Kurnool
-
ఐక్యతతోనే కురువల అభివృద్ధి
ఆదోని అర్బన్: జిల్లాలో కురువలందరూ ఐక్యంగా ఉండి అన్ని రంగాల్లో రాణించాలని కురువ సంఘం నాయకులు అన్నారు. ఆదోని పట్టణంలోని భీరప్పనగర్లో వెలసిన బీరప్ప దేవాలయంలో ఆదివారం కురువ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.కె.మల్లికార్జున, జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున, కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప, సంఘం పెద్దలు కుబేర్నాథ్, జయరామ్, నాయకులు నాగరాజుగౌడ్ ఆధ్వర్యంలో కురువ సంఘం సమ్మేళనం జరిగింది. ముందుగా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి కనకదాసు చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కురువ సంఘం పెద్దలు, నాయకులు మాట్లాడుతూ.. ఒకరినొకరు సహాయం చేసుకుంటూ అభివృద్ధి చెందాలన్నారు. ప్రతిఒక్కరూ తమ పిల్లలను బాగా చదివించాలన్నారు. అనంతరం ఆదోని పట్టణాధ్యక్షుడిగా గోల్డ్ రఘును, మండలాధ్యక్షుడిగా చాగి మల్లికార్జునను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య జిల్లా అధ్యక్షుడిగా అరవింద ప్రసాద్
నంద్యాల(వ్యవసాయం): బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య జిల్లా అధ్యక్షుడిగా అరవింద ప్రసాద్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం స్థానిక రామకృష్ణ స్కూల్లో నిర్వహించారు. ఈ సమావేశంలో సభ్యుల ఆమోదం మేరకు ప్రస్తుత అధ్యక్షుడైన వెంకట రామరాజును అనివార్య కారణాల వలన తొలగించి, నూతన అధ్యక్షుడిగా చొపురాల అరవింద ప్రసాద్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు మాట్లాడుతూ.. సంఘ సభ్యుల సహకారంతో బ్రాహ్మణుల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. సభ్యుల సహకారంతో ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు విస్తృతం చేస్తామన్నా రు. సమావేశంలో సంఘ నాయకులు నివర్తి వెంకట మొహన్కుమార్, బాలమురళీ, ప్రభాకర శర్మ, రాజశేఖర్, శశికళ, విజయ్ కుమార్ శర్మ, కృష్ణమోహన్, లక్ష్మీ నరసింహ, ఆదినారాయణ, సుధీర్, మల్లిక, స్వర్ణలత, ప్రశాంతి, లక్ష్మీ కళ్యాణి, చెంచయ్య తదితర బ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు. -
‘సెస్సా’ దియ్యా!
● గ్రంథాలయాలకు బకాయి భారం ● అభివృద్ధికి ఆటంకంగా మారిన వైనంకర్నూలు కల్చరల్: దశాబ్దాలుగా పేరుకు పోయిన పన్నులు స్థానిక సంస్థల నుంచి రాక అక్షర జ్ఞానాన్ని అందించే గ్రంథాలయాల అభివృద్ధి అటకెక్కింది. కర్నూలు నగర పాలక సంస్థతో పాటు మున్సిపాలిటీలు, మేజర్ గ్రామ పంచాయతీలు, పంచాయతీల నుంచి సెస్సు వసూలు కావడం లేదనేది గ్రంథాలయాధికారులు చెబుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం 60 గ్రంథాలయాలు ఉన్నాయి. ఇందులో ఒకటి కేంద్ర గ్రంథాలయం, ఒకటి గ్రామీణ గ్రంథాలయం, 58 గ్రంథాలయ శాఖలు ఉన్నాయి. 39 సొంత గ్రంథాలయాలు ఉండగా 8 గ్రంథాలయాలు రెంట్ ఫ్రీ, 12 గ్రంథాలయాలకు అద్దె చెల్లిస్తున్నారు. వీటితో పాటు పుస్తక నిక్షిప్త కేంద్రాలు (బీడీసీ) ఉన్నాయి. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సుమారు 15 వేల మంది సభ్యులు ఉండగా మిగతా శాఖల్లో 70 వేల మంది ఉన్నారు. కేంద్ర గ్రంథాలయానికి రోజుకు 400 మంది వరకు పాఠకులు హాజరవుతుంటారు. మిగతా వాటికి సుమారు 12 వేల మంది పాఠకులు వస్తుంటారు. రూ. 20 కోట్ల మేర బకాయిలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో సుమారు రూ. 20 కోట్ల వరకు బకాయి ఉంది. ఇందులో కర్నూలు జిల్లాకు సంబంధించి రూ. 8.67 కోట్లు, కర్నూలు కార్పొరేషన్, మున్సిపాలిటీలు రూ. 5.32 కోట్లు, గ్రామ పంచాయితీలు రూ. 3.35 కోట్లు రావాల్సి ఉంది. నంద్యాల జిల్లాకు సంబంధించి మొత్తం రూ. 11.53 కోట్లు, మున్సిపాలిటీలు రూ. 10.01 కోట్లు, గ్రామ పంచాయతీలు రూ. 1.50 కోట్లు బకాయి రావాల్సి ఉంది. వీటిని చెల్లించాలని జిల్లా ఉన్నతాధికారులు, సంబంధిత శాఖల అధికారులకు విన్నవిస్తునే ఉన్నారు. ఆ మొత్తం వస్తే అభివృద్ధి పనులు, పుస్తకాల కొనుగోలు, నిర్వహణ, పేపర్ బిల్లులు, జీతభత్యాలు చెల్లింపులకు ఉపయోగ పడుతుందని ఉద్యోగులు చెబుతున్నారు. రెగ్యులర్గా సెస్సు చెల్లించే గ్రామ పంచాయతీలు ● మొలగవెల్లి, ఉయ్యాలవాడ, వెలుగోడు, గోస్పాడు, కోవెలకుంట్ల, ఆలూరు. సెస్సుచెల్లింపులో నిర్లక్ష్యంగా ఉన్న పంచాయతీలు ● వెల్దుర్తి, తుగ్గలి, రుద్రవరం, ప్యాపిలి, ఓర్వకల్, కల్లూరు, మంత్రాలయం, కొత్తపల్లి, కోడుమూరు, గడివేముల. గ్రంథాలయాలకు చెల్లించాల్సిన పన్నును స్థానిక సంస్థలు చెల్లించక పోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సుమారు రూ. 23.50 కోట్లు సెస్సు బకాయి ఉండేది. ఇటీవలే కర్నూలు నగర పాలక సంస్థ నుంచి రూ. 2 కోట్లు, నంద్యాల మున్సిపాలిటీ నుంచి రూ. 1.50 కోటి వసూలు అయింది. దీంతో కొంత ఉపశమనం కలిగింది. నిధుల లేమితో మరమ్మతులు చేయించడం, మౌలిక వసతుల కల్పన కష్టంగా మారింది. సెస్సు వసూలై పరిపాలన అనుమతులు లభిస్తే పనులు మొదలు పెడతాం. – కె. ప్రకాష్, కార్యదర్శి, జిల్లా గ్రంథాలయ సంస్థ -
వృద్ధురాలి మృతిపై విచారణ
కొలిమిగుండ్ల: అంకిరెడ్డిపల్లెలో విద్యుదాఘాతంతో వృద్ధురాలు కాశింశెట్టి లక్ష్మీదేవి మృతి చెందడంతో ఆదివారం ఆళ్లగడ్డ డీఎస్పీ శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. చింత చిగురు కోసేందుకు వెళ్తున్న ఆమె అప్పటికే కొద్ది రోజులు ముందు గాలి వానకు పడిపోయిన విద్యుత్ స్తంభం వద్ద దాటుకునే క్రమంలో అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై విచారించేందుకు డీఎస్పీ అంకిరెడ్డిపల్లె చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. స్తంభం పడిపోయిన విషయాన్ని సిబ్బంది దృష్టికి ఎవరైనా తీసుకెళ్లారా.. అని ఆరా తీశారు. అలాగే బాధిత కుటుంబ సభ్యులతో సమావేశమై ప్రమాదం చోటు చేసుకున్న తీరుతో పాటు పలు అంశాలపై చర్చించారు. విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకోకుండా గ్రామాల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఆయన వెంట సీఐ రమేష్బాబు, కోవెలకుంట్ల విద్యుత్ శాఖ ఏడీ సతీష్కుమార్రెడ్డి,అవుకు ఏఈ ఫక్కీరయ్య తదితరులు పాల్గొన్నారు. క్వింటా వేరుశనగ రూ.7,620 ఎమ్మిగనూరు టౌన్: స్థానిక వ్యవసాయ మార్కెట్లో ఆదివారం క్వింటం వేరుశనగ గరిష్టంగా రూ.7,620 ధర పలికింది.మార్కెట్కు 88 క్వింటాళ్ల వేరుశనగ దిగుబడులు విక్రయానికి వచ్చాయి. క్వింటం కనిష్ట ధర రూ.5,280, మధ్యస్థ ధర రూ.6,600 ప్రకారం వ్యాపారులు కొనుగోలు చేసినట్లు మార్కెట్ యార్డ్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు. ఆముదాలు మార్కెట్కు 6 క్వింటాళ్లు రాగా క్వింటం కనిష్ట ధర రూ,4,670, గరిష్ట ధర రూ.5,510 పలికింది. క్రేన్ డ్రైవర్ నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి ఆళ్లగడ్డ: క్రేన్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా శిల్పకళా కూలీ మృతి చెందిన విషాద సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది. ఆళ్లగడ్డ మండలం గూబగుండం గ్రామానికి చెందిన మునెయ్య (55) పట్టణంలోని శిల్పకళా మందిరాల్లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంటాడు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్న సమయంలో రోడ్డుపై నడుచుకుంటూ వస్తుండగా పెద్ద రాయి ఎత్తుకుని వెళ్తున్న క్రేన్ తగిలి కిందపడియాడు. అతనిపై క్రేన్ టైర్లు వెళ్లడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన జరిగిన వెంటనే క్రేన్ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న పట్టణ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. షార్ట్ సర్క్యూట్తో కారు దగ్ధం శ్రీశైలంప్రాజెక్ట్: సున్నిపెంట డిగ్రీ కళాశాల సమీపంలోని ప్రధాన రహదారిపై ఆదివారం సాయంత్రం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ కారు దగ్ధమైంది. మార్కాపురం జిల్లా కనిగిరికి చెందిన నాగేశ్వరరావు కుటుంబ సభ్యులతో కలిసి శనివారం శ్రీశైలం చేరుకున్నారు. ఆదివారం స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం సైట్సీయింగ్కు బయలు దేరారు. మార్గమధ్యలో సున్నిపెంట డిగ్రీ కళాశాల సమీపంలో కారులో నుంచి మంటలు రావడంతో అప్రమత్తమైన ఏడుగురు కుటుంబ సభ్యులు కారు దిగిపోయారు. క్షణాల్లో కారు పూర్తిగా దగ్ధమైంది. జింక మాంసం స్వాధీనం ఆదోని సెంట్రల్: చాగి గ్రామంలో ఫారెస్ట్ అధికారులు జింక మాంసం స్వాధీనం చేసుకున్నారు. సమాచారం మేరకు ఫారెస్ట్ అధికారిణి తేజశ్విని సిబ్బందితో ఆదివారం గ్రామానికి చేరుకుని తనిఖీ చేశారు. గ్రామానికి చెందిన చంద్రశేఖర్, హరికృష్ణ, గూళప్ప, శంకర్ జింక మాంసాన్ని వండేందుకు సిద్ధం చేస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. జింక మాంసం స్వాధీనం చేసుకున్నారు. మరో వ్యక్తి పరారైనట్లు తెలిసింది. మాంసం కృష్ణ జింకదిగా గుర్తించారు. అయితే కుక్కలు వెంబడించి జింకను చంపేశాయని పట్టుబడిన వారు చెబుతుండగా, వేటాడి చంపారా అనేది విచారణలో తేలుతుందని ఫారెస్ట్ ఆఫీసర్ తెలిపారు. కేసు నమోదు చేసి నిందితులను కోర్టుకు అప్పగిస్తున్నట్లు చెప్పారు. ఈ దాడుల్లో ఎఫ్బీఓ బాలకృష్ణ, షఫిఉల్లా, ఏబీఓ విజయ్ కుమార్ పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సులో కర్నూలు వాసి మృతి
చీరాల: ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడి గుండె ఆగింది. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలా డు. అందిన వివరాల మేరకు.. కర్నూలులోని ప్రకాష్నగర్కు నగర్ చెందిన కుమ్మరి కిరణ్ (38)కొద్ది రోజులు క్రితం కూలి పనుల నిమిత్తం వేటపాలెం మండలానికి ఐదుగురితో కలిసి వచ్చారు. గతంలోనే ఆరోగ్య సమస్యలు ఉండడంతో శనివారం గుంటూరు హాస్పిటల్లో చికిత్స చేయించుకుని ఆదివారం తిరుగు ప్రయాణంలో చీరాల వస్తున్నట్లు తెలిపారు. గుంటూరు నుంచి వస్తూ బాపట్లలో దిగి మరో బస్సు ఎక్కినట్లు తెలుస్తోంది. బస్సు చీరాల ఆర్టీసీ బస్టాండ్కు వచ్చి తిరిగి ఒంగోలుకు వెళ్తుండగా కండక్టర్కు అనుమానం వచ్చి నిద్రపోతున్నాడనుకుని కిరణ్ను పలుమార్లు లేపినా ఎటువంటి స్పందన లేదు. దీంతో అనుమానం వచ్చి బస్సును చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. డాక్టర్ పరిశీలించి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఔట్ పోస్టు పోలీసులు ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్ వద్ద నుంచి వివరాలు నమోదు చేశారు. అలానే చీరాల వన్టౌన్ పోలీసుస్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బస్సులో ఉన్న ప్రయాణికులను మరో బస్సులో ఎక్కించి పంపించి వేశారు. కిరణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కుటుంబ సభ్యులు ఏరియా వైద్యశాలకు వచ్చి పరిశీలించారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. -
భక్తుల ప్రాణాలకు ముప్పు!
మహానంది: మహానంది – గాజులపల్లె మార్గంలో రహదారికి ఇరువైపులా ఉన్న విద్యుత్ స్తంభాలు పక్కకు ఒరిగి ప్రమాదకరంగా మారాయి. ఈ మార్గంలో గాజులపల్లె రైల్వేస్టేషన్, వ్యవసాయ కళాశాల, ఉ ద్యాన పరిశోధనా స్థానం, శ్రీ వెంకటేశ్వర ఒంగోలు జాతి పశు పరిశోధనా స్థానం ఉన్నాయి. దీంతో నిత్యం వందలాది వాహనాల్లో రాకపోకలు సాగుతుంటాయి. దారికి ఇరువైపులా అక్కడక్కడ స్తంభాలు ఒరిగి పడిపోతాయేమో అన్నట్లు భయపెడు తున్నాయి. అసలే ఈదురు గాలులు అధికంగా వీస్తుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అధికారులు చర్యలు తీసుకుని ఒరిగిన విద్యుత్ స్తంభాలను సరి చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
మహానందిలో సండే సందడి
మహానంది: వేసవి సెలవులు ముగుస్తుండటంతో పాటు ఆదివారం కావడంతో మహానంది ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వేలాది మంది భక్తుల రాకతో ఆలయ ప్రాంగణాల్లో పండుగ వాతావరణం నెలకొంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు తరలి రావడంతో భక్తజన సంద్రంగా మారింది. రుద్రాభిషేకం, క్షీరాభిషేకం, శీఘ్రదర్శనం, మహా మంగళ హారతుల ఆర్జిత సేవా టికెట్ల ద్వారా భక్తులు శ్రీ కామేశ్వరీదేవి సహిత శ్రీ మహానందీశ్వరస్వామి వార్లతో పాటు కోదండ రామాలయం, వినాయకనంది, ఆంజనేయస్వామి, గరుడనంది ఆలయాలను సందర్శించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిర్విరామంగా దర్శనం ఏర్పాటు చేశారు. యువకుడి బలవన్మరణం ఓర్వకల్లు: నన్నూరు గ్రామంలో ఆదివారం ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన మంగలి మద్దిలేటి కుమారుడు బజారు (26) ఇంట్లోనే ఉరేసుకుని మృతి చెందాడు. కొంతకాలంగా అతని మానసిక పరిస్థితి సరిగా లేదని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
తల్లికి వందనం పేరుతో నకిలీ లింకులు
● ఎస్పీ విక్రాంత్ పాటిల్ కర్నూలు (టౌన్): తల్లికి వందనం పథకం పేరుతో వచ్చే నకిలీ లింకులపై విద్యార్థుల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పథకానికి సంబంధించిన దరఖాస్తులు, అర్హత వివరాలు నగదు, జమ తదితర అంశాల పేరుతో వాట్సప్, ఎస్ఎంఎస్ లేదా సోషల్ మీడియా ద్వారా వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని తెలిపారు. వ్యక్తిగత వివరాలు, ఓటీపీలు, ఎవరికి పంపించకూడదని సూచించారు. సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే1930 హెల్ప్లైన్కు కాల్ చేయాలని తెలిపారు. -
పొలంబడి.. వెనుకబడి
కర్నూలు(అగ్రికల్చర్): ప్రజారోగ్యం కోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ (గ్యాప్) పద్ధతులకు పెద్దపీట వేసింది. పొలంబడులు నిర్వస్తూ పంటల సాగు పూర్తిగా వ్యవసాయ అధికారుల పర్యవేక్షణలో జరిగేలా చర్యలు తీసుకుంది. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ఆర్బీకేల వారీగా నిర్వహించే పొలంబడి కార్యక్రమాలను నామమాత్రానికి పరిమితం చేసింది. ఈ ఏడాది ఖరీఫ్లో కర్నూలు జిల్లాలో 13, నంద్యాల జిల్లాలో 14 పొలంబడి కార్యక్రమాలు మాత్రమే నిర్వహించేందుకు ఆదేశాలు వచ్చాయి. ఇందులో జిల్లాకు ఒకటి ప్రకారం ‘గ్యాప్’ పొలంబడులు నిర్వహిస్తారు. చంద్రబాబు ప్రభుత్వం ‘గ్యాప్’ పద్ధతులకు మంగళం పలకడంతో ఆహార పంటల్లో కెమికల్స్ అవశేషాలు పెరుగుతాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఇదీ దుస్థితి.. చంద్రబాబు ప్రభుత్వంలో వ్యవసాయం దండగ అయిపోయింది. రెండేళ్లలో అన్నదాత సుఖీభవ అమలు చేసింది ఒక్క ఏడాది మాత్రమే. కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ అమలే కాలేదు. ఉచిత పంటల బీమాకు స్వస్తి పలికారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. రైతులకు ఏటేటా వ్యవసాయ విజ్ఞానాన్ని పెంచే పొలంబడి కార్యక్రమానికి స్వస్తి పలికారు. రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకాన్ని తగ్గించేందుకు నిర్వహించే ‘గ్యాప్’ పొలంబడి కార్యక్రమాలను జిల్లాకు ఒక్కటి మాత్రమే పరిమితం చేసింది. ఒకవైపు డిమాండ్కు తగ్గట్టుగా యూరియా పంపిణీలో చేతులెత్తేసి మరోవైపు కెమికల్స్ వ్యవసాయానికి గేట్లు ఎత్తుతోంది. చంద్రబాబు ప్రభుత్వమే పట్టించుకోకపోవడంతో అధికారులు గ్యాప్ పద్ధతుల అమలుకు చొరవ తీసుకోలేదు. దీంతో రైతులు రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకాన్ని పెంచారు. పండించిన పంట ఉత్పత్తులను సర్టిఫికేషన్ కోసం శ్యాంపుల్స్ తీసి ల్యాబ్కు పంపితే కెమికల్స్ మోతాదుకు మించి ఉన్నట్లు తెలిసింది. ‘గ్యాప్’కు మంగళం పలుకడం వల్లనే మిర్చిలో మోతాదుకు మించి కెమికల్స్ అవశేషాలు ఉన్నట్లు తేలింది. ‘పొలంబడు’లను పక్కనపెట్టిన చంద్రబాబు ప్రభుత్వం జిల్లాకు గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ పొలంబడి ఒక్కటి మాత్రమే ఇక ప్రజలకు కెమికల్స్ అవశేషాలు కలిగిన ఆహారమే దిక్కు! -
పడిపోయిన నీటి నిల్వలు
శ్రీశైలం మినహా ఉమ్మడి జిల్లాలోని రిజర్వాయర్లలో 9.8 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఇందులో లైవ్ స్టోరేజీ 5.365 టీఎంసీలు మాత్రమే ఉంది. ఈ నీటిని మాత్రమే వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. తాగు నీటికి కూడా సరిపోని పరిస్థితులు ఉన్నాయి. ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు కురిస్తే...అక్కడి ప్రాజెక్టులు నిండుకున్న తరువాతే శ్రీశైలానికి వస్తాయి. శ్రీశైలం ప్రాజెక్టులో నీరు లేకుంటే ఉమ్మడి జిల్లాలోని రిజర్వాయర్లకు తరలిస్తారు. అయితే జూలై నుంచి సెప్టెంబరు, అక్టోబరు నెలల వరకు ఎల్నినో ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదే జరిగితే నీరు లేక రిజయర్వాయర్లు వెలవెలబోతాయి. -
మెదడులో కణితి కల్లోలం!
మానవ శరీరం పనితీరు మొత్తం మెదడు మీదే ఆధారపడి పనిచేస్తుంది. అలాంటి మెదడులో ఏ మాత్రం తేడా వచ్చినా కల్లోలంగా మారుతుంది జీవితం. శరీరం మొత్తం స్తంభించి పోతుంది. ఇక మెదడులో వచ్చే కణితులు ఇంకా ప్రమాదం. ఈ సమస్య పట్ల జాగ్రత్తగా ఉండకపోతే ఇక అంతే సంగతులు. ప్రజలకు ఈ కణితులపై అవగాహన కల్పించేందుకు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ ప్రతి ఏటా జూన్ 8న వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ప్రత్యేక అవగాహన కథనం.కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రాంతంలో ఇటీవల కాలంలో మెదడు కణితులుండే బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ సమస్యతో పక్క రాష్ట్రమైన తెలంగాణ, కర్ణాటకకు చెందిన వారు కూడా కర్నూలుకే వస్తున్నారు. చికిత్స చేయించుకునేందుకు గతంలో బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు కర్నూలు నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలతో పాటు ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులకు చికిత్స కోసం వస్తున్నారు. ఇక్కడే ఆధునిక పరికరాలు, వసతులు, సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో చికిత్స సులభమవుతోంది. ఇక్కడి వైద్యుల వద్దకు నరాలు, మెదడు చికిత్సల కోసం వచ్చే వారిలో 10 నుంచి 15 శాతం మంది బ్రెయిన్ ట్యూమర్ కేసులే ఉంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. మెదడు కణితులు, రకాలు మెదడులోని కణజాలాల్లో ఏర్పడే ముద్దను మెదడు కణితి అంటారు. ఇవి రెండు రకాలు. ప్రైమరీ ట్యూమర్, సెకండరీ బ్రెయిన్ ట్యూమర్. ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్ను నాలుగు విభాగాలుగా విభజించారు. సెకండరీ బ్రెయిన్ ట్యూమర్లు శరీరంలో వివిధ భాగాల్లో సోకుతాయి. అవి రక్తంలో ప్రవేశించి మెదడుకు చేరతాయి. దీని ద్వారా మెదడులో కణితులు ఏర్పడతాయి. సాధారణంగా ఇవి జన్యుపర లోపాలతో, వంశపారంపర్యంగా వస్తాయి. మెదడుకు రేడియేషన్ సోకడం వల్ల కూడా ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. సెల్ఫోన్ విపరీతంగా వాడటం వల్ల రేడియేషన్ సోకి మెదడులో గడ్డలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతం చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అన్ని వయస్సుల వారికీ ఈ సమస్య వస్తోంది. బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలుమెదడు కణితుల లక్షణాలను రెండు రకాలుగా విభజించవచ్చు. మొదటిది జనరల్ లక్షణాలు. రెండవది ప్రత్యేకమైనది. జనరల్ లక్షణాలు కణితి పరిమాణాన్ని బట్టి వస్తాయి. తలనొప్పి, వాంతులు, చూపు మందగించడం, ఒత్తిడి పెరగడం, స్పృహ కోల్పోవడం వంటివి. ఇక రెండోది మెదడులో కణితి ఏర్పడిన స్థానాన్ని బట్టి వస్తాయి. మెదడు ముందు భాగం, మధ్యభాగం, వెనుక భాగంలో ఆయా స్థానాలను బట్టి లక్షణాలు ఉంటాయి. అందులో మాట తడబడటం, చూపు మబ్బుగా కనిపించడం, చెవులు వినిపించకపోవడం, మూతి వంకరపోవడం, ఫిట్స్ రావడం, పక్షవాతం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ప్రతి తలనొప్పిని కణితికి కారణం అని చెప్పలేమని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ లక్షణాలు ఉన్నప్పుడు వైద్యులను తప్పనిసరిగా కలిసి చికిత్స తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. పెరుగుతున్న బ్రెయిన్ ట్యూమర్ బాధితులు ఆధునిక పద్ధతిలో ట్యూమర్ల తొలగింపు జీజీహెచ్లో ప్రతి ఓపీకి 30 మంది బాధితుల రాక నేడు వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే -
‘బెల్ట్’ తీసేవారెవరు?
● గ్రామాల్లో జోరుగా బెల్ట్ షాపులు ● చోద్యం చూస్తున్న ఎకై ్సజ్ శాఖ అధికారులు ఎమ్మిగనూరుసెంట్రల్: జిల్లాలోని కొన్ని గ్రామాల్లో తాగడానికి గుక్కెడు మంచి నీరు దొరకదేమో కానీ మద్యం మాత్రం లభిస్తోంది. టీడీపీ నాయకుల అండతో గ్రామగ్రామానా బెల్టుషాపులు వెలిశాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో ఉన్న మద్యం పాలసీని రద్దు చేశారు. ప్రభుత్వం చేతిలో ఉన్న మద్యం షాపుల నిర్వహణను ప్రెవేట్ వ్యక్తులకు అప్పగించారు. దీంతో మద్యం షాపులను దక్కించుకున్న వ్యక్తులు కాసులు దండుకోవడం కోసం గ్రామానికి రెండు నుంచి ఎనిమిది వరకు బెల్టుషాపులు నిర్వహిస్తున్నారు. లైసెన్స్డ్ మద్యం షాపులను దక్కించుకున్న టీడీపీ నాయకుల ప్రోత్సాహంతో ఊరూరా బెల్ట్షాపులు పుట్టగొడుగులా వెలిశాయి. దీనికితోడు లైసెన్స్డ్ మద్యం దుకాణాల్లో ఒక వ్యక్తికి మూడు మద్యం సీసాల కంటే ఎక్కువ ఇవ్వకూడదనే నిబంధన ఉన్నప్పటికీ ఎక్కడా అమలుకావడం లేదు. ఎంత అడిగితే అన్ని మద్యం సీసాలు ఇచ్చేస్తున్నారు. ఎక్కడపడితే అక్కడ అమ్మకాలు టీడీపీ నాయకుల ప్రోత్సాహంతో బెల్ట్ షాపులు దక్కించుకున్న అధికార పార్టీ కార్యకర్తలు ఎక్కడ పడితే అక్కడ అమ్మకాలు సాగిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో గుడి, బడి అనే తేడా లేకుండా అమ్మకాలు సాగిస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లో ద్విచక్రవాహనాల్లోనే ఎక్కడ ఉంటే అక్కడికే మద్యం సీసాలు తెచ్చి ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరికొన్ని గ్రామాల్లో మినీ డాబాలను తలిపించేలా కూర్చునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మద్యం, గ్లాసులు, వాటర్ బాటిళ్లు, తినుబండారాలు అందిస్తున్నారు. ఇందుకు ఒక సీసాకు రూ.50 అదనంగా వసూలు చేస్తున్నారు. గత రెండేళ్లుగా బెల్ట్ దుకాణాలు నిర్వహిస్తుండటం, మద్యంబాబుల అరాచకాలు ఎక్కువ కావడంతో మహిళలు మండిపడుతున్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికై నా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గ్రామాల్లో ఎక్కడైనా బెల్ట్షాపులు నిర్వహిస్తే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటాం. గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తాం. అక్రమంగా బెల్ట్షాపుల నుంచి మద్యం అమ్మే వ్యక్తులపై కేసులు నమోదు చేస్తాం. – రమేష్రెడ్డి, ఎకై ్సజ్ సీఐ -
16 ఏళ్ల తర్వాత..
● ఘనంగా ఆకుమల్లలో దేవర ● అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులుపెద్దమ్మ తల్లి విగ్రహాన్ని ఊరేగిస్తున్న దృశ్యం సంజామల: 16 ఏళ్ల తర్వాత ఆకుమల్లలో దేవర ఘనంగా నిర్వహించారు. మూడు రోజుల కార్యక్రమం ఆదివారం ముగిసింది. శనివారం రాత్రి ప్రారంభమైన పెద్దమ్మతల్లి విగ్రహం ఊరేగింపు ఆదివారం తెల్లవారుజాము వరకు కొనసాగింది. కుమ్మరాం కట్ట వద్ద నుంచి ఊరువాకిలి పెద్దమ్మ గుడి వద్దకు మేళతాళాల మధ్య ఊరేగింపు నిర్వహించారు. కులమతాలు అతీతంగా దేవర నిర్వహించారు. గ్రామంలో దాదాపు 1,100 కుటుంబాలు ఉన్నాయి. ప్రతి కుటుంబం బంధువులతో కళకళలాడింది. గ్రామం మొత్తం దాదాపు రూ. 4 కోట్లు ఖర్చు అయ్యింటుందని అంచనా వేస్తున్నారు. బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, వైఎస్సార్సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ చల్లా విఘ్నేశ్వర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గుండం సూర్య ప్రకాష్రెడ్డి, అవుకు మండల కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి, నాయకులు చల్లా విక్రాంత్ రెడ్డి, గౌరిగారి నాగేశ్వర్ రెడ్డి తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఐ హనుమంత్ నాయక్, ఎస్ఐ రమణయ్య ఆధ్వర్యంలో 100 మంది పోలీసులతో భారీ పోలీస్ బందో బస్తు మధ్య ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా చర్యలు తీసుకున్నారు. -
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల మూల్యాంకనం ప్రారంభం
కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షల మూల్యాంకనం ఆదివారం ప్రారంభం అయ్యింది. ప్రభుత్వ(టౌన్ మోడల్)జూనియర్ కాలేజీలో మూల్యాంకన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, సంస్కృతం, చరిత్ర, గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, మైనర్ లాంగ్వేజెస్, మైనర్ మీడియ మూల్యాంకనం ప్రారంభమైంది. ఇందుకు ఏసీఓలుగా 32 మంది, ఛీఫ్ ఎగ్జామినర్లుగా 153 మంది, అసిస్టెంట్ ఎగ్జామినర్లుగా 1446 మంది, స్క్రూటీనైజర్లుగా 188 మందిని నియమించారు. మొదటి రోజున 450 మందికిగాను 385 మంది విధుల్లో చేరి 5,745 సమాధాన పత్రాలను మూల్యాంకనం చేశారు. రేపటి(మంగళవారం)నుంచి కామర్స్, సివిక్స్, ఎకనామిక్స్ సబ్జెక్టుల మూల్యాంకనం జరుగనుంది. ఈ నెల 13వ తేదీ వరకు స్పాట్ క్యాంపు జరుగనున్నట్లు ఇంటర్మీడియెట్ బోర్డు అధికార వర్గాలు తెలిపాయి. నేడు డయల్ యువర్ సీఎండీ, ఎస్ఈ కర్నూలు(అగ్రికల్చర్): ఏపీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయమైన తిరుపతి నుంచి డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు కర్నూలు సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ ఆర్.ప్రదీప్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు 8977716661 నంబరుకు ఫోన్ చేయవచ్చని పేర్కొన్నారు. కర్నూలు కొత్తబస్టాండు సమీపంలో ఉన్న విద్యుత్ భవన్లో కూడా సోమవారం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. వినియోగదారులు ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు 7382614308 నంబరుకు ఫోన్చేసి సమస్యలు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. 22 మండలాల్లో వర్షాలు కర్నూలు(అగ్రికల్చర్): నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు 22 మండలాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. హాలహర్విలో 92.6, హొళగుందలో 53.2, చిప్పగిరిలో 30.2, పత్తికొండలో 27.4, కౌతాళంలో 26.4, గోనెగండ్లలో 14.4, ఎమ్మిగనూరులో 14.2, కోడుమూరులో 13.8, ఆదోనిలో 12.6, ఓర్వకల్లులో 11.4 మి.మీ. ప్రకారం వర్షాలు కురిశాయి. జూన్ నెల సాధారణ వర్షపాతం 77.7 మిమీ ఉండగా.. ఇప్పటి వరకు 33.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. రానున్న రెండు, మూడు రోజుల్లో జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. దివ్యాంగుల హాస్టల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం కర్నూలు(అర్బన్): సీ క్యాంప్లోని దివ్యాంగుల వసతి గృహంలో ప్రవేశం పొందేందుకు ఉమ్మడి జిల్లాకు చెందిన అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్దుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయిస్ ఫాతిమా ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. ఈ వసతి గృహంలో 2026–27 విద్యా సంవత్సరానికి వంద మంది వరకు ఉచిత వసతి కల్పిస్తామని పేర్కొన్నారు. ప్రవేశం పొందే విద్యార్థులు సదరం, స్టడీ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, మూడు పాస్పోర్టు సైజు ఫోటోలు, తల్లిదండ్రుల అంగీకార పత్రం, బ్యాంకు అకౌంట్ నంబర్ ఉన్న మొదటి పేజీ జిరాక్స్ కాపీలను దరఖాస్తుకు జత చేయాలన్నారు. వసతి గృహంలో 3వ తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇతర కోర్సులు చేసే వారు కూడా ప్రవేశం పొందవచ్చన్నారు. మరిన్ని వివరాలకు 08518– 277864, 8985547169 నంబర్లను సంప్రదించాలన్నారు. కర్నూలు (టౌన్): నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఆదివారం పోలీసు అధికారులు అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లకు, నేర చరిత కలిగిన వారికి, చెడు నడత కలిగిన వ్యక్తులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటమాని హెచ్చరించారు. -
జ్ఞాపకాల జడివాన
గోస్పాడు: దాదాపు 25 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థులు అపూర్వ సమ్మేళన కార్యక్రమంలో కలుసుకోవడంతో జ్ఞాపకాల జడివాన కురిసింది. 2001–2002 విద్యా సంవత్సరానికి చెందిన పదో తరగతి పూర్వపు విద్యార్థుల సమ్మేళనం ఆదివారం దీబగుంట్ల హైస్కూల్లో నిర్వహించారు. అప్పట్లో 90 మంది విద్యార్థులు ఉండగా 65 మంది పూర్వ విద్యార్థులు 25 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. పాఠశాలలో విద్యార్థులు గా విద్యాభ్యాసం చేసి ఒక్కొక్కరు ఒక్కోచోట ఉన్న అందరూ ఈ వేదికపై కలసి జ్ఞాపకాలను పంచుకుంటూ ఎంతో ఆనందంగా గడిపారు. అప్పట్లో గురువులుగా ఉన్న వేమారెడ్డి, రఘురామిరెడ్డి, బ్రహ్మం నాయక్, నాగలక్ష్మి, రాజు, శాస్త్రి, గోపాల్, వజీదున్ని సా బీబీ, షఫీ, శ్రీనివాసులను సన్మానించారు. ఈ సందర్భంగా పూర్వ గురువులు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల ద్వారా అందరూ ఒకచోట కలవడం మరవలేనిది అన్నారు. అలాగే అప్పటి విద్యా చైర్మన్ చిన్ననాగి రెడ్డి పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు మధ్యాహ్న భోజనాలతో విందు చేసుకున్నారు. అనంతరం పూర్వ విద్యార్థులు గురువులను సన్మానించారు. -
త్వరగా గుర్తించి చికిత్స చేస్తే మేలు
మెదడులో ఏర్పడే కణితులను గ్రేడ్ 1, 2, 3,4 విభాగాలుగా విభజించి చికిత్స అందిస్తారు. కణితుల స్థానంపై కూడా చికిత్స ఆధారపడి ఉంటుంది. గ్రేడ్ 1, 2లలో ఉన్న కణితులు మూడు సెంటిమీటర్ల కంటే తక్కువగా ఉంటే రేడియేషన్ ద్వారా తగ్గించవచ్చు. ఈ చికిత్స ద్వారా రోగులు తమ సాధారణ జీవితాన్ని కొనసాగించవచ్చు. అయితే గ్రేడ్ 3, 4 కణితులు ఉంటే జీవించే అవకాశం తక్కువగా ఉంటుంది. రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ వంటి అత్యాధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఈ కణితులను త్వరగా గుర్తించి చికిత్స అందిస్తే మేలు. –డాక్టర్ ఎన్.సుమంత్కుమార్, న్యూరోసర్జన్, కర్నూలు ఇటీవల కాలంలో చిన్న వయస్సు వారికి కూడా బ్రెయిన్ ట్యూమర్లు బయటపడుతున్నాయి. మా వద్దకు 20 ఏళ్ల యువకుడు తలనొప్పిగా ఉందని వచ్చాడు. పరీక్షలు చేయిస్తే అతనికి బ్రెయిన్ ట్యూమర్ ఉంది. చాలా మంది తలనొప్పిని నిర్లక్ష్యం చేస్తుంటారు. దీంతో పాటు మూర్ఛ, కంటిచూపులో మార్పు, మాట తడబడటం, ప్రవర్తనలో మార్పు, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. ముఖ్యంగా బ్రెయిన్ ట్యూమర్లను నిర్లక్ష్యం చేయరాదు. –డాక్టర్ కె.హేమంత్కుమార్, న్యూరోఫిజీషియన్, కర్నూలు ● -
మూగజీవుల ఆపద్బాంధవుడు
● కష్టంలో ఉన్నాయని తెలిస్తే చాలు సాయం చేస్తాడు ● ఆదుకుని అక్కున చేర్చుకుని వైద్యం చేయిస్తాడు ● అవి కోలుకున్నాక యథా స్థానంలో వదిలేస్తాడు ● సంరక్షణ కోసం ప్రత్యేక షెల్టర్ ఏర్పాటు కర్నూలు(హాస్పిటల్): ఆపదొస్తే మనుషులకు సాటి మనుషులు ఎవరో ఒకరు సాయం చేస్తారు. కానీ మూగజీవులకు ఎవరు సాయం చేస్తారు. అయితే ఇలాంటి జీవుల కోసం మేమున్నామంటూ ముందుకు వస్తున్నారు వాక్ సంస్థ ప్రతినిధులు. ఏ మూగ జీవైనా కష్టంలో ఉందని తెలిస్తే చాలు వెంటనే దాని వద్దకు చేరుకుంటారు. దానిని రక్షించడం/వైద్యం చేయించడం చేసి అది కోలుకునేంత వరకు తన వద్దే ఉంచుకుంటారు. బాగయ్యాక తిరిగి అది ఎక్కడ దొరికిందో అక్కడికే వెళ్లి వదిలేస్తారు. ఆ జీవి వైకల్యం చెంది ఎక్కడికి వెళ్లలేకపోని పరిస్థితిలో ఉంటే తన వద్దే ఉంచుకుని ఆలనాపాలనా చూసుకుని పోషిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ సంఘాన్ని కూడా రిజిస్టర్ చేయించి ఆదుకుంటున్నాడు ఈ సంస్థ సృష్టికర్త, మూగజీవుల ఆపద్బాందవుడు శివకుమార్. కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనికి చెందిన రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్ పి.తిరుపాల్ కుమారుడైన పి.శివశంకర్ ఇంటర్ వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత డిగ్రీలో చేరినా ఇతర కారణాల వల్ల మధ్యలోనే చదువు మానేశాడు. ప్రభుత్వ వసతి గృహాలకు అవసరమైన స్నాక్స్ను సరఫరా చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మూగజీవులపై ఉన్న మమకారం అతనికి సరికొత్త దారి చూపింది. ఎక్కడైనా ఏ మూగజీవైనా సరే ఆపదలో ఉన్నట్లు తెలిసిందంటే వెంటనే ఆ ప్రాంతంలో వాలిపోతాడు. వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేసి ఆ జీవిని రక్షిస్తాడు. రోడ్డు ప్రమాదాల్లో, ఇతర ప్రమాదాల్లో గాయపడిన, అనారోగ్యం బారిన పడిన జీవులేవైనా సరే వాటిని అక్కున చేర్చుకుంటాడు. వాటికి దగ్గరుండి సపర్యలు చేస్తూ ప్రభుత్వ జంతువుల ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తాడు. అవి బాగయ్యేంత వరకు వాటి ఆలనాపాలనా చూస్తాడు. వాటిని బంధీఖానాలో ఉంచకుండా అవి ఎక్కడ లభించాయో అక్కడే తెచ్చి వదిలేసి వాటికి స్వేచ్ఛావాయువులు ప్రసాదిస్తాడు. వాక్ సంస్థ స్థాపన.. మూగజీవులకు సేవలందించేందుకు అతను ఓ ప్రత్యేక సంస్థను స్థాపించాడు. 2021లో వెల్ఫేర్ ఆఫ్ యానిమల్స్ అండ్ లిబరేషన్ కర్నూలు(వాక్) అనే సంస్థను ఏర్పాటు చేశాడు. ఇందుకు సంబంధించిన షెల్టర్ను స్థానిక కర్నూలు నగర శివారులోని పంచలింగాల చెక్పోస్ట్ సమీపం నుంచి మామిదాలపాడు గ్రామానికి వెళ్లేదారిలో ఏర్పాటు చేశాడు. గాయపడిన, అనారోగ్యం బారిన పడిన జంతువులు, పక్షులను ఆ కేంద్రానికి తీసుకెళ్లి సపర్యలు చేస్తాడు. ఇందులో వైకల్యం చెందిన వాటిని తన వద్దే ఉంచుకుని జీవితాంతం చూసుకుంటాడు. ఎక్కడైనా ఏదైనా మూగజీవి ప్రమాదంలో ఉందని, అనారోగ్యంలో ఉందని సమాచారం (వాక్ సంస్థ 99668 64428)కు చెబితే చాలు వెంటనే ఆ సంస్థ ప్రతినిధులు వచ్చి ఆ జీవిని కాపాడే ప్రయత్నం చేస్తారు. సొంత నిధులతో షెల్టర్.. ఒకవైపు ప్రభుత్వ వసతి గృహాలకు అవసరమైన స్నాక్స్ను సరఫరా చేస్తూ జీవనం సాగిస్తున్న శివకుమార్ మరోవైపు మూగజీవుల ఆదరణకు సంపాదించిన సొమ్మును ఖర్చు చేస్తున్నాడు. మూగజీవులకు చికిత్స అందించడమే గాక వాటి ఆలనాపాలనా చూడటం, ఆహారం అందించడం, వైద్య ఖర్చులు, షెల్టర్ నిర్వహణ ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. ఈ మేరకు అతనికి ప్రతి నెలా రూ.40 వేల నుంచి రూ.60 వేల దాకా వెచ్చిస్తున్నాడు. ఇతని సేవా కార్యక్రమాలు చూసి ఎవ్వరైనా దాతలు స్పందించి విరాళం ఇస్తే తీసుకుంటాడు. లేకపోతే సొంత నిధులతోనే వాటిని సంరక్షిస్తాడు. ఈ యజ్ఞంలో అతనికి కొందరు స్వచ్ఛంద సేవకులు సహకరించారు. ప్రస్తుతం అతనితో పాటు ఇద్దరు సేవకులు సహాయం చేస్తున్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు ఆయన కర్నూలు నగర పరిసర ప్రాంతాల్లో 2 వేలకు పైగా జంతువులు, పక్షులను సంరక్షించాడు. ఇందులో కుక్కలు, కోతులు, ఆవులు, ఇతర జంతువులతో పాటు కాకులు, గద్దలు, చిలుకలు, ఇతర పక్షులు, పాములు సైతం ఉన్నాయి. గుత్తిలో ఒక శునానికి తల వద్ద పెద్ద రంధ్రం పడి తీవ్ర అనారోగ్యం ఉండి అనాథగా ఉందని తెలిసి అక్కడికి వెళ్లి దానిని తీసుకొచ్చి సంరక్షించాడు. ఓ కోతి కళ్లకు గాయం తగిలి గుడ్డిదై పోయింది. దానినీ ఆయనే ఆలనాపాలనా చూసుకుంటున్నాడు. ఇలాంటి జీవులు ఆయన వద్ద ఎన్నో ఉన్నాయి. షెల్టర్ నిర్వహణను చూసి అవసరమైన వస్తువులు, సరుకులు సహాయం చేసినా చాలని శివకుమార్ కోరుతున్నాడు. -
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు
● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని బీఎల్ఓలను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. అనర్హుల పేర్లు జాబితాలో చేరకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో శనివారం ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చెందిన బీఎల్ఓలు, సూపర్వైజర్లు, ఈఆర్వోలు, ఏఈఆర్వోలకు ‘ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం’పై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్యుమరేషన్ ఫారమ్లను పూరించి ఓటరు లేదంటే ఇంటి పెద్దల సంతకం తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. వాటిని డిజిటలైజ్ చేసి డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో నమోదు చేయాలన్నారు. ఎన్యుమరేషన్ ఫారమ్లు తిరిగి రాని సందర్భాల్లో కేవలం నాలుగు కారణాలైన ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్, డూప్లికేట్ అనే వివరాలను మాత్రమే నమోదు చేయాలన్నారు. ఈ వివరాల ఆధారంగా బూత్ వారీగా ప్రత్యేక జాబితాలు తయారు చేసి ప్రజల అభ్యంతరాల కోసం అందుబాటులో ఉంచాలన్నారు. జూన్ 15 నుంచి జూలై 14 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను ధ్రువీకరిస్తారన్నారు. జిల్లాలో మొత్తం 14 లక్షల మంది ఓటర్లలో ఇప్పటికే 10 లక్షల మందికి పైగా మ్యాపింగ్ పూర్తయిందన్నారు. మ్యాపింగ్ సక్రమంగా జరగకపోతే సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగవద్దని సిబ్బందికి సూచించారు. ప్రత్యేక సర్వే, మ్యాపింగ్, ఫారమ్ల డిజిటలైజేషన్ తదితర పనులను జూన్ 14లోపు వంద శాతం పూర్తి చేసి నివేదికలు సమర్పించాలన్నారు. అనంతరం బీఎల్ఓలకు గొడుగు, క్యాప్ తదితర వస్తువులతో కూడిన ప్రత్యేక కిట్లను కలెక్టర్ పంపిణీ చేశారు. డీఆర్ఓ రామునాయక్, నంద్యాల ఆర్డీఓ, ఈఆర్ఓ విశ్వనాధ్, ఆరు మండలాల తహసీల్దార్లు, అన్ని పోలింగ్ స్టేషన్ల బీఎల్ఓలు పాల్గొన్నారు. -
అధికారులైనా.. ఆట బొమ్మలే!
