు ఆర్డీఓ సందీప్కుమార్ వెల్లడించారు. పత్తికొండ డివిజన్లో రెండు ప్రాజెక్టులకు సంబంధించి డబుల్ ట్రాక్ కోసం ల్యాండ్ అక్విజిషన్ పూర్తి అయిందని, మరోప్రాజెక్టుకు సంబంధించి అవార్డు స్టేజ్ వరకు వచ్చినట్లు ఆర్డీఓ భరత్నాయక్ చెప్పారు. సమావేశంలో డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, ఆర్అండ్బీ ఎస్ఈ మహేశ్వరరెడ్డి, ఈఈ బాబు, ఆదోని ఈఈ వెంకటేశ్వర్లు, రైల్వే అసిస్టెంట్ డివిజినల్ ఇంజినీరు దుర్గారావు, ఆదోని మునిసిపల్ కమిషనర్ కృష్ణ పాల్గొన్నారు. -
విజిలెన్స్ అధికారుల సోదాలు
● ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి ఫుడ్ సప్లై సిబ్బందిపై కేసు నమోదు ఆదోని అర్బన్: విజిలెన్స్ అధికారులు శనివారం పట్టణంలో సోదాలు నిర్వహించారు. రైతు బజారులోని మూడు కిరాణాషాపుల్లో ఎటువంటి లైసెన్సులు లేకపోవడంతో కేసు నమోదు చేసినట్లు జిల్లా సివిల్ సప్లై అధికారి రాజారఘువీర్ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫుడ్ సప్లై చేస్తున్న వారిపై కేసు నమోదు చేశామన్నారు. అంతకుముందు వ్యవసాయ మార్కెట్యార్డులో వేరుశనగకాయల దిగుబడులను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. తూకాల్లో ఏవైనా మోసాలు జరుగుతున్నాయా, పట్టీలు ఎక్కువ తక్కువ వేస్తున్నారా అనే విషయాలపై ఆరా తీశారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని వంటశాలను పరిశీలించారు. అపరిశుభ్ర వాతావరణంలో వంట చేయడం, కోడిగుడ్ల సైజు చిన్నగా ఉండటంతో కేసు నమోదు చేశారు. రైతు బజారులోని లైసెన్స్ లేని మూడు కిరాణాషాపులపై కేసు నమోదు చేశారు. పెట్రోల్ బంకును తనిఖీ చేసి, టాయిలెట్లు సరిగాలేవని, వాహనాలకు ఉచితంగా గాలి పట్టే సౌకర్యం ఏర్పాటు లేదని గుర్తించారు. అనంతరం వాటర్ ప్లాంటును పరిశీలించారు. కర్ణాటక రాష్ట్రం నుంచి లీటర్ బాటిళ్లు బిల్లులు లేకుండా సరఫరా అవుతుండటం, వాటర్ ప్యాకెట్లపై సీల్ లేకుండా ఉండడంపై ఆరా తీశారు. అనంతరం జిల్లా సివిల్ సప్లై అధికారి రాజారఘువీర్ మాట్లాడుతూ కర్నూలు, ఆదోనిలో తనిఖీలు నిర్వహించామన్నారు. నివేదికలను ఉన్నతాధికారులకు పంపుతామన్నారు. తనిఖీల్లో ఫుడ్సేఫ్టీ అధికారి రాజగోపాల్, అసిస్టెంట్ మార్కెట్యార్డు డైరెక్టర్ నారాయణమూర్తి, డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఓ సత్యవతి, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ అనుపమ, అసిస్టెంట్ కంట్రోలర్ లీగల్ మెట్రాలజీ అధికారి శ్రీరాములు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ సందీప్, కన్జూమర్ ప్రొటెక్షన్ సెక్రటరీ శివమోహన్రెడ్డి పాల్గొన్నారు. -
రేపు అనంతపురంలో వ్యవసాయ అధికారుల బదిలీలు
కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ శాఖలో మండల వ్యవసాయ అధికారులు, సహాయ సంచాలకులు, సీనియర్ అసిస్టెంట్లు, సూపరిటెండెంట్లు, పరిపాలన అధికారుల బదిలీల ప్రక్రియ జోనల్ స్థాయిలో సోమవారం అనంతపురంలో జరుగనుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మండల వ్యవసాయ అధికారుల్లో ఒకే స్టేషన్లో ఐదేళ్లు పైబడి పని చేస్తున్న వారు 32 మంది ఉన్నారు. ఏడీఏల్లో ఒకరు లాంగ్ లీవ్లో ఉన్నారు. ఒకే స్టేషన్లో ఐదేళ్లు పైబడి పని చేస్తున్నవారు ఆరుగురు ఉన్నారు. వీరందరు బదిలీ కావాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం రిక్వెస్ట్పై జీరో సర్వీస్ ఉన్న వారు కూడా బదిలీకి అర్హులేనని ప్రకటించడంతో వ్యవసాయ శాఖలో బదిలీల జాతర నెలకొంది. జిల్లాలో కల్లూరు, ఆదోని, ఎమ్మిగనూరు మండలాలకు గతంలో ఎపుడూ లేని పెద్ద ఎత్తున పైరవీలు నడుస్తున్నాయి. ఇప్పటికే కూటమి పార్టీల నేతలను ముడుపులతో ప్రసన్నం చేసుకుని లైన్ క్లియర్ చేసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సిఫార్స్ లేఖలతో దరఖాస్తులు చేసుకున్నారు. లేఖలతో పాటు ఫోన్లు కూడా చేయించుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సోమవారం బదిలీలకు శ్రీకారం చుట్టనున్నారు. రాయలసీమ జిల్లాల్లో అనంతపురం డీఏఓ సీనియర్ కావడంతో అక్కడ అడిషినల్ డైరెక్టర్ కృపానందం ఆధ్వర్యంలో బదిలీలు చేపట్టనున్నారు. -
కార్మికుల వినూత్న నిరసన
కోడుమూరు రూరల్: గూడూరులో నగర పంచాయతీ కార్మికులు మెడకు ఉరిగి తగిలించుకుని వినూత్న రీతిలో శనివారం ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు. సమస్యల పరిష్కారంలో భాగంగా వారం రోజుల నుంచి గూడూరు నగర పంచాయతీ కార్మికులు విధులను బహిష్కరించి దీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా కార్మికులు ఆరవింద్, మధు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా ప్రభుత్వం తమను నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. చాలీచాలని జీతాలతో ఏళ్ల తరబడి దుర్భర జీవితాలు అనుభవిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి 15 ఏళ్లకు పైబడి పనిచేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయడంతో పాటు, నెలనెలా జీతాలు సక్రమంగా ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో నగర పంచాయతీ కార్మికులు అల్లిబాషా, డూకేశ్వరరావు, షబ్బీర్బాషా, ఆంజనేయులు, బసవరాజు, జయన్న, ఖాజాహుసేన్, ప్రభాకర్, ఉసేన్ పాల్గొన్నారు. యువకుడి ఆత్మహత్య కోవెలకుంట్ల: స్థానిక ఎల్ఎం కాంపౌండ్కు చెందిన యువకుడు శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ మల్లికార్జునరెడ్డి తెలిపిన వివరాలు.. ఎల్ఎం కాంపౌండ్కు చెందిన రమేష్(36) కూలి పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. పిల్లలకు కొత్త దుస్తులు తీసుకొచ్చే విషయంలో శుక్రవారం రాత్రి భార్య, భర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీనికి తోడు కొంతకాలం నుంచి రమేష్ క్షయవ్యాధితో బాధపడుతున్నాడు. ఈక్రమంలో మనస్తాపానికి గురై ఇంట్లో ఉరి వేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి చుట్టుపక్కల వారి సాయంతో తలుపు బద్ధలు కొట్టి ఫ్యాన్కు వేలాడుతున్న రమేష్ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. మృతుని భార్య సుధారాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి గోనెగండ్ల: మండల పరిధిలోని చిన్న మరివీడు గ్రామానికి చెందిన ఎం.రవి(32) విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. సీఐ విజయ భాస్కర్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన రవికు భార్య రోజా ఉంది. వీరు గ్రామంలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రవి ఇటీవల కొత్త ఇల్లు కట్టుకుంటున్నాడు. గురువారం కొత్త ఇంటికి స్లాబ్ వేశారు. శుక్రవారం అర్ధరాత్రి ఆ ఇంట్లో కరెంట్ పడడం లేదని రవి పరిశీలిస్తుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య రోజా ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కొత్త ఇల్లు నిర్మాణం చేపట్టి గృహప్రవేశం చేయకుండానే రవి మృతిచెందడంతో భార్య, బంధువులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. -
కచ్చితమైన సమాచారం ఉండదు
సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే వారు, యువతలో ఎక్కువగా ఆన్లైన్లో ఆరోగ్య విషయాలు బ్రౌజ్ చేయడం చేస్తుంటారు. నెట్లో కొన్ని నమ్మకమైన వెబ్సైట్లు, యాప్స్ మినహా అన్నింటిలోనూ కచ్చితమైన సమాచారం ఉండదు. కచ్చితత్వంలేని సమాచారాన్ని చదివితే మనసు మరింత ఆందోళనకు గురవుతుంది. ఆరోగ్య సమస్యల వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. అంతేగానీ ప్రతి విషయానికీ ఆన్లైన్పై ఆధారపడటం మంచిది కాదు. –డాక్టర్ ఎన్.నాగేశ్వరరావు, హెచ్వోడి, సైకియాట్రి విభాగం, జీజీహెచ్, కర్నూలు వైద్యులను నేరుగా సంప్రదించాలి ఇటీవల ప్రజలు తమ ఆరోగ్య సమస్యలను ముందుగా ఆన్లైన్లో వెతకడం ఎక్కువైంది. అందులో వచ్చిన సమాచారాన్ని చూసి మరింత ఆందోళనకు గురై మా వద్దకు వస్తున్నారు. కొందరైతే ఆన్లైన్లో వెతికి అందుకు అనుగుణంగా అన్ని రకాల పరీక్షలు చేయించుకుని వస్తున్నారు. టెస్టుల్లో కొన్ని అబ్నార్మల్ చూపిస్తాయి. వాటిని చూసి టెన్షన్ పడుతుంటారు. కొన్ని అబ్నార్మల్ ఉన్నా ఎలాంటి లక్షణాలు లేకపోతే ఏమీ కాదు. ఆన్లైన్ వైద్యాన్ని నమ్ముకోకుండా వైద్యులను నేరుగా సంప్రదించి చికిత్స తీసుకుంటేనే మంచి ఫలితాలు ఉంటాయి. –డాక్టర్ మీనుగ శ్రీనివాసులు, జనరల్ ఫిజీషియన్, జీజీహెచ్, కర్నూలు ● -
కోలుకోలేక ఉపాధి కూలీ మృతి
కృష్ణగిరి: మండలంలోని అమకతాడు గ్రామానికి చెందిన ఉపాధి కూలీ మానుకింది అనసూయమ్మ (42) కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక శనివారం మృతి చెందింది. ఈసీ మధు తెలిపి న వివరాలు.. శుక్రవారం గ్రామ సమీపంలో కాలువ వద్ద జరుగుతున్న ఉపాధి పనులకు హాజరైన అనసూయమ్మ పనిచేస్తూ తీవ్ర అస్వస్థతకు గురైంది. హుటా హుటిన కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి లో చికిత్స పొందుతుండగా అదే రోజు రాత్రి ఫిట్స్ రావడంతో కోలుకోలేక మృతి చెందినట్లు వైద్యు లు ధ్రువీకరించారు. మృతురాలికి భర్త రామాంజనేయులు, కు మారుడు, కుమార్తె ఉన్నా రు. మృతురాలికి ప్రభు త్వం ద్వారా వచ్చే సహా య సహకారాలకు సిఫా రసు చేసినట్లు ఈసీ తెలిపారు. -
ఆర్ఎంపీలు స్కానింగ్కు రెఫర్ చేయొద్దు
కర్నూలు(హాస్పిటల్): గర్భిణిలకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయాలని ఆర్ఎంపీలు రెఫర్ చేయవద్దని డీఎంహెచ్ఓ డాక్టర్ పి. శాంతికళ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గర్భిణిలలో పిండం పెరుగుదల, జన్యుపరమైన వ్యాధులు, అంగవైకల్యం తదితర వాటిని గుర్తించేందుకు అర్హత కలిగిన వైద్యులు మాత్రమే అల్ట్రాసౌండ్ స్కానింగ్ కోసం రెఫర్ చేయవచ్చన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆర్ఎంపీలు గర్భిణిలను స్కానింగ్ కోసం రెఫర్ చేయరాదని హెచ్చరించారు. ఆర్డబ్ల్యూఎస్లో బదిలీల ప్రక్రియ కర్నూలు (అర్బన్): రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలను విడుదల చేసిన నేపథ్యంలో జోన్ ఫోర్ పరిధిలో ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీర్ల బదిలీలను శనివారం చేపట్టారు. ఆర్డబ్ల్యూఎస్ సీఈ హరేరామ్ నాయక్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ బదిలీల ప్రక్రియకు ఉమ్మడి కర్నూలు, అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాలకు చెందిన పర్యవేక్షణ ఇంజినీర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కర్నూలు ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బి.నాగేశ్వరరావు మాట్లాడుతూ బదిలీలకు అర్హులైన జోన్ ఫోర్ పరిధిలో 8 మంది డీఈఈలు, 34 మంది సెక్షన్ ఆఫీసర్లకు బదిలీల ప్రతిపాదనలను ఈఎన్సీ కార్యాలయానికి పంపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఒకే ప్రాంతంలో ఐదేళ్లు పూర్తయిన వారు బదిలీ కానున్నారని తెలిపారు. -
వైద్యసేవలకు ఆన్లైన్ శోధన
● మందులు తెలుసుకొని సొంత వైద్యం ● వైద్యుల వద్దకు వెళ్లినా రాసిచ్చిన మందులపై అనుమానం ● మంచివో.. కాదోనని ఇంటర్నెట్లో తెలుసుకునే ప్రయత్నం ● సోషల్ మీడియా కథనాలను అనుసరిస్తున్న వైనం ● తెలిసీ తెలియని వైద్యంతో అవస్థలు కర్నూలు(హాస్పిటల్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో 3వేల దాకా రిటైల్ మెడికల్ షాపులు, ఏజెన్సీలు ఉన్నాయి. దీంతో పాటు 12వేల దాకా ఎంబీబీఎస్, స్పెషాలిటీ, సూపర్స్పెషాలిటీ కోర్సులు అభ్యసించిన వైద్యులూ ఉన్నారు. వీరితో పాటు వైద్యవిద్యను అభ్యసిస్తున్న వారు మరో 3వేల మంది దాకా ఉంటారు. ఇక ఫార్మాసిస్టులు, నర్సులు, ఏఎన్ఎంలు, ఆర్ఎంపీలు మరో 15వేల దాకా ఉంటారు. వీరందరూ అల్లోపతి వైద్యంపై ఆధారపడి రోగులకు వైద్యసేవలు అందిస్తున్నారు. ఆరోగ్య సమస్యలు వచ్చిన ప్రజలు వీరిలో ఎవరో ఒకరిని సంప్రదించి అవసరమైన చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల ఇంటర్నెట్ సదుపాయం అందరికీ అందుబాటులోకి రావడం, విద్యావంతులు పెరగడం, ముఖ్యంగా సాఫ్ట్వేర్, ఇంటర్నెట్పై యువతకు పట్టురావడం వంటి విషయాల కారణంగా ఆన్లైన్లో తమకు వచ్చిన ఆరోగ్య సమస్యలకు పరిష్కారాన్ని వెతకడం అధికమైంది. క్షణాల్లో వచ్చే సమాచారం ఆధారంగా తమకు ఈ కారణంగానే ఆరోగ్య సమస్య వచ్చిందని భావించి మెడికల్ షాపులకు వెళ్లి మందులు తీసుకుని వాడే వారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది. భౌతికంగాపరీక్షిస్తేనే.. మంచి పేరున్న వైద్యుని వద్దకు వందల కిలోమీటర్లు ప్రయాణించి రోగులు చికిత్స కోసం వెళ్తుంటారు. అలా వెళ్లిన వారు అవసరమైతే గంటల తరబడి క్యూలో ఉండి చికిత్స తీసుకుని వెళ్తుంటారు. ఫలానా డాక్టర్ చేయి తగిలితేనే(హస్తవాసి) సగం రోగం నయం అవుతుందన్న నమ్మకంతో ఉన్న వారూ ఉన్నారు. ఈ నమ్మకంతోనే ఇప్పటికీ చాలా మంది వారికి ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా నమ్ముకున్న వైద్యుల వద్దే చికిత్స తీసుకుంటారు. సదరు డాక్టర్ భౌతికంగా రోగిని పరిశీలించడమే గాక వారి యోగక్షేమాలు అడగడం, నవ్వుతూ మాట్లాడటం, ఏమీ కాదులే అని ధైర్యం చెప్పడంతో వారికి సగం రోగం నయమవుతుంది. కొందరు సీనియర్ వైద్యులు ఇప్పటికీ రోగిని భౌతికంగా ముట్టుకుని చేతులు, కాళ్లు కదిపి, పొట్టను ఒత్తి చూసి, నాడి పట్టుకుని పరీక్షించి వైద్యం చేస్తుంటారు. ఇలాంటివన్నీ ఆన్లైన్లో లభించవని పెద్దలు చెబుతుంటారు. ఎంతగా ఆన్లైన్ సేవలు అభివృద్ధిలోకి వచ్చినా మనిషిని చూసి వైద్యం ఇచ్చి ధైర్యం చెబితేనే తగ్గుతుందని వారు భావిస్తున్నారు. -
పారిశుద్ధ్యం లోపిస్తే చర్యలు తప్పవు
● 20 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు కర్నూలు(అర్బన్): గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యం లోపిస్తే చర్యలు తప్పవని జిల్లా పంచాయతీ అధికారి జి.భాస్కర్ హెచ్చరించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల మూడవ వారంలో ఇంటింటి చెత్త సేకరణకు సంబంధించి నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వేలో జిల్లాలోని 20 గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉన్నట్లు ఆయా గ్రామాల ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేశారన్నారు. ఈ నేఫథ్యంలో ఆయా పంచాయతీల కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు. తాగునీటి పైప్లైన్లు ఎక్కడైనా పాడైపోయి ఉంటే వెంటనే ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. సమన్వయంతో ఆయా పైప్లైన్లను బాగు చేయించి రక్షిత నీటిని విడుదల చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదన్నారు. జూన్ 1 నుంచి రేషన్ షాపుల్లోనే సరుకులు కర్నూలు(సెంట్రల్): జూన్ 1వ తేదీ నుంచి రేషన్ షాపుల్లోనే బియ్యం, బ్యాళ్లు, చక్కెర ఇతర సరుకులను పంపిణీ చేయాలని జేసీ డాక్టర్ బి.నవ్య డీలర్లను ఆదేశించారు. శనివారం ఆమె జి.సింగవరం, కల్లూరులోని రేషన్ షాపులను ఆకస్మికంగా తని ఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జూన్ 1 నుంచి ఎండీ యూ వాహనాల ద్వారా కాకుండా రేషన్షాపుల్లో నే సరుకులను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, వికలాంగులకు మాత్రమే డోర్ డెలివరీ చేయిస్తామన్నారు. ప్రతి నెలా 1 నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు షాపుల్లోనే ఈపాస్ మిషన్ల ద్వారా సరుకు లు పంపిణీ చేయాలన్నారు. జేసీ వెంట కర్నూలు రూరల్ తహసీల్దార్ రమేష్బాబు పాల్గొన్నారు. హైకోర్టు జడ్జిని కలసిన కలెక్టర్ కర్నూలు(సెంట్రల్): కర్నూలు వచ్చిన హైకోర్టు జడ్జి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డిని కలెక్టర్ రంజిత్బాషా మర్యాద పూర్వకంగా కలిశారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వ ఆతిథి గృహంలో ఉన్న జడ్జిని కలెక్టర్ కలసి పుష్పగుచ్ఛం అందజేసి జిల్లా పరిస్థితులను వివరించారు. 16 మంది డిబార్ కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిఽధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 59 పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తున్న పరీక్షల్లో భాగంగా శనివారం జరిగిన సెమిస్టర్ పరీక్షలకు 1,181 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. 2వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలకు 10,775 మందికి 9,616 మంది హాజరు కాగా 1,159 మంది గైర్హాజరయ్యారని వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. 6వ సెమిస్టర్ స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షలకు 207 మందికి 185 మంది హాజరు కాగా 22 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. చూచిరాతలకు పాల్పడిన 16 మంది విద్యార్థులను గుర్తించి డిబార్ చేసినట్లు పేర్కొన్నారు. సీలింగ్ ఎత్తివేయాలి కర్నూలు సిటీ:ఉపాధ్యాయుల బదిలీల్లో స్టేషన్ పాయింట్స్పై ఉన్న సీలింగ్ను ఎత్తివేయాలని ఏపీటీఎఫ్(257) ఆధ్వర్యంలో పలువురు ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శని వారం డీఈఓ ఎస్.శామ్యూల్పాల్ను కలిసి విన్న వించారు. 2014 డీఎస్సీ ఉపాధ్యాయులు కౌతా ళం, కోసిగి, హొళగుంద మండలాల్లో సుమారు తొమ్మిది సంవత్సరాలుగా పని చేస్తున్నారన్నారు. అయితే ఉపాధ్యాయుల బదిలీల్లో ప్రస్తుతం దర ఖాస్తు చేసుకుంటే స్టేషన్ పాయింట్లు ఎనిమిది సంవత్సరాలకే కేటాయించడం వల్ల తీరని అన్యా యం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. డీఈఓను కలసిన వారిలో జిల్లా ప్రధాన కార్య దర్శి రంగన్న, సుదర్శన్రెడ్డి తదితరులు ఉన్నారు. -
నాణ్యత 'తెల్ల'బోతోంది!
ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెండు, మూడేళ్ల క్రితం కావేరి–జాదు రకం బీటీ పత్తి విత్తనాలు రైతులను నిండా ముంచేశాయి. 17 మండలాల్లో దాదాపు 2,400 ఎకరాల్లో పత్తి దెబ్బతినగా.. 1,899 మంది రైతులు నష్టపోయారు. ఎకరాకు 3 క్వింటాళ్ల వరకు నష్టం జరిగిందని, క్వింటాకు రూ.7,300 ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని జిల్లా అధికార యంత్రాంగం ఆదేశాలు ఇచ్చింది. దీనిపై కావేరి కంపెనీ హైకోర్టును ఆశ్రయించగా వ్యవసాయ శాఖ కమిషనర్కు అప్పీల్ చేసుకోవాలనే తీర్పు వచ్చింది. ఆ మేరకు అప్పీలు చేసుకోగా.. సుదీర్ఘ విచారణ తర్వాత పరిహారాన్ని కొంతమేర తగ్గిస్తూ జడ్జిమెంట్ వచ్చింది. అయితే ఆ ప్రకారం కూడా కంపెనీ రైతులకు పరిహారం చెల్లించకపోవడం గమనార్హం. ... కంపెనీలపై వ్యవసాయ శాఖ పర్యవేక్షణ లేకపోవడం.. విత్తన ధ్రువీకరణ కంపెనీలే సొంతంగా చేసుకోవడం కారణంగా పంట దెబ్బతిన్న సమయంలో రైతులు కోలుకోలేని విధంగా నష్టపోతున్నారు.కర్నూలు(అగ్రికల్చర్): ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రాష్ట్రం మొత్తం మీద పత్తి 5,28,361 హెక్టార్లలో సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా. ఇందులో ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే దాదాపు 50 శాతం వరకు సాగవుతోంది. కర్నూలు జిల్లాలో 2,34,409 హెక్టార్లు, నంద్యాల జిల్లాలో 18,827 హెక్టార్లలో పత్తి సాగయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నల్లరేగడి నేలలు ఎక్కువగా ఉండటం వల్ల దశాబ్దాలుగా పత్తి రైతుల పాలిట తెల్ల బంగారం అవుతోంది. ఇక్కడ హైబ్రిడ్ పత్తి, బీటీ పత్తి విత్తనోత్పత్తి కూడా ఎక్కువగా ఉంటోంది. విత్తన కంపెనీల దృష్టి కూడా ఉమ్మడి కర్నూలు జిల్లాపైనే ఉండటం గమానార్హం. రాష్ట్రం మొత్తం మీద జరిగే మార్కెటింగ్ ఒక ఎత్తు అయితే, ఇక్కడి మార్కెటింగ్ మరో ఎత్తు. జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో పత్తి సాగుకు విత్తనాలు సిద్ధం చేసుకునే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా ఇక్కడ కో–మార్కెటింగ్, సిస్టర్ కన్సల్టెన్సీ, సబ్ డీలర్స్.. ఇలా రకరకాల పేర్లతో పత్తి విత్తన ప్యాకెట్లను అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏది ఒరిజినల్, ఏది నకిలీ తెలుసుకోవడం రైతులకు కష్టంగా మారింది. వాస్తవానికి కో–మార్కెటింగ్ అనేది లేదు. కానీ అనధికారికంగా సిస్టర్ కన్సల్టెన్సీ, సబ్ డీలర్స్ పేర్లతో రైతులను దగా చేస్తున్నా వ్యవసాయ శాఖ చేష్టలుడిగి చూస్తోంది. జిల్లాలో 250 కంపెనీలు దాదాపు 1000 దాకా బీటీ పత్తి విత్తన రకాలను మార్కెట్లోకి విడుదల చేయడం గమనార్హం. పంట దెబ్బతింటే దేవుడే దిక్కు! పత్తి విత్తన నాణ్యతపై వ్యవసాయ శాఖకు ఎలాంటి సంబంధం లేదు. ఆయా కంపెనీలే సొంతంగా ధ్రువీకరించుకుంటున్నాయి. ఈ కారణంగా పంట దెబ్బతింటే ఆయా కంపెనీలదే పూర్తి బాధ్యత. అయితే పంట దెబ్బతిన్న సమయంలో వాతావరణ పరిస్థితులను కారణంగా చూపుతూ కంపెనీలు చేతులు దులుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. పంట దెబ్బతిన్నప్పుడు పరిహారం ఇవ్వకుండా తప్పించుకునేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. 2024 ఖరీఫ్ సీజన్లో కూడా ఒక పేరొందిన కంపెనీ విత్తనంతో సాగు చేసిన పత్తి పలు చోట్ల దెబ్బతినింది. అయితే ఆ కంపెనీ వ్యవసాయ యంత్రాంగాన్ని ముడుపులతో లోబరుచుకొని ఇతర కారణాలతో పంట దెబ్బతిన్నట్లు రిపోర్టు ఇవ్వడం గమనార్హం.బ్లాక్లో పత్తి విత్తనాలు ఈ సారి పత్తి సాగు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. వర్షాలు పడుతున్నందున ఈ నెల చివరి వారం నుంచే పత్తి విత్తనాలు నాటుకునేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో వందల కంపెనీలు, రకాలు మార్కెట్ను ముంచెత్తుతున్నా.. వీటికి అనుమతులు ఉన్నాయా, లేదా అని వ్యవసాయశాఖ పటించుకున్న పాపాన పోవడంలేదు. ప్రధానంగా రెండు కంపెనీల బీటీ పత్తి విత్తన ప్యాకెట్లను బ్లాక్లో అమ్మకాలు సాగిస్తున్నారు.జిల్లాలోకి ఒకవైపు తెలంగాణ నుంచి, మరోవైపు కర్ణాటక నుంచి అనధికార పత్తి విత్తన ప్యాకెట్లు జిల్లాలోకి వెల్లువెత్తుతున్నాయి. పశ్చిమ ప్రాంతంలో పత్తి లూజు విత్తనాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఆదోని, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో నకిలీలు, అనుమతి లేని విత్తనాలను జోరుగా అమ్మకాలు సాగిస్తున్నా వ్యవసాయ శాఖ నుంచి స్పందన కరువైంది. » 450 గ్రాముల బీటీ–2 పత్తి విత్తన ప్యాకెట్ ఎంఆర్పీ రూ.901. నూజివీడు కంపెనీ రేవంత్ రకం ప్యాకెట్లను రూ.1,300 పైబడిన ధరతో అమ్ముతున్నట్లు తెలుస్తోంది.»యుఎస్ అగ్రీ కంపెనీకి చెందిన 7067 రకాన్ని రూ.1,200 వరకు బ్లాక్లో అమ్మకాలు సాగిస్తున్నట్లు సమాచారం.» బీటీ టెక్నాలజీని మ్యాన్శ్యాంటో కంపెనీ తెచ్చింది. బీటీ టెక్నాలజీని పొంది విత్తనోత్పత్తి, ప్యాకింగ్, మార్కెటింగ్ చేసుకోవాలంటే మ్యాన్శ్యాంటో నుంచి లైసెన్స్ తీసుకోవడం తప్పనిసరి. ఈ కంపెనీ నుంచి తెలుగు రాష్ట్రాల్లో 45 కంపెనీలకు లైసన్లు ఉండగా.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒకే ఒక్క కంపెనీకి మాత్రమే లైసన్స్ ఉంది. » కో–మార్కెటింగ్ పేరుతో ఉమ్మడి జిల్లాలో 10 వరకు కంపెనీలు ఉండగా.. సిస్టర్ కన్సల్టెన్సీ, సబ్ డీలర్స్ పేరుతో వందలాది కంపెనీల బీటీ పత్తి విత్తన ప్యాకెట్ల మార్కెటింగ్లో నిమగ్నమయ్యాయి.హెచ్టీ పత్తి సాగు ప్రమాదకరం పత్తిలో హెచ్టీ విత్తనాలకు కేంద్రం ఇంతవరకు అనుమతి ఇవ్వలేదు. పత్తిలో కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. హెచ్టీ పత్తిలో కలుపు నివారణకు గ్లైపోసేట్ మందును పిచికారి చేస్తే కలుపు నాశనం అవుతుంది తప్ప.. పత్తి పంటకు ఏమీ కాదు. హెర్బిసైడ్ టాలరెంట్(హెచ్టీ) బీటీ పత్తి విత్తనాలు జీవవైవిధ్యానికి ప్రమాదకరమనే ఉద్దేశంతో కేంద్రం వీటికి అనుమతివ్వలేదు. అయినప్పటికీ కొంతమంది రైతులు హెచ్టీ పత్తి సాగు చేస్తున్నారు. ఇటీవల వ్యవసాయ శాఖ నుంచి వచ్చిన ప్రత్యేక టీమ్ వచ్చి హెచ్టీ పత్తి విత్తనాలను గుర్తించేందుకు తనిఖీలు జరిపి పరీక్షలు నిర్వహించారు. అయితే తూతూమంత్రంగా పరీక్షలు నిర్వహించారనే చర్చ జరుగుతోంది. -
ప్రజలను మోసం చేయడంలో తెలుగుదేశం పార్టీ ఆరితేరింది. ఎన్నికలకు ముందు పచ్చ పత్రికలు అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై లేనిపోని రాతలతో దుమ్మెత్తి పోశాయి. గోరంతను కొండంత చేసి చూపడం.. కూటమి నేతలు ప్రజల చెవుల్లో జోరీగలా మారడంతో నిజాలను కూడా అబద్దాలుగా చేయగలిగారు
తుగ్గలి: రహదారులను మెరిపిస్తామంటూ ఆర్భాటంగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏడాదిలోపే చేతులెత్తేసింది. స్థానిక నాయకుల జేబులు నింపేందుకు గుంతలు పూడ్చే పనిని ఆగమేఘాల మీద చేపట్టింది. ఆకలి మీద ఉన్న కూటమి స్థానిక నేతలు.. అవకాశం చిక్కినప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని ౖపైపె మెరుగులతో మమ అనిపించారు. ఈ పనుల్లో నాణ్యత మూడు నెలలకే తేలిపోయింది. ఇప్పుడు అడుగుకో గుంత ప్రజలకు స్వాగతం పలుకుతోంది. కిలోమీటరు ప్రయాణం కూడా నరకాన్ని తలపిస్తోంది. ద్విచక్ర వాహనాల్లో వెళ్లాలంటే కిందామీదా పడక తప్పని పరిస్థితి. పత్తికొండ–గుత్తి ప్రధాన రహదారిలో ప్రజల అవస్థలు చూస్తే కూటమి ప్రభుత్వ మోసం కళ్లకు కడుతుంది. మంత్రాలయం పుణ్య క్షేత్రానికి.. ఆదోని, గుత్తికి 25 కిలోమీటర్ల ఈ రహదారి మీదుగానే రాకపోకలు సాగుతున్నాయి. నిత్యం వందలాది వాహనాలు తిరిగే దారి దీనావస్థ చూస్తే టీడీపీ నేతలు, పచ్చ పత్రికలు గత ప్రభుత్వంపై ఏస్థాయిలో అవాస్తవాలను వండి వర్చారో అర్థమవుతోంది. పత్తికొండ–గుత్తి రోడ్డు మరమ్మతులకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఐదు నెలల క్రితం రూ.13లక్షలు మంజూరు చేసింది. కంటి తుడుపు చర్యగా ౖపైపె పూతతో సరిపుచ్చారు. పట్టుమని మూడు నెలలు కూడా గడవలేదు. అంతలోనే పూడ్చిన గుంతలు మళ్లీ పుట్టుకొచ్చాయి. గుంతలు పెద్దవిగా ఉండడంతో వర్షపు నీరు నిలిచి వాహనదారులకు లోతు తెలియక నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ దారి మొత్తం తారు లేచిపోయి గుంతలే దర్శనమిస్తుండటంతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రమాదంతో కలిసి ప్రయాణం చేస్తుండటం గమనార్హం. -
ఫిబ్రవరి 21, 2025
ఇదీ పత్తికొండ–గుత్తి రోడ్డు. జొన్నగిరి సమీపంలో ఓ మలుపు వద్ద పెద్ద గుంత ఉండ టంతో తప్పించే క్రమంలో టూరిస్టు బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆర్అండ్బీ అధికారులు గుంతను పూడ్చినా పనులు నామమాత్రమే. ఫలితంగా మళ్లీ గుంత ఏర్పడటం చూసి ఈసారి ఎవరి ప్రాణం బలిగొంటుందోనని ప్రజల్లో చర్చ జరుగుతోంది... కూటమి ప్రభుత్వ పనితీరుకు, మాటల గారడీకి ఈ రహదారి పనులే నిదర్శనం. ఇక్కడ మాత్రమే కాదు, జిల్లా మొత్తంగా ఆ పార్టీ చోటా నేతల ఆధ్వర్యంలో చేపట్టిన పనులు మూన్నాళ్ల ముచ్చటగా మారడంతో రహదారులు ప్రమాదాలకు స్వాగతం పలుకుతున్నాయి. -
కర్ణాటక మద్యం అక్రమ రవాణా జరిగితే వేటు
ఆలూరు: ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో కర్ణాటక మద్యం రవాణా, అమ్మకాలు జరిగితే వేటు తప్పదని జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారులు, సిబ్బందిని ఆ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్దేవ్ శర్మ హెచ్చరించారు. శుక్రవారం ఆయన ఆలూరు ఎకై ్సజ్ స్టేషన్లో ఎకై ్సజ్ డిప్యూటీ కమీషనర్ శ్రీదేవి సమక్షంలో అధికార సిబ్బందితో ఆయన ప్రత్యేకంగా సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరిహద్దు గ్రామాల్లో అక్రమ మద్యం రవాణాను అడ్డుకోవాల్సిన బాధ్యత ఎకై ్సజ్ సిబ్బందిపై ఉందన్నారు. ప్రధానంగా చెక్పోస్టులో సీసీ కెమెరాలు నిరంతం పనిచేసేలా చూడాలన్నారు. వాహనాల తనిఖీ చేపడుతూ, అడ్డ రహదారులపై నిఘా వేసి చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. మద్యం షాపులలో ఎంఆర్పీ కంటే అధిక రేట్లకు విక్రయిస్తే వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. హాలహర్వి మండలం క్షేత్రగుడి ఎకై ్సజ్ చెక్ పోస్టును ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. ఆయన వెంట జిల్లా అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సుధీర్బాబు, అసిస్టెంట్ సూపరింటెండెంట్ రామకృష్ణ, డీటీఎఫ్ సీఐ రాజేంద్రప్రసాద్, ఆలూరు ఎకై ్సజ్ సీఐ లలితాదేవి, ఎస్ఐ నవీన్, సిబ్బంది తదితరులు ఉన్నారు. మహా ‘నందీశ్వరుడి’కి నేడు ప్రదోషకాల అభిషేకం మహానంది: మహానందిలో శనివారం బహుళ త్రయోదశి, మహా ప్రదోష కాలం సందర్భంగా నందీశ్వరుడు జన్మించిన మహానంది క్షేత్రంలో సాయంత్రం 4–00 గంటల నుంచి ప్రదోష కాల నందీశ్వర అభిషేకం జరుగనుంది. ప్రదోష కాల నందీశ్వర అభిషేక సేవలో పాల్గొనాల్సిన వారు, మధ్యాహ్నం 3–30కి ఆర్జిత సేవా టికెట్ తీసుకుని ఆలయంలో ఉండాలని వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర్ అవధాని విజ్ఞప్తి చేశారు. డీసీసీబీ సీఈఓగా రామాంజనేయులు కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా పి.రామాంజనేయులు నియమితులయ్యారు. ఈ మేరకు జాయింట్ కలెక్టర్, డీసీసీబీ అఫీషియల్ పర్సన్ ఇన్చార్జి నవ్య ఫైల్పై సంతకం చేసినట్లు సమాచారం. ఇంతవరకు సీఈఓగా ఉన్న విజయ్కుమార్ ఆప్కాబ్కు వెళ్లనున్నారు. విజయ్కుమార్ ఆప్కాబ్లో డీజీఎం. డిప్యూటేషన్పై డీసీసీబీలో ప్రత్యేక అధికారిగా పనిచేస్తున్నారు. సీఈఓ పోస్టు ఖాళీ కావడంతో గత ఏడాది జనవరి నుంచి పూర్తి బాధ్యతలతో కొనసాగుతున్నారు. ఈయన ఆప్కాబ్కు వెళ్లనుండటంతో ఆ స్థానంలో జనరల్ మేనేజర్ అయిన రామాంజనేయులు నియమితులైనట్లు సమాచారం. ఈయన 20 నెలల క్రితం వరకు సీఈఓగా దాదాపు ఎనిమిదేళ్లు పనిచేశారు. మళ్లీ పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. డిగ్రీ పరీక్షల్లో ఇద్దరు డిబార్ కర్నూలు సిటీ: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ నాలుగో సెమిస్టర్ పరీక్షల్లో శుక్రవారం ఇద్దరు విద్యార్థులు మాల్ ప్రాక్టీస్కు పాల్పడుతుండటంతో గుర్తించి డిబార్ చేశారు. మొత్తం 7112 మంది విద్యార్థులకు గాను 6414 మంది పరీక్షలకు హాజరైనట్లు వర్సిటీ పరీక్షల విభాగం అధికారులు శుక్రవారం వెల్లడించారు. -
పేడ ఎరువుకు భలే గిరాకీ
కోడుమూరు రూరల్: పశువుల పేడ ఎరువుకు భారీగా డిమాండ్ నెలకొంది. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో పంటల సాగుకు రైతులు భూములను ఎరువులు, ఇతర పోషకాలతో సారవంతం చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించేందుకు చాలామంది రైతులు పేడ ఎరువుపైనే ఆధారపడుతున్నారు. అయితే గ్రామాల్లో రైతుల అవసరాలకు తగినట్లుగా ప్రస్తుతం పేడ ఎరువు లభించని పరిస్థితి. పశుపోషణ భారమవడం, మేత దొరక్క చాలామంది రైతులు పశువుల పెంపకానికి స్వస్తి పలుకుతుండడంతో పేడ ఎరువుకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ట్రాక్టర్ పేడ ఎరువు రూ.6,500 నుంచి రూ.7వేలు పలుకుతోంది. ఒక ఎకరాకు 3 నుంచి 4 ట్రాక్టర్ల పేడ ఎరువు అవసరమవుతోంది. దీంతో స్థానికంగా పేడ ఎరువు లభించక చాలామంది రైతులు సుదూర ప్రాంతాల్లో ఉన్న పశువుల పెంపకందారుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. ట్రాక్టర్ ఎరువు ధర రూ.7 వేలు -
ప్రభుత్వంతో పోరాడి న్యాయం చేయండి
కర్నూలు(టౌన్): గత ప్రభుత్వంలో ఎండీయూ వాహనాల ద్వారా ప్రజలకు రేషన్ పంపిణీ చేశామని, అయితే అర్ధాంతరంగా తొలగించిన తమకు మద్దతుగా ప్రభుత్వంతో పోరాడి న్యాయం చేయా లని ఎండీయూ ఆపరేటర్స్ యూనియన్ సూర్యనారాయణ, కిషోర్ కుమార్, రవికుమార్, శ్రీనివాసులు విన్నవించారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక గిప్సన్ కాలనీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అద్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2021 సంవత్సరం నుంచి ఎండీయూ వాహనాలతోనే జీవనోపాధి పొందుతున్నట్లు చెప్పారు. కరోనా సమయంలో రెడ్జోన్లో ఉన్న ప్రజలకు సైతం ఇంటింటికీ రేషన్ పంపిణీ చేశామన్నారు. కూటమి ప్రభుత్వ నిర్ణయం వల్ల 18,520 కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. స్పందించిన ఎస్వీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ డిమాండ్ల సాధనకు కలసికట్టుగా ప్రభుత్వంపై పోరాటం సాగిద్దామన్నారు. ప్రభుత్వ పథకాలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తోందన్నారు. అగ్రిమెంట్ ప్రకారం 2027 వరకు ఎండీయూ వాహనాలను కొనసాగించాలన్నారు. ఎండీయూ వాహన ఆపరేటర్ల వినతి -
కోవిడ్ను ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్తలు
కర్నూలు(హాస్పిటల్): కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు చెప్పారు. ఆయన శుక్రవారం తన చాంబర్లో కోవిడ్ వైరస్పై హెచ్ఓడీలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కోవిడ్ వైరస్ను ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన ప్రొటోకాల్ గురించి చర్చించామన్నారు. కోవిడ్ కేసుల దృష్ట్యా ఆసుపత్రిలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామన్నారు. వైరస్ పట్ల వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పల్మనాలజీ, అనస్తీషియా, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్, ఎమర్జెన్సీ మెడిసిన్, మైక్రోబయాలజీ ఫ్యాకల్టీతో కూడిన ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్లు రెడీ చేసుకోవాలని సంబంధిత హెచ్ఓడీలను ఆదేశించారు. పీపీఈ కిట్లకు సంబంధించి తగినంత స్టాక్ అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. మాస్క్, పీపీఈ కిట్స్, యాంటీవైరల్ డ్రగ్స్, అత్యవసర ఔషధాలు అందుబాటులో ఉండేలా సర్జికల్ అండ్ మెడికల్ స్టోర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఆక్సిజన్ పోర్ట్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అనస్తీషియా వైద్యులకు చెప్పారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, గతంలో మాదిరిగానే స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం, జనసమూహాలకు దూరంగా ఉండటం, కోవిడ్ వైరస్ సోకితే క్వారంటైన్లో ఉండటం చేయాలన్నారు. ఆసుపత్రి సీఎస్ఆర్ఎంఓ డాక్టర్ బి.వెంకటేశ్వరరావు, వైద్యులు ఇక్బాల్ హుసేన్, విశాల, నాగలక్ష్మి, విజయలక్ష్మి, సుబ్రహ్మణ్యం, శారద, అడ్మినిస్ట్రేటర్ శివబాల నాగాంజన్, కిరణ్కుమార్ పాల్గొన్నారు. -
తాగునీటి ఎద్దడిని నివారించండి
హొళగుంద: మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ మల్లికార్జునయ్య, ఏఈ రామ్లీలకు సూచించారు. శుక్రవారం హొళగుందకు చేరుకున్న వారికి గ్రామస్తులు నీటి సమస్యను వివరించారు. కడ్లమాగి వద్ద ఉన్న మంచినీటి పథకం నుంచి గ్రామంలోని ఫిల్టర్బెడ్కు నీరు సక్రమంగా సరఫరా కాకపోవడం, గ్రామ జనాభాకు తగ్గట్టు సంప్, ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు లేకపోవడం, పైప్లైన్ సమస్య తదితర కారణాలతో నీటి సమస్య నెలకొందని వారి దృష్టికి తీసుకెళ్లారు. వారానికో సారి నీరు రావడం గగనమైందని, వచ్చినా బోరు నుంచి వదిలే ఉప్పు నీరే వస్తుందని వాపోయారు. 30 వేలకు పైగా జనాభా ఉన్న హొళగుందలో రోజూ నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నా రు. పక్కనే ఉన్న ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ మల్లికార్జునయ్య, ఏఈ రామ్లీల, ఎస్ఎస్ ట్యాంక్ నిర్వహణ కాంట్రాక్టర్ సుంకన్నను జెడ్పీ చైర్మన్ విచారించగా ఎస్ఎస్ ట్యాంకులో నీరు పుష్కలంగా ఉన్నాయని అయితే పథకం వద్ద తరుచూ విద్యుత్ అంతరాయం కలుగుతుండడంతో, నీటి నిల్వలకు సరైన ట్యాంకులు లేకపోవడంతో నీటి సమస్య తలెత్తుందని వివ రించారు. అదనంగా సంప్, ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకు, పైప్లైన్కు గాను దాదాపు రూ. 15 పుంచి 20 లక్షలు అవసరం అవుతాయని ఆ నిధులను సమకూర్చాలని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ షఫివుల్లాతో పాటు నాయకులు, ఎంపీటీసీలు ఈశా, పంపాపతి, కెంచప్ప, రామకృష్ణ, మల్లయ్య, హను మప్ప, శివన్న, షేక్షావలి తదితరులు జెడ్పీ చైర్మన్ విన్నవించారు. ఈ మేరకు ఆయన సానుకూలంగా స్పందించారు. అలాగే ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈతో ఫోన్లో మాట్లాడి నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం వారు పక్కనే ఉన్న ఫిల్టర్బెడ్, సంప్ను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట వైఎస్సార్సీపీ జిల్లా ఉపా ధ్యక్షుడు ఎస్కే గిరి, కో కన్వీనర్ లక్ష్యన్న, సిందువాళ కృష్ణయ్య, గోవిందు, మంజునాయక్ పాల్గొన్నారు. జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి -
తిరోగమనంలో డీసీసీబీ
● నిరర్ధక ఆస్తులు రూ.195 కోట్ల నుంచి రూ.265 కోట్లకు పెరిగిన వైనం కర్నూలు(అగ్రికల్చర్): గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో లాభాల బాట పట్టిన ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్రబ్యాంకు కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తిరోగమనంలోకి పయనిస్తోంది. శుక్రవారం జాయింట్ కలెక్టర్, డీసీసీబీ అఫీషియల్ పర్సన్ ఇన్చార్జీ నవ్య అధ్యక్షతన బోర్డు సమావేశం జేసీ చాంబరుర్లో నిర్వహించారు. సమావేశంలో సీఇవో విజయకుమార్, జీఎం పి.రామాంజనేయులు, డీసీవో ఎన్.రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. 2024–25 ఆడిట్ రిపోర్టులను జేసీ ఆమోదించారు. నష్టాల ఊబిలో కూరుకుపోయిన డీసీసీబీ వైఎస్ఆర్సీపీ పాలనలో, అంటే 2022 నుంచి లాభాల బాట పట్టింది. లోనింగ్ పెంచడం, రికవరీలు పెరగడం వల్ల నిరర్థక ఆస్తులు తగ్గించుకొని నికర లాభాల్లోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత డీసీసీబీ పరిస్థితి తారుమారైంది. 2024–25లో లోనింగ్ పూర్తిగా పడిపోయింది. 2024 ఏప్రిల్ నెలలో డీసీసీబీ టర్నోవర్ రూ.3,930 కోట్లు ఉండగా.. నేడు కూడా టోర్నోవర్ అలాగే ఉంది. నిరర్థక ఆస్తులు మాత్రం భారీగా పెరిగిపోయాయి. 2024 ఏప్రిల్ నెలలో నిరర్థక ఆస్తులు రూ.195 కోట్లు ఉండగా.. నేడు రూ.265 కోట్లకు చేరుకోవడం గమనార్హం. డీసీసీబీకి 2022–23లో రూ.10 కోట్ల ఆదాయం రాగా రూ.4 కోట్లు పీఏసీఎస్లకు డివిడెండు రూపంలో పంపిణీ చేశారు. 2023–24లో రూ.4.50 కోట్ల లాభం వచ్చింది. 2024–25లో అతి కష్టం మీద డీసీసీబీకి రూ.1.20 కోట్ల ఆదాయం వచ్చినట్లు స్పష్టమైంది. చిన్న సినిమాలను ఆదరించండి ఆదోని టౌన్: చిన్న సినిమాలను ఆదరించాలని సినీ హీరో వీర్రాజు (చరణ్) విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ద్వారకా సినీ థియేటర్లో వీర్రాజు 1971 సినిమా రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకున్న సందర్భంగా సక్సెస్మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో పలు సినీ హీరోల అభిమాన సంఘాల నాయకులు, ప్రేక్షకులు, ప్రముఖ పారిశ్రామికవేత్త విట్టా రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినీ హీరో వీర్రాజు మాట్లాడుతూ.. భారీ పెట్టుబడితో తీసే పెద్ద హీరోల సినిమాల మాదిరిగానే తక్కువ ఖర్చుతో తీస్తున్న చిన్న సినిమాలను పాఠకులు ఆదరించాలన్నారు. ద్వారకా థియేటర్లో శుక్రవారం వీర్రాజు సినిమా రిలీజైన సందర్భంగా పట్టణ ప్రముఖులు థియేటర్కు వెళ్లి సినిమాను వీక్షించారు. సినీ హీరో ఆదోని వాసి కావడం సంతోషకరమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. -
ఆధార్ అప్డేట్.. సర్వర్ బిజీ!
