Kurnool
-
‘సేవ’కు పోటు.. జీవితాలపై వేటు!
నియోజకవర్గాల వారీగా పనిచేసిన వలంటీర్లు ... నియోజకవర్గం మొత్తం వలంటీర్లు ఆదోని 1,073 ఆలూరు 1,383 కోడుమూరు 1,174 కర్నూలు 1,308 మంత్రాలయం 1,096 పాణ్యం 1,344 పత్తికొండ 1,310 ఎమ్మిగనూరు 1,382 మొత్తం: 10,070రోడ్డున పడిన వలంటీర్లు ● దగా చేసిన కూటమి ప్రభుత్వం ● ఉగాది సాక్షిగా మాట నిలుపుకోని నేతలు ● మొత్తం వ్యవస్థనే లేకుండా చేసిన వైనం ● చిరుద్యోగులతో రాజకీయం కర్నూలు(అర్బన్): కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన ఒక్కొక్క హామీకి నీళ్లొదులుతోంది. అధికారంలోకి రాగానే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు అండ్ కో.. ఉన్న ఉద్యోగ్యులను కూడా వీధిన పడేస్తోంది. దేశానికే ఆదర్శగా నిలిచిన వలంటీరు వ్యవస్థకు రూపమే లేదని కూ టమి ప్రభుత్వం కూల్చేసింది. గత ప్రభుత్వంలో అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను అర్హులైన పే ద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు పారదర్శకంగా ఇళ్ల వద్దకు చేర్చిన వలంటీర్లపై కూటమి ప్రభుత్వం కక్షకట్టింది. ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వలంటీరు వ్యవస్థను కొనసాగిస్తామని, పారితోషకాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని నమ్మబలికింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు వలంటీరు వ్యవస్థపై ఎటూ తే ల్చలేక, చివరకు ఈ వ్యవస్థకు చట్టబద్ధత లేదని తేల్చేసింది. ‘వలంటీరు వ్యవస్థే లేనప్పుడు ఎలా కొనసాగిస్తామని, లేని పిల్లాడికి ఏమి పేరు పెట్టాలన్నట్లు ఉందని ’ సాక్షాత్తూ మంత్రి డోలా వీరాంజనేయస్వామి చేత శాసనమండలిలో చెప్పించడం గమనార్హం. కొనసాగుతున్న పోరాటాలు ... ఐదేళ్లు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా సేవలు అందించిన తమను తిరిగి కొనసాగించాలని, ఇచ్చిన మాట ప్రకారం పారితోషకాన్ని రూ.10 వేలకు పెంచాలని వలంటీర్లు పోరాటాలను కొనసాగిస్తూనే ఉన్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయి సంఘాలుగా ఏర్పడి ఉద్యమాన్ని బలోపేతం చేస్తున్నారు. వీరి ఉద్యమాలకు కామ్రేడ్లు కూడా తోడు కావడంతో ఉద్యమ్యం ఉద్ధృతమవుతోంది. నమ్మించి గొంతు కోశారు వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం, వీరి సేవలను ఉపయోగించుకుంటాం, నెలకు రూ.10 వేలు పారితోషకం అందిస్తామని నమ్మించి గొంతు కోశారు. తక్కువ వేతనమైనా, సొంత గ్రామంలో ఉపాధి లభించడంతో పాటు అనేక మంది సొంత గ్రామస్తులకు సేవలు అందిస్తున్నామనే తృప్తి ఉండేది. అలాంటి మాపై ప్రభుత్వం కక్షతో వ్యవహరించడం సమంజసం కాదు. – హమీద్, ప్యాలకుర్తి, కోడుమూరు మండలం తెల్లవారక ముందే అవ్వా, తాతలను నిద్రలేపి నిస్వార్థంగా పెన్షన్లు అందించిన వలంటీర్ల సేవలను రాజకీయ స్వార్థం కబళించింది. నిరక్షరాస్యులైన తల్లిదండ్రుల పిల్లల చదువులకు అవసరమైన సర్టిఫికెట్లను ఇంటి ముంగిళ్లలోనే అందించిన వారిపై వేటు పడింది. గత ప్రభుత్వం అందించిన అనేక సంక్షేమ పథకాలను ఎలాంటి లాభాపేక్ష లేకుండా అతి తక్కువ గౌరవ వేతనంతో అనేక రకాల సేవలు అందించిన వలంటీర్లపై కూటమి ప్రభుత్వం కరుణ చూపాల్సింది పోయి కాఠిన్యం ప్రదర్శించింది. కరోనా కష్టకాలంలో సొంత కుటుంబ సభ్యులు కూడా వారి వద్దకు వెళ్లలేని పరిస్థితుల్లో తమ ప్రాణాలను లెక్క చేయకుండా సేవలందించిన వలంటీర్ల జీవితాలనే ఈ ప్రభుత్వం కూల్చేసింది. -
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
● గోస్పాడులో 43.. కర్నూలులో 42 డిగ్రీలు నమోదు కర్నూలు(అగ్రికల్చర్): భానుడి భగభగలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఎండల తీవ్రతకు ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. శనివారం గోస్పాడులో అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటం గమనార్హం. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎండవేడిమి అధికంగా ఉంటోంది. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య బయట తిరగలేని పరిస్థితి నెలకొంది. ప్రాంతం ఉష్ణోగ్రత గోనవరం 42.83 (పాణ్యం మండలం) కోసిగి 42.7 సంజామల 42.7 బనగానపల్లె 42.62 ఆళ్లగడ్డ 42.44 నందికొట్కూరు 42.43 కర్నూలు 42 -
కూటమి నేతల మాటలు నమ్మి మోసపోయాం
కర్నూలు(సెంట్రల్): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ల మాటలు నమ్మి మోసపోయామని వలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఉగాది రోజు వారు ఇచ్చిన హామీని నమ్మి దగా పడ్డామని, రోడ్డున పడి అడుక్కుతుంటున్నామని వాపోయారు. ఈ ఉగాది వలంటీర్లకు ఉగాది కాదని, దగాది అని వ్యాఖ్యానించారు. శనివారం కలెక్టరేట్ ఎదుట ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు వలంటీర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు నూర్ అహ్మద్ మాట్లాడుతూ పోయిన ఉగాదిన సీఎం, డిప్యూటీ సీఎంలు వలంటీర్లకు రూ.10 వేల వేతనంతో కొనసాగిస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే అధికారంలోకి రాగానే సాకులు వేతికి ఉద్యోగులను తొలగించారన్నారు. గత ప్రభుత్వ హయాంలో సరైన జీఓలు ఇవ్వలేదని చెప్పడం అన్యాయమన్నారు. అలాంటప్పుడు ఆ ప్రభుత్వం తమను ఐదేళ్లపాటు ఎలా కొనసాగించిందని ప్రశ్నించారు. ఎలాంటి జీఓలు లేనప్పుడు తమ సేవలను విజయవాడ వరదల సమయంలోఎలా వినియోగించుకున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే సమయం వస్తుందన్నారు. కార్యక్రమంలో వలంటీర్లు శివ, అనిల్,సునీత, ప్రభావతి, అజ్మతుల్లా, వెంకటేశ్ పాల్గొన్నారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట వలంటీర్ల ధర్నా -
సారా రహిత జిల్లాగా మార్చేందుకు కృషి
కోసిగి: నాటు సారా రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు జిల్లా ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ సూపరింటెండెంట్ ఎం. సుధీర్ బాబు తెలిపారు. శుక్రవారం కోసిగి ఎకై ్సజ్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 110 గ్రామాల్లో నాటుసారా తయారీ చేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఆయా గ్రామాల్లో నవోదయం 2.0లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఎకై ్సజ్ పోలీసులతో, ప్రచారం రథం ద్వారా ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించినట్లు తెలిపారు. నాటుసారా స్థావరాలపై ముమ్మరంగా దాడులు చేస్తున్నామన్నారు. కర్ణాటక , తెలంగాణ రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం రవాణా పూర్తి తగ్గి పోయిందన్నారు. కర్ణాటక టెట్రా ప్యాకెట్లు అక్కడక్కడ సరఫరా అవుతోందని, వాటిని అరికట్టేలా సిబ్బందికి సూచించినట్లు తెలిపారు. మద్యం అమ్మకాలతో జిల్లా ఆదాయం రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉందన్నారు. కోసిగి ఎకై ్సజ్ సీఐ భార్గవ్ రెడ్డి, జిల్లా ఎకై ్సజ్ టాస్క్ఫోర్స్ సీఐ రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. -
పెట్రోల్ బంకులో దోపిడీ దొంగల బీభత్సం
ఆదోని రూరల్: పెట్రోల్ బంకులో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. సిబ్బంది గొంతుపై కత్తులు పెట్టి బెదిరించి రూ.60 వేల నగదు, రెండు సెల్ఫోన్లను చోరీ చేశారు. పెద్దతుంబళం గ్రామంలోని మాధవరం రోడ్డులో ఉన్న ఎస్సార్ పెట్రోల్ బంకుకు శుక్రవారం తెల్లవారుజామున బొలెరో వాహనంలో ఏడుగురు వచ్చారు. వారిలో ఐదుగురు పెట్రోల్ బంకులోకి చొరబడి తమ వాహనానికి పెట్రోల్ వేయాలని నిద్రిస్తున్న పెట్రోల్ బంకు సిబ్బంది ఈరన్న, తాయప్పలను లేపారు. పెట్రోల్ కొట్టించుకున్న అనంతరం సిబ్బంది గొంతుపై కత్తులు పెట్టి డబ్బులు ఎక్కడున్నాయో చూపించాలని బెదిరించారు. పెట్రోల్ బంకులో బీరువాను పగులగొట్టారు. సీసీ ఫుటేజీ బాక్సు, విద్యుత్ సరఫరా వైర్లను కత్తిరించి క్యాష్ కౌంటర్లో ఉన్న రూ.60 వేలు, రెండు సెల్ఫోన్లను దొంగలించుకుని వెళ్లారు. బొలెరో వాహనంలో కోసిగి వైపు వెళ్లిపోయినట్లు సీసీ ఫుటేజీలో తేలిందని ఎస్ఐ తెలిపారు. ఈరన్న, తాయప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. రూ.60 వేల నగదు, రెండు సెల్ఫోన్ల చోరీ -
హడావుడిగా ‘మీ సమస్య–మా పరిష్కారం’
కర్నూలు(సెంట్రల్): రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టీజీ భరత్ శుక్రవారం నిర్వహించిన మీ సమస్య – మా పరిష్కారం కార్యక్రమం హడావుడిగా సాగింది. ప్రజల నుంచి అర్జీ రాగానే సంబంధిత అధికారులకు అప్పగించి పరిష్కారం అవుతుందని బాధితులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంగా..11.15 గంటలకు మొదలైంది. అప్పటి నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మౌర్య ఇన్ హోటల్లోని ఆర్య ఫంక్షన్ హాలులో నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలకు మంత్రి టీజీ భరత్ అందుబాటులో ఉండడం లేదనే విమర్శలు నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలుస్తోంది. సొంత పార్టీ వారే అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో ప్రజలకు అందుబాటులో ఉన్నట్లు చెప్పుకునే ప్రయత్నం మంత్రి చేశారని తెలుస్తోంది. కార్యక్రమంలో కలెక్టర్ పి.రంజిత్బాషా, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, మునిసిపల్ కమిషనర్ రవీంద్రబాబు, టౌన్ డీఎస్పీ బాబు ప్రసాదు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రెండున్నర గంటల్లో ముగిసిన మంత్రి టీజీ భరత్ కార్యక్రమం -
బాల్యమిత్రుల ఆర్థిక సాయం
హొళగుంద: అనారోగ్యంతో బాధపడుతున్న స్నేహితునికి బాల్యమిత్రులు రూ.41 వేలు ఆర్థిక సహాయం చేశారు. ధైర్యంగా ఉండాలని, తామంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. హొళగుంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2005–06లో మార్లమడికి గ్రామానికి చెందిన రామంజితో పాటు పలువురు చదువుకున్నారు. క్యాన్సర్తో బాధపడుతూ రామంజి.. కర్నూలులోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న 50 మంది బాల్య స్నేహితులు తలా ఇంత ఇచ్చి.. రూ.41 వేలు చేశారు. అందరి తరఫున శుక్రవారం స్నేహితులు పెద్దహ్యాట మల్లయ్య, వార్డు సభ్యుడు చిన్న మల్లయ్య, తిమ్మారెడ్డి, సుధాశెట్టి, ద్యావన్నలు కర్నూలుకు వెళ్లి రామాంజిని పరామర్శించి రూ. 41,000 నగదును అతని చేతికి అందజేశారు. విద్యుత్ చార్జీల భారం తగ్గించాలికర్నూలు(అగ్రికల్చర్): కూటమి ప్రభుత్వం ప్రజలపై వేసిన విద్యుత్ ట్రూ అఫ్ చార్జీలను, సర్దుబాటు చార్జీలను రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ఉపసంహరించుకోవాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కొత్తబస్టాండు సమీపంలోని విద్యుత్భవన్ ఎదుట పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే.ప్రభాకర్రెడ్డి, జిల్లా కార్యదర్శి గౌస్దేశాయ్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలను పెంచబోమని చెప్పిన కూటమి నాయకులు తర్వాత ట్రూ అప్చార్జీలు, సర్దుబాటు పేరుతో అడ్డుగోలుగా చార్జీలు పెంచడం దారుణమన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లను వ్యతిరేంచిన టీడీపీ నేడు వాటిని ఏర్పాటు చేస్తూ వినియోగదారులపై భరించలేని భారం మోపుతోందని విమర్శించారు. స్మార్ట్ మీటర్ల వల్ల వ్యాపార, పారిశ్రామికవేత్తలపై ప్రతి నెలా రూ.5 వేల నుంచి రూ.30 వేల వరకు భారం పడుతుందన్నారు. అలాగే స్మార్ట్ మీటర్ల వల్ల వేలాది మంది మీటర్ రీడింగ్ సిబ్బంది ఉపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టీ.రాముడు, రాధాకృష్ణ, ఎండీ ఆనంద్, ఓల్డ్సీటీ కార్యదర్శి రాజశేఖర్, జిల్లా కమిటీ సభ్యులు అరుణ, గురుశేఖర్, విజయ్ పాల్గొన్నారు. అనుమానం పెనుభూతమై.. వెలుగోడు:మోత్కూరు మజారా గ్రామమైన తిమ్మనపల్లి గ్రామంలో ఓ వివాహిత దారుణహత్యకు గురైంది. కట్టుకున్న భర్తనే భార్యను కడతేర్చాడు. పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. రుద్రవరం మండలం చిన్న కంబలూరు గ్రామానికి చెందిన పసుల లక్ష్మీదేవి (32)కి తిమ్మనపల్లి గ్రామానికి చెందిన మధు చిన్ని కృష్ణతో వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరి సంసారం కొన్ని సంవత్సరాలు సజావుగా సాగింది. కాగా భార్యపై అనుమానం పెనుభూతమైంది. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం మధు చిన్ని కృష్ణ తన భార్య లక్ష్మీదేవి తలపై గొడ్డలి కామాతో దాడి చేయగా తీవ్ర రక్త గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న ఆత్మకూరు రూరల్ సీఐ సురేష్ కుమార్ రెడ్డి, వెలుగోడు ఏఎస్ఐ శేషా వలి గ్రామానికి చేరుకుని హత్యకు కారణాలపై ఆరా తీశారు. మృతురాలు తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
‘ఉపాధి’లో రూ.1.74 లక్షల అవినీతి
● పీడీ వెంకటరమణయ్య మంత్రాలయం: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జరిగిన పనుల్లో రూ.1,74,469 అవినీతి జరిగినట్లు నిర్ధారించగా.. వాటిని వెంటనే రీకవరీ చేయించాలని డ్వామా పీడీ వెంకటరమణయ్య ఆదేశించారు. శుక్రవారం మంత్రాలయం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఎంపీడీఓ రాధ ఆధ్వర్యంలో 18వ విడత సామాజిక తనిఖీ బహిరంగ సమావేశం నిర్వహించారు. రికార్డులు సరిగ్గా లేనట్లు తేల్చారు. రూ.1,74,469 అవినీతి జరగగా రికవరీ చేయాలని ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు రూ.33వేలు అపరాధ రుసుం విధించినట్లు చెప్పారు. ఇందులో అడిషనల్ పీడీ మాధవీలత, ఏపీడీ లోకేశ్వర్, ఏపీఓ తిమ్మారెడ్డి, ఈసీ శ్రీనివాసులు సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన విద్యుదాఘాతం
దేవనకొండ: గ్రామసభ కోసం వేసిన టెంటును తొలగిస్తూ విద్యుదాఘాతంతో కింద పడి ఒక యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన తెర్నెకల్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఉదయం గ్రామసభను నిర్వహించి రాత్రి 7:30 గంటల సమయంలో టెంటును తొలగిస్తున్నారు. ఈ క్రమంలో టెంటుపైభాగాన ఉన్న హెవీ విద్యుత్ లైన్కు గిరిపోగు ప్రతాప్ ప్రతాప్ (30) చేయి తగిలింది. విద్యుదాఘాతంతో ఆ యువకుడు 12 అడుగుల ఎత్తు నుంచి ఒక్కసారిగా సీసీ రోడ్డుపై పడ్డాడు. తలకు బలమైన గాయాలు తగలడంతో దేవనకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. గిరిపోగు ప్రతాప్కు వివాహం కాలేదు. తల్లి మునెమ్మ, ఒక అన్న, ఒక తమ్ముడు ఉన్నారు. -
ఆడపడుచుకు అగ్రాసనం
శ్రీశైలంటెంపుల్: కన్నడిగుల భక్తి భావంతో శ్రీగిరి క్షేత్రం పరవశించిపోతుంది. వందల కి.మీ పాదయాత్రగా చేరుకుని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తరించిపోతున్నారు. ఉగాది మహోత్సవాలను పురస్కరించుకుని కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు భ్రమరాంబాదేవిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి ప్రత్యేకంగా తమ ఇంటి నుంచే సారెను తీసుకువస్తారు. ఈ సారెలో బియ్యం, బెల్లం, శనగబ్యాళ్లు, గోధుమపిండి, కొబ్బరిగిన్నె, పూలు, రవిక, చీర, తమ పొలాల్లో పండిన ధాన్యాన్ని తీసుకువచ్చి ఐదు రోజుల పాటు శ్రీశైలంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఈ సారెను అమ్మవారికి సమర్పిస్తారు. అలాగే మల్లికార్జున స్వామి స్వరూపంగా భావించే కంబికి (పల్లకీ) ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పాదయాత్రగా తరలివచ్చే భక్తులు ఈ కంబిని తమ సొంత గ్రామాల నుంచి భుజాన మోసుకుంటూ వస్తారు. ఈ కంబికి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఉగాది ఉత్సవాలు ముగిసే వరకు పూజలు నిర్వహిస్తారు. శ్రీశైలం నుంచి తిరిగివెళ్లే సమయంలో భక్తులు తమ తోబుట్టువులు, ముత్తైదువుల కోసం ప్రత్యేక వాయనం తీసుకెళ్తారు. చీర, జాకెట్, గాజులు, పూలు, పసుపు, కుంకుమ, బెల్లం, విభూది, వివిధ రకాల పండ్లతో వాయనం తీసుకెళ్తారు. ఈ వాయనానికి తమ ఇంటి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి తమ వారికి నూతన చాటల్లో అందిస్తారు. ఈ చాటలను కూడా శ్రీశైలం నుంచి తీసుకెళ్తారు. దీంతో శ్రీశైలంలో చాటల వ్యాపారం బాగా జరుగుతోంది. శ్రీశైలంలో ఎక్కడ చూసినా చాటల విక్రయాలే కనబడుతున్నాయి. కన్నడిగులు అధికసంఖ్యలో చాటలను కొనుగోలు చేస్తున్నారు. అలాగే అమ్మవారి గుర్తుగా బొమ్మను కొనుగోలు చేస్తారు. శ్రీశైల భ్రమరాంబాకు కన్నడిగుల సారె తిరుగు ప్రయాణంలో తోబుట్టువులకు వాయనంతో స్వగ్రామానికి శ్రీశైలంలో చాటలకు పెరిగిన డిమాండ్ -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ఆస్పరి: ఆదోని – పత్తికొండ మార్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఆస్పరి సీఐ మస్తాన్వలి తెలిపిన వివరాల మేరకు.. పత్తికొండ మండలం అటికెలగుండు గ్రామానికి చెందిన బోయ మహానంది (40) గురువారం పని నిమిత్తం బైక్పై ఆస్పరికి చేరుకున్నారు. పని ముగించుకొని రాత్రి స్వగామానికి బైక్పై తిరిగి వెళ్తుండగా పత్తికొండ నుంచి ఆస్పరి వైపు వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహానందిని ఆస్పరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స చేసి ఆదోని ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో డాక్టర్లు సూచన మేరకు కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందతూ కొలుకోలేక మృతి చెందాడని సీఐ తెలిపారు. మృతుడుకి భార్య, ఒక కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
కన్నీటి సాగు.. కనిపించదా కరువు!
● కేవలం 15 మండలాల్లోనే కరువు ఉన్నట్లు ప్రతిపాదనలు ● నేడో, రేపో కరువు మండలాలను ప్రకటన ● రబీలో తీవ్రంగా నష్టపోయిన రైతులు ● రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరు రావద్దనే తప్పుడు లెక్కలు కర్నూలు(అగ్రికల్చర్): వరుణుడు కరుణించడు.. సాగునీరు పారదు.. పొలం పండదు.. అన్నదాతకు అప్పులే మిగులుతున్నాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వానికి కరువు కనిపించదు. కేవలం కొన్ని మండలాల్లో మాత్రమే కరువు ఉన్నట్లు ఒక ప్రకటన వస్తుంది. ఖరీఫ్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో అన్ని మండలాల్లో కరువు పరిస్థితి ఉండగా కేవలం రెండు మండలాల పేర్లు వచ్చాయి. రబీ పరిస్థితి అందుకు భిన్నంగా ఏమీ లేదు. అక్టోబరు నుంచి మార్చి నెల వరకు డిసెంబరు నెలలో మాత్రం ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. మిగిలిన నెలల్లో వర్షాభావ పరిస్థితులే నెలకొన్నాయి. సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. పంటలు వేసినా దిగుబడులు రాక.. గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతున్నా.. కేవలం 15 మండలాల్లోనే కరువు ఉన్నట్లు నివేదికలు వెళ్లాయి. రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరు రావద్దనే సూచనలతో అధికారులు తప్పుడు లెక్కలు పంపారనే విమర్శలు ఉన్నాయి. ఇదీ దుస్థితి.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 55 మండలాలు ఉన్నాయి. పంటలు పండక, దిగుబడులు రాక రైతులకు తీవ్ర నష్టాలు వచ్చినప్పటికీ 2024 ఖరీఫ్ సీజన్లో కౌతాళం, పెద్దకడుబూరు మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా గుర్తించారు. రబీ సీజన్లో వర్షాలు లేక సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. సాగు చేసిన పంటలు కూడా పొగమంచు కారణంగా దెబ్బతిన్నాయి. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భూగర్భ జలాలు గణనీయంగా పడి పోయినా కేవలం 15 మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా ప్రతిపాదించారు. ● కర్నూలు జిల్లాలో కల్లూరు, కర్నూలు రూరల్, కర్నూలు అర్బన్, కోడుమూరు, గూడూరు, ఓర్వకల్లు, ఆస్పరి, వెల్దుర్తి, మద్దికెర, పత్తికొండ మండలాలను మాత్రమే కరువు మండలాలుగా గుర్తించేందుకు జిల్లా యంత్రాంగం ప్రతిపాదించింది. ● నంద్యాల జిల్లాలో సంజామల, బనగానపల్లె, ఉయ్యాలవాడ, కొలిమిగుండ్ల, బేతంచెర్ల మండలాలను ప్రతిపాదించారు. ● డోన్ నియోజకవర్గంలోని ప్యాపిలి, డోన్ మండలాలు పూర్తిగా వర్షాధారంపైనే ఆధారపడి ఉన్నాయి. రబీలో ఈ మండలాల్లో సాగు భారీగా తగ్గిపోయింది. ఈ మండలాలను జిల్లా యంత్రాంగం పక్కన పెట్టడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ● జిల్లా యంత్రాంగం పంపించిన ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం ఒకటి, రెండు రోజుల్లో కరువు మండలాలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ● కర్నూలు జిల్లాలో కరువు తీవ్రతను తగ్గించి కేవలం 10 మండలాలను, నంద్యాల జిల్లాలో 5 మండలాలను చేర్చారు. దిగులే మిగిలింది! రబీ సీజన్ అక్టోబరు నుంచి మొదలై మార్చి వరకు కొనసాగుతుంది. కరువు ప్రాంతాలను గుర్తించాలంటే ఆయా నెలల్లో నమోదైన వర్షపాతం వివరాలను పరిగణనలోకి తీసుకుంటారు. డిసెంబరు నెలలో ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. అక్టోబరు, నవంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో వర్షాలు లేవు. ఐదు నెలల పాటు వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. అక్టోబరు నుంచి డిసెంబరు వరకు 27 శాతం లోటు వర్షపాతం ఉంది. జనవరి నుంచి మార్చి వరకు ప్రతి నెల 47 శాతం లోటు వర్షపాతం ఉంది. వర్షాభావంతో శనగ, జొన్న, మినుముల్లో దిగుబడులు 60 శాతం వరకు పడిపోయాయి. ఈ విషయాన్ని పంట కోత ప్రయోగాలు స్పష్టం చేస్తున్నాయి. దిగుబడులు లేక రైతుకు దిగులే మిగిలినా రాష్ట్ర ప్రభుత్వం కరుణ చూపకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. కరువున్నా కరుణ ఏదీ? గత ఏడాది ఫిబ్రవరి నెలతో పోలిస్తే ఉమ్మడి కర్నూలు జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. చెరువులు, కుంటలు ఎండిపోయి ఇప్పటికే వందలాది గ్రామాల్లో తాగునీటికి తీవ్ర సమస్య ఏర్పడింది. పశువులకు సైతం నీరు అందని దుస్థితి నెలకొంది. కరువు మండలాలను గుర్తించడంలో భూగర్భ జలాలు కీలకం. అయి నా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. కర్నూలు జిల్లాలోని వివిధ మండలాల నుంచి గత ఏడాది నవంబరు నెల నుంచే వలసలు మొదలయ్యాయి. కోసిగి, ఆదోని, పెద్దకడుబూరు, కౌతాళం, హాలహర్వి, హొళగుంద, మద్దికెర, దేవనకొండ, తుగ్గలి, హాలహర్వి తదితర మండలాల నుంచి వ్యవసాయ కూలీలు, సన్న, చిన్నకారు రైతులు వలస వెళ్లిపోయారు. రబీ కరువు ప్రతిపాదనల్లో జిల్లా పశ్చిమ ప్రాంతంలోని పలు మండలాలు లేవు. జిల్లాలో ఖరీఫ్ సీజన్కు సంబంధించి పెద్దకడుబూరు, కౌతాళం కరువు మండలాలకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ కోసం జిల్లా యంత్రాంగం డిసెంబరు నెలలోనే ప్రతిపాదనలు పంపింది. ఇంతవరకు రూ.25.24 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఊసే లేకుండా పోయింది. 2023 ఖరీఫ్ కరువు మండలాలకు సంబంధించి 41,857 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో తప్పులు ఉన్నందున రూ.60.59 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ విడుదల కాలేదు. జిల్లా అధికారులు ఖాతాలను సరిచేసి పంపినప్పటికీ నిధుల విడుదల అతీగతీ లేకుండా పోయింది. 2023–24 రబీ కరువు మండలాలకు దాదాపు లక్ష మంది రైతులకు రూ.98 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ విడుదల పెండింగ్లో ఉండిపోయింది. 2023 ఖరీఫ్ సీజన్, 2023–24 రబీ సీజన్, 2024 ఖరీఫ్ సీజన్లకు సంబందించి పంటల బీమా పరిహారం విడుదల పెండింగ్లోనే ఉంది. భూగర్భ జలాల దుస్థితి ఇదీ... సాగు విస్తీర్ణం హెక్టార్లలో హాలహర్వి మండలం చింతకుంట్ల సమీపంలో వరి పైరును జీవాలు మేస్తున్న దృశ్యం -
డిజిటల్ చెల్లింపులు.. ‘ఖాతా’కు చిల్లులు!
డబ్బులు ఏట్లో పారేసినా లెక్క పెట్టి పారేయాలన్నది పెద్దల మాట. అంటే చేతితో డబ్బులు లెక్క పెట్టి పారేస్తూ ఉంటే దాని విలువ తెలుస్తుందని భావన. అలాగే మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయినీ ఏదైనా పుస్తకంలో రాసుకుంటే నెల చివరలో దేనికెంత ఖర్చు పెట్టాము.. ఎక్కడ అనవసరంగా ఖర్చు చేస్తున్నాము.. ఏ ఖర్చులు తగ్గించుకోవాలి.. ఎక్కడ మిగిలించాలనే విషయాలు తెలుస్తాయి. దీన్ని బట్టే ఫ్యామిలీ బడ్జెట్ రూపొందించుకోవచ్చు. కానీ ఇటీవల డిజిటల్ పేమెంట్స్, ఆన్లైన్ కొనుగోళ్ల పుణ్యమా అని ఎంత డబ్బు వస్తున్నా ఇట్టే అయిపోతోంది. లెక్క పెట్టకుండా ఖర్చు చేయడం వల్లే ఈ సమస్య వస్తోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.కర్నూలు(హాస్పిటల్): కర్నూలు జిల్లాలో ప్రస్తుతం అన్ని రకాల వ్యాపారాలు ఎక్కువగా డిజిటల్ పేమెంట్స్ ద్వారానే సాగుతున్నాయి. ఒకప్పుడు ఫోన్ పే, గూగుల్ పే లాంటివి ఉపయోగించాలంటే భయపడే జనం ఇప్పుడు అవలీలగా లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఎంతగా అంటే రూ.5 నుంచి వేల రూపాయల వరకు ఆన్లైన్లోనే చెల్లింపులు చేస్తున్నారు. ఏదైనా కొనుగోలు చేసినా, ఎవరికైనా డబ్బు పంపాలన్నా, అప్పు ఇవ్వాలన్నా, తీసుకున్న రుణం తీర్చాలన్నా, ఇతర ఎలాంటి లావాదేవీలైనా సరే డిజిటల్ పేమెంట్ తప్పనిసరి అవుతోంది.అయితే పెట్టే ఖర్చు మొత్తం బ్యాంకు ఖాతా ద్వారానే జరుగుతోంది. దీన్నిబట్టి ఎవరికి ఎంత డబ్బులు వస్తున్నా యి, ఎంత ఖర్చు చేస్తున్నారు, ఎంత ఏఏ ఖాతాలకు మళ్లిస్తున్నారు, ఎవరెవరికి చెల్లిస్తున్నారు, వీరికి ఎవరి నుంచి డబ్బులు వస్తున్నాయనే విషయాలన్నీ బ్యాంకుల వారికి తెలిసిపోతోంది. అది చిన్న మొత్తమైనా, పెద్ద మొత్తమైనా సరే అన్ని వివరాలు ఆన్లైన్ పేమెంట్స్ ద్వారా మనకు తెలియకుండానే బ్యాంకులకు/ప్రభుత్వానికి చెప్పేస్తున్నాయన్న మాట. కోవిడ్ తర్వాత ఊపందుకున్న పేమెంట్స్ డిజిటల్ పేమెంట్స్ రూపంలో పదేళ్ల క్రితం డెబిట్, క్రెడిట్కార్డులు, గిఫ్ట్కార్డులు వచ్చాయి. కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసి వాటిని వ్యాపార దుకాణాల్లో స్క్రాచ్ చేసి డబ్బులు చెల్లించేవారు. కొంత కాలం తర్వాత ఇవే కార్డుల ద్వారా ఆన్లైన్లోనే వస్తువులను కొనుగోలు చేసే అవకాశం వచ్చింది. కోవిడ్ అనంతరం వ్యాపార లావాదేవీల్లో మరింత సరళతరం వచ్చింది. అప్పటి వరకు స్తబ్దుగా ఉన్న ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్ల ద్వారా జనం డబ్బు చెల్లించడం, తీసుకోవడం ప్రారంభించారు. ఎంతగా అంటే రూ.5ల కొనుగోలుకు సైతం ఫోన్ పే, గూగుల్ పే ద్వారా డబ్బులు చెల్లిస్తున్నారు. మొదట్లో ఇలా డబ్బులు తీసుకోవడానికి ఇష్టపడని వ్యాపారులు సైతం క్రమంగా అంగీకరించక తప్పని పరిస్థితి. చిల్లర కొరత కారణంగా కూడా డిజిటల్ పేమెంట్స్ ఊపందుకున్నాయి.» కర్నూలు నగరంలోని ఎ.క్యాంపునకు చెందిన వెంకట్ ఓ ప్రైవేటు కంపెనీలో ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారు. ఆయన జీతం నెలకు రూ.60వేలు. వచ్చిన జీతంతో ఇంట్లోని నలుగురు కుటుంబసభ్యులతో హాయిగా జీవిస్తున్నాడు. అయితే ఇటీవల కాలంలో నెలాఖరుకు అకౌంట్లో డబ్బులన్నీ అయిపోయినట్లు గమనిస్తున్నాడు. ఇంత డబ్బు ఏమైందని పరిశీలిస్తే అదంతా డిజిటల్ పేమెంట్స్ ద్వారా తానే ఖర్చు చేసినట్లు నిర్ధారించుకున్నాడు.» ఆదోనికి చెందిన నాగేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. చిరుద్యోగమే అయినా 20 ఏళ్లకు పైగా సీనియారిటీ ఉండటంతో జీతం రూ.లక్షకు పైగా వస్తోంది. మొదట్లో తాను ఖర్చుచేసిన ప్రతిదీ ఓ పుస్తకంలో రాసుకునే అలవాటు ఉండేది. అన్ని ఖర్చులు పోను నెలకు 30శాతం దాకా మిగిలేది. కానీ ఇటీవల డిజిటల్ అకౌంట్లో ఖర్చు పెడుతూ లెక్క రాసుకోవడం మానేశాడు. నెల తిరిగేసరికి బ్యాంకు ఖాతా ఖాళీ అవుతోంది. ఎందుకిలా అని ప్రశ్నించుకుంటే ఆన్లైన్లో తెలియకుండానే తానే ఖర్చు చేస్తున్నట్లు తెలుసుకున్నాడు.లెక్కలేకుండా ఖర్చు పెట్టేస్తున్నారు ఆన్లైన్ లావాదేవీల కారణంగా బ్యాంకు ఖాతా ఖాళీ అయ్యేవరకు మనం ఎంత ఖర్చు పెట్టామో తెలియని పరిస్థితి. దీనికితోడు ఏ వస్తువును ఎంతకు కొనుగోలు చేస్తున్నారో కూడా తెలియకుండా, బేరమాడకుండా కొనేస్తున్నారు. సాధారణంగా మనం కిరాణా దుకాణానికి వెళ్తే సరుకులకు దేనికి ఎంత బిల్లు వేశాడో చూస్తాము. కానీ డిజిటల్ పేమెంట్స్ కారణంగా ఇవేమీ పట్టించుకోవడం లేదు. షాపువారు ఎంత చెబితే అంత చెల్లించి వచ్చేస్తున్నారు. దీనివల్ల డబ్బు విలువ చాలా మందికి తెలియకుండా పోతోంది. ముఖ్యంగా ఈ తరం యువతకు అస్సలు తెలియడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బ్యాంకుల్లోనూ పలుచబడిన జనం ఒకప్పుడు బ్యాంకులకు వెళ్తే అక్కడ పనిపూర్తి చేసుకుని తిరిగి రావడానికి గంట నుంచి రెండు గంటల సమయం పట్టేది. కోవిడ్ తర్వాత ఈ పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చింది. అప్పటి వరకు వివిధ రకాల పథకాల సొమ్ము అకౌంట్లో ప్రభుత్వం వేస్తే దానిని తీసుకోవడానికైనా బ్యాంకులకు, ఏటీఎంలకు వెళ్లేవారు. ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ కారణంగా డబ్బు ఎలా వస్తుందో, ఎలా పోతుందో కూడా తెలుసుకోలేకపోతున్నారు. దాదాపుగా అన్ని చోట్లా ఏటీఎంలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. రుణాలను సైతం బ్యాంకు యాప్ల ద్వారానే నిమిషాల్లో తీసుకునే సౌలభ్యం వచ్చింది. కేవలం కరెంట్ బ్యాంకు ఖాతాలు ఉన్న కొద్ది మంది వ్యాపారులు మాత్రమే పెద్ద మొత్తంలో డబ్బులు వేయడానికి, డ్రా చేయడానికి మాత్రమే బ్యాంకులకు వెళ్తుండటం గమనార్హం. ఖాతాల్లో మార్పులు, చేర్పులు చేసుకోవడానికి, అనుమానాలు తీర్చుకోవడానికి మాత్రమే బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. ఎంత ఖర్చు చేస్తున్నామో తెలియట్లేదు గతంలో డబ్బు చేతిలో ఉంటే చూసి ఖర్చు పెట్టేవారం. నగదు రూపంలో డబ్బులు ఉండటం వల్ల దేనికెంత ఖర్చు చేస్తున్నామో తెలిసేది. కానీ ఇప్పుడంతా డిజిటల్ పేమెంట్స్ కావడంతో ఎంత ఖర్చు చేస్తున్నామో అర్థంకాని పరిస్థితి. తెలియకుండానే నెలలో 20 నుంచి 30 శాతం ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నాం. – సాయిరామ్, ప్రభుత్వ ఉద్యోగి, కర్నూలు -
బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
కర్నూలు(సెంట్రల్): కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం(బార్ అసోసియేషన్) నూతన కార్యవర్గాన్ని గురువారం ఎన్నుకున్నారు. నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా పి.హరినాథ్చౌదరి, వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 856 మంది ఓటర్లు ఉండగా 767 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధ్యక్ష స్థానం కోసం పోటీ పడిన పి.హరినాథ్చౌదరి తన సమీప ప్రత్యర్థి బి.మురళీమోహన్పై 92 ఓట్లతో గెలుపొందారు. ప్రధాన కార్యదర్శి స్థానానికి జరిగిన పోటీలోఎం. వెంకటేశ్వర్లు తన ప్రత్యర్థి ఎం.ఆంజనేయులుపై 76 ఓట్లతో విజయం సాధించారు. జాయింట్ సెక్రటరీ స్థానానికి పోటీ చేసిన ఎం. బాలసుబ్రమణ్యం తన ప్రత్యర్థి బీకే నాగారుజుపై 411 ఓట్లతో గెలిచారు. లైబ్రరీ సెక్రటరీ స్థానానికి పోటీలో ఉన్న పి.చంద్రశేఖర్ తన ప్రత్యర్థి సంపత్పై భారీ ఓట్లతో విజయం సాధించారు. ఉపాధ్యక్ష, కోశాధికారి, క్రీడా కార్యదర్శి మహిళాప్రతినిధి స్థానాలకు త్రివిక్రమ్, గౌతంమానె, బెస్త సుధాకర్, కె. అరుణలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గెలుపొందిన వారికి ఎన్నికల అధికారులు జి.విజయకుమార్, కె.రంగనాథ్,సి. ప్రభాకరరెడ్డి డిక్లరేషన్ పత్రాలను అందజేశారు. అధ్యక్ష, కార్యదర్శులుగా హరినాథ్, వెంకటేశ్వర్లు -
జవాబుదారీతనంతో పనిచేయండి
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లా సహ కార కేంద్రబ్యాంకును ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి జవాబుదారీతనంతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్, పర్సన్ ఇన్చార్జీ కమిటీ చైర్మన్ బి.నవ్య అన్నారు. గురువారం డీసీసీబీ బోర్డు సమావేశం, మహా జనసభలు జేసీ ఆధ్వర్యంలో జరిగాయి. రికవరీలను ముమ్మరం చేసి ఇటు సంఘాలు, అటు డీసీసీబీ బలోపేతానికి తోడ్పడాలని జేసీ పేర్కొన్నారు. కంప్యూటరీకరణలో భాగంగా 68 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ఈ–ప్యాక్స్లుగా మారాయన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరం తయారు చేసిన బడ్జెట్ ప్రతిపాదనలను జేసీ ఆమోదించారు.కర్నూలు, నంద్యాల డీసీవోలు ఎన్.రామాంజనేయు లు, వెంకటసుబ్బయ్య, డీసీసీబీ సీఈవో విజయకుమార్, జనరల్ మేనేజర్ పి.రామాంజనేయులు పాల్గొన్నారు. -
చెక్కుచెదరని ప్రజాభిమానం
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి కర్నూలు (టౌన్): ఎన్ని కుయుక్తులకు పాల్పడినా వైఎస్సార్సీపీపై ప్రజాభిమానం చెక్కుచెదరలేదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి అన్నా రు. జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యుడిగా ఏక గ్రీవంగా ఎన్నికై న మదర్థాన్ ఇలియాస్ ఖాన్, జిల్లా పరిషత్ చైర్మన్ పాపిరెడ్డి కలిసి గురువారం సాయంత్రం కర్నూలు గిప్సన్ కాలనీలో ఉన్న పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డిని కలిశారు. శాలువా కప్పి సన్మానించారు. గెలుపొందిన జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యున్ని ఎస్వీ సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్వీ మాట్లాడుతూ.. ‘కూటమి’ నేతలు ఎన్ని కు ట్రలు చేయాలని చూసినా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలిచారన్నారు. విజయంలో కీలకంగా వ్యవహరించిన పత్తికొండ మాజీ ఎ మ్మెల్యే కంగాటి శ్రీదేవి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. -
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. జిల్లా పరిషత్, మండల పరిషత్ పరిధిలో ఖాళీగా ఉన్న అన్ని స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. జెడ్పీ, కృష్ణగిరి కోఆప్షన్ సభ్యులుగా వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందారు. నిత్యం ప్రజ
● ఎదురులేని ఫ్యాన్● నాలుగు స్థానాల్లోను వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయం ● జెడ్పీ కోఆప్షన్ సభ్యునిగా ఎం. ఇలియాజ్ఖాన్ ● జెడ్పీ చైర్మన్తో పాటు 37 మంది జెడ్పీటీసీ సభ్యులు హాజరు ● వెల్దుర్తి, తుగ్గలి ఎంపీపీలుగా దేశాయి లక్ష్మిదేవమ్మ, రాచపాటి రామాంజినమ్మ ● కృష్ణగిరి కోఆప్షన్ సభ్యునిగా షేక్ చిన్న షాలు తుగ్గలిలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న నూతన ఎంపీపీ, వైఎస్సార్సీపీ నాయకులుకర్నూలు(అర్బన్): జిల్లాలోని స్థానిక సంస్థల్లో ఏర్పడిన నాలుగు ఖాళీలకు గురువారం నిర్వహించిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. జిల్లా పరిషత్, కృష్ణగిరి కోఆప్షన్ సభ్యులతో పాటు తుగ్గలి, వెల్దుర్తి ఎంపీపీ స్థానాలకు, జిల్లాలోని ఐదు గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచ్ స్థానాలకు ఎన్నికలను నిర్వహించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటలను చోటు చేసుకోకుండా, ఆయా ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తును నిర్వహించారు. జెడ్పీ, కృష్ణగిరి కోఆప్షన్ సభ్యులతో పాటు తుగ్గలి, వెల్దుర్తి మండల పరిషత్తుల్లో వైఎస్సార్సీపీకి విశేషమైన బలం ఉన్న నేపథ్యంలో అభ్యర్థులు సునాయాసంగా విజయం సాధించారు. జెడ్పీ కోఆప్షన్ సభ్యునిగా మదర్ఖాన్ ఇలియాజ్ ఖాన్ జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యునిగా శ్రీశైలం నియోజకవర్గం వెలుగోడుకు చెందిన మదర్ఖాన్ ఇలియాజ్ ఖాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయన అభ్యర్థిత్వాన్ని వెలుగోడు జెడ్పీటీసీ అమీరున్బీ ప్రతిపాదించగా, మహానంది జెడ్పీటీసీ కేవీఆఆర్ మహేశ్వరరెడ్డి బలపరిచారు. ఈ నేపథ్యంలోనే ఉదయం 10 గంటల్లోపు నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయ్యింది. జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డితో కలిపి 37 మంది జెడ్పీటీసీ సభ్యులు హాజరై ఇలాయాజ్ఖాన్కు మద్దతు ప్రకటించారు. ఇలియాజ్ఖాన్ నామినేషన్ను స్క్రూటినీ చేసిన అనంతరం వాలీడ్ నామినేషన్గా డిక్లేర్ చేసి జిల్లా కలెక్టర్ పీ రంజిత్బాషా ఎన్నికల ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించారు. జెడ్పీ కోఆప్షన్ సభ్యునిగా ఇలాయాజ్ఖాన్ను ప్రకటించి డిక్లరేషన్ ఫారం అందించి ప్రమాణ స్వీకారం కూడా చేయించారు. జెడ్పీ సీఈఓ జీ నాసరరెడ్డి, డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఏకగ్రీవంగా తుగ్గలి, వెల్దుర్తి ఎంపీపీలు తుగ్గలి మండల పరిషత్ అధ్యక్షురాలిగా మండలంలోని శభాష్పురం ఎంపీటీసీ సభ్యురాలుగా రాచపాటి రామాంజినమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలంలో మొత్తం 17 మంది ఎంపీటీసీ సభ్యులు ఉండగా, ఒకరు గైర్హాజరు కాగా మిగిలిన వారంతా రామాంజనమ్మ అభ్యర్థిత్వానికి మద్దతుగా చేతులెత్తి తమ అంగీకారాన్ని తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి, హెచ్ఎన్ఎస్ఎస్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అజయ్కుమార్ ఆమెను ఎంపీపీగా డిక్లేర్ చేసి ధ్రువీకరణ పత్రాన్ని అందించారు. అలాగే వెల్దుర్తి మండలంలో మొత్తం 17 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, టీడీపీకి చెందిన ముగ్గురు ఎంపీటీసీలు ఎంపీపీ ఎన్నికకు గైర్హాజరయ్యారు. మిగిలిన 14 మంది వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యులు ఏకగ్రీవంగా ఎల్ నగరం ఎంపీటీసీ దేశాయి లక్ష్మిదేవమ్మను ఎంపీపీగా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల అధికారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కే తులసీదేవి ఎంపీపీగా ఎన్నికై న లక్ష్మిదేవమ్మకు ధ్రువీకరణ పత్రాన్ని అందించారు. కృష్ణగిరి కోఆప్షన్ సభ్యునిగా వైఎస్సార్సీపీ మద్దతుదారుడు చిన్నషాలును సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారి, సెట్కూరు సీఈఓ డా.కే వేణుగోపాల్ ధ్రువీకరణ పత్రాన్ని అందించారు. ఐదు పంచాయతీల్లో ఉప సర్పంచుల ఎన్నిక... జిల్లాలోని ఐదు గ్రామ పంచాయతీల్లో జరిగిన ఎన్నికల్లో సభ్యులు.. ఉప సర్పంచులను ఎన్నుకున్నారు. ఓర్వకల్లు మండలం గుట్టపాడు గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్గా లక్ష్మమ్మ, ఆలూరు మండలం మొలగవెళ్లి ఉప సర్పంచ్గా గరక షాకీరా, కర్నూలు మండలం సుంకేసుల ఉప సర్పంచ్గా వడ్డే నీలమ్మ, వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లి ఉప సర్పంచ్గా ఎం రామాంజనేయులు, దేవనకొండ మండలం వెలమకూరు ఉప సర్పంచ్గా ఉప్పర సరస్వతిని ఎన్నుకున్నారు. -
భృంగివాహనంపై మల్లన్న
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో గురువారం ఉగాది మహోత్సవాలను శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈ నెల 31 వరకు ఐదు రోజుల పాటు ఉత్సవాలను అంగరంగవైభవంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని కన్నడ భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. శ్రీశైల భ్రామరి మహాలక్ష్మీ అలంకారంలో భక్తులకు దర్శనమివ్వగా, భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి భృంగివాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవ నిర్వహణలో భాగంగా దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, స్థానాచార్యులు, అర్చకస్వాములు, వేదపండితులు, అధికారులు సంప్రదాయబద్ధంగా ఆలయప్రాంగాణంలోని స్వామివార్ల యాగశాల ప్రవేశం చేశారు. లోకక్షేమాన్ని కాంక్షిస్తూ ఉత్సవ సంకల్పాన్ని పఠించారు. ఈ సందర్భంగా చండీశ్వరునికి ప్రత్యేకంగా పూజాదికాలు నిర్వహించారు, అనంతరం కంకణాలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి అధికారులు, అర్చకస్వాములు ధరించారు. రుత్వికులకు దీక్షావస్త్రాలను అందజేశారు. అమ్మవారి ఆలయంలో విశేష కుంకుమార్చనలు, నవావరణార్చన పూజలను జరిపించారు. అనంతరం ఉగాది మహోత్సవాలకు అంకురార్పణ చేశారు. మహాలక్ష్మీ అలంకారంలో భ్రామరి ఉగాది మహోత్సవాల్లో భాగంగా మొదటిరోజు శ్రీశైల భ్రమరాంబాదేవి మహాలక్ష్మీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. చతుర్బుజాలు కలిగిన దేవి పై రెండు చేతులలో పద్మాలను, కింది చేతులలో కుడివైపున అభయహస్తం, ఎడమవైపున వరముద్రతో దర్శనం ఇచ్చారు. మహాలక్ష్మీ స్వరూపాన్ని దర్శించడం వల్ల శత్రుబాధలు నివారించబడి, సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. కనుల పండువగా భృంగివాహన సేవ ఉగాది మహోత్సవాల్లో భాగంగా శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామికి భృంగివాహనసేవ నిర్వహించారు. స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను భృంగివాహనంపై ఆశీనులను చేసి అలంకార మండపంలో పూజాదికాలు నిర్వహించారు. భృంగీవాహనాధీశులైన స్వామిఅమ్మవార్లను దర్శించడం వలన పనులలో ఏకాగ్రత లభిస్తుందని, పాపాలను హరించబడుతాయని భక్తుల విశ్వాసం. అనంతరం ప్రత్యేక అలంకీకృతులైన అమ్మవారికి, వాహనాధీశులైన స్వామిఅమ్మవార్లకు గ్రామ పురవీధుల గుండా గ్రామోత్సవం నిర్వహించారు. శ్రీశైలంలో నేడు ఉత్సవాల్లో రెండవ రోజు శుక్రవారం భ్రమరాంబాదేవికి మహాదుర్గ అలంకారం, భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామివారికి కైలాసవాహనసేవ నిర్వహించనున్నారు. గ్రామోత్సవం నిర్వహిస్తారు.శాస్త్రోక్తంగా ప్రారంభమైన ఉగాది మహోత్సవాలు ఐదు రోజుల పాటు నిర్వహణ మహాలక్ష్మీ అలంకారంలో శ్రీశైల భ్రామరి శ్రీగిరి క్షేత్రానికి పోటెత్తిన కన్నడ భక్తులు -
కోర్టును తనిఖీ చేసిన జిల్లా జడ్జి