శేషఫణి రజినీకాంత్ రెడ్డి అబ్దుల్ వాహబ్ ఆదోని: కూటమి పాలనలో అధికారులకు విలువ లేకుండా పోతోంది. నాయకులకు నచ్చినట్లు మెలగకపోయినా, ఆ పార్టీలోని ఏ ఒక్కరికి ఎదురుచెప్పినా మరో ప్రాంతానికి బదిలీపై వెళ్లక తప్పని పరిస్థితి. చిరుద్యోగులకే కాదు, మండల మేజిస్ట్రేట్ స్థాయి తహసీల్దారులైనా తమ స్థానాన్ని కాపాడుకునేందుకు జీ హుజూర్ అనక తప్పడం లేదు. ఇక కూటమి పాలనలో మూడు పార్టీల్లో ఏ ఒక్కరికి నచ్చకపోయినా ఆ అధికారి జీవితం ఆటబొమ్మగా మారిపోతోంది. గతంలో అతను నాతో సరిగా మెలగలేదని ఒకరు.. ఇతను ప్రతిపక్ష పార్టీ అని ఇంకొకరు.. కొత్త వ్యక్తి మాకొద్దని మరొకరు.. ఇలా అధికారులను ఎవరికి తోచిన రీతిలో వాళ్లు అక్కడా ఇక్కడ తిప్పడం పరిపాటిగా మారింది. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారా, లేదా అనేది పక్కనపెట్టి మన చెప్పుచేతల్లో ఉంటున్నాడా లేదా అనే విషయానికే ప్రాధాన్యత ఇస్తుండటంతో అధికారులు రాజకీయ ఛట్రంలో కంటి మీద కునుకు లేకుండా ఉద్యోగాలను నెట్టుకొస్తున్నారు. తాజాగా ఆదోని తహసీల్దార్ పోస్టు విషయంలో చోటు చేసుకున్న ‘రాజకీయం’ అధికారుల దీనావస్థకు అద్దం పట్టింది. డిప్యూటీ తహసీల్దార్లకు తహసీల్దార్లుగా పదోన్నతి కల్పించడంతో కొందరికి స్థానచలనం కలిగింది. ఈ కోవలోనే ఆదోని తహసీల్దార్గా పనిచేస్తున్న శేషఫణిపై బదిలీ వేటు పడింది. ఆయన స్థానంలో కౌతాళం డిప్యూటీ తహసీల్దార్ రజనీకాంత్రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. అయితే రజనీకాంత్ రెడ్డి నియామకం కూటమిలోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు వర్గానికి మింగుడుపడలేదు. ఈ నేపథ్యంలో రాత్రికి రాత్రే ఆ ఉత్తర్వులు మారిపోయాయి. కౌతాళం డిప్యూటీ తహసీల్దార్గా ఉన్న ఆయనను పదోన్నతిపై అక్కడే తహసీల్దార్గా కొనసాగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. నందవరం తహసీల్దార్ అబ్దుల్ వాహబ్ను ఆదోని తహసీల్దార్గా బదిలీ చేశారు. ఈసారి బీజేపీ నేతలు తెరపైకి వచ్చారు. అబ్దుల్వాహబ్ నియామకం కూటమిలోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి వర్గానికి నచ్చకపోవడంతో ఆయనను కూడా తిరిగి పాత స్థానమైనా నందవరానికే డిప్యూటేషన్పై పంపించేశారు. ఈ పరిణామాల మధ్య ప్రస్తుతం ఆదోని తహసీల్దార్గా శేషఫణినే కొనసాగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈయన స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తారనే ప్రచారం ఉంది. ఎనిమిది నెలల క్రితం ఇక్కడ బాధ్యతలు స్వీకరించిన ఆయనకు బలమైన రాజకీయ మద్దతు ఉండటంతోనే స్థానం పదిలం చేసుకోగలిగారనే చర్చ జరుగుతోంది. శేషఫణి తన సర్వీసులో సస్పెండ్ అయినప్పటికీ అధికార పార్టీ అండదండలతోనే తిరిగి పోస్టింగ్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే ఒక్క పోస్టుకు ముగ్గురు అధికారుల మధ్య జరిగిన ‘రాజకీయ’ పోరు అధికార వర్గాల్లో చర్చకు తావిస్తోంది. నేతల సిఫార్సులతో సీటు పదిలం చేసుకుంటున్న అధికారులు పారదర్శక సేవలు ఎంత మేరకు అందించగలరనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. కూటమి నేతల సిఫారసుతో మూడుముక్కలాట నాయకులను మెప్పించలేక అధికారుల పాట్లు ఇద్దరు తహసీల్దార్ల ఉత్తర్వులు అప్పటికప్పుడు మార్పు ఎట్టకేలకు పాత తహసీల్దారే కొనసాగింపు -
పని ఒత్తిడి తగ్గించాలి
ప్రభుత్వం మాపై కక్ష గట్టినట్లు కనిపిస్తోంది. ఏ పని చేయాలన్నా మాపైనే వేస్తోంది. ఎన్ని సర్వేలు చేస్తున్నాం. రోజుకు ఎంతమంది ప్రజలను కలుస్తున్నాం. అయినా పట్టించుకోవడంలేదు. సచివాలయాల పనులన్నీ చేస్తూనే జనగణన, ఎస్ఐఆర్, సర్వేలు చేయాలి. వాటి కోసం బయటకు వెళ్లితే ఎందుకు సచివాలయంలో లేరని ప్రశ్నిస్తున్నారు. పని ఒత్తిడితో దిక్కుతోచడంలేదు. రాత్రి 10 గంటల వరకు టీసీ పెడుతున్నారు. కుటుంబ సభ్యులతో కూడా గడపడానికి సమయం లేకుండా పోతుంది. – మహేష్, సచివాలయ ఉద్యోగి, కర్నూలు -
పిడుగు పడి చీలిన చెట్టు
కొలిమిగుండ్ల: పిడుగు పడటంతో పొలంలోని వేప చెట్టు చీలి పోయింది. కొలి మిగుండ్ల మండలం హనుమంతుగుండం సొ సైటీ సమీపంలో ఈ ఘటన శనివారం సాయంత్రం ఆరు గంట ల సమయంలో జరిగింది. ఒక్క సారిగా మెరుపులు, ఉరుము లు రావడంతో చెట్టు కింద ఉన్న రైతులు ఇళ్లకు వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. పిడుగు పాటుకు చెట్టు రెండు భాగాలుగా మారడంతోపాటు బెరడు పూర్తిగా ఊడిపోయింది. కర్నూలు (అర్బన్) : కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యాలయంలో శనివారం అధ్యక్షుడు గోల్కొండ అజ్మత్ బీ ఆధ్వర్యంలో పాలకవర్గం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మార్కెట్ యార్డులో సౌర విద్యుత్ ద్వారా విద్యుత్ను వినియోగించాలని పాలకవర్గ సభ్యులు చర్చించి తీర్మానించారు. సమావేశంలో కార్యదర్శి ఆర్ జయలక్ష్మి, ఉపాధ్యక్షులు శేషగిరి శెట్టి, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. మంత్రాలయంలో 4.4 సెం.మీ వర్షపాతం మంత్రాలయం రూరల్: మండలంలో శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. బూదూరు, సూగూరు, మంత్రాలయం, మాధవరం, రాంపురం, కల్లుదేవకుంట, చెట్నిహళ్లి గ్రామాల్లో వంకలు, వాగులు పొంగిపొర్లాయి. మండలంలో 4.4 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు రెవె న్యూ అధికారులు తెలిపారు. మాధవరం గ్రామానికి చెందిన జగన్నాథ రైతుకు చెందిన పొలం భారీగా కోతకు గురైంది. పొలాన్ని సాధారణ సిత్థికి చేర్చాలంటే రూ. లక్ష ఖర్చు అయ్యే అవకాశం ఉందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నాడు. -
భారమైనా.. ‘సాగా’ల్సిందే
వ్యవసాయం రోజురోజుకు భారమవుతోంది. కష్టంతో పాటు ఖర్చు పెట్టిన ప్రతి పైసా తిరిగి రావాలని రైతులు దేవుడిపై భారం వేస్తారు. విత్తు మొదలు పంట అమ్మే వరకు ఎదురయ్యే సమస్యలను అధిగమిస్తూ ముందకెళ్తారు. అన్నీ అనుకూలిస్తే గట్టెక్కుతారు.. లేదంటే నష్టాలు మూటగట్టుకుంటారు. కుటుంబమంతా రెక్కలు ముక్కలు చేసుకున్నా ఒక్కోసారి మిగిలేది అప్పులే. అయినా రైతులు పట్టువదలని విక్రమార్కుల్లా వ్యవసాయం చేస్తూనే ఉంటారు. మద్దికెర మండలం పెరవలికి చెందిన రైతు రామాంజినేయులు తనకున్న మూడెకరాల తోటలో మిరప పంట సాగు చేశారు. బాడుగ ట్రాక్టర్తో పొలం దుక్కిదున్ని పంట సాగు చేశారు. పంటలో కలుపు తీసేందుకు కాడెద్దులు పెట్టాలంటే ఎక్కువ ఖర్చువుతుంది. ప్రతి చిన్న పనికి కాడెద్దులు పెడితే పంట నుంచి వచ్చే కాస్తో కూస్తో ఆదాయం కూడా మిగలకుండా పోతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కాడెద్దులు పోషణ భారమైంది. ఈ క్రమంలో ఇలా తన కొడుకు, కూతురు కాడెద్దులుగా మారగా తండ్రి దంతెతో మిరప పంటలో కలుపు తొలగించారు. – తుగ్గలి -
విద్యుదాఘాతానికి వృద్ధురాలి బలి
● విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమమని బంధువుల ఆరోపణ కొలిమిగుండ్ల: చింత చిగురు కోసం వెళుతున్న ఓ వృద్ధురాలిని మృత్యువు విద్యుత్ రూపంలో బలితీసుకుంది. బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నా యి. అంకిరెడ్డిపల్లెకు చెందిన కాశింశెట్టి లక్ష్మీదేవి (63) కుమారుడు నాగేంద్రతో కలిసి ఉంటుంది. శుక్రవారం సాయంత్రం ఇంట్లో పనులు పూర్తి చేసు కొని సమీపంలో ఉన్న చింత చెట్ల వద్దకు చిగురు కోసుకునేందుకు వెళ్లింది. ఇటీవలనే గాలి వానకు విద్యుత్ స్తంభం తీగతో పాటు నేలకొరిగింది. చెట్టు వద్దకు వెళ్లే క్రమంలో తీగ తగలడంతో మంటలు వ్యాపించి అక్కడికక్కడే మృత్యువాత పడింది. కుమారుడు కూడా సిమెంట్ ఫ్యాక్టరీలోకి డ్యూటీకి వెళ్లాడు. శనివారం ఉదయం బంధువులు ఇంటి వద్దకు వచ్చి చూడగా కనిపించక పోవడంతో కుమారునికి సమాచారం ఇచ్చారు. డ్యూటీ నుంచి ఇంటికి చేరుకొని బంధువుల సాయంతో ఊర్లో అక్కడక్కడ వెతికారు. చుట్టు పక్కల గ్రామాల్లో ఆచూకీ కోసం వెతికినా కనిపించ లేదు. చివరకు విరిగిపడిన విద్యుత్ స్తంభం వద్ద పడి ఉన్న వృద్దురాలిని స్థానికులు చూసి లక్ష్మీదేవిగా గుర్తించారు. వారం, పది రోజుల క్రితం గాలి వానకు స్తంభం పడిపోయినా విద్యుత్ సిబ్బంది పట్టించుకోక పోవడంతో నిండు ప్రాణం బలైందని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. ఇప్పుడు వృద్ధురాలి మృతికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. -
రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలి
కర్నూలు(అర్బన్): రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి, గుంటూరు వ్యవసాయ డైరెక్టరేట్ సహాయ సంచాలకులు వెంకటేశ్వర్లు కోరారు. శనివారం వారు జాతీయ ఆహార భద్రత మిషన్, జాతీయ నూనెగింజల అండ్ ఆయిల్ పామ్ మిషన్ పథకాల కింద రైతులకు సరఫరా చేస్తున్న విత్తనాల నాణ్యత, పరిమాణం, ప్యాకింగ్ విధానాలపై విత్తన సరఫరా సంస్థలైన ఏపీ సీడ్స్, ఎన్ఎస్సీ, హెచ్ఐఎల్ గోదాములను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీడ్ ట్రీట్మెంట్, రసాయనాలు, సంబంధిత పంటల సాగు విధానాల బ్రోచర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్తి విత్తన ప్యాక్తో పాటు సీడ్ ట్రీట్మెంట్ కెమికల్, సంబంధిత పంట సాగు విధానాల బ్రోచర్ను తప్పనిసరిగా జత చేయాలన్నారు. నాణ్యమైన విత్తనాల ప్యాకింగ్ పూర్తి చేసి సంబంధిత ప్రాంతాలు, రైతు సేవా కేంద్రాలు, మండలాలకు తక్షణమే డిస్పాచ్ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి అల్లీపీర, మండల వ్యవసాయ అధికారి విష్ణువర్దన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ నేతా.. మజాకా!
పెద్దకడబూరు: పేదల సమస్యలను పరిష్కరించాల్సిన అధికార పార్టీ నేత డబ్బులకు కక్కుర్తి పడి పేదలను కష్టాల పాలుజేశాడు. అధికారులు సైతం టీడీపీ నేతకే మద్దతు ఇచ్చి నోటీసులు ఇవ్వడంతో పేదలు ఆందోళన చెందుతున్నారు. టీడీపీ నాయకుడు, కోసిగి మార్కెట్యార్డ్ వైస్ చైర్మన్ బొగ్గుల తిక్కన్నకు మామూళ్లు ఇవ్వలేదని తమపై అన్యాయంగా ఫిర్యాదు చేశారని పెద్దకడబూరు ఎస్సీ కాలనీకి చెందిన బొగ్గుల నరసన్న, శివయ్య, మడ్రి అనిల్ తదితరులు వాపోతున్నారు. ఈ మేరకు శనివారం వారంతా తహసీల్దారు వలిబాషాను కలసి తమ ఒరిజినల్ పట్టాలను చూపించారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. పెద్దకడబూరు మండల కేంద్రం పరిధిలోని సర్వే నెంబర్ 262ఏ3లో 3.30 సెంట్లు భూమిలో దాదాపు వందేళ్లకు పైగా నివాసం ఉంటున్నారు. 2005 – 2006లో అధికారులు ఆ గుడిసెలకు పట్టాలు ఇచ్చారు. 2016లో రెవెన్యూ డివిజినల్ అధికారి ఇచ్చిన నివేదిక మేరకు 262/ఏ1లో 1.16 ఎకరాలు శాన వాటిక, 262/ఏ2ఏలో 2.30 ఎకరాలు పోలీస్స్టేషన్, 262/ఏ3లో 2.50 ఎకరాలలో ఎస్సీ కాలనీ, 262/ఏ3లో 0.88 ఎకరాలలో ఓపెన్ సైట్, 262/బిలో 1.54 ఎకరాలలో ఎస్సీ కాలనీ, 262/సిలో 0.09 సెంట్లు ఎస్సీ కాలనీ మొత్తం 8.47 ఎకరాలు ఉంది. పైన కనబరిచిన ఓపెన్ సైట్లో గతంలో టీడీపీ నాయకుడు, కోసిగి మార్కెట్యార్డ్ వైస్ చైర్మన్ బొగ్గుల తిక్కన్న నకిలీ పట్టాలు సృష్టించి ఒక్కొక్కరితో రూ. 20 వేల వరకు వసూలు చేశాడని బాధితులు ఆరోపించారు. ప్రస్తుతం 262/ఏ3లో 3.30 ఎకరాలలో నివాసం ఉంటున్న వారితో డబ్బులు డిమాండ్ చేశాడని, తమకు గతంలోనే పట్టాలు ఉన్నాయని డబ్బుల ఇవ్వమని నిరాకరించడంతో టీడీపీ నాయకుడు అధికారులను అడ్డం పెట్టుకుని అక్రమ నోటీసులు ఇప్పించారని మండిపడ్డారు. తహసీల్దార్ను కలసిన వారిలో ఎస్సీ కాలనీ వాసులు మేకల నరసన్న, మేకల షడ్రక్, జె.కుమార్, కాకి సుందరం, జె.తిమ్మక్క, మంచోది బొడ్డన్న, మేరమ్మ, జోతమ్మ, తదితరులు ఉన్నారు. మామూళ్లు ఇవ్వలేదని పేదల స్థలాలపై ఫిర్యాదు అధికారులు నోటీసులు ఇవ్వడంతో ఆందోళన ఒరిజినల్ పట్టాలతో తహసీల్దార్ను కలసిన బాధితులు -
రోడ్లపై చెత్త వేస్తే జరిమానా
కర్నూలు(సెంట్రల్): కర్నూలు నగరంలోని రోడ్లపై చెత్త వేస్తే జరిమానా విధిస్తామని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి హెచ్చరించారు. శనివారం కలెక్టరేట్లోని తన కార్యాలయంలో ఆమె మీడియా ప్రతినిధులతో సుహృద్భావ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలోని కేసీ కెనాల్లో చెత్త వేసినా కూడా వదిలిపెట్టబోమన్నారు. కొన్ని ప్రభుత్వ శాఖలు కూడా చెత్తను బాధ్యతా రాహిత్యంగా ఎక్కడ పడితే అక్కడ రోడ్లు, కాలువల్లో వేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. కర్నూలు నగరంలో పరిశుభ్రతను పాటించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఏడాది సీజనల్ హాస్టళ్లను ముందుగానే ప్రారంభించేందుకు చర్యలు చేపడతామన్నారు. డ్రిప్ ఇరిగేషన్కు ప్రాధాన్యం ఇవ్వడానికి ఈ యేడాది 20వేల హెక్టార్లో పండ్ల తోటలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ పాల్గొన్నారు. కొత్త బ్యాంకు ఖాతాకు పాన్ కార్డు మినహాయింపు కర్నూలు(అర్బన్): ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం ఎస్సీ విద్యార్థులు తల్లికి వందనం ప్రయోజనం పొందేందుకు కొత్తగా ఓపెన్ చేసే బ్యాంకు ఖాతాకు పాన్కార్డు అవసరం లేదని జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారిణి బి.రాధిక తెలిపారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ 2026–27 విద్యా సంవత్సరంలో ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు సమీపంలోని యూనియన్ బ్యాంకు లేదా కెనరా బ్యాంకులో విద్యార్థి పేరు మీద ఆధార్ కార్డు, ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నెంబర్తో కొత్త ఖాతాను ప్రారంభించవచ్చన్నారు. ఈ ఖాతాను తప్పనిసరిగా ఎన్పీసీఐతో అనుసంధానం చేయాలన్నారు. ఈ ప్రక్రియను ఈ నెల 10లోగా పూర్తి చేయాలన్నారు. ప్రస్తుతం జిల్లాలో 4,960 మంది అర్హులైన ఎస్సీ విద్యార్థుల బ్యాంకు ఖాతాలు ఎన్పీసీఐ లింకు ప్రక్రియ పెండింగ్లో ఉందన్నారు. ఆధార్కార్డు, ఆధార్ అనుసంధానమైన మొబైల్ నంబర్తో సమీపంలోని స్వర్ణ గ్రామ /స్వర్ణ వార్డు సచివాయాలను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చన్నారు. తాగునీటి సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు కర్నూలు(అర్బన్): జిల్లాలో తాగునీటి సమస్యల పరిష్కారానికి చేపట్టిన పనుల్లో వేగాన్ని పెంచి నిర్ణీత సమయంలోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీరు సీహెచ్ మనోహర్ చెప్పారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాగునీటి అవసరాలకు ప్రభుత్వం ఒక్కో జిల్లా రూ.కోటి విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. అందులో మొదటి విడతగా రూ.50 లక్షలతో జిల్లాలోని 19 మండలాల్లో 24 పనులు చేపట్టేందుకు జిల్లా కలెక్టర్ అనుమతి ఇచ్చారన్నారు. ఈ నిధులతో ముఖ్యంగా బోర్ల డీపెనింగ్, ఫ్లష్షింగ్, పంపు సెట్ల రిపేర్లు, పైప్లైన్ల మార్పు, విస్తరణ, లీకేజీలను అరికట్టడం తదితర పనులు చేపడతామన్నారు. అలాగే స్వచ్ఛ భారత్ మిషన్ కింద వ్యక్తిగత మరుగుదొడ్లు, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సుల పనులను వేగవంతం చేయాలని ఇప్పటికే ఈఈ, డీఈఈలను ఆదేశించామరు. జిల్లాలో ఎక్కడ నీటి ఎద్దడి తలెత్తినా, వెంటనే అక్కడికి వెళ్లి సంబంధిత ఇంజనీర్లతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తున్నామన్నారు. ఉదయం 9.30కే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ఉదయం 9.30 గంటలకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులను సమర్పించుకోవచ్చన్నారు. కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తామన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో సమాచారం తెలుసుకోవడానికి కాల్ సెంటర్ నంబర్ 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. అలాగే meekosam.ap.gov.in అనే వెబ్సైట్లో కూడా అర్జీలను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. -
బీఎల్ఓ విధుల నుంచి మినహాయించాలి
సచివాలయ ఉద్యోగులకు బీఎల్ఓ విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలి. బీఎల్ఓ విధులను ఇతర శాఖలకు చెందిన ఉద్యోగుల ద్వారా చేయించుకోవాలి. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులకు కల్పిస్తున్న ప్రయోజనాలను సచివాలయ ఉద్యోగులకు కూడా కల్పించాలి. ముఖ్యంగా ఉన్నతాధికారుల వేధింపులు ఆపాలి. స్వేచ్ఛగా విధులు నిర్వహించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలి. – బి.భాస్కర్రెడ్డి, కార్యదర్శి, సచివాలయ ఉద్యోగుల సంఘం -
ఉద్యోగుల ప్రాణాల కంటే పనులే ముఖ్యమా ?
సచివాలయల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ప్రాణాల కంటే పనులే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు కనిపిస్తోంది. పెరుగుతున్న పని ఒత్తిడి కారణంగా వరుస మరణాలు సంభవిస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం. గత ఆరు నెలల కాలంలోనే జిల్లాలో ఐదుగురు ఉద్యోగులు మృతి చెందారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రత్యేక సర్వేలు, ఇతర శాఖల అదనపు విధులను ఒకే సారి నిర్వహించమనడంతో ఉద్యోగులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. – ఎం.రవికుమార్, స్వర్ణ గ్రామ/ స్వర్ణ వార్డు ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర కో చైర్మన్ సచివాలయ ఉద్యోగులకు నిర్దిష్టమైన పనిగంటలు ఉండేలా చూడాలి. తమకు సంబంధం లేని అనేక రకాల పనులను పురమాయించడం వల్ల సచివాలయ ఉద్యోగులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. ఇప్పటికే ఈ రకమైన ఒత్తిళ్లు తట్టుకోలేక పలువురు బలవన్మరణాలకు పాల్పడుతుంటే, మరికొందరు అనారోగ్యాలతో మరణిస్తున్నారు. సచివాలయ ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడరు కానీ, వారితో వెట్టి చాకిరీ మాత్రం చేయిస్తున్నారు. – శివప్రసాద్, సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి -
గిరిజన విద్యాలయాల్లో సమస్యలు ఉత్పన్నం కారాదు
● జిల్లా గిరిజన సంక్షేమ అధికారి బి.సురేష్ కర్నూలు (అర్బన్): విద్యాసంస్థలు పునఃప్రారంభమవుతున్న దృష్ట్యా జిల్లాలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ/గురుకుల విద్యాలయాల్లో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి బి.సురేష్ ఆదేశించారు. శనివారం సాయంత్రం సంక్షేమ భవన్లోని తన కార్యాలయంలో గిరిజన విద్యాసంస్థలకు చెందిన ప్రిన్సిపాళ్లు, వార్డెన్లు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, నాల్గో తరగతి సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ.. మరో వారం రోజుల్లో విద్యాసంస్థలు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆయా పాఠశాలలు, వసతి గృహాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అలాగే వంట పాత్రలు, తరగతి గదులు, డైనింగ్ హాల్స్ను కూడా శుభ్రం చేసుకోవాలన్నారు. తాగునీటి సరఫరా, విద్యుత్ తదితర వాటిపై కూడా దృష్టి సారించాలని చెప్పారు. విద్యార్థినీ, విద్యార్థులు పాఠశాలలకు వచ్చే నాటికి వారి అవసరాలకు అనుగుణంగా అన్ని చర్యలు చేపట్టాలన్నారు. -
కస్టోడియల్ డెత్పై ఆర్డీఓ విచారణ
కొలిమిగుండ్ల: స్థానిక పోలీస్ స్టేషన్లో ఇటీవల జరిగిన కస్టోడియల్ డెత్పై విచారణ చేపట్టినట్లు బనగానపల్లె ఆర్డీఓ నరేంద్రనాథ్రెడ్డి శనివారం తెలిపారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బెలుం శింగవరానికి చెందిన దొమ్మరి వెంకటసుబ్బయ్యను ట్రాక్టర్ చోరీ కేసులో ఏప్రిల్ 18న పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. పోలీస్ స్టేషన్లోని బాత్రూంలో ఉరివేసుకొని వెంకటసుబ్బయ్య మృతి చెందాడు. దీనిపై జిల్లా కలెక్టర్ మెజిస్ట్రీరియల్ విచారణ చేయమని ఆదేశించారన్నారు. ఇందులో భాగంగానే మృతునికి చెందిన ఏడుగురు కుటుంబ సభ్యులు, పోలీస్, రెవెన్యూకు చెందిన మొత్తం 16 మందిని విచారించామన్నారు. విచారణ నిర్వహణపై వారం రోజుల క్రితం బహిరంగ నోటీసు ఇచ్చామని, ఈ ఘటనపై బయట వ్యక్తులకు ఎవరికై నా అభ్యంతరాలుంటే ఫిర్యాదు ఇవ్వవచ్చని పేర్కొన్నామన్నారు. విచారణలో భాగంగా ఇంకా కొంత మంది వైద్యులతో పాటు సంఘటన జరిగిన సమయంలో ఇక్కడ విధులు నిర్వహించిన తహసీల్దార్ను విచారించాల్సి ఉందన్నారు. త్వరలోనే ఈ ప్రక్రియ ముగించి నివేదికలను కలెక్టర్కు అందజేస్తామని చెప్పారు. -
మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ
కర్నూలు(సెంట్రల్): మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, ప్రధాన అటవీ సంరక్షణ అధికారి సి.సెల్వం అన్నారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కాలుష్య నియంత్రణ మండలి, అటవీ శాఖ ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు. జెడ్పీ నుంచి కలెక్టరేట్ వరకు కొనసాగిన ర్యాలీలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్లాస్టిక్ కాలుష్యం పర్యావరణంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని, అందువల్ల ప్లాస్టిక్ని తమ జీవనశైలి నుంచి తొలగించడం మంచిదన్నారు. సముద్రం, భూమి, చివరకు మనిషి శరీరంలోకి కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు చేరిపోతుండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఫలితంగా క్యాన్సర్ మహమ్మారి విజృంభిస్తోందన్నారు. ఇప్పటికై నా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయాధికారి పి.వి.కిశోర్కుమార్రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిక్షణకు జిల్లా యంత్రాంగం వారం రోజులుగా అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. కళాజాతాల ద్వారా పాటలు, నృత్యాలతో ప్రజల్లో చైతన్యం కల్పించామన్నారు. కార్యక్రమంలో కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు, సీనియర్ సైంటిస్టు ఎంబీఎస్ శంకరరావు, పీసీబీ అధికారి స్వామి వివేకానంద, అటవీ అధికారిని తేజస్వి, ప్రియాంక, పి.లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
శ్రీగిరి.. ప్రగతి అధోగతి!
శ్రీశైలంటెంపుల్: తిరుమల తరహాలో శ్రీశైలాన్ని అభివృద్ధి చేస్తాం.. శ్రీశైలం పర్యటనకు వచ్చినప్పుడల్లా సీఎం చంద్రబాబు చెప్పే మాటలు కార్యరూపం దాల్చలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్నా శ్రీశైల క్షేత్రంలో అభివృద్ధి కనిపించడం లేదు. క్యూ కాంప్లెక్స్, సరిపడినన్ని వసతి గదులు లేక.. అరకొర సౌకర్యాలతో భక్తులు నానా అవస్థలు పడుతున్నారు. ఇక ఉత్సవాల్లో భక్తుల అవస్థలు వర్ణనాతీతం. మాటల్లోనే అభివృద్ధి! రాష్ట్రంలో తిరుమల తరువాత రెండో పెద్ద పుణ్యక్షేత్రం శ్రీశైలం. శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి దర్శనానికి ప్రతి రోజూ లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. శ్రీశైల క్షేత్ర అభివృద్ధిపై పలుమార్లు సమావేశాలు నిర్వహించినప్పటికీ ఇంతవరకు ఫలితం లేకుండా పోయింది. అంతేకాకుండా సీఎం హోదాలో చంద్రబాబు శ్రీశైల క్షేత్రాన్ని మూడుసార్లు సందర్శించారు. శ్రీశైల క్షేత్రాన్ని పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా మరింత అభివృద్ధి చేస్తామని చెప్పినా ఆచరణలో కనిపించలేదు. శ్రీశైల క్షేత్ర అభివృద్ధి కోసం టూరిజం, రెవెన్యూ, దేవదాయ, అటవీశాఖ, ఆర్అండ్బీ శాఖల మంత్రులతో కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ కూడా అభివృద్ధి చేయలేదు. చంద్రబాబు మాటల్లో మాత్రమే అభివృద్ధి ఉంటుందని, చేతల్లో ఉండదని ప్రజలు విమర్శిస్తున్నారు. సమావేశాలకే పరిమితం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మూడు పార్టీలకు చెందిన 26 మందితో జంబో ట్రస్ట్బోర్డును నియమించారు. ట్రస్ట్బోర్డు ఏర్పాటై ఎనిమిది సమావేశాలు నిర్వహించినా ఇంతవరకు ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. జంబో ట్రస్ట్బోర్డు సభ్యులు తమ దర్శనాలు, తమ సిఫార్స్ లేఖలకు ప్రాధాన్యత ఇవ్వలేదని దేవస్థాన అధికారులపై ఆగ్రహించడం తప్ప క్షేత్రాభివృద్ధికి ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలుస్తోంది. అంతేకాకుండా ట్రస్ట్బోర్డుకు స్వయంప్రతిపత్తి లేకపోవడంతో తీర్మానాలన్నింటినీ దేవదాయశాఖ కమిషనర్కు పంపుతున్నారు. అక్కడి నుంచి ఇంతవరకు అనుమతులు రావడం లేదు. భక్తుల అసంతృప్తి శ్రీశైల క్షేత్రాన్ని సందర్శిస్తున్న భక్తుల సంతృప్తిస్థాయిని తెలుసుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఐబీఆర్ఎస్ కాల్స్ చేస్తోంది. సమయానుకూలంగా దర్శనాలు జరగకపోవడం, కనీస సౌకర్యాలు లేకపోవడం తదితర విషయాలపై భక్తులు అసంతృప్తి చెందుతున్నారు. దీంతో భక్తుల సంతృప్తి స్థాయిలో శ్రీశైల క్షేత్రం అట్టడుగు స్థాయికి చేరుకుంటోంది. శ్రీశైల క్షేత్ర అభివృద్ధిని మరచిన చంద్రబాబు ప్రభుత్వం సమావేశాలు, చర్చలకే పరిమితమైన జంబో ట్రస్ట్బోర్డు సౌకర్యాలు లేక భక్తులకు తప్పని తిప్పలు మెరుగుపడని సౌకర్యాలు శ్రీశైల క్షేత్రంలో భక్తులకు సౌకర్యాలు మెరుగుపడడం లేదు. ప్రస్తుతం దేవస్థానంలో రేకుల షెడ్డులతో క్యూకంపార్ట్మెంట్లు ఉన్నాయి. అలాగే ఈ క్యూ కంపార్ట్మెంట్లలో సుమారు 10 వేల మంది మాత్రమే భక్తులు వేచి ఉండేలా ఉన్నాయి. దీంతో సాధారణ రోజుల్లోనే భక్తులు నానా అవస్థలు పడుతున్నారు. ఇక బ్రహ్మోత్సవాల సమయంలో అయితే భక్తుల అవస్థలు వర్ణానాతీతం. భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనలో భాగంగా అధునాతన టెక్నాలజీతో కూడిన నూతన క్యూకాంప్లెక్స్ నిర్మిస్తామని చెబుతునప్పటికీ ఇంతరవకు ఒక్క అడుగు ముందుకు సాగలేదు. అలాగే భక్తులకు సరిపడా వసతి సౌకర్యాలు లేవు. శ్రీశైల క్షేత్రంలో వసతి సౌకర్యాలు మెరుగుపడాల్సిన ఉంది. అయితే ఆ దిశగా ఒక్క అడగు కూడా పడలేదు. -
ఏడాదిగా పెండింగ్
ఉన్నత విద్యను అభ్యసిస్తున్న పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన విద్యార్థులకు ఈ ప్రభుత్వం తీరని ద్రోహం చేస్తోంది. నిర్ణీత సమయంలోగా విడుదల చేయాల్సిన ఫీజులను ఏడాదిగా పెండింగ్ పెట్టింది. మొత్తం రూ.10,700 కోట్లను బకాయి పెట్టింది. కళాశాలల యాజమాన్యాలు మాత్రం విద్యార్థుల ముక్కుపిండి ఫీజులను వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వ వర్సిటీల నుంచి ఏకంగా రూ.1500 కోట్ల నిధులు దారి మళ్లాయి. – కటికె గౌతం, రాష్ట్ర అధికార ప్రతినిధి, వైఎస్సార్సీసీ విద్యార్థి విభాగం ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల ఘోష కూటమి ప్రభుత్వానికి పట్టనట్టు కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్పుల బకాయిలను పూర్తి స్థాయిలో విడుదల చేస్తామని నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ నేటికి నేరవేరలేదు. కేవలం అరకొరగానే ఫీజులను విడుదల చేస్తున్నారు. వెంటనే ఫీజులను విడుదల చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతాం. – ఎస్ శరత్కుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించిన అంశాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నాం. గత విద్యా సంవత్సరానికి సంబంధించి 34,427 మంది విద్యార్థులకు రూ.77.76 కోట్లు విడుదల అయ్యాయి. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పెండింగ్ బకాయిలు త్వరలోనే విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. – బీ రాధిక, జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారిణి -
వసతిగృహ విద్యార్థులకు నాణ్యమైన సేవలు
కర్నూలు(అర్బన్): వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన సేవలు అందించాలని బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్, ఐఏఎస్ అధికారి డాక్టర్ ఎ.మల్లికార్జున ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ఆయన జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కార్యాలయంతో పాటు బీసీ కార్పొరేషన్, కల్లూరులోని ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయా కార్యాలయాల్లోని రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాలు పునః ప్రారంభమవుతున్న దృష్ట్యా విద్యార్థులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. వసతి గృహాల నిర్వహణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సూచించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సాధికరత అధికారిణి కె.ప్రసూన, బీసీ కార్పొరేషన్ ఈడీ జాకీర్ హుసేన్, సహాయ సంక్షేమ అధికారులు శ్రీనివాసులు, ఆంజినేయులు నాయక్, బీసీ వసతి గృహ సంక్షేమ అధికారుల సంఘం అధ్యక్షులు పాలేగార్ సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్దాం
● వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి కర్నూలు(టౌన్): రెండేళ్ల ప్రభుత్వ పాలనలో వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్దామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక గిప్సన్ కాలనీలోని ఆయన స్వగృహంలో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలోని 25వ వార్డు నుంచి 46వ వార్డు వరకు బూత్ ఏజెంట్లు, వార్డు నాయకులతో సమావేశం నిర్వహించారు. పార్టీ బలోపేతం, బూత్ స్థాయిలో కార్యకర్తల సమన్వయం, ఎస్ఐఆర్పై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం మాయమాటలతో ప్రజలను మోసగిస్తోందన్నారు. చంద్రబాబు నాయుడు అన్ని వర్గాల ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీలు ఇచ్చి రెండేళ్లు గడుస్తున్నా అతీగతీ లేకపోవడం పట్ల ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోందన్నారు. కర్నూలు నియోజకవర్గంలో ఈనెల 14 నుంచి వచ్చే నెల 15 వరకు నిర్వహించే ఎస్ఐఆర్ సర్వే కీలకమని, పార్టీ పరంగా ప్రభుత్వం నియమించిన బూత్ లెవల్ ఏజెంట్లు ఈ విషయంలో చురుగ్గా వ్యవహరించాలన్నారు. కూటమి నేతలు ఓట్లు తొలగించడం, బోగస్ ఓట్లు చేర్చడం వంటి అనైతిక చర్యలకు పాల్పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు ఎస్వీ విజయ మనోహరి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబు మహిళలకు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ఒక్కటీ అమలు చేయలేకపోయాడన్నారు. మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం, ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఉచిత బస్సు ప్రయాణం పేరుతో అరకొర బస్సులు ఏర్పాటు చేసి మహిళలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. అబద్ధాలు చెప్పిన ఈ ప్రభుత్వానికి త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుదామని పిలుపునిచ్చారు. -
ముగిసిన సప్లిమెంటరీ పరీక్షలు
కర్నూలు సిటీ: పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారంతో ముగిశాయి. గత నెల 28న బక్రీద్ పండుగ సందర్భంగా వాయిదా పడిన పరీక్షను శుక్రవారం నిర్వహించారు. చివరి రోజున ఇంగ్లిష్ పరీక్షకు 916 మంది విద్యార్థుల్లో 692 మంది హాజరయ్యారు. డీఈఓ ఎల్.సుధాకర్ రెండు కేంద్రాలను, ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ రెండు కేంద్రాలు, స్క్వాడ్ బృందాలు 15 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. మూల్యాంకనం ఈ నెల 8, 9, 10 తేదిల్లో చేపట్టనున్నారు. ● ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు ముగియడంతో ఈ నెల 7వ తేది నుంచి మూల్యాంకనం నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ కార్యాలయ అధికారి జి.లాలెప్ప తెలిపారు. ప్రభుత్వ(టౌన్ మోడల్) జూనియర్ కాలేజీలో నిర్వహించే మూల్యాంకనానికి ఎంపిక చేసిన సిబ్బందికి నేడు(శనివారం) స్పాట్పై అవగాహన కల్పించనున్నారు. సుమారుగా లక్ష సమాధాన పత్రాలు జిల్లాకు వచ్చినట్లు తెలిసింది. రైతులను వెక్కిరిస్తున్న ధరలు కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు నిరాశాజనకంగా ఉండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్కు వేరుశశనగ 173 క్వింటాళ్లు వచ్చింది. కనిష్ట ధర రూ.5,400, గరిష్ట ధర రూ.7,831 లభించింది. సగటు ధర రూ.6520 మాత్రమే నమోదైంది. ఎక్కువ లాట్లకు కేవలం రూ.6వేల నుంచి రూ.6500 మాత్రమే ధర లభించినట్లు తెలుస్తోంది. ● వాము మార్కెట్కు 310 క్వింటాళ్లు వచ్చింది. కనిష్ట ధర రూ.4,450, గరిష్ట ధర రూ.24,288 లభించగా.. సగటు ధర రూ.19,050 నమోదైంది. వాముకు ఇటీవల గరిష్ట ధర రూ.30 వేల వరకు పలికింది. ● మిర్చి(రెడ్) ధరలు దయనీయంగా మారడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనిష్ట ధర రూ.5,555, గరిష్ట ధర రూ.13,639 లభించింది. సగటు ధర రూ.9,619 నమోదైంది. మార్చి, ఏప్రిల్ నెలలో లభించిన ధరలతో పోలిస్తే 60 శాతం వరకు ధరలు పడిపోవడం గమనార్హం. ఆర్ఆర్బీ పరీక్షలకు ఉచిత శిక్షణ కర్నూలు(అర్బన్): రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు–అసిస్టెంట్ లోకో పైలెట్, గ్రూపు – డీ – 2026 పరీక్షలకు స్థానిక బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ కె.ప్రసూన శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అభ్యర్థులు ఈ నెల 11లోగా బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయం, అబ్బాస్నగర్, కల్లూరు తహసీల్దార్ కార్యాలయం, కర్నూలు అనే చిరునామాలో దరఖాస్తులను అందజేయాలన్నారు. వంద మంది అభ్యర్థులకు రెండు నెలల పాటు ఉచిత శిక్షణతో పాటు స్టైఫండ్, స్టడీ మెటీరియల్ అందిస్తామన్నారు. ఇతర వివరాలకు 08518 – 236076, 9652093661 నెంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు. అక్రమంగా ఐరన్ ఓర్ తవ్వకాలు టాస్క్ఫోర్స్: అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నాయకులు అక్రమంగా సంపాదించుకోవడానికి పలు మార్గాలను ఎంచుకున్నారు. గ్రామాల్లో విచ్చల విడిగా బెల్టుషాపులు ఏర్పాటు చేసుకున్నారు. అదీ చాలక ఇసుక వ్యాపారం చేస్తున్నారు. వీటికి అదనంగా ఐరన్ ఓర్ తవ్వకాలు చేపడుతున్నారు. బేతంచెర్ల మండలంలోని గూటుపల్లె, హుసేనాపురం, తవిసికొండ, పాపాసాని కొట్టాల, రేపల్లె, వీరాయపల్లె పరిసర ప్రాంతాల్లోని పంట పొలాల్లో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఐరన్ ఓర్ తవ్వుతున్నారు. ఇందుకోసం జేసీబీ, హిటాచీ వాహనాలను ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ ఇనుప ఖనిజం తవ్వకాలు జరుగుతున్నా రెవెన్యూ, భూగర్భ గనులశాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. టీడీపీ నాయకుల తవ్వకాలకు సహకరించడంతోపాటు వారు అనుకున్న ప్రాంతాలకు ఐరన్ఓర్ను తరలించే ప్రకియలో కొందరు అధికారులు పాలు పంచుకుంటున్నట్లు విమర్శలు వస్తున్నాయి. -
వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి
దొర్నిపాడు: డబ్ల్యూ కొత్తపల్లె గ్రామానికి చెంది న ఉపాఽధి కూలీ బాలయ్య (34) వడదెబ్బతో అస్వస్థతకు గురై మృతి చెందిన ఘటన గురువారం చోటు చేసుకుంది. బాలయ్య రోజులాగే పనులకు వెళ్లి కాలువ పూడికతీత పనుల వద్ద రెండు ఫొటోలు కూడా దిగాడు. 020587 నంబర్గల జాబ్కార్డు కల్గి ఉన్నాడు. ఇంతలో ఎండతీవ్రతకు తట్టుకోలేక పని ప్రదేశంలోనే అస్వస్థతకు గురై కుప్పకూలాడు. వెంటనే డబ్ల్యూ గోవిందిన్నెలోని ఓ వైద్యుడి దగ్గరకు చికిత్స నిమిత్త తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. మృతుడికి భార్య సరోజ ఉన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ సుబ్బరాయుడు వెంటనే ఎంపీడీఓ సావిత్రి, ఏపీఎం హనీఫాకు విషయం చెప్పగా అనంతరం వారు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. బాధిత కుటుంబానికి అధికారులు ఆర్థిక సాయం అందించి కుటుంబాన్ని ఆదుకోవాలని డీసీ ప్రెసిడెంట్ ప్రసాద్రెడ్డి కోరారు. గుండెపోటుతో ఏఎస్ఐ శంకర్ మృతి మద్దికెర: మద్దికెర పోలీస్స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఆరిపల్లి శంకర్ (58) గురువారం గుండెపోటుతో మృతి చెందారు. విధులకు ఇంటి నుండి బయలుదేరే సమయంలో గుండెపోటు రావడంతో వెంటనే 108 సమాచారం అందించగా వైద్యపరీక్షల కోసం గుంతకల్లు వైద్యశాలకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు వున్నారు. విద్యుదాఘాతంతో ఎలక్ట్రిషన్ మృత్యువాతఎమ్మిగనూరురూరల్: గార్లదిన్నె గ్రామంలో బోరు మరమ్మతు చేసేందుకు వెళ్లిన ఓ ఎలక్ట్రిషన్ ప్రమాదవశాత్తూ విద్యుత్ఘాతానికి గురై మృతి చెందాడు. గ్రామానికి చెందిన కురవ లక్ష్మన్న(36) చుట్టుపక్కల గ్రామాల్లో ప్రైవేట్ ఎలక్ట్రిషన్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఉదయం గ్రామానికి చెందిన కౌలు రైతు లాజర్ పొలంలో బోరు మరమ్మతు చేసేందుకు ఎలక్ట్రిషన్ కురవ లక్ష్మన్నను తీసుకెళ్లాడు. విద్యుత్ సరఫరా లేదు అనుకొని ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఫీజు వేసేందుకు వెళ్లగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మీనరసమ్మ, కుమారులు శ్రీకాంత్(10), హరికృష్ణ(8)లు ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం అదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న ట్లు రూరల్ ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. చలనచిత్ర రంగానికి ఘంటసాల, ఎస్పీ రెండు కళ్లు కర్నూలు కల్చరల్: వందేళ్ల తెలుగు చలన చిత్ర రంగానికి నేపథ్య గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రెండు కళ్లు అని వక్తలు కొనియాడారు. గురువారం సీక్యాంప్ టీజీవీ కళాక్షేత్రంలో ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 80వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఎస్పీ బాలు పాడిన పాటలను గాయకులు చంద్రకంటి మద్దయ్య, రమణ తదితరులు ఆలపించారు. ఈ సందర్భంగా ఏపీ తెలుగు సినిమా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కరణ్ మాట్లాడుతూ తెలుగు సినిమా రంగంలో బాలుకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడి ప్రేక్షకులను అలరించారన్నారు. టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య మాట్లాడుతూ కరోనా మన జాతికి తీరని నష్టం కలిగించిందన్నారు. ఆయన గాయకుడు మాత్రమే కాక ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారన్నారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ విశ్రాంత మేనేజర్ చిన్నరాముడు, కళాక్షేత్రం కార్యదర్శి యాగంటీశ్వరప్ప, సభ్యులు ఈశ్వర్, కేవీ రమణ, వివేక్, మహేష్, గోపిశెట్టి, సామ్యూల్, సందడి మహేశ్ పాల్గొన్నారు. ఖరీఫ్కు సరిపడా ఎరువులు అందిస్తాం కోవెలకుంట్ల: ప్రస్తుత ఖరీప్ సీజన్కు రైతులకు కొరత లేకుండా రసాయన ఎరువులను సరఫరా చేస్తామని జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం కోవెలకుంట్ల ఏడీఏ కార్యాలయంలో సబ్ డివిజన్ పరిధిలోని ఆరు మండలాల రైతు సేవా కేంద్రాల సిబ్బంది, డీలర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది యూరియా, డీఏపీ తదితర ఎరువులను ’ఏపీఏఐఎంఎస్’ యాప్ ద్వారా పంటల విస్తీర్ణాన్ని బట్టి మూడు విడతలుగా కేటాయిస్తామన్నారు. అధిక యూరియా వాడకం వల్ల కలిగే అనర్థాలు, ఎలినినో ప్రభావం, కౌలు కార్డుల ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో డీడీఏ గంగాధర్, ఏడీఓ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
బైక్ ఢీకొని మహిళ మృతి
కర్నూలు: నగరంలో కిడ్స్ వరల్డ్ సమీపంలోని యునానీ హాస్పిటల్ వద్ద బైక్ ఢీకొన్న ప్రమాదంలో బి.నాగేశ్వరమ్మ (51) మృతిచెందారు. కల్లూరు మండలం గోకులపాడు గ్రామానికి చెందిన నాగేశ్వరమ్మ, చిన్నసుంకన్న దంపతులు కొంతకాలంగా పాతబస్తీలోని రాధాకృష్ణ టాకీస్ వెనుక ఉన్న డబరా వీధిలో నివాసముంటున్నారు. వీరికి ముగ్గురు కొడుకులు. ఎగ్జిబిషన్ షాపింగ్ కాంప్లెక్స్ దుకాణాల్లో నాగేశ్వరమ్మ పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. గురువారం ఉదయం ఇంటి వద్ద నుంచి మనవరాలు శాంతిప్రియతో కలసి షాపుల్లో పనిచేయటానికి వెళ్తుండగా స్థానిక యునానీ హాస్పిటల్ వద్ద వెనుకనుంచి బైక్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగేశ్వరమ్మ తల వెనుకభాగంలో తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలో పడిపోయింది. మనవరాలి తలకు స్వల్ప గాయాలయ్యాయి. ఎదురుగా గోశాల వద్ద అరటి పండ్ల బండితో ఉన్న నాగేశ్వరమ్మ భర్త చిన్నసుంకన్న గమనించి భార్యను ఆటోలో చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. క్యాజువాలిటీలో వైద్యులు పరీక్షించి అప్పటికే ఆమె మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని ఆసుపత్రి ఆవరణలోని మార్చురీ కేంద్రానికి తరలించారు. శాంతిప్రియ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మృతురాలి భర్త చిన్నసుంకన్న ఫిర్యాదు మేరకు ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రేషన్ బియ్యం పట్టివేత
ఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని మునెప్ప నగర్లో అక్రమంగా ఓ రేకుల షెడ్లో నిల్వ ఉంచిన 56 ప్యాకెట్ల రేషన్ బియ్యాన్ని బుధవారం రాత్రి విజిలెన్స్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. అధికార పార్టీ నాయకుడికి చెందిన రేకుల షెడ్లో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ ఉంచినట్లు పక్కా సమాచారంతో విజిలెన్స్ పోలీసులు దాడి చేసినట్లు తెలుస్తోంది. గురువారం విజిలెన్స్ సీఐ పవన్కుమార్ మాట్లాడుతూ.. నందవరం మండలం సోమలగూడూరు మహబుబ్బాషాకు చెందిన రేకుల షెడ్లో 56 బస్తాలు (24 క్వింటాళ్ల) రేషన్ బియ్యాన్ని నిల్వ చేసినట్లు సమాచారం అందిందన్నారు. ఈ మేరకు దాడి చేసి బియ్యంతో పాటు, రవాణాకు ఉపయోగించే ఆటోను కూడా సీజ్ చేసినట్లు తెలిపారు. పట్టుబడిన బియ్యాన్ని ఎంఎల్ఎస్ పాయింట్కు తరలించి, నిందితుడు మహబుబ్బాషాపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ప్రజలకు అందించే బియ్యాన్ని అక్రమంగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలిస్తే మాకు సమాచారం ఇవ్వాలని సీఐ తెలిపారు. సమావేశంలో ఆర్ఐ హఫీజ్, విజిలెన్స్ కానిస్టేబుళ్లు అశోక్కుమార్, ప్రతాప్రెడ్డి ఉన్నారు. -
చట్టాలపై మహిళలు అవగాహన పెంచుకోవాలి
కోడుమూరు రూరల్: మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. గురువారం కోడుమూరులోని శ్రీవాసవి కల్యాణ మండపంలో మహిళల భద్రత–నేరాల నివారణ మరియు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళలు ఏ చిన్న సమస్య వచ్చినా భయపడకుండా పోలీసులను సంప్రదించాలన్నారు. కుటుంబ కలహాలు తలెత్తినప్పుడు పోలీసులను ఆశ్రయిస్తే కౌన్సెలింగ్ ద్వారానే 90శాతం సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అనంతరం మహిళల రక్షణకు ఏర్పాటు చేసిన ’ఆపరేషన్ దండయాన్’ పోస్టర్లను ఎస్పీ ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ పదిలో అత్యధిక మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థినులను, వాలీబాల్ క్రీడలో గెలుపొందిన విద్యార్థులను ఎస్పీ విక్రాంత్ పాటిల్ మెమోంటోలతో సత్కరించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ బాబు ప్రసాద్, కోడుమూరు సీఐ తబ్రేజ్, ఎస్ఐ ఎర్రిస్వామి, సి.బెళగల్ ఎస్ఐ వేణుగోపాల్, కోడుమూరు ఇంచార్జీ ఎంపీడీఓ క్రిష్ణారెడ్డి, ఎంఈఓ రామచంద్రుడు తదితరులు పాల్గొన్నారు. -
స్వర్ణ పల్లకోత్సవం
మంత్రాలయం: పవిత్ర తుంగభద్ర నదీ తీరాన వెలసిన సుప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో స్వర్ణ పల్లకోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. గురువారం మఠం ప్రాంగణంలో దివాన్ సుజయింద్ర ఆచార్, బృందావనం, అర్చకులు శ్రీకాంత్ స్వామి, సహాయ పీఆర్వో హొన్నళ్లి వ్యాసరాజచార్ ఆద్వర్యంలో మృతికా బృందావనాన్ని బంగారు పల్లకిలో ఉంచి అశేష జనవాహిని నడుమ భజా భంత్రీల నడుమ, మంగళ వాయిద్యాలతో నమో రాఘవేంద్ర నామస్మరణంతో ఊరేగించారు. ప్రవచన మండపంలో బంగారు పల్లకి సేవ చేయించి భక్తులకు విశేష దర్శన భాగ్యం కల్పించారు. శ్రీ మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు భక్తులకు ఆశీర్వచనాలు గావించారు. కార్యక్రమంలో మఠం అధికారులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా సిట్రా సత్యనారాయణమ్మ కర్నూలు(టౌన్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి(కర్నూలు పార్లమెంట్)గా మాజీ జిల్లా అధ్యక్షురాలు, తాజా మాజీ కార్పొరేటర్ సిట్రా సత్యనారయణమ్మ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. 10న జెడ్పీ సర్వసభ్య సమావేశం కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 10న ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ జి.వి.రమణారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన స్థానిక జెడ్పీ సమావేశ భవనంలో నిర్వహించనున్న సమావేశంలో వ్యవసాయం, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్, పాఠశాల విద్యా శాఖలపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. సమావేశానికి జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రులు, జెడ్పీటీసీ, కోఆప్షన్ సభ్యులు, కర్నూలు, నంద్యాల పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, ఎంపీపీ, వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన చైర్మన్లు హాజరు కావాలని ఆయన కోరారు. ఒకవైపు ఎండలు, మరోవైపు వానలు కర్నూలు(అగ్రికల్చర్): ఒకవైపు ఉష్ణోగ్రతలు కొనసాగుతుండగా.. మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు 14 మండలాల్లో వర్షం కురిసింది. రెండు, మూడు మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. దేవనకొండలో అత్యధికంగా 85.4 మి.మీ వర్షపాతం నమోదైంది. చిప్పగిరిలో 66.6, పత్తికొండలో 36.6, మద్దికెరలో 10, కల్లూరులో 8.8 మిమీ ప్రకారం వర్షాలు కురిశాయి. ఇదిలాఉంటే ఉష్ణోగ్రతలు కూడా తగ్గడం లేదు. పాణ్యంలో 40.3, గోస్పాడులో 40.3, చాగలమర్రిలో 39.9, ఆళ్లగడ్డలో 39.4, కల్లూరులో 38.8 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రెండు లక్షల సీడ్ బాల్స్ తయారీ లక్ష్యం కర్నూలు కల్చరల్: అటవీ శాఖ ఆధ్వర్యంలో కర్నూలు, ఆదోని రేంజ్లలో రెండు లక్షల సీడ్ బాల్స్ తయారీ లక్ష్యంగా పెట్టుకున్నామని కర్నూలు ఇన్ఛార్జి స్క్వాడ్ డీఎఫ్వో స్వామి వివేకానంద తెలిపారు. కర్నూలు విజయవనం పుల్లయ్య పార్క్లో సీడ్ బాల్స్ను తయారు చేయిస్తున్నామన్నారు. ఈనెల 20వ తేదీ తరువాత వాటిని వివిధ ప్రాంతాలకు చేరవేస్తామన్నారు. పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అటవీ శాఖ, కాలుష్య నియంత్రణ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం జెడ్పీలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. సీడ్ బాల్స్ తయారీపై అవగాహన కల్పించడంతో పాటు మొక్కలు నాటుతామన్నారు.అనంతరం జెడ్పీ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపడతామన్నారు. కార్యక్రమంలో కర్నూలు, ఆదోని రేంజ్ ఆఫీసర్లు ప్రియాంక, తేజశ్వి, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లు ఓబులేష్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
నగరంలో మహిళా దొంగ అరెస్ట్
కర్నూలు: కర్నూలులోని శ్రీరాం నగర్, ఫోర్త్క్లాస్ ఎంప్లాయీస్ కాలనీలో ఇళ్లలో చోరీలకు పాల్పడి తప్పించుకుతిరుగుతున్న మహిళా దొంగను మూడో పట్టణ పోలీసులు పక్కా ఆధారాలతో అరెస్టు చేసి కటకటాలకు పంపారు. కర్నూలు శ్రీరాం నగర్కు చెందిన దాసరి శిరీష, పెద్దమాల్ ప్రవీణ్ కుమార్ దంపతులు ఇంటికి తాళం వేసి ఈ ఏడాది మే 19వ తేదీన రాఘవేంద్రస్వామి దర్శనం నిమిత్తం మంత్రాలయం వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు ప్రధాన ద్వారం తాళాలు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి బెడ్రూమ్లోని డ్రెస్సింగ్ టేబుల్లో ఉంచిన 25 గ్రాముల బంగారు ఆభరణాలు మూటగట్టుకుని ఉడాయించారు. మరుసటి రోజు తిరిగి వచ్చిన దంపతులు ఇంట్లో చోరీ జరిగిందని నిర్ధారించుకుని మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా.. గురువారం నంద్యాల చెక్పోస్టు వద్ద అరుంధతి నగర్కు వెళ్లే రోడ్డులో టీవీ టవర్ వద్ద జెగ్గిలి నాగమల్లేశ్వరి అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసు కుని విచారించగా ఆమె నేరాల చిట్టా బయటపడింది. సాయిబాబా సంజీవ య్య నగర్కు చెందిన ఈమె ప్రస్తుతం శ్రీరాం నగర్లో నివాసముంటోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 11వ తేదీన కూడా ఈమె ఫోర్త్క్లాస్ ఎంప్లాయీస్ కాలనీలోని (గణేష్ నగర్2) నివాసముంటున్న బెస్త నాగరాజు ఇంట్లో కూడా చోరీకి పాల్పడినట్లు విచారణలో అంగీకరించింది. దీంతో ఆమె వద్ద నుంచి ఈ కేసుకు సంబంధించి కూడా బంగారు, వెండి ఆభరణాలు గుర్తు తెలియని వ్యక్తికి విక్రయించగా వచ్చిన నగదు రూ.55 వేలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శేషయ్య తెలిపారు. కేసుల దర్యాప్తులో ప్రతిభ కనపరచిన ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డితో పాటు క్రైం పార్టీ సిబ్బందిని సీఐ అభినందించారు. నిందితురాలిని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్కు ఆదేశించినట్లు సీఐ తెలిపారు. -
హోరాహోరీగా బండలాగుడు పోటీలు
చాగలమర్రి: మండలంలోని మద్దూరు పరిశుద్ధ యోహాను ఆలయ 22వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం నిర్వహించిన ఆరు పళ్ల విభాగం ఎద్దుల బండలాగుడు పోటీలు హోరాహోరీగా సాగాయి. చర్చి ఫాదర్ రెవ. సంపత్ సౌందర్యరాజ్, గ్రామ పెద్ద దస్తగిరి పోటీలను ప్రారంభించారు. నంద్యాల, కర్నూలు, ప్రకాశం జిల్లాల నుంచి ఎనిమిది జతల ఎద్దులు పాల్గొన్న ఈ పోటీలకు సదాశివ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ పోటీలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. ● ప్రథమ బహుమతి (రూ.30వేలు): దొర్నిపాడుకు చెందిన బత్తుల మనోహర్ యాదవ్, పెద్దకొట్టాల బోరెడ్డి నారాయణరెడ్డికి చెందిన ఎ ద్దులు కంబైన్డ్ విజేతగా నిలిచాయి. ● ద్వితీయ, తృతీయ బహుమతులు (రూ.20వేలు, రూ.10 వేలు): గోస్పాడు మండలం సాంబవరానికి చెందిన జుపల్లె ప్రభాకరరెడ్డికి చెందిన ఎద్దులు (బీరం బుల్స్) కై వసం చేసుకున్నాయి. ● నాల్గో బహుమతి (రూ.7వేలు): ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం పాపినేనిపల్లెకు చెందిన పలాస వినీతాగౌడ్ ఎద్దులు గెలుచుకున్నాయి. -
తక్కువ మెరిట్ ఉన్న వారికి ఉద్యోగం
నా కంటే తక్కువగా మెరిట్ ఉన్న అభ్యర్థులకు ఎస్జీటీ పోస్టులు ఇచ్చారు. ఉపాధ్యాయ పోస్టుకు అర్హత ఉందని, సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాలని 2025 సెప్టంబర్ 9న సమాచారం ఇచ్చారు. ఎండీఎస్సీలో నా హల్టికెట్ 033915, ర్యాంకు 12,004, నాకు 54.4 మార్కులు వచ్చాయి. దివ్యాంగుల కోటా కింద 7 శాతం ఉద్యోగాలును భర్తీ చేయాలని ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి. వీటన్నీంటి తుంగలో తొక్కి 47.72 మార్కులు ఉన్న అభ్యర్థులను ఎస్జీటీ పోస్టులకు సెలెక్ట్ చేశారు. నాకు అన్యాయం జరిగిందని కోర్టుకు వెళ్లాను. – జెట్టప్పగారి వీరేష్, కమ్మరచేడు, ఆలూరు ●దగా డీఎస్సీ -
సూక్ష్మ చిత్రం.. పర్యావరణ హితం
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నంద్యాలకు చెందిన చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ వినూత్నంగా టెంకాయ చుట్టూ 620 సూక్ష్మ చిత్రాలను గీచి అందరినీ ఆలోచింప చేశారు. పచ్చని చెట్లు ప్రశాంత వాతావరణం, కొండలు, కోనలు, ఎగిరే గువ్వలు, పక్షులు, జంతవులు స్వేచ్ఛగా ఉన్నట్లు నది జలాలు, నీటిలో నివసించే జలచరాలు ప్రకృతి సోయగాన్ని చూసి వన దేవత సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు ఒక వైపు.. పర్యావరణ కాలుష్యంతో పచ్చదనం ఎండి వన్యప్రాణులకు నీరు లేక అలమటించి పోయి వన దేవతకు మొరపెట్టుకున్నట్లు చనిపోయిన వన్యప్రాణులు, మనుషుల మృతదేహాలు చూసి వనదేవత కన్నీరు పెడుతూ చేతులు జోడించి మనుషుల్లారా ఇకనైనా మారండి అంటూ వేడుకుంటున్నట్లు మరో వైపు చిత్రాలు వేశారు. – నంద్యాల(అర్బన్) -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
● 15 రోజుల క్రితం కుమారుడి మృతి కోసిగి: డి.బెళగల్ గ్రామానికి చెందిన గుడిసె లక్ష్మన్న(41) అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మాధవరం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. లక్ష్మన్నకు భార్య శారద, ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండవ కుమారుడు గుడిసె నాని (12) అనారోగ్యంతో 15 రోజుల క్రితం మృతి చెందాడు. ఈ మేరకు మంత్రాలయం రాఘవేంద్ర స్వామి సన్నిధిలో నిద్ర చేసేందుకు బైక్పై బుధవారం సాయంత్రం లక్ష్మన్న బయలు దేరాడు. మార్గమధ్యలో మాధవరం బ్రిడ్జ్ సమీపంలో మంత్రాలయం నుంచి ఎదురుగా వస్తున్న ఇన్నోవా కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో లక్ష్మన్న తలకు తీవ్ర గాయమైంది. వెంటనే అంబులెన్స్లో ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ కోలుకోలేక గురువారం ఉదయం మృతి చెందాడు. మృతుడి భార్య శారద ఫిర్యాదు మేరకు మాధవరం పోలీసులు కేసు నమోదు చేశారు. 15 రోజుల వ్యవధిలో ఇద్దరిని పోగొట్టుకున్న కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
10 లక్షల మొక్కలు నాటేందుకు సిద్ధం
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, రోడ్లుకు ఇరువైపుల, వివిధ కార్యాలయాల ఆవరణల్లో 10 లక్షల మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో వెల్దుర్తిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాలుష్యనియంత్రణ మండలి ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 7 గంటలకు రాజ్విహార్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ ఉంటుంది. విద్యార్థులకు ముందుగానే నిర్వహించిన పోటీ పరీక్షల్లో విజేతలకు త్వరలో బహుమతులు ప్రదానం చేస్తాం. – కిశోర్కుమార్రెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ అధికారి -
ఇలా చేద్దాం..