హాలహర్వి: ఆధార్ సేవల కోసం వెళితే సర్వర్ బిజీ కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో ప్రస్తుతం బాపురం గ్రామంలో మాత్రమే ఆధార్ ఎన్రోల్మెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ–కేవైసీ, కొత్త రేషన్కార్డుల కోసం చిన్నారుల అప్డేట్, పెద్దవారు అప్డేట్ కోసం ఆధార్ కార్డు ప్రతిఒక్కరికీ తప్పనిసరి అయ్యింది. చిన్నారులకు కొత్త ఆధార్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. ఇదిలాఉండగా బాపురం గ్రామంలో మాత్రమే ఆధార్ అప్డేట్ సెంటర్ ఉండడంతో ప్రజలు భారీగా తరలివస్తున్నారు. అక్కడ సర్వర్ బిజీ వల్ల పనులు జరగడం లేదు. ఒక ఆపరేటర్ మాత్రమే ఆధార్ అప్డేట్ చేస్తున్నారు. దీంతో గంటల కొద్దీ ప్రజలు కార్యాలయం వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి మండల కేంద్రమైన హలహర్వి, గూళ్యం, చింతకుంట లాంటి పెద్ద పంచాయతీల్లో కూడా ఆధార్ అప్డేట్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇబ్బందులు పడుతున్న ప్రజలు -
మాదకద్రవ్యాలను అరికడదాం
కర్నూలు(అర్బన్): జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో నషా ముక్త్ భారత్ అభియాన్ అమలుపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 13–19 సంవత్సరాల మధ్య వయస్సు పిల్లలు మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు అధ్యయనాల్లో తేలినందుకు పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీల్లో అవగాహన కార్యక్రమాలను విస్తృత చేయాలన్నారు. సమావేశంలో దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ రయీస్ ఫాతిమా, లీగల్ సెల్ అడ్వకేట్ హేమలత, మెప్మా పీడీ నాగశివలీల, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, డీఎంహెచ్ఓ డాక్టర్ శాంతికళ, ఐసీడీఎస్ పీడీ నిర్మల, డీఈఓ శామ్యూల్ పాల్, డీఎస్పీ బాబుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అవగాహన కార్యక్రమాలు ఇలా.. ● జూన్ 1 నుంచి 7వ తేదీ వరకు విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ● జూన్ 8 నుంచి 14వ తేదీ వరకు వాల్ పెయింటింగ్స్, పోస్టర్లు వేయించాలన్నారు. ● జూన్ 15 నుంచి 21వ తేదీ వరకు చర్చలు, కాంపిటీషన్స్, సెమినార్లు, వెబినార్లతో అవగాహన కల్పించాలన్నారు. ● 22 నుంచి 26వ తేదీ వరకు అవగాహన ర్యాలీలు సంతకాల సేకరణ, బైక్ ర్యాలీలు చేపట్టాలన్నారు. ● 26న ప్రతి కార్యాలయంలో మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించాలన్నారు. జూన్ 1 నుంచి 26వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు -
దూర ప్రాంతాలకు వెళ్లాల్సిందే
ఉర్దూ మీడియంలో చదువుకున్న విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించాలంటే కర్నూలు, అనంతపురం, హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిందే. గ్రామీణ ప్రాంతాల్లో 1 నుంచి 5వ తరగతి వరకు, పట్టణ ప్రాంతాల్లో 1 నుంచి 10వ తరగతి వరకు ఉర్దూ మీడియంలో చదువుకోవడానికి పాఠశాలలు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్మీడియెట్, డిగ్రీ చదువుకునేందుకు ఇక్కడి ప్రాంతంలో అవకాశాలు లేవు. దీంతో చాలా మంది చదువును మధ్యలోనే ఆపేస్తున్నారు. అధికారులు స్పందించి కళాశాలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలి. – ఫయాజ్ అహ్మద్ నిజాం, కౌన్సిలర్, ఆదోని కళాశాలను ప్రారంభించాలి మైనార్టీ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల భవన నిర్మాణం పూర్తయ్యింది. కానీ ప్రారంభానికి మాత్రం నోచుకోవడం లేదు. కళాశాల ప్రారంభమైతే అందులో చేరాలని ఎంతోమంది విద్యార్థినులు ఎదురు చూస్తున్నారు. అసలు ఈ విద్యా సంవత్సరంలో కళాశాల ప్రారంభమవుతుందో లేదో తెలియని పరిస్థితి. ఇప్పటికై న విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కళాశాలను ప్రారంభించాలి. – గౌస్, ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి -
రియల్ ఎస్టేట్ రంగానికి ప్రోత్సాహం
కర్నూలు (టౌన్): రియల్ ఏస్టేట్ రంగానికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని మంత్రి టీజీ భరత్ అన్నారు. శుక్రవారం స్థానిక ఎస్టీబీసీ కళాశాల మైదానంలో క్రెడాయ్ ప్రాపర్టీ ప్రదర్శన నిర్వహించారు. మంత్రి భరత్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగానికి ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రాన్ని టూరిజం హబ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తుందన్నారు. ఓర్వకల్లులో పెద్దఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని, అక్కడ స్టార్ హోటళ్లను ఏర్పాటు చేసే వారికి ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. కర్నూలు పరిసర ప్రాంత ప్రజలు ఈ ప్రదర్శనను వినియోగించుకోవాలన్నారు. క్రెడాయ్ అధ్యక్షుడు, కన్వీనర్, చైర్మన్ సురేష్కుమార్ రెడ్డి శ్రీనివాసరావు, గోరంట్ల రమణ మాట్లాడుతూ ఇళ్ల స్థలాలు, ఇళ్లు, ప్లాట్లు, నిర్మాణ సంస్థలు, ఇంటీరియర్స్, బిల్డింగ్ మెటీరియల్స్, బ్యాంకింగ్ సంస్థలను ఈ ప్రదర్శనలో ఉంచామన్నారు. ఇంటి కోనుగోళ్లకు రుణసౌకర్యం అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అనంతరం మంత్రి స్టాళ్లను సందర్శించారు. నగర మేయర్ బీవై రామయ్య, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు, క్రెడాయ్ సంస్థ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, కోశాధికారి టీఏవీ ప్రకాష్, రాగమయూరి బిల్డర్స్ అధినేత కేజే రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అసాంఘిక కార్యకలాపాలపై ‘స్పెషల్’ దాడులు
కర్నూలు: క్షేత్రస్థాయిలో అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తే స్పెషల్ టీమ్లను రంగంలోకి దింపి దాడులు చేయిస్తానని ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో ఎస్పీ శుక్రవారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. కర్నూలు, పత్తికొండ, ఎమ్మిగనూరు, ఆదోని సబ్ డివిజన్లలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసులను సమీక్షించి పరిష్కారానికి సూచనలు చేశారు. స్టేషన్ల వారీగా కేసుల పెండింగ్కు కారణాలను అడిగి తెలుసుకున్నారు. డాబాల్లో మద్యం అనుమతించకుండా గట్టి చర్యలు చేపట్టాలని.. ఓపెన్ డ్రింకింగ్, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలపై గట్టి నిఘా ఉంచాలన్నారు. గ్రామాల పర్యటనకు వెళ్లినప్పుడు రోడ్డు ప్రమాదాల మలుపులు, ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించాలన్నారు. రేడియం స్టిక్కర్స్, బారికేడ్స్, బ్లింకర్స్, స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలన్నారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు విస్తృతం చేయాలన్నారు. గత నెలలో నమోదైన కేసులను ఛేదించడంలో ప్రతిభ కనపరచిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ ప్రశంసాపత్రాలు అందజేశారు. డీఎస్పీలు బాబుప్రసాద్, ఉపేంద్ర బాబు, హేమలత, భాస్కర్ రావు, సీఐలు, ఎస్ఐలు సమావేశంలో పాల్గొన్నారు. -
మృత్యువు మింగేసింది!
గోనెగండ్ల: ‘అమ్మా.. నేను నీ వెంట వస్తా.. అంటూ పొలం పనులకు పోతున్న తల్లుల వెంట వెళ్లిన ఇద్దరు బాలికలు విగతజీవులుగా ఇంటికి చేరారు. పొలంలోని నీటి తొట్టిలో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన ఇద్దరు బాలికలు ప్రమాదవశాత్తూ మృత్యువాత పడ్డారు. ఈ విషాద సంఘటన మండల కేంద్రం గోనెగండ్లలో శుక్రవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గోనెగండ్లలోని కురువ పేటకు చెందిన బోయ మందకల్, సరస్వతి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఈ దంపతులు గ్రామంలోనే కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి రెండవ కూతురు మాధురి(12) గోనెగండ్ల హైస్కూల్లో ఆరవ తరగతి వరకు చదివి మధ్యలో బడి మానేసింది. అలాగే అదే కాలనీకి చెందిన బోయ రంగప్ప నాయుడు, మహేశ్వరి దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరి రెండో కుమార్తె మంజుల (12) కూడా బడి మానేసింది. రోజు మాదిరిగా సరస్వతి, మహేశ్వరిలు శుక్రవారం ఉదయం అదే కాలనీకు చెందిన ఓ రైతు పొలంలో పత్తి విత్తనాలు విత్తేందుకు బయలుదేరారు. తల్లుల వెంట వారి బిడ్డలు మాధురి, మంజుల కూడా వెంట వెళ్లారు. తల్లులు పొలంలో పత్తి విత్తనాలు విత్తుతుండగా మధ్యాహ్న సమయంలో ఆ చిన్నారులు ఇద్దరు పొలంలోని నీటి తొట్టి దగ్గరకు వెళ్లారు. సరదాగా ఈత కొట్టేందుకు అందులోకి దిగారు. లోతు ఎక్కువగా ఉండటంతో ఇద్దరు నీటిలో మునిగి పోయారు. పొలంలో పనులు చేస్తున్న తల్లులు పిల్లలు కనిపించడం లేదని గాలిస్తుండగా అనుమానంతో నీటి తొట్టిలో చూశారు. నీటిలో మునిగి పోయిన చిన్నారులను చూసి గుండెలు బాదుకున్నారు. చుట్టు పక్కల పొలం రైతులు వచ్చి చిన్నారులను బయటకు తీశారు. గోనెగండ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే బాలికలు మృతిచెందారని వైద్యులు నిర్ధారించారు. ఒకే కాలనీలో ఇద్దరు చిన్నారుల మృతితో విషాదం నెలకొంది. తల్లిదండ్రులు, కుటుంబీకులు రోదిస్తున్న తీరును చూసిన పలువురు కంటతడి పెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బాలికల వివరాలు సేకరించారు. పొలం నీటి తొట్టిలో మునిగి ఇద్దరు బాలికలు మృతి సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లి ప్రమాదం గోనెగండ్లలో విషాదం -
మహానందీశ్వరుడి సేవలో ప్రముఖులు
మహానంది: మహానందీశ్వర స్వామి సన్నిధిలో శుక్రవారం పలువురు ప్రముఖులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏపీ ఎకై ్సజ్ శాఖ డైరెక్టర్, ఐజీ, ఐపీఎస్ రాహుల్దేవ్ శర్మ, ఈఎస్ రవికుమార్, కర్నూలు కోర్టు 7వ అదనపు జిల్లా జడ్జి వి.లక్ష్మీరాజ్యం, రామశర్మ దంపతులు, సీఐ కష్ణమూర్తి, నంద్యాల మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ సూపరింటెండెంట్ అంబటి శశిధర్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్బారెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు కామేశ్వరి దేవి, మహానందీశ్వర స్వామిని దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన పూజలు చేశారు. దర్శనం అనంతరం స్థానిక అలంకార మండపంలో వేద పండితులు, అర్చకులు వారికి ఆశీర్వచనాలు అందించి స్వామి, అమ్మవారి ప్రసాదాలు అందజేశారు. బీసీ భవన్ స్థల పరిశీలన కర్నూలు(అర్బన్): నగరంలోని బీ క్యాంప్ పరిసరాల్లో బీసీ భవన్కు కేటాయించిన స్థలాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సత్యనారాయణ పరిశీలించారు. శుక్రవారం ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు కర్నూలుకు వచ్చిన ఆయన్ను స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో పలువురు బీసీ నాయకులు కలిసి నిర్మాణ దశలో ఆగిపోయిన బీసీ భవన్ను పరిశీలించాలని కోరారు. ఈ నేపథ్యంలోనే ఆయన బీసీ భవన్ స్థలాన్ని పరిశీలించి, భవనం పూర్తి చేసే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని చెప్పారు. ఈ నేపథ్యంలో నగరంలోని బీసీ స్టడీ సర్కిల్కు హాస్టల్ మంజూరు చేయాలని, ఉమ్మడి జిల్లాలోని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించాలని బీసీ నాయకులు కోరారు. అలాగే బీసీ కులాలకు చెందిన వివిధ కార్పొరేషన్లకు నిధులు మంజూరు చేయాలని, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మహాత్మా జ్యోతిరావు ఫూలే రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లా బీసీ సంక్షేమ సాధికారత అధికారిణి కే.ప్రసూన, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎస్.జాకీర్హుసేన్, సహాయ బీసీ సంక్షేమాధికారి శ్రీనివాసులు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి వేంపెంట రాంబాబు, నాయకులు ఉప్పరి శివన్న, పీజీ వెంకటేష్ తదితరులు ఉన్నారు. -
యోగాంధ్రలో ప్రజలు భాగస్వాములు కావాలి
కర్నూలు(అర్బన్): యోగాంధ్రలో ప్రజలు భాగస్వాములై అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య కోరారు. శుక్రవారం జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుంచి రాజ్విహార్ సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రాముఖ్యతను ప్రజలందరూ తెలుసుకోవాలన్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో యోగా పోటీలను నిర్వహించి జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బహుమతులు అందిస్తామన్నారు. ప్రతి రోజు యోగాపై అవగాహన కల్పించేందుకు ర్యాలీలు, మానవహారాలు, ఏదో ఒక రకమైన ఈవెంట్లను నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా వినియోగదారుల కమిషన్ అధ్యక్షులు కరణం కిశోర్కుమార్, డీఎస్ఓ రాజారఘువీర్, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, డీఎస్డీఓ భూపతిరావు, డీఏఓ డాక్టర్ శ్రీనివాసులు, ఆయుష్ శాఖ డాక్టర్ కేవీఎన్ ప్రసాద్, రాష్ట్ర యోగా సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్శెట్టి తదితరులు పాల్గొన్నారు. 27లోగా బదిలీల దరఖాస్తులు జెడ్పీకి పంపాలి కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ పరిధిలోని ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన దరఖాస్తులను ఈ నెల 27లోగా జిల్లా పరిషత్కు పంపాలని జెడ్పీ సీఈఓ జి.నాసరరెడ్డి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలకు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఒకేచోట 5 సంవత్సరాల సర్వీసు పూర్తయిన ఉద్యోగుల బదిలీలను చేపడుతున్నట్లు ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలను కూడా ఆయా కార్యాలయాల అధిపతులకు పంపించామన్నారు. 27వ తేదీ తరువాత వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోబోమన్నారు. కోడుమూరుకు చేరిన జీడీపీ నీరు కోడుమూరు రూరల్: పట్టణ ప్రజల దాహార్తి తీర్చేందుకు గాజులదిన్నె ప్రాజెక్టు నీరు శుక్రవారం కోడుమూరు వద్ద హంద్రీకి చేరుకున్నాయి. హంద్రీ పరీవాహక ప్రాంతాల్లో నెలకొన్న నీటి సమస్య పరిష్కారానికి జీడీపీ ఎడమ కాల్వ ద్వారా 40క్యూసెక్కుల చొప్పున వర్కూరు సుద్ధవాగు మీదుగా గత మూడు రోజుల నుంచి కోడుమూరు హంద్రీనదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. మరో నాలుగైదు రోజులు నీరు వదిలితే పూర్తిస్థాయిలో మంచినీటి పథకాలకు చేరుకుంటాయని కోడుమూరు ఆర్డబ్ల్యుఎస్ ఏఈ ప్రసాద్ తెలిపారు. సీహెచ్ఓల వినూత్న నిరసన ● ధర్నా చౌక్లో యోగా, రక్తదానం కర్నూలు(హాస్పిటల్): వైద్య ఆరోగ్యశాఖలోని విలేజ్ హెల్త్ క్లినిక్లలో పనిచేసే సీహెచ్వోల(ఎంఎల్హెచ్పీ) ఆందోళన 26వ రోజుకు చేరుకుంది. కర్నూలులోని శ్రీకృష్ణదేవరాయల సర్కిల్ వద్దనున్న ధర్నా చౌక్లో శుక్రవారం యోగాసనాలు, రక్తదాన కార్యక్రమాలతో వినూత్నంగా నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఏపీఎంసీఏ జిల్లా ప్రెసిడెంట్ చందన మాట్లాడుతూ డిమాండ్ల పరిష్కారానికి తాము 26 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం, అధికారుల నుంచి ఎలాంటి స్పందన రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ఒక్క రూ తమను చర్చలకు పిలవడం లేదన్నారు. తమ డిమాండ్లు నెరవేర్చేంత వరకు శాంతియుతంగా ఆందోళనలు కొనసాగిస్తామన్నారు. నిరసనలో అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నాగేంద్రప్రసాద్, ఉపాధ్యక్షులు నాగరాజు, ట్రెజరర్ కార్తీక్ పాల్గొన్నారు. -
పడితే ఇంటికొచ్చేది శవమే..
కూటమి ప్రభుత్వం రోడ్ల మరమ్మతుల పేరిట ప్రజలను నిలువునా మోసం చేసింది. గుంతలు పడిన రోడ్లను హడావుడి పనులతో సరిపెట్టారు. మూడు నెలలు గడవక ముందే ఆ పనుల్లో నాణ్యత తేలిపోయింది. పత్తికొండ–గుత్తి రహదారిలో ప్రయాణం చేయాలంటేనే భయమేస్తుంది. ఇప్పుడు వర్షాలు పడుతుండటంతో ఏ గుంత ఎంత లోతు ఉందో కూడా తెలియడం లేదు. పడితే ఇంటికి వచ్చేది శవమే. తాము అధికారంలోకి వస్తే రోడ్లను మెరిపిస్తామని నమ్మబలికారు. ఇప్పుడు చూస్తే గుంతల రోడ్లపై మా చావుకు వదిలేశారు. – సోమశేఖరరెడ్డి, జొన్నగిరి -
చేనేత కార్మికుల అభ్యున్నతికి కృషి
● స్పెషల్ ఆఫీసర్ మౌర్య భరద్వాజ్ ఎమ్మిగనూరుటౌన్: చేనేత కార్మికుల అభ్యున్నతికి కృషి చేస్తామని ఆదోని సబ్కలెక్టర్, వైడబ్ల్యూసీఎస్ స్పెషల్ ఆఫీసర్ మౌర్య భరద్వాజ్ అన్నారు. సొసైటీకి స్పెషల్ ఆఫీసర్గా నియామకమైన ఆయన మొదటి సారిగా గురువారం పట్టణంలోని వైడబ్ల్యూసీఎస్ కార్యాలయం ఆవరణలో ఉన్న ఉత్పత్తి కేంద్రాన్ని, గోదాంతో పాటు, విక్రయ కేంద్రం, డయింగ్ ప్రదేశాన్ని పరిశీలించారు. చేనేత ఉత్పత్తి,క్రయ విక్రయాల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైడబ్ల్యూసీఎస్ పరిధిలోని చేనేత కార్మికులు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చేనేత ఉత్పత్తుల్లో కొత్త ఆవిష్కరణలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. చేనేత జౌళిశాఖ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ నాగరాజారావు, వైడబ్ల్యూసీఎస్ కార్యదర్శి అప్పాజి, డిప్యూటీ తహసీల్దార్ వీరభద్రగౌడ్ పాల్గొన్నారు. పెండింగ్ బిల్లులు వెంటనే అప్లోడ్ చేయండి కర్నూలు(అర్బన్): 2014–19 మధ్య కాలంలో చేపట్టిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే అప్లోడ్ చేయాలని పీఆర్ ఇంజినీరింగ్ కమిషనర్ కోరారు. గురువారం ఆయన పీఆర్ ఎస్ఈలతో గూగుల్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పీఆర్ ఎస్ఈ వీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే పెండింగ్లో ఉన్న రూ.3 కోట్లకు సంబంధించిన బిల్లులను అప్లోడ్ చేశామని, ఇంకా 13 పనులకు సంబంధించిన రూ.6 లక్షల బిల్లులను మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉందన్నారు. ఇందులో కూడా నాలుగు బిల్లులు ఎస్ఎస్ఏకు సంబంధించినవి ఉన్నాయని, మిగిలిన వాటిలో 9 బిల్లులను కూడా అప్లోడ్ చేశామన్నారు. సాంకేతిక కారణాలతో రూ.58 వేల బిల్లును మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉందన్నారు. ఈ గూగుల్ మీట్లో ఎస్ఈ పీఏ బండారు శ్రీనివాసులు పాల్గొన్నారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి పాములపాడు: జూటూరు గ్రామానికి చెందిన గోరపూటి సత్యం(48) కేసీ కాలువ గట్టుపై అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సమాచారం మేరకు ఎస్ఐ సురేష్బాబు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని భార్య వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామన్నారు. మృతదేహాన్ని ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. రైల్వేస్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి కర్నూలు: గుర్తు తెలియని వ్యక్తి కర్నూలు రైల్వే స్టేషన్లో మృతిచెందాడు. రైల్వే పీఎస్ హెడ్ కానిస్టేబుల్ మాధవస్వామి మృతదేహాన్ని పరిశీలించారు. ప్రమాదమా లేదంటే సాధారణ మరణమా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. మృతి చెందని వ్యక్తి సుమారు 50 సంవత్సరాల వయస్సు ఉంటుంది. కాషాయం రంగు టవల్, తెలుగు రంగు చొక్కా ధరించాడు. కుడి చేతిపైన 96975368 అనే సంఖ్యలు గల టాటూ మార్కు ఉంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీ కేంద్రానికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ మాధవస్వామి తెలిపారు. ఆచూకీ తెలిసినవారు 9030481295, 9441802327కి సమాచారం అందించాలన్నారు. -
నెలరోజుల్లో పెళ్లి.. అంతలోనే విషాదం
ఆస్పరి: నెలరోజులకు పెళ్లి కావాల్సిన యువతి విద్యుదాఘాతంతో మృతి చెందారు. దీంతో ఆస్పరిలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆస్పరిలో గురువారం కుళాయిలకు నీటిని సరఫరా చేశారు. పింజరి శభేరా (20) అనే యువతి కుళాయికి విద్యుత్ మోటారు వేసే సమయంలో విద్యుదాఘాతంతో స్పృహ తప్పి పడిపోయారు. గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆస్పరికి చెందిన పింజరి కాశన్న, బీబీ దంపతులకు నలుగురు కుమార్తెలు. వీరిలో ఇప్పటికే ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేశారు. మూడో కుమార్తె శభేరాకు మండలంలోని ములుగుందం గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. ఈమేరకు గత 15రోజులకు క్రితం ఆస్పరిలో నిశ్చితార్థం కూడా చేశారు. జూన్ 22, 23వ తేదీల్లో పెళ్లి జరిగేలా కుటుంబ సభ్యులు నిశ్చయం చేసుకున్నారు. ఇంతలోనే విషాదకరమైన ఘటన జరగడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల కంటతడి పెట్టారు. యువతి ప్రాణం తీసిన విద్యుదాఘాతం -
మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి
వెల్దుర్తి: మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని డీఆర్డీఏ పీడీ కేవీ రమణారెడ్డి అన్నారు. పీఎమ్ఆర్ఎమ్ఈ కింద, ఎస్బీఐ సౌజన్యంతో పట్టణ సభ్యురాలు లక్ష్మిదేవి తీసుకున్న ఆయిల్ మిషన్ను గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం స్థానిక కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రతి పొదుపు సభ్యురాలు జీవనోపాధులను మెరుగు పరుచుకోవాలన్నారు. కుటుంబ అవసరాలకు కిచెన్ గార్డెన్ తదితరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. డీపీఎంలు నర్సమ్మ, నవీన్, ఏపీఎం అనురాధ, హెచ్డీ ఏపీఎం వెంకటస్వామి, ఉన్నతి ఏపీఎం కాశేశ్వరుడు, సీసీలు పాల్గొన్నారు. ‘ఎకై ్సజ్’ సమస్యలు పరిష్కరించండి కర్నూలు: జిల్లా ఎకై ్సజ్ శాఖలో పనిచేస్తున్న సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎకై ్సజ్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ వినతిపత్రం సమర్పించారు. జిల్లా ఎకై ్సజ్ శాఖలో 135 మంది కానిస్టేబుళ్లు ఉండగా, కేవలం 61 మంది మాత్రమే ఉన్నారని, సిబ్బంది కొరత వల్ల ఉన్న సిబ్బందిపై పనిభారం పెరిగి ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. ఎకై ్సజ్ శాఖలో పోలీసు కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియను చేపట్టి సిబ్బందిపై పనిభారం తగ్గించేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా వినతిపత్రంలో కోరారు. ఎస్ఐలు సందీప్, సోమశేఖర్, నవీన్, రెహనా బేగం త దితరులు కూడా రాహుల్ దేవ్ శర్మను కలసిన వారిలో ఉన్నారు. -
లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు
● ఒకరు మృతి డోన్ టౌన్: జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన లారీ క్లీనర్ గోపి చంద్ అలియాస్ చంటి(25)మృతి చెందాడు. లారీ డ్రైవర్ అమీర్, బస్సు డ్రైవర్ భాస్కర్కు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రయాణికులు హేమ, మహిధర్తో పాటు మరికొంత మందికి స్వల్ప గాయాలు అయ్యినట్లు పట్టణ పోలీసులు తెలిపారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత (గురువారం తెల్లవారు జాము 1గంట దాటిన తరువాత) అనంతపురం నుంచి కర్నూలు వైపుకు వెళుతు న్న లారీ టైర్ పంక్చర్ అయ్యింది. జాతీయ రహదారిపై యు.కొత్తపల్లె వద్ద ఉన్న బ్రిడ్జి వద్ద లారీని ఆపారు. క్లీనర్ చంటి లారీ టైర్ల కింద రాళ్లు పెట్టడానికి ఉండగా కదిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్కు వెళ్తూ ఢీ కొట్టింది. లారీ వెనుక నిలబడి ఉన్న చంటి నలిగి పోయి అక్కడికక్కడే మృతి చెందారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
నల్లమల మీదుగా ‘నంబాల’
ఆత్మకూరురూరల్: చత్తీస్గఢ్ రాష్ట్రంలోని అబూజ్మడ్ అడవుల్లో మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ ఎన్కౌంటర్లో బుధవారం తెల్లవారు జామున మృతి చెందారు. ఈయన పలుమార్లు, పలు హోదాల్లో నల్లమలలో పర్యటించారని మాజీ మావోయిస్టులు గుర్తు చేసుకుంటున్నారు. పీపుల్స్వార్ పార్టీ కేంద్ర కమిటీలోకి నంబాల కేశవరావు వచ్చిన తరువాత 1991లో నల్లమలకు వచ్చినట్లు కొందరు మాజీ మావోయిస్టులు తెలిపారు. 1995లో నల్లమలలో జరిగిన రాయలసీమ – దక్షిణ కోస్తా రీజినల్ మిలటరీ క్యాంప్నకు హాజరైనట్లు, 1997లో నల్లమల అడవిలో ఆయన పర్యటించినట్లు గుర్తు చేశారు. పీపుల్స్వార్ ఆంధ్ర రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 1998లో నల్లమలలో జరిగిన రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతుల్లో కూడా పాల్గొన్నట్లు చెప్పారు. చిట్టచివరి సారిగా నల్లమలకు 2003లో ఏపీ రాష్ట్ర కమిటీ ప్లీనంలో పాల్గొనేందుకు వచ్చినట్లు గుర్తు చేసుకున్నారు. -
సర్పంచ్లకు తెలియకుండా నిధుల డ్రా
● అధికారులపై ప్రజాప్రతినిధులు ఆగ్రహంపత్తికొండ: గ్రామాల్లో టీడీపీ నాయకుల అండ చూసుకొని సర్పంచ్లకు తెలియకుండా కొందరు నిధులుడ్రా చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారని పలువురు సర్పంచ్లు మండిపడ్డారు. పత్తికొండ మండల పరిషత్ సమావేశ భవనంలో ఎంపీపీ నారాయణ దాస్ అధ్యక్షతన గురువారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. దూదేకొండ సర్పంచ్ ముజఫర్ రెహమాన్ మాట్లాడుతూ.. తన గ్రామ పంచాయతీ కార్యదర్శి అక్రమంగా నిధులు డ్రా చేశారని, ఈ విషయం అధికా రులు దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. సర్పంచ్లతో సంబంధం లేకుండా నిధులు డ్రా చేసే అధికారం కొత్తగా కూటమి ప్రభుత్వం ఏమైనా ఉత్తర్వులు ఇచ్చి ఉంటే చూపాలని కోరారు. సమస్యలపై అధికారులు చర్చించి చర్యలు చేపడతామని ఎంపీడీవో కవిత, ఎంపీపీ దాస్ తెలిపారు. వైస్ ఎంపీపీ రంగమ్మ, మేజర్ పంచాయతీ కార్యదర్శి నరసింహులు, వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు నీలకంఠ, కేశప్ప, పెద్దవీరన్న, కృష్ణారెడ్డి, లక్ష్మి, మహలక్ష్మి, సర్పంచ్లు ప్రవీణ, కేశవరెడ్డి, అంజనేయులు పాల్గొన్నారు. -
ఖాళీ కుర్చీల ‘మహా’నాడు
నంద్యాల(అర్బన్): స్థానిక టెక్కె మార్కెట్యార్డులో గురువారం నిర్వహించిన నంద్యాల జిల్లా స్థాయి మహానాడులో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. వేలాది మంది కార్యక్రమానికి హాజరవుతారని భావించిన నిర్వాహకులకు నిరాశ ఎదురైంది. మూడు షెడ్లలో ఏర్పాటు చేసిన మహానాడుకు ఒక్క షెడ్డులో మాత్రమే కార్యకర్తలు కూర్చోవడంతో మిగిలిన రెండు షెడ్లలో ఖాళీ కుర్చీలు కనిపించాయి. భారీగా పార్టీ శ్రేణులు వస్తారని భావించిన నిర్వాహకులు అనుకున్న స్థాయిలో రాకపోవడంతో చేసేదేమీ లేక నాయకులు ఆర్భాటపు ప్రసంగాలతో అదరగొట్టారు. ఈ కార్యక్రమానికి డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్రెడ్డి గైర్హాజరయ్యారు. అనంతరం టీడీపీ జిల్లా అధ్యక్షుడు మల్లెల్ల రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తమ నియోజకవర్గానికి నిధులు మంజూరు కాలేదంటూ డోన్ నియోజకవర్గ నాయకులు ధర్మారం సుబ్బారెడ్డి సభ దృష్టికి తేవడం చర్చనీయాంశమైంది. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ గ్రామ, మండల స్థాయి కమిటీలో పెండింగ్లో ఉన్నాయన్నా రు. మంత్రి బీసీ జనార్ధన్రెడ్డి మాట్లాడుతూ నాణ్యమైన పొగాకును కంపెనీలు కచ్చితంగా కొనుగోలు చేస్తారని, నాణ్యత లేని పొగాకు విషయంలో రైతులు కొంత రాజీ పడక తప్పదనానరు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ, ఆర్ఐసీ మాజీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డిలు సభ మధ్యలోనే వెళ్లిపోయారు. కార్యక్రమంలో మంత్రి ఫరూక్, ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యేలు గౌరుచరితారెడ్డి, జయసూర్య, మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. డోన్ ఎమ్మెల్యే కోట్ల డుమ్మా ఆర్భాటపు ప్రసంగాలతో మమ అనిపించిన నేతలు వెక్కిరించిన ఖాళీ కుర్చీలు -
చట్టాలపై అవగాహనతోనే న్యాయవాద వృత్తిలో రాణింపు
కర్నూలు (సిటీ): చట్టాలపై అవగాహనతోనే న్యాయవాద వృత్తిలో రాణించవచ్చునని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.హరిహరనాథ శర్మ అన్నా రు. ‘కెరీర్ ప్రాస్పెక్ట్స్ ఇన్ లా’ అనే అంశంపై స్థానిక ఓ న్యాయ కళాశాలలో జరిగిన సెమినార్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. లా విద్యార్థులు కోర్సు సమయంలోనే చట్టాలపై పరిజ్ఞానం పెంచుకుంటే కోర్టులలో సమర్థవంతంగా వాదించడానికి, సాక్షులను క్రాస్ ఎగ్జామ్ చేయడానికి ఉపకరిస్తుందన్నారు. సమాజంలో న్యాయవాద వృత్తికి ఎంతో ప్రాధాన్యం ఉందని, ప్రతి ఒక్కరూ న్యాయ సహాయం పొందేందుకు న్యాయవాదులను సంప్రదిస్తారన్నారు. చట్టాలపై అవగాహనతో పాటు ఆంగ్ల భాషపై ప్రావీణ్యం సాధించడం కూడా ముఖ్యమేనని తెలిపారు. ప్రసూనా న్యాయ కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ పెంచలయ్య మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతమైన కర్నూలును విద్యాపరంగా అభివృద్ధిపరిచేందుకు తాను 1999లో కర్నూలులో న్యాయ కళాశాలను ప్రారంభించి వేలాది మందిని న్యాయవాదులుగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. సీనియర్ న్యాయవాది శ్రీనివాసులు మాట్లాడుతూ న్యాయవాద వృత్తిలో రాణించాలంటే కష్టపడి పనిచేసే తత్వం అలవరుచుకోవాలని కోరారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.శివాజీరావు మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థులకు చట్టాలపై అవగాహన పెంచేందుకు పలు వెబ్సైట్లు సెమినార్లను నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో డీన్ డాక్టర్ జేవీ శివకుమార్, జూనియర్ న్యాయవాదులు, లా విద్యార్థులు పాల్గొన్నారు. జస్టిస్ ఎ.హరిహరనాథ శర్మ -
యోగాపై ప్రజలకు అవగాహన కల్పించాలి
కర్నూలు(సెంట్రల్): యోగాపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యోగాంధ్రా కార్యక్రమాల నిర్వహణపై గురువారం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 22వ తేదీ వరకు ప్రతిరోజూ ఒక జిల్లాలో ఒక థీమ్తో స్టేట్ ఈవెంట్ యోగా సెషన్ను నిర్వహించేలా ప్రణాళికను సిద్ధం చేసిందన్నారు. అందులో భాగంగా జిల్లాలో జూన్ 17న 5 వేల మంది పారిశుద్ధ్య కార్మికులతో యోగా కార్యక్రమాలను నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. జూన్ 8న కర్నూలు, ఆదోని పత్తికొండ డివిజన్లలో సీనియర్ సిటీజన్లతో యోగా కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. కొండారెడ్డి బురుజు, ఓర్వకల్లు రాక్ ఆర్డెన్, నగరవనం, మంత్రాలయంలలో మే 30, జూన్ 12, 18 తేదీల్లో కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రతి గ్రామంలో మే 26 నుంచి 30వ తేదీ వరకు వివిధ రకాల యోగా పోటీలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. జూన్ 2 నుంచి 7వ తేదీ వరకు మండల స్థాయిలో పోటీలు ఉంటాయన్నారు. జూన్ 9 నుంచి 14వ తేదీ వరకు జిల్లాలో, జూన్ 21వతేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవంరోజు ప్రతి కేటగిరిలో ఉత్తమ ప్రతిభ కనబరచిన వారికి అవార్డులను ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో జేసీ డాక్టర్ బి.నవ్య, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, కర్నూలు, పత్తికొండ ఆర్డీఓలు సందీప్కుమార్, భరత్నాయక్ పాల్గొన్నారు. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా -
రూ.4.13 కోట్లు ఇంకా సర్దుబాటు కాలేదు
స్టాంప్ డ్యూటీ సర్దుబాటుకు సంబంధించి ప్రతి మండలంలో ఒక లైజనింగ్ అధికారికి ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగిస్తు చేసిన ప్రయత్నంతో 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.9,34,68,168లు సర్దుబాటు అయ్యాయి. అలాగే 2020–21లో రూ.4 కోట్లు, 2021–22లో 5 కోట్లు, 2022–23లో రూ.5.48 కోట్లు, 2023–24లో రూ.5.02 కోట్లు సర్దుబాటు అయ్యాయి. అయితే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అపోర్షనేట్ అయిన మొత్తం రూ.4.13 కోట్లు ఇంకా సర్దుబాటు కాలేదు. స్టాంప్ డ్యూటీ స్థానిక సంస్థలకు సర్దుబాటు అయితే వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు కనీసం అపోర్షనేట్ కూడా చేయకపోవడం ఏమిటి? దీంతో జిల్లా పరిషత్కు ఎంత సర్దుబాటు చేయాలనే విషయంపై కూడా స్పష్టత కొరవడింది. – ఎర్రబోతుల పాపిరెడ్డి, జెడ్పీ చైర్మన్ స్థానిక సంస్థలు ఆర్థికంగా దెబ్బతింటున్నాయి ప్రభుత్వ నిధులు సక్రమంగా విడుదల కాకపోవడంతో స్థానిక సంస్థలు ఆర్థికంగా నిర్వీర్యం అయిపోతున్నాయి. అంతంతమాత్రం ఆదాయం ఉన్న జిల్లా పరిషత్కు ఏడాది కాలంగా స్టాంప్ డ్యూటీ విడుదల కాకుంటే ఎలా? స్టాంప్ డ్యూటీ కింద స్థానిక సంస్థలకు విడుదలయ్యే 1.5 శాతం నిధులతో గ్రామాల్లో ప్రజలకు ఉపయోగపడే పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఉంది. అయితే ఈ నిధులను సర్దుబాటు చేయడంలో జరుగుతున్న జరుగుతున్న జాప్యాన్ని నివారించి వెంటనే నిధులు జెడ్పీకి జమ అయ్యేలా చూడాలి. – ఆర్బీ చంద్రశేఖర్రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు, గడివేముల ● -
ఆగస్టు చివరికి సారా రహిత జిల్లాగా చేయాలి
కర్నూలు: నవోదయం 2.0 కార్యక్రమం అమలులో భాగంగా కర్నూలు జిల్లాను ఆగస్టు చివరి నాటికి నాటుసారా రహిత జిల్లాగా ప్రకటించేలా పనిచేయాలని జిల్లా ఎకై ్సజ్ అధికారులను ఆ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ ఆదేశించారు. విజయవాడ నుంచి బుధవారం రాత్రి కర్నూలు చేరుకున్న రాహుల్ దేవ్ శర్మ బీ.క్యాంప్లోని పోలీస్ గెస్ట్ హౌస్లో బస చేశారు. గురువారం ఉదయం 10:30 గంటలకు స్థానిక ఎకై ్సజ్ కార్యాలయానికి చేరుకున్నారు. నోడల్ డిప్యూటీ కమిషనర్ పి.శ్రీదేవి, అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు, జిల్లా నోడల్ ఎకై ్సజ్ అధికారి సుధీర్ బాబు, ఏఈఎస్లు రాజశేఖర్ గౌడ్, రామకృష్ణారెడ్డి, సీఐలు రాజేంద్రప్రసాద్, చంద్రహాస్, జయరాం నాయుడు తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం డీటీఎఫ్, ఎన్ఫోర్స్మెంట్ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నవోదయం 2.0 అమలు తీరు, జిల్లాలో ఉద్యోగుల పనితీరుపై సమీక్షించారు. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ నుంచి బార్డర్ చెక్పోస్టుల పనితీరును సమీక్షించారు. చెక్పోస్టులలో నిఘాను పెంచి అక్రమ మద్యం జిల్లాలోకి రాకుండా అడ్డుకట్ట వేయాలన్నారు. రీజనల్ ఎకై ్సజ్ ల్యాబ్ను, అందులోని పరికరాలను పరిశీలించి ల్యాబ్ పనితీరును సమీక్షించారు. రిపోర్టులు తయారైన వెంటనే సంబంధిత స్టేషన్లకు స్పెషల్ మెసెంజర్ల ద్వారా పంపాలన్నారు. జిల్లా కార్యాలయం ఆవరణం మొత్తం కలియదిరిగి ఎకై ్సజ్ కార్యాలయ ఆవరణంలో మొక్కలు నాటారు. అనంతరం మాదవరం, ఛత్రగుడి చెక్పోస్టులను తనిఖీ చేశారు. ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ -
ఉపాధ్యాయ బదిలీలకు వేళాయె!
