breaking news
Kurnool
-
ఇద్దరు పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్
కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేస్తూ పీఆర్ అండ్ ఆర్డీ కమిషనర్ కృష్ణతేజ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ పంచాయతీల్లో ఆన్లైన్లో పన్నుల చెల్లింపునకు సంబంధించి ఇళ్ల యజమానుల పేర్లు, వాళ్ల మొబైల్ నెంబర్లను స్వర్ణ పంచాయత్ పోర్టల్లో నమోదు చేయాల్సి ఉంది. అయితే ఈ ప్రక్రియలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాక వందల ఇళ్ల యజమానులకు ఒకే ఫోన్ నెంబర్ను నమోదు చేయడాన్ని పీఆర్ అండ్ ఆర్డీ ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే నంద్యాల జిల్లా బనగానపల్లె గ్రామ పంచాయతీ గ్రేడ్–2 పంచాయతీ కార్యదర్శి బి.సతీష్కుమార్ రెడ్డి, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కోటేకల్ గ్రామ పంచాయతీ గ్రేడ్–4 పంచాయతీ కార్యదర్శి ఫరీద్ అహ్మద్ను కమిషనర్ సస్పెండ్ చేశారు. అలాగే వీరిద్దరూ సంబంధిత అధికారుల అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ను విడిచి వెళ్లరాదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అక్రమ అడ్మిషన్ ఫీజు వసూళ్లపై విచారణ ఎమ్మిగనూరుటౌన్: పట్టణంలోని మాచాని సోమప్ప బాలికల జెడ్పీ హైస్కూల్లో విద్యార్థుల నుంచి అక్రమంగా అడ్మిషన్ ఫీజు వసూలు చేశారన్న ఫిర్యాదులపై బుధవారం కడప ఆర్జేడీ శామ్యూల్, డీఈఓ శామ్యూల్పాల్ విచారణ జరిపారు. పాఠశాలలో విద్యార్థులతో, ఉపాధ్యాయినులతో వేర్వేరుగా మాట్లాడారు. విచారణ రోజున ఆరోపణలు వచ్చిన హెచ్ఎం కృష్ణమూర్తి సెలవులో ఉన్నారు. విచారణ జరిపామని, తదుపరి చర్యలు తీసుకొంటామని ఆర్జేడీ తెలిపారు. డిప్యూటీ డీఈఓ వెంకటరమణారెడ్డి, ఎంఈఓలు ఆంజినేయులు, మధుసుదన్రాజు, గోనెగండ్ల ఎంఈఓ రామాంజనేయులు పాల్గొన్నారు. ఇసుకను తోడేస్తున్నారు కౌతాళం: కూటమి నాయకుల అండదండలుంటే చాలు అనుమతులతో పనిలేదు. చలానాలు అస్సలు అక్కర్లేదు. ఎంతైనా ఇసుక తీసుకెళ్లవచ్చు. కౌతాళం మండలం నదిచాగి ఇసుక రీచ్లో సాగుతున్న దందా ఇదే. అడిగే వారు ఎవరూ లేరని అక్రమార్కులు యథేచ్ఛగా ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తున్నారు. ఇటీవల నదికి నీరు రావడంతో గుడికంబాలి, మరళి గ్రామాల రీచ్ల్లో ఇసుక తరలింపును తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో కూటమి నాయకులు, వారి అనుచరులు, మద్దతుదారులు నదిచాగి రీచ్ వద్ద ట్రాక్టర్లతో వాలిపోతున్నారు. కనిపించిన ఇసుకనంతా తోడుకొని ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. బుధవారం పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరిగినా ఏ ఒక్క అధికారి అటు వైపు తొంగి చూడకపోవడం గమనార్హం. శ్రీశైల భ్రామరికి లక్ష కుంకుమార్చన శ్రీశైలంటెంపుల్: అష్టాదశ శక్తిపీఠంగా వెలసిన శ్రీశైల శ్రీ భ్రమరాంబాదేవికి కార్తీకపౌర్ణమి సందర్భంగా బుధవారం లక్ష కుంకుమార్చన పూజలను నిర్వహించారు. లక్ష కుంకుమార్చన పూజలో భాగంగా అర్చకులు, పండితులు ముందుగా పూజా సంకల్పాన్ని పఠించారు. ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజను నిర్వహించారు. అనంతరం లక్ష కుంకుమార్చనను జరిపించారు. -
భారీగా సెల్ఫోన్ల రికవరీ
● ఎస్పీ చేతుల మీదుగా బాధితులకు అప్పగింత కర్నూలు: ప్రయాణాలు, జాతరలు, ఉత్సవాలు... ఇలా పలు చోట్ల పోగొట్టుకున్న, చోరీకి గురైన రూ.1.20 కోట్ల విలువ చేసే 669 సెల్ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణతో పాటు పలు జిల్లాల నుంచి ఫోన్లను రికవరీ చేసి జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ మైదానంలో బుధవారం మొబైల్ రికవరీ మేళా నిర్వహించి వాటిని ఎస్పీ విక్రాంత్ పాటిల్ చేతుల మీదుగా బాధితులకు అప్పగించారు. పోగొట్టుకున్న సెల్ఫోన్లను రికవరీ చేసి అప్పగించినందుకు బాధి తులు ఎస్పీ విక్రాంత్ పాటిల్తో పాటు సైబర్ ల్యాబ్ పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో డీఎస్పీ బాబు ప్రసాద్, సీఐలు తేజమూర్తి, కేశవరెడ్డి, నాగరాజరావు, శివశంకర్, వేణుగోపాల్తో పాటు సైబర్ ల్యాబ్ టెక్నికల్ టీమ్ పోలీసులు పాల్గొన్నారు. -
వేదభూమిలో కనుల పండువగా తుంగా హారతి
● లక్ష దీపోత్సవంతో కాంతులీనిన నదీ తీరంతుంగా హారతిలో ప్రజల భక్తిభావం, తుంగభద్రమ్మకు కార్తీక హారతి ఇస్తున్న శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు మంత్రాలయం: కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం మంత్రాలయంలో తుంగా హారతి కార్యక్రమం కనుల పండువగా సాగింది. వేడుకల్లో భాగంగా శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి శ్రీమఠం పీఠాధిపతి సుబుదేంధ్ర తీర్థులు కార్తీక పూజోత్సవం చేశారు. అనంతరం వేద పాఠశాల విద్యార్థుల వేద పఠనంతో మేళతాళాలతో ఉత్సవమూర్తి ప్రహ్లాద రాయలు ఊరేగింపుగా తుంగభద్ర నది చెంతకు తీసుకొచ్చారు. ప్రత్యేక వేదికపై కొలువుంచిన అనంతరం పీఠాధిపతి కార్తీక సందేశాన్ని ప్రవచించారు. ఉత్సవమూర్తికి విశేష పూజలు నిర్వహించి కార్తీక హారతి పట్టి తుంగా హారతికి అంకురార్పణ పలికారు. అర్చకులు వేద పఠనం చేస్తూ తుంగభద్రమ్మకు శాస్త్రోక్తంగా నక్షత్ర హారతులు పట్టారు. అంతకు ముందు ఉత్సవమూర్తికి తెప్పోత్సవం కానిచ్చారు. పీఠాధిపతుల తెప్పపై కొలువైన ప్రహ్లాద రాయలకు పుష్పాభిషేకం చేశారు. భక్తులు నదితీరంలోనికి పుష్కర ఘాట్లు పై లక్ష దిపోత్సవం నిర్వహించారు. ఏఏఓ మాధవ శెట్టి మేనేజర్లు శ్రీనివాస రావు, వెంకటేష్ జోషి, శ్రీపతి ఆచార్ పాల్గొన్నారు. -
అధికారుల ఆట విడుపు
కర్నూలు కల్చరల్: కర్నూలు నగర శివారులోని విజయవనం పుల్లయ్య పార్క్లో జిల్లా అధికారులు ఆట పాటలతో ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపారు. షటిల్, క్యారమ్స్, మ్యూజికల్ ఛైర్స్, ఆటల్లో, జేసీ టగ్ ఆఫ్ వార్, షటిల్, క్యారమ్స్లో అధికారులతో కలసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి ఆడారు. టగ్ ఆఫ్ వార్, షటిల్ ఆటల్లో జేసీ నూరుల్ ఖమర్ టీం గెలుపొందింది. జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి అవినాష్ జయసింహ పాటలు పాడి అలరించారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లతో పాటు సీఎఫ్ బీవీఏ కృష్ణ మూర్తి, జిల్లా అటవీ శాఖ అధికారి పి. శ్యామల.. విజయ వనంలో మొక్కలు నాటారు. అనంతరం ఉసిరి చెట్టుకు పూజలు నిర్వహించారు. డీఎఫ్వో శ్యామల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డీఆర్వో వెంకట నారాయణమ్మ, కర్నూలు ఆర్డీవో సందీప్ కుమార్, ఆర్అండ్బీ ఎస్ఈ మహేశ్వర రెడ్డి, హౌసింగ్ పీడీ చిరంజీవి, డీఎస్డీవో భూపతిరావు, ఐసీడీఎస్ పీడీ విజయ, అటవీ శాఖ ఫ్లైయింగ్ స్వ్కాడ్ రేంజ్ అధికారి రమణారెడ్డి, కర్నూలు, ఆదోని రేంజ్ అధికారులు విజయకుమార్, తేజశ్వి, తదితరులు పాల్గొన్నారు. -
దివ్య శోభితం
ఓ వైపు కార్తీదీపకాంతులు..మరో వైపు భక్తుల శివనామస్మరణతో శైవక్షేత్రాలు మార్మోగాయి. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం తెల్లవారుజామున నుంచి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. పుణ్య స్నానాలు ఆచరించి దీపాలను వెలిగించారు. అభిషేకాలు, రుద్రాభిషేకాలు, బిల్వార్చన, సామూహిక సత్యనారాయణ వ్రతాలు, శివ పార్వతుల కల్యాణాలు, కార్తీక వన భోజన కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీశైలం, మహానందిలో జ్వాలాతోరణోత్సవం కనుల పండువగా సాగింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి ఈ వేడుకను తిలకించారు. కర్నూలు వినాయక ఘాట్ కేసీ కెనాల్లో సామూహికంగా కార్తీక దీపాలు వదులుతున్న మహిళలు -
జర్నలిస్టుల సమస్యలపై పోరుబాట
కర్నూలు(సెంట్రల్): జిల్లాలోని జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్(ఏపీడబ్ల్యూజేఎఫ్) ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి బి.మద్దులేటి, రాష్ట్ర కమిటీ సభ్యుడు గోరంట్లప్ప పేర్కొన్నారు. బుధవారం సమాచార శాఖ కార్యాలయ ఆవరణలో ఏపీడబ్ల్యూజేఎఫ్ 19వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సంఘం నగర అధ్యక్ష, కార్యదర్శులు ఎం.శివశంకర్, ఎర్రమల అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి బి.మద్దులేటి, రాష్ట్ర కమిటీ సభ్యుడు గోరంట్లప్పతో పాటు సమాచార పౌర సంబంధాల శాఖ డెప్యూటీ డైరక్టర్ జయమ్మ ముఖ్య అతిథులుగా హాజరై కేకు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. నిరంతరం జర్నలిస్టుల సమస్యల కోసం పోరాడుతున్న ఏపీడబ్ల్యూజేఎఫ్ మరెన్నో ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర కమిటీ సభ్యుడు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకొచ్చి 17 నెలలు అవుతున్నా ఒక్క సమస్యను పరిష్కరించలేదన్నారు. అధికారంలో లేని సమయంలో కూటమి నాయకులు చంద్రబాబునాయుడు, పవన్ కల్యాన్ భ్రమలు కల్పించి మోసం చేశారని విమర్శించారు. ఇప్పటి వరకు ఎందుకు జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు మంజూరు చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాల విషయంలోనూ కూటమి ప్రభుత్వ నేతలు పూటకోమాట మాట్లాడుతున్నారని విమర్శించారు మరోవైపు ఎక్కడికక్కడే మీడియా స్వేచ్ఛను హరిస్తూ జర్నలిస్టులపై కేసులు పెట్టడం అన్యాయమన్నారు. జర్నలిస్టుల రక్షణ చట్టం తేవాలని కోరుతున్నా ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. సమాచార శాఖ డీడీ జయమ్మ మాట్లాడుతూ..జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. త్వరలోనే అక్రిడిటేషన్లు, ఇళ్ల స్థలాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్నారు. కార్యక్రమలో సీనియర్ ఫొటోగ్రాఫర్ డి.హుస్సేన్, ప్రజాశక్తి ఎడిషన్ ఇన్చార్జి పానుగంటి చంద్రయ్య, సీనియర్ రిపోర్టర్లు చంద్రశేఖర్, వినయ్కుమార్, చంద్రమోహన్, రవిప్రకాష్, రామకృష్ణ, ప్రతాప్, అనిల్, మణిబాబు, నర్సిరెడ్డి, భాస్కరరావు, బాలకృష్ణ, ఓర్వకల్ మధు తదితరులు పాల్గొన్నారు. -
జీవితంపై విరక్తితో..
● చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యకేసు ముద్దాయిల తండ్రి ఆత్మహత్య కృష్ణగిరి: కృష్ణగిరి మండలం తొగర్చెడు గ్రామానికి చెందిన బోయ బజారి(66) మంగళవారం ఆత్మహత్మ చేసుకున్నాడు.ఇతను పత్తికొండ వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న బోయ బాలకేశన్న, బోయ రామాంజనేయులు తండ్రి. ఎస్ఐ కృష్ణమూర్తి తెలిపిన వివరాల మేరకు.. భార్య వెంకటలక్ష్మమ్మతో కలిసి తొగర్చెడులో బోయబజారి జీవిస్తున్నాడు. ముగ్గురు కుమారులు బోయ బాలకేశన్న, బోయ రామాంజనేయులు, బోయ రామానాయుడు 2017లో మండల కేంద్రానికి చేరువలో జరిగిన చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో ముద్దాయిలు. వీరిలో రెండో కుమారుడు బోయ రామాంజనేయులు హత్య కేసు విచారణ సందర్భంలోనే ఆరేళ్ల క్రితం ఆత్యహత్య చేసుకున్నాడు. మిగిలిన ఇద్దరు కుమారులకు కర్నూలు కోర్టు ఇటీవల జీవిత ఖైదు విధించింది. దీంతో వారు కడప సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఒకవైపు అనారోగ్యం, మరో వైపు ఉన్న ముగ్గురు కుమారుల్లో ఒకడు చనిపోయి, మరో ఇద్దరు జైలులో ఉండడంతో బజారికి చూసుకునే వారు కరువయ్యారు. ఈ క్రమంలో ఎవరి కోసం జీవించాలని మనస్థాపం చెంది తన ఇంటి ముందు ఉన్న పశువుల కొట్టంలో ఉరివేసుకున్నాడు. మృతుడి భార్య వెంకట లక్ష్మమ్మ బుధవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. గురువారం జరిగే మృతుడి అంత్యక్రియల్లో ఒక కుమారుడిని మా త్రమే పాల్గొనేందుకు జైలు అధికారులు అనుమతి ఇచ్చినట్లు సమాచారం. 9న యాదవుల కార్తీక వనభోజనం కర్నూలు (సెంట్రల్): యాదవుల కార్తీక వన భోజన కార్యక్రమాన్ని ఈ నెల 9వ తేదీన నిర్వహించనున్నట్లు సంఘం నాయకులు డాక్టర్ బాలమద్దయ్య, పీజీ నరసింహులుయాదవ్, శేషఫణి యాదవ్, నాగేశ్వరరావు యాదవ్ తెలిపారు. బుధవారం ఆర్ఆర్ హాస్పిటల్లో యాదవుల వనభోజన కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. జగన్నాథగట్టు రూపా ల సంగమేశ్వరస్వామి ఆలయ ఆవరణలో ఉదయం 10 గంటల నుంచి వనభోజన మహోత్సవం ఉంటుందన్నారు. యాదవ కుటుంబ సభ్యులందరూ హాజరై విందు స్వీకరించాలని కోరారు. సమావేశంలో నాయకులు సదానంద యాదవ్, సీతారాం యాదవ్, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. -
రేషన్ బియ్యం పట్టివేత
గడివేముల: మండల పరిధిలోని కరిమద్దెల గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. సమాచారం మేరకు వారు గ్రామానికి చెందిన సింగారి ప్రసాదరావు ఇంట్లో తనిఖీలు నిర్వహించి 1,350 కేజీల రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచినట్లు గుర్తించి సీజ్ చేశారు. ప్రసాదరావుపై కేసు నమోదు చేసినట్లు తహసీల్దార్ వెంకటరమణ బుధవారం తెలిపారు. నిరుపేదలకు అందాల్సిన బియ్యాన్ని ఎవరైనా పక్కదారి పట్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కొత్తూరులో సామూహిక ఒడిబియ్యం ● వేలాదిగా తరలివచ్చిన మహిళలు పాణ్యం: మండల పరిధిలోని కొత్తూరు గ్రామంలో వెలసిన శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో బుధవారం సామూహిక ఒడిబియ్యం కార్యక్రమం నిర్వహించారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఆలయ ప్రధాన అర్చకులు పుల్లయ్యశర్మ, వీరయ్యశర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సుమారు 4వేల మంది సంతానం లేని మహిళలు తరలివచ్చారు. దైవ సన్నిధిలో సాముహిక ఒడిబియ్యం పోసుకుంటే సంతానం కలుగుతుందని వారి నమ్మకం. ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం తెల్లవారుజామున శ్రీ వల్లి సుబ్రమణ్యేశ్వర సమేత ఉత్సవమూర్తులకు అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.తర్వాత ఆలయ ప్రాంగణంలో మహిళలకు నూతన వస్త్రాలు అందించి ఒడిబియ్యం పోశారు. నంద్యాల ఎస్డీపీఓ మంద జావళి ఆలయంలో భక్తులకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. శాంతిరామ్ ఆసుపత్రి వారు ఉచిత మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించారు. -
అంతర పంటలతో అదనపు ఆదాయం
వెల్దుర్తి: అంతర పంటలతో రైతులు అదనపు ఆదాయం పొందవచ్చునని వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(ఆత్మ) జిల్లా పీడీ శ్రీలత పేర్కొన్నారు. మండల పరిధిలోని బింగిదొడ్డి గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో జిల్లా వనరుల కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం రైతు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఆమె మాట్లాడుతూ పత్తి, కంది ఇతరత్రా ప్రధాన దీర్ఘకాలిక పంటలు, పండ్ల తోటల్లో అంతర పంటలుగా ఆకుకూరలు, కూరగాయలు, పప్పుధాన్యాలు సాగు చేయాలన్నారు. దీని వల్ల అదనపు ఆదాయంతోపాటు ప్రధాన పంటకు చీడపీడల నివారణ, భూసారం మెరుగవుతుందన్నారు. జిల్లా ఏరువాక కేంద్రం డాక్టర్ వైఎస్ సతీష్, జిల్లా వనరుల కేంద్రం ఏడీఏ వెంకటేశ్వర్లు, పత్తికొండ ఏడీఏ మోహన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ భూసార పరీక్షల ఆవశ్యకత, సమగ్ర ఎరువుల యాజమాన్యం, నానో యూరియా పిచికారీ, కపాస్ కిసాన్ యాప్పై అవగాహన కల్పించారు. అనంతరం క్షేత్ర సందర్శనలో భాగంగా గ్రామంలో సాగు చేసిన కంది పంటను పరిశీలించి పంటకు ఆశించిన మచ్చల పురుగు నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. అనంతరం మదార్పురం గ్రామంలో ప్రకృతి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్ను పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో ఏఓ అక్బర్బాషా, బింగిదొడ్డి గ్రామ సర్పంచ్ వెంకటేశ్వరమ్మ, జిల్లా వనరుల కేంద్రం ఏఓ వెంకట రంగారెడ్డి, ప్రకృతి వ్యవసాయ శాఖ మండల ఇన్చార్జ్ జనార్ధన్, ఆర్ఎస్కే సిబ్బంది లింగన్న పాల్గొన్నారు. -
బాలల సంరక్షణ పట్ల నిర్లక్ష్యం వద్దు
కర్నూలు(అర్బన్): జిల్లాలోని బాలల సంరక్షణ కేంద్రాల్లోని చిన్నారుల పట్ల ఎలాంటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించకుండా జాగ్రత్తగా చూసుకోవాలని జిల్లా స్థాయి ఇన్స్పెక్షన్ కమిటీ సూచించింది. జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ఆదేశాల మేరకు జిల్లా బాలల సంరక్షణ అధికారి టి.శారద, జువైనల్ జస్టిస్ బోర్డ్ సభ్యురాలు ఎస్.మాధవి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు కె.మధుసుధాకర్, ఎన్జీఓ లయన్ రాయపాటి శ్రీనివాస్, తాండ్రపాడు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మంజుష, సైకాలజిస్డ్ డాక్టర్ కె.చంద్రశేఖర్ బుధవారం పలు బాలల సంరక్షణ కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలోనే స్థానిక శిశు గృహ, నందికొట్కూరు రోడ్డులోని మెర్సీ హోంలోని పిల్లలకు అందిస్తున్న ఆహారం, నివాసం, విద్య, ఆరోగ్య సేవలు, మానసిక స్థితిగతులను కమిటీ సభ్యులు పరిశీలించారు. అలాగే సిబ్బంది పనితీరు, రికార్డుల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, సదుపాయాలను మెరుగుపరచుకునేందుకు అవసరమైన సహకారాన్ని జిల్లా అధికార యంత్రాంగం ద్వారా అందజేస్తామన్నారు. కార్యక్రమంలో శిశు గృహ మేనేజర్ మెహతాజ్, మెర్సీ హోం సిస్టర్స్ మేరీ సిరి, సారంగా, పద్మ తదితరులు పాల్గొన్నారు. -
క్షయ తినమంటోంది... షుగర్ వద్దంటోంది!
పేరుకే తీపి రోగం. కానీ ఈ వ్యాధి ఒళ్లంతా విషమే. దీనిని అదుపులో ఉంచుకోకపోతే ఒక్కో అవయవాన్ని నిశ్శబ్దంగా నాశనం చేసుకుంటూ పోతుంది. ఇలా దెబ్బతినే అవయవాల్లో ఊపిరితిత్తులు ప్రధానమైనవి. షుగర్ వల్ల వ్యాధినిరోధకశక్తి తగ్గి మరో మహమ్మారి క్షయకు దారితీస్తుంది. ఈ క్షయ తగ్గాలంటే బాగా తినాలని వైద్యులు చెబుతారు. బాగా తింటే షుగర్ నియంత్రణలో ఉండదు. ఈ జంట వ్యాధులున్న వారు మితంగా తింటూ చికిత్స తీసుకుంటేనే అవి దారికి వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కర్నూలు(హాస్పిటల్): క్షయ వ్యాధి వచ్చిందంటే ఒకప్పుడు ఊరికి దూరంగా ఉంచేవారు. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న వారికి కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుందని భయపడేవారు. ఊరి చివరలో ఒక గదిలో ఉంచి వైద్యం అందించేవారు. కాలక్రమేణా ఆధునిక మందులు అందుబాటులోకి రావడంతో ఈ వ్యాధి త్వరగా నియంత్రణలోకి వస్తుంది. ఫలితంగా రోగి త్వరగానే కోలుకుంటున్నాడు. ఇప్పుడు కూడా క్షయ వ్యాధిగ్రస్తుడు పక్కనుంటే చుట్టుపక్కల ఉన్న వారికి కూడా ఈ వ్యాధి తాలూకు బ్యాక్టీరియా విస్తరించి ఇతరుల్లోకి వెళ్తుంది. కానీ వ్యాధినిరోధక శక్తి తగ్గితేనే ఆ ఇతరుల్లో క్షయగా మారుతుంది. అవగాహన కార్యక్రమాలు, ఆధునిక మందుల వల్ల క్షయ వ్యాధిగ్రస్తుల నుంచి ఇతరులకు వ్యాధి విస్తరించకుండా అడ్డుకుంటున్నారు. షుగర్ వ్యాధి అదుపులో క్షయ...! ఇటీవల కాలంలో షుగర్ వచ్చిన వారిలోనూ క్షయ కనిపించడం సాధారణంగా మారింది. ఇలాంటి కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా క్షయ రోగుల మాదిరిగా ఇది పోషకాహారం బాగా తింటే త్వరగా నియంత్రణలోకి వస్తుంది. కానీ షుగర్ ఉన్న వారికి క్షయ వస్తే మాత్రం అంత త్వరగా లొంగదు. చాలా మంది షుగర్ వ్యాధిగ్రస్తులు మందులు సరిగ్గా వాడకపోవడం, వాడినా ఆహార నియమాలు పాటించకపోవడం, వ్యాయామం చేయకపోవడం వంటి కారణాల వల్ల వారిలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండటం లేదు. కొంత మందికి తినకముందు 200లకు పైగా, తిన్నాక 350 నుంచి 400లకు పైగా షుగర్ స్థాయిలు ఉంటున్నాయి. ఇలాంటి వారిలో అధికంగా క్షయ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. షుగర్ నియంత్రణలో ఉంటేనే క్షయ కూడా తగ్గుతుంది. క్షయ తగ్గాలంటే మంచి పౌష్టికాహారం తినాలి. షుగర్ రోగుల్లో అయితే ఆహారం అధికంగా తీసుకుంటే షుగర్ నియంత్రణలో ఉండదు. ఈ రెండు వ్యాధులను సమన్వయం చేసుకుంటూ చికిత్స తీసుకుంటేనే అవి దారికి వస్తాయి. వీరికి క్షయ వచ్చే అవకాశం ఎక్కువ సాధారణంగా వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉండే వారిలో క్షయ వచ్చే అవకాశం ఉంది. ఆల్కహాలు, స్మోకింగ్, పొగాకు ఉత్పత్తులు వాడేవారు, పలు పరిశ్రమల్లో పనిచేసేవారు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు, కాలేయ, కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వారు, హెచ్ఐవీ, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులతో పాటు గర్భిణిలు, బాలింతలు, శిశువులు, పిల్లలు, 60 ఏళ్లు పైబడిన వారిలో వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. క్షయ వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉంది. నమోదు కాని కేసులెన్నో ! ఇప్పటికే షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారికి క్షయ వ్యాధి వచ్చిందంటే వారు ప్రభుత్వ ఆసుపత్రులకు రావడం లేదు. నేరుగా ప్రైవేటు వైద్యుల క్లినిక్లను ఆశ్రయిస్తున్నారు. ఈ కారణంగా అధికారిక లెక్కల్లో వీరి వివరాలు పూర్తిగా నమోదు కావడం లేదు. టీబీ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే తనకున్న జబ్బు అందరికీ తెలిసి పోతుందనే భయం ప్రతి ఒక్కరినీ వెంటాడుతోంది. ఈ కారణంగానే డబ్బులు ఖర్చు అయినా ప్రైవేటు వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. ఇలా ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లే టీబీ/షుగర్ రోగుల సంఖ్య 30 శాతానికి పైగానే ఉంటుంది. క్షయ వ్యాధిగ్రస్తులకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలతో పాటు మందులు కూడా ఉచితంగా అందిస్తున్నాము. క్షయ రోగితో పాటు ఇంట్లో ఉన్న వారికీ టీబీ నిర్ధారణ పరీక్షలతో పాటు సీవైటీబీ స్కిన్ టెస్ట్ చేయిస్తున్నాము. అంతర్గత టీబీ ఉంటే వారికి టీబీ రాకుండా ఉండే మందులు ఇస్తున్నాము. ప్రతి రోగికి పౌష్టికాహారం అందించేందుకు నెలకు రూ.1000 చొప్పున ఆరు నెలలకు రూ.6 వేలు ఇస్తున్నాము. వీరికి నిక్షయ మిత్ర ద్వారా పౌషకాహార కిట్లను సైతం అందిస్తున్నాము. క్షయ రోగిని గుర్తించి చెప్పిన వైద్యులకు ఒక కేసుకు రూ.500 ఇస్తున్నాము. –డాక్టర్ ఎల్.భాస్కర్, డీఎంహెచ్ఓ, కర్నూలు డయాబెటీస్ రోగులకు క్షయ సోకితే తప్పనిసరిగా వారు ఇన్సులిన్ వాడాలి. క్షయ ఉన్న వారు ఆహారం బాగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో షుగర్ రీడింగ్ మరింత పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల షుగర్ నియంత్రణలో ఉండదు. ఇది నియంత్రణలో లేకపోతే క్షయ కూడా తగ్గదు. దీనివల్ల షుగర్ ఉన్న వారికి క్షయ వస్తే అలాంటి వారికి ఇన్సులిన్ వాడాలని సూచిస్తాము. ఒకవైపు షుగర్కు ఇన్సులిన్, మరోవైపు క్షయ వ్యాధి మందులు వైద్యుల సూచన మేరకు క్రమం తప్పక వాడుతూ ఉంటే రెండు వ్యాధులూ నియంత్రణలోకి వస్తాయి. –డాక్టర్ మల్లికార్జున్రెడ్డి, టీబీ మెడికల్ ఆఫీసర్, కర్నూలు -
పంట కాల్వలో పడి..
