Kurnool
-
మహారాష్ట్ర దొంగల ముఠా గుట్టు రట్టు
కర్నూలు: కాల్వబుగ్గ బుగ్గ రామేశ్వరస్వామి ఆలయంలో దోపిడీకి పాల్పడిన మహారాష్ట్ర దొంగల ముఠా గుట్టు రట్టయ్యింది. గత నెల 17వ తేదీన అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు ఆలయంలోకి ప్రవేశించి స్వామి, అమ్మవారికి చెందిన వెండి వస్తువులు అపహరించారు. దాదాపు 10 కిలోల వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు ఆలయ అర్చకులు లక్ష్మీనారాయణ శర్మ, నరసింహశర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓర్వకల్లు పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కర్నూలు రూరల్ సీఐ చంద్రబాబు నాయుడు, ఓర్వకల్లు, ఉలిందకొండ, నాగలాపురం ఎస్ఐలు సునీల్ కుమార్, ధనుంజయ, అఖిల్లతో కలసి మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించి 20 రోజుల వ్యవధిలోనే కేసును పోలీసులు ఛేదించారు. సీసీ ఫుటేజీ ద్వారా పక్కా ఆధారాలతో మహారాష్ట్ర ముఠానే ఈ నేరానికి పాల్పడినట్లు గుర్తించారు. మహారాష్ట్ర పూణెకు చెందిన అర్జున్ పూనం కుంబ్హర్, మహారాష్ట్రలోని చించ్వడ్కు చెందిన అక్షయ్ జైసింగ్ ఠాకూర్లను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. తమ సహచరులు జర్నల్, అమిత్, బజరంగిలతో కలసి ఈ నేరం చేసినట్లు అంగీకరించారు. దీంతో వారి వద్ద నుంచి 4 కిలోల వెండి ఆభరణాలు, దొంగతనానికి ఉపయోగించిన పరికరాలు పెద్ద బోల్ట్ కట్టర్, స్క్రూ డ్రైవర్లు, గ్లౌజులు, నిందితులు నేరానికి ఉపయోగించిన వాహనాలతో పాటు మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకుని ఇరువురు నిందితులను జిల్లా కేంద్రానికి తీసుకువచ్చి ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఎదుట హాజరుపరిచారు. సోమవారం మధ్యాహ్నం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో డీఎస్పీ బాబుప్రసాద్, సీఐ చంద్రబాబు నాయుడులతో కలసి విలేకరుల సమావేశం నిర్వహించి ఎస్పీ వివరాలు వెల్లడించారు. గూగుల్ మ్యాప్లో గుర్తించి దోపిడీ... నిందితులు ఆలయ పరిసర ప్రాంతాలను గూగుల్ మ్యాప్ ద్వారా గుర్తించి మొత్తం ఐదుగురు రెక్కీ నిర్వహించి దోపిడీకి పాల్పడ్డారు. ఆలయం తాళాలు కట్ చేసి చోరీకి పాల్పడినట్లు సీసీటీవీ ఫుటేజీ, ఇతర సాంకేతిక సాక్ష్యాధారాలతో నిందితుల ప్రమేయాన్ని నిర్ధారించారు. అలాగే టోల్గేట్లలోని సీసీ ఫుటేజీ టెక్నాలజీ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. మిగిలిన మరో ముగ్గురు నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. త్వరలో వారిని కూడా అరెస్టు చేసి మిగిలిన వెండి ఆభరణాలు కూడా రికవరీ చేయనున్నట్లు ఎస్పీ తెలిపారు. కేసును త్వరితగతిన ఛేదించి నిందితులను అరెస్టు చేయడంలో ప్రతిభ కనపరచిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించి నగదు రివార్డులు అందజేశారు. ఆలయాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని జిల్లా ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. గూగుల్ మ్యాప్ ద్వారా కాల్వబుగ్గ ఆలయ పరిసరాలు గుర్తించి చోరీ సీసీ ఫుటేజీ ద్వారా కేసు ఛేదించిన పోలీసులు నాలుగు కిలోల వెండి రికవరీ వివరాలు వెల్లడించిన ఎస్పీ విక్రాంత్ పాటిల్ -
తర్తూరు జాతరకు వెళ్లొస్తుండగా..
● రుద్రవరం వద్ద ఆటో బోల్తా ● ఒకరు దుర్మరణం..పలువురికి గాయాలు పాములపాడు: జూపాడుబంగ్లా మండలంలోని తర్తూరు గ్రామంలో జరిగే తిరునాలకు వెళ్లి వస్తుండగా ఆటో బోల్తా పడింది. సోమవారం తెల్లవారు జామున జరిగిన ఈ ఘటనలో ఒకరు దుర్మరణం చెందగా పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు .. ఆత్మకూరు మండలం నాగలూటి గూడెం చెందిన ఆరుగురు ఆటోలో తర్తూరు తిరునాలకు వెళ్లి తిరిగి వస్తున్నారు. ఆటోను డ్రైవర్ పులిచెర్ల బయ్యన్న వేగంగా నడుపుతూ రుద్రవరం వద్ద ఎన్హెచ్ 340సీ ఫ్లైఓవర్ వంతెనపై డివైడర్ను ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఆటో బోల్తా పడటంతో అందులోని వారికి గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆత్మకూరు ప్రభుత్వ వైదశాలకు తరలించగా నిమ్మల బయమ్మ అనే మహిళ మృతి చెందారు. గుర్రప్ప, అంకమ్మ అనే మరో ఇద్దరికి మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. క్షతగాత్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తిరుపాలు తెలిపారు. -
జీడీపీలో మట్టి తోడేళ్లు!
● టీడీపీ నేతల అండ ● యథేచ్ఛగా ఎర్రమట్టి తరలింపుగోనెగండ్ల: టీడీపీ నేతల అండతో గాజులదిన్నె ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలోని ఎర్రమట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. ఇందుకోసం జేసీబీలను ఏర్పాటు చేసుకున్నారు. పిల్లిగుండ్ల, నెరుడుప్పల గ్రామాల సమీపంలోని తవ్వకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గత 20 రోజుల నుంచి రోజుకు 100 నుంచి 150 ట్రాక్టర్ల దాకా మట్టిని ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. దీనిని పలు గ్రామాల్లోని ఇళ్లు, వెంచర్లు నిర్మించే వారికి అమ్ముతున్నారు. ట్రాక్టర్ మట్టి రూ.వెయ్యి నుంచి రూ.1300 దాకా వసూలు చేస్తున్నారు. దూరం ఎక్కువగా ఉంటే మరింత ఎక్కువ వసూలు చేస్తున్నారు. జీడీపీ ఎగువ ప్రాంతంలో మట్టిని తవ్వాలంటే అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే టీడీపీ నేత అండ ఉండటంతో ఎర్రమట్టి మాఫియా చెలరేగిపోతోంది. మట్టి మాయం అవుతోందని, గాజులదిన్నె ప్రాజెక్టును కాపాడాలని అధికారులకు ఆయా గ్రామాల ప్రజలు ఫిర్యాదు చేశారు. గుంతలమయం అధికార పార్టీకి చెందిన నాయకుల కనుసన్నుల్లోనే ఎర్రమట్టి మాఫియా యథేచ్ఛగా సాగుతోంది. గాజులదిన్నె ప్రాజెక్టుకు సమీపంలో ఉన్న గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులే అక్రమ ఎర్రమట్టి వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది. ట్రాక్టర్కు రూ.200 ఇవ్వాలని ఆ నాయకులు వసూలు చేస్తున్నారు. ఎర్రమట్టి కోసం జేసీబీలతో తవ్వడంతో జీడీపీ ఎగువ ప్రాంతం గుంతలమయంగా మారింది. ఆ ప్రాంతాలను రైతులు తమ పశువులను మేపించేందుకు వెళ్తుంటారు. అలాగే వేసవి కాలం కావడంతో ఆయా గ్రామాలకు చెందిన చిన్నారులు సరదాగా ఈతకు వెళ్తుంటారు. గతంలో గుంతలు పడిన ప్రదేశంలో సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు నీటిలో మునిగి మృతి చెందారు. ఇప్పుడు కూడా మట్టి మాఫియా కోసం జేసీబీతో గుంతలు గుంతలు తవ్వడంతో మళ్లీ ప్రమాదాలు జరుగుతామని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. జేసీబీలతో తవ్వి ట్రాక్టర్లలో మట్టిని తరలిస్తున్నట్లు మాకు ఫిర్యాదులు వచ్చాయి. మట్టి తవ్వకాలకు ఉన్నతాధికారుల నుంచి ఎవరికీ అనుమతి ఇవ్వలేదు. మట్టిని తరలిస్తున్నారని ఫిర్యాదులు అందడంతో వారం రోజులుగా మా సిబ్బందిని రాత్రి 12 గంటలకు వరకు కాపాలగా పెట్టాం. అయినా తప్పించుకొని తెల్లవారు జామున 3 గంటల సమయంలో మట్టి తవ్వకాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంది. పట్టుబడితే కేసులు నమోదు చేస్తాం. – మహమ్మద్ ఆలీ, ప్రాజెక్టు ఏఈ కళ్లుగప్పి తరలింపు రాత్రిపూట అక్రమంగా ఎర్రమట్టి తరలిస్తుండడంతో ఉదయం చూడగానే పెద్దపెద్ద గుంతలు కనిపిస్తున్నాయి. వారం రోజులుగా రాత్రి 9 గంటల నుంచి అర్థరాత్రి 12 గంటల వరకు ప్రాజెక్టు సిబ్బంది నలుగురు కాపలాగా ఉంటున్నారు. అయినప్పటికీ వారి కళ్లుగప్పి మట్టిని తరలిస్తున్నారు. ఆదివారం రాత్రి కూడా మట్టి తవ్వకాలు యథేచ్ఛగా జరిగాయి -
శుభగాత్రి..గిరిజాపుత్రి!
మహాశక్తి పీఠమైన శ్రీశైలంలో భ్రమరాంబాదేవి రూపంలో పార్వతీదేవి కొలువై ఉన్నారు. అయితే, ఎప్పుడూ ఆమె నిజరూపంలో కనిపించరు. ప్రత్యేక అలంకరణలో మాత్రమే భక్తులకు అనుగ్రహిస్తారు. ఏడాదిలో ఒక్క రోజు అది కూడా కుంభోత్సవం రోజున మాత్రమే అమ్మవారు నిజరూపదర్శనంలో అగుపిస్తారు. నేడు వార్షిక కుంభోత్సవం సందర్భంగా భక్తులకు ఆ దర్శన భాగ్యం లభించనుంది. ఒకప్పుడు చెంచుల ఉత్సవంగా ఉన్న ఈ కుంభోత్సవం నేడు సకల జనులదిగా మారడం విశేషం. శ్రీశైలం టెంపుల్: శ్రీశైల ఆలయపు జానపద ఆచారాల్లో స్థానికులైన చెంచులకు సంబంధించిన అతి ముఖ్యమైన ఉత్సవం అమ్మవారి వార్షిక కుంభోత్సవం. ఉగాది ముగిశాక వచ్చిన మొదటి పౌర్ణమి తరువాత వచ్చే మంగళ, శుక్రవారాల్లో ఈ వేడుక నిర్వహిస్తారు. గతంలో ఆ రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అమ్మవారి ఆలయం మూసివేసేవారు. సాయంత్రం చంద్రోదయం తర్వాత గుడి తెరచి అమ్మవారిని కేవలం పసుపు, కుంకుమలతో పూజించేవారు. ముందుగానే అమ్మవారి గర్భాలయం తెరచినప్పటికీ ముఖమండపంలోని శక్తియంత్రం వెనుకాల వండిన అన్నం పెద్ద రాశిగా పోసి ఒక దున్నపోతును తెచ్చి పసుపు, కుంకుమలతో అలంకరించి దాని తల నరికేవారు. తర్వాత ఆ తలను అన్నపురాసిపై దేవి విగ్రహాన్ని చూస్తున్నట్లుగా ఉంచేవారు. అలాగే నాలుగు మేకపోతులను బలిఇచ్చి అన్నపు రాశికి నాలువైపులా వాటి తలలను ఉంచి అవి నాలుగు దిక్కులు చూస్తున్నట్లుగా ఉంచేవారు. కాలక్రమేణ చెంచుల సంప్రదాయాలు, సంస్కృతి, ఆచారాలు, వ్యవహరాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. దీనికితోడు జంతు సంరక్షణ సమితితో పాటు మరికొన్ని స్వచ్చంధ సంస్థలు, జంతుప్రేమికుల విన్నపం మేరకు దేవస్థానం పరిధిలో జంతు బలులు నిషేధిస్తూ దేవదాయశాఖ చట్టం చేసింది. దీంతో జంతుబలి నుంచి సాత్వికబలి దిశగా కుంభోత్సవం మారింది. ప్రస్తుతం సాత్వికబలిలో భాగంగా వేలకొద్ది నిమ్మకాయలు, గుమ్మడికాయలు, కొబ్బరికాయలు సమర్పిస్తున్నారు. దేవస్థానం వారితో పాటు స్థానికులు, వ్యాపారులు, తమ గ్రామం, ఊరు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ వందల కేజీల అన్నం, పెసరపప్పుతో కూడిన కుంభాన్ని అమ్మవారికి సమర్పిస్తున్నారు. కుంభోత్సవం రోజు పూజలు ఇలా కుంభోత్సవం రోజున అమ్మవారికి ప్రాతఃకాల పూజలు యధావిధిగా జరిపించబడతాయి. తరువాత అర్చకస్వాములు నవావరణపూజ, త్రిశతి, ఖడ్గమాల, సహస్రనామ, అష్టోత్తరపూజలు, జపపారాయణలు చేస్తారు. అయితే సంప్రదాయాన్ని అనుసరించి ఈ పూజలన్నీ అమ్మవారికి ఏకాంతంలో నిర్వహిస్తారు. కుంభోత్సవం కారణంగా తెల్లవారుజాము నుంచే అమ్మవారి ఆలయ తలుపులు మూసివేస్తారు. సాయంత్రం అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. సాయంత్రం స్వామివారి ప్రదోషకాల పూజల అనంతరం విశేషంగా అన్నాభిషేకం జరిపిస్తారు. అనంతరం స్వామివారి మూలమూర్తిని పూర్తిగా పెరుగన్నంతో కప్పివేస్తారు. నిజరూప దర్శనంఎనిమిది చేతులలో వివిధ ఆయుధాలను ధరించి ఉన్న భ్రమరాంబాదేవి రోజూ అలంకారమూర్తిగా దర్శనమిస్తారు. అమ్మవారికి స్వర్ణముఖకవచం అలంకరింపబడి ఉంటుంది. అయితే, సంవత్సరంలో ఒక్క కుంభోత్సవం రోజున మాత్రమే అమ్మవారి ముఖానికి కవచాలంకరణ ఉండదు. ఆ రోజున భక్తులు అమ్మవారి నిజరూప దర్శనం చేసుకోవచ్చు. రాత్రి 10గంటల సమయంలో అమ్మవారికి పునఃపూజలు, 9 రకాల పిండివంటలతో మహానివేదన గావించాక ఈ ఉత్సవం ముగుస్తుంది. కుంభోత్సవం రోజు సాయంత్రం ప్రధానఘట్టం ప్రారంభమవుతుంది. ఒక పురుషుడు చీరను ధరించి సీ్త్ర వేషంలో అమ్మవారికి హారతి తీసుకువస్తాడు. స్వామివారి ఆలయ ప్రధాన ద్వారం వద్ద విధులను నిర్వహించే ఉద్యోగి సీ్త్ర వేషాన్ని ధరిస్తాడు. స్వామిఅమ్మవార్ల సహస్రదీపాలంకరణ సేవా మండపం నుంచి భాజాభజంత్రీలతో ఈ హారతి తీసుకుని రావడం జరుగుతుంది. దీనికే కుంభహారతి అని పేరు. ఈ హారతి తెచ్చేటప్పుడు సీ్త్ర వేషధారి ముఖం కనపడకుండా చీరకొంగుతో ముసుగువేస్తారు. కుంభహారతి గర్భాలయం వద్దకు చేరుకున్న వెంటనే అర్చకులు గర్భాలయ ద్వారాలు తెరచి ఆ వేషధారి అమ్మవారికి హారతిని సమర్పించి అమ్మవారి తొలిదర్శనం చేసుకుంటారు. అంటే అమ్మవారిని మొదటగా దర్శించుకునేది ఈ సీ్త్ర వేషధారే. శ్రీశైల భ్రమరాంబాదేవికి నేడు వార్షిక కుంభోత్సవం దక్షిణాచార సంప్రదాయంతో జంతు బలులు నిషేధం నాటి చెంచుల ఉత్సవం.. నేడు సకల జనుల ఉత్సవం గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలతో అమ్మవారికి సాత్వికబలి అమ్మవారి నిజరూపదర్శనంతో పులకించనున్న భక్తజనం -
ఉపాధి కల్పనపైనే ప్రత్యేక దృష్టి
కర్నూలు(అగ్రికల్చర్): ఏప్రిల్ నెల మొత్తంగా అన్ని పంచాయతీల్లో ఉపాఽధి పనులు కల్పించడంపైనే దృష్టి సారిస్తామని జిల్లా నీటియాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఐ.నరసింహారెడ్డి తెలిపారు. జిల్లా నీటియాజమాన్య సంస్థ నూతన ప్రాజెక్టు డైరెక్టర్గా ఆయన సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ముందుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం ఇప్పటి వరకు పూర్తి అదనపు బాధ్యతలతో పీడీగా విధులు నిర్వహిస్తున్న మాధవీలత నుంచి నూతన ప్రాజెక్టు డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ ఈ నెల చివరి వరకే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో ఉంటుందని, మే నెల 1 నుంచి నూతన చట్టమైన వీబీజీ రామ్జీ అమలులోకి వస్తుందన్నారు. కొత్త చట్టంపై కూలీలకు, ఉద్యోగులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తామన్నారు. కిరాణా షాపులోకి దూసుకెళ్లిన టిప్పర్ ● తప్పిన ప్రమాదం కోవెలకుంట్ల: పట్టణంలోని జమ్మలమడుగు చౌరస్తాలో సోమవారం సాయంత్రం ఓ టిప్పర్ కిరాణా షాపులోకి దూసుకెళ్లింది. టిప్పర్ గ్రావెల్ లోడ్తో నంద్యాల వైపు వెళుతుండగా పీఆర్ సినిమా థియేటర్ సమీపంలో డ్రైవర్ టిప్పర్ను నిలిపి కిందకు దిగాడు. హ్యాండ్ బ్రేక్ వేయకపోవడంతో రోడ్డు స్లోబుగా ఉండటంతో ముందుకు కదిలి పక్కనే ఉన్న కిరణాషాపు వైపు దూసుకెళ్లింది. రోడ్డుపక్కనఆగి ఉన్న టూవీలర్ వాహనం టిప్పర్ టైర్ల కింద పడి నలిగిపోయింది. తర్వాత టిప్పర్ కిరణాషాపు వరండాను ఢీకొని ఆగిపోయింది. షాపు నిర్వాహకులు గట్టిగా కేకలు వేయడంతో డ్రైవర్ పరిగెత్తుకుంటూ వచ్చి వాహనాన్ని నిలిపి వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. శ్రీశైలం ఘాట్ అటవీ ప్రాంతంలో భారీగా మంటలు శ్రీశైలం: దోర్నాల – శ్రీశైలం ఘాట్ రోడ్లోని తుమ్మలబైలు సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. 222/8 మైలురాయి నుంచి అటవీలోకి మంటలు వ్యాపించినట్లు శ్రీశైలం వస్తున్న వాహనదారుల తెలిపారు. ఈ ఘటన ఎలా జరిగిందో తెలియదు కానీ అటవీ శాఖ అధికారులు త్వరగా స్పందించి మంటలను అర్పే ప్రయత్నం చేయకపోతే అడవిలో మంటలు మరింత విస్తరించే ప్రమాదం ఉందని వారు పేర్కొన్నారు. 15 క్వింటాళ్ల పత్తి దగ్ధం ఆదోని అర్బన్: అమ్మకానికి తెచ్చిన 15 క్వింటాళ్ల పత్తి సోమవారం ఆదోని వ్యవసాయ మార్కెట్యార్డులో కాలిపోయింది. విద్యుత్ తీగ నుంచి వచ్చిన మంటలు పత్తికి అంటుకుని ఈ ప్రమాదం జరిగింది. వెంటనే స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించడంతో ఫైర్ ఇంజన్ ద్వారా మంటలను ఆర్పి వేశారు. పత్తి కాలిపోవడంతో రూ.4 లక్షల వరకు నష్టం వాటిల్లిందని హానువాల్ గ్రామానికి చెందిన బారికి రాజు అనే రైతు తెలిపారు. తగలబడిన పత్తి ఎన్ని క్వింటాళ్లు ఉందో తెలుసుకుని ఇన్సూరెన్స్ వచ్చేటట్లు చర్యలు తీసుకుంటామని యార్డు సెక్రటరీ గోవిందు తెలిపారు. ఘటన స్థలాన్ని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పరిశీలించారు. లారీ దగ్ధం ఆదోని రైల్వేస్టేషన్ నుంచి ఎమ్మిగనూరుకు రేషన్ బియ్యాన్ని అన్లోడ్ చేసి తిరిగి వెళ్తున్న లారీ సోమవారం దగ్ధమయ్యింది. ఆదోని పట్టణ శివారులోని బైపాస్లోని నూతన బ్రిడ్జిపై ఈ దృశ్నాన్ని సూచి అగ్నిమాపక సిబ్బంది సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మంటలను అదుపు చేశారు.లారీలో బ్యాటరీ వద్ద షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు చెలరేగి రూ.2 లక్షలు నష్టం వాటిల్లిందని యజమాని షాషావలి తెలిపారు. ఫీజు చెల్లించలేదని విద్యార్థులకు శిక్ష ● హాల్లో కూర్చోబెట్టిన ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం మంత్రాలయం రూరల్: ఫీజులు చెల్లించలేదని పరీక్ష రాయకుండా విద్యార్థులను హాల్లో కూర్చోబెట్టారు. మంత్రాలయంలోని ఓ ప్రవేట్ స్కూల్ (పరిమళ విద్యా నికేతన్)లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న ఎంఈఓ–2 రాఘన్న.. పాఠశాలను తనీఖీ చేసి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యహక్కు చట్ట ప్రకారం ముందస్తు ఫీజు ఎలా వసూలు చేస్తారన్నారు. నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా.. ఏడుస్తూ ఎనిమిదో వతరగతి తల్లిదండ్రులను పిలుచుకుని వచ్చి ఫీజు చెల్లించారు. -
ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
కర్నూలు(అర్బన్): ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించవద్దని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిటిషనర్లకు ఇచ్చే ఎండార్స్మెంట్ను స్పష్టంగా ఇవ్వడం లేదని, అందువల్ల సంతృప్తి శాతం తగ్గుతోందన్నారు. ముఖ్యంగా రెవెన్యూ, సర్వే శాఖల అధికారులు ఈ అంశంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఒక సర్వేయర్ ఐదుగురు పిటిషనర్లకు సంబంధించి సర్వే చేసినప్పటికీ సర్టిఫికెట్ ఇవ్వనందున అతని ఇంక్రిమెంట్లు కట్ చేశామన్నారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ఖమర్, డీఆర్ఓ సి.వెంకటనారాయణమ్మ, హౌసింగ్ పీడీ చిరంజీవి, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. అర్జీదారులకు కలెక్టర్ ఫోన్ 1100 కాల్ సెంటర్ ద్వారా అర్జీదారులతో జిల్లా కలెక్టర్ ఎ.సిరి స్వయంగా మాట్లాడి వారి సమస్యల పరిష్కారంపై ఆరా తీశారు. రెవెన్యూ శాఖకు సంబంధించి నందవరం మండలం షేక్రియాజ్బీ, ఎమ్మిగనూరు మండలం తార్నాద్, గోనెగండ్ల మండలం బోయ బుడ్డన్న, కల్లూరు మండలం లక్ష్మికాంతరెడ్డితో వారు పెట్టుకున్న అర్జీల వివరాలు తెలుసుకున్నారు. ఆయా అర్జీలపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని సంబంధిత తహసీల్దార్లు, సర్వే అధికారులను ఆదేశించారు. -
1,178 ట్రావెల్స్ బస్సుల తనిఖీలు
● 188 కేసులు నమోదు కర్నూలు: నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై రవాణా శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. డీటీసీ శాంతకుమారి ఆధ్వర్యంలో గత నెల 26 నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 1,178 కాంట్రాక్టు క్యారేజీ బస్సులను తనిఖీ చేసి 188 కేసులు నమోదు చేశారు. నిబంధనలను ఉల్లంఘించిన ఆరు బస్సులను సీజ్ చేశారు. రూ.35,12,130 నగదు జరిమానా విధించారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని స్పెషల్ డ్రైవ్ను కొనసాగిస్తామని డీటీసీ శాంతకుమారి తెలిపారు. -
ఏ‘మనీ’ చెప్పాలి?
నగదు లేక ఖాళీగా ఉన్న ఏటీఎం కేంద్రం కర్నూలు నగరంలో కొన్ని ఏటీఎం సెంటర్లు మూతపడ్డాయి. మరికొన్ని తెరిచి ఉంచినా డబ్బు అంతంతమాత్రమే ఉండటంతో ప్రజలు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లినా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. నగదు కొరతతో కర్నూలులోని కలెక్టరేట్, గాయత్రీఎస్టేట్, బుధవారం పేట, పెద్దాసుపత్రి, యూకాన్, సెంట్రల్ ప్లాజాల్లోని ఏటీఎం కేంద్రాల్లో ఈ దుస్థితి ఏర్పడింది. బ్యాంకు అకౌంట్లలో జమ అయిన వేతనాలు తీసుకోవడానికి ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు -
రాలిపోయిన ఆశలు
2024లో ఎకరాకు సగటున 6–8 టన్నుల దిగుబడి వచ్చింది. 2025లో 2–3 టన్నుల వరకే దిగుబడి పరిమితమైంది. ఈ సారి మామిడిపై పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా నల్ల తామర విజృంభించింది. దీనికి తోడు తేనెమంచు పురుగులు చుట్టుముట్టి తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ సారి జనవరి, ఫిబ్రవరి నెలల్లో పూత ఆశాజనకంగా వచ్చినప్పటికీ వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో పూత, పిందే మొత్తం రాలిపోయింది. మామిడిలో కనిపించని పిందె, కాయలుకర్నూలు(అగ్రికల్చర్): ఏప్రిల్ నెల వచ్చినా మార్కెట్లో మామిడి కనిపించని పరిస్థితి. మామూలుగా మార్చి రెండో వారం నుంచే మధుర ఫలం నోరూరిస్తుంది. మే నెల వరకు మామిడి మార్కెట్ను తనవైపు తిప్పుకుంటుంది. అలాంటిది గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి మామిడి గల్లంతవడం రైతులతో పాటు వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పండించే బేనిసా మామిడి అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధి. దీనినే బంగినపల్లి మామడిగా వ్యవహరిస్తారు. మొదటిసారి ఈ బేనిసా కనిపించని పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 13,256 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ఎకరాకు 70 వరకు చెట్లు ఉంటాయి. మామూలుగా అయితే ఎకరాకు 6 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఉద్యాన శాఖ అధికారుల ప్రకారం ఎకరాకు సగటున 4 టన్నులు వస్తుంది. ఈ ప్రకారం ఉమ్మడి జిల్లాలో దాదాపు 53వేలకు పైగా టన్నుల దిగుబడి రావాలి. గతంలో ఎప్పుడూ లేని విధంగా అనేక తోటల్లో ఎకరాకు కనీసం రెండు క్వింటాళ్ల మామిడి కూడా లేకపోవడం సర్వత్రా ఆందోళనకు గురి చేస్తోంది. డిసెంబర్, జనవరి నెలల్లో కనీవినీ ఎరుగని విధంగా పూత వచ్చింది. ఈ ఆనందం కొద్ది రోజులకే ఆవిరైపోయింది. వచ్చిన పూతలో 95 శాతంపైగా రాలిపోయింది. దాదాపు 10వేల ఎకరాల్లో అస్సలు పంట అనేది లేకుండా పోయింది. మిగిలిన తోటల్లో ఎకరాకు అర్ధ టన్ను వరకు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. లబోదిబోమంటున్న వ్యాపారులు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఓర్వకల్, కల్లూరు, వెల్దుర్తి, క్రిష్ణగిరి, తుగ్గలి, గూడూరు, దేవనకొండ, పత్తికొండ, సి.బెళగల్, హాలహర్వి, ప్యాపిలి, డోన్, బేతంచెర్ల, బనగానపల్లి, కొలిమిగుండ్ల, కోవెలకుంట్ల, అవుకు తదితర మండలాల్లో తోటలు ఉన్నాయి. నవంబర్, డిసెంబర్ నెలల్లోనే వ్యాపారులు తోటలను ఆ సీజన్ వరకు కొనుగోలు చేస్తారు. దిగుబడులు పెంచుకునేందుకు వ్యాపారులు చేయని ప్రయత్నం లేదు. నల్లతామర, తేనెమంచు పురుగుల నివారణకు విచ్చలవిడిగా పురుగుమందులు పిచికారీ చేశారు. పెట్టుబడి వ్యయం పెరిగిందే తప్ప ఉపయోగం లేకుండాపోయింది. కాయలు లేక వెలవెలబోతున్న చెట్లను చూసి వ్యాపారులు లబోదిబోమంటున్నారు. మామిడి పూర్తిగా దెబ్బతినడానికి ప్రధాన కారణం నల్లతామర. నివారణకు తగిన చర్యలు తీసుకునేందుకు రైతులకు అవగాహన కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. ఏప్రిల్ నెలలోనూ కనిపించని మధుర ఫలం ముంచిన నల్లతామర, తేనేమంచు పురుగులు దాదాపు 10 వేల ఎకరాల్లో కనిపించని కాయలు పంట లేక టన్ను ధర రూ.లక్షకు పైనే.. లబోదిబోమంటున్న వ్యాపారులు -
విద్యుత్ సమస్యలకు సత్వర పరిష్కారం
కర్నూలు(అగ్రికల్చర్): విద్యుత్ సమస్యలకు సత్వర పరిష్కారం అందించాలని ఈఈలు, డీఈఈ, ఏడీఈలను విద్యుత్ శాఖ ఎస్ఈ ప్రదీప్కుమార్ ఆదేశించారు. కర్నూలులోని విద్యుత్ భవన్లో సోమవారం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం నిర్వహించారు. వినియోగదారుల నుంచి ఫోన్ ద్వారా వివిధ సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు. బిల్లింగ్, పోల్స్ తదితర సమస్యలపై పలువురు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరువ తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఈ విజయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువు
● రాష్ట్రంలో పోలీసులు పేరుకు మాత్రమే ● శాంతిభద్రతలను గాలికి వదిలేశారు ● ప్రతిపక్షనేతను తిట్టేందుకే అనితకు మంత్రి పదవి ● వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ధ్వజం బొమ్మలసత్రం: ‘అండగా ఉండాల్సిన ఎమ్మెల్యేలే మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. దీనిపై ప్రశ్నిస్తే బహిరంగంగా పోలీసుల సమక్షంలోనే దాడులు చేస్తున్నార’ని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మండిపడ్డారు. సోమవారం నంద్యాల జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఉమ్మడి జిల్లాల మహిళా విభాగం ఆత్మీయ సమ్మేళనం జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళ్యాణి హాజరుకాగా ఎమ్మెల్సీ ఇసాక్బాషా, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సూర్య నారాయణరెడ్డి, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వీ విజయమనోహరి, జోనల్ ఇన్చార్జ్ గాజుల శ్వేతారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ శశికళారెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షురాలు సుజాతమ్మ, కర్నూలు జిల్లా అధ్యక్షురాలు రేణుక పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో వరుదు కళ్యాణి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రజా పోరాటాల నుంచి ఆవిర్భవించిందన్నారు. 2024 ఎన్నికల్లో తప్పుడు హామీలతో కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిందన్నారు. చంద్రబాబు సర్కారు ఏర్పడి 22 నెలలు గడిచినా ఒక్క హామీని సక్రమంగా అమలు చేసిన దాఖలాలు లేవన్నారు. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కూటమి ప్రజాప్రతినిధులే మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారన్నారు. పాలకుల తీరుతో ఇబ్బందులు పడుతున్న మహిళలకు వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందని చెప్పారు. ఇందు కోసం గ్రామ స్థాయి నుంచి మహిళా విభాగం కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక మహిళను గర్భిణి చేసి 5 సార్లు కడుపు తీయించటం దారుణమన్నారు. జరిగిన అన్యాయంపై బాధితురాలు ప్రశ్నిస్తే కర్రతో నడిరోడ్డుపై దాడి చేశారన్నారు. రక్షించాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని మండిపడ్డారు. ఏపీలో శాంతి భద్రతలు లోపించటంతో ఎక్కడ చూసినా గంజాయి, డ్రగ్స్, మద్యం విక్రయాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హోంమంత్రి అనిత ప్రతిపక్షనేతను తిట్టేందుకే సరిపోయారని నియోజకవర్గం దాటి గంజాయి తరలివెళ్తున్నా ఆమెకు పట్టడం లేదన్నారు. పీఏని అడ్డుగా పెట్టుకొని ఆమె వసూళ్లకు పాల్పడుతుందని ఆరోపించారు. పవన్వి అన్ని ప్రగల్భాలే మంత్రి నారా లోకేష్ విద్యాశాఖను గాలికి వదిలేసి ట్విట్టర్లో పోస్ట్ చేయడానికి సరిపోయారని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు మహిళలపై ఎవరైనా దాడులకు పాల్పడితే తాటా తీస్తామని ప్రగల్భాలు పలికిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పుడు నోరు మెదపడం లేదని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాస పరిసరాల్లో మత్తుపదార్థాల విక్రయాలు జరగుతున్నా ఏమీ పట్టనట్టు వ్యవహరించటం దారుణమన్నారు. అధికార తెలుగుదేశం పార్టీ ఎంపీ డ్రగ్స్ సేవించి పట్టుబడితే అతనిపై ఇప్పటి వరకు చర్యలు లేవన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కావాలంటే తిరిగి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్ జగన్ మహిళల కోసం తీసుకొచ్చిన దిశ చట్టాన్ని కూటమి సర్కారు నీరుగార్చిందన్నారు. ఈ బిల్లును టీడీపీ ప్రభుత్వం పార్లమెంట్లో ఎందుకు ప్రవేశపెట్టలేదో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు. కార్యక్రమంలో నంద్యాల మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మాబున్నిసా, మాజీ డైరెక్టర్ సునీతా అమృతరాజ్, జెడ్పీటీసీలు దివ్య, ఖలీమున్నీసా, ఎంపీపీలు వెంకటేశ్వరమ్మ, హుస్సేన్బీ, శారదమ్మ, మాజీ కౌన్సిలర్లు, నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. -
కర్నూలు అభివృద్ధికి కార్పొరేటర్ల కృషి
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డికర్నూలు (టౌన్): కర్నూలు నగర అభివృద్ధికి వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల ఎంతో కృషి చేశారని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. నగరపాలకసంస్థకు చెందిన వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల పదవీ కాలం ముగియడంతో సోమవారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్వీ మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ.800 కోట్లు ఖర్చు చేసి కర్నూలులో ఎన్నో అభివృద్ధి పనులు చేశారన్నారు. నగరంలోని 52 వార్డుల్లో గడపగడపకు వెళ్లి 2021 నుంచి 2026 వరకు ప్రజల సమస్యలు పరిష్కారించామన్నారు. రూ. 28 కోట్లతో నూతన నగరపాలక కార్యాలయం, రూ.28 కోట్లతో సుంకేసుల నుంచి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు వరకు పైపులైన్ పనులు చేశారన్నారు. రాష్ట్రంలోనే అద్భుతంగా మున్సిపల్ పార్కులు అభివృద్ధి చేసి క్రీడా వసతులు కల్పించినట్లు చెప్పారు. అలాగే 2023లో స్వచ్ఛతలో రాష్ట్రంలోనే రెండో స్థానంలో కర్నూలు కార్పొరేషన్ నిలవడం వెనుక ప్రతి కార్పొరేటర్ కృషి ఉందన్నారు. ఇదే ఉత్సాహంతో వచ్చే ఎన్నికలకు సన్నద్ధం కావాలన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్న వారందరికీ పార్టీ అండగా నిలుస్తుందన్నారు. పార్టీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు ఎస్వీ విజయ మనోహరి మాట్లాడుతూ.. మహిళలు పురుషులతో సమానంగా పనిచేస్తారని జగనన్న హయంలో కర్నూలు మహిళా కార్పొరేటర్లు నిరూపించారన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ అమలు చేసిన ఘనత జగనన్నదే అన్నారు. ఐదేళ్ల పాటు నిజాయితీగా పనిచేశారని, భవిష్యత్తులో పార్టీ కోసం పనిచేసి ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. తాజా మాజీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు షరీఫ్, నరసింహులు యాదవ్, వివిధ విభాగాల నాయకులు పాల్గొన్నారు. -
ఉమ్మడి జిల్లాకు 21 నూతన కోర్టులు
కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లాలో 21 నూతన కోర్టులను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జీవో జారీ చేసింది. కర్నూలుకు అదనంగా ఐదు నూత న కోర్టులు, నంద్యాలలో నాలుగు నూతన కోర్టులు మంజూరయ్యాయి. కర్నూలులో 8వ అదనపు జిల్లా కోర్టు, 5వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు, నంద్యాలలో 9వ అదనపు జిల్లా కోర్టుతో పాటు మూడు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు, ఆదోనిలో మొదటి అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టుతో పాటు ఒక జేసీజే కోర్టు మంజూరైంది. ఆళ్లగడ్డ, ఆలూరు, ఆత్మకూరు, బనగానపల్లె, డోన్, నందికొట్కూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, శ్రీశైలంలో ఒక్కొక్క జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు మంజూరయ్యాయి. ఆయా కోర్టులకు అవసరమైన న్యాయమూర్తులు, సిబ్బందిని కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. ఎమ్మిగనూరుకు నూతనంగా సీనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరైంది. -
మరణంలోనూ వీడని బంధం
● మూడు గంటల వ్యవధిలోనే గూళ్యంలో దంపతుల మృతి ● మృతుల కుటుంబానికి ఆలూరు ఎమ్మెల్యే పరామర్శ హాలహర్వి: తోడునీడగా నిలిచిన దంపతులు మరణంలోనూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయారు. కొన్ని గంటల వ్యవధిలోనే తనువు చాలించారు. గూళ్యం గ్రామంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు యమునాసాబ్ తల్లిదండ్రులైన పింజరి ఉలిశేఖన్న(73), ఆయన భార్య ఉలి శేఖమ్మ(70) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఉలి శేఖన్న మృతి చెందారు. ఈ విషయం తెలిసి తీవ్రంగా కలత చెందిన ఉలి శేఖమ్మ అదేరోజు సాయంత్రం 6 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. మూడు గంటల వ్యవధిలోనే భార్యాభర్తలిద్దరూ మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వీరికి నలుగురు సంతానం. ఆలూరు ఎమ్మెల్యే పరామర్శ విషయం తెలుసుకున్న ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి సోమవారం గూళ్యం గ్రామానికి చేరుకున్నారు. మృతదేహాలకు నివాళులు అర్పించి, యమునాసాబ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. నివాళులు అర్పించిన వారిలో వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి హర్ధగేరి శ్రీనివాసులు, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ కార్యదర్శి యల్లప్ప, పార్టీ నాయకులు రామిరెడ్డి, వీరేషప్ప, మండల కార్యదర్శి గోపాల్కృష్ణ, స్థానిక నాయకులు బసవరాజు, శేఖన్న, లింగప్ప, సుంకన్న, కుమార్స్వామి, కార్యకర్తలు ఉన్నారు. -
‘మావిగన్’తో రాష్ట్ర సమగ్రాభివృద్ధి
● ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిచిప్పగిరి: రాష్ట్ర రాజధానిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదిస్తున్న ‘మావిగన్’పై రాష్ట్ర ప్రజలు సుముఖత వ్యక్తం చేస్తున్నారని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్యే మాట్లాడారు. ‘మావిగన్’తో రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల చుట్టూ జాతీయ రహదారులు, సముద్రతీరం ఉందని అన్నారు. ఇవేవి పట్టించుకోకుండా కేవలం అమరావతి రాజధాని పేరుతో ఆ ప్రాంతం రైతులను, ప్రజలను మోసగించడానికే తీర్మానం చేశారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లలో అమరావతి రాజధానిలో ఏం అభివృద్ధి చేసిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. నిర్మాణం పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా అభవృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందన్నారు. అమరావతి నిర్మాణం గ్రాఫిక్స్లో మాత్రమే కనిపిస్తోందని, ఆచరణలో మాత్రం లేదని అన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని అన్నారు. -
హోరాహోరీగా బండలాగుడు పోటీలు
బేతంచెర్ల: స్థానిక చౌడేశ్వరీ దేవి తిరుణాల సందర్భంగా శేషారెడ్డి ఉన్నత పాఠశాల మైదానంలో ఆదివారం పాలపండ్ల విభాగం ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహించారు. పారిశ్రామికవేత్తలు, ఆలయ కమిటీ సభ్యులు గౌరి హుస్సేన్రెడ్డి, మల్లు సుబ్బారెడ్డి పోటీలను ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి ఏడు జతల వృషభాలు పాల్గొనగా.. పోటీలు ఉత్సాహంగా సాగాయి. విజేతలు వీరే.. ప్రథమ, ద్వితీయ స్థానాల్లో గోస్పాడు మండలం సాంబవరానికి చెందిన జూపల్లె ప్రభాకర్రెడ్డి ఎడ్లు నిలిచాయి. తృతీయ స్థానంలో డోన్ మండలం సీసంగంతల మదన్మోహన్రెడ్డి, నాలుగో స్థానంలో దువ్వూరు వీరన్న యాదవ్, డోన్ కృష్ణమోహన్ల ఎడ్లు సంయుక్తంగా నిలిచాయి. ఐదో స్థానంలో బేతంచెర్లకు చెందిన సయ్యద్ నూర్, ఆరో స్థానంలో ఉంగరానిగుండ్ల వెంకటేశ్వర్లు ఎడ్లు నిలిచాయి. విజేతలకు దాతల సహకారంతో రూ. 50 వేల నుంచి రూ. 5 వేల వరకు నగదు పురస్కారాలను అందజేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు రఘురామిరెడ్డి, శేఖర్రెడ్డి, మద్దయ్య, రామస్వామి, అన్నారావు, నాగభూషణంరెడ్డి పాల్గొన్నారు. -
జగ్జీవన్రామ్ ఆశయ సాధనకు కృషి
● జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి కర్నూలు(అర్బన్): డాక్టర్ బాబు జగ్జీవన్రామ్ ఆశయ సాధనకు, సమసమాజ స్థాపనకు ప్రతి ఒక్కరం కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ డా. ఏ సిరి పిలుపునిచ్చారు. ఆదివారం జగ్జీవన్రామ్ 119వ జయంతి వేడుకలను స్థానిక ఆర్ఎస్ రోడ్, ఐదు రోడ్ల కూడలిలోని ఆయన విగ్రహం సమీపంలో ఘనంగా నిర్వహించారు. సాంఘిక సంక్షేమ, సాధికారత అధికారిణి బీ రాధిక అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా బాబు జగ్జీవన్రామ్ చిత్రపటం ముందు జ్యోతి ప్రజ్వలన చేసి, భారీ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. ఏ సిరి మాట్లాడుతూ.. మనిషి అభివృద్ధికి పేదరికం అడ్డురాదని జగ్జీవన్రామ్ నిరూపించారన్నారు. అతి చిన్న వయస్సులోనే ఆయన పార్లమెంట్కు ఎన్నికయ్యారని, సుదీర్ఘకాలం కేంద్రంలో అనేక మంత్రిత్వ శాఖలతో పాటు దేశ ఉప ప్రధాని పదవిని చేపట్టి ఆయా శాఖల్లో తనదైన ముద్రను వేశారన్నారు. సంక్షేమ వసతి గృహాలపై ప్రత్యేక దృష్టి జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలపై ప్రత్యేక దృష్టి సారించామని జిల్లా కలెక్టర్ డా.ఏ సిరి చెప్పారు. 25 ప్రభుత్వ భవనాల్లో పలు రకాల మరమ్మతులకు రూ.7.80 కోట్లు మంజూరు చేశామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 10 వసతి గృహాలకు టాయ్లెట్స్, బాత్రూమ్స్కు రూ.1.69 కోట్లు, 14 వసతి గృహాలకు 351 మస్కిటో మెష్లను ఏర్పాటు చేసేందుకు రూ.9.50 లక్షలను మంజూరు చేశామన్నారు. అలాగే జిల్లాలోని పలు గ్రామాల్లో దళితులకు స్మశానవాటికల ఏర్పాటుకు సంబంధించి అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని ఆర్డీఓలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తామన్నారు. కార్యక్రమంలో సహాయ సంక్షేమాధికారులు బీ మద్దిలేటి, కే బాబు, డీఎస్సీ మహబూబ్బాషా, డీవీఎంసీ నాయకులు మాలతి, సురేష్గౌడ్, ఎస్సీ, ఎస్టీ, ప్రజా సంఘాల నాయకులు గోన నాగరాజు, ఆర్ రాజ్కుమార్, అనంతరత్నం మాదిగ, ఆర్ కై లాస్నాయక్, యోగేష్నాయక్, రాగిరి చంద్రప్ప, కాసారపు వెంకటేష్, సోమసుందరం మాదిగ, నాగేశ్వరి, ఎన్సీహెచ్ బజారన్న, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అలా వచ్చి.. ఇలా వెళ్లారు కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి సభాస్థలి వెనుకనున్న జగ్జీవన్రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించి వెళ్లిపోయారు. సభ ఉదయం 10.30 గంటలైనా ప్రారంభించకపోవడంతో మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్బాబు అసహనంతో వెళ్లిపోయారు. వేదిక చాలా చిన్నదిగా ఏర్పాటు చేశారని కళాకారుడు విజయ్ ఆధ్వర్యంలో కళాకారులు వేదిక ముందు కింద కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. దళిత నేతలంటే లెక్కలేని తనంగా అధికారులు వ్యవహరిస్తున్నారని వాపోయారు. -
ఈత పోటీల్లో నాలుగు స్వర్ణ పతకాలు
నంద్యాల(అర్బన్): కృష్ణా జిల్లా జగ్గయ్య పేటలో ఆదివారం జరిగిన ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి ఈత పోటీల్లో నంద్యాల వాసి కాశీపురం ప్రభాకర్రెడ్డి నాలుగు స్వర్ణ పతకాలు సాధించారు. జగ్గయ్య పేట మున్సిపాలిటీ సౌజన్యంతో డ్రిమర్స్ స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో 50 ప్లస్ మాస్టర్స్ కేటగిరిలో 25 మీటర్ల ఫ్రీ స్టైల్, 25 మీటర్ల బ్యాక్ స్ట్రోక్, 50 మీటర్ల ఫ్రీస్టైల్, 50 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ విభాగాల్లో ప్రభాకర్రెడ్డి మొదటి స్థానంలో నిలిచారు. రెండు రాష్ట్రాల్లోని 29 జిల్లాల నుంచి 300 మందికి పైగా స్విమ్మర్లు పోటీల్లో పాల్గొనగా.. నంద్యాల జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆయన నాలుగు స్వర్ణ పతకాలు కై వసం చేసుకున్నారు. నంద్యాల పట్టణంలోని ప్రొఫెషనల్ స్విమ్మింగ్ పూల్ లేకపోయినా కేసీ కెనాల్లో ప్రాక్టీస్ చేసి పోటీల్లో సత్తా చాటారు. వివాదాస్పద స్థలం పరిశీలన ఉయ్యాలవాడ: పెద్దయమ్మనూరు గ్రామంలో ఇరువర్గాల ఘర్షణకు కారణమైన వివాదాస్పద స్థలాన్ని ఆదివారం అధికారులు పరిశీలించారు. గ్రామంలో సిమెంట్ రోడ్డు నిర్మాణం సంబంధించి జెడ్పీటీసీ సభ్యురాలు పుణ్య లక్ష్మీదేవి, గ్రామ మాజీ సర్పంచ్ కసాని నారాయణమ్మ సొంత స్థలంలో వేయడంతో టీడీపీ వర్గీయులు మహిళా ప్రజా ప్రతినిధులపై శనివారం దాడి చేసిన విషయం విధితమే. ఈ మేరకు తహసీల్దార్ ప్రసాద్బాబు, ఎంపీడీఓ ఉమామహేశ్వరరావు, ఆళ్లగడ్డ టౌన్ సిఐ యుగంధర్బాబు, స్థానిక ఎస్ఐ రామిరెడ్డి పెద్దయమ్మనూరు గ్రామానికి చేరుకుని స్థలం వివాదానికి సంబంధించిన డాక్మెంట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల నాయకులతో స్థలం వివాదానికి సంబందించి ఆన్లైన్లో పరిశీలన చేసి రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. అంత వరకు ఇరువర్గాల వారు ఎలాంటి ఘర్షణలకు పాల్పడరాదని సూచించారు. -
అలరించిన పౌరాణిక నాటకాలు
కర్నూలు కల్చరల్: కళావాహిని సాంస్కృతిక సాహితీ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం సీక్యాంప్ టీజీవీ కళాక్షేత్రంలో ప్రదర్శించిన పౌరాణిక పద్య నాటకాలు అలరించాయి. అల్లూరి సీతారామ రాజు ఏకపాత్రాభినయం, శ్రీకృష్ణ పడక సీను, సత్య హరిశ్చంద్ర అడవి సీను పాత్రలను కళాకారులు శీలం రోషన్న, బెల్డోన కృష్ణమూర్తి, నాగశేషయ్య, దాగంటి శ్రీనివాస్, నారాయణస్వామి నాయుడు, నాగేశ్వరరావు, అరుణ పోషించి అలరించారు. సంస్థ అధ్యక్షుడు మనోహర్బాబు అఽధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కళాకారులు ధనుంజయ, పీజీ వెంకటేశ్వర్లు, మారెన్న, చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు. -
బంగారు ఉంగరం అప్పగింత
మహానంది: మహానందీశ్వరస్వామి దర్శనానికి వచ్చిన భక్తుడు కోనేరులో పోగొట్టుకున్న బంగారు ఉంగరాన్ని దేవస్థానం సిబ్బంది వెతికి అప్పగించారు. బెస్తవారిపేటకు చెందిన నాగరాజు ఆదివారం మహానందికి వచ్చారు. కోనేరులో స్నానం ఆచరిస్తుండగా తన వేలికి ఉన్న మూడు గ్రాముల బంగారు ఉంగరం జారిపోయింది. దీంతో బయటికి వచ్చి గుర్తించిన భక్తుడు నాగరాజు స్థానిక హోంగార్డు నాయక్ దృష్టికి తీసుకురాగా శానిటేషన్ సిబ్బంది మేకల మూగన్న ద్వారా కోనేరులో వెతికించగా ఉంగరం దొరకడంతో ఆలయ సూపరింటెండెంట్ పి. సుబ్బారెడ్డి ద్వారా భక్తుడికి అందించారు.పాలిసెట్కు ఉచిత శిక్షణ కర్నూలు సిటీ: పాలిసెట్కు ఎస్.జి.పుల్లారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఈనెల 4న ఉచిత శిక్షణ ప్రారంభమైంది. విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ ఇవ్వనున్నారు. ఈ నెల 22వ తేదీ వరకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. పదో తరగతి పరీక్షలకు హాజరై పాలిసెట్కు దరఖాస్తు చేసుకున్న వారందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆ కాలేజీ ప్రిన్సిపాల్ ఎంవిఎస్ఎస్ఎన్ ప్రసాద్ తెలిపారు. పూర్తి వివరాలకు 9492403015 నంబరును సంప్రదించవచ్చునని ఆయన పేర్కొన్నారు. జాతీయ పోటీలకు కస్తూర్బా విద్యార్థిని కృష్ణగిరి: స్థానిక కస్తూర్బా విద్యాలయంలో తొమ్మిదో తరగతి చదువుతున్న గొల్ల వర్షిత జాతీయస్థాయి రగ్బీ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ చైతన్యస్రవంతి ఆదివారం తెలిపారు. గతేడాది అక్టోబర్ 23న తూర్పుగోదావరి జిల్లా గన్నవరంలో జరిగిన అండర్–14 స్కూల్ గేమ్స్లో మొదటి స్థానాంలో రాణించగా జాతీయస్థాయికి ఎంపిక అయ్యారన్నారు. ఈ నెల 9 నుంచి భువనేశ్వర్లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో వర్షిత పాల్గొననున్నట్లు ఆమె తెలిపారు. గతంలో కూడా ఈ విద్యార్థిని రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నారన్నారు. విద్యార్థిని ఎంపికకు కృషి చేసిన పీఈటీ సుప్రియను ఆమె అభినందించారు. యువతి అదృశ్యం కోవెలకుంట్ల: మండలంలోని భీమునిపాడుకు చెందిన ఓ యువతి అదృశ్యమైనట్లు ఎస్ఐ మల్లికార్జునరెడ్డి తెలిపారు. ఆదివారం ఎస్ఐ అందించిన సమచారం మేరకు.. గ్రామానికి చెందిన యువతి ఉదయం స్నేహితుల వద్దకు వవెళ్లివస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి ఇంట్లో నుంచి వెళ్లింది. సాయంత్రమైనా తిరిగి రాకపోవడంతో బంధువులు, స్నేహితుల ఇళ్ల వద్ద విచారించినా ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు యువతి అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. మద్యం బాటిళ్ల స్వాధీనం నంద్యాల(అర్బన్): మండలంలోని పెద్దకొట్టాల గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గ్రామానికి చెందిన నాగ హేమంత్కుమార్ బెల్ట్ షాపు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో ఆదివారం దాడి చేసి 26 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. నంద్యాల(అర్బన్): నంద్యాల చిన్నచెరువులో శనివారం ఈతకు వెళ్లి మృతి చెందిన వ్యక్తి ఆచూకీ లభ్యమైంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణానికి చెందిన సయ్యద్ జమాల్బాషా కొడుకులతో కలిసి చిన్న చెరువులో ఈతకు వెళ్లాడు. కొడుకులు కట్టపై వేరే ప్రాంతంలో ఉండగా జమాల్బాషా ఈత కొడుతూ చెరువులో మునిగిపోయాడు. కొద్ది సేపటికి కొడుకులు వచ్చి చూడగా తండ్రి కనిపించలేదు. వెంటనే బంధువులకు సమాచారం ఇవ్వడంతో వారు పోలీసులను తీసుకొచ్చి గాలించగా రాత్రి శవమై కనిపించాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. శిరివెళ్ల: రాముల మాన్యం ప్రాంతంలో పేకాట ఆడుతుండగా పోలీసులు దాడి చేశారు. ముందస్తు సమాచారంతో జరిపిన ఈ దాడిలో ముగ్గురు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ. 1800 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ మధు సూదన్ తెలిపారు. రుద్రవరం: మండలంలోని విద్యుత్ సబ్స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న నలుగురు ఆపరేటర్లను ఉన్నతాధికారులు తొలగించినట్లు ఏఈ రాజశేఖర్ ఆదివారం తెలిపారు. ఎల్లావత్తుల సబ్స్టేషన్ నుంచి హరి, చిన్నకంబలూరు నుంచి పెద్దిరెడ్డి, ఆలమూరు నుంచి నరసింహనాయక్, హరినగరం సబ్బ్ స్టేషన్ నుంచి ఆంజనేయులు అనే నలుగురు ఆపరేటర్లను తొలగించినట్లు తెలిపారు. వారంతా నకిలీ ధ్రువ పత్రాలతో విధుల్లో చేరడంతో వేటు వేసినట్లు వెల్లడించారు. -
హొళగుందలో దాహం కేకలు
హొళగుంద: తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ) నీటిని కడ్లమాగి వద్ద ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో నిల్వ ఉంచినా హొళగుంద గ్రామంలోని ఫిల్టర్బెడ్ సరఫరా కావడం లేదు. దీంతో మంచినీటి ఎద్దడి తలెత్తింది. పంచాయతీ వారు ట్యాంకర్ ఏర్పాటు చేసినా నీరు అందడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు వారాలుగా మంచినీటి కోసం పనులకు, పొలాలకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉండాల్సి వస్తోందని తెలిపారు. ఎస్ఎస్ ట్యాంక్ నుంచి ఫిల్టర్బెడ్కు సక్రమంగా నీరు రావడం లేదని పంచాయతీ సెక్రటరీ రాజశేఖర్గౌడ్ చెప్పారు. -
నంద్యాల అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా..?
