Kurnool
-
మంత్రి టీజీ భరత్కు సిద్ధార్థరెడ్డి కౌంటర్
కర్నూలు: తాను ఎమ్మెల్యే కావాలనే కోరిక తనకంటే మంత్రి టీజీ భరత్కే ఎక్కువగా ఉన్నట్టు కనబడుతోందని వైఎస్సార్సీపీ యువజన రాష్ట్ర విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఎద్దేవా చేశారు. కర్నూలులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నాయకుల వేధింపుల బాధితుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ తాము ధర్నాలు చేస్తే తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ టీజీ కుటుంబంపై మండిపడ్డారు. టీజీ వెంకటేశ్ అంటే గౌరవం ఉండేదని.. కానీ తనపై చేసిన వ్యాఖ్యలు చూశాక, ఆయనపై గౌరవం పోయిందన్నారు. తన తండ్రి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని టీడీపీ నేతలు తిట్టినా స్పందించని ఎంపీ బైరెడ్డి శబరి.. మంత్రి భరత్ గురించి తాను మాట్లాడితే పరుగెత్తుకుంటూ వచ్చి ప్రెస్మీట్లు పెట్టడం విడ్డూరంగా ఉందని సిద్ధార్థరెడ్డి అన్నారు.ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుని పోటీ చేయాలంటూ తనపై మంత్రి భరత్ చేసిన వ్యాఖ్యలకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు సిద్ధార్థరెడ్డి. టీజీ భరత్ 48 సంవత్సరాల వయసులో మంత్రి అయ్యారని, 43 ఏళ్ల వయసులో ఎమ్మెల్యేగా పోటీ చేశారని.. ఇప్పుడు ఆయన వయసు ఇప్పుడు 50 ఏళ్లు అని చెప్పారు. 'నీ వయసుకు వచ్చినప్పుడు నేను ఎమ్మెల్యేగా పోటీ చేయకపోతే అప్పుడు అడగండి' అంటూ భరత్కు కౌంటర్ ఇచ్చారు. ''కర్నూలు మూడో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు నిరసనగా, అక్రమ కేసులకు వ్యతిరేకంగా ఈనెల 14న మేము ధర్నా కార్యక్రమం నిర్వహించాం. టీడీపీ నాయకుల వేధింపుల కారణంగా కర్నూలు పట్టణంలో ఆత్మహత్య చేసుకున్న సతీశ్ అనే కుర్రాడి కుటుంబానికి న్యాయం చేయాలన్న డిమాండ్తో ఆ రోజు ధర్నా చేశాం. బాలు మరో కుర్రాడిపై పోలీసులు వేధింపులు ఆగాలన్న ఉద్దేశంతోనూ ధర్నా చేపట్టాం. మూడో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కార్యాయలం దగ్గర ధర్నాకు దిగాం. ప్రభుత్వాన్ని, మంత్రి టీజీ భరత్కు ప్రశ్నించామని గడచిన 3 రోజులుగా టీడీపీ నేతల, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, టీజీ వెంకటేశ్ తదితరులు మా గురించి రకరకాలు మాట్లాడారు. వారి మాటలకు సమాధానం చెప్పాలనే మీడియా ముందుకు వచ్చాను. సతీశ్ కుటుంబానికి మంత్రి టీజీ భరత్ న్యాయం చేసివుంటే కర్నూలు టౌన్లో ఆయన స్థాయి వందశాతం పెరిగేది. ఆయన ఆ పని చేయకుండా సిద్ధార్థరెడ్డిని తిట్టినవాళ్లకు పదివేల రూపాయలు, సిద్ధార్థరెడ్డిపైనా సెల్ఫీ వీడియో చేసిన వాళ్లకు ఇరవై వేల రూపాయలు, ప్రెస్మీట్ పెడితే కార్పొరేటర్ సీటు, సిద్ధార్థరెడ్డి ఇంటి మీదకు పోతే స్టోర్ బియ్యం వంటివి చేయడంతో కర్నూలు టౌన్లో టీజీ భరత్ స్థాయి 500 శాతం పడిపోయింది. సతీశ్ కుటుంబానికి న్యాయం చేయమని నేను అడిగితే ఆయన ప్రెస్మీట్ పెట్టి.. సిద్ధార్థ నువ్వు టికెట్ తెచ్చుకో. మూడు ఎలక్షన్లు చేసినా ఏ పార్టీ కూడా నీకు టికెట్ ఇవ్వలేదని మాట్లాడారు. భరత్ వయసు ఇప్పడు 50 సంవత్సరాలు. 48 ఏళ్ల వయసులో ఎమ్మెల్యే అయ్యారు. 43 ఏళ్ల వయసులో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా నిలబడ్డారు. నా వయసు 33 సంవత్సరాలు. మీ వయసు వచ్చినప్పడు నాకు టికెట్ రాకుంటే అప్పుడు అడగండి. నేను ఎమ్మెల్యే కావాలనే కోరిక నా కన్నా మీకు ఎక్కువ ఉండడమేంటి? 33 సంవత్సరాలకు నేను శాప్ చైర్మన్ను అయ్యాను. వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడిని అయ్యాను. నందికొట్కూరు నియోజకవర్గానికి ఇన్చార్జిని అయ్యాను. నా వెంట తిరిగిన ఎంతో మందిని ఎంటీసీ, జెడ్పిటీసీ, సర్పంచ్, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లుగా గెలిపించుకున్నాను. రాష్ట్రంలో ఎన్నో నియోజకవర్గాల్లో పార్టీ తరపున ప్రచారం చేశాను. ఎన్నో ప్రెస్మీట్లు, ర్యాలీలు, ధర్నాలు చేశాను. 33 ఏళ్లకే ఒక గుర్తింపు తెచ్చుకున్నాను. అదే 33 సంవత్సరాలకు మీరు ఉయ్యాల ఊగుతున్నారా? సతీశ్ కుటుంబానికి న్యాయం చేయమని మేము అడుగుతుంటే ఏదేదో మాట్లాడుతున్నార''ని సిద్ధార్థరెడ్డి ధ్వజమెత్తారు. -
హత్యాయత్నం కేసు నమోదు
ఉయ్యాలవాడ: మండలంలోని తుడమలదిన్నె గ్రామానికి చెందిన ఇమ్రాన్పై జరిగిన దాడిని ఆదివారం హత్యాయత్నం కేసుగా పోలీసులు నమోదు చేశారు. గ్రామానికి చెందిన ఇమ్రాన్ ఇదే గ్రామానికి ఒక యువ తి పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆ యువతి బంధువులు బోయ వెంకటస్వామి, నిఖిల్, మోక్షాజ్ఞాన్, సాయి వరణ్, పాణ్యం మణివర్ధన్ శనివారం రాత్రి ఇమ్రాన్ మాయలూరు వెళ్తుండగా వెంటపడి రైల్వే ట్రాక్ సమీపంలో పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యా యత్నానికి పాల్పడ్డారు. ఈ మేరకు ఆదివారం ఆళ్లగడ్డ డీఎస్పీ శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకుని దాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కోవెలకుంట్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇమ్రా న్ నుంచి వివరాలు సేకరించారు. ఐదుగురిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ వివరించారు. గ్రామంలో ముందస్తుగా శిరివెళ్ల సీఐ రాము, రేవనూరు, ఉయ్యాలవాడ ఎస్ఐలు ధనుంజయులు, రామిరెడ్డి, ఏఎస్ఐ ప్రతాప్రెడ్డి సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఏపీ జీఓఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా యూనస్ అలి
కర్నూలు(హాస్పిటల్): ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఫోరమ్(ఏపీ జీఓఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడిగా కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చీఫ్ బయోకెమిస్ట్గా పనిచేస్తున్న ఎండీ యూనస్ అలీ ఏకగ్రీవంగా ఎన్నియ్యారు. గెజిటెడ్ అధికారుల సేవా సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ, సంక్షేమం, పరిపాలనా వ్యవహారాల్లో సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ నియామకం చేసినట్లు యూనస్ అలి చెప్పారు. తాను నిర్వహించిన సేవా కార్యక్రమాలు, వృత్తిలో నిబద్ధత, పారదర్శకతతో తనకు ఈ పదవి లభించినట్లు ఆయన పేర్కొన్నారు. ఆయనను వివిధ ప్రభుత్వ విభాగాల గెజిటెడ్ అధికారులు, సహచరులు, మిత్రులు అభినందించారు. కోడిపందేల స్థావరంపై పోలీసుల దాడి ఓర్వకల్లు: గుట్టుగా కోడి పందేలు నిర్వహిస్తున్న స్థావరంపై పోలీసులు దాడి చేసి బైక్లు, కార్లు, కోళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ సంఘటన వివరాలు ఇలా.. కాల్వ గ్రామం, బ్రాహ్మణపల్లె గ్రామాల మధ్య గల ఓ మామిడి తోటలో గుట్టు చప్పుడు కాకుండా కొందరు కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. నిఘాపెట్టిన పోలీసులు ఆదివారం మెరుపు దాడులు చేసి కొందరిని అదుపులోకి తీసుకోగా ఇంకొందరు పరారైనట్లు సమాచారం. ఘటనా స్థలంలో 25 బైక్లు, 3 కార్లు, 4 కోళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. స్థావరాన్ని ఎవరు నిర్వహిస్తున్నారు తదితర వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలనుంది. మోడ్రన్ పెంటాథ్లాన్లో జిల్లాకు పతకాలు కర్నూలు (టౌన్): విజయవాడలోని ఎలైట్ స్విమ్మింగ్పూల్లో ఈనెల 16 నుంచి 17 వర కు నిర్వహించిన 10వ రాష్ట్ర స్థాయి మోడ్రన్ పెంటాథ్లాన్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు పతకాలు సాధించారు. ఆ క్రీడా జిల్లా సంఘం కార్యదర్శి మంచికంటి అవినాష్ ఆదివారం క్రీడాకారులను అభినందించి మాట్లాడారు. అండర్– 13లో విక్షిత, అండర్ 17లో లహరి, జూనియర్స్ విభాగంలో షేక్ సామియా విజేతలుగా నిలిచినట్లు వెల్లడించారు. -
ప్రైవేట్ పేరుతో ఆర్టీసీ నిర్వీర్యానికి కుట్ర
ఎమ్మిగనూరుటౌన్: ప్రైవేట్ పేరుతో ఆర్టీసీ నిర్వీర్యానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఎంప్లాయీస్ యునియన్ వర్కింగ్ ప్రసిడెంట్ బసవరాజు అన్నారు. ఎమ్మిగనూరు డిపో ఎదుట ఆర్టీసీ ఉద్యోగులు ఆదివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతగా రాష్ట్రంలో 12 ఆర్టీసీ డిపోలను పినాకిల్ అనే ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టేందుకు కుట్ర జరుగుతోందన్నారు. ఆయా డిపోల్లో పనిచేసే సిబ్బందిని ఇతర డిపోలకు పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎలక్ట్రిక్ బస్సులు ఏర్పాటు చేస్తే ఆర్టీసీలో పనిచేసే సిబ్బందితోనే నడపాలన్నారు. సీ్త్రశక్తి పథకం విజయవంతం కావాలంటే ఆర్టీసీకి 3 వేల బస్సులు మంజూరు చేయాలని, ఖాళీగా ఉన్న 10వేల పోస్టులను భర్తీ చేయాలన్నారు. పాత టిమ్స్ మిషన్ల స్థానంలో కొత్తవి ఇవ్వాలని కోరారు. ధర్నాలో గ్యారెజీ కార్యదర్శి మహేశ్వర్రెడ్డి, అధ్యక్షుడు శ్రీనివాసులు,సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రశాంతంగా జేఈఈ అడ్వాన్డ్స్ పరీక్ష
కర్నూలు సిటీ: జేఈఈ అడ్వాన్డ్స్ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. నగర శివారులోని దుపాడు దగ్గర ఉన్న ఐయాన్ డిజిటల్లో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్–1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్–2 పరీక్షలు నిర్వహించారు. పరీక్షలకు మొత్తం 973 మంది విద్యార్థులు హాజరయ్యారు. అడ్వాన్డ్స్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు బీఆర్క్ కోర్సుల్లో చేరాలనుకుంటే ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు(ఏఏటీ)రాయల్సి ఉంటుంది. ఈ పరీక్ష వచ్చే నెల 1న రిజిస్ట్రేషన్ చేసుకుంటే, 4వ తేదీన పరీక్ష నిర్వహించి, 7వ తేదీ తుది ఫలితాలు ప్రకటించనున్నారు. అడ్వాన్డ్స్ పరీక్షకు హాజరైన విద్యార్థుల ఓఎంఆర్ 21న వెబ్సైట్లో ఉంచి 25వ తేదీ ప్రాథమిక కీ విడుదల చేస్తారు. జూన్ 1వ తేది ఉదయం 10 గంటలకు తుదికీ ఫలితాలను విడుదల చేయనున్నారు. పేపర్–1, పేపర్–2 రెండు పరీక్షలు రాసిన విద్యార్థుల ఫలితాలను మాత్రమే విడుదల చేయనున్నారు. జూన్ 2వ తేదీ సాయంత్రం 5 గంటలకు జోసా (జాయింట్ సీట్ అలకేషన్ ఆథారిటీ–జేఓఎస్ఏఏ) కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఉదయం 9.30 గంటలకే పీజీఆర్ఎస్ కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ఉదయం 9.30 గంటలకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజల నుంచి అధికారులు అర్జీలను స్వీకరిస్తారని తెలిపారు. ప్రజలు meekoram.ap.gov.in అనే వెబ్సైట్లో కూడా అర్జీలను నమోదు చేసుకోవడానికి అవకాశం ఇచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. -
బారులు తీరిన గ్యాస్ కష్టాలు
హొళగుంద: బుకింగ్ చేసి 45 రోజులైనా గ్యాస్ సిలిండర్ రాకపోవడంతో ప్రజలు ఆదివారం నిరసన తెలిపారు. హొళగుందలో పోలీసుస్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. మండల కేంద్రమైన హొళగుందకు వివిధ పల్లెల నుంచి గ్యాస్ సిలిండర్లను తీసుకుని ఆదివారం ఉదయమే వచ్చారు. గ్యాస్ ఏజెన్సీ వద్ద ఖాళీ సిలిండర్లను క్యూలో ఉంచి గంటల తరబడి ఎదురు చూశారు. నిర్వాహకులు ఆలస్యంగా గ్యాస్ బండి రాదని చెప్పడంతో ప్రజలు తీవ్ర అసహనానికి గురయ్యారు. అక్కడే నిరసన తెలిపారు. గత నెలన్నర్ర నుంచి ఇబ్బంది పడుతున్నామని, అయినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్లాక్లో అమ్ముకునే వారికి ముందుగా అందిస్తున్నారని ఆరోపించారు. సోమవారం కర్నూలుకు వెళ్లి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని ఖాళీ గ్యాస్ సిలిండర్లను తీసుకుని స్వగ్రామాలకు వెళ్లారు. -
మధుర నివేదన
కర్నూలు నగరంలోని శ్రీ పూరి జగన్నాథ మందిరంలో ఆదివారం మామిడి పండ్ల ఉత్సవం వైభవో పేతంగా జరిగింది. శీల ప్రభు పాదుల ప్రేమ విందు, భగవద్గీత తరగతులు నిర్వహించారు. మామిడి పండ్ల ఉత్సవంలో భాగంగా జగన్నాథ్, సుభద్ర, బలదేవ్లను ప్రత్యేకంగా అలంకరించి దర్శనం కల్పించారు. భక్తులు తెచ్చిన వివిధ రకాల మామిడి పండ్లతో జగన్నాథ్కు రాజ భోగ నివేదన చేశారు. ఇస్కాన్ కర్నూలు బాధ్యులు రఘునందన సేవక్ ప్రభు సందేశమిచ్చారు. ప్రతి ఒక్కరు ఆఽధ్యాత్మిక సేవా గుణం కలిగి ఉండాలన్నారు. – కర్నూలు కల్చరల్కర్నూలు(హాస్పిటల్): డెంగీ జ్వరం పేరు చెబితేనే అందరికీ వణుకుపుడుతోంది. ఈ జ్వరం వచ్చిందంటే చాలు నిలువెత్తు మనిషిని నిలువునా కూలిపోయి రోజుల పాటు మంచాన పడతాడు. చిన్నదోమ కుడితే వచ్చే ఈ జ్వరంతో బాధపడే వ్యక్తులతో జిల్లాలోని ప్రధాన ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. రక్తంలో ప్లేట్లెట్లు తగ్గుతుంటే రోగుల సహాయకుల్లో మరింత ఆందోళన పెరుగుతోంది. ఎలాగైనా రోగిని ప్రాణాలతో దక్కించుకోవాలని అప్పులు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఇదే అదునుగా సాధారణ జ్వరానికి సైతం కొందరు వైద్యులు, ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు డెంగీ పేరుతో రోగులను దోచుకుంటున్నాయి. జిల్లాలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతో పాటు ఆదోని, ఎమ్మిగనూరులలో ఏరియా ఆసుపత్రులు, 47 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 5 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. వీటితో పాటు 400లకు పైగా నర్సింగ్హోమ్లు, క్లినిక్లు రోగులకు వైద్యసేవలు అందిస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులన్నింటిలో సాధారణ జ్వరాలకు చికిత్స అందిస్తున్నారు. డెంగీ లాంటి జ్వరాలు వస్తే జిల్లా కేంద్రంలోని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో లేదా ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరి ప్రాణాలు కాపాడుకోవాల్సిందే. వ్యాధి లక్షణాలతో ఆసుపత్రికి రాగానే వైద్యులు ముందుగా ర్యాపిడ్ పరీక్ష చేయిస్తున్నారు. అందులో డెంగీగా నిర్ధారణ అయితే వెంటనే రక్తకణాల పరీక్షలు చేస్తున్నారు. కణాల సంఖ్య తక్కువగా ఉంటే రక్తం, ప్లేట్లెట్లు తెచ్చుకోవాలని చెబుతున్నారు. ఇలాంటి ఉదంతాలు ఇటీవల కాలంలో నిత్యం ప్రతి ఆసుపత్రిలో కనిపిస్తున్నాయి. ఈ మధ్యన సగటున ప్రతి ఆసుపత్రిలో ఒకరు డెంగీ లక్షణాలతో బాధపడుతున్నట్లు వైద్యులు అంచనా వేస్తున్నారు. ఏటా పెరుగుతున్న డెంగీ కేసులు జిల్లాలో డెంగీ వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న వారి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 625 మందికి డెంగీ జ్వర లక్షణాలు ఉండగా వారికి పరీక్ష చేయడంతో 83 మందికి డెంగీ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఏటా వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న వారికి పరీక్షలు చేస్తే అందులో 10 శాతం కూడా డెంగీగా నిర్ధారణ చేయడం లేదు. వాస్తవంగా చూస్తే డెంగీ బాధితుల సంఖ్య అధికారిక గణాంకాల కంటే రెట్టింపు సంఖ్యలో ఉంటున్నాయని ఓ ప్రైవేటు ఆసుపత్రి యాజమాని చెప్పారు. డెంగీ కేసులు అధికంగా చూపితే అధికారుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని ప్రైవేటు ఆసుపత్రుల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డెంగీ కేసు రాపిడ్ పరీక్షలో నిర్ధారణ కాగానే వ్యాధి లక్షణాలకు తగ్గట్లు చికిత్స ఇచ్చి రోగికి నయం చేసి పంపిస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు బ్లడ్బ్యాంకుల్లో ప్లేట్లెట్లు తీసుకున్న వారి జాబితా పరిశీలిస్తే అసలు విషయం వెలుగులోకి వస్తుందని పలువురు వైద్యులు చెబుతున్నారు. ఆదోని డివిజన్లో అధికం జిల్లాలోని మూడు డివిజన్ల కంటే ఆదోని డివిజన్లో డెంగీ కేసులు ఎక్కువగా నమోదువుతున్నాయి. ఈ యేడాది ఇప్పటి వరకు 625 డెంగీ లక్షణాలతో చికిత్స తీసుకోగా వారికి రక్తపరీక్షలు చేయగా 83 మందికి డెంగీ ఉన్నట్లు నిర్దారణ అయ్యింది. ఇందులో కర్నూలు డివిజన్లో 210 అనుమానితులకు గాను 26 మందికి పాజిటివ్, పత్తికొండ డివిజన్లో 113 మందికి గాను 16మందికి, ఆదోని డివిజన్లో 302 మందికి గాను 41 మందికి డెంగీ పాజిటివ్ ఉన్నట్లు తేలింది. ఒకవైపు మలేరియా వ్యాధి తగ్గుముఖం పడుతుండగా మరోవైపు డెంగీ జ్వరాలు ప్రతి సంవత్సరం పెరుగుతుండటం అధికారులను సైతం ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లా వ్యాప్తంగా డెంగీ నివారణ చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకు ప్రజల భాగస్వామ్యం కూడా కోరుతున్నాం. ఈ మేరకు డెంగీ కారక ఏడిస్ ఈజిప్టై దోమలు పెరగకుండా జాగ్రత్తలు సూచిస్తున్నాం. డెంగీ కేసు నమోదైన ఇంటి చుట్టుపక్కల 50 ఇళ్లల్లో పైరిత్రమ్ స్ప్రే చేస్తున్నాం. నీరు నిలిచిన చోట యాంటి లార్వా చర్యలు తీసుకుంటున్నాం. దోమల నివారణకు మున్సిపల్, పంచాయతీ శాఖల సహకారంతో ఫాగింగ్ ఆపరేషన్ చేస్తున్నాం. – టి.వెంకటేశ్వర్లు, జిల్లా మలేరియా అధికారి, కర్నూలు వైభవంగా శ్రీశైలేశుడి పల్లకోత్సవంశ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్ధానంలో ఆదివారం స్వామి అమ్మవార్ల పల్లకోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రతి ఆదివారం, పౌర్ణమి, మూలా నక్షత్రం రోజులలో (సర్కారి సేవగా) ఈ ఉత్సవం జరుపుతారు. పల్లకోత్సవంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పం పఠించారు. కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ చేశారు. అనంతరం శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తుల ను పల్లకీలో కూర్చోబెట్టి శాస్త్రోక్తంగా షోడశోపచారపూజలు నిర్వహించారు. సంవత్సరం అనుమానిత నిర్ధారణ 2022 4,088 342 2023 2,484 409 2024 2,220 306 2025 3,546 4672026 625 83ఇప్పటివరకు( 20025లో డెంగీతో ఇద్దరు మరణించారు) ఏటా పెరుగుతున్న కేసులు 2024లో 306 కేసుల నమోదు గత ఏడాది 467కు చేరిక ఈ ఏడాది ఇప్పటికే 83 కేసులు నమోదు ఆదోని డివిజన్లో అధికం గ్రామాలు, పట్టణాల్లో లోపించిన పారిశుద్ధ్యం అవగాహన కల్పించని వైద్య సిబ్బంది తూతూమంత్రంగా చర్యలుఅధ్వానంగా పారిశుద్ధ్యం కర్నూలు నగరంతో పాటు జిల్లాలోని ఇతర మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా మారింది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ పేరుతో కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తున్నా, ప్రతి నెలా మూడవ శనివారం వరకే ఆ కార్యక్రమం పరిమితం అవుతోంది. మిగిలిన రోజుల్లో పారిశుధ్యం గురించి పట్టించుకునే వారే కరువయ్యారు. ముఖ్యంగా మురుగుకాలువల్లో నీరు నిల్వ ఉండటం, మురికివాడలు, గ్రామాల్లో ప్రజలు తాగునీటిని నీటి తొట్లలో నిల్వ ఉంచుకుని, వాటిని వారం వారం శుభ్రం చేసుకోకపోవడంతో డెంగీ దోమలు పెరుగుతున్నాయి. వైద్య సిబ్బంది ఆయా ప్రాంతాలకు వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంది. కానీ వారు తూతూ మంత్రంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. -
మయూరం.. పరవశం
ఆకాశం మేఘావృతమైన వేళ పచ్చని చెట్ల నడుమ మయూరాలు పరవశిస్తూ ప్రకృతికి మరింత వన్నె తెస్తున్నాయి. తంగడంచ ఫారం జాతీయపక్షి నెమళ్లకు నివాస కేంద్రంగా మారింది. సారవంతమైన నల్లరేగడి నేలలుండటంతో పాటు సమీపంలో కేసీ కాల్వ ఉంది. దీంతో వందల సంఖ్యలో నెమళ్లు నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో అరుస్తూ సందడి చేస్తున్నాయి. తంగడంచ సీడ్ ఫారాన్ని జాతీయ పక్షి నెమళ్లకు ఆవాసయోగ్య ప్రాంతంగా గుర్తించి అభివృద్ధి చేయాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. – జూపాడుబంగ్లా -
సమాజంలో సౌభ్రాతృత్వం విలసిల్లాలి
● బిషప్ తెలగతోటి జోసఫ్ రాజారావుకర్నూలు (టౌన్): సమాజంలో ప్రేమ, సౌభ్రాతృత్వం విలసిల్లాలని విజయవాడ డయాసిస్ బిషప్ తెలగతోటి రాజారావు అన్నారు. కర్నూలులోని లూర్డుమాత క్యాథడ్రల్ బిషప్ చర్చిలో ఆదివారం కర్నూలు డయాసిస్ బిషప్ గోరంట్ల జ్వాన్వేష్తో కలిసి క్రీస్తు మోక్షారోహణ మహోత్సవం నిర్వహించారు. బిషప్ తెలగతోటి రాజారావు దైవసందేశమిస్తూ.. యేసుక్రీస్తు సాధారణ మానవుడిగా శిలువ వేయబడి మృత్యుంజయుడయ్యాడన్నారు. అనంతరం శరీరంతోనే మోక్షారోహణమై పరలోకంలో సింహాసీనుడయ్యారన్నారు. క్రీస్తు ఈ లోకానికి నేర్పిన ప్రేమ, సేవ, త్యాగాలను పాటించాలన్నారు. -
ఇస్తారో..లేదో?
మేం ప్రతి ఏటా వేరుశనగ సాగు చేస్తాం. ఈ సారి కూడా రెండు ఎకరాల్లో సాగు చేయాలనే లక్ష్యంతో భూములను సిద్ధం చేసుకున్నాం. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతి ఏటా మే 15 నుంచే వేరుశనగతో సహా అన్ని రకాల విత్తనాలను సబ్సిడీపై ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పరస్థితులు లేవు. ఈ సారి సబ్సిడీపై విత్తనాలు ఇస్తారో..లేదో? మరో నాలుగైదు రోజుల్లో విత్తనాలు అందుబాటులో ఉంచకపోతే బ్లాక్లో కొనాల్సి వస్తుంది. – బీమా నాయక్, మీటేతండా, తుగ్గలి మండలం మాకు నీటి వసతి ఉంది. బోరు కింద మూడు ఎకరాల్లో వేరుశనగ సాగుకు సిద్ధమయ్యాం. ఈ నెల 20వ తేదీలోపు నీటి వసతి కింద వేరుశనగ వేసుకుంటే బాగా కలసి వస్తుంది. సకాలంలో సబ్సిడీపై వేరుశనగ పంపిణీ చేస్తే రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆలస్యం అయితే బ్లాక్లో కొనుగోలు చేయకతప్పని పరిస్థితి ఏర్పడుతుంది. వేరుశనగతో పాటు ముందస్తుగా కంది కూడా సాగు చేస్తాం. వేరుశనగతో పాటు కందులు, ఇతర విత్తనాలు సబ్సిడీపై పంపిణీ చేయాలి. – నరసింహులు, బైన్దొడ్డి గ్రామం, కోడుమూరు మండలం ఖరీఫ్ సీజన్కు సంబంధించి సబ్సిడీపై వేరుశనగ పంపిణీకి చర్యలు చేపట్టాం. ఇప్పటికే ప్రభుత్వం జిల్లాల వారీగా వేరుశనగతో పాటు పచ్చి రొట్ట, ఇతర విత్తనాల అలాట్మెంటు కూడా ఇచ్చింది. వేరుశనగ ధర, సబ్సిడీలు కూడా ఖరారయ్యాయి. వేరుశనగను సిద్ధం చేయాలని ఇప్పటికే ఏపీసీడ్స్కు ఆదేశాలు ఇచ్చాం. మరో పది రోజుల్లో వేరుశనగను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. చిన్న సమస్యలు ఉంటే అన్ని మూడు రోజుల్లో సర్దుకుంటాయి. – పీఎల్ వరలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి, కర్నూలు -
ఇది బాదుడు ప్రభుత్వం
● వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాటిల్ తిరుమలేశ్వర రెడ్డి కర్నూలు (టౌన్): ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలపై మోయలేని భారం వేసే ప్రభుత్వం పాలన సాగిస్తుందని వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాటిల్ తిరుమలేశ్వర రెడ్డి విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని రంగాల్లో బాదుడే బాదుడు పనిగా పెట్టుకుందని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఆదివారం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారన్నారు. పప్పులు, నూనెలు, కూరగాయలు తదితర నిత్యావసర వస్తువుల ధరలు 2024 సంవత్సరం తొలి త్రైమాసికంలో పోలిస్తే ఏకంగా 100 నుంచి 200 శాతం పెరిగాయని చెప్పారు. ఇప్పుడు పెట్రోలు, డీజీల్ ధరలు ఇతర రాష్ట్రాల్లో కన్నా మన రాష్ట్రంలోనే అధికంగా ఉన్నాయన్నారు. రోడ్డు సెస్సు, వ్యాట్ పేరుతో బాబు సర్కారు ప్రజల నడ్డి విరుస్తుందన్నారు. తమ ప్రభుత్వంలో ట్యాక్సులు ఎక్కువగా ఉన్నాయని గగ్గోలు పెట్టిన చంద్రబాబు నాయుడు, నారాలోకేష్లు ఇప్పుడు చేస్తున్నదేమిటని ప్రశ్నించారు. ప్రజలు రోడ్డెక్కి ఆందోళనలు చేయకముందే ప్రభుత్వం స్పందించి పెట్రోలు, డీజీల్పై ఉన్న అదనపు ట్యాక్స్లను తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఈ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. -
వేరుశనగ ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే మండలాలు
కర్నూలు(అగ్రికల్చర్): ఒకవైపు ఎల్నినో భయపెడుతోంది.. మరో వైపు ఖరీఫ్ సీజన్ మంచుకొస్తోంది.. రైతులకు ఇప్పటి వరకు విత్తనాలు అందలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతి ఏటా మే నెల 15 నుంచే ఆర్బీకేల వారీగా విత్తన పంపిణీ జరిగేది. వర్షాలు పడిన వెంటనే రైతులు విత్తుకునే అవకాశాన్ని లభించేది. చంద్రబాబు ప్రభుత్వంలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. విత్తన పంపిణీకి సంబంధించి ఎటువంటి ప్రణాళిక లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది. ప్రైవేట్ కంపెనీలపై ఆధారం సబ్సిడీపై వేరుశనగ, పచ్చిరొట్ట విత్తనాలను రైతులకు పంపిణీ చేస్తారు. వేరుశనగ సరఫరాకు టెండర్లు నిర్వహించినా ఇంతవరకు ప్రాసెసింగ్ ప్రక్రియనే మొదలు కాలేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు అన్ని రకాల విత్తనాలను ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ(ఏపీ సీడ్స్) సరఫరా చేస్తోంది. విత్తనోత్పత్తికి ఏపీ సీడ్స్ స్వస్తి పలికి వివిధ ప్రైవేట్ కంపెనీలపై ఆధారపడింది. ప్రస్తుతం విత్తనాలు లేక కర్నూలులోని ఏపీ సీడ్స్ గోదాములు ఖాళీగా కనిపిస్తున్నాయి. వర్షాలు కురిస్తే రైతులు పచ్చిరొట్ట విత్తనాలతో పాటు కంది, వేరుశనగ విత్తుకుంటారు. అవి లేకపోవడంతో రైతులు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. రూ.350 కోట్ల వరకు బకాయిలు రాష్ట్రం మొత్తం మీద ఏపీ సీడ్స్కు విత్తనాలు సరఫరా చేసే కంపెనీలు 45 వరకు ఉన్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాకు మాత్రం కేవలం ఒక కంపెనీ మాత్రమే సరఫరా చేస్తోంది. ఈ కంపెనీలో కూడా వేరుశనగ అరకొరగా ఉంది. ఖరీఫ్ సీజన్లో 2024–25, 2025–26 సంవత్సరాల్లో సరఫరా చేసిన వేరుశనగ, ఇతర విత్తనాలకు సంబంధించి కంపెనీలకు ఏపీ సీడ్స్ రూ.350 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. చంద్రబాబు ప్రభుత్వం ఏపీసీడ్స్కు ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడంతో వేరుశనగ ఇవ్వలేమని విత్తన కంపెనీలు చేతులెత్తేస్తున్నాయి. బకాయిలు చెల్లిస్తేనే విత్తనాలు సరఫరా చేస్తామంటూ భీష్మించుకూర్చున్నాయి. దొరకని పచ్చిరొట్ట విత్తనాలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో వరి సాగు ఎక్కువగా ఉంది. ఫలితంగా పచ్చిరొట్ట విత్తనాలకు డిమాండ్ ఏర్పడింది. నంద్యాల జిల్లాలో వరి ప్రధాన పంట. కర్నూలు జిల్లాలో కూడా వరి ఎక్కువగా సాగు చేస్తారు. వరి నాట్లకు ముందు పచ్చిరొట్ట ఎరువులుగా ఉపయోగపడటానికి జీలుగ, పిల్లిపెసర, సన్హెంఫ్ విత్తనాలు విత్తుకొని 45 రోజుల సమయంలో దున్ని పొలంలో కలిపేస్తారు. ఫలితంగా భూమికి అన్ని పోషకాలు కలిగిన ఎరువులు లభిస్తాయి. పచ్చిరొట్ట విత్తనాలు ఉమ్మడి జిల్లాకు కనీసం 9,232 క్వింటాళ్లు అవసరం. అయితే ఏపీ సీడ్స్ దగ్గర ఒక్క క్వింటం కూడా విత్తనాలు లేవు. కంపెనీలు విత్తన సరఫరా చేయడంలో చేతులెత్తేశాయి. ఫలితంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇదీ దుస్థితి.. ఖరీఫ్లో ఉమ్మడి కర్నూలు జిల్లా రైతులు 50 వేలకు పైగా హెక్టార్లలో వేరుశనగ సాగు చేస్తారు. మొత్తం 30 వేల క్వింటాళ్ల విత్తనం కాయలు అవసరమని వ్యవసాయ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వం కర్నూలు జిల్లాకు 10,723, నంద్యాల జిల్లాకు 2,136 క్వింటాళ్లు మాత్రమే కేటాయించింది. బహిరంగ మార్కెట్లో నాణ్యత కలిగిన క్వింటా వేరుశనగ ధర రూ.7,500 ఉంది. ప్రభుత్వం సబ్సిడీపై పంపిణీ చేసే క్వింటా వేరుశనగ ధరను రూ.10,200గా నిర్ణయించింది. కిలో ధర రూ.102 ఉండగా అందులో రైతులకు 40 శాతం సబ్సిడీ ఇవ్వనున్నారు. బకాయిలు చెల్లిస్తేనే వేరుశనగతో సహా పచ్చిరొట్ట విత్తనాలు సరఫరా చేస్తామని కంపెనీలు చెబుతున్నాయి. కర్నూలు జిల్లా: ఆలూరు, పత్తికొండ, చిప్పగిరి, దేవనకొండ, హాలహర్వి, పెద్దకడుబూరు, కల్లూరు, క్రిష్ణగిరి, వెల్దుర్తి, కర్నూలు, ఓర్వకల్లు, ఆదోని, కోసిగి, ఎమ్మిగనూరు, గోనెగండ్ల నంద్యాల జిల్లా: డోన్, ప్యాపిలి, బేతంచెర్ల, నందికొట్కూరు -
వీహెచ్పీ దక్షిణాంధ్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి మృతి
కర్నూలు కల్చరల్: విశ్వహిందూ పరిషత్ దక్షిణాంధ్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయి రెడ్డి (74)అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. ఈయన అనేక దేవాలయాల నిర్మాణాలు, నిర్వహణలో కీలకంగా వ్యవహరించారు. వీహెచ్పీ కార్యాలయాల నిర్మాణాల్లో సాయిరెడ్డి పాత్ర మరువలేనిది. కర్నూలు ప్రాంత కార్యాలయ నిర్మాణానికి ఆర్థిక సేకరణ చేశారు. హిందూ సమాజ సేవ, ధార్మిక పరిరక్షణలో ఆయన సేవలు చిరస్మరణీయమని వీహెచ్పీ, బీజేపీ నాయకులు పేర్కొన్నారు. సాయిరెడ్డి పార్థివ దేహం కర్నూలు ఏక్యాంప్ చాణిక్యపురి కాలనీలోని వారి స్వగృహంలో కార్యకర్తల సందర్శనార్థం సోమవారం ఉదయం 9 గంటల వరకు ఉంచబడుతుందని వీహెచ్పీ రాష్ట్ర మీడియా కన్వీనర్ మాళిగి భాను ప్రకాష్ తెలిపారు. పాతనగరంలోని జమ్మిచెట్టు వద్ద అన్న హరిశ్చంద్ర ఘాట్లో అంతిమ సంస్కారాలు జరుగుతాయని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం వెలుగోడు: అబ్దుల్లాపురం సమీపంలోని మంచినీళ్ల వాగు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. రేగడగూడూరుకు చెందిన మౌలాలి, అతని కుమారుడు హర్షద్ నంద్యాల నుంచి స్వగ్రామానికి బైక్పై వెళ్తుండగా, గుంతకందనాలకు చెందిన అశోక్(22), సోమరాజు అనే ఇద్దరు స్నేహితులు వేల్పనూరులో జరిగిన ఫంక్షన్కు హాజరై తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో అబ్దుల్లాపురం మంచినీళ్ల వాగు వద్ద రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అశోక్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే వెలుగోడు సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్సీ)కు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుంటలో పడి వ్యక్తి మృతి హొళగుంద: హెబ్బటం గ్రామ శివారులోని పెద్దవంక కుంటలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు ఆలూరు మండలం మనేకుర్తి గ్రామానికి చెందిన బందిర్ల రవికుమార్(26). మతిస్థిమితం సరిగాలేకపోవడంతో అతను అప్పుడప్పుడు ఇంటి నుంచి వెళ్లిపోయి మళ్లీ తిరిగి వచ్చేవాడు. ఇదే మాదిరిగా ఈ నెల 13న కూడా ఇంటి నుంచి వెళ్లిపోయాడు.అయితే, తిరిగి రాకపోవడంతో గాలింపు చేపట్టిన కుటుంబసభ్యులకు ఆదివారం ఉదయం హెబ్బటం పెద్దవంక కుంటలో శవమై కనిపించాడు. నీళ్లు తాగేందుకు వెళ్లి కుంటలో పడి మృతి చెంది ఉంటాడని రవికుమార్ భార్య కుప్పగల్దివ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ లక్ష్మిరామ్నాయక్ విలేకరులకు తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అన్నమయ్య జిల్లా వాసి మృత్యువాతఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణ శివారులోని హైవే గార్డెన్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. జై భారత్ ట్రావెల్స్ బస్సు పాండిచ్చేరి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఆళ్లగడ్డ సమీపంలో హైవైగార్డెన్ సమీపంలోకి వచ్చేసరికి నెల్లూరు నుంచి హైదరబాద్ వెళ్తున్న లారీని క్రాస్ చేస్తూ ప్రమాదవశాత్తూ లారీ వెనుక భాగాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు సీట్లో ఉన్న అన్నమయ్య జిల్లా కంభంవారిపల్లె మండలం కురువపల్లి గ్రామానికి చెందిన సుబ్రమణ్యం తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దొర్వి కోనేరులో బాలిక మృతి రుద్రవరం: మండల కేంద్రం రుద్రవరానికి సమీపాన దొర్వి లక్ష్మీనరసింహస్వామి కోనేరు నీటిలో మునిగిపోయి లియో అనే ఆరేళ్ల బాలిక మృతి చెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు... స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన ఆనంద్ తన ఆరేళ్ల కుమార్తె లియోకు ఈత నేర్పేందుకు ఆదివారం దొర్వి నరసింహ స్వామి ఆలయం వద్దకు వెళ్లాడు. అక్కడ ఆ బాలికకు టైర్ ట్యూబ్ కట్టి కోనేరులో వదిలాడు. మరి కొందరు పిల్లలు కూడా అందులో ఈత కొడుతుండటంతో బాలిక తండ్రి కోనేరుకు కొద్ది దూరంలో కూర్చున్నాడు. కొద్దిసేపటికి దగ్గరికి వెళ్లి చూడగా బాలిక చనిపోయి నీటిలో తేలియాడుతూ కనిపించింది. ఈత నేర్పించేందుకు తీసుకెళ్లితే తిరిగిరానిలోకాలకు బిడ్డ వెళ్లిందని బోరున విలపించారు. -
బౌండరీలు దాటిన క్రీడోత్సాహం!