గోస్పాడు: మండలంలోని సాంబవరం గ్రామంలో ఓ వ్యక్తి పంట కాల్వలో పడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నందవరం పుల్లయ్య (55) మతిస్థితిమితం సక్రమంగా లేక గత 15 రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తిరిగి ఇంటికి రాలేదు. మంగళవారం పంట కాల్వలో పడి ఉండగా స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ సుధాకర్రెడ్డి ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి కుమారుడు ప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
నాటు కోళ్ల పెంపకం లాభదాయకం
ఎమ్మిగనూరురూరల్: గ్రామీణలు నాటు కోళ్లను పెంచుకుంటే లాభదాయకంగా ఉంటుందని కేవీకే సమన్వయకర్త డా. రాఘవేంద్రచౌదరి పేర్కొన్నారు. బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో నాటు కోళ్ల పెంపకంపై ఏర్పాటు చేసిన శిక్షణ మంగళవారం ముగిసింది. ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు నాటు కోళ్ల పెంచుకోవటం వలన కోడి గుడ్లతో పాటు కోళ్లను విక్రయించుకోవచ్చునని తెలిపారు. అయితే, కోళ్ల పెంపకంలో జాగ్రత్తలు తీసుకోవాలని, ఏమైనా వ్యాధి సంక్రమిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలన్నారు. అనంతరం శిక్షణలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్స్, నాటు కోళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నార్మ్ ప్రిన్సిపల్ సైంటిస్టు డా. నిర్మల, డా. సుప్రియ తదితరులు పాల్గొన్నారు. అలాగే తెనే టీగల పెంపకం చేస్తున్న వారికి వాటిపై అవగాహన కల్పించి తేనేటీగ పెట్టెలు అందజేశారు.జాతీయ ఆహార భద్రత పథకం కింద ఎంపిక చేసిన రైతులకు నూనె గింజల పంటల్లో భాగంగా వేరుశనగ విత్తనాలు అందజేశారు. -
● దారులన్నీ ఇంతే
అధ్వానంగా రామాపురం, లింగాపురం రోడ్డుగతుకుల రోడ్డుపై భయంభయంగా ప్రయాణంరోడ్లను అభివృద్ధి చేస్తామని, ఎక్కడా చిన్నపాటి గుంత లేకుండా చేస్తామని ఎన్నికల ముందు కూటమి నాయకులు ప్రగల్భాలు పలికారు. ఏడాదిన్నర గడిచినా అతీగతీ లేదు. దీంతో ఏ ఊరు రోడ్డు చూసినా కంకర తేలి, అడుగడుగునా మోకాళ్లలోతు గుంతలతో దర్శనమిస్తున్నాయి. ఈ అధ్వాన దారులపై రాకపోకలు సాగించేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏ మాత్రం ఆదమరిచినా గుంతల్లో పడిపోవాల్సిందే. బండిఆత్మకూరు మండలం రామాపురం, లింగాపురం గ్రామాలకు వెళ్లే దారులు మరీ దారుణంగా ఉన్నాయి. ఈ గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ ప్రయాణించాల్సి వస్తోంది. – సాక్షి, ఫొటోగ్రాఫర్, కర్నూలు -
పాల వ్యాన్ ఢీకొని వ్యక్తి దుర్మరణం
ఆలూరు రూరల్: పాల వ్యాన్ ఢీ కొని తుమ్మలబీడు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. హులేబీడు గ్రామంలోని హైవే 167లో మంగళవారం తెల్లవారు జామున ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని తుమ్మలబీడు గ్రామానికి చెందిన దేవేంద్ర (40) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం తెల్లవారు జామున 4.30 గంటలకు ఆకు కూరలు విక్రయించడానికి ఆదోనికి వెళ్తున్న తన తల్లి ఈరమ్మను తుమ్మలబీడు నుంచి హులేబీడుకు స్కూటర్పై తీసుకొచ్చాడు. ఆటోలో ఎక్కించి రోడ్డు పక్కన నిలబడిన దేవేంద్రను ఆదోని నుంచి ఆలూరు వైపు వెళ్తున్న పాల వ్యాన్ బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. పోలీసులు మృతదేహాన్ని ఆలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మృతుడికి భార్య కుమారి, ఇద్దరు కుమారులు సంతానం. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మన్మథ విజయ్ విలేకరులకు తెలిపారు. -
సెరికల్చర్కు ప్రత్యామ్నాయంగా ఎరికల్చర్
● ఆముదం ఆకులు తినే ఎరి పట్టుపురుగుల పెంపకంపై పట్టుపరిశ్రమ శాఖ దృష్టి ● తక్కువ పెట్టుబడితో అధిక నికరాదాయం ● 2026–27 నుంచి ఎరికల్చర్ సాగు.. వచ్చేనెలలో శిక్షణ కార్యక్రమాలు కర్నూలు(అగ్రికల్చర్): మల్బరీ ద్వారా పట్టు సాగు పెంపకంపై రైతులు ఆసక్తి చూపకపోతుండటంతో పట్టుపరిశ్రమ శాఖ ప్రత్యామ్నాయం వైపు దృష్టి సా రించింది. మల్బరీ ద్వారా చేపడుతున్న పట్టు పురుగుల పెంపకం, పట్టు గూళ్ల ఉత్పత్తిని సెరికల్చర్గా వ్యవహరిస్తారు. ఇందులో పెట్టుబడి వ్యయం ఎక్కు వగా ఉండటం, పట్టుగూళ్ల ధరలు తక్కువగా ఉండటం, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల పట్టుసాగు రైతులకు కలసి రావడం లేదు. దీంతో జిల్లాలో సెరికల్చర్ గణనీయంగా తగ్గిపోవడంతో పట్టుపరిశ్రమ శాఖ దృష్టి ఎరికల్చర్పై పడింది. పట్టు పురుగుల్లో ఎరి రకం పురుగులు ఆముదం(క్యాస్టర్) ఆకులు తిని గూళ్లు కడుతాయి. దీనినే ఎరికల్చర్గా పేర్కొంటారు. ఎరికల్చర్ సాగు రాంచీలో విజయవంతంగా ఉంది. ఈ సాగులో పెట్టుబడి వ్యయం బాగా తక్కువ. వాతావరణ పరిస్థితులకు ఆనువుగా ఉంటుంది. ఆముదం ఆకులు తినే పట్టుపురుగులు అధిక ఉష్ణోగ్రతలను కూడా తట్టుకుంటాయి. కాగా మల్బరీ ఆకులు తినడం ద్వా రా కట్టిన పట్టుగూళ్లలో నాణ్యత ఉంటుంది. ధర కిలోకు రూ.600 వరకు ఉంటుంది. ఎరికల్చర్లో ఉత్పత్తి అయిన పట్టుగూళ్ల నాణ్యత అంతగా ఉండ దు.ధర కూడా తక్కువే. అయితే, పెట్టుబడి వ్యయం తక్కువగా ఉండటం, నికరాదాయం ఎక్కువగా ఉండటం, వాతావరణ పరిస్థితులను తట్టుకోవడం తదితర కారణాలతో ఎరికల్చర్ కలసి వస్తు ందనే అభిప్రాయం పట్టుపరిశ్రమ అధికారుల్లో ఉంది. ఉమ్మడి జిల్లాలో 50 వేల హెక్టార్లలో ఆముదం సాగు ఉమ్మడి జిల్లాలో ఆముదం సాగు దాదాపు 50 వేల హెక్టార్లలో ఉంది.సాగు ఎక్కువగా ఉండటం ద్వారా ఎరి పట్టుపురుగులతో పట్టుగూళ్ల ఉత్పత్తి సాధ్యమేనని అధికారులు పేర్కొంటున్నారు. ఎరి పట్టుపురుగులు ఆముదం ఆకునే తింటాయి. ఆకులను పురుగులకు ఆహారంగా ఉపయోగిస్తారు. ఆముదం కాయలను యథావిధిగా అమ్ముకోవచ్చు. ఇందువల్ల రైతులు కూడా ఎరికల్చర్పై ఆసక్తి చూపుతారనే అభిప్రాయం ఉంది. వచ్చే నెలలో ఎరి పట్టుపురుగుల పెంపకంపై రైతులకు పట్టుపరిశ్రమ శాఖ శిక్షణ కార్యక్రమాలు కూడ నిర్వహించడానికి చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే జిల్లా పట్టుపరిశ్రమ శాఖ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి అముదం సాగును అధ్యాంయం చేశారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఆముదం సాగు ఎన్ని ఎకరాల్లో ఉందనే దానిని సేకరించి పట్టు పరిశ్రమ శాఖకు నివేదించారు. 2026–27 నుంచి ఆముదం పంట ఆధారంగా ఎరి పట్టుపురుగుల పెంపకానికి శ్రీకారం చుట్టేందుకు ఆ శాఖ కసరత్తు చేస్తోంది. -
ఆకతాయికి దేహశుద్ధి
ఆలూరు రూరల్: మండలంలోని హులేబీడు గ్రామం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో అనుమానాస్పదంగా కనిపించిన ఆకతాయిని గ్రామస్తులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. అదే గ్రామానికి చెందిన ఆకతాయి యువకుడు శివరాజ్ బడి వెనుక భాగంలో విద్యార్థినులు కాలకృత్యాలకు వెళ్లే ప్రదేశంలోని చెట్ల పొదల్లో చిన్న పాటి స్థావరం ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతి రోజు పాఠశాల ఇంటర్వెల్ సమయంలో అక్కడ ఉంటున్నాడు. దీనిని గమనించిన మధ్యాహ్న భోజనం నిర్వాహకురాలు గ్రామస్తులు, ఉపాధ్యాయులతో కలిసి మంగళవారం రెడ్హ్యాండ్గా పట్టుకున్నారు. విద్యార్థులు కాలకృత్యాల కోసం వచ్చే ప్రదేశంలో నీకు ఏం పని అని ప్రశ్నించగా తాను బహిర్భూమికి వచ్చానని వారితో వాగ్వాదానికి దిగాడు. ఆగ్రహించిన స్థానికులు దేహశద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో యువకుడు అనుమానాస్పదంగా సంచరిస్తున్నాడని పాఠశాల ప్రిన్సిపాల్ భూపాల్ రెడ్డి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
శ్రీశైలంలో నేడు కార్తీక పౌర్ణమి వేడుకలు
● జ్వాలా తోరణోత్సవానికి ఏర్పాట్లు పూర్తిశ్రీశైలంటెంపుల్: కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో ప్రత్యేక ఉంది. కార్తీక పౌర్ణమి రోజున శ్రీశైల దేవస్థానం జ్వాలా తోరణోత్సవాన్ని వైభవంగా నిర్వహించనుంది. ఈ మేరకు దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఆలయం ఎదురుగా ఉన్న గంగా ధర మండపం వద్ద నిర్వహించే జ్వాలాతోరణాన్ని భక్తులు అధికసంఖ్యలో వీక్షించేలా దేవస్థానం అధికారులు ఏర్పా ట్లు చేశారు. నేతితో తడిపిన నూలు ఒత్తులను తోరణంలా ఏర్పాటు చేసి వెలిగిస్తారు. ఇది తోరణంగా వెలుగుతోంది. కాలిన నూలు ఒత్తుల నుంచి వచ్చిన భస్మాన్ని భక్తులు నుదుట ధరించడం ఎంతో విశేషంగా భావిస్తారు. ఈ విధంగా ధరించడం వలన ఆయుష్షు, ఐశ్వర్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. జ్వాలాతోరణోత్సవంలో స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా విశేష పూజలు నిర్వహించి జ్వాలాతోరణం చుట్టూ మూడుసార్లు స్వామిఅమ్మవార్ల పల్లకీని ప్రదక్షిణ చేయిస్తారు. శివపార్వతులతో ముడిపడిన పురాణగాఽథ పూర్వం కృతయుగంలో అమృతం కోసం దేవదాన వు లు క్షీరసాగరాన్ని మధిస్తారు. అందులో నుంచి మొద ట సకల లోకాలనూ దహించివేసే కాలకూట విషం రాగా.. దానిని పరమశివుడు లోక హితం కోసం సేవించాడని గాథ. హాలహలం కంఠంలో ఉంచుకోవడంతో శివుడికంఠం నీలంగా మారింది. దీనిని చూసి భయాందోళనకు గురైన పార్వతీదేవి తన శివుడికి ఏ కీడు జరగ కుండా ఆపద నుంచి బయటపడితే భర్తతో పాటు తాను చిచ్చుల తోరణం కింద మూడుసార్లు నడిచి వస్తాను అని కోరుకుందంట. తర్వాత శివుడుకి ఎటువంటి ఆపద కలగకపోవడంతో పార్వతీదేవి శివుడితో కలిసి కార్తీక పౌర్ణమినాడు జ్వాలాతోరణం కింద మూడుసార్లు నడిచారని, అప్పటి నుంచి జ్వాలాతోర ణం ప్రారంభమైనట్లు పురాణ గాథల్లో ఉంది. -
వైభవం.. ప్రహ్లాద రాయల తెప్పోత్సవం
మంత్రాలయం రూరల్: శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో మంగళవారం కార్తీక మాసం సందర్భంగా శ్రీ పరిమళ తీర్థ పుష్కరిణిలో ప్రహ్లాదరాయలు తెప్పపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీమఠం పీఠాధిపతులు సుభుదేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో నిర్వహించిన తెప్పోత్సవాన్ని తిలకించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు తరలివచ్చారు. పుష్కరిణి మండపంలో ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీఠాధిపతి చేతుల మీదుగా మంగళహారతులు పట్టి భక్తులను ఆశీర్వదించారు. నేడు తుంగా హారతి, లక్ష దీపోత్సవం.. కార్తీక పౌర్ణమి సందర్భంగా తుంగా తీరంలో తుంగా హారతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు మంగళవారం తెలిపారు. శ్రీమఠం నుంచి తుంగభద్రమ్మ వరకు ప్రహ్లాద రాయలు ఊరేగింపు ఉంటుందన్నారు. లక్ష దీపోత్సవ కార్యక్రమం శ్రీమఠం ప్రాకారంలో చేపడుతున్నట్లు మేనేజర్ ఎస్కే శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్ని రాఘవేంద్రుడి ఆశీర్వాదం పొందాలని ఆకాంక్షించారు. -
పంటల నమోదు తనిఖీ
కోడుమూరు రూరల్: మండలంలోని ప్యాలకుర్తి గ్రామంలో పంట నమోదు జాబితాను జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ మంగళవారం తనిఖీ చేశారు. గతంలో వ్యవసాయ శాఖ సిబ్బంది నమోదు చేసిన పంటల నమోదు జాబితాను జేసీ సూపర్ చెక్ చేశారు. సిబ్బంది నమోదు చేసిన పంటల వివరాలు సక్రమంగా ఉన్నాయా లేదా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. కొందరు రైతులు ఉల్లి పంటను తొలగించి ఉండటాన్ని చూసిన జేసీ ఎందుకని ప్రశ్నించగా గిట్టుబాటు ధర లేకపోవడంతో పొలాల్లోనే దున్నేసుకున్నట్లు రైతులు వాపోయారు. జేసీ వెంట కర్నూలు ఆర్డీఓ సందీప్కుమార్, గూడూ రు తహసీల్దార్ వెంకటేష్ నాయక్, మండల వ్యవసాయాధికారి రవిప్రకాష్ ఉన్నారు. నేడు సెల్ఫోన్ల రికవరీ మేళా కర్నూలు: చోరీకి గురైన, పోగొట్టుకున్న సెల్ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించనున్నా రు. జిల్లా పోలీసు కార్యాలయ మైదానంలో బుధవారం ఉదయం 10 గంటలకు సెల్ఫోన్ల రికవరీ మేళా నిర్వహించేందుకు పోలీసు అధికారులు ఏర్పాట్లు చేశారు. 600కు పైగా సెల్ఫోన్లను రిక వరీ చేశారు. వీటిని ఎస్పీ విక్రాంత్ పాటిల్ చేతుల మీదుగా బాధితులకు అందజేయనున్నారు. 11న వ్యాస రచన పోటీలు కర్నూలు(అర్బన్): భారతరత్న డాక్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి/మైనారిటీ సంక్షేమ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 11న జిల్లా స్థాయిలో ఆయన జీవిత చరిత్రపై వ్యాస రచన, వక్తృత్వ పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి ఎస్.సబీహా పర్వీన్ తెలిపారు. ఈ పోటీలను మూడు భాషల్లో (తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ) హైస్కూల్, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నా రు. విద్యార్థినీ, విద్యార్థులకు వేర్వేరుగా ఈ నెల 6వ తేదీన (గురువారం) ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నగరంలోని గడియారం హాస్పిటల్ సమీపంలోని ప్రభుత్వ మైనారిటీ జూనియర్ కళాశాల ప్రాంగణంలో పోటీలను నిర్వహిస్తామన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు తమ పేర్లను జనాబ్ డాక్టర్ షంషుద్దీన్ 9441761206 కు తెలియజేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా వర్షాలు ● గోనెగండ్లలో 34.2 మి.మీ వర్షపాతం కర్నూలు(అగ్రికల్చర్): మోంథా తుపాను ప్రభావం తగ్గిపోయినప్పటికీ జిల్లాలో వర్షాలు పడుతుండటంతో పంటలకు నష్టం జరుగుతోంది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు మద్దికెర మినహా మిగిలిన అన్ని మండలాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. గోనెగండ్లలో అత్యధికంగా 34.2 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లా మొత్తం మీద సగటున 10.6 మి.మీ వర్షం కురిసింది. నవంబర్ నెల సాధారణ వర్షపాతం 29 మి.మీ ఉండగా.. మొదటి నాలుగు రోజుల్లో 10.6 మి.మీ వర్షపాతం నమోదైంది. కాగా మంగళవారం ఉదయం నుంచి పలు మండలాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. వసతిగృహాల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్సులు తప్పనిసరి కర్నూలు(అర్బన్): ప్రభుత్వ బీసీ వసతి గృహాల్లోని విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, అన్ని వసతి గృహాల్లో ఫస్ట్ఎయిడ్ బాక్సులను అందుబాటులో ఉంచుకో వాలని జిల్లా బీసీ సంక్షేమం, సాధికారత అధికారిణి కె.ప్రసూన కోరారు. మంగళవారం స్థానిక బీసీ స్టడీ సర్కిల్లోని సమావేశ భవనంలో జిల్లాలోని సహాయ బీసీ సంక్షేమాధికారులు, వసతి గృహ సంక్షేమాధికారులతో ఆమె ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హాస్టల్లోని విద్యార్థులతో పాటు వసతి గృహ సంక్షేమాధికారులు, సిబ్బంది కూడా ఎఫ్ఆర్ఎస్ కచ్చితంగా నమో దు చేయాలన్నారు. వసతి గృహాల్లో ఏవైనా ఘటనలు చోటు చేసుకుంటే 15 నిమిషాల్లోగా సంబంధిత అధికారులకు తెలియజేయాలన్నా రు. కూరగాయాలు, పాలు, తదితర సరుకులకు సంబంధించి రిజిస్టర్ను తప్పక నిర్వహించాలన్నారు. 10వ తరగతి విద్యార్థులను గ్రేడ్లుగా విభజించి వంద శాతం ఫలితాలు వచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో సహాయ బీసీ సంక్షేమాధికారులు ఎం.శ్రీనివాసులు, ఆంజనేయులు నాయక్, మాదప్ప పాల్గొన్నారు. -
మా రోడ్డుపై టిప్పర్లు తిప్పితే ఊరుకోం
● గ్రావెల్ తరలింపును అడ్డుకున్న పూడూరువాసులుకర్నూలు సిటీ: కర్నూలు రూరల్ మండల పరిధిలోని పూడూరు గ్రామస్తులు మరోసారి రోడ్డెక్కారు. ఇప్పటికే రెండు సార్లు గ్రావెల్ తవ్వకాలను అడ్డుకున్న గ్రామస్తులు.. రెండు రోజుల క్రితం మరోసారి గ్రావెల్ తరలిస్తుండడంతో మంగళవారం టిప్పర్లను అడ్డుకొని రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. తాము ఎన్నో ఏళ్లుగా పోరాటం, ఆందోళనలు చేసి సాధించుకున్న రోడ్డుపై అధిక బరువుతో టిప్పర్లు తిరిగితే గుంతలు పడే అవకాశం ఉందని అగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే అధికారులు స్పందించి మట్టి తరలింపును నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. సమాచారం తెలుసుకున్న తాలుకా పోలీసులు అక్కడికి చేరుకొని గ్రామస్తులతో చర్చలు నిర్వహించడంతో గ్రామస్తులు శాంతించారు. మరోసారి భారీ టిప్పర్లు తిరిగితే ఊరుకోబోమని తెగేసి చెప్పారు. కాంట్రాక్టర్కు కూటమి నేతల అండ పూడూరు గ్రామానికి వెళ్లే రహదారి 2009 వరదల సమయంలో పూర్తిగా దెబ్బతినడంతో తాత్కాలికంగా రోడ్డు వేసి వదిలేశారు. 2014–19 వరకు అధికారంలో ఉన్న అప్పటి టీడీపీ ప్రభుత్వం రోడ్డు వేయిస్తామని మాయ మాటలతో మోసం చేసింది. గ్రామ ప్రజలు పార్టీలకు అతీతంగా పోరాటాలు చేయడంతో 2024లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సుమారు రూ.11.84 కోట్లతో కర్నూలు–గుంటూరు ప్రధాన రోడ్డు నుంచి పడిదెంపాడు గ్రామం మీదుగా పూడురు నుంచి కోళ్లబాపురం వరకు దాదాపు 15 కి.మీ బీటీ రోడ్డును వేయించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కర్నూలు–గుంటూరు రోడ్డు వేస్తున్న కాంట్రాక్టర్ రోడ్డు నిర్మాణం పేరిట పూడూరు సమీపంలోని ఎర్రమట్టిని భారీ టిప్పర్లలో తరలిస్తుండడంతో అక్కడక్కడ రోడ్డు కంకర తెలుతుండడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఆందోళనలు చేపట్టి టిప్పర్లను అడ్డుకున్నారు. అయితే కాంట్రాక్టర్కు కూట మి నేతలు అండగా నిలవడంతో టిప్పర్లు పదేపదే ఈ రోడ్డులో తిరుగుతున్నట్లు స్థానికులు వాపోతున్నారు. అయితే రోడ్డును కాపాడుకునేందుకు కలసికట్టుగా పోరాటం సాగిస్తామని గ్రామస్తులు చెబుతున్నారు. -
కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
ఎమ్మిగనూరు రూరల్: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి మంగళవారం ఎమ్మిగనూరు పట్టణంలోఏరియా ప్రభుత్వాసుపత్రి, మంత్రాలయం రోడ్డులో ఉన్న శివ పత్తి జిన్నింగ్ మిలు, అన్న క్యాంటీన్ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వంద పడకల ఆసుపత్రిని శుభ్రంగా ఉంచాలని సూపరిండెంట్ డాక్టర్ సుధాకు సూచించారు. పత్తి కొనుగోలులో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. స్లాట్ బుకింగ్లో వస్తున్న సాంకేతిక, తేమ శాతం వంటి సమస్యలున్నాయని చెప్పారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు. తనిఖీలకు ముందుగా ఆమె పట్టణంలో 87వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవంలో పాల్గొని పూజలు నిర్వహించారు. -
కాంట్రాక్టర్లను బెదిరించిన మంత్రి అనుచరుడు
కర్నూలు (అర్బన్): కర్నూలు నగరపాలకసంస్థలో రూ.2 కోట్ల పనులకు సంబంధించిన టెండర్లు తమవారికే దక్కాలని, ఎవరూ టెండర్లు వేయవద్దని మంత్రి అనుచరుడు బెదిరిస్తున్నారని సాక్షిలో ప్రచురించటంతో కూటమి నేతలు కక్షగట్టారు. ఎవరూ టెండర్లు వేయవద్దని మున్సిపల్ కాంట్రాక్టర్ల వాట్సాప్ గ్రూపుల్లో పంపించిన మెస్సేజ్ సహా వాస్తవాలు ప్రచురించడాన్ని జీర్ణించుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత నెల 30వ తేదీన సాక్షి కర్నూలు ఎడిషన్లో ‘టెండర్లలో పాల్గొనొద్దు’ శీర్షికన కథనం ప్రచురించినందుకు సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై కేసు నమోదు చేశారు. ఉద్దేశపూర్వకంగా అధికార పార్టీకి చెందిన వారిపై తప్పుడు సమాచారాన్ని ప్రచురించారనే ఫిర్యాదు మేరకు సాక్షి ఎడిటర్, పబ్లిషర్ ఆర్.ధనంజయరెడ్డి, సాక్షి కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ రిపోర్టర్ ప్రతాప్పై కర్నూలు ఒకటో పట్టణ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. కార్పొరేషన్లో ముక్కు, మొహం తెలియని వ్యక్తులు, కాంట్రాక్ట్ పనిచేయనివారు, కాంట్రాక్టర్ లైసెన్స్ కూడా లేనివారు కార్పొరేషన్లో పెత్తనం చెలాయిస్తున్నారని పత్రికలో ప్రచురించారని బిజినేపల్లి సందీప్, చంద్ర శేఖర్ల ఫిర్యాదు మేరకు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో 267/2025 యూ/సెక్షన్ 352, 353(1)(బి), 356(3) అండ్ (4), 61(1)(బి) ఆర్/డబ్ల్యూ 3(5) బీఎన్ఎస్ కింద ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. కర్నూలులో ఐదో కేసు వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలనే సదుద్దేశంతో వరుస కథనాలను ప్రచురిస్తున్న ‘సాక్షి’పై కర్నూలులో ఇప్పుడు ఐదోకేసు నమోదైంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి పాలకులు వ్యవహరిస్తున్న తీరు, అనుసరిస్తున్న విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతుండటాన్ని కూటమి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే కూటమి నేతల ఫిర్యాదుల మేరకు పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు. ఒక ఉపాధ్యాయుడు తనను కిడ్నాప్ చేశారు మొర్రో అంటూ ప్రింట్, ఎల్రక్టానిక్ మీడియా ముందు వాపోయిన కథనాన్ని ప్రచురించిన ‘సాక్షి’పై మొదటి కేసు నమోదైంది.‘రాయలసీమలో అనకొండ ఐపీఎస్’ శీర్షికతో ప్రచురితమైన కథనంపైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే దశాబ్దాల తరబడి నివాసముంటున్న నగరంలోని ఎ, బి, సి క్యాంపుల్లోని ప్రభుత్వ క్వార్టర్లను ఖాళీ చేయించాలనే ప్రభుత్వ నిర్ణయంపై ‘ఎ, బి, సి క్యాంపుల భరతం పడతాం’ శీర్షికన ప్రచురితమైన వార్తపై కూటమి నేతలు నగరంలోని పోలీస్స్టేషన్లలో రెండు ఎఫ్ఐఆర్లను నమోదు చేయించారు. -
జీఎస్టీని కాస్త తగ్గించి ‘సూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్’ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంబరాలు చేశాయి. అయితే నిత్యావసర వస్తువుల ధరల్లో ఒక్క రూపాయి కూడా తగ్గుదల లేకుండా పోయింది. తాజాగా కూరగాయల ధరలు ప్రజల జేబుకు చిల్లు పెడుతున్నాయి. సామాన్యులను ఉక్కిర
ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో అల్లాడిపోతున్నాం. ఇప్పుడు కూరగాయల ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. మూడు నెలల క్రితంతో పోలిస్తే ఇప్పుడు నాలుగు రెట్లు ధరలు పెరిగాయి. రూ.500 తీసుకెళ్లినా చేతి సంచికి తగిన కూరగాయలు రావడం లేదు. ప్రభుత్వం చొరవ తీసుకొని ధరలను నియంత్రించాల్సిన అవసరం ఉంది. – మహబూబ్బీ, బృందావన్నగర్, కర్నూలు రైతుబజారుతో పోలిస్తే బయట కిలోకు రూ.10–15 వరకు ఎక్కువ ధరలు ఉన్నాయి. చౌళకాయలు కిలో ధర రూ.80 పైగా ఉంటోంది. అన్ని కూరగాయల పరిస్థితి ఇదే మాదిరిగా ఉంది. వారానికి రూ.1,000 అదనపు భారం పడుతోంది. కుటుంబానికి ఆదాయం పెరుగకపోగా.. ధరల పెరుగుదల భారం పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. ధరల నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. – లక్ష్మీదేవి, చౌరస్తా, కర్నూలు కర్నూలు(అగ్రికల్చర్): కూరగాయల సాగుకు రాయితీలు ఇచ్చి రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రోత్సహించలేదు. రబీ సీజన్ మొదలై 35 రోజులవుతున్నా కూరగాయల సాగు పెరగలేదు. ఖరీఫ్లో అంతంతమాత్రం సాగు చేసిన పంటలు వరుసగా కురుస్తున్న వర్షాలతో దెబ్బతిన్నాయి. దిగుబడులు పడిపోయాయి. డిమాండ్ తగ్గట్టు కూరగాయలు ఉత్పత్తి లేకపోవడంతో మార్కెట్లో కొరత ఏర్పడింది. దీంతో ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదలతో సామాన్య, మద్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ‘సమగ్ర’ నిర్లక్ష్యం సమగ్ర ఉద్యాన అభివృద్ధి మిషన్, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద కూరగాయల సాగుకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి 50 శాతం సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేయలేదు. గతేడాది వ్యవసాయ సీజన్లో (2024–25)లో ఒక్క రైతుకు కూడా రాయితీపై విత్తనాలు ఇవ్వలేదు. ఈ ఏడాది( 2025–26) కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. ఖరీఫ్ ముగిసిపోయి రబీ సీజన్ మొదలైనా సబ్సిడీపై విత్తనాలు ఇవ్వలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సాగు దయనీయం జిల్లాలోవివిధ మండలాల మీదుగా హంద్రీ– నీవా కాలువ వెళ్తోంది. కూరగాయల సాగుకు అవకాశం ఉంది. నీటి సదుపాయం ఉన్నా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు లేకపోవడంతో రైతులకు కూరగాయల సాగుపై ఆసక్తి తగ్గిపోయింది. 2023 ఖరీఫ్లో ఈ–క్రాప్ ప్రకారం ఉల్లి, టమాటతో సహా కూరగాయల సాగు 60,614 ఎకరాల్లో ఉంది. ఉల్లి, టమాట మినహాయిస్తే కూరగాయల పంటలు 11,868 ఎకరాల్లో సాగైంది. దీంతో ధరలు పెరిగిన దాఖలాలు లేవు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రోత్సాహకాలు అందక గతేడాది కూరగాయల సాగు 58,382 ఎకరాలకు తగ్గిపోయింది. ఉల్లి, టమాట పంటలను మినహాయిస్తే 6,976 ఎకరాల్లో కూరగాయల పంటలు సాగయ్యాయి. ఈ ఏడాది అధికారిక లెక్కల ప్రకారం 72,752 ఎకరాల్లో కూరగాయల పంటలు సాగయ్యాయి. ఇందులో ఉల్లి 61,243 ఎకరాలు, టమాట 6,457 ఎకరాల్లో సాగైంది. ఈ పంటలను మినహాయిస్తే కూరగాయల సాగు 5,052 ఎకరాలకే పరిమితం అయ్యింది. అంతంతమాత్రం సాగైన పంటలు కూడా అధిక వర్షాలతో దెబ్బతిన్నాయి. దీంతో దిగుబడులు పడిపోవడంతో కొరత ఏర్పడి ధరలు పెరుగుతున్నాయి. దళారుల ఇష్టారాజ్యం గత ఏడాది నవంబరు నెలతో పోలిస్తే కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. గత ఏడాది ఇదే సమయంలో టమాట కిలో రూ.10, క్యాలీప్లవర్ రూ.30, బెండ రూ.14, చెవుల కాయ రూ.24 ఇలా ఏ కూరగాయ తీసుకున్నా... రూ.30 వరకే ఉన్నాయి. ప్రస్తుతం కూరగాయల ధరలు షాక్ కొడుతున్నాయి. నేడు టమాటతో సహా అన్ని కూరగాయల ధరలు పెరిగాయి. రైతుబజారులో ధరలు కాస్త తక్కువగా ఉంటాయని వెళితే బోర్డుపై రాసిన ధరలను పట్టించుకునే వారే కరువయ్యారు. పేరుకే రైతుబజారు అయినప్పటికీ ఇందులో రైతులు వెదికినా కనిపించరు. నేడు దళారీల బజారు అయిందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కూటమి పార్టీల నేతలే రైతుబజారును దళారీల బజారుగా మార్చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతుబజారులోనే వంకాయ రూ.56/70 వరకు ఉంటోంది. ఏ కూరగాయ కొనాలన్నా రూ.60 పైనే ఉంటోంది. గత ఏడాదితో పోలిస్తే కూరగాయల ధరలు 30 నుంచి 50 శాతం వరకు ధరలు పెరిగాయి. వైఎస్సార్సీపీ హయాంలో ఇలా.. 2019 నుంచి 2024 వరకు కూరగాయల సాగును అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం విశేషంగాా ప్రోత్సహించింది. హైబ్రిడ్ కూరగాయల విత్తనాలు 50 శాతం సబ్సిడీపై పంపిణీ చేసింది. కూరగాయల సాగును విస్తరించేందుకు ప్రత్యేక రాయితీలు ఇచ్చింది. టమాట ధరలు పెరిగినప్పుడు సబ్సిడీపై పంపిణీ చేసింది. ధరలు నిలకడగా ఉండటంతో వినియోగదారులకు ఉపశమనం లభించింది. కూరగాయలు ధర చౌళకాయ 80 వంకాయ 60/74 టమాట 26 బెండ 54 కాకర 44 బీర 50 క్యాలీఫ్లవర్ 54 క్యాబేజీ 28 చిక్కడు 64 దొండకాయ 48 క్యారెట్ 60 బీట్రూట్ 54 క్యాప్సికం 84 బీన్స్ 84 దిగుమతి.. దుర్గతి జిల్లాలో చౌళకాయలు, చిక్కుడు, కాకర, క్యాలీఫవర్, క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికం తదితర అన్ని రకాల కూరగాయలు పండుతాయి. వీటిని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. అయితే ఈ ఏడాది వరుసగా తుపాన్ ప్రభావంతో వర్షాలు కురిసి పంటలు దెబ్బతిన్నాయి. వేరుకుళ్లు,. కాయకుళ్లు వంటి తెగుళ్లు సోకడం, నేలతో తేమ ఎక్కువై పంటలు కుళ్లిపోయాయి. దీంతో కూరగాయలకు కొరత ఏర్పడింది. జిల్లాకు వివిధ ప్రాంతాల నుంచి కూరగాయలు దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. బె‘ధర’ గొడుతున్న కూరగాయలు కొనలేక.. తినలేకపోతున్న పేదలు జిల్లాలో దెబ్బతిన్న కూరగాయల పంటలు సాగు తగ్గినా స్పందించని రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహించని వైనం -
ప్రజల కోసమే ‘కోటి’ ఉద్యమం
● ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రెవేటీకరించొద్దు ● వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామలకర్నూలు (టౌన్): ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు చెక్ పెట్టేందుకు వైఎస్సార్సీపీ రచ్చబండ, కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని చేపడుతోందని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల పిలుపు తెలిపారు. కర్నూలులోని కొండారెడ్డి బురుజు వద్ద వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ ఆధ్వర్యంలో సోమవారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె హాజరై ప్రజల నుంచి సంతకాలను సేకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమె మాట్లాడుతూ.. అర్హులైన పేదలు, మధ్యతరగతి విద్యార్థినీ, విద్యార్థుల కోసం జగనన్న ప్రభుత్వంలో 17 ప్రభుత్వ వైద్య కళశాలలు, ఆసుపత్రులు ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం వాటిని ప్రెవేటీకరించేందుకు నిర్ణయించడం దుర్మార్గమన్నారు. వైద్యాన్ని ప్రెవేటుకు అప్పగిస్తే పేద రోగులకు ఉచిత వైద్యం ఎలా అందుతుందని ప్రశ్నించారు. కూటమి సర్కార్ తక్షణం పీపీపీ విధానాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కూటమిలోని నాయకులకు లబ్థి చేకూరేందుకు చేస్తున్న ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకుంటామన్నారు. ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. పీపీపీ విధానాన్ని అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ ఆధ్యర్యంలో నెల రోజులుగా నిర్వహిస్తున్న కోటి సంతకాల సేకరణకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్, రాంపుల్లయ్య యాదవ్, నరసింహులు యాదవ్, పాటిల్ తిరుమలేశ్వర రెడ్డి, కిషన్, కటారి సురేష్, బీసీ సెల్ అద్యక్షుడు రాఘవేంద్ర, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లా నాగవేణి రెడ్డి, నగర అధ్యక్షురాలు మంగమ్మ, రాష్ట్ర బీసీ సెల్ మహిళా నాయకులు భారతి, లీగల్ సెల్ నాయకులు ప్రభాకర్, రాజేష్ కుమార్, కార్పొరేటర్లు రాజేశ్వర రెడ్డి, జుబేర్, షేక్ అహమ్మద్, ఆర్షియా ఫర్హీన్, వివిధ విభాగాలకు చెందిన అధ్యక్షులు, మహిళా విభాగం నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. -
మెసేజ్లు వచ్చినా పత్తి కొనుగోలు చేయరా?
● సీసీఐ కేంద్రం వద్ద రైతుల ఆందోళన కోడుమూరు రూరల్: గూడూరు మండలం పెంచికలపాడులోని పత్తి మిల్లు వద్ద సోమవారం రైతులు ఆందోళన చేపట్టారు. సీసీఐ ద్వారా పత్తిని అమ్ముకునేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచి భారీగా రైతులు పత్తి దిగుబడితో మిల్లు వద్దకు చేరుకున్నారు. సీసీఐ ద్వారా అమ్ముకునేందుకు రైతులు పంట నమోదుతో పాటు, కిసాన్ యాప్లో సోమవారం అమ్ముకునేందుకు స్లాట్ బుక్ చేసుకున్నారు. దిగుబడిని మిల్లు వద్దకు తీసుకెళ్లగా.. సీసీఐ కేంద్రం అధికారులు తమకు మెసేజ్ రాలేదంటూ కొనుగోలుకు నిరాకరించారు. పత్తిని వెనక్కి తీసుకెళ్తే తమకు రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతాయంటూ ఆగ్రహించిన రైతులు మిల్లు ఎదుట నిరసన చేపట్టారు. ఇదే సమయంలో అటుగా వెళ్తున్న కర్నూలు ఎంపీ బస్తిపాడు నాగరాజు రైతుల సమస్యను తెలుసుకుని సీసీఐ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ ఏ.సిరితో మాట్లాడారు. సాంకేతిక సమస్య వల్ల పరిస్థితి తలెత్తిందని, స్లాట్ బుక్ చేసుకుని మెసేజ్లు వచ్చిన రైతుల నుంచి పత్తి కొనుగోలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలివ్వడంతో మిల్లు కేంద్రం అధికారులు పత్తిని కొనుగోలు చేశారు. కొనుగోలు కేంద్రం సందర్శన.. కాగా రైతుల ఆందోళన, జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జిల్లా వ్యవసాయాధికారిణి వరలక్ష్మి, కర్నూలు ఏడీఏ సాలురెడ్డి సోమవారం సాయంత్రం పెంచికలపాడు వద్దనున్న మిల్లులో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ఇకనుంచి పత్తి కొనుగోలులో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడడంతో పాటు, సజావుగా కొనుగోలు చేయాలని సూచించారు. -
ప్రకృతి వనరులను కొల్లగొడుతున్నారు
● వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్రెడ్డిఆళ్లగడ్డ: అభివృద్ధిని గాలికొదిలేసిన కూటమి నేతలు అక్రమార్జనకు ప్రకృతి వనరులను కొల్లగొడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పారీ రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్రెడ్డి విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు గగ్గోలు పడుతున్నా ఇంతవరకు ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుపై ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే చెప్పారని, అయితే సుమారు 10 రోజులు కావస్తున్నా కనీసం ఒక్క కేంద్రమైనా ఎందుకు ఏర్పాటు చేయలేదో వెంటనే రైతులకు చెప్పాలన్నారు. కూటమి నేతల కల్తీ మద్యం దందాను నిలదీసిన వైఎస్సార్సీపీ నాయకులపై కేసులు పెట్టడం సిగ్గుచేటన్నారు. కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ అక్రమ అరెస్ట్ను ప్రజలు గమనించాలన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో కాశిబుగ్గ దేవాలయంలో జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు మృత్యువాత పడిన విషయాన్ని డైవర్షన్ చేయడానికి కూటమి ప్రభుత్వం జోగిరమేష్ను అక్రమ అరెస్ట్ యడం జరిగిందన్నారు. తాము అధికారంలోకి వస్తే ఉచితంగా ఇసుక ఇస్తామంటూ ఊదరగొట్టిన కూటమి నాయకులు అధికారంలోకి వచ్చిందే తడువుగా ఇసుక దందా కొనసాగిస్తున్నారన్నారు. ఉచితంగా ఇవ్వాల్సిన ఇసుకను ట్రాక్టర్ రూ. 7 వేలకే అమ్ముతున్నామంటూ బహిరంగంగా ప్రెస్మీట్ చెబుతున్నారంటే ఎంతకు బరితెగించారో గమనించాలన్నారు. ఇసుక ఉచితమే...లోడింగ్ చార్జీలు మాత్రమే చెల్లించమంటున్నామంటూ కబుర్లు చెబుతూ ప్రజల కళ్లకు గంతలు కడుతున్నారన్నారని విమర్శించారు. -
సుబ్రమణ్యేశ్వరస్వామి హుండీ ఆదాయం రూ. 24.69 లక్షలు
పాణ్యం: ఎస్.కొత్తూరు గ్రామంలో వెలసిన శ్రీవల్లి సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయానికి హుండీ ద్వారా రూ. 24.69 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈఓ రామకృష్ణ తెలిపారు. సోమవారం ఆలయ ఆవరణలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా రూ.24,69,127 నగదు, 10.500 గ్రాముల బంగారు, 747 గ్రాముల వెండి వచ్చిందన్నారు. దేవదాయ శాఖ డివిజన్ తనిఖీ అధికారి హరిశ్చంద్రారెడ్డి పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిగిందన్నారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది సుబ్బారెడ్డి, గ్రామ పెద్దలు శివరామిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, నందివర్గం బ్యాంకు అధికారులు, నంద్యాల బాలాజీ సేవా సమితి సభ్యులు, శ్రీరామ సేవా ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు. -
కనుల పండువగా కర్నూలు ఉత్సవాలు
కర్నూలు (అగ్రికల్చర్): కర్నూలు ఉత్సవాలు మూడో రోజు సోమవారం కనుల పండువగా జరిగాయి. ఉదయం 10 నుంచి సాయంత్రం వరకు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన కళాకారులు వివిధ నాటకాలు నిర్వహించి రక్తి కట్టించారు. పోటీల్లో కళాకారులు వివిధ నాటకాలను, సన్నివేశాలను ప్రదర్శించి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. గయోపాఖ్యానం యుద్ధ సీనుతో ప్రారంభమై భవాని, చింతామణి, శ్రీకృష్ణ తులాభారం, బాలనాగమ్మ వంటి నాటకాల్లోని వివిధ సన్నివేశాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమాలను ప్రారంభిస్తూ టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య మాట్లాడుతూ ఏకాంకికలను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ రికార్డు చేసిందన్నారు. వరుసగా మూడోసారి అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కన్వీనర్గా జీవీ శ్రీనివాస రెడ్డి, గాండ్ల లక్ష్మన్న, వాల్మీకి రాముడు వ్యవహరించారు. కార్యక్రమంలో వివిధ నాటకాలు, సన్నివేశాలను ప్రదర్శించిన కళాకారులను సత్కరించి అభినందించారు. -
అదృశ్యమైన వ్యక్తి మృతి
సంజామల: నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లి అదృశ్యమైన వ్యక్తి సోమవారం శవమై కనిపించాడు. అక్కంపల్లె గ్రామానికి చెందిన గుర్క కుళాయి రెడ్డి (44) గత నెల 31వ తేదీ బయటకు వెళ్లి రెండు రోజులైనా తిరిగి రాకపోవడంతో భార్య పార్వతి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పాలేరు వాగు వద్ద ఏమైనా ప్రమాదానికి గురయ్యాడా అనుమానంతో అక్కంపల్లి నుంచి సంజామలకు వెళ్లే రహదారిలో పాలేరువాగులో సోమవారం గాలింపు చర్యలు చేపట్టారు. ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన గజ ఈతగాళ్లతో పాలేరు వాగు వెంట గాలిస్తుండగా కుక్కల గడ్డ వంతెన వద్ద బైకును గుర్తించారు. అనంతరం గిగ్గమ్మ గుడి సమీపంలో గుర్క కుళాయి రెడ్డి మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. మృతునికి భార్య పార్వతి, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవ పరీక్షలు అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్ఐ రమణయ్య తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తి మృతి కర్నూలు (టౌన్): ఎద్దులదొడ్డి– తుగ్గలి రైల్వే స్టేషన్ల మధ్య రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. వయస్సు 30 నుంచి 35 సంవత్సరాలు ఉంటుందని, నలుపు, తెలుపు రంగు డిజైన్ గీతలు కలిగిన ఫుల్ హ్యాండ్స్ షర్ట్, నషం కలర్ ప్యాంట్, బ్లూ కలర్ డ్రాయర్ వేసుకున్నట్లు సోమవారం రైల్వే పోలీసులు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. షార్ట్సర్క్యూట్తో అగ్నిప్రమాదం డోన్ టౌన్: ధర్మారం గ్రామంలో ఓ ఇంటిలో షార్ట్సర్క్యూట్తో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. డోన్ అగ్నిమాపక కేంద్రం అధికారి రంగస్వామిగౌడ్ తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన బోయ మణి ఇంటిలో సోమవారం మధ్యాహ్నం టీవీ వద్ద ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డులో మంటలు చెలరేగి ఇల్లంతా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్తో చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో విద్యుత్ పరికరాలు, ధాన్యం, దస్తులతో పాటు దాచుకున్న రూ. 15 వేల నగదు కాలి బూడిదైనట్లు బాధితురాలు తెలిపారు. -
ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలపై ‘కూటమి’ కక్ష
● కర్నూలు కలెక్టరేట్ ఎదుట ధర్నాకర్నూలు(సెంట్రల్): బ్యాక్ ఎండ్ సబ్సిడీ కింద వివిధ పథకాల్లో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలుగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తాము రాణించామని, కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం తగదని ఎస్సీ, ఎస్టీ ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలు అన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ గాంధీ విగ్రహం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా కర్నూలు జిల్లా జేఏసీ అధ్యక్ష, కార్యదర్శులు, ట్రెజరర్ మౌలాలి, త్రిమూర్తులు, దస్తగిరి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు రూ.500 కోట్ల సబ్సిడీలు విడుదల కావాల్సి ఉందన్నారు. అయితే 20 శాతం మేరకు ఇస్తామని, మిగతా వాటిని ఇవ్వలేమని చెప్పడం అన్యాయమన్నారు. నూరు శాతం సబ్సిడీ రుణాన్ని ఇవ్వకపోతే భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు తప్పవని హెచ్చరించారు. జేఏసీ నాయకులు సుందర్, రాజేష్, రాజ్కుమార్, శివమాధవ్, చెన్నకేశవులు, రామకృష్ణ, రాజశేఖర్, దస్తగిరి, శివరామ్, సుబ్బరాయుడు, సుదర్శనం, దిలిప్, నాగరాజు, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
చదువు ‘కూలీ’పోయింది!