నంద్యాల(అర్బన్): నంద్యాల అభివృద్ధికి మాజీ మంత్రి శిల్పా మోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి చేసిన అభివృద్ధిపై టీడీపీ నాయకులు బహిరంగ చర్చకు సిద్ధమా అని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా, వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యవసాయ విభాగం కార్యదర్శి రత్నబాబు చౌదరి, జిల్లా మేధావుల విభాగం అధ్యక్షుడు రసూల్ ఆజాద్ సవాల్ విసిరారు. శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ ద్వారా వేలాది మంది కుటుంబాలకు లబ్ధి పొందుతుంటే ఓర్వలేని టీడీపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. స్థానిక శిల్పా స్వగృహంలో ఆదివారం వైఎస్సార్సీపీ ముఖ్యనేతల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నూనెపల్లె మార్కెట్యార్డులో రెండు ఎకరాల స్థలాన్ని ఏడాదికి రూ.2 వేలకే 33 ఏళ్ల పాటు టీడీపీ కార్యాలయ ఏర్పాటుకు లీజుకు తీసుకోవడం రైతులను వంచించడం కాదా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందన్నారు. శిల్పా కుటుంబంపై టీడీపీ నాయకులు చేస్తున్న వ్యక్తిగత విమర్శలకు తగిన సమయంలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. శిల్పా సహకార్ ద్వారా నిత్యావసరాలపై 10 శాతం రాయితీ ఇస్తుంటే దానిపై విమర్శలు చేయడం సిగ్గు చేటని, టీడీపీ నాయకులకు దమ్ముంటే ఇలాంటి రాయితీ సరుకులను ప్రజలకు అందించి మెప్పు పొందాలన్నారు. నందమూరినగర్ బ్రిడ్జి, ఉర్దూ కాలేజీ పనులను ఇంత వరకు పూర్తి చేయలేకపోవడం దారుణమన్నారు. బొగ్గులైన్ వాసులకు గత ఎన్నికల సమయంలో నకిలీ పట్టాలు ఇచ్చి మోసం చేయడం దుర్మార్గమన్నారు. కేవలం దోచుకోవడమే లక్ష్యంగా టీడీపీ నాయకులు పని చేస్తున్నారని ప్రజలు మిమ్మల్ని గమనించడం లేదనుకోవడం అవివేకమని అన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు టైలర్ శివ, కార్యదర్శి దేవనగర్ బాషా, మాజీ కౌన్సిలర్ చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు. రైతుల భూములను టీడీపీ కార్యాలయాలకు కేటాయించడం దారుణం శిల్పా కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించం -
మార్చురీలో మరణవేదన
మార్చురీలో ప్రస్తుతం ఒక్క వాక్ ఇన్ కూలర్ సౌకర్యం ఉన్న గది మాత్రమే పనిచేస్తోంది. దీనిని శుభ్రం చేయకపోవడంతో అపరిశుభ్రంగా రక్తపు మరకలతో దుర్వాసన కొడుతోంది. ఇందులోనే తాజాగా తీసుకొచ్చిన మృతదేహాలను ఉంచుతున్నారు. వాటిని కూడా నేలపైనే రక్తపు మరకలపై పడుకోబెడుతున్నారు. మూడు బాడీ ఫ్రీజర్లు పనిచేయకపోవడంతో వాటికి తాళాలు వేశారు. ఎంఎల్సీ విషయంలో కొన్నిసార్లు ఆలస్యమయ్యే మృతదేహాలు, అనాథ మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించే విషయంలో కొన్నిసార్లు రోజులు పడుతుంది. అలాంటి వాటిని ఫ్రీజర్లలో ఉంచాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆ సౌకర్యం లేకపోవడంతో వాక్ఇన్ కూలర్లోనే వాటిని ఉంచాల్సి రావడంతో ఆ ప్రాంతం దుర్వాసన కొడుతోంది. ప్రస్తుతం వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువయ్యే కొద్దీ దుర్వాసన ఎక్కువ దూరం వ్యాపిస్తోంది. రాత్రివేళలో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. దీంతో రాత్రివేళల్లో అటువైపు వచ్చేందుకు జనం జంకుతున్నారు. ఈ పరిస్థితుల్లో మార్చురిలో ఉన్న మృతదేహాలను చూసి వారి కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. -
భజేహం..వాయుపుత్రం
దేవనకొండ: మండలంలోని బంటుపల్లి గ్రామంలో ఆంజనేయస్వామి రథోత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. ‘భజేహం..వాయుపుత్రం’ అంటూ గ్రామంలోని పిల్లలు, పెద్దలు, యువకులు అందరూ రథాన్ని లాగి మొక్కులు చెల్లించుకున్నారు. రథోత్సవం అనంతరం నిర్వహించిన కుందేలు పార్వేట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పీఎం సూర్యఘర్ ఉత్సవ్ ప్రారంభం కల్లూరు: ప్రభుత్వ ఆదేశాల మేరకు పీఎం సూర్యఘర్ ఉత్సవ్ కార్యక్రమం ఏప్రిల్ 5 నుంచి 14వ తేదీ (బాబు జగ్జీవన్ రామ్ జయంతి నుంచి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి) వరకు జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్నట్లు విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఆర్.ప్రదీప్కుమార్ అన్నారు. ఆదివారం కల్లూరు మండలం ఎ.గోకులపాడులో పీఎం సూర్యఘర్ ఉత్సవ్ కార్యక్రమం ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీ గృహాలపై పీఎం సూర్య ఘర్ పథకం, రాష్ట్ర ప్రభుత్వ యూఎల్ఏ మోడల్ ద్వారా పెద్ద ఎత్తున సోలార్ రూఫ్టాప్ వ్యవస్థలు ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టినట్లు వివరించారు. జిల్లావ్యాప్తంగా 23,077 గృహాలకు సోలార్ రూఫ్ టాప్ కిట్లు మంజూరయ్యాయన్నారు. డివిజన్ల వారిగా గుత్తేదారులను నియమించి మొదటి దశలో సుమారు 6 వేల గృహాల్లో సోలార్ రూఫ్టాప్ వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. కర్నూలు టౌన్ ఈఈ శేషాద్రి, ఏఈ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. శ్రీశైలంటెంపుల్: లోక కల్యాణం కోసం శ్రీశైల శ్రీభ్రమరాంబాదేవికి మంగళవారం కుంభోత్సవం నిర్వహించనున్నారు. ఈ ఉత్సవంలో గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, అన్నపురాశి మొదలైనవి అమ్మవారికి సాత్వికబలిగా సమర్పిస్తారు. మంగళవారం ఉదయం పూజల అనంతరం అమ్మవారి ఆల యం ముందు రజకునిచే ముగ్గు వేయించి, భ్రమరాంబాదేవికి కొబ్బరికాయలు, నిమ్మకా యలు, గుమ్మడికాయలతో తొలి విడత సాత్వికబలి సమర్పిస్తారు. కుంభోత్సవంలో భాగంగానే హరిహరరాయ గోపురం వద్ద ఉన్న మహిషాసురమర్థిని అమ్మవారికి (కోటమ్మవారికి) ప్రత్యేక పూజాదికాలను జరిపించి సాత్వికబలిగా కొబ్బరికాయలను సమర్పిస్తారు. సాయంత్రం మల్లికార్జున స్వామివారికి ప్రదోషకాల పూజల అనంతరం అన్నాభిషేకం చేపడుతారు. ఆ సమయంలో ఆలయ ద్వారాలు మూసివేస్తారు. అనంతరం అమ్మవారి ఆలయానికి ఎదురుగా సింహ మండపం వద్ద వండిన అన్నం కుంభరాశిగా పోస్తారు. సీ్త్ర వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతిని సమర్పిస్తాడు. అనంతరం రెండోవిడత సాత్వికబలిని సమర్పిస్తారు. తరువాత భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. -
వైఎస్సార్సీపీలో ప్రత్యేక గుర్తింపు
కర్నూలు(సెంట్రల్): వైఎస్సార్సీపీలో నాయకులు, కార్యర్తలకు ప్రత్యేక గుర్తింపు ఉందని, వారికి కొన్ని పదవులు ఇచ్చారని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీమోహన్రెడ్డి తెలిపారు. కర్నూలులోని పార్టీ కార్యాలయంలో ఆదివారం కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇప్పటికే పదవులు పొంది వారికి గుర్తింపు కార్డులు ఇచ్చే ప్రక్రియ ప్రారంభమైందన్నారు. సంబంధిత నాయకుల మొబైల్ నంబర్లకు లింకులు వెళ్లాయని, వారు దానిని క్లిక్ చేస్తే వివరాలు వస్తాయన్నారు. అందులో పేరు, ఫొటో తదితర వివరాలను సరిచూసుకొని ఆమోదం తెలిపితే కార్డులను ప్రింట్కు పంపుతామన్నారు. ఫోన్ నంబర్ తప్పుగా ఉంటే లింక్ రాదని, అ లాంటి వారు పార్టీ కార్యాలయంలో సంప్రదించి సరైన మొబైల్ నంబర్ను ఎంటర్ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
టీడీపీ, బీజేపీ మధ్య భగ్గుమన్న విభేదాలు
● బీజేపీ జెండా కట్ట నిర్మాణంలో వివాదం ● అడ్డుకున్న టీడీపీ నాయకులు నందవరం: నందవరంలో టీడీపీ, బీజేపీల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఆదివారం మండల కేంద్రంలోని స్థానిక సొసైటీ సమీపంలో బీజేపీ నాయకులు జెండా దిమ్మె నిర్మాణానికి పునుకున్నారు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు ఖాశీం వలి, గోపాల్ అడ్డుకున్నారని బీజేపీ మండల నాయకులు గురురాజ్ దేశాయ్ ఆరోపించారు. పోలీసులు దిమ్మె నిర్మాణాన్ని అడ్డుకోవడంతో బీజేసీ నాయకులు ధర్నా చేపట్టి ‘ఇదేమి రాజ్యం..ఇదేమి రాజ్యం..దొంగల రాజ్యం..దోపీడీ రాజ్యం’ ‘నందవరంలో టీడీపీ నాయకుల దౌర్జన్యం నశించాలి’ అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు గురురాజ్ దేశాయ్ మాట్లాడుతూ..సోమవారం బీజేపీ ఆవిర్భా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు పీవిఎన్ మాధవ్, జిల్లా అధ్యక్షుడు అక్కమ్మ తోట రామకృష్ణ ఆదేశాల మేరకు నందవరంలో జెండా ఆవిష్కరణకు దిమ్మెను నిర్మించేందుకు చర్యలు చేపట్టామన్నారు. అయితే కుట్రపూరితంగానే టీడీపీకి చెందిన ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అనుచరులు ఖాశీంవలి, గోపాల్ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని దురుద్దేశంతో దిమ్మె నిర్మాణాన్ని అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లోనే టీడీపీ నాయకులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. బీజేపీ దిమ్మె నిర్మించే చోటే టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన జెండా కట్టలు ఉన్నాయని, తమకు అనుమతులు ఎందుకు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరుపార్టీ నాయకులకుతో ఎస్ఐ తిమ్మారెడ్డి మాట్లాడి సమస్యను పరిష్కరించారు. జెండా కట్ట వద్ద పోలీసు బందోబస్తు చేపట్టారు. -
నగదు కొరత!
● మూతపడుతున్న ఏటీఎంలుకర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో నగదు కొరత ఏర్పడింది. ఫలితంగా జిల్లాలో ఉన్న ఏటీఎంలు మూత పడుతున్నాయి. ఐదారేళ్లుగా డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగిపోయాయి. టీ తాగినా, పల్లీలు కొన్నా.... ఫోన్పేను వినియోగిస్తున్నారు. మొత్తం లావాదేవీల్లో 90 శాతం డిజిటల్ లావాదేవీలే జరుగుతున్నాయి. నగదు సర్క్యులేషన్ గణనీయంగా పడిపోయింది. ఆర్బీఐ నుంచి కూడా దాదాపు నెల రోజుల నుంచి నగదు రావడం లేదు. గతంలో వారానికి కనీసం ఒకసారి నగదు వచ్చేది. ప్రధానంగా ఆర్బీఐ నుంచి రూ.500 నోట్లు వచ్చేవి. ఆర్బీఐ నుంచి జిల్లాల్లోని కరెన్సీ చెస్ట్లకు నగదు సరఫరా దాదాపు నెల రోజులుగా లేకుండా పోయింది. గతంలో పెట్రోలు బంకులు, మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన నగదును బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం జరిగేది. నేడు ఇందులో కూడా డిజిటల్ లావాదేవీలే జరుగుతున్నాయి. దీంతో నగదు సర్క్యులేషన్ తగ్గిపోయింది. డిజిటల్ లావాదేవీలు ఎంతమేర ఉన్నప్పటికీ చేతిలో అవసరాలకు కొంత నగదు ఉంచుకోవడం సర్వసాధారణం. చేతిలో రూ.1000, రూ.2000 ఉంచుకునేందుకు కూడా నగదు లభించడం లేదు. నగదు లేకపోవడంతో జిల్లాలోని ఏటీఎంలు మూతపడుతున్నాయి. ఏటీఎంలో రూ.500 నోట్లు ఉంచే అవకాశం ఉంటుంది. అయితే ఈ నోట్లు కనిపించని పరిస్థితి ఏర్పడటంతో ఏటీఎంలు మూత పడుతున్నాయి. బ్యాంకులు కొన్నింటిని సొంతంగా నిర్వహిస్తున్నాయి. కొన్ని ఏటీఎంలను అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలకు ఇచ్చారు. నగదు లభ్యతను బట్టి బ్యాంకులు ఏటీఎంల్లో పెడుతున్నాయి. పలు బ్యాంకుల్లో కూడా నగదు నిల్వలు పడిపోవడంతో ఏటీఎంలను మూసేశారు. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా పనిచేసే ఏటీఎంలు దాదాపు మూతపడ్డాయి. జిల్లాలో ఎస్బీఐ ఏటీఎంలు 153 ఉన్నాయి. ఇందులో బ్రాంచీల ఆధ్వర్యంలో 63, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా 90 పనిచేస్తున్నాయి. వీటిలో 75 శాతం ఏటీఎంలు పనిచేయడం లేదు. జిల్లాలో అన్ని బ్యాంకులకు సంబంధించి 500కుపైగా ఏటీఎంలు ఉన్నాయి. ఇందులో అత్యధిక ఏటీఎంలు పనిచేయడం లేదు. కలెక్టరేట్లోని ఎస్టీఐ ట్రెజరీ బ్యాంకు ఏటీఎం కొద్ది రోజులుగా మూత పడింది. దీంతో ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్బీఐ నుంచి నగదు ప్రధానంగా రూ.500 నోట్లు సరఫరా పెరిగితేనే ఏటీఎంలు తెరుచుకునే అవకాశం ఉంది. -
టీడీపీ నేతలు దుష్ప్రచారం మానుకోవాలి
● చెన్నకేశవ స్వామి ఆలయ కమిటీ ధర్మకర్త, వైస్చైర్మన్ హితవుగోనెగండ్ల: ఎర్రబాడు గ్రామంలో చెన్నకేశవ స్వామి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన వినోద కార్యక్రమాలను తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుకోవడమేకాక వైఎస్సార్సీపీ నేతలపై దుష్ప్రచారం చేయడం సరికాదని దేవాలయ ధర్మకర్త శ్రీరాములు, వైస్ చైర్మన్ రొగి రాముడు, అర్చకులు మనోహర్స్వామి, కమిటీ సభ్యులు రామచంద్ర గౌడ్, శివ అన్నారు. ఆదివారం వారు విలేకరులతో మాట్లాడుతూ ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఎర్రబాడు గ్రామంలో చెన్నకేశవ స్వామి ఉత్సవాల్లో చెన్నకేశవస్వామి రథోత్సవంతో పాటు వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. ఇందుకు సంబంధించి కరపత్రాల్లో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి, కుడా మాజీ చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి తదితర పేర్లు ముద్రించామన్నారు. ఈ కరపత్రిక చూసిన ఎమ్మెల్యే.. వైఎస్సార్సీపీ నేతల పేర్లు ఉన్నాయని, వాటిని తొలగించి కొత్తగా కరపత్రికలు కొట్టించాలని ఆదేశించగా ఇప్పుడు సమయం లేదని మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటామని చెబితే ఆయన వినిపించుకోలేదన్నారు. తర్వాత వేడుకలకు సహకరించాలని కోరేందుకు గోనెగండ్ల సీఐ వద్దకెళ్లితే సిబ్బంది లేరని చెప్పి వినోద కార్యక్రమాలకు అనుమతి ఇవ్వలేదన్నారు. ఇలా దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలను అడ్డుకొని టీడీపీ నేతలు జరిపించే కార్యక్రమాలను యథావిథిగా నిర్వహించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. దీనికి టీడీపీ నేతలు సమాధానం చెప్పకపోగా సీఐని కలిసి అనుమతి కొరలేదని మాపై దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. గ్రామంలో జరిగే ఉత్సవాలకు రాజకీయ రంగు పూయాల్సిన అవసరం లేదన్నారు. జాతర అంటేనే అన్ని రాజకీయ పార్టీల నాయకులు వస్తారన్నారు. కార్యక్రమంలో ఎర్రబాడు గ్రామస్తులు పాల్గొన్నారు. -
కమనీయం.. స్వర్ణ రథోత్సవం
మంత్రాలయం: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో నడిచే రాఘవేంద్రులుగా పేరుగాంచిన శ్రీ రాఘవేంద్రస్వామి మఠం పూర్వపు పీఠాధిపతి శ్రీసుశమీంద్ర తీర్థులు శతమహోత్సవ మధ్యారాధన వేడుకలు వైభవంగా నిర్వహించారు. శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల నేతృత్వంలో సుశమీంద్ర తీర్థుల మధ్యారాధన వేడుకలు కనులపండువగా నిర్వహించారు. ముందుగా వేద పఠనంతో సుశమీ ంద్ర తీర్థుల మూల బృందావనానికి విశేష పంచామృతాభిషేకం గావించి అలంకరణలతో ప్రత్యేక పూజలు చేపట్టారు. శ్రీమఠం ప్రాంగణంలో సుశమీంద్ర చిత్ర పటాన్ని బంగారు రథంపై శ్రీమఠం ప్రాంగణ పురవీధుల్లో వైభవంగా ఊరేగించారు. గురుసార్వభౌమ సాహిత్య మండలి భజనలు, కీర్తనలు, వేద పాఠశాల విద్యార్థుల వేద మంత్రాలు, మంగళవాయిద్యాల మధ్య రథయాత్ర వైభవంగా సాగింది. సుశమీంద్ర తీర్థులకు టీటీడీ పట్టువస్రాలు శ్రీమఠంలో శ్రీ సుశమీంద్రతీర్థులు శతమహోత్సవ మధ్యారాధన కార్యక్రమాలు వేకువజామున సుప్రభాత సేవతో ప్రారంభమయ్యాయి. టీటీడీ ఆనవాయితీగా పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా శ్రీమఠం మహాద్వారం నుంచి శ్రీ మఠం అధికారులు, సంస్కృత పాఠశాల వేద విద్యార్థులు మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. టీటీడీ అధికారి రామకృష్ణ నేతృత్వంలో శ్రీ సుశమీంద్రుల తీర్థుల ఆరాధన సందర్భంగా పట్టు పస్త్రాలు సమర్పించారు. పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు టీటీడీ పట్టువస్త్రాలను శ్రీ రాఘవేంద్రుల మూలబృందావనం వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేపట్టి మహామంగళ హారతులు గావించారు. అనంతరం శ్రీసుశమీంద్రతీర్థులకు పీఠాధిపతి ఆరాధన చేపట్టారు. -
తన్నుల సేవలో తరించి.. వీరభద్రుడి మొక్కులు తీర్చి!
చిన్నహోతూరులో శనివారం నిర్వహించిన సిద్ధరామేశ్వర స్వామి వసంతోత్సవంలో గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పార్వతీ, పరమేశ్వరుల కల్యాణం, కుడుముల ఆట, నందికోలు, వీరభద్రస్వామి తన్నుల సేవ, వసంతోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయం దగ్గర వీరభద్ర స్వామి అవతారంలో వున్న పూజారి వీరభద్రస్వామి తలపై తట్ట పెట్టుకుని, త్రిశూలం చేత పట్టుకుని కేకలు వేసుకుంటూ భక్తులను తన్నుతూ తిరగడం ఆకట్టుకుంది. ఆయన తన్ను కోసం భక్తులు ఎగబడ్డారు. వీరభద్ర స్వామి ఉగ్రుడై గ్రామ పెద్దలను ఇలా తన్నారని గ్రామస్తులు చెబుతున్నారు. వసంతోత్సవంలో భాగంగా గ్రామంలో కులమతాలకు ఆతీతంగా ప్రజలందరూ గులాబీ రంగు వినియోగించడంతో గ్రామం గులాబీ రంగు మయమైంది. చిన్నా పెద్ద తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగు వేసుకుంటూ ఆనందంగా పాల్గొన్నారు. – ఆస్పరి -
సెల్ఫోన్ దొంగల అరెస్టు
బనగానపల్లె రూరల్ : సెల్ఫోన్ల దొంగలు పోలీసులకు చిక్కారు. విలువైన 30 ఫోన్లతో పాటు, సారా స్వాధీనం చేసుకొని నిందితులను జైలుకు పంపారు. బనగానపల్లె అర్బన్ సీఐ ప్రవీణ్కుమార్ శనివారం పట్టణంలోని స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. హైదరాబాద్కు చెందిన యశ్వంత్ అలియాస్ గుడ్డి ఏసు అనే వ్యక్తి వద్ద గత కొన్నేళ్ల నుంచి రమేష్, లక్ష్ముయ్య, నిఖిల్, చరణ్ అనే నలుగురు వ్యక్తులు పనిచేస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చైన్నె, తిరుపతి,విజయవాడ తదితర జనరద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తిరుగుతూ సెల్ఫోన్లను దొంగిలించి వాటిని యస్వంత్కు అప్పగించడమే వారి పని. ఇందుకుగాను యశ్వంత్ వారికి నెలకు రూ.20 వేల ప్రకారం వేతనంతో పాటు దొంగతనాల కోసం కారు ఇచ్చాడు. గత నెల 31వ తేదీన బనగానపల్లెలో రెండు సెల్ ఫోన్లు చోరీ చేసిన పై నిందితులు శనివారం ఉదయం బనగానపల్లె మీదుగా డోన్ వైపు కారులో వెళ్తున్నారు. యాగంటిపల్లె రహదారిలోని సాయిబాబా గుడి సమీపంలో ఎస్ఐలు దుగ్గిరెడ్డి, కల్పన ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా దొంగలు గమనించి పారిపోయేందుకు ప్రయత్నించారు. గుర్తించిన పోలీసు లు ఆ వాహనాన్ని వెంబడించి పట్టుకోగా కారులో 30 సెల్ ఫోన్లు, సారా ఉంది. ఈ రెండింటితో పాటు కారును స్వాధీనం చేసుకొని విచారించగా సెల్ఫోన్ల చోరీకి పాల్పడుతున్నట్లు దొంగలు అంగీకరించారు. పట్టుబడిన సెల్ఫోన్ల విలువ రూ. 6.50 లక్షలు ఉంటుందని సీఐ వెల్లడించారు. -
ఎంబీబీఎస్ ఫైనల్ పరీక్షల తనిఖీ
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫైనలియర్ పరీక్షలను శనివారం డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ పి.చంద్రశేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సెకండియర్ పార్ట్ 2 పరీక్షలు నిర్వహిస్తున్న కేంద్రం వద్దకు ఆయన నేరుగా వెళ్లి పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు. పరీక్షల నిర్వహణ సంతృప్తికరంగా ఉందని, మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు పలు సూచనలు చేశారు. యూనివర్శిటీ పరిధిలో పరీక్షలన్నీ పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, వాటికి మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు, ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఉండకుండా ఉండేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజీల్లో ప్రత్యేక బృందాలతో ఆకస్మిక తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో రిజిస్ట్రార్ కూడా పరీక్ష కేంద్రాలను తనిఖీ చేస్తారన్నారు. యూనివర్సిటీ విద్యార్థులను అకడమిక్ యాక్టివిటీ మరింత మెరుగుపరుస్తూ రీసెర్చ్ ఆక్టివిటి వైపు, క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు అనేక మార్పులకు శ్రీకారం చుట్టామన్నారు. ఆయన వెంట కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. చిట్టినరసమ్మ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సింధియా శుభప్రద, యూనివర్సిటీ స్పెషల్ అబ్జర్వర్ ప్రొఫెసర్ రంగయ్య, పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజేష్, పరీక్షల నిర్వహణ సిబ్బంది ఉన్నారు. అబ్దుల్ కలాం స్కూల్ ప్రవేశ పరీక్ష రద్దు కర్నూలు సిటీ: డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మున్సిపల్ మెమోరియల్ హైస్కూల్ ప్రవేశ పరీక్షను డీఈఓ ఆదేశాలతో రద్దు చేస్తున్నట్లు ఆ స్కూల్ హెచ్ఎం ఎస్.ఎం హూసేన్, పెరెంట్స్ కమిటీ చైర్మన్ టి.బిల్కీస్ బాను శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రవేశ పరీక్ష ఈ నెల 18వ తేదీన నిర్వహించాల్సి ఉంది. ఇందుకు విద్యార్థుల తల్లిదండ్రులు రూ.100 ఎంట్రీఫీజు చెల్లించారు. ఈ సొమ్మును తిరిగి ఇవ్వనున్నట్లు వారు వెల్లడించారు. ప్రవేశాలపై ఈ ఏడాది జూన్ నెల మొదటి వారంలో సమావేశం నిర్వహించి నిర్ణయం ప్రకటిస్తామన్నారు. -
మద్దిలేటయ్య క్షేత్రం కిటకిట
బేతంచెర్ల: జిల్లాలోని ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రమైన శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామి, అమ్మవార్లకు పంచామృతాభిషేకం, కుంమార్చన, ఆకుపూజ, స్వామి వారికి ప్రీతి పాత్రమైన వరపూజతో పాటు మహా మంగళహారతి నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు మొక్కుబడులు చెల్లించడానికి తరలిరావడంతో మద్దిలేటయ్య నామస్మరణతో ఆలయం మారుమోగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్గకుండా ఉప కమిషనర్ రామాంజనేయులు పర్యవేక్షిస్తూ చర్యలు చేపట్టారు. -
కడివెళ్లలో ప్ర‘జల’ కష్టాలు
ఎమ్మిగనూరుసెంట్రల్: మండలంలోని కడివెళ్ల గ్రామంలో బిందెడు నీటికి ప్రజలు తీవ్ర అష్టకష్టాలు పడుతున్నారు. గ్రామానికి తాగునీటి అందించాలని ఎస్.నాగాలపురం గ్రామం నుంచి పైపులైన్లు వేసినా సక్రమంగా నీటిని సరఫరా చేయడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులకొకసారి, కొన్నిసార్లు వారం అయినా నీటి సరఫరా జరగడం లేదని, దీంతో గుక్కెడు నీటికి నిత్యం యుద్ధం చేయాల్సి వస్తుందని గ్రామస్తులు వాపోతున్నారు. రేపు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులు సమర్పించుకోవచ్చన్నారు. కార్యక్రమాన్ని కలెక్టరేట్తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తామన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడానికి కాల్ సెంటర్ నంబర్ 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. అలాగే అర్జీదారులు meekosam.ap.gov.in అనే వెబ్సైట్లోనూ అర్జీలను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. శ్రీశైలంలో భక్తుల రద్దీ శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. శనివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం వేలాది మంది శ్రీగిరి చేరుకున్నారు. వేకువజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆల య క్యూలైన్ల వద్ద బారులుదీరారు. భక్తుల రద్దీతో ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. భక్తుల శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. గ్యాస్ పంపిణీలో తిప్పలు బనగానపల్లె: పట్టణంలో గ్యాస్ సిలిండర్ల సరఫరా అస్తవ్యస్తంగా మారింది. భారత్ గ్యాస్ వినియోగదారులు సిలిండర్ పొందడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిబంధనల ప్రకారం బుకింగ్ చేసిన 48 గంటల్లోపు డెలివరీ ఇవ్వాల్సి ఉండగా, ఇక్కడ మాత్రం 15 నుంచి 20 రోజులు గడుస్తున్నా అతీగతి లేదని వినియోగదారులు వాపోతున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో బ్లాక్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు డెలివరీ చార్జీల పేరుతో ఏజెన్సీ ప్రతినిధులు ఇష్టానుసారంగా వసూళ్లు చేస్తున్నారు. ఐదు కిలోమీటర్ల లోపు ఉచితంగా అందించాల్సి ఉన్నా, దూరంతో సంబంధం లేకుండా రూ. 50 నుంచి రూ. 60 వరకు అదనంగా అడుగుతున్నారని సమాచారం. -
దేశం సుధాకర్రెడ్డికి వైఎస్ జగన్ పరామర్శ
నంద్యాల: వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్య దర్శి దేశం సుధాకర్రెడ్డిని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం మధ్యా హ్నం ఫోన్లో పరామర్శించారు. పది రోజుల క్రితం ఉయ్యాలవాడ మండలం రూపనగుడి గ్రామంలో బైక్ ప్రమాదంలో గాయపడిన దేశం సుధాకర్రెడ్డి చికిత్స అనంతరం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న జగన్మోహన్రెడ్డి శనివారం దేశం సుధాకర్రెడ్డికి ఫోన్ చేసి ప్రమాదం ఎలా జరిగింది, వైద్య చికిత్స తదితర వివరాలు అడిగి తెలుసుకున్నా రు. డాక్టర్లు చెప్పిన విధంగా సమయానికి మందులు వాడుతూ.. తగిన విశ్రాంతి తీసు కోవా లని సూచించారు. పార్టీ శ్రేణులకు అండగా ఉంటామని, త్వరగా కోలుకోవాలని కోరారు. 7న ఉపాధి కార్యాలయంలో జాబ్మేళా కర్నూలు(సెంట్రల్): జిల్లా ఉపాధి కార్యాల యంలో ఈనెల 7వ తేది ఉదయం 10 గంటలకు ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి పి.దీప్తి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్మేళాకు ఎనోవిజన్, జీపీఎస్ పునరుత్పాదక ఎనర్జీ, బ్లూ స్టార్, అంబర్ తదితర కంపెనీలు హాజరై ప్రొ డక్షన్ ఆపరేటర్లు, మెషిన్ ఆపరేటర్లు, సెక్యూరిటీ గార్డులు, టెలీ కాలర్ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పది ఆపై విద్యార్హత కలిగిన యువతీ,యువకులు జాబ్ మేళాకు హాజరు కావాలని, మరిన్ని వివరాలకు www. ncs. gov. in, www. employ ment. ap.gov.inలో వివరాలు నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు. నిరాశతో వెనుదిరిగిన విద్యార్థులు కర్నూలు సిటీ: ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్షలు ఈ నెల 2వ తేది నుంచి ప్రారంభమయ్యాయి. నగర శివారులోని కేవీ సుబ్బారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన కేంద్రంలో శనివారం జరిగిన పరీక్షలకు నలుగురు విద్యార్థులు ఆలస్యంగా వచ్చారు. అయితే, అప్పటికే కేంద్రంలోకి అనుమతించే సమయం ముగిసిపోవడంతో వారిని లోపలికి పంపలేదు. దీంతో ఆ నలుగురు విద్యార్థులు పరీక్ష రాయకుండా నిరాశతో వెనుదిరిగిపోయారు. అంకితభావంతో పనిచేస్తే విజయం సాధ్యం కర్నూలు(అర్బన్): ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తే విజయం సాధ్యమవుతుందని జిల్లా పంచాయతీ అధికారి జి. భాస్కర్ అన్నారు. అందరి సమిష్టి సహకారం, కృషితో జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో 90 శాతం పన్నుల వసూలు సాధ్యమైందన్నారు. పన్నుల వసూలులో లక్ష్యాన్ని సాధించడం పట్ల శనివారం జిల్లాకు చెందిన డివిజినల్ పంచాయతీ అధికారులు, డిప్యూటీ ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు డీపీఓ భాస్కర్ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కర్నూలు, ఆదోని డీఎల్పీఓలు టి. లక్ష్మి, తిమ్మక్క, డిప్యూటీ ఎంపీడీఓ లు ఈశ్వరయ్య స్వామి, నరసింహులు, నాగేష్, కిషోర్, జేమ్స్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యాన పంటలపై అవగాహన కల్పించాలి ఆలూరు: ఉద్యాన పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి రాజా కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. స్థానిక ఏడీఏ కార్యాలయంలో శనివారం ఆలూరు క్లస్టర్ హార్టికల్చర్ అధికారిణి ఇందిర ఆధ్వర్యంలో సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి జిల్లాలో పదివేల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. జిల్లాలో ప్రస్తుతం తక్కువ నీటితో ఆకుకూరలు, కూరగాయాలు, గోరుచిక్కుడు, బెండ, వంకాయలను సాగుచేసే రైతులకు ప్రభుత్వం డ్రిప్, సబ్సి డీ ఎరువులు, విత్తనాలను ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. -
గమ్యం చేరేదెట్టా?
