Kurnool
-
అన్నదాతలకు తీవ్ర అన్యాయం
● రైతు భరోసా కేంద్రాలను నాశనం చేశారు ● టీడీపీ నాయకుల ఇళ్లలోకి ఎరువుల బస్తాలు ● వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి పాణ్యం: దేశానికి అన్నం పెట్టే రైతులకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి మండిపడ్డారు. అన్నదాతలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, ప్రభుత్వంపై పోరాడతామని చెప్పారు. పాణ్యం మండలం ఆలమూరు గ్రామంలో రైతులతో సోమవారం ముఖాముఖి నిర్వహించారు. పెట్టుబడి వ్యయం, గిట్టుబాటు ధర, సాగు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో కాటసాని మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఎరువులను టీడీపీ నాయకుల ఇళ్లలో ఉంచుతున్నారన్నారు. చేసేదేమి లేక రైతులు వేరే ప్రాంతానికి వెళ్లి యూరియా బస్తా రూ. 400 ప్రకారం కొనాల్సి వస్తోందన్నారు. కనీస మద్దతు ధర లేకపోవడంతో ధాన్యం కల్లాలు దాటడడం లేదన్నారు. సాగు నీరు అందలేదు ‘పది రోజులుగా కల్లాల్లో ధాన్యం ఉంచినా కొనుగోలు చేసేందుకు ఎవరూ రావడం లేదు’ అని కన్నీటితో తమ కష్టాలను కాటసానికి రైతులు వివరించారు. ‘సాగు నీరు సరిగ్గా రాలేదని, తెగుళ్లు ఎక్కువయ్యాయని, మందు బస్తాల రేటు చాలా పెరిగిందని.. ఇలా ఉంటే రైతులు ఏమి చేయాలి’ అని వాపోయారు. గత ప్రభుత్వంలో ఆర్బీకేల్లో బుకింగ్ చేస్తే ఊర్లోనే మందులు, విత్తనాలు, పనిముట్లు ఇచ్చేవారని, నాటి పరస్థితులు నేడు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు అన్నదాత సుఖీభవ కింద రూ. 20వేలు రైతులకు ఇస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చి మోసం చేశారని కాటసాని అన్నారు. అధికారంలోకి వచ్చాక వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నాశనం చేశారన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో రైతులు నష్టపోతే ఒక్క పైసా పరిహారం ఇవ్వలేదన్నారు. మోసం చేస్తే ప్రభుత్వానికి రైతులే బుద్ధి చెబుతారన్నారు. జెట్పీటీసీ మాజీ సభ్యుడు సద్దల సూర్యనారాయణరెడ్డి, వైస్ ఎంపీపీలు వెంకటేశ్వర్లు, పార్వతమ్మ, మల్లు జయచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు రామలక్ష్మయ్య, గోపాల్రెడ్డి, ఉపేంద్రారెడ్డి, దేవేంద్రరెడ్డి, శ్రీనాథ్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సాగులో లేని వాళ్లు ఉన్నట్లు చూపిస్తున్నారు. అసలు ప్రాణాలతో లేని వ్యక్తులు పరిహారం కోసం కోర్టుకు వెళ్లినట్లు సృష్టించారు. ఈ విషయంలో ఓ టీడీపీ నేత చక్రం తప్పారు. ఇప్పటికే కొంతమందికి పరిహారం మంజూరు కాగా, మిగిలిన వారికీ పరిహారం మంజూరు చేయాలని సదరు నేత అధికారుల
2002లో చనిపోతే.. 2018లో కోర్టుకు ఎలా వెళ్లారు? పాలకొలనులోనే కలగొట్ల నాగమ్మ అనే మహిళకు 2 ఎకరాల పొలం ఉంది. ఎకరాకు రూ.4.30లక్షల చొప్పున ఈమెకు రూ.8.60లక్షలు పరిహారం రావాలి. అయితే నాగమ్మ 2002లో చనిపోయారు. భూమిని 2013లో సేకరించారు. కానీ పరిహారం కోసం నాగమ్మ పేరుతో ఓ టీడీపీ నేత 2018లో రిట్ (డబ్ల్యూపీ 42989/2018)దాఖలు చేశారు. అందులో నాగమ్మ వేలిముద్రలను ఫోర్జరీ చేశారు. అయ్యన్న సంతకాలు ఫోర్జరీ సర్వేనెంబర్ 232లో అయ్యన్న అనే వ్యక్తికి రెండు ఎకరాల పొలం ఉంది. ఇతనికి కూడా రూ.8.60లక్షలు పరిహారం రావాలి. ఇతను 2008 జూలై 8న చనిపోయారు. ప్రభుత్వం మరణధ్రువీకరణ పత్రం కూడా జారీ చేసింది. అయితే ఇతని పొలాన్ని 2013లో సేకరించారు. పరిహారం కోసం చనిపోయిన అయ్యన్న 2018 నవంబర్ 5న కోర్టులో రిట్(40116/2018) దాఖలు చేశారు. 2002లో చనిపోయిన వ్యక్తి 2018లో కోర్టును ఎలా ఆశ్రయించారో అధికారులకే తెలియాలి. నాకు తెలీకుండానే నా పేరుతో కోర్టుకు.. నాకు అరెకరా ఉంది. నాకు రూ.2.15లక్షలు రావాలి. నేను బతికే ఉన్నా. నాకు తెలియకుండా నా పేరుతో టీడీపీ లీడర్ కోర్టుకు వెళ్లారు. నాకు సంతకం రాదు. నేనైతే ఎక్కడా వేలిముద్రలు వేయలేదు. కానీ నేను వేసినట్లు వేలిముద్రలు వేశారట. లేదంటే డ్వాక్రా గ్రూపులోని వేలిముద్రలను తీసుకున్నారేమో తెలీదు. ఇది చాలా అన్యాయం. నా పరిహారం నాకు ఇప్పించాలి. – శేషమ్మ నకిలీ పాసుపుస్తకాలు సృష్టించారు మా మానాన్న మద్దిలేటికి 4.38 ఎకరాల పొలం ఉంది. ఇప్పటికీ పాసుపుస్తకాలు మా నాన్న పేరుతో ఉన్నాయి. అయితే మా ఆడపిల్లలతో పాటు మా సోదరుడు వెంకటేశ్వర్లు భార్య భాగమ్మ, ఆమె పిల్లలు బతికే ఉన్నారు. వారికి తెలియకుండా భూమి భాగ పరిష్కారాలు కాకుండా మొత్తం భూమి రామాంజనేయులు తీసుకున్నట్లు నకిలీ పాసుపుస్తకాలు సృష్టించారు. మా వద్ద మా నాన్న పాసుపుస్తకాలు ఉన్నాయి. దీనిపై అధికారులు విచారణ చేయాలి. అప్పటి వరకూ పరిహారం ఆపాలి. – మద్దిలేటి వారసులుఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ భూసేకరణ కుంభకోణం ● పరిహారం కోసం రైతులకు తెలియకుండా కోర్టుకు ● చనిపోయిన వారి పేరిట రిట్ పిటిషన్లు దాఖలు ● ఇప్పటికే 120 మందికి పరిహారం.. త్వరలో మరో 70 మందికి ● ఈ విషయంలో చక్రం తిప్పుతున్న ఓ టీడీపీ నేత ● మంజూరైన పరిహారంలో 50శాతం ఇచ్చేలా ఒప్పందం సాక్షి ప్రతినిధి కర్నూలు: ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్లో డీఆర్డీఓ(డిఫెన్స్ రీసెర్స్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్) కోసం 3,250 ఎకరాల భూమిని ఏపీఐఐసీ ద్వారా ప్రభుత్వం సేకరించింది. పట్టా భూము లకు, అసైన్డ్ భూములకు ప్రభుత్వం ఎకరాకు రూ.4.30లక్షల చొప్పున పరిహారం ఇచ్చింది. అయితే ఈ పరిహారం మంజూరులో కొందరు రైతుల పేర్లతో టీడీపీ నేతల భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. 15–20 ఏళ్ల కిందట చనిపోయిన వారి పేర్లతో ఫోర్జరీ సంతకాలు చేసి పరిహారం పొందేందుకు సిద్ధమ య్యారు. ఇప్పటికే 120మందికి పరిహారం అందింది. మరో 70మందికి పరిహారం మంజూరు కాగా, ఖా తాల్లో జమ కావల్సి ఉంది. అయితే ఈ పరిహారం మంజూరులో అక్రమాలు జరిగాయని ఇటీవలే బాధిత రైతు కుటుంబాలతో పాటు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాట సాని రాంభూపాల్రెడ్డి కలెక్టర్ను కలిసి విన్నవించారు. నిజమైన బాధితులకు న్యాయం చేయాలని కోరారు. వేలిముద్రలు ఫోర్జరీ చేసి కోర్టులో రిట్ పాలకొలనులో మాదిగ శేషమ్మకు అరెకరా పొలం ఉంది. ఈమె భూమిని డీఆర్డీఓ కోసం సేకరించారు. అయితే పొలంలో శేషమ్మ సాగులో లేదని పరిహారం తిరస్కరించారు. దీనిపై శేషమ్మకు తెలియకుండానే ఆమె పేరుతో హైకోర్టులో 2022లో రిట్(పిటిషన్ నెం.25654) దాఖలు చేశారు. పిటిషన్లో శేషమ్మ పేరుతో వేలిముద్రలు వేసి ఆమె పేరు రాశారు. నిజానికి ఈ విషయం ఆమెకు ఏమాత్రం తెలీదు. గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు తప్పుడు వేలిముద్రలతో శేషమ్మ పేరుతో రిట్ దాఖలు చేశారు. లేదంటే డ్వాక్రా సంఘంలో ఉన్న శేషమ్మ రుణాల లావాదేవీలలో గతంలో వేసిన వేలిముద్రలను ఫోర్జరీ చేసి ఉండొచ్చని శేషమ్మ అనుమానిస్తున్నారు. ఇప్పుడు ఈమె పేరుతో మంజూరైన పరిహారం శేషమ్మకు తెలియకుండానే టీడీపీ నేత ఖాతాలో జమ కానుంది. వచ్చిన పరిహారంలో ఫిఫ్టీ.. ఫిఫ్టీ పాలకొలనులో డీఆర్డీఓ కోసం వందల ఎకరాల భూమి సేకరించారు. ఇందులో కొందరు నిజమైన అర్హులు ఉంటే కొందరు భూమి లేకుండా కేవలం నకిలీ పట్టాలు సృష్టించి పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్న వారున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎవరైతే ప్రభుత్వం నుంచి అసైన్డ్భూములు పొంది, సాగులో లేకుండా ఉన్నారో వారికి పరిహారం నిరాకరించారు. ఇదే అదునుగా ఓ టీడీపీ నేత పరిహారం నిరాకరించిన కొందరి పేర్లతో వారికి తెలీకుండా వారి పేర్లతో కోర్టులో రిట్దాఖలు చేశారు. ఇది చూసి ఇంకొందరు రైతులు కూడా టీడీపీ నేతతో కలిసి వెళ్లి తమకూ పరిహారం ఇప్పించాలని కోరారు. దీంతో ఆ టీడీపీ నేత వచ్చే పరిహారంలో సగం తనకు ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. తనకు వచ్చే సగంలో అధికారులకు వాటా ఇస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. ఫ్యామిలీకి తెలీకుండా దోపిడీ నక్కల మద్దిలేటికి సర్వేనెంబర్ 199లో 3.50 ఎకరాలు, సర్వేనెంబర్ 243/5లో 0.88 ఎకరాలు మొత్తంగా 4.38 ఎకరాలు ఉంది. మద్దిలేటి చనిపోయి 20 ఏళ్లు దాటింది. ఈయనకు ఐదుగురు ఆడపిల్లలు, ముగ్గురు మగపిల్లలు. వీరిలో మొదటి, రెండో కుమారులు మద్దిలేటి, వెంకటేశ్వర్లు చనిపోయారు. అలాగే ఓ ఆడపిల్ల కూడా చనిపోయింది. చిన్నోడు రామాంజనేయులుతో పాటు నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. మద్దిలేటి పేరుతో ఉన్న పొలాన్ని రెండో కుమారుడు వెంకటేశ్వర్లు భార్య భాగ్యమ్మకు మగపిల్లోడు ఉన్నారు. ఈమెతో పాటు తక్కిన నలుగురు ఆడపిల్లలకు సంబంధం లేకుండా మొత్తం పొలం దాన విక్రయం కింద తండ్రి తనకు రాసిచ్చినట్లు పాస్బుక్కులు సృష్టించారు. పరిహారం కోసం కోర్టులో 2018లో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే రామాంజనేయులు మినహా తక్కిన మద్దిలేటి వారసులు పాస్బుక్కులు తమ తండ్రి పేరుతోనే ఉన్నాయని, నకిలీ పాసుపుస్తకాలు సృష్టించుకుని రామాంజనేయులు తమకు పరిహారం ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీని వెనుక గ్రామానికి చెందిన టీడీపీ నేత ఉన్నారని చెబుతున్నారు. -
తుంగా తీరంలో మా‘రీచు’లు
మంత్రాలయం: రీచ్ల నుంచి ఇసుక అక్రమ రవాణా కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు సాగుతోంది. ఇందుకు టీడీపీ నేతలు సహకరిస్తున్నారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్లను ఇటీవల పోలీసులకు పట్టుకున్నారు. ఈ టిప్పర్లకు నంబర్లు లేకపోవడం గమనార్హం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంత్రాలయం నియోజకవర్గంలోని కౌతాళం మండలంలో మూడు ఇసుక రీచ్లను ప్రారంభించారు. తుంగభద్ర నదిని ఆనుకుని ఉన్న మరళి, గుడికంబాళి, నదిచాగి గ్రామాలతో ఇసుక రీచ్లను ఏర్పాటు చేశారు. ఇక్కడి రీచ్ల్లో నాణ్యమైన ఇసుక లభిస్తోంది. దీంతో బిల్డర్లు ఇక్కడి ఇసుకను ఎక్కువగా ఇష్టపడతారు. గోడల ప్లాస్టరింగ్ నేరుగా ఇసుకను వినియోగానికి వస్తుండటంతో మక్కువ చూపుతున్నారు. ఇక్కడి నుంచి కర్నూలు, హైదరాబాద్ ప్రాంతాలకు కూడా ఇసుకను తీసుకెళ్తున్నారు. నంబర్ల ప్లేట్లు లేకుండా.. సరిహద్దులు దాటిపోతున్న టిప్పర్లకు నంబర్లు ప్లేట్లు తీసేస్తున్నారు. మాధవరం చెక్పోస్టు దాటుకుని పోతున్న ఓ ఇసుక టిప్పర్కు నంబర్ ప్లేటు కనిపించలేదు. భారత్ బెంజ్ పేరుతో ఉన్న మూడు టిప్పర్లలో ఇలాగే ఇసుకను తీసుకెళ్తున్నట్లు సమాచారం. దర్జాగా చెక్పోస్టులను ఇసుక టిప్పర్లు దాటుకుని పోతున్నా ఎలాంటి అడ్డగింత లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. చర్యలేవీ? ‘ఏదో టెండర్లు వేశాం.. రీచ్లు ఏర్పాటు చేశాం.. ఎవ్వరు ఇసుక ఎటు తీసుకెళ్తే మాకేం’ అన్నట్లు మైనింగ్ అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇసుక అక్రమణ రవాణాను పట్టించుకోవడం లేదు. జిల్లా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో కర్ణాటక మైనింగ్, పోలీస్ అధికారులు స్పందించారు. అక్రమ ఇసుక టిప్పర్లను పట్టుకున్నారు. ఇసుక అక్రమ రవాణాకు సంకెళ్లు వేయాలని ప్రజలు కోరుతున్నారు. టీడీపీ నేతల అండతోనే సాగుతున్న ఇసుక దందా కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు తరలింపు పోలీసులకు పట్టుబడుతున్న టిప్పర్లు -
పీఎం కిసాన్తో కలిపే ‘అన్నదాత సుఖీభవ’
కర్నూలు(అగ్రికల్చర్): 2024–25 సంవత్సరంలో అన్నదాత సుఖీభవ కింద చెల్లించే పెట్టుబడి సాయం ఎగ్గొట్టిన కూటమి ప్రభుత్వం.. 2025–26 సంవత్సరానికి అన్నదాత సుఖీభవ అమలుకు చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు జారీ అయ్యాయి. గత ఏడాది మే నెలలో జరిగిన ఎన్నికల సమయంలో సూపర్–6 హామీల్లో భాగంగా తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏటా రైతులకు రూ.20 వేలు చెల్లిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతి ఎన్నికల ప్రచార సభలో ప్రకటించారు. గత ఏడాది జూన్ నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఎన్నికల సమయంలో ప్రకటించిన విధంగా మొదటి ఏడాదే అన్నదాత సుఖీభవ కింద రూ.20వేల పెట్టుబడి సాయం అందిస్తారని ఆశించారు. కానీ ఆ దిశగా ఆలోచనే చేయలేదు. దీంతో చంద్రబాబు ఎన్నికల సమయంలో అధికారం కోసం ఒక విధంగా.. అధికారంలోకి వచ్చిన తర్వాత మరోలా వ్యవహరిస్తారనే చర్చ రైతుల్లో మొదలైంది. రైతుల్లో వ్యతిరేకత పెరుగకుండా ఉండేందుకు ఈ ఏడాది అమలుకు మార్గదర్శకాలు జారీ చేసింది. పీఎం కిసాన్ కింద కేంద్రం రూ.6 వేలు, రాష్ట్రం రూ.14 వేలు వెరసి రూ.20 వేలు చెల్లిస్తుంది. ఇందుకు సంబందించి మార్గదర్శకాలను వ్యవసాయ శాఖ జారీ చేసింది. అయితే కుటుంబం యూనిట్(కుటుంబంలో ఒక్కరికి మాత్రమే) లబ్ధి కల్పిస్తారు. హంద్రీనీవా ఎస్ఈగా పాండురంగయ్య ● కర్నూలు సర్కిల్ ఎస్ఈగా బాల చంద్రారెడ్డి కర్నూలు సిటీ: హంద్రీనీవా సుజల స్రవంతి పథకం సర్కిల్–1 పర్యవేక్షక ఇంజనీర్గా పాండురంగయ్యను నియమిస్తూ ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సాయిప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఎల్ఎల్సీ ఎగ్జిక్యుటివ్ ఇంజనీర్గా పాండురంగయ్య పని చేస్తున్నారు. హంద్రీనీవా సర్కిల్–1కి రెగ్యులర్ ఎస్ఈ లేరు. గత నెల 30న ఇన్చార్జిగా ఉన్న సురేష్ పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం హంద్రీనీవా విస్తరణ పనులు జరుగుతుండడంతో ఖాళీగా ఉన్న ఎస్ఈ పోస్టుకు పాండురంగయ్యను నియమించారు. ● అదేవిధంగా కర్నూలు సర్కిల్ ఎస్ఈగా బాల చంద్రారెడ్డిని నియమించారు. ఈయన కర్నూలు సర్కిల్ ఎస్ఈగా గతేడాది నాలుగు నెలలకుపైగా పని చేశారు. ప్రస్తుతం అదే సర్కిల్లో డిప్యూటీ ఎస్ఈగా పని చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి నెలలో రెగ్యులర్ ఎస్ఈలుగా పదోన్నతులు ఇవ్వడంతో ద్వారకనాథ్ రెడ్డి ఎస్ఈగా బాధ్యతలు స్వీకరించారు. గత నెల 30న పదవీ విరమణ పొందారు. ఖాళీగా ఉన్న ఈ స్థానంలో బాల చంద్రారెడ్డిని ఎస్ఈగా నియమితలయ్యారు. అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించండి కర్నూలు(సెంట్రల్): పీజీఆర్ఎస్(పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్)లో వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రీఓపెన్ అయిన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యతతో పరిష్కరించాలన్నారు. ఆయా అర్జీల పరిష్కారంపై జిల్లా అధికారులు ఆడిట్ నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, ఎస్డీసీ వెంకటేశ్వర్లు పాల్నొన్నారు. రేషన్ దుకాణాల్లో విజిలెన్స్ తనిఖీ ఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని రేషన్ దుకాణాల్లో సోమవారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని 7, 14, 15 నంబర్ గల రేషన్ దుకాణాల్లో డీసీటీవో వెంకటేష్, సీఎస్డీటీ మహేష్, సచివాయలం వీఆర్వో లింగేష్ల ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. డీసీటీవో వెంకటేష్ మాట్లాడుతూ పై మూడు దుకాణాల్లో స్టాక్లో తేడాలున్నందున షాపులను సీజ్ చేసినట్లు తెలిపారు. -
బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ప్రారంభం
నంద్యాల(అర్బన్): స్థానిక కేసీ కెనాల్ కాంపౌండ్లోని మైనర్ ఇరిగేషన్ కార్యాలయ భవనంలో సోమవారం సాయంత్రం అత్యాధునిక వసతులతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్లడ్ స్టోరేజ్ సెంటర్ను మంత్రులు ఎన్ఎండీ ఫరూక్, బీసీ జనార్దన్రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి, జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ ప్రారంభించారు. రెడ్క్రాస్ సొసైటీ వ్యవస్థాపకులు హెండ్రీ డ్యూనంట్ చిత్రపటానికి మంత్రులు, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి ఎన్ఎండీ ఫరూక్ మాట్లాడుతూ రక్తం దొరక్క ఏ ఒక్కరూ మరణించకూడదనే ఉద్దేశంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ప్రెసిడెంట్, గౌరవ జిల్లా కలెక్టర్ నేతృత్వంలో బ్లడ్ స్టోరేజ్ సెంటర్ను ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలన్నారు. కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో రక్తం అవసరం ఉన్న వారికి సరైన సమయంలో అందించడానికి ఇతర జిల్లాలోని రక్తనిల్వ కేంద్రాల మీద ఆధార పడకుండా మన జిల్లాలోనే రక్త నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో రెడ్ క్రాస్ సంస్థ వారి సహకారంతో రక్త నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక సబ్ యూనిట్ను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ రాము నాయక్, ఆర్డీఓ విశ్వనాథ్, డీఈఓ జనార్దన్ రెడ్డి, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి, డీసీహెచ్ఎస్ డాక్టర్ జఫ్రుళ్ల్ల, సెట్కూర్ సీఈఓ డాక్టర్ వేణుగోపాల్, డ్రగ్ ఇన్స్పెక్టర్ ఖలందర్, రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి పాల్గొన్నారు. -
ఈ–శ్రమ్ కార్డులపై అవగాహన అవసరం
కర్నూలు (అర్బన్): ఈ–శ్రమ్ కార్డులపై కార్మికులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వ శాఖల అధికారులపై ఉందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి సూచించారు. సోమవారం న్యాయ సేవా సదన్లో ఆశా వర్కర్లకు ఈ–శ్రమ్ కార్డులపై అవగాహన సదస్సు నిర్వహించారు. సంస్థ అధ్యక్షులు వెంకటహరినాథ్, డీఎంహెచ్ఓ డాక్టర్ శాంతికళ, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ శ్రీలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లీలా వెంకటశేషాద్రి మాట్లాడుతూ ప్రతి కార్మికుడికి ఈ–శ్రమ్ కార్డు అందేలా కృషి చేయాలన్నారు. ఈ–శ్రమ్ కార్డుల వల్ల లభించే ఉపయోగాలను ప్రతి కార్మికుడికి తెలియజేయాలన్నారు. డీఎంహెచ్ఓ శాంతికళ మాట్లాడుతూ తమ డిపార్ట్మెంట్లో ఆశా వర్కర్లందరూ ఈ–శ్రమ్ కార్డులు పొందారని తెలిపారు. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఆశా వర్కర్లకు ఈ–శ్రమ్ కార్డులు పోర్టల్లో ఎలా నమోదు చేయాలో వివరించారు. కార్డులు పొందిన వారికి ప్రభుత్వం అందించే అన్ని రకాల సామాజిక భద్రత, సంక్షేమ పథకాలు వర్తింపజేయనున్నట్లు తెలిపారు. ప్రతి కార్మికునికి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద రూ.2 లక్షల ప్రమాద బీమా ఉచితంగా కల్పించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హెల్త్ డిపార్ట్మెంట్ లీగల్ ఆఫీసర్ సుమలత పాల్గొన్నారు. -
రెట్టింపు లాభం అంటూ మోసం చేశారు
కర్నూలు: ఇన్స్ట్రాగామ్లో స్టాక్ మార్కెట్ గురించి ఒక ప్రకటన ఇచ్చి వాట్సాప్ గ్రూప్లో లింక్ పంపి ఇద్దరు వ్యక్తులు తనతో చాట్ చేసి ఒక యాప్ ఇచ్చి, అకౌంట్ నెంబర్ ఇచ్చి పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభాలు చూపిస్తూ ఆ డబ్బులు ఇవ్వాలంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలని రూ.5 లక్షలు తీసుకుని సైబర్ మోసానికి గురి చేశారని కర్నూలుకు చెందిన సునిత అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరాకు ఫిర్యాదు చేశారు. కర్నూలు టూటౌన్ పక్కనున్న ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో సోమవారం అడిషనల్ ఎస్పీ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి వినతులను స్వీకరించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 111 ఫిర్యాదులు రాగా వాటన్నింటిపై చట్ట పరిధిలో విచారణ జరిపి బాధితులకు సత్వరమే న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని అడిషనల్ ఎస్పీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీఐలు శ్రీనివాస నాయక్, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. పీజీఆర్ఎస్కు వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని.. ● చెత్త బండి ఇప్పిస్తామని చెప్పి రూ.3.30 లక్షలు తీసుకుని ధనుంజయ్, జానకిరామ్ అనే వ్యక్తులు మోసం చేశారని కృష్ణగిరి మండలం ఆలంకొండ గ్రామానికి చెందిన బంగారి ఫిర్యాదు చేశారు. ● 10 ఎకరాల ఆస్తిని ఇద్దరు కొడుకులు సమానంగా పంచుకున్నారని, వచ్చిన పెన్షన్ డబ్బు కూడా వారే తీసుకుని తన బాగోగులు పట్టించుకోవడం లేదని, విచారణ జరిపి తనకు జీవనాధారం కల్పించాలని ఆస్పరి మండలం కై రుప్పల గ్రామానికి చెందిన అంగడి శివమ్మ ఫిర్యాదు చేశారు. ● కర్నూలు సంతోష్ నగర్ వద్ద ఉన్న విజయ నగర్ కాలనీలో మార్ట్గేజ్ చేసిన ఒక ప్రాపర్టీని అమ్ముతామని చెప్పి కొందరు బ్రోకర్లు అడ్వాన్స్గా డబ్బులు తీసుకుని తనతో పాటు చాలా మందిని మోసం చేశారని కర్నూలు బాలాజీ నగర్కు చెందిన రెహమాన్ ఫిర్యాదు చేశారు. ● రూ.2 లక్షల విలువైన కంది పంటను నాశనం చేసి నా కుటుంబాన్ని మానసికంగా, ఆర్థికంగా కొందరు ఇబ్బందులకు గురిచేస్తున్నారని, విచారణ జరిపి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఓర్వకల్లు మండలం లొద్దిపల్లె గ్రామానికి చెందిన మాదమ్మ ఫిర్యాదు చేశారు. అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితురాలు -
ఓర్వకల్లును పారిశ్రామికంగా తీర్చిదిద్దుతాం
ఓర్వకల్లు: ఓర్వకల్లు ప్రాంతాన్ని పారిశ్రామికంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. సోమవారం మండలంలోని గుట్టపాడు గ్రామం వద్ద రూ.38.50 కోట్లతో నిర్మించిన ఎంఎస్ఎంఈ పార్కును ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, కలెక్టర్ రంజిత్ బాషా, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లుతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ సరైన శిక్షణ, చదువు ఉంటేనే ఉద్యోగాలు వస్తాయన్నారు. స్థానిక యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు వచ్చేవిధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగానే ఓర్వకల్లులో పైలట్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని, దానికి ఖర్చు ఎక్కువగా ఉన్నప్పటికీ త్వరగా మంచి సంపాదన ఉంటుందని, యువత పైలెట్ కోర్సుల వైపు ఆసక్తి చూపాలని సూచించారు. ఈ పార్కుకు అవసరమైన దూపాడు నుంచి ఓర్వకల్లు మీదుగా బేతంచెర్ల వరకు రైల్వే లైనింగ్ ఏర్పాటుకు అనుమతులు వచ్చాయన్నారు. ఇండస్ట్రీయల్ హబ్ కోసం ఏర్పాటు చేస్తున్న నీటి సౌలభ్యం పనులు 90 శాతం పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కు ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. చిన్న తరహా పరిశ్రమల పార్కులు, స్టార్టప్లు ఎవరైతే ఎంఎస్ఎంఈలుగా మారాలనుకున్నారో, వారందరికీ అవకాశం కల్పించేందుకు గాను 7 నియోజకవర్గాల్లో భూమిని గుర్తించామన్నారు. ప్రస్తుతం మొట్టమొదటి సారిగా జిల్లాలోని ఓర్వకల్లు మండలంలోని గుట్టపాడు వద్ద ప్రారంభించడం శుభపరిణామమన్నారు. కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు మల్లెల రాజశేఖర్, ఆర్డీఓ సందీప్కుమార్, మండల మహిళా సమాఖ్య గౌరవ సలహాదారురాలు విజయభారతి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ శ్రీనివాసరెడ్డి, పరిశ్రమల శాఖ జీఎం అరుణకుమారి, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, తహసీల్దార్ విద్యాసాగర్, ఎంపీడీఓ శ్రీనివాసులు పాల్గొన్నారు. -
పీజీఆర్ఎస్కు 93 వినతులు
బొమ్మలసత్రం: నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి ప్రజల నుంచి 93 వినతులు అందాయి. జిల్లా ఎస్పీ అధిరాజ్సింగ్రాణా ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి వచ్చి అర్జీదారులు వినతులు అందించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ వినతుల్లో చట్టపరమైన సమస్యలను అక్కడికక్కడే ఆయా స్టేషన్ అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. అన్నదమ్ముల ఆస్తి తగాదాలు, నగదు మోసాలు, ఉద్యోగాల పేరుతో మోసం, అత్తింటి వేధింపులు తదితర ఫిర్యాదులను విచారించి చర్యలు తీసుకోవాలని సూచించారు. తమ దృష్టికి వచ్చిన వినతులు తిరిగి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐలు మోహన్రెడ్డి, సూర్యమౌళి తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలు ● ముగ్గురి పరిస్థితి విషమం చాగలమర్రి: మండలంలోని నగళ్లపాడు గ్రామ సమీపంలోని 40వ నెంబరు జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఎస్ఐ సురేష్ తెలిపిన వివరాలు.. హైదరాబాద్ చందానగర్ కాలనీకి చెందిన శ్రీకాంత్ తన కుటుంబ సభ్యులతో కారులో తిరుపతికి బయలు దేరారు. మార్గమధ్యలోని నగళ్లపాడు వద్ద కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొంది. అంతటితో ఆగక ఎదురుగా వచ్చే హైదరాబాద్ బండ్లగూడ కాళికామందిర్కు చెందిన మందా అశోక్రెడ్డి కారును ఢీకొంది. ప్రమాదంలో అశోక్ రెడ్డి, అతని కుమారుడు నరేన్, మరో మహిళ సరితతో పాటు ప్రమాదానికి కారణమైన కారులోని శ్రీకాంత్, మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను టోల్ ప్లాజా అంబులెన్సులో స్థానిక కేరళ ఆసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి తీవ్రంగా ఉన్న ముగ్గురిని నంద్యాల ఉదయానంద ఆసుపత్రికి తరలించారు. అశోక్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. కాగా అశోక్ రెడ్డి తన తల్లిదండ్రుల పెళ్లి రోజును పురస్కరించుకుని అరుణాచలం వెళ్లి తిరిగి హైదరాబాదుకు వెళ్తుండగా ప్రమాదం చేసుకున్నట్లు సమాచారం. -
ప్రమాదపుటంచున ప్రయాణం
రోజూ ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు మృత్యువాత పడుతుండగా ఇంకొందరు అవిటివాళ్లవుతున్నారు. అయినా అటు ప్రయాణికులు కానీ.. ఇటు వాహనదారులు కానీ మేల్కోవడం లేదు. రోడ్ల భద్రత వారోత్సవాల పేరుతో పోలీసు అధికారులు సైతం నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నా.. కాసులకు కక్కుర్తి పడి వాహనదారులు పెడచెవిన పెడుతున్నారు. ప్రమాదమని తెలిసినా పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని రాకపోకలు సాగిస్తున్నారు. ఐదారుగురు ప్రయాణించే ఆటోలో ఏకంగా 30 మందిని ఎక్కించుకుని ప్రయాణాలు సాగిస్తున్నారు. – ఆలూరు -
నాటుసారా బట్టీలపై ఎకై ్సజ్ దాడులు
కర్నూలు: గుడుంబాయి తండా గ్రామ శివారులోని నాటుసారా బట్టీలపై ఎకై ్సజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ రాజశేఖర్ గౌడ్, కర్నూలు స్టేషన్ సీఐ చంద్రహాస్ తమ సిబ్బందితో బృందాలుగా ఏర్పడి సోమవారం సారా స్థావరాలపై దాడులు నిర్వహించి బట్టీలను ధ్వంసం చేశారు. దాదాపు నాటుసారా తయారీకి ఉపయోగించే 1,600 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి, 45 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. సారా తయారీదారులు మాదావత్ దన్ను నాయక్, నానావత్ రాజు నాయక్, మాదావత్ మద్దిలేటి నాయక్, నానావత్ రమేష్ నాయక్ తదితరులపై కేసు నమోదు చేశారు. నవోదయం 2.0లో భాగంగా గ్రామ సభ నిర్వహించి నాటుసారా తయారీ, రవాణా, విక్రయాలు జరిపితే తీసుకునే చట్టపరమైన చర్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. నలుగురిపై కేసు నమోదు -
స్కూల్ లేదని తాగునీరు బంద్!
మహానంది: వేసవి సెలవులని పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ మోటార్ పంపు కనెక్షన్ కట్ చేయడంతో బసవాపురం గ్రామస్తులకు తాగు నీటి సమస్య నెలకొంది. బసవాపురంలో రెండు చోట్ల నీటి ట్యాంకులున్నాయి. ఎంపీపీ పాఠశాల వద్ద ఉన్న మోటార్కు కనెక్షన్ తీసేయడంతో నీటి సమస్య తలెత్తింది. గ్రామంలో వాటర్ ఫిల్టర్ ట్యాంకులు సైతం లేకపోవడంతో ఇదే నీటిని ప్రజలు తాగుతుంటారు. ఉన్న రెండు మోటార్ల వద్ద సరఫరా అయ్యే నీళ్లలో పాఠశాల వద్ద ఉన్న నీళ్లే బాగుంటాయని, అధికారులు స్పందించి సరఫరాను పునరుద్ధరించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శి ఇర్ఫాన్ను ఆరా తీయగా.. ఇంత వరకు గ్రామస్తుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని, అయినా మరమ్మతులు చేయించి పునరుద్ధరిస్తామని తెలిపారు. పది రోజులుగా బసవాపురం గ్రామస్తులకు నీటి సమస్య -
పులి దాడిలో ఆవు మృతి
వెలుగోడు: పులి దాడిలో ఆవు మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. పట్టణ సమీపంలో ఉన్న గట్టు తండాకు చెందిన శివనాయక్ మద్రాస్ మెయిన్ కెనాల్ సమీపంలో ఉన్న పంట పొలంలో ఆవుల మందును నిల్వ ఉంచాడు. సోమవారం తెల్లవారుజామున మందపై పులి దాడి చేసి ఒక ఆవును చంపేసినట్లు బాధితుడు వాపోయాడు. ఆవు మృతితో రూ.50 వేల నష్టం వాటిల్లిందన్నాడు. పశు గ్రాసం దగ్ధం రుద్రవరం: మండల పరిధిలోని తువ్వపల్లె గ్రామ సమీపంలో సోమవారం విద్యుత్ ప్రమాదంలో ట్రాక్టర్పై తరలిస్తున్న పశుగ్రాసం దగ్ధమైంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. రెడ్డిపల్లెకు చెందిన రైతు చిన్నక్రిష్ణయ్య తువ్వపల్లె సమీపంలోని రంగాపురం బావి వద్ద మరో రైతు నుంచి గ్రాసం కొనుగోలు చేసి ట్రాక్టర్లో లోడ్ చేసుకుని స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో తక్కువ ఎత్తులో వేలాడుతున్న విద్యుత్ తీగలు తాకి నిప్పులు చెలరేగడంతో గ్రాసానికి మంటలు వ్యాపించాయి. డ్రైవర్ అప్రమత్తమై లిఫ్ట్ ద్వారా గ్రాసాన్ని కిందకు తోసేయడంతో ట్రాక్టర్కు ఎలాంటి నష్టం కలగలేదు. కానీ గ్రాసం పూర్తిగా కాలిపోవడంతో రైతుకు రూ.50 వేల వరకు నష్టం వాటిల్లినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆస్తి కోసం మేనత్తపై కత్తితో దాడి బొమ్మలసత్రం: మేనత్తకు చెందిన ఆస్తిని రాసివ్వటం లేదని సొంత మేనల్లుడే కత్తితో దాడికి పాల్పడిన ఘటన నంద్యాలలో సోమవారం చోటుచేసుకుంది. అవుట్పోస్ట్ పోలీసులు తెలిపిన వివరాలు.. నూనెపల్లిలో నివాసముంటున్న షేక్రహమున్నిసాకు అక్కడే రెండు భవనాలున్నాయి. ఆమె అన్న కుమారుడు అబ్దుల్రహమాన్ పనిపాట లేకుండా ఖాళీగా తిరుగుతుంటాడు. ఈక్రమంలో ఒక ఇంటిని తన పేరుమీద రాసివ్వాలని మేనత్తను ఒత్తిడికి గురిచేసేవాడు. ఈనేపథ్యంలో రైల్వేస్టేషన్ సమీపంలో బంధువుల ఇంటికి వెళ్లి వస్తున్న రహమున్నిసాపై మేనల్లుడు కత్తితో దాడి చేశాడు. బాధితురాలికి స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు ఘటనా స్థలానికి చేరుకోవటంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలిని చికిత్స నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. త్రీటౌన్ పోలీసులు విచారణ చేపట్టారు. -
శేష వాహనంపై అహోబిలేశుడు
ఆళ్లగడ్డ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జయంతి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మూలమూర్తులను సోమవారం ఉదయం సుప్రభాత సేవతో మేలుకొలిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి, శ్రీ లక్ష్మీనరసింహస్వాములను యాగశాలలో కొలువుంచి అర్చన, అభిషేకం, తిరుమంజనం నిర్వహించి పట్టు వస్త్రాలతో అలంకరించారు. అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉభయ దేవేరులతో శేషవాహనంపై మాడ వీధుల్లో వివహరిస్తూ భక్తులను కటాక్షించారు. రాత్రి చంద్రప్రభ వాహనంపై కొలువైన జ్వాలా నరసింహస్వామి మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. -
పోలీసులకు పట్టుబడి
మంత్రాలయం నియోజకవర్గం నుంచి టిప్పర్లతో కర్ణాటకలోని రాయచూరు, తెలంగాణలోని హైదరాబాద్, గద్వాల, జడ్చర్ల, పాలమూరు ప్రాంతాలకు ఇసుకను తరలిస్తున్నారు. ఇటీవల ఆంధ్ర టిప్పర్లను కర్ణాటక పోలీసుల చేతికి పట్టుబడ్డాయి. గత నెల 28న ఐదు టిప్పర్లను సీజ్ చేశారు. మంత్రాలయం సరిహద్దు గ్రామం మాధవరం చెక్పోస్టు నుంచి కర్ణాటక వైపుగా ఈ టిప్పర్లు తరలిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటకలోని ఎరిగేర సర్కిల్ ఠాణాలో టిప్పర్లను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. మాధవరం చెక్పోస్టు దాటుతుండగా ఇసుక ఎక్కడి నుంచి తెచ్చారని కొందరు అడుగగా మరళి రీచ్ నుంచి తెచ్చినట్లు చెప్పారు. టీడీపీ నేతల అండతోనే ఈ దందా సాగిపోతున్నట్లు తెలుస్తోంది. -
సమయం లేదు మిత్రమా!
● రిజిస్ట్రేషన్లలో టైమ్ స్లాట్ ● బుక్ చేసుకున్న స్లాట్ సమయానికి వెళ్లకపోతే అంతే సంగతులు ● అదనంగా రూ.200 చెల్లించి మరోస్లాట్ బుక్ చేసుకోవాలి ● ఇబ్బంది పడుతున్న క్రయ, విక్రయదారులుకర్నూలు(సెంట్రల్): స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమల్లోకి తెచ్చిన టైమ్ స్లాట్ విధానంతో క్రయ, విక్రయదారులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో రోజులో ఎన్ని డాక్యుమెంట్లు అయినా రిజిస్ట్రేషన్ చేసేవారు. ఒకనొక సమయంలో సిబ్బంది రాత్రిళ్లు ఉండి నూరు డాక్యుమెంట్లకుపైగా రిజిస్ట్రేషన్లను జరిపే వారు. నూతన విధానంతో ఎస్ఆర్ఓల్లో (సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో) రోజుకు కేవలం 39, ఆర్ఓ కార్యాలయంలో 78 స్లాట్లే బుకింగ్ అవుతున్నాయి. దీంతో ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి దూర ప్రాంతాల నుంచి రిజిస్ట్రేషన్ పని మీద వచ్చిన వారు రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. అన్లిమిటెడ్ నుంచి లిమిటెడ్కు... ఉమ్మడి కర్నూలు జిల్లాలో 24 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ఇందులో 22 ఎస్ఆర్ఓ, కర్నూలు, నంద్యాల ఆర్ఓ కార్యాలయాలు ఉన్నాయి. గతంలో కర్నూలు, నంద్యాల, ఆదోని, కల్లూరు, ఎమ్మిగనూరు, కోడుమూరు తదితర సబ్ రిజిస్ట్రార్ కార్యాలాయల్లో రోజులో ఎన్ని డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లైనా జరిగేవి. ఒకనొక రోజులో 100కు పైగా డాక్యుమెంట్లు జరిగేవి. డాక్యుమెంట్ ఉంటే రిజిస్ట్రేషన్ కార్యాలయ సిబ్బంది అర్ధరాత్రి వరకు పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమల్లోకి తెచ్చిన టైం స్లాట్తో అనేక అవస్థలు ఉన్నాయి. వాటిని సరిచేయకపోతే క్రయ, విక్రయదారులు ఇబ్బంది పడాల్సిందే. డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ సంఖ్య టైమ్ స్లాట్తో బాగా తగ్గిపోతోంది. గతంలో అన్లిమిటెడ్గా జరిగే డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నూతన విధానంలో లిమిటెడ్గా మారిపోయింది. ఇప్పుడు రోజులో సబ్ రిజిస్ట్ట్రార్ కార్యాలయం(ఎస్ఆర్ఓ)లో అయితే కేవలం 39, ఆర్ఓ కార్యాలాయల్లో అయితే 78 డాక్యుమెంట్లను మాత్రమే రిజిస్ట్రేషన్ చేయడానికి టైమ్ స్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఇబ్బందిగా మారింది. వారు మరుసటి రోజు ఉండే టైం స్లాట్లను బుక్ చేసుకోవాల్సి వస్తోంది. ఆ రోజు కూడా ఆన్లైన్ సైట్ పనిచేయకపోతే వేచి ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రెండో సారి స్లాట్బుక్ చేసుకుంటే రూ.200 వసూలు ఒకసారి రిజిస్ట్రేషన్ కోసం టైం స్లాట్ను బుక్ చేసుకుంటే కచ్చితంగా అదే సమయానికి వెళ్లాల్సి ఉంటుంది. వారికి ఇచ్చిన 10 నిమిషాల సమయంలో వెళ్లకపోతే ఆ స్లాట్ ముగిసిపోతుంది. వారు మళ్లీ స్లాట్ను బుక్ చేసుకోవాలంటే అదనంగా రెండో సారి అయితే రూ.200, మూడోసారి అయితే రూ.500 చెల్లించాలనే నిబంధనలు ఉన్నాయి. ఫలితంగా విక్రయదారులపై మరింత ఆర్థిక భారం పడుతుంది. ఇప్పటికే పెరిగిన రిజిస్ట్రేషన్ చార్జీలు, డాక్యుమెంట్ రైటర్ల ఫీజు, చలానాల మొత్తాలతో వినియోగదారులపై తీవ్ర రుణ భారం పడుతోంది. గతంలో ఎప్పుడైనా అందుబాటులో టైం స్లాట్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో టైం స్లాట్ విధానం 2020 నుంచే వినియోగదారులకు అందుబాటులో ఉంది. గత ప్రభుత్వ హయాంలో క్రయ, విక్రయదారులే తమ డాక్యుమెంట్ను తయారు చేసుకొని వారికి అనువైన సమయంలో రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లేలో పీడీఈ(పబ్లిక్ డేటా ఎంట్రీ) విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నూతనంగా టైం స్లాట్ విధానాన్ని అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించారు. గతంలో ఎప్పుడైనా టైం స్లాట్లు బుక్ చేసుకునే అవకాశం ఉండగా..ప్రస్తుతం వాటిని కుదించారు. దీంతో క్రయ, విక్రయదారులు ఇబ్బంది పడుతున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది టైమ్స్లాట్ విధానంలో అనేక లోపాలు ఉన్నాయి. వాటిని సరిచేయడానికి అవకాశం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. గతంలోనూ స్లాట్లు అన్లిమిటెడ్గా బుక్ చేసుకునేందుకు అవకాశం ఉండేది. ప్రస్తుతం లిమిటెడ్ చేయడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చి వారికి ఇబ్బంది మారింది. ప్రభుత్వం పునరాలోచనచేయాల్సిన అవసరం ఉంది. – చంద్రశేఖర్, డాక్యుమెంట్ రైటర్ -
ఆర్బీకేలు ఉన్నా లేనట్టే!
మాకు ఆరు ఎకరాల భూమి ఉంది. ఇందులో కంది, వేరుశనగ, మొక్కజొన్న తదితర పంటలు సాగు చేస్తున్నాం. ఆర్బీకే మాకు అన్ని విధాలా ఉపయోగకరంగా ఉండేది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్బీకేలు లేనట్లుగా ఉన్నాయి. ఎలాంటి సేవలు అందడం లేదు. ఎరువులు, విత్తనాలు, పురుగుమందులకు కోడుమూరుకు, వెల్దుర్తికి వెళ్లాల్సి వస్తోంది. రాజకీయాలకు అతీతంగా ఆర్బీకేలను నిర్వహించాల్సిన అవసరం ఎంతో ఉంది. – ఎం.మాదన్న, ఎస్హెచ్ ఎర్రగుడి, కృష్ణగిరి మండలం ప్రభుత్వం చొరవ తీసుకోవాలి గత ఏడాది మే నెల వరకు రైతుభరోసా కేంద్రాలతో అన్ని రకాల సేవలు పొందాం. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఆర్బీకేలు పనిచేయడం లేదు. గత ఏడాది వరకు ఎరువులు/ పురుగు మందులు ఏదీ అవసరమైనా నిమిషాల వ్యవధిలోఆర్బీకే ద్వారా పొందువారం. నేడు బస్తా ఎరువు కావాలన్నా... నీళ్ల మందులు కావాలన్నా డోన్కు, పత్తికొండకు పోవాల్సి వస్తోంది. ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. – నౌనేపాటి, ముక్కెళ్ల, తుగ్గలి మండలం -
వైఎస్సార్సీపీ హయాంలో ఇలా..
