Kurnool
-
అసలు చెల్లిస్తే వడ్డీ మాఫీ అవుతుంది
ఈ పథకాలకు సంబంధించి ఈ నెల 30వ తేదీ నాటికి అసలు చెల్లిస్తే గత ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు అయిన వడ్డీని పూర్తిగా మాఫీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేఫథ్యంలోనే ఇప్పటి వరకు ఆయా పథకాల ద్వారా లబ్ధిదారులు రూ.60 లక్షల వరకు చెల్లించారు. రుణాలు తిరిగి చెల్లించే విషయంలో లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు కరపత్రాలను పంపిణీ చేస్తున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నెలవారీ లక్ష్యాలను పూర్తి చేసేందుకు తమ వంతు కృషి చేస్తున్నాం. – కే తులసీదేవి, ఈడీ, ఎస్సీ కార్పొరేషన్ ఎన్ఎస్ఎఫ్డీసీ, ఎన్ఎస్కేఎఫ్డీసీ పథకాల కింద లబ్దిపొందిన వారికి రికవరీ పేరుతో చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆయా పథకాల కింద ఏర్పాటు చేసుకున్న చిరు వ్యాపారాలు జరగక, తీసుకున్న వాహనాలకు అద్దెలు లభించక అనేక మంది లబ్ధిదారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. వాయిదాలు సరైన సమయానికి చెల్లించలేక పోతున్నారు. ఈ రుణాలను ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసి ఎస్సీ లబ్ధిదారులకు ఉపశమనం కల్పించాలి. – కాసారపు వెంకటేష్, మాల సంఘాల జేఏసీ కన్వీనర్ ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాలని ఇంత తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేయడం తగదు. గతంలో ఎప్పుడు ఇలా వసూలు చేసింది లేదు. ఆయా పథకాల ద్వారా పెట్టుకున్న వ్యాపారాలు జరగక ఎస్సీ లబ్ధిదారులు అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అప్పులు కట్టాలని ఒత్తిడి చేయడం వల్ల అనేక మంది అనారోగ్యం పాలవుతున్నారు. మానవతా ధృక్పథంతో ప్రభుత్వం ఈ రుణాల రికవరీపై పునరాలోచించాల్సి ఉంది. – చిటికెల సామెల్, మాజీ డీవీఎంసీ సభ్యులు ● -
అడవి రక్షణకు ఫైర్లైన్స్
అటవీ రేంజ్ల వారీగా వివరాలు.. కర్నూలు ఆదోని సెక్షన్లు :2 బీట్లు: 6 సెక్షన్లు: 3 బీట్లు: 11 అటవీ విస్తీర్ణం : 15,276.21 హెక్టార్లు అటవీ విస్తీర్ణం: 19,851.95 హెక్టార్లు మండలాలు : వెల్దుర్తి, సి.బెళగల్, కర్నూలు మండలాలు: కోసిగి, కౌతాళం, మంత్రాలయం, కోడుమూరు, కల్లూరు, ఓర్వకల్లు గూడూరు, నందవరం, పెద్దకడుబూరు, కృష్ణగిరి. ఎమ్మిగనూరు, గోనెగండ్ల, ఆదోని, హోళగుంద, ఆస్పరి, ఆలూరు, దేవనకొండ, పత్తికొండ, హాలహర్వి, తుగ్గలి, మద్దికెర ఈస్ట్, చిప్పగిరి.కర్నూలు కల్చరల్: వేసవి కాలం వచ్చిందంటే చాలు అగ్ని ప్రమాదాల భయం వెంటాడుతోంది. తెలిసో తెలియకో చేస్తున్న మానవ తప్పిదాలు అడువులను కాల్చి వేస్తున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో అడవుల సంరక్షణకు అటవీ శాఖ అధికారులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. జంతు జాతులను కాపాడుకునేందుకు కార్యాచరణను అమలు చేస్తున్నారు. అరుదైన వృక్షాల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టారు. పక్షులు, ఇతర జీవుల దాహార్తి తీర్చేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అగ్ని ప్రమాదాలు సంభవించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిప్పు రాజుకున్నా.. మంటలు వ్యాప్తి చెందకుండా అర్పివేసేందుకు ప్రత్యేక సిబ్బందికి బాధ్యతలు అప్పగించారు. వారు అప్రమత్తంగా ఉంటూ పరిిస్థితులను పరిశీలించేలా ఆదేశాలు జారీ చేశారు. కట్టుదిట్టంగా నిఘా వేసివి కాలంలో నేపథ్యంలో అటవీ శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. అడువులను అగ్నికీలల నుంచి కాపాడేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. కన్జర్వేటర్ ఆఫ్ పారెస్ట్ బీవీఏ కృష్ణమూర్తి పర్యవేక్షణలో ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా కట్టుదిట్టంగా నిఘా పెడుతోంది. ఇందు కోసం ప్రత్యేకంగా పలువురు అధికారులకు విధులు కేటాయించింది. అటవీ సంరక్షణ, అక్రమ రవాణా కట్టడికి గ్రామాల్లో కళాజాతా బృందాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నారు. అడవులకు నిప్పు పెట్టడం వల్ల జరిగే నష్టాలపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రత్యేక బృందాలు అగ్ని ప్రమాదాలు సంభవిస్తే మంటలను అదుపు చేసేందుకు అటవీ శాఖ అధికారులు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 10 మందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వీరు పెట్రోలింగ్ చేయడంతో పాటు అడవిలో పరిస్థితులను గమనిస్తుంటారు. వారికి కావాల్సిన నీళ్ల బాటిళ్లు, బూట్లు, డ్రెస్, సేఫ్టీ కిట్స్ను అందించారు. కర్నూలు సిటీ ఫారెస్ట్, సోమయాజుల పల్లె ఫారెస్ట్ ప్రాంతాల్లో వీరు పెట్రోలింగ్ చేస్తుంటారు. అటవీ ప్రాంతంలో రాజుకునే మంటలను ఎస్ఎన్పీపీ శాటిలైట్ సహకారంతో డీఎఫ్ఓలు ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆ మేరకు సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. ఫైర్లైన్స్లో ఎండుటాకుల తొలగింపు అడవుల్లో మంటలను అందుపు చేయడానికి వీలుగా అటవీశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. మంటలు వ్యాపించకుండా అర్పేందుకు వీలుగా ఫైర్లైన్స్ ఏర్పాటు చేస్తున్నారు. కర్నూలు డివిజన్లో కర్నూలు నగరవనం, సోమయాజుల పల్లె ప్రాంతాల్లో 12 కి.మీ., ఆదోని డివిజన్లో 18 కి.మీ. మేర ఫైర్లైన్స్ ఏర్పాటు చేశారు. 8 నుంచి 10 మీటర్లు వెడల్పుతో ఒకే వరుసలో చెట్లను, ఎండుటాకులను తొలగిస్తున్నారు. దీంతో మంటలు ఎక్కడికక్కడ ఆగిపోయే అవకాశం ఉంటుందని అధికారులు వివరిస్తున్నారు. సాసర్ పిట్ల ఏర్పాటు ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో ప్రస్తుతం నీటి ఎద్దడి లేదు. అయినప్పటికీ వేసవి కారణంగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అటవీ ప్రాంతాల్లో కర్నూలు డివిజన్లో 17, ఆదోని డివిజన్లో 21 సాసర్ పిట్లను గుర్తించారు. ఇంకా అవసరమైన చోట్ల పిట్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. జంతువుల దాహార్తిని తీర్చేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు సిబ్బందిని నియమించి ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. వారికి ఫైర్ బ్లోయర్స్ అందించాం. ఎక్కడైనా ప్రమాదం జరిగితే వారు వెంటనే స్పందించి మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటారు. అడవికి ఎవరూ నిప్పు పెట్ట కూడదు. దీనిపై ప్రజల్లో చైతన్యం రావాలి. అడవులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. – పి.శ్యామల, ఐఎఫ్ఎస్, జిల్లా అటవీ శాఖ అధికారి అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు ఫైర్ వాచర్లతో నిరంతర పర్యవేక్షణ పటిష్టంగా 45 కి.మీ.ఫైర్ లైన్స్ ఏర్పాటు అగ్ని ప్రమాదాల నివారణ చర్యలకు రూ.10 లక్షల నిధులు -
ఉపాధి నిధుల దుర్వినియోగంపై నేడు వైఎస్సార్సీపీ ధర్నా
కర్నూలు(అర్బన్): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలపై ఈ నెల 27వ తేదీన (నేడు) కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం జిల్లా అధ్యక్షులు పీఎన్ అస్లాం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం అవినీతి మయంగా మార్చిందన్నారు. ఉపాధి నిధులను టీడీపీ నేతలు, కార్యకర్తలకు దోచిపెడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధిలోని అక్రమాలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు పలు డిమాండ్ల సాధన కోసం చేపట్టిన ఈ ధర్నా కార్యక్రమానికి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు. మహిళల స్వయం సమృద్ధికి కృషి కర్నూలు(టౌన్): మహిళల స్వయం సమృద్ధి, సాధికారతకు కేడీఎస్ఎస్ఎస్ కృషి చేస్తోందని కర్నూలు డయాసిస్ బిషప్ గోరంట్ల జ్వాన్నేష్ అన్నారు. ఆదివారం కర్నూలు శివారులోని కర్నూలు డయాసిస్ సాంఘిక సేవాసంస్థ (కేడీఎస్ఎస్ఎస్) ఆధ్వర్యంలో 70 మంది మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేడీఎస్ఎస్ఎస్ డైరెక్టర్ ఫాదర్ తోట జోసఫ్ మాట్లాడుతూ.. 40 ఏళ్లుగా మహిళాభ్యుదయం కోసం భాగస్వాములవుతున్నామన్నారు. త్వరలోనే నూతన రంగాల్లో సాంకేతిక శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కెడీఎస్ఎస్ఎస్ సిబ్బంది పాల్గొన్నారు. క్వింటా వేరుశనగ రూ.6,970 ఎమ్మిగనూరుటౌన్: స్థానిక వ్యవసాయ మార్కెట్కు ఆదివారం వేరుశనగ దిగుబడులు 474 క్వింటాళ్లు విక్రయానికి వచ్చాయి. క్వింటా వేరుశనగకు గరిష్టంగా రూ.6,970 ధర పలికిందని మా ర్కెట్ యార్డ్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జి. చంద్ర మౌళి తెలిపారు. క్వింటా కనిష్ట ధర రూ.4,170, మధ్యస్థ ధర రూ.6,147 వచ్చిందన్నారు. మొక్కజొన్న 17 క్వింటాళ్లు విక్రయానికి రాగా క్వింటాకు రూ.1,120 ధర లభించిందన్నారు. -
ఉదయం 9.30 గంటలకే పీజీఆర్ఎస్
కర్నూలు(హాస్పిటల్): కలెక్టరేట్లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక ఉదయం 9.30 గంటలకే ప్రారంభమవుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఉదయం 9.30 గంటలకు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ కర్నూలు: నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీస్ అధికారులు జిల్లా అంతటా రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లాలో నాలుగు పోలీస్ సబ్ డివిజన్లు, 39 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్లను ఆదివారం స్టేషన్కు రప్పించి వారి నేర చరిత్ర వివరాలను ఆరా తీసి కౌన్సెలింగ్ ఇచ్చారు. చెడు నడత కలిగిన వ్యక్తులను తీవ్రంగా హెచ్చరించారు. సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. పోలీస్ సూచనలను పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేణుమాధవా..! ● వైభవంగా నారసింహుడి జయంతి బ్రహ్మోత్సవాలు ఆళ్లగడ్డ: అహోబిలేశుడి జయంతి బ్రహ్మోత్సవాలు పరవశంగా కొనసాగుతున్నాయి. భక్తుల గోవిందా నామస్మరణలతో ఎగువ అహోబిల క్షేత్రం మారుమోగుతోంది. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ జ్వాలా నరసింహస్వామి వేణుగోపాల స్వామి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజామున నిత్య పూజల్లో భాగంగా సుప్రతభాత సేవతో స్వామిని మేలుకొలిపిన అనంతరం అర్చనలు, అభిషేకాలు నిర్వహించి జ్వాలా నరసింహుడిని వేణుగాపాలస్వామి అలంకారంలోను శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను రుక్మిణి, సత్యభామలుగా అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం ఉభయ దేవేరులతో ఉత్సవ పల్లకీని అధిరోహించిన నరసింహస్వామి మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. రాత్రి స్వామి వారు పొన్నచెట్టు వాహనం అధిష్టించి భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీగిరికి పోటెత్తిన భక్తులు శ్రీశైలం టెంపుల్: శ్రీశైలంలో వెలసిన శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు శ్రీగిరి చేరుకున్నారు. వేకువ జామున పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి క్యూ లైన్లలో బారులు దీరారు. క్యూ లైన్లలో వేచివున్న భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. -
భక్తి.. సామరస్య దీప్తి
● రేపటి నుంచి ఖాదర్లింగస్వామి ఉరుసుకౌతాళం: ఖాదర్లింగ స్వామి.. హిందు, ముస్లింల ఆరాధ్య దైవం. ప్రతి సంవత్సరం కౌతాళంలో ఉరుసును వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలు మంగళవారం ప్రారంభమై మే 2వ తేదీ వరకు భక్తిశ్రద్ధలతో కొనసాగనున్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ పట్టణానికి చెందిన ఖాదర్లింగ స్వామి అమీనూద్దీన్ అలిఆలా షేర్ ఏ ఖుదా గురువు ఆజ్ఞానుసారం మానవుల్లో మత మౌఢ్యాన్ని తొలగించేందుకు కౌతాళానికి వచ్చారు. ఈయన లింగాన్ని ధరించడాన్ని గ్రామంలో ఉన్న కొందరు అభ్యంతరం చెప్పగా వారిలో ఇళ్ల నుంచి బావిలోకి వెళ్లిన లింగాలను తిరిగి రప్పించారు. అప్పటి నుంచి గ్రామస్తులంతా మత సామరస్యంతో ఆయనను ఖాదర్లింగ స్వామిగా పూజిసున్తన్నారు. ఆయన గ్రామస్తులు ఇచ్చిన స్థలంలోనే సమాధి అయ్యారు. అక్కడే ఖాదర్లింగస్వామి దర్గా నిర్మించారు. భక్తుల సహకారంతో దర్గా ఆవరణలో 2023లో మసీద్ నిర్మాణం పూర్తి చేశారు. దర్గా గోపురం 60 అడుగులతో ఎంతో సుందరంగా ఉంది. దీని లోపలి భాగంలో నూతనంగా గ్లాస్ ఫిట్టింగ్తో వివిధ రంగులతో ప్రత్యేక హాదిసు ఆయాత్లు (ఉర్దూలో) గ్లాసుల్లో అమర్చారు. ఉత్సవాల్లో పాల్గొనే భక్తులకు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశాం. స్వామిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఢిల్లీ, జమ్ముకశ్మీర్ వంటి రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు సహకారించాలి. – సయ్యద్ మున్నపాషా వుసేని చిష్తీ, దర్గా ధర్మకర్త -
నాపరాతి పరిశ్రమపై డీజిల్ ఎఫెక్ట్
● డీజిల్ లేక నిలిచిపోయిన ట్రాక్టర్లు ● కార్మికుల ఉపాధిపై ప్రభావంకొలిమిగుండ్ల: డీజిల్ సరఫరాలో జాప్యంతో నాపరాతి పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడుతుంది. నియోకవర్గంలో కొలిమిగుండ్ల, అవుకు, బనగానపల్లె మండలాల్లో వ్యవసాయం తర్వాత నాపరాతి గనులపై ఆధారపడిన కార్మికులు వేలాది మంది ఉన్నారు. నాపరాతి గనుల్లో వెలికితీసిన రాళ్లను ఎక్కువ భాగం ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తుంటారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా డీజిల్ సమస్య వేధిస్తుండటంతో యజమానులు ట్రాక్టర్లను ఇళ్ల వద్దనే ఖాళీగా పెట్టుకోవాల్సి వస్తుంది. కొలిమిగుండ్ల మండలంలోనే 600కు పైగానే ట్రాక్టర్లు ఉన్నాయి. డీజిల్ లభించక పోవడంతో పదుల సంఖ్యలో ట్రాక్టర్లు రోడ్డెక్కడం లేదు. బంక్లకు డీజిల్ ఎప్పుడు వస్తోందో తెలియని పరిస్థితి నెలకొంది. వచ్చినా క్షణాల్లో వాహనాలు బారులు దీరుతున్నాయి. నాపరాతి గనుల్లో పనులు చేసేందుకు డీజిల్తో నడిచే కోత మిషన్లను ఉపయోగిస్తున్నారు. డీజిల్ లేక గనులు బంద్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని యజమానులు వాపోతున్నారు. గనుల్లో పని చేసే కార్మికులతో పాటు ట్రాక్టర్ డ్రైవర్లు, లోడింగ్, అన్లోడింగ్ కార్మికుల ఉపాధి లేక ఖాళీగా ఉండాల్సి వస్తుంది. ప్రధాన రహదారిపై పదుల సంఖ్యలో ట్రాక్టర్లు రవాణ సాగిస్తుండేవి. డీజిల్ కొరత వల్ల ఎక్కడక్కడ నిలిచిపోయాయి. మరి కొన్ని రోజులు ఇదే పరిస్థితి నెలకొంటే కార్మికుల పరిస్థితి దయనీయంగా మారుతుంది. సొంత కార్లు ఉన్న యజమానులకు డీజిల్ లేక ప్రత్యామ్నాయ మార్గాల్లో రాక పోకలు సాగిస్తున్నారు. డీజిల్ సమస్యను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ప్రజలు ఆరోపిస్తున్నారు. -
ఇంధనం.. ఇంకెంత దూరం!
ఉమ్మడి జిల్లాలో పెట్రోలు, డీజిల్ కొరత రోజురోజుకు తీవ్రమవుతోంది. ప్రజలు తమ వాహనాలను బయటకు తీయాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. బంకులు మూతపడుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. డీజిల్ సరఫరాలో జాప్యంతో రవాణా రంగం స్తంభించిపోతోంది. ఆదివారం కూడా వాహనదారులు పెట్రోల్, డీజిల్ కోసం గంటల తరబడి పడిగాపులు కాశారు. ఆటో వాలాలతో పాటు ఇతర రంగాలకు చెందిన వారి ఉపాధిపై దెబ్బపడుతోంది. మరో వైపు వ్యవసాయ పనులు స్తంభించిపోతున్నాయి. పంట నూర్పిళ్ల యంత్రాలు, ట్రాక్టర్లకు డీజిల్ అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. – సాక్షి, నెట్వర్క్గత నాలుగైదు రోజుల ఉంచి కోడుమూరుతో పాటు చుట్టూ పక్కల ఎక్కడా కూడా పెట్రోల్ లభించడం లేదు. స్టాక్ వచ్చిన గంటల వ్యవధిలోనే ఖాళీ అవుతోంది. పెట్రోల్ కావాలంటే బంకుల వద్ద గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. చివరకు పెట్రోల్ దొరకక బండిని తీయడం లేదు. ప్రభుత్వం స్పందించి పెట్రోల్, డీజిల్ను అన్ని బంకుల్లో అందుబాటులో ఉంచాలి. – వీరేష్రెడ్డి, వ్యాపారి, కోడుమూరు -
గడ్డకట్టని రక్తం!
కర్నూలు(హాస్పిటల్): సాధారణంగా ఎవ్వరికై నా దెబ్బతగిలి రక్తగాయమైతే వెంటనే రక్తస్రావం జరుగుతుంది. కాసేపు అదిమి పట్టుకుంటే రక్తస్రావం ఆగిపోతుంది. కానీ హిమోఫీలియా జబ్బుతో బాధపడే వారికి గాయమైందంటే రక్తస్రావం ఆగదు. నిరంతరంగా రక్తస్రావం సాగుతూనే ఉంటుంది. ఇలాంటి బాధితుల సంఖ్య జిల్లాలో పెరుగుతోంది. రక్తస్రావం అధికం కావడంతో బాధితుల వ్యథ అంతా ఇంతా కాదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో హిమోఫీలియాతో బాధపడే వారి సంఖ్య 135 వరకు ఉంటుంది. ఒక్క కర్నూలు జిల్లాలోనే 90 మందికి పైగా బాధితులు ఉన్నారు. ఈ వ్యాధి బాధితుల బాధలు విన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019 ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చాక నెలకు రూ.10వేల ప్రత్యేక పింఛన్ ఇచ్చి ఆసరా కల్పించారు. అప్పటి నుంచి ఈ బాధితులు ప్రతి నెలా ఠంఛనుగా పింఛన్ తీసుకోవడం వల్ల వారి ఆర్థిక ఇబ్బందులు కొంతమేరకు తీరుతున్నాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన ఈ ప్రత్యేక పింఛన్ను ప్రస్తుత ప్రభుత్వం సైతం తీసివేయలేని పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వంలో కూడా ప్రతి నెలా పింఛన్ను బాధితులు అందుకుంటున్నారు. హిమోఫీలియా అంటే... హిమోఫిలియా అనేది అరుదైన జబ్బు. ఇది జన్యుపరంగా కుటుంబ సభ్యులకు వ్యాపిస్తుంది. ఈ వ్యాధిలో రక్తం గడ్డకట్టే ప్రొటీన్లు (గడ్డకట్టే కారకాలు) తగినంత ఉండవు. ఈ కారణంతో వారికి ఏదైనా గాయమైతే రక్తస్రావం ఆగకుండా జరుగుతుంది. చిన్నగాయమైనా సరే రక్తస్రావం ఆగదు. అయితే కొందరిలో ఎలాంటి గాయాలు లేకున్నా అంతర్గతంగా కూడా రక్తస్రావం అవుతుంది. దీనిని బ్లీడర్స్ డిసీస్ అని కూడా పేర్కొంటారు. అధికంగా మగపిల్లలే బాధితులు జన్యుపర వ్యాధి అయిన హిమెఫిలియా సాధారణంగా వారసత్వంగా వస్తుంది. ముఖ్యంగా ఇది ఎక్కువగా ప్రధానంగా మగపిల్లల్లో కనిపిస్తుంది. ఈ వ్యాధిలో జన్యువు ఎక్స్ క్రోమోజోముపై ఉంటుంది. ఇది తల్లివాహకంగా పనిచేస్తుంది. వ్యాధికి కారణాలు సాధారణంగా ప్రతి మనిషి శరీరంలోని రక్తప్రసరణ వ్యవస్థలో రక్తం గడ్డకట్టేందుకు కోయాగ్యులేషన్ ఫ్యాక్టర్స్ అనే రసాయనాలు ఉంటాయి. హిమోఫిలియా బాధితుల్లో మాత్రం ఇలాంటివి ఉండవు. ఇవే ఫ్యాక్టర్ 8, ఫ్యాక్టర్ 9. రక్తస్రావ సమయంలో ఈ ఫ్యాక్టర్స్లో ఏది కోల్పోతే దానిని తిరిగి రోగికి ఎక్కించాల్సి ఉంటుంది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని చిన్నపిల్లల విభాగంలో హిమోఫీలియా బాఽధితులకు అవసరమైన చికిత్సను ఉచితంగా అందిస్తున్నాము. వారికి అవసరమైన పరీక్షలతో పాటు చికిత్స, మందులను ఉచితంగా ఇస్తున్నాము. జిల్లా సత్వర చికిత్స కేంద్రం(డైస్)లో ప్రత్యేకంగా ఐసీహెచ్హెచ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇక్కడ జనరల్ ఫిజీషియన్తో పాటు చిన్నపిల్లల వైద్యులూ ఉన్నారు. బాధిత చిన్నారులకు అవసరమైన పరీక్షలు, కౌన్సిలింగ్ వారు అందిస్తారు. –డాక్టర్ విజయానందబాబు, హెచ్ఓడీ, చిన్నపిల్లల విభాగం, జీజీహెచ్, కర్నూలు వేధిస్తోన్న అరుదైన హిమోఫీలియా జబ్బు ఉమ్మడి జిల్లాలో 135 మంది బాధితులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక చికిత్స కేంద్రంపెద్దాసుపత్రిలో ప్రత్యేక కేంద్రం ఇంటిగ్రేటెడ్ సెంటర్ ఫర్ హిమోగ్లోబినోపతీస్, హిమోఫిలియా(ఐసీహెచ్హెచ్) టెస్టింగ్ అండ్ ట్రీట్మెంట్ సెంటర్లను 2020లో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విశాఖపట్టణం, ఈస్ట్గోదావరి, గుంటూరుతో పాటు కర్నూలులోనూ ఏర్పాటు చేసింది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని మాతాశిశు కేంద్రం పక్కనున్న జిల్లా సత్వర చికిత్స కేంద్రం (డైస్)లో ఇది కొనసాగుతోంది. ఇక్కడ తలసీమియాతో పాటు సికిల్సెల్, హిమోఫిలియా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. -
ప్రహ్లాదరాయులకు బంగారు పల్లకీ సేవ
మంత్రాలయం: శ్రీ రాఘవేంద్రస్వామి సన్నిధిలో ఆదివారం భక్తుల మధ్య ప్రహ్లాదరాయులకు బంగారు పల్లకీ సేవ నిర్వహించారు. పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఇవ్వడంతో మంత్రాలయానికి భక్తులు పోటెత్తారు. కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తుంగభద్ర నదిలో పుణ్యసాన్నాలు ఆచరించి ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకున్నారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి ప్రత్యేక ఆలంకరణలో మూల బృందవనాని దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. శ్రీ మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు గ్రామదేవత మంచాలమ్మకు, మూల బృందవనానికి మహామంగళహారతులు గావించారు. పరిమళ ప్రసాదం కౌంటర్లలో, అన్నపూర్ణ భోజశాల దగ్గర భక్తులు రద్దీ కొనసాగింది. -
ఎస్సీ, ఎస్టీ కేసుపై విచారణ
కొత్తపల్లి: ఎర్రమఠం గ్రామానికి చెందిన ఎలకంటి చిన్న ఓబులేసు ఫిర్యాదు మేరకు నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై డీఎస్పీ రామాంజీనాయక్ విచారణ చేపట్టారు. ఈనెల 23 వ తేదిన పొలం విషయంలో చిన్న ఓబులేసుపై పాతమాడుగుల గ్రామానికి చెందిన పెద్దవెంకట స్వామి, చిన్న వెంకట స్వామి, రాజులు కర్రలతో దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పై ముగురిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు కావడంతో ఆదివారం ఆత్మకూరు రూరల్ సీఐ సరేష్కుమార్ రెడ్డి, ఎస్ఐ జయశేఖర్తో కలిసి ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్ పాతమాడుగుల గ్రామంలో విచారణ చేపట్టారు. స్వయంగా ఆయన సమస్యాత్మక పొలాన్ని పరిశీలిచారు. చుట్టపక్కల రైతులను, గ్రామస్తులను విచారించారు. కోడి పందేల నిర్వాహకుల అరెస్టు ప్యాపిలి: పోతుదొడ్డి గ్రామంలో కోడి పందేల నిర్వాహకులను ప్యాపిలి ఎస్ఐ నాగార్జున ఆదివారం అరెస్టు చేశారు. గ్రామానికి చెందిన పెనుగొండ రవికుమార్, మునుగుల రామాంజనేయులు, నాగప్ప, రామకృష్ణ తదితరులు గ్రామ శివారు ప్రాంతంలో కోడి పందేలు నిర్వహిస్తుండటంతో అరెస్టు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. నిందితుల నుంచి 8 బైక్లు, 4 కోడి కత్తులు, 3 పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న మరో ఐదుగురి కోసం గాలిస్తున్నామని తెలిపారు. గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి అవుకు(కొలిమిగుండ్ల): పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు ముఖేష్ (36) ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. గతంలో అవుకు మోడల్ స్కూల్లో ఏడేళ్ల పాటు ఇంగ్లిష్ పీజీటీగా పనిచేసిన ఆయన, రెండేళ్ల క్రితం బదిలీపై వెలుగోడు మోడల్ స్కూల్కు వెళ్లారు. ప్రస్తుతం ఆయన కుటుంబంతో కలిసి నంద్యాలలో నివసిస్తున్నారు. ముఖేష్ భార్య స్వర్ణరేఖ ఉప్పులపాడు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ముఖేష్ తండ్రి వెంకట కృష్ణయ్య కూడా ఏడాదిన్నర క్రితం ఆకుమల్లలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ గుండెపోటుతోనే మరణించారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి పెద్దకడబూరు: నౌలేకల్లు గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఎస్ఐ ఈ మారుతి తెలిపిన వివరాల మేరకు.. పెద్దకడబూరు మండల కేంద్రానికి చెందిన బోయ ఆంజనేయ కుమారుడు నందవరం తిక్కన్న (42) ఆదివారం తమ బంధువుల పెళ్లి సంబంధం చూసేందుకు కోసిగి వెళ్లారు. కార్యక్రమం అనంతరం బైక్పై తిరిగి వస్తుండగా నౌలేకల్లు గ్రామ సమీపంలో బొలెరో వాహనం ఢీకొంది. ఎమ్మిగనూరు సంతలో ఎద్దులను కొనుగోలు చేసిన కౌతాళం మండలం కుప్పగళ్లు గ్రామానికి చెందిన రైతులు బొలెరో తీసుకొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తిక్కన్న తీవ్రంగా గాయ పడంతో పెద్దతుంబళం ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. మృతునికి ముగ్గురు ఆడ పిల్లలు, భార్య ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
ప్రమాదకరంగా ఈత
● సుంకేసుల క్రస్టు గేట్ల దగ్గర చిన్నారుల ఈత ● పట్టించుకోని అధికారులు కర్నూలు సిటీ: సుంకేసుల బ్యారేజీ దగ్గర ప్రమాదకరమైన ప్రదేశంలో చిన్నారులు ఈత కొడుతున్నారు. ఇటీవలే విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వడం, ఆదివారం రోజున బ్యారేజీ దగ్గర సరగాగా గడిపేందుకు స్నేహితులు, కుటుంబ సభ్యులతో వెళ్తుంటారు. ఇలాంటి అనేక సందర్భాల్లో ఈత సక్రమంగా రాక..ఈత వచ్చిన పెద్ద పెద్ద గుంతల్లో చిక్కుకోని నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. బ్యారేజీ క్రస్టు గేట్ల నుంచి విడుదల చేసే నీటితో దిగువన గుంతలు ఏర్పడి లోతు ఎక్కువగా ఉండి నీరు నిల్వ ఉంటుంది. గేట్లకు సమీపంలో ఏ ఒక్కరు కూడా ఈతకు కానీ, సరదాగా కూడా వెళ్లకూడదు. అయితే ఆదివారం 25, 26 గేట్లకు దిగువన చిన్న పిల్లలతో కలిసి ప్రమాదకరమైన ప్రదేశంలో ఈత చేస్తున్నారు. ఇలాంటి ప్రదేశంలోకి ఇతరులు ఎవరూ వెళ్ళకుండా చూడాల్సిన బ్యారేజీ సిబ్బంది పట్టించుకోకపోవడంతోనే క్రస్టు గేట్ల వరకు వెళ్ళుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికై నా బ్యారేజీ అధికారులు స్పందించి ప్రమాదాలు జరుగకుండా చూడాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. -
శస్త్రచికిత్సల్లో అనెస్తీషియా కీలకం
కర్నూలు(హాస్పిటల్): శస్త్రచికిత్సల సమయంలో అనెస్తీషియా వైద్యులు అందించే సేవలు కీలకమని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు చెప్పారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల అనెస్తీషియా విభాగం ఆధ్వర్యంలో ఆదివారం ఆసుపత్రిలోని మోర్టాన్ సెమినార్ హాలులో ‘మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్’ అనే అంశంపై జోనల్ సీఎంఈ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ వెంకటేశ్వర్లు కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సలన్నీ అనెస్తీషియా విభాగంపై ఆధారపడి ఉంటాయన్నారు. నొప్పుల నివారణకు అనెస్తీషియా వైద్యులు ప్రత్యేకంగా క్లినిక్లు ఏర్పాటు చేసిన ఆధునిక వైద్యసేవలు అందిస్తున్నారని కొనియాడారు. ఏపీ మెడికల్ కౌన్సిల్ అబ్జర్వర్, పీడియాట్రిక్ సర్జరీ హెచ్ఓడీ డాక్టర్ శివకుమార్ మాట్లాడారు. అనంతరం తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణ గురించిన పలు అంశాలపై నిపుణులైన వైద్యులు సైన్స్ సెషన్స్ ద్వారా వివరించారు. జోనల్ సీఎంఈ కో–ఆర్డినేటర్, పాథాలజీ హెచ్ఓడీ డాక్టర్ బాలీశ్వరి, అనెస్తీషియా విభాగాధిపతి డాక్టర్ సుధీర్కుమార్, డాక్టర్ విశాల, డాక్టర్ రామశివనాయక్, నంద్యాల ప్రభుత్వ సర్వజన వైద్యశాల అనెస్తీషియా హెచ్ఓడీ డాక్టర్ క్రిష్టఫర్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి బీచ్ కబడ్డీ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక
కోసిగి: రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ పోటీలకు జిల్లా జట్టు ఎంపికై నట్లు బీచ్ కబడ్డీ జిల్లా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మురళి, కార్యదర్శి వలకలదిన్నె వెంకటేష్ తెలిపారు. ఆదోని నేషనల్ స్కూల్లో ఆదివారం జరిగిన ఎంపిక పోటీలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 60 మంది క్రీడకారులు హాజరైయారన్నారు. ఇందుల్లో ప్రతిభ కనబరిచిన రాష్ట్రస్థాయికి 6 మంది పురుషులను, ఆరుగురు మహిళా క్రీడాకారులను ఎంపిక చేశామన్నారు. ఎంపికై న వారు మే 7 నుంచి 10 తేదీ వరకు నెల్లూరు జిల్లాలో జరిగే 13వ రాష్ట్రస్థాయిలో బీచ్ కబడ్డీ పోటీల్లో పాల్గొంటారన్నారు. దేశ అభివృద్ధిలో జనగణన కీలక పాత్ర కర్నూలు (టౌన్): దేశ అభివృద్దిలో జనగణన కీలక పాత్ర పొషిస్తుందని జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అన్నారు. ఆదివారం స్థానిక పాతబస్టాండ్ కొండారెడ్డి బురుజు నుంచి కలెక్టరేట్ వరకు 5 కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేష్ కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. స్వీయ జనగణనలో ప్రజలు తమ వివరాలను ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసుకోవాలన్నారు. జనగణన సిబ్బంది ఫోన్ నంబర్ తప్ప ఇతర వివరాలు, ఓటీపీలు అడగబోరని, వేలిముద్రలు, ఐరిస్ సేకరించరని తెలిపారు. ప్రజలు సందేహాల నివృత్తి కోసం 1855 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించాలని తెలిపారు. ఈనెల 30వ తేదీ వరకు స్వీయ జనగణనకు అవకాశం ఉందన్నారు. నగరపాలక కమిషనర్ చల్లా ఓబులేష్ మాట్లాడుతూ.. మే 1 నుంచి ఇంటింటా జనగణన సర్వే ప్రారంభమవుతుందన్నారు. ప్రజలు స్వయంగా వివరాలు నమోదు చేస్తే సమయం ఆదా అవుతుందన్నారు. ఎన్యూమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు ఎస్ఈఐడీ నంబర్ చూపించాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్ఓ చిరంజీవి, డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, సెన్సస్ ఇంచార్జీ ఎస్. ఇజ్రాయేలు, ఎస్ఈ రమణ మూర్తి, ప్రజారోగ్య అధికారి డాక్టర్ రఘ. డిఎస్ డీవో భూపతిరావు పాల్గొన్నారు. అనంతరం 5 కే రన్లో విజేతలకు రూ. 5 వేలు,. రూ. 3 వేలు, రూ. 2 వేలు నగదు బహుమతులు అందజేశారు. ఆకుమల్లలో అ‘పూర్వ’ సమ్మేళనం సంజామల: వారంతా చిన్నపిల్లలైపోయారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. చిన్ననాటి అనుభవాలను నెమరువేసుకున్నారు. ఫొటోలు, సెల్ఫీలతో సందడిగా గడిపారు. ఆకుమల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2002–2003 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. వివిధ హోదాల్లో పలు ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా పాఠశాల వేదికగా కలుసుకున్నారు. ప్రధాన ఉపాధ్యాయులు పుల్లారెడ్డి, ఉపాధ్యాయులు ప్రసాద్బాబురావ్, రామసుబ్బారెడ్డి, శ్రీనివాసయాదవ్, ప్రశాంత్ రెడ్డి, వెంకటస్వామి, దామోదర్, లక్ష్మిదేవి, శ్రీనివాసరెడ్డిని సన్మానించి, వారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని పూర్వ విద్యార్థులు జి. నాగరాజు, వై. నాగరాజు, రాజ్యలక్ష్మి, విజయలక్ష్మి, మధుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. చార్టెడ్ అకౌంటెంట్ మల్లికార్జున రెడ్డి, ఆకుమల్ల ఉపసర్పంచ్ హజీపీరన్, వీఆర్ఓ రాజ్యలక్ష్మి, కానిస్టేబుల్ గఫార్ బాషా, నాగరాజు, సుబ్బు, రాజేష్, పద్మావతి పాల్గొన్నారు. -
ఖాళీ బిందెలతో పంచాయతీ కార్యాలయం ముట్టడి
● 15 రోజులుగా నీరందడం లేదని ఆగ్రహం ● పంచాయతీ కార్యాలయానికి తాళం వేస్తామని మహిళల హెచ్చరిక హొళగుంద: ™èlÐ]l$ M>ÌS-±ÌSMýS$ ÐéÆ>ÌS ™èlÆý‡ºyìl Ð]l$…_-±â¶æ$Ï Æ>Ð]l-yýl…Ìôæ§ýl° çߟâýæ-VýS$…-§ýlÌZ° 5, 6Ð]l ÐéÆý‡$z-ÌSMýS$ ^ðl…¨¯]l Ð]l$íßæ-âýæË$ Rêä ¼…§ðlÌS™ø ç³…^éĶæ$¡ M>Æ>Å-ÌS-Ķæ*°² Ð]l¬rt-yìl…-^éÆý‡$. AMýSPyýl A«¨-M>-Æý‡$-ÌñæÐ]lÆý‡* ÌôæMýS-´ù-Ð]l-yýl…™ø M>Æ>Å-ÌSĶæ$… ÌZç³Ìôæ O»ñæu>-Ƈ$$…_ °Æý‡çܯ]l ™ðlÍ-´ëÆý‡$. ÑçÙĶæ$… ™ðlË$-çÜ$-MýS$¯]l² DK-ï³-B-ÈŠ-ీyýlz, {V>Ð]l$ {ç³™ólÅ-M>-«¨M>Ç ^èl{MýS-Ð]lÇ¢ AMýSP-yìlMìS Ð]l_a Ð]l$íßæ-âýæÌS™ø Ð]l*sêÏ-yýlyé-°MìS {ç³Ä¶æ$-†-²…^èlV> ÐéÆý‡$ ¡{Ð]l B{VýSçßæ… Ð]lÅMýS¢… ^ólÔ>Æý‡$. VýS™èl 15 Æøk-Ë$V> ™èlÐ]l$ M>ÌS-±-ÌSMýS$ Ð]l$…_-±â¶æ$Ï Æ>Ð]lyýl… Ìôæ§ýl-¯é²Æý‡$. {糆 Æøþ ±â¶æ$Ï Ð]lÝë¢Ä¶æ$° G§ýl$Æý‡$ ^èl*çÜ*¢ Æ>{†â¶æ$Ï °{§ýl´ù-MýS$…yé gêVýSÆý‡×æ ^ólçÜ$¢-¯é²-Ð]l$-¯é²Æý‡$. Ð]l$…_-±Æý‡$ CÐ]lÓÆ> A…r* DK-ï³B-Èz™ø ÐéV>Ó§ýl… ^ólÔ>Æý‡$. ±â¶æ$Ï C糚yýl$ Ð]lÝë¢Æ‡$$, A糚yýl$ Ð]lÝë¢Ä¶æ$° VýS…rÌS ™èlÆý‡-ºyìl G§ýl$Æý‡$ ^èl*yýl-yýl…, Ððl*sêÆý‡$Ï ÐólíÜ º…§Šæ ^ólçÜ$¢-¯é²Ð]l$° BÐól-§ýl¯]l Ð]lÅMýS¢… ^ólÔ>Æý‡$. Mö…§ýlÆý‡$ M>ÌS-±-ÐéçÜ$Ë$ yîlï³-K™ø ¸ù¯ŒSÌZ Ð]l*sêÏyìl çÜÐ]l$-çÜů]l$ ÑÐ]l-Ç…-^éÆý‡$. Ð]l$…_-±sìæ çÜÐ]l$çÜÅ E¯é² A«¨-M>-Æý‡$Ë$ çܵ…¨…^èl-yýl…-Ìôæ§ýl-°, B…§øâýæ¯]lË$ ^ólÝë¢-Ð]l$¯é²Æý‡$. ±â¶æ$Ï Ð]l§ýl-ÌS-MýS´ù™ól ç³…^éĶæ$¡ M>Æ>ÅÌS-Ķæ*-°MìS ™éâýæ… ÐólÝë¢Ð]l$° òßæ^èlaÇ…^éÆý‡$. మంచినీరు అందక ప్రజలు అల్లాడుతున్న దృశ్యాలు టీడీపీ నాయకులకు, ఆ పార్టీ ఇన్చార్జ్కు కనపడదా అని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి ప్రశ్నించారు. హొళగుంద పక్కనే ఎల్లెల్సీలో నీటి ప్రవాహం ఉందని, ఎస్ఎస్ ట్యాంకులో కూడా మంచినీరు నిల్వ ఉందని, అయినా ప్రజలకు అందించలేక పోతున్నారన్నారు. ఖాళీ బిందెలతో పంచాయతీ, ఇతర కార్యాలయాలను మట్టడించే స్థితికి ప్రజలు వచ్చారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థమవుతోందన్నారు. ప్రజల సమస్యలు చెబితే టీడీపీ నేతలు, నాయకులు పరిష్కరించాలి గాని ఎదురుదాడి చేయడం హాస్యాస్పదమన్నారు. ఇప్పటికై నా ప్రజల నీటి కష్టాలు తీర్చేందుకు కృషి చేయాలన్నారు. – ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి -
పెట్రోల్, డీజిల్ కొరత లేదు!