పత్తి చేనులో కూలీ పనులకు వెళ్తున్న ఈ బాలిక పేరు నివేదిత. ఎమ్మిగనూరు మండల పరిధిలోని సోగనూరు గ్రామానికి చెందిన రాముడు, జయంతిల పెద్ద కుమార్తె. 5వ తరగతి వరకు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంది. ఆ తర్వాత 6వ తరగతికి ఆదోనిలోని కేజీబీవీలో సీటు రావటంతో అక్కడ చేర్పించారు. అయితే అలర్జీ కారణంగా పలుమార్లు అనారోగ్యం బారిన పడింది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు స్థానిక కేజీబీవీలో చేర్పించేందుకు ప్రయత్నించగా సీట్లు లేకపోవడంతో మిన్నకుండిపోయారు. విషయం డీఈఓ దృష్టికి వెళ్లినా సమస్యకు పరిష్కారం లేకపోయింది. ఈ పరిస్థితుల్లో బాలికను తల్లిదండ్రులు పత్తి పనులకు వెంట తీసుకెళ్తున్నారు. తనకు చదువుకోవాలని ఉందని, ఎలాగైనా అధికారులు తనకు స్థానికంగా చదువుకునేందుకు అవకాశం కల్పించాలని బాలిక వేడుకుంటోంది. – ఎమ్మిగనూరు రూరల్ -
డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్
కర్నూలు(సెంట్రల్): డిసెంబర్ 13న జిల్లాలోని అన్ని కోర్టుల ప్రాంగణాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి ఆదేశించారు. సోమవారం ఆయన తన కార్యాలయంలో జాతీయ లోక్ అదాలత్పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టుల్లో పెండింగ్లోని కంపౌండబుల్ క్రిమినల్ కేసులు, ఎకై ్సజ్ కేసులను లోక్ అదాలత్లలో ప్రవేశపెట్టి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. గవర్నమెంట్ జీఓ నంబర్ 417 ప్రకారం కంపౌండ్, ఎకై ్సజ్ కేసులను కచ్చితంగా పరిష్కరించుకోవాలన్నారు. డిసెంబర్ 13న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చూడాలని ఆయన పోలీసులు, ఎకై ్సజ్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ డి.రామకృష్ణారెడ్డి, ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్లు మంజుల, చంద్రశేఖర్ పాల్గొన్నారు. 7న జెడ్పీ సర్వసభ్య సమావేశం కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 7న జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ జి.నాసరరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక జెడ్పీ సమావేశ భవనంలో ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న సమావేశంలో వ్యవసాయం–అనుబంధ శాఖలు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, మత్స్యశాఖ, దేవదాయ ధర్మాదాయ శాఖలపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. సమావేశానికి ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, ఎమ్మెల్యేలు, కర్నూలు, నంద్యాల జిల్లాల కలెక్టర్లు, జెడ్పీటీసీ, ఎంపీపీలు హాజరు కావాలని కోరారు. పోలీస్ పీజీఆర్ఎస్కు 97 ఫిర్యాదులు కర్నూలు (టౌన్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు మొత్తం 97 ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. కర్నూలు కొత్తపేటలోని రెండో పట్టణ పోలీస్స్టేషన్ పక్కనున్న ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో సోమవారం పోలీ స్ పీజీఆర్ఎస్ను నిర్వహించారు. ఉద్యోగం ఇప్పిస్తానని రూ.1.80 లక్షలు తీసుకుని మోసం చేసిన కర్నూలు మండలం నూతనపల్లెకు చెందిన లక్ష్మీనారాయణ, కర్నూలు ఔట్డోర్ స్టేడియం వద్ద పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాన్ని దొంగిలించారని ఇ.తాండ్రపాడు గ్రామానికి చెందిన బొల్లెద్దుల వెంకటసాయి కృష్ణ ఫిర్యాదు చేశారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న తన తల్లి ఆచూకీ తెలియడం లేదని ప్రకాశం జిల్లా కంభం గ్రామానికి చెందిన సత్యనారాయణ ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాని ఎస్పీ తెలిపారు. -
హెఐవీ పరీక్షలకు ‘మొబైల్’ అంబులెన్స్
కర్నూలు(సెంట్రల్): మొబైల్ ఐసీటీసీ అంబులెన్స్తో ఎక్కడైనా హెఐవీ పరీక్షలు నిర్వహించేందుకు అవకాశం కలుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ద్వారా జిల్లాకు కేటాయించిన వాహనాన్ని ఆమె ప్రారంభించారు. హెచ్ఐవీ వచ్చిన వారు క్రమం తప్పకుండా మందులు తీసుకుంటే జీవిత కాలం పెరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ హెచ్ఐవీ పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఇన్చార్జి డీఎంహెచ్ఓ డాక్టర్ ఎల్.భాస్కర్, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, ఆసుపత్రుల సమన్వయాధికారి జఫరుల్లా, మలేరియా అధికారి నూకరాజు పాల్గొన్నారు. -
కూటమి నేతలు అంతే!
అయినా.. మేము మారం!నిత్యం ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఎంతో మంది విగతజీవులుగా మారుతున్నారు. పెద్దలను కోల్పోయి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. పెద్దవారి నుంచి అభం శుభం తెలియని చిన్నారులకు సైతం నూరేళ్ల ఆయుష్షు తీరుతుండటం చూస్తుంటే కన్నీళ్లు వస్తాయి. ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా కొందరిలో మాత్రం మార్పు రాకపోవడం బాధాకరం. మహానంది క్షేత్రానికి కొందరు ఇలా చిన్న వాహనాల్లో అధిక సంఖ్యలో పైన, కింద కూర్చుని వచ్చారు. ఎంతో విలువైన ప్రాణాలను గాలిలో దీపంలా ఉంచి ప్రయాణించడం ఎంత వరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు. – మహానంది● పాత సచివాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యేవాహనంలో పైన, కింద కూర్చుని వెళ్తున్న భక్తులుమెడికల్ షాపుల్లో ఫార్మాసిస్టులు తప్పనిసరి ● ఔషధ నియంత్రణ శాఖ ఏడీ రమేష్రెడ్డి కర్నూలు(హాస్పిటల్): జిల్లాలోని ప్రతి మెడికల్ షాపుల్లో ఫార్మాసిస్టులు తప్ప నిసరిగా ఉండాలని ఔషధ నియంత్రణ శాఖ ఏడీ పి.రమేష్రెడ్డి అన్నారు. స్థానిక వెంకటరమణ కాలనీలోని ఔషధ నియంత్రణ శాఖ కార్యాలయంలో సోమవారం ఆ యన ఏడీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫార్మాసిస్టులు లేకుండా దుకాణాలు నిర్వహిస్తే చర్యలు తప్పవన్నారు. వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండా నార్కోటిక్స్ డ్రగ్స్, యాంటిబయాటిక్స్ వంటి మందులు విక్రయించరాదన్నారు. 10న అప్రెంటిస్ మేళా కర్నూలు సిటీ: బి.తాండ్రపాడులోని ప్రభుత్వ బాలికల ఐటీఐ కాలేజీలో ఈ నెల 10వ తేదీన అప్రెంటిస్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ ఎల్.నాగరాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీఐలో ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతీ, యువకులు ఈ మేళాను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. మేళాకు జిల్లాలోని వివిధ పరిశ్రమల పారిశ్రామికవేత్తలు హాజరై వారికి కావాల్సిన వారిని ఎంపిక చేసుకుంటారని తెలిపారు. ఆన్లైన్లో అప్రెంటిస్ కోసం https:/ apprentceshipindis.gov.in అనే పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈ నెల 10వ తేదిన ఉదయం 10 గంటలకు బి.తాండ్రపాడులోని ప్రభుత్వ బాలికల ఐటీఐ కాలేజీ నందు హాజరు కావాలని ఆయన పేర్కొన్నారు.జూపాడుబంగ్లా: వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో నిర్మించి, ప్రస్తుతం రన్నింగ్లో ఉన్న సచివాలయాన్ని కూటమి నేతలు ప్రారంభించడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. దాదాపు ఏడాదికి పైగా రన్నింగ్లో ఉన్న సచివాలయాన్ని ఇప్పుడు ప్రారంభించడం ఏంటబ్బా అని జనం నవ్వుకుంటున్నారు. గ్రామస్వరాజ్య స్థాపనలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఒక్కో గ్రామంలో రూ.42 లక్షలతో సచివాలయం, రూ.21 లక్షలతో రైతుభరోసా (రైతు సేవా కేంద్రం) కేంద్రాలను నిర్మించారు. 2024లో ఎన్నికల నాటికి నిర్మాణాలు పూరైనా ఎన్నికల కోడ్ కారణంగా ప్రారంభానికి నోచుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్సార్సీపీ పాలనలో నిర్మించిన వాటిని తామెందుకు ప్రారంభించాలనుకొన్నారో ఏమో కానీ ప్రారంభించలేదు. అయితే ఈ నేపథ్యంలో తాడిపాడు గ్రామంలో నిర్వహణలో ఉన్న సచివాలయం, రైతుభరోసా కేంద్రాలను సోమవారం నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య, టీడీపీ నంద్యాల పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు మాండ్రశివానందరెడ్డి ప్రారంభించడం పట్ల నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. దీనికితోడు గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఇచ్చిన వినతిపత్రాలను సైతం అక్కడే వదిలివెళ్లటంతో ‘ప్రజల సమస్యలను పట్టించుకోవటమంటే’ ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ వంగల లక్ష్మీదేవి, ఎంపీడీఓ గోపికృష్ణ, తహసీల్దార్ చంద్రశేఖర్నాయక్, ఏపీఓ రేష్మ, ఏడీ గిరీష్, ఏఓ కృష్ణారెడ్డి, వంగల కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఏటీఎం కార్డు మార్చి.. రైతును మోసం చేసి!డోన్ టౌన్: ఏటీఎం కేంద్రంలో ఒక గుర్తు తెలియని ఆగంతుకుడు ఓ రైతును ఏమార్చి రూ.35 వేలు అపహరించిన సంఘటన సోమవారం డోన్లో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. కృష్ణగిరి మండలం అలంకొండ గ్రామానికి చెందిన రైతు చంద్రశేఖర్ ఇటీవల ఆముదం పంటను విక్రయించగా మార్క్ఫెడ్ అధికారులు తన ఖాతాలో రూ.90 వేలు జమ చేశారు. వీటిని తీసుకెళ్లేందుకు సోమవారం డోన్ ప్రధాన స్టేట్ బ్యాంక్కు వచ్చాడు. అయితే తన ఖాతాకు పాన్ కార్డు లింక్ లేక పోవడంతో రూ.50 వేలు బ్యాంక్లో డ్రా చేసుకున్నారు. మిగిలిన డబ్బులను ఏటీఎంలో విత్డ్రా చేసుకునేందుకు ప్రయత్నిస్తుండగా అక్కడే మాటు వేసిన నిందితుడు తాను విత్డ్రా చేసి ఇస్తాను అని చెప్పి రైతు ఏటీఎం కార్డు తీసుకొని మొదట రూ.5 వేలు డ్రా చేసి ఇచ్చాడు. మిగిలిన డబ్బులు విత్డ్రా చేస్తున్నట్లు నటించి ‘పని చేయడం లేదు’.. అంటూ రైతు కార్డు తస్కరించి, వేరే ఏటీఎం కార్డును రైతు చేతిలో పెట్టి ఉడాయించాడు. కొద్ది సేపటి తరువాత తన ఖాతా నుంచి రూ.35 వేలు డ్రా అయినట్లు మెసేజ్ రావడంతో రైతు మోసపోయానని గ్రహించి బ్యాంక్ మేనేజర్ను సంప్రదించాడు. విచారణ చేయడంతో ఏటీఎం కార్డు మార్చిన సంగతి బయట పడింది. ఈ విషయంపై పట్టణ పోలీసు స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేశాడు.డీడీఓ కార్యాలయాలకు 12 మంది ఉద్యోగుల డిప్యుటేషన్ కర్నూలు (అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆదోని, ఆత్మకూరు, డోన్, పత్తికొండలోని డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాలకు జిల్లాపరిషత్ పరిధిలోని వివిధ కార్యాలయాల్లో పనిచేస్తున్న వివిధ కేడర్లకు చెందిన 12 మంది ఉద్యోగులను డిప్యుటేషన్పై పంపిస్తున్నట్లు జిల్లాపరిషత్ సీఈఓ జి.నాసరరెడ్డి సోమవారం రాత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
పట్టపగలే ఉపాధ్యాయుడి ఇంట్లో చోరీ
బనగానపల్లె: పట్టపగలే బనగానపల్లె ఎన్జీవో కాలనీ రేషన్షాపు సమీపంలో ప్రభుత్వ టీచర్ నాగరాజుకు చెందిన ఇంట్లో చోరీ జరిగింది. సుమారు రూ.15లక్షల విలువ చేసే 15 తులాల బంగారు అభరణాలు, రూ.20వేల నగదు అపహరణ చేశారు. పట్టణ సీఐ ప్రవీణ్కుమార్ తెలిపిన వివరాల మేరకు.. ఉపాధ్యాయుడు నాగరాజు యాగంటిపల్లె గ్రామంలోని పాఠశాలకు వెళ్లారు. ఆయన భార్య మాస్తానమ్మ యాగంటి క్షేత్రానికి వెల్లారు. ఆమె మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి, ఇంట్లో బీరువా తాళం ధ్వంసం చేసి అందులోని 15 తులాల బంగారు ఆభరణాలు రూ.20 వేలు చోరీ చేశారు. విషయం తెలిసి సీఐ ప్రవీణ్కుమార్ క్లూస్టీంతో ఇంటి వద్దకు వెళ్లి పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లక్ష దీపోత్సవం.. కోటి తేజం!
● కార్తీక రెండవ సోమవారం భక్తులతో కిటకిటలాడిన శ్రీగిరిశ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రం కార్తీక శోభితంగా మారింది. కార్తీక మాసం రెండవ సోమవారం శ్రీశైలం భక్తులతో పోటెత్తింది. వేకువజామునే పాతాళగంగలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, మల్లన్న దర్శనానికి బారులుదీరారు. భక్తుల రద్దీ దృష్ట్యా స్వామిఅమ్మవార్ల అలంకార దర్శనానికి మాత్రమే అవకాశం కల్పించా రు. భక్తుల శివనామస్మరణలతో శ్రీగిరి క్షేత్రం మారుమోగింది. ఆలయం ముందు భాగంలోని గంగాధర మండపం వద్ద, ఆలయ శివ మాఢవీధిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దీపారాధనలో పలువురు భక్తులు దీపాలు వెలిగించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. లోక కల్యాణం కోసం పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతిని నిర్వహించారు. పుష్కరిణి ప్రాంగణమంతా భక్తులు భక్తిశ్రద్ధలతో దీపాలను వెలిగించారు. ఉత్సవమూర్తులను పుష్కరిణి వద ఆశీనులు చేసి అర్చకులు, వేదపండితులు విశేషంగా పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీస్వామిఅమ్మవార్లకు, పుష్కరిణికి దశవిధ హారతులను శాస్త్రోక్తంగా ఇచ్చారు.భక్తులు హారతులను కనులారా తిలకించి స్వామిఅమ్మవార్లను దర్శించి నేత్రానందభరితులయ్యారు. పూజా కార్యక్రమంలో ఈఓ ఎం.శ్రీనివాసరావు దంపతులు, అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. -
కర్నూలు కిమ్స్ వైద్యుల అరుదైన చికిత్స.. యువతికి రిలీఫ్
కర్నూలు, సాక్షి: గర్భాశయంలో ఫైబ్రాయిడ్ ఏర్పడడంతో పాతికేళ్ల వయసులోనే బేతంచర్లకు చెందిన ఓ యువతికి హిస్టరెక్టమీ (గర్బాశయ తొలగింపు) శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ఫైబ్రాయిడ్ కారణంగా ఆమెకు తరచు రక్తస్రావం అవుతుండటంతో ఆ శస్త్రచికిత్స తప్పలేదు. అప్పటికే పెళ్లయ్యి ఇద్దరు పిల్లలు కూడా ఉండడంతో దానికి కుటుంబసభ్యులు కూడా అంగీకారం తెలిపారు. అయితే, హిస్టరెక్టమీ చేసిన తర్వాత ఆమెకు తరచు మూత్రం లీక్ అవ్వడం మొదలైంది. దీనివల్ల ఆమె ఎక్కడకూ బయటకు వెళ్లలేకపోవడం, తరచు దుర్వాసనతో శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఎట్టకేలకు రెండు నెలల తర్వాత కర్నూలు కిమ్స్ ఆస్పత్రిలో యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ వై.మనోజ్ కుమార్ ఆమెకు ఒక సంక్లిష్టమైన శస్త్రచికిత్స చేసి, పూర్తి ఊరట కల్పించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన తెలిపారు.“నంద్యాల జిల్లా బేతంచర్లకు చెందిన పాతికేళ్ల యువతికి తప్పనిసరి పరిస్థితిలో హిస్టరెక్టమీ చేయాల్సి వచ్చింది. అయితే, ఆ తర్వాతి నుంచి ఆమెకు మూత్రం లీక్ అవుతుండడంతో మా వద్దకు వచ్చారు. ఇక్కడ ఆమెకు సీటీ సిస్టోగ్రఫీ లాంటి కొన్ని పరీక్షలు చేస్తే.. ఆమెకు మూడు వెసికోవెజైనల్ ఫిస్టులాలు ఏర్పడ్డాయని తెలిసింది. ఇవి మూత్రకోశానికి, యోనికి మధ్యన ఏర్పడతాయి. శస్త్రచికిత్స కారణంగా ఏర్పడిన ఈ ఫిస్టులాల వల్లే ఆమెకు మూత్రం లీక్ అయ్యే సమస్య తలెత్తింది. ఇలా జరగడం వల్ల రోగులు సమాజానికి, తమ కుటుంబసభ్యులకు కూడా దూరమై, క్రమంగా ఆత్మవిశ్వాసం కోల్పోతారు. బయటకు రావడానికి ఇబ్బంది పడతారు.ఈ కేసు సంక్లిష్టమైనది. ఎందుకంటే మూడింటిలో ఒక ఫిస్టులా మూత్రనాళానికి చాలా దగ్గరగా ఉంది. అందువల్ల దాని మరమ్మతును అత్యంత జాగ్రత్తగా, కచ్చితత్వంతో చేయాల్సి ఉంటుంది. దానికితోడు మొదటి శస్త్రచికిత్స జరిగిన తర్వాత కణజాలాలు స్థిరపడేందుకు కనీసం మూడు నెలలు ఆగాల్సి ఉంటుంది. వాళ్లు రెండు నెలల తర్వాత మా వద్దకు వచ్చారు. దాంతో మరో నెలరోజులు ఆగమని చెప్పి, ఆ తర్వాత శస్త్రచికిత్స చేపట్టాం. ఈ శస్త్రచికిత్సలో మూత్రాశయాన్ని, యోనిని వేరు చేసి, దెబ్బతిన్న భాగాలను శుభ్రపరచి, కొత్త పొరలతో పునర్నిర్మాణం చేశాం. అత్యంత కచ్చితత్వం, జాగ్రత్తలతో మూడు ఫిస్టులాలనూ మూసేశాం. శస్త్రచికిత్స తర్వాత రోగి బాగా కోలుకున్నారు. మొత్తం క్యాథెటర్లు, ట్యూబులు కూడా తీసేసి ఆమెను డిశ్చార్జి చేశాం. ఇప్పుడు మూత్రం లీకేజి లేకపోవడంతో ఆమెకు పూర్తి ఆత్మవిశ్వాసం వచ్చింది. ఇంతకుముందు కంటే ఎంతో సంతోషంగా ఉన్నారు.వెసికో వెజైనల్ ఫిస్టులా అనేది మహిళల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేసే సమస్య. ఇది కేవలం శారీరక సమస్య కాదు, సామాజిక అవరోధం కూడా. సమయానికి గుర్తించి సరైన చికిత్స చేస్తే పూర్తిగా నయం అవుతుంది. ఈ రోగి మళ్లీ సాధారణ జీవితానికి రావడం మా మొత్తం బృందానికి గొప్ప సంతృప్తినిచ్చింది” అని డాక్టర్ వై. మనోజ్ కుమార్ వివరించారు. -
సాంకేతిక వి‘పత్తి’
● పత్తి కొనుగోళ్లలో సర్వర్ సమస్యలు ● పరిష్కరించని మార్కెటింగ్ శాఖ ● ఇబ్బంది పడుతున్న రైతులు కర్నూలు(అగ్రికల్చర్): మద్దతు ధరతో పత్తి కొనుగోలుకు సర్వర్ సమస్యలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. సర్వర్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాల్సిన మార్కెటింగ్ శాఖ చేతులెత్తేసింది. పత్తి దిగుబడులు మొదలైన మూడు నెలల తర్వాత కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ రైతులకు ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పటికే 50 శాతం దిగుబడులను తక్కువ ధరకే అమ్ముకొని నష్టపోయారు. మిగిలిన పత్తిని మద్దతు ధరతో అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్న రైతులకు నిరాశనే మిగులుతోంది. ‘యాప్’సోపాలు పత్తి కొనుగోళ్ల సాఫీగా జరుగాలంటే మూడు యాప్లు బాగా పనిచేయాల్సి ఉంది. ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటాయి. యాప్లేవీ పనిచేయకపోవడంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఈ–పంట యాప్లో రైతులు ఏ పంట.. ఎన్ని ఎకరాల్లో వేశారనే వివరాలు ఉంటాయి. సీఎం యాప్లో రైతుల ఆధార్, మొబైల్ నంబరు నమోదు చేస్తే ఈ–పంట యాప్లోని వివరాలు డిస్ప్లే కావాల్సి ఉంది. సీఎం యాప్లో ఈ–పంట యాప్లోని వివరాలు డిస్ప్లే కాకపోవడంతో రిజిస్ట్రేషన్లు చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. కపాస్ కిసాన్ యాప్లో రైతులు స్లాట్ బుక్ చేసుకుంటారు. పత్తి పంటను ఏ తేదీలో.. ఏ కొనుగోలు కేంద్రానికి తీసుకెల్లాలనేది వస్తుంది. అయితే ఏ యాప్ పనిచేయకపోవడంతో ఒకవైపు రిజిస్ట్రేషన్లు చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఎకరాకు 6 క్వింటాళ్లే కొనుగోలు.. స్లాట్ బుకింగ్ కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎకరాకు సగటు దిగుబడి ఉన్నట్లు వ్యవసాయ శాఖ ప్రకటించింది. సీసీఐ మాత్రం ఎకరాకు 6 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని చెబుతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన పత్తిని దళారీలకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఒక్కో కొనుగోలు కేంద్రంలో రోజుకు 2,500 క్వింటాళ్లు కొనాల్సి ఉన్నప్పటికీ అరకొరగా కొనుగోలు చేస్తుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. దిగుబడి మొత్తం కొనేవిధంగా తగిన చర్యలు తీసుకోవాలని రైతులు మార్కెటింగ్ శాఖను, సీసీఐ అధికారులను కోరుతున్నారు. -
వీరబ్రహ్మేంద్ర స్వామికి మహానందీశుడి పట్టువస్త్రాలు
మహానంది: కాలజ్ఞాన రచయిత, శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆనవాయితీ ప్రకారం మహానంది దేవస్థానం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ మేరకు ఆదివారం మహానంది ఆలయ ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి, ఉప ప్రధాన అర్చకులు మూలస్థానం శివశంకరశర్మ, వనిపెంట జనార్ధనశర్మ, వేదపండితులు హనుమంతుశర్మ, అర్చకులు మూలస్థానం సుబ్బయ్యశర్మ, టెంపుల్ ఇన్స్పెక్టర్ నాగమల్లయ్య బ్రహ్మంగారి మఠానికి చేరుకుని అక్కడి పీఠాధిపతి ఈశ్వరాచారి వారికి పట్టువస్త్రాలు అందించారు. బ్రహ్మంగారి మఠం అధికారులు స్వాగతం పలకగా శాస్త్రోక్తంగా అందజేశారు. -
● భక్తులకు భద్రత కరువు
కర్నూలు (టౌన్): చంద్రబాబు పాలనలో భక్తులకు భద్రత కరువైందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి విమర్శించారు. కర్నూలులోని ఎస్టీబీసీ కళాఽశాల నుంచి ఆంజనేయ స్వామి దేవాలయం వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్వీ మాట్లాడుతూ.. రెండు రోజుల క్రితం కాశీబుగ్గలో తొక్కిసలాట జరిగి అమాయక భక్తులు తొమ్మిది మంది మృతి చెందారన్నారు. సినిమా థియేటర్ల వద్ద పోలీసులను నియమించే కూటమి ప్రభుత్వం దేవాలయాల వద్ద ఎందుకు భద్రత కల్పించలేదని విమర్శించారు. పవిత్ర తిరుపతిలో లడ్డూ వివాదాన్ని రాజకీయాలకు వాడుకోవడం వల్లే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వరుసగా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు. ఇటీవల తిరుపతిలో తొక్కిసలాటలో ఆరుగురు, సింహాచలం దేవాలయం వద్ద తొక్కిసలాటలో ఏడుగురు అమాయక భక్తులు మృతిచెందారన్నారు. కాశీబుగ్గ తొక్కిసలాటలో మృతి చెందిన కుటుంబాలకు రూ.25 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. కర్నూలు నగర మహిళా విభాగం అధ్యక్షురాలు మంగమ్మ, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్, పార్టీ నాయకులు నరసింహులు, యాదవ్, ప్రభాకర్, కార్పొరేటర్ రాజేశ్వర రెడ్డి, పార్టీ నాయకులు పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. -
ఆదుకోని ‘ఉపాధి’.. ఆగని వలసలు
కోసిగి: గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు లేకపోవడంతో ప్రజలు దూర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. ఆదివారం కోసిగిలోని వివిధ కాలనీల నుంచే కాక మండలంలోని వివిధ గ్రామాల నుంచి కూలీలు టెంపో వాహనాల్లో వలస వెళ్లారు. మరికొందరు రైల్వే స్టేషన్లో చైన్నె నుంచి ముంబై వెళ్లే మెయిల్ రైలులో మూటముళ్ల కట్టుకుని రైలు ఎక్కి కర్ణాటక ప్రాంతానికి వెళ్లారు. ఈఏడాది అధిక వర్షాలు కారణంగా పంటలు పూర్తిగా దెబ్బతి పోయాయి. పంటలు చేతిక రాకపోవడంతో కూలీలతో పాటు రైతులు కూడా తరలి వెళ్లుతున్నారు. అత్యధికంగా కర్ణాటక, తెలంగాణ ప్రాంతాలకు వలస వెళ్లారు. వెళ్లిన చోటు పిల్లతో పాటు ప్రతి ఒక్కరికి పనులు ఉంటాయని చెబుతున్నారు. -
ఎంపీడీఓలుగా ఐదుగురికి పోస్టింగ్స్
కర్నూలు(అర్బన్): ఎంపీడీఓలుగా పదోన్నతి పొందిన ఐదుగురికి జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి ఉత్తర్వుల మేరకు పోస్టింగ్స్ ఇచ్చినట్లు జెడ్పీ సీఈఓ జీ నాసరరెడ్డి తెలిపారు. పీఆర్ కమిషనర్ ఆదేశాల మేరకు ఏ జిల్లాకు కేటాయించిన వారికి ఆ జిల్లాలోనే పోస్టింగ్స్ ఇచ్చినట్లు ఆయన ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మండల పరిషత్ కార్యాలయాల్లో పరిపాలనాధికారులు, డిప్యూటీ ఎంపీడీఓలుగా విధులు నిర్వహిస్తున్న ఐదుగురికి పదోన్నతులు వచ్చాయని తెలిపారు. బేతంచెర్ల ఎంపీడీఓ కార్యాలయంలో ఏఓగా విధులు నిర్వహిస్తున్న పీ దస్తగిరిబాబును కొలిమిగుండ్లకు, బనగానపల్లె ఏఓ ఎస్ నాగరాజును బనగానపల్లెకు, బండి ఆత్మకూరు డిప్యూటీ ఎంపీడీఓ వై రామక్రిష్ణవేణిని అవుకు, తుగ్గలి ఏఓ ఎస్ఎం భాషను కోసిగి, గోస్పాడు డిప్యూటీ ఎంపీడీఓ ఎం నాగ అనసూయను ఓర్వకల్ ఎంపీడీఓగా పోస్టింగ్స్ ఇచ్చామన్నారు. చిరుత పాద ముద్రల పరిశీలన ఆస్పరి: ఆస్పరి సమీపంలోని నల్లవాగు దగ్గర ఆదివారం ఆదోని ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ తేజస్వి, ఆలూరు సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసులు, బీట్ ఆఫీ సర్ బాలకృష్ణ చిరుత పాద ముద్రలు పరిశీలించారు. ఆస్పరి రైతులు రెండు రోజులు నుంచి ఈ ప్రాంతంలో చిరుత సంచరిస్తుందని ఫారెస్టు ఆఫీసర్లుకు సమాచారం ఇవ్వడంతో వారు ఆస్పరికి వచ్చారు. పాద ముద్రలను పరిశీలించి.. అవి చిరుతవి కాదని తోడేలివని రైతులకు వివరించారు. ఈసందర్భంగా ఆదో ని రేంజ్ ఆఫీసర్ మాట్లాడుతూ.. ఒక వేళ చిరు త కనిపించిన వెంటనే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. పొలాలకు వెళ్లే రైతులు, మహి ళలు ఒంటరిగా వెళ్లకుండా కొంత మంది గుంపు కలిసి వెళ్లాలని సూచించారు. పొలాలు దగ్గరకు చిన్న పిల్లలను తీసుకెళ్లకూడదన్నారు. వన్య ప్రాణులకు హాని కల్పించవద్దని రైతులకు సూచించారు. నేడు డయల్ యువర్ సీఎండీ కర్నూలు(అగ్రికల్చర్): డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిస్తున్నట్లు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ లోతేటి శివశంకర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం శ్రీసత్యసాయి జిల్లాలకు చెందిన వినియోగదారులు సోమవారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు 8977716661 నంబరుకు ఫోన్చేసి సమస్యల గురించి చెప్పవచ్చని పేర్కొన్నారు. వినియోగదారులు 9133331912 నంబరుకు వాట్సాప్ ద్వారా కూడా సమస్యలను చెప్పవచ్చని తెలిపారు. -
● తొక్కిసలాట ప్రభుత్వ వైఫల్యమే
ఆలూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతోనే శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది భక్తులు మృతి చెందారని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు. చిప్పగిరిలోని భోగేశ్వర స్వామి ఆలయం ఆవరణంలో అయ్యప్ప మాలాధారులతో కలిసి ఆదివారం కొవ్వత్తులతో ర్యాలీ నిర్వహించారు. మృతులకు నివాళులర్పించారు. భక్తుల మృతి ఘటన నుంచి తప్పించేకునేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు.. జోగి రమేష్ను అరెస్టు చేయించారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఆలూరులోని ఆర్అండ్బీ అతిథి గృహంలో ఆదివారం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం ఊరూరా ఏరులై పారుతోందని విమర్శించారు. ఇద్దరు యువకులు మద్యం సేవించడంతోనే చిన్నటేకూరు వద్ద బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందారన్నారన్నారు. వైఎస్సార్సీసీ మండల అధ్యక్షడు మల్లికార్జున, జిల్లా నాయకులు రామాంజినేయులు, భాస్కర్, గిరి, ఎంపీటీసీ దేవరాజు,కో–అప్షన్ మెంబర్ మహబూబ్ బాషా, ఎల్లప్ప, వరుణ్, నాగప్ప, రంగన్న, అనిల్ హనుమతప్ప, నాగేంద్ర, బాషా, రెడ్డి, రాజు, సాయి తదితరులు పాల్గొన్నారు. -
దిగువకు 383.7 టీఎంసీల నీరు
కర్నూలు సిటీ: సుంకేసుల జలాశయం నుంచి జూన్ నెల నుంచే ఇప్పటి వరకు జల వనరుల శాఖ గణాంకాల ప్రకారం 383.7 టీఎంసీల నీటిని దిగువకు వదిలేశారు. ఎగువ రాష్ట్రంలో కురిసిన వర్షాలతో టీబీ డ్యాం గేట్లు ఖరీఫ్ సీజన్కంటే ముందుగానే తెరుచుకున్నాయి. నదికి వచ్చిన వరద నీటితో సుంకేసుల జలాశయం గేట్లు ఇప్పటి వరకు తెరుచుకునే ఉన్నాయి. జలాశయం నుంచి కేసీ కెనాల్ ఆయకట్టుకు 17.33టీఎంసీలు, కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలోని జనాభాకు 1.7 టీఎంసీల నీటిని వినియోగించారు. ప్రస్తుతం నదిలో 17,500 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంది. ఇదిలా ఉండగా గాజులదిన్నె ప్రాజెక్టు గేట్లు ఎత్తి ఈ ఏడాది హంద్రీ నదికి 9 టీఎంసీలకుపైగా నీటి ని వదిలారు. ప్రస్తుతం హంద్రీనదిలో 250 క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్ర‘జల’ కష్టాలు కనిపించవా?ఆలూరు: ‘మంచినీటి కోసం ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నా ప్రజల కష్టాలు కనిపించవా’ అని అధికారులపై ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మనోహర్, జిల్లా పంచాయతీ అధికారి భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలూరులో అధికారులతో ఆదివారం వారు సమావేశమయ్యారు. జిల్లాలోనే తాగునీటి సమస్య ఆలూరులో ఎందుకు ఉందని ప్రశ్నించారు. వచ్చే తాగునీటిని కూడా ప్రజలకు సక్రమంగా పంపింగ్ చేయడంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని గ్రామపంచాయతీ అధికారులను హెచ్చరించారు. సమస్య పరిష్కారం కాకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఈఈ పద్మావతి, ఆర్డబ్ల్యూఎస్ డీఈ మల్లికార్జునయ్య పాల్గొన్నారు. -
ఐక్యతతోనే సమస్యలకు పరిష్కారం
● ఘనంగా కురువల కార్తీక వనభోజన కార్యక్రమం కర్నూలు(అర్బన్): రాజకీయ పార్టీలకు అతీతంగా కురువలు ఐకమత్యంగా ఉంటే ఎలాంటి సమస్యకై నా పరిష్కారం లభిస్తుందని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, కర్నూలు, హిందూపురం ఎంపీలు బస్తిపాటి నాగరాజు, పార్థసారథి అన్నారు. ఆదివారం స్థానిక పెద్దపాడు రోడ్డులోని శ్రీ భీరప్ప స్వామి దేవాలయం ప్రాంగణంలో ఉమ్మడి జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో 23వ కార్తీక వన భోజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఉసిరిక చెట్టుకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీలు మాట్లాడుతూ.. కురువలు విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ తదితర అన్ని రంగాల్లో ముందుండాలన్నారు. కులానికి సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వాటిని వెంటనే పరిష్కరించేందుకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటామన్నారు. ఈ నేపథ్యంలోనే కురువ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి హిందూపురం ఎంపీ పార్థసారథి రూ.25 లక్షలను ఇచ్చేందుకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ అరుణ్కుమార్, సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిసె శివన్న, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పత్తికొండ శ్రీనివాసులు, ఎంకే రంగస్వామి, మహిళా విభాగం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీలీలమ్మ, అనిత, గొర్రెల సహకార సంఘం చైర్మన్ శ్రీనివాసులు, కల్లూరు సింగిల్ విండో ప్రెసిడెంట్ శేఖర్, డిప్యూటీ కలెక్టర్ మల్లికార్జున, ఐఆర్ఎస్ అధికారి యాదగిరి, తహసీల్దార్ ఆంజనేయులు, పాల సుంకన్న, గడ్డం రామక్రిష్ణ, కార్పొరేటర్ సిట్రా సత్యనారాయణమ్మ, డా.లక్ష్మి ప్రసాద్, నాయకులు కే కిష్టన్న, ఉపాధ్యక్షులు కత్తి శంకర్, ఉరుకుందు, ధనుంజయ, కేసీ నాగన్న, నాగశేషులు, తిరుపాల్, వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు. -
మున్సిపల్ కాంట్రాక్టర్ల తిరుగుబాటు
● ఇద్దరు చేస్తున్న దందాపై ఆగ్రహం ● నూతన అసోసియేషన్ ఏర్పాటుకు రంగం సిద్ధం కర్నూలు (టౌన్): నగరంలో మున్సిపల్ కాంట్రాక్టర్ల తిరుగుబాటు చేశారు. కాలం చెల్లిన కాంట్రాక్టర్ల అసోసియేషన్ పేరుతో అధికారుల వద్ద పైరవీలు చేయడాన్ని వ్యతిరేకించారు. కొత్తగా కర్నూలు నగరపాలక సంస్థ మున్సిపల్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. మెజార్టీ మున్సిపల్ కాంట్రాక్టర్లు ఓ ప్రెవేటు హోటల్లో సమావేశం కానున్నారు. ఇప్పటికే అదిశగా ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఏడేళ్ల క్రితం గడువు ముగిసినా.... గ్రేటర్ కర్నూలు కాంట్రాక్టర్ల అసోసియేషన్ 2015 మార్చి 10న ఏర్పాటైంది. ఇద్దరు మాత్రమే నాయకులుగా చెలామణీ అవుతున్నారు. ఇతరులను పట్టించుకోవడం లేదు. కాంట్రాక్టర్ల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. ఇద్దరు మాత్రమే అభివృద్ధి చెందారు. బిల్లుల నుంచి పనుల వరకు వారే అధికారుల వద్ద వారే పెత్తనం చెలాయిస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అసోసియేషన్ సమావేశం నిర్వహించాలి. నూతనంగా కార్యవర్గంలో మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది. ఈ అసోసియేషన్ గడువు 2018 మార్చి 9 వ తేదీ నాటికి ముగిసింది. ఇప్పటి వరకు అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించలేదు. 4న నూతన అసోసియేషన్ ఏర్పాటుకు రంగం సిద్ధం కర్నూలు కార్పొరేషన్లో 110 మంది కాంట్రాక్టర్లు ఉన్నారు. వీరిలో 90 మందికి పైగా కాంట్రాక్టర్లు విసుగు చెంది కొత్తగా మున్సిపల్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ ఏర్పాటుకు నిర్ణయించారు. ఇతర కాంట్రాక్టర్లతో చర్చించారు. దాదాపు అందరూ కాంట్రాక్టర్లు ఒప్పుకోవడంతో ఈనెల 4న కర్నూలు నగరంలోని చిల్డ్రన్స్ పార్కు సమీపంలోని ఓ హోటల్లో సమావేశం కానున్నారు. అదే రోజు కొత్తగా మున్సిపల్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు పలువురు మున్సిపల్ కాంట్రాక్టర్లు వెల్లడించారు. ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే 90 శాతం మంది కాంట్రాక్టర్లు ఆంగీకారం తెలిపారని పేర్కొన్నారు. కాంట్రాక్టర్ల సమస్యలు, బిల్లుల పెండింగ్, తీవ్ర జాప్యంతో పాటు పలు సమస్యలను పరిష్కరించుకునే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. -
● చెట్టంతా ఆదర్శం
ఈ చిత్రం చూస్తుంటే ఇంటిపై టెంకాయ చెట్టును నాటారా అన్నట్లుగా ఉంది కదూ.. అసలు విషయం ఏమిటంటే.. ఆ చెట్టు ఇంటిపైనా కాదు.. ఇంటిలోనే ఉంది. అదేంది ఇంటిలో చెట్టు అనుకుంటున్నారా..! బేతంచెర్ల పట్టణం కోటపేట కాలనీకి చెందిన నాపరాయి పరిశ్రమ యజమాని రహిమాన్కు చెట్లు అంటే ఇష్టం. రెండేళ్ల క్రితం శిథి లావస్థకు చేరుకున్న పడగొట్టి నూతన ఇంటి నిర్మాణం చేపట్టాడు. అయితే అప్పటికే ఏపుగా పెరిగిన టెంకాయ చెట్టును తొలగించకుండా ఇంటిని నిర్మించాడు. ప్రస్తుతం ఆ చెట్టు ఇంటికన్నా ఎత్తు పెరిగింది. ఈ విషయం తెలుసుకున్న వారంతా ఔరా అంటూ రహిమాన్ను అభినందిస్తున్నారు. – బేతంచెర్ల -
బాటిల్ ఉంది జాగ్రత్త !