పత్తికొండ రూరల్: పత్తికొండలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టును గురువారం జిల్లా జడ్జి కబర్ధి తనిఖీ చేశారు. రెవెన్యూ డివిజన్ కేంద్రమైన పత్తికొండలో సబ్కోర్టు ఏర్పాటు ప్రతిపాదనల నేపథ్యంలో భవనం, స్థలం తదితర వివరాలను న్యాయవాదులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక సబ్జైలుకు వెళ్లి అక్కడ ఖైదీలకు అందుతున్న సౌకర్యాలను సూపరింటెండెంట్తో అడిగి తెలుసుకున్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు రంగస్వామి, సీనియర్ న్యాయవాదులు సురేష్, రమణ, కృష్ణ, రవిప్రకాశ్ పాల్గొన్నారు. విద్యాశాఖ ఉద్యోగుల అవస్థలు ● మూడు రోజులుగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కర్నూలు(సిటీ): జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో గత మూడు రోజులుగా కరెంటు లేకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. షార్ట్ సర్క్యూట్తో విద్యుత్ తీగలు కాలిపోవడం, తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టినా ఫలితం లేకపోవడంతో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలుగుతోంది. గురువారం పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఉద్యోగులు అవస్థలు పడుతూ డిప్యూటీ డీఈఓ ఆఫీస్లో కూర్చొని పని చేసుకున్నారు. అయితే ఆఫీసులో విద్యుత్ సరఫరా లేకపోవడంతో కంప్యూటర్లు పనిచేయక పూర్తిస్థాయిలో పనిచేయలేని పరిస్థితి నెలకొంది. -
బహిష్కరణ ఉత్తర్వులు నిలుపుదల
కర్నూలు(అగ్రికల్చర్): ఏపీ ఎన్జీవో అసోషియేషన్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ నుంచి నలుగురు కార్యవర్గసభ్యులను బహిష్కరిస్తూ జిల్లా అధ్యక్షుడు వీసీహెచ్ వెంగళ్రెడ్డి జారీ చేసిన ఉత్తర్వులను రాష్ట్ర నాయకత్వం నిలుపుదల చేసింది. సంఘం వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారనే కారణంతో ఇటీవల జిల్లా ప్రధాన కార్యదర్శి జవహర్లాల్, ఉపాధ్యక్షులు సాంబశివారెడ్డి, రమణ, కోశాధికారి బాస్కరనాయుడులను ముందుగా సస్పెండ్ చేశారు. ఆ తర్వాత సంఘం నుంచి బహిష్కరించారు. దీనిపై నలుగురు నేతలు రాష్ట్ర నాయకత్వాన్ని ఆశ్రయించారు. జిల్లాలో జరుగుతున్న పరిణామాలను వివరించారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు శివారెడ్డి, విద్యాసాగర్లను తాము ఆదేశాలు ఇచ్చేంత వరకు తాలూకా ఎన్నికలు నిర్వహించవద్దని జిల్లా నాయకత్వాన్ని ఆదేశించారు. దీంతో మొదటిసారిగా జిల్లా అధ్యక్షుడు వీసీహెచ్ వెంగళ్రెడ్డికి ఎదురు దెబ్బతగిలినట్లు అయింది. తాజా నలుగురిపై సస్పెన్షన్, బహిష్కరణ ఉత్వర్వులను కూడా నిలుపుదల చేయడం గమనార్హం. ● జిల్లా అధ్యక్షునిగా సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న వెంగళ్రెడ్డి త్వరలో పదవీ విరమణ చేయనున్నారు. తన వారసుడిని కూడా ఏకపక్షంగా సిద్ధం చేశారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై అసోసియేషన్లో విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. బైక్ దగ్ధం సి.బెళగల్: మండల కేంద్రం సి.బెళగల్ శివారులో గురువారం షార్ట్ సర్క్యూట్తో ఓ బైక్ దగ్ధమైంది. ఇనగండ్ల గ్రామానికి చెందిన మద్దిలేటి తన హోండా షైన్ బైక్పై సి.బెళగల్కు వస్తుండగా మార్గమధ్యలో హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో సాంకేతిక సమస్యతో నిలిచి పోయింది. పరిశీలిస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోవడంతో బైక్ పూర్తిగా కాలి పోయింది. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని తెలుస్తోంది. హిజ్రాల రాళ్ల దాడి బొమ్మలసత్రం: పట్టణంలోని టూటౌన్, తాలుకా పోలీస్స్టేషన్ల మధ్య రెండు వర్గాలకు చెందిన హిజ్రాలు రాళ్లు, కారం పొడితో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. రానున్న పండుగల నేపథ్యంలో పట్టణానికి చెందిన హిజ్రాలు దుకాణాల యజమానుల వద్ద పండుగ మామూళ్లు వసూలు చేస్తున్నారు. ఈక్రమంలో మరో వర్గం ఎదురు కావడంతో ఒకరికొకరు దాడులు చేసుకుని ఒక గుంపు తాలుకా స్టేషన్ వద్దకు.. మరో గుంపు టూటౌన్ వద్దకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. రెండు పోలీస్టేషన్లు పక్కపక్కనే ఉండడంతో రెండు వర్గాలు మరోసారి దాడి చేసుకున్నాయి. రాళ్లు, కారంపొడి పొట్లాలు ఒకరిపై మరొకరు విసిరి దాడికి పాల్పడ్డారు. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. పోలీసులను సైతం లెక్క చేయకుండా జనావాసాల మధ్య రాళ్లు విసురుకోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిజ్రాలను పోలీసులు క్రమశిక్షణలో ఉంచకపోతే సామాన్యులను రోడ్లపైకి రానివ్వరేమోనని ఆందోళన చెందుతున్నారు. -
ఈ–శ్రమ్తో సామాజిక భద్రత
కర్నూలు(అర్బన్): అసంఘటి త రంగాల్లోని, వలస కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ–శ్రమ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. జిల్లాలో ఈ–శ్రమ్ నమోదు లక్ష్యం 14,07,281 కాగా, ఈ నెల 25వ తేది వరకు 6,39,247 మంది నమోదు చేసుకున్నారు. నమోదుకు ఈ నెలాఖరు వరకు సమ యం ఉన్నట్లు కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ కె.వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ –శ్రమ్ నమోదుతో కార్మికులు దురదృష్టవశాత్తూ మృతి చెందినా, అంగవైకల్యం ఏర్పడినా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతుందన్నారు. ఎవరు అర్హులంటే ... ● 16 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు వారై ఉండాలి. ● అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు, ఈపీఎఫ్ సభ్యత్వం లేని వారు, ఆదాయ పన్ను పరిధిలోకి రాని వారు. ● ఉపాధిహామీ కూలీలు, మత్స్యకారులు, భవన నిర్మాణ, పారిశుద్ధ్య కార్మికులు, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు, స్వయం సహాయక సంఘాల్లోని మహిళ లు, మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు, వ్యవ సాయ, ఉద్యాన, పాడి పరిశ్రమ కూలీలు, కుమ్మరి, స్వర్ణకారులు, ఇతర చేతివృత్తుల వారు, వాహన చోద కులు, వీధి వ్యాపారులు, సేవా రంగంలో ఉన్న వారు. ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే.. ● ప్రమాదవశాత్తూ మృతి చెందినా, శాశ్వత అంగవైకల్యానికి గురైనా రూ.2 లక్షలు, పాక్షికంగా గాయపడితే రూ.లక్ష ఆర్థిక సహాయం అందుతుంది. ● వలస కార్మికులకు రాష్ట్రంలో లేదా వారి సొంత ప్రాంతంలో ఎక్కడా రేషన్కార్డు లేకుంటే పౌర సరఫరాల శాఖ ద్వారా మంజూరు చేసే నిత్యావసర సరుకులు అందజేస్తారు. ● ప్రభుత్వ వృత్తి నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు పొందవచ్చు. ఇలా నమోదు చేసుకోవాలి ... ఈ–శ్రమ్ నమోదుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. సమీపంలోని గ్రామ/వార్డు సచివాలయాలు, కామన్ సర్వీస్ సెంటర్లు లేదా కార్మిక శాఖ కార్యాలయాల్లో సంప్రదిస్తే ఆన్లైన్ పద్ధతిలో నమోదు చేస్తారు. నామినీ ఆధార్ వివరాలను అందజేయాల్సి ఉంటుంది. నమోదు పూర్తయిన అనంతరం యూఏఎన్ గుర్తింపు కార్డు జారీ అవుతుంది. నమోదుకు ఈ నెలాఖరు వరకు అవకాశం -
గొర్రెల మందపైకి దూసుకెళ్లిన లారీ
పాణ్యం: బపలనూరు మెట్ట వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 20 గొర్రెలు మృతి చెందగా, మూడు వాహనాలు దెబ్బతిన్నాయి. పిన్నాపురం గ్రామానికి చెందిన గని వెంకటసుబ్బయ్య, ఓరుగంటి సుధాకర్, ఒరుగంటి వెంకటకృష్ణ, మిద్దె రమణయ్య, మూగ ధనికొండకు చెందిన జీవాలను మేత కోసం తీసుకెళ్తూ బపలనూరు మెట్ట గురువారం తెల్లవారుజామున రోడ్డు దాటిస్తున్నారు. వేగంగా వస్తున్న లారీ గమనించి బ్రేకులు వేసేలోపే లారీ కింద పడి అకక్కడిక్కడే 20 గొర్రెలు మృతి చెందాయి. కాగా ఈ ప్రమాదంలో రహదారిపై లారీ నిలిచిపోయింది. అదే సమయంలో కర్నూలు వైపు నుంచి తిరుపతికి వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు లారీ ఢీకొని నిలిచిపోయింది. వెనుక వస్తున్న మరో లారీ బస్సును ఢీకొంది. కాగా బస్సులో ప్రయాణికులకు గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు లారీ, బస్సును స్టేషన్కు తరలించారు. 20 గొర్రెలు మృతి నిలిచిన లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు బస్సును ఢీకొన్న మరో లారీ -
అన్న చెప్పాడు. తవ్వేద్దాం
మహానంది: ‘మట్టిని తరలించి సొమ్ము చేసుకుందాం, ఇప్పుడే నాలుగు డబ్బులు సంపాదించుకోకపోతే మళ్లీ ఎప్పుడు చెప్పు.. కాదు, కూడదని ఎవడైనా అడ్డొస్తే బండి (టిప్పర్)తో తొక్కిస్తా. అందరూ తలా ఇంతా సంపాదించుకుందాం.. నీకు అర్ధ రూపాయా, నాకు అర్ధ రూపాయి, పై వాళ్లకు ఇంత ఇద్దాం’ మట్టి తవ్వకాలపై ఇద్దరు టీడీపీ నేతలు ఫోన్లో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయం చివరకు టీడీపీ అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు తెలిసింది. ‘తలా ఓ రూపాయి తీసుకుందాం’ అంటూ ఫోన్లో ఏకంగా నియోజకవర్గ నేతల పేర్లతో సహా చర్చించుకోవడం విశేషం. మహానంది మండలం గోపవరం గ్రామంలో బైరవాణి చెరువు ఉంది. ఇటీవల ఈ చెరువు నుంచి పొలాలు, ప్లాట్లకు తరలించే మట్టితో పాటు ఇటుకలకు వినియోగించే ఎర్రమట్టి ఎక్కువగా ఉంది. అధికారంలో ఉన్నాం.. మనల్ని అడిగేదెవరూ అను కుని ఇటీవల కొద్దిరోజుల క్రితం మట్టి తరలింపుకు కూటమి నేతలు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులతో పాటు వైఎస్సార్సీపీ నేతలు అడ్డుకోవడంతో మట్టి తరలింపు ఆగిపోయింది. అయితే ఇదే చెరువులోని మట్టి తరలింపుపై గ్రామంలోని రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుండటంతో ఒకరిపై ఒకరు వాదోపవాదాలు చేసుకున్నారు. పార్టీలోని రెండు వర్గాలకు చెందిన ఇద్దరు నాయకులు క్రాంతికుమార్ యాదవ్, శ్రీనివాసులు ఫోన్లో మాట్లాడుకున్న సంభాషణ బయటికి రావడంతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వారి మాటల్లో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, నియోజకవర్గ నేత బన్నూరు రామలింగారెడ్డిల పేర్లు సైతం రావడంతో ఆ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అందరం తలా ఇంత పంచుకుందాం టైం ఉన్నప్పుడే నాలుగు డబ్బులు సంపాదించుకుందాం పది బండ్లు పెట్టుకుని కూర్చుందాం ఎవరైనా ఆపితే టిప్పర్తోనే కొడతా! మట్టి తవ్వకాలపై టీడీపీ నేతల ఫోన్ సంభాషణ వైరల్ -
మెరవని పచ్చ బంగారం
కొలిమిగుండ్ల: ఆరుగాలం కష్టపడి పసుపు సాగు చేసిన రైతులు ఈ ఏడాది నష్టాలు మూటగట్టుకుంటున్నారు. ఎన్నో ఆశలతో పండించిన పంటకు రోజురోజుకు మార్కెట్లో ధర పడిపోతుండటంతో ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి అన్నదాతకు ఏమాత్రం సహాయ సహకారాలు అందడం లేదు. జిల్లాలో కొలిమిగుండ్ల మండలంలోని తిమ్మనాయినపేట, ఆళ్లగడ్డ, చాగలమర్రి, శిరివెళ్ల, రుద్రవరం, ఆళ్లగడ్డ, పాములపాడు తదితర మండలాల్లో 590 హెక్టార్లలో పసుపు సాగు చేశారు. నామమాత్రంగా వర్షాలు కురిసినప్పటికీ బోర్ల కింద రైతులు పంట వేసేందుకు ముందుకొచ్చారు. పంట వేసిన కొద్ది రోజులకే దుంప తెగులు ఆశించి పంట బాగా దెబ్బతిని దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. పసుపు సాగుకు కనీసం తొమ్మిది నెలల సమయం పడుతుంది. పైగా పెట్టుబడి సైతం ఎక్కువగా ఉంటుంది. ఎకరా సాగుకు విత్తనం, కలుపుతీత, కూలీలు, రసాయన ఎరువులు, పసుపు కొమ్ముల తవ్వకానికి, ఉడకబెట్టేందుకు దాదాపు రూ.1.50 లక్షలకు పైగానే ఖర్చు వస్తోంది. సాధారణంగా ఎకరాకు 30 నుంచి 30 క్వింటాళ్లు రావాల్సి ఉండగా దుంప తెగులు ఆశించడంతో దిగుబడి 25 క్వింటాళ్లలోపే వచ్చింది. నిరాశపర్చుతున్న ధరలు ఏడాదిలో తొమ్మిది నెలలు రేయింబవళ్లు కష్టపడి పంట పండించిన పంట దిగుబడి చేతికొచ్చే సరికి ధరలు పూర్తిగా తక్కువగా ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పసుసు మార్కెట్లో క్వింటా ధర రూ.9 నుంచి 10 వేల మాత్రమే ధర పలుకుతుంది. ఈ పరిస్థితుల్లో కష్టానికి నష్టాలే మిగులుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గరిష్టంగా 10 వేలు ఉండటంతో మార్కెట్లో గ్రేడింగ్ పేరుతో క్వింటాకు రూ. 8 వేలు దక్కడం కష్టమంటున్నారు. ఈపరిస్థితిల్లో పెట్టుబడి అయినా చేతికందుతుందా లేదోనని ఆందోళన చెందుతున్నారు. క్వింటాకు కనీసం రూ.15వేలు ధర ఉంటే కష్టానికి తగ్గఫలితం లభిస్తుందన్నారు. జిల్లాలో 590 హెక్టార్లలో పసుపు సాగు దుంప తెగులుతో తగ్గిన దిగుబడులు మార్కెట్లో ధర పతనంతో రైతుల ఆందోళన -
ఇరిగేషన్, విజిలెన్స్ అధికారులపై తేనెటీగల దాడి
వెల్దుర్తి: విధి నిర్వహణలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న మైనర్ ఇరిగేషన్, విజిలెన్స్ అధికారులపై తేనెటీగలు దాడి చేశాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎల్ తండా గ్రామ పరిధిలో అదే గ్రామానికి చెందిన రాజు చెక్డ్యామ్లు నిర్మించాడు. మూడు చెక్డ్యామ్ల నిర్మాణం, నాణ్యతలో తేడాలున్నాయని, నిధులు కాజేశారని అందిన ఫిర్యాదుల మేరకు గురువారం విజిలెన్స్ జేఈలు ఆనంద్బాబు, శ్రీనివాసరావు ఇరిగేషన్ జేఈ రవినాయక్, క్వాలిటీ కంట్రోల్ జేఈలు కృష్ణప్రియ, మనోజ్, నారాయణ కలిసి క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లారు. రెండు చెక్డ్యామ్ల పరిశీలన అనంతరం మూడవ చెక్డ్యామ్ పరిశీలన సందర్భంగా వీరందరిపై చెట్లపొదల్లోని పెద్ద తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. కృష్ణప్రియ ముఖంపై తేనెటీగలు తీవ్రంగా దాడి చేయగా, మనోజ్, ఆనంద్బాబను ఓ మోస్తారుగా, రవినాయక్, నారాయణ, శ్రీనివాసరావును స్వల్పంగా గాయపరిచాయి. సమాచారం అందుకున్న ఇరిగేషన్ ఏఈలు రియాజ్, నాగరాజు హుటాహుటిన సంఘటనాస్థలికి చేరుకుని వారిని వెల్దుర్తి సీహెచ్సీకి తరలించారు. ప్రథమ చికిత్సానంతరం అక్కడి నుంచి కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిని విజిలెన్స్ జిల్లా ఎస్పీ చౌడేశ్వరరావు, ఇరిగేషన్ ఎస్ఈ ద్వారాకానథ్ రెడ్డిలు పరామర్శించారు. కృష్ణప్రియను వైద్యులు 24 గంటలపాటు అబ్జర్వేషన్లో ఉంచి మిగితా వారిని చికిత్సానంతరం డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు తెలిపారు. చెక్డ్యామ్లు తనిఖీ చేస్తుండగా ఘటన ఇరిగేషన్ క్వాలిటీ కంట్రోల్ జేఈ పరిస్థితి విషమం మరో నలుగురికి స్వల్ప గాయాలు -
దాహం తెచ్చిన తిప్పలు
ఎరక్కపోయి వచ్చి ఓ శునకం ఇరుక్కుపోయింది. మండు వేసవిలో మూగ జీవాల నీటి కష్టాలు అన్నీ ఇన్నీకావు. ఇందుకు నిదర్శనం ఈ కుక్క కష్టమే. నంచర్ల సమీప పొలంలో గురువారం గొర్రెల కాపరులు బిందెలో నీటిని తెచ్చుకుని తాగారు. కొంచెం నీరు మిగలడంతో ఒక చోట ఉంచారు. అటుగా వచ్చిన ఒక కుక్క దాహం తీర్చుకోవడానికి బిందెలో తల దూర్చడంతో ఇరుక్కుపోయి విలవిలాడింది. భయంతో బిందెతోనే పరుగులు తీసి రహదారిపైకి చేరుకుంది. కొందరు వాహనదారులు గమనించి చాలా కష్ట పడి చివరకు బిందెను తొలగించడంతో ఊపిరిపీల్చుకుంది. – చిప్పగిరి -
రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలం
కర్నూలు(సెంట్రల్): రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఏపీ రైతుసంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పి.రామచంద్రయ్య, రాష్ట్ర కార్యదర్శి కె.జగన్నాథం విమర్శించారు. బుధవారం సీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన ఏపీ రైతుసంఘం జిల్లా కార్యవర్గ సమావేవంలో వారు మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు ఏటా రూ.20 వేలు ఇస్తామని మోసం చేశాయన్నారు. అన్నదాతలు పంటలు పండక అప్పులు పాలయ్యారని, అయినా బీమాను వర్తింపజేయడంలేదన్నారు. డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫారసుల మేరకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 4న కర్నూలులో నిర్వహించనున్న జాతీయ రైతు సదస్సును జయప్రదం చేయాలని, అందులో రైతుల సమస్యలపై కూలంకషంగా చర్చించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్సీపీ మాజీ కౌన్సిలర్ మృతి
ప్యాపిలి: మండల పరిధిలోని మెట్టుపల్లి గ్రామ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో డోన్కు చెందిన వైఎస్సార్సీపీ మాజీ కౌన్సిలర్ మంగమూరి గోపాల్ (37) మృతి చెందాడు. డోన్ త్రివర్ణ కాలనీలో నివాసం ఉంటున్న మంగమూరి గోపాల్ మెట్టుపల్లి గ్రామంలో జరిగిన దేవరకు హాజరయ్యాడు. అనంతరం ద్విచక్రవాహనంపై డోన్కు తిరుగు ప్రయాణమయ్యాడు. మెట్టుపల్లి శివారు ప్రాంతంలోని సుంకులమ్మ గుడి వద్ద గేదెను తప్పించే క్రమంలో అదుపు తప్పి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య సుధారాణి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్యాపిలి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. మాజీ మంత్రి సంతాపం వైఎస్సార్సీపీ మాజీ కౌన్సిలర్ మంగమూరి గోపాల్ మృతి పట్ల మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయనతో పాటు మీట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీరాములు, ఎంపీపీ రేగడి రాజశేఖర్ రెడ్డి, జెడ్పీటీసీ బద్దల రాజ్కుమార్, మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేశ్, వైస్ చైర్మన్ జాకీర్ హుసేన్, వలంటీర్ పార్టీ విభాగం అధ్యక్షులు పోస్టు ప్రసాద్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. -
దొంగలకు బామ్మ ఝలక్!
● ఊరెళుతూ నగలన్నీ వెంట తీసుకెళ్లిన వృద్ధురాలు ● ఇంట్లో చోరీకి యత్నించి విఫలమైన దుండగులు పత్తికొండ రూరల్: పట్టణంలోని రెండు ఇళ్లలో దొంగలు చోరీకి యత్నించారు. ఓ ఇంట్లోని బామ్మ తన ఇంట్లోని నగలు ఏమీ ఉంచకపోవడం.. మరో ఇంట్లో కూడా రూపాయి కూడా లభ్యం కాకపోవడంతో దొంగలు చిర్రెత్తి బీరువాలోని వస్తువులను చిందరవందరగా పడేసి ఉడాయించారు. బాధితులు తెలిపిన వివరాలు.. స్థానిక షిరిడీసాయి స్కూల్ సమీపంలో హేమకాంతరెడ్డి ఇల్లు ఉంది. ఇతను వ్యాపార రీత్యా బెంగళూరులో ఉండటంతో వృద్ధురాలైన అతని తల్లి లక్ష్మిదేవి ఒక్కరే ఇంటి వద్ద ఉంటోంది. ఆమె కూడా మంగళవారం గుత్తిలోని బంధువుల ఇంటికి వెళ్తూవెళ్తూ ఇంట్లోని విలువైన ఆభరణాలు, నగదును ఒక సంచిలో వేసుకుని వెంట తీసుకెళ్లింది. ఇంటికి తాళం వేసి ఉండటంతో దొంగలు అర్ధరాత్రి లోపలకు చొరబడ్డారు. ఉడెన్ లాకర్లు, అల్మారా లాక్లు పెకిలించి చూసినా చిల్లిగవ్వ దొరకలేదు. చిర్రెత్తి చీరలు, వస్తుసామగ్రిని చిందరవందరగా పడేశారు. ఇత్తడి పూతతో ఉన్న వడ్డాణం, ఇతర ఆభరణాలపై గీసి మరీ పరీక్షించి అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. బుధవారం ఉదయం ఇంటికొచ్చిన వృద్ధురాలికి తాళాలు పగులగొట్టి ఉండటం కనిపించింది. ఇంట్లో ఏమీ చోరీ కాకపోవడంతో వృద్ధురాలిని కుటుంబ సభ్యులు అభినందించారు. ఇదే ఇంటి సమీపంలోని చెరువు పెద్దయ్య ఇంట్లోనూ చోరీకి యత్నించి దొంగలు విఫలమయ్యారు. కాగా సుమారు ఐదుగురు వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు సీసీ కెమెరాలో రికార్డు అయినట్లు బాధిత కుటుంబీకులు తెలిపారు. పోలీసులు క్లూస్టీంతో విచారణ చేపట్టారు. -
వలస కూలీల ఇంట్లో భారీ చోరీ
● 60 తులాల వెండి, 2 తులాల బంగారం నగలు అపహరణ కోసిగి: పిల్లలతో కలిసి గుంటూరుకు వలస వెళ్లిన దళితుల ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఈ విషయం బుధ వారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 60 తులాల వెండి, 2 తులాల బంగారం నగలు అపహరణ చేశారని బాధితులు తెలిపారు. కోసిగి మండలం కందుకూరు గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన కమలమ్మ, ఆనంద్ దంపతులు ఇంటికి తాళాలు వేసి పిల్లలతో కలిసి జనవరి 19న గుంటూరుకు వలస వెళ్లారు. ప్ర భుత్వం ఎస్సీలకు సబ్సిడీపై సోలార్ విద్యుత్ ప్రాజెక్టు ఇస్తుండటంతో కరెంట్ బిల్లు ఇవ్వాలని తమ్ముడికి ఆనంద్ ఈనెల 16న ఫోన్ చేసి చెప్పారు. ఇంటి వద్దకు వెళ్లి చూడగా చోరీ జరిగినట్లు తేలింది. విషయం తెలిసిన వెంటనే బాధితులు గుంటూరు నుంచి కందుకూరు గ్రామానికి వవచ్చారు. బీరువా పగులగొట్టి అందులో ఉన్న 60 తులాలు వెండి, 2 తులాల బంగారు నగలు, గత ప్రభుత్వం విద్యార్థినికి ఇచ్చిన ట్యాబ్, పొలం పత్రాలు అపహరించుకెళ్లినట్లు బాధితులు వాపోయారు. పోలీసులకు సమాచారం ఇచ్చామని, అనుమానితుల పేర్లు సైతం ఇచ్చామని తెలిపారు. -
ఫ్యాప్టో జిల్లా నూతన కార్యవర్గం
● జిల్లా చైర్మన్గా సేవలాల్ నాయక్ కర్నూలు సిటీ: ఫ్యాప్టో (ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య) జిల్లా నూతన కార్యవర్గాన్ని (2025–27 సంవత్సరాలకు) బుధవారం ఎన్నుకున్నారు. కర్నూలులోని సలాంఖాన్ భవనంలో ఫ్యాఫ్టో అనుబంధ సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఫ్యాప్టో జిల్లా నూతన కమిటీ చైర్మన్గా అప్టా(ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్)జిల్లా ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న సేవలాల్ నాయక్ ను ఎన్నుకున్నారు. అలాగే సెక్రటరీ జనరల్గా జి.భాస్కర్ (బి.టీ.ఏ), కో చైర్మన్లుగా వై.నారాయణ(ఏపీ ప్రధానోపాధ్యాయుల సంఘం), వి.జి వెంకట్రాములు(డిటీఎఫ్), ఎల్.గులాబీ బాషా(రూట), రాజేష్(ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం), డిప్యూటీ సెక్రటరీ జనరల్గా యు.రవికుమార్ (యూటీఎఫ్), టి.కె జనార్దన్(ఎస్టీయూ), ఎస్.ఇస్మాయిల్ (ఏపీటీఎఫ్1938), కోశాధికారిగా ఎన్.రంగన్న(ఏపీటీఎఫ్ 257)ఎన్నికయ్యారు. ఎన్నిక కార్యక్రమానికి రాష్ట్ర పరిశీలకులుగా, రాష్ట్ర ఫ్యాఫ్టో కో–చైర్మన్ కాకి ప్రకాష్ రావు వ్యవహరించారు. ఆయా సంఘాల నాయకులు నవీన్ పాటిల్, ఎస్.గోకారి, మరియానందం, తిమ్మప్ప, మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. -
‘స్థానిక’ ఖాళీలకు నేడు ఎన్నికలు!
● ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఖాళీగా నాలుగు స్థానాలు ● వెల్దుర్తి, తుగ్గలి ఎంపీపీలతో పాటు జెడ్పీ, కృష్ణగిరి కోఆప్షన్కు ఓటింగ్ ● నాలుగు స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం నల్లేరుపై నడకే ● ఉదయం 10 గంటల్లోపు జెడ్పీ కోఆప్షన్ సభ్యుని నామినేషన్ కర్నూలు(అర్బన్): జిల్లాలోని స్థానిక సంస్థల్లో (జెడ్పీ, మండల పరిషత్, గ్రామ పంచాయతీ) ఖాళీగా ఉన్న స్థానాలకు గురువారం ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ సులేమాన్, కృష్ణగిరి మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు షేక్ షాలీసాహెబ్ మరణించగా, వెల్దుర్తి ఎంపీపీ బి.సరళ, తుగ్గలి ఎంపీపీ ఆదెమ్మ తమ పదవులకు 2024 మార్చి 29న రాజీనామా చేశారు. ఈ నాలుగు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా అధికారులు చర్యలు తీసుకుంది. జెడ్పీ కోఆప్షన్ సభ్యుని ఎన్నికకు కలెక్టర్ ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించనున్నారు. నేటి ఉదయం 10 గంటల్లోపు నామినేషన్లను దాఖాలు చేయాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్ల పరిశీలన, తదుపరి బరిలో ఉన్న జాబితాను ప్రచురిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు జెడ్పీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి కోఆప్షన్ సభ్యున్ని ఎన్నుకుంటారు. జెడ్పీలో మొత్తం చైర్మన్తో కలిపి 53 మంది సభ్యులు ఉండగా, ఇద్దరు సభ్యులు మృతి చెదడం, ఒకరు తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ప్రస్తుతం 50 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో నేడు జరగనున్న ఎన్నికకు 50 శాతం కోరం ఉంటే (25 మంది సభ్యులు హాజరైతే) సమావేశంలో కోఆప్షన్ సభ్యు న్ని ఎన్నుకుంటారు. ఒకవేళ కోరం లేకపోతే మరుసటి రోజుకు ఎన్నిక వాయిదా పడ నుంది. కృష్ణగిరి మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుని ఎన్నిక కూడా ఇదే ప్రకారం నిర్వహించనున్నారు. ఎంపీపీల ఎన్నిక ఇలా.. తుగ్గలి, వెల్దుర్తి మండల పరిషత్ల్లో ఎంపీపీలను ఎన్నుకునేందుకు ముందుగా ఆయా మండలాల్లో ఎంపీటీసీ సభ్యులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి చేతులు ఎత్తే పద్ధతిలో ఎంపీపీలను ఎన్నుకుంటారు. ఎన్నిక పూర్తయిన అనంతరం సంబంధిత ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికలకు సంబంధించిన అంశాలన్నింటిని రికార్డు చేస్తారు. కృష్ణగిరికి సెల్కూరు సీఈఓ డా.కే వేణుగోపాల్, వెల్దుర్తికి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కే తులసీదేవి, తుగ్గలికి హెచ్ఎన్ఎస్ఎస్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అజయ్కుమార్ ప్రిసైడింగ్ అధికారులుగా వ్యవహరించనున్నారు. ఐదు ఉప సర్పంచు స్థానాలకు కూడా .. జిల్లాలోని దేవనకొండ మండలం వెలమకూరు, ఓర్వకల్లు మండలం గుట్టపాడు, ఆలూరు మండలం మొలగవెళ్లి, కర్నూలు మండలం సుంకేసుల, వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీల్లో కూడా ఉప సర్పంచు స్థానాలకు ఎన్నికలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి జీ భాస్కర్ తెలిపారు. ఆయా గ్రామ పంచాయతీల్లో ఈ ఎన్నికలను నిబంధనల మేరకు నిర్వహించేందుకు ఈఓఆర్డీలకు బాధ్యతలు అప్పగించామన్నారు. అన్ని ప్రాంతాల్లో కూడా వీడియోగ్రఫీ తీయించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ఎక్కడా ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ భద్రత కల్పించాలని జిల్లా ఎస్పీని కోరామన్నారు. ఉదయం 9 గంటల నుంచి ఎన్నికల ప్రకియ ప్రారంభమవుతుందన్నారు. మెజార్టీ సభ్యులు వైఎస్సార్సీపీ వైపే.. ఎన్నికలు జరగనున్న నాలుగు స్థానాల్లోను వైఎస్సార్సీపీకి చెందిన అభ్యర్థులు సునాయాసంగా విజయం సాధించనున్నారు. జిల్లా పరిషత్లో ప్రస్తుతం ఉన్న 50 మంది జెడ్పీటీసీ సభ్యులు వైఎస్సార్సీపీకి చెందిన వారే కావడంతో కోఆప్షన్ సభ్యుని ఎన్నిక లాంఛనమే. అలాగే కృష్ణగిరి మండల పరిషత్లో మొత్తం 13 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, ఒకరు మృతి చెందడంతో మిగిలిన 12 స్థానాల్లో ఒకటి టీడీపీ, మిగిలిన 11 స్థానాల్లోను వైఎస్సార్సీపీ ఎంపీటీసీలే ఉన్నారు. తుగ్గలిలో 17 మంది ఎంపీటీసీలు వైఎస్సార్సీపీకి చెందిన వారే ఉన్నారు. వెల్దుర్తిలో ఎంపీటీసీలు17 మంది ఉండగా, ముగ్గురు టీడీపీ, మిగిలిన 14 మంది ఎంపీటీసీలు వైఎస్సార్సీపీకి చెందిన వారే. ఈ నేపథ్యంలోనే ఎన్నికలు జరగనున్న నాలుగు స్థానాల్లో కూడా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎంపిక నల్లేరుపై నడకే అనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. -
సెల్ఫోన్ చూడొద్దని తండ్రి మందలింపు..
కుమారుడి ఆత్మహత్య! కర్నూలు: పనికి వెళ్లకుండా నిత్యం సెల్ఫోన్లో కాలక్షేపం చేస్తున్న కుమారుడిని తండ్రి మందలించడంతో మనస్థాపం చెంది ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కర్నూలులో బుధవారం చోటు చేసుకుంది. వివరాలివీ.. కల్లూరు మండలం చౌడేశ్వరి వీధిలో నివాసముంటున్న కమ్మరి కృష్ణమోహనాచారి, వసంత దంపతులకు కుమారుడు, కూతురు సంతానం. కృష్ణమోహనాచారి వడ్రంగి పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. భార్య కూలీ పనులకు వెళ్లేది. కుమారుడు యశ్వంతాచారి(21) 8వ తరగతిలోనే చదువు మానేసి వడ్రంగి పనులు నేర్చుకునేవాడు. కొంతకాలంగా ఎప్పుడూ సెల్ఫోన్ చూస్తూ పనులకు పోకుండా ఉండటంతో మంగళవారం ఉదయం తండ్రి మందలించాడు. దీంతో కుమారుడు కోపంతో సెల్ఫోన్ను నేలకేసి పగులకొట్టి పనికి పోకుండా ఇంట్లోనే పడుకున్నాడు. బుధవారం ఉదయం తల్లిదండ్రులు పనికి వెళ్లిన తర్వాత యశ్వంతాచారి ఇంటి హాల్లోని సీలింగ్ ఫ్యాన్కు చీరతో ఉరేసుకున్నాడు. తల్లి వసంత ఇంటికి వచ్చి చూడగా ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. ఇరుగుపొరుగు వారి సాయంతో అతన్ని కిందకు దించి ఆటోలో చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. క్షణికావేశంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని, కేసు కూడా అవసరం లేదని తల్లిదండ్రులు పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. -
పోలీసులకు గ‘మ్మత్తు’ సమచారం
కర్నూలు: కర్నూలు–నంద్యాల జాతీయ రహదారిలోని కాల్వబుగ్గ, సోమయాజులపల్లె మధ్య తన ఆటోను దోపిడీ దొంగలు తీసుకెళ్లారని పోలీస్ కమాండ్ కంట్రోల్కు ఒక వ్యక్తి ఫోన్కాల్ చేసి సమాచారం ఇచ్చాడు. దీంతో జిల్లా పోలీసులు అప్రమత్తమై ఘటనా ప్రాంతానికెళ్లి చూడగా తప్పుడు సమాచారంగా తేలింది. ఊపిరి పీల్చుకున్న పోలీసులు.. తప్పుడు సమాచారం ఇచ్చిన ఆటోవాలాను మందలించి పంపారు. పోలీసుల విచారణలో తేలిన వివరాలు ఇలా.. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఆటోడ్రైవర్ మనోజ్ జమ్మలమడుగులో వివాహం చేసుకున్నాడు. భార్య గొడవ పడి పుట్టింటికి వెళ్లడంతో ఆమెను తీసుకురావడానికని వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో నంద్యాల నుంచి 11 గంటలకు కర్నూలుకు బయలుదేరాడు. ఓర్వకల్లు పోలీస్స్టేషన్ పరిధిలోని కాల్వబుగ్గ వద్ద ఆటో లోయలో పడి డ్రైవర్ మనోజ్ గాయాలకు గురయ్యాడు. మద్యం మత్తులో ఉన్న అతను తన ఆటోను దోపిడీ దొంగలు ఎత్తుకెళ్లారని పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించడంతో అది కమాండ్ కంట్రోల్కు చేరింది. దీంతో కర్నూలు డీఎస్పీ బాబుప్రసాద్ చెక్పోస్టు, కర్నూలు సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులను అప్రమత్తం చేసి తనిఖీ నిర్వహించారు. అర్ధరాత్రి ఓర్వకల్లు పోలీస్స్టేషన్ చేరుకుని కాల్వబుగ్గ దగ్గరకు వెళ్లి ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించగా ఆటో లోయలో పడినట్లు గుర్తించారు. మనోజ్ను విచారించగా మద్యం మత్తులో ఉన్న తాను ఏమి మాట్లాడానో గుర్తు లేదని, బ్రెయిన్ సరిగా పనిచేయడం లేదని తప్పు ఒప్పుకున్నాడు. దీంతో అతనిని పోలీసులు మందలించి కౌన్సెలింగ్ చేసి పంపించారు. లోయలో పడిన ఆటోను జేసీబీ సాయంతో తీయించారు. ఆటోను దొంగలు తీసుకెళ్లారని చెప్పిన ఆటోవాలా -
వెల్లువలా ఫిర్యాదులు
సాక్షి నెట్వర్క్:⇒ పింఛన్ ఇప్పించాలంటూ వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళల వేడుకోలు..!⇒ తమ భూములు కబ్జాకు గురయ్యాయంటూ కాళ్లరిగేలా తిరుగుతున్న గిరిజనులు..!⇒ రేషన్ కార్డులు, ఇళ్ల కోసం నెలల తరబడి ఆరాటంతో ఎదురు చూస్తున్న పేదలు..! ⇒ అడుగు ముందుకు పడని భూముల మ్యుటేషన్లు.. పాస్బుక్లు అందక రైతన్నల గగ్గోలు..! ⇒ స్థలాలు ఆక్రమణలకు గురై తీవ్ర ఆందోళనలో సామాన్యులు..! ⇒ ఫీజు రీయింబర్స్మెంట్ అందక చదువులు మధ్యలో ఆగిపోయిన పిల్లలు..!ఇంతమంది ఇన్ని సమస్యలతో ప్రభుత్వ కార్యాలయాలకు వస్తున్నా పరిష్కారం లభిస్తుందనే భరోసా ఏ ఒక్కరిలోనూ కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఓ ప్రహసనంగా.. సమస్యల నిలయంగా మారింది! కలెక్టర్ నుంచి జిల్లా స్థాయి అధికారులు పాల్గొంటున్న ఈ వేదిక ప్రజలకు ఏమాత్రం భరోసా కల్పించలేకపోతోంది. ప్రతి సోమవారం కలెక్టరేట్కు తరలి వస్తున్న వారితోపాటు కార్యాలయాలను కుప్పలు తెప్పలుగా ముంచెత్తుతున్న అర్జీలే ఇందుకు సాక్ష్యం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎక్కడ చూసినా సమస్యలతో సతమతమవుతూ నెలల తరబడి తిరుగుతున్నవారే కనిపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పరిష్కార వేదికల వద్దకు వచ్చిన వారిని ‘సాక్షి’ ప్రతినిధుల బృందం పలుకరించగా ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు కనిపించాయి. గత ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ సంతృప్త స్థాయిలో ప్రయోజనం కల్పిస్తూ అడుగులు ముందుకు వేసిందని, గ్రామ స్థాయిలో ఇంటి వద్దకే పౌర సేవలను అందచేసిందని గుర్తు చేసుకున్నారు. ఏ కారణం చేతనైనా సరే.. అర్హుల్లో ఇంకా ఎవరైనా మిగిలిపోతే వారికి కూడా లబ్ధి చేకూరేలా ఏటా రెండుసార్లు జాబితాను సిద్ధం చేసి సచివాలయాల్లో పారదర్శకంగా ప్రదర్శించి వలంటీర్ల ద్వారా ఇంటికే పథకాలను చేరవేసిందని చర్చించుకోవడం కనిపించింది.⇒ ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు రామలింగం. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం మాచాపురానికి చెందిన ఆయన కుమారుడు గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 32లో 89 సెంట్లను రామచంద్రుడు అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేశాడు. ఇందులో 44 సెంట్ల భూమిని ఈశ్వరయ్య అనే వ్యక్తికి విక్రయించాడు. మిగిలిన 45 సెంట్ల భూమికి పాస్బుక్ కోసం వెళితే మూడు సార్లు సర్వే కోసం చలానా కట్టించుకున్నారు. సర్వేయర్ ఒక్కసారి కూడా వచ్చి సర్వే చేయలేదు. కోర్టు పరిధిలో భూమి ఉందంటూ దాట వేస్తున్నారు. దీంతో బాధితుడు నాలుగైదుసార్లు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం.⇒ ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నమ్మలు తన కుమారుడిని పాలిటెక్నిక్ చదివిస్తోంది. ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడంతో కాలేజీ యాజమాన్యం వారిపై ఒత్తిడి తెస్తోంది. దీంతో అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం చౌడువాడ నుంచి దివ్యాంగుడైన తండ్రి సాయంతో కలెక్టరేట్కు వచ్చింది. కాలేజీకి ఫీజు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతిపత్రం అందించింది. నిరుపేదనైన తాను ఇన్నాళ్లూ ప్రభుత్వం ఇచ్చే ఫీజుల డబ్బులతోనే కుమారుడిని చదివిస్తున్నానని, ఈ ప్రభుత్వం ఇవ్వకపోవడంతో కాలేజీ యాజమాన్యం ఇబ్బంది పెడుతోందని చిన్నమ్మలు వాపోయింది.⇒ చిత్రంలో కనిపిస్తున్న గిరిజనులు పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గుణదతీలేసు పంచాయతీ పరిధిలోని లాబేసు గ్రామం వాసులు. వీరంతా నిరుపేదలు. గ్రామానికి చెందిన18 మంది గిరిజన రైతులు సర్వే నంబర్ 16, 11లోని కొంత ప్రభుత్వ భూమిలో తుప్పలు తొలగించి 1995 నుంచి పంటలు పండిస్తున్నారు. సాగు హక్కు పట్టాలు మంజూరు చేయాలంటూ తొమ్మిది నెలలుగా తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే వారే లేరని వాపోతున్నారు.నేను చచ్చిన తరువాత పింఛన్ ఇస్తారా? పెన్షన్ కోసం కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా. కలెక్టరేట్కు వస్తే సచివాలయానికి వెళ్లమంటారు. అక్కడికి వెళితే మళ్లీ ఇక్కడికే పొమ్మంటారు. అసలు పెన్షన్ ఇస్తారా? ఇవ్వరా? ఇవ్వబోమంటే మా పని ఏదో చేసుకొని బతుకుతాం. పేదలను ఇలా తిప్పుకోవడం మంచిది కాదు. నేను చచ్చిన తరువాత పెన్షన్ ఇస్తామంటే ఏం లాభం? గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ల మంజూరు చాలా చక్కగా ఉండేది. – మద్దయ్య, బి.తాండ్రపాడు, కర్నూలు మండలం, కర్నూలు జిల్లాఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయడం లేదు బండిపై బాదంపాలు విక్రయిస్తూ జీవిస్తున్నా. ఒంటరి మహిళను. ఈ ఏడాది జనవరి 22వ తేదీన చిలకలూరిపేటలో ద్విచక్ర వాహనంపై వెళుతుండగా కారు ఢీకొనడంతో కాలు, చేయి విరిగాయి. ఆపరేషన్కు రూ.లక్ష ఖర్చు అయింది. ఇప్పటికీ నడవలేకపోతున్నా. నిందితుడిని గుర్తించి, పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయడం లేదు. ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలి. ప్రమాదానికి కారకుడిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి. –షేక్ సైదాబీ, కావూరు లింగంగుంట్ల, నాదెండ్ల మండలం, పల్నాడు జిల్లాముళ్ల పొదల్లో మృతదేహాలను మోసుకుంటూ..మా గ్రామం నుంచి నంద్యాల వెళ్లే రహదారిలో మాంటిస్సోరి స్కూల్ వెనుక భాగంలో 70 సెంట్ల హిందూ శ్మశాన వాటిక స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. అక్కడకు వెళ్లాలంటే రహదారి లేదు. పొలం గట్లపై, ముళ్ల పొదల్లో భయంభయంగా మృతదేహాలను మోసుకుంటూ తీసుకెళ్తున్నాం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నాలుగు సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకొనే నాథుడే లేరు. – చాపిరేవుల గ్రామస్తులు, నంద్యాల జిల్లా -
ఎస్డీఆర్ఎఫ్ సేవలకు కమాండెంట్ అభినందన
కర్నూలు: కర్నూలు ఏపీఎస్పీ రెండో పటాలం ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సేవలను కమాండెంట్ దీపిక పాటిల్ అభినందించి సత్కరించారు. ఈనెల 16న విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన వెంకటరత్నం (80) వచ్చి ప్రమాదవశాత్తూ ప్రకాశం బ్యారేజీ సమీపంలో కెనాల్లో పడిపోయాడు. అదే సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న రెండో బెటాలియన్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆర్ఎస్ఐ మహేంద్ర నాయక్, శివ, పద్మనాభం, సుదర్శన్ రెడ్డి, హుసేన్, నాగన్న, సత్యనారాయణ తదితరులు పడవ సాయంతో వృద్ధుడిని కాపాడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అందుకు గాను ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సేవలను అభినందిస్తూ మంగళవారం కమాండెంట్ దీపిక పాటిల్ తన కార్యాలయంలో ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో అదనపు కమాండెంట్ నాగేంద్ర రావు, ఎస్డీఆర్ఎఫ్ డీఎస్పీ సుధాకర్ రెడ్డి, ఆర్ఐ సాయికుమార్ పాల్గొన్నారు. -
‘కూటమి’ తంత్రం.. అందని యంత్రం
కర్నూలు(అగ్రికల్చర్): రైతుల సంక్షేమానికి, వ్యవసాయ అభివృద్ధికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పలు పథకాలు అమలు చేయగా.. ప్రస్తుత ప్రభుత్వం ఉన్న పథకాలను నీరుగారుస్తోంది. గత ప్రభుత్వంలో రాజకీయాలకు అతీతంగా యాంత్రీకరణతో పాటు అన్ని రకాల సంక్షేమ పథకాలు అమలు చేశారు. కూటమి ప్రభుత్వం మాత్రం సిఫారస్సులకు లోబడే యంత్రీకరణ అమలు చేస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. టీడీపీకి చెందిన వారికే ప్రభుత్వ పథకాలు అందిస్తున్నారని ప్రజలే చెబుతున్నారు. టీడీపీ వారికే యంత్రాలు వ్యక్తిగత వ్యవసాయ యంత్రాల పంపిణీలో టీడీపీ నేతల సిఫార్సులకే వ్యవసాయ శాఖ అఽధికారులు పెద్దపీట వేస్తున్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరం ముగింపు సమయంలో వ్యవసాయ శాఖ.. రైతులకు వ్యక్తిగతంగా వ్యవసాయ యంత్ర పరికరాలు సబ్సిడీపై పంపిణీ చేస్తోంది. కేంద్రప్రభుత్వ నిధులు 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వ నిధులు 40 శాతం నిధులు అందిస్తోంది. కర్నూలు జిల్లాలో రూ.రూ.2.87 కోట్లతో 1,660 యంత్రపరికరాలు, నంద్యాల జిల్లాలో రూ.2.85 కోట్లతో 1,635 యంత్రపరికరాలు సబ్సిడీపై పంపిణీ చేస్తున్నారు. కర్నూలు జిల్లాకు బ్యాటరీ స్ప్రేయర్లు 250, థైవాన్ స్ప్రేయర్లు 600, ట్రాక్టర్ ఆపరేటెడ్ స్ప్రేయర్లు 7, ట్రాక్టర్ డ్రాన్ ఇంప్లిమెంట్స్ 740, రోటావేటర్లు 28, పవర్ వీడర్లు 17, బ్రస్కట్టర్లు 13, పవర్ టిల్లర్లు 5 ప్రకారం పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఒక్కటి కూడా ఇవ్వకుండా... నంద్యాల జిల్లాలో థైవాన్ స్ప్రేయర్లు 575 కేటాయించగా.. మిగిలినవన్నీ.. కర్నూలు జిల్లాతో సమానంగా కేటాయించారు. ఒక్కో మండలంలో 30 నుంచి 50 గ్రామాలు ఉంటాయి. బ్యాటరీ స్ప్రేయర్లు, థైవాన్ స్ప్రేయర్లు గ్రామానికి కనీసం ఒక్కటి కూడా ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. రోటా వేటర్లు మండలానికి ఒక్కటి ప్రకారమే కేటాయించారు. పవర్ టిల్లర్లు, బ్రస్కట్టర్లు, పవర్ వీడర్లు అతి తక్కువగా ఉండటంతో టీడీపీ నేతల ప్రాబల్యం ఉన్న మండలాలకే కేటాయించారు. వ్యక్తిగత యంత్ర పరికరాలు సరఫరా చేసేందుకు దాదాపు 50 కంపెనీలను గుర్తించింది. బ్యాటరీ స్ప్రేయర్లకు రూ.1000, థైవాన్ స్ప్రేయర్లకు రూ.8000 నుంచి 10 వేల వరకు, ట్రాక్టర్ డ్రాన్ ఇంప్లిమెంట్స్కు కంపెనీని బట్టి గరిష్టంగా రూ,35 వేల వరకు, రోటావేటర్కు రూ.46 వేలు, పవర్ వీడర్లకు రూ.30 వేల నుంచి 40 వేల వరకు, బ్రస్కట్టర్లకు రూ.25 వేల నుంచి రూ.44 వేలు, పవర్ టిల్లరుకు లక్ష నుంచి రూ.1.20 లక్షల వరకు సబ్సిడీ ఉంటుంది. ఇంప్లిమెంట్స్ అతి తక్కువగా ఉండటంతో కూటమి నేతల సిఫార్సుల పర్వం జోరుగా సాగుతోంది. వారు ఎవ్వరికి చెబితే వారికే ఇస్తామని వ్యవసాయ అధికారులు స్పష్టం చేస్తున్నారు. టీడీపీ నేతలు చెప్పిన వారికే వ్యవసాయ యంత్ర పరికరాలు -
పల్లె పుష్కరిణిలుగా చెరువుల అభివృద్ధి
కర్నూలు(అగ్రికల్చర్): ఉపాధి నిధులతో గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులను ‘పల్లె పుష్కరిణిలు’గా అభివృద్ధి చేయాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు జిల్లాలో 31 పల్లె పుష్కరిణిలను గుర్తించారు. ఒక ఎకరా నుంచి ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువులను.. కనీసం వెయ్యి జనాభా కలిగిన గ్రామాల్లో మాత్రమే ఈ పనులు చేపట్టాల్సి ఉంది. ప్రతి మండలంలో ఒకటి లేదా రెండు చెరువులను మొదటి విడతలో పైలెట్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేయనున్నారు. గ్రామ పంచాయతీలు, దేవాలయ కమిటీలు, గ్రామ ప్రజల సమ్మతితో మాత్రమే కోనేర్లను అభివృద్ధి చేయాలని గ్రామీణాభివృద్ది శాఖ ఆదేశించింది. జాతీయ స్థాయిలో జిల్లా క్రీడాకారుల సత్తా కర్నూలు (టౌన్): జిల్లాకు చెందిన 51 మంది క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటారని జిల్లా వృత్తి విద్యా శాఖాధికారి పరమేశ్వర రెడ్డి తెలిపారు. స్కూల్గేమ్స్ ఫెడరేషన్ జాతీయ స్థాయి పోటీల్లో రాణించిన జిల్లా క్రీడాకారులకు మంగళవారం ఆర్ఐఓ గురువయ్యశెట్టితో కలిసి ఆయన పతకాలు, ప్రశంసా పత్రాలు అందజేసి, సత్కరించారు. కార్యక్రమంలో కేవీఆర్ కళాశాల ప్రిన్సిపాల్ సుంకన్న, లాలప్ప, అండర్–19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి హర్షవర్దన్ పాల్గొన్నారు. తేనెటీగల పెంపకంతో ఆర్థికాభివృద్ధి కొత్తపల్లి: తేనెటీగల పెంపకంతో ఆర్థికాభివృద్ధి చెందాలని నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ ఎం.జాన్సన్, ఐటీడీఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కేజీ నాయక్ గిరిజనులకు సూచించారు. మంగళవారం మండలంలోని పాలెంచెరువు గూడెంలో గిరిజనులకు తేనెటీగల పెంపకంపై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, నేషనల్ హానీ బీ బోర్డ్ సంయుక్తంగా పాలెంచెరువు గ్రామానికి చెందిన 25 మంది గిరిజన రైతులకు శాసీ్త్రయ పద్ధతిలో తేనెటీగలను పెంచి, తేనెను తయారు చేసుకునే విధానంపై ఏడు రోజుల శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణ, సర్పంచు మశమ్మ, జెడ్పీటీసీ సోమల సుధాకర్ రెడ్డి, శాస్త్రవేత్తలు కె.అశోక్ కుమార్, కె.మోహన్, విష్ణువర్ధన్, ఎం.శివరామకృష్ణ పాల్గొన్నారు. -
‘బోసి నవ్వుల’ బంధం!