కర్నూలు కల్చరల్: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి తెలిపారు. శనివారం కలెక్టరేట్ మినీ కాన్ఫెరెన్స్లో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రోజువారీ సగటున 2,36,000 లీటర్లు పెట్రోల్ వినియోగం జరుగుతుండగా ప్రస్తుతం జిల్లాలో 7 లక్షల లీటర్ల పెట్రోల్ నిల్వ ఉందన్నారు. అదనంగా ట్రాన్సిట్లో 6,39,000 లీటర్ల పెట్రోల్ అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. ఈ నిల్వలతో ఆరు రోజుల వరకు సరఫరా కొనసాగించవచ్చన్నారు. డీజిల్ విషయంలో కూడా ఎటువంటి కొరత లేదన్నారు. మొత్తం కలిపి 11 లక్షల లీటర్లు డీజిల్ అందుబాటులో ఉండటంతో సుమారు 4 రోజుల సరఫరా నిరంతరం కొనసాగుతుందన్నారు. సాధారణ ధరలకే సరఫరా జరుగుతోందని స్పష్టం చేశారు. అవసరానికి మించి పెట్రోల్, డీజిల్ నిల్వ చేసుకోవద్దన్నారు. పెట్రోల్, డీజిల్ను బ్లాక్లో అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
నగరడోణ @ 44.8
కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి ఉగ్రరూపానికి బయట తిరిగేందుకు జనం బెంబేలెత్తిపోతున్నారు. తీవ్రమైన ఉష్ణోగ్రతలతో పాటు వేడి గాలులు వీస్తున్నాయి. శనివారం జిల్లాలోని చిప్పగిరి మండలం నగరడోన గ్రామంలో 44.8 డిగ్రీలు, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్జైన్ తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని, ఎండలో బయటకు వెళితే తప్పక టోపీలు ధరించాలన్నారు. చెవుల్లోకి వేడి గాలి వెళ్లకుండా జాగ్రత్త పడాలన్నారు. నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, మంచి నీరు అధికంగా తీసుకోవాలని సూచించారు. రేపు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులను సమర్పించుకోవాలని సూచించారు. కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తామన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో సమాచారం తెలుసుకోవడం కోసం కాల్ సెంటర్ నంబర్ 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. meekosam.ap.gov.in అనే వెబ్సైట్లో కూడా అర్జీలను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రశాంతంగా పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష కర్నూలు సిటీ: పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష శనివారం ప్రశాంతంగా జరిగింది. పరీక్ష నిర్వహణకు కర్నూలులో 8, ఆదోని నందు 5, మంత్రాలయం 1, పత్తికొండ 3, ఎమ్మిగనూరులో 4 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 7735 మంది విద్యార్థులకుగాను 7202 మంది హాజరుకాగా 533 మంది గైర్హాజరయ్యారు. ఎస్పీతో సివిల్ జడ్జి మర్యాదపూర్వక భేటీ కర్నూలు: ఇటీవల వెలువడిన ఆంధ్రప్రదేశ్ జుడీషియల్ సర్వీసెస్ ఫలితాల్లో జూనియర్ సివిల్ జడ్జి (జేసీజే)గా ఎంపికై న బి.తాండ్రపాడు గ్రామానికి చెందిన మహమ్మద్ అజామ్ శనివారం ఎస్పీ విక్రాంత్ పాటిల్ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మహమ్మద్ అజామ్ను ఎస్పీ అభినందిస్తూ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కృషి, పట్టుదలతో సాధించిన ఈ విజయాన్ని ప్రశంసిస్తూ న్యాయ వ్యవస్థలో ప్రజలకు న్యాయం అందించే దిశగా సేవలు అందించాలని సూచించారు. తండ్రి అల్లాబకాష్ హెడ్ కానిస్టేబుల్గా సేవలందిస్తుండగా కుమారుడు న్యాయ వ్యవస్థలో ప్రతిష్టాత్మక స్థానం పొందడం గర్వకారణమని ఎస్పీ కొనియాడారు. 28 నుంచి ఖాదర్లింగస్వామి ఉరుసు ● మే2 వరకు నిర్వహణ కౌతాళం: మతసామరస్యానికి ప్రతీకగా వెలసిన జగద్గురు ఖాదర్లింగ స్వామి ఉరుసు కౌతాళంలో ఈనెల 28నుంచి ప్రారంభమై మే 2వ తేదీ వరకు జరగనుంది. శనివారం వివిధ దర్గాల పీఠాధిపతులతో కలిసి ఉరుసు పోస్టర్లను దర్గా ధర్మకర్త సయ్యద్ మున్నపాషా చీష్తీ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. 28న మంగళవారం స్వామి సమాధిని సుగంధ, అత్తర్ పానియాలతో (గుసుల్) శుభ్రచేస్తారని,, 29న బుధవారం గంధం, 30న గురువారం ఉరుసు ఉంటుందని తెలిపారు. ఉత్సవాలకు ఇప్పటికే దర్గా పరిసరాల్లో షామియాలను ఏర్పాటు చేశారు. దర్గాను పూర్తిగా విద్యుత్ దీపాలతో అలంకరించారు. -
మోహినీ అలంకరణలో సింహరూపుడు
● వైభవంగా కొనసాగుతున్న నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలుఆళ్లగడ్డ: అమృతం అసురులపాలు కాకుండా లోక సంరక్షణ కోసం మహావిష్ణువు దాల్చిన జగన్మోహిని అవతారంలో శ్రీ లక్ష్మీనరసింహుడు భక్తులను కనువిందు చేశారు. లోక కల్యాణార్థం ఏటా నిర్వహించే వార్షిక నృసింహ జయంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఎగువ అహోబిలంలో సింహరూపుడైన లక్ష్మీ నరసింహస్వామి జగన్మోహినీ అలంకరణలో దర్శనమిచ్చారు. వేకవజామున నిత్య పూజల్లో భాగంగా సుప్రభాతసేవతో స్వామి అమ్మవార్లను మేలుకొలిపి ప్రత్యే క పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ జ్వాలా నరసింహ స్వామిని యాగశాలలో కొలువుంచి నవకళశస్థాపన గావించారు. ఆ తర్వాత ఉత్సవమూర్తి శ్రీ ప్రహ్లాదవరదుడిని నూతన పట్టుపీతాంబరాలతో మోహినీ అలంకరణ గావించారు. అనంతరం వివిధ పుష్పాలంకరణ గావించిన పూల పల్లకీని అధిరోహించి భక్తుల గోవింద నామస్మరణలు, మంగళవాయిద్యాల మధ్య తిరుమాడవీధుల్లో విహరిస్తూ శృంగార రసాధి దేవతగా సర్వాలంకార భూసితుడై భక్తులకు దర్శనమిచ్చారు. -
మాజీ సైనికులకు ఉచిత న్యాయ సహాయం
కర్నూలు: మాజీ సైనికులందరూ ఉచిత న్యాయ సహాయానికి అర్హులని, చట్టబద్ధమైన సమస్యలు ఉంటే వాటికి ఉచితంగా న్యాయాన్ని అందించి వారి సమస్యలను పరిష్కరిస్తామని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి అన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి సూచనల మేరకు శనివారం కర్నూలు బి.క్యాంప్లో ఉన్న జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్ను లీలా వెంకటశేషాద్రి సందర్శించారు. మాజీ సైనికుల సమస్యలను చర్చించారు. సైనిక సంక్షేమ కార్యాలయంలో లీగల్ సర్వీసెస్ క్లినిక్ ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడ న్యాయవాదితో పాటు పారా లీగల్ వాలంటీర్లు ఉంటారని తెలిపారు. లీగల్ సర్వీసెస్ టోల్ఫ్రీ హెల్ప్లైన్ నెంబర్ 15100కు ఫోన్ చేస్తే వారి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. జిల్లా ఇన్చార్జి సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ మహేంద్రమ్మ, పారా లీగల్ వలంటీర్ మధుసూదన్, మాజీ సైనికుల ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
మలేరియా నిర్మూలనే లక్ష్యం
కర్నూలు(హాస్పిటల్): జిల్లా వ్యాప్తంగా 2,030 నాటికి మలేరియాను పూర్తిగా నిర్మూలించడమే అంతిమ లక్ష్యంగా పనిచేస్తున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ వై.కామేశ్వర ప్రసాద్ చెప్పారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం స్థానిక డాక్టర్స్ కాలనీలోని రాయలసీమ నర్సింగ్ కాలేజీలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కామేశ్వరప్రసాద్ మాట్లాడుతూ మలేరియాను నిర్మూలించాలనే నినాదంతో పట్టణ/ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ర్యాలీలు, ప్రదర్శనలు, కరపత్రాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దోమల ద్వారా కలిగే మలేరియా... ప్లాస్మోడియం అనే సూక్ష్మజీవి వల్ల వస్తుందని, జ్వరంతో పాటు చలి, వణుకు, తలనొప్పి, వాంతులు, నీరసం లాంటి లక్షణాలు కనిపిస్తే ప్రజలు సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలన్నారు. గర్భిణిలు, ఐదేళ్లలోపు పిల్లలు, వ్యాధినిరోధక శక్తి తక్కువ ఉన్న వారు ఈ వ్యాధి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. మలేరియా నియంత్రణ అధికారి నూకరాజు మాట్లాడుతూ మురుగునీటిలో ఉత్పత్తయ్యే దోమల మూలంగా బోధకాల వ్యాధి వస్తుందన్నారు. కార్యక్రమంలో మాస్ మీడియా అధికారి ప్రకాష్రాజు, యూపీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ చంద్రకళ, సీనియర్ ఎపిడమాలజిస్టు వెంకటేశ్వర్లు, ఏఎంఓ ఎస్.విజయకుమార్, ఎంపీహెచ్ఎస్ అస్లాం, రఘు, శ్రీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రేడియో టవర్ ఎక్కి యువకుడి హల్చల్
● యువకుడి ప్రాణాలు కాపాడిన టూటౌన్ సీఐఆదోని అర్బన్: పట్టణంలోని మర్చంట్స్ క్లబ్ పక్కనే ఉన్న ఆలిండియా రేడియో టవర్ ఎక్కి శనివారం చిప్పగిరి మండలం సంగాల గ్రామానికి చెందిన యువకుడు సురేంద్ర హల్చల్ చేశారు. సీఐ రాజశేఖర్రెడ్డి చాకచక్యంగా వ్యవహరించి ఆ యువకుడిని కిందకు వచ్చేలా చేసి ప్రాణాలు కాపాడారు. వివరాలు.. నేమకల్ గ్రామానికి చెందిన నాగేశ్వరిని ప్రేమించి సురేంద్ర పెళ్లి చేసుకున్నాడు. మద్యం మత్తులో భార్యను కొట్టడంతో ఆమె సహించలేక పుట్టింటికి వెళ్లారు. భార్యను పిలిచినా రాకపోవడంతో శనివారం ఆదోని పట్టణంలోని ఆల్ ఇండియా రేడియో టవర్ పైకి ఎక్కాడు. నా భార్య వస్తేనే దిగుతా.. లేదంటే దూకేస్తానంటూ కేకలు వేయడంతో స్థానికులకు భయబ్రాంతులు గురయ్యారు. విషయం తెలుసుకున్న టూటౌన్ సీఐ రాజశేఖర్రెడ్డి, ఎస్ఐ రామనాథ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ యువకుడైన సురేంద్ర ఫోన్ నంబర్ను తెలుసుకుని సీఐ రాజశేఖర్రెడ్డి చాకచక్యంగా వ్యవహరించి ధైర్యం చెప్పి నీవు కిందకు దిగితే నీ భార్య నాగేశ్వరితో మాట్లాడిస్తాను అని చెప్పారు. సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో సురేంద్ర వెంటనే టవర్పై నుంచి కిందకు దిగొచ్చాడు. దాదాపు 2 గంటల వరకు టవర్పైనే ఉండడంతో సీఐ రాజశేఖర్రెడ్డి సురేంద్రకు తాగేందుకు నీరు ఇచ్చి, స్టేషన్కు తీసుకెళ్లారు. నాగేశ్వరి, వారి తల్లిదండ్రులను ఆలూరు పోలీస్స్టేషన్కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు సీఐ తెలిపారు. -
మధుర ఫలం.. ప్రియం
● నిరాశపరిచిన బంగినపల్లి దిగుబడులు ● గతేడాది కంటే పెరిగిన ధరలు ● వంద పండ్లు రూ. 5 వేలు పైమాటే! బనగానపల్లె: వేసవి వచ్చిందంటే మార్కెట్లో ఫలరాజు మామిడి పండ్లు కళకళలాడుతాయి. మామిడి పండ్లలో బంగినపల్లి బేనిషాన్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ ఏడాది బంగినపల్లి తినాలంటే సామాన్యులు జేబులు తడమాల్సిన పరిస్థితి ఏర్పడింది. దిగుబడులు తగ్గడంతో ధరలు ఆకాశాన్ని తాకాయి. బేనిషాన్ మామిడి తోటలు జిల్లా వ్యాప్తంగా సుమారు 10 వేల ఎకరాల్లో విస్తరించాయి. ఏటా సగటున 51.896 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది. ఈ సంవత్సరం వాతావరణం అనుకూలించకపోవడంతో దిగుబడి పూర్తిగా తగ్గినట్లు ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో బనగానపల్లె ప్రాంతంలో 650 ఎకరాల్లో, డోన్ 2,439, వెల్దుర్తి 892 బేతంచర్ల 587, ప్యాపిలి 805, కల్లూరు 496, ఓర్వకల్లు 1122, కోడుమూరు 238, వెలుగోడు 214, రుద్రవరం 215 ఎకరాలతో పాటు తదితర ప్రాంతాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. ఈ ఏడాది ప్రధానంగా రైతులు యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం, మిరప పంటను ఆశించే తేనే మంచుపురుగు మామిడి చెట్లకు పట్టడంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. 15–20 రోజుల ముందే పూత రావడం, వేసవి తాపంతో అధికంగా రాలిపోవడం, ఈ క్రమంలో కొందరు రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టడంలో విఫలం కావడంతో పూత నిల్వలేదు. దీంతో దిగుబడి తగ్గిపోయింది. ఈ క్రమంలో మార్కెట్లో ధరలు ఆకాశాన్నంటాయి. పది రోజులుగా బేనిషాన్ మామిడి పండ్లు మార్కెట్లో కనిపిస్తున్నాయి. వ్యాపారులు కిలో వంద రూపాయలకు, వంద పండ్లు రూ 5 వేల నుంచి 6 వేలకు విక్రయిస్తున్నారు. గతేడాది ఇదే సైజ్ పండ్లు వంద రూ.3 వేల నుంచి 4 వేలకు లభించాయి. ఈ ఏడాది బంగినపల్లె ప్రియం కావడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. నవాబులు పాలనలో విస్తరించిన తోటలు బనగానపల్లె ప్రాంతంలో సుమారు 120 ఏళ్ల క్రితం బంగినపల్లి బేనిషాన్ మామిడితోటల పెంపకానికి అప్పటి నవాబులు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. మామిడి పండ్లలో బేనిషాన్ రకాన్ని రాజుగా, మలుగువ మంత్రిగా, దిన్పసన్ సేనానిగా పిలిచేవారు. పేర్లను బట్టి బంగిపల్లి మామిడికి ఎంత ప్రాముఖ్యత ఉందో చెప్పవచ్చు. ఇక్కడి భూములు అనుకూలంగా ఉండడంతో మామిడితోటల సాగుకు నవాబులు ప్రత్యేకంగా బావులు తవ్వించి తోటలను విస్తరించారు. బేనిషాన్ మామిడి పండు కాంతివంతంగా కనిపిస్తూ రుచి అద్భుతంగా ఉంటుంది. మాగిన తరువాత పది రోజుల పాటు నిల్వ ఉన్నా చెడిపోదు. వినియోగదారులు ఈ రకాన్ని అధికంగా కొనుగోలు చేస్తారు. ఈ ప్రాంతవాసులు వేసవి కాలంలో ఇక్కడ లభించే బంగినపల్లి రకం మామిడిని తమ బంధువులు, స్నేహితులు ఎక్కడ ఉన్నా ఏటా పంపుతూ అభిమానాన్ని చాటుకుంటారు. మాకు 30 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ఈ సంవత్సరం తేనే మంచుపురుగు ఆశించడంతో పాటు వేసవితాపం ఎక్కువ కావడంతో పూత రాలిపోయి దిగుబడి పూర్తిగా తగ్గింది. ఈ పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు. దిగుబడి తక్కువగా ఉండటంతో మార్కెట్లో ధరలు పెరుగుతాయి. – అబ్దుల్హమిద్ మామిడితోట యజమాని ఈ సంవత్సరం మామిడిపండ్ల దిగుబడి తగ్గి ధరలు చుక్కలంటుతున్నాయి. ఈ విధంగా దిగుబడులు తగ్గడం ఐదేళ్లలో ఇదే ప్రథమం. దిగుబడి తగ్గడం వల్ల సైజును బట్టి కిలో వంద వరకు ధర ఉంది. వంద మామిడి పండ్లు 4 – 5 వేల వరకు విక్రయిస్తున్నాం. – ఖాజాహుస్సేన్ మామిపండ్ల వ్యాపారి -
ప్రాణం తీసిన విద్యుదాఘాతం
కృష్ణగిరి: మండల పరిధిలోని ఎరుకుల చెరువు గ్రామంలో గౌండ పని చేస్తూ కరెంట్ షాక్కు గురై వెల్దుర్తి మండలం చెరుకులపాడు గ్రామానికి చెందిన మనుగొండ రాజమోహన్(44)మృతి చెందాడు. ఎస్ఐ కృష్ణమూర్తి తెలిపిన వివరాల మేరకు.. రాజమోహన్ తన చిన్నాన్న కుమారుడితో కలిసి ఎరుకుల చెరువులోని సూర్యనారాయణ ఇంటి గౌండ పనికి వెళ్లాడు. ప్లాస్టింగ్ పని ముగించుకుని ప్లాసింగ్ చేసేందుకు వేసుకున్న సారువ కట్టెలపై నుంచి దిగే సమయంలో జారి కరెంట్ తీగలకు తగిలాడు. దీంతో షాక్కు గురై కింద పడ్డాడు. వెంటనే క్షతగాత్రుడిని వెల్దుర్తి సీహెచ్సీకి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. మృతునికి భార్య సుజాత, కుమారుడు సుమంత్ ఉన్నారు. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి నందికొట్కూరు రూరల్: బ్రాహ్మణకొట్కూరు గ్రామంలో ఏబీఎం చర్చి వద్ద శనివారం ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. బ్రాహ్మణకొట్కూరు ఎస్ఐ మణికంఠ తెలిపిన వివరాల మేరకు.. కర్నూలు నుంచి నందికొట్కూరుకు వెళ్తున్న నందికొట్కూరు ఆర్టీసీ డిపో అద్దె బస్సును బ్రహ్మణకొట్కూరు ఏబీఎం చర్చి వద్ద కొత్తపల్లి మండలం శివపురం గ్రామానికి చెందిన సయ్యద్ యూసుఫ్ (63) ఎక్కుతున్నాడు. ఆ సమయంలో డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును ముందుకు కదిలించడంతో యూసుఫ్ కింద పడ్డాడు. అతనిపై బస్సు వెనుక టైర్ ఎక్కడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు ఎస్ఐ తెలిపారు. యూసూఫ్ పని నిమిత్తం బ్రాహ్మణకొట్కూరు వచ్చినట్లు సమాచారం. మద్యం దుకాణాల్లో విస్తృత తనిఖీలు కర్నూలు: మద్యం దుకాణాలు, బార్లలో ధరల ఉల్లంఘన, కల్తీ నివారణ కోసం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారులు నగరంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఆ శాఖ కమిషనర్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఉత్తర్వుల మేరకు కర్నూలు ఎకై ్సజ్ నోడల్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి, జిల్లా అధికారి ఎం.సుధీర్ బాబు బృందాలుగా ఏర్పడి శనివారం బార్లు, మద్యం దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. మద్యం నాణ్యతను పరిశీలించి మద్యం బాటిళ్ల స్కానింగ్ను నిశితంగా పరిశీలించారు. ప్రతి బాటిల్ను సురక్ష యాప్ ద్వారా స్కాన్ చేయాలని, ఖచ్చితంగా సమయపాలన పాటించాలని దుకాణ నిర్వాహకులకు సూచించారు. కర్నూలు ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో మొత్తం 51 మద్యం దుకాణాలు, బార్లు ఉన్నాయి. ఇప్పటివరకు సుమారుగా 38 దుకాణాలను తనిఖీ చేసినట్లు అధికారులు తెలిపారు. మరో రెండు రోజుల పాటు తనిఖీలు కొనసాగుతాయని వెల్లడించారు. -
భార్య హత్య కేసులో భర్త అరెస్ట్
ఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో ఈనెల 19వ తేదీ సాయంత్రం భార్యను కత్తితో పొడిచి హత్య చేసిన కేసులో నిందితుడైన భర్త బోయ మీనుగ రాముడును అరెస్ట్ చేసినట్లు టౌన్ సీఐ శ్రీనివాసులు తెలిపారు. శనివారం స్థానిక పట్టణ పోలీస్స్టేషన్లో విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఎమ్మిగనూరు మండలం గుడేకల్ గ్రామానికి చెందిన బోయ మీనుగ రాముడు మద్యానికి బానిసైన భార్య నరసమ్మతో గొడవపడేవారు. దీంతో ఆమె భర్తను వదలి పుట్టింటికి వెళ్లారు. కుమార్తె ప్రసవం కోసం ఈనెల 19న ప్రభుత్వాసుపత్రికి నరసమ్మ వెళ్లగా భర్త రాముడు అక్కడికి వచ్చి అందరు చూస్తుండగానే కత్తితో పొడిచి హత్య చేశాడు. భార్యాభర్తల మధ్య గొడవలు, అప్పులే హత్యకు కారణమని విచారణలో నిందితుడు అంగీకరించినట్లు సీఐ తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సీఐతో పాటు పట్టణ ఎస్ఐ మధుసూదన్రెడ్డి తదితరులు ఉన్నారు. -
ఆర్టీసీ బస్సులో దివ్యాంగ బాలుడికి జరిమానా
● మహిళా కండక్టర్పై కేసు నమోదు ● తనిఖీ అధికారుల అత్యుత్సాహం కర్నూలు సిటీ: మహిళలకు, దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం ఉన్నా తనిఖీ అధికారుల అత్యుత్సాహం చూపారు. దివ్యాంగ బాలుడికి జరిమానా జరిమానా వేయడంతోపాటు మహిళా కండక్టర్పై కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. కర్నూలు డిపో–2కు చెందిన బస్సు శనివారం ఎమ్మిగనూరు నుంచి కర్నూలుకు వచ్చే సమయంలో కండక్టర్ టికెట్లు ఇస్తున్నారు. స్టేజ్ రాకముందే రీజినల్ ప్రొద్దుటూరు స్క్వాడ్ అధికారులు బస్సును నిలిపారు. స్టేజ్ రాలేదు, టికెట్లు ఇవ్వడం పూర్తికాలేదని తనిఖీ ఆఫీసర్లకు మహిళా కండక్టర్ చెప్పినా వినలేదు. తనిఖీలు చేసి అనారోగ్యంతో బాధపడుతున్న ఓ ఐదేళ్ల దివ్యాంగ బాలుడు టికెట్ తీసుకోలేదని బాలుడి తల్లికి రూ.100 జరిమానా వేశారు. ఆ తరువాత కండక్టర్పై సైతం కేసు నమోదు చేశారు. దివ్యాంగ బాలుడికి జరిమానా విధించడపై ప్రయాణికులు నిలదీశారు. బే స్టేజ్ (స్టేజ్ రాకముందే)లో తనిఖీలు చేస్తూ కండక్లర్లపై కేసులు నమోదు చేస్తూ మానసిక ఒత్తిళ్లకు గురి చేస్తున్నారని ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు పి.రాజ్యలక్ష్మి తెలిపారు. -
అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
● 30 కిలోల వెండి పట్టీలు స్వాధీనం ● మధ్యప్రదేశ్ వెళ్లి దొంగలను పట్టుకొచ్చిన డోన్ పోలీసులు డోన్ రూరల్: వారం రోజుల్లో డోన్ పోలీసులు భారీ చోరీ కేసు మిస్టరీని ఛేదించి నిందితులను అరెస్ట్ చేసి కటకటాలకు పంపారు. మధ్యప్రదేళ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.66.62 లక్షల విలువైన 30.200 కిలోల వెండి పట్టీలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం డీఎస్పీ శ్రీనివాసులు విలేకరుల సమావేశంలో దొంగల వివరాలను వెల్లడించారు. ఈ నెల 18వ తేదీన తెల్లవారుజామున డోన్ మండలంలోని యు.కొత్తపల్లి వద్ద ఉన్న న్యూ భారత్ డాబా వద్ద మధురై నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఆగింది. ఆ సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న మువాజ్ ఖాన్కు చెందిన వెండి పట్టీలు ఉన్న బ్యాగ్ అపహరణకు గురైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో మధ్యప్రదేశ్ రాష్ట్రం ధార్ జిల్లాకు చెందిన చోటు దవార్(20), రాజేశ్ చోహన్ (32), మన్సూర్ ఖాన్(32) చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. డోన్ టౌన్ సీఐ ఇంతియాజ్ బాషా, ఎస్ఐలు శరత్ కుమార్, నరేంద్ర కుమార్, సీసీఎస్ సీఐ సురేష్ కుమార్, బృందం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ధర్మపురి ప్రాంతానికి వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితులు ఏపీ, తెల్లంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పలు చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారు. చాకచక్యంగా కేసును ఛేదించిన సిబ్బందిని పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. -
సజ్జ రైతుల ఆందోళన
● కంపెనీ ఒప్పందంతో 200 ఎకరాల్లో సాగు ● దిగుబడులు కొనుగోలు చేయని వైనం చాగలమర్రి: డి.కొత్తపల్లె గ్రామానికి చెందిన రైతులు హైదరాబాద్కు చెందిన సూపర్ సీడ్స్ కంపెనీ చేతిలో మోసపోయి లబోదిబోమంటున్నారు. సంబంధిత కంపెనీ ఒప్పందం మేరకు గ్రామానికి చెందిన 20 మంది రైతులు 200 ఎకరాల్లో బాజ్రా–99 రకం సజ్జ పంట సాగు చేశారు. క్వింటాకు రూ.4,400 ప్రకారం పంట కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. పంట కోతలు పూర్తయి ఎకరానికి 23 బస్తాల ప్రకారం దిగుబడి వచ్చింది. రైతులు దిగుబడిని కంపెనీకి విక్రయించేందుకు ఆర్గనైజర్ శ్రీనివాసరెడ్డితో మాట్లాడినా స్పందన లేదు. కంపెనీ ఎండీ నిర్లక్ష్యం వహిస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దాదాపు 3,800ల క్వింటాళ్ల దిగుబడిలో ఆర్గనైజర్ శ్రీనివాసరెడ్డి 1,200 క్వింటాళ్లను చాగలమర్రిలోని గోదాముకు తరలించి నట్లు చెబుతున్నారు. మిగిలిన రైతులకు చెందిన ధాన్యాన్ని కలాల్లోనే నిల్వ ఉంచారు. అకాల వర్షాలు వస్తే దిగుబడి తడిసిపోయి తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు పెద్ద ఈశ్వరరెడ్డి, విక్రమ నరసింహారెడ్డి, దస్తగిరిరెడ్డి, సుబ్బారెడ్డి, శివరామిరెడ్డి, పెద్ద నరసింహారెడ్డి, నాగరాజు ఆందోళన చెందుతున్నారు. జిల్లా కలెక్టర్ ఈ విషయమై చొరవ చూపి కంపెని అధికారులతో మాట్లాడి సజ్జలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
పెళ్లి కాలేదని సర్టిఫికెట్ తెస్తేనే ఆపరేషన్ చేస్తాం
కర్నూలు (హాస్పిటల్): అనారోగ్యంతో ఆరోగ్యశ్రీ కార్డు చేతబట్టుకుని ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లిన ఓ యువతికి, “నీకు ఇంకా పెళ్లి కాలేదని సర్టిఫికెట్ తెచ్చుకుంటేనే ఆపరేషన్ చేస్తాం” అని ఆ ఆస్పత్రి యాజమాన్యం వెనక్కి పంపించిన ఘటన కర్నూలు జిల్లాలో వెలుగుచూసింది.వివరాలు.. ఓ యువతి అనారోగ్యంగా ఉండడంతో కర్నూలు నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా, పరీక్షించిన వైద్యులు గాల్బ్లాడర్లో రాళ్లు ఉన్నాయని, ఆపరేషన్ చేయాలని చెప్పారు. తనకు డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ) కార్డు ఉందని ఆమె వైద్యులకు చూపించింది. అయితే అందులో ఆమె పేరు తల్లిదండ్రులతో పాటు ఉండటంతో అక్కడి వైద్య సిబ్బందికి అనుమానం వచ్చింది.చాలామంది వివాహమైనా ఉచితంగా ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించుకునేందుకు కార్డులో పేరు తీయించుకోవడం లేదని, నీవు కూడా అలాగే చేసి ఉంటావని భావించారు. అందుకే ముందుగా “నీకు పెళ్లి కాలేదని సర్టిఫికెట్ తెచ్చుకోవాలి” అని ఆస్పత్రి సిబ్బంది చెప్పడంతో ఆమె కంగుతింది.సాధారణంగా వివాహమైతే సర్టిఫికెట్ ఇస్తారు.. కానీ పెళ్లి కాలేదని ఎవరు సర్టిఫికెట్ ఇస్తారని ఆ యువతి ప్రశ్నించింది. అయితే అదంతా తమకు సంబంధం లేదని, పెళ్లి కాలేదని సర్టిఫికెట్ తెచ్చుకుంటేనే ఉచితంగా ఆపరేషన్ చేస్తామని ఆస్పత్రి నిర్వాహకులు తేల్చిచెప్పారు. -
ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. భారీ క్యూలైన్..
సాక్షి, కర్నూలు: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరతతో వాహనదారులు అల్లాడిపోతున్నారు. డీజిల్ కొరత తీవ్రతరం కావడంతో పెట్రోల్ కూడా దొరుకుతుందో లేదో అనే భయంతో లీటర్ల కొద్దీ పెట్రోల్ తీసుకువెళ్తున్నారు. బంకుల వద్ద గంటల తరబడి పెట్రోల్ కోసం వాహనదారులు బారులు తీరారు.కర్నూలులో పెట్రోల్, డీజిల్ కొరతపెట్రోలు బంకుల వద్ద నోస్టాక్ బోర్డులు దర్శనం ఇవ్వడంతో ఆందోళన చెందుతున్న వాహనదారులుపెట్రోలు దొరకదు అనే భయంతో వాహనదారుల్లో టెన్షన్. గంటల కొద్దీ పెట్రోల్ కోసం ఖాళీ బాటిల్స్లో వాహనదారుల బారులు.పెట్రోల్, డీజిల్ కోసం ఆందోళన చెందుతున్న వినియోగదారులు.తక్షణమే సమస్యను పరిష్కరించాలని కోరుతున్న వాహనదారులు.స్పందించిన కర్నూలు కలెక్టర్పెట్రోలు కొరతపై స్పందించిన కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి స్పందిస్తూ.. జిల్లా వ్యాప్తంగా ఉన్న 166 పెట్రోల్ బంకుల్లో 13 లక్షల లీటర్ల పెట్రోల్, 11 లక్షల లీటర్ల డిజిల్ అందుబాటులో ఉందని తెలిపారు. పెట్రోల్, డీజిల్ దొరకదని భయంతో ప్రజలు అధికంగా కొనుగోలు చేస్తున్నారని, దీంతో బంకులు ఖాళీ అవుతున్నాయని.. ఫలితంగా 32 బంకులు మూతపడ్డాయని చెప్పారు. అక్రమంగా పెట్రోల్, డీజిల్ నిల్వ చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నందిగామలో డీజిల్ కొరత..డీజిల్ కొరత కారణంగా నందిగామలో సామాన్యుల అవస్థలుబంకుల వద్ద బారులు తీరుతున్న వాహనాలుకొన్ని బంకుల్లో రేషన్ పద్దతిలో డీజిల్..కారుకి 10, లారీకి 50 లీటర్లు మాత్రమే..నిన్నటి నుండి బంకుల చుట్టు ప్రదక్షిణలు చేస్తున్న వాహనదారులురెండు గంటలపైన వాహనం లైన్లో ఉండే 15 లీటర్లు మాత్రమే కొడుతున్నారంటూ వాహనదారుల ఆవేదనడీజిల్ కొరత నేపధ్యంలో కొన్ని బంకుల్లో టిన్నుల్లో డీజిల్ కొట్టించుకుంటున్న వాహనదారులుడీజిల్ కొరతతో ఇబ్బందులు పడుతున్నామని వాహనదారుల ఆవేదన. మచిలీపట్నంలోనూ బారులుమచిలీపట్నం పలు పెట్రోల్ బంక్ లలో డీజీల్ కొరతమచిలీపట్నంలోని రెండు బంక్ లలో మాత్రమే దొరుకుతున్న డీజిల్రెండు బంకుల వద్ద బారులు తీరిన వాహనాలుఆంక్షలు విధించి వాహనాలలో డీజిల్ నింపుతున్న బంక్ సిబ్బందిపలుచోట్ల పెట్రోల్ బంకు సిబ్బందితో వాగ్వివాదానికి దిగిన వాహనదారులు కాకినాడ జిల్లాడీజిల్ కోసం పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరుతున్న వాహనదారులుపలు బంకుల వద్ద క్యూ లైన్లో ఆటోలుకొన్ని బంకులలో 2 లీటర్లే కొట్టడంతో ఆవేదన చెందుతున్న ఆటో డ్రైవర్లు.ప్లాస్టిక్ టిన్నుల్లో డీజిల్ కొట్టించుకుంటున్న వినియోగదారులుడీజిల్ కొరత లేదని అధికారులు చెబుతున్న మాటలకు, బంకుల వద్ద పరిస్ధితికి పొంతన లేదని మండిపడుతున్న ఆటో డ్రైవర్లు. -
ప్రకృతి వ్యవసాయంలో పీఎండీఎస్ది ప్రధాన పాత్ర
● జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి కల్లూరు: ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించడంలో పీఎండీఎస్ ప్రధాన పాత్ర పోషిస్తోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అన్నారు. శుక్రవారం కల్లూరు మండలం తడకనపల్లె గ్రామంలో ధర్తీ మాతా బచావ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రైతులకు పీడీఎంఎస్ విత్తనాల కిట్లను అందజేశారు. ప్రకృతి వ్యవసాయ పంటలను పరిశీలించిన అనంతరం రైతు పీడీఎంఎస్ విత్తనాలను చల్లారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పీఎండీఎస్ అంటే వర్షాధారిత ప్రాంతాలలో, భూమిలో తేమ లేనప్పుడు విత్తనాలు వేసే విధానమన్నారు. ఈ ప్రక్రియ ద్వారా వేసవిలో భూమి ఖాళీగా ఉన్నప్పుడు, వర్షాలు పడటానికి ముందే (మే –జూన్ సమయంలో) 30 రకాల నవధాన్యా లు, ఇతర విత్తనాలను కలిపి పొలంలో చల్లుతారన్నారు. ఈ విత్తనాలు వర్షం పడగానే మొలకెత్తి, భూమికి అవసరమైన పోషకాలను అందిస్తాయన్నారు. ప్రతి గ్రామంలో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పీ ఎల్ వరలక్ష్మీ, డిపిఎం మాధురి, సహాయ వ్యవసాయ సంచాలకులు సాలురెడ్డి, తహసీల్దార్ ఆంజనేయులు, ఎఓ విష్ణువర్ధన్రెడ్డి, హార్టికల్చ ర్ ఆఫీసర్ నరేష్రెడ్డి, రైతులు పాల్గొన్నారు. పెట్రోల్, డీజిల్ కొరత లేదు కర్నూలు (సెంట్రల్): జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని డీఎస్ఓ ఎం.రాజారఘువీర్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన కర్నూ లు నగరంలోని పలు పెట్రోల్ బంకులను పరిశీలించారు. నిల్వలు ఉండి వాహనదారులకు విక్రయించకపోతే కఠిన చర్యలు తప్పవని పెట్రోల్ బంకుల యజమానులను హెచ్చరించారు. అధిక ధరలకు విక్రయిస్తే బంకులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. 24లోగా ఫీజు చెల్లించాలి కర్నూలు సిటీ: ఇంటర్మీడియేట్ సప్లిమెంటరీ పరీక్షలకు నిర్దేశించిన గడువులోపు ఫీజులు చెల్లించాలని ఇంటర్మీడియేట్ విద్యా మండలి ప్రాంతీయ కార్యాలయ అధికారి జి.లాలెప్ప ఒక ప్రకటనలో తెలిపారు. ఫీజుల చెల్లింపు ప్రక్రియ శుక్రవారం మొదలైందని, ఈ నెల 24వ తేదీ వరకు గడువు ఉందని, ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లు విద్యార్థులకు ఫీజు గడువు తెలియజేయాలన్నారు. ఉదయమే దిగుబడులు తీసుకురావాలి కర్నూలు(అర్బన్): ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున మార్కెట్యార్డుకు రైతులు తమ పంట ఉత్పత్తులను ఈ నెల 27వ తేదీ నుంచి ఉదయం 9 గంటల్లోపు తీసుకు రవావాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎంపిక శ్రేణి కార్యదర్శి ఆర్ జయలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలియజేసిన సమయానికే వ్యాపారులు కూడా టెండర్ వేయాలన్నారు. నేటి నుంచి ఫ్యాఫ్టో రిలే దీక్షలు కర్నూలు సిటీ: ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఫ్యాఫ్టో ఆధ్వర్యంలో నేటి(శనివారం)నుంచి మూడు రోజుల పాటు విజయవాడలో రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను శుక్రవారం కర్నూలు డీఈఓ ఆఫీస్ ఆవరణలో ఫ్యాఫ్టో నాయకులు విడుదల చేశారు. దీక్షల్లో భాగంగా ఆదివారం ఫ్యాఫ్టో కర్నూలు కమిటీ కూర్చోనుందని జిల్లా కమిటీ చెర్మన్ ఎం.మధుసూదన్ తెలిపారు. ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలన్నారు. ఫ్యాఫ్టో నాయకులు బి.నవీన్ పాటిల్, రవికుమార్, మరియానందం, ఇస్మాయిల్, యోగేశ్వరుడు, నరేంద్ర నాథ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. నేడు పాలిసెట్ ఆదోని సెంట్రల్: పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ పరీక్ష శనివారం జరుగుతుందని ఆదోని పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ చిన్నపరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదోనిలో 1500 మంది విద్యార్థులు పరీక్షలను రాయనున్నట్లు , మొత్తం ఐదు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. -
వైఎస్సార్సీపీ హయాంలోనే ఎంపీడీఓలకు పదోన్నతులు
● జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డికర్నూలు(అర్బన్): వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే పంచాయతీరాజ్ వ్యవస్థలో పదోన్నతులకు శ్రీకారం చుట్టడం జరిగిందని జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. గతంలో ఎంపీడీఓగా విధుల్లో చేరిన వారు ఎంపీడీఓగానే పదవీ విరమణ చేసేవారని, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం వల్ల డివిజినల్ స్థాయిలో డీఎల్డీఓ పోస్టులను క్రియేట్ చేయడంతో పీఆర్లో పదోన్నతుల పర్వం ప్రారంభం అయ్యిందన్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం స్థాపనే ధ్యేయంగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామాల్లోనే ప్రజలు 542 రకాల సేవలను పొందగలుగుతున్నారన్నారు. 33వ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని శుక్రవారం సాయంత్రం స్థానిక జెడ్పీలోని మినీ సమావేశ భవనంలో ఘనంగా నిర్వహించారు. జెడ్పీ సీఈఓ జీవీ రమణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా పంచాయతీ అధికారి జీ భాస్కర్, డీఆర్డీఏ, డ్వామా పీడీలు రమణారెడ్డి, ప్రభాకర్రెడ్డి హాజరయ్యారు. ఆర్థిక సంఘం నిధులు విడుదల కావడం లేదు జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ హయాంలో 2007, 2008 సంవత్సరాల్లో దాదాపు 9 శాఖలకు చెందిన నిధులు, విధులు, అధికారాలను పంచాయతీరాజ్ వ్యవస్థకు బదలాయించారన్నారు. కాలక్రమేణ కొన్ని మాత్రమే కొనసాగుతున్నాయన్నారు. రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు కూడా 2016 తరువాతి నుంచి విడుదల కావడం లేదన్నారు. కేంద్ర ఆర్థిక సంఘం గ్రాంట్లు, ముఖ్యంగా జిల్లా పరిషత్ అవసరాలకు అనుగుణంగా విడుదల కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన దామాషాలో విడుదల చేయడం లేదన్నారు. భూగర్భ ఖనిజ శాఖ వసూలు చేసి రాష్ట్ర కన్సాలిడేటెడ్ నిధికి జమ చేసిన రాయల్టీకి, పంచాయతీరాజ్ వ్యవస్థలకు విడుదల చేస్తున్న గ్రాంట్ల మధ్య ఎక్కువ శాతం వ్యత్యాసం ఉందన్నారు. దీని వల్ల పంచాయతీరాజ్ వ్యవస్థలు ఆర్థికంగా బలోపేతం కాలేకపోతున్నాయన్నారు. సమన్వయంతో ముందుకు వెళ్లాలి స్టాంప్ డ్యూటీకి సంబంధించిన సర్దుబాటును కూడా సకాలంలో చేయడం లేదని జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దీర్ఘకాలంగా ఉన్న పెండెన్సీపై 2022 నుంచి రిజిస్ట్రేషన్ శాఖపై ఒత్తిడి చేస్తూ వస్తే గత ఆర్థిక సంవత్సరం కొంత మేర పెండెన్సీ తగ్గిందన్నారు. ప్రస్తుతం స్థానిక సంస్థలు సొంత ఆదాయ వనరులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. 73వ రాజ్యాంగ సవరణ ముఖ్య ఉద్దేశం నెరవేరాలంటే, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు. జెడ్పీ సీఈఓ జీవీ రమణారెడ్డి మాట్లాడుతూ.. 73వ రాజ్యాంగ సవరణ బిల్లు 1993లో పార్లమెంట్లో ఆమోదం పొందిందన్నారు. అప్పటి నుంచే దేశంలో మూడంచెల వ్యవస్థ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో స్వయం పరిపాలన సాధ్యమైందన్నారు. డీపీఓ జీ భాస్కర్ మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన మౌళిక సౌకర్యాలు కల్పిస్తు, వారి మనోభావాలకు అనుగుణంగా సేవలు అందించాలన్నారు. -
యువకుడి దారుణ హత్య
ఓర్వకల్లు: మండల పరిధిలోని ఉయ్యాలవాడలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామస్తుల కథనం మేరకు.. ఈడిగోటి లలితమ్మ, వెంకటేశ్వర్లు దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు మనోజ్కు గత నెల ఓర్వకల్లు మండలం చింతలపల్లెకి చెందిన వెంకటేశ్వరితో వివాహమైంది. రెండేళ్లుగా వెంకటేశ్వర్లు కర్నూలు నగరంలోని జంపాల ఈశ్వరయ్య నగర్లో ఉంటూ లారీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఈ నెల 21 నుంచి 23 వరకు గ్రామంలో జరిగే ఉత్సవాలకు కుటుంబ సమేతంగా వచ్చారు. ఉత్సవాల్లో పోలీసుల అనుమతితో గురువారం రాత్రి డీజే ఏర్పాటు చేయగా పాటల విషయంలో గ్రామానికి చెందిన వంశీ, మనోజ్ సోదరుడైన మధుబాబుతో గొడవ పెట్టుకున్నాడు. గమనించిన మనోజ్ సర్దిచెప్పే క్రమంలో వాగ్వాదం చోటుచేసుకొంది. కోపోద్రికుడైన వంశీ పొడవాటి కత్తిని తీసుకుని, కుటుంబసభ్యులతో కలిసి మనోజ్ ఇంటివద్దకు వెళ్లి గొడవ పెట్టుకున్నాడు. ఈ సమయంలో కరెంట్ పోవడంతో అరుగుపై కూర్చొన్న మనోజ్ను పక్కకు ఈడ్చి గొంతుపై కత్తితో పొడిచాడు. అపస్మారక స్థితికి చేరుకున్న మనోజ్ను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసినట్లు సీఐ చంద్రబాబు నాయుడు తెలిపారు. కాగా, డీజే ప్రదర్శనకు అనుమతినిచ్చిన పోలీసులు బందోబస్తు నిర్వహించకుండా, యువకుల మధ్య గొడవలో జోక్యం చేసుకోకపోవడం విమర్శలకు దారితీసింది. కేవలం 100 మీటర్ల దూరంలో యువకుడి హత్య జరుగుతున్నప్పటికీ ఖాకీలు అడ్డుకోకపోవడం వారి చేతకానితనానికి నిదర్శనమంటూ స్థానికులు మండిపడుతున్నారు. వడ్డెర సంఘం నాయకుల అందోళన వడ్డెర సంఘం నేతలు వందలాది మందితో కలిసి మృతదేహాన్ని వంశీ ఇంటి ఎదుట ఉంచి ఆందోళన చేశారు. హంతకుడైన వంశీని తక్షణమే ఎన్కౌంటర్ చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో వంశీతో పాటు, లక్ష్మీనారాయణ, రేణుక, వెంకటలక్ష్మి, శ్రీరాములు అనే ఐదుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
సెలవులు ప్రకటించాలి
ఎండలు మండుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాలకు పంపేందుకు తల్లిదండ్రులు ఇష్టపడడం లేదు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన నేపథ్యంలో పెద్ద పిల్లలందరూ ఇళ్ల వద్ద ఉంటే చిన్నారులను కేంద్రాలకు పంపేందుకు అయిష్టత వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల కేంద్రాల్లో పిల్లల హాజరు శాతం కూడా తగ్గిపోతోంది. అంగన్వాడీ కేంద్రాలకు కూడా వేసవి సెలవులు ప్రకటించాలి. – బీ రేణుక, కోశాధికారి, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ (సీఐటీయూ) అంగన్వాడీ కేంద్రాలకు పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలు సెలవులు ప్రకటించాయి. మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. వేసవిలో కేంద్రాలకు సెలవులు ఇవ్వాలని రెండు నెలలుగా అడుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. – జేలలితమ్మ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (ఏఐటీయూసీ) అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు అందలేదు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని చిన్నారులు, బాలింతలు, గర్భవతుల ఫీడింగ్కు ఇబ్బంది రాకుండా ఉండేందుకు వర్కర్లు, హెల్పర్లకు వేర్వేరుగా 15 రోజుల పాటు సెలవులు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. – పీ విజయ, పీడీ, మహిళా శిశు సంక్షేమ శాఖ -
86,730
జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల వివరాలు...అంగన్వాడీ కేంద్రాలు 1,88644,627కర్నూలు(అర్బన్): అధిక ఉష్ణోగ్రతలతో అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని కేంద్రాల్లో సీలింగ్ ఫ్యాన్లు పనిచేయకపోవడంతో ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. మండే ఎండల్లో కాళ్లకు చెప్పులు లేకుండా ఇళ్లకు వెళ్లడానికి నానా అవస్థలు పడుతున్నారు. చిన్నారుల అష్టకష్టాలను చూసి చంద్రబాబు ప్రభుత్వం స్పందించడం లేదు. పక్కనున్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులను ప్రకటించినా రాష్ట్రంలో అలాంటివేమీ లేవు. పైగా ఎండలు మండుతున్న ప్రస్తుత వేసవిలో పలు రకాల ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. చాలీచాలని గదులు రాష్ట్రంలోని దాదాపు అన్ని విద్యా సంస్థలకు వేసవి సెలవులు ప్రకటించారు. అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ఇవ్వకపోవడంతో ఎండలకు చిన్నారులను కేంద్రాలకు పంపేందుకు తల్లిదండ్రులు అయిష్టత చూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించినా, అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో చాలీ చాలని ఇరుకు గదుల్లో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాల్లో తీవ్ర ఉక్కపోతతో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా, అంగన్వాడీ టీచర్లకు 15 రోజులు, హెల్పర్లకు 15 రోజులు సెలవులు మంజూరు చేసినా, ఎవరో ఒకరు మాత్రం కేంద్రాన్ని నిర్వహించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ఆ దిశగా కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టకోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ఆర్థికంగా చితికి పోతున్న కేంద్రాలు అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు అందించాల్సిన పౌష్టికాహారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించడం లేదు. దీంతో అంగన్వాడీ కేంద్రాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. బియ్యం, కంది పప్పు, ఆయిల్ మినహా మిగిలిన సరుకులన్ని ( ఆకుకూరలు, కూరగాయలు, గ్యాస్ ) బయటి మార్కెట్ నుంచి కొనుగోలు చేయాల్సి ఉంది. ఇందుకు ప్రభుత్వం ఒక్కో చిన్నారికి రూ.2 ఇస్తోంది. రెండు రూపాయలతో పౌష్టికాహారం పెట్టడం ఎలా సాధ్యమని అంగన్వాడీ వర్కర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉప్పు, చింతపండు, కారం, వెల్లుల్లి, ఆకుకూరలు తదితర వాటి ధరలన్ని పెరిగి పోయాయని వారంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కేంద్రాల్లోనే పిల్లలను ఉంచుకోవాలని చెబుతున్న ప్రభుత్వం సాయంత్రం సమయాల్లో పిల్లలకు అందించే స్నాక్స్ను మరిచి పోయింది. మెనూ చార్జీలు పెంచాలని, పనిభారాన్ని తగ్గించాలని, వేతనాలను పెంచాలనే పలు డిమాండ్లతో ఇప్పటికే అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు వివిధ రూపాల్లో పోరాటాలను కొనసాగిస్తున్నారు. తీవ్ర ఉక్కపోత ... ఉదయం 8 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో ఫ్యాన్లు ఉన్నప్పటికీ ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. చిన్నారులు ఉక్కపోత తాళలేక ఏడుస్తుంటే, వారిని సముదాయించలేక ఆయాలు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే విద్యుత్ సరఫరాలో పలు ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్న అంతరాయం అంగన్వాడీ కేంద్రాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. అలాగే గర్భిణులు, బాలింతలు కూడా పౌష్టికాహారం కోసం ఎండలోనే అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇళ్లకు దూరంగా ఉన్న కేంద్రాలకు వెళ్లి సరుకులు తెచ్చుకునేందుకు వారు ఇబ్బంది పడుతున్నారు.భోజనం చేస్తున్న చిన్నారులుగర్భిణులు18,992ఐసీడీఎస్ ప్రాజెక్టులు 09బాలింతలు15,3463–6 సంవత్సరాల మధ్య వయస్సు చిన్నారులు0–3 సంవత్సరాల చిన్నారులు అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం పక్క రాష్ట్రాల్లో ముందస్తు చొరవ తీసుకున్న ప్రభుత్వాలు జిల్లాలో ఉక్కపోతతో అల్లాడిపోతున్న చిన్నారులు -
చద్దన్నంకు ఆదరణ బాగుంది
చద్దన్నం హోటల్ను నేను గత ఫిబ్రవరిలో ప్రారంభించాను. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు చద్దన్నం పదార్థాలను విక్రయిస్తాం. ఆ తర్వాత ఇంటికి వెళ్లి మరుసటి రోజుకు కావాల్సిన చద్దన్నం తయారీకి సిద్ధమవుతాం. ఉదయం పొంగలి తయారు చేసుకుని రెడీమేడ్గా ప్రజలకు అందిస్తున్నాం. చద్దన్నంకు ప్రజల నుంచి ఆదరణ బాగుంది. – నారాయణమ్మ, చద్దన్నం హోటల్ నిర్వాహకురాలు, కర్నూలు నేను ఓ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలో ఫీల్డ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. రెండు వారాలుగా నాకు, నా భార్యకు చద్దన్నం రుచులను తీసుకెళ్తున్నాను. ఇందులో ముఖ్యంగా అరికెలు, సామలతో చేసిన పదార్థాలు, కారాలు తీసుకుంటున్నాను. నేను రోజూ యోగా, ప్రాణాయామం చేస్తుంటాను. ఆరోగ్య రీత్యా చద్దన్నం రుచులు ఎంతో బాగుంటాయి. –జి. శ్రీరాములు, ప్రైవేటు ఉద్యోగి, కర్నూలు నేను రెండు నెలల క్రితం చద్దన్నం హోటల్ను ప్రారంభించాను. మా వద్ద వరి చద్దన్నంతో పాటు రాగులు, జొన్నలు, అరికెలు, కొర్రలతో చేసిన చద్దన్నాలు, కినోవా, రెడ్రైస్, సామలు, కొర్రలతో చేసిన పొంగలి తయారు చేస్తున్నాం. వీటికితోడుగా మునగాకు, కరివేపాక చట్ని, సూప్లు, ఉల్లి,క్యారెట్, బీట్రూట్లతో తురిమిన మిక్స్, ఆయుర్వేదిక్ కారం పొడి, మజ్జిగ అందిస్తున్నాం. రోజుకు వంద మందికిపైగా వస్తున్నారు. – బాల లక్ష్మి, చద్దన్నం హోటల్ నిర్వాహకురాలు, కర్నూలు మేము కర్నూలులోని వెంకటరమణ కాలనీలో ఉంటున్నాం. రెండు వారాలుగా చద్దన్నం రుచులను తీసుకెళ్తున్నాం. ఒక్కోరోజు ఒక్కో పదార్థాన్ని మధ్యాహ్న భోజనంగా పార్శిల్ తీసుకుంటున్నారు. ఒక పార్శిల్ ఒకరికి సరిపోతుంది. నూనె, మసాలాలు ఉండవు కాబట్టి ఆరోగ్యానికి మంచిది. వేసవిలో ఇలాంటి ఆహారం ఒంటికి ఎంతో మేలు చేస్తాయి. ఎంతో రుచిగా ఉంటున్నాయి. – రామకృష్ణ, లెక్చరర్, కర్నూలు -