ఇంట్లో కుక్క ఉంటే గేటుకు ‘కుక్కలు ఉన్నా యి.. జాగ్రత్త’ అంటూ బోర్డు తగిలిస్తారు. ఇక్కడ మాత్రం కుక్కలను భయపెట్టడానికి ఎర్ర నీళ్ల బాటిల్ ఉంచి.. బాటిల్ ఉంది జాగ్రత్త అంటూ శునకాలకే వార్నింగ్ ఇస్తున్నారు. కుక్కల బెడదతో కొందరు ఈ బాటిల్ మంత్రాన్ని వాడుతున్నారు. వీధి కుక్కలు ఇళ్ల ముందు మల, మూత్ర విసర్జన చేస్తూ పరిసరాలను పాడు చేస్తున్నాయని ప్రజలు బాటిల్ చిట్కాను అనుసరిస్తున్నారు. కుక్కలు ఇంటి ముందుకు రాకుండా పత్తికొండలో కొన్ని కాలనీ ప్రజలు ఓ బాటిల్ నీళ్లలో కొంత కుంకుమ వేసి బాటిల్ను తాడుతో ఇంటి గేటుకు, ప్రహరీకి వేలాడదీస్తున్నారు. ఈ ప్రక్రియ ప్రస్తుతం పట్టణంలోని పలు వీధులకు విస్తరించింది. చాలా చోట్ల ఇంటి గేటుకు ఎర్ర రంగు నీళ్ల బాటిళ్లు వేలాడుతూ కని పిస్తున్నాయి. విషయం తెలియని చాలా మంది ఇదేమి పద్ధతి అంటూ ఆశ్చర్యపోతున్నారు. – పత్తికొండ రూరల్ -
సిబ్బంది లేక ఇబ్బంది!
● గాజులదిన్నె ప్రాజెక్టు నిర్వహణకు 14 మంది అవసరం ● ఉన్నది నలుగురు మాత్రమే గోనెగండ్ల: గాజులదిన్నె ప్రాజెక్టు నిర్వహణకు సిబ్బంది లేపక అధికారులకు ఇబ్బంది పడుతున్నారు. మొత్తం ఆరుగురు లస్కర్లు, ఆరుగురు టెక్నికల్ సిబ్బంది, ఇద్దరు నైట్ వాచ్మెన్లు ఉండాలి. ప్రస్తుతం ముగ్గురు లస్కర్లు, ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి, ఒక వర్క్ఇన్స్పెక్టర్ మాత్రమే ఉన్నారు. ప్రాజెక్టు నుంచి నీటి విడుదల సమయంలో సిబ్బంది ఎంతో అవసరం అవుతుంది. సిబ్బంది లేకపోవడంతో రాత్రి పగలు ఉన్న నలుగురితోనే పనులు చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదీ దుస్థితి.. ప్రాజెక్టుకు గత రెండు నెలలుగా వరద నీరు వస్తోంది. గత నెల 12వ తేదీ నుంచి నేటి వరకు 30 సార్లు గేట్లు ఎత్తి నీటిని హంద్రీ నదికు విడుదల చేశారు. అత్యవసరం కావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెండు నెలల పాటు ముగ్గురి వ్యక్తులను కాంట్రాక్ట్ కింద ఏర్పాటు చేసుకున్నారు. వారు నవంబర్ నెల చివరి వరకు మాత్రమే పనిలో ఉంటారు. ఉన్న ముగ్గురు రెగ్యులర్ ఉద్యోగులు కూడా మరో మూడేళ్లకు రిటైర్డ్ అవుతారు. ఇక నియామకాలు జరగకపోతే మూడేళ్లకు ప్రాజెక్టులో పనిచేసే సిబ్బంది ఒక్కరు కూడా ఉండరు. సమస్యలు ఇవీ.. ప్రాజెక్టు నిర్వహణకు క్రస్ట్గేట్లకు వేసేందుకు గ్రీస్, ఇతర అవసరాలకు ప్రత్యేక నిధులు ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. కాని నిధులను విడుదల చేయడం లేదు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న అధికారులే సొంత నిధులతో గ్రీస్ను, ఇతర అవసర పరికరాలను ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోంది. ఇప్పటికై న ఉన్నతాధికారులు స్పందించి ప్రాజెక్టులో సిబ్బందిని ఏర్పాటు చేసి అవసరమైన నిధులను విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ప్రాజెక్టు విద్యుత్ బిల్లు కూడా దాదాపు రూ.30 లక్షల మేర పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది.గాజులదిన్నె ప్రాజెక్టుకు సిబ్బంది కొరత ఉంది. ఇప్పటికే ప్రాజెక్టుకు సిబ్బంది కొరత ఉందని ఉన్నతాధికారులకు నివేదిక పంపాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. – మహమ్మద్ ఆలీ, ప్రాజెక్టు ఏఈ -
5న కార్తీక లక్ష దీపోత్సవం
కర్నూలు కల్చరల్: కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఈనెల 5వ తేదీన కార్తీక లక్ష దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు సమితి కార్యాధ్యక్షులు ఇ.పద్మావతి పేర్కొన్నారు. ఆదివారం సమితి కార్యాలయంలో దీపోత్సవానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పదకొండు సంవత్సరాలుగా కర్నూలు నగరం వినాయక్ ఘాట్ కేసీ కెనాల్లో సామూహికంగా కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలులో ఈ కార్యక్రమం నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందన్నారు. సమితి కార్యదర్శులు జె.రాధిక, స్వప్నసారథి, సహ కార్యదర్శులు జయలక్ష్మి, సభ్యులు అనురాధ, హేమలత, మల్లీశ్వరి, మల్లికార్జున రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. నదిలో స్నానానికి వెళ్లి యువకుడి మృతి మంత్రాలయం రూరల్: తుంగభద్ర నదిలో స్నానానికి వెళ్లి ఒక యువకుడు మృతి చెందారు. ఈ దుర్ఘటన ఆదివారం తుంగభద్ర గ్రామం పుష్కరఘాట్ వద్ద చోటుచేసుకుంది. తుంగభద్ర గ్రామానికి చెందిన వీరేంద్రగౌడ్(26) ఆదివారం ఉదయం స్నానానికి తుంగభద్ర నదికి వెళ్లాడు. పుష్కరఘాట్ వద్ద జారి నీళ్లలో పడిపోయాడు. ఈత రాక పోవడంతో నీళ్లల్లో కొట్టుకుని పోయాడు. నీళ్లల్లో కొట్టుకొని పోతున్న వీరేంద్రగౌడ్ను స్థానికులు కాపాడానికి ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. నదిలో కిలోమీటర్ మేర వరకు పోయి అక్కడ కంపచెట్లలో విగతజీవిగా కనిపించాడు. వీరేంద్రగౌడ్ ఆటో డ్రైవర్గా పనిచేస్తూ జీవిస్తున్నాడు. ఇంకా పెళ్లికాలేదు. తల్లి లక్ష్మీ ఈశ్వరమ్మ రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నదీతీర ప్రాంతాల్లో భక్తులు అప్రమత్తంగా ఉండాలి కర్నూలు (టౌన్): కార్తీక మాసం పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో దేవాలయాలకు వస్తుంటారని, నదీతీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్తీక పుణ్య స్నానాలు ఆచరించడానికి వెళ్లే భక్తులు తమ వెంట చిన్న పిల్లలను తీసుకొని వెళ్లినప్పుడు జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. ఓర్వకల్లు కాల్వబుగ్గ రామేశ్వర శివాలయం , బ్రహ్మగుండేశ్వరం శివాలయం, గురజాల గ్రామ శివాలయాల్లో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారని తెలిపారు. ప్రజలు పోలీసుల సూచనలు పాటిస్తూ క్షేమంగా వారి గమ్య స్థానాలకు చేరుకోవాలని ఎస్పీ సూచించారు. క్రీస్తు త్యాగంతోనే పాప విమోచనం కర్నూలు (టౌన్): దేవాది దేవుడైన ఏసుక్రీస్తు లోకరక్షణార్థమై రక్తం చిందించి ప్రాణత్యాగం చేశారని, ఆయన త్యాగానికి ఫలితంగానే మానవులకు పాప విమోచన లభించిందని కర్నూలు డయాసిస్ బిషప్ గోరంట్ల జ్వాన్నేష్ అన్నారు. కర్నూలు నగరంలోని బుధవార పేట, వెంకయపల్లెలోని క్రిస్టియన్ సమాధుల వద్ద ఆదివారం పరిశుద్ధ ఆత్మల పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. క్రైస్తవులు సమాధుల తోటలో డయాసిస్ బిషప్ గోరంట్ల జ్వాన్నేష్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా బిషప్ మాట్లాడుతూ ప్రతి ఏడాది నవంబర్ 2వ తేదీ ప్రపంచంలోని ప్రతి క్రైస్తవుడు సమాధుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేస్తారన్నారు. చనిపోయిన ఆత్మలను స్వర్గ ప్రాప్తి చేకూరాలన్నారు. అనంతరం సమాధులకు పవిత్ర తైలంతో పావనం చేశారు. చర్చి ఫాదర్లు ప్రతాప్ రెడ్డి, జాన్ డేవిడ్, ఆర్లప్ప. థామస్, సుధాకర్, రాజశేఖర్, ఉపదేశులు ఎన్, అంథోనీ, రాజు, మరియ దళ సభ్యులు, క్యాథలిక్ యూత్ పాల్గొన్నారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
బేతంచెర్ల: కనుమకింది కొట్టాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన జంగిటి అనిల్ కుమార్(29) శుక్రవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి శనివారం ఉదయం వచ్చాడు. ఎక్కడకు వెళ్లావని భార్య గంగమ్మ నిలదీయడంతో మనస్తాపానికి గురై పొలం దగ్గరకు వెళ్లి పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కోలుకోలేక ఆదివారం మృతి చెందాడు. మృతుని భార్య గంగమ్మతోపాటు రెండేళ్ల కుమార్తె హర్షిత ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ నబి తెలిపారు. -
చిన్నారికి డెంగీ లక్షణాలు
వెల్దుర్తి: పట్టణంలో డెంగీ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఆదివారం పట్టణంలోని రాణితోటకు చెందిన ఆరేళ్ల మానస డెంగీ జ్వరానికి గురైనట్లు తెలుస్తోంది. ఇటీవల జ్వరం తీవ్రతరం కావడంతో తల్లిదండ్రులు మనోహర్, శిరీషలు కర్నూలు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు డెంగీ లక్షణాలు తేలిన ట్లు నిర్ధారించారని తల్లితండ్రులు తెలిపారు. దీపం అంటుకుని చిన్నారి మృతి వెల్దుర్తి: దీపం అంటుకుని గా యాలపాలైన ఎనిమిదేళ్ల చిన్నారి రేవతి కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందు తూ శుక్రవారం కోలుకోలేక మృతిచెందింది. గ్రామానికి చెందిన గొల్ల బుడ్డన్న, సు లోచన దంపతుల కుమార్తె రేవతి తన ఇంటి పక్క నే ఉన్న దేవాలయంలో ఆంజనేయ స్వామి విగ్రహానికి కుంకుమ బొట్టు పెట్టే ప్రయత్నంలో ఉండ గా దీపారాధనకు ఉంచి దీపం దుస్తులకు అంటు కుని గాయాలపాలైంది. రేవతి గ్రామంలోని ఎంపీపీ స్కూల్లో 3వతరగతి చదువుతోంది. చిన్నారి ఆసుపత్రిలో ఉన్నప్పటి నుంచి వారి కుటుంబానికి గ్రామ వైఎస్సార్సీపీ నాయకుడు, సర్పంచ్ కుమారుడు కృష్ణారెడ్డి అండగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి సైతం ఆసుపత్రికి వెళ్లి చిన్నారి కుటుంబాన్ని పరామర్శించారు. చిన్నారి మృతిపై మాజీ ఎమ్మెల్యే తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పట్టుబడిన వాహనాలకు రేపు వేలం నంద్యాల: పలు కేసుల్లో పట్టుబడిన వాహనాలను జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కార్యాలయంలో ఈనెల 4వ తేదీన వేలం నిర్వహిస్తున్నట్లు ఎకై ్సజ్ సీఐ క్రిష్ణమూర్తి ఆదివారం ఓప్రకటనలో తెలిపారు. ఎకై ్సజ్ నేరాల్లో పట్టుబడిన 10 వాహనాలకు మంగళవారం ఉదయం 11 గంటలకు నిర్వహించే వేలం పాటలో పాల్గొనాలన్నారు. వివరాలకు నంద్యాల ఎకై ్సజ్ స్టేషన్లో సంప్రదించాలన్నారు. -
రెండో పంటకు నీరు లేనట్లే!
కర్నూలు సిటీ: భారీ వర్షాలు కురిసి సమృద్ధిగా నీరు ఉన్నా రైతులు రెండో పంట పండించే వీలు లేకుండా పోయింది. గతేడాది ఆగస్టులో టీబీ డ్యాం 19వ గేటు కొట్టుకుపోవడంతో తుంగభద్ర దిగువ కాలువ కింద రబీలో ఆయకట్టు సాగు కాలేదు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితులు నెలకొన్నాయి. డ్యాంలో 80 టీఎంసీల నీరు ఉండడంతో ఆయకట్టు రైతులు రబీపై ఆశలు పెట్టుకున్నారు. డ్యాం గేట్ల మార్పుల పనులతో రెండో పంటకు నీరు అందుబాటులో ఉండే పరిస్థితులు అగుపించడం లేదని డ్యాం ఇంజనీర్లు చెబుతున్నారు. 19వ గేటు ఏర్పాటుకు ఆటంకం! టీబీ డ్యాం 19వ గేటు గతేడాది ఆగస్టులో కొట్టుకుపోయింది. దాని స్థానంలో కొత్త గేటు ఏర్పాటుకు నిపుణుల కమిటీ సలహా మేరకు రూ.1.98 కోట్లతో టెండర్ పిలిచారు. టెండర్ను దక్కించుకున్న గుజరాత్ కంపెనీ ఏప్రిల్ చివరి వారంలో డిజైన్స్ తయారు చేసింది. టీబి బోర్డు ద్వారా ఏపీ సెంట్రల్ డిజైన్ కమిటీకి పంపించారు. అయితే ఆ డిజైన్కు ఆమోదం నెల రోజులు ఆలస్యం కావడంతోనే సకాలంలో గేటు తయారు చేసి బిగించలేకపోవడంతో 105 టీఎంసీల నుంచి 80 టీఎంసీలకు సామర్థ్యాన్ని తగ్గించారు. ఏజేన్సీ గేటు తయారు చేసి బిగించేందుకు రెండు నెలల గడువు ఇచ్చారు. గేటును సిద్ధం చేసుకొని డ్యాం దగ్గరకు తీసుకొచ్చింది. అయితే డ్యాం ఎగువన భారీ వర్షాలు కురవడంతో గేటు బిగించేందుకు సాధ్యం కాకపోవడంతో జూన్ నెలలో వాయిదా వేశారు. ఈ గేటుతో పాటు మిగిలిన 32 గేట్ల తయారీ టెండర్ దక్కించుకున్న గుజరాత్ కంపెనీ జూన్ నెల నుంచి ఇప్పటి వరకు 12 గేట్లను తయారు చేసింది. ఈ నెల 15వ తేదీలోపు మిగిలిన గేట్లను సిద్దం చేయనున్నట్లు డ్యాం ఇంజినీర్లు చెబుతున్నారు.3.5 లక్షల ఎకరాల్లో పంటలు లేనట్లే! తుంగభద్ర జలాలపై రాయలసీమ జిల్లాల్లో ఎల్ఎల్సీ, హెచ్చెల్సీ, ఆలూరు బ్రాంచ్ కెనాల్, కేసీ కాలువల పరిధిలో 6.56 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో రబీ సీజన్లో 3.5 లక్షల ఎకరాల్లో పంటల సాగు కావాలి. అయితే డ్యాం గేట్ల మార్పుతో సామర్థ్యాన్ని 80 టీఎంసీలకు తగ్గించారు. రబీకి నీరు ఇవ్వమని ఖరీఫ్ సీజన్కు ముందే బోర్డు ప్రకటించింది. అయితే వర్షాలు కురుస్తుండడంతో డ్యాంలో నీటి సామర్థ్యం (80 టీఎంసీలకు)తగ్గిపోయింది. ఇన్ఫ్లో ఉండడంతో రబీ ఆయకట్టుకు కూడా నీరు ఇస్తారని ఆయకట్టు రైతులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ నెలలోపు వర్షాలు నిలిచిపోయే అవకాశాలు ఉండడం, ఉన్న నీటితో ఖరీఫ్లో సాగు చేసిన పంటలకు డిసెంబర్ నెలాఖరు వరకు నీరు ఇవ్వాల్సి ఉండడంతో రెండో పంటలకు నీరు ఇవ్వడం సాధ్యం కాదని ఇంజినీర్లు చెబుతున్నారు. రబీలో ఎల్ఎల్సీ, హెచ్చెల్సీ, కర్ణాటక సాగు నీటి కాలువకు రోజుకు 0.89 టీఎంసీలు, నెలకు సుమారు 27 టీఎంసీల ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్ నెలాఖరు వరకు నీరు ఇవ్వాలంటే కనీసం 110 టీఎంసీల నీరు అవసరం ఉంది. అంత నీటి లభ్యత లేదని, తాగు నీటి అవసరాలు, వేసవిని దృష్టిలో పెట్టుకొని రబీకి నీరు ఇవ్వలేమని ఇంజినీర్లు చెబుతున్నారు. ఈ నిర్ణయాన్ని ప్రకటించేందుకు ఈ నెల 7న టీబీ బోర్డు సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక శాఖ తరుపున సభ్యులుగా ఉండే వ్యక్తి ఆ రోజు వచ్చేందుకు అవకాశం లేకపోవడంతో ఈ నెల 21వ తేదీకి సమావే«శం వాయిదా వేసినట్లు తెలుస్తుంది. ‘సుంకేసుల’పై నిర్లక్ష్యం ఓఅండ్ఎం నిధుల మంజూరులో జాప్యం రూ.52 లక్షల బిల్లులు పెండింగ్ ఉమ్మడి కర్నూలు, వైఎస్ఆర్ కడప జిల్లాలకు సాగు, తాగు నీటిని అందిండంలో కీలకమైనా సుంకేసుల బ్యారేజీ గేట్ల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో లీకేజీలు అవుతున్నాయి. బ్యారేజీకి స్పిల్వేకు 30 క్రస్టు గేట్లు ఉన్నాయి. ఓక్కో గేటు 18 మీటర్లు పొడవు, 7 మీటర్లు వెడల్పు ఉన్నాయి. ఈ గేట్ల నుంచి 5.25 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయవచ్చు. అదే విధంగా స్కవరింగ్ స్లూయిజ్కు నాలుగు వర్టికల్ గేట్లు ఉన్నాయి. కేసీ కాలువకు నీటి విడుదలకు నాలుగు వర్టికల్ గేట్లు ఉన్నాయి.మొత్తం 38 గేట్లను రూ.140 కోట్లతో రెండు దశాబ్దాల క్రితం ఏర్పాటు చేశారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి వరకు బ్యారేజీలో నీరు అడుగంటలేదు. 2014 తరువాత ఇప్పటి వరకు నాలుగు సార్లు పూర్తిగా ఎండిపోయింది. ఆ సమయంలో బ్యారేజీ గేట్లకు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయలేదు. తాగు నీటికి ఇక్కట్లే! సుంకేసుల బ్యారేజీ 1.2 టీఎంసీల సామర్థ్యం. ఇందు లో పూర్తి స్థాయిలో నీరు ఉంటేనే కర్నూలు నగర ప్రజలకు తాగు నీటి అవసరాలు తీరేది. ఈ ఏడాది సీజన్ మొదలయ్యాక బ్యారేజీ నిర్వహణకు కొంత నిధులు మంజూరు చేశారు. ఈ ఏడాది ఎనిమిది గేట్లు రోప్స్ తుప్పుపట్టి ఇంజినీర్లను ఇబ్బంది పెట్టాయి. ఈ గేట్లకు రోప్స్ మార్చాలని రూ.24 లక్షలతో అంచనాలు వేసి పనులు చేపట్టారు. స్పిల్వే గేట్ల రబ్బర్ సీల్సు మా ర్చాల్సి ఉందని, పెండింగ్ బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్లు కోరుతున్నారు. కేసీ కెనాల్ డివిజన్ కార్యాలయంలో అప్లోడ్ చేయకపోవడంతో ఏడాదిన్నరగా రూ.52 లక్షల బిల్లులు రాలేదు. రబ్బర్ సీల్సు టెఫ్లాన్ కోటింగ్ పోయి చాలా గేట్ల నుంచి నీరు లీకేజీ అవుతోంది. నీరంతా దిగువకుపోతే కర్నూలు నగరవాసులతో పాటు వందలాది గ్రామాల ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. రబీకి నీరు ఇవ్వలేం తుంగభద్ర డ్యాం గేట్లు కొత్తవి ఏర్పాటు చేసేందుకు పనులు జరుగుతున్నాయి. డ్యాంలో ఉండే 80 టీఎంసీల నీటితో రెండో పంటకు నీరు ఇవ్వడం సాధ్యం కాదు. ఖరీఫ్కు డిసెంబర్ వరకు నీరు ఇవ్వాల్సి ఉంది. రబీకి నెలకు 27 టీఎంసీల నీరు ఇవ్వాలి. డ్యాంలో నీరు లేదనందున రబీకి ఇవ్వడం సాధ్యం కాదు. – జ్ఞానేశ్వర్, టీబీ డ్యాం డీఈఈ దెబ్బతిన్న గేట్లుతుంగభద్ర డ్యాంను సుమారు ఏడు దశబ్దాల క్రితం నిర్మించారు. డ్యాంలో మొత్తం 33 క్రస్టు గేట్లు ఉన్నాయి. నిర్మాణం సమయం నుంచి ఇప్పటి వరకు డ్యాం గేట్ల భద్రతపై దృష్టి సారించలేదు. దీంతో గేట్లన్నీ దెబ్బతిన్నాయి. గతేడాది ఆగస్టు నెలలో వచ్చిన భారీ వరద నీటి ప్రవాహనికి డ్యాం 19వ క్రస్టు గేటు కొట్టుకుపోయింది. ఆ గేటు స్థానంలో నాడు తాత్కాలికంగా నిపు ణుల పర్యవేక్షణలో స్టాప్లాక్ గేటును ఏర్పాటు చేశారు. ఏడాదికిపైగా స్టాప్లాక్ గేటుతోనే డ్యాం భద్రతను పర్యవేక్షిస్తున్నారు. సీడబ్యూసీ మాజీ చైర్మెన్ ఏకే బజాజ్, నేషనల్ డ్యాం సేఫ్టీ ఆథారిటీ ఆధ్వర్యంలో కమిటీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేశారు. వారు ఇచ్చిన సూచనల ఆధారంగా కేఎస్ఎన్డీటీ సర్వీసెస్ అనే సంస్థతో స్టడీ చేయించారు. ఆ సంస్థ సుమారుగా 15 రకాల పరీక్షలు నిర్వహించి నివేదిక ఇచ్చింది. అందులో డ్యాం 33 గేట్లు మార్చాలని, గేట్లలో అత్యధిక శాతం 40 నుంచి 50 శాతం తప్పుపట్టి దెబ్బతిన్నాయని, గడ్డర్లు, సపోరి్టంగ్ ప్లేట్లు దెబ్బతిన్నాయని చెప్పారు. దీంతో అన్ని గేట్లు మార్చేందుకు రూ. 52 కోట్లతో అంచనాలు వేసి టెండర్లు పిలవ్వగా..గుజరాత్ కంపెనీ టెండర్ దక్కించుకుంది. -
అంతా ధ్వంసం
గతేడాది మహారాష్ట్ర దొంగల ముఠా దుశ్చర్యతో ప్రాజెక్టు పరిధిలోని ఆరు ఎత్తిపోతల పథకాల పంపుహౌస్ల్లో విలువైన సామగ్రి చోరీకి గురైంది. సామగ్రి సైతం దేనికీ పనికిరాకుండా ధ్వంసమైంది. మంత్రాలయం పరిధిలోని మూగలదొడ్డి స్టేజ్–1 పంపుహౌస్తో రెండు ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం చేసి 1200 కేజీ కాపర్ను దొంగలించారు. పంప్హౌస్లో రూ.18 లక్షలు నష్టం వాటిల్లింది. మాధవరం స్టేజ్–1 పంపుహౌస్లో రెండు ట్రాన్స్ఫార్మర్లు, మూడు స్టార్టర్లు, ఇన్సులేటర్, బ్రేకర్స్, బ్యాటరీలను నాశనం చేశారు. అందులో 9 కాపర్ షీట్లను ఎత్తుకెళ్లారు. కారణంగా రూ.1.46 కోట్లు నష్టం జరిగింది. బసలదొడ్డి స్టేజ్–1 పంపుహౌస్లోనూ స్టార్టర్, బ్యాటరీలు, ఫీడర్లను ధ్వంసం చేయగా రూ.12 లక్షలు నష్టం వాటినట్లు కేసు నమోదైంది. ఎమ్మిగనూరు పరిధిలోని సోగనూరు స్టేజ్–1 పంపుహౌస్లో రెండు ట్రాన్స్ఫార్మర్లు, 1200 కేజీల కాపర్ను దొంగలించారు. పంప్హౌస్లో రూ.20 లక్షలు నష్టం జరిగింది. పూలచింత స్టేజ్–1, స్టేజ్–2 పంపుహౌస్లోనూ 4 ట్రాన్స్ఫార్మర్లు, కాపర్, ఆయిల్ ఎత్తుకెళ్లగా రూ.40 లక్షలు నష్టం వాటిల్లింది. చిలకలడోణ స్టేజ్–1, స్టేజ్–2 పంపుహౌస్లో 4 ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం చేసి కాపర్, ఆయిన్ తీసుకెళ్లగా రూ.40 లక్షలు నష్టం జరిగిందని ప్రాజెక్టు అధికారుల అంచనా. -
కర్నూలులో ‘ఐక్యత’ పరుగు
కర్నూలు టౌన్:సర్దార్ వల్లబాయ్ పటేల్ జయంతి పురస్కరించుకొనిరాష్ట్రీ య ఏక్తా దివాస్ పేరుతో యూనిటీ రన్ను శుక్రవారం కర్నూలు నగరంలో నిర్వహించారు. జిల్లా పోలీసు కార్యాలయం నుంచి ప్రారంభమై రాజ్విహార్ వరకు కొనసాగింది. రన్ను జెండా ఊపి ప్రారంభించిన అనంతరం అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా మాట్లాడారు. రన్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన క్రీడాకారులకు అడిషనల్ ఎస్పీ బహుమతులు అందజేశారు. ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, కర్నూలు టౌన్ డీఎస్పీ బాబు ప్రసాద్, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. అంతర్జాతీయ క్రీడా పోటీలకు ఎంపిక సంజామల: సంజామల ప్రభుత్వ ఉన్నత పాఠశాల వ్యాయామ సంచాలకులు బాషా జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ అఽథ్లెటిక్స్ క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. తమిళనాడు రాష్ట్రంలో నవబంర్ 5 నుంచి 9 వరకు జరిగే అంతర్జాతీయ ఏసియా మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీల్లో బాషా పాల్గొనున్నారు. ఈ మేరకు శుక్రవారం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు షబ్బీర్ హుస్సేన్, ఉపాధ్యాయులు పరమేశ్వర్ రెడ్డి, భరత్ రెడ్డి, వసంత లక్ష్మి తదితరులు ఆయనను అభినందించారు. -
వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా మురహరి రెడ్డి
కర్నూలు (టౌన్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులుగా ఎమ్మిగనూరుకు చెందిన మురహరి రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగే పార్టీ రాష్ట్ర రైతు విభాగం సంయుక్త కార్యదర్శిగా జి.శివ శంకర్ రెడ్డి (పాణ్యం), జిల్లా విద్యార్థి విభాగం కార్యదర్శిగా మల్లెపోగు సోమశేఖర్ ( ఎమ్మిగనూరు), జిల్లా ఎస్సీ సెల్ కార్యవర్గ సభ్యులుగా మదుబాబును (ఎమ్మిగనూరు) నియమించారు. కర్నూలు నగరంలోని 52 డివిజన్లకు సంబందించి డివిజన్ల వారీగా 52 మందిని డివిజన్ అధ్యక్షులుగా నియమించారు. పారా మెడికల్ సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజిలో డిప్లొమా ఇన్ అలైడ్ అండ్ హెల్త్కేర్ సర్వీసెస్(డిప్లొమా ఇన్ పారామెడికల్)లో మిగిలిన సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. డీఆర్డీఏలో బీసీ–ఏ కేటగిరీకి ఒక సీటు, ఈసీజీలో ఓసీ–పీహెచ్ కి ఒక సీటు, డీఏఎన్ఎస్లో ఓసీ–పీహెచ్కి ఒక సీటు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆయా కేటగిరీ లకు సంబంధించి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులను నవంబర్ 7వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా కళాశాల కార్యాలయంలో సమర్పించాలని ఆమె వివరించారు. మల్లన్న సేవలో సినీ నటులు శ్రీశైలంటెంపుల్: శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను సినీ, టీవీ నటులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకు న్నారు. శుక్రవారం సినీ నటుడు ఛత్రపతి ఫేమ్ శేఖర్, బుల్లితెర నటుడు అమర్దీప్ వేర్వేరు సమయాల్లో మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అలాగే భ్రమరాంబాదేవిని దర్శించుకున్నారు. సినీ, టీవీ నటులను చూసిన పలువురు భక్తులు వారితో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల సమ్మె విరమణ కర్నూలు (హాస్పిటల్): ప్రభుత్వం నుంచి బకాయిల విడుదలకు హామీ రావడంతో ఎన్టీఆర్ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ) నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మె విరమించినట్లు ఏపీ ప్రైవేటు స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి డాక్టర్ ఎస్వీ చంద్రశేఖర్ శుక్రవారం తెలిపారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్యసేవ నెట్వర్క్ ఆసుపత్రులకు రూ.2,500 కోట్లకు పైగా బకాయిలు ఉండటంతో గత 20 రోజులుగా సమ్మె చేస్తున్నామన్నారు. ఇప్పటి నుంచి చేసిన ఆరోగ్యశ్రీ కేసులకు ప్రతి నెలా రూ.250 కోట్లు విడుదల చేస్తామని ప్రభు త్వం హామీ ఇచ్చిందన్నారు. పాండురంగ స్వామి ఆలయంలో చోరీ హొళగుంద: వందవాగిలి గ్రామం గజ్జెళ్లి రోడ్డులో ఉన్న శ్రీరుక్మిణీ పాండురంగస్వామి ఆలయంలో గురు వారం అర్ధరాత్రి తాళిబొట్లు, కంచు గంటలను దొంగలు చోరీ చేశారు. రాత్రి సమయంలో ఆలయ తాళాలను పగులగొట్టి అమ్మ వారి మెడలోని రూ.35 వేలు విలువ చేసే 5 గ్రాముల బంగారు తాళిబొట్లు, రూ.10 వేలు విలువ చేసే రెండు కంచు గంటలను ఎత్తుకెళ్లారు. హుండీ తాళాలను కూడా పగల గొట్టేందుకు దొంగలు ప్రయత్నించారు. ఆలయ పూజారి ఫిర్యాదు మేర కు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల శ్రీరాంనగర్ క్యాంపు, మార్లమడికిలోని ఆలయాల్లో చోరీ జరగ్గా తాజాగా ఈ చోరీతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
విద్యార్థులకు తృటిలో తప్పిన ప్రమాదం
● పెచ్చులూడిన తరగతి గది పైకప్పు ● స్థల వివాదంతో మధ్యలో నిలిచిన నాడు – నేడు పనులు ● గ్రామ సచివాలయంలో తరగతుల నిర్వహణ జూపాడుబంగ్లా: పారుమంచాల ఉర్దూ పాఠశాల విద్యార్థులకు తృటిలో ప్రమాదం తప్పింది. పాఠశాల తెరవక ముందే తరగతి గది పైకప్పు పెచ్చులు కూడి కింద పడ్డాయి. శుక్రవారం ఉదయం తరగతి గది తెరిచిన విద్యార్థులకు బెంచీలపై పెచ్చులు కనిపించాయి. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 30 ఏళ్ల క్రితం గ్రామంలో ఉర్దూ ప్రాథమిక పాఠశాలను నిర్మించారు. గత వైఎస్సార్సీపీ పాలనలో నాడు–నేడు పథకం కింద ఈ పాఠశాలకు అదనపు తరగతి గదులు మంజూరయ్యాయి. పునాదులు తవ్వి గదుల నిర్మాణం చేపట్టారు. కాగా స్థలం విషయమై గ్రామస్తుల మధ్య వివాదం తలెత్తటంతో కోర్టును ఆశ్రయించారు. దీంతో పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణం పునాదులకే పరిమితమైంది. ఒకటి నుంచి ఐదు వరకు 15 మంది విద్యార్థులుండగా వారు శిథిలమైన తరగతి గదుల్లోనే విద్యను అభ్యిసిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం పాఠశాల పైకప్పు పెచ్చులూడిపడ్డాయి. విషయం తెలుసుకున్న గ్రామ వైఎస్సార్సీపీ నాయకులు పాఠశాలను సందర్శించి విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. పాఠశాలను సందర్శించిన ఎంఈఓ–1 చిన్న మద్దిలేటి పాఠశాల తరగతులను ఎంపీడీఓ అనుమతితో పాత సచివాలయంలో నిర్వహించేలా చేశారు. -
నిరాశ పరిచిన మంత్రి బీసీ
● రాయల్టీ సమస్య వెంటనే పరిష్కారం కాదంటూ తేల్చిన మంత్రి ● ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానంటూ దాట వేసిన వైనం కొలిమిగుండ్ల: మంత్రి దృష్టికి సమస్యను తీసుకెళ్తే వెంటనే సమస్య పరిష్కారమవుతుందని ఆశించిన మైనింగ్ యజమానులు, ట్రాక్టర్ల నిర్వాహకులు, కార్మికులకు నిరాశే ఎదురైంది. ఇప్పటికే పరిశ్రమ స్తంభించి కార్మికులు ఉపాధి కోల్పోయిన రోడ్డున పడ్డారు. రోజులు గడిచేకొద్ది కుటుంబాల పోషణ భారంగా మారుతోంది. ఈ క్రమంలో మైనింగ్ రాయల్టీలు ప్రైవేట్ సంస్థకు అప్పగించడంతో ఉత్పన్నమైన సమస్యల గురించి నాపరాతి గనుల యజమానులు మంత్రి బీసీ జనార్దనరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం బెలుం గుహల ఆవరణలో ఏర్పాటు చేసిన మైనింగ్, పాలీష్ ఫ్యాక్టరీలు, ట్రాక్టర్ యజమానులు, కార్మికులతో సమావేశం ఏర్పాటు చేశారు. రాయల్టీ ప్రవేట్ పరం చేయడంతో ఎదురవుతున్న కష్ట, నష్టాల గురించి పలువురు యజమానులు మంత్రికి వివరించి వినతి పత్రం అందజేశారు. పాత పద్ధతిలోనే రాయల్టీ విధానం ఉండేలా చేస్తేనే పరిశ్రమ మనుగడ సాధిస్తుందన్నారు. ప్రైవేట్ సంస్థకు అప్పగించడం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని అన్ని జిల్లాల్లో వివిధ రకాల మినరల్స్కు ఇదే పద్ధతి అమల్లో ఉందని మంత్రి బీసీ పేర్కొన్నారు. ఈ సమస్య ఒకటి, రెండు రోజుల్లో పరిష్కారం కాదని, పది రోజుల్లో ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఎన్నో ఆశలు పెట్టుకొని సమావేశానికి వచ్చిన యజమానులు నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారు. -
● టీడీపీ కౌన్సిలర్ల తీరుపై సర్వత్రా విమర్శలు ● కౌన్సిల్ సమావేశంలో ప్రజా సమస్యలు ప్రస్తావించని వైనం ● పార్టీ కార్యాలయ స్థలం కేటాయింపునకు పట్టు ● తీర్మానాన్ని ఆమోదించాలని గగ్గోలు ● వ్యతిరేకించిన మెజార్టీ సభ్యులు
ఆ నలుగురు అంతే! బొమ్మలసత్రం: ఎంతో నమ్మకంతో ప్రజలు వారిని వార్డు కౌన్సిలర్లుగా గెలిపించుకున్నారు. తమ సమస్యలు పరిష్కరిస్తారని, వార్డు అభివృద్ధికి కృషి చేస్తారని నమ్మి కౌన్సిలర్లుగా ఎన్నుకున్నారు. ప్రజల నమ్మకాన్ని వారు వమ్ము చేస్తున్నారు. పార్టీ కోసం ప్రజల సమస్యలను పక్కన పడేస్తున్నారు. వరుసగా మూడు నెలలుగా కౌన్సిల్ సమావేశాల్లో ఆ నలుగురు వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆయా వార్డు ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని 4, 12, 21, 27 వార్డు కౌన్సిలర్లు టీడీపీ పార్టీ కార్యాలయం నిర్మాణానికి స్థలం కేటాయింపుకు సంబంధించిన అంశాన్ని ఆమోదించుకోవాలని మూడు నెలలుగా సభలో వ్యవహరిస్తున్న తీరును అందరూ తప్పుబడుతున్నారు. ఓ వైపు ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రజలు అవస్థలు పడుతుంటే వాటిపై చర్చ జరపకుండా పార్టీ కార్యాలయం కోసం వారు చేస్తున్న గందరగోళంతో సభా సమయం వృథా అవుతోంది. శుక్రవారం నంద్యాల మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్హాల్లో చైర్పర్సన్ మాబున్నిసా అధ్యక్షతన కమిషనర్ శేషన్న ఆధ్వర్యంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్.. మోంథా తుపాన్ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా కృషి చేసిన అన్ని శాఖల అధికారులకు అభినందనలు తెలిపారు. అనంతరం అజెండాలోని మొదటి అంశమైన తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సంబంధించి పట్టణం నడిబొడ్డులో ఉన్న 1.57 సెంట్ల భూమి కేటాయింపు ప్రస్తావనను కౌన్సిల్ ఆమోదం కోసం ఉంచారు. అధిక సంఖ్యలో కౌన్సిల్ సభ్యులు ఈ తీర్మానాన్ని వ్యతిరేకించటంతో చైపర్సన్ ఆ అంశాన్ని రద్దు చేశారు. దీంతో 4వ వార్డుకు చెందిన టీడీపీ కౌన్సిలర్ మెహబూబ్వలి, 12వ వార్డుకు చెందిన ఇండిపెండెంట్ కౌన్సిలర్ శ్యామ్సుందర్లాల్, 21వ వార్డుకు చెందిన శ్రీదేవి, 27వ వార్డుకు చెందిన జైనాబీలు సభలో గందరగోళం సృష్టించారు. స్థలం కేటాయింపుకు అనుకూలంగా సభ్యులు ఆమోదం తెలపాలని పట్టుబట్టారు. సభలో వారు వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, పామ్షావలిలపై గట్టిగా కేకలు వేస్తూ బెదిరింపు ధోరణికి పాల్పడ్డారు. మెజార్టీ సభ్యుల అభ్యర్థన మేరకు చైర్పర్సన్ మాబున్నిసా ఆ అంశాన్ని రద్దు చేయటంతో ఆ నలుగురు కౌన్సిలర్లు బాయ్కాట్ చేసి వెళ్లిపోయారు. మూడు నెలలుగా.... కౌన్సిల్ సమావేశంలో గత మూడు నెలలుగా టీడీపీ సభ్యుల తీరు ఇలాగే ఉంది. ప్రజా సమస్యలు కౌన్సి ల్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకునేందుకు పట్టణంలో 42 వార్డుల కౌన్సిలర్లు కౌన్సిల్ సమావేశానికి హాజరవుతారు. అయితే తెలుగుదేశం పార్టీకి చెందిన ఈ నలుగరు సభ్యుల్లో ప్రజా సమస్యలు చర్చించా లన్న తపన లేకపోగా ప్రజలకు అవసరం లేని తమ పార్టీ కార్యాలయ స్థల కేటాయింపు కోసం వారు పడేపాట్లు చూస్తే ముక్కున వేలేసుకుంటున్నారు. తమ వార్డుల్లో అభివృద్ధి మొత్తం జరిగిపోయినట్లు .. ఇక తమ వార్డు ప్రజలకు ఎలాంటి సమస్యలు లేవన్నట్లు.. కేవలం ఒకే అంశాన్ని సభలో చర్చకు పట్టుబడటం చూసి స్థానికులు నవ్వుకుంటున్నారు. మంత్రి శంకుస్థాపన చేసినా ప్రయోజనం లేదు.. ఈ సందర్భంగా కౌన్సిలర్ కృష్ణమోహన్ మాట్లాడుతూ.. తమ వార్డులో సాక్షాత్తు మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినా ప్రయోజనం లేదన్నారు. అభివృద్ధి పనులకు తమ వద్ద నిధులు లేవని నేరుగా కమిషనర్ చెప్పడం భావ్యం కాదన్నారు. అనివృద్ధి పనులు చేయలేనప్పుడూ పన్నులు చెల్లించవద్దని వార్డు ప్రజలకు చెబుతామన్నారు. మంత్రి వచ్చి అభివృద్ధి పనులు ప్రారంభం చేసినప్పటికీ తమ వద్ద నిధులు లేవని చెప్పడం సరైందికాదన్నారు. అలాంటప్పు డూ వార్డుల్లో అభివృద్ధికి కృషి చేస్తున్నామంటూ ఆడంబరాలు చెప్పుకోవడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. అభివృద్ధికి నిధుల్లేవ్.. పట్టణంలోని 42 వార్డుల్లో రహదారులు, డ్రైనేజీలు తదితర అంశాలకు సంబంధించి కౌన్సిలర్లు ప్రస్తావనకు తేగా తమ వద్ద కౌన్సిలర్లు అడిగిన ప్రతి పనికి అంత నిధులు లేవని కమిషనర్ శేషన్న సమాధానమిచ్చారు. మున్సిపాల్టీ ద్వారా అమృత్ ఈఎంఐ చెల్లింపునకు రూ.74.53 లక్షలు కాగా తక్కిన వాటి ఖర్చులు పోను అంతంత మాత్రమే నిధులు ఉన్నాయని రూ.కోట్లు ఖర్చు చేసి కౌన్సిలర్లు అడిగిన సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించలేమని సభలో తేల్చి చెప్పారు. సీసీ రోడ్డు, డ్రైనేజీలు ఎక్కడ వేయాలో తాము వెమళ్లీ ప్రత్యక్షంగా చూసి ఆ పనులను మాత్రమే చేస్తానని కమిషనర్ వెల్లడించారు. -
పులుల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యం
రుద్రవరం: నల్లమల అటవీ ప్రాంతంలో పులుల సంరక్షణకు అత్యంత ప్రాధాన్య త ఇస్తామని ఎఫ్డీపీటీ బి.విజయకుమార్ అన్నారు. ఫీల్డ్ డైరెక్టర్ ప్రాజెక్టు టైగర్ (ఎఫ్డీపీటీ)గా బాధ్యతలు చేపట్టిన మొదటిసారి రుద్రవరంరేంజ్ను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. ఎర్రచందనం కలిగిన రేంజి, వన్యప్రాణులకు ఆవాసమిచ్చే ప్రదేశం రుద్రవరం రేంజిని అన్నారు. వృక్ష సంపదను కూల్చడం, వన్య ప్రాణులను వేటాడటం వంటి వాటిని అరికట్టేందుకు డ్రోన్ వంటి టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు తెలిపారు. కొండల్లో సాయుధ దళాలను రంగంలోకి దించుతామని, ఎలాంటి నేరాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆయన వెంట సబ్డీఎఫ్ఓ శ్రీనివాసరెడ్డి, రేంజర్ ముర్తుజావలి ఉన్నారు. -
గురువా.. కనవా!