కర్నూలు సిటీ: ఉపాధ్యాయుల బదిలీలకు విద్యాశాఖ సిద్ధమైంది. ఉమ్మడి జిల్లా కేంద్రంగా బదిలీలు చేసేందుకు ఇటీవలే షెడ్యూల్ జారీ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉపాధ్యాయుల బదిలీల కోసం టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్–2025 ను తీసుకొచ్చారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే ప్రక్రియ ప్రారంభం అయ్యింది. 2023 మే నెలలో ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టారు. రెండేళ్లకు జరుగుతున్న బదిలీలకు ఆన్లైన్లో ఈ నెల 21 నుంచే దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. మొదటగా ప్రధానోపాధ్యాయులు, ఆ తరువాత స్కూల్ అసిస్టెంట్ టీచర్లు, అనంతరం సెకండ్ గ్రేడ్ టీచర్లను బదిలీలకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. నిబంధనలు ఇవీ.. ● ప్రధానోపాధ్యాయులు 5 ఏళ్లు, ఇతర కేటగిరీ టీచర్లు 8 ఏళ్ల పాటు ఒకే చోట పని చేస్తూ ఉంటే కచ్చితంగా బదిలీ కానున్నారు. ● స్టడీ లీవ్ పేరుతో సెలవుల్లో ఉన్న ఉపాధ్యాయులు(ఆగస్టులోపు) 8 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకుంటే బదిలీ కానున్నారు. ● విద్యాశాఖ వెబ్సైట్లో ముందుగా ప్రధానోపాధ్యాయులకు దరఖాస్త్తులకు అవకాశం ఇవ్వగా, ఆ గడువు గురువారంతో ముగిసింది. స్కూల్ అసిస్టెంట్లకు ఈ నెల 24, ఎస్జీటీలకు ఈ నెల 27వ తేదితో ముగియనుంది. ● ప్రొవిజినల్ సీనియారిటీ జాబితాలు ప్రధానోపాధ్యాయులకు ఈ నెల 24, స్కూల్ అసిస్టెంట్లకు 26,27, ఎస్జీటీలకు ఈ నెల 31వ తేదీన ప్రకటించనున్నారు. ● జాబితాలపై అభ్యంతరాలకు ఈ నెల 25న హెచ్ఎం, 28న ఎస్ఏ, 28 నుంచి జూన్ 1వ తేదీ వరకు ఎస్జీటీలకు అవకాశం ఇచ్చారు. ● తుది సీనియారిటీ జాబితా ఖాళీలను హెచ్ఎంలకు ఈ నెల 27, ఎస్ఏలకు 31, ఎస్జీటీలకు జూన్ 6వ తేదిన ప్రదర్శించనున్నారు. ● బదిలీలకు ఆప్షన్లను హెచ్ఎంలకు ఈ నెల 28, ఎస్ఏలకు జూన్ 1,2, ఎస్జీటీలకు జూన్ 7నుంచి 10వ తేదీ వరకు గడువు ఇచ్చారు. ● హెచ్ఎంలకు ఈ నెల 30, ఎస్ఏలకు జూన్ 4, ఎస్జీటీలకు జూన్ 11వ తేదీన బదిలీలు ఇవ్వనున్నారు. బదిలీలకు 8,042 పోస్టుల ఖాళీ ఉమ్మడి కర్నూలు జిల్లాకు 15,564 ఉపాధ్యాయ పోస్టులు మంజూరు అయ్యాయి. ఇందులో రెగ్యులర్ టీచర్లు 12,191 మంది, మినిమం టైం స్కేల్ టీచర్లు 361 మంది పని చేస్తున్నారు. డీఎస్సీ–2024 ద్వారా 2,645 మంది టీచర్లను భర్తీ చేసేందుకు ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చారు. వచ్చే నెల 6వ తేదీ నుంచి ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించేందుకు పరీక్ష కేంద్రాలను పరిశీలిస్తున్నారు. నూతన మార్గదర్శకాల ప్రకారం 16,898 మంది టీచర్ పోస్టులు అవసరం ఉంది. ఇటీవల విద్యాశాఖ విడుదల చేసిన జీఓ నంబరు 21 ప్రకారం వర్కింగ్ సర్ప్లస్ 499, ఖాళీల సర్ప్లస్ 1,194 టీచర్ పోస్టులు ఉన్నాయి. దీంతో పాటు ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయుల కొరత పోస్టులు 1,334, టీచర్లు 1,701 మంది ఉండగా, వివిధ మేనేజ్మెంట్లలోకి 344 పోస్టులను కన్వర్ట్ చేశారు. ఎస్జీటీ/స్కూల్ అసిస్టెంట్ పోస్టులని అధిగమించడం ద్వారా సృష్టించిన పోస్టుల సంఖ్య 100 ఉన్నాయి. బదిలీలకు ఉమ్మడి జిల్లాలో 8,042 పోస్టులను ఖాళీగా విద్యాశాఖ చూపుతోంది. ఇందులో క్లియర్ వెకేన్సీలు 2,766 ఉండగా, 8/5 అకడమిక్ ఈయర్స్ పూర్తి చేసుకున్న వారు 2,216 మంది టీచర్లు ఉన్నారు. ఇద్దరు టీచర్లు ఫారీన్ సర్వీస్లు ఉన్నారు. పునఃవిభజన ఖాళీలు(రీ–అపోర్సిమెంట్ ఖాళీలు) 1,486, స్టడీ లీవ్లో 25 మంది, కొత్తగా మంజూరై ఖాళీలుగా 1,547 ఉండగా, మొత్తం కలిపి 8,042 పోస్టులను ఖాళీలు విద్యాశాఖ చూపించింది. ఈ నెల 27 వరకు దరఖాస్తులకు అవకాశం జూన్ 11 నాటికి బదిలీల ప్రక్రియ పూర్తివ్యవసాయ శాఖలో.. కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ శాఖలో బదిలీలకు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి కర్నూలు జిల్లా స్థాయిలో చేపట్టాల్సిన బదిలీలపై కర్నూలు, నంద్యాల జిల్లా వ్యవసాయ అధికారులు పీఎల్ వరలక్ష్మి, మరళీకృష్ణ, పరిపాలన అధికారి, సూపరింటెండెంట్లు గురువారం సమావేశమై చర్చించారు. ఉమ్మడి జిల్లా స్థాయిలో అటెండర్లు, డ్రైవర్లు, జూనియర్ అసిస్టెంట్లు, వ్యవసాయ విస్తరణ అధికారుల బదిలీలు జరుగుతాయి. కొందరు ‘కూటమి’ నేతల సిపారస్సు లెటర్లు తెచ్చి కోరుకున్న చోటుకు బదిలీ అయ్యే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. బదిలీల ప్రక్రియను పూర్తి చేసినప్పటికీ జూన్ 2 వతేదీన ఉత్తర్వులు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. -
జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీల్లో సింహభాగం వైఎస్సార్సీపీకి చెందిన ప్రజాప్రతినిధుల పాలన కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఆయా సంస్థలను ఆర్థికంగా నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక సంస్థ
● స్టాంప్ డ్యూటీ జమ కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు? ● జెడ్పీకి సర్దుబాటు కాని అపోర్షన్డ్ మొత్తం రూ.4.13 కోట్లు ● అపోర్షన్డ్ చేయని మొత్తం దాదాపు మరో రూ.6 కోట్లు ● ప్రధాన ఆదాయ వనరుపై దెబ్బకొట్టే యత్నం ● చిన్న పనులను కూడా చేపట్టలేని స్థితిలో స్థానిక సంస్థలు కర్నూలు(అర్బన్): స్థానిక సంస్థలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న స్టాంప్ డ్యూటీపై రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను చేపట్టింది. దీంతో ఏడాది కాలంగా స్టాంప్ డ్యూటీ ఆయా స్థానిక సంస్థలకు జమ కావడం లేదు. జిల్లా పరిషత్కు స్టాంప్ డ్యూటీ నిధులను విడుదల చేయవద్దని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఆస్తుల క్రయ విక్రయాల సమయంలో వినియోగదారులు రిజిస్ట్రేషన్ల శాఖకు స్టాంప్ డ్యూటీ కింద 6.5 శాతం చెల్లించాల్సి ఉంది. ఇందులో 5 శాతం ప్రభుత్వానికి పోగా, మిగిలిన 1.5 శాతం స్థానిక సంస్థలకు జమ చేయాల్సి ఉంది. నయాపైసా ఇవ్వలేదు.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు స్థానిక సంస్థలకు స్టాంప్ డ్యూటీ కింద నయాపైసా సర్దుబాటు చేసిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలోనే కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అపోర్షన్డ్ చేసిన మొత్తం రూ.4,13,63,139 నేటికి జిల్లా పరిషత్కు సర్దుబాటు కాలేదు. అలాగే 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కూడా ఉమ్మడి జిల్లాలోని 24 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు నేటికీ స్థానిక సంస్థలకు తమ వాటా ఎంత మొత్తాన్ని సర్దుబాటు చేయాలనే విషయాన్ని కూడా తెలియజేయకపోవడం దురదృష్టకరం. ఈ నేపథ్యంలోనే ఆయా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు దాదాపు 141 నెలలకు సంబంధించి నేటికి అపోర్షనేట్ చేయలేదు. ఈ మొత్తం కూడా దాదాపు రూ.6 కోట్ల వరకు ఉండవచ్చని జెడ్పీ పాలకవర్గం అంచనా వేస్తోంది. చిన్న పనులు కూడా చేపట్టలేని స్థితిలో.. స్టాంప్ డ్యూటీ సర్దుబాటు కాకపోవడంతో గ్రామ పంచాయతీలు, మండల పరిషత్ పరిధిలో చిన్న చిన్న పనులను కూడా చేపట్టలేని పరిస్థితి నెలకొందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్టాంప్ డ్యూటీ మొత్తం విడుదలైతే గ్రామాల్లో డ్రైనేజీ, తాగునీరు, రోడ్లు, ఇతరత్రా పనులకు వినియోగించుకునే అవకాశం ఉంది. అయితే ఏడాది కాలంగా స్టాంప్ డ్యూటీ విడుదలపై నీలి నీడలు కమ్ముకున్న నేపథ్యంలో స్థానిక సంస్థలు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. -
టీబీ డ్యాంకు వరద నీరు
హొళగుంద: కర్ణాటక రాష్ట్రం హొస్పేట్ వద్ద నిర్మించిన తుంగభద్ర జలాశయానికి వరద నీరు వస్తోంది. డ్యాం ఎగువ భాగంలోని శివమొగ్గ, తీర్థనహళ్లీ, చిక్క మంగళూరు, వరనాడు, శృంగేరి తదితర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో డ్యామ్కు ఇన్ఫ్లో పెరుగుతున్నట్లు టీబీ బోర్డు అధికారులు తెలిపారు. తుంగభద్ర రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 1,633 అడుగులుండగా గురువారం 1,588.80 అడుగులు నమోదైంది. నీటి నిల్వ పూర్తి సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 10.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్ఫ్లో 9,993 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో రూపంలో 2,100 క్యూసెక్కులు వదులుతున్నారు. శ్రీమఠంలో భక్తుల సందడి మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠంలో భక్తుల సందడి నెలకొంది. గురువారం ప్రత్యేకం కావడంతో రాఘవేంద్రస్వామి దర్శనార్థం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల నుంచి భక్తులు అధికసంఖ్యలో రావడంతో మంత్రాలయ క్షేత్రం కళకళలాడింది. తుంగభద్ర నదికి వరద నీరు రావడంతో నదీతీరంలో భక్తుల కోలాహలం కనిపించింది. భక్తులు ముందుగా గ్రామ దేవత మంచాలమ్మ, తర్వాత రాఘవేంద్రుల మూల బృందావన దర్శనాలు చేసుకున్నారు. రాఘవేంద్రుల దర్శనానికి రెండున్నర గంటల సమయం పట్టింది. అన్నపూర్ణభోజనశాల, పరిమళ ప్రసాదం కౌంటర్లతో భక్తులు బారులు తీరారు. శ్రీశైల దేవస్థానానికి రూ.5లక్షల విరాళం శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న వివిధ పథకాలకు గురువారం హైదరాబాద్కు చెందిన ఎం.శివాజీ రూ.5 లక్షల విరాళాన్ని అందించారు. అన్నప్రసాద వితరణకు రూ. 2 లక్షలు, గో సంరక్షణ నిధి పథకానికి రూ.2లక్షలు, ప్రాణదాన ట్రస్ట్కు రూ. లక్ష విరాళాన్ని పర్యవేక్షకులు హిమబిందుకు అందజేశారు. విరాళాన్ని అందించిన దాతకు రసీదు, లడ్డూ ప్రసాదాలు, స్వామివారి శేషవస్త్రం అందజేసి సత్కరించారు. -
కొనసాగుతున్న కక్ష సాధింపు.. భూమా కిశోర్రెడ్డిపై కేసు
నంద్యాల: జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్లో భూమా కిశోర్రెడ్డిపై కేసు నమోదైంది. చికెన్ ధరలపై ప్రజల తరపున ప్రశ్నించినందుకు భూమా కిశోర్రెడ్డిపై అఖిల ప్రియ అనుచరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రజల పక్షాన నిలబడి చికెన్ ధర ఎందుకు పెంచారని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతారా అంటూ కూటమి ప్రభుత్వంపై భూమా కిశోర్రెడ్డి మండిపడ్డారు.అక్రమంగా కేసులు నమోదు చేయడం సరికాదన్న భూమా కిషోర్ రెడ్డి.. అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నాయకులు చికెన్ దందా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే ప్రజా వ్యతిరేక పనులు చేస్తే.. ప్రజల తరపున పోరాటం చేస్తామన్నారు. ఎన్ని అక్రమ కేసులు ఎన్ని పెట్టినా కానీ భయపడేది లేదని భూమా కిషోర్రెడ్డి అన్నారు. -
టీడీపీలో లుకలుకలు.. మంత్రిపై సీనియర్ నేత బహిరంగ విమర్శలు
సాక్షి, కర్నూలు: టీడీపీ నిర్వహిస్తున్న మినీ మహానాడులో పచ్చనేతల మధ్య లుకలుకలు బయటపడుతున్నాయి. గురువారం కర్నూలు జిల్లాలో నిర్వహించిన టీడీపీ మినీ మహా నాడులో రాష్ట్ర మంత్రి టీజీ భరత్పై ఆ పార్టీ సీనియర్ నాయకుడు కేఈ ప్రభాకర్ ఫైరయ్యారు. కర్నూలు జిల్లా మినీ మహా నాడు కార్యక్రమంలో సభను ఉద్దేశించి మంత్రి టీజీ భరత్పై విమర్శలు గుప్పించారు. మహా నాడు సభకు కూడా హాజరు కాలేనంత బిజీ బిజీగా మంత్రి టీజీ భరత్ ఉన్నారని మండిపడ్డారు. పార్టీ కార్యకర్తలను పట్టించుకోవటం లేదు , కార్యకర్తలకు న్యాయం జరగాలి లేదంటే నేను ఊరు కోను ముఖ్యమంత్రే కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పీఠాన్ని ఎందుకు దక్కించులేదనే ప్రశ్నకు మంత్రి దగ్గరే సమాధానం లేదని చురకలంటించారు. ఒకటి, రెండు నెలలు చూసి పార్టీ బలోపేతానికి తాను రంగంలోకి దిగుతాను అంటూ కేఈ ప్రభాకర్ హెచ్చరించారు. -
నంద్యాల: పంటి నొప్పితో వెళ్తే.. ప్రాణం తీసిన ఆర్ఎంపీ వైద్యుడు
సాక్షి, నంద్యాల జిల్లా: పంటి నొప్పితో వెళితే ఓ వైద్యుడు ప్రాణం తీశాడు. సంజామల మండల కేంద్రంలో ఆర్ఎంపీ వైద్యుడి నిర్వాకంతో మహిళ మృతి చెందింది. సంజామల మండలం చిన్న కొత్తపేట గ్రామానికి చెందిన సుబ్బలక్ష్మి (52) రెండు రోజులుగా పంటి నొప్పి ఉండటంతో ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు వెళ్లింది. ఇంజెక్షన్ నరానికీ ఇవ్వగా ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.దీంతో 108 ద్వారా కోవెలకుంట్ల ఆసుపత్రికి ఆర్ఎంపీ వైద్యుడు తరలించగా, అప్పటికే ఆ మహిళ మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. విషయం తెలుసుకున్న ఆర్ఎంపీ వైద్యుడు పరారిలో ఉన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. -
బెస్తలకు రాజకీయగుర్తింపు ఇవ్వాలి
కర్నూలు(అర్బన్): బెస్తలకు రాజకీయ గుర్తింపు ఇవ్వాలని అఖిల భారత బెస్త మహాసభ రాష్ట్ర కోకన్వీనర్ టి.సాయిప్రదీప్ కోరారు. బుధవారం స్థానిక బిర్లా కాంపౌండ్ సమీపంలోని డాక్టర్ బ్రాహ్మారెడ్డి ప్రజా వైద్యశాల సమావేశ భవనంలో బెస్త ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ముందుగా భగవాన్ శ్రీ వ్యాస మహర్శి చిత్ర పటానికి నేతలు పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిప్రదీప్ మాట్లాడుతూ బెస్తలు రాజకీయ పదవులకు నోచుకోవడం లేదన్నారు. జనాభా నిష్పత్తి ప్రకారం రావాల్సిన రాజ్యాంగపరమైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ పదవులు కోల్పోయినా, కనీసం రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల పదవుల్లోనూ బెస్తలకు అవకాశం కల్పించకపోవడం దారుణమన్నారు. త్వరలో ప్రకటించనున్న మార్కెట్యార్డు, దేవాలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్లు, ఇతర పదవుల్లో బెస్తలను నియమించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో నాయకులు భాస్కర్రావు, ఉదయ్, పీజీ వెంకటేష్, ఆనంద్రాజు, జయన్న, ఎద్దుల వెంకటేశ్వర్లు, గ్యాస్ శ్రీనివాసులు పాల్గొన్నారు. -
సీఐపై దాడి కేసులో ఏడుగురికి జైలు, జరిమానా
కర్నూలు: స్థానిక బంగారుపేటలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిలోని ఆక్రమణల తొలగింపు సమయంలో పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్న సీఐ పార్థసారధిరెడ్డిపై దాడి చేసిన ఏడుగురు నిందితులకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.2 వేల చొప్పున జరిమానా విధిస్తూ కర్నూలు అదనపు అసిస్టెంట్ సెషన్స్ జడ్జి దివాకర్ బుధవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు 2021 నవంబర్ 30న అక్రమ కట్టడాలను తొలగించేందుకు బందోబస్తుగా అప్పటి రెండో పట్టణ సీఐ పార్థసారధిరెడ్డి, కోడుమూరు సీఐ శ్రీధర్ సిబ్బందితో బంగారుపేటలోకి వెళ్లారు. సాయంత్రం 4 గంటల సమయంలో జేసీబీతో ఆక్రమణలు తొలగిస్తుండగా కొంతమంది రాళ్లతో పోలీసులపై దాడి చేయగా సీఐకి గాయాలయ్యాయి. వెంటనే ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి చికిత్స అనంతరం టూటౌన్లో ఫిర్యాదు చేశారు. బంగారుపేటకు చెందిన లక్ష్మి, నీలిషికారి బెల్కీ, ఎన్.నరసింహులు, నీలిషికారి సుగుణ, ప్రసాద్, నీలి షికారి నాగమణి, నీలిషికారి బెగినిలపై అభియోగపత్రాలు దాఖలు చేశారు. కేసు విచారణలో నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి నిందితులకు జైలు, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. రేపటి నుంచి క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్ పో కర్నూలు (టౌన్): ఈనెల 23 నుంచి 25వ తేదీ వరకు స్థానిక ఎస్టీబీసీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేయనున్న క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్ పోను మంత్రి టీజీ భరత్ ప్రారంభించనున్నట్లు క్రెడాయ్ కర్నూలు చైర్మన్ గోరంట్ల రమణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలు, నంద్యాల పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు, బైరెడ్డి శబరి, ఎమ్మెల్యేలు గౌరు చరితా, బొగ్గు ల దస్తగిరి, కలెక్టర్ పి.రంజిత్బాషా, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మేయర్ బీవై.రామ య్య, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు పాల్గొంటారన్నారు. ప్రాపర్టీ షోలో 60 మంది బిల్డ ర్లు, నిర్మాణ వస్తువుల సరఫరాదారులు, ఇంటీరియర్ డిజైనర్లు పాల్గొంటారన్నారు. ప్రధాన స్పాన్సర్గా రాగమయూరి బిల్డర్స్, కో స్పాన్సర్గా స్కందాన్షి ఇన్ ఫ్రా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ఆటో పెవిలియన్ అదనపు ఆకర్షణగా నిలుస్తుందని, క్రెడాయ్ కన్వీనర్ ఎన్.శ్రీనివాసరావు, కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, కోశాధికారి టీఏవీ ప్రకాష్, ఇతర క్రెడాయ్ సభ్యులు పాల్గొంటున్నట్లు తెలిపారు. -
అంతర్రాష్ట్ర బైక్ దొంగ అరెస్ట్
● 16 మోటార్ బైక్లు స్వాధీనంఎమ్మిగనూరురూరల్: గత కొంత కాలంగా మోటార్ బైక్ల దొంగతనమే తన ప్రవృత్తిగా మార్చుకొని చోరీలకు పాల్పడుతున్న దొంగను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగ నుంచి 16 మోటార్ బైక్లను రికవరీ చేశారు. బుధవారం సాయంత్రం స్థానిక పట్టణ పోలీస్స్టేషన్ అవరణలో సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ మధుసుధన్రెడ్డి వివరాలు వెల్లడింఆచరు. సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాల ఆధారంగా దొంగను గుర్తించినట్లు చెప్పారు. సి.బెళగల్ మండలం పొలకల్ బీసీ కాలనీకి చెందిన ఉప్పరి వీరేష్, అదే గ్రామానికి చెందిన వర్థన్ అలియాస్ ఇక్బాల్, కోడుమూరుకు చెందిన అబ్దుల్ కలామ్ అలియాస్ మచ్చాలు ముఠాగా ఏర్పడి మోటార్ బైక్ల చోరీలకు చేయటం మొదలు పెట్టినట్లు చెప్పారు. మీరి ముగ్గురిపై పట్టణ పోలీస్స్టేషన్లో 11 , కర్నూల్ –2 టౌన్లో 2, కర్నూల్ తాలూకా స్టేషన్లో 1, సి. బెళగల్ స్టేషన్లో 1, కర్నాటక రాష్ట్రం బళ్లారి గాంధీనగర్ పోలీస్స్టేషన్లో 1 చొప్పున కేసులు ఉన్నాయన్నారు. ఏ1 నిందితుడు ఉప్పర వీరేష్ పట్టణంలోని మంత్రాలయం రోడ్డ్ ఉప్పర కాలనీ కొట్టాల దగ్గర అనుమాన్పదంగా సంచరిస్తున్నట్లు సమాచారం రావటంతో వెళ్లి పట్టుకొన్నట్లు చెప్పారు. విచారణలో మోటార్ బైక్లను దొంగతనం చేసినట్లు అంగీకరించటంతో అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు. బైక్ల కేసులో ఇప్పటికే కోడుమూరుకు చెందిన అబ్దుల్కలాం అలియాస్ మచ్చా కర్నూల్ తాలూకా పోలీస్స్టేషన్లో ఉన్నాడని, మరో నిందితుడు సి. బెళగల్ వర్థన్ అలియాస్ ఇక్బాల్ పరారీలో ఉన్నట్లు చెప్పారు. పట్టబడిన 16 మోటార్ బైక్ల విలువ రూ. 16.50 లక్షలు ఉంటుందని తెలిపారు. -
వక్ఫ్ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి
● రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు కర్నూలు(సెంట్రల్): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని ముస్లింపర్సనల్ లా బోర్డు రాష్ట్ర కన్వీనర్ రఫిక్ అహ్మద్ డిమాండ్ చేశారు. బుధవారం వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ ఏక్యాంపులోని ఎంఎంఐ షాదీఖానాలో సయ్యద్ జాకీర్ మౌలానా రషీద్ అధ్యక్షతన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కేవీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఆనంద్బాబు, న్యాయవాది సుబ్బయ్య, అవాజ్ కమిటీ కార్యదర్శి ఎస్ఎండీ షరీఫ్, మైనార్టీ నాయకుడు షేక్ హఫీజ్, ఇలియాజ్, సమాచారహక్కు నాయకులు జయన్న, ఎమ్మార్పీఎస్ నాయకుడు కిరణ్, కాంగ్రెస్ మీడియా ఇన్చార్జ్ అమానుఉల్లా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రఫిక్ అహ్మద్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం ముస్లింలపై వివక్ష చూపుతోందని, అందులో భాగంగానే వక్ఫ్ సవరణ చట్టాన్ని తెచ్చారని ఆరోపించారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 25 మానవహారం, 27న ఎస్టీబీసీ కళాశాలలో బహిరంగ సభ నిర్వహిస్తామని, జూన్ 3న మహిళలతో సమావేశం ఉంటుందని తెలిపారు. -
ముందే వచ్చిన వర్షాకాలం!