● ప్రస్తుత సమాజంలో ప్లాస్టిక్ వినియోగం అధికమైంది. ఇప్పటికే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం అమల్లో ఉంది. రీసైక్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ● ప్రస్తుతం కర్నూలు జిల్లాలో వాయు కాలుష్యమే అధికం. కర్నూలు జిల్లాలో 42 లక్షల జనాభా ఉంది. ఇందులో 70 శాతం జనాభా వాహనాలను వినియోగిస్తోంది. ఈ సంఖ్య ఏటా పెరుగుతూ పోతుండడం ఆందోళన కలిగిస్తోంది. దీని నివారణకు ప్రజలకు వీలైనంత వరకు వాహనాల వినియోగాన్ని తగ్గించాలి. ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ విద్యుత్ను వినియోగించాలి. ● కర్నూలుతోపాటు ఇతర పట్టణాల్లో దాదాపు లక్ష వరకు ఆటోలు ఉన్నాయి. వీటిలో కాలం తీరిన వాహనాలు ఎక్కువగా ఉన్నాయి. ఆటోలు చేసే ధ్వని శబ్ధాలు 140 డెసిబుల్స్ వరకు ఉండడంతో శబ్ధకాలుష్యం అధికమవుతోంది. ప్రభుత్వం స్పందించి సిటీ బస్సులను ప్రవేశపెడితే కాలుష్య నియంత్రణకు ఒక పరిష్కారం లభిస్తుంది. ● కర్నూలు, నంద్యాల, ఆదోని మునిసిపాలిటీతో పాటు నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీల్లో చెత్తను ఎక్కడ పడితే అక్కడే పారబోసి నిప్పు బెడుతున్నారు. కల్లూరు ఎస్టేట్లోని పారిశ్రామిక వాడలో పరిశ్రమల కోసం వినియోగించిన వ్యర్థ ప్లాస్టిక్ను రోడ్లపైనే కాల్చి వేస్తున్నారు. గార్గేయపురంలోని డంప్యార్డులో చెత్తకు నిప్పు పెడుతున్నారు. ఈ విషయంపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. ● హంద్రీ, తుంగభద్ర, కుందూ నదిలో మురుగు నీరు కలుస్తున్నా అధికారుల చర్యలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. నదులు, వాగులు కలుషితం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కాలుష్య కారకాల నియంత్రణలో ప్రజలు భాగస్వామ్యం, అధికారుల సమన్వయం ముఖ్యం. కాలుష్య నియంత్రణ మండలితో పాటు పోలీసు, రవాణాశాఖ, మునిసిపల్, పంచాయతీ అధికారుల బాధ్యత ఉంటుంది. ఎవరి విధులు వారు పాటిస్తే కాలుష్య నియంత్రణానికి మేలు చేసిన వారవుతారు. పర్యావరణ సంరక్షణ బాధ్యతలో మొక్కల పెంపకం అతి ముఖ్యమైనది. మొక్కల పెంపకంపై ప్రభుత్వాలు ఎంతో ఖర్చు చేస్తున్నా ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. ఎవరైతే మొక్కను నాటుతారో వారే సంరక్షణ బాధ్యతను తీసుకుంటే మొక్కలు చెట్లవుతాయి. -
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మృతి
కర్నూలు సిటీ: విద్యావేత్తగా, ఐకానిక్ హెచ్ఎంగా పేరొంది, జాతీయ ఉత్తమ అవార్డు పొందిన రిటైర్డ్ హెచ్ఎం ఎస్పీ కనకలింగం (95) అనారోగ్యంతో బుధవారం నగరంలోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న ఏపీటీఎఫ్ నాయకులు కనకలింగం పార్థివదేహాన్ని సందర్శించి, పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఏపీటీఎఫ్ మహిళా ప్రతినిధి ఎస్పీ మంగళలక్ష్మీని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.హృదయరాజు మాట్లాడుతూ.. రాయలసీమ ప్రాంతంలో విద్యాభివృద్ధికి కనకలింగం ఎంతో కృషి చేశారన్నారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారని, ఆ తరువాత ఆయన చేసిన కృషికి రెండోసారి సైతం అవార్డు వచ్చినా.. తాను ఒకసారి అవార్డు స్వీకరించానని, మరోసారి అవసరం లేదని తిరస్కరించి గొప్ప హెచ్ఎంగా నిలిచారన్నారు. నివాళులర్పించిన వారిలో ఆ సంఘం గౌరవ అధ్యక్షులు ఐ.మరియానందం, సీనియర్ నాయకులు కమలాకర్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పూజారి లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు. -
ఎస్ఐఆర్లో కృత్రిమ మేధస్సును అమలు చేయాలి
● ఆల్ ఇండియా ముస్లిం మైనారిటీస్ కౌన్సిల్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు కర్నూలు(అర్బన్): స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియలో కృత్రిమ మేధస్సును అమలు చేయాలని పలువురు వక్తలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం స్థానిక ఉర్దూఘర్ షాదీఖానాలో ఆల్ ఇండియా ముస్లిం మైనారిటీస్ కౌన్సిల్ చైర్మన్ సయ్యద్ మహ్మూద్ పీర్ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్పై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక మైనారిటీ శాఖకు చెందిన కేయూపీఎస్ ట్రైనింగ్ అకాడమీ కోఆర్డినేటర్ సయ్యద్ ఏజాజ్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే హఫీజ్ఖాన్, ఏపీ ముతవల్లీల సంఘం అధ్యక్షులు షకీల్షఫీ, ఐఎంసీ టీం వ్యవస్థాపకులు రహ్మత్పాషా, సామాజిక కార్యకర్త జమీల్ అహ్మద్, డిప్యూటీ తహసీల్దార్ ధనుంజయ హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. ఓటరు జాబితాలో పేర్లు కొనసాగేందుకు ప్రతి ఓటరు తమ వివరాలను ధ్రువీకరించుకోవాలన్నారు. ఏఐ ఆధారిత వ్యవస్థల ద్వారా అర్హులైన ఓటర్లను సులభంగా గుర్తించడం, పొరపాట్లను తగ్గించడం జరుగుతుందన్నారు. అలాగే దరఖాస్తుల స్థితిగతులు, అవసరమైన చర్యల గురించి ఓటర్లకు ఆటోమేటిక్గా ఎస్ఎంఎస్లు, డిజిటల్ నోటిఫికేషన్లను పంపించడం సాధ్యమవుతుందన్నారు. ఈ నేపథ్యంలోనే ఓటరు ధ్రువీకరణ మరింత పారదర్శకంగా సమర్థవంతంగా ప్రజలకు అనుకూలంగా మారుతుందన్నారు. కౌన్సిల్ చైర్మన్ సయ్యద్ మహ్మూద్ పీర్ మాట్లాడుతూ.. ఓటరు చైతన్యం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. సమాచారం లేమి కారణంగా ఒక్క నిజమైన ఓటు కూడా కోల్పోకూడదన్నారు. అర్హత కలిగిన పౌరులందరూ ఓటరు జాబితాలో ఉండాలని కోరారు. కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఉలేమా, పలు సామాజిక సంస్థల నాయకులు, మహిళలు పాల్గొన్నారు. -
సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతో రూ. 7 కోట్ల టోకరా!
● ఎస్పీని ఆశ్రయించిన బాధితులుబొమ్మలసత్రం: నంద్యాల పట్టణంలోని పద్మావతినగర్లో మెడికల్ సంబంధిత సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతో దాదాపు 700 మంది నుంచి రూ. 7 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. పద్మావతినగర్లో పట్టణానికి చెందిన ముల్లా ఇమ్రాన్, వెంకట మధుసాయి, విఘ్నేష్లు ఒక బిల్డింగ్ అద్దెకు తీసుకున్నారు. సీఆర్ కాలింగ్ సంస్థ పేరుతో మెడికల్ సంబంధిత సాఫ్ట్వేర్ కంపెనీని ఏడాది క్రితం ప్రారంభించారు. అప్పటి నుంచి దాదాపు 700 మంది నిరుద్యోగులను చేర్చుకున్నారు. సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల వరకూ వసూలు చేశారు. మూడు నెలల నుంచి వేతనాలు ఇవ్వడం మానేశారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి బాధితులు ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. ఎస్పీని కలిసి తమగోడును చెప్పుకుని, కంపెనీ నిర్వాహకులకు తాము ఇచ్చిన నగదు ఇప్పించాలని కోరారు. -
నార్మలైజేషన్తో ఉద్యోగం రాలేదు
నార్మలైజేషన్ పద్ధతితో నాకు ఉద్యోగం రాలేదు. ఎస్జీటీలో 75.35 మార్కులు వచ్చినా ఉద్యోగం రాకపోవడానికి కారణం నార్మలైజేషన్. పదేళ్లు కష్టపడి చదివినా నార్మలైజేషన్తో 0. 4 పాయింట్లతో ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. పాత పద్ధతిలో ఒకే రోజు ఒకే పేపర్ విధానంలో డీఎస్సీ పరీక్ష పెట్టింటే నాకు ఉద్యోగం తప్పని సరిగా వచ్చేది. – శ్రీనివాసులు, నందికొట్కూరు నేను ఎంఏ, బీఈడ్ పూర్తి చేశాను. ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో డీఎస్సీ–2025 పరీఓలు రాసినా చివరకు ఎంపిక కాలేకపోయా. ప్రస్తుతం డీఎస్సీ–2025 నియామకాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వెలుగులోకి రావడంతో నేను బాధపడుతున్నా. ప్రతిభ, కష్టానికి గుర్తింపు దక్కాల్సిన చోట అవకతవకలు జరగడం అన్యాయం. పారదర్శకంగా విచారణ జరిపి నిజాలు వెలుగులోకి తీసుకురావాలని కోరుకుంటున్నా. – జీ.సాదిక్ బాషా (ఎంఏ., బీఈడ్), వెలుగోడు ●దగా డీఎస్సీ -
ఐదారు వేల ఖర్చు అధికం
మా కుటుంబంలో ఆరుగురు సభ్యులం ఉన్నాం. మాది మధ్య తరగతి కుటుంబం. నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఆదాయం ఉంది. 30కిలోలకు పైగా బియ్యం, వంట నూనెలు 6–7 లీటర్లు అవసరం. కొద్ది రోజులుగా అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ఆదాయం రూపాయి పెరగలేదు. ధరల పెరుగుదలతో ఖర్చు నెలకు రూ.25 వేలకు పైగానే వస్తోంది. ఏప్రిల్ నెలతో పోలిస్తే మే నెలలో దాదాపు ఐదారు వేల వరకు ఖర్చు అధికమైంది. దిక్కుతోచని స్థితిలో ఉన్నాం. – కె.రత్నమ్మ, కృష్ణానగర్, కర్నూలు మా కుటుంబానికి నెలకు రూ.15వేల వరకు ఆదాయం ఉంది. సొంత ఇల్లు ఉంది. మిగిలిన ఖర్చు నెలకు రూ.20 వేలకు పైగా వస్తోంది. ప్రతినెలా రూ.5వేలు చేబదులు తీసుకుంటున్నాం. రెండు నెలల క్రితం సన్ఫ్లవర్ ఆయిల్ లీటరు ప్యాకెట్ ధర రూ.160. ఇప్పుడు రూ.180లకు విక్రయిస్తున్నారు. మాకు నెలకు 10 లీటర్ల ఆయిల్ అవసరమవుతుంది. ఈ లెక్కన ఆయిల్పైనే రూ.200 అదనంగా ఖర్చు అవుతోంది. పెరిగిన ఖర్చులకు సమానంగా ఆదాయం ఉండటం లేదు. ధరల మోతతో బతుకు భారమవుతోంది. – కతిజాబి, గీతానగర్, కర్నూలు చంద్రబాబు ప్రభుత్వం సంక్షేమ పథకాలకు మంగళం పలికింది. ఈ కారణంగా ప్రజల్లో కొనుగోలు సామర్థ్యం తగ్గిపోయింది. దీనికి తోడు నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగిపోయాయి. మహిళా సంక్షేమం ఊసే లేకుండా పోయింది. ఖర్చులు చాలా వరకు పెరిగిపోయాయి. ప్రభుత్వం పథకాలతో ప్రజలకు లబ్ధి చేకూర్చినప్పుడే జీవనం సాఫీగా సాగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పులు చేసి నెట్టుకురావాల్సి వస్తోంది. – లక్ష్మీదేవి, పొదుపు మహిళ, ఆర్ఎస్ రంగాపురం, బేతంచెర్ల మండలం -
అడ్మిషన్ల పేరిట సైబర్ మోసాలు
కర్నూలు: ప్రస్తుత విద్యా సంవత్సరానికి స్కూళ్లు, కాలేజీల్లో అడ్మిషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు. కొంతమంది మోసగాళ్లు ప్రముఖ పాఠశాలలు, కళాశాలల ప్రతినిధులమని నమ్మబలికి ఫోన్ కాల్స్, వాట్సప్ సందేశాలు లేదా సోషల్ మీడియా ప్రకటనల ద్వారా సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. రూ.10 వేలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని అడ్వాన్స్గా చెల్లించి సీటు రిజర్వు చేసుకోండని తల్లిదండ్రులను మోసం చేస్తున్నారన్నారు. అపరిచిత వ్యక్తులు పంపిన బ్యాంకు ఖాతాలు, యూపీఐ ఐడీలు లేదా క్యూఆర్ కోడ్లకు డబ్బులకు పంపవద్దని సూచించారు. సైబర్ మోసాలపై 1930 హెల్ప్లైన్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. -
నవ చేతన యాప్తో పిల్లల్లో లోపాల గుర్తింపు
కర్నూలు(సెంట్రల్): నవ చేతన యాప్తో ఏఐ ఆధారిత ఈసీడీ స్క్రీనింగ్ నిర్వహించి 0–6 సంవత్సరాల్లోపు చిన్నారుల ఆరోగ్యం, ఎదుగుదల లోపాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ సిరి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నవ చేతన యాప్పై సీడీపీఓలు, అంగన్వాడీ సూపర్వైజర్లకు జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిన్నారుల్లో సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన వైద్య సేవలు అందించాలనేది నవ చేతన యాప్ ఉద్దేశమన్నారు. జూన్ 5 నుంచి 10వ తేదీ వరకు మండల స్థాయిలో అంగన్వాడీ కార్యకర్తలకు యాప్ నిర్వహణపై శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. యాప్లోని అంశాలపై సీడీపీఓలు, అంగన్వాడీలు పూర్తిగా అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ విజయ, వైద్యురాలు డాక్టర్ సృజనారెడ్డి, జిల్లా ప్రారంభ జోక్య కేంద్రం మేనేజర్ ఇర్ఫాన్ పాల్గొన్నారు. ముగ్గురు సీనియర్ అకౌంటెంట్లకు పదోన్నతి కర్నూలు(అగ్రికల్చర్): ఖజానా శాఖ ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న ముగ్గురు సీనియర్ అకౌంటెంట్లకు సబ్ ట్రెజరీ అధికారులు(ఎస్టీవో)గా పదోన్నతులు లభించాయి. రాష్ట్రం మొత్తం మీద ఆరుగురు సీనియర్ అకౌంటెంట్లకు పదోన్నతులు దక్కగా.. ఉమ్మడి జిల్లాలోనే ముగ్గురు ఉండటం విశేషం. పత్తికొండ సబ్ ట్రెజరీలో సీనియర్ అకౌంటెంట్గా పనిచేస్తున్న శీలమ్మకు ఎమ్మిగనూరు సబ్ ట్రెజరీ అధికారిగా నియమించారు. కర్నూలు జిల్లా ట్రెజరీలో సీనియర్ అకౌంటెంటుగా పనిచేస్తున్న రవికుమార్ పదోన్నతిపై సత్యవేడు సబ్ ట్రెజరీకి బదిలీ అయ్యారు. నంద్యాల జిల్లా సబ్ ట్రెజరీలో సీనియర్ అకౌంటెంట్గా పనిచేస్తున్న కమలాకర్ను పదోన్నతిపై తిరుపతికి బదిలీ చేశారు. ఈ మేరకు ఖజానా శాఖ డైరెక్టర్ పద్మజ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇళ్ల గణనకు జరగకపోతే ‘డయల్ 1855’ కర్నూలు(సెంట్రల్): జనగణన 2027లో భాగంగా మొదటి దశలో నిర్వహిస్తున్న ఇళ్ల జాబితా, ఇళ్ల గణన జూన్ 5వ తేదీన ముగుస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకు ఏదైనా కారణంతో సర్వేకు రాకపోతే 1855 టోల్ఫ్రీ నెంబర్ లేదా సమీపంలో ఉన్న గ్రామ, వార్డు సచివాలయాలను సంప్రదించాలని కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి బుధవారం ఒక ప్రకటనలో జిల్లా ప్రజలను కోరారు. దేశాభివృద్ధిలో కీలకమైన 2027 జనాభా గణన ప్రక్రియలో భాగస్వాములు కావాలని, దేశాభివృద్ధికి తోడ్పడాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. సెలవుల్లో టీచర్లకు శిక్షణ ● నేటి నుంచి 9వ తేదీ వరకు నిర్వహణ కర్నూలు సిటీ: ప్రాథమిక విద్యలో నాణ్యత ప్రమాణాలు పెంచేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది. విద్యాశాఖలో ఉపాధ్యాయులకు విద్యా సంవత్సరంలో బోధనాంశాలపై శిక్షణ ఇవ్వడం పరిపాటి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రాథమిక విద్యలో సమూల మార్పుల పేరిట గతంలో ఎప్పుడూ లేనంతగా వేసవి సెలవుల్లో హడావుడి చేస్తోంది. ఫండమెంటల్ లిటరసీ అండ్ న్యూమరసీ(ఎఫ్ఎల్ఎన్) పేరుతో నేటి(గురువారం) నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇటీవలే జిల్లా స్థాయిలో శిక్షణ ఇచ్చేందుకు మాస్టర్ ట్రైనర్స్కి కీరిసోర్స్ పర్సన్స్ శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన ట్రైనర్స్ ఈ నెల 9వ తేది వరకు నాన్ రెసిడెన్షియల్ విధానంలో శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లాలోని 7 కేంద్రాల్లో ఈ శిక్షణనిస్తారు. 1, 2 తరగతులు బోధన చేసే సెకండరీ స్కూల్ టీచర్లు, గతేడాది మెగా డీఎస్సీ ద్వారా నియామకమైన ఎస్జీటీలు మొత్తం 2,489 మంది శిక్షణ గురించి తెలుసుకునేందుకు మాడ్యూల్స్ ఇవ్వాల్సి ఉంది. కానీ ఇంత వరకు జిల్లాలకు శిక్షణ మాడ్యూల్స్ రాకపోవడం గమనార్హం. శిక్షణకు జిల్లా వ్యాప్తంగా 7 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎంపిక చేసిన కేంద్రాల్లో టీచర్లకు సౌకర్యవంతంగా ఉండే ఏ కేంద్రానిౖకైనా హాజరు కావచ్చని సమగ్ర శిక్ష అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీ చౌడేశ్వరిదేవి ఆలయానికి రూ.5 లక్షల విరాళం బనగానపల్లె రూరల్: నందవరం చౌడేశ్వరిదేవి ఆలయ అభివృద్ధికి విజయవాడ పట్టణానికి చెందిన న్యూ ఎలక్ట్రిసీటి కాలనీ పటమటకు చెందిన శీలందేవి వివేకానంద, పద్మజ కుటుంబ సభ్యులు రూ.5.05 లక్షల విరాళాన్ని అందజేసినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి బుధవారం తెలిపారు. రూ. 4,50,005 ఆలయ అభివృద్ధికి, మరో రూ.50 వేలు అన్నదానానికి విరాళంగా అందజేశారన్నారు. -
శ్రీమఠం హుండీ ఆదాయం రూ.4.35 కోట్లు
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ రాఘవేంద్రస్వామి కొలువైన శ్రీమఠానికి హుండీ ఆదా యం రూ.4,35,25,136 సమకూరింది. బుధవారం శ్రీమఠం రాజాంగణ భవనంలో హుండీ లెక్కింపు చేపట్టారు. మే నెల నుంచి జూన్ వరకు 22 రోజులకు సంబంధించి హుండీ కానుకలు శ్రీమఠం అధికారులు లెక్కగట్టారు. నగదు రూపంలో రూ 4,19,97,861, నాణేల రూపంలో రూ.15,27,275 వచ్చిందన్నారు. అలాగే 46 గ్రాముల బంగారం,750 గ్రాముల వెండి కానుకలు సమకూరినట్లు మేనేజర్ ఎస్.కె శ్రీనివాసరావు తెలిపారు. హుండీ లెక్కింపును దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుధాకర్రెడ్డి తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్–2 వెంటేష్ జోషి, ఇంజినీర్ సురేష్ కోనాపూర్ పాల్గొన్నారు. -
జిల్లాలో తేలికపాటి వర్షాలే
కర్నూలు: ఎల్నినో ప్రభావంతో జిల్లాలో వర్షాలు తేలికపాటికే పరిమితమవుతున్నాయి. ఆకాశం మేఘావృతమై భారీ ఉరుములు, మెరుపులు ఉంటున్నా వర్షాలు నామమాత్రంగా పడుతుండటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం వరకు ఆరు మండలాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. కల్లూరులో 16.2 మి.మీ, కర్నూలు అర్బన్లో 11.4, కర్నూలు రూరల్లో 6.8, దేవనకొండలో 6.8, ఆస్పరిలో 5.8, పత్తికొండలో 5.2 మి.మీ ప్రకారం వర్షపాతం నమోదైంది. కాగా బుధవారం సాయంత్రం నుంచి కర్నూలు, కల్లూరు, వెల్దుర్తి తదితర ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. ఉరుములు, మెరుపుల తీవ్రత ఎక్కువగా ఉంది. ఇకపోతే జిల్లాలోని గోస్పాడు, పాణ్యంలో 40.3 డిగ్రీలు, నంద్యాల రూరల్, కోవెలకుంట్ల, ఉయ్యాలవాడలో 39.5, ఆళ్లగడ్డలో 39.4, బనగానపల్లెలో 39, కల్లూరులో 38.8, కర్నూలులో 38.5 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
పాలియేటివ్ కేర్తో రోగుల్లో మానసిక ధైర్యం
కర్నూలు(హాస్పిటల్): ప్రాణాంతక, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు నొప్పి నివారణతో పాటు మానసిక ధైర్యాన్ని కల్పించడంలో పాలియేటివ్ కేర్ కీలక పాత్ర పోషిస్తోందని డీఎంహెచ్ఓ డాక్టర్ వై.కామేశ్వరప్రసాద్ అన్నారు. బుధవారం స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో పాలియేటివ్ కేర్ సెన్సిటైజేషన్, శిక్షణ కార్యక్రమం జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ సీఎస్కే ప్రకాష్ మాట్లాడుతూ స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లోని పాలియేటివ్ కేర్ యూనిట్ నిరుపేద రోగులకు విశేష సేవలను అందిదిస్తోందన్నారు. ఈ కేంద్రానికి నార్కోటిక్ మందుల వినియోగానికి అవసరమైన లైసెన్స్ ఉండటంతో తీవ్ర నొప్పితో బాధపడుతున్న రోగులకు సమర్థవంతమైన చికిత్స సాధ్యమవుతోందన్నారు. ఇప్పటి వరకు దాదాపు 3,500 నుంచి 4వేల మంది రోగులకు పాలియేటివ్ కేర్ సేవలను అందించామన్నారు. స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ను నోడల్ కేంద్రంగా గుర్తించి అనంతపురం, హిందూపురం, నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు, నర్సింగ్ సిబ్బందికి ఈనెల 2 నుంచి 6వ తేదీ వరకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కర్నూలు మెడికల్ కాలేజి ఇన్ఛార్జి ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీరాములు, అదనపు డీఎంహెచ్ఓ డాక్టర్ ఎల్.భాస్కర్, అనెస్తీషియా హెచ్ఓడీ డాక్టర్ సుధీర్ పాల్గొన్నారు. -
లింగనిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం
● ఆలూరులో స్కానింగ్ మిషన్ సీజ్ఆలూరు రూరల్: లింగనిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని ఆదోని డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ సత్యవతి అన్నారు. స్థానిక కొత్త బస్టాండు సమీపంలో అమ్మ ప్రైవేటు ఆసుపత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారని ఓ వ్యక్తి డీఎం అండ్ హెచ్ఓ, వైద్యారోగ్య శాఖ కమిషనర్ కార్యాలయానికి ఫిర్యాదు చేయడంతో గురువారం ఆమె తహసీల్దార్ శోభ సువర్ణమ్మ సమక్షంలో పంచనామా నిర్వహించి స్కానింగ్ గదిని సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమ్మ ఆసుపత్రిపై అందిన ఫిర్యాదు మేరకు తనిఖీలు నిర్వహించి స్కానింగ్ మిషన్, గదిని సీజ్ చేశామన్నారు. అలాగే ఆసుపత్రి నిర్వాహకులకు నోటీసులు జారీ చేశామన్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఆసుపత్రుల్లో వైద్యం చేయరాదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆలూరు ఆర్ఐ బసవన్న గౌడ్, వైద్యారోగ్య సిబ్బంది ఉన్నారు. -
ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలు
● రెండు నెలల్లోనే ధరల్లో భారీగా వ్యత్యాసం ● ప్రజల్లో తగ్గిపోయిన కొనుగోలు సామర్థ్యం ● గత వైఎస్సార్సీపీ హయాంలో సంక్షేమ పథకాలతో ఆర్థిక లబ్ధి ● సూపర్–6 హామీలను విస్మరించిన టీడీపీ ప్రభుత్వం ● ప్రతి కుటుంబంపై సగటున రూ.6వేల అదనపు భారంకర్నూలు(అగ్రికల్చర్): నిత్యావసర వస్తువుల ధరలు సామాన్య, మధ్య తరగతి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక విస్మరించింది. ఒకటి, రెండు హామీలతోనే సూపర్–6 విజయవంతమైనట్లు ప్రచారం చేసుకోవడం పట్ల ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. సంక్షేమ పథకాలు లేకపోవడం వల్ల అన్ని వర్గాల ప్రజల్లో కొనుగోలు సామర్ధ్యం పడిపోయింది. నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయనేందుకు జిల్లా యంత్రాంగం ప్రతి 15 రోజులకు పంపుతున్న నివేదికనే నిదర్శనం. ఈ ఏడాది ఏప్రిల్ 3వ తేదీతో పోలిస్తే ప్రస్తుతం అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినట్లు స్పష్టమవుతోంది. ధరల పెరుగుదలను నియంత్రించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కనీస చర్యలు కూడా చేపట్టని పరిస్థితి. 2024 జూన్లో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైన రెండున్నర నెలల్లోనే ధరలు 10 నుంచి 20 శాతం వరకు పెరగడంతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాల బడ్జెట్ తలకిందులైంది. ఈ రెండు నెలల వ్యవధిలో ధరల పెరుగుదల లేని నిత్యావసర వస్తువు ఒక్కటీ లేదు. నిత్యావసర వస్తువుల ధరలకు తోడు కూరగాయల ధరలు కూడా ముట్టుకుంటే మండిపోతున్నాయి. ప్రతి నెలా అప్పులే.. ధరల పెరుగుదల కారణంగా సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు, చిరుద్యోగుల పరిస్థితి దారుణంగా మారింది. చిరుద్యోగుల వేతనాలు రూ.20వేల లోపే ఉండటం, ధరలు అడ్డగోలుగా పెరుగుతుండటంతో ఖర్చులను తట్టుకునేందుకు అప్పులు చేయక తప్పని పరిస్థితి. ఉమ్మడి జిల్లాలో అవుట్సోర్సింగ్పై దాదాపు 3వేల మంది వరకు పని చేస్తున్నారు. వీరి వేతనాలు రూ.15 వేల నుంచి రూ.20వేల లోపే ఉంటున్నాయి. పెరిగిన ధరల ప్రకారం పరిశీలిస్తే వీరి నెల ఖర్చులు రూ.30 వేల వరకు చేరుతున్నాయి. అంటే ప్రతి నెలా రూ.10 వేల వరకు అప్పు చేయాల్సి వస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆర్థిక లబ్ధితో ఊరట 2019–20 నుంచి 2023–24 వరకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున అమలు చేసింది. 2019 మే నెలలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే చెప్పిన మాట ప్రకారం హామీల అమలుకు శ్రీకారం చుట్టారు. ఐదేళ్లు సంక్షేమ పథకాలు అమలయ్యాయి. ఒక్కో కుటుంబానికి మూడు, నాలుగు పథకాల కింద సగటున ఏడాదికి రూ.75 వేల నుంచి లక్ష వరకు నగదు ప్రయోజనం లభించింది. ఉమ్మడి జిల్లాలో ఏడాదికి రూ.4,500 కోట్ల వరకు నగదు నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాలకు జమ అయ్యింది. అప్పట్లో ప్రజల్లో కొనుగోలు సామర్థ్యం కూడా గణనీయంగా పెరిగింది. సరుకులు ఖర్చులు (రూపాయల్లో) సరుకు ఏప్రిల్ జూన్ కందిపప్పు 115 135 బియ్యం పాతవి 52 62 చక్కెర 40 49 శనగపప్పు 65 80 ఇడ్లీరవ్వ 38 42 పామాయిల్(లీటరు) 120 145 సన్ప్లవర్ అయిల్ 160 175 గోధుమ పండి 38 45 వెల్లుల్లి 160 220 -
రూ.5 లక్షల విలువైన విత్తనాలపై స్టాప్సేల్
కర్నూలు: కల్లూరు మండలంలోని విత్తన దుకాణాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆ శాఖ ఉన్నతాధికారి ఆదేశాల మేరకు రాయలసీమ సీడ్స్, లక్ష్మి సీడ్స్, కామధేను ట్రేడర్స్ విత్తన దుకాణాల్లో బుధవారం తనిఖీలు చేపట్టారు. కంపెనీ స్టోర్స్ సర్టిఫికెట్లు లేనందున ఆయా దుకాణాల్లో రూ.5 లక్షల మేరకు సేల్స్ నిలుపుదల చేస్తూ (స్టాప్ సేల్ ఆర్డర్) ఇచ్చారు. విజిలెన్స్ సీఐ పవన్ కుమార్, వ్యవసాయ అధికారి విశ్వనాథ్, ఏఓ విష్ణువర్దన్ రెడ్డి తదితరులు తనిఖీల్లో పాల్గొన్నారు. -
ఆత్మకూరులో బరితెగించిన పచ్చమూకలు
సాక్షి, నంద్యాల జిల్లా: ఆత్మకూరులో టీడీపీ కార్యకర్తలు బరితెగించారు. ఆత్మకూరు పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంపై పచ్చ మూకలు దాడికి యత్నించాయి. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి అరాచకాలను వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ప్రశ్నించారు. దీంతో వైఎస్సార్సీపీ కార్యాలయంపై చొచ్చుకొచ్చిన టీడీపీ గూండాలు శిల్పా చక్రపాణిరెడ్డి ఇంటిపై రాళ్లు రువ్వారు.పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో ప్రత్యేక పోలీసు బలగాలు భారీగా చేరుకున్నాయి. చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై వైఎస్సార్సీపీ పోరు బాట పట్టిన సంగతి తెలిసిందే. రేపు(గురువారం) జరగబోయే కార్యక్రమాన్ని అడ్డుకునే కుట్రలో భాగంగా పార్టీ కార్యాలయంపై టీడీపీ గూండాలు దాడికి యత్నించారు. -
నీరు కొనాలన్నా పోటీపడాల్సిందే!
ఆదోని అర్బన్: మంచినీరు తాగాలంటే బిందెకు రూ.15 పెట్టి నీరు కొనాల్సిన పరిస్థితి ఆదోని మండలం పెద్దపెండేకల్ గ్రామస్తులది. బయట నుంచి వాహనంలో వచ్చిన మినరల్ వాటర్కూ డబ్బులిచ్చి పోటీపడాల్సిన పరిస్థితి. గ్రామంలో తాగునీటి సమస్య సంవత్సరం నుంచి తీవ్రంగా వేధిస్తోంది. నెల రోజుల క్రితం ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథిని గ్రామస్తులు అడ్డుకొని బిందెలతో నిరసన తెలిపారు. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. అయినా ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. ట్యాంకును శుభ్రపరచకుండా దాదాపు సంవత్సరం నుంచి నీరు లేకుండా గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు. సంవత్సరంపాటు వాటర్ ట్యాంకులో నీటిని వదలకుండా ఉండడంతో ట్యాంకులో చెత్తాచెదారం, క్రిములు, కీటకాలతో నిండిపోయింది. దాన్ని శుభ్రపరచకుండానే అధికారులు ఎమ్మెల్యే ఆదేశించారని నీటిని సరఫరా చేశారు. ఆ నీరంతా కలుషితం కావడంతో నీటిని వృథాగా బయటకు వదిలేశారు. ఇక మరుసటి రోజు నీరు వస్తాయనుకున్న గ్రామస్తులకు నీరు రాకపోవడంతో యథావిధిగా నీటి కొరత కొనసాగింది. దీంతో ఏమీ చేయలేక నీటిని కొనుగోలు చేసుకుని తాగుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దపెండేకల్లో తీవ్ర నీటి ఎద్దడి నెల రోజుల క్రితం ఎమ్మెల్యేకు విన్నవించిన గ్రామస్తులు అయినా పరిష్కారం కాని సమస్య బిందె నీరు రూ.15కు కొంటున్న వైనం -
నిర్లక్ష్యానికి ‘మందు’లేదు!