అన్నదాతల వలస బాట మంత్రాలయం: జిల్లా పశ్చిమ ప్రాంతంలో బీడుభూములను సస్యశ్యామలం చేసేందుకు గురురాఘవేంద్ర ప్రాజెక్టును నిర్మించారు. ఈ ప్రాజెక్టు పరిధిలో ఒక మైనర్ ఇరిగేషన్, 11 ఎత్తిపోతల పథకాలు ఉండగా మొత్తం 50 వేల ఎకరాలకు నీరు అందించాల్సి ఉంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసింది. దీంతో నీరందక రైతులు పొలాలను బీళ్లుగా పెట్టుకున్నారు. తీవ్ర కరువుతో చాలా మంది చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు ఉన్న ఊరిని వదిలి జీవనోపాధి నిమిత్తం సుదూర ప్రాంతాలకు వలస వెళ్లారు. రబీ సీజన్ ప్రారంభమైనా రాష్ట్ర ప్రభుత్వం కనీసం గురురాఘవేంద్ర ప్రాజెక్టు మరమ్మతులకు నిధులను కూడా కేటాయించలేదు. ప్రాజెక్టు లక్ష్యం ఇదీ.. గురు రాఘవేంద్ర ప్రాజెక్టు కింద మంత్రాలయం నియోజకవర్గంలో మూగలదొడ్డి, దుద్ది, మాధవరం, బసలదొడ్డి ఎత్తిపోతలతోపాటు సూగూరు మైనర్ ఇరిగేషన్ జలాశయం నిర్మించారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్రెడ్డి చేతుల మీదుగా 2006లో సూగూరు జలాశయం ప్రారంభోత్సవం చేశారు. అదేరోజు రూ.261.19 కోట్లతో పులికనుమ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఇక ఎమ్మిగనూరు నియోజకవర్గంలో సోగనూరు, పూలచింత, చిలకలడోణ ఎత్తిపోతలు, కోడుమూరు నియోజకవర్గంలో ఏపీఎస్ఐడీసీ శాఖ పరిధిలో కృష్ణదొడ్డి, చింతమాన్పల్లె, రేమట, మునుగాల లిఫ్టు ఇరిగేషన్ పథకాలు నెలకొల్పారు. తుంగభద్ర నది నుంచి 5.373 టీఎంసీల నీటిని జలాశయాలకు ఎత్తిపోసి సాగునీరు అందించి ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఎమ్మిగనూరులో 4,350 ఎకరాలు, నందవరంలో 8,033 ఎకరాలు, మంత్రాలయంలో 11,034 ఎకరాలు, కోసిగిలో 8,566 ఎకరాలు, పెద్దకడబూరులో 1,420 ఎకరాలు, సి.బెళగల్లో 6,825 ఎకరాలు, గూడూరులో 4,365 ఎకరాలు, కర్నూలులో 4,997 ఎకరాల ఆయకట్టు నిర్ధారించారు. ప్రతిపాదనలకే పరిమితం ముఠా చోరీల కారణంగా ఆరు ఎత్తిపోతల పథకాలు నిర్వీర్యమయ్యాయి. పంపుహౌస్ల మరమ్మతుల కోసం ప్రాజెక్టు అధికారులు ప్రతిపాదనలు పంపి ఏడాది కావొస్తున్నా కూటమి ప్రభుత్వం కరుణించడం లేదు. ప్రాజెక్టు అధికారులు మరమ్మతులకు రూ.17 కోట్లు అంచనాతో ప్రతిపాదనలు పంపడం జరిగింది. మొండికేసిన ప్రభుత్వం ఇప్పటి వరకు చిల్లిగవ్వ కేటాయించలేదు. కేవలం రాష్ట్ర విపత్తు ఉపశమన నిధి (ఎస్డీఎంఎఫ్) కింద రూ.1.28 కోట్లు మాత్రమే మంజూరు చేసి చేతులు దులుపుకుంది. పథకం పరిధిలో ఏడు పనులు, జీతాలకు ఈ నిధి సరిపోయింది. మాధవరం, బసలదొడ్డి పథకాల నుంచి సెంటు భూమికి నీరివ్వలేదు. పథకాల పరిధిలో భూములు బీళ్లుగా మారాయి. మూగలదొడ్డి స్టేజ్–1 పంపుహౌస్ తుంగభద్ర నదిలో వరద నీరు ఏరులై పారుతోంది. పంపుహౌస్ల మరమ్మతులు చేపట్టకపోవడంతో పథకాలన్నీ దిష్టిబొమ్మలుగా మారాయి. నీరు ఎత్తిపోయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా రబీ సీజన్లో పంట సాగుకు అవకాశం లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదు. ఇటీవల ప్రభుత్వం హెచ్ఎన్ఎస్ఎస్ కాలువలు, కేసీ కాలువ మైనర్ రిపేర్లకు నిధులు కేటాయించి చేతులు దులుపుకుంది. జిల్లా పశ్చిమ ప్రాంత రైతులను పట్టించుకోకపోవడం దారుణం. –గడ్డం నారాయణరెడ్డి, వైఎస్సార్సీపీ రైతు సంఘం జిల్లా అధికార ప్రతినిధి పంపుహౌస్ల్లో జరిగిన చోరీలతో పథకాలు నిరుపయోగంగా మారాయి. కరువు ప్రాంత రైతులకు ఊతంగా ఉన్న ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడం సరికాదు. ఇప్పటికే చాలా గ్రామాల్లో రైతులు, వ్యవసాయ కూలీలు వలస వెళ్లారు. వలసల నియంత్రణకు జీఆర్పీ ప్రాజెక్టు మరమ్మతులు ఎంతో అవసరం. ఇప్పటికై నా ప్రభుత్వం దిగివచ్చి రబీ పంటలకు సాగునీరు అందించేందుకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాల్సి ఉంది. – రాముడు, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి -
గల్లంతైన వ్యక్తి మృతి
పాములపాడు: చెలిమిల్ల గ్రామం వద్ద సుద్దవాగులో ఈ నెల 28న గల్లంతైన వ్యక్తి శవమై కనపించాడు. మూడు రోజుల క్రితం కొత్తపల్లి మండలం నాగంపల్లి గ్రామానికి చెందిన నాగేశ్వరయ్య(46), వెంకటేష్ బైక్పై పాములపాడు నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా నీటి ప్రవాహానికి అదుపు తప్పి కింద పడ్డారు. నీటిలో కొట్టుకుపోతున్న వెంకటేష్ను చెలిమిల్ల గ్రామానికి చెందిన యువకులు కాపాడగా నాగేశ్వరయ్య అనే వ్యక్తి గల్లంతైన విషయం విధితమే. మూడు రోజులుగా ఉధృతంగా ఉన్న నీటి ప్రవాహంలో ఎస్ఐ సురేష్బాబు ఏపీఎస్డీఆర్ఎఫ్ బృందాలు, మత్స్యకారులు బోట్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం సాయంత్రం సమయంలో ఈతవనం వద్ద నాగేశ్వరయ్య మృత దేహం లభ్యమైంది. మృతుడికి అతనికి భార్య లక్ష్మీదేవి, కుమారుడు నాగమల్లేష్, కూతురు రాజేశ్వరి ఉన్నారు. ఈ నెల 28న మందుల కోసం పాముల పాడుకు వచ్చినట్లు బంధువులు తెలిపారు. ప్రత్యక్ష సాక్షి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పంచనామా నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు ఎస్ఐ సురేష్బాబు తెలిపారు. -
కృష్ణమ్మా.. చల్లగా చూడమ్మా!
శ్రీశైలంటెంపుల్: కార్తీక మాసోత్సవాల్లో భాగంగా రెండో శుక్రవారం సాయంత్రం కృష్ణమ్మ హారతి కార్యక్రమం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. పాతాళగంగ వద్ద ప్రతిష్టించిన కృష్ణవేణి విగ్రహానికి శాస్త్రోక్తంగా పూజలు చేపట్టారు. ముందుగా లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకులు సంకల్పాన్ని పఠించారు. నదీమతల్లికి ఏకహారతి, నేత్రహారతి, బిల్వహారతి, నాగహారతి, పంచహారతి, సద్యోజాతాది పంచహారతి, కుంభహారతి, నక్షత్రహారతి, రథహారతి, కర్పూరహారతులిచ్చారు. శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, ఏఈవో వెంకటేశ్వరరావు, పర్యవేక్షకులు పాల్గొన్నారు. -
జీఎస్టీ తగ్గింపు కావాలంటే డిస్కౌంట్ అడగొద్దు
చాలా దుకాణాల్లో నూతన జీఎస్టీ సంస్కరణల ఫలాలు అందడం లేదు. ఎవ్వరైనా అవగాహన ఉండి జీఎస్టీ తగ్గింది కదా ధరలు తగ్గాలి కదా అని అడిగితే నీకు జీఎస్టీ తగ్గించాలంటే డిస్కౌంట్ అడగొద్దు అని చెబుతున్నారు. జీఎస్టీ 12 శాతం నుంచి 5శాతానికి తగ్గింది. అంటే ఎంఆర్పీపై 7 శాతం మాత్రం తగ్గుతుంది. అదే డిస్కౌంట్ అయితే ఎంఆర్పీపై 10 శాతం డిస్కౌంట్ వస్తుంది. మనం జీఎస్టీ తగ్గించాలని అడిగితే డిస్కౌంట్ కోల్పోతాం. ఫలితంగా 3 శాతం మనకే నష్టమని భావించి అధిక శాతం వినియోగదారులు దుకాణదారులు ఇచ్చిన బిల్లుకు మందులు తీసుకుంటున్నారు. బిల్లు కావాలని అడిగిన వారికీ ఇదే పరిస్థితి నెలకొంది. బిల్లు కావాలంటే డిస్కౌంట్ అడగొద్దని ఖరాకండిగా చెప్పేస్తున్నారు. బిల్లు ఇస్తే ఎంఆర్పీపై 7 శాతం జీఎస్టీ తగ్గించి ఇవ్వాలి. అదే బిల్లు లేకుండా అయితే 10 శాతం డిస్కౌంట్తో ఇవ్వొచ్చు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రజలతో వ్యాపారులు మైండ్గేమ్ ఆడుతున్నారు. -
కన్నీటి దిగుబడి!
కర్నూలు(అగ్రికల్చర్): పొలంలో విత్తనం వేసినప్పటి నుంచి పంట పండించే వరకు రైతులు ఎంతో కష్టాలు ఎదుర్కొంటున్నారు. పంట చేతికొచ్చాక దానికి విలువ లేక లబోదిబోమంటున్నారు. మార్కెట్లో కనీసం మద్దతు ధర కూడా లభించకపోవడంతో కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్లో కర్నూలు జిల్లాలో 16,165, నంద్యాల జిల్లాలో 2,01,057 చొప్పున 2,17,222 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. విత్తనం వేసినప్పటి నుంచి రైతులకు కష్టాలు తప్పలేదు. తొలుత సాగునీటిని మళ్లించుకునేందుకు అవస్థలు పడ్డారు. కొన్ని చోట్ల డీజల్ ఇంజిన్లు అమర్చుకుని సాగునీటిని అందించారు. ఇందుకోసం ఎకరానికి రూ. 5 వేలు అదనపు భారం పడింది. అవసరం లేని సమయంలో వర్షాలు కురవడం, ఎండు తెగులు, కత్తెర పురుగు ఆశించడంతో కంకి నిండా గింజ రాలేదు. ఎకరాకు 30 నుంచి 35 క్వింటాళ్ల దిగుబడులు వస్తాయనుకుంటే 20 నుంచి 22 క్వింటాళ్లకే పరిమితమయ్యాయి. మిగిలింది నష్టమే! మొక్కజొన్న సాగులో రాణించాలంటే క్వింటాకు కనీసం రూ.2600 వరకు ధర ఉండాలి. ప్రస్తుతం మద్దతు ధర రూ.2400 ఉంది. మార్కెట్లో మాత్రం రూ.1400 నుంచి రూ.1800 వరకు మాత్రమే ధర వస్తోంది. పంట దిగుబడులు మార్కెట్లోకి రాకముందు క్వింటాకు రూ.2000 నుంచి రూ.2200 వరకు ధర లభించింది. దిగుబడులు మార్కెట్లోకి రావడం మొదలైన తర్వాత ధర పడిపోయింది. క్వింటాపై రైతులు రూ.600 నుంచి రూ.1000 వరకు నష్టపోతున్నారు. పెట్టుబడి వ్యయం ఎకరాకు రూ.30 వేల వరకు వస్తోంది. మద్దతు ధరతో అమ్ముకుంటే పెట్టిన పెట్టుబడి వస్తుంది. లేదంటే నష్టమే మిగులుతోంది. నాలుగైదు నెలల పాటు కష్టించిన రైతుకు మిగులు సున్నానే. ఽమొక్కజొన్న రైతు ఇంత భారీగా నష్టపోతున్నా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేకుండా పోయింది. నకిలీలతో నట్టేట మునిగిన రైతులు కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత నకిలీల బెడద పెరిగిపోయింది. ప్రధానంగా నంద్యాల జిల్లాలో మొక్కజొన్నలో విత్తనోత్పత్తి కూడా ఎక్కువగా ఉంటోంది. మామూలుగా అయితే మొక్కజొన్నలో గరిష్టంగా కంకులు మాత్రమే వస్తాయి. నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు, ఆత్మకూరు సబ్ డివిజన్లలో ఒక్క మొక్కకు ఐదారు కంకులు వచ్చాయి. ఒక్క కంకికి కూడా గింజలు రాలేదు. వీటిని చూస్తే ఎవ్వరికై న నకిలీ విత్తనాల ప్రభావమేనని స్పష్టమవుతుంది. కాని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు మాత్రం ‘అవి నకిలీ విత్తనాలు కాదు... అధిక వర్షాల వల్ల ఇలా జరిగింది’ అని చెప్పారు. నకిలీ విత్తనాలపై ఒక్క నందికొట్కూరు సబ్ డివిజన్లో 36 ఫిర్యాదులు వచ్చాయి. వైఎస్సార్సీపీ హయాంలో ఇలా.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది. పంటలకు మద్దతు ధర లేని సందర్భాల్లో ముందస్తుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. దీంతో పంటలకు మార్కెట్లో ధర పెరిగేది. మొక్కజొన్న, వరి తదితర పంటల కోతలకు ముందే రైతు భరోసా కేంద్రాల వారీగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో రైతులకు ఊరట లభించేది. ప్రస్తుతం ఇలా.. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పంటలకు ధరలు పడిపోయాయి. నష్టం వచ్చి రైతులు ఆత్మహత్యాయత్నాలు చేసుకుంటుండగా వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. మద్దతు ధరతో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై పౌరసరఫరాల సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు లేవు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సన్న రకాలు సాగు చేస్తారని, వీటికి ధర బాగుంటుందని ప్రభుత్వానికి పౌరసరఫరాల సంస్థ ప్రభుత్వానికి నివేదించంపై ఆందోళన వ్యక్తమవుతోంది.ఇవీ కష్టాలు.. పంట కోత, నూర్పిడి పనులు ప్రారంభం కాగా మోంథా తుపాన్ ప్రభావంతో ఇటీవల కురుస్తున్న వర్షాలతో రైతులు అల్లాడిపోతున్నారు. రోడ్లపై, కల్లాల్లో ఆరబెట్టిన దిగుబడులు తడిచి పోతున్నాయి. కోతకు వచ్చిన మొక్కజొన్న పైరు వర్షానికి నేలవాలడంతో రైతులకు కష్టాలు తప్పలేదు. మొక్కజొన్న రైతుకు లభించని ‘మద్దతు’ మార్కెట్లో అరకొర ధర స్పందించని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు లేక నష్టపోతున్న రైతులు -
మద్యం తాగి వాహనాలు నడిపితే జైలు
● ఎస్పీ విక్రాంత్ పాటిల్ కర్నూలు (టౌన్): మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి జైలు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. డ్రంకన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్లపై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నందున మండలాల్లో, గ్రామాల్లో చిన్నపాటి గొడవలు జరుగకుండా కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. అవసరం అయితే పీడీ యాక్ట్లు నమోదు చేయాలన్నారు. ప్రధాని పర్యటనలో వివిధ కేసుల్లో ప్రతిభ కనబరచిన పోలీసు అధికారులకు ఎస్పీ ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈగల్ టీమ్ క్యూర్ కోడ్ను అవిష్కరించారు. అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీరా, క్రిష్ణ మోహన్, లీగల్ ఆడ్వైజర్ మల్లిఖార్జునరావు, డిఎస్పీలు బాబు ప్రసాద్ పాల్గొన్నారు. -
ఇలాంటి సంఘటనలు ఇటీవల నిత్యం జరుగుతూనే ఉన్నాయి. గత నెల 22వ తేదీ నుంచి పలు వస్తువులపై జీఎస్టీ తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజూ ముమ్మరంగా అన్ని శాఖల అధికారులు ప్రచారం చేస్తూనే ఉన్నారు. కానీ కొన్ని రకాల వస్తు
చాలా మంది జీఎస్టీ సంస్కరణల మేరకు ఔషధాలు విక్రయించడం లేదని మా దృష్టికి వచ్చింది. ఇప్పటికే అందరికీ నూతన జీఎస్టీ ప్రకారం మందులు విక్రయించాలని ఆదేశాలు ఇచ్చాం. ఈ మేరకు వాట్సాప్లలో మెసేజ్లు పంపించాం. కరపత్రాలు మెడికల్షాపుల వద్ద అతికించాం. ఇటీవల కర్నూలులో నిర్వహించిన మేళాలో మూడు స్టాళ్ల ద్వారా అవగాహన కల్పించాం. కానీ చాలా మంది పాత స్టాక్ ఉందని చెబుతూ ధరలు తగ్గించకుండా మందులు విక్రయిస్తున్నారని తెలిసింది. ఇకపై ముమ్మరంగా దాడులు చేస్తాం. మోసపోయిన వారు ఫిర్యాదు చేస్తే ధరలు తగ్గించని వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలు తప్పకుండా బిల్లులు తీసుకోవాలి. –పి.హనుమన్న, డ్రగ్ ఇన్స్పెక్టర్, కర్నూలు కర్నూలు(హాస్పిటల్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో 3వేలకు పైగా రిటైల్, హోల్సేల్ మెడికల్షాపులు ఉన్నాయి. వీటిలో ప్రతిరోజూ రూ.కోట్ల దాకా వ్యాపారం సాగుతోంది. అయితే ఈ దుకాణాల్లో అధిక శాతం ప్రజలకు జీఎస్టీ 2.0 సంస్కరణల ఫలాలు అందడం లేదు. గతంలో ఔషధాలు, శస్త్రచికిత్సల పరికరాలపై 12 శాతం, కొన్నింటిపై మాత్రమే 5శాతం జీఎస్టీ ఉండేది. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా గత నెల 22వ తేది నుంచి మందులపై ఉన్న 12శాతం జీఎస్టీని 5 శాతానికి, క్యాన్సర్ సహా అరుదైన వ్యాధులకు వాడే 33 రకాల మందులపై జీఎస్టీని పూర్తిగా తొలగించింది. ఈ నూతన ధరల ప్రయోజనాలను సెప్టెంబర్ 22వ తేదీ నుంచే ప్రజలకు అందించాలని జాతీయ ఔషధ ధరల ప్రాధికార సంస్థ పేర్కొంది. కానీ మెజారిటీ దుకాణాల్లో ఈ తగ్గింపు ధరలు లభించడం లేదు. జీఎస్టీపై అధిక శాతం ప్రజలకు అవగాహన ఉన్న కర్నూలు నగరంలోనే నూతన సంస్కరణల ఫలాలు అందడం లేదు. ఇక నంద్యాల, ఆదోని, పత్తికొండ, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, డోన్, ఎమ్మిగనూరు, కోడుమూరు వంటి ప్రాంతాల్లో అడిగినా జీఎస్టీ తగ్గించే నాథుడే కరువయ్యారు. అధికారులకు తగ్గించామని చెబుతూనే ! ఒకవైపు జీఎస్టీ 12 శాతం నుంచి 7 శాతంకు తగ్గించి మందులు విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం అందించిన ఫలాలు ప్రజలకు చేరువ కావాలని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు మేళాలు, ప్రచార జాతాలు, ర్యాలీలు నిర్వహించి అధికారులు అవగాహన కల్పించారు. కానీ వారి ఆదేశాలు ఎక్కడా అమలు కావడం లేదు. ఏ దుకాణంలోనూ జీఎస్టీ తగ్గించి ఇవ్వడం లేదు. ఎక్కడా పాత, కొత్త ధరల బోర్డులు ఏర్పాటు చేయలేదు. అడిగితే మా వద్ద పాత స్టాక్ ఉందని, కొత్త స్టాక్ ధరలు తగ్గించి వస్తే ఇస్తామని దుకాణదారులు చెబుతున్నారు. ఇప్పుడు మీకు(వినియోగదారులకు) 7శాతం తగ్గించి ఇస్తే తాము నష్టపోతామని వారు పేర్కొంటున్నారు. పాత నిల్వలైనా ప్రస్తుత తగ్గిన ధరల ప్రకారమే అమ్మాలని స్పష్టమైన ఆదేశాలు అధికారులు ఇచ్చినా అమలు కావడం లేదు. జీఎస్టీ అధికారులతో పాటు డ్రగ్ నియంత్రణ అధికారులు నిఘా పెంచి తరచూ తనిఖీలు చేస్తేనే జీఎస్టీ తగ్గింపు ఫలాలు ప్రజలకు అందే వీలుంది. ఏది కావాలో తేల్చుకోమంటున్న మెడికల్ దుకాణాల వ్యాపారులు పాత ధరలకే మందుల అమ్మకాలు తగ్గించి విక్రయించని వైనం తప్పని పరిస్థితుల్లో కొనుగోలు చేస్తున్న సామాన్య ప్రజలు తనిఖీలు చేయని అధికారులు కర్నూలు నగరానికి చెందిన విజయ్కుమార్ ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న ఓ మెడికల్షాపునకు వెళ్లి మందులు కొన్నాడు. ఇందుకు అతనికి రూ.1,200 బిల్లు అయ్యింది. డిస్కౌంట్ పోను రూ.1,080 ఇవ్వాలని షాపు అతను సూచించాడు. ‘ఇప్పుడు మందులపై కూడా 7 శాతం జీఎస్టీ తగ్గింది కదా తగ్గించరా’ అని దుకాణదారున్ని విజయ్కుమార్ ప్రశ్నించాడు. ‘మీకు ఇప్పటికే 10 శాతం డిస్కౌంట్ ఇచ్చాం కదా...జీఎస్టీ కావాలంటే ఆ డిస్కౌంట్ ఉండదు’అని చెప్పాడు. దీంతో డిస్కౌంట్తోనే సరిపెట్టుకుని విజయకుమార్ వెళ్లిపోయాడు. కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనికి చెందిన మాధవరెడ్డి స్థానికంగా ఉన్న ఓ మెడికల్షాపులో మందులు కొన్నాడు. ఈ మేరకు రూ.3,600 బిల్లు అయ్యింది. డిస్కౌంట్ పోను రూ.3,140 చెల్లించాలని షాపు అతను సూచించాడు. బిల్లు కావాలని అడిగితే బిల్లు కావాల్సి వస్తే నీకు జీఎస్టీ 7 శాతం మాత్రమే తగ్గింపు ఉంటుందని చెప్పాడు. 3 శాతం నష్టపోవాల్సి వస్తుందని భావించి మాధవరెడ్డి బిల్లు లేకుండానే మందులు తీసుకెళ్లిపోయాడు. -
మద్యం, మాదక ద్రవ్యాలతో జీవితాలు నాశనం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి జడ్జి కబర్ధికర్నూలు (టౌన్): మద్యం, మాదక ద్రవ్యాలతో జీవితాలు సర్వనాశనం అవుతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి అన్నారు. జిల్లా న్యాయసేవాదికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి ఆధ్వర్యంలో జిల్లా కోర్టు వద్ద ట్రాఫిక్ రూల్స్, డ్రంక్ అండ్ డ్రైవ్ మాదక ద్రవ్యాల నిర్మూలనపై శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీ కర్నూలు జిల్లా కోర్టు నుంచి కొండారెడ్డి బురుజు వరకు కొనసాగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలన్నారు. తాగి వాహనం నడపడంతో ప్రమాదాలు జరగడమే కాకుండా జీవితాలు నాశనం అవుతాయన్నారు. ర్యాలీలో కర్నూలు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరినాథ్ చౌదరి, మొదటి, ఏడవ అదనపు జిల్లా జడ్జీలు కమలా దేవి, లక్ష్మీరాజ్యం, సీబీఐ కోర్టు జడ్జి శోభారాణి, కర్నూలు ఆర్టీసీ డిపో మేనేజర్ సుధారాణి, టౌన్ డీఎస్పీ బాబు ప్రసాద్, న్యాయవాదులు, పారా లీగల్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఈ నెల కొత్త పింఛన్లు లేవు
కర్నూలు(అగ్రికల్చర్): నవంబరు నెల పింఛన్ల పంపిణీ కార్యక్రమం శనివారం జరగనుంది. జిల్లాలో 2,37,904 పింఛన్లకు రూ.103.82 కోట్లు విడుదల అయ్యింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 17 నెలలు అవుతోంది. ఇప్పటి వరకు కొత్త పింఛన్ ఒక్కటి కూడా ఇవ్వలేదు. కనీసం పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. దీనిపై కూటమి ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. 2024 ఎన్నికల సమయంలో 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎప్టీ, బీసీ, మైనార్టీలకు పింఛన్లు ఇస్తామని టీడీపీ నేతలు ఊరువాడా ప్రకటించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఈ ఊసే లేకుండా పోయింది. కొత్త పించన్లు ఇవ్వకపోగా.. ఉన్న వాటిని అడ్డుగోలుగా తొలగిస్తుండటం పట్ల నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నేటి నుంచి అఖిల భారత సర్వీసు అధికారుల పర్యటన కర్నూలు(సెంట్రల్): గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీల పనితీరును పరిశీలించేందుకు జిల్లాకు 15 మంది అఖిల భారత సర్వీసు అధికారులను కేటాయించారు. ఇందులో ఒక్కరు ఐఈఎస్, ముగ్గురు ఐఎస్ఎస్, ఇద్దరు ఐసీఏఎస్, ఏడుగురు ఐఎఫ్ఎస్, ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఉన్నారు. వీరంతా ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో శిక్షణలో ఉన్నారు. ఈనేపథ్యంలో జిల్లాలోని గ్రామపంచాయతీలు, మునిసిపాలిటీల్లో పనితీరును నవంబర్ 1 నుంచి 8వ తేదీ వరకు పరిశీలించి తిరిగి వారికి కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్టును నమోదు చేస్తారు. కొత్త పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలు తెలపాలి కర్నూలు(సెంట్రల్): జిల్లాలో కొత్తగా ప్రతిపాదించిన 240 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీల ప్రతిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు రావడంతో 240 కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వీటిపై రాజకీయ పార్టీలు ఏమైనా సలహాలు, సూచనలు, అభ్యంతరాలు ఉంటే తెలపాలని కోరారు. ఇప్పటికే ఉన్న 2,203 కేంద్రాలకు కొత్త కేంద్రాలు అదనమన్నారు. కార్యక్రమంలో డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ మురళీ పాల్గొన్నారు. ఆదోని టౌన్: బస్సులు నడపాలని విద్యార్థులు శుక్రవారం ఆదోని ఆర్టీసీ డిపో ఎదుట రహదారిపై ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ డిపో అసిస్టెంట్ మేనేజర్ మల్లికార్జునకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా డీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఢణాపురం ఉదయ్బాబు మాట్లాడుతూ.. వివిధ గ్రామాల నుంచి అనేక మంది విద్యార్థులు కళాశాలలకు, పాఠశాలలకు చదువుకోవడానికి ఆదోని పట్టణానికి వస్తుంటారన్నారు. బస్సులు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. విద్యార్థులతో టూటౌన్ ఎస్ఐ రామ్నాథ్ మాట్లాడటంతో ధర్నా విరమించారు. -
వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్తగా బుట్టారేణుక
● ఎమ్మిగనూరు సమన్వయకర్తగా రాజీవ్రెడ్డిఎమ్మిగనూరుటౌన్: వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్తగా మాజీ ఎంపీ బుట్టా రేణుకను నియమించారు. అలాగే ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్తగా మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడైన కడిమెట్ల రాజీవ్రెడ్డిని నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్రకార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. -
డిస్కౌంట్ కావాలా..జీఎస్టీ తగ్గించాలా?