ఆ మహాత్ముని బోసినవ్వు ఆ చిన్నారిని ఆకట్టుకుంది. విగ్రహంలోని అమాయకత్వంతో ఆ పసిహృదయం మాట కలిపింది. మచ్చలేని మహనీయుడికి అంటుకున్న మరకలను ఆ ‘తెల్లని’ మనసు తుడిచేసింది. ఆ చిక్కని చిరునవ్వుని తన చిట్టి చేతులతో తడమటం తాతా మనవడి బంధాన్ని గుర్తుచేసింది. ( మంగళవారం ఉదయం కర్నూలు పెద్దాసుపత్రిలోని చిన్నపిల్లల విభాగంలో మహాత్మాగాంధీ విగ్రహంతో ఓ బాలుడి ఆత్మీయత అక్కడున్న వారందరిలో నవ్వులు పూయించింది. ) – ఫొటోలు: డి.హుస్సేన్, సాక్షి ఫొటోగ్రాఫర్ చిరునవ్వు చిందిస్తూ..మరక చెరిపేస్తూ.. -
ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు అధిక డిమాండ్
● జిల్లా వ్యవసాయ అధికారి వైవి మురళీకృష్ణకొత్తపల్లి: ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో పండించిన ఉత్పత్తులకు అధిక డిమాండ్ ఉంటుందని జిల్లా వ్యవసాయాధికారి వైవీ మురళీకృష్ణ తెలిపారు. మండల పరిధిలోని పాలెంచెరువు గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ జి.నరేంద్రారెడ్డి, ఏడీఏ ఆంజనేయలు, జెడ్పీటీసీ సోమల సుధాకర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ప్రకృతి వ్యవసాయంపై మొగ్గు చూపాలన్నారు. పంటమార్పిడి పద్ధతిని అవలంబించాలన్నారు. రైతు సేవ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకుని మినుములు, శనగలను మద్దతు ధరకు విక్రయించుకోవాలన్నారు. నీటి వసతి ఉన్న రైతులు వేసవిలో పప్పు జాతి పంటలను సాగుచేసుకోవాలని, తద్వారా నేలకోత తగ్గడంతో పాటు భూ సారం పెరుగుతుందన్నారు. అనంతరం ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేసిన పొలాలను పరిశీలించా రు. ప్రకృతి వ్యవసాయ సిబ్బందితో విత్తన గుళికల త యారీ విధానం, పొలంలో వెదజల్లే తీరును రైతులకు చూపించారు. కార్యక్రమంలో సర్పంచ్ మశమ్మ, ఏఓ మహేష్, ఉద్యాన శాఖ అధికారి చందన పాల్గొన్నారు. -
మల్లన్న సేవలో కర్ణాటక రాష్ట్ర గవర్నర్
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను కర్ణాటక రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లట్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. మంగళవారం మల్లన్న దర్శనార్థం ఆలయం వద్దకు విచ్చేసిన కర్టాటక గవర్నర్కు శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు, ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు, వేదపండితులు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ మల్లికార్జున స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారిని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అమ్మవారి ఆలయం వద్దగల ఆశీర్వచన మండపంలో గవర్నర్కు వేదపండితులు వేదమంత్రాలు పలుకగా, అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. దేవస్థాన ఈఓ స్వామివారి శేషవస్త్రాలను, లడ్డూ ప్రసాదాలను, జ్ఞాపికను అందించి సత్కరించారు. -
విద్య, ఉపాధితోనే గ్రామాల అభివృద్ధి
కర్నూలు సిటీ: విద్య, ఉపాధి అవకాశాలతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని క్లస్టర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె వెంకటేశ్వర్లు అభిప్రాయపడ్డారు. సిల్వర్జూబ్లీ డిగ్రీ కాలేజీలో ఎకనమిక్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాలలో ఉద్యో గ అవకాశాలు – సాధకబాధకాలు అంశంపై ఏర్పాటు చేసిన రెండు రోజుల జాతీ య సదస్సు మంగళవారంతో ముగిసింది. చివరి రోజు వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె వెంకటేశ్వర్లు పాల్గొని ప్రసంగించారు. గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే విద్య అవకాశాలు మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. సాంకేతిక నైపుణ్యాలు అభివృద్ధి కావాలని, స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. ప్రభుత్వ పురుషుల డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిరాశాంతి, కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బీఆర్ ప్రసాద్ రెడ్డి, సీఐ నాగశేఖర్, ఆర్థిక శాఖ అధ్యాపకురాలు డాక్టర్ సవితదేవి, సదస్సు డైరెక్టర్ డాక్టర్ ఎల్లా కృష్ణ పాల్గొన్నారు. -
మేలైన యాజమాన్య పద్ధతులతో నాణ్యమైన దిగుబడి
కర్నూలు(అగ్రికల్చర్): ఉల్లి సాగులో కర్నూలు జిల్లా రాష్ట్రంలోనే మొదటిస్థానంలో ఉందని.. రైతులు అధిక దిగుబడి, నాణ్యతను పెంపొందించుకోవడంతో పాటు నిల్వ పద్ధతులపై అవగాహన కలిగి ఉండాలని ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్, ఏపీఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్ ఉమాదేవి తెలిపారు. మంగళవారం ఉద్యానశాఖ ఉల్లి సాగులో మేలైన యాజమాన్య పద్ధతులపై రైతులకు కర్నూలులోని ఉద్యానభవన్లో శిక్షణ, చర్చా కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లా ఉద్యాన అధికారి పి.రామంజనేయులు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏపీఎంఐపీ పీడీ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో ఏటా 5.40 లక్షల టన్నుల ఉల్లి ఉత్పత్తి అవుతోందన్నారు. అవగాహనతో సాగు చేపడితే నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చని, నాణ్యత బాగుంటే గిట్టుబాటు ధరలు లభిస్తాయన్నారు. ● జిల్లా ఉద్యాన అధికారి పి.రామాంజనేయులు మాట్లాడుతూ ఉల్లి సాగులో ఆధునిక సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ● మార్కెటింగ్ శాఖ ఏడీ నారాయణమూర్తి మాట్లాడుతూ పండించిన పంటను బాటీ ఆరబెట్టి గ్రేడింగ్ చేసుకొని మార్కెట్కు తీసుకొస్తే గిటుబాటు ధర లభించే అవకాశం ఉంటుందన్నారు. ● ఏపీఎంఐపీ అదనపు పీడీ రాజాకృష్ణారెడ్డి మాట్లాడుతూ సూక్ష్మ సేద్యం ద్వారా తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో ఉల్లి సాగు చేసుకోవచ్చని, ఎరువుల వినియోగం కూడా తక్కువగా ఉంటుందని తెలిపారు. ● మహానంది వైఎస్ఆర్ ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త ఠాగూర్నాయక్ మాట్లాడుతూ ఉల్లి సాగులో మేలైన యాజమాన్య పద్దతులను వివరించారు. -
నీటి ఎద్దడి తలెత్తకుండా ఎస్ఎస్ ట్యాంకులను నింపండి
కర్నూలు (అర్బన్): జిల్లాలోని నీటి పారుదల ప్రాజెక్టులకు ఏప్రిల్ 14వ తేదీ వరకు నీటి సరఫరా జరుగుతున్నందున ప్రస్తుత వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ఎస్ఎస్ ట్యాంకులన్నిటినీ నింపుకోవాలని జిల్లాపరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి కోరారు. మంగళవారం సాయంత్రం స్థానిక జెడ్పీ మినీ సమావేశ భవనంలో తాగునీటి ఎద్దడి, జెడ్పీ నిధులతో చేపట్టిన వివిధ పనుల పురోగతిపై ఆయన పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ తాగునీటి సరఫరా పథకాలకు ఎలాంటి విద్యుత్ అంతరాయం లేకుండా విద్యుత్ను సరఫరా చేయాలని సూచించారు. గ్రామ పంచాయతీల్లో నీటి వృథాను అరికట్టేందుకు పైప్లైన్ల లీకేజీలను వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రస్తుత వేసవిలో నీటి ఎద్దడి తలెత్తే మండలాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లను ఆదేశించారు. జిల్లాపరిషత్ నిధుల ద్వారా మంజూరైన ఎస్సీ, ఎస్టీ, మహిళా శిశు సంక్షేమ శాఖలకు మంజూరు చేసిన ఈఎంఎఫ్ పనులను వెంటనే చేపట్టి జూలై నెలాఖరు నాటికి పూర్తి చేయాలన్నారు. సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ పనులకు సంబంధించి ఐసీడీఎస్ అధికారులను సమన్వయం చేసుకుని పంచాయతీరాజ్ ఇంజనీర్లు పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ కర్నూలు, నంద్యాల ఎస్ఈలు బి.నాగేశ్వరరావు, సీహెచ్ మనోహర్, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ ఉమాపతి తదితరులు పాల్గొన్నారు. జిల్లాపరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి -
చెప్పుకోలేక.. కన్నీళ్లు దిగమింగలేక!
ఆసుపత్రి ఎదుట డివైడర్పై అచేతన స్థితిలో సత్యనాగరాజుకన్నబిడ్డలు ఉన్నారో లేరో తెలియదు.. భారమై వదిలించుకున్నారో, తానే వాళ్లకు భారమనుకున్నాడో చెప్పుకోలేడు.. పరువు బజారున పడుతుందనుకున్నాడో.. ఎక్కడో ఒకచోట ఈ ప్రాణం ఇలా వదిలేద్దామనుకున్నాడో.. ముదిమి వయస్సులో మండుటెండలో జీవశ్చవమయ్యాడు. కాళ్లు కదపలేడు, కన్నీటిని ఆపుకోలేడు.. ఊరు పేరు తప్ప వివరాలకు ఉబికి వచ్చే కన్నీళ్లే సమాధానం. ఈ 70 ఏళ్ల శరీరం నగరం నడిబొడ్డున, ప్రభుత్వాసుపత్రి ఎదుట మంగళవారం మధ్యాహ్నం దిక్కులు చూస్తూ.. దేవుడిపైనే భారం వేసింది. రోడ్డు మధ్యనున్న పచ్చని డివైడర్లో ఈ ‘పెద్దరికం’ మోడుబారి పడుకుంది. – కర్నూలు(హాస్పిటల్)(ఇతని పేరు సత్యనాగరాజు. ఊరు విజయవాడ. ఈ వివరాలు తప్ప మరో మాట మాట్లాడని ఈయన దయనీయ స్థితికి కర్నూలు నగరం కన్నీరు పెట్టింది. విషయం తెలుసుకున్న ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ కె.వెంకటేశ్వర్లు చలించిపోయారు. రాత్రి 8 గంటల సమయంలో 108ను పంపి ఆయనను క్యాజువాలిటీలో అడ్మిట్ చేయించారు. ) -
సంక్షేమ హాస్టళ్లలో రాత్రి బసకు శ్రీకారం
● కర్నూలు కళాశాల బాలికల వసతిగృహంలో జేడీ రంగలక్ష్మిదేవి బస కర్నూలు(అర్బన్): ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సహాయ సంక్షేమ అధికారులు, వసతి గృహ సంక్షేమ అధికారులు తప్పక హాస్టళ్లలో బస చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ జేడీ జె.రంగలక్ష్మిదేవి ఆదేశించారు. మంగళవారం రాత్రి నిర్వహించిన గూగుల్ మీట్లో ఆమె మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వార్డెన్లు రాత్రి సమయాల్లో హాస్టళ్లలోనే నిద్రించి విద్యార్థులతో మాట్లాడి అక్కడి సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలన్నారు. అలాగే ఆయా హాస్టళ్లలో స్టడీ అవర్స్ నిర్వహించాలన్నారు. బాలల సంరక్షణ చట్టాలు, ఫోక్సో యాక్ట్, చైల్డ్ హెల్ప్లైన్ తదితర నెంబర్లను విద్యార్థులకు తెలియజేయాలన్నారు. జేడీతో పాటు హెచ్డబ్ల్యూఓ పెన్నమ్మ కర్నూలు కళాశాల బాలికల వసతి గృహంలో విద్యార్థులతో కలసి నిద్రించారు. అలాగే కళాశాల బాలుర వసతి గృహంలో కర్నూలు సహాయ సంక్షేమాధికారి బి.మద్దిలేటి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ వెంకటరెడ్డి బస చేశారు. -
ఈకేవైసీ చేయిస్తేనే రేషన్.. ఈనెల 31వ తేదీ వరకు గడువు
కర్నూలు(సెంట్రల్): రేషన్ కార్డులోని సభ్యులంతా ఈకేవైసీ చేయించుకోకపోతే కార్డులోని వారి తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టంది. కార్డులోని ప్రతి సభ్యుడు సమీపంలోని రేషన్ డీలర్, వీఆర్వో, సచివాలయ సిబ్బంది లాగిన్లలో ఆధార్ కార్డు చూపించి వేలి ముద్రలు లేదా ఐరిస్ ఇవ్వాలి. లేదంటే మార్చి 31వ తేదీ తరువాత వారి పేర్లను కార్డు నుంచి తొలగిస్తారు. కర్నూలు జిల్లాలో 6,34,631 రేషన్ కార్డులు ఉన్నాయి. వాటిలో కుటుంబ సభ్యులంతా సభ్యులుగా ఉంటారు. అలా 6,34,631 కార్డులలో 21,92,047 మంది సభ్యులు ఉన్నారు. వీరంతా ఈకేవైసీ చేయించు కోవాలి. గతంలోనే దాదాపు 80 శాతం మంది చేయించుకున్నారు. మిగిలిన 20 శాతం మంది సభ్యుల ఈకేవైసీ పెండింగ్లో ఉంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వారి నుంచి వేలిముద్రలు, కంటి ఐరీష్తో ఈకేవైసీని పూర్తి చేయాలని ఆదేశించింది. జిల్లాలో 19,13,870 మంది రేషన్కార్డు సభ్యుల ఈకేవైసీ పూర్తయింది. మిగిలిన 2,78,177 మంది సభ్యులు మార్చి31వ తేదీలోపు పూర్తి చేయాల్సి ఉంది.స్పందించని డీలర్లు.. పనిచేయని మొబైల్ ఆప్లికేషన్పెండింగ్ ఈకేవైసీని డీలర్లు, వీఆర్వోలు, సచివాలయ కార్యాదర్శుల దగ్గర చేయించుకోవాలి. ఇందుకు సంబంధించి ఈకేవైసీ పెండింగ్ జాబితాను మండలాలు, సచివాలయాల వారీగా అందు బాటులో ఉంచారు. అయితే డీలర్లు ఈకేవైసీ వేయించడానికి స్పందించడం లేదు. వీఆర్వోలు పదే పదే చెబుతున్నా పట్టించుకోవడం లేదు. సచివాలయ సిబ్బంది మొబైల్ అప్లికేషన్లో సర్వనఖ బిజీ వస్తోంది. ఈక్రమంలో నిర్దేశించిన సమయం దగ్గర పడుతుండడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈకేవైసీ కోసం గడువును పొడిగించాలని కోరుతున్నారు.ఈనెలాఖరులోపు చేయించుకోవాలిజిల్లాలో మొత్తం 21,92,047 మంది సభ్యుల్లో ఇంకా 2,78,177 మంది ఈకేవైసీ చేయించుకోవాలి. వీరంతా ఈకేవైసీని మార్చి31వ తేదీలోపు చేయించుకోవాలి. లేదంటే ఎవరి ఈకేవైసీ పూర్తి కాలేదో ఆ సభ్యుడి పేరును రేషన్ కార్డును నుంచి తొలగించి, రేషన్ సరఫరా నిలిపేస్తారు.– ఎం.రాజారఘువీర్, డీఎస్ఓగడువును పొడిగించాలిరేషన్ కార్డుల్లోని సభ్యుల ఈకేవైసీ కోసం గడువును పొడిగించాలి. ఈ అంశంపై అధికారులు విస్తృత ప్రచారం కల్పించడం లేదు. దీంతో చాలా మందికి ఈ విషయంపై అవగాహన లేదు. మరో నెలపాటు గడువును పొడిగించాలి. లేదంటే చాలా మంది ఇబ్బంది పడతారు.– చంద్రశేఖర్, సీపీఐ నాయకులు, కర్నూలు -
పశువుల దాహార్తి తీర్చేందుకు తొట్లు ఏర్పాటు
● డ్వామా పీడీ వెంకటరమణయ్య కర్నూలు(అగ్రికల్చర్): వేసవిలో పశువుల దాహార్తిని తీర్చేందుకు గ్రామీణ ప్రాంతాల్లో నీటి తొట్లు ఏర్పాటు చేస్తున్నట్లుగా జిల్లా నీటియాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటరమణయ్య తెలిపారు. మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. నీటి తొట్లు ఎక్కడెక్కడ అవసరమనే దానిపై వివరాలు ఇవ్వాలని పశుసంర్ధక శాఖ అధికారులను అడిగామని, వారు నివేదిక మేరకు 300 తొట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతామన్నారు. ఏప్రిల్ మూడో వారంలో పూర్తి చేసే విధంగా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. మే నెల చివరిలోపు జిల్లాలో 8,500 ఫాంపాండ్స్ నిర్మించనున్నామని పేర్కొన్నారు. వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి పంట కాల్వలు, పీడర్ చానళ్లల్లో పేరుకపోయిన పూడికను తొలగిస్తామన్నారు. రానున్న రోజుల్లో ఉపాధి పనులకు లేబర్ డిమాండ్ ఎక్కువగా ఉంటుందని, డిమాండ్కు అనుగుణంగా చెరువులు, కుంటల్లో కూడా పూడిక తీసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. -
28 నుంచి వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు
ఆస్పరి: మండలంలోని కై రుప్పల గ్రామంలో వెలసిన వీరభద్రస్వామి, కాళికాదేవి బ్రహ్మోత్సవాలు ఈనెల 28 నుంచి నిర్వహించనున్నట్లు మంగళవారం ఆలయ కార్యనిర్వహణాధికారి రాంప్రసాద్, సర్పంచ్ తిమ్మక్క, గ్రామ పెద్దలు తెలిపారు. ఈనెల 28 ధ్వజారోహణ సందర్భంగా ఆలయంలో వీరభద్రస్వామి, కాళికాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారన్నారు. 29న పూజా కార్యక్రమం, 30న ఉగాది, 31న పెద్దనుగ్గులాట, ఏప్రిల్ 1వ తేదీన స్వామి వారికి ప్రత్యేక పూజలు, 2న సాధారణ పూజలు, 3న రథోత్సవం, 4న ప్రత్యేక పూజలు, 5న వసంతోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు. ఏప్రిల్ 1 వరకు ఎండుమిర్చి, వాము క్రయవిక్రయాలు బంద్ కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 1 వరకు ఎండుమిర్చి, వాము క్రయవిక్రయాలు నిలిపివేస్తున్నట్లు మార్కెట్ కమిటీ సెక్రటరీ జయలక్ష్మి తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున అకౌంట్స్ను క్లోజ్ చేసుకోవాల్సి ఉందని.. వాము, ఎండుమిర్చి క్రయవిక్రయాలు చేపట్టలేమని వ్యాపారస్తుల అసోషియేషన్ చెప్పినందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలని, కమీషన్ ఏజెంట్లు కూడా ఆయా సరుకులను తెప్పించరాదని మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. డ్వామాలో బదిలీల ప్రక్రియ పూర్తి కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా నీటియాజమాన్య సంస్థలో బదిలీల ప్రక్రియ పూర్తయింది. వివిధ కేటగిరీల్లో 119 మందిని బదిలీ చూస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు డ్వామా పీడీ వెంకటరమణయ్య తెలిపారు. ● ఆలూరు క్లస్టర్ ఏపీడీగా పనిచేస్తున్న పద్మావతిని కర్నూలు క్లస్టర్కు, కర్నూలు క్లస్టర్ ఏపీడీగా పనిచేస్తున్న లక్ష్మన్నను పత్తికొండ క్లస్టర్కు, పత్తికొండ క్లస్టర్ ఏపీడీగా పనిచేస్తున్న పక్కీరప్పను ఆలూరు క్లస్టర్ ఏపీడీగా బదిలీ చేశారు. ● ఏపీవోల్లో ఎం.తిమ్మారెడ్డిని మంత్రాలయం నుంచి హొలగొంద మండలానికి, జి.మద్దేశ్వరమ్మను కల్లూరు నుంచి ఓర్వకల్కు, కే.వెంకటేశ్వర్లును పత్తికొండ నుంచి తుగ్గలికి, ఎం.భక్తవత్సలంను హొలగొంద నుంచి మంత్రాలయానికి, కుమార్సాయినాథ్ను ఓర్వకల్ నుంచి పత్తికొండకు, బి.మాధవశంకర్ను కోసిగి నుంచి ఆదోనికి బదిలీ చేశారు. ● ఐదుగురు జేఈలు, ఇద్దరు ఇంజనీరింగ్ కన్సల్టెంట్లు కూడా బదిలీ అయ్యారు. ఆర్యూ, కేయూల ఇన్చార్జ్ వీసీగా ప్రొఫెసర్ ఉమా కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ, క్లస్టర్ యూనివర్సిటీల ఇన్చార్జ్ వైస్ చాన్స్లర్గా ప్రొఫెసర్ వి.ఉమా నియమితులయ్యారు. ఈ మేరకు ఉన్నత విద్యా శాఖ జీవో ఆర్టీ నెం.56, 2025 జారీ చేసింది. రాయలసీమ యూనివర్సిటీకి రెగ్యులర్ వీసీగా, క్లస్టర్ యూనివర్సిటీకి ఇన్చార్జ్ వీసీగా ఉన్న ప్రొఫెసర్ వి.వెంకట బసవరావు వ్యక్తిగత పనుల నిమిత్తం విదేశీ పర్యటనకు వెళ్లేందుకు ప్రభుత్వ అనుమతి కోరడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆయన 16 రోజుల పర్యటన ముగించుకొని వచ్చే వరకు తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ వి.ఉమాను రెండు వర్సిటీలకు ఇన్చార్జ్ వీసీగా వ్యవహరించనున్నారు. -
రోగమొస్తే వైద్యం చేయించుకోవడానికి గ్రామీణులకు అందుబాటులో ఉన్నది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలే. ఇక్కడ కూడా సకాలంలో వైద్యులు, సిబ్బంది లేకపోవపోతే వారు కాళ్లీడ్చుకుంటూ పట్టణాలకు పోవాల్సిందే. అప్పటి వరకు వారి ఆరోగ్య పరిస్థితి ఎలాగుంటుందో చెప్పలేని పరిస్థితి. గ్రా
రక్తపరీక్షలు కూడా చేయడం లేదు నేను గత వారం రోజుల నుంచి జ్వరంతో బాధపడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వస్తున్నా. కేంద్రంలోని వైద్యులు పరీక్షించి మందులు రాసిచ్చినా తగ్గడం లేదు. వైద్యపరీక్షలు చేయమని కోరితే ఇక్కడ పరీక్షలు చేసేవారు లేరు మరోసారి రమ్మని చెబుతున్నారు. తమ వద్ద డబ్బులు లేకపోవడం వల్లే పట్టణాలకు వెళ్లి వైద్యం చేయించుకోలేకపోతున్నామని, ప్రాథమిక ఆరోగ్యానికి వస్తే కనీసం పరీక్షలు చేయడం లేదు. –దావీద్, క్రిష్ణగిరి పీహెచ్సీల్లో తూతూమంత్రంగా వైద్యసేవలు ● మొక్కుబడిగా మందులు సరఫరా ● సకాలంలో రాని వైద్యులు, సిబ్బంది ● ప్రసవాలు ఎక్కువ శాతం సీహెచ్సీలు, ఏరియా ఆసుపత్రుల్లోనే.. ● రాత్రి వేళల్లో రోగులకు తప్పని ఇక్కట్లు ● మొలగవల్లి పీహెచ్సీలో శానిటరి అటెండర్ పోస్టు, రెండు వాచ్మెన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 66 కాన్పులు చేశారు. 15 కి.మీల దూరంలో సీహెచ్సీ ఉన్నందున ప్రవసం కోసం అక్కడికి వెళ్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. కర్నూలు(హాస్పిటల్): కర్నూలు జిల్లాలో 35 పాత పీహెచ్సీలు, 12 కొత్త పీహెచ్సీలు ఉన్నాయి. పాత పీహెచ్సీ భవనాల్లోనే కొత్త పీహెచ్సీ వైద్యులు, వైద్యసిబ్బంది ఉండి వారికి కేటాయించిన పీహెచ్సీల పరిధిలో పనిచేస్తున్నారు. ప్రతి పీహెచ్సీలో 14 మంది చొప్పున వైద్యులు, వైద్య సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఫేస్ రికగ్నేషన్ యాప్ ద్వారా హాజరు వేయాల్సి ఉంది. అయినా కూడా కొంత మంది విధులకు ఆలస్యంగా రావడం, త్వరగా వెళ్లడం చేస్తున్నారు. కొందరు మధ్యలో వెళ్లి తిరిగి సాయంత్రం వచ్చి హాజరు వేసి వెళ్తున్నారు. జిల్లాలో దాదాపుగా అన్ని పీహెచ్సీలు 24 గంటలు పనిచేయాల్సి ఉండగా 10 శాతం పీహెచ్సీలు కూడా పనిచేయడం లేదు. పీహెచ్సీల్లో నైట్వాచ్మెన్ లేరని సాకుచూపుతూ ఎవ్వరూ రాత్రివేళల్లో విధులకు హాజరుకావడం లేదు. దీంతో ప్రసవాలకు, అత్యవసర వైద్యానికి సమీపంలోని సీహెచ్సీలకు, ఏరియా ఆసుపత్రులకు, కర్నూలు జీజీహెచ్ను ఆశ్రయిస్తున్నారు. మందుల కొరత తీవ్రం జిల్లాలోని అన్ని పీహెచ్సీల్లో మందుల కొరత కొన్నాళ్లుగా వేధించింది. గత నెలరోజుల నుంచి మందుల సరఫరా మెరుగుపడటంతో ఇప్పుడిప్పుడే ఆయా పీహెచ్సీలకు మందులు చేరుతున్నాయి. అందులోనూ గతంలో ఇచ్చినన్ని రకాల మందులు ఇప్పుడు ఇవ్వడం లేదు. ముఖ్యంగా బీపీ, కొలెస్ట్రాల్, షుగర్కు వాడే మందుల్లో కోత విధించారు. ఇన్సులిన్ను సైతం నెలరోజులుకు కాకుండా వారానికి ఒకటి చొప్పున ఇచ్చి పంపుతురు. దీనివల్ల వారం వారం రోగులు ఆసుపత్రికి రావాల్సి వస్తోంది. ఇప్పుడు సరఫరా అవుతున్న మాత్రల్లో కూడా నాణ్యత ఉండటం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాత్రలు స్ట్రిప్లో నుంచి తీయగానే పొడిగా మారిపోతున్నాయని చెబుతున్నారు. దీంతో మందుల నాణ్యతపై రోగుల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రసవాలు కూడా తక్కువే.. జిల్లాలోని పీహెచ్సీల్లో ప్రసవాలు నామమాత్రంగా జరుగుతున్నాయి. నెలలో మూడు నుంచి ఐదులోపు ప్రసవాలు జరుగుతున్న పీహెచ్సీలు కూడా జిల్లాలో ఉన్నాయి. గత సంవత్సరం ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో 20,479 ప్రసవాలు జరగ్గా అందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 4,671(22.80శాతం), ప్రైవేటు ఆసుపత్రుల్లో 15,808(77.19శాతం) ప్రసవాలు జరిగాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకం ఉన్నందున ప్రభుత్వ ఆసుపత్రులకు రావడానికి గర్భిణిలు ఇష్టపడటం లేదని వైద్యులు చెబుతున్నారు. ● కర్నూలుకు కూతవేటు దూరంలో ఉన్న గార్గేయపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు వైద్యాధికారులు, ఒక సూపర్వైజర్, ఒక ఎంపీహెచ్వో, ముగ్గురు స్టాఫ్నర్సులు, ఫార్మాసిస్టు, ల్యాబ్టెక్నీషియన్ ఉండగా ఇక్కడ ఒక మహిళా వైద్యాధికారి మినహా ఇతరులెవ్వరూ సమయపాలన పాటించడం లేదు. ఒకవేళ వచ్చినా ఆన్లైన్లో అటెండెన్స్ వేసుకుని కర్నూలుకు వెళ్లి వారి పనులు చూసుకుంటున్నారు. ఆదివారం సెలవు రోజుల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అస్సలు తెరవడం లేదు. -
ఐపీఎల్లో బెట్టింగ్ జోరు
ఈ సీజన్ ఐపీఎల్లో మొదటి మ్యాచ్ కోల్కత నైట్రెడర్స్ (కేకేఆర్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మధ్య మొదలైంది. డఫ్పా బెట్తో పాటు దాదాపు అన్ని బెట్టింగ్ యాప్లు కేకేఆర్ ఫేవరెట్ టీంగా బెట్టింగ్ నిర్వహించాయి. ఆర్సీబీపై మొదట్లో బెట్టింగ్ కాసిన వారు ఆ తర్వాత మళ్లీ కేకేఆర్పై బెట్టింగ్ కాశారు. కానీ, చివరికి ఆర్సీబీ గెలుపొందింది. దీంతో కేకేఆర్పై బెట్టింగ్ చేసిన వారంతా నిండా మునిగిపోయారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచుల్లో బెట్టింగ్ల జోరు తీరిది.సాక్షి ప్రతినిధి కర్నూలు : అందరి చేతిలో స్మార్ట్ఫోన్లు ఉండటం, ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్లో బెట్టింగ్ యాప్లు పుష్కలంగా ఉండడంతో అధికశాతం క్రికెట్ అభిమానులు ఆన్లైన్ బెట్టింగ్లో మునిగిపోతున్నారు. సెలబ్రిటీలు కూడా వీటిని ప్రమోట్ చేస్తుండడంతో రెండేళ్లుగా ఈ యాప్లు భారీగా పెరిగాయి. పైగా.. ఈసారి ప్లేయర్ల ఆక్షన్లో ఎక్కువశాతం ప్లేయర్లు జట్లు మారారు. దీంతో బెట్టింగ్ రాయుళ్లు జట్ల విజయావకాశాలను సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు. చివరికి.. వారి ఖాతాల్లోని డబ్బు ఆవిరవుతోంది. ఆఫ్లైన్ కంటే ఆన్లైన్లోనే బెట్టింగ్లు ఎక్కువగా జరుగుతుండడంతో పోలీసులకు కూడా ఇవి సవాల్గానే మారాయి. ఈ ఐపీఎల్ సీజన్ ముగిసేలోపు రూ.లక్ష కోట్లు చేతులుమారే అవకాశముందని అంచనా.బెట్టింగ్ యాప్లు ఇవే.. ఆన్లైన్ బెట్టింగ్లో ఎక్కువమంది ‘డఫ్పా బెట్టింగ్’ యాప్ను వాడుతున్నారు. దీంతో పాటు ఎక్స్ బెట్, స్కై ఎక్సే్ఛంజ్, ఫ్యాన్సీ లైఫ్, క్రికెట్ మజా, లైవ్లైన్, లోటస్, బెట్ 65, బెట్ ఫెయిర్, టెన్క్రిక్, 22 బెట్, ఫోర్రాబెట్, వన్ విన్, పారిమ్యాచ్, మెల్బెట్తో పాటు అనేక బెట్టింగ్ యాప్లు ఉన్నాయి.ఆన్లైన్ బెట్టింగ్ తీరిది..⇒ ఈ విధానంలో మ్యాచ్కు గంట ముందే కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. దాంతోనే బెట్టింగ్ కాయాలి. ⇒ మ్యాచ్కు ముందు రేటింగ్స్ ఇస్తారు. ఆ ప్రకారం పందెం వేయాలి. ⇒ మ్యాచ్ సాగేతీరును బట్టి ఇవి మారుతుంటాయి. డిపాజిట్ క్లోజ్ అయితే అప్పటికప్పుడు డిపాజిట్ చేసి బెట్టింగ్ కాసే అవకాశం ఉండదు. దీంతో చాలామంది రూ.50వేల నుంచి లక్షల రూపాయలు ముందుగానే యాప్స్లో డిపాజిట్ చేస్తున్నారు. ⇒ మ్యాచ్ పరిస్థితి, రేటింగ్స్ను బట్టి అప్పటికప్పుడు ఆకర్షితులై కూడా భారీగా బెట్టింగ్ కాస్తారు. ⇒ బెట్టింగ్లో గెలిస్తే క్షణాల్లో డబ్బు ఖాతాల్లో జమవుతుంది. ఓడిపోతే ఖాతా ఖాళీ అవుతుంది. .. ఇలా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఆన్లైన్ బెట్టింగ్ ఊబిలో చిక్కుకుని రూ.వేల నుంచి రూ.లక్షల వరకూ పొగొట్టుకుంటున్నారు.ఆఫ్లైన్ బెట్టింగ్ ఇలా.. టాస్ నుంచి బాల్ టు బాల్ వరకూ బెట్టింగ్ సాగుతుంది. టాస్ ఎవరు గెలుస్తారు? తొలి ఓవర్ స్పిన్నర్తో బౌలింగ్ వేయిస్తారా? పేసర్తో వేయిస్తారా? మొదటి ఓవర్లో ఎన్ని పరుగులు వస్తాయి? జట్టు ఎంత స్కోర్ చేస్తుంది? ఎవరు గెలుస్తారు? ఫలానా బాల్కు ఫోర్ వస్తుందా? సిక్స్ వస్తుందా? లేదా ఒక్క పరుగే వస్తుందా? ఇలా అనేక రకాలుగా బెట్టింగ్లు ఉంటాయి. ఇక బుకీలు ముంబై, హైదరాబాద్, బెంగళూరులో ఉంటారు. జిల్లా, పట్టణ కేంద్రాల్లో సబ్బుకీలు ఉంటారు. మ్యాచ్ మారుతున్న స్వరూపాన్ని బట్టి బెట్టింగ్ లెక్కలు మారుస్తారు. వీరు వాట్సప్ గ్రూపుల్లో బెట్టింగ్ ధరలు నిర్ధారిస్తారు. ఆఫ్లైన్లో బెట్టింగ్ కాసేవారు బార్లతో పాటు హోటళ్లలో కూర్చుని బెట్టింగ్ కాస్తారు. 357 రకాల వెబ్సైట్లు బ్లాక్.. బెట్టింగ్లను అరికట్టేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) 357 రకాల వెబ్సైట్లను బ్లాక్ చేసింది. వాటికి చెందిన 2,400 బ్యాంకు ఖాతాల్లో రూ.126 కోట్లను ఫ్రీజ్ చేసింది. మరో 700 యాప్లపై నిఘా ఉంచింది. అనుమతితో నడిచే బెట్టింగ్ యాప్లను టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు సోషల్ మీడియా సెలబ్రిటీలు ప్రమోట్ చేస్తున్నారు. ఈనెల 16న ఫణీంద్రశర్మ అనే వ్యక్తి ఫిర్యాదుతో హైదరాబాద్లో దగ్గుబాటి రానా, ప్రకాశ్రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీత, శ్రీముఖి, వర్షిణితో పాటు 24 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ బెట్టింగ్ ఊబిలో వ్యాపారులు, ఉద్యోగులతో పాటు యువత ఎక్కువగా చిక్కుకుంటున్నారు. -
తూతూమంత్రంగా ట్రాన్స్ఫార్మర్లు, ఇతర మెటీరియల్
గత తొమ్మిది నెలల్లో ఇదీ పరిస్థితి.. విడుదల డివిజన్ ఏడాది చేసిన కాలంగా విద్యుత్ నిరీక్షిస్తున్న కనెక్షన్లు రైతుల సంఖ్య 341 ఆదోని 3,766 310 కర్నూలు టౌన్ 1,220 351 ఎమ్మిగనూరు 2,656 179 నంద్యాల 2,427 164 ఆత్మకూరు 867 129 డోన్ 1,357 1,474 మొత్తం 12,293విద్యుత్ కనెక్షన్లకు గ్రహణం ● తొమ్మిది నెలలు గడుస్తున్నా మంజూరులో జాప్యం ● ఇప్పటి వరకు ఇచ్చిన కనెక్షన్లు 1,474 ● ఉమ్మడి జిల్లాలో 12,293 రైతుల నిరీక్షణ ● ఏడాది క్రితం డబ్బు చెల్లించినా నోరు మెదపని అధికారులు మాకు ఐదెకరాల భూమి ఉంది. రెండు బోర్లు ఉన్నాయి. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం ఏడాది క్రితం విద్యుత్ మా వాటా కింద రూ.18,600 చెల్లించాం. ఇప్పటి వరకు కనెక్షన్ ఇవ్వలేదు. పోల్స్, మెటీరియల్ కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. అదిగో ఇదిగో అని తిప్పిపంపుతున్నారు. బోర్లలో నీళ్లున్నా ఉపయోగించుకోలేకపోతున్నాం. – కమ్మరి చిన్న రంగస్వామి, జిల్లేడుబుడకల గ్రామం, దేవనకొండ మండలం మాకు ఎనిమిది ఎకరాల భూమి ఉంది. రెండు బోర్లు వేయించాం. 2023 డిసెంబర్లో విద్యుత్ కనెక్షన్ కోసం రైతు వాటాగా రూ.80 వేలు చెల్లించాం. ఇప్పటికి ఏడాది గడిచిపోయినా కనీసం పోల్స్ కూడా ఇవ్వలేదు. నీళ్లు ఉన్నా కనెక్షన్ ఇవ్వకపోవడంతో భూములను ఖాళీగా ఉంచుకున్నాం. డోన్లోని డీఇ, ఏడీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాం. – ధర్మవరం సుబ్బరాయుడు, ఓబులదేవరపల్లి గ్రామం, ప్యాపిలి మండలం కర్నూలు(అగ్రికల్చర్): వర్షాధారం కింద పంటల సాగు గాలిలో దీపంగా మారింది. బావులు, బోర్లలోని అంతంతమాత్రం నీటితో పంటలు పండించుకోవాలని ఆశించిన రైతులకు నిరాశే మిగులుతోంది. వ్యవసాయ విద్యుత్ పట్ల కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారుతోంది. కొత్త విద్యుత్ కనెక్షన్ల కోసం వేలాది మంది రైతులు డబ్బు చెల్లించి కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్నారు. విద్యుత్ కనెక్షన్ ఇస్తే బోర్ల కింద కూరగాయల పంటలు, ఆరుతడి పంటలు సాగు చేసుకోవచ్చనే ఉద్దేశంతో రైతులు ఉన్నారు. అయితే కనెక్షన్ల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతోంది. విద్యుత్ అధికారులు వేసిన ఎస్టిమేట్ల ప్రకారం డబ్బులు చెల్లించినప్పటికీ 12,293 మంది రైతులు కనెక్షన్ ఎప్పుడిస్తారో తెలియక విద్యుత్ అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. తొమ్మిది నెలల్లో 1,474 కనెక్షన్లు కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు తొమ్మిది నెలలు పూర్తవుతోంది. ఈ మధ్య కాలంలో ఇచ్చిన కనెక్షన్లు 1,474 మాత్రమే. కర్నూలు జిల్లాలో 1,002, నంద్యాల జిల్లాలో 472 మాత్రమే విడుదలయ్యాయి. నిబంధనల ప్రకారం సీనియారిటీకి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉన్నా.. టీడీపీ నేతల జోక్యంతో అర్హులకు అన్యాయం జరుగుతోందని తెలుస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా వైఎస్ఆర్సీపీ వాళ్లకు ఎలాంటి పనులు చేయరాదని బహిరంగంగా చెప్పడంతో కిందిస్థాయి టీడీపీ నేతలు మరింత చెలరేగిపోతున్నారు. పేరుకుపోతున్న దరఖాస్తులు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం రైతులు వేలాది రూపాయలు చెల్లించారు. ఉమ్మడి జిల్లాలో 12,293 మంది రైతులు తమ వాటా మొత్తం చెల్లించి కనెక్షన్ల కోసం నిరీక్షిస్తున్నారు. కర్నూలు జిల్లాలో 7,642, నంద్యాల జిల్లాలో 4,651 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పెండింగ్లో ఉండిపోయాయి. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న రైతులు మరో 6వేల మంది ఉన్నారు. ఈ రైతులకు సంబంధించి విద్యుత్ అధికారులు ఎస్టిమేట్లు వేసి డిమాండ్ నోటీసులు ఇస్తే తమ వాటా సొమ్ము చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే వ్యవసాయ విద్యుత్పై అలసత్వం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ట్రాన్స్పార్మర్లు కాలిపోతే దక్కులేదు కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేందుకు మెటీరియల్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇదే సమయంలో పాత కనెక్షన్లకు సంబంధించి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే వెంటనే ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వ్యవసాయానికి అవసరమైన ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చింది. నాటి ప్రభుత్వ ఆదేశాల మేరకు దళారీల ప్రమేయం లేకుండా.. రైతుల నుంచి ఒక్క రూపాయి వసూలు చేయకుండా ట్రాన్స్ఫార్మర్లను సరఫరా చేసి ఏర్పాటు చేయడం విశేషం. నిబంధనల ప్రకారం ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినప్పుడు కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు 24 గంటల సమయం ఉంటుంది. ఇప్పుడు వారం రోజులు దాటినా ట్రాన్స్ఫార్మర్లు సరఫరా చేయలేని పరిస్థితి. మే చివరికి పూర్తి చేస్తాం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరు ప్రక్రియ మొదలైంది. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో 1,474 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు విడుదల చేశాం. ఇంకా 12,293 కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. మే నెల చివరికి పూర్తి చేస్తాం. సీనియారిటీ ప్రకారం కనెక్షన్లు ఇస్తాం. – ఉమాపతి, ఎస్ఇ, విద్యుత్ శాఖ, కర్నూలు జిల్లా ఈ చిత్రం మద్దికెర మండలం బసినేపల్లి గ్రామంలోనిది. బోర్లలో నీళ్లు పడినా రైతులుపంటలు పండించుకోలేని పరిస్థితి. ఆరేడుగురు రైతులు 14–15 నెలల క్రితం బోర్లు వేయించుకున్నారు. బోర్లలో ఆశాజనకంగా నీళ్లు పడ్డాయి. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం ఏడాది క్రితం దరఖాస్తు చేసుకున్నారు. విద్యుత్ అధికారులు ఎస్టిమేట్లు వేశారు. రైతులు తమ వాటా మొత్తాన్ని డీడీ తీశారు. ఆ మేరకు పోల్ సరఫరా చేసి నాటారు. ఇతర మెటీరియల్ ఇవ్వకపోవడంతో నీళ్లున్నా విద్యుత్ కనెక్షన్ లేక భూములను ఖాళీగా ఉంచుకున్నారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడానికి ట్రాన్స్ఫార్మర్లతో పాటు కండక్టర్, కేబుల్ కొరత ఉంది. 2024 జూలై 25 నాటి వరకు పెండింగ్లో ఉన్న వాటికి ట్రాన్స్ఫార్మర్లు సరఫరా అయ్యాయి. పెండింగ్లో ఉన్న మొత్తం కనెక్షన్లకు ఇంకా 1,900 ట్రాన్స్ఫార్మర్లు అవసరం. ఈ ట్రాన్స్ఫార్మర్లు ఎప్పటికి వస్తాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. 2వేల కిలోమీటర్లకు కండక్టర్, కేబుల్ అవసరం కాగా.. ఇందుకోసం రైతులు తగిన మొత్తాన్ని చెల్లించారు. అయితే సరఫరా చేయడంలో ప్రభుత్వం చేతులెత్తేస్తోంది. -
27 నుంచి ఉగాది ఉత్సవాలు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలం మహా క్షేత్రంలో ఈనెల 27వ తేదీ నుంచి ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి. ఐదు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో పాల్గొనేందుకు కన్నడిగులు వేలాది మంది తరలివస్తున్నారు. ఈనెల 31వ తేదీ వరకు జరిగే మహోత్సవాల్లో ప్రతిరోజు స్వామి అమ్మవార్లకు విశేష వాహన సేవ నిర్వహిస్తారు. అలాగే కన్నుల పండువగా గ్రామోత్సవం సైతం నిర్వహించనున్నారు. ఉగాది మహోత్సవాల్లో వీరాచారా విన్యాసాలు, పంచాంగ శ్రవణం, స్వామి అమ్మవార్లకు రథోత్సవం తదితర కార్యక్రమాలు ప్రధానమైనవి. కన్నడ భక్తుల సౌకర్యార్థం శ్రీశైల దేవస్థానం ఈనెల 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి స్పర్శ దర్శనానికి అనుమతించారు. విడతల వారీగా నిర్దిష్ట వేళలలో, 10 రోజులపాటు కన్నడ భక్తులు మల్లన్నను స్పర్శ దర్శనం చేసుకునేందుకు దేవస్ధానం అధికారులు ఏర్పాట్లు చేశారు. మహోత్సవాలను పురస్కరించుకుని కన్నడిగుల సౌకర్యార్థం, శ్రీశైల దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు కల్పించిన సౌకర్యాలను యథావిధిగా ఉగాది మహోత్సవాలకు అమలు చేస్తోంది. క్షేత్ర పరిధిలో తాత్కాలిక వసతి కోసం పలు ఉద్యానవనాల్లో, ఖాళీ ప్రదేశాలలో షామియానాల ఏర్పాటు చేసింది. భక్తులకు ఉచిత, శీఘ్ర, అతి శీఘ్ర దర్శనంతో పాటు మల్లన్న స్పర్శ రూ.500 టికెట్ కౌంటర్ సైతం ఏర్పాటు చేసింది. భక్తులకు సౌకర్యవంతమైన స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశామని ఈఓ శ్రీనివాసరావు తెలిపారు. కన్నడ భక్తులు దేవస్థానానికి సహకరించేలా శ్రీశైల జగద్గురు పీఠాధిపతి వారి ప్రసంగ వీడియోని ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా ప్రసారం చేస్తున్నామన్నారు. శ్రీశైలానికి భారీగా చేరుకుంటున్న కన్నడ భక్తులు భక్తులకు విస్తృత ఏర్పాట్లు చేపట్టిన దేవస్ధానం -
పొదుపు సంఘం లీడర్లు డబ్బులు స్వాహా చేశారు
కర్నూలు: కృష్ణ వర్ష పొదుపు సంఘంలో రూ.8 లక్షలు అప్పు తీసుకుని ప్రతి నెలా కంతులు చెల్లించాం. పొదుపు సంఘంలోని లీడర్లు ఆ డబ్బును బ్యాంకుకు చెల్లించకుండా మోసం చేశారని, బ్యాంకు నుంచి తమకు నోటీసులు వచ్చాయని కర్నూలు నిర్మల్ నగర్కు చెందిన పల్లవి, రషీద, విజయలక్ష్మి, మరికొంతమంది పొదుపు సంఘం సభ్యులు ఎస్పీ విక్రాంత్ పాటిల్కు ఫిర్యాదు చేశారు. కర్నూలు రెండవ పట్టణ పోలీస్స్టేషన్ పక్కనున్న క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించి వారితో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి మొత్తం 94 ఫిర్యాదులు వచ్చాయి. వాటన్నింటిపై చట్ట పరిధిలో విచారణ జరిపి బాధితులకు తగిన న్యాయం చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరాతో పాటు సీఐలు కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని... ● నీటిపారుదల శాఖలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తామని కర్నూలుకు చెందిన సూర్యమాధవ రావు రూ.6.50 లక్షలు తీసుకుని మోసం చేశాడని కర్నూలు వెంకటరమణ కాలనీకి చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు. ● వాటర్ ప్లాంట్ ఫిట్టింగ్ చేస్తానని చెప్పి రూ.లక్ష తీసుకుని కర్నూలుకు చెందిన వారిషా వాటర్ టెక్స్ మున్నా మోసం చేశాడని కర్నూలు మద్దూర్ నగర్కు చెందిన రామ్మూర్తి ఫిర్యాదు చేశారు. ● నా పెద్ద కుమారుడు ఇల్లు రాసివ్వాలని ఇంటి కొళాయి పన్నులు కట్టకుండా ఇంటి పట్టా తీసుకెళ్లి ఇబ్బందులకు గురిచేస్తున్నాడని కర్నూలు కొత్తపేటకు చెందిన సుంకులమ్మ ఫిర్యాదు చేశారు. -
పేదలకు ‘అదనపు’ మోసం
కర్నూలు(సెంట్రల్): పేదలకు ఇళ్లస్థలాలు అందడం లేదు. ఎన్నికల సమయంలో ఒక మాట చెప్పిన టీడీపీ నేతలు.. అధికారంలోకి వచ్చాక అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పేదలు ఎవరూ ఇంటిస్థలం కావాలని అడగకుండా ఇంటి నిర్మాణం కోసం అదనపు సాయం ఇస్తామని మోసం చేస్తున్నారు. ఇళ్ల స్థలాల కోసం జిల్లాలో ఇప్పటి వరకు 39 వేల మంది పేదలు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఒక్కరికీ కూడా ఇంటిస్థలం మంజూరు చేయలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పార్టీలు, కులాలకు అతీతంగా సిక్స్ స్టెప్ వ్యాలిడేట్ ఆధారంగా ఇళ్ల స్థలాలు మంజూరు చేసింది. జిల్లాలో ఏకంగా 48 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇంటి నిర్మాణం కోసం పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే ఇళ్లస్థలాలు మంజూరు చేయడం లేదు. కొత్తగా మంజూరు చేసే ఇళ్ల స్థలాలను టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ఇవ్వొచ్చనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి. మభ్యపెట్టేందుకే అదనపు సాయం గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో 48 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఇందులో 39వేల మందికి పీఎంఏవై అర్బన్–వైఎస్ఆర్ జగనన్న పేరిట ఇళ్లను మంజూరు చేశారు. అందులో దాదాపు 22 వేల ఇళ్లనిర్మాణాలు పూర్తయ్యాయి. మరో 16 వేల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వాటిని తానే పూర్తి చేశానని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఇటీవల ఇళ్ల నిర్మాణాలకు అదనపు ఆర్థిక సాయం పేరిట జీఓ నంబర్ 9 విడుదల చేశారు. ఈ జీఓ ప్రకారం ప్రస్తుతం ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇస్తున్న రూ.1.80 లక్షలకు అదనంగా ఎస్సీ, బీసీలకు రూ.50వేలు, ఎస్టీలకు రూ.70 వేలను మంజూరు చేస్తారు. ఇందులో భాగంగా జిల్లాలో 5,170 మంది బీసీలు, 4,028 మంది ఎస్సీలు, 248 మంది ఎస్టీ లబ్ధిదారులు మొత్తం 9,446 మందికి అదనపు సాయంగా మొత్తం 47. 85 కోట్లు మంజూరు అవుతాయి. అయితే అదనపు సాయం చేయడంలో పెద్ద మతలబు ఉంది. ఆయన తాను అధికారంలోకి వస్తే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలు ఇస్తానని ఇచ్చిన హామీలను హుళక్కి చేయవచ్చే పన్నాగం ఉంది. ఎన్టీఆర్ కాలనీల్లోని ఇళ్లను పూర్తి చేస్తే ఇంకా ఎవరూ ఇంటిస్థలం కావాలని అడగరని, ఇంటి నిర్మాణం కోసం రూ.4 లక్షలు ఇవ్వాలని కోరరనే అదనపు సాయానికి పూనుకున్నట్లు తెలుస్తోంది. ఓర్వకల్లులోని జగనన్న కాలనీ ఇళ్ల స్థలాల కోసం జిల్లాలో 39 వేల మంది దరఖాస్తు ఒక్కరికీ మంజూరు కాని ఇంటిస్థలం ప్రజలను మభ్యపెట్టేందుకే అదనపు సాయం పేరు మార్చి వంచన జగనన్న కాలనీలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నోరు పారేసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా పేదలకు ఇచ్చిన సెంటున్నర స్థలం బాత్ రూమ్ నిర్మాణానికి కూడా సరిపోదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అధికారంలోకి రాగానే అదే జగనన్న కాలనీల పేర్లను ఎన్టీఆర్ కాలనీలుగా మార్చారు. ఇప్పుడు అదే ఇళ్ల నిర్మాణానికి అదనపు సాయం చేసి తాను ఇచ్చిన మేజర్ హామీలను పక్కదారి పటిస్తున్నారు. స్థలం లేని పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తానని, ఇంటి నిర్మాణం కోసం రూ.4 లక్షలు ఇస్తానని చెప్పినా హామీలను ఎవరూ అడగరు అనే కోణంలో అదనపు సాయం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నిబంధనల మేరకు ఇళ్లస్థలాలు పేదలకు ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు సచివాలయాల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. గతంలో ఎక్కడా ఇంటి స్థలం పొందని వారికే కొత్త జాబితాలో చోటు ఉంటుంది. ఎన్టీఆర్ కాలనీల్లో ఇళ్ల స్థలం ఉన్న వారు అనర్హులు అవుతారు. నిబంధనలు మేరకు ఇళ్లస్థలాలు ఇవ్వనున్నాం. – పి.రంజిత్బాషా, కలెక్టర్, కర్నూలు ప్రభుత్వంపై వ్యతిరేకత సీఎం చంద్రబాబునాయుడు ఇచ్చిన మాట ప్రకా రం పట్ట ణాల్లో 2, గ్రామీణ ప్రాంతా ల్లో 3సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలి. ఇంటి నిర్మాణం కోసం రూ.4 లక్షలు ఇవ్వాలి. మంజూరయ్యే ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణ వ్యయాలను టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ఇస్తే ప్రజలు తిరగబడతారు. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. – రామకృష్ణారెడ్డి, సీపీఐ నగర కార్యదర్శి, కర్నూలు -
డెస్క్ల సమస్య పరిష్కారం
హొళగుంద: పదో తరగతి పరీక్షల్లో భాగంగా మొదటి రోజు హొళగుంద జెడ్పీ హైస్కూల్లో డెస్క్ల సమస్య వచ్చిందని, సమస్య పరిష్కారమైందని డీఈఓ శామ్యూల్ పాల్ తెలిపారు. హొళగుందలోని పరీక్ష కేంద్రాలను సోమ వారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాటాడుతూ.. జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా సాగుతున్నాయన్నారు. డీఈఓ వెంట ఎంఈఓ–1, 2 సత్యనారాయణ, జగన్నాథం ఉన్నారు. ఏపీపీఎస్సీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లుకర్నూలు(సెంట్రల్): ఏపీపీఎస్సీ ఆన్లైన్ పరీక్షలు మార్చి 25, 26,27 తేదీల్లో జరగనున్నాయని, పడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను జేసీ డాక్టర్ బి.నవ్య ఆదేశించారు. పరీక్షలపై కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్హాలులో సోమవారం ఆమె సమీక్షించారు. కర్నూలులో ని డిజిటల్ అయాన్లో 25, 26 తేదీల్లో అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ నియామక పరీక్షలు, ఎమ్మిగనూరులోనిసెయింట్ జోసెఫ్ డిగ్రీకళాశాలలో గ్రేడు–2 అనలిస్టు నియామక పరీక్షలు జరుగుతాయన్నారు. కర్నూలులోని ఆయాన్ డిజిటల్లో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టు కోసం 27న ఆన్లైన్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. కలెక్టరేట్ ఏఓ విజయశ్రీ, ఏపీపీఎస్సీ సెక్షన్ ఆఫీసర్ ఢిల్లేశ్వరరావు పాల్గొన్నారు. ‘సిల్వర్జూబ్లీ’లో జాతీయ సదస్సు కర్నూలు సిటీ: సిల్వర్జూబ్లీ డిగ్రీ కాలేజీలో సోమవారం జాతీయ సదస్సు ప్రారంభమైంది. ప్రిన్సిపాల్ డాక్టర్ వీవీఎస్ కుమార్ అధ్యక్షత వహించారు. రెండు రోజుల పాటు ఈ సదస్సును నిర్వహించనున్నారు. క్లస్టర్ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కే వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు అనే అంశంపై నిర్వహించిన సదస్సులో పలువురు మాట్లాడారు. సదస్సుకు 130 పత్రాలు వచ్చాయి. ప్రొఫెసర్లు డాక్టర్ ఎల్లా కృష్ణ, శ్రీనివాసమూర్తి, జి.చంద్రశేఖర్, సిల్వర్జూబ్లీ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ బీఆర్ ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. -
కర్నూల్ హాస్టల్ లో దారుణం.. చిన్న పిల్లలనే కనికరం లేకుండా
కర్నూల్: జిల్లాలోని కోడుమూరు ఎస్సీ హాస్టల్ లో దారుణం చోటు చేసుకుంది. చిన్న పిల్లలు అని చూడకుండా ఏడో తరగతికి చెందిన ముగ్గురు విద్యార్థులపై పదో తరగతికి చెందిన ఓ విద్యార్థి విచక్షణా రహితంగా విరుచుకుపడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.తన బెల్టు తీసుకుని ఆ విద్యార్థులను చితకబాదాడు. తన మాట వినలేదని చెప్పి ఏడో తరగతి విద్యార్థులను దారుణంగా కొట్టాడు. దాడికి పాల్పడ్డ పదో తరగతి విద్యార్థి అనధికారంగా హాస్టల్ ఉంటున్నట్లు తెలుస్తోంది. -
అమ్మానాన్నను వీడి అనంతలోకాలకు..