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మందుల కోసం రోగులు, సహాయకులు గంటల కొద్దీ నిలబడాల్సి వస్తోంది. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట అయినా మందులు ఇచ్చే షెడ్డును దాటి రోగులు క్యూలో నిల్చోవాల్సి వచ్చింది. తీవ్రమైన ఉష్ణోగ్రతల కారణంగా ఉక్కపోతను భరిస్తూ రేకుల షెడ్డు కింద జనం నరకయాతన అనుభవించారు. కౌంటర్ వద్దకు వెళ్లి మందులు తీసుకోవాలంటే కనీసం గంట సమయం పడుతోందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతసేపు నిరీక్షించినా డాక్టర్ రాసిన మందులన్నీ ఇస్తారన్న గ్యారంటీ లేదు. చీటీలో రాసిన వాటిలో ఒకటి, రెండైనా మందులు ఇవ్వడం లేదని, వాటిని బయట కొనుగోలు చేయాల్సి వస్తోందని, ఇన్సులిన్ మందులను సైతం నెలకు సరిపడా ఇవ్వడం లేదని వాపోతున్నారు. – కర్నూలు(హాస్పిటల్) -
చేపల ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలి
కర్నూలు సిటీ: ఈ ఏడాది జిల్లాలో చేపల ఉత్పత్తి పెంపునకు నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి మత్స్యశాఖ డీడీని ఆదేశించారు. మంగళవారం సుంకేసుల బ్యాకేజీ వద్ద చేపల విత్తనోత్పత్తి కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కేంద్రంలోని మౌలిక సదుపాయాలు, ఉత్పత్తి సామర్థ్యం, చేపల పెంపకానికి సంబంధించిన ఏర్పాట్లను డీడీని అడిగి తెలుసుకున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది చేపల విత్తనోత్పత్తి లక్ష్యాలను గణనీయంగా పెంచిన నేపథ్యంలో ఆ మేరకు చర్యలు చేపట్టాలన్నారు. సీడ్ ప్రొడక్షన్ సెంటర్ పరిధిలోని చెరువులలో పేరుకుపోయిన పూడిక తొలగింపు(జంగిల్ క్లియరెన్స్) పనులను చేపట్టాల్సిన అవసరాన్ని మత్స్యశాఖ డీడీ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన కలెక్టర్ పూడికతీత, జంగిల్ క్లియరెన్స్ పనులకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలన్నారు. కలెక్టర్ వెంట కర్నూలు ఆర్డీఓ సందీప్కుమార్, మత్స్యశాఖ డీడీ రంగనాథ్ బాబు, కర్నూలు రూరల్ తహసీల్దారు టి.వి రమేష్ బాబు, తదితరులు ఉన్నారు. ట్రావెల్స్ బస్సుపై రూ.5.77లక్షల జరిమానా డోన్ టౌన్: వేరే నంబరుతో తిరుగుతున్న ట్రావెల్ బస్సుకు డోన్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ సీజ్ చేసి రూ.5,77,040 జరిమానా విధించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా మంగళవారం పట్టణానికి చెందిన వెంకటసాయి టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్సును తనిఖీ చేయగా.. నంబరు ప్లేట్పై మరో నంబర్ స్టిక్కరు అతికించి ఉంచడాన్ని గమనించారు. ఆన్లైన్లో తనిఖీ చేయగా ఆ బస్సుపై వైఎస్సార్ కడప జిల్లాలో గత సంవత్సరం 2025 ఆగస్టు నాటికి రూ. 4,14,250 లక్షలు జరిమానా బకాయిలుగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో బస్సును సీజ్ చేసి రవాణాశాఖ నిబంధనల ప్రకారం రూ.5,77,040 జరిమానా విధించి బస్సును ఆర్టీసీ డిపోకు తరలించారు. -
హౌసింగ్ పీడీగా నరసింహారెడ్డి
కర్నూలు(అర్బన్): జిల్లా గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్గా డ్వామా పీడీ ఐ.నరసింహారెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు హౌసింగ్ పీడీగా విధులు నిర్వహించిన టి.చిరంజీవి మే 31న పదవీ విరమణ చేశారు. ఈ నేపథ్యంలోనే డ్వామా పీడీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. గోస్పాడులో 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి జిల్లాలో ఉష్ణో గ్రతలు కొనసాగుతున్నాయి. మరోవైపు అక్కడక్కడ వర్షాలు కూడా కురుస్తున్నాయి. మంగళవారం నంద్యాల జిల్లాలోని పలు మండలాల్లో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. వానాకాలం మొదలైనా ఎండలు, వడగాలుల తీవ్రత కొనసాగుతోంది. గోస్పాడులో 41.6 డిగ్రీలు, పాణ్యంలో 41.5, శిరువెల్లలో 41.4, దొర్నిపాడులో 41.4, చాగలమర్రిలో 41.4, ఆళ్లగడ్డలో 41.3, అవుకులో 41.2, గడివేములలో 41.1, కొత్తపల్లిలో 41, ఓర్వకల్లో 40.6, కల్లూరులో 40.3, కౌతాళంలో 40.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. క్వింటా వేరుశనగ రూ.7,690 ఎమ్మిగనూరు టౌన్: స్థానిక వ్యవసాయ మార్కెట్లో మంగళవారం క్వింటా వేరుశనగ గరిష్టంగా రూ.7,690 పలికింది. మార్కెట్కు 90 క్వింటాళ్ల వేరుశనగ దిగుబడులు విక్రయానికి వచ్చాయి. క్వింటా కనిష్ట ధర రూ.5,890, మధ్యస్థ ధర రూ.7,600 ప్రకారం వ్యాపారులు కొనుగోలు చేసినట్లు మార్కెట్ యార్డ్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జి.చంద్రమౌళి తెలిపారు. ఎల్నినోతో దీర్ఘకాలం బెట్ట పరిస్థితులు కర్నూలు(అగ్రికల్చర్): ఎల్నినో ప్రభావంతో పంట కాలంలో దీర్ఘకాలం బెట్ట పరిస్థితులు ఉంటాయని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తక్కువ వర్షపాతం వల్ల భూగర్భ జలాల స్థాయి గణనీయంగా పడిపోవచ్చని, రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గుతాయన్నారు. వేడి గాలుల వల్ల నేలలోని తేమ ఆవిరై పంటలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. పూత, కాయ రాలడం, తాలుగింజలు ఏర్పడతాయన్నారు. వ్యవసాయంపై ఎల్నినో ప్రభావాన్ని తగ్గించుకునేందుకు ఎర్రనేలల్లో జూన్, జూలై నెలల్లో వేరుశనగ, కందులు, ఆముదం, సజ్జలు, కొర్రలు, ఆముదం+కందులు, సజ్జలు+కందులు/వేరుశనగ, కొర్ర, కందులు+ కొర్ర వేసుకోవచ్చన్నారు. నల్లరేగడి నేలల్లో సజ్జలు, పత్తి, కందులు, పొద్దుతిరుగుడు, ఆముదాలు, ఆముదాలు+కందులు, సజ్జలు+కందులు వేసుకోవచ్చని పేర్కొన్నారు. ఎర్ర నేలల్లో కనీసం 50 మి.మీ, నల్ల రేగడి నేలల్లో 75 మి.మీ వర్షపాతం నమోదైన తర్వాతనే విత్తనం వేసుకోవాలన్నారు. కూల్డ్రింక్స్ దుకాణంలో తనిఖీలు కర్నూలు(హాస్పిటల్): నగరంలోని మాధవనగర్లో ఉన్న ఈశ్వర్ కూల్డ్రింక్ దుకాణంలో మంగళవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇ. రజనీకాంత్ అనే వ్యక్తి ఈ దుకాణంపై ప్రజా స్పందన పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. జేసీ ఆదేశాలతో ఫుడ్ సేఫ్టీ అధికారి రాజగోపాల్ దుకాణాన్ని తనిఖీ చేశారు. ఇందులో గత సంవత్సరం అక్టోబర్లో ఎక్స్పైర్ అయిన 24 థమ్స్ అప్ బాటిల్స్ను గుర్తించారు. అలాగే నన్నారి బాటిల్స్ను సైతం పరిశీలించారు. వాటిని స్వాధీనం చేసుకుని పరీక్షల కోసం ల్యాబోరేటరికి పంపించారు. ఈ మేరకు సదరు దుకాణంపై కేసు నమోదు చేసినట్లు రాజగోపాల్ తెలిపారు. -
అధికార పార్టీ బెదిరింపులకు భయపడొద్దు
● పోలింగ్ బూత్ ఏజెంట్ల శిక్షణలో ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిదేవనకొండ: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికార టీడీపీ బెదిరింపులకు పాల్పడుతుందని, తాను ప్రతి గ్రామంలో పర్యటిస్తానని, కార్యకర్తలకు అండగా ముందుంటానని, ఎవరికీ భయపడాల్సిన పనిలేదని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అన్నారు. మండల కేంద్రమైన దేవనకొండలోని మూగితాత దర్గా ఫంక్షన్ హాల్లో సోమవారం జరిగిన బూత్ స్థాయి ఏజెంట్ల శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు నియోజకవర్గ పరిశీలకుడు రామచంద్రరెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియపై ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకుల కుటుంబాల్లో ఎవరికై నా ఓటు హక్కు లేకపోతే ఫారం–6 ద్వారా చేర్చాలన్నారు. టీడీపీ కార్యకర్తలు రెండు, మూడు చోట్ల ఓటుహక్కు కల్పించుకుని ఉంటే వారిని ఫారం–7 ద్వారా తొలగించాలని, అలాగే ఒక బూత్ స్థాయి ఓటరు మరొక బూత్స్థాయిలో చేరి ఉంటే వారిని ఫారం–8 ద్వారా మార్చాలని తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీపై వైఎస్సార్సీపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు ముగుస్తున్నా ఒక్క హామీ కూడా నెరవేర్చని సందర్భంగా ఈనెల 12న ఆలూరులో నిర్వహించే వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలన్నారు. ఈ రెండు సంవత్సరాల్లో కూటమి అరాచకాలను, అడ్డుగోలు దోపిడీని ప్రజలకు వివరిద్దామన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ, మండల కన్వీనర్ రామకృష్ణ, కో కన్వీనర్ ఆనంద్, వైఎస్సార్సీపీ రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ అబ్జర్వర్ ప్రేమనాథ్రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా లీగల్సెల్ సె క్రటరీ కబీర్దాస్, ఆలూరు అసెంబ్లీ బూత్ కన్వీనర్ సుధాకర్, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. -
మొరాయించిన సర్వర్
● అస్తవ్యస్తంగా పింఛన్ల పంపిణీ కర్నూలు(అగ్రికల్చర్): ఇంటి వద్దే పింఛన్ల పంపిణీ మాటలకే పరిమితమవుతోంది. సోమవారం చేపట్టిన జూన్ నెల పింఛన్ల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. సర్వర్ మొరాయించడంతో పంపిణీలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. సర్వర్ సమస్యల వల్ల కర్నూలు నగరంతో పాటు పలు మండలాల్లో పంపిణీ ముందుకు సాగలేదు. ఇక ఎప్పటిలానే ఇంటి వద్ద పింఛన్ల పంపిణీ నామమాత్రంగా జరిగింది. సర్వర్ సమస్యలను అవకాశంగా తీసుకొని సచివాలయాల్లోనే పంపిణీ చేశారు. అవ్వతాతలు, వికలాంగులు అతి కష్టం మీద వార్డు, గ్రామ సచివాలయాల మెట్లు ఎక్కాల్సి వచ్చింది. కర్నూలు నగరంలోని దేవనగర్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పింఛన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ వైపి రమణారెడ్డి పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలో 87.07 శాతం, నంద్యాల జిల్లాలో 86.96 శాతం పింఛన్ల పంపిణీ పూర్తయినట్లు అధికారులు తెలిపారు. పింఛన్కు సర్వర్ కష్టాలు నందవరం: పింఛన్ కోసం వృద్ధులు, దివ్యాంగులకు కష్టాలు తప్పడం లేదు. మండల పరిధిలోని జొహరాపురం గ్రామంలోని వృద్ధులు, దివ్యాంగులు శ్రీ దత్తత్రేయ మఠం వద్ద పింఛన్ పంపిణీ చేసే అధికారుల కోసం నిరీక్షించారు. అధికారులు రాగానే 3 గంటల పాటు సర్వర్ పని చేకపోడంతో ఎండలో అవస్థలు పడ్డారు. ఆ తర్వాత సమస్య పరిష్కారం కావడంతో పింఛన్ల పంపిణీ మొదలుపెట్టారు. -
వ్యవసాయాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది
అన్నదాత సుఖీభవ సాయాన్ని టీడీపీ ప్రభుత్వం మొదటి ఏడాది ఎగ్గొట్టి రెండవ ఏడాది అరకొరగా అమలు చేసింది. పంటల బీమాను నిర్వీర్యం చేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ ఇంతవరకు చినుకు జాడ లేదు. మాకు 10 ఎకరాల భూమి ఉంది. వేరుశనగ, ఆముదం, కంది, సజ్జ వంటి పంటలు వేస్తాం. ఇంతవరకు విత్తనాల పంపిణీ చేపట్టకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. ఇప్పటికై నా ఉచిత పంటల బీమా సదుపాయాన్ని కల్పించాలి. – రాజు నాయక్, పెండ్లిమాన్తండా, పత్తికొండ మండలం మాకు 15 ఎకరాల భూమి ఉంది. ఉల్లి, వేరుశనగ, కంది, సజ్జ, ఆముదం వంటి పంటలు సాగు చేస్తాం. రసాయన ఎరువుల ధరలు అడ్డుగోలుగా పెరిగిపోయాయి. 50 కిలోల బస్తా కాంప్లెక్స్ ఎరువు ధర రూ.2,450 వరకు ఉంది. ఎరువుల ధరల కారణంగా పెట్టుబడి వ్యయం అధికమవుతోంది. ఖరీఫ్ సీజన్ మొదలైనప్పటికీ వర్షాలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకోకపోవడం తగదు. – రామచంద్రుడు, కొచ్చెర్వు, డోన్ మండలం ● గతంలో ఎప్పుడూ లేనంత పెట్టుబడి సమస్య ● పంట రుణాల పంపిణీలో బ్యాంకుల నిర్లక్ష్యం ● ఎల్నినో ప్రభావంతో జాడలేని రుతుపవనాలు ● అప్పుడే మొదలైన యూరియా కొరత ● ఈసారి యాప్ ద్వారా పంపిణీకి ఏర్పాట్లుకర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ ఆరంభానికి ముందే యూరియా సమస్య రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అతీగతీ లేని విత్తన పంపిణీ, పెట్టుబడి కష్టాలతో రైతులు చుక్కలు చూస్తున్నారు. ఇప్పటివరకు వర్షపు చినుకే లేని మండలాలు ఉమ్మడి జిల్లాలో 46 ఉన్నాయి. ప్రభుత్వం నుంచి రైతులకు ఎలాంటి చేయూత లేకపోవడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. గత ఏడాది అధిక వర్షాలతో కోలుకోలేని విధంగా నష్టపోయిన రైతులు ఈ ఖరీఫ్ సీజన్పై కోటి ఆశలు పెట్టుకున్నారు. అయితే ఎల్నినో ప్రభావంతో ఈ సారి వర్షాలు నిరాశజనకంగా ఉంటాయని భారత వాతావరణ విభాగం కొద్ది నెలలుగా హెచ్చరిస్తోంది. ఇదిలాఉంటే ఖరీఫ్ రైతులను పెట్టుబడుల సమస్య వేధిస్తోంది. 2019–20 నుంచి 2023–24 వరకు ఖరీఫ్ సీజన్కు ముందే వైఎస్ఆర్ రైతుభరోసా కింద పెట్టుబడి సాయం విడుదల చేస్తుండటం రైతులకు ఊరటనిచ్చింది. అంతేగాక ఉచిత పంటల బీమా పరిహారం కూడా ఖరీఫ్ సీజన్కు ముందే విడుదల చేస్తుండటం రైతులకు పెట్టుబడి కష్టాలను దూరం చేసింది. చంద్రబాబు ప్రభుత్వం 2024 జూన్ 12న ఏర్పాటైనప్పటికీ మొదటి ఏడాది సూపర్–6లో ప్రకటించిన అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు చెల్లించడంలో చేతులెత్తేసింది. 2025–26 సంవత్సరంలో అమలు చేసినప్పటికి తూతూ మంత్రంగానే అమలు చేసింది. ఇక కౌలుదారులను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. అంకెల్లోనే పంట రుణాల పంపిణీ పంట రుణాల పంపిణీ అంకెల గారిడీకే పరిమితమవుతోంది. 2025–26 ఖరీఫ్లో రూ.3,635.62 కోట్ల పంట రుణాలు పంపిణీ చేయాలనేది లక్ష్యం కాగా.. ఇప్పటి వరకు రూ.4213.03 కోట్లు పంపిణీ చేసినట్లు లెక్కలు ఉన్నాయి. 2026–27లో రూ.4,241.54 కోట్ల పంట రుణాలు పంపిణీ చేయాలనేది లక్ష్యం. ఇప్పటి వరకు పాత రుణాలను రెన్యూవల్ చేయడం మినహా కొత్త రుణాలు పంపిణీ చేస్తున్న దాఖలాలు లేవు. బ్యాంకులు సహకరించకపోవడం, ప్రభుత్వం చేయూత ఇవ్వకపోవడంతో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. విత్తన సమస్య ఖరీఫ్ సీజన్లో మొత్తం 6,87,441హెక్టార్లలో పంటలు సాగయ్యే అవకాశం ఉంది. కర్నూలు జిల్లాలో ప్రధానంగా పత్తి, వేరుశనగ, కంది, ఉల్లి, మిర్చి, వరి, మొక్కజొన్న పంటలు.. నంద్యాల జిల్లాలో వరి, మొక్కజొన్న, మినుము, కంది, పత్తి సాగు చేయనున్నారు. కొద్ది రోజులుగా అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ కూడా మొదలైంది. కానీ విత్తన సమస్య రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రతి ఏటా మే నెల 15 నుంచి ఆర్బీకే స్థాయిలోనే విత్తనాల పంపిణీ జరిగింది. ఈ సారి ఖరీఫ్ సీజన్లో విత్తన పంపిణీని ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. ఇదే సమయంలో పత్తిలో నకిలీ విత్తనాలు, విత్తన ప్యాకెట్లు మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. హెచ్టీ పత్తి విత్తనాలకు అనుమతి లేకపోయినప్పటికీ మార్కెట్లో విచ్చలవిడగా లభిస్తుండటం గమనార్హం. భయపెడుతున్న ఎల్నినో ఎల్నినో రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఖరీఫ్ మొదలైనప్పటికీ ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతోంది. ఎల్నినో ప్రభావం ఆగస్టు వరకు ఉంటుందని భారత వాతావరణ విభాగం ఇప్పటికే ప్రకటించింది. వర్షాలు ప్రతి నెల సాధారణం కంటే అతి తక్కువగా నమోదయ్యే అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పసిఫిక్ మహా సముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల జూన్ నుంచి ఆగస్టు వరకు వేడి వాతావరణం అధికంగా ఉండి పంటల దిగుబడిపై ప్రతికూల ప్రబావం చూపనున్నాయి. మామూలుగా మే నెల చివరి నాటికి నైరుతి రుతుపవనాలు విస్తరించాలి. ఈ పాటికి తొలకరి మొదలవ్వాలి. ఎల్నినో ప్రభావంతో రుతుపవనాలు చురుకుతనాన్ని కోల్పోయాయి. గాలిలో తేమ తగ్గిపోయింది. ఇందువల్ల వడగాలులు తీవ్రత కొనసాగుతోంది. ఈ సారి ప్రధాన పంటలైన వరి, వేరుశనగ, పత్తి, మొక్కజొన్న సాగు కష్టమేనన్న అభిప్రాయం ఏర్పడుతోంది. పంట కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా (హెక్టార్లలో) (హెక్టార్లలో) వరి 13,343 70,201 మొక్కజొన్న 6,143 61,615 కంది 42,719 38,192 పత్తి 2,39,774 15,165 మినుము --- 10,188 ఉల్లి 19,242 4,583 వేరుశనగ 44,308 8,694 మిర్చి 37,642 12,028 -
యూరియాకు ‘యాప్’సోపాలే..
చంద్రబాబు ప్రభుత్వంలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడింది. 2024–25, 2025–26 సంవత్సరాల్లో రైతులను యూరియా కొరత తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. ఈ సారి ప్రభుత్వం యాప్ ద్వారా యూరియాను విక్రయించాలని నిర్ణయించింది. ఒకటి, రెండు రోజుల్లో యాప్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ యాప్లో 2025–26 సంవత్సరానికి సంబంధించి ఈ–క్రాప్ డేటా ఉంటుంది. ఈ సారి కూడా అదే పంట వేస్తే ఎన్ని బ్యాగుల యూరియా అవసరం అనేది ఇట్టే తెలిసిపోతుంది. కొత్త పంటకు మారితే యూరియా ఎంత అవసరమనే రెకమెండేషన్ కూడా ఉంటుంది. యాప్ ద్వారా యూరియా పంపిణీకి వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. అవసరమైన యూరియా రెండు లేదా మూడు దఫాలుగా పంపిణీ చేస్తారు. డిమాండ్ మేరకు పంపిణీ చేయకుండా యాప్ పేరుతో షరతులు విధిస్తుండటం పట్ల రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. -
5న ఓర్వకల్లో విద్యుత్ అదాలత్
కర్నూలు(అగ్రికల్చర్): విద్యుత్ వినియోగదారుల దీర్ఘకాల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్ కర్నూలు డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి.రాజశేఖర్ తెలిపారు. ఈ నెల 5న ఓర్వకల్లోని విద్యుత్ సబ్ స్టేషన్ ప్రాంగణంలో నిర్వహిస్తామని, విద్యుత్ అదాలత్లో రిటైర్డ్ జడ్జి శ్రీనివాస ఆంజనేయ మూర్తి, సాంకేతిక సభ్యులు శ్రీనివాసబాబు, స్వతంత్ర సభ్యులు విజయలక్ష్మి పాల్గొంటారని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కర్నూలు నగరం, కల్లూరు, క్రిష్ణగిరి, వెల్దుర్తి, కర్నూలు రూరల్, ఓర్వకల్ మండలాలకు చెందిన విద్యుత్ వినియోగదారులు సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. వినియోగదారులు తమ సమస్యలను రాతపూర్వకంగా తెలియజేయాలన్నారు. అదనపు ఎస్పీగా బాబుప్రసాద్ కర్నూలు: కర్నూలు డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న బాబుప్రసాద్ ఇటీవల అదనపు ఎస్పీగా పదోన్నతి పొందిన విషయం తెలిసిందే. సోమవారం క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ను అదనపు ఎస్పీ హోదాలో మర్యాదపూర్వకంగా కలసి పూలమొక్కను అందజేశారు. ప్రస్తుతం కర్నూలు డీఎస్పీ స్థానంలోనే అటాచ్ విధుల కింద నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేయడంతో మరికొంత కాలం అదనపు ఎస్పీ హోదాలో అదే సీటులో కొనసాగనున్నారు. అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలి కర్నూలు(సెంట్రల్): పీజీఆర్ఎస్లో వచ్చే అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆమె జేసీ నూరుల్ ఖమర్తో కలసి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అర్జీలను సంతృప్త స్థాయిలో పరిష్కరించేందుకు నోడల్ అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు. ప్రీ ఆడిటింగ్ బృందాల ద్వారా అర్జీల పరిష్కారంలో నాణ్యతను పెంచాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ రామసుబ్బయ్య, సర్వే ఏడీ మురళీకృష్ణ, డీఆర్డీఏ పీడీ రమణారెడ్డి పాల్గొన్నారు. జేఈఈ అడ్వాన్స్ ్డపరీక్ష ఫలితాలు విడుదల కర్నూలు సిటీ: ఐఐటీల్లో బీటెక్, బ్యాచ్లర్ ఆఫ్ సైన్స్, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో గత నెల 17న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్ ్డ పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. పరీక్షలకు సుమారు 973 మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థుల ఓఎంఆర్ గత నెల 21న వెబ్సైట్లో పెట్టి, 25వ తేది ప్రాథమిక కీ విడుదల చేసి, సోమవారం తుది కీ, ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో జిల్లాకు చెందిన ఎం.హర్షవర్ధన్ క్యాటగిరిలో 105వ ర్యాంకు, ఈ.అమృత 149వ ర్యాంకు, పి.ధర్మతేజ రెడ్డి 275, జి.ఉషాశ్రీ ఆల్ ఇండియా స్థాయిలో 563వ క్యాటగిరి ర్యాంకు, ఎల్.అను 631వ ర్యాంకు, ఎం.వరుణ్ 951వ క్యాటగిరి ర్యాంకు సాధించారు. నేటి (మంగళవారం) సాయంత్రం 5 గంటలకు జోసా(జాయింట్ సీట్ అలకేషన్ ఆథారిటీ–జేఓఎస్ఏఏ) కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. అటవీశాఖ స్క్వాడ్ ఎఫ్ఆర్ఓగా వెంకటశేషయ్య కర్నూలు కల్చరల్: అటవీ శాఖలో పలువురు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లకు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లుగా పదోన్నతులు కల్పిస్తూ పోస్టింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఆ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ డాక్టర్ పి.వి.చలపతిరావు ఉత్తర్వులు జారీ చేశారు. కడప డివిజన్లో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న కె.వెంకట శేషయ్యకు ఎఫ్ఆర్వోగా పదోన్నతి కల్పించి కర్నూలు డివిజన్ ఫ్లయింగ్ స్క్వాడ్కు పోస్టింగ్ ఇచ్చారు. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ బి.లక్ష్మికుమారికి ఎఫ్ఆర్వోగా పదోన్నతి కల్పించి ప్రాజెక్ట్ టైగర్ ఆత్మకూరు డివిజన్ నాగలూటి రేంజ్కు పోస్టింగ్ ఇచ్చారు. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఎస్.నాగేంద్రనాయక్కు ఎఫ్ఆర్ఓగా పదోన్నతి కల్పించి నంద్యాల డివిజన్ పాణ్యం రేంజ్కు పోస్టింగ్ ఇచ్చారు. -
నిరుద్యోగుల జీవితాలతో ఆటలొద్దు
కర్నూలు(టౌన్): మెగా డీఎస్సీ పేరుతో సాగించిన మెగా దగాపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం శ్రేణులు ప్రభుత్వంపై సమరభేరి మోగించారు. డీఎస్సీ బాధితులకు న్యాయం చేయాలంటూ ఆ పార్టీ శ్రేణులు కర్నూలులో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక విజయ మిల్క్ డైరీ నుంచి చంద్రబాబు డౌన్డౌన్, డేటా ఎందుకు డీలీట్ చేశారు.. మెరిట్ లిస్టు ఎందుకు దాచారు.. చినబాబు రాజీనామా చేయి.. చంద్రబాబు.. మీ సుపుత్రుడు శాఖలో డార్క్ అవినీతిని ఎందుకు దాచిపెడుతున్నారు. అన్న బ్యానర్లు ప్రదరిస్తూ, నినదాలు చేస్తూ విద్యార్థులతో కలిసి చలో కలెక్టరేట్ ర్యాలీ చేపట్టారు. అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాటసాని శివ నరసింహారెడ్డి లక్షాలాది నిరుద్యోగ యువత భవిష్యత్తుకు సంబంధించిన డీఎస్సీ నియామకాల ప్రక్రియపై రాష్ట్ర వ్యాప్తంగా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. మెరిట్ జాబితాలో పారదర్శకత లేకపోవడం, ఎంపిక ప్రక్రియపై సందేహాలు, అపోహలు నెలకొన్నాయన్నారు. యువత తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు. వీటన్నింటిపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జిచే న్యాయ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ నిర్వహణలో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ● వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుట్టా ప్రతూల్, జిల్లా అధ్యక్షులు ఎద్దుల శివారెడ్డి మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ఉపాధ్యాయుల నియామకాల్లో ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నా నోరు మెదపకపోవడం సిగ్గుచేటన్నారు. మెగా డీఎస్సీ అని చెప్పి నిరుద్యోగ ఉపాధ్యాయులను దగా చేశారని విమర్శించారు. నైతిక బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మెరిట్ జాబితా ఎందుకు ప్రదర్శించలేదని.. మేసేజ్లు పంపి ఆ తరువాత డీలీట్ చేసి అభ్యర్థుల్లో గందరగోళం సృష్టించారన్నారు. కాల్ లెటర్ పంపి ఆ తరువాత ఎంపిక కాలేదని చెప్పడంతో వేలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు మనోవేధనకు లోనయ్యారన్నారు. బోగస్ సర్టిఫికెట్లతో స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలను రూ.15 లక్షలకు అమ్ముకున్నారని ఆరోపించారు. అనంతరం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరిని కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమంతరెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి మణీ రెడ్డి, యువజన విభాగం కార్యదర్శి మధు, డి.నజీర్ అహమ్మద్(ఎమ్మిగనూరు) ఎం.కే. వెంకటేష్(కోడుమూరు) దుర్గ(పాణ్యం), అశోక్ కుమార్ రెడ్డి (పత్తికొడ), పాణ్యం పబ్లిసిటీ విభాగం అధ్యక్షులు సాయి, బనవాసి బసి రెడ్డి (ఎమ్మిగనూరు మండల యువజన విభాగం అధ్యక్షులు) తదితరులు పాల్గొన్నారు. డీఎస్సీ పరీక్షలో అర్హత సాధించా. నాకు 75 మార్కులు వచ్చాయి. ఉద్యోగం వస్తుందని ఆశించా. కాల్ లెటర్ వచ్చింది. అయితే ఏమి జరిగిందో ఏమో నాకు ఉద్యోగం రాలేదు. మీరే ఎలాగైనా న్యాయం చేయాలి మేడం. – జిల్లా కలెక్టర్కు షేక్ హసీనా బేగం వినతి బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం రూ.15 లక్షలకు స్పోర్ట్స్ కోటా పోస్టులను అమ్ముకున్న కూటమి నేతలు అవకతవకలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి కర్నూలులో ర్యాలీ, కలెక్టరేట్ ఎదుట ధర్నా, కలెక్టర్కు వినతిపత్రం అందజేత -
పింఛన్ల పంపిణీ కార్యాలయాల వద్దే!
ఇంటి వద్దే పింఛన్ల పంపిణీని టీడీపీ ప్రభుత్వం క్రమంగా అటకెక్కిస్తోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇంటి వద్దే పింఛన్ల పంపిణీ సాఫీగా సాగింది. చంద్రబాబు సర్కారు తాము కూడా ఇళ్ల వద్దే పంపిణీ చేస్తామని ప్రకటించినా, ప్రతినెలా సచివాలయాల వద్దకే వెళ్లి లబ్ధిదారులు పింఛను తీసుకున్న దృశ్యాలు కోకొల్లలు. సోమవారం చేపట్టిన పింఛన్ల పంపిణీకి చాలాచోట్ల సర్వర్ సమస్య తలెత్తింది. ఇదే సమయంలో అధికారులు కార్యాలయం వదలి రాకపోవడంతో లబ్ధిదారులు అక్కడికే వెళ్లి పింఛను తీసుకోవడం గమనార్హం. – చిప్పగిరి -
కౌతాళంలో లాకప్ డెత్!
ఆదోని: తన కుమారుడి ఆచూకీ కోసం పోలీసులను, ఆ తరువాత హైకోర్టును ఆశ్రయించిన మహిళ మృత్యువాత పడటం కలకలం రేపుతోంది. కర్నూలు జిల్లా కౌతాళంలో సిట్ పోలీసులు కొట్టడం వల్లే మాల గంగమ్మ అనే మహిళ మరణించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2024 నవంబర్ 13న పొలానికి మందులు పిచికారీ చేయడానికి వెళ్లిన తన కుమారుడు మాల రవీంద్ర ఇంటికి తిరిగి రాలేదని అతడి తల్లి గంగమ్మ కౌతాళం పోలీసులను ఆశ్రయించింది. అయితే, కౌతాళం పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసినా.. దర్యాప్తు చేయకుండా చేతులు దులుపుకున్నారని గంగమ్మ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై న్యాయస్థానం విచారణకు ఆదేశించగా.. గుంటూరు ఎస్పీ ఆధ్వర్యంలో సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) ఏర్పాటైంది.కాగా.. సిట్ అధికారులు విచారణ పేరిట మాల గంగమ్మను విపరీతంగా కొట్టడం వల్లే ఆస్పత్రి పాలై మరణించినట్టు సమాచారం. ఆమె మరణంతో కంగుతిన్న పోలీసులు పోస్టుమార్టం చేయించకుండా మృతదేహానికి దహన సంస్కారాలు ముగించేందుకు ప్రయత్నించినట్టు సమాచారం. ఈ కేసు లాకప్ డెత్ రూపంలో తమ మెడకు చుట్టుకుంటుందన్న భయంతో సిట్ పోలీసులు ముందుజాగ్రత్తగా గంగమ్మ కుమార్తె నుంచి స్టేట్మెంట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. గంగమ్మ ఇంటివద్ద ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడటంతో చికిత్స నిమిత్తం ఆస్పతికి తీసుకు వచ్చినట్టు, చికిత్స పొందుతూ గంగమ్మ మరణించినట్టు పోలీసులు ఆమె కుమార్తె నుంచి వాంగ్మూలం రాయించుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
25 ఏళ్ల తర్వాత..
కోసిగి: మండల కేంద్రం కోసిగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2000–2001 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు 25 ఏళ్ల తర్వాత కలుసుకుని జ్ఞాపకాలను పంచుకున్నారు. ఆదివారం స్థానిక పాఠశాలలో అపూర్వ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం చేపట్టారు. ఆనాటి విద్యా బోధన చేసిన గురువులు జ్యోతి, ఝాన్సీ, జయన్న, శ్రీనివాసులు, నాగరాజు శాసీ్త్ర, సంజన్న, పద్మనాభాచారి, రామ్మోహన్, వినోద్కుమార్, మహాబూబ్ బాషా, రతంగ పాండు రెడ్డి ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఆనాటి జ్ఞాపకాలు, ప్రస్తుతం స్నేహితులందురూ ఎక్కడెక్కరు ఉన్నారు, ఏ స్థాయిలో ఉన్నారో ఒకరికరు విషయ అనుభూతులను పంచుకున్నారు. తమతో పాటు చదువుకుని మృతి చెందిన స్నేహితులను గుర్తు చేసుకుని నివాళులర్పించారు. ఆర్థికంగా ఇబ్బంది ఉండే స్నేహితులకు తమవంతు సహాయ సమకారాలు అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు శ్రీరాములు, రైల్వే విజయ్, రామాంజినేయులు, చిప్పిగ బసవ, దుమతి శ్రీనివాసులు, రామకృష్ణ రెడ్డి, జ్ఞానేష్, నాగరాజు, సూర్యనారాయణ, నరసప్ప తదితరులు ఉన్నారు. -
వెంటనే విడుదల చేయాలని వినతి
ప్రధానమంత్రి ఫసల్ బీమా, వాతావరణ ఆధారిత బీమా కింద 2024 ఖరీఫ్ సీజన్కు సంబంధించి కేంద్రం వాటా బీమా పరిహారం కొద్ది రోజులుగా విడుదలవుతోంది. ఈ మేరకు రైతులకు మెసేజ్లు వస్తున్నాయి. వాతావరణ బీమా కింద కేంద్రం వాటా 25 శాతం మొత్తం ప్రధానమంత్రి విడుదల చేస్తున్నారు. మిగిలిన 75 శాతం రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో పెట్టినట్లు రైతులకు మెసేజ్లు వస్తున్నాయి. పంటల బీమాకు సంబంధించి రాష్ట్రం వాటా వెంటనే విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల పత్తికొండ నియోజకవర్గం తుగ్గలిలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ నూరుల్ఖమర్ నిర్వహించారు. పంటల బీమాకు కేంద్రం వాటా పరిహారం విడుదల చేసిందని, రాష్ట్రం వాటా కూడా విడుదల చేయలని రైతులు వినతి పత్రం ఇచ్చారు. -
మళ్లీ జీవం పోసుకుంది
కర్నూలు కల్చరల్: నగరంలోని ఓల్డ్సిటీలో 150 సంవత్సరాల చరిత్ర కలిగిన జమ్మిచెట్టు మళ్లీ జీవం పోసుకుంది. ఈ చెట్టు చుట్టు ప్రదక్షిణలు చేస్తే శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం. అందుకే దసరా పండుగా రోజు వేలాది మంది ఇక్కడికి వచ్చి ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. అలాంటి వృక్షం ఇటీవల పూర్తిగా ఎండి పోయి చెదలు పట్టింది. పలువురు దీనిని తొలగించి కొత్తది నాటాలనుకున్నారు. విషయం తెలుసుకున్న ప్రకృతి ప్రేమికుడు అంబిలి చంద్రమౌళి ఎండిన వృక్షాన్ని పరిశీలించి ఎలాగైన సంరక్షించాలని తలంచారు. 30 రోజుల పాటు శ్రమించి ప్రకృతి పద్ధతిలో చికిత్స చేసి కొత్త చిగురులు తెప్పించగలిగారు. ఎక్కడైనా ఎండిపోయిన చెట్లు ఉంటే 95812 11888 నంబర్కు సమాచారం ఇస్తే సంరక్షించే బాధ్యత తీసుకుంటానని అంబిలి చంద్రమౌళి పేర్కొన్నారు. -
కఠినంగా శిక్షించాలి
బొమ్మలసత్రం: పట్టపగలే నంద్యాల నడిబొడ్డులో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహంపై జనసేన కార్యకర్త దాడి చేయడంతో వెఎస్సార్సీసీ నాయకులు, అభిమానులు ద్రిగ్భ్రాంతికి గురయ్యారు. ఆదివారం సాయంత్రం పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పారవిచంద్రకిశోర్రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్బాషా, మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ పీపీనాగిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పీపీ మధుసూదన్రెడ్డి, సూర్యనారాయణరెడ్డి, సీఈసీ మెంబర్లు కల్లూరి రామలింగారెడ్డి, గోపవరం సాయినాథరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ అమీర్, సీనియర్ నాయకులు డాక్టర రాకేష్రెడ్డి, ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి నంద్యాల శ్రీనివాససెంటర్లో ధర్నా చేశారు. అనంతరం ర్యాలీతో వన్టౌన్ పోలీసు స్టేషన్కు వెళ్లి వినతి పత్రం అందజేశారు. దివంగతనేత విగ్రహంపై దాడికి పాల్పడిన వ్యక్తితో పాటు సూత్రధారులను పోలీసులు గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
మహానాడు.. మహా నాటకం
కర్నూలు (టౌన్): తెలుగుదేశంపార్టీ రెండు రోజులు నిర్వహించిన రాష్ట్ర మహానాడు మహానాటకంగా సాగిందని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ మేధావుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాటిల్ తిరుమలేశ్వర రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ ం రెండేళ్ల పాలనలో ప్రజలకు చేసింది శూన్యమన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు గాలికి వదిలేశారన్నారు. దీంతో చెప్పేందుకు ఏమిలేక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్పార్టీని విమర్శించడం పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఎన్నికల ముందు జగనన్న కంటే రెండింతలు ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ప్రగల్భాలు పలికి ఆచరణలో ఆ ఊసే లేదన్నారు. రెండేళ్లలో వైద్యం, వ్యవసాయ రంగాల నిర్వీర్యంపై, 6 లక్షల పెన్షన్ల రద్దుపై చర్చ ఏదీ అని ప్రశ్నించారు. 50 ఏళ్లకే పెన్షన్, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగులకు భృతి వంటి హామీలు ఏమయ్యాయని నిలదీశారు. సంక్షేమ పథకాలు అమలు చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే రూ.3 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందని ధ్వజమెత్తారు. డీఎస్సీ పేరుతో టీచర్ ఉద్యోగాలను అమ్ముకున్నారని ఆరోపించారు. అక్రమాలపై సీబీఐ చేత విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. నారా లోకేష్ జపం చేయడానికి తప్పా మహానాడుతో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. చెప్పేందుకు ఏమి లేక జగనన్నపై విమర్శలు వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాటిల్ తిరుమలేశ్వర రెడ్డి -
రాజన్నా.. మన్నించూ!
పేదల హృదయాల్లో కొలువైన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖ్ రెడ్డి విగ్రహంపై దాడిని నంద్యాల చిత్రకారుడు కోటేష్ ఖండించారు. నంద్యాల పట్టణంలోని శ్రీనివాససెంటర్లో ఉన్న వైఎస్సార్ విగ్రహాన్ని ఆదివారం పగులగొట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, దాడి జరిగిన సంఘటనకు స్పందించి ఓ చిత్రాన్ని ఆవిష్కరించారు. చిత్రంలో ధ్వంసం చేసిన విగ్రహాన్ని చూసి ప్రజలు మదన పడుతున్నట్లు ఓ అభిమాని రాజన్నా.. మమ్మల్ని మన్నించు.. నీ రూపాన్ని నీ విగ్రహంలో చూసుకొనే వాళ్లం. మా హృదయాల్లో ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉన్నావు.. దుండగులు విగ్రహం పడగొట్టిన చోటనే నూతన విగ్రహం తయారు చేసుకుంటామంటూ’ కన్నీరు పెడుతూ విలపిస్తున్నట్లు చిత్రాన్ని గీచారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో వైఎస్సార్ అభిమానులు వేదన పడుతున్నట్లు చూపారు. – నంద్యాల(అర్బన్) -
కడుపు నొప్పి తాళలేక ..
బనగానపల్లె రూరల్: మండలంలోని బీరవోలు గ్రామానికి చెందిన సత్యనారాయణ,లక్ష్మీదేవి దంపతుల కుమారుడు బోయ రమేష్(25) కడుపు నొప్పి తాళలేక రసాయన పౌడర్ను నీటిలో కలుపుకొని తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న ఈ యువకుడు పలు వైద్యులు వద్ద చూపించుకున్నా తగ్గకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆదివారం ఉదయం బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి చికిత్స కోసం బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే బోయ రమేష్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య నందిని ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ భూపాలుడు తెలిపారు. -
భక్తులకు మెరుగైన సౌకర్యాలు
కౌతాళం: ఉరుకుంద ఈరన్నస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ కె. రామచంద్రమోహన్ సూచించారు. ఆలయంలో రూ.15 కోట్ల పనులకు ప్రతిపాదనలు పంపడంతో వాటిని పరిశీలించేందుకు ఆదివారం ఆయన కుటుంబసమేతంగా వచ్చారు. రూ.4.20కోట్లతో మాడవీధులు, రూ.4.50 కోట్లతో అన్వేటి మంఠపం, రూ. 2.30కోట్లతో నూతన అన్నదానం సత్రం నిర్మాణానికి ప్రతిపాదనలు పంపారని, వాటిపై డిప్యూటీ కమిషనర్ వాణితో చర్చించారు. బస్టాండ్ను పరిశీలించి, దానిని డార్మెంటరీగా తయారు చేసి భక్తులకు ఉపయోగంలోకి తీసుకుని రావాలని సూచించారు. దేవాలయం వద్ద మొత్తం 42 పనులకు టెండర్లు పిలువగా ఇప్పటికే కొన్ని పూర్తవగా మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయని డిప్యూటీ కమిషనర్ వాణి వివరించారు. -
రజక విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు
● జూలై 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని రజక విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందించనున్నట్లు రజక విద్యా సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సీపీ వెంకటేష్ తెలిపారు. కర్నూలులోని సమితి కార్యాలయంలో ఆదివారం ప్రతిభా పురస్కారాల కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదో తరగతిలో 450 మార్కులు, ఇంటర్లో 75 శాతం, డిగ్రీ, బీటెక్, పీజీ కోర్సుల్లో 75 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు జూ లై 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాల కోసం రజక విద్యా సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సీపీ వెంకటేష్ సెల్: 9110396511, 9959366426, 9550934626 నంబర్లను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షులు సీ నరసింహులు, కోశాధికారి సిద్ద నాగేష్, సంయుక్త కార్యదర్శి వీరశేఖర్, నాయకులు మద్దూరు వెంకట్, మద్దూరు వెంకట నారాయణ, నాగేష్, దామగట్ల రమణ, మధు, న్యాయవాది జగదీష్ పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధికి విరాళం బనగానపల్లె రూరల్: నందవరం గ్రామంలోని శ్రీ చౌడేశ్వరిదేవి ఆలయ అభివృద్ధికి ఆదోనికి పట్టణానికి చెందిన పూడూరు రాఘవేంద్ర, పూడూరు వేణుగోపాల్ కుటుంబ సభ్యులు రూ.1,00,116 విరాళాన్ని అందజేసినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి ఆదివారం తెలిపారు. ఈ మేరకు దాత కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించి, అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. ట్రాక్టర్ డ్రైవర్ దుర్మరణం రుద్రవరం: ట్రాక్టర్ అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లిన ఘటనలో డ్రైవర్ దుర్మరణం చెందాడు. రుద్రవరం మండలం ఆర్.కొత్తూరు సమీపంలో ఈ సంఘటన జరిగింది. ఎస్ఐ జయప్ప తెలిపిన వివరాల మేరకు.. చందలూరుకు చెందిన పవన్ కుమార్రెడ్డి (30) కొన్నేళ్లుగా ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం ఆర్.కొత్తూరు సమీపంలో గల గంగిరెడ్డి కుంటలో నుంచి ట్రాక్టర్లో మట్టి తీసుకొచ్చేందుకు బయలుదేరాడు. రుద్రవరం–ఎర్రగుడిదిన్నె దారిలోని నాలుగు రోడ్ల కూడలి దాటి ముందుకు వెళ్లే సమయంలో ట్రాక్టర్ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో డ్రైవర్ ట్రాక్టర్ మీద నుంచి ఎగిరి కింద పడగానే ఆయనపై ట్రాక్టర్ టైర్లు ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడు అవివాహితుడు. తల్లిదండ్రులు లేరు. ఓ సోదరుడు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. కాగా ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. నేడు డయల్ యువర్ సీఎండీ, ఎస్ఈ కర్నూలు(అగ్రికల్చర్): ఏపీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయమైన తిరుపతి నుంచి డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు కర్నూలు సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ ఆర్.ప్రదీప్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు 8977716661 నంబరుకు ఫోన్ చేయవచ్చని పేర్కొన్నారు. కర్నూలు కొత్తబస్టాండు సమీపంలో ఉన్న విద్యుత్ భవన్లో కూడా సోమవారం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. వినియోగదారులు ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు 7382614308 నంబరుకు ఫోన్చేసి సమస్యలు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. క్వింటా వేరుశనగ రూ.8,100 ఎమ్మిగనూరుటౌన్: స్థానిక వ్యవసాయ మార్కెట్లో ఆదివారం క్వింటం వేరుశనగ గరిష్టంగా రూ.8,100 ధర పలికింది.మార్కెట్కు 143 క్వింటాళ్ల వేరుశనగ దిగుబడులు విక్రయానికి వచ్చాయి. కనిష్ట ధర రూ.4,380, మధ్యస్థ ధర రూ.6,670 పలికినట్లు మార్కెట్ యార్డ్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు. అలాగే 10 క్వింటాళ్ల కందులు మార్కెట్కు రాగా క్వింటం కనిష్ట ధర రూ.6,870, గరిష్ట ధర రూ,7,080 పలికినట్లు ఆయన వెల్లడించారు. -
శ్రీమఠంలో భక్తుల రద్దీ
మంత్రాలయం: శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో ఆదివారం భక్తుల రద్దీ కనిపించింది. మూల బృందావన దర్శనానికి మూడు గంటలకు పైగా సమయం పట్టింది. రాయరు దర్శన క్యూలైన్లు, అన్నపూర్ణ భోజనశాల, పరిమళ ప్రసాదం కౌంటర్లు భక్తులతో కిటకిటలాడాయి. వేసవి సెలవులు ఉండటంతో వేకువాజామున నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. తుంగభద్ర నదీ తీరంలో భక్తుల కోలాహలం కనిపించింది. ఎంపీడీఓలుగా ఇద్దరికి పోస్టింగ్స్ కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్/ మండల పరిషత్ కార్యాలయాల్లో పరిపాలనాధికారులుగా విధులు నిర్వహిస్తు ఇటీవలే ఎంపీడీఓలుగా పదోన్నతి పొందిన ఇద్దరికి ఆదివారం మండలాలు కేటాయిస్తూ జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి ఉత్తర్వులను అందించారు. జెడ్పీ ఏఓగా పనిచేస్తున్న కేవీ నాగేంద్రప్రసాద్ను ఎంపీడీఓగా మద్దికెరకు, ఆత్మకూరు మండల పరిషత్ కార్యాలయ ఏఓ సయ్యద్ ఉమర్ను హొళగుంద ఎంపీడీఓగా నియమించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు సేవలు అందించడంలో ఎంపీడీఓలు ముందుండాలని, పారదర్శకంగా విధులు నిర్వహించాలని కోరారు. జెడ్పీలోని చైర్మన్ చాంబర్లో జరిగిన ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ జీవీ రమణారెడ్డి, డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఇంటి వద్దే పింఛన్లు లేనట్లే! కర్నూలు(అగ్రికల్చర్): ఇంటి దగ్గర పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంటున్నా ఆచరణలో సాధ్యం కావడం లేదు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జూన్ నెల పింఛన్ల పంపిణీ కార్యక్రమం సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. ప్రతి నెలా చాలా ఆలస్యం అవుతూ.. ఎండల తీవ్రతతో వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐడీఆర్ఎస్ డేటా ప్రకారం సంతృప్తి రేటు చాలా తక్కువగా ఉండటంతో పెంచాలని ఇటీవలే ఉద్యోగులను జిల్లా అధికారులు ఆదేశించారు. జిల్లాకు జూన్ నెలకు సంబంధించి 2,34,764 పింఛన్లు ఉండగా వీటికి ప్రభుత్వం రూ.104.06 కోట్లు విడుదల చేసింది. టీబీ డ్యాంకు తగ్గిన ఇన్ఫ్లో హొళగుంద: కర్ణాటక హొస్పేట్ వద్ద నిర్మించిన తుంగభద్ర జలాశయానికి (టీబీ డ్యాం)కు ఇన్ఫ్లో తగ్గింది. గడిచిన పది రోజుల క్రితం అకాల వర్షాల కారణంగా డ్యాంకు వెయ్యి క్యూసెక్కుల వరకు ఇన్ఫ్లో మొదలైంది. వర్షాలు ఆగిపోవడంతో క్రమేణా తగ్గుతూ ఆదివారం 110 క్యూసెక్కులు మాత్రమే నమోదైంది. జలాశయంలో 10.128 టీఎంసీల వరకు నీరు నిల్వ ఉండగా 289 క్యూసెక్కులు ఔట్ఫ్లో ఉంది. డిజిటల్ అరెస్టు పేరుతో వచ్చే కాల్స్పై అప్రమత్తంగా ఉండాలి ● ఎస్పీ విక్రాంత్ పాటిల్ కర్నూలు (టౌన్): డిజిటల్ అరెస్టు పేరుతో పోలీసులమని సైబర్ నేరగాళ్లు చేసే కాల్స్పై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సీబీఐ అధికారులమని, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులమని నటిస్తూ వీడియో కాల్స్ చేస్తూ కేసు నమోదైందని, గంజాయి, డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కున్నారని ఫోన్లు వస్తాయన్నారు. అలాగే కొరియర్ వచ్చిందని అందులో డ్రగ్స్ ఉన్నాయని వచ్చే కాల్స్పై జాగ్రత్తగా ఉండాలన్నారు. పోలీసులు వీడియో, ఆడియో కాల్స్ చేయరని తెలిపారు. వీడియో కాల్ ద్వారా అరెస్టు గురించి సమాచారం చెప్పడం పోలీసు శాఖ పని కాదన్నారు. బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు, ఓటీపీ వివరాలు అధికారులు అడగబోరని తెలిపారు. ఇటువంటి ఫోన్ కాల్స్ వస్తే వాటిని బ్లాక్ చేయాలని, సమీప పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. -
విరుగుడు లేని విషం!