● జిల్లాలో కొనసాగుతున్న వర్షాలు ● గూడూరులో 49.2 మిమీ వర్షపాతం నమోదు ● తగ్గిన ఉష్ణోగ్రతలు కర్నూలు(అగ్రికల్చర్): ఈ సారి వానాకాలం ముందే వచ్చినట్లుంది. కొద్ది రోజులుగా జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు హాలహర్వి, ఆస్పరి, దేవనకొండ, చిప్పగిరి, తుగ్గలి మండలాలు మినహా మిగిలిన అన్ని మండలాల్లో వర్షాలు కురిశాయి. గూడూరులో అత్యధికంగా 49.2 మి.మీ వర్షపాతం నమోదైంది. కోడుమూరులో 47.6, కల్లూరులో 38.8, హొళగుందలో 19.4, గోనెగండ్లలో 16.4, సీ.బెళగల్లో 13.4, కౌతాళంలో 12.6, ఓర్వకల్లులో 12.4 మి.మీ ప్రకారం వర్షాలు కురిశాయి. జిల్లా మొత్తం మీద సగటున 11 మి.మీ వర్షపాతం నమోదైంది. మే నెలకు సంబంధించి 21వ తేదీ వరకు సాధారణ వర్షపాతం 27.2 మి.మీ ఉండగా... 77.9 మి.మీ వర్షపాతం నమోదైంది. హంద్రీకి ఒక మోస్తరుగా నీరు వచ్చింది. కొద్ది రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతుండటంతో ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. గరిష్టంగా 36 డిగ్రీల వరకు మాత్రమే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల రానున్న రెండు, మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. 17 వేల క్యూసెక్కుల వరదనీరు సి.బెళగల్: కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర నదిలో దాదాపు 17 వేల క్యూసెక్కుల వరదనీరు ప్రవహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నది పూర్తి స్థాయిలో రెండు దడులను తాకుతూ వరదనీరు ప్రవహిస్తుండటంతో నదికి జలకళ సంతరించుకుంది. కాగా మండల పరిధిలోని తుంగభద్ర తీర ప్రాంత గ్రామాల్లో రైతులు ముందస్తు పంటలు సాగు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఆర్డీఎస్ జళకళ కోసిగి: మండలంలోని కందుకూరు గ్రామ సమీపంలో రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) ఆనకట్టపై తుంగభద్ర నది జళకళ సంతరించుకుంది. మండలంతో పాటు నదితీర పై ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వర్షపు నీరు నదికి చేరుకున్నాయి. దీంతో ఆర్డీఎస్ ఆనకట్టపై రెండు అడుగుల మేర ఎత్తులో ఎక్కి దిగువ ప్రాంతం కర్నూలు వైపు ప్రవహిస్తోంది. ముందస్తు వర్షాలు కురిసి నది పుష్కలంగా ప్రవహించడంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
నాటుసారా స్వాధీనం
కర్నూలు: ఎకై ్సజ్ అధికారులు 55 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ చంద్రహాస్ తన సిబ్బందితో కాల్వ గ్రామ సమీపంలో బుధవారం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా గుడుంబాయి తండాకు చెందిన మాలవత్ ధను నాయక్ ద్విచక్ర వాహనంపై 40 లీటర్ల సారా తీసుకెళ్తూ ఎకై ్సజ్ అధికారులను చూసి బైక్, 40 లీటర్ల సారాను వదిలేసి పారిపోయారు. సారాతోపాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుని కర్నూలు ఎకై ్సజ్ స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి ధను నాయక్ కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు. గుమ్మితం తండాలో నాటుసారా బట్టీలపై దాడులు జరిపి వార్తే వీరాంజనేయ నాయక్ వద్ద 15 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని అతనిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి జైలుకు పంపారు. దాడుల్లో సబ్ఇన్స్పెక్టర్ నవీన్బాబు, కానిస్టేబుళ్లు మురహరిరాజు, మధు, రామలింగయ్య, ఈరన్న, చంద్రపాల్ తదితరులు పాల్గొన్నారు. -
వినిపిస్తుందో లేదో మిషన్ నిర్ధారిస్తుంది
కర్నూలు(హాస్పిటల్): పుట్టుకతో చెవుడు...మూగ సమస్యతో బాధపడుతుంటారు కొందరు. ఇలాంటి వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడియోమెట్రి పరీక్షలు నిర్వహించి వినికిడి సామర్థ్యాన్ని నిర్ధారిస్తారు. ఇప్పటివరకు ఈ యంత్రాన్ని అమరిస్తే వినిపిస్తుందా లేదా అని రోగి సంజ్ఞలు చేస్తే దానిని బట్టి నివేదికలు ఇచ్చేవారు. దీనిని ఆసరగా చేసుకుని కొందరు ఎలాంటి సమస్య లేకపోయినా ఉన్నట్లు నటించి వికలాంగ సర్టిఫికెట్లు పొంది ప్రభుత్వ పథకాలు అందుకుంటున్నారు. ఇలాంటి వాటిని చెక్పెట్టేందుకు ఇప్పుడు బేరా పరీక్ష అందుబాటులోకి వచ్చింది. బుధవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఈఎన్టీ విభాగం ఓపీ వద్ద ఏర్పాటు చేసిన బేరా పరీక్ష కేంద్రాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈఎన్టీ హెచ్వోడి డాక్టర్ వీరకుమార్ మాట్లాడుతూ బేరా పరీక్ష ద్వారా రోగికి వినిపిస్తుందా లేదా అన్నది మిషనే నిర్ధారిస్తుందన్నారు. సదరం సర్టిఫికెట్లతో పాటు వినికిడి లోపం, శ్రవణ నాడీ రుగ్మతలు, వినికిడిని ప్రభావితం చేసే నాడీ సంబంధిత పరిస్థితులను నిర్ధారించడంలో ఈ బేరా టెస్ట్ మిషన్ సహాయపడుతుందన్నారు. కార్యక్రమంలో సీఎస్ఆర్ఎంవో డాక్టర్ బి.వెంకటేశ్వరరావు, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ సింధు సుబ్రహ్మణ్యం, డాక్టర్ శివబాలనాగాంజన్, ఈఎన్టి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ హరికృష్ణ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ చిన్న లింగన్న, డాక్టర్ మమతాదేవి తదితరులు పాల్గొన్నారు. -
వర్షానికి కూలిన బ్రిడ్జి
కల్లూరు: మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలోని గంజివాగు బ్రిడ్జి కూలిపోయింది. మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతోపాటు మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లక్ష్మిపురం గ్రామంలోని గంజివాగుపై ఉన్న బ్రిడ్జి కూలిపోవడంతో రైతులకు రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. అధికారులు స్పందించి బ్రిడ్జి మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కాగా మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు గ్రామంలో పర్యటించారు. గంజివాగుపై కూలిన బ్రిడ్జితోపాటు గ్రామంలోని కమ్యూనిటీ హాల్ను పరిశీలించారు. -
శ్రీశైలంలో తొట్టెల నిర్మాణం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలోని పైకప్పుల నుంచి లీకేజీ అరికట్టేందుకు దేవస్థానం చర్యలకు ఉపక్రమించింది. ఇందుకోసం సున్నపు, జాజికాయ, బెల్లం తదితర వస్తువుల మిశ్రమాన్ని కలుపుకునేందుకు ఆలయంలో పలు ప్రదేశాలలో తొట్టెల నిర్మాణం చేపడుతున్నారు. పూణేలోని ఉత్తరాదేవి చారిటబుల్ట్రస్ట్ వారితో పురాతన పరిరక్షణ పద్ధతులను అనుసరించి ఆలయంలో పైకప్పుల నుంచి లీకేజీని అరికట్టే పనులు చేపడుతున్నారు. దేవాలయాల ప్రాంగణంలో పరిరక్షణ పనులు చేపట్టడం శుభపరిణామమని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ ఆర్.చంద్రశేఖరరెడ్డి తెలిపారు. గతంలో (1965–70, 2013–14 సంవత్సరాల్లో) శ్రీశైల ఆలయంలో స్థానభ్రంశం చెందిన నిర్మాణాలను యథాతధం చేసిన తరువాత పరిరక్షణ పనులు చేపట్టాలని కోరారు. -
నేరాల నియంత్రణకు గ్రామాల్లో సీసీ కెమెరాలు
తుగ్గలి/మద్దికెర: నేరాల నియంత్రణకు గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసులను ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. జొన్నగిరి, తుగ్గలి, మద్దికెర పోలీస్ స్టేషన్లను బుధవారం సాయంత్రం తనిఖీ చేశారు. స్టేషన్ల పరిధిలోని పెండింగ్ కేసులపై ఆరా తీశారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారి పట్ల కఠినంగా వ్యహరించాలని ఆదేశించారు. తరచూ నేరాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ వెంకటరామయ్య, రూరల్ సీఐ పులిశేఖర్, ఎస్ఐలు మల్లికార్జున, కృష్ణమూర్తి, విజయ్కుమార్నాయక్, సిబ్బంది ఉన్నారు.వైద్య మందులపై తప్పుడు ప్రకటనలు ఇస్తే చర్యలు ● ఔషధ నియంత్రణ శాఖ ఏడీ రమాదేవి కర్నూలు(హాస్పిటల్): ప్రజలను తప్పుదోవ పట్టించేలా వైద్య మందుల వినియోగంపై ప్రకటనలు ఇస్తే చర్యలు తీసుకుంటామని ఔషధ నియంత్రణ శాఖ ఏడీ రమాదేవి హెచ్చరించారు. బుధవారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ అధిక బరువు తగ్గిస్తామని, పలు రకాల వ్యాధులు నయం చేస్తామని సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చిన పలు సంస్థలపై ఇటీవల కేసులు నమోదు చేశామన్నారు. అందులో ఇండోర్కు చెందిన ఈమాన్ డ్రగ్స్, నందికొట్కూరుకు చెందిన వెంకటేశ్వరరెడ్డి, బనగానపల్లి మండలం బానుముక్కల గ్రామంలోని పక్షవాత నివారణ కేంద్రాలపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. కర్నూలు నగరంలోని గణేష్నగర్ సమీపంలోని పార్థగ్రాండ్లో ఫిజీషియన్ శాంపిల్స్ అక్రమంగా నిల్వ ఉంచుకున్న ఉదయ్కుమార్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశామన్నారు. ఇతనిపై ఇప్పటికే పలుమార్లు కేసులు ఉన్నట్లు తెలిపారు. అలాగే నంద్యాలలో శ్రీ వైష్ణవి మెడికల్స్పై డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి మత్తును కలిగించే మందులను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశామన్నారు. దరఖాస్తుల ఆహ్వానం కర్నూలు(అర్బన్): సీ క్యాంప్లోని ప్రభుత్వ శారీరక వికలాంగుల వసతి గృహంలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయో వృద్దుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయిస్ఫాతిమా కోరారు. హాస్టల్లో 3వ తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇతర కోర్సులు చదివే విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తామని పేర్కొన్నారు. నిబంధనల మేరకు వంద మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తామని ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు కార్యాలయ ఫోన్ నంబర్ 08518–277864ను సంప్రదించాలన్నారు. ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు ప్రారంభం కర్నూలు సిటీ: ఏపీ ఈఏపీ సెట్లో ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. కర్నూలులో ఏర్పాటు చేసిన తొమ్మిది కేంద్రాల్లో మొదటి రోజున ఉదయం 1,247 మందికి గాను 1,177 మంది, మధ్యాహ్న సెషన్లో 1,255 మందికి గాను 1,182 మంది హాజరయ్యారు. నంద్యాలలోని మూడు కేంద్రాల్లో మొదటి రోజు ఉదయం 544 మందికి గానూ 520 మంది, మధ్యాహ్నం 543 మందికి గానూ 523 మంది హాజరయ్యారు. ఈ నెల 27వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. తవ్వారు.. వదిలేశారు! ఆదోని అర్బన్: పట్టణంలోని బసాపురం రోడ్డు మార్కెట్యార్డు సమీపంలో చిన్న వర్షానికి పెద్దదిగా గుంత మారి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులకు గురవుతోంది. గత నెలలో ఈ రోడ్డులో పైపులైన్ లీకేజీ అయ్యి గుంత తవ్వారు. ఆ గుంతను అసంపూర్తిగా పూడ్చారు. దీంతో ఆ రోడ్డులో మార్కెట్యార్డు, పత్తి పరిశ్రమలకు వెళ్లేవారు ఇబ్బంది పడుతున్నారు. రెండు రోజుల లారీ గుంతలో ఇరుక్కుపోవడంతో ప్రొక్లెయిన్ను తీసుకొచ్చి బయటకు తీశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
ప్రగతి.. వెనుక‘బడి’
ఆదోని సెంట్రల్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పాఠశాలల్లో పనులు ఆగిపోయాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చేపట్టిన నాడు–నేడు పనులు చివరి దశలో ఉన్నా పూర్తి చేయలేకపోయారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ఉండాలనే లక్ష్యంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దారు. అదనపు తరగతి గదుల నిర్మాణాలకు నిధులు ఇచ్చారు. అ యితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక అదనపు తరగతి గదులను పనులు పూర్తి చేయలేకపోయింది. వైఎస్సార్సీపీ హయాంలో ఇలా.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సర్కార్ స్కూళ్ల రూపు రేఖలు మారిపోయాయి. విద్యార్థులు నేలపైన సాగే చదువులకు స్వస్తి పలికారు. డిజిటల్ బాటలో చదివే బాట పట్టారు. ఆదోని నియోజకవర్గంలో ప్రభుత్వ, ఎయిడెడ్, పురపాలక గురుకుల పాఠశాలలు మొత్తం 130 ఉన్నాయి. అయా పాఠశాలల్లో 30,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. నాడు– నేడులో భాగంగా గత ప్రభుత్వం విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అదనపు తరగతి గదుల నిర్మాణాల పనులను చేపట్టింది. ఒక్కోక్క గది నిర్మాణానికి రూ.12 లక్షలు చొప్పున 38 పాఠశాలల్లో 162 అదనపు తరగతి గదులను నిర్మాణం చేపట్టేందుకు చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వంలో పరుగులు పెట్టిన పనులు కూటమి ప్రభుత్వం వచ్చాక అర్ధాంతరంగా నిలచిపోయాయి. దీంతో ఏమి చేయాలో తెలియక అయా పాఠశాల ఉపాధ్యాయులు ఉన్న తరగతి గదులల్లోనే విద్యార్థులను కూర్చోబెట్టి విద్యను అందిస్తున్నారు. కొన్ని చోట్ల వరండాలోనూ, చెట్ల కింద విద్యార్థులు చదువుకోవాల్సి వస్తోంది. ఇదీ దుస్థితి ● ఆదోని పట్టణంలోని అర్అర్ లేబర్ కాలనీలో పురపాలక ఉన్నత పాఠశాల, నెహ్రూ మోమోరియల్ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదులు నిర్మిస్తున్నారు. చిన్న పనులు పెండింగ్లో ఉన్నాయి. ● కల్లుబావిలోని ప్రాథమిక పాఠశాల, డణాపురంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, విరుపాపురం, పెద్దహరివాణం, పెద్దతుంబళం, అరెకల్లు వంటి పలు పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణాలు అసంపూర్తిగానే ఉన్నాయి. ● ఆదోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. ● కిటికీలు, తలుపులు, ప్లాస్టరింగ్, ఎలక్ట్రికల్, ఫ్లోరింగ్ వంటి పనులను పూర్తి చేస్తే వినియోగంలోకి తీసుకురావచ్చు. ఒక్కపైసా కూడా ఇవ్వలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు గడుస్తున్న నాడు– నేడు అభివృద్ధి పనులకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఆదోని పట్టణంలోని అర్అర్ లెబర్ కాలనీ పురపాలక ఉన్నత పాఠశాలలో 960 మంది విద్యార్థులు ఉన్నారు. ఐదు గదులు ఉన్నాయి. నాలుగు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను చేపట్టారు. అలాగే నెహ్రుమోమోరియల్ ఉన్నత పాఠశాలలో రెండు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను చేపట్టారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గదులు పూర్తిగాక అసంపూర్తిగా ఉండడంతో అయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులే కొంత డబ్బులు వెచ్చించి తరగతి గదులు కీటికీలు, తలుపులు ఫ్లోరింగ్ వంటి పనులను చేపట్టి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు. నిధుల కోసం ఇండెంట్ పెట్టాం అదనపు తరగతి గదుల పనులు మధ్యలో ఆగిపోయాయి. చిన్న చిన్న పనులు పెండింగ్లో ఉన్నాయి. గదుల నిర్మాణాలపై అధికారులకు ఇండెంట్ పెట్టాం. ఒక వేళ ప్రభుత్వం నిధులను విడుల చేస్తే పనులను ప్రారంభించేందుకు చర్యలు చేపడుతాం. – శ్రీనివాసులు మండల విద్యాధికారి–2 ఆదోని అసంపూర్తిగా తరగతి గదుల నిర్మాణాలు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు తప్పని తిప్పలు పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం -
ప్రభుత్వ తీరు దారుణం
కర్నూలు(సెంట్రల్): పేదలకు ఇంటివద్దనే రేషన్ సరుకులు అందిస్తూ.. నిరుద్యోగులకు ఉపాధి అందిస్తూ ఉపయుక్తంగా ఉన్న ఎండీయూ వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం దారుణమని ఆపరేటర్లు, హెల్పర్లు అన్నారు. కేవలం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఉన్న కోపంతో తమ కడుపులు కొడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. బుధవారం కలెక్టరేట్ ఎదుట ఎండీయూ ఆపరేటర్లు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. తమకు జీవనాధారమైన ఎండీయూ వాహనాలను కొనసాగించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎండీయూ ఆపరేటర్లు అక్బర్వలి, కేశవ్, మహ్మద్రఫీ, వీరేష్, శీను, మద్దిలేటి మాట్లాడుతూ.. రేషన్ సరుకుల డెలివరీ కోసం ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం మేరకు 2027 జనవరి వరకు ఎండీయూ వాహనాలను కొనసాగించాలన్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నెలకు రూ.21 వేలు ఇచ్చేదని, ఇందులో రూ.3 వేలు బండి ఈఎంఐ పోను మిగిలిన రూ. 18 వేలలో రూ. 5 వేలు హెల్పర్కు, మరో రూ.3 వేలు పెట్రోలు, ఇతర నిర్వహణ చార్జీలకు ఖర్చు అయి రూ.10 వేలు మిగిలేదన్నారు. దానితో తాము ఉపాధి పొంది కుటుంబాలను పోషించుకునే వారమని తెలిపారు. వాటిని రద్దు చేస్తే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. తమతో ప్రభుత్వం చేసుకున్న గడువు వరకు కొనసాగించాలని, ఆ తర్వాత ఇతర ప్రభుత్వ శాఖల్లో తమకు ఉపాధిని చూపాలన్నారు. తమ డిమాండ్లను పట్టించుకోకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామన్నారు. కలెక్టరేట్ ఎదుట ఎండీయూ ఆపరేటర్ల ధర్నా -
ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెండు, మూడేళ్ల క్రితం కావేరి–జాదు రకం బీటీ పత్తి విత్తనాలు రైతులను నిండా ముంచేశాయి. 17 మండలాల్లో దాదాపు 2,400 ఎకరాల్లో పత్తి దెబ్బతినగా.. 1,899 మంది రైతులు నష్టపోయారు. ఎకరాకు 3 క్వింటాళ్ల వరకు నష్టం జరిగిందని, క్వింటాకు రూ.7,300 ప్
బీటీ పత్తి విత్తనాలకు సొంత ధ్రువీకరణ ● కంపెనీల తీరుపై వ్యవసాయ శాఖ మీనమేషాలు ● కో–మార్కెటింగ్ పేరిట బీటీ పత్తి విత్తన వ్యాపారం ● సిస్టర్ కన్సల్టెన్సీ, సబ్ డీలర్ల పేరుతో దందా ● తరచూ విత్తనం కారణంగా దెబ్బతింటున్న పంట ● గతంలో నిండా ముంచిన ‘కావేరి–జాదు’ ● బీటీ–2 పత్తి విత్తన ప్యాకెట్లు బ్లాక్ విక్రయాలుకర్నూలు(అగ్రికల్చర్): ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రాష్ట్రం మొత్తం మీద పత్తి 5,28,361 హెక్టార్లలో సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా. ఇందులో ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే దాదాపు 50 శాతం వరకు సాగవుతోంది. కర్నూలు జిల్లాలో 2,34,409 హెక్టార్లు, నంద్యాల జిల్లాలో 18,827 హెక్టార్లలో పత్తి సాగయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నల్లరేగడి నేలలు ఎక్కువగా ఉండటం వల్ల దశాబ్దాలుగా పత్తి రైతుల పాలిట తెల్ల బంగారం అవుతోంది. ఇక్కడ హైబ్రిడ్ పత్తి, బీటీ పత్తి విత్తనోత్పత్తి కూడా ఎక్కువగా ఉంటోంది. విత్తన కంపెనీల దృష్టి కూడా ఉమ్మడి కర్నూలు జిల్లాపైనే ఉండటం గమానార్హం. రాష్ట్రం మొత్తం మీద జరిగే మార్కెటింగ్ ఒక ఎత్తు అయితే, ఇక్కడి మార్కెటింగ్ మరో ఎత్తు. జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో పత్తి సాగుకు విత్తనాలు సిద్ధం చేసుకునే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా ఇక్కడ కో–మార్కెటింగ్, సిస్టర్ కన్సల్టెన్సీ, సబ్ డీలర్స్.. ఇలా రకరకాల పేర్లతో పత్తి విత్తన ప్యాకెట్లను అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏది ఒరిజినల్, ఏది నకిలీ తెలుసుకోవడం రైతులకు కష్టంగా మారింది. వాస్తవానికి కో–మార్కెటింగ్ అనేది లేదు. కానీ అనధికారికంగా సిస్టర్ కన్సల్టెన్సీ, సబ్ డీలర్స్ పేర్లతో రైతులను దగా చేస్తున్నా వ్యవసాయ శాఖ చేష్టలుడిగి చూస్తోంది. జిల్లాలో 250 కంపెనీలు దాదాపు 1000 దాకా బీటీ పత్తి విత్తన రకాలను మార్కెట్లోకి విడుదల చేయడం గమనార్హం. పంట దెబ్బతింటే దేవుడే దిక్కు! పత్తి విత్తన నాణ్యతపై వ్యవసాయ శాఖకు ఎలాంటి సంబంధం లేదు. ఆయా కంపెనీలే సొంతంగా ధ్రువీకరించుకుంటున్నాయి. ఈ కారణంగా పంట దెబ్బతింటే ఆయా కంపెనీలదే పూర్తి బాధ్యత. అయితే పంట దెబ్బతిన్న సమయంలో వాతావరణ పరిస్థితులను కారణంగా చూపుతూ కంపెనీలు చేతులు దులుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. పంట దెబ్బతిన్నప్పుడు పరిహారం ఇవ్వకుండా తప్పించుకునేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. 2024 ఖరీఫ్ సీజన్లో కూడా ఒక పేరొందిన కంపెనీ విత్తనంతో సాగు చేసిన పత్తి పలు చోట్ల దెబ్బతినింది. అయితే ఆ కంపెనీ వ్యవసాయ యంత్రాంగాన్ని ముడుపులతో లోబరుచుకొని ఇతర కారణాలతో పంట దెబ్బతిన్నట్లు రిపోర్టు ఇవ్వడం గమనార్హం. బ్లాక్లో పత్తి విత్తనాలు ఈ సారి పత్తి సాగు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. వర్షాలు పడుతున్నందున ఈ నెల చివరి వారం నుంచే పత్తి విత్తనాలు నాటుకునేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో వందల కంపెనీలు, రకాలు మార్కెట్ను ముంచెత్తుతున్నా.. వీటికి అనుమతులు ఉన్నాయా, లేదా అని వ్యవసాయశాఖ పటించుకున్న పాపాన పోవడంలేదు. ప్రధానంగా రెండు కంపెనీల బీటీ పత్తి విత్తన ప్యాకెట్లను బ్లాక్లో అమ్మకాలు సాగిస్తున్నారు. జిల్లాలోకి ఒకవైపు తెలంగాణ నుంచి, మరోవైపు కర్ణాటక నుంచి అనధికార పత్తి విత్తన ప్యాకెట్లు జిల్లాలోకి వెల్లువెత్తుతున్నాయి. పశ్చిమ ప్రాంతంలో పత్తి లూజు విత్తనాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఆదోని, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో నకిలీలు, అనుమతి లేని విత్తనాలను జోరుగా అమ్మకాలు సాగిస్తున్నా వ్యవసాయ శాఖ నుంచి స్పందన కరువైంది. హెచ్టీ పత్తి సాగు ప్రమాదకరం పత్తిలో హెచ్టీ విత్తనాలకు కేంద్రం ఇంతవరకు అనుమతి ఇవ్వలేదు. పత్తిలో కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. హెచ్టీ పత్తిలో కలుపు నివారణకు గ్లైపోసేట్ మందును పిచికారి చేస్తే కలుపు నాశనం అవుతుంది తప్ప.. పత్తి పంటకు ఏమీ కాదు. హెర్బిసైడ్ టాలరెంట్(హెచ్టీ) బీటీ పత్తి విత్తనాలు జీవవైవిధ్యానికి ప్రమాదకరమనే ఉద్దేశంతో కేంద్రం వీటికి అనుమతివ్వలేదు. అయినప్పటికీ కొంతమంది రైతులు హెచ్టీ పత్తి సాగు చేస్తున్నారు. ఇటీవల వ్యవసాయ శాఖ నుంచి వచ్చిన ప్రత్యేక టీమ్ వచ్చి హెచ్టీ పత్తి విత్తనాలను గుర్తించేందుకు తనిఖీలు జరిపి పరీక్షలు నిర్వహించారు. అయితే తూతూమంత్రంగా పరీక్షలు నిర్వహించారనే చర్చ జరుగుతోంది. బీటీ టెక్నాలజీని మ్యాన్శ్యాంటో కంపెనీ తెచ్చింది. బీటీ టెక్నాలజీని పొంది విత్తనోత్పత్తి, ప్యాకింగ్, మార్కెటింగ్ చేసుకోవాలంటే మ్యాన్శ్యాంటో నుంచి లైసెన్స్ తీసుకోవడం తప్పనిసరి. ఈ కంపెనీ నుంచి తెలుగు రాష్ట్రాల్లో 45 కంపెనీలకు లైసన్లు ఉండగా.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒకే ఒక్క కంపెనీకి మాత్రమే లైసన్స్ ఉంది. కో–మార్కెటింగ్ పేరుతో ఉమ్మడి జిల్లాలో 10 వరకు కంపెనీలు ఉండగా.. సిస్టర్ కన్సల్టెన్సీ, సబ్ డీలర్స్ పేరుతో వందలాది కంపెనీల బీటీ పత్తి విత్తన ప్యాకెట్ల మార్కెటింగ్లో నిమగ్నమయ్యాయి. 450 గ్రాముల బీటీ–2 పత్తి విత్తన ప్యాకెట్ ఎంఆర్పీ రూ.901. నూజివీడు కంపెనీ రేవంత్ రకం ప్యాకెట్లను రూ.1,300 పైబడిన ధరతో అమ్ముతున్నట్లు తెలుస్తోంది. యుఎస్ అగ్రీ కంపెనీకి చెందిన 7067 రకాన్ని రూ.1,200 వరకు బ్లాక్లో అమ్మకాలు సాగిస్తున్నట్లు సమాచారం. -
డీఈఓ ఆఫీస్ ముట్టడి వాయిదా
కర్నూలు సిటీ: ఉపాధ్యాయుల ఐక్య వేదిక బుధవారం చేపట్టనున్న డీఈఓ ఆఫీస్ ముట్టడి వాయిదా పడింది. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోనశశిధర్తో జరిగిన ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో ఆర్థికపరమైన అంశాలు కాకుండా ఇతర ప్రతిపాదనలకు విద్యాశాఖ ఉన్నతాధికారులు అంగీకరించినట్లు ఐక్య వేదిక నాయకులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో ముట్టడి నిర్ణయాన్ని వాయిదా వేశామన్నారు. ఐఐటీ/నీట్ అకాడమీ ప్రవేశాలకు 25న పరీక్ష కర్నూలు(అర్బన్): 2025–26 విద్యా సంవత్సరానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఐఐటీ/నీట్ అకాడమీల్లో ప్రవేశానికి రెండవ దశ పరీక్షకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ఐ.శ్రీదేవి తెలిపారు. మొదటి దశ ప్రవేశ పరీక్షకు హాజరైన అభ్యర్థుల్లో 1:3 నిష్పత్తిలో ఎంపిక చేసినట్లు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికై న అభ్యర్థులకు సమాచారం ఎస్ఎంఎస్ రూపంలో పంపించామన్నారు. చిన్నటేకూరు కేంద్రానికి కేటాయించిన అభ్యర్థులు తాజాగా డౌన్లోడ్ చేసుకున్న హాల్టికెట్ లేదా పాత హాల్టికెట్తో ఈ నెల 25న ఉదయం 11 గంటల్లోపు హాజరు కావాలన్నారు. వీరికి 50 మార్కులకు రాత పరీక్ష ఉంటుందని, పరీక్ష సమయం ఉదయం 11.30 నుంచి మధ్యా హ్నం 1 గంట వరకు నిర్వహిస్తామన్నారు. మరింత సమాచారం కోసం http://apbragcet.apcfss.in వెబ్సైట్ను సందర్శించాలని డీసీఓ కోరారు. మైనారిటీలకు సబ్సిడీ రుణాలు ● దరఖాస్తుకు ఈ నెల 25 ఆఖరు కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మైనారిటీ, క్రిష్టియన్ వర్గాల ప్రజలు సబ్సిడీ రుణాలకు ఈ నెల 25లోగా దరఖాస్తు చేసుకోవాలని మైనారిటీ కార్పొరేషన్ ఈడీ ఎస్.సబీహా పర్వీన్ తెలిపారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ మైనారిటీ వర్గాలకు చెందిన వారికి రూ. లక్ష నుంచి రూ.8 లక్షల వరకు, క్రిస్టియన్ మైనారిటీలకు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు రుణాలను అందిస్తామన్నారు. దరఖాస్తు చేసుకొని ఎంపికై న వారికి 50 శాతం సబ్సిడీ మంజూరవుతుందన్నారు. అర్హులు తమ వివరాలను ( https://apobmms.apcfss.in) వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు ఈడీ, మైనారిటీ కార్పొరేషన్ కార్యాలయంలో, లేదా 9848864449, 9440822219 నెంబర్లలో సంప్రదించవచ్చన్నారు. కేజీబీవీల్లో మూడు విడతల్లో సీట్ల కేటాయింపు కర్నూలు సిటీ: జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో 6, 7, 8, 9, 11 తరగతుల్లో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు మూడు విడతల్లో సీట్లు కేటాయించినట్లు డీఈఓ, సమగ్ర శిక్ష అదనపు కో–ఆర్డినేటర్ ఎస్.శామ్యూల్ పాల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీట్లు పొందిన విద్యార్థుల నుంచి ఆయా కేజీబీవీల ప్రిన్సిపాళ్లు సర్టిఫికెట్లు తెప్పించుకుని నిర్ధారించుకున్నారన్నారు. 6నుంచి 9వ తరగతి వరకు అన్ని సీట్లు భర్తీ అయ్యాయన్నారు. ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ బైపీసీ గ్రూప్లో 73 సీట్లు, ఎంపీసీలో 191 సీట్లు, ఎంఈసీలో 18 సీట్లు, ఒకేషనల్ గ్రూప్లో 79 సీట్లు ఖాళీ ఉన్నట్లు డీఈఓ వెల్లడించారు. గోరుకల్లు కట్ట పనులకు ప్రణాళిక రూపొందించండి పాణ్యం: గోరుకల్లు కట్ట కుంగిన ప్రదేశంలో త్వరగా పనులు చేసేందుకు ప్రణాళికలు రూ పొందించాలని ఎస్సార్బీసీ ఎస్ఈ పునర్ధనరెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయన గోరుకల్లు కట్ట కుంగిన ప్రదేశాన్ని పరిశీలించి మాట్లాడారు. ఇటీవల ఎక్స్ఫర్ట్ కమిటీ సభ్యు లు గోరుకల్లును సందర్శించారని చెప్పారు. జలాశయంలో 3.5 టీఎంసీల నీరు ఉండడంతో పనులు చేసేందుకు వీలుపడదన్నారు. నీటి నిల్వను తగ్గించడంపై ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావాల్సి ఉందన్నారు. రివిట్మెంట్ పనులు పూర్తి చేస్తేనే గోరుకల్లు రిజర్వాయర్లో వరదనీటిని నిల్వ చేసేందుకు వీలుంటుందన్నారు. కార్యక్రమంలో ఈఈ సుభకుమార్, డీఈఈలు జ్యోతి, గీతారాణి, శివప్రసాద్, ఏఈఈలు పాల్గొన్నారు. -
చిరుద్యోగుల ఆకలి కేకలు పట్టించుకోని ప్రభుత్వం
కర్నూలు(సెంట్రల్): నాలుగు నెలలుగా వేతనాలు అందక కుటుంబాలతో పస్తులు ఉంటున్నామని తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహన డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. నగరంలోని ధర్నా చౌక్లో ఆంధ్రప్రదేశ్ తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జల్లా అధ్యక్షుడు రంగస్వామి అఽధ్యక్షతన చేపట్టిన దీక్షను సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పీఎస్ రాధాకృష్ణ, సీఐటీయూ న్యూసిటీ కార్యదర్శి సీహెచ్ సాయిబాబా, ఆల్ ఇండియా రోడ్డు ట్రాన్స్పోర్టు వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్ ప్రారంభించారు. అంతకముందు డ్రైవర్లు తమ సమస్యలను పరిష్కరించాలని కోరు తూ కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా వచ్చి నిరాహార దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చిరుద్యోగుల ఆకలి కేకలను విస్మరిస్తోందన్నారు. తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్లకు కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలన్నారు. 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని, ప్రభుత్వ సెలవులను కూడా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి నరేష్, ఉపాధ్యక్షులు పవన్కుమార్, కిరణ్, సురేష్, చిరంజీవి, కోశాధికారి నరేంద్రరెడ్డి పాల్గొన్నారు. 396 మంది గైర్హాజరు కర్నూలు సిటీ: పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షలు కొనసాగుతున్నాయి. మంగళవారం జరిగిన పరీక్షలకు రెగ్యులర్ టెన్త్కు 603 మంది విద్యార్థులకుగాను 207 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. 396 మంది గైర్హాజరయ్యారు. ఓపెన్ టెన్త్ పరీక్షకు 280 మందికిగాను 258 మంది హాజరుకాగా 22 మంది గైర్హాజరయ్యారు. అలాగే ఓపెన్ ఇంటర్మీడియెట్ పరీక్షలకు 152 మందికిగాను 127 మంది హాజరుకాగా 25 మంది గైర్హాజరైనట్లు డీఈఓ కె.శామ్యూల్ తెలిపారు. -
రేషన్ బండ్ల తొలగింపునకు ప్రభుత్వ నిర్ణయం
● జీవనోపాధి కోల్పోనున్న 409 మంది ఆపరేటర్లు, 409 మంది హెల్పర్లు ● మళ్లీ రేషన్ దుకాణాలకుక్యూ కట్టాల్సిన పరిస్థితి కర్నూలు(సెంట్రల్): గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పేదలకు నిత్యావసరాలను డోర్ డెలివరీ చేయాలని ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఎండీయూ వాహనాలకు కూటమి సర్కార్ మంగళం పాడింది. జూన్ 1వ తేదీ నుంచి రేషన్ షాపుల్లోనే బియ్యం, ఇతర నిత్యావసరాలను ఇవ్వాలని మంత్రుల సబ్ కమిటీ నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంతో ఇకపై ప్రజలే రేషన్ షాపులను వెతుక్కుంటూ కిలోమీటర్ల దూరం వెళ్లక తప్పని పరిస్థితి. ప్రభుత్వ నిర్ణయంపై ప్రజలతో పాటు ఎండీయూ వాహనాల ఆపరేటర్లు, హెల్పర్లు భగ్గుమంటున్నారు. మళ్లీ రేషన్ దుకాణాల వద్ద పడిగాపులే.. కర్నూలు జిల్లాలో 6,34,631 రేషన్ కార్డులు ఉన్నాయి. ఆయా కార్డుల్లో 12.65 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో పేద, మధ్యతరగతి ప్రజలే అధికం. 2021 ఏప్రిల్ ఒకటో తేదీకి ముందు వరకు రేషన్ షాపుల ద్వారా ప్రజలు సరుకులను పొందేవారు. అయితే కొన్ని గ్రామాల్లో షాపులు లేకపోవడం, పట్టణాల్లో కిలోమీటర్ల దూరంలో రేషన్ చౌకధరల దుకాణాలు ఉండడంతో సరుకుల కోసం ఇబ్బంది పడాల్సి వచ్చేది. అంతేకాక గంటల కొద్దీ వేచి చూడక తప్పని పరిస్థితి. డీలర్లు ఎప్పుడు వస్తే అప్పుడు సరుకులను తీసుకోవాల్చి ఉండేది. తూకాల్లో మోసం చేయడం, నిలదీస్తే అసలు బియ్యమే వేయని ఘటనలు కోకొల్లలు. ఈక్రమంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదల ఇళ్లకు డెలివరీ ద్వారా నిత్యావసరాలను సరఫరా చేయాలని నిర్ణయించారు. ఎండీయూ వాహనాల ద్వారా ఇంటికే సరుకులను అందించేలా చర్యలు తీసుకున్నారు. ఎంతో సౌకర్యంగా, వ్యయప్రాయాసలు తగ్గడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. అయితే గత ప్రభుత్వ నిర్ణయాలను అక్కసుతో వ్యతిరేకిస్తున్న కూటమి ప్రభుత్వం తాజాగా ఎండీయూ వాహనాలను అర్ధాంతరంగా తొలగించింది. మళ్లీ రేషన్ దుకాణాల ద్వారానే నిత్యావసరాలను సరఫరా చేయాలని నిర్ణయించడం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. రోడ్డున పడిన ఎండీయూ ఆపరేటర్లు, హెల్పర్లు కర్నూలు జిల్లాలో 409 ఎండీయూ వాహనాలు ఉన్నా యి. ప్రతి వాహనానికి ఒక ఆపరేటర్, ఒక హెల్పర్ ఉంటారు. వీరికి వాహనం నడిపేందుకు అవసరమైన ఖర్చుల కోసం ప్రతి నెలా ప్రభుత్వం రూ.21 వేలు చెల్లిస్తుంది. ఇందులో రూ.3వేలు వాహనం కంతు, రూ.3వేలు పెట్రోలు, రూ.5వేలు హెల్పర్కు ఇస్తారు. మిగిలిన రూ.10 వేలు ఆపరేటర్ వేతనంగా జమ చేసుకుంటారు. ఈక్రమంలో ఎండీయూ వాహనాలను రద్దు చేయడంతో ఆపరేటర్లు, హెల్పర్లు రోడ్డున పడాల్సి వస్తోంది. వారి నోటి కాడి కూడును ప్రభుత్వం లాగేస్తోంది. కర్నూలు నగరంలో ఎండీయూ వాహనం ద్వారా రేషన్ సరుకులు తీసుకుంటున్న ప్రజలు (ఫైల్) ఉపాధి కోల్పోతాం నేను నాలుగేళ్ల నుంచి ఎండీయూ వాహనాన్ని నడుపుకుంటూ జీవనం సాగిస్తు న్నా. ఈ.తాండ్రపాడు, గొందిపర్ల ప్రజలకు ప్రతి నెలా 1–16 మధ్య బియ్యం, ఇతర సరుకులను పేదలకు వారి ఇళ్ల వద్దకే వెళ్లి ఇస్తున్నాం. బండి ద్వారా నాకు, నా హెల్పర్కు జీవనోపాధి లభిస్తోంది. బండ్లను నిలిపివేస్తే ఉపాధిని కోల్పోయి రోడ్డున పడుతాం. – నవీన్రాజు, ఈ.తాండ్రపాడు, కర్నూలు రూరల్ మండలం మేము రోడ్డున పడతాం ఎండీయూ వాహనాల ద్వా రా ఉపాధిని పొందుతు న్నాం. పేదలకు రేషన్ సరు కులు ఇస్తుంటే సంతోషంగా ఉంటోంది. ఈ బండి ద్వారా నెలకు రూ.10వేల ఆదాయం వస్తుంది. అది లేకపోతే మేం రోడ్డున పడతాం. ప్రభుత్వం మరోసారి ఆలోచన చేయాలి. మా జీవితాలను రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదు. – సురేంద్రబాబు, బళ్లారి చౌరస్తా ఏరియా, కర్నూలు -
21 నుంచి యోగాంధ్ర మాసోత్సవం
కర్నూలు(సెంట్రల్): జూన్ 21న అంతర్జాతీయయోగా దినోత్సవం సందర్భంగా ఈనెల 21 నుంచి యోగాంధ్ర మాసోత్సవాన్ని నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకల నిర్వహణపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూన్ 21న జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ప్రజలు యోగాలో పాల్గొందుకు అవసరమైన, అనువైన స్థలాన్ని గుర్తించాలని మునిసిపల్ కమిషనర్ రవీంద్రబాబు, అడిషినల్ ఎస్పీ హుస్సేన్ పీరాలను ఆదేశించారు. యోగాకు సంబంధించిన పాటలు, పెయింటింగ్, వ్యాసరచన పోటీలను పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీల్లో నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని డీఈఓ శామ్యూల్పాల్, ఇంటర్మిడియట్ అధికారి(ఆర్ఐఓ) గురువయ్య శెట్టి, సెట్కూరు సీఈఓ వేణుగోపాల్ను ఆదేశించారు. ప్రజలందరూ యోగాలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని, వివరాలను రిజిస్ట్రేషన్ చేయించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, డీఎంహెచ్ఓ డాక్టర్ శాంతి కళ, డీఆర్డీఏ, మెప్మా పీడీలు రమణారెడ్డి, నాగశివలీల పాల్గొన్నారు. -
అరకొరగా విత్తన కేటాయింపులు
విత్తన పంపిణీలో అంతులేని నిర్లక్ష్యం ● వర్షాలు కురుస్తున్నా స్పందించని ప్రభుత్వం ● బకాయిలు చెల్లిస్తేనే విత్తన సరఫరా అంటున్న కంపెనీలు ● ఇప్పటి వరకు మొదలుకాని ప్రాసెసింగ్ ప్రక్రియ ● గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మే 15 నుంచే పంపిణీ ● ఇప్పుడు అరకొర కేటాయింపులతో సరి ● వర్షాలు కురుస్తుండటంతో దిక్కుతోచని రైతులు కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్ మంచుకొస్తోంది. వర్షాలు ఆశాజనకంగా కురుస్తున్నాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ విత్తనం అందుబాటులో లేకపోవడం రైతుల పాలిట శాపంగా మారుతోంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఐదేళ్లు మే నెల 15 నుంచే విత్తన పంపిణీ జరిగింది. వర్షాలు పడిన వెంటనే విత్తనాల కోసం ఎదురు చూడకుండా సకాలంలో విత్తుకునే అవకాశాన్ని కల్పించింది. 2024 ఖరీఫ్ సీజన్ సమయంలో కూడా అప్పటి ప్రభుత్వం ముందస్తు చర్యల వల్ల సకాలంలో విత్తన పంపిణీ సాధ్యమైంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పూర్తి స్థాయిలో విత్తన పంపిణీపై దృష్టి సారించని పరిస్థితి. సబ్సిడీ పంపిణీలో వేరుశనగ, పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలు ప్రధానమైనవి. ఈ విత్తనాల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది. వేరుశనగ సరఫరాకు కూటమి ప్రభుత్వం టెండర్లు పిలిచి రేట్లు ఖరారు చేసినప్పటికీ సంబంధిత కంపెనీలు విత్తన సరఫరాకు సిద్ధంగా లేవని తెలుస్తోంది. ఇంతవరకు ప్రాసెసింగ్ ప్రక్రియనే మొదలు పెట్టలేదంటే పంపిణీ ఎలా సాధ్యమనే ప్రశ్న తలెత్తుతోంది. దీంతో రైతులు వేరుశనగ విత్తనం కాయల కోసం వ్యాపారులను ఆశ్రయించక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2024–25 బకాయిలు చెల్లిస్తేనే విత్తన సరఫరా రాష్ట్రం మొత్తం మీద ఏపీ సీడ్స్కు విత్తనాలు సరఫరా చేసే కంపెనీలు 45 వరకు ఉన్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాకు 3 కంపెనీలు సరఫరా చేయాల్సి ఉంది. 2024–25 ఖరీఫ్ సీజన్లో వేరుశనగ, రబీ సమయంలో సరఫరా చేసిన శనగ(బెంగాల్గ్రామ్), ఇతర విత్తనాలకు ఏపీ సీడ్స్ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. సబ్సిడీ మొత్తం ప్రభుత్వం నుంచి ఏపీ సీడ్స్కు విడుదల కావాల్సి ఉంది. ప్రభుత్వం ఏపీసీడ్స్కు ఒక్క రూపాయి కూడా విదిల్చకపోవడం వల్ల సరఫరా చేసిన కంపెనీలకు నగదు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. బకాయిలు చెల్లిస్తేనే విత్తనాలు సరఫరా చేస్తామంటూ కంపెనీలు బీష్మించాయి. విత్తనాల కోసం రైతులకు తప్పని తిప్పలు ఖరీఫ్ సీజన్ ముంచుకొస్తున్నా విత్తన పంపిణీ విషయంలో కూటమి ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ సారి సబ్సిడీ విత్తన పంపిణీ విషయమై కూటమి ప్రభుత్వం చేతులెత్తేసే అవకాశం ఉండటంతో రైతులు విత్తనాల కోసం దిక్కులు చూస్తున్నారు. ఇప్పటి వరకు వేరుశనగ క్వింటా ధర రూ.6,500 ఉండగా.. వ్యాపారులు ఉన్నట్లుండి ధరను పెంచేశారు. ఈ సారి విత్తనాల పంపిణీ దిశగా ప్రభుత్వ చర్యలు లేకపోవడం వ్యాపారులకు కలసి వస్తోంది. ధరలను అడ్డగోలుగా పెంచి దోపిడికి పాల్పడే ప్రమాదం ఏర్పడింది. పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలకు సమస్య ఉమ్మడి కర్నూలు జిల్లాలో వరి సాగు ఎక్కువగా ఉన్నందున పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలకు డిమాండ్ ఉంది. నంద్యాల జిల్లాలో వరి ప్రధాన పంట. కర్నూలు జిల్లాలో కూడా వరి సాగవుతోంది. వరి నాట్లకు ముందు పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలైన జీలుగ, పిల్లిపెసర, సన్హెంఫ్ విత్తనాలు విత్తుకొని 45 రోజుల సమయంలో దున్ని పొలంలో కలిపేస్తారు. ఇందువల్ల భూమికి అన్ని పోషకాలు కలిగిన ఎరువులు లభిస్తాయి. పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలు జిల్లాకు కనీసం 3,500 క్వింటాళ్లు అవసరం. అయితే ఏపీ సీడ్స్ వద్ద కేవలం 1000 క్వింటాళ్లు మాత్రమే ఉన్నాయి. కంపెనీలు విత్తన సరఫరా చేయడంలో చేతులెత్తేశాయి. ఇప్పటికే పచ్చిరొట్ట ఎరువుల విత్తనాల కోసం రైతులు వ్యవసాయ అధికారులు, ఏపీ సీడ్స్ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో విత్తనాలను అందుబాటులో పెట్టకపోతే రైతులు రోడ్డెక్కే పరిస్థితి నెలకొంది. ఖరీఫ్లో వేరశనగ ప్రధాన పంట. కర్నూలు జిల్లాలో 54,170 హెక్టార్లు, నంద్యాల జిల్లాలో 11,943 హెక్టార్ల వరకు సాగయ్యే అవకాశం ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఖరీఫ్ సీజన్లో వేరుశనగ సాగు చేపట్టేందుకు 32,181 క్వింటాళ్ల విత్తన కాయలు అవసరమని మండల వ్యవసాయ అధికారులు, ఏడీఏలు నివేదించారు. ఆయా జిల్లాల అధికారులు వినతిని కూటమి ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. ఉమ్మడి జిల్లాకు తూతూమంత్రంగా 11,108 క్వింటాళ్లు మాత్రమే కేటాయించింది. సాధారణంగా గత ఏడాది ఏఏ విత్తనం ఏ మేర పంపిణీ అయిందో దానికి అనుగుణంగా విత్తనాలను కేటాయిస్తారు. గత ఏడాది ఖరీఫ్లో కర్నూలు జిల్లాకు 14,395 క్వింటాళ్లు, నంద్యాల జిల్లాకు 3,062.7 క్వింటాళ్ల ప్రకారం విత్తన పంపిణీ జరిగింది. కనీసం ఈ ప్రకారమైన కేటాయించాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు కరువయ్యాయి. కర్నూలు జిల్లాకు 9,099, నంద్యాల జిల్లాకు 2,009 క్వింటాళ్లతో సరిపెట్టడం గమనార్హం. ఈ కేటాయింపులు చూసి అధికారులు పంపిణీ ఎలా చేపట్టాలోనని తలలు పట్టుకుంటున్నారు. -
బ్లాక్లో కొనాల్సి వస్తుందేమో
ఐదు ఎకరాల్లో వేరుశనగ సాగు చేస్తాం. గత ఏడాది వరకు మే 15 నుంచే వేరుశనగ సహా అన్ని రకాల విత్తనాల పంపిణీ చేశారు. ముందస్తుగా విత్తనాలు సిద్ధం కావడంతో వర్షాలు కురిసిన వెంటనే సకాలంలో విత్తుకు అవకాశం ఉండేది. ఈ సారి సబ్సిడీపై విత్తనాల పంపిణీ జరుగుతుందో, లేదో తెలియని పరిస్థితి. ఇప్పటికీ వర్షాలు కురుస్తున్నాయి. విత్తనాల కోసం దిక్కుతు చూడాల్సి వస్తోంది. మరో నాలుగైదు రోజుల్లో విత్తనాలు అందుబాటులోకి రాకపోతే బ్లాక్లో కొనాల్సిందే. – సత్యప్ప, మామిళ్లకుంట, తుగ్గలి మండలం ఎప్పుడు పంపిణీ చేస్తారో తెలియదు 13 ఎకరాల్లో వరి, వేరుశనగ 8 ఎకరాల్లో సాగు చేస్తున్నాం. మామూలుగా అయితే పచ్చి రొట్ట ఎరువుల విత్తనాలు వినియోగించం. మొదటిసారిగా వరి నాట్లకు ముందు పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలు విత్తుకోవాలనుకున్నాం. కానీ వ్యవసాయ శాఖ ఇంతవరకు విత్తనాల పంపిణీ చేపట్టలేదు. కేటాయింపులు అరకొరగా ఉన్నాయి. ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారో చెప్పడం లేదు. వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఏమీ చెప్పలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితిని మొదటిసారి చూస్తున్నాం. – కెంచప్ప, గజ్జెహళ్లి, హొలగొంద మండలం -
పది రోజులైనా ప్రజల అర్జీలు చూడరా?