నంద్యాల: బుడిబుడి నడకలతో..వచ్చీ రాని మాటలతో... ముసిముసి నవ్వులతో అందరినీ మెప్పించే ఆ చిన్నారి ఇక లేరు. ఎప్పుడూ అమ్మానాన్న వెంటే ఉండే ఆ బాలిక ఈ లోకాన్ని వీడి వెళ్లి పుట్టెడు శోకాన్ని మిగిల్చింది. ప్రమాదవశాత్తూ ఇంటి మిద్దైపె నుంచి పడి మృత్యువాత పడింది. ఈ దుర్ఘటన కోసిగి మండలం వందగల్లు గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన లంకా ఆంజనేయులు, నాగలక్ష్మి దంపతులు వ్యవసాయ కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె శ్రీదేవికి మూడేళ్లు ఉండగా.. చిన్న కుమార్తె ఏడాది వయస్సులో ఉన్నారు. ఆదివారం తల్లిదండ్రులు ఇంటి పనుల్లో నిమగ్నమై ఉండగా పెద్ద కుమార్తె శ్రీదేవి (3) ఇంటి ఆవరణలో ఆడుకుంటూ ఉంది. ఆటల్లోనే మెల్లగా మెట్లు ఎక్కి మిద్దె పైకి వెళ్లింది. అదే సమయంలో ట్రాక్టర్ శబ్దం రావడంతో తండ్రి వెళ్తున్నాడని భావించి మిద్దైపె నుంచి తొంగి చూస్తూ కింద పడిపోయింది. తలకు తీవ్రమైన రక్త గాయం కావడంతో బైక్పై కోసిగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కళ్లెదుట కుమార్తె మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. -
అమ్మానాన్నను వీడి అనంతలోకాలకు..
కోసిగి: బుడిబుడి నడకలతో..వచ్చీ రాని మాటలతో... ముసిముసి నవ్వులతో అందరినీ మెప్పించే ఆ చిన్నారి ఇక లేరు. ఎప్పుడూ అమ్మానాన్న వెంటే ఉండే ఆ బాలిక ఈ లోకాన్ని వీడి వెళ్లి పుట్టెడు శోకాన్ని మిగిల్చింది. ప్రమాదవశాత్తూ ఇంటి మిద్దైపె నుంచి పడి మృత్యువాత పడింది. ఈ దుర్ఘటన కోసిగి మండలం వందగల్లు గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన లంకా ఆంజనేయులు, నాగలక్ష్మి దంపతులు వ్యవసాయ కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె శ్రీదేవికి మూడేళ్లు ఉండగా.. చిన్న కుమార్తె ఏడాది వయస్సులో ఉన్నారు. ఆదివారం తల్లిదండ్రులు ఇంటి పనుల్లో నిమగ్నమై ఉండగా పెద్ద కుమార్తె శ్రీదేవి (3) ఇంటి ఆవరణలో ఆడుకుంటూ ఉంది. ఆటల్లోనే మెల్లగా మెట్లు ఎక్కి మిద్దె పైకి వెళ్లింది. అదే సమయంలో ట్రాక్టర్ శబ్దం రావడంతో తండ్రి వెళ్తున్నాడని భావించి మిద్దైపె నుంచి తొంగి చూస్తూ కింద పడిపోయింది. తలకు తీవ్రమైన రక్త గాయం కావడంతో బైక్పై కోసిగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కళ్లెదుట కుమార్తె మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. మిద్దైపె నుంచి పడి చిన్నారి మృతి -
రిజర్వాయర్ల విస్తరణ జరగాలి
ఆలూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉంది. జనాభా పెరిగిన నేపథ్యంలో చింతకుంట, బాపురం రిజర్వాయర్లను విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దశాబ్దాల క్రితం వేసిన పైప్లైన్ల లీకేజీలతో అనేక గ్రామాల్లో నీటి సమస్య ఉత్పన్నమవుతోంది. అలాగే ఆలూరు చెరువు అన్యాక్రాంతం కాకుండా ఎస్ఎస్ ట్యాంకు నిర్మించాల్సి ఉంది. అలాగే సమ్మతగేరిలో ఎస్ఎస్ ట్యాంకు, జే హొసళ్లి, బండగట్టులో ఓహెచ్ఎస్ఆర్లు నిర్మించాలి. దేవనకొండ మండలం కొత్తపేట, పుల్లాపురం గ్రామాలకు పైప్లైన్ వేయాలి. పందికోన రిజర్వాయర్ నుంచి పైప్లైన్ వేస్తే ఆస్పరి మండలంలోని పలు గ్రామాల నీటి సమస్య తీరే అవకాశం ఉంటుంది. – బీ విరూపాక్షి , ఆలూరు ఎమ్మెల్యే శాశ్వత పరిష్కారం చూపాలి ఆస్పరి మండలంలోని జొహరాపురం గ్రామానికి శాశ్వత మంచినీటి పరిష్కారం చూపాలి. పలుమార్లు అధికారులు, రాజకీయ నాయకుల దృష్టికి తీసుకువెళ్లినా సమస్యకు పరిష్కారం లభించడం లేదు. అనేక సంవత్సరాలుగా గ్రామంలోని వక్కిరేణి నీటిని తాగుతూ ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఒక ట్యాంకర్ రూ.800 పెట్టి కొనుగోలు చేస్తున్నారు. గ్రామ సమీపంలో రిజర్వాయర్ నిర్మించి హంద్రీనీవా కాలువ నుంచి పైప్లైన్ ద్వారా నిల్వ చేస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. – చంద్ర, జొహరాపురం, ఆస్పరి మండలం చర్యలు చేపడతాం ప్రస్తుత వేసవిలో జిల్లాలో తాగునీటి ఎద్దడికి గురయ్యే గ్రామాలను ఇప్పటికే క్షేత్ర స్థాయిలోని అధికారుల ద్వారా నివేదికలు తెప్పించుకొని గుర్తించాం. ఆయా గ్రామాల ప్రజల నీటి కష్టాలను తొలగించేందుకు అవసరమైన ముందస్తు చర్యలను చేపడతాం. అవసరమున్న జనవాసాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు కార్యాచరణను రూపొందించాం. ఎల్ఎల్సీకి నీరు బంద్ కాకముందే మరోసారి కెనాల్ పరిధిలోని ఎస్ఎస్ ట్యాంకులన్నింటినీ నింపుకుంటాం. ఇప్పటికే వేసవిలో నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు రూ.6.91 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. – బీ నాగేశ్వరరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ● -
శ్రీమఠంలో ‘న్యాయసుధ’ మహోత్సవం
మంత్రాలయం: శ్రీరాఘవేంద్ర స్వామి మఠంలో ప్రతి ఏటా శ్రీమన్ న్యాయసుధ మంగళ మహోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆదివారం శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల నేతృత్వంలో మంగళ మహోత్సవం వైభవంగా ప్రారంభమైంది. వివిధ పీఠాధిపతులు జ్యోతి ప్రజ్వలనతో మహోత్సవానికి అంకురార్పణ పలికారు. మహోత్సవంలో భాగంగా రాఘవేంద్ర స్వామి రచించిన శ్రీమన్ న్యాయసుధ గ్రంథంపై వ్యాక్యార్థగోష్టి నిర్వహించారు. ముందుగా వేద వ్యాసుడి పూజోత్సవం, శ్రీమన్ న్యాయసుధ శోభయాత్ర భక్తులను అలరించింది. వేడుకలో వ్యాసరాజ మఠం పీఠాధిపతి విద్యాశ్రీషా తీర్థులు, శ్రీపాదరాజ మఠం పీఠాధిపతి సుజయనిధి తీర్థులు, కృష్ణాపుర మఠం పీఠాధిపతి విద్యాసాగర తీర్థులు, కనియూరు మఠం పీఠాధిపతి విద్యావల్లభతీర్థులు, శిరూర్ మఠం పీఠాధిపతి వేదవర్ధన తీర్థులు, అధమారు మఠం పీఠాధిపతి ఈషాప్రియ తీర్థులు, బందరకెరె మఠం పీఠాధిపతి విద్ద్యేశ తీర్థులు, కన్వమఠం పీఠాదిపతి విద్యాకన్వ విరాజ తీర్థులు, బాలఘర్ మఠం పీఠాధిపతి అక్షోభ్య రామ ప్రియతీర్థులు , చిత్తాపూర్ మఠం పీఠాధిపతి విద్ద్యేంద్ర తీర్థులు, ఉడిపి మఠం పీఠాధిపతులు బన్నంజే రాఘవేంద్ర తీర్థులు, వామన తీర్థులు పాల్గొన్నారు. -
కేజీబీవీ పిలుస్తోంది!
● అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం ● వచ్చే నెల 11వ తేదీ వరకు గడువు కర్నూలు సిటీ: కస్తూర్భా గాంధీ బాలిక విద్యాలయాల్లో (కేజీబీవీల్లో) అడ్మిషన్లకు ప్రతి ఏటా పోటీ పెరుగుతోంది. 2025–26 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం ఇటీవలే నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఆన్లైన్లో శనివారం నుంచి వచ్చే నె ల 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాపౌట్స్(మధ్యలో చదువు మానేసిన వారు), పేద, బడుగు, బలహీన, మైనార్టీ, బీపీఎల్ కుటుంబాల్లోని బాలికలు మాత్రమే అర్హులు. అర్హులైన వారు https:// apkgbv.apcfss.in అనే వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకే... బాలికల్లో అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు 2004–05 విద్యా సంవత్సరంలో కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలను ఏర్పాటు చేశారు. 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు మొదటగా ఏర్పాటు చేసిన స్కూళ్లలలో 9,10 తరగతులకు అప్గ్రేడ్ చేశారు. ఇక్కడ చదువుతున్న బాలికలు సెకెండరీ విద్యకు దూరం అవుతున్నారని గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ స్కూళ్లలో ఇంటర్మీడియెట్, వృత్తివిద్య కోర్సులను ప్రవేశ పెట్టింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 54 కస్తూర్బా గాంఽధీ బాలిక విద్యాలయాలు ఉండగా.. 6 నుంచి 10వ తరగతి వరకు, అలాగే ఇంటర్మీడియేట్ విద్య, వృత్తి విద్యా కోర్సులు ఆంగ్ల మాధ్యమంలో అందిస్తున్నారు. ప్రతి తరగతికి 40 సీట్లు ఉన్నాయి. మైనార్టీలకు ప్రత్యేక కేజీబీవీలు, ఉర్దూ మీడియంలో సైతం ఓ కేజీబీవీ స్కూల్ అందుబాటులో ఉంది. -
ఎకై ్సజ్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
కర్నూలు: ఎకై ్సజ్ శాఖలో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుళ్ల అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక కోలాహలంగా సాగింది. మూడేళ్లకు ఒకసారి సాగాల్సిన అసోసియేషన్ ఎన్నికలు తొమ్మిదేళ్లుగా వాయిదా పడుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆదివారం స్థానిక ఎకై ్సజ్ కార్యాలయంలో అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక నిర్వహించారు. ఎన్నికల అధికారిగా ఈఎస్టీఎఫ్ సీఐ కేఆర్ రాజేంద్రప్రసాద్ వ్యవహరించారు. కర్నూలు ఏసీ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో పనిచేస్తున్న ఎర్రల వెంకట గిరిబాబు పూర్వపు అధ్యక్షుడు ఓబులేసుపై 86 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. మొత్తం 207 మంది ఓటింగ్లో పాల్గొనగా, గిరిబాబుకు 146, ఓబులేసుకు 60 ఓట్లు రాగా, ఒక ఓటు చెల్లలేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం 14 ఎకై ్సజ్ స్టేషన్లు, నంద్యాల కర్నూలు పీఎస్ కార్యాలయాలు, ఈఎస్టీఎఫ్, మోబైల్ పార్టీ, చెక్పోస్టులు, ఎన్ఫోర్స్మెంట్ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఓటింగ్లో పాల్గొని నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అలాగే అసోసియేట్ అధ్యక్షులుగా ఎస్ఆర్ అబ్దుల్మాలిక్, ఉపాధ్యక్షులుగా బలరాముడు, పీ విరుపాక్షిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా విజయ్కుమార్, ఆర్టనైజింగ్ కార్యదర్శిగా జయచంద్రుడు, సహాయ కార్యదర్శులుగా నక్కా సుధాకర్, పాలొళ్ల జగదీష్, ప్రెస్ సెక్రెటరీలుగా కేసీ శ్రీనివాసులు, డీ దస్తగిరి, కోశాధికారిగా కల్పన, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా జీ రాణి, ఎం రవికుమార్, కే వెంకటరాముడు, డీ చిన్న అల్లస్వామి ఎన్నికయ్యారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా గిరిబాబు, విజయ్కుమార్ -
ఉల్లాస్... ఉత్తుత్తి పరీక్ష!
కర్నూలు సిటీ: ఉల్లాస్ కార్యక్రమం కింద చదువు నేర్పించకుండానే ఆదివారం పరీక్ష నిర్వహించారు. ‘ఉల్లాస్’ కింద స్వయం సహాయక సంఘాల్లో నిరక్షరాస్యులను గుర్తించి వారికి చదువు నేర్పాలి. జిల్లాలోని కర్నూలు, కల్లూరు, ఓర్వకల్లు, సి.బెళగల్, దేవనకొండ, కృష్ణగిరి, కోడుమూరు, ఆస్పరి, కోసిగి మండలాల్లోని 28,872 మంది పొదుపు మహిళలకు 2,887 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎంపిక చేసిన కేంద్రాల్లో అక్షర జ్ఞానాన్ని నేర్పించే కార్యక్రమాన్ని వయోజన విద్యకు చెందిన సూపర్వైజర్లు పర్యవేక్షణ చేయాలి. కానీ వారు జిల్లా కేంద్రానికి పరిమితమై పర్యవేక్షణ చేయలేకపోయారు. కొన్ని కేంద్రాల్లో స్వచ్ఛందంగా పొదుపు సంఘాల్లోని చదువుకున్న వారు అక్షరాలను నేర్పించినా...అది సంతకాల వరకే పరిమితం అయ్యింది. కొన్ని చోట్ల మినహా చాలా చోట్ల చదువు చెప్పించకపోయినా కూడా ఆదివారం పరీక్ష నిర్వహించారు. మెజార్టీ కేంద్రాల్లో డీఆర్డీఓ గుర్తించిన నిరక్షరాస్య మహిళలు కాకుండా వారి పిల్లలు, అప్పటికే చదువుకున్న వారికి పరీక్ష నిర్వహించారు. కొన్ని చోట్ల పరీక్ష నిర్వహించకుండానే మహిళలతో సంతకాలు చేయించుకున్నట్లు తెలుస్తోంది. తనిఖీ చేసిన డీడీ జిల్లాలో ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పరీక్షను వయోజన శాఖ డీడీ చంద్రశేఖర్ రెడ్డి తనిఖీ చేశారు. ఓర్వకల్లు మండలంలోని పాలకొల్లు గ్రామంలోని కేంద్రాన్ని పరిశీలించారు. ఆయన వెంట పర్యవేక్షకులు నెమలయ్య ఉన్నారు. -
‘పశుసంవర్ధక’ సంఘాలు ఏకగ్రీవం
కర్నూలు(అగ్రికల్చర్): పశుసంవర్ధక శాఖలో మూడు సంఘాలకు ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి. కర్నూలులోని కొండారెడ్డిబురుజు సమీపంలోని బహుళార్ధ పశువైద్యశాల ప్రాంగణంలో నాన్ గ్రాడ్యుయేట్ వెటర్నేరియన్స్ ఫెడరేషన్ ఉమ్మడి జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముఖ్య అథితిగా రాష్ట్ర ఫెడరేషన్ చైర్మన్ సేవానాయక్ హాజరయ్యారు. పశుసంవర్ధక శాఖలో ప్రభుత్వ గుర్తింపు పొందిన వెటర్నరీ అసిస్టెంట్స్ అసోసియేషన్, లైవ్స్టాక్ అసిస్టెంట్స్ సర్వీస్ అసోసియేషన్, జూనియర్ వెటర్నరీ అఫీసర్స్ అసోసియేషన్/ వెటర్నరీ లైవ్స్టాక్ అఫీసర్స్ అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవంగా నిర్వహించారు. ● ఆంధ్రప్రదేశ్ నాన్ గ్రాడ్యుయేట్ వెటర్నేరియన్స్ ఫెడరేషన్ ఉమ్మడి జిల్లా శాఖ చైర్మన్గా జి.వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా బజారి, ఉపాధ్యక్షులుగా జనార్దన్రెడ్డి, రాముడు,వెంకట రమణయ్య, ప్రధాన కార్యదర్శిగా రంగన్న, కోశాధికారిగా గంగ ఎన్నికయ్యారు. ● లైవ్స్టాక్ అసిస్టెంట్స్ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జీసీ సుబ్బరాయుడు, అసోసియేట్ ప్రసిడెంటుగా భరత్కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఆయేశ్వరి, కోశాధికారిగా రాజేష్ ఎన్నికయ్యారు. ● వెటర్నరీ అసిస్టెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా స్రవంతి, అసోసియేట్ అధ్యక్షుడుగా మద్దిలేటి, ప్రధాన కార్యదర్శిగా హనుమంతు, కోశాధికారిగా శశిధర్ ఎన్నికయ్యారు. ● ఏపీ ఎన్జీవో అసోసియేషన్ జిల్లా నాయకులు జవహర్లాల్, సాంబశివారెడ్డి, రమణ, భాస్కరనాయుడు, ఆర్గనైజింగ్ సెక్రటరీ పి.రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం కోవెలకుంట్ల: కోవెలకుంట్ల– ఆళ్లగడ్డ ఆర్అండ్బీ రహదారిలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఎస్ఐ మల్లికార్జునరెడ్డి అందించిన సమాచారం మేరకు.. సంజామల మండలం కానాలకు చెందిన మేడిగ దానియేలు(45) వ్యవసాయ, ఉపాధి పనులకు వెళుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సొంత పనుల నిమిత్తం స్కూటీపై ఆళ్లగడ్డకు వెళుతుండగా పట్టణ శివారులోని పేరా బిల్డింగ్ వద్ద అటువైపే వెళుతున్న టర్బో లారీ వెనుక వైపు నుంచి స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దానియేలు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య రాణి, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. లారీ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వెళుతుండటంతో ప్రమాద ఘటనను చూసిన వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దొర్నిపాడు వద్ద లారీని ఆపి పోలీసులు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి శవపరీక్ష నిమత్తం మృతదేహాన్ని కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
నేడు అర్జీల స్వీకరణ
కర్నూలు(సెంట్రల్): కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు అర్జీలను సమర్పించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జాతీయ పోటీల్లో స్వర్ణం కర్నూలు (టౌన్): అహ్మదాబాదులో ఈనెల 20 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించిన సీనియర్ జాతీయ బధిరుల (డెఫ్) టెన్నిస్ క్రీడలో కర్నూలు క్రీడాకారిణి జాఫ్రీన్ బంగారు పతకం సాధించింది. కర్నూలులో డిప్యూటీ రిజిస్ట్రార్ కో–ఆపరేటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్న ఆమె మహిళల సింగిల్స్ విభాగంలో స్వర్ణం, అలాగే నంద్యాల జిల్లాకు చెందిన చందన్తో కలిసి మిక్స్డ్ డబుల్స్ విభాగంలో బంగారు పతకం సాధించింది. దీంతో ఈ ఏడాది నవంబర్లో జపాన్ దేశంలో నిర్వహించనున్న అంతర్జాతీయ బధిరుల ఒలింపిక్స్లో పాల్గొనేందుకు అర్హత సాధించింది. ఈ సందర్భంగా క్రీడా సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘాకర్నూలు: జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోటు చేసుకుంటున్న సంఘటనలను దృష్టిలో ఉంచుకొని జిల్లా పోలీస్ శాఖ రౌడీ షీటర్ల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ఆదివారం జిల్లా అంతటా పోలీస్ స్టేషన్ల వారీగా 584 మంది రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. నేర ప్రవృత్తికి స్వస్తి పలికి గౌరవ ప్రదమైన జీవితం కొనసాగించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా రౌడీ షీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులకు కౌన్సెలింగ్ ఇస్త్తూనే, కొత్తగా కేసుల్లో ఇరుక్కున వారి జాబితాను సిద్ధం చేస్తున్నారు. స్టేషన్ల వారీగా రౌడీ షీటర్లు జీవనోపాధికి చేస్తున్న వృత్తులపై కూడా ఆరా తీస్తున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటే, పోలీస్ శాఖ పరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సబ్ డివిజన్ల వారీగా రౌడీ షీటర్లు ఇలా ... జిల్లాలోని వివిధ సబ్ డివిజన్ల వారీగా 584 మంది రౌడీ షీటర్లు ఉన్నారు. అందులో కర్నూలు సబ్ డివిజన్ పరిధిలో 199 మంది, ఆదోని 87, పత్తికొండ 112, ఎమ్మిగనూరులో 186 మంది ఉన్నారు. -
జలం ఇవ్వలేక చేతి పంపులు ‘బోరు’మంటున్నాయి. బిందె నీటిని కూడా ఇవ్వలేక మంచినీటి పథకాలు దిష్టిబొమ్మల్లా మారాయి. చుక్కనీరు అందక పల్లెల్లో ‘దాహం’ కేకలు వినిపిస్తున్నాయి. మంచినీటి కోసం పనులు మానుకొని ప్రజలంతా ఇంటి వద్దే ఉండాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయ
హొళగుంద మండలం నెరణికి గ్రామంలో నీటి కోసం బిందెలను తీసుకొచ్చిన దృశ్యం● ఎండాకాలంలో ప్రజలకు అందని మంచినీరు ● తుంగభద్ర దిగువ కాలువ ఉన్నా తప్పని తిప్పలు ● 76 గ్రామాల్లో నీటి ఎద్దడి ఉంటుందని అధికారుల అంచనా ● రూ.6.91 కోట్ల ప్రతిపాదనలు పంపినా కనిపించని ఫలితం ● అడుగంటుతున్న ఎస్ఎస్ ట్యాంకుల్లోని నీటి నిల్వలుకర్నూలు(అర్బన్): వేసవి కాలం ప్రారంభం కావడం, భూగర్భ జలాలు అడుగంటడం తదితర కారణాలో జిల్లాలో అనేక గ్రామాలు తాగునీటి ఇబ్బందులను చవిచూస్తున్నాయి. పల్లెల్లో చేతిపంపులు పనిచేయకపోవడంతో ప్రజలు వ్యవసాయ బావులు, బోర్లపై ఆధారపడ్డారు. తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొని జిల్లా పశ్చిమ ప్రాంతంలో పరిస్థితి దయనీయంగా మారింది. పలు గ్రామాల్లో సమీపంలోని ఎస్ఎస్ ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నా ప్రజల అవసరాలకు సరిపోవడం లేదు. కొంతమేర ముందస్తు చర్యలు చేపట్టినా.. ఆయా ఎస్ఎస్ ట్యాంకుల్లోని నీటి నిల్వలు రోజు రోజుకు తగ్గిపోతుండడంతో భవిష్యత్తును తలచుకొని ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు రిజర్వాయర్లు, ఎస్ఎస్ ట్యాంకుల నుంచి సరఫరా అవుతున్న నీరు చివరి గ్రామాల వరకు వెళ్లకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నీరు బంద్ అయితే.. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న ఎస్ఎస్ ట్యాంకులన్నీ తుంగభద్ర దిగువ కాలువ (ఎల్ఎల్సీ) నీటిపై ఆధారపడినవే. ఈ నీటిని ఈ నెలాఖరు, ఏప్రిల్ 10వ తేదీన బంద్ చేసే అవకాశాలు ఉన్నట్లు నీటిపారుదల అధికారులు చెబుతున్నారు. ఈ నీరు బంద్ అయితే ఈ నీటిపై ఆధారపడిన ఎస్ఎస్ ట్యాంకుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారనుంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వేసవి ప్రారంభంలోనే ఎల్ఎల్సీ నీటితో ఆయా ప్రాంతాల్లోని ఎస్ఎస్ ట్యాంకులన్నింటినీ మందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఒకటికి రెండు సార్లు నింపారు. దీంతో నీటి సమస్య ఎక్కడా ఉత్పన్నం కాలేదు. ప్రస్తుతం ఎస్ఎస్ ట్యాంకుల్లో కూడా 50 నుంచి 75 శాతం నీటి నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరు నాటికి ఈ నిల్వలు మరింత తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికై నా ఎల్ఎల్సీ నీటితో మరోసారి ఆయా ట్యాంకులను నింపుకోగలిగితే కొంత ఉపశమనం లభించే అవకాశాలు ఉంటాయి. స్పందించని ప్రభుత్వం జిల్లాలో ప్రస్తుత వేసవిలో 76 గ్రామాలు తీవ్ర మంచినీటి ఎద్దడికి గురయ్యే ప్రమాదం ఉందని, ఆయా గ్రామాల్లో వేసవి దాహార్తిని ఎదుర్కొనేందుకు రూ.6.91 కోట్లు వ్యయం కానుందని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. ఇప్పటికే అనేక గ్రామాల్లో ట్రాన్స్పోర్టేషన్, హైరింగ్ ద్వారా నీటిని అందించాల్సిన పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాగునీటికి 2 కిలోమీటర్లు వెళ్లాల్సిందే విద్యుత్ తీగలు తెగిపోవడం, పైప్లైన్ పనులు జరుగుతున్న నేపథ్యంలో గోనెగండ్ల మండలం బీ అగ్రహారం గ్రామానికి చెందిన ప్రజలు గత వారం రోజులుగా గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలోని వ్యవసాయ బోర్ల నుంచి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. సైకిళ్లు, తోపుడు బండ్లు, మోటారు సైకిళ్లపై బిందెలు వేసుకొని పోయి నీటిని తెచ్చుకుంటున్నారు. అలాగే మండల కేంద్రమైన గోనెగండ్లలో కూడా నాలుగు రోజులకు ఒకసారి నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బైలుప్పల, హెచ్ కై రవాడి గ్రామంలోని బీసీ, జమ్మన్న కాలనీల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. అలాగే ఎమ్మిగనూరు మండలంలోని అల్వాల ఎస్ఎస్ ట్యాంకు నుంచి మూడు రోజులకు ఒకసారి నీరు వదులుతుండడం వల్ల పెసలదిన్నె, గార్లదిన్నె తీవ్ర మంచి నీటి ఎద్దడి నెలకొంది.గ్రామీణం.. ప్ర‘జల’ కష్టం ఆలూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన అనేక గ్రామాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొనింది. హాలహర్వి మండలం బాపురం రిజర్వాయర్ నుంచి 27 గ్రామాలకు, చింతకుంట రిజర్వాయర్ నుంచి 11 గ్రామాలకు నీటిని సరఫరా చేయాల్సి ఉంది. అయితే పైప్లైన్లు లీకేజీ కావడం, ఓహెచ్ఎస్ఆర్లు శిథిలావస్థకు చేరడంతో పదుల సంఖ్యలో గ్రామాలకు నీరందని పరిస్థితి నెలకొనింది. చింతకుంట రిజర్వాయర్ కింద టీ చాకిబండ, మల్లికార్జునపల్లి, అమృతాపురం, బళ్లూరు తదితర గ్రామాలకు నీరు అందడం లేదు. బాపురం రిజర్వాయర్ కింద ఆస్పరి మండలంలోని చిన్నహోతూరు, జోహరాపురం, నాగనాథనహళ్లి రిజర్వాయర్ కింద చిగిలి, తంగరడోణ, అలాగేర, శంకరబండ, నగరూరు గ్రామాల్లో ప్రజల క‘న్నీటి’ కష్టాలు కనిపిస్తున్నాయి. ఎండుతున్న గొంతులుహొళగుంద మండలం విరుపాపురం ఎస్ఎస్ ట్యాంకు నుంచి నీరు సరఫరా కాకపోవడంతో నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెరణికి గ్రామంలో 2 వేల జనాభా ఉందని, 100 కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా స్పందన కరువైంది. అ లాగే మంత్రాలయం మండలంలోని చెట్నేహళ్లి, కల్లుదేవకుంట గ్రామాలకు ఎన్ఏపీ స్కీం నుంచి నీరు అందడం లేదు. గొంతులు ఎండుతున్నా యని, తాగునీటి సమస్య తీర్చాలని ఆయా గ్రామాల ప్రజలు ఇటీవలే ఎన్ఎహ్ 167పై రాస్తారోకో నిర్వహించారు. అయినా స్పందన లే దు. ఎన్ఏపీ స్కీం నుంచి నందవరం మండలం ఇబ్రహీంపురం, ఇబ్రహీంపురం కొట్టాల, మంత్రాలయంతోపాటు మరో మూడు గ్రామాలకు అరకొరగా నీరు సరఫరా అవుతోంది. అంతటా నీటి ఎద్దడేపత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గలి మండలం లింగనేనిదొడ్డి, పత్తికొండ మండలం అటికెలగుండు, దేవనబండ, చక్రాళ్ల, పెండ్లిమాన్ తండా, కృష్ణగిరి మండలం బాపనదొడ్డి, పెద్దొడ్డి, బోయబొంతిరాళ్ల గ్రామాల్లో నీటి ఎద్దడి ఏర్పడింది. అలాగే ఆదోని మండలం బసరకోడు, అలసందగుత్తి, దిబ్బనకల్, నెట్టేకల్, చిన్న పెండేకల్, పెద్ద పెండేకల్, బైచిగేరి తదితర గ్రామాల్లో బోర్లు సరిగా పనిచేయడం లేదు. పైప్లైన్లు సక్రమంగా లేకపోవడం వల్ల నీటి ఇబ్బందులు తలెత్తాయి. జిల్లాలో చాలా గ్రామాల్లో నీటి ఎద్దడి కనిపిస్తోంది. -
పేలిన వంట గ్యాస్.. ముగ్గురికి గాయాలు
ఆలూరు రూరల్: వంట గ్యాస్ లీకై సిలిండర్ పేలడంతో ముగ్గురు గాయపడ్డారు. ఇందులో గురుస్వామి, ధర్మ అనే బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. మండలంలోని కురువళ్లి గ్రామంలో ఆదివారం తెల్లవారు జామున ప్రమాదం జరిగింది. ఎస్ఐ మహబూబ్ బాషా తెలిపిన వివరాలు.. కురువళ్లి గ్రామానికి చెందిన గురుస్వామి తన భార్య గాయత్రి, కుమరుడు ధర్మతో కలిసి ఇంట్లో నిద్రపోయారు. ఆదివారం తెల్లవారు జామున చుట్టుపక్కల వారు.. గ్యాస్ లీకై న వాసన వస్తోందని గురుస్వామికి చెప్పారు. ఆయన లైట్ ఆన్ చేయగానే ఒక్క సారిగా లీకై న గ్యాస్ మంటలు చెలరేగి పెద్ద శబ్దం వచ్చింది. ప్రమాదంలో గురుస్వామి, కుమారుడు ధర్మ తీవ్రంగా గాయపడ్డారు. గాయత్రికి స్వల్పగాయాలయ్యాయి. ఇల్లు ధ్వంసమైంది. క్షతగాత్రులను ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆదోని ఆసుపత్రికి రెఫర్ చేశారు. ప్రస్తుతం గాయపడిన తండ్రి, కొడుకు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయత్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. గాయపడిన వీరిలో ఇద్దరి పరిస్థితి విషమం -
శ్రీశైలానికి వెళ్తుండగా ప్రమాదం
కోడుమూరు రూరల్: కర్ణాటక రాష్ట్రంనుంచి శ్రీశైలానికి వెళ్తున్న కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు వ్యక్తులు గాయపడ్డారు. దుర్ఘటన ఆదివారం కోడుమూరు–కర్నూలు రోడ్డులో ప్యాలకుర్తి వద్ద చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్రం దావణగేరి జిల్లా నరసగండ్ల హల్లి గ్రామానికి చెందిన మురుగేంద్రయ్య, పద్మావతి, గౌరమ్మలతో పాటు మరో నలుగురు వ్యక్తులు కలిసి శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు బయలుదేరారు. కోడుమూరు దాటిన తర్వాత ప్యాలకుర్తి వద్ద కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో మురుగేంద్రయ్య, పద్మావతి, గౌరమ్మలకు రక్తగాయలవ్వగా, మిగిలిన నలుగురు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం కోడుమూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కోడుమూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కారును ఢీకొన్న లారీ.. ఏడుగురికి గాయాలు -
నైతిక విలువలకు ప్రాధాన్యం
కర్నూలు(సిటీ): రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో నైతిక విలువలు, నాణ్యమైన విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఏపీ ప్రైవేట్ ఆన్ ఎయిడ్ స్కూల్స్ యాజమాన్య సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు వీ జనార్దన్రెడ్డి, గౌరవాధ్యక్షులు జీ పుల్లయ్య అన్నారు. ఆదివారం స్థానిక సెయింట్ జోసఫ్ డిగ్రీ కళాశాలలో నగరంలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రైవేట్ ఆన్ ఎయిడెడ్ పాఠశాలల గుర్తింపును 8 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు పెంచాలన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఇంటి స్థలాలను, ఆరోగ్యశ్రీ కార్డులను, ఇళ్లు నిర్మించుకునేందుకు తక్కువ వడ్డీతో రుణాలను ఇప్పించాలన్నారు. సమావేశంలో సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎస్ శ్రీనివాసరెడ్డి, జిల్లా గౌరవాధ్యక్షులు సీఆర్ షాహిదా, పట్టణ అధ్యక్షులు బీ యుగంధర్, కార్యదర్శులు కే శ్రీనివాస్, బీ మాధవక్రిష్ణతో పాటు జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన అధ్యక్ష, కార్యదర్శులు, కోశాధికారులు, స్కూళ్లకు అవసరమైన స్టాల్స్ స్టేషనరీ, యూనిఫామ్స్, లేబరెటరీ, సీసీ కెమెరాలు, కంప్యూటర్స్, ఎల్ఈడీ ప్యానల్స్, బోర్డ్స్, బుక్ పబ్లిషర్స్ పాల్గొన్నారు. ఏపీ ప్రైవేట్ ఆన్ ఎయిడ్ స్కూల్స్ యాజమాన్య సంఘం నేతలు -
బీసీల హక్కులను కాలరాస్తున్న పాలకులు
కర్నూలు(అర్బన్): పాలక పార్టీలు బీసీల హక్కులను కాలరాస్తున్నాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక బీ క్యాంప్లోని బీసీ భవన్లో జిల్లా అధ్యక్షుడు మురళీమోహన్ అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు వై నాగేశ్వరరావుయాదవ్, ప్రధాన కార్యదర్శి టీ మద్దులేటి, ప్రచార కార్యదర్శి ఎం. రాంబాబు, వైఎస్సార్పీపీ మహిళా విభాగం రాష్ట్ర నాయకురాలు భారతి, ఉపాధక్షులు గ్యాస్ శ్రీనివాసులు, రజక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాడాల నాగరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా నక్కలమిట్ట శ్రీనివాసులు మాట్లాడుతూ.. బీసీ కులగణన చేపట్టి జనాభా నిష్పత్తి మేరకు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లకై ఉద్యమాలను చేపడుతామన్నారు. దేశంలో, రాష్ట్రంలో బీసీల ప్రయోజనాలను దెబ్బతీస్తూ వారి హక్కులను కూడా హరిస్తున్నారన్నారు. కార్యక్రమంలో గొర్రెల పెంపకందారుల సంఘం చైర్మన్ శ్రీనివాసులు, పలు బీసీ కుల సంఘాల నాయకులు నాగేంద్రయాదవ్, శకుంతల, ఉప్పరి శివన్న, ధర్మ, పీజీ వెంకటేష్, సాయి తదితరులు పాల్గొన్నారు. జిల్లా కమిటీలో పలువురికి చోటు ... ఈ నేపథ్యంలోనే బీసీ సంక్షేమ సంఘం జిల్లా కమిటీలో పలువురికి స్థానం కల్పించి నియామక పత్రాలను అందించారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా కుమ్మరి రామక్రిష్ణ, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలిగా కుమ్మరి రాజేశ్వరి, కార్యదర్శిగా కే శ్రీనివాసులు, కోశాధికారిగా కే బజారన్న, కే గిరిబాబు, సహాయ కార్యదర్శిగా ఎం రవికుమార్, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా ఏ నాగార్జున, జిల్లా కమిటీ ఉపాధ్యక్షులుగా బీ రాధ, కార్యదర్శిగా సీ రేణుక, కే లింగన్నను నియమించారు. -
కర్రలపై 450 కి.మీ పాదయాత్ర
దారి పొడవునా వడివడిగా అడుగులు వేసుకుంటూ కన్నడిగులు శ్రీగిరి వైపు సాగిపోతున్నారు. వారిలో కొందరు కాళ్లకు కర్రలకు కట్టుకుని నడుస్తూ భక్తిని చాటుతున్నారు. కర్ణాటక రాష్ట్రం భాగల్కోట్ జిల్లా నీల్లోఖేరీ గ్రామానికి చెందిన కృష్ణగౌడు ఆరు అడుగుల ఎత్తైన కర్రలతో, మంజునాథ్ తల్వార్, మండేస్దేవూర్ శివ్దళ్వార్, హనుమంత్తల్వార్ నాలుగు అడుగుల ఎత్తైన కర్రలతో శ్రీశైలానికి వెళ్తున్నారు. తొమ్మిది రోజుల క్రితం బయలుదేరి దాదాపు 450 కి.మీ ప్రయాణించి జూపాడుబంగ్లా చేరుకున్నారు. మల్లన్న స్వామి తమ కోర్కెలు నెరవేర్చడంతో కర్రలపై నడుస్తూ మొక్కు తీర్చుకుంటామని వారు తెలిపారు. – జూపాడుబంగా్ల -
ఆకట్టుకోని పవన్ ప్రసంగం
పాణ్యం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు కావస్తున్నా ఇప్పటికీ తాము చేసిన అభివృద్ధి ఇదీ అని చెప్పుకోలేకపోతున్నారు. ఎంతసేపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై విమర్శలు చేయడంతోనే సరిపెడుతున్నారు. శనివారం కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఇదే పంథా కొనసాగించారు. దీంతో ఆయన ప్రసంగానికి ప్రజల నుంచి స్పందన కరువైంది. కార్యక్రమం నిర్వహించిన ఊరి పేరు పూడిచెర్ల అనబోయి ఉప్పలపాడుగా సంభోదించారు. సభకు పొదుపు సంఘాల మహిళలను పెద్ద ఎత్తున తరలించారు. అయితే పవన్ ప్రసంగిస్తుండగానే మహిళలు ఇంటిబాట పట్టడం కనిపించింది. ఇకపోతే కర్నూలు జిల్లాలో కూటమి ఎమ్మెల్యేలు పది మంది ఉండగా.. కార్యక్రమంలో ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే పాల్గొనడం గమనార్హం. -
పిడుగుపాటుతో రైతుకు అస్వస్థత
గోనెగండ్ల: వర్షం కురుస్తూ.. ఉరుములు, మెరుపు రావడంతో పొలం నుంచి ఇంటికి వస్తున్న రైతు అస్వస్థతకు గురయ్యాడు. చేతికి, వీపుకు గాయలై స్పృహ కోల్పోయి పడిపోయాడు. ఈ ఘటన గోనెగండ్ల గ్రామ సమీపంలో శనివారం చోటుచేసుకుంది. గోనెగండ్లకు చెందిన అంగడి మాబుసాహె బ్ అనే రైతు గ్రామ శివారులో తనకు ఉన్న మూడు ఎకరాల భూమిలో సజ్జ పంటను సాగు చేశాడు. శనివారం సాయంత్రం పొలానికి వెళ్లగా అనుకోకుండా ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు వస్తుండడంతో మాబు సాహెబ్ ఇంటికి వెళ్లేందుకు తన బైకు దగ్గరకు వచ్చి స్పృహ కోల్పోయి పడిపోయాడు. ఆ దారిలో ఆటోలో వెళ్తున్న ఇతర రైతులు, కూలీలు స్పృహ కోల్పోయి పడిఉన్న రైతును గమనించి గోనెగండ్ల ఆస్పత్రికి తీసుకువచ్చారు. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఆటోలో ఎమ్మిగనూరు ఆస్పత్రికి తరలించారు. -
శ్రీశైలానికి తరలివస్తున్న కన్నడిగులు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల క్షేత్రానికి కన్నడిగులు భారీగా తరలివస్తున్నారు. ఉగాది మహోత్సవాలు సమీపిస్తుండటంతో వేలాది మంది భక్తులు పాదయాత్రగా, వాహనాల్లో చేరుకుంటున్నారు. కర్ణాటక, మహారాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తజనంతో క్షేత్ర వీధులు కిటకిలాడుతున్నాయి. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి బారులుదీరారు. ఉగాది ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీ వరకు కన్నడ భక్తుల కోసం విడతల వారీగా మల్లన్న స్పర్శదర్శనాన్ని ఏర్పాటు చేశారు. కన్నడ భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగుతుంది. -
విత్తనాల డీలర్లకు లైసెన్స్ తప్పనిసరి
కర్నూలు(అగ్రికల్చర్): విత్తనాల డీలర్లకు తప్పనిసరిగా లైసెన్స్ ఉండాలని, ఎరువులు, పురుగుమందులు కూడా లైసెన్స్తోనే విక్రయించాలని రాష్ట్ర వ్యవసాయ అధికారుల సంఘం జనరల్ సెక్రటరీ డాక్టర్ ప్రవీణ్ అన్నారు. వ్యవసాయ శాఖ రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఫర్టిలైజర్ దుకాణాలు నిర్వహించుకోవాలని సూచించారు. కర్నూలు, పత్తికొండ సబ్ డివిజన్లోని మండలాలతో పాటు గోనెగండ్ల మండలాలకు చెందిన డీలర్లకు జిల్లా వ్యవసాయ అధికారుల సంఘం నాయకులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ...ప్రతి డీలరు లైసెన్స్ కాపీలను దుకాణంలో అందరికి కనిపించే విధంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి మాట్లాడుతూ.. ఎరువులు, విత్తనాలకు కొంతమంది కృత్రిమ కొరత సృష్టిస్తుంటారని, ఇది మంచిది కాదన్నారు. ఈ సందర్బంగా డీలర్లకు ఉపయోగపడే విధంగా కరదీపిక బుక్లెట్ను విడుదల చేశారు. జిల్లా వ్యవసాయ అధికారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు విశ్వనాథ్, దస్తగిరిరెడ్డి, ఆత్మ డీపీడీ శ్రీలత, ఏడీఏలు సాలురెడ్డి, మహమ్మద్ ఖాద్రీ, మోహన్విజయ్, అరుణకుమారి, తెలుగు రాష్ట్రాల సీడ్మెన్ అసోషియేషన్ అధ్యక్షుడు మురళీధర్రెడ్డి, ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల డీలర్ల సంక్షేమ సంఘం నేతలు అశోకానందరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారుల సంఘం నేతలు రామకృష్ణ, మధుమతి తదితరులు పాల్గొన్నారు. -
చట్టాలపై అవగాహన అవసరం
కర్నూలు(అర్బన్): బాలల పరిరక్షణ, బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపులకు సంబంధించిన చట్టాలపై అవగాహన పెంచుకోవాలని డీసీపీఓ శారద కోరారు. శనివారం సాయంత్రం స్థానిక పెద్దపాడులో జేజే యాక్ట్, పోక్సో యాక్ట్పై బాలల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శారద మాట్లాడుతూ బాల బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపుల నుంచి రక్షించేందుకు 2012లో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింద న్నారు. బాల బాలికలపై ఎక్కడైనా లైంగిక వేధింపులు జరిగితే ఫిర్యాదు చేసేందుకు నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా ఆన్లైన్ ద్వారా ఈ బాక్స్ ఏర్పా టు చేయడం జరిగిందన్నారు. లీగల్ కం ప్రొఫెషనల్ ఆఫీసర్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ 18 సంవత్సరాల లోపు బాలబాలికలు ఎవరైనా నేరాలకు గురైనప్పుడు అలాంటి వారిని బాలల న్యాయమండలి ముందు ప్రవేశ పెడతామన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్లు జమీలబేగం, చోటీమాబేగం,ప్రొటెక్షన్ ఆఫీసర్ పద్మ, నాన్ ప్రొటెక్షన్ ఆఫీసర్ దీపారాణి, డీసీపీయు సిబ్బంది శ్వేత పాల్గొన్నారు. -
ఉల్లాస్.. తుస్..!