● కర్నూలు, నంద్యాల పోలీసు అధికారుల ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ● ఇరు జట్లకు కెప్టెన్లుగా వ్యవహరించిన ఎస్పీలు కర్నూలు: విధి నిర్వహణలో మానసిక ఒత్తిడితో సతమతమవుతున్న పోలీసు అధికారులు ఆటవిడుపుగా కర్నూలు ఏపీఎస్పీ 2వ బెటాలియన్ మైదానంలో ఆదివారం ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఆడారు. ఇందులో కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఇరు జట్ల మధ్య నిర్వహించిన క్రికెట్ మ్యాచ్కు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్, నంద్యాల ఎస్పీ సునీల్ షెరాన్ కెప్టెన్లుగా వ్యవహరించారు. పోలీసు సిబ్బందిని ఉత్సాహపరుస్తూ సాగిన ఈ మ్యాచ్లో నంద్యాల జిల్లా పోలీస్ జట్టు విజయం సాధించింది. ఈ సందర్భంగా కర్నూలు ఎస్పీ మాట్లాడుతూ ఇలాంటి ఫ్రెండ్లీ మ్యాచ్లు పోలీసుల్లో ఒత్తిడిని తగ్గించడంతో పాటు శారీరక ధారుడ్యాన్ని పెంచుతాయన్నారు. నంద్యాల ఎస్పీ మాట్లాడుతూ.. కర్నూలు, నంద్యాల జిల్లాల పోలీసుల మధ్య స్నేహ పూరిత వాతావరణాన్ని పెంపొందించేందుకు ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించామన్నారు. క్రీడలు శారీరక ధృడత్వానికి, ఆరోగ్యానికి దోహదం చేస్తాయన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు సుధాకర్, శ్రీనివాసులుతో పాటు సీఐ, ఆర్ఐ, ఎస్ఐ, ఆర్ఎస్ఐలు పాల్గొన్నారు. -
నేడు వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీ
కర్నూలు (టౌన్): పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు వ్యతిరేకంగా సోమవారం కర్నూలు నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టనుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నిరసనలో భాగంగా కర్నూలులోని ప్రభుత్వ ప్రెస్ దగ్గర నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి అనంతరం వినతిపత్రం అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజీల్ ధరలు తగ్గిస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలను మోసం చేశారన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఏపీలోనే అత్యధికంగా పెట్రోల్, డీజీల్ ధరలు ఉన్నాయని తెలిపారు. నిరసనలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. -
20న మెడికల్షాపుల బంద్
కర్నూలు(హాస్పిటల్): మెడికల్షాపులను ఈ నెల 20న బంద్ చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు యాడికి పుల్లయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్ ఫార్మసీల నియంత్రణలేని కార్యకలాపాలు, అన్యాయ డిస్కౌంట్ విధానాలకు వ్యతిరేకంగా ఈ ధర్నా చేస్తున్నట్లు పేర్కొన్నారు. కోవిడ్ కాలానికి సంబంధించిన తాత్కాలిక నోటిఫికేషన్ను తక్షణమే ఉపసంహరించాలని తెలిపారు. ఈ–ఫార్మసి సంబంధిత జీఎస్ఆర్ 817(ఇ) నోటిఫికేషన్ను రద్దు చేయాలని పేర్కొన్నారు. కార్పొరేట్ సంస్థల అన్యాయ భారీ డిస్కౌంట్లను అరికట్టేందుకు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ విధానాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. నేడు డయల్ యువర్ సీఎండీ, ఎస్ఈ కర్నూలు(అగ్రికల్చర్): ఏపీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయమైన తిరుపతి నుంచి డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు కర్నూలు సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ ఆర్.ప్రదీప్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు 8977716661 నంబరుకు ఫోన్ చేయవచ్చని పేర్కొన్నారు. కర్నూలు కొత్తబస్టాండు సమీపంలో ఉన్న విద్యుత్ భవన్లో కూడా సోమవారం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. వినియోగదారు లు 7382614308 నంబరుకు ఫోన్చేసి సమ స్యలు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ కర్నూలు: శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీస్ అధికారులు రౌడీషీటర్లకు నేర చరిత్ర ఉన్న వారిని, సమస్యాత్మక వ్యక్తులకు ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లాలో నాలుగు పోలీస్ సబ్డివిజన్లు, 39 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఆయా స్టేషన్ల పరిధిలో దాదాపు 2 వేల మంది రౌడీషీటర్లు ఉన్నట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ఆయా స్టేషన్ల పరిధిలోని రౌడీ షీటర్లను ఆదివారం స్టేషన్కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. నేర ప్రవృత్తికి స్వస్తి పలికి గౌరవ ప్రదమైన జీవితాన్ని గడపాలని హితబోధ చేశారు. అవసరమైతే పీడీ చట్టం ప్రయోగించి సెంట్రల్ జైలుకు పంపుతామని హెచ్చరించారు. జాతీయ పోటీలకు ‘ౖసైసెరా’ కర్నూలు కల్చరల్: తిరుపతి అభినయ ఆర్ట్స్ ఆధ్వర్యంలో జూలైలో నిర్వహించనున్న జాతీయ స్థాయి నాటక పోటీలకు ‘ౖసైసెరా నరసింహారెడ్డి’ నాటకం ఎంపికై ంది. ఈ మేరకు అభినయ ఆర్ట్స్ అధ్యక్షుడు బీఎన్ రెడ్డి ప్రకటించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను నాటక రూపంలో పత్తి ఓబులయ్య దర్శకత్వంలో ప్రదర్శించనున్నారు. ఈ నాటకం నంది నాటక పోటీలలో పాల్గొని వెండి నందితో పాటు ఇతర నందులను కై వసం చేసుకుంది. గత నెలలో మిర్యాలగూడలో నిర్వహించిన జాతీయస్థాయి పద్య నాటక పోటీల్లో ద్వితీయ బహుమతిని పొందిందని పత్తి ఓబులయ్య తెలిపారు. ప్రస్తుతం అభినయ ఆర్ట్స్ పోటీలకు ఎంపిక కావడంపై పలువురు కళాకారులు హర్షం వ్యక్తం చేశారు. ఆళ్లగడ్డలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం ఆళ్లగడ్డలో అత్యధికంగా 42.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. నంద్యాల రూరల్, కోవెలకుంట్ల, ఉయ్యలవాడల్లో 42.5, చాగలమర్రిలో 42.4, పగిడ్యాల, జూపాడుబంగ్లా, సంజామలల్లో 42.3, మహనందిలో 42.2. కౌతాళంలో 41.5, చిప్పగిరి, గూడూరు, మద్దికెరల్లో 41.4, కర్నూలులో 41.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రానున్న నాలుగైదు రోజుల్లో ఒక వైపు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. -
మంత్రి ఇలాకాలో మూత‘బడి’
నిరుపయోగంగా ఉన్న సంస్కృతోన్నత పాఠశాల మూతపడిన బ్రాహ్మణపల్లె ఎంపీపీ పాఠశాలనంద్యాల(అర్బన్): పేద విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల విద్య ప్రశ్నార్థకంగా మారింది. బడిఈడు పిల్లలు పాఠశాలల్లో ఉండాలని చంద్రబాబు ప్రభుత్వం లక్షలు వెచ్చిస్తూ ప్రచారాలు నిర్వహిస్తున్నా వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ నియోజకవర్గమైన నంద్యాల మండలంలో జెడ్పీహెచ్ఎస్ 9, 3 ఎంపీయూపీ, 39 ఎంపీపీ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో వేలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెండు సంస్కృతోన్నత పాఠశాలలు ఉండగా అందులో నంద్యాల మండలం కానాల గ్రామ మజరా హైస్కూల్ కొట్టాల గ్రామంలో ఉండేది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల సంఖ్య తగ్గిందంటూ పాఠశాలను మూసివేశారు. సంస్కృతం చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులు అయోమయాలకు గురయ్యారు. మామూలు విద్య అయితే ఏదో ఒక పాఠశాలలో చదివేవారు. కాని సంస్కృత పాఠశాల కావడంతో విద్యార్థులు కొంత మంది బడి మానేయాల్సిన పరిస్థితి వచ్చింది. అదే విధంగా బ్రాహ్మణపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎంపీపీ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువ కావడంతో మూతవేశారు. అక్కడ విద్యాభాస్యం చేసే చిన్నారులు సుదూర ప్రాంతాలకు వెళ్లలేక బాల కార్మికులుగా మారాల్సిన పరిస్థితి వచ్చింది. పాండురంగాపురం మజరా సుబ్బారెడ్డి పాలెం ఎంపీపీ పాఠశాల కూడా చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే మూత దశకు చేరుకుంది. రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ నంద్యాల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నంద్యాల మండలంలోని పాఠశాలలు మూతపడి విద్యార్థులు బాల కార్మికులుగా మారుతున్నా మంత్రి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా జిల్లా స్థాయి అధికారులు చర్యలు తీసుకొని మూత పడిన పాఠశాలను తెరిచి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేయాలని కోరుతున్నారు. విద్యార్థులు లేక మూడు ప్రభుత్వ పాఠశాలల మూత సుదూర ప్రాంతాలకు వెళ్లలేని పేద విద్యార్థులు బాల కార్మికులుగా మారుతున్న చిన్నారులు -
బైన్దొడ్డి.. కొల్లగొట్టి!
కోడుమూరు రూరల్: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో కొచ్చింది మొదలు టీడీపీ నాయకులు పెట్రేగిపోతున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనుమతులు లేకున్నా యథేచ్ఛగా ఎర్రమట్టి, ఇసుక తవ్వకాలు చేపడుతూ ప్రకృతి సంపదను కొల్లగొడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. కోడుమూరు మండలంలో కనుమరుగువుతున్న బైన్దొడ్డి తిప్పనే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. అనుమతులు లేనప్పటికీ కొన్ని రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా రాత్రి వేళల్లో ఇక్కడ ఎర్రమటి తవ్వకాలు చేపడుతున్నారు. ఇందుకు యంత్రాలను ఉపయోగిస్తున్నారు. కొండ సగం మాయం! పులకుర్తి గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు, ఆయన అనుచరులంతా కలిసి అక్రమంగా ఎర్రమట్టి తరలింపుకు పాల్పడుతున్నారు. తరలించుకుపోయిన ఎర్రమట్టితో పవన్ విద్యుత్ కోసం ఏర్పాటు చేసే గాలిమరల కోసం పొలాల్లో రోడ్లు వేయడం, కర్నూలు వంటి ప్రాంతాల్లో వేసే వెంచర్లకు టిప్పర్ రూ.12వేల నుంచి రూ.15వేల చొప్పున అమ్ముకుంటూ రూ.లక్షలను అక్రమంగా ఆర్జిస్తున్నారు. ఇప్పటికే బైన్దొడ్డి కొండను సగానికి పైగా మాయం అయ్యింది. దీంతో కొండపై ఉన్న పొలాల పక్కనున్న ఎర్రమట్టిని కూడా తరలించుకుపోతున్నారు. నిత్యం పదుల సంఖ్యలో భారీ టిప్పర్లతో ఎర్రమట్టిని తరలించుకుపోతున్నా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఎర్రమట్టి మాఫియా నుంచి తమ ఊరిని, తిప్పను కాపాడాలని పలు మార్లు అధికారులకు మొరపెట్టుకున్నా వారు పట్టించుకోవడం లేదని బైన్దొడ్డి గ్రామస్తులు వాపోయారు. మండలంలోని బైన్దొడ్డి తిప్ప నుంచి ఎర్రమట్టి తరలింపుకు ఎవ్వరికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. తిప్ప నుంచి ఎవ్వరైనా ఎర్రమట్టి తరలించేందుకు ప్రయత్నిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. – నాగరాజు, తహసీల్దార్, కోడుమూరుతవ్వకాలను అడ్డుకునే వారిపై దాడులు పగలంతా కొండ పక్కన ఉన్న పొలాలు, తోటల్లో యంత్రాలను దాచి పెట్టి చీకటి పడిందంటే చాలు అక్రమార్కులు ఎర్రమట్టి తరలింపును చేపడుతున్నారు. తిప్ప నుంచి ఎర్రమట్టి తవ్వకాలను ఆపాలంటూ వెళ్లే బైన్దొడ్డి గ్రామస్తులు, రైతులపై మాఫియా దాడులకు సైతం తెగబడుతోంది. దీంతో గ్రామస్తులు తిప్ప వైపు పోవాలంటే బెంబేలెత్తిపోతున్నారు. అనుమతులు లేకున్నా ఎర్రమట్టి తవ్వకాలు పులకుర్తి టీడీపీ నేత కనుసన్నల్లోనే తరలింపు చోద్యం చూస్తున్న అధికారులు -
యూరియా విక్రయాల్లో అక్రమాలను సహించం
● ఎరువుల దుకాణాల లైసెన్స్ రద్దు చేస్తాం ● జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి కర్నూలు(అగ్రికల్చర్): యూరియా విక్రయాల్లో అక్రమాలను సహించేది లేదని, ఎరువుల దుకాణాల లైసెన్స్ రద్దు చేస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి హెచ్చరించారు. కర్నూలు పాత బస్టాండు ప్రాంతంలోని సూర్యట్రేడర్స్, బంగారుపేటలోని శివరామకృష్ణ ఎరువుల దుకాణాలను కలెక్టర్తోపాటు జేసీ నూరుల్ ఖమర్ తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... యూరియా అమ్మకాలు విధిగా ఓటీపీ లేదంటే బయోమెట్రిక్ ద్వారా ఆన్లైన్లోనే జరుగాలన్నారు. ఫిబ్రవరిలో జరిగిన యూరియా విక్రయాలను ఏప్రిల్లో ఈ–పాస్లో నమోదు చేయడం నిర్లక్ష్యానికి పరకాష్టగా పేర్కొన్నారు. ఈ షాపులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని, అవసరమైతే లైసన్స్లను సస్పెండ్ చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 14 షాపులపై చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఇబ్బడి ముబ్బడిగా యూరియా అమ్మకాలు చేసిన షాపులపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని వ్యవసాయ యంత్రాంగాన్ని ఆదేశించారు. సాగు తక్కువగా ఉన్న సమయాల్లో యూరియా అమ్మకాలు ఎక్కువగా ఉండటం పలు అనుమానాలకు తావు ఇస్తోందని పేర్కొన్నారు. తనిఖీల్లో జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి, ఏడీఏ సాలురెడ్డి, కర్నూలు మండల వ్యవసాయ అధికారి రూపల్ రోనాల్డ్ తదితరులు పాల్గొన్నారు. శివరామకృష్ణ దుకాణంపై సస్పెన్షన్ వేటు కర్నూలు బంగారు పేటలోని శివరామకృష్ణ పర్టిలైజర్స్లో రికార్డుల నిర్వహణ సరిగా లేనట్లు కలెక్టర్ గుర్తించారు. రికార్డుల నిర్వహణ సరిగా లేకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా నంద్యాల జిల్లాకు యూరియా ఇవ్వడానికి కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు లైసన్స్ను రద్దు చేస్తూ వ్యవసాయ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. -
శబరమ్మా... స్క్రిప్ట్ చదవొద్దు.. వాస్తవాలు తెలుసుకో!
కర్నూలు (టౌన్): ‘నంద్యాల ఎంపీ శబరమ్మ ఆడబిడ్డ. కర్నూలుకు పుట్టింటికి వచ్చినట్లు వస్తుంటారు. ఇక్కడి విషయాలు తెలియవు. మంత్రి కార్యాలయం నుంచి వచ్చిన స్క్రిప్ట్ చదవడం తప్ప వాస్తవాలు తెలియవు’ అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. కర్నూలులోని పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఎస్వీ మాట్లాడారు. ఫార్మా కంపెనీల నుంచి మంత్రి టీజీ భరత్ రూ. 45 కోట్లు వసూలు చేశారని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆరోపించారని, ఆధారాలు ఉన్నాయని అంటున్నారని, మంత్రి టీజీ కేసు వేస్తే హైకోర్టులో చూసుకుంటామన్నారు. అయితే ఈ విషయంపై ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, చివరకు రౌడీ షీటర్ వరకు మాట్లాడుతున్నారన్నారు. ఎందుకంత ఉలుకు అని ఎస్వీ ప్రశ్నించారు. అమరావతిలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అవినీతి, అక్రమాలు చేస్తున్నారని, వేల కోట్లు దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించినప్పుడు స్పందించని ఈ నాయకులంతా ఒకేసారి బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే ‘తప్పు చేశారా.. కప్పి పుచ్చే ప్ర యత్నాలు చేస్తున్నారా..’ అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. రెండు రోజుల క్రితం వైఎ స్సార్సీపీ నిర్వహించిన ధర్నాలో గంజాయి బ్యాచ్, రౌడీలు ఉన్నట్లు చెప్పిన శబరమ్మ అందులో ఒక్కరిపైన అయినా కేసులు చూపించగలవా..మీ అను చరులు మట్కా నిర్వాహకులు అన్న సంగతి తెలి యదా?’ అని ప్రశ్నించారు. పోలీసుల వేధింపులతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బాలుపై నిరా ధార ఆరోపణలు చేస్తున్న శబరమ్మా.. బాలు గత పదేళ్లు టీజీ వద్దే ఉన్నారన్న విషయం తెలుసా...అప్పుడు లేని ఆరోపణలు ఇప్పుడు మాత్రమే కనిపిస్తున్నాయా.. అని అన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులతో ఇబ్బందులు పెడుతున్నారని, వేధిస్తున్నారంటూ కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్సీపీ ధర్నా చేస్తే.. అధికారంలో ఉన్న మీరు ఎస్వీ మోహన్ రెడ్డిని, బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని అరెస్టు చేయాలంటూ ధర్నా చేయడం దిగజారుడుతనానికి నిదర్శమన్నారు. మీరే అధికారంలో ఉన్నప్పుడు అరెస్టు చేయ్యలేరా.. ఇవన్నీ డ్రామాలు కాదా.. అని ప్రశ్నించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. మంత్రి టీజీ అవినీతి, ఆరోపణలపై ఎందుకంత ఉలుకు? విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి -
ఐసెట్లో 1,309 మంది ఉత్తీర్ణత
కర్నూలు సిటీ: ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(ఏపీ ఐసెట్) ఫలితాలను శనివారం విడుదల చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 1,309 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ నెల 2న ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష ప్రాథమిక కీ ఈ నెల 6వ తేదీ విడుదల చేసి 8వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు కీపై అభ్యంతరాలు స్వీకరించారు. ఐసెట్ కర్నూలు జిల్లా నుంచి 1,205 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోగా 999 మంది పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం 905 మంది ఉత్తీర్ణులయ్యారు. అదే విధంగా నంద్యాల జిల్లాకు చెందిన 448 ఐసెట్ పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా 404 మంది పరీక్షలు రాస్తే, 354 మంది ఉత్తీర్ణులయ్యారు. ● ఐయాన్ డిజిటల్లో కేంద్రం ఏర్పాటు కర్నూలు సిటీ: దేశ వ్యాప్తంగా ఉన్న 23 ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)లో బీటెక్ ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్స్లో అర్హత పొందిన విద్యార్థులకు మాత్రమే జేఈఈ అడ్వాన్డ్స్ పరీక్ష నేడు(ఆదివారం) నిర్వహించనున్నారు. మొదటి, రెండు విడతల్లో మెయిన్స్లో అర్హత పొందిన జిల్లాకు చెందిన 1,080 మంది విద్యార్థులు అడ్వాన్డ్స్ పరీక్షకు హాజరుకానున్నారు. కర్నూలు నగర శివారులోని కల్లూరు మండలం దూపాడు గ్రామానికి సమీపంలో ఉన్న ఐయాన్ డిజిటల్లో ఒక పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి విద్యార్థి పేపర్–1, పేపర్–2 పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఉద యం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్–1, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్–2, రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రంలోకి ఉదయం 7 గంటల నుంచే అనుమతించనున్నారు. రేపు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ఉదయం 9.30 గంటలకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులను సమర్పించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్జీల పరిష్కార సమాచారం కోసం 1100కు ఫోన్చేసి తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. కర్నూలు(అర్బన్): రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదిన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ‘ తాలీం – ఎ – హునర్ ’ (టాలెంట్ టెస్ట్) నిర్వహిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి సయిదా సబీహా పర్వీన్ తెలిపారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఈ టాలెంట్ టెస్ట్కు కర్నూలు, నంద్యాల జిల్లాల నుంచి మొత్తం 1,581 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు చెప్పారు. ఈ పరీక్షకు రెండు జిల్లాల్లో నాలుగు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు మధ్యాహ్నం 1.15 గంటలకంతా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, అలాగే హాల్ టికెట్, ప్రభుత్వం జారీ చేసిన ఒరిజినల్ గుర్తింపుకార్డు (ఆధార్ లేదా ఓటరు ఐడీ)ను తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలన్నారు. కర్నూలులోని ఉస్మానియా కళాశాల (పరీక్షా కేంద్రం కోడ్ సీ 12 )లో 576 మంది, ప్రభుత్వ జూనియర్ కళాశాల ( ఓల్డ్ కంట్రోల్ రూమ్ దగ్గర, కోడ్ 13 )లో 334 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. 23న బీసీ డెడికేటెడ్ కమిషన్ రాక ● సునయన ఆడిటోరియంలో బీసీ రిజర్వేషన్లపై వినతుల స్వీకరణ కర్నూలు(అర్బన్): స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన డెడికేటెడ్ కమిషన్ చైర్మన్, రిటైర్డు ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా ఈ నెల 23న కర్నూలుకు వస్తున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ సాధికారత అధికారిణి కే ప్రసూన తెలిపారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. 23న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు స్థానిక కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో సంబంధిత శాఖలకు చెందిన అధికారులతో రాజీవ్ రంజన్ మిశ్రా సమీక్ష నిర్వహిస్తారన్నారు. అలాగే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై ఆసక్తి కలిగిన కుల సంఘాలు, సామాజిక సంస్థలు, ప్రజా ప్రతినిధులు, ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తారన్నారు. ఈ అంశంపై అవగాహన ఉన్నవారు తగు ఆధారాలతో వినతి పత్రాలను కమిషన్కు స్వయంగా అందించవచ్చన్నారు. వినతుల్లో వాస్తవాలను స్పష్టంగా తెలియజేయాలని, సాధ్యమైనంత వరకు తమ వాదనలకు మద్దతుగా అవసరమైన పత్రాలు, ఆధారాల నకళ్లను జతపరచాలన్నారు. ఈ అవకాశాన్ని ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని ఆమె కోరారు. -
బంగారు పల్లకీలో దివ్యతేజం
మంత్రాలయం: శ్రీమఠం ప్రాంగణంలో భక్తుల మధ్య బంగారు పల్లకీలో ఉత్సమూర్తి కొలువుంచి ఉత్సవం నిర్వహించారు. అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం శ్రీరాఘవేంద్రస్వామి దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. మూల బృందావన దర్శనానికి రెండు గంటలకు పైగా సమయం పట్టింది. కల్పతరు దర్శన క్యూలైన్లు, అన్నపూర్ణ భోజనశాల, పరిమళ ప్రసాదం కౌంటర్లు భక్తులతో కిటకిటలాడాయి. తుంగ భద్ర నదీ తీరంలో భక్తుల కోలాహలం నెలకొంది. శ్రీమఠం ప్రాంగణంలో చిన్నబాలుడు శ్రీరాఘవేంద్రస్వామి వేషధారణలో చూడముచ్చటగా కనిపించారు. పాత ఊరిలో శ్రీలక్ష్మివెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
ఎస్సీ కార్పొరేషన్ భూమి కబ్జా
● ఎస్సీ కార్పొరేషన్ ఈడీకి డీహెచ్పీఎస్ నేతల ఫిర్యాదు కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లా డోన్ మండలం కొత్తకోట గ్రామంలో ఎస్సీ కార్పొరేషన్కు చెందిన ఆరు ఎకరాల భూమి కబ్జాకు గురైందని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రామచంద్ర, సీ మహేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు శుక్రవారం ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కే తులసీదేవిని కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలోని 341, 337 సర్వే నెంబర్లలోని 9.31 ఎకరాలను ఎస్సీ కార్పొరేషన్ కొనుగోలు చేసిందన్నారు. గ్రామంలోని 30 మంది దళితులకు కోళ్ల ఫారాలు, షెడ్లు కూడా ఏర్పాటు చేసిందన్నారు. అయితే ఈ భూమిలో ఆరు ఎకరాల భూమి కబ్జాకు గురైందని, రీ సర్వేలో కూడా కబ్జాదారులకే కొమ్ము కాశారని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన రికార్డులను డోన్ తహసీల్దారు, ఆర్డీఓకు అందించినా ఎలాంటి ఫలితం కనిపించడం లేదన్నారు. తక్షణమే ఈ భూమిని మరోసారి రీ సర్వే చేయించి అప్పట్లో కోళ్ల ఫారాలు కేటాయించిన లబ్ధిదారులకు లేదంటే ఎస్సీ కార్పొరేషన్కై నా అప్పగించాలన్నారు. లేని పక్షంలో డీహెచ్పీఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు. ఈడీని కలిసిన వారిలో జిల్లా నాయకులు మాణిక్యం, నాగరాజు, సులోచనమ్మ, ప్రసాద్, మల్లికార్జున తదితరులు ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో నవ వరుడు మృతి
● ముగతి వద్ద ఆటో బోల్తా ● పెళ్లింట విషాదం నందవరం: ముగతి గ్రామ సమీపంలో ఆటో బోల్తా పడి నవ వరుడు బోయ మద్దిలేటి రంగడు (22) మృతి చెందాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇవి.. దేవనకొండ మండలం కప్పట్రాళ్లకు చెందిన బోయ రంగడుకి, గోనెగండ్లకు చెందిని శ్రావణికి ఈ నెల 3వ తేదీన వైభవంగా పెళ్లి చేశారు. నూతన వధువరులు కావడంతో రథోత్సవం చూడాలని గురువారం ఆటోలో కుటుంబ సభ్యులతో మంత్రాలయానికి వెళ్లారు. రాఘవేంద్ర స్వామి దర్శిచుకుని శుక్రవారం తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో నందవరం మండలంలోని ముగతి గ్రామ సమీపంలోని 167వ జాతీయ రహదారిపై ఆటోకు కుక్కలు అడ్డం వచ్చాయి. వాటిని తప్పించబోయి అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నవవరుడు బోయ రంగడుకి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులందరూ (8మంది పెద్దలు, 4 చిన్నారులు) స్వల్ప గాయాలతో బయట పడ్డారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని అంబులెన్స్లో ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి బోయ రంగడిని తరలించారు. డాక్టర్లు పరీక్షించి బోయ రంగడు మృతి చెందినట్లు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పెళ్లింట తీవ్ర విషాదఛాయాలు ఆలుముకున్నాయి. మృతిడి అన్న బోయ రమేష్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ తిమ్మారెడ్డి కేసు నమోదు చేశారు. -
రైతుకు ‘చుట్ట’రికం
● వరిగడ్డికి బేలర్తో భద్రత..! కోవెలకుంట్ల సమీపంలో వరిగడ్డిని చుట్టలుగా చుడుతున్న బేలర్ మారుతున్న కాలానికనుగుణంగా రైతులకు ఆధునిక వ్యవసాయ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. యంత్రాలు రైతులకు శ్రమను తగ్గిస్తూ, కూలీల కొరతను తీరుస్తూ డబ్బులు ఆదా చేస్తున్నాయి. జిల్లాలోని ఆయా మండలాల పరిధిలో ప్రతి ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో వరి విస్తారంగా సాగవుతోంది. ఈ ఏడాది రబీ సీజన్లో వరి పంట చేతికందగా రైతులు కంబైండ్ హార్వేస్టర్లతో కోత, నూర్పిడి పనులు పూర్తి చేశారు.. పైరు నుంచి పంట ఉత్పత్తులు వేరుకాగా పొలంలో గ్రాసం మిగులుతోంది. గతంలో గ్రాసాన్ని కూలీల సాయంతో ట్రాక్టర్లు, ఎద్దుల బండ్లలో నింపుకుని కల్లాల్లో వాములుగా భద్రపరిచి పశువులకు ఆహారంగా అందించేవారు. గ్రాసాన్ని సులభంగా తరలించేందుకు సైతం యంత్రాలను వినియోగిస్తుండటంతో చకచకా పనులు జరుగుతున్నాయి. బేలర్ యంత్రం పొలంలోని వరి గడ్డిని చుట్టలుగా చుడుతోంది. ఆ చుట్టలను ట్రాక్టర్ల లో తరలించి కల్లాల్లో వాములుగా వేస్తున్నారు. గ్రాసం భద్రపరుచుకునేందుకు యంత్రం అందుబాటులోకి రావడంతో పని సులభంగా మారడమే కాకుండా రైతులకు కూలీల కొరత, డబ్బులు ఆదా అవుతోంది. చుట్టలుగా చుట్టిన పశుగ్రాసాన్ని వాములుగా వేయడం వల్ల వర్షాకాలం తడవకుండా ఉండటంతో పశువులకు నాణ్యమైన గ్రాసం అందుతోంది. – కోవెలకుంట్ల -
బ్రెయిన్ స్ట్రోక్తో హెడ్ కానిస్టేబుల్ మృతి
కృష్ణగిరి: కర్నూలు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో హెడ్కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న డి. హనుమంతు (57) అనారోగ్యంతో కో లుకోలేక శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలి పారు. ఈయన స్వగ్రామం కృష్ణగిరి మండల పరిధిలోని టి.గోకులపాడు. ఈయన 1995 బ్యాచ్లో కానిస్టేబుల్గా విధుల్లో చేరి జిల్లాలోని అవుకు, కర్నూలు టూటౌన్, హోళగుంద, మిడుతూ రు,వెల్దుర్తి, ఉల్లిందకొండ, మద్దికెర, ప్రస్తుతం కర్నూ లు త్రీటౌన్లో పని చేస్తున్నారు. ఈ నెల 8న బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రితో ఆపరేషన్ చేశారు. చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందినట్లు వారు తెలిపారు. మృతదేహాన్ని టి. గోకులపాడు గ్రామంలో పోలీస్ లాంచనాలతో అంత్యక్రియలు చేశారు. త్రీటౌన్ సీఐ శేషయ్య, జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు నాగరాజు, సహుద్యోగులు పాల్గొన్నారు. మృతుడికి భార్య విజయ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. -
● రూ.6.73 లక్షలు నగదు, 12 సెల్ఫోన్లు స్వాధీనం
ఆదోని అర్బన్: కర్ణాటక, తెలంగాణ, గోవా, ఆంధ్రప్రదేశ్లో బెట్టింగ్ చేయిస్తున్న తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.6.73 లక్షలు నగదు, తొమ్మిది సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆదోని టూటౌన్ పోలీస్స్టేషన్లో శుక్రవారం రాత్రి సీఐ రాజశేఖర్రెడ్డి వివరాలు వెల్లడించారు. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, హైదరాబాద్, బెంగళూరు, బళ్లారి, గోవా రాజధానిలో 18 రోజులపాటు వారి కోసం మకాం వేశామన్నారు. ప్రత్యేకంగా నిఘా ఉంచి ఆయా నగరాల్లో, జిల్లాల్లో ఆడుతూ, ఆడిస్తున్న తొమ్మిది మంది బెట్టింగ్ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మరి కొంతమంది ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నట్లు తెలియజేశారు. తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నట్లు చెప్పారు. పరారీలో ఉన్న వారిని ఐపీఎల్ క్రికెట్ ముగించేలోపు అరెస్ట్ చేస్తామన్నారు. యాప్లతో బెట్టింగ్.. బెట్టింగ్ నిర్వాహకులు ముందుగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటారని సీఐ తెలిపారు. ఆన్లైన్లో బెట్టింగ్ ఆడుకునేందుకు వారికి యాప్లు ఇస్తారన్నారు. నేరుగా వెళ్లి డబ్బు అందజేసి బెట్టింగ్లు ఆడే వ్యవస్థ ప్రస్తుతం లేదన్నారు. మొత్తం యాప్లోనే ప్రతి ఆటకు, బంతికి, వికెట్కు, గెలుపు, ఓటములకు బెట్టింగ్ ఉంటుందన్నారు. అమాయకులైన యువకులను బెట్టింగ్ మాయలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. ఎవరైనా బెట్టింగ్ ఆడుతున్నా, ఆడిస్తున్నా వారి సమాచారం తమకు అందిస్తే వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. ఎస్ఐ రామ్నాథ్, ఏఎస్ఐ నరసయ్య, సిబ్బంది సురేష్, మద్దిలేటి, మూర్తి తదితరులు పాల్గొన్నారు. బెట్టింగ్ నిర్వాహకుల అరెస్ట్ -
కొమ్ములు తిరిగినా.. క్యూలోనే!
వంతెన మీద నిలిచిన గొర్రెల మంద వందల సంఖ్యలో జీవాలు.. కాపరులు ఇద్దరు, ముగ్గురు మాత్రమే కనిపిస్తారు. వేసవిలో మేత కోసం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి జీవాలను తరలిస్తూ ఉంటారు. ఈ క్రమంలో రహదారులు, వాగులు, వంకలు, కుంటలు మీదుగా తీసుకెళ్లాల్సి వస్తోంది. అయితే మందలో ఒకటి కూడా తప్పిపోకుండా చూసుకోవడం కాపరుల నిఘా ఎంత ఉన్నా.. జీవాలు ఒక దాని వెంట ఒకటి వెళ్తూ క్రమశిక్షణ అవవర్చుకున్నట్లుగా కనిపిస్తాయి. మండు వేసవిలో జీవాలకు దాహం తీర్చుందుకు కాపరులు క్రిష్టిపాడు సమీపంలోని కుందూ నది ఆవతలి వైపు తీసుకెళ్తుండగా వంతెనపై జీవాలు వరుసలో నిలబడి ‘ఎక్కడైనా సరే క్యూలో ఉంటామంటూ’ చెప్పినట్లుగా కనిపించింది ఈ చిత్రం. కొమ్ములు తిరిగిన పొట్టేళ్లు సైతం వరుసలో నిలబడి ఆకట్టుకున్నాయి. – దొర్నిపాడు -
కంకర పరిచారు.. తారు మరిచారు!
కర్నూలు–బళ్లారి రహదారిపై తారు వేయని రోడ్డు ఆలూరు రూరల్: ఆలూరు మీదుగా వెళ్లే కర్నూలు–బళ్లారి ప్రధాన రహదారి దెబ్బతిని గుంతల మయంగా మారింది. రోడ్డు మరమ్మతుల్లో భాగంగా అధికారులు మూడు నెలల క్రితం అర కిలో మీటరు దూరం వరకు గుంతలు పూడ్చి కంకర పరిచారు. ఇప్పటి వరకు తారు వేయకపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ప్రతి రోజు ఆలూరు మీదుగా కర్నూలు నుంచి బళ్లారికి వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. వాహనాల రాకపోకల సమయంలో దుమ్ము,ధూళి రేగుతుండటంతో వాహనదారులు ముఖ్యంగా బైకర్లు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కంకర పరచడంతో బైక్లు అదుపుతప్పి కింద పడుతుండటంతో వాహనదారులు గాయాలపాలవుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
విద్యార్థులందరినీ బడిలో చేర్పించాలి
కర్నూలు(సెంట్రల్): ఐదో తరగతి చదివిన విద్యార్థులందరినీ ఆరో తరగతిలో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఎంఈఓలు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు. శుక్రవారం పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్ల అంశంపై కలెక్టర్ విద్యాశాఖాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ.. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి 2,81,000 మంది విద్యార్థులను బడిలో చేర్పించే లక్ష్యం ఇచ్చారన్నారు. అందులో ఇప్పటి వరకు 2,36,000 మందిని చేర్పించారని, మిగిలిన 45 వేల మందిని చేర్పించడంలో సమస్య వస్తోందన్నారు. ఇందులో ఎక్కువగా 5వ తరగతి నుంచి 6వ తరగతి వెళ్లే వారిలో కేవలం 56 శాతం మాత్రమే అంటే 17,595 మందిని మాత్రమే బడిలో చేరుతున్నారని, మిగిలిన 13,510 మందిని చేర్పించలేక పోతున్నారన్నారు. ఇందుకోసం ఎంఈఓలు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అడ్మిషన్లపై దృష్టి సారించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో డీఈఓ సుధాకర్ పాల్గొన్నారు. జాతీయ రహదారిపై మట్టి లారీ బోల్తా పాణ్యం: వికారాబాద్ నుంచి కడపకు మట్టిలోడ్తో వెళ్తున్న లారీ తమ్మరాజుపల్లె గ్రామం వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో బోల్తా పడింది. ఈ ఘటనలో కడపకు చెందిన లారీ డ్రైవర్ రవికుమార్కు తీవ్ర గాయాలయ్యాయి. అతి వేగంగా వస్తూ అదుపు తప్పి హైవేలోని డివైడర్ మధ్యలో ఉన్న విద్యత్ స్తంభాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. హైవే రోడ్డుపై మట్టి పడడంతో రాకపోకలు అంతరాయం ఏర్పడింది. హైవే పోలీసులు జేసీబీల సహాయంతో మట్టిని తొలగించి ట్రాఫిక్ సమస్య లేకుండా చేశారు. గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఆదోని అర్బన్: ఆదోని నుంచి ఇస్వీకి వెళ్లే మార్గంలో మాసా మసీదు వెనుక భాగంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు వన్టౌన్ సీఐ చంద్రశేఖర్ శుక్రవారం తెలిపారు. మృతుని వయస్సు 35 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉండొచ్చన్నారు. ఎత్తు 5.6 ఉంటుందని, శరీరంపై తెల్లటి బనియన్, తెల్లటి ప్యాంటు ఉందన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. గుర్తు పట్టిన వారు ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి రావాలన్నారు. వీధి కుక్కల దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు గడివేముల: వీధి కుక్కల దాడిలో గురువారం బూజనూరు గ్రామానికి చెందిన ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామానికి చెందిన ఓబులమ్మ, శివయ్య కుమారుడు బండి సంజయ్ ఆడుకునేందుకు వెళ్తుండగా ఒక్కసారిగా వీధి కుక్కలు కింద పడేసి తీవ్ర గాయాలు పాలు చేశాయి. దీంతో చుట్టుపక్కల ఉన్నవారు కుక్కలను కొట్టడంతో బాలుడిని వదిలేసి వెళ్లిపోయాయి. తీవ్ర గాయాల పాలైన బాలుని ఆటో ద్వారా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలుడి ముఖంపై తీవ్ర గాయాలు కావడంతో కుట్లు వేసి చికిత్స పొందుతున్నాడు. గ్రామాల్లో కుక్కలు ఎక్కువగా ఉన్నా అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు తెలిపారు. -
వ్యవసాయ బావిలో పడిన 40 బర్రెలు
జూపాడుబంగ్లా/పాములపాడు: నీటికోసం వెళ్లిన 45 బర్రెలు బావిలో పడగా ఎనిమిది మృత్యువాతపడిన సంఘటన మండలంలోని 80 బన్నూరు గ్రామసమీపంలోని లక్ష్మీనగర్ వద్ద చోటుచేసుకుంది. బాధిత రైతులు తెలిపిన వివరాల మేరకు.. 80 బన్నూరు గ్రామానికి చెందిన పెద్దసామేలు, లక్ష్మమ్మ, ఈడిగ రమణ, శంకర్గౌడు, జక్కరయ్య, మనోహర్, హర్షపోగు శ్రీనివాసులు మరో వ్యక్తి బర్రెలను పోషించుకొంటూ జీవిస్తున్నారు. గురువారం ఉదయం బర్రెలను మేపుకునేందుకు గ్రామ సమీపంలోని పొలాల్లోకి తోలుకెళ్లారు. మధ్యా హ్నం సమయంలో వారు ఇళ్లవద్ద భోజనం చేసి వచ్చేందుకు వచ్చారు. అయితే ఎండల తీవ్రతతో దాహం కొన్న బర్రెలు నీటికోసం వెతుకుతూ సమీపంలోని కృష్ణారెడ్డి పొలంలో ఉన్న బావి వద్దకు వెళ్లాయి. బావిలోని నీటిని తాగేందుకు యత్నించిన బర్రెలు ఒక్కొక్కటిగా బావిలో పడిపోయాయి. బావిచుట్టూ కట్టడం లేకపోవటం, బావిలోంచి పైకి వచ్చేందుకు మార్గం లేక పోవటంతో బర్రెలు రాత్రంతా బావిలోనే ఈదుకొంటూ ఉన్నాయి. 8 బర్రెలు ఊపిరాడక మృత్యువాతపడినట్లు బర్రెల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లవద్ద భోజనం చేసి వెళ్లిన యజమానులకు బర్రెలు కనిపించకపోవటంతో వాటి కోసం చుట్టుపక్కల పొలాల్లో వెతకసాగారు. చివరికు శుక్రవారం సాయంత్రం ఆరుగంటల సమయంలో ఓ రైతు పొలంలోని బావిలో కనిపించాయి. అయితే వాటిని పైకి రప్పించేందుకు యత్నించిన యజమానులు మార్గం లేకపోవటంతో జేసీబీ సహాయంతో కొన్నింటిని బయటకు తీశారు. ప్రస్తుతానికి 8 మృత్యువాత పడ్డాయి. మరికొన్ని కనిపించకుండా పోయినట్లు రైతులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పాములపాడు ఎస్ఐ తిరుపాలు తన సిబ్బందితో సంఘటన స్థల చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లక్షల రూపాయల విలువైన పాడి పశువులు మృత్యువాత పడటంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
ప్రయాణికుల అగచాట్లు
వేసవి సెవులు కావటం, పెళ్లిళ్లు, ఉత్సవాలు ఉండటం, విద్యార్థులకు ఎంట్రెన్స్ పరీక్షలు ఉండటంతో ఆర్టీసీ బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. సరైన బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఎమ్మిగనూరు బస్టాండ్ నుంచి కర్నూలు, ఆదోని ప్రాంతాలకు వెళ్లేందుకు శుక్రవారం బస్సులు దొరకలేదు. ఎండ వేడిని లెక్క చేయకుండా బస్సుల రాకకోసం గంటల తరబడి ప్రయాణికులు నిరీక్షించారు. ఒక్క బస్సు వస్తే సీటు కోసం దానితో పరుగులు పెట్టారు. ప్రమాదవశాత్తు టైరు కిందపడితే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంది. బస్సు సర్వీసులు పెంచి ప్రయాణికులు కష్టాలను తీర్చాల్సి ఉంది. – ఎమ్మిగనూరురూరల్ -
పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి
● కలెక్టరేట్ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నాకర్నూలు(సెంట్రల్): పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి డి.గౌస్దేశాయ్ మాట్లాడుతూ.. ఐదు రాష్ట్రాల ఎన్నికల తరువాత బీజేపీ దేశ ప్రజలపై పెనుభారం మోపిందన్నారు. ఎన్నికల సమయంలో దేశం వెలిగిపోతుందని చెప్పి ముగియగానే పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచడం అన్యాయమన్నారు. ఇది దేశ ప్రజలను మోసం చేయడం అవుతుందన్నారు. మోదీ అధికారంలోకి రాక మునుపు లీటర్ పెట్రోల్ కేవలం 55, డీజిల్ రూ.45 ఉండేదన్నారు. ఇప్పుడు ఆ ధరలు రెట్టింపయ్యాయన్నారు. ఇటీవల గ్యాస్ ధరలను కూడా భారీగా పెంచారని పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు. సీపీఎం నాయకులు ఎం.రాజశేఖర్, విజయ్, షరీఫ్, సుధాకరప్ప, అబ్దుల్దేశాయ్, రామకృష్ణ, ప్రభాకర్, నరసింహులు, ఏసు పాల్గొన్నారు. నేడు జిల్లా వ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళనలు పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని కోరుతూ శనివారం సీపీఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య ఓ ప్రకటనలో తెలిపారు. ఆటో చార్జీలు పెరిగి ప్రజలకు ఇబ్బంది అవుతుందన్నారు. -
అను‘మతిలేకుండా’..
కర్నూలు(సెంట్రల్): ఇళ్లులేని పేదలు సెంటు స్థలం ఇవ్వమని కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరిగినా అధికారులు కనికరించరు. అయితే అధికార పార్టీ(టీడీపీ) జిల్లా కార్యాలయానికి స్థలాన్ని కేటాయించమని అడిగితే మాత్రం హూ జిహూర్ అంటున్నారు. క్షణాల మీద కర్నూలు నగరంలోని నడిబొడ్డున సీక్యాంపులో 1.5 ఎకరాలను కేటాయించడానికి అన్ని రకాల అనుమతులు ఇచ్చేశారు. భూ కేటాయింపుపై ప్రభుత్వం తుది నిర్ణయాన్ని వెల్లడించక ముందే టీడీపీ నాయకులు కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అయినా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. అనుమతులు రాకుండానే భూమి పూజ కల్లూరు మండలం కల్లూరు గ్రామ రెవెన్యూ సర్వే నంబర్743/ఏ1లో టీడీపీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భూమి అడిగిన నేపథ్యంలో 1.5 ఎకరాలను కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం శుక్రవారం(మే15)వ తేదీన జీఓ ఎంఎస్ నంబర్ 285ను విడుదల చేసింది. అయితే ప్రభుత్వం నుంచి తుది ఆదేశాలు రాక మునుపే టీడీపీ నాయకులు ముందుగా అనుకున్న ప్రదేశంలో మే 5వ తేదీనే కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ చేయడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ప్రభుత్వ అనుమతులు లేకుండా భూమిపూజ చేశారంటే అది ఆక్రమణ కిందకు వస్తుందని, అప్పుడు అధికారులు ఏమి చేస్తున్నారనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. విమర్శలు.. ఆరోపణలు అన్నీ అనుమతులు వచ్చాక అందులో సంబంధిత వ్యక్తులు లేదా సంస్థలు లీజు నిబంధనల మేరకు ఏమైనా చేసుకోవచ్చు. అయితే టీడీపీ నాయకులు అధికారం తమదేనని, తమను ఎవరూ ప్రశ్నిస్తారన్న అహంకారంతో అనుమతులు లేకున్నా పది రోజలు ముందుగానే కార్యాలయ నిర్మాణానికి భూమి చేశారు. ప్రభుత్వ భూమిని అనధికారికంగా ఆక్రమించుకున్నా అధికారులు పట్టనట్లు వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి. పదవులు లేకున్నా అధికారిక కార్యక్రమాల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులను అధికారులు ఆహ్వానించడంపై ఆరోపణలు వస్తున్నాయి. 66 ఏళ్లకు లీజు!టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయానికి కల్లూరు సర్వే నంబర్లోని 743/ఏ1లో 1.5 ఎకరాలను లీజు ప్రతిపాదికన కేటాయించారు. అయితే ఇందులో కొన్ని విస్తుపోయే నిజాలు ఉన్నాయి. కేవలం ఏడాదికి ఎకరానికి రూ.1000 మాత్రమే లీజు కింద చెల్లిస్తారు. అలా 66 ఏళ్లపాటు లీజు ఉంటుంది. తరువాత దానిని మరో 66 పొడిగించుకునే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో టీడీపీ జిల్లా కార్యాలయానికి కేటాయించిన 1.5 ఎకరాలకు ఏడాదికి రూ.1500, అలాగే 66 ఏళ్లకు కేవలం రూ. 99 వేలు మాత్రమే లీజు కింద చెల్లిస్తారు. లీజు కేటాయింపులపై ప్రజలు టీడీపీ జాక్పాట్ కొట్టిందని, ప్రభుత్వ ధనాన్ని అధికార పార్టీ కోసం దుర్వినియోగం చేయడం అన్యాయమని ప్రజలు పేర్కొంటున్నారు. మే 5న టీడీపీ జిల్లా కార్యాలయానికి భూమి పూజ స్థలం కేటాయింపుపై మే 15న జీఓ విడుదల 1.5 ఎకరాల స్థలం 66 ఏళ్లపాటు లీజు అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై ప్రజల ఆగ్రహం -
రెప్పపాటులో విషాదం!