డిగ్రీ పరీక్షలకు 22 మంది గైర్హాజరు
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో గురువారం జరిగిన డిగ్రీ సెమిస్టర్ పరీక్షలకు 22 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు వర్సిటీ పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ ఎన్.నరసింహులు తెలిపారు. రెండవ సెమిస్టర్ పరీక్షలకు 214 మందికి 196 మంది విద్యార్థులు హాజరు కాగా 18 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. ఆరవ సెమిస్టర్ పరీక్షలకు 31 మందికి 27 మంది హాజరు కాగా నలుగురు విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. స్కూళ్లకు వేసవి సెలవులు కర్నూలు సిటీ: జిల్లాలోని అన్ని పాఠశాలలకు గురువారం నుంచి వేసవి సెలవులు వచ్చాయి. దీంతో విద్యార్థులు కేరింతలు కొడుతూ ఇళ్లకు వెళ్లారు. విద్యా సంవత్సరం చివరిగా నిర్వహించే సమ్మెటివ్–2 పరీక్షలు ఈ నెల 16వ తేదీతో ముగిశాయి. ఈ పరీక్షల మూల్యాంకనం నిర్వహించి ఆన్లైన్లో నమోదు చేసి, ప్రోగ్రెస్ కార్డులను విద్యార్థులకు అందజేశారు. సెలవులు ప్రకటించిన తరువాత సమ్మర్ క్యాంపు పేరుతో ప్రత్యేక తరగతుల పేరుతో స్కూళ్లలో క్యాంప్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.సుధాకర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో(హాస్టల్స్ మినహా)చదువుతున్న విద్యార్థులకు బియ్యంతో పాటు కోడి గుడ్లు, చిక్కీలను పంపిణీ పంపిణీ చేశారు. కర్నూలు సిటీ: జిల్లా విద్యాశాఖ పరిధిలో ప్రభుత్వ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలను డీఈఓ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు డీఈఓ ఎల్.సుధాకర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మునిసిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల యాజమాన్యాల కింద పని చేస్తున్న ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, హెచ్ఎం సీనియారిటీ జాబితాలను ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ ఆధారంగా రూపొందించామన్నారు. ఈ జాబితాలను www.doekrnl13.blogspot.com అనే వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ జాబితాలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 27వ తేదీలోపు(పని దినాల్లో మాత్రమే) డీఈఓ కర్నూలు(ఉమ్మడి జిల్లా) ఆఫీస్లో సా యంత్రం 5 గంటల్లోపు తగిన ఆధారాలతో ఇవ్వాలన్నారు. గడువు తరువాత ఎలాంటి అభ్యంతరాలు స్వీకరించబోరని డీఈఓ వెల్లడించారు. ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య డోన్ రూరల్: ఉద్యోగం రావడం లేదని ఓ యువకుడు గురువారం ఉరివేసుకుని ఆత్మ హత్య చేసుకున్నాడు. ఈ దుర్ఘటన డోన్ పట్టణంలో చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన ధీరజ్(31) డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఎలాంటి ఉద్యోగాలు రాకపోవడం, పెళ్లి కాకపోవడంతో మనస్తాపం చెందాడు. డోన్ పట్టణంలోని తన మేనమామ ఇంటికి వచ్చి, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈతకు వెళ్లి బాలుడి మృతి దేవనకొండ: మండలంలోని గుడిమిరాళ్ల గ్రామానికి చెందిన కౌశిక్(12) గురువారం ఈతకు వెళ్లి బావిలో చిక్కుకుని మృతిచెందాడు. కౌలుట్ల, వరలక్ష్మీ దంపతుల కుమారుడైన కౌశిక్ ఆరో తరగతి చదువుతున్నాడు. మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ కుమారుడి మృతిపై అనుమానం ఉందని, పోలీసులు విచారణ చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. బాలుడి మృతిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నగరంలో ప్రత్యేక హోటళ్లు
ఆధునిక కాలంలో చాలా మంది బిజీ జీవితాన్ని గడుపుతున్నారు. ఈ క్రమంలో అప్పట్లోలాగా ఇప్పుడు చద్దన్నం తయారు చేసుకుని తినే సమయం, ఓపిక ఇప్పటి వారికి లేదు. అందుకే ఇలాంటి వారి కోసం రెడీమేడ్గా చద్దన్నం అంది స్తున్నాయి హోటళ్లు. ఇటీవల కాలంలో కర్నూలు నగరంలో అవుట్ డోర్ స్టేడియం, వెంకటరమణ కాలపీ, బి.క్యాంపులోని సిల్వర్జూబ్లీ కాలేజి వద్ద ‘మన చద్దన్నం’ పేరుతో వరి అన్నంతో పాటు కొర్రలు, సామలు, అరికెలు, జొన్నలు, రాగులతో చద్దన్నం, పొంగలి తయారు చేసి మట్టిపాత్రలో వడ్డిస్తున్నారు. ఇందులో మునగాకు సూపు, మునగాకు చట్ని, వేరుశనగ, మిరియాలు, లవంగాలు, మిర్చి విత్తనాలతో కూడిన పౌడర్, ఉల్లి, క్యారెట్, బీట్రూట్ తురిమిన సలాడ్ను కలిపి ఇస్తున్నారు. దీంతో పాటు అవిశగింజెలు లడ్డు, డ్రైఫ్రూట్ లడ్డూలను తయారు చేసి ఇస్తున్నారు. ప్రతిచోటా రోజూ వంద మందికి పైగా ఈ చద్దన్నం తింటున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. వీరికి నల్గొండకు చెందిన ఓ వారు ప్రాంచైజీ రెండు రోజుల పాటు శిక్షణ, పరికరాలు ఇచ్చి వెళ్తున్నట్లు వారు పేర్కొంటున్నారు. వీరి చద్దన్నంకు సోషల్ మీడియాలోనూ వైరల్ కావడంతో ప్రజలు చిరునామా తెలుసుకుని వచ్చి తింటున్నారు. నగరంలో చద్దన్నం పదార్థాల విక్రయశాల -
గొప్ప మహనీయుడు భగీరథ మహర్షి
● మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికోసిగి: గంగను భూమిపైకి తీసుకువచ్చిన భగీరథ మహర్షి గొప్ప మహనీయుడని మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు. భగీరథ మహర్షిని స్ఫూర్తిగా తీసుకుని యువత లక్ష్యాలను సాధించాలన్నారు. కోసిగి మండలం సజ్జలగుడ్డం గ్రామంలో గురువారం శ్రీ భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలో భగీరథ మహర్షి విగ్రహావిష్కరణ చేసి ప్రత్యేక పూజలు చేపట్టారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. భగీరథ మహర్షి గొప్ప మహానీయుడని, ఆయన అడుగు జాడల్లో అందరూ నడుచుకోవాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి పి. మురళీమోహన్ రెడ్డి, వైఎస్సా సీపీ డాక్టర్ల విభాగం జిల్లా నాయకుడు దశరథ రెడ్డి, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు బెట్టన గౌడ, నాడుగేని నాగరాజు, బసిరెడ్డి, కాంట్రాక్టర్ నాగరాజు, గ్రామ ఉప్పర సంఘం నాయకులు పాల్గొన్నారు. -
కనీస వేతనం ఇవ్వకపోతే మరో సుదీర్ఘ సమ్మె
కర్నూలు(అర్బన్): తమకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని లేదంటే మరో సుదీర్ఘ సమ్మె చేస్తామని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు అన్నారు. అంగన్వాడీ యూనియన్ల రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు గురువారం స్థానిక అర్బన్ ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ముందుగా సీ క్యాంప్ సెంటర్ నుంచి అర్బన్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్షురాలు జే లలితమ్మ, సీఐటీయూ జిల్లా కోశాధికారి గోపాల్ మట్లాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే జీతాలు పెంచుతామని ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ తప్పారని ఆరోపించారు. కనీస వేతనం రూ.26 వేలు, నెల రోజులు వేసవి సెలవులు ఇవ్వాలన్నారు. అంగన్వాడీలపై అదనపు భారాన్ని తగ్గించాలని, సర్వేలు, పెన్షన్ల పంపిణీ, బీఎల్ఓ డ్యూ టీలు వేయరాదన్నారు. పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణలో గత రెండు సంవత్సరాలుగా వేసవి సెలవులు ఇస్తుంటే ఇక్కడ అమలు చేయడంలేదన్నారు. ప్రభుత్వం వెంటనే అంగన్వాడీ యూనియన్లతో చర్చలు జరిపి వేతనాలను పెంచాలని, సెలవులను మంజూరు చేయాలన్నారు. సీఐటీయూ నాయకులు ఆర్ నరసింహులు, కే సుధాకరప్ప, మహమ్మద్ రఫీ, బాలదర్గమ్మ, చౌడేశ్వరి, నాగమణి, విజయ మంజుల తదితరులు పాల్గొన్నారు. -
మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం
● మత్తు వ్యసనాల నిర్మూలన ర్యాలీలో కలెక్టర్, ఎస్పీ పిలుపుకర్నూలు: కర్నూలును మాదక ద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేద్దామని కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ పిలుపునిచ్చారు. నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అవగాహన కల్పించేందుకు ఈగల్ ఆధ్వర్యంలో గురువారం భారీ వాకథాన్ ర్యాలీ నిర్వహించారు. రాజ్విహార్ సెంటర్లో కలెక్టర్, ఎస్పీ జెండా ఊపి వాకథాన్ను ప్రారంభించారు. ఈగల్ టీమ్ ఎస్ఐ సుజన్కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో పోలీసు, ఎకై ్సజ్, విద్యార్థులు, యువకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సే నో టు డ్రగ్స్, డ్రగ్ ఫ్రీ సొసైటీ వంటి నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రజల్లో చైతన్యం కల్పించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలని సందేశాలందించారు. రాజ్విహార్ నుంచి బుధవారపేట మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ సాగింది. మాదక ద్రవ్యాలకు సంబంధించి ఈగల్ టీమ్ టోల్ఫ్రీ నెంబర్ 1972కు సమాచారం ఇవ్వాలని యువత నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ.. యువతను మత్తు వ్యసనాల నుంచి కాపాడటం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఆల్కహాల్, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం పెరుగుతోందని, దీనివల్ల యువత భవిష్యత్తు దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ నోడల్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి, జిల్లా అధికారి సుధీర్ బాబు, అసిస్టెంట్ సూపరింటెండెంట్ రామకృష్ణా రెడ్డి, ఔషధ నియంత్రణ శాఖ ఏడీ హరిహర తేజ, సీఐలు చంద్రహాస్, రాజేంద్రప్రసాద్, జయరాం నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
బారులు తీరిన కష్టాలు
● పెట్రోల్, డీజిల్ అందక వాహనదారుల ఇబ్బందులుఎమ్మిగనూరురూరల్/సెంట్రల్: పెట్రోల్, డీజిల్ అందకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎమ్మిగనూరు పట్టణంలో గత ఐదు రోజులుగా పెట్రోల్ బంకుల వద్ద బారులుదీరి గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. కొన్ని పెట్రోల్ బంక్లు మూతపడగా, మరికొన్ని ఉన్నదాంట్లోనే వంతులవారీగా ఇస్తున్నారు. పెట్రోల్ బంక్ యజమానులతో వాహనచోదకులు వాగ్వాదానికి దిగుతున్నారు. గురువారం ఎమ్మిగనూరు పట్టణంలోని ఆదోని రోడ్డులో జీఎం, మంత్రాలయం రోడ్డులోని రిలయన్స్, ఎంజీ పెట్రోల్ బంక్లు మూతపడ్డాయి. దీంతో వాహనదారులందరూ శివ సర్కిల్లోని పెట్రోల్ బంక్, కర్నూలు రోడ్డులోని పెట్రోల్ బంక్ దగ్గరకు పరుగులు తీశారు. వాహనదారులను అదుపు చేయలేక పెట్రోల్ బంక్ నిర్వాహకులు కొద్దిసేపు పంిపిణీని నిలుపుదల చేశారు. ఎన్నిరోజులు ఈ కష్టాలని చంద్రబాబు ప్రభుత్వంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులుగా డీజిల్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. డీజిల్ దొరక్కపోవడంతో ఇంటి దగ్గరే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆటో మీద తెచ్చిన ఫైనాన్స్ను ఎలా చెల్లించాలో అర్థం కావడం లేదు. పాలకులు చర్యలు తీసుకుని డీజిల్ను అందుబాటులోకి తీసుకురావాలి. – ఉరుకుందు, ఆటో డ్రైవర్, ఎమ్మిగనూరు -
నేరగాళ్లపై పీడీకిలి
● నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్కర్నూలు: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ నేరాలకు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని పోలీసు అధికారులకు ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నెలవారీ నేర సమీక్ష సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నేరాల నియంత్రణకు డ్రోన్ కెమెరాలను సమర్థవంతంగా వినియోగించాలన్నారు. పీజీఆర్ఎస్ పిటిషన్లను నిర్లక్ష్యం చేయకుండా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని వేగంగా పరిష్కరించాలని సూచించారు. ఫోక్సో కేసులలో 60 రోజుల లోపు చార్జి షీట్లు నమోదు చేయాలని ఆదేశించారు. ప్రాపర్టీ కేసులను ఛేదించి రికవరీ శాతాన్ని పెంచాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగం ఊడుతుంది! డయల్ 112 కాల్స్పై నిర్లక్ష్యం వహిస్తే ఉద్యోగం ఊడుతుందని ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. పెండింగ్ కేసుల దర్యాప్తులను పకడ్బందీగా చేయాలని, రాత్రి గస్తీలు, విజిబుల్ పోలీసింగ్ను బలోపేతం చేయాలని సూచించారు. రాత్రివేళల్లో గస్తీ తిరిగే పోలీసు బృందాలు మొబైల్ చెక్ డివైజ్ పరికరంతో అనుమానితుల వేలిముద్రలను సేకరించాలని, అది నేర పరిశోధనకు బాగా పనిచేస్తుందన్నారు. సీసీఎస్ పోలీసులు పనితీరును మెరుగుపరచుకోవాలని, గట్టిగా పనిచేయకపోతే శాఖపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రొబేషనరీ ఎస్ఐలు విధుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు. అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, లీగల్ అడ్వైజర్ మల్లికార్జునరావు, డీఎస్పీలు వెంకటరామయ్య, ఉపేంద్ర బాబు, భార్గవి, సీఐలు, ఎస్ఐలు సమావేశంలో పాల్గొన్నారు. -
వీఓఏలకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ
కర్నూలు(సెంట్రల్): గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల (వీఏఓ)కు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆమె తన కార్యాలయంలో 908 వీఏఓలకు శ్యామ్సంగ్ 5జీ స్మార్ట్ ఫోన్లను అందజేశారు. స్వయం సహాయక సంఘాలకు వీఏఓలు అందించే సేవలు చాలా ఉంటాయని, వారికి అవసరమైన సాంకేతికను అందిస్తే మరింత సేవ చేసే అవకాశం ఉండడంతో 5జీ స్మార్ట్ ఫోన్లను ప్రభుత్వం ఇచ్చినట్లు చెప్పారు. కార్యక్రమలో డీఆర్డీఏ పీడీ రమణారెడ్డి పాల్గొన్నారు. మల్లన్న సేవలో ఎస్సీ కమిషన్ చైర్మన్ శ్రీశైలంటెంపుల్: శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్.జవహర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. గురువారం ఉదయం మల్లన్న దర్శనార్థం ఆలయం వద్దకు విచ్చేసిన ఎస్సీ కమిషన్ చైర్మన్, సభ్యులకు ఆలయ ఏఈవో వెంకటేశ్వరరావు, అధికారులు, అర్చకస్వాములు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం చైర్మన్ స్వామివారికి రుద్రాభిషేకం, భ్రమరాంబాదేవికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం అమ్మవారి ఆలయం వద్ద ఉన్న ఆశీర్వచన మండపంలో ఆయనకు వేదపండితులు వేదమంత్రాలు పలుకగా, అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. అధికారులు స్వామివారి శేషవస్త్రాలను, లడ్డూప్రసాదాలను అందించి సత్కరించారు. ఎస్సీ కమిషన్ చైర్మన్ వెంట కమిషన్ సభ్యులు గౌతమ్రాజు, దాసు తదితరులు ఉన్నారు. -
‘పొరుగు’ మద్యాన్ని కట్టడి చేయాలి
● పంచలింగాల చెక్పోస్టులో తనిఖీ చేసిన డిప్యూటీ కమిషనర్ కర్నూలు: జిల్లాలోకి పొరుగు రాష్ట్రాల మద్యం కాకుండా నిరంతరం తనిఖీలు చేస్తూ కట్టడి చేయాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ నోడల్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి ఎకై ్సజ్ అధికారులకు సూచించారు. గురువారం కర్నూలు శివారు హైదరాబాదు రోడ్డులో ఉన్న పంచలింగాల ఎకై ్సజ్ చెక్పోస్టును జిల్లా అధికారి సుధీర్ బాబుతో కలసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇక్కడ ఇద్దరు సీఐలు, ఒక ఎస్ఐ ఐదుగురు సిబ్బంది రెండు షిఫ్టులలో విధులు నిర్వహిస్తుంటారు. అక్కడున్న రికార్డులను డిప్యూటీ కమిషనర్ తనిఖీ చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి స్పిరిట్ ట్యాంకర్లు జిల్లాలోకి వస్తే ఖచ్చితంగా రిజిస్టర్లో నమోదు చేయాలని, అలాగే అనుమానిత వాహనాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. షిఫ్ట్ విధానంలో అప్రమత్తంగా ఉంటూ సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ తనిఖీలు నిర్వహించాలన్నారు. గంజాయి, మద్యం, మాదక ద్రవ్యాలు వంటి అక్రమ రవాణాపై కూడా గట్టిగా నిఘా ఉంచాలని సూచించారు. ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి, సీఐలు చంద్రహాస్, రాజేంద్రప్రసాద్, తదితరులు కూడా డీసీ వెంట ఉన్నారు. ఈ సందర్భంగా వారు కొన్ని అనుమానిత వాహనాలను కూడా తనిఖీ చేశారు. లా సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదల కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో ఫిబ్రవరిలో నిర్వహించిన లా 3, 5 సంవత్సరాల కోర్సుల 3, 5, 7, 9 సెమిస్టర్, డిగ్రీ 6వ సెమిస్టర్ల రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ ఎన్.నరసింహులు తెలిపారు. వర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ వి.వెంకట బసరావు ఆదేశాల మేరకు ఫలితాలు విడుదల చేశామన్నారు ఫలితాలు https:// rayalaseemauniversity.ac.in వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. -
నేడు సీక్యాంప్ రైతుబజార్ బంద్
కర్నూలు(అర్బన్): నగరంలోని సీ క్యాంప్ రైతు బజార్ను ఈ నెల 24వ తేదీన ( శుక్రవారం ) బంద్ చేస్తున్నట్లు ఎస్టేట్ ఆఫీసర్ కళ్యాణి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి నెలలో ఒక రోజు రైతు బజార్ను పూర్తి స్థాయిలో శుభ్రం చేయాల్సి ఉన్నందున ఈ బంద్ను నిర్వహిస్తున్నామన్నారు. పరిశుభ్రత పనులు చేపడుతున్న దృష్ట్యా ఎలాంటి వ్యాపారాలు జరగబోవన్నారు. యథాతథంగా శనివారం రైతు బజార్ పునః ప్రారంభం అవుతుందన్నారు. ఈ విషయాన్ని రైతులు గుర్తించాలన్నారు. ఇద్దరు విద్యార్థులకు ‘షైనింగ్’ అవార్డులు కర్నూలు సిటీ: కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన ఇద్దరు విద్యార్థులు షైనింగ్ స్టార్స్ అవార్డులకు ఎంపికై నట్లు సమగ్ర శిక్ష అదనపు కో–ఆర్డినేటర్ డా.ఎన్.బి లోకరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కల్లూరు కేజీబీవీల్లో చదివిన షేక్ ఆఫ్రీన్ ఒకేషనల్ గ్రూప్ కంప్యూటర్ సైన్స్లో 990 మార్కులు సాధించారని, పంచలింగాల కేజీబీవీకి చెందిన గుడిసె చందన ఒకేషనల్ గ్రూప్ అకౌంటెన్సీ–టాక్సేషన్లో 987 మార్కులు సాధించారని పేర్కొన్నారు. వీరిద్దరూ షైనింగ్ స్టార్స్ అవార్డులకు ఎంపికయ్యారన్నారు. కోవెలకుంట్ల: గతేడాది ఆగస్టు నెలలో జరిగిన చైన్స్నాచింగ్ కేసులో దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. కోవెలకుంట్ల పోలీస్ సర్కిల్ కార్యాలయంలో గురువారం సీఐ హనుమంతునాయక్ వివరాలు వెల్లడించారు. పట్టణంలోని సత్యసాయిబాబా ఆలయ సమీపంలో నివా సం ఉంటున్న లక్ష్మీకుమారి గతేడాది ఆగస్టు 24వ తేదీన ఇంటి పక్కన మహిళలతో వాకింగ్కు వెళ్లింది. ఆ సమయంలో మహిళల వద్దకు గుర్తు తెలియని 35 ఏళ్ల వయస్సు కలిగిన ఓ వ్యక్తి వారి వెనుకనే వాకింగ్ చేస్తున్నట్లు నటించి వారిని దాటే వెళ్లే సమయంలో లక్ష్మికుమారి మెడలో ఉన్న నల్లపూసలదండ, బంగారు గొలుసు లాక్కొని ముందుకు పరిగెత్తాడు. కొంతదూరంలో మరో వ్యక్తి బైక్తో సిద్ధంగా ఉండగా ఆ బైక్ ఎక్కి ఇద్దరు అక్కడి నుంచి గుంజలపాడు గ్రామం వైపు పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా దొంగలను గుర్తించి కోవెలకుంట్ల ఎస్ఐ మల్లికార్జునరెడ్డి దర్యాప్తు చేపట్టి కేసు మిస్టరీని చేధించారు. అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన షేక్ తహలిబ్ ఉసేన్, షేక్ దిల్వర్ చోరికి పాల్పడినట్లు విచారణలో తేలడంతో వారిని అరెస్ట్ చే సి నల్లపూసలదండ, బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు దొంగలను కోర్టులో హాజరు పరుచగా మేజిస్ట్రేట్ రిమాండ్కు ఆదేశించినట్లు సీఐ పేర్కొన్నారు. -
డిగ్రీ పరీక్షల్లో ఆరుగురు డిబార్
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో ఆరుగురు డిబార్ అయ్యారు. బుధవారం జరిగిన నాలుగో సెమిస్టర్ పరీక్షలకు 8,338 మందికి 7,525 మంది విద్యార్థులు హాజరు కాగా 807 మంది గైర్హాజరయ్యారు. ఓర్వకల్ జడ్పీహెచ్ కేంద్రంలో ముగ్గురు, నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆళ్లగడ్డ కేవీ సుబ్బారెడ్డి డిగ్రీ కళాశాల, కోడుమూరు శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఆరుగురు విద్యార్థులు చూచిరాతలకు పాల్పడగా వారిని డిబార్ చేసినట్లు వర్సిటీ పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ ఎన్.నరసింహులు తెలిపారు. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు దరఖాస్తు చేసుకోవాలి కర్నూలు(అర్బన్): నగరంలో ఏర్పాటు చేయనున్న సఖీ నివాస్ ( వర్కింగ్ ఉమెన్ హాస్టల్ ) కోసం మానవ వనరుల సరఫరా నిమిత్తం నమోదిత అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా శిశు అభివృద్ధి, సాధికారత అధికారి పి. విజయ బుధవారం ఒక ప్రకటనలో కోరారు. మొత్తం ఆరు పోస్టులకు అర్హత కలిగిన సంస్థలు ఈ నెల 27వ తేదీలోగా దరఖాస్తులలు అందజేయాలన్నారు. ఇతర వివరాల కోసం కర్నూలు కలెక్టరేట్లోని జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి సాధికారత అధికారి కార్యాలయంలో సంప్రదించాలని ఆమె కోరారు. 24 న హ్యాండ్బాల్ ఎంపిక పోటీలు కర్నూలు (టౌన్) : ఈ నెల 24 వ తేదీ స్థానిక బి. క్యాంపు క్రీడా మైదానంలో జిల్లా స్థాయి అండర్–19 విభాగంలో బాల బాలికల జట్లకు ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా హ్యాండ్బాల్ సంఘం కార్యదర్శి పి.సువర్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిభ కనబరచి ఎంపికై న క్రీడాకారులు వచ్చే నెల 9, 10 తేదీల్లో కదిరి పట్టణంలో జరిగే రాష్ట్ర స్థాయి జూనియర్ హ్యాండ్బాల్ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. పాల్గొనదలచిన క్రీడాకారులు వెంట వయస్సు ధ్రువీకరణ పత్రం తెచ్చుకోవాలని సూచించారు. బైక్లు ఢీ.. వ్యక్తి మృతి పాములపాడు: మండలంలోని వేంపెంట గ్రామం వద్ద బ్రిడ్జిపై బుధవారం ఎదురెదురు గా బైక్లు ఢీకొని ఒకరు దుర్మరణం చెందారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. వెలుగోడు ద్వారకా నగర్కు చెందిన సయ్యద్నూర్ (46) బైక్పై వెలుగోడుకు బయలుదేరాడు. బానుముక్కల గ్రామానికి చెందిన జాకీర్ వెలుగోడు నుంచి స్వగ్రామానికి వస్తున్నాడు. బ్రిడ్జి వద్దకు రాగానే సయ్యద్నూర్ ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టడంతో ఇద్దరూ కిందపడ్డారు. ఈ ఘటనలో నూరు మృతిచెందగా జాకీర్కు గాయాలయ్యాయి. మృతుడికి భార్య సయ్యద్ రమిజా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తగ్గిన వేరుశనగ ధర ఎమ్మిగనూరుటౌన్: స్థానిక వ్యవసాయ మార్కెట్లో వేరుశనగ ధర క్వింటం రూ.6,670కు పడిపోయింది. బుధవారం మార్కెట్కు వేరుశనగ దిగుబడులు 190 క్వింటాళ్లు విక్రయానికి రాగా అందులో క్వింటం ధర గరిష్టంగా రూ.6,670 పలికినట్లు మార్కెట్ యార్డ్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు. కనిష్ట ధర క్వింటం రూ.5,490, మధ్యస్థ ధర రూ.6,080 పలికినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఆముదాలు 34 క్వింటాళ్లు విక్రయానికి రాగా కనిష్ట ధర క్వింటం రూ.5,870, మధ్యస్థ ధర రూ.5,890, గరిష్ట ధర రూ.5,910, కందులు కేవలం రెండు క్వింటాళ్లు విక్రయానికి రాగా గరిష్ట ధర రూ.6,520 పలికిందన్నారు. బావిలో పడి వివాహిత మృతి నందవరం: ప్రమాదవశాత్తూ బావిలో పడి వివాహిత మృతి చెందాడు. మండల పరిధిలోని ఇబ్రహీంపురం గ్రామంలో బుధవారం ఈ సంఘటన జరిగింది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఇబ్రహీంపురం గ్రామానికి చెందిన కురవ మల్లేశ్వరి (45) బుధవారం బట్టలు ఉతకడానికి స్థానిక బావి వద్దకు వెళ్లింది. బట్టలు ఉతికే సమయంలో ప్రమాదవశాత్తూ కాలు జారి బావిలో పడిపోయింది. బంధువుల పెళ్లి నిమిత్తం నదికై రవాడి గ్రామానికి వెళ్లిన ఆమె భర్త మల్లికార్జున మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. ఇంట్లో భార్య మల్లేశ్వరి కనిపించకపోడంతో చుట్టు పక్కల గాలించాడు. ఎక్కడా కనిపించకపోవడంతో బావి వద్దకెళ్లి చూడగా గట్టుపై బట్టలు, చెప్పులు కనిపించాయి. అనుమానంతో గ్రామస్తుల సాయంతో ట్రాక్టర్ల ద్వారా బావిలోని నీరు తోడించగా భార్య మృతదేహం లభించింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. -
ఎన్నికల హామీలు అమలు చేయాలి
● బీసీ గళం పోస్టర్ల ఆవిష్కరణలో కాటసాని రాంభూపాల్రెడ్డి నంద్యాల: బీసీలకు ఎన్నికల సమయంలో కూటమి సర్కారు అనేక హామీలు ఇచ్చిందని, వాటిని వెంటనే అమలు చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలోని అన్నపూర్ణ హోటల్లో పార్టీ నాయకులతో కలిసి వైఎస్సార్సీపీ బీసీ గళం పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ బీసీలకు చంద్రబాబు ఇచ్చిన హామీల అమలుకు ఈనెల 26వ తేదీ అనంతపురంలో బీసీ గళం సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వైఎస్సార్సీపీ శ్రేణులు, బీసీలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ పోచాబ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్బాషా, వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పరిశీలకురాలు కల్పలతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి, నందికొట్కూరు వైఎస్సార్సీపీ సమన్వయకర్త దారా సుధీర్, మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ పీపీనాగిరెడ్డి, నాయకులు సూర్యనారాయణరెడ్డి, దాల్మిల్ అమీర్బాషా, శిల్పాభువనేశ్వరరెడ్డి, సాయిరాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
పెద్దపాడు సంజీవయ్య బాలసదన్ హాస్టల్ తనిఖీ
కర్నూలు : నగర శివారులోని పెద్దపాడులో ఉన్న దామోదరం సంజీవయ్య బాలసదన్ హాస్టల్ను న్యా య సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాలసదన్ లోని అపరిశుభ్ర పరిస్థితులను చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. పిల్లలకు అందుతున్న భోజన వస తి సదుపాయాల గురించి విచారించగా నాణ్యమైన భోజనం పెట్టడం లేదని, గుడ్లు అందరికీ సరఫరా చేయడం లేదని విద్యార్థులు జడ్జికి విన్నవించారు. దీంతో అక్కడి సిబ్బందిపై లీలా వెంకటశేషాద్రి ఆగ్రహం వ్యక్తం చేసి పిల్లలకు సరైన సమయంలో నాణ్యమైన భోజనం, అందరికీ గుడ్లు ఖచ్చితంగా పంపిణీ చేయాలని ఆదేశించారు. నిర్వహణకు సంబంధించిన రికార్డులను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. -
రాష్ట్రంలో నిరంకుశ పాలన
● వెంకట్రామిరెడ్డిపై వేటు దుర్మార్గ చర్య ● వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుమలేశ్వర్ రెడ్డి కర్నూలు (టౌన్): రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంకుశ పాలన సాగిస్తున్నాడని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ మేధావుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాటిల్ తిరుమలేశ్వర రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం నగరంలోని ఎస్వీ కాంప్లెక్స్లో ఉన్న పార్టీ సమావేశ హాలులో ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రశ్నించేవారిపై దాడులు, అరెస్టు చేయడం వంటి చర్యలకు పాల్పడుతుందన్నారు. తాజాగా ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డిని ఉద్యోగంలో నుంచి తొలగించడం కూడా అందులో భాగమేనన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై గళం విప్పడమే వెంకట్రామిరెడ్డి చేసిన తప్పా అని చంద్రబాబు సర్కారును ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు అన్న ము ద్ర వేసి ఆయనపై వేటు వే యడం దుర్మార్గమన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న అశోక్బాబు టీడీపీ కార్యకర్తలా పనిచేశారన్నారు. మరి ఎందుకు ఆయనను అప్పట్లో డిస్మిస్ చేయలేదన్నారు. మీకు అనుకూలంగా ఉంటే ఒక న్యాయం.. ఇతరులకై తే మరో న్యాయమా అని ప్రశ్నించారు. చంద్రబాబు పాలన పట్ల ఉద్యోగులు ఆగ్రహంగా ఉన్నారన్నారు. త్వరలోనే వారు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపే పరిస్థితి ఉందన్నారు. ఇప్పటికై నా ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలుకు చర్యలు తీసుకోవాలన్నారు. విస్మరిస్తే వచ్చే ఎన్నికల్లో వారు కూటమిసర్కారుకు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. -
కాలేయానికి కష్టం!
శరీరంలో ఏ భాగానికి ఇబ్బంది కలిగినా అవి మనకు హెచ్చరిక చేస్తాయి. కానీ కాలేయం మాత్రం తనకు ఎంత ఇబ్బంది కలిగినా ఓర్పు, సహనంతో పనిచేసుకుంటూ పోతుంది. ఇదే మనుషుల పాలిట శాపంగా మారుతోంది. పసిరికలు, కడుపు ఉబ్బరం వంటి లక్షణాలు కనిపించే సమయానికి కాలేయానికి గణనీయమైన నష్టం జరిగి ఉంటోంది. ఈ కారణంగానే ఈ అవయవాన్ని కాపాడుకోలేకపోతున్నారు. మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలి ఇందుకు ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని గ్యాస్ట్రో ఎంట్రాలజి విభాగం (జీర్ణకోశవ్యాధుల విభాగం)లో ప్రతిరోజూ ఓపీ చికిత్స అందిస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ విభాగానికి రోగు ల తాకిడి అధికమైంది. ముఖ్యంగా కాలేయ సమస్యలతో బాధపడే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇందులో జీవనశైలి సమస్యలు,ఆహారం విషతుల్యం కావడం,ఇన్ఫెక్షన్లు, మద్యపానం తదితర కారణాల తో కాలేయం దెబ్బతిని చికిత్స కోసం వచ్చే వారు అధికమవుతున్నారు. ఈ ఆసుపత్రితో పాటు నగరంలోని ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్లలో ఉన్న గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు, జనరల్ ఫిజీషియన్ల వద్దకు ప్రతిరోజూ 1,500 మంది దాకా వివిధ రకాల జీర్ణకోశ వ్యాధుల తో వస్తుండగా అందులో పావు భాగం మద్యపానం కారణంగా కాలేయ సమస్యలకు గురైన వారే ఉంటున్నారని వైద్యులు చెబుతున్నారు. మిగిలిన వారిలో ఆహారపు అలవాట్లు, వంశపారంపర్యం, హెపటైటిస్–బి,సి వైరస్ వంటి ఇన్ఫెక్షన్ల కారణంగా కాలేయం దెబ్బతింటోంది. కొంపముంచుతున్న మద్యపానం సరదాగా స్నేహితులతో ప్రారంభమయ్యే మద్యపా నం అలవాటు కొన్నాళ్లకు వ్యసనమై కాలేయానికి పెనుముప్పుగా మారుతోంది.వ్యసనపరులకు ప్రతి రోజూ మద్యం ముట్టనిదే రోజు గడవని పరిస్థితి ఉంటోంది.ఈ కారణంగా శరీరంలో ముందుగా కాలేయం,దాంతో పాటు గుండె,రక్తనాళాలు దెబ్బతింటున్నాయి. కొందరిలో బీపీ,షుగర్ వ్యాధులూ వస్తున్నాయి. కాలేయ సమస్యలతో వైద్యుల వద్దకు వస్తున్న వారిలో 25 శా తం మద్యపానం వల్లేనని నిర్ధారణ అవుతోంది. ప్ర భు త్వం నాణ్యమైన మద్యం పేరుతో దుకాణాలు పెంచి విచ్చలవిడిగా సరఫరా చేస్తోంది. వ్యసనపరులు రాత్రి పగలు అనే తేడా లేకుండా మద్యం తాగి ఒళ్లుగుల్ల చేసుకుంటూ కాలేయ వ్యాధుల భారిన పడుతున్నారు. కాలేయ వ్యాధి లక్షణాలు కాలేయ సమస్యలతో బాధపడే వారిలో కాళ్లు, చీలమండలాల్లో వాపు, ఆకలి లేకపోవడం, వికారం, వాంతులు, జ్వరం, కామెర్లు, కడుపునొప్పి, మూ త్రం రంగులో మార్పు, పొట్టుచుట్టూ దురద, ఎరు పు చర్మం, మలంలో రక్తం పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎవ్వరిలోనైనా ఈ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను కలిసి చికిత్స తీసుకోవాలి. ప్రారంభ దశలో చికిత్స తీసుకుంటే నయం చేసుకునే అవకాశం ఉంటుంది. వ్యాధి ముదిరాక తీసుకుంటే ఫలితం ఉండదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సంవత్సరం ఓపీడీ ఎండోస్కోపిలు కాలేయ సమస్యల మద్యపానంతో 2021 12,131 3,024 940 13 2022 14,065 3,700 1,062 36 2023 14,837 5,965 1,303 41 2024 17,578 6,104 1,450 61 2025 18,612 7,115 1,518 65 2026 5,790 1,824 495 19 (ఇప్పటివరకు)కాలేయ వ్యాధులతో బాధపడే వారి సంఖ్య పెద్దాసుపత్రిలోని గ్యాస్ట్రో ఎంట్రాలజి విభాగంలో ఇటీవల పెరిగింది. చికిత్స కోసం వచ్చే వారికి అవసరమైన వైద్యపరీక్షలు, మందులు, చికిత్స ఉచితంగా అందిస్తున్నాము. కేంద్ర ప్రభుత్వ సహకారంతో హెపటైటిస్–బి,సి వ్యాధులతో బాధపడే వారికి ఖరీదైన మందులను ఉచితంగా ఇస్తున్నాము. కాలేయం దెబ్బతినకుండా ఉండాలంటే మద్యపానానికి కూడా దూరంగా ఉండాలి. – డాక్టర్ జి.మోహన్రెడ్డి, హెచ్ఓడీ, గ్యాస్ట్రో ఎంట్రాలజి విభాగం, జీజీహెచ్, కర్నూలుగత రెండు దశాబ్దాల్లో కాలేయ శస్త్రచికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ల్యాపరోస్కోపిక్ సర్జరీల ద్వారా చిన్నకోతలతో ట్యూమర్లు తొలగించడం, తక్కువ రక్తస్రావం, త్వరితగతిన కోలుకోవడం సాధ్యమవుతోంది. దేశంలో లివర్ డోనర్ కొరత ఉన్న నేపథ్యంలో ట్రాన్స్ప్లాంటేషన్ ఎంతో కీలకంగా మారింది. –డాక్టర్ ఎస్.జె.జానకిరామ్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు, కర్నూలు ప్రమాదంలో ప్రధాన అవయవం ఒకవైపు ఫ్యాటీ లివర్, మరోవైపు హెపటైటిస్ వేధింపు మద్యపానమే అసలు సమస్య జిల్లాలో పెరుగుతున్న కాలేయ బాధితులు -
జూనియర్ పేరుతో సీనియర్ ర్యాగింగ్ మెసేజ్లు
● కేఎంసీలో ర్యాగింగ్ విషయంపై విచారణ ● సీనియర్ల మధ్య గొడవే కారణమని అధికారుల వెల్లడి కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజీ లోని వసతి గృహంలో ఎంబీబీఎస్ చదువుతున్న సీనియర్ విద్యార్థుల అంతర్గత సమస్యలతోనే ర్యాగింగ్ పేరుతో మెసేజ్ల రూపంలో ఫిర్యాదు చేశారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ వెల్లడించారు. బుధవారం ఆమె తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడా రు. కాలేజీలో ఎలాంటి ర్యాగింగ్ జరగలేదని తమ విచారణలో తేలిందన్నారు. కళాశాలలో ర్యాగింగ్ జరుగుతోందంటూ పదే పదే ఈమెయిల్ మెసేజ్లు వస్తుండగా వాటి తీవ్రత దృష్ట్యా కళాశాల ర్యాగింగ్ వ్యతిరేక కమిటీ మూడు రోజుల పాటు వసతి గృహంలో విచారణ జరిపిందన్నారు. ఇందుకు పోలీసుల సహకారం కోరామన్నారు. తమ విచారణలో వసతి గృహంలో, కళాశాలలో ఉన్న విద్యార్థులందరినీ ప్రశ్నించామని, భయపడకుండా నేరుగా తమ వద్దకు వచ్చి జరిగిన విషయం చెప్పాలని చెప్పినా ఎవ్వరూ ర్యాగింగ్ జరుగుతున్నట్లు చెప్పలేదన్నారు. మెయిల్స్ను పోలీసులు ఛేదించగా అసలు విషయం బయటపడిందన్నారు. ప్రస్తుతం ఫైనలియర్కు వెళ్లబోతున్న ఓ సీనియర్ విద్యార్థి తన మెయిల్ నుంచి మూడో సంవత్సరం విద్యార్థి పేరుతో తప్పుడు మెయిల్స్ పంపించినట్లు వెల్లడైందన్నారు. వారిద్దరినీ పిలిచి ఆధారాలతో విచారణ చేయగా తామే చేసినట్లు తెలిపారన్నారు. సీనియర్ల మధ్య ఉన్న అంతర్గత సమస్యల కారణంగానే ఇలాంటి మెసేజ్లు పెట్టారన్నారు.హాస్టల్లో మొదటి సంవత్సరం విద్యార్థులు ఉండేందుకు ప్రత్యేక భవనం ఏర్పాటు చేశామన్నారు. తప్పుడు మెయిల్స్ పెట్టిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే ఆ విద్యార్థిని హాస్టల్ నుంచి పంపించేశామన్నారు. సమావేశంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సింధియా శుభప్రద, డాక్టర్ శ్రీరాములు(వార్డెన్), యాంటి ర్యాగింగ్ కమిటీ కన్వీనర్ డాక్టర్ రామకృష్ణనాయక్, టూటౌన్ సీఐ శ్రీధర్ పాల్గొన్నారు. -
పోలీసు శాఖలో బదిలీలు
కర్నూలు : పోలీసు శాఖలో ఏళ్ల తరబడి పాతుకుపోయిన, ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురిపై బదిలీ వేటు పడింది. డీజీపీ కార్యాలయ ఉత్తర్వుల మేరకు సాధారణ బదిలీల్లో భాగంగా బుధవారం 15 మంది ఏఎస్ఐలు, 25 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 93 మంది కానిస్టేబుళ్లు కలిపి మొత్తం 133 మందిని బదిలీ చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరాతో కలసి కౌన్సెలింగ్ నిర్వహించి ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీసు సిబ్బంది బదిలీల ప్రక్రియను పూర్తి చేసి అందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. ఒకే స్టేషన్లో ఐదేళ్లు పూర్తిచేసుకున్న పోలీసులకు నిబంధనల ప్రకారం బదిలీల ప్రక్రియ చేపట్టారు. గతంలో పనిచేసిన పోలీస్స్టేషన్లు కాకుండా సొంత మండలం, నియోజకవర్గం మినహాయించి ఇతర పోలీస్స్టేషన్లలో ఖాళీగా ఉన్న వాటిని బోర్డుపై చూపించి ఐదు ఆప్షన్లు ఇచ్చి కోరుకున్న స్థానాలకు నియమిస్తూ బదిలీ చేశారు. బదిలీ అయినవారు ప్రస్తుతం పనిచేస్తున్న స్టేషన్ విధుల నుంచి వెంటనే వైదొలిగి కేటాయించిన స్టేషన్లో బాధ్యతలు చేపట్టాలని ఎస్పీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మెసేజ్ ద్వారా కౌన్సెలింగ్కు పిలుపు... బదిలీలకు సంబంధించిన జాబితా ముందుగానే సిద్ధం చేసి శాంతి భద్రతలు, ట్రాఫిక్, మహిళతో పాటు ఇతర విభాగాల్లో పనిచేస్తున్న వారికి కమ్యూనికేషన్ విభాగం ద్వారా ముందురోజు మెసేజ్ రూపంలో సమాచారం పంపారు. ఉదయమే సిబ్బంది అంతా జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకున్నారు. పోలీస్ స్టేషన్లతో పాటు వివిధ విభాగాల్లో ఐదేళ్లు పూర్తి చేసుకున్న కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ వరకు బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. అనారోగ్యం, స్పౌజ్ కేసులకు ప్రాధాన్యత కల్పించారు. పోలీసు సిబ్బందికి కోరుకున్న చోటుకే నియమించడంతో అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారని పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు నాగరాజు సిబ్బంది తరఫున ఎస్పీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. డీపీఓ ఏఓ విజయలక్ష్మితో పాటు సిబ్బంది ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. -
నీరు వదలకపోతే నేనే వస్తా!
● అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డిఆదోని అర్బన్: ‘ఎండాకాలంలో నీరు వదలకపోతే ప్రజలు ఎలా జీవించేది.. తమాషా చేస్తున్నారా.. నీరు వదలకపోతే నేనే అక్కడికి వచ్చి కూర్చుంటా... వెంటనే నీరు వదలండి.. లేదంటే ట్యాంకర్లను అయినా పంపండి’ అంటూ అధికారులపై ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదోని పట్టణంలోని బండిమెట్ట కాలనీవాసులు వారం రోజులైనా నీరు వదలడంలేదని బిందెలు పట్టుకుని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి స్వగృహానికి బుధవారం వచ్చారు. దీంతో ఆశ్చర్యపోయిన మాజీ ఎమ్మెల్యే... తన దగ్గరకు ఎందుకు వస్తారు, ఎమ్మెల్యే ఉన్నారు కదా అక్కడికి వెళ్లండి అని సమాధానం చెప్పారు. దీంతో కాలనీవాసులు ‘ఎమ్మెల్యే ఎక్కడున్నాడు.. యాడుంటారో మాకు తెలియదు... మాకు మీరే ఎమ్మెల్యే మీరే అన్నీ’ అని చెప్పడంతో వెంటనే మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి సంబంధిత మున్సిపల్ అధికారులకు ఫోన్ చేశారు. నీరు వదలాలని, లేదంటే ట్యాంకర్లను అయినా పంపాలని ఆదేశించారు. నీరు వదలకపోతే నేను అక్కడికి వచ్చి కూర్చుంటాను అని హెచ్చరించారు. వెంటనే నీరు వదిలి తన ఫోన్ చేయాలన్నారు. అధికారులకు ఫోన్ చేసిన గంటలోనే సమస్యకు పరిష్కారం లభించింది. దీంతో ప్రజలు తమ దాహార్తిని తీర్చిన మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డికి కృతజ్ఞతలు చెప్పారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం
సి.బెళగల్: బైక్ అదుపుతప్పి కిందపడిన ఘటనలో ఒకరు మృతిచెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఎస్ఐ వేణుగోపాల్రాజు తెలిపిన వివరాల మేరకు... మండలంలోని గుండ్రేవుల గ్రామానికి చెందిన కొంకల సోమిరెడ్డి (29) పనిమీద కర్నూలుకు వచ్చారు. తిరిగి వెళ్లే సమయంలో పరిచయస్తులైన తెలుగు వీరేష్, తెలుగు రాఘవేంద్రతో కలిసి బైక్పై మంగళవారం రాత్రి బయలుదేరాడు. ఇనగండ్ల గ్రామ సమీపంలో గాలితో కూడిన వర్షానికి తోడు ఎదురుగా వచ్చే వాహనాల లైటింగ్కు దారి కనిపించకపోవడంతో బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కన పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో అటుగా వెళ్తున్న వాహన దారులు గాయపడిన వారిని గుర్తించి, వారి కుటంబ సభ్యులకు సమాచారం ఇచ్చి చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే కొంకల సోమిరెడ్డి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తెలుగు వీరేష్, తెలుగు రాఘవేంద్ర పరిస్థితి సైతం విషమంగా ఉంది. సోమిరెడ్డికి భార్య తులసి, పది నెలల కుమారుడు ఉన్నాడు. మృతుడి తండ్రి వెంకటేశ్వరరెడ్డి ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వేణుగోపాల్ రాజు తెలిపారు. మరో ఇద్దరి పరిస్థితి విషమం -
ఆసుపత్రిలో మాయమై ... శ్మశానంలో ఖననమై
ఆత్మకూరురూరల్: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి ఆపై కనిపించకుండా పోయిన వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాలు ఇలా.. ఆత్మకూరు మండలం వడ్లరామాపురం గ్రామానికి చెందిన సుగులూరి శేఖర్(47)అనారోగ్యంతో కర్నూలు సర్వజన ఆసుపత్రిలో ఈనెల 13 వ తేదీన చేరారు. ఆయన భార్య జయమ్మ మందులు తీసుకు రావడానికి బయటకు వెళ్లివచ్చిలోపు శేఖర్ కనిపించ లేదు. ఎంత వెతికినా ఆయన ఆచూకీ చిక్కక పోవడంతో జయమ్మ స్థానిక మూడో పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ నెల 18 న పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ సభ్యులు శేఖర్ ఫొటోతో కరపత్రాలు ముద్రించి గోడలకు అతికించా రు. స్థానిక శ్మశాన వాటికలో పనిచేసే ఓ వ్యక్తి ఆ ఫొటోను చూసి తమ వద్దకు అనాథ శవంగా రాగా అంత్యక్రియలు చేసినట్లు శేఖర్ కుటుంబసభ్యులకు సమాచారమిచ్చాడు. వారు ఈ విషయం పోలీసులకు తెలియజేయడంతో బుధవారం మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం చేసి కుటుంబసభ్యులకు అప్పగించారు. పోస్ట్మార్టం రిపోర్ట్ వస్తే ఎలా చనిపోయాడో తెలుస్తుందని, ప్రస్తుతానికి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు. -
అనుమతి లేని విత్తనాలు విక్రయిస్తే చర్యలు