కర్నూలు(సెంట్రల్): పీజీఆర్ఎస్ లాగిన్లో వచ్చిన ప్రజల అర్జీలను కొన్ని శాఖల అధికారులు పది రోజులైనా చూడడంలేదని జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా, డీఆర్వో సి.వెంకట నారాయణమ్మ, ఎస్డీసీ బీకే వెంకటేశ్వర్లు, అనురాధ హాజరై ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..కర్నూలు సీడీపీఓ, ఆదోని మునిసిపల్ కమిషనర్, అర్బన్ తహసీల్దార్, లీగల్ మెట్రాలజీ డీడీలు వారం రోజుల నుంచి అర్జీలను చూడకపోవడం విడ్డూరమన్నారు. ప్రజలు ఇచ్చిన అర్జీలపై నిర్లక్ష్యం వద్దు అని, ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. సీఎంఓ నుంచి వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అర్జీల్లో కొన్ని... ● జాతీయ రహదారి 340సీ కింద బ్రిడ్జి నుంచి వ్యవసాయపొలాలకు వెళ్లేందుకు రహదారిని నిర్మించాలని కర్నూలు మండలం నూతనపల్లి రైతులు అర్జీ ఇచ్చారు. ● తన 6.20 ఎకరాల పొలాన్ని కొందరు ఆక్రమించుకొని ఇబ్బంది పెడుతున్నారని, తన భూమిని తనకు ఇప్పించాలని గోనెగొండ్ల మండలం పెద్దనెలటూరుకు చెందిన చాకలి నరసింహులు అర్జీ ఇచ్చారు. ● తనకు మంత్రాలయం మండలం మాలపల్లిలో 58 సెంట్ల భూమి ఉందని, అది నిషేధిత జాబితాలో ఎవరూ అప్పు ఇవ్వడం లేదని, కుమార్తె పెళ్లి ఉందని, సమస్య పరిష్కరించాలని భీమన్న వినతి పత్రం అందజేశారు. అధికారుల తీరుపై జిల్లా కలెక్టర్ అసంతృప్తి -
నేర్పిస్తున్నందుకు తృప్తిగా ఉంది
16 ఏళ్ల నుంచి ఆధునిక నృత్యంలో శిక్షణ ఇస్తున్నాను. ఈ శిబిరంలో శిక్షణ పొందిన వారు కొందరు డ్యాన్స్ అకాడమీలను స్థాపించుకున్నారు. మరికొందరు ప్రైవేటు విద్యాసంస్థల్లో డ్యాన్స్ మాస్టర్లుగా ఉపాధి పొందుతున్నారు. ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఎంతో తృప్తిగా ఉంది. – రాజాహుసేన్, డ్యాన్స్ మాస్టర్ నృత్యం నేర్చుకుంటున్నా ఆరేళ్ల నుంచి వేసవిలో నృత్యం నేర్చుకుంటున్నాను. ఎలాంటి ఫీజు తీసుకోవడం లేదు. బాగా నేర్పుతున్నారు. జూన్లో ప్రదర్శన ఇచ్చే అవకాశం ఉంటుందంటా. అందుకే బాగా నేర్చుకుంటున్నాను. – గోవర్ధిని, శిక్షణ పొందుతున్న విద్యార్థిని భవిష్యత్తులోనూ నేర్పిస్తా ఎక్కువ మంది చిన్నారులు ఆధునిక నృత్యంపైనే ఆసక్తి చూపుతున్నారు. నాలుగైదేళ్ల చిన్నారులు కూడా హుషారుగా, ఎంతో జోష్తో పాల్గొంటున్నారు. ఫీజు లేకపోయినా సరే చిన్నారులకు నేర్పుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. కాబట్టి మున్ముందు కూడా చిన్నారులకు డ్యాన్స్ నేర్పిస్తా. – డాక్టర్ లలితాసరస్వతి, భరతనాట్యం డ్యాన్స్ మాస్టర్ -
వాల్మీకి ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం
ఆదోని సెంట్రల్: ఎమ్మిగనూరులో నిర్వహించిన కర్నూలు జిల్లా వాల్మీకి ఉద్యోగుల సమావేశంలో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం వాల్మీకి ఉద్యోగుల సంఘం నాయకులు మాట్లాడుతూ వాల్మీకి విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తామని, వారు భవిష్యత్లో ఉన్నత స్థానానికి ఎదిగేలా చూస్తామన్నారు. వాల్మీకి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి వారు అభివృద్ధి వైపు నడిచేలా చూస్తామన్నారు. గౌరవాధ్యక్షులుగా కర్నూలుకు చెందిన టి.బాలవెంకటేశ్వర్లు (రిటైర్డ్ ఉద్యోగి), అధ్యక్షుడిగా కర్నూలుకు చెందిన బి.మల్లన్న, (ఏడీ, వెటర్నరీశాఖ), ప్రధాన కార్యదర్శిగా ఆదోనికి చెందిన బి.సుధాకర్బాబు (ఉపాధ్యాయుడు), కోశాధికారిగా కోసిగికి చెందిన ఎస్.వెంకటరెడ్డి (ఉపాధ్యాయుడు), ఇతర సలహాదారులు, ఉపాధ్యక్షులు, అదనపు కార్యదర్శులు, కార్యనిర్వాహక సభ్యులను ఎన్నుకున్నట్లు చెప్పారు. వాల్మీకి ఉద్యోగ సంఘం గౌరవ సలహాదారుడు వెంకన్న, ఉపాధ్యక్షుడు హుసేని, ఇతర నాయకులు పులుసు నారాయణ, తిమ్మారెడ్డి, లక్ష్మీనారాయణ, రఘునాథ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
బాలిక ప్రాణం తీసిన నీటి గచ్చు
కోడుమూరు రూరల్: నీటి గచ్చు ఐదేళ్ల బాలిక ప్రాణం తీసింది. ఈ దుర్ఘటన కోడుమూరు మండలం వర్కూరు గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన లక్కసాగరం రామాంజినేయులుకు ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. నాల్గవ కుమార్తె గాయత్రి (5)ని తోటి పిల్లలతో పాటు ఎప్పటిలాగే ఇంట్లో వదిలి తండ్రి రామాంజినేయులు పొలం పనులకు వెళ్లాడు. అయితే బాలిక గాయత్రి ఆటలాడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు నీటి గచ్చులో పడిపోయింది. గాయత్రి కన్పించకపోవడంతో మిగిలిన పిల్లలు చుట్టుపక్కల వెతికి ఇంటిలోని గచ్చులో చూశారు. అప్పటికే బాలిక అపస్మారక స్థితికి చేరుకుంది. విషయం తెలుసుకున్న తండ్రి రామాంజినేయులు ఇంటికి చేరుకుని పాపను బతికించుకునేందుకు కోడుమూరు ప్రభుత్వాసుపత్రికి తరలించినప్పటికీ లాభం లేకపోయింది. అప్పటికే బాలిక మృతిచెందినట్లు వైద్యులు చెప్పడంతో రోదిస్తూ గ్రామాన్ని చేరుకున్నారు. పిడుగుపాటుతో 18 మేకలు మృతి ఆదోని రూరల్: మండలంలోని పాండవగల్ గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి పిడుగుపాటుకు గురై 18 మేకలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన కొరవన్నగారి తిక్కయ్యకు చెందిన 3, కప్పట్రాళ్ల రాందాసుకు చెందిన 4, చింతకుంట నరసయ్యకు చెందిన 3, జెల్లీ గోకర్లకు చెందిన 4, జెల్లీ చిన్నలక్ష్మన్నకు చెందిన 4 మేకలు మృతిచెందాయి. రాత్రిపూట పొలంలో ఆపిన సమయంలో పిడుగు పడడంతో మేకలు మృతిచెందాయని గొర్రెల కాపరులు చెప్పారు. మేకల మృతితో దాదాపు రూ.2 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందన్నారు. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య దేవనకొండ: అప్పుల బాధతో దేవనకొండకు చెందిన గిడ్డిగారి ప్రకాష్(48) అనే రైతుసోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న మూడు ఎకరాల పొలంలో పంటలు పండిస్తూనే సెంట్రింగ్ పనులు చేస్తూ ప్రకాష్ జీవనం సాగించేవాడు. గత రెండు సంవత్సరాల నుంచి పంటలు సరిగా పండలేదు. ముగ్గురు కుమార్తెలకు పెళ్లిళ్లు చేసి దాదాపు రూ.15 లక్షలు దాకా అప్పులపాలయ్యాడు. అప్పులు ఎలా తీర్చాలో తెలియక నిత్యం సతమతమవుతూ ఉండేవాడు. భార్య పిల్లలు బంధువుల శుభకార్యానికి వెళ్లగా ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం ఎంతసేపటికీ తలుపులు తీయకపోవడంతో కిటికీలో నుంచి చూడగా శవమై వేలాడుతున్నాడు. దీన్ని గమనించిన స్థానికులు పోలీస్స్టేషన్కు ఫిర్యాదు ఇచ్చారు. పోలీసులు వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈతకు వెళ్లి బాలుడి మృతి ప్యాపిలి: మండల పరిధిలోని ఎస్ రంగాపురంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రామాంజనేయులు, సునీతల కుమారుడు చరణ్ (10) సోమవారం ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. స్థానిక పాఠశాలలో ఐదో తరగతి చదివిన చరణ్.. వేసవి సెలవులు కావడంతో తోటి మిత్రులతో కలసి ప్రతిరోజూ గ్రామ శివారులోని కుంటలో ఈత నేర్చుకునేవాడు. రోజులాగే సోమవారం కూడా ఈతకు వెళ్లాడు. నీటిలో మునిగిపోకుండా వీపునకు ప్లాస్టిక్ డబ్బా కట్టుకుని కాసేపు ఈత కొట్టాడు. తర్వాత ప్లాస్టిక్ డబ్బా తొలగించి కుంటలోకి దూకి బయటకు రాలేకపోయాడు. కొద్ది సేపటి తర్వాత అదే కుంటలో ఈత కొడుతున్న కొందరు అడుగున తమకు ఏదో తగులుతోందని గుర్తించారు. వెంటనే అందరూ కలిసి అడుగున ఉన్న చరణ్ను బయటకు తీశారు. అప్పటికే బాలుడు మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న బాలుడి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. -
ఏపీ ఈఏపీ సెట్కు 94.04 శాతం హాజరు
కర్నూలు సిటీ: ఏపీ ఈఏపీ సెట్ సోమవారం ప్రారంభం కాగా 94.04 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. కర్నూలు జిల్లాలో 9, నంద్యాల జిల్లాలో మూడు కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించారు. మొత్తం 3,190 మందికిగాను 3,000 మంది (94.04 శాతం) హాజరయ్యారు. కర్నూలు నగరంలో 7 కేంద్రాలు, ఎమ్మిగనూరు, ఆదోనిలలో ఒక్కో కేంద్రం ఏర్పాటు చేశారు. కర్నూలు జిల్లాలో ఉదయం సెషన్ పరీక్షకు 1,597 మందికిగాను 1,492 మంది, మధ్యాహ్నం సెషన్లో జరిగిన పరీక్షకు 1,593 మందికిగాను 1,508 మంది హాజరయ్యారు. నంద్యాల జిల్లాలో 3 కేంద్రాలలో ఉదయం సెషన్లో 713 మందికి 659 మంది, మధ్యాహ్నం సెషన్లో 711 మందికిగాను 659 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. కర్నూలు నగర శివారులోని జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన కేంద్రానికి ఇద్దరు విద్యార్థులు ఆలస్యంగా రావడంతో అనుమతించలేదు. సమయానికి చేరుకోలేక వెనుదిరిగిన ఇద్దరు విద్యార్థులు -
జిల్లాలో విస్తారంగా వర్షాలు
కర్నూలు(అగ్రికల్చర్): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు మంత్రాలయం, చిప్పగిరి మినహా మిగిలిన అన్ని మండలాల్లో వర్షాలు కురిశాయి. జిల్లా మొత్తం మీద 12.7 మి.మీ. వర్షపాతం నమోదైంది. వర్షాలతోపాటు గాలుల తీవ్రతతో జిల్లాలో అరటి, మునగ పంటలకు నష్టం జరిగింది. అయితే ఉద్యాన అధికారులు మాత్రం అరటి ఒక హెక్టారు, మునగ ఒక హెక్టారులో మాత్రమే దెబ్బతిన్నట్లుగా తేల్చారు. జీడీపీలోకి వరద నీరు గోనెగండ్ల: గాజులదిన్నె ప్రాజెక్ట్ (జీడీపీ)లోకి వరద నీరు వచ్చి చేరుతున్నటున్ల ప్రాజెక్టు ఏఈ మహమ్మద్ ఆలీ ఆదివారం తెలిపారు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు దాదాపు 880 క్యూసెక్కుల వరద నీరు వచ్చి జీడీపీలోకి చేరిందన్నారు. ప్రస్తుతం జీడీపీలో ఒక టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. కాగా.. గాజులదిన్నె ప్రాజెక్ట్కు 4.5 టీఎంసీల నీరు నిల్వ చేసే సామర్థ్యం ఉంది. -
దివ్యాంగులకు ల్యాప్టాప్లు
కర్నూలు(సెంట్రల్): విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ద్వారా మంజూరైన ల్యాప్టాప్లను ఇద్దరు దివ్యాంగులకు జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా అందజేశారు. కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో సోమవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పాలిటెక్నిక్, డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సులు చేస్తున్న దివ్యాంగులకు ప్రభుత్వం ఉచితంగా ల్యాప్టాప్లను అందజేస్తోందన్నారు. విభిన్న ప్రతిభావంతుల శాఖసహాయ సంచాలకులు రయూస్ ఫాతిమా పాల్గొన్నారు. రేషన్ బియ్యం కోసం ధర్నా ఎమ్మిగనూరుటౌన్: ఈనెల 19 రోజులు గడిచినప్పటికీ రేషన్ బియ్యం ఇవ్వకపోవడంతో ఎమ్మిగనూరు పట్టణం లక్ష్మీపేట వాసులు సోమవారం ధర్నా చేశారు. ప్రతి నెలా మొదటి వారంలోనే రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయాల్సి ఉందన్నారు. ఈ నెల ఇప్పటి వరకు పంపిణీ చేయకపోవడంతో తాము పస్తులుండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పని చేసుకొని బతికే తమకు రేషన్ బియ్యం పంపిణీ చేయకుంటే ఎలా అని లక్ష్మి, నర్సమ్మ తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలైన తమకు సత్వరం రేషన్ బియ్యం పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కర్నూలు సిటీ: పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 80 కేంద్రాలు ఏర్పాటు చేయగా మొదటి రోజు 3,436 మందికి గాను 2,248 మంది హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.శామ్యూల్ పాల్ తనిఖీ చేశారు. జిల్లాలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని తెలిపారు. సీఐడీ నుంచి 10 మంది వెనక్కి కర్నూలు: సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో ఐదేళ్ల సర్వీసు పూర్తయిన 10 మంది సిబ్బంది తిరిగి యధాస్థానానికి వచ్చారు. సోమవారం ఎ స్పీ దగ్గర హాజరుకావడంతో తిరిగి వారికి పోస్టింగ్ కేటాయించేందుకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇందులో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ఓ మహిళా కానిస్టేబుల్, ఏడుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు. పొగాకును కొనుగోలు చేయాలినంద్యాల(అర్బన్): రైతులు పండించిన పొగాకు దిగుబడులను కంపెనీలు కొనుగోలు చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్రెడ్డి, జిల్లా కార్యదర్శి రాజశేఖర్ డిమాండ్ చేశారు. ఏపీ రైతు సంఘం ఆద్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ పొగాకు బేళ్లను వెనక్కు పంపకుండా ఒప్పందం మేరకు క్వింటా రూ.18,500తో కొనుగోలు చేయాలన్నారు. -
డిగ్రీ స్పెషల్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిఽధిలో ఫిబ్రవరి/మార్చి నెలల్లో జరిగిన డిగ్రీ స్పెషల్ సప్లిమెంటరీ (2015, 2016, 2017,2018) పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. వివరాలు వర్సిటీ వెబ్సైట్లో ఉన్నాయని వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. ఈనెల 30వ తేదీలోగా రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. 22న కురువ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు కర్నూలు(అర్బన్): కురువ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను ఈ నెల 22న ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్ ప్రాంగణంలోని మండల పరిషత్ సమావేశ భవనంలో అందించనున్నట్లు జిల్లా కురువ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పత్తికొండ శ్రీనివాసులు, ఎంకే రంగస్వామి తెలిపారు. సోమవారం స్థానిక కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ 10వ తరగతి, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించిన వారికి ఈ పురస్కారాలను అందిస్తున్నామన్నారు. ఎంపికై న విద్యార్థులందరికీ జ్ఞాపిక, సర్టిఫికెట్లు, నగదు బహుమతులను అందిస్తామన్నారు. సమావేశంలో సంఘం అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న, ఉపాధ్యక్షులు ధనుంజయ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. వైభవంగా భువనేంద్రుల ఆరాధన మంత్రాలయం: మధ్వమత పూర్వపు పీఠాధిపతి భువనేంద్రుల ఆరాధన వేడుక వైభవంగా జరిగింది. తెలంగాణలోని రాజోలి గ్రామంలో క్షేత్రంలో శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు నేతృత్వంలో వేడుకలు చేపట్టారు. ముందుగా భువనేంద్ర తీర్థుల మూల బృందావనానికి శాస్రోక్తంగా విశేష పూజలు చేశారు. అక్కడే శ్రీమఠం రాములోరి సంస్థాన పూజలు నిర్వహించారు. ఈ ఆరాధన వేడుకలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వేడుకలో పండిత కేసరి రాజా ఎస్. గిరియాచార్, ద్వారపాలక అనంతస్వామి పాల్గొన్నారు. గడువులోగా సమస్యలు పరిష్కరించాలి బొమ్మలసత్రం: ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను గడువులోగా పరిష్కరించాలని జిల్లా అడిషనల్ ఎస్పీ యుగంధర్బాబు పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజలు అడిషనల్ ఎస్పీకి 67 వినతులను అందించారు. కొన్ని సమస్యలను ఆయన ఫోన్లో సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. అన్నదమ్ముల ఆస్తి తగాదాలు, అత్తింటి వేధింపులు, మోసాలకు సంబంధించిన ఫిర్యాదులను త్వరగా విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సీఐ జయరాముడు పాల్గొన్నారు. హత్య కేసులో ఐదుగురు నిందితుల అరెస్ట్ హాలహర్వి: హత్య కేసులో ఐదుగురు నిందితులను సోమవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఆలూరు సీఐ రవిశంకర్రెడ్డి తెలిపారు. హాలహర్వి పోలీస్స్టేషన్లో అరెస్ట్ చేసిన నిందితులను చూపుతూ సీఐ వివరాలను వెల్లడించారు. అమృతాపురం గ్రామంలో గత నెల 25న కంటినేని పెద్ద వెంకటేశులు హత్యకు గురి కాగా నిందితుడు సోమన్నను ఇప్పటికే అరెస్టు చేశామన్నారు. కుటుంబ కలహాల కారణంగా కంటినేని పెద్ద వెంకటేశులను హతమార్చినట్లు సోమన్న ఒప్పుకున్నారన్నారు. హత్యలో భాగస్వాములైన హొళగుంద గ్రామస్తులు చాకలి నాగరాజు, నటరాజగౌడ, కర్ణాటక రాష్ట్రం ఉత్తనూరుకు చెందిన భోగప్ప, ధనుంజయ, దళిత ఈరన్నను విరుపాపురం గ్రామ శివారులోని బల్గోట బసవేశ్వర ఆలయం వద్ద అరెస్టు చేసినట్లు చెప్పారు. నిందితుల స్టేట్మెంట్లను రికార్డు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు సీఐ తెలిపారు. హాలహర్వి ఎస్ఐ చంద్ర, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ మద్దతుదారుడి జయకేతనం
మద్దికెర: వైఎస్సార్సీపీ మద్దతుదారుడైన కవిరెడ్డి కృష్ణ మద్దికెర ఉపసర్పంచ్గా సోమవారం ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఎన్నికల అధికారి రంగస్వామి ప్రకటించారు. పంచాయతీ కార్యాలయంలో ఉపసర్పంచ్ ఎన్నికలు నిర్వహించగా 18 పంచాయతీ సభ్యులకు గాను 14 మంది హాజరయ్యారు. ఉపసర్పంచ్గా కవిరెడ్డి కృష్ణను సభ్యులు కోలి మల్లికార్జున ప్రతిపాదించగా 12 మంది చేతులెత్తి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎస్ఐ విజయ్కుమార్నాయక్ బందోబస్తు నిర్వహించారు. సర్పంచ్ సుహాసిని, కార్యదర్శి శివకుమార్ సభ్యులు బాలచంద్ర, వరప్రసాద్, కిట్టి, సుధాకర్, జంబునాథ్రాయుడు తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీలో సంబరాలు ఉప సర్పంచ్గా కవిరెడ్డి కృష్ణ ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ను ఘనంగా సన్మానించి గ్రామ వీధులు గుండా ఊరేగింపు నిర్వహించారు. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, జెడ్పీటీసీ సభ్యుడు మురళీధర్రెడ్డి, మాజీ సర్పంచ్ శాంతన్న, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మల్లికార్జున, మాజీ ఎంపీటీసీ సభ్యుడు శ్రీనివాసులు, ఆంజనేయులు, కృష్ణ, మంజునాథ్రెడ్డి, అశోక్ తదితరులు పాల్గొన్నారు. మద్దికెర ఉపసర్పంచ్గా కవిరెడ్డి కృష్ణ -
ఆదోనిలో వైఎస్సార్సీపీ ప్రభంజనం
ఆదోని టౌన్: మునిసిపల్ చైర్పర్సన్ ఎన్నికలో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 36 మంది పాలకవర్గ సభ్యుల ఆమోదంతో ఎన్నిక ఏకగ్రీవంగా సాగింది. ఆదోని మున్సిపల్ చైర్పర్సన్ సీహెచ్ లోక్వేరి ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. ఆదోని సబ్కలెక్టర్ భరద్వాజ్, ఎన్నికల అబ్జర్వర్, జాయింట్ కలెక్టర్ నవ్య ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. కౌన్సిల్లో 42 మంది పాలకవర్గ సభ్యులు ఉండగా అందులో ఐదుగురు బీజేపీలోకి వెళ్లగా, ఒకరు టీడీపీ కౌన్సిలర్ ఉన్నారు. మిగిలిన 36 మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లుగా ఉన్నాయి. సీహెచ్ లోకేశ్వరిని చైర్పర్సన్గా 36వ వార్డు కౌన్సిలర్ సందీప్రెడ్డి ప్రతిపాదించగా 40వ వార్డు కౌన్సిలర్ ఫయాజ్అహ్మద్ బలపరిచారు. దీంతో సిహెచ్ లోకేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు సబ్కలెక్టర్ మౌర్యభరద్వాజ్ ప్రకటించారు. అబ్జర్వర్ అయిన జాయింట్ కలెక్టర్ నవ్య, సబ్కలెక్టర్ మౌర్యభరద్వాజ్లు చైర్పర్సన్గా సి.హెచ్.లోకేశ్వరి ఎన్నికై నట్లు ఎన్నిక నియామక పత్రాన్ని అందజేశారు. కమిషనర్ ఎం.కృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ అనుపమ ప్రమాణస్వీకారం చేయించారు. వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి బస్సులో.... ఎస్కేడీ కాలనీ జీరో రోడ్డులోని వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి 35 మంది కౌన్సిలర్లు బస్సులో మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసులు విచారణ అనంతరం కౌన్సిల్హాల్కు చేరుకున్నారు. కౌన్సిల్లో ఆల్ఫాబెట్ ప్రకారం సీట్లను కేటాయించారు. వారివారి సీట్లలో కౌన్సిలర్లు కూర్చొని ఎన్నిక ప్రక్రియలో పాల్గొన్నారు. ఆదోని మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నికై న సీహెచ్ లోకేశ్వరి కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి మహాయోగి లక్ష్మమ్మవ్వను దర్శించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి ఇంటికి ఆశీస్సులు పొందారు. రుణపడి ఉంటా వాల్మీకి వర్గానికి చెందిన తనను ఎంపిక చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డికి రుణపడి ఉంటానని మున్సిపల్ చైర్పర్సన్ సీహెచ్ లోక్వేరి తెలిపారు. ఆదోని ప్రాంతాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. ప్రజా సమస్యలను ప్రాధాన్యతపరంగా పరిష్కరిస్తానని తెలిపారు. ప్రలోభాలకు లొంగలేదు మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల్లో ఆదోని చరిత్ర తిరగరాసిందని ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి తెలిపారు. పాలకవర్గ సభ్యులు మాటకు కట్టుబడి వైఎస్సార్సీపీలోనే ఉంటూ చైర్ పర్సన్ ఎన్నికను ఏకగ్రీవంగా చేశారన్నారు. కూటమి నేతలు ప్రలోభాలకు గురి చేసినా లొంగలేదన్నారు. ఒక్కరు కూడా పార్టీని ఫిరాయించకుండా, ప్రలోభాలకు లొంగకుండా సత్తా చాటారన్నారు. మునిసిపల్ చైర్పర్సన్ ఎన్నిక ఏకగ్రీవం 36 మంది పాలకవర్గ సభ్యుల ఆమోదం చైర్పర్సన్గా సీహెచ్ లోకేశ్వరి -
మోసం చేశారు.. న్యాయం చేయండి
కర్నూలు: నమ్మంచి మోసం చేశారని, తమకు న్యాయం చేయాలని ప్రజలు సోమవారం ఎస్పీ విక్రాంత్ పాటిల్ను కోరారు. కర్నూలు రెండో పట్టణ పోలీస్స్టేషన్ పక్కనున్న క్యాంప్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి సమస్యలపై వినతులను స్వీకరించి వారితో ఎస్పీ మాట్లాడారు. మొత్తం 128 ఫిర్యాదులు రాగా.. వాటన్నింటిపై చట్ట పరిధిలో విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, లీగల్ అడ్వైజర్ మల్లికార్జునరావు, సీఐలు పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. జీతాలు కూడా ఇవ్వకుండా.. వెల్దుర్తి, చిట్యాల, సూదేపల్లె, అమకతాడు పాఠశాలల్లో అటెండర్లు, రికార్డు అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లుగా కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని కర్నూలు జొహరాపురానికి చెందిన శ్రీనివాసులు, కృష్ణగిరి గ్రామానికి చెందిన ఆవుల రామాంజనేయులు నమ్మించారు. మొత్తం ఏడుగురు నుంచి రూ.10 లక్షలు డబ్బులు తీసుకుని నకిలీ పత్రాలు సృష్టించారు. ఏడు నెలల పాటు ఆయా పాఠశాలల్లో పని చేయించుకుని జీతాలు కూడా ఇవ్వకుండా మోసం చేశారని డోన్ మండలానికి చెందిన ఎరుకలి శేషన్న సోమవారం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మోసాల్లో కొన్ని.. ● ఓర్వకల్లు మండలం కన్నమడకల గ్రామానికి చెందిన రామకృష్ణ అనే వ్యాపారి 95 కిలోల నకిలీ విత్తనాలు ఇచ్చి రైతులను మోసం చేశాడని వైఎస్సార్ జిల్లా పెండ్లిమర్రి గ్రామానికి చెందిన నాగమల్లారెడ్డి ఫిర్యాదు చేశారు. ● ఇల్లు కట్టిస్తామని చెప్పి ఒక వ్యక్తి అడ్వాన్స్గా డబ్బులు తీసుకుని మోసం చేశాడని గూడూరుకు చెందిన యుగంధర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ● తమ్ముడు విరుపాక్షితో కలసి డబ్బులు అవసరముందని, బంగారు ఆభరణాలు తీసుకెళ్లి తాకట్టు పెట్టి రుణం తీసుకున్నాం. తిరిగి రుణం చెల్లించడానికి వెళ్లినప్పుడు బంగారు ఆభరణాలు గతంలోనే రిలీజ్ చేసినట్లు బ్యాంకు అధికారులు చెబుతున్నారని, సంఘటనపై విచారణ జరిపి తగు న్యాయం చేయాల్సిందిగా కర్నూలు మండలం నిడ్జూరు గ్రామానికి చెందిన నాగేశ్వరరెడ్డి ఫిర్యాదు చేశారు. ● కర్నూలు మార్కెట్ యార్డులో 50 మంది కమీషన్ ఏజెంట్ల నుంచి రూ.1.80 కోట్లు విలువ చేసే ఉల్లి సరుకు తీసుకుని ఆనియన్ ట్రేడర్స్ వారు డబ్బులు ఇవ్వడం లేదని కర్నూలు బుధవారపేటకు చెందిన సాంబశివుడు ఫిర్యాదు చేశారు. ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితులు పీజీఆర్ఎస్కు 128 ఫిర్యాదులు -
తమ్ముడి మృతితో ఆగిన అక్క పెళ్లి
ఆలూరు రూరల్(కర్నూలు): అందరూ వివాహ వేడుకల్లో ఆనందంగా ఉన్నారు. మరి కొద్ది గంటల్లో కల్యాణ తంతు నిర్వహించాల్సి ఉంది. ఇంతలోనే విషాదం. వధువు తమ్ముడు రోడ్డు ప్రమా దంలో దుర్మరణం చెందడంతో అక్క వివాహం నిలిచిపోయింది. శనివారం రాత్రి హుళేబీడు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆస్పరికి చెందిన ఆనంద్ (19) మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో అతని స్నేహితులు పూర్ణచంద్ర, తిమ్మప్ప తీవ్రంగా గాయపడ్డారు. ఆదోని ఆస్పత్రిలో పూర్ణచంద్ర, కర్నూలు ఆస్పత్రిలో తిమ్మప్ప చికిత్స పొందుతున్నారు. ఆస్పరికి చెందిన తిమ్మన్న, శుకుంతల కుమారుడు ఆనంద్.. కాగా అతని సోదరి వివాహం హొళగుంద మండలం వందవాగిలి గ్రామంలో ఆదివారం ఉదయం జరగాల్సి ఉంది. ఆనంద్, పూర్ణచంద్ర, తిమ్మప్ప గుంటూరులోని ఆర్వీఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నారు. పూర్ణచంద్ర స్వగ్రామం ప్రకాశం జిల్లా కంభం గ్రామం కాగా తిమ్మప్పది ఆస్పరి మండలం చిగిళి గ్రామం. శనివారం రాత్రి ఆనంద్ సోదరి వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు బైక్పై వెళ్తుండగా కారు ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఆనంద్ మృతితో అతని సోదరి పెళ్లి ఆగిపోయింది. అక్క పెళ్లికి వచ్చి తమ్ముడి అంత్యక్రియలు చేయాల్సి వచ్చిందని బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.ఎమ్మెల్యే పరామర్శ.. ఆనంద్ మృతి బాధాకరమని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అన్నారు. ఆదివారం ఆయన ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆనంద్ మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
ఆడబిడ్డలకు ద్రోహం
కర్నూలు (టౌన్)/ కాకినాడ రూరల్: ఎన్నికల సమయంలో ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేస్తామని టీడీపీ అధినేతగా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక ఆ హామీని సమాధి చేశారని మహిళలు మండిపడ్డారు. కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్ నుంచి వైఎస్సార్ సర్కిల్ వరకు వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం మహిళలు ర్యాలీ నిర్వహించారు. ‘ముఖ్యమంత్రి చంద్రబాబు డౌన్.. డౌన్.. ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయాలి’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మహిళలను నమ్మించి మోసం చేశారని నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లా నాగవేణి రెడ్డి మాట్లాడుతూ.. ఓట్ల కోసం సూపర్ సిక్స్ హమీలు ఇచ్చి.. తీరా గద్దెనెక్కాక కూటమి పార్టీల పెద్దలు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఆడబిడ్డ నిధి పేరుతో ప్రతి మహిళకు ఏటా రూ.18 వేలు ఇస్తామని చంద్రబాబు నాయుడు బహిరంగంగా ప్రకటించారన్నారు. ఆ మేరకు కూటమి మేనిఫెస్టోలోనూ పెట్టారన్నారు. తీరా ఇప్పుడు సీఎం చంద్రబాబు తన కర్నూలు పర్యటనలో.. ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎత్తేస్తున్నట్లు ప్రకటించడం దుర్మార్గం అన్నారు.2029 నాటికి కూడా పేదరికం తగ్గకపోతే అప్పుడు పీ–4 పథకానికి ఆడబిడ్డ నిధి పథకాన్ని అనుసంధానం చేస్తానని చెప్పడం మరోసారి మహిళలను దగా చేయడమే అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి భారతి, కర్నూలు నగర మహిళ నాయకులు మంగమ్మ, 43వ వార్డు కార్పొరేటర్ మునెమ్మ, కర్నూలు నియోజకవర్గ ఆంగన్వాడీ మహిళ నాయకురాలు రాధికమ్మ తదితరులు పాల్గొన్నారు.సూపర్ మోసం కూటమి ప్రభుత్వ మోసపూరిత వాగ్దానాలు మహిళలకు శాపంగా మారాయని, ఆడబిడ్డ నిధి పేరిట ప్రతి మహిళకూ నెలకు రూ.1,500 ఇస్తామని నమ్మించి.. ఇప్పుడు మోసం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం సూపర్ మోసాలు చేస్తోందని ధ్వజమెత్తారు. కాకినాడ 49వ డివిజన్లోని తన నివాసంలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆడబిడ్డ నిధి పథకాన్ని సూపర్ సిక్స్ హామీల కింద పెట్టి.. ఇప్పుడు మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించారని.. ఆ పథకం అక్కర్లేదని సీఎం చంద్రబాబు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల ముందు మహిళల్లో కనిపించిన పేదరికం.. అధికారం చేపట్టగానే మాయమైందా.. అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తెచ్చిన వేల కోట్ల రూపాయలతో ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. -
వినతిపత్రాలు ఇచ్చేందుకు వెళ్తే అరెస్టులు
కల్లూరు: సూపర్సిక్స్ పథకాలను అమలు చేయాలని కోరుతూ సీఎం చంద్రబాబునాయుడుకు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన సీపీఐ, కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం సీఎం పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రజా వేదిక వద్దకు సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి మునెప్ప నేతృత్వంలో శ్రీనివాసరావు, మహేష్, బాబయ్య, అశోక్, రాముడు, అలాగే నంద్యాల డీసీసీ అధ్యక్షుడు జే.లక్ష్మీనరసింహ, కర్నూలు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు జిలానీ బాషా చేరుకున్నారు. వీరిని పోలీసులు అత్యు త్సాహంతో అదుపులోకి తీసుకున్నారు. వినతిపత్రం ఇచ్చేందుకు సీఎంను కలిసే ఏర్పాటు చేస్తామని చెప్పి ఉలిందకొండ పోలీసుస్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా సీఎంకు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తే అరెస్టు చేయడం భావ్యం కాదన్నారు. పోలీసులే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుండటం విడ్డూరంగా ఉందన్నారు. అక్రమ అరెస్టును సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య ఖండించారు. -
ఫొటో, వీడియోగ్రఫీలో ఉచిత శిక్షణ
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని గ్రామీణ ప్రాంత యువకులకు కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్ధ డైరెక్టర్ కె.పుష్పక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 10వ తేదీ నుంచి శిక్షణ మొదలవుతుందని, 18 నుంచి 45 ఏళ్లలోపు వయస్సు 10వ తరగతి పాసైన యువకులు అర్హులన్నారు. శిక్షణా కాలంలో ఉచిత భోజనం, హాస్టల్ వసతి కల్పిస్తామన్నారు. ఆసక్తి కలిగిన యువకులు బి.తాండ్రపాడు సమీపంలోని కెనరాబ్యాంకు–గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ(డీఆర్డీఏ–టీటీడీసీ ప్రక్కన)లో సంప్రదించవచ్చన్నారు. మరిన్ని వివరాలకు 63044 91236 నంబర్కు ఫోన్ చేయవచ్చని పేర్కొన్నారు. ఈతకు వెళ్లి బాలుడి మృతి ఆత్మకూరురూరల్: వెంకటాపురం గ్రామంలో శనివారం ఓ బాలుడు ప్రమాదవశాత్తూ బావిలో మునిగి మృత్యువాత పడ్డాడు. గ్రామానికి చెందిన కుందూరు రామచంద్రారెడ్డి, లక్ష్మీదేవి దంపతుల ఏకై క కుమారుడు కుందూరు చరణ్ రెడ్డి(15) తొమ్మిదో తరగతి పూర్తి చేసి పదో తరగతికి వెళ్లాల్సి ఉంది. వేసవి సెలవులు కావడంతో స్నేహితులతో ఊరు శివారులోని వ్యవసాయ బావిలో ఈతకు వెళ్లాడు. అయితే ఈత అంతగా రాని చరణ్ రెడ్డి బావిలో దూకడంతో నేరుగా నీటిలో మునిగి బురదలో చిక్కుకున్నాడు. దీంతో ఊపిరాడక మరణించాడు. సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు చరణ్ మృతదేహాన్ని వెళికి తీశారు. ఆత్మకూరు పోలీసులు సంఘటనా స్థలా నికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆత్మకూరు ఆసుపత్రి మార్చురీకి తరలించారు. -