ఒక్క రోజూ కూడా తరగతులు నిర్వహించ లేదు మాది కానాల గ్రామం. ఇక్కడ ఒక్క రోజు కూడా అభ్యసనా తరగతులు నిర్వహించలేదు. మాకు ఒక్క పాఠ్యపుస్తకం ఇవ్వలేదు. అసలు ఉల్లాస్ కార్యక్రమం గురించే తెలియదు. పరీక్షలు ఎక్కడ పెడతారు? ఏమి రాయాలో తెలియదు. అధికారులెవ్వరూ ఒక్క రోజూ కూడా రాలేదు. మమ్మల్ని ఏమి అడగలేదు. – కమాల్బీ, నిరక్షరాస్యురాలు, కానాల, నంద్యాల మండలం తరగతులు నిర్వహించారు ఉల్లాస్ కార్యక్రమంలో ప్రతి గ్రామంలో వలంటీర్లు రోజూ అభ్యసనా తరగతులు నిర్వహించారు. తాను, మా సిబ్బంది పర్యవేక్షించాం. ఫొటోలు కూడా మా ఉన్నతాధికారులకు అప్లోడ్ చేశాం. పరీక్షలు రాసే విధంగా అభ్యాసకులను ఇప్పటికే సిద్ధం చేశాం. –భాస్కరరెడ్డి, నోడల్ ఆఫీసర్, నంద్యాల ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అంటారు. మహిళ చదువుకుంటే ఆమెలో ఆత్మవిశ్వాసం పెరిగి పిల్లల పెంపకంతో పాటు ఆర్థిక వ్యవహరాల్లో స్వతంత్య్రంగా వ్యవహరించనుంది. కుటుంబానికి సారథిగా ఎదిగి రాణించే అవకాశం కలుగుతుంది. ఈ నేపథ్యంలో మహిళల్లో అక్షరాస్యత శాతం పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అధికారుల నిర్లక్ష్యంతో లక్ష్యం నీరుగారిపోతుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉల్లాస్ కార్యక్రమం అధికారుల పర్యవేక్షణ లేక తుస్స్మంది. నేడు పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా ఇప్పటి వరకు పలు చోట్ల అభ్యసన తరగతులు చేపట్టకపోవడం, పుస్తకాలు సైతం పంపిణీ చేయకపోవడం విడ్డూరం. నంద్యాల(న్యూటౌన్): గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులైన మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉల్లాస్ కార్యక్రమం జిల్లాలో తుస్సుమంది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో ఎక్కడా అభ్యసనా తరగతులు సక్రమంగా నిర్వహించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నేడు ఆదివారం జరగనున్న అర్హత పరీక్ష గురించి వారికి తెలియదంటున్నారంటే అధికారుల తీరు ఎలా ఉందో అర్థమవుతోంది. ప్రస్తుత రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు నిరక్షరాస్యత అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో ఉల్లాస్ పేరుతో చదవడం, రాయడం నేర్పించే ప్రయత్నం చేస్తున్నారు. పొదుపు సంఘాల మహిళలు, పాఠశాలల్లో పని చేస్తున్న వంట ఏజెన్సీ నిర్వాహకులు, ఆయాలు, అంగన్వాడీ కేంద్రాల ఆయాలకు రాత్రి పూట రెండు గంటల పాటు అభ్యసనా తరగతులు నిర్వహించాలి. జిల్లాలోని ప్రతి మండలం నుంచి 1000 మంది చొప్పున మొత్తం 26,784 మందిని గుర్తించారు. వీరికి గత ఏడాది డిసెంబర్ 24 నుంచి తొలి విడతగా అభ్యసనా తరగతులు ప్రారంభించారు. వీరిలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఎక్కువ మంది మహిళలు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులే. వీరికి బోధించేందుకు ప్రతి పది మందికి ఒకరు చొప్పున సంఘంలో విద్యావంతులైన ఒక స్వచ్ఛంద శిక్షకురాలిని నియమించారు. రోజుకు రెండు గంటల పాటు ఆయా గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రం, సామాజిక భవనం, ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఎక్కడో ఒక చోట అభ్యసనా తరగతులు నిర్వహించాలి. అభ్యసనా సామగ్రి కూడా ప్రభుత్వం అందజేసింది. అయితే ఉల్లాస్ కార్యక్రమంలో గ్రామాల్లో అభ్యసనా తరగతులు తూతూ మంత్రంగా సాగినట్లు తెలుస్తోంది. నమోదైన మహిళలందరికీ వలంటీర్లు ప్రాథమిక అక్షరాస్యత పరీక్ష ఈ నెల 23వ తేదీన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ ద్వారా నిర్వహించేందుకు సన్నద్ధం చేశారు. ఎలా రాయాలో? ఏమి రాయాలో! ఈనెల 23న ఉల్లాస్ పరీక్ష ఉండటంతో అభ్యసకులు ఆందోళన చెందుతున్నారు. గ్రామాల్లో ఎక్కడా సక్రమంగా అభ్యసనా తరగతులు జరగలేదని.. ఎక్కడో జరిగినా అవి తూతూ మంత్రంగా జరిగాయని విమర్శలు వినిపిస్తున్నాయి. సంబంధిత అధికారులు కూడా ఉల్లాస్ శిక్షణ తరగతులు పర్యవేక్షణ చేయలేదని, అక్కడక్కడా ఫొటోలకు ఫోజులిచ్చి వెళ్లిపోయారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. డ్వాక్రా మహిళలు కనీసం ఒక్క రోజూ కూడా అభ్యసన తరగతులు నిర్వహించలేదని, చదువుకునేందుకు ఒక్క పాఠ్యపుస్తకం ఇవ్వలేదు చెబుతున్నారు. ఈ నెల 23వ తేదీన అర్హత పరీక్ష నిర్వహిస్తారని తెలిసిందని, ఆ పరీక్షలో ఏమి రాయాలో, ఎలా రాయా లో తెలియక ఆందోళనగా ఉందని చెబుతున్నారు. ఉల్లాస్ కార్యక్రమంలో అభ్యసనా తరగతుల నిర్వహణకు ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు పెట్టి పాఠ్య పుస్తకాలు, అభ్యాసకుల హాజరు పట్టికలు ముంద్రించింది. వాటిని పూర్తి స్థాయిలో పంపిణీ చేయక పోవడంతో స్థానిక వెలుగు కార్యాలయాల్లో మూల న మగ్గుతున్నాయి. మహిళలందరినీ విద్యావంతు లు చేయాలనే కేంద్ర ప్రభుత్వం లక్ష్యానికి అధికారులుతూట్లు పొడుస్తున్నారని, రూ.కోట్లు ప్రజాధనం వృథా అవుతుందని జిల్లాలో పలువురు విమర్శిస్తున్నారు. జిల్లాలో ఇలా.. పరీక్ష కేంద్రాలు : 760 పరీక్ష రాయనున్న వారు : 26,784 పరీక్ష తేదీ : 23-03-2025 సమయం : ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు గ్రామాల్లో కానరాని అభ్యసనా తరగతులు అధికారుల పర్యవేక్షణ కరువు నేడు పరీక్ష ..అభ్యాసకుల ఆందోళన జిల్లాలో పరీక్షకు హాజరు కానున్న 26,784 మంది -
టిప్పర్ కింద పడి వ్యక్తి దుర్మరణం
బేతంచెర్ల: ఆర్ఎస్ రంగాపురం గ్రామంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. గూడూరు మండలం నాగలాపురం గ్రామానికి చెందిన కురువ సుధాకర్, తన సోదరుడు కుమారుడు శివతో కలిసి మద్దిలేటి నరసింహస్వామి ఆలయానికి బైక్పై వచ్చారు. స్వామి దర్శనం అనంతరం స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా ఆర్ఎస్ రంగాపురం గ్రామంలో ప్రమాదవశాత్తు బైక్ అదుపుతప్పి కింద పడటంతో టిప్పర్లు టైర్ల కురువ సుధాకర్ (44)పై ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. శివ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరు కుని ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రాణం తీసిన విద్యుదాఘాతం ఆదోని అర్బన్: విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతిచెందాడు. ఈ దుర్ఘటన శనివారం ఆదోని మండలం సాదాపురం గ్రామంలో చోటు చేసుకుంది. తాలూకా పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన 16 మంది ఆదోని మండలం సాదాపురం గ్రామంలో త్రీఫేజ్ విద్యుత్ లైనింగ్ పనులు చేస్తున్నారు. రెండు ట్రాన్స్ఫార్మర్లు ఉండగా.. ఒకదానిని మాత్రమే ఆఫ్ చేశారు. రెండో ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేయకుండా పనులు చేస్తుండగా.. జార్ఖండ్ రాష్ట్రంలోని లోడాసోయి గ్రామానికి చెందిన జయరామ్పార్థర్(24) విద్యుత్షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని బంధువులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తు న్నట్లు పోలీసులు చెప్పారు. ఈతకు వెళ్లి బాలుడి మృతి కోడుమూరు రూరల్: ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు ఒక బాలుడు నీటమునిగి మృతిచెందాడు. ఈ ఘటన శనివారం పులకుర్తి గ్రామంలో చో టు చేసుకుంది. గ్రామానికి చెందిన సత్యన్న, మల్లీశ్వ రీ దంపతుల పెద్ద కుమారుడు వరుణ్తేజ్ (7) కోడుమూరులోని ఓ ప్రైవేట్ స్కూల్లో 2వ తరగతి చదువుతున్నాడు. అయితే ఒంటిపూ ట బడులు కావడంతో శనివారం మధ్యాహ్నం పాఠశాల నుంచి ఊరికి వెళ్లాడు. ఇంటి సమీపంలో ఉన్న సుంకులమ్మ వంకకు బాలుడు ఈతకు వెళ్లాడు. అయితే ఈత సరిగా రాకపోవడం, వంక లోతుగా ఉండడంతో వరుణ్తేజ్ నీటిలో మునిగిపోయాడు. చుట్టుపక్కల ఎవ్వరూ లేకపోవడంతో బాలుడు నీట మునిగి మృతిచెందాడు. కూలి పనికి వెళ్లి వచ్చిన తండ్రి కుమారుడి కోసం వెత కగా వంకలో మృతదేహం కనిపించింది. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు నీట ము నిగి మృతిచెందడంతో అప్పుడే నూరేళ్లు నిండా యా నాన్న అంటూ ఆ తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు చూపరులను సైతం కంటతడి పెట్టించింది. బాలుడు నీట మునిగి మృతిచెందడంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. -
చిల్లర కొరత తీరింది
మాది జనరల్ స్టోర్. రూ.10 నుంచి రూ.5వేల వరకు వివిధ రకాల వస్తువులు విక్రయిస్తాం. వీటిని కొనుగోలు చేసేందుకు ప్రతిరోజూ ఎంతో మంది వస్తుంటారు. ఈ క్రమంలో చిల్లర కొరత బాగా ఎదురయ్యేది. ముఖ్యంగా రూ.10, రూ.20 నోట్ల కొరత కారణంగా ఇబ్బంది పడేవాళ్లం. డిజిటల్ పేమెంట్స్ రాకతో చిల్లర సమస్య తీరింది. 90 శాతం మంది వీటి ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. – జి.రాజశేఖర్, వ్యాపారి, కర్నూలు 80 శాతం పైగా డిజిటల్ పేమెంట్సే.. మాకు హోటల్, కంప్యూటర్ విడిభాగాల వ్యాపారాలు ఉన్నాయి. కోవిడ్కు ముందు ఎక్కువగా లావాదేవీలన్నీ నగదు రూపంలో జరిగేవి. కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కరూ డిజిటల్ పేమెంట్ చేస్తున్నారు. 80 నుంచి 90 శాతం వీటినే వినియోగిస్తున్నారు. ఫలితంగా మాకు కూడా ప్రతిరోజూ బ్యాంకుకు వెళ్లి డబ్బులు జమ చేసే శ్రమలేదు. మా వద్ద పనిచేసే ఉద్యోగులకు మాత్రం వారి సౌలభ్యం కోసం నగదు రూపంలో జీతం ఇస్తున్నాం. – భూమా కిశోర్, వ్యాపారి, కర్నూలు ఎంత ఖర్చు చేస్తున్నామో తెలియట్లేదు గతంలో డబ్బు చేతిలో ఉంటే చూసి ఖర్చు పెట్టేవారం. నగదు రూపంలో డబ్బులు ఉండటం వల్ల దేనికెంత ఖర్చు చేస్తున్నామో తెలిసేది. కానీ ఇప్పుడంతా డిజిటల్ పేమెంట్స్ కావడంతో ఎంత ఖర్చు చేస్తున్నామో అర్థంకాని పరిస్థితి. తెలియకుండానే నెలలో 20 నుంచి 30 శాతం ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నాం. – సాయిరామ్, ప్రభుత్వ ఉద్యోగి, కర్నూలు -
బ్యాంకుల్లోనూ పలుచబడిన జనం
ఒకప్పుడు బ్యాంకులకు వెళ్తే అక్కడ పనిపూర్తి చేసుకుని తిరిగి రావడానికి గంట నుంచి రెండు గంటల సమయం పట్టేది. కోవిడ్ తర్వాత ఈ పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చింది. అప్పటి వరకు వివిధ రకాల పథకాల సొమ్ము అకౌంట్లో ప్రభుత్వం వేస్తే దానిని తీసుకోవడానికై నా బ్యాంకులకు, ఏటీఎంలకు వెళ్లేవారు. ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ కారణంగా డబ్బు ఎలా వస్తుందో, ఎలా పోతుందో కూడా తెలుసుకోలేకపోతున్నారు. దాదాపుగా అన్ని చోట్లా ఏటీఎంలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. రుణాలను సైతం బ్యాంకు యాప్ల ద్వారానే నిమిషాల్లో తీసుకునే సౌలభ్యం వచ్చింది. కేవలం కరెంట్ బ్యాంకు ఖాతాలు ఉన్న కొద్ది మంది వ్యాపారులు మాత్రమే పెద్ద మొత్తంలో డబ్బులు వేయడానికి, డ్రా చేయడానికి మాత్రమే బ్యాంకులకు వెళ్తుండటం గమనార్హం. ఖాతాల్లో మార్పులు, చేర్పులు చేసుకోవడానికి, అనుమానాలు తీర్చుకోవడానికి మాత్రమే బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. -
వడగండ్లు.. కడగండ్లు
కర్నూలు(అగ్రికల్చర్)/సి.బెళగల్: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వడగండ్లతో కూడిన అకాల వర్షాలు కురిశాయి. దీంతో పలు గ్రామాల్లో దాదాపు గంటకుపైగా విద్యుత్ సరఫరా నిలిపోయింది. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వడగండ్ల వానలతోపాటు గాలి తీవ్రత ఉండటంతో పలుచోట్ల మామాడితోటల్లో కాయలు నేలరాలాయి. చాలా చోట్ల రాళ్లతో కొట్టినట్లుగా వర్షం కురిసింది. సి.బెళగల్తో పాటు కంబదహాల్, కృష్ణదొడ్డి, వెల్దుర్తి, ఆస్పరి మండలంలో చిన్నహోతూరులో భారీ చినుకులలో వడగండ్లు కురిశాయి. వర్షాలతో భానుడి భగభగలు కొద్దిగా తగ్గడంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఊరట పొందారు. ఆది, సోమవారాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. -
కోసిగిలో ‘గరివిడి లక్ష్మీ’ షూటింగ్
కోసిగి: గరివిడి లక్ష్మీ చిత్ర యూనిట్ సభ్యులు శనివారం కోసిగిలోని దొరల ఇంటి ఆవరణలో షూటింగ్ చేశారు. గరివిడి లక్ష్మీ అనే సినిమాలో ఆనంది హీరోయిన్గా నటిస్తున్నారు. కోసిగిలోని దొరల ఇంటిలో గ్రామీణ ప్రాంత సర్పంచ్ సన్నివేశం చిత్రీకరించారు. సాయంత్రం గ్రామ సమీపంలో ఓ మొక్కజొన్న పైరులో మరికొన్ని సన్నివేశాలు చీత్రికరిస్తున్నట్లు యూనిట్ సభ్యులు తెలిపారు. గ్రామంలో దొరల ఇంటిలో షూటింగ్ జరుగుతుండడంతో చుట్టు పక్కల గ్రామాల నుంచి ప్రజలు చూడడానికి ఎగపడ్డారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీస్ బందోబస్తు కల్పించారు. -
లెక్కలేకుండా ఖర్చు పెట్టేస్తున్నారు
ఆన్లైన్ లావాదేవీల కారణంగా బ్యాంకు ఖాతా ఖాళీ అయ్యేవరకు మనం ఎంత ఖర్చు పెట్టామో తెలియని పరిస్థితి. దీనికితోడు ఏ వస్తువును ఎంతకు కొనుగోలు చేస్తున్నారో కూడా తెలియకుండా, బేరమాడకుండా కొనేస్తున్నారు. సాధారణంగా మనం కిరాణా దుకాణానికి వెళ్తే సరుకులకు దేనికి ఎంత బిల్లు వేశాడో చూస్తాము. కానీ డిజిటల్ పేమెంట్స్ కారణంగా ఇవేమీ పట్టించుకోవడం లేదు. షాపువారు ఎంత చెబితే అంత చెల్లించి వచ్చేస్తున్నారు. దీనివల్ల డబ్బు విలువ చాలా మందికి తెలియకుండా పోతోంది. ముఖ్యంగా ఈ తరం యువతకు అస్సలు తెలియడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
చంద్రబాబుకు తొత్తుగా మందకృష్ణ మాదిగ
● మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి కర్నూలు(టౌన్): మరుగున పడిన ఎస్సీ వర్గీకరణను ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్ రెడ్డి యూపీఏ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఉషా మెహ్రా కమిషన్ వేయించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి అన్నారు. శనివారం సాయంత్రం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పుడు మాదిగ జాతికి ప్రతినిధిగా చెప్పుకునే మందకృష్ణ మాదిగ చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరిస్తున్నారన్నారు. రాజకీయ పదువుల్లో కూడా రాష్ట్రంలో ముగ్గురు మాదిగ కులస్థులకు జిల్లా పరిషత్ చైర్మన్ పదువులు ఇచ్చి గౌరవం కల్పించిన ఘనత దివంగత వైఎస్సార్కే దక్కుతుందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి ప్లీనరీలోనే ఎస్సీ వర్గీకరణ అంశంపై తీర్మానం చేశారన్నారు. 30 ఏళ్లకు పైగా పోరాటంలో మాదిగలకు సుప్రీం కోర్టు తీర్పు వల్ల న్యాయం జరుగుతుందని, దీన్ని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోందన్నారు. చంద్రబాబు నాయుడు ఇప్పటికై నా రెండు కళ్ల సిద్ధాంతం మానుకోవాలని, సుప్రీం కోర్టు తీర్పు లేకపోతే ఆయన ఎప్పటికీ వర్గీకరణకు ఆమోదం తెలిపేవాడు కాదన్నారు. ఎస్సీ వర్గీకరణ సాధనలో అమరులైన ఏడుగురికి రూ.25లక్షల ఎక్స్గ్రేషియా ఇప్పించాలని మందకృష్ణను డిమాండ్ చేశారు. -
పెరిగిన అనవసర ఖర్చు
● ధర తెలుసుకోవడం దాదాపుగా మానేశారు ● రూ.5 మొదలు వేల రూపాయల లావాదేవీలు ఆన్లైన్లోనే.. ● తలకిందులవుతున్న ఫ్యామిలీ బడ్జెట్ ● ఎంత సంపాదిస్తున్నా ఇట్టే అయిపోతుందనే భావన ● కోవిడ్ తర్వాత అన్నీ డిజిటల్ చెల్లింపులే.. ● చిల్లర కొరత నేపథ్యంలోనూ మారిన తీరు● ఆదోనికి చెందిన నాగేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. చిరుద్యోగమే అయినా 20 ఏళ్లకు పైగా సీనియారిటీ ఉండటంతో జీతం రూ.లక్షకు పైగా వస్తోంది. మొదట్లో తాను ఖర్చుచేసిన ప్రతిదీ ఓ పుస్తకంలో రాసుకునే అలవాటు ఉండేది. అన్ని ఖర్చులు పోను నెలకు 30శాతం దాకా మిగిలేది. కానీ ఇటీవల డిజిటల్ అకౌంట్లో ఖర్చు పెడుతూ లెక్క రాసుకోవడం మానేశాడు. నెల తిరిగేసరికి బ్యాంకు ఖాతా ఖాళీ అవుతోంది. ఎందుకిలా అని ప్రశ్నించుకుంటే ఆన్లైన్లో తెలియకుండానే తానే ఖర్చు చేస్తున్నట్లు తెలుసుకున్నాడు.● కర్నూలు నగరంలోని ఎ.క్యాంపునకు చెందిన వెంకట్ ఓ ప్రైవేటు కంపెనీలో ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారు. ఆయన జీతం నెలకు రూ.60వేలు. వచ్చిన జీతంతో ఇంట్లోని నలుగురు కుటుంబసభ్యులతో హాయిగా జీవిస్తున్నాడు. అయితే ఇటీవల కాలంలో నెలాఖరుకు అకౌంట్లో డబ్బులన్నీ అయిపోయినట్లు గమనిస్తున్నాడు. ఇంత డబ్బు ఏమైందని పరిశీలిస్తే అదంతా డిజిటల్ పేమెంట్స్ ద్వారా తానే ఖర్చు చేసినట్లు నిర్ధారించుకున్నాడు. కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో ప్రస్తుతం అన్ని రకాల వ్యాపారాలు ఎక్కువగా డిజిటల్ పేమెంట్స్ ద్వారానే సాగుతున్నాయి. ఒకప్పుడు ఫోన్ పే, గూగుల్ పే లాంటివి ఉపయోగించాలంటే భయపడే జనం ఇప్పుడు అవలీలగా లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఎంతగా అంటే రూ.5 నుంచి వేల రూపాయల వరకు ఆన్లైన్లోనే చెల్లింపులు చేస్తున్నారు. ఏదైనా కొనుగోలు చేసినా, ఎవరికై నా డబ్బు పంపాలన్నా, అప్పు ఇవ్వాలన్నా, తీసుకున్న రుణం తీర్చాలన్నా, ఇతర ఎలాంటి లావాదేవీలైనా సరే డిజిటల్ పేమెంట్ తప్పనిసరి అవుతోంది. ఎంత ఖర్చు పెడుతున్నారో తెలియనంతగా వీటి వినియోగం ఉంటోంది. అయితే పెట్టే ఖర్చు మొత్తం బ్యాంకు ఖాతా ద్వారానే జరుగుతోంది. దీన్నిబట్టి ఎవరికి ఎంత డబ్బులు వస్తున్నాయి, ఎంత ఖర్చు చేస్తున్నారు, ఎంత ఏఏ ఖాతాలకు మళ్లిస్తున్నారు, ఎవరెవరికి చెల్లిస్తున్నారు, వీరికి ఎవరి నుంచి డబ్బులు వస్తున్నాయనే విషయాలన్నీ బ్యాంకుల వారికి తెలిసిపోతోంది. అది చిన్న మొత్తమైనా, పెద్ద మొత్తమైనా సరే అన్ని వివరాలు ఆన్లైన్ పేమెంట్స్ ద్వారా మనకు తెలియకుండానే బ్యాంకులకు/ప్రభుత్వానికి చెప్పేస్తున్నాయన్న మాట. కోవిడ్ తర్వాత ఊపందుకున్న పేమెంట్స్ డిజిటల్ పేమెంట్స్ రూపంలో పదేళ్ల క్రితం డెబిట్, క్రెడిట్కార్డులు, గిఫ్ట్కార్డులు వచ్చాయి. కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసి వాటిని వ్యాపార దుకాణాల్లో స్క్రాచ్ చేసి డబ్బులు చెల్లించేవారు. కొంత కాలం తర్వాత ఇవే కార్డుల ద్వారా ఆన్లైన్లోనే వస్తువులను కొనుగోలు చేసే అవకాశం వచ్చింది. కోవిడ్ అనంతరం వ్యాపార లావాదేవీల్లో మరింత సరళతరం వచ్చింది. అప్పటి వరకు స్తబ్దుగా ఉన్న ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్ల ద్వారా జనం డబ్బు చెల్లించడం, తీసుకోవడం ప్రారంభించారు. కోవిడ్ కారణంగా డబ్బుల మార్పిడి వల్ల ఎక్కడ వైరస్ అంటుకుంటుందోనని భయపడి ఈ పేమెంట్స్కు అలవాటు పడ్డారు. ఎంతగా అంటే రూ.5ల కొనుగోలుకు సైతం ఫోన్ పే, గూగుల్ పే ద్వారా డబ్బులు చెల్లిస్తున్నారు. మొదట్లో ఇలా డబ్బులు తీసుకోవడానికి ఇష్టపడని వ్యాపారులు సైతం క్రమంగా అంగీకరించక తప్పని పరిస్థితి. చిల్లర కొరత కారణంగా కూడా డిజిటల్ పేమెంట్స్ ఊపందుకున్నాయి. డబ్బులు ఏట్లో పారేసినా లెక్క పెట్టి పారేయాలన్నది పెద్దల మాట. అంటే చేతితో డబ్బులు లెక్క పెట్టి పారేస్తూ ఉంటే దాని విలువ తెలుస్తుందని భావన. అలాగే మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయినీ ఏదైనా పుస్తకంలో రాసుకుంటే నెల చివరలో దేనికెంత ఖర్చు పెట్టాము.. ఎక్కడ అనవసరంగా ఖర్చు చేస్తున్నాము.. ఏ ఖర్చులు తగ్గించుకోవాలి.. ఎక్కడ మిగిలించాలనే విషయాలు తెలుస్తాయి. దీన్ని బట్టే ఫ్యామిలీ బడ్జెట్ రూపొందించుకోవచ్చు. కానీ ఇటీవల డిజిటల్ పేమెంట్స్, ఆన్లైన్ కొనుగోళ్ల పుణ్యమా అని ఎంత డబ్బు వస్తున్నా ఇట్టే అయిపోతోంది. లెక్క పెట్టకుండా ఖర్చు చేయడం వల్లే ఈ సమస్య వస్తోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. -
రేపు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులను సమర్పించుకోవచ్చన్నారు. కార్యక్రమాన్ని కలెక్టరేట్తో పాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తామన్నారు. వైద్యులకు ఏఐ ఎంతో ఉపయోగం కర్నూలు(హాస్పిటల్): రోగులకు వైద్య సేవలు అందించడంలో వైద్యులకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) ఎంతో ఉపయోగపడుతుందని కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ అన్నారు. శనివారం కళాశాలలోని కమ్యూనిటీ మెడిసిన్ విభాగంలో ‘ప్రజారోగ్య రీసెర్చ్లో కృత్రిమ మేధస్సు పాత్ర’ అనే అంశంపై ఇంటర్నీస్, పీజీ విద్యార్థులతో సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ మాట్లాడుతూ.. వైద్యరంగంలో ఇమేజింగ్ టెక్నాలజీ, డేటా అనలైజేషన్ మొదలైన విభాగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ మంచి ఫలితాలు ఇస్తోందన్నారు. రాబోయే కాలంలో ప్రజారోగ్యానికి అవసరమయ్యే ఏఐని ఉపయోగించుకుని చక్కటి ప్రణాళికలు రూపొందించుకోవచ్చని చెప్పారు. కమ్యూనిటీ మెడిసిన్ హెచ్వోడీ డాక్టర్ పి. సుధాకుమారి మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్తో తక్కువ సమయంలో లక్షలాది మంది రోగుల డేటాను అనలైజ్ చేయవచ్చన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్కు అవసరమైన మేరకు ఉపయోగించుకోవాలని, ప్రతి దానికీ దాని మీదే ఆధారపడితే వైద్యులకు, రోగులకు మధ్య హ్యూమన్ టచ్ మిస్ అవుతుందని కొందరు అన్నారు. ఏఐలో డేటా, సాంకేతిక తేడాలు వస్తే ఫలితాలు కూడా ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. సెమినార్లో ప్రొఫెసర్ డాక్టర్ సింధియా శుభప్రద, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అరుణ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డీసీహెచ్ఎస్లు డాక్టర్ స్వర్ణకుమారి, డాక్టర్ రవినాయక్, డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ పుష్పలత, డాక్టర్ ప్రవీణ, డాక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. శ్రీశైల దేవస్థానానికి భారీగా విరాళాలు శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానానికి పలువురు భక్తులు భారీగా విరాళాలు సమర్పించారు. శనివారం రంగారెడ్డి జిల్లా బాలాపూర్కు చెందిన కనకదుర్గ అన్నప్రసాద వితరణకు రూ.2,00,232 విరాళాన్ని సహాయ కార్యనిర్వహణాధికారి జి.స్వాములకు అందజేశారు. అలాగే నెల్లూరుకు చెందిన బి.పల్లవి ప్రాణధాన ట్రస్ట్కు రూ.1,00,011, గోసంరక్షణనిధి పథకానికి బి.మౌనిక రూ.1,00,011, అన్నప్రసాద వితరణకు యామిని సురేష్ రెడ్డి రూ.1,00,011, అన్నప్రసాద వితరణకు బసిరెడ్డి శ్రీనివాసరెడ్డి రూ.1,00,011, గో సంరక్షణ నిధి పథకానికి బసిరెడ్డి సాయిచరణ్ రూ.1,00,011 విరాళాన్ని అందజేశారు. ఆయా విరాళాలను క్యూలైన్ల సహాయ కార్యనిర్వహణాధికారి జి.స్వాములుకు అందజేశారు. విరాళాలు అందించిన దాతలకు దేవస్థానం తరుఫున స్వామివారి శేషవస్త్రాలను, లడ్డూప్రసాదాలను, జ్ఞాపికలను అందించి సత్కరించారు. -
జెడ్పీ నిధుల తగ్గింపుతో ఇబ్బందులు
కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ (జెడ్పీ)లకు విడుదల చేస్తున్న 15వ ఆర్థిక సంఘం నిధులను 15 శాతం నుంచి 10 శాతానికి తగ్గించడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. జిల్లాకు వచ్చిన పీఆర్అండ్ఆర్డీ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్కుమార్, డైరెక్టర్ కృష్ణతేజను శనివారం కలిసి వినతిపత్రం అందించారు. జెడ్పీకి 15 శాతం కింద రూ.25 కోట్ల మేర నిధులు విడుదలవుతున్నాయని, జిల్లాలోని సీపీడబ్ల్యూఎస్ పథకాల ఆపరేషన్, నిర్వహణకు వ్యయం అవుతున్న రూ.80 కోట్లను భరించడం చాలా కష్టంగా మారిందన్నారు. ఇంత కష్టాలు ఉన్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక సంఘం నిధులను 10 శాతానికి తగ్గింపు నిర్ణయాన్ని పునః సమీక్షించాలని కోరారు. లేని పక్షంలో కనీసం రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులనైనా విడుదల చేయాలని కోరారు. అలాగే జెడ్పీ పాత పరిపాలనా భవనాన్ని రాష్ట్ర పర్యాటక శాఖకు లీజుకు వచ్చే ప్రతిపాదనను కూడా త్వరగా పరిశీలించి తగు ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. సీఎఫ్ఎంఎస్లో పెండింగ్లో ఉన్న గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ల పలు రకాల బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని కోరారు. జెడ్పీ సీఈఓ, డిప్యూటీ సీఈఓలు వినియోగిస్తున్న ప్రభుత్వ వాహనాలు రవాణా శాఖ నిబంధనల మేరకు కాలాతీతమైనందున ఇద్దరు అధికారులు అద్దె వాహనాలు వినియోగించుకునేందుకు అనుమతితో పాటు వాటి బాడుగలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని కోరారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో లిఫ్ట్ సౌకర్యం కోసం రూ.48 లక్షల అంచనాతో దివ్యాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్కు పంపిన ప్రతిపాదనలపై ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు ఉన్నతాధికారులతో చైర్మన్ సుదీర్ఘంగా చర్చించారు. పీఆర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, డైరెక్టర్ను కలిసిన జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి -
కష్టపడి పనిచేస్తే లక్ష్యం చేరుకోవచ్చు
కర్నూలు సిటీ: న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ లక్ష్యాలను చేరుకోవాలంటే కష్టపడి పనిచేయాలని రాష్ట్ర హైకోర్టు జడ్జి, జిల్లా పోర్ట్ ఫోలియో జడ్జి జస్టిస్ బి.ఎస్ భానుమతి అన్నారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలో జరిగిన న్యాయవాద సంఘం వార్షికోత్సవానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హైకోర్టు జడ్జి మాట్లాడుతూ.. కర్నూలు జిల్లాకు చారిత్రాత్మక పేరుందని, ఈ జిల్లా నుంచి చాలా మంది ఉన్నత న్యాయమూర్తులుగా రాణించారన్నారు. న్యాయపరంగా జిల్లా అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని హామీనిచ్చారు. ● హైకోర్టు జడ్జి జస్టిస్ కె. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. తాను ఈ జిల్లాకు చెందిన వాడినని, జిల్లా గురించి తనకు మంచి అవగహన ఉందన్నారు. కక్షిదారులకు న్యాయవాదులు అందుబాటులో ఉండి పని చేస్తే విజయాలు సొంతం అవుతాయన్నారు. ● జస్టిస్ ఎన్.హరినాథ్ మాట్లాడుతూ.. న్యాయవాదులు స్థానికంగానే కాకుండా అన్ని ప్రాంతాల్లో తిరిగి న్యాయ సేవలను కక్షిదారులకు అందించాలన్నారు. న్యాయవాది పనితనంపై ఆధారపడి కక్షిదారులకు న్యాయం అందుతుందన్నారు. ● న్యాయమూర్తి జస్టిస్ ఎ.హరినాథశర్మ మాట్లాడుతూ తాత్కాలిక ఆదాయానికి ఆశపడకుండా జూనియర్ న్యాయవాదులు పని చేస్తే భవిష్యత్తులో అభివృద్ధి వైపు వెళ్తారన్నారు. ప్రస్తుతం న్యాయవాదులు సాంకేతికతను అందిపుచ్చుకొని వృత్తిలో నైపుణ్యం పొందాలన్నారు. ● న్యాయవాద సంఘం వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో గెలుపొందిన న్యాయమూర్తులకు, న్యాయవాదులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి, బార్ కౌన్సిల్ సభ్యులు పి.రవిగువేరా, బార్ అధ్యక్ష, కార్యదర్శులు బి. కృష్ణమూర్తి, బి.ఎస్ రవికాంత్, ప్రసాద్, సీనియర్ న్యాయవాదులు సి.నాగేంద్రనాథ్, ఎ.రామసుబ్బారెడ్డి, శివరామయ్య, జోగయ్య శర్మ, వై.జయరాజ్, ప్రభుత్వ న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు జడ్జి భానుమతి -
మెడికల్ షాపుల్లో ‘ఆపరేషన్ గరుడ’
కర్నూలు: ఆపరేషన్ గరుడలో భాగంగా డీజీపీ ఆదేశాల మేరకు ఐజీ ఈగల్ టీమ్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ లోకల్ పోలీస్, డ్రగ్స్ కంట్రోల్ టీమ్ ఆధ్వర్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో మెడికల్ షాపులు, ఏజెన్సీల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్ ఎస్పీ ఆదేశాల మేరకు అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి కర్నూలు, నంద్యాల, ఆదోని ప్రాంతాల్లో ఉదయం నుంచి సాయంత్రం పొద్దుపోయేదాకా విస్తృత తనిఖీలు నిర్వహించారు. దుకాణం లైసెన్స్, నిల్వలకు సంబంధించిన రిజిస్టర్లతో పాటు ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయాలు జరుపుతున్న విషయాలపై పరిశీలన జరిపారు. దాదాపు 20కి పైగా దుకాణాల్లో తనిఖీలు చేయగా కొన్నింటిలో నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు జరుగుతున్నట్లు గుర్తించారు. అలాగే భౌతిక నిల్వలకు రికార్డులో పొందుపరచిన నిల్వలకు తేడాలు ఉన్నట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. -
గుర్తు తెలియని వాహనం ఢీకొని..
వెలుగోడు: మోత్కూరు గ్రామ సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మోత్కూరు గ్రామానికి చెందిన గుండెపోగు ఏసేపు కుమారుడు అశోక్(28) బైక్పై వెలుగోడుకు వస్తుండగా మార్గమధ్యలో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు వెలుగోడులోని ఓ మందుల దుకాణంలో పని చేస్తున్నాడు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ద్వారా వెలుగోడుకు చెందిన వాహనం బైక్ను ఢీకొట్టినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. -
మోక్ష మార్గానికి శుభ రాత్రులు
రహదారులపై నీళ్లు కనిపిస్తున్నాయి. అక్కడికి వెళ్లి చూస్తే ఏమీ కనిపించవు. తీవ్ర ఉష్ణోగ్రతల ఫలితంగా ఏర్పిడిన ఎండమావులని తేలుతోంది. ఇటీవల ఉమ్మడి కర్నూలు జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 40 డిగ్రీలు దాటి పోయాయి. కర్నూలు నగరం సమీపంలోని బెంగళూరు–హైదరాబాద్ జాతీయ రహదారిపై ఎండమావులు కనిపిస్తున్నాయి. దీంతో వాహనదారులు మధ్యాహ్నం వేళ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాలను కాసేపు ఆపుకుని వెళ్తే మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు నంద్యాల(వ్యవసాయం): పవిత్ర రంజాన్ మాసం చివరి ఘట్టానికి చేరుకుంది. ముస్లింలు ఈ మాసమంతా మహిమతో కూడినదిగా భావిస్తారు. ఇందులో మొదటి పది రోజులు అల్లాహ్ కరుణ కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తే... రెండవ పది రోజుల్లో తమ తప్పులను క్షమించాలని ప్రార్థిస్తారు. ఇక మూడవదైన ముఖ్యమైన చివరి పదిరోజులు మొదటి రెండు విభాగాల కంటే కొంచెం భిన్నమైనవిగా భావిస్తారు. నరకం నుంచి బయట పడేయాలని అల్లాను శరుణు కోరుకునేందుకు ఈ పదిరోజులను ప్రత్యేకమైనవిగా భావిస్తారు. ఈ పవిత్ర మాసంలో చివరి పదిరోజులు ఏకాగ్రతతో అల్లాను ఆరాధిస్తే ఎక్కువ ఫలితాలు లభిస్తాయని, మోక్షానికి మార్గం లభిస్తుందని భావించి ముస్లింలు మసీదులు, ఇళ్లల్లో ఎతెకాఫ్, తాఖ్రాత్ చేపట్టనున్నారు. పుణ్య ఫలాల శుభరాత్రులు.. రంజాన్ మాసం చివరి పది రోజుల్లో పవిత్ర బడీరాత్ వస్తుంది. దీన్నే షబ్ ఏ ఖదర్ లేదా లైలతుల్ ఖద్ర్ అనికూడా అంటారు. ఈ పవిత్ర రాత్రి చివరి పది రోజుల్లో బేసి రాత్రుల్లో (ఈనెల 24, 25, 27, 29వ తేదీ) ఉంటుందన్న నమ్మకంతో ముస్లింలు తాఖ్రాత్గా నిర్వహిస్తారు. మరీ ముఖ్యంగా ఈనెల 27వ రోజు రాత్రే లైలతుల్ ఖద్ర్ ఉంటుందని ముస్లింల విశ్వాసం. లైలతుల్ ఖద్ర్ రాత్రి జాగరణ చేసి ప్రార్థనలు చేయడంతో వెయ్యి నెలలపాటు ఉపవాస దీక్షలు చేసినంత ఫలం లభిస్తుందని పెద్దలు పేర్కొంటున్నారు. ప్రజల పాపాలను క్షమించాలని కోరుతూ మహమ్మద్ ప్రవక్త ప్రార్థించారని పవిత్ర ఖురాన్ గ్రంథంలో ఉండడంతో ముస్లింలు జాగరణ చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. పవిత్ర రంజాన్ మాసంలో అత్యంత ముఖ్యమైనవిగా, అధిక పుణ్యాన్ని ఇచ్చే తాఖ్ రాత్లు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయా రోజుల్లో రాత్రుల నుంచి తెల్లవారుజామున ఫజర్ నమాజ్ వరకు పవిత్ర రంజాన్ విశిష్టత, మహాప్రవక్త గుణగణాలు, ఖురాన్ పఠనం, జికార్, తహజూద్, నమాజ్లతో గడుపుతారు. ఇందుకోసం ఆయా మసీదులకు ఇతర ప్రాంతాల నుంచి పీఠాధిపతులు, గురువులు, వక్తలను పిలిపించి దైవసందేశాలను భక్తులకు వివరిస్తారు. ఇందుకుగాను పట్టణంలోని పలు మసీదు కమిటీ నిర్వాహకులు ఈ పదిరోజుల పాటు వక్తలను ఆహ్వానిస్తారు.. ఈ సమయాల్లో మసీదులకు హాజరయ్యే భక్తులకు తెల్లవారుజామున సహేరి ఏర్పాట్లు చేస్తారు. అల్లాహ్ ఇంటి ఆతిథ్యం ఎతెకాఫ్.. రంజాన్లో బడీరాత్ ఎంత ప్రాధాన్యత ఉంటుంతో ఎతెకాఫ్కు కూడా అంతే ఉంటుంది. అల్లాహ్ ఇంటి (మసీదు) ఆతిథ్యం ఈ ఎతెకాఫ్ కల్పిస్తుందంటారు. ‘రంజాన్ కే మహినేమె..జిస్ గావ్మే ఏక్బీ ఆద్మీ ఎతెకాఫ్ నా రహేత.. ఉస్ గావ్ పర్ లానత్ హై. ఔర్ మేరి రహ్మత్ నహీ రహేగి’. అంటే రంజాన్ మాసంలో ఒక ఊర్లో ఒక వ్యక్తి కూడా ‘ఎతెకాఫ్’ ఉండకపోతే.. ఆ ఊరిపై నా కరుణ, ప్రేమాభిమానాలు ఉండవు అని పవిత్ర ఖురాన్లో అల్లాహ్ స్పష్టం చేశారు. ఎతెకాఫ్ను చివరి పది రోజుల్లో పాటించాలి. ఇల్లు, కుటుంబం, వృత్తిని పక్కన పెట్టి వీలు పడిన రోజులు (కనీసం 24 గంటలు) మసీదులో గడపడమే ఎతెకాఫ్ అంటారు. అన్నింటినీ త్యాగం చేసి ఆధ్యాత్మికతతో ఉండే మనుషులపై అల్లాహ్ అత్యంత కరుణ చూపి మొరను ఆలకిస్తారని మౌల్వీలు అంటున్నారు. ప్రజాప్రతినిధుల ఇంటికెళ్లి మనం సమస్య చెప్పుకుంటాం. ఆయన అభయం ఇస్తే ధైర్యం వస్తుంది. మన ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధి అభయానికే ఊరట కలిగితే.. సృష్టికర్త అల్లాహ్కు మొరపెట్టుకుంటే లభించే ఆనుగ్రహానికి హద్దు ఉండదంటారు. పది రోజులు పవిత్రమైన రోజులు రంజాన్ మాసంలో చివరి పదిరోజులు మోక్ష మార్గానికి తరావి, ఎతెకాఫ్, తాఖ్ రాత్లు ఎంతో పవిత్రమైన రోజులు. ఈ రోజుల్లో కఠోర దీక్షలు రాత్రింబవళ్లు ఖురాన్, దైవ బోధనలతో నియనిష్టతో ఉంటే ఎన్నో మాసాల నుంచి చేయనటువంటి పుణ్యం, మోక్షాలు లభిస్తాయన్నారు. – అబ్దుల్ఖాదీర్, మౌల్వి, ఆర్టీసీ బస్టాండ్ మసీదు, నంద్యాల రంజాన్ మాసం ఆఖరి పది రోజులు ప్రత్యేకం ఎతెకాఫ్, తాఖ్రాత్ల నిర్వహణలో ముస్లింలు -
ఎకై ్సజ్ శాఖలో ఎస్ఐల పదోన్నతికి దేహదారుఢ్య పరీక్ష
కర్నూలు: ఎకై ్సజ్ శాఖ ఫోర్త్ జోన్ పరిధిలో ఎస్ఐ పోస్టుల భర్తీకి అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. సీమ జిల్లాల్లో 52 ఎస్ఐ పోస్టులు ఖాళీగా ఉండగా 48 పోస్టులను హెడ్ కానిస్టేబుళ్లు, క్లర్కులకు అడ్హాక్ పద్ధతిలో పదోన్నతి కల్పించి పోస్టింగులు కేటాయించాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక ఎకై ్సజ్ కార్యాలయ ఆవరణలోని డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్లకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. రాయలసీమ జిల్లాల నుంచి 17 మందికి గాను 16 మంది హాజరయ్యారు. వారికి బరువు, ఎత్తు, ఛాతీ కొలతలను తీసుకున్నారు. వీరంతా అర్హత సాధించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి, లీగల్ మెటరాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ రాములు, జిల్లా ఎకై ్సజ్ అధికారి సుధీర్ బాబు, ఏఈఎస్ రాజశేఖర్ గౌడ్, ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ రామకృష్ణ, సీఐలు రాజేంద్రప్రసాద్, చంద్రహాస్ తదితరులు పాల్గొన్నారు. ●16 మంది జూనియర్ అసిస్టెంట్లు ఉత్తీర్ణత -
ఆధిపత్యం కోసమే అంతమొందించారు
● వీడిన టీడీపీ నేత సంజన్న హత్యకేసు మిస్టరీ ● ఐదుగురు నిందితుల అరెస్ట్ ● వివరాలు వెల్లడించిన ఎస్పీ విక్రాంత్ పాటిల్ కర్నూలు: టీడీపీ నాయకుడు షరీన్నగర్కు చెందిన కాశపోగు సంజన్న హత్య కేసు మిస్టరీ వీడింది. షరీన్నగర్లో ఆధిపత్యం కోసమే సంజన్నను వడ్డె రామాంజనేయులు అలియాస్ అంజి కుటుంబ సభ్యులు హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేల్చారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వడ్డె రామాంజనేయులు, వడ్డె శివకుమార్, వడ్డె తులసి, రేవంత్, వారి అనుచరుడు మాల అశోక్ను నాల్గవ పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఎదుట హాజరు పరిచారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో దర్యాప్తు అధికారి మహిళా పీఎస్ డీఎస్పీ కే శ్రీనివాసాచారి, కర్నూలు డీఎస్పీ బాబుప్రసాద్తో కలిసి ఎస్పీ విక్రాంత్ పాటిల్ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. ఈ నెల 14వ తేదీన రాత్రి 9.30 గంటల ప్రాంతంలో షరీన్నగర్లో అల్లీపీరా, వీరాస్వామి భజన మందిరంలో భజన ముగించుకుని బయటకు వస్తున్న కాశపోగు సంజన్నపై అదే వీధికి చెందిన వడ్డె రామాంజనేయులు అతని కుమారులు కొంత మంది అనుచరులు కలిసి పిడిబాకులు, కత్తులు, వేటకొవళ్లతో దాడి చేసి హత్య చేశారు. 30వ వార్డు కార్పొరేటర్ జయరాముడుకు హతుడు సంజన్న తండ్రి. జయరాముడు ఫిర్యాదు మేరకు నాల్గవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా సాంకేతిక ఉపకరణాలను ఉపయోగించుకొని నిందితుల కదలికలు, వారు వినియోగించిన వాహనాలు, సీసీ ఫుటేజీల ద్వారా గుర్తించి కాదాంబరి టౌన్షిప్ సమీపంలోని నిర్జన ప్రదేశంలో అరెస్ట్ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. హత్యకు వాడిన వేట కొడవళ్లు, పిడిబాకు, రక్తం మరకలు ఉన్న దస్తులు, సెల్ఫోన్లు, కర్రలు, హత్య సమయంలో వాడిన కార్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వివరించారు. జిల్లా వ్యాప్తంగా రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచామని, ప్రతి వారం స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చేలా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ చెప్పారు. శిక్షలు పడే విధంగా చర్యలు ... విచారణ వేగవంతం చేసి నిందితులపై కఠిన శిక్షలు పడేటట్లు చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు. మృతుడు సంజన్న కుటుంబం, హంతుకులు వడ్డె రామాంజనేయులు కుటుంబం మధ్య ఉన్న పాతకక్షలు, వార్డులో ఆధిపత్య పోరే కారణంగా దర్యాప్తులో తేలిందని వివరించారు. చాకచక్యంగా, వేగంగా కేసును ఛేదించి త్వరగా నిందితులను అరెస్ట్ చేసిన పోలీస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. విలేకరుల సమావేశంలో సీఐలు మధుసూదన్గౌడ్, శేషయ్య, చంద్రబాబునాయుడు, శ్రీధర్, తబ్రేజ్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
పొలంలో పేలుడు.. ముగ్గురికి గాయాలు
● ఒకరి పరిస్థితి విషమం సి.బెళగల్: పొలంలో అడ్డుగా ఉన్న బండరాళ్లను తొలగిస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించి ముగ్గురు యువకులు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సి.బెళగల్కు చెందిన పింజరి ఖాజా పొలంలో బండరాళ్లు అడ్డుగా ఉన్నాయి. వీటిని కాంప్రెసర్తో పగులగొట్టడానికి గ్రామానికి చెందిన వాహన యజమాని వడ్డె రాజుతో ఒప్పందం చేసుకున్నాడు. గురువారం కాంప్రెసర్ వాహన యజమాని గ్రామానికి చెందిన బలిగేరి కుంటిచేయి లక్ష్మన్న కుమారుడు బలిగేరి వీరాంజనేయులు, సురపురం మునిస్వామి కుమారుడు సురపురం శ్రీరాములు, కేశారం కుమారుడు మద్దిలేటి అనే యువకులతో కలసి పొలానికి వెళ్లారు. పొలంలోని మూడు ప్రాంతాల్లో బండరాళ్లను పేల్చేందుకు ప్రయత్నించగా రెండు మాత్రమే పేలాయి. శుక్రవారం మరోసారి వెళ్లగా మూడో బండరాయి నుంచి ఒక్కసారిగా పేలుడు సంభవించింది. రాళ్లు ఎగిరి పడటంతో పనిలో నిమగ్నమైన ముగ్గురు యువకులు బలిగేరి వీరాంజనేయులు, సురపురం శ్రీరాములు, మద్దిలేటి గాయపడ్డారు. గాయపడిన క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం చేయిస్తున్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బలిగేరి వీరాంజనేయులు పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై విచారిస్తున్నట్లు ఎస్ఐ తిమ్మారెడ్డి తెలిపారు. -
కర్నూలు మార్కెట్లో వరి ధాన్యం క్రయవిక్రయాలు
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో వరి ధాన్యం క్రయవిక్రయాలకు శ్రీకారం చుట్టారు. మార్కెటింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్ రామాంజనేయులు శుక్రవారం పూజలు నిర్వహించి కొనుగోళ్లను ప్రారంభించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వరి సాగు ఎక్కువగా ఉన్నప్పటికీ మార్కెటింగ్ సదుపాయం లేదు. దళారీలకు, మిల్లులకు తీసుకెళ్లి అమ్మకోవాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో మార్కెటింగ్ శాఖ కర్నూలు మార్కెట్లో వరి ధాన్యం కొనుగోళ్లు చేపట్టింది. మార్కెట్కు మొదటి రోజు ఇద్దరు రైతులు మాత్రమే 23 క్వింటాళ్ల ధాన్యం తీసుకొచ్చారు. క్వింటాకు రూ.2,529 ధర లభించింది. 2024–25 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున ఏప్రిల్ 1 నుంచి ధాన్యం క్రయవిక్రయాలు రెగ్యులర్గా చేపడతామని జేడీ తెలిపారు. కార్యక్రమంలో సెక్రటరీ జయలక్ష్మి, అసిస్టెంట్ సెక్రటరీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
పోలీసుల స్ఫూర్తి.. సామరస్య దీప్తి
కర్నూలు: శాంతిభద్రతల పరిరక్షణలో నిత్యం బిజీగా ఉండే పోలీసులు వారు. రంజాన్ నెల సందర్భంగా సామరస్యాన్ని చాటారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయగా.. హిందూ, ముస్లింలు పోలీసులు అందరూ కలసి వచ్చారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ కూడా హాజరయ్యారు. మండ్లెం పీఠాధిపతి కరీముల్లా ప్రార్థన చేయించి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఇఫ్తార్ విందు మతసామరస్యాన్ని చాటిందని ఎస్పీ తెలిపారు. ప్రజలు అన్ని పండుగలను ప్రశాంత వాతావరణంలో కలసి మెలసి ఆనందోత్సాహాల మధ్య నిర్వహించుకోవాలని సూచించారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, కర్నూలు డీఎస్పీ బాబుప్రసాద్, సీఐలు, ఎస్ఐలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇఫ్తార్ విందులో ఎస్పీ విక్రాంత్ పాటిల్ -
కొత్త జిల్లాల్లో ట్రెజరీ భవన నిర్మాణాలు
కర్నూలు(అగ్రికల్చర్): కొత్త జిల్లాల్లో ట్రెజరీ కార్యాలయాల భవన నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఖజానా, లెక్కల శాఖ డైరెక్టర్ మోహన్రావు తెలిపారు. అదేవిధంగా సబ్ ట్రెజరీ కార్యాలయాలకు కూడా సొంత భవనాలు నిర్మిస్తామని, కలెక్టర్లు అవసరమైన స్థలాలు కేటాయించాల్సి ఉందన్నారు. శుక్రవారం ఆయన కర్నూలు జిల్లా ట్రెజరీ, కర్నూలు డివిజన్ సబ్ ట్రెజరీలను తనిఖీ చేశారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో జరిగిన లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించారు. గత నెల ‘సాక్షి’లో ‘ట్రెజరీల్లో లంచావతారాలు’ శీర్షికన ప్రచురితమైన కథనంపై తీసుకున్న చర్యలపైనా ఆరా తీసినట్లు సమాచారం. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. జిల్లా ట్రెజరీ, సబ్ ట్రెజరీల్లో కొంతమంది ఏళ్ల తరబడి ఒకేచోట పని చేస్తున్నారని, ఇందువల్లనే అక్రమాలకు అవకాశం ఏర్పడిందనే విషయాన్ని విలేకర్లు డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా.. ఇందులో వాస్తవం ఉందని, అయితే ఇందుకు కొన్ని కారణాలు ఉన్నాయన్నారు. మరో నెల, రెండు నెలల్లో బదిలీలకు అవకాశం ఉందని, ఆ సమయంలో ఇలాంటి వారిని బదిలీ చేస్తామన్నారు. ఆయన వెంట జిల్లా ట్రెజరీ అధికారి రామచంద్రరావు, ఏటీవో జయలక్ష్మి, ఎస్టీవో పలనాటి సునీల్ తదితరులు ఉన్నారు. మోహన్రావును పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు కలిశారు. ఏళ్ల తరబడి ఒకే చోట పనిచేస్తున్న వారిని త్వరలో బదిలీ చేస్తాం ఖజానా, లెక్కల శాఖ డైరెక్టర్ మోహన్రావు వెల్లడి -
ప్రశాంతంగా ‘పది’ పరీక్షలు
కర్నూలు సిటీ: జిల్లాలోని 172 కేంద్రా ల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. శుక్రవారం మొత్తం 31,686 మంది విద్యార్థులకుగాను 31,393 మంది హాజరుకాగా.. 293 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని డీఈఓ ఎస్.శ్యామూల్ పాల్ తెలిపారు. ఒపెన్ స్కూల్ పదో తరగతి పరీక్షలకు 821 మందికిగాను 728 మంది విద్యార్థులు హాజరు కాగా.. 93 మంది గైర్హాజరయ్యారు. బ్యాంకుల సమ్మె వాయిదా కర్నూలు(అగ్రికల్చర్): ఈ నెల 24, 25 తేదీల్లో చేపట్టనున్న బ్యాంకుల సమ్మె వాయిదా పడింది. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్ పిలుపు మేరకు ఈ నెల 24, 25 తేదీల్లో బ్యాంకుల సమ్మెకు అన్ని బ్యాంకు యూనియన్లు సిద్ధమయ్యాయి. శుక్రవారం ఉన్నతస్థాయిలో ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్ ప్రతినిధులు చర్చలు జరిపారు. అందులో భాగంగా రెండు నెలల సమయం ఇస్తే డిమాండ్లపై సానుకూలంగా చర్యలు తీసుకుంటామని కోరినట్లు జిల్లా కన్వీనర్ నాగరాజు తెలిపారు. ఇందుకు అనుగుణంగా రెండు రోజుల సమ్మెను వాయిదా వేసినట్లు ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జిల్లా కోర్టుల్లోనూ మధ్యవర్తిత్వం
కర్నూలు(సెంట్రల్): సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అన్ని కోర్టుల్లో మధ్యవర్తిత్వాన్ని ప్రవేశపెట్టాలని హైకోర్టు ఆదేశించిందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు/ జిల్లా ప్రధానన్యాయమూర్తి జస్టిస్ జి.కబర్ధి తెలిపారు. జిల్లా కోర్టుల్లోనూ మధ్యవర్తిత్వం విధానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉందన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలతో మధ్యవర్తిత్వంపై న్యాయవాదులు, ఎన్జీఓలకు ఇచ్చిన 40 గంటల శిక్షణ కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. ఈనెల 17 నుంచి 21వ తేదీ వరకు భావన, మధ్యవర్తిత్వం, సాంకేతిక అంశాలపై న్యాయవాదులకు కేరళల నుంచి వచ్చిన గోపీనాథన్ బృంద సభ్యులు 40 గంటలపాటు శిక్షణ తరగతులను నిర్వహించారు. ముగింపు కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.కబర్ధి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జస్టిస్ బి.లీలా వెంకట శేషాద్రి మాట్లాడుతూ..సివిల్ ప్రోసిజర్ కోడ్లోని సెక్షన్ 89 కింద పరిగణించేదే మధ్యవర్తిత్వమని, కోర్టుల్లో కేసు విచారణ వరకు వెళ్లకుండానే పరిష్కరించుకోవచ్చన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.కబర్ధి -
పుట్టుకతో తోడై.. జీవితం సూదిపోటై!