ఎమ్మిగనూరురూరల్: ఎవరైనా వ్యాపారులు అనుమతిలేని విత్తనాలు రైతులకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఏడీఏ మహమ్మద్ఖాద్రి హెచ్చరించారు. పట్టణంలోని ఎరువులు, విత్తనాల విక్రయ దుకాణాల్లో బుధవారం ఏవో శివశంకర్లతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఏడీఏ మాట్లాడుతూ పట్టణంలోని ట్యాంక్ బండ్ రోడ్డులో గల భారత్ సీడ్స్ దుకాణంలో పత్తి విత్తన ప్యాకెట్లను అనుమతి లేకుండా విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు. రూ. 3,60,400 విలువ గల 400 ప్యాకెట్లను సీజ్ చేయటంతో పాటు 6ఏ కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అలాగే బిస్మిల్లా హైబ్రీడ్ సీడ్స్ దుకాణంలో 129 మొక్కజొన్న విత్తనాల ప్యాకెట్లు అనుమతి లేకుండా విక్రయిస్తున్నట్లు గుర్తించి వాటిని సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు చెప్పారు. సీజ్ చేసిన మొక్కజొన్న విత్తనాల విలువ రూ. 1,37,616 ఉంటుందన్నారు. మలేరియా నివారణ మన చేతుల్లోనే.. కర్నూలు(హాస్పిటల్): మలేరియా నివారణ మన చేతుల్లోనే ఉందని, ప్రతి ఒక్కరూ వ్యాధిపై అవగాహన పెంచుకుని దోమకాటుకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కర్నూలు మెడికల్ కాలేజి వైస్ ప్రిన్సిపాల్, కమ్యూనిటీ మెడిసిన్ హెచ్ఓడీ డాక్టర్ సింధియా శుభప్రద సూచించారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కర్నూలు మండలం దిన్నెదేవరపాడు గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు వైద్య విద్యార్థులు గ్రామంలో ఇంటింటికి తిరిగి మలేరియా వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించారు. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని డాక్టర్ సింధియా సూచించారు. కార్యక్రమంలో కమ్యూనిటీ మెడిసిన్ వైద్యులు వైష్ణవి, పుష్పలత, యాస్మిన్, బ్రయాన్, లెక్చరర్ సురేష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో అరాచక పాలన
● ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిచిప్పగిరి: హామీలు అమలు చేయాలని అడిగినందుకు ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డిని విధుల నుంచి డిస్మిస్ చేయడం ప్రభుత్వ ‘రెడ్బుక్’ అరాచక పాలనకు నిదర్శమని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అన్నారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో బుధవారం విలేకరులతో ఎమ్మెల్యే మాట్లాడారు. ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ ఇంతవరకు చంద్రబాబు ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. అమలుకు సాధ్యం కాని హామీలు ఇవ్వడం అధికారంలోకి వచ్చాక విస్మరించడం చంద్రబాబుకు వెన్నుతో పెట్టిన విద్య అన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగులను సర్వేల పేరుతో వేధిస్తున్నారు. వేధింపులు తాళలేక రాష్ట్రంలో కొంతమంది ఉద్యోగులు మృతిచెందారన్నారు. హక్కులు అడిగే వారిని అణచి వేసే ధోరణిలో కాకుండా వారి సమస్యలు పరిష్కరించే చర్యలు చేపట్టాలన్నారు. తక్షణమే డిస్మిస్ చేసిన కాకర్ల వెంకట్రామి రెడ్డిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ధరణిని కాపాడుకుందాం
కర్నూలు(అర్బన్): జీవజాతుల మనుగడకు ఆధారమైన భూమిని కాపాడుకుందామని సెట్కూరు సీఈఓ డాక్టర్ వేణుగోపాల్ అన్నారు. ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా బుధవారం స్థానిక గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో యువజన సంక్షేమ శాఖ, సెట్కూరు, జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా అందుకు ఆధారం గాలి, నీరు, నింగి, నిప్పు, నేల అనే పంచభూతాలే అన్నారు. వీటిలో ఏ ఒక్కటి లోపించినా జీవనం అస్తవ్యస్తమవుతుందన్నారు. కాలుష్య నియంత్రణ మండలి ఈఈ కిషోర్రెడ్డి మాట్లాడుతూ పరిశ్రమలు, వాహనాలు తదితరాల నుంచి వెలువడుతున్న క్లోరోఫోరో కార్బన్లు భూగ్రహాన్ని మరింత వేడెక్కిస్తూ పలు కాలుష్యాలకు కారణమవుతున్నాయన్నారు. ప్రిన్సిపాల్ అరుణ మాట్లాడుతూ వృక్షాలను విచక్షణా రహితంగా నరికి వేయడంతో అడవులు అంతరించిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థినులకు వ్యాసరచన, చిత్రలేఖనం, వకృత్వ పోటీలు నిర్వహించి విజేతలకు సర్టిఫికెట్, మెమొంటోలు అందించారు. -
‘ఎల్నినో’ను సమర్థంగా ఎదుర్కొందాం
కర్నూలు(అర్బన్): రాబోయే ఖరీఫ్ సీజన్లో ఎల్నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొందాం అని వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్ సాలురెడ్డి అన్నారు. పసుపుల ఆర్ఎస్కేలో బుధవారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సాలురెడ్డి మాట్లాడుతూ.. వాతావరణ మార్పులకు అనుగుణంగా నిలకడైన వ్యవసాయ పద్ధతులను పాటించాలన్నారు. ఘన జీవామృతం, విత్తనాల పెల్లైటెజేషన్ ప్రాముఖ్యతను ఏపీసీఎన్ఎఫ్ జిల్లా ఇన్చార్జ్ రాజేశ్వర్, జెడ్బీఎన్ఎఫ్ డీపీఎం మాధురి వివరించారు. డీఆర్సీ ఏఓ రంగారెడ్డి, హెచ్ఓ నరేష్కుమార్రెడ్డి, మండల వ్యవసాయ అధికారి రుఫస్ రోనాల్డ్, ఆర్ఎస్కే సిబ్బంది పాల్గొన్నారు. శ్రీమఠం హుండీ ఆదాయం రూ.3.25 కోట్లు మంత్రాలయం: శ్రీ రాఘవేంద్రస్వామి మంఠంలో మార్చి 31 నుంచి ఏప్రిల్ 21 వరకు భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలను బుధవారం లెక్కించారు. మొత్తం రూ.3,25,96,854 సమకూరింది. శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఆదేశానుసారంగా హుండీ లెక్కింపునకు ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఒక సారి కౌటింగ్ హాల్లోనికి ప్రవేశించిన తరువాత ఎవరినీ ఏ కారణంతోనూ బయటకు అనుమతించలేదు. హుండీ లెక్కింపునకు ఆలస్యముగా వచ్చే వారికి ప్రవేశం లేదు అని సూచిక బోర్డును ఏర్పాటు చేసినట్లు మేనేజర్ ఎస్కె.శ్రీనివాసరావు తెలిపారు. నగదు రూపేణా రూ. 3,15,62,354, నాణేల రూపంలో రూ.10,34,500 వచ్చినట్లు వివరించారు. అలాగే 47 గ్రాముల బంగారం, 592 గ్రాముల వెండి కానుకలు సమకూరినట్లు ఏఏఓ మాధవశెట్టి , మేనేజర్–2 వెంటేష్ జోషి,ఇంజనీర్ సురేష్కోనాపూర్ తెలిపారు. అక్రమంగా యూరియా అమ్మితే చర్యలు కర్నూలు(అర్బన్): ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎక్కడైనా యూరియా అమ్మకాలు జరిగితే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పలు ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశాల మేరకు కల్లూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని పలు పరిశ్రమల్లో యూరియా నిల్వలు, విక్రయాలు నిర్వహిస్తున్నారా అనే అంశంపై సివిల్ సప్లైస్ డీఎం, ఇండస్ట్రియల్ ఆఫీసర్, కార్మిక శాఖ, వ్యవసాయ, రెవెన్యూ శాఖకు చెందిన అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు యూరియాను అక్రమంగా నిల్వ ఉంచుకోరాదని, విక్రయాలు జరపరాదని సూచించారు. పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి కర్నూలు(సెంట్రల్): జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. ఎంఓయూలు చేసుకున్న పరిశ్రమల పురోగతిపై బుధవారం కలెక్టరేట్లో తన కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలులో ఉన్న వివిధ ప్రాజెక్టుల పురోగతిని కలెక్టర్ సమగ్రంగా పరిశీలించారు. ప్రాజెక్టులను వేగవంతంగా అమలు చేయడం, భూసేకరణ, అవసరమైన అనుమతులు, ఇతర సమస్యలపై విస్తృతంగా చర్చించారు. జిల్లాలో 38 పరిశ్రమల ఏర్పాటుకు ఎంఓయూలు జరిగాయని, వాటిలో ఇంకా మొద లు కాని పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పరిశ్రమల స్థాపనను వేగవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ అశోక్కుమార్, ఏపీఐఐసీ జెడ్ఎం మధుసూదన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘సీమ’ ఆదాయం అమరావతిలో ఖర్చు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ‘రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయాలని కడప, తిరుపతి, కర్నూలు, అనంతపురం జిల్లాలలో మూణ్ణెళ్లుగా ఉద్యమం జరుగుతోంది. ఇప్పటి వరకు సీఎం చంద్రబాబు స్పందించ లేదు. ఈ ప్రాంతంపై ఆయనకు మంచి ఉద్దేశం లేకపోవడమే దీనికి కారణం. రాష్ట్రంలో దారుణంగా ఆర్థిక దుర్వినియోగం జరుగుతోంది. ‘సీమ’ ప్రాంతం నుంచి వచ్చే ఆదాయం మొత్తాన్ని అమరావతిలో ఖర్చు చేస్తున్నారు..’ అని పలువురు నేతలు మండిపడ్డారు. రాయలసీమ లిఫ్ట్ను నిర్మించాలని ‘గ్రేటర్’ నేతలు మూడు నెలలుగా ఉద్యమిస్తున్న క్రమంలో నంద్యాల జిల్లా వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి ఆధ్వర్యంలో ‘రాయలసీమ ప్రాజెక్టులు–సమాలోచనలు’ పేరుతో బుధవారం నంద్యాలలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఏమన్నారంటే... ‘కృష్ణా’పై నిర్మిస్తున్న ప్రాజెక్టులతో ‘సీమ’, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు భవిష్యత్తులో నీటి కష్టాలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. అందుకే వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందు చూపుతో రాయలసీమ లిఫ్ట్ పనులు ప్రారంభించగా అవి దాదాపు పూర్తయ్యాయి. రూ.200 కోట్లు ఖర్చు చేస్తే ప్రాజెక్టు పూర్తయి సీమకు నీరందుతుంది. కానీ, రాజకీయ కారణాలతో చంద్రబాబు ఈ పనులు చేయడం లేదు. మన ప్రాంత ఆదాయాన్ని కూడా మన ప్రాంతానికి ఖర్చు చేయడం లేదు. కుప్పానికి నీళ్లిచ్చానని చంద్రబాబు చెబుతున్నారు. నిజానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుప్పం ప్రజలకు మాటిచ్చి, పనులుచేసి, ప్రారంభించారు. జగన్కు దక్కాల్సిన క్రెడిట్ కూడా చోరీ చేస్తున్నారు. రేవంత్ ప్రకటనపై బాబు స్పందించలేదు తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసమే చంద్రబాబును ఒప్పించి రాయలసీమ లిఫ్ట్ ఆపించానని రేవంత్రెడ్డి చేసిన ప్రకటనపై చంద్రబాబు ఇప్పటి వరకు స్పందించ లేదు. ఇక కర్ణాటకలోని ఆల్మట్టి, అప్పర్ భద్ర పూర్తయితే 138 టీఎంసీలు తగ్గిపోయి శ్రీశైలానికి వరద ప్రవాహం తగ్గుతుంది. శ్రీశైలానికి నీరు రాకముందే నెట్టెంపాడు వద్ద తెలంగాణ తోడేస్తోంది. రోజూ ఎనిమిది టీఎంసీలు తెలంగాణ తీసుకెళ్తే పోతిరెడ్డిపాడుకు చుక్కనీరు అందదు. అందుకే రాయలసీమ లిఫ్ట్ చేపట్టాం. దీని నిర్మాణం కోసం పార్టీలకతీతంగా అందరినీ కలుపుకుని ఉద్యమిస్తాం. ఈ అంశంలో రాజకీయాలకు అతీతంగా అంతా కలిసి రావాలి. చంద్రబాబు సీమకు ఎప్పుడూ న్యాయం చేయలేదు. ‘సీమ’ ఆదాయాన్ని చంద్రబాబు ముంపు ప్రాంతమైన అమరావతికి ఖర్చుచేస్తున్నారు. ఏ రోజుకైనా కృష్ణా పొంగడం, అమరావతి మునగడం ఖాయం. ‘సీమ’కు జరుగుతున్న అన్యాయాలపై వైఎస్సార్సీపీ మినహా ఎవ్వరూ ప్రశ్నించడంలేదు. ప్రశ్నించేందుకు పార్టీ పెట్టిన వ్యక్తి కూడా పత్తాలేడు... అని నేతలు అన్నారు. సభలో మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్థన్రెడ్డి, శైలజానాథ్, బుగ్గన రాజేంద్రనాథ్, జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
రాయలసీమ లిఫ్టును పూర్తి చేయాల్సిందే
సాక్షి, నంద్యాల జిల్లా: రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టును తక్షణం మొదలుపెట్టి ఎట్టిపరిస్థితుల్లో పూర్తి చేయాల్సిందేనని వైఎస్సార్సీపీ నాయకులు, రైతు నాయకులు, రాయలసీమ ఉద్యమకారులు డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా వైఎస్సార్సీపీ ఆధ్యర్యంలో నంద్యాలలో జరిగిన రాయలసీమ లిఫ్టు సమాలోచన సమావేశంలో రాయలసీమ ప్రాంతానికి చంద్రబాబు చేస్తున్న ద్రోహంపై గళమెత్తారు. రాయలసీమ ప్రాజెక్టు ఆవశ్యకతతోపాటు కూటమి పాలనలో ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై గ్రామ స్థాయి నుంచే ప్రజల్లో అవగాహన కల్పించేలా ప్రణాళిక రూపొందించాలని తీర్మానించారు.రాయలసీమ లిప్టుతోపాటు గుండ్రేవుల ప్రాజెక్టు, మల్లిఖార్జున రిజర్వాయర్లు కూడా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా శ్రీశైలం ప్రాజెక్టు ముంపు బాధితుల కోసం ఇచ్చిన జీవో నెంబర్ 98 అమలు చేసి బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే గ్రామ స్థాయి నుంచి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. రాయలసీమ నీటి హక్కులు సాధించుకోవడం కోసం సమన్వయంతో ముందుకు సాగాలని, ప్రాజెక్టుల అమలుకు కార్యాచరణ సిద్ధం చేయాలని నేతలు నిర్ణయించారు.రాయలసీమ ప్రాజెక్టులు, ఈ ప్రాంత అభివృద్దిపై చంద్రబాబుకి చిత్తశుద్ధిలేదని, ఆయన ఈ ప్రాంతంలో పుట్టడం దౌర్భాగ్యమని నాయకులు మండిపడ్డారు. తన పార్టీకి ఓట్లు వేయడం లేదని రాయలసీమ ప్రాంతాన్ని చిన్నచూపు చూస్తున్న చంద్రబాబు, తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో రాయలసీమకు ఏం చేశానో తనను తానే ప్రశ్నించుకోవాలని సూచించారు.రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ స్కీమ్ సమాలోచన కార్యక్రమంలో నంద్యాల, నెల్లూరు జిల్లాల వైయస్సార్సీపీ అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, జిల్లా పరిశీలకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణిరెడ్డి, కాటసాని రామిరెడ్డి, గంగుల బిజేంద్ర రెడ్డి, మాజీ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సాకె శైలజానాథ్, నందికొట్కూరు సమన్వయకర్త దారా సుధీర్, మాజీ ఎంపీలు తలారి రంగయ్య, పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీలు కల్పలతారెడ్డి, ఇసాక్ బాషాలతోపాటు రాయలసీమ ఉద్యమకారులు, రైతు సంఘాల నాయకులు, వివిధ విభాగాలకు చెందిన వైయస్సార్సీపీ నాయకులు, పాల్గొన్నారు.రేవంత్తో చంద్రబాబు చీకటి ఒప్పందం: కాటసాని రాంభూపాల్ రెడ్డితెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో చీకటి ఒప్పందం చేసుకుని రాయలసీమ ప్రాంతానికి చంద్రబాబు ద్రోహం చేశారు. ముఖ్యమంత్రిగా ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్నప్పటికీ రాయలసీమకు చంద్రబాబు చేసిందేమీ లేదు. రాయలసీమ అంటే చంద్రబాబుకు చులకన భావన ఉంది. రాయలసీమ రైతుల సమస్యలను పట్టించుకోకుండా, ప్రాంత అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాడు. నీటి ప్రాజెక్టుల విషయంలో రాయలసీమకు అన్యాయం జరుగుతోంది. ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి, రాయలసీమ హక్కుల కోసం పిడికిలి బిగించి పోరాటం చేయాలి. పసుపు పూలు చల్లి చంద్రబాబు క్రెడిట్ చోరీ: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిరాయలసీమ ఎత్తిపోతల పథకం లేకపోతే రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఉంది. 90 శాతం పనులు పూర్తి చేసి, యంత్ర సామాగ్రి సిద్ధం చేసిన ప్రాజెక్టును పక్కనపెట్టేశాడు. 23 నెలల్లో రూ. 3.56 లక్షల కోట్లు అప్పులు చేసిన చంద్రబాబు, రాయలసీమ లిఫ్టు పూర్తి చేయకపోవడం రాయలసీమ ప్రాంతానికి ద్రోహం చేయడమే. వైయస్ జగన్ కుప్పానికి నీళ్లిస్తే అది కూడా చంద్రబాబు తన ఘనతగానే చెప్పుకోవడం సిగ్గుచేటు. పసుపు పూలు చల్లి క్రెడిట్ చోరీకి పాల్పడుతున్న చంద్రబాబు రాయలసీమలో పుట్టడం మన ప్రాంత ప్రజల దౌర్భాగ్యం.బాబు చేసిందేమీ లేదు: కాకాణి గోవర్థన్ రెడ్డిరేవంత్రెడ్డి ప్రయోజనాలు కాపాడటం కోసం చంద్రబాబు రాయలసీమ లిఫ్టును తాకట్టుపెట్టాడు. నిజం కాదని మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలు చెప్పలేకపోతున్నారు. సూటిగా సమాధానం చెప్పకుండా వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ మీదున్న ప్రేమ చంద్రబాబుకి ఏపీ మీద లేదని తేలిపోయింది. చంద్రబాబు రోజురోజుకీ దిగజారి ప్రవర్తిస్తున్నాడు. సాగునీటి రంగం గురించి కానీ, రైతుల గురించి కానీ ఏనాడూ చంద్రబాబు ఆలోచన చేసిన పాపాన పోలేదు.చంద్రబాబు సీఎంగా ఉంటే చకచకా ప్రాజెక్టులు కట్టుకోవచ్చని పక్క రాష్ట్రాలు సంబరాలు చేసుకుంటాయి. రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు ఆగిపోతే ఆరు జిల్లాల ప్రజల మనుగడ ప్రశ్నార్థకం అయ్యే ప్రమాదం ఉంది. సాగునీటి ప్రాజెక్టులు కట్టకుండా సాగునీటి భద్రత- నీటి సంఘాల బాధ్యత అంటూ తెలుగుదేశం నాయకులు జేబులు నింపే కార్యక్రమాలు చేస్తున్నాడు. ప్రాజెక్టులు మొదలుపెట్టి దోచుకోవడం మినహా చేసిందేమీ లేదు. తెలంగాణకు ఎందుకు అమ్ముడుపోయాడో చంద్రబాబు సమాధానం చెప్పాలి. కలిసొచ్చే వారితో ఉద్యమించి రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్తును తిరిగి ప్రారంభించేలా పోరాడదాం.చంద్రబాబుకి చిత్తశుద్ధి లేదు: బుగ్గన రాజేంద్రనాథ్దేశంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతం రాయలసీమ. రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంత ప్రయోజనాల కోసం అందరూ ఏకం కావాలి. రాయలసీమ ప్రజలు నాకు ఓటెయ్యరు కాబట్టి, నేను రాయలసీమకు ఏమీ చేయననే ఆలోచనలో చంద్రబాబు ఉన్నాడు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉండి రాయలసీమ ప్రాంతానికి ఆయన చేసిందేమీ లేదు. ఓటేసిన వారికే పనిచేస్తానని ముఖ్యమంత్రి స్ధాయిలో ఉన్న చంద్రబాబు చెప్పడం కన్నా నీచం ఇంకోటి ఉండదు. వైయస్సార్సీపీ హయాంలో జరిగిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలి.కృష్ణా నది మీద ఎగువన ఉన్న రాష్ట్రాలు ప్రాజెక్టులు కట్టుకుంటూ పోతే రాయలసీమకి నీరు ఎలా వస్తాయని విజనరీనని చెప్పుకునే చంద్రబాబు ఆలోచించడం లేదు. రాయలసీమ అభివృద్ధి మీద చంద్రబాబుకి చిత్తశుద్ధి లేదు కాబట్టే ఇవన్నీ పట్టించుకోవడం లేదు. వైయస్సార్ గారు చేసిన ప్రాజెక్టులను నేనే చేశానని చెప్పుకుంటున్నాడు. రాయలసీమ సమస్యల గురించి పట్టించుకునే వాళ్లే కరువయ్యారు. చంద్రబాబు మోసాలపై ప్రతిఒక్కరూ ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలి.రాయలసీమను ఎడారిగా మార్చే కుట్ర: సాకే శైలజానాథ్రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి. రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేస్తున్న కూటమి నాయకులకు ఖచ్చితంగా బుద్ధి చెబుతాం. వారు ఇప్పటికైనా రాయలసీమ ద్రోహి చంద్రబాబును నిలదీయాలి. 20 టీఎంసీలు దేనికి పనికొస్తాయని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటు. పంటలు పండక రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారితే ఈ భూములన్నీ ఎకరం 99 పైసలకు అమ్ముకోవాలని చంద్రబాబు కుట్ర చేస్తన్నాడు. గ్రేటర్ రాయలసీమ ప్రజల ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. రాయలసీమ రైతులు వలస వెళ్లి కూలీలుగా మారే పరిస్థితికి ఇప్పటికైనా ఫుల్స్టాప్ పెట్టాలి.గ్రామ స్థాయి నుంచి రిలే నిరాహార దీక్షలు: శిల్పా చక్రపాణిరెడ్డిచంద్రబాబు తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే రాయలసీమ లిఫ్టును తాకట్టుపెట్టాడు. ఎన్జీటీ అనుమతులు లేవనేది కేవలం సాకు మాత్రమే. గతంలో పట్టిసీమ ప్రాజెక్టును చంద్రబబు ఎన్జీటీ అనుమతులు లేకుండానే మొదలుపెట్టాడు. తెలంగాణలో ఎన్నో ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు లేకుండానే శరవేగంగా సాగుతున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదు. రాయలసీమకు తీవ్ర నష్టం జరుగుతున్నా చంద్రబాబుకి పట్టడం లేదు. గ్రామ స్థాయి నుంచి రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ సాధన కోసం సమిష్టిగా ఉద్యమించాల్సిన అసవరం ఉంది.అందుకోసం గ్రేటర్ రాయల్ సీమ వ్యాప్తంగా గ్రామ, మండల, జిల్లా స్థాయిలో రిలే నిరాహార దీక్షలు చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి. దీంతోపాటు ప్రాజెక్టు ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి కృషి చేయాలి. సిద్ధేశ్వరం అలుగు పేరుతో గతంలో హడావుడి చేసిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తన కుమార్తెకు ఎంపీ పదవి రాగానే నోరు తెరవడం లేదు. రాయలసీమ లిప్టు కోసం వైఎస్ జగన్ చేసిన కృషిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పెండింగ్ ప్రాజెక్టు పనులు పూర్తి చేయడం చేతకాని చంద్రబాబు, పోలవరం- బనకచర్ల అంటూ ప్రజలకు అబద్ధాలు చెబుతున్నాడు. రైతులకు మేలు జరగాలంటే రాయలసీమ లిఫ్టుని సాధించుకోవాల్సిందే. రాయలసీమ లిఫ్టుపై ప్రజల్లో చర్చ జరగాలి.చంద్రబాబు రాయలసీమ ద్రోహి: ఎమ్మెల్సీ ఇసాక్ బాషానేను అడగడం వల్లే చంద్రబాబు రాయలసీమ లిప్టు ఇరిగేషన్ స్కీమ్ను ఆపేశాడని రేవంత్ రెడ్డి చెప్పాడు. రాయలసీమలో పుట్టి ఈ ప్రాంతానికి చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నాడు. రాయలసీమ బిడ్డల కోసం మనం ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది. చంద్రబాబు చేస్తున్న ద్రోహాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రాజెక్టును తిరిగి ప్రారంభించేదాకా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం.ప్రభుత్వం మనసు పెడితే ఏడాదిలోపు ప్రాజెక్టు పూర్తి: దారా సుధీర్వైఎస్సార్సీపీ హయాంలోనే రాయలసీమ లిప్టు ఇరిగేషన్ ప్రాజెక్టులో 90 శాతం పనులు పూర్తయ్యాయి. ప్రాజెక్టుకు అవసరమైన యంత్ర సామాగ్రిని కూడా వైఎస్ జగన్ సమకూర్చారు. చంద్రబాబు వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం రెండేళ్లుగా ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేశాడు. ప్రాజెక్టు పూర్తయితే వైఎస్ జగన్కి మంచి పేరొస్తుందనే పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం మనసుపెడితే మిగిలిన 10 శాతం పనులు ఏడాదిలోపే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావొచ్చు. వ్యవసాయం, రైతులంటే చంద్రబాబుకి అసహ్యం: పోచ్చా బ్రహ్మానందరెడ్డిచంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం గురించి ఎప్పుడూ పట్టించుకున్న పాపాన పోలేదు. రైతులన్నా, వ్యవసాయమన్నా చంద్రబాబుకి నచ్చదు. ఘోరకల్లు రిజర్వాయర్ సాధ్యం కాదని గతంలో టీడీపీ ప్రభుత్వం తేల్చేసింది. కానీ వైయస్సార్ సీఎం అయ్యాక సాధ్యం చేసి చూపించారు. రైతులతో కలిసి రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ స్కీమ్ కోసం ఉద్యమించాలి. ప్రతి గ్రామంలో అవగాహన సదస్సులు నిర్వహించాలిరాయలసీమ రైతుల త్యాగం గొప్పది: గంగుల బ్రిజేంద్రరెడ్డితరతరాలుగా రాయలసీమ ప్రాంతం తీవ్రంగా నష్టపోతోంది. శ్రీశైలం ప్రాజెక్టు కోసం భూములను త్యాగం చేసిన చరిత్ర మన రైతులది. రాజధానిని కోల్పోయింది. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టాడు. సాధ్యం కాదని తెలిసీ వేల కోట్లు అప్పులు తెచ్చి అమరావతి రాజధాని మీద గుమ్మరిస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నాడు. కానీ రాయలసీమ ప్రాంతానికి నీరిచ్చే లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేయడానికి వెయ్యి కోట్లు వెచ్చించడానికి మాత్రం చంద్రబాబుకి మనసు రావడం లేదు. మంత్రులను సింగపూర్ కి పంపి పబ్లిసిటీలు, జల్సాలు చేయడం తప్ప చిత్తశుద్ధితో చంద్రబాబు ఆలోచించడం లేదు. చంద్రబాబు సీఎం కావడం రైతుల దౌర్భాగ్యం: బుడ్డా శేషారెడ్డిచంద్రబాబు అధికారంలో ఉంటే రైతులంతా రోడ్ల మీద ఉండాల్సిన దుస్థితి. ఎరువులు, పురుగు మందులు, గిట్టుబాటు ధరలు ఏది కావాలన్నా రోడ్డెక్కి ధర్నా చేయాల్సిన దుస్థితి. రాయలసీమలో పుట్టి ఈ ప్రాంతానికి చంద్రబాబు చేసింది శూన్యం. రాయలసీమ రైతాంగాన్ని కాపాడుకోవడం కోసం అందరూ ఉద్యమించాలి. అమరావతికైతే డబ్బులున్నాయా?: తలారి రంగయ్యరాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వైయస్ జగన్ గారు ప్రారంభించక పోయుంటే రైతుల పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. అమరావతి కోసం లక్షల కోట్లు అప్పులు తెచ్చి మరీ ఖర్చు చేయడానికి సిద్ధపడిన చంద్రబాబు, రాష్ట్రంలో సగం ప్రాంతమైన గ్రేటర్ రాయలసీమ ప్రజల కోసం రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తి చేయడానికి ఖర్చు చేయడం లేదు. విద్య, వైద్యం, సాగునీటి రంగాల విషయంలో రాయలసీమ ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరుగుతోంది.జగన్ ముందుచూపుతో ఆలోచించారు: పాపిరెడ్డిరాష్ట్ర సాగునీటి రంగాన్ని 2004కి ముందు 2004 తర్వాత అని చూడాలి. దివంగత వైయస్సార్ కృషితో రాయలసీమ ముఖచిత్రం మారిపోయింది. సాగునీటి రంగానికి ఎనలేని కృషి చేశారు. చంద్రబాబు మాటలన్నీ నీటి మూటలుగానే మిగిలిపోయాయి. రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన మొదలు పెట్టి పూర్తి చేసిన ఘనత వైయస్ జగన్కే దక్కుతుంది. రాయలసీమ భావితరాల కోసం దూరదృష్టితో ఆలోచించి పనిచేశారు.అమరావతిపై ఉన్న శ్రద్ధ రాయలసీమ మీద లేదు: కాటసాని రామిరెడ్డిరాయలసీమ లిప్టు ఇరిగేషన్ ప్రాజెక్టు ఆవశ్యకతపై రైతులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత వైయస్సార్సీపీ నాయకుల మీదనే ఉంది. భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పోరాటం చేయాలి. చంద్రబాబు కారణంగా రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ముంచుకొస్తోంది. అమరావతి మీద ఉన్న శ్రద్ధ ఆయనకు పుట్టిన గడ్డ రాయలసీమ మీద లేదు. రైతు సంఘాలతో కలిసి రాయలసీమ ప్రాజెక్టును పునః ప్రారంభించేలా ఉద్యమించాలి.చంద్రబాబు మోసాలపై గ్రామ గ్రామాన చర్చ జరగాలి: గంగుల ప్రభాకర్ రెడ్డిసాగునీటి రంగాన్ని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. రాయలసీమ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై గళమెత్తాలి. 90 శాతం పూర్తయిన రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టును పక్కనపెట్టేయడం దుర్మార్గం. యావత్తు రాయలసీమ ప్రాంతానికే అన్యాయం జరిగే పరిస్థితి ఏర్పడింది. రాయలసీమ ప్రాంతానికి చంద్రబాబు చేస్తున్న అన్యాయంపై గ్రామగ్రామాన చర్చజరగాలి.ప్రభుత్వానికి బుద్ది చెప్పే సమయం ఆసన్నమైంది: ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డిలిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపేసి ప్రజల మనుగడను చంద్రబాబు ప్రశ్నార్థకం చేశాడు. తన వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం రాయలసీమ రైతాంగం భవిష్యత్తును పణంగా పెట్టడం దుర్మార్గం. 90 శాతం పనులు పూర్తయిన ప్రాజెక్టు విషయంలో ఆయన వ్యవహారశైలి అనుమానాస్పదంగా ఉంది. రాయలసీమకు వెన్నుపోటు పొడిచిన కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. తక్షణం పనులు మొదలుపెట్టకపోతే రాయలసీమ కూటమి ప్రజాప్రతినిధులు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నా. -
చంద్రబాబు, రేవంత్ మధ్య చీకటి ఒప్పందం: కాకాణి
సాక్షి, నంద్యాల జిల్లా: సీమకు నీటి కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి నెలకొందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ముందు చూపుతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను ఏర్పాటు చేస్తే.. చంద్రబాబు తన స్వార్థం కోసం ఆపేసారంటూ మండిపడ్డారు. ఇక్కడ ఇంత పోరాటం చేస్తుంటే.. చంద్రబాబు మాత్రం కాసేపట్లో మమ్మల్ని టీడీపీ నాయకులతో తిట్టించే పని మొదలు పెడతారు’’ అంటూ కాకాణి ధ్వజమెత్తారు.చంద్రబాబు, రేవంత్ మధ్య చీకటి ఒప్పందం జరిగింది. ప్రతి విషయంలో ఇంతకన్నా దిగజారుడు అనుకున్న ప్రతి సారి చంద్రబాబు ఇంకా దిగజారి వ్యవహరిస్తున్నారు. ఏ రోజు చంద్రబాబు అధికారంలోకి వస్తాడో ఆ రోజు నుంచి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. రైతుల పేరుచెప్పుకొని నీరు-చెట్టు పేరుతో టీడీపీ నాయకులు దోచుకుంటున్నారు. రైతుల పేరుతో దోచుకోవడం తప్ప సాయం చేయడం చంద్రబాబుకు తెలియదు. ఏ ప్రాంత ప్రజల ఆత్మభిమానం కోసం చంద్రబాబు పని చేయడు ఆయనకు ఆత్మభిమానం లేదు..చంద్రబాబు కన్ను అర్పకుండా చెబుతాడు రాయలసీమను సస్యశ్యామలం చేస్తానంటాడు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గాలికి వదిలేసి కల్లబొల్లి మాటలు చెప్పడంలో దిట్ట. చంద్రబాబు మెడలు వంచి రాయలసీమ ప్రాజెక్టులను సాధించుకుందాం అందరూ సిద్ధం కావాలి’’ అంటూ కాకాణి పిలుపునిచ్చారు. -
పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూ.. వాహనదారుల విలవిల
కర్నూలు(సెంట్రల్): పశ్చిమాసియా యుద్ధంతో ఓ వైపు గ్యాస్ కష్టాలు వెంటాడుతున్న నేపథ్యంలో జిల్లా వాసులను పెట్రోల్, డీజిల్ కొరత వేధిస్తోంది. నాలుగైదు రోజులుగా జిల్లాలో ఒక్కొక్కటి పెట్రోల్ బంకు మూత పడుతుండటంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. బంకుల ఎదుట నోస్టాక్ బోర్డులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా దాదాపు 50 వరకు బంకులు మూతపడడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆకస్మికంగా పెట్రోల్ బంకులు మూత పడుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, కర్నూలుతోపాటు పలు ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల్లో నిల్వలు లేకపోవడంతో నో స్టాక్ బోర్డులు వెలిశాయి. ఈ క్రమంలో ప్రభుత్వ, అధికార యంత్రాంగం తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 132 పెట్రోల్ బంకులు ఉన్నాయి. వాటికి సరాసరిగా రోజుకు లక్షన్నర లీటర్ల పెట్రోలు, లక్షన్నర లీటర్ల డీజిల్ సరఫరా జరిగితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే ప్రస్తుతం రోజుకు పెట్రోల్ 90 వేల లీటర్లు, డీజిల్ 90 వేల లీటర్లు మాత్రమే సరఫరా జరుగుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాకు అయ్యే సరఫరాలో కర్నూలు, ఆదోని ప్రాంతాలకు ఎక్కువ కేటాయింపు ఉంది. అయితే రూరల్ ఏరియాల్లో రోజురోజుకు స్టాక్ ఖాళీ కావడంతో పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు వెలుస్తున్నాయి. ఈ క్రమంలో ఎమ్మిగనూరు, ఆదోని, ఆలూరు, పత్తికొండ, కోడుమూరు, కర్నూలుతోపాటు పలు ప్రాంతాల్లో దాదాపు 50 బంకుల వరకు మూతపడ్డాయి. దీంతో ఆ ప్రాంత వినియోగదారులు పెట్రోల్, డీజిల్ కోసం అగచాట్లు పడుతున్నారు. స్టాక్ ఉన్న బంకుల వద్ద గంటల తరబడి క్యూలో నిలవాల్సి వస్తోంది. వారం రోజులుగా నిలిచిన సరఫరా.. మూత పడిన బంకుల్లో ఎక్కువగా హెచ్పీ, ఐఓసీ పెట్రోల్ బంకులు ఉన్నాయి. వారం రోజులుగా కడప నుంచి హెచ్పీ పెట్రో ఉత్పత్తుల సరఫరా జరగడం లేదు. దీంతో మూడు రోజులుగా జిల్లాలోని పలు బంకులు మూతపడుతున్నాయి. ముఖ్యంగా ఆలూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ, కర్నూలులో కూడా హెచ్పీ బంకులు మూతపడ్డాయి. మూతపడిన జాబితాలో ఐఓసీ బంకులు ఉన్నా వాటి సంఖ్య తక్కువగా ఉంది. పెట్రోల్, డీజిల్ సరఫరాలో జాప్యాన్ని ముందే పసిగట్టడంలో అధికార యంత్రాంగం విఫలమైంది. జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరతే లేదని చెబుతున్నా అధికారులు ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు అధిక విని యోగం వల్లే కొరత అంటూ దాట వేస్తున్నారనే విమర్శ లు ఉన్నాయి. రెండు, మూడు రోజుల్లో అవసరం మేరకు పెట్రోల్, డీజిల్ సరఫరా జరగకపోతే మరికొన్ని పెట్రోల్ బంకులు మూత పడే అవకాశం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆయిల్ కంపెనీలతో మాట్లాడాల్సి ఉంది. లే దంటే ప్రజలు మరింతగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇబ్బంది లేకుండా చేస్తాం జిల్లాలో చాలా చోట్లా పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. పత్తికొండ, ఆలూరు, కర్నూలులో మూతపడిన విషయాలు మా దృష్టికి రాలేదు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఎన్ని పెట్రోల్ బంకులు మూత పడ్డాయో వివరాలు తెప్పించుకుంటున్నాం. అససరం మేరకు పెట్రోల్ స్టాక్ ఉంది. అయితే ప్రజలే అవసరం కంటే ఎక్కువ గా వినియోగిస్తుండడంతోనే సమస్య ఉత్ప న్నం అవుతోంది. కాగా, మూతపడిన బంకుల కు రాత్రిలోపు పెట్రో ఉత్పత్తుల సరఫరా జరుగుతుంది. బుధవారం నుంచి ఇబ్బంది ఉండదు. – ఎం రాజారఘువీర్, డీఎస్ఓ, కర్నూలు స్టాక్ ఉన్న బంకుల్లో రద్దీ.. చాలా చోట్ల పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు వెలుస్తుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రెండు, మూడు రోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు మూత పడుతుండడంతో స్టాక్ ఉన్న బంకుల వద్దకు వాహనదారులు క్యూ కడుతున్నారు. పెట్రోల్ కొరత భయంతో వాహనదారులు పరుగులు పెడుతున్నారు. అక్కడ గంటల కొద్ది క్యూలో నిలుచుని పెట్రోల్, డీజిల్ తీసుకెళ్తున్నారు. ఎమ్మిగనూరు, ఆలూరు, పత్తికొండలలో ఈ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. -
ప్రశ్నించే ఉద్యోగులను డిస్మిస్ చేస్తారా ?
● వెంకట్రామిరెడ్డి తొలగింపు అన్యాయం ● ఉద్యోగులతో పెట్టుకుంటే పుట్టగతులుండవు ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్రెడ్డి కర్నూలు (టౌన్): ‘ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా వాటిని అమలు చేయలేదు. దీనిపై ఉద్యోగుల సంఘం నాయకుడిగా కె. వెంకట్రామిరెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు డిస్మిస్ చేస్తారా..? ఈ ప్రభుత్వానికి పోయే కాలం దాపురించింది. గళమెత్తే ఉద్యోగులపై కక్ష కట్టి వేధించాలని చూస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే’ అని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి కూటమి సర్కారును హెచ్చరించారు. మంగళవారం ఎస్వీ కాంప్లెక్స్లోని తన చాంబర్లో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్యాధ్యక్షులు, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షులు కె. వెంకట్రామిరెడ్డిని కూటమి ప్రభుత్వం ఏకంగా ఉద్యోగం నుంచి తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాక ఉద్యోగ సంఘం నేతపై వేటు వేయడం తగదన్నారు. ఉద్యోగులతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఇతర ముఖ్యమంత్రుల కన్నా చంద్రబాబుకు బాగా తెలుసునన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలనే కాకుండా ఇక ఉద్యోగ సంఘం నాయకులపై కూడా ఈ ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తొందన్నారు. రెండేళ్ల వ్యవధిలోనే టీడీపీ ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో వ్యతిరేకత వస్తోందని, ఇప్పటికే రోడ్లెక్కి ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారన్నారు. అంగన్వాడీలు, ఉపాధ్యాయులు, రైతులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, మున్సిపల్ కార్మికులు.. ఇలా ప్రతి ఒక్కరూ తమ సమస్యలు పరిష్కారించాలని నిరసనలు వ్యక్తం చేస్తున్నారన్నారు. సమస్యలు పరిష్కారించాల్సిన ప్రభుత్వం ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలపై నిరంకుశంగా వ్యవహరించడం మంచిది కాదన్నారు. పెండింగ్ డీఏలు, పీఆర్సీ ఏమయ్యింది..? అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు పెండింగ్ డీఏలు, పీర్సీ వేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయు డు ఎందుకు అమలు చేయలేదని ఎస్వీ మోహన్రెడ్డి ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఉద్యోగులకు సంబంధించిన రూ. 40 వేల కోట్ల బకాయిలు ఎందుకు చెల్లించలేదన్నారు. హక్కుల సాధనకు పోరాడుతున్న ఉద్యోగులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు. ఇప్పటికై నా టీడీపీ ప్రభుత్వం మొండి వైఖరి వీడి ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని హితవు పలికారు. ఒంటెద్దు పోకడలకు పోతే భారీ నష్టం తప్పదన్నారు. -
గంజిహళ్లి చెరువులో తవ్వకాలు నిలిపివేత
గోనెగండ్ల: గంజిహళ్లి గ్రామ చెరువును మంగళవారం ఉదయం మైనింగ్ అధికారులు పరిశీలించారు. వారం రోజులుగా గంజిహళ్లి చెరువు మట్టిని ఇటుకల బట్టి వ్యాపారులు టిప్పర్లతో అక్రమంగా తరలిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని గంజిహళ్లి గ్రామ రైతులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం మైనింగ్ సహాయ కార్యనిర్వాహక ఇంజినీరింగ్ రంగడు గంజిహళ్లి చెరువును పరిశీలించారు. కొందరు వ్యక్తులు రైతుల పేరుపై తీసుకున్న అనుమతులను రద్దు చేసినట్లు ఏఈ తెలిపారు. రైతులు తమ పంట పొలాలకు చెరువు మట్టిని వేసుకునేందుకు మాత్రమే అనుమతి ఇస్తామని తెలిపారు. ఆయన వెంట గ్రామస్తులు మహేష్ రెడ్డి, తోలు రాముడు, గంజిల్లయ్య, మల్లేష్, చిన్న సవారి తదితరులు ఉన్నారు. తుగ్గలి: త్వరలో ప్రారంభం కానున్న జొన్నగిరి సమీపంలోని జియో మైసూర్ సర్వీసెస్ (ఇండియా) గోల్డ్ మైనింగ్ ప్లాంట్ను మంగళవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి సందర్శించారు. రూ.200 కోట్లతో నూతనంగా చేపట్టిన ప్లాంట్లో బంగా రం ఉత్పత్తి అయ్యే చివరి దశ, ఇతర విభాగాలను పరిశీలించారు. బంగారం ఎంత ఉత్పత్తి అవుతుంది, దాన్ని వెలికితీసే ఖర్చు, ఎంత మంది కార్మి కులు పనిచేస్తున్నారు, వారి భద్రతపై తీసుకుంటున్న చర్యలు తదితర వివరాలపై ఆమె ఆరా తీశారు. అనంతరం ఏపీఐఐసీ జెడ్ఎం, జియో మైసూర్ సంస్థ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న భూసేకరణ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని తహసీల్దార్ రవిని ఆదేశించారు. కలెక్టర్ వెంట పత్తికొండ ఇన్చార్జ్ ఆర్డీవో మధుసూదన్రెడ్డి, పరిశ్రమల శాఖ డిప్యూటీ డైరెక్టర్ జవహర్ ఉన్నారు. రేపు భగీరథ మహర్షి జయంతి కర్నూలు(అర్బన్): ఈ నెల 23వ తేదీన శ్రీ భగీరథ మహర్షి రాష్ట్ర స్థాయి జయంతి ఉత్సవాల ను కర్నూలులో నిర్వహించేందుకు ప్రభు త్వం నిర్ణయం తీసుకుందని జిల్లా బీసీ సంక్షేమ సాధికారత అధికారిణి కే ప్రసూన తెలిపారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి ఆదేశాల మేరకు స్థానిక సునయన ఆడిటోరియంలో ఉదయం 11 గంటల కు జయంతి ఉత్సవ కార్యక్రమాలు ప్రారంభం అవుతాయన్నారు. ఆంధ్రప్రదేశ్ సగర / ఉప్పర సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఆర్ వెంకటరమణప్ప అధ్యక్షతన జరగనున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమం, చేనేత జౌళి శాఖా మంత్రి సవిత హాజరవుతున్నట్లు తెలిపారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు జిల్లా ఇన్చార్జ్ మంత్రితో పాటు జిల్లా మంత్రులు, ఎంపీ, జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లకు ఇప్పటికే ఆహ్వానాలు పంపామన్నారు. రుద్రమూర్తికి విశేష పూజలు శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో లోకకల్యాణం కోసం ఆలయ ఈశాన్య భాగంలో రుద్రవనంలోని రుద్రమూర్తికి మంగళవారం శాస్త్రోక్తంగా పూజలు చేశారు. లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ అర్చకులు సంకల్పాన్ని పఠించారు. తరువాత రుద్రమూర్తికి అభిషేకం జరిపించారు. అర్చకులు రుద్రమంత్రాలను పఠిస్తుండగా శాస్త్రోక్తంగా పంచామృతాలు, గందోధకం, భస్మోదకం, పుష్పోదకం, బిల్వోదకం, సుగంధోదకాలతో, ఆ తరువాత జలంతోనూ అభిషేకం నిర్వహించారు. అనంతరం రుద్రదేవునికి బిల్వార్చన, పుష్పార్చన జరిపించారు. కార్యక్రమంలో ఆలయ ఏఈవో హరిదాసు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
జిల్లాలో ఉత్తర్ప్రదేశ్ భవారియా గ్యాంగ్
కర్నూలు: ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రం షాంలి జిల్లాకు చెందిన భవారియా గ్యాంగ్ జిల్లాలో తిష్ట వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈనెల 9వ తేదీ రాత్రి గుత్తి పెట్రోల్ బంకు సమీపంలో ఇద్దరు దుండగులు చైన్స్నాచింగ్కు పాల్పడ్డారు. అదే రోజు రాత్రి 10 గంటల సమయంలో సంతోష్ నగర్లో ఓ మహిళ వద్ద ఉంచి చైన్ స్నాచింగ్కు పాల్పడి పారిపోతుండగా ఆమె కొడుకు, మనవడు అప్రమత్తమై దొంగలను పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో దుండగుల వాహనం అదుపు తప్పి కింద పడి అక్కడి నుంచి పారిపోయారు. సంఘటనా స్థలంలో దొరికిన బైక్, కీప్యాడ్ ఫోన్, బ్యాగులను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. టెక్నికల్ ఆధారాలతో దొంగలు ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని షాంలి జిల్లాకు చెందిన భవారియా గ్యాంగ్ సభ్యులుగా తేలింది. వరుస చోరీలకు పాల్పడిన సభ్యులు మానవ్, హరిప్రకాష్లుగా గుర్తించారు. మానవ్ని మంగళవారం బాలాజీ నగర్ వద్ద అరెస్టు చేసి దొంగిలించిన చైన్లోని రెండు గ్రాముల ముక్కను సీజ్ చేసి పోలీసులు రిమాండ్కు పంపారు. మరొక దొంగ హరి ప్రకాష్ కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నట్లు నాలుగో పట్టణ సీఐ విక్రమసింహ తెలిపారు. మానవ్, హరి ప్రకా ష్లపై హరియానా, ఢిల్లీ, ఉత్తర్ప్రదేశ్లలో 15కు పైగా దొంగతనం కేసులు ఉన్నాయి. వీరిద్దరూ ఈనెల 7వ తేదీ బెంగళూరుకు వచ్చి అక్కడి నుంచి అనంతపురం చేరుకున్నారు. పట్టణంలో ఓ పల్సర్ బైక్ దొంగిలించుకుని కర్నూలుకు వచ్చి వరుసగా రెండు చోట్ల గొలుసు దొంగతనాలకు పాల్పడ్డారు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాల చిట్టా బయటపడింది. మరొకరి కోసం గాలింపు -
రైతుల పక్షాన నిలిస్తే దాడులా?
బొమ్మలసత్రం: గ్రీన్కో ప్రాజెక్ట్లో భూములు కోల్పోయిన రైతుల పక్షాన నిలిచిన వారిపై దాడులు చేస్తారా? అని వైఎస్సార్సీపీ నంద్యా ల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి ప్రశ్నించారు. గ్రీన్కో ప్రాజెక్ట్లో భూమి కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెక్కులు మంజూరయ్యాయి. వాటిని అధికార టీడీపీ నాయ కులు పంచకపోగా వేధించారు. దీనిపై వైఎస్సార్సీపీ నాయకులు ప్రశ్నించడంతో సోమవారం అధికారపార్టీ నాయకులు దాడి చేశారు. ఈ ఘటనలో గాయపడి నంద్యాల జీజీహెచ్లో చికిత్స పొందుతున్న పార్టీ నాయకులను మంగళవారం కాట సాని పరామర్శించి మాట్లాడారు. బాధిత రైతుల కు మంజూరైన పరిహార చెక్కులను మంచాలకట్టకు చెందిన టీడీపీ నేతలు తమ వద్ద ఉంచుకొని వేధించడం సరికాదన్నారు. అధికారపార్టీ గూండాల దాడిలో గాయపడిన తమ పార్టీ శ్రేణులు పోలీస్స్టేషన్కు వెళితే ఎస్ఐ కేసు నమోదు చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. టీడీపీ నేతలు చెప్పినట్లు ఎస్ఐ వ్యవహరించడం సరికాదన్నారు. అనంతరం ఆయన బాధితులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ను కలిసి విన్నవించారు. కాటసాని వెంట వైఎస్సార్సీపీ నాయకులు సూర్యనారాయణరెడ్డి, రవిరెడ్డి, మేఘనాథరెడ్డి, అనిల్కుమార్రెడ్డి ఉన్నారు. వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి -
రంగు పడుద్ది.. బిల్లు చేయాల్సిందే!
ఆలూరు: ‘అధికారంలో ఉన్నాం.. మేం ఇష్టం వచ్చినట్లు పనులు చేస్తాం.. నిబంధనలు అని అడ్డుకుంటే జాగ్రత్త.. రంగుపడుద్ది.. అన్ని బిల్లులు చేయాల్సిందే’ అని ఇంజినీర్లను టీడీపీకి చెందిన కాంట్రాక్టర్లు బెదిరిస్తున్నారు. ప్రభుత్వ సూచనల మేరకు భవనాలకు రంగులు వేయాలని చెప్పినా వినడం లేదు. ఆలూరు నియోజకవర్గంలో 15వ ఆర్థిక సంఘం నిధులతో కొన్ని గ్రామ పంచాయతీల్లో ఎన్టీఆర్ హెల్త్ క్లినిక్ కేంద్రాలు 25 వరకు మంజూరు అయ్యాయి. ప్రతి హెల్త్ క్లినిక్ కేంద్రం భవనానికి రూ. 36 లక్షల నిధులను మంజూరయ్యాయి. ఈ నిధులతో ఆలూరు మండలంలో మొలగవెల్లి, ఎం.కొట్టాల, అరికెర, కురుకుంద గ్రామ పంచాయతీల్లో ఎన్టీఆర్ హెల్త్ క్లినిక్ కేంద్రాలను టీడీపీకి చెందిన కాంట్రాక్టర్లు నిర్మించారు. పూర్తి చేసి భవనాలకు ప్రభుత్వం సూచనలు మేరకు తెలుపు రంగు వాడాలి. అయితే వీరు టీడీపీకి చెందిన ‘పచ్చ’ రంగును వేశారు. దీంతో పీఆర్ ఇంజినీర్లు ఎంబుక్ను రికార్డును చేస్తే తమకు ఎక్కడ నోటీసులిచ్చి చర్యలు తీసుకుంటారోనని భయపడుతున్నారు. అయితే తాము భవనాలకు వేసిన పెయింట్కే బిల్లులను మంజూరు చేయాలని ఇంజినీర్లను కాంట్రాక్టర్లు బెదిరిస్తున్నారు. -
పనిచేస్తారా.. పోతారా?