దేశానికే రోల్ మోడల్గా గుర్తింపు పొందిన రైతు భరోసా కేంద్రాలు కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడుతోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వీటిని రైతుసేవా కేంద్రాలుగా మార్చడంతో నీలినీడలు అలుముకున్నాయి. ప్రస్తుతం రేషనలైజేషన్ పేరుతో వందలాది రైతుసేవా కేంద్రాలు మనుగడ కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఉమ్మడి కర్నూలు జిల్లా యూనిట్గా రేషనలైజేషన్ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది.ఇవీ కష్టాలు..● రైతు సేవా కేంద్రాలకు ఉరి వేసిన రాష్ట్ర ప్రభుత్వం ● రేషనలైజేషన్ పేరుతో కొన్ని కేంద్రాల తొలగింపు ● రెండు, మూడు రోజుల్లో రానున్న ఉత్తర్వులు ● వైఎస్సార్సీపీ హయాంలో 188 ఆర్బీకేల మనుగడ ● ఇక పోస్టుల భర్తీ, ఆర్బీకేల మనుగడ లేనట్లే ఆర్బీకేలో పనిచేయని డిజిటల్ కియోస్క్ కర్నూలు(అగ్రికల్చర్): రైతుభరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్రామ స్థాయిలోనే అన్నదాతలకు అన్ని రకాల సేవలు అందించింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామస్థాయిలో రైతులకు సేవలు అందించే రైతుభరోసా కేంద్రాలు నిర్వీర్యం అయ్యాయి. వీటిని రైతు సేవా కేంద్రాలుగా మార్పు చేశారే తప్ప ఎలాంటి సేవలు అందించడం లేదు. వాటికి అన్నదాతలకు దూరం చేసేందుకు సరికొత్త ప్రణాళిక రూపొందించారు. గతంలో విత్తనం వేసే సమయం నుంచి మద్దతు ధరతో పంటను అమ్ముకునే వరకు అనేక సేవలు పొందిన రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కర్షకుల కష్టం రెట్టింపు అయ్యింది. ఎక్కడి పనులు అక్కడే! ఉమ్మడి కర్నూలు జిల్లాలో 877 ఆర్బీకేలు(ఆర్ఎస్కేలు) ఉన్నాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 849, అర్బన్ ప్రాంతాల్లో 28 పనిచేస్తున్నాయి. కర్నూలు జిల్లాలో 466, నంద్యాల జిల్లాలో 411 ఆర్బీకేలు సేవలు అందిస్తున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులతో ఆర్బీకేలకు సొంత భవనాలు ఏర్పాటు చేసింది. కర్నూలు జిల్లాలో 328, నంద్యాల జిల్లాలో 156 ప్రకారం 484 ఆర్బీకేలకు అపురూపమైన సొంత భవనాలు ఉన్నాయి. మిగిలిన 393 ఆర్బీకేలకు కూడా సొంత భవనాలు నిర్మితం అవుతున్నప్పటికీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. పోస్టుల భర్తీ లేనట్టే ఆర్ఎస్కే పరిధిలో ఉద్యాన పంటలు ఉంటే గ్రామ ఉద్యాన సహాయకుడు(వీహెచ్ఏ) ఉండాలి. మల్బరీ సాగైతే గ్రామ పట్టు పరిశ్రమ సహాయకుడు(వీఎస్ఏ) పనిచేయాల్సి ఉంది. వ్యవసాయ పంటలు ఎక్కువగా ఉంటే గ్రామ వ్యవసాయ సహాయుడు( వీఏఏ) విధులు నిర్వర్తించాలి. అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో గ్రామ పట్టుపరిశ్రమ సహాయకులందరికీ పదోన్నతులు లభించాయి. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఖాళీ అయిన పోస్టులను భర్తీ చేయలేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వీఏఏలు 474, వీహెచ్ఏలు 215 ప్రకారం మొత్తం 689 మంది పని చేస్తున్నారు. మిగిలిన 188 పోస్టులను భర్తీ చేయడంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించే అవకాశం లేకుండా పోయింది. ఈ పోస్టులన్నీ రద్దయినట్లేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మూతపడినట్లే! ఉమ్మడి కర్నూలు జిల్లాలో 877 ఆర్బీకేలు(ఆర్ఎస్కేలు)ఉండగా రేషనలైజేషన్తో వీటిలో 188 కేంద్రాలు మూతపడినట్లే అని వ్యవసాయశాఖ వర్గాలే పేర్కొంటున్నాయి. పోస్టుల భర్తీ లేనందున ఆర్ఎస్కేలు కూడా లేనట్లేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఏకంగా 188 ఆర్ఎస్కేలు మూత పడే పరిస్థితి ఉత్పన్నం అవుతుందంటే రైతులకు సేవలు ఏ స్థాయికి దిగజారి పోతాయో ఊహించుకోవచ్చు. 2,600 ఎకరాలకు ఒక వీఏఏ/వీహెచ్ఏ! ప్రతి 2,600 ఎకరాలకు ఒక వీఏఏ/వీహెచ్ఏలు ఉండే విధంగా రేషనలైజేషన్ జరుగుతోంది. ఉమ్మడి జిల్లా యూనిట్గా ఈ ప్రక్రియ జరుగుతోంది. దీనిపై వ్యవసాయ, ఉద్యాన శాఖలు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాయి. మిగిలిన భూములకు వ్యవసాయ శాఖలో ఎంపీఈవోలుగా పనిచేస్తున్న వారిని నియమిస్తారు. వీఏఏ, వీహెచ్ఏ పోస్టులను భర్తీ చేయకుండా కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న ఎంపీఇవోలను వినియోగించుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ● విత్తనం మొదలు పండించిన పంటను మద్దతు ధరతో అమ్ముకునే వరకు రైతుకు ఆర్బీకేలు అండగా నిలిచాయి. ● ఖరీఫ్, రబీ సీజన్లలో ఆర్బీకేల ద్వారా రైతులకు విత్తనాలు పంపిణీ చేసేవారు. ● వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, ఏపీఎంఐపీ, ఫిషరీష్, మార్కెటింగ్ తదితర శాఖలకు సంబంధించిన అన్ని రకాల కార్యాక్రమాలు ఆర్బీకేల ద్వారానే అమలయ్యాయి. ● ఆర్బీకేల్లో వ్యవసాయ విజ్ఞానానికి సంబంధించిన దాదాపు 50 పుస్తకాలతో మినీ లైబ్రరీ ఉండేది. ● ఆర్బీకేల్లోనే రైతుల సందేహాలను నివృత్తి చేసేవారు. ఏ ఎరువు ఎందుకు ఉపయోగపడుతుందనే దానిపై అవగాహన కల్పించేవారు. ● డిజిటల్ కియోస్క్ల ద్వారా తమకు అవసరమైన రైతులు ఆర్డర్ చేస్తే 48 గంటల్లోనే సరఫరా అయ్యేవి. ● ఆడియో, వీడియోలతో వ్యవసాయానికి సంబంధించిన సలహాలు, సూచనలు ఇచ్చేవారు. రేషనలైజేషన్ జరుగుతోంది ఉమ్మడి జిల్లా యూనిట్గా రేషనలైజేషన్ ప్రక్రియ జరుగుతోంది. అయితే రైతులకు ఎలాంటి నష్టం ఉండదు. ఉమ్మడి జిల్లాలో 877 ఆర్బీకేలు ఉన్నాయి. ప్రస్తుతం వీఏఏలు, వీహెచ్ఏలు కలిపి 689 మంది పనిచేస్తున్నారు. ఇందువల్ల ఆర్బీకేలు తగ్గే అవకాశం లేదు. వీఏఏలు, వీహెచ్ఏలు స్థానంలో ఎంపీఇవోలను వినియోగించుకుంటాం. రైతులకు సేవలు యథావిధిగా అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. – పీఎల్ వరలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి, కర్నూలు 2014నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న టీడీపీ హయాంలో రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం అవే కష్టాలు ఎదురవుతున్నాయి. సకాలంలో ఎరువులు, విత్తనాలు అందడం లేదు. కల్తీ విత్తనాలు విజృంభిస్తున్నాయి. గతేడాది డిసెంబర్ నెలలో నకిలీ కంది విత్తనాలతో నష్టపోయిన రైతులు పత్తికొండలో ఆందోళన చేపట్టారు. అలాగే గతేడాది ఖరీఫ్ సీజన్లో జూపాడుబంగ్లా, గడివేముల, మిడుతూరు మండలాల్లోని రైతులు నకిలీ విత్తనాలతో తీవ్రంగా నష్టపోయారు. పురుగుమందులు, ఇతరత్రా సేవలు పొందడానికి పట్టణాలకు వెళ్లాల్సి వస్తోంది. ఆర్బీకేల్లో ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబందించిన సేవలను పొందడానికి కియోస్క్లను వినియోగిస్తారు. అయితే ఇవి నిరుపయోగంగా మారాయి. రైతుల నుంచి పంటలను మద్దతు ధరతో కొనుగోలు చేసే ఆర్బీకేలు అసలు లేవు. పంటలు పండకపోయినా రైతులను పలకరించే వారు కరువయ్యారు. -
పెరిగిన ఎండల తీవ్రత
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎండల తీవ్రత పెరిగింది. వడగాడ్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆదివారం పాణ్యంలో 42.7, బనగానపల్లిలో 42.1, నంద్యాలలో 42, దొర్నిపాడు, గడివేములలో 41.8, బండిఆత్మకూరు, రుద్రవరంలో 41.5, కర్నూలులో 41.4, ఆత్మకూరు, పాములపాడులో 41.3, నందికొట్కూరులో 41.1, డోన్లో 41 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న మూడు, నాలుగు రోజుల్లో ఎండలు, వడగాల్పుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని జిల్లా విపత్తుల నిర్వహణ అథారిటీ డీపీఎం అనుపమ తెలిపారు. ఇన్చార్జ్ ఎస్పీగా ఆదిరాజ్ రాణా ● జపాన్ పర్యటనకు వెళ్లిన ఎస్పీ విక్రాంత్ పాటిల్ కర్నూలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్ విదేశీ పర్యటన నిమిత్తం సెలవుల్లో వెళ్లారు. ఈ నెల 4 నుంచి 14వ తేదీ వరకు జపాన్లో పర్యటిస్తారు. పది రోజుల పాటు నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ రాణా ఇన్చార్జ్ బాధ్యతలు నిర్వహిస్తారు. ఆదివారం ఉదయమే ఎస్పీ విక్రాంత్ పాటిల్ జపాన్కు బయలుదేరి వెళ్లారు. భగీరథ మహర్షి పట్టుదల స్ఫూర్తిదాయకం కర్నూలు(సెంట్రల్): భగీరథ మహర్షి పట్టుదల స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా అన్నారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ఆదివారం భగరథ మహర్షి జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. కఠోర శ్రమతో దేనినైనా సాధించవచ్చని భగీరథ మహర్షి నిరూపించడారన్నారు. మహర్షిని యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. గతంలో తాత్కాలికంగా మూసివేసిన హాస్టళ్లను తిరిగి ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. బీసీ విద్యార్థుల కోసం డీఎస్సీ శిక్షణను ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపారు. బీసీ వెల్ఫేర్ అధికారి కె.ప్రసూన, యాదవ కార్పొరేషన్ డైరక్టర్ వెంకటేశ్వరరావు, నాయీబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివ, డైరక్టర్ సత్యన్న, నగర సంఘం అధ్యక్షుడు సత్యన్న తదితరులు పాల్గొన్నారు. మల్లన్న ఆలయంలోని హుండీకి కన్నం? ● కానుకలు చోరీచేసిన నలుగురు ● ఓ ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలోని మల్లికార్జున స్వామి గర్భగుడిలో ఉన్న హుండీకి నలుగురు మైనర్లు కన్నం వేసినట్లు సమాచారం. ఈనెల 1న ఉచిత దర్శన క్యూలైన్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన మైనర్లు గర్భగుడిలోని రత్నగర్భ గణపతి ఆలయం వద్ద ఉన్న (క్లాత్)హుండీని బ్లేడ్తో కోసి, అందులో కొంత డబ్బు తీస్తుండగా దేవస్థాన సూపరింటెండెంట్ పట్టుకున్నట్లు సమాచారం. వారి వద్ద నుంచి సుమారు రూ.10 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. పది రోజుల నుంచి నలుగురు మైనర్లు దర్శనం పేరుతో ఉచిత క్యూలైన్ల ద్వారా ఆలయంలో తరచూ తిరిగినట్లు వెల్లడైంది. ఈఓ ఆదేశాలతో దేవస్థాన సీఎస్ఓ ఫిర్యాదు మేరకు శ్రీశైలం ఒకటో పట్టణ స్టేషన్ ఆఫీసర్ కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సమాచారం. చోరీ విషయమై విధుల్లో అలసత్వం ప్రదర్శించిన సీనియర్ అసిస్టెంట్ను బాధ్యుడిని చేస్తూ సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. శ్రీశైలంలో సండే సందడి శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే గాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు మల్లన్న దర్శనానికి భారీగా తరలివచ్చారు. వేకువజామునే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లికార్జునస్వామివారి దర్శనానికి క్యూలైన్ వద్దకు చేరుకున్నారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. పలువురు భక్తులు ఆన్లైన్ ద్వారా టికెట్లు పొంది స్వామివారి స్పర్శదర్శనం నిర్వహించుకున్నారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులన్నీ కిటకిటలాడాయి. -
సీహెచ్ఓల నిరవధిక సమ్మె
కర్నూలు(హాస్పిటల్): తమ సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో నిరవధిక సమ్మె చేస్తున్నట్లు సీహెచ్ఓలు తెలిపారు. గత వారం రోజులుగా వీరు కర్నూలు నగరంలోని మ్యూజియం (ధర్నా చౌక్) వద్ద ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆరేళ్లు దాటిన సీహెచ్ఓలను క్రమబద్ధీకరించాలని, ఎన్హెచ్ఎంలోని ఇతర ఉద్యోగులతో సమానంగా 23 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలన్నారు. ప్రతి సంవత్సరం 5 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలని, ఆర్థిక, ఆర్థికేతర సమస్యలు తీర్చే విధంగా హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. ఏపీఎంసీఏ జిల్లా అధ్యక్షురాలు చందన, ఉపాధ్యక్షుడు నాగరాజు, నాగేంద్ర, ట్రెజరర్ కార్తీక్, కాంగ్రెస్ నాయకుడు షేక్ జిలానీ బాషా పాల్గొన్నారు. -
పెద్దహరివాణంలో సామూహిక వివాహాలు
ఆదోని రూరల్: పెద్దహరివాణం గ్రామంలో ఆదివారం 55 జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు. గ్రామంలో వెలిసిన శ్రీగర్జిలింగేశ్వరస్వామికి బండార మహోత్సవం నిర్వహించారు. ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ప్రత్యేక పూజల అనంతరం సామూహిక వివాహాలు నిర్వహించారు. నూతన వధూవరులు స్వామి వారికి పూజలు నిర్వహించారు. 12 యేళ్లకు ఒకసారి బండార మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గ్రామపెద్దలు తెలిపారు. నూతన జంటలను ఎమ్మెల్యే పార్థసారథి, మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి ఆశీర్వదించారు. -
ప్రశాంతంగా ‘నీట్’
కర్నూలు సిటీ: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో ఎన్టీఏ ఆదివారం నిర్వహించిన జాతీయ స్థాయి అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ప్రశాంతంగా ముగిసింది. ఎన్టీఏ నిబంధనలను అనుసరిస్తూ విద్యార్థులను గంట ముందుగానే కేంద్రాల్లోకి అనుమతించారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫ్లైన్ విధానంలో పరీక్ష నిర్వహించారు. మొత్తం 4,466 మంది విద్యార్థులు పరీక్ష రాసేందుకు పేర్లు రిజిస్టర్ చేసుకోగా 4,381 మంది హాజరరుకాగా 85 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలకు రెండు గంటల ముందే విద్యార్థులు చేరుకున్నారు. ఎన్టీఏ నిబంధనల మేరకు ప్రతి ఒక్క విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేసి కేంద్రాల్లోకి అనుమతించారు. విద్యార్థినుల ముక్కు పుడకలు, చెవుల దిద్దులు, చేతుల గాజులు, ఆభరణాలను తీయించారు. పరీక్ష కేంద్రాల వెలుపల విద్యార్థులను మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు చేశారు. కర్నూలు నగరంలోని సిల్వర్ జూబ్లీ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన నీట్ యూజీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా తనిఖీ చేశారు. డీఆర్ఓ సి.వెంకట నారాయణమ్మ.. ప్రభుత్వ టౌన్ మోడల్ హైస్కూల్, టౌన్ మోడల్ జూనియర్ కాలేజీ, రాయలసీమ యూనివర్శిటీ ఇంజనీరింగ్ కాలేజీ, ప్రభుత్వ ఐటీఐ బాలిక కాలేజీ(బి.తాండ్రపాడు)లలో ఏర్పాటు చేసిన కేంద్రాలను తనిఖీ చేశారు. జిల్లాలో 16 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహణ 4,381 మంది హాజరు -
రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్రగాయాలు
కోవెలకుంట్ల: కోవెలకుంట్ల– లింగాల ఆర్అండ్బీ రహదారిలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అందించిన సమాచారం మేరకు.. మండలంలోని బిజనవేములకు చెందిన ప్రసాదు సొంత పనుల నిమిత్తం కోవెలకుంట్లకు వెళ్లాడు. తిరిగి బైక్పై ఇంటికి వెళుతుండగా గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రసాదుకు స్థానికులు కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నంద్యాలకు రెఫర్ చేశారు. రోడ్డు ప్రమాద ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. న్యాయం చేయండి సారూ.. డోన్ రూరల్: టీడీపీ నాయకుల నుంచ తమ స్థలాన్ని కబ్జాకు గురికాకుండా కాపాడి న్యాయం చేయాలని ఎద్దుపెంట గ్రామానికి చెందిన విజయ్కుమార్ అధికారులను వేడుకుంటున్నాడు. తన తండ్రి డి.ప్రసాద్ పేరుతో ఇంటి ముందు 1సెంట్ ఖాళీ స్థలం ఉందని విజయ్కుమార్ తెలిపారు. ఆ స్థలాన్ని పక్కనే ఉన్న టీడీపీ నాయకులు కేబీసీ డీలర్ పెద్దన్న, మాజీ సర్పంచ్ బి.ఈశ్వరయ్య, కేబీసీ మల్లేశ్వరయ్య ఆ ఆక్రమించడానికి యత్నిస్తున్నారన్నారు. పోలీసులకు, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోకపోవడంతో కోర్టుకు వెళ్లానన్నారు. కోర్టు కూడా తమకు అనుకూలంగా తీర్చు ఇచ్చినా టీడీపీ నాయకులు దౌర్జన్యంగా రచ్చకట్టపేరుతో నిర్మాణం చేపట్టారని ఆరోపించారు. జిల్లా ఉన్నతాధికారులు తమకు న్యాయం చేయాలని కోరారు. -
విద్యార్థుల చూపు.. ట్రిపుల్ ఐటీ వైపు!
కోవెలకుంట్ల: 2025–26 విద్యా సంవత్సరానికి రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ(ఆర్జీయూకేటీ)కళాశాలల్లో సీట్లు పొందేందుకు విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. గత నెల 23వ తేదీన పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదల కాగా ఇటీవలే ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లాలోని 29 మండలాల పరిధిలో 456 ప్రభుత్వ పాఠశాలలుండగా గత నెలలో విడుదలైన పది ఫలితాల్లో 54 పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. జిల్లాలోని ఆయా పాఠశాలల పరిధిలో 11,794 మంది బాలికలు పరీక్షలు రాయగా 9,954 మంది, 12,702 మంది బాలురకు గాను 10,097 మంది బాలురు వివిధ గ్రేడుల్లో ఉత్తీర్ణత పొందారు. ఆరేళ్ల ఇంటి గ్రేటెడ్ ఇంజినీరింగ్ ప్రోగ్రాంలో భాగంగా రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో ఒక్కో ట్రిపుల్ ఐటీకి వెయ్యి సీట్ల చొప్పున నాలుగు వేల సీట్లను కేటాయించారు. నాణ్యమైన విద్యకు కేరాఫ్గా మారిన ట్రీపుల్ ఐటీల్లో చేరి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకునేందుకు గ్రామీణ, పేద మధ్యతరగతి వర్గాల విద్యార్థులు మక్కువ చూపుతున్నారు. ఈ నెల 20వ తేదీ వరకు దరఖాస్తుకు గడువు ట్రిపుల్ ఐటీ కళాశాలల్లో అడ్మిషన్లు పొందేందుకు గత నెల 24వ తేదీ నోటిఫికేషన్ విడుదల కాగా 27వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉంది. ఎంపికై న అభ్యర్థుల జాబితా జూన్ 6వ తేదీన విడుదల చేయనున్నారు. జూన్ 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించనున్నారు. స్పెషల్ కేటగిరి( పీహెచ్సీ/క్యాప్/ ఎన్సీసీ/స్పోర్ట్స్/భారత్స్కాట్స్) కోటా అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనను ఈ నెల 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నూజివీడు ట్రిపుల్ ఐటీలో నిర్వహించనున్నారు. అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి అయిన అనంతరం జూలై మొదటి వారం నుంచి తరగతులు ప్రారంభించే అవకాశం ఉంది. ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేసిన దివంగత సీఎం వైఎస్సార్ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అత్యున్నత సాంకేతిక విద్యను అందించేందుకు 2008వ సంవత్సరంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఇడుపులపాయ, నూజివీడు, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని బాసరలో ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేశారు. ప్రారంభంలో ఒక్కో కళాశాలకు 2 వేల సీట్లను కేటాయించగా తర్వాతి ప్రభుత్వాలు 2010 నుంచి ఒక్కో ట్రిపుల్ ఐటీలో వెయ్యి సీట్లు ఉండేలా కుదించాయి. 2014 రాష్ట్ర విభజన అనంతరం బాసర ట్రిపుల్ ఐటీ కళాశాల తెలంగాణాకు వెళ్లిపోవడంతో 2016వ సంవత్సరం నుంచి ఏపీలో ఒంగోలు, శ్రీకాకుళం ప్రాంతాల్లో ట్రిపుల్ ఐటీలను ప్రారంభించారు. వీటిలో రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల విద్యార్థులకు సమానంగా సీట్లు కేటాయించాలని యూనివర్సిటీ అధికారులు నిర్ణయించారు. 4 వేల సీట్లలో ఓపెన్ కేటగిరిలో 600 సీట్లను స్థానికేతరులు, తెలంగాణ ఎన్ఆర్ఐలు, తదితరులకు కేటాయిస్తారు. మిగిలిన 3,400 సీట్లను ఉమ్మడి జిల్లాల వారికి సమానంగా పంచనున్నారు. జిల్లాకు కేటాయించే సీట్ల ఆధారంగా మెరిట్ విద్యార్థులకు అవకాశం లభించనుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకే ట్రిపుల్ ఐటీ కళాశాలల్లో ఎక్కువ సీట్లు వచ్చే అవకాశముంది. ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుంది. విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు వెబ్సైట్ అందుబాటులో ఉంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు దరఖాస్తు రుసుం రూ. 200, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఓసీ విద్యార్థులు రూ. 300 చెల్లించాల్సి ఉంది. పేద విద్యార్థుల చదువుకు భరోసా గత ప్రభుత్వ చర్యలతో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు జిల్లాలో 456 ప్రభుత్వ పాఠశాలలు ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేసిన దివంగత సీఎం వైఎస్సార్ పదవ తరగతి మార్కుల ఆధారంగా విద్యార్థుల ఎంపిక ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాలుగు శాతం డిప్రివేషన్ స్కోరు మొదలైన ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ఆన్లైన్ దరఖాస్తుకు ఆఖరు తేది: మే 20 ఎంపికై న అభ్యర్థుల జాబితా విడుదల: జూన్ 6 సర్టిఫికెట్ల పరిశీలన: జూన్ 11 నుంచి 17 వరకు ప్రత్యేక కేటగిరి అభ్యర్థులకు: మే 28 నుంచి 31 వరకు ఏపీలో ట్రిపుల్ ఐటీ కాలేజీలు: ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం మొత్తం సీట్లు: 4వేలు -
ట్రిపుల్ఐటీలో సీటు వస్తుందని భావిస్తున్నా
నేను పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేశాను. ట్రిపుల్ ఐటీలో సీటు సాధించాలన్న తపనతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో కష్టపడి 589 మార్కులు తెచ్చుకున్నాను. మా అన్న ఉసేన్వలి సైతం ట్రిపుల్ ఐటీలోనే బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. – ఉసేన్బాష, పదవ తరగతి మండల టాపర్, కోవెలకుంట్ల పది ఫలితాల్లో 578 మార్కులు వచ్చాయి మాది మధ్యతరగతి కుటుంబం. పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేశాను. గత నెలలో విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో 600 మార్కులకు 578 మార్కులు సాధించి పాఠశాల టాపర్గా నిలిచాను. ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లను నోటిఫికేషన్ విడుదల కావడంతో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నాను. – కరిష్మ, కోవెలకుంట్ల విద్యార్థులు దరఖాస్తు చేసుకోండి 2024–25 విద్యా సంవత్సరంలో పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లను దరఖాస్తులు చేసుకోవాలి. డోన్ డివిజన్ పరిధిలో ఈ ఏడాది 119 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో 6,280 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 4,813 మంది విద్యార్థులు వివిధ గ్రేడుల్లో ఉత్తీర్ణత సాధించారు. పాసైన విద్యార్థులు ఈ నెల 20వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. – వెంకట్రామిరెడ్డి, డిప్యూటీ డీఈఓ, డోన్ -
భారీ అగ్ని ప్రమాదం
డోన్ టౌన్: పట్టణంలోని కంబాలపాడు సర్కిల్ వద్ద ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పక్కన శ్రీరాఘవేంద్ర ఎలక్ట్రానిక్స్ షాపులో శనివారం తెల్లవారుజామున భారీ అగ్రిప్రమాదం చోటుచేసుకుంది. మూసివున్న షాపు నుంచి ఉదయం 4.30 గంటల సమయంలో పోగలు వస్తుండటం గమనించిన స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేసుకుని మంటలను అదుపు చేశారు. షాపులో ఎలక్ట్రానిక్ వస్తువులు కావడంతో మంటలను అదుపు చేయడానికి ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఫైర్ ఇంజిన్తో పాటు రెండు ట్రాక్టరు ట్యాంకర్లతో నీటిని అందుబాటులో ఉంచుకుని మంటలను అదుపు చేసేలోపు ఉదయం 10 గంటలైంది. టీవీలు, ఫ్రిజ్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండీషనర్లు, ఎయిర్ కూలర్లు, టాటా స్కై, వాటర్ ఫిల్టర్లు, ఫ్ల్యాన్లతో పాటు పలు ఎలక్రానిక్ వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. మంటలు ఉవ్వెత్తున ఎగసి పడుతుండటంతో చుట్టపక్కల దట్టమైన పగ కమ్ముకోవడంతో సమీప దుకాణాల యజమానులు భయాందోళన చెందారు. ప్రమాదంపై పలువురి ఆరా.. పట్టణానికి చెందిన ఆర్య వైశ్యుడు నగేష్ గుప్త 40 ఏళ్ల క్రితం బైసాని కృష్ణమూర్తికి చెందిన షాపును అద్దెకి తీసుకుని మొట్టమొదట డోన్లో అతి పెద్ద టీవీల షాపు ప్రారంభించారు. ఇటటీవల ఆయన మరణించగా కుమారుడు కిశోర్ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. హైదరాబాద్లో చదువుతున్న కూతురిని చూసేందుకని కిశోర్ శుక్రవారం రాత్రి వెళ్లగా శనివారం తెల్లవారుజామున ప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ ప్రసాద్గౌడ్, చైర్మన్ సప్తశైల రాజేష్తోపాటు ఆర్యవైశ్య సంఘం నాయకులు అక్కడికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీస్తూ సానుభూతి వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా అగ్నిమాపక అధికారి బాలరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించి డోన్ అగ్నిమాపక కేంద్రం అధికారి రంగస్వామి గౌడ్ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులు బుగ్గి రూ.50 లక్షల నష్టం -
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించండి
కర్నూలు(హాస్పిటల్): శ్రీశైలం దర్శనానంతరం తిరిగి వస్తూ నంద్యాల జిల్లా బైర్లూటి సమీపంలో ప్రమాదానికి గురై గాయపడిన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి అధికారులను జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా ఆదేశించారు. ప్రమాదంలో గాయపడి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని పురుషులు, సీ్త్రల విభాగాల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను శనివారం జిల్లా కలెక్టర్ పరామర్శించారు. ఆందోళన చెందవద్దని, మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. వారి ఆరోగ్య విషయాలను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లును అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట అడ్మినిస్ట్రేటర్ సింధు సుబ్రహ్మణ్యం, నాయీబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ విజయకుమార్, నాయీ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర కార్యదర్శి రంగస్వామి, జిల్లా అధ్యక్షులు వీరన్న ఉన్నారు. -
రేపు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులను సమర్పించుకోవాలని సూచించారు. కలెక్టరేట్తో పాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ ప్రజల ఫిర్యాదులను స్వీరిస్తారని ఆయన పేర్కొన్నారు. పవన్ వ్యాఖ్యలపై ముస్లింల ఆగ్రహం ● నేడు కర్నూలులో ధర్నా కర్నూలు(సెంట్రల్): ‘ముస్లమాన్లందరూ టెర్రరిస్టులే’ అన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముస్లింల చరిత్ర తెలియక లేనిపోని వ్యాఖ్యలు చేయడం ఆయనకు భావ్యం కాదన్నారు. డిప్యూటీ సీఎం మాటలను నిరసిస్తూ ఆదివారం ఉదయం 10 గంటలకు కర్నూలులోని జమ్మిచెట్టు దగ్గర ధర్నా కార్యక్రమాన్ని చేపట్టినట్లు ముస్లిం సంఘాల జేఏసీ నాయకుడు ఎస్ఎండీ షరీఫ్ తెలిపారు. ఎంపీహెచ్ఏల కౌన్సెలింగ్ వాయిదా కర్నూలు(హాస్పిటల్): జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్(మేల్)ల కౌన్సెలింగ్ వాయిదా పడింది. శనివారం నిర్వహించాల్సిన రీ డిప్లాయ్మెంట్ కౌన్సెలింగ్లో పలువురు హెల్త్ అసిస్టెంట్లు కొన్ని సందేహాలను లేవనెత్తారు. అన్ని జిల్లాల్లో ఉమ్మడి జిల్లాగా జాబితాను వేసి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారని, ఇక్కడ మాత్రమే కేవలం కర్నూలు జిల్లా జాబితాను తయారు చేశారని చెప్పారు. దీంతో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ వివరణ తీసుకుని డీఎంహెచ్వో డాక్టర్ పి.శాంతికళ కౌన్సెలింగ్ను వాయిదా వేశారు. ముగ్గురికి జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కర్నూలు(అర్బన్): జిల్లాలోని వివిధ జెడ్పీ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు రికార్డు/లైబ్రరీ/ ల్యాబ్ అసిస్టెంట్లకు జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి లభించింది. వీరిని మండల పరిషత్ కార్యాలయాలు, పాఠశాలలకు కేటాంచినట్లు జెడ్పీ సీఈఓ జీ నాసరరెడ్డి తెలిపారు. ఎన్.కొత్తపల్లి జెడ్పీహెచ్ఎస్లో రికార్డు అసిస్టెంట్గా పనిచేస్తున్న ఎస్.వీరశేఖర్రాజును జెడ్పీహెచ్ఎస్ బలపనూరుకు, దేవనకొండ నుంచి ఎం.అన్వర్సాదత్ను జూపాడుబంగ్లా ఎంపీపీ కార్యాలయానికి, బనగానపల్లె నుంచి ఎస్.జాకీర్హుసేన్ను ఎంపీపీ కోవెలకుంట్లకు పదోన్నతిపై బదిలీ చేసినట్లు సీఈఓ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో వాహన తనిఖీలు కర్నూలు: జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్లు వాహన తనిఖీలు నిర్వహించారు. రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా ప్రతి శనివారం రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో పోలీసు అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని, బైకులు నడిపేవారు కచ్చితంగా హెల్మెట్లు ధరించాలని తనిఖీల సందర్భంగా అవగాహన కల్పించారు. ఓవర్ స్పీడ్, ఓవర్ లోడ్తో వెళ్తున్న వాహనాలను ఆపి తనిఖీ నిర్వహించారు. స్పెషల్ డ్రైవ్లో మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై 170 కేసులు నమోదు చేశారు. అక్రమ కుళాయి కనెక్షన్ తొలగింపు ఆలూరు: మొలగవెల్లి గ్రామంలో దేవాలయ నీటిని టీడీపీ నాయకుడు ఇంటికి తరలిస్తుండగా అధికారులు స్పందించారు. మంచినీటి కుళాయి కనెక్షన్ను శనివారం తొలగించారు. భక్తులకు ఇచ్చే నీటిని అక్రమ కనెక్షన్తో టీడీపీ నాయకుడు తన ఇంటికి తరలిస్తున్నాడు. ‘సాక్షి’ దినపత్రికలో శుక్రవారం వార్త ప్రచురితం కావడంతో జిల్లా, డివిజనల్ పంచాయతీ అధికారులు స్పందించారు. వెంటనే కుళాయి కనెక్షన్ తొలగించాలని పంచాయతీ కార్యదర్శి వెంకటనాయుడిని ఆదేశించారు. పంచాయతీ సిబ్బంది రామాంజనేయులుతో కలసి కుళాయి కనెక్షన్ తొలగించారు. -
హాయిగా నవ్వండి...!
ఒకప్పుడు నవ్వు నాలుగు విధాలా చేటు అనేవారు. ఇప్పుడు నవ్వడం భోగం.. నవ్వించడం యోగం.. నవ్వలేకపోవడం రోగం అంటున్నారు. నిత్యం సమస్యలతో సతమతమయ్యే వారిని మనసారా నవ్వుతూ పలకరిస్తే వారికి కొండంత బలం, ధైర్యం వస్తుంది. వ్యాధులతో బాధ పడేవారిని సైతం నవ్వించేందుకు ఇటీవల లాఫింగ్ క్లబ్లు కూడా ఏర్పాటయ్యాయి. అందులో నవ్వడం కూడా ఒక వ్యాయామంగా శిక్షణ ఇస్తున్నారు. అందుకే మే మొదటి ఆదివారం ప్రపంచ నవ్వుల దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. – కర్నూలు(హాస్పిటల్) ఎవరైనా ఫొటోలు దిగేటప్పుడు ఫొటోగ్రాఫర్ ‘స్మైల్ ప్లీజ్’ అంటుంటారు. నవ్వితే ముఖం మరింత అందంగా కనిపించి ఫొటో బాగా వస్తుందని వారి భావన. భావనే కాదు నిజం కూడా. మనం అద్దంలో చూసుకునేటప్పుడు ముఖాన్ని కోపంగా కంటే నవ్వుతూ చూస్తున్నప్పుడే ఎంతో అందంగా కనిపిస్తామన్నది అందరికీ తెలిసిందే. అందుకే శుభకార్యాల్లో బంధువులు, స్నేహితులు ఎవ్వరైనా కనిపిస్తే వెంటనే చిరునవ్వుతో పలకరిస్తాం. కేవలం ఫొటో కోసమే గాకుండా చిరునవ్వు జీవితమంతా కొనసాగిస్తే మరింత అద్భుతంగా ఉంటుందని మేధావులు సెలవిస్తున్నారు. నవ్వు ముఖ కవళికలపై, వారి భావోద్వేగాలపై ప్రభావం చూపుతాయని వారు పేర్కొంటున్నారు. నవ్వు ఒక మంచి అనుభూతే కాదు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే వ్యాయామం కూడా. ఒత్తిడి నుంచి శారీరక, మానసిక బాధల నుంచి నవ్వు ఉపశమనం కలిగిస్తుంది. నవ్వడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. నవ్వుతో మానసిక ఉల్లాసం నవ్వవయ్య బాబూ నీ సొమ్మేం పోతుంది.. అనేది ఓ సినీగీతం. నిజమే నవ్వితే మీ సొమ్ము ఏమీ పోదు. నవ్వడానికి పైసా ఖర్చులేదు. ఎప్పుడైనా మనసారా నవ్వినప్పుడు మనలో కలిగే ఆనందం, ఆహ్లాదం అంతా ఇంతా కాదు. ఇటీవల సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బ్లస్టర్ అయిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇతర సినిమాల్లో హింస ఎక్కువగా ఉండటం, ఇటీవల కాలంలో అన్నీ ఇలాంటి సినిమాలే రావడంతో జనం కామెడీకి దూరం అయ్యారు. ఇలాంటి సమయంలో వచ్చిన వెంకటేష్ సినిమాల్లో కావాల్సిన కామెడీ దక్కింది. అందుకే కుటుంబ సమేతంగా ఈ సినిమాను చూసి జనం ఎంజాయ్ చేశారు. ఇప్పటికీ టీవీ చానల్స్లో కొన్నింటిలో కేవలం కామెడీ సన్నివేశాలే ప్రదర్శిస్తూ ఉంటారు. రాత్రి నిద్రించే ముందు ఇలాంటి దృశ్యాలు చూస్తే ఆందోళన తగ్గి హాయిగా నిద్ర పడుతుందని వైద్యులు చెబుతున్నారు. నవ్వులో ఆరోగ్య రహస్యాలు చిరునవ్వుతో మానసిక, శారీరక ఉల్లాసం పలు రకాల జబ్బులు దూరం మానవ సంబంధాలు మెరుగు నేడు ప్రపంచ నవ్వుల దినోత్సవం హాయిగా నవ్వితే మన శరీరంలో ఎండార్ఫిన్స్ విడుదలవుతాయి. నోట్లో చిగుళ్ల, దంతాల ఆరోగ్యం బాగుంటుంది. రక్తపోటు తగ్గుతుంది. మొహం వెలిగిపోతుంది. ముఖ కండరాలు బాగా పనిచేస్తాయి. నవ్వటానికి పదిహేను కండరాలు పనిచేస్తే.. మొహం చిట్లించడానికి దాదాపు 72 కండరాలు పనిచేయాల్సి ఉంటుంది. ఇందులో ఏది మేలో మీరే తేల్చుకోవాలని వైద్యులు చెబుతున్నారు. నవ్వితే శరీరం మొత్తం రిలాక్స్ అవుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఒత్తిడి తగ్గి గుండెజబ్బుల నుంచి దూరం చేస్తుంది. వాటి రక్తప్రసరణ బాగై రక్తనాళాల పనితీరు మెరుగవుతుంది. హాయిగా రోజుకు 10 నుంచి 15 నిమిషాలు నవ్వడం వల్ల 40 క్యాలరీల వరకు ఖర్చువుతాయని వైద్యులు చెబుతున్నారు. ఎప్పుడూ నవ్వుతూ జీవించే వారి రక్తంలో ఆక్సీజన్ శాతం పెరిగి, జ్ఞాపకశక్తి ఇనుమడిస్తుందని, వారి ఆయుప్రమాణాలు కూడా పెరుగుతాయంటున్నారు. నవ్వు కోపాన్ని కూడా తగ్గించడమే గాక ఆందోళనను దూరం చేస్తుంది. లాఫింగ్ థెరపీతో క్యాన్సర్ జయించిన వాళ్లు ఎంతో మంది ఉన్నారని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రపంచం పట్ల(అంటే మనుషుల పట్ల) ప్రేమతో ఉంటూ, కనీసం ఒక్కర్నైనా నవ్వించాలని మనుషులకు సందేశం ఇచ్చాడు హార్వేబాల్. అయితే ఎదుటి వ్యక్తి బాధలో ఉన్నప్పుడు నవ్వితే మాత్రం ఇబ్బందులు తప్పవు. మనపై మనం జోకులు వేసుకుని నవ్వితే మేలు. ఇతరులపై జోకులు వేసి నవ్వితే కొన్నిసార్లు పరిస్థితులు వికటించవచ్చు. నవ్వుతూ పలకరిస్తే దగ్గరవుతారు సాధ్యమైనంత వరకు మన ముఖంలో చిరునవ్వు కనిపించాలి. అలాగని పనిచేయించాల్సిన చోట కూడా చిరునవ్వుతో ఉంటే జోకర్గా భావించి పనిచేసేవారు లెక్కచేయరు. ఇతరులతో స్నేహాన్ని కొనసాగించాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా నవ్వును మించిన ఆయుధం లేదు. మనసులో బాధలు ఎన్ని ఉన్నా చిరునవ్వుతో కనిపించాలి. అలాగుంటేనే అందరూ మన వద్దకు ధైర్యంగా వస్తారు. – గోవిందు, హెల్త్ ఇన్స్పెక్టర్, జీజీహెచ్, కర్నూలు నవ్వు దేవుడిచ్చిన వరం మనిషికి నవ్వడం ఆదేవుడిచ్చిన వరం. నవ్వడం వల్ల పాజిటివ్ థింకింగ్ అలవడతుంది. దీనివల్ల ఆరోగ్యంతో పాటు ఆయుష్షు పెరుగుతుంది. హాయిగా నవ్వుతూ ఉంటే అనారోగ్యాలు దరిచేరవు. చిరునవ్వుతో పలకరిస్తే ఎంతటి వారైనా ఫిదా కావాల్సిందే. నవ్వు, నడక, నడత, నమ్రత...ఈ నాలుగు ఉంటే మందులు అవసరం లేని ఆరోగ్యం మన సొంతం. తరచూ నవ్వుతూ ఉంటే ఆరోగ్యానికే మేలు. –వాసుదేవరావు, మెడికల్ రెప్, కర్నూలు హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి కోపం, బాధపడటంతో పాటు నవ్వు కూడా ఒక భావోద్వేగం. నవ్వడం వల్ల మెదడులో కెరోటినిన్, డోపమైన్ అనే రసాయనాలు(హ్యాపీ హార్మోన్స్) విడుదలవుతాయి. దీంతో పాటు రిలాక్సేషన్ హార్మోన్లు కూడా విడుదలవుతాయి. ఈ కారణంగా శరీరంలో అన్ని వ్యవస్థలు కుదుటపడతాయి. మానసిక ఒత్తిళ్లు తగ్గిపోతాయి. కొన్నిరకాల మానసిక వ్యాధులూ తగ్గుతాయి. –డాక్టర్ సరయురెడ్డి, జనరల్ ఫిజీషియన్, కర్నూలు -
గడ్డి వామి పడి బాలుడి మృతి
తుగ్గలి: గడ్డి వామి మీద పడి ఓ బాలుడు మృతిచెందిన ఘటన శనివారం మండలంలోని రాంపల్లిలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన బుచ్చి రామాంజిని, సరస్వతి దంపతుల కుమారుడు 7వ తరగతి చదివే దివ్యాంగుడు రమేష్(13) పశువుల మేతకోసం వామిదొడ్డికి వెళ్లాడు. అక్కడ గడ్డివామి తవ్వుతుండగా వామి పైకప్పు మీద పడి ఊపిరాడక మృతి చెందారు. కుమారుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు వామిదొడ్డికి వెళ్లి గాలించారు. అక్కడ గడ్డివామి పైకప్పు కింద పడి పోవడాన్ని చూసి అనుమానంతో గడ్డిని తొలగించి చూడగా విగతజీవిగా పడిఉండటంతో బోరున విలపించారు. కేశఖండనకు వెళ్తూ తిరిగి రాని లోకాలకు.. ● రోడ్డుప్రమాదంలో యువకుడి దుర్మరణం పాణ్యం: మేనల్లుడి కేశఖండన కోసం వెళ్తూ ఓ యువకుడు బైక్ అదుపు తప్పిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. హైవే పోలీసులు తెలిపిన వివరాలు.. కేఆర్ఆర్ తండాకు చెందిన శంకర్నాయక్, మంగీబాయి కుమారుడు జానవత్ మనోజ్నాయక్(28) తన సోదరి కుమారుడు (మేనల్లుడి) కేశఖండన వచ్చే మంగళవారం నంద్యాలలో ఉండటంతో ఏర్పాట్ల నిమిత్తమని శనివారం మధ్యాహ్నం బయలుదేరాడు. మండల కేంద్రంలోని ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద బైక్ అదుపు తప్పి కిందపడ్డాడు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. రెండేళ్ల క్రితం దిగుబడి సరిగా రాలేదనే మనస్తాపంతో భర్త ఆత్మహత్య చేసుకోవడం, ఇప్పుడు కుమారుడు రోడ్డుప్రమాదంలో మృతిచెందడంతో మంగీబాయి, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. మృతుడికి తల్లితోపాటు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల జీజీహెచ్కు తరలించారు. ఓబులాపురం మిట్ట వద్ద.. డోన్ రూరల్: మండల పరిధిలోని ఓబులాపురం మిట్ట వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓబులాపురం గ్రామానికి చెందిన షేక్లాలు(52) మృతి చెందాడు. కాశిరెడ్డినాయన ఆలయం వద్ద నుంచి 44వ జాతీయ రహదారిని దాడుతుండగా కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
నేడు ఆఫ్లైన్లో నీట్ పరీక్ష
కర్నూలు(సిటీ): వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి ఎన్టీఏ ఆదివారం నిర్వహించనున్న జాతీయస్థాయి అర్హత ప్రవేశ పరీక్ష(నీట్)కు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో 16 పరీక్షా కేంద్రాల్లో 4,466 మంది, నంద్యాల జిల్లాలో 1,172 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు ఆఫ్లైన్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకునేందుకు సమయానికి బస్సులు, ప్రతి కేంద్రంలో దివ్యాంగుల కోసం వీల్చైర్లు ఏర్పాటు చేశారు. కర్నూలు నగర శివారులోని ట్రిపుల్ఐటీడీఎంలో ఏర్పాటు చేసిన కేంద్రానికి ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎన్టీఏ నిబంధనల మేరకు ప్రతి ఒక్క విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సి ఉండటంతో విద్యార్థులు కనీసం రెండు గంటల ముందుగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని పరీక్ష నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ప్రకటించింది. వస్త్రధారణపై ఆంక్షలు ● నీట్కు హాజరయ్యే విద్యార్థుల వస్త్రధారణపై ఎన్టీఏ కఠినమైన ఆంక్షలు విధించింది. విద్యార్థినులు జీన్స్ ప్యాంట్లు వంటి వస్త్రాలను ధరించకూండా, సాధారణ దుస్తుల్లోనే రావాల్సి ఉంటుంది. తలకు టోపీ, కళ్లకు బ్లాక్ సన్గ్లాసెస్ ధరించకూడదు. విద్యార్థినులు ముక్కుపుడక సహా చెవులకు దిద్దులు, చేతులకు గాజులతో పాటు ఎలాంటి ఆభరణాలను ధరించరాదు. ● చేతికి స్మార్ట్, సాధారణ వాచీలను సైతం ధరించరాదు. సమయాన్ని తెలుసుకునేందుకు వీలుగా పరీక్షా కేంద్రాల్లోని గదుల్లో గడియారాలను ఏర్పాటు చేశారు. ● బ్లూటూత్ వాచీలు, సెల్ఫోన్లు, స్మార్ట్ బ్యాండ్లు, పెన్నులు సహా ఇతర ఎలాంటి వస్తువులను విద్యార్థులు తమ వెంట తీసుకురాకూడదు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి నాలుగు బస్సులు జగన్నాథగట్టులోని ట్రిపుల్ ఐటీలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రానికి చేరుకునేందుకు కర్నూలు కొత్త బస్టాండ్ నుంచి నాలుగు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఈ బస్సులు ఉదయం 10.30, 11.15, 11.45, 12.15 గంటల సమయంలో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట భద్రత కర్నూలు: నీట్ యూజీ 2025 పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. జిల్లా కేంద్రంలోని 16 పరీక్షా కేంద్రాల వద్ద ఆదివారం నిర్వహిస్తున్న నీట్ పరీక్షకు 210 మంది పోలీసులను బందోబస్తు విధులకు నియమించినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ శనివారం తెలిపారు. ప్రతి కేంద్రానికి ఒక సీఐ లేదా ఎస్ఐ స్థాయి పోలీసు అధికారిని నియమించారు. ట్రాఫిక్ వల్ల విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ సిబ్బందికి ఎస్పీ సూచించారు. పరీక్షా కేంద్రాల సమీపంలో జిరాక్స్ దుకాణాలు మూసివేసేలా చర్యలు చేపట్టారు. ఉమ్మడి జిల్లాలో 20 పరీక్ష కేంద్రాలు -
శ్వేత వర్ణంతో ఆనందిం‘చేను’
భానుడు భగభగ మంటున్నాడు.. ఎండలు మండుతున్నాయి.. నెత్తిమీద టవాల్ వేసుకుని రైతులు బయటకు వెళ్లాల్సి వస్తోంది. అయితే పొలంలో ఉండే పంట పరిస్థితి ఏమిటని రైతు మద్దిలేటి రెడ్డి ఆలోచించాడు. ఎండలకు పంట దెబ్బతినకుండా, తెగుళ్లబారిన పడకుండా వినూత్న ప్రయోగం చేశారు. కాయల నాణ్యత తగ్గకుండా తోటలో దానిమ్మ చెట్లకు గ్రో కవర్ తొడిగారు. దీనిని గుజరాత్ నుంచి తెప్పించారు. ఎకరాకు 10 టన్నులు దిగుబడి వస్తుందని, పెట్టుబడికి రూ.1.5 లక్షలు ఖర్చవుతుందని రైతు చెప్పారు. తుగ్గలి మండలం తువ్వదొడ్డి గ్రామ సమీపంలో మొత్తం 10 ఎకరాల్లో దానిమ్మ తోట శ్వేత వర్ణంతో అందరినీ ఆకర్షిస్తోంది. – తుగ్గలి -
అమ్మా.. నేనేమి చేశాను నేరం?