షుగర్ వ్యాధి బారిన పడకుండా ఒక్కొక్కరు ఒక్కో ఆరోగ్య సూత్రాన్ని పాటిస్తుంటారు. ఒకరు రైస్ తినకూడదంటారు.. ఇంకొకరు నడక మంచిదంటారు.. ఒక వయస్సుకు వచ్చిన తర్వాత వ్యాధి బారిన పడటం ఒక ఎత్తయితే, రాకుండా జాగ్రత్త పడటం ఇంకొక ఎత్తు. మరి పుట్టుకతోనే ఈ వ్యాధి తోడుగా వస్తే. ఆ పిల్లల జీవితం నరకప్రాయం. ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుంటే తప్ప బతకలేని పరిస్థితి తలుచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. అసలు ఎందుకు ఈ పరిస్థితి? వీళ్లు చేసిన పాపం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ కథనంకర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీకి చెందిన యువకునికి పుట్టుకతోనే షుగర్ వ్యాధి వచ్చింది. వైద్యులు పరిశీలించి టైప్–1 డయాబెటిస్గా నిర్ధారించారు. అప్పటి నుంచి ఇన్సులిన్ను ఇంజెక్షన్ రూపంలో అందిస్తున్నారు. ప్రస్తుతం ఇతని వయస్సు 30 ఏళ్లు. రోజూ ఇంజెక్షన్ వేయించుకోవాలంటే బాధగా ఉంటోందని, కానీ బతకాలంటే తప్పదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. స్వీట్లు అంటే ఇష్టమని, కానీ తింటే పరిస్థితి దారుణంగా ఉంటుందని వాపోతున్నాడు.పగిడ్యాల మండలంలోని పాత ముచ్చుమర్రి గ్రామానికి చెందిన మల్లయ్య, మానస దంపతులు వ్యవసాయ కూలీలు. వీరికి ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు వెంకట ఉమామహేష్, రెండవ కుమారుడు లిఖిత్. 9 నెలల వయస్సు కలిగిన లిఖిత్కు పుట్టుకతోనే చక్కెర వ్యాధి తోడుగా వచ్చింది. తరచూ అపస్మారక స్థితికి చేరుకోవడం గమనించి కర్నూలు ప్రైవేట్ ఆసుపత్రిలో సుమారు రూ.3లక్షలకు పైగా ఖర్చు చేసినా ఫలితం లేకపోయింది. షుగర్ లెవెల్స్ గుర్తించేందుకు మిషన్ తెచ్చుకుని వారానికోసారి ఇన్సులిన్ ఇంజెక్షన్ వేయించాల్సిన పరిస్థితి. వారానికి సుమారు రూ.5వేల దాకా ఖర్చవుతోందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. కర్నూలు(హాస్పిటల్): పేరులో తియ్యదనం దాచుకున్న మహమ్మారి మధుమేహం. ఇది పెద్దలనే కాదు.. చిన్నారులనూ వదలని పరిస్థితి. పుట్టుకతోనే తోడుగా వచ్చి జీవించినంత కాలం వేధిస్తోంది. అందరిలా జీవించాలంటే రోజూ సూదిపోటుతో ఇన్సులిన్ మందు వేసుకోవడం తప్పనిసరి. అల్లారుముద్దుగా పెంచుకున్న కన్నబిడ్డలను తల్లిదండ్రులే స్వయంగా ఇంజెక్షన్ ద్వారా ఇన్సులిన్ ఇవ్వడం వారికీ నరకంతో సమానం. ఇలాంటి బాధితుల సంఖ్య సమాజంలో రోజురోజుకూ పెరుగుతోంది. శరీరంలోని క్లోమగ్రంధిలో ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ గ్రంధిలో ఇన్సులిన్ను ఉత్పత్తి చేసే కణాలను(బీటా కణాలు) వ్యక్తుల రోగనిరోధక వ్యవస్థ నాశనం చేస్తుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. దీన్ని టైప్–1 మధుమేహం(డయాబెటిస్) అంటారు. సాధారణంగా పిల్లలు, యువకుల్లో ఈ పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొన్నిసార్లు బీటా కణాలను రోగినిరోధక వ్యవస్థ నిర్వీర్యం చేయడం కాకుండా క్లోమగ్రంధికి ఏదైనా వ్యాధి సోకినప్పుడు లేదా గాయం అయినప్పుడు బీటా కణాలు నిర్వీర్యం అవుతాయి. దీనిబారిన పడిన వారికి క్రమం తప్పకుండా ఇన్సులిన్ను ఇంజెక్షన్ చేయాల్సి ఉంటుంది. ఇది కొంత మందికి జన్యుపరంగా కూడా రావచ్చు. మరికొంత మందికి పలు రకాల వైరల్ వ్యాధులు, ఇతర ప్రమాదకర అనారోగ్యాల కారణంగా కూడా ఈ పరిస్థితి ఎదురవ్వొచ్చు. అంతేకానీ ఆహారం, జీవనశైలి అలవాట్లు టైప్–1 డయాబెటిస్కు కారణం కావు. ప్రభుత్వాసుపత్రుల్లో అరకొర ఇన్సులిన్ ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్సతో పాటు ఇన్సులిన్ను ఉచితంగా అందించాల్సి ఉంది. అయితే గత 10 నెలలుగా వీరికి అరకొరగా ఇన్సులిన్ ఇస్తున్నారు. కేవలం కర్నూలు, నంద్యాల ప్రభుత్వ సర్వజన వైద్యశాలల్లో మాత్రమే అధికారులు స్థానికంగా కొనుగోలు చేసి ఇన్సులిన్ను కొద్దిమొత్తంలో అందజేస్తున్నారు. ఏరియా ఆసుపత్రులు, సీహెచ్సీలు, పీహెచ్సీల్లో ఇన్సులిన్ అందుబాటులో ఉండటం లేదు. దీంతో చాలా మంది మెడికల్ షాపుల్లో కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో చిన్నారికి వ్యాధి తీవ్రతను బట్టి నెలకు రెండు నుంచి నాలుగు ఇన్సులిన్ ఇంజెక్షన్లు అవసరం. పెరుగుతున్న చికిత్స వ్యయం మెడికల్షాపుల్లో ఒక్కో ఇన్సులిన్ ఖరీదు రూ.180 వరకు ఉంటోంది. ఈ మేరకు ప్రతి చిన్నారికి నెలకు రూ.600 నుంచి రూ.800 వరకు ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వాసుపత్రులతో పాటు ప్రైవేటు క్లినిక్లు, ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యుల వద్ద చికిత్స తీసుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఆధునిక వైద్యవిధానాల మేరకు వారికి నొప్పి తక్కువగా ఉండే ఇన్సులిన్ పెన్నుల ద్వారా ఇంజెక్షన్ చేస్తున్నారు. వీటి ఖరీదు సాధారణ ఇన్సులిన్తో పోలిస్తే రెట్టింపుగా ఉంటుంది.లక్షణాలు » టైప్–1 డయాబెటిస్ లక్షణాలు బయటపడటానికి కొన్ని నెలలు లేదా సంవత్సరాలు పట్టవచ్చు. » విపరీతమైన దాహం, తిన్న తర్వాత కూడా బాగా ఆకలివేయడం, నోరు తడి ఆరిపోవడం. » కడుపునొప్పి, వాంతులు, ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లడం. »ఊహించని విధంగా బరువు తగ్గిపోవడం, అలసట, కంటిచూపు తగ్గిపోవడం. » శ్వాస తీసుకోవడానికి ఎక్కువ కష్టపడటం, తరచుగా చర్మ, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు. » మూడ్ మారిపోవడం, నిద్రలో మూత్రవిసర్జన చేయడం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 50లక్షల వరకు జనాభా ఉంటుంది. ఇందులో 15 నుంచి 20 శాతం వరకు మధుమేహ బాధితులు. వీరిలో టైప్–2 మధుమేహ బాధితులు 90 శాతం కాగా.. టైప్–1 బాధితులు 10 శాతం పైనే. ఈ లెక్కన 7.50లక్షల నుంచి 10లక్షల వరకు మధుమేహ బాధితులు ఉండగా.. 75వేల నుంచి లక్ష దాకా చిన్నారులు ఉంటున్నారు.కోవిడ్ తర్వాత పెరిగిన కేసులు కోవిడ్–19 అనంతరం టైప్–1 డయాబెటిస్ రోగుల సంఖ్య పెరిగింది. గతంలో డయాబెటిస్ రోగులు 5 శాతం ఉండగా ఇప్పుడు 10శాతానికి చేరుకుంది. కోవిడ్ వైరస్ నేరుగా బీటా కణాలపై దాడి చేయడమే ఇందుకు కారణం. ఈ కారణంగా కోవిడ్కు గురైన వారికి జన్మించే పిల్లల్లో టైప్–1 డయాబెటీస్ ఎక్కువగా కనిపిస్తోంది. – డాక్టర్ పి.శ్రీనివాసులు, ఎండోక్రైనాలజీ హెచ్వోడి, జీజీహెచ్, కర్నూలు ఇన్సులిన్తో మాత్రమే చికిత్స చిన్నపిల్లల్లో వచ్చే టైప్–1 డయాబెటిస్కు ఇన్సులిన్తో మాత్రమే చికిత్స అందుబాటులో ఉంది. ఆయాసం, కడుపునొప్పి, వాంతులు లక్షణాలతో చిన్నపిల్లలను ఆసుపత్రికి తీసుకొస్తారు. అన్నిరకాల పరీక్షలు నిర్వహించి డయాబెటిస్ నిర్దారణ అయ్యాక చికిత్స ప్రారంభిస్తాం. ఈ పిల్లలకు ఇన్సులిన్తో పాటు ఆహార నియమావళి తప్పనిసరి. – డాక్టర్ ఎం.మల్లికార్జున, అసోసియేట్ ప్రొఫెసర్, పీడియాట్రిక్స్, జీజీహెచ్, కర్నూలు -
నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలి
కర్నూలు(సెంట్రల్): జిల్లా అభివృద్ధికి నిర్దేశించిన లక్ష్యం మేరకు ప్రగతి సాధించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో 25, 26 తేదీల్లో జరిగే కలెక్టర్ల కాన్ఫరెన్స్కు అవసరమైన సమాచార సేకరణపై కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ఈ ఏడాది నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని వ్యవసాయాధికారి పీఎల్ వరలక్ష్మీని ఆదేశించారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా 50 శాతం సబ్సిడీతో యంత్ర పరికరాలను ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సాయిల్ టెస్టు ఫలితాలను వెంటనే ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. పశుసంవర్ధక శాఖకు సంబంధించి పెండింగ్లోని గోకులాల నిర్మాణాలకు నిధుల కోసం ప్రతిపాదనలు పంపాలన్నారు. పరిశ్రమల శాఖకు సంబంధించి విశ్వకర్మ యోజన పథకం కింద లబ్ధిదారులకు త్వరగా రుణాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. బీసీ సంక్షేమ శాఖకు సంబంధించిన వసతి గృహాల మరమ్మతులను త్వరగా చేపట్టాలన్నారు. సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించి 24 హాస్టళ్లకు సంబంధించి రూ.7.89 కోట్లు మంజూరయ్యాయని, ఈ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఐసీడీఎస్కు సంబంధించి 146 అంగన్వాడీ సెంటర్లను అప్గ్రేడ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కల్యాణి, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ సీపీఓ హిమప్రభాకరరాజు, కర్నూలు నగర పాలకసంస్థ కమిషనర్ రవీంద్రబాబు పాల్గొన్నారు. -
ముగిసిన సుయతీంద్రతీర్థుల సమారాధన
మంత్రాలయం: నవ మంత్రాలయం శిల్పి, రాఘవేంద్రస్వామి మఠం పూర్వపు పీఠాధిపతి సుయతీంద్రతీర్థుల ఉత్తరారాధనతో వేడుకలు ముగిశాయి. గురువారుం శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల నేతృత్వంలో మధ్యారాధన వేడుకలు అంగరంగా వైభవంగా జరిగాయి. సుప్రభాత సేవతో ఆరాధనకు అంకురార్పణ పలుకగా.. వేద పఠనం గావిస్తూ సుయతీంద్రతీర్థుల మూల బృందావనానికి శాస్త్రోక్తంగా విశేష పంచామృతాభిషేకం నిర్వహించారు. ఆధ్యాత్మిక పరిమళాలు విరబూసేలా మధ్యారాధన పూజోత్సవాలు గావించారు. కర్ణాటకలోని మత్తూరు మఠం పీఠాధిపతి బోధానంద సరస్వతీ శ్రీమఠాన్ని సందర్శించి పీఠాధిపతులు సుబుధేంద్రతీర్థులను సన్మానించారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన విధ్వాంసులు, కళాకారులను స్వామిజీ సన్మానించారు. -
ప్రభుత్వాసుపత్రుల్లో తగ్గిన ప్రసవాలు
● ఈ ఆర్థిక సంవత్సరంలో 22.8 శాతానికే పరిమితం ● సరైన సేవలు అందకపోవడమే ప్రధాన కారణం ● 77 శాతం పైగా ప్రయివేట్ ఆసుపత్రుల్లోనే.. ● ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మొక్కుబడి సేవలు ● పరిస్థితి విషమిస్తేనే కర్నూలు జీజీహెచ్కు తరలింపుకర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ప్రసూతి విభాగంపత్తికొండ నియోజకవర్గం: తుగ్గలి పీహెచ్సీ పరిధిలో 2024 జూన్ నుంచి 638 మంది గర్భిణిలను గుర్తించారు. వీరిలో 25 మంది మాత్రమే పీహెచ్సీలో డెలివరీ అయ్యారు. మరో 28 మందిని రెఫర్ చేశారు. కోడుమూరు నియోజకవర్గం: గూడూరు పీహెచ్సీ పరిధిలో మొత్తం 476 మంది గర్భిణిలను గుర్తించగా.. వీరిలో 67 మంది పీహెచ్సీలోనే డెలివరీ అయ్యారు. మరో ఆరుగురిని కర్నూలుకు రెఫర్ చేశారు. ఆలూరు నియోజకవర్గం: మొలగవల్లి పీహెచ్సీ పరిధిలో మొత్తం 210 మంది గర్భిణిలను గుర్తించగా.. 8 మంది మాత్రమే పీహెచ్సీలో డెలివరీ చేయించుకున్నారు. 15 మందిని రెఫర్ చేశారు.గత ఆర్థిక సంవత్సరంలో 45,040 మంది గర్భిణిలు రిజిష్టర్ అయ్యారు. ఇందులో 10,072 మంది(22.36శాతం) హైరిస్క్లో ఉన్నట్లు వైద్య సిబ్బంది గుర్తించారు. ఇదే గత ప్రభుత్వంలో ప్రసవాల సంఖ్య ప్రభుత్వాసుపత్రుల్లో 60శాతం వరకు ఉండగా.. హైరిస్క్ గర్భిణిల శాతం కూడా 19లోపే. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం సన్నగిల్లడంతోనే గర్భిణిలు ప్రయివేట్ను ఆశ్రయిస్తున్నట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.20,479 ఈ ఆర్థిక సంవత్సరం(2024–25)లో ప్రసవాల సంఖ్య ప్రభుత్వ సర్వజన వైద్యశాల: కర్నూలు ఏరియా ఆసుపత్రి: 1 (ఆదోని) ఎంసీహెచ్ ఆసుపత్రి: 1 సీహెచ్సీలు: 5 పీహెచ్సీలు: 44 అర్బన్ హెల్త్ సెంటర్లు: 28 జరిగిన ప్రసవాలు: 4,671 మంది (22.80శాతం) ప్రయివేట్ ఆసుపత్రులు: 120 జరిగిన ప్రసవాలు: 15,808 (77.19శాతం) కర్నూలు(హాస్పిటల్): ప్రభుత్వాసుపత్రుల్లో సకాలంలో వైద్యులు ఉండకపోవడం.. ఉన్న సిబ్బంది నుంచి మాటల తూటాలు.. అరకొర వైద్య సేవలు.. సాయంత్రం దాటితే ఆయా ఆసుపత్రుల్లో ఎవ్వరూ కనిపించకపోవడం.. ఇదీ జిల్లాలో ప్రభుత్వాసుపత్రుల తీరు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చక్కబెట్టిన సేవలను కూటమి ప్రభుత్వం దూరం చేస్తోంది. ఇందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో తగ్గిన ప్రసవాల సంఖ్యే నిదర్శనం. గత ప్రభుత్వంలో 60 శాతం వరకున్న ప్రసవాలు.. ఇప్పుడు ముక్కుతూ మూలుగుతూ 25 శాతం మించకపోవడం గమనార్హం. అనుభవజ్ఞులైన వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ఉన్నా ప్రభుత్వాసుపత్రులను ఆశ్రయించడం క్రమంగా తగ్గుతోంది. మరీ ముఖ్యంగా కర్నూలు సర్వజన ప్రభుత్వాసుపత్రిలో అధునాతన కొత్త భవనంతో పాటు ప్రత్యేక వసతులతో కూడిన ఐసీయూ సేవలందిస్తోంది. ఉచితంగా రక్తం ఇచ్చేందుకు బ్లడ్ బ్యాంకు కూడా ఉంది. వైద్యులు, పీజీ విద్యార్థులు, నర్సుల సంఖ్య గణనీయంగా పెరిగినా పరిస్థితి విషమంగా ఉన్న గర్భిణిలు మాత్రమే ప్రసవానికి వస్తుండటం గమనార్హం. ప్రైవేటు ఆసుపత్రుల్లో 76 శాతం ప్రసవాలు జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) 20,479 ప్రసవాలు జరిగితే అందులో ప్రైవేటు ఆసుపత్రుల్లో 15,808(77.19శాతం) ప్రసవాలు జరగడం గమనార్హం. గర్భం దాల్చినప్పటి నుంచి పట్టణాలు, నియోజకవర్గ కేంద్రాల్లోని గైనకాలజిస్టుల వద్ద గర్భిణిలు చికిత్స చేయించుకుంటున్నారు. ప్రసవానికి కూడా వారి సూచన మేరకు ప్రైవేటు ఆసుపత్రులనే ఆశ్రయిస్తున్నారు. ఇక్కడ వార్డులు, బాత్రూమ్లు శుభ్రంగా ఉండటం, నర్సింగ్ కేర్ బాగుండటం, వైద్యులు అందుబాటులో ఉండటం వల్ల ప్రయివేట్ను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. అత్యవసరమైతేనే కర్నూలు జీజీహెచ్కు.. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ప్రసూతి విభాగానికి ఉమ్మడి జిల్లాగా ఉన్న సమయంలో ప్రతిరోజూ 35 నుంచి 40 దాకా ప్రసవాలు జరిగేవి. ఇక్కడ అనుభవజ్ఞులైన వైద్యులు, ఎప్పుడూ పీజీల సేవలు, నర్సింగ్ సేవలు అందుబాటులో ఉంటాయని నమ్మి ఇతర ప్రాంతాల నుంచి సైతం ప్రసవానికి ఇక్కడికే వచ్చేవారు. కానీ ఆరోగ్యశ్రీ ప్రైవేటులోనూ వర్తిస్తుండటంతో ఇక్కడికి వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ప్రస్తుతం ప్రతిరోజూ 15 నుంచి 20 ప్రసవాలు మాత్రమే ఇక్కడ జరుగుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 80 శాతం సిజేరియన్ కాన్పులే.. ప్రైవేటు ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాల్లో 80 శాతం సిజేరియన్ కాన్పులే ఉంటున్నాయి. గర్భిణిలు, కుటుంబసభ్యులు ప్రసవ వేదనకు తట్టుకోలేక సిజేరియన్ చేయాలని కోరడం, కొంత మంది వైద్యులు, చాలా మంది గర్భిణిలకు హైబీపీ, రక్తహీనత, షుగర్, థైరాయిడ్, గర్భంలో బిడ్డ అడ్డం తిరగడం, ఉమ్మునీరు తక్కువగా ఉండటం వంటి హైరిస్క్ కారణాలతో సిజేరియన్ ఆపరేషన్లు చేయాల్సి వస్తోందని అధికారులకు ఆయా ఆసుపత్రుల నిర్వాహకులు వివరణ ఇస్తున్నారు. అయితే కొన్ని ఆసుపత్రులు, వైద్యులు సిజేరియన్ చేస్తే ప్యాకేజి, డబ్బులు ఎక్కువ వస్తాయని కూడా అటువైపు మొగ్గు చూపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో 60శాతం ప్రభుత్వాసుపత్రుల్లోనే! సంవత్సరం ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు ప్రసవాల శాతం హైరిస్క్ గర్భిణిల శాతం 2019-20 39,140 61.33 19.69 2020-21 36,170 57.60 19.32 2021-22 27,305 58.47 19.08 2022-23 26,433 51.42 17.10 2023-24 28,108 54.39 21.30 † గత ప్రభుత్వంలో ప్రతి పీహెచ్సీకి ఇద్దరేసి మెడికల్ ఆఫీసర్లు ఉండగా.. ఒకరు క్షేత్రస్థాయికి వెళ్లినా మరొకరు ఆసుపత్రిలోనే ఉండి రోగులకు చికిత్సలు అందించే పరిస్థితి. రాత్రివేళల్లోనూ నర్సింగ్ సిబ్బంది తప్పనిసరిగా ఉండేలా చర్యలు చేపట్టారు. వైద్యులు ఫోన్ చేస్తే వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడం ప్రసవాల సంఖ్య తగ్గేందుకు కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
జీజీహెచ్కు హైరిస్క్ కేసులే ఎక్కువ
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ప్రసూతి విభాగానికి గతంలో సాధారణ కాన్పులకు కూడా వచ్చేవారు. ఇప్పుడు ఎక్కువ శాతం హైరిస్క్ కేసులే వస్తున్నాయి. గతంలో 40 దాకా ప్రసవాలు జరుగుతుండగా, ఇప్పుడు 15 నుంచి 20 శాతానికి మించని పరిస్థితి. ఇందుకు ప్రధాన కారణం నంద్యాల జిల్లా విడిపోవడం, అక్కడి ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులకు లక్ష్యాలు విధించడం, ప్రైవేటు ఆసుపత్రుల సంఖ్య పెరగడం, అక్కడ కూడా ఆరోగ్యశ్రీ ఉండటమే. కర్నూలు చుట్టుపక్క మండలాలు, నియోజకవర్గ కేంద్రాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లోనూ ప్రసవాలు జరుగుతుండంతో జీజీహెచ్కు వచ్చే వారి సంఖ్య తగ్గింది. – డాక్టర్ శ్రీలక్ష్మి, హెచ్ఓడీ, గైనకాలజి విభాగం, జీజీహెచ్, కర్నూలు -
సాంకేతికతతో నేరాలను నియంత్రిద్దాం
కర్నూలు: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరాల నియంత్రణతో పాటు నేరస్థులను పట్టుకోవాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో గురువారం జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో ఎస్పీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా వర్చువల్ విధానంలో పాల్గొన్న సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్లాల్తో ఎస్పీ మాట్లాడారు. సీసీ టీఎన్ఎస్ గురించి ఐజీ ఎస్పీతో చర్చించారు. అనంతరం కర్నూలు, పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు సబ్ డివిజన్లలో దీర్ఘకాలంగా పెండింగ్లోని కేసుల గురించి ఎస్పీ ఆరా తీశారు. స్టేషన్ల వారీగా కేసుల పెండింగ్కు కారణాలను తెలుసుకొని పరిష్కారానికి పలు సూచనలు, సలహాలు చేశారు. సీసీటీఎన్ఎస్ అప్లికేషన్లో నమోదు తప్పనిసరి కేసు నమోదు నుంచి అభియోగ పత్రాల దాఖలు వరకు ప్రతి అంశాన్ని సీసీటీఎన్ఎస్ అప్లికేషన్లో నమోదు చేయాలని ఎస్పీ ఆదేశించారు. పోలీస్స్టేషన్లలో నమోదయ్యే కేసుల వివరాలను ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా సీసీ టీఎన్ఎస్లో ఎప్పటికప్పుడు పొందుపరచాలన్నారు. హత్య కేసుల్లో, 174 సీఆర్పీసీ కేసుల్లో త్వరితగతిన పురోగతి పొందేలా చూసుకుంటూ అభియోగ పత్రాలను వీలైనంత త్వరగా కోర్టులో దాఖలు చేయాలన్నారు. స్టేషన్లో పనిచేసే సీసీ టీఎన్ఎస్ పోలీస్ సిబ్బందితో ఈ అంశాలపై మాట్లాడారు. నేర సమీక్ష సమావేశంలో అధికారులకు ఎస్పీ ఆదేశంసైబర్ నేరాలపై అవగాహన కల్పించండి సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు స్టేషన్ల వారీగా సదస్సులు నిర్వహించాలని సూచించారు. రోడ్డు ప్రమాద నియంత్రణ చర్యలతో పాటు డ్రంకెన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్పై స్టేషన్ల వారీగా ముమ్మర తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ జి.హుసేన్ పీరా, ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, డీఎస్పీలు బాబుప్రసాద్, శ్రీనివాసాచారి, ఉపేంద్రబాబు, హేమలత, భాస్కర్రావు, ట్రైనీ డీఎస్పీ ఉషశ్రీ, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
శ్రీమఠంలో భక్తుల సందడి
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో భక్తుల సందడి నెలకొంది. గురువారం ప్రత్యేకం కావడంతో భక్తులు వేలాదిగా తరలివచ్చారు. స్థానిక తుంగభద్ర నది, శ్రీమఠం ప్రాంగణం, మధ్వాచార్ కారిడార్లు భక్తులతో కిక్కిరిశాయి. స్వామి మూల బృందావన దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. రాఘవేంద్రస్వామి, గ్రామ దేవత మంచాలమ్మ, అన్నపూర్ణ భోజనశాల, పరిమళ ప్రసాద కౌంటర్ల వద్ద భక్తులు బారులు తీరడం కనిపించింది. ఫార్మసీ ఉద్యోగ నియామక ప్రక్రియ నిలిపివేత కర్నూలు(హాస్పిటల్): కడప జోన్–4 పరిధిలో కాంట్రాక్టు ఫార్మసీ ఆఫీసర్ ఉద్యోగాల నియామక ప్రక్రియ హైకోర్టు ఉత్తర్వుల మేరకు తాత్కాలికంగా నిలిపివేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ అధికారి డాక్టర్ బి.రామగిడ్డయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హైకోర్టు నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చిన తర్వాత నియామక ప్రక్రియ చేపడతామన్నారు. ఈ విషయాన్ని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు గమనించాలని కోరారు. డీఈఓ బ్లాగ్లో టీచర్ల సీనియారిటీ జాబితా కర్నూలు సిటీ: జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా డీఈఓ బ్లాగ్లో ఉంచామని డీఈఓ ఎస్.శ్యామూల్ పాల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. స్కూల్ అసిస్టెంట్లు(అన్ని సబ్జెక్టులు), ఎస్జీటీ తత్సమాన అర్హత కలిగిన వారి సీనియారిటీ జాబితా సిద్ధం చేశామని పేర్కొన్నారు. ఈ జాబితాలను https://deokrnl13blogspot.com అనే బ్లాగ్లో అందుబాటులో ఉన్నాయని, అభ్యంతరాలు ఉంటే ఈ నెల 23వ తేదీలోపు ఆధారాలతో సంప్రదించాలని తెలిపారు. చెత్త వాహనాలతో నిరసన కర్నూలు (టౌన్): నగరంలో మొండి బకాయిలు రాబట్టేందుకు మున్సిపల్ సిబ్బంది వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక దేవనగర్లోని ఉమ్మడి ఎంఎస్ 9– గెస్ట్ ఇన్ లాడ్జి నిర్వాహకులు ఏడు సంవత్సరాలుగా ట్రేడ్ లైసెన్సులు నగరపాలక సంస్థకు చెల్లించడం లేదు. దీంతో గురువారం మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది చెత్త వాహనాన్ని తీసుకొని లాడ్జి ఎదుట నిలిపేశారు. అక్కడే శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు. ట్రేడ్ లైసెన్సుల బకాయిలు రూ.3,31,250 చెల్లించాలని నిర్వాహకులకు తెలియజేశారు. నగరపాలక సంస్థ నుంచి ప్రయోజనాలు పొందుతూ పన్నులు చెల్లించకుండా ఉండటం తగదని పారిశుద్ధ్య పర్యవేక్షకులు నాగరాజు వెల్లడించారు. పారిశుద్ధ్య తనిఖీదారులు అనిల్ పాల్గొన్నారు. నేడు ఖజానా శాఖ డైరెక్టర్ రాక కర్నూలు (అగ్రికల్చర్): ఖజానా, లెక్కల శాఖ డైరెక్టర్ మోహన్రావు శుక్రవారం కర్నూలుకు రానున్నారు. ఈ నెల 17 నుంచి 22వ తేదీ వరకు జిల్లా ట్రెజరీ, సబ్ ట్రెజరీల్లో 2024–25లో జరిగిన లావాదేవీలపై ఖజానా శాఖ వార్షిక తనిఖీ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఖజానా శాఖ డైరెక్టర్ మోహన్రావు కర్నూలుకు రానున్నారు. శుక్రవారం ఉదయం 9:30 గంటలకు కలెక్టరేట్లోని స్ట్రాంగ్ రూమ్ను తనిఖీ చేయనున్నారు. అనంతరం బి.క్యాంప్లోని ట్రెజరీ కార్యాలయానికి వెళ్లి వార్షిక తనిఖీలలో భాగంగా ఇంతవరకు చేపట్టిన తనిఖీలను పరిశీలిస్తారు. -
దేవదాయ శాఖ ఈఓల పవర్కు ‘చెక్’
కర్నూలు కల్చరల్: దేవదాయ శాఖకు సంబంధించిన ఆలయాలు, సంస్థలకు చెందిన నిధులు దుర్వినియోగం కాకుండా ఆ శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఇకపై ప్రతి ఫిక్స్డ్ డిపాజిట్ ఈఓతో పాటు సంబంధిత దేవదాయశాఖ అధికారితో కలిపి సంయుక్త పేరిట ఉండాలనే మార్గదర్శకాలను జారీ చేశారు. ఆలయాలకు చెందిన ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) నిధులను కొందరు ఈఓలు గుట్టుచప్పుడు కాకుండా తీసుకుని సొంతంగా వాడుకుంటున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఇద్దరు ఈఓలు వారి పరిధిలోని దేవాలయాల ఎఫ్డీలను స్వాహా చేశారు. వారిపై కేసులు పెట్టి సస్పెండ్ చేశారు తప్ప నిధులు రీకవరీ చేయడంలో జాప్యం చేస్తున్నారు. ఎఫ్డీలు స్వాహా కావడంతో మేల్కొన్న దేవదాయ శాఖ ఉన్నతాధికారులు ఈఓల పరిధిలో ఉన్న ఆలయాల్లోని ఫిక్స్డ్ డిపాజిట్లను గ్రూప్ల వారీగా తనిఖీ చేయించారు. దీనికి పైతం కొందరు ఈఓలు సహకరించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఒక్కొక్కరు, వైఎస్సార్ కడప జిల్లాలో ఇద్దరు ఈఓలు వారి ఆలయాల ఎఫ్డీల పరిశీలనకు సహకరించడం లేదని తెలిసింది. ఈ నేపథ్యంలో ఇకపై ప్రతి ఫిక్స్డ్ డిపాజిట్ ఈఓతో పాటు సంబంధిత దేవదాయశాఖ అధికారితో కలిపి సంయుక్త పేరిట ఉండాలనే ఆదేశాలు ఇచ్చారు. కమిషనర్ ఆదేశాలు పాటించాలి కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో ని ఈఓలు నలుగురు ఇంకా వారికి సంబంధించిన గ్రూప్ టెంపుల్స్ ఎఫ్డీల ఫైల్స్ను చూపించడం లే దు. వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశాం. దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటించాలి. – పి. గురుప్రసాద్, డిప్యూటీ కమిషనర్, దేవాదాయ శాఖ ఈఓ, జిల్లా దేవదాయ శాఖ అధికారి పేరిట ఫిక్స్డ్ డిపాజిట్లు -
అడవి తల్లి చల్లగా ఉండాలని..
● ఐస్క్రీమ్ పుల్లపై 90 సూక్ష్మ చిత్రాలు ఆవిష్కరణ ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకొని నంద్యాల చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ ఐస్క్రీమ్ పుల్లపై 90 సూక్ష్మ చిత్రాలు గీచి అబ్బుర పరిచారు. మైక్రో పెన్ను, బ్రష్తో పోస్టర్ కలర్స్ ద్వారా ఐస్క్రీమ్ పుల్లపై 3 గంటలు శ్రమించి 90 సూక్ష్మ చిత్రాలు వేశారు. చిత్రంలో అడవిలో చెట్లు లేక వన్యప్రాణులు అలమటించిపోయే వేదన, వారి వేదనను వనదేవతకు మొరపెట్టుకోవడం, వన దేవత కన్నీరు పెట్టడం, చెట్లు, నీరు లేక వన్యప్రాణులు విలవిలలాడుతుండటం, ఎండిపోయిన చెట్లు, జంతు కళేబరాలు, నరికివేసిన చెట్లు, తదితరాలతో పాటు జంతువులు, ఖడ్గమృగాలు, నెమళ్లు, కొంగలు, పక్షులు, చేపలు, తాబేళ్లు, తదితర వన్యప్రాణులను సూక్ష్మ చిత్రాల్లో చూపించారు. – నంద్యాల(అర్బన్) -
అనుమతి లేని బోట్లు నడిపితే చర్యలు
పగిడ్యాల: కృష్ణా నదిలో అనుమతి లేని బోట్లు నడిపితే చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ శివరాముడు హెచ్చరించారు. ‘నిబంధనలు నీట ముంచి.. ప్రయాణికుల రక్షణ మరిచి’ అన్న శీర్షికను గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై తహసీల్దార్ స్పందించారు. ఉదయం పోలీస్, రెవెన్యూ సిబ్బందితో కలసి మూర్వకొండ ఘాట్ను పరిశీలించి ఘాట్ నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేశారు. కృష్ణానది బ్యాక్వాటర్లో ఎలాంటి ఇంజిన్ బోట్లు తిప్పరాదని ఆదేశించారు. ఫోర్ట్ అధికారులు జారీ చేసి న బోటుకు ఫిట్నెస్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్, బోట్ లైసెన్స్ తెచ్చుకోవాలన్నారు. బోట్లు తిప్పకుండా ప్రతి రోజు మూర్వకొండ ఘాట్ వద్ద రెవెన్యూ అసిస్టెంట్లకు బందోబస్తు విధులు వేస్తామన్నారు. తహసీల్దార్ వెంట రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీరంగారెడ్డి, వీఆర్వో వెంకటస్వామి, పోలీసు సిబ్బంది, రెవెన్యూ అసిస్టెంట్లు ఉన్నారు. ఆదర్శ పాఠశాల ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం ● 6వ తరగతి ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల ● ఈనెల 31వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ నంద్యాల(న్యూటౌన్): ఆదర్శ పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతిలో ప్రవేశాలకు ఈనెల 31వ తేదీతో దరఖాస్తు గడువు ముగియనుంది. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.150, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.75 పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్, కార్డులు, యూపీఐ ద్వారా ఆన్లైన్లో ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. పూర్తి వివరాలు, ఆన్లైన్ దరఖాస్తు సమర్పించేందుకు www. cse.ap.gov.in, www.apms. apcfss.in వెబ్సైట్ సంప్రదించాలి. ఆరో తరగతిలో ప్రవేశానికి గతేడాది మాదిరిగానే పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకున్న మోడల్ స్కూల్లోనే ఏప్రిల్ 20వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరగనుంది. మెరిట్ లిస్ట్ ఆధారంగా రోస్టర్ ప్రకారం సీట్లను కేటాయించనున్నారు. ఏప్రిల్ 27న మెరిట్ లిస్ట్, అదే రోజు సెలక్షన్ లిస్ట్ను సైతం వెల్లడిస్తారు. ఏప్రిల్ 30న సర్టిఫికెట్ల పరిశీలనతో పాటు కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టనున్నారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా, రిజర్వేషన్ రూల్స్ ప్రకారం సీట్లు కేటాయిస్తారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభ తేదీ నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి. పేద విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ జనార్దన్రెడ్డి తెలిపారు. ఈ పాఠశాలల్లో ఒక్కసారి సీటు దక్కితే ఇంటర్మీడియట్ పూర్తయ్యే వరకూ చదువుకోవచ్చాన్నారు, ఆంగ్ల మాధ్యమంలో చదువుకోవాలనే తపన ఉండే గ్రామీణ విద్యార్థులకు ఆదర్శ పాఠశాలలు వరంగా చెప్పవచ్చు. విద్యార్థులు కష్టపడి చదువుకుని ప్రతిభకనబరిస్తే సీటు దక్కుతుంది. -
పశువైద్యానికి ‘పరీక్ష’!
బహుళార్ధ పశువైద్య శాలలో అరకొర సేవలు ● మూగజీవాలకు పరీక్షలన్నీ బయటికే ● పశువులను ఎక్కడెక్కడో తిప్పాల్సిన పరిస్థితి ● వేధిస్తున్న మందుల కొరత ● చికిత్సకోసం యజమానుల జేబులు ఖాళీ ● మూలనపడిన అధునాతన యంత్రాలు అన్నీ బయటికే రాస్తున్నారు దాదాపు పది నెలల ఒంగోలు జాతి కోడెదూడ కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉంది. మేత కూడా తినడం లేదు. స్థానిక పశువైద్యలలో చూపించినా ఫలితం లేకపోయింది. మెరుగైన వైద్యం కోసం కర్నూలు బహుళార్ధ పశువైద్యశాలకు తీసుకొచ్చాం. డాక్టర్లు వైద్య సేవలు బాగా అందిస్తున్నా మందులు, సూదులు, పరీక్షలు అన్నింటినీ బయటికే రాశారు. దీనివల్ల ఖర్చు ఎక్కువగానే వచ్చింది. – నారాయణ, మిట్టకందాల, పాములపాడు మండలం కర్నూలు(అగ్రికల్చర్): బహుళార్థ పశువైద్యశాల.. కర్నూలు నగరంతో పాటు జిల్లాలోని మూగజీవుల పాలిట వరం. ఏరియా పశువైద్యశాలలు, వెటర్నరీ డిస్పెన్సరీల్లో చేతులెత్తేసిన కేసులకు ఇక్కడి వైద్యులు మెరుగైన వైద్యం అందించడంతో పాటు శస్త్ర చికిత్సలు చేస్తూ ప్రాణం పోస్తున్నారు. అత్యవసర వైద్యం కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూగజీవులను కొండారెడ్డిబురుజు సమీపంలోని బహుళార్ధ పశువైద్యశాల కు తీసుకొస్తారు. గత వైఎస్ఆర్సీపీ పాలనలో వైద్య సేవల్లో ఎలాంటి లోపం లేకుండా అందించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆసుపత్రి నిర్వహణ అటకెక్కింది. అధునాతన యంత్ర పరికరాలు మరుగునపడటంతో వైద్య సేవలు అధ్వాన్నమయ్యాయి. గతంలో యజమానులకు ఒక్క రూ పాయి ఖర్చు లేకుండా వైద్య సేవలు అందించారు. నేడు వైద్య సేవలు మినహాయిస్తే.. పరీక్షలు, మందు లు ఇతరత్రాలన్నీ బయటకే రాస్తుండటం గమనార్హం. సేవలు నిర్వీర్యం ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక బహుళార్ధ పశువైద్య శాల ఉంది. ఒక డీడీ పోస్టు, రెండు ఏడీ పోస్టులు, రెండు వెటర్నరీ అసిస్టెంటు సర్జన్ పోస్టులు ఉన్నాయి. సిబ్బంది పూర్తి స్థాయిలో ఉన్నారు. ప్రధానమైన సమస్య చికిత్సకు ఏది అవసరమైన బయటికి వెళ్లి తెచ్చుకోవాల్సిందే. సాంకేతిక సమస్యల కారణంతో సేవలను నిర్వీ ర్యం చేసినట్లు తెలుస్తోంది. డిజిటల్ ఎక్స్రే యూనిట్ ఉన్నా.. కొన్ని నెలలుగా పూర్తిగా మరుగున పడిపోయింది. ఎక్స్రే మిషన్ దుమ్మూ, ధూళితో నిండిపోయింది. రక్తం, యూరిన్ పరీక్షలను కూడా బయటికే పంపుతున్నారు. ఎక్స్రే కోసం గాంధీనగర్కు.. రక్త, యూరిన్ పరీక్షలకు గాయత్రీ ఎస్టేటుకు వెళ్లాల్సి వస్తోంది. అరకొరగా మందులు ప్రస్తుతం ఆసుపత్రిలో రెండు, మూడు మందులు ఇస్తే.. మరో రెండు, మూడు బయటికి రాస్తున్నారు. ఆసుపత్రిలో సేవలు గాడితప్పినా పశువైద్యశాల డీడీ, జిల్లా పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ పట్టించుకున్న దాఖలాలు లేవు. కాస్త చొరవ తీసుకుంటే అన్ని రకాల వైద్య సేవలు బయటకు పంపకుండానే అందించే అవకాశం ఉన్నప్పటికీ పట్టించుకోకపోవడం గమనార్హం. ఆసుపత్రికి ప్రతి రోజు కుక్కలు, పిల్లులు, పందులు ఇతర పశువులను 130 వరకు తెస్తుంటారు. ఇందులో 10 శాతం వాటికి ఎక్స్రే అవసరం అవుతుంది. మరో 10 శాతం వాటికి రక్త, పేడ పరీక్షలు నిర్వహిస్తారు. ఎక్స్రే తీయడానికి రూ.800–రూ.1000 వరకు ఖర్చు అవుతుంది. పరీక్షలకు మరో రూ.1000 వరకు వెచ్చించాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని చూస్తే ఆసుపత్రి అధికారులు రైతులపై ఏ స్థాయిలో ఆర్థిక భారం మోపుతున్నారో స్పష్టమవుతోంది. కుక్కలు, పిల్లులకు ఉచితంగా టీకాలు వేయాల్సి ఉన్నా.. వాటిని కూడా బయటకే రాస్తుండటం విమర్శలకు తావిస్తోంది. మరుగున పడిన ప్రతిపాదనలు బహుళార్ధ పశువైద్యశాలను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్పు చేయాలనే ప్రతిపాదన ఉంది. ఇందులో భాగంగానే రూ.4 కోట్లతో అన్ని రకాల సదుపాయాలతో జి+3 అంతస్తుల భవనాన్ని నాబార్డు నిధులతో నిర్మించారు. 24 గంటలు మూగ జీవులకు వైద్య సేవలు అందించే విధంగా డాక్టర్లను కూడా పెంచాలనే ప్రతిపాదన ఉంది. ఈ ప్రతిపాదనలు మరుగున పడిపోగా.. స్థాయికి తగినట్లుగా కూడా సేవలు అందించకపోవడం గమనార్హం. మెరుగైన వైద్య సేవలే అందిస్తున్నాం బహుళార్ధ పశువైద్యశాలలో మెరుగైన వైద్య సేవలే అందిస్తున్నాం. డిజిటల్ ఎక్స్రే యూనిట్లో సాంకేతిక సమస్యలు ఏర్పడటంతో కొంత అంతరాయం కలిగింది. ఇతర పరీక్షల కోసం శాంపిల్స్ తీసి వ్యాధి నిర్ధారణ కేంద్రానికి పంపుతున్నాం. అక్కడ చేయని వాటిని బయటకు పంపుతున్నాం. – డాక్టర్ హేమంత్కుమార్, డిప్యూటీ డైరెక్టర్, బహుళార్ధ పశువైద్యశాల, కర్నూలు -
నోట మాట రావడం లేదు
● ధరలు భారీగా పతనం ● పొలాల్లోనే దిగుబడిని వదిలేసిన రైతులుటమాట పంట సాగు చేసిన రైతుల నోట మాట రాక మూగబోయింది. పంట ఆరంభం నుంచి కోత దశ వరకు అష్ట కష్టాలు పడి సాగు చేసినా ఒకవైపు తెగుళ్లు.. మరో వైపు నిలకడలేని ధరల కారణంగా నష్టాలు మూట గట్టుకున్నారు. ఆఖరికి పంటపై పెట్టిన పెట్టుబడి కూడా చేతి కందే పరిస్థితి లేకపోవడంతో ఏం చేయాలో దిక్కు తోచక సతమతమవుతున్నారు. పంట సాగు కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలి భగవంతుడా..! అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రబీలో మండల వ్యాప్తంగా దాదాపుగా 150 ఎకరాల్లో పంట సాగు చేయగా ధర మాత్రం గత మూడు నెలలుగా ఒడిదుడుగులకు గురవుతుంది. 25 కేజీల బాక్స్ కేవలం రూ.80 లకే మార్కెట్లో ధర పలకుతుండటంతో కోత కోసిన కూలీల ఖర్చు కూడా రావడం లేదని పంటను పొలాల్లో వదిలేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఆదుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – కృష్ణగిరి -
టీడీపీ నేతలా.. మజాకా
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్రబ్యాంకు అధికారులపై టీడీపీ నాయకులు జులం ప్రదర్శిస్తున్నారు. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ తమ వాళ్లకే దక్కాలని, మళ్లీ టెండర్లు పిలవాలని, లేదా కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఏదో ఒకటి తమ వాళ్లకే ఇవ్వాల్సిందేనని ఏకంగా సీఈవో చాంబరులోకి చొచ్చుకెళ్లి రభస సృష్టించారు. జిల్లా సహకార కేంద్రబ్యాంకు అధికారులు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ కోసం ఇటీవల టెండర్లు పిలిచారు. టెండరుదారుల సమక్షంలోనే గురువారం టెండర్లు ఓపెన్ చేశారు. ఐదుగురు టెండర్లు వేయగా.. టెక్నికల్ బిడ్లో ఇద్దరికి మాత్రమే అర్హత లభించింది. పైనాన్సియల్ బిడ్లో ఎవ్వరు తక్కువ సర్వీస్ చార్జీలతో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీని నిర్వహిస్తామని కోట్ చేసి ఉంటారో వారికే టెండరు ఖరారు చేస్తారు. డీసీసీబీలో జీవీఎల్ మ్యాన్ పవర్ సప్లయి ఏజెన్సీస్ సర్వీస్ చార్జీ కేవలం 2 శాతం మాత్రమే కోట్ చేసింది. మరో ఏజెన్సీ 8 శాతం సర్వీస్ చార్జీలను కోట్ చేసింది. దీంతో డీసీసీబీ అధికారులు జీవీఎల్ సంస్థకే టెండరు ఖరారు చేశారు. డీసీసీబీలో 106 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వీరందరూ ఈ సంస్థ తరుఫున పని చేస్తారు. ఈ సంస్థ మూడు నాలుగేళ్లుగా పని చేస్తోంది. ఎలాంటి రిమార్కులు లేవు. టెండర్లు పిలిచే ముందు ఈ సంస్థను కూడా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ నుంచి తప్పించారు. తాజాగా పిలిచిన టెండర్ల ద్వారా అతి తక్కువ సర్వీస్ చార్జీ కోట్ చేయడం ద్వారా ద్వారా మళ్లీ దక్కించుకున్నారు. జీవీఎల్ సంస్థపై వైఎస్సార్సీపీ ముద్ర వేసిన నందికొట్కూరు, పాణ్యం ఎమ్మెల్యే వర్గీయులు బ్యాంకు అధికారులపై అక్కసు వెల్లగక్కుతున్నారు. పథకం ప్రకారం జీవీఎల్కే టెండరు దక్కే విధంగా చేశారని ఆక్రోశం వ్యక్తం చేశారు. కాగా పాలక వర్గాలు ఉంటే వాళ్లు చెప్పిన సంస్థను ఎంపిక చేసే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం పాలక వర్గాలు లేవు. జాయింట్ కలెక్టర్ నవ్య అఫీషియల్ పర్సన్ ఇన్చార్జ్గా కొనసాగుతున్నారు. ఈ సమయంలో పారాదర్శకంగా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీని టెండరు ద్వారా ఎంపిక చేశారు. దీనిని టీడీపీ నేతలు జీర్ణించుకోలేక అధికారులపై జులుం ప్రదర్శిస్తున్నరనే విమర్శలు ఉన్నాయి. టీడీపీ నేతల చేసిన రభసను బ్యాంకు అధికారులు మూడవ పట్టణ పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. డీసీసీబీలో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ టెండర్లపై రభస అతి తక్కువ సర్వీస్ చార్జీ కోట్ చేసిన జీవీఎల్కు సంస్థకు ఖరారు తమ వారికే ఏజెన్సీ దక్కాలని టీడీపీ నేతల పట్టు -
నంద్యాల జిల్లాలో కీచక టీచర్
సాక్షి, నంద్యాల జిల్లా: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఘటనలు సమాజంలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా, నంద్యాల జిల్లాలో కీచక టీచర్ బాగోతం వెలుగులోకి వచ్చింది. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించి కీచకుడి అవతారం ఎత్తాడు. ప్యాపిలి మండలం ఏనుగుమర్రి ఉన్నత పాఠశాలలో ఘటన జరిగింది.నీలిచిత్రాలు చూడమంటూ సోషల్ టీచర్ బొజ్జన్న ఒత్తిడి చేస్తున్నారని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. హెడ్మాస్టర్కు తెలిసే చేస్తున్నారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీచర్ బొజ్జన్నపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. -
మా వాహనాన్నే ఆపుతావా..
సాక్షి టాస్్కఫోర్స్: ఓర్వకల్లు మండలం నన్నూరు టోల్గేట్ వద్ద ఓ ఎస్ఐ హల్చల్ చేశారు. మా వాహనాన్నే ఆపుతావా అని అక్కడి సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేశారు. ఒక్కసారిగా వాహనాన్ని ముందుకు కదిలించడంతో టోల్బూత్లో ఏర్పాటు చేసిన బూమ్ బ్యారియర్ దెబ్బతినింది. ఈ ఘటన బుధవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. సదరు ఎస్ఐ కర్నూలు ఉపకారాగారం నుంచి ఓ ముద్దాయిని స్టేషన్కు తీసుకొచ్చారు. స్వయంగా ఆయనే కారు నడుపుతున్నారు. వాహనం నన్నూరు టోల్గేట్కు చేరుకోగా ముందున్న మరో వాహనం ఫాస్టాగ్ స్కాన్ కాకపోవడంతో సిబ్బంది మాన్యువల్గా టోల్ రుసుము వసూలు చేశారు. ఆ వెంటనే బూమ్ బ్యారియర్ యథాస్థితికి వస్తుండగా ఎస్ఐ నడుపుతున్న వాహనం ఒక్కసారిగా ముందుకు కదిలింది. ఆ సమయంలో బూమ్ బ్యారియర్ దెబ్బతినింది. ఇంతలో టోల్ సిబ్బంది వాహనం చుట్టూ గుమికూడటంతో ఎస్ఐ బూతు పురాణం మొదలుపెట్టారు. తమ వాహనాన్నే ఆపుతారా అంటూ గద్దించారు. అంతటితో ఆగకుండా టోల్ కలెక్టర్ మహబూబ్బాషాను బలవంతంగా అదే వాహనంలో ఎక్కించుకొని స్టేషన్కు తీసుకెళ్లారు. టోల్ సిబ్బంది బతిమాలినా ఫలితం లేకపోయింది. ఉద్యోగిని తీసుకెళ్లి స్టేషన్లో ఉంచారు. అయితే విషయం ఆనోటా ఈనోటా బయటకు పొక్కడంతో సాయంత్రం 5 గంటల ప్రాంతంలో టోల్ ఉద్యోగిని విడిచిపెట్టడం గమనార్హం. ఇదిలాఉంటే గతంలోనూ ఈ ఎస్ఐ టోల్గేట్ సిబ్బంది పట్ల దురుసుగా వ్యవహరించినట్లు సమాచారం. ఆ సమయంలో ఆయన మఫ్టీలో కారు నడుపుతుండగా సిబ్బంది ఐడీ కార్డు అడిగినట్లు తెలిసింది. నన్నే కార్డు అడుగుతావా అని సిబ్బందిపై విరుచుకుపడినట్లు సమాచారం. -
సెల్ ఫోన్ హ్యాక్ చేసి.. రూ. 90 వేలు కాజేసి!