● ఫోన్లో ఏపీఎంకు సింగిల్విండో చైర్మన్ హుకూం ● బుక్ కీపర్ నియామకంపై బెదిరింపులు పగిడ్యాల: కూటమి పాలనలో అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు, బెదిరింపులకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం విస్తుపోయే ఘటన చోటుచేసుకుంది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి హాజరైన ఏపీఎం కళావతికి ఉన్నట్టుండి 12.30 గంటలకు ఫోన్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేసిన ఏపీఎం కొద్ది సేపు సమాధానంగానే చెబుతూ వచ్చారు. అయితే ఒక్కసారిగా స్వరం మారిపోయి ‘పనిచేసే వాళ్లను ఎవ్వరినైనా తెచ్చుకోండన్న.. గ్రామ సంఘం తీర్మానం లేకుండా బుక్కీపర్ను నియమించలేం’.. అని గట్టి గట్టిగా మాట్లాడే సంభాషణలతో తోటి ఉద్యోగులు అవాకై ్క చూశారు. అయితే ఏపీఎంకు ఫోన్ చేసిన వ్యక్తి టీడీపీ నాయకుడు, సింగిల్విండో చైర్మన్ దామోదర్రెడ్డిగా తెలిసింది. మూడు నెలల క్రితం ఆంజనేయనగర్లోని అంజయ్య గ్రామ సంఘంలో బుక్ కీపర్ సమస్య ఉందని, గ్రామ టీడీపీ నాయకుడు విజయ్, దామోదర్రెడ్డి చెప్పిన వ్యక్తిని తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని ఏపీఎం తెలిపారు. వాళ్లు చెప్పిన వ్యక్తికి గ్రామ సంఘం తీర్మానం చేయడం లేదని, ప్రొసీజర్ ప్రకారం చేస్తామని చెబుతున్నా.. పనిచేస్తారా... పోతారా, ఎవ్వకిరి చెప్పాలో వారికి చెబుతామని బెదిరిస్తున్నారన్నారు. నాగాభరణం, ముఖకవచం బహూకరణ గడివేముల: దుర్గాభోగేశ్వరస్వామి, అమ్మవార్లకు భక్తులు సోమవారం నాగాభరణం, ముఖకవచం బహూకరించినట్లు ఈఓ చంద్రశేఖరరెడ్డి తెలిపారు. పల్నాడు జిల్లా వినుకొండ మండలం చీకటిగలపాలెం గ్రామానికి చెందిన బొబ్బా బ్రహ్మారెడ్డి, బాలాకుమారి దంపతులు 1.223 కేజీల వెండి నాగాభరణం సమర్పించారు. అలాగే నంద్యాలకు చెందిన అట్రావణం రాజారావు, వసంతసుందరమ్మ దంపతులు రూ.1.30 లక్షలు విలువ చేసే వెండి ముఖకవచాన్ని అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో దాతలకు వేదాశీర్వచనం చేయించి స్వామి, అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో చైర్మన్ శ్రీనివాసులు, అర్చకులు శ్యాంసుందర్శర్మ, గిరినాథశర్మ పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో ఫీల్డ్ అసిస్టెంట్ దుర్మరణం గోనెగండ్ల: బొలెరో వాహనం ఢీకొని ఎస్. లింగందిన్నె గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ బోయ మదనగోపాల్(52) దుర్మరణం చెందాడు. పుట్టపాశం గ్రామ సమీపంలో ఈసంఘటన జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. ఎస్. లింగందిన్నె గ్రామానికి చెందిన బోయ మదన గోపాల్ గత 12 ఏళ్లుగా జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా సోమవారం జరిగిన ఉపాధి పనులకు సంబంధించి మస్టర్లు తీసుకొని బిల్లు చేయించేందుకు గోనెగండ్ల ఎంపీడీఓ కార్యాలయానికి బైక్పై బయలు దేరాడు. ఎమ్మిగనూరు నుంచి బూత్పూర్కు కోడిగుడ్లతో వేగంగా వెళ్తున్న బొలెరో వాహనం పుట్టపాశం గ్రామ సమీపంలో బైకును ఢీకొంది. ఈ ఘటనలో గోపాల్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య ఈరమ్మ, ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతుడు భార్యఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రబాబు తెలిపారు. వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి శిరివెళ్ల: నంద్యాల– ఆళ్లగడ్డ జాతీయ దారిపై జరిగిన వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలలో ఇద్దరు మృతి చెందారు. వెంకటాపురానికి చెందిన తేనేల మధు (54) ఈ నెల 19వ తేదీ రాత్రి శిరివెళ్ల మెట్ట వద్ద చికెన్ కొనుగోలు చేసి తిరిగి స్వగ్రామానికి నడిచి వెళ్తూ గ్రామం వద్ద రోడ్డు దాటుతుండంగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మధు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి ఇరువురు కుమారులు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మధుసూదన్ తెలిపారు. విధులకు వెళ్తూ.. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో వెటర్నరీ డిపార్ట్మెంట్లో అటెండర్గా పని చేస్తున్న ఎరుకలి వెంకటేశ్వర్లు (49) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అవుకు మండలం మిట్టపల్లికి చెందిన ఇతను ప్రస్తుతం నంద్యాల శ్రీనివాససెంటర్లో నివాసముంటున్నాడు. ఈ నెల 19వ తేదీ ఆదివారం కావడంతో ఇంటికి చేరుకున్నాడు. సోమవారం ఉదయం బైక్పై విధులకు వెళ్తుండగా సోమవారం యర్రగుంట్ల ఉషోదయ పాఠశాల వద్ద మరో మోటార్ బైక్ ర్యాంగ్ రూట్లో వచ్చి ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి ఇరువురు కుమారులు, ఇరువురు కుమార్తెలు. మృతుడి భార్య కళావతి ఫిర్యాదు మేరకు పోలీస్లు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బంగారు షాపుపై మెరుపు దాడులు నంద్యాల(వ్యవసాయం): పట్టణంలోని మెయిన్ బజార్లోని ఓ బంగారు షాపుపై సోమవారం విజయవాడ నుంచి బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండెడ్స్) వినియోగదారుల శాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. స్థానిక మహానంది జ్యువెలరీ షాపుపై వినియోగదారులు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేయడంతో దాడులు చేశారు. పోలీసుల సమక్షంలో షాపుల్లోని నాలుగున్నర కేజీల హాల్మార్క్ గుర్తు లేని బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటిని కోర్టుకు అందజేస్తామన్నారు. ఈ విషయం తెలియడంతో బంగారు షాపుల యజమానులందరూ అక్షయ తృతీయ పండుగ ఉన్నా కూడా షాపులు మూసివేశారు. -
బాలిక అదృశ్యం
నందవరం: మండల పరిధిలోని గంగవరం గ్రామానికి చెందిన బాలిక గుజ్జుల వైష్ణవి (13) అదృశ్యమైంది. బోయ గుజ్జుల వెంటేశ్వరి, బోయ గుజ్జుల వెంకటేష్ దంపతుల కుమార్తె అయిన ఈ బాలిక ఎమ్మిగనూరులోని బాలిక ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. ఈ నెల 18వ తేదీన ఎప్పటిలాగే ఏపీఎస్ఆర్టీసీ బస్సులో పాఠశాలకు బయలు దేరింది. ఒంటి పూట బడులు కావడంతో మధ్యాహ్నం 3:00 గంటలకు తిరిగి రావాల్సిన అమ్మాయి రాలేదు. తల్లిదండ్రులు బాలిక స్నేహితులు, బంధువులను ఆరా తీయగా ఎక్కడా ఆచూకీ లభించలేదు. దీంతో సోమవారం స్థానిక పోలీస్స్టేషన్ను ఆశ్రయించారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తిమ్మారెడ్డి తెలిపారు. బావిలో వ్యక్తి గల్లంతు నందికొట్కూరు: మిడుతూరు మండలంలోని చింతపల్లె గ్రామానికి చెందిన చాకలి గోవిందు(60) బావిలో ఈతకు వెళ్లి గల్లంతైనట్లు సోమవారం మిడుతూరు ఎస్ఐ ఓబులేసు తెలిపారు. వేసవి తాపానికి గ్రామ ప్రజలు చింతలపల్లె–దేవనూర్ గ్రామాల మధ్య ఉన్న వ్యవసాయ బావిలో సరదాగా ప్రతి రోజు ఈతకెళ్తున్నారు. ఈ క్రమంలో సోమవారం చాకలి గోవిందు బావిలో దూకి బయటకు రాలేదు. గమనించిన వారు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. భార్య, కుమారులు బావి వద్దకు చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. తహసీల్దార్ శ్రీనివాసులు, ఎస్ఐ ఓబులేసు సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకున్నారు. గాలింపు చర్యలు చేపట్టిన ఆచూకీ లభించలేదు. భార్య తిరుపాలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు ఎస్ఐ తెలిపారు. వృద్ధురాలికి అరుదైన ఆపరేషన్ డోన్: స్థానిక వంద పడకల ప్రభుత్వాసుపత్రిలో 80 ఏళ్ల వృద్ధురాలికి చేసిన అరుదైన శస్త్రచికిత్స విజయవంతమైందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హనీఫ్ తెలిపారు. వెల్దుర్తి మండలం మంగంపల్లి గ్రామానికి చెందిన లక్ష్మమ్మ కొద్ది రోజుల క్రితం ప్రమాదవశాత్తూ జారిపడటంతో ఆమె కుడివైపు తుంటి వద్ద ఫెమర్ మెడ విరిగినట్లు పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు ఆమెకు ఫ్రాక్చర్ నెక్ ఆఫ్ ఫెమర్ శస్త్ర చికిత్సను ఆసుపత్రి వైద్య బృందం విజయవంతంగా నిర్వహించారు. గత వారం జరిగిన శస్త్రచికిత్స అనంతరం ఆమె వేగంగా కోలుకుని నడుస్తున్నారని, సోమవారం ఆమె డిశ్చార్జ్ అయ్యారని డాక్టర్ హనీఫ్ వివరించారు. వీఆర్వోలకు పదోన్నతి ఉత్తర్వులు జారీ కర్నూలు(సెంట్రల్): ఇటీవల రెవెన్యూ శాఖలో పని చేస్తున్న 150 మంది గ్రేడు–2 వీఆర్వోలకు గ్రేడు–1 వీఆర్వోలుగా పదోన్నతి కల్పించారు. అయితే, ఇంత వరకు వారికి వ్యక్తిగతంగా పదోన్నతి ఆర్డర్ వెళ్లలేదు. ఈ నేపథ్యంలో డీఆర్వో టి.చిరంజీవి వారికి వ్యక్తిగత ఆర్డర్లతో పాటు కర్నూలు జిల్లాకు 83 మంది, నంద్యాల జిల్లాకు 67 మందిని కేటాయిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వృద్ధురాలి మృతి బండిఆత్మకూరు: ఓంకారం క్షేత్రంలో ఆదివారం అదృశ్యమైన మహిళ సోమవారం క్షేత్రానికి సమీపంలోని తెలుగుగంగ కాల్వలో శవమై కనిపించింది. ఎస్ఐ జగన్మోహన్ తెలిపిన వివరాల మేరకు.. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని ఖాదరబాద్కు చెందిన జింకల లక్ష్మీదేవి (63) ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి ఓంకార క్షేత్రానికి ఆటోలో వచ్చారు. దర్శనం అనంతరం కాశిరెడ్డి నాయన ఆశ్రమంలో భోజనం చేసిన తర్వాత లక్ష్మీదేవి బంధువుల నుంచి వేరయింది. ఈ క్రమంలో బంధువుల ఆచూకీ కోసం వెదుకుతూ తెలుగుగంగ ప్రధాన కాలువ వెంట వెళ్తూ ప్రమాదవ శాత్తూ కాలు జారి పడి మృతి చెందినట్లు తెలుస్తుందని ఎస్ఐ తెలిపారు. పోస్ట్మార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించామన్నారు. మృతురాలి కూతురు అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి చేశామన్నారు. మృతురాలి శరీరంపై ఉన్న 12 తులాల బంగారు ఆభరణాలను కూతురికి అప్పజె ప్పామని ఎస్ఐ తెలిపారు. జొన్నచొప్ప దగ్ధం హొళగుంద: మండలంలోని మార్లమడికి గ్రామంలో కురువ సణ్ణణ్ణి అనే రైతుకు చెందిన ఆరు ఎకరాల జొన్నచొప్పకు సోమవారం ఆకస్మికంగా మంటలు చేలరేగి కాలిబూడిదైంది. స్థానిక ఎస్సీ కాలనీలో జొన్నచొప్పను వాముగా వేసుకున్నాడు. మధ్యాహ్న సమయంలో మంటలు అంటుకుని కాలిపోతుండగా స్థానికులు ఆర్పేందుకు ప్రయత్నించారు. అదుపులోకి రాకపోవడంతో ఆలూరు ఫైర్స్టేషన్కు సమాచారమిచ్చారు. వారొచ్చేలోగా దాదాపు చొప్ప కాలిపోయింది. మొత్తం రూ.లక్ష ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు. -
వాహనాలన్నీ పెట్రోల్ బంకుల వైపు
● పెట్రోల్, డీజిల్ కోసం క్యూలో వాహనాలు ఎమ్మిగనూరురూరల్: డిమాండ్కు తగ్గట్లుగా ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ సరఫరా చేయలేక పోతున్నాయి. దీంతో పలు పెట్రోల్ బంకుల వద్ద నోస్టాక్ బోర్డులు వెలుస్తున్నాయి. ఎమ్మిగనూరు పట్టణంలో గత రెండురోజులుగా ఈ సమస్య మరీ తీవ్రమైంది. స్టాక్ లేక పలు పెట్రోల్ బంకులు మూసేయగా ఒకటి రెండు బంకుల్లో కొద్ది పాటి నిల్వలున్నాయి. అక్కడికి వెళితే వాహనాలు బారులుతీరాయి. గంటల తరబడి నిరీక్షిస్తే లీటర్ పెట్రోల్ మాత్రమే వేస్తున్నారని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే స్టాక్ లేదని పెట్రోల్బంకుల నిర్వాహకులు చెబుతున్నారు. -
ట్రాక్టర్ను ఢీకొన్న గూడ్స్ ఇంజిన్
● తీవ్రంగా గాయపడిన రైతుసంజామల: రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ రైల్వే ట్రాక్పై రెడ్డిపల్లె గ్రామ సమీపంలో సోమవారం ఉదయం ప్రమాదం చోటు చేసుకుంది. సంజామల రైల్వే స్టేషన్ నుంచి కొలిమిగుండ్ల రాంకో సిమెంట్ ఫ్యాక్టరీకి నూతనంగా రైల్వేట్రాక్ను ఏర్పాటు చేశారు. కొద్దిరోజుల నుంచి వివిధ ప్రాంతాల నుంచి సిమెంట్ ఫ్యాక్టరీకి గూడ్స్ రాకపోకలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రెడ్డిపల్లె గ్రామానికి చెందిన ఎం.రామచంద్రా రెడ్డి సోమవారం ఉదయం ట్రాక్టర్తో పొలానికి వెళ్తున్నాడు. ఆ సమయంలో రాంకో సిమెంట్ ఫ్యాక్టరీకి చెందిన గూడ్స్ ఇంజిన్ సంజామల వైపు నుంచి వస్తోంది. అయితే గిద్దలూరు రస్తా వద్ద ట్రాక్ వద్ద మలుపు ఉండడంతో లొకో పైలెట్ ట్రాక్టర్ను గమనించకపోవడంతో ఢీకొంది. ఈ ప్రమాదంలో రామచంద్రారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైతు కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని రెడ్డిపల్లె ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామంలో మూడు చోట్ల ట్రాక్ను దాటుకుని రైతులు పొలాలకు వెళ్లాల్సి వస్తుందని, వెంటనే గేట్మెన్లను ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలని కోరుతున్నారు. -
ముగ్గురు వేటగాళ్లు అరెస్టు
● రెండు నాటు తుపాకులు స్వాధీనంరుద్రవరం: నల్లమల అటవీ ప్రాంతంలో వన్య ప్రాణులను వేటాడుతున్న ముగ్గురు వేటగాళ్లను అరెస్టు చేసినట్లు రుద్రవరం రేంజ్ అధికారి ముర్తుజావలి తెలిపారు. అహోబిలం నార్త్ బీట్ పెద్దసెల అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల వేట సాగుతున్నట్లు సమాచారం రావడంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే నిఘా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం చెంచులు వన్య ప్రాణులను వేటాడేందుకు వెళ్లినట్లు సమాచారం అందడంతో సిబ్బందితో దాడులు చేశారు. ఆ దాడిలో అహోబిలానికి చెందిన సిసింద్రితో పాటు మరో ఇద్దరు మైనర్లు పట్టుబడ్డారు. వారి నుంచి రెండు నాటుతుపాకులు, మందుగుండు సామగ్రి, 2 కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు రేంజర్ తెలి పారు. మరో ఇద్దరు నిందితులు పరారైనట్లు ఆయన తెలిపారు. ప్రధాన నిందితుడిపై అటవీ చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చగా మెజిస్ట్రేట్ రిమాండుకు ఆదేశించారన్నారు. -
ఎమ్మిగనూరులో భారీ చోరీ
● 21 తులాల బంగారు ఆభరణాలు, రూ. 15 వేల నగదు చోరీఎమ్మినగూరు రూరల్: పట్టణంలోని శిల్పా ఎస్టేట్లో ఆదివారం భారీ చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న ఇంట్లో చొరబడి దొంగలు 21 తులాల బంగారు ఆభరణాలు, రూ. 15 వేల నగదు ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళితే..శిల్పా ఎస్టేట్ కాలనీకి చెందిన శంకర్రెడ్డి, చరిత దంపతుల కుమార్తె వివాహం వచ్చే నెల 7,8 వ తేదీల్లో జరుగనుంది. శంకర్రెడ్డి, భార్య చరిత, కుమారుడు నర్సిరెడ్డి ఆదివారం ఉదయం బళ్లారిలోని బంధువులకు పెళ్లి కార్డుల ఇచ్చేందుకు వెళ్లారు. అక్కడ కార్డులు పంచి అనంతపురానికి వెళ్లారు. రాత్రి కావడంతో అక్కడ బంధువుల ఇంట్లో ఉన్నారు. సోమవారం ఉదయం శంకర్రెడ్డి ఇంటికి పనిమనిషి వచ్చి చూడగా ఇంటి తలుపులు కట్చేసి ఉన్నాయి. ఈ విషయాన్ని ఆమె ఇంటి యజమానికి చేరవేసింది. వెనువెంటనే శంకర్రెడ్డి బంధువుల ద్వారా పట్టణ పోలీసులకు సమాచారం అందించాడు. టౌన్ సీఐ వి. శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకొని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. 12.30 గంటల ప్రాంతాంలో క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ను రప్పించారు. ఇంటి తలుపులకు, బీరువాకు ఉన్న వేలిముద్రలను సేకరించారు. బీరువాలో ఉంచిన 2 తులాల నెక్లెస్, 5 తులాల 6 గాజులు, 32 గ్రాముల కంకణం, 4 జతల కమ్మలు, 1 జత బుట్టలు, 2 ఉంగరాలు, రూ. 15 వేల నగదు చోరీ అయినట్లు శంకర్రెడ్డి ఫిర్యాదులో తెలిపారు. పెళ్లి జరగాల్సిన ఇంట్లో దొంగతనం జరగటంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చోరీ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ తెలిపారు. -
మద్యం దుకాణాల్లో విస్తృత తనిఖీలు
కర్నూలు: మద్యం దుకాణాలు, బార్లలో ధరల ఉల్లంఘన, కల్తీ నివారణ కోసం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఆ శాఖ కమిషనర్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఉత్తర్వుల మేరకు కర్నూలు ఎకై ్సజ్ సీఐ చంద్రహాస్ స్టేషన్ సిబ్బందితో పాటు ఈఎస్టీఎఫ్, ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందితో కలసి బృందాలుగా ఏర్పడి రెండు రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎస్ఐలు దుర్గా నవీన్ బాబు, రెహనా బేగం తదితరులు కూడా ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో మొత్తం 51 మద్యం దుకాణాలు, బార్లు ఉన్నాయి. రెండు రోజులుగా 21 దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. కర్నూలు టౌన్తో పాటు ఓర్వకల్లు, కర్నూలు రూరల్ మండలాలు ఈ స్టేషన్ పరిధి కిందికి వస్తాయి. సీఐ చంద్రహాస్ నేతృత్వంలో ప్రతి మద్యం దుకాణంలో తనిఖీలతో పాటు మద్యం బాటిళ్లను సురక్ష యాప్ ద్వారా స్కాన్ చేసిన తర్వాతనే వినియోగదారుడికి విక్రయించాలని సూచించారు. సేకరించిన మద్యంలో కల్తీ జరిగినట్లు పరీక్షల్లో తేలితే చర్యలు తప్పవని దుకాణ యజమానులకు హెచ్చరించారు. -
వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై దాడులు
● ఇద్దరికి తీవ్రగాయాలుసాక్షి టాస్క్ఫోర్స్: గడివేముల మండల పరిధిలోని ఒండుట్ల మజరా గ్రామమైన పైబోగులలో వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఇళ్లపై టీడీపీ వర్గీయులు కర్రలు, రాడ్లతో దాడి చేశారు. గ్రామానికి చెందిన రమణయ్య, రాజులు పొలం పనులతో జీవనం సాగిస్తున్నారు. గ్రామ సమీపంలో ఏర్పాటు చేస్తున్న సోలార్ నిర్మాణానికి పొలాలను తీసుకున్నారు. పొలాలు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం రాకుండా టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారు. నష్టపరిహారం అడిగినందుకు దాడులకు తెగబడుతున్నారు. రమణయ్య, రాజు గత ఎన్నికలలో వైఎస్సార్సీపీకి అనుకూలంగా వ్యవహరించారు. వీరిద్దరూ సోమవారం ఉదయం పొలానికి ఎద్దుల బండిపై వెళ్తుతుండగా టీడీపీ కార్యకర్తలు కర్రలు, రాడ్లతో దాడి చేశారు. రాజు కాలికి తీవ్రగాయం కావడంతో రక్తస్రావమైంది. స్థానిక పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న బాధితులను వైస్ ఎంపీపీ కాలునాయక్, వైఎస్సార్సీపీ నాయకులు రవీంద్రారెడ్డి, మేఘనాధరెడ్డి, అనిల్కుమార్రెడ్డి పరామర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్సీపీ సానుభూతి పరులు, నాయకులపై దాడులు చేయడం పరిపాటిగా మారింది. పైబోగుల గ్రామంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై దాడులు చేయడం హేమమైన చర్య. గ్రామానికి చెందిన రాజు, రమణయ్య కుటుంబాలకు అండగా ఉంటాం. దాడులకు పాల్పడిన టీడీపీ వర్గీయులపై పోలీసులు నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవాలి. – కాటసాని రాంభూపాల్రెడ్డి, వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు -
క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు
● నలుగురు అరెస్ట్, రూ.22 లక్షల నగదు స్వాధీనంఎమ్మిగనూరురూరల్: పట్టణంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ రాకెట్ను పోలీసులు ఛేదించారు. నలుగురు బెట్టింగ్ రాయుళ్లను అరెస్టు చేసి, భారీగా నగదు, విలువైన సెల్ ఫోన్లు సీజ్ చేశారు. డీఎస్పీ ముర్రవాడ భార్గవి సోమవారం స్థానిక పట్టణ పోలీస్స్టేషన్ అవరణలో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. డెక్కన్ 247 పేరుతో ప్రత్యేకంగా మొబైల్ యాప్ను క్రియేట్ చేసి ఎమ్మిగనూరు పట్టణ పరిసరాల్లో ఆరుగురు వ్యక్తులు క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఈ మేరకు సమాచారం అందడంతో డీఎస్పీ పర్యవేక్షణలో పట్టణ సీఐ వి. శ్రీనివాసులు, ఎస్ఐ మధుసుధన్రెడ్డి, క్రైంపార్టీ పోలీసులు దాడి చేశారు. బెట్టింగ్ ముఠాకు చెందిన ఆరుగురిలో పట్టణానికి చెందిన మహమ్మద్షాషావలి, షరీఫ్, రంగాచారి, పెద్దతుంబళానికి చెందిన పవన్కుమార్ను అరెస్టు చేసి వారి నుంచి రూ. 22 లక్షల నగదు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆదోనికి చెందిన శివమూర్తి, సిరుగుప్పకు చెందిన పీరా పరారీలో ఉన్నట్లు డీఎస్పీ వెల్లడించారు. డబ్బు ఆశతో యువత బెట్టింగ్ ఉచ్చులోపడి జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు. బెట్టింగ్ జరగుతున్నట్లు తెలిస్తే వెంటనే 112 నెంబర్కు ఫోన్ చేసి తెలియజేయాలన్నారు. -
వైభవంగా అక్షయ తృతీయ
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠంలో అక్షయ తృతీయ వేడుకలు వైభవంగా జరిగాయి. సోమవారం శ్రీమఠం పీఠాధిపతి సబుధేంద్రతీర్థులు నేతృత్వంలో వేడుకలు నిర్వహించారు. ముందుగా రాఘవేంద్రులకు సుప్రభాత సేవతో పూజలు ప్రారంభం కాగా రాఘవేంద్రుల మూల బృందావనానికి విశేష పంచామృతాభిషేకం గావించారు. వేడుక ప్రత్యేకతగా మూల బృందావనాన్ని గంధ లేపనంతో విశేషాలంకరణ చేశారు. పీఠాధిపతి చేతుల మీదుగా మహా మంగళహారతి కానిచ్చారు. అనంతరం గ్రామ దేవత మంచాలమ్మ, మూల సంస్థాన పూజలో భాగంగా మూల, జయ, దిగ్విజయ రాముల పూజలో తరించారు. అక్షయ తృతీయ సందర్భంగా భక్తుల రద్దీ కనిపించింది. మూల బృందావన అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. -
వైఎస్సార్సీపీ హయాంలో వాల్మీకులకు పెద్దపీట
● మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డిప్యాపిలి: గత వైఎస్సార్సీపీ హయాంలోనే వాల్మీకుల సంక్షేమానికి పెద్దపీట వేశామని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. గుడిపాడు గ్రామంలో నూతనంగా ప్రతిష్టించిన వాల్మీకి విగ్రహానికి సోమవారం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చేరుకున్న బుగ్గనకు వాల్మీకులు, గ్రామ పెద్దలు ఘన స్వాగతం పలికారు. వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోలేని వాల్మీకి గుహలను తమ ప్రభుత్వ హయాంలో తీర్చిదిద్ది పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చామన్నారు. రూ. 3 కోట్లతో పర్యాటకంగా అభివృద్ధి చేశామన్నారు. బేతంచెర్ల మండలంలో వాల్మీకి భవన్ నిర్మించిన ఘనత కూడా తమకే దక్కుతుందన్నారు. వాల్మీకి మహర్షిని ఆదర్శంగా తీసుకొని తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించుకోవాలన్నారు. వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి మెట్టు వెంకటేశ్వర్ రెడ్డి, బూత్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి బొర్రా మల్లికార్జునరెడ్డి, వాల్మీకులు నారాయణ స్వామి, మాజీ సర్పంచ్ గోవిందు, నరేశ్, శంకర్, ఓబులేసు, గ్రామ పెద్దలు రామిరెడ్డి, చిన్నపుల్లారెడ్డి, వెంకటరామిరెడ్డి, జనార్ధన్ రెడ్డి, నారాయణ స్వామి, వైఎస్సార్సీపీ నాయకులు బోరెడ్డి పుల్లారెడ్డి, కృష్ణారెడ్డి, రజనీ రెడ్డి, కొండయ్య, నాగరాజు, రంగస్వామి, వెంకటేశ్, ప్రేమసాగర్ రెడ్డి, ప్రభాకర్రెడ్డి, పాలవెంకటేశ్, చెన్నకేశవ యాదవ్, ఇంద్రసేనారెడ్డి, పరమేశ్ రెడ్డి, నాగేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉల్లి సాగు వద్దంటున్న చంద్రబాబు ప్రభుత్వం
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉల్లి ప్రధాన వాణిజ్య పంట. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఏటా లక్ష ఎకరాల వరకు ఉల్లి సాగవుతోంది. ఇలాంటి పంటకు మద్దతు ధర కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాలకు ఉల్లి ఎగుమతులు నిలిచిపోయాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పండించిన ఉల్లిలో 50 శాతం బంగ్లాదేశ్కు ఎగుమతి అవుతుంది. అయితే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎగుమతులను నిలిపివేయడం ఉల్లి ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వానికి రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ మద్దతు ఇస్తోంది. అయినప్పటికీ బంగ్లాదేశ్కు ఉల్లి ఎగుమతులను ప్రోత్సహించే విధంగా చొరవ తీసుకోవాల్సిన చంద్రబాబు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. రాష్ట్రంలోని ఉల్లిలో 80 శాతం ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే పండుతుంది. 2025 ఖరీఫ్లో పండించిన ఉల్లికి ధర పడిపోయినప్పుడు ఎకరాకు రూ.20 వేల ప్రకారం పరిహారం చెల్లించినప్పటికీ రైతులకు పెట్టుబడి కూడా దక్కలేదు. రబీలో ఉల్లి సాగు చేసిన రైతులు 100 శాతం మంది నష్టాలు భరించారు. ఉల్లి సాగు చేసి లాభపడిన రైతు ఒక్కరంటే ఒక్కరూ లేకపోవడం గమనార్హం. కలసిరాని మహారాష్ట్ర రకాలు సాగు మహారాష్ట్రలోని పుణే, నాసిక్ తదితర ప్రాంతాల్లో పండించిన ఉల్లిలో నాణ్యత ఎక్కువగా ఉంటోంది. నిల్వ కూడా ఎక్కువ రోజులు సాధ్యం. మహారాష్ట్ర రకాలతో జిల్లాలో ఉల్లి సాగు చేయించాలని కొన్నేళ్ల క్రితమే కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో మహారాష్ట్ర ప్రభుత్వం ఎన్హెచ్ఆర్డీఎఫ్ను ఏర్పాటు చేసింది. మహారాష్ట్ర విత్తన రకాలతో ఉల్లి సాగు చేయిస్తున్నప్పటికీ కలసిరాని పరిస్థితి నెలకొంది. అక్కడి నేలలకు, ఇక్కడి నేలలకు తేడా ఉండటంతో సాగులో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. విధిలేని పరిస్థితుల్లో లోకల్ రకాలైన బళ్లారి రెడ్, పూనా రెడ్ వంటి రకాలతో నెట్టుకొస్తున్నారు. ఉల్లి ధర దయనీయం పశ్చిమాసియా యుద్ధ ప్రభావం, బంగ్లాదేశ్కు ఎగుమతులు నిలిచిపోవడం తదితర కారణాలతో ఉల్లికి డిమాండ్ పడిపోయింది. కేంద్రంతో చర్చించి బంగ్లాదేశ్కు ఎగుమతులను ప్రోత్సహించాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఉల్లికి అన్సీజన్. ఈ సమయంలో ఉల్లి ధరల్లో కొంతమేర పెరుగుదల ఉండాలి. కానీ ఎగుమతులు నిలిచిపోవడం వల్ల ఉల్లికి డిమాండ్ లేకుండా పోయింది. రాష్ట్రంలోనే ఉల్లి మార్కెటింగ్కు కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు ఆధారం. ఇక్కడే ఉల్లి ధర దయనీయంగా ఉంటోంది. గరిష్ట ధర రూ.841 మాత్రం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ ధర కూడా ఒకటి, రెండు లాట్లకు మాత్రమే లభించింది. ఎక్కువ లాట్లకు రూ.500 కూడా మించని పరిస్థితి. 2025–26 రబీలో ఒకటిన్నర ఎకరాలో ఉల్లి సాగు చేశాం. రూ.1.30 లక్షల వరకు పెట్టుబడి పెట్టాం. దిగుబడి ఆశాజనకంగా వచ్చింది. ధరనే పూర్తిగా నిరాశకు గురి చేసింది.క్వింటాలుకు కనీసం రూ.1200 ధర లభిస్తే గిట్టుబాటు అవుతుంది. అయితే క్వింటాలుకు లభించిన ధర రూ.480 మాత్రమే. ఈ ధరతో అమ్ముకోవడం వల్ల రూ.లక్ష మాత్రమే వచ్చింది. పెట్టుబడితో పోలిస్తే రూ.30 వేలు నష్టం వచ్చింది. ఎగుమతులు లేకపోవడం వల్ల ఉల్లి ధరలు పడిపోయాయి. బంగ్లాదేశ్కు ఎగుమతులు ఉన్నప్పుడు క్వింటాలుకు కనీసం రూ.1200 నుంచి రూ.1500 వరకు ధర లభించేది. ఎగుమతులు లేకపోవడంతో క్వింటాలుకు రూ.500 కూడా లభించడం లేదు. – రామానాయుడు, పులకుర్తి, కోడుమూరు మండలం సోలార్ డ్రైయ్యర్లను విస్మరించిన సర్కారు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీని ఏర్పాటు చేసిన ఉల్లి రైతులను ఆదుకోవాలనే ప్రధాన లక్ష్యంతో సోలార్ డ్రైయర్లను ప్రోత్సహించింది. వీటి వల్ల రైతులు పండించిన ఉల్లికి డిమాండ్ ఏర్పడటంతో పాటు పొదుపు మహిళలకు ఉపాధి లభించింది. ఉల్లి రైతులను ఆదుకోవాలనే ఏకై క లక్ష్యంతో వందలాది సోలార్ డ్రైయర్లను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం అధికారంలోని చంద్రబాబు ప్రభుత్వం సోలార్ డ్రైయర్లను పూర్తిగా పక్కన పెట్టింది. నేడు జిల్లాలో ఒక్క సోలార్ డ్రైయర్ కూడా కనిపించని పరిస్థితి. బంగ్లాదేశ్కు ఎగుమతులను నిలిపేసిన కేంద్రం మోదీని ఒప్పించడంలో చొరవ చూపని టీడీపీ ప్రభుత్వం ధర పతనమై రైతులకు నష్టాలు మద్దతు ఇవ్వకపోగా సాగు వద్దంటున్న చంద్రబాబు గత ప్రభుత్వం సోలార్ డ్రైయర్లతో ప్రోత్సాహం వీటిని పక్కన పెట్టిన ప్రస్తుత సర్కారు సరిగ్గా 10 నెలల క్రితం ఉల్లి సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర బృందం జిల్లాలో పర్యటించింది. సాగులో ఇబ్బందులు, విస్తీర్ణాన్ని పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలు, కొత్త ఉల్లి రకాలను రైతులకు అందుబాటులోకి తేవడం తదితర అంశాలపై కేంద్ర బృందం రైతులతో చర్చించింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఉల్లి సాగు వద్దంటోంది. రాయలసీమ జిల్లాలను ఉద్యాన పంటల హబ్గా అభివృద్ధి చేస్తామంటున్న చంద్రబాబు సర్కార్ ఉల్లి సాగు చేయకుండా చూడాలని, ప్రత్యామ్నాయ పంటలను సూచించాలని ఉద్యాన శాఖను ఆదేశించింది. ఉమ్మడి జిల్లాలో ఏడాది పొడవునా లక్ష ఎకరాల వరకు ఉల్లి సాగవుతోంది. దీనిని 50 శాతానికిపైగా తగ్గించాలని ఉద్యాన శాఖకు లక్ష్యాన్ని నిర్దేశించింది. ఉల్లి పంటకు మద్దతు కల్పించడంలో చేతులెత్తేసిన సర్కార్ ఏకంగా సాగును లేకుండా చేయాలనుకోవడం గమనార్హం. -
‘మండిపోతున్న’ సూరీడు!
● చిప్పగిరిలో 43.9, ఆళ్లగడ్డలో 43.6 డిగ్రీల ఉష్ణోగ్రత కర్నూలు(అర్బన్): ప్రస్తుత వేసవిలో ఎండ, వడగాలులతో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్జైన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పలు మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందన్నారు. కర్నూలు జిల్లా చిప్పగిరిలో 43.9, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 43.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయన్నారు. ఎండలకు బయటకు వెళ్లేటప్పుడు చెవుల్లోకి వేడి గాలి వెళ్లకుండా జాగ్రత్త పడాలన్నారు. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగరాదన్నారు. నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు, మంచినీళ్లు ఎక్కువగా తీసుకోవాలన్నారు. మరో వైపు ద్రోణి ప్రభావంతో మంగళవారం కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ర్యాగింగ్పై ఫిర్యాదు రాలేదు ● కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ కర్నూలు (హాస్పిటల్): కర్నూలు మెడికల్ కళాశాల వసతి గృహంలో ర్యాగింగ్ జరిగినట్లు మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థి నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 17, 18 తేదీల్లో ర్యాగింగ్ అంశంపై కేఎంసీ విద్యార్థుల నుంచి ఎన్ఎంసీకి ఫిర్యాదు చేసిన విషయమై పూర్తిస్థాయి విచారణ కొనసాగుతోందన్నారు. ఎన్ఎంసీకి ఫిర్యాదు చేసినట్లు ఎవరూ తమ దృష్టికి తీసుకురాలేదన్నారు. హాస్టల్లో ఫస్టియర్ విద్యార్థులను, సీనియర్ విద్యార్థులకు వేర్వేరు బిల్డింగుల్లో ఉంచుతామన్నారు. రాత్రి 9 గంటల తర్వాత ఫస్టియర్ విద్యార్థులు ఉండే భవనంలోకి ఎవరికీ ప్రవేశం ఉండదన్నారు. సీనియర్ల నుంచి జూనియర్లకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ర్యాగింగ్ చేస్తే ఎలాంటి వారైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 9 మందికి కారుణ్య నియామక ఉద్యోగాలు కర్నూలు(సెంట్రల్): కారుణ్య నియామకం కింద రెవెన్యూ శాఖలో 9 మందికి ఉద్యోగాలు కల్పించారు. ఒకరు జూనియర్ అసిస్టెంట్ కాగా, 8 మంది ఆఫీసు సబార్డినేట్ ఉద్యోగాలు పొందారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఉద్యోగాలకు ఎంపికై న వారికి నియామక పత్రాలను అందజేసి సక్రమంగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్చార్జి డీఆర్వో చిరంజీవి పాల్గొన్నారు. కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో ఆరుగురు విద్యార్థులు డిబార్ అయ్యారు. సోమవారం నాలుగో సెమిస్టర్ పరీక్షలకు 8,395 మందికి గాను 7,570 మంది విద్యార్థులు హాజరు కాగా 819 మంది గైర్హాజరైనట్లు వర్సిటీ పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ ఎన్.నరసింహులు తెలిపారు. డోన్ జీవీఆర్ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేంద్రంలో ఇద్దరు, కర్నూలు సెయింట్ జోసప్స్ కళాశాల, ఉస్మానియా కళాశాల, నంద్యాల పీఎస్సీ అండ్ కేవీఎస్సీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆలూరు శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల కేంద్రంలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఆరుగురు విద్యార్థులు చూచి రాతలకు పాల్పడటంతో డిబార్ చేసినట్లు తెలిపారు. ఎస్పీ పీజీఆర్ఎస్కు 115 ఫిర్యాదులు కర్నూలు: కర్నూలు కొత్తపేటలోని టూటౌన్ పోలీస్స్టేషన్ పక్కనున్న క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించి నేరుగా వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పీజీఆర్ఎస్కు మొత్తం 115 ఫిర్యాదులు వచ్చాయి. ప్రధానంగా భూ వివాదం, బంధువుల నుంచి వేధింపులు, ఉద్యోగాల పేరుతో మోసం, ఇంటి స్థలాల ఆక్రమణ, అధిక వడ్డీ పేరుతో మోసం, రోడ్డు ప్రమాదాలతో పాటు వ్యక్తిగత సమస్యలపై బాధితులు ఎస్పీకి విన్నవించుకున్నారు. వాటన్నింటిపై చట్ట పరిధిలో విచారణ జరిపి సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, సీఐలు శివశంకర్, రామకృష్ణ, రామయ్య నాయుడు తదితరులు పీజీఆర్ఎస్లో పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. -
సకల దేవతా స్వరూపిణి గోమాత
నంద్యాల(వ్యవసాయం): భూలోకంలో సకల దేవతల స్వరూపిణి గోమాతే అని ప్రవచన చక్రవర్తి వాచస్పతి బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక రామకృష్ణ పీజీ కళాశాల మైదానంలో హైదరాబాద్ ధర్మవర్తిని ట్రస్టు, మన ఊరు–మనగుడి, మన బాధ్యత ఆధ్వర్యంలో గో ప్రాధాన్యత, గోసేవ ఆవశ్యకత, విశిష్టత గురించి ప్రవచన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా గోవులకు పూజా కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హైకోర్టు జస్టిస్ బి.కృష్ణమోహన్, కలెక్టర్ రాజకుమారి, ఆర్డీఓ విశ్వనాథ్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ మానవులు తెలిసి తెలియక చేసిన పాపాలను పోగొట్టుకోవడానికి మరుజన్మ లేకుండా మోక్షం పొందడానికి రుషులు అనేక మార్గాలు సూచించారన్నారు. ఏదైనా పొరపాటు చేశానని భావిస్తే గోమాత వద్దకు వెళ్లి గ్రాసం వేసి ప్రార్థిస్తే ఆ దోషం నుంచి బయట పడతారన్నారు. ఆవు గంగడోలు నిమిరినా పాపం నుంచి విముక్తి లభిస్తుందన్నారు. గోవును మనం చూసినా.. అది మనల్ని చూసినా పాపం తొలుగుతుందన్నారు. ప్రతి ఒక్కరు గోమాతకు సేవ చేయడం లక్ష్యంగా పెట్టుకొని జీవనం సాగించాలన్నారు. కార్యక్రమంలో గుంటూరు ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్ శివకుమార్రెడ్డి, రఘువీర్, హరికృష్ణ, వెంకటేశ్వర్లు, పెద్ద ఎత్తున ప్రజలు, అధికారులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. -
మల్లన్న సేవలో గోవా మంత్రి
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను గోవా ప్రభుత్వ పవర్, న్యూ రెన్యువబుల్ ఎనర్జీ మంత్రి ఆర్.ఎం.దవళికర్ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఆదివారం మల్లన్న దర్శనార్థం ఆలయం వద్దకు విచ్చేసిన గోవా మంత్రి దంపతులకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం గోవా మంత్రి మల్లికార్జున స్వామివారికి రుద్రాభిషేకం, భ్రమరాంబాదేవికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం ఆశీర్వచన మండపంలో వేదపండితులు వేదమంత్రాలు పలుకగా, అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. దేవస్థాన అధికారులు స్వామివారి శేషవస్త్రాలను, లడ్డూ ప్రసాదాలను అందించి సత్కరించారు. అలాగే మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మనందరెడ్డి దంపతులు కూడా స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. -
వివాహిత అదృశ్యం
ఉయ్యాలవాడ: మండలంలోని హరివరం గ్రామానికి చెందిన వివాహిత మెట్టుపల్లె లక్ష్మి (30) అదృశ్యమైంది. ఈ మేరకు ఉయ్యాలవాడ పోలీస్స్టేషన్లో ఆదివారం కేసు నమోదైంది. ఏఎస్ఐ ప్రతాప్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. మెట్టుపల్లె లక్ష్మి ఈ నెల 16వ తేదీ తెల్లవారుజామున ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి భార్య ఆచూకీ కోసం భర్త దస్తగిరి తన బంధువులు, తెలిసిన వారి ఇళ్లలో గాలించారు. ఆమె ఎక్కడా కనిపించకపోవడంతో దస్తగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మెట్టుపల్లె లక్ష్మికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. బైక్ దొంగల అరెస్ట్ ఆదోని రూరల్: ఇటీవల ఇస్వీ పోలీస్స్టేషన్ పరిధిలో బైక్ చోరీలకు పాల్పడిన ఇద్దరిని పట్టుకున్నట్లు ఇస్వీ ఎస్ఐ మహేష్కుమార్ తెలిపారు. ఆదివారం స్థానిక పోలీస్స్టేషన్లో నిందితుల వివరాలను ఎస్ఐ వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారి పట్టణంలోని ఎంజీ సర్కిల్ వద్ద నివాసముంటున్న మాదిగ మనోజ్కుమార్, కర్నూలు జిల్లా కోసిగి మండలం అగసనూరు గ్రామానికి చెందిన మాదిగ రాముడు అలియాస్ చరణ్ ఇటీవల ఇస్వీ గ్రామంలో రెండు మోటార్ సైకిళ్లను దొంగలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టామన్నారు. పక్కా సమాచారం మేరకు దొంగలను పట్టుకున్నట్లు ఎస్ఐ వివరించారు. ఈ దాడుల్లో పోలీసు సిబ్బంది సుదర్శన్, బీరప్ప, వెంకటేష్, కిరణ్కుమార్, రామచంద్ర, హెడ్కానిస్టేబుల్ నాగరాజు పాల్గొన్నారు. కాలువలో పడి విద్యార్థిని మృతి కౌతాళం: మండల పరిధిలోని కామవరం గ్రామంలో శనివారం తప్పిపోయిన బాలిక కాలువలో పడి మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన నర్సమ్మను మండల పరిధిలోని చిరుతపల్లి గ్రామానికి చెందిన నరసింహులకు ఇచ్చి పది సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక బాబు సంతానం ఉన్నారు. మొదటి సంతానం రక్షిత (7) చిరుతపల్లి గ్రామంలో 1వ తరగతి చదువుతున్నది. రెండు రోజుల క్రితం తల్లి నర్సమ్మతో కలిసి కామవరం గ్రామానికి వచ్చింది. శనివారం మధ్యహ్నం ఇంటి నుంచి ఆడుకునేందుకు బయటకు వెళ్లి స్థానికంగా ఉన్న ఎల్ఎల్సీ కాలువలో పడిపోయింది. ఎంతసేపైన బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు బందువులు బాలిక కోసం గాలించిన ఫలితం లేకపోయింది. ఆదివారం సాయంత్రం కాలువలో బాలిక మృతదేహం లభ్యమైంది. దీంతో బాలిక కాలువలో పడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పిడుగుపాటుతో రెండు ఎద్దులు మృతి సి.బెళగల్: మండల పరిధిలోని కంబదహాల్ గ్రామంలో పిడుగుపాటుతో రెండు ఎద్దులు మృతి చెందాయి. గ్రామానికి చెందిన ఉప్పరి బసన్నకు చెందిన దాదాపు రూ.3 లక్షలు విలువ చేసే రెండు ఎద్దులను ఎప్పటిలాగానే ఆదివారం గ్రామంలోని పశువుల దొడ్డిలో కట్టేసుకున్నాడు. అయితే ఆదివారం సాయంకాలంలో మండలంలోని పలు గ్రామాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ క్రమంలో కంబదహాల్ గ్రామంలో వర్షంలో భారీ శబ్దంతో పిడుగు పడటంతో దొడ్లో కట్టేసుకున్న రెండు ఎద్దులు అక్కడికి అక్కడే మృతి చెందాయి. సంఘటనను గమనించిన స్థానిక రైతులు బాధిత రైతుకు విషయం తెలియజేశారు. బాల్యవివాహాలను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు మంత్రాలయం రూరల్: బాల్యవివాహాలను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తప్పవని, మహిళలు, బాలికల భద్రతకు పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత కల్పిస్తుందని ఎమ్మిగనూరు డీఎస్సీ భార్గవి అన్నారు. ఆదివార చిలకలడోణ గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..బాలికలు, మహిళల భద్రతకు విఘాతం కల్గిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మహిళల చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. గురువారం చిలకలడోణ గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చాలా బాధాకరం అన్నారు. ఇకపై ప్రమాదాలపై ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామన్నారు. ఎక్కడైనా ఏమైనా సమస్యలు ఉంటే వారి భద్రత కోసం 100, 112, 1930 హెల్ప్లైన్ నంబర్లకు గాని, స్థానిక పోలీసులకు గానీ సమాచారం అందించాలని సూచించారు. సీఐ ఎం దస్తగిరి బాబు, ఎస్ఐ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రత్యేక’ నిర్లక్ష్యం!
● ఫెయిల్ అయిన ఇంటర్ విద్యార్థులకు మొదలవ్వని ప్రత్యేక తరగతులు ● ఉత్తర్వులు ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ విద్యలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో ఈ ఏడాది మొదటి సంవత్సర విద్యార్థులు జిల్లాలో 6,813 మంది ఫెయిల్ అయ్యారు. ఫెయిలైన విద్యార్థులు తిరిగి ఉత్తీర్ణులయ్యేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రత్యేక తరగతులు నిర్వహించింది. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటి వరకు ‘ప్రత్యేక’ ఉత్తర్వులు జారీ చేయలేదు. ఈ నెల 1వ తేదీ నుంచే ఇంటర్మీడియెట్ రెండో సంత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి. ఫెయిల్ అయిన విద్యార్థులు సెకండియర్ తరగతులకు హాజరుకావాలా? ఫెయిల్ అయిన సబ్జెక్టులు చదువుకోవాలా? అని ఆందోళన చెందుతున్నారు. సప్లిమెంటరీ పరీక్షలు వచ్చే నెల 21 నుంచి జూన్ 4వతేదీ వరకు ఉదయం, మధ్యాహ్నం నిర్వహించనున్నారు. ప్రాక్టికల్ పరీక్షల్లో ఫెయిల్ అయినవారికి జూన్ 7 నుంచి 11వ తేదీ వరకు జిల్లా కేంద్రంలో మాత్రమే పరీక్షలు జరపనున్నారు. సప్లిమెంటరీ పరీక్షలకు ఈ నెల 20 నుంచి 27వ తేదీలోపు పరీక్ష ఫీజులు చెల్లించాలి. జిల్లాలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు మొత్తం 23,169 మంది పరీక్షలు రాస్తే 16,356 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరితోపాటు రెండో సంవత్సరం విద్యార్థులకు ఇంప్రూవ్మెంట్ అవకాశం ఇచ్చారు. ఈ నెల 20 నుంచి 27వ తేదీలోపు ఫీజు చెల్లించాలి. ఈ తేదీల్లోనే ఫెయిల్ అయిన విద్యార్థులు, మార్కులు తక్కువ వచ్చినవారు, వచ్చిన మార్కులపై అనుమానమున్న వారు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్కు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఫీజుల వివరాలు.. ● రీకౌంటింగ్కి ఒక్కో పేపర్కు రూ.260 ● రీవెరిఫికేషన్తో పాటు, స్కాన్ చేసిన సమాధాన పత్రానికి ఒక్కో సబ్జెక్టుకు రూ.1300 ● సప్లిమెంటరీ ఫస్ట్ ఇయర్లో థియరీ పరీక్షలకు రూ.600 ● ప్రాక్టికల్ పరీక్షలకు రూ.275 ● బ్రిడ్జి కోర్సు ప్రాక్టికల్ పరీక్షలకు రూ.275 ● ఫస్ట్ ఇయర్, సెకండియర్ థియరీ పరీక్షలకు రూ.1200 ● వొకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలకు రూ.550 ● మొదటి, ద్వితీయ పరీక్షల్లో పాసై, మార్కులు పెంచుకునేందుకు ఆర్ట్స్ విద్యార్థులు రూ.1350, సైన్స్ విద్యార్థులు రూ.1600 ఇంటర్మీడియెట్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాసి సెకండియర్లోకి వచ్చిన విద్యార్థులకు ఈనెల 1 నుంచి 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యింది. – జి.లాలెప్ప, ఇంటర్మీడియెట్ విద్యా మండలి ప్రాంతీయ కార్యాలయ అధికారి -
క్వింటం వేరుశనగ రూ.7,394
ఎమ్మిగనూరు టౌన్: స్థానిక వ్యవసాయ మార్కెట్కు ఆదివారం వేరుశనగ దిగుబడులు 1,212 క్వింటాళ్లు వచ్చాయి. క్వింటం వేరుశనగ గరిష్టంగా రూ.7,394 ధర పలికింది, కనిష్ట ధర రూ.3,860,మధ్యస్థ ధర క్వింటం రూ.5,627 పలికినట్లు మార్కెట్ యార్డ్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు. ఆముదాలు 67 క్వింటాళ్లు విక్రయానికి రాగా కనిష్ట ధర క్వింటం రూ.5,010, మధ్యస్థ ధర క్వింటం రూ.5,709, గరిష్ట ధర రూ.5,890, అదేవిధంగా మొక్కజొన్న 25 క్వింటాళ్లు విక్రయానికి రాగా అందులో క్వింటం కనిష్ట ధర రూ.1,410, మధ్యస్థ ధర రూ.1,455, గరిష్ట ధర రూ.1,480కు, కందులు కేవలం 5 క్వింటాళ్లు విక్రయానికి రాగా కనిష్ట ధర రూ.6,170, మధ్యస్థ ధర రూ.6,190, గరిష్ట ధర రూ.6,212లకు వ్యాపారులు కొనుగోలు చేశారు. -
నెరవేరిన నేవీ కల
● ఎన్డీఏలో 46వ ర్యాంకర్గా పీఎం కోవిధ్రెడ్డికర్నూలు(అర్బన్): నేవీలోకి వెళ్లాలనేది ఆ విద్యార్థి కల. 9వ తరగతి నుంచే ఎంతో కష్టపడ్డాడు. కఠోర సాధన, పుస్తక పఠనం, అనుభవజ్ఞుల నుంచి మెలకువలు నేర్చుకొని తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. కర్నూలు ధర్మపేటలో నివాసం ఉంటున్న జూపాడుబంగ్లా మండలం తర్తూరు గ్రామానికి చెందిన సాప్ట్వేర్ ఇంజినీరు పీఎం విశ్వనాథరెడ్డి, మాధవీ దంపతుల తనయుడు పీఎం కోవిధ్రెడ్డి నేషనల్ డిఫెన్స్ అకాడమీలో జాతీయ స్థాయిలో 46వ ర్యాంకు సాధించి కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారు. దిశ మార్చిన కోవిడ్ ... 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు కర్నూలులోని సెయింట్ జోసప్ స్కూల్లో చదువుతున్న కోవిధ్రెడ్డి కోవిడ్ సమయంలో స్కూల్స్ మూతపడగా, ఇంటి వద్ద ఉంటూ చుదువుకుంటున్నాడు. ఆ సమయంలోనే కోరుకొండ సైనిక్ స్కూల్లో ప్రవేశాలకు వచ్చిన ప్రకటన చూసి దరఖాస్తు చేసుకున్నాడు, రెండు నెలల కోచింగ్ తీసుకున్న అనంతరం విజయనగరం కోరుకొండ సైనిక్ స్కూల్లో ప్రవేశం పొందాడు. 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ ( 12 గ్రేడ్ ) వరకు అక్కడే విద్యను అభ్యసిస్తునే నేషనల్ డిఫెన్స్ అకాడమీకి ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. 12 గ్రేడ్ పాస్ అయిన వారికి ఎన్డీఏలో ప్రవేశం పొందేందుకు యూపీఎస్సీ ప్రతి ఏడాది రెండు సార్లు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తోంది. లక్షల సంఖ్యలో విద్యార్థులు రాసిన అత్యధిక పోటీ ఉండే ఈ పరీక్షలో కోవిధ్రెడ్డి 46వ ర్యాంకు సాధించాడు. ఈ ఏడాది జూలై నెలలో ఇండియన్ నేవీలో శిక్షణకు వెళ్తున్నాడు. గత ఏడాది సెప్టెంబర్లో జరిగిన పరీక్షకు లక్షల సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలో మంచి మార్కులను సాధించాను. మ్యాథమేటిక్స్, జనరల్ ఎబిలిటీ, ఇంగ్లిషు, జనరల్ నాలెడ్జ్లో పరీక్ష ఉంటుంది. ప్రతి సబ్జెక్టులో కనీసం 25 శాతం మార్కులను సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సర్వీస్ సెలెక్షన్ బోర్డు ( ఎస్ఎస్బీ ) ఇంటర్వ్యూను కూడా నిర్వహించింది. ఇంటర్వ్యూలో కూడా మంచి మార్కులు సాధించాను. తల్లిదండ్రుల ప్రోత్సాహం, అధ్యాపకుల శిక్షణతో జాతీయ స్థాయిలో 46వ ర్యాంకు సాధించడం చాలా సంతోషంగా ఉంది. -
నంద్యాలలో అదనపు కోర్టులు ప్రారంభం
నంద్యాల(వ్యవసాయం): నంద్యాల కోర్టు కాంప్లెక్స్లో ఆదివారం 9వ అదనపు జిల్లా కోర్టుతో పాటు రెండవ, మూడవ, నాల్గవ అదనపు కోర్టులను ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి.కృష్ణమోహన్, జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి, జస్టిస్ ఎ.హరిహరనాథ శర్మ ప్రారంభించారు. అదనపు కోర్టుల్లో సర్వ మత ప్రార్థనలు నిర్వహించి కాల్వర్క్ను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తులు మాట్లాడుతూ.. అదనపు కోర్టుల ఏర్పాటు కేసుల పరిష్కారం వేగవంతమవుతుందని, ఇది కక్షిదారులకు ఎంతో ఉపయోగమన్నారు. జూనియర్ న్యాయవాదులు వృత్తి ప్రావీణ్యం పెంచుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ది మాట్లాడుతూ.. త్వరలో ఉమ్మడి జిల్లాలో మిగిలిన అనదపు కోర్టులను ప్రారంభిస్తామన్నారు. అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జీవీఎన్ ప్రసాద్, ప్రతాపరెడ్డి, గౌరీశంకర్ ఆధ్వర్యంలో జడ్జీలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాలోని వివిధ కోర్టుల జడ్జీలతో పాటు సీనియర్ న్యాయ వాదులు రామసుబ్బయ్య, పెద్ది శ్రీనివాసులు, తిమ్మారెడ్డి, హుసేన్బాషా, సుబ్బరాయుడు, శ్రీనివాసరెడ్డి, రాజగోపాల్రెడ్డి, తులసిరెడ్డి, కృపావతి, వివేకానందరెడ్డి, రాజేశ్వరరెడ్డి, వెంకటేశ్వర్లు, మహమ్మద్ రఫీ, రామ్మోహన్రెడ్డి, గోళ్ల జయకృష్ణ, ఖలీల్, తిరుపతి, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. -
రేపు ఆది శంకరుల జయంతి
శ్రీశైలంటెంపుల్: వైశాఖ శుద్ధ పంచమి సందర్భంగా మంగళవారం ఆదిశంకరాచార్యుల జయంతి నిర్వహిస్తున్నట్లు శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం ఈఓ మాట్లాడుతూ మంగళవారం ఉదయం 9 గంటలకు పాలధార–పంచధార ఉన్న శంకర మందిరంలో ప్రత్యేక పూజలు చేపడుతామన్నారు. శంకరులు శ్రీశైలంలోని పాలధార–పంచధార వద్ద కొంతసేపు తపస్సు చేసి ఇక్కడే శివానందలహరి గ్రంథాన్ని రచించారని తెలిపారు. కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులను సమర్పించుకోవాలని సూచించారు. కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తామన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో సమాచారం తెలుసుకోవడం కోసం కాల్ సెంటర్ నంబర్ 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. meekosam.ap.gov.in అనే వెబ్సైట్లో కూడా అర్జీలను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. 21న కలెక్టరేట్ ఎదుట ధర్నా కర్నూలు సిటీ: ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ఈనెల 21న కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎన్.వి కృష్ణారెడ్డి తెలిపారు. కర్నూలులోని పీఆర్టీయూ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కామన్ సీనియారిటీతో ఉపాధ్యాయల పదోన్నతులు జరపాలన్నారు. తక్షణమే పీఆర్సీ కమిషన్ను ప్రకటించి, మధ్యంతర భృతిని ప్రకటించాలన్నారు. ఎంటీఎస్ ఉపాధ్యాయులను రెగ్యులర్ చేయాలని, పెండింగ్ డీఏలు చెల్లించాలని, ఇన్సర్వీస్ టీచర్స్కు టెట్ పరీక్ష రద్దు చేయాలన్నారు. సమావేశంలో ఆ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రవి ప్రకాష్, రాష్ట్ర కౌన్సిలర్ వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. డీఎస్జీఎస్డబ్ల్యూఓగా భాస్కర్నాయుడు ● నంద్యాల అధికారిగా కే లలితాబాయి కర్నూలు(అర్బన్): జిల్లా స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు అధికారిగా (డీఎస్జీఎస్డబ్ల్యూఓగా) టీవీ భాస్కర్నాయుడు నియమితులయ్యారు. నంద్యాల జిల్లా డ్వామాలో ఎంఅండ్ఈగా విధులు నిర్వహిస్తున్న ఈయనను కర్నూలు డీఎస్జీఎస్డబ్ల్యూఓగా నియమిస్తూ ప్రభుత్వ కార్యదర్శి భాస్కర్ కాటంనేని ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. డీఎస్జీఎస్డబ్ల్యూఓగా నియమితులైన భాస్కర్నాయుడు గతంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎంపీడీఓగా, జిల్లా పరిషత్ ఏఓ, డిప్యూటీ సీఈఓగా విధులు నిర్వహించారు. ఇటీవల జరిగిన పదోన్నతుల్లో భాగంగా ఆయనను ప్రభుత్వం ఇక్కడకు నియమించింది. అలాగే నంద్యాలలో జిల్లా గ్రామ పంచాయతీ అధికారిగా విధులు నిర్వహిస్తున్న కే లలితాబాయిని నంద్యాల డీఎస్జీఎస్డబ్ల్యూఓగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 19 మంది డిప్యూటీ సీఈఓ, డీడీఓలకు పదోన్నతులు కల్పిస్తూ వేర్వేరు జిల్లాలకు స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు జిల్లా అధికారులుగా నియమించారు. ఆళ్లగడ్డ: ప్రముఖ పుణ్యక్షేత్రం ఎగువ అహోబిల క్షేత్రంలో కారధ్య నరసింహస్వామి ఆలయ ప్రవేశ ద్వారం వద్ద భద్రత సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక షెల్టర్ షార్ట్ సర్క్యూట్తో కాలిపోయింది. ఆదివారం గేటు వద్ద ఉన్న షెల్టర్ను ఒక్కసారిగా పొగలు, మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల వారంతా భయాందోళనకు గురయ్యారు. సీసీ కెమెరాలతో పాటు నిఘా వ్యవస్థ పూర్తిగా కాలి బూడిదైంది. -
జల్సాల కోసం చోరీలు
● అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్ ● 16 తులాల బంగారు, 60 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం ఎమ్మిగనూరురూరల్: జులాయిగా తిరుగుతూ జల్సాల కోసం చోరీలకు పాల్పడుతున్న బావ, బావమర్దిని పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను ఎమ్మిగనూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 16 తులాల బంగారు, 65 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక డీఎస్సీ కార్యాలయంలో డీఎస్పీ భార్గవి విలేకరుల సమావేశంలో దొంగల వివరాలను వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా సిరుగుప్ప టౌన్కు చెందిన శ్రీకాంత్, బళ్లారి జిల్లా సింధనూరు టౌన్కు చెందిన ఏజే పవన్కళ్యాణ్ బావబామర్దులు. ఇద్దరు జులాయిగా తిరిగేవారు. జల్సాల కోసం చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడేవారు. అప్పులు చేసి పేకాటాడేవారు. అయితే అప్పులు చెల్లించేందుకు పెద్ద దొంగతనాలు చేశారు. గతేడాది జూలై 20వ తేదీ అర్ధరాత్రి పెద్దకడుబూరు మండలం చిన్నతుంబళం గ్రామంలో బుడిజగ్గుల ఈరన్న ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. అలాగే ఈ ఏడాది జనవరి 12వ తేదీన ఎమ్మిగనూరు మండలం బోడబండ గ్రామంలో పెద్దనర్సిరెడ్డి ఇంట్లో, మార్చి 28వ తేదీన పెద్దకడుబూరు మండలం హనుమాపురం గ్రామానికి చెందిన మోకాసి వీరేష్ ఇంట్లో చోరీకి పాల్పడి బంగారు, వెండి ఆభరణాలు అపహరించారు. దొంగలించిన బంగారు ఆభరణాల్లో కొంత సింధనూరులో ఓ ప్రైవేట్ బ్యాంక్లో తాకట్టు పెట్టగా వచ్చిన డబ్బుతో ఎంజాయ్ చేశారు. మిగిలిన బంగారు ఆభరణాలను కర్నూలులో విక్రయించేందుకు పల్సర్ బైక్పై బయలుదేరారు. మార్గమధ్యలో మహాయోగి లక్ష్మమ్మ డిగ్రీ కాలేజీ దగ్గర పెద్దకడుబూరు పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి 16 తులాల బంగారు, 65 తులాల వెండి ఆభరణాలు, బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ భార్గవి తెలి పారు. రికవరీ చేసిన బంగారు, వెండి ఆభరణాలను బాధితులకు కోర్టు ద్వారా అప్పగిస్తామన్నారు. కేసును ఛేదించిన కోసిగి సీఐ మంజునాథ్, పెద్దకడుబూరు ఎస్ఐ మారుతి, పోలీస్లను డీఎస్పీ అభినందించారు. -
అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలి
గంజిహళ్లి గ్రామం చెరువులో అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్మోహన్రెడ్డి అన్నారు. ఆదివారం గ్రామంలోని చెరువులో తవ్వకాలను పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. గ్రామ పరిధిలో వున్న చెరువులో మట్టిని తమ భూ ములకు తరలించుకునేందుకు గ్రామ రైతుల హక్కు ఉందన్నారు. అయితే అదే మట్టిని ఇటుకల తయారీ తరలించుకునేందుకు వ్యాపారులకు మాత్రం అనుమతులివ్వడం వెనుక మతలబమేమిటని ప్రశ్నించారు. గ్రామ రైతులకు ఒక న్యాయం, ఇటుకల వ్యాపారులకు ఒక న్యాయమా.. అంటూ మండిపడ్డారు. 40 నుంచి 50 టిప్పర్లు పెట్టి చెరువ మట్టిని తరలించడంతో శనివారం గ్రామస్తులు టిప్పర్లను అడ్డుకున్నా.. అధికారుల అండతో మళ్లీ తరలిస్తున్నారన్నారు. చెరువు కట్టకు వంద మీటర్ల లోపే పూడిక తవ్వుకునేందుకు నిబంధన వుందని దీనిపై అధికారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. గ్రామస్తులు చెరువు మట్టి తవ్వకాలపై ఆందోళన చేస్తున్నా అధికారులు స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. మట్టి తవ్వకాలు నిలిపివేయకపోతే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని, కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఆయన వెంట సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు గంజిహళ్లి తిరుమల్రెడ్డి, మల్లేష్, గ్రామ మాజీ సర్పంచ్ రాముడు, మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ మన్సూర్, పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం లక్ష్మీనారాయణ రెడ్డి, గ్రామ మాజీ ఎంపీటీసీ గంజిలయ్య, కోటేకల్ గ్రామ మాజీ సర్పంచ్ లక్ష్మన్న, మహేశ్వర్రెడ్డి, కడివెళ్ల బాష, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డెక్కని పనులు
గతుకుల రోడ్డు● ప్రయాణికులకు తప్పని తిప్పలు కోడుమూరు రూరల్: ఏడాది అయినా కోడుమూరు నుంచి వెల్దుర్తికి వెళ్లే రోడ్డు నిర్మాణ పనులు పూర్తికాకపోవడంతోప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతుల రోడ్డుపై ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ రోడ్డు నిర్మాణానికి చంద్రబాబు ప్రభుత్వం గతేడాది రూ.20కోట్లు విడుదల చేసింది. పనులు తీసుకున్న కాంట్రాక్టర్ రోడ్డుకిరువైపులా కంకర, గ్రావెల్ పరిచి వదిలేశారు. రోడ్డు నిర్మాణం పూర్తికాకపోవడంతో కోడుమూరు నుంచి వెల్దుర్తికి వెళ్లే వాహనదారులతో పాటు వెంకటగిరి, గోరంట్ల, లద్దగిరి, అనుగొండ, అమడగుంట్ల వంటి సుమారు 10 గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గ్రావెల్ పరిచిన రోడ్డుపైన ప్రయాణికులు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ రోడ్డుపై ప్రయాణించేందుకు ఆయా గ్రామాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. -
అరటి తోట దగ్ధం
ఓర్వకల్లు: ప్రమాదవశాత్తూ అరటి తోటకు నిప్పంటుకొని కాలిపోయింది. ఈ ఘటన బాధిత రైతుకు రూ. 80 వేలు నష్టాన్ని మిగిల్చిది. మండలంలోని పాలకొలను గ్రామంలో జరిగిన ఈ ప్రమాదం ఆలస్యంగా వెలుగు చూసింది. బాధిత రైతు న్యామతుల్ల తెలిపిన వివరాల మేరకు.. న్యామతుల్ల ఊరిలో పండ్లతోటలను కౌలుకు తీసుకొని జీవనం సాగిస్తాడు. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన వెంకటరామిరెడ్డి అనే రైతుకు సంబంధించిన 5 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని మూడేళ్ల క్రితం అరటి మొక్కలను నాటుకున్నాడు. ఇప్పటికే రెండు కోతలు కోయగా, మరో రెండు మాసాలలో పంటకోత వచ్చేదశకు చేరుకుంది. శనివారం పక్కపొలంలోని రైతు పొలం గట్టుపై ఉన్న గడ్డిని కాలుస్తుండగా మంటలు ఎగిసి అరటి తోటకు వ్యాపించాయి. గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న న్యామతుల్లా పొలానికి వెళ్లి చూడగా అర ఎకరా విస్తీర్ణంలోని సుమారు 300 అరటి మొక్కలు, డ్రిప్ పరికరాలు కాలిపోయి ఉన్నాయి. వెంటనే పొలంలోని విద్యుత్ మోటర్ను ఆన్చేసి, డ్రిప్ పైపుల సాయంతో మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంతో సుమారు రూ.80 వేలు ఆస్తినష్టం వాటిల్లినట్లు కౌలు రైతు గగ్గోలు పెట్టారు. ప్రభుత్వం స్పందించి తనను ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నారు. -
బామ్మర్దుల చేతిలో బావ హతం
● భార్యే చంపించిందని హతుడి కుటుంబీకుల ఆరోపణ బొమ్మలసత్రం: బామ్మర్దుల చేతిలో బావ హతమైన ఘటన నంద్యాల మండలం కొత్తపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. హతుడి బంధువులు తెలిపిన వివరాల మేరకు.. బండిఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన కరీముల్లా (26) పాలిష్ కట్టర్గా పనిచేస్తున్నాడు. కరిముల్లా నంద్యాల పట్టణం చాంద్బాడా వీధికి చెందిన కరిష్మాను ఇష్టపడి ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావటంతో తరచూ గొడవలు జరిగేవి. కరిష్మాకు ఇదివరకే వివాహం జరిగి కరిముల్లాను రెండో వివాహం చేసుకున్నారు. అయితే తాను మొదటి భర్తతో కాపురం చేస్తానని చెప్పడంతో గొడవ మొదలైనట్లు మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. రాత్రి 8 గంటల వరకూ ఇంట్లో ఉన్న కరీముల్లాను కొందరు ఇంటి వద్దకు వచ్చి నంద్యాలలో ఉన్న కరిష్మా రమ్మని చెప్పిందని వెంటతీసుకుని వెళ్లారు. ఉదయం కొత్తపల్లి నుంచి భీమవరం వేళ్లే రహదారిలో శవమై కనిపించాడు. విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కరీముల్లాను మొదటి భర్త కోసం భార్య తన సోదరులు అల్తాఫ్, రహమాన్లతో హత్య చేయించిందని ఆరోపించారు. కరీముల్లా శరీరంపై కత్తితో పొడిచి పేగులు బైటికి లాగారాని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. తాలూకా పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల జీజీహెచ్కు తరలించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గుండెపోటుతో ఏఎస్ఐ మృతి కొయ్యూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): శ్రీశైలంలో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న మంప గ్రామానికి చెందిన వంజరి కొండబాబు (45) ఆదివారం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మృతితో గ్రామంలో విషాధ ఛాయలు అలముకున్నాయి. శ్రీశైలంలో ఏఎస్ఐగా పనిచేస్తున్న కొండబాబు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదివారం పాయకరావుపేటలో చదువుకుంటున్న తన కుమారుడిని పరామర్శించి, స్వగ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యలో ఆయనకు గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయారు. వెంటనే వైద్య సేవలు అందించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
అక్రమ సాగుకు అవి‘నీటి’ మార్గం!