● రోడ్డు ప్రమాదంలో కర్నూలు వాసులు ముగ్గురు మృతి ● 8 మందికి తీవ్ర గాయాలు ● ప్రమాదానికి నిద్రమత్తే కారణంకర్నూలు: చిత్తూరు– తిరుపతి జాతీయ రహదారి చవటపల్లి సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలు బళ్లారి చౌరస్తా ప్రాంతానికి చెందిన కృష్ణ (68), కోడళ్లు రమ్యశ్రీ (35), హేమలత (31) మృతిచెందారు. తమిళనాడు రాష్ట్రం తిరువన్నమలై జిల్లా అరుణాచలం శివపార్వతి స్వామివార్లను దర్శించుకుని తిరుగు ప్రయాణంలో తిరుమల శ్రీవారి దర్శనార్థం వెళ్తుండగా చవటపల్లి సమీపంలో ఆగి ఉన్న లారీని వీరు వెళ్తున్న జైలో కారు ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. వాహనంలో కృష్ణ కుటుంబానికి చెందిన 11 మంది సభ్యులు ఉన్నారు. గురువారం సాయంత్రం కర్నూలు నుంచి అరుణాచలానికి చేరుకుని స్వామిఅమ్మవార్ల దర్శనం పూర్తి చేసుకున్నారు. తిరుగు ప్రయాణంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో మృతిచెందిన కృష్ణ కుమారుడు మనోజ్ కుమార్ విశ్రాంతి లేకుండా వాహనం నడుపుతుండటంతో చవటపల్లి సమీపంలో నిద్రమత్తులోకి జారుకున్నాడు. దీంతో రోడ్డుపై ఆగివున్న లారీని ఢీకొట్టడంతో జైలో వాహనం ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో మనోజ్ కుమార్, విజయలక్ష్మి, హేమంత్, చిన్నారులు లోహిత్ చార్మి, కళ్యాణ్, సుహస్రలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు వారిని 108 అంబులెన్స్లో చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే పూతలపట్టు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద సంఘటనను పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
వైఎస్సార్సీపీలో పలువురికి పదవులు
కర్నూలు (టౌన్): జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పార్టీ కోసం పనిచేస్తున్న పలువురికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవులు దక్కాయి. వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా కె. గోవర్ధన్ (ఆలూరు), ఎస్సీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా హగనూరు పాండు (ఆలూరు) నియమితులయ్యారు. జిల్లా ఉపాధ్యక్షులుగా పీ. జీ. నరసింహులు యాదవ్ (కర్నూలు), ఆదోని మున్సిపల్ పార్టీ నిర్వాహక సభ్యులుగా ఎస్. మహబూబ్ బాషా (ఆదోని), ఆదోని మున్సిపాల్టీ పార్టీ విభాగం అధ్యక్షులుగా బోయ చిన్న లారెప్ప (ఆదోని) లను పార్టీ నియమించింది. శుక్రవారం ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. కొత్తపల్లిలో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. కొత్తపల్లిలో 42.7, బనగానపల్లిలో 42.6, బండిఆత్మకూరులో 42.3, ఆళ్లగడ్డలో 42.3, చిప్పగిరిలో 42.2, సంజామలలో 42.1, నంద్యాల రూరల్లో 42.1, పాణ్యంలో 42.1 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో కూడా అధిక ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉందని, ప్రజలు వడదెబ్బకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ విభాగం అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అపర భగీరథుడు కాటన్ కర్నూలు సిటీ: కరువు నేలను అన్నపూర్ణగా మార్చిన అపర భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్ అని జల వనరుల శాఖ ఇంజినీర్లు అన్నారు. సర్ ఆర్థర్ కాటన్ జయంతి సందర్భంగా శుక్రవారం కర్నూలులోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జల వనరుల శాఖ శాఖ కర్నూలు సర్కిల్ పర్యవేక్షక ఇంజినీర్ బాలచంద్రారెడ్డి, రిటైర్డ్ ఈఎన్సీ జలంధర్, రిటైర్డ్ సీఈ మురళీనాథ్ రెడ్డి, రిటైర్డ్ ఎస్ఈలు చెంగయ్యకుమార్, పునార్దన్ రెడ్డి, రిటైర్డ్ ఈఈ విశ్వనాథం ముఖ్య అతిఽథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గోదావరిపై ధవళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి భరీరథుడుగా కాటన్ రైతు గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. జల వనరుల శాఖ ఏఈఈ సంధ్యరాణి, ఇంజినీర్లు పాల్గొన్నారు. త్వరితగతిన భూ సేకరణ తుగ్గలి: జియో మైసూర్ సర్వీసెస్(ఇండియా)గోల్డ్ మైనింగ్ ప్రవేటు లిమిటెడ్ కంపెనీ కోసం భూ సేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆర్డీవో ఓబులేసు సూచించారు. తుగ్గతి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రవి, మైనింగ్ ప్రతినిధి బాలాజీతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. మైనింగ్ పరిధిలోని ప్రభుత్వ, డి పట్టా భూముల కొనుగోలుకు సంబంధించి పరిహారంపై రైతులతో మాట్లాడాలన్నారు. భూసేకరణ వేగవంతం చేయాలని సూచించారు. కర్నూలు (అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్ ఆరంభం నుంచే యూరియా క్రయవిక్రయాలపై జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులు నిఘా ఉంచాలని వ్యవసాయ శాఖ కమిషనర్ మనజీర్ జిలానీ ఆదేశించారు. ఈనెల 14న ‘సాక్షి’లో ‘లెక్కల్లో యూరియా.. దుకాణాల్లో మాయ’ శీర్షికన ప్రచురితమైన కథనానికి వ్యవసాయ శాఖ కమిషనరేట్ స్పందించింది. కర్నూలు, నంద్యాల జిల్లా కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారుల నుంచి యూరియాకు సంబంధించి వాస్తవ పరిస్థితి తెప్పించుకుంది. ఖరీఫ్ ఆరంభం నుంచి యూరియా పంపిణీపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి నిరంతరం సమీక్షించాలని కమిషనర్ సూచించారు. ప్రస్తుతానికి యూరియాకు ఎలాంటి సమస్య లేదని, డిమాండ్కు తగ్గ నిలువలు ఉన్నాయని పేర్కొన్నారు. సబ్సిడీ విత్తన ధరలు ఖరారు కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్కు సబ్సిడీపై పంపిణీ చేసే విత్తనాల ధరలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. వేరుశనగ కిలో ఽపూర్తి ధర రూ.102 నిర్ణయించగా సబ్సిడీ 40 శాతం ఉంటుంది. సబ్సిడీ పోగా రైతులకు కిలోకు రూ.61.20 చెల్లించాల్సి ఉంది. కర్నూలు జిల్లాకు వేరుశనగ 10,723 క్వింటాళ్లు, నంద్యాల జిల్లాకు 2,136 క్వింటాళ్లు కేటాయించింది. పచ్చి రొట్ట ఎరువుల విత్తనాలను 50 శాతం సబ్సిడీపై పంపిణీ చేస్తోంది. దయంచ కిలో ఽపూర్తి ధర రూ.160 ఉండగా... సబ్సిడీ రూ.80 ఉంటుంది. సన్హెంప్ కిలో పూర్తి ధర రూ.154 ఉండగా... సబ్సిడీ రూ.77 ఉంటుంది. పిల్లి పెసర కిలో పూర్తి ధర రూ.196 ఉండగా.. సబ్సిడీ రూ.98 ఉంటుంది. -
లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు
● న్యాయ విజ్ఞాన సదస్సులో లీలా వెంకటశేషాద్రి కర్నూలు: పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి హెచ్చరించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి సూచనల మేరకు కల్లూరు ముజఫర్ నగర్ సచివాలయంలో పోక్సో యాక్ట్పై శుక్రవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి లీలా వెంకటశేషాద్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జాగృతి పథకం 2025 కింద సురక్షిత బచ్చన్ – సురక్షిత భవిష్యపై అవగాహన కల్పించారు. అక్కడున్న పిల్లలకు పొక్సో చట్టంపై అవగాహన కల్పించారు. 18 సంవత్సరాల లోపు వయస్సు గల పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడకుండా పోక్సో చట్టం ఉపయోగపడుతుందని తెలిపారు. పోక్సో కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక కోర్టు ఉందని తెలిపారు. పిల్లలకు ఏదైనా సమస్య వస్తే లీగల్ సర్వీసెస్ టోల్ఫ్రీ నంబర్ 15100కు కాల్ చేస్తే వారి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. కిశోర వికాసం కింద బాల్య వివాహాలతో జరిగే నష్టాల గురించి జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శారద వివరించారు. చైల్డ్ హెల్ప్లైన్ నంబర్ 1098, మహిళా హెల్ప్లైన్ నంబర్ 181, పోలీస్ హెల్ప్లైన్ నంబర్ 112 గురించి పిల్లలకు, వారి తల్లిదండ్రులకు వివరించి కర్నూలు సీడీపీఓ అనురాధ అవగాహన కల్పించారు. అనంతరం బాల్య వివాహాల వ్యతిరేక ప్రతిజ్ఞను పిల్లలతో చేయించారు. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ శివరామచంద్రరావు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
‘పల్లె’ పనులు మళ్లీ పరిశీలన
కర్నూలు(అర్బన్): జిల్లాలో పల్లె పండుగ 2.0 కింద చేపట్టిన పనులను మరోసారి పరిశీలించాలని ప్రభు త్వం నిర్ణయించింది. తక్కువ సమయంలో అధిక పనులను మంజూరు చేయడం, వేగంగా వాటిని పూర్తి చేయడంతో పీఆర్ క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్లు, డ్వామా ఏపీడీలు సంయక్తంగా ఆయా పనులను పరిశీలిస్తున్నారు. కర్నూలు, ఆదోని, పత్తికొండ క్లస్టర్లలో 25 శాతం పనులను పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే సంబంధిత అధికారులు క్లస్టర్ల పరిధిలోని ఆయా గ్రామాల్లో చేపట్టిన ప నులను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నారు. పరిశీలనకు సంబంధించిన నివేదికలను ఈ నెలాఖరు నాటికి జిల్లా అధికార యంత్రాంగానికి అందజేయనున్నారు. పల్లె పండుగ 2.0 కార్యక్రమంలో జిల్లాలో రూ.119.20 కోట్లతో 1,131 పనులను చేపట్టారు. ఆయా గ్రామా ల్లో మొత్తం 160 కిలోమీటర్ల మేర అంతర్గత సీసీ రోడ్లు వేయాలనేది లక్ష్యం. ప్రస్తుతం జరుగతున్న పరిశీలన పూర్తి అయిన అనంతరం ఆయా రోడ్లను పీఆర్ క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్లు తనిఖీ చేయనున్నారు. -
జీఎస్టీ సక్రమంగా వసూలు చేయాలి
● జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరికర్నూలు(సెంట్రల్): వ్యాపారుల నుంచి సక్రమంగా జీఎస్టీ వసూలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వాణిజ్య పన్నుల శాఖల అధికారులతో జీఎస్టీ వసూళ్లపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..జిల్లాలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయ మార్గాలను మెరుగుపరచేందుకు వసూళ్లలో పారదర్శకతను పాటించాలన్నారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను జీఎస్టీ ఆదాయానికి సంబంధించి నిర్దేశించిన లక్ష్యాన్ని చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. రికవరీ చేసే సమయంలో ఆర్ఆర్ యాక్ట్ కింద వేలం వేసేటప్పుడు తగిన సహాయ సహకారాలు అందించాలని పోలీసు శాఖకు సూచించారు. నిషేధిత ఆస్తుల జాబితాను జీఎస్టీ వారి నుంచి సేకరించి వాటిని రిజిస్ట్రేషన్లు చేయకుండా అడ్డుకోవాలని రిజిస్ట్రేషన్ శాఖను ఆదేశించారు. కాంట్రాక్టర్లు సక్రమంగా పన్ను చెల్లింపులు చేస్తున్నారా లేదా అనే డేటాను సేకరించాలని ఆదేశించారు. సమావేశంలో కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ నీరజ, డిప్యూటీ కమిషనర్ సతీష్కుమార్, పరిశ్రమల శాఖ జీఎం అశోక్కుమార్, జెడ్పీ సీఈఓ రమణారెడ్డి, డీఎస్ఓ రాజా రఘువీర్, ఎల్డీఎం మెహన్, సమగ్ర శిక్ష ఏపీఓ లోకరాజు పాల్గొన్నారు. -
వసూళ్లు ఇలా..
● ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల లైసెన్స్ల జారీకి పెద్ద ఎత్తున వసూళ్లు ● నమ్మకస్తులైన ఏఈవోలు, డీలర్ల ద్వారా ముడుపుల దందా ● వ్యవసాయ శాఖలో కలకలం రేపిన ఎమ్మిగనూరు ఏఈవో లంచం వ్యవహారం● వ్యవసాయ శాఖ ద్వారా విత్తన వ్యాపారానికి ఉన్న లైసెన్స్ ఫీజు రూ.1000 మాత్రమే. ఇది కూడా చలానా రూపంలో చెల్లించాల్సి ఉంది. ● ఎమ్మిగనూరులో మాత్రం రూ.35 వేలు డిమాండ్ చేసి రూ.30 వేలకు ఒప్పందం చేసుకొని లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోవడం వ్యవసాయ శాఖలో సంచలనం సృష్టిస్తోంది. ● ఫర్టిలైజర్ వ్యాపారానికి సంబంధించి హోల్సేల్ లైసెన్స్కు రూ.9 వేలు, రిటైల్ వ్యాపారానికి లైసెన్స్ కోసం రూ.5,000 చలానా చెల్లించాల్సి ఉంది. ● రీటైల్కు రూ.50 వేల వరకు, హోల్సేల్కు రూ. 75 వేల వరకు ముడుపులు వసూలు చేస్తున్నారు. ● పురుగు మందుల వ్యాపారానికి అర్బన్ ప్రాంతాల్లో రూ.7,500, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,500 లైసెన్స్ ఫీజు ఉంది. ● అర్బన్ ప్రాంతాల్లో రూ.50 వేల నుంచి రూ.75 వేల వరకు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు పిండుతున్నారనే విమర్శలు ఉన్నాయి. కర్నూలు(అగ్రికల్చర్): రైతులకు సేవలందించాల్సిన వ్యవసాయ శాఖ అక్రమాలకు నిలయంగా మారుతోంది. ఎమ్మిగనూరులో ఏఈవో లంచం వ్యవహారం ఇందుకు ఉదాహరణగా నిలిచింది. రంగన్నగౌడు అనే వ్యక్తికి సీడ్ లైసెన్స్ కోసం రెకమెండ్ చేసేందుకు రూ.30 వేలు లంచం తీసుకుంటూ వ్యవసాయ విస్తరణాధికారి ఏసీబీ అధికారులకు పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల షాపులకు లైసెన్స్ పొందాలంటే మండలస్థాయిలో ఏవో కీలకం. ఏవో రెకమెండ్ చేస్తేనే ఏడీఏకు వెళ్తుంది. రెకమెండ్ చేయడంలో వ్యవసాయ విస్తరణ అధికారులకు ఏ విధమైన సంబంధం లేదు. అయితే కొందరు ఏవోలు నమ్మకస్తులైన వారిని నియమించుకొని ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల షాపుల కోసం వచ్చే దరఖాస్తుల ప్రక్రియ, ముడుపుల వ్యవహారం నడుపుతున్నారు. గత ఏడాది వ్యవసాయ అధికారుల బదిలీలు జరిగాయి. టీడీపీ నేతలకు రూ.లక్షలు ముడుపులు ఇచ్చుకొని కీలకమైన మండలాలకు కొందరు ఏవోలు పోస్టింగ్లు పొందినట్లు విమర్శలు ఉన్నాయి. రూ.20 వేల వరకు వసూలు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత అవినీతి, అక్రమాలు రాజ్యమేలుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులు తమ జేబుల్లో రూ.1000 వరకు మాత్రమే ఉంచుకోవాలి. అంతకంటే ఎక్కువగా ఉంటే రికార్డుల్లో చూపాల్సి ఉంటుంది. ఎమ్మిగనూరు మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో అనధికారికంగా రూ.73,600 ఉన్నట్లు తేలింది. ఈ మొత్తం లంచాల కింద రాబట్టినదేనన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సాధారణంగా సీడ్, ఫెస్టిసైడ్ లైసెన్స్లు జిల్లా వ్యవసాయ అధికారి జారీ చేస్తారు. ఎరువుల వ్యాపారానికి సబ్ డివిజన్ స్థాయిలో ఏడీఏ, జిల్లా స్థాయిలో అడిషినల్ డైరెక్టర్ లైసెన్స్లు ఇస్తారు. ఏ లైసెన్స్ పొందాలన్నా ఏవో రెకమెండేషన్ చేయాల్సి ఉంది. కొందరు ఏవోలు లంచం కింద రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. నకి‘లీలలు’ నకిలీ పురుగుమందులు, విత్తనాలను వ్యవసాయ అధికారులు అరికట్టాల్సి ఉంది. అయితే ఎమ్మిగనూరు, ఆదోని, ఆలూరు, మంత్రాలయం ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా ఉంటున్నాయి. లైసెన్స్ పొందిన దుకాణాల్లో నకిలీలను ఉంచి బహిరంగంగా అమ్మకాలు సాగిస్తూ రైతుల జీవితాలతో చెలగాట మాడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎమ్మిగనూరు ఏవో గత ఏడాది అధికార పార్టీ నేతలకు రూ. 20 లక్షలు ముడుపులు ఇచ్చుకొని పోస్టింగ్ వేయించుకున్నారనే చర్చ వ్యవసాయశాఖలో జోరుగా సాగుతోంది. ఏవోగా వచ్చినప్పటి నుంచి ముడుపుల వేటలోనే ఉన్నట్లు విమర్శలు ఉన్నాయి. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల డీలర్లు ప్రతి నెలా రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు ముడుపులు ఇస్తున్నట్లు తెలుస్తోంది. -
నవోదయలో నో అడ్మిషన్
● 27 మందికి సీట్లు రిజెక్ట్ ● విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన ఎమ్మిగనూరురూరల్: మండల పరిధిలోని బనవాసి జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశానికి నిర్వహించిన ఎంట్రెన్స్ పరీక్షలు ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు 27 మందిని విద్యాలయంలో చేర్చుకోమని విద్యాలయ ప్రిన్సిపాల్ పద్మావతి చెప్పారు. దీంతో శుక్రవారం విద్యాలయం సమీపంలో విద్యార్థుల తల్లిదండ్రులు అందోళన చేశారు. ప్రిన్సిపాల్ రిజెక్ట్ చేసిన 27 మంది విద్యార్థులు వివిధ ప్రాంతాలకు చెందిన వారు. నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశానికి దరఖాస్తు ఒక్క సారే చేసుకోవాలని, మొదటి సారి సీటు రాకపోతే రెండోసారి చేసుకోవటానికి లేదని విద్యాలయం వారు చెబుతున్నారు. రెండోసారి దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఇచ్చినప్పుడు ఉత్తీర్ణత సాధించినప్పుడు ఎందుకు చేర్చుకోవటం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్, నవోదయ సమితి స్పందించి విద్యార్థులకు న్యాయం చేయలని, లేదంటే విద్యాలయం ముందే దీక్షలు చేపడతామన్నారు. -
ఆలయ ప్రవేశంపై వివాదం
● పోలీసు స్టేషన్ను ఆశ్రయించిన దళితులుపత్తికొండ రూరల్: మండల పరిధిలోని జూటూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీఆంజనేయస్వామి ఆలయ ప్రవేశంపై శుక్రవారం గ్రామంలో వివాదం చోటుచేసుకుంది. గత రెండు రోజుల క్రితం గ్రామంలో సమష్టిగా ఆలయ ప్రారంభం, ధ్వజస్తంభ ప్రతిష్ట పూర్తి చేశారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఆలయంలోకి వెళ్లిన కొందరిని మరో సామాజిక వర్గానికి చెందిన వారు ప్రశ్నించినట్లుగా తెలిసింది. దీంతో ఆలయంలోకి వెళ్లేందుకు తమకు అనుమతి కావాలని దళితులు పోలీసు స్టేషన్ను ఆశ్రయించారు. ఈ సందర్భంగా సీఐ జయన్న మాట్లాడుతూ.. ఘటనపై విచారణ చేసి న్యాయం చేస్తామన్నారు. -
గుర్తు తెలియని వ్యక్తి మృతి
కోవెలకుంట్ల: పట్టణ శివారులోని రైల్వేస్టేషన్ రోడ్లో గురువారం గుర్తు తెలియని ఓ వ్యక్తి మృతి చెందాడు. కోవెలకుంట్ల ఎస్ఐ మల్లికార్జునరెడ్డి అందించిన సమాచారం మేరకు.. సుమారు 35 నుంచి 40 సంవత్సరాల్లోపు వయస్సు కలిగిన వ్యక్తి ఉదయం 10 గంటల సమయంలో అతిగా మద్యం సేవించి ఆ పరిసర ప్రాంతాల్లో కనిపించాడు. ఎక్కువగా మద్యం తాగడం వల్ల ఎండతీవ్రత కారణంగా బెట్టకు గురై మృతిచెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతునికి సంబంధించిన ఎలాంటి వివరాలు లభ్యం కాలేదు. మృతుని ఆచూకీ తెలిసిన వారు 9121101173, 9121101174కు సమాచారం అందించాలని పేర్కొన్నారు. -
పేగులు బయటపడినా బతికించారు!
● విజయవంతంగా ఆపరేషన్ చేసిన పెద్దాసుపత్రి వైద్యులుకర్నూలు(హాస్పిటల్): అతను రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి పొట్టలోని పేగులను చేతులతో పట్టుకుని ప్రాణాలు కాపాడాలని పలు ప్రైవేటు ఆసుపత్రులు తిరిగాడు. అతని పరిస్థితి చూసి ఏ ఆసుపత్రీ చేర్చుకుని వైద్యం అందించే సాహసం చేయలేదు. ఈ పరిస్థితిలో మేమున్నామంటూ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల అక్కున చేర్చుకుని మెరుగైన వైద్యం అందించి ప్రాణం పోసింది. వివరాలను జనరల్ సర్జరీ యూనిట్–5 ఛీఫ్ డాక్టర్ మాధవీశ్యామల పేర్కొన్నారు. నంద్యాల జిల్లాకు చెందిన తౌఫిక్(17) అనే యువకుడు గత యేడాది ఆగష్టు 30వ తేదిన జరిగిన జేసీబీ, బైక్ ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో అతని చిన్న, పెద్ద పేగులు పూర్తిగా దెబ్బతిని బయటకు వచ్చాయి. పరిస్థితి విషమించి ఉండటంతో అనేక ప్రైవేటు ఆసుపత్రులు తిరిగినా ఎవ్వరూ చేర్చుకోలేదు. ఆఖరి ప్రయత్నంగా కుటుంబసభ్యులు అతన్ని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తీసుకురాగా వైద్యులు అతనికి అత్యవసర ఆపరేషన్ చేసి ప్రాణం పోశారు. దాదాపు ఏడు గంటల పాటు ఐదుగురు వైద్యులు శ్రమించి అత్యంత క్లిష్టమైన ఈ ఆపరేషన్ను నిర్వహించి దెబ్బతిన్న ప్రేగులకు చికిత్స అందించారు. పూర్తి ఆరోగ్యంగా తౌఫిక్ ప్రమాదం వల్ల కోల్పోయిన కండర శక్తిని తిరిగి పొందేందుకు రోగికి దాదాపు 8 నుంచి 9 నెలల సమయం పట్టింది. మధ్యలో ఏర్పడిన ఎంటెరోక్యూటేనియస్ ఫిస్టులా సమస్యకు కూడా విజయవంతంగా సర్జరీ నిర్వహించారు. ప్రస్తుతం తౌఫిక్ పూర్తి ఆరోగ్యంగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. వైద్యబృందాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు గురువారం అభినందించారు. కార్పొరేట్ ఆసుపత్రులు సైతం చికిత్స అందించలేమని వెనకడుగు వేసిన తరుణంలో ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్యం అందించి రోగిని కాపాడటం గర్వకారణమని ఆయన కొనియాడారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక వసతులు, నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉన్నారనడానికి ఈ విజయమే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఆపరేషన్ చేసిన వారిలో యూనిట్–5 చీఫ్ డాక్టర్ మాధవీశ్యామల, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ డివి.చంద్రరెడ్డి, డాక్టర్ ఎస్.శృతి, పీజీలు డాక్టర్ సాయికుమార్, డాక్టర్ దేవిక, డాక్టర్ షమీర్, అనెస్తీషియా విభాగం ప్రొఫెసర్ డాక్టర్ రామశివనాయక్ ఉన్నారు. -
దొంగను హత్యచేసిన యాచకుడు
● మద్యం మత్తులో ఇరువురి మధ్య గొడవే కారణం కర్నూలు: కోడుమూరు పట్టణానికి చెందిన పాత నేరస్థుడు, మోటర్ సైకిళ్ల దొంగ అబ్దుల్ కలాం అలియాస్ మచ్చా(24) దారుణ హత్యకు గురయ్యాడు. అబ్దుల్ కలాం బళ్లారి చౌరస్తా ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద పాత కల్లూరుకు చెందిన రెడ్డిపోగు చిన్నప్రసాద్ అతిగా మద్యం తాగి ఇద్దరూ కొట్టుకున్నారు. ఈ క్రమంలో అబ్దుల్ కలాం ముఖంపై, గొంతుపై బీరు సీసాతో పొడిచి హత్య చేశాడు. రెడ్డిపోగు చిన్నప్రసాద్ దివ్యాంగుడు. ఈయన యాచక వృత్తి చేస్తూ రాత్రివేళల్లో బళ్లారిచౌరస్తా ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద పడుకుంటాడు. చిన్నప్రసాద్తో అబ్దుల్ కలాంకు పాత పరిచయం ఉంది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అబ్దుల్ కలాం బ్రిడ్జి వద్దకు చేరుకుని ప్రసాద్ను డబ్బులు ఇవ్వాలని కోరాడు. మద్యం మత్తులో ఉన్న ఇద్దరూ ఒకరినొకరు తిట్టుకుంటూ దొబ్బుకున్నారు. ఈ క్రమంలో ఆవేశానికి లోనైన చిన్నప్రసాద్ పక్కనే ఉన్న బీరు సీసాతో ముఖం, గొంతుపైన బాదడంతో తీవ్ర రక్తస్రావమై అబ్దుల్ కలాం సొమ్మసిల్లి పడిపోయాడు. రాత్రి గస్తీ పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి హత్య జరిగినట్లు నిర్ధారించారు. ఆ ప్రాంతంలో ఉన్న వారిని విచారించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీ కేంద్రానికి తరలించారు. ఫోర్త్టౌన్లో సస్పెక్ట్ షీట్ కలాంపై నాల్గవ పట్టణ పోలీస్స్టేషన్లో సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. కృష్ణగిరి మండలం పోతుగల్లు గ్రామానికి చెందిన రమీజాబీ కుమారుడు కలాంతో కలసి 15 ఏళ్ల క్రితం కోడుమూరుకు వలస వచ్చి కూలీ పనులు చేస్తూ జీవనం సాగించేవారు. అబ్దుల్ కలాం చిన్న వయస్సులోనే జల్సాలకు అలవాటు పడి జులాయిగా తిరిగేవాడు. ఖర్చుల కోసం వాహన దొంగతనాలు, ఇళ్లలో చోరీలకు పాల్పడుతూ పలుమార్లు జైలుకు కూడా వెళ్లాడు. బ్రిడ్జి కింద పడుకుని ఉన్న చిన్నప్రసాద్ను డబ్బుల కోసం ఒత్తిడి చేయడంతో మాటామాటా పెరిగి కొట్టుకునే క్రమంలో హత్యకు గురయ్యాడు. తల్లి రమీజాబీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి హత్యకు సంబంధించి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ విక్రమసింహ తెలిపారు. -
క్షణ.. క్షణం ఉత్కంఠ
● కోతులబావి దేవాలయం దగ్గర మోహరించిన పోలీసులుఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని కోతులబావి శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం చుట్టూ ఉన్న బండలను తొలగిస్తామని శ్రీహనుమాన్ కరసేవకులు పిలుపునివ్వటంతో భారీ పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఏ క్షణం ఏమి జరుగుతుందోనని ఉత్కంఠ భరితంగా మారింది. కోతులబావి శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం స్థలం చుట్టూ కంచెను హిందూ సంఘాలు ఏర్పాటు చేశాయి. కొన్ని నెలల క్రితం దేవాలయం చుట్టూ ఉన్న కంచెను మున్సిపల్ కమిషనర్ పోలీసు అధికారుల సమక్షంలో జేసీబీలతో తొలగించి, దేవాలయం చుట్టు వివాదాస్పద స్థలంలో నాపరాళ్లను పాతించారు. అప్పటి నుంచి హిందూ సంఘాలు, మున్సిపల్ అధికారుల మధ్య వివాదం నడుస్తూనే ఉంది. శ్రీ హనుమాన్ కరసేవకులతో దేవాలయం చుట్టూ ఉన్న బండలను తొలగిస్తామని, హిందూవుల తరలిరావాలని మాజీ కౌన్సిలర్ కోనేరు నాగేంద్రప్రసాద్, కరసేవ కార్యకర్త ఉపేంద్రరెడ్ది సోషల్ మీడియాలో పోస్టులను ఉంచి పిలుపునిచ్చారు. దీంతో పోలీస్, రెవిన్యూ, మున్సిపల్ అధికారులు అప్రమత్తమయ్యారు. కరసేవకులు తరలిరావాలని సోషయల్ మీడియాలో పోస్ట్ చేసిన మాజీ కౌన్సిలర్ కోనేరు నాగేంద్రప్రసాద్ను బైండోవర్ చేశారు. మళ్లీ పోస్టులు ఉంచడంతో అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. మరో కరసేవ కార్యకర్త ఉపేంద్రరెడ్డి, మరి కొందరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా వారు సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ఎటువైపు నుంచి కరసేవకులు వస్తారో, ఏమి జరుగుతుందోనని ఒక డీఎస్పీ, పది మంది సీఐలు, 13 మంది ఎస్ఐలు, పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసులతో కలపి మొత్తం 160 మందితో బందోబస్త్ నిర్వహించారు. దేవాలయం దగ్గర పరిస్థితిపై డీఎస్పీ ముర్రవాడ భార్గవి, టౌన్ సీఐ కంబగిరిరాముడు, తహసీల్దార్ శ్రీనివాసుల ఆరా తీశారు. దేవాలయం పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. -
గురు రాయర సన్నిధిలో భక్తుల సందడి
మంత్రాలయం: గురు రాయర సన్నిధిలో గురువారం భక్తుల సందడి నెలకొంది. రాఘవేంద్రస్వామి ప్రత్యేక దినం కావడంతో భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామి సేవలో తరించారు. భక్తుల రాకతో శ్రీమఠంలో రద్దీ కనపించింది. మూల బృందావన దర్శనానికి రెండు నుంచి మూడు గంటలకు పైగా సమయం పట్టింది. సేవాభక్తుల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన ఆరో నంబర్ గేట్ దగ్గర బ్రిడ్జ్ పై నుంచి సేవా కౌంటర్లులో దిగడానికి శ్రీమఠం అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో ప్రధాన ప్రాంగణంలో భక్తులకు ఇబ్బంది లేకుండా చేశారు. కల్పతరు దర్శన క్యూలైన్లు, అన్నపూర్ణ భోజనశాల, పరిమళ ప్రసాదం కౌంటర్లు భక్తులతో కిటకిటలాడాయి. తుంగ భద్ర నదీ తీరంలో భక్తుల కోలాహలం నెలకొంది. వేసవి సెలవుల దృష్ట్యా భక్తుల రాక విపరీతంగా పెరిగిపోయింది. ఎట్టకేలకు పదోన్నతి వీఆర్ఓలకు స్థానాలు కర్నూలు(సెంట్రల్): జిల్లాలో గ్రేడ్–2 నుంచి గ్రేడ్–1గా పదోన్నతి పొందిన వీఆర్వోలు స్థానాల కోసం రెండు నెలలుగా నిరీక్షించారు. అదిగో ఇదిగో అంటూ కాలం గడపటంపై వీఆర్వోలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వారికి గురువారం స్థానాలను కేటాయిస్తూ డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ ఉత్తర్వులిచ్చారు. మొత్తం 83 మందికి పదోన్నతి లభించిన విషయం విదితమే. కాగా ప్రస్తుతం గ్రేడ్–2 వీఆర్వోలుగా పనిచేస్తున్న 25 మందికి డిప్యూటేషన్ అవకాశం కల్పించారు. వీరు ప్రస్తుతం ఉన్న స్థానం నుంచి మరో స్థానానికి వెళ్లేలా డీఆర్వో ఉత్తర్వులిచ్చారు. భానుడి భగభగ ● సంజామలలో 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కర్నూలు(అగ్రికల్చర్): ఎండల తీవ్రత, ఉక్కపోత సమస్యలు పెరుగుతున్నాయి. వడగాడ్పుల తీవ్రతకు ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాష్ట్రంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతువున్నాయి. గురువారం సంజామలలో 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత. చిప్పగిరిలో 42.9, కౌతాళంలో 42.9, దొర్నిపాడులో 42.6, అవుకులో 42.4, బేతంచెర్ల, చాగలమర్రి, కొత్తపల్లి, పాణ్యం, పగిడ్యాల, నంద్యాల రూరల్, గోస్పాడు, జూపాడుబంగ్లాల్లో 42.1, ఆళ్లగడ్డలో 42, గూడూరులో 41.8, కల్లూరులో 41.8, బనగానపల్లిలో 41.8, గూడూరులో 41.6, మంత్రాలయంలో 41.5 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో కూడా ఉమ్మడి జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు వడదెబ్బకు గురి కాకుండా తగిన జాగ్రతలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు తెలిపారు. నంద్యాల డీసీఓపై అభియోగాల నమోదు కర్నూలు(అగ్రికల్చర్): ఆదోని రెవెన్యూ డివిజన్ పరిధిలోని కల్లుదేవకుంట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో జరిగిన నిధుల దుర్వినియోగంపై అప్పట్లో జిల్లా సహకార అధికారిగా పనిచేసిన ఎన్.రామాంజినేయులు సరిగ్గా స్పందించలేదనే కారణంపై ప్రభుత్వం ఆయనపై అభియోగాలను నమోదు చేసింది. ఈయన ప్రస్తుతం నంద్యాల జిల్లా సహకార అధికారిగా పనిచేస్తున్నారు. కల్లుదేవకుంట పీఏసీఎస్ సీఈఓ వెంకటేశ్వర్లు సొసైటీ నిధులు రూ.21,18,883 దుర్వినియోగం చేసిన వ్యవహారంపై డీసీఓను విచారణ అధికారిగా నియమించగా ఆయనతో కుమ్మకై ్క విచారణను నీరుగార్చినట్లు అభియోగాలు నమోదయ్యాయి. అదే విధంగా రైతులకు పంపిణీ చేసిన రుణాలకు సంబంధించి రికవరీ చేసిన రూ.2 కోట్ల నిధులు సొసైటీకి జమ కాలేదని, ఇందుకు బాధ్యులు సొసైటీ సీఈఓనే కారణమని, ఆయనపై చర్యలు తీసుకోవాలని రాఘవరెడ్డి అనే వ్యక్తి లోకాయుక్తకు ఫిర్యాదు చేయగా డీసీఓను విచారణ చేయాలని ఆదేశించారు. అయితే అక్రమార్కులతో డీసీఓ కుమ్మకై ్క విచారణను పక్కదోవ పట్టించినట్లు పలువురి విచారణలో వెల్లడైనట్లు అభియోగాలు నమోదయ్యాయి. వీటితో పాటు మరో రెండు అభియోగాలు కూడా నమోదు చేస్తూ సహకార శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ జీఓ ఆర్టీ నెంబర్ 367 జారీ చేశారు. -
మద్దతు ధరలపై కేంద్రం పునరాలోచన చేయాలి
● ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి చిప్పగిరి: పంటల మద్దతు ధరలపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చెయ్యాలని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి కోరారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గతేడాది ధరలతో పోలిస్తే మూడు నుంచి ఏడు శాతం మాత్రమే మద్దతు ధరలు పెంచడంతో రైతులు తీవ్రస్థాయిలో నష్టపోయే అవకాశం ఉందన్నారు. ప్రస్తుత పెట్టుబడులను పరిగణనలోకి తీసుకొని మద్దతు ధరలను ప్రకటించాలన్నారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందని, పంటల మద్దతుధరలో ఏపీకి ప్రత్యేక వెసులుబాటు ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. -
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై ఇంత నిర్లక్ష్యమా?
కర్నూలు(సెంట్రల్): ‘ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారంలో ఇంత నిర్లక్ష్యమా? కర్నూలు జిల్లా బాగా వెనుకబడి ఉంది.. ఒక్క శాతం కంటే కూడా తక్కువగా పరిష్కార రేటు నమోదై ఉంది.’ అని ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో జిల్లా, నియోజకవర్గ, మండల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కర్నూలు జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు113 నమోదు కాగా ఇప్పటి వరకు వాటిలో కేవలం 11 కేసులకు సంబంధించి మాత్రమే యాక్షన్ టేకేన్ రిపోర్టు వచ్చిందన్నారు. మిగిలిన 102 కేసులకు ఇంకా రాకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో దళితులు స్వేచ్ఛగా బతికేలా పోలీసులు భరోసా కల్పించాల్సి ఉందన్నారు. బాధితులు ఫిర్యాదు చేసినప్పుడు తప్పుడు కేసులుగా చిత్రీకరించకుండా, సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు కచ్చితంగా ఎస్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు. విధుల్లో వైఫల్యం చెందిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషన్ తరపున సిఫార్సు చేస్తామని హెచ్చరించారు. అనంతరం శాఖల వారీగా ఆయనసమీక్షించారు. ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పెండింగ్ కేసులకు సంబంధించి యాక్షన్ టేకెన్ రిపోర్టు 15 రోజుల్లోగా సమర్పిస్తామని చైర్మన్కు వివరణ ఇచ్చారు. భూ సమస్యలు, అసైన్మెంట భూ ముల పంపిణీ, పెన్షన్లు, హౌస్ సైట్ పట్టాల అంశాలపై ప్రత్యేకంగా సమీక్షలు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే సగం కేసుల్లో ఉద్యోగాలు, భూములు ఇచ్చామని, ఇళ్ల పట్టాలు ఇవ్వలేదని, బాధితులకు అందించాల్సిన పింఛన్ల కోసం 40 నుంచి రూ.50 లక్షల వరకు అవసరమని చైర్మన్ దృష్టికి కలెక్టర్ తీసుకెళ్లారు. 60 రోజుల్లో విచారణ పూర్తి జిల్లా ఎస్పీ విక్రాంత్పాటిల్ మాట్లాడుతూ..పోలీసు శాఖ తరపు నుంచి తాము రిజిస్టర్ చేస్తున్న కేసుల్లో 60 రోజుల్లో విచారణను పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో ఎస్సీ కమిషన్ సెక్రటరీ చిన్న రాముడు, అదనపు ఎస్పీ హుస్సేన్పీరా, డీఆర్వో సి.వెంకటన నారాయణమ్మ, జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి తులసిదేశి, కర్నూలు ఇన్చార్జి ఆర్డీఓ అనురాధ, పత్తికొండ ఇన్చార్జి ఆర్డీఓ మధుసూధన్రెడ్డి, కర్నూలుమునిసిపల్ కమిషన్ ఓబులేషు, ఎస్సీ కమిషన్ సభ్యులు బిక్షం మేకల, పాకనాటి గౌతమ్ రాజ్, రామాంజినమ్మ పాల్గొన్నారు. పలు ప్రజా సంఘాలు, కుల సంఘాల నాయకులు వివిధ సమస్యలపై వినతులు అందజేశారు. కర్నూలు జిల్లా బాగా వెనుకబడి ఉంది కేసుల్లో ఒక్కశాతం కంటే తక్కువ పరిష్కారమా? 102 కేసులు పెండింగ్లో ఉండడంపై అసంతృప్తి దళితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించిన ఎస్సీ కమిషన్ కేఎస్ జవహర్ -
కడప ఘటనతో డైవర్షన్ పాలిటిక్స్
మత్స్యానందంమండే ఎండాకాలంలో పాణ్యంలోని ఊరుముందరి చెరువులో చేపల వేటకు మత్స్యకారులు పోటీ పడ్డారు. చెరువులో ముందుగానే వేసిన వలలను గురువారం వాటిని ప్రయాసతో బయటకు తీశారు. గడ్డిమోసు, వాల్గా, బొచ్చ, జిలేబీ తదితర చేపలు దొరకడంతో వాటిని అమ్మకానికి ఉంచగా కొనుగోలు చేసేందుకు భారీగా ప్రజలు వచ్చారు. మరో రెండు రోజుల్లో చేపలు పట్టే ప్రక్రియ పూర్తి అవుతుందని మత్స్యకారులు తెలిపారు. –పాణ్యం● హజ్ కమిటీ మాజీ చైర్మన్ గౌసల్ ఆజాం, వైఎస్సార్ సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు హఫీజ్ ఖాన్ వెల్లడిఎగుమతి చేసేందుకు సిద్ధం.. కర్నూలు(టౌన్): తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ షరీఫ్ కడప ఘటనను రాజకీయం చేస్తున్నాడని కర్నూలు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు హాఫీజ్ ఖాన్ అన్నారు. కర్నూలులోని తన స్వగృహంలో హజ్ కమిటీ మాజీ చైర్మన్ గౌసల్ ఆజాంతో కలిసి హఫీజ్ఖాన్ గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కడప అల్లర్లు డైవర్షన్ చేసి మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాపై నెట్టాలని చూస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. స్వార్థ రాజకీయాలతో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కుట్రలు చేస్తున్నారన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ లబ్ధి పొందేందుకే ఇలాంటి కుట్రలు చేస్తోందని విమర్శించారు. ఎప్పటికీ పేద లు, బడుగు, బలహీన వర్గాలు, ముస్లిం మైనార్టీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంటే ఉంటారనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు గుర్తుంచుకోవాలన్నారు. హజ్ కమిటీ మాజీ చైర్మన్ గౌసల్ ఆజాం మాట్లాడుతూ గత వారం కడపలో జరిగిన అల్లర్లకు కూటమి నేతలే కారణమన్నారు. కేవలం అల్మాస్ సర్కిల్ పేరు మార్పు కోసమే ఈ వివాదం చోటు చేసుకుందన్నారు. అల్మాస్ పేట సర్కిల్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు పేరు మారుస్తామని ప్రజలకు హామీ ఇచ్చాడని గుర్తు చేశారు. అయితే టిప్పు సుల్తాన్ సర్కిల్ కోరిన వారికి చంద్రబాబు మద్దతు ఇచ్చారన్నారు. సర్కిల్ పేరు మార్పులో తెలుగుదేశం పార్టీ నేతల తీరు వల్లే ఈ ఘర్షణ చోటు చేసుకుందన్నారు. హిందూ సోదరులు హనుమాన్ సర్కిల్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారని, అయితే ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదన్నారు. సరైన నిర్ణయం తీసుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమై వైఎస్సార్సీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ ఎటువంటి మతపరమైన రాజకీయాలు చేయదన్నారు. -
పరిశ్రమల ఏర్పాటును వేగవంతం చేయాలి
కర్నూలు(సెంట్రల్): జిల్లాలో పరిశ్రమల ఏర్పాటును వేగవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. పరిశ్రమల ఏర్పాటు పురోగతిపై జేసీ నూరుల్ ఖమర్తో కలసి పరిశ్రమల శాఖ, ఏపీఐఐసీ, నెడ్ క్యాప్ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 40 పరిశ్రమలకు ఎంఓయూలు అయ్యాయని, వీటిలో 11 పరిశ్రమలకు శంకుస్థాపనలు పూర్తయ్యాయన్నారు. కోడుమూరు ఎంఎస్ఎంఈ ప్రాజెక్టుకు త్వరగా భూసేకరణ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని జేసీ, డీఆర్వోలను ఆదేశించారు. మంత్రాలయం సందర్శనకు వచ్చే వీఐపీల కోసం పరిసర ప్రాంతాల్లో హెలిప్యాడ్ను సిద్ధం చేయాలన్నారు. దూపాడు–బేతంచెర్ల రైల్వేలైన్ ఏర్పాటు, ఓర్వకల్ వద్ద మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో పరిశ్రమలశాఖ జీఎం అశోక్కుమార్, ఏపీఐఐసీ జెడ్ఎం మధుసూధన్రెడ్డి, నెడ్క్యాప్ అధికారి దేవేంద్ర పాల్గొన్నారు. ● వ్యవసాయ, ఉద్యాన శాఖలకు కేటాయించిన లక్ష్యాల సాధనకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు. డ్రిప్ ఇరిగేషన్తో పండ్ల తోటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. గురువారం సాయంత్రం ఆమె తన కార్యాలయంలో వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. -
పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు
మంత్రి టీజీ భరత్ అనుచరులు ప్రతి డిపార్టుమెంట్లో కలెక్షన్లు చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి, మున్సిపాల్టీలో, మద్యం, బియ్యం, తదితర వాటిల్లో వసూళ్లకు పాల్పడుతున్నారు. కర్నూలు అభివృద్ధిని మంత్రి పూర్తిగా విస్మరించారు. వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప టీడీపీ పాలనలో ఏమీ కనిపించడం లేదు. ప్రతిపక్షంలో తొమ్మిదేళ్లు ప్రజల పక్షాన పోరాటం చేశాం. పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. అక్రమ కేసులు పెట్టి భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. – హఫీజ్ఖాన్, కర్నూలు మాజీ ఎమ్మెల్యే -
సమాజాభివృద్ధికి కార్పొరేట్ సంస్థలు దోహదపడాలి
నంద్యాల(అర్బన్): ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావడం ఎంతో అభినందనీయమని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. గురువారం నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ కళాశాల బాలుర హాస్టల్ –1, 2లకు నూతనంగా నిర్మించిన మరుగుదొడ్ల కాంప్లెక్స్ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రత, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యాసంస్థల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించడం అత్యంత అవసరమన్నారు. ది రామ్కో సిమెంట్స్ లిమిటెడ్ కొలిమిగుండ్ల యూనిట్ తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమంలో భాగంగా రూ.14.53 లక్షల వ్యయంతో ఈ మరుగుదొడ్ల సముదాయాన్ని నిర్మించినట్లు తెలిపారు. సమాజాభివృద్ధికి దోహదపడే ఇటువంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలన్నారు. కార్యక్రమంలో రామ్కో సిమెంట్స్ కొలిమిగుండ్ల యూనిట్ హెడ్ మీనాక్షి సుందరం, జిల్లా ఎస్సీ సంక్షేమ, సాధికారత అధికారి చింతామణి తదితరులు పాల్గొన్నారు. పాముకాటుతో బాలుడి మృతి బేతంచెర్ల: రహిమానుపురం గ్రామానికి చెందిన బాలుడు పాముకాటుతో మృతి చెందాడు. గ్రామానికి చెందిన నాగరాజు ఈనెల 9వ తేదీ సాయంత్రం మొక్కజొన్న పంటకు నీరు పెట్టేందుకు కుమారుడు నవీన్ (16)ను వెంట తీసుకెళ్లాడు. నీరు కట్టేందుకు పొలంలో వెళ్తుండగా నవీన్ చూడకుండా పామును తొక్కడంతో కాలుపై కాటు వేసింది. వెంటనే బేతంచెర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. కాగా చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11 గంటల సమయంలో మరణించాడు. తండ్రి నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. షార్ట్ సర్క్యూట్తో అగ్నిప్రమాదం డోన్ టౌన్: పట్టణంలోని సుందర్సింగ్ కాలనీలో నివాసం ఉండే కమ్మర గీతారాణి ఇంటిలో గురువారం తెల్లవారు జామున షార్ట్ సర్క్యూట్తో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఫ్రిజ్ వద్ద షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు వ్యాపించాయి. ఇంట్లో నిద్రిస్తున్న గీతారాణి అప్రమత్తమై బయటకు వచ్చింది. స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది రంగస్వామి, మహేశ్వరరెడ్డి, చంద్రమోహన్ చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే ఇంట్లో సామగ్రి, నిత్యావసర సరుకులు, రూ. 50 వేల నగదు దగ్ధమైనట్లు బాధితురాలు తెలిపారు. ఈ ప్రమాదంలో దాదాపు రూ. 2.20 లక్షల ఆస్తినష్టం వాటిలి నట్లు అగ్నిమాపక అధికారి రంగస్వామిగౌడ్ తెలిపారు. ఉన్నారు. వ్యక్తి ఆత్మహత్య బేతంచెర్ల: పట్టణంలోని అల్లా బకాష్ దర్గా కాలనీలో నివాసం ఉంటున్న కుమ్మరి సురేష్(46) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దాదాపు రూ. 10 లక్షల దాకా అప్పులు చేయడంతో రోజు అప్పుదారులు ఇంటికొచ్చి పోతుండటంతో చెప్పుకోలేక జీవితంపై విరక్తి చెందాడు. ఈ క్రమంలోఈనెల 9న పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు బేతంచెర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం 108లో కర్నూలుకు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి సురేష్ మృతి చెందాడు. మృతుడి భార్య నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ చెన్నయ్య తెలిపారు. మద్దిలేటయ్య హుండీ ఆదాయం రూ.48.75 లక్షలు బేతంచెర్ల: ఆర్ఎస్ రంగాపురం శివార్లలో వెలసిన వైష్ణవ పుణ్యక్షేత్రమైన శ్రీ మద్దిలేటి నరసింహస్వామి హుండీ ఆదాయం రూ.48,75,058 వచ్చింది. స్వామి, అమ్మ వార్లకు భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలు, ముడుపులు, నిత్యన్నదాన సత్రం హుండీ లెక్కింపు గురువారం చేపట్టారు. దేవదాయశాఖ అధికారి రమేష్ పర్యవేక్షణలో 44 రోజులకు సంబంధించిన హుండీ లెక్కింపు నిర్వహించగా రూ.48,75,058 నగదు, 21 గ్రాముల బంగారు, 1.210 గ్రాముల వెండి వచ్చిందని ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులు వెల్లడించారు. కార్యక్రమంలో బాలజీ సేవా ట్రస్ట్ సభ్యులు, డోన్, బేతంచెర్ల మద్దిలేటి సేవా సమితి, వాసవీ సభ్యులు పాల్గొన్నారు. పండితులు వెంకటాచలపతి మృతి కర్నూలు కల్చరల్: ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రముఖ పండితులు, అపరబ్రహ్మ, స్మార్త పురోహితులు గూడా వెంకటాచలపతి (72) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం మరణించారు. ఆయన మృతికి పలువురులు నగర ప్రముఖులు, బ్రాహ్మణ సంఘం నాయకులు సంతాపం తెలిపారు. -
కర్నూలులో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ
● కలెక్టరేట్ వద్ద మూడు గంటల పాటు ధర్నా ● చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ● పోలీస్ స్టేషన్ల వద్ద టీడీపీ నాయకులు అంగడి పెట్టారని విమర్శ ● పోలీసుల పేరుతో కలెక్షన్లు ఎక్కువయ్యాయని ఆరోపణ ● ధర్నాలో పాల్గొన్న వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, నేతలు -
టీడీపీ తీరు ప్రతిపక్షంలో ఒకలా, అధికారంలో మరోలా!