వెల్దుర్తి: సైబర్ నేరగాళ్లు రోజుకో పంథాలో దోచుకుంటున్నారు. సెల్ఫోన్ను హ్యాక్ చేసి, ఓటీపీలు తెలుసుకుని బ్యాంక్ ఖాతాలో ఉన్న నగదును అపహరించారు. వెల్దుర్తి పట్టణానికి చెందిన రేమడూరు రామిరెడ్డికి స్థానిక యూనియన్ బ్యాంకులో ఖాతా ఉంది. సైబర్ నేరగాళ్లు అతని సెల్ ఫోన్ను ఈనెల 17న హ్యాక్ చేసి ఓటీపీలు తెలుసుకుంటూ బ్యాంకు ఖాతాలోని రూ.99 వేలను అమేజాన్ పే ద్వారా బదిలీ చేసుకున్నారు. తన ఖాతా నుంచి నగదు మాయమైనట్లు గుర్తించిన బాధితుడు బుధవారం బ్యాంకుకు వెళ్లి ఆరా తీశారు. సైబర్ నేరగాళ్ల పనేనని తెలుసుకుని తన ఖాతాను లాక్ చేయించారు. బాధితుడు సైబర్ పోలీసులు, స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఫోన్లకు వచ్చే కొత్త లింకులు ఓపెన్ చేయవద్దని, ఫోన్లు హ్యాక్ అయి నగదు మోసాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎస్ఐ అశోక్ హెచ్చరించారు. ప్రయాణికుల భద్రతకు పకడ్బందీ చర్యలు చేపట్టండి ఆదోని సెంట్రల్: ప్రయాణికుల భద్రతకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని రైల్వే సౌత్ సెంట్రల్ జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ రైల్వే అధికారులకు సూచించారు. వార్షిక తనిఖీలో భాగంగా ఆయన బుధవారం సులహాళ్లి నుంచి గుంతకల్లు వరకు రైల్వే స్టేషన్లను పరిశీలిస్తూ ఆదోని రైల్వే స్టేషన్ను తనిఖీ చేశారు. అమృత్ భారత్ పథకం కింద స్టేషన్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. పనుల్లో నాణ్యత పాటించాలని సూచించారు. ఈయన వెంట ప్రిన్సిపల్ చీఫ్ అప్రంటీస్ మేనేజర్ పద్మజ, గుంతకల్లు డీఅర్ఎం చంద్ర శేఖర్ గుప్త ఆదోని స్టేషన్ మాస్టర్ వెంకటేశ్వర్లు, చీఫ్ క్యాంప్ సూపరింటెండెంట్ త్రిభువన్, రైల్వే పోలీసులు తదితరులు ఉన్నారు. పట్టణంలోని నల్లగేటు వద్ద అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మా ణం చేపట్టాలని బీజేపీ నాయకులు నాగరాజు గౌడ్, మధుసూనద్ శర్మ తదితరులు అరుణ్ కుమార్ జైన్కు వినతి పత్రం అందజేశారు. ఒద్దెల వాగులో యువకుడి గల్లంతు ● గాయాలతో బయటపడిన మరొకరు పాణ్యం: మండల కేంద్రమైన పాణ్యం–కొణిదేడు గ్రామాల మధ్య ఉన్న వొద్దెలవాగులో ఓ యువకుడు గల్లంతు కాగా మరో యువకుడు గాయాలతో బయటపడ్డాడు. కొణిదేడు సమీపంలో రైల్వే డబ్లింగ్ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ పనులు చేస్తున్న ఛత్తీస్ఘడ్కు చెందిన రాహూల్, మరో యువకుడు పని మీద బుధవారం సాయంత్రం బైక్పై పాణ్యం వచ్చారు. రాత్రి పని ముగించుకుని పని చేసే చోటుకు తిరిగి వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఒద్దెలవాగులో పడిపోయారు. గమనించిన వాహనదారులు రాహుల్ అనే వ్యక్తికి బయటకు తీశారు. మరో యువకుడు గల్లంతైనట్లు తెలిపారు. సమాచారం తెలుసుకు న్న 108 సిబ్బంది గాయపడిన రాహుల్ను నంద్యాల జీజీహెచ్కు తరలించారు. స్థానికులు వాగు వెంట మరో యువకుడికి కోసం గాలిస్తున్నారు. ట్రాక్టర్ డ్రైవర్ దుర్మరణం డోన్ టౌన్: పట్టణంలో వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ దుర్మరణం చెందాడు. మల్లెంపల్లె గ్రామానికి చెందిన సలీంద్ర వీరాంజనేయులు (30) డోన్ పట్టణం నుంచి కొత్తపల్లె వైపు ట్రాక్టర్లో వెళ్తుండగా వెనుక వస్తున్న మరో ట్రాక్టరు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వీరాంజనేయులు ట్రాక్టర్ నుంచి ఎగిరి పక్కనే ఉన్న డివైడర్పై పడటంతో తలకు తీవ్రగాయమైంది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతునికి భార్య మంజుల, నెలల వయస్సు కుమారుడు ఉన్నారు. -
దుఃఖాన్ని దిగమింగి పరీక్షకు హాజరు
ఆలూరు: బాల్యంలో చేయి పట్టుకుని ప్రపంచాన్ని చూపించిన, మంచి నేర్పించిన తండ్రి ఇక లేరు..పుట్టినప్పటి నుంచి లాలన పంచి, మమకారంతో పెంచిన అమ్మ ఇక రాదు.. ఎంతో కష్టాన్ని భరించి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు లేరనే దుఃఖంలోనే ఇద్దరు పదో తరగతి విద్యార్థులు బుధవారం పరీక్ష రాశారు. కంట నీరు వస్తున్నా అమ్మానాన్నలు పెట్టుకున్న ఆశలు, తమ ఆశయాలను నెరవేర్చుకునేందుకు పరీక్షకు హాజరయ్యారు. ఆలూరు మండలం మొలగవెల్లి గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన సాయి పోగు భగీరత, భార్య శ్రీదేవి దంపతుల నాలుగో కుమారుడు సాయిపోగు రామకృష్ణ స్థానిక పాఠశాలలో పదో తరగతి చదివారు. తల్లిదండ్రులు కూలి పనులు చేస్తూ కుమారుడిని చదివించారు. ఈ నెల 18న హాలహర్వి మండలం గూళ్యం గ్రామంలో మిర్చి పంటను కోసేందుకు శ్రీదేవి (47) కూలి పనికి వెళ్లారు. పొలం సమీపంలోని ఎల్లెల్సీలో నీటిని తాగేందుకు వెళ్లి కాలు జారి పడి మృతి చెందారు. తల్లి మృతి చెందిన బాధను దిగమింగుకుని ఆలూరు ప్రభుత్వ బాలికల ఉన్న పాఠశాల పరీక్ష కేంద్రంలో సాయిపోగు శివరామకృష్ణ బుధవారం హిందీ పరీక్ష రాశారు. తండ్రి మరణించినా.. ఆలూరులోని మెయిన్ ఉర్దూ పాఠశాలలో మహ్మద్ ముజమల్ అనే విద్యార్థి పదో తరగతి చదివారు. మంగళవారం తెల్లవారు జామున విద్యార్థి తండ్రి నూర్మహ్మద్ (50) అనారోగ్యంతో మృతి చెందారు. ఆ బాధతోకూడా బుధవారం ఉదయం పరీక్ష కేంద్రానికి మహ్మద్ ముజమల్ చేరుకున్నారు. హిందీ పబ్లిక్ పరీక్షను రాశారు. తండ్రి మరణించిన దుఃఖంలోనూ పరీక్షకు హాజరైన విద్యార్థి మహ్మద్ ముజమల్ను ఉపాధ్యాయులు అభినంధించారు. -
రైతు ఇంట మెరిసిన ఆణిముత్యాలు
● ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ముగ్గురు కుమారులు ● చిన్నారులకు ఉచితంగా బోధన చేస్తున్న రైతు బేతంచెర్ల: ఆ రైతుకు చదువు అంటే ఎంతో ఇష్టం. ఆర్థిక ఇబ్బందులతో ఉన్నత చదువుకు దూరమయ్యాడు. అయితే వ్యవసాయం చేస్తూనే తన కలను కుమారులతో సాకారం చేసుకున్నాడు. ముగ్గురు కొడుకులను బాగా చదివించడంతో వారు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. తన బిడ్డల్లానే గ్రామంలో చిన్నారులు కూడా శ్రద్ధగా చదువుకుని ప్రయోజకులు కావాలని ఆకాంక్షిస్తూ సాయంత్రం వేళ ఉచితంగా విద్యను బోధిస్తున్నాడు. ఎంబాయి గ్రామం పాడి పంటలకు ప్రసిద్ధి. ఆ గ్రామంలో ఈడిగ వెంకటేశ్వర్లు, వెంకటేశ్వరమ్మ దంపతులది సాధారణ వ్యవసాయ కుటుంబం. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. తల్లిదండ్రుల కష్టాన్ని దగ్గరగా చూసిన ముగ్గురు కుమారులు పట్టుదలతో చదివి ఉద్యోగాలు సాధించారు. పెద్ద కుమారుడు తులసీ రామ్ గౌడ్ డిగ్రీలో బీజెడ్సీ పూర్తి చేసి 2014లో ఎయిర్ ఫోర్స్లో మెడికల్ అసిస్టెంట్గా ఎంపికయ్యారు. ప్రస్తుతం బెంగళూరులో పని చేస్తున్నారు. రెండవ కుమారుడు బెనర్జీ గౌడ్ వెటర్నరీలో డిప్లొమో పూర్తి చేసి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అనిమల్ హస్బెండరీగా ఎంపికయ్యారు. కొలుములపల్లె సచివాలయంలో పని చేస్తూ.. ఇటీవల వెటర్నరీ అసిస్టెంట్గా పదోన్నతి పొంది ముద్దవరంలో విధులు నిర్వహిస్తున్నారు. చిన్న కుమారుడు తరుణ్కుమార్ గౌడ్ 2019లో అనంతపురం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించారు. ఇటీవల కళాశాలలో జరిగిన గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ మాణిక్యరావు చేతుల మీదుగా డాక్టర్ పట్టా అందుకున్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రభుత్వ కొలువులు సాధించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పట్టుదలతో సాధించారు నేను 10వ తరగతి వరకు చదువుకున్నాను. ఆర్థిక పరిస్ధితుల కారణంగా ఉన్నత చదువులకు వెళ్లలేక గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ పిల్లలను బాగా చదివించాలనుకున్నా. వారు కూడా పట్టుదలతో చదివి ప్రయోజకులయ్యారు. చిన్నప్పటి నుంచి పిల్లలు పాఠశాలకు వెళ్లి వచ్చిన తరువాత బోధన ఆంశాలపై చర్చించి, సందేహాలను నివృత్తి చేసేవాడిని. మా పెద్ద కుమారుడు తులసీరామ్ గౌడ్ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగం సాధించిన తరువాత తమ అన్నను ఇద్దరు తమ్ములు ఆదర్శంగా తీసుకుని ఉద్యోగాలు సాధించారు. నా కొడుకుల మాదిరిగానే గ్రామంలోని చిన్నారులు కూడా బాగా చదువుకోవాలని నా వంతుగా సాయంత్రం వేళలో ఉచితంగా బోధన చేస్తున్నాను. – వెంకటేశ్వర్లు గౌడు, ఎంబాయి -
ప్రజల రక్షణ మరిచి !
నిబంధనలు నీట ముంచి.. ● యథేచ్ఛగా ఇంజిన్ బోటు ప్రయాణం ● కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్ ● కెపాసిటీకి మించి లైఫ్ జాకెట్స్ లేకుండా ప్రయాణికుల తరలింపు ● ఘాట్ నిర్వాహకులకు అధికార పార్టీ నేతల అండదండలు పగిడ్యాల: శ్రీశైలం బ్యాక్వాటర్లో ఇంజిన్ బోటులో ప్రయాణికుల తరలింపును అడ్డుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించినా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. మూర్వకొండ ఘాట్, అర్లపాడు ఘాట్ నిర్వాహకులకు అధికార పార్టీ నేతల అండదండలతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కృష్ణానదికి ఇరువైపులా బంధువర్గాలు ఉన్న ప్రజలు ఆయా ప్రాంతాలకు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే వ్యవప్రయసాలు కావడంతో చాలా మంది ఇంజిన్ బోట్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఘాట్ నిర్వాహకులు కెపాసిటీకి మించి ప్రయాణికులను పడవలో తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కనీసం లైఫ్ జాకెట్లు లేకుండా ప్రయాణికులను పంపుతున్నారు. మూడు నెలలుగా కొనసాగుతున్న అనధికారిక ఇంజిన్ బోటు ప్రయాణంపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఘాట్ నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఇంజిన్ బోట్లలో కెపాసిటీకి మించి 25 నుంచి 30 మంది ప్రయాణికులను తరలించడమే కాకుండా బైక్లను అందులో తరలించి ఒక్కొక్కరి నుంచి రూ. 200ల ప్రకారం వసూలు చేస్తున్నారు. 2007 జనవరి 18న ఇదే మూర్వకొండ ఘాట్ నుంచి సింగోటం జాతరకు నాటు పడవలో వెళ్తూ 60 మంది జల సమాధి అయిన ఘటన నేటికి కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. అయినా కాలం చెల్లిన ఫిట్నెస్ లేని ఇంజిన్ బోట్లపై ప్రయాణికులు భయం భయంగా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ అనుమతి (లైసెన్స్) లేకపోయినప్పటికీ అధికార పార్టీ ఎమ్మెల్యే వర్గీయుల కనుసన్నల్లో అనధికార ప్రయాణానికి పచ్చ జెండా ఊపడంతో ఘాట్ నిర్వాహకులకు కాసుల పంట పండుతోంది. ఈ విషయమై తహసీల్దార్ శివరాముడును వివరణ కోరగా.. ఇంజిన్ బోటు ప్రయాణానికి ఎలాంటి అనుమతి ఇవ్వలేదని విచారించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. -
పెద్దాయనా.. మన్నించు !
సంజీవయ్య జయంతి ఉత్సవాలకు రూ.3 లక్షలు ● ఫిబ్రవరి 14న ఘనంగా నిర్వహించిన జిల్లా అధికార యంత్రాంగం ● నేటికీ నయాపైసా విదల్చని ప్రభుత్వం కర్నూలు(అర్బన్): దివంగత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి నిర్వహణకు సంబంధించిన వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నేటికీ విడుదల చేయకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సంజీవయ్య సొంత జిల్లా అయిన కర్నూలులో ఆయన జయంతిని అంగరంగ వైభవంగా అధికారికంగా రాష్ట్ర స్థాయి పండుగ నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే స్టేట్ హెడ్ క్వార్టర్స్తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఒక్కో జిల్లాకు రూ.లక్ష, సంజీవయ్య సొంత జిల్లా కర్నూలుకు రూ.3 లక్షల నిధులు కేటాయిస్తున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరి 10న రాష్ట్ర ప్రభుత్వం జీఓ 2 విడుదల చేసింది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం స్థానిక నంద్యాల చెక్పోస్టు సమీపంలో దామో దరం సంజీవయ్య విగ్రహం ఉన్న ప్రాంతంలో జయంతి వేడుకలను ఫిబ్రవరి 14న ఘనంగా నిర్వహించారు. నేడో రేపో నిధులు విడుదలైన వెంటనే చెల్లించవచ్చనే ధైర్యంతో సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన పలువురు అధికారులు సప్లయర్స్ షాపు, పూల దుకాణాలు, కిరాణ తదితర షాపుల్లో అప్పులు చేసి జయంతిని ఘనంగా చేశారు. జయంతి నిర్వహించి నెల రోజులు గడచిపోయినా, ప్రభుత్వం నుంచి నేటికీ నయాపైసా విడుదల కాకపోవడంతో అప్పులు ఇచ్చిన షాపుల వారికి ముఖాలు చూపించలేక, అపద్దాలు చెప్పలేక పలువురు అధికారులు ముఖం చాటేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయా షాపుల యజమానులు సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండటం గమనార్హం. -
దైవ దర్శనానికి వెళ్తూ..
జూపాడుబంగ్లా/కొత్తపల్లి: సప్తనదుల సంగమేశ్వరంలో వెలిసిన సంగమేశ్వరుడి దర్శనానికి వెళ్లిన ఓ యువకుడు కృష్ణానదిలో మునిగి మృత్యువాత పడ్డాడు. మండ్లెం గ్రామానికి చెందిన పోతులరాజు మద్దిలేటి, బాలావతమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దవాడైన సందీప్కుమార్బాబు తిరుపతిలోని ఐఎఫ్ ఎఫ్టీ కంపెనీలో మార్కెటింగ్ ఉద్యోగం చేస్తున్నాడు. తండ్రికి ఆరోగ్యం బాగోలేదని చూసేందుకు నాలుగు రోజుల క్రితం స్వగ్రామానికి చేరుకున్నాడు. కాగా బుధవారం తన మిత్రుడు తంగడంచ గ్రామానికి చెందిన శివకుమార్తో కలిసి బైక్పై సప్తనదుల సంగమేశ్వరాలయానికి వెళ్లారు. నదిలో స్నానం చేసిన అనంతరం ఆలయ అర్చకుడు తగ్గిన కృష్ణా జలాల్లో నడుచుకొంటూ ఆలయం వద్దకు వెళ్లి పూజలు చేసి రావటాన్ని గమ నించారు. వారు కూడా ఆలయం వద్దకు వెళ్లి స్వామిని దర్శించుకునేందుకు కృష్ణాజలాల్లో నడుచుకొంటూ వెళ్లసాగారు. కొద్దిదూరం వెళ్లాక శివకుమార్ తన వద్ద ఉన్న సెల్ఫోన్ ఒడ్డుపై పెట్టివస్తానని బయటకు వచ్చాడు. సందీప్కుమార్బాబు ఒక్కడే నీళ్లల్లో నడుచుకుంటూ ఆలయం వద్దకు వెళ్లాడు. ఆలయం సమీపిస్తుండగానే అక్కడ లోతైన గుంతలోని పూడికలో కూరుకపోయి మునిగిపోయాడు. శివకుమార్ గమనించి కేకలు వేయటంతో సమీపంలోని మత్స్యకారులు పుట్టిల్లో వెళ్లి నీట మునిగిన సందీప్కుమార్బాబును ఒడ్డుకు చేర్చారు. కాగా అప్పటికే అతను మృతిచెందాడు. సమాచారం అందుకన్న యువకుడి తల్లిదండ్రులు సంగమేశ్వరానికి చేరుకుని విలపించారు. సమాచారం అందుకున్న కొత్తపల్లి ఎస్ఐ ఎం.కేశవ సిబ్బందితో కలసి సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి బాబాయి బుజ్జన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని ఎస్ఐ తెలిపారు. పేకాటరాయుళ్ల అరెస్ట్ సంజామల: మండల పరిధిలోని మంగపల్లె గ్రామంలో పేకాట ఆడుతున్న ఐదుగురిని ఎస్ఐ రమణయ్య బుధవారం అరెస్ట్ చేశారు. గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు రైల్వే ట్రాక్ సమీపంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారం రావడంతో సిబ్బందితో కలసి దాడి చేసి పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.3150 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. -
నేడు నేర సమీక్ష సమావేశం
దుకాణానికో రేటు ఖరారు ● కర్నూలులో రూ.70 వేలు ఇవ్వాల్సిందేనని పట్టు ● మధ్యవర్తిత్వం చేసిన ఓ మంత్రి ● ప్రస్తుతానికి రూ.40వేలు చెల్లించేలా ఒప్పందం ● వ్యాపారాన్ని బట్టి కూడా వసూళ్లు ●● ప్రతినెలా 10లోపు లావాదేవీల పూర్తి కర్నూలు: ఉమ్మడి జిల్లాలోని మద్యం దుకాణాల్లో పోలీసుల మామూళ్ల దందా శృతి మించుతోంది. వ్యాపారం సాగుతుందా? లేదా అనే విషయంతో సంబంధం లేకుండా అన్ని చోట్టా వసూళ్ల పర్వం యథేచ్ఛగా సాగుతోంది. నెలకు దుకాణానికి రూ.40 వేలు, మరికొన్ని చోట్ల రూ.50 వేలు చొప్పున కప్పం కట్టాల్సిందేనంటూ అనధికారిక ఆదేశాలు జారీ చేస్తున్నారు. వచ్చిన మొత్తాన్ని వాటాలేసి పంచుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో 225 మద్యం దుకాణాలు, 60 బార్లు ఉన్నాయి. వీటిలో 90 శాతం దుకాణాల్లో పోలీసులు మామూళ్లు వసూలు చేస్తున్నారు. నెలకు రూ.40 వేల చొప్పున ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. కర్నూలు అర్బన్లో 21, రూరల్లో 11 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఒక్కొక్క దుకాణానికి రూ.70 వేల చొప్పున ఇవ్వాలని ఓ పోలీసు అధికారి హుకూం జారీ చేయగా మద్యం సిండికేట్దారులు ఓ మంత్రిని ఆశ్రయించారు. వ్యాపారంలో ఎదురవుతున్న కష్టాల గురించి చెప్పుకున్నారు. దీంతో మంత్రి మధ్యవర్తిత్వం చేసి ఒక్కొక్క దుకాణానికి రూ.40 వేలు ఇచ్చేలా డీల్ కుదిర్చినట్లు వ్యాపారుల్లో చర్చ జరుగుతోంది. ఒక్క కర్నూలు ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో ఉన్న 32 మద్యం దుకాణాలు, 18 బార్ల నిర్వాహకులు కలసి నెలకు రూ.20 లక్షల దాకా పోగేస్తున్నారంటే వసూళ్ల పర్వం ఏస్థాయిలో సాగుతుందో అర్థమవుతోంది. వ్యాపారం బాగా సాగితే అదనపు వసూళ్లు కోడుమూరు ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో 15 మద్యం దుకాణాలు ఉన్నాయి. జిల్లాలోనే అత్యధిక వ్యాపారం జరిగే నాగలాపురం మద్యం దుకాణం నుంచి నెలకు రూ.లక్ష చొప్పున ఇవ్వాల్సిందేనంటూ ఓ అధికారి హుకూం జారీ చేసినట్లు వ్యాపార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇలా ఉమ్మడి కర్నూలు జిల్లాలో వందకు పైగా దుకాణాల్లో అత్యధిక వ్యాపారం జరుగుతుండటంతో వాటి నిర్వాహకుల నుంచి పోలీసులు అదనంగా వసూలు చేస్తున్నట్లు సమాచారం. సిండికేట్ నిర్వాహకుల లెక్కల్లో ఏయే స్టేషన్కు ఎంత మొత్తం మామూళ్లు ఇస్తున్నారో పొందుపరచిన వివరాలపై ఇటీవల ఎకై ్సజ్ అధికారులు, మద్యం వ్యాపారుల మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. ప్రతినెలా 10వ తేదీలోపే! కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వసూళ్ల దందా జోరుగా సాగుతోంది. ప్రతినెలా 10వ తేదీ లోపే వసూళ్ల ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. రెండు జిల్లాల్లో నెలకు రూ.కోటికి పైగా మామూళ్ల రూపంలో పోలీసులకు అందుతున్నట్లు వ్యాపార వర్గాల్లో చర్చ జరుగుతోంది. వచ్చిన మొత్తాన్ని రెండు వాటాలు వేసి ఎస్హెచ్లు, ఆపై అధికారులు పంచుకుంటున్నట్లు చర్చ జరుగుతోంది. స్టేషన్, సబ్ డివిజన్ పరిధిలో ఉండే మద్యం దుకాణాల సంఖ్యను బట్టి మామూళ్లు ముట్టజెపుతున్నట్లు తెలుస్తోంది. అధిక ధరలకు అమ్మకాలు ●పోలీసులను మామూళ్ల మత్తులో పెట్టి నిర్వాహకులు నిబంధనలు గాలికి వదిలేస్తున్నారు. ● అధిక ధరలకు అమ్ముకునేందుకు రూరల్ ప్రాంతాల్లో బెల్టు షాపులకు మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. ● ఈ క్రమంలో అర్బన్ ప్రాంతాల్లో దుకాణానికి నెలకు రూ.40 నుంచి రూ.50 వేలు, రూరల్ ప్రాంతాల్లో రూ.60 వేల నుంచి రూ.80 వేల దాకా మామూళ్ల రూపంలో పోలీసులు పోగేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ● ప్రతి మద్యం దుకాణం నుంచి వాటి అనుబంధ బెల్టు షాపులకు క్వార్టర్పై ఉన్న ఎమ్మార్పీ కంటే రూ.20 నుంచి రూ.50 వరకు ఎక్కువ ధరకు వ్యాపారులు సరఫరా చేస్తున్నారు. ● బెల్టు దుకాణాల్లో జరిగే దందాను చూసీచూడనట్లు ఉండేందుకు వ్యాపారాన్ని బట్టి ప్రత్యేక ప్యాకేజీలు ఏర్పాటు చేసుకుని వసూలు చేస్తున్నట్లు సమాచారం. కర్నూలు: జిల్లా పోలీస్ కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో గురువారం నేర సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. గత నెలలో జరిగిన నేరాలతో పాటు పెండింగ్ కేసులపై ఎస్పీ విక్రాంత్ పాటిల్ సమీక్షించనున్నారు. ముందుగా ఉదయం 6 నుంచి 9 గంటల వరకు కర్నూలు శివారులోని జగన్నాథగట్టుపై ఉన్న పోలీసు శిక్షణ కేంద్రంలో పోలీసు అధికారులకు ఫైరింగ్పై శిక్షణ, 10 గంటల నుంచి వ్యాస్ ఆడిటోరియంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు జిల్లాలోని పోలీసు అధికారులకు ఆదేశాలు అందాయి. -
యోగా అవార్డులకు నామినేషన్ల ఆహ్వానం
కర్నూలు(హాస్పిటల్): పీఎం యోగా అవార్డులు ఇచ్చేందుకు ఆన్లైన్ ద్వారా నామినేషన్లు, ప్రతిపాదనలు ఆహ్వానిస్తున్నట్లు సెట్కూరు సీఈఎ డాక్టర్ కె.వేణుగోపాల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. యోగాలో జాతీయ, అంతర్జాతీ య స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారికి, యోగా అభివృద్ధికి కృషి చేసిన సంస్థలకు అవార్డులు ప్రదానం చేస్తారని పేర్కొన్నారు. ఆసక్తిగల వారు ఈ నెల 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. పూర్తి వివరాలకు https:// innovateindia. mygov. in/ pm& yoga& awards–2025 ను సందర్శించాలన్నారు. క్వింటా పత్తి రూ.7,666 ఆదోని అర్బన్: ఆదోని వ్యవసాయ మార్కెట్యార్డులో పత్తి ధర క్రమంగా పెరుగుతోంది. బుధవారం క్వింటా ధర రూ.7,666గా నమోదైంది. రైతులు 517 క్వింటాళ్లు అమ్మకానికి తీసుకురాగా.. గరిష్ట ధర రూ.7,666, మధ్య ధర రూ.7,380, కనిష్ట ధర రూ.5,389 పలికింది. ● వేరుశనగలు 5,100 సంచులు విక్రయానికి రాగా.. గరిష్ట ధర రూ.6,827, మధ్య ధర రూ. 6,469, కనిష్ట ధర రూ.3,399 నమోదైంది. ● ఆముదాలు 32 సంచులు రాగా గరిష్ట ధర రూ.5,970, మధ్య ధర రూ.5,970, కనిష్ట ధర రూ.5,077 పలికింది. ● ఎండుమిర్చి 2,057 సంచులు రాగా గరిష్ట ధర రూ.10,206, మధ్య ధర రూ.8,300, కనిష్ట ధర రూ.2,009 నమోదైంది. మధ్యవర్తిత్వంపై శిక్షణ కర్నూలు(సెంట్రల్): సుప్రీంకోర్టు నూతనంగా ప్రవేశపెట్టిన మధ్యవర్తిత్వంపై బార్ అసోసియేషన్ సభ్యులకు శిక్షణ ఇచ్చారు. బుధవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కబర్థి ఆదేశాలతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి, కేరళ నుంచి వచ్చిన రిసోర్స్పర్స్న్లు సురేష్, జ్యోతిగోపీనాథన్ న్యాయవాదులకు అవగాహన కల్పించా రు. మధ్యవర్తిత్వంతో కేసులను ఎలా పరిష్కరించాలనే అంశాలు, ఉన్న చట్టాలపై శిక్షణ ఇచ్చారు. పది పరీక్ష కేంద్రాల తనిఖీ కర్నూలు సిటీ: నగరంలోని పదోతరగతి పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా తనిఖీ చేశారు. బిషప్ సెంట్ జోసెఫ్ ఇంగ్లిషు మీడియం హైస్కూల్, గుడ్ షెప్పర్డ్ ఇంగ్లిషు మీడియం హైస్కూల్లో ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా 172 పరీక్ష కేంద్రాల్లో బుధవారం జరిగిన పదో తరగతి పరీక్షలకు 219 మంది గైర్హాజరయ్యారు. మొత్తం 31,535 మంది విద్యార్థులకుగాను 31,316 మంది హాజరు అయ్యారని డీఈఓ ఎస్. శామ్యూల్ తెలిపారు. రెండో రోజు ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదు. ఓపెన్ స్కూల్ టెన్త్ పరీక్షలకు 809 మంది విద్యార్థులకుగాను 721 మంది పరీక్షకు హాజరుకాగా 88 మంది గైర్హాజరయ్యారు. -
అవిశ్వాస తీర్మానం
ఆదోని మునిసిపల్ చైర్పర్సన్పై కర్నూలు(సెంట్రల్): ఆదోని మునిసిపల్ చైర్పర్సన్ బోయ శాంత ప్రజాస్వామ్యబద్ధంగా ఎంపికై నా కౌన్సిలర్ల మాటకు విలువ ఇవ్వకుండా విశ్వాసం కోల్పోయారని, ఆమైపె అవిశ్వాస తీర్మానానికి అవకాశం ఇవ్వా లని కోరుతూ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు కలెక్టర్ను కలిశారు. బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ పి.రంజిత్బాషాను ఆయన చాంబర్లో కలసి 35 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా సంతకాలు చేసిన లేఖను అందజేశారు. ఈ లేఖపై కలెక్టర్ 15 రోజుల్లో విచారణ జరిపి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రత్యేకంగా మునిసిపల్ససర్వసభ్య సమావే శా న్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అవిశ్వాస తీర్మానం నెగ్గితే నూతన ౖచైర్మన్ను ఎన్నుకునే వీలుంటుంది. కౌన్సిలర్ల మాటకు విలువ లేకుండా చేశారు... ఆదోని మునిసిపల్ చైర్పర్సన్ బోయ శాంత కౌన్సిలర్ల మాటకు విలువ లేకుండా చేయడంతోనే ఆమైపె అవిశ్వాస తీర్మానానికి సిద్ధమైనట్లు కౌన్సిలర్లు గౌస్, రఘునాథఽరెడ్డి, లక్ష్మీదేవి, లోకేశ్వరి, నరసింహులు, సందీప్రెడ్డి తెలిపారు. వైఎస్సార్సీపీ తరపున గెలిచిన ఆమె ఇటీవల బీజేపీలోకి వెళ్లి ఎమ్మెల్యే డాక్టర్ బి.పార్థసారథి మాటలు విని తమ తీర్మానాలను పట్టంచుకోవడంలేదన్నారు. ఇదేసమయంలో ఆదోని ఎమ్మెల్యే అభివృద్ధికి ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురాకుండా, కౌన్సిలర్లపై పెత్తనం చేస్తున్నారని, బలవంతంగా పార్టీ మారాలని ఒత్తిళ్లు చేస్తున్నట్లు వాపోయారు. బెదిరించి పార్టీ మార్పిస్తున్నారు అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు వైఎస్ఆర్సీపీ మునిసిపల్ మేయర్లు, చైర్మన్లను దౌర్జన్యంగా బెదిరించి టీడీపీ, బీజేపీ, జనసేనల్లోకి చేర్చుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి, ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి, మేయర్ బీవై రామయ్య ఆవేదన వ్యక్తంచేశారు. ఇటీవల తిరుపతిలో కనీస బలం లేకుండా డిప్యూటీ మేయర్ పోస్టును టీడీపీ కై వసం చేసుకోవడాన్ని చూశామని, అదే తరహాలో ఆదోనిలో కూడా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను భయపెట్టి పార్టీలో చేర్చుకుంటున్నారన్నారు. చైర్పర్సన్ సహా ఐదుగురు కౌన్సిలర్లను పార్టీలో చేర్చుకున్నారని తెలిపారు. పార్టీ మారిన వారంతా అవిశ్వాసం సందర్భంగా వైఎస్ఆర్సీపీకే ఓటు వేయాలని, లేదంటే విప్ను జారీ చేసి డిస్క్వాలిఫై చేస్తామన్నారు. మొత్తం వార్డులు: 42 వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు: 41 టీడీపీ కౌన్సిలర్లు: 01 కలెక్టర్కు లేఖను అందించిన 35 మంది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఆదోని మున్సిపాలిటీలో పార్టీల బలాబలాలు (కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక చైర్పర్సన్ సహా ఐదుగురిని బెదిరించి బీజేపీలో చేర్చుకున్నారు. ఒకరు చనిపోయారు. అయినప్పటికీ వైఎస్ఆర్సీపీకి 35 మంది కౌన్సిలర్ల బలం ఉంది.) -
అందరూ చూస్తుండగానే ఆత్మహత్య
● గుత్తి రైల్వే స్టేషన్లో రైలు కింద పడి మృతి ● మృతుని స్వగ్రామం గొర్విమానుపల్లె ● ఆర్థిక సమస్యలే కారణమని సమాచారం కొలిమిగుండ్ల: అనంతపురం జిల్లా గుత్తి రైల్వే స్టేషన్ బుధవారం మధ్యాహ్నం ప్రయాణికులతో రద్దీగా ఉంది.. అందరూ చూస్తుండగానే ఓ యువకుడు పట్టాలపైకి చేరుకొని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హఠాత్తు సంఘటనతో అక్కడి ప్రయాణికులు షాక్కు గురయ్యారు. కొలిమిగుండ్ల మండలం గొర్విమానుపల్లెకు చెందిన రామదాసు శ్రీరాములు, మునెమ్మ దంపతులకు కుమార్తె, కుమారుడు సంతానం కాగా కూతురుకు వివాహమైంది. కుమారుడు మహేంద్ర (25) గతంలో గ్రామంలో వలంటీర్గా పని చేశాడు. ప్రస్తుతం అనంతపురం జిల్లా యాడికి సమీపంలోని ఓ సిమెంట్ పరిశ్రమలో పని చేస్తున్నాడు. కొద్ది రోజుల నుంచి ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కే మార్గం లేక ఐదు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు పలు చోట్ల గాలిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం గుత్తి రైల్వే స్టేషన్కు చేరుకున్న యువకుడు రైలు వేగంగా వస్తుండగా ప్రయాణికులు చూస్తుండగానే ప్లాట్ఫామ్ పైనుంచి దూకి పట్టాలపై తల పెట్టి పడుకోవడంతో రైలు అతనిపై వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు ఆరా తీయగా గొర్విమానుపల్లెకు చెందిన మహేంద్రగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. -
27న ‘స్థానిక’ ఖాళీల భర్తీకి ఎన్నికలు
కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్, మండల పరిషత్తుల్లో ఖాళీగా ఉన్న కోఆప్షన్ సభ్యులు, ఎంపీపీ పదవుల భర్తీకి ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించనున్నట్లు జిల్లా పరిషత్ సీఈఓ జి.నాసరరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యుడు వెలుగోడుకు చెందిన సయ్యద్ సులేమాన్ గత ఏడాది మార్చి 28న, క్రిష్ణగిరి మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు షేక్ షాలీసాహెబ్ ఈ ఏడాది జనవరి 1న మృతి చెందారన్నారు. అదేవిధంగా వెల్దుర్తి, తుగ్గలి మండల పరిషత్ అధ్యక్షులు బి.శారద, ఆదెమ్మ వ్యక్తిగత కారణాలతో 2024 మార్చి 29న తమ పదవులకు రాజీనామా చేశారన్నారు. ఈ నేపథ్యంలో ఖాళీ ఏర్పడిన నాలుగు పోస్టులకు ఎన్నికలను నిర్వహించునున్నామన్నారు. ఇందుకు సంబంధించి ఈ నెల 23న నోటీసులు జారీ చేస్తామని, ఆ రోజు నుంచి కోఆప్షన్ సభ్యుల స్థానాలకు 27వ తేది ఉదయం 10 గంటల వరకు, ఎంపీపీ స్థానాలకు ఉదయం 11 గంటల వరకు నామినేషన్లు దాఖాలు చేసుకోవచ్చన్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన అనంతరం యథావిధిగా నామినేషన్ల ఉపసంహరణ, బరిలో ఉన్న వారి జాబితాలను ప్రకటిస్తామన్నారు. అదే రోజున మధ్యాహ్నం 1 గంటకు జెడ్పీలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి కోఆప్షన్ సభ్యున్ని ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. అలాగే మండల పరిషత్ కార్యాలయాల్లో కూడా ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి ఎంపీపీ, కోఆప్షన్ సభ్యున్ని ఎన్నుకుంటారన్నారు. ఆరు గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచులకు.. జిల్లాలోని ఆరు గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచు స్థానాలకు ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి జి.భాస్కర్ తెలిపారు. దేవనకొండ మండలం వెలమకూరు, పత్తికొండ మండలం జూటూరు, ఓర్వకల్ మండలం గుట్టపాడు, కర్నూలు మండలం సుంకేసుల, ఆలూరు మండలం మొలగవెళ్లి, వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచు ఎన్నికలను నిర్వహించనున్నట్లు తెలిపారు. 27న ఉదయం 11 గంటలకు ఆయా గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎన్నికలను నిర్వహిస్తామన్నారు. ఖాళీగా మూడు జెడ్పీటీసీ స్థానాలు .... జిల్లా పరిషత్లో కూడా మూడు జెడ్పీటీసీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కల్లూరు జెడ్పీటీసీ వి.ప్రభాకర్రెడ్డి 2023 అక్టోబర్ 20న మృతి చెందారు. చిప్పగిరి జెడ్పీటీసీగా ఉన్న బి.విరుపాక్షి ఆలూరు ఎమ్మెల్యేగా ఎన్నికవడం వల్ల తన జెడ్పీటీసీ పదవికి 2024 జూన్ 14న రాజీనామా చేశారు. ప్యాపిలి జెడ్పీటీసీగా ఉన్న బోరెడ్డి శ్రీరాంరెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడి ఈ నెల 10న మరణించారు. ఈ మూడు స్థానాలతో పాటు జిల్లాలో ఖాళీగా ఉన్న సర్పంచు, ఎంపీటీసీ, వార్డు సభ్యుల స్థానాలకు త్వరలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. -
రాష్ట్రంలో అరాచకపాలన
● వైఎస్సార్ విగ్రహానికి నిప్పు పెట్టడం దారుణం ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి కోడుమూరు రూరల్: రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి అన్నారు. ప్రజల గుండెల్లో నుంచి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిని, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తొలగించాలనే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. మహానేత వైఎస్సార్ విగ్రహానికి నిప్పు పెట్టారన్న విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నేతలు బుధవారం కోడుమూరు వెళ్లారు. మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని పరిశీలించి అక్కడే నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి, కుడా మాజీ చైర్మన్ కోట్ల హర్షవర్దన్రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేందర్రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ప్రజల సంక్షేమానికి అహర్నిశలు పాటుపడిన వైఎస్సార్ విగ్రహానికి నిప్పు పెట్టడం దారుణమన్నారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన ‘కూటమి’ నేతలు హామీలను అమలు చేయలేక.. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే వైఎస్సార్ విగ్రహాలపై దాడులు చేయిస్తున్నారన్నారు. యూనివర్సిటీలకు వైఎస్సార్ పేరు ఉండగా మార్చడం దారుణమన్నారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారన్నారు. ఒకే వ్యక్తిపై పలు జిల్లాల్లో ఒకే విధమైన కేసులు నమోదు చేయించి వేధింపులకు పాల్పడుతున్నారని, ఇది అనాగరిక చర్య అన్నారు. అధికారం శాశ్వతం కాదని, భవిష్యత్లో తాము మళ్లీ అధికారంలోకి వస్తామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోడుమూరులో వైఎస్సార్ విగ్రహానికి నిప్పు పెట్టడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహారించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జెడ్పీటీసీ సభ్యుడు రఘునాథ్రెడ్డి, వైస్ ఎంపీపీ విజయ్కుమార్రెడ్డి, కృష్ణాపురం సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు కృష్ణారెడ్డి, వెఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.ప్రభాకర్, మండల అధ్యక్షుడు రమేష్నాయుడు, మాజీ ఉపసర్పంచ్ ప్రవీణ్కుమార్, స్థానిక నాయకులు జగదీష్, గోపి, విజయభాస్కరరెడ్డి, బందె నవాజ్, డీజె రాజు, బజారి, వెంకటేశ్వర్లు, ఈరన్న, మాసుమ్, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. -
సూర్య @ 42.7 డిగ్రీలు
కర్నూలు(అగ్రికల్చర్): మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో రాష్ట్రంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒకవైపు సుర్రుమంటున్న ఎండలు, మరోవైపు వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయితే ఎండల నుంచి ప్రజలకు కొంతైనా ఉపశమనం కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ఏ మాత్రం చొరవ తీసుకోవడం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్న ఐదేళ్లు కర్నూలు నగరంలోని ప్రధాన కూడళ్లలో చలువ పందిళ్లు ఏర్పాటు చేసింది. 2024లో ఫిబ్రవరి నెల చివరి నాటికే చలువ పందిళ్లు ఏర్పాటు అయ్యాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చలువ పందిళ్లు, చలి వేంద్రాల జాడ కనిపించడం లేదు. బండిఆత్మకూరు మండలంలో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత... రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే నమోదు అవుతున్నాయి. బండి ఆత్మకూరు మండలం పెద్ద దేవళాపురం గ్రామంలో 42.7 డిగ్రీలు, కల్లూరులో 42.6, చాగలమర్రిలో 42.4 డిగ్రీలు, గోస్పాడులో 41.9, దొర్నిపాడులో 41.7, ఆత్మకూరులో 41.5, కొత్తపల్లిలో 41.4, కోడుమూరులో41.2, కోసిగిలో 41.2, పెద్దకడు బూరులో 41.1 కర్నూలులో 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత లు నమోదైంది. సాధారణం కంటే రెండు, మూడు డిగ్రీల అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా యి. రానున్న రోజుల్లో వడగాల్పులు, ఉష్ణోగ్రతల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. మార్చి నెలలో నే ఉష్ణోగ్రతలు గతంలో ఎపుడూ లేని విధంగా 44 డిగ్రీలను అధిగమించే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజలు వడదెబ్బకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచిస్తున్నారు. పెద్ద దేవళాపురంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కల్లూరులో 42.6 డిగ్రీలు నమోదు వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి -
దివ్యాంగులకు యూడీఐడీ
శాశ్వత ఐడీ తప్పనిసరి దివ్యాంగులకు ఇప్పటి వరకు సదరం సర్టిఫికెట్లు జారీ చేసేవారు. అయితే ఇకపై శాశ్వతంగా ఆధార్కార్డు తరహాలో కేంద్ర ప్రభుత్వం యూడీఐడీను ప్రవేశపెట్టింది. దివ్యాంగులకు రానున్న రోజుల్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి సంక్షేమ పథకాలు అందాలన్నా ఈ కార్డు తప్పనిసరి కానుంది. దివ్యాంగులు ఆన్లైన్లో నమోదు చేసుకొని ఈ కార్డును పొందితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. – రయిస్ ఫాతిమా, ఏడీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ కర్నూలు(అర్బన్): దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు, ఇతరత్రా సేవలకు సదరం స్థానంలో యూడీఐడీ (యూనిక్ డిజేబిలిటీ ఐడెంటిటీ కార్డు )ని అందించనుంది. దివ్యాంగులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే చేయూత, ఇతర ప్రయోజనాలకు ఇప్పటి వరకు సదరం సర్టిఫికెట్ తప్పనిసరి. దీని కోసం దివ్యాంగులు గ్రామ సచివాలయాలు, మీ సేవా కేంద్రాల్లో సదరం శ్లాట్ బుక్ చేసుకుంటే ప్రభుత్వం నిర్దేశించిన వైద్య శిబిరంలో వైద్యులు వైకల్య నిర్ధారణ అనంతరం సర్టిఫికెట్లను జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం సదరం సర్టిఫికెట్లకు స్వస్తి పలికింది. ఆ స్థానంలో యూడీఐడీని పొందేందుకు స్వాలంబన్కార్డు.జీఓవీ.ఇన్ (https://swavlambancard. gov.in) అనే వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో దివ్యాంగులు నేరుగా ఇంటి వద్ద నుంచే ఫోన్, ఇంటర్నెట్ సెంటర్, మీ సేవా కేంద్రాల నుంచి కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సులభతరంగా సేవలు ... కొత్తగా అందుబాటులోకి తీసుకువచ్చిన యూడీఐడీ పోర్టల్ వల్ల సేవలు చాలా సులభతరం కానున్నాయి. ఇకపై సదరం శిబిరాల కోసం మీ సేవతో పాటు యూడీఐడీ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారికి సదరం శిబిరాలకు సంబంధించి ఎప్పుడు హాజరు కావాలనే సమాచారం దివ్యాంగుల ఫోన్ నెంబర్కు సంక్షిప్త సందేశం రూపంలో వస్తుంది. దివ్యాంగులు ఆన్లైన్లో దరఖాస్తు చేసే సమయంలో ఎలాంటి తప్పులు, అక్షరదోషాలు లేకుండా చూసుకోవాలి. ఇప్పటి వరకు ఐదు రకాల వైకల్యం ఉన్న వారికే మీ సేవ ద్వారా సదరం శిబిరాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. ఇక యూడీఐడీ పోర్టల్లో 21 రకాల వైకల్యాలను చేర్చారు. తలసేమి యా, ఆటిజం, యాసిడ్ బాధితులు, న్యూరో సంబంధిత బాధితులు కూడా సదరం శిబిరాల కోసం యూడీ ఐడీ పోర్టల్లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. సదరం శిబిరంలో వైకల్య నిర్ధారణ పూర్తయిన అనంతరం సర్టిఫికెట్లను స్మార్ట్ కార్డు రూపంలో పోస్టల్శాఖ ద్వారా ఇంటికే పంపించనున్నారు. ఈ కార్డు ద్వారా చేయూత పింఛన్లతో పాటు ఇతర పలు సంక్షేమ ప్రయోజనాలకు దేశ వ్యాప్తంగా చెల్లుబాటు కానుంది. యూనిక్ డిజేబులిటీ ఐడీ కార్డులను ఆన్లైన్ నుంచే డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. ఇప్పటి వరకు ఉన్న సదరం సర్టిఫికెట్లు మన రాష్ట్రంలో మాత్రమే చెల్లుబాటు అయ్యేవి. ఇలా దరఖాస్తు చేసుకోండి ... ఆన్లైన్లో స్వాలంబన్కార్డు.జీఓవీ.ఇన్ వెబ్సైట్ను సందర్శించాలి. అప్లయ్ బటన్పై క్లిక్ చేసి దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి కొన్ని సూచనలు ఉంటాయి. వాటిని పూర్తిగా చదివి అర్థం చేసుకొని తరువాత అంగీకరిస్తు సబ్మిట్ క్లిక్ చేస్తే దరఖాస్తు ఫారం ఓపెన్ అవుతుంది. దివ్యాంగులు వారికి చెందిన పూర్తి సమాచారాన్ని అక్కడ అడిగిన విధంగా నమోదు చేస్తే దరఖాస్తు ప్రక్రియ పూర్తి అవుతుంది. వైద్య పరీక్షల అనంతరం వెబ్సైట్లో అర్జీల స్టేటస్ను నిత్యం పరిశీలించుకోవచ్చు. కొత్త పోర్టల్ను అందుబాటులోకి తెచ్చిన కేంద్ర ప్రభుత్వం 21 రకాల సేవలు సులువుగా పొందే అవకాశం -
ప్రశాంతంగా ఏఎన్ఎంల పదోన్నతి కౌన్సెలింగ్
కర్నూలు(హాస్పిటల్): సచివాలయాల్లో పనిచేసే ఏఎన్ఎం–3లకు ఎంపీహెచ్ఏ–ఎఫ్గా పదోన్నతి కల్పించారు. ఈ మేరకు వీరికి కర్నూలు మెడికల్ కాలేజీలోని నూతన ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కౌన్సెలింగ్ నిర్వహించి స్థానాలు కేటాయించారు. కౌన్సెలింగ్లో స్థానం పొందిన వారికి డీఎంహెచ్వో డాక్టర్ పి. శాంతికళ, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు ఆర్డర్ కాపీలు అందజేశారు. కర్నూలు, నంద్యాల జిల్లాల పరిధిలో 172 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ పి. శాంతికళతో పాటు ఏవో అరుణ, సూపరింటెండెంట్ పి. శ్రీనివాసులు, సీనియర్ అసిస్టెంట్ మధుసూదన్లు కౌన్సెలింగ్ నిర్వహించి స్థానాలు కేటాయించారు. -
అన్నదానం పేరుతో అక్రమ వసూళ్లు
● కాశినాయన ఆశ్రమమంటూ విరాళాల సేకరణ ● రాజమండ్రి పోలీసులకు చిక్కిన వెలుగోడు ముఠా ఆత్మకూరురూరల్: అన్నదానం పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ముఠా పోలీసులకు పట్టుబడింది. వెలుగోడు మండలానికి చెందిన నిందితులు కర్ణాటక, తమిళనాడుతో పాటు ఉమ్మడి తెలుగు రాష్ట్రా ల్లో కాశిరెడ్డి నాయన పేరిట నిత్యాన్నదానం చేస్తున్నామని, శ్రీశైలంలో ఒక వసతి గృహం నిర్మిస్తున్నామని నమ్మబలుకుతూ లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న విషయాన్ని రాజమండ్రి పోలీసులు బట్టబయలు చేశారు. వెలుగోడు మండల కేంద్రంలో నివసించే శంకర్ అనే వ్యక్తి శంకర్ రెడ్డి, భవనం రమణారెడ్డి అనే పేర్లతో చెలామణి అవుతూ దాదాపు లక్షలాది రూపాయలు సేకరించినట్లు తెలుస్తోంది. ఇతను అతని కులస్తులను కొందరిని తన ముఠాలో చేర్పించుకుని ఖరీదైన దుస్తులు, వేషధారణతో వాహనాల్లో తిరుగుతూ పలు ప్రాంతాల్లో విరాళాలు సేకరించారు. వీరు రెండు రోజుల క్రితం రాజమండ్రిలో తాము ఆత్మకూరు మండలం నల్లకాల్వ గ్రామంలో వైఎస్సార్ స్మృతివనం సమీపంలో కాశిరెడ్డి నాయనం ఆశ్రమం ఏర్పాటు చేశామని, అక్కడ నిత్యాన్నదానం జరుగుతుందని చెబుతూ.. చందాలు వసూలు చేసే యత్నం చేశారు. వీరి పోకడ గమనించిన రాజమండ్రికి చెందిన త్రినాథరెడ్డి అనే వ్యక్తి ఈ ముఠాను పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేశారు. ఇంతకు ముందు నంద్యాల ఎస్పీగా పని చేసిన రఘువీరారెడ్డి అక్కడ ఉండడంతో ఆయన ఈ విషయంపై విచారణ జరిపించారు. దీంతో శంకర్ ముఠా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు తేలడంతో వారిపై కేసు నమోదు చేశారు. వారి వద్ద ఉన్న రసీదు పుస్తకాలు, డిజిటల్ లావాదేవీలను పరిశీలిస్తే ఈ మధ్య కాలంలోనే రూ. 20 లక్షలకు పైగా వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. శంకర్ ముఠాలో వెలుగోడు మండలం రేగడగూడూరు గ్రామానికి చెందిన వారు కూడా ఇద్దరు ఉన్నట్లు తెలిసింది. నల్లకాల్వలో కాశిరెడ్డి నాయన ఆశ్రమం ఉన్న విషయం నిజమే అయినప్పటికీ ఈ ఆశ్రమ నిర్వాహకులు వేరే వారు కావడం గమనార్హం. ఇందులో వారు ప్రచారం చేసుకుంటున్నంత స్థాయిలో అన్నదాన కార్యక్రమాలు జరగడం లేదు. -
మత్తు పదార్థాలను సమష్టిగా నిర్మూలిద్దాం
కర్నూలు(సెంట్రల్): జిల్లాలో గంజాయి సాగు, మత్తు పదార్థాల రవాణా, వినియోగాన్ని సమష్టి కృషితో నిర్మూలిద్దామని జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా అధికారులకు పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నార్కోటిక్స్ కోఆర్డినేషన్(ఎన్సీఓఆర్డీ) సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మత్తు పదార్థాలతో కలిగే అనార్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మత్తు పదార్థాల వినియోగం, రవాణాపై ప్రజలు కూడా సమాచారం అందించాలని కోరారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం నుంచి మత్తు పదార్థాల వినియోగంతో కలిగే అనార్థాలపై పాఠశాలల్లో వ్యాసరచన, వక్తృత్వ పోఈలను నిర్వహించాలన్నారు. ప్రజలకు అవగాహన కోసం ర్యాలీలు నిర్వహించాలని, ప్రతిజ్ఞలు చేయించాలని డీఈఓను కోరారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లాకల్యాణి, జిల్లా వ్యవసాయాధికారి వరలక్ష్మీ, డీఈఓ శామ్యూల్పాల్, ఆర్టీసీ ఆర్ఎం శ్రీనివాసులు, అదనపు మునిసిపల్ కమిషనర్ ఆర్ర్జీవీ కృష్ణ, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సుధీర్కుమార్ పాల్గొన్నారు. -