మహాయోగి.. మహిమాన్విత మూర్తి
● రేపు ఆదోనిలో లక్ష్మమ్మ అవ్వ జాతర ● భారీగా తరలిరానున్న భక్తులు మహాయోగిగా ప్రసిద్ధి.. ఆదోని పట్టణంలో లక్ష్మమ్మ అవ్వ మహిమలు చూపారు. మహాయోగిగా ప్రసిద్ధి చెందారు. దుకాణాల వద్దకు అవ్వ వచ్చిపోతే వ్యాపారం బాగా సాగుతుందనే నమ్మేవారు. అవ్వను కలిసి వేడుకుంటే సంతానం కలిగేదని భక్తులు చెప్పేవారు. ఆదోనిలో రాచోటి రామయ్య వంశీయులు, చాకలి నరసప్ప తదితరులు అవ్వను ఆశ్రయించి దగ్గరుండి సేవలు చేసేవారు. ఓ పెద్ద కుర్చీలో ఉంచి పల్లకీ సేవగా ఊరేగించేవారు. లక్ష్మమ్మ అవ్వ 1933లో జీవసమాధి అయ్యారు. అక్కడే రాచోటి రామయ్య వంశీకులు గుడి కట్టించారు. లక్ష్మమ్మ అవ్వ గుడిలో జీవసమాధి వద్ద ధ్యానం చేసిన వారికి మంచి జరిగేదని నిర్వాహకులు తెలిపారు. ఆలయ గర్భగుడికి బంగారు తొడుగు ఏర్పాటు చేసిన దృశ్యం ఆదోని అర్బన్: మహిమలు చూపిన మాతృమూర్తి మహాయోగి లక్ష్మమ్మ అవ్వ. ఆదోని పట్టణంలో సోమవారం అవ్వ జాతర నిర్వహించనున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి భారీగా భక్తులు తరలిరానున్నారు. దళితుల ఇంట పుట్టి.... లక్ష్మమ్మ అవ్వ ఆలూరు మండలం మూసానహళ్లి గ్రామంలో దళితులు మంగమ్మ, బండెప్ప దంపతులకు జన్మించారు. చిన్నప్పటి నుంచే మౌనంగా ఉండడంతో గ్రామస్తులు తిక్కమ్మగా పిలిచేవారు. లక్ష్మమ్మ అవ్వను కర్ణాటక రాష్ట్రం సిరుగుప్ప గ్రామానికి చెందిన యువకుడు మారెప్పకు ఇచ్చి తల్లిదండ్రులు వివాహం చేశారు. ఒక రోజు లక్ష్మమ్మ అవ్వ శక్తిస్వరూపిణిగా భర్తకు కనిపించడంతో ఆయన భయపడి ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశాడు. దీంతో సిరుగుప్ప నుంచి అవ్వ ఆదోనికి చేరుకుని తన మహిమలు చూపారు. రేపు రథోత్సవం లక్ష్మమ్మ అవ్వ జాతర సందర్భంగా సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆదోని పట్టణంలో వెండి రథోత్సవం నిర్వహించనున్నారు. అమ్మవారిని కొలువుదీర్చే మండపాన్ని, ఆలయ సమీపంలోని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త రాచోటి రామయ్య చేయించిన బంగారు కిరీటాన్ని సోమవారం సమర్పించను న్నారు. జాతర సందర్భంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అన్నదానం చేయనున్నారు. డీఎస్పీ హేమలత ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తును నిర్వహిస్తున్నారు. -
‘విశ్వ’మంత సంబరం
● సందడిగా జేఎన్టీయూ(ఏ) 14వ స్నాతకోత్సవంఅనంతపురం: రాయలసీమకే తలమానికంగా నిలిచిన అనంతపురం జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ (ఏ) 14వ స్నాతకోత్సవ సంబరం అంబరమంటింది. జేఎన్టీయూ ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన స్నాతకోత్సవానికి చాన్స్లర్ హోదాలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు. గౌరవ డాక్టరేట్ గ్రహీత డాక్టర్ చావా సత్యనారాయణ, వీసీ ప్రొఫెసర్ హెచ్. సుదర్శనరావు, ముఖ్య అతిథి, కాన్పూర్ ఐఐటీ ఎమిరటర్స్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.ఆర్. మాధవ్, పాలకమండలి సభ్యులు, డీన్లు వేదికపై ఆశీనులయ్యారు. చాన్స్లర్ హోదాలో ఏపీ గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగం ఆద్యంతం విద్యార్థులు చప్పట్లతో హోరెత్తించారు. తన ప్రసంగం ప్రారంభంలో జేఎన్టీయూ విద్యార్థులు బంగారు బిడ్డలు అంటూ గవర్నర్ అనడం ఆకట్టుకుంది. గౌరవ డాక్టరేట్ డాక్టర్ చావా సత్యనారాయణకి ప్రదానం చేయడం ద్వారా జేఎన్టీయూ కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. స్నాతకోత్సవాన్ని పురస్కరించుకుని పీజీ, పీహెచ్డీ, డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. మొత్తం 41 బంగారు పతకాలు ఇవ్వగా, 27 బంగారు పతకాలు అమ్మాయిలే సాధించడం గమనార్హం. ఆరు పతకాలు దక్కించుకున్న విద్యార్థి నంద్యాల పూజిత్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి.. బంగారు పతకాలు చాలా బరువుగా ఉన్నాయంటూ గవర్నర్ సరదాగా వ్యాఖ్యానించారు. జేఎన్టీయూ (ఏ) వీసీ ప్రొఫెసర్ హెచ్. సుదర్శనరావు స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి ప్రసగించారు. ‘ద టైమ్స్ ఇండియా వరల్డ్’ ర్యాంకింగ్లో వర్సిటీ 801–1000 ర్యాంకు దక్కించుకుందన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ కోర్సులో మైనర్ డిగ్రీని ప్రవేశపెట్టామని, అపార్ అనుసంధానంతో అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ను ఏర్పాటు చేశామన్నారు. ‘రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్’లో వర్సిటీ భాగస్వామి కావడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఎస్. కృష్ణయ్య, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. -
తల్లిదండ్రులకు చెంతకు చేరిన బాలుడు
వెల్దుర్తి: పట్టణంలోని 9వ వార్డు ముల్ల గేరిలో నివాసముంటున్న మూడేళ్ల బాలుడు అభిరామ్ శనివారం మధ్యాహ్నం తప్పిపోయి కొన్ని గంటల్లోనే తల్లితండ్రులు పరుశరాముడు, లుఽథియాల చెంత చేరాడు. వివరాలు.. అభిరామ్ తన ఇంటి ముందు ఆడుకుంటూ బంధువుల యువకుడితో కలిసి అరకిలోమీటర్ దూరంలోని పోలీస్స్టేషన్ సమీప దుకాణానికి వెళ్లాడు. ఆ యువకుడు వెళ్లిపోవడంతో అభిరామ్ ఒక్కడై డోన్ వైపు దారి వెంట ఏడ్చుకుంటూ తిరిగాడు. అక్కడున్న వారు బాలుడ్ని చేరదీసి పోలీస్స్టేషన్ను సంప్రదించారు. ఎస్ఐ అశోక్ సలహా మేరకు బాలుడి ఫొటోను వాట్సాప్లో ఉంచగా తల్లితండ్రులకు సమాచారం అందింది. వెంటనే వారు పోలీస్స్టేషన్ చేరుకుని పిల్లవాడ్ని ముద్దాడుతూ ఊపిరి పీల్చుకున్నారు. -
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు రెండు కేంద్రాలు
కర్నూలు సిటీ: దేశంలోని ప్రతిష్టాత్మకమైన ఐఐటీల్లో ప్రవేశాలకు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించనున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెండు పరీక్ష కేంద్రాలను ఎంపిక చేశారు. కర్నూలు సనత్నగర్లోని ఆయాన్ డిజిటల్, జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో పరీక్ష నిర్వహించనున్నారు. సుమారు 700 మంది పరీక్షకు హాజరుకానున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్–1, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పేపర్–2 పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు గంట ముందుగానే కేంద్రాల్లోకి అనుమతిస్తారు. అడ్వాన్స్డ్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు బీఆర్క్ కోర్సుల్లో చేరాలనుకుంటే ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు(ఏఏటీ)రాయల్సి ఉంటుంది. ఈ పరీక్ష వచ్చే నెల 5న నిర్వహించనున్నారు. ఇద్దరు విద్యార్థులు డిబార్ కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిఽధిలో నిర్వహిస్తున్న డిగ్రీ, బీఈడీ సెమిస్టర్ పరీక్షల్లో శనివారం ఇద్దరు విద్యార్థులు డిబార్ అయ్యారని వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. ఆలూరు శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల కేంద్రంలో ఒకరు, కర్నూలు డిగ్రీ కళాశాల కేంద్రంలో ఒకరు చూచిరాతకు పాల్పడగా డిబార్ చేసినట్లు పేర్కొన్నారు. అమెరికాలో కర్నూలు విద్యార్థి మృతి కర్నూలు: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలు విద్యార్థి ఇస్కాల వెంకట కౌశిల్ (26) మృతి చెందాడు. కర్నూలు నగరం వెంకటరమణ కాలనీకి చెందిన ఇస్కాల రవికుమార్ కుమారుడు ఇస్కాల వెంకట కౌశిల్ అమెరికాలోని టెక్సాస్లోని బ్యూమౌంట్ ఉంటున్నారు. లామర్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు. టెక్సాస్లో కారు నడుపుతూ ఈనెల 12వ తేదీన రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. శనివారం రాత్రి మృతదేహం కర్నూలుకు చేరింది. 31న చలో సిద్ధేశ్వరం కర్నూలు సిటీ: చలో సిద్ధేశ్వరం కార్యక్రమాన్ని ఈ నెల 31న నిర్వహిస్తున్నట్లు రాయలసీమ సాగు నీటి సాథన సమితి అద్యక్షులు బొజ్జా దశరథ రామిరెడ్డి తెలిపారు. ిసిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన 9వ వార్షికోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. అదే రోజు సిద్ధేశ్వరం వద్ద ప్రజా బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. కర్నూలులోని ఓ హోటల్లో క్రెడాయ్ మాజీ అధ్యక్షుడు వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో శనివారం చలో సిద్ధేశ్వరంవాల్ పోస్టర్లను విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికై నా మత్తునిద్ర వదిలి రాయలసీమలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు. కృష్ణా యాజమాన్య బోర్డు కర్నూలులో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజస్వామ్య హక్కుల పరిరక్షణ వేదిక కన్వీనర్ రామకృష్ణారెడ్డి, సీడ్ గ్రోయర్స్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి మోక్షేశ్వరరెడ్డి, రాయలసీమ సాంస్కృతిక వేదిక కన్వీనర్ అప్పిరెడ్డి హరినాథరెడ్డి, సీనియర్ నాయకులు జి.చంద్రన్న, రాయలసీమ సాగు నీటి సాధన సమితి కార్యదర్శి మహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రసాద వితరణపై పర్యవేక్షణ శ్రీశైలం టెంపుల్: అన్న ప్రసాద వితరణపై నిరంతరం పర్యవేక్షణ చేస్తుండాలని అధికారులను ఈఓ శ్రీనివాసరావు ఆదేశించారు. శనివారం రాత్రి అన్నప్రసాద వితరణ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈఓ సంబంధిత అధికారులతో మాట్లాడుతూ అన్నప్రసాద వితరణకు సమయపాలనను పాటించాలన్నారు. -
నల్లమలలో ‘అవినీతి’ అనకొండ
ఆత్మకూరు రూరల్: ఆత్మకూరు అటవీ శాఖ కార్యాలయంలో 15 ఏళ్లుగా పని చేస్తూ ఐదు నెలల క్రితం పదవీ విరమణ పొందిన ఉద్యోగి అవినీతి బాగోతం చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. ఏకంగా రూ.6కోట్ల నిధులను మళ్లించిన బాగోతం ఇప్పుడు ఆ శాఖను కుదిపేస్తోంది. నాగార్జున సాగర్ – శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యంలోని ఆత్మకూరు అటవీ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో అకౌంట్స్ సూపరింటెండెంట్గా పని చేసిన చాంద్ బాషా గతేడాది డిసెంబర్లో పదవీ విరమణ పొందారు. ఆ తర్వాత రికార్డులు పరిశీలించిన సిబ్బందికి మొదట రూ.20 లక్షలు దారి మళ్లించినట్లు గుర్తించి దరాప్తు చేపట్టగా తవ్వే కొద్దీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. బైర్లూటీలోని ఎన్విరాన్మెంటల్ మెయింటెనెన్స్ చెక్ పోస్టు నుంచి వసూలైన మొత్తం సర్కిల్ కార్యాలయానికి జమ చేయకుండా ప్రైవేటు వ్యక్తుల ఖాతాలకు మళ్లించినట్లు గుర్తించారు. ఈ విషయమై చాంద్ బాషాపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఈ క్రమంలో అధికార పార్టీకి చెందిన ప్రముఖులు పోలీసులతో మధ్యవర్తిత్వం చేసి అరెస్టును వాయిదా వేయించినట్లు సమాచారం. ఈ మధ్య కాలంలో దారి మళ్లిందనుకున్న రూ.20 లక్షలు ఆత్మకూరు ఎఫ్టీ డీడీ ఖాతాలో తిరిగి జమ చేశారు. ఆపై ముందస్తు బెయిల్ ప్రయత్నాల్లో చాంద్బాషా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా గత ఐదేళ్లలో అతని అక్రమాలు పరిశీలిస్తే దాదాపు రూ.6 కోట్లు దారి మళ్లించినట్లు విశ్వసనీయ సమాచారం. ఆత్మకూరు అటవీ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్కు చెందిన యూనియన్ బ్యాంకు ఖాతా, నాగార్జున సాగర్ – శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యం ఫీల్డ్ డైరెక్టర్కు చెందిన నంద్యాల ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఖాతాలు పరిశీలిస్తే గత ఐదేళ్లుగా పెద్ద మొత్తంలో ప్రభుత్వ ధనం ప్రయివేట్ వ్యక్తుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసినట్లు వెలుగు చూసింది. అటవీశాఖకు చెందిన వివిధ ఆదాయ మార్గాల ద్వారా వచ్చిన నగదు మొత్తాలను చాంద్బాషా తెలివిగా తన సమీప బంధువులు, నమ్మకస్తుల ఖాతాలకు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. ఆత్మకూరు పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉండే మహేశ్వర ప్రింటింగ్ ప్రెస్ యజమాని శివయ్య, అతని కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలకు ఏకంగా సుమారు రూ.3 కోట్లకు పైగా నగదు బదిలీ చర్చనీయాంశంగా మారింది. కెమెరాల కొనుగోల్మాల్ నల్లమల అభయారణ్యంలో జంతువుల లెక్కింపు, వేటగాళ్ల కదలికలను పసిగట్టేందుకు ఏర్పాటు చేసే ఇన్ఫ్రారెడ్ కెమెరాలా కొనుగోళ్లలోను అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. హైదరాబాద్కు చెందిన గ్లోబల్ టెలీ కమ్యూనికేషన్ సంస్థకు అటవీశాఖ ద్వారా ఇన్ఫ్రారెడ్ కెమెరాలు కొనుగోలుకు ఇండెంట్ పెట్టారు. అయితే అటవీ శాఖ అనకొండ కన్ను దీనిపై కూడా పడడంతో ఆ సంస్థకు కొంత కమీషన్ ఇచ్చి కెమెరాలు కొనుగోలు చేసినట్లు బిల్లులు సృష్టించి నిధులు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆత్మకూరు అటవీ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ సహాయ కన్జర్వేటర్ సాయిబాబా అటవీదళాల ప్రధానాధికారి పీసీసీఎఫ్ ఏకే నాయక్కు సమగ్ర నివేదికను పంపారు. ఈ మేరకు ఆయన ఐదుగురితో కూడిన ఒక దర్యాప్తు కమిటీని నియమించారు. సమగ్ర నివేదిక అందజేశాం ఆత్మకూరు అటవీడివిజన్ ప్రధాన కార్యాలయంలో అకౌంట్స్ సూపరింటెండెంట్గా పని చేసి ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన చాంద్బాషా అక్రమాలపై అటవీశాఖ ప్రధాన కార్యాలయానికి సమగ్ర నివేదికను అందజేశాం. ప్రభుత్వ సొమ్మును తన సొంత ఖాతాకు మళ్లించడంతో ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అక్రమాలు రూ. కోట్లలో ఉండటంతో ఐదుగురి సభ్యులతో విచారణ కమిటీ దర్యాప్తు చేపడుతోంది. – వి.సాయిబాబా, ప్రాజెక్ట్ టైగర్ డిప్యూటీ డైరెక్టర్, ఆత్మకూరు ఆత్మకూరు అటవీ కార్యాలయంలో ఫెవికాల్ ఉద్యోగి అక్రమాలు పదవీ విరమణతో అవినీతి వెలుగులోకి రూ.6 కోట్ల ప్రభుత్వ నిధులు దారి మళ్లింపు -
కర్నూలులో భారీ వర్షం
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలులో శనివారం సాయంత్రం రెండు గంటల పాటు ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. నగరంలో 46.5 మి.మీ వర్షపాతం నమోదైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండల తీవ్రత లేకపోయినా ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేసింది. సాయంత్రం నుంచి భారీ వర్షం పడటంతో వాతావరణం చల్లబడింది. ఉరుముల తీవ్రతకు చిన్నపిల్లలు భయభ్రాంతులకు లోనయ్యారు. ఆనంద్ సినీ కాంప్లెక్స్, కేసీ కెనాల్, రైల్వే బ్రిడ్జి కిందకు భారీగా వర్షం నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆర్టీసీ బస్సులను చౌరస్తా మీదుగా బైపాస్కు మళ్లించడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. 14 మండలాల్లో అకాల వర్షాలు ఉరుములు, మెరుపులు.. గాలులతో అకాల వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు 14 మండలాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. తుగ్గలిలో భారీ వర్షం కురిసింది. తుగ్గలిలో 45.2 మి.మీ, కోడుమూరులో 33.6, పత్తికొండలో 21.4, పెద్దకడుబూరులో 15.4, గోనెగండ్లలో 14.8, కోసిగిలో 9.2 మి.మీ వర్షపాతం నమోదైంది. గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మామిడి తోటలకు నష్టం కలిగింది. రానున్న రెండు రోజుల్లో వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. -
చంద్రబాబు మాటలన్నీ అబద్ధాలే!
కర్నూలు(సెంట్రల్): రాయలసీమలోని తాగునీటి ప్రాజెక్టులన్నీ టీడీపీ చేపట్టినవేనని సీఎం చంద్రబాబునాయుడు అబద్ధాలు ఆడుతున్నారని, ఆయన హయాంలో ఒక్క ప్రాజెక్టును నిర్మించలేదని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి అన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చలువతో రాయలసీమలో చాలా ప్రాజెక్టులు ఏర్పాటయ్యాయని పేర్కొన్నారు. కల్లూరులోని తన నివాసంలో శనివారం కాటసాని విలేకరులతో మాట్లాడారు. గోరుకల్లు రిజర్వాయర్కు ప్రధానమంత్రి ఉన్న సమయంలో పీవీ నరసింహారావు భూమి పూజ చేశారని తెలిపారు. 1994 ముందే కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో కాలువలను పూర్తి చేశారన్నారు. 1994 నుంచి 2004 వరకు చంద్రబాబు అధికారంలో ఉన్నా నీళ్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారన్నారు. 2004లో సీఎంగా వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి గోరుకల్లు రిజర్వాయర్తో ప్రజలకు నీళ్లు ఇచ్చారన్నారు. హాస్యాస్పదం ఎస్ఆర్బీసీ, హంద్రీనీవా ప్రాజెక్టులను టీడీపీ హయాంలో చేపట్టినట్లు సీఎం చంద్రబాబునాయుడు చెప్పడం హాస్యాస్పదమని కాటసాని అన్నారు. ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణం వైఎస్సార్ హయాంలోనే జరిగిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. కర్నూలు పర్యటనకు సీఎం చంద్రబాబు ఎందుకు వచ్చినట్లో అర్థం కావడం లేదన్నారు. స్వచ్ఛాంద్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పరిసరాలను పరిశుభ్రం చేయడానికి ఎక్కడి నుంచైనా సందేశం ఇస్తే సరిపోతుందన్నారు. అయితే ఆయన మాత్రం ఆ పనిమీదనే జిల్లా పర్యటనకు వచ్చారని, ఆయన రాకతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో ఖర్చు వచ్చిందన్నారు. ఎక్కడైనా ముఖ్యమంత్రి పర్యటిస్తే ఆ జిల్లాకు ఏదైనా ప్రాజెక్టు లేదా ఏదైనా సంక్షేమ పథకాన్ని అమలు చేయడానికి వస్తారన్నారు. చంద్రబాబు మాత్రం రైతు బజార్ను శుభ్రం చేయడానికి రావడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. కేవలం ప్రచార ఆర్భాటం కోసమే చంద్రబాబునాయుడు జిల్లాల్లో పర్యటిస్తున్నారని, సంక్షేమ పథకాలను ఎవరూ అడగకూడదని ఆగస్టు, జూన్ అంటూ చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. రాయలసీమలో ఒక్క సాగుప్రాజెక్టును నిర్మించలేదు గోరుకల్లును నిర్వర్యీం చేశారు ఆయన పర్యటనతో జిల్లాకు ఒరిగిందేమిటి? వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి -
అసలు, వడ్డీ చెల్లిస్తేనే కొత్తగా పంట రుణం
● గత ఏడాది కలసిరాని వ్యవసాయం ● అప్పుల్లో కూరుకుపోయిన రైతులు ● బ్యాంకుల తీరుతో దిక్కుతోచని స్థితి ● వడ్డీకి ఇస్తామని తిష్టవేసిన దళారీలు ● ఇంటెన్సివ్ ఉన్నా వడ్డీ వసూలు ● రైతు సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వంఅప్పులు తెచ్చి కట్టాల్సిందే.. గత ఏడాది ఖరీఫ్లో కర్నూలులోని పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.8లక్షల వరకు పంట రుణం తీసుకున్నా. పత్తి, కంది, ఉల్లిగడ్డలు తదితర పంటలు సాగు చేస్తున్నాం. ప్రస్తుతం క్రాప్లోన్ రెన్యూవల్ చేసుకుందామని బ్యాంకుకు పోతే అసలు, వడ్డీ మొత్తం చెల్లించాలంటున్నారు. ఇంత మొత్తం కట్టాలంటే అప్పు చేయక తప్పదు. ప్రభుత్వం రైతులను ఆదుకోకపోతే వ్యవసాయం చేయలేం. – పరమేశ్వరరెడ్డి, రేమడూరు, కల్లూరు మండలం అసలు, వడ్డీ చెల్లించాల్సిందే.. గత ఏడాది బ్యాంకుల నుంచి తీసుకున్న పంట రుణాలు, బంగారంపై పొందిన వ్యవసాయ రుణాలు రెన్యూవల్ చేసుకోవాలంటే అసలు, వడ్డీ చెల్లించాల్సిందే. అప్పు మొత్తం క్లియర్ అయిన తర్వాతనే కొత్తగా పంట రుణం ఇస్తారు. ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలని ఆర్బీఐని ఎస్ఎల్బీసీ కోరుతోంది. కొన్ని బ్యాంకులు కేవలం వడ్డీ కట్టించుకొని రెన్యూవల్ చేస్తున్నాయి. – రామచంద్రరావు, ఎల్డీఎం, కర్నూలుపంట రుణాల కోసం వెల్దుర్తి యూనియన్ బ్యాంక్కు తరలి వచ్చిన రైతులు -
నీళ్లు కొంటున్నాం
కుళాయిలకు ఐదు రోజులకోసారి నీళ్లను వదులుతున్నారు. అవి కూడా అందుతాయన్న నమ్మకం లేదు. ప్రతి రోజూ నీళ్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. చుట్టు పక్కల బోర్లలో ఎక్కడా మంచినీళ్లు లేవు. కుళాయిలకు సరిగా నీళ్లు రాక డబ్బులు పెట్టి క్యాన్ల నీళ్లు కొంటున్నాం. – శ్రీనివాసులు, కొండపేట, కోడుమూరు సమస్య ఉంది హంద్రీ నది ఎండిపోవడంతో మంచినీటి పథకాలు సరిగ్గా పనిచేయడం లేదు. హంద్రీలో నీటి కొరత కారణంగా పట్టణంలో నీటి సమస్య ఉత్పన్నమవుతోంది. సమస్య పరిష్కారం కోసం కోడుమూరు హంద్రీనదికి గాజులదిన్నె ప్రాజెక్టు నీటిని విడుదల చేయాలంటూ ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లాం. – ప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ, కోడుమూరు -
మోసం చేసి పర్యటనా?
● ఏపీ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు బి.గిడ్డమ్మ కర్నూలు(సెంట్రల్): ఎన్నికల సమయంలో మహిళలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక టీడీపీ అధినేత చంద్రబాబు మోసం చేశారని ఏపీ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు గిడ్డమ్మ విమర్శించారు. మోసం చేసిన వ్యక్తి ఏ ముఖం పెట్టుకొని కర్నూలుకు వస్తున్నారని ప్రశ్నించారు. శుక్రవారం సీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళలకు ఉచిత బస్సు, 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500, తల్లికి వందనం కింద ఎంత మందిపిల్లలు ఉంటే అందరికీ రూ.15,000 ఇస్తామని టీడీపీ అధినేత హామీ ఇచ్చారనప్నారు. సంపద సృష్టించి మహిళలను లక్షాధికారులను చేస్తానని చెప్పి బిచ్చగాళ్లను చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి భారతి, పావని పాల్గొన్నారు. -
సైకిల్పై శక్తిపీఠాల సందర్శన
ఆత్మకూరురూరల్: మండువేసవిలో సైకిల్పై ప్రయాణం ఎంత కష్టం. కాని ఆయన సంకల్ప శక్తికి మండే సూర్యుడు కూడా చల్లబడ్డాడేమోననిపిస్తోంది. షిరిడీకి చెందిన రాధాకృష్ణ అనే వ్యక్తి దేశం నలుమూలలా వెలసిన అష్టాదశ శక్తిపీఠాలను సైకిల్పై ప్రయాణిస్తూ సందర్శిస్తున్నారు. శ్రీశైలంలో వెలసిన శ్రీ భమరాంబిక శక్తి పీఠాన్ని సందర్శించుకుని మరో శక్తిపీఠమైన అలంపూర్ జోగులాంబ దర్శనానికి వెళ్తూ శుక్రవారం మార్గమధ్యలో ఆత్మకూరులో కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను గత జనవరి నుంచి ఉత్తరభారతదేశంలోని శక్తిపీఠాలన్నింటిని సైకిల్ యాత్రలో దర్శించుకుని దక్షిణ దేశానికి చేరుకున్నానన్నారు. శ్రీలంకకు కూడా వెళ్లాల్సి ఉందని ఆయన తెలిపారు. 798 మంది గైర్హాజరు కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిఽధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 59 పరీక్ష కేంద్రాల్లో శుక్రవారం జరిగిన సెమిస్టర్ పరీక్షల్లో 798 మంది గైర్హాజరయ్యారు. 4వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలకు 8,376 మందికి 7,632 మంది హాజరు కాగా 744 మంది గైర్హాజరయ్యారని వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. ఎమ్మిగనూరు రావూస్ డిగ్రీ కళాశాల కేంద్రంలో ఒకరు, కర్నూలు సెయింట్ జోసెఫ్ మహిళా డిగ్రీ కళాశాల కేంద్రంలో ఒకరు మొత్తం ఇద్దరు విద్యార్థులు చూచిరాతకు పాల్పడగా గుర్తించి డిబార్ చేసినట్లు పేర్కొన్నారు. బీఈడీ మూడో సెమిస్టర్ పరీక్షలకు 589 మందికి 535 మంది హాజరు కాగా 54 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. వేసవి సెలవుల్లో చిన్నారులు జాగ్రత్త ● జిల్లా విపత్తుల నిర్వహణ అథారిటీ డీపీఎం అనుపమ కర్నూలు(అగ్రికల్చర్): వేసవి సెలవుల్లో చిన్న పిల్లలు ఈత కొట్టడానికి వాగులు, వంకలు, చెరువులు, బావుల్లోకి వెలుతుంటారని, అటువంటి సమయంలో వారిపై కుటుంబీకులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా విపత్తుల నిర్వహణ అఽథారిటీ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ అనుపమ సూచించారు. వేసవి ఎండల తీవ్రత మరికొన్ని రోజులు ఉండే అవకాశం ఉన్నందున చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులు వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శుక్రవారం డీపీఎం అనుపమ విలేకర్లతో మాట్లాడుతూ.. ఈ నెల చివరి వర కు ఎండలు, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందన్నారు. ఈ నెల చివరి వరకు మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్య చిన్నపిల్లలు, సీనియర్ సిటిజన్లు, గర్భిణులు, బాలింతలు బయట తిరగరాదని, అత్యవసర పరిస్థితుల్లో బయటికి వచ్చినా గొడుగు ధరించాలన్నారు. ఉరుములు, మెరుపుల సమయంలో ఆరుబయట ఉండరాదని, చెట్లు, టవర్లకు సమీపంలో ఉండకూడదని తెలిపారు. అకాల వర్షాల సమయంలో సురక్షితమైన భవనాల్లో ఉండాలని పేర్కొన్నారు. -
సర్దుబాటుతో చతికిల‘బడి’
● ఒకే పాఠశాలలో మాయమైన 10 ఉపాధ్యాయ పోస్టులు పత్తికొండ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం సరికొత్తగా తీసుకొచ్చిన సర్దుబాటు ప్రక్రియ పత్తికొండ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను దెబ్బతీసింది. పాఠశాలకు 40 ఉపాధ్యాయ పోస్టులు మంజూరవగా ఇక్కడ 31మంది పనిచేస్తున్నారు. ఇప్పుడు విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా ఉపాధ్యాయులను కుదించారు. దీంతో 10 పోస్టుల వరకు ఇతర ప్రాంతాలకు కేటాయించారు. ఇప్పుడు 21మంది ఉపాధ్యాయులు మాత్రమే ఇక్కడ ఉండనున్నారు. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఉంది. మొత్తం 1,300 మంది విద్యార్థులు ఇక్కడ ఉంటున్నారు. తరగతుల వారీగా సెక్షన్లు విభజించి బోధన కొనసాగిస్తూ వచ్చారు. ఈ ఏడాది కరువు పరిస్థితులు ఏర్పడటంతో తల్లిదండ్రులు వలసబాట పట్టి పిల్లలను కూడా తీసునకెళ్లారు. దీంతో విద్యార్థుల సంఖ్య 800కు తగ్గింది. దీంతో పాఠశాలలో 10 ఉపాధ్యా పోస్టులు మాయమయ్యాయి. -
జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
కర్నూలు (టౌన్) : గుజరాత్లో ఈనెల 24వ తేదీన నిర్వహించనున్న జాతీయ స్థాయి ఖేలో ఇండియా ఫుట్బాల్ పోటీలకు కర్నూలు నగరానికి చెందిన ఎం. రేణుకా, బి. భువనేశ్వరీలు ఎంపికయ్యారు. ఎంపికయిన క్రీడాకారులను శుక్రవారం జిల్లా ఫుట్బాల్ సంఘం అధ్యక్షులు ముప్పా రాజశేఖర్ తన కార్యాలయంలో అభినందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయి ఖేలో ఇండియా ఫుట్బాల్ పోటీలకు కర్నూలు క్రీడాకారులు ఎంపిక కావడం గర్వకారణమన్నారు. జాతీయ స్థాయిలో మంచి ప్రతిభ కనబరచాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఫుట్బాల్ సంఘం ప్రతినిధులు శ్రీనివాసులు, వేణుగోపాల్, పాల్ విజయ్కుమార్, శ్రీధర్, కోచ్ బ్రహ్మాకుమార్ పాల్గొన్నారు. మల్లికార్జునపల్లిలో నిలిచిన ఉపాధి పనులు ● వేతనాలపై ప్రశ్నించినందుకు అధికారుల నిర్వాకం ఆలూరు: హాలహర్వి మండలం మల్లికార్జునపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులు నిలిచిపోయాయి. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. పనిదినాలకు తక్కువగా వేతం వచ్చిదంటూ ఉపాధి పథకం టెక్నికల్ అసిస్టెంట్ రాజశేఖర్తో గ్రామానికి చెందిన కూలీలు వాగ్వాదానికి దిగారు. ఈ మేరకు ఈనెల 3న టెక్నికల్ అసిస్టెంట్ రాజశేఖర్, ఫీల్డ్ అసిస్టెంట్ నాగరాజుతో కలిసి వెళ్లి మస్టర్లు తదితర అంశాలను విచారించి చేసిన పనులను కొలతలు వేశారు. అయితే తక్కువ కొలతలను చూపిస్తున్నారని కూలీలు ఈరప్ప, మల్లికార్జున, చాంద్బాషా ఈశ్వరప్ప తదితరులు టీసీ రాజశేఖర్ను నిలదీశారు. దీంతో ఆ రోజు నుంచి గ్రామంలో పనులు నిలిపేశారు. కాగా శుక్రవారం కూడా పనులు జరగలేదు. పనులు నిలిపివేయడంపై హాలహర్వి ఏపీఓ చక్రవర్తి దృష్టికి తీసుకెళ్లగా అలాంటిదేమీ లేదని సమాధానం దాటవేశారు. -
రైతుల ఆశలపై ‘నీళ్లు’
● ఆయకట్టుకు అందని సాగునీరు ఆలూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. వర్షాలు సరిగ్గా కురవలేదు. కాలువలకు సక్రమంగా సాగు నీరు కూడా రాలేదు. దీంతో అన్నదాతలకు కన్నీరే మిగిలింది. హంద్రీనీవా సుజల స్రవంతి కాలువ నుంచి ఆలూరు సబ్ బ్రాంచ్ కాలువకు నీరు ఇవ్వాలనే ప్రతిపాదన ఉంది. అయితే కూటమి ప్రభుత్వం ఈ ప్రతిపాదనను పట్టించుకోకుండా రైతుల ఆశలపై ‘నీళ్లు’ చల్లింది. ఇదీ ప్రతిపాదన.. ఆలూరు సబ్ బ్రాంచ్ కాలువకు హెచ్ఎల్సీ మెయిన్ కాలువ నుంచి నీరు వస్తుంది. మొత్తం 14,555 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. ప్రస్తుతం కాలువకు 650 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేస్తున్నారు. అయితే 150 నుంచి 200 క్యూసెక్కులు సాగునీరు (హెచ్ఎల్సీ మెయిన్ కాలువ నుంచి) మించి విడుదల కావడం లేదని రైతులు వాపోయారు. చిప్పగిరి గ్రామానికి రెండు కిలోమీటర్ల సమీపంలో ప్రవహిస్తున్న హంద్రీ–నీవా సుజల స్రవంతి కాలువకు ప్రత్యేకంగా తూము (డీపీ)ను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ తూము ఏర్పాటు చేస్తే దాదాపు 80 వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. పట్టించుకోని ప్రభుత్వం కాలువకు నీరు రాక, పంటలు పండక రైతులు ఇబ్బందులు పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. హంద్రీ–నీవా సుజల స్రవంతి కాలువకు ప్రత్యేకంగా తూము ఏర్పాటు చేయాలనే అధికారుల ప్రతిపాదనను పక్కన పెట్టారు. దీంతో ఆయకట్టు రైతులకు పంటలు పండటం లేదు. హామీలను గాల్లోకి వదిలేశారు ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు ఇచ్చిన హామీలను గాల్లోకి వదిలేశారు. ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదు. సాగు ప్రాజెక్టులు నిర్మించాలని, కాలువలకు తూములు ఏర్పాటు చేయాలని ఆలోచన చేయడం లేదు. హెచ్ఎన్ఎస్ నుంచి ఏబీసీకి సాగునీరు విడుదల చేయాలి. నగరడోణ గ్రామ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు కూడా పూర్తిచేయాలి. – బి. విరూపాక్షి, ఆలూరు ఎమ్మెల్యే అనుమతులు రాలేదు ఆలూరు సబ్ బ్రాంచ్ కాలువకు సాగుటిని విడుదల చేసేందుకు హెచ్ఎన్ఎస్కు ప్రత్యేకంగా తూము ఏర్పాటు చేయాలని గతంలో రూ. 3 కోట్లకు ప్రతిపాదనలు పంపారు. ఇప్పటి వరకు అనుమతులు రాలేదు. వాటర్ యూజర్స్ కమిటీ పర్యవేక్షణ చేయాల్సి ఉంది. – చంద్రశేఖర్, హెచ్ఎల్సీ ఆలూరు ఏబీసీ డీఈ -
అధికారం ఇచ్చింది దోచుకునేందుకేనా ?