ఇలాంటి సంఘటనలు ఇటీవల నిత్యం జరుగుతూనే ఉన్నాయి. గత నెల 22వ తేదీ నుంచి పలు వస్తువులపై జీఎస్టీ తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజూ ముమ్మరంగా అన్ని శాఖల అధికారులు ప్రచారం చేస్తూనేఉన్నారు. కానీ కొన్ని రకాల వస్తువుల ధరలు మాత్రం తగ్గడం లేదు. తమ వద్ద పాత స్టాక్ ఉందని, జీఎస్టీ తగ్గించి ఇచ్చి మేం నష్టపోవాలా అని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు.కర్నూలు(హాస్పిటల్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో 3వేలకు పైగా రిటైల్, హోల్సేల్ మెడికల్షాపులు ఉన్నాయి. వీటిలో ప్రతిరోజూ రూ.కోట్ల దాకా వ్యాపారం సాగుతోంది. అయితే ఈ దుకాణాల్లో అధిక శాతం ప్రజలకు జీఎస్టీ 2.0 సంస్కరణల ఫలాలు అందడం లేదు. గతంలో ఔషధాలు, శస్త్రచికిత్సల పరికరాలపై 12 శాతం, కొన్నింటిపై మాత్రమే 5శాతం జీఎస్టీ ఉండేది. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా గత నెల 22వ తేది నుంచి మందులపై ఉన్న 12శాతం జీఎస్టీని 5 శాతానికి, క్యాన్సర్ సహా అరుదైన వ్యాధులకు వాడే 33 రకాల మందులపై జీఎస్టీని పూర్తిగా తొలగించింది. ఈ నూతన ధరల ప్రయోజనాలను సెపె్టంబర్ 22వ తేదీ నుంచే ప్రజలకు అందించాలని జాతీయ ఔషధ ధరల ప్రాధికార సంస్థ పేర్కొంది. కానీ మెజారిటీ దుకాణాల్లో ఈ తగ్గింపు ధరలు లభించడం లేదు. జీఎస్టీపై అధిక శాతం ప్రజలకు అవగాహన ఉన్న కర్నూలు నగరంలోనే నూతన సంస్కరణల ఫలాలు అందడం లేదు. ఇక నంద్యాల, ఆదోని, పత్తికొండ, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, డోన్, ఎమ్మిగనూరు, కోడుమూరు వంటి ప్రాంతాల్లో అడిగినా జీఎస్టీ తగ్గించే నాథుడే కరువయ్యారు. అధికారులకు తగ్గించామని చెబుతూనే ! ఒకవైపు జీఎస్టీ 12 శాతం నుంచి 7 శాతంకు తగ్గించి మందులు విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం అందించిన ఫలాలు ప్రజలకు చేరువ కావాలని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు మేళాలు, ప్రచార జాతాలు, ర్యాలీలు నిర్వహించి అధికారులు అవగాహన కల్పించారు. కానీ వారి ఆదేశాలు ఎక్కడా అమలు కావడం లేదు. ఏ దుకాణంలోనూ జీఎస్టీ తగ్గించి ఇవ్వడం లేదు. ఎక్కడా పాత, కొత్త ధరల బోర్డులు ఏర్పాటు చేయలేదు. అడిగితే మా వద్ద పాత స్టాక్ ఉందని, కొత్త స్టాక్ ధరలు తగ్గించి వస్తే ఇస్తామని దుకాణదారులు చెబుతున్నారు. ఇప్పుడు మీకు(వినియోగదారులకు) 7శాతం తగ్గించి ఇస్తే తాము నష్టపోతామని వారు పేర్కొంటున్నారు. పాత నిల్వలైనా ప్రస్తుత తగ్గిన ధరల ప్రకారమే అమ్మాలని స్పష్టమైన ఆదేశాలు అధికారులు ఇచ్చినా అమలు కావడం లేదు. జీఎస్టీ అధికారులతో పాటు డ్రగ్ నియంత్రణ అధికారులు నిఘా పెంచి తరచూ తనిఖీలు చేస్తేనే జీఎస్టీ తగ్గింపు ఫలాలు ప్రజలకు అందే వీలుంది. » కర్నూలు నగరానికి చెందిన విజయ్కుమార్ ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న ఓ మెడికల్షాపునకు వెళ్లి మందులు కొన్నాడు. ఇందుకు అతనికి రూ.1,200 బిల్లు అయ్యింది. డిస్కౌంట్ పోను రూ.1,080 ఇవ్వాలని షాపు అతను సూచించాడు. ‘ఇప్పుడు మందులపై కూడా 7 శాతం జీఎస్టీ తగ్గింది కదా తగ్గించరా’ అని దుకాణదారున్ని విజయ్కుమార్ ప్రశ్నించాడు. ‘మీకు ఇప్పటికే 10 శాతం డిస్కౌంట్ ఇచ్చాం కదా...జీఎస్టీ కావాలంటే ఆ డిస్కౌంట్ ఉండదు’అని చెప్పాడు. దీంతో డిస్కౌంట్తోనే సరిపెట్టుకుని విజయకుమార్ వెళ్లిపోయాడు.» కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనికి చెందిన మాధవరెడ్డి స్థానికంగా ఉన్న ఓ మెడికల్షాపులో మందులు కొన్నాడు. ఈ మేరకు రూ.3,600 బిల్లు అయ్యింది. డిస్కౌంట్ పోను రూ.3,140 చెల్లించాలని షాపు అతను సూచించాడు. బిల్లు కావాలని అడిగితే బిల్లు కావాల్సి వస్తే నీకు జీఎస్టీ 7 శాతం మాత్రమే తగ్గింపు ఉంటుందని చెప్పాడు. 3 శాతం నష్ట పోవాల్సి వస్తుందని భావించి మాధవరెడ్డి బిల్లు లేకుండానే మందులు తీసుకెళ్లిపోయాడు. జీఎస్టీ తగ్గింపు కావాలంటే డిస్కౌంట్ అడగొద్దుచాలా దుకాణాల్లో నూతన జీఎస్టీ సంస్కరణల ఫలాలు అందడం లేదు. ఎవ్వరైనా అవగాహన ఉండి జీఎస్టీ తగ్గింది కదా ధరలు తగ్గాలి కదా అని అడిగితే నీకు జీఎస్టీ తగ్గించాలంటే డిస్కౌంట్ అడగొద్దు అని చెబుతున్నారు. జీఎస్టీ 12 శాతం నుంచి 5శాతానికి తగ్గింది. అంటే ఎంఆర్పీపై 7 శాతం మాత్రం తగ్గుతుంది. అదే డిస్కౌంట్ అయితే ఎంఆర్పీపై 10 శాతం డిస్కౌంట్ వస్తుంది. మనం జీఎస్టీ తగ్గించాలని అడిగితే డిస్కౌంట్ కోల్పోతాం. ఫలితంగా 3 శాతం మనకే నష్టమని భావించి అధిక శాతం వినియోగదారులు దుకాణదారులు ఇచ్చిన బిల్లుకు మందులు తీసుకుంటున్నారు. బిల్లు కావాలని అడిగిన వారికీ ఇదే పరిస్థితి నెలకొంది. బిల్లు కావాలంటే డిస్కౌంట్ అడగొద్దని ఖరాకండిగా చెప్పేస్తున్నారు. బిల్లు ఇస్తే ఎంఆర్పీపై 7 శాతం జీఎస్టీ తగ్గించి ఇవ్వాలి. అదే బిల్లు లేకుండా అయితే 10 శాతం డిస్కౌంట్తో ఇవ్వొచ్చు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రజలతో వ్యాపారులు మైండ్గేమ్ ఆడుతున్నారు. పాత స్టాక్ ఉన్నా జీఎస్టీ తగ్గించి అమ్మాలి చాలా మంది జీఎస్టీ సంస్కరణల మేరకు ఔషధాలు విక్రయించడం లేదని మా దృష్టికి వచ్చింది. ఇప్పటికే అందరికీ నూతన జీఎస్టీ ప్రకారం మందులు విక్రయించాలని ఆదేశాలు ఇచ్చాం. ఈ మేరకు వాట్సాప్లలో మెసేజ్లు పంపించాం. కరపత్రాలు మెడికల్షాపుల వద్ద అతికించాం. ఇటీవల కర్నూలులో నిర్వహించిన మేళాలో మూడు స్టాళ్ల ద్వారా అవగాహన కల్పించాం. కానీ చాలా మంది పాత స్టాక్ ఉందని చెబుతూ ధరలు తగ్గించకుండా మందులు విక్రయిస్తున్నారని తెలిసింది. ఇకపై ముమ్మరంగా దాడులు చేస్తాం. మోసపోయిన వారు ఫిర్యాదు చేస్తే ధరలు తగ్గించని వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలు తప్పకుండా బిల్లులు తీసుకోవాలి. – పి.హనుమన్న, డ్రగ్ ఇన్స్పెక్టర్, కర్నూలు -
'ప్రారంభ' శూరత్వం!
కర్నూలు(అగ్రికల్చర్): రాష్ట్రంలోనే అత్యధికంగా పత్తి సాగయింది కర్నూలు జిల్లాలోనే. ఈ ఖరీఫ్ సీజన్లో 5.62 లక్షల ఎకరాల్లో పంట సాగు చేశారు. అధిక వర్షాలు.. గులాబిరంగు పురుగుతో పాటు చీడపీడల బెడద తీవ్రం కావడంతో దిగుబడులు తగ్గిపోయాయి. సాధారణంగా ఎకరాకు 8–9 క్వింటాళ్ల దిగుబడులు వస్తాయి. ఈ సారి నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా దిగుబడులు 4–5 క్వాంటాళ్లకే పరిమితం అవుతున్నాయి. పెట్టుబడి వ్యయానికి అనుగుణంగా క్వింటాకు ధర రూ.9వేల వరకు ఉంటే గిట్టుబాటు అవుతుంది. ఇంతవరకు అమ్ముకున్న రైతుల్లో ఏ ఒక్కరికీ రూ.7వేలలకు మించి ధర లభించలేదు. రూ.6వేల–రూ.6,500 ధరతో అమ్ముకొని రైతులు నష్టపోతున్నారు. ధరలు పడిపోయినప్పుడు ప్రభుత్వం వెంటనే మద్దతు ధరతో కొనుగోలు చేసే ప్రక్రియను చేపట్టి రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపాల్సి ఉంది. అయితే సీఎం చంద్రబాబు ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం రైతుల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధికి అద్దం పడుతోంది. పత్తి క్రయవిక్రయాలకు ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డు మాత్రమే ఏకైక ఆధారం. మార్కెట్లో వ్యాపారులు సిండికేట్ అవుతుండటంతో ధరల్లో పురోగతి లోపిస్తోంది. మద్దతు ధర రూ.8,110.. మార్కెట్లో రూ.7వేల లోపే! వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారమే ఎకరా పత్తి సాగుకు పెట్టుబడి వ్యయం రూ.36,500 వరకు వస్తోంది. పత్తికి మద్దతు ధర రూ.8110 ఉంది. అయితే మార్కెట్లో ప్రస్తుతం రూ.6వేల–రూ.7వేల ధర మాత్రమే లభిస్తోంది. రెక్కల కష్టాన్ని తక్కువ ధరకు అమ్ముకొని రైతులు నష్టపోతున్నారు. ఈ ఖరీఫ్లో సాగు చేసిన పత్తిలో దిగుబడులు ఆగస్టు మూడవ వారం నుంచే మొదలయ్యాయి. రైతులు ఆదోని మార్కెట్కు, పత్తి జిన్నింగ్ మిల్లులకు తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు. ఇప్పటికే దాదాపు 10 లక్షల క్వింటాళ్ల పత్తి క్రయవిక్రయాలు జరిగాయి. మూడు నెలలు ఆలస్యంగా కొనుగోలు కేంద్రాలు పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు మార్కెటింగ్ శాఖ 20 రోజుల నుంచి చెబుతోంది. ఈ సారి ముందస్తు వర్షాలు పడటంతో ఆగస్టు నుంచే పత్తి దిగుబడులు మొదలయ్యాయి. ఎట్టకేలకు మూడు నెలల తర్వాత కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే 10 లక్షల క్వింటాళ్ల పత్తిని అమ్ముకొని వేలాది మంది రైతులు నష్టపోయిన తర్వాత కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఆదోనిలో 4, ఎమ్మిగనూరులో 4, మంత్రాలయంలో 1, పెంచికలపాడులో ఒకటి ప్రకారం మొత్తం 10 జిన్నింగ్ మిల్లుల్లో మద్దతు ధరతో పత్తి కొనుగోలుకు సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. అయితే ఇప్పటి వరకు కొనుగోళ్లు చేపట్టకపోవడం గమనార్హం. కర్నూలు సమీపంలోని గూడూరు మండలంలో పంటల నమోదు అస్తవ్యస్తంగా తయారైంది. రైతుభరోసా కేంద్రం ఇన్చార్జీలు స్పందించడం లేదని తెలుస్తోంది. మండల వ్యవసాయ అధికారి పట్టించుకోవడం లేదనే చర్చ జరుగుతోంది. దీంతో రైతులు ఎవరికి చెప్పుకోవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఫిర్యాదు చేద్దామంటే ఏఓకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫలితం లేకపోతోందని రైతులు వాపోతున్నారు.ఈ–క్రాప్ పూర్తి కాదు.. యాప్ పనిచేయదు.. » పత్తిని మద్దతు ధరతో అమ్ముకోవాలంటే పంట సాగు చేసినట్లు ఈ–క్రాప్లో నమోదు కావాల్సి ఉంది. » ఈ సారి పంటల నమోదు ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి. » మేము పత్తి సాగు చేశాం.. పంటను ఈ–క్రాప్లో నమోదు చేయాలని కోరుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. » పత్తి పంటను మద్దతు ధరతో అమ్ముకోవడానికి యాప్ ఇచ్చారు. » ఈ యాప్పై అవగాహన లేకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. » అవగాహన కల్పించాల్సిన వ్యవసాయ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జిల్లాలో 10 జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఇప్పటికే జిల్లాలోని ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, పెంచికలపాడుల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాం. వీటిని జాయింట్ కలెక్టర్ కూడా పరిశీలించారు. రైతులు సీఎం యాప్లో పేర్లు నమోదు చేసుకొని మద్దతు ధరతో అమ్ముకోవచ్చు. ఈ అవకాశాన్ని సది్వనియోగం చేసుకోవాలి. – నారాయణమూర్తి, సహాయ సంచాలకులు, మార్కెటింగ్ శాఖ ప్రభుత్వ తీరుతోనే నష్టపోతున్నాంఈ ఏడాది అధిక వర్షాలతో పత్తిలో దిగుబడులు పడిపోయాయి. ఖరీఫ్లో 13 ఎకరాల్లో పత్తి సాగు చేశాం. ఎకరాకు పెట్టుబడి రూ.36 వేల వరకు వచ్చింది. అధిక వర్షాలతో కాయలన్నీ కుళ్లిపోతున్నాయి. దిగుబడి ఎకరాకు సగటున 5 క్వింటాళ్ల వరకు వస్తోంది. ప్రస్తుతం వ్యాపారులు రూ.6,500 నుంచి రూ.7వేల ధరతో కొంటున్నారు. మద్దతు ధర రూ.8,110 ఉంది. వ్యాపారులు కొంటున్న ధరతో పోలిస్తే క్వింటాపై రూ.1000 పైనే నష్టపోతున్నాం. – ఇప్పల శేషారెడ్డి, లక్ష్మీపురం గ్రామం, కల్లూరు మండలం -
ప్రైవేటు చెక్ పోస్టులు ఎత్తేయాలి
● నాపరాతి పరిశ్రమ యజమానులు, కార్మికుల ఆందోళన బేతంచెర్లలో నిరసన తెలుపుతున్న నాపరాతి పరిశ్రమ కార్మికులుప్రైవేట్ రాయల్టీ చెక్ పోస్ట్ వద్ద నిలిచిన నాపరాళ్ల ట్రాక్టర్లుబేతంచెర్ల: నాపరాళ్ల పరిశ్రమకు పాత పద్ధతిలోనే రాయల్టీలు మంజూరు చేస్తూ, ప్రైవేటు చెక్పోస్టులు ఎత్తేయాలని మైనింగ్, ట్రాక్టర్ యజమానులు, కార్మికులు ఆందోళనకు దిగారు. గురువారం పట్టణంలోని బనగానపల్లె రహదారిలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రైవేటు రాయల్టీ చెక్ పోస్టు వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇప్పటికే నష్టాల్లో ఉన్న నాపరాతి పరిశ్రమపై రాయల్టీలు పెంచడమే కాకుండా ప్రైవేటుకు అప్పగించడం ఎంత వరకు సమంజసం అన్నారు. సంక్షోభంలో ఉన్న నాపరాతి పరిశ్రమ వాస్తవ పరిస్థితులను తెలుసుకోకుండా పెద్ద తరహా పరిశ్రమలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పరిశ్రమలను నడుపుకోలేక పోతున్నామన్నారు. ప్రభుత్వం దిగిరాకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యజమానులు, కార్మికులు వెంకటేశ్వర్లు, చింతల నాగిరెడ్డి, మోహన్ రావు, నాగేశ్వరరావు, ఓబులేసు, సుబ్రమణ్యం, నాగేష్, లక్ష్మి కాంతారెడ్డి, ఉపేంద్ర, ప్రసాద్, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. -
ఆశలను ‘కూల్చేసి’!
ఆర్థిక పరిస్థితి బాగోలేక ఇంటి నిర్మాణాలను చేపట్టలేని పేదల ఇళ్లను ప్రభుత్వం రద్దు చేసేందుకు పూనుకోవడం అనాలోచిత చర్య. ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణాలకు ఒక్కో ఇంటికి రూ.4 లక్షలు అందించాలి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర దాటినా, నేటి వరకు గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు ఒక్క ఇళ్లు కూడా మంజూరు చేయకపోవడం దుర్మార్గం. – కే రామాంజనేయులు, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో కేవలం ఓట్ల కోసం ప్రజలను మోసం చేసేందుకు పలు హామీలను ఇచ్చింది. పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్ల స్థలాలను ఇచ్చి గృహాలు నిర్మించి ఇస్తామని నమ్మబలికింది. అయితే నేటికి ఒక్క గృహాన్ని కూడా మంజూరు చేయలేదు. హామీని అమలు చేయాలి. – కే ప్రభాకర్రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుకర్నూలు(అర్బన్): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పేద వర్గాలకు సంబంధించిన ఇళ్లపై కాఠిన్యాన్ని ప్రదర్శిస్తోంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండి, మంజూరైన ఇంటిని నిర్మించుకోలేని గృహాలను రద్దు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు క్షేత్ర స్థాయిలోని అధికారులు ఆయా కాలనీలను సందర్శించి నిర్మాణాలు ప్రారంభించని గృహాలను లెక్కగట్టి, వీటిని రద్దు చేసేందుకు ప్రతిపాదనలను పంపారు. ఈ లెక్కన జిల్లాలోని నాలుగు అర్బన్ ప్రాంతాల్లో 13,403 గృహాలు రద్దు కానున్నాయి. గత వైఎస్సార్సీపీ పాలనలో ‘నవ రత్నాలు పేదలందరికి ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా నిరుపేద వర్గాల సొంతింటి కలను సాకారాం చేసేందుకు చేసిన ప్రయత్నాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం నీరుగారుస్తోంది. ఎలాంటి సొంత స్థలం లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలను ఇచ్చి, ఉచితంగా ఇళ్లు నిర్మించుకునేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం జిల్లాలో 291 వైఎస్సార్ జగనన్న కాలనీలను ఏర్పాటు చేసి దాదాపు 52 వేల గృహాలను మంజూరు చేసింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం జగనన్న కాలనీల పేర్లను పీఎంఏవై ఎన్టీఆర్ కాలనీలుగా మార్చింది. అలాగే అప్పట్లో ఇళ్లు మంజూరైనా, వివిధ కారణాల వల్ల గృహ నిర్మాణాలు చేపట్టని పేదల ఇళ్లను రద్దు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో ఆర్థిక కష్టాల్లో ఉన్న పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో ఒక్క ఇంటినీ మంజూరు చేయని ప్రభుత్వం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర పూర్తవుతున్నా, నేటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఒక్క ఇళ్లు కూడా మంజూరు చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సొంత ఇళ్లు లేని వేలాది మంది పేదలు గ్రామ/వార్డు సచివాలయాల్లో ఇళ్ల కోసం దరఖాస్తు చేస్తున్నా, నేటికీ ఎలాంటి పురోగతి కనిపించని పరిస్థితి. కేవలం అర్బన్ ప్రాంతాల్లో (కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, గూడురు) అది కూడా సొంత స్థలాలు ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో పీఎంఏవై –2 కింద 2,839 మందికి గృహాలు మంజూరైనట్లు సమాచారం. ఈ పథకం కింద ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.50 లక్షలను అందించనున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.1.50 లక్షలు కాగా, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.లక్షగా ఉంది. అయితే ఈ నిర్మాణాలు కూడా ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. 13,403 గృహాల రద్దుకు ప్రతిపాదనలు గ్రామాల్లో కొత్తగా ఒక్క ఇంటినీ మంజూరు చేయని ప్రభుత్వం అర్బన్లో సొంత స్థలాలున్న వారికి మాత్రమే 2,839 గృహాలు మంజూరు -
జగనన్న ఉన్నప్పుడే ఇన్పుట్ సబ్సిడీ వచ్చేదని రైతులు అంటున్నారు
నంద్యాల జిల్లాలో 5,98,750 ఎకరాల్లో పంటలు వేస్తే మొత్తం దాదాపు 36 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వరి 17,312 ఎకరాలు, కంది 1046, మినుములు 769 హెక్టార్లు, మొక్కజొన్న 17 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఆళ్లగడ్డలో రెండు కాలనీల మునిగిపోతే మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. వరి పంట పడిపోయింది. అరటి దెబ్బతినింది. వర్షం వల్ల బాగా ఇబ్బంది అయ్యింది. జగనన్న ఉన్నప్పుడే ఇన్ పుట్ సబ్సిడీ వచ్చేదని రైతులు అంటున్నారు. – కాటసాని రాంభూపాల్రెడ్డి, పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు -
నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం ఇవ్వాలి
● ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి చిప్పగిరి: మోంథా తుపాన్తో పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిహారం ఇవ్వాలని అలూరు ఎమ్మెల్యే విరూపాక్షి డిమాండ్ చేశారు. తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో గురువారం ఎమ్మెల్యే మాట్లాడారు. భారీ వర్షాలకు అలూరు, చిప్పగిరి, దేవనకొండ, హాలహర్వి, హొళగుంద, ఆస్పరి మండలాల్లో మిరప, పత్తి, కంది, వేరుశనగ, సజ్జ, ఉల్లి, టమాట పంటలు దెబ్బతిన్నాయన్నారు. ఇటీవల సాగు చేసిన పప్పుశనగ, మిరప తదితర పైర్లు నీట మునిగి కుళ్లిపోయాయన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రకృతి సైతం రైతులపై పగబట్టినట్లు ఉందని అన్నారు. పంట నష్టంపై ప్రభుత్వం తక్షణమే సర్వే నిర్వహించి, రైతులకు వెంటనే పరిహారం అందించాలన్నారు. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిగా హేమంత్కుమార్ ● నేడు జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి శ్రీనివాస్ పదవీ విరమణ కర్నూలు(అగ్రికల్చర్): పశుసంవర్ధకశాఖ జిల్లా అధికారిగా డాక్టర్ హేమంత్కుమార్ నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం కర్నూలులోని బహుళార్ధ పశువైద్యశాల డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఈయన కొద్ది నెలలుగా కర్నూలు డివిజన్ డిప్యూటీ డైరెక్టర్గా కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిగా నియమిస్తూ ఆ శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారిగా పనిచేస్తున్న గుడివాడ శ్రీనివాస్ ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. ఖాళీ అవుతున్న ఈ పోస్టులో డాక్టర్ హేమంత్కుమార్ను తాత్కాలికంగా నియమించారు. 61 ఇళ్లు నేలమట్టం కర్నూలు(సెంట్రల్): మోంథా తుపాన్ ప్రభావంతో జిల్లాలో 61 ఇళ్లులు నేలమట్టం అయ్యాయి. ఈమేరకు ప్రభుత్వానికి అధికారులు నివేదించారు. జిల్లాలో దెబ్బతిన్న పంటల అంచనా కొనసాగుతోంది. దాదాపు 35 వేలకుపైగా ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. పూర్తి స్థాయి వివరాలు వచ్చిన తరువాత ప్రభుత్వానికి కలెక్టర్ నివేదించనున్నారు. వివాహ వెబ్సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండండి కర్నూలు: వివాహ సంబంధ వెబ్సైట్ల (మ్యాట్రిమోనియల్) పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. ఇటీవలి కాలంలో వివాహ సంబంధ వెబ్సైట్లు, మొబైల్ యాప్స్, సోషల్ మీడియా వేదికల ద్వారా మ్యాట్రిమోనియల్ మోసాలు జరుగుతున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చినట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రేమ, పెళ్లి పేరుతో వ్యక్తిగత, ఆర్థిక సమాచారం పొందే నేరగాళ్లు అమాయకుల నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. నకిలీ పేర్లతో ఆకర్షణీయమైన ఫొటోలతో మ్యాట్రిమోనియల్ ప్రొఫైళ్లు సృష్టించి మోసాలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. ఎవరైనా మోసానికి గురైతే సైబర్ క్రైం టోల్ఫ్రీ నెంబర్ 1930కి ఫిర్యాదు చేయాలన్నారు. -
ఉల్లి, పత్తికి ఎక్కువ నష్టం
మా జిల్లాలో ఉల్లి, పత్తికి ఎక్కువ నష్టం జరిగింది. ఉల్లి రైతులకు హెక్టార్కు రూ.50 వేల పరిహారం ఇస్తామని చెప్పినా, ఇప్పటి వరకు మొదలు పెట్టలేదు. రైతులంతా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. ఇంకా విధి విధానాల రూపకల్పనలోనే ఉన్నామని చెబుతున్నారు. చంద్రబాబు ఎప్పుడు వచ్చినా అతివృష్టి, అనావృష్టి. అని ప్రజలు అనుకుంటున్నారు. ఉల్లి పంటకు ఇంత ముందు రూ.1200 ఇస్తామని కొన్నారు. కానీ, రైతులకు ఆ రూ.1200 ఇప్పటికీ ఇవ్వలేదు. దాదాపు 75 శాతం రైతులు కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. – ఎస్వీ మోహన్రెడ్డి, పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు -
కర్నూలు ఘటనాస్థలి వద్ద షాకింగ్ దృశ్యాలు
వెల్దుర్తి: కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదం 19 మంది ప్రాణాలను బలిగొన్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా కన్నీళ్లు పెట్టించిన ఈ ఘటనలో కాలిబూడిదైన మృతదేహాలను ఇప్పటికే కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఘటన జరిగిన రోజునే పోలీసులు బస్సును క్షుణ్ణంగా పరిశీలించి అక్కడి వస్తువులను తరలించారు. అయితే మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో వారు ధరించిన బంగారం, వెండి ఆభరణాలు కరిగి బూడిదలో ఉంటాయనే దురాశతో మహబూబ్నగర్కు చెందిన కొన్ని కుటుంబాలు బుధవారం బస్సు దుర్ఘటన ప్రాంతానికి చేరుకున్నారు. బూడిదను సంచుల్లో సేకరించి, ప్రమాద స్థలికి దగ్గరలోని ఓ కుంట వద్ద నీటిలో కడిగి మరీ పరీక్షిస్తున్నారు. ఈ ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపగా.. వీళ్లు మాత్రం ఆశ చంపుకోలేక ఇలా దూరప్రాంతం నుంచి రావడం అందరినీ నివ్వెరపరుస్తోంది. -
టెండర్లలో పాల్గొనొద్దు
కర్నూలు (టౌన్): కర్నూలు కార్పొరేషన్లో టెండర్ల పనులపై అధికార పార్టీ నేతల అనుచరులు హల్చల్ చేస్తున్నారు. ఇతర కాంట్రాక్టర్లు ఎవరూ టెండర్లు దాఖలు చేయకూడదని, తమకే పనులు కావాలంటూ బెదిరింపులు దిగే స్థాయికి చేరారు. ముక్కూమొఖం తెలియని వ్యక్తులు, కాంట్రాక్ట్ పనులు చేయని వారు, కాంట్రాక్టు లైసెన్స్ కూడా లేని వారు సైతం కార్పొరేషన్లో పెత్తనం చెలాయిస్తున్నారు. కేవలం వారికున్న అర్హత మంత్రికి అనుచరులుగా వ్యవహరించడమే. ఏడాది కాలంగా కర్నూలు కార్పొరేషన్లో వారి ఆగడా లు శృతి మించుతున్నాయి. అర్హత ఉండి నిబంధనల ప్రకారం టెండర్లలో పాల్గొంటే ఏ ఒక్కరికీ అభ్యంతరం ఉండదు. కానీ అధికార పార్టీ అనే ఒకే ఒక్క అర్హతతో టెండర్ల ప్రక్రియలో చక్రం తిప్పుతున్నారు. తాజాగా కర్నూలు నగరంలో రూ.2 కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులకు ఇతర మున్సిపల్ కాంట్రాక్టర్లు పాల్గొనకూడదంటూ మౌఖిక ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ఇంత చేసి వారు ఏమైనా ఆ పనులు చేస్తారా... అంటే అదీ లేదు. కేవలం తమకు కావాల్సిన వారికి పనులు ఇప్పించుకుని 10 శాతం కమిషన్లు దండుకునేందుకేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిండికేట్ రాజకీయం.. నగరపాలక సంస్థలో ఇటీవల అభివృద్ధి పనులకు సంబంధించి సిండికేట్ రాజకీయానికి నేతల అనుచరులు తెర తీశాారు. ఏడాది కాలంగా మంత్రికి అనుచరులుగా వ్యవహరిస్తున్నా ఒకరిద్దరు మున్సిపల్ కాంట్రాక్టర్లతో రహస్య సమావేశం ఏర్పాటు చేశారు. టెండర్ల ప్రక్రియలో ఏ మాత్రం అనుభవం లేని పాతబస్తీకి చెందిన ఈ వ్యక్తి మున్సిపల్ అభివృద్ధి పనుల్లో పర్సెంటేజీల కోసం దందా చేస్తున్నారు. పైగా టెండర్ల ప్రక్రియ పోటీ పడి దక్కించుకుంటున్న కాంట్రాక్టర్లకు క్లాస్లు పీకుతున్నారు. పోటీ పడి అంచనా విలువ కన్నా లెస్కు పనులు దక్కించుకుంటే ఇంకేం లాభం. సిండికేట్ అవుదాం. పోటీ లేదు. గీటీ లేదు. పనులు దక్కించుకుందాం. అవసరమైతే టెండర్లను ఎక్సెస్కు దక్కించుకుందాం. తానే దగ్గరుండి ఇంజినీరింగ్ అధికారులతో సెటిల్ చేస్తా. వాళ్ల పర్సెంటేజీలు వాళ్లకు ఇద్దాం. అంటూ బేరసారాలు చేసేశారు. ఇక బిల్లులు రాకుంటే చెప్పండి. ఇంత పర్సెంటేజీ ఇచ్చుకుంటే సరే.. ఏ పనైనా క్లియర్ చేస్తానంటూ ఇప్పటికే హామీలు ఇచ్చాడు. తాజాగా మరోసారి టెండర్ల ప్రక్రియల ఫలానా వర్కులన్నీ తమకే కావాలంటూ ఇతర కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేయకూడదంటూ హుకుం జారీ చేయడం, వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టడం చర్చానీయంశంగా మారింది. ఇలా పర్సంటేజీలకు పనులు ఖరారైతే నాణ్యత పరిస్థితి ఏంటన్న అభిప్రాయాన్ని పలువురు కాంట్రాక్టర్లు వ్యక్తం చేస్తున్నారు. అంతా తాము నడిపిస్తాం. అంచనాలు మించి టెండర్ దాఖలు చేసినా... మైహూనా అంటూ సమాధానం ఇవ్వడం గమనార్హం. ఇలా అనుమతులు ఇచ్చుకుంటూ పోతే నగరపాలక సంస్థ ఆదాయానికి గండి పడుతుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇతనికి ఇంజినీరింగ్ విభాగంలోని ఒక అధికారి జీ హుజూరు అంటూ వత్తాసు పలకడం విశేషం. నిఘా వర్గాలు సైతం తమకేం సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించడం కొసమెరుపు. మున్సిపల్ కాంట్రాక్టర్ల వాట్సప్ గ్రూపుల్లో.. బిజినిపల్లె సందీప్ (మంత్రి అనుచరుడు) పేరుతో నగరపాలక టెండర్లకు సంబంధించి ఐడి : 854082 నోటీసు నెంబర్ : 15 నుండి 19 వరకు ఉన్న దాదాపు రూ.2 కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులకు ఇతర కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనవద్దని మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారు. అలాగే 851330 – 17/8 నుంచి వరుసగా 17/9, 17/7 పనుల టెండర్లలో ఇతర కాంట్రాక్టర్లు టెండర్లు వేయకూడదని సదరు అనుచరుడు సూచించారు. కర్నూలు నియోజకవర్గానికి చెందిన ఇతడు పాణ్యం అర్బన్ వార్డుల్లోను తమ వాళ్లకే పనులు ఇప్పించేందుకు చక్రం తిప్పడం గమనార్హం. -
మత్తు పదార్థాలను నియంత్రించండి
నంద్యాల: వివిధ ప్రాంతాల నుంచి దిగుమతి అయ్యే గంజాయి, గుట్కా తదితర మత్తు పదార్థాల నియంత్రణకు పోలీసులతో పాటు రెవెన్యూ, వ్యవసాయ, ఉన్నత విద్యా, తదితర శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మత్తు పదార్థాల నియంత్రణ అమలుపై సంబంధిత కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో స్పెషల్ డ్రైవ్ చేపట్టి గంజాయి తదితర మత్తు పదార్థాల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కాకుండా విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ముఖ్యకూడళ్లలో మాదక ద్రవ్యాల వినియోగ నియంత్రణకు హోర్డింగ్లను ఏర్పాటు చేసి యువతపై మాదకద్రవ్యాల ప్రభావం పడకుండా చూడాలన్నారు. అడిషనల్ ఎస్పీ యోగేంద్ర బాబు మాట్లాడుతూ జిల్లా పోలీసు యంత్రాంగం తరపున మత్తు పదార్థాల నియంత్రణకు కృషి చేస్తామన్నారు. -
● ఉల్లి పంట జీవాల పాలు
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. దేవనకొండ మండలం కరిడికొండ గ్రా మానికి చెందిన రైతు మహబూబ్బాషా తనకున్న ఎకరన్నర పొలంలో రూ.1.80 లక్షల పెట్టుబడి పెట్టి ఉల్లి సాగుచేశాడు.పంట చేతికొచ్చే దశలో ఉంది. కోతకోసి మార్కెట్కి తరలించాలంటే మరో రూ.50 వేలు ఖర్చు చేయాల్సి ఉంది. అయితే మార్కెట్లో ఉల్లి క్వింటా రూ.600 మించి ధర పలకకపోవడం, ప్రభుత్వం ప్రకటించిన రూ.1,200 మద్దతు ధరతో కొనుగోలు చేసే నాథుడే లేకపోవడంతో జీవాలకు వదిలేశాడు. – దేవనకొండ -
అబుబక్కర్ మృతి పార్టీకి తీరని లోటు
● బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, డాక్టర్ దార సుధీర్ నందికొట్కూరు: వైఎస్సార్సీపీ ముస్లిం మైనార్టీ సెల్ ఉమ్మడి కర్నూలు జిల్లా జోనల్ ఇన్చార్జ్ అబుబక్కర్ మృతి పార్టీకి తీరని లోటని నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ దార సుధీర్, యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ అన్నారు. బుధవారం అబుబక్కర్ మృతదేహానికి డాక్టర్ దార సుధీర్, సిద్ధార్థరెడ్డి, హఫీజ్ఖాన్ పూలమాలలు వేసి నివాళులర్పించి అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అబుబక్కర్ పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్సార్సీపీలో కొనసాగుతూ జిల్లా స్థాయికి ఎదిగారన్నారు. ఆయన లేని లేని లోటు పార్టీకి తీరనిదన్నారు. కర్నూలు మాజీ ఎమ్మెల్యే గఫూర్, వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ జగదీశ్వరరెడ్డి, సోమల సుధాకర్రెడ్డి, కౌన్సిలర్లు నాయబ్, సురేష్, రవూఫ్, పట్టణ అధ్యక్షులు మన్సూర్, నాయకులు పుల్యాల నాగిరెడ్డి, చంద్రమౌళి, రమేష్నాయుడు, అవాజ్ కమిటీ నాయకులు సుభాన్, అబ్దుల్ జబ్బార్, ఎమ్మార్పీఎస్ నాయకులు రమణ తదితరులు నివాళులర్పించారు. -
పాల వ్యాన్ డ్రైవర్పై చేయి చేసుకున్న ఎంవీఐ
పత్తికొండ: పాల వ్యాను డ్రైవర్పై ఆదోని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ చేయి చేసుకోవడంతో పత్తికొండలోని బైపాస్ రహదారిలో బుధవారం రాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతపురం నుంచి ఆదోనికి వెళ్తున్న పాలవ్యానును తనిఖీల్లో భాగంగా రికార్డుల పరిశీలన కోసం బైపాస్ రహదారిలో ఆదోని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కేఎండీ అవైస్ వాహనాన్ని ఆపారు. పాలవ్యాను డ్రైవరు చరణ్రెడ్డి బండి రికార్డులను చూపడంలో కాస్త ఆలస్యం చేయడంతో ఎంవీఐ డ్రైవరుపై బూతులు తిడుతూ చేయి చేసుకున్నాడు. బండి పేపర్లు లేకపోతే జరిమానా వేయాలి కాని ఎందుకు కొడుతున్నారని ప్రశ్నించడంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగి అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ ఉన్న స్థానికులు ఎంవీఐను నిలదీయడంతో అక్కడ నుంచి జారుకున్నారు. దీంతో బైపాస్ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎంవీఐ చేయి చేసుకోవడంతో డ్రైవరు చరణ్రెడ్డి రహదారిపై బైఠాయించి నిరసనకు దిగాడు. సమాచారం అందుకున్న ఏఎస్ఐ శివాజీనాయక్ సిబ్బందితో అక్కడికి చేరుకుని పాలవ్యాను, డ్రైవర్ను పోలీస్ స్టేషన్కు తరలించారు. పాల లారీ కావడంతో సరుకును ఆదోనిలో దింపి రావాలని చెప్పి పంపించారు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా విచారణ చేస్తామని పోలీసులు తెలిపారు. వివాదాలకు కేరాఫ్ ఆదోని ఎంవీఐ రహదారిలో వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో జరిమానాలు విధించకుండా వాహనదారులపై చేయి చేసుకోవడం ఆదోని ఎంవీఐ కెంఎడి అవైస్కు పరిపాటిగా మారింది. గతంలో బెంగళూరుకు చెందిన న్యాయవాది తన కుటుంబసభ్యులతో మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో ఆదోని మండలం బిణిగేరి వద్ద వాహనాల తనిఖీలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారి తీసింది. ఈక్రమంలో ఎంవీఐ అక్కడి నుంచి వెళ్లిపోతుండగా న్యాయవాది కారు బ్యానెట్పై ఎక్కగా దాదాపు రెండు కిలో మీటర్లు దూరం తీసుకెళ్లారు. అక్కడి స్థానికులు ఎదురు తిరగడంతో వదిలేసి వెళ్లిపోయారు. బుధవారం మరోసారి పాలవ్యాను డ్రైవర్పై దురుసుగా వ్యవహరించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయమై ఎంవీఐ కేఎండీ అవైస్ను వివరణ కోరగా రికార్డులను చూపడంలో పాలవ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోపాటు దురుసుగా మాట్లాడటంతోనే తాను చేయి పైకెత్తానని తెలిపారు. -
హరికిషన్కు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం
కర్నూలు కల్చరల్: జిల్లాకు చెందిన బాలల కథా రచయిత డాక్టర్ ఎం.హరికిషన్కు సురవరం ప్రతాప్రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. బుధవారం హైదరాబాద్లో ని తెలుగు కళామందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచా ర్య వెలుదండ నిత్యానందరావు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య డి.మునిరత్నం నాయుడు, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం విభాగాధిపతి ఎస్.రమేష్, రిజిస్ట్రార్ కోట్ల హ నుమంతరావు తదితరులు హరికిషన్కు పురస్కారాన్ని అందజేశారు. సంయుక్త అక్షరాలు లేకుండా విద్యార్థుల్లో ఉత్తమ విలువలు పెంపొందించేలా అత్యంత సులభమైన శైలిలో రచించిన చందమామ పుస్తకంలోని 25 కథలు పిల్లల్లో భాషా నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు వాళ్లను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతాయని, నవ సమాజ నిర్మాణంలో భాగమవుతాయని, ఇప్పటి తరానికి ఇటువంటి పుస్తకాల ఆవశ్యకత ఎంతో ఉందని అతిథులు పేర్కొన్నారు. -
భూసార పరీక్ష ఫలితాలపై అవగాహన కల్పించండి
కర్నూలు(అగ్రికల్చర్): భూసార పరీక్ష ఫలితాలపై రైతులకు అవగాహన కల్పించాలని కర్నూలు సబ్ డివిజన్ ఏడీఏ సాలురెడ్డి వ్యవసాయాధికారులకు సూచించారు. బుధవారం ఆయన తన కార్యాలయంలో మండలాల వ్యవసాయ అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. 6,500 భూసార పరీక్ష ఫలితాల కార్డులు వచ్చాయని, వీటిని రైతులకు అందజేసి ఫలితాలను బట్టి వచ్చే రబీలో స్థూల, సూక్ష్మ పోషకాలు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. భూసార పరీక్షల్లో సూక్ష్మ పోషకాల లోపం ఉన్నట్లు తేలితే 100 శాతం సబ్సిడీపై సూక్ష్మ పోషకాలను పంపిణీ చేస్తామని రైతులకు తెలియజేయాలన్నారు. సమావేశంలో సాంంకేతిక ఏఓ శ్రీవర్ధన్రెడ్డి, ఏఓలు దస్తగిరిరెడ్డి, రవిప్రకాశ్, విష్ణువర్ధన్రెడ్డి, మల్లేష్ యాదవ్ పాల్గొన్నారు. కర్నూలు: జిల్లా పోలీసు శాఖకు జూడో, క్లస్టర్ ఆటల పోటీల్లో జాతీయస్థాయి గుర్తింపు లభించింది. ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో జరిగిన 10వ జాతీయ పోలీస్ జూడో క్లస్టర్ ఆటల పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరపున కర్నూలు జిల్లా పోలీసు శాఖ నుంచి ఆర్ఎస్ఐ కల్పన పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ కనపరచి కరాటేలో కాంస్య పతకం, పెన్కాక్ సిలాట్లో వెండి పతకం సాధించారు. ఈ సందర్భంగా బుధవారం ఎస్పీ తన క్యాంప్ కార్యాలయంలో ఆమెను సత్కరించి అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించి జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఎస్పీ ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆర్ఐ జావెద్ పాల్గొన్నారు. కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాల యం పరిధిలో మే నెలలో నిర్వహించిన బీఈడీ మూడో సెమిస్టర్ రీ వాల్యుయేషన్ ఫలితాలు విడుదలయ్యాయి. వర్సిటీ వైస్ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.వెంకట బసవరావు ఆదేశాల మేరకు ఫలితాలను విడుదల చేసినట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. 1098 మంది రీ వాల్యుయేషన్కు దర ఖాస్తు చేసుకోగా 955 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు. ఫలితాలు htt pr://rayareemauniverrity.ac.in వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. -
వాహనం ఢీకొని వృద్ధుడి మృతి
మహానంది: సీతారామాపురం గ్రామానికి చెందిన చింతపూత నరసింహుడు(71) గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందినట్లు ఎస్ఐ రామ్మోహన్రెడ్డి తెలిపారు. నరసింహుడు గ్రామ సమీపంలోని చెంచయ్య పొలం వద్ద నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా వాహనం ఢీకొందన్నారు. మృతుడి భార్య వెంకటసుబ్బమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. పాములపాడు: ఉధృతంగా ప్రవహిస్తున్న సుద్దవాగులో నాగేశ్వరయ్య అనే వ్యక్తి గల్లంతయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కొత్తపల్లి మండలం నాగంపల్లికి చెందిన వెంకటేష్, పరమేశ్వరుడు, నాగేశ్వరయ్యలు పాములపాడు నుంచి బైక్పై వెళ్తున్నారు. పరమేశ్వరుడు ముందుగానే బైక్నుంచి దిగాడు. మిగతా ఇద్దరూ అలాగే వెళ్లారు. అదపు తప్పి బైక్ కిందదపడటంతో సుద్దవాగు నీటి ప్రవాహానికి కొట్టుకుపోతుండగా అక్కడే ఉన్న చెలిమిల్ల గ్రామస్తులు స్పందించారు. వెంటనే వెంకటేష్ను కాపాడారు. అయితే నాగేశ్వరయ్య ఆచూకీ తెలియలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు పుట్టీల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య నంద్యాల(అర్బన్): పట్టణ శివారు ప్రాంతానికి చెందిన షేక్ ఇమ్రాన్ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఇమ్రాన్ తాగుడుకు బానిసయ్యాడు. నిత్యం మద్యం తాగి కుటుంబం గురించి పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో ఇరుగుపొరుగు వారు మందలించడంతో మంగళవారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య హసీనా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
మార్కెట్యార్డ్లో అగ్నిప్రమాదం
ఎమ్మిగనూరుటౌన్: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్లోని గోదాంలో బుధవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుని ఖాళీ గోనెసంచులు కాలిపోయాయి. రైతులు, సిబ్బంది గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతోనే మంటలు వ్యాపించి 500 గోనెసంచుల కాలిబూడిదయ్యాయని గోనెసంచుల వ్యాపారి మాబూబాషా ఆవేదన వ్యక్తం చేశాడు. దాదాపు రూ.5 లక్షల వరకు నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు. మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, మార్కెట్యార్డ్ చైర్మన్ మల్లయ్య, మార్కెట్యార్డ్ కార్యదర్శి చంద్రమౌలితో పాటు పలువురు టీడీపీ నాయకులు ఘటనా స్థలికి చేరుకుని బాధితుడిని పరామర్శించారు. బనగానపల్లె: భారీ వర్షాలతో నందవరం గ్రామ సమీపంలో వ్యవసాయ పొలాల్లో ఉన్న 60 మేకపిల్లలు మృతి చెందినట్లు గొల్ల బర్రెన్న, హరికృష్ణ, కృష్ణ మద్దిలేటి తెలిపారు. వర్షంతో పాటు ఈదురుగాలులకు మేక పిల్లలు మృతి చెందినట్లు వారు చెప్పారు. తమకు రూ.3 లక్షలు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు. -
అత్యాశతో అవినీతికి పాల్పడరాదు
● డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ కర్నూలు(సెంట్రల్): ప్రభుత్వ ఉద్యోగులు అత్యాశతో అవినీతికి పాల్పడి ఉద్యోగ ధర్మానికి అన్యా యం చేయరాదని డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ సూచించారు. ఆత్మసాక్షితో విధులను నిర్వహించి పేదలకు సేవ చేయాలని, అప్పుడు సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని చెప్పారు. బుధవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో విజిలెన్స్ అవేర్నెస్ వీక్–2025 కార్యక్రమంలో డీఆర్వో మాట్లాడారు. ఈనెల 31న దేశ తొలి ఉప ముఖ్యమంత్రి సర్దార్ వల్లాభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రాష్ట్రంలో అవినీతి నివారణపై ప్రజ లు, ఉద్యోగులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా నవంబర్ 2 వరకు అవగాహన కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. ఎంతో కష్టపడి చదివి లక్షల మందితో పోటీ పడి సాధించిన ఉద్యోగాన్ని పది మంది మంచి కోసం వినియోగించాలన్నారు. ఉద్యోగ ధర్మంలో అవినీతి అక్రమాలకు పాల్పడి సమాజంలో తలదించుకుని బతికే పరిస్థితి తెచ్చుకోవద్దన్నారు. ఈ మధ్య ఉద్యోగులకు వస్తున్న ఫేక్ ఫోన్ కాల్స్, డిజిటల్ అరెస్టు పేరుతో వస్తున్న వాటికి భయపడాల్సిన అవసరంలేదని, నీతి, నిజాయితీతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగి దగ్గర నిబంధనల మేరకు 1000 కంటే ఎక్కువ నగదు ఉంచుకోరాదని సీసీఎల్ఏ రూల్స్ చెబుతున్నట్లు చెప్పారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న మాట్లాడుతూ అవినీతి నిరోధక అవగాహన కార్యక్రమాలను ఏటా వారం రోజులపాటు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. లంచం తీసుకోవడం, ఇవ్వడం నేరమన్నారు. ఏడేళ్ల జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుందన్నారు. వచ్చే జీతంతో ఆనందంగా జీవనం గడపాలన్నారు. కార్యక్రమంలో జిల్లా చిన్న పిల్లల ఆరోగ్య అధికారి జఫరుల్లా, ఏసీబీ ఇన్స్పెక్టర్లు కృష్ణ, రాజా ప్రభాకర్ పాల్గొన్నారు. -
లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధం
ఆత్మకూరు: శ్రీశైలం నియోజకవర్గంలో అతి భారీ వర్షాలు కురవడంతో జన జీవనం స్తంభించిపోయింది. పలు కాలనీలు జలదిగ్బంధం అయ్యాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరి బియ్యం, కందిపప్పుతోపాటు నిత్యావసర వస్తువులు తడిసిపోయాయి. వాగులు పొంగిపొర్లడంతో మొత్తం 18 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పొలాలన్నీ జలమయం అయ్యి కోట్ల రూపాయలు విలువ చేసే పంట మట్టిపాలైంది. రెవెన్యూ అధికారుల సమాచారం మేరకు 10 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 8 వేల ఎకరాలకు పైగా వరి పంటలు ధ్వంసమయ్యాయి. శ్రీశైలం: తుపాన్ కారణంగా శ్రీశైలానికి చేరుకునే వాహనాలను మున్ననూరు, దోర్నాల చెక్పోస్టుల వద్ద మంగళవారం రాత్రి నుంచి నిలుపుదల చేశారు. శ్రీశైల మహా క్షేత్రంలో అమ్మవారి ఆలయం వెనుక ఉన్న ఏనుగుల చెరువు నిండిపోయి ఆలయ ప్రాకార దక్షిణ మాడ వీధిలో వరదలా ప్రవహించింది. పాతాళగంగ రోప్వే నుంచి ఘాట్ల వరకు ఉన్న రోడ్డు మార్గంలో కొండ రాళ్లు విరిగిపడటంతో తాత్కాలికంగా వేసుకున్న షాపులు కూలిపోయాయి. -
కర్నూలు జిల్లాలో ఇదీ పరిస్థితి..