కర్నూలు(హాస్పిటల్): ఇల్లు, పొలాల్లో కలుపును తొలగించేందుకు వాడే పారాక్వాట్ అనే గడ్డిమందు విష రసాయనంగా మారింది. అది కలుపు తీయడంలో కంటే మనిషి ప్రాణాలు తీయడంలో ముందుంటోంది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబసమస్యలు వంటివి తలెత్తినప్పుడు క్షణికావేశంలో కొందరు వ్యవసాయ కూలీలు, రైతులు తదితరులు ఈ మందును తాగేస్తున్నారు. కొన్ని గంటల్లోనే అది వారి ప్రాణాలను తీసేస్తోంది. దీంతో కొన్ని సంవత్సరాల క్రితమే పలు దేశాల్లో, రాష్ట్రాల్లో పారాక్వాట్ను నిషేధించినా మన రాష్ట్రంలో యథేచ్ఛగా లభించేది. పెద్దాసుపత్రికి అధికంగా కేసులు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని క్యాజువాలిటికి ప్రతి నెలా 250 నుంచి 300 వరకు వివిధ విష రసాయనాలు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స కోసం వస్తుంటారు. అందులో 10 శాతానికి పైగానే పారాక్వాట్(గడ్డిమందు) కేసులు ఉంటున్నాయి. ఈ మేరకు గత 2024 సంవత్సరంలో 39 మంది, 2025 లో 34 మంది, ఈ యేడాది ఇప్పటి వరకు 12 మంది పారాక్వాట్ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స కోసం వచ్చారు. ఈ మందు తాగిన వారిలో ఉమ్మడి కర్నూలు జిల్లాలతో పాటు అనంతపురం, వైఎస్ఆర్ కడప, అనంతపురం జిల్లాలు, తెలంగాణా జిల్లాల నుంచి సైతం రోగులు వస్తున్నారు. ఈ ఆసుపత్రితో పాటు నంద్యాల ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు, ఏరియా ఆసుపత్రులు, సీహెచ్సీలకు, ప్రముఖ ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులకు నేరుగా వెళ్లి చికిత్స తీసుకుంటున్నారు. ఈ మందును తీసుకున్న వారిలో 99 శాతం మరణిస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. ఈ మందుకు విరుగుడు లేకపోవడమే కారణమని వారు పేర్కొంటున్నారు. ప్రాణాలు తీసే కటిక విషం ఈ గడ్డిమందును కొందరు ఆత్మహత్యాయత్నం చేసుకునేందుకు వాడుతుండగా, మరికొందరు పొలాల్లో పిచికారీ చేస్తున్న సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల దానిని పీల్చి అస్వస్థతకు గురవుతున్నారు. ఇలాంటి గాలిని పీల్చడం ద్వారా అది ఊపిరితిత్తుల్లోకి వెళ్లి నాశనం చేస్తుంది. వైద్య పరిభాషలో దీనిని పారాక్విడ్ లంగ్ అని పేర్కొంటారు. ఈ రసాయనం చర్మంపై పడటం, కంటి ద్వారా కూడా శరీరంలోకి వెళ్తుంది. కలుషితమైన నీరు, ఆహార పదార్థాల తీసుకోవడం వల్ల, గాలి ద్వారా కూడా ఈ రసాయనం శరీరంలోకి ప్రవేశిస్తోంది. అధికంగా రైతులు, వ్యవసాయ కూలీలు, నిరక్షరాస్యులు క్షణికావేశంలో ఈ విషరసాయనాన్ని తీసుకుంటున్నారు. తీసుకున్న కొన్ని సెకన్లలోనే ఆ మందు శరీరంలోని కీలక అవయాలపై తీవ్ర ప్రభావం చూపి ప్రాణాలు తీస్తుందని వైద్యులు చెబుతున్నారు. నిషేధించిన కేంద్రం ఇంతటి ప్రభావం చూపిస్తున్న ఈ గడ్డిమందును అభివృద్ధి చెందిన 32 దేశాల్లోనూ, గడ్డిమందు జన్మస్థానమైన స్విట్జర్లాండ్లోనూ నిషేధించారు. కానీ దీనిని కొన్ని దశాబ్దాలుగా మన దేశంలో విచ్చలవిడిగా వాడుతున్నారు. ఫర్టిలైజర్ దుకాణాల్లోనూ విరివిగా విక్రయిస్తున్నారు. దీని ప్రభావం వల్ల కలుగుతున్న నష్టాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇటీవలే దీనిని పూర్తిగా నిషేధించింది. అన్ని రాష్ట్రాలు దీనిని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది. దీంతో మన రాష్ట్రంలోనూ ఆరు నెలల పాటు దీనిపై నిషేధం విధించారు. అయినా, కూడా ఇప్పటికీ పలు దుకాణాల్లో దీనిని యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. పారాక్వాట్ అనే గడ్డిమందును తాగడం, తాకడం, దీని గాలిని పీల్చడం వల్ల ప్రభావానికి గురై చాలా మంది చికిత్స కోసం ఆసుపత్రికి వస్తున్నారు. వాస్తవంగా ఈ మందుకు విరుగుడు లేదు. బాధితుల ఆరోగ్య లక్షణాలను బట్టి వారికి వైద్యం అందిస్తాము. అయినా, పెద్దగా ప్రయోజనం ఉండదు. దీనిని తీసుకున్న వారు, ప్రభావానికి గురైన వారు 95 శాతం మరణించే అవకాశమే ఎక్కువ. దీనిని తాగిన కొన్ని నిమిషాల్లోనే గుండె, మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. ఈ పరిస్థితుల్లో కొందరికి డయాలసిస్, మరికొందరికి వెంటిలేటర్ అవసరం పడుతుంది. –డాక్టర్ రామశివనాయక్, ఎమర్జెన్సీ మెడిసిన్ ఇన్చార్జ్ హెచ్వోడీ, జీజీహెచ్, కర్నూలు ప్రాణాలు తీస్తున్న గడ్డిమందు కలుపు కంటే ఆత్మహత్యలకే ఎక్కువగా వినియోగం ఏటా జిల్లాలో వంద మందికి పైగా ఆత్మహత్య పారాక్వాట్ (గడ్డి మందు)ను నిషేధించిన కేంద్రం అయినా, కొనసాగుతున్న విక్రయాలు బండి ఆత్మకూరు మండలానికి చెందిన ఓ మహిళ ఈ నెల 25వ తేదీన గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకుని మరణించింది. చికిత్స నిమిత్తం ఆమెను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించినా ఫలితం లేకుండా పోయింది. కర్నూలు మెడికల్ కాలేజికి చెందిన ఓ వైద్యవిద్యార్థిని గతేడాది ఇదే గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఆమెను బతికించుకునేందుకు తల్లిదండ్రులు పలు ఆసుపత్రులు తిరిగి నెలరోజులు పోరాడినా ఫలితం లేకుండాపోయింది. -
డిగ్రీ అధ్యాపకులకు ప్రిన్సిపాళ్లుగా పదోన్నతి
కర్నూలు సిటీ: జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న అధ్యాపకులు ప్రిన్సిపాళ్లుగా పదోన్నతులు పొందారు. వారికి కేటాయించిన కాలేజీల్లో ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. సిల్వర్జూబ్లీ డిగ్రీ కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న డాక్టర్ కే నాగరాజు శెట్టి, కర్నూలు ప్రభుత్వ పురుషుల డిగ్రీ కాలేజీలో అధ్యాపకుడిగా పని చేస్తున్న డాక్టర్ డీ నాగన్న అక్కడే ప్రిన్సిపాళ్లుగా పదోన్నతి పొందారు. కేవీఆర్ మహిళా డిగ్రీ కాలేజీ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న డా.వెంకటరెడ్డికి పదోన్నతి కల్పిస్తూ రెగ్యులర్ చేశారు. అదే కాలేజీకి చెందిన ఉర్దూ విభాగం అధ్యాపకురాలు డాక్టర్ ఇర్ఫానా బేగం పదోన్నతి కల్పిస్తూ పాణ్యం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్గా నియమించారు. కర్నూలు ప్రభుత్వ పురుషుల డిగ్రీ కాలేజీ అధ్యాపకుడు డా.టి మాదన్నకు పదోన్నతి కల్పించి మార్కాపురం జిల్లా దోర్నాల ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్గా నియమించారు. వీరందరూ బాధ్యతలు స్వీకరించంతో ఆయా కాలేజీలకు చెందిన అధ్యాపకులు అభినందనలు తెలిపారు. -
తీరం దాటిన దుఃఖం
మంత్రాలయం/మంత్రాలయం రూరల్: ఆశలు నిర్జీవమయ్యాయి.. తుంగభద్ర నదిలో గల్లంతైన వారందరూ మృత్యు ఒడికి చేరుకున్నారు. నది నుంచి ఒక్కొక్క మృతదేహాన్ని బయటకు తీసుకొస్తుంటే బంధువుల రోదనలు మిన్నంటాయి. మంత్రాలయంలోని ఓ ఇంట్లో సత్యనారాయణ వ్రతం పూజ నిమిత్తం వచ్చిన ఐదుగురు శనివారం తుంగభద్ర నదిలో స్నానాలకు వెళ్లి గల్లంతైన విషయం తెలిసిందే. కాళప్ప ఆచారి కుమారుడు శశికుమార్ వివా హం సందర్భంగా ఆదివారం పౌర్ణమి రోజన ఇంట్లో సత్యనారాయణ వ్రత పూజ నిర్వహించాల్సి ఉంది. పూజ నిమిత్తం పలువురు బంధవులు శనివారమే మంత్రాలయానికి చేరుకున్నారు. సాయంకాలం కర్నూలులోని ఆదిత్య నగర్కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి సతీష్(35) తన పెద్దకొడుకు యువన్చంద్ర(5)తో కలసి మరో నలుగురు కలసి తుంగభద్రా నదిలో పుణ్యస్నానానికి వెళ్లారు. అనంతపురం జిల్లా ఉరవకొండ రత్నయ్య ఆచారి కూతురు సంధ్య(21) (పెళ్ళికూతురు చెల్లెలు), ఎమ్మిగనూరుకు చెందిన వడ్ల ధనుష్ (22), మంత్రాలయానికి చెందిన వడ్ల రాఘవేంద్ర(25)తో పాటు ఆదోనికి చెందిన అపర్ణ(13)వెళ్లారు. చెంబు కోసం తుంగభద్ర నది లోకి వెళ్లిన యువన్ చంద్ర (5) గల్లంతయ్యాడు. కుమారుడిని కాపాడుకునేందుకు తండ్రి సతీష్, మిగతావారు నదిలోకి దిగారు. నీటి ప్రవాహం కారణంగా అందరూ గల్లంతయ్యారు. అందులో అపర్ణ మాత్రమే మృత్యుంజయురాలిగా ప్రాణాలతో బయటపడ్డారు. మృతదేహాల లభ్యం గల్లంతైన వారి ఆచూకీ కోసం రెండు రోజుల పాటు గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం సాయకాలం ధనుష్ మృతదేహం మాత్రమే జాలర్లు గుర్తించారు. మిగతా నలుగురి ఆచూకీ లభించకపోవడంతో ఆదివారం స్థానిక జాలర్లు నదిలో గాలించారు. ఉదయం 6 గంటల సమయంలో ఘటనా స్థలానికి కిలోమీటరు దూరంలోని తెల్లబండ్ల మడుగులో తండ్రి, కుమారుడు సతీష్,యువన్ చంద్ర మృతదేహాలు బయటపడ్డాయి. ఎస్డీఆర్ఎఫ్ బృందం గాలిస్తుండగా తెల్లబండ్ల మడుగు దిగువ ప్రాంతంలో సంధ్య మృతదేహం లభించింది. రాఘవేంద్ర మృతదేహం ఘటనా స్థలం దగ్గరలోనే దొరికింది. విషాదకరం మృతుడు సతీష్.. గ్లోబుల్ ఆప్టాప్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. భర్త, సతీష్ , కుమారుడు యువన్చంద్ర చనిపోవడంతో ఝాన్సీరాణి కన్నీటి పర్యంతమయ్యారు. మృత్యురాలు సంధ్య బీటెక్ పూర్తి చేసుకుని జాబ్ కోసం యతిస్తున్నారు. పెళ్లి కూతురు చెల్లెలు అయిన ఈమె తల్లిదండ్రులకు ఆఖరి సంతానం. మంత్రాలయానికి చెందిన నరసింహాచారి రెండో కుమారుడైన రాఘవేంద్ర వంశపారపర్యంగా మారికాంబ, దేవమ్మ అవ్వ ఆలయ పూజారిగా పనిచేస్తున్నాడు. ఎమ్మిగనూరుకు చెందిన ధనుష్ బీటెక్ పూర్తి చేసుకుని జాబ్ కోసం యత్నిస్తున్నాడు. మిన్నంటిన రోదనలు గల్లంతైన వారి మృతదేహాలు లభ్యమవడంతో తుంగభద్ర నదీ తీరంలో బంధువుల రోదనలు మిన్నంటాయి. మృత శిశువు యువన్ చంద్ర భూజాన వేసుకుని తల్లి ఝాన్సీరాణి విలపించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. పెళ్లి కూమార్తె చెల్లెలు సంధ్య మృతదేహం లభించగానే ఇంటిల్లాపాది ఆర్తనాదాలు కలచి వేశాయి. అనుకోని దుర్ఘటనలో ఐదుగురు ప్రాణాలు గాలిలో కలసి పోవడంతో మంత్రాలయం వాసులు అక్కడికి చేరుకుని అయ్యోపాపమంటూ కన్నీరుమున్నీరుయ్యారు. హృదయ విచారకర ఘటన పలువురిని దిగ్భ్రాంతికి గురిచేసింది. కుటుంబసభ్యులకు మృతదేహాల అప్పగింత మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మొత్తం 20 మంది ఎస్డీర్ఎఫ్ బృంద సభ్యులు, ఆరుగురుగజ ఈతగాళ్లు, స్థానిక మృత్స్యకారులు గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. తహసీల్దార్ రమాదేవి, సీఐ దస్తగిరిబాబు, ఎస్ఐలు మల్లికార్జున, విజయ్కుమార్, ఎస్డీఆర్ఎఫ్ ఎస్ఐ చంద్రశేఖర్నాయక్, ఫైర్స్టేషన్ ఎస్ఐ రామాంజినేయులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. సత్యానారాయణ వ్రతం నిమిత్తం బంధువుల ఇంటికి వచ్చాం. మధ్యాహ్నం మా పిల్లలకు యువన్ చంద్ర, తిరుధన్విక్కు రాఘవేంద్రస్వామి మఠంలో తలనీలాలు ఇచ్చాం. స్నానాలు చేసేందుకు తుంగభద్ర నది వద్దకు వెళ్లాం. అక్కడ మా పిల్లలు చెంబుతో ఆడుకుంటున్నారు. చెంబు నీటిలోకి పోగా మా పెద్దోడు నీళ్లలోకి దిగాడు. గమనించిన మా ఆయన సతీష్ బాబు కోసం నీటిలోకి దిగారు. అయితే అక్కడ లోతు ఎక్కవగా ఉండటంతో మా భర్త, బాబు రక్షించేందుకు తోటివారు దిగారు. అంతటితో ఐదుగురు పూర్తిగా కళ్లెదుటే మునిగిపోగా అపర్ణ మాత్రమే ప్రాణాలతో బయట పడింది. నదీ తీర ప్రాంతంలో ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేక పోగా అప్రమత్తం చేసే నాథుడే లేడు. ఘటనా స్థలానికి జనాలు దూరంగా ఉండటంతో ఐదుగురిని కోల్పోవాల్సి వచ్చింది. – ఝాన్సీరాణి, మృతుడు సతీష్ భార్య పరామర్శ తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతైన విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్య నిర్వాహక సభ్యులు, టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు వై.సీతారామిరెడ్డి సంఘటన స్థలాన్ని చేరుకున్నారు. బాధితులను పరామర్శించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఆయనతో పాటు వైఎస్సార్సీపీ జిల్లా కార్య దర్శి విశ్వనాథ్రెడ్డి, నాయకులు పరమేష్, వెంకటేశ్ శెట్టి, జనార్దన్రెడ్డి, పులికుక్క రాఘవేంద్ర, మల్లికార్జున, వీకేసీ రఘ, వడ్డే నారాయణ తదితరులు పాల్గొన్నారు. తుంగభద్ర నదిలో మృతదేహాల వెలికితీత మిన్నంటిన బంధువు రోదనలు ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రిలో పోస్టు మార్టం -
ఖరీఫ్కు సబ్సిడీ విత్తనాలు ఇవ్వరా?
● ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షిచిప్పగిరి: ఖరీఫ్ సమీపిస్తున్నా విత్తనాలు, ఎరువులపై స్పష్టమైన ప్రకటన రాకపోవడం రైతాంగాన్ని భయాందోళనకు గురి చేస్తోందని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అన్నారు. ఆదివారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో గత రెండు సంవత్సరాలుగా రైతులు పడుతున్న బాధలు వర్ణనాతీతం అని అన్నారు. రైతు సంక్షేమం విషయంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వానికి ఎంతో తేడా ఉందన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు. పంట నష్టపోతే బీమా రావడం లేదని మండిపడ్డారు. ఈ ఏడాది యూరియా, ఎరువుల కోసం అనేక ఆంక్షలు విధించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా ఇన్పుట్ సబ్సిడీ, రైతు భరోసా సీజన్ ముగిసే లోపు వచ్చేదని గుర్తు చేశారు. ఎల్నీనో ప్రభావానికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో రైతులకు చెప్పాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు బుసినే చంద్రశేఖర్, శ్రీరాములు, వెంకటేష్, మహానంది, హనుమంతు, రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు. -
రాయలసీమ సాహిత్యం చాలా గొప్పది
● కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కుం.వీరభద్రప్పఎమ్మిగనూరుటౌన్: రాయలసీమ సాహిత్యం చాలా గొప్పదని, మారుతి పౌరోహితం రచించిన ఇల్లిడిసిన తొమ్మిది కథలు పుస్తకం సీమ జీవితాన్ని ప్రతిబింబించేలా ఉందని కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కుం.వీరభద్రప్ప, రాయలసీమ ఉద్యమ నాయకులు, రచయిత భూమాన్ పేర్కొన్నారు. ఎమ్మిగనూరు పట్టణంలోని వాసవీ కళ్యాణ మండపంలో కంభం పాటి సాయినాథ్ శర్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ‘ఇల్లిడిసిన తొమ్మిది కథలు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. సీనియర్ జర్నలిస్ట్ , రచయిత తాడి ప్రకాష్, ప్రముఖ సాహితీ వేత్త ముక్కామల చక్రధర్, కవి వెంకటకృష్ణ, సాహితి స్రవంతి రాష్ట్ర అధ్యక్షుడు కెంగర మోహన్లు మాట్లాడుతూ.. రాయలసీమ ప్రాంతం సస్యశ్యామలం కావడానికి ఉద్యమాలు అవసరమన్నారు. రాయలసీమ జీవితం కంటే సాహిత్యం గొప్పదని కొనియాడారు. కార్యక్రమంలో మారుతి పౌరోహితం అక్కబావలైన శ్రీనివాసమూర్తి, వెంకటలక్ష్మి, కవులు అనంత్, వెంకటేష్, కర్ణాటకకు చెందిన సాహితీవేత్తలు చిదానందసాలె, రచయిత ఇనాయతుల్లా, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రమాకాంతరెడ్డి పాల్గొన్నారు. -
మంత్రాలయం, గాజువాక ఘటనలపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
తాడేపల్లి : మంత్రాలయం, గాజువాక ఘటనలపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ రెండు వేర్వేరు ఘటనలో పలువురు మృత్యువాత పడటంపై వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రాలయం తుంగభద్ర నదిలో ఈతకు దిగిన ఘటనలో ఐదుగురు, గాజువాక రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘తుంగభద్ర నదిలో మునిగి ఐదుగురు మృతిచెందడం విషాదకరం. ఈతకు వెళ్లి ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’ అని వైఎస్ జగన్ సంతాంప వ్యక్తం చేశారు. ఇక గాజువాక రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడటంపై వైఎస్ జగన్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు వైఎస్ జగన్. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్ జగన్ కోరారు.కాగా, మంత్రాలయం వద్ద తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు గల్లంతైన సంగతి తెలిసింద. మంత్రాలయంలోని బంంధువుల ఇంట్లో జరిగే సత్యనారాయణ స్వామి పూజకు బంధువులు హాజరయ్యారు. పూజ అయిపోయిన తర్వాత సమీపంలో ఉన్న తుంగభద్ర నదికి వెళ్లారు వారు. వారిలో ఆరుగురు ఈత కొట్టడం కోసం దిగగా, వారిలో ఆదోనికి చెందిన అపర్ణ ముందుగానే సురక్షితంగా బయటకొచ్చేసింది. మిగతా ఐదుగురు నదిలో చిక్కుకుపోయి గల్లంతయ్యారు. అక్కడ నీటి లోతు ఎంత ఉందో అంచనా వేయలేక పోవడంతో ప్రమాదం చోటు చేసుకుని ఐదుగురు గల్లంతయ్యారు. వీరి కోసం తీవ్ర గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. వారంతా విగత జీవులుగా మిగిలిపోయారు. ఈ విషాద ఘటనలో ఇద్దకు హైదరాబాద్కు చెందిన యువన్ చంద్ర, సతీష్లుగా గుర్తించగా మరో ఇద్దరిని మంత్రాలయంకు చెందిన రాఘవేంద్ర, ధనులుగా గుర్తించారు, ఉరవకొండకు చెందిన సంధ్య అనే యువతి కూడా ఉంది. మరొకవైపు ఈరోజు(ఆదివారం, మే 31) ఉదయం గాజువాకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సుఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. పలువురికి గాయాలు కాగా, వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. రాజమండ్రి నుంచి పార్వతీపురం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. -
భార్య చేతిలో భర్త హతం
ఆదోని అర్బన్: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడన్న నెపంతో భర్తను భార్య గొంతు నులిమి చంపేసిన ఘటన కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని అమరావతినగర్లో శనివారం వెలుగుచూసింది. ఆదోని వన్టౌన్ సీఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల మేరకు.. అమరావతి నగర్కు చెందిన నల్లబోతుల మహేష్(28), బళ్లారి ఈరమ్మ ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.ఈరమ్మ వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని తెలుసుకుని మహేష్ మద్యం సేవించి గొడవ పడేవాడు. దీంతో వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భావించిన ఈరమ్మ పొలానికి తీసుకెళ్లి మహేష్ గొంతు నులిమి హత్య చేసినట్టు సీఐ తెలిపారు. మృతుడు అక్క చిట్టెమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. -
ఓటరు నమోదు ప్రక్రియలో బీఎల్ఏలు కీలకం
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి ● ‘సర్’పై ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఆధ్వర్యంలో కార్యకర్తలకు అవగాహన ఆలూరు రూరల్: గ్రామాల్లో ఓటరు నమోదు ప్రక్రియలో బూత్ లెవెల్ ఏజెంట్లు (బీఎల్ఏ) కీలకమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే విరూపాక్షి అధ్యక్షతన, వైఎస్సార్సీపీ బీఎల్ఏ ఆలూరు నియోజకవర్గ అధ్యక్షుడు సుధాకర్ సమక్షంలో ఎస్ఐఆర్పై ఆలూరులో బీఎల్ఏలకు శనివారం అవగాహన కల్పించారు. కార్యక్రమానికి వైఎస్సార్సీపీ ఆలూరు నియోజకవర్గ పరిశీలకుడు రామచంద్రా రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆలూరు నియోజకవర్గంలో 315 మందిని బూత్ ఏజెంట్లుగా నియమించారన్నారు. వీరంతా ఓటరు నమోదు ప్రక్రియలో సైనికుల్లా పనిచేయాలన్నారు. వైఎస్సార్సీపీ అనుకూల ఓట్లను తొలగించే ‘కూటమి’ కుట్రలను అడ్డుకోవాలన్నారు. ఓటర్ల్ల తుది జాబితా విడుదలయ్యే వరకు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. సర్ ప్రక్రియపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్రీన్పై వివరించారు. 2002 ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకుని 2025 ఓటర్ల మ్యాపింగ్ జరుగుతుందన్నారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు. త్వరలో వచ్చే స్థానిక సంస్థల్లో, 2029 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేయాలని పిలుపు నిచ్చారు. ఓటరు సవరణ కార్యక్రమంలో బీఎల్ఏలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. నియోజకవర్గంలో తాగునీటి సమస్య, గుంతల రోడ్లతో ప్రజలు ఇబ్బంది పడుతున్నా టీడీపీ ఆలూరు ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి సోషల్ మీడియాలో పోస్టులకే పరిమితమయ్యారన్నారు. క్రమశిక్షణతో నిర్వర్తించాలి ఆలూరు నియోజకవర్గ పరిశీలకుడు రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ అధిష్టానం అప్పజెప్పిన బాధ్యతను 315 మంది బీఎల్ఏలు క్రమశిక్షణతో నిర్వర్తించాలన్నారు. వైఎస్సార్సీపీకి కార్యకర్తలే బలం అని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ధైర్యంగా నిలబడి పనిచేయాలన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కమిటీ నాయకులు తెర్నేకల్ సురేందర్ రెడ్డి, శశికళ, వైకుంఠం మల్లికార్జున చౌదరి, సౌమ్యారెడ్డి, దివాకర్ నాయుడు, మధుసూధన్ రెడ్డి, బూత్ లెవెల్ నియోజకవర్గ అధ్యక్షుడు సుధాకర్, వైఎస్సార్సీపీ వివిధ విభాగాల జిల్లా నాయకులు, ఆరు మండలాల కన్వీనర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు,మాజీ సర్పంచులు పాల్గొన్నారు.టీడీపీ.. వెన్ను పోటు పార్టీ సూపర్సిక్స్ అనే అబద్ధపు హామీలతో అధికారం చేపట్టిన టీడీపీ వెన్నుపోటు పార్టీ అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. సొంత మామను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలకు వెన్నపోటు పొడిచాడన్నారు. నంద్యాల జెడ్పీటీసీ సభ్యుడు రమేష్ను, ఆలూరులో ఈరన్న అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశారని, హత్యా రాజకీయాల చరిత్ర టీడీపీది కాదా అని ప్రశ్నించారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు రాక్షసులతో యుద్ధం చేస్తున్నారన్నారు. మోసపూరిత హామీలతో పాలన సాగిస్తూ.. ప్రశ్నించిన వారిపై టీడీపీ నేతలు అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. -
దగా డీఎస్సీపై రేపు ర్యాలీ
కర్నూలు (టౌన్): ఉపాధ్యాయ నియామక ప్రక్రియ(డీఎస్సీ)లో జరిగిన అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో, సీబీఐతో విచారణ జరిపించాలన్న డిమాండ్తో సోమవారం (జూన్1న) భారీ నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఎద్దుల శివారెడ్డి తెలిపారు. కర్నూలులోని తన కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాటసాని శివ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం కర్నూలులోని విజయ డెయిరీ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహిస్తామన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేస్తామన్నారు. ర్యాలీలో పెద్ద సంఖ్యలో యువకులు, నిరుద్యోగులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. దేవదాయ శాఖ ఈవోలకు అదనపు బాధ్యతలు కర్నూలు కల్చరల్: దేవదాయ శాఖలో ఈనెల 31వ తేదీన పలువురు ఈవోలు పదవీ విరమణ పొందనున్నారు. వారి స్థానంలో ఇతర గ్రూప్ ఆలయాల ఈవోలకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. గడివేముల గ్రూప్ టెంపుల్స్, నందికొట్కూరు గ్రప్ –4 టెంపుల్స్ ఈవోగా విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందనున్న టి. హనుమంతరావు స్థానంలో నంద్యాల గ్రూప్ –1 టెంపుల్స్ ఈవో యు. స్వర్ణముఖికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆదోని గ్రూప్–2 టెంపుల్స్, ఎమ్మిగనూరు గ్రూప్ టెంపుల్స్ ఈవోగా విధులు నిర్వహ స్తూ పదవీ విరమణ పొందనున్న పి.సి.రామ్ ప్రసాద్ స్థానంలో ఎం. ఈశ్వర్రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు. సంజామలలో 41.4 డిగ్రీల ఉష్ణోగ్రత కర్నూలు(అగ్రికల్చర్): అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నా.. ఉష్ణోగ్రతలు అదుపులోకి రావడం లేదు. సంజామలలో శనివారం 41.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. బనగానపల్లెలో 40.2, కల్లూరులో 40, పలు మండలాల్లో 39 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా.. నాలుగు మండలాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. ఎమ్మిగనూరులో 6.8, పెద్దకడుబూరులో 4.4, మంత్రాలయంలో 3.8, కౌతాళంలో 08 మి.మీ ప్రకారం వర్షాలు కురిశాయి. గ్యాస్ సిలిండర్ పేలి గుడిసె దగ్ధం గోనెగండ్ల: గ్యాస్ సిలిండర్ పేలి గుడిసె దగ్ధం అయ్యింది. ఈ దుర్ఘటన శనివారం ఉదయం వేముగోడు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సుందరమ్మ తన గుడిసెలో గ్యాస్ సిలిండర్పై వంటలు చేస్తుండగా విద్యుత్ షార్ట్సర్క్యూట్తో భారీగా మంటలు వచ్చాయి. ఆమె కేకలు వేస్తూ బయటకు రాగా గ్యాస్ సిలిండర్ పెద్దశబ్దంతో పేలి మంటలు చెలరేగి గుడిసె దగ్ధమైంది. నిత్యావసర సరుకులు, బంగారు, వెండి తదితర వస్తువులు కాలి బూడిదై రూ.లక్షకు పైగా నష్టం వాటిల్లినట్లు బాధితుడు బోయ దస్తగరి తెలిపారు. కాలి బుడిదైన గుడిసెను రెవెన్యూ అధికారులు పరిశీలించారు. జూన్ 10వ తేదీలోగా బ్యాంకు ఖాతాలు తెరవాలి కర్నూలు (అర్బన్): 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి తల్లికి వందనం పథకం కింద లబ్ధి పొందేందుకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న అర్హత కలిగిన ఎస్సీ విద్యార్థులు జూన్ 10వ తేదీలోగా బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేయాలని జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారిణి బి.రాధిక శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన విద్యార్థులు తమ సమీపంలోని యూనియన్ బ్యాంకు లేదంటే పోస్టాఫీసులలో విద్యార్థి పేరు మీద నూతన అకౌంట్ను ఓపెన్ చేయాలన్నారు. ఓపెన్ చేసిన ఖాతాను ఎన్పీసీఐ లింక్ చేసుకుంటేనే తల్లికి వందనం పథకం ప్రయోజనాలు వర్తిస్తాయన్నారు. ఈ ప్రక్రియను జూన్ 10వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు సమీపంలోని స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల ద్వారా విద్యార్థులు ఆధార్ కార్డుతో పాటు ఆధార్ లింక్ అయిన ఫోన్నెంబర్ను కూడా తీసుకెళ్లాలన్నారు. ఆయా సచివాలయాల్లోని గ్రామ సంక్షేమ, విద్య సహాయకులు, వార్డు సంక్షేమ విద్య కార్యదర్శిని సంప్రదించాలని ఆమె తెలిపారు. -
రాష్ట్ర ఉత్తమ హెచ్డబ్ల్యూఓగా బెన్నమ్మ
కర్నూలు (అర్బన్): రాష్ట్ర ఉత్తమ వసతి గృహ సంక్షేమ అధికారిణిగా నగరంలోని ప్రభుత్వ బాలికల కళాశాల వసతి గృహం నెంబర్–1 హెచ్డబ్ల్యూఓ బి.బెన్నమ్మ ఎంపికయ్యారు. ఈ మేరకు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆమెకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, ప్రిన్సిపల్ సెక్రటరీ మల్లికార్జున నాయక్, డైరెక్టర్ లావణ్య వేణి అవార్డును అందించారు. అలాగే ఈ విద్యాసంవత్సరంలో అదే వసతి గృహంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన ఎ.రూప (960), ఎస్.లక్ష్మిదేవి (957)లను కూడా సన్మానించారు. ఈ సందర్భంగా శనివారం వసతి గృహ సంక్షేమాధికారిణి బెన్నమ్మ మాట్లాడుతూ.. జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారిణి జి.రాధిక, సహాయ సంక్షేమాధికారి బి.మద్దిలేటి సలహాలు, సూచనలతో ప్రోత్సాహాన్ని అందించడంతో పలువురు విద్యార్థినులు మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రస్థాయిలో విద్యార్థినులు మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యారన్నారు. ఇలాగే ప్రతి ఏడాది విద్యార్థినులు ఉత్తమ మార్కులు సాధించేందుకు మరింత కృషి చేస్తామని చెప్పారు. -
బ్లాక్ స్పాట్లను త్వరగా బాగు చేయండి
● రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో కలెక్టర్ కర్నూలు(సెంట్రల్) : రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా బ్లాక్ స్పాట్లలో చేపడుతున్న పనులు త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లారోడ్డు భద్రత కమిటీ సమావేశాన్ని ఆమె నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా ఎస్పీ విక్రాంత్పాటిల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..పెద్ద పాడు నుంచి హైదరాబాద్ జాతీయ రహదారిని లింక్ చేస్తూ ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు ప్రతిపాదిత ప్రాంతాన్ని మునిసిపల్, ఆర్అండ్బీ, ఏపీఎస్ ఆర్టీసీ శాఖల అధికారులు సంయుక్తంగా తనిఖీ చేయాలని చెప్పారు. పంచలింగాల టోల్గేట్ నుంచి వెల్దుర్తి వరకు, ఆదోని పట్టణంలో నూతన బైపాస్ రోడ్డు నుంచి మంత్రాలయం వరకు గుర్తించిన బ్లాక్ స్పాట్ల వద్ద రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలను త్వరగా చేపట్టాలన్నారు. గత సమావేశాల్లో కర్నూలు నగర శివారులోని పిస్తా హౌస్ నుంచి ఉలింద కొండ వరకు గుర్తించిన బ్లాక్ స్పాట్లలో హైమాస్ లైట్లను ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చామని, ఆ పనులు ఎంత వరకు వచ్చాయని జాతీయ రహదారుల అధికారులను ప్రశ్నించారు. కిడ్స్ వరల్డ్ నుంచి కలెక్టరేట్ వరకు చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనుల్లో వేగం పెంచాలని మునిసిపల్, ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. ఉల్చాల జంక్షన్ అభివృద్ధికి సంబంధించి ట్రాన్స్ఫార్మర్ల మార్పిడి పనులు పూర్తయ్యాయని, సుందరీకరణలో భాగంగా చేపట్టిన గుంతలు పూడ్చే పనులను కూడా త్వరగా పూర్తి చేయాలని మునిసిపల్ అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారుల వెంట ఆక్రమణలు తొలగించాలి సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు జాతీయ రహదారుల వెంటనే అనధికార అక్రమణలు, అక్రమ పార్కింగ్లను తొలగించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సంయుక్త తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారి 44 లో ఈనాడు కార్యాలయం నుంచి మిస్ట ర్ ఇడ్లీ వరకు సర్వీసు రోడ్లపై ఉన్న ఆక్రమణల తొలగింపున కు సంబంధించి మునిసిపల్, జాతీయ రహదారులు, రెవె న్యూ శాఖలు సంయుక్తంగా క్షేత్ర స్థాయి పరిశీలన చేసి నివేదిక సమర్పించాలని నేషనల్హైవే డెప్యూటీ కలెక్టర్ను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో అదనపు ఎస్పీ హుస్సేన్పీరా, ఆర్అండ్బీ ఎస్ఈ మహేశ్వరరెడ్డి, డీటీసీ శాంతకుమారి, పీఆర్ ఎస్ఈ ప్రభాకరరరెడ్డి, డీఎంహెచ్ఓ డాక్టర్ కామేశ్వరప్రసాదు, నేషనల్ హైవే స్పెషల్ డె ప్యూటీ కలెక్టర్ సునీత ఆర్టీసీ ఆర్ఎం శ్రీనివాసులు పాల్గొన్నారు. -
మృత్యువును జయించి...
మంత్రాలయం: శుభకార్యానికి వచ్చి ఆనందంగా ఉన్న వారి ఇళ్లల్లో తుంగభద్ర నదీ స్నానం తీవ్ర విషాదాన్ని నింపింది. సత్యనారాయణ పూజకు వచ్చి ఐదుగురు గల్లంతయ్యారు. పిల్లవాడిని రక్షించబోయి నదీ ప్రవాహంలో కొట్టుకుపోయారు. మంత్రాలయానికి చెందిన కాళప్ప ఆచారి కుమారుడు శశికుమార్ వివాహం ఈ నెల 7న జరిగింది. వివాహం ముగియడంతో పూర్ణిమ సందర్భంగా కాళప్ప ఆచారి ఇంట్లో సత్యనారాయణ పూజ చేస్తున్నారు. పూజ నిమిత్తం పలు ఊళ్ల నుంచి బంధువులు మంత్రాలయం వచ్చారు. శనివారం మధ్యాహ్నం కాళప్ప ఇంట్లో భోజనాలు ముగించుకుని ఆరుగురు బంధువులు పుణ్యస్నానాలకు తుంగభద్ర నదికి వెళ్లారు. మంత్రాలయంలో శ్మశానవాటిక దగ్గరలోని ఉన్న పుష్కర ఘాట్ సమీపానికి చేరుకున్నారు. స్నానాలకు దిగుతుండగా కర్నూలులోని ఆదిత్య నగర్ వాసి సతీష్ చంద్ర కుమారుడు యువన్ చంద్ర (5) తీరంలో చెంబుతో ఆడుతూ కనిపించారు. అయితే బాలుడి చెంబు గాలికి నీటిలోకి కొట్టుకుపోయింది. దీంతో చెంబు కోసం ఆబాలుడి నదిలోకి దిగాడు. పిల్లోడు అనుకోకుండా నదీ ప్రవాహంలో కొట్టుకుపోతుండటంతో అక్కడే ఉన్న బంధువులు వెంటనే స్పందించారు. పిల్లోడిని రక్షించడానికి ఆరుగురు నదిలో దూకారు. వీరిలో ఐదుగురు నదీ ప్రవాహంలో గల్లంతయ్యారు. అపర్ణ అనే యువతి మాత్రం ప్రవాహంలో కొట్టుకుపోతూ దూరాన బండ రాయిని చేరుకుని ప్రాణాలతో బయటపడ్డారు. గల్లంతైన వారిలో తండ్రి, కొడుకు కర్నూలులోని ఆదిత్యనగర్కు చెందిన సతీష్ చంద్ర (36) పూజారిగా పనిచేస్తున్నారు. తన ఆశలన్నీ కుమారుడు యువన్ చంద్ర (5)పైనే ఉంచుకున్నారు. అనుకోకుండా కుమారుడు తుంగభద్ర నదిలో అదృశ్యం కావడంతో తండ్రి తల్లడిల్లారు. వెంటనే నదిలో దూకి కుమారుడిని కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అయితే నదిలో గుండాలు ఉండటంతో కుమారుడితోపాటు తండ్రి కూడా గల్లంతయ్యారు. పెళ్లి కుమార్తె చెల్లెలు.. అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన రత్నమయ్య ఆచారి కుమార్తె సంధ్య(21) భవిష్యత్పైనే ఎన్నో ఆశలు ఉంచుకున్నారు. శశికుమార్ వివాహం చేసుకున్న యువతికి ఈమె స్వయానా చెల్లెలు. తన అక్క వివాహంలో ఎంతో సందడి చేసిన ఈ యువతి సత్యనారాయణ పూజలో పాల్గొన్నారు. భక్తి గీతాలు కూడా ఆలపించారు. పుణ్యస్నానాలు చేసేందుకు తుంగభద్ర నదికి వచ్చి బాలుడిని కాపాడేందుకు వెళ్లి గల్లంతయ్యారు. గజ ఈతగాళ్లతో గాలింపు.. తుంగభద్ర నదిలో బాలుడు అదృశ్యమయ్యాడని, మరో ఆరుగురు కనిపించడం లేదని తెలిసిన వెంటనే పోలీసులు స్పందించారు. సంఘటన స్థలానికి ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి చేరుకుని గజ ఈతగాళ్లను రప్పించారు. పుట్టీలతోనూ నదిలో విస్తృతంగా గాలింపులు చేపట్టారు. ధనుష్ మృతదేహం బయటపడటంతో బంధువులు గుండెలు బాదుకుంటూ రోదించారు. దీంతో తుంగభద్ర తీరం శోక సంద్రాన్ని తలపించింది. గల్లంతైన వారి కోసం తుంగభద్ర నదిలో గజఈతగాళ్లు అర్ధరాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపుల్లో కర్ణాటక హసన్ జిల్లా బెలూరు నియోజకవర్గం దోడ్డ చెల్లూరు గ్రామానికి చెందిన రామలక్ష్మణగౌడు (65) మృతదేహం లభ్యమైంది. మృతదేహంలోని చొక్కాలో ఉన్న ఆధారాల ఆధారంగా కుటుంబసభ్యులకు సమాచారం అందవేశారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం ఆదివారం కూడా గాలింపు చర్యలు చేపట్టనున్నారు. ధనుష్ మృత దేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులుబాలుడి తప్పటడుగులు ఇక కనిపించవు.. వచ్చీరాని మాటలు అదృశ్యమయ్యాయి. దివ్య సౌధాలు నిర్మించే వారి మాటలు ఇక వినిపించవు...బంగారు భవిష్యత్తుపై యువతి, యువకుల స్వప్నాలు గల్లంతయ్యాయి. కుమారుడే ఇంటి దీపం అని తండ్రి తన ధైర్యాన్ని చూపలేరు.. అనంతలోకాలకు వెళ్లిపోయారు. ఈ విషాదంతో భక్తి కీర్తనలతో అలారుతూ ఉండే మంత్రాలయంలోని తుంగభద్ర నదీ తీరం శనివారం శోకాన్ని ఆలపించింది. బాలుడితోపాటు రక్షించడానికి వెళ్లిన నలుగురు గల్లంతు కావడంతో బంధువులకు దుఃఖమే మిగిలింది.ఆదోనికి చెందిన శంకరప్ప ఆచారి కుమారుడు అపర్ణ (13) మృత్యువును జయించారు. నదీ ప్రవాహంలో కొట్టుకుపోతుండగా బండ రాయిని ఈ బాలికను కాపాడింది. దానిని పట్టుకుని ప్రాణాలతో నదీ తీరం చేరుకున్నారు. తనతోపాటు నదిలో దూకినవారు మృత్యువాత పడటంతో శోకసంద్రంలో మునిగారు. -
క్రికెట్ బెట్టింగ్పై ప్రత్యే నిఘా
కర్నూలు: ఐపీఎల్ ఫైనల్ క్రికెట్ మ్యాచ్ ఆదివారం ఉన్న నేపథ్యంలో బెట్టింగ్ కార్యకలాపాలపై గట్టి నిఘా ఉంచాలని క్షేత్రస్థాయి పోలీసు అధికారులను ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో శనివారం డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలన కోసం ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేసి గంజాయి అమ్మేవారిని, సేవించే వారిని డ్రగ్ డిటెక్షన్ కిట్స్తో తనిఖీలు నిర్వహించాలన్నారు. లైంగిక నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఒకటి కంటే ఎక్కువ కేసుల్లో నిందితులుగా ఉన్న వారిపై షీట్లు ఓపెన్ చేయాలని ఆదేశించారు. వారికి జియో ట్యాగింగ్ చేయాలన్నారు. ఏడాది కాలంలో శిక్ష పడిన నేరస్తుల వివరాలు సేకరించి నిఘా కొనసాగించాలన్నారు. మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి మిస్సింగ్ కేసులు, చోరీకి గురైన వాహనాలను గుర్తించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆర్టీజీఎస్, సీసీటీవీ 360 అప్లికేషన్ ద్వారా వస్తున్న అలర్ట్లను ప్రతిరోజూ సమీక్షించాలన్నారు. సీసీటీవీ ఏపీ 360 అప్లికేషన్ను సమర్థవంతంగా వినియోగించాలని, 1930 సైబర్ హెల్ప్లైన్కు వచ్చిన కాల్స్పై వెంటనే స్పందించాలన్నారు. రూ.10 లక్షలకు పైగా జరిగిన సైబర్ మోసాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి వెంటనే దర్యాప్తు చేపట్టాలన్నారు. డ్రంకెన్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వారి నుంచి జరిమానాలు కోర్టుకు మాత్రమే చెల్లించే విధంగా చూడాలన్నారు. ఈ విషయంలో ఎవరైనా అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవన్నారు. సంవత్స రం క్రితం బదిలీ అయిన పోలీసు సిబ్బందిని పాత పోలీస్స్టేషన్లోనే కొనసాగించకుండా బదిలీల్లో వారికి కేటాయించిన స్టేషన్లలో విధులు నిర్వహించేలా చర్య లు తీసుకోవాలన్నారు. లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు, డీఎస్పీలు బాబుప్రసాద్, వెంకటరామయ్య, ఉపేంద్ర బాబు, భార్గవి తదితరులు పాల్గొన్నారు.మాట్లాడుతున్న ఎస్పీ -
దిల్ మ్యాంగ్ మోర్
సాధారణంగా మామిడి కాయలు గుండ్రంగా, కోలగా ఉంటాయి. లేత అకుపచ్చ రంగులో, నున్నగా మెరుస్తూ నోరూరిస్తాయి. అయితే వెంగళాం పల్లి గ్రామానికి చెందిన రైతు శ్రీనివాసులు తోటలో లవ్ షేప్లో కాసిన ఓ మామిడి కాయ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. శనివారం కాయలు తెంపడానికి వెళ్లిన కూలీ తిమ్మప్పకు ఈ కాయ కనిపించింది. అచ్చం హృదయం ఆకారంలో ఉన్న ఈ మామిడి కాయను కూలీలు ఆశ్చర్యంగా చూస్తున్నారు. కాయ పెరిగే దశలో వాతావరణ ప్రభావం వల్ల మామిడి కాయలు కొన్నిసార్లు ఇలాంటి విభిన్న ఆకారంలో వస్తాయని ఉద్యానశాఖ అధికారిణి కళ్యాణి తెలిపారు. –ప్యాపిలి -
కాసులకు కక్కుర్తి!