పత్తికొండ రూరల్: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చిన తరువాత మరోలా వ్యవహరించడం టీడీపీకి తగదని రాష్ట్రోపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు టి.కె.జనార్ధన్, రాష్ట్ర కార్యదర్శి రామ్మోహన్రెడ్డి అన్నారు. గురువారం స్థానిక ఎస్టీయూ ప్రాంతీయ కార్యాలయంలో టీచర్స్ యూనియన్ మండల అధ్యక్షుడు ఎ.నాగరాజు అధ్యక్షతన ఏర్పాటుచేసిన ఉపాధ్యాయ సంఘం నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 12వ ిపీఆర్సీ వెంటనే ఏర్పాటుచేసి 30శాతం ఐఆర్ ప్రకటించాలన్నారు. వేతన సవరణ చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాలు నిరసన తెలుపుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదన్నారు. ఇప్పటి వరకు నాలుగు డీఏలను పెండింగ్లో పెట్టారని, ఐఆర్పై ఎలాంటి ప్రకటన చేయకపోవడం చాలా దురదృష్టకరమన్నారు. అలాగే పెండింగ్లోని ఉద్యోగుల సరెండర్ లీవ్ బకాయిల చెల్లింపుపై ఒక ప్రకటన చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకన్న, మండల ప్రధాన కార్యదర్శి మారుతి, నాయకులు వెంకటేశ్వర్లు, బలరాముడు పాల్గొన్నారు. -
గ్యాస్ ఏజెన్సీలో అధికారుల తనిఖీలు
బనగానపల్లె: గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఏజెన్సీ డీలర్ నిర్లక్ష్యంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బనగానపల్లెలోని బాలాజీ గ్యాస్ ఏజెన్సీ డీలర్ సిలిండర్ల డెలివరీలో ఇష్టారాజ్యంగా వ్యవహరించడంపై వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో గురువారం ‘గ్యాస్ సిలిండర్ల కోసం పడిగాపులు’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. బాలాజీ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాన్ని సివిల్ సప్లై అధికారి రవిబాబు, బనగానపల్లె ఆర్డీవో నరేంద్రనాథ్రెడ్డి, ఇన్చార్జ్ తహసీల్దార్ నాగేశ్వరరెడ్డి తనిఖీ చేశారు. అధికారులు వచ్చారనే సమాచారం తెలుసుకున్న కొందరు వినియోగదారులు అక్కడికి చేరుకుని పలు సమస్యలను విన్నవించారు. సిలిండర్ బుక్ చేసినా 20– 30 రోజుల వరకు అందడం లేదన్నారు. సిలిండర్లను డోర్ డెలివరీ చేయాల్సి వుండగా పట్టణానికి మూడు కిలో దూరంగా ఉన్న గోడౌన్ వద్దకు వచ్చి సిలిండర్లను పొందడంలో తీవ్ర ఇబ్బందులుపడుతున్నట్లు వినియోగదారులు వాపోయారు. సుమారు 10 మంది నుంచి రాతపూర్వకంగా ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో రికార్డులను గోడౌన్లో స్టాక్ను అధికారులు పరిశీలించారు. డీఎస్ఓ రవిబాబు మాట్లాడుతూ డీలర్ వద్ద ఆన్లైన్లో 495 సిలిండర్ల స్టాక్ ఉండాల్సి ఉండగా 11 స్టాక్ మాత్రమే ఉన్నట్లు తెలిపారు. పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్కు, భారత్ గ్యాస్ కంపెనీకి చెందిన సేల్స్ అధికారికి నివేదిక అందజేయడం జరిగిందన్నారు. గ్యాస్ డీలర్పై చట్టరీత్య చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గ్యాస్ వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. -
పెండింగ్ కేసులను పరిష్కరించాలి
● న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రికర్నూలు: సుప్రీం కోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల సెటిల్మెంట్కు స్పెషల్ లోక్ అదాలత్ ద్వారా కృషి చేయాలని లీగల్ సర్వీసెస్ సిబ్బందికి న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి సూచించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి సూచనల మేరకు కర్నూలు కోర్టు కాంపౌండ్లోని న్యాయసేవా సదన్లో లీగల్ సర్వీసెస్ స్టాఫ్ విధులపై సమీక్ష సమావేశం జరిగింది. కార్యక్రమానికి లీలా వెంకటశేషాద్రితో పాటు శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకటహరినాథ్ ముఖ్య అతిథులుగా హాజరై లీగల్ సర్వీసెస్ స్టాఫ్ విధులు, లీగల్ ఎయిడ్ కేసుల వివరాలు, వాటి పరిష్కారం తదితర అంశాలపై సూచనలు చేశారు. ఆగస్టు 21 నుంచి 23వ తేదీ వరకు సుప్రీం కోర్టులో జరిగే స్పెషల్ లోక్ అదాలత్లో పెండింగ్లో ఉన్న కేసుల సెటిల్మెంట్ కోసం కృషి చేయాలన్నారు. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ స్టాఫ్ వద్ద పెండింగ్ కేసులలో ఎన్నింటినికి బెయిల్స్ మంజూరు చేశారో ఆ కేసుల స్థితిగతులను తెలుసుకున్నారు. మిగిలిన వాటిని ఏ విధంగా త్వరితగతిన పరిష్కరించాలనేదానిపై సూచనలు ఇచ్చారు. శాశ్వత లోక్అదాలత్ స్టాఫ్ ప్రజా వినియోగ పది రకాల సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం రికార్డులు, రిజిస్టర్లు పరిశీలించారు. చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శివరాం, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సులోచన, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. -
15 నుంచి ఎల్ఆర్ఎస్ మేళా
కర్నూలు టౌన్: నగరపాలక సంస్థ నూతన కౌన్సిల్ హాలులో ఈనెల 15, 16 తేదీల్లో ఎల్ఆర్ఎస్ మేళా నిర్వహిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనధికారిక లేఔట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న వారు త్వరితగతిన పరిష్కరించుకోవాలన్నారు. ఎల్ఆర్ఎస్ ద్వారా ప్లాట్లకు పూర్తి చట్టబద్ధత లభిస్తుందని, భవిష్యత్తులో రిజిస్ట్రేషన్, భవన నిర్మాణ అనుమతులు, బ్యాంకు రుణాలు, ఆస్తి బదలాయింపు వంటి ప్రక్రియలు సులభమవుతాయన్నారు. గృహ నిర్మాణ సమస్యలపై కాల్ చేయండి కర్నూలు(అర్బన్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో గృహాలు నిర్మించుకుంటున్న లబ్ధిదారులు తమ సమస్యలు, సందేహాలను నివృత్తికి ఈ నెల 14న 08518– 257481 నెంబర్కు ఉదయం 10 నుంచి 11 గంటల్లోపు కాల్ చేయాలని హౌసింగ్ పీడీ చిరంజీవి తెలిపారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి రావాల్సిన సిమెంట్, స్టీల్ తదితర గృహ నిర్మాణ సామగ్రి, బిల్లుల గురించి ఫోన్ చేసి తెలుసుకోవచ్చ న్నారు. అలాగే పీఎంఏవై 2.0 అర్బన్ గృహాలకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా సంప్రదించాలని పేర్కొన్నారు. డీఈఓ వెబ్సైట్లో సీనియారిటీ జాబితాలు కర్నూలు సిటీ: ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో పని చేస్తున్న ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్, సెకండ్ గ్రేడ్ టీచర్లు, తత్సమాన టీచర్లందరి తుది సీనియారిటీ జాబితాలను డీఈఓ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు డీఈఓ ఎల్.సుధాకర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ ఆధారంగా సబ్జెక్టులతో సహా జాబితాలను రూపొందించామన్నారు. ఈ జాబితాలను www.deokrnl13.blogspot.com అనే వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 19 లోపు (పని దినాల్లో మాత్రమే) డీఈఓ కర్నూలు (ఉమ్మడి జిల్లా) ఆఫీస్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల్లోపు తగిన ఆధారాలతో సమర్పించవచ్చన్నారు. గడువు తరువాత ఎలాంటి అభ్యంతరాలు స్వీకరించబోమని పేర్కొన్నారు. ఇంటర్ అడ్వాన్స్డ్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు కర్నూలు(సెంట్రల్): మే 21 నుంచి జూన్ 4వ తేదీ వరకు ఇంటర్ అడ్వాన్స్డ్ పబ్లిక్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 57 కేంద్రాల్లో సప్లిమెంటరీ పరీక్షలకు 15,834 మంది జనరల్ విద్యార్థులు, 1,815 మంది ఒకేషనల్ విద్యార్థులు హాజరవుతారన్నారు. రెండో సంవత్సరానికి 7,374 మంది జనరల్ విద్యార్థులు, 775 మంది ఒకేషనల్ విద్యార్థులు ఉన్నట్లు చెప్పారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా కేంద్రాలకు అనువుగా బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఆర్ఓ సి.వెంకటనారాయణమ్మ, ఆర్ఐఓ లాలెప్ప, కర్నూలు నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ కృష్ణ, కార్మిక శాఖాధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. పాలనలో మోదీ విఫలం ● సీపీఐ జాతీయ కార్యదర్శి అన్నె రాజా పత్తికొండ రూరల్: విశ్వగురువుగా ప్రచారం చేసుకునే నరేంద్రమోదీ దేశ ఆర్థిక, ప్రజా సమస్యలను గాలికొదిలేసిన అసమర్థుడుని, పాలనలో ఘోరంగా విఫలమయ్యారని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ కార్యదర్శిఏ. రాజా విమర్శించారు. బుధవారం కర్నూలులో ఆమె విలేకరులతో మాట్లాడారు. రైతులు, వ్యాపారులు, కార్మికులు, మధ్యతరగతి వర్గాల వారందరూ మోదీ అవలంబిస్తున్న విధానాలతో తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. మోదీ వెన్నెముక లేని రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. దేశంలో అన్ని వర్గాల ప్రజల ఇబ్బందులు, మతోన్మాదంపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు దేశవ్యాప్తంగా ఆగస్టు 6 నుంచి 15 వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాదయాత్రలు చేపడుతామని తెలిపారు. విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఏసీబీకి పట్టుబడిన ఏఈఓ
● అదుపులో మరో వ్యక్తి ఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని వ్యవసాయ కార్యాలయంలో బుధవారం సాయంత్రం రూ.30 వేలు లంచం తీసుకుంటున్న ఏఈఓ నరసింహులు, కార్యాలయంలో ఉన్న అనధికార వ్యక్తి మోహన్ను ఏసీబీ అధికారులు రెడ్ వ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల మేరకు.. పట్టణానికి చెందిన ఈడిగ రంగన్న గౌడ్ అంబేద్కర్ సర్కిల్లో మహలక్ష్మీ ట్రేడర్స్ ఫర్టిలైజర్ షాప్ను నిర్వహిస్తున్నాడు. షాప్ లైసెన్సు రెన్యూవల్తో పాటు ఇదే షాప్లో పెస్టిసైడ్స్ విక్రయించేందుకు కొత్తగా లైసెన్స్ కోసం వ్యవసాయ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే లైసెన్సు మంజూరు చేయాలంటే రూ. 35 వేలు ఇవ్వాలని ఏఈఓ నరసింహులు.. డీలర్ రంగన్నగౌడ్కు చెప్పాడు. దీంతో ఆయన ఏసీబీ అధికారులను సంప్రదించాడు. పక్కా ప్లాన్తో బుధవారం సాయంత్రం ఏఈఓకు రూ. 30 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏఈఓతో పాటు కార్యాలయంలో ఉన్న అనధికార వ్యక్తి మోహన్ దగ్గర రూ. 73,600ను స్వాధీనం చేసుకొని ఇద్దరిని అదుపులో తీసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు. ఏ కార్యాలయంలోనైనా పనులకు లంచం అడిగితే నేరుగా ఏసీబీ అధికారులను సంప్రదింవచ్చునని సూచించారు. దాడుల్లో ఏసీబీ సీఐలు రాజా ప్రభాకర్, కృష్ణయ్య, ఎస్ఐ సుబ్బారాయుడుతోపాటు సిబ్బంది ఉన్నారు. అయితే ఏసీబీ దాడులు జరిగినప్పుడు ఏడీఏ, ఏఓ కార్యాలయాల్లో లేకపోవటం గమనార్హం. -
బైకులకు నిప్పు
ఆదోని అర్బన్: పట్టణంలోని వసంత టాకీస్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి రెండు బైకులకు నిప్పు పెట్టి పరారయ్యాడు. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని వసంత టాకీస్ సమీపంలో కిషోర్ అనే వ్యక్తి ఇంటి ముందు రెండు బైకులు నిలిపి ఉంచారు. బుధవారం అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో ఓ వ్యక్తి వచ్చి బైక్లకు నిప్పు పెట్టాడు. మంటలు చెలరేగడంతో వెంటనే అక్కడినుంచి పరారయ్యాడు. మంటలను గమనించిన స్థానికులు బైకు యజమానిని లేపారు. మంటలో ఒక బైక్ పూర్తిగా దహనం కాగా, మరో బైకు సగభాగం కాలిపోయింది. ఘటనపై వన్టౌన్ పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు వచ్చి పరిశీలించి వెళ్లారని బైకు యజమాని కిషోర్ తెలిపారు. ట్రాక్టర్ను ఢీకొన్న బస్సు ● ఒకరికి తీవ్ర గాయాలు చాగలమర్రి: మండలంలోని చిన్నబోధనం గ్రామ సమీపంలో 40వ నంబరు జాతీయ రహదారిపై ట్రాక్టర్ను ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాదు నుంచి పాండిచ్చేరికి వెళ్తున్న ట్రావెల్స్ బస్సు బుధవారం తెల్లవారుజామున రాంపల్లె నుంచి చిన్నబోధనం గ్రామంలోకి వెళ్లేందుకు రోడ్డు దాటుతున్న ట్రాక్టర్ను అతివేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ ఓబులేసు తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డ ఓబులేసును టోల్ప్లాజా అంబులెన్సులో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో బస్సులోని వారికి ఏమీ కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పొగాకు ఉత్పత్తులతో ఫ్లోరోసిస్ ముప్పు కర్నూలు(హాస్పిటల్): బీడీ, చుట్టా, సిగరెట్, జరదా, తంబాకు, పాన్ మసాలా, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులు వాడితే ఫ్లోరోసిస్ వ్యాధి సమస్యలు వస్తాయని ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ డాక్టర్ సుధాకర్ చెప్పారు. బుధవారం నగర శివారులోని ప్రజానగర్లో ఉన్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో నిర్వహించిన సంచార చికిత్స కార్యక్రమంలో ఆయన ఫ్లోరోసిస్పై అవగాహన కల్పించారు. అధిక స్థాయిలో ఫ్లోరైడ్ కలిగిన ఆహార పదార్థాలు, నీరు తీసుకోవడం వల్ల ఫ్లోరోసిస్ వ్యాధికి గురవుతారన్నారు. దీనివల్ల వికారం, వాంతులు, ఆకలి మందగించడం, కడుపునొప్పి, కడుపు ఉబ్బరం, దంతాల రంగు మారడం, తరచూ మూత్రం రావడం, అధికంగా దాహం వేయడం, కండరాలు, కీళ్ల నొప్పులు, ఎక్కువగా నడవలేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయన్నారు. ఫ్లోరోసిస్కు గురైన వారు తాజా ఆకుకూరలు, పాలపదార్థాలు, తాజా పండ్లు, విటమిన్–సి ఉన్న ఆహార పదార్థాలు (ద్రాక్ష, ఉసిరి, నిమ్మకాయలు) తప్పకుండా తీసుకోవాలన్నారు. ఎక్కువగా మరగకాచిన టీ, కాఫీ, డికాషన్ తీసుకోవడం వల్ల కూడా ఫ్లోరోసిస్కు గురవుతారని తెలిపారు. వైద్యులు నందిని, క్షేత్రస్థాయి పర్యవేక్షకులు ఎస్తేర్ రాణి, సామాజిక ఆరోగ్య అధికారులు అనిత, మహేశ్వరి, ఆశా కార్యకర్తలు, జమృత్, భారతి, ప్రొజెక్షనిస్టు ఖలీల్ పాల్గొన్నారు. -
టమాట ధర ఎరుపెక్కుతోంది!
కర్నూలు(అగ్రికల్చర్): టమాట కొరత ఏర్పడటంతో ధర రోజురోజుకు పెరిగిపోతోంది. టమాట సాగుకు పెట్టింది పేరైన ఉమ్మడి కర్నూలు జిల్లాలో నేడు కనిపించని పరిస్థితి ఏర్పడింది. ఆస్పరి, దేవనకొండ, పెద్దకడుబూరు, హాలహర్వి, హొళగుంద, పత్తికొండ, మద్దికెర, డోన్, ప్యాపిలి, ఓర్వకల్, క్రిష్ణగిరి, కోడుమూరు, బేతంచెర్ల మండలాల్లో టమాట ఎక్కువగా సాగవుతోంది. మామూలుగా అయితే వేసవిలో టమాట కొరత ఏర్పడకుండా రైతులకు సబ్సిడీపై విత్తనాలు ఇచ్చి నీటి వసతి కింద సాగు చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఈ బాధ్యతను విస్మరించింది. ఫలితంగా నేడు ఒక్క ఎకరాలో కూడా టమాట కనిపించని పరిస్థితి ఏర్పడింది. మదనపల్లి, చిత్తూరు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో పండించిన టమాట జిల్లాలోకి దిగుమతి అవుతోంది. బుధవారం కర్నూలులోని రైతుబజార్లలో కిలో ధర రూ.40 పలికింది. బయట రూ.50 నుంచి రూ.60 ధరతో అమ్మకాలు సాగిస్తున్నారు. రానున్న రోజుల్లో టమాట ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
గ్యాస్ సిలిండర్లు పేలి అగ్నిప్రమాదం
రేకుల షెడ్డులో చెలరేగుతున్న మంటలుకాలిపోయిన సామగ్రిని చూస్తున్న కార్మికులుమంత్రాలయం రూరల్: మండల కేంద్రంలో బుధవారం ఉదయం 11.40 గంటల సమయంలో మాధవరం రోడ్డులోని శ్రీమఠం నరహరి తీర్థ వసతి గృహం పక్కన రేకుల షెడ్డులో 3 చిన్న గ్యాస్ సిలిండర్లు (ఒక్కోటి 2 కేజీలు) పేలాయి. వివరాలు.. శ్రీమఠం భవనాల్లో పనులు చేసేందుకు వచ్చిన యూపీ, బీహార్కు చెందిన దాదాపు 50 మంది కూలీలు ఇక్కడి షెడ్లలో ఉంటున్నారు. బుధవారం వీరందరూ పనులకు వెళ్లిన సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించి ఉండొచ్చని సీఐ, ఎస్ఐ తెలిపారు. కార్మికులందరూ ఉదయాన్నే పనులకు వెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. ప్రమాదంలో దుస్తులు, బియ్యం, పెయింటింగ్ మిషన్, వంట సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. సమాచారం తెలుసుకున్న సీఐ దస్తగిరిబాబు, ఎస్ఐ మల్లికార్జున ఆగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చేలోపు కర్ణాటక గెస్ట్హౌస్లోని బోరుతో మంటలను అదుపు చేశారు. తర్వాత అగ్నిమాపక సిబ్బంది వచ్చి పూర్తిగా ఆర్పివేశారు. హెచ్పీ గ్యాస్ సిబ్బంది ఘటనా స్థలంలోని 15 కేజీల సిలిండర్కు మంటలు వ్యాప్తించకుండా సకాలంలో బయటకు తీసుకొచ్చారు. అలాగే బాధితులకు సీఐ చేతుల మీదుగా రూ.10 వేలు ఆర్థిక సహాయం అందించారు. బాధితులకు సాయం అందిస్తాం: పీఠాధిపతి ప్రమాద సమాచారం తెలుసుకున్న శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. శ్రీమఠం పనికి వచ్చిన కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. బాధితులకు అన్ని సౌకర్యాలు, వసతులు కల్పించాలని శ్రీమఠం అధికారులను ఆదేశించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో శ్రీమఠం క్వార్టర్స్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. మఠం మేనేజర్ ఎస్కె.శ్రీనివాసరావు, ఇంజినీర్ సురేష్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
వ్యక్తి ఆత్మహత్య
పగిడ్యాల: భార్యతో గొడవ పడి భర్త ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పగిడ్యాల అంబేడ్కర్ కాలనీలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. మృతుని భార్య నాగమణి తెలిపిన వివరాలు.. స్థానిక అంబేడ్కర్ కాలనీకి చెందిన నాగరాజు అలియాస్ ఏసు(29) మద్యానికి బానిసయ్యాడు. మంగళవారం నందికొట్కూరులో బీరు తెచ్చుకుని తాగి తనతో గొడవ పడినట్లు తెలిపింది. ఇంతకుముందు ఫోన్ పే చేసిన రూ.12 వేలు ఇవ్వాలని వేధించడంతో చిన్న మామ సామేలు ఇంటి వద్దకు వెళ్లినా వదలకుండా వెంటపడి కొట్టాడని వివరించింది. దెబ్బలకు తట్టుకోలేక ఇంటి వెనుక కల్లంలో దాక్కున్నట్లు తెలిపింది. ఈక్రమంలో నాగరాజు తాను ఉరి వేసుకుంటున్నట్లు బంధువులకు సమాచారం ఇవ్వగా వారు తనకు చెప్పడంతో వెళ్లి చూడగా అప్పటికే మృతిచెంది ఉన్నట్లు భార్య నాగమణి తెలిపింది. కాగా నాగరాజు మృతిపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
మాకే మార్కులు తక్కువ వేస్తారా?
కర్నూలు(హాస్పిటల్): ‘చూడండి సార్..! పారిశుద్ధ్యంలో తక్కువ మార్కులు ఇస్తున్నారు. దీనివల్ల సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి కూడా ఇబ్బంది అవుతుంది. మేము చెబితే వినడం లేదు. మీరైనా గట్టిగా చెప్పండి’ అంటూ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల అధికారులపై పద్మావతి శానిటేషన్ ఏజెన్సీ నిర్వాహకులు మంత్రి టీజీ భరత్కు ఫిర్యాదు చేశారు. బుధవారం ఆసుపత్రి అభివృద్ధి పనులపై కర్నూలు మెడికల్ కాలేజీలోని కౌన్సిల్ హాల్లో మంత్రి టీజీ భరత్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనుల గురించి చర్చించారు. చివరగా పద్మావతి శానిటేషన్ ఏజెన్సీ నిర్వాహకులు లేచి పై విధంగా ఫిర్యాదు చేశారు. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు సమాధానమిస్తూ తాము మార్కులు మరీ తక్కువేమీ వేయడం లేదని, 94 వేశామన్నారు. దీనికి నిర్వాహకులు కలుగజేసుకుంటూ 94 వేస్తే ఎలా? కనీసం 95 వేస్తే పూర్తిగా డబ్బులు వస్తాయని బదులిచ్చారు. మంత్రి కలుగజేసుకుంటూ మార్కులు తక్కువ వేస్తే వారికి నష్టం వస్తుంది కదా? చూసి వేయండి అంటూ బదులిచ్చారు. దీనికి సూపరింటెండెంట్ కలుగజేసుకుంటూ 94 మార్కులు వేస్తే వారికి కొద్ది శాతం మాత్రమే కోత పడుతుందని, వారు చెబుతున్నట్లుగా పూర్తిగా డబ్బులు రాకుండా పోవన్నారు. పైగా ఆసుపత్రిలో పారిశుద్ధ్యం బాగాలేదని, స్వయంగా తాము తనిఖీలకు వెళ్లినప్పుడు పరిశీలనలో వెల్లడైందన్నారు. ఈ నేపథ్యంలో అధికారులు, పారిశుద్ధ్య ఏజెన్సీ నిర్వాహకుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. చివరగా మంత్రి స్పందిస్తూ అధికారులు సూచించినట్లు తప్పులు సరిచేసుకుంటే మార్కులు పూర్తిస్థాయిలో పడతాయి. ఆ విధంగా నడుచుకోవాలని చెప్పి వెళ్లిపోయారు. మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ, డిప్యూటీ సూపరింటెండెంట్లు డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ లక్ష్మిబాయి, అడ్మినిస్ట్రేటర్ సింధు సుబ్రహ్మణ్యం, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు ప్రవీణ్, సాయిప్రదీప్, స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ సీఎస్కే ప్రకాష్, ఏపీఎంఎస్ఐడీసీ ఈఈ చిరంజీవులు, డీఎంహెచ్ఓ డాక్టర్ వై.కామేశ్వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో మంత్రి అనుచరులు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి సంబంధించి నిర్వహించిన అధికారిక సమావేశంలో అధిక సంఖ్యలో మంత్రి టీజీ భరత్ అనుచరులు హాజరుకావడం విమర్శలకు తావిస్తోంది. సమావేశానికి వచ్చిన అధికారులు, వైద్యుల కంటే అనుచరులే అధిక సంఖ్యలో సీట్లలో ఆశీనులయ్యారు. పైగా చర్చ జరుగుతున్నంత సేపు కొందరు ముఖ్య అనుచరులు అధికారులను ప్రశ్నించడం మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. తాము ఇలాంటి సమావేశం ఎప్పు డూ చూడలేని ఓ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. మార్చురీలో వర్కర్ల నియామకానికి గ్రీన్సిగ్నల్ ప్రభుత్వాసుపత్రి మార్చురీపై ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన కథనాలను మంత్రి టీజీ భరత్ వద్ద అధికారులు ప్రస్తావించారు. అనధికారింగా 15 ఏళ్ల నుంచి ఎలా పనిచేయించుకుంటున్నారని, ఇప్పుడు వారిని అక్కడ నుంచి తీసేస్తే పని కష్టం అవుతుంది కదా అని ప్రశ్నించారు. కాబట్టి వారిని కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించారు. వారిని ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికులుగా చేర్చుకుని మార్చురీలో పనిచేయించుకోవాలన్నారు. అనంతరం వారు ప్రజల నుంచి డబ్బులు తీసుకోకుండా చూడాలని చెప్పారు. మంత్రి టీజీ భరత్ ముందు అధికారులను నిలదీసిన పద్మావతి శానిటేషన్ ఏజెన్సీ నిర్వాహకులు పారిశుద్ధ్యం బాగా లేకపోతే ఎలా వేయాలని బదులిచ్చిన అధికారులు వాడీవేడిగా ప్రభుత్వ సర్వజన వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశం -
‘పచ్చ’పాత పోలీసులపై పోరాటం
కర్నూలు(టౌన్): ‘జిల్లాలో టీడీపీ నాయకుల ఒత్తిడితో పోలీసులు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల వ్యవధిలోనే నంద్యాలలో కొత్తపల్లి సుబ్బరాయుడు, ఆలూరు నియోజకవర్గంలో బండారి ఈరన్న దారుణంగా హత్యకు గురయ్యారు. కర్నూలు నగర యువజన విభాగం అధ్యక్షులు బాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడేలా పోలీసులు వేధించారు. పోలీసుల వేధింపులను నిరసిస్తూ గురువారం కర్నూలు మూడవ పట్టణ పోలీసు స్టేషన్ ఎదుట మహా ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. ధర్నాలో వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా, వర్కింగ్ ప్రసిడెంట్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి పాల్గొంటారన్నారు. బుధవారం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్లోని సమావేశ హాలులో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి లోకేష్కు పోలీసు డిపార్ట్మెంట్ దాసోహం అయ్యిందన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసు లు పెట్టి వేధించడం పనిగా పెట్టుకున్నారన్నారు. సోషల్ మీడియాలో ఫొటోలను షేర్ చేసినా కేసులు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. కర్నూలు 10 వార్డు కార్పొరేటర్ షేక్ యూనుస్ బాషా కార్యాలయంపై మంత్రి అనుచరులు దాడి చేసి ధ్వంసం చేస్తే.. ఈ ఘటనలో బాధితుడి మీదనే హత్యాయత్నం కేసు నమోదు చేశారన్నారు. అధికార పార్టీ నేతలు భూ కబ్జాలకు సైతం పోలీసులను పంపుతు ండటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.రెండేళ్లు భరించాం.. సహనం నశించింది! ‘అధికార పార్టీ వేధింపులు, దౌర్జన్యాలు రెండేళ్లు చూశాం.. సహనం నశించింది.. ఇక పోరాటం ఎంచుకున్నాం’ అని ఎస్వీ మోహన్రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని, వెనుకడుగు వేసే ప్రసక్తి లేదదన్నారు. అవసరమైతే జైళ్లకు సైతం వెళ్లేందుకు వెనుకాడమన్నారు. కర్నూలు యువజన విభాగం నగర అధ్యక్షులు బాలాంజనేయులు ఆలియాస్ బాలు వృత్తిరీత్యా ఫిజియోథెరపిస్టు అని, వైఎస్సార్సీపీలో చురుగ్గా పనిచేస్తున్నాడని ఆయన కారులో సారా ఉందని అక్రమ కేసు పెట్టారన్నారు. వారం క్రితం పోలీసుల వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు శ్రీరామనగర్లో ఐటీడీపీ జిల్లా అధ్యక్షులు గట్టు తిలక్ మృతికి ముందు లేఖలో రాసినా ఎటువంటి చర్యలు లేవన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మణిరెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు నవీన్ మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీలో బలంగా పనిచేసే నాయకులు, కార్యకర్తలను టీడీపీ నాయ కులు టార్గెట్ చేసి పోలీసులు ద్వారా వేధించడంతో పాటు, అక్రమ కేసులకు పాల్పడుతున్నారన్నారు. సమావేశంలో పార్టీ సీఈసీ సభ్యులు రాంపుల్లయ్య యాదవ్, గడ్డం రామకృష్ణ, షరీఫ్, కిషన్, శ్రీనివాసరెడ్డి, అనిల్కుమార్, మాజీ కార్పొరేటర్లు కృష్ణకాంత్ రెడ్డి, షేక్ యూనుస్ బాషా, షాషావలీ, సాయి పాల్గొన్నారు. మూడవ పట్టణ పోలీసు స్టేషన్ ఎదుట నేడు మహా ధర్నా పాల్గొననున్న యువజన రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా, బైరెడ్డి సిద్దార్థరెడ్డి భారీగా తరలి రావాలని వైఎస్సార్సీపీ యువజన, విద్యార్థి నాయకులకు పిలుపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్రెడ్డి -
గ్యాస్ సిలిండర్ల కోసం పడిగాపులు
బనగానపల్లె: మండలంలో గ్యాస్ వినియోగదారుల కష్టాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. సిలిండర్ బుక్ చేసి 30 – 40 రోజులైనా వినియోగదారులకు అందడం లేదు. అయితే బుకింగ్ చేసిన వారం రోజులకే సిలిండర్ను డెలివరీ చేసినట్లు వినియోగదారుల మొబైల్స్కు మెసేజ్లు వస్తుండటం గమనార్హం. గ్యాస్ సిలిండర్లను డెలివరీ బాయ్లు వినియోగదారుల ఇళ్ల వద్దకు వెళ్లి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఏజెన్సీ కార్యాలయం వద్దకు వెళ్లి సిబ్బందితో గొడవకు దిగిన వారికి మాత్రం అప్పటికప్పుడు డెలివరీ రిసిప్ట్ ఇచ్చి గోడౌన్ వద్దకు వెళ్లి తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో గౌడౌన్ ఉంది. అక్కడికి వెళ్లి సిలిండర్ తెచ్చుకునేందుకు మహిళలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం గౌడౌన్ వద్ద భారీ ఎత్తున వినియోగదారులు ఖాళీ సిలిండర్లతో క్యూ లో వేచి ఉన్నారు. వారంతా ఎండలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రజల కష్టాలు అధికారులకు తెలిసినా సదరు డీలర్పై చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా గోడౌన్ వద్ద సిలిండర్లు పంపిణీ చేస్తున్నారని, ఎదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. వ్యాపారులకు ఫుల్గా గ్యాస్ ప్రభుత్వం సుమారు 40 రోజులుగా వాణిజ్య గ్యాస్ సిలిండర్లను సరఫరా చేయడంలేదు. అయినా ఆహార వ్యాపారుల వద్ద గృహ వినియోగ సిలిండర్లు ఫుల్గా ఉంటాయి. గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు బ్లాక్లో వ్యాపారులకు ఒక్కో సిలిండర్ రూ.1700–1900 ఆదాయంతో విక్రయిస్తున్నట్లు వ్యాపారులే చెబుతున్నారు. ఇళ్లకు సిలిండర్ల పంపిణీ సక్రమంగా జరగకపోవడంతో వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో జిల్లా సివిల్ సప్లై అధికారులు మంగళవారం ఏజెన్సీ వద్దకు వచ్చి రికార్డులను తనిఖీ చేసి గౌడౌన్ను పరిశీలించి డీలర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా అధికారులు చర్యలు చేపట్టి గ్యాస్ సరఫరాలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు. -
అ‘పూర్వం’.. మధుర జ్ఞాపకం
సంజామల: మండల పరిధిలోని నొస్సం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వవిద్యార్థులు 31 సంవత్సరాల తరువాత తిరిగి కలుసుకొని ఆప్యాయంగా పలకరించుకున్నారు. 1994–1995 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు బుధవారం నొస్సం పాఠశాల వేదికగా కలుసుకున్నారు. నాటి ఉపాధ్యాయులు లక్ష్మిరెడ్డి, రామిరెడ్డి, దినకర్ నాయుడు, కృష్ణ మూర్తి, నాగయ్య, సుబ్రమణ్యం, ఖాజ హుస్సేన్, రామచంద్రయ్యను నొస్సం బురుజు వద్ద నుంచి పాఠశాల వరకు బ్యాండ్మేళంతో ఊరేగింపుగా తీసుకెళ్లారు. నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆహ్లాదంగా గడిపారు. విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. వివిధ హోదాలలో స్థిరపడ్డ పూర్వ విద్యార్థులు ఒకే వేదికపై కలుసుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. పూర్వ విద్యార్ధులు రజనీ, సాయికుమారి, శివశంకర్ రెడ్డి, సుబ్బరంగయ్య, రామకృష్ణరెడ్డి, సంజీవ, హైదర్ బాష, ఆలీబాషా, జగదీష్, తదితరులు పాల్గొన్నారు. -
పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి
కోడుమూరు రూరల్: స్వచ్ఛ పథం కార్యక్రమంలో భాగంగా ప్రజలంతా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని జెడ్పీ సీఈఓ రమణారెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కోడుమూరులో నిర్వహిస్తున్న స్వచ్ఛ పథం కార్యక్రమాన్ని జెడ్పీ సీఈఓ రమణారెడ్డి, డీఎల్డీఓ ఆశ్వినికుమార్ పరిశీలించి పారిశుద్ధ్య సిబ్బందికి పలు సూచనలిచ్చారు. జెడ్పీ సీఈఓ మాట్లాడుతూ.. పారిశుద్ధ్య సిబ్బంది ప్రతిరోజు సకాలంలో వీధులను శుభ్రం చేయడంతో పాటు, ఇంటింటి నుంచి చెత్తను సేకరించి చెత్త నుంచి తయారీ కేంద్రానికి తరలించాలని ఆదేశించారు. అలాగే ప్రజలు కూడా తమ వద్ద వేస్ట్ పొడి చెత్త, పాత పుస్తకాలు, అట్టపెట్టెలు, ఇనుము, ప్లాస్టిక్ బాటిళ్లను స్వచ్ఛ రథంలో అప్పగించి పారిశుద్ధ్య నిర్వహణకు సహకరించాలని కోరారు. అనంతరం సీఈఓ కోడుమూరులో జరుగుతున్న జనగణన కార్యక్రమాన్ని తనిఖీ చేసి త్వరితగతిన మ్యాపు చేయబడిన సర్వేను పూర్తి చేయాలని ఎనుమరేటర్లకు సూచించారు. అలాగే మేజర్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని సీఈఓ సందర్శించారు. కేంద్రాన్ని సక్రమంగా నిర్వహించాలని, చెత్తను ఉపయోగించి వర్మీ కంపోస్టు ఎరువును తయారు చేయాలని ఎంపీడీఓ రాముడుకు సూచించారు. పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. -
‘గాలి’ వైద్యం!
సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్నా మనిషి మూఢనమ్మకాలను వీడలేకపోతున్నాడు. ఇప్పటికీ దెయ్యం పట్టిందనే అపోహతో నాటు వైద్యులను ఆశ్రయిస్తున్నారు. తాయత్తులు, అంత్రాలు కట్టించుకొని నయమైనట్లుగా భ్రమపడుతున్నారు. చివరకు వ్యాధి ముదిరి మానసిక వైద్యులను సంప్రదిస్తున్నారు. బుధవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని సర్జికల్ విభాగం వద్ద కొందరు మహిళలు ఓ మహిళను జుట్టు పట్టుకొని కొడుతున్నారు. ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, ఈమెను విడిచి పో అంటూ గట్టిగా కేకలు వేస్తున్నారు. అక్కడున్న వారంతా ఈ దృశ్యాన్ని వేడుకగా చూస్తున్నారు. ఏమైందోనని ‘సాక్షి’ ఆరా తీయగా.. ఆమెకు కొద్ది రోజులుగా మానసిక సమస్య ఉన్నట్లు తెలిపారు. ఆసుపత్రిలోని మానసిక వ్యాధుల విభాగంలో చేర్చినా ఉండటం లేదన్నారు. గాలి సోకినట్లుగా భావించి ఇలా చేయిస్తున్నట్లు ఆమె సంబంధీకులు చెప్పడం గమనార్హం. – కర్నూలు(హాస్పిటల్) -
యువతితో ఎస్ఐ వివాహేతర సంబంధం..!