నంద్యాల నుంచి రేటిగుంట వరకు ప్రస్తుతం ఒకే డెమో రైలు నడుస్తోంది. ఈ రైలు ఉదయం 6.45 గంటలకు కోవెలకుంట్లకు చేరుకుంటుంది. ఈ రైలు వెళ్లిన తర్వాత రాత్రి వరకు రైళ్ల రాకపోకలు లేవు. ఇదే సమయంలో రేణిగుంట నుంచి నంద్యాలకు మరో ప్యాసింజర్ రైలు నడిపితే ప్రయాణికులకు అన్ని విధాలా రైలు ప్రయాణం ఉపయోగకరంగా ఉంటుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ మార్గంలో రైళ్ల సంఖ్యను పెంచాలి. – రాజేశ్వరరెడ్డి, జోళదరాశి గ్రామం, కోవెలకుంట్ల మండలంనంద్యాల– ఎర్రగుంట్ల రైల్వే మార్గంలో గత ఏడాది జూలై నెల నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు నడిచేది. నంద్యాల, వైఎస్సార్ జిల్లాల ప్రజలకు తిరుపతికి వెళ్లేందుకు ఈ రైలు ఎంతో ఉపయోగకరుంగా ఉండేది. ఈ నెల 1వ తేదీ నుంచి ప్రత్యేక రైలును రైల్వేశాఖ అధికారులు రద్దు చేశారు. ప్రస్తుతం ఈ మార్గంలో తిరుపతి ఒకే రైలు ఉండటంతో వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు రైలు ప్రయాణం కష్టతరంగా మారింది. – డీసీ ఉసేన్, కోవెలకుంట్ల కోవెలకుంట్ల: నంద్యాల– ఎర్రగుంట్ల రైల్వే మార్గం లో రైళ్ల రాకపోకలు అంతంత మాత్రంగానే ఉండటంతో రెండు జిల్లాల ప్రయాణికులు అవస్థలు పడుతు న్నారు. ఉమ్మడి కర్నూలు– వైఎస్సార్ జిల్లాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు నంద్యాల నుంచి వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల వరకు 130 కిమీ మేర రైల్వేలైన్ ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, ఉప్పలపా డు, నొస్సం, సంజామల, కోవెలకుంట్ల, బనగాన పల్లె, మద్దూరు, నంద్యాలలో రైల్వేస్టేషన్లు ఉన్నాయి. రెండు జిల్లాల ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచు కుని 2016 ఆగస్టు నెల నుంచి ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. నంద్యాల నుంచి చిత్తూరు జిల్లా రేణిగుంట వరకు డెమో, అనంత పురం జిల్లా ధర్మవరం నుంచి రాష్ట్ర రాజధాని అమరావతి మీదుగా మచిలీపట్నం వరకు, గుంటూరు నుంచి తిరుపతికి ప్రతి రోజు ఎక్స్ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. అయితే ఈ మార్గంలో డెమో రైలు మినహా మిగిలిన ఎక్స్ప్రెస్ రైళ్లు రాత్రి వేళల్లో మాత్రమే తిరుగుతుండటం, ఇటీవలే ఒక ఎక్స్ప్రెస్ రైలును రద్దు చేయడంతో ప్రజలకు రైలు ప్రయాణం కష్టతరంగా మారింది. ఎనిమిది నెలల క్రితం తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా నాందేడ్ నుంచి నంద్యాల మీదు గా తిరుపతికి ప్రత్యేక రైలు తిరుగుతుండేది. నాందేడ్ నుంచి బయలుదేరే ఈ రైలు చర్లపల్లి, పిడుగురాళ్ల, మార్కాపురం, నంద్యాలకు గురువారం ఉదయానికి నంద్యాల చేరుకుని అక్కడి నుంచి బనగానపల్లె, కోవెలకుంట్ల, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల మీదుగా తిరు పతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2.20 గంటలకు తిరుపతి నుంచి బయలు దేరి అదే రోజు రాత్రి 7.40 గంట లకు నంద్యాలకు చేరుకునేది. ఈ ప్రత్యేక రైలును మార్చి 1వ తేదీ నుంచి రద్దు చేయడంతో ఈ మార్గం రెండు ఎక్స్ప్రెస్ రైళ్లుకు మాత్రమే పరిమితమైంది. నంద్యాల– ఎర్రగుంట్ల రైల్వే మార్గంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైళ్ల రాకపోకలను పెంచాలని రెండు జిల్లాల ప్రజలు కోరుతున్నా రైల్వేశాఖ రైళ్ల పెంపును కంటితుడుపుగా చేపడుతోంది. ఉన్న రైలును రద్దు చేయడం, ప్రస్తుతం నడుస్తున్న తిరుపతి రైలుకు కోవెలకుంట్లలో శాశ్వత స్టాపింగ్ లేకపోవడంతో రైల్వేశాఖ ఆరు నెలలకొకసారి స్టాపింగ్ ప్రక్రియను రెన్యువల్ చేయాల్సి వస్తోంది. రైల్వే అధికారులు ఏమాత్రం అనుమతి నిరాకరించినా ఈ ప్రాంత ప్రజలు తిరుపతికి వెళ్లేందుకు కోవెలకుంట్లలో స్టాపింగ్ ఉండదు. నిత్యం వందల మంది ప్రయాణికులు రైలు మార్గం ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. అయితే రైల్వే అధికారులు పగటి వేళ్లలో ఈ మార్గంలో రైళ్లను నడపకపోవడంతో అవస్థలు పడుతున్నారు.● తిరుమల ఎక్స్ప్రెస్ రైలును కడప నుంచి నంద్యాల వరకు పొడిగించాలని ప్రతిపాదన ఉన్నా ఆ రైలును నంద్యాలకు కాకుండా అనంతపురం జిల్లా గుంతకల్లు వరకు పొడిగించడంతో ఈ ప్రాంత ప్రజల ఆశలు అడియాశలయ్యాయి. ● ఆరు నెలల క్రితం అనంతపురం జిల్లా గుంతకల్లు నుంచి ప్రకాశం జిల్లా మార్కాపురంకు కొత్తగా ప్యాసింజర్ రైలును మంజూరు చేశారు. వాస్తవానికి ఈ రైలు గుంతకల్లు నుంచి నంద్యాల మీదుగా కడప వరకు ఉంటుందని ప్రజలు భావించారు. అలా కాకుండా నంద్యాల నుంచి మార్కాపురానికి మార్చడంతో ప్రజలకు నిరాశే మిగిలింది. ఆరు నెలలు గడిచినా గుంతకల్లు– మార్కాపురం రైలు పట్టాలెక్కలేదు. ● ఉత్తర భారదేశానికి రైలు కనెక్టివిటిని విస్తరించేందుకు 2020వ సంవత్సరం నుంచి ఈ మార్గంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైలు నడపాలని ప్రతిపాదన ఉండేది. ఆ ఏడాది కరోనా వ్యాపించడంతో ఆ ప్రాతిపాదనను రైల్వే అధికారులు రద్దు చేశారు. తిరిగి ఈ ప్రతిపాదనపై రైల్వే శాఖ దృష్టి సారించలేదు. నాందేడ్ – నంద్యాల– తిరుపతి రైలు రద్దు ఎర్రగుంట్ల రైల్వేమార్గంలో పట్టాలెక్కని ప్రతిపాదన రైళ్లు అరకొరగా నడుస్తున్న రైళ్లలో కిక్కిరిసి ప్రయాణం రెండు జిల్లాల ప్రయాణికులకు తప్పని నిరీక్షణ -
ప్రైవేట్ పాఠశాలకు షోకాజ్ నోటీసులు
ఆదోని సెంట్రల్: పట్టణంలోని శ్రీబాలాజీ విద్యానికేతన్ ప్రైవేట్ పాఠశాలకు జిల్లా విద్యాధికారి సుధాకర్ శనివారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ పాఠశాలలో శుక్రవారం తరగతి గది పైకప్పు పెచ్చులూడి ఇద్దరు విద్యార్థులు గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జిల్లా విద్యాధికారి స్పందించి శనివారం పాఠశాలకు చేరుకొని తరగతి గదులను పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల నిర్వహణలో నిర్లక్ష్యం సరికాదని యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు అరవింద్, చరణ్ లను పరామర్శించి వైద్యులనడిగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. తర్వాత పాఠశాల నిర్వహణ, ప్రమాదానికి గల కారణాలపై వివరణ ఇవ్వాలని పాఠశాల యాజమాన్యానికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. కాగా సదరు పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని డీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్, ఎస్ఎఫ్ఐ నాయకులు గౌస్, ఉమాకాంత్, జగన్ డీఈఓను కలిసి వినతి పత్రం అందించారు. -
దళిత క్రైస్తవుల ను ఎస్సీలుగానే గుర్తించాలి
కర్నూలు(సెంట్రల్): దళిత క్రైస్తవులను ఎస్సీలుగానే గుర్తించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పునః సమీక్ష చేయా లని కోరారు. శనివారం డీహెచ్పీఎస్ జిల్లా కార్యదర్శి సి.మహేష్ అధ్యక్షతన ఎస్టీయూ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆవుల శేఖర్, సీనియర్ న్యాయవాది వై.జయరాజు, కాంగ్రెస్పార్టీ జిల్లా అధ్యక్షుడు బి.క్రాంతినాయుడు, క్రైస్తవ ఐక్యవేదిక నాయకులు బి.జాషువా దానియేల్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.మునెప్ప, జిల్లా నాయకులు విజయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆవుల్ శేఖర్, సీనియర్ న్యాయవాది జయరాజు మాట్లాడుతూ...డాక్టర్ బీఆర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఒకే తాటి పైకి వచ్చి అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించినట్లు చెప్పారు. అయితే కాలనుగుణంగా రిజర్వేషన్లను మతం ప్రతిపాదికన అన్వయించడం అన్యాయమన్నారు. దళితుడు క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే ఎస్సీ రిజర్వేషన్ చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అన్యాయమన్నారు. వెంటనే సుప్రీంకోర్టు తన తీర్పును పునః సమీక్షించుకోవాలన్నారు. అత్యంత వెనుకబడిన దళితులు క్రిష్టియన్ మతం స్వీకరించినంత మాత్రాన ధనికులు కారన్నారు. వారి జీవన విధానాన్ని సమీక్షించి రిజర్వేషన్ కొనసాగించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు తీర్పుపై సమీక్షకు వెళ్లాలని కోరారు. -
పడిపోయిన టమాట ధర
పెద్దకడబూరు: టమాట రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. మార్కెట్లో మూడుకిలలో ధర రూ.4 పలుకుతోంది. దీంతో పెద్దకడబూరులోని సోమన్నాచారి అనే రైతు తన రెండు ఎకరాల్లో టమాట కాయలను తెంపకుండా అలాగే వదిలేశారు. రెండు ఎకరాల్లో టమాట ను రూ.1.50లక్షల ఖర్చుపెట్టి సాగు చేశానని, మొక్కలకు పందిరి వేసినా దిగుబడికి ధర లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్లో కిలోకు రూ. 2 ధర కూడా రావడం లేదని కన్నీటి పర్యంతమయ్యాడు. అపరిచితులతో డిజిటల్ లావాదేవీలు చేయొద్దు ● ఎస్పీ విక్రాంత్ పాటిల్ కర్నూలు: అపరిచితులు, తెలియని వ్యక్తులతో డిజిటల్ లావాదేవీలు చేయొద్దని ఎస్పీ విక్రాంత్ పాటిల్ జిల్లా ప్రజలకు సూచించారు. ఏటీఎంల వద్ద అపరిచిత వ్యక్తులతో లావాదేవీలు చేయరాదని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ‘అత్యవసరం ఉందని, నగదు ఇస్తాం.. ఫోన్పే, గూగుల్ పే చేయండి.. మేం ఫోన్పే, గూగుల్పే చేస్తాం.. మాకు నగదు డబ్బులివ్వండి’ అని అపరిచిత వ్యక్తులు నమ్మించి మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఏటీఎంలు, బ్యాంకుల ద్వారానే ప్రజలు నేరుగా లావాదేవీలు జరుపుకోవాలి తప్ప అపరిచితులను నమ్మి డిజిటల్ లావాదేవీలు జరపరాదని సూచించారు. తెలియని వ్యక్తులకు ఏటీఎం కార్డులిచ్చి డబ్బులు డ్రా చేసి ఇవ్వాలని కోరవద్దని హెచ్చరించారు. ఎవరైనా సైబర్ మోసానికి గురై ఉంటే 1930 సైబర్ క్రైం హెల్ప్లైన్కు ఫిర్యాదు చేయాలని సూచించారు.రహదారులు బాగుంటేనే గ్రామాల అభివృద్ధి కృష్ణగిరి: రహదారులు బాగుండి, రవాణా సౌకర్యం పెరిగినప్పుడే గ్రామాలు అభివృద్ధిలోకి వస్తాయని రాష్ట్ర పంచాయతీరాజ్ చీఫ్ ఇంజనీర్ విజయకుమారి అన్నారు. వెల్దుర్తి క్రాస్ నుంచి టి.గోకులపాడు, తొగర్చేడు గ్రామాలకు ఇటీవల నాబార్డు నిధులతో వేసిన బీటీ రహదారులను శుక్రవారం ఆమె పరిశీలించారు. రహదారుల నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు తప్పక పాటించాలన్నారు. టి.గోకులపాడు గ్రామ సమీపాన హంద్రీపై బ్రిడ్జి, కటారుకొండ క్రాస్ రహదారి నుంచి పులిచెర్లకు బీటీ రహదారికి ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడారు. ఈమె వెంట పీఆర్ ఈఈ మహేశ్వరరెడ్డి, డీఈ శేషయ్య, క్వాలిటీ కంట్రోల్ డీఈఽ దనిబాబు, మండల పీఆర్ ఏఈ జాకీర్హుసేన్ ఉన్నారు. ఎల్లెల్సీకి నీటి విడుదల హొళగుంద: వేసవిలో ప్రజల గొంతులు తడిపేందుకు తుంగభద్ర జలాశయం నుంచి దిగువ కాలువ(ఎల్లెల్సీ)కు శుక్రవారం టీబీ బోర్డు అధికారులు నీటిని విడుదల చేశారు. డ్యాం నుంచి పవర్ కెనాల్కు విడుదలైన 1,500 క్యూసెక్కులు నీరు గుండ్లకెరె (చెరువు)కు చేరి అక్కడ నుంచి ఎల్లెల్సీకి విడుదలవుతున్నాయి. ప్రస్తుతం వదిలిన నీరు మరో మూడు రోజుల్లో ఆంధ్ర (250 కి.మీ)కు చేరనున్నాయి. దాదాపు 15 రోజుల పాటు నీటిని వదిలి మళ్లీ ఈ నెల 18 లేదంటే 20వ తేదీకి నిలిపివేయనున్నారు. టీబీ డ్యాం పూర్తి స్థామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా ప్రస్తుతం 18.121 టీఎంసీల వరకు నీరు నిల్వ ఉన్నాయి. ఇక భానుడి భగభగలే! కర్నూలు(అగ్రికల్చర్): రానున్న నాలుగు రోజులు జిల్లాలో ఎండలు, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ విభాగం శుక్రవారం ఓ ప్రకటనలో ప్రకటించింది. ఈ నెల 7వ తేదీ వరకు పొడి వాతావరణం( డ్రై వెదర్) ఉంటుందని, ఉష్ణోగ్రతలు 42 నుంచి 43 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు వడదెబ్బకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. -
విండ్ పవర్లో టీడీపీ నాయకుడి పెత్తనం
● వాహనాల యజమానుల నుంచి కమీషన్లు ● తాజాగా సెక్యూరిటీ సూపర్వైజర్పై దాడి సాక్షి టాస్క్ఫోర్స్: అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీలో చిన్న స్థాయి కార్యకర్త నుంచి నాయకుల వరకు రెచ్చిపోతున్నారు. ఏమి చేసినా తమను అడిగేవారు లేరంటూ హద్దుమీరి ప్రవరిస్తున్నారు. దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. కొద్ది రోజులుగా విండ్ పవర్లో పెత్తనం చెలాయిస్తున్న టీడీపీ నాయకుడు తాజాగా సెక్యూరిటీ సూసర్వైజర్పై దాడికి పాల్పడ్డాడు. కొలిమిగుండ్ల మండలం యర్రగుడి సమీపంలోని కొండల్లో ఇండో ఫ్యూచర్ ఎనర్జీస్ సంస్థ విండ్ వపర్ (గాలిమరలు) ఏర్పాటు చేస్తోంది. పరిశ్రమలో ఎవరైనా వాహనాలు, జేసీబీలు తదితర వాహనాలు ఏర్పాటు చేసుకుంటే ఈ గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు రాజగోపాల్ వారి నుంచి నెలకు కొంత మొత్తాన్ని కమీషన్గా ఇవ్వా లని వాహనాల యజమానులను బెదిరిస్తూ వచ్చాడు. అలాగే అక్కడ పని చేస్తున్న కొందరిని మచ్చిక చేసుకు ని హవా నడుపుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 1వ తేదీన యర్రగుడి సమీపంలో విండ్పవర్ వద్ద సెక్యూరిటీ సూసర్వైజర్ శ్రీనివాస యాదవ్పై రాజగోపాల్ దాడి చేశాడు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విండ్ పవర్ సంస్థకు యాక్ట్వ్ ప్రొటెక్షన్ సెక్యూరిటీ సంస్థ 84 మంది సెక్యూరిటీ గార్డులను నియమించింది. అయితే ఏజెన్సీ నుంచి వచ్చే వేతనాలు సక్రమంగా ఇవ్వకుండా మధ్యవర్తులు కోత విధిస్తున్నారంటూ వైఎస్సార్ కడప జిల్లా వద్దిరాలకు చెందిన సెక్యూరిటీ సూపర్వైజర్ శ్రీనివాసయాదవ్ సంస్థలోని ప్రతినిధులను ప్రశ్నిస్తూ వచ్చాడు. గార్డులు సైతం ఈ విషయంలో మద్దతు పలికారు. అందరూ సంతకాలు చేయడంతో కొద్ది రోజుల క్రితం జిల్లా కార్మిక శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. దాడి చేసి.. వేటు వేసి! వేతనాల విషయంలో గార్డుల కడుపుకొడుతున్నారని శ్రీనివాస యాదవ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. అయితే తరచూ ప్రశ్నిస్తునందుకు అడ్డు తొలగించుకోవాలనే దురుద్దేశంతో ఏజెన్సీకి చెందిన కొంత మంది ప్రతినిధులు శ్రీనివాస యాదవ్ను తెలంగాణ రాష్ట్రం నల్గొండకు బదిలీ చేయడంతో వెళ్లేదిలేదని భీష్మించాడు. అయితే తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని గార్డులు సమాచారం ఇవ్వడంతో నాలుగు రోజుల క్రితం అతను సైట్లోకి వెళ్లాడు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకుడు రాజగోపాల్ సంబంధం లేక పోయినా ఐదారుగురిని వెంట తీసుకెళ్లి శ్రీనివాస యాదవ్ను దుర్బాషలాడి దాడికి దిగాడు. గార్డులు అడ్డుపడి కాపాడారు. చివరకు గార్డుల వేతనాల వివాదం పోలీస్ స్టేషన్కు చేరింది. ఏజెన్సీ ప్రతినిధులు, సెక్యూరిటీ సూపర్వైజర్తో మంతనాలు చేపట్టారు. చివరకు అతనికి చెందిన బకాయిలన్నీ ఇచ్చి, నల్గొండకు వెళ్లేలా ఒప్పందం కుదిరినట్లు సమాచారం. -
పాఠశాల పైకప్పు పెచ్చులూడి విద్యార్థులకు గాయాలు
ఆదోని సెంట్రల్: ఆదోని పట్టణంలోని హనుమాన్ నగర్లో ఉన్న శ్రీ బాలాజీ విద్యానికేతన్ పాఠశాల పైకప్పు పెచ్చులూడి ఇద్దరు విద్యార్థులు గాయాలపాలయ్యారు. శుక్రవారం పాఠశాలకు సెలవు ఉన్నప్పటికీ స్పెషల్ క్లాసుల పేరుతో విద్యార్థులను పాఠశాలకు పిలిపించి విద్యాబోధన అందిస్తున్నారు. తరగతులు నిర్వహిస్తున్న సమయంలో పైకప్పు పెచ్చులూడి పడడంతో అరవింద్, చరణ్ అనే ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. స్పందించిన ఉపాధ్యాయులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాలను పర్యవేక్షించి వాటిని సరి చేయాల్సిన అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్రిమినల్ కేసు నమోదు చేయాలి... ఆదోనిలో నిబంధనలకు విరుద్ధంగా చదువులు కొనసాగించిన శ్రీ బాలాజీ విద్యానికేతన్ పాఠశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. పైకప్పు పెచ్చులూడి గాయాలపాలై ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, ఎస్ఎఫ్ఐ పట్టణాధ్యక్ష, కార్యదర్శులు సంజయ్, శశిధర్ పరామర్శించారు. -
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం
కోసిగి: మండల పరిధిలోని కోసిగి– సజ్జలగూడెం గ్రామ రోడ్డులో ఆర్టీసీ బస్సు–బైక్ ఢీకొన్న సంఘటనలో ఓ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు... కోసిగి కడపాళెం వీధిలో నివాసం ఉండే కంపాటి శ్రీనివాసులు, వెంకటలక్ష్మి దంపతుల కుమారుడైన కంపాటి నరసింహులు (16) కోసిగి బాలుర ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ఈనెల 5వ తేది పెద్దనాన్న కుమార్తె ఎంగేజ్మెంట్ ఉంది. శుక్రవారం బడికి సెలవు ఉండటంతో సజ్జలగుడ్డంలోని బంధువులను శుభకార్యానికి పిలిచేందుకు పెద్దనాన్న కుమారుడు విజయ్గోపాల్తో కలిసి బైక్పై వెళ్లాడు. ఆదోని డిపోకు చెందిన ఐరన్గల్లు బస్సు సజ్జలగుడ్డం గ్రామం మీదుగా కోసిగి వైపు వేగంగా వస్తుంది. నాగదేవతల కట్ట వద్ద మలుపులో బస్సును తప్పించబోయి బైక్ అదుపుతప్పి కిందపడ్డాడు. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న విజయ్గోపాల్ బస్సు తప్పించబోయి స్కిడ్ అయి ఎడమవైపు రోడ్డు దిగువ భాగంలో పడిపోయాడు. వెనుక కూర్చున్న నరసింహులు రోడ్డు పై పడడంతో బస్సు టైర్ ఆ విద్యార్థిపై ఎక్కింది. ఈ ఘటనలో ఈ విద్యార్థి అక్కడిక్కడే మృతి చెందాడు. బైక్ నడుపుతున్న విజయ్గోపాల్ స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని చేతికొచ్చిన కుమారుడు మృతి చెందడంతో బోరున విలపించారు. బాలుడి తండ్రి శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మంజునాథ్ తెలిపారు. -
అన్ని రంగాల్లో ప్రభుత్వం ఫెయిల్!
పాణ్యం: చంద్రబాబు ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయ్యిందని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి అన్నారు. టీడీపీ నాయకులు దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజలకు ఏమీ చేయడం లేదని విమర్శించారు. గోరుకల్లు గ్రామంలో శుక్రవారం విలేకరులతో కాటసాని మాట్లాడారు. తన రాజకీయ అనుభవంలో ఇంతలా టీడీపీ నాయకులు దోపిడీకి పాల్పడటం చూడలేదన్నారు. యూరియా, మద్యం, ఇసుక, ఇతర అభివృద్ధి పనుల్లో ఇష్టానుసారంగా దోచుకుంటున్నారని, ఇదేమని ప్రశ్నించిన వారిపై దొంగ కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. అధికార పార్టీ నాయకులకే పనులు చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచిస్తూ కొత్త సంప్రదాయానికి తెరలేపారన్నారు. ఇదే అదనుగా తీసుకున్న కొందరు అధికారులు ప్రజల వినతులను కూడా స్వీకరించకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. టీడీపీ నాయకుల అక్రమాలపై ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపుతున్నారన్నారు. అక్రమ కేసులు బనాయించి సామాన్య ప్రజలను సైతం వేధిస్తున్నారన్నారు. మహిళలపై టీడీపీ నాయకులు, అధికార పార్టీ ఎమ్మెల్యే చేస్తున్న లైంగిక దాడులపై కనీసం చర్యలు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. రాజధాని పేరుతో రేట్లు పెంచి దోచుకుంటున్నారన్నారు. ప్రజల తరఫున వైఎస్సార్సీపీ ఉద్యమాలు ఉధృతం చేస్తుందన్నారు. పార్టీ కోసం కష్టపడే వారికి పదవులు వస్తాయని కాటసాని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చెయ్యకపోవడంపై వైఎస్సార్సీపీ తరఫున పోరాటం చేసిన వారికి సముచిత స్థానం కల్పిస్తున్నామన్నారు. విలేకరుల సమావేశం అనంతరం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ రేగటి పెద్దస్వామిరెడ్డి కుమార్తె వివాహానికి హాజరయ్యారు. పెద్దస్వామి దర్గాలలో ప్రత్యేక ఫాతెహాలు సమర్పించారు. జెట్పీటీసీ మాజీ సభ్యుడు సద్దల సూర్యనారాయణరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు జింకల సుబ్బారెడ్డి, నాగిరెడ్డి, ఉసేన్సా, వెంకటరామిరెడ్డి, లక్ష్మీమద్దయ్య తదితరులు పాల్గొన్నారు. దోచుకోవడం, దాచుకోవడం తప్ప ఏమీ లేదు ప్రజల తరఫున ఉద్యమాలు ఉధృతం చేస్తాం వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి -
వైభవంగా సుశమీంద్ర తీర్థుల ఆరాధన
మంత్రాలయం: శ్రీరాఘవేంద్రస్వామి పూర్వ పీఠాధిపతి సుశమీంద్రతీర్థులు శతమహోత్సవ జయంతి ఆరాధన వైభవంగా నిర్వహించారు. శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో శుక్రవారం వేడుకలు ప్రారంభమయ్యాయి. ముందుగా డోలోత్సవ మండపంలో జ్యోతి ప్రజ్వలనతో ఉత్సవాలకు అంకురార్పణ పలికారు. వేడుకల్లో భాగంగా సుశమీంద్ర తీర్థులు మూలబృందావనానికి ప్రత్యేక పూజలు చేపట్టారు. శ్రీసుశమీంద్ర తీర్థుల బృందావనానికి పంచామృతాభిషేకాలు, మంగళహారతులు చేపట్టారు. అనంతరం శ్రీ సుశమీంద్ర తీర్ధులు చిత్రపటానికి పుష్పార్చన, దీపారాధన చేశారు. ఆరాధన వేడుకలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు మట్లాడుతూ.. శ్రీరాఘవేంద్రస్వామి మఠం గురువులు పూర్వపీఠాధిపతి శ్రీ సుశమీంద్ర తీర్థుల సేవలు మరవరానివి అన్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు, మంత్రాలయం మఠం అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తామన్నారు. అన్నదాన కోసం రెండు లక్షల విరాళం: ప్రముఖ పుణ్యక్షేత్రంలో శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కోసం ఆదోనికి చెందిన మీనప్ప కుటుంబ సభ్యులు రెండు లక్షలు రూపాయలు అందజేసినట్లు శ్రీమఠం మేనేజర్ ఎస్కె.శ్రీనివాసరావు తెలిపారు.అనంతరం ఆ కుటుంబ సభ్యులకు శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు శేషవస్త్రం, ఫలమంత్రాక్షితలతో శ్రీరాఘవేంద్రల జ్ఞాపిక అందజేసి ఆశీర్వదించారు. -
తండ్రి హత్య కేసులో కుమారుల అరెస్ట్
కౌతాళం: ఆస్తి కోసం కన్న తండ్రిని హత్య చేసిన ఇద్దరు కుమారులను, వారికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో విలేకరుల సమావేశంలో సీఐ అశోక్కుమార్ వివరాలు వెల్లడించారు. కుంటనహాల్ గ్రామంలో గత నెల 30వ తేదీన తెల్లవారు జామున నన్నేసాబ్ హత్యకు గురయ్యాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆస్తి కోసం కుమారులే తండ్రిని చంపారని విచారణలో తేలింది. పరారీలో ఉన్న నన్నేసాహెబ్ పెద్దకుమారుడు నూర్ మహమ్మద్, చిన్న కుమారుడు జునైద్, జునైద్ స్నేహితుడు రీహన్ను శుక్రవారం అరెస్ట్ చేశారు. ఆస్తిలో తమ వాటా ఇవ్వకుండా తండ్రి అలసత్వం వహిస్తున్నాడన్న అనుమానంతో మానసికంగా కుంగి నిందితులు తండ్రి హత్యకు పథకం పన్నారు. ఇందులో భాగంగానే ముగ్గరు కలిసి గత నెల 30వ తేదీన ఇంట్లో నిద్రిస్తున్న నన్నేసాబ్ను కత్తితో పొడిచి, కట్టెలతో కొట్టి చంపి అక్కడి నుంచి పారిపోయారు. మృతుడు నన్నేసాబ్ సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి నిందితుల్ని పట్టుకుని వారి వద్ద నుంచి ద్విచక్ర వాహనం, పీడిబాకు, సెల్ఫోన్ను స్వాదినం చేసుకుని నిందితుల్ని రిమాండుకు పంపినట్లు సీఐ తెలిపారు. డోన్ టౌన్: స్థానిక జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో తేనె తుట్టెను తొలగించే క్రమంలో అగ్నిమాపక సిబ్బందిపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ నెల 1వ తేదీ విద్యార్థినులపై తేనె టీగలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీటిని తొలగించడానికి డోన్ అగ్నిమాపక సిబ్బంది శుక్రవారం పాఠశాలకు వెళ్లారు. తేనె తుట్టెను తొలగించడానికి నీళ్లు కొట్టడంతో అవి ఒక్కసారిగా సిబ్బందిపై దాడి చేశాయి. సిబ్బంది పరుగులు తీయాల్సి వచ్చింది. చివరకు ప్రత్యేక దుస్తులు ధరించి వాటర్ గన్ల సాయంతో తుట్టెను తొలగించారు. దీంతో విద్యార్థినులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. డోన్ అగ్నిమాపక కేంద్రం అధికారి రంగస్వామిగౌడ్, లీడింగ్ ఫైర్మన్ ప్రభాకర్, ఆపరేటర్ హరిప్రసాద్, ఫైర్మన్లు మహేశ్వరరెడ్డి, షహన్షా, రంగస్వామి పాల్గొన్నారు. -
లోక రక్షకుడు యేసు ప్రభువు
దేవా.. కరుణామయా గుడ్ఫ్రైడే వేడుకలను క్రైస్తవులు శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. యేసుక్రీస్తు శిలువ యాత్రను కొనసాగించారు. జిల్లా వ్యాప్తంగా చర్చీల్లో ఉదయం నుంచే ప్రత్యేక ప్రార్థనలు చేశారు. శిలువలో క్రీస్తు పలికిన చివరి ఏడు మాటలను మత పెద్దలు వివరించారు. జిల్లా కేంద్రమైన కర్నూలుతో పాటు ఆదోని, ఎమ్మిగనూరు, గుడూరు ప్రాంతాల్లోని ఆర్సీయం, సీఎస్ఐ, ఎబీఎం చర్చీల్లో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బాధాతప్త హృదయాలను కాపాడి శాంతి సందేశాన్ని ఇచ్చిన మహనీయుడు యేసుక్రీస్తు అని మతపెద్దలు అన్నారు. కర్నూలులో శిలువ మోసి బిషప్ గోరంట్ల జ్వాన్వేష్ యాత్ర ప్రారంభించారు. -
వైభవంగా శ్రీవారి రథోత్సవం
క్రిష్ణదొడ్డిలో జనసందోహం మధ్య సాగుతున్న శ్రీ వారి రథోత్సవం సి బెళగల్: మండల పరిధిలోని క్రిష్ణదొడ్డి గ్రామంలో కొండపై వెలసిన శ్రీ కోన వేంకటేశ్వర స్వామి రథోత్సవ కార్యక్రమం శుక్రవారం వైభవంగా సాగింది. శ్రీ వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి స్వామికి భక్తులు ప్రత్యేక పూజలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పూజార్లు గణపతి పూజ, సంప్రోక్షణ గావించి అర్ధరాత్రి 12 గంటలకు కుంభం ప్రారంభించారు. కుంభం కాగు రథం దగ్గరకు చేరుకోగా శుక్రవారం తెల్లవారు జామున 5 గంటలకు మహారథోత్సవం ప్రారంభమైంది. ఈ వేడుకను వీక్షించేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు భారీగా తరలివచ్చారు. పార్వేటకు బయలుదేరిన స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆలయ పూజార్లు వేంకటేశ్వర స్వామికి పార్వేట కార్యక్రమం నిర్వహించారు. ఇందులో శ్రీవారు, అమ్మవారి సమేత ఉత్సవ విగ్రహాలను అశ్వ, గజారోహణం తదనంతరం పల్లకీలో గ్రామంలో ఊరేగించారు. శనివారం ఆది దంపతులకు వసంతోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
జూనియర్ సివిల్ జడ్జిగా మహమ్మద్ ఆజం
కర్నూలు: కర్నూలు మండలం బి.తాండ్రపాడు గ్రామానికి చెందిన మహమ్మద్ ఆజం జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. ఈయన తండ్రి అల్లాబకాష్ కర్నూలు జోనల్ ఇంటెలిజెన్స్ కార్యాలయంలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తుండగా తల్లి షేకున్బీ గృహిణి. మహమ్మద్ ఆజం ప్రాథమిక విద్య కర్నూలులో, పెండేకంటి లా కళాశాల ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్డీ, విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య నేషనల్ యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. ఈ సందర్భంగా మహమ్మద్ ఆజాం మాట్లాడుతూ.. జ్యుడీషియల్ పరీక్షలు రాయాలంటే కృషి, పట్టుదల ప్రధానమని, తల్లిదండ్రులు, చిన్నమ్మ, చిన్నాన్న ప్రోత్సాహం, అధ్యాపకుల మార్గదర్శకత్వంతో రెండో ప్రయత్నంలోనే జూనియర్ సివిల్ జడ్జిగా విజయం సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఆజాంకు శుభాకాంక్షలు తెలిపారు. జడ్జి ఉద్యోగం సాధించిన రాచర్ల యువకుడు ప్యాపిలి: లక్ష్యాన్ని సాధించాలన్న పట్టుదల ఉంటే అనుకున్నది సాధించడం కష్టమేమీ కాదని ఎందరో నిరూపిస్తున్నారు. ఇదే కోవలో రాచర్ల గ్రామానికి చెందిన కిరణ్ కుమార్ రెడ్డి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై అందరికీ ఆదర్శంగా నిలిచారు. రామచంద్రారెడ్డి, విజయలక్ష్మిల కుమారుడు కిరణ్ కుమార్ రెడ్డి రాచర్లలోనే పదో తరగతి, హైదరాబాదులో ఇంటర్ పూర్తి చేశారు. పంజాబ్లోని నేషనల్ లా యూనివర్సిటీలో 2024లో బీఏఎల్ఎల్బీ హానర్స్ పూర్తి చేసి 2025 జనవరిలో జడ్జి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడంతో దరఖాస్తు చేసుకుని ప్రణాళికతో చదివారు. 2025 జూలైలో ప్రిలీమ్స్, అక్టోబర్లో మెయిన్స్ పరీక్షలు రాసి, 2026 మార్చిలో ఇంటర్వ్యూలో ప్రతిభ చాటారు. ఏప్రిల్ 2 వ తేదీ విడుదలైన సెలెక్షన్ జాబితాలో 250 మార్కులకు గాను 175.75 మార్కులు సాధించి జడ్జిగా ఎంపికయ్యారు. చిన్నప్పటి నుంచి మేనమామ కంబిరెడ్డి స్ఫూర్తితో చదివినట్లు కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. జడ్జిగా ఎంపిక కావడం వెనుక తల్లిదండ్రుల పోత్సాహంతో పాటు మేనమామ ప్రోత్సాహం కూడా ఉందన్నారు. తమ గ్రామానికి చెందిన యువకుడు జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపిక కావడంపై రాచర్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. -
దొంగ అరెస్ట్
● రూ. 15 లక్షల విలువైన బంగారు, వెండి నగదు స్వాధీనం నంద్యాల: జిల్లాలోని పలు పోలీసుస్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న దొంగను అరెస్టు చేసినట్లు ఎస్పీ సునీల్ షెరాన్ తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దొంగ వివరాలు వెల్లడించారు. నంద్యాల పట్టణ పరిధిలోని వైఎస్సార్నగర్కు చెందిన షేక్ బాబావలీ నంద్యాల తాలూకా, బండిఆత్మకూరు, రేవనూరు, సంజామల, గడివేముల, బేతంచెర్ల, అవుకు పోలీసు స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడ్డాడు. ఇతనిపై ప్రత్యేక నిఘా ఉంచారు. శుక్రవారం నందమూరి నగర్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా నంబర్లేని బైక్పై వస్తున్న బాబావలీ పోలీసులను చూసి పారిపోతుండగా వెంబడించి పట్టుకున్నారు. అతని నుంచి సుమారు రూ. 15 లక్షల విలువైన 98 గ్రాముల బంగారు నగలు, 400 గ్రాముల వెండి వస్తువులు, రూ.54,500 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుని అరెస్ట్లో కీలక పాత్ర పోషించిన నంద్యాల తాలూకా సీఐ ఈశ్వరయ్య, ఎస్ఐ సురేష్ కుమార్తోపాటు నంద్యాల తాలూకా సిబ్బందిని ఈ సందర్భంగా ఏఎస్పీ మందాజావళి, ఎస్పీ అభినందించారు.దొంగ అరెస్ట్ చూపుతున్న ఎస్పీ సునీల్ షెరాన్స్వాధీనం చేసుకున్న పోలీసులు -
‘మావిగన్’తో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి
కర్నూలు (టౌన్): మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు (మావిగన్) ప్రాంతాల్లోని 110 కిలోమీటర్ల పరిధిలో రూ.20 వేల కోట్ల ఖర్చుతో రాజధానిని అభివృద్ధి చేసుకుంటే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మావిగన్ ప్రతిపాదనకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. శుక్రవారం కర్నూలులో ఆయన మాట్లాడుతూ అమరావతికి వైఎస్సార్సీపీ ఏనాడూ వ్యతిరేకం కాదన్నారు. 2014 నుంచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నా ఎందుకు అమరావతిలో ఇల్లు నిర్మించుకోలేదన్నారు. ఇప్పటికీ చుట్టపు చూపుగా షాడో సీఎం నారా లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ నుంచి మన రాష్ట్రానికి వచ్చి పోతున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఇప్పటికే అమరావతిలో ఇల్లు కట్టుకున్నారన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో చదరపు అడుగుకు రూ.4 నుంచి రూ.6 వేలు ఖర్చు అవడం లేదని... అమరావతి నిర్మాణంలో మాత్రం చదరపు అడుగుకు రూ.12 వేలు ఖర్చు చేస్తున్నారన్నారు. ఇప్పటికే 50 వేల ఎకరాలు తీసుకున్నా ఈ ప్రభుత్వం అక్కడ ఎందుకు ఏ ఒక్క నిర్మాణమూ చేపట్టలేదని ప్రశ్నించారు. మళ్లీ 50 వేల ఎకరాలకు నోటిఫికేషన్ ఇచ్చారని... మొత్తంగా లక్ష ఎకరాలో అభివృద్ధికి రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేయడం అవసరమా అని ప్రశ్నించారు. రాజధాని పేరుతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రూ.లక్షల కోట్లు దోపీడీ చేయడాన్ని వైఎస్సార్సీపీ వ్యతిరేకిస్తోందన్నారు. ఏడేళ్ల సీఎం హోదాలో ఒక్క శాశ్వత బిల్డింగ్ కట్టారా?అమరావతి రాజధాని అని పదే పదే చెబుతున్న చంద్రబాబు నాయుడు ఇప్పటికి రెండో సారి ముఖ్యమంత్రిగా ఏడేళ్లు పూర్తి అవుతున్నా ఎందుకు అమరావతిలో శాశ్వత నిర్మాణాలు చేపట్టలేదని ప్రశ్నించారు. తుప్పలు తొలగించడానికి, వరద నీరు ఎత్తి పోయడానికి, తాత్కాలిక భవనాలకు కోట్లు ఖర్చు చేశారన్నారు. గ్రోత్ ఇంజిన్ లేని ప్రాంతంలో రాజధాని కోసం రూ. 2 లక్షల కోట్లు ఖర్చు చేయడం కన్నా... అందులో 10 శాతం నిధులు మావిగన్ కోసం ఖర్చు చేస్తే సంపద సృష్టించవచ్చన్నారు. చంద్రబాబు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీ (సీఆర్డీఏ) పేరుతో పక్కా వ్యాపారం తప్ప... భూములిచ్చిన రైతులను పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికై నా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపాదించిన ప్లాన్ బి మావిగన్పై దృష్టి సారించాలని సూచించారు. రెండేళ్ల చంద్రబాబు పాలనలో ఇప్పటికే రూ.3.30 లక్షల కోట్ల అప్పులు చేసినా సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదన్నారు. సంపద సృష్టి అంటే వేల కోట్లు అప్పులు చేయడమేనా అని ఎస్వీ ప్రశ్నించారు. సమావేశంలో ఎస్వీ విజయ మనోహరి, నరసింహులు యాదవ్ పాల్గొన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రతిపాదనలకు ప్రజల నుంచి మంచి స్పందన వైఎస్సార్సీపీ కర్నూలు అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి -
బోరుకు తాళం తొలగింపు
పగిడ్యాల: తూర్పు ప్రాతకోట గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయ సమీపాన సీసీ రోడ్డుకు పక్కన ఉన్న చేతి పంప్నకు ఓ వ్యక్తి వేసిన తాళాన్ని పోలీసులు తొలగించారు. ‘చేతి పంప్ బోర్కు తాళం’ అనే శీర్షికతో శుక్రవారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి ముచ్చుమర్రి ఎస్ఐ నరేంద్ర స్పందించారు. శుక్రవారం సిబ్బందితో ఎస్ఐ వెళ్లి వివరాలు తెలుసుకుని తాళాన్ని తొలగించారు. కాగా బోరు వద్ద బండలు పగిలిపోవడం వలన తాళం వేసినట్లు సమీపంలో నివాసముంటున్న వేణు భార్య రాజమ్మ పోలీసుల దృష్టికి తెచ్చారు. గతంలో ఇదే బోరుకు ప్రత్యేక మోటార్ అమర్చి ప్రజలను ఇబ్బందులకు గురి చేయగా ఎంపీడీఓకు ఫిర్యాదు చేసినట్లు గ్రామస్తులు చర్చించుకున్నారు. దళితుల ఆత్మ గౌరవంపై దాడి కోవెలకుంట్ల: నర్సీపట్నంలో డప్పుకొడుతున్న దళితుడిపై అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు దాడి చేయడం వారి ఆత్మ గౌరవంపై జరిగిన దాడిగా వైఎస్సార్సీపీ ఎస్టీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసనాయక్ విమర్శించారు. ఈ సందర్భంగా కోవెలకుంట్లలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అధికార దర్పంతో దళితులపై దాడులు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ ఘటనలో దళిత భాస్కర్రావును స్పీకర్ దుర్భాషలాడి దాడి చేసిన తీరు మరింత ఆవేదన కల్గిస్తోందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి సమాన హక్కులున్నాయన్నారు. అధికార మదంతో ఇలాంటి దాడులు చేయడం అత్యంత బాధాకరమన్నారు. దళితుల గౌరవాన్ని కించపరిచేలా చోటు చేసుకున్న ఘటనకు బాధ్యత వహించి స్పీకర్ ప్రజల ముందు క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో దళిత సమాజం తరుఫున పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడతామని హెచ్చరించారు. మూడు గడివాములు దగ్ధం కల్లూరు: దొడ్డిపాడు గ్రామంలో శుక్రవారం మూడు గడివాములు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన రైతు చిన్న చాంద్ బాషా పశువుల మేత కోసం రెండు వేరుశనగ, ఒక సొప్ప వాము వేసుకున్నాడు. ప్రమాదవశాత్తూ గడివాములకు మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్తో చేరుకుని మంటలను ఆర్పివేశారు. ప్రభుత్వమే ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నాడు. దేవస్థానం ఉద్యోగి సస్పెన్షన్ మహానంది: మహానంది దేవస్థానంలో పనిచేస్తు న్న జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసులును సస్పెన్షన్ చేస్తూ ఈఓ నల్లకాలువ శ్రీనివాస రెడ్డి శుక్రవారం ఆదేశాలు జారీ చేశారని ఆలయ ఏఈఓ ఎరమల మధు తెలిపారు. ఆయన మాట్లాడుతూ జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసులు విధులు సక్రమంగా నిర్వహించకపోవడంతో పాటు నిర్లక్ష్యం వహించారని గుర్తించినట్లు చెప్పారు. విచారణ చేసిన ఈఓ శ్రీనివాస రెడ్డి క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని చెప్పారు. ముగిసిన కంబగిరిస్వామి బ్రహ్మోత్సవాలుఅవుకు (కొలిమిగుండ్ల): కునుకుంట్ల సమీపంలోని ఎర్రమల కొండల్లో వెలసిన సద్దలక్ష్మి సమేత లక్ష్మీకంబగిరిస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ఏప్రిల్ 29న ప్రారంభమైన ఈ వేడుకల్లో మూడు రోజుల పాటు స్వామివారు వివిధ వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు. చివరి రోజు పూర్ణాహుతి, వసంతోత్సవం శాస్త్రోక్తంగా జరిపించారు. భక్తుల సమక్షంలో పారువేట ఘట్టాన్ని వైభవంగా నిర్వహించారు. -
నాసరరెడ్డి సేవలు ఆదర్శం
● జెడ్పీ సీఈఓను సన్మానించిన అధికారులు, ఎంపీడీఓలుకర్నూలు(అర్బన్): తనదైన శైలిలో విధులు నిర్వహించి అందరి మన్ననలను పొందిన జెడ్పీ సీఈఓ జి. నాసరరెడ్డి అందరికీ ఆదర్శమని పులువురు కొనియాడారు. జెడ్పీ సీఈఓగా విధులు నిర్వహిస్తూ డీఎస్జీఎస్డబ్ల్యూఓగా అనంతపురానికి పదోన్నతిపై వెళ్తున్న జి. నాసరరెడ్డి సన్మాన కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం స్థానిక జెడ్పీలోని మినీ మీటింగ్ హాల్లో నిర్వహించారు. జెడ్పీ డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జెడ్పీ సీఈఓ జీవీ రమణారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి జి భాస్కర్, ఆదోని డీడీఓ బాలకృష్ణారెడ్డితో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన ఎంపీడీఓ, జెడ్పీ ఏఓ, సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా డీపీఆర్సీ కోఆర్డినేటర్ మంజులావాణి, ఎంపీడీఓలు జ్యోతి, దస్తగిరిబాబు, దశరథరామయ్య మాట్లాడుతూ నెలలుగా ఎదుర్కొంటున్న అనేక క్లిష్టమైన సమస్యలను కూడా తక్కువ సమయంలోనే సులభంగా పరిష్కరించారని తమ అనుభవాలను వివరించారు. ఫైళ్ల క్లియరెన్స్లో ఎప్పుడు జెడ్పీలో జాప్యం జరగలేదన్నారు. నాసరరెడ్డిని మార్గదర్శకంగా తీసుకొని విధులు నిర్వహిస్తామని పలువురు ఎంపీడీఓలు భావోద్వేగంతో అన్నారు. -
ఉద్యోగుల జీతాల్లో కమీషన్లు దండుకుంటున్న టీడీపీ నేతలు