కర్నూలు: మద్యం తాగి వాహనాలు నడపటం వల్లే జిల్లాలో అధిక శాతం రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. దీంతో ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలో రోజుకో మార్గంలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నారు. బ్రీత్ ఎనలైజర్ ద్వారా 100కు 30 శాతం రీడింగ్ వస్తే మద్యం తాగినట్లు గుర్తించి వెంటనే వాహనాలు స్వాధీనం చేసుకుంటున్నారు. నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి మరుసటి రోజు వారిని కోర్టులో హాజరుపరచాల్సి ఉండగా డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో స్టేషన్ రైటర్లు, కోర్టు కానిస్టేబుళ్లు కుమ్మక్కయ్యారు. ఒక్కొక్కరి నుంచి రూ.10 వేలు చొప్పున వసూలు చేస్తున్నారు. కోర్టులో అపరాధ రుసుం రూపంలో కేవలం రూ.5 వేలు చెల్లించి రూ.5 వేలు స్వాహా చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ దృష్టికి వెళ్లింది. ఈ విషయంపై అంతర్గత విచారణ జరిపించి వాస్తవమని తేలడంతో నాలుగో పట్టణ హెడ్ కానిస్టేబుల్ రవికుమార్పై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వీఆర్కు పంపుతూ ఆదేశాలు ఇచ్చారు. మందుబాబుల నుంచి రూ.10 వేలు వసూలు చేసి కోర్టు కానిస్టేబుళ్లు రూ.5 వేలు స్వాహా చేస్తున్నట్లు ఎస్పీ దృష్టికి వెళ్లడంతో శుక్రవారం హెడ్ కానిస్టేబుల్ రవికుమార్ను స్వయంగా పిలిపించి విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయన వద్ద ఉన్న రూ.5 లక్షల వసూలు డబ్బుతో పాటు చలానా బుక్కును అప్పజెప్పి ఇంటికి వెళ్లిపోయినట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా.. మద్యం తాగి పట్టుబడిన వారిని నిబంధనల ప్రకారం మరుసటి రోజు కోర్టులో హాజరుపరచాలి. అలా కాకుండా వారం రోజుల వరకు కేసులను పెండింగ్లో ఉంచుతున్నారు. ఒక్కొక్కరి నుంచి రూ.10 వేలు నగదు, ఆధార్ కార్డు తీసుకుని వారు కోర్టుకు రాకుండానే కానిస్టేబుళ్లే వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. నిబంధనల ప్రకారం మద్యం తాగిన వ్యక్తిని కూడా కోర్టులో హాజరుపరచాలి. జేఎఫ్సీఎం కోర్టులో డ్రంకెన్ డ్రైవ్ కేసులకు రూ.10 వేలు జరిమానా విధించేవారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రతి నాలుగు మాసాలకోసారి లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. దీనిని అవకాశంగా తీసుకుని లోక్ అదాలత్ జరిగే నెలలో కొన్ని కేసులను హోల్డ్లో ఉంచి ఒకేసారి లోక్అదాలత్లో హాజరుపరచి రూ.3 వేలు అపరాధ రుసుం చెల్లించి మద్యం బాబుల నుంచి మాత్రం రూ.10 వేలు వసూలు చేస్తున్నట్లు ఎస్పీ దృష్టికి వెళ్లింది. అలాగే డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన వారిని ఓపెన్ డ్రింకింగ్లో పట్టుబడినట్లు చూపించి రూ.10 వేలు వసూలు చేసుకుని కోర్టులో రూ.వెయ్యి మాత్రమే జరిమానా చెల్లించి మిగతా డబ్బులు నొక్కేస్తున్నట్లు ఎస్పీ దృష్టికి వెళ్లింది. అలాగే ఏప్రిల్ 20వ తేదీ నుంచి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో కూడా డ్రంకెన్ డ్రైవ్ కేసులు విచారణ చేపట్టి రూ.3 వేలు అపరాధ రుసుం విధిస్తున్నారు. కోర్టు కానిస్టేబుళ్లు మాత్రం మందుబాబుల నుంచి రూ.10 వేలు వసూలు చేసి అందులో సగం నొక్కేస్తున్నట్లు ఎస్పీకి ఫిర్యాదు అందింది. ఇంకా దండుకున్న వారెందరో? పోలీసు శాఖ అంటేనే క్రమశిక్షణకు మారుపేరు. చట్టాలకు లోబడి పనిచేయాల్సిన సిబ్బంది కాసులకు రుచిమరిగి డ్రంకెన్ డ్రైవ్ కేసుల నుంచి వసూలు చేసిన డబ్బుల్లో నొక్కుడు వ్యవహారం బయటపడటంతో ఎస్పీ సీరియస్గా తీసుకున్నారు. ఈ వ్యవహారం జిల్లా పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారడంతో జిల్లా పోలీసు శాఖలో కోర్టు కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న వారందరిపై విచారణకు ఆదేశించినట్లు సమాచారం. ట్రాఫిక్ విభాగంలో కూడా డ్రంకెన్ డ్రైవ్ కేసులో రూ.లక్షల్లో స్కామ్ జరిగినట్లు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొంతమంది కోర్టు కానిస్టేబుళ్లు ఏళ్లుగా పాతుకుపోయి చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పోలీసు శాఖకు అప్రతిష్ట తెచ్చే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ నిర్ణయించి జిల్లా అంతటా విచారణకు ఆదేశించినట్లు సమాచారం. డ్రంకెన్ డ్రైవ్ కేసులంటే వారికి పండగే! డ్రంకెన్ డ్రైవ్ కేసులంటే స్టేషన్ రైటర్లు, కోర్టు కానిస్టేబుళ్లకు పండగే. కోర్టుకు వెళ్తే శిక్షలు ఖాయమని మందుబాబులను బెదిరించి భారీగా దండుకుంటున్నారు. ఇలాంటి వసూలు రాజాలు కర్నూలు ట్రాఫిక్ స్టేషన్తో పాటు సబ్ డివిజన్ పరిధిలోని పలు పోలీస్స్టేషన్లలో హవా సాగిస్తున్నారు. రూ.10 వేలు వసూలు చేసి కోర్టులో రూ.5 వేలు చెల్లించి మిగతా మొత్తాన్ని నొక్కేస్తున్నారు. జప్తు చేసిన వాహనాలను వారికి అప్పగించేందుకు కూడా మరికొంత మొత్తం వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. అందుకే ఆ కేసులంటే వారికి ఉత్సాహం. జిల్లాలో నాలుగు పోలీస్ సబ్ డివిజన్లు, 39 పోలీస్స్టేషన్లు ఉన్నాయి. నెలలో కనీసం ఒక్కొక్క స్టేషన్ పరిధిలో 100కు పైగా డ్రంకెన్ డ్రైవ్, 150కి పైగా ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదవుతుంటాయి. ఆయా కేసుల్లో భారీగా స్కామ్ జరిగినట్లు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
కోవెలకుంట్ల: పట్టణంలోని గాంధీనగర్లో నివాసం ఉంటున్న ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. శనివారం కోవెలకుంట్ల ఎస్ఐ మల్లికార్జునరెడ్డి అందించిన సమాచారం మేరకు.. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నటువ మనోహర్ (30) హోటల్ నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. దొర్నిపాడు మండలం డబ్ల్యూ గోవిందిన్నెకు చెందిన భువనేశ్వరితో ఏడాదిన్నర క్రితం వావాహమైంది. శుక్రవారం రాత్రి హోటల్ పని ముగించుకుని భార్య పుట్టింటి వద్ద ఉండటంతో బైక్పై బయలు దేరాడు. మండలంలోని కంపమల్ల– గోవిందిన్నె ఆర్అండ్బీ రహదారిలో బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. రాత్రివేళ ఆ రహదారిలో వాహనాల రాకపోకలు లేకపోవడంతో రోడ్డు ప్రమాద సంఘటనను ఎవరూ గమనించ లేదు. తెల్లవారుజామున అటుగా వెళుతున్న వాహన చోదకులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా అప్పటికే మృతి చెందినట్లు భావించి శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నుట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
విషాదం: తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
కర్నూలు: జిల్లాలోని మంత్రాలయం వద్ద తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు గల్లంతైన విషాదకర ఘటన చోటు చేసుకుంది. మంత్రాలయంలోని బంంధువుల ఇంట్లో జరిగే సత్యనారాయణ స్వామి పూజకు బంధువులు హాజరయ్యారు. పూజ అయిపోయిన తర్వాత సమీపంలో ఉన్న తుంగభద్ర నదికి వెళ్లారు వారు. వారిలో ఆరుగురు ఈత కొట్టడం కోసం దిగగా, వారిలో ఆదోనికి చెందిన అపర్ణ ముందుగానే సురక్షితంగా బయటకొచ్చేసింది. మిగతా ఐదుగురు నదిలో చిక్కుకుపోయి గల్లంతయ్యారు. అక్కడ నీటి లోతు ఎంత ఉందో అంచనా వేయలేక పోవడంతో ప్రమాదం చోటు చేసుకుని ఐదుగురు గల్లంతయ్యారు. దాంతో అక్కడ విషాద చాయలు అలుముకున్నాయి. గల్లంతైన వారిలో ఇద్దకు హైదరాబాద్కు చెందిన యువన్ చంద్ర, సతీష్లుగా గుర్తించగా మరో ఇద్దరిని మంత్రాలయంకు చెందిన రాఘవేంద్ర, ధనులుగా గుర్తించారు, ఉరవకొండకు చెందిన సంధ్య అనే యువతి కూడా ఉంది. వీరి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిలో ధను మృతదేహం లభ్యమైనట్లు తెలుస్తోంది. మిగతా వారి కోసం పోలీసులు, మత్య్సకారులు గాలిస్తున్నారు. -
సీబీఐతో విచారణ చేపట్టాలి
● అవినీతి కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ ● ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఆలూరు రూరల్: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాడ్డాక నిర్వహించిన మెగా డీఎస్సీ దగా డీఎస్సీగా మారిందని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఆరోపించారు. డీఎస్సీ అవకతవకలపై సీబీఐతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆలూరులోని ఆర్అండ్బీ అతిథి గృహంలో శుక్రవారం విలేకరులతో ఎమ్మెల్యే మాట్లాడారు. మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థులు ఉద్యోగాలకు అర్హులవుతారని, అయితే రాష్ట్రంలో అందుకు విరుద్ధంగా అనర్హత సాధించి వారికి టీచర్ పోస్టులు దక్కాయని ఆరోపించారు. అర్హత సాధించినా తమకు డీఎస్సీలో టీచర్ ఉద్యోగం రాలేదని 200 మంది హైకోర్టును ఆశ్రయించినా చంద్రబాబు ప్రభుత్వానికి చలనం లేదన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన రాష్ట్రంలో అవినీతి పాలనపై ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడుతున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని మండిపడ్డారు. ముగిసిన మద్యం కేసులో కేఎన్ఆర్ పాత్ర ఉందని సిట్ విచారణకు అదేశించడం, అలాగే ప్రొఫెసర్ నాగేశ్వర రావుపై అక్రమ కేసులు నమోదు చేయడం ప్రజలను తప్పదోవ పట్టించడమేనన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మల్లికార్జున, నాయకులు వాల్మీకి రామాంజినేయులు, వెంకటేశ్వర్లు, గుండయ్య, ఎల్లప్ప, భాస్కర్, హనుమంతప్ప, నాగేంద్ర, శివ, రాజు, వరుణ్, శేఖర్, బాషా, మల్లయ్య, గౌస్, నాగేష్ తదితరులు పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ను కలిసిన వారికే టీచర్ పోస్టులువిద్యాశాఖ మంత్రి లోకేష్కు డబ్బులు ఇచ్చిన అనర్హులకే టీచర్ పోస్టులు దక్కాయని రాష్ట్రంలో ప్రతి నోటా వినుపిస్తోందని ఎమ్మెల్యే అన్నా రు. ఈ విషయాన్ని బహిరంగంగా మాట్లాడితే కేసులు బనాయిస్తారని అభ్యర్థులు భయపడుతున్నారన్నారు. డీఎస్సీలో జరిగిన అవినీతిపై సోషల్ మీడియాలో, మీడియాలో, పత్రికల్లో వార్తలు వస్తున్నా మంత్రి లోకేష్ స్పందించడం లేదన్నారు. అర్హులకు కాకుండా ముడుపులు అందించిన అనర్హులకు పోస్టులు పంచిపెట్టారని ఆరోపించారు. -
టీడీపీ .. అదొక హంతక పార్టీ!
కర్నూలు(టౌన్): గొడ్డలి పార్టీ అంటూ పైనుంచి కింది స్థాయి వరకు వైఎస్సార్సీపీపైనే ఏడ్వడమే పనిగా పెట్టుకున్నారని, టీడీపీ .. హంతక పార్టీ అని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుసుకోవాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి సూచించారు. కర్నూలులోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రౌడీలు, గుండాలతో అంబటి ఇంటిని ధ్వంసం చేశారని, పెట్రోలు బాంబులతో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిని తగులబెట్టారన్నారు. నంద్యాలలో జెడ్పీటీసీ సభ్యుడు రమేష్ను నరికి చంపారని, ఆలూరులో ఈరన్న అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశారన్నారు. కర్నూలులో సతీష్ ఆత్మహత్య వరకు ఎన్నో దుర్మార్గాలు చేశారన్నారు. మోహన రంగాను చంపిన చరిత్ర టీడీపీ కాదా అని ప్రశ్నించారు. ఊరూరా బెల్ట్ షాపులు కల్తీ మద్యం కేసులో టీడీపీకి చెందిన జయచంద్రారెడ్డి, మోలకల చెరువుకు చెందిన జనార్దనరావు జైళ్లకు వెళ్లారని ఎస్వీ మోహన్రెడ్డి తెలిపారు. టీడీపీ పాలనలో ఊరూరా బెల్ట్ షాపులు వెలిశాయని, కల్తీ మద్యం పారుతోందని విమర్శించారు. ఇటీవల లక్ష్మీపురంలోని బెల్ట్షాపులో మద్యం తాగి రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతిచెందితే బస్సు దగ్ధమై 19 మంది కాలిబూడిద అయ్యాయన్నారు. డ్రగ్స్ సేవిస్తూ టీడీపీకి చెందిన పార్లమెంటు సభ్యులు పుట్టామహేష్ పట్టుబడలేదా అని ప్రశ్నించారు. పోలీసులు వస్తే వారిపై కాల్పులు జరిగిన ఘనత టీడీపీ నాయకులకే చెందుతుందన్నారు. ‘మహా’మోసం హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసేందుకే మహానాడు నిర్వహిస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందేనన్నారు. మామను వెన్ను పోటు పొడిచిన పార్టీ టీడీపీ కాదా అని ఎస్వీ ప్రశ్నించారు. రెండేళ్లు దాటుతున్నా మహిళలకు రూ.1,500 ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచారన్నారు. నిరుద్యోగులకు రూ. 3 వేలు, 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రూ. 4వేల పింఛన్ ఇవ్వకుండా మోసం చేశారన్నారు. ప్రతి సంవత్సరం మూడు సిలిండర్ల ప్రకారం రెండేళ్లలో ఆరు సిలిండర్లు ఇవ్వకుండా రెండు ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. మెగా డీఎస్సీని కాస్తా దగా డీఎస్సీగా మార్చిన ఘనత టీడీపీది కాదా అని ప్రశ్నించారు. సంక్షేమం.. వైఎస్సార్సీపీ సొంతం అధికారంలో ఉన్న సమయంలో జగనన్న అన్ని వర్గాలకు చెప్పిన ప్రతి హామీ అమలు చేశారన్నారు. అవినీతిని గొడ్డలితో నరికి ఒక్క రూపాయి దుర్వినియోగం కాకుండా రూ.2.76 లక్షల కోట్లు సంక్షేమ పథకాల పేరుతో నేరుగా ప్రజల బ్యాంక్ అకౌంట్లలోనే జమ చేశారన్నారు. రాష్ట్రంలో సుపరిపాలన అందించారని, ప్రతి గ్రా మంలో సచివాలయాలను ఏర్పాటు చేసి అక్క డే పదిమంది ఉద్యోగులను నియమించారన్నారు. అభివృద్ధి, సంక్షేమం వైఎస్సార్సీపీ సొంతం అయ్యిందన్నారు. నంద్యాలలో జెడ్పీటీసీ సభ్యుడిని నరికి చంపారు ఆలూరులో ఈరన్న అనే వ్యక్తిని హత్య చేశారు మోహన రంగాను చంపిన చరిత్ర ఎవరిది? వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి -
ఖరీఫ్లో వేరుశనగ సాగు ఇలా.. 30వేల హెక్టార్లు 15వేల హెక్టార్లు
కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్కు సమయం ఆసన్నమైంది. జిల్లాలో ప్రధానంగా వేరుశనగ సాగవుతుంది. నంద్యాల జిల్లాలో డోన్, ప్యాపిలి, క్రిష్ణగిరి, నందికొట్కూరు, మిడుతూరు మండలాల్లోనూ వేరుశనగ ప్రధాన పంట. అయితే వేరుశనగ పంపిణీలో చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. ఉమ్మడి కర్నూలు జిల్లాకు ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ(ఏపీసీడ్స్) విత్తనాలు సరఫరా చేస్తుంది. కొన్నేళ్లుగా ఏపీ సీడ్స్లో వేరుశనగ విత్తనోత్పత్తి నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఏపీ సీడ్స్ ప్రయివేటు విత్తన కంపెనీలపై ఆధారపడింది. ఖరీఫ్ సీజన్కు అవసరమైన వేరుశనగ సరఫరా చేస్తామంటూ 26 ప్రయివేటు విత్తన కంపెనీలు టెండర్లు వేశాయి. 2024–25 ఖరీఫ్, రబీ, 2025–26 ఖరీఫ్, రబీ సీజన్లకు ఏపీసీడ్స్కు సరఫరా చేసిన వేరుశనగ, పచ్చిరొట్ట ఎరువులు, శనగ విత్తనాలకు సంబంధించి కంపెనీలకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం ఏపీ సీడ్స్కు చెల్లిస్తేనే కంపెనీలకు చెల్లించే అవకాశం ఉంది. రెండేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వం ఏపీ సీడ్స్కు రూపాయి కూడా విడుదల చేయలేదు. పాత బకాయిలు చెల్లిస్తేనే ఇప్పుడు వేరుశనగ సరఫరా చేస్తామంటూ టెండర్లు వేసిన కంపెనీలు పేర్కొంటున్నాయి. ఇదిలాఉంటే సబ్సిడీపై పంపిణీ చేసే వేరుశనగ పూర్తి ధర, సబ్సిడీలను పేపరుపై ఖరారు చేసినప్పటికీ కార్యాచరణలో పురోగతి లేకపోవడం గమనార్హం. హమాలీ చార్జీలు చెల్లించలేని దుస్థితి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఏపీ సీడ్స్ నిర్వీర్యమైంది. లోడింగ్, అన్లోడింగ్ హమాలీల కష్టానికి ప్రతిఫలం కూడా చెల్లించలేని దుస్థితికి ఏపీ సీడ్స్ చేరుకుంది. సహజంగా వారానికి ఒకసారి నగదు చెల్లిస్తుంటారు. అప్పుడే హమాలీల జీవనం సజావుగా సాగుతుంది. అయితే టీడీపీ ప్రభుత్వంలో ఏపీ సీడ్స్ నిర్వీర్యమవడంతో హమాలీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మొదటిసారి ఏప్రిల్ నుంచి నుంచి హమాలీలకు చెల్లింపులు నిలిచిపోవడంతో వీరి జీవనం దుర్భరమవుతోంది. సిబ్బందికి వేతనాలూ కరువే.. 2023–24 వరకు వరకు ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ ఒక వెలుగు వెలిగింది. ప్రతి ఏటా మే 15 నాటికే వేరుశనగతో పాటు అన్ని రకాల విత్తనాలను ఏపీ సీడ్స్ రైతులకు అందుబాటులోకి తెచ్చేది. అయితే చంద్రబాబు ప్రభుత్వం కార్మికులకు రూపాయి కూడా చెల్లించలేని దుస్థితికి ఏపీ సీడ్స్ను తీసుకొచ్చింది. హమాలీలకే కాదు డైలీ వేజ్పై పనిచేసే వారికి కూడా ఏప్రిల్ నుంచి వేతనాల్లేవు. కనీసం కరెంటు బిల్లులూ చెల్లించలేని దయనీయం నెలకొంది. ఏప్రిల్స్ నెల విద్యుత్ బిల్లులు ఇంతవరకు చెల్లించలేదంటే పరిస్థితి అర్థమవుతోంది. ట్రాన్స్పోర్టు చార్జీలు కూడా చెల్లించకపోవడం గమనార్హం. కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాసర్టిఫికేషన్, ట్యాగ్లు వచ్చేది ఎప్పుడో! టెండర్లు వేసిన కంపెనీల దగ్గర క్వింటా వేరుశనగ కూడా లేదు. బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయాల్సి ఉంది. కర్నూలు జిల్లాలో ప్రస్తుతం వేరుశనగ పంటే లేదు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీకి 150 క్వింటాళ్లు, ఆదోని మార్కెట్కు 15 క్వింటాళ్లు, ఎమ్మిగనూరు మార్కెట్కు 50 క్వింటాళ్ల లోపు మాత్రమే వస్తోంది. టెండర్లు వేసిన కంపెనీలు ఇతర జిల్లాల్లో కొనుగోలు చేయాలి. ఈ ప్రక్రియ మొదలే కాలేదు. కొనుగోలు చేసిన దానిని ప్రాసెసింగ్ చేసి.. ప్యాకింగ్ చేయాల్సి ఉంది. లాట్ల వారీగా శాంపుల్స్ తీసి సర్టిఫికేషన్ కోసం ఆంధ్రప్రదేశ్ విత్తన ధృవీకరణ సంస్థకు పంపాలి. అక్కడ మొలక శాతం, స్వచ్ఛత తదితరాలను పరిశీలించి సర్టిఫికేషన్తో పాటు ట్యాగ్లు ఇవ్వడానికి 10 రోజులకుపైగా సమయం పడుతుతుంది. టెండర్లు వేసిన కంపెనీలు ఇప్పటికప్పుడు వేరుశనగ కొనుగోలు చేపట్టినా రైతులకు పంపిణీ చేయడానికి కనీసం 20 రోజులు పడుతుంది. దీన్నిబట్టి చూస్తే ఈ సారి సబ్సిడీపై వేరుశనగ పంపిణీ చేసే ఉద్దేశం లేదని అర్థమవుతోంది. చంద్రబాబు ప్రభుత్వంలో నిర్వీర్యమైన ఏపీ సీడ్స్ సరఫరాకు 26 విత్తన కంపెనీల టెండర్లు ఇప్పటి వరకు అందుబాటులో లేని వేరుశనగ ఖరీఫ్ మొదలవుతున్నా చలనం కరువు ముందుగా పాత బకాయిలు చెల్లించాలని మెలిక 10,723 క్వింటాళ్లు 2,136 క్వింటాళ్ల -
బి. కోడూరు కుక్కు ప్రథమ స్థానం
● పులగం, పచ్చడి వంటతో గుర్తింపు బండిఆత్మకూరు: మిడ్డే మీల్స్ కుక్ కం హెల్పర్స్ రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమంలో బండి ఆత్మకూరు మండలం బి. కోడూరు ఎంపీపీఎస్ పాఠశాల కుక్ నాగ భూషణమ్మ ప్రథమ బహుమతి సాధించింది. మండల విద్యాశాఖ అధికారులు యశోద, మోహన్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. విజయవాడలో ఈనెల 28, 29 తేదీల్లో జరిగిన రాష్ట్ర స్థాయి కుకింగ్ ట్రైనింగ్ కార్యక్రమంలో నాగ భూషణమ్మ పులగం, పచ్చడి చేసి మొదటి బహుమతి సాధించినట్లు తెలిపారు. ప్రథమ బహుమతి సాధించిన నాగభూషణమ్మతో పాటు మరొక వంట మనిషి ఈశ్వరమ్మను మండల విద్యాశాఖ అధికారులు అభినందించారు. -
మునగ బెండ్లు ఊడిపోయి..
మద్దికెర: స్థానిక ఎడవలి రోడ్డులో బావిలో ఈత నేర్చుకునేందుకు వెళ్లిన పదేళ్ల బాలిక మృత్యువాత పడింది. అనంతపురం జిల్లా బెలుగుప్ప గ్రామానికి చెందిన గాయత్రి, తిమ్మారెడ్డి దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. పాఠశాలకు వేసవి సెలవులు రావడంతో పెద్ద కుమార్తె లక్ష్మీదేవి (10) మద్దికెరలోని మేనమామ కేశవరెడ్డి ఇంటికి వచ్చింది. శుక్రవారం ఈత నేర్చుకునేందుకు ఎడవలి రోడ్డులోని సుంకరోళ్ల బావి వద్దకు వెళ్లింది. మునగబెండ్లు కట్టుకుని బావిలోకి దూకిన సమయంలో బెండ్లు ఊడిపోవడంతో ఈతరాక మునిగిపోతుండడంతో గమనించి బయటికి తీశారు. కాగా అప్పటికే అపస్మారక స్థితికి చేరుకుని మృతి చెందింది. బాలిక మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
మలకల కుంట కబ్జా
పత్తికొండ:కూటమి ప్రభుత్వంలో చెరువులు, వాగులు, వంకలు కనుమరుగు అవుతున్నాయి. ఓ వైపు తెలుగు తమ్ముళ్లు మట్టి, ఇసుక తవ్వకాలు.. మరో వైపు దర్జాగా కబ్జాలు. అధికార పార్టీ నేతల అండదండలతో ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు రాత్రికిరాత్రే ఆక్రమించేస్తున్నారు. పత్తికొండ పట్టణంలోని బైపాస్ రహదారి పక్కన ఉన్న మలకులకుంటలోని సర్వేనంబర్ 203–3లో 2.83 ఎకరాలను వంక పోరంబోకు భూమి లో ఓ రియల్ ఏస్టేట్ వ్యాపారి రెండు రోజుల క్రితం ముళ్లకంపలను తొలగించి చదును చేయించాడు. అయితే సమీప పొలాలు రైతులు, ఎస్సీ కాలనీవాసులు అక్కడికి చేరుకోని నిలదీసినా వారినే దబాయించాడు. పట్దాదారు పాసు పుస్తకం చూపి పనులు చేయాలని గట్టిగా అడగటంతో అక్కడి నుంచి వెళ్లిపో యాడు. ఈ భూమిని గత ప్రభుత్వంలో అధికారులు జగనన్న కాలనీకి కేటాయించగా.. మలకులకుంటకు వానకాలంలో నీరు వస్తే దాదాపు వెయ్యి ఎకరాలకు సంబంధించిన బోరుబావుల్లో భూగర్భ జలాలు పెరిగి పంటలు సాగుకు ప్రయోజనకరంగా ఉంటుందని, అక్కడ ఇళ్ల పట్టాలు ఇవ్వద్దని రైతులు కోరారు. అప్పటి ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి చొరవతో అధికారులు జగనన్న కాలనీ కోసం మరో చోట భూమి కేటాయించా రు.ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఈ భూమిపై రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను పడింది. బెంగళూరు–మంత్రాల యం ప్రధాన రహదారి పక్కన ఉండటం వల్ల దాదాపు రూ. 3 కోట్లు పైగా విలువ చేస్తోంది. బైపాస్ రహదారి పక్కన ఉండటం వల్ల ప్లాటు వేసి విక్రయించేందుకు భూమి అనుకూలంగా ఉంది. దీంతో అధికార పార్టీ నాయకుల అండదండలు, రెవెన్యూ అధికారుల సహకారంతో ఈ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారి కబ్జా చేసేందుకు యత్నిస్తున్నాడు. పట్టపగలు యథేఛ్చగా భూములను కబ్జా చేస్తున్న రెవెన్యూ అధికారులు నోరు మెదపడం లేదన్న విమర్శలు ఉన్నాయి. వచ్చే వారంలో పత్తికొండ పట్టణ పరిసరాల్లో భూముల రీసర్వే కార్యక్రమం నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈలోగా వంక పోరంబోకు స్థలాన్ని చదును చేసి ఉంచితే నకలీ పాసు పుస్తకం ద్వారా నేరుగా అడంగల్లో పేర్లు నమోదు చేసుకునేందుకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఇదంతా ఓ రెవెన్యూ అధికారి కనుసన్నల్లోనే జరుగుతుందని సమాచారం. వంక పోరంబోకు భూమిలో ముళ్లకంప చెట్లును తొలగించిన దృశ్యం మొద్దునిద్రలో మైనర్ఇరిగేషన్ అధికారులు చెరువులు, కుంటలు యథేచ్ఛగా కబ్జా అవుతున్నా మైనర్ ఇరిగేషన్ శాఖ అధికారులు మాత్రం మొద్ద నిద్ర వీడటం లేదు. ములకులకుంటతో పాటు పత్తికొండ పెద్ద చెరువు కింద కడుగొమ్మ వంక ప్రాంతంలో పదుల ఎకరాల్లో భూమి కబ్జాకు గురై నేడు వంక ఆనవాలు లేకుండా చేసినా కూడా పట్టించుకోవడం లేదు. వానకాలంలో వంకకు వరద వస్తే అక్రమార్కులు కబ్జాల వల్ల కడుగొమ్మ వంక పరిసర ప్రాంతాల్లో దాదాపు బుడగజంగాల కాలనీ, నాయిబ్రాహ్మణ కాలనీ, వీకె ఆదినారాయణరెడ్డి కాలనీల్లో దాదాపు 500 ఇళ్లు ముంపునకు గురై అవకాశం ఉంది. ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నా మైనర్ ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. మలకుల కుంటలో ముళ్లకంపలను తొలగించిన విషయం మా దృష్టికి వచ్చింది. ఈ విషయంపై ఆర్డీఓతో చర్చించి విచారణ చేపడతాం. కబ్జాకు పాల్పడితే చర్యలు తీసుకుంటాం. వంక పోరంబోకు భూములపై ప్రభుత్వ హక్కులు ఉంటాయి తప్పా డీ పట్టాలు తీసుకున్న వారికి ఎలాంటి హక్కులు ఉండవు. – హుస్సేన్సాహెబ్, తహసీల్దార్, పత్తికొండ -
గాలీవాన బీభత్సం
జొహరాపురంలో కూలిన రేకులషెడ్డు నేలకొరిగిన విద్యుత్ స్తంభం పెద్దకొత్తిలిలో ఇంటిపై పడిన చెట్టునందవరం: దాదాపు 45 నిమిషాలు భారీ ఈదురు గాలులు, వర్షం తొమ్మిది గ్రామాల్లో బీభత్సం సృష్టించింది. జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. మండల కేంద్రం నందవరంతో పాటు నాగలదిన్నె, చిన్నకొత్తిలి, పెద్దకొత్తిలి, జొహరాపురం, గంగవరం, నదికై రవాడి, ఇబ్రహీంపురం, మాచాపురం తదిరత గ్రామా ల్లో శుక్రవారం ఉదయం గాలివాన బీభత్సం సృష్టించింది. ఉదయం 6.15 నుంచి 7 గంటల మధ్య కురిసి న గాలీవానకు భారీ చెట్లు నెలకొరిగాయి, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. నదికై రవాడి గ్రామంలో ఇళ్లపై భారీ వృక్షాలు పడ్డాయి. రేకుల షెడ్డులు ఎగిరిపోయాయి. జొహరాపురం గ్రామంలో మహిళ రైతు సుశీలమ్మ రేకుల షెడ్డు ఎగిరిపోవడంతో ధాన్యం, ఎరువు లు వానకు తడిచిపోయాయి. గ్రామంలో దాదాపు 15 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మంత్రాలయం – నాగలదిన్నె ప్రధాన రహదారిలో నదికై రవాడి, జొహరాపురం, పెద్దకొత్తిలి, చిన్నకొత్తిలి గ్రామాల్లో రోడ్లపై భారీ వృక్షాలు విరిగిపడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాదాపు 40కిపైగా విద్యుత్ స్తంభాలు, ఐదు ట్రాన్స్ఫార్మర్లు విరిగిపడ్డాయి. జొహరాపురం గ్రామంలోని మండల పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న భారీ బసిరి చెట్టు గాలీవానకు నేలకూలింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇబ్రహీంపురం గ్రామానికి చెందిన రైతు బోయ కిష్టప్ప(45)పై పొలం వద్ద చెట్టు కూలి పడటంతో మృత్యువాత పడ్డాడు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కుటుంబీకులను పరామర్శించారు. ఉప్పొంగిన వంకలు.. నిలిచిన రాకపోకలు భారీ వర్షంతో మండలంలో వాగులు, వంకలు పొంగి పొర్లాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పెద్దకొత్తిలి గ్రామంలో వంక ఉద్ధృతంగా ప్రవహించడంతో మంత్రాలయం, ఎమ్మిగనూరు మీదుగా వెళ్లే వాహనాలకు 8 గంటల పాటు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ గాలీవానలకు చెట్లు కూడా ప్రధాన రహదారుల్లో నేలకొరిగాయి. మండలంలోని ఇబ్రంహీంపురం, మాచాపురం, పెద్దకొత్తిలి వంకలు ఉధృతంగా ప్రవహించాయి. -
గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
కర్నూలు: కర్నూలు నుంచి దూపాడుకు వెళ్లే మార్గంలో కార్బైడ్ ఫ్యాక్టరీ దగ్గర గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం 9:30 గంటల ప్రాంతంలో వందేభారత్ ఎక్స్ప్రెస్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రమాదంలో శరీరమంతా నుజ్జునుజ్జు అయి గుర్తు పట్టలేని విధంగా ఉంది. సుమారు 45 సంవత్సరాల వయసు ఉండి తెలుపు రంగు గీతల షర్టు, నీలం రంగు లోయర్, తెలుపు రంగు కట్ బనియన్, నలుపు రంగు కట్ డ్రాయర్ ధరించాడు. సుమారు 5.6 అడుగుల ఎత్తు, ఛామన ఛాయ వర్ణం ఉంటాడు. ఎడమ మోచేతిపైన ఎంఎస్కే అనే ఇంగ్లిష్ అక్షరాలు ఉన్నాయి. ఆచూకీ తెలిసినవారు 9247575608, 9247575609 ఫోన్ చేసి సమాచారమివ్వాలని కర్నూలు రైల్వే పీఎస్ సీఐ శ్రీనాథ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శతాధిక వృద్ధుడి మృతి కొత్తపల్లి: మండల కేంద్రంలో ఓ శతాధిక వృద్ధుడు గురువారం రాత్రి మృతి చెందాడు. కొత్తపల్లి గ్రామానికి చెందిన ఏళ్ల బాల సుబ్బారెడ్డి (108) గత కొద్దిరోజు లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురై మృత్యువాత పడ్డాడు. ఈయన 1918లో జన్మించి ఇప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఉ న్నాడని గ్రామస్తులు చెప్పారు. వృద్ధుడికి ము గ్గురు కుమారులు, ఒక కూతురు ఉండగా వా రిలో పెద్దకొడుకు,చిన్న కొడుకు చనిపోయారు. కరీంనగర్ వాసి ఆత్మహత్య కర్నూలు: తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ పట్టణానికి చెందిన కందనూరి వేణుసాగర్ (28) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన ఉపాధి నిమిత్తం ఏడాది క్రితం కర్నూలుకు వలస వచ్చి బళ్లారి చౌరస్తాలో ఉన్న డీ–మార్ట్ వెనుక గణేష్ నగర్లో ఓ అద్దె ఇంట్లో నివాసమున్నాడు. అదే కాలనీలో నివాసమున్న మెకానిక్ కేశన్నతో కలసి ట్రాన్స్పోర్టు వాహనాల వ్యాపారం చేసేవారు. రాత్రి గదిలో చీరతో ఉరి వేసుకున్నాడు. శుక్రవా రం ఉదయం తలుపు తెరవకపోవడంతో ఇంటి ఓనర్లు గట్టిగా తలుపు తట్టినా పలకలేదు. దీంతో బద్దలుకొట్టి లోపలికి వెళ్లి చూడగా ఉరికి వేలాడు తూ మృతి చెందాడు. వెంటనే విషయం కరీం నగర్లో ఉన్న తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు కర్నూలు చేరుకున్నారు. ఆత్మహత్యకు దారితీసిన కారణాలు తెలియాల్సి ఉంది. నాలుగో పట్టణ పోలీసులు మృతుడి తండ్రి శ్రీనివాసులు తో సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇద్దరికి పాము కాటు శిరివెళ్ల: కోటపాడులో ఉపాధి పనుల వద్ద ఇద్ద రు పాము కాటుకు గురయ్యారు. శుక్రవారం ఉపాధి కూలీలు పంట కాల్వలో పూడిక తీస్తుండంగా మొదట ఉపాధి కూలీ హబీబ్బాషాను పాము కరిచింది. పక్కనే ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ షేక్ ఉస్సేనిబాషా కొడవలితో పామును కొడుతుండగా అతడిని కరిచింది. చికిత్స నిమిత్తం ఇద్దరిని 108లో నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే ఇన్చార్జ్ ఏపీఏ సల్లాఉద్దీన్ వైద్యశాలకు వెళ్లి పరామర్శించారు. బీఎల్ఓలకు షోకాజ్ నోటీసులు కర్నూలు (టౌన్): నగరపాలక సంస్థలో పనిచేసే 17 మంది బూత్ లెవెల్ ఆఫీసర్లకు శుక్రవారం కర్నూలు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి చల్లా ఓబులేసు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నగరంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) సర్వేకు నియమించిన బీఎల్ఓలు విధి నిర్వహణలో స్పందించకపోవడంతో నోటీసులు జారీ చేశారు. 24 గంటల వ్యవధిలో లిఖిత పూర్వకంగా కారణాలు తెలియజేయాలన్నారు. -
నేడు పశుసంవర్థక శాఖ జేడీ పదవీ విరమణ
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా పశుసంవర్ధకశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సుబ్బదాసు శనివారం పదవీ విరమణ చేయనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిగా పనిచేస్తున్న ఆయనకు ప్రభుత్వం జాయింట్ డైరెక్టర్గా పదోన్నతి కల్పించి కర్నూలు జిల్లాకు బదిలీ చేసింది. ఈ నెల 23న పదవీ బాధ్యతలు స్వీకరించారు. సెలవులను మినహాయిస్తే ఆరు రోజులు మాత్రమే జేడీ హోదాలో పనిచేశారు. పదవీ విరమణ కార్యక్రమాన్ని శనివారం కొండారెడ్డి బురుజు సమీపంలోని బహుళార్ధ పశువైద్యశాల ప్రాంగణంలో నిర్వహించనున్నారు. జేడీగా పనిచేస్తున్న సుబ్బదాసు పదవీ విమరణ చేస్తుండటంతో ఆయన స్థానంలో బహుళార్ధ పశువైద్యశాల డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ హేమంత్కుమార్కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వ్యక్తిని రక్షించిన హోంగార్డులు తుగ్గలి: ఆత్మహత్యయత్నానికి పాల్పడుతున్న ఓ వ్యక్తిని హోంగార్డులు రక్షించారు. ఎస్ఐ నరేష్ తెలిపిన వివరాల మేరకు.. పత్తికొండకు చెందిన నారాయణరెడ్డి కుటుంబ సమస్యల నేపథ్యంలో మానసిక ఒత్తిడితో తుగ్గలి రైల్వే ట్రాక్పై నిల్చుని డోన్ నుంచి గుంతకల్లు వైపు వెళ్లే రైలు కిందపడి చనిపోతున్నాని కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. వారు వెంటనే తుగ్గలి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ నరేష్ అందుబాటులో ఉన్న హోంగార్డులను అప్రమత్తం చేశారు. హోంగార్డులు రంగస్వామి, లక్ష్మానాయక్ హుటాహుటిన వెళ్లి ట్రాక్పై ఉన్న బాధితున్ని రక్షించి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రాణాలు కాపాడిన ఎస్ఐ, హోంగార్డులకు నారాయణరెడ్డి కుంటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. హోంగార్డులను ఎస్ఐ నరేష్, పత్తికొండ రూరల్ సీఐ పులిశేఖర్, పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. -
పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు పోటీలు
● కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ అధికారి పి.కిశోర్రెడ్డికర్నూలు(సెంట్రల్): పర్యావరణ పరిరక్షణపై పాఠశాల, కాలేజీ విద్యార్థులకు వివిధ విభాగాల్లో పోటీలను నిర్వహించనున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ అధికారి పి.కిశోర్రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘ఇన్స్పైర్డ్ ది నేచర్ ఫర్ క్లైమెట్.. ఫర్ ఫీచర్’ అనే నినాదంతో పోటీ పరీక్షలను ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తామన్నారురు. ఆన్లైన్ సైట్ కోసం స్కానర్ను స్కాన్ చేసి వివరాలు నమోదు చేసి టాపిక్ ఎంచుకొని పోటీ పరీక్షలో పాల్గొనాలని సూచించారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ సర్టిఫికెట్ అందజేస్తామన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు జూన్ 5లోపు పోటీల్లో పాల్గొనాలని, వివరాలకు వెంకటరమణ కాలనీలోని పీసీబీ కార్యాలయాన్ని సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు -
బ్రహ్మగుండంలో తెరుచుకోని ఆలయాలు
వెల్దుర్తి: బ్రహ్మగుండం క్షేత్రంలో అమ్మవారి, రాములోరి గుళ్ల తలుపులు నెల రోజులుగా తెరుచుకోవడంలేదు. బ్రహ్మగుండేశ్వరుడి గర్భగుడి పక్కనే కామేశ్వరీదేవి అమ్మవారి గర్భగుడి ఉంది. ఆలయం ఎదురుగా రాములోరి గుడి ఉంది. ఈ ఏడాది శివరాత్రికి ముందు కామేశ్వరీ దేవి గుడి పూజారి శ్రీధర్ శర్మ రాజీనామా చేయడంతో అధికారులు, గ్రామ పెద్దలు కర్నూలుకు చెందిన ఫణిశర్మకు బాధ్యతలు అప్పజెప్పారు. అప్పటికే అనాదిగా రాములవారి గుడికి పూజారి లేక, తలుపులు తెరుచుకోక భక్తులు పడుతున్న ఇబ్బందులను ఈ ఏడాది ఫిబ్రవరి 16న ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో అధికారులు ఫణిశర్మకు రాములవారి గుడి బాధ్యతలు సైతం అప్పజెప్పారు. అయితే అమ్మవారి, రాములోరి రెండు గుళ్ల పూజారి అయిప ఫణిశర్మ గత నెల రోజులుగా విధులకు హాజరుకాకపోతుండడంతో ఆయా గుళ్ల తలుపులకు తాళాలు వేసి ఉండి, స్వామి, అమ్మవార్లకు నైవేద్యం సైతం అందడంలేదు. భక్తులకు దర్శనభాగ్యం కలగడం లేదు. -
1,060 లీటర్ల డీజిల్, 150 లీటర్ల పెట్రోల్ సీజ్
కర్నూలు(సెంట్రల్)/కౌతాళం: కర్ణాటక నుంచి అక్రమంగా పెట్రోలు, డీజిల్ తెచ్చి కర్నూలు జిల్లా కౌతాళం మండలం ఉరుకుందలో అధిక ధరతో విక్రయాలు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నట్లు డీఎస్ఓ రాజారఘువీర్ తెలిపారు. వీరి నుంచి 1,060 లీటర్ల డీజిల్, 150 లీటర్ల పెట్రోల్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ముందస్తు సమాచారం మేరకు ఉరుకుందలో రెండు షాపుల్లో దాడులు చేయగా అక్రమ పెట్రోలు, డీజిల్ విక్రయాలను గుర్తించామన్నారు. కర్ణాటక నుంచి పెట్రో ఉత్పత్తులను తెచ్చి విక్రయించడం చట్టపరంగా నేరమని, ఇలా చేయడం వల్ల రాష్ట్రానికి జీఎస్టీ ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోతుందన్నారు. స్క్వాడ్ బృందంలో ఆదోని సీఎస్డీటీ రుద్రగౌడు, కౌతాళం మండల ఆర్ఐ తిక్కస్వామి, వీఆర్వో శివానంద ఉన్నారు. -
బైక్ల దొంగ అరెస్ట్
ఆదోని అర్బన్: పత్తికొండ, ఆదోని ప్రాంతాల్లో బైక్లను అపహరించిన దొంగను పోలీసులు పట్టుకున్నారు. దొంగ నుంచి రూ. 10 లక్షల విలువైన 12 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం సీఐ రాజశేఖర్రెడ్డి విలేకరుల సమావేశంలో దొంగ వివరాలను వెల్లడించారు. ఆదోని పట్టణంలోని లక్ష్మమ్మవ్వ ఆర్చ్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈక్రమంలో అనుమానాస్పదంగా బైక్పై వస్తున్న హానవాలు గ్రామానికి చెందిన ముల్లా లతీఫ్ (31)ను అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుడు గతంలో ఆదోని వన్టౌన్, టూటౌన్, త్రీటౌన్, ఆదోని తాలూకా, పత్తికొండ, వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో మొత్తం పరిధిలో మొత్తం 12 మోటార్ సైకిళ్లను దొంగలించినట్లు ఒప్పుకున్నాడు. అతని సమాచారం మేరకు ఆదోని–ఆస్పరి రహదారిలో బైపాస్ రోడ్డులో రహస్య ప్రదేశంలో దాచిన రూ.10 లక్షల విలువైన 12 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకుల దుర్మరణం
కర్నూలు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. బైక్పై వెళుతుండగా ఆటో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు గణేకల్ గ్రామానికి చెందిన వీరేష్, మహేంద్ర, విశ్వనాథ్లుగా గుర్తించారు. -
గుండెపోటుతో ప్రయాణికుడి మృతి
కొలిమిగుండ్ల: మండల కేంద్రం కొలిమిగుండ్ల ప్రధాన రహదారిలో గురువారం గుండెపోటుతో ఓ ప్రయాణికుడు మృతి చెందాడు. అవుకు మండలం చెర్లోపల్లెకు చెందిన దేవభూషణం (55)కు అనారోగ్యంగా ఉండటంతో ఉదయం ఒక్కడే వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు వైద్యశాలకు వెళ్లాడు. పరీక్షలు చేయించుకొని మందులు తీసుకొని కొలిమిగుండ్ల బస్టాండ్కు చేరుకున్నాడు. స్వగ్రామమైన చెర్లోపల్లెకు వెళ్లేందుకు ప్రధాన రహదారిలోనే తోటి ప్రయాణిలకులతో కలిసి బనగానపల్లె డిపో బస్సు ఎక్కేందుకు వెళుతున్న క్రమంలో గుండెపోటు రావడంతో కుప్పకూలి పోయాడు. స్థానికులు పరీక్షించి చూడగా అప్పటికే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు చేరుకుని బోరున విలపించారు. వేధింపులు తాళలేక వివాహిత మృతి దేవనకొండ: అదనపు కట్నం కోసం అత్తారింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. బేతపల్లి గ్రామానికి చెందిన కోతింటి సుధాకర్తో కోడుమూరు మండలం ఎర్రదొడ్డి గ్రామానికి చెందిన ఐశ్వర్య(20)కు రెండేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి అయిన నాటి నుంచి సుధాకర్ కుటుంబ సభ్యులు ఐశ్వర్యని మానసికంగా, అదనపు కట్నం కోసం వేధించడంతో ఈనెల 26వ తేదీన ఇంట్లో ఉరేసుకుని మృతిచెందింది. మృతురాలి తండ్రి అలువాల వనుములన్న ఫిర్యాదు మేరకు భర్త సుధాకర్తో పాటు మామ కోతింటి శివరాముడు, అత్త శరణావతి, మరిది సురేష్లపై కేసు నమోదు చేసినట్లు దేవనకొండ పోలీసులు తెలిపారు. మృతురాలికి 8 నెలల కుమారుడు ఉన్నారు. 30న జాతీయ స్థాయి నాటక పోటీలు ఆదోని అర్బన్: పట్టణంలో ఈనెల 30, 31వ తేదీల్లో జాతీయ స్థాయి నాటక పోటీలు నిర్వహిస్తున్నట్లు లలిత కళాసేవ సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ జి.నల్లారెడ్డి, డి.చిట్టిబాబు తెలిపారు. గురువారం వారు మాట్లాడుతూ నైతిక విలువలు, సామాజిక స్పృహను దృష్టిలో ఉంచుకుని నాటక పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గతంలో హరికథలు, బుర్రకథలు తోలు బొమ్మలాటల ద్వారా పురాణ, ఇతిహాస పాత్రలను, వారి వ్యక్తిత్వాలను తెలుసుకుని ఆప్యాయతలు, అనురాగాలు ఉండేవని, నేడు కళలు కనుమరుగవడంతో అనుబంధాలు కూడా బలహీనపడ్డాయన్నారు. శివరాములు, రాయుడు, రవి ప్రకాష్, రంగన్న, నరసింహులు పాల్గొన్నారు. 50 మంది బీఎల్ఓల నియామకం కర్నూలు (టౌన్): కర్నూలు నియోజకవర్గ పరిధిలో ఖాళీగా ఉన్న బీఎల్ఓల స్థానంలో నగరపాలక కమిషనర్ చల్లా ఓబులేసు కొత్త వారిని నియమించారు. మెడికల్ లీవ్, స్టడీలీవ్, అనారోగ్య కారణాలు, ప్రమోషన్, డిప్యూటేషన్ తదితర కారణాలతో ఖాళీగా ఉన్న పోలింగ్ కేంద్రాలకు మరో 50 మందిని కమిషనర్ నియమించి నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నియమించిన బీఎల్ఓలు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని ఆయన ఆదేశించారు. -
సుంకేసుల బ్యారేజీకి లీకేజీలు!
కర్నూలు సిటీ: కేసీ కాలువ జీవనాడిగా ఉన్న సుంకేసుల బ్యారేజీ గేట్ల లీకేజీలు అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతున్నాయి. కర్నూలు, నంద్యాల, వైఎస్సార్ కడప జిల్లాల్లో 2.65 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీటిని మళ్లీంచే బ్యారేజీ నిర్వహణను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరో వారంలో ఖరీఫ్ సీజన్ మొదలుకానుంది. ఇలాంటి సమయంలో బ్యారేజీ గేట్లతో పాటు, అత్యవసరమైన పనులు చేసేందుకు నిధులు కేటాయించాల్సిన ప్రభుత్వం ఆ వైపుగా ఇంత వరకు చర్యలు తీసుకోలేదు. దీంతో ఈ ఏడాది కూడా గేట్లకు శాశ్వత మరమ్మతులకు నోచుకోవడం లేదు. గతేడాది గేట్లకు రోప్లు, తాత్కాలికంగా లీకేజీల అరికట్టే పనులు చేసినా నిధుల కొరతతో చేసిన పనులకు సకాలంలో బిల్లులు ఇవ్వక మూడు గేట్లకు మాత్రమే రబ్బర్ సీళ్లు మార్పులు చేశారు. మిగిలిన గేట్లకు మార్చకపోవడంతో లీకేజీలు అవుతూనే ఉన్నాయి. ఏటా ఖరీఫ్ సీజన్కు ముందు జల వనరుల శాఖలోని మెకానికల్ విభాగం ఇంజినీర్లు ప్రాజెక్టు గేట్ల పనితీరును పరిశీలించి సీజన్ ముందు, సీజన్ తరువాత పరిశీలించిన నివేదిలను ప్రభుత్వాలకు అందజేయాల్సి ఉంది. అయితే ఆ విభాగం ఇంజినీర్లు ఏ సీజన్లో వస్తున్నారో.. ఎప్పుడు ఏ నివేదికలు ఇస్తున్నారో కూడా ఆ శాఖ ఇంజినీర్లకు, ఆయా ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఇంజినీర్లకు సైతం తెలియడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మెకానికల్ విభాగం నిర్లక్ష్యం ఏటా తాత్కాలిక మరమ్మతులతో సరిపెడుతున్న వైనం వందల క్యూసెక్కుల నీరు వృథాగా దిగువకు -
రక్తం కొరత.. రోగులు విలవిల!