కోడుమూరు రూరల్: బకెట్లోని ఈ మృతశిశువును చూస్తే ‘అమ్మా.. నేనేమి నేరం చేశాను. నీవు చేసిన తప్పును కప్పి పుచ్చుకునేందుకు పురిట్లోనే నన్ను ఈ లోకం నుంచి దూరం చేశావా’ అన్నట్లంది కదూ.. స్థానిక సంతమార్కెట్ ప్రాథమిక పాఠశాల వద్ద శనివారం సాయంత్రం మృత మగ శిశువును మాయతో పాటు ఎవరో బకెట్లో ఉంచి వదిలి వెళ్లారు. ఈ విషయం పట్టణంలో దావానలంలా వ్యాపించడంతో ప్రజలు పెద్దఎత్తున అక్కడికి చేరుకుని నెలలు నిండక ముందే అబర్షన్ చేయించి ఉండవచ్చని కొందరు.. పురిటిలోనే చనిపోవడంతో వదిలేసి పోయారని ఇంకొందరూ చర్చించుకున్నారు. మరికొందరు మాత్రం మగ మృత శిశువును వదిలించుకోవడానికి మనసెట్ల వచ్చిందో అంటూ శాపనార్థాలు పెట్టారు. వృద్ధుడి ఆత్మహత్య కొలిమిగుండ్ల: మండల పరిధిలోని అంకిరెడ్డిపల్లెలో ఓ వ్యక్తి శనివారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలిల మేరకు.. గ్రామానికి చెందిన చాకలి రాముడు (67) పనికి వెళ్లకుండా మద్యానికి బానిసయ్యాడు. దీంతో కుమారుడు కొత్త రాయుడు తండ్రిని మందలించాడు. మనస్తాపానికి లోనైన అతను జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరివేసుకున్నాడు. కొద్ది సేపటి తర్వాత కుటుంబ సభ్యులు గమనించి చూడగా అప్పటికే మృతి చెందాడు. పొలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతికి గల కారణాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ఎర్రకోట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
ఎమ్మిగనూరు రూరల్: మూలమలుపే మృత్యువైంది. క్షణాల్లో ఇద్దరి ప్రాణాలను గాల్లో కలిపేసింది. రెప్పపాటు కాలంలోనే ఒకరి తలను మొండెం నుంచి వేరు చేసి.. మరొకరి తలలోని మెదడును ఛిద్రం చేసింది. ఇంతటి ఘోర రోడ్డుప్రమాదం ఎర్రకోట గ్రామ సమీపంలో విద్యుత్ సబ్ స్టేషన్ మూలమలుపు వద్ద శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని కడిమెట్ల గ్రామానికి చెందిన బోయ కేశన్న(32) సొంత పని నిమిత్తం ఎమ్మిగనూరుకు వచ్చాడు. సాయంత్రం స్వగ్రామానికి వెళ్లేందుకు వేచి చూస్తుండగా.. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంకు చెందిన రజాక్(35) ఎడ్ల కొమ్ములు నునుపు చేసేందుకని బైక్పై ఎమ్మిగనూరుకు వచ్చాడు. ఇదే వృత్తి నిమిత్తం రజాక్ కడిమెట్లకు వెళ్తుండగా కేశన్న కూడా అతని బైక్ ఎక్కాడు. ఇద్దరూ కలిసి కడిమెట్లకు బయలుదేరారు. ఎర్రకోట సమీపంలోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్దకు రాగానే మూలమలుపు ఉండటంతో కర్నూలు నుంచి ఆదోనికి మద్యం బాక్సులతో వెళ్తున్న బొలెరో వాహనం వేగంగా బైక్ను ఢీకొంది. ప్రమాదంలో రజక్ తల తెగి పడింది. కేశన్న తలలోని మెదడు బయటకు వచ్చింది. కొన ఊపిరితో ఉన్న కేశన్న ప్రభుత్వాసుపత్రికి తరలించగా కొద్దిసేపటికే మృతి చెందాడు. కేశన్నకు భార్య శారద, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. రజాక్ కుటుంబ వివరాలు తెలియాల్సి ఉంది. రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రూరల్ ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు.ఘటనా స్థలంలో రోడ్డుపై చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలుకేశన్న మృతదేహం రజాక్(ఫైల్) -
‘పది’ సంతోషం.. దారిలోనే మాయం!
బొలెరో బోల్తా ఘటనలో ఐదుకు చేరిన మృతులు ● ఎర్రబాడు గ్రామంలో అలుముకున్న విషాదం గోనెగండ్ల: పదో తరగతి పాసైన సంతోషంలో శ్రీశైలానికి వెళ్లొస్తుండగా జరిగిన ప్రమాదంలో విద్యార్థి మృత్యువాతపడ్డాడు. ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించగా, విద్యార్థి కురువ కుమార్ చికిత్స పొందుతూ కోలుకోలేక మరణించాడు. వివరాలివీ.. ఎర్రబాడు గ్రామానికి చెందిన సునిల్కు భార్య సునిత, ఇద్దరు కుమారులు సంతానం. సునిల్కు బొలెరో వాహనం ఉంది. భార్య గ్రామంలో కూలీ పనులు చేస్తోంది. పెద్ద కుమారుడు కుమార్ సున్నిపెంటలోని గురుకుల పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేశాడు. చిన్న కుమారుడు గ్రామంలోనే ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో కుమార్ 514 మార్కులు సాధించాడు. ఎర్రబాడు గ్రామానికి చెందిన చంద్రమ్మకు ఆదోనికి చెందిన వ్యక్తితో వివాహమైంది. ఈ నేపథ్యంలో సునీల్ బొలెరో వాహనాన్ని ఆదోని చెందిన వారు శ్రీశైలానికి వెళ్లేందుకు బడుగకు మాట్లాడుకున్నారు. తన కుమారుడు కూడా పదిలో మంచి మార్కులు సాధించడంతో కుమార్ను కూడా తండ్రి సునీల్ తన వెంట తీసుకెళ్లాడు. శ్రీశైలంలో స్వామి అమ్మవార్లను దర్శించుకొని శుక్రవారం తిరిగి ఆదోనికి పయనమయ్యారు. మార్గమధ్యంలో ఆత్మకూరు మండలం సిద్దాపురం చెరువు సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనానికి దారి ఇవ్వబోగా బొలెరో టైరు జారింది. వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి పల్టీకొట్టింది. ప్రయాణికులంతా చెల్లాచెదురుగా పడిపోయారు. ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 14 మంది గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గోనెగండ్ల మండలం ఎర్రబాడు గ్రామానికి చెందిన కుమార్ కోలుకోలేక శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందాడు. పదవ తరగతిలో మంచి మార్కులు సాధించిన కుమారుడు కళ్ల ముందే చనిపోవడంతో తల్లిదండ్రుల రోదన మిన్నంటింది. శనివారం ఉదయం ఎర్రబాడు గ్రామంలో కుమార్ అంత్యక్రియలు నిర్వహించారు. -
బాలుడిని బలిగొన్న నీటి గుండం
● మద్దిలేటి నరసింహస్వామి ఆలయంలో అపశ్రుతి బేతంచెర్ల: మండల పరిధిలోని వైష్ణవ పుణ్యక్షేత్రం మద్దిలేటి నరసింహస్వామి ఆలయ ఆవరణలోని నీటి గుండం ఓ బాలుడిని బలితీసుకుంది. క్షేత్ర పరిధిలోని నీటి గుండంలో పడి అంబాపురం గ్రామానికి చెందిన జూలకంటి రామాంజనేయులు, పుల్లమ్మ దంపతుల పెద్ద కుమారుడు 9వ తరగతి చదివే మణిధర్ (14) మృతిచెందాడు. తన మేనమామ పిల్లల పుట్టు వెంట్రుకల కార్యక్రమానికి హాజరైన మణిధర్.. మరో ఇద్దరు చిన్నారులతో కలిసి నీటి గుండంలో సరదాగా ఈతకు దిగారు. ఈత రాకపోవడంతో మణిధర్ నీటిలో మునిగి గల్లంతయ్యాడు. వెంట ఉన్న చిన్నారులకు కూడా ఈత రాకపోవడంతో కాపాడలేకపోయారు. బంధువులు, కుటుంబ సభ్యులు నీటి గుండం వద్దకు చేరుకుని గాలించినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న డోన్ ఆర్డీఓ నరసింహులు, బేతంచెర్ల సీఐ డి.వెంకటేశ్వరరావు, తహసీల్దార్ ప్రకాశ్బాబు ఘటనా స్థలానికి చేరుకొని బనగానపల్లె ఫైర్ సిబ్బంది, గజ ఈతగాళ్లను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి 7గంటల సమయంలో మణిధర్ మృతదేహాన్ని వెలికితీశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
రోడ్డుప్రమాదంలో మహిళ మృతి
ఆస్పరి: మండల కేంద్రమైన ఆస్పరి సమీపంలో శనివారం ఆటోను స్కూటర్ ఢీకొట్టడంతో కోసిగికి చెందిన కోసిగమ్మ (50) దుర్మరణం చెందగా స్కూటరిస్టు మహమ్మద్ జాకీర్కు తీవ్రగాయాలయ్యాయి. సీఐ మస్తాన్వలి తెలిపిన వివరాలు.. అనారోగ్యంతో బాధపడుతున్న బంధువులను పరామర్శించేందుకని కోసిగికి చెందిన కోసిగమ్మతోపాటు మరో ఆరుగురు ఆటోలో పత్తికొండకు వెళ్లారు. పరామర్శించిన అనంతరం తిరుగు ప్రయాణమయ్యారు. ఆస్పరి సమీపంలోకి రాగానే ఆస్పరిలోని ఓ డాబాలో పనిచేస్తున్న బిహార్ యువకుడు మహమ్మద్ జాకీర్ బైక్పై పత్తికొండ వైపు వెళ్తూ ఆటోను ఢీకొట్టాడు. ప్రమాదంలో ఆటో చివరలో కూర్చున్న కోసిగమ్మ ఎగిరి కింద పడి తీవ్రంగా గాయపడింది. స్కూటరిస్టు మహమ్మద్ జాకీర్ సృహ తప్పి పడిపోయాడు. ఇద్దరినీ ఆస్పరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలిస్తుండగా మార్గమధ్యలో కోసిగమ్మ మృతిచెందింది. ప్రథమ చికిత్స అనంతరం మహమ్మద్ జాకీర్ను ఆదోనిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కోసిగమ్మ సోదరుడు కోసిగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతురాలికి గతంలోనే భర్త మృతిచెందగా ఇద్దురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. స్కూటరిస్ట్కు తీవ్రగాయాలు -
పెద్దపులి మృతిపై దర్యాప్తు ప్రారంభం
కొత్తపల్లి: మండలంలోని నల్లమల అడవిలో దేవరసెల ప్రాంతంలో పెద్దపులి మృతి ఘటనపై ఎన్ఎస్టీఆర్ ఫీల్డ్ డైరెక్టర్(కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్) కృష్ణమూర్తి శుక్రవారం దర్యాప్తు ప్రారంభించారు. పెద్దపులి మృతి చెందిన దేవరసెల ప్రాంతానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. సిబ్బందితో కలిసి అటవీ ప్రాంతంలో కలియతిరిగారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పెద్దపులిది సహజ మరణమా, మరేదైనా కారణమా అనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. మృతిచెందిన పులి నుంచి సేకరించిన శాంపిళ్లను పరీక్షల కోసం ల్యాబ్కు పంపించామన్నారు. రిపోర్టు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామన్నారు. 2004లో ఈ ప్రాంతంలోనే ఓ పులి ఉచ్చులకు చిక్కుకొని గాయపడగా చికిత్స అందించి అటవీ ప్రాంతంలోనే వదిలేశామన్నారు. అదే పులి ఏమైనా అనారోగ్యంతో మృతి చెందిందా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉందన్నారు. కాగా అటవీ అధికారులను కూడా మందలించినట్లు తెలిసింది. ప్రొటెక్షన్ వాచర్లను విధులకు పంపి కార్యాలయాలకే పరిమితమవుతుండటంతోనే పులులు, వన్యప్రాణులకు రక్షణ కరవైందని, మరోసారి ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకోవాలని హెచ్చరించినట్లు సమాచారం. కార్యక్రమంలో డీఎఫ్ఓ సాయిబాబా, ఎఫ్ఆర్ఓ పట్టాభి, ఎఫ్ఎస్ఓ కావేరి, అటవీ శాఖ వైద్యులు ఉన్నారు. సారా తయారీ మానుకోకుంటే పీడీ యాక్ట్ కర్నూలు: నాటుసారా తయారీ, రవాణా, విక్రయాలు చేయడం చట్టరీత్యా నేరమని, మానుకోకపోతే పీడీ చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపుతామని కర్నూలు ఎకై ్సజ్ సీఐ చంద్రహాస్ హెచ్చరించారు. నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కల్లూరు మండలం ఓబులాపురం తండాలో నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. సారా బట్టీలను ధ్వంసం చేసి దాదాపు 1600 లీటర్ల బెల్లం ఊట, 30 లీటర్ల నాటుసారాను నేలపాలు చేశారు. గ్రామంలో సారా తయారీదారులతో సమావేశం నిర్వహించి ఇకపై సారా విక్రయాలకు స్వస్తి పలుకుతామని ప్రమాణం చేయించారు. పీడీ చట్టం కింద కేసు నమోదు చేస్తే శిక్ష కఠినంగా ఉంటుందని హెచ్చరించారు. సారా బట్టీలు ఎవరు నడుపుతున్నారనేది దర్యాప్తులో తేలితే వారిపై కూడా కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ముళ్ల కంపల మధ్యలో ప్లాస్టిక్ బిందెల్లో నిల్వ చేసిన బెల్లం ఊటను కూడా పారబోసి తయారీదారులను హెచ్చరించారు. -
జ్వాలాపురం సందర్శించిన అధికారులు
బనగానపల్లె రూరల్: మండలంలోని జ్వాలాపురం గ్రామ సమీపంలో ఉన్న కొండలను నంద్యాల ఆర్డీఓ నరసింహులు, అనంతపురం, కర్నూలు పురావస్తు శాఖ ఏడీ డాక్టర్ వి రజిత, జిల్లా పర్యాటకశాఖ అధికారి సత్యనారాయణ, డీపీఓ శివారెడ్డి తదితరులు శుక్రవారం సందర్శించారు. 74 వేల ఏళ్ల క్రితం ఇండోనేషియా దేశంలోని సుమత్రా దీవిలో తోబా అగ్నిపర్వతం మహా విస్పోటనం చెందడంతో ఎగసి పడిన బూడిద గ్రామ పరిసర ప్రాంతాల్లో పడినట్లు పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించడం తెలిసిందే. ఇక్కడి భూమిలో వ్యవసాయ పంటలు పండించుకోవడంతో పాటు మైనింగ్ కార్యకలాపాల వల్ల బూడిద ఆనవాళ్లు చెదిరిపోయే ప్రమాదముందని, మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉండటంతో భూ పొరలను, మట్టిని, నేలను ధ్వంసం చేయకూడదని అధికారులు గ్రామస్తులకు సూచించారు. ఈ ప్రాంతాన్ని జ్వాలాపురం సర్క్యూట్గా అభివృద్ధి చేయడంతో పాటు సమీపంలోనే దద్దణాల ప్రాజెక్టు ఉండడంతో టూరిజం స్పాట్గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదించనున్నామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ నారాయణరెడ్డి, ఎంపీడీఓ వెంకటరమణ, అసిస్టెంట్ జియాలజిస్టు రవికుమార్, భూగర్భ గనుల శాఖ టెక్నికల్ అసిస్టెంట్ పద్మ, ఈఓఆర్డీ సతీష్కుమార్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి శకుంతల, వీఆర్ఓ గోవిందప్ప పాల్గొన్నారు. -
ధ్వజారోహణం.. దేవతాహ్వానం
ఆళ్లగడ్డ: సత్యలోకానికి సంకేతంగా కోటి సూర్యతేజస్సుతో వెలిగిపోయే గరుడ ఆళ్వార్లను మంత్రపూర్వకంగా ఆహ్వానించే ధ్వజారోహణం.. తనువు మనసు పులకించిపోతుండగా దేవదేవుడి వాహనమైన గరుత్మంతుని ద్వారా దేవతలను ఆహ్వానించే దేవతాహ్వానం.. భేరీపూజ.. లను ఎగువ అహోబిలంలో శుక్రవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. మహా పుణ్యక్షేత్రం ఎగువ అహోబిలేశుని నృసింహ జయంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడోరోజైన శుక్రవారం ధ్వజారోహణ కార్యక్రమం ఆగమశాస్త్రం ప్రకారం వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ గరుత్మంతుని చిత్రపటావిష్కరణ చేశారు. అంతకుముందు ఉత్సవ మూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత జ్వాలా నరసింహుడిని, గరత్ముంతుని సూర్యాస్తమయానికి ముందే పంచామృతాలతో అభిషేకించి పట్టు పీతాంబరాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి విడివిడిగా పల్లకీలో కొలువుంచి ఆస్థాన విధ్వాంశుల మంగళవాయిద్యాలతో ఆలయ ప్రదక్షిణ చేసిన అనంతరం ఆలయం ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ మొదటి జియర్ ఆదివన్ షఠకోపన్ ఉత్సవ విగ్రహం ఎదురుగా ఉంచి లక్ష్మీనృసింహస్వామి జయంతి బ్రహ్మోత్సవాలకు తరలిరావాలని ఆహ్వానిస్తూ ధ్వజారోహణం చేసి మంత్ర పూర్వకంగా పిలుపునిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన జ్వాలానృసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల కల్యాణ మహోత్సవానికి ముక్కోటి దేవతలు వస్తారని విశ్వాసం. స్వామి, అమ్మవార్లను ఆశీర్వదించేందుకు వచ్చే ముక్కోటి దేవతలతో పాటు బ్రహ్మోత్సవాలకు తరలి వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా గరుత్మంతుడు కాపలా ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. సింహ వాహనాధీశా.. నమో నారసింహా! అహోబిల లక్ష్మీనరసింహ స్వామి జయంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి జ్వాలానృసింహస్వామి సింహవాహనం అధిష్టించి భక్తులకు దర్శనమిచ్చారు. నిత్యపూజల అనంతరం విశేషాలంకరణ గావించిన సింహవానంపై కొలువైన స్వామి మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజపటావిష్కరణ, ధ్వజారోహణం పట్టు పీతాంబరాలు.. వజ్రవైఢూర్యాలు ధరించి కొలువుదీరిన దేవతామూర్తులు -
ఫైనల్ మెరిట్ లిస్ట్, సెలెక్షన్ లిస్ట్ల విడుదల
కర్నూలు(హాస్పిటల్): కర్నూలులోని స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం గత ఏడాది జనవరి 29న జారీ చేసిన నోటిఫికేషన్కు సంబంధించి మెడికల్ ఫిజిసిస్ట్, అనెస్తీషియా టెక్నీషియన్, ఓటీ అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్ కేటగిరిల అభ్యర్థుల ఫైనల్ మెరిల్ లిస్ట్లు, సెలక్షన్ లిస్ట్లను కర్నూలు, నంద్యాల జిల్లాలు, కర్నూలు మెడికల్ కాలేజీల ప్రభుత్వ వెబ్సైట్లు https://kurnool.ap.gov.in, https://nandyal .ap.gov.in,https://kurnoolmedicalcollege.ac.inలలో ఉంచినట్లు కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు సెట్ల జిరాక్స్ సర్టిఫికెట్లతో ఈనెల 6 నుంచి 8వ తేదీ వరకు ఉదయం 10.30 గంటలకు కర్నూలు మెడికల్ కాలేజీలో నిర్వహించే కౌన్సెలింగ్కు హాజరుకావాలన్నారు. ఈశ్రమ్ కార్డులు పొందండి ● జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి కర్నూలు(సెంట్రల్): అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులందరూ ఈ శ్రమ కార్డులను పొందేలా పారా లీగల్ వలంటీర్లు కృషి చేయాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి సూచించారు. శుక్రవారం జిల్లా న్యాయ సేవా సదన్లో అంతర్జాతీయ కార్మిక దినోత్సవాల్లో భాగంగా పారా లీగల్ వలంటీర్లకు కార్మికులు ఈశ్రమ కార్డును పొందేలా అవగాహన కల్పించడం కోసం సదస్సును ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ శ్రమ కార్డు ను పొందిన కార్మికులకు ఉచితంగా రూ.2లక్షల ప్రమాద బీమా సదుపాయం ఉందన్నారు. కార్మికుల పిల్లలకు స్కాలర్షిప్పులు, వారి పెళ్లిళ్లకు ఆర్థిక సాయం పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. అనంతరం అసిస్టెంట్ లేబర్ కమిషనర్ సాంబశివరావు, పారా లీగల్ వలంటీర్లకు అవగాహన కల్పించారు. నేటి నుంచి హ్యాండ్బాల్ పోటీలు కర్నూలు (టౌన్): ప్రకాశం జిల్లా మార్కాపురంలోని సుజాత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ క్రీడా మైదానంలో ఈనెల 3,4 తేదీల్లో 54వ రాష్ట్రస్థాయి మహిళా హ్యాండ్బాల్ చాంపియన్షిప్ పోటీలు నిర్వహించనున్నట్లు హ్యాండ్బాల్ సంఘం నిర్వహణ కార్యదర్శి గణేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీల్లో ప్రతిభ కనచరచిన క్రీడాకారులను ఆంఽధ్రప్రదేశ్ జట్టుకు ఎంపిక చేస్తారని వెల్లడించారు. -
బిహార్ సర్పంచ్ల బృందం పర్యటన
కర్నూలు(రూరల్): పసుపల గ్రామంలో శుక్రవారం బిహార్ సర్పంచ్ల బృందం పర్యటించింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో దాదాపు 55 మంది బిహార్ సర్పంచ్లు పసుపల గ్రామానికి చేరుకుని అభివృద్ధి పనులను, గ్రామ సచివాలయ వ్యవస్థ పనితీరును, ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించారు. గ్రామం నుంచి సేకరించే తడి, పొడిచెత్త నుంచి తయారయ్యే సేంద్రియ ఎరువు యూనిట్ను పరిశీలించారు. ప్రజలకు ప్రభుత్వం అందజేస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట ఎన్ఐఆర్డీ అధికారి శశిరేఖ, జిల్లా పంచాయతీ అధికారి భాస్కర్, ఎంపీడీఓ రఘునాథ్, గ్రామ సర్పంచ్ బొగ్గుల శీలమ్మ, పసుపల పంచాయతీ సెక్రటరీ హేమంత్ రెడ్డి ఉన్నారు. -
బయో ఉత్పత్తులు విక్రయిస్తే కఠిన చర్యలు
కోవెలకుంట్ల: అనుమతులు లేని బయో ఉత్పత్తులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణ హెచ్చరించారు. స్థానిక మార్కెట్ యార్డు రైతు విశ్రాంతి భవనంలో శుక్రవారం సబ్ డివిజన్లోని కోవెలకుంట్ల, సంజామల, అవుకు, కొలిమిగుండ్ల, ఉయ్యాలవాడ, దొర్నిపాడు మండలాల రసాయన ఎరువులు, విత్తన, పురుగు మందుల డీలర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ జీ–2, జీ–3 అప్లియేషన్ కలిగి వ్యవసాయ కమిషనర్ ఆమోదించిన బయో ఉత్పత్తులను మాత్రమే విక్రయించాలన్నారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు విత్తన, ఎరువుల డీలర్లు నాసిరకం విత్తనాలు, ఎరువులు అంటగడుతున్నారన్నారు. విత్తన చట్టం పరిధిలో అధీకృత కంపెనీల ద్వారా జిల్లాలోని రైతులకు నాణ్యమైన రసాయన ఎరువులు, కల్తీ లేని విత్తనాలు, క్రిమి సంహారక మందులు సరఫరా చేయాలన్నారు. రైతులకు తప్పని సరిగా బిల్లులు ఇవ్వాలన్నారు. స్టాక్ వివరాలు, నిల్వలు, గరిష్ట ధరను పొందుపరిచి విక్రయాలు జరపాలన్నారు. అధిక ధరలకు విక్రయిస్తే దుకాణాల లైసెన్స్లు రద్దు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఏడీఏ సుధాకర్, జిల్లా వ్యవసాయ కార్యాలయ టెక్నికల్ ఏఓ కల్యాణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్యూ వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్గా ప్రొఫెసర్ కృష్ణారెడ్డి
కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్గా ఫిజిక్స్ డిపార్ట్మెంట్ హెచ్ఓడీ ప్రొఫెసర్ సీవీ కృష్ణారెడ్డిని నియమితులయ్యారు. వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.వెంకట బసరావు ఆదేశాల మేరకు కృష్ణారెడ్డిని నియమించినట్లు రిజిస్ట్రార్ డాక్టర్ విజయకుమార్ నాయుడు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆర్యూలో ఇప్పటి వరకు ఆర్ట్స్, సైన్స్ కళాశాలలకు విడివిడిగా ప్రిన్సిపాల్స్ ఉండగా రెండింటినీ కలిపి ఒకే కళాశాలగా మార్పు చేశారు. ఈనేపథ్యంలో సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్గా ఉన్న కృష్ణారెడ్డిని వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్గా నియమించారు. దీంతో పాటు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, సెంట్రల్ లైబ్రరీ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. రెండేళ్ల పాటు ఈయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ● వర్సిటీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్గా, వర్సిటీ హాస్టల్స్ వార్డెన్గా తెలుగు విభాగం అధిపతి ప్రొఫెసర్ ఎన్.నరసింహులును నియమించారు. ● సీడీసీ డీన్గా మాథ్స్ హెచ్ఓడీ ప్రొఫెసర్ పీవీ సుందరానంద్ను నియమితులయ్యారు. ఈయన ఇప్పటికే ఎగ్జామినేషన్స్ డీన్గా ఉన్నారు. ● సుమారు రెండు నెలలుగా ఖాళీగా ఉన్న రాయలసీమ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్కు ప్రిన్సిపాల్ను నియమించాల్సి ఉంది. ● ఆర్యూసీఈకి వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ విజయకుమార్ నాయుడు ఇన్ఛార్జి ప్రిన్సిపాల్గా కొనసాగుతున్నారు. -
తెలుగుగంగ ప్రాజెక్టుకు పాలకుల తూట్లు
● తెలుగుగంగ ప్రాజెక్టు ఆయకట్టు పరిరక్షణ సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి రుద్రవరం: తెలుగుగంగ ప్రాజెక్టుకు పాలకులు తూట్లు పొడుస్తున్నారని ప్రాజెక్టు ఆయకట్టు పరిరక్షణ సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి విమర్శించారు. అసంపూర్తిగా ఉన్న తెలుగుగంగ ప్రాజెక్టు పనులతో పాటు రుద్రవరం, చాగలమర్రి మండలాల్లోని చెరువుల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్తో శుక్రవారం సమితి సభ్యులు, వివిధ గ్రామాల రైతులతో కలిసి ఆయన రుద్రవరం రెవెన్యూ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ నాలుగు శతాబ్దాలు గడుస్తున్నా తెలుగుగంగ ప్రాజెక్టు అసంపూర్తిగానే ఉందన్నారు. కీలకమైన నిర్మాణాలు చేపట్టడంలోనూ విధానాలు అమలు చేయడంలోనూ పాలకులు విఫలమయ్యారన్నారు. వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయరు వద్ద నేటికీ బైపాస్ కెనాల్ నిర్మాణం చేపట్టక పోవడంతో పూర్తి సామర్థ్యంతో పని చేయడం లేదని, ప్రధాన కాల్వ పనులు పూర్తి చేపట్టకపోవడంతో బ్రహ్మసాగర్కు నీరు చేరడం లేదని అన్నారు. కూటమి ప్రభుత్వం తక్షణమే ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ అంటే అమరావతి, పోలవరమే కాదని, డబ్బంతా అక్కడ ఖర్చు చేసి రాయలసీమను నిర్వీర్యం చేయడం సరికాదన్నారు. 90 లక్షల ఎకరాలకు సరిపడా నీటిని శ్రీశైలం నుంచి సముద్రంలోకి పారబోసి, చివరగా పంటలు ఎండుతుంటే సాగు నీరు అందించలేక నోరెళ్లబెడుతున్నారన్నారు. ఇప్పటికై నా అలగనూరు, గోరుకల్లు, వెలుగోడు రిజర్వాయర్లకు మరమ్మతులు చేసి సాగునీరు అందేలా చూడాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం ఒత్తిడి తెచ్చేందుకు ఈనెల 31న సిద్ధేశ్వరం అలుగు వద్ద భారీ జన సమీకరణతో తొమ్మిదో వార్షికోత్పవం నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దారు మల్లికార్జునరావుకు అందజేశారు.కార్యక్రమంలో సమితి సభ్యులు వైఎన్ రెడ్డి, రామగురివి రెడ్డి, పార్థసారధి రెడ్డి, హరిక్రిష్ణ, రామకృష్ణారెడ్డి, మహబూబ్బాషా, దేవానందరెడ్డి, పట్నం రాముడు, రవికుమార్రెడ్డి, కొమ్మా శ్రీహరి, తిమ్మారెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, వీరబ్రహ్మానందరెడ్డి, మహేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రమణీయం.. స్వర్ణ రథోత్సవం
శ్రీశైలంటెంపుల్: ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీశైల మహాక్షేత్రంలో శుక్రవారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు స్వర్ణరథోత్సవం నిర్వహించారు. వేకువజామున స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం చేశారు. లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకులు సంకల్పాన్ని పఠించారు. అనంతరం రథారూఢులైన శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిపించారు. ఉదయం 7.30గంటలకు స్వర్థరథోత్సవం ప్రారంభమైంది. ఆలయ మహాద్వారం ముందుభాగం గంగాధర మండపం నుంచి నందిమండపం వరకు రథోత్సవాన్ని జరిపించారు. రథోత్సవంలో కోలాటం, చెక్కభజన మొదలైన జానపద కళారూపాలు అలరించాయి. శ్రీశైల దేవస్థాన డిప్యూటీ కార్యనిర్వహణాధికారి రమణమ్మ, సహాయ కమిషనర్ ఇ.చంద్రశేఖరరెడ్డి, పలు విభాగాల అధికారులు, భక్తులు పాల్గొన్నారు. -
కార్పొరేటర్పై అక్రమ కేసులను సహించబోం
కర్నూలు(టౌన్): నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో చోటు చేసుకున్న చిన్న గొడవను సాకుగా చూపి తమ పార్టీ కార్పొరేటర్ షేక్ యూనుసు బాషాపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. అక్రమ కేసుల విషయాన్ని ఇప్పటికే జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ను కలిసి నగర మేయర్ వివరించారని, న్యాయం చేస్తారనే నమ్మకం తమకు ఉందన్నారు. శుక్రవారం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీలో స్పీకర్పై పేపర్లు చించివేయడం, గొడవ చేయడం, ఇబ్బందులు సృష్టించిన ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయన్నారు. అయితే ఎప్పుడూ సంబంధిత ప్రజా ప్రతినిదులపై కేసులు పెట్టిన దాఖలాల్లేవన్నారు. అలాంటిది గతనెల 26న కర్నూలు కార్పొరేషన్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ షేక్ యూనుసుబాషాపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. సర్వసభ్య సమావేశంలో 4వ వార్డు కార్పొరేటర్ ఆర్షియా పర్వీన్ అడిగిన ప్రశ్నకు అడ్డు తగిలినందుకు 10వ వార్డు కార్పొరేటర్ ఆమెకు మద్దతుగా మాట్లాడారన్నారు. అక్కడే ఉన్న 12వ వార్డు కార్పొరేటర్ కలుగజేసుకొని గట్టిగా వాదించడం వల్లే చిన్నపాటి గొడవ జరిగిందన్నారు. ఆ సమయంలో ఇనుప కుర్చీ ఎత్తి కింద పడేశారన్నారు. దీన్ని సాకుగా చూపి ఇనుప కుర్చీ విరిగిందని, ఒకరిద్దరికి గాయాలయ్యాయని అదనపు కమిషనర్ ఆర్జీవీ. క్రిష్ణ రెండవ పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు. గాయాలు అయినట్లయితే ఎందుకు ఆసుపత్రికి తీసుకెళ్లలేదని, ఎంఎల్సీ ఎందుకు చేయించలేదని ప్రశ్నించారు. తమ కార్పొరేటర్లను ఇబ్బందులకు గురిచేయాలని చూస్తే అధికారిపై కేసులు వేసి విశాఖపట్నం నుంచి కర్నూలుకు తిప్పడం ఖాయమన్నారు. ● కర్నూలు నగర మేయర్ బి.వై.రామయ్య మాట్లాడుతూ టీడీపీ కార్పొరేటర్లు గొడవ చేయాలనే ఉద్దేశంతోనే ఆ రోజు కౌన్సిల్కు వచ్చారన్నారు. కేసు పెట్టిన క్రాంతికుమార్ వైఎస్సార్సీపీ కార్పొరేటర్ అని, అయితే టీడీపీ కార్పొరేటర్ అంటూ రెండవ పట్టణ పోలీసు స్టేషన్లో తమ కార్పొరేటర్పై కేసు పెట్టారన్నారు. పార్టీ టిక్కెట్టు ఇచ్చి కార్పొరేటర్గా, స్టాండింగ్ కమిటీ సభ్యులుగా నియమిస్తే డబ్బులకు అమ్ముడుపోయి దిగజారి కేసులు వేయడం మంచి సంప్రదాయం కాదన్నారు. ● స్టాండింగ్ కమిటీ సభ్యులు విక్రమసింహారెడ్డి, గాజుల శ్వేతారెడ్డి మాట్లాడుతూ కుల రాజకీయా లు, నీతిలేని రాజకీయాలు టీడీపీకే చెల్లు అన్నారు. ● సమావేశంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు దండు లక్ష్మీకాంత రెడ్డి, సుదర్శన్ రెడ్డి, క్రిష్ణకాంత్ రెడ్డి, జుబేర్, ఆర్షియా ఫర్హీన్, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ షేక్ అహమ్మద్, మునెమ్మ పాల్గొన్నారు. -
బాలికల కోసం ‘కిశోరి వికాసం’
● జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా కర్నూలు(సెంట్రల్): బాలికల కోసం ప్రభుత్వం కిశోరి వికాసం కార్యక్రమాన్ని అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అన్నారు. తన క్యాంపు కార్యాలయంలో కిశోరి వికాసం–వేసవి శిక్షణ కార్యక్రమల ప్రణాళిక పోస్టర్ను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల్య వివాహాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. బాలల హక్కుల చట్టంపై అవగాహన కల్పించాలన్నారు. మే 2 నుంచి జూన్ 10 వరకు జరిగే కిశోరి వికాసం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. జిల్లా శిశు సంక్షేమ అధికారి నిర్మల, డీఎంహెచ్ఓ శాంతి కళ, డీసీపీఓ శారద, లీగల్ ఆఫీసర్ శ్రీలక్ష్మీ, సామాజిక కార్యకర్త నరసింహులు, కౌన్సిలర్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. జిల్లాకు 13.50 లక్షల బీటీ పత్తి విత్తన ప్యాకెట్లు కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో పత్తి సాగుకు 13.50 లక్షల బీటీ విత్తన ప్యాకెట్లు అవసరమని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. నల్లరేగడి నేలలు ఎక్కువగా ఉండటంతో పత్తి సాగు అధికంగా ఉంటోంది. వచ్చే ఖరీఫ్లో 2.45 లక్షల హెక్టార్లో పత్తి సాగయ్యే అకాశం ఉంది. హెక్టారుకు 450 గ్రాముల బీటీ పత్తి విత్తన ప్యాకెట్లు ఐదు అవసరమవుతాయి. ఈ ప్రకారం జిల్లాకు 13.50 లక్షల బీటీ విత్తన ప్యాకెట్లు అవసరం. వీటిని 11 కంపెనీలు సరఫరా చేస్తాయి. జిల్లాలో ప్రధానంగా బీటీ–2 పత్తి సాగు చేస్తారు. 450 గ్రాముల ప్యాకెట్ ధర రూ.901 ఉంది. బీటీ పత్తి ప్యాకెట్లకు ఎలాంటి సబ్సిడీలు ఉండవు. ఎంఆర్పీ ప్రకారం చూసినా రైతులు విత్తన ప్యాకెట్ల కోసమే రూ.122 కోట్లు ఖర్చు చేయనున్నారు. బ్రాండెడ్ కంపెనీల విత్తన ప్యాకెట్లను డీలర్లు బ్లాక్లో విక్రయించనున్నారు. జిల్లాలో బీటీ–2 విత్తన ప్యాకెట్లపైనే రైతులు రూ.200 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు. -
టీడీపీ నాయకుడి ఇంటికి ఆలయ నీరు!
ఆలూరు: దేవస్థానంలో భక్తులకు అందాల్సిన నీరు టీడీపీ నాయకుడి ఇంటికి నేరు వెళ్తోంది. ఇందుకు అక్రమంగా పైప్లైన్ వేసుకున్నారు. అధికారుల అనుమతి కూడా తీసుకోలేదు. ఆలూరు మండలంలోని మొలగవెల్లి గ్రామంలో కాశీవిశ్వేశ్వరస్వామి దేవాలయం ఉంది. ఆలయానికి వచ్చే భక్తులకు తాగునీటి వసతి కల్పించాలని పంచాయతీ అధికారులకు గ్రామపెద్దలు విన్నవించారు. ఇదే అదునుగా భావించిన గ్రామ టీడీపీ నాయకుడు దేవాలయంలో భక్తుల తాగు నీటికోసం ఇచ్చిన మంచినీటి పైపులకు అదనంగా వాల్ను బిగించుకున్నారు. ప్లాస్టిక్ పైపులైన్ వేసుకుని తన ఇంటికి దేవాలయ నీటిని తరలించుకుంటున్నారు. ఈ నీటితో తన వాహనాలను శుభ్రం చేస్తున్నారు. టీడీపీ నాయకుడి దౌర్జన్యాన్ని చూసి గ్రామ ప్రజలు ఇదేమి చోద్యం అని చర్చించుకుంటున్నారు. అంతటితో ఆగకుండా పంచాయతీ అధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని పీఎస్ వెంకటనాయుడి దృష్టికి తీసుకెళ్లగా.. అక్రమ మంచినీటి కుళాయి కనెక్షన్ను తీసుకున్న విషయాన్ని పరిశీలించిన చర్యలు తీసుకుంటానని తెలిపారు. -
భూ వివాదాలతోనే లక్ష్మినారాయణ హత్య
ఆలూరు రూరల్: కాంగ్రెస్ నేత, ఎమ్మార్పీఎస్ రాయలసీమ అధ్యక్షుడు లక్ష్మినారాయణ హత్యకు భూ వివాదాలు, పంచాయతీలే కారణమని అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా తెలిపారు. ఆలూరులోని పోలీసు సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. లక్ష్మినారాయణ హత్య కేసులో 14 మందిపై కేసు నమోదు చేశామన్నారు. అయితే పది మందిని నిందితులుగా గుర్తించామన్నారు. లక్ష్మినారాయణ కుమారుడు వినోద్ ఫిర్యాదు చేసినట్లు వైకుంఠం ప్రసాద్, వైకుంఠం మల్లికార్జున, మల్లేష్, చికెన్ రామాంజిలపై కేసు దర్యాప్తులో ఉందని, వీరి పాత్ర ఉంటే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణానికి చెందిన ప్రధాన నిందితులైన పూనుగొండ్ల రాజేష్, బేపర్ గౌసియా, కత్రిమల సౌభాగ్యలను పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య, ఆలూరు సీఐ రవి శంకర్ రెడ్డితో కలిసి శుక్రవారం హైవే 167లోని నక్కనదొడ్డి గ్రామం వద్ద అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. ఇదే కేసులో ముద్దాయిలుగా ఉన్న పెద్దన్న, బోయ మేకల శ్రీనివాసులు, బోయ గోవిందు, బోయ రాము, వడ్డే నవీన్, ధర్మ, మనోహర్లను అరెస్టు చేయాల్సి ఉందన్నారు. హత్యకు కారణమైన వివాదాలు అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని ఆలూరు రోడ్డులో ఉన్న 1.10 ఎకరాల ఇంటి స్థలాల భూమి, సిద్ధార్థ కాలనీలోని 9 ఎకరాల దేవదాయ భూమి పంచాయతీ విషయంలో గుంకతల్లుకు చెందిన గౌసియా, రాజేష్లతో లక్ష్మినారాయణకు వివాదం నడుస్తోంది. ఈ భూమిలోని 4 ఎకరాల్లో లక్ష్మినారాయణ ప్లాట్లు వేసి విక్రయించాడు. గుంతకల్లు మండలం కొనకొండ్ల చెందిన ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం విషయంలోనూ ఆయన పంచాయతీ చేసినట్లు తెలిసింది. అలాగే పెద్దన్నకు చెందిన 8 ఎకరాల భూమికి ఏడేళ్ల క్రితం లక్ష్మినారాయణ తన అత్త పేరిట నకిలీ పాసు పుస్తకాలు సృష్టించాడు. ఈ భూమి వివాదం కోర్టులో ఉంది. ఈ విషయంలో వివాదంతో పాటు పెద్దన్నపై లక్ష్మినారాయణ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించారు. అదేవిధంగా నాలుగు నెలల క్రితం పెద్దన్న, రాజేష్, గౌసియాలను లక్ష్మినారాయణ బహిరంగంగా దూషించడంతో వారంతా ఆయనను అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారమే హత్య ● రెండు నెలల క్రితం హిందూపురంలో టిప్పర్ కొనుగోలు చేశారు. ● గత నెల 27న ఉదయం పెద్దయ్య ఇంటి వద్ద సమావేశమయ్యారు. ● అదే రోజు మధ్యాహ్నం లక్ష్మినారాయణ గుంతకల్లు నుంచి తన స్వగ్రామమైన చిప్పగిరికి ఇన్నోవా కారులో బయలుదేరాడు. ● రాజేష్ అతన్ని మరో కారులో అనుసరించి టిప్పర్ డ్రైవర్ మేకల శ్రీనివాసులు, మరో వ్యక్తి ధర్మన్నకు సమాచారం ఇస్తూ వచ్చాడు. ● మరో నిందితుడు రాము మార్గమధ్యంలో ఉండి టిప్పర్ డ్రైవర్ను అప్రమత్తం చేశాడు. ● లక్ష్మినారాయణ కారు గుంతకల్లు సమీపంలోని రైల్వే బ్రిడ్జి వద్దకు రాగానే డ్రైవర్ శ్రీనివాసులు ఇన్నోవా కారును బలంగా ఢీకొట్టాడు. ● పక్కనే వేచి ఉన్న పెద్దన్న కొడవలితో లక్ష్మినారాయణ తలపై నరికాడు. ● మరో వ్యక్తి వడ్డే నవీన్ వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్డుతో ఆయన తలపై కొట్టాడు. ● మిగిలిన నిందితులు రహదారిలో ఎవరూ రాకుండా జాగ్రత్త వహించారు. ● లక్ష్మినారాయణపై దాడి అనంతరం అందరూ కలిసి పరారయ్యారని ఏఎస్పీ హుసేన్ పీరా విలేకరులకు వెల్లడించారు. ● విలేకరుల సమావేశంలో పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య, ఆలూరు సీఐ రవి శంకర్ రెడ్డి, హొళగుంద ఎస్ఐ దిలీప్ కుమార్, ఆలూరు ఎస్ఐ మహబూబ్ బాషా, చిప్పగిరి ఎస్ఐ శ్రీనివాసులు పాల్గొన్నారు. -
4న మహానందిలో వైశాఖ శుద్ధ సప్తమి వేడుకలు
మహానంది: ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో ఈ నెల 4వ తేదీన వైశాఖ శుద్ధ సప్తమి వేడుకలు నిర్వహించనున్నట్లు ఆలయ వేదపండితుడు రవిశంకర అవధాని, ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతి ఏడాది వైశాఖ శుద్ధ సప్తమి రోజున గంగాదేవి స్వయంగా మహానంది రుద్రగుండం కోనేరులో స్నానమాచరించి భక్తుల పాపాలను పోగొడుతుందన్నారు. ఆ రోజు స్నానం చేయడం 12 ఏళ్లకు ఒకసారి వచ్చే గంగానది పుష్కరస్నానంతో సమానమన్నారు. వేడుకల్లో భాగంగా గంగాదేవికి ప్రత్యేక పూజలు చేస్తామని చెప్పారు. -
ఉరుకుంద హుండీ ఆదాయం రూ.1.14 కోట్లు
కౌతాళం: ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయ హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను శుక్రవారం లెక్కించారు. మొత్తం 56 రోజులకు భక్తులు నగదు రూపంలో రూ.1,14,68,836 సమర్పించినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ విజయరాజు, హుండీ పర్యవేక్షణ అధికారి వెంకటేశ్ తెలిపారు. వెండి 13 కేజీల 790 గ్రాములు, బంగారం 29 గ్రాముల 100 మిల్లీ గ్రాములు వచ్చిందన్నారు. 1000 హెక్టార్లలో ఆయిల్పామ్ సాగు కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ ఏడాది 1000 హెక్టార్లలో ఆయిల్పామ్ సాగుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హెక్టారుకు ఆయిల్పామ్ మొక్కలు నాటుకోవడానికి రూ.25,250 నుంచి రూ.29 వేల వరకు సబ్సిడీ ఇస్తోంది. అధిక సాంద్రతలో మొక్కలు నాటుకుంటే రూ.29వేలు, మొక్కలు తక్కువ వచ్చే విధానంలో నాటుకుంటే రూ.25,250 సబ్సిడీ లభిస్తుందని జిల్లా ఉద్యాన అధికారి పి.రామాంజనేయులు తెలిపారు. కర్నూలు జిల్లాలో 500 హెక్టార్లు, నంద్యాల జిల్లాలో 500 హెక్టార్లలో సాగు చేయాలనేది లక్ష్యం. మొక్కలు కంపెనీలే సరఫరా చేస్తుండటం వల్ల సబ్సిడీలను కంపెనీలకే విడుదల చేస్తారు. నాలుగేళ్ల పాటు ఏడాదికి రూ.5,250 ప్రకారం నిర్వహణ కింద సబ్సిడీ ఇస్తారు. నాలుగేళ్ల పాటు అంతర పంటలుగా వ్యవసాయ, ఉద్యానపంటలు సాగు చేసుకోవచ్చు. అంతరపంటల సాగుకు ఏడాదికి రూ.5,250 ప్రకారం నాలుగేళ్ల పాటు సబ్సిడీ లభిస్తుందని జిల్లా ఉద్యాన అధికారి పేర్కొన్నారు. 1.06 లక్షల మందికి ఉపాధి పనులు కర్నూలు(అగ్రికల్చర్): ఉపాధి పనులకు డిమాండ్ పెరిగిందని, రోజుకు 1.06 లక్షల మందికి ఉపాధి పనులు కల్పిస్తున్నామని జిల్లా నీటియాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటరమణయ్య తెలిపారు. శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ప్రతి టెక్నికల్ అసిస్టెంట్ తన పరిధిలోని మూడు పంచాయతీల్లో జరిగే పనులను తనిఖీ చేసి ఫొటోలను అప్లోడ్ చేయాలని ఆదేశించామన్నారు. ఏపీవో ప్రతి రోజు రెండు పంచాయతీలు, ఏపీడీలు తన పరిధిలో రోజూ 2 మండలాల్లో ఉపాధి పనులను తనిఖీ చేసి ఫొటోలు అప్లోడ్ చేస్తారన్నారు. భూగర్భ జలాలను పెంచే పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రతి ఒక్కరికి రూ.300 నుంచి రూ.307 వేతనం లభించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద ఏడాదికి రూ.20 చెల్లించి రూ.2లక్షల వరకు ప్రమాద బీమా పొందవచ్చన్నారు. ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ(ఐటీఐ)లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఏ.రవీంద్రబాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండు సంవత్సరాల ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్ కోర్సులు, ఒక సంవత్సరం మెకానికల్ డీజిల్, వెల్డర్ కోర్సులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నెల 24లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు 9703395091, 9440748448, 08524–286055లను సంప్రదించాలన్నారు. -
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏర్పడిన కరువు పరిస్థితులు ‘క్షీర’ క్షోభానికి దారితీశాయి. వేసవి కాలం పాల ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోయింది. శిశువులు ఏడుస్తున్నా సీసాలో నింపి కాసిన్ని పాలు ఇవ్వలేని దుస్థితి నెలకొంది. ఇంట్లో ఉన్న వృద్ధులకు సైతం పాలు వేడి చేసి ఇవ్వడం కష
పాల ఉత్పత్తి తగ్గింది మాకు 14 ముర్రా గేదెలు ఉన్నాయి. అన్నీ పాలు ఇస్తాయి. డిసెంబరులో రోజుకు 90 నుంచి 100 లీటర్ల వరకు పాలు ఉత్పత్తి అయ్యేవి. ఫిబ్రవరి నుంచి పాల ఉత్పత్తి తగ్గింది. రోజుకు 50 నుంచి 55 లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. దాణా ఖర్చులు పెరిగాయి. వేసవిలో పచ్చిమేత తగినంత లేదు. నీటి సమస్య, ఎండల తీవ్రతతో పాల ఉత్పత్తి బాగా తగ్గింది. వర్షాలు కురిసి పచ్చి మేత అందుబాటులోకి వస్తే ఆగష్టు నుంచి పాల ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంది. – వెంకటేశ్వరరెడ్డి, సర్పంచ్, మల్లెపల్లి, వెల్దుర్తి మండలం త్వరలో దాణామృతం ఇస్తాం వేసవిలో పాల ఉత్పత్తి 20 నుంచి 30 శాతం వరకు తగ్గుతుంది. వేసవిలో పాల ఉత్పత్తి తగ్గకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఒక్కో జిల్లాకు 250 టన్నుల సమీకృత దాణాను ప్రభుత్వం కేటాయించింది. త్వరలోనే పాడి రైతులకు సరఫరా చేస్తాం. పశుగ్రాసాల సాగుకు గడ్డి విత్తనాలను కూడా సబ్సిడీపై ఇస్తాం. వేసవిలో పశువుల కోసం ఉపాధి నిధులతో గ్రామాల్లో నీటితొట్లు కూడా ఏర్పాటు చేయనున్నాం. – డాక్టర్ జి.శ్రీనివాస్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ఉమ్మడి జిల్లాలో ‘క్షీర’ క్షోభం ● వేసవిలో తగ్గిపోయిన పాల ఉత్పత్తి ● రోజుకు 13 లక్షల లీటర్లు అవసరం ● లభించేది 5 లక్షల లీటర్లు మాత్రమే ● ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి దిగుమతి కర్నూలు(అగ్రికల్చర్): అసలే వేసవి కాలం.. ఒక వైపు పచ్చిమేత కొరత.. మరోవైపు నీటి సమస్య.. దీంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో పాల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదు. ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు అంటూ హడావుడి చేసినప్పటికీ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. ఇండియన్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం ప్రతి ఒక్కరూ రోజుకు 250 ఎంఎల్ పాలు తీసుకోవాల్సి ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 52 లక్షల జనాభా ఉంది. వీరి ప్రతి రోజూ 13 లక్షల లీటర్ల పాలు అవసరం అవుతాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో అన్ని పాలు అందుబాటులో లేవు. నీరు లేదు.. పచ్చిమేత కరువు ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2,55,747 పశువులు ఉన్నాయి. వీటిలో 1,61,228 ఆవులు, గేదెల నుంచి మాత్రమే పాల దిగుబడి ఉంది. మిగిలినవి చూలు(ప్రెగ్నెంట్)తో, గొడ్డుబోతు పశువులుగా ఉన్నాయి. ఆగస్టు నుంచి జనవరి వరకు పచ్చిమేత నీరు పుష్కలంగా ఉండటంతో 10 లక్షల పాలు ఉత్పత్తి అయ్యేవి. కరువు పరిస్థితుల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఫిబ్రవరి నుంచి పాల ఉత్పత్తి తగ్గింది. ప్రస్తుతం పశువులకు పచ్చి మేత లేదు.. నీరు కూడా లభించని పరిస్థితి నెలకొంది. దీంతో వేసవిలో పాల దిగుబడి 50 శాతానికి పైగా పడిపోయింది. కేవలం 5 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. పాలపొడికి డిమాండ్ డెయిరీల్లో వెన్న పూర్తి తీసి పాలపొడి తయారు చేస్తారు. పాల కొరత ఉన్నసమయంలో పాల పొడిని ఉపయోగించి పాలు తయారు చేస్తారు. పాలపొడితో టోన్డ్ మిల్క్ తయారు అవుతాయి. టోన్డ్ మిల్క్లో వెన్న 3 శాతం ఉంటుంది. గేదె పాలల్లో వెన్న 6.50 శాతం నుంచి 8 శాతం ఉంటుంది. ఆరు శాతంపైన ఉన్న వెన్నను తీసి 6 శాతం వెన్నతో గోల్డ్ మిల్క్ తయారు చేస్తారు. పాల పొడిపాలల్లో వెన్న ఉండదు. 50 శాతం పాలపొడి పాలు, మరో 50 శాతం 6 శాతం వెన్న ఉన్న పాలు కలిపితే మొత్తంగా పాలల్లో వెన్న మూడు శాతం ఉన్నట్లు అవుతోంది. వీటితో టోన్డ్ మిల్క్ ప్యాకెట్లు తయారు చేసి వినియోగదారులకు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న టోన్డ్మిల్క్ పాలు పాలపొడితో తయారు చేసినవేనని స్పష్టమవుతోంది. ఉత్తుత్తి హడావుడే వేసవిలో పాల ఉత్పత్తి తగ్గకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాణామృతం (టీఎంఆర్), సమీకృత దాణా వంటి వాటిని సరఫరా చేయాలి. అయితే దాణామృతం లేదు.. దాణా సరఫరా లేకుండా పోయింది. ‘ఉపాధి’ నిధులతో ఊరూర పశుగ్రాస క్షేత్రాలు ఏర్పాటు అంటూ హడావుడి చేసింది.. ఇంతవరకు కార్యరూపమే దాల్చలేదు. 10 సెంట్ల నుంచి 50 సెంట్ల వరకు భూమిలో ఉపాధి నిధులతో పశుగ్రాసక్షేత్రాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఉమ్మడి జిల్లాలో దాదాపు 600 ఎకరాల్లో పశుగ్రాస క్షేత్రాలు ఏర్పాటుకు అనుమతులు లభించాయి. కాని ఒక్క సెంటులో పశుగ్రాస క్షేత్రం ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. వేసవిలో పశువుల దాహర్తి తీర్చేందుకు ఉపాధి నిధులతో ఇదుగో నీటితొట్లు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించినప్పటికీ ఆచరణలో సాద్యం కాలేదు. అక్కడక్కడ నీటితొట్లు నిర్మించినప్పటికీ వాటిని నీటితో నింపే వారు కరువయ్యారు. రైతుల చేతికి పంటలే చేతికి అందలేదు. దీంతో రైతులు పాడిగేదెలకు మేతను సర్దుబాటు చేయలేక కబేళాలకు తరలిస్తున్నారు. దిగుమతి ఇలా.. ఉత్పత్తి తగ్గిపోవడంతో డెయిరీ నిర్వాహకులు పక్క జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి పాలు దిగుమతి చేసుకుంటున్నారు. కొన్ని ప్రయివేటు డెయిరీలు మహారాష్ట్ర నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. మరికొన్ని డెయిరీలు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలను ఆశ్రయించాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 లక్షల కుటుంబాలు ఉండగా... దాదాపు 40 శాతం కుటుంబాలు లూజు పాలు వినియోగిస్తున్నాయి. 60 శాతం కుటుంబాలు ప్యాకెట్ పాలను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. నేడు గ్రామాల్లో పశుసంపద తగ్గిపోయింది. గ్రామాల్లో కూడా ప్యాకెట్ పాలే వినియోగిస్తున్నారు. -
నీట్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
కర్నూలు కల్చరల్: మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి మే 4వ తేదీన నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్)కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులను కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆదేశించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో నీట్ యూజీ పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై చీఫ్ సూపరింటెండ్లు, లైన్ డిపార్ట్మెంట్ అధికారులు, పోలీస్ అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ చెప్పిన విషయాలు ఇవీ.. ● జిల్లాలో 16 పరీక్ష కేంద్రాల ఏర్పాటయ్యాయి. అన్నీ కర్నూలు నగరంలోనే ఉంటాయి. ● పరీక్షకు మొత్తం 4,466 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ● మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫ్లైన్ విధానంలో పరీక్ష ఉంటుంది. ● మే 4న ఉదయం 11 గంటల నుంచి విద్యార్థులను పురీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు.మధ్యాహ్నం 1.30 గంట తరువాత అనుమతించరు. ● ప్రతి నాలుగు కేంద్రాలకు ఒక జిల్లా అధికారి నియామించాం. ● దివ్యాంగ విద్యార్థులకు వీల్ చైర్లను ఏర్పాటు చేయాలి. ● కర్నూలు నగరంలో ట్రాఫిక్ అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలి. ● ట్రిపుల్ఐటీ డీఎం కేంద్రానికి వెళ్లేందుకు బస్సులు అందుబాటులో ఉంచాలి. ● పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్ షాప్లను మూసివేయాలి. విద్యుత్ అంతరాయం లేకుండా చూసుకోవాలి. ● సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి లేదు. ● సమావేశంలో అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, డీఎస్పీ బాబు ప్రసాద్, డీఆర్ఓ వెంకటనారాయణమ్మ, కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్, నోడల్ ఆఫీసర్ పాయల్ ప్రియదర్శిని, డీఈవో శామ్యూల్ పాల్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా -
చిప్పగిరిలో భయం.. భయం!