ఎమ్మిగనూరు టౌన్: అధికారంలో ఉన్నాం కదా తాము అనుకుంటే ఏదైనా చేస్తాం అని టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. అవినీతికి, అక్రమాలకు పాల్పడుతున్నారు. అమాయకులైన రైతుల నుంచి గోనెగండ్ల మండలం ఒంటెడుదిన్నె గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు దాదాపు రూ.35 లక్షల వరకు వసూలు చేశారు. వసూలు చేసిన డబ్బును ఎమ్మిగనూరు నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేగా పేరుగాంచిన వ్యక్తికి ఇప్పటికే ముట్టజెప్పినట్లు తెలిసింది. సదరు వ్యక్తి హామీ ఇవ్వడంతో టీడీపీ నేతలతో కలసి కొందరు తమ పొలాల నుంచి జీడీపీ (గాజులదిన్నె ప్రాజెక్ట్ ) కుడికాలువ గట్టువరకు భూములను తవ్వి పైపులు వేశారు. ఇక కాలువ గట్టు తవ్వి కాలువలో పైపులు వేసుకొవాల్సి ఉంది. ఆ తరువాత కాలువ నీటిని అక్రమ సాగుకు మళ్లించు కోవచ్చు. ఈవిషయం తెలిసిన జీడీపీ అధికారులు వారి వద్దకు వెళ్లి కాలువకు పైపులు వేసి మళ్లిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అయితే టీడీపీ నేతలు పైపులు మాత్రమే వేసుకుంటున్నామని బుకాయించారు. పైపులను తొలగించాలి ఏటా నిల్వ ఉంటే ఉన్న నీటితోనే ఆయకట్టు రైతులు పంటలు పండించుకునే వారు. అయితే జేసీబీతో ఏకంగా భూమిని తవ్వి పదుల సంఖ్యలో పైపులు వేసుకొని అక్రమ సాగుకు మళ్లించుకోనేందుకు టీడీపీ నేతలు ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసమని ఆయకట్టు రైతులు మండిపడుతున్నారు. అక్రమ సాగుకు మళ్లించేందుకు వేసుకొన్న పైపులను తొలగించాలని, కాలువ గట్లను తవ్వి పైపులు వేసుకొంటే ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు. ఈమేరకు రైతులు కోడుమూరులో సమావేశమై నిర్ణయం తీసుకున్నారు. కుడి కాలువ కింద ఒంటెడుదిన్నె గ్రామ సమీపంలో పైపులు వేసుకొంటున్నారని తెలిసిన వెంటనే ఆ ప్రాంతాన్ని పరిశీలించాం. వారికి హెచ్చరికలు జారీ చేశాం. వారు కాలువకు పైపులు వేస్తే కఠిన చర్యల్లో భాగంగా కేసులు నమోదు చేస్తాం. – మహమ్మద్ ఆలీ, జీడీపీ ఏఈ టీడీపీ నేతల బరితెగింపు రైతుల నుంచి రూ.35 లక్షల వసూలు జీడీపీ కుడి కాలువ నుంచి అక్రమంగా నీరు పారించుకొనేందుకు పన్నాగం ముందస్తుగా పైపుల ఏర్పాటుఅక్రమ సాగు కోసమే.. జీడీపీ కింద స్థిరీకరించిన ఆయకట్టు 24,372 ఎకరాలు మా6తమే. ఏటా రబీలో కేవలం 13 వేల ఎకరాల్లోపే సాగునీరు సరఫరా చేస్తున్నారు. ఇందులో కుడి కాలువ కింద 20,790 ఎకరాలకుపైగా సాగునీరు ఇవ్వాల్సి ఉంది. అయితే 11వేల ఎకరాలకు మించి సాగునీరందడం లేదు. అదేవిధంగా ఎడమ కాలువ కింద 3,582 ఎకరాలకు నీరు ఇవ్వాల్సివుండగా 1,500 ఎకరాలకు మించడం లేదు. ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరివ్వాల్సిన టీడీపీ నేతలు అక్రమ సాగుకు నీరు పారించుకొనేందుకు పైప్లైన్ వేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసమని కుడి కాలువ ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
కడదొడ్డిలో దాహం..దాహం
కోసిగి: ఎండాకాలంలో మంచినీరు దొరకక కడదొడ్డి గ్రామస్తులు దాహంతో అల్లాడుతున్నారు. గ్రామం 2009లో వరద ముంపు కావడంలో 1.5 కిలో మీటర్ దూరంలో సురక్షిత ప్రాంతంలో కొత్త గ్రామం ఏర్పాటు చేశారు. కొందరు కొత్త గ్రామంలో నివాసాలు ఏర్పాటు చేసుకోగా, మరికొందరు పాతం గ్రామం వదిలి రాక అక్కడ నివాసం ఉంటున్నారు. రెండు గ్రామాలకు కలిసి కొత్త గ్రామంలో ఒక తాగునీటి బోరు ఏర్పాటు చేశారు. ఆ గ్రామం నుంచి పాత గ్రామానికి పైప్లైన్ ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. గతంలో నది నుంచి తాగునీరు సరఫరా అయ్యేది. కొద్ది కాలంగా నది నీరు సరఫరా బంద్ అయ్యింది. కేవలం ఒక బోరు నుంచి మాత్రమే నీరు సరఫరా అవుతోంది. కొత్త గ్రామం నుంచి వచ్చే పైప్లైన్ లీకేజ్ కావడంతో పాత గ్రామానికి నీళ్లు అరకొరగా వస్తున్నాయి. నీటి కోసం ట్యాంక్ వద్ద బిందెలు వరుస క్రమం పెట్టి గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తోందని గ్రామస్తులు తెలిపారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
తాగొచ్చి.. ఆస్పత్రిలో భార్యను చంపేశాడు
ఎమ్మిగనూరు రూరల్: మద్యం మత్తులో ఓ వ్యక్తి ప్రభుత్వాస్పత్రిలో అందరూ చూస్తుండగానే భార్యను కత్తితో పొడిచి కిరాతకంగా చంపిన ఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఎమ్మిగనూరు మండలం గుడేకల్కు చెందిన బోయ బెలగల్ రామయ్య కూలి పనులు చేసుకుంటూ మద్యానికి బానిసయ్యాడు. భార్య నరసమ్మను తరచూ డబ్బుల కోసం వేధించేవాడు. దీంతో నరసమ్మ పెద్దతుంబుళంలోని పుట్టింటికి వెళ్లిపోయింది. కాగా.. పెద్దకుమార్తె శాంతి ప్రసవం కోసం నరసమ్మ వద్దకు వచ్చింది.శనివారం ఉదయం ఎమ్మిగనూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకురాగా బిడ్డకు జన్మనిచ్చింది. విషయం తెలుసుకున్న రామయ్య ఆస్పత్రికి వచ్చాడు. ఆదివారం మధ్యాహ్నం భార్య దగ్గరకు వచ్చి తనతో కాపురానికి రావాలని గొడవపడ్డాడు. ఆమె ససేమిరా అనడంతో బయటకు వెళ్లి మద్యం తాగాడు. సాయంత్రం ప్రభుత్వాస్పత్రికి వచ్చి అందరూ చూస్తుండగానే కత్తితో భార్యను పొడిచాడు. దీంతో అక్కడి వారంతా భయంతో కేకలు వేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులో తీసుకున్నారు. రక్తం మడుగులో పడిఉన్న నరసమ్మకు డాక్టర్ మల్లికార్జున వైద్య సేవలు ప్రారంభించగా.. అప్పటికే మృతి చెందింది. -
జూట్ బ్యాగుల తయారీలో ఉచిత శిక్షణ
కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని రేషన్కార్డు కలిగిన గ్రామీణ ప్రాంత నిరుద్యోగ మహిళలకు జూట్ బ్యాగుల తయారీలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ డైరెక్టర్ కె.పుష్పక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ ఈ నెల 20 నుంచి మే 4వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన 19 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు అభ్యర్థులు అర్హులన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భో జనం, వసతి సౌకర్యాలను కల్పిస్తామన్నారు. వివరాలకు 9000710508, 9666224931, 9440905477, 08518– 273710 నెంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు. ఎమ్మిగనూరుటౌన్/గోనెగండ్ల: గడువు తీరినా టిప్పర్లతో చెరువులో మట్టి తరలింపు చేయడాన్ని ప్రజలు అడ్డుకున్నారు. టీడీపీ నాయకుల అండదండలతో ప్రజాధనాన్ని లూటీ చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు సర్దిచెప్పినా వినకుండా వారితో వాగ్వాదం చేశారు. దీంతో గోనెగండ్ల మండలం గంజిహళ్లి గ్రామంలో శనివారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామ చెరువులో నల్లమట్టిని స్థానిక రైతులు వ్యవసాయ భూములకు తరలించేవారు. అయితే శుక్రవారం రాత్రి పోలీసులు దాడి చేయడంతో ట్రాక్టర్ డ్రైవర్ దివాకర్ గాయపడ్డాడు. దీంతో గ్రామస్తులు ఆగ్రహంతో శనివారం చెరువు నుంచి మట్టిని తరలిస్తున్న టిప్పర్లకు దారి పొడవునా ట్రాక్టర్లు అడ్డుకున్నారు. విషయం తెలిసి గోనెగండ్ల సీఐ చంద్రబాబు అక్కడి వచ్చి గ్రామస్తులు, రైతులను సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా ససేమిరా అన్నారు. రెండు అనుమతులా? చెరువులో నల్లమట్టిని తరలించేందుకు ఇటుకల వ్యాపారుల పేరుపై ఈనెల 10 నుంచి 17వరకు ఒక అనుమతి, మరొకటి రైతుల పేరుపై ఈనెల 10 నుంచి 25 వరకు మరో అనుమతి ఇవ్వడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపారులు షాడో ఎమ్మెల్యేకు లక్షలు ముట్టజెప్పారని ఆరోపించారు. శుక్రవారానికే గడువు తీరిందని శనివారం వచ్చిన టిప్పర్లపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల కోసం మరో అనుమతి ఉత్తర్వులను తెచ్చుకున్నామని ఇటుకల వ్యాపారులు తెలపడంతో గ్రామస్తులు శాంతించారు. అయితే సాయంత్రం మరో అనుమతితో చెరువు మట్టిని తరలించే ప్రక్రియను ప్రారంభించడంతో గ్రామస్తులు జీర్ణించుకోలేకపోరున్నారు. రైతులు తమ భూములకు నల్ల మట్టిని తరలించాల్సి ఉండగా సాయంత్రం నుండి అవే టిప్పర్లు ఎమ్మిగనూరు ఇటుకల బట్టీలకు తరలించడంపై గ్రామ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎవరైనా టిప్పర్లను అడ్డుకొంటే చర్యలు తీసుకొంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. -
మత్తాంధ్రప్రదేశ్గా మారుస్తున్న ప్రభుత్వం
ఆలూరు: టీడీపీ పాలనలో, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి లోకేష్ పర్యవేక్షిస్తున్న పాఠశాలల్లో విద్యార్థులు మ త్తుకు బానిసలవుతున్నారని, ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని మత్తాంధ్రప్రదేశ్గా మారుస్తోందని ఆలూ రు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అరికెర గ్రామంలోని అంబేడ్కర్ బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులను పస్తులు ఉంచకుండా ఉపాధ్యాయులే స్వయంగా వంట వండిపెట్టారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విరూపాక్షి శనివారం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు, వంట ఏజెన్సీ నిర్వాహకులు, కొందరు విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమయ్యా రు. ఉపాధ్యాయులు వర్గాలుగా విడిపోవడం, ఓ ఉపాధ్యాయులు కొందరు విద్యార్థుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని మద్యం, సిగరెట్లు, డ్రగ్స్కు బానిసలను చేస్తున్నట్లు గుర్తించారు. ఈ విషయమై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచే జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరికి ఫోన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సొంత శాఖను సవ్యంగా పర్యవేక్షించలేని మంత్రి లోకేష్ ఆ పదవి నుంచి తప్పుకోవాలన్నారు. పాఠశాలల్లో విద్యార్థులను మత్తుకు బానిసలను చేస్తున్నా అధికార యంత్రాంగం నిద్ర మత్తులో జోగుతోందన్నారు. టీడీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని మత్తాంధ్రప్రదేశ్గా మారుస్తోందన్నారు. ఇదిలాఉంటే మొత్తం వ్యవహారంపై నివేదిక పంపాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. -
చిలకలడోణ ప్రమాదంలో మరో ఇద్దరు మృతి
మంత్రాలయం: చిలకలడోణ గ్రామ సమీపంలో మూడు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాద దుర్ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. కర్నూలు పెద్దాసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో మరో ఇద్దరు మహిళలు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 11కు చేరింది. శనివారం చిక్మంగళూరు జిల్లా శెట్టిగెర గ్రామానికి చెందిన శుభ (35), కన్నైనతన హళ్లి గ్రామానికి చెందిన జయమ్మ (60) మృతి చెందారు. వీరి తలకు గాయాలు కావడంతో పరిస్థితి విషమించి మరణించారు. కర్ణాటక ప్రాంతానికి చెందిన 22 మంది గూడ్స్ వాహనంలో మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శనానికి వస్తుండగా చిలకలడోణ గ్రామం దగ్గర గురువారం తెల్లవారుజామున ఎదురుగా వస్తున్న ట్యాంకర్ ఢీకొన్న ప్రమాదంలో ఎనిమిది మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ప్రమాద ఘటనలో లోలాక్షమ్మ మృతి చెందగా గాయపడిన ఆమె చిన్నకూతురు తేజస్విని (10వ తరగతి) శుక్రవారం మృతి చెందింది. శనివారం శుభ, జయమ్మ ఇద్దరు ప్రాణం విడిచారు. మృతురాలు శుభ కొడుకు దీపక్, కూతుళ్లు దీక్షిత, ధన్యశ్రీ కూడా కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తల్లి మృతి కొడుకు, కూతుళ్లను మరింతగా కుంగదీస్తోంది. మృతుల సంఖ్య పెరిగిపోతుండటంతో ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కర్నూలు పెద్దాసుపత్రిలో 9 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. ఈ దుర్ఘటన నుంచి స్థానికులు కోలుకోలేకపోతున్నారు. శెట్టిగెర, కన్నైనతన హళ్లి, ఉదేవ గ్రామస్తులు ఈ విషాదం నుంచి కోలుకోలేక పోతున్నారు. -
25న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష
కర్నూలు(సెంట్రల్): పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షను ఈ నెల 25న పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో పాలిసెట్ నిర్వహణపై శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 25న పాలిసెట్ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందన్నారు. పరీక్షల పర్యవేక్షణ కోసం సీనియర్ నోడల్ అధికారిని నియమించినట్లు చెప్పారు. జిల్లాలో 21 కేంద్రాల్లో 6,904 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాలకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా సరఫరా చేయాలని, విద్యార్థులకు అనువుగా బస్సులను నడపాలని ఆదేశించారు. ప్రతి కేంద్రం వద్ద మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, తాగునీటి వసతిని ఏర్పాటు చేయాలన్నారు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడంతోపాటు ప్రత్యేకంగా పోలీసుల భద్రతన ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాలకు సమీపంలో ఉన్న జిరాక్స్ కేంద్రాలను మూసి వేయించాలని ఆదేశించారు. సమావేశంలో ఇన్చార్జి డీఆర్వో చిరంజీవి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రసాద్, డెప్యూటీ కమిషనర్ సతీష్కుమార్రెడ్డి పాల్గొన్నారు. డిగ్రీ పరీక్షల్లో 49 మంది విద్యార్థులు గైర్హాజరు కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహిస్తున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షలకు శనివారం 49 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు వర్సిటీ పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ ఎన్.నరసింహులు తెలిపారు. రెండవ సెమిస్టర్ పరీక్షకు 777 మందిలో 732 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. 6వ సెమిస్టర్ పరీక్షలకు 38 మందిలో నలుగురు విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. బీఈడీ నాల్గవ సెమిస్టర్ పరీక్షలకు 3,523 మందిలో 3,335 మంది హాజరయ్యారన్నారు. కర్నూలు శ్రీ సాయికృష్ణ డిగ్రీ కళాశాల కేంద్రంలో ఇద్దరు విద్యార్థులు చూచి రాతకు పాల్పడుతుండగా డిబార్ చేశామన్నారు. -
కష్టపడి చదివితేనే ఉజ్వల భవిష్యత్తు
కర్నూలు(అర్బన్): ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లోని పేద, మధ్య తరగతి విద్యార్థులు కష్టపడి చదివితేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారిణి బి.రాధిక అన్నారు. ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన కళాశాల బాలికల వసతి గృహాల్లోని విద్యార్థినులను ఆమె తన కార్యాలయంలో అభినందించారు. కర్నూలు ఎస్సీ కళాశాల బాలికల నెంబర్–1 వసతి గృహంలో ఫస్టియర్ విద్యార్థినులు ఎ.అంజలి(470), స్వరూప (468), శిరీష(447), మాధవి(439), టి.లక్ష్మిదేవి (434) తదితర 11 మంది విద్యార్థినులు 400కు పైగా మార్కులు సాధించారన్నారు. సెకండియర్లో నెంబర్–2 కళాశాల వసతిగృహం విద్యార్థినులు టి.గీత(955), యు. నాగజ్యోతి స్వరూప (929), నెంబర్–1 వసతిగృహం విద్యార్థినులు రూప(960), లక్ష్మిదేవి(957), జి.అహల్యా (941), మరో నలుగురు 900కు పైగా మార్కులు సాధించారన్నారు. కార్యక్రమంలో కర్నూలు సహాయ సంక్షేమాధికారి బి.మద్దిలేటి, వసతి గృహ సంక్షేమాధికారుల సంఘం అధ్యక్షులు బి.సుంకన్న పాల్గొన్నారు. -
సత్వర న్యాయం కోసమే నూతన కోర్టులు
కర్నూలు: పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించే ఉద్దేశంతోనే నూతన న్యాయస్థానాలను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర హైకోర్టు జడ్జి, కర్నూలు జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ బి.కృష్ణమోహన్ అన్నారు. శనివారం సాయంత్రం కర్నూలులో కొత్తగా ఏర్పాటు చేసిన 5వ, 6వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులను తన సహచర న్యాయమూర్తులు జస్టిస్ కె.శ్రీనివాస రెడ్డి, జస్టిస్ ఎ.హరిహరనాథ శర్మలతో కలసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొత్త కోర్టుల ప్రారంభం యువ న్యాయవాదులకు మంచి అవకాశం అన్నారు. ప్రతి జూనియర్ న్యాయవాది సీనియర్ న్యాయవాదుల అనుభవాలను తెలుసుకుని వృత్తిలో రాణించాలన్నారు. జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కర్నూలుతో తనకున్న అనుబంధం వల్లే ఇతర పనులున్నా నూతన కోర్టుల ప్రారంభానికి వచ్చానన్నారు. జీవితం ఎవరికీ వడ్డించిన విస్తరి కాదని, కష్టే ఫలి అని భావించి కష్టపడటం అలవాటు చేసుకుని ఉన్నత స్థితికి చేరాలన్నారు. జస్టిస్ ఎ.హరిహరనాథ శర్మ మాట్లాడుతూ న్యాయవాదులు తమ ప్రతిభతో పాటు విలువలను అలవర్చుకుని భవిష్యత్తు తరాలకు మంచి నడవడిక, పురోభివృద్ధికి నాంది పలకాలన్నారు. తన న్యాయవాద వృత్తిలో కర్నూలు న్యాయవాదుల సహాయ సహకారాలను మరువలేనన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి మాట్లాడుతూ జిల్లాకు మంజూరైన కోర్టులలో కొన్ని మాత్రమే ప్రస్తుతం ప్రారంభిస్తున్నామని, అతి త్వరలో మంజూరైన అన్ని కోర్టులను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు బి.చంద్రుడు, ప్రధాన కార్యదర్శి టి.మహేశ్వర్ రెడ్డి, జిల్లాలోని అదనపు జిల్లా జడ్జిలు, సీనియర్ సివిల్ జడ్జిలు, జూనియర్ సివిల్ జడ్జిలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, జీపీ, ఏజీపీ, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, న్యాయ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. అనంతరం పాత చట్టాల స్థానంలో నూతన చట్టాలు అమలు జరుగుతున్న తరుణంలో జిల్లాలోని న్యాయమూర్తులకు శనివారం జిల్లా కోర్టు హాల్లో కార్యశాల నిర్వహించారు. -
‘సేవ్ పునర్విక’ సక్సెస్
వెల్దుర్తి: కదలలేని స్థితిలో ఉన్న చిన్నారి పునర్వికను బతికించేందుకు ‘సేవ్ పునర్విక’ పేరుతో మానవతావాదులు చేసిన ప్రయత్నం ఫలించింది. శనివారం పునర్వికకు హైదరాబాద్ బంజారాహిల్స్లోని రెయిన్బో ఆస్పత్రిలో డాక్టర్ రమేశ్ కోనంకి ఆధ్వర్యంలో యూఎస్ఏ నుంచి దిగుమతి చేసుకున్న రూ.16 కోట్ల ఇంజెక్షన్ను విజయవంతంగా అందించారు. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన మంగళి సురేశ్, పుష్పావతి దంపతుల కుమార్తె పునర్వికశ్రీ. సురేష్ బార్బర్ షాపు నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతడి కుమార్తె పుట్టుకతోనే జన్యు సంబంధిత స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ టైప్–1 వ్యాధికి గురైంది. కదలలేని స్థితిలో ఉన్న చిన్నారికి రెండేళ్లలోపు రూ.16 కోట్ల విలువైన జోల్ జెన్స్మా ఇంజెక్షన్ ఇస్తే గాని సాధారణ స్థితికి చేరుకునే అవకాశం లేదని వైద్యులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో గత ఏడాది డిసెంబర్లో పునర్విక తండ్రి తన పాపను కాపాడమంటూ అభ్యర్థించాడు. ‘సాక్షి’లో కథనం.. మానవతావాదుల స్పందన గత ఏడాది డిసెంబర్ 8న ‘పసిమొగ్గకు రూ.16 కోట్ల కష్టం’ శీర్షికన పునర్విక దయనీయ స్థితిని ‘సాక్షి’ పత్రిక వెలుగులోకి తెచ్చింది. నాటి నుంచి పత్రికలు, సోషల్ మీడియాలో ‘సేవ్ పునర్విక’ పేరుతో ఓ ఉద్యమమే నడిచింది. కేవలం మూడు నెలల్లోనే మానవతావాదుల నుంచి దాదాపు రూ.10 కోట్లు సమకూరాయి. ఈ దశలో ప్రభుత్వాలు స్పందించవా అన్న ప్రశ్నలతో సోషల్ మీడియా ఉక్కిరిబిక్కిరి చేసింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయం ప్రకటించాయి. దిగుమతి సుంకం మినహాయించిన కేంద్రం క్రౌడ్ ఫండింగ్ ద్వారా పోగైన రూ.10 కోట్లను మార్చి నెలాఖరున చిన్నారి తల్లిదండ్రులు రెయిన్బో ఆస్పత్రికి అందించారు. యూఎస్ఏ నుంచి తెప్పించాల్సిన రూ.16 కోట్ల ఇంజెక్షన్కు దాదాపు రూ.6 కోట్ల దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం మినహాయించింది. దీంతో రెండ్రోజుల క్రితం ఇంజెక్షన్ ఆస్పత్రికి చేరింది. శనివారం పునర్వికకు ఇంజెక్షన్ చేశారు. మరికొన్ని రోజులు చిన్నారికి చికిత్స కొనసాగనుంది. -
సంజామలలో 44.8
నిర్మానుష్యంగా కర్నూలులోని కొండారెడ్డి బురుజు ప్రాంతం కర్నూలు(అగ్రికల్చర్): ఎండలు, వడగాలుల తీవ్రత ఉమ్మడి జిల్లాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ కారణంగా విద్యుత్ వినియోగం కూడా అధికమైంది. బయట తిరగడం పక్కనపెడితే.. ఇంట్లో ఫ్యాన్ లేకుండా ఒక్క నిముషం కూడా ఉండలేని పరిస్థితి నెలకొంది. ఉష్ణోగ్రతల తీవ్రతకు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు నిరంతరం తిరుగుతుండటంతో విద్యుత్ మీటర్లు గిర్రున తిరుగుతున్నాయి. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 2.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం పెరిగిందంటే ఎండల తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏప్రిల్ మూడవ వారంలోనే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటిపోయాయి. నంద్యాల జిల్లా సంజామల మండలంలో హీట్వేవ్ కొనసాగుతోంది. సంజామలలో ఈ నెల 16న ఉష్ణోగ్రత 45.1 డిగ్రీలు నమోదైంది. 17న 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండటం గమనార్హం. ఎండల తీవ్రతతో ఈ మండలం అగ్నిగుండాన్ని తలపిస్తోంది. 183 చలివేంద్రాలు ఏర్పాటు చేశారట! ఉష్ణోగ్రతలు, వడగాలుల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నా.. పాదచారులకు తగిన ఉపశమన చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం విఫలమైంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రైతులు ఇబ్బంది పడరాదనే ఉద్దేశంతో ఎరువులు, పురుగుమందులు, విత్తన షాపుల ఎదుట చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈసారి ఎండలు, వడగాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నా.. చలి వేంద్రాలు, చలువ పందిళ్లు వేయడంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని చాటుకుంటోంది. జిల్లా మొత్తం మీద ప్రభుత్వం, లోకల్ బాడీస్, స్వచ్ఛంద సంస్థలు అన్నీ కలిపి 183 చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు లెక్కలు ఉన్నాయి. ఇందులో 10 శాతం వరకు పనిచేయడం లేదు. చలివేంద్రాల ఏర్పాటులో అంకెలగారిడీ ప్రదర్శించినట్లు తెలుస్తోంది. కర్నూలు నగరంలోని 9 పాంత్రాల్లో 12 చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, గూడూరు వంటి పట్టణాల్లో చలువ పందిళ్ల జాడ లేకపోవడం గమనార్హం.మండలం ఉష్ణోగ్రత ఆళ్లగడ్డ 44.5 బనగానపల్లి 43.7 రుద్రవరం 43.7 కొత్తపల్లి 43.6 కోడుమూరు 43.6 వెల్దుర్తి 43.6 మంత్రాలయం 43.5 నంద్యాల రూరల్ 43.5 చాగలమర్రి 43.4 కర్నూలు 43.4 ఉయ్యాలవాడ 43.3 కోవెలకుంట్ల 43.3 గూడూరు 43.1 దొర్నిపాడు 43.1 కల్లూరు 43.1 చిప్పగిరి 43 మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలురానున్న రోజుల్లో పలు మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ విభాగం ప్రకటించింది. రాష్ట్రంలోనే అత్యధిక ఎండలు, వడగాలుల తీవ్రత నంద్యాల జిల్లాలోనే ఉన్నట్లు తెలుస్తోంది. అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరగవచ్చని, మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య బయట తిరగరాదని రాష్ట్ర విపత్తుల నిర్వహణ విభాగం ప్రకటించింది. ఈ సారి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 48 నుంచి 50 డిగ్రీలకు చేరే ప్రమాదం ఉన్నట్లు స్పష్టమవుతోంది. సంజమల మండలంలో కొనసాగుతున్న హీట్వేవ్ రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు సంజామలలో 44.8.. ఆళ్లగడ్డలో 44.4 డిగ్రీలు నమోదు అధికమైన విద్యుత్ వినియోగం గిర్రున తిరుగుతున్న విద్యుత్ మీటర్లు 0 -
మహిళలకు సముచిత స్థానం కల్పించిన జగనన్న
● వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు ఎస్వీ విజయమనోహారికర్నూలు(టౌన్): 2019 సంవత్సరం మే 30వ తేదీ నుంచే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చట్ట సభల్లోనే కాకుండా నామినేటెడ్ పదవుల్లోనూ మహిళలకు సముచిత గౌరవం కల్పించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షురాలు ఎస్వీ విజయమనోహరి తెలిపారు. శుక్రవారం కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్లో వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే నిర్ణయానికి వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందన్నారు. స్థానిక సంస్థల్లో 50 శాతం మించి మహిళలకు సీట్లు, పదవులు కేటాయింన ఘనత జగనన్నదేనన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా డిప్యూటీ సీఎం పదవి, హోంమంత్రి పదవి, మహిళా సంక్షేమ శాఖలను మహిళలకే కేటాయించారన్నారు. మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా రాణించాలని జగనన్న ఐదేళ్ల క్రితం మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. అమ్మ ఒడి, చేదోడు, ఆసరా, పొదుపు మహిళలకు సున్నా వడ్డీ రుణాలు, 31 లక్షల ఇళ్ల పట్టాలు మహిళల పేరు మీద ఇచ్చారన్నారు. మోసగించడం చంద్రబాబు నైతం ఎన్నికల సమయంలో ఓట్ల కోసం మహిళలను మభ్య పెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మహిళలను మోసం చేశారన్నారు. ఆడబిడ్డ నిధి ఇంటింటికి, ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తామని హడా వుడి చేశారన్నారు. 50 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. రాష్ట్రంలో మహిళలు జగనన్నకు రుణపడి ఉంటారన్నారు. ఎంపీ బైరెడ్డి శబరి వ్యాఖ్యలు ఖండిస్తున్నాం వైఎస్ జగన్ పాలన డార్క్ డేస్ అని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి చేసిన వ్యాఖ్యలను మాజీ డిప్యూటీ మేయర్, మాజీ జిల్లా అధ్యక్షురాలు సిద్దారెడ్డి రేణుక, సిట్రా సత్యనారాయణమ్మ ఖండించారు. జగనన్న పాలనంతా మహిళలకు గోల్డెన్ డేస్ అన్నారు. జగనన్న పాలన గురించి మాట్లాడే అర్హత టీడీపీ నేతలకు లేదన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు మహిళలను, మహిళా ఉద్యోగులను వేధించడం, దారుణంగా కొట్టడం వంటి ఘటనలు ఈ ప్రభుత్వంలో కోకొల్లలు అన్నారు. అయినప్పటికీ చంద్రబాబు వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. దిశ చట్టం, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు తీసుకొచ్చిన ఘనత జగనన్నదే అన్నారు. సమావేశంలో పార్టీ మహిళా విభాగం నాయకురాళ్లు కార్పొరేటర్లు మునెమ్మ, నగర అధ్యక్షురాలు మంగమ్మ, పార్టీ నాయకులు హేమలత, కమలా, కాంతమ్మ, లలితమ్మ,షేకూన్, స్వర్ణలత, విజయ లక్ష్మీ, రమిజాబీ పాల్గొన్నారు. -
కర్నూలు డీడీఓగా అశ్వినీకుమార్
కర్నూలు(అర్బన్): రాష్ట్ర వ్యాప్తంగా పలువురు డివిజినల్ డెవలప్మెంట్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ కాంతిలాల్దండే శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రకాశం జిల్లా డ్వామాలో విజిలెన్స్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఎ.అశ్వినీకుమార్ను కర్నూలు డీడీఓగా నియమించారు. కర్నూలు డీడీఓగా విధులు నిర్వహిస్తున్న జీవీ రమణారెడ్డిని కర్నూలు జిల్లా పరిషత్ సీఈఓగా నియమించిన విషయం విదితమే. అలాగే అనంతపురం నుంచి జి.శివశంకర్ను పత్తికొండ డీడీఓగా నియమించారు. ఈ నేపథ్యంలో అనంతపురం డీడీఓగా విధులు నిర్వహిస్తున్న ఎం.నాగశివలీలను కర్నూలు డ్వామా ఏఓగా నియమించారు. స్వీయ గణనలో పాల్గొనాలి కర్నూలు(సెంట్రల్): స్వీయ గణనలో జిల్లా ప్రజలు చురుగ్గా పాల్గొనాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం భారతదేశ జనగణన –2027లో భాగంగా డిజిటల్ విధానం ద్వారా కలెక్టర్ తన మొబైల్లో స్వయంగా తన కుటుంబ వివరాలను నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..జనగణనకు సంబంధించి ఏప్రిల్ 16 నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్న స్వయ గణనలో ప్రతి కుటుంబం పాల్గొనాలని పిలుపునిచ్చారు. స్వీయ గణన పక్రియ సులభమైనదని, వేగవంతమైనదని, దానిని పారదర్శకంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ ఇంటి నుంచే www.se.census.gov. in పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవచ్చని ఆమె సూచించారు. పోలీసు శాఖలో హోంగార్డుల సేవలు కీలకం ● సదరన్ రీజియన్ కమాండెంట్ మహేష్ కుమార్ కర్నూలు: పోలీసు శాఖలో హోంగార్డుల సేవలు అత్యంత కీలకమని సదరన్ రీజియన్ హోంగార్డు కమాండెంట్ మేకల మహేష్ కుమార్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ మైదానంలో జిల్లాస్థాయి హోంగార్డులకు శుక్రవారం ‘ప్రత్యేక పరేడ్’ నిర్వహించారు. కార్యక్రమానికి కమాండెంట్ ముఖ్య అతిథిగా హాజరై హోంగార్డుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. సిబ్బంది పనితీరును పరిశీలించారు. అనంతరం కమాండెంట్ మాట్లాడుతూ.. తమిళనాడు రాష్ట్రంలో త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల విధులకు వెళ్లే హోంగార్డులు ఓటర్లతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. సవాళ్లతో కూడుకున్న పోలీసు ఉద్యోగంలో ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహించరాదన్నారు. రోడ్డు భద్రతపై కూడా హోంగార్డులు అవగాహన కలిగి ఉండాలని, ప్రయాణాల్లో జాగ్రత్తలు, రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలన్నారు.అనంతరం నిర్వహించిన దర్బార్లో హోంగార్డులు తమ సమస్యలను కమాండెంట్ దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, డీఎస్పీ ప్రసాద్, హోంగార్డ్స్ ఇన్చార్జి ఆర్ఐ పోతుల రాజు, ఆర్ఎస్ఐలు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. -
నేడు కొత్త కోర్టులు ప్రారంభం
● హాజరుకానున్న రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు కర్నూలు: జిల్లాకు కొత్తగా మంజూరైన న్యాయస్థానాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. కర్నూలులో నూతనంగా 5వ, 6వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి, జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులను శనివారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జిల్లా పోర్ట్ ఫోలియో జడ్జి జస్టిస్ బి.కృష్ణమోహన్, జిల్లాకు చెందిన రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె.శ్రీనివాస రెడ్డి, జస్టిస్ ఎ.హరిహరినాథ శర్మలు ప్రారంభించనున్నారు. కొత్త కోర్టుల ప్రారంభానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి వారం రోజులుగా స్వయంగా పర్యవేక్షిస్తూ ప్రస్తుతానికి రెండు కోర్టులను కర్నూలు, నాలుగు కోర్టులను నంద్యాలలో, నందికొట్కూరులో ఒకటి తయారు చేయించారు. కర్నూలులో మరో అదనపు జిల్లా కోర్టు, మరో రెండు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుల ప్రారంభం కోసం భవనాల అన్వేషణ జరుగుతోంది. త్వరలో కొత్తగా మంజూరైన అన్ని కోర్టులను ప్రారంభించేందుకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి తీవ్రంగా కృషి చేస్తున్నారు. శనివారం ఉదయం నందికొట్కూరులో కొత్త కోర్టు ప్రారంభించి ఆ తర్వాత కర్నూలు జిల్లా కోర్టులో జిల్లాలోని న్యాయమూర్తుల వర్క్షాప్ తర్వాత సాయంత్రం కొత్త కోర్టులను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా బార్ అసోసియేషన్ కార్యవర్గం సంయుక్తంగా నిర్వహించనున్నారు. -
మసీదు పత్రాలను అందిస్తేనే గౌరవ వేతనాలు
కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మసీదులకు సంబంధించిన పత్రాలను ఈ నెల 30వ తేదిలోగా అందజేస్తేనే ఆయా మసీదులకు చెందిన ఇమామ్, మౌజన్లకు ప్రభుత్వం నుంచి గౌరవ వేతనాలు విడుదలవుతాయని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిణి సయిదా సబీహా పర్వీన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మసీదు కమిటీ ప్రెసిడెంట్ లేదా ముత్తవలి ఆయా డాక్యుమెంట్లను జిల్లా వక్ఫ్బోర్డు కార్యాలయంలో అందించాలన్నారు. మసీదు రిజిస్ట్రేషన్ కోసం మసీదుకు సంబంధించిన స్థలం పత్రాలను కచ్చితంగా సమర్పించాలన్నారు. ఏపీ స్టేట్ వక్ఫ్బోర్డు ముఖ్య కార్య నిర్వహణాధికారి ఆదేశాలను ఆయా మసీదులకు చెందిన వారు తప్పక పాటించాలన్నారు. భవన నిర్మాణ కార్మికులకు నాలుగు పథకాలు కర్నూలు(అర్బన్): భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులకు ప్రసూతి సహాయం, వివాహ కానుక, అంత్యక్రియల ఖర్చు, సహజ మరణ ఆర్థిక సహాయం పథకాలను పునరుద్ధరించినట్లు ఉప కార్మిక కమిషనర్ కె.వెంకటేశ్వర్లు తెలిపారు. భవన నిర్మాణ గుర్తింపు కార్డు కలిగిన కార్మికుల కుటుంబ సభ్యులకు వివాహ కానుకగా రూ.20 వేలు, ప్రసూతి ప్రయోజనం కింద రూ.20 వేలు, సహజ మరణ ఉపశమనానికి రూ.60 వేలు, అంత్యక్రియల ఖర్చులకు రూ.20 వేలు లభిస్తుందని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయా పథకాల కింద ప్రయోజనం పొందేందుకు తమ దరఖాస్తులను సమీప సహాయ కార్మిక అధికారి కార్యాలయంలో అందజేయాలన్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 15న కార్మిక సంఘాల నాయకులతో అవగాహన సదస్సును నిర్వహిస్తామన్నారు. కార్మిక సంక్షేమ బోర్డులో లబ్ధిదారులుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. కంటి ఆపరేషన్ల వివరాల నమోదు తప్పనిసరి కర్నూలు(హాస్పిటల్): ప్రభుత్వ, ప్రైవేటు కంటి ఆసుపత్రుల్లో ఇకపై నిర్వహించే కంటి ఆపరేషన్లను తప్పనిసరిగా వెబ్పోర్టల్లో నమోదు చేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ వై.కామేశ్వరప్రసాద్ తెలిపారు. జాతీయ అంధత్వ నివారణ, దృష్టిలోప నివారణ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం డీఎంహెచ్ఓ తన ఛాంబర్లో ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల మేరకు కంటి ఆపరేషన్లు నిర్వహిస్తున్న ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు తప్పనిసరిగా ఈ సంవత్సరం ఏప్రిల్ ఒకటో తేది నుంచి దృష్టిలోప నివారణ వెబ్ పోర్టల్లో ఆపరేషన్ చేసిన రోగుల వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రామ్ మేనేజర్ డాక్టర్ హిమబిందు, ప్రభుత్వ, ప్రైవేటు కంటి ఆసుపత్రుల అధికారులు, నిర్వాహకులు పాల్గొన్నారు. పౌష్టికాహారంతోనే ఆరోగ్యం కర్నూలు(అర్బన్): అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు జంక్ ఫుడ్తో నష్టాలను, హెల్తీ ఫుడ్తో కలిగే ప్రయోజనాలను తల్లిదండ్రులకు వివరించాలని ఐసీడీఎస్ ఆర్జేడీ రోహిణి తెలిపారు. శుక్రవారం కర్నూలు అర్బన్ ఐసీడీఎస్ కార్యాలయంలో పోషణ్ పక్వాడా ఉత్సవాలను నిర్వహించారు. అర్బన్ సీడీపీఓ అనురాధ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రోహిణి మాట్లాడుతూ మొదటి ఆరు సంవత్సరాల్లో పిల్లల మెదడు అభివృద్ధిని పెంపొందించడంపై దృష్టి సారించడం పోషణ్ పక్వాడా ముఖ్య ఉద్దేశమన్నారు. ఈనెల 19న అక్షయ తృతియ రోజున బాల్య వివాహాలు జరిగే అవకాశం ఉన్నందున బాల్య వివాహ రహిత భారత్ ప్రచారంలో భాగంగా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. బాల్య వివాహాల గురించి సమాచారం తెలిస్తే వెంటనే 1800–102–7222 లేదా చైల్డ్ హెల్ప్లైన్ నెంబర్ 1098కు ఫిర్యాదు చేయాలని కోరారు. ఈ సందర్భంగా పోషక విలువలపై అవగాహన కల్పించే పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో సీడీపీఓ సౌజన్య, సూపర్వైజర్లు, అంగన్వాడీ వర్కర్లు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
మృత్యు పంజా!