కర్నూలు: కర్నూలు నగరంలో ట్రాఫిక్ ఎస్ఐగా పని చేస్తున్న హరిప్రసాద్ను డిస్మిస్ చేస్తూ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్ఐకి వివాహమై పిల్లలు ఉన్నప్పటికీ మరో యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. దీనిపై యువతి కుటుంబ సభ్యులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన అధికారులు హరిప్రసాద్ను విధుల నుంచి తొలగించారు. వైఎస్సార్ కడప జిల్లా రాజుపాలేనికి చెందిన హరిప్రసాద్ 2013లో ఎస్ఐగా పోలీసు శాఖలో చేరారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లలో విధులు నిర్వహించారు. పది రోజుల క్రితం నంద్యాల జిల్లా నుంచి కర్నూలు ట్రాఫిక్ విభాగానికి బదిలీపై వచ్చారు. హరిప్రసాద్కు యువతితో వివాహేతర సంబంధం విషయంలో రెండు నెలలుగా ఇరు కుటుంబాల మధ్య వివాదం కొనసాగుతోంది. చివరకు యువతి కుటుంబ సభ్యులు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అంతర్గత విచారణ జరిపించి డిస్మిస్ చేశారు.కాగా, హరిప్రసాద్ ఆళ్లగడ్డ రూరల్ ఎస్ఐగా పనిచేసే సమయంలో కూడా ఆయనపై అనేక ఆరోపణలు రావడంతో అధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన వ్యక్తి ట్రాక్టర్లో ఇసుక తరలిస్తుండగా చాగలమర్రి టోల్ప్లాజా వద్ద పట్టుకుని పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేయడంతో అతను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో ఎస్ఐ హరిప్రసాద్ను వీఆర్కు పంపారు. -
పోలీసులు వేధింపులు తాళలేక వైఎస్సార్సీపీ నేత ఆత్మహత్యాయత్నం
కర్నూలు: పోలీసుల వేధింపులు తాళలేక వైఎస్సార్సీపీ యువజన విభాగం కర్నూలు నగర అధ్యక్షుడు బాలాంజనేయులు అలియాస్ బాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పాత ఆర్టీఓ కార్యాలయం పక్కనున్న కమలానగర్లో నివాసం ఉంటున్న బాలు ఇంటికి మంగళవారం మధ్యాహ్నం కర్నూలు మూడో పట్టణ క్రైం పార్టీ పోలీసులు వెళ్లి సీఐ పిలుస్తున్నాడు.. రావాలంటూ ఒత్తిడి చేశారు. దీంతో బాలాంజనేయులు ఇంట్లో ఉన్న కత్తితో చేయి కోసుకున్నాడు. భారీగా రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.గత ఎన్నికల సమయంలో జరిగిన గొడవల్లో ఈయనపై మూడో పట్టణ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఇటీవల ఓ చికెన్ సెంటర్ మహిళతో గొడవకు సంబంధించి పోలీసులు బాలును స్టేషన్కు రావాలంటూ బెదిరిస్తున్నారు. దీంతో తాను ఎలాంటి తప్పు చేయకపోయినా టీడీపీ నాయకుల ఒత్తిడితోనే వేధింపులకు గురిచేస్తున్నారని బాధితుడితో పాటు కుటుంబ సభ్యులు ఆరోపించారు. అక్రమంగా సారా, డ్రగ్స్ కేసులు నమోదు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని వాపోయారు. ఎస్వీ మోహన్రెడ్డి పరామర్శ విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి బాధితుడు బాలాంజనేయులును పరామర్శించారు. వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. తనపై ఎలాంటి ఫిర్యాదు లేకపోయినప్పటికీ పోలీసులు వేధిస్తున్నారని బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ ఘటనపై కచ్చితంగా న్యాయపోరాటం చేస్తామని, పోలీసుల వైఖరిని ఎండగడతామని ఎస్వీ మోహన్రెడ్డి వారికి హామీ ఇచ్చారు. -
ఏపీవీఏ ఫోర్త్ ఉపాధ్యక్షుడిగా రవిబాబు
కర్నూలు(అగ్రికల్చర్): ఆంధ్రప్రదేశ్ వెటర్నరీ అసోసియేషన్ (ఏపీవీఏ) ఫోర్త్–4 ఉపాధ్యక్షుడిగా సహాయ సంచాలకులు గుండంపాటి రవిబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయన నంద్యాల జిల్లా పొన్నాపురం గ్రామానికి చెందిన వారు. కర్నూలు పశువ్యాధి నిర్ధారణ కేంద్రం వెటర్నరీ అసిస్టెంటు సర్జన్గా, సహాయ సంచాలకులుగా దాదాపు 15 ఏళ్లపాటు పనిచేశారు. ప్రస్తుతం అనంతపురం జిల్లా పశువ్యాధి నిర్ధారణ కేంద్రం సహాయ సంచాలకులుగా పనిచేస్తున్నారు. ఇటీవల ఏపీ వెటర్నరీ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఫోర్త్–4 (రాయలసీమ) ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన కర్నూలులో విలేకరులతో మాట్లాడుతూ... రాయలసీమ స్థాయిలో పశువైద్యులు ఎదుర్కొంటున్న వివిద సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. -
శ్రీమఠం హుండీ ఆదాయం రూ.2.78 కోట్లు
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ రాఘవేంద్రస్వామి హుండీ ఆదాయం రూ.2,78,19,526 సమకూరింది. మంగళవారం శ్రీమఠం రాజాంగణ భవనంలో హుండీ లెక్కింపు చేపట్టారు. ఏప్రిల్ 22 నుంచి మే 11 వరకు సంబంధించి 20 రోజుల హుండీ కానుకలు శ్రీమఠం అధికారులు లెక్కగట్టారు. అందులో నగదు రూపేణా రూ 2,69,28,176, నాణేలా రూపంలో రూ.8,91,350 వచ్చిందన్నారు. అలాగే 15 గ్రాముల బంగారం, 751గ్రాముల వెండి కానుకలు సమకూరినట్లు మేనేజర్ ఎస్.కె శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్–2 వెంటేష్ జోషి, ఇంజనీర్ సురేష్కోనాపూర్ పాల్గొన్నారు. కొత్తిమీర ధరకు రెక్కలు ● ఒక మడి ధర రూ.1600 గోనెగండ్ల: కొత్తిమీర ధరకు రెక్కలు వచ్చాయి. ఒక మడి ధర రూ. 1500 నుంచి రూ.1600 వరకు పలుకుతోంది. ఎండలు ఎక్కువకావడం, బోర్లు, బావుల్లో నీరు ఎండిపోవడం, పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొత్తిమీరకు డిమాండ్ పెరిగింది. గోనెగండ్ల మండలంలో ప్రస్తుతం బోర్లు, బావుల కింద 100 ఎకరాల్లో ఈ పంట సాగులో ఉంది. ఒక ఎకరా సాగుకు రూ.40 వేల పెట్టుబడి వస్తుంది. ఈ ఏడాది ఉల్లి తదితర పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రెండు రోజుల నుంచి కొత్తిమీరకు ధర పెరగడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దాడికి పాల్పడిన టీడీపీ నాయకులపై కేసు వెల్దుర్తి: మల్లెపల్లె వైఎస్సార్సీపీ కార్యకర్త వీరేశ్ ఆచారిపై సోమవారం దాడికి పాల్పడిన అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు రామదుర్గనాయుడు, అయ్యన్న, చంద్రారెడ్డి, మాధవ్పై కేసు నమోదు చేసి నట్లు ఎస్ఐ నరేశ్ మంగళవారం తెలిపారు. హైవే 44 పక్కన మల్లెపల్లె స్టేజ్ సమీపంలో వీరేశ్ ఆచారి, భార్య గాయత్రి, ఇద్దరు పసిపిల్లలతో కలిసి బైక్పై వస్తుండగా నిందితులు దారికాచి బైక్ను అటకాయించి వీరేశ్ ఆచారిపై దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే. జరిగిన సంఘటనపై గాయత్రి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. -
ఏపీ ఈఏపీసెట్కు తొలిరోజు 92.5 శాతం హాజరు
కర్నూలు సిటీ: ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్–ఫార్మాసీ కామన్ ఎంట్రెన్స్ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. కర్నూలు జిల్లాలో ఆరు, నంద్యాల జిల్లాలో మూడు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో జరిగిన పరీక్షలకు మొత్తం 3,432 మందికిగాను 3,173 మంది హాజరయ్యారు. కర్నూలు నగరంలో నాలుగు, ఎమ్మిగనూరు, ఆదోనిలలో ఒకొక్క కేంద్రం ఏర్పాటు చేయగా ఉదయం 1,011 మందికిగాను 926 మంది, మధ్యాహ్నం పరీక్షకు 1382 మందికిగాను 1266 మంది హాజరయ్యారు. నంద్యాల జిల్లాలో మూడు కేంద్రాల్లో ఉదయం 369 మందికి 346 మంది, మధ్యాహ్నం పరీక్షకు 670 మందికి 635 మంది విద్యార్థులు హాజరయ్యారు. తొలిరోజు పరీక్ష కేంద్రాల దగ్గర సందడి నెలకొంది. ఉదయం 7.30 గంటల నుంచే కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించారు. పరీక్షకు హాజరైన ప్రతి విద్యార్థిని తనిఖీ చేసి కేంద్రంలోకి పంపించారు. -
క‘నీట్’ సుడులు!
కర్నూలు సిటీ: వైద్య విద్యను అభ్యసించాలనేది ఎంతో మంది విద్యార్థుల కల. ఇందుకోసం రేయింబవళ్లు కష్టపడుతున్న విద్యార్థులు కోకొల్లలు. ఆ దిశగా తొలి అడుగు వేస్తున్న తీరుణంలో నీట్ రద్దు వార్త విద్యార్థులను కన్నీళ్లు పెట్టిస్తోంది. రాజస్థాన్లో పేపర్ లీక్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈనెల 3న నిర్వహించిన వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్ యూజీ–2026 రద్దయింది. ఎంతో కష్టపడి చదివిన విద్యార్థులు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి శిక్షణ ఇప్పించిన తల్లిదండ్రులు ఈ వార్తతో ఆందోళన చెందుతున్నారు. ప్రశ్నపత్రం మధ్యస్తంగా ఉండటంతో చాలా మంది విద్యార్థులు మంచి మార్కులు వస్తాయని, ఇక వైద్య విద్యను అభ్యసించవచ్చని ఎంతో ఆశతో ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో వెలువడిన రద్దు వార్త విద్యార్థుల కళ్లలో కన్నీటి సుడికి కారణమైంది. మళ్లీ ఆ స్థాయిలో పరీక్ష రాస్తామో, లేదోనని ఆందోళన వ్యక్తమవుతోంది. నీట్ పరీక్షకు కర్నూలులో 16 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 4,928 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 4,807 మంది హాజరయ్యారు. మా అబ్బాయి గత నెల 3న జాతీయ స్థాయిలో జరిగిన నీట్ యూజీ–2026 ప్రవేశ పరీక్ష రాశారు. మంచి మార్కులు వస్తాయని అనుకుంటున్న సమయంలో రాజస్థాన్లో నీట్ ప్రశ్నపత్రం లీకై ందని ఎన్టీఏ పరీక్షను రద్దు చేసిన విషయం తెలిసింది. ఈ పరిస్థితుల్లో పరీక్ష రాసిన విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. దేశ వ్యాప్తంగా కాకుండా ఎక్కడైతే నీట్ ప్రశ్నపత్రం లీకై ందని తెలుస్తుందో అక్కడ మాత్రమే రద్దు చేస్తే బాగుంటుంది. – డా.చైతన్య కుమార్, గుండె వైద్య నిపుణులు, విద్యార్థి తండ్రి నీట్ పరీక్షకు కష్టపడి సిద్ధమయ్యాను. పరీక్ష రాసిన ఆనందం ఎన్నో రోజులు నిలువలేదు. నేను అనుకున్న మార్కులు సాధిస్తాననే నమ్మకం ఉంది. ఇక వైద్య విద్యను అభ్యసించవచ్చని ఆశించా. ఇప్పుడు పేపర్ లీక్ అయిందని పరీక్ష రద్దు చేయడం తెలిసి చాలా బాధ కలుగుతోంది. రీ ఎగ్జామ్లో పేపర్ ఎలా వస్తుందో తెలియదు. అమ్మానాన్న ధైర్యం చెబుతున్నా కోలుకోలేకపోతున్నా. – పి.ప్రవళ్లిక, బోడబండ, ఎమ్మిగనూరు మండలం మా కుమార్తె సిరిసౌమ్య ఎంతో కష్టపడి చదివి నీట్ పరీక్ష రాసింది. రాజస్థాన్లో పేపర్ లీకై ందని పరీక్షను రద్దు చేయడంతో ఎంతో మంది విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురైయ్యే అవకాశం ఉంది. మొదటిసారి పరీక్ష రాసినంత ఉత్సాహం రెండోసారి ఉండదు. ఒత్తిడికి లోనవుతారు. పరీక్ష రద్దు లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడమే. – బోరెల్లి సోమన్న, కోడుమూరు మా అమ్మాయి షేక్ యాస్మిన్ మెడిసిన్ చేయాలనే లక్ష్యంతో నెలల తరబడి చాలా కష్టపడి చదివి నీట్ పరీక్ష రాసింది. మంచి మార్కులు వస్తాయనే నమ్మకంతో సంతోషంగా ఉన్న సమయంలో పరీక్ష రద్దు అని ప్రకటించడం చాలా బాధాకరం. ప్రభుత్వాలు గతంలో లీక్ అయిన సమయంలో కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. – అబ్బాస్, పెరవలి గ్రామం మద్దికెర మండలం పరీక్ష బాగా రాశామని చాలా మందిలో సంతోషం వైద్య విద్యను అభ్యసించేందుకు నిరీక్షణ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు నిరాశ కలిగించిన పరీక్ష రద్దు మళ్లీ ఆ స్థాయిలో రాయగలమో లేదోనన్న సంశయం -
కోనేరులో జారిపడి వ్యక్తి మృతి
బనగానపల్లె: మండలంలోని నందవరం చౌడేశ్వరి ఆలయం ఎదురుగా ఉన్న కోనేటిలో మంగళవారం నడిగంటి బాలనరసింహుడు (43) ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందినట్లు సీఐ మంజునాథరెడ్డి తెలిపారు. వివరాలు.. వైఎస్సార్ కడప పట్టణంలోని అంగన్ వీధిలో నివసించే బాల నరసింహుడు మొక్కుబడి తీర్చుకునేందుకు కుటుంబంతో సహా చౌడేశ్వరి ఆలయానికి వచ్చారు. కోనేటిలో దిగి కాళ్లు, ముఖం శుభ్రం చేసుకుంటుండగా ప్రమాద వశాత్తు నీటిలో పడిపోయారు. ఆ సమయంలో కాపాడేందుకు ఎవరూ లేకపోవడంతో నీట మునిగి మృతి చెందాడు. కొంత సేపటికి కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి చూడగా శవమై తేలాడు. సమాచారం అందుకున్న పోలీసులు కోనేటిలో ఉన్న మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. భార్య రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
మార్చురీకి సిబ్బంది కేటాయింపు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆవరణలోని మార్చురీకి అవసరమైన సిబ్బందిని కేటాయిస్తూ మంగళవారం కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 9న ‘మార్చురీలో రాబందులు’ శీర్షికన ప్రచురించిన కథనానికి ఆమె స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నారు. మార్చురీలో ప్రభుత్వ సిబ్బంది లేకపోవడంతో అనధికార వ్యక్తులు వచ్చి పోస్టుమార్టం విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు వీరి స్థానంలో కళాశాలలో పనిచేసే ఇద్దరు శానిటేషన్ వర్కర్లు, నలుగురు సెక్యూరిటీ గార్డులు, నలుగురు తోటీలు, ఒక ఆఫీస్ సబార్డినేట్ను కేటాయించారు. -
పండ్ల దుకాణాల్లో తనిఖీలు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు నగరంలో నిబంధనలకు విరుద్ధంగా పండ్లను మాగిస్తున్న దుకాణాలపై మంగళవారం ఆహార భద్రత విభాగం (ఫుడ్ సేఫ్టీ) అధికారులు తనిఖీలు నిర్వహించారు. నగరంలోని మండిబజార్లో ఉన్న గౌస్ ఫ్రూట్స్ కంపెనీ, షమీవుల్లా ఫ్రూట్ మర్చంట్ దుకాణాల్లో తనిఖీలు చేసి అరటి, మామిడి పండ్లు మాగిస్తున్న విధానాన్ని పరిశీలించారు. ఇథలిన్ గ్యాస్ను గదిలోకి పంపి పండ్లను మాగించకుండా ఇథలిన్ పౌడర్ను నీళ్లలో కలిపి అందులో పండ్లను మాగించడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇలా మాగించిన పండ్లను తినడం వల్ల వ్యాధులు వస్తాయని ఫుడ్ సేఫ్టీ అధికారి రాజగోపాల్ చెప్పారు. ఈ మేరకు అరటి, మామిడి పండ్లను శాంపిల్ తీసి ల్యాబోరేరీకి పంపించారు. డిస్ట్రిక్ట్ కన్జూమర్ సెక్రటరీ శివమోహన్రెడ్డి తదితరులు వెంట ఉన్నారు. -
ఉల్లి డీహైడ్రేషన్ యూనిట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు
కర్నూలు(సెంట్రల్): జిల్లాలో వచ్చే మంగళవారం నాటికి ఉల్లి డీహైడ్రేషన్ యూనిట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఉద్యాన, ఫుడ్ ప్రాసెసింగ్, మెప్మా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో ఉల్లి సాగు, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుపై కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉల్లి సాగులో దిగుబడిని పెంచడానికి నాణ్యమైన విత్తనాలను నాటడం, సీడ్ డ్రిల్లర్ యంత్రాలను సబ్సిడీపై రైతులకు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఉద్యాన శాఖాధికారులను ఆదేశించారు. సమావేశఃలో ఉద్యాన శాఖాధికారి రాజాకృష్ణారెడ్డి, ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు, మెప్మా పీడీ శ్రీనివాసులు పాల్గొన్నారు. 17న కురువ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు కర్నూలు(అర్బన్): కురువ విద్యార్థులకు ప్రతిభా పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఈ నెల 17న ఉదయం 10 గంటలకు పెద్దపాడు రోడ్డులోని ఏపీ మోడల్ స్కూల్ పక్కనున్న శ్రీ భీర లింగేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కురువ సంఘం ప్రధాన కార్యదర్శి ఎంకే రంగస్వామి తెలిపారు. మంగళవారం స్థానిక కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి కర్నూలు జిల్లాలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినీ, విద్యార్థులను విద్యాపరంగా మరింత ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు పెద్ద సంఖ్యలో కురువ సామాజిక వర్గ ప్రజలు హాజరు కావాలని కోరారు. సమావేశంలో సంఘం అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న, ఉపాధ్యక్షులు ధనుంజయ, కోశాధికారి కేసీ నాగన్న తదితరులు పాల్గొన్నారు. ఏపీ పీఆర్ రాష్ట్ర అసోసియేషన్లో జిల్లాకు చోటు కర్నూలు(అర్బన్): ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గంలో జిల్లాకు చోటు లభించింది. ఇటీవల గుంటూరు జిల్లా పరిషత్ సమావేశ భవనంలో అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఎన్నికలు నిర్వహించి, నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యవర్గంలో కర్నూలు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఆర్.మధు వెంకటేశ్వరరావును రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా, జిల్లా పరిషత్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఆర్బీవీ కృష్ణారావును రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచాలి సి.బెళగల్: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలను పెంచాలని ఉపాధ్యాయులకు డీఈఓ సుధాకర్ సూచించారు. మండల విద్యాశాఖ అధికారులు జ్యోతి, ఆదామ్బాషా ఆధ్వర్యంలో మంగళవారం పొలకల్లో బడిపిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. డిప్యూటీ ఈఓ శ్రీధర్బాబుతో కలిసి డీఈఓ తనిఖీ చేశారు. అనంతరం స్థానిక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో రెమిడియల్ తరగతులను తనిఖీ చేసి విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. హెచ్ఎంలు తిమ్మన్న, వరలక్ష్మమ్మ, మునిస్వామి, సీఆర్పీలు పాల్గొన్నారు. వడదెబ్బతో వ్యక్తి మృతి పాములపాడు: వడదెబ్బతో కోల్స్ ఆనందాపురం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ విజయానందం(54) మృతి చెందాడు. సోమవారం ఉదయం ఉపాధి పనులకు, మొక్కజొన్న మిషన్ పనులకు వెళ్లి ఎండలు ఎక్కువగా ఉండటంతో అస్వస్థతకు గురై మంగళవారం తెల్లవారు జామున మృతి చెందాడు. -
హరిత మంత్రాలయంగా తీర్చిదిద్దుతాం
● రూ.15లక్షలతో పనులకు శ్రీకారం చుట్టిన పీఠాధిపతి మంత్రాలయం: శ్రీరాఘవేంద్ర స్వామి వెలసిన ప్రాంతాన్ని హరిత మంత్రాలయంగా తీర్చిదిద్దుదామని మఠం పీఠాధిపతులు సుబుధేంద్రతీర్థులు తెలిపారు. డీజీవీ అతిథి గృహం వద్ద హైవే రోడ్డులో డివైడర్ మధ్యలో ఉన్న మొక్కలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసే పనులకు మంగళవారం పీఠాధిపతులు శ్రీకారం చుట్టారు. మంత్రాలయం పట్టణంతో పాటు మఠం అతిథి గృహాలు, తులసీ వనం, గోశాల, బృందావన్ గార్డెన్, సుశమీంద్రతీర్థుల పార్క్, గురునివాస్, ప్రధాన రహదారుల్లో మొక్కలు నాటడం, వాటిని సంరక్షించే బాధ్యత పీవీ బద్రినాథ్ రావు తీసుకున్నారు. ఈ పనులకు రూ.15లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఆయనను పీఠాధిపతి శాలువ, పూలమాలలు వేసి, అక్షింతలు ఇచ్చి ఆశీర్వదించారు. -
జిల్లాలోకి తెలంగాణ, కర్ణాటక విత్తనాలు
వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం హెక్టారుకు 5 ప్యాకెట్ల బీటీ–2 పత్తి విత్తనాలు వినియోగించాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాకు దాదాపు 30 లక్షల ప్యాకెట్లు అవసరం కాగా.. వ్యవసాయ అధికారులు కర్నూలు జిల్లాకు 11 లక్షల ప్యాకెట్లు, నంద్యాల జిల్లాకు 50 వేల ప్యాకెట్లు కేటాయించాలని వ్యవసాయ శాఖను కోరారు. దీంతో జిల్లాలో పత్తి విత్తనాల కొరత ఏర్పడే పరిస్థితి నెలకొంది. దీనిని అవకాశంగా తీసుకొని అక్రమార్కులు తెలంగాణ, కర్ణాటక నుంచి అనధికార బీటీ–2 విత్తనాలను జిల్లాలోకి డంప్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆదోని, కౌతాళం, పెద్దకడుబూరు, మంత్రాలయం, దేవనకొండ, కోడుమూరు, సి.బెళగల్, కల్లూరు, క్రిష్ణగిరి మండలాల్లోకి అనధికార పత్తి విత్తన ప్యాకెట్లు పెద్ద ఎత్తున డంప్ అయినట్లు సమాచారం. వందల కంపెనీలు, అనేక రకాల పేర్లతో పత్తి విత్తన ప్యాకెట్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నా వ్యవసాయ శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. -
కొండలు పిండి.. సంపద కొల్లగొట్టి
కొచ్చేర్వు, కన్నపకుంట గ్రామల మధ్య అక్రమ మైనింగ్ చిన్న మల్కాపురం గ్రామంలో అక్రమ మైనింగ్ జరుగుతున్న దృశ్యండోన్ రూరల్: నంద్యాల జిల్లా డోన్ మండలంలోని పచ్చని కొండల్ని అధికార పార్టీ నాయకులు అక్రమ మైనింగ్ చేస్తూ పిండి చేస్తున్నారు. భూగర్భంలో ఇమిడి ఉన్న విలువైన ఖనిజ సంపదను కొల్లగొడుతూ అక్రమంగా కోట్లు గడిస్తున్నారు. ప్రభుత్వానికి నయాపైసా రాయాల్టీ, వే బిల్లుల రూపంలో చెల్లించకుండానే యాథేచ్ఛగా ఖనిజాన్ని తరలిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. మండలంలోని కన్నపకుంట, కొచ్చెర్వు, మల్కాపురం, పరదేశిబావి, పెద్ద మల్కాపురం, డోన్ శివారులోని వెంకటనాయునిపల్లె, గుడితిప్ప ప్రాంతాల్లోని అ టవీ, రెవెన్వూ భూముల్లో ప్రభుత్వం నుంచి ఎలా ంటి అనుమతులు లేకుండా అక్రమ తవ్వకాలు సా గిస్తూ విలువైన ఖనిజాలను కొల్లగొడుతున్నారు. కళ్లు మూసుకున్న అటవీ, రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూముల్లో తవ్వకాలు జరిపేందుకు రెవెన్యూ శాఖ నుంచి ఎన్ఓసీ (నో అబ్జెక్షన్) సర్టిఫికెట్ పొందకుండా, ఏడీఎంజీకి రాయల్టీ బిల్లులు చెల్లించకుండా, సేల్ ట్యాక్స్ నుంచి వే బిల్లులు లేకుండానే ఖనిజాలను అక్రమంగా తవ్వుతూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. కొచ్చెర్వు, కన్నపకుంట అటవీ భుముల నుంచి డోలమైట్, వైట్ సెల్, లైమ్ స్టోన్లతో పాటు వివిధ రంగుల రాళ్లను అక్రమంగా తరలిస్తున్నారు. పట్టణ శివారుతో పాటు పలు ప్రాంతాల్లో లైసెన్స్లు పొందకుండానే గనుల్లో బ్లాస్టింగ్ (పేల్లుళ్లు)కు పాల్పడుతున్నారు. అటవీ, రెవెన్యూ, ఎడీఎంజీ, సేల్స్ ట్యాక్స్ అధికారులు కళ్లుండి చూడలేని కబోదుల్లా మారడంతో అధికార పార్టీ నేతల అక్రమార్జనకు అంతులేకుండా పోతోంది. ఈ విషయంపై నోరు మెదిపేందుకు కుడా సంబంధిత అధికారులు ఇష్టపడటం లేదు. ఖనిజాల అక్రమ తవ్వకం ద్వారా కోట్లు గడిస్తున్న టీడీపీ నాయకులు ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి మొద్దు నిద్రలో ఏడీఎంజీ, అటవీ, రెవెన్యూ అధికారులు -
ఇళ్లు తనఖా పెట్టించి ఘరానా మోసం
వెల్దుర్తి: పలు ప్రైవేట్ బ్యాంకులలో గ్రామస్తుల ఇళ్లు తనఖా పెట్టించి లోన్ మంజూరు చేయించాడు. అందులో సగం తీసుకుని, మిగతా సగం కూడా తనకే ఇస్తే అధిక వడ్డీ చెల్లిస్తానని ఆశ జూపి మొత్తం కాజేశాడు. లోన్కు సంబంధించి పూర్తి ఈఎంఐ తానే కట్టేస్తానని నమ్మబలికి చివరకు పత్తా లేకుండా పోయాడు. ఈ క్రమంలో రుణం తీసుకున్న వారికి ఈఎంఐ చెల్లించాలంటూ బ్యాంకు వారు ఒత్తిడి చేస్తుండటంతో మోసపోయినట్లు తెలుసుకుని బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ ఘటనపై బాధితులు పాండు, మల్లయ్య, గిడ్డయ్య, ఎల్లయ్య, రాజు, రామాంజనేయులు, మాదన్న, మనోహర్, రామలింగం తదితరులు తెలిపిన వివరాల మేరకు.. మల్లెపల్లె గ్రామానికి చెందిన ఏజెంట్ బురకల శాంతకుమార్ దాదాపు 4 ఏళ్ల నుంచి డోన్కు చెందిన ఓ ప్రైవేట్ బ్యాంకులో, మరిన్ని బ్యాంకులలో ఇళ్లు తనఖా పెట్టి లోన్ ఇప్పిస్తానని, అందులో సగం తాను తీసుకుని, లోన్ మొత్తం కంతుల వారీగా బ్యాంకుకు చెల్లిస్తానని ఆశ చూపాడు. దీంతో మల్లెపల్లెలోని దాదాపు 70 మందికి పైగా గ్రామస్తులు తమ ఇళ్లు, ఇతర ఆస్తి పత్రాలు శాంతకుమార్కు అప్పగించారు. వాటిని ప్రైవేట్ బ్యాంకులలో తనఖా పెట్టించి (మార్టిగేజ్ చేయించి) దాదాపు రూ.4 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు లోన్ మంజూరు చేయించాడు. సొమ్ము లబ్ధిదారుల ఖాతాలో జమ కాగానే ఒప్పందం ప్రకారం సగం తీసుకున్నాడు. మిగతా సగం కూడా తనకే ఇస్తే అధిక వడ్డీ చెల్లిస్తానని ఆశ చూపి మొత్తం కాజేశాడు. మొదట్లో లోన్ ఈఎంఐ సక్రమంగా కడుతూ ఇతరుల నమ్మకం పెంచుకున్నాడు. నమ్మకం మరింత పెరిగేలా ఇళ్లు తనఖా పెట్టిన వారికి బాండ్ సైతం రాసిచ్చాడు. దీంతో వందల సంఖ్యలో మల్లెపల్లెతో పాటు మండల పరిధిలోని చెరుకులపాడు, రామళ్లకోట, కలుగొట్ల, పుల్లగుమ్మి, బుక్కాపురం ఇలా పలు గ్రామాల వాసులు ఇతని ద్వారా హోమ్లోన్ తీసుకుని నగదు సమర్పించుకున్నారు. క్షేత్రస్థాయి విచారణ లేకుండా కేవలం ధ్రువపత్రాలను చూసి లోన్ మంజూరు చేయడంపై ఈ స్కామ్లో బ్యాంకు వారి పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని పత్రాలు లేకపోయినా ఏజెంట్ శాంతకుమార్ అధికారుల వద్దకు తిరిగి మరీ ఏర్పాటు చేసినట్లు బాధితులు చెబుతున్నారు. ఎమ్మిగనూరు, కోడుమూరు, వెల్దుర్తి తదితర మండలాల్లో ఈ తరహాలో రూ.కోట్లలో స్కామ్ జరిగినట్లు చెప్పారు. ఈ స్థితిలో శాంతకుమార్ పత్తా లేకుండా పోవడంతో గత వారం నుంచి తమకు బ్యాంకుల నుంచి ఈఎంఐ కట్టాలంటూ ఒత్తిడి ఎక్కువైందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబంలో ఒకరు పేడ రంగు తాగి ఆత్మహత్యకు సైతం ప్రయత్నించినట్లు చెప్పారు. తమ పరిస్థితీ అదేనని, అధికారులు చర్యలు చేపట్టి న్యాయం చేయాలని కోరారు. ఘటనపై స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వందల మందికి రూ.కోట్లలో కుచ్చుటోపీ పరారీలో ఏజెంట్ ఈఎంఐ కట్టాలని బ్యాంకుల నుంచి ఒత్తిడి -
ఉమ్మడి జిల్లాలో నకిలీ పత్తి విత్తన ప్యాకెట్లు
● 2025 ఖరీఫ్లో 2,86,622 హెక్టార్లలో పత్తి సాగు ● ఈ సారి సాగు మరింత పెరిగే అవకాశం ● కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి భారీగా పత్తి విత్తన ప్యాకెట్లు డంప్ ● గుట్టుచప్పుడు కాకుండా హెచ్టీ పత్తి సాగు ● సొంత ధృవీకరణతోనే మార్కెట్లోకి బీటీ పత్తిన ప్యాకెట్లు కర్నూలు(అగ్రికల్చర్): 2025 ఖరీఫ్ సీజన్లో ఉమ్మడి జిల్లాలో పత్తి 2,86,622 హెక్టార్లలో సాగయింది. ఈ సారి పత్తి సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. నీటి వసతి కింద ముందస్తు ఖరీఫ్లో పత్తి సాగు చేయడం విశేషం. 2026లో కర్నూలు జిల్లాలో 3 లక్షల హెక్టార్లు, నంద్యాల జిల్లాలో 20వేల హెక్టార్లలో పత్తి సాగయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడే హైబ్రిడ్ పత్తి, బీటీ పత్తి విత్తనోత్పత్తి కూడా అధికం. బీటీ–2 పత్తి విత్తనాల మార్కెటింగ్కు రాష్ట్రం మొత్తం మీద జరిగే మార్కెటింగ్ ఒక ఎత్తు అయితే ఉమ్మడి జిల్లాలో జరిగే మార్కెటింగ్ మరో ఎత్తు. ఉమ్మడి జిల్లాలో పత్తి విత్తన ప్రాసెసింగ్ యూనిట్లు 9 మాత్రమే ఉన్నాయి. ఈ కంపెనీల్లో ఇప్పటికే ప్యాకింగ్ కూడా పూర్తయింది. అయితే జిల్లాలో 250 కంపెనీలు దాదాపు 1000 దాకా బీటీ పత్తి విత్తన రకాలను మార్కెట్లోకి విడుదల చేశాయి. తెలంగాణా కేంద్రంగా ఉన్న వందలాది కంపెనీలు ఉమ్మడి కర్నూలు జిల్లాను మార్కెటింగ్కు కల్పతరువుగా వినియోగించుకుంటున్నాయి. గుజరాత్ కంపెనీలతో కన్సల్టెన్సీ, సబ్ డీలర్స్ లైసెన్స్ పేరుతో వందలాది కంపెనీలు బీటీ పత్తి విత్తన ప్యాకెట్ల మార్కెటింగ్లో నిమగ్నమయ్యాయి. గుజరాత్ కంపెనీలకు రాయల్టీ చెల్లిస్తూ.. ఇక్కడ ప్యాకింగ్ చేస్తున్నా అడిగే నాథుడే కరువయ్యాడు. నాణ్యత దేవుడికెరుక పత్తి విత్తన నాణ్యతతో వ్యవసాయ శాఖకు ఎలాంటి సంబంధం లేదు. ఆయా కంపెనీలే సొంతంగా ధృవీకరించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో మూడు, నాలుగేళ్ల క్రితం కావేరి–జాదు రకం బీటీ పత్తి విత్తనాలతో వేలాది మంది రైతులు నష్టపోయారు. పరిహారం చెల్లించాలని కోర్టులు ఆదేశించినప్పటికీ కంపెనీలు చేతులెత్తేశాయి. 2024 ఖరీఫ్ సీజన్లో కూడా ఒక పేరొందిన కంపెనీ విత్తనంతో సాగు చేసిన పత్తి పలు చోట్ల దెబ్బతినింది. అయితే ఆ కంపెనీ పెద్దలు వ్యవసాయ యంత్రాంగాన్ని ముడుపులతో లోబరుచుకొని ఇతర కారణాలతో పంట దెబ్బతిన్నట్లు రిపోర్టు ఇవ్వడం గమనార్హం. పత్తిలో కలుపు సమస్య అధికం. హెచ్టీ పత్తిలో కలుపు నివారణకు గ్లైపోసేట్ మందును పిచికారి చేస్తే కలుపు నాశనం అవుతుంది తప్ప.. పత్తి పంటకు ఏమీ కాదు. హెర్బిసైడ్ టాలరెంట్ బీటీ పత్తి విత్తనాలు జీవవైవిధ్యానికి ప్రమాదకరమనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వీటికి అనుమతివ్వలేదు. రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు ఏర్పాటు తర్వాత అనుమతి లేకపోయినప్పటికీ కొన్ని కంపెనీలు రైతులతో హెచ్టీ పత్తి సాగు చేస్తుండటం గమనార్హం. ఇటీవల ఆదోనిలో నిర్వహించిన హెచ్టీ పరీక్షల్లో గ్లైపోసేట్ ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో 2500 బీటీ–2 విత్తన ప్యాకెట్ల అమ్మకాలను నిలిపి వేశారు. కర్నూలులోని వివిధ కంపెనీల్లో హెచ్టీ పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. పత్తిలో నకిలీ విత్తనాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీసు, వ్యవసాయ అధికారులతో ఆరు అంతర్రాష్ట్ర చెక్పోస్టులు ఏర్పాటు చేశాం. కర్నూలు, ఆదోనిల్లో పత్తి విత్తన ప్రాసెసింగ్ యూనిట్ల వారీగా తనిఖీ బృందాలు ఏర్పాటయ్యాయి. విత్తన దుకాణాల్లో ఇంటర్నల్ స్క్వాడ్లతో తనిఖీలు చేయిస్తున్నాం. హెచ్టీ పత్తి సాగును నియంత్రించేందుకు 175 శాంపుల్స్ సేకరించి పరీక్షించాం. కల్లూరులో రెండు, ఆదోనిలో నాలుగు హెచ్టీ పాజిటివ్ వచ్చింది. ఆ మేరకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. – సీఎల్ వరలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి, కర్నూలు -
నాటి దానం నేటికీ పదిలం
● అహోబిలం ఆలయ కుడ్యంపై 500 ఏళ్ల క్రితం నాడు కురుకుంద వాసి దానంపై శాసనంఆత్మకూరురూరల్: కృష్ణా తీరం వెంట ఉన్న ప్రాంతాలను వేల సంవత్సరాలుగా బాదామి చాళుక్యులు, హోయసలలు, రాష్ట్రకూటులు, కాకతీయులు, రెడ్డి రాజులు వంటి అనేక రాజవంశాలు పాలించినట్లు చరిత్ర ఉంది. ఈ ప్రాంతంలోని ధనవంతులు ధర్మవితరణ చేసేవారనే సత్యం ఇటీవల బయల్పడిన ఒక శాసనం ద్వారా తెలుస్తోంది. దిగువ అహోబిలం ఆలయ గోపురం కుడివైపు గోడపై ఉన్న శాసనాలను స్పష్టంగా చదవడం కోసం రసాయనాలతో శుద్ధీకరణ జరిపారు. అందులో ఒక శాసనంలో ఆత్మకూరు మండలం కురుకుంద గ్రామ ప్రసక్తి ఉండడమే ఈ వార్తాంశం అయ్యింది. కన్నడ భాష లిపి ఉన్న ఈ శాసనం క్రీ.శ 1553 జులై 2న శనివారం వేయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కురుకుంద గ్రామానికి చెందిన దళవాయి లింగరస, గురజాల నరసనాయన కుమారుడైన పోచిరాజ నరసరాజయ మహా అరసు పుణ్యం కోసం అహోబిల నరసింహుడికి ప్రతిరోజు సహస్త్రనామ పూజ నిర్వహించేందుకు 12 వరమా – గద్వాణాలను దానంగా ఇచ్చినట్లు ఈ శాసనంలో ఉంది. దీన్ని భారత పురావస్తు శాక సర్వేక్షణ శాఖ డైరెక్టర్ (ఎఫిగ్రఫి) పరిష్కరించారు. కురుకుంద గ్రామంలో 500 ఏళ్ల నాటి గురుతులు ఏవీ ఇప్పుడు కనిపించక పోయినా ఈ గ్రామంలోనూ, పరిసరాల్లో ఉన్న రెండు చెరువులకు మాచా వీరప్ప చెరువులుగా పేరుండటం అవి ఎప్పటివో ఎవరు చెప్పలేకపోవడం, ఇప్పటికీ ఇవి వందల ఎకరాలకు జీవనాధారంగా ఉండడం వంటివి గ్రామ ప్రాచీనతను చాటుతున్నాయి. -
బెంగళూరుకు క్యూ కడుతున్న ఏపీ ప్రజలు.. కారణం ఇదే
నంద్యాల జిల్లా: అధికారంలో ఉన్నామని, తాము ఏం చేసినా ఎవరూ ప్రశ్నించకూడదని టీడీపీ నాయకులు బరితెగిస్తున్నారు. పేదలకు ఉపాధిహామీ పథకాన్ని దూరం చేస్తూ కరువు శాసనం రాశారు. తమ కష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక చాలా మంది దూర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. వీరి వెంట చిన్నారులు, వృద్ధులు వస్తున్నారు. డోన్ మండలం జగదుర్తి గ్రామంలో ఈ దుస్థితి నెలకొంది. ఈ గ్రామంలో మొత్తం 1,200 మంది ఉండగా వీరిలో అత్యధికమంది పేదలు. వేసవి కాలంలో వీరికి గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు అండగా నిలిచాయి. ఈ పథకం లక్ష్యం నీరుగార్చేందుకు టీడీపీ నాయకులు ఆధిపత్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. అక్రమార్జన కోసం మేటీ, ఫీల్డ్ అసిస్టెంట్ పదవుల కోసం పోట్లాడుతూ పేదలకు పనులు కల్పించకుండా అడ్డుకట్ట వేశారు. దీంతో జగదుర్తి గ్రామస్తులు చాలా మంది పనుల కోసం ఆదివారం గుంటూరు, బెంగళూరు ప్రాంతాలకు వెళ్తేందుకు డోన్ రైల్వేషన్కు వెళ్లారు. టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని, దొంగ మస్టర్లతో కూలీల డబ్బులు కాజేస్తున్నారని ప్రజలు ఆరోపించారు. గ్రామస్తులు వలస వెళ్తున్నారు, ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఏపీఎం సుకూర్ను ప్రశ్నించగా జగదుర్తి పంచాయతీ పరిధిలో ఉపాధి హామీపనులు ఇంతవరకు జరగని మాట వాస్తవమని పేర్కొన్నారు. గ్రామ పెద్దలతో చర్చించి కూలీలు పనుల కోసం వలస వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. -
పోలీసు పీజీఆర్ఎస్కు 94 ఫిర్యాదులు
కర్నూలు: కర్నూలు రెండో పట్టణ పోలీస్స్టేషన్ పక్కనున్న క్యాంప్ కార్యాలయంలో సోమవారం అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించి నేరుగా వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 94 ఫిర్యాదులు వచ్చాయి. అందులో ప్రధానంగా ఉద్యోగాల పేరుతో డబ్బులు తీసుకుని మోసం, ఇళ్ల స్థలాలు, పొలాల ఆక్రమణలతో పాటు పలు వ్యక్తిగత సమస్యలపై ఫిర్యాదులు ఉన్నాయి. సీఐలు శివశంకర్, రామయ్య నాయుడు తదితరులు కూడా పీజీఆర్ఎస్లో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. -
హైకోర్ట్ ఎస్పీఎఫ్ హెడ్కానిస్టేబుల్ మృతి
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని పెనుమాక శివారు వద్ద సీడ్ యాక్సెస్ రోడ్లో సోమవారం స్కూటీపై వెళుతున్న హైకోర్టు ఎస్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ను వెనుక నుంచి అతివేగంగా వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సేకరించిన వివరాల ప్రకారం... కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామానికి చెందిన కె.శ్రీనివాసరావు (49) హైకోర్టు ఎస్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఉండవల్లిలో కుటుంబంతో నివాసముంటున్న శ్రీనివాసరావు ఉదయం 7 గంటల సమయంలో తన స్కూటీపై సీడ్ యాక్సెస్ రోడ్లో నుంచి పెనుమాక మీదుగా హైకోర్టుకు వెళుతున్నాడు. పెనుమాక మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం రోడ్డులో స్కూటీపై వెళుతున్న శ్రీనివాసరావును వాహనం అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ద్విచక్రవాహనంపై నుంచి కిందపడిన శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న తాడేపల్లి ఎస్ఐ సంఘటనా స్థలానికి వెళ్లి రోడ్డుపై తీవ్ర రక్తస్రావంతో పడిపోయి ఉన్న శ్రీనివాసరావును వైద్య నిమిత్తం దగ్గరలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లగా మృతిచెందినట్లు నిర్ధారించారు. జరిగిన సంఘటనపై హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఖాజావలి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తగ్గిన ఉష్ణోగ్రతలు
కర్నూలు(అగ్రికల్చర్): ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఏప్రిల్ నెలలోనే రికార్డు స్థాయి లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మే నెలలో మరింత అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుందనే ప్రచారం జరిగి ంది. అయితే అక్కడక్కడ వర్షాలు పడటం, గా లుల తీవ్రత కొనసాగుతోంది. ఈ కారణాలతో ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. మంత్రాలయంలో 41.5,చిప్పగిరిలో 41.2, కౌతాళంలో 41.4, హలహర్విలో 41.1, దొర్నిపాడులో 40.7, సంజామలలో 40.7,కొత్తపల్లిలో 40.5, ఆళ్లగడ్డలో 40.1 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎల్నినో ప్రభావం మొదలైనందున ఈ ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులుంటాయని వా తావరణ శాస్త్రవేత్తలు ప్రకటించారు. కాగా ఆదివారం సాయంత్రం నుంచి నాలుగు మండలా ల్లో వర్షం కురిసింది. ఓర్వకల్లో 16.4 మి.మీ, కల్లూరులో 4.4, వెల్దుర్తిలో 3.2, కర్నూలు రూరల్లో 1, కర్నూలు అర్బన్లో 0.8 మిమీ ప్రకారం వర్షపాతం నమోదైంది. పెనుగాలులకు పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. నేటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు కర్నూలు సిటీ: ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్–2026 ప్రవేశ పరీక్షలకు ఉన్నత విద్యా మండలి అన్ని ఏర్పాట్లు చేసింది. నేటి(మంగళవారం) నుంచి మొదలైయ్యే పరీక్షలకు ఉమ్మడి జిల్లాలో మొత్తం 9 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆన్లైన్ కంప్యూటర్ ఆధారితంగా నేటి నుంచి 18వ తేది వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్, 19, 20 తేదిల్లో అగ్రికల్చర్, ఫార్మా సీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాలో అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజనీరింగ్ పరీక్షలకు 29,144 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ప్రతి రోజు ఉదయం 9 నుంచి 12 గంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. నిర్దేశిత సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైన కేంద్రాల్లోకి అనుమతించబోమని సెట్ కన్వీనర్ సీఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద జిరాక్స్ కేంద్రాల మూసివేత కర్నూలు(అర్బన్): ఏపీఈఏపీసెట్–2026 పరీక్షల నేపథ్యంలో ఈ నెల 12 నుంచి 20వ తేది వరకు పరీక్ష కేంద్రాల పరిసరాల్లోని జిరాక్స్, ఇంటర్నెట్ కేంద్రాలను ఆయా సమయాల్లో మూసివేయాలని ఉప కార్మిక కమిషనర్ కె.వెంకటేశ్వర్లు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్షను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తున్నారన్నారు. ఆయా సమయాల్లో జీరాక్స్, ఇంటర్నెట్ కేంద్రాలను తెర చి ఉంచితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉర్దూ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ ఫలితాలు విడుదల కర్నూలు కల్చరల్: డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఫిబ్రవరి నెలలో నిర్వహించిన మొదటి సెమిస్టర్, సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను వర్సిటీ ఇన్ఛార్జి వైస్ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్.షావలి ఖాన్ విడుదల చేశారు. ఫలితాలు వర్సిటీ వెబ్సైట్ www.ahuuk.ac.inలో అందుబాటులో ఉన్నాయని ఇన్ఛార్జి వీసీ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ మహబుబ్ బాషా, ఎగ్జామినేషన్స్ కో ఆర్డినేటర్స్ మహమ్మద్ ఇర్ఫాన్, డాక్టర్ నబియా సుల్తాన, డాక్టర్ బి. వెంకటప్ప తదితరులు పాల్గొన్నారు. మార్కెట్లో పడిపోయిన ధరలు కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోవడం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. ప్రధానంగా వేరుశనగ, వాము, మొక్కజొన్న, కందులు, శనగల ధరలు పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సోమవారం కర్నూలు మార్కెట్లో సగటున లభించిన ధర రూ.6,100 మాత్రమే. మార్కెట్కు 759 క్వింటాళ్ల వాము రాగా.. సగటున క్వింటాకు లభించిన ధర రూ.16,299. గరిష్టంగా రూ.24,444 ధర లభించినప్పటికీ ఈ ధర ఒకటి, రెండు లాట్లకే పరిమితం కావడం గమనార్హం. మొక్కజొన్నలు మార్కెట్కు 231 క్వింటాళ్లు రాగా లభించిన సగటు ధర రూ.1,727. కందులకు సగటున రూ.7712, శనగలకు రూ.5,380 ప్రకారం ధరలు లభించాయి. మార్కెట్కు ఉల్లి రావడం బాగా తగ్గిపోయింది. కేవలం నలుగురు రైతులు 125 క్వింటాళ్ల ఉల్లిగడ్డలు తీసుక రాగా రూ.767 ధర మాత్రమే లభించింది. -
స్వాభిమానం.. సహస్ర కలశాభిషేకం
● శ్రీశైలంలో సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ ● కలశయాత్రలో పాల్గొన్న వెయ్యి మంది భక్తులు శ్రీశైలంటెంపుల్: సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాన్ని సోమవారం శ్రీశైల దేవస్థానంలో నిర్వహించారు. ఉదయం ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి ఆలంకార మండపంలో సహస్ర కలశారాధన చేశారు. భక్తులందరూ కలశాలను తలపై ధరించి ఆలయ ప్రాంగణం నుంచి గంగాధర మండపం, నందిగుడి, మల్లికార్జునసదన్ మీదుగా బయలు వీరభద్రస్వామి ఆలయానికి వెళ్లారు. అక్కడ స్వామికి విశేషపూజాదికాలను జరిపి వెయ్యి మంది భక్తులు ఆలయానికి వెళ్లి వృద్ధమల్లికార్జున స్వామివారికి కలశాభిషేకం చేశారు. కలశయాత్రలో పాల్గొన్న భక్తులందరికీ మల్లికార్జున స్వామివారికి అలంకార దర్శనం, అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం దేవస్థానం అందించిన పుస్తకాలు, పెన్నులతో శివపంచాక్షరీ నామ లేఖ యజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమంలో భాగంగానే గంగాధర మండపం వద్ద సాయంత్రం పలు ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు చేశారు. అనంతరం వనపర్తికి చెందిన సత్యంస్వామి, బృందం వారిచే శివభజనలు, రాజమహేంద్రవరానికి చెందిన తాతా సందీప్శర్మ వారిచే ఓంకారం ప్రాశస్త్యంపై ప్రవచనం నిర్వహించారు. విజయనగరానికి చెందిన సుప్రియ బృందం వారిచే పేరిణి శివతాండవం ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఈఓ ఎం.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సోమనాథ్ ఆలయంపై దాడి జరిగి వెయ్యి సంవత్సరాలు, ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 సంవత్సరాల సందర్భంగా భారత ప్రభుత సాంస్కృతిక శాఖ దేశవ్యాప్తంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ పేరుతో పలు కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. -
ఐచర్ వాహనం దగ్ధం
పత్తికొండ రూరల్: అటికెలగుండు గ్రామ బ్రిడ్జి సమీపంలో సోమవారం ఐచర్ వాహనంలో మంటలు చెలరేగి వాహనం దగ్ధమైంది. తాడిపత్రికి చెందిన ఐచర్ వాహనం సిమెంట్ లోడుతో ఆస్పరికి వెళ్లి అక్కడే అన్ లోడింగ్ చేశారు. తిరిగి వస్తున్న సమయంలో షార్ట్సర్క్యూట్ సంభవించి ఇంజన్లో వైర్లు కాలిపోయి మంటలు వ్యాపించాయి. డ్రైవర్ కంబయ్య వాహనంలో మంటలను గమనించి కిందకు దిగి ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కొద్దిసేపటికే వాహనం మొత్తం మంటలు వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో దారి వెంట వెళ్తున్న వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. అయితే అప్పటికే వాహనం దగ్ధమైపోయింది. ప్రయాణికురాలి బ్యాగ్కు కన్నం హొళగుంద: బస్టాండులో దొంగలు బస్సెక్కుతున్న మహిళా బ్యాగుకు కన్నం వేసి బంగారు చైను, నగదు కొట్టేసిన సంఘటన సోమవారం ఉదయం హొళగుందలో చోటు చేసుకుంది. స్థానిక తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ) పక్కన వన్నూరు కొట్టాలకు వెళ్లే దారిలో నివాసం ఉంటున్న వట్టికుట్టి శాంతమ్మ అనే మహిళ ఉదయం ఆదోని వెళ్లేందుకు హొళగుంద బస్టాండుకు వచ్చింది. బస్సు రాగానే అందరితో కలసి బస్సెక్కి సీట్లో కూర్చుంది. టికెట్ కోసంఆధార్ కార్డు తీసేందుకు బ్యాగ్ చూడగా చిరిగి ఉండటం, అందులో రెండు తులాల బంగారు చైనుతో పాటు దాదాపు రూ.10 వేలుకు పైగా ఉన్న నగదు కనబడలేదు. వెంటనే ఆమె బస్సు దిగి భర్త వట్టికుట్టి ప్రభాకర్కు ఫోన్ చేసి విషయం చెప్పగా ఆయన అక్కడికి చేరుకుని విచారించి విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. బస్టాండ్లో చోరీ జరగడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. 21 మందికి కారుణ్య నియామకాలు కర్నూలు(సెంట్రల్): కారుణ్య నియామకాల కింద వివిధ శాఖల్లో 21 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి చెప్పారు. వీరందరినీ జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ పోస్టుకు ఎంపిక చేసినట్లు వివరించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ఎంపికై న వారికి నియామక పత్రాలను కలెక్టర్ అందజేశారు. జేసీ నూరుల్ ఖమర్, ఇన్చార్జ్ డీఆర్వో చిరంజీవి, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లు సునీత, రామసుబ్బయ్య, సెక్షన్ సిబ్బంది సన పాల్గొన్నారు. గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలి శ్రీశైలం: దేశంలో జరుగుతున్న గవర్నర్ల నియామకాల వ్యవస్థను రద్దు చేయాలని రాష్ట్రపతికి లేఖ రాసినట్లు రాయలసీమ రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షులు డాక్టర్ కుంచం వెంకటసుబ్బారెడ్డి తెలిపారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దర్శనర్థమై సోమవారం శ్రీశైలం వచ్చిన ఆయన స్థానిక దేవస్థానం అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 153 ఆధారంగా ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి గవర్నర్లను నియమిస్తున్నార్నారు. సంబంధిత రాష్ట్రాలకు గవర్నర్ కార్యనిర్వాహక అధిపతి మాత్రమేనని, రాజ్యాంగం ప్రకారం గవర్నర్ మంత్రి మండలికి విధుల నిర్వహణలో సలహాలు ఇస్తారే కానీ ఎటువంటి నిర్ణయం, చర్యలు తీసుకునే అధికారం లేదని అన్నారు. ప్రస్తుతం గవర్నర్లు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు ఉన్నాయన్నారు. రాష్ట్ర గవర్నర్ల వ్యవహారాల తీరును వివరిస్తూ తమిళనాడులో ఇటీవల చోటు చేసుకు న్న పరిణామాలు దారుణమన్నారు. ఎన్నికల్లో విజయ్కి మెజారి టీ వచ్చినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటులో గవర్నర్ తీవ్ర జాప్యం చేయడం సబబు కాదన్నారు. లా సెమిస్టర్ పరీక్షలకు ఐదుగురు గైర్హాజరు కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాల యం పరిధిలో సోమవారం జరిగిన 5 సంవత్సరాల ఎల్ఎల్బీ 8వ సెమిస్టర్ పరీక్షల్లో ఐదుగురు విద్యార్థులు గైర్హాజరైనట్లు వర్సిటీ పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ ఎన్.నరసింహులు తెలిపారు. 74 మందికి 69 మంది హాజరు కాగా 93 శాతం హాజరు నమోదైందని ఆయన పేర్కొన్నారు. -
కరువు శాసనం.. కన్నీటి పయనం!