లాభాల బాట పట్టించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం
నష్టాల ఊబిలో చిక్కుకున్న డీసీసీబీకి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఊపిరిపోసింది. వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు కేడీసీసీబీ రుణాలు పంపిణీ చేసే ఏర్పాటు చేసింది. కస్టమ్స్ హయరింగ్ సెంటర్లు, మల్టీపర్పస్ గోదాముల నిర్మాణాలకు డీసీసీబీ రుణాలు అందచేసింది. గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల ఫలితంగా బ్యాంకు లోనింగ్ భారీగా పెరిగింది. వైఎస్ఆర్సీపీ హయాంలో దశాబ్దాల నాటి నష్టాలను అధిగమించి నికర లాభాల్లోకి వచ్చింది. 2022–23, 2023–24 సంవత్సరాల్లో రికార్డు స్థాయిలో ఏకంగా రూ.10కోట్ల లాభం ఆర్జించగా.. సభ్యులైన పీఏసీఎస్లకు రూ.4 కోట్లు డివిడెండ్ ఇచ్చింది. రాయలసీమ జిల్లాల్లోనే అత్యధిక టర్నోవర్ కలిగిన బ్యాంకుగా రెండేళ్లు వరుస అవార్డులను సొంతం చేసుకోవడం విశేషం. ● నికర లాభాల్లోకి వచ్చిన కేడీసీసీబీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన మొదటి ఏడాదిలోపే మళ్లీ నష్టాల్లోకి వచ్చి బలహీనమైన బ్యాంకుగా రికార్డు నమోదు చేసుకోవడం ఆందోళన కలిగించే విషయం. గతంలో ఎప్పుడూ లేని విధంగా 2024–25లో రుణాల పంపిణీ నామమాత్రంగా చేపట్టారు. పీఏసీఎస్ల కంప్యూటరీకరణ పేరుతో రైతులకు అవసరమైన రుణాల పంపిణీ విషయంలో కనీస చొరవ కరువైంది. ఇదే సమయంలో బకాయిలు పేరుకుపోవడంతో బ్యాంకు మళ్లీ నష్టాల బాట పట్టింది. -
ప్రశాంతంగా ఏఎన్ఎంల పదోన్నతి కౌన్సెలింగ్
కర్నూలు(హాస్పిటల్): సచివాలయాల్లో పనిచేసే ఏఎన్ఎం–3లకు ఎంపీహెచ్ఏ–ఎఫ్గా పదోన్నతి కల్పించారు. ఈ మేరకు వీరికి కర్నూలు మెడికల్ కాలేజీలోని నూతన ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కౌన్సెలింగ్ నిర్వహించి స్థానాలు కేటాయించారు. కౌన్సెలింగ్లో స్థానం పొందిన వారికి డీఎంహెచ్వో డాక్టర్ పి. శాంతికళ, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు ఆర్డర్ కాపీలు అందజేశారు. కర్నూలు, నంద్యాల జిల్లాల పరిధిలో 172 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ పి. శాంతికళతో పాటు ఏవో అరుణ, సూపరింటెండెంట్ పి. శ్రీనివాసులు, సీనియర్ అసిస్టెంట్ మధుసూదన్లు కౌన్సెలింగ్ నిర్వహించి స్థానాలు కేటాయించారు. -
రూ.330 కోట్లకు చేరుతున్న నిరర్ధక ఆస్తులు
రైతుల మెడపై జప్తుల కత్తి ● నష్టాల బాటన కేడీసీసీ బ్యాంకు ● కూటమి ప్రభుత్వ పాలనలో మళ్లీ చీకటి రోజులు ● ఇప్పటికే 90 మంది రైతుల ఆస్తులు స్వాధీనం ● 800 మంది ఆస్తుల వేలానికి రంగం సిద్ధం ● రికవరీ పేరిట రైతుల ఆత్మాభిమానంతో ఆటలు ● వైఎస్సార్సీపీ పాలనలో కేడీసీసీబీ లాభాల బాట ● నేడు నిరర్థక ఆస్తులే రూ.330 కోట్లు వడ్డీ రూ.20 లక్షలు చిప్పగిరి మండలం ఏరూరు గ్రామానికి చెందిన ఒక రైతు 2021లో కర్షక జ్యోతి కింద రూ.25 లక్షలు, దీర్ఘకాలిక రుణం కింద గొర్రెల పెంపకానికి రూ.15 లక్షల ప్రకారం మొత్తం రూ.40 లక్షల రుణం తీసుకున్నారు. వివిధ కారణాల వల్ల రుణాలను చెల్లించలేదు. నాలుగేళ్లలో వడ్డీ రూ.20 లక్షలు అయింది. మొత్తం రూ.60 లక్షలు చెల్లించాలని, లేకపోతే ఆస్తులు వేలం వేస్తామని నోటీసు జారీ చేశారు. ఇటీవల గ్రామానికి వెళ్లిన ప్రత్యేక టీమ్ రైతుకు చెందిన ట్రాక్టరును జప్తు చేసి బెల్డోణలోని పీఏసీఎస్కు స్వాధీనం చేశారు. బైక్ను జప్తు చేశారు చిప్పగిరి మండలం రామదుర్గం గ్రామానికి చెందిన ఒక మహిళ 2014లో దీర్ఘకాలిక రుణం కింద డెయిరీ లోన్ తీసుకున్నారు. కంతుల ప్రకారం కొంత మొత్తం కూడా చెల్లించారు. అసలు రూ.2.70 లక్షలు, అయితే ఇప్పుడు ఈ మహిళ చెల్లించాల్సిన మొత్తం వడ్డీతో కలిపి రూ.7 లక్షలు దాటింది. ఇటీవల గ్రామానికి వెళ్లిన రికవరీ టీమ్ ఈ మహిళ కుటుంబానికి చెందిన బైకును జప్తు చేసి సొసైటీకి తరలించింది. మహిళ తాకట్టు పెట్టిన స్థిరాస్తులను వేలంలో విక్రయించేందుకు రంగం సిద్ధం చేసింది.కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(కేడీసీసీబీ) బకాయిలను రాబట్టుకునేందుకు రైతుల మెడపై జప్తుల కత్తి పెట్టింది. కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు డీసీసీబీ రైతుల జీవితాలతో చెలగాటమాడుతోంది. రైతాంగాన్ని 2024–25లో అధిక వర్షాలు, అనావృష్టి పరిస్థితులు కోలుకోలేని దెబ్బతీశాయి. అంతంతమాత్రం పండిన పంటలకు కూడా గిట్టుబాటు ధరలు లేక నష్టాలను మూటకట్టుకున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లా సహకార కేంద్రబ్యాంకు రైతుల ఆస్తులు స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచే రైతుల ఆస్తుల వేలానికి చర్యలను వేగవంతం చే యడం గమనార్హం. రుణాల రికవరీకి వెళ్లిన అధికారులు ఏది కనిపిస్తే దానిని స్వాధీనం చేసుకుంటుండటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. 90 మంది రైతుల ఆస్తుల స్వాధీనం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వత డీసీసీబీ జప్తుల తీవ్రత మొదలైంది. 2014–15 నుంచి 2018–19 వరకున్న టీడీపీ ప్రభుత్వంలో వరుస కరువు రైతులను నిలువునా ముంచింది. పంటలు పండక రైతులు అల్లాడుతుంటే అప్పట్లో కూడా జప్తుల పర్వం కొనసాగింది. నాడు ఆస్తులను వేలం వేయడంతో పాటు రైతుల ఇళ్లలోని చరాస్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు. తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో మళ్లీ నాటి పరిస్థితులే పునరావృతం అవుతున్నాయి. 2024 జూన్ 12న కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. నాటి నుంచి నేటి వరకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో 90 మంది రైతుల ఆస్తులను డీసీసీబీతో పాటు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు స్వాధీనం చేసుకున్నాయి. 2024–25లో మొత్తం 800 మంది రైతుల ఆస్తులు వేలం వేయడం, స్వాధీనం చేసుకోవాలనేది లక్ష్యంగా తెలుస్తోంది. ఈ నెల చివరిలోపు రైతుల ఆస్తుల వేలానికి ముమ్మర కసరత్తు జరుగుతోంది. డీసీసీబీలో ప్రధానంగా ఆలూరు బ్రాంచీలో బకాయిలు అత్యధికంగా ఉన్నాయి. మరో రెండు, మూడు రోజుల్లో ఆలూరు ప్రాంతంలోని 18 మంది రైతుల ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి రంగం సిద్ధమైంది. ముమ్మరంగా చరాస్తుల జప్తు బకాయిలను రాబట్టుకునేందుకు ముందుగా రైతులకు సంబంధించిన చరాస్తులను జప్తు చేయాలని జాయింట్ కలెక్టర్, డీసీసీబీ పర్సన్ ఇన్చార్జి చైర్మన్ నవ్య స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. చరాస్తుల జప్తు తర్వాత స్థిరాస్తుల వేలానికి శ్రీకారం చుట్టాలని ఆదేశించారు. జప్తులు, వేలంపాట, రికవరీలపై జేసీ ప్రతి రోజు డీసీసీబీ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తున్నారు. దీంతో అధికారులు జప్తుల పర్వాన్ని వేగవంతం చేయడం గమనార్హం. ఇప్పటికే ఆలూరు బ్రాంచి పరిధిలోని చిప్పగిరి మండలం ఏరూరు గ్రామంలో ట్రాక్టరు, బైకు.. కుందనగుర్తి గ్రామంలో ఒక బైకు, రామదుర్గం గ్రామంలో రెండు బైకులను జప్తు చేసినట్లు స్పష్టమవుతోంది. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నిరర్థక ఆస్తులు కొండలా పెరిగిపోతున్నాయి. 2024 ఏప్రిల్ నెలలో రూ.193 కోట్ల నిరర్ధక ఆస్తులు ఉన్నాయి. ఈ నెల 15 నాటికి నిరర్థక ఆస్తులు రూ.267 కోట్లకు చేరుకోగా.. మార్చి చివరి నాటికి రూ.330 కోట్లకు చేరనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆలూరు, డోన్, ఆదోని, పత్తికొండ, కృష్ణానగర్, కోడుమూరు, కోవెలకుంట్ల, నందికొట్కూరు, వెలుగోడు, ఆత్మకూరు బ్రాంచీల్లో నిరర్థక ఆస్తులు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. -
సూర్య @ 42.7 డిగ్రీలు
కర్నూలు(అగ్రికల్చర్): మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో రాష్ట్రంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒకవైపు సుర్రుమంటున్న ఎండలు, మరోవైపు వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయితే ఎండల నుంచి ప్రజలకు కొంతైనా ఉపశమనం కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ఏ మాత్రం చొరవ తీసుకోవడం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్న ఐదేళ్లు కర్నూలు నగరంలోని ప్రధాన కూడళ్లలో చలువ పందిళ్లు ఏర్పాటు చేసింది. 2024లో ఫిబ్రవరి నెల చివరి నాటికే చలువ పందిళ్లు ఏర్పాటు అయ్యాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చలువ పందిళ్లు, చలి వేంద్రాల జాడ కనిపించడం లేదు. బండిఆత్మకూరు మండలంలో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత... రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే నమోదు అవుతున్నాయి. బండి ఆత్మకూరు మండలం పెద్ద దేవళాపురం గ్రామంలో 42.7 డిగ్రీలు, కల్లూరులో 42.6, చాగలమర్రిలో 42.4 డిగ్రీలు, గోస్పాడులో 41.9, దొర్నిపాడులో 41.7, ఆత్మకూరులో 41.5, కొత్తపల్లిలో 41.4, కోడుమూరులో41.2, కోసిగిలో 41.2, పెద్దకడు బూరులో 41.1 కర్నూలులో 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత లు నమోదైంది. సాధారణం కంటే రెండు, మూడు డిగ్రీల అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా యి. రానున్న రోజుల్లో వడగాల్పులు, ఉష్ణోగ్రతల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. మార్చి నెలలో నే ఉష్ణోగ్రతలు గతంలో ఎపుడూ లేని విధంగా 44 డిగ్రీలను అధిగమించే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజలు వడదెబ్బకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచిస్తున్నారు. పెద్ద దేవళాపురంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కల్లూరులో 42.6 డిగ్రీలు నమోదు వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి -
ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి
కర్నూలు: ఖైదీలు సత్ప్రవర్తనతో శిక్షను పూర్తి చేసి గౌరవప్రదమైన జీవితం గడపాలని న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి, కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి సూచించారు. మంగళవారం కర్నూలు శివారులోని పురుషుల కేంద్ర కారాగారం, మహిళా కారాగారాలను వారు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖైదీలకు న్యాయవాదులు లేకుంటే ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామన్నారు. ఖైదీలకు అందించే ఆహారం, రేషన్తో పాటు ఆరోగ్యం గురించి తీసుకుంటున్న చర్యలను తెలుసుకున్నారు. ఖైదీలను కోర్టు వాయిదాలకు కచ్చితంగా హాజరుపరచాలని జైలు అధికారులను ఆదేశించారు. ఏవైనా సమస్యలుంటే కర్నూలు న్యాయ సేవాధికార సంస్థను, లేదంటే లీగల్ సర్వీసెస్ హెల్ప్లైన్ నెంబర్ 15100ను సంప్రదించాలని సూచించారు. కొందరు ఖైదీలు బెయిల్ మంజూరైనప్పటికీ జామీనుదారులు లేక జైలులోనే ఉంటున్నామని జిల్లా జడ్జి దృష్టికి తీసుకురాగా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వైభవంగా సుయతీంద్రతీర్థుల పూర్వారాధన మంత్రాలయం: నవ మంత్రాలయ శిల్పి, రాఘవేంద్రస్వామి మఠం పూర్వపు పీఠాధిపతి సుయతీంద్రతీర్థులు పూర్వారాధన వేడుకలు వైభవంగా జరిగాయి. శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల నేతృత్వంలో మంగళవారం వేకువ జామున సుప్రభాత సేవతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుత పీఠాధిపతి గురువులైన సుయతీంద్రతీర్థుల వేడుకలు శాస్త్రోక్తంగా చేపట్టారు. ముందుగా స్వామిజీ మూల బృందావనానికి నిర్మల్య విసర్జన గావించి పుష్ప, పంచామృతాభిషేకం చేపట్టి ప్రత్యేక పూలతో విశేష అలంకరణ గావించారు. వేడుకల్లో భాగంగా యాగ మంటపంలో సుయతీంద్రతీర్థుల ప్రశస్థితి భక్తులకు ప్రవచించారు. పత్తికొండ కళాశాలకు ఏ గ్రేడు పత్తికొండ రూరల్: పత్తికొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఏ గ్రేడు వచ్చినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ మాధురి తెలిపారు. పాణ్యం డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు డాక్టర్ ఎం.ఫరీదా బేగం, డోన్ డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ జి.చంద్రశేఖర్ అకడమిక్ ఆడిట్లో భాగంగా మంగళవారం కళాశాలను పరిశీలించారన్నారు. అకడమిక్ రిజిస్టర్లు, తరగతి గదులు, ప్రయోగశాలలు, కళాశాల మైదానంలో స్పోర్ట్స్, విద్యార్థులకు తాగునీటి సదుపాయం వంటి వాటిని పరిశీలించి సంతృప్తి చెందినట్లు తెలిపారు. -
ఎస్సీ వర్గీకరణతో మాల, మాదిగలకు నష్టమే
కర్నూలు(అర్బన్): రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ నివేదికల ఆధారంగా ఎస్సీ వర్గీకరణను జిల్లా యూనిట్, రాష్ట్ర యూనిట్గా చేసినా.. రాష్ట్రంలోని మాల మాదిగలకు నష్టం జరుగుతుందని ఏపీ ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోన నాగరాజు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం స్థానిక కార్యాలయంలో సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు ఎన్సీహెచ్ బజారన్నతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ వర్గీకరణను జిల్లా యూనిట్గా విద్యా, ఉద్యోగాల్లో మూడు కేటగిరీలుగా వాటాలు చేస్తామని ప్రకటించిందన్నారు. అయితే ఏకసభ్య కమిషన్ వర్గీకరణను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించి అమలు చేసేందుకు రాష్ట్రం యూనిట్గా చేయనున్నట్లు ప్రకటించారన్నారు. ఈ నేపథ్యంలోనే ఏ కేటగిరీలోని రెల్లి, ఉపకులాలకు 1 శాతం, బీ కేటగిరీలోని మాదిగ, ఉపకులాలకు 6.50 శాతం, సీ కేటగిరిలోని మాల, ఉపకులాలకు 7.50 శాతం రిజర్వేషన్ ప్రతిపాదిస్తు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు అందించిందన్నారు. ఏ విధంగా వర్గీకరణ చేపట్టినా రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి అనంతపురం, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మాలలకు, వైఎస్సార్, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మాదిగలకు నష్టం జరుగుతుందన్నారు. జిల్లా యూనిట్గా అమలు చేసినా ఎస్సీ జాబితాలోని 59 ఉప కులాలు భారీగా విద్య, ఉద్యోగాలను కోల్పోతారన్నారు. ఈ అంశంపై ఈ నెల 20న అసెంబ్లీలో చర్చ జరిగిన అనంతరం రాయలసీమలోని మేధావులను కలిసి ఎస్సీలకు ఎలాంటి నష్టం జరగకుండా నేషనల్ ఎస్సీ కమిషన్ను కలిసి వివరించనున్నట్లు తెలిపారు. ఏపీ ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోన నాగరాజు -
దాహం తీర్చుకునేందుకు వెళ్లి..
● ఎల్లెల్సీలో పడి మహిళా కూలీ మృత్యువాత హాలహర్వి: వ్యవసాయ పనులకు వెళ్లిన ఓ మహిళా కూలీ ప్రమాదవశాత్తూ ఎల్లెల్సీ కాల్వలో పడి మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఆలూరు మండల మొలగవల్లి గ్రామానికి చెందిన శ్రీదేవి(40) మంగళవారం గూళ్యం గ్రామానికి చెందిన ఓ రైతు మిరప పంట కోసేందుకు తోటి కూలీలతో కలసి వెళ్లింది. మధ్యాహ్నం ఇంటికి తిరిగి వస్తూ పచ్చారపల్లి వద్ద నీళ్లు తాగేందుకు ఎల్లెల్సీ కాలువలోకి దిగింది. ప్రమాదవశాత్తూ కాలు జారి శ్రీదేవి కాలువలో పడిపోయింది. పక్కనే ఉన్న ఆటో డ్రైవర్ మునిస్వామి రక్షించే ప్రయత్నం చేసినా ఫలించలేదు. సమాచారం అందుకున్న హాలహర్వి ఎస్ఐ చంద్ర వెంటనే ఫైర్ స్టేషన్ సిబ్బంది, గజ ఈతగాళ్లను పిలిపించి గాలింపు చర్యలు చేపట్టారు. గూళ్యం 48వ డీప్ సమీపంలో మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. మృతురాలికి భర్త భగీరథ, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చంద్ర తెలిపారు. రెండు బైక్లు ఢీకొని.. ● వృద్ధుడి మృతి ● యువకుడికి తీవ్ర గాయాలు పత్తికొండ రూరల్: అతి వేగం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. టిఫిన్ చేసేందుకు హోటల్ వెళ్లిన వృద్ధుడు తిరిగిరాని లోకాలకు చేరాడు. పత్తికొండ పట్టణంలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందగా, మరో యువకు డు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానిక దాసరి వీధిలో బోయ హనుమన్న, తిమ్మక్కలు నివాసముంటున్నారు. వారి కుమారుడు భార్యా పిల్లలతో బతుకుదెరువుకు గుంటూరు వలస వెళ్లారు. ఇంటి వద్ద వున్న తిమ్మక్క మంగళవారం మిరపకాయలు తెంపేందుకు కూలికి వెళ్లగా.. హనుమన్న టిఫిన్ చేసేందుకు టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనంపై ప్రభుత్వ బీసీ హాస్టల్ సమీపంలోని ప్రధాన రోడ్డు పక్కనే ఉన్న హోటల్కు వెళ్లాడు. టిఫిన్ చేసిన తర్వాత ఇంటికి వచ్చేందుకు వాహనాన్ని తీస్తుండగా పత్తికొండకు చెందిన కూరగాయల వ్యాపారి అభిరాం పల్సర్ బైక్తో వేగంగా వచ్చి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా కోలు కోలేక వృద్ధుడు మృతి చెందాడు. యువకుడు అభి రాం చికిత్స పొందుతున్నాడు. భర్త మృతితో భార్య తిమ్మక్క రోదిస్తున్న తీరు పలువురిని కలిచివేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
దివ్యాంగులకు యూడీఐడీ
శాశ్వత ఐడీ తప్పనిసరి దివ్యాంగులకు ఇప్పటి వరకు సదరం సర్టిఫికెట్లు జారీ చేసేవారు. అయితే ఇకపై శాశ్వతంగా ఆధార్కార్డు తరహాలో కేంద్ర ప్రభుత్వం యూడీఐడీను ప్రవేశపెట్టింది. దివ్యాంగులకు రానున్న రోజుల్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి సంక్షేమ పథకాలు అందాలన్నా ఈ కార్డు తప్పనిసరి కానుంది. దివ్యాంగులు ఆన్లైన్లో నమోదు చేసుకొని ఈ కార్డును పొందితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. – రయిస్ ఫాతిమా, ఏడీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ కర్నూలు(అర్బన్): దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు, ఇతరత్రా సేవలకు సదరం స్థానంలో యూడీఐడీ (యూనిక్ డిజేబిలిటీ ఐడెంటిటీ కార్డు )ని అందించనుంది. దివ్యాంగులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే చేయూత, ఇతర ప్రయోజనాలకు ఇప్పటి వరకు సదరం సర్టిఫికెట్ తప్పనిసరి. దీని కోసం దివ్యాంగులు గ్రామ సచివాలయాలు, మీ సేవా కేంద్రాల్లో సదరం శ్లాట్ బుక్ చేసుకుంటే ప్రభుత్వం నిర్దేశించిన వైద్య శిబిరంలో వైద్యులు వైకల్య నిర్ధారణ అనంతరం సర్టిఫికెట్లను జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం సదరం సర్టిఫికెట్లకు స్వస్తి పలికింది. ఆ స్థానంలో యూడీఐడీని పొందేందుకు స్వాలంబన్కార్డు.జీఓవీ.ఇన్ (https://swavlambancard. gov.in) అనే వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో దివ్యాంగులు నేరుగా ఇంటి వద్ద నుంచే ఫోన్, ఇంటర్నెట్ సెంటర్, మీ సేవా కేంద్రాల నుంచి కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సులభతరంగా సేవలు ... కొత్తగా అందుబాటులోకి తీసుకువచ్చిన యూడీఐడీ పోర్టల్ వల్ల సేవలు చాలా సులభతరం కానున్నాయి. ఇకపై సదరం శిబిరాల కోసం మీ సేవతో పాటు యూడీఐడీ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారికి సదరం శిబిరాలకు సంబంధించి ఎప్పుడు హాజరు కావాలనే సమాచారం దివ్యాంగుల ఫోన్ నెంబర్కు సంక్షిప్త సందేశం రూపంలో వస్తుంది. దివ్యాంగులు ఆన్లైన్లో దరఖాస్తు చేసే సమయంలో ఎలాంటి తప్పులు, అక్షరదోషాలు లేకుండా చూసుకోవాలి. ఇప్పటి వరకు ఐదు రకాల వైకల్యం ఉన్న వారికే మీ సేవ ద్వారా సదరం శిబిరాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. ఇక యూడీఐడీ పోర్టల్లో 21 రకాల వైకల్యాలను చేర్చారు. తలసేమి యా, ఆటిజం, యాసిడ్ బాధితులు, న్యూరో సంబంధిత బాధితులు కూడా సదరం శిబిరాల కోసం యూడీ ఐడీ పోర్టల్లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. సదరం శిబిరంలో వైకల్య నిర్ధారణ పూర్తయిన అనంతరం సర్టిఫికెట్లను స్మార్ట్ కార్డు రూపంలో పోస్టల్శాఖ ద్వారా ఇంటికే పంపించనున్నారు. ఈ కార్డు ద్వారా చేయూత పింఛన్లతో పాటు ఇతర పలు సంక్షేమ ప్రయోజనాలకు దేశ వ్యాప్తంగా చెల్లుబాటు కానుంది. యూనిక్ డిజేబులిటీ ఐడీ కార్డులను ఆన్లైన్ నుంచే డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. ఇప్పటి వరకు ఉన్న సదరం సర్టిఫికెట్లు మన రాష్ట్రంలో మాత్రమే చెల్లుబాటు అయ్యేవి. ఇలా దరఖాస్తు చేసుకోండి ... ఆన్లైన్లో స్వాలంబన్కార్డు.జీఓవీ.ఇన్ వెబ్సైట్ను సందర్శించాలి. అప్లయ్ బటన్పై క్లిక్ చేసి దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి కొన్ని సూచనలు ఉంటాయి. వాటిని పూర్తిగా చదివి అర్థం చేసుకొని తరువాత అంగీకరిస్తు సబ్మిట్ క్లిక్ చేస్తే దరఖాస్తు ఫారం ఓపెన్ అవుతుంది. దివ్యాంగులు వారికి చెందిన పూర్తి సమాచారాన్ని అక్కడ అడిగిన విధంగా నమోదు చేస్తే దరఖాస్తు ప్రక్రియ పూర్తి అవుతుంది. వైద్య పరీక్షల అనంతరం వెబ్సైట్లో అర్జీల స్టేటస్ను నిత్యం పరిశీలించుకోవచ్చు. కొత్త పోర్టల్ను అందుబాటులోకి తెచ్చిన కేంద్ర ప్రభుత్వం 21 రకాల సేవలు సులువుగా పొందే అవకాశం -
అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు
కర్నూలు: అదనపు కట్నం కోసం అత్త, మామ, బావ కలిసి వేధిస్తున్నారని పత్తికొండకు చెందిన వి.రమాదేవి జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్కు ఫిర్యాదు చేశారు. కర్నూలు రెండో పట్టణ పోలీస్స్టేషన్ పక్కనున్న క్యాంపు కార్యాలయంలో ఎస్పీ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించి వారితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 115 ఫిర్యాదులొచ్చాయి. వాటన్నిటిపై చట్ట పరిధిలో విచారించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, సీఐలు పాల్గొన్నారు.వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని..⇒ కర్నూలు ఫుడ్ కార్పొరేషన్లో కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బు తీసుకుని మోసం చేసిన కేసులో కర్నూలుకు చెందిన జాకీర్ బాషా, అయేషా బాను, జహీర్ బాషా అరెస్టయి కండీషన్ బెయిల్పై విడుదలయ్యారని, ఈ కేసు దర్యాప్తును పకడ్బందీగా చేసి న్యాయం చేయాలని వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన సుబ్బయ్య ఫిర్యాదు చేశారు.⇒ తన కుమారుడు పెద్ద మద్దిలేటి, మనవడు మధు కలిసి తన పొలాన్ని వారి పేరు మీద ఆన్లైన్లో అడంగల్లో ఎక్కించుకున్నారని, పొలం తప్ప తనకు వేరే జీవనాధారం లేదని, విచారణ జరిపి న్యాయం చేయాలని కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామానికి చెందిన వెంకన్న ఫిర్యాదు చేశాడు.⇒ డీఆర్డీఏ వెలుగు డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వెంకటరత్నం ప్రభుత్వ స్కీముల ద్వారా లబ్ధి పొందేలా చేస్తానని ఆశ పెట్టి డబ్బు తీసుకుని మోసం చేశాడని హాలహర్వికి చెందిన శీలం నాగమ్మ ఫిర్యాదు చేశారు.⇒ పిల్లల చదువుల కోసం చీటీలు వేసి దాచుకున్న డబ్బు ఇవ్వకుండా జొహరాపురం గ్రామానికి చెందిన మహమ్మద్ తప్పించుకుని తిరుగుతున్నాడని ఇందిరమ్మ గృహాలకు చెందిన చాకలి రామచంద్రుడు ఫిర్యాదు చేశారు. -
పొలం వద్దే ప్రాణాలొదిలిన రైతు
కొత్తపల్లి: పైరు కాపలా కోసమని పొలానికెళ్లిన రైతు అక్కడే ప్రాణాలొదిలన ఘటన ఆదివారం రాత్రి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండల కేంద్రానికి చెందిన రైతు చాకలి మధు(38) ఆరు ఎకరాలు కౌలుకు తీసుకొని 3 ఎకరాల్లో వేరుశనగ, 3 ఎకరాల్లో మినుము సాగు చేశాడు. సమీపంలో నల్లమల అటవీ ప్రాంతం ఉండటంతో అడవి పందుల బెడద నుంచి వేరుశనగ పైరును కాపాడుకునేందుకని రాత్రి కాపలా కోసమని పొలానికి వెళ్లి అక్కడే నిద్రించాడు. సోమవారం ఉదయం అతని స్నేహితుడు పాతకోట వెంకటరమణ డీజిల్ కోసమని మధు పొలం వద్దకు వెళ్లి చూడగా విగత జీవిగా పడి ఉండటంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. వారు అక్కడికి చేరుకుని బోరున విలపించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ ఎం.కేశవ సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. విషపురుగు కాటుతో మృతిచెంది ఉండొచ్చని పలువురు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి భార్య అనిత ఫిర్యాదు మేరు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్యతోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. -
మధ్యవర్తిత్వంతో త్వరితగతిన కేసుల పరిష్కారం
కర్నూలు(సెంట్రల్): మధ్యవర్తిత్వంతో కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు/జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.కబర్ధ్థి అన్నారు. సోమవారం జిల్లా లీగల్ సెల్ ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వంపై కర్నూలు, నంద్యాల జిల్లాల న్యాయవాదులు, ఎన్జీఓలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రితో కలసి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం హైకోర్టు అన్ని కోర్టుల్లో మధ్యవర్తిత్వాన్ని ప్రవేశపెట్టాలని తీర్మానించినట్లు చెప్పారు. అందులో భాగంగా ఈనెల 17 నుంచి 21వ తేదీ వరకు న్యాయవాదులకు శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనంతరరం కేరళ నుంచి వచ్చిన జ్యోతిగోపీనాథన్ మధ్యవర్తిత్వంపై శిక్షణనిచ్చారు. -
నంద్యాలలో జిల్లా కేంద్రంలో..
బొమ్మలసత్రం: స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అదిరాజ్సింగ్రాణా ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదికకు 72 ఫిర్యాదులు అందాయి. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పీజీఆర్ఎస్లో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి పరిష్కార మార్గాన్ని చూపుతున్నామన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ మందా జావళి ఆల్ఫోన్స్ తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని.. ● ఆస్తి కోసం తన పెద్ద కుమారుడు శివశంకర్గౌడ్ తప్పుడు కేసులు పెట్టి మానసికంగా, శారీరకంగా తనను వేధిస్తున్నారని పగిడ్యాల మండల కేంద్రానికి చెందిన లక్ష్మన్నగౌడ్ ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. ● చుక్కల భూమి జాబితాలో నుంచి తన పొలాన్ని తీసేయిస్తానని నమ్మించి పూజారి నాగేంద్రయ్య రూ. 1.50 లక్షలు కాజేశాడని దొర్నిపాడు మండలం ఉమాపతి గ్రామానికి చెందిన మల్లికార్జున ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. యించాడు. -
ప్రసవ వేదనతో ఉపాధ్యాయిని మృతి
కోసిగి: మండల కేంద్రంలోని చాకలిగేరి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని కవిత(28) ప్రసవ వేదనతో ఆత్మకూరు ఆస్పత్రిలో ఆదివారం రాత్రి మృతి చెందిందారు. సోమవారం ఉదయం ఎంఈఓ శోభరాణి, హెచ్ఎం సుబ్బలక్ష్మి తెలిపిన వివరాలు.. పాములపాడు మండలం బానుముక్కల గ్రామానికి చెందిన కవిత 2018 డీఎస్సీలో ఉపాధ్యాయురాలిగా ఎంపికై 2020 సెప్టెంబర్ 27న కోసిగి చాకలిగేరి ప్రాథమిక పాఠశాలలో చేరింది. ఏడాది క్రితం సచివాల ఉద్యోగి వినోద్తో వివాహం కాగా మూడు నెలల క్రితం మెటర్నిటీ సెలవుల్లో సొంత గ్రామం బానుముక్కలకు వెళ్లింది. ఆదివారం అర్ధరాత్రి ప్రసవ నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆత్మకూరు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రసవ సమయంలో ఆమె హైబీపీతో ఆస్పత్రిలోనే మృతి చెందారు. విషయం తెలుసుకున్న తోటి ఉపాధ్యాయులు సంతాపం తెలిపారు. మహిళ ఆత్మహత్యాయత్నం బండి ఆత్మకూరు: మండల పరిధిలోని కడమల కాలువ గ్రామానికి చెందిన మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మహిళపై కొన్నిరోజుల క్రితం ఆర్ఎంపీ సుబ్బరాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇదే విషయమై గతంలో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తనపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ ఆర్ఎంపీతోపాటు అతని తండ్రి సోమవారం తెల్లవారుజామున మహిళ ఇంటి మీదకు వెళ్లి హత్యాయత్నానికి పాల్పడ్డారు. భయాందోళనకు గురైన మహిళ పురుగు మందు తాగింది. కుటుంబ సభ్యులు, స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఈ విషయంపై ఎస్ఐ జగన్మోహన్ను వివరణ కోరగా జరిగిన ఘటనపై విచారణ జరిపి, బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. జలవనరుల శాఖలో పదోన్నతులు కర్నూలు (సిటీ): జలవనరుల శాఖలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న వారికి అడ్హక్ విధానంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లుగా పదోన్నతులు కల్పించి పోస్టింగులు ఇస్తూ ఆ శాఖ ప్రత్యేక స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయిప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి జిల్లాకు చెందిన 11 మంది ఇంజినీర్లు పదోన్నతులు పొందారు. ఎస్ఆర్బీసీ సర్కిల్1లోని సబ్ డివిజన్3లో డీఈఈగా పనిచేస్తున్న సీహెచ్ శ్రీనివాసరావు, ఎన్.నాగేంద్రకుమార్ (తెలుగు గంగ), ఎం.రమేష్ బాబు(ఎస్ఆర్బీసీ క్వాలిటీ కంట్రోల్), ఎస్.గుణకర్రెడ్డి (సీఈ ఆఫీస్, కర్నూలు), ఎం.వేణుగోపాల్ రెడ్డి(ఎస్ఆర్బీసీ సర్కిల్1), ఎస్.మురళి (జీఆర్పీ), ఎం.మల్లికార్జున రెడ్డి(ఎస్ఆర్బీసీ సర్కిల్1), పి.శరత్కుమార్ (తెలుగు గంగ), బి.మహేష్ (సీఈ ఆఫీస్, కర్నూలు), ఎస్.శివప్రసాద్ (హెచ్ఎన్ఎస్ఎస్ సర్కిల్1), టి.రాధాకృష్ణ (ఎస్ఆర్బీసీ సర్కిల్1) పదోన్నతి పొందారు. వీరందరికీ పదోన్నతులు కల్పించి పోస్టింగ్ ఇచ్చారు. మృతదేహం లభ్యం పెద్దకడబూరు: మండల పరిధిలోని పులికనుమ ప్రాజెక్టులో గల్లంతైన వ్యక్తి మృతదేహం సోమవారం రాత్రి లభ్యమైంది. మండల పరిధిలోని హులికన్వీ గ్రామానికి చెందిన మస్కి నాగేంద్ర శనివారం రాత్రి చేపలు పట్టడానికి పులికనుమ ప్రాజెక్టులో దిగి గల్లంతైన విషయం విధితమే. ఆదివారం గాలించినా మృతదేహం ఆచూకీ దొరక్క పోవడంతో సోమవారం కూడా గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి మృతదేహం లభ్యమైంది. మృతుడి కుమారుడు చిన్న లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మంజునాథ్, ఎస్ఐ నిరంజన్రెడ్డి తెలిపారు. -
పలుమార్లు అర్జీలు ఇచ్చినా స్పందించడం లేదు
నేను దివ్యాంగుడిని. నాకు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ తప్ప వేరే ఆదాయ మార్గాలు లేవు. రెండు కాళ్లు లేకపోవడంతో ఏ పనీ చేసుకోలేను. సొంత ఇల్లు కూడా లేదు. వచ్చిన పింఛన్తో ఇంటి బాడుగ, కరెంటు బిల్లు, ఇంటి ఖర్చులు, అనారోగ్యం కోసం ఖర్చు పెట్టుకోవాలి. నా పరిస్థితిని చూసి ఇంటి స్థలంతోపాటు, ఏదైనా ఔటు సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వాలని పలుమార్లు కలెక్టర్కు అర్జీలు పెట్టుకున్నా ఫలితం లేకపోయింది. – బోయ మద్దిలేట్టి, ఉల్చాల గ్రామం, కర్నూలు పెన్షన్ కోసం ఐదుసార్లు అర్జీ నాకు షుగర్ ఎక్కువై ఒక కాలు ను ఆపరేషన్ చేసి తొలగించారు. రెండేళ్ల నుంచి కాలు లేకపోవడంతో ఇంటి దగ్గరే ఉంటున్నా. బతుకు భారమైంది. దివ్యాంగుల పెన్షన్ కోసం ఐదుసార్లు కలెక్టర్కు అర్జీ పెట్టుకున్నా. ఎంపీడీఓను కలవమన్నారు.. అక్కడ కూడా ఎవరూ పట్టించుకోరు. – వెంకటేశ్వర్లు, కులుమాల, గొనెగండ్ల మండలం -
అంతర్గత బదిలీలకు తిలోదకాలు
శ్రీశైల దేవస్థానంలో అంతర్గత బదిలీలకు అధికారులు తిలోదకాలిచ్చారు. మూడు నెలలకోసారి అంతర్గత బదిలీలు చేయాలనే దేవదాయశాఖ కమిషనర్ ఆదేశాలను గాలికొదిలేశారు. ఫలితంగా కొందరు ఫెవికాల్ వీరులు దాదాపు తొమ్మిది నెలలుగా కొన్ని విభాగాల్లో తిష్టవేశారు. శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలో వెలసిన భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి తరలివచ్చే భక్తులకు సేవలందించేందుకు రాష్ట్ర దేవదాయశాఖ సుమారు 300 మంది రెగ్యులర్ సిబ్బందిని, 1000 మందికి పైగా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఇతర ఉద్యోగులను నియమించింది. దేవస్థానంలో విధులు నిర్వహించే రెగ్యులర్ ఉద్యోగులకు ప్రతి ఐదేళ్లకోసారి ఇతర దేవస్థానాలకు బదిలీ చేస్తారు. ఇక పరిపాలన సౌలభ్యం కోసం, ప్రతి అధికారికి, సిబ్బందికి పాలనలో అనుభవం కోసం ప్రతి మూడు నెలలకోసారి రొటేషన్ పద్ధతిన అంతర్గత బదిలీలు చేయాలని రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను పాటించకుండా అధికారులు తమకు నచ్చిన సమయంలో ఇష్టానుసారంగా అంతర్గత బదిలీలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈఓల మాట వినని అధికారులు, సిబ్బందిపై కక్ష తీర్చుకునేందుకు మాత్రమే కమిషనర్ ఆదేశాలు ఉపయోగిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం రాగానే.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత జూలై 8న పర్యవేక్షకులు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్లు, పలువురు అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులతో పాటు పరిచారకులను ఒకేసారి 52 మందిని బదిలీ చేశారు. మరికొన్ని రోజులకు ఏఈఓ, పర్యవేక్షకులను సైతం అంతర్గత బదిలీలు చేస్తూ ఈఓ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత సుమారు తొమ్మిది నెలలవుతున్నా అంతర్గత బదిలీల ఊసే లేదు. దీంతో వసతి విభాగంలో కొందరు పాతుకుపోయారనే విమర్శలున్నాయి. ఈ విభాగంలోని వారు ప్రొటోకాల్ వ్యవహారాలు, సిఫార్స్ లేఖలకు వసతి గదులు, దర్శనం టికెట్లు కేటాయించాల్సి ఉంటుంది. ప్రాధాన్యత ఉన్న విభాగం కాబట్టి ఇక్కడి నుంచి కొందరు కదలడం లేదనే ఆరోపణలున్నాయి. మల్లికార్జున సదన్ కౌంటర్లో పనిచేసే ఓ ఉద్యోగి రెండేళ్లకు పైగా అక్కడే విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ప్రమోషన్లు ఇచ్చి..పోస్టింగులు మరిచి! దేవస్థానంలో పర్యవేక్షకులుగా విధులు నిర్వహిస్తున్న ఇద్దరికి సహాయ కార్యనిర్వహణాధికారులుగా, సీనియర్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న ఐదుగురికి పర్యవేక్షకులుగా గత ఏడాది డిసెంబరు 27న ప్రమోషన్లు ఇచ్చారు. కానీ ఇంతవరకు పోస్టింగులు ఇవ్వలేదు. గత మూడు నెలలుగా వారు గతంలో వారికి కేటాయించిన సీటులోనే విధులు నిర్వహిస్తున్నారు. చర్యలు తీసుకుంటాం అంతర్గత బదిలీలు పరిపాలన సౌలభ్యం కోసం చేపట్టే అంశం. ఈ విషయం పరిపాలనకు సంబంధించిన అంశం. నేను ఈఓగా వచ్చి మూడు నెలలు మాత్రమే అవుతుంది. అప్పటి నుంచి సంక్రాంతి, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణపైనే ప్రత్యేక దృష్టి సారించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఎవరెవరు ఎన్ని నెలలుగా ఒకే సీటులో ఉంటున్నారనే విషయంపై పరిశీలించి, చర్యలు తీసుకుంటాం. – ఎం.శ్రీనివాసరావు, శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి మూడు నెలలకోసారి బదిలీలు చేయాలని కమిషనర్ ఆదేశాలు పట్టించుకోని శ్రీశైలం దేవస్థానం అధికారులు -
కమనీయం.. కల్యాణోత్సవం
● వైభవంగా గోరంట్ల మాధవుడి గరుడోత్సవంకోడుమూరు రూరల్: శ్రీలక్ష్మీ మాధవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గోరంట్ల గ్రామంలో సోమవారం వేకువజామున కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. మాధవస్వామి తరఫున ఎర్రగుడి గ్రామస్తులు, అమ్మవార్ల తరఫున గోరంట్ల వాసులు పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. ఆలయ పండితులు ఆగమశాస్త్ర ప్రకారం కల్యాణోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. ఉత్సవాన్ని తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి వందలాదిగా తరలివచ్చారు. భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఈఓ గుర్రెడ్డి, వేద పండితులు వందవాసి రాధాకృష్ణ, లక్ష్మీనారాయణ, పురుషోత్తం, హరి, శ్రీనివాస ఆచారి, వెంకటరమణ, రమణమూర్తి, వెంకట్రామయ్య, రాజేష్, పద్మానాభ ఆచారి, ఎస్ఐ శ్రీనివాసులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఘనంగా గరుడోత్సవం కల్యాణోత్సవం అనంతరం ఉత్సవమూర్తులైన శ్రీలక్ష్మి, భూదేవి, మాధవస్వామిని గరుడ వాహనంపై అధిష్టింపజేశారు. డప్పువాయిద్యాలు, మేళతాళాల మధ్య గ్రామ వీధుల్లో గరుడోత్సవం నిర్వహించారు. గరుడ వాహనానికి ముందు ఎర్రగుడి వాసులు, వెనుక గోరంట్ల వాసులు నిలబడ్డారు. భక్తులు స్వామివారికి కర్పూర హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గరుడోత్సవాన్ని నిర్వహిస్తున్న తరుణంలో ఎర్రగుడి గ్రామానికి చెందిన సుధాకర్ అనే భక్తుడి కాలికి గాయమైంది. దీంతో అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
ఎకై ్సజ్లో అసోసియేషన్ ఎన్నికల కోలాహలం
కర్నూలు: ఎకై ్సజ్ శాఖలో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుళ్ల అసోసియేషన్ ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. మూడేళ్లకోసారి జరగాల్సిన అసోసియేషన్ ఎన్నికలు తొమ్మిదేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికలు నిర్వహించేందుకు ఆ శాఖ ఉన్నతాధికారులు గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో అధ్యక్ష పదవి రేసులో ఉన్న ఓబులేసు, వైవీ గిరిబాబు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 ఎకై ్సజ్ పోలీస్స్టేషన్లు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఓబులేసు నంద్యాల డీటీఎఫ్లో పనిచేస్తుండగా మరో అభ్యర్థి గిరిబాబు కర్నూలు ఏసీ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో పనిచేస్తున్నారు. వీరిద్దరూ 1995 బ్యాచ్కు చెందిన ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు. ఎకై ్సజ్ శాఖలోకి డిప్యూటేషన్పై వచ్చి ఇక్కడే విలీనమయ్యారు. 1992 బ్యాచ్కు చెందిన సీనియర్లతో పాటు 2014 బ్యాచ్కు చెందిన కానిస్టేబుళ్లు ఐఎంఎల్ డిపో, కారుణ్య నియామకం కింద ఎంపికై నవారు వివిధ విభాగాల్లో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. మొత్తం 135 మంది కానిస్టేబుళ్లు, 75 మంది హెడ్ కానిస్టేబుళ్లు కలిపి 210 మంది తమ ఓటు ద్వారా అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాల్సి ఉంది. అధ్యక్ష పదవికి ఓబులేసు, గిరిబాబు పోటీ పడుతుండగా, ప్రధాన కార్యదర్శి పదవికి విజయ్కుమార్, జగన్నాథం పేర్లు వినిపిస్తున్నాయి. ఈనెల 23న కర్నూలు ఎకై ్సజ్ కార్యాలయ ఆవరణంలో పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు నిర్ణయించారు. ఎన్నికల తేదీ గడువు సమీపిస్తుండటంతో బరిలో ఉన్న అభ్యర్థులు.. ఎకై ్సజ్ స్టేషన్లతో పాటు ఈఎస్టీఎఫ్, మొబైల్ పార్టీ, చెక్పోస్టు, ఎన్ఫోర్స్మెంట్, నంద్యాల, కర్నూలు ఈఎస్ కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందిని కలిసి తమ విజయానికి దోహదపడాలని అభ్యర్థిస్తున్నారు. ఎకై ్సజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి ఇటీవలనే ఎన్నికలు నిర్వహించి ఆ సంఘం అధ్యక్షునిగా రాజేంద్రప్రసాద్ను ఎన్నుకున్న విషయం తెలిసిందే. జోరుగా ప్రచారం చేస్తున్న అభ్యర్థులు ఈనెల 23న పోలింగ్ -
సమస్య పరిష్కారం అయితే బాధితులు తిరిగి అర్జీ ఇచ్చేందుకు ఎందుకు వస్తారు? అర్జీల పరిష్కారం 93 శాతం ఉంటే.. వ్యయప్రయాసలకోర్చి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ చుట్టూ ఎందుకు తిరుగుతారు? బాధితులతో మాట్లాడినంతనే పరిష్కారం అయినట్లు చూపుతుండటమే ఇందుకు ప్రధాన కారణంగా
నామమాత్రంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక ● కలెక్టరేట్ చుట్టూ బాధితుల ప్రదక్షిణ ● రాజకీయ జోక్యంతో ఎక్కడి అర్జీలు అక్కడే.. ● కనీసం పింఛన్లు కూడా ఇవ్వలేని దైన్యం ● భూ సమస్యలతో వృద్ధుల పడరానిపాట్లు ● జిల్లా కలెక్టర్కు చెప్పుకున్నా క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యం కర్నూలు(సెంట్రల్)/కర్నూలు రూరల్/కల్లూరు: ప్రతి సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లా నలుమూలల నుంచి వ్యయ ప్రయాసలకోర్చి బాధితులు వస్తున్నారు. స్వయంగా జిల్లా కలెక్టర్ అర్జీలు స్వీకరిస్తుండటంతో తమ సమస్యకు పరిష్కారం లభిస్తుందనే భావన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. వీరిలో ఎక్కువగా 50 ఏళ్లకు పైబడిన వారే ఉంటున్నారు. చాలా మంది బీపీ, షుగర్తోపాటు ఒళ్లు, కాళ్ల నొప్పులతో బాధ పడుతున్నా ఎంతో ఆశతో కలెక్టరేట్కు వచ్చి అర్జీలు అందజేస్తున్నారు. అయితే వాటి పరిష్కారాలపై క్షేత్రస్థాయిలో వేరుగా.. అధికారిక లెక్కల్లో మరో రకంగా ఉంటోంది. వచ్చిన అర్జీల్లో దాదాపు 93 శాతం అర్జీలకు పరిష్కారాలు చూపినట్లు అధికారులు చెబుతుండగా బాధితులు మళ్లీ మళ్లీ అవే అర్జీలతో కలెక్టరేట్కు వస్తుండటం గమనార్హం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీ ఇచ్చిన వారితో మాట్లాడినంతనే పరిష్కారం అయినట్లు అధికారులు రికార్డుల్లో చూపుతున్నారు. కొందరైతే కలెక్టర్, వారి శాఖల ఉన్నతాధికారుల భయంతో కూడా సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపకపోయినా చూపినట్లు లాగిన్లో ఎంట్రీ చేస్తున్నట్లు బాధితుల మాటలను బట్టి అర్థమవుతోంది. విపరీతమైన రాజకీయ జోక్యం.. ● కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిపాలన విషయంలో రాజకీయ జోక్యం పెరిగిపోయింది. ● ఏకంగా సీఎం చంద్రబాబునాయుడే వైఎస్ఆర్సీపీ నాయకులకు సాయం చేస్తే ఇబ్బందులు పడతారని హెచ్చరించిన నేపథ్యంలో పాలనలో పక్షపాతం కనిపిస్తోంది. ● కూటమి నేతలు నేరుగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నా ఎవరూ ఏమి అనడంలేదు. ● పట్టున్న గ్రామాల్లో పేదల ఆధీనంలో ఉన్న భూములను దౌర్జన్యంగా ఆక్రమించుకొని గెంటేస్తున్నారు. ● పోలీసు స్టేషన్కు వెళ్లినా బాధితులకు న్యాయం జరగడంలేదు. ● రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకొచ్చినా ఏమి చేయలేకపోతున్నారు. ● ఈక్రమంలో కలెక్టరేట్, ఆర్డీఓ, తహశీల్దార్ కార్యాలయాల్లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికను బాధితులు ఆశ్రయిస్తుండడంతో అక్కడ కూడా తమకు తెలియకుండా పరిష్కారాలు చూపరాదని అధికారులకు హుకుం జారీ చేస్తున్నారు. సీఎంఓ పంపే అర్జీలపైనే ప్రత్యేక దృష్టి సీఎంఓ పంపే అర్జీలపైనే అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. నిర్దేశించిన గడువులోపు వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు మొత్తం 317 అర్జీలు రాగా, 259 అర్జీలను పరిష్కరించారు. అయితే ఆయా సమస్యలపై కూడా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయి విచారణ చేయడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అర్జీలపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నాం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నాం. ప్రతిరోజూ అర్జీలను పరిశీలించి పరిష్కారాలు చూపాలని అధికారులకు ఆదేశాలు ఇస్తున్నాం. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. రాజకీయ జోక్యాన్ని సహించం. – పి.రంజిత్ బాషా, జిల్లా కలెక్టర్ 2024 జూన్ 15 నుంచి ఇప్పటి వరకు అర్జీల వివరాలు అర్జీలు 40,072 పరిష్కారం 37,415 పెండింగ్ 2657