● కొనసాగుతున్న పోలీసు పికెట్ ఆలూరు: ఎమ్మార్పీఎస్ రాయలసీమ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ ఆలూరు నియోజకవర్గ నేత లక్ష్మీనారాయణ(60)ను గత నెల 27న హత్య చేయడంతో చిప్పగిరి గ్రామంలో భయం నెలకొంది. ఎప్పుడు ఏమి జరుగుతుందోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. టీడీపీ నాయకులే హత్య చేసి ఉండవచ్చనే అనుమానాలు వస్తున్నాయి. చిప్పగిరిలో ప్రజలకు రక్షణ కల్పిస్తూ పోలీసులు పికెట్ కొనసాగిస్తున్నారు. గుంతకల్లు నుంచి చిప్పగిరికి గత నెల 27న లక్ష్మీనారాయణ ఇన్నోవా వాహనంలో బయలు దేరగా గుంతకల్లు రైల్వేబ్రిడ్జి వద్ద టిప్పర్తో ఢీ కొట్టి హత్య చేసిన విషయం తెలిసిందే. హత్య కేసును పూర్తిస్థాయిలో విచారించేందుకు ఏఎస్పీ హుసేన్పీరా నియమించగా.. ఐదు పోలీసుల బృందాలుగా ఏర్పడి ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో విచారణ సాగిస్తున్నారు. గ్రామంలో పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య నేతృత్వంలో ఆలూరు సీఐ రవిశంకర్రెడ్డి, పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. గ్రామంలో 10 నుంచి 15 మంది పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారని, ప్రత్యేక నిఘా ఉంచినట్లు ఎస్ఐ సతీష్ కుమార్ తెలిపారు. -
భోజన భారం పంచాయతీ కార్యదర్శులదే!
అమరావతిలో మోదీ సభకు తరలించే జనాలకు భోజన ఖర్చుల భారం పంచాయతీ కార్యదర్శులు భరించాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. జన సమీకరణలో భాగంగా జిల్లాలోని కొన్ని గ్రామాలకు బస్సులను కేటాయించారు. ఆ బస్సుల్లో వెళ్లే జనాలకు భోజనం, మంచినీటి సౌకర్యాలు అన్నీ ఆ గ్రామ పంచాయతీ సెక్రటరీ చూసుకోవాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఒక్కో బస్సులో 30 నుంచి 40 మంది వరకు వెళ్లే అవకాశం ఉంది. వారి ఖర్చు లకు రూ. 25 వేల వరకు కానుంది. ఈ భారమంతా పంచాయతీ సెక్రటరీలపై పడటంతో ఉద్యోగులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. -
ఓ వైపు వేసవి సెలవులతో విహారయాత్ర, దైవ దర్శనాలకు బయలుదేరిన కొందరు, మరో వైపు పెళ్లిళ్ల్లు, శుభాకార్యాలకు కుటుంబాలతో ప్రయాణమైన మరి కొందరు.. వివిధ పనుల మీద దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ఇంకొందరు.. ఇలా ఎంతో మంది బస్టాండ్లకు చేరుకుంటే బస్సుల్లేవ్. ఆరా తీస్తే బస్స
ప్రయాణికులతో కిక్కిరిసిన కర్నూలు బస్టాండ్ జిల్లాల వారీగా తరలించిన బస్సుల సంఖ్య కర్నూలు నంద్యాల 105 115రెండు గంటలైనా ఒక్క బస్సు రాలేదు మా బంధువు కర్నూలు పెద్దాసుపత్రిలో ఉంటే పరామర్శించేందుకు వచ్చాం. తిరిగి ఆదోని వెళ్లేందుకు బస్టాండ్కు వచ్చి రెండు గంటలైనా ఒక్క బస్సు కూడా లేదు. ఊరికెట్లా పోవాలో తెలియడం లేదు. ఎంతో మంది బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. అధికారులు బస్సులన్నీ వేరే ఊళ్లకు పంపితే మాలాంటోళ్ల పరిస్థితి ఎట్లా. కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు హామీని వెంటనే నెరవేర్చాలి. – వెంకటలక్ష్మి, ఆదోని బస్సు లేక ఇబ్బంది పడ్డాం పెళ్లి నిమిత్తం కుటుంబం అంతా కలిసి నంద్యాలకు వచ్చాం. కార్యక్రమం ముగించుకున్న తర్వాత మధ్యాహ్నం 1.30 గంటలకు ఆర్టీసీ బస్టాండక్కు చేరుకున్నాం. అప్పటి నుంచి 3 గంటలుగా బస్సు కోసం వేచి చూస్తూనే ఉన్నాం. ఎంకై ్వరీలో అడిగితే ఎక్స్ప్రెస్ బస్సులు అమరావతికి తరలించడంతో బస్సులు తక్కువగా ఉన్నాయని, బస్సు వచ్చేంత వరకు వేచి ఉండాలన్నారు. దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులకు ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి. – మహేశ్వరరెడ్డి, కడప ప్రయాణికులను ఇబ్బంది పెట్టడం సరికాదు రాజధాని పేరుతో ఆర్టీసీ బస్సులన్నీ గుంటూరు, విజయవాడ జిల్లాకు తరలించి ఇక్కడి ప్రయాణికులకు ఇబ్బంది పెట్టడం కూటమి ప్రభుత్వానికి తగదు. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాల్సిన బాధ్యత ఆర్టీసీ అధికారులదే. కూటమి నేతల ఒత్తిళ్లకు తలొగ్గి బస్సులను ఇతర ప్రాంతాలకు పంపితే పేదలు ఎలా ప్రయాణం చేయాలి. – ఎం.శంకర్, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ కార్యదర్శి, నంద్యాల కర్నూలు సిటీ: రాజధాని పనుల పునఃప్రారంభానికి శుక్రవారం దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమరావతికి వస్తుండడంతో కూటమి ప్రభుత్వం భారీగా జనసమీకరణకు సిద్ధమైంది. జిల్లాతో పాటు, ఇతర జిల్లాలకు చెందిన మహిళలు, కూటమి పార్టీల కార్యకర్తలు, నాయకులను ఆర్టీసీలో బస్సుల్లో తరలించే ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆర్టీసీ డిపోల నుంచి దాదాపు 220 బస్సులను ఆర్టీసీ అధికారులు వివిధ ప్రాంతాలకు తరలించారు. దీంతో వివిధ పనుల మీద ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు బస్టాండ్కు చేరుకున్న ప్రయాణికులు ఇబ్బందుల పాలయ్యారు. బస్టాండ్లలో బస్సులు లేకపోవడంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. చిన్న పిల్లలతో వచ్చిన వారు, వైద్య చికిత్స నిమిత్తం వివిధ ఆసుపత్రులకు వచ్చి తిరుగు ప్రయాణమయిన వారు.. వృద్ధులు బస్టాండ్లలో ఉక్కపోతకు విలవిలలాడారు. కొంత మంది తప్పని పరిస్థితుల్లో అధిక చార్జీలు పెట్టి ప్రైవేటు వాహనాల్లో సొంతూర్లకు చేరుకున్నారు. పీఎం సభకు తరలించిన బస్సులు అత్యధిక శాతం గ్రామీణ ప్రాంతాలకు చెందినవి కావడంతో పేదలు, సామాన్యులు ఇబ్బందులు పడ్డారు. అరకొరగా ఉన్న బస్సుల్లో వెళ్లేందుకు పోటీ పడ్డారు. సీటు లేకపోయినా అతి కష్టం మీద నిల్చుని ప్రయాణించాల్సి వచ్చింది. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి.. బస్సు సర్వీసుల రద్దుతో బస్టాండ్లలో ప్రయాణికుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా కర్నూలు, నంద్యాల, ఎమ్మిగనూరు, ఆదోని, డోన్ బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ నిత్యం ఉంటుంది. ఈ క్రమంలో పలు రూట్లలో బస్సు సర్వీసులు లేకపోవడంతో గంటల తరబడి అక్కడే నిరీక్షించాల్సి వచ్చింది. అయితే ఎండ వేడమితో ఉక్కిరిబిక్కిరయ్యారు. చిన్నారులు, వృద్ధులు, మహిళలు ఉక్కపోతతో విలవిలాడారు. బస్టాండ్లలో సౌకర్యాలు సైతం లేకపోవడంతో అవస్థలు పడ్డారు. మరో రెండు రోజులూ ఇవే కష్టాలు ఏపీ రాజధాని అమరావతి అంటూ.. 2015 జూన్లో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ చేతల మీదుగా శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత అప్పటి టీడీపీ ప్రభుత్వం తాత్కాలిక భవనాలతో సరిపెట్టింది. మరోసారి రాజధాని పనుల పునఃనిర్మాణం పేరుతో కూటమి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. పునఃనిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు పీఎం మోడీ శుక్రవారం అమరావతి రానున్నారు. ఈ సందర్భంగా నిర్వహించనున్న సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలతో పాటు స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలను తరలించేందుకు కర్నూలు జిల్లా నుంచి 105, నంద్యాల జిల్లా నుంచి 115 బస్సులను వివిధ ప్రాంతాలకు మళ్లీంచారు. గత ఎన్నికల సమయంలో ఆర్టీసీ బస్సులను ప్రజల ప్రయాణానికి మాత్రమే వినియోగించాలి.. ప్రభుత్వ కార్యక్రమాలు, రాజకీయ పార్టీ సమావేశాలు కాదని ప్రగల్భాలు పలికారు. ఇప్పుడే అదే కూటమి నేతలు పీఎం సభకు ఆర్టీసీ బస్సులను మళ్లించడంపై ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులతో పాటు కొన్ని చోట్ల ప్రైవేటు స్కూళ్లకు చెందిన బస్సుల్లోనూ జనాలను తరలిస్తున్నారు. శుక్ర, శని వారాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. సూదూర ప్రాంతాలకు బస్సులను తరలించడంతో ఆ బస్సులు తిరిగి శనివారం ఆయా డిపోలకు చేరుకునే అవకాశం ఉంది. దీంతో ఉమ్మడి జిల్లాలో వివిధ రూట్లలో రద్దు చేసిన బస్సు సర్వీసులను శనివారం సాయంత్రం తర్వాతనే ఆర్టీసీ అధికారులు పునఃరుద్ధరించనున్నారు. అప్పటి వరకు ప్రయాణికులు ప్రైవేటు వాహనాల్లో అధిక చార్జీలతో ప్రయాణించాల్సి పరిస్థితి నెలకొంది. ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి 220 బస్సులు మోదీ సభకు తరలింపు పలు రహదారుల్లో బస్సు సర్వీసులు రద్దు అవస్థలు పడిన ప్రయాణికులు గంటల తరబడి బస్టాండ్లలో నిరీక్షణ ప్రైవేటు వాహనాల్లో గమ్యస్థానాలకు చేరిన వైనం కూటమి ప్రభుత్వంపై ప్రయాణికుల ఆగ్రహం -
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగులు పారదర్శకంగా పనిచేసేవారు. ప్రజలకు నిజాయితీగా సేవలు అందించేవారు. ఎవరి సిఫార్సులు లేకుండా, రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలను అమలు చేసేవారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. గ్ర
కోడుమూరు మండలం పులకుర్తి గ్రామ సచివాలయం● మారిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పనితీరు ● టెక్నికల్, జనరల్ ఫంక్షనీర్స్గా ఉద్యోగుల విభజన ● పలువురికి తప్పని స్థాన చలనం ● రెండు, మూడు సచివాలయాలకు ఒకరు పనిచేసేలా చర్యలు ● వైఎస్సార్సీసీ హయాంలో జిల్లాలో 672 సచివాలయాలు ● నేడు 350కి కుదించిన రాష్ట్ర ప్రభుత్వం టెక్నికల్ ఫంక్షనీర్స్ ఎంత మంది ఉన్నారంటే... వీఆర్ఓ 106 సర్వే అసిస్టెంట్ 411 అగ్రికల్చర్ అసిస్టెంట్ 230 హార్టికల్చర్ అసిస్టెంట్ 114 ఫిషరీస్ అసిస్టెంట్ 08 ఏఎన్ఎం 280 ఇంజినీరింగ్ అసిస్టెంట్ 359 అనిమల్ హజ్బెండరీ అసిస్టెంట్ 159 సెరికల్చర్ అసిస్టెంట్ 178 మహిళా పోలీస్ 373 ఉద్యోగుల విభజన ఇలా.. ఇప్పటికే గ్రామ/వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను టెక్నికల్, జనరల్ ఫంక్షనీర్స్ అంటు రెండు విభాగాలుగా విభజించారు. ప్రస్తుతం ప్రతి సచివాలయంలో అన్ని విభాగాలకు సంబంధించిన ఉద్యోగులు ఒకే చోట విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన క్లస్టర్ ప్రక్రియకు మార్గదర్శకాలు విడుదలైన వెంటనే ముందుగా టెక్నికల్ ఫంక్షనీర్స్గా గుర్తించిన ఉద్యోగులు ఒక్కొక్కరు రెండు లేక మూడు సచివాలయాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఆయా కేటగిరీలకు చెందిన మిగిలిన ఉద్యోగులను ఖాళీగా ఉన్న ప్రాంతాలకు లేదా ఇతర శాఖలకు బదిలీ చేసే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. -
సార్.. మంచినీటిని సరఫరా చేయండి
● ఆరేళ్ల బాలుడి అభ్యర్థన సోషల్ మీడియాలో వైరల్ కోవెలకుంట్ల: పట్టణంలోని వివిధ కాలనీల్లో కుళాయిల ద్వారా ఉప్పునీరు సరఫరా అవుతోందని ఆరేళ్ల బాలుడు గురువారం లేఖ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. స్థానిక సాయినగర్ కాలనీకి చెందిన షాజిల్ హుస్సేన్ అనే బాలుడు ‘మాకు ఉప్పునీరు వద్దు.. కుందూనది నీరు సరఫరా చేయండి’ అనే సందేశాన్ని లేఖ ద్వారా ఇన్చార్జ్ ఈఓ ప్రకాష్నాయుడుకు తెలియజేశాడు. బాలుడు రాసిన లేఖ కోవెలకుంట్ల పట్టణంలోని స్థానిక వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
హత్య కేసులో నిందితుల అరెస్ట్
కర్నూలు (టౌన్): హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలులోని డీఎస్పీ కార్యాలయంలో గురువారం సాయంత్రం డీఎస్పీ బాబు ప్రసాద్ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వవెల్లడించారు. కోడుమూరు మండలం పులకుర్తికి గ్రామంలో మునిస్వామి, మరో వర్గానికి చెందిన నడిపి రంగడు, సురేష్కు మధ్య కొన్నేళ్లుగా ఒక అమ్మాయి విషయంలో గొడవలు ఉన్నాయి. గత నెల 26న మునిస్వామి, అతని స్నేహితుడు మహేష్ మద్యం సేవించి ట్రాక్టర్ డ్రైవర్ సోమేష్ వద్దకు వెళ్లి సురేష్ గురించి అరా తీశారు. సురేష్కు ఈ విషయాన్ని డ్రైవర్ సోమేష్ చెప్పారు. పులకుర్తి గ్రామంలోని గూడూరు బస్టాప్ వద్ద ఉన్న సురేష్, నడిపి రంగడులపై నాటు కట్టెలు, రాడ్లతో మునిస్వామి వర్గీయులు దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయ పడిన నడిపి రంగడు ఈనెల 28న కోడుమూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిందితులను గురువారం మధ్యాహ్న సమయంలో అరెస్టు చేసినట్లు డిఎస్పీ వెల్లడించారు. ● అరెస్టు అయిన వారిలో మునిస్వామి, శివ రాముడు, పెద్ద బజారి, రాకేష్, సురేష్, నాగరాజు, బంగి తిప్మప్ప (పులకుర్తి గ్రామం) కల్లపరి నాయుడు ఉన్నారు. హత్య ఘటనలో పాల్గొన్న మొత్తం 8 మంది నిందితులను కోడుమూరు సీఐ చిరంజీవి, ఎస్ఐ స్వామి, గూడూరు ఎస్ఐ తిమ్మయ్య, పోలీస్ సిబ్బంది అరెస్టు చేశారు. నిందితుల నుంచి నాటు కట్టెలు, రాడ్లు, మూడు మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అమ్మాయి విషయంలో గొడవ పడే హత్య వివరాలు వెల్లడించిన కర్నూలు టౌన్ డీఎస్పీ -
శ్రీమఠంలో భక్తజన సందోహం
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామి మఠం భక్తజన సందోహంతో కనువిందు చేసింది. గురువారం ప్రత్యేకం కావడంతో భక్తులు కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చారు. రాఘవేంద్రస్వామి బృందావన దర్శనానికి 3 గంటల సమయం పట్టింది. సాధారణ క్యూలైన్లు, వీవీఐపీ క్యూలైన్లు, మంచాలమ్మ దర్శన మార్గాలు భక్తలతో కిక్కిరిశాయి. అన్నపూర్ణ భోజనశాల, పరిమళ ప్రసాదం కౌంటర్లలో రద్దీ నెలకొంది. మధ్వమార్గం కారిడార్, తుంగభద్ర నది వైపు కారిడార్లు భక్తులతో పోటెత్తాయి. పదవీ కాలం పొడిగింపు కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మూడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు అఫీషియల్ పర్సన్ ఇన్చార్జీల పదవీ కాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలు జిల్లాలోని కృష్ణగిరి పీఏసీఎస్కు సహకార శాఖ సీనియర్ ఇన్స్పెక్టర్ పి.లక్ష్మీకాంతరెడ్డి, కల్లూరు పీఏసీఎస్కు అసిస్టెంటు రిజిస్ట్రార్ టి.నాగరమణయ్య, నంద్యాల జిల్లాలోని హనుమంతుగుండం పీఏసీఎస్కు అసిస్టెంటు రిజిస్ట్రార్ జి.రాచయ్య అఫీషియ ల్ పర్సన్ ఇన్చార్జీలుగా కొనసాగుతున్నారు. వీరి పదవీ కాలం ఏప్రిల్ 30తో ముగిసిన నేపథ్యంలో ఆరు నెలల పాటు పొడిగిస్తూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి.రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జీవో ఆర్టీ నెంబరు 229 జారీ అయ్యింది. ఈ ఏడాది అక్టోబరు 30 వరకు అఫీషియల్ పర్సన్ ఇన్చార్జీలుగా కొనసాగుతారు. కార్మిక చట్టాలపై అవగాహన కర్నూలు కల్చరల్: మేడే సందర్భంగా కర్నూలులోని న్యాయ సేవా సదన్లో గురువారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్మిక చట్టాలపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి, శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్ అవగాహన కల్పించారు. ఈ–శ్రమ్ కార్డును పొందాలని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ సాంబశివరావు సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్లు శ్రీలక్ష్మీ, కేశన్న, ప్రసాద్, దుకాణ కార్మికులు, ఆటో, హమాలీ, బిల్డింగ్ కార్మికులు పాల్గొన్నారు. అస్తవ్యస్తంగా పింఛన్ల పంపిణీ కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో పింఛన్ల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. చాలా చోట్ల వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గురువారం ఉదయం 10 గంటల దాటినా ఉద్యోగులు ఇంటి వద్దకు రాకపోవడంతో మండటెండల్లో గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లాల్సి వచ్చింది. కల్లూరులో ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయలేదు. కోడుమూరు, సి.బెళగల్, కర్నూలు, ఆదోని, డోన్, బనగానపల్లి, అవుకు తదితర ప్రాంతాల్లో నామమాత్రంగా చేశారు. గురువారం సాయంత్రం 6 గంటల సమయానికి కర్నూలు జిల్లాలో 2,37,828 పింఛన్లు ఉండగా 2,20,796 (92.84 శాతం), నంద్యాల జిల్లాలో 2,14,058 పింఛన్లు ఉండగా 1,97,669 (92.34 శాతం) పంపిణీ చేశారు. పింఛన్ల పంపిణీలో కర్నూలు జిల్లాకు రాష్ట్రంలో 15, నంద్యాల జిల్లాకు 22వ స్థానం లభించింది. -
వీహెచ్ఏల రేషనలైజేషన్కు శ్రీకారం
కర్నూలు(అగ్రికల్చర్): ఉద్యాన శాఖలో గ్రామ ఉద్యాన సహాయకుల రేషనలైజేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఉద్యాన శాఖ కర్నూలు, నంద్యాల జిల్లాల అధికారులు పి.రామాంజనేయులు, నాగరాజు, కర్నూలు, నంద్యాల జిల్లాల హార్టికల్చర్ ఆఫీసర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాలో 215 మంది గ్రామ ఉద్యాన సహాయకులు ఉన్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఉద్యాన పంటలు ఉన్నప్పటికీ వీహెచ్ఏలు లేకపోవడం వల్ల రైతులకు సేవలు అందడం లేదు. ఉద్యాన పంటలు ఉన్న అన్ని ప్రాంతాల్లో వీహెచ్ఏలు అందుబాటులో ఉండాలని, అందరికి సమానంగా సాగు విస్తీర్ణం ఉండాలనే కోణంలో కసరత్తు చేస్తున్నట్లు జిల్లా ఉద్యాన అధికారి రామాంజనేయులు తెలిపారు. ఒకటి, రెండు ఈ ప్రక్రియ కొలిక్కి వస్తుందన్నారు. కార్యక్రమంలో ఉద్యాన అధికారులు అనూష, మదన్మోహన్గౌడు, నరేష్కుమార్రెడ్డి, దస్తగిరి, చందన తదితరులు పాల్గొన్నారు. -
ఈత కొలనులో విషాదం
● నీట మునిగి ఐదేళ్ల బాలుడు మృతి ఆదోని అర్బన్: ఈత కొలనులో నీట మునిగి ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ దుర్ఘటన ఇస్వీ గ్రామ సమీపంలో గురువారం చోటుచేసుకుంది. ఇస్వీ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆదోని పట్టణం ఇందిరానగర్ కాలనీకి చెందిన రవి, రీటా దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. గురువారం ఉదయం ఇస్వీ గ్రామ సమీపంలో ఉన్న ఈత కొలనుకు ముగ్గురు కుమారులతో కలిసి తల్లిదండ్రులు వెళ్లారు. తల్లి రీటా తన రెండో కుమారుడు దుస్తులు మారుస్తుండగా తండ్రి బెలూన్ తేవడానికి వెళ్లాడు. తల్లిదండ్రులకు చెప్పకుండా పెద్ద కుమారుడు ప్రిన్స్ (5) ఈతకొలనుతో దూకాడు. కాళ్లు, చేతులు ఆడించినా నీటిలో మునిగిపోయాడు. పది నిమిషాల తర్వాత తల్లిదండ్రులు ప్రిన్స్ ఎక్కడికి వెళ్లిపోయాడని వెతుకుతుండడంతో ఈత కొట్టే వ్యక్తి విషయాన్ని తెలిపారు. ఈత కొలను నుంచి ప్రిన్స్ను బయటకు తీసి వెంటనే ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు అప్పటికే ప్రిన్స్ మృతి చెందాడని తెలిపారు. కోలుకోలేక ఏఆర్ కానిస్టేబుల్ మృతి బొమ్మలసత్రం: నంద్యాల జిల్లా కేంద్రంలో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న చిన్నికృష్ణ (35) గడ్డిమందు తాగి గత ఏప్రిల్ 25 నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే కోలుకోలేక గురువారం మరణించారు. ఉద్యోగ రీత్య స్థానిక బాలాజీ కాంప్లెక్స్లో నివాసముంటున్న చిన్నికృష్ణ ఆర్థిక ఇబ్బందులతో పాటు కుటుంబ కలహాల కారణంగా జీవితంపై విరక్తి చెందాడు. ఈనేపథ్యంలో నంద్యాల శివారులో గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే కోలుకోలేక గురువారం మృతి చెందినట్లు తాలుకా పోలీసులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు సంతానం. ఆర్యూలో ఘర్షణ కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీలో చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంది. గురువారం వర్సిటీలోని ఫోర్త్ బిల్డింగ్ సమీపంలో ఓ విద్యార్థి సంఘం నాయకుడు, బోధనేత ర ఉద్యోగి ఒకరికొకరు వాగ్వాదం చేసుకున్నా రు.ఘర్షణ తీవ్రం కావడంతో పరస్పరం దూషి ంచుకుంటూ దాడి చేసుకున్నారు. తర్వాత ఇరువురు వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బి.విజయకుమార్ నాయుడుకు ఫిర్యాదు చేశారు. -
పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
ఆలూరు రూరల్: పరీక్షల్లో ఫెయిల్ అయ్యాయని మనస్తాపానికి చెందిన పదో తరగతి విద్యార్థి సిద్ధార్థ్ (15) ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువులు తెలిపిన వివరాలు.. ఆలూరులోని కొట్టాల వీధికి చెందిన శ్రీనివాసులు, దానమ్మ దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. మూడో సంతానమైన సిద్ధార్థ్ (15) స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల–1 పదో తరగతి చదివారు. గత ఏప్రిల్ 23న వెలువడిన ఫలితాల్లో సిద్ధార్థ్ ఫెయిల్ అయ్యాడు. దీంతో మనస్తాపం చెంది ఇంట్లో ఊరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బంధువులు గమనించి ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. సిద్ధార్థ్ పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు బళ్లారి ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేశారు. వారం రోజులుగా చికిత్స పొందుతూ గురువారం కోలుకోలేక మృతి చెందాడు. సిద్ధార్ మృతికి ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. బాలికపై పందుల దాడి కల్లూరు: ఆటలు ఆడుకుంటున్న బాలికపై పందులు దాడి చేయడంతో గాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం కల్లూరు అర్బన్ 32వ వార్డు పరిధిలోని పోలీస్ కాలనీలో చోటుచేసుకుంది. గురువారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. చుట్టుపక్కలవారు గమనించి పందులను తోలడంతో చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. తల్లిదండ్రులు చిన్నారిని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. కాలనీలో పందుల బెడద ఎక్కువగా ఉందని, అధికారుల స్పందించి సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు. బెల్లం ఊట ధ్వంసం ఆత్మకూరు: సిద్ధాపురం గ్రామానికి రెండు కి.మీ. దూరంలోని అటవీ ప్రాంతంలో నాటుసారా తయారీకి ఉపయోగించే 600 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సీఐ కిషోర్కుమార్ గురువారం తెలిపారు. పీటల రాంప్రసాద్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశామన్నారు. ఎవరైనా అక్రమంగా నాటుసారా తయారు చేసినా, విక్రయించినా అలాంటి వారిపై కేసులు నమోదు చేసి జైలుకు తరలిస్తామన్నారు. నాటుసారా తయారు చేసే వారి వివరాలను 9440902585, 9177299067, 8328307774కు సమాచారం అందించాలన్నారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. -
హత్య కేసు నిందితులకు యావజ్జీవ జైలు శిక్ష
డోన్ టౌన్: ఓ వ్యక్తి హత్య కేసులో సాక్ష్యాలు రుజువు కావడంతో నిందితులకు యావజ్జీవ జైలు శిక్ష విధిస్తూ జిల్లా న్యాయమూర్తి కబర్ది తీర్పు వెలువరించారు. డోన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొట్రాయి పంచాయతీ పరిధిలోని మజరా గ్రామమైన ఎస్. గుండాలకు చెందిన బోయ గుడిమిరాళ్ల కౌలుట్ల (60) డోన్ రైల్వే స్టేషన్ సమీపంలో 2016 మే 15వ తేదీన దారుణహత్యకు గురయ్యాడు. పాత కక్షల నేపథ్యంలో కొట్రాయి గ్రామానికి చెందిన మాదిగ నగేష్, అతని బంధువు గుమ్మకొండ గ్రామానికి చెందిన హరిజన నాయకంటి బాలమద్ది అలియాస్ కంకర బాలమద్ది రాయితో తలపై మోది హత్యకు పాల్పడినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. ఈ మేరకు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. కోర్టు విచారణలో ఇద్దరు నిందితులు హత్యకు పాల్పడినట్లు రుజువు కావడంతో గురువారం జిల్లా న్యాయమూర్తి కబర్ది యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. -
క్యూఆర్ కోడ్తో వైద్యసేవలపై అభిప్రాయం
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అందే వైద్యసేవలపై క్యూఆర్ కోడ్తో రోగులు, వారి కుటుంబసభ్యులు అభిప్రాయాన్ని చెప్పవచ్చని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు సూచించారు. గురువారం ఆయన ఆసుపత్రిలోని పలు విభాగాలను తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఓపీ కౌంటర్, ఎంసీహెచ్, పీడియాట్రిక్, ఫిజియోథెరపి, శుశ్రుత భవన్ తదితర విభాగాల్లో పర్యటించి వైద్యసేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని పలు ఓపీ, ఐపీ విభాగాలకు వచ్చే రోగులకు అందుతున్న వైద్యసేవల అభిప్రాయాన్ని క్యూఆర్ కోడ్లో నమోదు చేసుకునే విధంగా రోగులకు అవగాహన ఇవ్వాలని వైద్యులు, నర్సింగ్ సిబ్బందికి సూచించారు. శుశ్రుత భవన్, సర్జికల్ విభాగంలోని ఆపరేషన్ థియేటర్లో పర్యటించి యూ నిట్ వారీగా ఎన్నెన్ని సర్జరీలు చేస్తున్నారనే దానిపై ఆరా తీశారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగి తప్పనిసరిగా ఆధార్కార్డు, అభా కార్డు తీసుకుని వస్తే ఓపీ నమోదు ప్రక్రియ, ఇతర సేవలు వేగంగా అందుతా యని చెప్పారు. ఈ విషయమై రోగులకు, వారి కుటుంబసభ్యులకు వైద్య సిబ్బంది అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఆయన వెంట డిప్యూటీ సూపరింటెండెంట్ శ్రీరాములు, అడ్మినిస్ట్రేటర్ సింధు సుబ్రహ్మణ్యం, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ శివబాల నాగాంజన్, డాక్టర్ కిరణ్కుమార్, డాక్టర్ సునీల్ ప్రశాంత్ ఉన్నారు. -
మార్గదర్శకాలు రావాల్సి ఉంది
ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి గ్రామ/ వార్డు సచివాలయాల మ్యాపింగ్ను దాదాపు పూర్తి చేశాం. సమీపంలోని సచివాలయాల మ్యాపింగ్లో భాగంగా 350 సచివాలయాలను గుర్తించాం. ప్రధానంగా టెక్నికల్ ఫంక్షనీర్స్గా గుర్తించిన ఉద్యోగులు ఇక నుంచి సమీపంలోని రెండు సచివాలయాల్లో సేవలను అందించాల్సి ఉంటుంది. ఉద్యోగుల సర్దుబాటుకు సంబంధించి ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు విడుదలైతే స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. – జీ నాసరరెడ్డి, జెడ్పీ సీఈఓ, జీఎస్డబ్ల్యూఎస్ జిల్లా నోడల్ అధికారి -
‘పబ్లిసిటీ అప్పులు తప్ప అభివృద్ధి శూన్యం’
కర్నూలు జిల్లా: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయలేదని కర్నూలు జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు ఎస్పీ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబుకి అమరావతి, పోలవరం తప్ప ప్రజల గురించి ఆలోచించే టైమ్ లేదని మండిపడ్డారు. చంద్రబాబు లక్ష కోట్లు అప్పు చేసి అమరావతి నిర్మిస్తున్నాడన్నారు.చంద్రబాబు ప్రభుత్వంలో అమ్మ ఒడిగానీ, విద్యా దీవెన గానీ రాలేదన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి రూ. 15 వేలు ఇస్తానని చెప్పి ఏ ఒక్కరికీ ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. కూటమి ప్రభుతంలో చంద్రబాబు పబ్లిసిటీ అప్పులు తప్ప అభివృద్ధి ఏమీ చేయలేదని విమర్శించారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడని , వాటికి తాము భయపడే ప్రసక్తే లేదన్నారు. నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి జగన్ ను మళ్లీ సీఎం చేసుకుందామని ఎస్పీ మోహన్ రెడ్డి పిలువునిచ్చారు. -
ప్రియుడి ఇంటి ముందు ట్రాన్స్జెండర్ ధర్నా
ఆదోని రూరల్(కర్నూలు): తనను మోసం చేశాడంటూ ఆదోని మండలం బైచిగేరికి చెందిన యువకుడి ఇంటి ఎదుట ఓ ట్రాన్స్జెండర్ ఆందోళనకు దిగింది. బాధితురాలి కథనం మేరకు.. నాలుగేళ్ల క్రితం ఆదోని మండలం బైచిగేరికి చెందిన గణేష్ అనే యువకుడు ఉద్యోగరీత్యా హైదరాబాద్కు వెళ్లాడు. అక్కడ అన్నమయ్య జిల్లా మదనపల్లె గ్రామానికి చెందిన వెంకటరమణ కుమారుడు హాసినిగౌడ్ ఊరఫ్ రామకృష్ణ(24) అనే ట్రాన్స్జెండర్తో పరిచయం ఏర్పడి, సహజీవనం చేస్తూ వచ్చాడు. గతేడాది గణేష్కు పెళ్లి కుదరడంతో ట్రాన్స్జెండర్ హాసినిని వదిలేసి సొంత గ్రామానికి రావడంతో 2024 జూన్ 10న బైచిగేరి గ్రామానికి వచ్చి తనకు న్యాయం చేయాలని హాసినిగౌడ్ నిరసన తెలిపింది. ఆదోని తాలూకా పోలీసులు ఆమె నివాసముంటున్న హైదరాబాద్లోని సైబరాబాద్ కమిషనరేట్ సనత్నగర్ పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ మేరకు హాసినిగౌడ్ అక్కడ ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అయితే మరలా బుధవారం వచ్చి బైచిగేరిలో గణేష్ ఇంటి ముందు ధర్నాకు దిగింది. ‘‘నువ్వే నా ప్రాణం, నా సర్వస్వం.. నువ్వు లేనిదే నేను లేనంటూ నా వెంట పడ్డాడు. నేను ఒక ట్రాన్స్జెండర్. నాతో నీవు సావాసం చేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదని చెప్పాను. అయినా వినకుండా, తననే పెళ్లి చేసుకుంటాని వెంట బడ్డాడు. నాకు పిల్లలు పుట్టరని చెప్పినప్పటికీ వినిపించుకోలేదు. మా ఇంటి నుంచి రూ.5 లక్షలు తీసుకెళ్లి ఇద్దరం పెళ్లి చేసుకుని హైదరాబాద్లో నివాసముంటున్నామని హాసినిగౌడ్ వాపోయింది. తన డబ్బులు రూ.5 లక్షలు అయినా ఇప్పించాలని, లేకపోతే గణేష్తో కాపురం అయినా చేయించాలని డిమాండ్ చేసింది. సమాచారం అందుకున్న తాలూకా ఎస్ఐ రామాంజనేయులు గ్రామానికి చేరుకుని విచారించారు. హాసినిగౌడ్ గణేష్పై ఇదివరకే కేసు హైదరాబాద్లో నమోదయ్యిందని, ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి న్యాయం చేస్తామని ఎస్ఐ చెప్పడంతో వారు హాసినిగౌడ్, ఇతర ట్రాన్స్జెండర్లు ధర్నా విరమించారు. -
కుందూనదిలో మునిగి యువకుడి మృతి
కోవెలకుంట్ల: రేవనూరుకు చెందిన ఓ యువకుడు గొర్రెలు మేపుకునేందుకు వెళ్లి బుధవారం ప్రమాదశాత్తు కుందూనదిలో మునిగి మృతి చెందాడు. స్థానికులు అందించిన సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన బాలుడు, లక్ష్మీదేవి దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె సంతానం. కుమారుడు జయవర్ధన్(20) పదవ తరగతి వరకు విద్యనభ్యసించి మధ్యలో చదువు మానేశాడు. గొర్రెల కాపరిగా ఉంటూ తల్లిదండ్రులకు చేదోడు వాడోడుగా ఉంటున్నాడు. ఉదయం మరో ఇద్దరు యువకులతో కలిసి గొర్రెలు మేపుకునేందుకు రేవనూరు– కలుగొట్ల గ్రామాల మధ్య ప్రవహిస్తున్న కుందూనది వైపు వెళ్లారు. నది ఆవతలి ఒడ్డుకు గొర్రెలను తోలుకపోయే క్రమంలో ముగ్గురు నదిలో దిగారు. జయవర్ధన్ లోతు ఎక్కువ ఉన్న వైపు వెళ్లి ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. మిగిలిన యువకులు పెద్దగా కేకలు వేయడంతో పక్క పొలాల్లో ఉన్న రైతులు నదిలో దిగి గాలించగా అప్పటికే మృతి చెందాడు. ఈ మేరకు రేవనూరు పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
కూటి కోసం పాము చేత పట్టి
కూటి కోసం కోటి విద్యలన్నారు పెద్దలు. కడుపు నింపుకోవడానికి వైఎస్సార్ జిల్లా కడపకు చెందిన వెంకటమ్మ అనే మహిళ కొండచిలువను మెడలో వేసుకుని భిక్షాటన చేస్తోంది. మండలంలోని పల్లెల్లో భిక్షాటన చేస్తూ కనిపించిన మహిళ పలు ఆసక్తికర విషయాలు చెప్పింది. గొంతుకు చుట్టుకుంటే ప్రాణానికే ప్రమాదం కదా అని ప్రశ్నిస్తే ప్రస్తుతం భిక్షాటన చేయాలంటే ఏదో ఒక కొత్తదనం ఉంటే తప్పా పైసలు ఇవ్వడం లేదని చెబుతోంది. పాముకు ఆహారంగా కోళ్ల వ్యర్థాలు, కప్పలు, ఎలుకలను వేస్తానని, కొండచిలువను చూసేందుకు వచ్చి ఒకొక్కరు రూ.10, రూ.5 ఇస్తున్నారని కోటివిద్యల్లో ఇదోకటి అంటూ నవ్వుతూ చెబుతోంది. – దొర్నిపాడు -
అధికారులు ఈ వంక చూడరు?
● యథేచ్ఛగా వాగులు, వంకలు కబ్జా చేస్తున్న కూటమి నేతలు ● వంక పోరంబోకు స్థలంలో షెడ్లకు ఇంటి నంబర్ల కేటాయింపు డోన్: ఖాళీ జాగా కనిపిస్తే చాలు కూటమి నేతలు పాగా వేస్తేన్నారు. వాగులు, వంకలను సైతం వదలడం లేదు. రాత్రిరాత్రికి ఆక్రమణకు గురవుతున్నా అధికారులు అటు వైపు కన్నెతి చూడటం లేదు. అంతేకాకుండా కొందరు అధికారులు ఆక్రమణదారులకు అండగా నిలుస్తున్నారు. కూటమి నేతల ఆక్రమణలకు చెరువులు సైతం ఒట్టిపోయే ప్రమాదం పొంచి ఉంది. డోన్ పట్టణ నడిబొడ్డున ఉన్న బోగందాని వంక.. కొచ్చెర్వు చెరువు, వెంకటాపురం, ఉడుములపాడు, జగదుర్తి చెరువులకు సమృద్ధిగా నీరందించేది. ఈ వంకను పూడ్చేందుకు కొందరు టీడీపీ నాయకులు పూడ్చివేస్తున్నారు. మరోవైపు వంకను ఆనుకొని ఓ టీడీపీ కార్యకర్త రేకులషెడ్డును నిర్మించి నిబంధనలకు విరుద్ధగా మున్సిపాలిటీ నుంచి ఇంటి నంబర్ను పొందడం జరిగింది. ఈ ప్రాంతంలో సెంటు స్థలం రూ.10 లక్షల ధర పలుకుతుండటంతో టౌన్ ప్లానింగ్ అధికారులతో కుమ్మకై ్క ఇంటి నంబర్ పొందేందుకు పలువురు నేతలు పావులు కదుపుతున్నారు. దీంతో వంక నానాటికి ఆక్రమణతో కుశించికుపోయి నీటి ప్రవాహం నిలిచిపోయి చెరువులకు నీరందని పరిస్థితి ఏర్పడుతుంది. వెంటనే మైనర్ ఇరిగేషన్ అధికారులు ఈ వంక వెంట వెలుస్తున్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. లేకపోతే లోతట్టు కాలనీలు జలమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. -
బంగారు దుకాణంలో చోరీ
పత్తికొండ రూరల్:పత్తికొండ–గుత్తి రోడ్డు కూడలిలో మెయిన్ రోడ్డులో ఉన్న బంగారు దుకాణంలో చోరీ జరిగింది. దూదేకొండ గ్రామానికి చెందిన పింజరి అక్బర్ సాహెబ్ గత 13 ఏళ్లుగా పత్తికొండ పట్టణంలో బంగారు దుకాణం నిర్వహిస్తున్నాడు. వెండి, బంగారు ఆభరణాలు తయారు చేస్తూ విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి షాపునకు తాళం వేసి సొంతూరుకు వెళ్లాడు. బుధవారం ఉదయం షాపు తెరిచి చూడగా గుర్తు తెలియని వ్యక్తులు పైకప్పు తొలగించి చోరీకి పాల్పడినట్లు గుర్తించాడు. షాపులోని లాకర్లో ఉంచుకున్న 8 జతల బంగారు కమ్మలు, ఒకటిన్నర కేజీల వెండి ఆభరణాలతో పాటు రూ.3 లక్షల నగదును అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దుకాణాన్ని స్థలాన్ని పరిశీలించి, వేలిముద్రలు సేకరించినట్లు సీఐ జయన్న తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. -
గిర గిర తిరగాలి బొంగరం..!