మోంథా తుపాను ప్రభావంతో కర్నూలు జిల్లాలో దాదాపు 4వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. హొళగుంద, కోసిగి, మంత్రాలయం, ఆలూరు, చిప్పగిరి, మద్దికెర మండలాల్లోని 27 గ్రామాలపై తుపాను ప్రభావం ఉంది. వరి 1,500 ఎకరాలు, శనగ 2,500 ఎకరాల ప్రకారం దెబ్బతిన్నాయి. వరికి ఎకరాకు రూ.30 వేలు, శనగకు ఎకరాకు రూ.15 వేల ప్రకారం రూ.7.60 కోట్ల మేర పంట నష్టం వాటిల్లింది. తుపాను ప్రభావంతో ఓర్వకల్లో 57.8 మి.మీ, కర్నూలు రూరల్లో 37.6, కల్లూరులో 34.6, కర్నూలు అర్బన్లో 34.2, వెల్దుర్తిలో 23, గూడూరులో 14.8, క్రిష్ణగిరిలో 14.4 మి.మీ వర్షపాతం నమోదైంది. -
చాలా బాధగా ఉంది
ఆరబోసిన ధాన్యం వరదలో కొట్టుకుపోవడం చాలా బాధగా ఉంది. నేను ఆరు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. దిగుబడి తక్కువగానే వచ్చింది. కనీసం రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల దాకా పంట దిగుబడి ఆదాయం వస్తుందని భావించాను. మా కష్టం నీటిపాలు అయ్యింది. ప్రభుత్వం మాలాంటి రైతులను ఆదుకుని న్యాయం చేయాలి. – రాజేంద్రప్రసాద్, ఆత్మకూరు మార్కెట్యార్డులో ధాన్యాన్ని నిల్వ ఉంచితే తడవదని భావించాం. వ్యాపారులు రావడంతో 60 క్వింటాళ్ల ధాన్యాన్ని కాటా వేసి ఉంచాం. ఊహించని విధంగా గోడౌన్లో దాచుకున్న ధాన్యమంతా తడిచింది. ఈ ధాన్యాన్ని కొనే నాథుడే లేడు. ఆరబోసేందుకు అవకాశం లేకుండా పోయింది. అధికారులు స్పందించి మమ్మల్ని ఆదుకోవాలి. – భాస్కర్రెడ్డి, ఆత్మకూరు మాకు కన్నీళ్లు తప్ప ఏమీ మిగల్లేదు. మూడు ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగుచేసి సంబరపడ్డాను. పెట్టుబడి పోయి అంతోఇంతో వస్తుందని భావించాను. అయితే పంట ఇలా వరదపాలవుతుందని ఊహించలేదు. అప్పులను మూటగట్టుకునే పరిస్థితి నెలకొంది. మాలాంటి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. – సాంబశివుడు, క్రిష్ణాపురం -
ఉపాధి కోసం ఊరొదులుతున్న జనం
కోసిగి: ఉన్న ఊళ్లో పనులు చేసుకుని కలోగంజో తాగి బతికే వేలాదిమంది ఇప్పుడు ఇక్కడ ఉపాధి కరువై వలసబాట పట్టారు. కర్నూలు జిల్లా నుంచి పొరుగునున్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు వలస వెళుతున్నారు. జిల్లాలో పశ్చిమ ప్రాంతమైన మంత్రాలయం నియోజకవర్గం నుంచి అత్యధికంగా బతుకుదెరువు కోసం ఊళ్లొదిలి వెళుతున్నారు. ఈ ఏడాది అధికవర్షాలు, తుపాను కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం ఏ మాత్రం ఆదుకోలేదు. పెట్టుబడులకు చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్థంగాక రైతులు, కూలీలు కూడా పనుల కోసం ఇతర ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. మూటాముల్లె సర్దుకుని పిల్లాపాపలతో ఇళ్లకు తాళాలు వేసి కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు వెళ్లి పనులు వెదుక్కుంటున్నారు. మంత్రాలయం, కోసిగి, పెద్దకడబూరు, కౌతాళం మండలంలోని వివిధ గ్రామాల నుంచి 20 రోజులుగా లారీలు, టెంపోలు, ట్రాక్టర్లలలో 10వేల మంది వలస వెళ్లారు. ప్రధానంగా కోసిగి మండలం నుంచి అత్యధికంగా వలసలు ఉంటున్నాయి. కోసిగితో పాటు చింతకుంట, పల్లెపాడు, దుద్ది, కొల్మాన్పేట, ఆర్లబండ, కామన్దొడ్డి, చిర్తనకల్లు, సజ్జలగుడ్డం, వందగల్లు, జుమ్మాలదిన్నె, మూగలదొడ్డి, జంపాపురం గ్రామాల ప్రజలు ఊళ్లొదిలారు. దీంతో ఆయా గ్రామాలు నిర్మానుష్యంగా మారాయి. వీరంతా కర్ణాటక రాష్ట్రంలోని సేదాపురం, గబ్బూరు, మటమారి, మర్చటాల్, ఉట్నూరు, తెలంగాణ రాష్ట్రంలో గద్వాల, మహబూబ్నగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉపాధి పొందుతున్నారు. ప్రాంతాల్లో పత్తి పొలాల్లో పనులకు వెళ్తున్నారు. కిలో పత్తి సేకరిస్తే రూ.15 చొప్పున కూలి లభిస్తోంది. రోజుకు ఒక క్వింటా పైగా తీస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం కల్పిస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ గిట్టుబాటు కాదని, ఆ పనులకు పోతే బతకడం కష్టమవుతోందని స్థానికులు వాపోతున్నారు. పాఠశాలల్లో తగ్గిన హాజరుశాతం పలువురు తల్లిదండ్రులు తమ పిల్లల్ని కూడా తీసుకెళ్లడంతో మండలంలోని పలు పాఠశాలల్లో విద్యార్థుల హజరుశాతం పూర్తిగా తగ్గింది. ప్రధానంగా కోసిగి హిందూ గరŠల్స్ ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు 442 మంది చదువుతున్నారు. పదిరోజులుగా పాఠశాలకు 166 మంది మాత్రమే హజరవుతున్నారు. ఆగస్ట్, సెపె్టంబర్ నెలల్లో 343 మంది వరకు హాజరయ్యారు. వలస వెళ్లడంతో అక్టోబర్లో సగానికి పైగా తగ్గిపోయారు. కోసిగిలోని చాకలగేరి, ఆదిఆంధ్ర, రంగప్పగట్టు, కుమ్మరివీధి, జేబీఎం, ఎస్డబ్ల్యూ, బాలుర, బాలికల ఉన్నత పాఠశాలల్లో హాజరు అమాంతం పడిపోయింది. మండలంలో 1 నుంచి 10వ తరగతి వరకు 48 ప్రభుత్వ పాఠశాలల్లో 14,554 మంది విద్యార్థులు చదువుతున్నారు. అధికారికంగా 432 మంది విద్యార్థులు తల్లిదండ్రులతో వలస వెళ్లారు. అనధికారికంగా ఈ సంఖ్య వెయ్యికిపైనే ఉన్నట్లు తెలుస్తోంది.అమ్మ, నాన్న వలస వెళ్లారు కోసిగి హిందూ గర్ల్స్ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నా. అమ్మానాన్నతో పాటు అన్న, అక్క వలస వెళ్లారు. నన్ను మా నానమ్మ దగ్గర వదిలిపెట్టారు. అక్కడ ఉండి రోజూ బడికి పోతున్నా. ప్రతి సంవత్సరం అమ్మానాన్న సుగ్గికి పోతుంటారు. – విజయలక్ష్మి, 5వ తరగతి, కోసిగి సగానికిపైగా తగ్గిన హాజరు మా పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు 442 మంది చదువుతున్నారు. దసరా సెలవుల తరువాత సగానికిపైగా పిల్లలు రావడం లేదు. తల్లిదండ్రులను, పిల్లలను విచారిస్తే ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినట్లు చెబుతున్నారు. ఏటా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో విద్యార్థుల హాజరు తగ్గిపోతోంది. – సంజన్న, హిందూగర్ల్స్ స్కూల్ హెచ్ఎం, కోసిగి -
శ్రీశైలం ఘాట్ రోడ్డు.. విరిగిపడిన కొండచరియలు
సాక్షి, శ్రీశైలం: ఏపీలో మోంథా తుపాను కారణంగా తీవ్ర నష్టం వాటిల్లింది. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. మరోవైపు.. ఎడతెరిపిలేని వర్షాలతో శ్రీశైలం ఘాట్ రోడ్డులో విరిగిపడిన భారీ కొండచరియలు పడ్డాయి. దీంతో, బస్సుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.మోంథా తుపాను ప్రభావంతో శ్రీశైలంలో భారీ వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా డ్యామ్ ఘాట్ రోడ్డుపై భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో, హైదరాబాద్-శ్రీశైలం బస్సుల రాకపోకలకు అంతరాయం కలిగింది. పోలీసులు జేసీబీ సాయంతో వాటిని తొలగిస్తున్నారు. లింగాలగట్టు చెక్ పోస్ట్ వద్ద వాగు ఉప్పొంగి ప్రవహించడంతో భవనం కోతకు గురైంది. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.Andhra Pradesh Cyclone Montha hits Srisailam, Nandyal District. Landslides on Patalaganga steps destroy 3 shops. Continuous rain halts normal life, devotees confined to shelters. Floodwaters erode roads, locals fear further damage. #CycloneMontha #Srisailam #Nandyal pic.twitter.com/Ar2EKsXEeH— Gummalla Lakshmana (@GUMMALLALAKSHM3) October 29, 2025ఇదిలా ఉండగా.. పాతాళగంగ (Paathal Ganga)కు వెళ్లే దారిలో కొండచరియలు విరిగిపడ్డియాయి. ఈ దుర్ఘటనలో మొత్తం మూడు షాపులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు భక్తులను అటువైపు వెళ్లేందుకు అనుమతించడం లేదు. పుష్కరిణికి వెళ్లే మార్గం పూర్తిగా శిథిలాలతో మూసుకుపోగా పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. మరోవైపు టూరిజం శాఖ ఆధ్వర్యలోని రోప్ వే (Rope Way) సర్వీసును కూడా తాత్కాలికంగా మూసివేశారు.తుపాను ప్రభావంతో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కర్నూలు నగరం సహా కొత్తపల్లి, మహానంది, ఆత్మకూరు మండలాల్లో ఎడతెరిపి లేకుండా ముసురు పడుతోంది. మహానంది మండలం నందిపల్లి వద్ద పాలేరు వాగు వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. కొత్తపల్లి మండలంలో శివపురం పెద్దవాగు పొంగిపోర్లుతుండటంతో సమారు 11 గ్రామాల రాకపోకలకు అంతరాయం తీవ్ర అంతరాయం ఏర్పడింది. -
వెల్ఫేర్ సొసైటీలో సభ్యత్వం తీసుకోండి
కర్నూలు(అర్బన్): జిల్లా ఎక్స్ సర్వీస్మెన్ వెల్ఫేర్ సొసైటీ ఎన్నికలు నవంబర్ 23న జరగనున్న దృష్ట్యా, సొసైటీలో సభ్యత్వం తీసుకోని ఎక్స్ సర్వీస్మెన్స్ ఈ నెల 31లోగా తీసుకోవాలని ఎన్నికల కమిటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి కోరారు. అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎక్స్ సర్వీస్మెన్ సొసైటీకి నూతన కమిటీని ఎన్నుకునేందుకు ఎన్నికలను నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. నవంబర్ 9న నామినేషన్లను దాఖలు, 12న పరిశీలన, ఉపసంహరణ ఉంటుందని, అభ్యర్థుల అవగాహన సమావేశాన్ని 13న నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 23న ఓటింగ్, ఓట్ల లెక్కింపు కార్యక్రమాలతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందన్నారు. సీనియర్ సభ్యులు పురుషోత్తం మాట్లాడుతూ ఎన్నికలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు చేపడతామన్నారు. సమావేశంలో సీనియర్ సభ్యులు కేడీవీఎం రెడ్డి, వాసు, ప్రసాద్, గోవర్దన్, రవీంద్ర పాల్గొన్నారు. పోరాటాలకు సిద్ధం కావాలి నంద్యాల(న్యూటౌన్): కనీస వేతనం, హెచ్ఆర్ పాలసీ అమలు కోసం పోరాటాలకు సిద్ధం కావాలని వీఓఏల సంఘంం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రూపాదేవి, ధనలక్ష్మి సూచించారు. స్థానిక జేకే ఫంక్షన్ హాల్లో వీఓఏల సంఘం రాష్ట్ర మహాసభలు మంగళవారం ముగిశాయి. చివరి రోజు రాష్ట్ర వీఓఏల సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్ష కార్యదర్శులతో పాటు 13 మంది రాష్ట్ర ఆఫీసు బేరర్లను, 43 మంది కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. రాష్ట్ర నూతన అధ్యక్ష కార్యదర్శులు వీఓఏలపై రాజకీయ వేధింపులు అరికట్టాలని, ఆన్లైన్ పని భారాన్ని తగ్గించాలని, 5జీ మొబైల్స్, సిమ్ కార్డ్స్, రెండేళ్ల సీ్త్రనిధి ఇన్సెంటివ్స్ ఇవ్వాలని, రూ.10 లక్షల గ్రూప్ ఇన్సురెన్స్ కల్పించాలని, లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని తీర్మానించారు. వీటి సాధనకు పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. మహా సభల్లో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మిట్నాల తిరుపతయ్య, నాయకులు పుల్లా నరసింహులు, లక్ష్మణ్, తోట మద్దులు, గౌస్, బాలవెంకట్, తదితరులు పాల్గొన్నారు. అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి కోడుమూరు రూరల్: కోడుమూరు–కర్నూలు రోడ్డులో ప్యాలకుర్తి గ్రామ సమీప పొలాల్లో మంగళవారం అనుమానాస్పద స్థితిలో దేవనకొండ మండలం పి.కోటకొండ గ్రామానికి చెందిన కమ్మరి దస్తగిరి ఆచారి (38) మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాలు.. దస్తగిరి ఆచారికి చెల్లెలిచెలిమ గ్రామానికి చెందిన వరలక్ష్మితో 16 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. మృతుడి భార్య వరలక్ష్మి పి.కోటకొండ గ్రామంలో ఆశావర్కర్గా పనిచేస్తోంది. కాగా వివాహమైనప్పటి నుంచి భార్య భర్తలిద్దరూ తరచూ గొడవపడుతూ ఉండేవారు. ఈనేపథ్యంలో 4 నెలల క్రితం వరలక్ష్మి ఆశా వర్కర్ ఉద్యోగాన్ని రూ.2 లక్షలకు ఇతరులకు అమ్ముకుని, భర్తను వదిలేసి కర్నూలు చేరి అక్కడే జీవనం సాగిస్తోంది. అనంతరం మృతుడు దస్తగిరి కూడా కర్నూలు వెళ్లి భార్యతో రాజీపడి అక్కడే కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో దస్తగిరి 15 రోజుల క్రితం కారుకు డ్రైవర్గా బళ్లారికి వెళ్లి అక్కడి నుంచి పలుమార్లు ఫోన్ చేసినా భార్య స్పందించలేదు. దీంతో కర్నూలు చేరుకున్న దస్తగిరి భార్య వరలక్ష్మిపై అనుమానంతో మూడు రోజుల నుంచి తీవ్రంగా గొడవపడుతున్నాడు. ఈ విషయంపై సోమవారం రాత్రి వరలక్ష్మి సోదరుడు కమ్మరి మధు, పెద్దమ్మ కుమారుడు వీరేష్లిద్దరూ కలిసి మృతుడు దస్తగిరిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. అనంతరం ఏమి జరిగిందో తెలియదు కానీ దస్తగిరి ప్యాలకుర్తి పొలాల్లో శవమై కన్పించాడు. కాగా భార్య సోదరులు కమ్మరి మధు, వీరేష్లతో కలిసి తమ కుమారుడు దస్తగిరి ఆచారిని దారుణంగా కొట్టి, గొంతుకు ఉరేసి చంపి ఇక్కడ పడేశారంటూ మృతుడి తండ్రి వెంకటరాముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కోడుమూరు ఇన్చార్జ్ సీఐ మన్సురుద్దీన్, ఎస్ఐ ఎర్రిస్వామి తెలిపారు. -
కిలో టమాట రూ.50
కర్నూలు(అగ్రికల్చర్): రిటైల్ మార్కెట్లో టమాట ధర అమాంతం పెరుగుతోంది. కర్నూలు రైతుబజారులో ఎలాంటి నాణ్యత లేని టమాట కిలో ధర రూ.26 పలుకుతోంది. బయటి వ్యాపారులు కిలో రూ.50 పైనే విక్రయిస్తున్నారు. రైతులకు మాత్రం టమాట ధర సంతోషాన్ని ఇవ్వలేకపోతోంది. సోమవారం పత్తికొండ మార్కెట్లో క్వింటా టమాటకు కనిష్టంగా రూ.1,200.. గరిష్టంగా రూ.2వేల ధర మాత్రమే లభించింది. సగటు ధర రూ.1,600 నమోదైంది. మార్కెట్లో టమాటకు డిమాండ్ ఉన్నప్పటికీ వ్యాపారులు సిండికేట్గా మారి రైతుల నుంచి తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అయినప్పటికీ మార్కెటింగ్ శాఖ అధికారులు స్పందించకపోవడం గమనార్హం. వినియోగదారులను మాత్రం టమాట ధరలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అంతంత మాత్రం వచ్చిన దిగుబడులు కూడా హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ తదితర ప్రాంతాలకు తరలిపోవడంతో స్థానికంగా టమాటకు కొరత ఏర్పడుతోంది. రానున్న రోజుల్లో టమాట ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
గమ్మత్తు కనరా..!
ఊరూరా ఏటీఎం (ఎనీ టైం మద్యం) దుకాణాలు వెలిశాయి. చిరు దుకాణాలు బెల్ట్షాప్లుగా మారాయి. పరదాల చాటున మినీ బార్లను తలపిస్తున్నాయి. మందు కోసం పట్టణాలకు రావాల్సిన అవసరం లేదు. పక్క వీధిలో అడుగుపడితే చేతిలో సీసా ప్రత్యక్షమవుతోంది. అవసరమైతే అక్కడే సిట్టింగ్ వేసినా అడిగేవారు ఉండరు. అధికారులు మామూళ్ల మత్తులో జోగుతుండటంతో ఓ వైపు మద్యం దుకాణదారులు నిబంధనలు అతిక్రమించి మద్యం విక్రయిస్తుండగా మరో వైపు పల్లెల్లో బెల్ట్ షాపు దందా ఫుల్గా సాగుతోంది. మద్యం మత్తులో రోడ్డు ప్రమాదాలు, దారుణాలు చోటు చేసుకుంటున్నా అధికారుల చర్యలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. – సాక్షినెట్వర్క్ ఈర్నపాడు గ్రామంలోని బెల్ట్ షాప్ వద్ద ఉన్న పర్మిట్ రూమ్లో వాడేసిన లిక్కర్ బాటిళ్లు మహానందిలో కూల్ డ్రింక్స్ ట్రేలో క్వార్టర్ బాటిళ్లు పెట్టిన దృశ్యం -
జీడీపీ నీటి విడుదల
గోనెగండ్ల: ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు గాజులదిన్నె ప్రాజెక్ట్కు వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో జీడీపీ నీటిని హంద్రీనదికి విడుదల చేశారు. ప్రస్తుతం 3.8 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. నాలుగో క్రస్ట్ గేటు ద్వారా 336 క్యూసెక్కుల నీరు హంద్రీ నదిలోకి విడుదలైంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి వెయ్యి క్యూసెక్కుల వరద నీరు జీడీపీలోకి వచ్చి చేరుతోంది. 3.7 టీఎంసీల నీటిని నిలువ ఉంచేందుకు చర్యలు చేపడుతున్నామని అధికారులు తెలిపారు. గాజులదిన్నె ప్రాజెక్టును మంగళవారం ఇరిగేషన్ ఈఈ పాండురంగయ్య, డీఈ సుబ్బారాయుడు పరిశీలించారు. -
రక్తదానం చేసి.. స్ఫూర్తి నింపి..
కర్నూలు: పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో, ఏపీఎస్పీ కర్నూలు రెండో పటాలం కల్యాణ మండపంలో రక్తదాన శిబిరాలు నిర్వహించారు. పోలీసు సిబ్బందితో పాటు పలువురు విద్యార్థులు, యువకులు ఉత్సాహంగా తరలివచ్చి రక్తదానం చేశారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ డీపీఓలో, ఏపీఎస్పీ కర్నూలు రెండో పటాలంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి కమాండెంట్ దీపికా పాటిల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, అడిషనల్ కమాండెంట్ నాగేంద్రరావు సహా పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది రక్తదానం చేసి ఇతరులకు స్ఫూర్తిగా నిలిచారు. అమీలియో హాస్పిటల్ డైరెక్టర్ లక్ష్మీప్రసాద్, జెమ్కేర్ కామినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో రక్తదాన, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు. డీపీఓలో 110 మంది, ఏపీఎస్పీ పటాలంలో 60 మంది పోలీసు సిబ్బంది రక్తదానం చేశారు. ఉచిత మెగా వైద్య శిబిరాల్లో పోలీసు కుటుంబాలు పెద్ద ఎత్తున పాల్గొని వివిధ రకాల వైద్యపరీక్షలు చేయించుకున్నారు. సదరన్ రీజియన్ హోంగార్డ్ కమాండెంట్ మహేష్ కుమార్, అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్ డాక్టర్ స్రవంతి, ప్రభుత్వాసుపత్రి డాక్టర్ రంగస్వామి తదితరులు పాల్గొన్నారు. -
ఎన్సీసీతో ఉజ్వల భవిష్యత్తు
కర్నూలు సిటీ: విద్యార్థి దశలో ఎన్సీసీలో చేరితే క్రమ శిక్షణతో పాటు, శారీరక ఆరోగ్యం మెరుగై ఉజ్వల భవిష్యత్తుకు మంచి మార్గాన్ని నిర్దేశిస్తుందని క్లస్టర్ యూనివర్సిటీ ఇన్చార్జ్ రిజిస్ట్రార్ డాక్టర్ జి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం సిల్వర్జూబ్లీ డిగ్రీ కాలేజీలో ఎన్సీసీలో ప్రవేశాల ఎంపిక ప్రక్రియ చేపట్టారు. ఎన్సీసీ 28 ఆంధ్ర బెటాలియన్ ఆఫీసర్ లెఫ్ట్నెంట్ కల్నల్ శశికుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన ఎంపిక ప్రక్రియకు ఇన్చార్జ్ రిజిస్ట్రార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్సీసీ సర్టిఫికెట్ ఉన్నవారికి ఉన్నత విద్యలోనూ, పోలీసు శాఖ, త్రివిధ దళాల ఉద్యోగాల ఎంపికలోనూ ప్రాధాన్యత ఉంటుందన్నారు. కాలేజీ నుంచి 60 మందికి అవకాశం ఉంటే 75 మంది పోటీ పడ్డారన్నారు. కార్యక్రమంలో ఎన్సీసీ 28వ ఆంధ్రా బెటాలియన్ పురుషుల ఆఫీసర్ డాక్టర్ ఎ బంగారుబాబు, ఎన్సీసీ ఆఫీసర్ జక్తర్ సింగ్, పి.శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు. 11 నుంచి అంతర్ పాఠశాలల క్రీడా పోటీలు కర్నూలు టౌన్: చిల్డ్రన్స్ డేను పురస్కరించుకొని నవంబర్ 11, 12 తేదీల్లో కర్నూలు శివారులోని చిన్నటేకూరు వద్ద ఉన్న ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ క్రీడా మైదానంలో ఉమ్మడి జిల్లా స్థాయి అంతర్ పాఠశాలల క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ఒలింపిక్ సంఘం జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాలీబాల్ (బాల బాలికలు), హ్యాండ్బాల్ (బాలబాలికలు), ఫుట్బాల్ (బాలురు), బాస్కెట్బాల్ (బాలికలు), రగ్బీ (బాల బాలికలు), చెస్ (బాల బాలికలు), రైఫిల్ షూటింగ్ (బాల బాలికలు) తదితర క్రీడాంశాల్లో పోటీలు ఉంటాయన్నారు. పోటీల్లో పాల్గొనే ఆయా స్కూళ్ల జట్ల వివరాలను నవంబర్ 7లోపు పంపించాలన్నారు. మరిన్ని వివరాలకు 93938–27585 నంబర్ను సంప్రదించాలన్నారు. -
విద్యుదాఘాతంతో వైఎస్సార్సీపీ నాయకుడి మృతి
నందికొట్కూరు: విద్యుదాఘాతంతో వైఎస్సార్సీపీ మైనార్టీ సెల్ ఉమ్మడి కర్నూలు జిల్లా జోనల్ ఇన్చార్జ్ అబుబక్కర్(షేక్ షాలిమియా)(51) మంగళవారం మృతిచెందారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. అబుబక్కర్ స్థానిక మా పల్లె దోశ హోటల్ ఎదుట ఉన్న స్టాండ్ను పట్టుకోవడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. చుట్టూ ఉన్న వారందరూ కలిసి స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న పార్టీ యూత్ వింగ్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ దార సుధీర్ సంతాపం ప్రకటించారు. అబుబక్కర్ వైఎస్సార్సీపీ మైనార్టీ నాయకుడిగా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారని, ఆయన మరణం తీరని లోటు అని పేర్కొన్నారు. -
పంట కోతలు వాయిదా వేసుకోండి
తుగ్గలి: మోంథా తుపాను నేపథ్యంలో రైతులు పంట కోతలను కొద్ది రోజులు వాయిదా వేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి సూచించారు. మంగళవారం ఆమె రాతన శివారులో రైతులు ఉల్లిగడ్డలను గ్రేడింగ్ చేసుకోవాడాన్ని పరిశీలించి స్వయంగా కష్టసుఖాలను తెలుసుకున్నారు. ఎకరా ఉల్లి సాగుకు రూ.లక్ష దాకా ఖర్చు పెట్టామని, దిగుబడి బాగానే వచ్చినా పైసా మిగల్లేదని రైతులు వాపోయారు. రైతులు సాగు చేసిన ప్రతి పంటను కచ్చితంగా ఈ–క్రాప్ బుకింగ్ చేయాలని వ్యవసాయ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం గ్రామ సమీపంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. విద్యార్థినులతో మాట్లాడి పాఠశాలలో వసతి సౌకర్యాలు, మెనూ ప్రకారం భోజనం, బోధనపై ఆరా తీశారు. క్రమశిక్షణతో చదువుకుంటే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని సూచించారు. కలెక్టర్ వెంట పత్తికొండ ఆర్డీఓ భరత్నాయక్, తుగ్గలి తహసీల్దార్ రవి, ఎంపీడీఓ విశ్వమోహన్, డిప్యూటీ ఎంపీడీఓ శ్రీహరి, ఏఓ సురేష్, ఎంఈఓలు మాలతి, వెంకటేశ్వర్లు, ఏపీఓ హేమసుందర్ ఉన్నారు. -
జిల్లా పరిషత్లో కంట్రోల్ రూమ్
● మూడు షిఫ్టుల్లో ఆరుగురు ఉద్యోగుల విధి నిర్వహణ కర్నూలు(అర్బన్): మోంథా తుపాను నేపథ్యంలో ప్రజలకు అవసరమైన సహాయక చర్యలను అందించేందుకు జిల్లా పరిషత్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జెడ్పీ సీఈఓ జి.నాసరరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కంట్రోల్ రూమ్లో ఈ నెల 31వ తేది వరకు 24 గంటలు సేవలు అందించేందుకు ఆరుగురు ఉద్యోగులు మూడు షిఫ్టుల వారీగా విధుల్లో ఉంటారన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా 9885050659, 9603944141, 8247569269, 9494734090, 9014581332, 9848498816 నెంబర్లను సంప్రదించాలన్నారు. కంట్రోల్ రూమ్ ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సీసీఏ నిబంధల మేరకు చర్యలు తప్పవని సీఈఓ హెచ్చరించారు. అదేవిధంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయాల్లోనూ కంట్రోల్ రూములను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి కంట్రోల్ రూమ్కు డిప్యూటీ ఎంపీడీఓ ఇన్చార్జిగా వ్యవహరిస్తారన్నారు. ఎంపిక చేసిన సచివాలయ ఉద్యోగులు మూడు షిఫ్టుల్లో కంట్రోల్ రూమ్లో విధులు నిర్వహిస్తారన్నారు. -
తుపాను గుప్పిట్లో అన్నదాతలు
మోంథా తుపాను గుప్పిట్లో అన్నదాతలు విలవిల్లాడుతున్నారు. అతి భారీ వర్షాలు లేకపోయినప్పటికీ కోతల వేళ తుపాను చుట్టుముట్టడంతో నష్టం తీవ్రత ఎక్కువగా ఉంటోంది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 21 మండలాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచే జిల్లాను ముసురు పట్టుకుంది. జిల్లా యంత్రాంగం వర్షపాతం నమోదు వివరాలను ప్రతి 3–4 గంటలకు పరిశీలిస్తున్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించారు. 322 హెక్టార్లలో పంట నష్టం మోంథా తుపాను ప్రభావంతో జిల్లాలో జరిగిన పంట నష్టాన్ని వ్యవసాయ, ఉద్యాన శాఖ ప్రాథమికంగానే అతి తక్కువగా చూపడం గమనార్హం. మోంథా తుపాను ప్రభావం హొళగుంద, చిప్పగిరి, కోసిగి, పెద్దకడుబూరు మండలాల్లోని ఎనిమిది గ్రామాలపై ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా తేల్చారు. మొత్తం 322 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు ప్రకటించారు. హొళగుంద మండలంలో 150 హెక్టార్లు, కోసిగి మండలంలో 120 హెక్టార్లలో వరి, చిప్పగిరి మండలంలో 17 హెక్టార్లలో శనగ మొత్తం 287 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా తేల్చారు. కాగా పెద్దకడుబూరు మండలం కంబలదిన్నె గ్రామంలో 30 హెక్టార్లు, కోసిగి మండలం డి.బెళగల్ గ్రామంలో 5 హెక్టార్లలో మిరప పంట దెబ్బతిన్నట్లు ఉద్యాన అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. రైతులకు రూ.11.75 లక్షల మేర నష్టం వాటిళ్లింది. -
పోలీసుల అప్రమత్తతతో తల్లీబిడ్డలు సురక్షితం
మంత్రాలయం: పోలీసుల అప్రమత్తతతో తల్లీ, బిడ్డలు సురక్షితంగా బయటపడ్డారు. ఎస్ఐ శివాంజల్ తెలిపిన వివరాలు.. బెంగళూరుకు చెందిన సౌమ్య శివానంద్ భర్తతో గొడవ పడి ఇద్దరు పిల్లలతో కలిసి రైలులో మంగళవారం తెల్లవారుజామున మంత్రాలయం చేరుకుంది. పిల్లలతో కలిసి తుంగభద్ర నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకుంది. బెంగళూరులోని బిడిది పోలీస్ స్టేషన్ ఎస్ఐ ద్వారా విషయం తెలుసుకున్న మంత్రాలయం ఎస్ఐ శివాంజల్ కానిస్టేబుళ్లు రామకృష్ణ, నాగరాజులను అప్రమత్తం చేశారు. వారు నదీ తీరంలో గాలింపు చేపట్టి సౌమ్య శివానంద, కుమారుడు భువనేష్, కూతురు చార్విని గుర్తించి పోలీస్స్టేషన్కు తీసుకొచ్చారు. ఎస్ఐ కౌన్సిలింగ్ ఇచ్చి ఆమె సోదరులు సనత్కుమార్, సచిన్, రాహుల్ను పిలిపించి అప్పగించారు. -
చంద్రబాబువి చెత్త ఆలోచనలు
● ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి మంత్రాలయం: సీఎం చంద్రబాబు నాయుడివి చెత్త ఆలోచనలు అని, ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ప్రక్రియను వెంటనే విరమించుకోవాలని ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి అన్నారు. స్వార్థం కోసం ఇలాంటి కుట్రకు తెరతీయడం సబబు కాదన్నారు. మంగళవారం మంత్రాలయంలోని వాసవీ కల్యాణ మంటపంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల ప్రైవేటు పరంపై రాష్ట్ర ప్రజలు మండిపడుతున్నా కూటమి పాలకులల్లో ఏమాత్రం చలనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సదాలోచనతో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలకు పునాది రాళ్లు వేయగా అందులో 5 మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయన్నారు. పేదలకు ప్రభుత్వ వైద్యాన్ని అందని ద్రాక్షగా మార్చడమే చంద్రబాబు ధ్యేయంగా పెట్టుకున్నారన్నారు. గతాన్ని మరిచిపోవద్దు.. తాను పెట్టిన భిక్షతోనే టీడీపీ నేత రాఘవేంద్రరెడ్డి కుటుంబానికి రాజకీయ భవిష్యత్తు వచ్చిందని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ హయాంలో ఆయన తండ్రి రామిరెడ్డికి కేడీసీసీ చైర్మన్ పదవి ఇవ్వడంతో ఎదిగారని గుర్తు చేశారు. రాఘవేంద్రరెడ్డి కుటుంబం గతాన్ని మరిచి వ్యవహరిస్తోందని పేర్కొ న్నారు. ఇలాంటోళ్లు ఎంతమంది పోటీకి వచ్చినా వచ్చే ఎన్నికల్లో ఐదోసారి తాను ఎమ్మెల్యేగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజల అండదండలు ఉన్నంత కాలం తనకు ఓటమంటూ లేదని వివరించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి విశ్వనాథ్రెడ్డి, మండల కన్వీనర్ జి.భీమారెడ్డి, పార్టీ జిల్లా లీగల్ సెల్ అడ్వైజర్ గురురాజారావు, సర్పంచు తెల్లబండ్ల భీమయ్య, ఉప సర్పంచులు హోటల్ పరమేష్, వీరనాగుడు, వైస్ ఎంపీపీ రాఘవేంద్ర, ఎంపీటీసీ సభ్యుడు వెంకటేష్శెట్టి, నాయకులు దశరథరెడ్డి, రోగప్ప, సూగూరు లక్ష్మయ్య, బొంబాయి శివ, వీరారెడ్డి, మదుసూధన్రెడ్డి, శంకర్, నరసింహులు, గోపిస్వామి తదితరులు పాల్గొన్నారు.కోటి సంతకాలతో కూటమి మెడలు వంచుతాం కూటమి ప్రభుత్వ మెడలు వంచేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీపీపీ విధానం రద్దుకు కోటి సంతకాల సేకరణ కార్యాచరణ చేపట్టిందని ఎమ్మెల్యే అన్నారు. అందులో భాగంగా మంత్రాలయం నియోజకవర్గం నుంచి లక్ష్యానికి మించి సంతకాలు సేకరిద్దామని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు పిలుపునిచ్చారు. నియోజకవర్గం నుంచి 60 వేలకు పైగా సంతకాలు సేకరిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కంటే మంత్రాలయం నుంచి అధికంగా సంతకాలు సేకరిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సహకరించాలని కోరారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న సంక్షేమ పనులు అంతంత మాత్రమేనని, ప్రచారంలో మాత్రం ఆహా..ఓహో.. అని డప్పు కొట్టుకుంటోందని వై.బాలనాగిరెడ్డి ఆరోపించారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం చంద్రబాబుకు ఎన్నటికీ చేతకాదన్నారు. మూడేళ్లు గడిస్తే రెడ్ రాజ్యాంగం తుడిచిపెట్టుకు పోతోందన్నారు. కూటమిని కూకటి వేళ్లతో పీకేందుకు రాష్ట్ర ప్రజానీకం సిద్ధంగా ఉందన్నారు. -
మనవడిని చూడకుండానే మృత్యుఒడికి!