సాక్షి, నంద్యాల జిల్లా: నంద్యాల జిల్లాలో టీడీపీ అరాచకాలు కొనసాగుతున్నాయి. ప్రైవేట్ కంపెనీ ఉద్యోగుల జీతాల్లో టీడీపీ నేతలు కమీషన్లు దండుకుంటున్నారు. ఇదేమని ప్రశ్నించిన ఉద్యోగులపై టీడీపీ నేత రాజగోపాల్ దాడికి పాల్పడ్డారు. కొలిమిగుండ్లలోని ఇండో ఫ్యూచర్ ఎనర్జీస్ కంపెనీలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డుల జీతాలు ఏజెన్సీ నిర్వాహకులు తగ్గించి ఇస్తున్నారు. కంపెనీ చెల్లిస్తున్న పూర్తి జీతాన్ని ఉద్యోగులకు ఇవ్వకుండా టీడీపీ నాయకులు కమీషన్లు తీసుకుంటున్నారు.సెక్యూరిటీ సూపర్వైజర్గా విధులు నిర్వహించిన శ్రీనివాస్ యాదవ్ను గతంలో ప్రశ్నించినందుకు టీడీపీ నాయకుడు రాజగోపాల్.. ఆయన్ని ఉద్యోగం నుంచి తీయించివేయించాడు. నిరసన తెలుపుతున్న సెక్యూరిటీ సిబ్బందికి మద్దతు తెలిపిన శ్రీనివాస్ యాదవ్, సెక్యూరిటీ గార్డులపై టీడీపీ నేత రాజగోపాల్ దాడి చేశారు.26,330 ఏజెన్సీ వారు సెక్యూరిటీ గార్డులకు జీతాలు చెల్లిస్తుంటే.. టీడీపీ నాయకులు మాత్రం 13,270 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు అంటూ ఉద్యోగులు వాపోతున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం వారిని ఉద్యోగంలో నుంచి తొలగిస్తామంటూ టీడీపీ నాయకులు బెదిరింపులకు దిగుతున్నారు. -
ఆరోగ్యశ్రీ బంద్ కొనసాగింపు
కర్నూలు(హాస్పిటల్): జిల్లాలోని ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఎన్టిఆర్ వైద్యసేవ(ఆరోగ్యశ్రీ) సేవల బంద్ కొనసాగుతోంది. బకాయిల వసూలుకు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ఈ నెల ఒకటో తేది నుంచి సమ్మె చేస్తున్నాయి. గురువారం సైతం మెజారిటీ ఆసుపత్రులు బంద్ పాటించాయి. జిల్లా మొత్తం 60 నెట్వర్క్ ఆసుపత్రులు ఉండగా గురువారం సైతం సగానికి పైగా ఆసుపత్రుల్లో సేవలు నిలిచిపోయాయి. ఆయా ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అని బోర్డు ఏర్పాటు చేశారు. వైద్యసేవ సేవలు కొనసాగిస్తున్న ఆసుపత్రుల్లోనూ కొన్నింటిలో అత్యవసర కేసులు మాత్రమే తీసుకుంటున్నారు. దీంతో అక్కడి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగుతున్న ఆసుపత్రులకు రోగులు వెళ్లాల్సి వస్తోంది. ఆరోగ్యశ్రీ బకాయిల విషయంలో హైకోర్టు సూచనలను ప్రభుత్వం అమలు చేయాలని ఆసుపత్రుల యాజమాన్యాలు కోరుతున్నాయి. ఆర్ఆర్బీ ఉచిత శిక్షణ దరఖాస్తు గడువు పెంపు కర్నూలు(అర్బన్): ఆర్ఆర్బీ గ్రూపు–డీ పోస్టుల ఉచిత శిక్షణ దరఖాస్తు గడువు ఈ నెల 10వ తేది వరకు పొడిగించినట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కె.ప్రసూన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణకు ఉమ్మడి జిల్లాకు చెందిన ఎస్ఎస్సీలో అర్హత సాధించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అర్హులన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు ఫారంను కల్లూరు తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో నేరుగా వచ్చి అందించాలన్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో ఉచిత శిక్షణ 60 రోజుల పాటు కొనసాగుతుందన్నారు. శిక్షణ కాలంలో స్టడీ మెటీరియల్ అందిస్తామని, శిక్షణ పూర్తయిన అనంతరం అర్హులైన వారికి స్టైఫండ్ మంజూరవుతుందన్నారు. వివరాలకు 08518 – 236076, 9652093661 నెంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు. -
జెడ్పీ సీఈఓ బాధ్యతల స్వీకరణ
కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ సీఈఓగా జీవీ రమణారెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ సీఈఓగా విధులు నిర్వహించిన జి.నాసరరెడ్డిని అనంతపురం డీఎస్జీఎస్డబ్ల్యూఓగా నియమించారు. ఈ నేపథ్యంలో కర్నూలు డీడీఓగా విధులు నిర్వహిస్తున్న రమణారెడ్డిని సీఈఓగా నియమిస్తూ పీఆర్అండ్ఆర్డీ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ శశిభూషణ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. నూతన సీఈఓని డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి, డీపీఆర్సీ కోఆర్డినేటర్ మంజులవాణి, కర్నూలు డీఎల్పీఓ టి.లక్ష్మి, జెడ్పీ పరిపాలనాధికారులు, కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జెడ్పీ ఉద్యోగులు విధులను సక్రమంగా నిర్వహించాలన్నారు. నివేదికలను సకాలంలో ఉన్నతాధికారులకు చేరవేయాలన్నారు. ప్రస్తుత వేసవిలో ఎక్కడా తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలకు ప్రథమ స్థానం కర్నూలు(అర్బన్): ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు నిర్వహించడంలో రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025 ఏప్రిల్ నుంచి 2026 ఫిబ్రవరి వరకు 5,500 ప్రసవాలు లక్ష్యం కాగా 7,982 ప్రసవాలను నిర్వహించారన్నారు. ఇందులో సాధారణ ప్రసవాలు 5,881 కాగా, సిజేరియన్ 2,101 కాన్పులు ఉన్నాయన్నారు. 30 శాతానికి మించి సిజేరియన్ కాన్పులు జరగకూడదని, జిల్లాలో 26 శాతం మాత్రమే సిజేరియన్ కాన్పులు చేసి, సాధారణ ప్రసవాలకు పెద్దపీట వేశారన్నారు. ఎంసీహెచ్ ఆదోని, ఎమ్మిగనూరు ఏరియా హాస్పిటల్, పత్తికొండ, ఆలూరు, కోడుమూరు, వెల్దుర్తి, ఓర్వకల్ సీహెచ్సీల్లో ఈ ప్రసవాలు జరిగాయని కలెక్టర్ వివరించారు. రానున్న రెండు రోజుల్లో వడగాడ్పులు కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో రానున్న రెండు రోజుల్లో వడగాడ్పులు, ఎండల తీవ్రత పెరిగే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. శుక్ర, శనివారాల్లో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 42 నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ విభాగం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ సురేష్కుమార్ తెలిపారు. గురువారం కౌతాళంలో 39.4, పెద్దకడుబూరు, రుద్రవరంలలో 39.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దరఖాస్తు గడువు పొడిగింపు ఎమ్మిగనూరుసెంట్రల్: బనవాసి ఏపీ బాలికల గురుకుల కళాశాలలో ఇంటర్మీడియెట్ ప్రవేశానికి దరఖాస్తు గడువును ఈనెల 7వ తేదీ వరకు పెంచినట్లు కళాశాల ప్రిన్సిపాల్ రజిత తెలిపారు. ఆమె మాట్లాడుతూ ఎంపీసీలో 60 సీట్లు, బైపీసీలో 40 సీట్లు, ఎంఈసీలో 30 సీట్లు ఖాళీగా ఉన్నాయని, కళాశాల వైబ్సెట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ముగిసిన పది పరీక్షలు కర్నూలు సిటీ: పదవ తరగతి పరీక్షలు గత నెల 16న మొదలై గురువారంతో ముగిశాయి. జిల్లాలో 160 కేంద్రాల్లో పరీక్షలను పకడ్బందీగా నిర్వహించారు. చివరి పరీక్షకు 34,301 మంది విద్యార్థుల్లో 33,792 మంది హాజరయ్యారు. పరీక్షలు ముగియడంతో విద్యార్థులు కేంద్రాల వద్ద కేరింతలు కొడుతూ స్నేహితులకు వీడ్కోలు పలికారు. హాస్టళ్లలో చదువుకుంటున్న విద్యార్థులు లగేజీలతో సొంత ఊళ్లకు పయనమయ్యారు. పరీక్షలు ముగియడంతో మూల్యాంకనానికి పరీక్షల విభాగం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 6 నుంచి 15వ తేది వరకు నిర్వహిస్తున్న మూల్యాంకనానికి క్యాంపు ఆఫీసర్గా డీఈఓ ఎల్.సుధాకర్ వ్యవహారించనున్నారు. ఇందుకు కావాల్సిన 738 సిబ్బందిని నియమించి, ఆర్డర్లు సైతం ఇచ్చారు. జిల్లాకు ఇప్పటి వరకు 1,03,809 లక్షల వరకు స్క్రీప్ట్లు వచ్చాయి. శ్రీశైలంలో మద్యం పట్టివేత శ్రీశైలం: దేవస్థానం పరిధిలోని దాసరిసత్రం సమీపంలో గురువారం మద్యం విక్రయిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని వారి నుంచి 120 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం విక్రయిస్తున్న ఆత్మకూర్ మండలం సిద్ధాపురం గ్రామానికి చెందిన ఇరగ దిండ్ల రమాక్షి, దుండుగల చంద్రమ్మపై కేసు నమోదు చేసుకొని రిమాండ్ నిమిత్తం ఆత్మకూర్ కోర్టుకు తరలించినట్లు ఎస్ఐ సుబ్బారెడ్డి తెలిపారు. -
మాస్టర్స్ క్రీడల్లో రాష్ట్రస్థాయి గుర్తింపు
కర్నూలు: మాస్టర్స్ క్రీడల్లో జిల్లా పోలీసు శాఖకు రాష్ట్రస్థాయి గుర్తింపు లభించింది. గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో గత నెల 30, 31వ తేదీల్లో 35 – 45 సంవత్సరాల వయస్సు విభాగంలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ శాప్(ఎస్ఏపీ) లీగ్ మాస్టర్స్ క్రీడలలో జిల్లా పోలీసు శాఖకు చెందిన ఆర్ఎస్ఐ మహేశ్వర రెడ్డి, కానిస్టేబుల్ శివకుమార్లు పాల్గొని పథకాలు సాధించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతలైన వీరు గురువారం జిల్లా పోలీసు కార్యాలయం చేరుకుని ఎస్పీ విక్రాంత్ పాటిల్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని ఎస్పీ మెడల్స్, శాలువాతో సన్మానించి అభినందించారు. ఆర్ఎస్ఐ మహేశ్వరరెడ్డి 800 మీటర్ల పరుగుపందెంలో బంగారు పతకం, 1500 మీటర్ల పరుగుపందెంలో వెండి పతకం సాధించారు. అలాగే ట్రాఫిక్ పీఎస్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ శివకుమార్ లాంగ్జంప్లో కాంస్య పతకం సాధించారు. కార్యక్రమంలో ఆర్ఐ జావేద్, మాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పాండురంగారెడ్డి, సెక్రెటరీ రవికుమార్, తదితరులు పాల్గొన్నారు. -
సంక్షేమం లేకుండా ‘గ్రాఫిక్స్’ పాలన
● పేదలకు ఇళ్ల స్థలాల హామీ గంగలో కలిపివేశారు ● అరోగ్యశ్రీకు తూట్లు పొడుస్తున్నారు! ● ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి పత్తికొండ: చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత పేదల సంక్షేమాన్ని పక్కన పెట్టి గ్రాఫిక్స్ మాయాజాలంతో పరిపాలన చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు. గురువారం పత్తికొండ పట్టణంలో ఎస్. రామచంద్రారెడ్డి, నాగరత్నమ్మ దంపతుల నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఎన్నికల్లో అధికారం కోసం చంద్రబాబు ఇచ్చిన హామీలను గద్దెనెక్కిన తరువాత పూర్తిగా మరచిపోయారన్నారు. ఆమరావతి నుంచి రాయలసీమ, ఉత్తరాంధ్రల వరకు అన్ని జిల్లాలో సమగ్ర అభివృద్ధి జరగాలని తమ పార్టీ అధినేత నిర్ణయం అని, రాజధానికి తాము ఎప్పటికీ వ్యతిరేకం కాదన్నారు. అక్కడ జరుగుతున్న భూదందాలకు, రైతులకు జరుగుతున్న అన్యాయాలకు, అక్రమాలకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ పోరాడుతోందన్నారు. తమ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 31వేల ఎకరాలను కోనుగోలు 31.19 లక్షల మంది నిరుపేదలకు పట్టాలు ఇచ్చిందన్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా పేదలకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మూడు, రెండు సెంట్లు స్థలం ఇచ్చి గృహాలు నిర్మిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో నిర్మించిన ఇళ్లకు రంగులు వేసి క్రెడిట్ చోరి చేసి గృహ ప్రవేశాలు చేసుకోవడం సిగ్గు చేటున్నారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్న నెట్వర్క్ అసుపత్రిలకు సకాలంలో బిల్లులు చెల్లించలేదన్నారు. ఫలితంగా గత రెండు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు డీఎ, పీఎఫ్, అరియర్స్ లాంటి బకాయిలు చెల్లించుకుండా దాదాపు రూ. 33 వేలు కోట్లు పెండింగ్ పెట్టినట్లు ఆరోపించారు. నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు, ఉద్యోగులకు చంద్రబాబునాయుడు గ్రాఫిక్స్ మాయాజాలంలో పరిపాలనను చూపుతూ కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. చిత్తశుద్ధి లేదు పేదలపై చంద్రబాబు సర్కార్కు చిత్తశుద్ధి లేదని వైఎస్సార్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, ఆలూరు నియోజకవర్గ పరిశీలకులు ఎస్ రామచంద్రారెడ్డి అన్నారు. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చి రెండు ఏళ్ల గడిచినా నేటి వరకు కొత్త పింఛన్లు అందలేదన్నారు. జగనన్న హయాంలో 65 లక్షల మందికి పింఛన్లు అందజేశామన్నారు. ఈ రెండేళ్లలో దాదాపు 10 లక్షలు మంది పింఛన్దారులను కోతలు పెట్టి తగ్గించారన్నారు. విచ్చలవిడిగా అప్పులు చేయడం తప్ప పేదల సంక్షేమం కోసం పైసా కూడా ఖర్చు చేయడంలేదన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయడంతో పేదలకు విద్య, వైద్య రంగాల్లో తీరని నష్టం కలుగుతోందన్నారు. జిల్లా పశ్చిమ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే వేదావతి, గుండ్రేవుల ప్రాజెక్టులు నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర మేధావుల ఫోరం అధికార ప్రతినిధి శ్రీరంగడు, నాయకులు హోసూరు చంద్రశేఖర్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, వార్డు మెంబర్లు టైలర్ రంగన్న, రామాంజినేయులు, లింగన్న, మహమ్మద్, కాశీ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
అర నిమిషంలో గుండె సమస్యలపై నివేదిక
కర్నూలు(హాస్పిటల్): రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సహకారంతో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ‘కార్డియో స్లీవ్’ వ్యాలిడేషన్ పరీక్షల్లో భాగంగా 30 సెకన్లలోనే గుండె వైఫల్యాలను గుర్తించి నివేదికలు ఇస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు చెప్పారు. గురువారం ఆసుపత్రిలో ‘రిజువెన్ మెడికేర్’ ఏఐ వ్యాలిడేషన్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా వచ్చిన 300 దరఖాస్తులలో 18 వినూత్న కంపెనీలను ఎంపిక చేశారన్నారు. ఆ జాబితాలో రిజువెన్ మెడికేర్ ఇండియా సంస్థ వారి కార్డియో స్లీవ్ పరికరం పనితీరు పరీక్షించినట్లు చెప్పారు. ఈ పరికరం ద్వారా 30 సెకన్లలోనే గుండె సమస్యలను 93 శాతం కచ్చితత్వంతో గుర్తించవచ్చన్నారు. కార్డియాలజీ డాక్టర్లు ప్రశాంత్, కె.రవికిరణ్, రిజువెన్ సంస్థ ప్రతినిధులు బాలాజి లంక, ఉమా మహేష్ కట్టా, శాంతి పచ్చిపాల పాల్గొన్నారు. జీసస్ అక్షరాలతో యేసు చిత్రంనంద్యాల(వ్యవసాయం): పట్టణానికి చెందిన బ్యాంకు ఉద్యోగి మాణిక్యరావు గుడ్ఫ్రైడే పురస్కరించుకొని జీసెస్ అక్షరాలతో మైక్రో ఆర్ట్ చిత్రాన్ని గురువారం చిత్రించారు. ఆయన మాట్లాడుతూ.. జీసెస్ పేరులోని అక్షరాలతో చిత్రాన్ని చిత్రీకరించినట్లు చెప్పారు. -
బస్సు ఢీకొని యువకుడి దుర్మరణం
శిరివెళ్ల: ఆళ్లగడ్డ– నంద్యాల జాతీయ రహదారిపై గోవిందపల్లె సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొని గుండంపాడుకు చెందిన గాలి ప్రవీణ్కుమార్ (25) మృతి చెందాడు. ఘటనపై ఎస్ఐ మధుసూదన్ తెలిపిన వివరాలు.. ప్రవీణ్కుమార్ నంద్యాలలో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. అతనికి యర్రగుంట్లకు చెందిన అనుష్కతో గతేడాది వివాహమయ్యింది. ఆమె గర్భిణి కావడంతో పుట్టింట్లో ఉన్న భార్యను చూసేందుకు ఈ నెల 1వ తేదీన రాత్రి ప్రవీణ్కుమార్ నంద్యాల నుంచి బైక్పై బయలుదేరాడు. నంద్యాల డిపోకు చెందిన బస్సు మరమ్మతులు చేయించుకొని సర్వీస్ రోడ్డుపై నుంచి జాతీయ రహదారిపైకి వెళ్లే క్రమంలో బైక్పై వస్తున్న యువకుడిని ఢీకొట్టింది. ప్రమాదంలో ప్రవీణ్కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి జోజప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. 9న రైతు సంబరాలు శిరివెళ్ల: కాలేషా మస్తాన్ వలి ఉరుసు సందర్భంగా దాతల సహకారంతో ఈ నెల 9వ తేదీన యర్రగుంట్లలో రాష్ట్రస్థాయి రైతు సంబరాలు (ఎద్దుల పందేలు) నిర్వహించనున్నట్లు దర్గా నిర్వాహకుడు శంకర్ గురువారం తెలిపారు. ఒంగోలు జాతి సీనియర్ విభాగంలో రాతి దూళం లాగే పందెంలో గెలుపొందిన వృషభ రాజముల యజమానులకు మొదటి బహుమతి రూ.70 వేలు తరువాతి స్థానాలకు వరుసగా రూ.60 వేలు, రూ.50 వేలు, రూ.40 వేలు, రూ.35 వేలు, రూ.30 వేలు, రూ.25 వేలు, రూ.20 వేలు, రూ.10 వేలు, రూ.5 వేలను అందించనున్నట్లు వెల్లడించారు. అలాగే 8వ తేదీన గాడిదల పందేలు జరుగుతాయన్నారు. గెలుపొందిన గాడిదల యజమానులకు మొదటి బహుమతి రూ.10 వేలు, తరువాతి స్థానాలకు రూ.6 వేలు, రూ.3 వేలు అందించనున్నట్లు వెల్లడించారు. వెల్దుర్తి: స్థానిక రాణితోటకు చెందిన ఎరుకల జయంత్ (9) కర్నూలు ఆసుపత్రిలో కడుపునొప్పితో చికిత్స పొందుతూ కొలుకోలేక గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. గౌండ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్న రమేశ్, రాజేశ్వరి దంపతులకు ఇద్దరు కుమారులు,కుమార్తె సంతానం. పెద్ద కుమారుడు జయంత్ స్థానిక శర్మాస్ యూపీ స్కూల్లో రెండో తరగతి చదువుతున్నాడు. గత నెల 31న జ్వరం, వాంతులతో స్థానిక సీహెచ్సీలో చేరాడు. ఈ నెల 1న కడుపునొప్పి, ముఖం వాపు తీవ్రం కావడంతో వైద్యులు కర్నూలుకు రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మృత్యువాత పడ్డాడు. దీంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. బస్సు దిగుతూ మృత్యువాత దొర్నిపాడు: ఆళ్లగడ్డ ఆర్టీసీ బస్టాండులో బస్సు దిగుతూ దొర్నిపాడుకు చెందిన సాలయ్య (60) అనే వ్యక్తి గురువారం మృతి చెందాడు. ఆయన ఒంటిమిట్టలో స్వామివారి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణం అయ్యారు. అలసట, కళ్లు తిరగడం వంటి లక్షణాలతో ఆళ్లగడ్డ చేరుకున్నారు. బస్టాండులో బస్సు దిగుతూ కిందపడిపోయాడు. అక్కడున్న వారు 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. వైద్యుడికి చార్జ్ మెమో చాగలమర్రి: మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుడిగా పనిచేస్తున్న డాక్టర్ ఇమ్రాన్కు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి చార్జి మెమో జారీ అయినట్లు వైద్యాధికారిణి అంజలి తెలిపారు. హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ, ఆరోగ్యశ్రీ, జేఎస్ఎస్కే తదితర పథకాల నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. నిధుల వినియోగంలో నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు తోటి వైద్యులు, సిబ్బందితో పాలనాపరమైన సమన్వయం పాటించడంలో విఫలమయ్యారని అభి యోగాలు నమోదయ్యాయి. దీనివల్ల పీహెచ్సీ పనితీరుకు ఆటంకం కలిగిందని మెమోలో పేర్కొన్నారు. మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, లేనిపక్షంలో శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆదేశించినట్లు డాక్టర్ అంజలి వివరించారు. క్రీస్తు ప్రేమను ప్రపంచమంతా చాటాలి కర్నూలు (టౌన్): క్రీస్తు ప్రేమను ప్రపంచవ్యాప్తంగా చాటాలని కర్నూలు డయాసిస్ బిషప్ గోరంట్ల జ్వాన్నేష్ పిలుపునిచ్చారు. పవిత్ర గురువారం పురస్కరించుకొని స్థానిక నంద్యాల చెక్పోస్టులోని లూర్థుమాత కథిడ్రల్ బిషప్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన దైవసందేశమిస్తూ క్రీస్తును ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలన్నారు. ఆనాడు క్రీస్తును శిలువలో కొట్టే ముందు శిష్యుల పాదాలు కడిగి సోదరభావాన్ని చాటారన్నారు. గుడ్ఫ్రైడే సందర్భంగా శుక్రవారం చిల్డ్రన్స్ పార్కు వద్ద ఉన్న థెరిసమ్మ చర్చి నుంచి నంద్యాల చెక్పోస్టు బిషప్ చర్చి మీదుగా ప్రేమగిరికి భక్తిశ్రద్ధలతో శిలువ యాత్ర నిర్వహిస్తున్నామని, ప్రతిఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. -
జిల్లాలో వెటర్నరీ జనరిక్ మందుల దుకాణాలు
కర్నూలు(అర్బన్): జిల్లాలో పొట్టేళ్లు, మేకలు, గొర్రెల సంఖ్యను ప్రామాణికంగా తీసుకొని ఐదు ప్రాంతాల్లో పశు జనరిక్ మందుల దుకాణాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గురు వారం మధ్యాహ్నం కలెక్టర్ చాంబర్లో పశు సంవర్ధక శాఖకు చెందిన షీప్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జనరిక్ మందుల అవుట్లెట్ల ఏర్పాటుపై కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కర్నూలు, ఆదోని, పత్తికొండ, కోడుమూరు, హోళగుంద ప్రాంతాల్లో ప్రభుత్వ పశు వైద్యశాల భవనాలు, లేదా ప్రభుత్వ స్థలాల్లో జనరిక్ మందుల షాపులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని జేడీ హేమంత్కుమార్ను ఆదేశించారు. నిబంధనల మేరకు భవనాలకు రెంట్ ప్రపోజల్స్, రెవెన్యూ అధికారుల సహకారంతో ఆయా స్థలాల లీజ్ ప్రపోజల్స్ ఇవ్వాలని ఆర్అండ్బీ ఎస్ఈని ఆదేశించారు. జేడీ మాట్లాడుతూ.. ఒక దుకాణం యూనిట్ ధర రూ.3.61 లక్షలుగా నిర్ణయించినట్లు చెప్పారు. నాలుగు దుకాణాల ఏర్పాటుకు సంఘాలు ముందుకు వచ్చాయిని, హోళగుందలో ఎస్హెచ్జీ ద్వారా దుకాణం ఏర్పాటు చేసేందుకు రూ.1.50 లక్షలను కేంద్రం సబ్సిడీ ఇస్తుందన్నారు. మిగిలిన నాలుగు దుకాణాలకు ఏపీ షీప్ ఫెడరేషన్ రూ.1.50 లక్షల సబ్సిడీ భరిస్తుందని తెలిపారు. కమిటీ సభ్యులు ఏపీ డ్రగ్ కంట్రోల్ అధికారి హరిహరతేజ, డీసీఓ శిరీష, షీప్ డెవలప్మెంట్ ఏడీ రవిప్రకాష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఏకపక్షంగా మున్సిపల్ వేలం పాటలు
● ఇతరులు పాల్గొనకుండా టీడీపీ నేతల బెదిరింపులు ● మున్సిపల్ ఆదాయానికి గండిడోన్: అధికార టీడీపీ నాయకులు మున్సిపల్ అధికారుల లోపాయకారి ఒప్పందం వల్ల గురువారం నిర్వహించిన బహిరంగ వేలం పాటలు కాస్తా నాలుగు గోడల మధ్య జరగడంతో ప్రజలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన నలుగురు వ్యక్తులు మాత్రమే వేలం పాటల్లో పాల్గొని అతి తక్కువ ధరకే హక్కులను దక్కించుకోవడం చర్చనీయాశంగా మారింది. ఈ ఎడాది వారపు సంత రూ.3,38,000, దినసరి మార్కెట్ రూ.8,25,000, మాంసం దుకాణాలు రూ.2,28,000, బస్టాండ్ రూ.7,65,000లకు అధికార పార్టీ నేతలు దక్కించుకున్నారు. అంతకు ముందు వేలం పాటలో పాల్గొనేందుకు వచ్చిన కొండపేటకు చెందిన వ్యక్తులను అధికార పార్టీ నేతలను బెదిరించడంతో వారు వేలం పాటలో పాల్గొనకుండా వెళ్లిపోయారు. కేవలం నలుగురు టీడీపీ నేతలు వేలంలో పాల్గొని గతేడాది కంటే రూ.2,56,000 హెచ్చు పాడి హక్కులు దక్కించుకున్నారు. గతేడాది వేలం పాట ద్వారా రూ.19 లక్షలు ఆదాయం రాగా ప్రస్తుతం రూ.21,56,000 పలికినట్లు అధికారులు వెల్లడించారు. సరైన ప్రచారం చేసి ఉంటే వేలం పాటలో పాల్గొనేందుకు అధిక మంది వచ్చి ఉండేవారని ఇలా గుట్టుచప్పుడు గాకుండా వేలం నిర్వహించడంతో మున్సిపల్ ఆదాయానికి గండి పడిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. -
ప్రయాణం.. ‘పది’ంతల నరకం
పదో తరగతి పరీక్షలు గురువారం ముగిశాయి. ఆనందంగా ఇళ్లకు బయలుదేరిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆర్టీసీ బస్టాండ్కు చేరుకోగా అక్కడి పరిస్థితిని చూసి నివ్వెరపోయారు. హాస్టల్ నుంచి ఇళ్లకు వెళ్తున్న విద్యార్థులు, మరోవైపు పల్లెల్లో బంధువుల వివాహాలకు వెళ్లే ప్రయాణికులు, ఇంకోవైపు ఊర్లలో జాతర్లకు వెళ్లే బంధువులతో కర్నూలు ఆర్టీసీ బస్టాండ్ కిటకిటలాడింది. వచ్చిన బస్సు వచ్చినట్లే నిండిపోతుండటంతో రెండు మూడు గంటలపాటు వేచి చూసిన ప్రయాణికులు ఆపసోపాలు పడ్డారు. ఇలాగైతే ఇళ్లకు చేరుకోలేమనుకొని వచ్చిన బస్సుల్లో సీట్ల కోసం ఎగబడుతూ కిటికీల్లోంచి దూరడం, వస్తువులను సీట్లలో పెట్టడం చేస్తూ పలు అగచాట్లు పడ్డారు. ఎలాగోలా సీట్లు పట్టుకున్న వారు కూర్చొని ప్రయాణించగా మిగతావారు కిక్కిరిసిన బస్సులో ఉక్కపోతతో అల్లాడుతూ అలాగే ప్రయాణించారు. రాష్ట్రంలోనే రెండో అతి పెద్దదైన కర్నూలు బస్టాండు నుంచి పదో తరగతి పరీక్షలు ముగిసిన వేళ అదనపు బస్సులు కల్పించలేరా? అంటూ ప్రయాణికులు నిట్టూర్చారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలుపాపను కీటికీ నుంచి సీట్లోకి తోసేద్దాం.. -
దొంగ మస్టర్లతో నిధుల మేత!
● ఉపాధిలో 2025–26లో సాధించిన ప్రగతి ఇదే ● కర్నూలు, నంద్యాల జిల్లాల్లో లక్ష్యానికి మించి పనిదినాలు కల్పించినట్లు లెక్కలుకర్నూలు(అగ్రికల్చర్): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2025–26లో దొంగ మస్టర్లలో లక్ష్యాన్ని సాధించామనిపించారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఫీల్డ్ అసిస్టెంట్లుగా టీడీపీ కార్యకర్తలే నియమితులయ్యారు. టీడీపీ నేతలకు భారీగా ముడుపులు ఇచ్చుకొని ఏపీఓలు, ఈసీలు ఆదాయం బాగా ఉన్న మండలాలకు పోస్టింగ్లు తెచ్చుకున్నారు. వెరసి 2025–26లో అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడ్డారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉపాధి పనులకు 10 మంది వస్తే వంద మంది హాజరైనట్లు మస్టర్లు వేసి నిధులు కొల్లగొట్టారు. 2025–26లో కర్నూలు జిల్లాలో 58 లక్షలు, నంద్యాల జిల్లాలో 58 లక్షల పనిదినాలు కల్పించాలనేది లక్ష్యం. అయితే కర్నూలు జిల్లాలో 64,87,635, నంద్యాల జిల్లాలో 61,37,869 పని దినాలు కల్పించినట్లు స్పష్టమవుతోంది. ఇబ్బడిముబ్బడిగా దొంగ మస్టర్లు వేసి ఫీల్డ్ అసిస్టెంటు మొదలుకొని ఏపీఓల వరకు నిధులు కొల్లగొట్టారు. ఉమ్మడి జిల్లాలో 1,26,25,504 పనిదినాలు కల్పించినట్లు లెక్కలు ఉన్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా జిల్లా నుంచి వ్యవసాయ కూలీలు వలస వెళ్లారు. నిజంగా ఈ పనిదినాలు కల్పించి ఉంటే వంద రోజుల పని దినాలను వినియోగించుకున్న కుటుంబాలు భారీగా ఉండాలి. కర్నూలు జిల్లాలో 3702 కుటుంబాలు, నంద్యాల జిల్లాలో 4550 కుటుంబాలకు మాత్రమే వంద రోజుల పని దినాలు కల్పించినట్లు స్పష్టమవుతోంది. అలాగే పల్లె పండుగ కింద చేపట్టిన షెడ్లకు స్పందన కరువైంది. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 1400 చొప్పున పశువుల షెడ్లు నిర్మించాలనేది లక్ష్యం. అయితే కర్నూలు జిల్లాలో 561, నంద్యాల జిల్లాలో 257 పశువుల షెడ్లు మాత్రమే నిర్మించారు. కర్నూలు జిల్లాలో ఫాంఫాండ్స్ 4 వేలు నిర్మించాలనేది లక్ష్యం కాగా 488, నంద్యాల జిల్లాలో 2 వేలు లక్ష్యం కాగా కేవలం ఐదు మాత్రమే నిర్మించడం గమనార్హం. తుగ్గలి మండలంలో ఉపాధి పనులకు ఎక్కువ డిమాండ్ ఉంది. ఈ మండలంలో సంపాదించుకునే అవకాశం ఎక్కువగా ఉండటంతో ఏపీఓ టీడీపీ నేతలకు పెద్దఎత్తున ముడుపులు ఇచ్చుకొని పోస్టింగ్ పొందారనే విమర్శలు ఉన్నాయి. ఇటువంటి వారు అనేక మంది ఉన్నారు. మీరు దొంగ మస్టర్లు ఎన్నైనా వేసుకోండి మాకు మాత్రం వారం.. వారం ముడుపులు ఇచ్చుకోవాల్సిందేనని రేటు పెట్టినట్లు తెలుస్తోంది. తుగ్గలి, కౌతాళం, ఆదోని, కొసిగి, సి.బెళగల్, ప్యాపిలి, డోన్, బేతంచెర్ల తదితర మండలాల్లో దొంగ మస్టర్లదే పైచేయి కావడం గమనార్హం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ముగిసి కొత్తగా వీబీ జీ రామ్జీ అమల్లోకి వస్తుండటంతో నిధుల స్వాహాపైనే దృష్టి కేంద్రీకరించడం గమనార్హం. -
ఉపాధ్యాయ, ఉద్యోగులను విస్మరించడం తగదు
నందికొట్కూరు: కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉద్యోగులను విస్మరించడం తగదని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు హృదయరాజు అన్నారు. బుధవారం పట్టణంలోని ఎమ్మార్సీ భవనంలో ఏపీటీఎఫ్ నంద్యాల జిల్లా అధ్యక్షులు మాధవస్వామి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హృదయరాజు మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఉపాధ్యాయ, ఉద్యోగులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. 11వ వేతన సవరణ కమిషన్ కాలపరిమితి పూర్తయి 32 నెలలు గడుస్తున్నా.. 12వ వేతన సవరణ కమిషన్ చైర్మన్ను నియమించకపోవడం మోసం చేయడమేనన్నారు. పెండింగ్లోఉన్న నాలుగు డీఏలను ప్రకటించాలని, 11వ పీఆర్సీ బకాయిలను, 2022 నుంచి పెండింగ్లో ఉన్న సరెండర్లీవ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏపీటీఎఫ్ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, కర్నూలు జిల్లా గౌరవవాధ్యక్షులు కమలాకర్రావు, జిల్లా అధ్యక్షులు ఇస్మాయిల్, ప్రధాన కార్యదర్శి మరియానందం, నంద్యాల జిల్లా ఉపాధ్యాక్షులు శ్రీదేవి, సుంకన్న, కార్యదర్శి శ్రీరాములు, నాయకులు స్వామినాథం, రాఘవరెడ్డి, వెంకటరాముడు, మహబూబ్బాషా, అజయ్కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
ట్రిపుల్ఐటీ డీఎంలో స్పోర్ట్స్ మీట్
కర్నూలు సిటీ: జగన్నాథగట్టుపై ఉన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ (ట్రిపుల్ఐటీ డీఎం) లో గురువారం నుంచి మూడు రోజుల పాటు ఇండోర్ స్పోర్ట్స్ మీట్ నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 15 ట్రిపుల్ ఐటీల నుంచి మొత్తం 357 మంది క్రీడాకారులు ఇండోర్ స్పోర్ట్స్ మీట్లో పాల్గొన్నారు. బ్యాడ్మింటన్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, క్యారమ్స్, చెస్ క్రీడల్లో పోటీలు జరుగనున్నాయి. గుండెపోటుతో బాలుడి మృతి కోసిగి: బెంగళూరు నుంచి నాందేడ్ వెళ్లే రైలులో ప్రయాణిస్తూ కోసిగి రైల్వే స్టేషన్ చేరుకునే సమయంలో ఓ బాలుడు గుండెపోటుతో మృతి చెందాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లా తుముకూరు గ్రామానికి చెందిన శివప్ప, యల్లమ్మ దంపతుల రెండో కుమారుడు రమేష్ (14) గుండెపోటుకు గురై మృతి చెందాడు. ఆ కుటుంబం బతుకుదెరువు కోసం బెంగళూరుకు వెళ్లి పనులు ముగించుకుని స్వగ్రామానికి వెళ్లేందుకు నాందేడ్ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణం చేస్తున్నారు. ఉన్నట్టుండి బాలుడు ఛాతిలో నొప్పి అంటూ అపస్మారక స్థితిలో పడిపోయాడు. కుటుంబసభ్యులు కోసిగి రైల్వేస్టేషన్లో దిగి హుటాహుటిన పీహెచ్సీకి తరలించగా వైద్య పరీక్షలు చేసేలోపు బాలుడు మృతి చెందాడు. చిన్న వయస్సులోనే నూరేళ్లు నిండాయా అంటూ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. దాడిలో గాయపడిన వ్యక్తి మృతి ఓర్వకల్లు: దాడి ఘటనలో కత్తిపోట్లకు గురై తీవ్రంగా గాయపడిన వ్యక్తి కోలుకోలేక ఆసుపత్రిలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని కన్నమడకల గ్రామంలో ఈ నెల 29వ తేదీన బోయ మహేష్ అదే గ్రామానికి చెందిన కప్ప రమేష్ను కత్తితో పొడిచిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబసభ్యుల పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండుకు తరలించారు. గాయపడిన రమేష్ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా కోలుకోలేక బుధవారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి మంగళవారం రాత్రి ఆసుపత్రిలో బాధిత కుటుంబసభ్యులను పరామర్శించి, ఘర్షణకు గల కారణాలను తెలుసుకొని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రమేష్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇది ముమ్మాటికి రాజకీయ హత్య అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతుడి పెద్ద కుమారుడు కప్ప హేమంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులు బోయ మహేష్, బాలకృష్ణపై హత్య కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సునీల్కుమార్ తెలిపారు. మృతుడికి భార్య మహేశ్వరి, ముగ్గురు కుమారులు సంతానం ఉన్నారు. ట్రాఫిక్ పోలీసులకు రక్షణ కిట్లు కర్నూలు: వేసవిలో రోడ్లపై ఎండలో విధులు నిర్వహించే ట్రాఫిక్ సిబ్బంది రక్షణ కోసం చలువ అద్దాలు, వాటర్ బాటిళ్లు, కూల్ వాటర్ క్యాన్లు, టోపీలు, గ్లూకోజ్–డి ప్యాకెట్లు పంపిణీ చేశారు. జిల్లాలో 41 డిగ్రీల సెల్సియస్కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకుంటూ విధులు నిర్వహించేలా పోలీసు శాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కార్పొరేట్ సామాజిక బాధ్యతతో కర్నూలు మెడికవర్ హాస్పిటల్ వారి సహకారంతో సేకరించిన రక్షణ కిట్లను బుధవారం కొండారెడ్డిబురుజు వద్ద ఎస్పీ విక్రాంత్ పాటిల్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అలాగే హైవే పెట్రోలింగ్ మొబైల్ పోలీసులకు మహబూబ్నగర్ కెనరా బ్యాంకు సహకారంతో ఇండికేటింగ్ కోన్స్, డ్రాగన్ లైట్లు, లైటింగ్ బాటన్స్, రిఫ్లెక్టివ్ జాకెట్లు (రేడియం), కంబళ్లు, సుత్తెలు వంటి పరికరాలను అందజేశారు. కర్నూలు డీఎస్పీ బాబుప్రసాద్, సీఐలు మధుసూదన్ రావు, నాగరాజరావు, మన్సూరుద్దీన్, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, నేషనల్ హైవే అథారిటీ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు. -
శ్రీమఠం పీఠాధిపతి జన్మదిన వేడుకలు
మంత్రాలయం: ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీమఠం ప్రాంగణంలో ఉదయం సంస్కృత విద్యార్థులతో వేద మంత్రోచ్ఛరణల మధ్య పీఠాధిపతి తైల అభ్యంగణ, కుటుంబ సభ్యులచే హారతి గావించారు. పీఠాధిపతికి శ్రీమఠం సిబ్బంది భక్తిశ్రద్ధలతో గురు వందనం సమర్పించి, పుష్ప వృష్టి, గజమాలతో సన్మానించారు. యాగశాలలో పవిత్ర యజ్ఞహోమాలు చేశారు. శ్రీ మూల రాములకు ప్రత్యేక పూజలు చేసి పీఠాధిపతి మహామంగళ హారతి గావించారు. సుజయింద్ర ఆరోగ్య శాలలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. గ్రామ ప్రజలు వైద్య సేవలు పొందారు. అనంతరం భక్తులకు తులసి మొక్కలను పంపిణీ చేశారు. -
డిగ్రీ, పీజీ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల
కర్నూలు కల్చరల్: డాక్టర్ అబ్దుల్హక్ ఉర్దూ విశ్వ విద్యాలయం డిగ్రీ, పీజీ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. డిసెంబర్ నెలలో నిర్వహించిన డిగ్రీ, పీజీ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ మహబూబ్ బాషా బుధవారం విడుదల చేశారు. డిగ్రీ 3, 5 సెమిస్టర్లు, పీజీ 3వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలతో పాటు సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు కూడా విడుదల చేశామన్నారు. విద్యార్థులు ఫలితాలను వర్సిటీ వెబ్సైట్ www.ah uuk.ac.in నుంచి పొందవచ్చన్నారు. కార్యక్రమంలో ఎగ్జామినేషన్ కోఆర్డినేటర్ మహమ్మద్ ఇర్ఫాన్, సైన్స్ కోఆర్డినేటర్ డాక్టర్ నబియా సుల్తానా, ఆర్ట్స్ కోఆర్డినేటర్ డాక్టర్ బి.వెంకటప్ప తదితరులు పాల్గొన్నారు. నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగాలు కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి జిల్లాలోని విద్యుత్ సబ్ స్టేషన్లలో పలువురు అవుట్ సోర్సింగ్ ద్వారా షిఫ్ట్ ఆపరేటర్లుగా నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగాలు పొందినట్లు వెల్లడైంది. నకిలీ ధ్రువపత్రాలతో అనేక మంది ఉద్యోగాలు పొందినట్లు సీఎండీకి ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులపై ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి నిర్వహించిన విచారణలో 16 మంది షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు పొందినట్లు స్పష్టమైంది. నకిలీ ఐటీఐ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వారు రాయలసీమ జిల్లాల్లో 69 మంది ఉండగా ఉమ్మడి జిల్లాలో 16 మంది ఉన్నారు. ఐటీఐ చేయకుండానే ఎలక్ట్రీషియన్లో ఐటీఐ పూర్తి చేసినట్లు నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి ఉద్యోగాలు పొందినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ నేపధ్యంలో నకిలీ ధ్రువపత్రాలు సమర్పించిన షిఫ్ట్ ఆపరేటర్లను తొలగించాల్సిందిగా సంబంధిత అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేయాలని కర్నూలు, నంద్యాల సర్కిళ్ల ఎస్ఈలను సీఎండీ ఆదేశించారు. ఈ మేరకు ఎస్ఈలు తగిన చర్యలు తీసుకుంటున్నారు. కారు ఢీకొని ఉద్యోగి దుర్మరణం ఓర్వకల్లు: కర్నూలు, కడప జాతీయ రహదారిపై రాక్గార్డెన్ సమీపంలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు.. మండలంలోని కన్నమడకల గ్రామ సచివాలయంలో రంగస్వామి (33) ఇంజినీరింగ్ అసిస్టెంటుగా విధులు నిర్వహిస్తున్నాడు. కర్నూలు నుంచి బైక్పై కన్నమడకల చేరుకుని విధులకు హాజరయ్యేవాడు. బుధవారం సాయంత్రం విధులు ముగించుకొని కర్నూలుకు బైక్పై బయలుదేరాడు. స్థానిక ఎయిర్పోర్టు వద్ద ముందు వెళుతున్న బైక్ను వెనుక నుంచి నంద్యాల నుంచి కర్నూలు వైపు అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రంగస్వామి అపస్మారకస్థితికి చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వ్యక్తిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కోలుకోలేక రంగస్వామి మృతి చెందాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది -
వంకాయ రైతు విలవిల
● 30 కిలోల బస్తా రూ.50 కూడా పలకని వైనం ● రోడ్డుపక్కన పారబోస్తున్న రైతులు దేవనకొండ: ఘుమఘుమలాడే గుత్తి వంకాయను చూస్తే ఎవరికై నా నోరూరుతుంది. అయితే అదే వంకాయ ఇప్పుడు రైతులకు గుదిబండగా మారింది. సరైన గిట్టుబాటు లేక, మార్కెట్కు తరలిస్తే రవాణా ఖర్చులు రాకపోవడంతో వంకాయ సాగుచేసిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటను అలాగే వదిలేస్తే పాడవుతుందని మున్ముందు అయినా రేటు పెరగకపోతుందా? అనే ఆశతో కూలీలచే వంకాయలు తెంపి రోడ్డు పక్కన పారబోస్తున్నారు. వంకాయకు ధర లేకపోవడంతో సాగుచేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. మార్కెట్లో 30 కిలోల బస్తా రూ.40 నుంచి రూ.50 కూడా పలకడం లేదు. అయితే వ్యాపారులు మాత్రం ప్రజలకు కిలో రూ.30 నుంచి రూ.40కు అమ్ముకుంటున్నారు. రైతుల వద్ద 30 కిలోల బస్తాను రూ.50కి కూడా వ్యాపారులు కొనడం లేదు. దీంతో చాలామంది రైతులు వంకాయలను గొర్రెలకు వదిలేస్తున్నారు. కొద్ది మంది రైతులు మున్ముందు రేటు పెరుగుతుందన్న ఆశతో తోటను కాపాడుకునేందుకు వంకాయలు తెంపి రోడ్డున పారపోస్తున్నారు. -
ఈనామ్ కొత్త వర్షన్తో అవస్థలు
ఆదోని అర్బన్: ఆదోని వ్యవసాయ మార్కెట్యార్డులో ఈనామ్ 2.0 కొత్త వర్షన్ రైతులు, కమిషన్ ఏజెంట్లు, వ్యాపారస్తులకు తలనొప్పిగా మారింది. రెండు రోజులుగా కొత్త నిబంధనలతో ఇబ్బందులకు గురవుతున్నారు. కొత్త వెర్షన్లో రైతు ఊరు, పేరు, సెల్ నంబర్తో పాటు ఓటీపీ కూడా చెప్పాలనడంతో ఒక్కసారిగా రైతులు, ఏజెంట్లు కార్యాలయానికి వచ్చి ఆందోళన చేపట్టారు. ఉన్నతాధికారులు స్పందించి ఓటీపీ చెప్పవసరం లేదనడంతో వారు వెనుదిరిగారు. కొత్త వెర్షన్లో మంగళవారం సాయంత్రం 5 – 6 గంటల సమయంలో టెండర్ ధర ప్రకటన రావడంతో రైతులు, ఏజెంట్లు, వ్యాపారులు ఇబ్బందులకు గురయ్యారు. బుధవారం సాయంత్రం అయినా టెండర్ ధర ప్రకటన రాకపోవడంతో రైతులు యార్డు కార్యాలయానికి చేరుకుని అధికారులను నిలదీశారు. టెక్నికల్ సిబ్బంది వచ్చారని, సమస్యను పరిష్కరిస్తామని సమాధానమిచ్చారు. అయితే రైతులు సాయంత్రం టెండర్ ధర ప్రకటన వస్తే దిగుబడులను కాటా ఎప్పుడు వేసుకోవాలి, తమ ఇళ్లకు ఎప్పుడు వెళ్లాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత పద్ధతి అయినా పెట్టండి లేదా మాన్యువల్గా నిర్వహించాలని కోరారు. పాత పద్ధతి ఈనామ్ డెలీట్ చేసి కొత్త వెర్షన్ తెచ్చినట్లు చెప్పడంతో రైతులు, ఏజెంట్లు మండిపడ్డారు. ఇలాంటి కొత్త వెర్షన్లను అన్ సీజన్లో ప్రయోగం చేయాలే గానీ, సీజన్లో తెచ్చి ఇబ్బందులు పెట్టడం మంచిది కాదన్నారు. ఉదయం 8 గంటలకు పల్లెల నుంచి దిగుబడులు వేసుకొస్తే రాత్రి బస్సులు లేక ఎలా వెళ్లాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై యార్డు అసిస్టెంట్ సెక్రటరీ శాంతకుమార్ను వివరణ కోరగా.. కొత్త వెర్షన్ రావడంతో త్వరగా నమోదుకావడం లేదని, ఈనామ్ వారు వచ్చారని, త్వరలో సమస్యను పరిష్కరిస్తారన్నారు. -
దొంగలు దొరికారు!