పాఠశాలలకు వేసవి సెలవులు కావడంతో విద్యార్థులు ఆటపాటల్లో మునిగి తేలుతున్నారు. మండుటెండలను సైతం లెక్కచేయకుండా ఆటల్లో బిజీ అయ్యారు. మారుతున్న కాలానుగుణంగా సెల్ఫోన్లకు బానిస కాకుండా పిల్లలను వారి తల్లిదండ్రులు పాతకాలంనాటి ఆటల వైపు దృష్టి మళ్లిస్తున్నారు. ఖోఖో, కబడ్డీ, క్యారమ్స్, బిల్లంగోడు, బొంగరాలు, తదితర ఆటలపై పిల్లలు ఆసక్తి కనబరుస్తున్నారు. కోవెలకుంట్ల పట్టణంలో నాగుల కట్ట సమీపంలో కొందరు పిల్లలు బొంగరాల ఆట ఆడుతూ కనిపించారు. – కోవెలకుంట్ల -
కర్ణాటక మద్యం స్వాధీనం
డోన్ రూరల్: అక్రమంగా కర్ణాటక మద్యం విక్రయిస్తుండగా ఎకై ్సజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ఎక్సైజ్ కార్యాలయంలో బుధవారం సీఐ వరలక్ష్మి కేసు వివరాలను వెల్లడించారు. అందిన సమాచారం మేరకు కొచ్చెర్వు గ్రామంలో దాడి చేయగా గ్రామానికి చెందిన మేకల లక్ష్మన్న, వడ్డే శ్రీనివాసులు అక్రమంగా మద్యం విక్రయిస్తూ పట్టుబడ్డారన్నారు. వారి వద్ద నుంచి 192 కర్ణాటక మద్యం సీసాలు, బైక్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులపై కేసు నమోదు చేశామన్నారు. సమావేశంలో ఎస్ఐలు సోమశేఖర్రావు, దౌలత్ఖాన్, హెడ్ కానిస్టేబుల్ నాగరాజు, సుధాకర్రెడ్డి, గోపాల్, భషీర్, ఉమాకాంత్రెడ్డి, చెన్నకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. బీరుసీసాతో దాడి మహానంది: మండల కేంద్రమైన ఎం.తిమ్మాపురంలోని వైన్షాపు వద్ద ఉన్న ఓ దుకాణంలో బుధవారం రాత్రి ఘర్షణ చోటుచేసుకుంది. అబ్బీపురం గ్రామానికి చెందిన యువకుడు దుకాణంలో వస్తువులు కొనుగోలు చేసి రూ.30 ఫోన్ పే చేశాడు. అయితే ఓ నంబరుకు పంపించబోయి మరో నెంబరుకు పంపించాడు. దీంతో తనకు డబ్బు రాలేదని దుకాణం యజమాని చెప్పడంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. కోపోద్రిక్తుడైన యువకుడు బీరుసీసాతో దుకాణం యజమానిపై దాడి చేయడంతో స్వల్పగాయమైనట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని విచారణ చేస్తున్నారు. ఈ విషయంపై ఎలాంటి ఫిర్యాదు అందలేని పోలీసులు తెలిపారు. -
సెంటిమెంట్ పండింది
● అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోళ్లకు పోటెత్తిన జనాలు ● ఉమ్మడి జిల్లాలో దాదాపు రూ.250 కోట్ల మేర అమ్మకాలు? ● వివాహాలు ఉండటంతో పెరిగిన కొనుగోళ్లుకర్నూలు(అగ్రికల్చర్): సెంటిమెంటు పండింది. అక్షయ తృతీయను పురస్కరించుకుని బుధవారం బంగారం కొనుగోలు చేసేందుకు వినియోగదారులకు దుకాణాలకు పోటెత్తారు. కర్నూలు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్ తదితర పట్టణాల్లో కొనుగోలుదారులతో బంగారం దుకాణాలు కిటకిటలాడాయి. ఉదయం 9 గంటలకే బంగారం దుకాణాలు తెరుచుకున్నాయి. రాత్రి ప్రొద్దుపోయే వరకు జనాల రద్దీ తగ్గలేదు. ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లా మొత్తం మీద దాదాపు రూ.250 కోట్ల వ్యాపారం జరిగి ఉంటందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కార్పొరేట్ జ్యువెలరీ సంస్థలు 10 రోజులుగా ఆఫర్ల గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నాయి. గత ఏడాది అక్షయ తృతీయ రోజున 10 గ్రాముల బంగారం ధర రూ.73,240గా ఉంది. ఈ అక్షయ తృతీయ నాటికి 22 క్యారెట్ల బంగారం ధర రూ.89,800, 24 క్యారెట్ల ధర రూ.97,960కి చేరాయి. ఈ ధరపై తరుగు పేరుతో డిజైన్ బట్టి 6 నుంచి 22 శాతం సొమ్ము అదనంగా రాబట్టినట్లు స్పష్టమవుతోంది. మే నెలలో వివాహాది శుభకార్యాలు ఉండటంతో అక్షయ తృతీయ అమ్మకాలు జోరుగా జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోళ్లు పెరిగినట్లు తెలుస్తోంది. ఈ రోజున బంగారం కొనుగోలు చేస్తే లక్ష్మీదేవిని ఇంటిలోకి ఆహ్వానించినట్లే అన్న సెంటిమెంటు కూడా బాగా కనిపించింది. కార్పొరేట్ బంగారం దుకాణ సంస్థలు అక్షయ తృతీయ ఆఫర్ల పేరుతో పెద్ద ఎత్తున చేసుకున్న ప్రచారం గ్రామీణ ప్రాంతాల ప్రజల్లోకి కూడా వెళ్లడంతో కొనుగోళ్లు కొంత పెరిగినట్లు తెలుస్తోంది. -
కల్వర్టును ఢీకొన్న లారీ
కోడుమూరు రూరల్: ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి లారీ అదుపుతప్పి కల్వర్టును ఢీకొన్న సంఘటన బుధవారం కోడుమూరు నుంచి కర్నూలు వెళ్లే రోడ్డులో చోటు చేసుకుంది. వివరాలు.. డోన్ నుంచి ఆదోని వైపు వెళుతున్న లారీ ప్యాలకుర్తి సమీపాన ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించే క్రమంలో రోడ్డు సైడ్కు ఉన్న కల్వర్టును వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ చక్రాలన్నీ ఊడిపోవడంతో పాటు, లారీ డ్రైవర్, క్లీనర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాద పరిస్థితి చూస్తే ఘోర ప్రమాదం నుంచి బయటపడినట్లుగా ఉంది. విషయం తెలుసుకున్న కోడుమూరు ఎస్ఐ ఎర్రిస్వామి ప్రమాద స్థలాన్ని చేరుకుని పరిస్థితి సమీక్షించి రోడ్డుపై వెళ్లే వాహనాలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు. -
కుక్కను తప్పించబోయి..
కర్నూలు: కర్నూలు బళ్లారి చౌరస్తా సమీపంలోని ఆంజనేయస్వామి గుడి వెనుక జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం తరిగోపుల గ్రామానికి చెందిన మండ్ల పరుశురాముడు (26) కర్నూలు నగరంలోని సాయికృష్ణ డిగ్రీ కళాశాల సమీపంలో నివాసముంటాడు. బుధవారం తెల్లవారుజామున హైదరాబాదు వైపు నుంచి కర్నూలులోకి వచ్చే సర్వీసు రోడ్డులో ఆంజనేయస్వామి గుడి వెనుక రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. బైక్పై స్నేహితుడు ఎల్లా నాయుడుతో కలసి వస్తూ ఆంజనేయస్వామి గుడి వద్ద అడ్డంగా వచ్చిన కుక్కను తప్పించబోయి అదుపు తప్పి కింద పడ్డాడు. బైక్ నడుపుతున్న పరుశురాముడు తలకు బలమైన గాయం కావడంతో అ క్కడికక్కడే చనిపోయాడు. వెనుక కూర్చున్న ఎల్లా నాయుడుకు స్వ ల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరుశురాముడు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీ కేంద్రానికి తరలించారు. మృతునికి ఇంకా వివాహం కాలేదు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి -
లంచం అడిగితే సమాచారమివ్వండి
కర్నూలు: ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే (లంచం అడిగితే) టోల్ఫ్రీ నెంబర్ 1064కి కాల్ చేసి సమాచారం అందించాలని అవినీతి నిరోధక శాఖ కర్నూలు రేంజ్ డీఎస్పీ దివిటి సోమన్న ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దాదాపు 11 నెలల కాలంగా ఏసీబీ డీఎస్పీ పోస్టు ఖాళీగా ఉండటంతో ప్రభుత్వం ఇటీవల సోమన్నను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం కలెక్టరేట్ వెనక ఎ.క్యాంప్లో ఉన్న ఏసీబీ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతపురం జిల్లా కనగానపల్లె మండలం వేపకుంట గ్రామానికి చెందిన సోమన్న 1991లో ఎస్ఐ హోదాలో పోలీసు శాఖలో చేరారు. క్రిష్ణగిరి, సంజామల, నందవరం, వెల్దుర్తి, అనంతపురం పీటీసీలో విధులు నిర్వహించారు. సీఐగా పదోన్నతి పొందిన తర్వాత సీఐడీ, ప్యాపిలి, ఆదోని తాలూకా, లక్కిరెడ్డిపల్లె పీఎస్లో పనిచేశారు. 2020లో డీఎస్పీగా పదోన్నతి పొంది సీఐడీ, ఆదోని డీఎస్పీగా పనిచేశారు. ప్రస్తుతం అమరావతి హెడ్ క్వార్టర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సోమన్నను కర్నూలు రేంజ్ ఏసీబీ విభాగానికి నియమించడంతో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అవినీతి నిర్మూలనకు ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలన్నారు. అవినీతి అధికారుల సమాచారం తన ఫోన్ నెంబర్ 9440446178కు కూడా ఫిర్యాదు చేయవచ్చన్నారు. టోల్ఫ్రీ నెంబర్ 1064 ఏసీబీ నూతన డీఎస్పీ దివిటి సోమన్న -
వైభవంగా అక్షయ తృతీయ వేడుక
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో పవిత్ర అక్షయ తృతీయ వేడుక వైభవంగా నిర్వహించారు. బుధవారం పీఠాధిపతి సుభుదేంద్రద్రతీర్థులు నేతృత్వంలో వేడుకలు శాస్త్రోక్తంగా చేపట్టారు. రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి గంధ లేపనం గావించి విశేష పూజలు కానిచ్చారు. రెండు గంటల పాటు వేద మంత్రోచ్ఛారణలతో పూజోత్సవాలు నిర్వహించారు. వేడుక భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. వైఎస్సార్సీపీ విభాగ కమిటీలో కర్నూలు వాసులు కర్నూలు (టౌన్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మున్సిపల్ విభాగ కమిటీలో కర్నూలుకు చెందిన పలువురికి పదవులు దక్కాయి. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర మున్సిపల్ విభాగ కమిటీలో ప్రధాన కార్యదర్శిగా ఎం.రాజేశ్వరరెడ్డి, కార్యదర్శులుగా దండు లక్ష్మీకాంతరెడ్డి, షేక్ యూనుస్ బాషా, సంయుక్త కార్యదర్శిగా సందీప్ రెడ్డిలను నియమించారు. ఈ మేరకు బుధవారం రాత్రి పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. -
ప్రశాంతంగా పాలిసెట్
కర్నూలు సిటీ: పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్–2025 బుధవారం ప్రశాంతంగా జరిగింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించిన పరీక్షకు కర్నూలు నగరంలో 12 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 4,595 మంది విద్యార్థులకుగాను 4,003 మంది హాజరయ్యారు. ఆదోనిలో ఏర్పాటు చేసిన 10 కేంద్రాల్లో 2,771 మందికి గాను 1,660 మంది హాజరయ్యారు. జిల్లా కో–ఆర్డినేటర్గా ప్రభుత్వ పాలిటెక్నిక్ ఫర్ మైనార్టీ కాలేజీ ప్రిన్సిపాల్ ఓ. శ్రీధర్, జిల్లా పరిశీలకులుగా స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఏపీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ నాగేశ్వరరావు, టౌన్ అబ్జర్వర్గా టి.శ్రీనివాసులు వ్యవహరించారు. వీరు పలు కేంద్రాలను తనిఖీ చేశారు. రానున్న మూడు రోజుల్లో అకాల వర్షాలు కర్నూలు(అగ్రికల్చర్): రానున్న మూడు రోజుల్లో ఉమ్మడి జిల్లాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒకవైపు వడగాల్పులు, మరోవైపు ఉరుములు, మెరుపులు, పిడుగులు, అకాల వర్షాల కురిసే అవకాశం ఉంది. గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉన్నట్లు పేర్కొన్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు, వడగాల్పులు, సాయంత్రం నుంచి ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. గిరిజన గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం కర్నూలు(అర్బన్): జిల్లాలోని గిరిజన సంక్షేమ గురుకులాల్లో 3వ తరగతి ప్రవేశాలతో పాటు 4 నుంచి 9వ తరగతి వరకు మిగిలిన సీట్లలో ప్రవేశానికి గిరిజన వర్గాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారిణి కె.తులసీదేవి బుధవారం ఒక ప్రకటనలో కోరారు. గిరిజన సంక్షేమ గురుకులాలు బాలికలకు కర్నూలు, ఆలూరు, బాలురకు తుగ్గలిలో ఉన్నాయన్నారు. ఈ మూడు గురుకులాల్లో 3వ తరగతి ప్రవేశాలకు మొత్తం 120 సీట్లు ఉన్నాయన్నారు. అర్హులైన విద్యార్థులు ఈ నెల 1 నుంచి 20వ తేదీలోగా ఆయా పాఠశాలల్లోనే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 30న కర్నూలు బిర్లాగేట్ సమీపంలోని గిరిజన సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయంలో లాటరీ పద్ధతిన సీట్లు కేటాయిస్తామన్నారు. నీట్ యూజీ–2025కు హెల్ప్ డెస్క్ ఏర్పాటు కర్నూలు కల్చరల్: ఈనెల 4వ తేదీన నిర్వహిస్తున్న నీట్ యూజీ–2025 పరీక్ష సందర్భంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. పరీక్షకు సంబంధించి ఏవైనా సమస్యలు, ఇబ్బందులు, సందేహాలు ఉన్నా నివృత్తి కోసం హెల్ప్ డెస్క్ నెంబర్ 08518 277305కు ఫోన్ చేయవచ్చన్నారు. మే 3, 4 తేదీలు రెండు రోజులు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు హెల్ప్ డెస్క్ అందుబాటులో ఉంటుందన్నారు. ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ ర్యాంపులు కర్నూలు(హాస్పిటల్): ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ ర్యాంపులు ఉండేలా చర్యలు చేపడతామని డీఆర్ఓ సి.వెంకట నారాయణమ్మ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా స్థాయి వైకల్య కమిటీ సమావేశాన్ని సంబంధిత అధికారులతో నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో శారీరక వికలాంగులకు ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డుల మంజూరు దరఖాస్తులు చాలా పెండింగ్లో ఉన్నాయని సభ్యులు తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. వాటిని వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా స్థాయి వైకల్య కమిటీ సమావేశాన్ని ఆరు నెలలకు ఒకసారి నిర్వహించేలా చూస్తామన్నారు. సభ్యులు తన దృష్టికి తీసుకొచ్చిన ప్రతి సమస్యను పరిశీలించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ నాసరరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి శామ్యూల్, విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు రాయిస్ ఫాతిమా, ఎల్డీఎం రామచంద్రరావు పాల్గొన్నారు. -
హిట్ అండ్ రన్ కేసులు త్వరితగతిన పరిష్కరించండి
కర్నూలు: హిట్ అండ్ రన్ కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు సరైన నష్టపరిహారం ఇప్పించాలని జిల్లా జడ్జి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో ఉమ్మడి కర్నూలు జిల్లా అధికారులతో హిట్ అండ్ రన్ కేసులపై సమీక్ష నిర్వహించారు. కర్నూలు జిల్లాలో 76, నంద్యాల జిల్లాలో 38 హిట్ అండ్ రన్ కేసులు దర్యాప్తు దశలో(ప్రాసెస్) ఉన్నాయని అధికారులు న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. వాటిని త్వరితగతిన పరిష్కరించి బాధితులకు సరైన నష్టపరిహారం ఇప్పించాలన్నారు. సమావేశంలో నంద్యాల జిల్లా రెవెన్యూ ఆఫీసర్ రాము నాయక్, కర్నూలు రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ భారతి చవాన్, కర్నూలు జిల్లా రెవెన్యూ ఆఫీస్ సూపరింటెండెంట్ రాజేశ్వరి, ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్, డీసీఆర్బీ సీఐ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. -
అభ్యుదయవాది బసవేశ్వరుడు
కర్నూలు కల్చరల్: సమాజంలో కుల, వర్ణ, లింగ వివక్షతను వ్యతిరేకించిన అభ్యుదయవాది మహాత్మా బసవేశ్వరుడు అని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అన్నారు. మహాత్మా శ్రీ బసవేశ్వర జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం బసవేశ్వర చిత్రపటానికి జిల్లా కలెక్టర్, వీరశైవ, జంగమ నాయకులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కర్నూలు నగరంలో మహాత్మా బసవేశ్వరుని పేరుతో ఒక సర్కిల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం హర్షిందగ్గ విషయమన్నారు. సెట్కూరు సీఈఓ డాక్టర్ వేణుగోపాల్, వీరశైవ ఐక్య సంఘం అధ్యక్షులు ఏజీ మల్లికార్జునప్ప, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరప్ప, సభ్యులు విశ్వేశ్వరయ్య, శివరాజ్, యాగంటయ్య, శెట్టి వీర శేఖరప్ప, జంగమ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదు
మా న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఏపీఎంసీఏ ఆధ్వర్యంలో దశలవారీగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా ఈ నెల 24, 25వ తేదీల్లో విజయవాడలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీహెచ్వోలందరూ మహాధర్నాలో పాల్గొన్నారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదు. జీతభత్యాల విషయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాము. ఇందులో భాగంగా నిరవధిక సమ్మె చేస్తూ శాంతియుత పద్ధతిలో ఆందోళనకు దిగాం. – టీఎస్. చందన, ఏపీ ఎంఎల్హెచ్పీ/ సీహెచ్వో అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు సీహెచ్వోలను క్రమబద్ధీకరించాలి ఆరేళ్లు దాటిన సీహెచ్వోలను క్రమబద్ధీకరించాల్సి ఉన్నా చేయడం లేదు. ఎన్హెచ్ఎంలోని ఇతర ఉద్యోగులతో సమానంగా 23 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలి. ప్రతి నెలా జీతంతో పాటు ఇన్సెంటివ్ ఇవ్వాలి. ప్రతి సంవత్సరం 5 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలి. ఆర్థిక, ఆర్థికేతర సమస్యలు తీర్చే విధంగా హామీ ఇవ్వాలి. ఈ డిమాండ్లు తీర్చేవరకు మేము శాంతియుత నిరసనలు కొనసాగిస్తాం. –కె.నాగరాజు, ఏపీ ఎంఎల్హెచ్పీ/సీహెచ్వో అసోసియేషన్ జిల్లా కోశాధికారి, కర్నూలు -
నా బిడ్డకు న్యాయం చేయండి
ఆదోని అర్బన్(కర్నూలు): డీఎస్పీ, సీఐ కారణంగా తన బిడ్డ జీవితం అన్యాయమైపోయిందని ఓ యువతి తండ్రి ఆవేదన చెందుతున్నాడు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. ఆదోని పట్టణంలోని వన్టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో నివాసముంటున్న యువతి, కౌతాళం మండలం కామవరానికి చెందిన యువకుడు వీరేష్ ప్రేమించుకున్నారు. గతేడాది డిసెంబర్ 1వ తేదీన పెద్దలకు తెలియకుండా ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఏమి జరిగిందో తెలియదు కానీ.. యువకుడు తన తల్లిదండ్రుల బలవంతంతో మరో యువతితో రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న యువతి తండ్రి గత నెల 19న ఆదోని వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సీఐ శ్రీరామ్ ఆ యువకుడిని పిలిపించి అడగగా, రెండో పెళ్లి చేసుకోవడం లేదని, ఒక నెల గడువు కోరి లలితను తీసుకెళ్తానని చెప్పాడు.ఇంతలోనే ఓ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలిసి యువకుడిని నిలదీయడంతో యువతి కుటుంబీకులపై దాడి చేశారు. ఈ మేరకు బాధిత యువతి తండ్రి ఆదోని డీఎస్పీకి ఈనెల 21న ఫిర్యాదు చేశాడు. అయితే ఎలాంటి చర్యలు తీసుకోని కారణంగానే.. కామవరం వీరేష్ ఈనెల 25న రెండో పెళ్లి చేసుకున్నాడని, పోలీసులు డబ్బులు తీసుకుని తమ కేసును తారుమారు చేశారని ఆరోపిస్తున్నాడు. ఈ విషయమై డీఎస్పీ హేమలతను వివరణ కోరగా.. యువకుడితో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేశామని, కేసు దర్యాప్తులో ఉందన్నారు. -
ఏపీ టీఏఎస్ఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సునీల్కుమార్
కర్నూలు(అగ్రికల్చర్): ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ సర్వీస్ అసోసియేషన్(ఏపీ టీఏఎస్ఏ) నూతన కార్యవర్గం ఎన్నికలు సోమవారం విజయవాడలో జరిగాయి. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కర్నూలు జిల్లా ట్రెజరీ కార్యాలయంలో ఎస్టీఓగా పనిచేస్తున్న పలనాటి సునీల్కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉమ్మడి జిల్లా నుంచి ఈయన అసోసియేషన్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికై నట్లుగా ఎన్నికల అధికారి పి.కిరణ్కుమార్ ధ్రువపత్రం అందజేశారు. ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్ర కార్యవర్గంలో తనకు ప్రాతినిధ్యం కల్పించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ట్రెజరీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం నంద్యాల(న్యూటౌన్): నంద్యాల ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా కేంద్రంలో ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ప్రసాద్ సోమవారం తెలిపారు. ప్రభుత్వ ఐటీఐలో చేరాల్సిన విద్యార్థులు మే 24వ తేదీలోపు iti.ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకుని, 26వ తేదీలోపు నంద్యాల ప్రభుత్వ ఐటీలో సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయించుకుని, జూన్ 2 నుంచి 10వ తేదీ వరకు డోన్ ప్రభుత్వ ఐటీఐలో జరిగే కౌన్సెలింగ్కు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు. మరింత సమాచారం కోసం 9866022451 నంబరును సంప్రదించాలన్నారు. సరిహద్దు చెక్పోస్ట్లపై నిఘా పెంచుతాం ఎమ్మిగనూరురూరల్: రాష్ట్రాల సరిహద్దు చెక్పోస్ట్ల వద్ద నిఘా పెంచుతామని రాష్ట్ర టాస్క్ఫోర్స్ ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ సుధాకర్రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక ఎకై ్సజ్ పోలీస్స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక మద్యాన్ని అక్రమ రాష్ట్రాంలోకి రాకుండా నిఘా ఉంచామన్నారు. మద్యం దుకాణాల పక్కన అనుమతులు లేకుండా షెడ్లు ఏర్పాటు చేసుకుంటే చర్యలు తీసుకుంటామన్నారు. కర్ణాటక మద్యంతో పాటు బెల్టుషాపులపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. సరిహద్దు చెక్పోస్ట్లను పరిశీలించనున్నట్లు చెప్పారు. సమావేశంలో ఎకై ్సజ్ సీఐ రమేష్రెడ్డి పాల్గొన్నారు. బదిలీలకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలి నంద్యాల(న్యూటౌన్): ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి డిమాండ్ శాచేరు. సోమవారం ఫెడరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాన కార్యదర్శి శివయ్య, ఉపాధ్యక్షుడు జాకీర్హుసేన్లతో కలిసి రామచంద్రారెడ్డి మాట్లాడారు. ఆన్లైన్ కౌన్సిలింగ్ ద్వారా ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం కలుగుతోందన్నారు. 8 ఏళ్లు పూర్తయిన ఎస్జీటీలు 1,500పైగా ఆప్సన్లు ఇచ్చుకోవాల్సి వస్తోందన్నారు. సమావేశంలో ఏపీటీఎఫ్ నాయకులు వీరేశ్వరరెడ్డి, పుల్లయ్య, రాజేష్, మల్లికార్జున, మధు, తదితరులు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో కేబుల్ ఆపరేటర్ మృతి
రుద్రవరం: మండల కేంద్రంలోని బెస్త కాలనీలో సోమవారం విద్యుదాఘాతంతో కేబుల్ ఆపరేటర్ జనార్దన్(42) మృతి చెందాడు. కాలనీ వాసులు తెలిపిన వివరాలు.. జనార్దన్ కొన్నేళ్లుగా కేబుల్ ఆపరేటర్గా పని చేస్తున్నాడు. అప్పుడప్పుడు విద్యుత్ స్తంభాలకున్న డిష్ తీగలను సరిచేస్తూ ఉండటాన్ని అదిగమనించిన విద్యుత్ లైన్మెన్ ఖాజామొహిద్దీన్.. బెస్త కాలనీకి వెళ్లే ప్రధాన రహదారిలో విద్యుత్ తీగలు సరి చేయాలని కోరాడు. లైన్మెన్ నిచ్చెన పట్టుకోగా కేబుల్ ఆపరేటర్ స్తంభంపైకి చేరుకొని విద్యుత్ తీగలను సరి చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని వెంటనే 108 వాహనంలో నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్సలు అందిస్తుండగానే మృతి చెందినట్లు కాలనీవాసులు తెలిపారు. ఎస్ఐ వరప్రసాదు ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. మృతుడి భార్య విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ పెద్ద మృతిచెందడంతో భార్య, పిల్లలు కన్నీటి పర్యంతమయ్యారు. -
హామీల అమలుపై చిత్తశుద్ధి లేని ప్రభుత్వం
కర్నూలు సిటీ: ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన మేనిఫెస్టో హామీల అమలుపై ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథ రెడ్డి విమర్శించారు. సోమవారం సలాంఖాన్ భవనంలో ఏర్పాటు చేసిన ఎస్టీయూ జిల్లా ప్రథమ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే సీపీఎస్/జీపీఎస్ విధానాన్ని సమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపుతామని, మెరుగైన పీఆర్సీ అమలు చేస్తామని, తాము అధికారాన్ని చేపట్టిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని, పెండింగ్లో ఉన్న బకాయిలు విడుదల చేస్తామని అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఆ దిశగా ఆలోచనలు చేయకపోవడం తగదన్నారు. ఇప్పటికై నా 12వ పీఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేసి, 30 శాతం ఐఆర్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. జీఓ 117 రద్దు చేసి కొత్త పాఠశాలల విధానాన్ని అమలు చేసేటప్పుడు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సమావేశంలో సంఘం మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిమ్మన్న, జిల్లా అధ్యక్షులు ఎస్.గోకారి, కార్యదర్శి టి.కె జనార్దన్, నాయకులు వీరచంద్ర యాదవ్, సి.రమేష్, షఫీ పాల్గొన్నారు. -
పాలిసెట్కు సర్వం సిద్ధం
● 30న ప్రవేశ పరీక్ష ● జిల్లాకు 22 పరీక్ష కేంద్రాలు కేటాయింపు ● హాజరుకానున్న 5,700 మంది అభ్యర్థులునంద్యాల(న్యూటౌన్): పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 30న పాలిసెట్–2025 నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. పరీక్షకు గంట ముందుగానే ఆయా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతిస్తారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. జిల్లా వ్యాప్తంగా పాలిసెట్కు 5,700 మంది దరఖాస్తు చేసుకున్నారు. నంద్యాలలో 13 పరీక్ష కేంద్రాలు కేటాయించారు. ఇందులో 3,747 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. జిల్లాలో 5 కళాశాలలు ప్రభుత్వ పాలిటెక్నిక్ పాటు జిల్లావ్యాప్తంగా 2 ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలున్నాయి. వీటిల్లో కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి. నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్లో సివిల్ 66, మెకానికల్ 132 సీట్లు ఉండగా, ఐదు ప్రైవేటు కళాశాలల్లో వివిధ కోర్సుల్లో సుమారు 1,500 సీట్లు ఉన్నాయి. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న వారిలో ఎంత మంది హాజరవుతారో, వారిలో ర్యాంకులు సాధించేవారెందరో, ర్యాంకు వచ్చినా పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరేందుకు ఎంత మంది ఆసక్తి చూపుతారో చూడాల్సి ఉంది. కొన్నేళ్లుగా కొన్ని కళాశాలల్లో వందల సంఖ్యలో సీట్లు ఉండగా, పదుల సంఖ్యలోనే విద్యార్థులు చేరుతూండటంతో తరగతుల నిర్వహణ ఇబ్బందిగా మారుతున్నట్లు సమాచారం. గంట ముందుగానే ప్రవేశం ● ప్రవేశ పరీక్ష ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తారు. ● పరీక్ష కేంద్రంలోకి ఉదయం 10 గంటల నుంచి అనుమతిస్తారు. ● పరీక్ష ప్రారంభమైన తర్వాత నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోనికి అనుమతించరు. ● విద్యార్థులు హాల్ టికెట్టు, బాల్ పాయింట్ పెన్ను, హెచ్బీ పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్ తీసుకుని వెళ్లాలి. ● సెల్ఫోన్, కాలిక్యులేటర్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. మౌలిక వసతులకు ప్రాధాన్యం పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేశాం. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. కేంద్రాల ఆవరణంలో తాగునీరు, విద్యుత్, వైద్య సేవల వంటి మౌలిక వసతులకు కల్పనకు ప్రాధాన్యమిచ్చాం. – శ్రీనివాసప్రసాద్, జిల్లా కో ఆర్డినేటర్, నంద్యాల -
కాంగ్రెస్ నేత హత్యోదంతంలో నలుగురిపై కేసు
ఆలూరు/ఆలూరు రూరల్/చిప్పగిరి: కాంగ్రెస్ పార్టీ ఆలూరు నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మార్పీఎస్ రాయలసీమ అధ్యక్షుడు లక్ష్మినారాయణ హత్యోదంతంపై కేసు నమోదు చేసినట్లు సీఐ రవిశంకర్ రెడ్డి సోమవారం విలేకరులకు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం చిప్పగిరి–గంతకల్లు మధ్య దుండగులు లక్ష్మినారాయణ ప్రయాణిస్తున్న ఇన్నోవా కారును లారీతో గుద్ది వేటకొడవళ్లతో దారుణంగా నరికి హత్య చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు వినోద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వైకుంఠం శివప్రసాద్, వైకుంఠం మల్లికార్జున, మల్లేష్, కొండ రామాంజితో పాటు మరికొందరిపై హత్య కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామన్నారు. 2006లో టీడీపీ నేత, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ వైకుంఠం శ్రీరాములు దంపతుల హత్యకేసులో లక్ష్మినారాయణ 7వ ముద్దాయి కాగా.. ఈ కేసును 2019లో కోర్టు కొట్టివేసింది. ఇదిలాఉంటే కర్నూలు–అనంతపురం జిల్లాలో సరిహద్దులో జరిగిన లక్ష్మినారాయణ హత్య కేసును అనంతపురం జిల్లా గుంతకల్లు పోలీసు స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు కాగా.. కర్నూలు జిల్లా చిప్పగిరి పోలీసు స్టేషన్కు బదలాయించారు. లక్ష్మినారాయణ మృతదేహానికి సోమవారం గుంతకల్లు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం ఆయన భౌతికాయాన్ని భారీ పోలీసు బందోబస్తు నడుమ స్వగ్రామమైన చిప్పగిరికి తరలించారు. ఉద్దేశపూర్వకంగానే పికెట్ తొలగింపు: మారెప్ప లక్ష్మినారాయణ హత్యోదంతంపై సీబీఐతో విచారణ జరిపించాలని మాజీ మంత్రి మూలింటి మారెప్ప డిమాండ్ చేశారు. సోమవారం ఆయన చిప్పగిరిలో లక్ష్మినారాయణ భౌతికాయానికి నివాళులర్పించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన పది నెలల్లో కుల రాజకీయాలకు వత్తాసు పలుకుతూ హత్యా రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నారని ఆరోపించారు. పోలీసులు ఉద్దేశపూర్వకంగానే లక్ష్మినారాయణ ఇంటి వద్ద పికెట్ను తీసివేశారన్నారు. పికెట్ కొనసాగించాలని హోంమంత్రి అనితకు స్వయంగా తాను విన్నవించినా పట్టించుకోలేదన్నారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ బాబు తదితరులు ఉన్నారు. భారీ బందోబస్తు మధ్య లక్ష్మినారాయణ అంత్యక్రియలు లక్ష్మీనారాయణ అంత్యక్రియలు పూర్తి చిప్పగిరి: గుంతకల్లు – చిప్పగిరి మధ్య ఆదివారం హత్యకు గురైన కాంగ్రెస్ పార్టీ ఆలూరు నియోజక వర్గ ఇన్చార్జ్ లక్ష్మీనారాయణ అంత్యక్రియలు ఆయన స్వగ్రామం చిప్పగిరిలో సోమవారం పూర్తయ్యాయి. మృతదేహానికి ఎమ్మెల్యే విరుపాక్షి నివాళులు అర్పించగా.. పీసీ అధ్యక్షురాలు షర్మిళ ఫోన్లో కుటుంబ సభ్యలును పరామర్శించి ధైర్యం చెప్పారు. అంత్యక్రియల సందర్భంగా గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఏఎస్పీ ఉసేన్ పీరా ఆధ్వర్యంలో 8 మంది సీఐలు, పలువురు ఎస్ఐలతో గట్టి బందోబస్తు నిర్వహించారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గ్రామాన్ని, హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. కుటుంభ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఆలూరు సీఐ రవిశంకర్రెడ్డి తెలిపారు. కాగా నిందితులను కఠినంగా శిక్షించాలని పలువురు నాయకులు, ఎమ్మార్పీఎస్ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
పెద్దమ్మ జాతరకు వేళాయె!
గోస్పాడు: కుల, మత, రాజకీయాలకు అతీతంగా యాళ్లూరులో పెద్దమ్మ జాతరను నిర్వహించేందుకు గ్రామస్తులు సిద్ధమయ్యారు. 1926, 1966, 2015 సంవత్సరాల్లో గ్రామంలో జాతరను నిర్వహించారు. మళ్లీ పదకొండేళ్ల తర్వాత ఈనెల 29, 30 తేదీల్లో జాతర నిర్వహించేందుకు గ్రామపెద్దలు నిర్ణయించారు. దీంతో గ్రామంలో సందడి నెలకొంది. అమ్మవారికి ప్రత్యేకంగా ఎలాంటి ఆలలయం లేకపోవడంతో పూర్వం నుంచి వస్తున్న ఆచారం మేరకు అమ్మవారిని స్థానిక రామచావిడి ఎదుట ఏర్పాటు చేసి జాతర నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నేటితో ఉత్సవాలు ప్రారంభం పెద్దమ్మ జాతర మహోత్సవంలో భాగంగా మంగళవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అమ్మ వారి మహిషముల గ్రామ ఊరేగింపు ఉంటుంది. రాత్రి 8గంటలకు అన్నదానం, 10 గంటలకు అమ్మవారిని రామ చావిడికి తీసుకెళ్లి ఆశీనులను చేయనున్నారు. 30 తెల్లవారుజామున 3.30 గంటలకు అమ్మవారికి మహిషముల సమర్పణ, ఉదయం 5 గంటల నుంచి గ్రామంలో పొలి చల్లే కార్యక్రమం, ఉదయం బోనాల సమర్పణ, మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు అన్నదానం, సాయంత్రం 4గంటల నుంచి అమ్మవారికి గ్రామోత్సవం(దీవెన బండారు) నిర్వహిస్తారు. జాతరకు అధిక ఖర్చు.. అమ్మవారికి మొక్కు తీర్చుకునే విషయంలో గ్రామ స్తులు ఖర్చుకు వెనుకాడటం లేదు. జాతరకు వ చ్చే బంధుమిత్రులకు మాంసాహార విందు ఇచ్చేందుకు బాగానే ఖర్చు అవుతుంది. ఈలెక్కన గ్రామం మొత్తంపై దాదాపు రూ. 4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు ఖర్చు కావచ్చని గ్రామ పెద్దలు అంచనా వేస్తున్నారు. ప్రశాంతంగా నిర్వహించాలి జాతర ప్రశాంతంగా జరుపు కోవాలి. ఎలాంటి గొడవలకు తావులేకుండా జాతర పూర్తయ్యేలా ప్రజలు సహకరించాలి. గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా, ప్రోత్సహించినా చర్యలు తప్పవు. జాతర సందర్భంగా వాహనాలకు, ప్రజలకు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా గ్రామ శివారులు ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలంతో వాహనాలు నిలుపుకోవాలి. – ఎస్ఐ వెంకటప్రసాద్ యాళ్లూరులో 11 ఏళ్ల తర్వాత ఉత్సవం గ్రామంలో పండగ సందడి -
యాగంటిని దర్శించుకున్న డైరెక్టర్ సుకుమార్
బనగానపల్లె రూరల్: మండలంలోని ప్రముఖ శైవక్షేత్రం యాగంటిలో వెలసిన శ్రీ ఉమామహేశ్వరస్వామిని ప్రముఖ సినీ డైరెక్టర్ సుకుమార్ సోమవారం సాయంత్రం దర్శించుకున్నారు. ముందుగా ఆలయంలో ఏకశిలారూపంలో కొలువైన శివపార్వతులకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వెంకటేశ్వరస్వామి గుహను సందర్శించి అక్కడున్న వెంకటేశ్వరస్వామిని కూడా దర్శించుకున్నారు. గతంలో అల్లుఅర్జున్ హీరోగా నటించిన పుష్ప–2 షూటింగ్ ఇక్కడ జరిగిన విషయం తెలిసిందే. మళ్లీ డైరెక్టర్ సుకుమార్ యాగంటిని దర్శించుకోవడంతో పుష్ప–3 షూటింగ్ చిత్రీకరణ ఏర్పాట్ల పరిశీలన నిమిత్తం వచ్చి ఉంటారనే చర్చ అభిమానుల మధ్య సాగుతోంది. -
బంగారు కిరీటం సమర్పణ
ఆదోని అర్బన్: మహాయోగి లక్ష్మమ్మవ్వకు సోమవారం ఆలయ నిర్వాహకులు బంగారు కిరీటం సమర్పించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి ఎండోమెండ్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకుడు రాయచోటి సుబ్బయ్య, సభ్యులు పాల్గొన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి కర్నూలు సిటీ: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నేషనల్ మజ్దూర్ యూనియన్ రీజినల్ వర్కింగ్ ప్రెసిడెంట్ పీఏ వలి అధ్యక్షతన రిలే నిరహార దీక్షలు చేపట్టారు. రెండు రోజుల పాటు జరిగే దీక్షలను మొదటి రోజు సోమవారం సంఘం రీజినల్ చైర్మన్ ఎస్ఎండీ గౌస్, కార్యదర్శి సి.మద్దిలేటిలు దీక్షలో కూర్చున ఉద్యోగులకు పూల మాలలు వేసి ప్రారంభించి ప్రసంగించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని డిపోల ఎదుట దీక్షలు చేపట్టినట్లు చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగుల ఉద్యోగ భద్రత కోసం జారీ చేసిన సర్క్యూలర్ 1/2019ను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అక్రమ సస్పెన్షన్స్, రిమూవల్స్ను నిలిపి వేయాలని, మహిళా ఉద్యోగులకు ప్రభుత్వ జీఓ ప్రకారం పిల్లల సంరక్షణ సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మొదటి రోజు దీక్షలో ఆర్బీఎన్ మూర్తి, కేటీ రెడ్డి, సి.లక్ష్మన్న, ఆర్పీ రావు, జేబీ రాజేశ్వరయ్య, ఎం.జెడ్ బాషా, ఎస్డీ బాషా కూర్చున్నారు. వీరికి డిపో–1 సెక్రటరీ సయ్యద్ ఇసాక్, డిపో–2 సెక్రటరీ ఎంఎస్బీ రెడ్డి సంఘీభావం తెలిపారు. -
కలపరిలో జ్వరంతో వృద్ధురాలి మృతి
ఆస్పరి: జ్వరాలతో మంచం పట్టిన కలపరిలో ఓ వృద్ధురాలు మృతి చెందడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. నాలుగు రోజుల క్రితం గ్రామంలో జ్వరపీడితుల రక్త నమూనాలు ల్యాబ్కు పంపగా చికున్గున్యాగా బయటపడింది. 26 మందిని పరీక్షించగా 10 మందికి చికున్ గున్యా ఉన్నట్లు తేలింది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన వెంకమ్మ (60) జ్వరంతో బాధపడుతూ ఆదివారం రాత్రి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. వారం రోజులు క్రితం వెంకమ్మకు జ్వరంతో పాటు కాళ్లు, కీళ్లు నొప్పులతో బాధపడుతండడంతో మొదట ఆర్ఎంపీతో వైద్యం చేయించారు. అయినా జ్వరం తగ్గకపోవడంతో ఆమెను ఐదు రోజుల క్రితం కర్నూలులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. అక్కడ రూ. 3 లక్షలు ఖర్చు అయినా జ్వరం నయం కాకపోవడంతో కుటుంబీకులు రెండు రోజులు క్రితం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. కాగా కోలుకోలేక ఆదివారం రాత్రి 11 గంటలకు మృతి చెందినట్లు వెంకమ్మ కుమారుడు గిడ్డయ్య తెలిపారు. వెంకమ్మకు భర్త వెంకటేష్, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కొనసాగుతున్న వైద్య శిబిరం కలపరి ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరం సోమవారం కూడా కొనసాగింది. వైద్య శిబిరాన్ని జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ రఘు, పత్తికొండ డీఎల్పీఓ వీరభద్రప్ప సదందర్శించి రోగులతో మాట్లాడారు. రక్త పరీక్షల ద్వారా చికెన్ గున్యా వ్యాధిగా నిర్ధారణ కావడంతో గ్రామస్తులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. చికెన్ గున్యా సోకిన వారికి తలనొప్పి, వాంతులు, జ్వరం, వికారం, చేతి వేళ్లు, కాళ్లు నుంచి మొదలుకుని శరీరంలోని అన్ని కీళ్లు నొప్పితో బాధిస్తుందన్నారు. కీళ్ల నొప్పులు వల్ల సరిగా నిలబడలేని పరిస్థితి వస్తుందని, జ్వరం తగ్గినా నొప్పులు ఎక్కువ కాలం ఉంటాయన్నారు. రోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గ్రామంలో జ్వరాలు తగ్గే వరకు వైద్య శిబిరం కొనసాగిస్తామని పత్తికొండ డీప్యూటీ డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ రఘురామిరెడ్డి చెప్పారు. సోమవారం వైద్య శిబిరంలో 30 మందికి వైద్య చికిత్సలు చేసి మందులు పంపిణీ చేశామని, అవసరమైన వారికి వైద్యం అందించాని డాక్టర దుర్గాబాయి తెలిపారు. వైద్య శిబిరంలో సర్పంచ్ సుధమ్మ, పంచాయతీ, వైద్య సిబ్బంది వెంకటేష్, విజయరాజు, పద్మావతి, శంకర్, ఖలీల్, శకుంతల రోగులకు సేవలు అందించారు. కొనసాగుతున్న వైద్య శిబిరం గ్రామాన్ని సందర్శించిన అధికారులు -
దాడిలో గాయపడిన వైఎస్సార్సీపీ కార్యకర్త మృతి
కోడుమూరు రూరల్: మండలంలోని పులకుర్తి గ్రామంలో ఈనెల 26న జరిగిన దాడిలో గాయపడిన వైఎస్సార్సీపీ కార్యకర్త నడిపి రంగన్న (38) ఆదివారం అర్ధరాత్రి మృతిచెందాడు. దీంతో పులకుర్తిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త నడిపి రంగన్న అదే గ్రామానికి చెందిన మునిస్వామిల మధ్య కొంతకాలంగా మనస్పర్థలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 26న నిందితుడు మునిస్వామి, బజారి, మరికొద్ది మంది అనుచరులతో కలిసి నడిపి రంగన్నను, అతని అల్లుడు సురేష్ విషయంపై మాట్లాడేందుకంటూ పిలిపించారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం నడిపి రంగన్నతో గొడవ పెట్టుకుని రాడ్లు, కర్రలతో తీవ్రంగా కొట్టారు. కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆదివారం సాయంత్రం ఇంటికి తీసుకెళ్లారు. అర్ధరాత్రి తీవ్ర అస్వస్థతకు గురై సృహలేకుండా పడిపోవడంతో కుటుంబ సభ్యులు 108 వాహనంలో కోడుమూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే రంగన్న మృతిచెందినట్లు చెప్పారు. మునిస్వామి అతని అనుచరులు కొట్టిన దెబ్బల వల్లే రంగన్న మృతి చెందాడంటూ కుటుంబ సభ్యులిచ్చిన ఫిర్యాదు మేరకు కోడుమూరు ఎస్ఐ ఎర్రిస్వామి కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చేపట్టారు. మృతుడికి భార్య మల్లీశ్వరీ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కాగా విషయం తెలుసుకున్న కుడా మాజీ చైర్మన్ కోట్ల హర్షవర్దన్రెడ్డి సోమవారం కోడుమూరు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని రంగన్న మృతదేహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నడిపి రంగన్న మృతికి కారకులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట కోడుమూరు జెడ్పీటీసీ సభ్యులు రఘునాథ్రెడ్డి, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు క్రిష్ణారెడ్డి, మాజీ ఉపసర్పంచు ప్రవీణ్కుమార్, స్థానిక నాయకులు రవికుమార్రెడ్డి, లింగమూర్తి, జగదీష్ ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన కోట్ల హర్ష -
టీడీపీ కార్యకర్తలకే డ్రోన్లు
● ఉమ్మడి జిల్లాకు 80 మంజారు ● గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే అందుబాటులోకి సేవలు ● అప్పట్లో మహిళా సంఘాలకు ఉచితంగా 8 సరఫరా ● శిక్షణ ధ్రువపత్రాలు ఇచ్చిన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ● కూటమి ప్రభుత్వం అప్పటి గ్రూపులను పక్కన పెట్టిన వైనం ● టీడీపీ కార్యకర్తలతో ఎఫ్ఎంబీ కిసాన్ డ్రోన్ గ్రూపుల ఏర్పాటు కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయంలో పెట్టుబడి వ్యయాన్ని తగ్గించుకునేందుకు సాంకేతికత దోహద పడుతోంది. ఇందులో భాగంగానే వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల వారీగా(ఆర్ఎస్కేలు) వైఎస్సార్ యంత్రసేవ పథకం కింద కస్టమ్ హయరింగ్ సెంటర్లు, కంబైన్డ్ హార్వెస్టర్లు అందుబాటులోకి తెచ్చింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సులభంగా, వేగంగా పురుగు మందుల పిచికారీ కోసం డ్రోన్లను కూడా వినియోగంలోకి తీసుకొచ్చింది. నాటి ప్రభుత్వ చొరవతో వివిధ ఎరువుల కంపెనీలు 8 డ్రోన్లు మహిళా గ్రూపులకు సరఫరా చేశా యి. ఐదు కోరమాండల్ కంపెనీ, ఇప్కో, ీపీపీఎల్, ఆర్సీఎఫ్ కంపెనీలు ఒక్కొక్కటి చొప్పున అందించాయి. డ్రోన్ల వినియోగానికి ప్రత్యేక గ్రూపులు ఏర్పాటు చేసి పైలెట్ శిక్షణ కూడా ఇప్పించారు. 2023–24లోనే ఈ గ్రూపులకు సబ్సిడీపై డ్రోన్లు ఇవ్వాలని తలపెట్టినప్పటికీ ఎన్నికల కోడ్ రావడం వల్ల సాధ్యం కాలేదు. కూటమి ప్రభుత్వం కూడా డ్రోన్ సేవలను రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. విశేషమేమంటే టీడీపీ కార్యకర్తలకే డ్రోన్లను మంజూరు చేస్తుండటం గమనార్హం. 2023–24లో రాజకీయాలకు అతీతంగా అర్హులైన వారితో ప్రత్యేక గ్రూపులు ఏర్పాటు చేసి ఇవ్వాలని తలపెట్టింది. కూటమి ప్రభుత్వం కూడా మొదట్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పైలెట్ శిక్షణ పొందిన వారిలో ఆసక్తి ఉన్న గ్రూపులకు డ్రోన్లు ఇవ్వాలని తలపెట్టింది. అయితే ఆ ప్రభుత్వంలో ఎంపిక చేసిన వారికి ఇవ్వడం తగదని కూటమి పార్టీల నేతలు ఒత్తిడి తెచ్చి టీడీపీ కార్యకర్తలకే మంజూరు చేసే విధంగా చర్యలు చేపట్టడం గమనార్హం. టీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జీ లు రెకమెండ్ చేసిన కార్యకర్తలకే డ్రోన్లు అంటూ ప్రచారం జోరుగా జరుగుతోంది. నాడు శిక్షణ సర్టిఫికెట్లు పొందినా.. గత ౖవైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కర్నూలు జిల్లాలో 36 మంది, నంద్యాల జిల్లాలో 35 మంది రిమోట్ పైలెట్ శిక్షణ పొందారు. వీరిలో అగ్రికల్చర్ బీఎస్సీ, అగ్రికల్చర్ డిప్లొమో చేసిన వారు కూడా ఉన్నారు. గుంటూ రులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వీరు 12 రోజుల శిక్షణ తీసుకుని సర్టిఫికెట్లు అందుకున్నారు. 2024 జూన్ నెలలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో డ్రోన్ అందుబాటులోకి రావడం ఆలస్యమైంది. ఆ తర్వాత కూడా ఏడాది జాప్యం చేశారు. ఎట్టకేలకు 2025–26లో డ్రోన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే వైఎస్సార్ సీపీ పాలనలో ఎంపిక చేసిన గ్రూపులను, రిమోట్ పైలెట్లను పక్కన పెట్టడం విమర్శలకు తావిస్తోంది. కొందరు వ్యవసాయ అధికారులే సంబంధిత ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలతో మాట్లాడు కోవాలని సూచిస్తుండటం గమనార్హం. టీడీపీ మద్దతుదారులు, సానుభూతి పరులనే ఎంపిక చేస్తుండటంతో తమ పరిస్థితి ఏమిటని శిక్షణ పొందిన వారు ప్రశ్నిస్తున్నారు. కర్నూలు జిల్లాలో వైఎస్సార్సీపీ హయాంలో రిమోట్ పైలెట్గా శిక్షణ పొందిన వారిలో కూటమి ప్రభుత్వంలో కూడా కొందరికి అవకాశం ఇచ్చారు. శిక్షణ పొందిన వారు సంబంధిత ఎమ్మెల్యేలను కలువడంతో ఇది సాధ్యమైంది. జిల్లాలో 36 మంది పైలెట్ శిక్షణ పొందితే 10 మందికి పైగా అవకాశం దక్కించుకున్నారు. నంద్యాల జిల్లాలో మాత్రం గత ప్రభుత్వంలో శిక్షణ పొందిన వారందరినీ ౖవైఎస్సార్సీపీ ముద్ర వేసి పక్కన పెట్టడం గమనార్హం. కూటమి ప్రభుత్వం అర్హతలను పక్కన పెట్టి కార్యకర్తలకే పెద్దపీట వేసింది. అర్హతలను పట్టించుకోకుండా పైలెట్ శిక్షణకు పంపుతుండటం మితిమీరిన రాజకీయానికి నిదర్శనం. ఉమ్మడి జిల్లాకు 80 డ్రోన్లు మంజూరు కూటమి ప్రభుత్వం ఉమ్మడి కర్నూలు జిల్లాకు 80 డ్రోన్లను మంజూరు చేసింది. కర్నూలు జిల్లాకు 40, నంద్యాల జిల్లాకు 40 ప్రకారం కేటాయించారు. టీడీపీ కార్యకర్తలతో ఏర్పాటైన ఎఫ్ఎంబీ కిసాన్ డ్రోన్ గ్రూపులకు మంజూరు చేస్తోంది. వీటి సరఫరాకు డ్రోగో, విహంగ కంపెనీలను ఎంపిక చేసింది. డ్రోగో కంపెనీ డ్రోన్ పూర్తి ధర రూ.9.80 లక్షలు, విహంగ కంపెనీ డ్రోన్ ధర రూ.9.81 లక్షలు. ఇందులో ప్రభుత్వం 80 శాతం సబ్సిడీ ఇస్తుంది. అయితే 50 శాతం మొత్తానికి బ్యాంకులు రుణాలు ఇస్తాయి. మిగిలిన 50 శాతం కిసాన్ డ్రోన్ గ్రూపులు భరిస్తాయి. ఎఫ్ఎంబీ కిసాన్ డ్రోన్ గ్రూపులో ఐదుగురు సభ్యులు ఉంటారు. గ్రూపు సభ్యులు పైలెట్గా ఎంపిక చేసుకున్న వారికి ప్రభుత్వం శిక్షణ ఇస్తుంది. ఈ పైలెట్ కనీసం మూడేళ్లు పనిచేయాల్సి ఉంది. మధ్యలో మానుకోవాలనుకుంటే రూ.70 వేలు చెల్లించాలనే నిబంధన పెట్టారు. డ్రోన్ల సామర్థ్యం 25 లీటర్లు.నంద్యాల జిల్లాలో వైఎస్సార్సీపీ ముద్ర వేసి.. -