చిలకలడోణ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం ఘటనా స్థలంలో క్షతగాత్రులుకర్నూలు (హాస్పిటల్): అప్పటి వరకు తనతో కబుర్లు చెప్పుకుంటూ వచ్చిన భార్య, అపురూపంగా చూసుకుంటున్న కుమార్తె మృతిని కళ్లారా చూసి గుండెపగిలేలా రోదిస్తున్న వ్యక్తి ఒకరు.. చెట్టంతా కు మారుడు, ఇంటికి పెద్దగా ఉన్న తండ్రి లోకం వీడటంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబీకులు.. తీవ్రంగా గాయపడి హహాకారాలు చేస్తున్న క్షతగాత్రు లను చూసి చీకట్లో మృత్యువు వికటాట్టహాసం చేసింది. అందరూ నిద్రలో ఉన్నారు. వారు ప్రయాణిస్తున్న వా హనం గమ్యానికి చేరువైంది. ఇంతలో ఉలిక్కిపాటు. రెప్పపాటులో ఘోరం. కళ్లు తెరిచి చూసేసరికి చుట్టూ చీకట్లు.. ఆర్తనాదాలు. ఘటనా స్థలం రక్తసిక్తం. కొందరు అప్పటికే ప్రాణం విడిచారు. దైవ దర్శనానికి బయలుదేరిన భక్తులపై మృత్యువు పంజా విసిరింది. మలుపులో మాటు వేసి లారీ రూపంలో ఎనిమిది మందిని మింగేసింది. కొందరు గాఢ నిద్రలోనే కన్నుమూశారు. సమీపంలోని పల్లె ప్రజలు మృత్యుకేకతో ఉలికిపడ్డారు. మరి కొద్ది నిమిషాల్లో దైవ స్మరణలో తరలించాల్సిన వారిలో కొందరు విగతజీవులుగా మారగా.. మరి కొందరు క్షతగాత్రులై ఆసుపత్రి పాలయ్యారు. మంత్రాలయం మండలం చిలకలడోణ గ్రామ సమీపంలో గురువారం తెల్లవారు జామున 3.20 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. కర్ణాటక ప్రాంతానికి చెందిన యాత్రికులు గూడ్స్ వాహనంలో మంత్రాలయం వస్తుండగా.. ఎదురుగా వస్తున్న ఫయాస్ మిల్లర్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలో ఐదుగురు మృతి చెందగా.. ఆసుపత్రిలో ముగ్గురు మృతి చెందారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఉన్నారు. ఎమ్మిగనూరు ఆసుపత్రిలో మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి. క్షతగ్రాతుల భాష అర్థం కాక వైద్యుల సతమతం.. చిలకలడోణ రోడ్డు ప్రమాద క్షతగాత్రులతో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని క్యాజువాలిటీ హాహాకారాలు అక్కడి వారిని కలిచి వేశాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. గాయపడిన వారిలో అమృత(11), తేజస్విని(15), దీక్షిత(16), వర్షిత(19), శుభ (34), జయమ్మ(60), ధన్యశ్రీ(14), దీపక్(16), ప్రతాప్(14), సునీత(20), భారతి(40), సునీల్కుమార్(25) ఉన్నారు. వీరిలో తేజస్విని, శుభల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. క్షతగాత్రుల్లో కొందరికి కాళ్లు, చేతులు విరగ్గా, మరికొందరికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిలో 12 నుంచి 15 ఏళ్ల చిన్నారులు కూడా ఉన్నారు. వారు బాధతో అల్లాడిపోయారు. చికిత్స సమయంలో వారు వారికి వచ్చిన కన్నడ భాషలో నొప్పిగా, బాధగా ఉందని, ముట్టుకోవద్దని విలపించారు. మరోవైపు క్షతగాత్రులు ఏమి చెబుతున్నారో అర్థం గాక.. కన్నడ భాష అర్థం కాని వైద్యులు, సిబ్బంది చికిత్స అందించడంలో సతమతమయ్యారు. కన్నడ భాష స్వల్పంగా తెలిసిన వారు దగ్గరుండి చికిత్స అందించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా చిన్నారులు బాధతో విలవిలలాడి కొద్దిసేపు మూర్చపోయారు. చాలా మందికి అంతర్గతంగా అవయవాల్లో గాయాలు ఉండటంతో వారు కదలలేని స్థితిలో ఇబ్బంది పడ్డారు. క్షతగ్రాతులను కలెక్టర్ సిరి పరామర్శించారు. సంఘటన స్థలాన్ని ఎస్పీ విక్రాంత్ పాటిల్ సందర్శించి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు.మృతులు తల్లీబిడ్డ వీణ, నిషిత (ఫైల్), ప్రమాదంలో బయటపడిన వీణ భర్త రాజేష్ ఎమినిమిది మంది మృత్యువాత, 12 మందికి తీవ్రగాయాలు ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి అందరూ కర్ణాటక రాష్ట్ర వాసులే క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమం -
సమష్టి పోరు
రాయలసీమ ప్రజలు అంటే చంద్రబాబుకు చిన్న చూపు. రాయలసీమ గురించి జగనన్న రాయలసీమ లిఫ్ట్ పనులు ప్రారంభించారు. రైతులకు, ప్రజలకు మేలు చేసే విధంగా జగనన్న చేస్తే, చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రం సీఎం కోసం నిలిపివేయడం దారుణం. రాయలసీమ కోసం పార్టీలకు అతీతంగా పోరాటం చేద్దాం. కలిసి వచ్చే వారందరినీ కలుపుకుందాం. గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తి చేయాలి. ప్రజలు, రైతుల గురించి ఆలోచిస్తున్న జగనన్నకు మద్దతుగా ఉద్యమ బాట పడదాం. – బుట్టా రేణుక, కర్నూలు పార్లమెంటు సమన్వయకర్త మాట్లాడుతున్న అనంతపురం మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, చిత్రంలో మాజీ మంత్రి శైలజానాథ్, నంద్యాల, కర్నూలు జిల్లాల అధ్యక్షులు కాటసాని రాంభూపాల్రెడ్డి, ఎస్వీ మోహన్రెడ్డి, ఎమ్మెల్యేలు బాల నాగిరెడ్డి, విరూపాక్షి, ఎమ్మెల్సీ మధుసూదన్, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, తదితరులుకర్నూలు(టౌన్): చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాయలసీమను పూర్తిగా విస్మరిస్తున్నారు. రైతులంటే ఆయనకు గిట్టదు. తాగునీరు, సాగునీటి విషయంలో సీమ ప్రాంత ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై ఇక పోరుబాట తప్పదని వైఎస్సార్సీపీ నేతలు హెచ్చరించారు. జిల్లాతో పాటు నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహించి ప్రజలు, రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. చంద్రబాబు సీమ ప్రాంత పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యాన్ని వీడాలని ధ్వజమెత్తారు. దివంగత మహానేత వైఎస్సార్, ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోనే సీమలో నీళ్లు పారాయన్నారు. చంద్రబాబు అధికారంలోకి రావడంతో కేవలం అమరావతి జపం సాగుతోందన్నారు. రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేసి అమరావతిలో రాజధాని నిర్మిస్తామంటున్న చంద్రబాబు.. సీమ ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమబాట తప్పదని నేతలు హెచ్చరించారు. వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి అధ్యక్షతన గురువారం కర్నూలు బిర్లా సర్కిల్లోని శ్రీలక్ష్మి ఫంక్షన్ హాలులో ‘రాయలసీమ నీటి ప్రాజెక్టులు– సమాలోచన’ అంశంపై సమావేశం నిర్వహించారు. ముందుగా దివంగత మహానేత డాక్టర్ వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతపురం మాజీ పార్లమెంటు సభ్యులు, పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామి రెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజానాథ్, కర్నూలు పార్లమెంట్ పరిశీలకులు గంగుల ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. సమావేశంలో పార్టీ నగర అధ్యక్షులు అహమ్మద్ అలీఖాన్, కర్నూలు నియోజకవర్గ పార్టీ పరిశీలకులు చల్లా విఘ్నేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ, రాష్ట్ర కార్యదర్శులు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాంపుల్లయ్య యాదవ్, తెర్నేకల్ సురేందర్ రెడ్డి, మద్దూరు సుభాష్ చంద్రబోస్, పార్టీ నేతలు షరీఫ్, కిషన్, రాఘవేంద్ర, పాటిల్ తిరుమలేశ్వర రెడ్డి, పాటిల్ హనుమంతరెడ్డి, శ్రీనివాస రెడ్డి, నరసింహులు యాదవ్, రామాంజనేయులు, మహిళా నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శశికళ, మాజీ కార్పొరేటర్లు రాజేశ్వర రెడ్డి, సిట్రా సత్యనారాయణమ్మ, గాజుల శ్వేతారెడ్డి, సిద్దారెడ్డి రేణుకా, అరుణ, మంగమ్మ, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.సీమకు అన్యాయం చేస్తే సహించేది లేదు. 1995 సంవత్సరం నుంచి 2004 వరకు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు రాయలసీమను పట్టించుకోలేదు. ఆ తర్వాత సీఎం అయిన దివంగత వైఎస్సార్ వల్లే ఎస్సార్బీసీ, హంద్రీనీవా ప్రాజెక్టులతో నీళ్లు పారాయి. తెలంగాణ రాష్ట్రం ప్రతి రోజు 8 టీఎంసీల నీటిని తోడుకుంటున్నా ఎందుకు చంద్రబాబు మౌనంగా ఉన్నారు. వేదావతి, గుండ్రేవుల కోసం ఉద్యమిద్దాం. లిఫ్ట్ పనులు సాధించుకుందాం. సీమకు అన్యాయం జరుగుతున్నా రాయలసీమ టీడీపీ నేతలకు పౌరుషం లేదా?. ఈ ప్రాంత రైతుల ప్రయోజనాల కోసం కలిసికట్టుగా పోరాడుదాం. – కాటసాని రాంభూపాల్రెడ్డి, వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీశైలం ప్రాజెక్టు కోసం సీమ ప్రాంతానికి చెందిన 26వేల మంది రైతులు త్యాగం చేశారు. ఊళ్లు ఖాళీ చేశారు.. గూడు కోల్పోయారు. మరి అమరావతిలో 28వేల మంది రైతుల త్యాగం మాత్రమే చంద్రబాబుకు కనిపిస్తుందా. సీమ రైతులది త్యాగం కాదా. సీమ ప్రాంతంలో సాగునీరు, తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు మాజీ సీఎం జగనన్న రూ.900 కోట్లు ఖర్చు చేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేపట్టారు. 10 శాతం పనులతో మొత్తం లిఫ్ట్ పూర్తవుతుంది. అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పాడని లిఫ్ట్ పనులు నిలిపేశావు. లిఫ్ట్ వల్ల 20 టీఎంసీలు నిల్వ చేసుకుంటే 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. – ఎస్వీ మోహన్ రెడ్డి పార్టీ జిల్లా అధ్యక్షులు చంద్రబాబు నాయుడు రాయలసీమను ఏడారి చేసే కుట్రలు చేస్తున్నారు. రాయలసీమలో సాగునీరు, తాగునీరు అందించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోతిరెడ్డిపాడు వద్ద ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుడితే చంద్రబాబు తెలంగాణ సీఎం అడిగారని పనులు నిలిపివేయించారు. సీమ ద్రోహి చంద్రబాబు. సీమకు అన్యాయం చేస్తున్న చంద్రబాబు నాయుడుపై పోరాటం చేద్దాం. – బి.విరూపాక్షి, ఆలూరు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాయలసీమ ప్రాంతం అంటే చిన్న చూపు. సీమలో పుట్టిన చంద్రబాబుకు చీము నెత్తురు లేదు. దివంగత నేత వైఎస్సార్ రైతులకు ఉచితంగా కరెంటు ఇస్తామని చెప్పి ఆచరణలో చూపిస్తే అప్పట్లో చంద్రబాబు నాయుడు హేళన చేశారు. కరెంటు వైర్లపై బట్టలు ఆరేసుకోవడానికి తప్ప ఏ మాత్రం సాధ్యం కాదన్నారు. గురు శిష్యులు కలిసి రాయలసీమ రైతాంగాన్ని దగా చేశారు. – వై.బాలనాగిరెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే రాయలసీమకు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచారు. సీమకు అన్యాయం చేసి తెలంగాణకు న్యాయం చేయడం ఏంటి? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీమ ప్రాంత రైతులు, ప్రజల కోసం ఎత్తిపోతల పథకాలకు రూ.900 కోట్లు ఖర్చు చేసి లిఫ్ట్ పనులకు శ్రీకారం చుడితే ఆ పనులు నిలిపివేసి చంద్రబాబు ద్రోహిగా నిలిచారు. సీమ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై పోరాడదాం. – డాక్టర్ మధుసూదన్, ఎమ్మెల్సీ సీమ ప్రాంతానికి న్యాయం జరిగిందంటే ఒక్క వైఎస్సార్ కటుంబంతోనే. పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద 11 వేల క్యూసెక్కుల సామర్థ్యాన్ని 44వేలకు పెంచిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిదే. రాయలసీమ లిఫ్ట్ పనులను నిలిపి వేసిన చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుదాం. లిఫ్ట్తో 20 టీఎంసీల నీరు నిల్వ చేసుకోవచ్చు. – ఎర్రబోతుల పాపిరెడ్డి, జిల్లా పరిషత్తు చైర్మన్తెలంగాణ సీఎంకు సీమ ప్రాంతంలో జరుగుతున్న లిఫ్ట్ పనులు నిలిపివేసి చంద్రబాబు నాయుడు గిఫ్గ్గా ఇచ్చారు. సీమలో పుట్టి ఈ ప్రాంతానికి చంద్రబాబు అన్యాయం చేస్తున్నారు. జగనన్న హయంలో మంజూరైన లా యూనివర్సిటీని కూడా తరలించారు. హైకోర్టును లేకుండా చేశారు. తెలంగాణ కోసం 6 జిల్లాలను చంద్రబాబు తాకట్టు పెట్టారు. – బీవై రామయ్య, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిరెండేళ్లలో చంద్రబాబు నాయుడు 3.30 లక్షల కోట్లు అప్పు చేశారు. వేల కోట్లు అప్పులు చేసి ప్రజలకు ఏం చేశారు. సుదీర్ఘ అనుభవం ఉన్న ముఖ్యమంత్రిగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఒక్క మంచి పథకం ప్రారంభించారా?. 10 పైసలు ఖర్చు చేసి వంద రూపాయిల బిల్డప్ తప్ప ఆయన చేసిందేమీ లేదు. రాయలసీమ వ్యక్తి అయిన చంద్రబాబు ఎప్పుడూ అమరావతి జపమే చేస్తున్నాడు. సీమ ప్రాంత ప్రజలు ఆయనను తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. – వై.సాయిప్రసాద్ రెడ్డి, ఆదోని మాజీ ఎమ్మెల్యే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు రాయలసీమ వాసిగా సిగ్గు పడాలి. ఒక్క ప్రాజెక్టు కట్టాడా. సీమ ప్రాంత రైతులను దగా చేశారు. రైతులంటే ఎందుకంత కోపం. రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించే లిఫ్ట్ పనులు నిలిపి వేసి చంద్రబాబు చరిత్ర హీనుడిగా నిలిచారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోసం సీమ ప్రజలను నాశనం చేస్తావా? ఈ ప్రాంత ప్రజలు ఆయన్ను ఎప్పటికీ క్షమించరు. హంద్రీనీవా అంటే దివంగత వైఎస్సార్ గుర్తుకు వస్తారు. మరి చంద్రబాబు రైతులకు ఏం చేశాడో చెప్పాలి. – కంగాటి శ్రీదేవి, పత్తికొడ మాజీ ఎమ్మెల్యే రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. తాగడానికి నీళ్లు దొరకని పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పిస్తుంది. సీమలోని రైతులు, ప్రజల దాహార్తి పట్టదా. భావి తరాల కోసం మనందరం పోరాడుదాం. ప్రాజెక్టులను సాధించుకుందాం. – ఎస్వీ విజయ మనోహరి, మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సీమ ప్రాంతానికి చంద్రబాబు అన్యాయం చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు వద్ద సీమ ప్రజలకు, రైతుల కోసం జగనన్న లిఫ్ట్ పనులు ప్రారంభిస్తే వాటిని తెలంగాణ కోసం చంద్రబాబు నాయుడు నిలిపివేసి సీమకు అన్యాయం చేస్తున్నారు. సీమలోని టీడీపీ నాయకులు రాయలసీమ ప్రాజెక్టు సాధనకు కలిసి రాకుంటే పుట్టగతులుండవు. రైతుల పక్షాన అలుపెరుగని పోరాటం సాగిస్తాం. – రాజీవ్ రెడ్డి, ఎమ్మిగనూరు సమన్వయ కర్త కర్నూలును రాజధానిగా కొనసాగించి ఉంటే బెంగళూరు, చైన్నె తరహాలో అభివృద్ధి సాధించేది. సీమ ప్రాంతాన్ని వైఎస్ కుటుంబం తప్ప ఏ ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. జగనన్న ప్రారంభించిన రాయలసీమ లిఫ్ట్ పనులను ప్రారంభించుకుందాం.గ్రేటర్ రాయలసీమ ప్రాంత సమస్యలపై ప్రజలను, రైతులను చైతన్యం చేద్దాం. ఇక సీమ రైతులందరూ కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. – తలారి రంగయ్య, మాజీ పార్లమెంట్ సభ్యులు చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సీమకు అన్యాయమే జరుగుతుంది. రాయలసీమలో భూమి మంచిదే. నీటి లభ్యత లేక రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దివంగత వైఎస్సార్ హయాంలో రిజర్వాయర్లు నిర్మించారు. జగనన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. సీమ రైతుల త్యాగం చంద్రబాబుకు కనిపించడం లేదు. ఆరుతడి పంటలు వేసుకోవాలని రైతులను అవమానిస్తున్నారు. రైతులను ఈ ప్రభుత్వం బిచ్చగాళ్లుగా చూస్తోంది. – వంగాల భరత్ కుమార్ రెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాయలసీమ లిఫ్ట్ పనులు వెంటనే ప్రారంభించాలి చంద్రబాబు సీమ ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారు అమరావతి జపం చేస్తున్న టీడీపీ నేతలు సీమ ప్రాంత అభివృద్ధి పూర్తిగా విస్మరించారు కర్నూలులో ‘రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు–సమాలోచన’ సదస్సు గళం వినిపించిన సీమ ప్రాంత ముఖ్య నేతలు -
రెప్పపాటులో ఘోర రోడ్డు ప్రమాదం..
మంత్రాలయం/ మంత్రాలయం రూరల్: రెప్పపాటులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఎనిమిది మందిని బలితీసుకుంది. 13 మందిని క్షతగాత్రులను చేసింది. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోణ గ్రామ సమీపంలో గురువారం తెల్లవారుజామున గూడ్స్ వాహనం, ఫ్లైయాష్ మిల్లర్ వాహనం ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. వ్యవసాయ పనులు ముగియడంతో కర్ణాటకలోని హాసన్, చిక్మంగళూరు జిల్లాలకు చెందిన రైతు, సాగు కూలీలు తమ ఇష్టదైవం రాఘవేంద్రస్వామిని దర్శించుకోవాలనుకున్నారు. దీంతో చిక్మంగళూరు జిల్లా తారికెర తాలూకా ఉదేవ గ్రామం, చిక్మంగళూరు, కన్నైనతళ్లి హళ్లి, అన్నేరడు గ్రామం, బూతుపల్లి, హాసన్ జిల్లా బెన్నూరు తాలూకా శెట్టిగెర, దావణగేరి గ్రామాలకు చెందిన 22 మంది రాఘవేంద్రస్వామి దర్శనానికి గూడ్స్ వాహనంలో ఉదేవా గ్రామం నుంచి బుధవారం సాయంత్రం పయనమయ్యారు. మంత్రాలయం వైపు వస్తుండగా.. గమ్యస్థానానికి 9 కిలోమీటర్ల దూరంలో చిలకలడోణ దాటగానే రాయచూరు నుంచి ఎదురుగా వస్తున్న ప్లైయాష్ కాంక్రీటు మిల్లర్ వాహనాన్ని యాత్రికుల వాహనం ఢీకొట్టింది. ఫ్లైయాష్ మిల్లర్ రోడ్డు పక్క పొలంలోకి బోల్తా పడింది. యాత్రికుల వాహనం రోడ్డుపైనే బోల్తా పడి నుజ్జునుజ్జయింది. ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. తీవ్రంగా గాయపడిన 16 మందిని పోలీసులు అంబులెన్స్లలో ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రికి వెళ్తుండగా మార్గమధ్యంలో ఇద్దరు, ఆస్పత్రిలో మరొకరు మరణించారు. 13 మంది క్షతగాత్రులను కర్నూలు పెద్దాస్పత్రికి తరలించారు. మృతులు వీళ్లే.. ప్రమాదంలో సునీల్ (29), మీనాక్షమ్మ (52), పుట్టమ్మ (60), లోలాక్షమ్మ (38), ఎస్.కె.వీణ (25), ఆమె కూతురు చిన్నారి నిషిత (3), సుశీల్ కుమార్ (45), జయమ్మ (60) చనిపోయారు. ఇందులో డ్రైవర్ సునీల్, అతని తండ్రి, చెల్లెలు, సుశీల్కుమార్, ఎస్.కె. వీణ, ఆమె కూతురు చిన్నారి నిషితతోపాటు సునీల్ అత్త జయమ్మ, అవ్వ లోలాక్షమ్మ ఒకే కుటుంబానికి చెందిన వారు. ఘోర ప్రమాదానికి డ్రైవర్ సునీల్ నిద్రమత్తే కారణమని పోలీసులు చెబుతున్నారు. ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి సాక్షి, న్యూఢిల్లీ: కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి రూ.2 లక్షల వంతున, క్షతగాత్రులకు రూ.50,000 చొప్పున సాయం చేయనున్నట్టు ప్రధాని కార్యాలయం ఎక్స్ వేదికగా ప్రకటించింది. వైఎస్ జగన్ సంతాపం సాక్షి, అమరావతి: ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దైవదర్శనానికి వెళ్తున్న భక్తులు ఈ ప్రమాదంలో మృతి చెందడం అత్యంత విషాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 13 మంది గాయపడటం, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
వృద్ధాశ్రమం సందర్శన
నందికొట్కూరు: పట్టణ సమీపంలోని శ్రీకాళీ ప్రసాద అశ్రితాశ్రమం, పల్లె ప్రియాంక సేవా సమితి వృద్ధుల ఆశ్రమాన్ని హైకోర్టు జడ్జి ఎన్. హరినాథ్రెడ్డి బుధవారం సందర్శించారు. ఆశ్రమంలో ఉన్న వృద్ధులు, దివ్యాంగులతో కాసేపు మాట్లాడారు. అనంతరం వారితో కలిసి అల్పాహారం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వృద్ధాశ్రమం సందర్శించడంతో మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉందన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఉండడంతో రోగాల దూరమవుతాయన్నారు. ఈయన వెంట నందికొట్కూరు సివిల్ జడ్జి శోభారాణి, పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు నరసింహారెడ్డి, ధర్మారెడ్డి, శివరాముడు, శోభారాణి, మండ్లెం రామిరెడ్డి, సురేష్, లక్ష్మీనారాయణ, జార్జి, తదితరులు పాల్గొన్నారు. -
‘సీమ’ రగులుతోంది!
రేవంత్రెడ్డితో చీకటి ఒప్పందం చేసుకొని రాయలసీమకు అన్యాయం చేసిన చంద్రబాబుపై ‘సీమ’ నేతలు ఉద్యమబాట పట్టారు. ‘సీమ’ ప్రయోజనాలను తాకట్టుపెట్టి ఆపేసిన ‘రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్’ పూర్తి చేయాల్సిందేనని పోరుబాటకు సిద్ధమయ్యారు. ఇప్పటికే పోతిరెడ్డిపాడు, తిరుపతి, కడప, అనంతపురంలో సభలు నిర్వహించారు. నేడు కర్నూలు కేంద్రంగా మరో సమావేశానికి సిద్ధమయ్యారు. రాయలసీమ లిఫ్ట్ ఆవశ్యకత, ప్రభుత్వ వంచన, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. – సాక్షి ప్రతినిధి కర్నూలు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిలిపేయడంపై ఫిబ్రవరి నుంచి ‘సీమ’ రగులుతోంది. తెలంగాణ రైతులు, ప్రాంత ప్రయోజనాల కోసం చంద్రబాబుతో తాను మాట్లాడి ప్రాజెక్టును ఆపేశానని తెలంగాణ అసెంబ్లీలో రేవంత్రెడ్డి మాట్లాడిన తర్వాత ఒక్కసారిగా ‘సీమ’ నివ్వెరపోయింది. ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన వ్యక్తి ఇలా మరోసారి రాష్ట్ర భవిష్యత్తును ఫణంగా పెట్టడం ఏంటనే చర్చ మొ దలైంది. రేవంత్రెడ్డి వ్యాఖ్యల్లో నిజం ఉందా? లేదా? అనేది చర్చించాల్సింది పోయి రాయలసీమ ప్రాజెక్టుపై టీడీపీ నేతలు వితండవాదం చేస్తున్నారు. ఈక్రమంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ప్రతీ జిల్లాలో సమావేశాలు నిర్వహించి ప్రజలను చైతన్యం చేస్తున్నారు. ‘సీమ’ త్యాగాలకు విలువ ఏముంది బాబూ! శ్రీశైలం ప్రాజెక్టు ఏర్పాటుకు భూములు కోల్పోయింది, గ్రామాలు ఖాళీ చేసింది ‘సీమ’ ప్రజలే. ‘సీమ’ త్యాగాలతోనే శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించారు. ప్రాజెక్టు నిర్మాణం తర్వాత జల ప్రయోజనాలను అన్ని ప్రాంతాలు అనుభవిస్తున్నాయి. ఏపీ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత కృష్ణాజలాలపై రెండు రాష్ట్రాలకు హక్కులు ఉన్నాయి. ఒక రాష్ట్రం మరొక రాష్ట్రాన్ని నియంత్రించే పరిస్థితి లేదు. ఈక్రమంలో త్యాగం చేసిన సీమకే తీవ్ర అన్యాయం జరుగుతోంది. అది కూడా సాక్షాత్తూ రాష్ట్రం ప్రభుత్వం చేయడం మరింత శోచనీయం. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. పోతిరెడ్డిపాడుకు 44వేల క్యూసెక్కుల నీరు అందాలంటే ప్రాజెక్టులో 881 అడుగులు ఉండాలి. తెలంగాణ 800 అడుగుల నుంచే రోజుకు 8 టీఎంసీలు తోడేస్తుంటే శ్రీశైలంలో నీటిమట్టం 881 అడుగులకు వచ్చే సరికి తెలంగాణ వంద టీఎంసీలుపైగా తోడేస్తుంది. ఒకవేళ శ్రీశైలంలో వరద ప్రవాహం తగ్గితే కేవలం తెలంగాణ మాత్రమే నీటిని తోడుకుంటుంది. ‘సీమ’కు చుక్క నీరు అందని పరిస్థితి. జగన్ ముందు చూపే.. తెలంగాణ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల, నెట్టెంపాడు, బీమా, కోయిల్సాగర్తో పాటు పలు ప్రాజెక్టుల ద్వారా రోజూ 8 టీఎంసీలు తరలిస్తోంది. మరోవైపు కర్నాటకలో ఆల్మట్టిడ్యాం సామర్థ్యాన్ని 129 టీఎంసీల నుంచి, 229 టీఎంసీలకు అక్కడి ప్రభుత్వం పెంచుతోంది. తెలంగాణ, కర్నాటక చర్యలతో శ్రీశైలానికి వరద ప్రవాహం తగ్గిపోయే ప్ర మాదముంది. ఈ పరిణామాలను బేరీజు జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడే రాయలసీమలిప్ట్కు శ్రీకారం చుట్టారు. తెలంగాణతో పాటు మనం కూడా 800 అడుగుల నుంచే నీటిని తోడుకునేలా రూ.3,850 కోట్లతో ప్రాజెక్టుకు రూపకల్పన చేసి నిర్మాణానికి ఉపక్రమించారు. రూ.1200కోట్లకు పైగా పనులు చేసి రూ.990కోట్ల విలువైన బిల్లులు కూడా చెల్లించారు. రాయలసీమ ఎత్తిపోతలతో ఉమ్మడి కర్నూలు సస్యశ్యామలం రాయలసీమ ఎత్తిపోతల పూర్తయితే ఉమ్మడి కర్నూలు సస్యశ్యామలం అవుతుంది. 800 అడుగుల నుంచే తోడుకోవచ్చు కాబట్టి నెల ముందే సాగునీరు రైతులకు అందుతుంది. ముందస్తు పంటలు సాగు చేసుకోవచ్చు. హంద్రీ–నీవా ఫేజ్–2కు రాయలసీమ లిఫ్ట్ నుంచి నీరు ఇస్తారు. మల్యాల ద్వారా ఫేజ్–2కు నీరు పంపాల్సిన అవసరం లేదు. హంద్రీ–నీవా నీరు మొత్తాన్ని కర్నూలు, అనంతపురం జిల్లాలు మాత్రమే వాడుకోవచ్చు. కర్నూలు జిల్లాలో హంద్రీ–నీవా పరిధిలో 79,300 ఎకరాల ఆయకట్టు ఉంది. దీనికి సాగునీరు అందుతుంది. అలాగే మరిన్ని చెరువులకు నీరు అందించొచ్చు. నంద్యాల జిల్లాలో నీటి నిల్వ సామర్థ్యం పెంచుకోవడంతో నెల నుంచి రెన్నెళ్లు ముందుగానే సాగునీరు అందుతుంది. ప్రాజెక్టులో నీటి నిల్వ 800 అడుగులకు తగ్గినా అవసరమైతే నీటిని తోడుకోవచ్చు. ఇది తాగు, సాగునీటి వనరుల కల్పనకు దోహదపడుతుంది. భవిష్యత్తులో కర్నూలు, నంద్యాల జిల్లాలో నీటినిల్వ ప్రాజెక్టులు, డిస్ట్రిబ్యూటరీలు పెంచుకుని మరింత ఆయకట్టును స్థిరీకరించుకోవచ్చు.ఎన్జీటీలో టీడీపీ నేతలతో కేసులు వేయించి పనులు ఆపేసిన టీడీపీరాయలసీమ లిఫ్ట్ పూర్తయితే జగన్మోహన్రెడ్డికి మంచి పేరు వస్తుందనే ఈర్ష్యతో టీడీపీ నేతలు మహబూబ్నగర్లోని టీడీపీ సానుభూతి పరులతో ఎన్జీటీ(నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్)లో కేసులు వేయించారు. దీంతో ప్రాజెక్టుపై ఎన్జీటీ స్టే ఇచ్చింది. అయితే ఎన్జీటీలో వాదనలు వినిపిస్తూనే పనులు ఆపకుండా భారీ భద్రత మధ్య అప్పటి ప్రభుత్వం 50శాతం పైగా పనులు చేసింది. ఎన్జీటీ అనుమతులు లేకుండా ప్రాజెక్టు చేపట్టిందని మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్తో పాటు పలువురు ఆరోపిస్తున్నారు. అదే సమస్య అయితే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ఎందుకు ఎన్జీటీ అనుమతులు తీసుకోలేకపోతోందో సమాధానం చెప్పాలి. ఏకమవుతున్న ‘సీమ’ జిల్లాల నేతలు, ప్రజలు నేడు కర్నూలులో వైఎస్సార్సీపీ నేతల ఆధ్వర్యంలో సమావేశం ఇప్పటికే పోతిరెడ్డిపాడు, కడప, తిరుపతి, అనంతపురంలో ‘గ్రేటర్’ నేతల సభలు, సమావేశాలు హాజరుకానున్న మాజీ మంత్రి శైలజానాథ్, అనంత వెంకట్రామిరెడ్డి -
కొట్టేసిన ఫోన్లు పట్టేశారు
కర్నూలు: రకరకాల కారణాలతో చోరీకి గురైన, పోగొట్టుకున్న సెల్ఫోన్ల రికవరీలో జిల్లా పోలీసులు సత్తా చాటుతున్నారు. బాధితులు ఇచ్చిన ఓ చిన్న ఫిర్యాదుతో పోయిన సెల్ఫోన్లు ఇతర రాష్ట్రాలు, జిల్లాల్లో ఎక్కడున్నా పట్టేస్తున్నారు. విక్రాంత్ పాటిల్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మూడు విడతల్లో రూ.3.70 కోట్ల విలువ చేసే 1,873 సెల్ఫోన్లను రికవరీ చేయగా, తాజాగా నాలుగో విడత రూ.1.10 కోట్ల విలువ చేసే 529 సెల్ఫోన్లను రికవరీ చేశారు. బాధితులను బుధవారం జిల్లా పోలీసు కార్యాలయానికి పిలిపించి ఎస్పీ చేతుల మీదుగా రికవరీ చేసిన సెల్ఫోన్లను బాధితులకు అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, సీఐలు మధుసూదన్రావు, శివశంకర్, మస్తాన్, సైబర్ ల్యాబ్ టెక్నికల్ టీమ్ పాల్గొన్నారు. మొబైల్ పోగొట్టుకుంటే.. ఎవరైనా మొబైల్ పోగొట్టుకుంటే కర్నూలు పోలీస్ వెబ్సైట్ http://kurnoolpolice.in/mobiletheft లోకి వెళ్లి లింక్ ఓపెన్ చేసి ఫిర్యాదు ఫారం నింపాలి. పేరు, జిల్లా, పోలీస్స్టేషన్ పరిధి, మొబైల్కు సంబంధించిన ఐఎంఈఐ–1, ఐఎంఈఐ–2 నెంబర్లతో పాటు బిల్లులు ఆన్లైన్లో సమాచారం పొందుపరిస్తే సాంకేతికత ఆధారంగా ట్రాక్ చేసి ఎక్కడుందో పోలీసులు గుర్తిస్తారు. -
నోటీసులు ఇవ్వకుండా శ్రీహరిని అరెస్టు చేయడమేంటి?
● వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బీవై రామయ్యకర్నూలు (టౌన్): పోలీసులు నోటీసులు ఇవ్వకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన శ్రీహరిని అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మేయర్ బీవై రామయ్య అన్నారు. బుధవారం ఆయన కర్నూలులో విలేకరులతో మాట్లాడుతూ.. శ్రీహరి ఒక జర్నలిస్టుగా పనిచేశారన్నారు. మీడియా ఇన్చార్జ్గా పనిచేసిన వ్యక్తిని ఎందుకు అరెస్టు చేస్తున్నారో కూడా తెలియకుండా పోలీసులు వ్యవహరించడం దారుణమన్నారు. ‘అసలు నోటీసులు ఇచ్చారా.. భయభ్రాంతులు చేయడం కోసమే కదా.. ఆటవిక పాలనలో ఉన్నామా..? ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా?’ అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత జయంతి రోజున అంబేడ్కర్కు దండలు వేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు అర్హుడా అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభు త్వం భారత రాజ్యాంగం ప్రకారం పనిచేయడం లేదని, రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో ప్రశ్నించిన వారిని ఇబ్బందులు పెడుతోందన్నారు. శ్రీహరి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని, వెంటనే అతన్ని బేషరుతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదన్నారు. అవకాశం ఉంది కదా అని చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ప్రజలు గమనిస్తున్నారని, భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. -
సంజామల ‘మండిపోతోంది’
● 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కర్నూలు(అగ్రికల్చర్): సూర్య ప్రతాపానికి ఉమ్మడి జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. గాలిలో తేమ మధ్యాహ్న సమయంలో 30 శాతం వరకు ఉంటే వడగాలుల తీవ్రత అంత తీవ్రంగా ఉండదు. అయితే 10 శాతం లోపునకు పడిపోవడంతో నిప్పులకొలిమిని తలపిస్తోంది. నంద్యాల జిల్లాలోని సంజామల మండలం ఏకంగా మండిపోతోంది. ఇక్కడి హీట్వేవ్ను రాష్ట్ర విపత్తుల నిర్వహణ విభాగం ఎల్లో అలర్ట్గా ప్రకటించింది. సంజామల మండలంలో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ మండలంలో వరుసగా అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటం గమనార్హం. గత ఏడాది ఇదే సమయంలో 43 డిగ్రీల వరకు మాత్రమే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సారి ఏప్రిల్ మాసం మధ్యలోనే 44.6 డిగ్రీలకు చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. -
రోగి కడుపులో అతి పెద్ద కణితి
● విజయవంతంగా తొలగించిన వైద్యులు కర్నూలు(హాస్పిటల్): ఓ రోగి కడుపులో ఏర్పడ్డ అతి పెద్ద క్యాన్సర్ కణితిని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో జనరల్ సర్జరీ విభాగం వైద్యులు విజయవంతంగా తొలగించారు. బుధవారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనరల్ సర్జరీ హెచ్ఓడీ డాక్టర్ హరిచరణ్ వివరాలు తెలిపారు. కర్నూలు నగరంలోని ఎర్రబురుజు ప్రాంతానికి చెందిన జి.మత్తయ్య(75)కు చాలా ఏళ్లుగా కడుపులో గడ్డ(కణితి) ఉంది. ఈ నెల 6న ఆయన కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో శస్త్రచికిత్స కోసం చేరాడు. జనరల్ సర్జరీ మొదటి యూనిట్ వైద్యులు అన్ని పరీక్షలు చేసిన తర్వాత అతనికి రెట్రోపెరిటోనియల్ లైపోసోర్కోమా అనే ఒక క్యాన్సర్ గడ్డ ఉన్నట్లు నిర్ధారించారు. ఇది కడుపులో ముప్పావు భాగాన్ని ఆక్రమించేంత పెద్దగా ఉంది. ఈ అతి పెద్ద కణితి అతని ఎడమ మూత్రపిండాన్ని పక్కకు జరిపింది. అన్ని పరీక్షలు అయిన తర్వాత ఈ నెల 15న ఆయనకు మూడు గంటల పాటు శ్రమించి ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. ఈ ఆపరేషన్ ప్రక్రియలో డాక్టర్ హరచరణ్తో పాటు అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ విజయబాబు, క్యాన్సర్ ఆసుపత్రి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నరేష్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ మహేష్, డాక్టర్ అజమ్ముల్ హుసేన్, పీజీలు ఉన్నారు. అనెస్తీషియా ప్రొఫెసర్ డాక్టర్ రామశివనాయక్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అరుణలత, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ భార్గవ్రామ్ సహకరించారు. ఇంత పెద్ద పరిమాణంలో ఉన్న క్యాన్సర్ కణితిని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ ఎన్టిఆర్ వైద్యసేవ(ఆరోగ్యశ్రీ) కింద ఉచితంగా నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. -
పేదింట్లో విరిసిన విద్యాకుసుమం
కోడుమూరు రూరల్: కోడుమూరు మండలం బైన్దొడ్డి గ్రామానికి చెందిన నిరుపేద దంపతులు కురువ ఈరన్న, పద్మావతిలు ఉన్న ఊర్లో పనులు లేక హైదరాబాద్కు వలసవెళ్లి అక్కడే భవన నిర్మాణ కార్మి కులుగా పనులు చేస్తున్నారు. అయితే తాము పడుతున్న కష్టం తమ పిల్లలకు రాకూడదన్న ఉద్దేశంతో తండ్రి ఈరన్న తమ కుమార్తె ఇంద్రజను కోడుమూరు కేజీబీవీ పాఠశాలలో చదివిస్తున్నాడు. తల్లిదండ్రుల కష్టాన్ని తెలుసుకున్న విద్యార్థిని ఇంద్రజ ఇంటర్ ఫస్టియర్ బైపీసీలో 455 మార్కులకు 450 మార్కులు సాధించి సత్తా చాటింది. భవిష్యత్లో డాక్టర్ కావాలన్నదే తన కల అని, అందుకోసం కష్టించి చదువుకుంటానని విద్యార్థిని ఇంద్రజ తెలిపారు. -
అమ్మ కష్టాన్ని చూసి చదివా
మాది నిరుపేద కుటుంబం. నాన్న అన్నపురెడ్డి భాస్కర్ 16 ఏళ్ల క్రితం గుండెపోటుతో మృతి చెందారు. రోజువారి కూలీపోతేగానీ ఇల్లు గడవని పరిస్థితి. మా అక్క అనారోగ్యంతో చనిపోగా, రెండో అక్క బీటెక్ చదువుతోంది. మా పేదరికాన్ని చూసి ఆర్డీటీ వారు ఆరో తరగతి నుంచే నా చదువు బాధ్యతలు తీసుకున్నారు. మా అమ్మ అన్నపురెడ్డి సుబ్బమ్మ కష్టాన్ని చూసి బాగా చదివాను. కర్నూలు నగరంలో ఓ కాలేజీలో ఎంపీసీ గ్రూప్లో చేరి 992 మార్కులు సాధించాను. భవిష్యత్తులో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించి, కుటుంబానికి అండగా నిలుస్తాను. – అన్నపురెడ్డి మరియమ్మ, నల్లకాల్వ, ఆత్మకూరు మండలం, నంద్యాల జిల్లా మా స్వస్థలం గూడూరు. మా అమ్మ, నాన్న పైగేరి అరుణమ్మ, బి.భాస్కర్కు నేను ఏకై క కూతురుని. నాన్న పదేళ్ల క్రితం మృతి చెందారు. అప్పటి నుంచి మా అమ్మ ఎంతో కష్టపడి నన్ను చదివిస్తున్నారు. కర్నూలు నగరంలో ఓ కాలేజీలో బైపీసీలో చేరి 460 మార్కులకుగాను 452 సాధించాను. డాక్టర్ కావాలనే లక్ష్యంగా నిర్దేశించుకున్నా. – బెక్కెం సౌమ్య భారతి, ఫస్ట్ ఇయర్ విద్యార్థి -
భక్తిశ్రద్ధలతో దేవర
ఎమ్మిగనూరుసెంట్రల్: మండలంలోని సోగనూరు గ్రామంలో శ్రీమారెమ్మవ్వ, శ్రీసుంకులమ్మవ్వ దేవర మహోత్సవాలు బుధవారం భక్తిశ్రద్ధలతో జరిగాయి. దేవర సందర్భంగా ఉదయం నుంచే అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. మహిళలు కుంభాలతో అమ్మవార్ల దేవాలయానికి వెళ్లి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వివిధ గ్రామాల నుంచి బంధువులు తరలిరావడంతో గ్రామంలో సందడి నెలకొంది. వైఎస్సార్సీపీ పార్లమెంట్ సమన్వయకర్త బుట్టా రేణుక, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్మోహన్రెడ్డి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించి కానుకలు సమర్పించారు. -
వైఎస్సార్సీపీలో పలువురికి పదవులు
కర్నూలు (టౌన్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పలువురికి పదవులు దక్కాయి. ఆదోనికి చెందిన కె. షౌకత్ తబ్రేజ్ను వైఎస్సార్సీపీ రాష్ట్ర లీగల్ సెల్ అధికార ప్రతినిధిగా నియమించారు.ఆ లూరుకు చెందిన రామిరెడ్డిని పార్టీ రాష్ట్ర రైతు విభాగం సంయుక్త కార్యదర్శిగా, గుడమరెల్ల సుధాకర్ను ఆలూరు నియోజకవర్గం బూత్ కమిటీ విభాగం అధ్యక్షులుగా నియమించారు. ఆదోనికి చెందిన ఉప్పర నారాయణకు ఆదోని మున్సిపల్ విబాగం ఉపాద్యక్షులుగా నియమించారు. ఈ మేరకు బుధవారం రాత్రి పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ భూములను రిజిస్ట్రేషన్ చేస్తే కఠిన చర్యలు కర్నూలు(సెంట్రల్): ప్రభుత్వ, వక్ఫ్, ఎండోమెంట్ భూములను అనధికారికంగా రిజిస్ట్రేషన్ చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి రిజిస్ట్రేషన్ శాఖాధికారులను హెచ్చరించారు. బుధవారం ఆమె తన కార్యాలయంలో రిజిస్ట్రేషన్ శాఖాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ, వక్ఫ్, ఎండోమెంట్ భూముల రిజిస్ట్రేషన్లపై పీజీఆర్ఎస్లో ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. వాటిని త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తప్పవన్నారు. ఆదాయాభివృద్ధిలో వెనుకబడిన కోడుమూరు, కర్నూలు, కల్లూరు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సమావేశంలో జిల్లా సబ్ రిజిస్ట్రార్ బజారి, సబ్ రిజిస్ట్రార్లు పాల్గొన్నారు. జిల్లాలో గ్రామీణ ఓటర్లు 12,51,580 మంది● వార్డుల వారీగా ఓటరు జాబితా ప్రచురణ పూర్తి కర్నూలు(అర్బన్): గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని 484 గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటరు జాబితాలను ప్రచురించడం పూర్తయిందని జిల్లా పంచాయతీ అధికారి జి.భాస్కర్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని 26 మండలాలు, 484 గ్రామ పంచాయతీల్లో 5,100 వార్డులు ఉన్నాయన్నారు. అసెంబ్లీ ఓటరు జాబి తా ఆధారంగా ఎస్ఈసీ ఆదేశాల మేరకు వార్డుల వారీగా ఓటరు జాబితా పబ్లికేషన్ ప్రక్రియ పూర్తయిందన్నారు. జిల్లాలో మొత్తం గ్రామీణ ఓటర్లు 12,51,580 మంది ఉండగా, వీరిలో పురుషులు 6,21,834 మంది, మహిళా ఓటర్లు 6,29,614 మంది, ట్రాన్స్జెండర్స్ 123 మంది ఉన్నారన్నారు. అత్యధికంగా కర్నూలు మండలంలోనే పురుష ఓటర్లు 38,566 ఉండగా, మహిళా ఓటర్లు 39,001 మంది ఉన్నారన్నారు. అత్యల్పంగా గూడురు మండలంలో పురుష ఓటర్లు 9898 కాగా, మహిళా ఓటర్లు 9971 మంది ఉన్నారని డీపీఓ వెల్లడించారు. జిల్లాలోని గ్రామీణ ఓటర్ల సంఖ్యను పరిశీలిస్తే పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 7,780 మంది అధికంగా ఉన్నారు. -
డిగ్రీ పరీక్షల్లో ఆరుగురు విద్యార్థులు డిబార్
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో బుధవారం ఆరుగురు విద్యార్థులు డిబార్ అయినట్లు వర్సిటీ పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ ఎన్.నరసింహులు తెలిపారు. నాల్గో సెమిస్టర్ పరీక్షలకు 8281 మందికి 7470 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. ఎస్వీ ఆర్ట్స్ కళాశాల కేంద్రంలో ఇద్దరు, నంద్యాల నేషనల్ డిగ్రీ కళాశాల, ఎమ్మిగనూర్ రావూస్ డిగ్రీ కళాశాల, ఎస్ఎమ్ఎల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆలూరు శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల పరీక్షల్లో కేంద్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఆరుగురు విద్యార్థులు చూచిరాతలకు పాల్పడగా డిబార్ చేసినట్లు తెలిపారు. బీఈడీ 4వ సెమిస్టర్ పరీక్షలకు 3575 మందికి 3381 మంది విద్యార్థులు హాజరు కాగా 194 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. వంకలోకి దూసుకెళ్లిన లారీ పత్తికొండ రూరల్ : మండల పరిధిలోని అటికెలగుండు గ్రామ సమీపంలోని మలుపులో ఉన్న బ్రిడ్జిపై నుంచి వెళ్తున్న ఓ లారీ మంగళవారం రాత్రి అదుపు తప్పి వంకలోకి దూసుకెళ్లింది. బనగానపల్లె నుంచి ఆదోనిలోని రైస్మిల్లుకు వడ్ల లోడుతో లారీ బయల్దేరింది. దేవనబండ–ఆటికెలగుండు మలుపు దగ్గర అదుపు తప్పి వంకలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో డ్రైవర్కు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. బుధవారం హమాలీలతో వడ్లను వేరే లారీలోకి మార్చారు. సుళువాయిలో గడ్డివాములు దగ్ధం హొళగుంద: సుళువాయి గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఆరు గడ్డివాములు కాలి బూడిదయ్యాయి. దాదాపు రూ. మూడు లక్షల వరకు ఆస్తి నష్ఠం సంభవించింది. గ్రామానికి చెందిన హరిజన పెద్ద ఈరన్న, వెండికట్ట వసంతకుమార్, బసాపురం రమేశ్, చాకలి పరుశురాం అనే రైతులు వరిగడ్డిని కొని ఎస్సీ కాలనీ సమీపంలో నిల్వ చేసుకున్నారు. అయితే మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఉన్నట్టుండి గడ్డివాములకు మంటలు అంటుకుని కాలిపోయాయి. స్థానికులు ఆలూరు ఫైర్స్టేషన్కు సమాచారం అందించగా వారు వచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా అప్పటికే కాలి బూడిదయ్యాయి. కర్నూలు(సెంట్రల్): వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీంను 2026–27 ఆర్థిక సంవత్సరానికి కొనసాగిస్తూ వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జీఓ విడుదల చేసినట్లు సమాచార పౌర సంబంధాల శాఖ డెప్యూటీ డైరక్టర్ జయమ్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్రిడిటేషన్ కలిగిన జర్నలస్టులు రూ.1250 ప్రీమియం చెల్లించి పథకాన్ని రెన్యూవల్ చేసుకోవాలన్నారు. www.cfmr.ap.gov.in అనే సైట్లో లాగిన్ అయి హెడ్ అకౌంట్ 8342–00–120–01–03–001, డీడీఓ కోడు 2703 0802 003 నందు ప్రీమియం చెల్లించేలాని సూచించారు. మరిన్ని వివరాలకు కలెక్టరేట్లోని ఐ అండ్ పీఆర్ కార్యాలయాన్ని సంప్రదించాలని పేర్కొన్నారు. వ్యక్తి ఆత్మహత్య ప్యాపిలి: పట్టణంలోని స్థానిక శ్రీరామ టాకీస్ సమీపంలో నివాసం ఉంటున్న రామాంజనేయులు (29) అలియాస్ బిట్టు రెండు రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలు గు చూసింది. రామాంజనేయులు కొద్ది సంవత్సరాల క్రితం గుడిపాడుకు చెందిన మహేశ్వరిని వివాహం చేసుకున్నాడు. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. రెండో కాన్పు కోసం పుట్టింటికి వెళ్లిన మహేశ్వరి రెండు నెలల క్రితం ఆడపిల్లకు జన్మనిచ్చింది. మద్యం సేవించే అలవాటు ఉన్న రామాంజనేయులు భార్య పుట్టింటికి వెళ్లినప్పటి నుంచి మద్యానికి బానిసగా మారాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం తన రెండు చేతులను కోసుకుని అనంతరం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భర్తకు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన భార్య తన బంధువులకు విషయం చెప్పింది. బుధవారం వారు ఇంటి వద్దకు వచ్చి చూడగా లోపల గడియ పెట్టినట్లు గుర్తించి వెంటనే తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూశారు. రామాంజనేయులు మృతి చెంది ఉండటంతో బంధువులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
బాలుడి గొంతులో చిక్కుకున్న గోలి
● గోలిని తీసి ప్రాణం కాపాడిన ఆదోని వైద్యురాలు ఆదోని అర్బన్: పట్టణంలోని ఎన్జీఓ కాలనీకి ఈర న్న, ఉష దంపతుల నాలుగేళ్ల కుమారుడు హన్విత్ ఇంటి దగ్గర ఆడుకుంటూ గోలిని మింగేశాడు. అది గొంతులో చిక్కుకుని నొప్పి వస్తూ గాలి తీసుకోలేక ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితిని చూసి వెంటనే తల్లిదండ్రులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యురాలు ప్రసూన వెంటనే బాలుడి పరిస్థితిని చూసి ఎండోస్కోపీ ద్వారా 15 నిమిషాల సమయంలోనే శస్త్ర చికిత్స లేకుండా, కుట్లు, కోతలు లేకుండా గోలిని సులభంగా బయటకు తీశారు. బాలుడి తల్లిదండ్రులు వైద్యురాలికి కృతజ్ఞతలు తెలియజేశారు. -
పువ్వుల నవ్వులు.. పచ్చని నేస్తాలు..!