● ఎమ్మెల్యేగా చికెన్ దందా తగునా ● అక్రమార్జన కోసం ప్రజలపై భారం మోపుతారా? ● ఏజెంట్లను పెట్టి వ్యాపారులను బెదిరిస్తారా? ● ఆళ్లగడ్డ ఎమ్మెల్యేపై వైఎస్సార్సీపీ నాయకుడు భూమా కిషోర్రెడ్డి విమర్శలు ఆళ్లగడ్డ: ప్రజలు అధికారం ఇచ్చింది ఇష్టమెచ్చినట్లు దోచుకునేందుకేనా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూమా కిషోర్రెడ్డి ఎమ్మెల్యే అఖిలప్రియను ప్రశ్నించారు. స్థానిక కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మండల కేంద్రంలో చాగలమర్రిలో చికెన్ సెంటర్ల నిర్వాహకులను అందరిని తమ దగ్గరే చికెన్ కొనుగోలు చేయాలని అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్ మండలానికి ఒక ఏజెంట్ను పెట్టి బెదిరింపులకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. ఇంత వరకు ఇలాంటి దందా ఎవరూ చేయలేదన్నారు. కిలోకు రూ. 35 అదనంగా డిమాండ్ చేస్తున్నారని, ఇందులో ఎమ్మెల్యేకు రూ. 25, ఏజెంట్లకు రూ. 10 లెక్కన నిర్ణయించి వసూళ్లకు పాల్పడటం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఇది సామాన్యమైన స్కామ్ కాదు. ఒక్క ఆళ్లగడ్డ పట్టణంలోనే రోజుకు 5 వేల కిలోల చికెన్ విక్రయాలు జరుగుతుండగా.. నెలకు రూ. కోటి పైగా వసూళ్లు చేయడమే లక్ష్యంగా దందా కొనసాగిస్తున్నారు. ఇదంతా చికెన్ తినే సామాన్య ప్రజలపై భారం మోపడమే కదా అని మండిపడ్డారు. ఓట్లు వేసి గెలిపించిన సామాన్యులను దోచుకోనేందుకేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చికెన్ డాన్గా ఎమ్మల్యే అఖిలప్రియ పేరు గాంచారన్నారు. ఎవరైనా మాట్లాడినా.. మీడియాలో కథనాలు రాసిన ఆధారాలు ఉన్నాయా అంటూ బొంకుతూ పరువు నష్టం దావాలు వేస్తామంటూ బెదిరించడం తగదన్నారు. నేరుగా పోలీసులు మీడియా ముందు పేర్లు చెబుతున్నారని, వారి ఫొటోలతో చికెన్ డాన్ అఖిలప్రియ అని అన్ని మీడియాల్లో కోడై కూస్తుందన్నారు. ఇప్పుడు ఆ మీడియా కార్యాలయాల దగ్గరకు వెళ్లి కోళ్లు, కోళ్ల పెంట తీసుకెళ్లి నిరసన తెలపాలన్నారు. ఇలాంటి ప్రజా ప్రతినిధులతోనే రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ పరువు పోతోందని విమర్శించారు. -
సైనికులకు జోహార్లు
కర్నూలు(సెంట్రల్): ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదులు తోక జాడించారని, భవిష్యత్లో టెర్రరిస్టులు భారత్ వైపు చూడాలంటే భయపడేలా చేసిన సైనికులకు జోహార్లు అని మాజీ సైనికుల జిల్లా అధ్యక్షుడు నర్రా పేరయ్య చౌదరి అన్నారు. శుక్రవారం జిల్లా మాజీ సైనికుల సంఘం ఆధ్వర్యంలో రాజ్విహార్ నుంచి కలెక్టరేట్ వరకు జై భరత్ మాతాకి జై అంటూ వందలాది మంది మాజీ సైనికులు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆపరేషన్ సింధూర్తో భారత్ సైనిక బలమేమిటో ప్రపంచానికి తెలిసిందన్నారు. ఆపరేషన్ సింధూర్లో ప్రాణాలుకోల్పోయిన సైనికులకు నివాళులు అర్పించారు. రూటు, గడ్డం రామకృష్ణ, కె.రాముడు, మనోహర్రాజు, మున్నీర్, రవీంద్ర, సూర్య నారాయణ పాల్గొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ● ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలకు డీఈఓ హెచ్చరిక కర్నూలు సిటీ: జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలలపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని డీఈఓ ఎస్.శామ్యూల్ పాల్ శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు గత నెల 24వ తేదీ నుంచి వేసవి సెలవులు ప్రకటించామన్నారు. కానీ కొన్ని ప్రైవేటు స్కూళ్లలో ఇప్పటికీ తరగతులు నిర్వహిస్తున్నట్లు విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులను అడ్మిషన్లకు క్యాంపెయిన్ చేయిస్తున్నట్లు తెలుస్తోందన్నారు. ప్రచార నిమిత్తం ఇష్టానుసారంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. వీటిని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురిచేస్తే పాఠశాల గుర్తింపు రద్దు చేస్తామన్నారు. ప్రైవేటు స్కూళ్ల తనిఖీలకు ఎంఈఓలు, డిప్యూటీ డీఈఓలు వచ్చిన సమయంలో సరైన సమాచారం అందించాలని, లేకపోతే చర్యలు తప్పవన్నారు.రాష్ట్రంలో తారాస్థాయికి కక్ష రాజకీయాలు కర్నూలు కల్చరల్: రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు తారా స్థాయికి చేరాయని వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఐఏఎస్, ఐపీఎస్లను టార్గెట్ చేసుకొని సస్పెన్షన్ వేటు వేయడం ఈ ప్రభుత్వానికి పరిపాటిగా మారిందన్నారు. తాజాగా మాజీ ఐఏఎస్, మాజీ ప్రభుత్వ అధికారులపైనా చంద్రబాబు రెడ్బుక్ రాజ్యాంగాన్ని రుద్దుతున్నారన్నారు. ఆయన కుట్రపూరిత చర్యలతో రాష్ట్రాన్ని, ప్రజలను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నారన్నారు. హామీలను అమలు చేయకపోగా, అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాడన్నారు. రాష్ట్రంలో ఎవరికీ భద్రత లేదన్న సంకేతాన్ని చంద్రబాబు ఇస్తున్నారన్నారు. మాజీ ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్రెడ్డిల అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. తప్పుడు రాజకీయాలు మాని రాష్ట్రాభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలికారు. -
భక్తులూ జర భద్రం!
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల శిఖరేశ్వరం వద్ద ఏర్పాటు చేసిన ర్యాంప్ రైలింగ్ విరిగిపోవడంతో భక్తులు అవస్థలు పడుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఈ రైలింగ్ విరిగిపోయినా దేవస్థానం అధికారులు పట్టించుకోవడం లేదు. శ్రీశైల భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి వచ్చిన భక్తులు శిఖరేశ్వర దర్శనం తప్పనిసరిగా చేసుకుంటారు. శిఖరేశ్వరంపై ఉన్న నందికొమ్ముల నుంచి మల్లికార్జున స్వామి గర్భాలయ శిఖర కలశాలను దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. శిఖరేశ్వరం వద్ద మెట్లు ఎక్కలేని వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లుల కోసం ర్యాంప్ ఏర్పాటు చేశారు. అయితే రైలింగ్ విరిగిపోవడంతో భక్తులు అవస్థలు పడుతున్నారు. -
కోడుమూరులో ప్ర‘జల’ కష్టాలు
కోడుమూరు రూరల్: నీళ్లు లేక హంద్రీ నది ఎండిపోవడంతో నియోజకవర్గ కేంద్రమైన కోడుమూరులో తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణంలో 45వేలకు పైగా ప్రజలు నివాసం ఉంటున్నారు. వీరికి మంచినీటిని అందించడం కోసం పంచాయతీ అధికారులు హంద్రీనదిలో ఎనిమిది బోర్లను వేశారు. వాటితో పట్టణంలోని ట్యాంకులకు నీటిని ఎక్కించి కాలనీల్లోని కుళాయిలకు వదులుతున్నారు. హంద్రీ నది ఎండిపోవడంతో బోర్లకు నీళ్లు అందని పరిస్థితి నెలకొంది. దీంతో పట్టణంలోని కొండపేట, వెంకటేశ్వరనగర్, లక్ష్మీనగర్, వెంకటగిరి రోడ్డు, మోబీన్వీధి, మెయిన్బజార్, కుర్నీ నగర్లకు ఐదు రోజులకోసారి కుళాయిలకు నీటిని వదులుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పట్టణంలో నీటి సమస్య మరింత జటిలంగా మారే ప్రమాదముంది. ఇకనైనా జిల్లా అధికారులు స్పందించి గాజులదిన్నె ప్రాజెక్టు నీటిని హంద్రీనదికి విడుదల చేయాలని ప్రజలు కోరుతున్నారు. స్పందించని టీడీపీ నేతలు తాము అధికారంలోకి వస్తే గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి పైపులైన్ నిర్మాణం చేపట్టి కోడుమూరుకు శాశ్వత నీటి సమస్యను పరిష్కరిస్తామంటూ ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాది అయినా ఇప్పటి వరకు హామీని అమలు చేయలేదు. కనీసం నీటి సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు సైతం చేపట్టడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఎండిపోయిన హంద్రీ నది అడుగంటిన భూగర్భ జలాలు పనిచేయని మంచినీటి బోర్లు ఐదు రోజులకోసారి నీటి సరఫరా -
గిరిజనులకు రాజకీయ ప్రాధాన్యత ఏదీ
● ఎల్హెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ కై లాస్నాయక్ కర్నూలు(అర్బన్): కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో గిరిజనుల రాజకీయ ప్రాధాన్యత కల్పించడంలో విస్మరించిందని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ కై లాస్నాయక్ విమర్శించారు. శుక్రవారం స్థానిక సీ క్యాంప్లోని డ్రైవర్స్ అసోసియేషన్ కార్యాలయంలో గిరిజన బంజారా ముఖ్య నేతల రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కై లాస్ నాయక్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడుస్తున్నా, గిరిజనులకు ఒక్క రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి కూడా ఇవ్వలేదన్నారు. రాయలసీమ ప్రాంతంలో అధిక సంఖ్యలో ఉన్న బంజారా కులస్థులు రాజకీయ అభ్యర్థుల గెలుపోటములను శాసించే స్థాయిలో ఉన్నారన్నారు. అలాగే బీసీ, ఎస్సీ కార్పొరేషన్ల ద్వారా ఆయా సామాజిక వర్గాలకు చెందిన వారి ఆర్థికస్థితిగతులను మెరుగుపరచుకునేందుకు రుణాలు అందించే ప్రక్రియ ప్రారంభమైందని, గిరిజన కార్పొరేషన్ ద్వారా నేటికి ఎలాంటి ప్రక్రియ ప్రారంభించకపోవడం శోచనీయమన్నారు. రాయలసీమ విశ్వ విద్యాలయంలో ఓ గిరిజన అధికారిపై ప్రజా సంఘాల నాయకులు ఫిర్యాదు చేయడం సరికాదన్నారు. బంజారాలు మాట్లాడే భాషను 8వ షెడ్యూల్లో చేర్చాలని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలన్నారు. సమావేశంలో నాయకులు నాగరాజునాయక్, నేణావత్ రామునాయక్, కాలు నాయక్, బాలునాయక్, రాజునాయక్, వెంకటేష్నాయక్, శ్రీనునాయక్, శంకర్నాయక్, బీ మద్దిలేటి, సీమ కృష్ణరాథోడ్, జయరామ్ నారాయణ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఐటీఐ.. అవకాశాలు మెండుగా..!
● పారిశ్రామిక శిక్షణా కేంద్రాల్లో ప్రవేశాలకు తొలి దశ నోటిఫికేషన్ విడుదల ● వివిధ ట్రేడుల్లో అడ్మిషన్లకు మే 24న తుది గడువు నంద్యాల(న్యూటౌన్): పదవ తరగతి పరీక్షలు పూర్తయి ఫలితాలు కూడా వచ్చాయి. ఇప్పుడు విద్యార్థులు పది అనంతర కోర్సులపై దృష్టి కేంద్రీకరించారు. ఇప్పటికే పాలిసెట్, రెసిడెన్షియల్ ప్రవేశ పరీక్షలు పూర్తయ్యాయి. పలువురు విద్యార్థులు వారి ఆసక్తిని బట్టి ఏ కోర్సులో చేరాలా అని ఆలోచన చేస్తున్నారు. అధిక శాతం మంది విద్యార్థులు ఇంటర్మీడియెట్లో చేరగా, పలువురు విద్యార్థులు పాలిటెక్నిక్, ఐటీఐ కోర్సులకు ప్రాధాన్యమిస్తున్నారు. పదవ తరగతి పూర్తి చేయగానే త్వరితగతిన ఉపాధి పొందేందుకు ఐటీఐ కోర్సులు ఒక చక్కని బాటను ఏర్పాటు చేస్తాయని సాంకేతిక నిపుణులు చెబుతారు. ఐటీఐ కోర్సు పూర్తి చేసినవారు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఒక చక్కటి అవకాశంగా భావించవచ్చు. ఉద్యోగం, ఉపాధితో పాటు స్వయం ఉపాధికిసైతం ఐటీఐ కోర్సు దోహదపడుతుంది. జిల్లాలో ఐదు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఏడాది, రెండేళ్ల కాలపరిమితితో 1,084 సీట్లు ఉ న్నాయి. 16 ప్రైవేట్ యాజమాన్యంలో 2225 సీట్లు ఉన్నాయి.ఐటీఐ కోర్సుల్లో ప్రవేశానికి మే 24వ తేదీ తుది గడువుగా ఉపాధి, శిక్షణ శాఖ ప్రకటించింది. రెండేళ్ల కాలపరిమితి కోర్సులు.. ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, డ్రాఫ్ట్మెన్ సివిల్, ఆర్అండ్ ఏసీ టెక్నాలజీ, మెకానికల్ మోటార్ వెహికల్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్సిస్టిట్యూట్ మెకానిక్, టర్నర్, మెచినిస్ట్. ఏడాది కాలపరిమితి కోర్సులు.. మెకానిక్ డీజిల్, సీవోపీఏ, వెల్డర్, సూయింగ్ టెక్నాలజీ, పీపీవో. డ్రోన్ టెక్నాలజీపై స్వల్ప కాలిక కోర్సు ప్రారంభం.. ఈ ఏడాది నంద్యాల జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐలో నూతనంగా డ్రోన్ టెక్నాలజీ పై ఆరు నెలల వ్యవధి గల కోర్సును ప్రవేశ పెట్టారు. ప్రభుత్వ ఐటీఐలో 20 సీట్లు ఉన్న ఈ కోర్సును ఈ ఏడాది నుంచి ప్రారంభిస్తున్నారు. వ్యవసాయం, సర్వే, షూటింగ్స్లో డ్రోన్ టెక్నాలజీ వినియోగం పెరిగిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 10 ఐటీఐల్లో డ్రోన్ టెక్నాలజీ కోర్సును ప్రవేశ పెట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఐటీఐలో చేరగోరే విద్యార్థులు మే 24వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు పరిశీలన సమయంలో సమీప ప్రభుత్వ ఐటీఐలకు విధిగా హాజరు కావాలి. కౌన్సెలింగ్ షెడ్యూల్ వివరాలను విద్యార్థుల మొబైల్కు పంపిస్తాం. పదవ తరగతిలో విద్యార్థి పొందిన మార్కులు, రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం అడ్మిషన్స్ ఉంటాయి. – ప్రసాదరెడ్డి, జిల్లా ప్రభుత్వ ప్రైవేటు ఐటీఐ కళాశాలల జిల్లా కన్వీనర్, నంద్యాల -
సారా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు
నందికొట్కూరు: నాటు సారా తయారు చేసినా, విక్రయించినా చట్ట పరమైన చర్యలు తప్పవని అసిస్టెంట్ ఎకై ్సజ్శాఖ సూపరింటెండెంట్ రాముడు హెచ్చరించారు. శుక్రవారం పట్టణ పరిధిలోని నీలిషికారిపేటలో ఎక్సైజ్ పోలీసులు దాడులు చేసి 3,810 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. 35 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టానికి వ్యతిరేకంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు తప్పవన్నారు. అనంతరం నీలిషికారులతో ‘నాటు సారా తయారు చేయం.. విక్రయించం’.. అంటూ ప్రతిజ్ఞ చేయించారు. 2.0 కార్యక్రమంపై నీలిషికారులకు అవగాహన కల్పించారు. ఈ దాడుల్లో ఎన్ఫోర్స్మెంట్ సీఐ సుభాషిణి, మారుతి, టాస్క్ఫోర్స్ ఎస్ఐ రమేష్, ఎకై ్సజ్ సీఐలు రామాంజనేయులు, విజయకుమార్, ఎస్ఐలు జఫ్రూల్లా, శ్రీనివాసులు, జగదీష్, తదితరులు పాల్గొన్నారు. -
రైతు బజారు నిండా దళారులే!
● కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రైతు బజార్లలో దళారుల తిష్ట ● సిఫారస్సులతో కూటమి నేతల అనుచరులకు అవకాశం ● సీఎం వస్తుండటంతో స్టాళ్లలో ఒక్క రోజు మాత్రం రైతులు ఉండేలా అధికారుల యత్నం కర్నూలు(అగ్రికల్చర్): అటు రైతులకు, ఇటు వినియోగదారులకు సౌకర్యంగా ఉండేలా ఏర్పాటు చేసిన సీ – క్యాంప్ రైతు బజార్ దళారీలకు అడ్డాగా మారింది. పేరులో మాత్రమే రైతు ఉన్నప్పటికీ వాస్తవంగా రైతుబజార్లలో వారికి స్థానం లేకుండా పోయింది. ఒకవైపు టీడీపీ, మరోవైపు జనసేన, ఇంకోవైపు బీజేపీ నేతలు దళారీలను ప్రోత్సహిస్తున్నారు. రాష్ట్రంలోని టాప్ 5 రైతుబజార్లలో కర్నూలు సి.క్యాంపు రైతుబజారు ఒకటి. కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు ఇతర నాయకులు ఏడాది కాలంగా రైతుబజారులోకి తమ అనుకూలమైన వారికి అవకాశం కల్పిస్తున్నారు. ‘వీరు మా వాళ్లు.. వారూ మావాళ్లు..’అంటూ సిఫారస్సు చేస్తూ రైతుబజారు నిండా దళారీలను నింపుతున్నారు. ఇటీవల సీ.క్యాంపు రైతుబజారులో దళారీలు ఎంతమంది ఉన్నారనే దానిని మార్కెటింగ్ శాఖ అధికారులు ఆరా తీశారు. రైతుబజారులో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూలు తదితర వాటిని అమ్ముకునే వారు దాదాపు 400 మంది ఉన్నారు. ఇందులో 98 శాతం దళారీలు, 2 శాతం మంది రైతులు ఉన్నట్లు పరిశీలనలో తేలింది. దళారీలను కట్టడి చేసేందుకు ప్రయత్నించే సిబ్బందిపై తిరుగబడుతుండటం గమనార్హం. రైతుబజారులో అమ్ముకుందామని కూరగాయలు తెచ్చుకున్న రైతులకు దళారీలు చుక్కలు చూపిస్తారు. దళారీలను తట్టుకోలేక ఏదో ఒక ధరకు కూరగాయలు అప్పగించి పోతున్నారు. కర్నూలు, కల్లూరు, ఓర్వకల్లు, వెల్దుర్తి తదితర ప్రాంతాల నుంచి కూరగాయలు, ఆకు కూరలు తెచ్చిన రైతులను లోనికి రానివ్వకుండా బయటనే దళారీలు కొంటారు. రైతుల నుంచి తక్కువ ధరలకు కొని అక్కడే బోర్డుపై రాసిన ధరలను ఏ మాత్రం పట్టించుకోకుండా అధిక ధరలకు విక్రయిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అలాగే వినియోగదారుల పట్ల అమర్యాద పూర్వకంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 11వ తేదీ ఆదివారం వినియోగదారులతో రైతుబజారు కిటకిటలాడింది. బోర్డుపై రాసిన ధరలను పట్టించుకోవడం లేదంటూ... తూకాల్లో దగా చేస్తున్నారంటూ కనీసం 100 ఫిర్యాదులు వచ్చాయి. దళారీలు తిష్ట వేయడం వల్లనే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం వస్తున్నారని.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు పర్యటన ఇటు రైతులు, అటు వినియోగదారులకు తీవ్ర కష్టాలకు గురి చేసింది. సీఎం వస్తున్నారు.. కట్టుదిట్టుమైన ఏర్పాట్లు చేయాలనే కారణంతో గురు, శుక్రవారాల్లో రైతుబజారులోకి ఎవరినీ అనుమతించడం లేదు. గ్రామీణ ప్రాంతాల నుంచి రైతులు తీవ్ర వ్యయ ప్రయాసలతో తెచ్చుకున్న కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను ఏమీ చేసుకోవాలో తెలియక ఆందోళనకు గురయ్యారు. క్వింటాళ్ల కొద్ది తెచ్చిన కూరగాయలను అమ్ముకునే అవకాశం లేకపోవడంతో బయట అతి తక్కువ ధరకు దళారీలకు అమ్ముకోవాల్సి వచ్చింది. శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు రైతుబజారులో జరిగే కార్యాక్రమంలో పాల్గొననుండటంతో రైతులకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. వినియోగదారులకు మాత్రం అనుమతి లేదు. సీఎం పర్యటన తమకు శాపంగా మారిందని రైతు లు ఆందోళనకు గురవుతున్నారు. రైతుబజారుకు అన్ని వైపుల అనేక మంది కూరగాయ లు, చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. వీరందరినీ ఖాళీచేయంచడంతో వందలాది మందికి ఉపాధి లేకుండా పోయింది. -
కూతురుకు భారం కాకూడదని..
వెల్దుర్తి: అనారోగ్యం బారిన పడిన ఓ వ్యక్తి కుమార్తె, అల్లుడుకి భారం కాకూడదని ఆత్మహత్య చేసుకున్నాడు. వెల్దుర్తి రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బనగానపల్లె మండలం పలుకూరుకు చెందిన డి చిన్నబాబు(42) పాలీస్ బండల ఫ్యాక్టరీలు కూలీగా జీవించేవాడు. ఒక్కగానొక్క కుమార్తె అమ్రిన్ను వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లెకు చెందిన వ్యక్తితో వివాహమైంది. ఇటీవల చిన్నబాబు పక్షవాతంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. అప్పులు ఎక్కువై స్వగ్రామంలో ఉన్న ఒక్క ఇంటిని అమ్మి భార్యతో కలిసి కుమార్తె, అల్లుడు వద్దకు చేరుకున్నారు. అనారోగ్యంతో వారికి భారమవడం ఇష్టంలేని చిన్నబాబు బుధవారం రాత్రి బయటకు వచ్చి గురువారం తెల్లవారుజామున గ్రామ సమీపంలోని రైల్వే పట్టాలపై శవమై కనిపించాడు. విషయం తెలుసుకున్న కర్నూలు జీఆర్పీ, ఆర్పీఎఫ్ ఏఎస్ఐలు ప్రేమ్కుమార్, రమేశ్లు సంఘటనాస్థలికి చేరుకుని విచారించారు. రాత్రి గుర్తుతెలియని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని, కర్నూలు ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. తండ్రి ఆత్మహత్య -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
● మరో ముగ్గురికి తీవ్ర గాయాలు మహానంది: నంద్యాల – గిద్దలూరు రహదారిలో గురువారం రాత్రి బోయిలకుంట్ల మెట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. బనగానపల్లె మండలం బీరవోలు గ్రామానికి తలారి వేణు(18), మధుకృష్ణ బైక్పై గాజులపల్లెలో బంధువుల ఇంట్లో జరుగుతున్న తిరుగు పెళ్లికి బయలుదేరారు. ఈ క్రమంలో బోయిలకుంట్ల మెట్ట వద్ద గంగవరం గ్రామానికి చెందిన తెలుగు రమణ, బాలు మరో బైక్పై వెళుతుండగా ప్రమాదవశాత్తూ రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో బీరవోలు గ్రామానికి చెందిన తలారి వేణు మృతి చెందగా రమణ, బాలు, మధుకృష్ణ గాయపడ్డారు. రోడ్ సేఫ్టీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న మహానంది ఎస్ఐ రామ్మోహన్రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని మృతుడి వివరాలు సేకరించి, కుటుంబీకులకు సమాచారం అందించారు. -
ఉచితాన్ని తుంగలో తొక్కి!
● తుంగభద్ర నదిలో టీడీపీ నాయకుల అక్రమ తవ్వకాలు ● ప్రాంతాలుగా పంచుకుని అడ్డగోలుగా తరలింపు ● విభేదాలు రావడంతో పంచాయితీ చేసిన టీడీపీ నేత ● కలిసి దోపిడీ చేయాలని సలహా! కర్నూలు(టౌన్): అధికారంలోకి వచ్చాక ధనార్జనే ధ్యేయంగా టీడీపీ నాయకులు పెచ్చుమీరిపోతున్నారు. సహజ వనరులను యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారు. కర్నూలు శివారులోని తుంగభద్ర నదిలో ఇసుక పేదలకు అందకుండా ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. ప్రాంతాలు వారీగా దందా సాగిస్తున్నారు. ఈ విషయంలో ఇటీవల గొడవలు జరగడంతో టీడీపీ నేత పంచాయతీ చేసి కలసి దోపిడీ చేయాలని సలహా ఇచ్చినట్లు సమాచారం. దోపిడీ ఇలా... ప్రజలకు ఉచిత ఇసుక ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. అందుకు విరుద్ధంగా టీడీపీ నాయకులు ఇసుక దోపిడీ చేస్తున్నారు. కర్నూలు నగర శివారు ప్రాంతాల్లో రీచ్లు లేకున్నా తుంగభద్ర నదిలో నిత్యం ఇసుక దందా సాగుతోంది. ఇంటి నిర్మాణాల కోసం ఒంటెద్దు బండ్లలో ఇసుకను తీసుకుపోవచ్చు అంటూ ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నా.. అమలుకు మాత్రం నోచుకోవడం లేదు. కర్నూలు నగర శివారులోని తుంగభద్ర పరిసర ప్రాంతాల నుంచి ప్రతి రోజూ పగలు, రాత్రి అన్న తేడా లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ట్రాక్టర్ ఇసుకను రూ. 3 వేలకు అమ్ముకుంటున్నారు. రీచ్ల నుంచి మాత్రమే ట్రాక్టర్లు, టిప్పర్లలో తరలించాల్సి ఉంది. అయితే తుంగభద్ర నదిలో రీచ్లు లేకున్నా ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తున్నారు. అడ్డుకుని.. హంగామా సృష్టించి తుంగభద్ర ఇసుకను అక్రమంగా తరలించడంలో కర్నూలు మండలానికి చెందిన టీడీపీ నేత అనుచరులు బృందంగా ఏర్పడ్డారు. అలాగే మంత్రి పేరు చెప్పి కార్పొరేటర్ కుటుంబం సభ్యులు సైతం ఇసుకను తరలిస్తున్నట్లు విమర్శలు ఉన్నారు. ఇసుక దోపిడీకి వీరు ప్రాంతాలను ఏర్పచుకున్నారు. ఇటీవల మంత్రి పేరు చెప్పి సంకల్బాగ్, పాత తుంగభద్ర పంపింగ్ హౌస్ వద్ద ఇసుకను తరలిస్తుండగా కర్నూలు మండల టీడీపీ నేత అనుచరులుగా ఉన్న వారు అడ్డుకున్నారు. ఇసుక ట్రాక్టర్కు అడ్డంగా పడుకొని నానా హంగామా సృష్టించారు. ‘ తమ ప్రాంతంలో ఇసుకను ఎలా తరలిస్తున్నారు’ అంటూ గొడవకు దిగారు. టీడీపీ నేత పంచాయితీ కర్నూలు నగర శివారులోని తుంగభద్ర నదిలో ఇసుక తరలించే విషయంలో జరుగుతున్న గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు టీడీపీ నేత పంచాయతీ చేశారు. ఇరు వర్గాల వారితో మాట్లాడారు. ఈ పంచాయితీలో ‘ ఇసుక మనది.. కలసి పంచుకుందాం.. గొడవలు వద్దు.. అందరం పంచుకుందాం’ అన్న అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ‘మీ ప్రాంతంలోకి మా వారు.. వారి ప్రాంతంలోకి మీరు రాకూడదు’ అంటూ టీడీపీ నేత ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇదీ దుస్థితి.. ● తుంగభద్ర నది నుంచి ప్రెవేటు ట్రాక్టర్ల అసోసియేషన్ వారు సైతం టీడీపీ నేతల నాయకుల పేర్లు చెప్పి ఇసుకను తరలిస్తున్నారు. ● ఒంటెద్దు బండ్లకు ఉచితంగా ఇసుకను తీసుకునే పోయే అవకాశం ప్రభుత్వం కల్పించినా పట్టించుకునే ఽనాధుడు లేడు. ● ఇసుక దందాపై అధికారులు తమకేం సంబంధం లేదని వ్యవహరిస్తున్నారు. -
నేటి నుంచి ఆటోమేటిక్ ఫిట్నెస్ పరీక్షలు
కర్నూలు: రవాణా శాఖ పరిధిలో వాహన సామర్థ్య పరీక్షలు (ఫిట్నెస్ టెస్ట్) సులభతరం కానున్నాయి. జిల్లాలో భారీ వాహనాలు, రవాణా వాహనాలకు ఆటోమేటిక్ ఫిట్నెస్ టెస్ట్(ఏటీఎస్) స్టేషన్ వసుధ ఇండస్ట్రీస్ ఏజెన్సీ దక్కించుకుంది. కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద ఏర్పాటు చేశారు. జిల్లా పరిధిలో సుమారు లక్షకు పైగా రవాణా వాహనాలు ఉన్నాయి. ఇప్పటివరకు వాటికి మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్లు (ఎంవీఐ) ప్రత్యక్షంగా తనిఖీ చేసి ధృవపత్రాలను జారీ చేస్తున్నారు. ఇకపై ఆ విధానానికి స్వస్తి పలికి ఏటీఎస్ ద్వారా వాహన సామర్థ్య పరీక్షలు పూర్తిస్థాయిలో నిర్వహించి ధృవపత్రాలు జారీ చేయనున్నారు. ఇప్పటివరకు కర్నూలు ఉప రవాణా శాఖ కార్యాలయం, ఆదోని ప్రాంతీయ కార్యాలయంలో ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు స్వయంగా ఎంవీఐలే జారీ చేశారు. ప్రభుత్వ తాజా ఉత్తర్వుల మేరకు నేటి నుంచి (16వ తేదీ) ఫిట్నెస్ సేవలు రవాణా శాఖ కార్యాలయాల్లో నిలిపివేశారు. నంద్యాల జిల్లాలో చాబోలు వద్ద ఈనెల మొదటి వారంలోనే ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ను ప్రారంభించగా.. కర్నూలు జిల్లాలో చిన్నటేకూరు వద్ద శుక్రవారం నుంచి ఏటీఎస్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఏటీఎస్ ద్వారా 54 రకాల పరీక్షలు చేస్తారు. ఇదిలాఉంటే ఉమ్మడి జిల్లాలో కేవలం రెండు కేంద్రాలే ఏర్పాటు చేయడం, మిగిలిన ప్రాంతాల వాసులు అక్కడికి వెళ్లాలంటే అవస్థలు తప్పేలా లేవు. ఆదోనికి చెందిన వాహనదారులు చిన్నటేకూరు వద్దకు, డోన్కు చెందిన వాహనదారులు చాబోలు కేంద్రానికి వెళ్లాలంటే సుమారు 60 నుంచి 80 కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సి ఉండటం గమనార్హం. ఇదే సమయంలో ముందస్తు సమాచారం లేకుండా రవాణా శాఖ కార్యాలయాల్లో ఫిట్నెస్ సేవలు నిలిపివేయడంతో రెండు రోజుల ముందే ఆన్లైన్లో స్లాట్ పొందిన గూడ్స్ వాహన యజమానులు అయోమయంలో పడ్డారు. కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద ప్రయివేట్ స్టేషన్ రవాణా శాఖ కార్యాలయాల్లో ఎఫ్సీ సేవలు నిలుపుదల -
వేసవిలో ఎమ్మిగనూరు ‘పులి’కింత
● నీటి ఎద్దడిని నివారిస్తున్న పులికనుమ రిజర్వాయర్ ● ఈ నెల 21 తరువాత నుంచి పట్టణానికి నీటి సరఫరా ● వైఎస్సార్ చలువతో ‘పులికనుమ’ నిర్మాణం ఎమ్మిగనూరు టౌన్: వేసవిలో ఎమ్మిగనూరు పట్టణ ప్రజల దాహాన్ని పులికనుమ రిజర్వాయర్ నీరు తీర్చనుంది. ఇందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. ఈనెల 21 నుంచి ‘పులికనుమ’ నుంచి నీటిని విడుదల చేయనున్నారు. ఆ నీటిని ఎస్ఎస్ ట్యాంక్లో నింపితే మళ్లీ వర్షాలు పడే వరకు నీటి ఎద్దడి ఉందని అధికారులు చెబుతున్నారు. ఇదీ పరిస్థితి.. ఎమ్మిగనూరు పట్టణంలో లక్షకు పైగా ప్రజలు నివాసం ఉంటున్నారు. వీరి దాహార్తిని తీర్చేందుకు గుడికల్ చెరువులో 526 మిలియన్ లీటర్ల నీటిని, సమ్మర్ స్టోరేజి ట్యాంక్లో 87 మిలియన్ లీటర్ల నీటిని అధికారులు నిల్వ చేశారు. వీటి ద్వారా పట్టణంలో ఉన్న 4 ట్యాంక్లతో 13 వేల కుళాయిలకు మంచినీటి సరఫరా చేస్తున్నారు. అయితే ఈ ఏడాది నీటి సమస్య ఉత్పనం అయ్యే సూచనలు కనిపించాయి. దీంతో పులికనుమ రిజర్వాయర్లో నిల్వ ఉంచిన నీటిని తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ)కు మళ్లించి ఎస్ఎస్ ట్యాంక్ను నింపేందుకు అఽధికారులు చర్యలు చేపట్టారు. పులికనుమ రిజర్వాయర్ను మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, డీఈ నీరజ, ఏఈ శరత్కుమార్ తదితరులు సందర్శించారు. నీటి విడుదలపై చర్చించారు. వైఎస్సార్ చలువ.. గతంలో ఎల్లెల్సీ ద్వారా నీటి సరఫరా నిలిచిపోతే ఎమ్మిగనూరు పట్టణంలో మంచినీటి ఎద్దడి ఏర్పడేది. ట్యాంక్లకు నీటి సరఫరా లేక గుక్కెడు నీటికోసం పట్టణ వాసులు ఇబ్బంది పడేవారు. అప్పట్లో ఎమ్మిగనూరు ఎమ్మెల్యేగా ఉన్న చెన్నకేశవరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. పులికనుమ రిజర్వాయర్ నిర్మించాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెనువెంటనే రిజర్వాయర్ నిర్మాణానికి అనుమతులు మంజూరు కావడం, నిధులను విడుదల కావడంతో నిర్మాణం పూర్తయ్యింది. ఇలా ఉపయోగం.. తాగు, సాగునీటి అవసరాలకు పులికనుమ రిజర్వాయర్ ఉపయోగపడుతోంది. ఏటా వేసవికి ముందు పులికనుమ రిజర్వాయర్లో నీరు నిల్వ చేస్తారు. వేసవిలో పులికనుమ నీటిని ఎల్లెల్సీ ద్వారా ఎమ్మిగనూరు పట్టణంలోని ఎస్ఎస్ ట్యాంక్, గుడికల్ చెరువుకు తరలిస్తారు. ఆ నీటిని ఎమ్మిగనూరు పట్టణ వాసులకు అందిస్తారు. ముందు చూపుతో నిర్మించిన పులికనుమ రిజర్వాయర్ పట్టణ వాసులకు అత్యవసర సమయంలో ఆదుకుంటూ నీటి ఎద్దడి రాకుండా ఉపయోగపడుతోంది. దీంతో పట్టణ వాసులు మహానేత వైఎస్సార్, మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి చేసిన మేలును మరువలేకపోతున్నారు. నీటి సమస్య ఉండదు ఎమ్మిగనూరు పట్టణానికి వేసవిలో ఎలాంటి నీటి సమస్య ఉండదు. ప్రస్తుతం ఎస్ఎస్ ట్యాంక్, గుడికల్ చెరువుల్లో ఉన్న నీరు నెలాఖరు వరకు ఉపయోగడుతుంది. పులికనుమ రిజర్వాయర్లో ఉన్న నీటిని ఇవ్వాలని సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడాను. వారు సానుకూలంగా స్పందించారు. మరో 45 రోజుల పాటు ఎమ్మిగనూరు పట్టణంలో మంచినీటి సమస్య తలెత్తదు. – గంగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ -
వ్యాధి బయటపడే కాలం
కర్నూలు(హాస్పిటల్): జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోనూ పారిశుధ్యం అధ్వానంగా ఉంది. మురుగుకాల్వలు నిండిపోవడంతో దోమలకు అవి ఆవాసంగా మారాయి. తరచూ వర్షాలు కురవడంతో ఖాళీ ప్రదేశాల్లో నీరు నిలుస్తోంది. అందులో దోమలు గుడ్లు పెట్టి అవి లార్వాలుగా మారి దోమల ఉత్పత్తి పెరుగుతోంది. ప్రధానంగా డెంగీ కారక ఏడిస్ ఈజిప్టై దోమ దోసెడు నీళ్లు చాలు అందులో పెరుగుతుంది. ఈ కారణంగా ఇళ్లు, దుకాణాల పరిసరాల్లో వాడి పారేసిన కొబ్బరి బోండాలు, కొబ్బరి చిప్పలు, పాతటైర్లు, ఇతర వస్తువుల్లో నీరు నిల్వ ఉండి అందులో డెంగీ దోమలు పెరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు మున్సిపల్, పంచాయతీ సిబ్బంది పారిశుధ్య కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించకపోవడం, గత ప్రభుత్వం చేపట్టిన పారిశుధ్య కార్యక్రమాలకు కూటమి ప్రభుత్వం మంగళం పాడటంతో దోమల ఉత్పత్తి అధికమవుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఈ నెల 13వ తేదీ వరకు జిల్లాలో ఆదోని మండలంలో ఒకటి, పెద్దకడుబూరులో 2, మంత్రాలయంలో 2, కర్నూలులో 9, ఓర్వకల్లో 3, పత్తికొండలో 4, కల్లూరులో 5, గూడూరులో 4, ఎమ్మిగనూరులో 10, సి.బెళగల్లో 13, దేవనకొండలో 3, తుగ్గలిలో 2, క్రిష్ణగిరిలో 3, గోనెగండ్లలో 4, వెల్దుర్తిలో 3, ఆస్పరిలో 3, నందవరంలో 1, చిప్పగిరిలో 2, కోడుమూరులో 5, కౌతాళం మండలంలో ఒకటి, కర్నూలు అర్బన్లో 16, ఆదోని అర్బన్లో 1, ఎమ్మిగనూరు అర్బన్లో 4, గూడూరు అర్బన్లో 3 కేసులు నమోదయ్యాయి. డెంగీ ఎలా వస్తుందంటే...! ఆర్ధో వైరస్ తరగతికి చెందిన నాలుగు రకాల డెంగీ వైరస్ల వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఇది మనిషి నుంచి మనిషికి ఏడిస్ ఈజిప్టై దోమల ద్వారా సంక్రమిస్తుంది. ఆడ ఏడిస్ ఈజిప్టై దోమకాటు ద్వారా ఈ వ్యాధి వస్తుంది. ఈ జాతి దోమ పైన నల్లని, తెల్లని చారలు ఉండటం వల్ల దీనిని టైగర్ దోమ అని కూడా పిలుస్తారు. ఈ దోమలు ఇంటిలోపల, ఆవరణలో ఉంటాయి. డెంగీ వైరస్తో ఇన్ఫెక్ట్ అయిన దోమలోనే గాకుండా దోమ గుడ్లలో కూడా ఈ వైరస్ ఉంటుంది. కాబట్టి త్వరితగతిన ఎక్కువ మందికి ఈ వ్యాధి వ్యాపించే అవకాశం ఉంటుంది. ఈ దోమ మంచినీటి నిల్వలలో మాత్రమే గుడ్లు పెడుతుంది. ఈ వైరస్ వల్ల ఒకటి కంటే ఎక్కువసార్లు డెంగీ రావచ్చు. ఈ వ్యాధిని డెంగీ జ్వరం, డెంగీ హెమరేజ్ జ్వరం, డెంగీ షాక్ సిండ్రోమ్గా విభజిస్తారు. వ్యాధి నిర్ధారణ.. డెంగీ జ్వరం నిర్ధారించేందుకు మొదటి వారంలో ఎన్ఎస్1 ర్యాపిడ్ కిట్తో పరీక్షను అన్ని పీహెచ్సీలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహిస్తారు. రెండవ వారంలో వ్యాధి తీవ్రతను బట్టి ధ్రువీకరణ పరీక్ష ‘మాక్ ఎలీసా’ పరీక్షలు బోధనాసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల్లో చేస్తారు. ఈ పరీక్షలో ధ్రువీకరించితేనే అది డెంగీగా నిర్ధారణ అవుతుంది. డెంగీ నివారణకు చర్యలు జిల్లా వ్యాప్తంగా డెంగీ నివారణ చర్యలు తీసుకుంటున్నాం. కేసు నమోదైన ఇంటి చుట్టుపక్కల 50 ఇళ్లల్లో పైరిత్రమ్ స్ప్రే చేస్తున్నాం. నీళ్లు నిలిచిన చోట యాంటిలార్వా చర్యలు తీసుకుంటున్నాం. దోమలు ఎక్కువగా ఉంటే మున్సిపల్, పంచాయతీ శాఖల సహకారంతో ఫాగింగ్ ఆపరేషన్ చేస్తున్నాం. వెయ్యి జనాభాలో ఇద్దరి కంటే ఎక్కువ పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతంలో 45 రోజులకు ఒకసారి డీడీటీ స్ప్రే చేయిస్తున్నాం. – నూకరాజు, జిల్లా మలేరియా అధికారి, కర్నూలు డెంగీ వైరస్ ఇన్ఫెక్ట్ అయిన దోమకాటు తర్వాత మూడు నుంచి 14 రోజుల్లో డెంగీ వ్యాధి రావచ్చు. ఈ వైరస్తో ఇన్ఫెక్ట్ అయిన తర్వాత సాధారణంగా 80 శాతం మందికి దానంతటదే తగ్గిపోతుంది. వీరికి ఎర్రటి దద్దుర్లు వచ్చిన సమయంలో రక్తంలో ప్లేట్లెట్లు తగ్గినా సాధారణ స్థితికి చేరుకుంటారు. మిగతా రెండు రకాలలో (డెంగీ హెమరేజ్, డెంగీ షాక్ సిండ్రోమ్) రక్తంలో ఈ ప్లేట్లెట్లు బాగా తగ్గడం వల్ల వీరికి ఆసుపత్రిలో చికిత్స అవసరం అవుతుంది. -