ఎంపీడీఓలకు మండలాలు కేటాయింపు
కర్నూలు(అర్బన్): ఉమ్మడి జిల్లాలో ఎంపీడీఓలు గా పదోన్నతులు పొందిన పరిపాలనాధికారులు, డిప్యూటీ ఎంపీడీఓలకు మండలాలు కేటాయించినట్లు జిల్లా పరిషత్ సీఈఓ జి.నాసరరెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆయా మండలాలకు నియమితులైన ఎంపీడీఓలకు జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ఉత్తర్వులను అందించారు. ఈ సందర్భంగా సీఈ ఓ నాసరరెడ్డి మాట్లాడుతూ బీవీ రమణారావును దేవనకొండ, బీ నూర్జహాన్ను మంత్రాలయం, కె.విజయశేఖర్రావును కౌతాళం, జి.ప్రభావతిదేవిని పెద్దకడుబూరు, ఎ.మద్దిలేటి స్వామిని ఆలూ రుకు నియమించామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఉచిత విద్య ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు కర్నూలు సిటీ: విద్యాహక్కు చట్టం ప్రకారం 2025–26 విద్యా సంవత్సరానికి ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్య ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగించినట్లు డీఈఓ ఎస్.శామ్యూల్ పాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాల్సి ఉందన్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి ఉచిత విద్యను అందించే జిల్లాలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలు గడువులోపు తమ వివరాలను విద్యాశాఖ వెబ్సైట్ htts://cse.ap.gov.inలో నమోదు చేసుకోవాలన్నారు. విద్యార్థులు మే నెల 2 నుంచి 19వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఐబీ, సీబీఎస్ఈ, ఐసీఎస్సీ సిలబస్ పాఠశాలల్లో ప్రవేశాలకు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేది నాటికి ఐదేళ్ల వయస్సు, స్టేట్ సిలబస్ పాఠశాలల్లో ప్రవేశాలకు జూన్ 1వ తేది నాటికి ఐదేళ్ల వయస్సు నిండిన పిల్లలు దరఖాస్తుకు అర్హులన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల డేటా ఆధారంగా వచ్చే నెల 20 నుంచి 24వ తేదీ వరకు విద్యార్థుల ప్రవేశాలకు అర్హతల ఆధారంగా లాటరీ తీస్తామన్నారు. 29న లాటరీ ఫలితాలను విడుదల చేసి, జూన్ 8వ తేదీన ప్రవేశాల నిర్ధారణ చేస్తారని, రెండో విడత జూన్ 11న సీట్ల కేటాయింపు జాబితా విడుదల చేసి, 18న ప్రవేశాల నిర్ధారణ చేస్తామన్నారు.బీఈడీ సెమిస్టర్ పరీక్షలకు 392 మంది గైర్హాజరు కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహిస్తున్న బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షల్లో భాగంగా సోమవారం జరిగిన పరీక్షలకు 392 మంది గైర్హాజరయ్యారు. 3,384 మందికి 2,992 మంది ఛాత్రోపాధ్యాయులు హాజరు కాగా 392 మంది గైర్హాజరయ్యారని, వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఇద్దరు విద్యార్థులు చూచిరాతలకు పాల్పడగా వారిని డిబార్ చేసినట్లు తెలిపారు. ఏఓలుగా ముగ్గురికి పదోన్నతి కర్నూలు(అర్బన్): జిల్లాపరిషత్ పరిధిలో సీనియర్ సహాయకులుగా పనిచేస్తున్న ముగ్గురికి పరిపాలన అధికారులుగా పదోన్నతి కల్పించినట్లు జిల్లాపరిషత్ సీఈఓ జి.నాసరరెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పదోన్నతి పొందిన వీవీ రామసుబ్బయ్యను ఆళ్లగడ్డ మండల పరిషత్కు, ఎం.మహమ్మద్ హక్ను కల్లూరు ఎంపీపీకి, ఎ.మధుసూదనయ్యను జూపాడుబంగ్లా మండల పరిషత్ కార్యాలయానికి కేటాయించామన్నారు. డీసీసీబీ, డీసీఎంఎస్లకు చైర్మన్లు ● డీసీసీబీ చైర్మన్గా ఎదురూరు విష్ణువర్ధన్రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్గా నాగేశ్వరరావు యాదవ్ కర్నూలు(అగ్రికల్చర్): కూటమి ప్రభుత్వం ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, ఉమ్మడి జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీలకు చైర్మన్లను ప్రకటించింది. సహకార సంఘాలు, డీసీసీబీ, డీసీఎంఎస్లకు ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ ఉంది. అయితే కూటమి ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లడానికి ఇష్టపడటం లేదని తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇదిలాఉంటే జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్గా కోడుమూరు నియోజకవర్గం ఎదురూరు గ్రామానికి చెందిన టీడీపీ నేత డి.విష్ణువర్ధన్రెడ్డి, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్గా డోన్ నియోజక వర్గం చండ్రపల్లి గ్రామానికి చెందిన జి.నాగేశ్వరరావు పేర్లను ప్రకటించారు. అయితే జీవోలు విడుదల కావాల్సి ఉంది. -
అకాల వర్షాలతో ఉద్యాన పంటలకు నష్టం
కర్నూలు(అగ్రికల్చర్): అకాల వర్షాలు రైతులకు తీరని నష్టాన్ని మిగుల్చుతున్నాయి. రెండు రోజులుగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షాలతో ఉద్యాన పంట లు భారీగా దెబ్బతిన్నాయి. కర్నూలు జిల్లాలో ఆదివారం సాయంత్రం నుంచి హొళగుంద, కౌతాళం, మంత్రాలయం మండలాలు మినహా అన్ని మండలాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. ఉమ్మడి జిల్లాలో అకాల వర్షాల వల్ల వరి, మిర్చి పంటలకు భారీ నష్టం వాటిల్లింది. ఆదోని, ఆలూరు మండలాల్లో బొప్పాయ కేవలం 3.5 హెక్టార్లలో దెబ్బతిన్నట్లుగా ఉద్యాన అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. 100 హెక్టార్ల వరకు దెబ్బతిన్నప్పటికీ తూతూమంత్రంగా నమో దు చేయడం పట్ల ఆందోళన వ్యక్తం అవుతోంది. నంద్యాల జిల్లాలో బనగానపల్లె, కొలిమిగుండ్ల మండలాల్లో అరటి 10 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా తేల్చారు. ఈ మండలాలతో పాటు బేతంచెర్ల మండలంలో మామిడికి భారీ నష్టం కలిగింది. 33 శాతం పైగా మామిడి నేల రాలి నట్లు ఉద్యాన అధికారులు గుర్తించారు. కాగా సోమ వారం సాయంత్రం నుంచి నంద్యాల జిల్లాలో కురిసిన వర్షాలు, పెనుగాలులకు వరి, మొక్కజొన్న, కొర్ర, మినుము పంటలు దాదాపు 1,321 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. బండిఆత్మకూరు మండలంలో 402 హెక్టార్లు, మహానందిలో 325, నంద్యాలలో 15, ఆళ్లగడ్డలో 81, అవుకులో 308, చాగలమర్రి మండలంలో 190 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. -
ఏజీబీఎస్సీ చేసిన యువకుడినీ పక్కనపెట్టారు
సర్టిఫికెట్లు ఏం చేసుకోవాలి అగ్రికల్చర్ డిప్లొమా పూర్తయింది. 2024 జనవరి 5 నుంచి 16వ తేదీ వరకు డ్రోన్ రిమోట్ పైలెట్గా శిక్షణ తీసుకున్నా. ఇలాగైనా ఉపాధి లభిస్తుందని ఆశపడ్డా. ప్రభుత్వం మారడంతో మమ్మల్ని పక్కనపెట్టేశారు. శిక్షణ పొందిన సర్టిఫికెట్లు ఏం చేసుకోవాలి. నిరుద్యోగుల విషయంలోనూ రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసం. – ముత్యాలరాజు, వెల్దుర్తి గ్రామం కల్లూరు మండలం పుసులూరు గ్రామానికి చెందిన యువకుడు అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేశాడు. వ్యవసాయం పట్ల అతనికున్న ఆసక్తిని గమనించి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో డ్రోన్ పైలెట్గా ఎంపిక చేశారు. రైతులకు సేవ చేసేందుకు అవకాశం కలిసి వచ్చిందని అతను ఎంతో సంతోషించాడు. ఆచార్యా ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 12 రోజులు రిమోట్ పైలెట్ శిక్షణ కూడా తీసుకున్నాడు. కూటమి ప్రభుత్వం ఆధికారంలోకి రావడంతో టీడీపీ నేతలు ‘తమ్ముళ్ల’ కోసం ఇతడిని పక్కన పెట్టేయడం గమనార్హం. -
ఆదోని మున్సిపల్ తాత్కాలిక చైర్మన్గా ఎంఎం గౌస్
ఆదోని టౌన్: ఆదోని మున్సిపల్ తాత్కా లిక చైర్మన్గా ఎంఎం గౌస్ను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పరిపాలన శాఖ కార్యదర్శి సోమవారం ఆదేశాలు జారీ చేశారని మున్సిపల్ కమిషనర్ ఎం.కృష్ణ తెలిపారు. ఎంఎం గౌస్ మున్సిపల్ వైస్ చైర్మన్–1గా కొనసాగుతున్నారు. అయితే మున్సిపల్ చైర్పర్సన్ బోయ శాంతపై ఈనెల 16వ తేదీన పాలకవర్గ సభ్యులు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఆమెను పదవి నుంచి తొలగిస్తూ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. ఈ మేరకు వైస్ చైర్మన్–1 ఎంఎం గౌస్ను తాత్కాలిక మున్సిపల్ చైర్మన్గా కొనసాగాలని ఉత్తర్వు లు అందాయన్నారు. త్వరలో చైర్మన్ ఎన్నికపై పాలకవర్గ సభ్యులతో సమావేశం ఉంటుందన్నారు. -
అర్జీల పరిష్కారంపై ఆడిట్
కర్నూలు(సెంట్రల్): పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్(పీజీఆర్ఎస్)లో వచ్చిన అర్జీల పరిష్కారంపై ఆయా శాఖల అధికారులు ఆడిట్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా, జేసీ డాక్టర్ బి.నవ్య ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సేవలకు సంబంధించి ప్రజల నుంచి ఫీడ్ బ్యాకు తీసుకుంటున్నారని, ఇందుకు సంబంధించి మొదటి సారి ఫిర్యాదు వచ్చినప్పుడు సంబంధిత వ్యక్తిని పిలిపించి మాట్లాడాలన్నారు. రెండుసార్లు అయితే జాయింట్ కలెక్టర్, మూడోసారి అయితే కలెక్టర్ పిలిపించి మాట్లాడతారన్నారు. సిటిజన్ చార్టు ఫీడ్ బ్యాక్పై మండలాల వారీగా సమీక్షలు నిర్వహించి లోపాలు ఉంటే సరిదిద్దేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓలను ఆదేశించారు. మద్దికెర, హాలహర్వి, వెల్దుర్తి మండలాల తహసీల్దార్లు ప్రజల సమస్యలను ఓపిగ్గా వినడం లేదని ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. అలాగే ఫిర్యాదుల పరిష్కారంలో గోనెగొండ్ల, మద్దికెర, హాలహర్వి, కర్నూలు అర్బన్ మండలాలు వెనుకబడ్డాయన్నారు. కార్యక్ర మంలో డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, హౌసింగ్ పీడీ చిరంజీవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ● శ్రీరామ రెసిడెన్సీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీలో నివాసం ఉంటున్న ఏఆర్ కానిస్టేబుల్ శ్యామ్ విద్యాసాగర్, అతని కుమారులు మహిళలు, పిల్లలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని కాలనీ వాసులుఫిర్యాదు చేశారు. తమకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే చంపుతామని బెదిరిస్తున్నారని, అసోసియేషన్ సభ్యులపై అనవసరంగా అక్రమ ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి వేధిస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. -
ముస్లింల హక్కులు కాలరాస్తున్న బీజేపీ
కర్నూలు(సెంట్రల్): ముస్లింల హక్కులను బీజేపీ కాలరాస్తోందని, వక్ఫ్ సవరణ చట్టాన్ని వెనక్కు తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని సేవ్ వక్ఫ్.. సేవ్ రాజ్యాంగం జేఏసీ ప్రకటించింది. సోమవారం కర్నూలులో జేఏసీ ఆధ్వర్యంలో ముస్లింలు పెద్ద ఎత్తున శాంతి ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది ముస్లింలు రోడ్డెక్కగా కులమతాలకు అతీతంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీలు మద్దతు పలికి ర్యాలీలో పాల్గొన్నారు. కూటమి పార్టీలైనా బీజేపీ, టీడీపీ, జనసేన తప్ప మిగిలిన రాజకీయ పార్టీలన్నీ మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ మౌలానా సయ్యద్ జాకీర్ అహ్మద్, కోకన్వీనర్ ఎంఏ హమీద్ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి వక్ఫ్ చట్ట సవరణ చేశారన్నారు. ఈ కారణంగా తాము రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కోల్పోయే ప్రమాదం ఏర్పడుతోందన్నారు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు చోటు కల్పించడం అన్యాయమన్నారు. వక్ఫ్ చట్టాన్ని ప్రజల మద్దతు లేకుండా సవరణ చేశారని, దానిని అమలు చేయడానికి ఎంతమాత్రం వీలు లేదన్నారు. నిలుపుదల చేసే వరకు పోరాటాలు ఉద్ధృతం చేస్తామన్నారు. ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీమోహన్రెడ్డి మాట్లాడుతూ వక్ఫ్ పరిరక్షణ ఉద్యమాలకు వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్లమెంట్లో చట్ట సవరణకు వ్యతిరేకంగా తమ పార్టీ ఎంపీలతో ఓటు వేయించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్, బిహార్ ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, నితీష్కుమార్ వక్ఫ్ సవరణ చట్టానికి మద్దతు తెలిపి ముస్లింలకు తీరని ద్రోహం చేశారన్నారు. ● వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే హఫీజ్ఖాన్, కాటసాని రాంభూపాల్రెడ్డి, పార్టీ నాయకుడు అహ్మద్ అలీఖాన్ మాట్లాడుతూ తమ పార్టీ తరపున వక్ఫ్ చట్ట సవరణను రద్దు చేయాలని సుప్రీంకోర్టుకు వెళ్లినట్లు చెప్పారు. వక్ఫ్ సవరణ చట్టం రద్దు చేసే వరకు జరిగే అన్ని పోరాటాల్లో తమ పార్టీ పాల్గొంటుందన్నారు. ● సీపీఎం, సీపీఐ నాయకులు డి.గౌస్దేశాయ్, ఎస్ఎండీ షరీఫ్, పి.రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వక్ఫ్ ఆస్తులపై కన్నేసి చట్ట సవరణ చేసిందన్నారు. దానిని రద్దు చేసే వరకు పోరాటం చేస్తామన్నారు. అనంతరం కలెక్టర్ పి.రంజిత్బాషాకు జేఏసీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. నిరసనలో జైరాజ్(బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు), దాసరి ఎర్రన్న(కార్యదర్శి), అబ్దుల్లాఖాన్, జహంగీర్(ఎస్డీపీఐ), సయ్యద్ ఖాలిద్(ప్రాసిక్యూషన్ రిటైర్డ్ జేడీ), తదితరులు పాల్గొన్నారు. ర్యాలీ సాగిందిలా.. ఉస్మానియా కాలేజీ ఆవరణలోని ఉర్దూ అరబిక్ పాఠశాల నుంచి ర్యాలీ ప్రారంభమైంది. వడ్డెగేరి, చిల్డ్రన్పార్కు, రాజ్విహార్ వరకు కొనసాగింది. అక్కడికి వెంకటరమణ కాలనీ, కొత్తబస్టాండ్, కల్లూరు తదితర ప్రాంతాల నుంచి కూడా కొన్ని ర్యాలీలు వచ్చి రాజ్విహార్ చేరుకున్నాయి. వీరంతా కలిసి వేలాది మంది ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకున్నారు. ఇక్కడ గాంధీ విగ్రహం ఎదుట వక్ఫ్ చట్ట సవరణ బిల్లును రద్దు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు.వక్ఫ్ సవరణ చట్టాన్ని వెనక్కు తీసుకునే వరకు పోరాటం కర్నూలులో సేవ్ వక్ఫ్.. సేవ్ రాజ్యాగం జేఏసీ ఆధ్వర్యంలో ముస్లింల భారీ ర్యాలీ మద్దతు ప్రకటించిన వైఎస్సార్సీపీ, కమ్యూనిస్టులతో పాటు విద్యార్థి, యుజవన, ప్రజా సంఘాలు -
ఉగ్రవాదులను అంతం చేయాలి
కర్నూలు (టౌన్): ఉగ్రవాదులను అంతం చేయాలని పలువురు నేతలు, వివిధ పార్టీలకు చెందిన నేతలు అన్నారు. అమాయకులను పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్ దేశంపై ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అన్నారు. కశ్మీర్లో ఉగ్రవాదుల హత్యాకాండను నిరసిస్తూ ఆదివారం రాత్రి కర్నూలులోని కొండారెడ్డి బురుజు వద్ద ‘ హిందూస్థాన్ జిందాబాద్.. పాకిస్తాన్ ముర్థాబాద్’ అన్న బ్యానర్ ప్రదర్శించారు. కశ్మీర్లో మృతి చెందిన వారికి కొవ్వొత్తులతో నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఖాజీ అబ్దుల్ సలామ్ మాట్లాడుతూ.. కశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడిని ప్రతి భారతీయుడు కులాలకు, మతాలకు అతీతంగా ఖండిస్తున్నారన్నారు. ఉగ్రవాదులను సమూలంగా నిర్మూలించాలన్నారు. కేంద్ర ప్రభుత్వానికి భారతదేశం సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. కశ్మీర్ ఘటనను ప్రతి భారతీయుడు స్వచ్ఛందంగా ఖండిస్తున్నారన్నారు. టెర్రరిస్టులపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలన్నారు. కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామన్నారు. ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ బహిరంగంగా ప్రకటించిందన్నారు. కేడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ విజయ మనోహరి మాట్లాడుతూ.. దేశంలో ఉగ్రవాద చర్యలు సమూలంగా నిర్మూలించాలన్నారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, వైఎస్సార్సీపీ నాయకులు, పార్టీ అనుబంధ నాయకులు పాల్గొన్నారు. కర్నూలులో కొవ్వొత్తులతో ప్రదర్శన -
పిడుగు పడి రెండు ఎద్దులు మృతి
పెద్దకడబూరు: మండల పరిధిలోని రంగాపురం గ్రామంలో ఆదివారం పిడుగు పడి చిన్న మాదన్న అనే రైతుకు చెందిన రెండు ఎద్దులు మృత్యువాత పడ్డాయి. బాధిత రైతు, స్థానికుల వివరాల మేరకు.. చిన్న మాదన్న ఎప్పటి లాగే (గ్రామానికి సమీపంలో ఉన్న) పొలానికి తీసుకెళ్లి అక్కడ ఎద్దులను కట్టేసి ఇంటికి వెళ్లాడు. మధ్నాహ్నం వాటిపై పిడుగు పడటంతో మృతి చెందాయి. అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి బాధిత రైతుకు సమాచారం అందించారు. కుటుంబసభ్యులు వెళ్లి విగతజీవులుగా పడిఉన్న ఎద్దులను చూసి బోరున విలపించారు. దాదాపు రూ. 1.80లక్షలు ఆస్తి నష్టం వాటిల్లినట్లు చిన్న మాదన్న వాపోయాడు. కష్టం చేసుకుని బతికే తమకు రెండు ఎద్దులు చనిపోవడంతో చేతులు విరిగినట్లు అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నాడు. -
మేలో పూర్తి స్థాయిలో దిగుబడి
జనవరి నెలలో ఈ పంట పూత దశ ఉన్న సమయంలో తేనే మంచుపురుగు ఆశించి కొంత మేర దెబ్బతిన్నా సస్యరక్షణ చర్యలతో దిగుబడి ఆశాజనకంగానే ఉంది. వారం రోజులుగా దిగుబడి లభిస్తుండగా మే నెలలో పూర్తి స్థాయిలో దిగుబడి మార్కెట్కు చేరుతుంది. – అబ్దుల్ హమీద్, మామిడి తోటల యజమాని, బనగానపల్లె గతేడాది కంటే తక్కువ ధర గతేడాది వంద మామిడి పండ్లు రూ. ఐదారు వేల వరకు విక్రయించగా ఈ సంవత్సరం రూ. నాలుగైదు వేలకు మించడం లేదు. పండ్లు నాణ్యతగా ఉన్నాయి. వ్యాపారం కూడా పదిరోజుల్లో ఊపందుకుంటుందని అనుకుంటున్నాం. బంగినపల్లి రకం రుచి అద్భుతంగా ఉంటుంది. – ఖాదర్వలి, పండ్లవ్యాపారి, బనగానపల్లె -
విదేశీ పక్షులకు ఆతిథ్యం
ఆత్మీయంనీరు ఉండే ప్రాంతంలో చేపల కోసం కొంగల నిరీక్షణకొన్ని తెల్ల కొంగలు.. మరికొన్ని నల్ల కొంగలు తుంగభద్రా నదీ తీరంలో సందడి చేస్తున్నారు. నల్ల కొంగలు విదేశాల నుంచి విహరిస్తూ వచ్చాయి. వీటితో తెల్ల కొంగల కలసి సంచరిస్తున్నాయి. తుంగభద్ర నదిలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే గుంతల్లో నీరు కనిపిస్తోంది. ఆ నీటిలో చేపలను వేటాడేందుకు ఇవి గుంపులుగా నిరీక్షిస్తున్నాయి. కర్నూలు జిల్లాలో దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు -
ప్రాణం తీసిన విద్యుదాఘాతం
సి.బెళగల్: విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బురాన్దొడ్డి గ్రామానికి చెందిన బోయ కాలప్ప (40).. సి.బెళగల్ గ్రామ శివారులోని హెచ్పీ పెట్రోల్ బంక్ పక్కనున్న బండల డిపోలో కట్టర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం బండల డిపోలో పని చేసుకుంటుండగా వైరు పాడైపోయి ఉండటంతో రేకుల షెడ్కు విద్యుత్ ప్రసారం అయ్యింది. గమనించని కాలప్ప.. షెడ్ రేకులను తాకడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మృతుడి భార్య లక్ష్మి సంఘటన స్థలానికి చేరుకుని రోదించిన తీరు పలువురను కంటతడి పెట్టించింది. బోయ కాలప్పకు భార్యతో పాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. విద్యుత్ తీగల నిర్వహణలో బండల డిపో యజమాని నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని మృతుడి బంధువులు ఆరోపించారు. యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానిక పోలీస్లకు ఫిర్యాదు చేశారు. హెడ్ కానిస్టేబుల్ తిమ్మప్ప సంఘటన స్థలానికి చేరుకుని వివరాలను నమోదు చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోడుమూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 5 నుంచి రంగస్థల నటనపై శిక్షణ కర్నూలు కల్చరల్: టీజీవీ కళాక్షేత్రం ఆధ్వర్యంలో మే 5వ తేదీ నుంచి రంగస్థల నటనపై శిక్షణ ఇస్తున్నట్లు కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య తెలిపారు. వేసవి సెలవుల నేపథ్యంలో మే 3వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తెలిపారు. ఎంపికై న వారికి ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. 16 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉండి, 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులని తెలిపారు. నట శిక్షకులు, నాటక దర్శకులు జల్లుకుమార్ (చైన్నె)చే 5 నుంచి 15వ తేదీ వరకు ప్రతి రోజు మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. శిక్షణ పొందిన వారిచే 16వ తేదీన నాటక ప్రదర్శన ఉంటుందని తెలిపారు. -
మత్స్యకారులను మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
కర్నూలు(అర్బన్): రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మత్స్యకారులను తీవ్రంగా మోసం చేస్తున్నదని జాతీయ మత్స్యకారుల సంఘం జిల్లా అధ్యక్షులు బెస్త శ్రీనివాసులు తీవ్రంగా ఆరోపించారు. ఆదివారం స్థానిక కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాయలసీమ జిల్లాలకు మత్స్యకార భరోసా ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేది వరకు 61 రోజుల పాటు రాష్ట్రంలో చేపల వేట జరగకుండా వెయిటర్ నిషేధం విధించిన సమయంలో రాష్ట్రంలోని మత్స్యకారులందరికీ భృతి చెల్లించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందన్నారు. అయితే ఇంగ్లాండ్ చెరువులపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో భృతి చెల్లించకపోవడం దారుణమన్నారు. రాయలసీమలోని మత్స్యకార సొసైటీలు కూడా చేపల పెంపకానికి చెరువులకు పన్ను చెల్లిస్తున్నప్పుడు మత్స్యకార భరోసాకు వారు ఎందుకు అర్హులు కారని ప్రశ్నించారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని విడనాడి అందరికీ న్యాయం చేయాలన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మత్స్యకారులకు రాజకీయంగా పెద్ద పీట వేశారని, ఒక రాజ్యసభ, ఒక మంత్రి, నాలుగు ఎమ్మెల్సీలు, నాలుగు పార్టీ జిల్లా అధ్యక్ష పదవులు, బ్యాంకు చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు తదితర అనేక పదవులు ఇచ్చారని శ్రీనివాసులు గుర్తు చేశారు. నేడు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తు ప్రాంతాల వారీగా మత్స్యకారులను విడదీసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఇప్పటి వరకు మత్స్యకారులను కూటమి ప్రభుత్వం గుర్తించిన దాఖలాలు లేవన్నారు. ఇప్పటికై నా సంప్రదాయ మత్స్యకారులు చంద్రబాబు కుటిల రాజకీయాలను తిప్పికొట్టాలన్నారు. సమావేశంలో నాయకులు బెస్త సత్యనారాయణ, ఎద్దుల వెంకటేశ్వర్లు, బెస్త కమల, తెలుగు కన్నా, నంద కిషోర్, మోహన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. జాతీయ మత్స్యకారుల సంఘం జిల్లా అధ్యక్షులు బెస్త శ్రీనివాసులు -
ఉరిమిన వర్షం.. పిడుగులా నష్టం!
అప్రమ్తతంగా ఉండాలి కర్నూలు(సెంట్రల్): జిల్లాలో నాలుగైదు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పి.రంజిత్బాషా ఆదివారం రాత్రి ఒక ప్రక టనలో తెలిపారు. ఉరుములతో వర్షాలు కురిసే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉండడంతో చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండ కూ డదని సూచించారు. పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపరులు, గొర్రెలు మేపేవారు సమీపంలోని సురక్షిత భవనాల్లోకి వెళ్లి ప్రాణాపాయం నుంచి సురక్షితంగా ఉండాలన్నారు. కర్నూలు(అగ్రికల్చర్): ఉరుములు, మెరుపులు, పి డుగులు, భారీ గాలులతో ఉన్నట్టుండి ఆదివారం మధ్యాహ్నం కురిసిన వర్షం రైతులను నిలువునా ముంచింది. తీవ్ర నష్టం మిగిల్చింది. ఉమ్మడి కర్నూ లు జిల్లాలో ఐదు చోట్ల పిడుగుపాటు ఘటనలు చోటు చేసుకోగా.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయా రు. అకాల వర్షంతో కల్లాల్లో ఉన్న వరి ధాన్యం తడిచి పోయింది, పెనుగాలుల తీవ్రతకు అరటి, బొప్పాయి, మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. నష్టం ఇలా.. ● కౌతాళం మండలం నదిచాగి, మేళిగనూరు గ్రామాల్లోని రైతులు వారం క్రితం వరిని కోసి ధాన్యాన్ని కల్లాల్లో నిల్వ ఉంచారు. అకాల వర్షంతో తడిచి ముద్ద అయ్యింది. ● నందవరం మండలంలో 1,250 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇప్పటికే 1,100 ఎకరాల్లో కోతలు పూర్తయ్యాయి. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడవటంతో రైతులకు నష్టం మిగిలింది. ● హొళగుంద మండలంలో గజ్జహళ్లి, వందవాగిలిగ్రామాల్లో వరి పైరు నేలకొరిగింది. గింజలు నేల పాలయ్యాయి. దిగుబడి చేతికొచ్చే సమయంలో ఇలా జరుగుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ● కృష్ణగిరి మండలంలోని కొన్ని గ్రామాల్లో పొలాల్లో ఉన్న మిరప పంట, పొగాకు ఉత్పత్తులు వర్షానికి తడిచిపోయాయి. ● హాలహర్వి మండలంలోని బిలేహాల్ గ్రామానికి చెందిన గోపాల్ అనే రైతు రెండు ఎకరాల్లో బొప్పాయి పంట నేలమట్టం అయ్యింది. దాదాపు రూ.5 లక్షల వరకు నష్టం వాటిల్లిందని రైతు వాపోయాడు. ● విరుపాపురం, సుళువాయి తదితర ప్రాంతాల్లో మామిడి చెట్లు, బొప్పాయి చెట్లు నేలమట్టమయ్యాయి. దీంతో రైతులకు తీవ్ర నష్టం వచ్చింది. కాత్రికి గ్రామంలో విషాదం కౌతాళం మండలం కాత్రికి గ్రామంలో పిడుగు పడి అశోక్(21), బాలయ్య (22) మృతి చెందారు. అలాగే నిరుపాధి, గంగాధర్ తీవ్రంగా గాయపడ్డారు. క్రికెట్ ఆడుతుండగా ఒక్కసారిగా గాలీవాన మొదలై వర్షం ఎక్కువ కావడంతో సమీపంలోని చెట్టు కిందకు చేరుకోవడంతో పిడుగు పడి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు యువకులు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. ● కృష్ణగిరి మండలం కటారుకొండ గ్రామంలో పొలానికి వెల్లిన బోయ శ్రీనివాసులు అనే రైతు పిడుగుపాటు పడి మృతి చెందారు. కల్లాల్లో తడిచిన వరి ధాన్యం నేలరాలిన బొప్పాయి, మామిడి పిడుగుపాటుతో ముగ్గురు మృతి -
హంతకులను తక్షణమే అరెస్టు చేయాలి
● సీడబ్ల్యూసీ సభ్యుడు ఎన్.రఘువీరారెడ్డి కర్నూలు(సెంట్రల్): ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ చిప్పగిరి లక్ష్మీనారాయణను హత్య చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. కర్నూలు, అనంతపురం జిల్లాల ఎస్పీలతో ఫోన్లో మాట్లాడినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. కాగా.. లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులను ఎన్.రఘువీరారెడ్డితో పాటు కర్నూలు జిల్లా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి అంబటి రామకృష్ణ యాదవ్ ఫోన్లో మాట్లాడి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పరిపాలనాధికారిగా పదోన్నతి కర్నూలు(అర్బన్): జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తూ జిల్లాల పునర్విభజనలో నంద్యాలకు వెళ్లిన జీఎన్ఏ ప్రసాద్కు పరిపాలనాధికారిగా పదోన్నతి లభించింది. జోన్–4లో జరిగిన పదోన్నతుల్లో భాగంగా ప్రసాద్ను శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ డీఎల్పీఓ కార్యాలయానికి పోస్టింగ్ ఇస్తూ పీఆర్అండ్ఆర్డీ డైరెక్టర్ వీఆర్ క్రిష్ణతేజ మైలవరపు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రసాద్కు పరిపాలనాధికారిగా పదోన్నతి లభించడంపై జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయ ఉద్యోగులు, సహచరులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. రేషన్ బియ్యం పట్టివేత గోస్పాడు: పేదలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా గోస్పాడు ఎస్ఐ వెంకటప్రసాద్ పట్టుకున్నారు. బియ్యం బస్తాలతో బనగానపల్లె వైపు వెళ్తున్న బొలెరో వాహనాన్ని మండలంలోని రాయపాడు గ్రామ సమీపంలో గుర్తించి తనిఖీలు చేపట్టారు. మొత్తం 16 బస్తాల బియ్యం ఉండటంతో ఆ వాహనాన్ని సీజ్ చేసి బనగానపల్లెకు చెందిన వంశీ, హుసేని, గిరి అనే వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఉరుముల శబ్దానికి వృద్ధుడి మృతి ప్యాపిలి: పట్టణంలో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. పట్టణంలోని బాలికల వసతి గృహం సమీపంలో నివాసం ఉంటున్న మసాలా బాషా సాహెబ్ (70) ఇంటి వసారాలో కూర్చుని ఉండగా ఒక్కసారిగా ఉరుముల శబ్దం వచ్చింది. ఉరుముల శబ్దంతో గుండెపోటుకు గురైన ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎర్రమట్టి ట్రాక్టర్ల పట్టివేత సి.బెళగల్: మండల కేంద్రం సి.బెళగల్లో అక్రమంగా ఎర్రమట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. శనివారం రాత్రి మండలంలోని గ్రామాల్లో వారు గస్తీ నిర్వహిస్తుండా నిషిద్ధ ప్రాంతమైన సి.బెళగల్ పచ్చిక బయళ్లు ఉన్న కొండ నుంచి ఎర్రమట్టిని తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లు కనబడ్డాయి. వాటిన సీజ్ చేసి రెవెన్యూ అధికారులకు అప్పగించినట్లు హెడ్ కానిస్టేబుల్ తిమ్మప్ప తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా అనుమతి లేకుండా ఎర్రమట్టి తరలిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. -
శ్రీశైలంలో భక్తుల సందడి
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల తాకిడి రోజురోజుకు పెరుగుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు మల్లన్న దర్శనానికి భారీగా తరలివచ్చారు. వేకువజామున్నే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లికార్జునస్వామివారి దర్శనానికి క్యూలైన్ వద్దకు చేరుకున్నారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. పలువురు భక్తులు ఆన్లైన్ ద్వారా టికెట్లు పొంది స్వామివారి స్పర్శదర్శనం చేసుకున్నారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులన్ని కిటకిటలాడాయి. సమస్యల పరిష్కారానికి కృషి కర్నూలు(సెంట్రల్): న్యాయశాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తగిన కృషి చేస్తానని కర్నూలు జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా భరోసా ఇచ్చారు. ఆదివారం సాయంత్రం కర్నూలు జిల్లా జ్యూడిషియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవేంద్రగౌడ్, జనరల్ సెక్రటరీ గోపాల్ ఆధ్వర్యంలో పలువురు ఉద్యోగులు కలెక్టర్ను ఆయన చాంబరులో మర్యాదపూర్వకంగా కలిశారు. న్యాయశాఖ ఉద్యోగులకు అన్ని వేళల సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ తెలిపినట్లు వారు వివరించారు. ట్రెజరర్ శివరాముడు, సలహాదారు రాముడు, కార్యదర్శులు రాఘవరెడ్డి, రమేష్, సభ్యుడు రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ప్రశాంతంగా ‘గురుకుల’ పరీక్ష ఆదోని సెంట్రల్: ఆంధ్రప్రదేశ్ మహాత్మా జ్యోతిరావ్ పూలే గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్ష ఆది వారం ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో 2,497 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 2,273 మంది పరీక్ష రాసినట్లు జిల్లా కో అర్డినేటర్ య మునాదేవి తెలిపారు. ఆదోని డివిజన్ పరిధిలో ఏడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. హ్యాండ్బాల్ చాంపియన్ ‘కర్నూలు’ కర్నూలు (టౌన్)/ కదిరి అర్బన్: శ్రీసత్యసాయి జిల్లా కదిరి పట్టణం ఎస్టీఎస్ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు రోజులుగా జరిగిన 54వ రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్ పోటీల్లో కర్నూలు జట్టు చాంపియన్షిప్ను కై వసం చేసుకుంది. మొత్తం 16 జట్లు ఈ టోర్నీలో పాల్గొన్నాయి. ఆదివారం టోర్నీ ముగిసింది. ప్రథమ స్థానం కర్నూలు, ద్వితీయ స్థానం పశ్చిమగోదావరి, తృతీయ స్థానంలో శ్రీసత్యసాయి జిల్లా జట్లు నిలిచాయి. విజేత జట్టుకు సీనియర్ హ్యాండ్బాల్ క్రీడాకారుడు ప్రసాద్ ట్రోఫీని ప్రదానం చేశారు. కార్యక్రమంలో జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ కార్యదర్శి మహేష్తో పాటు పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. ‘వేదావతి’లో ఇసుక దోపిడీ హొళగుంద: వేదావతి(హగరి) నుంచి అక్రమార్కులు యథేచ్ఛగా ఇసుక తరలిస్తున్నారు. దీంతో నదిలో రాళ్లు, రప్పలు కనిపిస్తున్నాయి. హొళగుంద మండల పరిధిలోని మార్లమడికి వద్ద ఈ దుస్థితి నెలకొంది. ఉచితంగా ఇసుక తీసుకునేందుకు అనుమతి ఉంది. అయితే నిబంధనలను పాటించడం లేదు. దీంతో వేదావతి నది నుంచి అక్రమంగా ఇసుకను పట్టణాలకు తరలిస్తున్నారు. ఫలితంగా భూగర్భ జలాలు ఇంకి పోయి నదిలో రాళ్లు తేలాయి. ఈ నదిలోనే ముందుకు వెళితే కర్ణాటక రాష్ట్రంలోని రారావి వద్ద ఇసుక మేటలు కనిపిస్తాయి. -
నేడు కర్నూలులో ముస్లింల శాంతి ర్యాలీ
కర్నూలు(సెంట్రల్): వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని కోరుతూ సోమవారం కర్నూలులో ముస్లింలు భారీ శాంతి ర్యాలీ నిర్వహణకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ ర్యాలీకి మతాలు, కులాలకు అతీతంగా రాజకీయ పార్టీలు, వివిధ ప్రజాసంఘాలు మద్దతు ఇవ్వాలని సేవ్ వక్ఫ్..సేవ్ రాజ్యాగం జేఏసీ కన్వీనర్ సయ్యద్ జాకీర్ అహ్మద్, కోకన్వీనర్ ఎంఏ హమీద్ కోరారు. ఆదివారం వక్ఫ్ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ..ఉదయం 9 గంటలకు ఉస్మానియా కాలేజీ నుంచి ర్యాలీ ప్రారంభమై వడ్డేగేరి, చిల్డ్రన్స్ పారు మీదుగా రాజ్ విహార్ చేరుకుంటుందన్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రారంభమయే ర్యాలీలు రాజ్విహార్ చేరుకొని అక్కడి నుంచి కలెక్టరేట్కు వస్తాయని చెప్పారు. ర్యాలీలో ప్రభుత్వాలకు ఎవరూ వ్యతిరేకంగా నినాదాలు చేయరాదని సూచించారు. వైఎస్ఆర్సీపీ నాయకుడు యూనస్బాషా, సీపీఎం నాయకుడు ఎస్ఎండీ షరీఫ్, బీఎస్పీ నాయకులు సలీం, జైరాజ్, బుర్రన్న, రాజ్కుమార్ పాల్గొన్నారు. -
మత సామరస్యంతో మెలగాలి
కర్నూలు కల్చరల్: ప్రజలు మత సామరస్యంతో మెలగాలని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేష్ సూచించారు. శ్రీశైలం ప్రాజెక్ట్ విశ్రాంత సర్కిల్ అఽధికారి, మిమిక్రీ ఆర్టిస్ట్ ఖాదర్బాబు అభినందన సభ, మిమిక్రీ నాటక ప్రదర్శన, సంగీత విభావరి కార్యక్రమాలు ఆదివారం సీక్యాంప్ టీజీవీ కళాక్షేత్రంలో జరిగాయి. ఈ సందర్భంగా టీజీ మాట్లాడుతూ.. ఖాదర్ బాబు నాటక రంగంలో మల్టీటాలెంటెడ్గా రాణించడం అభినందనీయమన్నారు. టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు కళారత్న పత్తిఓబులయ్య, ఆర్ఆర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ బాలమద్దయ్య, విశ్రాంత ఎస్పీ లక్ష్మీనాయక్ మాట్లాడారు. అనంతరం ఖాదర్బాబు ప్రదర్శించిన నాటక సన్నివేశాలు, గాయకులు సుధారాణి, హబీబ్, బాల వెంకటేశ్వర్లు నిర్వహించిన సంగీత విభావరి అలరించింది. కళాక్షేత్రం మాజీ అధ్యక్షుడు దస్తగిరి, కార్యదర్శి మహమ్మద్ మియ్యా, సభ్యులు రమణ తదితరులు పాల్గొన్నారు . -
కురువ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు
కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కురువ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందించేందుకు తీర్మానించినట్లు జిల్లా కురువ సంఘం నేతలు తెలిపారు. ఆదివారం సంఘం కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో గౌరవాధ్యక్షులు కే కిష్టన్న, అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న, ప్రధాన కార్యదర్శి ఎంకే రంగస్వామి, మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీలీలమ్మ, ప్రధాన కార్యదర్శి అనిత హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2024–25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రతిభా పురస్కారాలను అందించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠఠశాలల్లో 10వ తరగతిలో 500 మార్కులకు పైగా, ప్రైవేటు పాఠశాలల్లోని వారు 550కి పైగా మార్కులు వచ్చిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ప్రభుత్వ కళాశాలల్లో చదివిన వారు 850 మార్కులకు పైగా, ప్రైవేటు కళాశాలల్లో చదివిన విద్యార్థులు 900కి పైగా మార్కులు తెచ్చుకున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అర్హులైన విద్యార్థులు తమ మార్కుల మెమో, కులం సర్టిఫికేట్ జీరాక్స్ కాపీలను మే నెల 5వ తేదిలోగా సెల్: 9440756199, 9032741194 నెంబర్లకు వాట్సాప్ పంపాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బీ వెంకటేశ్వర్లు, కే ధనుంజయ, కేసీ నాగన్న, తిరుపాల్, తవుడు శ్రీనివాసులు, పాల సుంకన్న, బీసీ తిరుపాలు, పుల్లన్న, బాలరాజు, కే మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు. -
AP: కాంగ్రెస్ నేత దారుణ హత్య
అనంతపురం: జిల్లాలోని గుంతకల్లులో కాంగ్రెస్ నేత చిప్పగిరి లక్ష్మీనారాయణ దారుణహత్యకు గురయ్యారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్న లక్ష్మీ నారాయణను కొంతమంది దుండగులు దారుణంగా హత్య చేశారు. కాంగ్రెస్ లక్ష్మీనారాయణ కారును టిప్పర్ తో ఢీకొట్టారు దుండగులు. ఆపై లక్ష్మీ నారాయణపై వేట కొడవళ్లతో దాడి చేసి హత్య చేశారు. ఈ దాడిలో లక్ష్మీ నారాయణ కుమారుడు వినోద్కు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. -
శ్మశాన వాటికనూ వదలని జనసేన నేత.. తిరగబడిన స్థానికులు
సాక్షి, ధర్మవరం: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో కూటమి నాయకుల దౌర్జన్యానికి అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. పట్టణంలోని ఎల్సీకేపురంలో దశాబ్దాలుగా ఉన్న శ్మశాన వాటికకు నకిలీ పట్టాలు సృష్టించి రిజిస్ట్రేషన్లు చేసి కబ్జా చేసేందుకు జనసేన నాయకుడు తొండమాల రవి యత్నించడం కలకలం రేపింది. వివరాల ప్రకారం.. ధర్మవరం పట్టణంలోని ఎల్సీకేపురంలో సర్వే నంబర్ 649లో భవన నిర్మాణ కార్మికులకు ఇంటి స్థలాల కోసం 30 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో రెండు ఎకరాలకుపైగా మిగులు భూమి ఉండటంతో 2002లో ప్రభుత్వం శ్మశాన వాటికకు కేటాయించింది. అప్పటి నుంచి శివారు ప్రాంత కాలనీ ప్రజలు శ్మశాన వాటికగా ఉపయోగించుకుంటున్నారు. అయితే ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ స్థలంపై జనసేన నాయకుడు తొండమాల రవి కన్ను పడింది. ఈ రెండు ఎకరాల స్థలాన్ని తన బినామీల పేరిట అక్రమ రిజిస్ట్రేషన్ చేయించారు. ఆపై ఆక్రమించుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో శనివారం జేసీబీలతో స్థలాన్ని చదును చేసేందుకు వెళ్లడంతో స్థానికులు అవాక్కయ్యారు. ఇది శ్మశాన వాటిక స్థలమని, ఎందుకు చదును చేస్తున్నారని ప్రశ్నించారు. తమ స్థలం అంటూ జనసేన నాయకుడు రవి చెప్పడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే జేసీబీలను తీసుకెళ్లాలని భీష్మించారు. చదును పనులను అడ్డుకున్నారు. విషయం తెలిసిన పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అనంతరం పట్టణ పోలీస్స్టేషన్లో జనసేన నేత రవిపై స్థానికులు ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి శ్మశాన వాటికను కాపాడాలని కోరారు. -
ఛాతీలో కణితి తొలగించి ప్రాణం పోశారు
కర్నూలు(హాస్పిటల్): ఛాతీలో నాలుగు కిలోల కణితి ఉన్న ఓ మహిళకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించి ఆమెకు ప్రాణం పోశారు. డోన్ మండలం జొన్నగిరికి చెందిన దాసరి బేబి(40) ప్రస్తుతం కర్నూలులోని ఓ ప్రైవేటు కాలేజిలో స్వీపర్గా పనిచేస్తోంది. ఆమెకు భర్త లేడు. కష్టపడి జీవనం సాగిస్తున్న ఆమెకు తీవ్ర అనారోగ్యం వచ్చి పడింది. అకస్మాత్తుగా విపరీతమైన దగ్గు, ఊపిరి ఆడేది కాదు. ఇటీవల ఆమె చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స విభాగంలో వైద్యులను కలిసింది. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమె ఛాతీలో నాలుగు కిలోల కణితి ఉన్నట్లు గుర్తించారు. రక్తనాళాలను, వాయునాళాన్ని గట్టిగా ఒత్తేస్తోందని, ఆమెకు ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నట్లు తెలుసుకున్నారు. దీంతో ఈ నెల 22న కార్డియోథొరాసిక్ సర్జరీ హెచ్వోడీ డాక్టర్ సి. ప్రభాకర్రెడ్డి ఆధ్వర్యంలో వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేసి కణితిని తొలగించారు. ప్రస్తుతం ఆమె కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. పెద్దాసుపత్రిలో మహిళకు అరుదైన ఆపరేషన్ -
యూట్యూబ్లో చూసి.. చోరీ చేసి!