● స్టోరేజీ కెపాసిటీ 7,326 యూనిట్లు ● అందుబాటులో ఉన్నది 1,298 యూనిట్లు ● ముందుచూపు లేని బ్లడ్ బ్యాంకులు ● కర్నూలు పెద్దాసుపత్రిలోనూ ఇదే పరిస్థితి ● రక్తదాన శిబిరాలు నిర్వహించని వైనంకర్నూలు(హాస్పిటల్): రక్తం అందుబాటులో లేకపోవడంతో రోగులు విలవిల్లాడుతున్నారు. దాతల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు కలిపి 19 రక్తనిధులు(బ్లడ్బ్యాంకులు) ఉన్నాయి. వాటిలో బ్లడ్ స్టోరేజ్ కెపాసిటీ 7,326 యూనిట్లు. అయితే ప్రస్తుతం 1,298 యూనిట్ల రక్తం మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న రోగులకు అవసరానికి రక్తం లభించక వారి కుటుంబీకులు ఇబ్బందులు పడుతున్నారు. రక్తం కోసం బ్లడ్ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా లభించడం లేదు. దీంతో ఆయా బ్లడ్ బ్యాంకుల్లోని దాతల జాబితా తీసుకుని వారికి ఫోన్ చేసి పిలిపించుకుంటున్నారు. నెగిటివ్ గ్రూపులు మరింత కొరత జిల్లాలోని బ్లడ్ బ్యాంకుల్లో పాజిటివ్ గ్రూపుల కంటే నెగిటివ్ గ్రూపుల రక్తం కొరత మరింత తీవ్రంగా ఉంది. మొత్తం బ్లడ్బ్యాంకుల్లో ఏ నెగిటివ్ గ్రూపు రక్తం స్టోరేజ్ కెపాసిటీ 238 యూనిట్లు కాగా కేవలం 15 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అలాగే బీ నెగిటివ్ గ్రూపు 253 యూనిట్లు కాగా 35 యూనిట్లు, ఏబీ నెగిటివ్ రక్తం 187 యూనిట్లు కాగా కేవలం 6 యూనిట్లు, ఓ నెగిటివ్ గ్రూపు రక్తం 210 యూనిట్లు ఉండాల్సి ఉండగా కేవలం 18 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉండటంతో రోగుల సహాయకులు అవసరమైన రక్తం కోసం ముప్పుతిప్పలు పడుతున్నారు. కొన్ని బ్లడ్ బ్యాంకుల్లో స్టోరేజి కెపాసిటీకి గాను ఒక్క యూనిట్ కూడా నెగిటివ్ గ్రూపు బ్లడ్ ఉండకపోవడం గమనార్హం. దాతలు ఎక్కువగా ఆయా ప్రొఫెషనల్ కాలేజీల విద్యార్థులే ఉండటం, ఆయా కళాశాలలకు ప్రస్తుతం వేసవి సెలవులు ఇవ్వడంతో దాతలు సమయానికి లభించడం కష్టమవుతోంది. ప్రత్యామ్నాయ చర్యలు ఏవీ? బ్లడ్ బ్యాంకులకు అధికంగా దాతల నుంచి రక్తాన్ని సేకరిస్తారు. దాతలు అధికంగా ప్రొఫెషనల్ కాలేజీల విద్యార్థులు ఉంటారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఎప్పటిలాగే ఇప్పుడు కూడా బ్లడ్ బ్యాంకులకు రక్తం కొరత ఏర్పడింది. పరిస్థితిని ముందుగానే అంచనా వేసి, విద్యార్థులు గాకుండా ఇతర సంఘాలు, యువజన సంఘాల ద్వారా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తాన్ని సేకరించి నిల్వ చేసుకోవాల్సి ఉంది. అయితే బ్లడ్ బ్యాంకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బ్లడ్ బ్యాంకుల్లో కనీస నిల్వలు లేకపోవడంతో రోగుల సహాయకులు సమయానికి రక్తం లభించక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సమయానికి అవసరమైన గ్రూపు రక్తం ఉండే దాతలు లభించక ఇబ్బందులు పడుతున్నారు. బ్లడ్బ్యాంక్ పేరు అవసరం ఉన్నది కర్నూలు పెద్దాసుపత్రి 900 183 ఆదోని 200 34 నంద్యాల 295 29 ఇండియన్ 425 149 రెడ్క్రాస్ సొసైటీబ్లడ్ బ్యాంకులు నిబంధనల మేరకు నడుస్తున్నాయా లేదో చూస్తాం. ప్రైవేటు బ్లడ్ బ్యాంకులు అయితే నిబంధనల మేరకు రక్తదాన శిబిరాల ద్వారా సేకరించిన రక్తంలో 30 శాతం ప్రభుత్వ రక్తనిధికి ఇవ్వాలి. రక్తం నిల్వ చేసుకోవాల్సిన బాధ్యత ఆయా బ్లడ్ బ్యాంకులదే. – ఎల్.భాస్కర్, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ -
కొనసాగుతున్న సంప్రదాయం
మద్దికెర: మండల కేంద్రమైన మద్దికెరలో నేటికి రాచరిక సంప్రదాయం కొనసాగుతోంది. చిన్న మసీదు ముస్లింలు ప్రతి పండుగకు స్థానిక యాదవరాజులను కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం ఆనవాయితీ. అందులో భాగంగా గురువారం ముస్లింలు బక్రీదు పండగ సందర్భంగా యాదవరాజుల ఇంటికెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం యాదవరాజు జమేదార్ జయరామరాజు వారిని సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంటికి వచ్చిన ముస్లింలకు తాంబూలం అందజేయడం పెద్దల నుంచి ఆనవాయితీగా వస్తుందని, తాము కూడా ఆనవాయితీని ఆచరిస్తున్నామన్నారు. -
రోడ్డు ప్రమాదంలో 10 మందికి గాయాలు
కొలిమిగుండ్ల: నందిపాడు సమీపంలోని కాశిరెడ్డినాయన ఆశ్రమం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పది మంది గాయపడ్డారు. నంద్యాల పట్టణానికి చెందిన మహిళలు కొలిమిగుండ్ల మండలం కల్వటాలలోని బంధువుల వివాహానికి ఇన్నోవా కారులో హాజరయ్యారు. పెళ్లి తంతు ముగిశాక నంద్యాలకు తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో నందిపాడు శివార్లలోని ప్రధాన రహదారిలో ఉన్న కాశిరెడ్డినాయన ఆశ్రమం వద్దకు చేరుకోగానే ముందు వెళుతున్న ఐచర్ వాహనాన్ని డ్రైవర్ స్పీడ్ బ్రేకర్ గమనించకుండా అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. దీంతో వెనుకనే ఉన్న ఇన్నోవా కారు బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ ఇరుక్కుపోగా స్థానికుల సాయంతో బలవంతంగా బయటకు తీశారు. కారులో ప్రయాణిస్తున్న మహిళలు నాగలక్ష్మి, సరసమ్మ, అనూష, మల్లమ్మ, రాణి, చిన్నారి వేదాన్షితో పాటు మొత్తం పది మంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం 108 వాహన సిబ్బంది కొలిమిగుండ్ల పీహెచ్సీకి తరలించారు. బీజేవైఎం జిల్లా నూతన కమిటీ ఎన్నిక కర్నూలు కల్చరల్: భారతీయ జనతా యువమోర్చా జిల్లా నూతన కమిటీని రాష్ట్ర నాయకులు ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు జంపాల కేశవ్రామ్ చౌదరి ప్రకటించారు. జిల్లా ఉపాధ్యక్షులుగా కె.అఖిల్, బి.సూర్య, లోకేష్, బి.నాగరాజు, మోహన్, ప్రధాన కార్యదర్శులుగా జె.భరత్కుమార్, గోపి, కార్యదర్శులుగా పులిరాజు, సురేష్ నాయక్, ప్రవీణ్ కుమార్రెడ్డి, శరత్, లీగల్సెల్ కన్వీనర్గా గణేష్, మెడికల్ సెల్ కన్వీనర్గా నవీన్, ఆర్టీఐ సెల్ కన్వీనర్గా రాజు, ఐటీ సెల్ కన్వీనర్గా స్వరూప్, స్పోర్ట్స్ సెల్ కన్వీనర్గా భరత్, సోషియల్ మీడియా సెల్ కన్వీనర్గా దామోదర్లను ప్రకటించారు. 3న సీనియర్ హాకీ ఎంపిక పోటీలు కర్నూలు (టౌన్): స్థానిక ఎస్టీబీసీ కళాశాల క్రీడా మైదానంలో వచ్చే నెల 3వ తేదీన ఉదయం 11 గంటలకు సీనియర్ మెన్ హాకీ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు హాకీ ఆంధ్రప్రదేశ్ కోర్ కమిటీ సభ్యులు దాసరి సుధీర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులు 1992 సంవత్సరం తర్వాత పుట్టిన వారు అర్హులని, ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఒరిజినల్ ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రంతో హాజరు కావాలన్నారు. ఎంపికై న జిల్లా హాకీ జట్టు జూన్ 12 నుంచి 15 వరకు సత్యసాయి జిల్లా ధర్మవరంలో నిర్వహించనున్న 16వ హాకీ ఆంధ్రప్రదేశ్ అంతర్ జిల్లా పోటీల్లో పాల్గొంటారన్నారు. వివరాలకు 9966565317 నంబర్ను సంప్రదించాలని తెలిపారు. క్రీడా కారులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటి జిల్లాకు ఖ్యాతి తీసుకు రావాలన్నారు. -
శ్రీమఠంలో భక్తుల సందడి
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంలో భక్తుల సందడి నెలకొంది. గురువారం రాఘవేంద్రస్వామి ప్రత్యేక దినం కావడంతో భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామి సేవలో తరించారు. భక్తుల రాకతో శ్రీమఠంలో రద్దీ కనిపించింది. మూల బృందావన దర్శనానికి నాలుగు గంటలకు పైగా సమయం పట్టింది. రాయరు దర్శన క్యూలైన్లు, అన్నపూర్ణ భోజనశాల, పరిమళ ప్రసాదం కౌంటర్లు భక్తులతో కిటకిటలాడాయి. వేసవి సెలవులతో పాటు బక్రీద్ సెలవు ఉండటంతో వేకువజామున నుంచి భక్తుల తాకిడి మొదలైంది. తుంగభద్ర నదీ తీరంలో భక్తుల కోలాహలం నెలకొంది. మంచాలమ్మ ప్రత్యేక పూల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. రాఘవేంద్రుల మూలబృందవానికి శ్రీమఠం పీఠాధిపతి ప్రత్యేక పూజలు చేపట్టి మంగళ హారతులు గావించారు. వాహనాల రద్దీతో మంత్రాలయంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడి భక్తులు అవస్థలు పడ్డారు. -
శ్రీశైలం ప్రాజెక్ట్ నీటి ముంపు బాధితులు గుర్తుకురాలేదా
నందికొట్కూరు: శ్రీశైలం బ్యాక్ వాటర్ను కుప్పానికి తరలించామని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి శ్రీశైలం ప్రాజెక్ట్ నీటి ముంపు బాధితులు గుర్తుకు రాకపోవడం తగదని నీటిముంపు నిరుద్యోగ సంఘం నాయకులు జయన్న ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలోని కర్నూలు–గుంటూరు ప్రధాన రహదారి పక్కన శ్రీశైలం నీటిముంపు నిరుద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారానికి 64వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా జయన్న మాట్లాడుతూ నీటిముంపు బాధితులకు 98 జీవో ప్రకారం ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 40 ఏళ్లయినా కాలయాపన చేస్తూనే ఉన్నారన్నారు. ఇప్పటికై నా ఉద్యోగాలిచ్చి ఆదుకోవాలని కోరారు. దీక్షల్లో బాధితులు రామకృష్ణ, నాగేంద్రుడు, జమ్మన్న, నారాయణ, మౌలాలి, శివశంకర్, రాజేష్, రంగయ్య తదితరులు కూర్చున్నారు. -
న్యాయవాదులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
కర్నూలు: న్యాయవాదులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి ఎ.హరిహరనాథ శర్మ సూచించారు. కర్నూలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయ సేవా సదన్లో న్యాయవాదులకు న్యాయ వృత్తిపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి, కర్నూలు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చంద్రుడు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరిహరనాథ శర్మ మాట్లాడుతూ న్యాయవాద వృత్తిలో రాణించాలనుకునే వారికి అనేక రకాల ఉపాధి కల్పనలు ఉన్నాయన్నారు. కోర్టులలో డిజిటల్ ఫైలింగ్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసుల విచారణ వేగవంతం చేయవచ్చన్నారు. లోక్ అదాలత్, మధ్యవర్తిత్వం, రాజీ ద్వారా కేసులు త్వరగా పరిష్కరించుకోవచ్చన్నారు. ప్రతి కేసుకు టైమ్లైన్ ఏర్పాటు చేసుకుని త్వరగా పూర్తి చేయాలని సూచించారు. న్యాయవాది కోర్టులో చట్టం ప్రకారం ఏది సరైనదో క్లెయింట్లకు వివరించాలన్నారు. నిజాన్ని వెలికితీయడంలో కోర్టుకు సహకరించాలన్నారు. పేదలకు, సమాజానికి సంబంధించిన కేసులను ఉచితంగా వాదించాలని కోరారు. జూనియర్ న్యాయవాదులు అడిగిన సమస్యలకు ఈ సందర్భంగా ఆయన పరిష్కార మార్గాలను తెలియజేశారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సత్కరించారు. బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మహేశ్వర రెడ్డి, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ శివరామచంద్రరావు, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సులోచన, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. -
దెయ్యం చేప!
చెరువుల్లో సాధారణంగా పొలుసు చేపలు, బురదమట్టలు, కొర్రమీను, పంజరం, తదితర చేపలు దొరుకుతూ ఉంటాయి. చేపల ప్రియులు వీటిని ఇష్టంగా తింటారు. బొల్లవరంలోని రామరాజు బావిలో మత్స్యకారుడు ప్రసాద్ చేపలు పడుతుండగా ఓ చేప విచిత్రంగా కనిపించింది. శాసీ్త్రయంగా సక్కర్ మౌత్ క్యాట్ ఫిష్, హైపోస్టోమస్ ఫ్లెకోస్టోమస్గా పిలవబడే ఈ చేపను స్థానికంగా రాకాసి చేప, దెయ్యం చేప అని పిలుస్తారని స్థానికులు తెలిపారు. చేపకు శరీరం అంతా గరుకుగా, కవచం లాంటి పొలుసులు ఉన్నాయి. చెరువులోని పాచీ, జంతువుల కుళ్లిన కళేబరాలు తింటాయని చెబుతున్నారు. వీటికి ఉన్న పదునైన రెక్కలతో స్థానిక జాతి చేపలను గాయపరుస్తాయని, దీని ద్వారా చేపల సంఖ్య తగ్గే అవకాశం ఉందన్నారు. – మహానంది -
యూరియా ఏమవుతోంది
● సాగు 3వేల హెక్టార్లు.. యూరియా 4,861 టన్నులు! ● గతంలో ఎప్పుడూ లేని విధంగా వేసవిలో పెరిగిన అమ్మకాలు ● 2020 నుంచి 2024 మధ్య వేసవిలో అమ్మకాలు 1000 టన్నులే.. ● గత ఏప్రిల్ నెలలోనే కర్నూలు జిల్లాలో 2,161, నంద్యాల జిల్లాలో 2,700 టన్నుల అమ్మకాలు ● అడ్డగోలు అమ్మకాలపై కలెక్టర్, జేసీ సీరియస్ ● ఉమ్మడి జిల్లాలో 59 మంది డీలర్ల లైసెన్స్లు తాత్కాలిక సస్పెన్షన్ కర్నూలు సబ్ డివిజన్లోని గూడూరు మండలంలో ప్రతి బస్తా యూరియాకు లింక్లు పెట్టి రైతులను దోపిడీ చేస్తున్నా వ్యవసాయ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. కలెక్టర్, జేసీలు యూరియాపై దృష్టి పెట్టడంతో అప్రమత్తమైన వ్యవసాయ అధికారులు కర్నూలు జిల్లాలో 19, నంద్యాల జిల్లాలో 40 ఎరువుల షాపుల లైసెన్స్లను తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. లైసెన్స్ సస్పెన్షన్లో ఉన్నప్పుడు ఎలాంటి అమ్మకాలు చేపట్టరాదు. అయినప్పటికీ డీలర్లు యథావిధిగా అమ్మకాలు సాగిస్తుండటం అధికారులకు చిత్తశుద్ధికి అద్దం పడుతోంది.యూరియాకు లింక్ పెడుతున్న పనికిరాని ఎరువులు ఇవే కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ ఆరంభానికి ముందే యూరియా కొరత ఆందోళన కలిగిస్తోంది. మార్చి నుంచి మే నెల వరకు వ్యవసాయం అంతంతమాత్రంగానే ఉంటుంది. బావులు, బోర్ల కింద అక్కడక్కడ వేరుశనగతో పాటు కూరగాయల పంటలు సాగు చేయడం పరిపాటి. కొన్ని ప్రాంతాల్లో బోర్ల కింద పత్తి కూడా సాగవుతోంది. అయితే యూరియా అమ్మకాలు మాత్రం విపరీతంగా పెరిగిపోయాయి. కర్నూలు, నంద్యాల, ఆదోని ర్యాక్ పాయింట్లకు వచ్చే యూరియా, డీఏపీ, ఇతర ఎరువులను 50 శాతం మార్క్ఫెడ్కు, మరో 50 శాతం ప్రయివేటు డీలర్లకు ఇస్తున్నారు. మార్క్ఫెడ్కు ఇచ్చిన యూరియా బఫర్లో ఉండగా.. ప్రయివేటు డీలర్లు యూరియాతో కాసుల పంట పండించుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ నేతలకు మినహా సాధారణ రైతులకు యూరియా బస్తా లభించని పరిస్థితి నెలకొంది. ఏప్రిల్లో 4,861 టన్నుల యూరియా అమ్మకాలు 2020 నుంచి 2024 వరకు పరిశీలిస్తే వేసవిలో యూరియా అమ్మకాలు అతి తక్కువగా ఉన్నాయి. ఉమ్మడి జిల్లా మొత్తం మీద 1000 టన్నుల వరకే అమ్మకాలు జరిగాయి. 2025 నుంచి వేసవిలో యూరియా అమ్మకాలకు రెక్కకొచ్చాయి. చంద్రబాబు ప్రభుత్వానికి ప్లానింగ్ లేకపోవడం, డిమాండ్ను అంచనా వేయడంలో విఫలమవడం, డిమాండ్కు తగ్గట్టు సరఫరా చేయడంలో చేతులెత్తేయడంతో ఉన్న యూరియా బంగారం అవుతోంది. వేసవిలో వచ్చిన యూరియాను వచ్చినట్లు డిమాండ్ బాగా ఉన్న ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకున్నట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో ఏప్రిల్ నెలలో 2161 టన్నులు, నంద్యాల జిల్లాలో 2700 టన్నుల యూరియా అమ్మకాలు జరిగినట్లు స్పష్టమవుతోంది. ఉమ్మడి జిల్లా మొత్తంగా వేసవిలో 3వేల హెక్టార్లలో కూడా పంటలు లేవు. అయితే ఒక్క ఏప్రిల్ నెలలోనే ఉమ్మడి జిల్లాలో 4,861 టన్నుల యూరియా అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో అమ్మకాలు.. ఏప్రిల్, మే నెలల్లో నమోదు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం యూరియా బయోమెట్రిక్ ద్వారా ఆన్లైన్లోనే విక్రయించాలి. ఏ రోజుకారోజు జరిగిన అమ్మకాలను ఈ–పాస్ మిషన్లో నమోదు చేసి బయోమెట్రిక్ వేయాలి. జిల్లాలో మాత్రం ఫిబ్రవరి నెలలో యూరియా అమ్మకాలు జరిగితే ఏప్రిల్ నెలలో ఈ–పాస్ మిషన్లో నమోదు చేయడం గమనార్హం. అన్నీ సర్దుబాటు చేసుకున్న తర్వాత ఈ–పాస్లోకి ఎక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన జిల్లా కలెక్టర్, జేసీలే ఆశ్చర్యపోయినట్లు సమాచారం. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించినప్పటికీ జిల్లా వ్యవసాయ యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తుండటం గమనార్హం. ఇతర ఉత్పత్తులు తీసుకుంటేనే యూరియా ప్రయివేటు డీలర్లు యూరియాతో కాసుల పంట పండించుకుంటున్నారు. యూరియా బస్తా ధర రూ.266 మాత్రమే. డిమాండ్ పెరగడంతో బ్లాక్లో కొనడానికి కూడా రైతులు సిద్ధంగా ఉన్నారు. అయితే కొందరు డీలర్లు ఇతర ఉత్పత్తులను లింక్ పెట్టి అడ్డగోలుగా అమ్మకాలు సాగిస్తున్నారు. పంటకు ఏ మాత్రం ఉపయోగపడని వాటిని బస్తా రూ.1,500 ప్రకారం అంటగడుతూ యూరియాను మాత్రం ఎంఆర్పీ కంటే తక్కువకే ఇస్తుండటం గమనార్హం. ఈ బాగోతం కౌతాళం, ఎమ్మిగనూరు, హొళగుంద, ఆదోని, గూడూరు తదితర ప్రాంతాల్లో అధికంగా సాగుతోంది. సీ్త్ర శక్తి, భూశక్తి, గ్రోశక్తి పేర్లతో ఇతర ఉత్పత్తులను లింక్ పెట్టి డీలర్లు రైతులను దోచుకుంటున్నారు. దారి మళ్లిన యూరియాగత ఏడాది కౌతాళం, హొళగుంద, ఎమ్మిగనూరు తదితర మండలాల నుంచి యూరియా కర్ణాటకకు తరలినట్లు విమర్శలు ఉన్నాయి. ఆలూరు నియోజకవర్గంలోని ఓ మండలానికి కేటాయించిన యూరియా కర్ణాటకకు మళ్లిందని ఏకంగా గవర్నర్కే ఫిర్యాదు వెల్లింది. దీనిపై ఇప్పటికీ విచారణ సాగుతోంది. ఈ సారి ముందస్తుగానే వేసవిలో వచ్చిన యూరియాను దారి మళ్లిచినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మూడు, నాలుగేళ్లతో పోలిస్తే ఈ సారి వేసవిలో భారీగా యూరియా అమ్మకాలు పెరగడంపై కలెక్టర్, జేసీలు విచారణ జరుపుతుంటే.. వ్యవసాయ యంత్రాంగం మాత్రం వేసవిలో బోర్ల కింద సాగు పెరిగిందని నమ్మించే ప్రయత్నాలు చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒక్క బస్తా దొరికితే ఒట్టు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు కర్నూలు జిల్లాకు సంబంధించి 45,599 టన్నుల యూరియా జిల్లాకు రావాల్సి ఉంది. ఇప్పటి వరకు 22,916 టన్నుల యూరియా వచ్చింది. ఇందులో సహకార సంఘాలు, రైతు సేవా కేంద్రాలు, మార్క్ఫెడ్ గోదాములు, రీటైల్/హోల్సేల్ డీలర్లు, కంపెనీ గోదాముల్లో రైతులకు 17,530 టన్నుల యూరియా అందుబాటులో ఉందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. అయితే మార్కెట్లో మాత్రం యూరియా దొరకని పరిస్థితి. ఇదిలాఉంటే నంద్యాల జిల్లాలో 27వేల టన్నుల యూరియా ఉందని అధికారులు చెబుతున్నా.. పీఏసీఎస్లు, రైతుసేవా కేంద్రాలు, డీసీఎంఎస్ల్లో బస్తా యూరియా కూడా కనిపించకపోవడం గమనార్హం. -
మురళి నా జీవితాన్ని నాశనం చేశాడు..!
కర్నూలు: మండల పరిధిలోని సూగూరు గ్రామానికి చెందిన ఓ యువతి, అదే గ్రామానికి చెందిన కురువ మురళి నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నారు. ప్రియుడి మాటలను నమ్మి శారీరకంగా ఒక్కటయ్యారు. అయితే పెళ్లి చేసుకుంటానని నమ్మించి నట్టేట ముంచాడు. రెండు పర్యాయాలు గర్భం దాల్చగా మందు బిల్లలు వేయించి గర్భస్రావం చేయించినట్లు బాధితురాలు వాపోతోంది. ఎలాగో పెద్దలను ఒప్పిస్తాడని ఎంతో నమ్ముకుంది. చివరకు ప్రియుడు తమ ప్రేమను కాదనుకున్నాడు. మోజు తీరాక కులం అడ్డుపెట్టుకుని ఉడాయించాడు. దీంతో ఇటీవల ఆ యువతి ప్రియుడి ఇంటి ముందు మౌన దీక్ష చేపట్టింది. అప్పటికే ఇంటికి తాళాలు వేసుకుని ఉడాయించడంతో బాధితురాలి కుటుంబ సభ్యులు మంత్రాలయం పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. అక్కడకు చేరుకోగానే కొందరు పెద్దలు బాధితులను ఏమార్చారు. బాధితురాలికి న్యాయం చేస్తామంటూ ఊరికి తీసుకొచ్చారు. వంచన విలువ రూ.15 లక్షలు ప్రేమ పెళ్లికి అక్షింతలు వేయాల్సిన పెద్దలు వంచనకు విలువ కడుతూ పంచాయితీ చేపట్టారు. రూ.15 లక్షలు ఇచ్చేందుకు రాజీ కుదిర్చారు. ఇప్పటికే ప్రియుడి కుటుంబ సభ్యులు రూ.4 లక్షలు ముట్టజెప్పినట్లు తెలిసింది. ఇందులో తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు వాటాలు కూడా ఉన్నట్లు సమాచారం. అయిననూ బాధితురాలు తనను మోసగించిన మురళితోనే వివాహం చేయాలని పట్టుబట్టినట్లు సమాచారం. కాగా ప్రియుడు మురళి గ్రామానికి ఆరు నెలలు దూరంగా ఉండాలని నిర్ణయించారు. బాధితురాలు ఒప్పుకుంటే మిగిలిన కాస్త బ్యాలెన్స్ చేతిలో పెట్టి చేతులు దులుపుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులోనూ కొందరు అధికారులు అతి తెలివి ప్రదర్శించారు. బాధితురాలితో తనకు మురళితో ఎలాంటి సంబంధం లేదన్నట్లు సంతకాలు పెట్టించారు. బాధితురాలు తిరగబడకుండా పెద్దల సమక్షంలో సంకెళ్లు వేసుకునేలా చేయడం గమనార్హం. బలమైనా పోక్సో చట్టాలు ఉన్న నేపథ్యంలోనూ ఇలాంటి పంచాయితీలు చోటు చేసుకోవడం దారుణం. -
ఎస్ఎస్సీ బోర్డు నిర్లక్ష్యం
బేతంచెర్ల: ఎస్ఎస్సీ బోర్డు నిర్లక్ష్యం మరో సారి వెలుగులోకి వచ్చింది. ఇష్టానుసారంగా జవాబు పత్రాలు మూల్యాంకనం చేయడంతో విద్యార్థుల మార్కులు తలకిందులయ్యాయి. కనీసం రాసిన జవాబులు కూడా మూల్యాంకనం చేయకపోవడం వాల్యూయేషన్ జరిగిన తీరుకు అద్దంపడుతోంది. మరి కొందరికి వచ్చిన మార్కులు కూడా కలపలేదు. తమకు మార్కులు తక్కువ వచ్చాయని రీవాల్యూయేషన్, రీ వెరిఫికేషన్కు పలువురు విద్యార్థులు వెళ్లడంతో బోర్డు వైఫల్యం బహిర్గతమైంది. చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉండడంతో బోర్డు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇంకెంత మంది బాధితులు ఉన్నారో అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాధానాలు రాసినా.. వదిలేశారు.. నంద్యాల జిల్లా బేతంచెర్ల పట్టణానికి చెందిన కె.వసుప్రజ్వల (హాల్ టికెట్ నెం.2622123572)కు పదోతరగతి ఫలితాల్లో సోషల్లో 100, గణితం 100, సైన్స్లో 92, తెలుగు 92, హిందీలో 94 మార్కులు రాగా.. ఇంగ్లి‹Ùలో 65 మార్కులే రావడంతో అనుమానం వచ్చింది. దీంతో రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేయగా ఏకంగా 11 మార్కులు పెరిగి 76 మార్కులు నమోదయ్యాయి. అనంతరం ఆన్సర్ షీట్ను పరిశీలించగా 36, 37 ప్రశ్నలకు సమాధానాలు రాసినా దిద్దకుండా వదిలేసినట్లు గుర్తించారు. రీవాల్యుయేషనలో 11 మార్కులు పెరగడం ఎస్ఎస్సీ బోర్డు అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. మిగిలిన రెండు ప్రశ్నలకు కూడా మార్కులు కేటాయిస్తే తమ కుమార్తెకు మరిన్ని మార్కులు వచ్చే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు వాపోతున్నారు.12 మార్కులకు గానూ.. 7 డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం ఆదుర్రు గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్థి పెదపూడి సంజయ్ స్వరూప్నకు 558 మార్కులు వచ్చాయి. ఫిజిక్స్ పేపర్ రీ వెరిఫికేషన్కు దరఖాస్తు చేయగా పేపర్ పీడీఎఫ్ ఫైల్ పంపించారు. అందులో 13వ ప్రశ్నకు 4, 17వ ప్రశ్నకు 8 కలిపి మొత్తం 12 మార్కులు వచ్చాయి. కానీ, టోటల్లో 7 మార్కులు మాత్రమే వేశారు. ఈ విద్యార్థికి 5 మార్కులు కలపాల్సి ఉంది. దీని కోసం విద్యార్థి సంజయ్ స్వరూప్ ఎస్ఎస్సీ బోర్డుకు దరఖాస్తు చేసుకున్నాడు. -
కర్నూలు డీఎస్పీకి పదోన్నతి
కర్నూలు: కర్నూలు డీఎస్పీ జె.బాబుప్రసాద్కు అడిషనల్ ఎస్పీగా పదోన్నతి లభించింది. ఏపీలో 20 మంది అడిషనల్ ఎస్పీలకు ఎస్పీలుగా, 41 మంది డీఎస్పీలకు అడిషనల్ ఎస్పీలు గా పదోన్నతి కల్పిస్తూ ప్రిన్సిపల్ సెక్రెటరీ కుమార్ విశ్వజిత్ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్కు కూడా పదోన్నతి కల్పించి పోలీస్ హెడ్ క్వాటర్స్ మంగళగిరిలో రిపోర్ట్ చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కడప జిల్లాకు చెందిన బాబుప్రసాద్ 1991లో ఎస్ఐ హోదాలో పోలీసు శాఖలో చేరారు. 2004లో సీఐగా, 2014లో డీఎస్పీగా పదోన్నతి పొందారు. కర్నూలు స్పెషల్ బ్రాంచ్, నెల్లూరు జిల్లా గూడూరు, చిత్తూరు జిల్లా దిశ పోలీస్స్టేషన్లలో పనిచేశారు. 2024 ఫిబ్రవరిలో కర్నూలు మహిళా పీఎస్ డీఎస్పీగా బదిలీపై వచ్చి కొంతకాలం పనిచేశారు. 2024 ఆగస్టు 5న కర్నూలు డీఎస్పీగా బాధ్యతలు చేపట్టి 22 నెలల పాటు సేవలందించారు. -
ఆడపిల్ల అని తెలియగానే అబార్షన్
కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో యథేచ్ఛగా స్కానింగ్ కేంద్రాల్లో గర్భస్థ లింగనిర్ధారణ చేస్తున్నా చర్యలు ఉండటం లేదు. డెకాయిట్ ఆపరేషన్ చేసి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కార్యాలయం కదలడం లేదు. కొందరు కదిలినా స్కానింగ్ కేంద్రాల వైద్యులు, నిర్వాహకులు ఇచ్చే సొమ్ముతో చర్యలు తీసుకోకుండా తిరిగి వచ్చేస్తున్నారు. గత పదిహేనేళ్లుగా జిల్లాలో ఒక్క స్కానింగ్ కేంద్రం కూడా చర్యలు తీసుకోలేదంటే అతిశయోక్తి కాదు. 2024 ఏప్రిల్లో వైద్యుల బృందం 40 స్కానింగ్ కేంద్రాల పరిశీలనకు వెళ్లి అక్కడి రికార్డులు, రిపోర్టులు, మిషన్లు, వైద్యుల వివరాలు, గర్భిణుల వివరాలు పరిశీలించింది. అయితే అన్ని చోట్లా సక్రమంగా ఉన్నాయని నివేదికలు ఇవ్వడం విశేషం. కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్లో రెండు, కొత్తబస్టాండ్ వద్ద నాలుగు, ఎన్ఆర్ పేటలో రెండు, కోడుమూరు, గూడూరులోని ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాల్లో గర్భస్థ శిశువు లింగనిర్ధారణ, అబార్షన్లు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆర్ఎంపీలే సూత్రధారులు జిల్లాలోని ఆదోని, పత్తికొండ, కోసిగి, పెద్దతుంబళం, పత్తికొండ, క్రిష్ణగిరి, డోన్, మంత్రాలయం, గోనెగండ్ల, కౌతాళం నుంచి అనేక మంది గర్భిణులు స్కానింగ్, అబార్షన్ల కోసం ఆసుపత్రులకు వస్తున్నారు. ఇలాంటి వారిని స్థానిక ఆర్ఎంపీలు దగ్గరుండి మరీ ప్రత్యేక ఆసుపత్రులను తీసుకొచ్చి స్కానింగ్, ఆపై అబార్షన్లు చేయిస్తున్నారు. లింగనిర్ధారణ చేయాలంటే రూ.5వేలు, ఆపై అబార్షన్ చేయాలంటే రూ.20వేల నుంచి రూ.30వేలు వసూలు చేస్తున్నారు. గర్భిణిని తీసుకొచ్చిన వైద్యులకు 30 నుంచి 40 శాతం వరకు కమీషన్లు ముట్టజెబుతున్నారు. నిరక్షరాస్యత, పేదరికమే శాపం ఆడపిల్లల సంఖ్య తక్కువగా ఉన్న జిల్లాల్లో కర్నూలు ముందుంటుంది. దీనికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి. ఈ జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలోని ప్రజలు అధికంగా నిరక్షరాస్యులు, పేదలు కావడమే. పశ్చిమ ప్రాంతంలోని పల్లెల్లోని ప్రజలు అధికంగా స్థానికంగా పనులు లేక వలసలు వెళ్తున్నారు. ఇలా వెళ్లే సమయంలో ఎదిగిన ఆడపిల్లలను ఇంటి వద్ద వదిలేయలేక వారు రజస్వల కాగానే టీనేజీలోనే వివాహం చేసేస్తున్నారు. ఈ కారణంగానే టీనేజీ గర్భిణుల సంఖ్య సైతం జిల్లాలో అధికంగా ఉంటోంది. నిర్లక్షరాస్యత కారణంగా ఆడపిల్లలకు రక్షణ ఉండదని, ఎక్కువగా ఆడపిల్లలను కనకూడదని, కంటే అత్తామామలతో ఇబ్బంది అనే భయంతో చాలా మంది కడుపులో ఉన్నది ఆడబిడ్డ అని తెలియగానే అబార్షన్ చేయిస్తున్నారు. చట్టం ఉన్నా చెత్తబుట్టలోకే! అబార్షన్(భ్రూణహత్యలు) నివారణకు కేంద్ర ప్రభుత్వం 1994లో ఏపీ పీసీ పీఎన్డీటీ అనే పటిష్టమైన చట్టం చేసింది. స్కానింగ్ కేంద్రాల్లో లింగనిర్ధారణ చేసినా, అబార్షన్లు చేసినా ఈ చట్టం ప్రకారం ఇరువర్గాలను శిక్షార్షులు అవుతారు. మొదటిసారి తప్పు చేస్తే మూడేళ్లు జైలు, రూ.10వేల జరిమానా, రెండోసారి తప్పు చేస్తే ఐదేళ్లు జైలు, రూ.50వేల జరిమానా విధిస్తారు. స్కానింగ్ కేంద్రం, అబార్షన్ చేసిన సదరు వైద్యుల పేరును భారత వైద్యవిధాన మండలి నుంచి తాత్కాలికంగా, కొన్నిసార్లు శాశ్వతంగా తొలగిస్తారు. అయితే జిల్లాలో ఈ చట్టం ప్రకారం ఒక్కరిపై కూడా కేసు నమోదుకాకపోవడం గమనార్హం. ఈ చట్టం గురించి ఆయా స్కానింగ్ కేంద్రాల్లో ప్రకటనలు ప్రచురించి ఉంటాయి గానీ కొన్ని కేంద్రాల్లో ఉల్లంఘనలు జరుగుతున్నాయి. లింగనిర్ధారణ చేసే కేంద్రాలపై దృష్టి పెట్టనున్నాం. వాటిపై త్వరలో దాడులు ముమ్మరం చేయనున్నాం. ఆయా స్కానింగ్ కేంద్రాల గురించి ఎవ్వరైనా ఫిర్యాదు చేస్తే వారి పేరు, వివరాలు బహిర్గతం కాకుండా చేసి, సదరు స్కానింగ్ కేంద్రంపై దాడులు చేస్తాం. ఇకపై రెగ్యులర్గా ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాలపై దాడులు ముమ్మరం చేస్తాం. లింగనిర్ధారణ, అబార్షన్లు చేసే ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటాం. –డాక్టర్ వై.కామేశ్వరప్రసాద్, డీఎంహెచ్వో, కర్నూలు సంతానం లేక ఎంతో మంది డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు. దేవాలయాలకు, ప్రార్థనా మందిరాలకు వెళ్లి తమ ఇష్ట దైవానికి మొక్కుకుంటున్నారు. కొందరికి ఏడాదికి, మరికొందరి రెండు, మూడేళ్లకు బిడ్డ జన్మిస్తే ఇంకొందరికి పది, పదిహేనేళ్లయినా సంతానం కలగని పరిస్థితి. అయితే కొందరు కడుపులో బిడ్డ పడగానే అందులో ఉన్నది ఆడబిడ్డ అని తెలియగానే నిర్దాక్షిణ్యంగా కడుపులోనే చిదిమేస్తున్నారు. ఫలితంగా జిల్లాలో ఆడపిల్లల శాతం గణనీయంగా పడిపోతోంది. గర్భంలోనే తుదముట్టిస్తున్నారు జిల్లాలో యథేచ్చగా భ్రూణ హత్యలు అధికమైన అబార్షన్లు స్కానింగ్ సెంటర్లపై నిఘా శూన్యం తూతూ మంత్రంగా తనిఖీలు జిల్లాలో 260 అల్ట్రాసౌండ్ స్కానింగ్ కేంద్రాలు ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. అనధికారికంగా ఈ సంఖ్య మరో 40 నుంచి 50 వరకు ఉండే అవకాశం ఉంది. వీటికి జిల్లా కమిటీ పరిశీలించి అనుమతులు జారీ చేయాల్సి ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గర్భిణులకు స్కానింగ్ చేసి చాలా కేంద్రాల్లో గర్భస్థ శిశువు ఆరోగ్యం గురించి వివరిస్తున్నారు. అయితే ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న కొందరు మాత్రం గర్భంలో ఉన్నది ఎవరో నిర్భయంగా చెప్పేస్తున్నారు. ఇందుకోసం గర్భిణుల నుంచి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ప్రధానంగా కర్నూలు నగరంతో పాటు ఎమ్మిగనూరు, ఆదోని, కోడుమూరు, గూడూరులలోని కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబ్లలో ఇలాంటి స్కానింగ్ కేంద్రాలు ఉన్నాయి. వైద్యులు చెప్పిన దానిని బట్టి గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తెలియగానే కొందరు అబార్షన్ చేయించుకుంటూ కనబోయే బిడ్డను కడుపులోనే చంపేస్తున్నారు. ఇలా అబార్షన్ చేసిన గర్భస్థ శిశువును పూడ్చి పెట్టకుండా చెత్తకుప్పల్లో కొందరు పారేస్తున్నారు. ఇలా పారేసిన మృతశిశువులను కుక్కలు తింటూ ఉన్న దృశ్యాలు అప్పుడప్పుడూ జిల్లాలో కనిపిస్తూ ఆందోళనకు గురిచేస్తున్నాయి. -
ఓటరు మ్యాపింగ్ పకడ్బందీగా నిర్వహించాలి
కర్నూలు(సెంట్రల్): స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)కు సంబంధించి ఓటరు మ్యాపింగ్ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. బుధవారం నగరంలోని వన్టౌన్లోని మాసుంబాషా దర్గా, బుధవారపేటలో జరుగుతున్న ఓటరు మ్యాపింగ్ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎక్కడా తప్పులు జరగకుండా మ్యాపింగ్ నిర్వహించాలన్నారు. అర్హులందరికీ ఓటు హక్కు కల్పించడంతోపాటు అనర్హులను జాబితాను తొలగించడమే లక్ష్యమన్నారు. కుటుంబ సభ్యులందరినీ ఒకే పోలింగ్ బూత్లో మ్యాపింగ్ చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ దామోదరం సంజీవయ్య స్మారక నగరపాలక ఉన్నత పాఠశాలలోని 142, 143, 144, 145, 146, 147 పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ వివరాలను తెలుసుకున్నారు. కర్నూలు నియోజకవర్గ ఎన్నికల అధికారి, మునిసిపల్ కమిషనర్ చల్లా ఓబులేషు, ఏఈఆర్ఓ కర్నూలు అర్బన్ తహసీల్దార్ డి.రవికుమార్, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ మురళీ, ఎన్నికల డెప్యూటీ తహసీల్దార్ ధనుంజయ పాల్గొన్నారు. -
జిల్లాలో కట్టుదిట్టమైన భద్రత
ఆదోని అర్బన్: గోవుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు జిల్లావ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. బుధవారం ఆయన పట్టణ శివారు ఆలూరు రోడ్డులోని చెక్పోస్టును, సిరుగుప్ప జంక్షన్ ప్రధాన చెక్ పోస్టులను పరిశీలించారు. పట్టణంలో బందోబస్తు ఏర్పాట్లపై పోలీసు అధికారులతో త్రీటౌన్ పోలీస్స్టేషన్లో సమీక్ష నిర్వహించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఆదోని, కర్నూలు, ఎమ్మిగనూరు, గూడూరు, పత్తికొండ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోందన్నారు. కర్నూలు పట్టణ శివారులో 8 చెక్ పోస్టులు, ఆదోని పట్టణ శివారులో 4 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు నిరంతర తనిఖీలు చేపడుతున్నారన్నారు. గోవుల అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఎస్పీ వెంట ఆదోని ఇన్చార్జి డీఎస్పీ భార్గవి, స్పెషల్ బ్రాంచ్ సీఐ మధుసూదన్రావు, పట్టణ సీఐలు చంద్రశేఖర్, రాజశేఖర్రెడ్డి, రామలింగమయ్య, ఎస్ఐలు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
మంత్రి భరత్కు తండ్రి టీజీతో విభేదాలు
కర్నూలు(టౌన్): మంత్రి టీజీ భరత్కు, పెద్దాయన టీజీ వెంకటేష్ మధ్య విభేదాలు, గొడవలు ఉన్నట్లు ఐ టీడీపీ జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్ తనతో చెప్పినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు నగర అధ్యక్షులు అహమ్మద్ అలీఖాన్ అన్నారు. బుధవారం స్థానిక అబ్దుల్లాఖాన్ ఎస్టేట్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత రెండు రోజులుగా తనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోందన్నారు. ఐ టీడీపీ జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్, తనకు మధ్య జరిగిన సంభాషణలో కొంత భాగాన్ని వాయిస్ మార్చి ట్రోల్ చేస్తున్నారన్నారు. ఇటీవల మహానాడుకు మంత్రి టీజీ భరత్ డబ్బులు ఇవ్వలేదని.. గట్టు తిలక్ అడిగితే తానే పంపించానన్నారు. చాలాసార్లు ఇలా చేశానన్నారు. భరత్ తన మాట వినడం లేదని పెద్దాయన బాధ పడుతున్నట్లు కూడా తెలిపాడన్నారు. ఇలాంటి వాయిస్లు, వీడియోలు బయటపెడితే బాగుంటుందన్నారు. ఐ టీడీపీకి చెందిన జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్ నుంచి మిస్డ్ కాల్ రావడంతో ఫోన్ చేసి క్షేమ సమాచారాలు మాత్రమే తెలుసుకున్నానన్నారు. అయితే ట్రోల్ చేస్తున్న మిగతా వాయిస్ తనది కాదన్నారు. గట్టు తిలక్, తనకు మధ్య జరిగిన సంభాషణపై పరువునష్టం కేసు వేసినా ఆ డబ్బులు కూడా తానే ఇవ్వాల్సి వస్తుందన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు చోటు, ముస్తఫా, అబ్దుల్ మాలిక్, షోయబ్, రెహమాన్ ఖాన్ పాల్గొన్నారు. దమ్ముంటే ఈ వాయిస్ విడుదల చేయండి నా వాయిస్ మార్చి ట్రోల్ చేస్తున్నారు వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ కర్నూలు నగర అధ్యక్షుడు అహమ్మద్ అలీఖాన్ -
న్యాయ వ్యవస్థలో న్యాయవాది కీలకం
నంద్యాల(వ్యవసాయం): న్యాయ వ్యవస్థలో న్యాయవాది కీలక స్తంభమని హైకోర్టు న్యాయమూర్తి ఏ.హరిహరనాథశర్మ అన్నారు. బుధవారం స్థానిక రామకృష్ణ పీజీ కళాశాలలో నంద్యాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులకు సెమినార్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హైకోర్టు న్యాయమూర్తి మాట్లాడుతూ.. కోర్టుల్లో డిజిటల్ ఫైలింగ్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసుల విచారణ వేగవంతం చేయవచ్చన్నారు. లోక్ అదాలత్, మధ్యవర్తిత్వం, కోర్టు వెలుపల రాజీద్వారా కేసులను త్వరగా పరిష్కరించుకోవచ్చన్నారు. ప్రతి కేసుకు టైమ్లైన్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. న్యాయవాది కోర్టులో చట్టపరంగా బలమైన వాదనలు వినిపించాలని, చట్టం ప్రకారం ఏది సరైనదో క్లయింట్కు వివరించాలన్నారు. నిజాన్ని వెలికి తీయడంలో కోర్టుకు సహకరించాలని, అబద్ధం చెప్పకూడదన్నారు. పేదలకు, సమాజానికి సంబంధించిన కేసులను ఉచితంగా వాదించాలన్నారు. సకాలంలో న్యాయం అందాలంటే సాంకేతికతను వాడుకోవాలని, వాయిదాల సంస్కృతిని తగ్గించడానికి ప్రతి న్యాయవాది సహకరించాలన్నారు. అనంతరం సీనియర్, జూనియర్ న్యాయవాదులు అడిగిన సమస్యలకు పరిష్కార మార్గాలను తెలియజేశారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైకోర్టు జడ్జిని సత్కరించారు. నంద్యాల మూడో అదనపు జిల్లా జడ్జి అమ్మన్నరాజ, రామసుబ్బయ్య, అడ్డగాళ్ల వెంకటేశ్వర్లు, జీవీఎన్ ప్రసాద్, ప్రతాపరెడ్డి, గౌరీశంకర్, రామచంద్రారావు, శివశంకర్రెడ్డి, వివేకానందరెడ్డి తిమ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చదువుకునే ఖైదీలకు గ్రంథాలయం
పత్తికొండ: చదువుకునే ఖైదీల కోసం పత్తికొండ సబ్జైలులో గ్రంథాలయం ఏర్పాటు చేసినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి తెలిపారు. స్థానిక సబ్జైలును బుధవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రిమాండ్లో ఉన్న ముద్దాయిలతో మాట్లాడారు. రిమాండ్లో ఉండి, న్యాయవాదిని నియమించుకునే అర్థిక స్తోమత లేనివారికి న్యాయ సేవాధికార సంస్థ అధ్వర్యంలో ఉచితంగా న్యాయసేవలు అందిస్తామని తెలిపారు. ఖైదీలపై సిబ్బంది మానవత్వంతో ప్రవర్తించాలని సూచించారు. కోర్టు సిబ్బంది రాజశేఖర్, రాఘవేంద్ర, ప్రభుత్వ వైద్యుడు సత్యనారాయణ, న్యాయవాదులు సూరజ్నబీ, హరికృష్ణా ఆచారి తదితరులు పాల్గొన్నారు. 5వేల ఎకరాల్లో పండ్లతోటల అభివృద్ధి లక్ష్యం కర్నూలు(అగ్రికల్చర్): 2026–27 సంవత్సరంలో వీబీ జి రామ్ జి కింద 5వేల ఎకరాల్లో పండ్లతోటల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ నరసింహారెడ్డి తెలిపారు. చిన్న, సన్నకారు రైతులకు సుస్థిర ఆస్తులు కల్పించాలనే లక్ష్యంతో 100 శాతం సబ్సిడీతో పండ్లతోటల సాగుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ జాబ్కార్డు కలిగి ఐదు ఎకరాల్లోపు భూములున్న సన్న, చిన్నకారు రైతులందరూ అర్హులేనన్నారు. ఆసక్తి కలిగిన రైతులు సంబంధిత పీల్డ్ అసిస్టెంట్ లేదా సాంకేతిక సహాయకులు, ఏపీవో, ఎంపీడీవోలను సంప్రదించవచ్చన్నారు. 17 మండలాల్లో వర్షాలు ● మంత్రాలయంలో 48.2 మి.మీ వర్షపాతం కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలోని వివిధ మండలాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. బుధవారం ఉదయం 4 గంటల నుంచి ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. ఉదయం 11 గంటల వరకు జల్లులు పడ్డాయి. 17 మండలాల్లో వర్షపాతం నమోదైంది. మంత్రాలయంలో అత్యధికంగా 48.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఆదోనిలో 36.2, సి.బెళగల్లో 31.2, ఎమ్మిగనూరులో 30.2, కౌతాళంలో 26.8, పెద్దకడుబూరులో 24.8, కోసిగిలో 20.6, నందవరంలో 16.8, గోనెగండ్లలో 15.4 మి.మీ ప్రకారం వర్షాలు కురిశాయి. జిల్లా మొత్తంగా సగటున 11 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ నెల 26 వరకు ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. తాజాగా పలు మండలాల్లో వర్షాలు పడటంతో వాతావరణం చల్లబడింది. ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల లోపే నమోదయ్యాయి. ఆదోనిలో 28.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎంఐడీహెచ్ కింద జిల్లాకు రూ.11.40 కోట్లు ● ఆర్కేవీవై కింద రూ.1.09 కోట్లు కేటాయింపు కర్నూలు(అగ్రికల్చర్): ఉద్యాన సమగ్ర అభివృద్ధి మిషన్(ఎంఐడీహెచ్) కింద జిల్లాకు ప్రభుత్వం రూ.11.40 కోట్లు కేటాయించినట్లు జిల్లా ఉద్యాన అధికారి రాజాకృష్ణారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త తోటల విస్తరణకు అర్హులైన రైతుల ఎంపిక జరుగుతోందన్నారు. అదేవిధంగా రాష్ట్రీయ కృషి వికాస్ యోజన(ఆర్కేవీవై) కింద రూ.1.09 కోట్లు మంజూరయ్యాయన్నారు. జిల్లాలో శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన 13 మండలాల్లో 327.63 హెక్టార్లలో 100 శాతం సబ్సిడీతో ఆయిల్పామ్ మొక్కలు అందించామన్నారు. సాగు, నిర్వహణ, అంతర పంటల సాగుకు నాలుగేళ్ల పాటు హెక్టారుకు 50 శాతం రాయితీపై రూ.5,250 అందిస్తామన్నారు. డీసీసీబీ సీఈఓ పోస్టు నుంచి తప్పుకున్న శివలీల ● జనరల్ మేనేజర్ రామాంజనేయులుకు ఇన్చార్జి బాధ్యతలు కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈఓ)గా పనిచేస్తున్న శివలీల ఆ బాధ్యతల నుంచి వైదొలిగారు. వ్యక్తిగత కారణాలతో ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు చైర్మన్ డి.విష్ణువర్ధన్రెడ్డికి మంగళవారం ఆమె రాతపూర్వకంగా రాసిచ్చారు. శివలీల సీఈఓగా మార్చి మొదటి వారంలో బాధ్యతలు స్వీకరించారు. తర్వాత 20 రోజుల పాటు సెలవుల్లో ఉన్నారు. సెలవుల నుంచి తిరిగి వచ్చిన తర్వాత సీఇవో పోస్టును వ్యక్తిగత కారణాలతో వదులుకుంటున్నట్లు చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈమె వినతిని చైర్మన్ ఆమోదించారు. వెంటనే డీసీసీబీలో జనరల్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న పి.రామాంజనేయులును ఇన్చార్జి సీఈఓగా నియమించారు. సీఈఓ పోస్టు నుంచి తప్పుకున్న శివలీల జనరల్ మేనేజర్గా కొనసాగనున్నారు. -