● నాలుగు రోజుల వ్యవధిలోనే ఛేదించిన పోలీసులు ● 20 తులాల బంగారు, 10 తులాల వెండి ఆభరణాలు రికవరీ కర్నూలు: కర్నూలు వెంకటరమణ కాలనీ శివారులోని అమీన్ అబ్బాస్ నగర్లో నివాసముంటున్న వెంకటసుబ్బయ్య ఇంట్లో చోరీకి పాల్పడిన దొంగలు దొరికారు. నాలుగు రోజుల వ్యవధిలోనే కేసును పోలీసులు పక్కా ఆధారాలతో ఛేదించారు. నిందితులను అదుపులోకి తీసుకొని 20 తులాల బంగారు, 10 తులాల వెండి ఆభరణాలను రికవరీ చేశారు. నిందితులిద్దరూ మైనర్లు కావడంతో జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచారు. ఇంటి తాళం పగులగొట్టి చోరీ అమీన్ అబ్బాస్ నగర్లో నివాసముంటున్న వెంకట సుబ్బయ్య పేపర్ మిల్లులో పనిచేసి రిటైరయ్యారు. గత నెల 27న ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి కడపకు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దుండగులు 29వ తేదీ రాత్రి వారి ఇంటి తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించి బీరువా తాళాలు పగలగొట్టి 20 తులాల బంగారు, 10 తులాల వెండి ఆభరణాలు చోరీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా అందుబాటులో ఉన్న సీసీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. వేలిముద్రలను సేకరించారు. నిందితులు బాలాజీ నగర్లో నివాసముండే ఇద్దరు మైనర్లుగా గుర్తించారు. బుధవారం ఉదయం మునగాలపాడు సమ్మర్ స్టోరేజీ ట్యాంకు వద్ద ఉన్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. వారు చోరీ చేసిన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను కర్నూలు డీఎస్పీ బాబుప్రసాద్, నాల్గవ పట్టణ సీఐ విక్రమసింహ, మూడో పట్టణ సీఐ శేషయ్య, ఎస్ఐ చంద్రశేఖర్రెడ్డితో కలిసి వెల్లడించారు. నిందితులు గతంలో గణేష్నగర్ శివారులోని సాయివైభవ్ నగర్లో ఆర్టీసీ ఉద్యోగి ఇంట్లో దొంగతనానికి పాల్పడి జైలుకు వెళ్లి బెయిల్పై బయటకు రాగానే మళ్లీ నేరాల బాట పట్టారని పోలీసులు తెలిపారు. కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరచిన క్రైం పార్టీ సిబ్బంది మురళీధర్, సుబ్బరాయుడు, సుంకన్న, చెంచన్న, శేఖర్, వాసులను డీఎస్పీ అభినందించారు.జల్సాల కోసం జతకట్టి.. నిందితులు ఒకరు ఇంటర్, మరొకరు పదో తరగతి వరకు చదువుకున్నారు. జులాయిగా తిరుగుతూ గంజాయి, బెట్టింగ్లకు అలవాటుపడ్డారు. జల్సాల కోసం సులభంగా డబ్బులు సంపాదించేందుకు అడ్డదారులను ఎంచుకున్నారు. ప్రస్తుతం బంగారు ధరలు ఆకాశాన్నంటుతుండటంతో బంగారు నగలు చోరీ చేయాలని నిర్ణయించుకున్నారు. -
హరోం.. హర
ఎమ్మిగనూరురూరల్: పట్ణణంలోని కోసిగి రోడ్డులో వెలసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రథోత్సవం బుధవారం కనులపండువగా జరిగింది. భక్తులు ఉదయాన్నే పాత ఆంజనేయస్వామి దేవాలయం వద్దకు చేరుకొని జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించారు. అనంతరం పురుషులు, మహిళలు, బాలికలు పెద్ద ఇనుప కడ్డీలను దవడకు గుచ్చుకొని భక్తిని చాటుకున్నారు. వీపున ఇనుప కొక్కీలను తగిలించుకుని తాడుకట్టి స్వామివారి రథాన్ని లాగారు. ఇలా చేయడం వల్ల కోర్కెలు తీరుతాయని, చేసిన పాపాలు తొలగిపోతాయని భక్తులు చెబుతున్నారు. రథోత్సవం ఆంజనేయస్వామి ఆలయం నుంచి షరాఫ్ బజార్, సోమేశ్వర, శ్రీనివాస సర్కిల్ మీదుగా కోసిగి రోడ్డులోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి చేరుకుంది. రథం ముందు భక్తులు నృత్యాలు చేశారు. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు పాల్గొన్నారు. స్వామివారిని బుట్టా ఫౌండేషన్ అధినేత బుట్టా నీలకంఠప్ప, నాయకులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేసినట్లు ధర్మకర్త యూజీ కేశవర్ధన్ చెప్పారు.కలశాలతో వెళ్తున్న భక్తులుదవడకు కడ్డీలు గుచ్చుకొని భక్తిభావం -
90 శాతం పన్నులు వసూలు
కర్నూలు(అర్బన్): జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి (మార్చి 31వ తేది) 90 శాతం పన్నులు వసూలు చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి జి.భాస్కర్ తెలిపారు. బుధ వారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మొత్తం 484 గ్రామ పంచాయతీల్లో పన్నులు, పన్నేతరములకు సంబంధించి రూ.29.55 కోట్ల వసూలు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. క్షేత్ర స్థాయిలోని డిప్యూటీ ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శుల సమష్టి కృషి వల్ల రూ.25.01 కోట్లను వసూలు చేశామన్నారు. పన్నులకు సంబంధించి రూ.19 కోట్లను వసూలు చేయాల్సి ఉండగా రూ.17.20 కోట్లు, పన్నేతరములకు సంబంధించి 10.54 కోట్లలో రూ.7.80 కోట్లు వసూలయ్యాయన్నా రు. ఇదిలా ఉంటే ఈనెల 2వ తేదీతో గ్రామ పంచా యతీ సర్పంచుల పాలన ముగియనున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలకు ప్రత్యేకాధికారుల నియామకాలకు సంబంధించి జాబితా సిద్ధంగా ఉందన్నారు. ఈ జాబితాపై జిల్లా కలెక్టర్ ఆమోదముద్ర కూడా వేశారన్నారు. గతంలో ఉన్న విధంగానే ఎమర్జెన్సీ సర్వీసులు(మెడికల్, విద్యుత్) మినహా మిగిలిన అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన మండల స్థాయి అధికారులకు ప్రత్యేకాధికారులుగా బాధ్యతలు అప్పగించామన్నారు. ఈ నెల 3వ తేది నుంచి అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభమవుతుందన్నారు. -
కుంభోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 7వ తేదీన నిర్వహించే భ్రమరాంబాదేవి కుంభోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఈఓ శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. వార్షిక కుంభోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం దేవస్థాన పరిపాలన భవనంలో ఈఓ అధ్యక్షతన సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ.. అమ్మవారికి కుంభోత్సవ కై ంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరిపించాలన్నారు. అమ్మ వారి దర్శనానికి భక్తుల రద్దీ దృష్ట్యా క్యూలైన్లలో తొక్కిసలాట లేకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. కుంభోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 7న అన్ని ఆర్జిత సేవలు నిలుపుదల చేశామన్నారు. అలాగే 8వ తేదీ ఉదయం 7.30 గంటల నుంచి దర్శనాలు, ఆర్జితసేవలు మొదలవుతాయని తెలిపారు. దేవదాయ చట్టాన్ని అనుసరించి క్షేత్ర పరిధిలో జంతు, పక్షి బలులు, జీవహింస పూర్తిగా నిషేధించబడిందన్నా రు. ఈ విషయమై భక్తులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ఇందుకు రెవెన్యూ, పోలీసు శాఖల సహకారం తీసుకోవాలని ఆదేశించారు. కుంభోత్సవం నేపథ్యంలో ఈనెల 6, 7 తేదీల్లో సున్నిపెంటలో మద్యం దుకాణాలను మూసి వేసేలా తగు ఉత్తర్వులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్కు లేఖ రాసినట్లు ఈఓ తెలిపారు. -
న్యాయ శాఖ ఉద్యోగాల రాత పరీక్ష రద్దు
కర్నూలు: జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో రికార్డు అసిస్టెంట్, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్ష రద్దు చేస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ (అమరావతి) ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి ఉద్యోగ నియామకాలకు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం రికార్డు అసిస్టెంట్, ఫ్రెంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ పోస్టులకు ఈ ఏడాది ఫిబ్రవరి 18న కర్నూలులోని ప్రసూనా లా కళాశాలలో రాత పరీక్షలు నిర్వహించారు. హైకోర్టు ఆదేశాల మేరకు వీటిని రద్దు చేసి మళ్లీ రాత పరీక్ష నిర్వహిస్తున్నట్లు లీలా వెంకటశేషాద్రి వెల్లడించారు. పూర్తి వివరాలు జిల్లా కోర్టు వెబ్సైట్లో పొందుపరుస్తామని పేర్కొన్నారు. పీఆర్ ఎస్ఈ బాధ్యతల స్వీకరణ కర్నూలు(అర్బన్): పంచాయతీరాజ్ పర్యవేక్షక ఇంజనీరుగా జి.ప్రభాకర్రెడ్డి బుధ వారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ ఎస్ఈగా విధులు నిర్వహించిన ఐ.వేణుగోపాల్ గత మార్చి 31న పదవీ విరమణ పొందారు. ఈ నేపథ్యంలో అనంతపురం పీఆర్ఐ డివిజన్లో ఈఈగా విధులు నిర్వహిస్తున్న ప్రభాకర్రెడ్డికి ఇటీవలే ఎస్ఈగా పదోన్నతి కల్పించి ఇక్కడకు పోస్టింగ్ ఇచ్చారు. ఎస్ఈగా బాధ్యతలు స్వీకరించిన ప్రభాకర్రెడ్డిని ఈఈ మహేశ్వరరెడ్డి, డీఈఈలు పీఏ టు ఎస్ఈ బండారు శ్రీనివాసులు, కర్రెన్న, నాగిరెడ్డి, ఏఈ, ఏఈఈ, కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల కర్నూలు(హాస్పిటల్): కర్నూలులో ఏర్పాటైన స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు సంబంధించి ఉద్యోగ ఖాళీల భర్తీకి 29.01.2024న జారీ చేసిన నోటిఫికేషన్కు సంబంధించి ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేసినట్లు కర్నూలు మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా జాబితాలను కర్నూలు, నంద్యాల జిల్లాల ప్రభుత్వ వెబ్సైట్లు https:// kurnool.ap.gov.in,https://nandyal.ap.gov.in,https://kurnoolmedicalcollege.ac.inలో ఉంచామన్నారు. ఎంపికై న అభ్యర్థులు వారి ఒరిజినల్ సర్టిఫికెట్లు, నకలుతో ఈ నెల 7వ తేది ఉదయం 10.30 గంటలకు ప్రిన్సిపాల్ కార్యాలయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరుకావాలని సూచించారు. హాజరుకాని అభ్యర్థుల ఎంపిక రద్దు చేస్తామన్నారు. గృహ నిర్మాణ సమస్యలపై ఫోన్ చేయండి కర్నూలు(అర్బన్): జిల్లాలో గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించుకుంటున్న గృహాలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే ప్రతి గురువారం తమ కార్యాలయంలోని ల్యాండ్ లైన్ 08518–257481 నెంబర్కు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు కాల్ చేయాలని హౌసింగ్ పీడీ చిరంజీవి కోరారు. లబ్ధిదారులు నిర్మించుకుంటున్న ఇళ్లకు రావాల్సిన గృహ నిర్మాణ సామగ్రి, సిమెంట్, స్టీల్, బిల్లుల గురించి ఫోన్ చేయాలని ఆయన బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే పీఎంఏవై 2.0 అర్బన్ గృహాలకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా ఫోన్ చేసి సంప్రదించాలని కోరారు. పలు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కర్నూలు(హాస్పిటల్): రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల కోసం ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులు బుధవారం నుంచి జిల్లాలో ఎన్టిఆర్ వైద్యసేవ(ఆరోగ్యశ్రీ) సేవలు బంద్ చేశాయి. ఈ మేరకు జిల్లాలో మెజారిటీ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవల కోసం వచ్చిన రోగులను వెనక్కి పంపించాయి. ఆపరేషన్లను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. జిల్లాలో ప్రైవేటు రంగంలో 60 నెట్వర్క్ ఆసుపత్రులు ఉండగా, మొదటి రోజు బుధవారం 36 ఆసుపత్రులు బంద్ పాటించాయి. 24 ఆసుపత్రులు మాత్రమే ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించాయి. గురువారం నుంచి మరికొన్ని ఆసుపత్రులు సేవలు బంద్ చేసేందుకు నిర్ణయించాయి. కొత్తగా వచ్చిన రోగులకు ఆరోగ్యశ్రీ సేవలు అందించకుండా ఇప్పటికే ఆసుపత్రిలో చేరిన వారికి మాత్రం వైద్యసేవలు కొనసాగిస్తున్నారు. కొన్ని ఆసుపత్రులు అత్యవసరమైన కేసులు మాత్రమే తీసుకుని, మిగిలిన కేసులను వాయిదా వేస్తూ, తర్వాత రావాలని పంపించడం గమనార్హం. -
వాహనాల వేలంతో రూ.10 లక్షల ఆదాయం
కర్నూలు: ఎక్సైజ్ నేరా ల్లో పట్టుబడిన వాహనాలను స్థానిక కార్యాలయంలో అధికారు లు వేలం వేశారు. కర్నూలు ఎౖక్సైజ్ స్టేషన్ సీఐ చంద్రహాస్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. దాదాపు 50 మంది పోటీదారులు వేలం ప్రక్రియలో పాల్గొన్నారు. దాదాపు 57 వాహనాలకు గాను 53 వాహనాలను పోటీదారులు వేలంలో దక్కించుకున్నారు. మొత్తం విలువ రూ.6.73 లక్షలకు గాను రూ.8.70 లక్షలు ఆదాయం సమకూరింది. అదనంగా జీఎస్టీ రూ.1,57,500 కలిపి మొత్తం రూ.10,32,500 మొత్తాన్ని పాటాదారుల నుంచి అధికారులు వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు చలానా రూపంలో చెల్లించారు. వేలం ప్రక్రియలో నిర్ణయించిన ధర కంటే 30 శాతం పెరుగుదల వచ్చినట్లు సీఐ తెలిపారు. -
సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలు
● యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఒక్క రోజు నిరాహారదీక్షకర్నూలు(సెంట్రల్/సిటీ): ‘సీఎం చంద్రబాబు నాయుడు ఉద్యోగ, ఉపాధ్యాయులను తీవ్రంగా మోసం చేస్తున్నారు. ఆయన అధికారంలోకి వచ్చాక ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. ప్రభుత్వం దిగి వచ్చేలా ఐక్య పోరాటాలకు సిద్ధం అవుతున్నాం’ అని యూటీ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె.లక్ష్మీరాజు అన్నారు. బుధవారం కర్నూలులోని ధర్నా చౌక్లో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పీఆర్సీ, ఐఆర్, పెండింగ్ డీఏలు, ఇతర సమస్యల సాధన కోసం ఉపాధ్యాయులు ఒక్క రోజు నిరాహార దీక్ష చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు యూఆర్ఏ రవి కుమా ర్ అధ్యక్షతన చేపట్టిన దీక్షను రాష్ట్ర కార్యదర్శి కె.లక్ష్మీ రాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ దీక్షకు ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ జిల్లా చైర్మన్ వి.జవహర్లాల్, హెడ్మాస్టర్ అసోసియేషన్ నాయకు లు నారాయణ, ఫ్యాప్టో నాయకులు సేవాలాల్ నాయక్ పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మీరాజు మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు గత పాలనను చూసి నమ్మి మోసపోయామన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం అలసత్వం వహిస్తోందన్నారు. వెంటనే 12వ పీఆర్సీని వేయాలని, 30 శాతం ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాల విద్యా వ్యవస్థను మంత్రి నారా లోకేష్ గాలికి వదిలివేశారని విమర్శించారు. ఈ నెల చివరలో అమరావతిలో ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి బి.నవీన్ పాటిల్, జిల్లా గౌరవాధ్యక్షుడు దావీదు, జిల్లా సహాధ్యక్షుడు హేమంత్కుమార్, జిల్లా ఆర్థిక కార్యదర్శి యెహోషువ, జిల్లా కార్యదర్శులు లక్ష్మీదేవి, ఇబ్రహీం, తిమ్మన్న, బాబ, సురేష్, రాష్ట్ర కౌన్సిలర్లు మల్లాది నాగరాజు, కృష్ణవేణి పాల్గొన్నారు. -
వార్డుల సంఖ్య పెంపునకు గ్రీన్ సిగ్నల్
కర్నూలు (టౌన్): కర్నూలు కార్పొరేషన్లో వార్డుల సంఖ్యను ప్రభుత్వం మరోసారి పెంచేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే మున్సిపల్ పరిపాలన శాఖ సంచాలకులు డాక్టర్ పి.సంపత్కుమార్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రకారం కర్నూలు కార్పొరేషన్లో ప్రస్తుతం ఉన్న 52 వార్డులను 68కి పెంచేందుకు చర్యలు చేపట్టింది. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక పదేళ్లుగా ఎన్నికలు లేని కర్నూలు కార్పోరేషన్కు ఎన్నికల ప్రక్రియ చేపట్టింది. అప్పట్లో 49 వార్డులకు గాను కర్నూలు నగర శివారులోని పందిపాడు, లక్ష్మీపురం, పెద్దపాడు వంటి మూడు గ్రామాలను కర్నూలు కార్పొరేషన్లో విలీనం చేశారు. దీంతో వార్డుల సంఖ్య 52కు చేరుకుంది. అప్పటి జనాభా లెక్కల ప్రకారం ఒక్కో వార్డులో 9 వేల నుంచి 10 వేల మంది జనాభాను పరిగణలోకి తీసుకొని ఈ సంఖ్యను పెంచారు. తాజగా ప్రభుత్వ ఆదేశాల మేరకు మరోసారి వార్డుల సంఖ్య పెంచాలని నిర్ణయించడంతో రాజకీయ పార్టీలు, ఆశావాహులు ఇక వార్డుల పనర్విభజనపై దృష్టి సారించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం విభజన కర్నూలు కార్పొరేషన్లో 2011 లెక్కల ప్రకారం 4,50,184 మంది జనాభా ఉన్నారు. ఈ ప్రకారం వార్డుల సంఖ్యను 68కు పెంచాలని నిర్ణయించడంతో జనాభా సంఖ్య కుదించాల్సి ఉంది. గతంలో వార్డుకు 9 వేల నుంచి 10 వేల మంది జనాభాను ప్రామాణికంగా తీసుకున్నారు. తాజాగా 16 వార్డులను పెంచేందుకు ఒక్కో వార్డుకు 6,500 నుంచి 7,300 మంది జనాభా ప్రకారం లెక్కలు తేల్చాల్సి ఉంది. పాతబస్తీ, కోడుమూరు అర్బన్లో.. పాతబస్తీ జనాభా 2 లక్షల వరకు ఉంది. ఇక్కడ ప్రధానంగా కర్నూలు నియోజకవర్గం పరిధిలో 33 వార్డులు ఉన్నాయి. జనాభా పరంగా చూస్తే ఇక్కడ ఉన్న 33 వార్డులు తాజాగా 38కి పెరిగే అవకాశం ఉంది. ఇక కోడుమూరు పరిధిలో మూడు వార్డులు ఉన్నాయి. జనాభా పరంగా చూస్తే 30 వేల జనాభా ఉంది. ప్రస్తుత లెక్కల ప్రకారం ఈ సంఖ్య 4 లేదా 5కు చేరుకుంటుంది. ఇలా పునర్విభజనలో వార్డుల తారుమారు తప్పదు. రేపటి నుంచి ఫీల్డ్లోకి మున్సిపల్ సిబ్బంది కర్నూలు కార్పొరేషన్లో ప్రస్తుతం ఉన్న 52 వార్డులను 68కు పెంచాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండు రోజుల వ్యవధిలో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చర్యలు చేపట్టనున్నారు. పట్టణ ప్రణాళిక విభాగం అదికారులు, సచివాలయాల ఉద్యోగులతో కలిసి వార్డుల పర్యటన చేపట్టాల్సి ఉంది. మునిసిపాలిటీ ప్రస్తుతం ఉన్న పెరగనున్న కర్నూలు 52 68 ఆదోని 42 52 ఎమ్మిగనూరు 3544 గూడూరు 2023 నంద్యాల 42 52 డోన్ 3236 నందికొట్కూరు 29 32 ఆత్మకూరు 28 32 ఆళ్లగడ్డ 27 32 బేతంచెర్ల 2028 కర్నూలు కార్పొరేషన్ వార్డులు 52 నుంచి 68కి పెంపు 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా కుదింపు అత్యధికంగా పాతబస్తీ, కోడుమూరులో పెరగనున్న వార్డులు రేపటి నుంచి వార్డుల్లో సర్వే షురూ -
అస్తవ్యస్తంగా పింఛన్ల పంపిణీ
కర్నూలు(అగ్రికల్చర్): ఇంటి వద్దే పింఛన్ల పంపిణీ నోటి మాటలకే పరిమితమైంది. గత ఏడాది 2024 జూలై నుంచి ఇంటి దగ్గరే పింఛన్లు అంటూ హడావుడి చేస్తున్నా.. ఆచరణలో 10 నుంచి 20 శాతం మించని పరిస్థితి. ఏప్రిల్ నెల పింఛన్ల పంపిణీ కూడా అస్తవ్యస్తమైంది. ఉదయం 10 గంటలు దాటినా సచివాలయ ఉద్యోగుల జాడ లేకపోవడంతో మండుటెండలో వృద్ధులు, వికలాంగులు అతి కష్టం మీద సచివాలయాల మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఎండలు, వడగాడ్పులకు అవ్వతాతలు ఇబ్బందులు పడ్డారు. కాగా గోనెగండ్ల మండలం కై రవాడి గ్రామంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పింఛన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ వైపీ రమణారెడ్డి పాల్గొన్నారు. ఇదిలా ఉంటే సాయంత్రం 5.30 గంటల సమయానికి కర్నూలు జిల్లా 92.15 శాతం పంపిణీతో 17వ స్థానంలో, నంద్యాల జిల్లా 92.76 శాతంతో 9వ స్థానంలో నిలిచాయి. -
శ్రీశైలం డ్యాం పరిశీలన
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం డ్యాంను బుధవారం నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ బృందం పరిశీలించింది. డ్యాం వ్యూ పాయింట్ సమావేశ మందిరంలో శ్రీశైలం డ్యాం ఇంజినీర్లతో సేఫ్టీ బృందం సమావేశమైంది. శ్రీశైలం డ్యాం చీఫ్ ఇంజినీర్ కబీర్బాషా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శ్రీశైలం డ్యాం స్థితి గతులను క్షుణ్ణంగా వివరించారు. అనంతరం క్షేత్రస్థాయిలో డ్యాం పటిష్టతపై పరిశీలన చేట్టారు. రెండు రోజులపాటు జరిగే పరిశీలనలో డ్యాం పునాదులు, బ్లాక్లు, రేడియల్, స్లూయిస్ గేట్లు, పునాది భాగం ముందున్న సిలిండర్లు, ఫ్ల్లంజ్పూల్ ప్రాంతాల పటిష్టతపై పరిశీలన చేస్తారు. డ్యాంకు ఇరువైపులా ఉన్న కొండగట్ల పటిష్టతకు షార్ట్ క్రీటింగ్ ప్రక్రియలపై తుది నివేదికను కేంద్ర ప్రభుత్వానికి, ఆర్ధిక రుణం అందజేసే ప్రపంచబ్యాంక్కు అందజేస్తారు. డ్యాంను పరిశీలించిన సేఫ్టీ బృందంలో కేంద్ర జలశక్తి, కేంద్ర జలవనరుల శాఖ, ఎన్డీఎస్ఏలకు చెందిన నిపుణులు, చైర్మన్ డీకే శర్మ, హైడ్రో మెకానికల్ నిపుణులు గుల్షన్రాజ్, డ్యాం ఎక్స్పర్ట్ టీకే శివరాజన్, భూగర్భ నిపుణులు జేఎం గౌతంతో పాటు డ్యాం ఎస్ఈ బాలచంద్రారెడ్డి, ఇంజినీర్లు తదితరులు ఉన్నారు. -
పోగులన్నీ ఒక్కటై..
ఎమ్మిగనూరుటౌన్: తమ జీవనాధారమైన వైడబ్ల్యూ సీఎస్ను కాపాడుకునేందుకు చేనేతలు ఒక్క తాటిపై నిలిచారు. కలసికట్టుగా కూటమి కుట్రను ఛేదించారు. చేనేతలు, స్థానిక వైడబ్ల్యూసీ సభ్యులు అధికార పార్టీకి షాకిచ్చారు. కోట్లాది రూపాయల ఆస్తులతో పాటు దేశ వ్యాప్తంగా 16 వైడబ్ల్యూసీఎస్ ఔట్లెట్లు ఉన్న సొసైటీని నష్టాల్లో ఉన్న ఆప్కోలో విలీనం చేయడంతో పాటు మరో మూడు అంశాలను మహాజన సభలో ఆమోదింపజేసుకోవాలని అధికార పార్టీ నాయకులు పన్నిన కుట్ర బెడిసికొట్టింది. ఈ మేరకు మంగళవారం స్థానిక వైడబ్ల్యూసీఎస్ కార్యాలయ ఆవరణలో సొసైటీ మహాజన సభను ఆర్డీఓ అజయ్కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. 2026–27 ఆర్థిక సంవత్సర అంచనా బడ్జెట్తో పాటు హెచ్.మురవణి వద్ద సంఘ సభ్యులకు ఇచ్చిన 18.98 ఎకరాల భూమి గురించి చర్చించడం, 2024–25 ఆర్థిక సంవత్సర అడిట్ రిపోర్ట్తో పాటు అజెండాలోని 3వ అంశం చేనేత జౌళీశాఖ కమిషనర్ సూచనల మేరకు వైడబ్ల్యూసీఎస్ ఎంపోరియంలను ఆప్కోలో విలీనం చేసేందుకు అధికారులు సభలో ప్రతిపాదించారు. సభ్యులు ఒక్కసారిగా లేచి మూకుమ్మడిగా వ్యతిరేకించారు. తమ సొసైటీని ఆప్కోలో విలీనం చేయనీయమని, ఈ అంశాన్ని ఒప్పుకునే ప్రశ్నేలేదని మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఆర్డీఓ, చేనేత జౌళిశాఖ ఏడీ, స్థానిక వైడబ్ల్యూసీఎస్ ఇన్చార్జ్ కార్యదర్శి అయిన నాగరాజారావుతో సభ్యులు వాగ్వాదానికి దిగారు. లాభాల్లో ఉన్న తమ సొసైటీని నష్టాల్లో వున్న ప్రభుత్వ రంగ సంస్థ ఆప్కోలో ఎలా విలీనం చేస్తారని ధ్వజమెత్తారు. ఈ విలీనం వెనుక కుట్ర దాగుందన్నారు. అయితే వైడబ్ల్యూసీఎస్ను ఆప్కోలో విలీనం చేయబోమని, ఆప్కో ఉత్పత్తులతో పాటు సొసైటీ ఉత్పత్తులను విక్రయించేందుకే ఆప్కోలో ఉంచుతామని ఏడీ వివరించే ప్రయత్నం చేసినా.. సభ్యులు ససేమిరా అన్నారు. తామంతా ఈ ప్రతిపాదనకు వ్యతిరేకమని సభ అజెండాలోని మూడవ అంశాన్ని తాము ఆమోదించమని ముక్తకంఠంతో పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆదేశాలతో ఏదో ఒక విధంగా సభ్యులను నచ్చజెప్పి విలీన అంశాన్ని ఆమోదింపజేయాలని చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. దీంతో మహాజన సభకు హాజరైన 225 మంది సభ్యుల్లో వైడబ్ల్యూసీఎస్ను ఆప్కోలో విలీనానికి వ్యతిరేకంగా 210 మంది సభ్యులు సమావేశపు అజెండా పుస్తకంలో సంతకాలు చేశారు. మిగిలిన వారు సంతకాలు చేయకుండానే వెళ్లిపోయారు. దీంతో విలీన ప్రతిపాదనకు వ్యతిరేకంగా మెజార్టీ సభ్యులు సంతకాలు చేశారని ఏడీ ప్రకటించారు. వైడబ్ల్యూసీఎస్ను ఆప్కోలో విలీనానికి సభ్యులు వ్యతిరేకించిన అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని ఆర్డీఓ అజయ్కుమార్, ఏడీ నాగరాజారావు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పట్టణ సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఎస్ఐ శ్రీనివాసులు బందోబస్తు చేపట్టారు. కార్యదర్శి బదిలీ వెనుక రాజకీయం.. వైడబ్ల్యూసీస్, చేనేతల అభ్యున్నతికి పనిచేస్తూ, నిక్కచ్చిగా విధులు నిర్వర్తిస్తున్న సంఘ కార్యదర్శి అప్పాజీని చేనేత జౌళీ శాఖ కమిషనర్ గత ఆదివారం రాత్రి విధులను తప్పించి రాష్ట్ర కార్యాలయానికి సరెండర్ చేసినట్లు సమాచారం. ఆయన స్థానికంగా ఉంటే వైడబ్ల్యూసీస్ ఆప్కోలో విలీనంతో పాటు సంఘ ఆస్తులను కొల్లగొట్టేందుకు అవకాశం ఉండదనే నెపంతోనే కార్యదర్శి అప్పాజీని మహాజన సభకు రెండు రోజుల ముందు అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో ఆగమేఘాల మీద ఆదేశాలిచ్చినట్లు సభ్యులు విమర్శిస్తున్నా రు. కార్యదర్శి బదిలీపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఏడీ సమాధానమిస్తూ.. ఆప్కోలో విలీన అంశంపై ఆయన తప్పిదం చేశారని, ఈ మేరకు కమిషనర్ చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఎమ్మెల్యేకు చేనేతల ఝలక్.. చేనేతలపై అమితమైన ప్రేమ కురిపిస్తూ వారిని మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్న ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డికి వైడబ్ల్యూసీఎస్ సభ్యులు మహాజన సభలో ఝలక్ ఇచ్చారు. అధికార పార్టీ నాయకులు వైడబ్ల్యూసీఎస్ ఆస్తులను కొల్లగొట్టేందుకే తమ సంస్థను ఆప్కోలో విలీనం చేసే కుట్ర పన్నారని చేనేతలు పసిగట్టారు. విలీనాన్ని మూకుమ్మడిగా వ్యతిరేకించడంతో చేనేతలు తమవైపే వున్నారని చెప్పుకునే టీడీపీ నాయకులకు ఒక గుణపాఠం చెప్పినట్లు అయ్యిందని సభ వద్ద చేనేతలు బాహాటంగా చర్చించుకోవడం గమనార్హం. -
కాటసాని చొరవతోనే న్యాయం
కల్లూరు: వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి చొరవతో నే తమకు న్యాయం జరిగిందని ఓర్వకల్లు మండల రైతులు అన్నారు. ఓర్వకల్లు మండల పరిధిలోని పాలకొలను, హుసేనాపురం గ్రామాలకు చెందిన డీఆర్డీఓ భూనిర్వాసితులైన 21 మంది రైతులు మంగళవారం కాటసాని రాంభూపాల్రెడ్డిని స్వగృహంలో కలిసి, శాలువాతో సన్మానించి, కేక్ కట్ చేశారు. కాటసాని రాంభూపాల్రెడ్డి చొరవ తీసుకోవడంతో తమకు న్యాయం జరిగిందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఎకరాకు రూ. 4.30 లక్షల చొప్పున మొత్తం రూ. 1.30 కోట్లకు పైగా పరిహారం వచ్చిందన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో కాటసాని రాంభూపాల్రెడ్డి పాత్ర ప్రశంసనీయమన్నారు. కోర్టు ఉత్వర్వుల మేరకు తమకు న్యాయం జరిగిందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. -
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన చంద్రబాబు, కూటమి నేతలు ఇప్పుడు అదే విధానం అమలుకు శ్రీకారం చుట్టారు. అప్పట్లో మీటర్లు ఏర్పాటు చేస్తే పగులగొట్టాలని పిలుపునిచ్చిన టీడీపీ నేతలు ఇప్పుడు అదే విధానంలో ప్రజలకు షాక్ ఇచ్చేందుకు సిద్ధ
కర్నూలు(అగ్రికల్చర్): ప్రభుత్వ కార్యాలయాల విద్యుత్ బకాయిలకు రూపాయి ఇవ్వని ప్రభుత్వం ఏకంగా స్మార్ట్ మిటర్లు బిగించి ప్రీపెయిండ్ విధానాన్ని తీసుకొస్తోంది. ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల విద్యుత్ బిల్లులకు సంబంధించి రూ.520.37 కోట్ల బకాయిలు ఉండగా.. ఇప్పటి వరకు ఎలాంటి బడ్జెట్ కేటాయించని పరిస్థితి. గత వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లకు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, పవన్ కళ్యాణ్ తీవ్రంగా వ్యతిరేకించారు. స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగులగొట్టాలని పిలుపునిచ్చారు. నేడు అదే చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రజల నడ్డివిరిచే దిశగా స్మార్ట్ మీటర్లకు శ్రీకారం చుడుతుండటం గమనార్హం. ముందుగా స్మార్ట్ మీటర్లు బిగించిన ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీ పెయిడ్ విద్యుత్ విధానాన్ని ఏప్రిల్ 1 నుంచి అమలు చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రీ పెయిడ్ విద్యుత్ కోసం చెల్లించడానికి జిల్లాలోని ఏ ప్రభుత్వ కార్యాలయంలో రూపాయి కూడా అందుబాటులో లేని పరిస్థితి. ఆయా శాఖల హెచ్వోడీలు రాష్ట్ర స్థాయిలోనే ప్రత్యేక బడ్జెట్ కేటాయించి నెల వారీగా ప్రీ పెయిడ్ విద్యుత్ కోసం విని యోగించాల్సి ఉంది. ఇందుకు అన్ని శాఖలకు ప్రభు త్వం నిధులు వెచ్చించాలి. అప్పుడే ప్రీ పెయిడ్ విద్యుత్ సాధ్యమవుతుంది. అయితే ఉమ్మడి జిల్లా లో 25,060 ప్రభుత్వ కనెక్షన్లు ఉన్నాయి. చంద్ర బాబు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ప్రభుత్వ విద్యు త్ కనెక్షన్ల బకాయి రూ.520.37 కోట్లు ఉన్నాయి. 2024 జూన్ మాసం నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఈ బకాయిలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. 20,828 స్మార్ట్ మీటర్లకు ప్రీ పెయిడ్ విద్యుత్ విద్యుత్ బిల్లుల చెల్లింపులకు రూపాయి ఇవ్వని ప్రభుత్వం సర్కారు కార్యాలయాలకు ప్రీ పెయిడ్ విద్యుత్ విధానాన్ని ఏప్రిల్ 1 నుంచి అమలులోకి తెస్తోంది. కర్నూలు జిల్లాలో 10,643, నంద్యాల జిల్లాలో 10,188 ప్రభుత్వ కార్యాలయాలకు స్మార్ట్ మీటర్లు బిగించారు. ఉమ్మడి జిల్లాలో స్మార్ట్ మీటర్లు బిగించిన ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి ఇప్పటికే రూ.348.78 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఈ మొత్తం చెల్లించకుండానే స్మార్ట్ మీటర్లకు ప్రీ పెయిడ్ విద్యుత్ విధానం అమలు చేస్తుండటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక ప్రీ పెయిడ్ విద్యుత్ నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కర్నూలు(హాస్పిటల్): డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ(ఆరోగ్యశ్రీ) సేవలు బుధవారం(ఏప్రిల్ ఒకటి) నుంచి నిలిచిపోనున్నాయి. ఈ మేరకు ఏపీ నెట్ వర్క్ ఆసుపత్రుల సంఘం నాయకులు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. త్వరలో ఆరోగ్య శ్రీ స్థానంలో యూనివర్సల్ హెల్త్ పాలసీ అమలు కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అయితే ఇప్పటి వరకు ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులకు బకాయిపడ్డ రూ.3వేల కోట్లకు సంబంధించి ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో ప్రైవే టు ఆసుపత్రుల యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. జిల్లాలో 105 నెట్వర్క్ ఆసుపత్రు లు ఉండగా.. ఇందులో 60 ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులు పనిచేస్తున్నాయి. ఆయా ఆసుపత్రులు బకాయిల కోసం సమ్మె చేయడంతో రెండు నెలల క్రితం ప్రభుత్వం రూ.500కోట్ల వరకు ఇచ్చి చేతులు దులుపుకుంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మె చేయాల్సి వస్తోందని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు పేర్కొన్నాయి. శ్రీమఠం హుండీ ఆదాయం రూ. 2.48 కోట్లు మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయంలో కొలువైన శ్రీ రాఘవేంద్రస్వామి హుండీ ఆదాయం రూ.2,48,28,737 సమకూరింది. మంగళవారం శ్రీమఠం రాజాంగణ భవనంలో మార్చి 10 నుంచి 30వ తేదీ వరకు 21 రోజుల హుండీ కానుకలు లెక్కించారు. నగదు రూపంలో రూ 2,39,26,137, నాణేలా రూపంలో రూ.9,02,600 వచ్చినట్లు మేనేజర్ శ్రీనివాసరావు వివరించారు. అలాగే 14 గ్రాముల బంగారం, 2,163 గ్రాముల వెండి కానుకలు సమకూరినట్లు ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్–2 వెంటేష్ జోషి, ఇంజనీర్ సురేష్ కోనాపూర్ తెలిపారు. -
డిగ్రీ రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల
కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో నవంబర్/డిసెంబర్ నెలల్లో నిర్వహించిన డిగ్రీ 3, 5వ సెస్టర్ల రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదలయ్యాయి. వర్సిటీ వైస్ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.వెంకట బసవరావు ఆదేశాల మేరకు ఫలితాలు విడుదల చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. 3వ సెమిస్టర్కు 2999 మందిలో 713 మంది, 5వ సెమిస్టర్లో 1936 మందిలో 561 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు. ఫలితాలు http:// rayala seema university.ac.in వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. నేటి నుంచి గ్రామీణ ప్రాంత మహిళలకు ఉచిత శిక్షణ కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లా లోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలకు కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు డైరెక్టర్ కే.పుష్పక్ తెలిపారు. లేడీస్ టైలరింగ్, మగ్గం వర్క్, ఎంబ్రాయిడరీ డిజైన్లో 19 నుంచి 50 ఏళ్లలోపు వయస్సు మహిళలకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 1 నుంచి శిక్షణ మొదలవుతుందన్నారు. శిక్షణా కాలంలో ఉచిత భోజనం, హాస్టల్ వసతి కల్పిస్తామన్నారు. పూర్తి వివరా లకు 08518–273710, 90007 10508, 63044 91236, 96662 24931, 94409 0547 7 నెంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు. హాస్టల్ విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించండి కర్నూలు(అర్బన్): ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఆయన స్థానిక కలెక్టరేట్ సమీపంలోని ఎస్సీ, బీసీ సంక్షేమ బాలికల వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహాల్లోని విద్యార్థినీలతో భోజనం, వసతి సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆయన స్వయంగా విద్యార్థినీలతో కలిసి భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వసతి గృహాల్లోని స్టాక్ రిజిస్లర్లను పరిశీలించారు. పిల్లలకు చట్టపరమైన సమస్యలు ఉంటే లీగల్ సర్వీసెస్ హెల్ప్ లైన్ నెంబర్ 15100కు కాల్ చేయాలన్నారు. కార్యక్రమంలో సహాయ సాంఘిక సంక్షేమ అధికారి బి.మద్దిలేటి, వసతి గృహ సంక్షేమాధికారిణులు శైలజ, రజని పాల్గొన్నారు. ముగ్గురు డిబార్ కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో నిర్వహిస్తున్న బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షల్లో మంగళవారం 94 శాతం హాజరు నమోదైంది. 5,311 మందిలో 4990 మంది హాజరు కాగా 318 మంది గైర్హాజరయ్యారని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. డోన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేంద్రంలో ఇద్దరు, కర్నూలు ఉస్మానియా కళాశాల కేంద్రంలో ఒకరు చూచిరాతకు పాల్పడగా వారిని డిబార్ చేశామన్నారు. -
వైడబ్ల్యూసీఎస్ పక్షాన పోరాటం
నేతన్నల అభ్యున్నతికి చేనేత పితామహుడు పద్మశ్రీ మాచాని సోమప్ప పట్టణంలో స్థాపించిన వైడబ్ల్యూసీఎస్ సంస్థను కాపాడేందుకు వైఎస్సార్సీపీ పోరుబాట పట్టింది. వైఎస్సార్సీపీ పార్లమెంట్ సమన్వయకర్త బుట్టారేణుక, నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్రెడ్డి వేర్వేరు గా చేనేతలు, పార్టీ శ్రేణులతో భారీగా ర్యాలీ నిర్వహించి స్థానిక వైడబ్ల్యూసీఎస్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎమ్మిగనూరు చేనేతకు గుర్తింపు లేకుండా చేసేందుకే కూటమి ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే కుట్రపన్నుతున్నారని బుట్టారేణుక విమర్శించారు. మార్కెటింగ్ పేరుతో ఆస్తులను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని చేనేతలపై ప్రేమ వుంటే సంస్థను అభివృద్ధి చేయాలన్నారు. చేనేతలకు ఆధారమైన వైడబ్ల్యూసీఎస్ను ఆప్కోలో విలీనం చేస్తే వైఎస్సార్సీపీ అడ్డుకుంటుందన్నారు. -
రూ.2833 కోట్లతో జిల్లా అవుట్రీచ్ బడ్జెట్
కర్నూలు(సెంట్రల్): జిల్లాలో 52 శాఖలకు సంబంధించి రూ.2833 కోట్లతో అవుట్రీచ్ బడ్జెట్కు ఆమోదం తెలిపినట్లు జిల్లా ఇన్చార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ఇన్చార్జ్ మంత్రి అధ్యక్షతన 2026–27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి టీజీ భరత్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి, ఎమ్మెల్యేలు పార్థసారథి, బొగ్గుల దస్తగిరి, జయ నాగేశ్వరరెడ్డి, కేఈ శ్యామ్కుమార్, జేసీ నూరుల్ ఖమర్తోపాటు వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, చైర్మన్లు హాజరయ్యారు. ఇన్చార్జ్ మంత్రి మాట్లాడుతూ.. బడ్జెట్ అవుట్ రీచ్లో రూరల్ డెవలప్మెంట్, వైద్యం, విద్య, పాఠశాల విద్య, పీఆర్, పబ్లిక్ ట్రాన్స్పోర్టు డిపార్టుమెంట్లకు ఎక్కువ మొత్తంలో కేటాయింపులు జరిగినట్లు చెప్పారు. ఇవే కాక సూపర్సిక్స్లో రూ.2394 కోట్లను జిల్లాకు కేటాయించినట్లు చెప్పారు. జిల్లా ఇండస్ట్రియల్ హబ్గా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. త్వరలోనే పశ్చిమ ప్రాంతానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. బడ్జెట్ అవుట్ రీచ్పై ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు. వ్యక్తిపై గొడ్డలితో దాడి హొళగుంద: హొళగుంద పోలీస్ స్టేషన్ పరిధిలోని నెరణికి తండాకు చెందిన రామునాయక్పై అదే గ్రామానికి చెందిన రాఘవేంద్రనాయక్ గొడ్డలితో దాడి చేయడంతో తీవ్రంగా గాయాలైనట్లు ఎస్ఐ దిలీప్కుమార్ మంగళవారం తెలిపారు. రామునాయక్ ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడనే కారణంతో రాఘవేంద్రనాయక్ గొడ్డలితో దాడి చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు. ప్రస్తుతం రామునాయక్ ఆదోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాఘవేంద్రనాయక్పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ దిలీప్ కుమార్ వెల్లడించారు. వాహనం ఢీకొని జింక మృతి మంత్రాలయం రూరల్: మండల పరిధిలోని కల్లుదేవకుంట సమీపంలో మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక మృతి చెందింది. ఎమ్మిగనూరు టూ మంత్రాలయం జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి జింక కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు. జింక కళేబరానికి పోస్ట్మార్టం నిర్వహించిన అనంతరం ఖననం చేస్తామని ఎఫ్బీఓ నాగేష్ తెలిపారు. మద్యం మత్తులో వీరంగం కేసులో ఏడాది జైలు శిక్ష బేతంచెర్ల: పట్టణంలోని కొత్త బస్టాండులో మద్యం సేవించి మారణాయుధం పట్టుకొని ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన కేసులో నిందితుడికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు వెల్లడించారని సీఐ వెంకటేశ్వరరావు మంగళవారం తెలిపారు. వివరాలు.. పట్టణంలోని శేషారెడ్డి నగర్కు చెందిన కే.నాగ శేషు 2018లో మద్యం సేవించి కొత్త బస్టాండులో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుండటంతో పోలీసులకు ఫిర్యాదు అందింది. అప్పటి ఎస్ఐ తిరుపాలు ఘటనా స్థలానికి చేరుకొని మారణాయుధాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. డోన్ కోర్టు విచారణలో నేరం రుజువు కావడంతో నిందితుడు నాగశేషుకు ఏడాది జైలు శిక్ష, రూ.500 జరిమానా విధస్తూ జడ్జి తీర్పు వెల్లడించారు. ఈ కేసులో సాక్షులను సకాలంలో హాజరు పరచడంలో కృషిచేసిన సీఐ వెంకటేశ్వరరావు, కోర్టు కానిస్టేబుల్ మాధవ్ను ఉన్నతాధికారులు అభినందించారు. -
గ్యాస్ కష్టాలు ఇంకెన్నాళ్లు
గ్యాస్ వినియోగదారుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. సిలిండర్ల కోసం పనులు మానుకుని ఎండలో గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది. మంగళవారం మండల కేంద్రం హొళగుందలో భారత్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు సిలిండర్ల సరఫరా చేపట్టారు. ఆదోని నుంచి గ్యాస్ బండి వచ్చిందనే సమాచారంతో వినియోగదారులు సిలిండర్లతో బారులుదీరారు. మిట్ట మధ్యాహ్నం ఎండలో విలవిలాడుతూ గంటల తరబడి వేచి ఉన్నా చివరకు సిలిండర్లు ఇవ్వలేదు. ఈనెల 21వ తేదీ లోపు మాత్రమే బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఇస్తామని చెప్పడంతో కొందరు వాగ్వాదానికి దిగారు. చాలా మంది చివరకు ఖాళీ సిలిండర్లతో వెనుదిరగాల్సి వచ్చింది. – హొళగుంద -
ముప్పు తప్పేలా..!
శ్రీశైలం: శ్రీశైలంలోని పాతాళగంగ రోప్ వే వద్ద మంగళవారం ఉదయం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) పదో బెటాలియన్ కమాండర్ ప్రసన్నకుమార్ రోప్ వే మేనేజర్ పెంచల్ రెడ్డి పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ గోపాలకష్ణ ఆధ్వర్యంలో 30 మంది సిబ్బంది మాక్డ్రిల్ నిర్వహించారు. ప్రమాద సమయంలో అప్రమత్తంగా వ్యవహరించి ప్రయాణికులను రోప్ వే క్యాబిన్ నుంచి సురక్షితంగా ఎలా కిందకు చేర్చాలి. ఆ తర్వాత వారికి ఎలా ప్రథమ చికిత్స నిర్వహించాలో మాక్ డ్రిల్ ద్వారా ప్రదర్శించి అవగాహన కల్పించారు. కిందకు చేరిన వ్యక్తికి స్ట్రెచర్పై ప్రథమ చికిత్స -
డీఎంహెచ్ఓ బాధ్యతల స్వీకరణ
కర్నూలు(హాస్పిటల్): జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ)గా డాక్టర్ వై. కామేశ్వర ప్రసాద్ మంగళవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఆయనను కర్నూలుకు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన ఎంబీబీఎస్తో పాటు ఎండీ పల్మనాలజీ అభ్యసించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరిని మర్యాదపూర్వకంగా కలిశారు. 1,031 పింఛన్ల కోత కర్నూలు(అగ్రికల్చర్): ఏప్రిల్ నెల పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని 1వ తేదీ చేపట్టడానికి డీఆర్డీఏ ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి జిల్లాలో 4,47, 648 పింఛన్లకు రూ.196.3 కోట్లు విడుదలయ్యా యి. మార్చి నెలతో పోలిస్తే ఏప్రిల్ నెలలో 1,031 పింఛన్లపై కోత పడింది. చంద్రబాబు ప్రభుత్వం 2024 జూన్లో ఏర్పాటైంది. దాదాపు రెండేళ్లవుతున్నా ఇప్పటికీ కొత్త పింఛన్ల ఒక్కటంటే ఒక్కటీ ఇవ్వలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకు పింఛను ఇస్తామని ప్రకటించిన చంద్రబాబు ఈ హామీని కూడా కొండెక్కించడం గమనార్హం. -
చౌడేశ్వరీ దేవి హుండీ ఆదాయం లెక్కింపు
బనగానపల్లె రూరల్: మండలంలోని నందవరం గ్రామంలో వెలసిన చౌడేశ్వరీ దేవస్థానంలో హుండీలోని కానుకలను లెక్కించగా రూ.20,35,355 ఆదాయం వచ్చిందని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి మంగళవారం తెలిపారు. గత ఫిబ్రవరి 2వ తేదీ నుంచి మార్చి 30వ తేదీ వరకు భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలను మంగళవారం లెక్కించినట్లు చెప్పారు. నగదుతో పాటు 11 గ్రాముల బంగారు ఆభరణాలు, 390 గ్రాముల వెండి అభరణాలు వచ్చినట్లు వెల్లడించారు. గ్రూపు ఆలయాల ఈఓ బ్రహ్మనందరెడ్డి, చైర్మన్ పీవీ నాగార్జునరెడ్డి, పాలక మండలి సభ్యులు, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు. -
సంస్కరణల పేరుతో సతాయింపు!