కర్నూలు: కర్నూలులోని సాయి వైభవ్ నగర్లో నివాసముంటున్న ఆర్టీసీ డిపో–1 మేనేజర్ సర్దార్ హుసేన్ ఇంట్లో చోరీకి పాల్పడిన దొంగలను పోలీసులు అరెస్టు చేసి కటకటాలకు పంపారు. సీతారాం నగర్లో నివాసముంటూ దుర్గా హోటల్ పక్కన ఉన్న స్పైసీ డాబాలో పనిచేస్తున్న షేక్షావలితో పాటు ఐదుగురు మైనర్లు చోరీకి పాల్పడినట్లు సాంకేతిక ఆధారాలతో గుర్తించి పక్కా ఆధారాలతో నిందితులను అదుపులోకి తీసుకుని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఎదుట హాజరుపర్చగా శనివారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఎస్పీ వివరాలు వెల్లడించారు. షేక్షావలి సంతోష్ నగర్, కొండారెడ్డి నగర్, ఎన్టీఆర్ బిల్డింగ్స్ ప్రాంతాల్లో నివాసముంటున్న ఐదుగురు మైనర్లతో జట్టు కట్టి సర్దార్ హుసేన్ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ముందు రోజు ఇద్దరు మైనర్లు ద్విచక్ర వాహనంపై సాయి వైభవ్ నగర్లో రెక్కీ నిర్వహించారు. సర్దార్ హుసేన్ ఇళ్లు తాళం వేసి ఉండటంతో అర్ధరాత్రి ఆరుగురు నిందితులు అక్కడికి చేరుకుని ఇంట్లోకి చొరబడి అందినమట్టుకు మూటగట్టుకుని ఉడాయించారు. మరుసటి రోజు పనిమనిషి గుర్తించి సర్దార్ హుసేన్కు సమాచారం ఇవ్వడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి మూడో పట్టణ పోలీసులు దర్యాప్తులో భాగంగా పక్కా ఆధారాలతో షేక్షావలితో పాటు మరో ఐదుగురు మైనర్లను నంద్యాల చెక్పోస్టు సమీపంలోని కేంద్రీయ విద్యాలయం దగ్గర అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. వారి వద్ద నుంచి 27 తులాల బంగారు, 35 తులాల వెండి, నేరానికి ఉపయోగించిన రెండు మోటర్ సైకిళ్లు, రంపం, ఇనుప రాడ్డు స్వాధీనం చేసుకున్నారు. యూట్యూబ్లో చూసి... దొంగతనం ఎలా చేయాలనే దానిని యూట్యూబ్లో వీడియోలు చూసి తాళాన్ని విరగ్గొట్టేందుకు అవసరమైన పరికరాలను సమకూర్చుకుని రెండు బైక్లపై అర్ధరాత్రి నిందితులు ఆ ఇంటి వద్దకు చేరుకున్నారు. శబ్దం రాకుండా తాళం విరగ్గొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. బీరువాలో ఉన్న బంగారు, వెండి ఆభరణాలను దొంగలించి వాటిని పంచుకున్నట్లు విచారణలో బయటపడింది. ఇందులో ఇద్దరు మైనర్లు గతంలో ద్విచక్ర వాహనాల తాళాలు తీయడంలో నేర్పరులు. మైనర్లు ఐదుగురు కూడా పాఠశాలకు వెళ్లకుండా డ్రాపౌట్ అయి మెకానిక్ షెడ్డులో పనిచేస్తూ అల్లరిచిల్లరగా తిరుగుతూ జల్సాలకు అలవాటు పడి షేక్షావలితో జట్టు కట్టి చోరీలకు పాల్పడినట్లు ఎస్పీ వెల్లడించారు. ఎల్హెచ్ఎంఎస్ యాప్ను వినియోగించుకోండి... ఇళ్లకు తాళం వేసి ఊర్లకు వెళ్లేటప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని, ఇంటి భద్రత కోసం ఎల్హెచ్ఎంఎస్ యాప్ను వినియోగించుకోవాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. కాలనీలో కొత్త వ్యక్తులు, అనుమానితులు సంచరిస్తున్నట్లయితే సమాచారం అందించాలన్నారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ ఖాజా హుసేన్, కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్, సీఐలు శేషయ్య, నాగశేఖర్ తదితరులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. కేసును ఛేదించిన క్రైం పార్టీ సిబ్బందికి ఎస్పీ నగదు రివార్డులను అందజేశారు. ఆర్టీసీ డిపో మేనేజర్ ఇంట్లో చోరీ చేసిన దొంగలు అరెస్టు సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుల గుర్తింపు 27 తులాల బంగారు, 35 తులాల వెండి రికవరీ -
సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్తుల ఆటకట్టిద్దాం
కర్నూలు: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరస్తుల ఆట కట్టిద్దామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. శనివారం డీపీఓలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నేర సమీక్ష నిర్వహించారు. కర్నూలు, పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు సబ్ డివిజన్లలో దీర్ఘకాలిక పెండింగ్ కేసులను సమీక్షించి పరిష్కారానికి సలహాలు, సూచనలు చేశారు. డ్రంకెన్ డ్రైవ్ వల్ల ఎక్కడైనా రోడ్డు ప్రమాదాలు జరిగితే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించారు. సోషల్ మీడియాపై గట్టి నిఘా ఉంచాలని, ఎలాంటి ఆధారాలు లేకుండా పుకార్లు వ్యాపింపజేస్తే కఠినంగా వ్యవహరించాలన్నారు. పోలీసు అధికారులు గ్రామాల్లో పర్యటించేటప్పుడు సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఆదివారం కచ్చితంగా రౌడీషీటర్లను స్టేషన్లకు పిలిపించి కౌన్సెలింగ్ చేయాలన్నారు. వివిధ కేసుల్లో ప్రతిభ కనపరచిన పోలీసు అధికారులకు, సిబ్బందికి ఎస్పీ ఈ సందర్భంగా ప్రశంసాపత్రాలు అందజేశారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, లీగల్ అడ్వైజర్ మల్లికార్జునరావు, డీఎస్పీలు బాబుప్రసాద్, శ్రీనివాసాచారి, వెంకటరామయ్య, ఉపేంద్ర బాబు, హేమలత, సీఐలు, ఎస్ఐలు సమావేశంలో పాల్గొన్నారు. -
మాజీ ఎంపీటీసీ సభ్యుడిపై దాడి
బండి ఆత్మకూరు: కడమల కాలువ గ్రామంలో వైఎస్సార్సీపీకి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడుపై అదే గ్రామానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ సుబ్బరాయుడు దాడికి పాల్పడ్డాడు. బాధితుని వివరాల మేరకు.. గ్రామంలో ప్రస్తుతం రీ సర్వే జరుగుతోంది. అయితే సుబ్బరాయుడికి చెందిన 1.50 ఎకరాల భూమిని భాస్కర్ గతంలో కొనుగోలు చేశాడు. ప్రస్తుతం ఆ పొలాన్ని సాగు చేసుకుంటున్నాడు. పాస్ బుక్కులు కూడా ఉన్నాయి. అయితే ఆన్లైన్లో సుబ్బరాయుడి తండ్రి పేరు ఉందని ఆక్రమించే ప్రయత్నం చేయడంతో రెవెన్యూ అధికారులు భాస్కర్కు చెందుతుందని తేల్చారు. అయితే పొలాన్ని అక్రమంగా స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడని తెలుసుకున్న భాస్కర్ శనివారం సచివాలయం వద్దకు వెళ్లాడు. కాగా అక్కడే సుబ్బరాయుడు అతనిపై దాడి చేయడం గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఇద్దరి వ్యక్తులపై బైండోవర్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జగన్ మోహన్ తెలిపారు. 14వేల హెక్టార్లకు సూక్ష్మ సేద్యం కర్నూలు(అగ్రికల్చర్): 2025–26వ సంవత్సరానికి సూక్ష్మ సేద్యం లక్ష్యాలు ఖరారయ్యాయి. మొదట్లో ఉమ్మడి కర్నూలు జిల్లాకు 14వేల హెక్టార్లకు సూక్ష్మ సేద్యం కల్పించే విధంగా లక్ష్యాలను ఇచ్చింది. కర్నూలు జిల్లాలో 7 వేలు, నంద్యాల జిల్లాలో 7 వేల హెక్టార్లకు సూక్ష్మ సేద్యం కల్పిస్తారు. 2024–25 సంవత్సరంలో కర్నూలు జిల్లాలో 5,653 హెక్టార్లకు, నంద్యాల జిల్లాలో 5,058 హెక్టార్లకు సూక్ష్మ సేద్యం కల్పించినట్లు స్పష్టమవుతోంది. గత ఏడాది సాధించిన ప్రగతిని దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాదికి లక్ష్యాలను ఇచ్చినట్లుగా అధికార వర్గలు తెలిపాయి. ఐదెకరాల్లోపు ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం సబ్సిడీపై సూక్ష్మ సేద్యం కల్పిస్తారు. ఒక రైతుకు గరిష్టంగా రూ.2.18 లక్షల వరకు సబ్సిడీ ఇస్తారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా 33 శాతం ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం 67 శాతం భరిస్తుంది. ఇతర సన్న, చిన్నకారు రైతులకు ఐదు ఎకరాల వరకు 90 శాతం సబ్సిడీపై సూక్ష్మ సేద్యం కల్పిస్తారు. రైతులు 10 శాతం భరించాలి. సబ్సిడీ రూ.2.18 లక్షలు లభిస్తుంది. కేంద్రం 33 శాతం, రాష్ట్రం 57 శాతం భరిస్తాయి. స్ప్రింక్లర్లు 50 శాతం సబ్సిడీపై ఇవ్వనున్నారు. బెల్టు షాపులపై ఎకై ్సజ్ దాడులు కర్నూలు: లైసెన్స్ దుకాణాల నుంచి మద్యం తరలించి గ్రామీణ ప్రాంతాల్లో బెల్టు షాపుల ద్వారా అధిక లాభాలకు విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం అందడంతో ఎకై ్సజ్ అధికారులు దాడులు చేశారు. ఎన్ఫోర్స్మెంట్ సీఐ జయరాముడు, ఎస్ఐ రవితేజ, ఎకై ్సజ్ స్టేషన్ ఎస్ఐలు రెహనా, నవీన్, సిబ్బంది నందీశ్వర్ రెడ్డి, చంద్రపాల్, ఈరన్న, రామలింగయ్య తదితరులు బృందాలుగా ఏర్పడి కర్నూలు మండలంలోని వివిధ గ్రామాల్లో తనిఖీ నిర్వహించారు. లక్ష్మీపురంలో ఎరుకలి నరసింహులు, పుసులూరులో బోయ అయ్యస్వాములు బెల్టు షాపులు నడుపుతున్నట్లు గుర్తించి తనిఖీ నిర్వహించారు. 22 మద్యం బాటిళ్లను వారి నుంచి స్వాధీనం చేసుకుని ఇరువురిపై కేసు నమోదు చేసినట్లు ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా బంగారుపేటలో నాటుసారా స్థావరంపై దాడులు చేసి 25 లీటర్ల నాటుసారా, వెయ్యి లీటర్లు సారా తయారీకి ఉపయోగించే ఊటను ధ్వంసం చేశారు. సారా విక్రయిస్తున్న నీలిషికారి మహాలిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. -
ఉన్నత చదువుతో ఉజ్వల భవిష్యత్తు
కర్నూలు(సెంట్రల్): ఉన్నత చదువులు చదివితే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అన్నారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించి 17 మంది విద్యార్థులను శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ సన్మానించారు. ఇందులో 600 మార్కులకు గాను 597 మార్కులు సాధించిన విద్యార్థులు ఏడుగురు ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2,700 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. కొందరు విద్యార్థులు మధ్యలో చదువు మానేసి వలసలు వెళ్లడంతో ఉత్తీర్ణత శాతంలో వెనుకబడినట్లు చెప్పారు. అయినప్పటికీ నాలుగు సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం 1,000 మంది విద్యార్థులు అధికంగా పాసైనట్లు చెప్పారు. పదో తరగతి తరువాత విద్యార్థులు మంచి కెరీర్ను ఎంచుకునేందుకు వీలుగా ‘నైపుణ్య’ అనే పేరుతో హైదరాబాద్ 21వ సెంచరీ ఐఏఎస్ అకాడమీ ద్వారా ఉచిత శిక్షణను ప్రారంభించామన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను యూట్యూబ్లోనూ ఉంచామని అవసరమైన విద్యార్థులు చూసుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులను సన్మానించి వారితో గ్రూపు ఫొటో దిగారు. కార్యక్రమంలో డీఈఓ శామ్యూల్పాల్, గురుకుల పాఠశాల కో ఆర్డినేటర్ శ్రీదేవి, ఏసీబీ డీఎస్పీ కృష్ణారెడ్డి, పోటీ పరీక్షల నిర్వాహకుడు గణేష్, వెల్దుర్తి బీసీ వెల్ఫేర్ హాస్టల్ ప్రిన్సిపాల్ సబీనా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా -
పోలీసు శాఖలో 154 మందికి స్థానచలనం
కర్నూలు: జిల్లా పోలీసు శాఖలోని వివిధ స్టేషన్లలో పనిచేస్తున్న 118 మంది కానిస్టేబుళ్లు, 24 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 12 మంది ఏఎస్ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో శనివారం బదిలీల ప్రక్రియ నిర్వహించారు. ఒకే పోలీస్ స్టేషన్లో ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సిబ్బంది జాబితాను ముందుగానే సిద్ధం చేసి కౌన్సెలింగ్కు పిలిచారు. సీనియారిటీ జాబితాను ప్రొజెక్టర్ ద్వారా ప్రదర్శించి స్టేషన్ల వారీగా ఖాళీలను అందులో చూపి బదిలీలకు కౌన్సెలింగ్ చేపట్టారు. ఖాళీలకు అనుగుణంగా పోలీస్ స్టేషన్లను ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించారు. స్పౌజ్ కేసు (భార్యాభర్తలు ఉద్యోగులు), అనారోగ్యంతో ఉన్న పోలీసు సిబ్బందికి మినహాయింపు ఇచ్చి కోరుకున్న చోటుకు బదిలీ చేశారు. కార్యక్రమంలో అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, డీపీఓ ఏఓ విజయ్కుమార్ నాయుడు, స్పెషల్ బ్రాంచ్ సీఐ తేజమూర్తి, ఎస్ఐలు ఖాజా వలి, వేణుగోపాల్ రాజు, డీపీఓ కా ర్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. మైనారిటీలకు సబ్సిడీ రుణాలు ● దరఖాస్తుకు మే 25 ఆఖరు కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మైనారిటీ, క్రిిస్ట్టియన్ వర్గాల ప్రజలు సబ్సిడీ రుణాలకు మే 25లోగా దరఖాస్తు చేసుకోవాలని మైనారిటీ కార్పొరేషన్ ఈడీ ఎస్.సబీహా పర్వీన్ తెలిపారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ మైనారిటీలకు రూ.లక్ష నుంచి రూ.8 లక్షల వరకు, క్రిిస్టియన్ మైనారిటీలకు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు రుణాలను అందిస్తామన్నారు. ఎంపికై న వారికి 50 శాతం సబ్సిడీ మంజూరవుతుందన్నారు. అర్హత కలిగిన వ్యక్తులు వివరాలను https://apobmms.apcfss.in అనే వెబ్సైట్లో నమోదు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు ఈడీ, మైనారిటీ కార్పొరేషన్ కార్యాలయం, లేదా 9848864449, 9440822219 నెంబర్లను సంప్రదించాలన్నారు. విధుల నుంచి సమగ్ర శిక్ష ఏపీసీ రిలీవ్ కర్నూలు(సిటీ): సమగ్ర శిక్ష అదనపు కోఆర్డినేటర్గా పనిచేస్తున్న టి.శ్రీనివాసులు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఓఎస్డీగా నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం ఎస్ఎస్ఏ అదనపు కోఆర్డినేటర్ బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. ఆయన ఈ ఏడాది జనవరి 4వ తేదీన ఏపీసీగా బాధ్యతలు స్వీకరించారు. ఈయన సమగ్ర శిక్ష పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో లోటుపాట్లను సరిచేసుకునేందుకు 12 మంది స్పెషల్ ఆఫీసర్లకు నోటీసులు ఇచ్చి కొంత మేరకు మార్పులు తీసుకొచ్చారు. ఏపీసీగా విధుల్లో నుంచి రిలీవ్ అయ్యేందుకు ముందుగా జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషాను మర్యాదపూర్వకంగా కలిశారు. రేపు బీచ్ కబడ్డీ జట్ల ఎంపిక పోటీలు నంద్యాల(న్యూటౌన్): ఉమ్మడి కర్నూలు జిల్లా సీనియర్ బీచ్ కబడ్డీ పురుషుల, మహిళల జట్ల ఎంపిక పోటీలు ఈనెల 28వ తేదీన నిర్వహిస్తున్నట్లు నంద్యాల జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ ఏపీరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నంద్యాలలోని నందమూరినగర్ నాగులకట్ట వద్ద పోటీలు ఉంటాయని ఆయన తెలిపారు. పురుషులు 85 కేజీల్లోపు, మహిళలు 75 కేజీల్లోపు ఉండాలని, పోటీలకు వచ్చే సమయంలో ఆధార్కార్డు, పదో తరగతి మార్కులిస్టు తీసుకుని రావాలన్నారు. జట్లకు ఎంపికై న వారు మే 2 నుంచి 4వ తేదీ వరకు కాకినాడ బీచ్లో జరిగే రాష్ట్రస్థాయి బీచ్ కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. బెలుం గుహలకు వేసవి ఎఫెక్ట్ కొలిమిగుండ్ల: బెలుం గుహలపై వేసవి ప్రభా వం పడింది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. సాధారణ రోజుల్లో రోజుకు రూ.15వేలకు పైగా, శని, ఆదివారాల్లో రూ.30 వేల మేర ఆదాయం వస్తుండేది. ప్రస్తుతం ఎండల తీవ్రత దృష్ట్యా యాత్రికుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో ఆదాయం పడిపోయింది. -
లిమిటేషన్ యాక్ట్తో కేసుల సత్వర పరిష్కారం
● న్యాయమూర్తుల వర్కుషాపులో జిల్లా జడ్జి జి.కబర్ధి కర్నూలు(సెంట్రల్): లిమిటేషన్ యాక్ట్తో కేసులను త్వరగా పరిష్కరించేందుకు వీలు ఉంటుందని జిల్లా జడ్జి జి.కబర్ధి పేర్కొన్నారు. జిల్లా కోర్టులో ఉమ్మడి కర్నూలు జిల్లాలో పనిచేస్తున్న సీనియర్, జూనియర్ జడ్జీలకు లిమిటేషన్ యాక్ట్పై శనివారం వర్కుషాపు నిర్వహించారు. ముందుగా జిల్లా జడ్జి మాట్లాడుతూ.. లిమిటేషన్ యాక్ట్పై క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలన్నారు. అప్పుడు కేసులను సత్వరమే పరిష్కరించడానికి వీలు అవుతుందన్నారు. అనంతరం రిసోర్స్పర్సన్లు విశ్రాంత న్యాయమూర్తులైన మోహన్రావు, ఎస్.రజనీలు మాట్లాడారు. కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జీలు కమలాదేవి, పీజేసుధాకర్, అమ్మనారావు, పి.వాసు, ఎం.శోభారాణి, ఎన్. శ్రీవిద్య పాల్గొన్నారు. -
అప్పుల ఊబిలో బలవన్మరణం
పది నెలల్లో 67 మంది రైతుల బలవన్మరణం ●● కలసిరాని వ్యవసాయంతో అప్పులపాలు ● అన్నదాత సుఖీభవకు నీళ్లొదిలిన కూటమి ప్రభుత్వం ● ఆత్మహత్యల సంఖ్య తగ్గించి చూపే ప్రయత్నాల్లో త్రీమెన్ కమిటీ ● ఉచిత పంటల బీమాకు చెల్లుచీటి ● 2023 ఖరీఫ్, 2023–24 రబీ, 2024 ఖరీఫ్ పంటల బీమా అందనట్లే.. కుటుంబం వీధిన పడింది తుగ్గలి మండలం రాంపల్లి గ్రామానికి చెందిన వెంకట్రాములుకు వ్యవసాయమే జీవనాధారం. 2024–25లో గతంలో ఎప్పుడూ లేని విధంగా వ్యవసాయంలో దెబ్బతిన్నాడు. 5 ఎకరాల స్వంతభూమి ఉండగా.. మరో ఐదారు ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. సహకార సంఘంలో రూ.10 లక్షలకు పైగా అప్పు చేశాడు. ప్రయివేటు అప్పులు ఐదారు లక్షలు ఉన్నాయి. అధిక వర్షాలు, వర్షాభావంతో పాటు అరకొర పంటలకు గిట్టుబాటు ధర లేక నష్టాలను మూటకట్టుకున్నాడు. అప్పులు తీర్చాలనే ఒత్తిళ్లు అధికమవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య లక్ష్మి అనాథగా మారింది. వెల్దుర్తి మండలం రామళ్లకోటకు చెందిన కలుగొట్ల బోయ హనుమంతు కౌలుదారు. ఈయన 6.65 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని సాగు చేశాడు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వ్యవసాయం కోసం రూ.6 లక్షలు అప్పు చేశాడు. ప్రభుత్వం నుంచి ఎలాంటి తోడ్పాటు లభించక, వ్యవసాయం కలిసిరాక అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. విధిలేని పరిస్థితుల్లో గత ఏడాది పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈయనకు భార్య బోయ రామేశ్వరి. శివ(12), లత(10) సంతానం. ఇంటికి ఆధారమైన వ్యక్తి మరణించంతో వీళ్లంతా దిక్కులేని వాళ్లయ్యారు. త్రీమెన్ కమిటీ కౌలుదారు ఆత్మహత్యగా నిర్ధారించిందే కానీ, ప్రభుత్వం ఇప్పటికీ ఆదుకోని పరిస్థితి. కర్నూలు(అగ్రికల్చర్): ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేకపోవడం.. వ్యవసాయం కలసి రాకపోవడం.. ప్రకృతి కరుణించకపోవడం.. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించకపోవడం.. వెరసి రైతుల జీవనం దుర్భరం అవుతోంది. వ్యవసాయం కోసం బ్యాంకులు, పీఏసీఎస్ల్లో తీసుకున్న అప్పులు, ప్రయివేటు వ్యక్తుల దగ్గర అధిక వడ్డీలతో పొందిన రుణాలు బక్కచిక్కిన రైతులను బలవన్మరణాలకు ఉసిగొల్పుతున్నాయి. 2014–15 నుంచి 2018–19 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లాలో 321 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. తిరిగి మళ్లీ ఆయన ప్రభుత్వంలోనే రైతు ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. నాడు వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు ఇప్పటికి ఆ మాటలకే కట్టుబడి ఉన్నట్లు కనిపిస్తోంది. చంద్రబాబు, కరువు కవలలనే పేరుంది. 2014–15 నుంచి 2018–19 వరకు ఐదేళ్లు పాలిస్తే వరుసగా నాలుగేళ్లు కరువొచ్చింది. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ప్రతి ఏటా వర్షాభావం ఏర్పడుతుండటంతో ఉమ్మడి కర్నూలు జిల్లా ఎడారిగా మారింది. వర్షాలు లేక, అంతంతమాత్రం పండిన పంటలకు గిట్టుబాటు ధర లేక పెట్టిన పెట్టుబడిలో 10 శాతం కూడా దక్కక రైతులు చితికిపోయారు. నాటి దారుణ పరిస్థితులే మళ్లీ పునరావృతం అవుతున్నాయి. రైతులు బలవన్మరణాలకు పాల్పడుతుంటే.. బ్యాంకులు రుణాలు రికవరీకి ఆస్తులను జప్తులు చేస్తుండటం గమనార్హం. అన్నదాత సుఖీభవ అమలులో నిర్లక్ష్యం 2024 ఎన్నికల సమయంలో సూపర్–6లో భాగంగా రైతులకు అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి రూ.20 వేలు చెల్లించి ఆదుకుంటామని ఊరూవాడ చంద్రబాబు ప్రకటించారు. ఆయన మాటలు నమ్మి రైతులు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. రైతుల నమ్మకాన్ని వమ్ము చేస్తూ మొదటి ఏడాది అన్నదాత సుఖీభవకు నీళ్లొదిలారు. ఈ నేపథ్యంలో పంట పెట్టుబడులకు రైతులు అప్పులు చేయాల్సి వస్తోంది. ఈ అప్పులు తీర్చలేక పురుగుల మందు తాగడం, ఉరేసుకోవడం ద్వారా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 2025–26 సంవత్సరానికి అన్నదాత సుఖీభవ అమలు చేస్తామని ప్రకటించారు. అయితే పీఎం కిసాన్తో కలిపి రూ.20వేలు ఇస్తామని నాలుక మడతేశారు. రైతు సంక్షేమాన్ని పట్టించుకుంటే ఒట్టు 2023 ఖరీఫ్ కరువు మండలాలకు సంబంధించి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2024 జనవరిలోనే ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేసింది. 41,857 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో తప్పులు ఉన్నందున రూ.60.59 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ విడుదల కాలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు ఖాతాలను సరి చేసి పంపారు. ఇంతవరకు ఈ రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేయని పరిస్థితి. 2023–24 రబీలో ఉమ్మడి జిల్లాలో 31 కరువు మండలాలను గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గుర్తించింది. కరువు ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో 92,208 రైతులు నష్టాలను మూటకట్టుకున్నారు. ఇన్పుట్ సబ్సిడీ కోసం కర్నూలు జిల్లాకు రూ.58.28 కోట్లు, నంద్యాల జిల్లాకు రూ.37.76 కోట్లు విడుదల కావాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతనే కేంద్ర బృందం జిల్లాలో పర్యటించింది. అయితే ఇప్పటికీ ఇన్పుట్ సబ్సిడీ అతీగతీ లేకుండాపోయింది. బీమా మర్చిపోవాల్సిందే.. ● గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఐదేళ్లూ ఉచిత పంటల బీమాను అమలు చేసింది. ● 2024, 2024–25 రబీ సీజన్కు సంబంధించి రైతుల వాటా ప్రీమియం చెల్లించాల్సిన సమయానికి ఎన్నికల కోడ్ రావడంతో బ్రేక్ పడింది. ● కూటమి ప్రభుత్వం రైతుల వాటా సొమ్మును చెల్లిస్తే రైతులకు బీమా పరిహారం అందుతుంది. ● 2024 ఖరీఫ్ సీజన్లో కూటమి ప్రభుత్వం ఉచిత పంటల బీమాను అమలు చేస్తామని చెప్పినా, రైతుల వాటా విడుదల చేయని పరిస్థితి. ● దీంతో మూడు సీజన్లకు సంబంధించి రైతులు పంటల బీమా పరిహారానికి దూరమయ్యారు. ● కేవలం 2024–25 రబీ పంటల బీమాను మా త్రమే ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటోంది. ● అది కూడా ఉచిత పంటల బీమాను పక్కనపెట్టి రైతులే ప్రీమియం చెల్లించే విధానాన్ని తీసుకురావడం గమనార్హం. తుగ్గలి మండలం రాంపల్లి గ్రామానికి చెందిన రైతు భార్య లక్ష్మిదేవి రామళ్లకోట గ్రామానికి చెందిన రామేశ్వరి 18.7.24డోన్ మండలం గోసానిపల్లి గ్రామానికి చెందిన వై.రామాంజనేయులు(35) కౌలు రైతు. 3.95 ఎకరాల భూమి కౌలుకు తీసుకొని గత ఏడాది ఉల్లి సాగు చేశాడు. పెట్టుబడుల కోసం రూ.9 లక్షలు అప్పు తీసుకున్నాడు. అయితే అధిక వర్షాలు, అనావృష్టి కారణంగా పంట దెబ్బతినింది. గత ఏడాది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈయనకు భార్య అనిత, కూతురు మైతిలి(8), కుమారులు రామ్కుషల్(6), రామ్ చరణ్(4) ఉన్నారు. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి మరణించడంతో భార్యా పిల్లలు దీనావస్థలో ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో 67 మంది రైతులు ఆత్మహత్య కూటమి ప్రభుత్వం ఏర్పాటైన మొదటి ఏడాదిలోనే మరణమృదంగం మోగింది. ప్రభుత్వం నుంచి చేయూత లేకపోవడం, వ్యవసాయం కలసిరాక అప్పులు మీద పడటంతో రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో రికార్డు స్థాయిలో 67 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడటం గమనార్హం. కర్నూలు జిల్లాలో 42 మంది, నంద్యాల జిల్లాలో 25 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్యను తగ్గించి చూపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్రీమెన్ కమిటీ విచారణలో అనర్హులుగా తేల్చేందుకు రంగం సిద్ధమవుతోంది. మండల వ్యవసాయ అధికారి, తహసీల్దారు రైతుల ఆత్మహత్యలేనని నిర్ధారించినప్పటికీ త్రీమెన్ కమిటీ విచారణలో రైతులు కాదని, ఇతర కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడ్డారని అన్యాయం చేస్తుండటం విమర్శలకు తావిస్తోంది. -
జిల్లా అంతటా పోలీసుల విస్తృత తనిఖీలు
కర్నూలు: శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు జిల్లా అంతటా విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు సబ్ డివిజన్ అధికారుల నేతృత్వంలో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, లాడ్జీలు, దేవస్థానాలు, దర్గాలు, వ్యాపార సముదాయాలు, షాపింగ్ మాల్స్లలో శనివారం సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ఏకకాలంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. కర్నూలులో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు కూడా తనిఖీల్లో పాల్గొన్నాయి. కర్నూలు నగరంలో ముఖ్యమైన కూడళ్లతో పాటు కిడ్స్ వరల్డ్, రాజ్విహార్, ప్రభుత్వాసుపత్రి, సి.క్యాంప్, రైల్వేస్టేషన్, బస్టాండ్ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. మంత్రాలయంలో..మంత్రాలయం: కశ్మీర్ పహల్గామ్లో ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో శనివారం మంత్రాలయంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. బాంబు, డాగ్ స్క్వాడ్ బృందంతో శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం, గంగమ్మ గుడి, ఆంజనేయ స్వామి ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో తనిఖీలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి మంత్రాలయానికి వచ్చే బస్సులు, కార్లు, తదితర వాహనాలకు క్షుణ్ణంగా పరిశీలించారు. మంత్రాలయం మండలంలోని తుంగభద్ర రేల్వేస్టేషన్లో తనిఖీలు నిర్వహించారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సీఐ రామాంజులు, ఎస్ఐ శివాంజల్ సూచించారు. -
కేడీసీసీ బ్యాంకులో పిటిషన్ల గోల!
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా పిటిషన్ల పర్వం సాగుతోంది. తమ లక్ష్యాలకు అడ్డం పడుతున్నారనే అనుమానం ఉన్న అధికారులకు పిటిషన్ల ద్వారా చుక్కలు చూపుతున్నారు. ఇటీవల కాలంలో బ్యాంకులో పనిచేస్తున్న సీనియర్ అధికారుల పేరుతోనే పిటిషన్లు నేరుగా ఆప్కాబ్కు వెళ్తున్నట్లు తెలుస్తోంది. 10 నెలల కాలంలో దాదాపు 100 వరకు ఇలాంటి పిటిషన్లు వెళ్లినట్లు సమాచారం. బ్యాంకుకు కొత్త సీఈఓ వస్తున్నారంటే చాలు ఆయన క్యారెక్టర్ను దెబ్బతీసే విధంగా పిటిషన్లు వెళ్తుండటం గమనార్హం. పిటిషన్లు మంచి భాషతో పెడితే ఎవ్వరికీ ఇబ్బంది ఉండదు కానీ, కుటుంబ సభ్యులను దా రుణంగా కించపరుస్తూ బూతులతో నింపేస్తుండటం అధికారుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తోంది. ఈ వ్యవహారంపై బ్యాంకు అధికారులు కొద్ది నెలల క్రిత మే పోలీసులకు పిర్యాదు చేశారు. అయినప్పటికీ వీటి వెనుక ఎవరున్నారనే విషయాన్ని గుర్తించలేకపోవడంతో మరింత రెచ్చిపోతున్నట్లు చర్చ జరుగుతోంది. మహిళల జీవనోపాధికి రుణాలు ● డీఆర్డీఏ పీడీ రమణారెడ్డి కర్నూలు(అగ్రికల్చర్): స్వయం సహాయక సంఘాల్లోని మహిళల జీవనోపాధిని అభివృద్ధికి చేసేందుకు రుణాలు ఇవ్వనున్నట్లు డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ వైపీ రమణారెడ్డి తెలిపారు. ఇందుకోసం 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.3,898.15 కోట్లతో రుణ ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాలో 954 గ్రామైక్య సంఘాలు, 25 మండల సమాఖ్యలు ఉన్నాయన్నారు. మొత్తం 32,572 ఎస్హెచ్జీలు ఉండగా.,. ఇందులో 3,30,044 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి, ఉన్నతి తదితర వాటి కింద రుణ సదుపాయం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ‘ఉపాధి’ నిధులతో పండ్లతోటల అభివృద్ధి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో పండ్లతోటలను అభివృద్ధి చేసుకోవచ్చని డ్వామా పీడీ వెంకటరమణయ్య తెలిపారు. ఇందుకు అర్హులైన రైతులను గుర్తించాలన్నారు. కలెక్టరేట్లోని డ్వామా సమావేశ మందిరంలో సాంకేతిక సహాయకులకు ఈ నెల 17 నుంచి నిర్వహించిన శిక్షణ కార్యక్రమాలు శుక్రవారం ముగిశాయి. ముగింపు కార్యక్రమంలో డ్వామా పీడీ మాట్లాడుతూ.. 2025–26 సంవత్సరంలో 6,750 ఎకరాల్లో పండ్లతోటలు అభివృద్ధి చేయాలనేది లక్ష్యమన్నారు. మొత్తంగా 17 రకాల పండ్ల తోటల సాగుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. అదనపు పీడీ మాధవీలత, ఏపీడీలు పాల్గొన్నారు. 3,075 స్పౌజ్ పింఛన్లు మంజూరు కర్నూలు(అగ్రికల్చర్): ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద 3,075 మంది వితంతు మహిళలకు పింఛన్లు మంజూరయ్యాయి. 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 మధ్యకాలంలో వృద్ధాప్య పింఛను తీసుకుంటూ మరణించిన వారి భార్యలకు వితుంతు పింఛన్లు మంజూరు చేసింది. ఈ జాబితాలను ప్రభుత్వం డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్కు పంపగా.. వీటిని ఎంపీడీఓలు, ము న్సిపల్ కమిషనర్లు, వార్డు, గ్రామ సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్లకు పంపారు. వితంతు పింఛను మంజూరుకు ఆయా సచివాలయాల వెల్ఫేర్ అసిస్టెంట్లు వెంట నే డెత్ సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలన్నారు. నంద్యాల జిల్లాకు 3,169 పింఛన్లు మంజూరయ్యాయి. -
వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి
● 28న కర్నూలులో ముస్లింల భారీ ర్యాలీ ● 30న రాత్రి ఇళ్లల్లో విద్యుత్ దీపాలు ఆర్పివేసి నిరసన ● రౌండ్ టేబుల్ సమావేశంలో ముస్లిం మత పెద్దలుకర్నూలు (టౌన్): వక్ఫ్ సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని ఉలమ్ అధ్యక్షుడు మౌలానా మజీద్ డిమాండ్ చేశారు. కర్నూలు రైల్వే స్టేషన్ ప్రాంగణంలోని ఒక హోటల్లో శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముస్లిం మత పెద్దలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మేధావులు హాజరయ్యారు. కశ్మీర్లో ఉగ్రవాదుల దాడికి నిరసన తెలుపుతూ మృతులకు రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులు అర్పించారు. అనంతరం మౌలానా మజీద్ మాట్లాడుతూ.. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతర వ్యక్తులను నియమించడం, కలెక్టర్ పర్యవేక్షణ చేయడం వంటి విధానాలు వ్యతిరేకిస్తున్నామన్నారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ ఈనెల 28న కర్నూలులో భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే ఈనెల 30వ తేదీ రాత్రి 9 నుంచి 9.15 గంటల వరకు ప్రతి ఇంట్లో లైట్లను ఆర్పివేసి నిరసనను వ్యక్తం చేద్దామన్నారు. ● వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీమోహన్ రెడ్డి మాట్లాడుతూ... పార్లమెంట్, రాజ్య సభలో తమ పార్టీ ముస్లింలకు మద్దతుగా నిలిచిందన్నారు. వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించిందన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు అహమ్మద్ అలీఖాన్ మాట్లాడుతూ.. ముస్లింలు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. కలసికట్టుగా పోరాడుదామన్నారు. మైనార్టీలైన క్రైస్తవులు మద్దతు ఇవ్వడం సంతోషం అన్నారు. ● పాస్టర్లు షాలేమ్ రాజు, బొరెల్లి శశికుమార్ మాట్లాడుతూ.. ముస్లింలు చేపట్టే ఆందోళన కార్యక్రమాలకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తామన్నారు. సమావేశంలో ఆర్ఆర్డీ సజీవరావు, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్, రెవరెండ్ అమ్రోజ్, విజయ్కుమార్, జహీంగీర్ అహమ్మద్, హమీదు, జాకీర్ అహమ్మద్, అన్వర్ బాషా పాల్గొన్నారు. -
ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
బొమ్మలసత్రం: నంద్యాల పట్టణానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ చిన్ని కృష్ణ శుక్రవారం గడ్డిమందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న చిన్ని కృష్ణ గత కొంత కాలంగా బాలాజీ కాంప్లెక్స్లోని ఓ అద్దె ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక చిన్నచెరువు సమీపంలో గడ్డిమందు సేవించి అపస్మారక స్థితిలో పడిపోయాడు. స్థానికులు గమనించి నంద్యాల జీజీహెచ్కు చికిత్స నిమిత్తం తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం శాంతిరామ్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆత్మహత్యకు కుటుంబ కలహాల లేక మరేదైన కారణమా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. పొగాకు దగ్ధం ● రూ.10 లక్షల ఆస్తి నష్టం పాములపాడు: ఇస్కాల గ్రామంలో శుక్రవారం ప్రమాదవశాత్తు పొగాకు పంట దగ్ధమైంది. గ్రామానికి చెందిన గుర్రం వెంకటేశ్వర్లు 30 క్వింటాళ్లు, సోమేశ్వరుడు 10 క్వింటాళ్లు, రాము 10 క్వింటాళ్లు, బన్నూరు శివ 10 క్వింటాళ్ల చొప్పున పొగాకు పంటను తోరణాలు కూర్చి ఆరు బయట ప్రాంతంలో ఆరబెట్టారు. కాగా ప్రమాదవశాత్తు నిప్పు అంటుకోవడంతో 60 క్వింటాళ్ల పొగాకు పంట దిగుబడి అగ్నికి ఆహుతి అయ్యింది. గమనించిన రైతులు వ్యవసాయ బావిలో నుంచి మోటార్ల ద్వారా నీటిని చల్లినప్పటికీ పంటను కాపాడుకోలేక పోయారు. ప్రస్తుతం దిగుబడులు అంతంత మాత్రమే ఉండడం గిట్టుబాటు ధర లేకపోవడం రైతులను కృంగదీస్తుంది. ఇలాంటి తరుణంలో ఈ విపత్తుతో సుమారు పది లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం సంభవించిందని రైతన్న లబోదిబోమని వాపోతున్నారు. ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి బాధిత రైతులను ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. గుండెపోటుతో గర్భిణి మృతి ఆత్మకూరు: కొట్టాల చెరువు గ్రామానికి చెందిన గర్భిణి కుడుముల అంకమ్మ(40) గుండెపోటుతో మృతి చెందింది. బైర్లూటి సాంఘిక సంక్షేమ గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో కమాటీగా పని చేస్తున్న అంకమ్మ పాఠశాలకు వేసవి సెలవులు కావడంతో సొంతూరు కొట్టాల చెరువుకు చేరుకుంది. ప్రస్తుతం ఆమె తొమ్మిదో నెల గర్భిణి. కాగా శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో కుటుంబీకులు ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలికి భర్త వలి, కుమారుడు దరగయ్య, కుమార్తె ధరణి ఉన్నారు. అంకమ్మ మృతి విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే స్పందించి మట్టి ఖర్చులకు రూ.25 వేలు అందించారు. అంకమ్మ కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని గిరిజన సంక్షేమ సంఘం నాయకులు జవహార్నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. పోలీసు బదిలీలకునేడు కౌన్సెలింగ్ కర్నూలు: పోలీసు శాఖలో ఒకే చోట ఐదేళ్లు పనిచేసిన వారికి స్థానచలనం కలగనుంది. కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ స్థాయి సిబ్బంది ఐదేళ్లు ఒకేచోట పనిచేసిన వారికి బదిలీ అయ్యే అవకాశముంది. సిబ్బంది బదిలీ కోసం శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 12 మంది ఏఎస్ఐలు, 24 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 118 మంది కానిస్టేబుళ్లు కలిపి మొత్తం 154 మందికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్కు హాజరు కావాల్సిందిగా బదిలీ జాబితాలో పేర్లున్న వారికి డీపీఓ నుంచి ఆదేశాలు వెళ్లాయి. -
ఓవరాల్ చాంపియన్ కర్నూలు బెటాలియన్
కర్నూలు: ఏపీఎస్పీ రేంజ్–2 స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో కర్నూలు రెండో బెటాలియన్ క్రీడాకారులు ఓవరాల్ ఛాంపియన్ను కై వసం చేసుకున్నారు. కర్నూలు ఏపీఎస్పీ రెండో బెటాలియన్లో కమాండెంట్ దీపిక పాటిల్ నేతృత్వంలో మూడు రోజుల పాటు పోటీలు నిర్వహించారు. కర్నూలుతో పాటు కడప, అనంతపురం, చిత్తూరు స్పెషల్ ఆర్మ్డ్ రిజర్వ్ ఆఫ్ సెంట్రల్ పోలీస్ లైన్ అంబర్పేట, హైదరాబాదు బెటాలియన్కు చెందిన పోలీసు క్రీడాకారులు స్పోర్ట్స్ మీట్లో పాల్గొన్నారు. బాస్కెట్బాల్ పోటీల్లో రెండో బెటాలియన్ మొదటి బహుమతి సాధించగా, 9వ బెటాలియన్ రన్నర్స్గా నిలిచారు. అలాగే కబడ్డీ పోటీ ల్లో రెండో బెటాలియన్ మొదటి బహుమతి సాధించగా, 9వ బెటాలియన్ క్రీడాకారులు రన్నర్స్గా నిలిచారు. వాలీబాల్ పోటీల్లో 14వ బెటాలియన్కు మొదటి బహుమతి దక్కగా రెండో బెటాలియన్ క్రీడాకారులు రన్నర్స్గా నిలిచారు. క్రికెట్ పోటీల్లో కూడా 14వ బెటాలియన్ మొదటి బహుమతి సాధించగా కర్నూలు రెండో బెటాలియన్ రన్నర్స్గా నిలిచింది. వ్యక్తిగత స్పోర్ట్స్ విభాగాల్లో జావెలిన్ త్రోలో 11వ బెటాలియన్ పీసీ ప్రదీప్ కుమార్ మొదటి బహుమతి, నరసింహ తృతీయ బహుమతి, 9వ బెటాలియన్ పీసీ గోపీనాథ్ ద్వితీయ బహుమతి కై వసం చేసుకున్నారు. అలాగే లాంగ్జంప్లో 11వ బెటాలియన్ పీసీ ప్రదీప్ కుమార్ మొదటి బహుమతి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ ద్వితీయ బహుమతి, ఎస్ఏఆర్సీపీఎల్ యూనిట్ పీసీ వెంకటేశ్వర్లు మూడో బహుమతి సా ధించారు. 800 మీటర్ల పరుగుపందెంలో రెండో బెటాలియన్ పీసీ నరేంద్ర మొదటి బహుమతి, 9వ బెటాలియన్ పీసీ వెంకయ్య రెండో బహుమతి, పీసీ అశోక్ మూడో బహుమతి కై వసం చేసుకున్నారు. హైజంప్లో 11వ బెటాలియన్ పీసీ ప్రదీప్ కుమార్ మొదటి బహుమతి, రిజర్వు ఇన్స్పెక్టర్ రామకృష్ణ, రెండో బహుమతి, ఎస్ఏఆర్సీపీఎల్ యూనిట్ వెంకటేశ్వర్లు మూడో బహుమతి సాధించారు. ఈ పోటీల్లో ఓవరాల్ చాంపియన్గా రెండో బెటాలియన్ నిలిచింది. డీఐజీ చేతుల మీదుగా బహుమతుల ప్రదానం.. ఏపీఎస్పీ రేంజ్–2 స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ముగింపు కార్యక్రమానికి శుక్రవారం సాయంత్రం కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, రెండో బెటాలియన్ కమాండెంట్ దీపిక పాటిల్ ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో రెండో బెటాలియన్ అదనపు కమాండెంట్ నాగేంద్రరావు, అసిస్టెంట్ కమాండెంట్లు మహబూబ్ బాషా, రవికిరణ్, వెంకటరమణ, సుధాకర్ రెడ్డి, రిజర్వు సబ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. ముగిసిన ఏపీఎస్పీ రేంజ్–2 స్పోర్ట్స్ మీట్ డీఐజీ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం -
పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో బీఈడీ మూడో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించారు. ‘ఆర్యూలో నిత్యం సమస్యల ‘పరీక్ష’’ శీర్షికతో సాక్షిలో శుక్రవారం ప్రచురితమైన కథనానికి వర్సిటీ అధికారులు స్పందించారు. ఈనెల 25వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు గడువును విధించగా 24వ తేదీ వరకు ఫీజు చెల్లింపుకు ఎన్ఆర్లో విద్యార్థుల పేర్లు రాలేదు. దీంతో ఈనెల 28వ తేదీ వరకు ఎలాంటి ఫైన్ లేకుండా ఫీజు చెల్లించేందుకు గడువును పొడిగించారు. రూ. 100 ఫైన్తో 29వ తేదీ, రూ.200 ఫైన్తో 30వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. ఈనెల 24వ తేదీ కర్నూలు, ఆదోనిలోని పరీక్ష కేంద్రాల్లో ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తూ పట్టు బడటంతో సంబంధిత పరీక్ష కేంద్రాల సీఎస్, అబ్జర్వర్, ఇన్విజిలేటర్లకు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లును వర్సిటీ వైస్ఛాన్సలర్ ప్రొఫెసర్ వి. వెంకట బసవరావు ఆదేశించారు. -
తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానని మోసం
కర్నూలు: తక్కువ ధరకు బంగారం ఇప్పించి రెట్టింపు ధరకు అమ్మి పెడతానని చెప్పి మోసానికి పాల్పడిన రంగు నగేష్ అలియాస్ నాగిరెడ్డిని పోలీసులు పక్కా ఆధారాలతో అరెస్టు చేసి కటకటాలకు పంపారు. తెలంగాణ రాష్ట్రం కేవీ రంగారెడ్డి జిల్లా విజయ నగర్ కాలనీ హయత్ నగర్లో రంగు నగేష్ నివాసం ఉండేవారు. హైదరాబాదు సరూర్ నగర్లో నివాసముంటున్న సంతోషి మాతకు మాయ మాటలు చెప్పారు. తక్కువ ధరకు బంగారం ఇప్పించి రెట్టింపు లాభం వచ్చేలా చేస్తానని నమ్మబలికి మోసం చేశాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పక్కా ఆధారాలతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి కర్నూలు డీఎస్పీ బాబుప్రసాద్ ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా శుక్రవారం రెండో పట్టణ పోలీస్స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించి డీఎస్పీ వివరాలు వెల్లడించారు. రూ.60 లక్షలు డబ్బులిస్తే కేజీ బంగారం కొని రూ.30 లక్షలు లాభంతో రూ.90 లక్షలకు అమ్మిస్తానని రంగు నగేష్ నమ్మించాడు. వచ్చిన లాభంలో తనకు కొద్దిపాటి సొమ్ము ఇస్తే చాలని చెప్పాడు. దీంతో సంతోషి మాత భర్త శ్రీశైలంతో కలసి కొన్ని రోజుల క్రితం సొంత ఇంటిని అమ్మగా వచ్చిన మొత్తం డబ్బులు రూ.46 లక్షలు తీసుకున్నారు. ఈనెల 19వ తేదీన ఉదయం హైదరాబాద్ నుంచి కారులో రంగు నగేష్ కలసి కర్నూలుకు వచ్చారు. కర్నూలులోని సాయిబాబా గుడి దగ్గర వారిని దించేసి బంగారు కొనేటప్పుడు వేరే వ్యక్తులు ఉండకూడదని నమ్మించి రంగు నగేష్ కారులో కర్నూలు బస్టాండ్ చేరుకున్నాడు. అక్కడ డ్రైవర్కు బాడుగ డబ్బులు ఇచ్చేసి హైదరాబాద్కు ఉడాయించాడు. ఎంత సేపటికీ తిరిగి రాకపోవడంతో మోసపోయినట్లు సంతోషి మాత దంపతులు గ్రహించి రెండో పట్టణ పోలీస్స్టేషన్లో అదే రోజు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నిందితుడు హైదరాబాదులో ఉన్నట్లు గుర్తించి పక్కా ఆధారాలతో అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. అతని వద్ద నుంచి రూ.45.91 లక్షలు నగదు స్వాధీనం చేసుకుని నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్కు ఆదేశించినట్లు డీఎస్పీ బాబుప్రసాద్ తెలిపారు. సీఐలు నాగరాజరావు, శేషయ్యతో పాటు క్రైం పార్టీ పోలీసులు సమావేశంలో పాల్గొన్నారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు రూ.45.91 లక్షల నగదు స్వాధీనం -