శ్రీమఠంలో భక్తుల సందడి
మంత్రాలయం: శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో భక్తుల సందడి నెలకొంది. గురువారం ప్రత్యేకం కావడంతో భక్తులు వేలాదిగా తరలివచ్చారు. తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గ్రామ దేవత మంచాలమ్మ, రాఘవేంద్రుల మూల బృందావనం దర్శనాలు చేసుకున్నారు. రాఘవేంద్రుల బృందావన దర్శనానికి రెండు గంటలకుపైగా సమయం పట్టింది. భక్తుల రాకతో దర్శన క్యూలైన్లు, అన్నపూర్ణ భోజనశాల, పరిమళప్రసాదం కౌంటర్లు కిటకిటలాడాయి. నిత్య వేడుకల్లో భాగంగా రాయరు ప్రతిమకు ఊంజల మంటపంలో ప్రత్యేక ఆర్జిత సేవలు చేశారు. అనంతరం బంగారు పల్లకీలో రాయరు బృందావన ప్రతిమను రమణీయంగా ఊరేగించారు.శ్రీమఠం ప్రాంగణంలో భక్తులు -
అదృశ్యం కేసులో ఆద్యంతం మలుపులు
● గత నెల 26వ తేదీన అదృశ్యమైన వ్యక్తి హత్య? ● అనుమానితులను విచారిస్తున్న పోలీసులు సాక్షి, టాస్క్ ఫోర్స్: మండల కేంద్రమైన గడివేములకు చెందిన గొర్రెల కాపరి గువ్వల రాజు అదృశ్యం కేసు ఆద్యంతం మలుపులు తిరుగుతోంది. తన తమ్ముడు రాజు కనిపిచడం లేదని అన్న జనార్దన్ గత నెల 26వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసుల దర్యాప్తులో కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. విచారణ చేస్తుండగా గ్రామంలోని ఓ రైతు మొక్క జొన్న పొలంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఆనవాళ్లు లభించడంతో ఈనెల 10వ తేదీన అనుమానాస్పద మృతి కింద మరో కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. గువ్వల రాజును కొందరు వ్యక్తులు దారుణంగా హత్య చేసి, శవాన్ని మాయం చేసే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. గొర్రెల కాపరి రాజు కొన్నేళ్లుగా ఒంటరిగా ఉంటూ మద్యానికి బానిసయ్యాడు. ఇదే క్రమంలో భార్యాపిల్లలు కూడా అతడిని వదిలేశారు. దీంతో అక్కడక్కడా గొర్రెల కాపరిగా వెళ్తూ వచ్చే కూలీ డబ్బుతో జీవించేవాడు. అయితే మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన కొంత మంది యువకులు కలిసి రాజును హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసినట్లు సమాచారం.దారుణంగా హత్య చేసి గుర్తు పట్టకుండా మృత దేహంపై యాసిడ్, పెట్రోల్ పోసి దహనం చేసినట్లు సమాచారం. ఆ తర్వాత అస్తిపంజరంలో చిన్న ఎముకలను విసిరేసి పెద్ద ఎముకలను పిండి చేసి పొలంలో పడేసినట్లు తెలిసింది. అనుమానితులను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. హత్యకు పాల్పడిన స్థలానికి నిందితుల ను తీసుకెళ్లి విచారణ చేశారు. నిందితులను రెండు రోజుల్లో అరెస్టు చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
కార్పొరేషన్ అధికారుల పనితీరుకు టన్నుల కొద్దీ కదులుతున్న వ్యర్థాలే నిదర్శనం. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక అధికారుల పనితీరు ఏ స్థాయిలో దిగజారిందో ఎక్కడికక్కడ పేరుకుపోయిన చెత్త చెప్పకనే చెబుతోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కర్నూలు కార్పొరేషన్ క్లీన్ అం
టన్నుల కొద్దీ వ్యర్థాలు ● కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారి తొలగింపు ● వెయ్యి మందికి పైగా సిబ్బంది ఉన్నా ఎక్కడి చెత్త అక్కడే ● గత ప్రభుత్వ పారిశుద్ధ్య కార్యక్రమాలకు సెలవు ● ఇటీవల 200 మంది తాత్కాలిక సిబ్బంది నియామకం ● అయినప్పటికీ చెత్త నిర్వహణలో చిత్తశుద్ధి కరువు ‘ఒక్కరోజు’ హడావుడి! పది నెలలుగా పారిశుద్ధ్యంపై దృష్టి సారించని అధికారులు ఇప్పుడు హడావుడి చేస్తున్నారు. కాలువల్లో మురుగు పేరుకుపోయినా.. చెత్తకుండీలు పొంగిపొర్లినా అధికారులు ముక్కుమూసుకుని వెళ్లిపోయారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక అధికారుల్లో చిత్తశుద్ధి లోపించడంతో నగరం చెత్తమయమైంది. ఇన్ని నెలలుగా నిద్రపోతున్న అధికారులు ఒక్కరోజు సీఎం కార్యక్రమానికి హడావుడి చేస్తున్న తీరు పట్ల ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ప్రతిరోజూ వందలాది మంది సిబ్బంది పనిచేస్తుంటే.. ఇప్పుడు టన్నుల కొద్దీ వ్యర్థాలు ఎలా వస్తున్నాయో సమాధానం చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు అప్పుడు.. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లో క్లీన్ అండ్ గ్రీన్, క్లీన్ సిటీలో భాగంగా 2018 సంవత్సరంలో 221 ర్యాంకు సాధించింది. ఆ తరువాత వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కర్నూలు కార్పొరేషన్లో దేశ వ్యాప్త ర్యాంకులో 2019 సంవత్సరంలో 187, 2020 సంవత్సరంలో 197 ర్యాంకు.. 2021 సంవత్సరంలో 75వ ర్యాంకు, 2022 సంవత్సరంలో 55వ ర్యాంకు.. 2023 సంవత్సరంలో రికార్డు స్థాయిలో 32వ స్థానం సాధించడం విశేషం. అప్పట్లో పారిశుద్ధ్య విభాగంలో ప్రభుత్వం తీసుకున్న మెరుగైన కార్యక్రమాల వల్లే ఇది సాధ్యమైంది. చెత్తలేని నగరంగా తీర్చిదిద్దడంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ చేపట్టారు. తడిచెత్త, పోడిచెత్త వేరు చేయడంతో పాటు 1.25 మొక్కలు నాటి గ్రీన్ సిటీగా తీర్చిదిద్దారు. ఇప్పుడు.. క్లీన్ అండ్ గ్రీన్ ఊసే లేదు. ప్రత్యేకించి నిధులు రాలేదు. ఎక్కడి చెత్త అక్కడే దర్శనమిస్తోంది. మురుగు కాల్వలను శుభ్రం చేయడంలేదు. ఇంటింటి చెత్త సక్రమంగా అమలు కావడం లేదు. తడిచెత్త లేదు. పోడి చెత్త లేదు. అన్ని డివిజన్లలో అదే పరిస్థితి. చెత్త సేకరణలో కొత్తగా సంస్కరణల సంగతి దేవుడెరుగు.. గత ప్రభుత్వంలో చక్కగా పనిచేస్తున్న క్లాప్ (క్లీన్ ఆంధ్రప్రదేశ్) ఆటోలను ఆటకెక్కించారు. దాదాపు 90 మందికి పైగా తాత్కాలిక ఉద్యోగులకు వేతనాలు ఇవ్వకుండా పక్కన పెట్టారు. దీంతో పారిశుద్ధ్య సమస్య మళ్లీ మొదటికొచ్చింది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక తమ్ముళ్ల కోసం అంటూ ప్రతి శానిటేషన్ డివిజన్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల పేరుతో రూ.2 కోట్లు ఖర్చు చేసినా ఆశించిన ఫలితాలు రాకపోవడం గమనార్హం. కర్నూలు(టౌన్): రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వచ్చంధ్ర, స్వచ్ఛా సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా ఈనెల 17న కర్నూలులో పర్యటించనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రతి నెలా మూడవ శనివారం ఈ కార్యక్రమం చేపడుతోంది. ఇంకేముంది. సీఎం వస్తున్నాడని ఎన్నడూ లేని విధంగా మున్సిపల్ పారిశుద్ధ్య విభాగం మొత్తం వీధుల్లోకి వచ్చింది. ప్రతి రోజు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేస్తున్నా.. అక్కడ పెద్ద ఎత్తున్న వ్యర్థాలు బయట పడుతుండటం చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. సంబంధిత శానిటరీ ఇన్స్పెక్టర్, మేసీ్త్రలు, సచివాలయాల ఉద్యోగులు సరైన పర్యవేక్షణ చేస్తే గుట్టల కొద్దీ వ్యర్థాలు ఎలా బయటపడుతాయని ప్రశ్నిస్తున్నారు. సి.క్యాంపులో ప్రతి రోజు 50 టన్నులకు పైగా వ్యర్థాలు వస్తాయని తెలిసినా పారిశుద్ధ్య అధికారులు పెద్దగా దృష్టి సారించకపోవడం వల్లే ఇప్పుడు మొత్తం యంత్రాంగం శ్రమించాల్సి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 970 మంది ఉద్యోగులు పనిచేస్తున్నా.. ఎక్కడి చెత్త అక్కడే! కర్నూలు నగరంలో 970 మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తుండగా.. శానిటరీ ఇన్స్పెక్టర్లు, మేసీ్త్రలు, ప్రతి సచివాలయాల పరిధిలో సచివాలయాల వార్డు కార్యదర్శులు ఉన్నారు. ప్రతి రోజు 250 మెట్రిక్ టన్నుల చెత్త వ్యర్థాలు తరలించాల్సి ఉంది. సిబ్బంది ఉన్నారు.. వాహనాలు ఉన్నా.. పర్యవేక్షణ లోపించడంతో ఎక్కడి చెత్త అక్కడే ఉండిపోతోంది. ఇక పాతబస్తీలో పరిస్థితి చెప్పనలవి కాదు. రికార్డుల్లో మాత్రం చెత్తను నగర శివారలోని గార్గేయపురానికి తరలిస్తున్నా.. నగరం ప్రతి రోజూ కంపు కొడుతోంది. ప్రయివేట్ టెండర్తో కాల్వల శుభ్రం రెండు వారాల క్రితం కర్నూలు కార్పొరేషన్ పరిధిలో మెయిన్ డ్రైన్లను శుభ్రం చేసేందుకు రూ.2 కోట్లు ఖర్చు చేస్తున్నారు. 52 వార్డుల్లో ప్రధాన మురుగు కాల్వలను శుభ్రం చేయిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రయివేటు టెండర్ ద్వారా ఈ పనులు నిర్వహిస్తున్నారు. 970 మంది కార్మికులు చేస్తున్న పనినే ప్రత్కేక పారిశుద్ధ్య కార్యక్రమాల పేరుతో నగరంలో మళ్లీ డ్రైనేజీ క్లీనింగ్ పనులు చేయిస్తుండటం విస్తుగొలుపుతోంది. ఇది మూమ్మాటికీ మురుగు నిధుల దుర్వినియోగం కాదా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. తాత్కాలిక ఉద్యోగుల ఇష్టారాజ్యం కర్నూలు కార్పొరేషన్లో సిబ్బంది ఉన్నా పర్యవేక్షణ లేకపోవడంతోనే పారిశుద్ధ్య సమస్యకు అసలు కారణంగా తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పారిశుద్ధ్య విభాగంలో సిబ్బంది కొరత పేరిట 200 మంది తాత్కాలిక ఉద్యోగులను నియమించారు. రూ.10 వేల వేతనంతో పనిచేస్తున్న వీరు విధుల్లోకి వచ్చినట్లు థంబ్ వేయడం(వేలిముద్ర), ఐరిష్ తీసుకోవడం లేకపోవడంతో విధులకు డుమ్మా కొట్టడం పరిపాటిగా మారింది. ఇదేమని ప్రశ్నించే శానిటరీ సిబ్బందికి రెండు చేతులు తడుపుతున్నట్లు తెలుస్తోంది. వీరికి ఏటా రూ.2 కోట్లు నగరపాలక సంస్థ ఖర్చు చేస్తున్నా ఆశించిన ఫలితాలు లేకపోవడం చూస్తే పారిశుద్ధ్య నిర్వహణ విషయంలో ఉద్యోగుల చిత్తశుద్ధి అర్థమవుతోంది. -
ఆర్టీసీ బస్సు, లారీ ఢీ
● నలుగురికి గాయాలు ఓర్వకల్లు: కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారిపై పూడిచెర్ల బస్సు స్టేజీ వద్ద గురువారం ఆర్టీసీ బస్సు, లారీ ఢీ కొనడంతో నలుగురికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ఎస్ఐ సునీల్ కుమార్ తెలిపిన వివరాల మేరకు కర్నూలు నుంచి నంద్యాల వైపు వెళ్తున్న లారీకి ఆవుల మంద అడ్డురావడంతో లారీ డ్రైవర్ తన లారీని అకస్మాత్తుగా స్లో చేయడంతో, వెనక వస్తున్న ఆళ్లగడ్డ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తూ లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పోలూరుకు చెందిన నిర్మల అనే వృద్ధురాలి తలకు రక్తగాయాలు కాగా, జోత్స్న, వసంతకుమారి, ధర్మతేజ స్వల్పంగా గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని స్థానిక సీహెచ్సీ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ఈ ఘటనపై ఇరు వాహనదారులు ఫిర్యాదు చేయకుండా, రాజీ కుదుర్చుకోవడంతో కేసు నమోదు చేయలేదని ఎస్ఐ తెలిపారు. వ్యక్తి ఆత్మహత్య కోసిగి: తుంబిగనూరు గ్రామానికి చెందిన తలారా నాగరాజు (27) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామంలో చేపల చెరువులలో రోజు వారి కూలి పనులుకు వెళ్లి జీవనం సాగిస్తున్న యువకుడు కొద్ది రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. భార్య నాగమ్మ పుట్టినిల్లు ఆదోని మండలం జాలమంచి గ్రామం. ఆమె 15 రోజులుగా నాగమ్మ చెల్లెలు పెళ్లి ఉందని పుట్టినింటికి వెళ్లిపోయింది. బుధవారం రాత్రి కడుపు నొప్పి తాళలేక నాగరాజు జీవితంపై విరక్తి చెంది తుంగభద్ర నది కాల్వ ఒడ్డున రేకుల షెడ్వద్ద ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీస్లకు సమాచారం అందించడంతో ఎస్ఐ హనుమంత రెడ్డి, ఏఎస్ఐ నాగరాజులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. మృతుడు తల్లి ఉచ్చీరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతినికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పిడుగు పాటుకు గొర్రెల కాపరి మృతి చాగలమర్రి: చిన్నబోధనం మజరా గ్రామమైన తిప్పన పల్లె గ్రామ సమీపంలో గురువారం తెల్లవారుజామున పిడుగుపాటుకు ఓ గొర్రెల కాపరి మృతి చెందాడు. వైఎస్సార్ జిల్లా తొండురు మండలం కోరవానిపల్లె గ్రామానికి చెందిన చంద్రశేఖర్ (29)తో పాటు మరో ఐదుగురు కలసి సుమారు వెయ్యికి పైగా గొర్రెలతో 15 రోజుల క్రితం తిప్పనపల్లెకు చేరుకున్నారు. గ్రామంలోని బీడు భూముల్లో జీవాలను మేపుతూ అక్కడే ఉంటున్నారు. చంద్రశేఖర్ వేప చేట్టు కింద నిద్రిస్తుండగా గురువారం తెల్లవారు జామున చెట్టుపై పిడుగు పడింది. ఆ శబ్దానికి చంద్రశేఖర్ గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందగా, అక్కడే ఉన్న మూడు మేకలు కూడా మృత్యువాత పడ్డాయి. సమాచారం అందుకున్న ఏఎస్ఐ షేక్ అబ్దుల్ నబి సంఘటనా స్థలానికి చేరుకుని గొర్రెల కాపరుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న చంద్రశేఖర్ మృతితో సంఘటన స్థలంలో తల్లి పద్మావతి, కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
సప్లిమెంటరీ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్
● ఒక కేసు నమోదు కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షల్లో గురువారం ఓ మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేసినట్లు ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ కార్యాలయ అధికారి గురవయ్య శెట్టి తెలిపారు. ఉదయం జరిగిన ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో 9,380 మంది విద్యార్థులకుగాను 8,963 మంది హాజరై 417 మంది గైర్హాజరయ్యారన్నారు. కర్నూలు బీక్యాంపులోని ప్రభుత్వ వొకేషనల్ కాలేజీలో ఓ విద్యార్థి మాల్ప్రాక్టీస్కి పాల్పడుతున్నట్లు గుర్తించిన తనిఖీ అధికారులు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. మధ్యాహ్నం జరిగిన సెకండియర్ పరీక్షలకు 1,277 మందికిగాను 1,203 మంది హాజరై 74 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. 17న కర్నూలుకు సీఎం చంద్రబాబు కర్నూలు(సెంట్రల్): సీఎం చంద్రబాబునాయుడు కర్నూలు పర్యటన ఖరారైంది. కర్నూలు రైతు బజార్లో జరిగే స్వచ్ఛంధ్రా–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం ప్రజావేదికలో పీ4 లబ్ధిదారులు, మార్గదర్శకులతో మాట్లాడేందుకు వీలుగా పర్యటనను ఖరారు చేశారు. 17న ఉదయం 11.25 గంటలకు సీఎం ప్రత్యేక విమానంలో కర్నూలు ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. 11.55 గంటలకు రోడ్డు మార్గంలో కర్నూలు సీక్యాంపు రైతు బజార్ను చేరుకొని 12.25 గంటల వరకు స్వచ్ఛంధ్ర కార్యక్రమంలో భాగంగా శానిటరీ వర్కుర్లు, రైతులతో మాట్లాడుతారు. 12.35 గంటలకు కేంద్రీయ విద్యాలయం పక్కన ఏర్పాటు చేసే కార్యక్రమంలో స్వచ్ఛంధ్రా –స్వర్ణాంధ్ర పార్కు, 100 అడుగుల రోడ్డుకు భూమి పూజ చేస్తారు. 2 నుంచి 3.30 గంటల వరకు కర్నూలు ప్రజలతో సంభాషిస్తారు. 3.35 నుంచి 5.05 గంటల వరకు క్యాడర్ మీటింగ్లో పాల్గొంటారు. అనంతరం ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్టుకు వెళ్తారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ రంజిత్బాషా, ఎస్పీ విక్రాంత్పాటిల్ ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఏపీ ఈసెట్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ కర్నూలు సిటీ: ఏపీ ఈసెట్ ఫలితాలను గురువారం అనంతపురం జేఎన్టీయూ అధికారులు విడుదల చేశారు. ఫలితాల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. కర్నూలు జిల్లాలో 1,261 మంది పరీక్షలకు హాజరుకాగా 1,146 మంది ర్యాంకులు పొందారు. నంద్యాల జిల్లాలో 791 మంది హాజరుకాగా 736 మంది ర్యాంకులు సాధించారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రూమెంటేషన్ ఇంజినీరింగ్లో ఓర్వకల్లు మండలం కేతవరం గ్రామానికి చెందిన దొమ్మల హేమంత్ రెడ్డి రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు సాధించారు. అదే విధంగా డోన్ మండలంలోని రామదుర్గం గ్రామానికి చెందిన అప్పల ప్రణీత్ రెడ్డికి 6వ ర్యాంకు వచ్చింది. బీఎస్సీ ఎంపీసీలో నందికొట్కూరు విద్యా నగర్కి చెందిన పెరుమళ్ల రాజేష్ 6వ ర్యాంకు, సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో ఎమ్మిగనూరుకి చెందిన కె.రఘు 6వ ర్యాంకు, ఈఈఈలో ఎమ్మిగనూరు ఎన్టీఆర్ కాలనీకి చెందిన మడుగుల అమర్నాథ్ 7వ ర్యాంకు, బనగానపల్లె గొల్లపేటకు చెందిన జి.శ్రీనివాసులు 10వ ర్యాంకు సాధించారు. ఫార్మాసీలో కర్నూలు బుధవారపేట హబీబ్ ముబారక్ నగర్కి చెందిన షేక్ ముస్కాన్ 6వ ర్యాంకు, షేక్ తజ్మీన్ 10వ ర్యాంకు సాధించారు. ‘సిల్వర్జూబ్లీ’లో వందశాతం ఫలితాలు కర్నూలు సిటీ: క్లస్టర్ యూనివర్సిటీ సిల్వర్జూబ్లీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ 6వ సెమిస్టర్ ఫలితాలను గురువారం ఆ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు విడుదల చేశారు. మొత్తం 216 మంది విద్యార్థులు పరీక్షలు హాజరుకాగా 216 మంది ఉత్తీర్ణులు అయ్యారన్నారని పరీక్షల విభాగం డీన్ డాక్టర్ కె నాగరాజు శెట్టి తెలిపారు. ఆ తరువాత రిజిస్ట్రార్ మాట్లాడుతూ.. సిల్వర్ జూబ్లీ కాలేజీ అంటే ఓ బ్రాండ్ అని, ఇక్కడ చదివిన వారందరు గొప్ప స్థానాల్లో ఉన్నారన్నారు. సిల్వర్జూబ్లీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ జి. శ్రీనివాస్, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ బాల కృష్ణయ్య శెట్టి, డాక్టర్ పి ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. -
అర్ధరాత్రి క్షుద్రపూజల కలకలం..!
కర్నూలు: పట్టణంలోని కర్నూలు – బెంగళూరు జాతీయ రహదారి పక్కన చెరుకులపాడు క్రాస్ రోడ్డులోని ఓ ఇంట్లో క్షుద్రపూజలు చేసి న ఫొటోలు, వీడియో లు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. ఓ వ్యక్తి మీద చేతబడి ప్రయోగించినట్లుగా తెలుస్తోంది. ఇందుకు పట్టణానికి చెందిన వ్యక్తి సూత్రధారిగా ఉండి కొందరి ఫొటోలతో, భయానక చేతబడి చేస్తున్నప్పటి ఫొటోలు, వీడియోలు వైరల్గా మారాయి. సేకరించిన సమాచారం మేరకు.. పట్టణానికి చెందిన వ్యక్తి సిఫారసుతో చెరుకులపాడు క్రాస్ రోడ్డులోని ఓ ఇంటిని అద్దెకు తీసుకున్న వారు అందులో చేతబడులు చేస్తూ, గుప్తనిధుల వేటగాళ్లకు ఆసరాగా ఉంటున్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మిగనూరుకు చెందిన వ్యక్తికి అప్పు ఉండ గా అప్పు ఎగ్గొట్టేందుకు ఏకంగా ఆ వ్యక్తిపై చేతబడి ప్రయోగం చేసినట్లు సమాచారం. ఇందులో పట్టణానికి చెందిన పంచాయతీ కార్యాలయంలో అనధికారికంగా పనిచేస్తున్నకార్మికుడి ఫొటో ఉంది. ఇటీవల ఉలిందకొండకు చెందిన వ్యక్తిపై కూడా ఇక్కడి నుంచే చేతబడి ప్రయోగం చేసినట్లుగా తెలుసుకున్న ఉలిందకొండ వారు ఈ ఇంటికి చేరుకుని ఇంట్లో ఉన్నవారితో గొడవ పడినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ ఇళ్లు కేంద్రంగా రెండు నెలల పాటు మండలం వ్యాప్తంగా గుప్తనిధుల వేట కొనసాగినట్లుగా సైతం తెలుస్తోంది. పోలీసులకు సైతం సమాచారం అందినా చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. -
భర్త మరణాన్ని జీర్ణించుకోలేక భార్య ఆత్మహత్య
ఉయ్యాలవాడ: విధి ఆటలో ఓ చిన్నారి అనాథగా మారింది. అభంశుభం తెలియని పసిపాప తొమ్మిది రోజుల వ్యవధిలో తల్లిదండ్రులను కోల్పోయింది. ఈ విషాద ఘటన ఆర్. పాంపల్లె గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పొగాకు నారాయణ కూలీ పనులకు వెళుతూ జీవనం కొనసాగించేవాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 6వ తేదీన గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి చెందిన మట్టి మిద్దె పనులకు వెళ్లాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తూ మిద్దె కూలి శిథిలాలు నారాయణపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పటి నుంచి అతని భార్య లలిత (40) తీవ్ర మనోవేదనకు గురైంది. మనస్తాపంతో వారం రోజులుగా ఆహారం తీసుకోకుండా భర్త గురించే ఆలోచించింది. తన 45 రోజుల చిన్నారికి కూడా పోతపాలు తాపింది. చివరకు జీవితంపై విరక్తి చెంది బుధవారం ఉదయం లలిత రసాయన పౌడర్ను నీళ్లలో కలుపుకుని అపస్మారక స్థితిలో పడిపోయింది. గమనించిన బంధువులు, స్థానికులు చికిత్స నిమిత్తం 108లో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నంద్యాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో లలిత మృతి చెందింది. తల్లిదండ్రుల మృతి చెంద డంతో 45 రోజుల చిన్నారి అనాథగా మిగిలింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పసిపాపకు తల్లిదండ్రులు లేకపోవడంతో నాయనమ్మ శివమ్మ దిక్కైంది. అమ్మపాల కోసం ఏడస్తున్న చిన్నారిని చూసి పలువురు కంటతడి పెట్టారు. కాగా నారాయణ మొదటి భార్య విజయలక్ష్మి ఐదేళ్ల క్రితం కుటుంబ కలహాలతో క్రిమి సంహారక మందు తాగి మృతి చెందింది. రెండేళ్ల క్రితం లలితను రెండవ వివాహం చేసుకున్నాడు. మృతురాలి తల్లి నారాయణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్.. ఇటీవల జిల్లాలో పలువురు ఆత్మహత్యకు కల్లాపికి ఉపయోగించే పేడ రంగును నీళ్లలో కలుపుకుని తాగి మృతి చెందుతుండటంతో కలెక్టర్ రాజకుమారి నెల క్రితం పేడ రంగు విక్రయాలను నిషేధించారు. అయినా కొందరు కిరాణ దుకాణ వ్యాపారులు విక్రయిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. పేడ రంగు విక్రయించకుండా అధికారులు దుకాణాలపై దాడులు చేయా లని గ్రామస్తులు కోరుతున్నారు. -
ఆడనే చంపేస్తున్నారు!
ఒక బిడ్డకు జన్మనివ్వాలన్నది ప్రతి స్త్రీ కల. ఆ కలను సాకారం చేసుకునే క్రమంలో సంతానలేమితో బాధపడే వారి వేదన అంతా ఇంతా కాదు. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు మాత్రం కడుపులో ఉన్నది ఆడబిడ్డ అని తెలియగానే చేతులారా అబార్షన్ చేయించుకుంటున్నారు. ఆడ బిడ్డ పుడితే అత్తింటి వేధింపుల భయంతోనే కొందరు కడుపులోనే పిండాన్ని నిర్ధా్దక్షిణ్యంగా తొలగించుకుంటున్నారు. ఈ కారణంగా సమాజంలో స్త్రీ, పురుషుల నిష్పత్తిలో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. ఆడపిల్లలు లభించక చాలా మంది పురుషులకు వివాహాలు కాని పరిస్థితి నెలకొంది. కర్నూలు(హాస్పిటల్): ‘భ్రూణ హత్యలు వద్దు.. ఆడ పిల్లలను బతకనిద్దాం.. లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు’.. అంటూ అధికారులు పలు వేదికలపైఈ అంశంపై అవగాహన కల్పిస్తున్నా ఇంకా కొందరిలో మార్పు రావడం లేదు. కర్నూలు జిల్లాలో భ్రూణ హత్యలు జరుగుతూనే ఉన్నాయి. వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం జిల్లాలో 240 స్కానింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇంకా కొత్తగా దరఖాస్తు చేసుకున్నవి 8, రెన్యువల్ కోసం వచ్చినవి మరో 15 దాకా ఉన్నాయి. వీటికి జిల్లా కమిటీ పరిశీలించి అనుమతులు జారీ చేయాల్సి ఉంది. అధికారికంగా ఉన్న స్కానింగ్ కేంద్రాలే గాక అనధికారికంగా జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల అనుమతులు లేకుండా స్కానింగ్ మిషన్లు ఏర్పాటు చేసుకుని స్కానింగ్ చేస్తున్నట్లు సమాచారం. వీటిలో కర్నూలుతో పాటు కోడుమూరు, గూడూరు, ఎమ్మిగనూరు, ఆదోనిలోని కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబ్లలో కొందరు వైద్యులు స్కానింగ్ ద్వారా లింగనిర్ధా్దరణ చేస్తున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో కడుపులో ఉన్నది ఆడబిడ్డ అని తెలిస్తే చాలు నిర్ధా్దక్షిణ్యంగా అబార్షన్(భ్రూణహత్య)లు చేయించుకుంటున్నారు. ఇందుకు సాక్ష్యంగా అప్పుడప్పుడూ కర్నూలు నగరంలోని కొత్తబస్టాండ్, ప్రభుత్వ సర్వజన వైద్యశాల పరిసర ప్రాంతాలు, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోని శివారు ప్రాంతాల్లో మృతశిశువులు వెలుగు చూస్తుంటాయి. ఇలా లభించిన వాటి గురించి ఏ ఒక్క అధికారి కూడా విచారణ చేసి చర్యలు తీసుకున్న దాఖలాలు ఇప్పటి వరకు జిల్లాలో నమోదు కాలేదు. అంతెందుకు గత పదేళ్లలో ఒక్క స్కానింగ్ కేంద్రం, వైద్యులపై కూడా స్కానింగ్ అక్రమాల గురించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గత ఏప్రిల్ నెలలో జిల్లాలో వైద్యుల బృందం 40 స్కానింగ్ కేంద్రాల పరిశీలనకు వెళ్లింది. అన్ని స్కానింగ్ కేంద్రాల్లో రికార్డులు, రిపోర్టులు, మిషన్లు, వైద్యుల వివరాలు, గర్భిణిల వివరాలు అన్నీ సక్రమంగా ఉన్నాయని అధికారులకు రిపోర్టు ఇవ్వడం గమనార్హం. ఆర్ఎంపీలకు నజరానాలు జిల్లాలో డోన్, కృష్ణగిరి, ఆదోని, పత్తికొండ, కోసిగి, హొళగుంద, పెద్దతుంబళం, చిన్నతుంబళం, మంత్రాలయం, ఎమ్మిగనూరు, గోనెగండ్ల, కౌతాళం వంటి వెనుకబడిన ప్రాంతాలే గాక తెలంగాణా, కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి సైతం స్కానింగ్ కోసం గర్భిణులు కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరుకు వస్తుంటారు. ఇందులో కొందరికి అప్పటికే ఆడపిల్లలు జన్మించి ఉండటంతో మళ్లీ ఆడబిడ్డ జన్మిస్తే కుటుంబంలో పెద్దలు ఒప్పుకోరని భావించి స్కానింగ్లో ఆడబిడ్డ అని తేలితే అబార్షన్ చేయించుకోవడానికి సిద్ధపడి వస్తారు. ఈ మేరకు కర్నూలులోని కొత్తబస్టాండ్, గాయత్రి ఎస్టేట్, బుధవారపేట, ఎన్ఆర్ పేట, కోడుమూరు, గూడూరు, ఎమ్మిగనూరు, ఆదోనిలోని కొన్ని ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాలకు గర్భిణులను తీసుకొస్తారు. లింగ నిర్ధారణతో పాటు అవసరమైతే భ్రూణహత్య(అబార్షన్) చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఈ తతంగంలో మొత్తం సూత్రధారులు ఎక్కువగా ఆర్ఎంపీలే ఉంటున్నారు. లింగనిర్ధారణకు రూ.4వేల నుంచి రూ.5వేలు, అబార్షన్కు రూ.15వేల నుంచి రూ.20వేల దాకా తీసుకుంటున్నారు. ఇందులో ఆర్ఎంపీలకు 20 నుంచి 40 శాతం వరకు కమీషన్ ముట్టజెబుతున్నారు. లింగనిర్ధారణ చేస్తే జైలుకే...కానీ...! భ్రూణహత్యల నివారణకు కేంద్ర ప్రభుత్వం 1994లో పీసీ పీఎన్డీటీ యాక్ట్ను తీసుకొచ్చింది. దీని ప్రకారం లింగనిర్ధారణ చేసినా, గర్భస్రావాలు చేయించినా ఇరువర్గాలను శిక్షించే వీలుంది. మొదటిసారి తప్పు చేస్తే మూడేళ్లు జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా, రెండోసారి తప్పు చేస్తే ఐదేళ్లు జైలు శిక్ష, రూ.50వేల జరిమానా విధిస్తారు. అయితే ఇప్పటి వరకు ఒక్కరిపై కూడా కేసు నమోదు చేసిన దాఖలాలు లేవు. ఈ చట్టం కింద ఏ ఒక్కరికీ శిక్ష పడదు. ఈ చట్టం ఒకటి ఉందని రోగులకు, గర్భిణిలకు తెలిసేటట్లు ఆయా స్కానింగ్ కేంద్రాల్లో పోస్టర్లు మాత్రం ప్రదర్శించి ఉంటాయి. కానీ కొన్నిచోట్ల అదే ప్రాంతాల్లో లింగనిర్ధారణ జరుగుతుంది. గతంలో 10 ఏళ్ల క్రితం వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కర్నూలు, కోడుమూరు, గూడూరు ప్రాంతాల్లో స్కానింగ్ సెంటర్లపై దాడులు నిర్వహించి స్కానింగ్ మిషన్లను సీజ్ చేశారు. అయితే సీజ్ చేసిన మిషన్ల పక్కనే మరో మిషన్ను తీసుకొచ్చి లింగనిర్ధారణ చేసిన వైద్యశిఖామణులు ఉన్నారు. ఆయా ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులకు రాజకీయ నాయకుల పలుకుబడి ఉండటంతో ఇలా సీజ్ చేస్తే అలా తెరిపించుకునే స్థాయిలో ఉన్నారు.తిరిగి దాడులు, తనిఖీలు నిర్వహిస్తాం జిల్లాలోని స్కానింగ్ కేంద్రాలను తరచూ తనిఖీలు నిర్వహిస్తున్నాము. ఈ మేరకు ఐదుగురు వైద్యులతో బృందాలను ఏర్పాటు చేశాం. ఈ బృందాలు గత ఏప్రిల్లో 40 స్కానింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. అయితే ఆయా కేంద్రాలను తిరిగి తనిఖీ చేసి వాస్తవ పరిస్థితులను నిగ్గు తేలుస్తాం. ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారి పేరు, వివరాలు బహిర్గతం గాకుండా చేసి, సదరు స్కానింగ్ కేంద్రంపై దాడులు నిర్వహిస్తాం. రెగ్యులర్గా ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాలపై దాడులు ముమ్మరం చేస్తాం. లింగనిర్ధారణ, అబార్షన్లు చేసే ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ పి.శాంతికళ, డీఎంహెచ్వో, కర్నూలు -
కాంగ్రెస్ నేత హత్య కేసులో మరో ఏడుగురి అరెస్టు
ఆలూరు రూరల్: ఆలూరు కాంగ్రెస్ ఇన్చార్జ్, రాయలసీమ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ హత్యకేసులో మరో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మేకల శ్రీనివాసులు, సారాయి పెద్దన్న, బోయ గోవిందు, బోయ రాము, వడ్డే నవీన్, జీర్ల ధనుంజయ, దొడ్ల మనోహర్లను బుధవారం ఉదయం అనంతపురం జిల్లా గుంతకల్లు–బళ్లారి రహదారిలోని విడపకల్లు వద్ద ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు జిల్లా ఏఎస్పీ హుసేన్ పీరా ఆధ్వర్యంలో పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య, సీఐ రవి శంకర్ రెడ్డి, చిప్పగిరి, ఆలూరు, హొళగుంద ఎస్ఐలు శ్రీనివాసులు, మహబూబ్ బాషా, దిలీప్ కుమార్లతో కలిసి బుధవారం ఆలూరులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితుల వివరాలు వెల్లడించారు. గత నెల 27వ తేదీన గుంతకల్లు సమీపంలోని రైల్వే బ్రిడ్జి వద్ద ఆలూరు కాంగ్రెస్ ఇన్చార్జ్ లక్ష్మీనారాయణ కారును లారీతో ఢీకొట్టి వేటకొడవళ్లతో నరికి చంపారన్నారు. ఓ భూ వివాదంలో లక్ష్మీ నారాయణ కలుగచేసుకుని గౌసియా, పెద్దన్న, గుమ్మనూరు నారాయణపై ఎస్సీ, ఎస్టీ కేసుల్లో ఇరికిస్తామని బెదిరించాడన్నారు. దీంతో ముగ్గురు కలసి లక్ష్మీనారాయణను అంతమొందించారన్నారు. ఈ కేసు విచారణలో భాగంగా మొదట 14 మందిపై కేసు నమోదు చేశామన్నారు. ఇందులో ఇప్పటికే బేపర్ గౌసియా, రాజేష్, సౌభాగ్యలను ఈ నెల 2వ తేదీ అరెస్టు చేసి రిమాండ్ తరలించామన్నారు. అనంతరం కోర్టు అనుమతితో వారిని కస్టడీలోకి తీసుకుని విచారించామన్నారు. ఈ మేరకు అదుపులో తీసుకున్న ఏడుగురు లక్ష్మీనారాయణను హత్య చేసినట్లు చెప్పారు. అలాగే గుమ్మనూరు నారాయణ ప్రమేయం ఉండడంతో మంగళవారం ఆయన్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. దీంతో ఈ హత్యకేసులో 15 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యిందన్నారు. కాగా లక్ష్మీనారాయణ కుమారుడు వినోద్ ఫిర్యాదు మేరకు వైకుంఠం ప్రసాద్, వైంకుంఠం మల్లికార్జున, మల్లేష్, చికెన్ రామాంజిలపై కేసు నమోదు చేయగా విచారణలో వారి ప్రమేయం లేదని తేలిందన్నారు. హత్య కేసులో ఇంకా ఎవరిదైనా పాత్ర ఉందని బాధితులు ఆధారాలతో నిరూపిస్తే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ హుసేన్ పీరా విలేకరుల సమావేశంలో వెల్లడించారు.