కర్నూలు సిటీ: ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న పిల్లలు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో రాణించలేకపోతుండడంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పాఠశాల విద్యలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్పొరేట్ విద్యాసంస్థలకు దోచి పెట్టేందుకు పూనుకుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా జూన్ మొదలయ్యే అకడమిక్ ఇయర్ను మార్పు చేసి ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు తరగతులు ప్రారంభించేందుకు గతేడాది నుంచి చర్యలు చేపట్టింది. దీనికి సంస్కరణలు అనే సాకు చూపుతుండడం గమనార్హం. విద్యా వ్యవస్థల్లో మార్పుల కంటే అయిన వారి విద్యాసంస్థల కోసమే సెలవుల్లో తరగతులను ప్రారంభిస్తున్నారు. ఇటీవలే ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు 2026–27 అకడమిక్ ఇయర్ను ప్రారంభించి సెకండ్ ఇయర్ తరగతులు నిర్వహించేందుకు షెడ్యూల్ను జారీ చేశారు. ఈ ప్రకారం 314 రోజులు, 82 సెలవు దినాలు, 232 పని దినాలు ఉన్నాయి. ఈ నెల ఏప్రిల్ 6వ తేదీ వరకు ఇంటర్మీడియెట్ థీయరీ పరీక్షల మూల్యాంకనం జరుగనుంది. ఇలాంటి సమయంలో బోర్డు జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం బుధవారం నుంచే తరగతులను ప్రారంభించి, డొక్కా సీతమ్మ మధ్యాహ్నా భోజన పథకం సైతం అమలు చేయనున్నారు. అధ్యాపకులు లేకుండా అకడమిక్ ఇయర్ను ఎలా ప్రారంభిస్తున్నారు? వేసవి ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో విద్యార్థులు కాలేజీకి హాజరవుతారో? లేదోనని అధ్యాపకులు వాపోతున్నారు. 6 నుంచి ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు ఏప్రిల్ 6 నుంచి 23వ తేదీ వరకు అడ్మిషన్లు చేసుకునేందుకు షెడ్యుల్ జారీ చేశారు. ఈ నెల 2వ తేదీ పదో తరగతి పరీక్ష జరుగనుంది. మూల్యాంకనం 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరుగనున్నాయి. ఆ తరువాత సుమారుగా 20 రోజుల తరువాత ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఫలితాలు రాకముందే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లకు అనుమతులు ఇవ్వడం బట్టి చూస్తే కార్పొరేట్, సెమీ కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలు ఏటా షెడ్యుల్ కంటే ముందుగా అడ్మిషన్లు చేసుకోవడంపై జరిగే ఆందోళనలు లేకుండా వారికి పరోక్షంగా సాయం చేసేందుకే ప్రభుత్వం ముందస్తు అడ్మిషన్లకు అనుమతులు ఇచ్చినట్లు పలు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. పుస్తకాలు లేకుండా తరగతులు? ఇంటర్మీడియెట్ బోర్డు తీసుకొచ్చిన నూతన సంస్కరణల ప్రకారం ఏప్రిల్ 1వ తేదీ నుంచి విద్యా సంవత్సరం మొదలు కానుంది. 23వ తేదీ వరకు తరగతులు నిర్వహించి, 24 నుంచి మే నెల 31వ తేదీ వరకు వేసవి సెలవులు, జూన్ 1వ తేదీ నుంచి కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి. ఎండల తీవ్రత దృష్ట్యా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తరగతులు, ఆ తరువాత డొక్కా సీతమ్మ మధ్యాహ్నా భోజన పథకం ద్వారా భోజనం అందించేలా ఆదేశాలు ఇచ్చాం. – జి.లాలెప్ప, ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ కార్యాలయ అధికారి జిల్లాలో అన్ని యాజమాన్యాలకు చెందిన జూనియర్ కాలేజీలు 161 ఉన్నాయి. ఇంటర్మీడియెట్ విద్యలో కొత్తగా తీసుకొచ్చిన సంస్కరణలలో భాగంగా బుధ వారం నుంచి 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. 23వ తేదీ వరకు తరగతులు నిర్వహించి, 24వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. తిరిగి జూన్ 1న కాలేజీలు తెరవనున్నారు. ఏప్రిల్ 1 నాటికే విద్యార్థుల చేతికి నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పటివరకు కర్నూలు, నంద్యాల జిల్లాలకు ఒక్క నోటు బుక్కు కానీ, పాఠ్య పుస్తకం కానీ రాకపోవడం గమనార్హం. -
డోన్లో దొంగల హల్చల్
డోన్ టౌన్: పట్టణంలోని శ్రీనివాస నగర్లో ఆరుబయట నిద్రిస్తున్న మహిళ మెడలోని గొలుసును లాక్కెళ్లేందుకు ప్రయత్నించిన నలుగురు యువకుల్లో ఒకరు స్థానికులకు పట్టుబడ్డారు. సోమ వారం రాత్రి దుండగులు చైన్స్నాచింగ్కు యత్నించగా మహిళ అప్రమత్తమై కేకలు వేసింది. నిందితులు మోటార్ సైకిల్పై పారిపోవడానికి ప్రయత్నించగా కాలనీ ప్రజలు వెంబడించి ఒక యువకుడిని పట్టుకున్నారు. నిందితుడిని పట్టణ పోలీసులకు అప్పజెప్పారు. పట్టుబడిన యువకుడు కర్నూలు పట్టణం బుధవారపేటకు చెందిన అబ్దుల్ కరీంగా పోలీసుల విచారణలో తెలిసింది. పరారైన ముగ్గురు నిందితులపై గతంలో బండిఆత్మకూర్, నంద్యాల, పాణ్యం, నందికోట్కూ రు, కర్నూలు తాలూకా పోలీసు స్టేషన్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసులు నమోదై ఉన్నట్లు తెలిసింది. పట్టుబడిన అబ్దుల్ కరీంపై తెలంగాణ రాష్ట్రం గద్వాల పోలీసు స్టేషన్లో కేసు నమోదై ఉండటంతో అక్కడి పోలీసులకు అప్పజెప్పి, పరారైన ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సీఐ ఇంతియాజ్బాషా వెల్లడించారు. -
భార్య పుట్టింటికి వెళ్లిందని ఆత్మహత్య
పాణ్యం: భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి రాలేదని మనస్తాపం చెందిన భర్త రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన పాణ్యంలో చోటు చేసుకుంది. రైల్వే హెడ్కానిస్టేబుల్ ఖలీల్ మంగళవారం తెలిపిన వివరాల మేరకు.. ఆలమూరు గ్రామానికి చెందిన గని గోపాల్రెడ్డి (45), భార్య లక్ష్మీదేవి మధ్య గొడవ జరగడంతో మూడు నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన గోపాల్రెడ్డి సోమవారం రాత్రి 12 గంటల సమయంలో పాణ్యంలోని తాటికాయ చెరువు వద్ద రైలు కింద పడి మృతి చెందాడు. ఉదయం ట్రాక్ను పరిశీలించిన సిబ్బంది మృతదేహాన్ని చూసి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహం వద్ద లభించిన ఆధారాల మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల జీజీహెచ్కు తరలించారు. మృతుడి కుమారుడు భీష్మరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. -
వసతి గదిలో ఇద్దరు యువకులు, ఓ యువతి
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలం దేవస్థాన వసతి గదిలో అనుమానాస్పదంగా ఇద్దరు యువకులు, ఒక యువతి ఉండడం, వారిని విచారించగా పొంతనలేని సమాధానాలు చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇతర ప్రాంతానికి చెందిన ఓ యువతితో దేవస్థానంలో హౌస్కీపింగ్ నిర్వహణ చేపడుతున్న పద్మావతి ఏజెన్సీ సూపర్వైజర్, శ్రీశైలానికి చెందిన మరో వ్యక్తి ఉన్నట్లు దేవస్థానం ఉన్నతాధికారులకు సమాచారం అందింది. దీంతో ఇంచార్జ్ సీఎస్వో తన సిబ్బందితో దాడులు నిర్వహించగా రెడ్హ్యండెడ్గా ఇద్దరు యువకులు, ఒక యువతిని గుర్తించారు. వారిని విచారించగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో శ్రీశైలం పోలీసుస్టేషన్కు తరలించారు. అసలేం జరిగిందంటే.. శ్రీశైలం దేవస్థానంలోని సిద్దిరామప్ప వాణిజ్య సముదాయంలో భక్తుల సౌకర్యార్థం వసతి గదులను నిర్మించారు. మార్చి 29న నరేంద్రారెడ్డి పేరుతో భార్య, భర్త విడిది చేశారు. వీరు మంగళవారం ఉదయం 10.30గంటలకు వసతి విభాగాన్ని ఖాళీ చేశారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న పద్మావతి ఏజెన్సీ సూపర్వైజర్తో రసీదుపై సంతకం చేయించుకున్నారు. అనంతరం దేవస్థానం సెంట్రల్ రిసెప్షన్ ఆఫీసులో రసీదు చూపిస్తే వారికి రావాల్సిన అడ్వాన్స్ డబ్బులు తిరిగి ఇచ్చి, రూము ఖాళీ అయినట్లు నమోదు చేసుకుంటారు. అయితే వారికి ఇవ్వాల్సిన అడ్వాన్స్ డబ్బులు అక్కడ విధులు నిర్వహిస్తున్న సూపర్వైజర్ ఇచ్చి పంపించేశాడు. అనంతరం ఓ యువతితో ఎ–3 వసతి గదిలో తన సన్నిహితుడైన శ్రీశైలానికి చెందిన మరో వ్యక్తితో కలిసి ఉన్నారు. పెళ్లి సంగతి తేల్చుకోవాలనట! శ్రీశైలం పోలీసు స్టేషన్లో యువతి, యువకులను విచారించారు. పద్మావతి ఏజెన్సీలో సూపర్వైజర్గా విధులు నిర్వహిస్తున్న సాయికృష్ణ, గదిలో ఉన్న యువతి బంధువులు అవుతారని.. వాళ్ళిద్దరూ గత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్నారని తెలిసింది. అయితే సాయికృష్ణ ఇంట్లో వివాహ సంబంధాలు చూస్తుండడంతో విషయం తెలుసుకున్న యువతి సాయికృష్ణతో పెళ్ళి విషయం మాట్లాడి వస్తానని తల్లికి చెప్పి వచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైందని సమాచారం. అర్హత లేని వ్యక్తికి వసతి విభాగం బాధ్యతలు శ్రీశైలం దేవస్థానంలో ఆయా విభాగాలకు అధిపతులుగా (సహాయ కార్యనిర్వహణాధికారి) ఏఈవోలను నియమిస్తారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత తన రాజకీయ పలుకుబడి ఉపయోగించుకుని ఎలాంటి అర్హత లేకపోయినా వసతి విభాగం ఏఈవోగా దేవస్థానం పీఆర్వో బాధ్యతలు చేపట్టారు. ఆ విభాగంపై పర్యవేక్షణ లేకపోవడంతో తరచూ వసతి విభాగంలో వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఫలితంగా దేవస్థానం ప్రతిష్ట దెబ్బతింటోంది. వీరిలో పద్మావతి ఏజెన్సీ సూపర్వైజర్, మరో వ్యక్తి -
ఎమ్మిగనూరులో టెన్షన్.. టెన్షన్
సాక్షి, కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరు చేనేత సంఘాన్ని ఆప్కోలో విలీనం చేయడంపై ఆందోళన చేపట్టారు. కోఆపరేటివ్ సొసైటీ ఎదుట చేనేతలు నిరసనకు దిగారు. చేనేత కార్మికులకు మద్దతుగా వైఎస్సార్సీపీ, వామపక్ష నేతలు ధర్నాకు దిగారు. సొసైటీని అప్పుల్లో ఉన్న ఆప్కోలో విలీనం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై చేనేత కార్మికులు, వైఎస్సార్సీపీ నేతలు బైఠాయించారు.ఆందోళన చేస్తున్న వైఎస్సార్సీపీ, సీపీఐ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. విలీనం పేరుతో చేనేతల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారంటూ వైఎస్సార్సీపీ నేతలు నినాదాలు చేశారు. సర్వసభ్య సమావేశంలో విలీన అంశం తొలగించాలంటూ డిమాండ్ చేశారు. -
పీజీఆర్ఎస్కు కలెక్టర్, జేసీ గైర్హాజరు
కర్నూలు(సెంట్రల్): ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు ఎంతో వ్యయప్రయాసాలకోర్చి వస్తున్నారు. కలెక్టర్, జేసీలకు వినతులను ఇస్తే పరిష్కారం అవుతాయనే నమ్మకం ఇక్కడి వరకు వచ్చేలా చేస్తోంది. ఇలాంటి ముఖ్యమైన కార్యక్రమానికి ఉన్నతాధికారులు ఇద్దరూ హాజరు కాకపోవడంతో ప్రజలు తీవ్రత అసంతృప్తికి లోనయ్యారు. ఏడెనిమిది వా రాల నుంచి కలెక్టర్, జేసీ సరిగా అందుబాటులో ఉండటం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి ప్రభుత్వ కార్యక్రమాలకే అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో డీఆర్వో, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లు పీజీఆర్ఎస్ను నిర్వహిస్తున్నారు. ఈ సోమవారం కూడా కలెక్టర్ స్థానికంగానే కల్లూరులో ఓ లబ్ధిదారుడి గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొనగా.. జేసీ ఎమ్మిగనూరులో టిడ్కో గృహాల ప్రవేశంలో పాల్గొనడంతో డీఆర్వో ఆధ్వర్యంలోనే పీజీఆర్ఎస్ కొనసాగింది. కార్యక్రమంలో స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ అనురాధ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నల్లమలలో లారీ బోల్తా మహానంది: నంద్యాల–గిద్దలూరు నల్లమల ఘాట్రోడ్డులో కందుల లోడుతో వెళ్తున్న లారీ ఆదివారం అర్థరాత్రి బోల్తా పడింది. గిద్దలూరు నుంచి నంద్యాల వైపు వస్తున్న లారీ అదుపు తప్పి బోల్తాపడటంతో కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ నెలకొంది. మహానంది, శిరివెళ్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్రమబద్దీకరించారు. లారీ డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. ఘటనా స్థలం గిద్దలూరు పరిధిలోకి రావడంతో గిద్దలూరు పోలీసులు వివరాలు సేకరించినట్లు తెలిసింది. -
పరీక్ష కేంద్రం తనిఖీ
ఉయ్యాలవాడ : మండల కేంద్రమైన ఉయ్యాలవాడ మోడల్స్కూల్లో 10వ తరగతి పబ్లిక్ పరీక్ష కేంద్రాన్ని రాష్ట్ర పరిశీలకురాలు అనురాధ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సోమవారం విద్యార్థులు రాస్తున్న సోషల్ పరీక్షను ఆమె పరిశీలించారు. అనంతరం పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు అవసరమైన మౌళిక వసతులు, తదితర అంశాలపై ఎంఈఓ వీరప్రతాప్రెడ్డితో ఆరా తీశారు. నలుగురు విద్యార్థులు స్క్రైబర్ సహాయంతో పరీక్షలు రాస్తున్నారని, ఐదుగురు విద్యార్థులు గైర్హాజరయ్యారన్నారు. ఈమె వెంట చీఫ్ వెంకటేశ్వరరావు, డిపార్ట్మెంటల్ అధికారి విప్రనారాయణాచారి, సిట్టింగ్ స్క్వాడ్ శ్రీనివాసులు ఉన్నారు. పీఆర్సీ కోసం ఒక రోజు నిరాహార దీక్ష కర్నూలు సిటీ: పీఆర్సీ, ఐఆర్ కోసం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షుడు కె.సురేష్కుమార్ తెలిపారు. సోమవారం ఆ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పా టు చేయాలని, 29 శాతం మధ్యంతర భృతిని వెంటనే చెల్లించాలని కోరారు. అదే విధంగా పెండింగ్లో ఉన్న డీఏలను వెంటనే చెల్లించాల ని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. ఆర్థిక బకాయిల చెల్లింపునకు రోడ్ మ్యాప్ ప్రకటించి,నిర్ణీ త గడువులోగా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రవికుమార్, నవీన్ పాటి, గౌరవాధ్యక్షులు దా వీదు, సహాధ్యక్షుడు హేమంత్కుమార్, ఆర్థిక కార్యదర్శి యోహోషువ పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి నందవరం: మండల పరిధిలోని ముగతి గ్రామ సమీపంలోని ఎంఆర్బీ ఇట్టుకల బట్టి వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో షేక్షావలి(40) మృతి చెందాడు. మరొక విద్యార్థి నవీన్కుమార్ గాయపడ్డాడు. ఎస్ఐ తిమ్మారెడ్డి, స్థానికులు తెలిసిన వివరాలు..సోమవారం మంత్రాలయం మండలం, రచ్చమర్రి గ్రామానికి చెందిన షేక్షావలి బైక్పై మంత్రాలయం మీదుగా ఎమ్మిగనూరుకి బయలుదేరాడు. నదికై రవాడికి చెందిన తలారి అంజలి కుమారుడు నవీన్కుమార్ (7వ తరగతి విద్యార్థి) అతని బైక్పై లిఫ్ట్ అడిగి ఎక్కాడు. అదే సమయంలో ఎమ్మిగనూరు నుంచి ఓ ఆటో కోసిగి మండలం, దొడ్డి బెళగల్కు వస్తోంది. బైకు, ఆటో ఇట్టుకల బట్టి వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న షేక్షావలి, నవీన్కుమార్కి తీవ్ర గాయలయ్యా యి. పోలీసులు క్షతగాత్రులను అంబులెన్స్లో ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ షేక్షావలి మృత్యువాత పడ్డాడు. నవీన్కుమార్ తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని భార్య దస్తగిరమ్మ, గాయపడ్డ నవీన్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య ఎమ్మిగనూరురూరల్: అప్పుల బాధతో పురుగుమందు తాగి బోయ మా రెప్ప (27) అనే యువ రైతు సోమవారం తెల్లవారుజామున మృతి చెందా డు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు... ఎమ్మిగనూరు మండల పరిధిలోని కడివెళ్ల గ్రామానికి చెందిన బోయ పెద్దయ్య కుమారుడు బోయ మారెప్ప (27) తనకు ఉన్న 2 ఎకరాల పొలంతో పాటు మరో ఐదు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని మొక్కజొన్న సాగుచేశాడు. పెట్టుబడి కోసం బ యట వ్యక్తుల దగ్గర రూ.10 లక్షల వరకు అప్పు చేశాడు. పంట సరిగ్గా రాకపోవటంతో అప్పు లు ఎలా తీర్చాలో తెలియక నాలుగు రోజుల క్రితం పురుగు మందు తాగి స్పృహ కోల్పోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు ప్రథమ చికిత్స అనంతరం ఎమ్మిగనూరు నుంచి కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. బోయ మారెప్పకు భార్య, ఇద్దరు కమా రులు, ఒక కుమార్తె ఉన్నారు. ప్రభుత్వం ఆదు కోవాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అధికారులకు కోరుతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు. -
చేనేత పితామహుడు పద్మశ్రీ మాచాని సోమప్ప
ఎమ్మిగనూరుటౌన్: నేత వృత్తిని, చేనేత ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఘనత పద్మశ్రీ మాచాని సోమప్పకే దక్కిందని, అందుకే ఆయనను చేనేత పితామహుడు అంటారని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్రెడ్డి అన్నారు. మాచాని సోమప్ప 48వ వర్ధంతిని పురస్కరించుకొని సోమవారం పట్టణంలోని ఆయన విగ్రహానికి వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్మోహన్రెడ్డి, చేనేత కార్మికులు, పార్టీ శ్రేణులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. చేనేతల అభ్యున్నతి కోసం పద్మశ్రీమాచాని సోమప్ప ఎనిమిది దశాబ్దాల క్రితమే పట్టణంలో ఎన్నో సంస్థలు స్థాపించి చేనేతలతో పాటు ఎన్నో కులాలకు ఉపాధి అవకాశాలు కల్పించారన్నారు. స్పిన్నింగ్ మిల్లు, వైడబ్ల్యూసీఎస్, కో ఆపరేటివ్ స్టోర్స్, లెదర్ సొసైటీ, ట్రాన్స్పోర్ట్ లాంటి సంస్థలను నెలకొల్పి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించి దేశ, విదేశాల్లో చేనేత ఉత్పత్తులను పరిచయం చేశారన్నారు. దీంతో నేటికీ ఎమ్మిగనూరు చేనేత ఉత్పత్తులకు మంచి గుర్తింపు వుందని తెలిపారు. ఆయన ఆశయ సాధనకోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి మాచాని వెంకటేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుట్టారంగయ్య, చేనేత విభాగం నాయకులు పార్టీ నాయకులు సత్యన్న, శ్రీనివాసులు, గోవిందప్ప, బీఆర్ బసిరెడ్డి, భీమిరెడ్డి, రియాజ్ అహమ్మద్, కోటేకల్ లక్ష్మన్న, బంగిశ్రీరాం, షబ్బీర్ అహమ్మద్, షాబుద్దీన్, వేణుగోపాల్రెడ్డి, నాగభూషణ్రెడ్డి, పిల్లిగుండ్ల గోవిందు, సోమేష్ తదితరులు పాల్గొన్నారు. -
లోకాయుక్త సేవలకు గవర్నర్ అభినందన
కర్నూలు(సెంట్రల్): కర్నూలు నుంచి ప్రజలకు సేవలు అందిస్తున్న ఏపీ లోకాయుక్త సంస్థకు గవర్నర్ అభినందనలు తెలిపినట్లు ఉప లోకాయుక్త జస్టిస్ పి.రజనీ తెలిపారు. ఇటీవల లోకాయుక్త వార్షిక నివేదికను గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్కు సమర్పించినట్లు ఆమె చెప్పారు. ఆ నివేదికలోని తమ సంస్థ పనితీరుపై గవర్నర్ పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. 2025 జనవరి 01 నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు వచ్చిన 3106 కొత్త ఫిర్యాదులతోపాటు అప్పటికే పెండెన్సీలో ఉన్న 4,325 కేసులను కలుపుకొని మొత్తం7,431 ఫిర్యాదుల్లో 3,654 ఫిర్యాదులను పరిష్కరించామన్నారు. ఈ ఫిర్యాదుల్లో అధిక శాతం రెవెన్యూ సమస్యలే ఉన్నాయన్నారు. అంతేకాక దుర్వినియోగమైన రూ.15.29 కోట్ల ప్రజాధనాన్ని ఖజానాకు జమచేసినట్లు చెప్పారు. తప్పు చేసే అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంలో లోకాయుక్త కీలకపాత్ర పోషిస్తుందన్నారు. మోసాలకు పాల్పిన ఉద్యోగులను సర్వీసు నుంచి తొలగించడం, అనుమతి లేకుండా గైర్హాజరమైన వైద్యులు, ఉద్యోగుల నుంచి తొలగించడం, అవినీతి, అక్రమాలకు సంబంధించిన పలు అంశాలలో అధికారులు, ఉద్యోగులకు జరిమానాలను విధించడం వంటి చర్యలు తీసుకోవాలని లోకాయుక్త సిఫారుసు చేసిందని చెప్పారు. సుమోటో అధికారాలను ఉపయోగించి కేసులు నమోదు చేసుకుని కార్మికులు, కర్షకుల పిల్లల సంక్షేమ, ప్రభుత్వ ఖాజానా కార్యకలాపాల్లో పారదర్శకత పెంపు, ప్రజారోగ్యాన్ని కాపాడడంలో చర్యలు, విద్యార్థి హక్కుల పరిరక్షణ వంటి అంశాల్లో జోక్యం చేసుకొని పరిష్కారాలకు సిఫార్సు చేసినట్లు తెలిపారు. మున్ముందు కూడా లోకాయుక్త సంస్థ ఎంతో బాధ్యతయుతమైన పాత్రపోషించడంలో కీలకంగా ఉంటుందని వివరించారు. -
జెడ్పీ సీఈఓగా జీవీ రమణారెడ్డి
● అనంతపురం డీఎస్జీఎస్డబ్ల్యూఓగా జి.నాసరరెడ్డి ● డ్వామా పీడీగా ఐ.నరసింహారెడ్డి కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారిగా జీవీ రమణారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ శశి భూషణ్కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన గతంలో వైఎస్సార్ కడప జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓగా విధులు నిర్వహిస్తూ, 2024 నవంబర్ 25న ఇక్కడకు డీడీఓగా బదిలీపై వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా డీడీఓలుగా ఉన్న వారందరికీ సీనియారిటీ ప్రకారం ఇటీవలే ప్రభుత్వం సీఈఓ హోదాలో పదోన్నతి కల్పించింది. ఈ నేపథ్యంలో రమణారెడ్డిని ఇక్కడకు సీఈఓగా నియమించారు. ● నెల్లూరు జిల్లా బోగోలు నుంచి 2022 ఆగస్టు 13న ఇక్కడకు జెడ్పీసీఈఓగా పదోన్నతిపై వచ్చి ఇప్పటి వ రకు విధులు నిర్వహిస్తున్నజి.నాసరరెడ్డిని ప్రభు త్వ ం అనంతపురం డీఎస్జీఎస్డబ్ల్యూఓగా నియమించింది. ● నంద్యాల జిల్లా డోన్ డీఎల్డీఓగా విధులు నిర్వహిస్తున్న ఐ.నరసింహారెడ్డిని కర్నూలు డ్వామా పీడీగా నియమించారు. ● నంద్యాల జిల్లా గ్రామ పంచాయతీ అధికారిగా విధు లు నిర్వహిస్తున్న కె.లలితాబాయిని నంద్యాల డీఎస్జీఎస్డబ్ల్యూఓగా, నంద్యాల డ్వామా లో ఎంఅండ్ఈగా విధులు నిర్వహిస్తున్న టీవీ భాస్కర్నాయుడును ప్రకాశం డీఎస్జీఎస్డబ్ల్యూఓగా నియమించారు. జీవీ రమణారెడ్డి ,జీ నాసరరెడ్డి,ఐ నరసింహారెడ్డి -
జగనన్న హయాంలోనే పేదలందరికీ ఇళ్లు
టీడీపీ నేతలూ.. నోరు జాగ్రత్తమంగళవారం శ్రీ 31 శ్రీ మార్చి శ్రీ 2026మండే సూరీడు! కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో సోమవారం ఎండల తీవ్రతతో పాటు వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. నంద్యాల జిల్లా దొర్నిపాడులో అత్యధికంగా 42.27 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నంద్యాల రూరల్, కోవెలకుంట్ల, కొత్తపల్లి, ఆళ్లగడ్డ, పాణ్యం మండలాల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్నూలు జిల్లా కోడుమూరులో 41.3, కల్లూరులో 41.1, మంత్రాలయంలో 40.7, ఆస్పరిలో 40.3, హొళగుందలో 40.1 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న నాలుగైదు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ విభాగం సూచించింది. ఆలూరు రూరల్: ఇష్టానుసారంగా మాట్లాడకుండా టీడీపీ నేతలు నోరు అదుపులో ఉంచుకోవాలని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి హితవు పలికారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డిని విమర్శించే అర్హత వారికి లేదన్నారు. ఆలూరులోని ఆర్అండ్బీ అతిథి గృహంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. హద్దు మీరి మాట జారకుండా టీడీపీ ఆలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ జ్యోతి ఉండాలని సూచించారు. ఆలూరు అభివృద్ధి అంటే సోషల్ మీడియాలో నాలుగు మాటలు మాట్లాడి పోస్టులు ఉంచడం కాదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి ఆలూరు నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేయాలని సవాల్ విసిరారు. పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయం ఆలూరు ఎమ్మెల్యేగా తాను ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తాగునీటి సమ స్య, రహదారులపై అప్పటి కలెక్టర్ రంజిత్ బాషాకు నివేదిక ఇచ్చానని ఎమ్మెల్యే చెప్పారు. డీఆర్సీ మీటింగ్లో ఆలూరు నియోజకవర్గసమస్యలపై ప్రస్తావించి టీడీపీ జిల్లా ఇంచార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడుకు లెటర్ ప్యాడ్పై రాతపూర్వకంగా ఇచ్చానన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద విడుదలైన నిధులతో సీసీ రోడ్లు నిర్మిస్తే ఇదే అభివృద్ధి అంటూ కథలుగా చెప్పుకోవడం హాస్యాస్పదం అన్నారు. ఎన్ఆర్జీఎస్ నిధులు అన్ని ప్రాంతాలకు వస్తాయన్నారు. ఏ గ్రామం ఎక్కడ ఉందో, ఆ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయనే విషయం టీడీపీ ఆలూరు నియోజకవర్గ ఇన్చార్జ్కు తెలియదన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తూ.. గ్రామాల్లో ప్రజలను రెచ్చగొట్టి గొడవలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు మల్లికార్జున, నాయకులు వెంకటేషులు, భాస్కర్, ఎల్లప్ప, గుండయ్య, శివ, మల్లయ్య, నాగేష్, అనీల్ రెడ్డి, వరుణ్ పాల్గొన్నారు. మంత్రాలయం రూరల్: పేదలందరికీ ఇళ్లు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనే వచ్చాయని మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి అన్నారు. జగనన్న కాలనీలో నిర్మించుకున్న ఇళ్లకు రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదన్నారు. మండల పరిధిలోని వగరూరు గ్రామంలో సోమవారం పేదలకు ఇళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. గత ప్రభుత్వంలో కురువ రంగమ్మ నూతన గృహం మంజూరు కాగా పూర్తి చేశారు. గృహప్రవేశాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. ఎమ్మెల్యేకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో లేఅవుట్లతో నిర్మించిన జగనన్న కాలనీలను ప్రజలు ఎప్పటికీ మరచిపోరన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా గ్రామాల్లో గతంలో మంజూరైన ఇళ్లకు బిల్లు మంజూరు చేయాలన్నారు. గతంలో తాము నిర్మించిన జగనన్న కాలనీలు ముళ్లపొదలతో నిండి ఉన్నాయని, వాటిని బాగు చేయాలన్నారు. ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డికి గ్రామ నాయకులు, ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. తహసీల్దార్ రమాదేవి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ చంద్రశేఖర్, డిప్యూటీ ఎంపీడీఓ ఉపేంద్రరెడ్డి, హౌసింగ్ ఎఈ వీరేంద్ర, వైఎస్పార్సీపీ జిల్లా కార్యదర్శి విశ్వనాథరెడ్డి, మండల కన్వీనర్ భీమారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఇద్దరు అధికారులకు రెండు ఇంక్రిమెంట్లు కట్ కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ శాఖలో వెలుగులోకి వచ్చిన రూ.97.55 లక్షల కుంభకోణానికి సంబంధించి అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ శాఖ అమలు చేస్తున్న జాతీయ ఆహారభద్రత మిషన్ నిధులు పక్కదారిపట్టినట్లు 2019 మే నెలలో గుర్తించారు. పథకానికి సంబంధించి జూనియర్ అసిస్టెంట్గా వ్యవహరించిన రాజేష్ అధికారుల కళ్లు గప్పి తన భార్య పేరుపై ఉన్న ఖాతాకు నిధులు మళ్లించాడు. ఈ నేపథ్యంలో జూనియర్ అసిస్టెంట్ రాజేష్కు చెందిన రూ.1.34 కోట్ల ఆస్తులను ఏసీబీ అటాచ్ చేసింది. తాజాగా సూపర్వైజింగ్ లాప్స్ కింద సర్వీస్లో ఉన్న ఏడీఏ గిరీష్, ఏవో అశోక్ కుమార్రెడ్డికి రెండు వార్షిక ఇంక్రిమెంట్లను పర్మనెంటుగా కట్ చేస్తూ వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. పదవీ విరమణ చేసిన ఠాగూర్నాయక్, ఉమామహేశ్వరమ్మ నెల వారీ పెన్షన్లో 5 శాతం కట్ చేస్తూ జీవో జారీ అయ్యింది. అయితే సూత్రదారి రాజేష్పై ఇప్పటికీ చర్యలు పెండింగ్లో ఉండటం గమనార్హం. -
కత్తితో దాడి.. ఒకరికి గాయాలు
ఓర్వకల్లు: కన్నమడకల గ్రామంలో ఆదివారం రాత్రి ఇరువురి మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన బోయ మహేష్ తల్లి పద్మావతి ఈ నెల 28వ తేదీన అదే గ్రామానికి చెందిన చాకలి స్వామన్న పొలంలో కట్టెలు తీసుకురావడంతో స్వామన్న కొడుకు వెంకటేశ్వర్లు మందలించాడు. దీంతో తన తల్లిని మందలిస్తావా?.. అంటూ బోయ మహేష్ చాకలి వెంకటేశ్వర్లుతో తన తల్లి కాళ్లు పట్టించాడు. దీంతో కప్ప రమేష్ కల్పించుకొని కాళ్లు పట్టించుకోవడం తప్పవుంతుందిరా? అని బోయ మహేష్ను వారించాడు. ఈ విషయంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. స్థానికులు కల్పించుకొని ఇరువురికి సర్దిచెప్పి పంపారు. ఈ విషయాన్ని మనస్సులో పెట్టుకొన్న మహేష్ 29వ తేదీన స్థానిక రామాలయం వద్ద మహేష్తో గొడవ పెట్టుకున్నాడు. ఈ గొడవలో మాటామాట పెరిగి యాట కత్తితో రమేష్ పొట్టలో పొడవడంతో తీవ్ర రక్తగాయం కాగా, మరో వ్యక్తి శివరాముడు చేతి వేళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. సోమవారం బాధితుడి ఫిర్యాదు మేరకు మహేష్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
గ్యాస్ కష్టాలు హోటళ్లకెరుక
డోన్: పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ఉపాధి సంక్షోభం తలెత్తుతోంది. యుద్ధంతో క్రూడ్ ఆయిల్, పెట్రోలియం ఉత్పత్తులతో పాటు గ్యాస్ కొరత ఏమాత్రం లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదేపదే ప్రకటనలు ఇస్తున్నా.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ల ధరలకు రెక్కలొచ్చాయి. ఏజెన్సీ నిర్వాహకులు కృత్రిమ కొరత సృష్టించి లక్షలాది రూపాయలను అక్రమంగా ఆర్జిస్తున్నా అడిగేవారు లేరు. యుద్ధం పేరుతో డెలీవరి ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. మరో వైపు కమర్షియల్ సిలిండర్లు డెలీవరి దాదాపుగా నిలిపివేయడంతో హోటళ్ల నిర్వాహకులకష్టాల పాలయ్యారు. ముఖ్యంగా టిఫిన్ సెంటర్లు, భోజన హోటళ్లు కొన్ని మూతపడ్డాయి. మరికొన్ని హోటళ్లలో కట్టెల పొయ్యిలను నిర్మించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఇక చిరు తిండ్ల బండ్ల వ్యాపారుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో హోటళ్లు, రెస్టారెంట్లలో పనిచేసే వారు, తోపుడు బండ్లపై ఆహార పదార్థాలు విక్రయించే వారు ఉపాధి లేక వీధిన పడాల్సిన దుస్థితి ఏర్పడింది. బ్లాక్ మార్కెట్ను అరికట్టాల్సిన అధికారులు, ప్రజా ప్రతినిధులు చోద్యం చూస్తున్నారు. కొన్ని చోట్ల గ్యాస్ సిలిండర్ల బ్లాక్ దందాను ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మేజర్ గ్రామ పంచాయతీల్లో అనధికారిక గోడౌన్లను ఏర్పాటు చేసుకొని ఒక్కో గ్యాస్ సిలిండర్లను రూ.1,500 నుంచి రూ.2 వేల వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. గ్యాస్ సంక్షోభం మూలంగా చిన్న చిన్న టిఫెన్సెంటర్ల నిర్వాహకులు రోడ్డున పడ్డాం. గ్యాస్ కొరతతో హోటల్ నడపటం కష్టంగా మారింది. ఎంతో మంది ఉపాధి కోల్పోవాల్సి వచ్చింది. మాలాంటి వాళ్లు ఇబ్బంది పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. అధికారులు సమస్యను పరిష్కరించి ఆదుకోవాలి. –బింగి శ్రీనివాసులు, చిరు హోటల్ నిర్వాహకులు ఇరాన్ యుద్ధంతో గ్యాస్ సిలిండర్ల కొరత హోటల్ రంగం కుదేలు టిఫిన్ సెంటర్లు మూతపడి నిర్వాహకులు విలవిల చోద్యం చూస్తున్న టీడీపీ ప్రభుత్వం -
ముగిసిన బార్ అసోసియేషన్ ఎన్నికలు
● అధ్యక్షుడిగా చంద్రుడు, ప్రధాన కార్యదర్శిగా మహేశ్వర్ రెడ్డి కర్నూలు: కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సోమవారం జరిగిన న్యాయవాద సంఘం ఎన్నికల్లో అధ్యక్షుడిగా బి.చంద్రుడు, ప్రధాన కార్యదర్శిగా టి.మహేశ్వర రెడ్డి, ఉపాధ్యక్షుడుగా బి.మద్దిలేటి, జాయింట్ సెక్రటరీగా జహంగీర్, క్రీడల కార్యదర్శిగా ప్రభాకర్ గెలుపొందారు. పోలింగ్లో 1059 మంది ఓటర్లకు గాను 905 మంది న్యాయవాదులు పాల్గొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. అధ్యక్ష స్థానం కోసం మురళీమోహన్, చంద్రుడు పోటీ పడగా 14 ఓట్ల మెజార్టీతో చంద్రుడు విజయం సాధించారు. ప్రధాన కార్యదర్శి స్థానం కోసం మహేశ్వర రెడ్డి, నాగముని, నాగరాజు, సోమశంకర్, ఎం.వెంకటేశ్వర్లు పోటీ చేయగా మహేశ్వర రెడ్డికి 490 ఓట్లు, నాగమునికి 235, మిగతా వారికి 100 లోపే పోలయ్యాయి. 255 ఓట్ల మెజార్టీతో మహేశ్వర్ రెడ్డి గెలుపొందారు. ఉపాధ్యక్ష పదవికి జరిగిన పోటీలో మద్దిలేటి తన ప్రత్యర్ధి రసూల్ ఖాన్పై 135 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. జాయింట్ సెక్రటరీ పదవికి జహంగీర్, సాయిప్రదీప్ పోటీ పడగా 30 ఓట్ల మెజార్టీ తో జహంగీర్ గెలిచారు. క్రీడల సాంస్కృతిక కార్యదర్శి పదవికి ప్రభాకర్, సుధాకర్, సురేంద్రగౌడ్, సుధీర్లు పోటీ పడగా 14 ఓట్లతో ప్రభాకర్ విజయం సాధించారు. కోశాధికారిగా సుమన రాణి, లైబ్రరీ కార్యదర్శిగా మహేష్ కుమార్, మహిళా ప్రతినిధిగా కరుణ జ్యోతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులు ప్రభాకర్రెడ్డి, అనిల్ కుమార్, రామకృష్ణా రెడ్డి, చక్రపాణి, ఇందుమతి తదితరులు కలసి విజేతలకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగింది. సాయంత్రం ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటించారు. -
గుర్తుతెలియని మృతదేహం
వెల్దుర్తి: సూదేపల్లె గ్రామ పరిధిలోని రైల్వే ట్రాక్ సమీపంలో సోమవారం మధ్యాహ్నం గుర్తుతెలియని మృతదేహం కనిపించింది. అటు వైపు పొలాలకు వెళ్లే రైతులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సీఐ యుగంధర్, ఎస్ఐ నరేశ్, కర్నూలు రైల్వే పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని విచారించారు. దాదాపు 65 ఏళ్లున్న వృద్ధుడి మృతదేహాన్ని మోకళ్ల వరకు మడిచి, పాత బెడ్సీట్లతో కట్టి, ప్లాస్టిక్ పట్టలో చుట్టి పడేసినట్లు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆధారాల కోసం చుట్టుప్రక్కల ప్రాంతాలు జల్లెడ పడుతున్నారు. డాగ్స్క్వాడ్, క్లూస్టీం రానున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని ప్రయాణిస్తున్న రైలులోంచి విసిరి వేశారా, హత్య చేసి ఇతర ప్రాంతాల నుంచి తెచ్చి ఇక్కడ పడవేశారా అన్న కోణంలో విచారిస్తున్నారు. మృతదేహం వద్ద ఆధారాలేవీ లభించలేదని, ఆచూకీ తెలిసిన వారు 9121101118 నంబరులో తమను సంప్రదించాలని ఎస్ఐ కోరారు. -
ఆప్కోలో వైడబ్ల్యూసీఎస్ విలీనాన్ని ఆపాలి
ఎమ్మిగనూరుటౌన్: పట్టణంలోని వైడబ్ల్యూసీఎస్ను ఆప్కోలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ పార్లమెంట్ సమన్వయకర్త బుట్టా రేణుక ఆదేశాల మేరకు స్థానిక చేనేత విభాగం నాయకులు సోమవారం పట్టణంలోని సోమప్ప సర్కిల్లో నిరవదిక దీక్షలను ప్రారంభించారు. అంతకుమునుపు పద్మశ్రీ మాచాని సోమప్ప వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దీక్షలో కూర్చున్న మాజీ కౌన్సిలర్లు, చేనేత నాయకులు కామర్తి నాగేషప్ప, ఎంకే శివప్రసాద్, మీసాలనీలకంఠ, విశ్వనాథ్ రమేష్, చేనేతమల్లి, మాచాని రఘు, రఘువీర, కరె రాము, గురుమూర్తిలకు మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ కెఎస్ రఘు, మాజీ వైస్ చైర్మన్ నజీర్అహమ్మద్లు సంఘీభావం తెలిపి మాట్లాడారు. వైడబ్ల్యూసీఎస్ను ఆప్కోలో విలీన ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మధుబాబు, పాలశ్రీనివాసరెడ్డి, గురువయ్య, మాబ్బాష తదితరులు పాల్గొన్నారు. -
హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
కర్నూలు(అర్బన్): మైనార్టీ వసతి గృహాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిణి సబిహా పర్వీన్ హెచ్చరించారు. నగరంలోని పోస్టుమెట్రిక్ మైనార్టీ బాయ్స్ హాస్టల్ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెనూ పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పలువురు విద్యార్థులకు ఆమె స్వయంగా భోజనం వడ్డించి హాస్టల్లో అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హాస్టల్లో వసతి పొందుతున్న పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలన్నారు. డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్థులు పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు వీలుగా అవసరమైన మెటీరియల్ను సమకూర్చుతామన్నారు. ముఖ్యంగా వసతి గృహంలో శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, గదులు, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఆహారం తయారీలో తాజా కూరగాయలు, ఆకు కూరలు వాడాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే సహించబోమన్నారు. హాస్టల్లో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. -
అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్
ఎమ్మిగనూరురూరల్: బ్యాంకుల దగ్గర చోరీలకు పాల్పడే అంతర్రాష్ట్ర దొంగలను ఎమ్మిగనూరు పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ సీఐ వి. శ్రీనివాసులు ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ నెల 16వ తేదీన ప్రమీల అనే మహిళ కెనరా బ్యాంక్లో తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలు విడిపించుకొని స్కూటీలో పెట్టుకుంది. కొద్దిసేపటికే ఆమె కళ్లుగప్పి గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించుకెళ్లారు. తర్వాత చోరీ విషయం తెలుసుకున్న బాధితురాలు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ ముర్రవాడ భార్గవి పర్యవేక్షణలో దర్యాప్తు చేపట్టారు. దొంగతనం జరిగిన ప్రాంతంలో సీసీ పుటేజ్లను సేకరించి, సాంకేతిక పరిజ్ఞానంతో పరిశీలించి దొంగలు కర్ణాటక రాష్ట్రం భద్రావతి ప్రాంతానికి చెందిన శంకర్ బోవి, కార్తీ బోవిగా గుర్తించారు. ఆదివారం మంత్రాలయం రోడ్డులోని అనంతపద్మనాభస్వామి దేవాలయం దగ్గర వారిని అదుపులోకి తీసుకొని 13 గ్రాముల బంగారు చైన్, 17 గ్రాముల బంగారు నెక్లెస్, చోరీలకు ఉపయోగించే బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ దొంగలు నకిలీ ఐడీ కార్డులు పెట్టుకొని ఏపీతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో చోరీకి పాల్పడినట్లు విచారణలో తేలిందని సీఐ వెల్లడించారు. -
ఇంజినీరింగ్, మెడికల్ సీట్ల పేరుతో సైబర్ మోసాలు
● ఎస్పీ విక్రాంత్ పాటిల్ కర్నూలు: ప్రముఖ కళాశాలలు, విశ్వ విద్యాలయాల పేరుతో ఫోన్కాల్స్, వాట్సప్ మెసేజ్లు, ఫేక్ వెబ్సైట్ల ద్వారా సంప్రదిస్తూ మేనేజ్మెంట్ కోటా సీట్ల పేరుతో అడ్వాన్స్ బుకింగ్ డబ్బులు అడిగి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఇంజినీరింగ్, మెడికల్, బీటెక్ పేరుతో అడ్మిషన్ గ్యారెంటీ, తక్కువ ఫీజుతో సీటు కల్పిస్తామంటూ అమాయక విద్యార్థులు, తల్లిదండ్రులను డబ్బులు అడిగి సైబర్ గాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు జిల్లాలో చోటు చేసుకున్నాయని, ఏ కళాశాల సీటు కోసమైనా అధికారిక సీటు వెబ్సైట్ లేదా కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఫోన్ కాల్స్, సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఆఫర్లను నమ్మి డబ్బులు పంపి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగత బ్యాంకు వివరాలు, ఓటీపీ వివరాలు ఎవరికి చెప్పకూడదన్నారు. అనుమానాస్పద లింకులు, ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేయవద్దని, ఎవరైనా అడ్మిషన్ గ్యారెంటీ పేరుతో మోసపోయి ఉంటే 1930 సైబర్ క్రైం హెల్ప్లైన్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. -
రైతులను మభ్యపెట్టడానికే అసెంబ్లీలో రాజధాని తీర్మానం
● ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరూపాక్షిచిప్పగిరి: అమరావతి ప్రాంత రైతులను రాజధాని పేరుతో మరోసారి మభ్యపెట్టడానికే ముఖ్యమంత్రి చంద్రాబాబు ఆసెంబ్లీలో అమరావతిని శాశ్వత రాజధానిగా తీర్మానం చేసి కేంద్రానికి పంపుతున్నారని ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరూపాక్షి విమర్శించారు. ఆదివారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు తన రెండేళ్ల పాలనలో అమరావతి రాజధానిలో ఏం అభివృద్ధి చేశారో ప్రజలకు చెప్పాలన్నారు. నిర్మాణం పేరుతో రూ. వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని, అమరావతి నిర్మాణం మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందన్నారు. అమరావతి కోసం పోరాటాలు చేసిన రైతులకు చంద్రబాబు ప్రభుత్వం ఏం లాభం చేసిందో ఒక్కసారి ఆలోచించుకోవాలని సూచించారు. ప్లాట్లు ఇచ్చామని గొప్పలు చెబుతున్నా, స్థలాలు ఎక్కడ ఉన్నాయో చాలా మంది రైతులకు తెలియదన్నారు. కూటమి పాలనలో అభివృద్ధి గ్రాఫిక్స్లో మాత్రమే కనిపిస్తోందని, ఆచరణలో మాత్రం లేదన్నారు. 2028లో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని చెబుతూనే తిర్మానం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బుసినే శ్రీరాములు, వెంకటేష్, చంద్రశేఖర్, మహానంది, హనుమంతు పాల్గొన్నారు. -
అమరావతి పేరిట హైడ్రామా
● ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి మంత్రాలయం రూరల్: అమరావతి పేరుతో సీఎం చంద్రబాబు హైడ్రామా చేస్తున్నారని మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి అన్నారు. రాంపురం గ్రామంలో ఆదివారం విలేకరులతో ఎమ్మెల్యే మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేక అమరావతి రాజధాని పేరుతో మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ఆ ప్రాంతంలో అభివృద్ధే కనిపించడం లేదని, అవినీతి జరుగుతుందని ప్రశ్నిస్తే బురదజల్లడం చంద్రబాబు అలవాటైపోయిందన్నారు. అమరావతి రాజధానికి ఎవరు అడ్డు పడుతున్నారో, ఎవరు వ్యతిరేకిస్తున్నారో, ఎందుకు తీర్మానం చేయాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలన్నారు. రైతు సమస్యలను పక్కదారి పట్టించే కుట్రలో భాగంగానే అసెంబ్లీలో తీర్మానం పేరిట డ్రామా చేశారని విమర్శించారు. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల ప్లాట్లు చెరువులో ఉన్నాయన్నాయన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఘోరంగా విఫలమవడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. అమరావతిని టీడీపీ నేతలు ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారని ఆరోపించారు. 2028లోపు రాజధాని పూర్తి చేస్తామని చెబుతూ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారన్నారు. రాజధానిలో మూడు పంటలు పండే లక్షల ఎకరాలను రైతుల నుంచి సేకరించి కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పాలన వైఫల్యాలను నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు మభ్యపెడడుతున్నారన్నారు. చంద్రబాబుకు ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారన్నారు. శేషవాహనంపై శ్రీరంగనాఽథుడు జూపాడుబంగ్లా: తర్తూరు వెలసిన శ్రీలక్ష్మిరంగనాథస్వామి శేషవాహనంపై భక్తులకు అభయమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు ఆదివారం పట్టువస్త్రాలతో అలంకరించిన స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకీలో తీసుకెళ్లి శేషవాహనంతో అలంకరించిన గ్రామోత్సవ రథంపై స్వామివారిని ఉంచారు. ప్రధాన అర్చకుడు ఈశ్వరరెడ్డి స్వామివారికి సాష్టాంగనమస్కారాలు చేసుకొన్న అనంతరం భక్తులు జయజయ ధ్వానాల మధ్య గోవింద నామాన్ని స్మరిస్తూ స్వామివారి గ్రామోత్సవ రథాన్ని గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. స్వామివారి శేషవాహనోత్సవానికి ప్రత్యేక ఉంది. ప్రజలు, రైతులు పొలంగట్లవెంట తిరిగేటప్పుడు నాగశేషుని నుంచి తమకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా శేషవాహనం రోజున స్వామివారికి మల్లెపూలలను సమర్పించి ప్రత్యేకంగా మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు సమర్పించిన మల్లెలతో స్వామివారి, అమ్మవారి మూలవిగ్రహాలు నిండిపోయాయి. నేడు హనుమద్వాహనసేవ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు సోమవారం స్వామి వారికి హనుమద్వాహనసేవ నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు ఈశ్వరరెడ్డి, చైర్మన్ నారాయణరెడ్డి, ఈఓ సాయికుమార్ తెలిపారు. -
ఆప్కోలో విలీనం చేయొద్దు
ఎమ్మిగనూరుటౌన్: అధికారపార్టీ నాయకుల తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఎమ్మిగనూరు వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీని ఆప్కోలో విలీనం చేసే ప్రయత్నం చేస్తున్నారని, ఇది సరికాదని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి నివాసంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్మోహన్రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్లు బుట్టారంగయ్య, డాక్టర్ కేఎస్ రఘు,పార్టీ చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి మాచాని వెంకటేష్ తదితరులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. పద్మశ్రీ మాచాని సోమప్ప ఆశయాలకు తూట్లు పొడిచి సొసైటీని నిర్వీర్యం చేసే కుట్రలు జరుగుతున్నాయని వీటిని వెంటనే విరమించుకోవాలని కోరారు. చేనేతలపై ప్రేమ ఉంటే వైడబ్ల్యూసీఎస్ను అభివృద్ధి చేయా లే కాని నష్టాల ఊబిలో ఉన్న ఆప్కోలో విలీనం చేయరాదన్నారు. అధికారపార్టీ నాయకులు సొసైటీకి సంబంధించిన విలువైన అస్తులను కొల్లగొట్టేందుకే విలీన కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. చేనేత కార్మికుల శ్రేయస్సు కోసం పద్మశ్రీ మాచాని సోమప్ప స్థాపించిన వైడబ్ల్యూసీఎస్ను కాపాడుకునేందుకు తమ పార్టీ అవసరమైతే పోరాటం చేస్తుందన్నారు. సమావేశంలో చేనేత కార్మిక సంఘ నాయకులు రాము, నాగేంద్ర, గోవిందు తదితరులు పాల్గొన్నారు. -
వివాహ పరిచయ వేదికలతో ఉపయోగం
● కురువ సంఘం నేతలుకర్నూలు(అర్బన్): వివాహ పరిచయ వేదికలతో ఉపయోగం ఉందని కల్లూరు తహసీల్దార్ కే ఆంజనేయులు, ఎకై ్సజ్ సీఐ మంజుల అన్నారు. ఆదివారం స్థానిక జెడ్పీ ప్రాంగణంలోని ఎంపీపీ హాల్లో జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లా కురువ వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పత్తికొండ శ్రీనివాసులు, ఎంకే రంగస్వామి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాతో పాటు తెలంగాణ, కర్ణాటక, హిందూపురం, అనంతపురం, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి కురువ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కురువలు తమ పిల్లల ను బాగా చదివించి మంచి ప్రయోజకుల ను చేయాలన్నారు. గొర్రెల, మేకల పెంపకందారుల సంఘం అధ్యక్షులు కేఏ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతి ఏడాది నిర్వహిస్తున్న ఈ వివాహ పరిచయ వేదిక ద్వారా ఎంతో మందికి వివాహాలు జరిగాయన్నారు. సంఘం అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు మాట్లాడుతూ.. 2003 నుంచి కురువ వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ వేదిక ద్వారా ఇప్పటి వరకు 2500 మందికి వివాహాలు జరిగాయన్నారు. కార్యక్రమంలో జిల్లా మహిళా సంఘం కార్యదర్శి అనితాలక్ష్మి, జిల్లా ఉపాధ్యక్షులు బిల్డర్ వెంకటేశ్వర్లు, కోశాధికారి కేసీ నాగన్న, పరిచయ వేదిక కన్వీనర్ ఎల్లయ్య, కల్లూరు సహకార సొసైటీ అధ్యక్షులు పర్ల శేఖర్, నాయకులు కేటీ ఉరుకుందు, కత్తి శంకర్, పిల్లిగుండ్ల నాగన్న, అల్లబాబు, నాగరాజు, బూదురు లక్ష్మన్న, తవుడు శ్రీనివాసులు, బీ రామకృష్ణ, కే వెంకటేశ్వర్లు, తిరుపాలు, దివాకర్, గోపాల్, వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు. -
ఆప్కోలో వైడబ్ల్యూసీఎస్ విలీన కుట్ర?