ప్రకృతితో మమేకమైతే జీవితంలో సంతోషం విరబూస్తుంది. గొడ్డలితో నరికినా నీడనిస్తూ, ఫలాలను అందిస్తూ చల్లని గాలితో ఆహ్లాదాన్ని పంచడం చెట్లకే చెల్లు. కర్నూలు నగర శివారు, వెంకయపల్లె ఎల్లమ్మకు వెళ్లే దారిలోని చెట్లు(గోల్డెన్ ట్రంపెట్) సరిగ్గా నెల రోజుల క్రితం ఒళ్లంతా పూలతో నవ్వులు చిందించాయి. పసుపు పచ్చని పూలు గాలికి రాలిపడుతూ ఈ ప్రాంతానికి కొత్త అందాలను తీసుకొచ్చాయి. ఇవే చెట్లు నేడు పచ్చని ఆకులతో చల్లని నేస్తాలుగా మారడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు నెల రోజుల క్రితం పువ్వులతో నిండిన చెట్లు ప్రస్తుతం ఆకుపచ్చని ఆకులతో ఆహ్లాదాన్ని పంచుతూ.. -
తల్లిదండ్రులు ప్రోత్సహించారు
సాఫ్ట్వేర్ ఇంజినీరు అవ్వడమే లక్ష్యం. ఇందుకోసం రేయింబవళ్లు కష్టపడి చదువుతున్నా. ఇంటర్ ఫస్టియర్లో 470 మార్కులకు 459 మార్కులు వచ్చాయి. రెండో సంవత్సరం మరింత బాగా చదివి మంచి మార్కులు సాధిస్తాను. జేఈఈ, ఏపీఈఏపీ సెట్లో మంచి ర్యాంకు తెచ్చుకోవాలనే లక్ష్యంగా పెట్టుకున్నాను. మా తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉంది. వారితోపాటు చదువు చెప్పిన గురువులకు కూడా నా వందనాలు. – మాదినేని లహరి, ఇంటర్ ఫస్టియర్, కర్నూలు మాది మధ్యతరగతి కుటుంబం. కర్నూలు రూరల్ మండలం రేమట గ్రామం స్వస్థలం. మా నాన్న నన్నూరి రుద్రన్న ఓ చిరుద్యోగిగా పని చేస్తూ నన్ను, మా అన్నను చదివిస్తున్నారు. బీటెక్ పూర్తి చేసి అన్న ఉద్యోగం చేస్తున్నా రు. మా నాన్న ఐఏఎస్ సాధించాలనుకున్నా...ఆర్థిక ఇబ్బందులతో ఆ వైపుగా వెళ్లలేకపోయారు. నాకు ఇంటర్ సెకండియర్ ఎంపీసీలో 989 మార్కులు వచ్చాయి. నాన్న కలను సాధించేందుకు ఐఏఎస్ లక్ష్యంగా పెట్టుకున్నాను. – నన్నూరి హాసిని, కర్నూలు రూరల్ మండలం రేమట గ్రామం -
సారథీ.. నోరు అదుపులో పెట్టుకో..
● వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి హెచ్చరికకర్నూలు(టౌన్): మంత్రి పదవి ఇవ్వలేదని పక్క పార్టీలోకి వెళ్లి ఇప్పుడు వైఎస్సార్సీపీ ఉగ్రవాదుల పార్టీ, ఐఎస్ఐ అంటూ చేసిన వ్యాఖ్యల్ని మంత్రి కొలుసు పార్థసారథి ఉపసంహరించుకోవాలని వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. సారథీ.. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు.. అని హెచ్చరించారు. కర్నూలులో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతి రాజధాని విషయంలో అన్ని సౌకర్యాలు ఉన్న ప్రాంతంలో ఏర్పాటు చేసి రూ.20 వేలకోట్లు ఖర్చుచేస్తే అద్భుతమైన రాజధానిని నిర్మించవచ్చని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రతిపాదనను అన్ని వర్గాల ప్రజలు, మేధావులు హర్షిస్తున్నారని చెప్పారు. ఇది మింగుడుపడని చంద్రబాబుకు కుట్రలకు తెరతీసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. మావిగన్ ప్రతిపాదనతో టీడీపీ మంత్రులకు మతిభ్రమించిందని ఎద్దేవా చేశారు. తమ పార్టీ ముందు నుంచి అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదని, ఆ పేరుతో జరుగుతున్న అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తోందని చెప్పా రు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు, పార్టీ కురువ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం రామక్రిష్ణ మాట్లాడుతూ హౌసింగ్ మంత్రి పార్థసారథికి రాజకీయ భిక్ష పెట్టింది జగనన్న అనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఎన్నికల సమయంలో ఇంటింటికీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్, పార్టీ బెస్త సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అనిల్కుమార్, పార్టీ నాయకులు బబ్లూ, కంటూ, పాషావలీ, పత్తాబాషా పాల్గొన్నారు. -
పనులు సర్వేశ్వరుడికెరుక!
ఇంజినీర్ల కొరత.. శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం వార్షిక బడ్జెట్ సుమారు రూ.300 కోట్లు ఉంటుంది. అందులో ఇంజినీరింగ్ విభాగానికి బడ్జెట్ అగ్రభాగం. భక్తుల సౌకర్యార్థం క్షేత్రంలో ఏటా సుమారు రూ.వంద కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటాయి. అయితే ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఇంజినీరింగ్ విభాగంలో కొంత మందిదే హవా జరుగుతున్నట్లు సమాచారం. అభివృద్ధి పనుల పర్యవేక్షణకు ఇంజినీర్ల కొరత స్పష్టంగా కనపడుతుంది. రాష్ట్రంలో అతి పెద్ద పుణ్యక్షేత్రాల్లో శ్రీశైల మహాక్షేత్రం రెండవది. శ్రీశైల దేవస్థానంలో ఇంజినీరింగ్ విభాగంలో సూపరింటెండింగ్ ఇంజినీర్ స్థాయి అధికారి ఉండాలి. గతంలో ఎస్ఈ పోస్టు మంజూరైనప్పటికీ దేవస్థాన ఈఓతో సమానమైన హోదా ఉంటుందని గతంలో పనిచేసిన ఈవోలు ఆ పోస్టును తొలగించారు. ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్లు ఇద్దరు ఉండాలి. వీరికి బీటెక్ అర్హత ఉండాలి. అలాగే సివిల్–2, ఎలక్ట్రికల్–1, వాటర్ సప్లై–1 ఇలా నలుగురు డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్లు ఉండాలి. అలాగే హెడ్ డ్రాఫ్ట్స్మెన్–1, డ్రాఫ్ట్మెన్–2 ఉండాలి. అలాగే ఒక్కో డీఈఈ కింద ఐదుగురు సహాయ ఇంజినీర్లు ఉండాలి. ఒక్కో ఏఈకి ఒక వర్క్ ఇన్స్పెక్టర్ ఉండాలి. అంతేకాకుండా ఎలక్ట్రిషియన్లు, ఫ్లంబర్స్, ఫ్టిర్, పంప్ ఆపరేటర్, సూపర్వైజర్స్, మేషన్ (మేస్త్రి), కార్పెంటర్, వెల్డర్, పెయింటర్, హెల్పర్స్ ఉండాలి. ప్రస్తుతం శ్రీశైల దేవస్థానంలో ఎస్ఈ పోస్టు లేదు. అలాగే ఇద్దరు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లులో ఒకరికి మాత్రమే బీటెక్ అర్హత ఉంది. మరొక ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్కు డిప్లొమా అర్హత ఉంది. నలుగురు డీఈఈలకు గాను ఎవరూ లేరు. 20 మంది ఏఈలకు గాను నలుగురు రెగ్యులర్, మరి కొంత మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్నారు. డ్రాఫ్ట్మెన్ ఒకరు మాత్రమే ఉన్నారు. ఒకే ఒక్క డ్రాఫ్ట్మెన్.. ఇంజినీరింగ్ విభాగంలో అత్యంత కీలకమైన పోస్టు డ్రాఫ్ట్మెన్. క్షేత్రంలో హెడ్ డ్రాఫ్ట్మెన్ ఒకరు, ఇద్దరు డ్రాఫ్ట్మెన్ ఉండాలి. అయితే ప్రస్తుతం ఒక్క డ్రాఫ్ట్మెన్ మాత్రమే ఉన్నారు. టెండర్ ప్రతిపాదనలను పరిశీలించడం, తనిఖీ చేయడం, రేట్ కోడింగ్ తనిఖీ, టెక్నికల్, అడ్మినిస్ట్రేషన్ అనుమతులు తీసుకోవడం, బిడ్ డాక్యుమెంట్ సిద్ధం చేయడం, పేపర్ నోటిఫికేషన్ ద్వారా ఈ–ప్రొక్యూర్మెంట్లో టెండర్లు పిలవడం, టెక్నికల్ ఎవాల్యువేషన్, కండీషన్లు ప్రకారం కాంట్రాక్టర్లు దరఖాస్తు చేశారా.. లేదా? తదితర ముఖ్యమైన విధులు డ్రాఫ్ట్మెన్ నిర్వహిస్తారు. ఈయనపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలు పాటించకుండా అక్రమాలకు పాల్పడుతుంటారని పలువురు కాంట్రాక్టర్లు సైతం ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా దేవదాయ శాఖ అధికారులు శ్రీశైల దేవస్థానంలోని ఇంజినీరింగ్ విభాగంపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. అర్హత కలిగిన ఇంజినీర్లను నియమించి, అభివృద్ధి పనులు పూర్తి నాణ్యతతో నిర్మించేలా పర్యవేక్షణ చేసేందుకు అవరమైన పూర్తిస్థాయి ఇంజినీర్లను నియమించాలని పలువురు భక్తులు కోరుతున్నారు. పెద్దల ఆశీస్సులు ఆయనకే.. శ్రీశైల దేవస్థానంలో ఇద్దరు ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్లు ఉంటే ఒకరికి బీటెక్ క్వాలిఫికేషన్ ఉండగా మరొకరికి డిప్లొమా క్వాలిఫికేషన్ ఉంది. రాజకీయ పార్టీల నాయకుల ఒత్తిడితో బీటెక్ ఇంజినీర్కు ట్రాన్స్పోర్టు విభాగం తప్ప ఎటువంటి పనులు కేటాయించ లేదు. డిప్లొమా క్వాలిఫికేషన్ ఉన్న అతనికి కూటమి పెద్దల ఆశీస్సులు పుష్కలంగా ఉండడంతో ఆయనకు సివిల్ పనులు, వాటర్ విభాగం, ఎలక్రిక్టకల్ పనులు, సైట్ అలాట్మెంట్లు, మెటీరియల్ పరిమిషన్లు..ఇంకా అన్ని పనులు అప్పగించారు. ఆ సింహానికే అన్ని పనులు అంటూ స్థానికంగా పెద్ద చర్చ జరుగుతోంది. అలాగే ఇద్దరు ఏఈలకు డీఈఈగా ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఒకరికి సివిల్ (డిప్లమో మెకానికల్ అర్హత, ఆ తరువాత దూర విద్య ద్వారా డిప్లొమా సివిల్ చేశాడని సమాచారం), ఐటీఐ ఎలక్ట్రిషియన్ అర్హత ఉన్న మరొకరికి ఎలక్ట్రికల్ డీఈఈగా ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. క్షేత్రంలో జరుగుతున్న ఎలక్ట్రికల్, వాటర్ సప్లై పనులు ఈయనే పర్యవేక్షిస్తుంటాడు. అయితే ఎటువంటి అర్హతలు లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
కర్నూలులో ఘోర ప్రమాదం.. 8 మంది దుర్మరణం
సాక్షి, కర్నూలు: జిల్లాలో గురువారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ వాహనం- రెడీమిక్స్ లారీ ఢీ కొట్టి ఎనిమిది మంది మృతి చెందారు. మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మంత్రాలయం మండలం చిలకలడోన సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం ధాటికి బొలెరో వాహనం నుజ్జునుజ్జు అయ్యింది. మరోవైపు లారీ కూడా ఓ పక్కకు ఒరిగి పడిపోయింది. ఘటనాస్థలంలోనే ఐదుగురు మృతిచెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు చనిపోయారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, మూడేళ్ల చిన్నారి, వాహన డ్రైవర్తో సహా మరో వ్యక్తి. గాయపడినవాళ్లలో మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల పేర్లు.. కుమార్ (60), దీపిక వీణ (35), సునీల్ (40), బెల్లి (3), పుట్టమ్మ (60), మీనాక్షి (50), తాయమ్మ (60), లోలాక్షి. కర్ణాటక చిక్మంగళూరు వాసులుగా గుర్తించారు. మంత్రాలయ శ్రీరాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్తుండగా ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాద సమయంలో బొలెరోలో 16 మంది ఉన్నారు. మృతదేహాలను ఎమ్మిగనూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. -
అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు సాగుదాం
కర్నూలు(అర్బన్): ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయుడు భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి టీజీ భరత్గుప్తా అన్నారు. విశ్వ మేధావి అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా స్థానిక పాత బస్టాండ్ సమీపంలోని ఆయన విగ్రహానికి మంత్రితో పాటు కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ఖమర్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం అక్కడే జయంతి సభ నిర్వహించారు. సాంఘీక సంక్షేమ సాధికారత అధికారిణి బీ రాధిక అధ్యక్షతన నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ అంబేద్కర్ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అలుపెరుగని పోరాటం చేశారన్నారు. అందరికీ సమాన హక్కులు, రాజ్యాంగ ఫలాలు దక్కాలని కృషి చేశారన్నారు. డీవీఎంసీ సభ్యుల నిరస ఇదిలాఉంటే వేదికపై సీట్ల కేటాయింపులో అన్యాయం జరుగుతోందని, కేవలం తమను వేదిక మీదకు ఆహ్వానిస్తున్నారే తప్ప కూర్చునేందుకు సీట్లు ఉండటం లేదని డీవీఎంసీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అధికారులతో వాగ్వాదానికి దిగారు. డీవీఎంసీ సభ్యులు మాలతీ, సురేష్గౌడ్, సురేంద్ర, యోగేష్నాయక్ తదితరులు వేదిక కింద కూర్చొని నిరసన తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్, మాజీ మంత్రి మారెప్ప, మాజీ మేయర్ బంగి అనంతయ్య, గోన నాగరాజు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు నాగమణి, పోతురాజు రవికుమార్, వివిధ సంఘాల నాయకులు రెడ్డిపోగు రాజ్కుమార్, సోమసుందరం, కాసారపు వెంకటేశ్వర్లు, రాగిరి చంద్రప్ప, కై లాస్నాయక్ పాల్గొన్నారు. -
గుక్కెడు నీరివ్వలేని చంద్రబాబు ప్రభుత్వం
● దోచుకో.. దాచుకో అన్న ధ్యాస తప్ప, అభివృద్ధి లేదు ● ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఆలూరు రూరల్: తీవ్రమైన ఎండలతో మంచినీరు దొరకక, గొంతులు ఎండి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, గుక్కెడు నీరు ఇవ్వలేని దుస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు. ఆలూరులోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు లోకేష్ , పవన్కు ‘దోచుకో.. దాచుకో’ అన్న ధ్యాస తప్ప, అభివృద్ధి చేయడం తెలియదన్నారు. ఆలూరులో 20 రోజులకు ఒక సారైనా తాగునీరు రావడం లేదన్నారు. ఆస్పరి, చిప్పగిరి, ఆలూరు మండలంలోని మొలగవల్లి, కురుకుంద, హులేబీడు, పెద్దహోతూరు, తుంబళబీడు గ్రామాల్లో నెల తరబడి మంచినీరు సరఫరా లేకపోవడంతో ప్రజలు పంచాయతీ కార్యాలయాలకు తాళం వేశారన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఈఈ వచ్చి ఏదైనా చేస్తామని చెప్పి వెవెళ్లారన్నారు. గత పదేళ్లుగా కురుకుంద గ్రామస్తులు ఎద్దుల బండ్లు, ట్రాక్టర్లతో పక్కనే ఉన్న హెబ్బటం గ్రామానికి వెళ్లి తాగునీరు తెచ్చుకుంటున్నారన్నారు. ప్రభుత్వంలో కనీసం చలనం లేదు తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఆలూరు నియోజకవర్గంలో యాభై ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన తాగునీటి పైపు లైన్లు మార్చాలని గత జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాకు ఎస్టిమేట్ వేసి వినతిపత్రం ఇచ్చారన్నారు. అలాగే బాపురం, చింతకుంట రిజర్వార్ల సామర్థ్యం పెంచాలని కోరానన్నారు. డీఆర్సీ మీటింగ్లో కూడా చాలా సార్లు తాగునీటి సమస్యపై ప్రస్తావించినా చంద్రబాబు ప్రభుత్వానికి కనీసం చలనం లేదన్నారు. ఇటీవలే తాగునీటి సమస్య తీర్చాలని జిల్లా కలెక్టర్ సిరికి విన్నవించామన్నారు. ఆలూరు నియోజవర్గంలో తాగునీరు, రోడ్ల సమస్యలపై ఓర్వకల్లుకు వచ్చిన ప్రధాన మంత్రి మోదీని కలిసి విన్నవించినా ప్రయోజనం లేకపోయిందన్నారు. ఆలూరు చెరువు నిరుపయోగంగా ఉందని, ఎస్ఎస్ ట్యాంక్గా మార్చాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే చెరువు కబ్జాకు గురైందన్నారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కల్యాణ్కు గ్రామాల్లో తాగునీరు, రోడ్ల సమస్యలు కనిపించడం లేదన్నారు. ప్రచార ఆర్భాటాలకే పరిమితంగ్రామాల్లో తాగునీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే టీడీపీ ఆలూరు నియోజకవర్గ ఇంచార్జ్ సోషల్ మీడియాలో ప్రచార ఆర్భాటాలకే పరిమితమయ్యారని ఎమ్మెల్యే విరూపాక్షి విమర్శించారు. గ్రామాల్లో ప్రజలను రెచ్చగొట్టి తిరగడం కాదని, తాగునీరు, రోడ్లు సమస్య తీర్చాలన్నారు. గ్రామాల అభివృద్ధికి సహకరించాలన్నారు. ఇన్చార్జ్ పదవి పోతే వారు ఇక్కడ ఉండబోరన్నారు. మంచినీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నా.. పక్కనే ఎల్ఎల్సీ పారుతున్నా.. ఎస్ఎస్ ట్యాంకులు సామర్థ్యం పెంచుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆస్పరి మండలంలోని జొహరాపురం వద్ద ఎస్ఎస్ ట్యాంక్ ఏర్పాటు చేయాలని అప్పటి కలెక్టర్ సృజన ద్వారా ప్రతిపాదనలు పంపిస్తే.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక దాన్ని విస్మరించిందన్నారు. నగరడోణ రిజర్వార్కు బిల్లు చెల్లిస్తే రెండు మండలాలు సస్యశామలం అవుతాయన్నారు. -
అణగారిన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్
కర్నూలు(అర్బన్): అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అన్నారు. మంగళవారం అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా స్థానిక పాతబస్టాండ్ కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి మాజీ మంత్రి బుగ్గనతో పాటు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి, మాజీ మేయర్ బీవై రామయ్య తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ మేధావి అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఆదర్శంగా నిలుస్తోందన్నారు. సమ సమాజం, సమానత్వం కోసం ఆయన అనేక రూపాల్లో పరితపించి ఆచరణలో పెట్టారన్నారు. ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నగర అధ్యక్షులు అహ్మద్ ఆలీఖాన్, మాజీ డీవీఎంసీ సభ్యులు గద్ద రాజశేఖర్, నాయకులు గోల్డ్మెన్ శ్రీనివాసులు, కటారి సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఉగ్ర భానుడు
● కోడుమూరు, సంజామల మండలాల్లో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి జిల్లాపై బానుడు విరుచుకుపడుతున్నాడు. మంగళవారం ఉష్ణోగ్రతలు, వడగాలుల తీవ్రత మరింత పెరిగింది. కర్నూలు జిల్లా కోడుమూరులో 44.2, నంద్యాల జిల్లా సంజామలలో 44.2 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇవే అత్యధిక ఉష్ణోగ్రతలు కావడం గమనార్హం. ఏప్రిల్ మొదటి పక్షంలోనే ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటితే.. మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన నెలకొంది. అత్యధిక మండలాల్లో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు, వడగాలుల తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉందని, వడదెబ్బకు గురికాకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ విభాగం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ సురేష్కుమార్ తెలిపారు. -
టీడీపీని వీడి వైఎస్సార్సీపీలోకి
గడివేముల: మండల పరిధిలోని ఒండుట్ల గ్రామానికి చెందిన ఐదు కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాయి. వీరికి వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. గ్రామ వైఎస్సార్సీపీ నాయకుడు గంజర్ల రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం కాటసాని ఇంటి వద్దకు చేరుకుని పార్టీలో చేరారు. పార్టీలో చేరినవారిలో సత్యనారాయణ, మద్దిలేటి, గోరంట్ల, మారెళ్ల కిట్టు, నాగేష్ తదితర కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ.. టీడీపీ నాయకులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇంత వరకు అమలు చేయలేదన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధిస్తుందన్నారు. పార్టీలో చేరిన వారి భవిష్యత్తులో సముచిత న్యాయం చేస్తామన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కాలు నాయక్, వైఎస్సార్సీపీ నాయకులు అనిల్ కుమార్ రెడ్డి, గని రామలింగేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మూడు దశల్లో డ్రోన్ పరిశ్రమ పూర్తి
● పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ఓర్వకల్లు: చింతలపల్లె గ్రామం వద్ద నెలకొల్పనున్న డ్రోన్ పరిశ్రమ మూడు దశల్లో పూర్తవుతుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ తెలిపారు. చింతలపల్లె, పాలకొలను గ్రామాల వద్ద ఏపీఐఐసీ వారు సేకరించిన భూములను మంగళవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరితో కలసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చింతలపల్లె గ్రామం వద్ద దాదాపు 300 ఎకరాలలో నెలకొల్పనున్న డ్రోన్ పరిశ్రమను మొదట 150 ఎకరాలల్లో అభివృద్ధి చేయాలన్నారు. అనంతరం 100 ఎకరాల్లో, పిదప 50 ఎకరాలో పరిశ్రమను పూర్తి చేయాలని తెలిపారు. అంతకు ముందు ముచ్చుమర్రి గ్రామం వద్ద ఓర్వకల్లు జైరాజ్ ఇస్పాత్ ఉక్కు పరిశ్రమకు నీటి సరఫరా చేసే పైపులైన్ నిర్మాణ పణుల పురోగతి గూర్చి సంబంధిత ఇంజినీర్లతో చర్చించారు. కార్యక్రమంలో ఆర్డిఓ సందీప్కుమార్, తహసీల్దార్ విద్యాసాగర్ పాల్గొన్నారు. అగ్ని ప్రమాదమా.. డయల్ 101 కర్నూలు: అగ్నిప్రమాదం జరిగిన వెంటనే డయల్ 101కి ఫోన్ చేసి సమాచారం అందించాలని అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి ఎన్.అవినాష్ జయసింహ తెలిపారు. అగ్నిమాపక శాఖ వారోత్సవాలు కర్నూలు నగరం ఫైర్స్టేషన్ ఆవరణలో మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈనెల 20వ తేదీ వరకు వివిధ రూపాల్లో అగ్నిప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కార్యక్రమానికి డీటీసీ శాంతకుమారి, అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి అవినాష్ జయసింహ, స్టేట్ ట్రైనింగ్ సెంటర్ జిల్లా అగ్నిమాపక అధికారి బాలరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అగ్నిప్రమాదాల పట్ల అవగాహనకు అగ్నిమాపక శాఖ ముద్రించిన కరపత్రాలను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఫైర్ స్టేషన్ సిబ్బందితో పాటు ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ విద్యార్థినులు పాల్గొన్నారు. వైభవంగా వసంతోత్సవాలు ఆళ్లగడ్డ: చైత్ర కృష్ణఏకాదశి నుంచి మూడు రోజులపాటు శ్రీ అహోబిల లక్ష్మీనరసింహ స్వామి వసంతోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా రెండో రోజైన మంగళవారం ఉదయం దిగువ అహోబిలంలో ప్రత్యేక పూజలు చేశారు. వసంత మంటపంలో ఉభయ దేవేరులతో కొలువైన శ్రీ ప్రహ్లాదవరదులకు నవకలశాలతో, పంచామృతాలతో అభిషేకించారు. అనంతరం 108 కలశాలతో తిరుమంజనం సేవ నిర్వహించారు. కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ పరీక్షల ఫలితాలను నేడు(బుధవారం) విడుదల చేయనున్నారు. పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి గత నెల 24వ తేది వరకు నిర్వహించారు. జిల్లాలో మొదటి సంవత్సరం విద్యార్థులు 26,473 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 22,491 మంది హాజరయ్యారు. గత నెల 2వ తేది నుంచే కర్నూలు నగరంలోని టౌన్ మోడల్ జూనియర్ కాలేజీలో స్పాట్ క్యాంపును ఏర్పాటు చేశారు. ప్రధాన సబ్జెక్టుల మూల్యాంకనం గత 21వ తేదిన మొదలై.. ఈ నెల 9వ తేది వరకు కొనసాగింది. జిల్లాకు ఫస్ట్ ఇయర్, ద్వితీయ సంవత్సరానికి చెందిన సమధాన పత్రాలు మొత్తం 2,41,217 వచ్చాయి. పరీక్షల ఫలితాలు ఉదయం 10.31 గంటలకు విడుదల చేయ నున్నారు. ఫలితాల కోసం https:// resultsbie.ap.gov.in అనే వెబ్సైట్లో చూసుకోవచ్చు. 95523 00009 అనే నెంబరుకు Hi అని పెడితే ఫలితాలు తెలుసుకునే వీలుంది. -
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ క్షిప్రా మృతి
బెంగళూరు: రోడ్డు ప్రమాదంలో యువ టెక్కీ దుర్మరణం చెందిన ఘటన ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో జరిగింది. దక్షిణ కన్నడ జిల్లా సుళ్యకు చెందిన టెక్కీ క్షిప్రా (27) మృతి చెందింది. మంగళూరుకు చెందిన శశి కళాభట్కు ఏకైక కూతురు క్షిప్రా. బెంగళూరులో ప్రైవేట్ కంపెనీలో టెక్కీగా పని చేస్తోంది. రాయచూరు జిల్లాలో స్నేహితురాలి పెళ్లి ఉండడంతో సహ ఉద్యోగులతో కలిసి ఆనందంగా కారులో కర్నూలు పర్యటనకు వెళ్లారు. ఆదోని పట్టణం వద్ద కారు డ్రైవర్కు నిద్ర మత్తు వచ్చి చెట్టును ఢీన్నాడు. ఈ ప్రమాదంలో క్షిప్రాకు బలమైన గాయాలై అక్కడే చనిపోయింది. మరో యువకుడు, ఇద్దరు యువతులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానిక ఆస్పత్రిలో చేర్చి చికిత్సలు అందిస్తున్నారు. క్షిప్రా ఎంటెక్ చేసింది, కొన్నేళ్ల కిందట తండ్రి చనిపోగా, ఆమెను తల్లి కంటికి రెప్పలా చూసుకుంటోంది. తల్లీ కూతురు బెంగళూరులోనే నివసిస్తున్నారు. ఇంతలో ఏకైక ఆధారంగా ఉన్న కూతురు కూడా మరణించడంతో తల్లి శోకసంద్రంలో మునిగిపోయింది. బంధువులు మృతదేహాన్ని సొంతూరికి తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తిచేశారు. -
అమరావతి అవినీతి చూసి దేవుళ్లు కూడా భయపడతారు
సాక్షి, కర్నూలు: అమరావతి గురించి పదే పదే మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల గురించి ఏనాడైనా మాట్లాడారా? అని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రశ్నించారు. కేవలం అమరావతి డిజైన్ల పేరిట వందల కోట్ల అవినీతి జరుగుతోందని అంటున్నారాయన. మంగళవారం కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడారు. మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం వద్ద రూ.5 వేల కోట్లు కూడా లేవా?. ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించడానికి జీతాలకు డబ్బులు లేవని మీరే(చంద్రబాబును ఉద్దేశించి..) అంటారు. అమరావతిలో మాత్రం లక్షల కోట్లు పెట్టాలంటారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అమరావతిలోనే నిర్మాణ ఖర్చులు ఎక్కువ. కేవలం డిజైన్ల పేరుతోనే రూ.400 కోట్ల అవినీతి జరుగుతోంది. అమరావతి గురించి చంద్రబాబు పదే పదే మాట్లాడుతున్నారు. మరి రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల గురించి ఏనాడైనా మాట్లాడారా?. కనీసం ఆలోచన అయినా చేశారా?. అమరావతికి లక్షల కోట్లు అవసరమైతే.. మావిగన్కు కేవలం రూ. 10-20 వేల కోట్లు చాలు. అమరావతి పనుల్లో అంతులేని అవినీతి జరుగుతోంది. రైతులకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. జరుగుతున్న అవినీతి చూసి దేవుళ్లు కూడా భయపడతారు’’ అని బుగ్గన అన్నారు. టీడీపీ, జనసేన ప్రధాన కార్యాలయాలు ఉండేది నేషనల్ హైవే పక్కనే కదా!. శ్రీబాగ్ ఒడంబడికి అంటే టీడీపీ నేతలకు తెలుసా?. పెద్ద మనుషుల ఒప్పందం అంటే చంద్రబాబుకి తెలుసా?. రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు అనేవి ఉంటాయి. కనీసం చంద్రబాబుకి వాటి గురించైనా తెలుసా?. మావిగన్, వికేంద్రీకరణ అంటే చంద్రబాబుకి ఎందుకు కోపం?. కేంద్రం 2014 ఏప్రిల్ 25న శివరామకృష్ణన్ కమిటీ వేసింది. ఇప్పుడు ఉన్న అమరావతి ప్రాంతం రాజధానికి పనికి రాదని ఆ కమిటీ చెప్పింది కదా’’ అని బుగ్గన గుర్తు చేశారు. -
వైభవోపేతం.. వసంతోత్సవం
ఆళ్లగడ్డ: మహా పుణ్యక్షేత్రం అహోబిలం సన్నిధిలో వసంతోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. వసంత రుతువులో శ్రీ లక్ష్మీనరసింహస్వామికి జరిగే ఈ ఉత్సవానికి వసంతోత్సవం అని పేరు. ఎండ వేడి నుంచి స్వామివారు ఉపశమనం పొందేందుకు జరిపే ఈ ఉత్సవం కావడంతో ఉపశమనోత్సవం అని కూడా అంటారు. ఈ ఉత్సవంలో సుగంధాన్ని వెదజల్లే పుష్పాలతో పాటు పలురకాల మధురఫలాలను స్వామికి నివేదిస్తారు. ఈ వేడుకల కోసం దేవాలయం ఎదురుగా ఆకర్షణీయంగా నల్లమల అడవిని తలపించేలా మండపాన్ని తీర్చిదిద్దారు. వసంతోత్సవంలో భాగంగా ఉదయం నిత్య పూజలు అనంతరం యాగశాలకు చేరుకున్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వాములను కొలువుంచి ఆస్థాన విద్వాంసుల మంగళ వాయిద్యాలు, అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య తిరుమంజనం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు -
తపాలా శాఖలో పార్సిల్ బుకింగ్ కౌంటర్లు
కర్నూలు(అర్బన్): తపాలా శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంతో పాటు దేశ విదేశాలకు తక్కువ ఖర్చుతో పార్సిల్ పంపించే సౌకర్యాన్ని కల్పించినట్లు కర్నూలు డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ జి.జనార్దన్రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక హెడ్ పోస్టాఫీసులో నూతన పార్సిల్ బుకింగ్ కౌంటర్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్నూలు డివిజన్ పరిధిలోని కర్నూలు ప్రధాన తపాల కార్యాలయం, ఆదోని, కర్నూలు బీ క్యాంప్, ఎమ్మిగనూరు, డోన్ తపాలా కార్యాలయాల్లో పార్సిల్ బుకింగ్ కోసం ప్రత్యేక కౌంటర్లను ప్రారంభించామన్నారు. ప్రైవేటు పార్సిల్ సంస్థల కంటే తక్కువ మొత్తం చార్జీలతో పోస్టల్ శాఖలో ఈ సౌకర్యాన్ని పొందవచ్చన్నారు. నేడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి కర్నూలు(అర్బన్): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలను ఈ నెల 14న నిర్వహించనున్నట్లు సాంఘిక సంక్షేమ సాధికారత అధికారిణి బి.రాధిక సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక పాత బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి ఉదయం 9.30 గంటలకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పూలమాలలు వేసి నివాళి అర్పిస్తారన్నారు. అనంతరం అక్కడే జయంతి సభ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమానికి జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల డైరెక్టర్లు, డీవీఎంసీ సభ్యులు, ఆయా కుల సంఘాల నాయకులు, ప్రతి ఒక్కరూ హాజరు కావాలని ఆమె కోరారు. 21న ఎమ్మిగనూరులో జాబ్మేళా కర్నూలు(సెంట్రల్): 11 ప్రైవేట్ కంపెనీల్లోని 650 ఖాళీల భర్తీకి ఈనెల 21న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో జాబ్మేళాకు సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. పది, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, పీజీ, బీటెక్ చదివిన 18 నుంచి 35 సంవత్సరాల్లోపు యువతీ, యువకులు ఆర్హులన్నారు. ఆసక్తి ఉన్న వారు naipunyam.a p.gov.in అనే వెబ్సైట్లో పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధి అధికారిణి దీప్తి పాల్గొన్నారు. పీజీఆర్ఎస్ అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలి కర్నూలు(సెంట్రల్): పీజీఆర్ఎస్ అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆమె ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అర్జీలను సంతృప్త స్థాయిలో పరిష్కరించేందుకు నోడల్ అధికారులను నియమిస్తున్నట్లు చెప్పారు. ప్రీ ఆడిటింగ్ బృందాల ద్వారా అర్జీల పరిష్కారంలో నాణ్యతను పెంచాలని సూచించారు. అర్జీదారుడితో నేరుగా మాట్లాడి సరైన ఎండార్స్మెంట్ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి డీఆర్వో చిరంజీవి, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ అనురాధ, డీఆర్డీఏ పీడీ రమణారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హెచ్ఈఈవోలకు పదోన్నతులు కర్నూలు(హాస్పిటల్): రాష్ట్రంలో పనిచేస్తున్న పలువురు హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్(హెచ్ఈఈఓ)లకు డిస్ట్రిక్ట్ మాస్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్(డెమో)గా పదోన్నతులు లభించాయి. వీరిలో ఇద్దరు పదోన్నతిపై కర్నూలుకు బదిలీ అయ్యారు. కర్నూలులోని రీజనల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ట్రైనింగ్ సెంటర్(ఎం)లో పనిచేస్తున్న కె.ధర్మేంద్ర పక్కనే ఉన్న ఫిమేల్ ట్రైనింగ్ సెంటర్కు, కాకినాడలోని పీఓడీటీ కార్యాలయంలో పనిచేస్తున్న జి.నరేంద్రశేషును కర్నూలులోని మేల్ ట్రైనింగ్ సెంటర్కు బదిలీ చేశారు. -
గ్రామంలోకి భారీ వాహనం
● ఒక ట్రాన్స్ఫార్మర్, 10 విద్యుత్ స్తంభాలు నేలమట్టం పత్తికొండ రూరల్: గాలిమరలకు సంబంధించిన భారీ వాహనం హోసూరు గ్రామంలోకి రావడం, విద్యుత్ తీగలను బలంగా లాగడంతో ఒక విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, 10విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. మొలగవల్లి రోడ్డు సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్తో పాటుగా దీనికి అనుసంధానంగా వరుసగా ఉండే విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ అధికారులు ఉదయం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఊరిబయట జరిగిన ఘటనలో ప్రాణనష్టం సంభవించలేదు. పెద్ద ప్రమాదం తప్పడంతో గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు. -
ఎస్పీ పీజీఆర్ఎస్కు 112 ఫిర్యాదులు
కర్నూలు: కర్నూలు రెండో పట్టణ పోలీస్స్టేషన్ పక్కనున్న క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించి నేరుగా వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పీజీఆర్ఎస్కు మొత్తం 112 ఫిర్యాదులు వచ్చాయి. ప్రధానంగా క్రెడిట్ కార్డు మోసం, ఉద్యోగాల పేరుతో మోసం, ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలు, ఆస్తులు రాయించుకుని పిల్లలు తమ పోషణ పట్టించుకోవడం లేదని వృద్ధులు ఎస్పీకి విన్నవించుకున్నారు. వాటన్నింటిపై చట్ట పరిధిలో విచారణ జరిపి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, సీఐలు శివశంకర్, రామయ్య నాయుడు, శ్రీనివాస్ నాయక్ తదితరులు పీజీఆర్ఎస్లో పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. -
సీమజోన్లో 25 మంది సీఐల బదిలీ
● ఉమ్మడి జిల్లాలో 15 మందికి స్థానచలనం ● వీఆర్లో ఉన్న ఇద్దరికి పోస్టింగులు బదిలీ అయిన సీఐలు కర్నూలు: రాయలసీమ జోన్ కర్నూలు, అనంతపురం రేంజ్ల పరిధిలో వివిధ సర్కిళ్లలో పనిచేస్తున్న 25 మంది సీఐలపై బదిలీ వేటు పడింది. ఈ మేరకు ఆదివారం రాత్రి కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో 15 మంది సీఐలకు స్థానచలనం కలిగింది. ఇందులో ఒకరు సత్యసాయి, మరొకరు వైఎస్సార్ జిల్లా నుంచి బదిలీపై కర్నూలు జిల్లాకు వచ్చారు. అలాగే అనంతపురం రేంజ్లో వీఆర్లో ఉన్న ఒకరికి చెన్నూరు యూపీఎస్, కర్నూలు రేంజ్ పరిధిలో ఉన్న మరొకరిని మంత్రాలయం పీఎస్కు నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కర్నూలు రేంజ్లో వీఆర్లో ఉన్న మరో ఇద్దరు అనంతపురం రేంజ్కి బదిలీ అయ్యారు. పేరు ప్రస్తుత సర్కిల్ బదిలీ అయిన సర్కిల్ జి.వి.నాగరాజరావు కర్నూలు టూటౌన్ ఆళ్లగడ్డ యూపీఎస్ ఎం.శ్రీధర్ ఫ్యాక్షన్ జోన్, కర్నూలు కర్నూలు టూటౌన్ ఎం.యుగంధర్ ఆళ్లగడ్డ యూపీఎస్ కౌతాళం యూపీఎస్ ఎన్.అశోక్ కుమార్ కౌతాళం యూపీఎస్ నందికొట్కూరు వై.ప్రవీణ్ కుమార్ రెడ్డి నందికొట్కూరు సోషల్ మీడియా అండ్ సైబర్ క్రైం సెల్, కర్నూలు డి.మస్తాన్ వలి సోషల్ మీడియా అండ్ సీసీఎస్–2, సైబర్ క్రైం సెల్, కర్నూలు కర్నూలు కె.శ్రీనివాస నాయక్ సీసీఎస్–2, కర్నూలు ఆస్పరి, కర్నూలు దస్తగిరి బాబు వీఆర్, కర్నూలు మంత్రాలయం పి.రామాంజులు మంత్రాలయం పులివెందుల ట్రాఫిక్ వి.సీతారామిరెడ్డి పులివెందుల రూరల్ డీటీసీ, నంద్యాల డి.హాజీవలి డీటీసీ, నంద్యాల సీసీఎస్,వైఎస్సార్ కడప జి.మారుతి శంకర్ కొత్తచెరువు, సత్యసాయి జిల్లా కర్నూలు వన్టౌన్ ఎం.పార్థసారధి కర్నూలు వన్టౌన్ ఫ్యాక్షన్జోన్, కర్నూలు ఎ.గంగాధర్ వీఆర్, కర్నూలు వీఆర్, అనంతపురం కె.ఉలసయ్య వీఆర్, కర్నూలు వీఆర్, అనంతపురం -
ఊరు నీరడుగుతోంది
ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇచ్చి నీరందిస్తామని సర్కారు ప్రకటించడం తప్ప ఆచరణలో చూపించడం లేదు. దీంతో వేసవి కాలం ప్రారంభంలోనే పల్లెల్లో తాగునీటి సమస్య తలెత్తింది. పలు గ్రామాల్లో ప్రజలు తమ దాహం తీర్చాలంటూ రోడ్డెక్కుతున్నారు. సంజామల మండలం ఆకుమల్ల గ్రామంలో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఈ గ్రామంలోని చల్లా కాలనీలో ప్రధాన తాగునీటి పైపు లైన్ వెళ్తుంది. అయితే, అక్కడ నివసించే 50 కుటుంబాలు తాగునీటి కోసం అవస్థలు పడుతున్నాయి. రెండేళ్ల క్రితం వైఎస్సార్సీపీ ప్రభుత్వం మారి కూటమి సర్కారు రావడంతో కుళాయి కనెక్షన్ల ఏర్పాటు అంశం అటకెక్కింది. రెండేళ్లుగా ఈ ప్రాంత వాసులు కనిపించిన అధికారులను, పాలకులను కలిసి పనులు వదులుకొని సుదూరం వెళ్లి నీళ్లు తెచ్చుకోవాలంటే కష్టంగా ఉందని, తమ ఇళ్ల ముందే పైపులైన్ వెళ్తుందని కుళాయి కనెక్షన్లు ఇచ్చి సమస్య తీర్చాలని వేడుకుంటున్నారు. అయినా, వారి నుంచి ఎలాంటి స్పందన లేదని చల్లా కాలనీవాసులు వాపోతున్నారు. – సంజామల -
చేపల వేటకు వెళ్లి జాలరి మృతి
కోవెలకుంట్ల: పట్టణ శివారులోని వెలగటూరు రస్తాలో జుర్రేరు వాగుకు చేపల వేటకు వెళ్లిన జాలరి మృతి చెందాడు. కోవెలకుంట్ల పోలీసులు అందించిన సమాచారం మేరకు.. పట్టణానికి చెందిన బాలకృష్ణ(32) అదివారం చేపలు పట్టుకునేందుకు బైక్పై జుర్రేరు వాగు వద్దకు వెళ్లాడు. చేపలు పట్టుకునే తరుణంలో ప్రమాదవశాత్తు వాగు నీటి గుంతలో మునిగిపోయాడు. గుంత లోతుగా ఉండటంతో పాటు పూడిక పేరుకు పోవడంతో అందులో చిక్కుకుపోయాడు. సాయంత్రం అయినా ఇంటికి రాక పోవడంతో కుటుంబ సభ్యులు వాగు వద్దకు చేరుకోగా ఒడ్డున బైక్, చెప్పులు ఉండటంతో నీటిలో పడి పోయి ఉంటాడని భావించి ఈత గాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం మధ్యాహ్నం వాగులో బాలకృష్ణ మృతదేహం లభ్యమైంది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కోవెలకుంట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ఎన్హెచ్ 40లో ‘క్యూఆర్ కోడ్’ సేవలు
● స్కాన్ చేస్తే పెట్రోల్ బంక్లు, పంక్చర్ షాపుల వివరాలు కర్నూలు: జాతీయ రహదారిపై వెళ్లేటప్పుడు అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఎవరిని సంప్రదించాలి, పెట్రోల్ బంకులు, హోటళ్లు, మరుగుదొడ్లు, ఇ–చార్జింగ్ స్టేషన్లు వంటి వసతులు ఎక్కడ ఉన్నాయి అనే ఆందోళన ప్రయాణికుల్లో సహజంగా ఉంటుంది. ఇకపై అలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రాయలసీమ ప్రాంతానికి అత్యంత కీలకమైన రవాణా మార్గం 40వ నెంబర్ జాతీయ రహదారిలో ప్రయాణికుల భద్రత, పారదర్శకత, సౌకర్యార్థం వినూత్నంగా క్యూఆర్ కోడ్ సేవలు అమలులోకి వచ్చాయి. రాయలసీమ ఎక్స్ప్రెస్ వే లిమిటెడ్ ఆధ్వర్యంలో కర్నూలు నుంచి కడప వరకు విస్తరించి ఉన్న 189 కిలోమీటర్ల మేర రహదారిలో క్యూఆర్ కోడ్ ఆధారిత సమాచార బోర్డులను ఏర్పాటు చేశారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ, నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా నిబంధనల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమం వాహనదారులకు ఇకపై ఒక డిజిటల్ గైడ్లా మారనుంది. సోమవారం (13వ తేదీ) నుంచి 40వ జాతీయ రహదారిలో డిజిటల్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రాజెక్టు హెడ్ వి.మదనమోహన్ విలేకరులకు తెలిపారు. ఒక్క స్కాన్తో అన్ని వివరాలు హైవే వెంట ప్రయాణించేటప్పుడు స్మార్ట్ బోర్డులను స్మార్ట్ ఫోన్తో స్కాన్ చేయగానే మనకు అవసరమైన సమాచారం లభిస్తుంది. ప్రధానంగా అత్యవసర సేవా కేంద్రాలు, జాతీయ రహదారి హెల్ప్లైన్ నెంబర్ 1033, హైవే పెట్రోలింగ్, అంబులెన్స్ సేవలు, సమీపంలోని పోలీస్స్టేషన్ నెంబర్లు ఇట్టే తెలిసిపోతాయి. 189 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రోడ్డును రాయలసీమ ఎక్స్ప్రెస్ వే లిమిటెడ్ వారు నిర్వహిస్తున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వహణ, బాధ్యతలు, కాలపరిమితి, టోల్ప్లాజాల మేనేజర్లు, రెసిడెంట్ ఇంజనీర్ల ఫోన్ నెంబర్లు కూడా క్యూ ఆర్ కోడ్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే రోడ్డుకు ఇరువైపుల ఉన్న పెట్రోల్ బంకులు, హోటళ్లు, మరుగుదొడ్లు, పంక్చర్ షాపులు, ఇ–చార్జింగ్ స్టేషన్ల లొకేషన్ల వివరాలు కూడా ఒక్క స్కాన్తో తెలుసుకోవచ్చు. -
గొర్రెలను తప్పించబోయి..
కొత్తపల్లి: విధులకు మోటారు బైకుపై వెలుతుండగా మార్గ మధ్యంలో ఎదురుగా వస్తున్న గొర్రెలను తప్పించ బోయి ఇద్దరు ఉపాధ్యాయులు కిందపడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. శివపురం గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేసే ఖాజా మొహిద్ధీన్, షహిన్ షా అనే ఉపాధ్యాయులు సోమవా రం ఉదయం ద్విచక్రవానంపై ఆత్మకూరు నుంచి బయలుదేరారు. శివపురం గ్రామ శివారులోని జమ్ములమ్మ గుడి సమీపంలో రోడ్డుపై గొర్రెలు ఎదురయ్యా యి. వాటిని తప్పించే క్రమంలో బైకు అదుపుతప్పడంతో కింద పడ్డారు. ఈ ఘటనలో గాయపడిన ఇద్దరిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఖాజా మోహిద్దీన్ పరిస్థితి విషయంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వైద్యు లు కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు రెఫర్ చేశారు. గాయపడిన ఖాజా మోహిద్దీన్, షహీన్ షా -
గుర్తు తెలియని వాహనం ఢీ కొని ..
ఆత్మకూరు రూరల్: మండలంలోని సిద్దాపురం చెరువు సమీపంలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ బాలుడు మృతి చెందాడు. మండలంలోని సంజీవనగర తండాకు చెందిన నాగేశ్వరికి ఇద్దరు కుమారులు. చిన్నవాడైన అభిలాష్ (16)కు కుటుంబ సభ్యులు ఇటీవల కొత్త ద్విచక్రవాహనం కొనుగోలు చేశారు. ఆ వాహనంపై అభిలాష్ బైర్లూటి వెళ్లి వస్తుండగా సిద్దాపురం చెరువు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లింది. స్థానికులు గమనించి తీవ్రంగా గాయపడిన బాలుడి సమాచారం కుటుంబ సభ్యులకు ఇచ్చారు. వారు ఆ బాలుడిని చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. తీవ్ర రక్తస్రావం జరగడంతో అభిలాష్ కోలుకోలేక సోమవారం మరణించాడు. కూలిపోయిన రోడ్డు వంతెన గట్లు గోనెగండ్ల: గాజులదిన్నె ప్రాజెక్టు ఎడమ కాలువపై రోడ్డు వేయడానికి వంతెన నిర్మించగా రెండు వైపులా గట్లు కూలిపోయాయి. దీన్ని గమనించిన ఓ ప్రయాణికుడు ప్రమాదకరంగా ఉందని చెప్పేందుకు కట్టెకు ఎర్రటి గుడ్డ చుట్టి పాతి వెళ్లి పోయాడు. గాజులదిన్నె గ్రామ స్టేజీ వద్ద ఈ రోడ్డు వంతెన మీదుగా ప్రతి రోజూ వందలాది వాహనాలు వెళ్తుంటాయి. వంతెన గట్లు లేవని ప్రయాణిస్తే వాహనాలు కాలువలోకి పడే అవకాశం ఉంది. ఈ దారి గుండా వాహనాల్లో వెళ్లే టీడీపీ ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రమాదాన్ని చూసుకుంటూ వెళ్తున్నారే తప్ప చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు, ప్రయాణికులు అంటున్నారు. -
దూసుకొచ్చిన కారు
పత్తికొండ: కర్ణాటక రాష్ట్రానికి చెందిన కారు అదుపు తప్పి బంకు పైకి దూసుకెళ్లింది. ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి మంత్రాలయం వెళ్తున్న కెఎ 05ఎఎన్ 7939 నంబరు గల కారు పత్తికొండ పట్టణానికి సమీపంలో మలుపు దగ్గర అతివేగంగా అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న బంకు పైకి దూసుకెళ్లింది. దీంతో బంకులో ఉన్న సామాన్లు చెల్లాచెదురుగా పడిపోయాయి. పక్కన నిలిపిన మూడు ద్విచక్ర వాహనాలు ధ్వసం అయ్యాయి. అలాగే పెండ్లిమాన్తండాకు చెందిన రేక్యనాయక్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అర్బన్ సీఐ జయన్నకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకొని జరిగిన సంఘటనపై వివరాలు తెలుసుకున్నారు. బంకు యాజమాని లక్ష్మణస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
ఆర్యూలో నేడు అంబేడ్కర్ విగ్రహావిష్కరణ
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయంలో ప్రధాన ద్వారం వద్ద మంగళవారం ఉదయం 90.30 గంటలకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బి.విజయ్ కుమార్నాయుడు తెలిపారు. వర్సిటీ వైస్ఛాన్సలర్ ప్రొఫెసర్ వి. వెంకట బసవరావు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. సోమవారం వర్సిటీ వీసీ వెంకట బసవరావు, కమిటీ సభ్యులు భారీ అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు పనులను పరిశీలించారు. నల్లమలలో కారు బోల్తా మహానంది: నల్లమలలో కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు..మద్యం వ్యసనం మానుకునేందుకు పాణ్యం వద్ద పసురు, అంత్రాలు వేస్తున్నారని తెలుసుకుని గుంటూరు పట్టణానికి చెందిన ముగ్గురు కారులో బయలుదేరి వచ్చారు. వచ్చిన పని చూసుకొని నంద్యాల, గాజులపల్లె మీదుగా తిరిగి వెళ్తున్నారు. గిద్దలూరు నల్లమల ఘాట్రోడ్డులో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న వంతెనను ఢీకొని బోల్తాపడింది. ఈ సంఘటనలో డ్రైవర్తో పాటు కారులో ఉన్న మరో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
శ్రీశైలం ఘాట్లో చిరుత కలకలం
శ్రీశైలం: దోర్నాల– శ్రీశైలం ఘాట్లో శిఖరం సమీపంలో ఉన్న మలుపు వద్ద రోడ్డు పక్కన ఆదివారం రాత్రి చిరుత పులి కనిపించింది. గమనించిన వాహనదారులు భయంతో కిందకు దిగకుండా కేకలు వేస్తూ డిమ్ అండ్ డిప్ లైట్ కొట్టడంతో చిరుత అడవిలోకి వెళ్లిపోయింది. కాగా అటవీ శాఖ వారు ఘాట్ రోడ్లో శ్రీశైలం వచ్చి వెళ్లే ప్రయాణికులకు హెచ్చరికలను జారీ చేశారు. వేసవి కాలం కావడంతో రాత్రి సమయంలో అడవిలో ఉన్న వన్యప్రాణులు దాహం తీర్చుకోవడానికి రోడ్డు మార్గాలను దాటుతుంటాయని వాహనదారులు తక్కువ స్పీడ్లో వెళ్లాలని సూచించారు. ఒకవేళ వన్యప్రాణులు రోడ్డు దాటుతూ కనిపిస్తే వెంటనే వాహనాలను నిలిపి వేయాలని చెప్పారు. -
ఖాళీ బిందెలతో ఎంపీడీఓ కార్యాలయం ముట్టడి
హొళగుంద: వారాల తరబడి మంచినీళ్లు ఇవ్వకుండా అధికారులు ఏం చేస్తున్నారని ఖాళీ బిందెలతో మహిళలు ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. దాదాపు 15 రోజులుకుపైగా హొళగుందలోని 8వ వార్డు పింజరిగేరికి మంచినీరే రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీడీఓ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం జరుగుతుండగా అక్కడికెళ్లి అధికారులను నిలదీశారు. తమ కాలనీకి మంచినీరు రాకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వాదనకు దిగారు. సమస్య పరిస్కారానికి చర్యలు తీసుకుంటామని ఎంపీడీఓ విజయలలిత చెప్పడంతో ఆందోళన విరమించారు.