సార్.. కందులు కొనుగోలు చేయడం లేదు
కొత్తపల్లి: ‘కందుల కొనుగోలు నిర్వాహకుల నిర్లక్ష్యంతో దిగుబడిని అమ్ముకోలేక పోతున్నాం. రోజులు తరబడి నిరీక్షిస్తున్నా పట్టించుకోవడం లేదు’ అని రైతులు జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్కు మొర పెట్టుకున్నారు. దుద్యాల గ్రామంలోని కందుల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. కేంద్రం వద్ద కందు ల నాణ్యత, రైతుల ఆన్లైన్ వివరాల నమోదు, తుకా లు, క్యూఆర్ కోడ్ ట్యాగ్ పనితీరు, కందుల నాణ్యతను కొలిచే యంత్రం పనితీరులను క్షుణ్ణంగా పరిశీలించా రు. జేసీ వచ్చారనే సమాచారం తెలుసుకున్న రైతులు అక్కడికి చేరుకుని తమ సమస్యలు విన్నవించారు. ● ఎకరాకు ఐదు క్వింటాల కందులు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, పండించిన మొత్తం కందులను కొనుగోలు చేయాలని కోరారు. ● 20 రోజులైనా తన కందులను తీసుకోవడం లేదని రైతు నాగేశ్వరరావు జేసీకి మొరపెట్టుకున్నారు. అధికారులను అడిగితే తిప్పుకుంటున్నారన్నారు. ● ఈనెల 20వ తేదీతో కొనుగోలు గడువు ముగిసిందని సమయం పెంచి న్యాయం చేయాలన్నారు. ● నేషనల్ హైవే రహదారి నిర్మాణానికి మామిడి తోటలో ఉన్న సుమారు 22 మామిడి చెట్లు పోయాయని ఇంతవరకు పరిహారం అందలేదని ఓ మహిళ రైతు జేసీకి విన్నవించింది. ● కల్లాలకు ఆన్లైన్ సమస్య పరిష్కారం కావడం లేదని, పూర్వపు ఆస్తులు అమ్ముకునేందుకు పేర్లులేక ఇబ్బంది పడుతున్నామని రైతులు తెలిపారు. ● అనంతరం జేసీ మాట్లాడుతూ.. స్థానిక రెవెన్యూ అధికారులతో రైతుల సమస్యకు సమాధానం చెప్పాలని సమస్య ఏ స్థాయిలో ఉందో వెంటనే నాకు సమాచారం కావాలని రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ వెంట ఆత్మకూరు వ్యవసాయ సహాయ సంచాలకులు ఆంజనేయ, తహసీల్దార్ ఉమారాణి, ఎంపీడీఓ దాసరి మేరీ, ఎంపీపీ కుసుమలత, సర్పంచ్ శోభలత, మండల వ్యవసాయ అధికారి మహేష్ పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్కు సమస్యల వెల్లువ -
మాదక ద్రవ్యాల నియంత్రణకు చర్యలు
కర్నూలు(సెంట్రల్): మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నార్కోటిక్స్ కోఆర్డినేషన్(ఎన్సీఓఆర్డీ) సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మత్తు పదార్థాల వినియోగంతో కలిగే అనర్థాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. పొలాల్లో, అటవీ భూముల్లో గంజాయి సాగుపై నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ.. పట్టణాల శివారు ప్రాంతాల్లో ముళ్ల పొదలు, పాత భవనాలను తొలగించి విద్యుత్ దీపాలు వేయించాలన్నారు. పోలీసులతోపాటు 11 మంది జిల్లా అధికారులతో మాదకద్రవ్యాల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, మునిసిపల్ కమిషనర్ రవీంద్రబాబు, డీటీసీ శాంతకుమారి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సుధీర్కుమార్, డీఎంహెచ్ఓ శాంతి కళ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా -
కార్పొరేషన్లో బిల్లు బిల్లుకీ పర్సంటేజీ
● ఓ మంత్రి వద్ద పనిచేసే ఉద్యోగి, తెలుగు తమ్ముళ్ల దందా తోడు ● గగ్గోలు పెడుతున్న మున్సిపల్ కాంట్రాక్టర్లు ● కమిషనర్పై సీఎంకు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు ఫిర్యాదు ● రూ.60 కోట్ల బిల్లులకు ఇచ్చింది రూ.15 కోట్లే ● అదీ పర్సంటేజీలు ఇచ్చిన వారికే మంజూరు కర్నూలు(టౌన్): కర్నూలు నగరపాలక సంస్థలో కమీషన్ల దందా మితిమీరిపోయింది. కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించాలంటే 8 శాతం పర్సంటేజి ఇవ్వాల్సిందే. లేదంటే కార్యాలయం చుట్టూ తిరగాల్సిందే. వీరికి తోడు ఓ మంత్రి వద్ద పనిచేసే పీఏ స్థాయి ఉద్యోగి, కార్పొరేషన్లో పనిచేసే ఒకరిద్దరు తెలుగు తమ్ముళ్ల పైరవీలు సరేసరి. బిల్లుల క్లియరెన్స్లో వీరే మధ్యవర్తులు. ఆ పీఏ స్థాయి ఉద్యోగి సైతం మంత్రికి సంబంధించిన పనులైతే వెంటనే క్లియర్ అవుతాయి. జనరల్ ఫండ్ కింద చేసిన పనుల బిల్లులూ ఇవ్వడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. ‘ఏడాది అవుతుంది. మేము చేసిన అభివృద్ధి పనుల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. అప్పుల్లోకి వెళ్లిపోయాం. బిల్లులు క్లియర్ కావాలంటే 8 శాతం పర్సంటేజీ డిమాండ్ చేస్తున్నారు. అంత ఇచ్చుకోలేం. మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబుపై తగిన చర్యలు తీసుకోవాలి’ అంటూ కర్నూలు కార్పొరేషన్ కాంట్రాక్టర్ల వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు కలెక్టర్ నుంచి సీఎం వరకు అందరికీ ఫిర్యాదు చేశారు. కాంట్రాక్టర్లకు చుక్కలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.60 కోట్ల విలువైన పనుల బిల్లులు రాగా, అందులో దాదాపు రూ.15 కోట్ల వరకు నగరపాలక సంస్థ అధికారులు క్లియర్ చేశారు. వీటిలో అధిక శాతం అధికారుల పర్సంటేజీలు, ఇతరత్రా ముడుపులు ఇచ్చుకున్న వారికే బిల్లులు అందాయనే విమర్శలు ఉన్నాయి. కొంత మంది కాంట్రాక్టర్లు గట్టిగా మాట్లాడి రూ.2 కోట్ల వరకు బిల్లులు తీసుకున్నారు. ఇటీవల ప్రభుత్వం నుంచి మరో రూ.17 కోట్లు విడుదల చేశారు. దీంతో పైరవీలు, ఒత్తిళ్లు పెరిగాయి. అయినా ఇప్పటివరకు ఒక్క బిల్లు కూడా సీఎఫ్ఎంఎస్ ( కాంప్రెసీవ్ ఫైనాన్షియల్ మానటరింగ్ సిస్టమ్ ) నమోదు చేయలేదు. జీజీఎంపీ (గడప, గడపకు మన ప్రభుత్వం) బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. సకాలంలో బిల్లులు రాక, అప్పులు చేసి పనులు చేయడంతో ఆ ఒత్తిడి తాళలేక ఓ మున్సిపల్ కాంట్రాక్టరు గత నెలలో గుండెపోటుతో ఆసుపత్రి పాలయ్యాడు. పనుల టెండర్ దశ నుంచి అగ్రిమెంటు, ఆ తరువాత బిల్లుల చెల్లింపుల వరకు కాంట్రాక్టర్లకు సినిమా కనిపిస్తుంది. -
ప్రభుత్వాసుపత్రిలో రోగి అదృశ్యం
కర్నూలు (హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వాసుపత్రికి చికిత్స కోసం వచ్చిన ఓ రోగి కనిపించకుండా పోయాడు. కృష్ణగిరి మండలం బాపనదొడ్డికి చెందిన చిన్న ఆంజనేయులు (80)కు ఆయాసం ఉండటంతో కుమారుడు బీరప్ప బుధవారం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చాడు. తండ్రిని ఎమర్జెన్సీ వార్డు వద్దే ఉంచి స్కానింగ్ రిపోర్టు తీసుకునివచ్చే సరికి కనిపించకపోవడంతో ఆయన చుట్టు పక్కల గాలించాడు. కుటుంబ సభ్యులకు సమాచారమివ్వడంతో చెరుకులపాడు, బాపనదొడ్డి, చెట్లమల్లాపురం తదితర గ్రామాల్లో రాత్రి అంతా వెతికారు. చిన్న ఆంజనేయులు ఆచూకీ కానరాకపోవడంతో గురువారం ఉదయం కర్నూలులోని మూడో పట్టణ పోలీస్స్టేషన్లో తన తండ్రి కనిపించడం లేదని బీరప్ప ఫిర్యాదు చేశారు. తన తండ్రి ఆచూకీ తెలిసిన వారు 96664 96775, 70320 85182కు సమాచారం అందించాలని ఆయన కోరారు. ఏసీబీ కేసులో షరాఫ్ గోపాల్ ఉద్యోగం తొలగింపు కర్నూలు(సెంట్రల్): ప్రస్తుతం కర్నూలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో షరాఫ్గా పనిచేస్తున్న గోపాల్ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ జిల్లా రిజిస్ట్రార్ ఎం.చెన్నకేశవరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. 2022 ఏపిల్ర్ 27వ తేదీన కర్నూలు, కల్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏక కాలంలో ఏసీబీ దాడి చేసి కల్లూరులో 15 మంది డ్యాకుమెంట్ రైటర్లు, సిబ్బంది నుంచి రూ.55,660, కర్నూలులో 12 మంది డ్యాకుమెంట్రైటర్లు ఇతర ఉద్యోగుల నుంచి రూ.40,470 అనధికార నగదు ఏసీబీ స్వాధీనం చేసుకుంది. ఇందులో కల్లూరు అప్పటి సబ్ రిజిస్ట్రార్ అరుణ్కుమార్, కర్నూలులో షరాఫ్గా పనిచేస్తున్న గోపాల్లపై కేసులను ఏసీబీ నమోదు చేసింది. ఈ క్రమంలో షరాఫ్ గోపాల్పై అభియోగాలు వాస్తవమని తేలడంతో విధుల నుంచి తొలగించాలని డీఐజీని ఆదేశించింది. ఉపాధ్యాయులకు వైద్యపరీక్షలు కర్నూలు (హాస్పిటల్): బదిలీల నేపథ్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులకు గురువారం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని ధన్వంతరి హాల్లో వైద్యపరీక్షలు నిర్వహించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ వైద్య పరీక్షల్లో మొదటి రోజు 72 మందికి వైద్యులు పరీక్షించి నివేదికలు ఇచ్చారు. శుక్ర, శనివారాల్లో ధన్వంతరి హాలులో ఆర్థోపెడిక్ మినహా మిగిలిన విభాగాల వారు ఆయా విభాగాల్లోనే వైద్యపరీక్షలు నిర్వహించి నివేదికలు ఇవ్వాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. -
గ్రామీణాభివృద్ధిలో పంచాయతీరాజ్ కీలకం
● జిల్లా కలెక్టర్ రంజిత్బాషాకర్నూలు(అర్బన్): గ్రామీణాభివృద్ధి, స్థానిక పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తున్నదని జిల్లా కలెక్టర్ పీ రంజిత్బాషా అన్నారు. గురువారం జిల్లా పరిషత్ మినీ సమావేశ భవనంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 2025లో ఉన్న పంచాయతీరాజ్ వ్యవస్థకు 1947 స్వాతంత్య్రం వచ్చిన అనంతరం ఉన్న పరిస్థితికి చాలా వ్యత్యాసం ఉందన్నారు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ షెడ్యూల్లో 243 ఆర్టికల్ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను రూపొందిస్తూ చట్టం చేశారన్నారు. ఈ చట్టాన్ని రాజ్యసభ, లోక్సభతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో కూడా ఆమోదం చేసిన తరువాత 1993 ఏప్రెల్ 24వ తేదీన నుంచి అమల్లోకి వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలోనే పంచాయతీరాజ్ వ్యవస్థలో పర్యవేక్షణ బలోపేతం అయ్యిందన్నారు. పంచాయతీలకు చట్టపరమైన గుర్తింపు ఇవ్వడం, స్వయం ప్రతిపత్తి కల్పించడం వంటి సంస్కరణలు వచ్చాయన్నారు. ఫైనాన్స్ పరిధిలోకి రావడం, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా సక్రమంగా ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం రిజర్వేషన్, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం జరిగిందన్నారు. స్థానిక పాలనా వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించడంలో పీఆర్ సంస్థలు కీలకంగా వ్యవహరిస్తున్నాయన్నారు. నేషనల్ ఈ గవర్నెన్స్ అవార్డుకు పెరవలి ఎంపిక.. నేషనల్ ఈ గవర్నెన్స్ అవార్డుల కోసం దేశ వ్యాప్తంగా 1.40 లక్షల దరఖాస్తులు రాగా, ఇందులో ఆరు గ్రామ పంచాయతీలను ఎంపిక చేశారని కలెక్టర్ చెప్పారు. ఎంపికై న ఆరు గ్రామ పంచాయతీల్లో జిల్లాలోని మద్దికెర మండలం పెరవలి గ్రామ పంచాయతీ ఉండడం అభినందనీయమన్నారు. అలాగే ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ కింద జిల్లాలోని మద్దికెర, హొళగుంద, చిప్పగిరి మండలాలు ఎంపికయ్యాయన్నారు. ఇందులో మద్దికెర మండలం దక్షిణ భారత దేశంలో ప్రథమ స్థానంలో ఉందని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం రూ.1.50 కోట్లను మంజూ రు చేసిందన్నారు. కార్యక్రమంలో పీఆర్, ఆర్డబ్ల్యూఎస్ పర్యవేక్షక ఇంజనీర్లు వీ రామచంద్రారెడ్డి, బీ నాగేశ్వరరావు, కర్నూలు డివిజినల్ పంచాయతీ అధికారిణి టీ లక్ష్మి, పీఆర్ ఈఈ మద్దన్న, పీఏ టు ఎస్ఈ బండారు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
మొక్క జొన్న పంట దగ్ధం
పాణ్యం: మండల కేంద్రమైన పాణ్యంలోని డొంగు సమీపంలో చేతికొచ్చిన మొక్కజొన్న పంట అగ్ని ప్రమాదంలో కాలి బూడిదైంది. గ్రామంలోని రైతు వై.వి లింగమయ్యకు చెందిన 3 ఎకరాలు, లింగాల సుబ్రహ్మణ్యంకు చెందిన 3 ఎకరాలు, గుడిపాటి మద్దిలేటికి చెందిన 1.50 ఎకరాల పంట దగ్ధమైంది. పొలంలో మంటలు వ్యాపించడంతో గమనించిన రైతులు నంద్యాల అగ్నిమాపక స్టేషన్కు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. మరో రోజుల్లో మూడు రోజుల్లో పంట కోత చేపట్టాల్సిన సమయంలో ప్రమాదం జరగడంతో రైతులు నష్టపోయారు. బోర్ వైర్ నుంచి మంటలు చేలరేగి పంటలకు వ్యాపించినట్లు ప్రాథమికంగా తెలిసింది. ఎకరానికి రూ. 35వేలకు వరకు పెట్టుబడులు పెట్టామని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ నరేంద్రనాథ్రెడ్డి, ఆర్ఐ రాము, వ్యవసాయ అధికారులు దగ్ధమైన పంటను పరిశీలించారు. -
ప్రభుత్వాసుపత్రిలో నాగుపాము కలకలం
ఎమ్మిగనూరురూరల్: స్థానిక ప్రభుత్వాసుపత్రిలోని పిల్లల వార్డులో గురువారం నాగుపాము కలకలం సృష్టించింది. పిల్లల వార్డులో పామును గుర్తించిన తల్లులు కేకలు వేయటంతో అక్కడ ఉన్న బంధువులు వచ్చి పామును కర్రలతో వార్డు నుంచి బయటకు వెళ్లేలా చేశారు. అనంతరం బయటకు వచ్చిన పామును చంపటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గతంలో చాలా సార్లు పాములు ఆసుపత్రిలో వచ్చిన సంఘటనలు ఉన్నాయి. అసుపత్రి అవరణలో అపరిశుభ్రంగా ఉండటంతో పాములు వార్డుల్లోకి వస్తున్నాయని రోగులు వాపోతున్నారు. శ్రీశైలం ఘాట్లో అదుపుతప్పిన బస్సు ● డ్రైవర్కు తీవ్ర గాయాలు ● 20 మంది ప్రయాణికులకు స్వల్పగాయాలు శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం ఘాట్ రోడ్డులో గురువారం ఉదయం ఓ ప్రైవేటు బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపుతప్పి కొండచరియను ఢీ కొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు తీవ్ర గాయాలు, 20 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా సిరిగుప్ప ప్రాంతానికి చెందిన 40 మంది భక్తులు తీర్ధయాత్రలకు బయలుదేరారు. గురువారం ఉదయం 8 గంటల సమయంలో చిన్నారుట్ల ఘాట్ రోడ్డులో బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో డ్రైవర్ బస్సు లోయలో పడకుండా పక్కనే ఉన్న కొండ చరియలను ఢీ కొడ్డాడు. ప్రమాదంలో బస్సు డ్రైవర్ ఫయాజ్ (28) తీవ్ర గాయాలయ్యాయి. 20 మంది భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ ఫయాజ్ను మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. ప్రకాశం జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అహోబిలం.. ‘వసంత’ వైభవం
ఆళ్లగడ్డ: దిగువ అహోబిలంలో వసంతోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. వసంత రుతువులో శ్రీ లక్ష్మీనరసింహస్వామికి జరిగే ఈ ఉత్సవానికి వసంతోత్సవం అని పేరు. ఎండ వేడి నుంచి స్వామివారు ఉపశమనం పొందేందుకు జరిపే ఉత్సవం కావడంతో ఉపశమనోత్సవం అని కూడా అంటారు. ఉత్సవంలో సుగంధాన్ని వెదజల్లే పుష్పాలతో పాటు పలురకాల మధురఫలాలను స్వామికి నివేదిస్తారు. వేడుకల కోసం దేవాలయం ఎదరుగా భాష్యకార మండపంలో ఆకర్షణీయంగా మండపాన్ని తీర్చిదిద్దారు. అలాగే పలురకాల వృక్షాల ప్రతిరూపాలతో నల్లమల అడవిని తలపించేలా మండపాన్ని తీర్చిదిద్దారు. గురువారం ఉదయం నిత్య పూజలు అనంతరం యాగశాలకు చేరుకున్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వాములను కొలువుంచారు. ఆస్థాన విద్వాంసుల మంగళ వాయిద్యాలు, అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య తిరుమంజనం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
నేడు మార్కెట్యార్డుకు సెలవు
ఆదోని అర్బన్: జమ్మూ కశ్మీర్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని నిరసిస్తూ శుక్రవారం ఆదోని వ్యవసాయ మార్కెట్యార్డుకు సెలవు ఇవ్వాలని కమీషన్ ఏజెంట్లు, గుమస్తా, మర్చంట్ అసోసియేషన్ నాయకులు గురువారం యార్డు అసిస్టెంట్ సెక్రటరీ శాంతకుమార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు రాజాగౌడ్, లక్ష్మన్న మాట్లాడారు. ముస్లిం దేశాల్లో హిందువులకు రక్షణలేదని, హిందువులున్న దేశంలో కూడా హిందువులకు రక్షణ లేకపోవడం ఘోరమన్నారు. జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ శుక్రవారం సెలవు ప్రకటించాలని కోరారు. ఇందుకు యార్డు అధికారులు అంగీకరించారు.ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీగా డాక్టర్ పి.చంద్రశేఖర్కర్నూలు(హాస్పిటల్): డాక్టర్ ఎన్టిఆర్ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్గా కర్నూలుకు చెందిన ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ పి.చంద్రశేఖర్ నియమితులయ్యారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు గురువారం జీఓ విడుదల చేశారు. ఈ పదవిలో ఆయన మూడేళ్ల పాటు కొనసాగుతారు. ఆయన 1960 సంవత్సరం ఆగస్టు 14న జిడి.లక్ష్మణదాస్, జి.సావిత్రమ్మలకు కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామంలో జన్మించారు. తండ్రి జిడీ. లక్ష్మణదాస్ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేశారు. డాక్టర్ పి.చంద్రశేఖర్ కర్నూలు మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్గా 38 ఏళ్ల పాటు పనిచేసి పదవీ విరమణ చెందారు. అనంతరం ఆయన కార్డియాలజి విభాగంలోనే తిరిగి ప్రొఫెసర్గా నియమితులయ్యారు.కానిస్టేబుల్ అభ్యర్థులకు జూన్ 1న రాత పరీక్షకర్నూలు: కానిస్టేబుల్ అభ్యర్థులకు జూన్ 1వ తేదీన తుది రాత పరీక్ష నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు నియామక మండలి ప్రకటన విడుదల చేసింది. పోలీస్ కానిస్టేబుల్, సివిల్, ఏపీఎస్పీ విభాగాల్లో పోస్టులకు సంబంధించి ప్రాథమిక రాత పరీక్ష 2023 జనవరి 22న జరిగింది. అర్హత సాధించిన వారికి 2024 డిసెంబర్ 30 నుంచి 2025 ఫిబ్రవరి 1 వరకు కర్నూలు ఏపీఎస్పీ రెండో పటాలం మైదానంలో దేహదారుఢ్య పరీక్షలు పూర్తి చేశారు. ఇందులో అర్హత సాధించిన వారందరికీ జూన్ 1న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. మరిన్ని వివరాలకు htt pr://rprb.ap.gov.inను సందర్శించాలని పేర్కొన్నారు.ప్రధానోపాధ్యాయురాలు సర్వీస్ నుంచి తొలగింపుకర్నూలు సిటీ: కర్నూలు నగరంలోని బి.క్యాంపు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు డి.శారదాదేవిని సర్వీసు నుంచి తొలగిస్తూ ఆర్జేడీ శామ్యూల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ పనిచేస్తున్న ఆమెను అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ కింద అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు బదిలీ చేశారు. గతంలో కర్నూలులో పని చేసే సమయంలో జరిగిన కొన్ని వివాదాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే శారదాదేవి అక్కడ విధుల్లో చేరకపోవడంతో సర్వీసు నుంచి తొలగించారు.తనయుడు ఫెయిల్ అయ్యాడని తల్లి ఆత్మహత్యకర్నూలు: పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో కుమారుడు భరత్బాబు ఫెయిల్ అయ్యాడనే మనస్థాపంతో తల్లి బెజవాడ లక్ష్మీజ్యోతి (39) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రవి, లక్ష్మీజ్యోతి దంపతులకు ఇద్దరు పిల్లలు సంతానం కాగా మొదటి కుమారుడు భరత్ బాబు పదవ తరగతి పరీక్షల్లో రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు. బుధవారం ఫలితాలు వెలువడగా రాత్రి తల్లి లక్ష్మీజ్యోతి కర్నూలు నగరంలోని ఇంట్లోనే చీరతో ఉరేసుకుంది. ఆమె భర్త గుర్తించి ఉరి నుంచి తప్పించి ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి తల్లి రేపల్లె సుగుణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెండో పట్టణ ఎస్ఐ మల్లికార్జున కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సాగు పెరిగి.. నష్టాలు మిగిలి
ఉమ్మడి జిల్లాలో పొగాకు సాగు లేని మండలం లేదంటే అతిశయోక్తి కాదు. 10 ఎకరాల నుంచి 100 ఎకరాలు సాగు చేసిన రైతులు ఉన్నారు. ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు కౌలుకు తీసుకొని మరీ సాగు చేశారు. 2023–24లో రికార్డు స్థాయి ధరలు లభించడంతో ఈ ఏడాది రైతులు సాగుకు రెండు జిల్లాల్లో పోటీపడ్డారు. కంపెనీలు కూడా అదేవిధంగా ప్రోత్సహించాయి. 2024–25లో కర్నూలు జిల్లాలో 36,471 ఎకరాలు, నంద్యాల జిల్లాలో 30,865 ఎకరాల్లో పొగాకు సాగయింది. 2023–24తో పోలిస్తే 48,959 ఎకరాల్లో అదనంగా సాగు చేయడం విశేషం. విత్తనం మొదలు పొగాకును కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లే వరకు ఎకరాకు రూ.60 వేల వరకు పెట్టుబడి పెడుతున్నారు. ఎకరాకు సగటున 4 క్వింటాళ్ల వరకు మాత్రమే దిగుబడి వచ్చింది. కంపెనీలు అరకొరగా కొనుగోలు చేసి చేతులెత్తేయడంతో రైతులు రోడ్డెక్కుతున్నారు. -
రైతుల పాలిట ‘పగా’కు!
● ఉమ్మడి జిల్లాలో 67,336 ఎకరాల్లో పొగాకు సాగు ● 50వేల టన్నుల వరకు దిగుబడి ● ఇప్పటి వరకు కొనుగోలు 20 వేల టన్నులే.. ● పత్తాలేకుండా పోయిన కంపెనీల ప్రతినిధులు ● రైతుల కష్టాన్ని పట్టించుకోని ప్రభుత్వం ● అకాల వర్షాలతో దిక్కుతోచని రైతులు -
ఆర్యూలో నిత్యం సమస్యల ‘పరీక్ష’
కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ పరీక్షల విభాగంలో గందరగోళం వీడటం లేదు. నిత్యం ఏదో ఒక సమస్యతో నెట్టుకురావడం తప్ప పరిష్కార మార్గాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఈనెల 23న బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే రెండు కళాశాలల విద్యార్థులకు పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు కూడా హాల్టికెట్లు రాకపోవడంతో ఆందోళన చెందారు. దీంతో పాటు విద్యార్థుల వివరాలతో కూడిన ప్రింటెండ్ ఓఎమ్మార్ షీట్లు ఏర్పాటు చేయలేకపాయారు. డోన్లో ఓ పరీక్ష కేంద్రం, కర్నూలులో ఓ పరీక్ష కేంద్రంలో సుమారు 90 మంది విద్యార్థులతో బఫర్ ఓమ్మార్ షీట్లలో వివరాలు నమోదు చేయించి పరీక్ష రాయించారు. వివరాలు నమోదు చేసే సమయంలో పొరపాటు చేస్తే ఆ విద్యార్థి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. గురువారం జరిగిన పరీక్షకు కర్నూలు ఉస్మానియా కళాశాల కేంద్రంలో శాంతినికేతన్ కళాశాలకు చెందిన ఓ విద్యార్థి స్థానంలో మరో విద్యార్థి పరీక్ష రాస్తూ పట్టుబడటం పర్యవేక్షణ లోపమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిరాక్స్ ప్రశ్నపత్రాలు రెండు పరీక్ష కేంద్రాల్లో ప్రింటెండ్ కాకుండా జిరాక్స్ ప్రశ్నపత్రాలతో పరీక్షలు రాయిస్తున్నారు. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి అర గంట ముందు ప్రశ్నపత్రాల షీల్డ్బండిల్ను తెరుస్తారు. అందులోంచి ప్రశ్నపత్రాలను తీసుకొని వాటిని జిరాక్స్ తీయించి పరీక్షలు రాయిస్తున్నారు. అదే సమయంలో ప్రశ్నా పత్రం లీక్ అయినా, కరెంట్ పోయినా, ప్రింటర్ పనిచేయకపోయినా ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వెబ్సైట్లో కానరాని విద్యార్థుల పేర్లు 2023–25 విద్యా సంవత్సరం బీఈడీ మూడో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ఫీజును శుక్రవారంలోగా చెల్లించేందుకు వర్సిటీ అధికారులు గడువు విధించారు. అయితే గురవారం అర్ధరాత్రి వరకు ఫీజు చెల్లింపుకు ఎన్ఆర్లో విద్యార్థుల పేర్లు పెట్టలేదు. దీంతో ఒక్కరోజులోనే విద్యార్థులకు ఎప్పుడు సమాచారం ఇవ్వాలి, ఫీజు ఎప్పుడు చెల్లించాలని కళాశాలల యాజమాన్యాలు తలలు పట్టుకుంటున్నాయి. ఏజెన్సీ మారడంతో సమస్యలు పరీక్షల నిర్వహణకు సంబంధించి ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పరీక్ష నిర్వహణ ఏజెన్సీ మారడంతో కొన్ని సాంకేతిక సమస్యలు ఉత్పన్నవుతున్నాయి. త్వరలోనే పరిష్కరిస్తాం. వీసీతో చర్చించి బీఈడీ మూడో సెమిస్టర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంచేందుకు నిర్ణయం తీసుకుంటాం. ఒక విద్యార్థి స్థానంలో మరో విద్యార్థి పరీక్ష రాస్తూ దొరకడంతో అతనిపై పోలీస్లకు ఫిర్యాదు చేశాం. – డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్లు, సీఈ, ఆర్యూ గురువారం ఒక విద్యార్థికి బదులు మరో విద్యార్థి పరీక్ష రాస్తుండగా గుర్తింపు బీఈడీ మూడో సెమిస్టర్ పరీక్ష ఫీజు చెల్లింపు నేటితో గడువు పూర్తి ఫీజు చెల్లింపునకు వెబ్సైట్లో కానరాని విద్యార్థుల పేర్లు -
టీడీపీ నేత మమ్మల్ని వేధిస్తున్నాడు
● పార్టీ జిల్లా కార్యాలయం ఎదుట పత్తికొండ మహిళల ఆందోళన కర్నూలు(రూరల్): పత్తికొండ షాడో ఎమ్మెల్యేగా చెలమణి అవుతున్న సాంబశివారెడ్డి తమను వేధిస్తున్నాడని అతనిపై పార్టీ హైకమాండ్ చర్యలు తీసుకోవాలని బాధిత మహిళలు ఆందోళనకు దిగారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ మహిళ ఐక్య వేదిక వ్యవస్థాపకురాలు పట్నం రాజేశ్వరి, రాష్ట్ర అధ్యక్షరాలు నంది విజయలక్ష్మి ఆధ్వర్యంలో వారు బుధవారం నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా పార్టీలో ఉన్న తమను కనీసం గౌరవం ఇవ్వకపోగా ప్రతి పనిలో అడ్డు తగులుతున్నాడని పత్తికొండ రామచంద్రరెడ్డినగర్, కొండగేరికి చెందిన పార్వతీబాయి, లలితాబాయి, కురువ లలిత, కురువ వరలక్ష్మి కుటుంబాలు వాపోయాయి. పొదుపు సంఘాల్లో జోక్యం చేసుకుంటూ విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్గా తుగ్గలి మహిళను తీసుకొచ్చి పెట్టారన్నారు. ఈ అన్యాయంపై అధికారులకు కలిసి విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఈ ఆందోళనలో పొదుపు సంఘం సభ్యులు పాల్గొన్నారు. -
పల్లె ముంగిట్లోనే ‘పాలన’
వైఎస్సార్సీపీ హయాంలో విప్లవాత్మక సంస్కరణలు ● దేశంలోనే ఆదర్శంగా సచివాలయ వ్యవస్థ ● ఆర్డీఓల తరహాలో డీఎల్డీఓ పోస్టులు ● నెరవేరిన ఎంపీడీఓల దశాబ్దాల కల ● జిల్లా అధికారులుగా పదోన్నతి పొందిన ఎంపీడీఓలు ● పర్యవేక్షకులను ఏఓలుగా గుర్తించి గెజిటెడ్ హోదా ● సచివాలయ ఉద్యోగులకు పేస్కేల్ అమలు ● నేడు పంచాయతీరాజ్ దినోత్సవం కర్నూలు(అర్బన్): వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల వందల సంఖ్యలో ఉద్యోగులకు పదోన్నతుల పరంపర ప్రారంభమైంది. ముఖ్యంగా ఉద్యోగంలో చేరినప్పటి నుంచి పదవీ విరమణ అయ్యేంతవరకు ఎలాంటి పదోన్నతులు లేకుండా ఉన్న ఎంపీడీఓలకు పదోన్నతులు కల్పించి గత ప్రభుత్వం చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. 2022 ఆగష్టు నెలలో అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల జిల్లాలో అర్హులైన దాదాపు 17 మంది ఎంపీడీఓలు వివిధ ప్రభుత్వ శాఖల్లో జిల్లా అధికారులుగా పదోన్నతి పొందారు. వీరి కంటే ముందు ( 2020 అక్టోబర్ నెలలో ) రెవెన్యూ శాఖలో ఉన్న విధంగానే ( ఆర్డీఓ తరహాలో ) పంచాయతీరాజ్ శాఖలో కూడా డివిజన్ స్థాయిలో డీఎల్డీఓ పో స్టును క్రియేట్ చేసి అర్హులకు పదోన్నతులు కల్పించారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి జిల్లాకు ముగ్గురు డీఎల్డీఓలు వచ్చారు. ఎంపీడీఓలకు పదోన్నతులు ప్రారంభం కాగానే, క్షేత్ర స్థాయి (ఆఫీస్ సబార్డినేట్) నుంచి పదోన్నతుల ప్రక్రియ ఊపందుకుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో అర్హత కలిగిన 17 మంది ఎంపీడీఓలు జిల్లా స్థాయి అధికారులుగా పదోన్నతిపై వెళ్లగా, వారి స్థానంలో 14 మంది ఏఓ, 13 మంది ఈఓఆర్డీలకు 2023 మే నెలలో ఎంపీడీఓలుగా పదోన్నతి కల్పించారు. వీరి స్థానంలో 9 మంది సీనియర్ అసిస్టెంట్లు, 15 మంది గ్రేడ్–1 పంచాయతీ కార్యదర్శులకు ఈఓఆర్డీలుగా పదోన్నతి లభించింది. ఈ నేపథ్యంలోనే సీనియర్, జూనియర్ సహాయకులు, టైపిస్టులు, రికార్డు అసిస్టెంట్లకు వారి అర్హతలను బట్టి పదోన్నతులు దక్కాయి. పర్యవేక్షకులను ఏఓలుగా గెజిటెడ్ హోదా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన వివిధ కార్యాలయాల్లో (ఎంపీడీఓ, జెడ్పీ, పీఆర్, ఆర్డబ్ల్యూఎస్) పర్యవేక్షకులుగా(సూపరింటెండెంట్ ) ఉన్న వారిని పరిపాలనాధికారులుగా (ఏఓ)లుగా గుర్తించారు. వీరికి గెజిటెడ్ హోదా కల్పించిన ఘనత గత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికే దక్కింది. దేశానికే తలమానికంగా సచివాలయ వ్యవస్థ వైఎస్సార్పీపీ పాలనలో ఏర్పాటైన సచివాలయ వ్యవస్థ ద్వారా ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 10వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మొత్తం 1188 గ్రామ/వార్డు సచివాలయాలు ఉండగా, వీటిలో కర్నూలు జిల్లాలో 465 గ్రామ సచివాలయాలు, 207 వార్డు సచివాలయాలు ఏర్పాటయ్యాయి. నంద్యాల జిల్లాలో 420 గ్రామ సచివాలయాలు, 96 వార్డు సచివాలయాలు ఉన్నాయి. సచివాలయాల్లో మొత్తం మంజూరైన పోస్టులు 9,878 కాగా, 8,630 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరిలో రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకోవడంతో పాటు డిపార్టుమెంటల్ టెస్ట్ ఉత్తీర్ణులైన 7,466 మంది ఉద్యోగుల ప్రొబేషన్ ముందుగా డిక్లేర్ కాగా, మిగిలిన వారికి విడతల వారీగా డిక్లేర్ చేశారు. ప్రొబేషన్ డిక్లేర్ కావడంతో పే స్కేల్ను కూడా అమలు చేశారు. ఉద్యోగంలో చేరిన సమయంలో నెల జీతం రూ.15 వేలు ఉండగా, ప్రస్తుతం గ్రాస్గా ప్రతి సచివాలయ ఉద్యోగి దాదాపు నెలకు రూ.30 వేల వరకు డ్రా చేస్తున్నారు. అలాగే గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శులు నెలకు రూ.32 వేల వరకు డ్రా చేస్తున్నారు. జాతిపిత మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసిన ఘనత గత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికే దక్కుతుంది. పాలనను ప్రజలకు అత్యంత చేరువ చేసేందుకు ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ దేశానికే తలమానికంగా నిలిచిందనడలో అతిశయోక్తి లేదు. ప్రభుత్వ పథకాలను ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా పారదర్శకంగా అందించేందుకు ఏర్పాటు చేసిన వలంటీర్ వ్యవస్థను వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఆదర్శంగా తీసుకున్నాయి. ప్రభుత్వ పాలనలో అత్యంత కీలకమైన పంచాయతీరాజ్ శాఖలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడంతో అన్ని విభాగాల ఉద్యోగులకు న్యాయం జరిగింది. జిల్లా అధికారులుగా ఎంపీడీఓలు గత ప్రభుత్వం పదోన్నతులు కల్పించడం వల్ల అనేక మంది ఎంపీడీఓలు వివిధ ప్రభుత్వ శాఖల్లో జిల్లా అధికారులయ్యారు. పరిషత్ సీఈఓ, డిప్యూటీ సీఈఓ, జిల్లా పంచాయతీ అధికారి, డ్వామా, డీఆర్డీఏ, మెప్మా, హౌసింగ్ శాఖల్లో పీడీలుగా, పలు శాఖల్లో కీలకమైన పోస్టుల్లో పదోన్నతి పొందారు -
కుక్కను తప్పించబోయి..
పత్తికొండ రూరల్: పత్తికొండ–కర్నూలు రోడ్డులో అడ్డు వచ్చిన కుక్కను తప్పించబోయి బుధవారం కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. సిమెంట్నగర్కు చెందిన భానుప్రకాశ్, శంకరమ్మ దంపతులు, ఇద్దరు పిల్లలు కలిసి మద్దికెరలోని మామ మనవరాలి నామకరణ మహోత్సవానికి కర్నూలు నుంచి కారులో బయల్దేరారు. పత్తికొండ సమీపంలో ప్రధాన రోడ్డుకు అడ్డంగా కుక్క రావడంతో దాన్ని తప్పించబోగా కారు అదుపుతప్పి రోడ్డు పక్కన చెట్లలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారందరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. -
దేశ సమైక్యతను దెబ్బతీసే కుట్ర
● కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ కర్నూలు (టౌన్): దేశ సమైక్యతను దెబ్బతీసేందుకే ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారని, వారి కుట్రలను సమర్థవంతంగా తిప్పి కొట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ పోలిటికల్ ఆడ్వైజరీ కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. పర్యాటక ప్రాంతమైన జమ్మూ కశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని బుధవారం ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. 26 మంది అమాయకులు ప్రా ణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఉగ్రమూకల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలన్నారు. మృతుల కుటుంబాలకు వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ ప్రగాఢ సానుభూతి తెలుపుతుందని, కేంద్ర ప్రభుత్వం వారికిఅన్ని విధాలుగా అండగా నిలబడాలని కోరారు. మంగళగిరికి ఎంపీడీఓలు, స్థానిక ప్రజా ప్రతినిధులు కర్నూలు(అర్బన్): జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఈ నెల 24న ( నేడు ) మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో రాష్ట్ర స్థాయి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ జి.నాసరరెడ్డి తెలిపారు. బుధవారం జెడ్పీలోని తన చాంబర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రస్థాయి కార్యక్రమానికి తనతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ఎంపీడీఓలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు హజరవుతున్నట్లు వెల్లడించారు. గనులపై మైనింగ్ అధికారుల దాడులు కొలిమిగుండ్ల: బెలుం–బెలుం శింగవరం గ్రామా ల మధ్యలో ఉన్న నాపరాతి గనులపై బుధవారం భూగర్భ గనుల శాఖ అధికారుల బృందం దాడులు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మైనింగ్ చేస్తున్నారనే కారణంతో స్థానిక పోలీసులతో కలిసి మైనింగ్ అధికారులు ఈ దాడులు చేశారు. ఎంత మేర గనుల తవ్వకా లు చేశారనే వాటిపై కొలతలు సేకరించారు. నాపరాళ్ల వెలికి తీసేందుకు ఉపయోగించే ఆరు కోత మిషన్లతో పాటు ప్రొక్లెయినర్, ట్రిప్పర్ను స్వాధీ నం చేసుకొని పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉంచారు. అధికారులు దాడులకు వచ్చా రని తెలుసుకున్న చుట్టు పక్కల గనుల యజమానులు, కూలీలు అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లి పోయారు. ఏసీబీ డీఎస్పీగా సోమన్న కర్నూలు: కర్నూలు రేంజ్ ఏసీబీ డీఎస్పీగా సోమన్న నియమితులయ్యారు. సార్వత్రిక ఎన్నికల ముందు ఇక్కడ డీఎస్పీగా ఉన్న వెంకటాద్రి చిత్తూరు స్పెషల్ బ్రాంచ్కు బదిలీ అయ్యారు. అప్పటి నుంచి డీఎస్పీ స్థానం ఖాళీగా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 11 నెలల తర్వాత డీఎస్పీ పోస్టును భర్తీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. అనంతపురం జిల్లాకు చెందిన సోమన్న 1991లో ఎస్ఐ హోదాలో పోలీసు శాఖలో చేరి కర్నూలు రేంజ్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఎస్ఐగా, సీఐగా సేవలందించారు. కొంతకాలం పాటు ఆదోని డీఎస్పీగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం విజయవాడ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్లో పనిచేస్తున్న ఈయన కర్నూలుకు నియమితులయ్యారు. అయితే మరో ఆరు మాసాల పాటు అటాచ్మెంట్ కింద సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్లోనే విధులు నిర్వహిస్తూ కర్నూలు పర్యవేక్షణ బాధ్యతలు కూడా చూసుకునేలా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రెండు సీఐ పోస్టులు ఖాళీ కర్నూలు రేంజ్ ఏసీబీ విభాగంలో ప్రస్తుతం క్రిష్ణారెడ్డి, క్రిష్ణయ్య, రాజ ప్రభాకర్, శ్రీనివాసులు సీఐలుగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఇంతియాజ్, వంశీనాథ్, ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లడంతో రెండు సీఐ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఖాళీ సీఐ పోస్టులను కూడా భర్తీ చేసి ఏసీబీ విభాగాన్ని పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
ఏపీఎస్పీ బెటాలియన్లో రేంజ్–2 స్పోర్ట్స్ మీట్ ప్రారంభం
కర్నూలు : రాష్ట్ర విభజన తర్వాత కర్నూలు ఏపీఎస్పీ రెండవ బెటాలియన్లో రేంజ్–2 స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్– 2025 మొదటిసారిగా ప్రారంభమైంది. బెటాలియన్ కమాండెంట్ దీపిక పాటిల్ ముఖ్య అతిథిగా హాజరై పరేడ్ గ్రౌండ్లో క్రీడాపోటీలను ప్రారంభించారు. ఈనెల 25వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. కర్నూలుతో పాటు కడప, అనంతపురం, చిత్తూరుతో పాటు స్పెషల్ ఆర్మ్డ్ రిజర్వ్ ఆఫ్ సెంట్రల్ పోలీస్ లైన్, అంబర్పేట, హైదరాబాదు (ఎస్ఏఆర్సీపీఎల్) బెటాలియన్స్కు చెందిన పోలీసు క్రీడాకారులు స్పోర్ట్స్ మీట్లో పాల్గొన్నారు. బుధవారం ప్రారంభ రోజు జావెలిన్ త్రో, లాంగ్జంప్, 800 మీటర్ల పరుగు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజయం సాధించిన వివిధ పటాలాలకు చెందిన క్రీడాకారులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు కమాండెంట్ అందజేశారు. జావెలిన్ త్రోలో 11వ బెటాలియన్కు చెందిన పీసీ యు.ప్రదీప్ కుమార్ మొదటి బహుమతి కై వసం చేసుకోగా 9వ బెటాలియన్కు చెందిన పీసీ గోపీనాథ్ రెండో బహుమతి, 11వ బెటాలియన్కు చెందిన నరసింహ మూడో బహుమతి దక్కించుకున్నారు. లాంగ్జంప్లో 11వ బెటాలియన్ పీసీ ప్రదీప్ కుమార్ మొదటి బహుమతి, రిజర్వు ఇన్స్పెక్టర్ కె.రామకృష్ణ రెండో బహుమతి, ఎస్ఏఆర్సీపీఎల్ యూనిట్ పీసీ వెంకటేశ్వర్లు మూడో బహుమతి గెలుచుకున్నారు. అలాగే 800 మీటర్ల పరుగుపందెంలో రెండో బెటాలియన్ పీసీ నరేంద్ర మొదటి బహుమతి, 9వ బెటాలియన్ పీసీ వెంకయ్య రెండో బహుమతి, పీసీ అశోక్ మూడో బహుమతి సాధించారు. కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ నాగేంద్ర రావు, అసిస్టెంట్ కమాండెంట్లు మహబూబ్ బాషా, రవికిరణ్, వెంకటరమణ, సుధాకర్రెడ్డి, రిజర్వు ఇన్స్పెక్టర్లు, రిజర్వు సబ్ ఇన్స్పెక్టర్లు, మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారి జరుగుతున్న క్రీడాపోటీలు -
ట్రాన్స్జెండర్ల సమస్యల పరిష్కారానికి కృషి
కర్నూలు(అర్బన్): జిల్లాలో ట్రాన్స్జెండర్లు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి తెలిపారు. బుధవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు/జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ది ఆదేశాల మేరకు స్థానిక న్యాయ సేవా సదన్లో ట్రాన్స్జెండర్ల హక్కులపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ట్రాన్స్జెండర్లు తమకు గుర్తింపు కార్డులు, రేషన్కార్డులు లేని కారణంగా పింఛన్లు రావడం లేదని జడ్జి దృష్టికి తీసుకొచ్చారు. ఇందుకు ఆయన స్పందిస్తూ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ట్రాన్స్జెండర్లు అందుబాటులోని పథకాలను తెలుసుకొని ప్రయోజనం పొందాలన్నారు. టీజీఐడీ నేషనల్ పోర్టల్లో దరఖాస్తు చేసుకుంటే గుర్తింపు కార్డులు వస్తాయన్నారు. దివ్యాంగులు, హిజ్రాలు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయిస్ ఫాతిమా మాట్లాడుతూ ట్రాన్స్జెండర్స్కు అనేక ప్రభుత్వ పథకాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్యానెల్ న్యాయవాది హేమలత మాట్లాడుతూ ట్రాన్స్జెండర్లకు న్యాయ సహాయం అందించేందుకు తోడ్పడతామన్నారు. సదస్సులో ట్రాన్స్జెండర్ల నాయకులు వీణారెడ్డి, శ్రీవాణి, పావని తదితరులు పాల్గొన్నారు. -
మంచం పట్టిన కలపరి
● గ్రామంలో వంద మందికి పైగా జ్వరం ● ప్రతి ఇంట్లో ఇద్దరు, ముగ్గురు బాధితులు ● కన్నెత్తి చూడని వైద్యారోగ్యశాఖ అధికారులు ఆస్పరి: మండలంలోని కలపరి గ్రామం మంచం పట్టింది. ఈ గ్రామంలో 110 కుటుంబాలుండగా, ప్రతి ఇంట్లో ఇద్దరు, ముగ్గురు జ్వరాలతో బాధపడుతున్నారు. స్థానిక ఆర్ఎంపీల వద్ద చూపించుకుంటున్నా తగ్గడం లేదని వాపోతున్నారు. సమస్య ఇంత తీవ్రంగా ఉంటే వైద్యారోగ్యశాఖ అధికారులు ఇటువైపు కన్నెతి చూసిన దాఖలాలు లేవు. వెంకమ్మ అనే వృద్ధురాలు పరిస్థితి ఆందోళన కరంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మల్లమ్మ, మల్లికార్జున, ఉరుకుందు, సోమన్న, లక్ష్మి, మునిస్వామి, వీరేష్, వెంకటలక్ష్మి, ఆటో ఉరుకుందప్ప, సూరి, లోకేశ్వరీతో పాటు వందమంది వంద మంది జ్వరం, కాళ్లు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. దాదాపు రెండు వారాల నుంచి ఈ సమస్య ఉంది. ఇళ్లలో ఒకరి తర్వాత ఒకరు జ్వరం బారిన పడుతున్నారు. పారిశుద్ధ్య లోపమా లేక మరే కారణమో తెలియదని, అధికారులు స్పందించి వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.