● ‘ఉపాధి’కి టీడీపీ నాయకుల అడ్డుకట్ట ● వలసబాట పట్టిన జగదుర్తి గ్రామస్తులు డోన్: అధికారంలో ఉన్నామని, తాము ఏం చేసినా ఎవరూ ప్రశ్నించకూడదని టీడీపీ నాయకులు బరితెగిస్తున్నారు. పేదలకు ఉపాధిహామీ పథకాన్ని దూరం చేస్తూ కరువు శాసనం రాశారు. తమ కష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక చాలా మంది దూర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. వీరి వెంట చిన్నారులు, వృద్ధులు వస్తున్నారు. డోన్ మండలం జగదుర్తి గ్రామంలో ఈ దుస్థితి నెలకొంది. ఈ గ్రామంలో మొత్తం 1,200 మంది ఉండగా వీరిలో అత్యధికమంది పేదలు. వేసవి కాలంలో వీరికి గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు అండగా నిలిచాయి. ఈ పథకం లక్ష్యం నీరుగార్చేందుకు టీడీపీ నాయకులు ఆధిపత్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. అక్రమార్జన కోసం మేటీ, ఫీల్డ్ అసిస్టెంట్ పదవుల కోసం పోట్లాడుతూ పేదలకు పనులు కల్పించకుండా అడ్డుకట్ట వేశారు. దీంతో జగదుర్తి గ్రామస్తులు చాలా మంది పనుల కోసం ఆదివారం గుంటూరు, బెంగళూరు ప్రాంతాలకు వెళ్తేందుకు డోన్ రైల్వేషన్కు వెళ్లారు. టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని, దొంగ మస్టర్లతో కూలీల డబ్బులు కాజేస్తున్నారని ప్రజలు ఆరోపించారు. గ్రామస్తులు వలస వెళ్తున్నారు, ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఏపీఎం సుకూర్ను ప్రశ్నించగా జగదుర్తి పంచాయతీ పరిధిలో ఉపాధి హామీపనులు ఇంతవరకు జరగని మాట వాస్తవమని పేర్కొన్నారు. గ్రామ పెద్దలతో చర్చించి కూలీలు పనుల కోసం వలస వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
ఎమ్మిగనూరు రూరల్: అప్పుల బాధతో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మండల పరిధిలో ని కె.నాగలాపురం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రా మానికి చెందిన కె. రామాంజనేయులు(38)కు భార్య లక్ష్మీ, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు సంతానం. తనకున్న 2 ఎకరాల పొలానికి తోడు మరో 4 ఎకరాలు కౌలు తీసుకొని పత్తి, మిరప, మొక్కజొన్న పంటలు సాగు చేస్తున్నాడు. పెట్టుబడులు, ఇంటి ఖర్చులకు బయటి వ్యక్తుల వద్ద దాదాపు రూ.8 లక్షలకు పైగా అప్పులు చేశాడు. పంటలు రాక చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఈ నెల 9వ తేది రాత్రి 10 గంటల సమయంలో ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పపడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక ఆదివారం అర్థరాత్రి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ శ్రీనివాసులు సోమవారం సాయంత్రం తెలిపారు. జూనియర్ సివిల్ జడ్జీల బదిలీ కర్నూలు: జిల్లాలో జూనియర్ సివిల్ జడ్జీ పోస్టుల ను భర్తీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు సోమవారం ఉత్తర్వు లు జారీ చేసింది. కర్నూలు ప్రిన్సిపల్ జూనియర్ సి విల్ జడ్జిగా పనిచేస్తున్న ఎం.సరోజినమ్మను ఖాళీ గా ఉన్న రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కో ర్టుకు బదిలీ చేసి ఆమె స్థానంలో తిరుపతిలో పనిచేస్తున్న ఎం.సంధ్యారాణిని బదిలీ చేసింది. నూతనంగా మంజూరైన 5వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు గొల్లపూడి స్రవంతిని, గుంటూరు నుంచి బదిలీ చేసి నియమించారు. ఖాళీగా ఉన్న కోవెలకుంట్ల జూనియర్ సివిల్ జడ్జి పోస్టుకు అనంతపురంలో పనిచేస్తున్న జి.మంజులను బదిలీ చేసి నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా 62 మంది జూనియర్ సివిల్ జడ్జిలను రాష్ట్ర హైకోర్టు బదిలీ చేస్తూ విజిలెన్స్ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన న్యాయాధికారులు ఈనెల 18వ తేదీ లోగా వారి స్థానాల్లో చేరాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. -
పీజీఆర్ఎస్ అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలి
కర్నూలు(సెంట్రల్): పీజీఆర్ఎస్ అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆమె జేసీ నూరుల్ ఖమర్తో కలసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్జీలను సంతృప్త స్థాయిలో పరిష్కరించేందుకు నోడల్ అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు. అర్జీదారుడితో నేరుగా మాట్లాడి సరైన ఎండార్స్మెంట్ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి డీఆర్వో చిరంజీవి, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ సునీత, రామసుబ్బయ్య పాల్గొన్నారు. వైద్య సేవల్లో కర్నూలు జిల్లాకు ఏగ్రేడ్ జిల్లాలో ఏప్రిల్ 2025 నుంచి మార్చి 2026 వరకు నిర్వహించిన హాస్పిటల్ యాక్టివిటీ ఇండికేటర్ గణనలో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకొని జిల్లా సమగ్రంగా ఏ గ్రేడు సాధించినట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి సోమ వారం ఓ ప్రకటనలో తెలిపారు. మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి(ఆదోని), ప్రాంతీయ వైద్యశాల(ఎమ్మిగనూరు), సామాజిక ఆరోగ్య కేంద్రాలు కోడుమూ రు, వెల్దుర్తి, పత్తికొండ, ఆలూరులకు ఏ గ్రేడు, ఓర్వకల్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి బీ గ్రేడు లభించిందన్నారు. -
అకాల వర్షం .. రైతులకు నష్టం!
బనగానపల్లె రూరల్/కొలిమిగుండ్ల/వెల్దుర్తి: మండు వేసవిలో అకాల వర్షాలు రైతులను భయపెడుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా.. సాయంత్రం 6 గంటల సమయంలో బనగానపల్లె, చుట్టు పక్కల ప్రాంతాల్లో దాదాపు 20 నిమిషాలు మోస్తరు వర్షం కురిసింది. గాలీవానకు వరి పైర్లు నేలవాలాయి. ఆరబోసిన వరి, మొక్కజొన్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు పట్టలు కప్పారు. అవుకు ప్రాంతంలో వరి పంట కాలం పూర్తి కావడంతో చాలా మంది రైతులు కోత కోసేందుకు సిద్ధపడుతున్నారు. ఈ తరుణంలో ఈదురు గాలులు, వర్షంతో రైతులు నష్టపోయారు. వెల్దుర్తి మండలంలో ఆదివారం రాత్రి గాలీవాన భీభత్సం సృష్టించింది. మండల కేంద్రంలో ఈదురుగాలులతో పట్టణానికి తాగునీరందించే పథకం రామళ్లకోట రోడ్డులోని పార్వతయ్య బావి వద్ద ఉన్న సంప్పై భారీ చెట్టు కొమ్మలు విరిగి పడ్డాయి. ఫలితంగా సంప్ నుంచి పట్టణానికి సరఫరా చేసే పైప్లైన్లు, మోటార్లు దెబ్బతిన్నాయి. విద్యుత్ లైన్లు తెగిపోయాయి. పంచాయతీ సెక్రటరీ లక్ష్మీనాథ్, విద్యుత్ ఏఈఈ వెంకటేశ్వర్లు యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి తాగునీటి సరఫరాను సోమవారం సాయంత్రానికి పునరుద్ధరించారు. రామళ్లకోట రోడ్డులోని పెట్రోల్ బంక్ వద్ద, మరోచోట రెండు విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. విద్యుత్ అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టారు. ఈదురుగాలులకు గోవర్ధనగిరి, శ్రీరంగాపురం, ఎల్ నగరం, లక్షుంపల్లె, చెర్లకొత్తూరు, బోగోలు, తదితర ప్రాంతాల మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి రైతులు నష్టపోయారు. -
అను‘గృహం’ లేదు.. ఖాళీ చేయాల్సిందే!
● సున్నిపెంటలో 2,163 మందికి నోటీసులు శ్రీశైలంప్రాజెక్ట్: సున్నిపెంటలో ప్రభుత్వ గృహాలను ఖాళీ చేయాలని అందులో నివాసం ఉంటున్న వారికి తహసీల్దార్ కేవీ శ్రీనివాసులు సోమవారం నోటీసులు జారీ చేశారు. సున్నిపెంట ప్రభుత్వ గృహాల ఆక్రమణలపై దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై ఇచ్చిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ భూ ఆక్రమణ చట్టం 1905 కింద 2,163 మందికి ఈ నోటీసులు జారీ అయ్యాయి. జలవనరులశాఖ, గ్రామ సచివాలయ సిబ్బందితో కలసి తహసీల్దార్ ఇంటింటికి వెళ్లి నోటీసులు జారీ ఇస్తున్నారు. నివాసితులు అందుబాటులో లేనిపక్షంలో గృహాలకు నోటీసులు అంటిస్తున్నారు. ఈనెల 17వ తేదీలోగా తహసీల్దార్ కార్యాలయంలో సంజాయిషీ సమర్పించాలని నోటీసులో పేర్కొన్నారు. సంజాయిషీ సంతృప్తకరంగా లేకుంటే చట్టప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నోటీసులో సూచించారు. అధికారుల రికార్డులు జరిపిన సర్వేల ఆధారంగా 2,260 ప్రభుత్వ గృహాలు ఉన్నాయి. వీటిలో 82 మంది జలవనరులశాఖ ఉద్యోగులు నివాసం ఉంటుండగా 247 గృహాలను నేలమట్టం చేశారు. ప్రభుత్వ గృహాలు, నివాస యూనిట్టు 428కి పట్టాలు మంజూరు చేయగా వాటిలో నాలుగు పట్టాలు సక్రమమైనవి కావని అధికారులు తేల్చారు. 277 మంది ప్రభుత్వ గృహాలకు మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని అధికారులు జిల్లా కలెక్టర్కు నివేదిక సమర్పించారు. -
ప్రారంభించారు.. వదిలేశారు!
కోసిగి: దాదాపు 45 రోజుల క్రితం ‘ఊరికి రోడేస్తున్నాం’. అంటూ కూటమి నేతలు హడావుడి చేశారు. ఆర్భాటంగా పూజలు చేసి రోడ్డు పనులకు టెంకాయ కొట్టారు. త్వరలో పనులు పూర్తయి రోడ్డు సమస్య పరిష్కారమవుతుందని ప్రజలు సంతోషపడ్డారు. అయితే నెలన్నర రోజులు గడుస్తున్నా పనులు అడుగు కూడా కదలలేదు. తుంబిగనూరు గ్రామ మధ్యలో 25/6 కిలో మీటరు నుంచి కందుకూరు శివారు 33/4 కిలో మీటరు వరకు ఆర్అండ్బీ కింద నిధులు కేటాయించారు. ఇందులో అగసనూరు, సాతనూరు గ్రామాల్లో 900 మీటర్లు సీసీ రోడ్డుకు రూ.2.5 కోట్లు, మిగిలిన 8.1 కిలో మీటర్లు బీటీ రోడ్డుకు రూ.3 కోట్లు బడ్జెట్ కేటాయించారు. ఆయా గ్రామాల మధ్య రోడ్డు కంకర తేలి గుంతలు గుంతల మయంగా తయారైంది. ఏళ్ల తరుబడి రోడ్డు వసతి లేక ప్రయాణికులు , వాహనదారులు రోడ్డు పై వెళ్లలేక నరకయాతన అనుభవిస్తున్నారు. కూటమి నాయకులు భూమి పూజ చేయడంతో రోడ్డు ఏర్పాటు చేస్తారని సంతోషపడ్డారు. కానీ ఇంతవరకు పనులు ప్రారంభం కాకపోవడంతో రోడ్డు వేస్తారా లేదా కేవలం ఆర్భాటమేనా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆర్అండ్బీ ఏఈ నరేష్ను వివరణ కోరగా.. తుంబిగనూరు – కందుకూరు గ్రామ శివారు వరకు 9 కిలోమీటరుల రోడ్డు వేసేందుకు నిధులు మంజూరయ్యాయని, రోడ్డు అడుగు భాగాన వేసేందుకు గ్రావెల్ లభించడం లేదన్నారు. చుట్టు పక్కల ప్రాంతాల్లో కొరత ఉందని, తవ్వకాలకు మైనింగ్ అనుమతి కావాల్సి ఉందని చెప్పారు. -
కొత్తూరు క్షేత్రానికి రూ.2.64 లక్షల విరాళం
పాణ్యం: ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీవల్లి సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయానికి కర్నూలు పట్టణానికి చెందిన యశ్వంత్, తేజస్విని దంపతులు రూ. 2.64 లక్షలు విరాళంగా అందజేశారు. స్వామివారికి కేజీ వెండి విలువైన డబ్బులను ఏపీజీపీ బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు ఈఓ రామకృష్డుడు తెలిపారు. ఈ సందర్భంగా దాతలకు ఆలయ మర్యాదలతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందించి వేదాశీర్వచనం చేయించారు. కార్యక్రమంలో ప్రధాన అర్చకులు నారాయణస్వామి, సురేష్శర్మ, పంచాయతీ కార్యదర్శి సరస్వతి తదితరులు పాల్గొన్నారు. -
బాదం పప్పుపై బాల హనుమాన్
నంద్యాల(వ్యవసాయం): హనుమాన్ జయంతిని పురస్కరించుకొని పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ప్రముఖ చిత్రకారుడు తుర్లపాటి సుబ్రహ్మణ్యం సోమవారం ‘బాదం పప్పుపై బాల హనుమాన్ ‘అనే సూక్ష్మ వర్ణ చిత్రాన్ని ఆవిష్కరించారు. అష్టసిద్ధి ప్రదాత, నవ వ్యా కరణ పండితుడు అయిన శ్రీ హనుమంతుని ఆరాధన వల్ల బుద్ధి, బలం, ఆరోగ్యం, యశస్సు, ధైర్యం మొదలైనవన్నీ లభిస్తాయని చిత్రకారుడు తెలిపారు. అర్జునుడు తన రథం పైన హనుమద్ ధ్వజాన్ని స్థాపించడం వల్ల మహాభారత యుద్ధంలో తిరుగులేని విజయాన్ని సాధించారన్నారు. -
శిథిలావస్థలో ఎల్లెల్సీ వంతెన
పిల్లర్ రాళ్లు ఊడి పడిన దృశ్యం హొళగుంద: తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ)పై నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారింది. హొళగుంద మండలంలోని బళ్లారి రోడ్డులో ఉన్న ఈ వంతెన మీదుగా వందలాది వాహనాలు వెళ్తుంటాయి. వంతెన పిల్లర్ల రాళ్లు ఊడి పడి ప్రమాదకరంగా ఉండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎల్లెల్సీపై ఈ వంతెనను 1947లో నిర్మించారు. వాహనాలు తిరిగితే వంతెన నుంచి వింత శబ్దాలు వినిసిస్తున్నాయి. టీబీ బోర్డు అధికారులు స్పందించి రెండు లైన్ల కొత్త వంతెనను నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. -
ప్రయాణికుల కోసం..
● రూ. 10 లక్షలతో బస్ షెల్టర్ నిర్మించిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు ● ప్రారంభోత్సవం సందర్భంగా నేడు తోలు బొమ్మలాట ప్రదర్శన గడివేముల: ప్రజలకు ఉపయోగపడేలా.. పది కాలా ల పాటు గ్రామంలో గుర్తుండేలా ఓ వ్యక్తి బస్షెల్ట ర్ నిర్మించి ఆదర్శంగా నిలిచారు. గని గ్రామంలో రిటైర్ ఉపాధ్యాయుడు వెంకటరమణ, భార్య కళ్యా ణి రూ.10 లక్షలతో వెచ్చించి గ్రామస్తుల సౌకర్యా ర్థం బస్ షెల్టర్ నిర్మించారు. తన తల్లిదండ్రులు సు బ్బమ్మ, చిన్న మల్లయ్య జ్ఞాపకార్థం నిర్మించిన బస్ షెల్టర్ను మంగళవారం ప్రారంభిచనున్నారు. కాగా అంతరించి పోతున్న ప్రాచీన కళను ప్రోత్సహించేందుకు తోలుబొమ్మలాట ప్రదర్శన ఏర్పాటు చేయించారు. తోలుబొమ్మలాట ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అత్యంత ప్రాచూర్యం పొందిన ప్రాచీన జానపద కళారూపం. రాత్రి వేళల్లో, తెర వెనుక నుంచి దీపాల వెలుగులో బొమ్మలను ఆడిస్తూ, రామా యణ, మహాభారత వంటి పురాణ కథలను కళాకారులు వినోదాత్మకంగా ప్రదర్శిస్తారు. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ప్రధాన వినోద సాధనంగా ఉన్న ఈ కళారూపం, నేడు సాంకేతికత పెరగడంతో కనుమరుగవుతోంది. ప్రస్తుతం కొంతమంది కళాకారులు మాత్రమే ఈ కళను బతికించుకుంటున్నారు. ఈ మేరకు గ్రామంలో మంగళవారం సత్య సాయి జిల్లా లేపాక్షి చెందిన సిండే రామ్మూర్తి గ్రూపు వారు రామాయణం తోలుబొమ్మలాట ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై వీక్షించాలని వెంకటరమణ కోరారు. -
రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని మహిళ మృతి
ఓర్వకల్లు: జాతీయ రహదారిపై కాల్వబుగ్గ వద్ద సోమవారం రాత్రి హైవే పెట్రోలింగ్ వాహనం ఢీకొని ఓ గుర్తు తెలియని మహిళ మృతి చెందింది. కాల్వబుగ్గలో భిక్షాటన చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న మహిళకు ఓ వ్యక్తి పరిచయయ్యాడు. సోమవారం సాయంత్రం వ్యక్తితో ఆమె గొడవ పడింది. అతను దాడి చేయగా ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు రోడ్డు దాటుతుండగా హైవే పెట్రోలింగ్కు చెందిన బొలెరో వాహనం మహిళను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆమెను పోలీసులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మృతిచెందిన మహిళ, ప్రమాదానికి కారణమైన హైవాహనం -
వ్యవసాయానికి గడ్డుకాలం
కర్నూలు(అగ్రికల్చర్): గత ఏడాది మే నెలలో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఈ సారి మే నెలలో గాలుల తీవ్రత ఉన్నా.. చినుకు జాడ కరువైంది. ఎల్నినో ప్రభావం మొదలు కావడం వల్లే ఈ పరిస్థితి నెలకొన్నట్లు వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. 2026–27 సంవత్సరంలో ఎల్నినో ప్రభావంతో కరువు ఎదుర్కోక తప్పని పరిస్థితి ఏర్పడింది. మామూలుగా జూన్ 1వ తేదీ నుంచి తొలకరి మొదలవుతుంది. నైరుతి రుతుపవనాలు మే నెల చివరికే విస్తరించాల్సి ఉంది. ఈ సారి రుతుపవనాలు ఆలస్యంగా వచ్చే పరిస్థితి ఏర్పడింది. కొద్ది రోజులు ఆలస్యంగా వచ్చినా చురుగ్గా ఉండే అవకాశం లేదు. ఎల్నినోపై రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో కనీసం తాగునీటికి ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉన్నా ఆ దిశగా కూడా చర్యలు కరువయ్యాయి. అయితే నీటి వసతి కింద ఉల్లి, పత్తి, వరి పంటలు సాగు చేయవద్దని ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా ప్రచారం చేస్తోంది. ఉమ్మడి జిల్లాలో పత్తి, ఉల్లి, మిర్చి, వరి, వేరుశనగ, మొక్కజొన్న తదితరాలు ప్రధాన పంటలు. ఎల్నినో కారణంగా వర్షాధార పంటలకే కాకుండా నీటి ఆధారిత పంటలకు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పొడి వాతావరణం, అధిక వేడి వల్ల కొన్ని రకాల పురుగులు, తెగుళ్లు సోకి పంటలను మరింత దెబ్బతీసే ప్రమాదం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పంటల సాగు పడిపోయే ప్రమాదం 2025 ఖరీఫ్లో కర్నూలు జిల్లాలో 4,49,858 హెక్టార్లలో, నంద్యాల జిల్లాలో 2,78,204 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఈ సీజన్లోనూ ఇదే స్థాయిలో పంటలు సాగవుతాయి. నంద్యాల జిల్లాలో నీటి ఆధారం పంటలే ఎక్కువ. ఎల్నినో ప్రమాదం వల్ల నంద్యాల జిల్లాలో వ్యవసాయం ప్రశ్నార్థకమవుతోంది. ఈసారి సాగు విస్తీర్ణం పడిపోయే ప్రమాదం ఏర్పడింది. వర్షాలు పడుతాయా లేదోన్న ఉద్దేశంతో విత్తుకు రైతులు ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. కొన్ని పంటలు జూలై చివరి వరకు, మరికొన్ని ప ంటలు ఆగస్టు చివరి వరకు వేసుకునే అవకాశం ఉంది. వాతావరణ శాస్త్రవేత్తల సమాచారం మేరకు ఆగ స్టు వరకు ఎల్నినో ప్రమాదం ఉండటం వల్ల వివిధ పంటల సాగుకు అవకాశమే లేనట్లు తెలుస్తోంది. నీటి వసతి పంటలు కూడా కష్టమే.. ఉమ్మడి జిల్లాలో నీటి వసతి కింద వరి, మొక్కజొన్న, పత్తి, మిర్చి తదితర పంటలు సాగు చేస్తారు. ఇక్కడి సాగు నీటి ప్రాజెక్టులు నిండాలంటే ఎగువ ప్రాంతమైన కర్ణాటకలో భారీ వర్షాలు కురవాల్సి ఉంది. ఎల్నినో ప్రమాదం తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలపైనా ఉండటంతో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇందువల్ల వర్షాధార పంటలకే కాకుండా నీటి ఆధారిత పంటల సాగుకూ గడ్డుకాలం తప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో వ్యవసాయ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు నీటి ఆధారిత పంటలు వద్దు.. తక్కువ తేమతో సాగుకు అవకాశం ఉన్న స్వల్పకాలిక పంటలు సాగు చేసుకోవాలని సూచిస్తుండటం గమనార్హం. అంటే ఈ ఖరీఫ్లో నీటి ఆధారం కింద వరి, ఇతర పంటలకు అవకాశం లేనట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ సారి ఎల్నినో ప్రభావం ఆగస్టు వరకు కొనసాగే అవకాశం ఉంది. ఈ ప్రభావం వల్ల వర్షాలు సాధారణం కంటే తక్కువగా కురిసే అవకాశం కనిపిస్తోంది. ఒకే రోజు కనీసం 40 మి.మీ వర్షపాతం నమోదైనప్పుడే పత్తి, ఇతర పంటలు సాగు చేసుకోవాలి. జిల్లాలో ప్రధాన పంట పత్తి అయినందున ఈ పంటలో జొన్న, సజ్జ, ఆముదం వంటి అంతర పంటలు సాగు చేయాలి. నీటి వినియోగం ఎక్కువగా ఉండే పంటలు సాగు చేయవద్దని రైతులకు చెబుతున్నాం. – పీఎల్ వరలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి, కర్నూలు నాకు మూడు ఎకరాల పొలం ఉంది. పత్తి, కంది సాగు చేస్తుంటా. ఈసారి వర్షాలు ఉండవని చెబుతున్నారు. ఇప్పటికే ఆ పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నట్లు లేదు. ఉచిత పంటల బీమాను అమలు చేస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది. స్వల్పకాలిక పంటల సాగుకు 75 శాతం సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేయాలి. – ఎంబాయి రామాంజనేయులు, అమీనాబాద్, తుగ్గలి మండలంముంచుకొస్తున్న ఎల్నినో కర్నూలు జిల్లా పంట సాగు(హెక్టార్లలో.) పత్తి 280086 కంది 68854 ఉల్లి 24810 మిర్చి 17998 వేరుశనగ 44541 నంద్యాల జిల్లా పంట సాగు(హెక్టార్లలో.) వరి 95031 మొక్కజొన్న 98171 కంది 47691 మినుము 11134 నందికొట్కూరు సమీపంలో పొలంలో పంట వ్యర్థాలను తొలగిస్తున్న కూలీలు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటయ్యాక రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పంటల బీమా, ఉచిత పంటల బీమాకు మంగళం పలకడంతో కరువు నుంచి బయటపడే అవకాశం లేకుండా పోయింది. ఈ సారి ఎల్నినో ప్రమాదం పొంచి ఉండటం రైతులను ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మామూలుగా ఈ సమయానికి రైతులు పత్తి, ఉల్లి తదితర విత్తనాలు సిద్ధం చేసుకుంటారు. ఇప్పుడు మాత్రం వర్షాలు కురిసిన తర్వాత విత్తనాలు తీసుకుందామనే అభిప్రాయంలో ఉన్నారు. నీటి వసతి ఉన్న రైతులు పత్తి విత్తనాలు కొంటున్నారు తప్ప వర్షాధారం కింద సాగు చేసే రైతులు విత్తన సేకరణకు ఆసక్తి చూపని పరిస్థితి. ఎల్నినో సమయంలో వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అధిక ఉష్ణోగ్రత నేలలోని తేమను త్వరగా ఆవిరి చేస్తుందనే ఆందోళన నెలకొంది. -
నిర్లక్ష్యం రోగానికి మందులు బూడిద
పాములపాడు: ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో పేదలకు అందాల్సిన మందులు, సూదులు బూడిదపాలయ్యాయి. మద్దూరు గ్రామంలోని సచివాలయంలో నిర్వహిస్తున్న ఆరోగ్య ఉప కేంద్రం సిబ్బంది సోమవారం గుట్టుగా విలువైన మందులకు నిప్పుపెట్టి తగులబెట్టారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణా లోపం వేల రూపాయల ప్రజా ధనం బూడిదపాలైంది. ఆసుపత్రికి వచ్చే రోగులకు మందులు స్టాక్ లేవు.. బయటకొనుక్కోండి.. అని సలహాలు ఇచ్చే సిబ్బంది విలువైన మందులను ఆసుపత్రి వెనుక కుప్పగా పోసి తగలబెట్టారు. ఆ ప్రాంతంలో ఆరోగ్యశ్రీ కార్డులు కూడా ఉన్నాయి. గడువు ముగిసిన మందులను నిబంధనల ప్రకారం డిస్పోజ్ చేయాల్సి ఉండగా, తమ తప్పులు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతో గుట్టుచప్పుడు కాకుండా నిప్పు పెట్టారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు స్టాక్ ఉన్నప్పుడే రోగులకు ఎందుకు పంపిణీ చేయలేదు? అవి గడువు ముగిసే వరకు ఎందుకు నిల్వ చేశారు? అనే ప్రశ్నలకు సిబ్బంది వద్ద సమాధానం లేదు. ఈ ఘటనపై వైద్యాధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
మగ శిశువు లభ్యం
ఉయ్యాలవాడ: మాయలూరు గ్రామంలోని ఓ పాడుబడిన గృహంలో మగశిశువు లభ్యమైంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన వెన్నపూస శంకర్రెడ్డికి చెందిన పాడుబడిన గృహం నుంచి నవజాతశిశువు ఏడుపు వినిపించింది. సమీపంలో నివసించే కశిరెడ్డి నాగేశ్వరమ్మ అనే మహిళ ఆ శబ్దం విని గృహాలు వెతుకుంటూ వెళ్లింది. పాడుబడిన గృహం లోపలికి వెళ్లి చూడగా మగ శిశువు కనిపించాడు. వెంటనే ఆ శిశువును ఎత్తుకొని ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ఆరోగ్యంగా ఉన్నాడని నిర్ధారించడంతో శిశువును తిరిగి గ్రామానికి తీసుకుని వచ్చారు. ప్రస్తుతం నందిరెడ్డి ఈశ్వరరెడ్డి ఆ చిన్నారిని సంరక్షిస్తున్నారు. ఏం కష్టమొచ్చిందో ఆ తల్లి పేగు బంధాన్ని తెంచుకుందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. -
లేబర్ కోడ్లను రద్దు చేయకపోతే ఐక్య పోరాటాలు
కర్నూలు(సెంట్రల్): కేంద్ర ప్రభుత్వం మొండిగా తీసుకొచ్చి అమలు చేస్తున్న లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోకపోతే కార్మికులు ఐక్య పోరాటాలకు సిద్ధమవుతారని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పీఎస్ రాధాకృష్ణ హెచ్చరించారు. ఆదివారం ఆయూనియన్ ఆల్ ఇండియా కమిటీ పిలుపు మేరకు సుందరయ్య సర్కిల్లో న్యూసిటీ కమిటీ ఆధ్వర్యంలో లేబర్కోడ్ కాపీలను దహనం చేసి నిరసన తెలిపారు. నగర అధ్యక్షుడు వై.నగేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పీఎస్ రాధాకృష్ణ, నగర ప్రధాన కార్యదర్శి ఆర్.నరసింహులు మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం కార్మికుల పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తోందన్నారు. ఇటీవల గుట్టు చప్పుడు కాకుండా ఐదు రాష్ట్రాల ఎన్నికల ముగిసిన వెంటనే లేబర్ కోడ్లను అమల్లో తేవడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం దారుణమన్నారు. ఫలితంగా ఇప్పటి వరక కార్మికులకు అండగా ఉన్న చట్టాలు రద్దై నాలుగు కోడ్లు మాత్రమే అమల్లోకి వచ్చినట్లు అవుతుందన్నారు. వీటి ప్రకారం 13 గంటల పని విధానం అమల్లోకి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు ఎండీ ఆనంద్బాబు, టి.రాముడు పాల్గొన్నారు. -
బాలుడి అదృశ్యంపై ‘సిట్’ విచారణ
కౌతాళం: బాలుడి అదృశ్యంపై సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) విచారణ చేపట్టింది. ఇందుకోసం సిట్ సభ్యులు ఆదివారం బదినేహాల్ గ్రామానికి వెళ్లారు. పొలానికి పురుగు మందులు పిచికారీ చేయడానికి వెళ్లి బాలుడు మాల రవీంద్ర (17) ఇంటికి తిరిగి రాలేదు. దీంతో 2024 నవంబర్ 13న కౌతాళం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. తన కుమారుడి మిస్సింగ్ కేసులో ఎలాంటి పురోగతి లేదని రవీంద్ర తల్లి మాల గంగమ్మ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు 13 మంది అధికారులతో సిట్ను ఏర్పాటు చేసింది. బృందంలోని సభ్యులు ఆదివారం బదినేహాల్కు వచ్చి గంగమ్మ ఇంటికి వెళ్లి విచారణ చేశారు. అలాగే తుంగభద్ర దిగువ కాలువ వద్దకు కూడా వెళ్లి విచారణ చేపట్టారు. -
‘బండ’డు కష్టాలు
ఇండియన్ గ్యాస్ను సక్రమంగా సరఫరా చేయకపోవడంతో ఆదివారం ఆస్పరిలో బస్టాండ్ దగ్గర సిలిండర్లును క్యూలో పెట్టి ఉంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంటి దగ్గరకు గ్యాస్ సరఫరా చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం చెబుతున్నా ఆస్పరిలో మాత్రం జరగడం లేదని వినియోగదారులు అవేదన చెందుతున్నారు. ఆదివారం 250 మంది గ్యాస్ కోసం సిలిండర్లు క్యూలో పెట్టి వేచి ఉండగా గ్యాస్ ఏజెన్సీవారు 80 మందికి మాత్రమే ఇచ్చినట్లు వినియోగదారులు తెలిపారు. –ఆస్పరి -
25 ఏళ్ల తర్వాత..!