ఎమ్మిగనూరుటౌన్: ఎన్నికల ముందు చేనేత రంగాన్ని, దానిపై ఆధారపడిన కార్మికులను ఆదుకుంటానని నమ్మబలికిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పూర్తిగా విస్మరించాడు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నేతన్న నేస్తం కింద ఏటా అందే రూ. 24 వేల సాయాన్ని కూడా అటకెక్కించాడు. ఈ రెండేళ్లలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో నేతన్నల సంక్షేమానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ చేనేత సహకార సంఘం (ఆప్కో) ఆర్థికంగా కుదేలైంది. అలాంటి ఈ సంస్థలోకి ఎమ్మిగనూరు వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ (వైడబ్ల్యూసీఎస్)ని విలీనం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయి. ఈ సొసైటీకి సంబంధించిన కోట్లాది రూపాయల ఆస్తులు కొల్లగొట్టేందుకే అధికారపార్టీ నాయకులు ఈ కుట్రకు తెరలేపారని స్థానిక చేనేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వైడబ్ల్యూసీఎస్కు దేశంలోనే గుర్తింపు ఎమ్మిగనూరులో చాలా మంది చేనేత కార్మికులు ఉన్నారు. వీరిని ఆదుకునేందుకు పద్మశ్రీ మాచాని సోమప్ప 1938 సంవత్సరంలోనే వైడబ్ల్యూసీఎస్ను స్థాపించారు. అప్పట్లో 60కిపైగా చేనేత వస్త్ర దుకాణాలను నడిపి 600 మందికి పైగా సభ్యులతో సొసైటీ నడిపారు. వైడబ్ల్యూసీఎస్ బ్రాండ్తోనే దుప్పట్లు, దోమతెరలు, టవళ్లు, చీరలు తదితర జనతా వస్త్రాలను ఉత్పత్తి చేయిస్తూ ఉమ్మడి తెలుగురాష్ట్రాలతో పాటు కర్ణాటకలో చేనేత వస్త్ర దుకాణాలు నెలకొల్పి సొసైటీని లాభాల బాటలో నడిపించారు. ఇలా ఎమ్మిగనూరు చేనేత వస్త్రాలకు దేశ వ్యాప్తంగా గుర్తింపు రావడంతో రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, దేశ ప్రధానులు, ముఖ్యమంత్రులు సొసైటీని సందర్శించారు. ఇప్పటికీ లాభాల్లో నడుస్తున్న వైడబ్లూసీఎస్కు ఎమ్మిగనూరులో కోట్లాది రూపాయల విలువైన దుకాణాలు, భవనాలు, భూములున్నాయి. అలాంటి సొసైటీని నష్టాల ఆప్కోలో విలీనం చేసేందుకు ప్రతిపాదన చేయడం వెనుక ఏదో పెద్ద మతలబు ఉందని సొసైటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. జనవరిలోనే ప్రతిపాదనలు ఎమ్మిగనూరు వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీకి ఎమ్మిగనూరు పరిధిలోని 12 డిపోలు, అవుట్లెట్లు తెలంగాణలోని 1, కర్ణాటకలోని మూడు అవుట్లెట్లను ఆప్కోలో విలీనం చేసేందుకు ప్రతిపాదిస్తున్నట్లు గత జనవరి నెలలో అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఆదేశాలతో ఓ అధికారి హ్యాండ్లూమ్స్ కమిషనర్కు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. చేనేత పరిశ్రమ, చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్, బ్రాండ్ ఇమేజ్ను పెంచేందుకే విలీన ప్రతిపాదనలు అని అధికారులు చెబుతున్నారు. ఇదే వాస్తవమైతే సొసైటీలోని మెజారిటీ సభ్యులతో విలీన అంశంపై ఎందుకు చర్చించలేదని పలువురు చేనేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 31న జరిగే జనరల్ బాడీ సమావేశంలో సొసైటీ విలీన ఆమోదాన్ని వ్యతిరేకించాలని మెజార్టీ సభ్యులు నిర్ణయించుకున్నట్లు సమాచారం. కోట్లాది రూపాయల ఆస్తులను కొట్టేసేందుకే ఈ ఎత్తుగడ 31న సొసైటీ జనరల్ బాడీ సమావేశంలో ఆమోదానికి ప్రతిపాదన విలీనాన్ని వ్యతిరేకించాలని వైడబ్ల్యూసీఎస్ సభ్యులు నిర్ణయం -
డ్రగ్స్ స్మగ్లర్ అరెస్ట్
వెల్దుర్తి: బెంగళూరు నుంచి హైదరాబాద్కు డ్రగ్స్, గంజాయి తరలిస్తూ పోలీసులకు దొరికిపోయాడు అల్లూరి సీతారామరాజు జిల్లా రాళ్లగడ్డ గ్రామం కుర్ర రమేశ్. ఎస్ఐ నరేశ్ తెలిపిన వివరాల మేరకు.. శనివారం హైవే 44పై మండల పరిధిలోని సూదేపల్లె క్రాస్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న కుర్ర రమేశ్ను వాహనాల తనిఖీలో ఉన్న పోలీసులు అదుపులోకి తీసుకుని సోదా చేశారు. అతని వద్ద అనుమానాస్పద మత్తుపదార్థాలు లభించడంతో ఎస్ఐ బృందం అప్రమత్తమయ్యారు. అక్కడికక్కడే తహసీల్దార్ చంద్రశేఖర్ వర్మ, వ్యవసాయశాఖ, పంచాయతీ రాజ్ శాఖాధికారుల సమన్వయంతో పంచనామా చేశారు. 20గ్రాముల గంజాయి, ఎమ్డీఎమ్ఏ(నిషేధిక మత్తు పదార్థం–పార్టీ డ్రగ్) మత్తు పదార్థాలుగా గుర్తించారు. నిందితుడు కుర్ర రమేశ్ను విచారించగా బెంగళూరులోని వంశీ అను వ్యక్తి చెప్పిన మేరకు హైదరాబాద్లోని పార్టీ కోసం డ్రగ్స్ తీసుకువెళ్తున్నట్లు తెలుసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి ఆదివారం రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. వెలుగోడులో దారుణం ● పదేళ్ల చిన్నారిపై వృద్ధుడి అత్యాచారయత్నం వెలుగోడు: పదేళ్ల చిన్నారిపై ఓ వృద్ధుడు అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు.. సీపీ నగర్ ప్రాంతంలో కార్పెంటర్ పని చేసే వృద్ధుడు చిన్నారికి చాక్లెట్లు ఇస్తానని మాయమాట లు చెప్పి సమీపానికి రప్పించుకున్నాడు. అనంతరం అసభ్యంగా ప్రవర్తిస్తూ అత్యాచారయత్నానికి పాల్పడుతుండగా చిన్నారి కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. దీంతో వృద్ధుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై బాలిక తల్లి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ సురేష్ విచారణ చేపట్టారు. చిన్నారిపై జరిగిన దారుణాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వేధింపులు తాళలేక మహిళ బలవన్మరణం ఎమ్మిగనూరురూరల్: భర్త, మామ వేధింపులు తాళలేక భారతి(30) అనే మహిళ శరీరంపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నారు. బసాపురం గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తికి కౌతాళం మండలం ఎరిగేరి గ్రామానికి చెందిన భారతి(30)తో తొమ్మిది ఏళ్ల కిత్రం వివాహం జరిగింది. వీరికి నలుగురు సంతానం. గ్రామం సమీపంలోని పొలంలో గుడిసెవేసుకొని జీవనం సాగిస్తున్నారు. అయితే భర్త నాగరాజు, మామ చిన్నబసప్ప భారతిని వేధింపులకు గురిచేసేవారు. వీరి వేధింపులు తాళలేక జీవితంపై విరక్తి చెంది పొలం దగ్గర ఉన్న గుడిసెలో ఒంటిపై పెట్రోల్పోసుకొని భారతి నిప్పంటించుకున్నారు. మంటలతో బయటకు కేకలు వేస్తు రావటంతో అక్కడ ఉన్న వారు మంటలు ఆర్పి చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. తమ కుమార్తెను భర్త, మామలు కాల్చిచంపారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతురాలి తండ్రి రామాంజనేయుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్ఐ శ్రీనివాసలు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి ఆదోని సెంట్రల్: గుంతకల్–నంచర్ల రైల్వేస్టేషన్ల మధ్యలో ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. ఈ విషయాన్ని రైల్వే పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ శివరాములు వెల్లడించారు. మృతుడు ఆత్మహత్య చేసుకున్నాడా లేక ప్రమాదానికి గురైడా అన్నది తెలియరాలేదన్నారు. మృతదేహం దగ్గర ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఎవరైనా మృతుడిని గుర్తించినట్లయితే గుంతకల్ రైల్వే పోలీసులకు లేదా సెల్ నంబర్: 9247575606ను సంప్రదించాలన్నారు. జిల్లా స్థాయి ఓపెన్ చెస్ టోర్నమెంట్ ప్రారంభం నంద్యాల(న్యూటౌన్): స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని జింకా ఆడిటోరియంలో జిల్లా స్థాయి ఓపెన్ చెస్ టోర్నమెంట్ పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో 15 ఏళ్ల బాలబాలికలకు వేర్వేరుగా నిర్వహిస్తున్న ఈ పోటీలను జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెస్ క్రీడ ఏకాగ్రతను ఇనుమడింపజేస్తుందన్నారు. చదువులో కూడా రాణించడానికి అవకాశాలు ఉన్నాయన్నారు. మొబైల్ ఫోన్లో పిల్లల్లో దుష్ప్రభావం చూపుతుందని, పిల్లల దృష్టి క్రీడలపై ఉండేలా చూడాలన్నారు. విద్యతో పాటు క్రీడల్లో, కళల్లో పాల్గొనడం వ్యక్తిత్వ వికాసానికి దోహదమన్నారు. క్రీడల్లో పాల్గొంటే క్రమశిక్షణ అలవాటు అవుతుందన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికైన విజేతలు జూన్ నెలలో గుడివాడలో జరిగే రాష్ట్రస్థాయి చెస్ పోటీల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో జిల్లా చెస్ సంఘం కార్యదర్శి రామసుబ్బారెడ్డి, జనార్దన్, టోర్నమెంట్ కో ఆర్డినేటర్ వెంకటరావు, ఆర్బిటర్ సుజాత, 150 మంది చెస్ క్రీడాకారులు పాల్గొన్నారు. -
అరటి రైతు ఆశలు మట్టిపాలు
కృష్ణగిరి: ఇటీవల కురిసిన వడగండ్ల వర్షానికి అరటి రైతు ఆశలు మట్టిపాలయ్యా యి. గాలీవానకు అరటి తోటలు దెబ్బతినడంతో భారీ నష్టం వాటిల్లింది. కృష్ణగిరి మండలం బాపనదొడ్డి గ్రామానికి చెందిన గొల్ల రామాంజినేయులకు 10 ఎకరాల్లో అరటి తోటలు ఉన్నాయి. పెట్టుబడుల రూపేణ రూ.20 లక్షలు సాగు చేయగా ఇటీవల గెలలు కూడా వచ్చాయి. తన కష్టానికి తగిన ఫలితం వస్తుందని ఆశించిన ఆ రైతుకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర కల్పించకపోగా, వడగండ్ల వర్షానికి పంట చాలా వరకూ నేలమట్టమయ్యింది. తమ గోడు పట్టించుకునే వారెవ్వరని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు పరిశీలించి తగిన న్యాయం చేయకపోతే తనకు ఆత్మహత్యణే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఆప్కోలో విలీనం చేస్తే పోరాటం
● వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంట్ ఇన్చార్జి బుట్టా రేణుక కర్నూలు(సెంట్రల్): ఎమ్మిగనూరు వీవర్స్ సొసైటీని ఆప్కోలో విలీనం చేస్తే పోరాటానికి దిగుతామని చంద్రబాబు ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంట్ ఇన్చార్జి బుట్టా రేణుక హెచ్చరించారు. నష్టాల్లో ఉన్న ఆప్కోలో లాభాల్లో ఉన్న వీవర్స్ సొసైటీని ఎలా విలీనం చేస్తారని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, జేసీ నూరుల్ ఖమర్లను కలసి శనివారం ఆమె వినతిపత్రాన్ని ఇచ్చారు. ఎమ్మిగనూరు అంటే చేనేతలు..చేనేతలు అంటే ఎమ్మిగనూరు అనేలా పేరు ప్రఖ్యాతులు రావడానికి వీవర్స్ సొసైటీనే కారణమన్నారు. మాచాని సోమప్ప 1938లో ఎమ్మిగనూరు వీవర్ సొసైటీని ఏర్పాటు చేసి దానికి సొంత ఆస్తులను ఇచ్చారన్నారు. దీని ద్వారా సుమారు 200 మంది మగ్గాలు నేసి జీవనం సాగిస్తున్నారని చెప్పారు. ఈ సొసైటీకి 16 అవుట్లేట్లు ఉన్నాయని, విలీనం చేస్తే వాటి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. మార్చి 31వ తేదీన విలీనానికి సంబంధించిన సమావేశాన్ని రద్దు చేయాలని, లేని పక్షంలో ఉద్యమానికి సిద్ధమవుతామన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మిగనూరు పట్టణ అధ్యక్షుడు నాగేషప్ప, జిల్లా చేనేత అధ్యక్షుడు ఎంకే శివప్రసాదు, నియోజకవర్గ చేనేత అధ్యక్షుడు మీసాలబండ నీలకంఠ, 3వ వార్డు అధ్యక్షుడ చేనేత మళ్లి పాల్గొన్నారు. -
అప్పులు వద్దని.. చంద్రబాబు ఏం చేస్తున్నారు?
ఆలూరు: అప్పులు ఎక్కువ చేస్తున్నారని, రాష్ట్రాన్ని శ్రీలంకగా మర్చారని అధికారంలోకి రాక ముందు చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక చేస్తుందేమిటని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ ప్రశ్నించారు. గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్లలో రూ 3.31 లక్షల కోట్ల అప్పులు చేశారని, చంద్రబాబు నేడు ఏకంగా రూ 3.40 లక్షల కోట్ల అప్పులు చేశారన్నారు. ఆలూరు పాతబస్టాండు సమీపంలో శనివారం ఏఐటీయూసీ జిల్లా మహాసభలో ఆయన మాట్లాడారు. కార్మికుల సంక్షేమానికి పాల్పడకుండా కేంద్రప్రభుత్వం కార్పొరేట్లకు వత్తాసు పలుకుతోందని విమర్శించారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు అజయ్బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావుల పల్లి రవీంద్ర, సీపీఐ జిల్లా కార్యదర్శి కె.గిడ్డయ్య, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వెంకటసుబ్బయ్య, జిల్లా కార్యదర్శి మునెప్ప తదితరులు పాల్గొన్నారు. ● మొక్కజొన్న, ఉల్లి పంటలకు అంతంతమాత్రం ధరలు కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ ఉత్పత్తుల ధరలు రోజురోజుకు పడిపోతున్నాయి. ఇటీవలి వరకు మురిపించిన వేరుశనగ ధర నేల చూపులు చూస్తోంది. శనివారం మార్కెట్కు వేరుశనగ 2,047 క్వింటాళ్లు రాగా.. కనిష్ట ధర రూ.4,682, గరిష్ట ధర రూ.8,340 లభించగా.. సగటు ధర రూ.6,899 నమోదైంది. ● మొక్కజొన్నకు మద్దతు ధర రూ.2,400. మార్కెట్లో మాత్రం కనిష్ట ధర రూ.1,430, గరిష్ట ధర రూ.1,760 లభించగా.. సగటు ధర రూ.1,739 నమోదైంది. ● కందుల ధర పడిపోతుండటం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కనిష్ట ధర రూ.3,270, గరిష్ట ధర రూ.7,669 లభించగా.. సగటు ధర రూ.7,547 పలికింది. ● ఉల్లిగడ్డల ధర దయనీయంగా ఉంది. మార్కెట్కు 2,371 క్వింటాళ్లు రాగా.. లభించిన ధర రూ.220 మాత్రమే. గరిష్ట ధర రూ.1,119 పలికినా ఎక్కువ మంది రైతులకు రూ.220 నుంచి రూ.500లోపే ధరలు లభించడం గమనార్హం. ● మార్కెట్లో మిర్చి ధర అంతంతమాత్రమే. బ్యాడిగ రకం మిర్చికి గరిష్టంగా లభించిన ధర రూ.23,786 మాత్రమే. మిగిలిన రకాలకు ధర నామమాత్రంగానే ఉంది. -
యువకుడి దారుణహత్య
సి.బెళగల్: పాత కక్షలతో కె.సింగవరం గ్రామంలో ఓ యువడిని శనివారం దారుణంగా హత్య చేశారు. ఎస్ఐ వేణుగోపాల్రాజు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన బోయ మల్లికార్జున (27)కు అదే గ్రామానికి చెందిన కొందరి వ్యక్తుల మధ్య గొడవలు ఉన్నాయి. వారు శనివారం ఘర్షణ పడి బోయ మల్లికార్జునను చేతులు, కాళ్లతో కొట్టడమే గాక వేటకొడవలితో కుడి కాలును నరికారు. తీవ్ర రక్తస్రావమై బోయ మల్లికార్జున అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
కుట్టు శిక్షణ!
కర్నూలు(అర్బన్): గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని బీసీ, ఈబీసీ తదితర సామాజిక వర్గాలకు చెందిన మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఉద్దేశించిన ఉచిత కుట్టు శిక్షణ ప్రహసనంగా మారింది. ఈ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్తో పాటు ఉచితంగా కుట్టు మిషన్ను అందిస్తామని చంద్రబాబు ప్రభుత్వం గత ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో భారీగా ప్రచారాలు నిర్వహించి కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లాలోని బీసీ, ఈబీసీ కులాలతో పాటు కమ్మ, రెడ్డి, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, బలిజ కులాలకు చెందిన వేల మంది మహిళలు కుట్టు శిక్షణను పూర్తి చేసుకున్నారు. సీయుఆర్డీ (సెంటర్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ), ఎస్ఏపీఈ (సోషల్ ఏజెన్సీ ఫర్ పీపుల్స్ ఎంపవర్మెంట్) సంస్థల ఆధ్వర్యంలో శిక్షణా కేంద్రాలను నిర్వహించారు. గత ఏడాది ఏప్రిల్ 15వ తేది నుంచి ప్రారంభమైన శిక్షణ ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో పూర్తి అయింది. ఒక్కో కేంద్రంలో రెండు బ్యాచ్ల ప్రకారం శిక్షణను ఇచ్చారు. 45 రోజుల నుంచి 90 రోజుల్లోగా మొత్తం 360 గంటలు శిక్షణ తీసుకోవాల్సి ఉందని, 75 శాతం హాజరు ఉంటేనే ఉచితంగా కుట్టు మిషన్, సర్టిఫికెట్ అందిస్తామని అప్పట్లో ప్రకటించారు. శిక్షణ పూర్తి అయిన వెంటనే కుట్టు మిషన్తో పాటు సర్టిఫికెట్ను అందిస్తారనే నమ్మకంతో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఆరు వేల మందికి పైగా మహిళలు ఆయా కేంద్రాలకు వెళ్లి కుట్టు శిక్షణ పొందారు. అయితే శిక్షణ పూర్తి చేసుకొని ఆరేడు నెలలు గడచిపోయినా నేటికీ కుట్టు మిషన్ల గురించి ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. తాజాగా పరీక్ష, రూ.600 చెల్లించాలని మెలిక! ఉమ్మడి జిల్లాలోని ఆయా కేంద్రాల్లో కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు మిషన్లు అందించాలంటే, తప్పక తాము నిర్వహించే పరీక్ష పాస్ కావాలని, అలాగే ఒక్కో అభ్యర్థి రూ.600 చెల్లించాలని మెలిక పెట్టినట్లు మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శనివారం కర్నూలులోని శిక్షణ కేంద్రానికి శిక్షణ తీసుకున్న దాదాపు నలభై, యాభై మంది మహిళలు వచ్చి పరిపరి విధాలుగా ప్రశ్నించారు. గ్రామాలు, పట్టణాల్లోని కేంద్రాలకు రెగ్యులర్గా వచ్చి శిక్షణ తీసుకునేందుకు ప్రతి రోజు అప్పట్లో బస్సు, ఆటో చార్జీలకు కనీసం రూ.100 వరకు ఖర్చు చేసుకున్నామని వారంటున్నారు. గతంలో చెప్పిన విధంగా శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికేట్తో పాటు కుట్టు మిషన్ను అందించాల్సి ఉండగా, ఇప్పుడు పరీక్ష నిర్వహిస్తామని, అందుకు రూ.600 చెల్లించాలని చెప్పడం ఏమిటని వారు నిలదీస్తున్నారు. తాము చెల్లించే డబ్బులకు ఎవరు గ్యారెంటీ ఉంటారని ప్రశ్నిస్తున్నారు. ముందుగానే శిక్షణ పూర్తి అయిన అనంతరం పరీక్ష ఉంటుందని, ఫీజు రూ.600 చెల్లించాల్సి ఉంటుందని ఎందుకు చెప్పలేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రైనర్, డిజిటల్ అసిస్టెంట్లకు అందని వేతనాలు ఉమ్మడి జిల్లాలోని 47 కేంద్రాల్లో మహిళలకు కుట్టు శిక్షణ నేర్పించేందుకు ఒక ట్రైనర్, వారి హాజరును ఆన్లైన్లో నమోదు చేసేందుకు ఒక డిజిటల్ అసిస్టెంట్ను ఏర్పాటు చేశారు. వీరికి ఒక్కొక్కరికి నెలకు రూ.10 వేలు వేతనాలను అందించాలని నిర్ణయించారు. ఆయా కేంద్రాల్లో మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చిన వీరిలో పలువురికి నేటికీ పూర్తి స్థాయిలో వేతనాలను అందించనట్లు తెలుస్తోంది. ఈ పథకం నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం వల్ల వీరికి వేతనాలను అందించలేక పోతున్నట్లు సమాచారం. శిక్షణ పొందిన మహిళల ఆందోళన పలు ప్రాంతాల్లో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు తమకు కుట్టు మిషన్లు ఎప్పుడు ఇస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుట్టు శిక్షణ తీసుకుంటే తమకు ఉపాధి లభిస్తుందనే ఆశతో ప్రతి రోజు క్రమం తప్పకుండా కేంద్రానికి వెళ్లి శిక్షణ తీసుకున్నామంటున్నారు. ఎలాంటి ఇతర పనులకు వెళ్లకుండా శిక్షణ పూర్తి చేసుకున్న తమకు సర్టిఫికేట్, కుట్టు మిషన్లు అందించాలని కోరుతున్నారు. జిల్లా కేంద్రాల శిక్షణ పొందిన కర్నూలు 24 3108 నంద్యాల 23 3024 మొత్తం: 47 6132 శిక్షణ పూర్తయినా అందని మిషన్లు తాజాగా పరీక్ష, రూ.600 చెల్లించాలని మెలిక పరీక్ష పాస్ అయితేనే మిషన్లు ఇస్తారంట! తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహిళలు ఉమ్మడి జిల్లాలో శిక్షణ పూర్తి చేసుకున్న 6వేల మంది మహిళలు తమకెలాంటి సమాచారం లేదంటున్న బీసీ కార్పొరేషన్ అధికారులు -
పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
నందవరం: ఆర్టీసీ బస్సు అదు పు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. అందులోని ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారు. నందవరం గ్రామ సమీపంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. నాగలదిన్నె నుంచి ఆర్టీసీ బస్సు ఎమ్మిగనూరుకు 18 మంది ప్రయాణికులతో బయలుదేరింది. నందవరం గ్రామం దాటిన తరువాత బస్సు స్టీరింగ్ వీల్ పనిచేయకపోవడంతో డ్రై వర్ కాశీం పొలాల్లోకి మళ్లించాడు. ప్రధాన రహదారిలో చింత చెట్టు స్వల్పంగా ఢీకొని బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. కాలం చెల్లిన బస్సులు నడుపుడుతుడడంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు మండిపడ్డారు. ఇప్పటికై నా ప్రభుత్వం కండిషన్ కలిగిన బస్సులను నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. యాగంటి సందర్శన బనగానపల్లె: యాగంటి క్షేత్రంలో వెలసిన శ్రీ ఉమామహేశ్వరస్వామిని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కుటుంబ సభ్యులతో శనివారం దర్శించుకున్నారు. ఎస్పీకి ఆలయ చైర్మన్ బండి మౌళీశ్వరరెడ్డి, ఆలయ అర్చకులు, వేదపండితులు పూర్ణకుంభంతో ఆలయ ప్రధాన ద్వారం నుంచి స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ఏక శిలా రూపంలో కొలువైన ఉమా మహేశ్వరస్వామికి అభిషేకం అర్చన తదితర పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఎస్పీ కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించి స్వామి వారి ప్రసాదం, చిత్రపటాన్ని ఆలయ చైర్మన్ అందజేశారు. -
ప్రజలకు అందించే సేవలతోనే గుర్తింపు
● జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి కర్నూలు(అర్బన్): ప్రజలకు అందించే ఉత్తమ సేవలతోనే ప్రభుత్వ ఉద్యోగులకు మంచి గుర్తింపు వస్తుందని జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. శనివారం స్థానిక జెడ్పీలోని తన చాంబర్లో కారుణ్య నియామకాల కింద ముగ్గురికి ఉద్యోగాలు కల్పించి నియామకపు ఉత్తర్వులు అందించారు. ఈ సందర్భంగా పాపిరెడ్డి మాట్లాడుతూ జెడ్పీ యాజమా న్య పరిధిలోని ఆయా కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఆఫీసు సబార్డినేట్ పోస్టులకు ప్రస్తుతం ఉద్యోగాలు పొందిన వారి అభీష్టం మేరకే వారు కోరుకున్న ప్రాంతాల్లో నియమిచామన్నారు. జెడ్పీ సీఈఓ జీ నాసరరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగి సర్వీస్లో మృతి చెందితే ప్రభుత్వ ఆదేశాల మేరకు కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పిస్తున్నామన్నారు. ఆఫీసు సబార్డినేట్గా ఉద్యోగాలు పొందిన ఎస్ గణేష్ (ఎంపీపీ ఆళ్లగడ్డ), ఆర్ నరేంద్రకుమార్ (ఎంపీపీ కల్లూరు), వీ అభిషేక్ (ఎంపీపీ కౌతాళం)కు పోస్టింగ్స్ ఇచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. -
ఆలోచన సామర్థ్యం పెంచుకోవాలి
కర్నూలు సిటీ: పోటీ ప్రపంచంలో విద్యార్థులు సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన, సమస్య పరిష్కార సామర్థ్యాలను పెంపొందించుకోవాలని వక్తలు అభిప్రాయపడ్డారు. శుక్రవారం ట్రిపుల్ఐటీ డీఎంలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో కృష్ణహాల్లో పరిశ్రమ–విద్యా సంస్థల సమావేశం నిర్వహించారు. ఇన్ఫోసిస్ ఏవీపీ అండ్ సీనియర్ ఇండస్ట్రి ప్రిన్సిపాల్ అశోక్కుమార్, హెచ్సీఎల్ గువి హెడ్ హెచ్ఆర్ కంచన్ ఖేడ్కర్, వోల్వో ఇండియా హెచ్ఆర్ అరవింద్ వారియర్, టీసీఎస్ సీనియర్ డీవీ లీడ్ అర్జున్ నాగ్ తదితర నిపుణులు హాజరై ఏఐ, సంబంధిత రంగాల్లో పరిశ్రమల అంచనాలు, కెరీర్ అవకాశాలపై విద్యార్థులకు సలహాలు, సూచనలు చేశారు. పోటీ ప్రపంచంలో రాణించాలంటే విద్యార్థులు విభిన్న ఆలోచనలతో ప్రత్యేకత కలిగి ఉండాలన్నారు. ఇంటర్న్షిప్లు, హ్యాకథాన్లు, సర్టిఫికేషన్స్, వాస్తవ ప్రాజెక్టుల ద్వారా అనుభవం పొందవచ్చని వివరించారు. ప్రోగ్రామింగ్, డేటా స్ట్రక్చర్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, డేటాబేస్లు, కంప్యూటర్ నెట్వర్క్ వంటి ప్రాథమిక అంశాల్లో ప్రావీణ్యం సాధించడంపై సూచనలు చేశారు. ఇంటర్వ్యూ అంచనాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ట్రిపుల్ఐటీ డీఎం ఆచార్యులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. -
వైడబ్ల్యూసీఎస్ను ఆప్కోలో విలీనం చేయొద్దు
● వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బుట్టారేణుకఎమ్మిగనూరుటౌన్: ఎమ్మిగనూరు వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ (వైడబ్ల్యూసీఎస్)ని ఆప్కోలో ప్రభుత్వం విలీనం చేసేందుకు ప్రయత్నించడం తగదని వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బుట్టారేణుక అన్నారు. శుక్రవారం పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. చేనేత కార్మికుల కోసం వీవర్స్ సహకార సొసైటీని పద్మశ్రీ మాచాని సోమప్ప స్థాపించారన్నారు. నష్టాల్లో ఉన్న ఆప్కోలో విలీనం చేసే ప్రతిపాదనను చంద్రబాబు ప్రభుత్వం మానుకోవాలన్నారు. ఇలా చేస్తే కోట్లాది ఆస్తులున్న సొసైటీ అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. చేనేత అంటే ఒక గుర్తింపు ఉన్న సొసైటీని అభివృద్ధి చేయాలని సూచించారు. లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్ది, సంఘంలో సభ్యుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. సభ్యులకు ముడిసరుకులు ఇప్పించడంతో పాటు మార్కెటింగ్ సౌకర్యం పెంచాలన్నారు. ఎమ్మిగనూరులో తయారయ్యే చేనేత వస్త్రాలకు దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని తెలిపారు. సొసైటీని ఆప్కోలో విలీనం చేసే ప్రతిపాదన విరమించుకోకపోతే పార్టీలకు అతీతంగా పోరాడేందుకు చేనేత కార్మికులు ముందుకు రావాలని కోరారు. సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు కామర్తి నాగేషప్ప, జిల్లా చేనేత విభాగం అధ్యక్షుడు శివప్రసాద్, నియోజకవర్గ అధ్యక్షుడు మీసాలబండ నీలకంఠ, చేనేత మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ నాయకుడిపై హత్యాయత్నం
● దేవుడి మాన్యం భూముల్లో అక్రమ తవ్వకాలు ● మట్టి ట్రాక్టర్ల అతి వేగాన్నిప్రశ్నించినందుకు హత్యకు కుట్ర ● ట్రాక్టర్తో ఢీకొట్టి చంపాలని ప్రయత్నించారని బాధితుడి ఆరోపణ ఆత్మకూరురూరల్: వడ్ల రామాపురం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు శేషిరెడ్డిపై హత్యాయత్నం జరిగింది. గ్రామంలో పల్లెపాడు ఆంజనేయ స్వామి మాన్యం భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు లింగస్వామికి చెందిన ట్రాక్టర్లు ఇందుకోసం వినియోగిస్తున్నారు. ట్రాక్టర్లు మట్టిని తరలిస్తూ గ్రామంలో వేగంగా వెళ్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని డ్రైవర్లకు వేగం తగ్గించాలని చెప్పాలని సింగస్వామికి శేషిరెడ్డి చెప్పాడు. అయితే ట్రాక్టర్ డ్రైవర్ తమ్మలూ రు ముర్తుజా వెంటనే శేషిరెడ్డికి ఫోన్ చేసి ‘మమ్మల్ని అడిగే వాడివా.. నిన్ను చంపితే దిక్కెవరు’ అంటూ బెదిరించాడు. ఈ విషయంపై పదే పదే ఫోన్ చేసి బెదిరిస్తుండటంతో శేషిరెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. అయితే ముర్తుజా నేరుగా ట్రాక్టర్తో శేషిరెడ్డి ఇంటివద్దకు వచ్చి బూతులు తిడుతూ ఇంటి ముందు నిలుచున్న ఆయనను ట్రాక్టర్తో ఢీకొట్టే ప్రయత్నం చేశాడు. పక్కనే చంద్రమౌళీశ్వరరెడ్డి ఆయన కుటుంబ సభ్యులను కూడా తగిలేలా వెళ్లింది. వెంటనే వారు తేరుకుని ఇంట్లోకి పరిగెత్తారు. ట్రాక్టర్ శేషిరెడ్డి ఇంటి ప్రహరీని ఢీకొంది. శేషిరెడ్డి, అతని కుటుంబ సభ్యులు ఈ హఠాత్పరిణామానికి బిత్తర పోయి తేరుకునేలోగా ముర్తుజా అక్కడ నుంచి ట్రాక్టర్తో పరారయ్యాడు. శేషిరెడి వెంటనే ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు శేశాడు. ఈ మేరకు సీఐ మహేశ్వరరెడ్డి ట్రాక్టర్ను స్టేషన్కు తరలించారు. పోలీసులు గాలించి ముర్తుజాను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. అక్రమ మైనింగ్ను పోలీసులతో పాటు రెవెన్యూ అధికారులు అడ్డుకోవాలని వడ్లరామాపురం గ్రామస్తులు కోరుతున్నారు. చంపాలనే ట్రాక్టర్తో ఢీకొట్టాడు గ్రామంలో ఇష్టారాజ్యంగా వెళ్తున్న ట్రాక్టర్లను కాస్త నెమ్మదిగా వెళ్లాలని చెప్పినందుకే నన్ను చంపాలనే ట్రాక్టర్తో ఢీ కొట్టారు. ముర్తుజా నన్ను చంపుతానని అప్పటికి మూడు సార్లు ఫోన్ చేసి బెదిరించాడు. ఇంట్లోకి పరిగెత్తడంతో ప్రాణాలు దక్కాయి. ముర్తుజాపై తగిన చర్యలు తీసుకోవాలి. దేవుని మాన్యంలో అక్రమ తవ్వకాలు ఆపాలి. – శేషిరెడ్డి, బాధితుడు -
సాంకేతిక విద్య.. ఉద్యోగానికి భరోసా
● పాలిసెట్ నోటిఫికేషన్ విడుదల ● దరఖాస్తుకు ఏప్రిల్ 4వ తేదీతుది గడువు ● పది విద్యార్థులకు చక్కటి అవకాశం ● ఏప్రిల్ 25న ప్రవేశ పరీక్ష నంద్యాల(న్యూటౌన్): పదో తరగతి ఉత్తీర్ణతతో సాంకేతిక విద్యకు పునాది వేసే ‘పాలిసెట్’కు సాంకేతిక విద్యాశాఖ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్–2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలు పొందవచ్చు. పదో తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ముందుగానే సాంకేతిక విద్యాశాఖ ఉన్నతాధికారులు పాలిసెట్–2026 నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉపాధ్యాయులు, సాంకేతిక నిపుణులు సూచిస్తున్నారు. దీనికి సంబంధించి జిల్లాలో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలలు, ఆ కళాశాలల్లో ఉన్న సీట్ల వివరాలు, పరీక్ష తేదీ తదితర వివరాలు ఇలా.. ఉజ్వల భవిష్యత్కు బాటలు.. పాలిటెక్నిక్ ప్రవేశం ద్వారా తక్కువ ఖర్చుతో ప్రాథమికంగా సాంకేతిక విద్య లభిస్తే దానిని పునాదిగా చేసుకుని ఉజ్వల భవిష్యత్కు బాటలు వేసుకునే అవకాశం లభిస్తుంది. గ్రామీణ పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఇంజినీరింగ్ వంటి ఉన్నత సాంకేతిక చదువులను అందుకోవాలంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని. అటువంటి వారికి పాలిటెక్నిక్ కోర్సులు చక్కని వేదికలని పలువురు సాంకేతిక విషయ నిపుణులు పేర్కొంటున్నారు. పాలిసెట్ ద్వారా పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరి విలువైన సాంకేతిక విజ్ఞానాన్ని సొంతం చేసుకుని సత్వర ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందే వీలుంటుంది. పాలిసెట్–2026 కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా.. ఏప్రిల్ 4వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. పాలిసెట్ ఇలా.. పాలిసెట్ 120 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. గణితం 50, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 30 మార్కులకు పరీక్ష ఉంటుంది. పదో తరగతి సిలబస్ ఆధారంగా ఎంట్రెన్స్ పరీక్ష జరుగుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 25న పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఫీజు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.100, ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.400గా నిర్ణయించారు. ప్రయోజనాలెన్నో.. పాలిటెక్నిక్లో ఏ కోర్సును పూర్తి చేసినా ఉద్యోగం, ఉపాధి సులభంగా లభిస్తుంది. ఈ కళాశాలల్లో ఇటీవల తరచూ ఉద్యోగ మేళాలను నిర్వహిస్తున్నారు. ఆయా కంపెనీల ప్రతినిధులు వచ్చి విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కోర్సు చేయడానికి మూడేళ్లకు కేవలం రూ.13 వేలు అవుతుంది. ఆ తర్వాత ఇంజినీరింగ్ సెకండియర్లో చేరవచ్చు. లభించే కోర్సులు... పాలిటెక్నిక్ కోర్సులను ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలు అందిస్తున్నాయి. ఆయా కళాశాలల్లో కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ తదితర కోర్సులు అందుబాటులో ఉంటాయి. పలు చోట్ల ఒక్కో కోర్సులో ఒక్కో బ్రాంచ్కు 60 నుంచి 120 వరకూ సీట్లు అందుబాటులో ఉంటాయి. నంద్యాల జిల్లాలో 7 ప్రభుత్వ, 5 ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలున్నాయి. నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్ 60, మెకానికల్ 120, ఈసీఈ 120, ఎలక్ట్రికల్ 120 సీట్లు ఉన్నాయి. ఐదు ప్రైవేట్ కళాశాలల్లో సుమారు 1,500 వరకు సీట్లు ఉన్నాయి. ఈ కోర్సు కాల వ్యవధి మూడేళ్లు. ఇందులో భాగంగా ఆరు నెలల పాటు పారిశ్రామిక శిక్షణ ఉంటుంది. విద్యార్థులు నైపుణ్యం పెంపొందించుకునే శిక్షణ సైతం ఇస్తారు.పాలిటెక్నిక్ చదివితే చిన్న వయస్సులోనే ఉద్యోగావ కాశాలు లభిస్తాయి. ఉన్నత విద్యతో పాటు స్వయం ఉ పాధికి అవకాశముంటుంది. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో విద్యార్థులకు ఉచిత కోచింగ్తో పాటు, సంబంధిత మెటీరియల్ను ఉచితంగా సరఫరా చేస్తున్నాం. – శైలేంద్రకుమార్, పాలిసెట్ జిల్లా కన్వీనర్, నంద్యాల -
‘చిరునవ్వు’ పుస్తకావిష్కరణ
నందవరం: నాగలదిన్నె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడు, రచయిత గద్వాల సోమన్న రచించిన 93వ పుస్తకం ‘చిరునవ్వు’ పుస్తకావిష్కరణ శుక్రవారం ప్రకాశం జిల్లా గిద్దలూరులో జరిగింది. సెయింట్ పాల్స్ విద్యా సంస్థల అధినేత గోనె ఆశీర్వాదం సతీమణి డి. వైలెట మ్మ, ఇంజనీర్ డా.పి. మనోజ్కుమార్, ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల ఫిజిక్స్ లెక్చలర్ ఎం.ఎల్ హరిప్రసాద్, వివిధ విద్యాసంస్థల కరెస్పాండెంట్స్ చేతుల మీదుగా పుస్తకావిష్కరణ గావించారు. అనంతరం ఈ పుస్తకాన్ని గుండ్లూరు సుబ్రమణ్యంకు అంకితమిచ్చారు. అత్యల్ప కాలంలోనే 93 పుస్తకాలు ముద్రించి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న కవి గద్వాల సోమన్న విశేష కృషి గాను ప్రముఖులు ఆయనను సత్కరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సునీత, డయాన రంజిత, రిబ్కా, తదితర విద్యా సంస్థల సిబ్బంది పాల్గొన్నారు. -
వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. శుక్రవారం పీఠాధిపతి సుబుధేంద్ర ఆధ్వర్యంలో మూలరాముల విగ్రహాలకు విశిష్ట పూజలు గావించారు. వేడుకల్లో భాగంగా శ్రీమఠంలో విశిష్ట ప్రసిద్ధి చెందిన మూడు విగ్రహాలకు శ్రీమూల రాములు, శ్రీ దిగ్విజయరామ, శ్రీజయరామ దేవుళ్ల ఉత్సమూర్తులకు గంధ లేపనం సమర్పించారు. శ్రీ మూల రామదేవుడికి తైల అభ్యంగణ, తులసి పూజ, గోపూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ రాయర మూల బృందావనానికి ప్రత్యేక పూజలు, ఆలంకరణ గావించి మంగళహారతి చేశారు. ముందుగా శ్రీమఠంలో పీఠాధిపతికి పసుపు జలాలతో, నారీకృత నీరాజనం నిర్వహించా రు. వర్షాలు సకాలంలో కురిసి, పంటలు సమృద్ధిగా పండి రైతులు, భక్తులు సంతోషంగా ఉండాలని పీఠాధిపతి అనుగ్రహ సందేశాన్ని అందించి ఆశీర్వదించారు. -
డ్రోన్ టెక్నాలజీతో ఉజ్వల భవిష్యత్తు
కర్నూలు కల్చరల్: డ్రోన్ టెక్నాలజీతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని రాయలసీమ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ వెంకట బసవరావు అన్నారు. ఐఐటీ హైదరాబాద్, ట్రిపుల్ఐటీ డీఎం కర్నూలు సంయుక్త భాగస్వామ్యంతో రాయలసీమ యూనివర్సిటీలో 22వ తేదీ నుంచి నిర్వహిస్తున్న డ్రోన్ టెక్నాలజీపై స్కిల్ డెవలప్మెంట్ పోగ్రాం శుక్రవారం ముగిసింది. ఐదు రోజుల సదస్సులో పాల్గొన్న విద్యార్థులకు వీసీ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో డ్రోన్ టెక్నాలజీ ద్వారా అనేక ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రిన్సిపాళ్లు విశ్వనాథ్ రెడ్డి, వెంకట సుందరానంద, పోగ్రామ్ కో–ఆర్డినేటర్లు శరత్కుమార్, డాక్టర్ రవికుమార్ పాల్గొన్నారు -
సీతారాముల కల్యాణంలో ఈగల్ ఐజీ
దేవనకొండ: కప్పట్రాళ్ల గ్రామంలో శుక్రవారం జరిగిన సీతారాముల కల్యాణ వేడుకల్లో రాష్ట్ర ఈగల్ ఐజీ రవికృష్ణ దంపతులు పాల్గొని ప్ర త్యేక పూజలు నిర్వహించారు. ఫ్యాక్షన్కు మారుపేరుగా ఉన్న కప్పట్రాళ్ల గ్రామాన్ని గతంలో కర్నూలు ఎస్పీగా పనిచేసిన రవికృష్ణ దత్తత తీసుకుని రూపురేఖలు మార్చిన విషయం విధి తమే. స్వయంగా రవికృష్ణ దంపతులు గ్రామానికి చేరుకుని ఆలయంలో సీతారాములకు ప్ర త్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కర్నూలు(అగ్రికల్చర్): మహాత్మాగాంధీ జాతీ య గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రప్రభుత్వం అమలు చేయతలపెట్టిన వీబీజీ రామ్ జీ కొత్త పథకం మే నెల 1వ తేదీ నుంచి అమలు కానుంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం కొత్త పథకం ఏప్రిల్ 1 నుంచే అమలు కావాల్సి ఉంది. ఈ మేరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. తాజా ఉత్తర్వుల ప్రకారం మే 1వ తేదీ నుంచి ఈ పథకం అమలు కానుంది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆదేశాలు అందాయి. ఎన్క్యూఏఎస్ బృందం తనిఖీ దేవనకొండ: మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ (ఎన్క్యూఏఎస్) బృందం తనిఖీ చేసింది. బృందం సభ్యులు డాక్టర్ అజయ్కుమార్, డాక్టర్ రవి ఆసుపత్రిలోని ప్రసవ గది, రక్త నమూనా పరీక్ష కేంద్రం, ఓపీడీ, ఐపీడీ విభాగాలను పరిశీలించారు. వివిధ విభాగాల రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్యులు, సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్యాధికారులు విజయ్భాస్కర్, కళ్యాణ్, సీహెచ్ఓ భాగ్యలక్ష్మి ఉన్నారు. మెడికల్ షాపులో చోరీ డోన్ టౌన్: పట్టణంలోని పాతపేటలో ఉన్న ఓ మెడికల్ షాపులో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. పాత ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న ఈ దుకాణంలో గురువారం అర్ధరాత్రి దొంగలు పడి, షట్టర్ తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. క్యాష్ బాక్స్లో ఉన్న రూ.6 వేల నగదును ఎత్తుకెళ్లారు. దుకాణం యజమాని రాజు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం సాయంత్రం షాపు మూసివేసి వెళ్లగా, శుక్రవారం ఉదయం వచ్చి చూసేసరికి తాళాలు విరిగి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు. -
కుమారుడిని చూసేందుకు వచ్చి..
● రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి కర్నూలు: నగర శివారులోని ఓ పాఠశాలలో చదువుతున్న కుమారుడిని చూసేందుకు వచ్చిన తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నందవరం గ్రామానికి చెందిన షేక్ తపాలా ఖాశీం బాషా (45)కు ఎల్ఐసీ ఏజెంట్గా పని చేస్తున్నారు. ఇతనికి ఒక కొడుకు, కూతురు సంతానం. వీరు ప్రస్తుతం కర్నూలు శివారులోని మాంటెస్సోరి ఇండస్ స్కూల్లో చదువుతున్నారు. 8వ తరగతి చదువుతున్న కొడుకు సొహైల్కు ఆరోగ్యం బాగోలేదని తెలుసుకుని ద్విచక్ర వాహనంపై బనగానపల్లె నుంచి శుక్రవారం కర్నూలుకు వచ్చాడు. పాఠశాలలో తన పిల్లలను చూసుకుని తిరిగి ద్విచక్ర వాహనంపై ఎన్హెచ్ 44 మీదుగా కర్నూలు నగరంలోకి వస్తుండగా కృష్ణానగర్ రావూరు ఫంక్షన్ హాల్ దగ్గర బ్రిడ్జిపైన వెనుక వైపు నుంచి లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఖాశీం బాషా ద్విచక్ర వాహనం పైనుంచి కింద పడ్డాడు. హెల్మెట్ ఊడి పక్కనే పడింది. తలకు బలమైన గాయాలై అపస్మారక స్థితిలో పడివుండగా చుట్టు పక్కల ఉన్నవారు గుర్తించి ప్రైవేటు అంబులెన్స్ ద్వారా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్యాజువాలిటీ వార్డులో వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని ట్రాఫిక్ పోలీసులు మార్చురీకి తరలించారు. మృతుడి భార్య షేక్ రిజ్వానా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ట్రాక్టర్ కింద పడి వ్యక్తి మృతి
నంద్యాల(అర్బన్): ట్రాక్టర్ కింద పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం సాయంత్రం పెద్దకొట్టాల గ్రామంలో చోటు చేసుకుంది. అయ్యలూరు మెట్టకు చెందిన శంకర్(45) ఇటుకల లోడ్తో పెద్దకొట్టాల మీదుగా కొత్తపల్లె గ్రామానికి వెళుతున్నాడు. పెద్దకొట్టాల చర్చి వద్ద మట్టి కుప్పపై ట్రాక్టర్ ఎక్కడంతో ప్రమాదవశాత్తు డ్రైవింగ్ సీటులో ఉన్న శంకర్ టైరు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య శివమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని రూరల్ పోలీసులు తెలిపారు. -
ఆగిన 108 అంబులెన్స్ సేవలు
ఉమ్మడి కర్నూలు జిల్లాలో కిడ్నీ బాధితుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోంది. ప్రతి సంవత్సరం కొత్తగా 600 కొత్త కేసులు నమోదువుతున్నాయి. ఇందులో యువకుల నుంచి వృద్ధుల వరకు ఉంటున్నారు. ఇటీవల కాలంలో యువత సంఖ్య విపరీతంగా గణనీయంగా అధికమవుతోంది. వీరిలో 30 శాతం వరకు డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని నెఫ్రాలజీ విభాగంలో గత ఏడాది ఓపీ 7,942 మంది, ఇన్పేషంట్లుగా 1,892 మంది చికిత్స పొందగా, 3,190 మంది డయాలసిస్ చేయించుకున్నారు. దీంతో పాటు నంద్యాల, ఆదోనిలలోనూ డయాలసిస్ కేంద్రాలు ఉన్నా యి. మొత్తం ప్రతి ఏటా 4వేల మందికి పైగా రోగులు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా డయాలసిస్ చేయించుకుంటున్నారు. వీరందరూ డయాలసిస్ చేయించుకునేందుకు గత ప్రభుత్వ హయాంలో 108 అంబులెన్స్లో ఉచితంగా ఆసుపత్రికి వచ్చి వెళ్లేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ సేవలు తీసేశారు. దీంతో డయాలసిస్ చేయించుకునేవారు బస్సులు, అద్దె వాహనాల్లో ఆసుపత్రులకు ఖర్చులు పెట్టుకుని రావాల్సి వస్తోంది. ఇందుకు గాను ఒక్కొక్కరికి ప్రయాణఖర్చులు రూ.5వేల నుంచి రూ.8వేల దాకా అవుతోంది. బాధితుడితో పాటు సహాయకులు కూడా ఒకరు ఉండాల్సి రావడంతో ఆ రోజుకు వారు చేసే పని వదులుకోవడమో లేక సెలవుపై రావడమో చేయాల్సి వస్తోంది. ఈ రకంగా కూడా వారు నష్టపోతున్నారు. -
పెళ్లింట తీవ్ర విషాదం : నలుగురు మృత్యువాత
కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బందువుల పెళ్లికి వచ్చిన వారిని మృత్యువు కబళించింది. దీంతో పెళ్లి సందడితో కళకళలాడాల్సిన ఇల్లు ఒక్కసారిగా బంధువుల రోదనలతో విషాదంగా మారిపోయింది.కర్నూలు జిల్లాలోని కందుకూరు గ్రామానికి పెళ్లికి వచ్చారు కర్ణాటకకు చెందిన కొంతమంది బంధువులు. దాదాపు 15 మంది కోసిగి ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద స్నానానికి దిగారు. అయితే అనుకోకుండా వీరు ప్రమాదానికి గురైనారు. దీంతో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మృతులను కర్ణాటకలోని కురిడి గ్రామస్తులుగా గుర్తించారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. దాసరి శివాసనంద, దాసరి ఉమావతి, దాసరి రత్నమ్మ మహేష్గా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు ప్రమాద కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
జిల్లాలో చేతి పంపుల వివరాలు...