కూటమి సర్కారు విద్యారంగానికి చేసింది శూన్యం
కర్నూలు(సెంట్రల్) : కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన రెండేళ్లైనా విద్యారంగానికి చేసిన మేలు శూన్య మని సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి.వలరాజు అన్నారు. జూలై 1 నుంచి 4వ తేదీ వరకు కర్నూలులో నిర్వహించే ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర విద్యా, వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతులకు సంబంధించిన పోస్టర్లను బుధవారం సీఆర్ భవన్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి విద్యార్థుల్లో సమస్యలపై పోరాట పటిమ తగ్గిపోతుందన్నారు. అందువల్ల అఖిల భారత విద్యార్థి సమాఖ్య నాయకులు విద్యా, వైజ్ఞానిక రాజకీయ శిక్ష ణ తరగతులను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో జీఓ నంబర్ 77ను రద్దు చేస్తామని మంత్రిలోకేష్ చెప్పి ఇప్పటి వరకు చేయలేదన్నారు. ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు ఇంత వరకు విద్యార్థుల ఖాతాల్లో జమ కాలేదన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సోమన్న, షాబీర్బాషా పాల్గొన్నారు. -
జవాబుదారీతనంతో అర్జీల పరిష్కారం
తుగ్గలి: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలను అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో పరిష్కరించాలని జేసీ నూరుల్ఖమర్ ఆదేశించారు. బుధవారం మండలంలోని జొన్నగిరి జడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ప్రత్యేక ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఆర్డీఓ ఓబులేసుతో కలిసి జొన్నగిరి, జీ.ఎర్రగుడి, పగిడిరాయి రెవెన్యూ గ్రామాల ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జేసీ మాట్లాడుతూ అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి నిర్దిష్ట గడువులోపు పరిష్కరించాలన్నారు. క్షేత్రస్థాయి అధికారులను సమన్వయం చేసుకుని పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ, భూ సమస్యలకు సంబంధించి 30 అర్జీలు, ఇతర సమస్యలపై 4 అర్జీలు వచ్చాయన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రవి, ఎంపీడీఓ విశ్వమోహన్, డీటీ సుదర్శన్, రీ సర్వే డీటీ మధుమతి, ఆర్ఐ వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు. -
కోలాటం... ‘తరుణీ’యం
ఆధ్యాత్మికతకు.. శారీరక దృఢత్వానికి ప్రతీకగా నిలిచే మన సంప్రదాయ జానపద కళ ‘కోలాటం’ మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటోంది. రెండు కర్రలు తాకడంతో శ్రావ్యంగా వినిపించే శబ్దం, లయబద్ధంగా సాగే నృత్యంతో అలరించే ఈ కళను నేర్చుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా నిత్యం ఇంటి పనులతో బిజీగా ఉండే గృహిణులు కోలాటం నేర్చుకోవడంపై ఆసక్తి చూపడం విశేషం. కర్నూలు కల్చరల్: పల్లెలు సంప్రదాయ కళలకు పుట్టినిల్లు. గతంలో పగటివేళ పనులతో అలసిపోయిన గ్రామీణులు రాత్రివేళల్లో భజనలు, కోలాటాల ప్రదర్శనలతో మానసికోల్లాసాన్ని పొందేవారు. నేటి ఆధునిక యుగంలో కాలక్రమేణా వచ్చిన మార్పులతో సంప్రదాయ కళలు చాలా వరకు అంతరించిపోతున్నాయి. ప్రజల్లోనూ ఎంతో మార్పు వచ్చింది. క్షణం తీరిక దొరికినా సెల్ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో సంప్రదాయ కళ సమూహ నాట్యం కోలాటంపై కొందరు మక్కువ చూపుతూ పూర్వ వైభవాన్ని తీసుకొస్తున్నారు. పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోని మహిళలు, చిన్నారులు, యువకులు కోలాటం నేర్చుకుంటున్నారు. తమ ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో జరిగే ఉత్సవాల్లో కోలాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం వేడుకలు, శుభకార్యాల్లో కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందంటే అతిశయోక్తి కాదనే చెప్పాలి. రగుకుల తిలకా రారా, నిన్నెత్తి ముద్దులాడెదరా, బుజ్జిబుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య వంటి ఆధ్యాత్మిక పాటలు, కట్ట మీద పోయే అలకల చిలక, భలే బాగుంది బాల, బాగుందమ్మా బాగుందమ్మా వంటి సంప్రదాయ జానపద పాటలతో పాటు సినిమా పాటలకు సైతం కోలాట ప్రదర్శన చేస్తున్నారు. కోలాటానికి సంబంధించి అనేక పాటలు మనస్సుకు ఉల్లాసాన్ని ఇస్తున్నాయి. ఇక ఈ పాటలకు కళాకారులు ప్రదర్శించే నృత్యం చూసేందుకు రెండు కళ్లు చాలవు అన్నట్లుగా ఉంటాయి. వయస్సుతో సంబంధం లేకుండా... ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లోని మహిళలు, ముఖ్యంగా గృహిణులు కోలాటం నేర్చుకుంటున్నారు. ఈ కళ నేర్చుకునే వారిలో పిల్లలే కాక పెద్దలు కూడా ఉంటున్నారు. వయో భేదం, హోదాలు పక్కన పెట్టి కోలాట ప్రదర్శన చేయడాన్ని విశేషంగా చెప్పవచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు సైతం పండుగలు, ఉత్సవాల్లో కోలాట ప్రదర్శనలు చేసేందుకు వెళ్తున్నారంటే ఆ ఆటపై మహిళలకు ఉన్న ఆసక్తిని తెలియజేస్తుంది. క్షణం తీరిక లేని ఈ రోజుల్లో గృహిణులు సమయం కేటాయించుకుని కోలాటం నేర్చుకుంటున్నారు. వివాహ వేడుకల్లోనూ... ప్రస్తుతం వివాహ వేడుకల్లో కూడా కోలాటం స్టేటస్ సింబల్గా మారింది. పెద్దపెద్ద హోదాల్లో ఉన్నవారు వివాహాల్లో కోలాట ప్రదర్శన ద్వారా వధూవరులను వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. ఇందుకోసం వేలాది రూపాయలు ఖర్చు చేసి ప్రత్యేకంగా కళాకారులతో కోలాట ప్రదర్శన చేయిస్తున్నారు. మరికొంతమంది వధూవరులకు సంబంధించిన బంధువులే కోలాటం వేస్తూ వారికి స్వాగతం పలుకుతున్నారు. ఒకే డ్రస్ కోడ్తో కోలాటం చేస్తున్నారు. డ్రస్ కోడ్ ఎంపికపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుండటం కోలాటంపై మహిళలకు ఉన్న మక్కువను తెలియజేస్తుంది. -
పశ్చిమబెంగాల్ వాసి ఆత్మహత్య
తుగ్గలి : మండలంలోని చెన్నంపల్లి–రామలింగాయపల్లి మధ్యనున్న రైల్వే ట్రాక్ సమీపంలో పశ్చిమబెంగాల్ వాసి అనూప్మాలిక్ (34) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డోన్ రైల్వే ఎస్ఐ బిందు మాధవి తెలిపిన వివరాల మేరకు.. రైల్వే ట్రాక్ పక్కనున్న విద్యుత్ పోల్కు గుర్తు తెలియని వ్యక్తి లుంగీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారన్న సమాచారం అందింది. ఘటనాస్థలానికి చేరుకుని మృతుడి వద్ద లభ్యమైన ఆధారాల ప్రకారం అనూప్ మాలిక్ పశ్చిమబెంగాల్వాసిగా గుర్తించాం. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. భార్య విడి పోవడంతో అనూప్ ఇక్కడి వచ్చి కూలీ పనులు చేస్తుండేవారు. ఈ క్రమంలో మనస్తాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. ఆత్మహత్య సమాచారాన్ని కుటుంబ సభ్యులు చేరవేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఉపాధి కూలీకి పాముకాటు కోవెలకుంట్ల: స్థానిక మేజర్ గ్రామ పంచాయతీకి చెందిన ఉపాధి కూలీ బుధవారం పాముకాటుకు గురైంది. కోవెలకుంట్లకు చెందిన శిరీష ఇతర కూలీలతో కలిసి పట్టణ శివారులోని గుంజలపాడు రహదారిలో ఎస్సార్బీసీలో పూడిక తొలగింపు పనులకు వెళ్లింది. పనులు చేస్తున్న సమయంలో కాల్వలోని లైనింగ్లో దాగి ఉన్న పాము కాటు వేయగా అస్వస్థతకు గురైంది. తోటి కూలీలు చికిత్స నిమిత్తం ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. పాముకాటుకు గురైన శిరీషను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవా లని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా, మండల కార్యదర్శులు సుధాకర్, రాములమ్మ డిమాండ్ చేశారు. కోలుకోలేక వీఆర్ఓ మృతి కోవెలకుంట్ల: కోవెలకుంట్ల– నంద్యాల ఆర్అండ్బీ రహదారిలో మూడు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వీఆర్ఓ బుధవారం మృతి చెందాడు. స్థానికులు అందించిన సమాచారం మేరకు.. మండలంలోని కలుగొట్లకు చెందిన గుండాల పెద్దపుల్లయ్య (54) ఇదే మండలంలోని రేవనూరు వీఆర్ఓగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ నెల 25వ తేదీన విధులు ముగించుకుని బైక్పై ఇంటికి వెళుతుండగా పట్టణ శివారులోని పెట్రోల్ బంకు వద్ద ప్రమాదశాత్తు బైక్పై నుంచి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నంద్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ కోలుకోలేక మృతి చెందాడు. మృతుడికి భార్య విజయకుమారి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రోడ్డు ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నేడు ట్రాఫిక్ మళ్లింపు కర్నూలు: బక్రీద్ పండుగను పురస్కరించు కుని కర్నూలు నగరంలో గురువారం ఉదయం 6 గంటల నుంచి ప్రార్థనలు ముగిసే వరకు ట్రాఫిక్ మళ్లింపు అమలులో ఉంటుందని ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దిన్ తెలిపారు. హైదరాబాద్ వైపు నుంచి కర్నూలుకు వచ్చే ఆర్టీసీ బస్సులను కర్నూలు నగరంలోకి అనుమతించకుండా తిప్పమ్మ కొట్టం నుంచి నేషనల్ హైవే మీదుగా బస్టాండ్కు వెళ్లేలా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే ఆర్టీసీ బస్టాండ్ ఔట్గేట్ నుంచి బయలుదేరే బస్సులను బళ్లారి చౌరస్తా, గుత్తి పెట్రోల్ బంకు, బిర్లా జంక్షన్, సి.క్యాంప్ సర్కిల్ మీదుగా నంద్యాల చెక్పోస్టు వైపు మళ్లిస్తున్నట్లు తెలిపారు. నంద్యాల చెక్పోస్టు వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు సి.క్యాంప్ రైతుబజార్ మసీదు వద్ద నుంచి బిర్లా జంక్షన్ గుత్తి పెట్రోల్ బంకు మీదుగా ఆర్టీసీ బస్టాండ్కు వెళ్లేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ట్రాఫిక్ మళ్లింపు నేపథ్యంలో ప్రజలు పోలీసులకు సహకరించి ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని సీఐ విజ్ఞప్తి చేశారు. కర్నూలు (సెంట్రల్) : ఒక నెల ఒక నియోజకవర్గం, నాలుగు పర్యటనలు కార్యక్రమంలో భాగంగా పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి శుక్రవారం ఓర్వకల్లు మండల కేంద్రంలో ప్రత్యేక పీజీఆర్ఎస్ను నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ సిరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీ జీవేశ్వరస్వామి దేవస్థాన కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటల నుంచి నిర్వహించే ఈ కార్యక్రమానికి జిల్లా ఉన్నతాధికారులు హాజరై వినతులు స్వీకరిస్తారని, ఈ అవకాశాన్ని కల్లూరు, ఓర్వకల్లు మండలాలు, కర్నూలు నగరంలోని కల్లూరుకు చెందిన 16 వార్డుల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
ముగిసిన పోలీసుల మెడిటేషన్ శిక్షణ
కర్నూలు : జిల్లా పోలీసు శాఖలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందికి గత మూడు రోజులుగా హార్ట్ఫుల్నెస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెడిటేషన్ శిక్షణ కార్యక్రమం ముగిసింది. జిల్లా పోలీసు కార్యాలయ పరేడ్ మైదానంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని యోగా, ప్రాణాయామం, ధ్యానసాధన చేశారు. హార్ట్ఫుల్నెస్ ట్రైనర్లు శ్వాసక్రియలు, ఏకాగ్రత పెంపొందించే సాధనాలు, మానసిక ఒత్తిడి తగ్గించే ధ్యాన విధానాలపై శిక్షణ ఇస్తూ అవగాహన కల్పించారు. ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత పెరిగి విధి నిర్వహణలో మరింత సమర్థత సాధించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో హోంగార్డ్స్ సదరన్ రీజియన్ కమాండెంట్ మహేష్ కుమార్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహ న్,హోంగార్డ్స్ డీఎస్పీ ప్రసాద్, సీఐలు,ఆర్ఐలు, ఎస్ఐ లు, ఆర్ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. డీఐజీ కార్యాలయంలో... కర్నూలు బి.క్యాంప్లోని కర్నూలు రేంజ్ డీఐజీ కార్యాలయంలో పోలీసు అధికారులు, సిబ్బందికి ఆరోగ్య పరిరక్షణ, మానసిక ప్రశాంతత కోసం మూడు రోజుల పాటు ప్రత్యేక మెడిటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. -
గ్రామం కనుమరుగై.. ఆలయం సాక్ష్యంగా నిలిచి !
జూపాడుబంగ్లా: రాజులు, రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోగా వారు పాలించిన గ్రామాలు కూడా కనుమరుగయ్యాయి. ఈ నేపథ్యంలోనే జూపాడుబంగ్లా మండల పరిధిలోని 35 బొల్లవరం గ్రామం ఎనిమిది దశాబ్దాల క్రితం కాలగర్భంలో కలిసిపోగా అక్కడ గ్రామం ఉన్నట్లుగా నిదర్శనంగా శిథిలమైన పురాతన శివాలయం నాలుగు స్తంభాలతో నిల్చొని నేటికి దర్శనమిస్తూ ఆ గ్రామచరిత్రకు సజీవసాక్ష్యంగా ఉంది. పురాతన శివాలయం సమీపంలో ఆంజనేయస్వామి విగ్రహ ఉండగా భాస్కరాపురంవాసులు పదేళ్ల క్రిత ం గ్రామానికి తీసుకెళ్లి ప్రతిష్టించుకొన్నారు. ప్రస్తుతం నాలుగు స్తంభాల మధ్య న ధ్వంసమైన శివలింగం మాత్రం దర్శనమిస్తూ ఉంది. గుప్తనిధుల వేటగాళ్ల తవ్వకాలతో శివాలయం శిథిలం కాగా 2009లో పి.లింగాపురం గ్రామానికి చెందిన అవిజ నాగన్న, పార్వతీదేవి అనే భక్తులు 2009 డిశంబర్లో శిథిలమైన శివాలయానికి కొంత మేర మరమ్మతులు నిర్వహించి భక్తిని చాటుకున్నారు. గత్తరరోగం తో పాటు పలురకాల వ్యాధులు వ్యాపించటంతో గ్రామస్తులు ఒక్కొక్కరిగా కాలం చేస్తుండటంతో భయాందోళనకు గురైన 35 బొల్లవరం గ్రామస్తులు తోచిన దిక్కుగా వెళ్లి పలు గ్రామాల్లో నివాసం ఏర్పాటుచేసుకున్నట్లు పూర్వీకులు పేర్కొంటున్నారు.కాలగర్భంలో కలిసిపోయిన ఈ ఊరి పేరున నేటికీ 2,766.39 ఎకరాల రెవెన్యూ అలాగే కొనసాగుతుండటం విశేషం. కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని న్యూ డయాగ్నోస్టిక్ బ్లాక్లో లిఫ్ట్ పనిచేయడం లేదు. దీంతో పై అంతస్తులకు వెళ్లేందుకు రోగులు ఇబ్బందులు పడుతున్నారు. మొదటి అంతస్తులో బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజి, పెథాలజి ల్యాబ్లు ఉన్నాయి. రెండో అంతస్తులో ఐసీటీసీ, డెక్సా స్కాన్, రక్తనిధి కేంద్రాలు ఉన్నాయి. ఆయా విభాగాలకు నిత్యం వందలాది మంది రోగులు వైద్యసేవల కోసం వెళ్తుంటారు. అధికారులు స్పందించి లిఫ్ట్కు మరమ్మతులు చేయించాలని వారు కోరుతున్నారు. -
కారులో వచ్చి...చోరీలు చేసి
కర్నూలు : తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన అబ్దుల్ మతిన్, నంద్యాల జిల్లా పాములపాడు మండలం ఎర్రగూడూరు గ్రామానికి చెందిన దేవరశెట్టి శివకృష్ణ వృతిరీత్య డ్రైవర్లు. వీరు అద్దె కారులో వస్తారు. తాళాలు వేసిన ఇళ్ల వద్ద రాత్రి రెక్కి నిర్వహించి చోరీలకు పాల్పడుతారు. తర్వాత హైదరాబాద్కు వెళ్లి జల్సా చేస్తారు. నిఘావేసిన కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు ఆ ఇద్దరి అంతర్రాష్ట్ర దొంగలను వలపన్ని పట్టుకొని కటకటాల్లోకి నెట్టారు. కేసు వివరాల్లోకి వెళితే.. కర్నూలు నగరం ఉద్యోగ నగర్లో నివాసముండే తెలుగు చిన్నరంగడు కుటుంబ సమేతంగా ఇంటికి తాళం వేసి కేదార్నాథ్కు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు గత నెల 21వ తేదీన ఇంటికి వేసిన తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి బీరువాలో దాచుకున్న 13 తులాల బంగారు ఆభరణాలు, కొంత నగదు మూటగట్టుకుని ఉడాయించారు. బాధితుడు చిన్న రంగడు ఫిర్యాదు మేరకు నాల్గవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా అంతర్రాష్ట్ర దొంగలుగా పోలీసు రికార్డులకెక్కిన అబ్దుల్ మతిన్, దేవరశెట్టి శివకృష్ణ ఈ నేరాలకు పాల్పడినట్లు పక్కా ఆధారాలు చిక్కాయి. మంగళవారం రాత్రి కర్నూలు మండలం మునగాలపాడు గ్రామ శివారులో వారిద్దరూ ఉన్నట్లు సమాచారం అందడంతో అదుపులోకి తీసుకుని విచారించగా వారి నేరాల చిట్టా వెలుగు చూసింది. అబ్దుల్ మతిన్ మహబూబ్ నగర్, జడ్చర్ల, హైదరాబాద్, సదాశివ పేట ప్రాంతాల్లో, దేవరశెట్టి శివకృష్ణ జడ్చర్ల, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడి పోలీసు రికార్డులకు ఎక్కారు. జల్సాలకు అలవాటు పడి.. అబ్దుల్ మతిన్ డిగ్రీ వరకు చదువుకున్నాడు. మొదట్లో సంగారెడ్డి ఐఐటీలో ట్రాన్స్పోర్టు సూపర్వైజర్గా పనిచేసేవాడు. ఐఐటీ పక్కన ఉన్న ఐస్ ఫ్యాక్టరీకి తరచూ దేవరశెట్టి శివకృష్ణ డ్రైవర్గా వెళ్లేవాడు. అక్కడే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. కలసి మద్యం సేవించడం, పేకాట, బెట్టింగ్ వంటి వాటికి అలవాటుపడ్డారు. ఈ క్రమంలోనే అబ్దుల్ మతిన్ సూపర్వైజర్ ఉద్యోగం ఊడింది. దీంతో స్వగ్రామం సదాశివపేట సర్పంచుకు డ్రైవర్గా కుదిరాడు. కొంతకాలానికి వివాహేతర సంబంధం విషయంలో సర్పంచుతో గొడవ పడి కత్తితో పొడవటంతో హత్యాయత్నం కేసు నమోదైంది. అదే సమయంలో మద్యం మత్తులో మైనర్ బాలికపై కూడా అఘాయిత్యానికి పాల్పడినందుకు పోక్సో కేసు నమోదై రెండోసారి కూడా జైలుకు వెళ్లాడు. బెయిల్పై బయటకు వచ్చాక దేవరశెట్టి శివకృష్ణతో కలసి పలు చోట్ల ఇళ్ల దొంగతనాలకు పాల్పడ్డారు. వృత్తి రీత్యా ఇద్దరూ డ్రైవర్లు అయినందున కారు అద్దెకు తీసుకుని రాత్రివేళల్లో తాళాలు వేసిన ఇళ్ల వద్ద రెక్కీ నిర్వహించి దొంగతనాలకు పాల్పడి తిరిగి హైదరాబాద్కు చేరుకుని జల్సాలు చేసేవారు. ఈ క్రమంలో దేవరశెట్టి శివకృష్ణకు కుమారుడు జన్మించడంతో కలసి పార్టీ చేసుకునేందుకు హైదరాబాదు నుంచి ఇద్దరూ కారు తీసుకుని కర్నూలుకు వచ్చారు. ఈ క్రమంలోనే ఉద్యోగ నగర్లో తెలుగు చిన్నరంగడు ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. పక్కా ఆధారాలతో ఇరువురినీ అదుపులోకి తీసుకుని విచారించగా ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. విలాసవంతమైన జీవితానికి అప్పులు చేయడం, వాటిని తీర్చే క్రమంలో ఇరువురు దొంగలుగా మారారని సీఐ విక్రమసింహ తెలిపారు. చోరీకి గురైన బంగారు ఆభరణాలను వీరి నుంచి రికవరీ చేయాల్సి ఉందని తెలిపారు. కేసు ఛేదించడంలో ప్రతిభ కనపరచిన ఎస్ఐ గోపీనాథ్, సిబ్బంది సుబ్బరాయుడు, మురళి తదితరులను సీఐ అభినందించారు. -
ఉపాధి కూలీల ‘యాప్’సోపాలు
హాలహర్వి: జాతీయ ఉపాధి హామీ పథకంలో ప్రవేశపెట్టిన డిజిటల్ హాజరు విధానం కూలీలకు తలనొప్పిగా మారింది. పారదర్శకత పేరుతో ప్రభు త్వం తీసుకొచ్చిన ఫేస్రికగ్నిషన్ హాజరు విధానం క్షేత్రస్థాయిలో విఫలమవుతోంది. సిగ్నల్ సమస్యకు తోడు ఎన్ఎంఎంఎస్ యాప్ సర్వర్ లోపాల కారణంగా హాజరు నమోదు కోసం కూలీలు ఎండలో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. మండలకేంద్రమైన హాలహర్విలో బుధవారం ఉపాధి పనుల ప్రదేశంలో ఇదే పరిస్థితి ఎదురైంది. – మధ్యాహ్నం వరకు వేచి చూసినా.... నిబంధనల ప్రకారం ఉపాధి పనుల వద్ద ఉదయమే కూలీల గ్రూపు ఫొటోతో పాటు ఆన్లైన్ హాజరు నమోదు చేయాలి. అయితే హాలహర్విలో బుధవారం ఉదయం నుంచి సర్వర్ బిజీగా ఉండడంతో యాప్ అస్సలు ఓపెన్ కాలేదు. దీంతో ఫీల్డ్ అసిస్టెంట్లు, మేటీలు ఫోన్ పట్టుకుని ఎండలో సర్వర్ ఎప్పుడు వస్తుందా అని గంటల తరబడి నిరీక్షించారు. చివరకు మధ్యాహ్నం వేళ అతికష్టం మీద హాజరు నమోదు ప్రక్రియ పూర్తి చేశారు. హాజరు పడకపోతే కూలీలు ఆ రోజు చేసిన కష్టమంతా వృథా అయినట్టే. తమ కడుపుకొట్టే ఈ విధానానికి ప్రభుత్వం స్వస్తి పలికి పాత పద్ధతిలోనే హాజరు సేకరించాలని ఉపాధి కూలీలు కోరుతున్నారు. -
కోలాటంతో మానసిక ప్రశాంతత
మాది న్యూఢిల్లీ. భర్త ఉద్యోగ రీత్యా కర్నూలుకు వచ్చాం. ప్రతి రోజు కోలాటం సాధన చేస్తున్నాను. దేవుడి పాటలకు కోలాటంతో నృత్యం చేస్తుంటే సంతోషంగా ఉంది. ఈ ఆటలో మానసిక ప్రశాంతతతో పాటు మంచి వ్యాయామం లభిస్తుంది. – ప్రాచీ, న్యూఢిల్లీ ఉత్సవాల్లో కోలాటం వేసే భాగ్యాన్ని పూర్వ జన్మ సుకృతంగా భావిస్తాం. కోలాటంతో ఆధ్యాత్మిక చింతనకు దగ్గరగా ఉండే అవకాశం లభిస్తుంది. ఇది మాటల్లో వర్ణించలేనిది. కోలాటంతో ఐక్యత భావం కలుగుతుంది. మహిళలు సంప్రదాయ జానపద కళలపై ఆసక్తిని పెంపొందించుకోవాలి. – లలిత, కల్లూరు నాకు కోలాటం అంటే చాలా ఇష్టం. దానిపై ఉన్న మక్కువతో కష్టపడి నేర్చుకున్నా. ఎక్కడ కోలాటం వేయాలన్నా వెళ్లిపోతా. ఈ కళకు సంబంధించిన పాటలు ఎంతో ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని ఇస్తాయి. యువత సంప్రదాయ కళలకు జీవం పోయాలి. – రమాదేవి, బాబా బృందావన్ నగర్ ● -
టీబీ డ్యాంలో 10 టీఎంసీల నీరు
హొళగుంద: కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం(టీబీ డ్యాం)లో 10.066 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయానికి 2025 డిసెంబర్ 27వ తేదీ నుంచి నిలిచిపోయిన ఇన్ఫ్లో అకాల వర్షాలతో కొద్ది రోజులు చిన్నపాటి నీటి ప్రవాహం కొనసాగింది. తిరిగి ఈ నెల 19 నుంచి అకాల వర్షాల కారణంగా ఇన్ఫ్లో మళ్లీ మొదలైంది. ఆ రోజు డ్యాంలో 9.709 టీఎంసీలు ఉండగా.. మంగళవారానికి 10.066 టీఎంసీలకు చేరుకుంది. వర్షాలు పెద్ద ఎత్తున కురిస్తే జూన్ నెలాఖరు లేదా జూలై నెలలో డ్యాంకు పూర్తిస్థాయిలో నీరు చేరవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులతో 105.788 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉండగా.. మంగళవారం 1588.81 అడుగులతో 10.066 టీఎంసీల నీరు నిల్వ ఉండి ఇన్ఫ్లో 777, ఔట్ ఫ్లో 209 క్యూసెక్కులు నమోదైంది. -
ఆస్తి కోసమే మహిళను దారుణంగా..
పత్తికొండ/హొళగుంద: మొత్తం ఆస్తి తమకు దక్కాలని హరిజన గాదిలింగప్ప మొదటి భార్య పిల్లలు ఎల్లమ్మను హత్య చేసినట్లు పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య తెలిపారు. మంగళవారం పత్తికొండ పట్టణంలోని తన కార్యాలయంలో ఆలూరు, ఆస్పరి సీఐలు రవిశంకర్రెడ్డి, శ్రీనువాసులునాయక్లతో కలిసి డీఎస్పీ విలేకరుల సమావేశం నిర్వహించి కేసు వివరాలు వెల్లడించారు.హొళగుంద మండలం సులువాయి గ్రామానికి చెందిన హరిజన గాదిలింగప్పకు మల్లమ్మ, ఎల్లమ్మ అనే ఇద్దరు భార్యలు. గాదిలింగప్ప తనకున్న 4.50ఎకరాలు భూమిని వారిద్దరికి సమానంగా పంచాలని నిర్ణయించి కుటుంబసభ్యులకు తెలియజేశాడు. మొదటి భార్య హరిజన మల్లమ్మ, కుమారులు హరిజన శేకన్న, చిన్న గాదిలింగ అందుకు ఒప్పుకోలేదు.ఈ విషయంలో గ్రామంలో పెద్దల వద్ద పంచాయితీ జరిగింది. ఎలాగైనా తమ తండ్రి రెండో భార్యకు సగం ఆస్తి ఇస్తాడని, ఆమెను అంతమొందిస్తే మొత్తం తమకే దక్కుతుందని భావించి హత్యకు పథకం రచించారు. ఈనెల 21వ తేది అర్ధరాత్రి ఇంట్లో నిద్రపోతున్న ఎల్లమ్మను విచక్షణారహితంగా కొడవలితో తల, మెడ భాగాలపై నరికి చంపేశారు.విషయం తెలుసుకున్న హతురాలి కూతురు గుండమ్మ అక్కడికి చేరుకొని జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు మంగళవారం సాయంత్రం హరిజన శేకన్న, హరిజన మల్లమ్మ, హరిజన చిన్న గాదిలింగను ఆలూరు నుంచి ఎల్లార్తికి వెళ్లే రహదారిలో అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. నిందితులను పత్తికొండ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్కు ఆదేశించినట్లు డీఎస్పీ వెల్లడించారు. -
చంద్రబాబు కుట్రను తిప్పికొడదాం
కర్నూలు(సెంట్రల్): సర్ కార్యక్రమాన్ని అడ్డుపెట్టుకుని 2029 ఎన్నికల్లో మరోసారి ఓటు చోరీ చేసి అధికారంలోకి రావాలనే సీఎం చంద్రబాబునాయుడు కుట్రను వైఎస్సార్సీపీ బీఎల్ఏలు తిప్పికొట్టాలని వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంట్ పరిశీలకులు, ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం కర్నూలు నగర శివారులోని హ్యాంగౌట్ హోటల్లో పాణ్యం నియోజకవర్గ బీఎల్ఏలకు సర్పై అవగాహన సదస్సు నిర్వహించారు. పాణ్యం నియోజకవర్గ ఇన్చార్జ్, వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, పాణ్యం నియోజకవర్గ పరిశీలకులు గుండం సూర్యప్రకాష్రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..సర్ పేరుతో అనేక రాష్ట్రాల్లో లక్షల ఓట్లు తొలగించారని, ఏపీలోనూ నియోజకవర్గానికి 20 వేల ఓట్లను తొలగించాలన్న కుట్రలు జరుగుతున్నాయన్నారు. ఈ కుట్రలను తిప్పి కొట్టాల్సిన బాధ్యత బూత్ లెవల్ ఏజెంట్లపై ఉందన్నారు. ప్రతి బీఎల్ఏ తన పరిధిలోని బూతు ఓటర్లపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఎవరైనా వైఎస్సార్సీపీ సాను భూతి పరుల ఓట్లను తొలగించాలని యత్నిస్తే ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. టీడీపీ నాయకులు దొంగ ఓట్లు చేర్చి మరోసారి దొడ్డిదారిలో అధికారంలోకి రావాలని చూస్తున్నారని, వారి కుట్రలను సాగనీయవద్దని హెచ్చరించారు. భవిష్యత్లో బీఎల్ఏలే పార్టీలో కీలకమని, వారు పార్టీ నాయకులుగా ఎదిగే అవకాశం వస్తుందన్నారు. పార్టీ కోసం ఇప్పుడు కష్టపడితే జగనన్న సీఎం అవ్వగానే వారికి పార్టీ, ప్రభుత్వ పదవుల్లో ప్రాధాన్యం ఉంటుందన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కార్యకర్తలకు అన్యాయం జరిగిందని, 2029లో మాత్రం కార్యకర్తల ప్రభుత్వమే ఏర్పాటు అవుతుందని, అప్పుడు అనుకున్న లక్ష్యాలను సాధించుకోవచ్చన్నారు. టీడీపీ నేతలకు దోచుకోవడమే పని కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు దోచుకుని దాచుకోవడం తప్ప ఏమీ చేయడం లేదని.. ఇసుక, గ్రావెల్కు తెలుగు తమ్ముళ్లు టిప్పర్కు రూ.500 వసూలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి ఆరోపించారు. ఎవరికై నా అనుమానం ఉంటే తన వెంట వస్తే ఏ టీడీపీ నాయకుడు ఎంత వసూలు చేసింది చూపిస్తానని, ఇందుకు దమ్ముంటే ముందుకు రావాలని సవాల్ విసిరారు. మంగళవారం పాణ్యం నియోజకవర్గ బీఎల్ఏల సమావేశం కర్నూలు శివారులోని ఓ హోటల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు సంపద సృష్టిస్తానని చెప్పి.. వాళ్ల పార్టీ నేతల జేబులు నింపుతున్నాడని ఆరోపించారు. నంద్యాల జిల్లాలో పబ్లిక్గా టీడీపీ నాయ కులు ఇసుక, గ్రావెల్ కోసం డబ్బులు వసూలు చేస్తున్నారని, టిప్పర్ ఇసుకకు రూ.500, టిప్పర్ గ్రావెల్కు రూ.5 వేలు తీసుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై అధికారులకు చెప్పినా ఎవరూ చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్లో భూములు ఇచ్చిన రైతుల కుటుంబాలకు కాకుండా టీడీపీ నాయకులకు ఉద్యోగాలు ఇస్తున్నారని, 75 శాతం స్థానికులకు ఇవ్వాలని చట్టం ఉన్నా పట్టించుకోవడం లేదన్నారు. జయరాజ్ ఇస్పాత్, క్యాంపకోలా కంపెనీల్లో మంత్రి టీజీ భరత్ తన అనుచరులకు ఉద్యోగాలు ఇప్పంచుకుంటున్నారని ఆరోపించారు. ఇండస్ట్రియల్ హబ్ కోసం భూములు ఇచ్చిన రైతులకు పరిహారం ఇవ్వకుండా టీడీపీ, వైఎస్సార్సీపీ అని వేరు చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో దాదాపు 9వేల ఎకరాల భూములను హబ్ కోసం తీసుకున్నా ఎక్కడా పరిహారం రాలేదన్న మాట వినిపించలేదన్నారు. అయితే టీడీపీ ప్రభుత్వ హయాంలో ఓర్వకల్ మండల రైతులు కలెక్టరేట్, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ పరిహారం కోసం తిరుగుతున్నారని ఆరోపించారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కర్నూలు నగరంలో వెంటకరమణ కాలనీ, కృష్ణానగర్లో ఫ్లైఓవర్ బ్రిడ్జిలు నిర్మించామని, టీజీ భరత్ ఒక్కటైనా ఏర్పాటు చేశారా అని ప్రశ్నించారు. ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ కూడా తమ హయాంలోనే ఎక్కువగా అభివృద్ధి చెందిందని, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి హైదరాబాద్ – బెంగళూరు పారిశ్రామిక కారిడార్లో నోడ్ పాయింట్గా గుర్తించామని, 9 వేల ఎకరాల భూసేకరణ చేసి ల్యాండ్ బ్యాంకు ఏర్పాటు చేశామని, ఇప్పుడు మంత్రి టీజీ భరత్ తన హయాంలోనే మొత్తం జరిగినట్లు చెప్పడం దారుణమన్నారు. కాగా టీడీపీ నాయకులు చెప్పగానే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు కేసులు పెడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని, అక్రమ కేసులు పెడితే పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. -
160 ఆర్బీకేలు మూత
ఇతర సేవలకు వీఏఏ, వీహెచ్ఏలు ● వ్యవసాయ, అనుబంధ శాఖలకు సంబంధించి రైతులకు సేవలు అందించాల్సిన వీఏఏ, వీహెచ్ఏలను చంద్రబాబు ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగిస్తోంది. ● నిరంతరం ఏదో ఒక సర్వే చేపడుతూ.. ఇందులో వీఏఏ, వీహెచ్ఏలను సైతం భాగస్వాములను చేస్తుండటంతో రైతులకు అందుబాటులో ఉండని పరిస్థితి ఏర్పడుతోంది. డోన్ మండలం కొత్తపల్లిలో సేవలకు దూరమైన రైతుభరోసా కేంద్రం కర్నూలు(అగ్రికల్చర్): దేశానికే రోల్మోడల్గా గుర్తింపు పొందిన రైతుభరోసా కేంద్రాలు (రైతు సేవా కేంద్రాలు) నేడు దిష్టిబొమ్మలను తలపిస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటుతోనే వీటి మనుగడ ప్రశ్నార్థకమైంది. రైతుభరోసా కేంద్రాల పేరుతోనే కొనసాగితే వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుల మదిలో చిరస్థాయిగా ఉండిపోతారనే అక్కసుతో రైతు సేవా కేంద్రాలుగా పేరు మార్పు చేశారు. 2014–15 నుంచి 2018–19 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న సమయంలో రైతన్నలు ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు, ఇతరత్రా సేవలు పొందడానికి ఎన్ని కష్టాలు పడ్డారో తెలిసిందే. ఇప్పుడు కూడా మళ్లీ ఆ రోజులు పునరావృతం అవుతున్నాయి. వైఎసార్సీపీ ప్రభుత్వంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 877 ఆర్బీకేలు(ఆర్ఎస్కేలు) ఉన్నాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 849 ఆర్బీకేలు ఉండగా.. 28 ఆర్బన్ ప్రాంతాల్లో సేవలందించాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులతో ఆర్బీకేలకు సొంత భవనాల నిర్మాణానికి ఏర్పాట్లు చేసింది. కర్నూలు జిల్లాలో 328, నంద్యాల జిల్లాలో 156 ప్రకారం 484 ఆర్బీకేలకు అపురూపమైన సొంత భవనాలు రూపుదిద్దుకోవడం విశేషం. రైతులకు విశేషంగా సేవలు అందించిన ఆర్బీకేలను చంద్రబాబు ప్రభుత్వం గత ఏడాది చేపట్టిన రేషనలైజేషన్ ద్వారా కర్నూలు జిల్లాలో 408, నంద్యాల జిల్లాలో 309 మిగిలాయి. కర్నూలు జిల్లాలో 58, నంద్యాల జిల్లాలో 102 రైతుభరోసా కేంద్రాలను మూసివేయడం గమనార్హం. ఆర్బీకేలు మూతపడటంతో 160 పోస్టులు రద్దయ్యాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఉన్న పలు ఆర్బీకేలకు వీఏఏ, వీహెచ్ఏ పోస్టులు ఖాళీ గా ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో సెరికల్చర్కు సంబంధించి 13 వీఎస్ఏలను గత వైఎసార్సీపీ ప్రభుత్వం నియమించింది. వీరందరికీ పదోన్నతులు లభించాయి. ఆ తర్వాత వీటిని భర్తీ చేయడం పక్కనపెడితే చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా రద్దు చేసింది. రైతు గ్రంథాలయం కనుమరుగు రైతుల్లో వ్యవసాయ విజ్ఞానాన్ని పెంచేందుకు ప్రతి ఆర్బీకేలో 50 పుస్తకాలతో రైతు గ్రంథాలయం ఏర్పాటైంది. నేడు ఆర్బీకేల్లో గ్రంథాలయాల ఉనికే లేకుండా పోయింది. వీటి ద్వారా ఆర్బీకేల్లోనే రైతుల సందేహాలను నివృత్తి చేయడం జరిగేది. నేడు ఆర్బీకేలు గ్రామాల్లో దిష్టిబొమ్మలను తలిపిస్తున్నాయంటే ప్రభుత్వం ఏస్థాయిలో కక్షగట్టిందో అర్థమవుతోంది. దిష్టిబొమ్మల్లా రైతు భరోసా కేంద్రాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెచ్చిన ఆర్బీకేల వ్యవస్థ వ్యవసాయ శాఖలో సరికొత్త విప్లవం. వ్యవసాయంలో పెట్టుబడి వ్యయాన్ని తగ్గించి ఉత్పాదకతను పెంచడం, ఇందుకు అవసరమైన అన్ని రకాల ఇన్పుట్స్(విత్తనం మొదలు పండించిన పంటను మద్దతు ధరతో అమ్ముకునే వరకు)తో రైతులకు అండగా నిలిచాయి. ఖరీఫ్, రబీ సమయాల్లో ఆర్బీకేల ద్వారా రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, పశుసంవర్ధకశాఖ, ఏపీఎంఐపీ, ఫిషరీష్, మార్కెటింగ్ తదితర శాఖలకు సంబంధించిన అన్ని రకాల కార్యక్రమాలు ఆర్బీకేల ద్వారానే అమల య్యాయి. రైతులకు విశేష సేవలు అందించిన ఆర్బీకేలను చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. ఆర్బీకేల ద్వారా నేడు రైతులకు ఎరువులు, విత్తనాలు, ఇతర ఏ విధమైన సేవలు అందని పరిస్థితి. ఎరువులు, విత్తనాలు, పురుగుమందులతో పాటు వ్యవసాయ, అనుబంధ శాఖలకు సంబంధించిన ఏ అవసరానికై నా డిజిటల్ కియోస్క్ ద్వారా ఆర్డర్ పెడితే కొన్ని గంటల్లోనే రైతులకు అందుబాటులోకి వచ్చేవి. నేడు డిజిటల్ కియోస్క్లు మూలన పడ్డాయి. -
మాలలను అణచివేస్తున్న కూటమి ప్రభుత్వం
కర్నూలు(అర్బన్): రాష్ట్రంలో మాలలను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా కూటమి ప్రభుత్వం అణచివేస్తుందని మాల మహాసభ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లెల వెంకట్రావ్ తీవ్రంగా ఆరోపించారు. అన్ని విధాల నష్టాలను చవి చూస్తున్న మాలల్లో చైతన్యం నింపేందుకు హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు ‘మాలల ఐక్యతా చైతన్య యాత్ర ’ను చేపట్టినట్లు చెప్పారు. యాత్రలో భాగంగా మంగళవారరం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకట్రావు మాట్లాడుతూ మాల సంక్షేమ ఐక్యవేదిక ఆధ్వర్యంలో చేపట్టిన ఈ యాత్రలో మాల మహాసభ, మాల మహానాడు, మాల సంఘాల జేఏసీ, అంబేడ్కర్ యువజన సంఘాలు సంయుక్తంగా పాల్గొంటున్నాయన్నారు. రాష్ట్రంలోని మాల ఉద్యోగుల పట్ల ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపట్టిందన్నారు. కలెక్టర్, ఎస్పీ, ఆర్డీఓ, డీఎస్పీ తదితర ఉన్నత స్థానాల్లో పనిచేసేందుకు మాల అధికారులకు అర్హత ఉన్నా నియమించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పదోన్నతుల విషయంలో కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇదేమని ప్రశ్నిస్తే ఏసీబీతో సహా పలు రకాల కేసులను పెడుతు సస్పెన్షన్లకు గురి చేస్తున్నారన్నారు. గ్రామాల్లో కూడా మాల కులస్తులపై, చర్చీలపై ఇటీవల కాలంలో దాడులు అధికమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో విద్యా పరంగా కూడా ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. నేటికి ఫీజు రీయంబర్స్మెంట్ నిధులు విడుదల కాలేదన్నారు. మాలలకు అన్ని విధాల న్యాయం చేస్తామని ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన హామీలు నేటికి నెరవేరలేదన్నారు. ముఖ్యంగా రాజ్యాంగ వ్యతిరేక వర్గీకరణ చట్టాన్ని రద్దు చేయాలన్నారు. మాలల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా 10 లక్షల మందితో విజయవాడలో అగస్టు నెలలో మాలల సింహగర్జన సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో మాల మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు గంగాధర్, మాల సంఘాల జేఏసీ అధ్యక్షుడు చెరుకూరి అశోకరత్నం, ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోన నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
వ్యక్తిపై కత్తితో దాడి
కోసిగి: మండల పరిధిలోని మూగలదొడ్డి గ్రామానికి చెందిన గుడిసె రాఘవేంద్ర అనే వ్యక్తి పై అదే గ్రామానికి చెందిన కోసిగి మునేష్ అనే వ్యక్తి కత్తితో పొడిచాడు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాఘవేంద్ర, మునేష్లతో పాటు మరికొందరు కలిసి సోమవారం రాత్రి పేకాట ఆడేందుకు గ్రామ శివారులోని పొలాల్లోకి వెళ్లారు. ఆట ఆడేటప్పుడు డబ్బులు ఇచ్చి పుచ్చుకునే విషయంలో వివాదం రేగింది. కోపోద్రిక్తుడైన మునేష్ తన వద్ద ఉన్న కత్తితో రాఘవేంద్ర చేతి భాగం, శరీర వెనుకభాగంలో పొడిచాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని మంగళవారం తెల్లవారుజామున కోసిగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లగా వైద్యులు ప్రథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో ఆదోని ఏరియా ఆసుపత్రి తరలించారు. దాడి ఘటనపై బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
ఆర్బీకేల్లో అందుబాటులో లేని ఎరువులు
మాకు 10 ఎకరాల భూమి ఉంది. ప్రస్తుతం నీటి సదుపాయం కింద పత్తి, మొక్కజొన్న సాగు చేస్తున్నాం. గ్రామ స్థాయిలో ఆర్బీకే ఉన్నా యూరియా, డీఏపీ అందుబాటులో లేవు. పేరుసోమల, తిమ్మనాయునిపేటకు వెళ్లాల్సి వస్తోంది. ఈ కారణంగా వ్యయప్రయాసలకు లోనవుతున్నాం. ఆర్బీకేల్లో ఎరువులు అందుబాటులో ఉంచితే ఎంఆర్పీకే లభిస్తాయి. – వెంకటేశ్వరరెడ్డి, పెద్ద వెంతుర్ల, కొలిమిగుండ్ల మండలం మాకు మూడు ఎకరాల సొంత భూమి ఉండగా, మరో మూడు ఎకరాలు కౌలుకు సాగు చేస్తున్నాం. నేడు బస్తా ఎరువు కావాలన్నా, నీళ్ల మందులు కావాలన్నా 30 కిలోమీటర్ల దూరంలోని డోన్కు లేదా 28 కిలోమీటర్ల దూరంలోని పత్తికొండకు పోతున్నాం. ప్రతి అవసరానికి డోన్ లేదా పత్తికొండకు పోవాల్సి వస్తుండటంతో ఎక్కువ డబ్బులు ఖర్చవుతున్నాయి. రాజకీయాలు మానుకొని ఆర్బీకేలను రైతులకు అందుబాటులో ఉంచాలి. – గన మద్దిలేటి, మారెళ్ల, తుగ్గలి మండలం