నందవరం: దాదాపు పాతికేళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయికతో ఆ పాఠశాలలో ఆనందాలు విరబూశాయి. స్థానిక నాగలదిన్నె జెడ్పీ హైస్కూల్ ప్రాంగణం ఇందుకు వేదికైంది. స్థానిక పాఠశాలలో 2000–2001 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు పాతికేళ్ల తరువాత ఆదివారం అదే పాఠశాలలో కలుసుకున్నా రు. ఆనాటి తీపి జ్ఞాపకాలు, ఆటలు, అల్లర్లు గుర్తుకు తెచ్చుకుంటూ ఒకరునొకరు పిలుచుకుంటూ ఉత్సాహంగా గడిపారు. వివిధ వృత్తులు, ఉద్యోగ, వ్యాపారాల్లో స్థిరపడి పలు ప్రాంతాల్లో ఉన్న వారంతా తరలివచ్చారు. విద్యార్థులందరూ వినోద కార్యక్రమంలో పాల్గొని, పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. ఆనాడు చదువు చెప్పిన గురువులు షాజహాన్, నరసింహులు, రంగస్వామి, ఉస్సేన్ తదితర ఉపాధ్యాయులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం పదో తరగతి పబ్లిక్ పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు జ్ఞాపికలను అందజేశారు. -
ప్రజల దాహార్తి తీర్చుతూ.. బీడు భూములను సస్యశ్యామలం చేస్తూ గలగల పాడే తుంగభద్ర, హంద్రీ నదులు తమ రూపును కోల్పోతున్నాయి. టీడీపీ నాయకులు భారీగా ఇసుకను తవ్వుతుండటంతో నదుల భద్రతకు దిక్కే లేకుండా పోయింది. అడుగడుగునా మీటర్ల మేర భారీగా గుంతలు ఏర్పడటంతో నదుల్లో నీటి
హంద్రీ నది నుంచి జేసీబీతో ట్రాక్టర్లలో ఇసుకను నింపుతున్న దృశ్యంకోడుమూరు రూరల్/నందవరం: అడిగే వారు లేరనే ధీమానో, అధికారం ఉందన్న అహంకారమో టీడీపీ నాయకులు యథేచ్ఛగా హంద్రీనది నుంచి ఇసుకను తోడేస్తున్నారు. కోడుమూరులోని ముడుమలగుర్తి రోడ్డు వైపు గల హంద్రీనది నుంచి భారీ యంత్రాల సాయంతో రోజుకు 300 నుంచి 400 ట్రాక్టర్ల వరకు ఇసుకను పగలు, రాత్రి తేడా లేకుండా తరలించుకుపోతున్నారు. హంద్రీ నుంచి కోడుమూరు, కర్నూలు, గూడూరు, పత్తికొండ వంటి ప్రాంతాలకు తరలించి అమ్ముకుంటున్నారు. యంత్రాల సాయంతో కొన్ని మీటర్ల లోతు వరకు ఇసుకను తీస్తుండడంతో హంద్రీ నదిలో భారీగా గోతులేర్పడ్డాయి. హంద్రీ నుంచి భారీగా ఇసుకను తరలించుకుపోతుండడంతో భవిష్యత్తులో దొరకని పరిస్థితి నెలకొనే ప్రమాదముందని కోడుమూరు వాసులు తీవ్ర ఆందోళన చేందుతున్నారు. అబద్ధాల ప్రచారం ఇసుక అక్రమ రవాణాపై కోడుమూరు ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావడంతో టీడీపీ నాయకులు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. ఇందుకు విలేకరుల సమావేశం నిర్వహించి ఇసుక అక్రమ రవా ణాలో తమకేమి సంబంధం లేదని చెబుతున్నారు. భవన నిర్మాణ కార్మికులకు, ట్రాక్టర్ యాజమానులకు పనులు కల్పించడం కోసమే తాము అక్రమ ఇసుక రవాణాను ప్రోత్సహిస్తున్నట్లు అబద్ధాలు చెప్పారు. అక్రమ ఆర్జనకే టీడీపీ నాయకులు ఇసుక దోపిడీ చేస్తున్నారని ప్రజలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు ఇసుక అక్రమ రవాణా పట్టించుకోవడం లేదు. పొంచి ఉన్న నీటి సమస్య కోడుమూరు, వర్కూరు, ముడుమలగుర్తి, క్రిష్ణాపురం, వెంకటగిరి, గోరంట్ల, లద్దగిరి, ప్యాలకుర్తి, అనగొండ, అమడగుంట్ల, ఎర్రదొడ్డి వంటి గ్రామాల్లోని మంచినీటి పథకాలకు హంద్రీలోని బోర్ల ద్వారానే నీటిని సరఫరా చేస్తారు. ఇప్పటికే హంద్రీలో ఇసుకమేటలు లేకపోవడంతో నీళ్లు నిల్వ చేయలేని పరిస్థితి నెలకొంది. ఉన్న కాస్త ఇసుకను కూడా తరలిస్తే భవిష్యత్తులో నీటి సమస్య తీవ్ర రూపం దాల్చే ప్రమాదముంది. కోడుమూరుకు భారీ నీటి సమస్య పొంచి ఉంది. ఇప్పటికే హంద్రీలో నీటి నిల్వలు తగ్గిపోవడంతో 4 నుంచి 5రోజులకోసారి పంచాయతీ అధికారులు కుళాయిలకు నీటిని విడుదల చేస్తున్నారు. ఉన్న కాస్తా ఇసుకను కూడా తరలిస్తే నీటి సమస్య తీవ్రమవుతుందని ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎమ్మెల్యే అండదండలతో..ఇసుక దందా అంతా స్థానిక ఎమ్మెల్యే అండదండలతో సాగుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. నదికై రవాడి గ్రామానికి చెందిన ఓ చోట నాయకుడు, మరో ఇసుక రీచ్ సూపర్వైజర్ కలిసి ఈ దందాకు తెర తీశారు. ఇప్పటికే 200 క్యూబిక్ మీటర్లుకు పైగా ఇసుక తరలించినట్లు అంచనా. నదికై రవాడి గ్రామ సమీపంలో తుంగభద్ర నది ఒడ్డున ఉన్న చిలకలడోణ ఎత్తిపోతల పథకం సమీపంలో పొలంలో ఐదు ట్రాక్టర్లు, జేసీబీతో ఇసుకను డంప్ చేసి, రాత్రి పూట లారీల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తునట్లు సమాచారం. హంద్రీ నదిని యథేచ్ఛగా తవ్వుతున్న టీడీపీ నాయకులు తుంగభద్ర నది నుంచి ఇసుక తరలింపు జేసీబీ, హిటాచీ యంత్రాల ఉపయోగం నదుల్లో కనిపిస్తున్న భారీ గోతులు చోద్యం చూస్తున్న అధికారులు -
చంద్రబాబు పాలనలో అన్ని రంగాలు నిర్వీర్యం
● ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరూపాక్షిచిప్పగిరి: చంద్రబాబు పాలనలో విద్య, వైద్య, వ్యవసాయం, ఉపాధి తదితర రంగాలన్నీ నిర్వీర్యం అయ్యాయని ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరూపాక్షి అన్నారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్యే మాట్లాడారు. చంద్రబాబు పాలనలో రైతాంగానికి చేసింది ఏమీ లేదన్నారు. జగనన్న హయాంలో ఖరీఫ్, రబీ సీజన్ ముగిసేలోపు పంటల బీమా సాయం అందించారని గుర్తు చేశారు. చంద్ర బాబు పాలనలో మోంథా తుపాన్తో దెబ్బతిన్న పంటలకు నేటి వరకు నష్ట పరిహారం అందలేదన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతి రైతుకు రైతుభరోసా సాయం అందిస్తే చంద్రబాబు రెండేళ్ల పాలనలో కేవలం ఒక్కసారి తూతూ మంత్రంగా అన్నదాత సుఖీభవ అందించారన్నారు. ఫీజురీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో అనేక మంది విద్యార్థులు బాధపడుతున్నారన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయకుండా లక్షల కోట్లు అప్పులు తెస్తూ అప్పుల ఆంధ్రగా మారుస్తున్నారని ఆరోపించారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లులా పాలన చేస్తే ప్రస్తుత చంద్రబాబు పాలన దోచుకో, దాచుకో అన్న చందంగా పాలన చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే వెంట వైఎస్సార్సీపీ నాయకులు బుసినె చంద్రశేఖర్, శ్రీరాములు, వెంకటేష్, మహానంది, హనుమంతు ఉన్నారు. -
అందరిపై ఆరోగ్యమాత కరుణ
నందికొట్కూరు: ఆరోగ్యమాత కరుణ అందరిపై ఉందని ఉమ్మడి కర్నూలు జిల్లా ఆర్సీఎం చర్చి మేత్రాసన బిషప్ గోరంట్ల జ్వానేష్ అన్నారు. ఆదివారం పట్టణంలో వేలంగణి మాత మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలో ప్రధాన రహదారి, పురవీధుల వెంట మేరీమాత విగ్రహాన్ని మేళతాళాల మధ్య ఊరేగింపు నిర్వహించారు. రంగులు చల్లుకుంటూ అంగరంగ వైభవంగా మేరీమాత ఉత్సవాలను జరుపుకున్నారు. అనంతరం ఆర్సీఎం చర్చిలో భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. మేరీమాత వద్ద జ్యోతులు వెలిగించి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా బిషప్ మాట్లాడుతూ.. జిల్లా వాసులకు నాగపట్నం తరహాలో మేరీమాతను నందికొట్కూరులో ప్రతిష్టించడం విశేషమన్నారు. ఉత్సవాల్లో ఫాదర్ కేడీ జోసెఫ్, సహాయక ఫాదర్ బాల ఏసు తదితరులు ప్రార్థనలో పాల్గొన్నారు. -
వామ్మో.. వంతెన
కోవెలకుంట్ల: కోవెలకుంట్ల– ఆళ్లగడ్డ ఆర్అండ్బీ రహదారిలో మండలంలోని భీమునిపాడు సమీపంలో కుందరవాగుపై ఏర్పాటు చేసిన వంతెన ప్రమాదకరంగా మారింది. బ్రిటీష్కాలంలో 1932లో వాగుపై ఇరుకై న వంతెన ఏర్పాటు చేశారు. వంతెన నిర్మించి 94 సంవత్సరాలు కావడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. వంతెనకు ఏర్పాటు చేసిన కడ్డీలు ఒకవైపు వంగిపోవడంతోపాటు దిమ్మెలు పూర్తిగా దెబ్బతిని వంతెన కూలేందుకు సిద్ధంగా ఉంది. వంతెనకు సైడ్వాల్స్ లేకపోవడంతో గతంలో వాహనాలు వాగులో పడి ప్రయాణికులు ప్రాణా లు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. ఈ రహదారిలో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. రాత్రి వేళల్లో వంతెనపై ప్రయాణసమయంలో ఏమాత్రం ఏమరపాటు వహించినా వాహనాలు వాగులోపడి విలువైన ప్రాణాలు కోల్పోవాల్సిందే. సంబంధిత ఆర్అండ్బీ అధికారులు దెబ్బతిన్న వంతెన స్థానంతో కొత్తగా వంతెన ఏర్పాటు చేసి ప్రమాదాలు అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
మాజీ సైనికుడి భార్య ఆత్మహత్య
ఆదోని అర్బన్: పట్టణంలోని ఆర్టీసీ కాలనీకి చెందిన మాజీ సైనికుడు వీరేష్ భార్య శైలజ(36) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని టూటౌన్ సీఐ రాజశేఖర్రెడ్డి తెలిపారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆదివారం ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని, మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. అప్పుల బాధతో యువకుడు..కొత్తపల్లి: అప్పుల బాధ తాళలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దుద్యాల గ్రామంలోని రాజమూరి నాగశేషులు, నాగలక్ష్మీల దంపతులకు కుమారుడు పుల్లయ్య అలియాస్ ప్రవీణ్(23)తో పాటు మరో ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఇంటర్ చదివిన పుల్లయ్య చదువు మానేసి ఐదేళ్లుగా ఆత్మకూరు పట్టణంలోని బైక్ మెకానిక్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో కుటుంబ అవసరాలకు జీతం సరిపోగా స్నేహితుల వద్ద ఎక్కువ మొత్తంలో అప్పులు చేశాడు. అప్పుల భారంతో తీవ్ర మనస్తాపం చెంది శనివారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రుల రోదిస్తున్న తీరు పలువురిని కలిచివేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆదివారం ఉదయం గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జయశేఖర్ తెలిపారు. అనారోగ్యంతో వృద్ధురాలు..మహానంది: గోపవరం గ్రామానికి చెందిన పిన్నాపురం నాగలక్ష్మమ్మ (68) గూడ్సు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నాగలక్ష్మమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపం చెందిన ఆమె ఆదివారం గ్రామ సమీపంలో రైల్వే గేటు వద్ద గూడ్సు రైలు కిందపడి మృతి చెందింది. సమాచారం అందుకున్న నంద్యాల రైల్వే హెడ్ కానిస్టేబుల్ హరికృష్ణ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి కోడలు లక్ష్మిదేవమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వివరించారు. -
ఆరోగ్యంపై రంగు పడుద్ది!
వాటిని చూడగానే నోరూరిస్తున్నాయని ఆబగా తింటున్నారా...అయితే కాస్త ఆగండి. మీరు తినే రంగులు కలిపిన ఆహార పదార్థాలలో పరిమితికి మించి, నిషేధిత సింథటిక్ కలిపి ఉంటున్నాయి. దీనివల్ల ఇప్పటికిప్పుడు జీర్ణకోశవ్యాధులు, భవిష్యత్లో క్యాన్సర్ వంటి ప్రమాదకర జబ్బులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందంగా, ఆకర్షణీయంగా ఉన్నాయని ఏది పడితే అది తింటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని వారు చెబుతున్నారు. లాభాపేక్ష కోసం వ్యాపారులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నా అడ్డుకునే వారు కరువయ్యారు. ● ఆహార పదార్థాల్లో విచ్చలవిడిగా రంగుల వినియోగం ● నిషేధిత రంగులూ యథేచ్ఛగా వాడుతున్న వ్యాపారులు ● హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీల్లో అధికం ● జీర్ణకోశవ్యాధులు, క్యాన్సర్కు అవకాశం ● దాడులు చేస్తున్నా మారని వైనం కర్నూలు(హాస్పిటల్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో హోటళ్లు, రెస్టారెంట్లు, రోడ్డుసైడ్ తోపుడు బండ్లు, టీ దుకాణాలు, మొబైల్ క్యాంటీన్లు, డాబాలు, చాట్బాండార్, నూడుల్స్ షాపులు అన్నీ కలుపుకుని దాదాపు 15 వేలకు పైగా ఉంటాయి. కర్నూలు నగరంలో మాత్రమే 4 వేల దాకా హోటల్స్, దుకాణాలు, రోడ్డుసైడు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఆయా వ్యాపారాల ద్వారా ప్రతి ఏడాది కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతోంది. కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతున్నా వీటిలో జీఎస్టి చెల్లించేది కేవలం 5 శాతంలోపు వ్యాపారులే ఉంటారన్నది బహిరంగ రహస్యం. ఉమ్మడి జిల్లాలోని స్వీట్స్ తయారీ కేంద్రాలు, విక్రయ కేంద్రాలతో పాటు హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్ల, జంక్ఫుడ్ కేంద్రాలు, కూల్డ్రింక్స్ దుకాణాలలో పరిమితికి మించి ప్రాణాంతక బుష్పౌడర్ అనే సింథటిక్ కలర్ వాడుతున్నారు. నిబంధనల ప్రకారం ఒక కిలో ఆహార పదార్థానికి 0.001మి.గ్రా వాడాలి. అయితే వ్యాపారులు వారు విక్రయించే ఆహార పదార్థాలు ఆకర్షణీయంగా కనిపించాలన్న ఉద్దేశంతో కిలోకు 10 నుంచి 20 మి.గ్రా ఫుడ్కలర్ వాడుతున్నారు. ఇలా పరిమితికి మించి వాడితే ఆ పదార్థాలను తిన్న వారికి జీర్ణకోశవ్యాధులు, కాలేయ వ్యాధులు, కడుపులో అల్సర్, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా ఈ రంగులను ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో గోబీ మంచూరియా, కచోరి, కట్లెట్, రెస్టారెంట్లలో బిర్యానీలు, గ్రేవీ ఐటమ్స్, పలు రకాల ఫ్రై ఐటమ్స్, స్వీట్లు, చాక్లెట్లు, ఐస్క్రీమ్లు, కేక్లు, కూల్డ్రింక్లలో ఎక్కువగా వాడుతున్నారు. లెక్కచేయని వ్యాపారులు ఆహార భద్రత అధికారులు ఇటీవల కాలంలో కల్తీ పదార్థాలు, నిషేధిత రంగులు కలిపిన పదార్థాలను విక్రయించే వారిపై విస్తృతంగా దాడులు నిర్వహించి జరిమానాలు విధిస్తున్నారు. అయినా వ్యాపారుల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. యథేచ్ఛగా వారు ఆహార పదార్థాల్లో నిషేధిత సింథటిక్ రంగులు కలిపి విక్రయిస్తున్నారు. అధికారులు ఎవ్వరైనా దాడులు చేస్తే వెంటనే వ్యాపారులు వారికి పరిచయం ఉన్న వారితో ప్రజాప్రతినిధులతో అధికారులకు ఫోన్ చేయించి ‘మా వాడే వదిలేయండి’ అని చెప్పిస్తున్నారు. నూటికి 70 శాతం మంది ఇలాగే చేస్తుండగా అధికారులు తలపట్టుకుంటున్నారు. గత నాలుగేళ్లుగా జిల్లాలోని పలువురు వ్యాపారులస్తులపై దాడులు నిర్వహించి నిబంధనలు పాటించని వ్యాపారులకు భారీగా జరిమానాలు విధించారు. అయినా కూడా ఇతర వ్యాపారుల్లో ఎలాంటి మార్పు కనిపించకపోవడం ప్రజారోగ్యం పట్ల వారికున్న చిత్తశుద్ధి ఎలాంటిదో అర్థం అవుతుంది. రంగులు కలిపిన బెల్లంరంగులు కలిపిన బఠానీలురంగులు కలిపిన కివీ డ్రై ఫ్రూట్ ఆహార పదార్థాల్లో సింథటిక్ కలర్స్ వాడకూడదు. ముఖ్యంగా వీటిని గోబీమంచూరియా, చికెన్ దమ్ బిర్యానీ, రెస్టారెంట్లలో ఫ్రైలు, గ్రేవీ ఐటమ్స్లో ఎక్కువగా కలుపుతున్నారు. అలాగే స్వీట్లలో, కూల్డ్రింక్స్లోనూ పరిమితికి మించి రంగులు కలుపుతున్నారు. ఈ మేరకు వ్యాపారులను హెచ్చరించి నోటీసులు జారీ భారీగా జరిమానాలు కూడా విధిస్తున్నాం. ఆహార పదార్థాల తయారీలో నిబంధనలు పాటించని వ్యాపారుల పట్ల కఠినంగా ఉంటున్నాం. – కూర్మా నాయకులు, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, ఉమ్మడి కర్నూలు జిల్లా -
అల్లా మార్గంలో నడవాలి
రుద్రవరం: ముస్లింలు అల్లా మార్గంలో నడవాలని మత పెద్దలు అన్నారు. రుద్రవరంలో ఆదివారం ఇస్తెమా నిర్వహించారు. తెల్లవారు జాము నుంచి రాత్రి వరకు ఐదు మార్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మత పెద్దలు మాట్లాడుతూ.. ప్రతి రోజు నమాజ్ చేయాలని, అలాగే సంపాదనలో జకాత్ తీసి పేదలకు పంచాలని చెప్పారు. శాంతి మార్గంలో నడుస్తూ అందరితో మంచిగా మెలగాలని వివరించారు. ఇస్తెమాకు వచ్చిన వారికి స్థానిక ముస్లింలు తగిన వసతులు కల్పించారు. ఎండలు అధికంగా ఉండటంతో దాతల సహాయంతో మజ్జిగ, వాటర్ ప్యాకెట్లు, పండ్లు పంపిణీ చేశారు. గడ్డి వాము, ట్రాక్టర్ దగ్ధం బేతంచెర్ల: అంబాపురం గ్రామంలో గడ్డివాము, ట్రాక్టర్ దగ్ధమైన సంఘటన ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాల మేరకు గ్రామానికి దగడ సురేంద్రనాథ్ రెడ్డి గడ్డివాముకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. గమనించిన గ్రామస్తులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా అదుపులోకి రాకపోగా , పక్కన్న ఉన్న ట్రాక్టర్ ఇంజన్కు సైతం మంటలు వ్యాపించి దగ్ధమైంది. సుమారు గడ్డివాము, ట్రాక్టర్ దగ్ధమై రూ.6.50 లక్షల ఆస్తి నష్టం వాటిలినట్లు బాధితుడు తెలిపారు. గ్రామంలో గడ్డివాము దగ్ధం సంఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధిత రైతుకు న్యాయం చేయాలని గ్రామ సీపీఐ నాయకులు శ్రీరాములు, సోమన్న, నాగేశ్వరరావు, చంద్రమోహన్ డిమాండు చేశారు. రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి కర్నూలు (టౌన్): కర్నూలు – గుంటూరు రహదారిలో నందనపల్లి గ్రామ శివారులో ఉన్న శ్రీనివాస గార్డెన్ సమీపంలో ఆదివారం వాహనం ఢీకొని గుర్తుతెలియని ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికంగా కుంభకోణం కాఫీ హోటల్ దగ్గరలో గార్గేయపురం వైపు నుంచి కర్నూలుకు వస్తున్న కంకర మిక్చర్ వాహనం రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని ఢీకొంది. ఈ ఘటనలో తీవ్ర గాయాలుకావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న స్థానిక వీఆర్ఓ ఖాజామియ్య కర్నూలు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకొని మృతుడి ఆనవాళ్లు సేకరించారు. సుమారు 45 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు ఉండి 5.6 అడుగుల ఎత్తు, చామనఛాయ రంగు కలిగి ఉన్నాడు. వివరాలు తెలిస్తే 91211 01063 నంబర్కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఘాట్ రోడ్డులో లారీ బోల్తా ● ప్రాణభయంతో కిందకు దూకి మృతి చెందిన క్లీనర్ మహానంది: నంద్యాల – గిద్దలూరు నల్లమల ఘాట్రోడ్డులో అదుపు తప్పిన లారీ కొండచరియను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో క్లీనర్ మృతి చెందాడు. ఒంగోలు నుంచి బళ్లారికి ఐరన్ షీట్లతో వెళ్తున్న లారీ పాత బొగద దొరబావి వంతెన మలుపు సమీపంలో బ్రేకులు ఫెయిల్ కావడంతో కొండ చరియను ఢీకొని బోల్తా పడింది. దీంతో లారీలో డ్రైవర్తో పాటు ఉన్న క్లీనర్ ప్రసాద్ ప్రాణభయంతో కిందికి దూకడంతో తలకు దెబ్బలు తగిలి మృతి చెందాడు. లారీ వెనుకే వస్తున్న ఓ స్కార్పియో వాహన దారులు అప్రమత్తమై వెనుకకు వెళ్తుండగా లారీ వెనుక భాగం నుంచి ఐరన్ షీట్లు పడటంతో వాహనం ముందు భాగం దెబ్బతినింది. సుమారు మూడు గంటలకు పైగా వాహ నాల రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న రోడ్సేఫ్టీ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించి రోడ్డుపై బోల్తాపడిన లారీని జేసీబీ సహాయంతో పక్కకు తప్పించడంతో వాహనాల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి. క్లీనర్ ప్రసాద్ విజయవాడ నగరానికి చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు. నంద్యాల ఏఎస్పీ మందా జావళి, మహానంది ఎస్ఐ రామ్మోహన్రెడ్డి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. -
అకాల వర్షం.. తడిసిన ధాన్యం
పాణ్యంలో ఆరబెట్టిన మొక్కజొన్నలో నీటిని తోడుతున్న రైతులునెరవాడ మెట్ట వద్ద ధాన్యంపై పట్టలు కప్పడంతో నిలిచిన వర్షపునీరుపాణ్యం: మద్దతు ధర లేక కల్లాల్లో ఆరబెట్టుకున్న ధాన్యం అకాల వర్షంతో నీటిపాలైంది. రైతుల ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. పాణ్యం, నెరవాడ, బలపనూరు, కొండజూటూరు, భూపనపాడు, కొణిదేడు గ్రామాల్లో వర్షం ప్రభావంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. చేతికొచ్చిన మొక్కజొన్న, వరి ధాన్యాన్ని రోడ్లపై, కల్లాల్లో ఆరబోసుకోగా అకాల వర్షం కురియడంతో మొత్తం నీట తడిసి పోయింది. వర్షం తగ్గిన తర్వాత రైతులు వర్షపునీటిని తొలగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పాణ్యంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న సర్వీసు రోడ్లలో వర్షపునీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే నెరవాడ మెట్ట వద్ద సర్వీసు రోడ్లపై వరి, మొక్కజొన్న ధాన్యాన్ని ఆరబెట్టుకోగా దిగుబడులు మొత్తం నీట తడిసి పోయాయి. -
మిత్రుడి మరణం తట్టుకోలేక..
ఉరేసుకుని ఆత్మహత్యబేతంచెర్ల: ప్రాణ స్నేహితుడి మరణాన్ని తట్టుకోలేక ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద సంఘటన బేతంచెర్లలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. పట్టణానికి చెందిన యువకులు షేక్షావలి, ట్రాక్టర్ డ్రైవర్ కొడిగంటి చిన్న స్నేహితులు. ఎప్పుడూ ఇద్దరు కలసిమెలసి ఉండేవారు. షేక్షావలి శనివారం రోడ్డు ప్రమాదానికి గురై కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. మిత్రుడి మరణంతో తీవ్ర మనస్తాపానికి చెందిన డ్రైవర్ చిన్న (25) అనురాధ థియేటర్ సమీపంలోని తన ఇంట్లో అర్ధరాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్దిసేపటికి గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య చిలకమ్మతో పాటు కొడుకు, కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. -
వేరుశనగ క్వింటా రూ.7,200
ఎమ్మిగనూరుటౌన్: స్థానిక వ్యవసాయ మార్కెట్లో ఆదివారం క్వింటా వేరుశనగ గరిష్టంగా రూ.7,200 ధర పలికింది. మార్కెట్కు 115 క్వింటాళ్ల వేరుశనగ దిగుబడులు మాత్రమే మార్కెట్కు విక్రయానికి వచ్చాయి. దీంతో క్వింటా వేరుశనగ కనిష్ట ధర రూ.5,540కు, మధ్యస్థ ధర క్వింటం రూ,6,713 ప్రకారం వ్యాపారులు కొనుగోలు చేసినట్లు మార్కెట్ యార్డ్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు. అదేవిధంగా ఆముదాలు 42 క్వింటాళ్లు విక్రయానికి రావడంతో కనిష్ట ధర క్వింటా రూ.5,880లు. మధ్యస్థ రూ.5,890, గరిష్టంగా ధర రూ.5,901కు, కందులు 2 క్వింటాళ్లు అమ్మకానికి రావడంతో క్వింటా గరిష్ట ధర రూ.6,430కు వ్యాపారులు కొనుగోలు చేశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో వెట్టిచాకిరి కర్నూలు(సెంట్రల్): అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో రాష్ట్ర ప్రభుత్వం వెట్టిచాకిరి చేయించుకుంటోందని స్టేట్ గవర్నమెంట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు గంటా సంపత్కుమార్, ఈడుపుగంటి మోహన్రావు ఆరోపించారు. ఆదివారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా వారు మాట్లాడుతూ.. సమాన పనికి సమాన వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సుప్రీంకోర్టు చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. అవుట్సోర్సింగ్ పేరుతో నెలకు రూ.10 వేల జీతం ఇస్తూ శ్రమదోపిడీ చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా పదవీ విరమణ వయసును 62 సంత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని కోరారు. అసోసియేషన్ కర్నూలు జిల్లా కమిటీకి జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా నాగరాజు, జనరల్ సెక్రటరీగా రాములు, ట్రేజరర్గా శివప్రసాద్ ఎన్నికయ్యారు. నేడు కలెక్టరేట్ ఎదుట ధర్నా కర్నూలు(సెంట్రల్): తుంగభద్ర, హంద్రీ నదులను, వక్కెరవాగును పరిరక్షించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక కన్వీనర్ రామకృష్ణారెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు జెడ్పీ నుంచి కలెక్టరేట్ వరకు రాల్యీగా వస్తామని పేర్కొన్నారు. కర్నూలు నగరానికి శాశ్వతంగా నీటి సమస్య తలెత్తకుండా ఉండాలంటే తుంగభద్ర, హంద్రీ నదులను పరిరక్షించాలని, ధర్నాలో ప్రజలు పాల్గొనాలని కోరారు. అధికారిక వైబ్సైట్ను మాత్రమే వినియోగించాలి శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలో ఆర్జిత సేవా టికెట్లు, స్పర్శదర్శనం టికెట్లు, వసతి గదులు ముందస్తు బుకింగ్ కోసం దేవస్థాన అధికారిక వెబ్సైట్ను మాత్రమే వినియోగించుకోవాలని శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం ఈఓ మాట్లాడుతూ శ్రీశైల దేవస్థానంలోని ఉభయ దేవాలయాల్లో అన్నీ ఆర్జిత సేవలు, మల్లికార్జున స్వామివారి స్పర్శదర్శన టికెట్లను ఆన్లైన్ ద్వారా పొందే అవకాశం కల్పిస్తున్నామని అన్నారు. 17 ఆర్జిత సేవలకు సంబంధించిన సేవాటికెట్లను ఆన్లైన్ ద్వారా భక్తులు పొందవచ్చన్నారు. అలాగే వసతిని కూడా ముందస్తుగా ఆన్లైన్లో రిజర్వ్ చేసుకునే అవకాశం కల్పించబడిందన్నారు. భక్తులు రాష్ట్ర దేవదాయశాఖ అధికారిక వైబ్సైట్ www.aptemples.ap.gov.in, అలాగే దేవస్థానం అధికారిక వెబ్సైట్ www. srisailadevasthanam.org ద్వారా మాత్రమే వినియోగించుకోవాలని అన్నారు. అలాగే మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా అన్నీ ఆర్జిత సేవా టికెట్లను, మల్లన్న స్పర్శదర్శనం, శీఘ్రదర్శనం, అతిశీఘ్రదర్శనం టికెట్లను పొందవచ్చునని అన్నారు. -
మద్దిలేటయ్య క్షేత్రం కిటకిట
బేతంచెర్ల: వైష్ణవ పుణ్యక్షేత్రమైన శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయం వైశాఖ మాసం శనివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. వేసవి సెలవులు, శుభ దినాలు కావడంతో పెళ్లిలు, కేశఖండన కార్యక్రమాలు ఉండటంతో ఆలయం భక్త జన సంద్రంగా మారింది. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి, అమ్మవార్లకు పంచామృతాభిషేకం, కుంమార్చన, ఆకుపూజ, స్వామి వారికి ప్రీతి పాత్రమైన వరపూజతో పాటు మహా మంగళహారతి నిర్వహించారు. మద్దిలేటయ్య నామస్మరణలతో క్షేత్రం మారుమోగింది. -
ఆనాటి స్నేహం.. అద్భుత జ్ఞాపకం
నంద్యాల (అర్బన్): చదువులమ్మ చెట్టు నీడలో విద్యాబుద్ధులు నేర్చుకున్న స్నేహితులందరూ మూడు దశబ్దాల తర్వాత తిరిగి అక్కడే జ్ఞాపకాలను పంచుకున్నారు. ఇందుకు నంద్యాల మండలం చాపిరేవుల జెడ్పీ హైస్కూల్ ప్రాంగణం వేదికై ంది. స్థానిక ఉన్నత పాఠశాలలో 1995–96 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు 30 ఏళ్ల అనంతరం శనివారం అదే పాఠశాలలో కలుసుకున్నారు. తొలుత సభా వేదిక పైకి వెళ్లి ఒక్కొక్కరిగా పరిచయం చేసుకున్నారు. ఆనాటి తీపి జ్ఞాపకాలు, ఆటలు, అల్లర్లు, నిక్నెమ్లు గుర్తుకు తెచ్చుకుంటూ ఒకరినొకరు పిలుచుకుంటూ చిన్న పిల్లల్లా మారిపోయి ఉత్సాహంగా గడిపారు. ఆత్మీయ పలకరింపులతో యోగ క్షేమాలు తెలుసుకుంటూ ఆనందంగా సందడి చేశారు. వివిధ వృత్తులు, ఉద్యోగ, వ్యాపారాల్లో స్థిరపడి పలు ప్రాంతాల్లో ఉన్న వారంతా తరలి వచ్చారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేద్దామని, తోటి విద్యార్థులకు సాయపడదామని తీర్మానాలు చేసుకున్నారు. విద్యార్థులందరూ వినోద కార్యక్రమాల్లో పాల్గొని, పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉత్సాహంగా గడిపారు. పాఠశాల అభివృద్ధికి రూ.60వేలు బహూకరించారు. తోటి విద్యార్థి నరసింహారెడ్డి ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడటంతో అతనికి రూ.30 వేలు ఆర్థిక సాయం చేశారు. తమకు విద్యాబుద్ధులు నేర్చిన గురువులు, పీఈటీలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ జిల్లెల్ల సరస్వతి, వాసుదేవరెడ్డి, మల్లికార్జునరెడ్డి, వెంకటసుబ్బయ్య, అరుణ, శివపార్వతి, ప్రసన్న, తదితరులు పాల్గొన్నారు. -
‘తాలిమ్ ఏ హునర్’ను సద్వినియోగం చేసుకోండి
కర్నూలు(హాస్పిటల్): వక్ఫ్ ఎడ్యుకేషన్ మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ‘తాలిమ్ ఏ హునర్’ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని రోజా దర్గా ముతవల్లి సయ్యద్ దాదా బాషా ఖాద్రి అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్ స్థాయి విద్యను భరించలేని మైనార్టీ పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఈ పథకం ద్వారా ఉన్నత విద్యావకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. ఇంటర్ మీడియట్ విద్యతో పాటు జేఈఈ, ఎంసెట్, నీట్, ఇతర పోటీ పరీక్షలకు ప్రత్యేక కోచింగ్ అందించనున్నట్లు తెలిపారు. మొత్తం రూ.5 కోట్ల వ్యయంతో 250 మంది విద్యార్థులకు రెండు సంవత్సరాల పాటు నాణ్యమైన విద్య, శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 12వ తేదీ వరకు దరఖాస్తుకు గడువు ఉందని, ఈనెల 17వ తేదీన పరీక్ష ఉంటుందని తెలిపారు. కర్నూలు కల్చరల్: కళావాహిని సాంస్కృతిక సాహితీ సంస్థ ఆధ్వర్యంలో శనివారం రాత్రి సీక్యాంప్ కళాక్షేత్రంలో నిర్వహించిన అన్నమాచార్య సంకీర్తనల గాన కచేరి అలరించింది. అనమయ్య జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో సంగీత విద్వాంసులు రాఘవేంద్ర కుమార్, భార్గవిల బృందం అన్నమయ్య కీర్తనలను ఆలపించారు. ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ శంకర్ శర్మ, మధుర కవి ఎలమర్తి రమణయ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. అన్నమయ్య సంకీర్తనలు అజరామరమన్నారు. ఆయన తొలి తెలుగు వాగ్గేయ కారులు అన్నారు. కళావాహిని సాహితీ సంస్థ అధ్యక్షులు మనోహర్బాబు, హనుమంతరావు చౌదరి, సంస్థ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. -
నల్లమల ఘాట్ రోడ్డులో ప్రమాదం
మహానంది: నంద్యాల – గిద్దలూరు నల్లమల ఘాట్ రోడ్డులో శనివారం పెద్ద ప్రమాదం తప్పింది. పాత బొగద రైల్వే వంతెన వద్ద ఎదురెదురుగా వస్తున్న లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లారీ బోల్తా పడింది. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు లేకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు. రోడ్డుపై లారీ బోల్తా పడటంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రోడ్డుకు అడ్డుగా ఉన్న వాహనాలను పక్కకు తొలగించడంతో వాహ నాల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి. విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి ప్యాపిలి: ఊటకొండ గ్రామానికి చెందిన రామాంజనేయులు (47) శనివారం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. రామాంజనేయులు తన పొలంలో మోటార్ ఆన్ కాకపోవడంతో డీపీ వద్దకు వెళ్లి పరిశీలిస్తుండగా విద్యుత్ తీగలు తగలడంతో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య రాజమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జలదుర్గం ఎస్ఐ అనిల్ కుమార్ తెలిపారు. వివాహిత అదృశ్యం ఉయ్యాలవాడ: ఆర్.పాంపల్లెకు చెందిన లీలావతి (27) రెండు రోజుల నుంచి కనిపించడం లేదు. ఉయ్యాలవాడ పీఎస్ ఏఎస్ఐ ప్రతాప్రెడ్డి తెలిపి న వివరాల మేరకు.. ఆర్. పాపంల్లె గ్రామానికి చెందిన కళ్యాణ్బాబు, లీలా వతి దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె సంతానం. ఈ నెల 8వ తేదీ ఉదయం ఇంటి నుంచి లీలావతి తన కుమార్తెను వెంట తీసుకుని వెళ్లిపోయింది. ఆమె ఆచూకీ కోసం బంధువులు, భర్త గాలించారు. ఆచూకీ లేకపోవడంతో లీలా వతి తండ్రి రొక్కం ఏసయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ తెలిపారు. -
డ్రైవరూ.. టైరు జాగ్రత్త
● టైర్ల నిర్వహణపై అవగాహన లోపం ● వాహనాల టైర్లు పేలి వరుస ప్రమాదాలు ● వేసవిలో మరింత జాగ్రత్తంటున్న నిపుణులు సాక్షి, నంద్యాల: ‘వాహనాలు కండిషన్లోనే ఉన్నాయి. క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయిస్తున్నాం’ .. అని ధీమాగా ఉంటే సరిపోదు. వాహనాల కండిషన్, ఇంధనం మాత్రమే కాదు.. టైర్లు, అందులో గాలి తరచూ సరి చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వాహనం బయలుదేరడానికి ముందే ఒకటికి రెండు సార్లు టైర్లు ఎలా ఉన్నాయి.. వాటిలో సరిపడినంత గాలి ఉందా.. తక్కువ/ఎక్కువగా ఉందో పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో టైర్లు పేలిపోయి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. జిల్లాలో ఈ తరహాలో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రతి టైరుకు కాలపరిమితి ఉంటుంది. తర్వాత కాల పరిమితి తగ్గిపోతుంది. రబ్బరు గట్టిపడడంతో అందులో పరిమితికి మించి గాలి పట్టినప్పుడు, గుంతల్లో పడినప్పుడు టైర్లు పేలిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం వేసవి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో అరిగిపోయిన టైర్లతో వాహనాలు ప్రయాణం చేయడం అత్యంత ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. ఆ అక్షరమే... భద్రతకు కీలకం.. టైరు కొనుగోలు చేసే సమయంలో దాని తయారీ సంవత్సరం చూసుకోవాలి. రీ బటన్ వేసిన వాటిని కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. మరోవైపు బైక్లు, కార్లు, బస్సులు, లారీల టైర్లు నాణ్యత, స్పీడ్ రేటింగ్ సరిగ్గా లేకపోతే ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. టైర్ స్పీడ్ రేటింగ్ అక్షరాలలో ఉంటుంది. ప్రతి టైర్పై దాని సామర్థ్యం తెలియజేసే ప్రత్యేకమైన కోడ్ ఉంటుంది. అందులో చివరి ఆల్ఫా బెటికల్ అక్షరం చాలా కీలకమైంది. దాన్ని టైర్ స్పీడ్ రేటింగ్ అంటారు. వాహన కంపెనీలు ఆ మోడ ల్కు తగిన స్పీడ్ రేటింగ్ నిర్ణయిస్తాయి. డ్రైవర్ డోర్ వద్ద ఉండే స్టిక్కర్ లేదా వాహన మాన్యువల్లో ఇది స్పష్టంగా ఉంటుంది. హైవేలపై డ్రైవ్ చేసేవారు హెచ్, వి రేటింగ్ టైర్లు వినియోగించడం మంచిదని నిపుణు లు చెబుతున్నారు. సాధారణంగా టైర్ల మన్నిక కాలం ఐదారేళ్లు ఉంటుంది. కొత్త టైర్ తీసుకునే సమయంలో అది ఎప్పుడు తయారైందనేది తప్పనిసరిగా పరిశీలించాలి. ఉదాహరణకు 1226 అని ఉంటే 2026వ సంవత్సరం 12వ వారంలో తయారైనట్లు అర్థం. ద్విచక్ర వాహనాలు 2,74,768 ఆటోలు 16,631 కార్లు 16,832 గూడ్స్ వాహనాలు 12,839 ట్రాక్టర్లు 21,583 జీపులు, క్యాబ్లు, స్కూల్ బస్సులు 4,607 జిల్లాలో వాహనాల వివరాలు ఇలా... -
వసతుల కల్పనకు చర్యలు
● ఆర్యూ వీసీ ప్రొఫెసర్ వి.వెంకట బసవరావు కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో వసతులను మెరుగు పరుస్తామని మర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ వి.వెంకట బసవ రావు అన్నారు. శనివారం వర్సిటీ ప్రాంగణంలో ఇంజినీరింగ్ కళాశాలకు అనుబంధంగా అదనపు భవనాల నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సంద ర్భంగా వీసీ మాట్లాడుతూ.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న ఏకై క ఇంజినీరింగ్ కళాశాల అయిన వర్సిటీ కళాశాల విద్యార్థులకు సౌకర్యాలను మెరుగుపరిచే దిశగా ఈ నిర్మాణాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. వర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ ఎన్టీకే నాయక్, రిజిస్ట్రార్ డాక్టర్ బి.విజయ్కుమార్ నాయుడు, వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సి.విశ్వనాథ రెడ్డి, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార పుచ్చ వెంకట సుందరానంద్, డీన్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య ఎన్. నరసింహులు, బోటనీ ప్రొఫెసర్ భరత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
గుంతలు.. వాన పడితే మడుగులు
గుంతలమయమైన రహదారిలో చిన్నపాటి వర్షానికి నీరు చేరడంతో వాహనదారుల కష్టాలు అన్నీఇన్నీ కావు. మండల కేంద్రమైన కౌతాళంలో బాపురం రోడ్డు అధ్వానంగా మారింది. రెండు రోజు ల క్రితం కురిసిన చిన్న పాటి వర్షానికి రో డ్డులో గుంతలు పూర్తిగా నీటితో నిండి మడుగులను తలపిస్తున్నాయి. ఇండియన్ పెట్రోల్ బంక్ నుంచి వెలుగు కార్యాలయం వరకు బురదదారిలో ప్రయాణించ డం కష్టంగా మారింది. వాహనదారులు ఊరు దాటాలంటే భయపడుతున్నారు. రోడ్డుకు ఇరువైపులా నివాసముంటున్న వారి పరిస్థితి దారుణంగా ఉంది. అడుగు బయటపెట్టాలంటే ఆలోచించాల్సి వస్తోంది. కొందరు టెంకాయ పీచు సహాయంతో బురద దారిని దాటుతున్నారు. వెంటనే రహదారి మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు. – కౌతాళం -
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా
● ఆరుగురికి గాయాలు గోస్పాడు: కర్నూలు – కడప జాతీయ రహదారిపై సాంబవరం మెట్ట సమీపంలో శనివారం తెల్లవారుజామున ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్ నుంచి అరుణాచలానికి వెళ్తున్న జగన్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ అమరేంద్రగౌడ్ అతివేగంగా, అజాగ్రత్తగా నడపటంతో వేగాన్ని నియంత్రించుకోలేక సాంబవరం మెట్ట సమీపంలో అదుపు తప్పి బోల్తా పడి పొలాల్లోకి దూసుకెళ్లింది. బస్సులో 39 మంది ఉండగా ప్రయాణికులు వినయ్కుమార్, ఎల్లారెడ్డి, నాగేంద్రమ్మ, జ్యోతి, బాలనర్సమ్మ, ఇందిరారాణి తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరు కూడా స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108లో నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నాగేంద్రమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుధాకర్రెడ్డి తెలిపారు. భార్య హత్య కేసులో భర్త అరెస్టు కృష్ణగిరి: మద్యం మత్తులో ఈ నెల 5న బోయ బొంతిరాళ్ల గ్రామంలో భార్య పద్మావతి అలియాస్ సుజాతను గొడ్డలితో హత్య చేసిన భర్త పాపారాయుడును శనివారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు సంబంధించిన వివరాలను సీఐ యుగంధర్, ఎస్ఐ కృష్ణమూర్తి వెల్లడించారు. ఇతనికి ఆరోగ్యం బాగా లేదని కొంత కాలంగా భార్య సుజాత దాంపత్య జీవితానికి దూరంగా ఉంచింది. దీంతో ఆమైపె అనుమానం పెంచుకుని గొడవ పడి గొడ్డలితో దాడి చేసినట్లు విచారణ వెల్లడైందన్నారు. నిందితుడు ముందుగా ఆలంకొండ వీఆర్వో అనిల్ వద్ద లొంగిపోగా అతన్ని పోలీసులకు అప్పగించారన్నారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ రిమాండ్కు ఆదేశించినట్లు తెలిపారు. -
గొంతులో కత్తి దిగబడితే 3 రోజులకు తీస్తామన్నారు
కర్నూలు(హాస్పిటల్): వ్యాపారంలో వచ్చిన విభేదాల కారణంగా ప్రత్యర్థులు అతని గొంతులో కత్తి(సర్జికల్ బ్లేడ్)తో బలంగా పొడిచారు. పెనుగులాటలో సర్జికల్ బ్లేడ్ కాస్తా విరిగి అతని గొంతులో సగం ఇరుక్కుపోయింది. రక్తం కారుతున్న అతన్ని కుటుంబసభ్యులు మోసుకుని పెద్దాసుపత్రికి వెళితే వైద్యులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. బ్లేడ్ తీసేందుకు మూడు రోజులు పడుతుందన్నారు. ప్రాణభీతితో అతన్ని కుటుంబసభ్యులు డబ్బులు ఖర్చు చేసి ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించి బతికించుకున్నారు. ఈ విషాద ఘటన మూడు రోజుల క్రితం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పులకుర్తి గ్రామానికి చెందిన ఉప్పరి అశోక్(29) వ్యాపారం రీత్యా కర్నూలు నగరంలో నివాసం ఉంటున్నాడు.అతను వివాహ వేడుకలకు ఉపయోగించే రథాలను తయారు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఈ వ్యాపారంలో ప్రత్యర్థులతో అతనికి విభేదాలు రావడంతో ఈ నెల 5న మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు ఇంటి వద్ద అతనిపై దాడి చేశారు. వెంట తెచ్చుకున్న సర్జికల్ బ్లేడ్తో గొంతు కోసే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో అతని గొంతులోకి సర్జికల్ బ్లేడ్ దిగబడింది. పెనుగులాటలో ఆ బ్లేడ్ సగం విరిగిపోయి గొంతులోనే ఇరుక్కుపోయింది. వెంటనే కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. రాత్రి పది గంటలైనా సరైన వైద్యం అందించకపోగా ఆపరేషన్ చేయడానికి, ఇరుక్కుపోయిన బ్లేడ్ తీయడానికి మూడు రోజుల సమయం పడుతుందని కుటుంబ సభ్యులకు క్యాజువాలిటీలోని వైద్యులు తెలిపారు. దీంతో ఎలాగైనా అశోక్ ప్రాణాలు దక్కించుకోవాలన్న ఉద్దేశంతో అదే రోజు రాత్రి 10 గంటలకు నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి వెంటనే ఆపరేషన్ చేసి బ్లేడ్ తీయడమే కాకుండా దెబ్బతిన్న శరీర భాగాలను సరిచేయడంతో అతని ప్రాణాలు దక్కాయి. ప్రాణాలు పోస్తారని పెద్దాసుపత్రికి వెళితే కనీసం పట్టించుకోలేదని, ప్రాణం పోయే పరిస్థితి ఉన్నా ఆపరేషన్ చేయడానికి మూడు రోజులు పడుతుందని చెప్పడం పట్ల కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. -
‘ఉపాధి’ కార్యాలయానికి తాళం
టీడీపీ నాయకులు తాళాలు వేసిన దేవనకొండ ఉపాధి హామీ కార్యాలయం ఇది. నెల్లిబండ, దేవనకొండ, మాచాపురం ఫీల్డ్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న వారిని తొలగించాలని టీడీపీ నాయకులు ఎంపీడీఓను కోరారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావాలని ఆయన చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లను బలవంతంగా రాజీనామా చేయించాలని ‘ఉపాధి’ సిబ్బందిని టీడీపీ నాయకులు బెదిరించారు. అంతటితో ఆగకుండా మూడు రోజుల క్రితం కార్యాలయానికి తాళాలు వేశారు. దీంతో ఉద్యోగులు భయపడుతూ గురువారం ఒక్కరు కూడా విధులకు రాలేదు. విషయం తెలుసుకున్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి కార్యాలయాన్ని సందర్శించారు. అధికారులతో మాట్లాడి కార్యాలయాన్ని తెరిపించారు. -
రాయరు సన్నిధిలో భక్తుల సందడి
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయంలో గురువారం భక్తుల సందడి నెలకొంది. రాఘవేంద్రస్వామి ప్రత్యేక దినం కావడంతో భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వా మి సేవలో తరించారు. భక్తుల రాకతో శ్రీ మఠంలో రద్దీ కనపించింది. మూల బృందావ న దర్శనానికి రెండు గంటలకు పైగా సమ యం పట్టింది.రాయరు దర్శన క్యూలైన్లు, అన్నపూర్ణ భోజనశాల, పరిమళ ప్రసాదం కౌంటర్లు భక్తులతో కిటకిటలాడాయి. తుంగభద్ర నదీ తీరంలో భక్తుల కోలాహలం నెలకొంది. వేసవి సెలవుల దృష్ట్యా భక్తుల రాక అధికమైంది. 8న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు కర్నూలు(అర్బన్): జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలను ఈ నెల 8న నిర్వహిస్తున్నట్లు సీఈఓ జీవీ రమణారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి ఉత్తర్వుల మేరకు సమావేశాలను ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తున్నామన్నారు. సమావేశాల్లో గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సాంఘిక సంక్షేమం, విద్య, వైద్యం, మహిళాభివృద్ధి–శిశు సంక్షేమం, పనులు, ఆర్థిక ప్రణాళిక అంశాలపై చర్చిస్తామన్నారు. సమావేశాలకు స్థాయి సంఘాల సభ్యులు, కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు వారికి కేటాయించిన సమాయానికి హాజరు కావాలని సీఈఓ కోరారు. ఆర్ఆర్బీ, ఏపీ హైకోర్టు పరీక్షలకు ఉచిత శిక్షణ కర్నూలు(అర్బన్): రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు–లోకో పైలెట్, గ్రూప్–డీ, ఏపీ హైకోర్టు –2026 రిక్రూట్మెంట్ పరీక్షలకు ఉమ్మడి జిల్లాకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల అభ్యర్థులకు స్థానిక ఏపీ బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణను అందిస్తున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ కె.ప్రసూన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 20లోగా ఏపీ బీసీ స్టడీ సర్కిల్, కల్లూరు తహసీల్దార్ కార్యాలయం, అబ్బాస్నగర్, కర్నూలు చిరునామాలో అందించాలన్నారు. వంద మంది అభ్యర్థులకు 2 నెలలు ఉచిత శిక్షణతో పాటు స్టైఫండ్, స్టడీ మెటీరియల్ అందిస్తామన్నారు. ఎస్ఎస్సీ, డిగ్రీలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తాన్నారు. ఈ నెల 25వ తేది నుంచి శిక్షణా తరగతులు ప్రారంభమవుతాయన్నారు. ఇతర వివరాలకు 08518–236076, 9652093661 నెంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు. 21 నుంచి ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ సప్లమెంటరీ పరీక్షలు ఈ నెల 21 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్ట్ ఇయర్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకెండియర్ పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తం 25,819 మంది విద్యార్థులు పరీక్షల ఫీజు చెల్లించారు. పరీక్షలకు మొత్తం 57 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రాక్టికల్స్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు, గైర్హాజరైన వారికి వచ్చే నెల 7 నుంచి 11వ తేదీ వరకు కేవలం జిల్లా కేంద్రంలోని జనరల్ ప్రభుత్వ జూనియర్(టౌన్ మోడల్)కాలేజీ, వొకేషనల్ విద్యార్థులకు మూడు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అధ్యాపక నియామక నోటిఫికేషన్లు రద్దు కర్నూలు కల్చరల్: డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వ విద్యాలయంలో ఖాళీగా ఉన్న 63 అధ్యాపక పోస్టుల భర్తీకి 2023లో జారీ చేసిన నియామక నోటిఫికేషన్లు రద్దు చేసినట్లు వర్సిటీ ఇన్చార్జి వైస్ ఛాన్స్లర్, వర్సిటీ ఎఫ్ఏసీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ షావలి ఖాన్ తెలిపారు. డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వ విద్యాలయం కార్యనిర్వాహక మండలి తీర్మానం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీఓ 69, తేదీ 06.05.26 మేరకు అధ్యాపక పోస్టుల భర్తీకి ఇచ్చిన అనుమతిని ప్రభుత్వం ఉపసంహరించుకుందన్నారు. ఆయా నోటిఫికేషన్ల కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల అప్లికేషన్ ఫీజు రీఫండ్ వివరాలను విశ్వవిద్యాలయ అధికారిక వెబ్సైట్ https://ahuuk.ac.in లో తెలుసుకోవచ్చన్నారు. టీబీ డ్యాంలో 10 టీఎంిసీల నీరు హొళగుంద: తుంగభద్ర డ్యాంలో గురువారం ఉదయం నాటికి 105.788 టీఎంసీలకు గాను 10.190 టీఎంిసీల నీరు నిల్వ ఉంది. తుంగభద్ర దిగువ(ఎల్లెల్సీ) కాలువలో గురువారం నీటి ప్రవాహం పూర్తిగా ఆగిపోయింది. టీబీ డ్యాంకు ఇన్ఫ్లో జీరో ఉండగా అవుట్ఫ్లో 454 క్యూసెక్కులుంది. -
25, 26 తేదీల్లో ఎస్బీఐ ఉద్యోగుల సమ్మె
కర్నూలు(అర్బన్): స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధనకు ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ దేశ వ్యాప్తంగా ఈ నెల 25, 26వ తేదీల్లో రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చినట్లు కర్నూలు మాడ్యూల్ డీజీఎస్ పి.విద్యాసాగర్ తెలిపారు. గురువారం స్థానిక మాడ్యూల్ కార్యాలయంలో సమ్మెకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ బ్యాంకు యాజమాన్యానికి సమ్మె నోటీసు అందించారన్నారు. ఉద్యోగుల సమస్యల పట్ల యాజమాన్యం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యవైఖరికి వ్యతిరేకంగా ఈ సమ్మె నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పేద, వెనుకబడిన వర్గాలకు ఉద్యోగ అవకాశాలను కల్పించాల్సిన సామాజిక బాధ్యతను బ్యాంకు విస్మరిస్తోందన్నారు. బ్యాంకులో శాశ్వత స్వభావం కలిగిన పనులను అవుట్ సోర్సింగ్ చేయడం అత్యంత ప్రమాదకరమన్నారు. కార్యక్రమంలో ఏజీఎస్లు పి.శ్రీకాంత్, కె.ప్రవీణ్, అసిస్టెంట్ ట్రెజరర్ ఎన్.శ్రీకాంత్ పాల్గొన్నారు. -
కమనీయం.. మల్లన్న కల్యాణోత్సవం
శ్రీశైలంటెంపుల్: హిందూధర్మ ప్రచారంలో భాగంగా ప్రకాశం జిల్లా చింతల చెంచుగూడేంలో ‘మా స్వామి మల్లన్న– మా చెంతకే’ కార్యక్రమంలో భాగంగా భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు వైభవంగా కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. గురువారం సాయంత్రం ప్రకాశం జిల్లా చింతల చెంచుగూడెంలో శోభయాత్ర అనంతరం కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. కల్యాణోత్సవంలో భాగంగా ముందుగా స్వామిఅమ్మవార్లకు ప్రవర పఠించి, వరపూజ నిర్వహించి బాషికాలను అలంకరించారు. తరువాత భూమండలం, శ్రీశైల క్షేత్ర వర్ణనతో కూడిన మహాసంకల్పం పఠించారు. అర్చకులు మంగళాష్టకాలను పఠిస్తూ సుముహూర్త సమయంలో స్వామిఅమ్మవార్ల శిరస్సులపై జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని సమర్పించారు. లోకకల్యాణం కోసం అమ్మవారికి మాంగళ్యధారణ జరిపి, స్వామిఅమ్మవార్లకు తలంబ్రాలను సమర్పించారు. స్వామిఅమ్మవార్ల వస్త్రాల కొంగులను కలుపుతూ బ్రహ్మముడి వేశారు. స్వామిఅమ్మవార్లకు పునఃపూజలు జరిపి, ఆశీర్వచనం, భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. -
ఏఐఎస్–63 ప్రమాణాలు విధిగా పాటించాలి
జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థల యాజమాన్యాలు తమ బస్సుల్లో ఏఐఎస్–63 ప్రమాణాలు విధిగా పాటించాలి. భద్రత లోపాలు ఉన్న బస్సులకు నోటీసులు జారీ చేసి వారం గడువు ఇస్తున్నాం. ఆ తర్వాత కూడా లోపాలు సరిచేయకపోతే మోటార్ వాహన చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. బడి బస్సుల భద్రతలో వాటి యాజమాన్యాలు కూడా సమాన బాధ్యత వహించాలి. రాబోయే రోజుల్లో ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయి. – శాంతకుమారి, డీటీసీ -
వివాహిత ఆత్మహత్య
కొలిమిగుండ్ల: అంకిరెడ్డిపల్లెలో ఓ వివాహిత గురువారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన కొప్పుల సుధాకరరెడ్డి రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీలో జేసీబీ ఆపరేటర్గా పని చేస్తున్నాడు. కొలిమిగుండ్లలో లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మో త్సవాలకు భార్య సౌజన్య (35)తో కలిసి బంధువుల ఇంటికి వచ్చారు. బుధవారం రాత్రి దంపతులిద్దరూ స్వగ్రామానికి వెళ్లి పోయారు. నిద్ర మధ్యలో లేచి సౌజన్య ఉరి వేసుకుంది. కొద్ది సేపటి తర్వాత భర్త గమనించి చూడగా అప్పటికే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతికి గల కారణాలు సేకరించారు. సౌజన్య చాలా రోజుల నుంచి తల నొప్పితో బాధపడుతుందని, భరించలేకనే ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి చెన్నపురెడ్డి సంజీవరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మల్లెవేములలో భారీ చోరీ చాగలమర్రి: మండలంలోని మల్లెవేముల గ్రా మంలో భారీ చోరీ జరిగింది. రూ.15.50 లక్షల విలువైన 10 తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయని బాధితుడు గోపిరెడ్డి వెంకట్రామిరెడ్డి తెలిపారు. తామంతా నిద్రిస్తుండగా బుధవారం అర్ధరాత్రి ఇంటి వెనుక వైపున ఉన్న తలుపులను తెరుచుకొని దుండగులు ఇంట్లోకి వచ్చారన్నారు. బీరువాను పగుల గొట్టి అందులో ఉన్న బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన ట్లు చెప్పారు. ఆళ్లగడ్డ రూరల్ సీఐ వెంకట రమణ సంఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీంను ర ప్పించారు. వేలి ముద్రలను సేకరించి, కేసు న మోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వృద్ధుడి ఆత్మహత్య కోవెలకుంట్ల: పట్టణంలోని సుంకులమ్మ దేవాలయ సమీపంలో ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గురువారం ఎస్ఐ మల్లికార్జునరెడ్డి అందించిన సమాచారం మేరకు.. కాలనీకి చెందిన నరసింహుడు(85) కొన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది ఈ నెల 2వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. మృతుని కుమారుడు లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ట్రాక్టర్ నుంచి కిందపడి వ్యక్తి మృతి ఓర్వకల్లు: పొలానికి మట్టిని తరలిస్తున్న ఓ వ్యక్తి ట్రాక్టర్పై నుంచి కిందపడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఉయ్యాలవాడ గ్రామ సమీపంలో చేసుకుంది. మీదివేముల గ్రామానికి చెందిన ఎల్లయ్య(58) తన పొలానికి నల్లమట్టిని తరలించేందుకు అదే గ్రామానికి చెందిన బోయ కృష్ణకు చెందిన ట్రాక్టర్ను గురు వారం అద్దెకు తీసుకున్నాడు. వెల్దుర్తి మండలం బ్రహ్మగుండం చెరువు నుంచి మట్టిని తరలిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మార్గమధ్యలో ఉయ్యాలవాడ గ్రామ సమీపంలోని లింగమయ్య కుంట వద్ద డ్రైవర్ పక్కన కూర్చు న్న ఎల్లయ్య ప్రమాదవశాత్తు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. మృతదేహాన్ని కర్నూలు ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి, విచారిస్తున్నట్లు ఎస్ఐ సునీల్కుమార్ తెలిపారు. -
గోనెగండ్ల పంచాయతీకి ఐఎస్ఓ గుర్తింపు
గోనెగండ్ల: మెరుగైన సేవలతో గోనెగండ్ల మేజర్ గ్రామ పంచాయతీకి ఐఎస్ఓ గుర్తింపు లభించింది. టీక్యూఎస్ సంస్థ సభ్యులు పీఎం ప్రేమానంద్, ఆడిటర్ ఇమామ్, సాయికృష్ణ గురువారం గోనెగండ్ల మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 52 గ్రామపంచాయతీలు ఐఎస్ఓ సర్టిఫికెట్కు ఎంపికయ్యాయన్నారు. వాటిలో మొదటి విడతలో 24 పంచాయతీలు ఐఎస్ఓ సర్టిఫికెట్లు పొందేందుకు అర్హత పొందాయని తెలిపారు. ఇందులో భాగంగా 19వ పంచాయతీగా గోనెగండ్ల గుర్తింపు పొందిందన్నారు. అనంతరం కార్యాలయంలో మండల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి కార్యదర్శి సతీష్కు ఐఎస్ఓ సర్టిఫికెట్ను అందజేశారు. డిప్యూటీ ఎంపీడీఓ అనంతసేన, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. అటవీ సంరక్షణ అందరి బాధ్యత కర్నూలు కల్చరల్: అటవీ సంరక్షణ అందరి బాధ్యత అని కర్నూలు సర్కిల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ బీవీఏ కృష్ణమూర్తి అన్నారు. సర్కిల్ కార్యాలయంలో రెనోవేషన్ చేసిన అటవీ శాఖ గెస్ట్ హాస్ను డీఎఫ్ఓ పి. శ్యామలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎఫ్ మాట్లాడుతూ.. రూ. 34 లక్షలతో సర్కిల్ కార్యాలయం, మీటింగ్ హాల్, గెస్ట్ హౌస్లను రెనోవేషన్ పనులు చేపట్టి ఆధునీకరించామన్నారు. కార్పొరేట్ స్థాయిలో కార్యాలయాన్ని తీర్చిదిద్దామన్నారు. కర్నూలు డివిజన్లోని నగర వనాల్లో ప్లాంటేషన్ కార్యక్రమం చేపట్టామన్నారు. కర్నూలు, ఆదోని రేంజ్ ఆఫీసర్లు ప్రియాంక, తేజశ్వి, అకౌంట్స్ ఆఫీసర్ అబ్దుల్ సుభాన్, డీఆర్వోలు ఓబులేస్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
దేవుడి భూమి స్వాహా!