సమ్మతగేరి ఎస్ఎస్ ట్యాంకులో నీరు పూర్తిగా ఇంకిపోవడం వల్ల అక్కడున్న చౌడు భూముల్లో బోరు నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ నీటిని తాగడం వల్ల గ్రామంలోని ప్రజలు రోగాలకు గురవుతున్నారు. ఇప్పటికే పలువురు వాంతులు, విరేచనాల బారిన పడ్డారు. ఎస్ఎస్ ట్యాంకు నుంచి 25 రోజులకు పైగా నీటిని విడుదల చేయడం లేదు. గ్రామంలో నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. – సీహెచ్ మల్లికార్జున, చిన్నహ్యాట, హోళగుంద మండలం జిల్లాలోని అన్ని ఎస్ఎస్ ట్యాంకుల్లో దాదాపు 50 శాతం వరకు నీటి నిల్వలు ఉన్నాయి. ఏప్రిల్ 1వ తేది నుంచి ఎల్ఎల్సీకి నీరు విడుదల కానుంది. జిల్లా కలెక్టర్ ఇప్పటికే టీబీ డ్యాం అధికారులతో మాట్లాడారు. ఇరిగేషన్ అధికారులు కూడా నీటి విడుదలపై లేఖ రాశారు. పూర్తి స్థాయిలో నీటి ఇబ్బందులు ఉన్న గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తాం. ప్రస్తుత వేసవిలో ఎక్కడా నీటి సమస్య తలెత్తరాదని ప్రతి రోజు క్షేత్ర స్థాయిలోని అధికారులతో సమీక్ష చేస్తున్నాం. ప్రజల నుంచి సమస్యలు తెలుసుకునేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశాం. – సీహెచ్ మనోహర్, ఎస్ఈ, ఆర్డబ్ల్యూఎస్● సమ్మతగేరి ఎస్ఎస్ ట్యాంకు నుంచి హొళగుంద మండలంలోని సమ్మతగేరి, కోగిలతోట, ముద్దటమాగి, ఎల్లార్తి, చిన్నహ్యాట, పెద్దహ్యాట, బీజీ హళ్లి గ్రామాలకు రక్షిత మంచి నీటిని అందించాల్సి ఉంది. అయితే ఎస్ఎస్ ట్యాంకులో నీరు పూర్తిగా ఇంకిపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు తాగునీటి కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి రోజు రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోని పొలాల్లో బోర్లు, బావుల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. ● హాలహర్వి మండలం చింతకుంట హెడ్వర్క్స్ నుంచి 14 గ్రామాలకు రక్షిత మంచినీటిని అందించాల్సి ఉంది. అయితే రిజర్వాయర్లో నీటి మట్టం ఐదు అడుగులకు పడిపోవడంతో చాలా గ్రామాలకు నీరు అందని పరిస్థితి నెలకొంది. ఈ రిజర్వాయర్ పరిధిలోని కొక్కరచేడు, శిరిగాపురం, టి.చాకిబండ, బేవినహాల్, శ్రీధరహాల్, ఎంకే పల్లి, మేదేహాల్ గ్రామాల ప్రజలు తీవ్ర తాగునీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. కర్నూలు(అర్బన్): జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లోని మెజారిటీ గ్రామాల ప్రజలకు ఎల్ఎల్సీ నీరే ఆధారం. ఆయా నియోజకవర్గాల్లోని ఎస్ఎస్ ట్యాంకులను ఎల్ఎల్సీ నీటితో నింపితే, వేసవిలో నీటి కొరతను నివారించేందుకు అవకాశం ఉంటుంది. తుంగభద్ర డ్యాంలో కొనసాగుతున్న గేట్ల పనుల నేపథ్యంలో ఈ ఏడాది జనవరి 10వ తేది నుంచి ఎల్ఎల్సీకి నీటి సరఫరాను నిలిపివేశారు. అయితే నీటి సరఫరా నిలిపివేయక ముందే ఆయా ఎస్ఎస్ ట్యాంకులను నింపుకున్నా, ప్రస్తుతం పలు ట్యాంకుల్లో నీరు అడుగంటడంతో అనేక గ్రామాలు తాగునీటి కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పలు గ్రామాల ప్రజలు తాగేందుకు మినరల్ వాటర్ క్యాన్లను కొనుగోలు చేస్తుండగా.. పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన ప్రజలు ఆయా గ్రామాల్లోని బోరు నీటిపైనే ఆధారపడుతున్నారు. కరువుకు ఆలవాలంగా ఉన్న ఈ నియోజకవర్గాల్లో తాగునీటి సమస్య కూడా వేధిస్తోంది. బాపురం రిజర్వాయర్ నీటిపై ఆధారపడిన నియోజకవర్గ కేంద్రమైన ఆలూరు పట్టణంలోని ప్రజలు కూడా తాగునీటికి చాలా ఇబ్బంది పడుతున్నారు. వారం, పది రోజులకు ఒకసారి ఇక్కడ నీటిని విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఆస్పరి మండలంలోని చిన్నహోతూరు, జోహరాపురం గ్రామాల ప్రజల కష్టాలు చెప్పనలవి కాదు. ఎల్ఎల్సీ, తుంగభద్ర నది నీటిపై మొత్తం 26 సీపీడబ్ల్యూఎస్ స్కీంల ద్వారా 248 గ్రామాలకు రక్షిత మంచి నీటిని అందించాల్సి ఉంది. అయితే ఆయా ఎస్ఎస్ ట్యాంకుల్లో రోజు రోజుకు నీటి మట్టాలు పడిపోతుండడం వల్ల నిర్దేశించిన గ్రామాలకు నీరందని పరిస్థితి నెలకొంది. రూ.8.48 కోట్ల వేసవి ప్రణాళికపై నోరు మెదపని కూటమి ప్రభుత్వం వేసవిలో జిల్లాలోని 22 మండలాల పరిధిలోని 141 గ్రామాల్లో నీటి సమస్య తలెత్తే అవకాశం ఉంటుందని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ముందస్తుగానే అంచనా వేసి తాగునీటి ఇబ్బందులు తొలగించేందుకు రూ.8.48 కోట్లు అవసరవుతాయని ఈ ఏడాది జనవరి 5న ప్రభుత్వానికి తెలియజేశారు. 13 మండలాల్లోని 79 గ్రామాలకు రూ.6.14 కోట్లతో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని, అలాగే ఆరు మండలాల్లోని 26 జనవాసాల్లో పశువులకు నీటిని అందించేందుకు రూ.44.17 లక్షలు, బోర్ల ఫ్లష్సింగ్కు రూ.19.65 లక్షలు, బోర్ల డీపెనింగ్కు రూ.1.44 కోట్లు, ఓపెన్ వెల్స్ డీపెనింగ్కు రూ.17.80 లక్షలు, రెండు ఎస్ఎస్ ట్యాంకులు నింపేందుకు రూ.8 లక్షలు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఆర్డబ్ల్యూఎస్ ఇంజీనీర్లు ప్రతిపాదనలు రూపొందించారు. వీటిని జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి పంపారు. అయితే నేటికీ కార్యరూపం దాల్చకపోవడం గమనార్హం. ఎస్ఎస్ ట్యాంకుల ద్వారా అందిస్తున్న నీటి వివరాలు ● ఎల్ఎల్సీ: 18 సీపీడబ్ల్యూఎస్ స్కీంల ద్వారా 180 హ్యాబిటేషన్లకు ● హెచ్ఎల్సీ: గుంతకల్ బ్రాంచ్ కెనాల్ ద్వారా 7 హ్యాబిటేషన్లకు ● హెచ్ఎన్ఎస్ఎస్(ఆలూరు బ్రాంచ్ కెనాల్ ): 1 హ్యాబిటేషన్కు ●టీబీ రివర్ ఇంటెక్వెల్స్, ఇతర సోర్సులు: 29 హ్యాబిటేషన్లకు ● జీడీపీ, కొత్తపల్లి రిజర్వాయర్: 15 హ్యాబిటేషన్లకు ● కేసీ కెనాల్, హెచ్ఎన్ఎస్ఎస్: 16 హ్యాబిటేషన్లకు మొత్తం చేతి పంపులు: 4235 పూర్తిగా పనికిరాకుండా పోయినవి: 1338 ఉపయోగంలో ఉన్నవి: 2700 పనిచేయనివి: 197 క్రాష్ ప్రోగ్రామ్లో మరమ్మతు చేసినవి: 126 మరమ్మతు చేయాల్సినవి: 75గార్లదిన్నెలో ఎండుతున్న గొంతులు! ఎమ్మిగనూరుసెంట్రల్: గార్లదిన్నె గ్రామంలో ప్రజలు బిందెడు నీటికి అష్టకష్టాలు పడుతున్నారు. మూడు రోజుల కొకసారి తాగునీరు సరఫరా చేస్తుండటంతో పడరాని పాట్లు పడుతున్నారు. అల్వాల సమ్మర్ స్టోరేజీ నుంచి పెసలదిన్నె మీదుగా 25 ఏళ్ల కిందట గార్లదిన్నె వరకు పైపులైన్ ఏర్పాటు చేశారు. పైపులైన్లు పాతవి కావడంతో తుప్పు పట్టి నీరు రంగుమారి వస్తోందని, కుళాయిల వద్ద గంటల తరబడి నిలబడాల్సి వస్తోందిని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిందెడు నీరు కూడా దొరకడం లేదని, ఎండా కాలంలో గొంతులు ఎండిపోతున్నాయని తెలిపారు. ప్రతిరోజు శుభ్రమైన నీటిని అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. గొంతెండుతున్న పశ్చిమ పల్లెలు ఎస్ఎస్ ట్యాంకుల్లో అడుగంటుతున్న నీరు ఈ ఏడాది జనవరి 10 నుంచి నిలిచిపోయిన ఎల్ఎల్సీ నీటి సరఫరా దాదాపు 141 గ్రామాల్లో నీటి సమస్య ఉంటుందని గుర్తించిన అధికారులు రూ.8.48 కోట్ల వేసవి ప్రణాళికపై నోరు మెదపని ప్రభుత్వం -
పకడ్బందీగా జనగణన
కర్నూలు(సెంట్రల్): పొరపాట్లకు తావు లేకుండా కచ్చితత్వంతో జనగణన–2027 ప్రక్రియ నిర్వహించాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. జి.పుల్లయ్య కాలేజీలో ఫీల్డ్ ట్రైనర్లకు గురువారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శిక్షణలో బోధించిన ప్రతి అంశాన్ని స్పష్టంగా అర్థం చేసుకొని ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలన్నారు. ముందుగా హౌస్ మ్యాపింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ప్రతి ఇంటిని కచ్చితంగా గుర్తించి ఎటువంటి పొరపాట్లు లేకుండా మ్యాపింగ్ చేయలన్నారు. ఫీల్డ్ ట్రైనర్లుగా ఉన్న ఉపాధ్యాయులు తమ కింద పనిచేసే ఎన్యూమరేటర్లకు సమగ్ర శిక్షణ అందించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, సెన్సస్ అధికారి దీపక్ భరద్వాజ్ పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ పాలన ప్రజలకు స్వర్ణయుగం
బొమ్మలసత్రం: గత వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్ర ప్రజలు స్వర్ణయుగాన్ని చూశా రని వైఎస్సార్సీపీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు బొల్లవరపు జాన్ వెస్లీ అన్నారు. గురువారం స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో క్రిస్టియన్ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు కారు రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్రెడ్డి, జాన్వెస్లీలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జాన్వెస్లీ మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి హ యాంలో క్రిస్టియన్లకు పూర్తిగా న్యాయం జరిగిందన్నారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం డాక్టర్ బీఅర్ అంబే డ్కర్ రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి రెడ్బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నారని విమర్శించారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు పాలకుల చేతిలో కీలు బొమ్మ ల్లా మారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు కోర్టులను సైతం తప్పుదోవ పట్టిస్తూ వైఎస్సార్సీపీ నేతలను జైళ్లకు పంపుతున్నారన్నారు. అక్రమ సంపాదన కోసం అన్ని రకాల చట్ట వ్యతిరేక పనులకు నేతలు తెరలేపారని, రాష్ట్రంలో జూదాన్ని ప్రోత్సహించటం సరికాదన్నారు. సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను నమ్మించి నట్టేట ముంచారన్నారు. గత వైఎస్సార్సీపీ పాలనలో కోవిడ్ సంభవించినా సంక్షేమ పథకాలు ఆపలేదని గుర్తు చేశారు. ఇంత ఆదాయ వనరులు ఉన్నా టీడీపీ ప్రభుత్వం అప్పుల దిబ్బలా రాష్ట్రాన్ని ఆధోగతి పాలు చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ పాలనలో క్రిస్టియన్లకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సముచిత స్థానం కల్పించారన్నారు. టీడీపీ ప్రభుత్వం పేదలకు సంక్షేమ పథకాలు అందించకుండా మోసం చేయటం దుర్మార్గమన్నారు. బనగానపల్లి నియోజకవర్గంలో మైనింగ్ మాఫియా చెలరేగిపోతుందన్నారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపి తిరిగి సంక్షేమ ప్రభుత్వాన్ని గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉందన్నారు. సమావేశంలో రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ సెల్ సెక్రటరీ విల్సన్పాల్, నంద్యాల నియోజకవర్గ అధ్యక్షులు మనోజ్ కుమార్, పట్టణాధ్యక్షులు ఇమ్మానియేలు, రవిప్రకాష్, కరుణాకర్, ప్రేమ్కుమార్, కిరణ్ పాల్గొన్నారు. -
రాయల్టీ పేరుతో నిలువుదోపిడీ
● సుధాకర్ ఇన్ఫ్రా సిబ్బందికి మైనింగ్ అధికారుల వత్తాసుపాములపాడు: ఎస్ఆర్ ఎంసీ కెనాల్ వేస్ట్ బిల్కు (రాళ్ల మట్టి)ను తరలిస్తున్న వారిని సుధాకర్ ఇన్ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ సిబ్బంది దోచుకుంటోంది. ప్రభుత్వం నుంచి టెండర్లు దక్కించుకున్నామని, రోడ్డుపై కంకర, ఇసుక, మట్టి తదితరం తరలించే వాహనాల నుంచి రాయల్టీ పేరుతో డబ్బు వసూలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి స్థానికులను నియమించి దందాకు పాల్పడుతున్నారని వాహన యజమానులు వాపోతున్నారు. ఈ క్రమంలోనే గురువారం మండలంలోని కంబాలపల్లి గ్రామం వద్ద బిల్కు లోడుతో వెళ్తున్న ట్రిప్పర్లను అడ్డుకున్నారు. సుధాకర్ ఇన్ఫ్రా చెందిన వ్యక్తుల వెంట మైనింగ్ శాఖ టెక్నికల్ అసిస్టెంట్ రషీద్ అహ్మద్ ఉన్నారు. ట్రిప్పర్ డ్రైవర్ల వద్ద నుంచి సెల్ ఫోన్లు లాక్కుని బెదిరింపులకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న యజమాని వెంకటేష్, కో ఆప్టెడ్ సభ్యుడు ముర్తుజాఅలీ, మరి కొందరు వాహన యజమానులు అక్కడకు చేరుకుని సిబ్బందిని నిలదీశారు. ఇప్పటికే బిల్కు తరలించడానికి ఇరిగేషన్ శాఖకు చలానా చెల్లించామని, రాయల్టీ ఎందుకు చెల్లించాలని ప్రశ్నించారు. సుధాకర్ ఇన్ఫ్రా సంస్థకు రాయల్టీ చెల్లించవద్దని జీఓలో కనబరిచిన విషయాన్ని కూడా చూపించారు. అయితే సుమారు నాలుగు నెలలుగా ఇదే తంతు నడుస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశా మని వాహన యజమానులు తెలిపారు. స్థానిక రైతు లు శ్రీశైలం ముంపులో భూములు కోల్పోయామని అందులో తమ ఆస్తులు ఉన్నాయని, పరిహారం అప్ప ట్లో అరకొరగా ఇచ్చారని, ఇప్పుడు బిల్కు తరలిస్తే వేలల్లో వసూళ్లకు పాల్పడటం సరికాదన్నారు. దీంతో డ్రైవర్ల నుంచి తీసు కున్న సెల్ ఫోన్లు తిరిగి ఇచ్చేసి, అధికారులు, రాయల్టీ వసూలు సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
పకడ్బందీగా వీఏఏల బదిలీలు
కర్నూలు(అగ్రికల్చర్): గ్రామ వ్యవసాయ సహాయకుల బదిలీల కౌన్సెలింగ్ ప్రశాంతంగా జరిగింది. 2025 జూలై నెలలో చేపట్టిన వీఏఏల బదిలీలపై 35 మంది హైకోర్టును ఆశ్రయించడంతో వీరితో పాటు ఆప్షన్ పెట్టుకున్న 106 మంది వీఏఏలకు కర్నూలు జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో కౌన్సెలింగ్ చేపట్టారు. గురువారం నిర్వహించిన కౌన్సెలింగ్లో నంద్యాల జిల్లా వ్యవసాయ అధికారి కూడా పాల్గొన్నారు. ‘సాక్షి’లో వీఏఏల బదిలీల కౌన్సెలింగ్కు సంబంధించి మళ్లీ అక్రమాలు శీర్షికన కథనం ప్రచురితమవడంతో వ్యవసాయ యంత్రాంగం అప్రమత్తమైంది. 106 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. పొగను 8 నిమిషాల్లో నియంత్రించాం కర్నూలు(సెంట్రల్): మరమ్మతుల్లో భాగంగా పొగ వచ్చిందని, దానిని ఎనిమిది నిమిషాల్లో నియంత్రించాయని జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంటు యాజమాన్యం తెలిపింది. ఈ మేరకు గురువారం ఓ ప్రకటనను విడుదల చేసింది. మరమ్మతుల సమయంలో ఇలా పొగ రావడం చాలా సాధారణమని పేర్కొన్నారు. దానిని అంతర్గత భద్రతా బృందాలు పూర్తిగా నియంత్రించాయని, ఇందులో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు జరుగలేదని తెలిపారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి శ్రీశైలం ప్రాజెక్టు: సున్నిపెంటలోని అక్కమహాదేవి సెంటర్ సమీపంలో ఎం. నవీన్ (46) గురువారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సున్నిపెంట సీఐ సుబ్బారావు తెలిపిన వివరాల మేరకు.. నవీన్ అప్పుల భారంతో మద్యానికి బానిసై అతిగా మద్యం సేవించి తూలిపడి మరణించినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని, అతని తల్లి సరోజమ్మ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. పీఆర్ ఎస్ఈగా జి.ప్రభాకర్రెడ్డి కర్నూలు(అర్బన్): పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం కర్నూలు పర్యవేక్షక ఇంజనీరుగా జి.ప్రభాకర్రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ శశిభూషణ్కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పదోన్నతుల్లో భాగంగా అనంతపురం పీఆర్ఐ డివిజన్ ఈఈగా విధులు నిర్వహిస్తున్న ప్రభాకర్రెడ్డికి ఎస్ఈగా పదోన్నతి కల్పించి ఇక్కడకు పోస్టింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఇక్కడ ఎస్ఈగా విధులు నిర్వహిస్తున్న ఐ.వేణుగోపాల్ ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ఎస్ఈగా ప్రభాకర్రెడ్డి ఏప్రిల్ 1న బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. అహోబిలం ప్రధాన పరిపాలనాధికారిగా పార్థసారథి ఆళ్లగడ్డ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిలం దేవస్థానం ప్రధాన పరిపాలనాధికారిగా పార్థసారథి గురువారం బాధ్యతలు స్వీకరించారు. పీఠాధిపతి శ్రీ రంగరాజ యతీంద్ర మహాదేశికన్ ఆదేశానుసారం చైన్నె నుంచి అహోబిలం చేరుకున్న ఆయన గురువారం దేవస్థానం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అహోబిలం దేవస్థానం అభివృద్ధితో పాటు భక్తులకు వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అర్చకులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహిస్తూ క్షేత్ర అభివృద్ధికి పాటుపడాలన్నారు. గత రెండు సంవత్సరాల్లో ఇప్పటి వరకు సుమారు 12 మంది పరిపాలనాధికారులు మారడంతో పాటు బా ధ్యతలు చేపట్టిన మూడు నెలలకు మించి ఒక్కరు కూడా విధులు నిర్వహించలేక బాధ్యతల నుంచి తప్పుకుని వెళ్లిపోయారు. మొన్నటి దాక బాధ్యతలు నిర్వహించిన మరో వర్గం తమను కాదని చైన్నె నుంచి వచ్చిన ఇతను ఎన్ని రోజులు ఇక్కడ విధులు నిర్వహిస్తారో.. చూస్తాం అంటూ.. తేల్చిచెబుతున్నారు. స్థానిక నేతల ఒత్తిళ్లు, మఠం అసమ్మతి నేతల ఎత్తులను తట్టుకుని పార్థసారథి ఎన్నాళ్లు ఉంటారోననే చర్చ కొనసాగుతోంది. -
బంగారు తేరుపై ఆది దంపతుల విహారం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని గురువారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్లకు స్వర్ణ రథోత్సవం నిర్వహించారు. ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని వేకువ జామున స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు అర్చకులు జరిపించారు. స్వర్ణ రథోత్సవంలో ముందుగా అర్చకులు లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. అనంతరం రథారూఢులైన శ్రీస్వామిఅమ్మవార్లకు విశేష పూజలు జరిపించారు. ఉదయం 7.30 గంటలకు స్వర్ణ రథోత్సవం ప్రారంభమైంది. ఆలయ మహాద్వారం ముందుభాగం గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు రథోత్సవాన్ని నిర్వహించారు. రథోత్సవంలో కోలాటం, తాళం భజన, డోలు వాయిద్యం, చెక్కభజన మొదలైన జానపద కళారూపాలు కూడా ఏర్పాటు చేశారు. స్వర్ణ రథోత్సవంలో శ్రీశైల దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్నాయుడు, సభ్యులు ఏఈవో, అర్చకులు, వేదపండితులు, పలు విభాగాల అధికారులు, పర్యవేక్షకులు, ఇతర సిబ్బంది, శివసేవకులు, అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
గ్యాస్ అక్రమ నిల్వలపై విజి‘లెన్స్’
కర్నూలు: జిల్లాలో వంట గ్యాస్ సంక్షోభం ముదురుతున్న నేపథ్యంలో అధికారులు తనిఖీలు విస్తృతం చేశారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, సివిల్ సప్లయ్ శాఖ అధికారులు కలసి ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా సంయుక్త తనిఖీలు నిర్వహిస్తున్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రాంతీయ అధికారి చౌడేశ్వరి ఆదేశాల మేరకు ఆ శాఖ అధికారులు బృందాలుగా ఏర్పడి గ్యాస్ ఏజెన్సీలు, హోటళ్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈనెల 12వ తేదీ నుంచి ఇప్పటివరకు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఉన్న 10 గ్యాస్ ఏజెన్సీలు, 88 హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా నిల్వలను గుర్తించి 201 కేసులు నమోదు చేశారు. లబ్దిదారులకు సకాలంలో గ్యాస్ సరఫరా చేయకుండా కృత్రిమ కొరత సృష్టించి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏజెన్సీ నిర్వాహకులను హెచ్చరిస్తున్నారు. గృహ అవసరాలకు వినియోగించాల్సిన సబ్సిడీ గ్యాస్ను వ్యాపార అవసరాలకు హోటల్ నిర్వాహకులు వినియోగిస్తున్నట్లు గుర్తించి 6ఎ కేసులు నమోదు చేస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. -
పొలాల్లోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు
● పది మందికి గాయాలు నంద్యాల(అర్బన్): ప్రైవేటు ట్రావెల్ బస్సు ముందు టైర్ పగలడంతో డివైడర్ దాటి పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటన నంద్యాల మండలం చాబోలు గ్రామ హైవే సమీపంలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. 35 మంది ప్రయాణికులతో తిరుపతి నుంచి హైదరాబాద్కు వెళ్తున్న మార్నింగ్ స్టార్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు టైర్ పగలడంతో డివైజర్ను దాటి పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డ వారిని నంద్యాల ప్రభుత్వానికి తరలించారు. అనంతరం బస్టాండ్కు తరలించి సొంత ప్రాంతాలకు వెళ్లేలా సౌకర్యం కల్పించారు. జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంటులో మంటలు కర్నూలు(సెంట్రల్): ఓర్వకల్ మండల కేంద్రానికి సమీపంలోని జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంటులో బుధవారం సాయంత్రం ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు అలుముకోవడంతో గుట్టపాడు ప్రజలు ఉలిక్కిపడ్డారు. అయితే ప్రమాదంలో ఎవరూ చనిపోలేదు. దీంతో అక్కడ పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ప్రమాదం సాంకేతిక లోపంతో జరిగిందా, లేదంటే మరే ఇతర కారణంతో సంభవించిందా అనే విషయమై స్పష్టత రాలేదు. మరోవైపు ప్రమాదం విషయాన్ని తెలుసుకున్న జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ వివరాలు కోరగా.. ఉత్పత్తి ప్రక్రియలో ఇలాంటి ఘటనలు సాధారణమని, ఉత్పత్తి సమయంలో కొంత భాగం పక్కకకు వెళ్లడంతో పొగలు వ్యాపిస్తాయని యాజమాన్యం వివరించినట్లు తెలుస్తోంది. అయితే ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందారు. ఈనేపథ్యంలో భద్రతా ప్రమాణాలను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. -
అక్క పుట్టినరోజు వేడుకలకు వెళ్తూ..
● రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం ● ఇసుక ట్రాక్టర్, బైక్ ఢీకొనడంతో ప్రమాదం హాలహర్వి: అక్క పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని సరదాగా గడుపుదామనుకున్న ఆ యువకుడిపై మృత్యువు వల విసిరింది. రోడ్డు ప్రమాదం రూపంలో యువకుడిని కబ ళించింది. హాలహర్వి నుంచి ఆలూరుకు వెళ్లే మార్గంలో బాట మారెమ్మవ్వ ఆలయ సమీపంలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదోనికి చెందిన వడ్డె వెంకటేష్ (19) అక్కడికక్కడే మృతిచెందాడు. వివరాలు.. ఆదోని పట్టణంలోని బండిమెట్ట కాలనీకి చెందిన వడ్డె వెంకటేష్ (19), శ్రీనివాసులు బళ్లారిలో బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం వెంకటేష్ అక్క పుట్టినరోజు కావడంతో వేడుకల్లో పాల్గొనేందుకు ఇద్దరూ బైకుపై బళ్లారి నుంచి ఆదోనికి బయలుదేరారు. బాట మారెమ్మవ్వ ఆలయ సమీపంలోకి రాగానే అగ్రహారం గ్రామానికి చెందిన ఇసుక ట్రాక్టర్ వీరి బైకును ఢీకొట్టింది. ప్రమాదంలో వెంకటేష్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. శ్రీనివాసులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ ప్రమాద విషయం తెలుసుకున్న పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య, ఎస్ఐ ఈశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆసుపత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. -
వైభవంగా వసంతోత్సవం
బనగానపల్లెరూరల్: మండలంలోని నందవరం గ్రామంలో వెలసిన చౌడేశ్వరిదేవి దేవస్థానంలో ఈ నెల 19వ తేదీ నుంచి నిర్వహిస్తున్న చౌడేశ్వరిదేవి రాయబారాది జ్యోతి రథ మహోత్సవాలు బుధవారం వసంతోత్సవ కార్యక్రమంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, చైర్మన్ పీవీ నాగార్జున రెడ్డి, అర్చకుల ఆధ్వర్యంలో ఉదయం చౌడేశ్వరిదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చౌడేశ్వరిదేవి, చెన్నకేశవస్వామి ఉత్సవ విగ్రహాలకు వసంతోత్సవం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆలయం ఎదురుగా ఉన్న కోనేరులో స్వామి వార్ల విగ్రహాలకు వసంతోత్సవ పూజలు నిర్వహించి తిరిగి ఆలయాలకు చేర్చారు. ఆలయ పాలక మండలి సభ్యులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. -
చెవిలో పూలతో నిరసన
కర్నూలు(సెంట్రల్): ఇటీవల తెలుగుదేశం ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్తో ఒరిగేదేమీ లేదంటూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరుద్యోగులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట చెవిలో పూలు పెట్టుకొని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి.సంతోష్కుమార్ హాజరై మాట్లాడుతూ.. ఇటీవల ప్రకటించిన జాబ్ క్యాలెండర్తో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ప్రభుత్వ శాఖల్లో 2.30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేవలం 10 వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్ అంటూ హడావుడి చేయడం దారుణమన్నారు. మంత్రి లోకేష్ ఈ విధంగా నిరుద్యోగులను మోసం చేయడం అన్యాయమని, ఆయనకు వచ్చే ఎన్నికల్లో నిరుద్యోగుల తడాఖా ఏమిటో తెలుస్తుందని హెచ్చరించారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీరాములు, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
మళ్లీ అక్రమాలు!
కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ శాఖలో గ్రామ వ్యవసాయ సహాయకుల (వీఏఏ) బదిలీల వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైకోర్టును ఆశ్రయించిన 106 మందికి న్యాయస్థానం ఆదేశాల మేరకు పారదర్శకంగా కౌన్సెలింగ్ నిర్వహించి సీనియారిటీకి పెద్దపీట వేయాలి. రాజకీయ నేతల సిఫార్సులు, ముడుపులకు అవకాశం ఇవ్వరాదు. కానీ వీఏఏల బదిలీల్లో లోలోపల ముడుపుల పర్వం జోరుగా సాగుతోంది. బదిలీల కౌన్సెలింగ్ ఈ నెల 26వ తేదీ కర్నూలు జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఉమ్మడి జిల్లా యూనిట్గా జరుగుతుంది. నంద్యాల జిల్లా వ్యవసాయ అధికారి కూడా కౌన్సెలింగ్ నిర్వహించే కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. గతేడాది జూలైలో జరిగిన బదిలీల్లో కర్నూలు, నంద్యాల డీఏఓలు కుమ్మకై ్క సీనియారిటీకి పాతర వేశారు. సిఫార్సు లేఖలు, ముడుపులకు పెద్దపీట వేశారు. సిఫార్సు లేఖ లేకపోతే తెచ్చుకోవాలని ప్రోత్సహించారు. ఫలితంగా అర్హులు మారుమూల ప్రాంతాలు, కర్ణాటక సరిహద్దు మండలాలకు బదిలీ అయ్యారు. అనర్హులు దగ్గరి మండలాల్లో నియమితులయ్యారు. వీరందరూ హైకోర్టును ఆశ్రయించడంతో విచారణ జరిపి అక్రమాలు జరిగాయని నిర్ధారించి ఎక్కడ పనిచేసే వారు అక్కడే కొనసాగే విధంగా ఆదేశాలు ఇవ్వడంతో పాటు మళ్లీ కౌన్సెలింగ్ జరిపి బదిలీలు చేపట్టాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు బదిలీలు గురువారం చేపట్టనున్నారు. వీఏఏల బదిలీల్లో మళ్లీ అక్రమాలే.. నిబంధనల మేరకు వీఏఏలను ఖాళీ పోస్టుల్లోనే నియమించాలి. అయితే ముడుపులు దండుకొని కర్నూలు, నంద్యాల జిల్లాల్లో లీవ్ వేకెన్సీల్లో సైతం పోస్టింగ్లు ఇవ్వడానికి రంగం సిద్ధమైందనే విమర్శలు వెల్లువెతుతున్నాయి. కర్నూలు, నంద్యాల జిల్లా వ్యవసాయ అధికారులకు.. వీఏఏలకు కర్నూలులో పనిచేసే ఓ ఏఓ మధ్యన ఉండి ముడుపుల బాగోతం నడుపుతున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. కొంత మంది వీఏఏలు మెటర్నటీ లీవ్లో ఉన్నారు. మరికొందరు మెడికల్ లీవ్లో ఉన్నారు. ఇటువంటి ఖాళీల్లో ఎవరినీ నియమించరాదు. కానీ ముడుపుల మహిమ వల్ల ఇటువంటి లీవ్లు భర్తీ కానున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లీవ్ వేకెన్సీలు భర్తీ చేయడం వల్ల కర్ణాటక సరిహద్దు మండలాలైన కౌతాళం, కోసిగి, హొళగుంద, హలహర్వి, మంత్రాలయం తదితర మండలాల్లోని రైతు సేవా కేంద్రాల్లో యథావిధిగా ఖాళీలు మిగిలిపోయే పరిస్ధితి ఏర్పడింది. పనిలోపనిగా కొందరు వీఏఏలను మెడికల్ గ్రౌండ్స్ కింద బదిలీ చేయడానికి రంగం సిద్ధమైంది. మొత్తంగా 2025 జూలైలో జరిగిన అక్రమాల కంటే తాజాగా జరుపుతున్న బదిలీల్లో అక్రమాలు భారీగా జరుగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కలెక్టర్, జేసీలు వీఏఏల బదిలీలపై దృష్టి సారించి అక్రమాలను నిరోధించాల్సిన అవసరం ఎంతో ఉంది. వీఏఏల బదిలీల్లో ముడుపులు, సిఫార్సులకు పెద్దపీట లీవ్ వేకెన్సీలు కూడా భర్తీకి రంగం సిద్ధం కర్ణాటక సరిహద్దు మండలాల్లో ఖాళీల భర్తీ వట్దిదే నేడు వీఏఏల బదిలీల కౌన్సిలింగ్ ప్రక్రియ అబాసుపాలవుతున్న వ్యవసాయ శాఖ గతేడాది చేపట్టిన మండల వ్యవసాయ అధికారులు, ఏడీఏలు, డీడీఏల బదిలీల్లో అబాసుపాలైన వ్యవసాయ శాఖ ప్రస్తుతం గ్రామ స్థాయిలో వీఏఏల బదిలీల్లో సైతం పెద్ద ఎత్తున ముడుపులు దండుకొని అపఖ్యాతిని మూట కట్టుకుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యవసాయ అధికారులు, ఏడీఏల బదిలీల్లో రూ.లక్షలు ముడుపులు చేతులు మారాయి. కూటమి పార్టీల నేతలకు బదిలీల పర్వం కాసుల పంట పండించింది. తాజా బదిలీల్లోనూ అక్రమాలదే రాజ్యంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ముగిసిన రాతిదూలం పోటీలు
బనగానపల్లె రూరల్ : మండలంలోని నందవరం గ్రామంలో శ్రీ చౌడేశ్వరిదేవి దేవస్థానంలో జ్యోతి మహోత్సవాల సందర్భంగా రైతు సంబరాల్లో భాగంగా నిర్వహించిన న్యూకేటగిరీ విభాగం ఎద్దుల రాతిదూలం లాగుడు పోటీలు బుధవారం ముగిశాయి. పోటీల్లో వరుస స్థానాల్లో బాపట్ల జిల్లా వేటపాలెం గ్రామానికి చెందిన ఆర్కే బుల్స్, తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా రాయవరం గ్రామానికి చెందిన అక్షరరెడ్డి వృషభాలు, అదే జిల్లా రాయవరంకు చెందిన అక్షరరెడ్డి వృషభాలు, నంద్యాల జిల్లా బిల్లలాపురం గ్రామానికి చెందిన గోవర్థన్రెడ్డి ఎద్దులు, నంద్యాల జిల్లా చిన్నకానల గ్రామానికి చెందిన చెన్నరెడ్డి వృషభాలు, కోటకందుకురుకు చెందిన నరసింహారెడ్డి ఎద్దులు, సోమయాజులపల్లెకు చెందిన సుబ్బారెడ్డి, నరసయ్యయాదవ్ వృషభాలు, రోళ్లపాడుకు చెందిన ప్రభాకర్రెడ్డి, గుల్లదుర్తి గ్రామానికి చెందిన శశికాంత్ వృషభరాజములు నిలిచినట్లు నిర్వాహకులు తెలిపారు. విజేతలైన వృషభాల యజమానులకు దాతల సహకారంతో వరుసగా రూ.60వేలు, రూ.50వేలు, రూ.40 వేలు, రూ.30వేలు,రూ.20వేలు,రూ.15వేలు, రూ.10వేలు, రూ.8 వేలు బహుమతులతో పాటు జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటి చైర్మన్ పీవీ కుమార్రెడ్డి, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలుగా జుబేదాబీ
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలుగా కల్లూరు మండలం తడకనపల్లె గ్రామానికి చెందిన జుబేదాబీ ఎన్నికయ్యారు. గురువారం కర్నూలు శివారులోని టీటీడీసీ సమావేశ మందిరంలో జిల్లా సమాఖ్య వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి అన్ని మండల సమాఖ్యల నుంచి అధ్యక్షురాళ్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షురాలుగా జుబేదా బీ, ఉపాధ్యక్షురాలుగా కె.మల్లేశ్వరి(కోడుమూరు), కార్యదర్శిగా బి.రాజేశ్వరి (ఆదోని), ఉప కార్యదర్శిగా గ్రేసమ్మ(మంత్రాలయం), కోశాధికారిగా జి.అరుణ(కర్నూలు) ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులను డీఆర్డీఏ పీడీ రమణారెడ్డి అభినందించారు. బెట్టింగ్ అప్పు తీర్చేందుకు చైన్ స్నాచింగ్ కర్నూలు: తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం గోపాలదిన్నెకు చెందిన చాకలి ప్రవీణ్ క్రికెట్ బెట్టింగ్లో చేసిన అప్పులు తీర్చేందుకు చైన్ స్నాచింగ్కు పాల్పడి పోలీసులకు చిక్కాడు. ఇతడు కర్నూలు బాలాజీ నగర్లో ఫాస్ట్ఫుడ్ సెంటర్ నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు. క్రికెట్ బెట్టింగ్కు అలవాటు పడి వ్యాపారంలో వచ్చిన డబ్బంతా పోగొట్టుకుని అప్పులు చేశాడు. వాటిని తీర్చేందుకు చైన్ స్నాచింగ్ను ఎంచుకున్నాడు. కర్నూలు శివారులోని బి.క్యాంప్ హౌసింగ్ బోర్డు కాలనీలో సిరిగిరి శ్యామలమ్మ అనే వృద్ధురాలు ఈనెల 10వ తేదీన ఇంటి ముందు మనవరాలిని ఆడిస్తుండగా మోటర్సైకిల్పై వచ్చి ఆమె మెడలోని 3 తులాల బంగారు పుస్తెల గొలుసును లాక్కుని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మూడో పట్టణ పీఎస్ ఎస్ఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసి బుధవారం మధ్యాహ్నం నంద్యాల చెక్పోస్టు సమీపంలోని టీవీ టవర్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న ప్రవీణ్ను అదుపులోకి తీసుకుని విచారించగా గొలుసు దొంగతనానికి పాల్పడినట్లు నేరం అంగీకరించాడు. అతని నుంచి 30 గ్రాముల బంగారు పుస్తెల గొలుసు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్కు ఆదేశించినట్లు సీఐ శేషయ్య తెలిపారు. -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే హత్య
బనగానపల్లె: వివాహేతర సంబంధానికి అడ్డు తొలగించుకోవాలని డోన్కు చెందిన మేరీ భర్త విల్సన్ (32)ను ప్రియుడు మధుతో కలిసి ఈ నెల 15న రాత్రి హత్య చేసినట్లు బనగానపల్లె రూరల్ సీఐ మంజునాథ్రెడ్డి తెలిపారు. నిందితులు మేరీ, మధు, వీరికి సహకరించిన నంద్యాలకు చెందిన మహమ్మద్, అశోక్ను అరెస్టు చేసి బుధవారం రిమాండ్కు పంపారు. కేసు వివరాలను బుధవారం స్థానిక కార్యాలయంలో సీఐ వెల్లడించారు. 11 ఏళ్ల క్రితం నంద్యాలకు చెందిన మేరీకి డోన్కు చెందిన విల్సన్తో వివాహం జరిగింది. కూలి పని చేసుకుంటూ జీవనం సాగించేవారు. వీరికి పదేళ్ల కూతురు, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. మూడేళ్ల క్రితం వీరి కుటుంబం డోన్ నుంచి నంద్యాలలోని బోగ్గులైన్కు మారి అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఈ స్థితిలో మూడు నెలల క్రితం నంద్యాల మండలం బాపూజీ నగర్కు చెందిన మధుతో మేరికి వివాహేతర సంబంధం ఏర్పడగా వారు పెళ్లి చేసుకోవాలని భావించారు. ఈ విషయం భర్తకు తెలియడంతో దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో భర్త అడ్డు తొలగించుకునేందుకు మేరీ ప్రియుడితో కలిసి పన్నాగం పన్నింది. ఈ నెల 15న మధు, అతని స్నేహితులు రఫీ, అశోక్ కలిసి విల్సన్కు అతిగా మద్యం తాగించారు. ఆటోలో బనగానపల్లె నుంచి కై పకు వెళ్లే రహదారిలో ప్లాట్లలోకి తీసుకెళ్లి బెల్టుతో విల్సన్ మెడకు బిగించి హత్య చేసి వెళ్లిపోయారు. ఈ క్రమంలో పోలీసులు హంతకుల గాలిస్తున్నట్లు తెలుసుకున్న నిందితులు ఈ నెల 24న కై ప వీఆర్ఓ ద్వారా లొంగిపోయారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. -
కష్టాన్ని'కట్టె'బెట్టి!
కర్నూలు(సెంట్రల్)/కర్నూలు(అగ్రికల్చర్): వంట గ్యాస్ కొరతతో హోటళ్లు మూతపడుతున్నాయి. వేల మంది జీవనోపాధి కోల్పోతున్నారు. ప్రజలకు కష్టాన్ని కట్టబెట్టి చంద్రబాబు ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శలు వస్తున్నాయి. పశ్చియాసియాలో యుద్ధం రెండువారాలుగా జరుగుతుండటంతో గ్యాస్ అందని పరిస్థితి ఏర్పడింది. కట్టెల పొయ్యి వాడటానికి వంట చెరకు అందడం లేదు. ఏదో విధంగా కష్టపడి వాటిని సాధిస్తే.. ఈ కట్టెలు ఎక్కడి నుంచి వచ్చాయి.. బిల్లులు చూపాలని అటవీ అధికారులు అడుగుతున్నారు. కేంద్ర, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉండగా.. గ్యాస్ కొరతను తీర్చి ప్రజలకు అండగా నిలవాల్సి ఉంది. సీఎం చంద్రబాబు ఈ దిశగా చర్యలు తీసుకోలేదని విమర్శలు వచ్చాయి. పట్టణాల్లో మూతపడిన హోటళ్లు ఇందుకు నిదర్శనంగా నిలిచాయి. 100 హోటళ్లు మూత ఉమ్మడి జిల్లాలో చిన్న, పెద్ద హోటళ్లు 600 ఉన్నాయి. కర్నూలు నగరంలో వీటి సంఖ్య 225 వరకు ఉంది. పశి్చయాసియాలోయుద్ధ మొదలైన వెంటనే హోటళ్లకు కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా కర్నూలులో 20 వరకు చిన్న, పెద్ద హోటళ్లు మూతపడ్డాయి.ఉమ్మడి జిల్లాలో 100 హోటళ్లు మూతపడటంతో వాటిలో పనిచేసే 10 వేల మంది కార్మికులు జీవనోపాధి కోల్పోయారు. హోటళ్లు మూత పడటంతో వాటికి అద్దెలు చెల్లించడం కూడా కష్టమవుతుందనే ఆందోళన నిర్వాహకుల్లో వ్యక్తం అవుతోంది. గ్యాస్ కొరత కారణంగా వంట చెరుకుకు డిమాండ్ ఏర్పడింది. యుద్ధానికి ముందు టన్ను వంట చెరుకు ధర రూ.5000 వరకు ఉండగా నేడు రూ.10 వేలకు చేరింది. కరోనా కాలంలో ఎంతో మేలు! గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కరోనా వచ్చి ప్రపంచం మొత్తం లాక్డౌన్ ప్రకటించింది. ఎగుమతులు, దిగుమతులు బంద్ అయ్యాయి. కరోనా కారణంగా అప్పట్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. ఒక్క రోజు, రెండు రోజులు కాదు... రెండు నెలలకుపైగా లాక్డౌన్ ఉన్నప్పటికీ అప్పటి ప్రభుత్వం ప్రజలకు ఎంతో మేలు చేసింది. అప్పట్లో అందరికీ గ్యాస్ అందింది. ధరలు అదుపులోనే ఉండేవి. బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారా? కర్నూలు జిల్లాలో 42 గ్యాస్ ఏజన్సీలు ఉన్నాయి. వీటి పరిధిలో 6.68 లక్షల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కనెక్షన్నుల ఉన్నాయి. రోజుకు 11 వేల సిలిండర్లను డెలివరీ చేయవచ్చు. ఇదే సమయంలో రోజుకు 16 వేల సిలిండర్ల ప్రకారం గ్యాస్ నిల్వలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. నిల్వలు ఉన్న సమయంలో డెలివరీ నెమ్మదించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్యాస్ ఏజెన్సీలు ఏమైనా బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నాయా అన్న సందేహం ప్రజల్లో వ్యక్తమవుతోంది. అధికారులు మాత్రం అదేమి లేదని, బుకింగ్ ఎక్కువ మంది చేసుకుంటుండడంతో ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు. అయితే బుక్ చేసిన సిలిండర్లలో దాదాపు 80 వేలు వెయిటింగ్లో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలకు గ్యాస్ ఇవ్వొద్దు!పశి్చమాసియా యుద్ధంతో గ్యాస్ దిగుబడులు పడిపోయిన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలకు ఇచ్చే గ్యాస్పై కేంద్రం ఆంక్షలు విధించింది. గతంలో సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాలకు 45 రోజులకు సిలిండర్ ఇచ్చే విధంగా ఆదేశాలు ఉన్నాయి. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు 45 రోజులకు సిలిండరు అనే విధానానికి మంగళం పలికారు. వంట చెరకు అందుబాటులో ఉంటుందని వాడుకోవాలని సూచించారు. అయితే జిల్లా అధికారులు మాత్రం వంటకు కట్టెల వినియోగం వద్దు అని చెబుతున్నారు. గ్యాస్ కొరతను అధిగమించేందుకు ఇండక్షన్, ఎలక్ట్రికల్ స్టౌలు వినియోగించాలని సూచిస్తున్నారు. గ్యాస్ రాదు.. కట్టెల పొయ్యి వాడితే ఆరోగ్య సమస్యలు వస్తాయి.. జనజీవనం సాగేదెలా అని మహిళలు ఆందోళన చెందుతున్నారు. కట్టెల పొయ్యిమీదనే వంటఆదోని సెంట్రల్: గ్యాస్ కొరతతో ఆదోని పట్టణంలోని కొన్ని హోటళ్లలో కట్టెల పొయ్యిపై భోజనాలను చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడే అవకాశాలు ఉన్నాయని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పౌర సరఫరాల అధికారులు హోటళ్లపై దాడులు చేసి గృహాలకు వినియోగించుకోవాల్సిన దాదాపు 107 డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేశారు. మూతపడిన టీస్టాల్ పత్తికొండ రూరల్: గ్యాస్ సరఫరా మందగించడంతో టీ, టిఫిన్ సెంటర్లు, భోజనం హోటళ్లు మూతబడ్డాయి. చిన్నాచితక హోటల్ నిర్వాహకులు గత కొన్నిరోజుల క్రిందటే మూసివేశారు. కొన్నిరోజుల నుంచి సమస్య తలెత్తినా ఎలాగోలా నెట్టుకొచ్చారు. ఇక నిర్వహణ చేతకాక హోటల్లు సర్దుకుని మూతేశారు. ఇతర రాష్ట్రాల నుంచి బతుకుతెరువు నిమిత్తం వచ్చిన రాజస్థాన్ హోటల్ నిర్వాహకులు హోటల్ సర్దుకుని వారి ప్రాంతానికి తరలివెళ్లారు.డిమాండ్కు సరిపడేంత సరఫరా కర్నూలు జిల్లాలో తగినన్ని గ్యాస్ సిలిండర్ల నిల్వలు ఉన్నాయి. వినియోగదారులు అందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం జిల్లాలో 11 వేల సిలిండర్లు నిల్వ ఉన్నాయి. వీటికి అదనంగా మరో 7 వేల సిలిండర్లు వచ్చాయి. ప్రతిరోజు సగటున సుమారు 10 వేల సిలిండర్ల సరఫరా జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న డిమాండ్కు సరిపడేంత సరఫరా కొనసాగుతోందన్నారు. హాస్పిటళ్లు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తాం. ఏమైనా సమస్యలు ఉంటే 1967 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలి. – నూరుల్ ఖమర్, జేసీ, కర్నూలు పన్ను మినహాయింపులు ఇవ్వాలి కరోనా సమయంలో కూడా మేం ఇంత ఇబ్బంది పడలేదు. మొదటిసారిగా హోటళ్లు నడుపలేని పరిస్థితి ఏర్పడింది. గ్యాస్ దొరకడం లేదు. కట్టెల ధరలు పెరిగిపోయాయి. ప్రభుత్వం చొరువ తీసుకొని పన్ను మినహాయింపులు ఇవ్వాలి. పర్యాటకులకు ఆతిథ్యం ఇచ్చే హోటళ్లు మనుగడ కోల్పోకుండా చూడాలి. – ఎం.విజయ తిరుపతిరెడ్డి, జిల్లా కార్యదర్శి, హోటల్స్ అసోసియేషన్ -
గమ్యం చేరేలోగా విధి రాసిన మృత్యురాత
కర్నూలు : గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిఇంటికి వెళ్తున్న ద్విచక్రవాహనదారుడికి ప్రమాదం జరిగితే.. అతనికి సాయం చేద్దామని మానవత్వంతో స్పందించిన మరో ఇద్దరిని మృత్యువు వెంటాడింది. ఒకేచోట వెనువెంటనే జరిగిన ప్రమాదాలతో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఘటన కర్నూలు నగరంలో బుధవారం జరిగింది. వివరాలు.. కల్లూరు శివప్ప నగర్లోని శాంతినికేతన్ స్కూల్ వెనుక నివాసం ఉండే కుమ్మరి శేఖర్(28) మట్టి పెంకుల పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం అర్ధరాత్రి తలనొప్పి మాత్రలు తీసుకుని కృష్ణానగర్ వైపు నుంచి బైక్పై ఇంటికి వెళ్తుండగా హంద్రీ బ్రిడ్జిపై గుర్తు తెలియని వాహనం ఢీకొంది. సమాచారం అందడంతో ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ రఫీ, మరో కానిస్టేబుల్ సందీప్తో పాటు హైవే మొబైల్ సిబ్బంది, రోడ్డు సేఫ్టీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అదే సమయంలో చెరుకులపాడు గ్రామానికి చెందిన చాకలి అజిత్ కుమార్(26), శరీన్నగర్కు చెందిన బండారు కన్నా(23) బైక్పై వెళ్తున్నారు. ప్రమాదం జరిగిందని తెలిసి పోలీసులకు సహాయ పడుతున్నారు. అదే సమయంలో బెంగళూరు వైపు నుంచి హైదరాబాద్కు వెళ్తున్న గ్రానైట్ లారీ ముందున్న ట్రావెల్స్ బస్సును ఓవర్టేక్ చేయబోయి ఘటనా స్థలంలో నిలబడి ఉన్న జనం మీదకు దూసుకెళ్లింది. దీంతో బండారు కన్నా, అజిత్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దిన్ సిబ్బందితో అక్కడికి చేరుకుని గాయపడిన వారిని ప్రత్యేక అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బండారు కన్నా, చాకలి అజిత్కుమార్ మృతిచెందారు. చాకలి అజిత్ కుమార్ రివైండింగ్ దుకాణంలో పనిచేస్తుండగా, బండారు కన్నా గౌండా పని చేస్తుస్తున్నాడు. మొదటి ప్రమాదంలో మృతిచెందిన కుమ్మరి శేఖర్కు భార్యతోపాటు ఇద్దరు పిల్లలు. మృతుడి తండ్రి మద్దిలేటి ఇచి్చన ఫిర్యాదు మేరకు ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి అరగంట వ్యవధిలో జరిగిన రెండు ప్రమాద ఘటనలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో మొత్తం 7 ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. ట్రాఫిక్ విధుల్లో ఉన్న హెడ్కానిస్టేబుల్ రఫీతోపాటు మరో ఇద్దరు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి కారణమైన లారీని స్వా«దీనం చేసుకున్నారు. లారీ డ్రైవర్ మద్యం తాగి మితిమీరిన వేగంతో డ్రైవ్ చేయడమే ప్రమాదానికి కారణమని దర్యాప్తులో తేలినట్టు సీఐ మన్సూరుద్దీన్ తెలిపారు.