అన్యాక్రాంతం నందవరం: రెవెన్యూ రికార్డులు కాదని కొందరు దేవుడి భూమిని సొంతంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. ఆ భూమిని పాతికేళ్లుగా అనుభవిస్తూ దర్జాను ప్రదర్శిస్తున్నారు. ఇటీవల జరిగిన రీ సర్వేతో వారి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. నందవరం మండలం నదికై రవాడి గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయానికి 23.97 ఎకరాల భూమి ఉంది. గ్రామం తూర్పు భాగంలో తుంగభద్రనదీ తీరంలో ఈ భూములు ఉన్నాయి. ఇక్కడ ఎకరా ధర రూ.20 లక్షలకు పైగా పలుకుతోంది. ఇలాంటి విలువైన భూమిని కొందరు సెట్లర్స్(వేరే ప్రాంతం నుంచి వచ్చి గ్రామంలో ఉండేవారు) ఆక్రమణదారులతో కలిసి సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించారు. ఇబ్రహీంపురం కొట్టాలకు చెందిన సత్యనారాయణ, కృష్ణమూర్తిలతో దేవుడికి అర్చకులని చెప్పి షణ్ముఖ, వీరభద్రప్పలు మాన్యం భూమిని అనుభవిస్తున్నారు. వీరందరూ కలిసి మాన్యాన్ని అనుభవిస్తూనే రికార్డులు మార్చేశారు. కృష్ణమూర్తి 6 ఎకరాలు, సత్యనారాయణ 6 ఎకరాలు, వీరభద్రప్ప 5.93 ఎకరాలు, షణ్ముక 5.94 ఎకరాల చొప్పున అనుభవంలో ఉన్నట్లు చూపించుకున్నారు. సర్వేకు అడ్డంకులు దేవుడి మాన్యం ఆక్రమణ అయ్యిందని రీ సర్వేలో బయట పడింది. దీంతో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. జిల్లా కలెక్టర్కు, తహసీల్దార్కు వినతి పత్రాలు అందజేశారు. ఈ భూమిని రికార్డుల ఆధారంగా సర్వే చేసి తమకు స్వాధీన పరచాలని రెవెన్యూ అధికారులకు ఎండోమెంట్ అధికారులు విన్నవించుకున్నారు. విన్నపం మేరకు ఈ నెల 2న (శనివారం) మండల సర్వే అధికారి అక్బర్బాషా, గ్రామ సర్వేయర్లతో కలిసి సర్వే చేయడానికి వెళ్లగా అనుభవదారులు అడ్డుచెప్పారు. సర్వేకు దేవదాయ శాఖ అధికారులు రాకపోవడంతోపాటు రాజకీయ నాయకుల ఒత్తిళ్లు అడ్డంకిగా మారాయి. దేవదాయ శాఖ, రెవెన్యూ అధికారులు కలిసి సర్వే చేపట్టి భూమి దేవుడికి చెందేలా చూడాలి. గ్రామంలో ఆంజనేయ స్వామికి నిత్య పూజలు కరువయ్యాయి. ఆలయానికి సంబంధించి 23.97 ఎకరాలు దేవుడికి అప్పగిస్తే బాగుంటుంది. – ఈడిగ వేణు ఆక్రమణదారుల నుంచి దేవుడి మాన్యం విడిపించేంత వరకు పోరాడతాం. దేవదాయశాఖ, రెవెన్యూ, సర్వే అధికారులు గ్రామానికి వచ్చి సర్వే చేసి హద్దులు చూపించాలి. లేకపోతే విశ్వహిందూ పరిషత్తో కలిసి ఆందోళన తీవ్రతరం చేస్తాం. ఇప్పటికై నా అధికారులు స్పందించి సర్వే చేపట్టాలి. – బోయ వెంకటేష్ -
పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు
కర్నూలు: పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి అన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి సూచనల మేరకు స్థానిక పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ పక్కనున్న హోప్ ఆఫ్ హోమ్లో పొక్సో యాక్ట్పై గురువారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. లీలా వెంకటశేషాద్రి ముఖ్య అతిథిగా హాజరై పిల్లలకు పొక్సో చట్టం గురించి వివరించారు. 18 సంవత్సరాల్లోపు వయస్సు పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడకుండా పొక్సో యాక్ట్ ఉపయోగపడుతుందన్నారు. కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక కోర్టు ఉందన్నారు. పిల్లలకు ఏదైనా సమస్య వస్తే లీగల్ సర్వీసెస్ టోల్ఫ్రీ నంబర్ 15100కు కాల్ చేస్తే పరిష్కరిస్తామన్నారు. ఐసీడీఎస్ జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శారద, జాగృతి యూనిట్ సభ్యుడు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
‘ఆరు’ విధాలుగా మేలు
● 30 సెంట్లలో ఆరు రకాల ఆకుకూరల సాగు ● రోజు రూ.800 నుంచి రూ.1,200 వరకు ఆదాయం సి.బెళగల్: అహోరాత్రులు శ్రమించి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న సమయంలో పోలకల్ గ్రామానికి చెందిన రైతు బూడిదపాడు మద్దిలేటి వినూత్నంగా ఆలోచించారు. తన ఎకరా పామాయిల్ తోటలో అంతర పంటలుగా ఆరు రకాల ఆకుకూరలను సాగు చేస్తున్నారు. మంచి దిగుబడి, రాబడి రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే తోటలో గతంలో అంతర పంటగా ఉల్లి పంటను సాగుచేయడంతో నష్టాలు వచ్చాయి. నష్టాల నుంచి బయటపడేందుకు తోటలో 30 సెంట్ల భూమిలో ఆరు రకాల ఆకుకూరలను పండించాలని సంకల్పించారు. తన సతీమణి అనంతమ్మతో కలసి పొలంలో పాలకూర, తోటకూర, గోంగూరు, కొత్తిమీర, మెంతికూర, చిరుకూర విత్తనాలను చల్లారు. ఆకుకూరల పంటలు త్వరగా కోతలకు రావడంతో ప్రతిరోజు పనులను చేసుకుంటూ బిజీగా గడుపుతున్నారు. ప్రతిరోజూ కోతలు కోసుకుని సొంతంగా గ్రామాల్లో తిరుగుతూ అమ్ముకుని అధిక లాభాలు పొందుతున్నారు. రోజుకు రూ.800 నుంచి రూ.1,200ల వరకు ఆదాయం వస్తున్నట్లు రైతు మద్దిలేటి తెలిపారు. -
విద్యాసంస్థల బస్సులు తనిఖీ
● భద్రతా లోపాలున్న 61 బస్సులకు నోటీసులు జారీ కర్నూలు: పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభ తేదీ దగ్గర పడుతుండటంతో రవాణా శాఖ అధికారులు బడి బస్సుల తనిఖీలు విస్తృతం చేశారు. డిప్యూటీ కమిషనర్ శాంతకుమారి ఆదేశాల మేరకు ఎంవీఐలు, ఏఎంవీఐలు నాలుగు బృందాలుగా ఏర్పడి జిల్లాలో విద్యాసంస్థలకు చెందిన బస్సులపై సమగ్ర తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో మొత్తం 582 పైగా విద్యాసంస్థల బస్సులు ఉన్నాయి. ఇప్పటివరకు 38 విద్యాసంస్థలను సందర్శించి 168 పాఠశాలలు, కళాశాలల బస్సులను అధికారులు తనిఖీ చేశారు. ఈనెల 15లోపు ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొందాలని తనిఖీ సందర్భంగా అధికారులు ఆదేశిస్తున్నారు. భద్రతా లోపాలున్న 61 బస్సులకు లోపాల ను సరిచేసుకోవాలని నోటీసులు జారీ చేశారు. అగ్నిప్రమాద భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారు. -
పేదల బియ్యం.. పెద్దల భోజ్యం
రాజకీయనేతల ఒత్తిళ్లకు భయపడి! కర్నూలు(సెంట్రల్): పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం బడాబాబుల దరికి చేరుతోంది. అక్రమంగా సేకరించిన బియ్యాన్ని కర్నూలుకు 18 కిలోమీటర్ల దూరంలో నిల్వ ఉంచుతున్నారు. ఇందుకోసం నిర్జన ప్రాంతంలో గోదాము ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడి నుంచే అక్రమ బియ్యం వ్యాపార లావాదేవీలు సాగుతున్నాయి. కర్నూలుకు 18 కిలోమీటర్ల దూరంలోని గార్గేయపురం–నూతనపల్లెల మధ్య జాతీయ రహ దారి 340సీ నుంచి దాదాపు కిలోమీటర్ దూరంలో ఈ గోదాము కనిపిస్తుంది. ఇందులో ఐదారు లారీల బియ్యాన్ని ఏక కాలంలో నిల్వ చేయవచ్చు. మనుషు లు కూడా సరిగా సంచరించని ఈ ప్రాంతంలో అక్రమ వ్యాపారానికి అనువుగా ఉంటుందని నిర్మించారు. ఇక్కడి నుంచి చౌక ధరల దుకాణాల డీలర్లు, ప్రజల నుంచి సేకరించిన రేషన్ బియ్యాన్ని నిల్వ చేసి జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. ఈ గోదాములో కర్నూలు నగరం, కర్నూలు రూరల్ మండలం, కల్లూరు మండలం, మిడుతూరు, నందికొట్కూరు ప్రాంతాల్లో అక్రమ మార్గాల ద్వారా సేకరించిన బియ్యాన్ని నిల్వ చేస్తున్నారు. ముఖ్యంగా రేషన్ షాపుల డీలర్లు, ఇంటింటికీ వచ్చి బియ్యాన్ని కొనుగోలు చేసే వ్యాపారులు ఇక్కడకి వచ్చి విక్రయాలు చేస్తారని తెలుస్తోంది. బియ్యం అక్రమ వ్యాపారంపై ఉక్కుపాదం మోపుతామని అధికారులు పదే పదే చెబుతుంటారు. రేషన్ బియ్యాన్ని అమ్మినా..కొనుగోలు చేసినా చట్టరీత్యా నేరమని చెబుతుంటారు. అయితే అక్రమ బియ్యం వ్యాపారం కళ్లముందే జరుగుతున్నా రాజకీయనేతల ఒత్తిళ్లు, డబ్బుకు ఆశపడి అక్రమార్కులకే సహకరిస్తున్నారన్నది బహిరంగ సత్యం. ప్రస్తుతం అక్రమ బియ్యం డంపుపై అధికారులు ఏ విధంగా స్పందిస్తారో తెలియడంలేదు. -
మహాయోగి లక్ష్మమ్మవ్వ
మహిమాన్వితురాలు ● భక్తుల ఇలవేల్పుగా ప్రసిద్ధి ● రేపు అవ్వ జాతర ● తరలిరానున్న భక్తజనం ఆదోని అర్బన్: మహాయోగి లక్ష్మమ్మవ్వ కొలిచిన వారికి కొంగు బంగారమై విరాజిల్లుతున్నారు. ఆదోని పట్టణంలో వెలిసిన అవ్వను భక్తులు తమ ఇలవేల్పుగా కొలుస్తున్నారు. ఈనెల 9వ తేదీన శనివారం అవ్వ జాతర సందర్భంగా వెండి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక నుంచి కూడా భక్తులు తరలిరానుండటంతో ఆలయ నిర్వాహకులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం తెల్లవారుజామున అవ్వ వారి సమాధి, మూలవిరాట్కు క్షీరాభిషేకం, పట్టువస్త్రాలు, ఒడిబియ్యం, పూల అలంకరణతో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి అవ్వ విగ్రహాన్ని వెండి రథంలో ఉంచి పురవీధుల్లో ఊరేగించనున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయం చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఆలయం ముందు చలువ పందిళ్లు వేశారు. ఇన్చార్జి డీఎస్పీ భార్గవి ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తును నిర్వహిస్తున్నారు. జిల్లాలోని ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు, మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాల్లోనూ చుట్టుపక్కల గ్రామాల్లో దాదాపు 25 శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వ ఆలయాలు వెలిశాయి. అదేవిధంగా కర్ణాటక రాష్ట్రం బళ్లారి, సిరుగుప్ప తాలూకా రారావిలో కూడా అవ్వ వారి ఆలయాలు ఉన్నాయి. ప్రతిరోజూ శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వ పూజలందుకుంటున్నారు. ఆలూరు మండలం మూసానహళ్లి గ్రామంలో దళిత మంగమ్మ, బండెప్ప దంపతుల కుమార్తె లక్ష్మమ్మ చిన్నప్పటి నుంచే విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉండడంతో గ్రామస్తులు తిక్కమ్మగా పిలిచేవారు. పెళ్లీడు రావడంతో కర్ణాటక రాష్ట్రం సిరుగుప్ప గ్రామానికి చెందిన మారెప్పకు ఇచ్చి వివాహం చేశారు. ఓరోజు ఆమె తన భర్తకు శక్తిస్వరూపిణిగా కనిపించడంతో అతడు భయపడి ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశాడు. కొన్ని రోజుల తర్వాత సిరుగుప్ప నుంచి ఆదోనికి చేరుకుని పుర వీధుల్లో సంచరించే వారు. పట్టణ ప్రజలకు తరచూ ఆమె రకరకాల మహిమలు చూపుతుండడంతో మహాయోగిగా భావించి సమస్యలు చెప్పుకుని సాంత్వన పొందటం ప్రారంభించారు. ఆమె దుకాణాల వద్దకు వచ్చిపోతే వ్యాపారం బాగా జరుగుతుందనే నమ్మేవారు. సంతానం లేని వారికి అమ్మవారిని కలిసి వేడుకుంటే సంతానం కలిగేదని భక్తుల నమ్మకం. రోజురోజుకూ మహిమలు చూపడం ఎక్కువ కావడంతో తిక్క లక్ష్మమ్మను మహాయోగిగా పిలిచేవారు. అమ్మవారు జీవించిన కాలంలోనే ఓ పెద్ద కుర్చీలో ఉంచి పల్లకీ సేవగా ఊరేగించే వారు. 1933లో పట్టణంలో జీవసమాధి అయ్యారని ఆలయ నిర్వాహకులు రాచోటి రామయ్య, రాచోటి సుబ్బయ్య తెలిపారు.రథోత్సవంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాం. భక్తులు అందరికీ అన్నదానం నిర్వహిస్తున్నాం. శ్రీభగవాన్ శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో అవ్వవారి పేరుమీద ఉచితంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు యోగా సాధన, ధ్యానం, ఆధ్యాత్మిక ప్రవచనాలు నిర్వహిస్తున్నాం. – రాచోటి రామయ్య, ఆలయ ధర్మకర్త -
సుపరిపాలన అంటే అరాచకం.. దౌర్జన్యమా?
దేవనకొండ: టీడీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డూ అదుపులేకుండా దౌర్జన్యాలు చేయడం.. అరాచకాలకు పాల్పడటం.. ప్రభుత్వ ఉద్యోగులను, ప్రజలను వేధించడం... ఇదేనా సుపరిపాలన అంటే అని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ప్రశ్నించారు. దేవనకొండలో తాళా లు వేసిన ఉపాధి హామీ కార్యాలయాన్ని గురువారం ఆయన పరిశీలించారు. కార్యాలయానికి ఎందుకు తాళం వేశారని డ్వామా పీడీతో ఫోన్లో ఎమ్మెల్యే మా ట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. దేవనకొండ మండలంలోని మాచాపురం, నెల్లిబండ, దేవనకొండ గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లను బలవంతంగా రాజీనామా చేయాలని, ఉపాధి హామీ సిబ్బంది వారిని రాజీనామా చేసేలా టీడీపీ నాయకులు ఒత్తిడి తెచ్చారన్నారు. ఉపాధి హామీ సిబ్బందిని నానా దుర్భాషలాడుతూ ఇబ్బందులుకు గురి చేస్తున్నారన్నారు. గత మూడు రోజుల నుంచి సిబ్బంది పనిచేసే కార్యాలయానికి టీడీపీ నాయకులు తాళం వేసుకుని వెళ్లడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో నారా లోకేష్ రెడ్బుక్ పాలన నడుస్తోందన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులనే టార్గెట్ చేస్తూ వేధిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులను కూడా వేధించడం ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకున్నామా అని ప్రజలు భయాందోళన చెందుతున్నారన్నారు. ఇలాంటి అరాచకాలు ఇంకోసారి తన నియోజకవర్గంలో జరిగితే చూస్తూ ఊరుకునే ప్రసక్తేలేదని హెచ్చరించారు. తనను నమ్మి ఓటు వేసిన ఆలూరు నియోజకవర్గ ప్రజల వెనక తాను నిలబడి పోరాడతానని తెలిపారు. ‘ఉపాధి’ సిబ్బందికి అండగా ఉంటానని, ఎప్పుడు ఏ సమస్య వచ్చినా తనని సంప్రదించాలని సూచించారు. కార్యాలయానికి వచ్చి ప్రశాంతంగా పని చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యే వచ్చిన విషయాన్ని తెలుసుకున్న టీడీపీ నాయకులు ఎమ్మెల్యే వెళ్లిన ఒక గంటలోపే తాళాలను ఇచ్చి కార్యాలయాన్ని తెరిపించారు. ఎమ్మెల్యే వెంట జెడ్పీటీసీ రామకృష్ణ, దివాకర్నాయుడు, ఎర్రగోటి అంజి, మండలంలోని కార్యకర్తలు ఉన్నారు. -
భార్య హత్య కేసులో భర్త అరెస్ట్
బనగానపల్లె: భార్య హత్యకేసులో భర్త కొండగాళ్ల వెంకటస్వామిని గురువారం అరెస్టు చేసినట్లు బనగానపల్లె రూరల్ సీఐ మంజునాథ్రెడ్డి తెలిపారు. అతని సోదరులను కూడా అరెస్ట్ చేసినట్లు చెప్పారు. స్థానిక సీఐ కార్యాలయంలో వివరాలను వెల్లడించారు. బీరవోలు గ్రామానికి చెందిన వెంకటస్వామికి కొంత కాలంగా భార్య లక్ష్మీపై అనుమానం ఎక్కువైంది. గత నెల 29న కూలి పనికి వెళ్దామని భార్యను నమ్మించి తన మోటార్సైకిల్పై గ్రామ చివర ఉన్న గాలేరు నగరి కాల్వ వద్దకు వెళ్లారు. అక్కడే భార్యతో గొడవపడి హత్య చేసి మృతదేహానికి రాయి కట్టి పక్కనే ఉన్న బావిలో వేశాడు. రెండు రోజుల తరువాత అనుమానం వచ్చిన వెంకటస్వామి మళ్లీ బావి వద్దకు వెళ్లి చూడగా మృతదేహం తేలియాడుతూ కనిపించింది. తన సోదరులైన వెంకటరమణ, శ్రీనివాసులను బావి వద్దకు తీసుకెళ్లి మృతదేహాన్ని బయటికి తీసి పక్కనే పూడ్చివేశారు. ఈనెల 2న మృతురాలి తల్లి నంద్యాల దేవనగర్కు చెందిన రాజోలి సుబ్బలక్ష్మీ తన కుమార్తె కనిపించడం లేదని, తన అల్లుడిపై అనుమానం ఉందని నందివర్గం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడు వెంకటస్వామి పరారీలో ఉండగా సోదరులు వెంకటరమణ, శ్రీనివాసులను అదుపులోకి తీసుకొని విచారించగా నిజాన్ని ఒప్పుకున్నట్లు సీఐ తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడు వెంకటస్వామితో పాటు సోదరులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచినట్లు సీఐ చెప్పారు. -
భక్తులకు మెరుగైన సౌకర్యాలు
● శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు మంత్రాలయం: భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని శ్రీమఠం అధికారులను పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఆదేశించారు. భక్తులకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తప్పవని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మఠం అధికారులతో కలసి అన్నపూర్ణ భోజనశాల, వీఐపీ భోజనశాల, కల్పతర్వు క్యూ కాంపెక్స్ను తనిఖీ చేశారు. అన్నప్రసాదం ఎలా ఉందని భక్తులను అడిగి తెలుసుకున్నారు. క్యూ కాంపెక్స్లో భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. వంటశాలల్లో సిబ్బందితో మట్లాడి పలు సూచనలు ఇచ్చారు. ఎండతీవ్రత దృష్ట్యా అన్నపూర్ణ భోజన రహదారికి తడకలతో నీడ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. క్యూ కాంప్లెక్స్లో నీటి వసతి కల్పించాలన్నారు. కార్యక్రమంలో మేనేజర్ శ్రీనివాసరావు, ప్రధాన అర్చకులు, అధికారులు పాల్గొన్నారు. -
మల్లన్న సేవలో శ్రీశైల జగద్గురు పీఠాధిపతి
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను శ్రీశైల జగద్గురు పీఠాధిపతి చెన్నసిద్దరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. గురువారం మల్లన్న దర్శనార్థం విచ్చేసిన పీఠాధిపతికి ఆలయ రాజగోపురం వద్ద దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు, ప్రధానార్చకులు శ్రీశైల జగద్గురు పీఠాధిపతికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పీఠాధిపతి మల్లికార్జున స్వామికి రుద్రాభిషేకం, భ్రమరాంబాదేవికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం అమ్మవారి ఆలయం వద్ద ఉన్న ఆశీర్వచన మండపంలో పీఠాధిపతి గౌరవార్థం అర్చకులు, వేదపండితులు వేదగోష్టి నిర్వహించారు. -
కంటి ఆసుపత్రిలో ఉద్యోగులే దళారులు!
● కంటి అద్దాలకు బయటి దుకాణాలకు రెఫర్ కర్నూలు(హాస్పిటల్): కర్నూలులోని ప్రాంతీయ ప్రభుత్వ కంటి ఆసుపత్రిలో ఉద్యోగులే దళారుల అవతారం ఎత్తారు. ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి కంటి అద్దాలను వైద్యులు సూచించగా, వాటిని ఫలానా దుకాణంలో తీసుకోవాలంటూ కొందరు ఉద్యోగులు చెప్పి మరీ పంపుతున్నారు. కొందరు ఉద్యోగులైతే ఒక తెల్లకాగితంపై దుకాణం పేరు కూడా రాసి ఇస్తుండటం విమర్శలకు తావిస్తోంది. ఆసుపత్రిలో కంటి పరీక్షలు చేయించుకుని, దృష్టిలోపం ఉన్న వారికి కంటి అద్దాలు వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇలా వైద్యులు సూచించిన మేరకు అద్దాలను జగనన్న కంటి వెలుగు కార్యక్రమం కింద ఉచితంగా తయారు చేసి పంపిణీ చేసేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ పథకంను తీసివేశారు. అప్పటి నుంచి కంటి అద్దాలను రోగులు బయట కొనుగోలు చేస్తున్నారు. ఇలా వైద్యులు సూచించిన అద్దాలను రోగులే వారికి నచ్చిన దుకాణంలో కొనుగోలు చేసుకోవాలి. కానీ ఆసుపత్రిలో పనిచేసే కొందరు ఉద్యోగులు దళారుల అవతారం ఎత్తారు. ప్రైవేటు ఆప్టికల్స్ షాపులకు వీరే రోగులను పంపిస్తున్నారు. కొందరు దుకాణదారులు ఆసుపత్రిలోకి వచ్చి రోగులను వెంటబెట్టుకుని మరీ తీసుకెళ్తున్నారు. ఇలా రోగులను దుకాణాలకు పంపినందుకు గాను సదరు ఉద్యోగులకు తగిన మొత్తాన్ని అందిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణరెడ్డి వివరణ ఇస్తూ.. త్వరలో రోగులకు ఉచితంగా కంటి అద్దాలను అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందిస్తోందని తెలిపారు. ఆసుపత్రిలో రోగులను బయట దుకాణాలకు పంపే ఉద్యోగులను గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. -
సంగపట్నంలో పది గడ్డివాములు దగ్ధం
అవుకు(కొలిమిగుండ్ల): మండల పరిధిలోని సంగపట్నంలో ప్రమాదవశాత్తు బుధవారం పది గడ్డివాములు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన శేఖర్రెడ్డి, శివశంకర్రెడ్డి,బత్తుల ఈశ్వరరెడ్డి,చిన్న బయపురెడ్డి,చిన్న వెంకటసుబ్బారెడ్డి, నూర్బాషా, మల్లు శివశంకర్రెడ్డి పశువుల మేత కోసం పది గడ్డివాములను నిల్వ చేసుకున్నారు. గడ్డివాములకు సమీపంలో మొక్క జొన్న కోతలు కోసి వేస్టేజ్ను పక్కకు పడేయంతో వాటికి నిప్పు పెట్టారు. క్రమేణా మంటలు గడ్డివాములకు అంటుకున్నాయి. అదుపు చేసేందుకు యత్నించినా లాభం లేకుండా పోయింది. పూర్తిగా గడ్డివాములు కాలిపోవడంతో సుమారు రూ.8లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు వాపోయారు. నిలిచిపోయిన నీటి విడుదల గోనెగండ్ల: ఏపీవాట ఇండెంట్ పూర్తి కావడంతో తుంగభద్ర దిగువ కాలువకు నీటి విడుదలను డ్యామ్ అధికారులు నిలిపివేశారు. దిగువ ప్రాంతమైన గోనెగండ్ల సెక్షన్కు బుధవారం ఉదయం 10 క్యూసెక్కుల నీరు మాత్రమే చేరింది. సాయంత్రానికి నీటి విడుదల పూర్తిగా నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. తాగునీటి అవసరాల కోసం ఏప్రిల్ 1 నుంచి తుంగభద్ర దిగువ కాలువకు నీటి విడుదల కొనసాగింది. హత్య కేసుగా మారిన అదృశ్యం కేసు బనగానపల్లె: మండలంలోని బీరవోలు గ్రామానికి చెందిన లక్ష్మి(35) అదృశ్యం కేసు హత్య కేసుగా మారినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. వారు తెలిపిన వివరాల మేరకు.. గొల్ల వెంకటస్వామి భార్య లక్ష్మిపై భర్త అనుమానంతో వారం రోజుల క్రితం సోదరులు వెంకటరమణ, శ్రీనివాసులు సహకారంతో గ్రామ సమీపంలోని గాలేరు నగరి కాల్వ వద్దకు ఆమెను తీసుకెళ్లి అక్కడే చంపి పూడ్చివేశారు. అయితే ఏమీ తెలియనట్లు ఈ నెల 2న తన భార్య కనిపించడంలేదని వెంకటస్వామి నందివర్గం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. లక్ష్మి కొద్ది రోజులుగా అగుపించకపోవడంతో బంధువులు భర్తపై అనుమానం ఉందని, కేసు దర్యాప్తు చేయవలసిందిగా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బనగానపల్లె సీఐ మంజునాథ్రెడ్డి, ఎస్ఐ భూపాలుడులు కేసు నమోదు చేసి విచారణ చేయగా.. వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. మృతదేహం కుళ్లిపోవడంతో ఘటనా స్థలంలోనే పంచనామ, పోస్టుమార్టం చేశారు. భర్త వెంకటస్వామితో పాటు సోదరులు వెంకటరమణ, శ్రీనివాసులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అడుగుకో గుంత గోనెగండ్ల: మండల కేంద్రం గోనెగండ్ల నుంచి గంజిహళ్లి గ్రామానికి వెళ్లే రహదారి అధ్వానంగా ఉంది. అడుగడుగున గుంతలతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. గోనెగండ్ల నుంచి గంజిహళ్లి మీదుగా బైలుప్పల, బి. అగ్రహారం తదితర గ్రామాలకు ఈ దారిలోనే వెళ్లాలి. గంజిహళ్లి చెరువు నుంచి ఇటీవల టిప్పర్లలో ఎమ్మిగనూరుకు మట్టి తరలించారు. ఈ వాహనాలు అధికలోడ్తో ఇష్టనుసారంగా వెళ్లాడంతోనే రోడ్డు దెబ్బతినిందని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించి రహదారి బాగుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఉయ్యాలవాడలో పిడుగు ఉయ్యాలవాడ: మండలంలో బుధవారం సాయంత్రం భారీగా ఈదురు గాలులు వీచాయి. రాత్రి 7.15 గంటల సమయంలో మండల కేంద్రం ఉయ్యాలవాడలో ఉరుములతో కూడిన వర్షం కురిసింది. మండలకేంద్రంలో ఉన్న మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి స్వగృహం ఆవరణలోని కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. ఈ ఘటనలో చెట్టు పోయి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పిడుగు పడిన శబ్ధానికి చుట్టు పక్కల ఇళ్లలోని ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. తర్వాత వారు సంఘటనా స్థలానికి చేరుకుని నీటితో మంటలను అదుపు చేశారు. ఏఎస్ఐ ప్రతాప్రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అలాగే భారీగా గాలులు వీచడంతో మండలంలో పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. -
శ్రీశైల క్షేత్రంలో స్వచ్ఛత భేష్
శ్రీశైలం: పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రతలో భాగంగా శ్రీశైల మహా క్షేత్రంలో చేపడుతున్న చర్యలు భేష్ అని ఆదానీ అనుబంధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. నో ప్లాస్టిక్ – సేవ్ నేచర్ నినాదంతో ఆ సంస్థ ప్రతినిధులు నలుగురు 12 జ్యోతిర్లింగాల పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీశైల క్షేత్రానికి వచ్చిన వారు పారిశుధ్య పనులు, ప్లాస్టిక్ నివారణ చర్యలపై భక్తుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. తర్వాత నివేదిక తయారు చేసి ఈవో శ్రీ నివాసరావును కలిసి అందజేశారు. బృందంలో గుజరాత్కు చెందిన హరినాథ్ నబ్బవ, కపిల్ గోర్, మకుందనాథ్, సావన్గర్ గో స్వామి ఉన్నారు. -
ఆవును ఢీకొని..
ఆళ్లగడ్డ: మండల పరిధిలోని బత్తలూరు గ్రామం వద్ద జాతీయ రహదారిపై అవును ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. బుధవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. వివరాలు.. మండల కేంద్రం శిరివెళ్లకు చెందిన లింగప్రసాద్ (45) అనే వ్యక్తి ఆళ్లగడ్డలో జరుగుతున్న ఓ ఫంక్షన్కు హాజరయ్యేందుకు మోటర్సైకిల్ పై బయలు దేరగా నల్లగట్ల సమీపంలోకి వచ్చేసరికి కుటుంబ సభ్యులు ఫోన్ చేసి వెంటనే శిరివెళ్లకు రావాలని చెప్పారు. దీంతో నల్లగట్ల నుంచి శిరివెళ్లకు బయలు దేరగా బత్తలూరు సమీపంలోని జాతీయ రహదారిపై నల్లని ఆవును గమనించకుండా ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో లింగప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందగా వెనుక కూర్చుని ఉన్న శ్రీనివాసులు అనే వ్యక్తికి గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని రూరల్ పోలీసులు తెలిపారు. -
అవసరమేరకే ఎరువులు వాడాలి
నంద్యాల(అర్బన్): పంటలకు యూరియా, డీఏపీలను అవసరమైన మేరకే వాడాలని, మోతాదుకు మించి వాడితే భూసారం దెబ్బతింటుందని కేంద్ర బృందం సభ్యులు ఢిల్లీ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఫర్టిలైజర్స్ రవీంద్రయాదవ్, ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ మధుశేఖర్ పేర్కొన్నారు. యూరియా, డీఏపీ నిల్వల పరిశీలన నిమిత్తం నంద్యాల జిల్లా కేంద్రంలోని పలు ఎరువుల దుకాణాల్లో డీఏఓ వెంకటేశ్వర్లుతో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎరువుల నిల్వలు, రిజిస్టర్ బిల్లులు, క్రయవిక్రయాల రికార్డులు, ఈ పాస్ మిషన్ల ద్వారా రైతులకు ఎరువుల సరఫరా విధానం, గత మూడేళ్లుగా యూరియా అమ్మకాల వివరాలు సేకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎరువులు రైతులకు అవసరమైన మేరకు సమృద్ధిగా ఉన్నాయని, ఆందోళనలతో ముందస్తుగా కొనుగోలు చేయవద్దని చెప్పారు. డీలర్లు ఎరువుల విక్రయాలకు సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించాలని, యూరియా, డీఏపీలకు ప్రత్యామ్నాయంగా నానో యూరియా, నానో డీఏపీ, జీవన ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించాలన్నారు. తొలకరి వర్షాలు కురిసిన వెంటనే రైతులు పచ్చిరొట్ట ఎరువులు అయిన జీలుగ, పిల్లిపెసర, 25 నుంచి 30 రకాల విత్తనాలు కలిగిన పీఎండీఎస్ కిట్లను సాగు చేయాలన్నారు. కార్యక్రమంలో ఏడీఏ జయప్రకాష్రెడ్డి, గిరీష్, ప్రసాదరావు, పవన్, షేక్షావలి, మహేశ్వరరెడ్డి, నేతాజీ, నాగేశ్వరరెడ్డి, పీరునాయక్, కల్యాణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.