● ఆర్టీసీ బస్సును లారీ ఢీకొని మహిళ మృతి ● మరో 16 మందికి గాయాలు అవుకు(కొలిమిగుండ్ల): కోడలు పురిటి నొప్పులతో ఆస్పత్రిలో చేరగా చూసేందుకని బయలుదేరిన ఓ మహిళ.. మార్గమధ్యలో మృత్యుఒడికి చేరింది. ఉప్పల పాడు ఆర్చీ సమీప మలుపు రోడ్డులో మంగళవారం ఆర్టీసీ బస్సును లారీ ఢీకొనడంతో అవుకు మండలం శివవరానికి చెందిన చాకలి లక్ష్మీదేవి(55) మృతిచెందగా మరో 16 మంది గాయాలపాలయ్యారు. ప్రయాణికులు తెలిపిన వివరాలు.. బనగానపల్లె డిపో హైర్ బస్సు 36 మందికి పైగా ప్రయాణికులను ఎక్కించుకుని తాడిపత్రికి బయలుదేరింది. ఆర్చీ సమీపాన ఉన్న శ్రీకృష్ణుడి గుడి వద్దకు చేరుకోగా మలుపులో బనగానపల్లె వైపు వెళ్తున్న లారీ బస్సును ఢీకొంది. ప్రమాదంలో లక్ష్మీదేవి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందింది. బస్సు డ్రైవర్ కనకాద్రిపల్లెకు చెందిన నాగరాజు, అంకిరెడ్డిపల్లె లక్ష్మీనారాయణమ్మ, అవుకు కృష్ణవేణమ్మ, గోర్లగుట్టకు చెందిన లక్ష్మీదేవి, పునీత్, చౌడమ్మ, నడిపి సుబ్బరాయుడు, అనంతపురం జిల్లా యల్లనూరుకు చెందిన నాగేంద్రతో పాటు మరో ఎనిమిది మంది గాయపడ్డారు. లక్ష్మీదేవి మృతదేహాన్ని అతి కష్టం మీద బయటకు తీయాల్సి వచ్చింది. ఈమె కోడలు సుకన్య (కుమారుడి భార్య) పురిటి నొప్పులతో తాడిపత్రి ఆసుపత్రిలో చేరిందని బంధువులు ఫోన్ చేయడంతో చూసేందుకని వెళ్లి ప్రమాదం బారిన పడింది. కాగా లక్ష్మీదేవి మృతి చెందిన కొద్ది నిమిషాలకే కోడలు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మనవడిని చూడకుండానే పోయావా అంటూ కుటుంబ సభ్యులు రోదించిన తీరు కంట తడిపెట్టింది. బనగానపల్లె రూరల్ సీఐ మంజునాథరెడ్డి, అవుకు ఎస్ఐ రాజారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన నలుగురిని కుటుంబ సభ్యులు నంద్యాల, కర్నూలుకు తీసుకెళ్లారు. కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ తీవ్రంగా గాయపడిన గోర్లగుట్ట లక్ష్మీదేవి -
కర్నూలు కావేరి బస్సు డ్రైవర్ లక్ష్మయ్య అరెస్ట్
కర్నూలులో వి కావేరి బస్సు ప్రమాదం కేసు డ్రైవర్ లక్ష్మయ్యను అరెస్ట్ చేసిన పోలీసులు. బస్సు ప్రమాద కేసులో ఏ1గా ఉన్న మిరియాల లక్ష్మయ్య ఏ2 బస్సు యజమాని కోసం పోలీసుల గాలింపు.కర్నూలు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున 19 మంది సజీవ దహనానికి కారణమైన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మిరియాల లక్ష్మయ్య అర్హత లేకున్నప్పటికీ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. ప్రమాదం నేపథ్యంలో పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామానికి చెందిన లక్ష్మయ్య కుటుంబ నేపథ్యం, ప్రవర్తన, అలవాట్లపై అధికారులు ఆరా తీశారు. ఈయన 5వ తరగతి వరకే చదువుకున్నాడని, అయితే టెన్త్ ఫెయిల్ అయినట్లు సర్టిఫికెట్ ఇచ్చి, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడని గుర్తించారు.మొదట లారీ క్లీనర్గా, తర్వాత డ్రైవర్గా పని చేశాడు. 2004లో లారీ డ్రైవర్గా పని చేస్తున్నప్పుడు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి చెట్టుకు ఢీకొనడంతో అప్పట్లో లారీ క్లీనర్ మృతి చెందాడు. ఆ తర్వాత లారీ డ్రైవర్గా మానేసి కొన్నాళ్లు ట్రాక్టర్ కొని స్వగ్రామంలో వ్యవసాయం చేశాడు. తర్వాత ట్రావెల్స్ బస్సు డ్రైవర్గా ఏడెనిమిదేళ్ల నుంచి వెళ్తున్నాడని తెలిసింది. లక్ష్మయ్య తండ్రి రాములు రెండు నెలల కిందట మృతి చెందాడు. ఇతనికి భార్య, ఓ కుమారుడు, ఓ కుమార్తె, ఒక సోదరుడు, ఇద్దరు అక్కలు ఉన్నారు. లక్ష్మయ్యకు అప్పుడప్పుడు మద్యం సేవించే అలవాటు ఉందని సమాచారం. -
బస్సు ప్రమాదంపై ఎన్హెచ్ఆర్సీకి కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఫిర్యాదు
సాక్షి, న్యూఢిల్లీ: కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై అత్యవసర విచారణ జరపాలని కోరుతూ జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్హెచ్ఆర్సీ), కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి సోమవారం ఫిర్యాదు చేశారు. బస్సుపై 16 పెండింగ్ చలాన్లు ఉన్నాయని, అయినా ఆ బస్సు రోడ్లపై స్వేచ్ఛగా తిరిగిందన్నారు. అనుమతి లేకుండా స్లీపర్ సీట్లు అమర్చారని..అలాగే పెద్ద సంఖ్యలో ఫోన్ల రవాణాకు ప్రయత్నించారని పేర్కొన్నారు. వీటన్నింటి వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. ప్రమాదాలకు కారకులైన ప్రభుత్వం, రవాణా శాఖపై కూడా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
కర్నూలు ఘటన: ‘ఈ దుఖం నాతోనే ఉండిపోవాలి’
కర్నూలు (హాస్పిటల్): కర్నూలు వద్ద అగ్ని ప్రమాదానికి గురైన బస్సులో కరిగి ముద్దగా మారిన మృతదేహాన్ని తీసుకెళ్లి ఇంట్లో ఏమని చెప్పాలి.. వారికి ఈ శరీరాన్ని ఎలా చూపాలి.. చూపితే వారు తట్టుకోగలరా.. ఇంతటి దుఃఖం మాతోనే ముగిసిపోనీ.. కర్నూలులోనే కుమారునికి అంత్యక్రియలు చేస్తాం’ అని ఆ తండ్రి బోరున విలపిస్తూ భావోద్వేగంతో చెప్పిన మాటలు కంటతడి పెట్టించాయి. శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు శివారులో జరిగిన వి.కావేరి బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనమయ్యారు.వీరిలో తమిళనాడులోని ధర్మపురం జిల్లా పాలక్కాడ్ తాలూకా మాదగేరి గ్రామానికి చెందిన రాజన్ మారప్పన్ కుమారుడు ప్రశాంత్ (29) కూడా ఉన్నాడు. ఇతను హైదరాబాద్లో చిప్స్ ఫ్యాక్టరీ నడుపుకుంటున్నాడు. అతడికి ఏడాదిన్నర క్రితమే వివాహం కాగా.. ఐదు నెలల కుమారుడు ఉన్నాడు. స్వస్థలానికి వెళ్లి భార్యాపిల్లలను చూసేందుకు గురువారం రాత్రి హైదరాబాద్లో వి.కావేరి ట్రావెల్స్ బస్సు ఎక్కాడు. బస్సు కర్నూలు దాటగానే మంటల్లో కాలిపోయింది. ఇందులో ప్రశాంత్ సజీవదహనయ్యారు. సోమవారం తమిళనాడుకు చెందిన ప్రశాంత్ మృతదేహానికి కూడా కర్నూలులోనే అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబసభ్యులు అధికారులను కోరారు. కర్నూలు నుంచి 800 కి.మీ. దూరంలో ఉన్న మాదగేరికి వెళ్లాలంటే రెండు రోజుల సమయం పడుతుందని.. మరణించి ఇప్పటికే మూడు రోజుల సమయం దాటిందని, ఇప్పుడు స్వగ్రామానికి వెళ్లేలోపు ఐదు రోజులు పూర్తవుతుందని తండ్రి రాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. పైగా కాలిపోయిన మాంసం ముద్దగా మారిన మృతదేహాన్ని కుటుంబసభ్యులకు చూపించి వారిని మరింత క్షోభకు గురిచేయలేమని, కేవలం అస్థికలు మాత్రమే తీసుకెళ్తామని, అందుకు ఏర్పాట్లు చేయాలని కోరారు. దీంతో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సద్గురుదత్త కృపాలయం గ్యాస్ క్రిమేషన్ ద్వారా అంత్యక్రియలు నిర్వహించి అస్థికల్ని అందజేశారు. వాటిని ప్రశాంత్ తండ్రి రాజన్ మారప్పన్తో పాటు సోదరుడు మణి, స్నేహితులు తీసుకెళ్లారు. -
భగవంతుడా.. మాకే ఇంత పెద్ద శిక్ష ఎందుకు వేశావయ్యా..
వింజమూరు (ఉదయగిరి): ‘కడసారిది వీడ్కోలు.. కన్నీటితో మా చేవ్రాలు.. కలలోనైనా కనగలమా ఆశలు సమాధి చేస్తూ.. బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది’ అంటూ కుటుంబ సభ్యులు, బంధువుల రోదనల మధ్య ఊరంతా తరలివచ్చి.. కర్నూలులో జరిగిన బస్సు దగ్ధం ఘటనలో సజీవ దహనమైన గోళ్ల రమేష్, భార్య అనూష, ఇద్దరు పిల్లలు మన్విత, శశాంక్ అంత్యక్రియలు సోమవారం గోళ్లవారిపల్లిలో విషణ్ణ వదనాల మధ్య నిర్వహించారు. భగవంతుడా.. మాకే ఇంత పెద్ద శిక్ష ఎందుకు వేశావయ్యా.. మేము చేసిన పాపం ఏమిటీ? కనికరం లేదా ఆ బిడ్డలైనా బతికించకూడదా అంటూ మృతుల బంధువులు రోదించడం చూసిన ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యమయ్యారు. అగ్ని కీలల్లో చిక్కొని బొగ్గులైన మృతదేహాలను చూసిన ప్రతి ఒక్కరూ పగ వారికి కూడా ఇంత కష్టం రాకూడదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద శుక్రవారం తెల్లవారు జామున జరిగిన ప్రమాదంలో మృతి చెందిన గోళ్ల రమేష్ , భార్య, బిడ్డలకు డీఏన్ఏ టెస్ట్లు నిర్వహించి ఆదివారం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. రాత్రికి గోళ్లవారిపల్లికి ప్రత్యేక అంబులెన్స్ల ద్వారా చేర్చారు. సోమవారం ఉదయం అంతమయాత్ర నిర్వహించారు.ఆ కుటుంబాలను ఆదుకుంటాంఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ బాఽధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకొంటామని తెలిపారు. ఇప్పటికే టీడీపీ తరఫున రూ.10 లక్షలు వారి ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు. ఎంపీ వేమిరెడ్డి రూ.5 లక్షలు, కాకర్ల ట్రస్టు తరఫున తాను రూ.3 లక్షలు, స్వర్ణభారతి ట్రస్టు వారు రూ.లక్ష, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక్కొక్కరికి రూ.2 లక్షలు చొప్పున ఆర్థిక సహాయం లభిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి రూ.5 లక్షలు వంతున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. బస్సుకు సంబంధించి బీమాతో పాటు మరికొంత సహాయం అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో గూడా నర్సారెడ్డి, జూపల్లి రాజారావు, ఎంపీపీ మోహన్రెడ్డి, బండారు సత్యనారాయణ, మాజీ ఎంఈఓ జి.ఓబులరెడ్డి, కలిగిరి సీఐ వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
‘పోటెత్తిన’ అదనపు బాధ్యతలు
నిర్లక్ష్యం.. నీరుగారిన ఆశయం రాయలసీమ జిల్లాల్లోనే అత్యంత కీలకమైనది హంద్రీనీవా ప్రాజెక్ట్సు. ఈ ప్రాజెక్టు ఫేజ్–1కి రెగ్యులర్ ఎస్ఈ లేరు. అదనపు బాధ్యలతోనే నెట్టుకొస్తున్నారు. నాణ్యత విభాగంలో పనిచేస్తున్న ఇంజినీర్లు కొంత మంది పక్క జిల్లాల్లో నివాసం ఉంటారు. ఓ ఇంజనీర్ అతిథిగా వచ్చి 15 రోజులకు, నెలకొసారి వచ్చి పోతుంటారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రతి పొలానికీ నీరు ఇస్తామని ప్రభుత్వ పెద్దలు చెబుతన్నా.. వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. సాగునీటి ప్రాజెక్టుల ఆశయమే నీరుగారిపోతోంది. జల వనరుల శాఖలో కీలకమైన సర్కిల్స్కు రెగ్యులర్ పర్యవేక్షక ఇంజనీర్లు లేరు. ఈఈలుగా పని చేస్తున్న వారికి అదనపు బాధ్యతలుగా ఎస్ఈ పోస్టులను అప్పగించి చేతులు దులుపుకుంటున్నారు. వాస్తవానికి ఆ శాఖలో పని చేస్తున్న ఈఈలకు పదోన్నతులు ఇచ్చి రెగ్యులర్ ఎస్ఈలను నియమించాల్సి ఉంది. -
అధ్వాన రోడ్డుపై ప్రజల ఆందోళన
సి.బెళగల్: ప్రధాన రోడ్డు అధ్వానంగా ఉండటంతో వాహనాలను అడ్డుకుని ప్రజలు ధర్నా చేపట్టారు. సోమవారం సి.బెళగల్ మండల పరిధిలోని కంబదహాల్ ప్రజలు గ్రామం దగ్గర అధ్వాన రోడ్డు దుస్థితి, ప్రభుత్వ నిర్లక్ష్యపు తీరుపై మండిపడుతూ నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. గ్రామం దగ్గర ఎమ్మిగనూరు – గూడూరు వెళ్లే ప్రధాన రోడ్డుపై సంవత్సర కాలంకు పైగా దాదాపు మీటరున్నర గోతులు ఏర్పడ్డాయి. ప్రమాదకరంగా మారడంతో రోడ్డును బాగు చేయాలని అధికారులకు, టీడీపీ నేతలకు చెప్పి పట్టించుకోకపోవడంతో సోమవారం ప్రజలు ధర్నా చేశారు. దీంతో మూడు గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. భారీగా వాహనాలు ఆగిపోయాయి. ప్రజా నిరసనకు గ్రామ రైతులు, యువకులు, విద్యార్థులు, ప్రయాణికులు మద్దతు తెలిపారు. ధర్నా అనంతరం మండల కేంద్రం సి.బెళగల్కు చేరుకుని తహసీల్దార్ వెంకటలక్ష్మి, ఎంపీడీఓ రాణెమ్మ, ఎస్ఐ పరమేష్ నాయక్కు ప్రజలు వినతిపత్రాలు ఇచ్చారు. ఆత్మ పీడీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీలత కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్గా శ్రీలత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈమె ఏడాది జూన్ వరకు ఇక్కడే ఆత్మ డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్గా విధులు నిర్వహించారు. అనంతరం ఎమ్మిగనూరు ఫామ్ డీడీఏగా బదిలీ అయ్యారు. అక్కడ నాలుగు నెలల పాటు పనిచేశారు. ఇటీవల శ్రీలతకు జేడీఏగా పదోన్నతి లభించింది. పదోన్నతిపై ఖాళీగా ఉన్న ఆత్మ పీడీ పోస్టులో నియమిస్తూ ఇటీవల వ్యవసాయ శాఖ ఉత్తుర్వులు జారీ చేసింది. ఈ మేరకు బాధ్యతలు స్వీకరించారు. -
విద్యార్థులూ.. ఇదీ పోలీస్ ‘గన్’ కీర్తి!
● ఆయుధాలు చూపించి అవగాహన కల్పించిన ఎస్పీ దంపతులు ● ముగిసిన ఆయుధాలు, సాంకేతిక పరికరాల ప్రదర్శనకర్నూలు: ‘విద్యార్థులు ఇదిగో ఏకే 47 .. దూరంలో ఉన్న లక్ష్యాన్ని తునాతునకలు చేస్తుంది. ఇదిగో ఇదేమో డ్రోన్ కెమెరా.. చాలా ఎత్తుకు ఎగిరి అక్కడ జరిగే ప్రతి దృశ్యాన్ని చిత్రీకరిస్తుంది. ఇది దిశ ఎస్ఓఎస్ యాప్ ... ప్రతి సెల్ఫోన్లోను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆడపిల్లలకు ఎక్కడ ఏ ఆపద వచ్చినా, ఫోన్ ఊపితే చాలు మీరు ప్రమాదంలో ఉన్నట్లు పోలీసులకు తెలిసి పోతుంది. నిమిషాల వ్యవధిలో పోలీసులు అక్కడికి చేరుకొని రక్షిస్తారు. ఇవేమో పోలీసు జాగిలాలు.. దొంగల ఆచూకీ కనుగొని పేలుడు పదార్థాలను గుర్తిస్తాయి’ అంటూ విద్యార్థులకు ప్రతి అంశాన్ని ఎస్పీ దంపతులు విక్రాంత్ పాటిల్, దీపికా పాటిల్ వివరించారు. పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్ మైదానంలో ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఏపీఎస్పీ కర్నూలు 2వ పటాలం మైదానంలో కమాండెంట్ దీపికా పాటిల్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పోలీసులు శాంతి భద్రతలకు ఉపయోగించే ఆయుధాలు, నేర నిర్దారణకు వినియోగించే పరికరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. వారు కొద్దిసేపు ఉపాధ్యాయుల్లా వ్యవహరించారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. కమ్యూనికేషన్స్పై అవగాహన పోలీస్ శాఖ వినియోగించే వివిధ రకాల ఆయుధాలు, భద్రతా పరికరాలు, కమ్యూనికేషన్స్ వ్యవస్థ, ఫోరెన్సిక్ సామాగ్రి పనితీరు తదితర వాటిపై అక్కడున్న సిబ్బంది కూడా విద్యార్థులకు వివరించారు. పిస్టల్, తుపాకీ వినియోగం, టియర్ గ్యాస్ వినియోగం, బాంబుల గుర్తింపు, వాటిని నిర్వీర్యం చేయడం, వేలి ముద్రల సేకరణ తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అలాగే ప్రజలు, ప్రజాప్రతినిధుల రక్షణకు ఎలాంటి ఆయుధాలు వినియోగిస్తారో వివరించారు. ఆయుధ ప్రదర్శనను వీక్షించేందుకు కర్నూలులోని పలు పాఠశాలల విద్యార్థులు వచ్చారు. డీపీఓలో నిర్వహించిన కార్యక్రమంలో ఏఆర్ అడిషినల్ ఎస్పీ క్రిష్ణమోహన్, ఆర్ఐలు పోతుల రాజు, జావేద్, నారాయణ తదితరులు పాల్గొనగా, ఏపీఎస్పీ 2వ పటాలంలో ఇంచార్జీ అదనపు కమాండెంట్ నాగేంద్రరావు, మహబూబ్ బాషా, అసిస్టెంట్ కమాడెంట్లు రవికిరణ్, డీవీ రమణ, వెంకట శివుడు, రిజర్వు ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
75 శాతం సబ్సిడీపై పశుగ్రాసం విత్తనాలు
కర్నూలు(అగ్రికల్చర్): పశుగ్రాసాల సాగుకు మొక్కజొన్న, జొన్న విత్తనాలను 75 శాతం సబ్సిడీతో రైతులకు పంపిణీ చేస్తున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ జి.శ్రీనివాస్ తెలిపారు. ఈ విత్తనాలు 5 కిలోల ప్యాకెట్లలో లభిస్తాయని ఆయన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు మొక్కజొన్న విత్తనాలు 10 టన్నులు, జొన్న విత్తనాలు 10 టన్నుల ప్రకారం కేటాయించారన్నారు. మొక్కజొన్న 5 కిలోల ప్యాకెట్ పూర్తి ధర రూ.340 ఉండగా.. సబ్సిడీ రూ.255 ఉంటుందని.. రైతులు రూ.85 చెల్లించాలన్నారు. జొన్న 5 కిలోల ప్యాకెట్ ధర రూ.460 ఉండగా.. సబ్సిడీ రూ.345 ఉంటుందని.. రైతులు రూ.115 చెల్లించాలని సూచించారు. ఏక వార్షిక విత్తనాలైన జొన్న, మొక్కజొన్న విత్తనాలను అన్ని పశువైద్యశాలల్లో అందుబాటులో ఉంచుతామన్నారు. జగనన్న కాలనీవాసులకు పక్కా ఇళ్లు లేవు ఆలూరు: జగనన్న కాలనీవాసులకు పక్కా ఇళ్లు మంజూరు చేయలేమని ఆలూరు హౌసింగ్ డీఈ జె.విజయ్కుమార్ తెలిపారు. గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న ఇంజినీరింగ్ అసిస్టెంట్లతో ఆలూరులో సోమవారం ఆయన సమావేశం నిర్వహించారు. అనంతరం స్థానిక హౌసింగ్ డీఈ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఏఐ సర్వే ద్వారా పక్కాగృహాలను మంజూరు చేయాలని ఉన్నతాధికారులు నుంచి తమకు ఉత్తర్వులను అందాయన్నారు. నవంబర్ 5 నాటికి పక్కాగృహాలు ప్రభుత్వం నుంచి మంజూరు చేయించుకోవాలంటే అందుకు గ్రామ సచివాలయంలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. -
నిబంధనలు ఉల్లంఘిస్తే సీజ్ చేస్తాం
● మూడు రోజులుగా 24 కేసులు నమోదు ● రూ.1.45 లక్షలు జరిమానాలు విధించిన అధికారులు నంద్యాల(న్యూటౌన్): పర్మిట్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా తిప్పుతున్న ప్రైవేటు బస్సులను సీజ్ చేస్తామని నంద్యాల జిల్లా రవాణా అధికారి శివారెడ్డి హెచ్చరించారు. సోమవారం డీటీఓ మాట్లాడుతూ ఇటీవల జరిగిన బస్సు దగ్ధం ఘటన నేపథ్యంలో నంద్యాల ప్రాంతంలోని ప్రధాన జాతీయ రహదారిలో మూడు రోజుల పాటు ప్రత్యేక తనిఖీలు చేశామన్నారు. మూడు రోజుల నుంచి 14 బస్సులపై కేసులు నమోదు చేసి, ఒక బస్సును సీజ్ చేశామన్నారు. మూడు రోజుల్లో రూ.1.45 లక్షలు జరిమానా విధించినట్లు డీటీఓ తెలిపారు. కొన్ని ట్రావెల్ బస్సులకు ఒరిజినల్ రికార్డులు అందుబాటులో లేకపోవడంతో, పరిమితికి మించి లగేజీ రవాణా, డ్రైవర్ల లైసెన్స్లు లేని పక్షంలో కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు భద్రత ప్రమాణాలు పాటించాలని, లేని పక్షంలో సీజ్ చేస్తామన్నారు. -
ఇలకై లాసం.. కార్తీక శోభితం
శ్రీశైలంటెంపుల్: ఇల కైలాసమైన శ్రీశైలక్షేత్రం కార్తీక శోభను సంతరించుకుంది. దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీకమాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. కార్తీక మొదటి సోమవారాన్ని పురస్కరించుకుని వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చా రు. వేకువజామునుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి బారులు తీరారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. గంగాధర మండపం వద్ద, ఆలయ ఉత్తర మాఢవీధిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దీపారాధనలో పలువురు భక్తులు దీపాలు వెలిగించుకుని పూజలు నిర్వహించుకున్నారు. అలాగే కొంతమంది భక్తులు లక్ష వత్తులు వెలిగించి నోములు నోచుకున్నారు. భక్తుల రద్దీ మేరకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు శ్రీస్వామిఅమ్మవార్ల అలంకార దర్శనానికి మాత్రమే అవకాశం కల్పించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దేవస్థాన అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించారు. క్యూలైన్లలో వేచిఉన్న భక్తులకు బిస్కెట్లు, అల్పాహారం అందించారు. కమనీయం..లక్షదీపోత్సవం కార్తీక మాసం మొదటి సోమవారాన్ని పురస్కరించుకుని లోక కల్యాణం కోసం పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి నిర్వహించారు. సాయంత్రం 6.30 గంటలకు శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పుష్కరిణి వద్దకు ఆశీనులు చేసి అర్చకులు, వేదపండితులు విశేషంగా పూజాదికాలు నిర్వహించారు. అలాగే లక్షదీపోత్సవ కార్యక్రమంలో భాగంగా పుష్కరిణి ప్రాంగణమంతా లక్ష దీపాలను ఏర్పాటు చేసి వెలిగించారు. అనంతరం శ్రీస్వామిఅమ్మవార్లకు, పుష్కరిణికి దశవిధ హారతులను ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు వీరన్నస్వామి, మార్కండేయశాస్త్రి ఇచ్చారు. భక్తులు హారతులను కనులారా తిలకించి స్వామిఅమ్మవార్లను దర్శించి నేత్రానందభరితులయ్యారు. ఈ పూజా కార్యక్రమాల్లో శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, శ్రీశైల దేవస్థాన ట్రస్ట్బోర్డు చైర్మన్ రమేష్నాయుడు, ఈఓ ఎం.శ్రీనివాసరావు దంపతులు, అధికారులు పాల్గొన్నారు. మొదటి సోమవారం భక్తులతో కిటకిటలాడిన శ్రీగిరి మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు నేత్రానందభరితంగా లక్షదీపోత్సవం, పుష్కరిణికి దశవిధ హారతులు -
కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం
కొలిమిగుండ్ల: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విమర్శించారు. బెలుం గుహల ఆవరణలోని మీటింగ్ హాల్లో మూడు రోజుల పాటు జిల్లా స్థాయి శిక్షణా తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా హాజరైన ఈశ్వరయ్యను ముందుగా రాష్ట్ర కార్యదర్శిగా ఎంపికై నందుకు నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ..రైతులకు ఏ పంటకూ గిట్టు బాటు ధర లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని ఉల్లి రైతులకు ధర నిర్ణయించాలని డిమాండ్ చేశారు. టీడీపీ అధికారంలోకి రాక ముందు, వచ్చిన తర్వాత చెప్పిన మాటలకు ఏ మాత్రం పొంతన లేదని విమర్శించారు. అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు ఒకే సారి రూ.20 వేలు ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. భూ బ్యాంక్ అంటూ ప్రతి నియోజకవర్గంలో లక్షల ఎకరాలు సేకరించి కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు శ్రీకారం చుడుతున్నారన్నారు. రాజధానికి సమీపంలోనే ఎయిర్పోర్టులు ఉన్నా కొత్తగా కట్టడం ఏంటని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు ప్రధాని ఎజెండాను మోస్తున్నారని విమర్శించారు. రూ.6,400 కోట్ల ఫీజు బకాయిలు ఉన్నా యని గుర్తు చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు తీసుకొస్తే వాటిని ప్రైవేట్ పరం చేస్తుండటం దుర్మార్గమన్నారు. రేషన్ బియ్యాన్ని ఎమ్మెల్యేలు పోర్టుల ద్వారా అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మౌనం వీడటం లేదని విమర్శించారు. ప్రజల సమస్యలపై సీపీఐ నిర్విరామంగా పోరాటం సాగిస్తుందన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు,రైతు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు రామచంద్రయ్య, జిల్లా కార్యదర్శి రంగమనాయుడు, మండల రైతు సంఘం నాయకులు పుల్లయ్య, పెద్దయ్య, వేణుగోపాల్రెడ్డి, వినయ్ తదితరులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేట్కు అప్పగించడం దారుణం ప్రభుత్వ భూములు కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం -
కర్నూలు బస్సు ప్రమాదం.. రమేష్ కుటుంబాన్ని వెంటాడుతున్న ప్రమాదాలు
సాక్షి,అమరావతి: హైదరాబాద్ నుంచి గురువారం రాత్రి బెంగళూరుకు బయలు దేరిన వేమూరి కావేరి ట్రావెల్స్కు చెందిన స్లీపర్ కోచ్ బస్సు(డీడీ 01ఎన్9490) శుక్రవారం తెల్లవారు జామున కర్నూలు సమీపంలో ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసింది. అయితే ఈ ప్రమాదంలో మరణించిన గోళ్ల రమేష్(31) కుటుంబాన్ని ప్రమాదాలు వెంటాడుతున్నాయి.సోమవారం కర్నూలు బస్సు ప్రమాదంలో చనిపోయిన రమేష్ కుటుంబసభ్యుల అంత్యక్రియల్లో పాల్గొని ఇంటికి వెళ్తుండగా వారి కుటుంబసభ్యులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. నెల్లూరు జిల్లా జలదంకి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో రమేష్ కుటుంబసభ్యుల ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. వింజమూరు (మం) గోళ్ళవారి పల్లి నుండి విజయవాడ వెళ్తుండగా కారు టైర్ పంచర్ కావడంతో కల్వర్టను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
అడుగడుగునా ‘మందు’పాతర్లు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా మద్యం లభిస్తోంది. గుడి, బడి అనే తేడా లేకుండా ఎక్కడంటే అక్కడ మద్యం దుకాణాలను ఏర్పాటు చేశారు. ఎప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ మద్యం లభిస్తోంది. బెల్టు షాపుల నిర్వహణకు అడ్డూఅదుపూ లేకపోవడంతో 16 సంవత్సరాలు దాటని పిల్లలు కూడా మద్యానికి బానిసలుగా మారుతున్నారు. తరచూ ప్రమాదాలు చోటుచేసుకుని ప్రాణాలు పోతున్నా రాష్ట్ర ప్రభుత్వంలో కనీస స్పందన కరువైంది. – సాక్షినెట్వర్క్ ఎమ్మిగనూరు పట్టణంలో మంత్రాలయం రోడ్డు పక్కనే ఉన్న వైన్ షాప్ -
రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్
● మూడో రోజు 14 కేసుల నమోదు ● రూ.72 వేలు జరిమానా, రూ.96 వేల పన్నులు వసూలుకర్నూలు: కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధం ఘటన నేపథ్యంలో జిల్లాలోని రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. స్పెషల్ డ్రైవ్ ద్వారా తనిఖీలు విస్తృతం చేసి నిబంధనలు పాటించని ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ఐదు రవాణా శాఖ కార్యాలయాలు ఉన్నాయి. జిల్లా మీదుగా నిత్యం 200కు పైగా ట్రావెల్స్ బస్సులు తిరుగుతుంటాయి. హైదరాబాద్, బెంగుళూరు, చైన్నె, తిరుపతి, విజయవాడ, షిర్డీ వంటి ప్రాంతాలకు నిత్యం ట్రావెల్స్ బస్సులు కర్నూలు మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. ఉమ్మడి జిల్లా నుంచి సుమారు వెయ్యి మందికి పైగానే రోజు ఆయా ప్రాంతాలకు ప్రయాణిస్తుంటారు. కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్దం ఘటన నేపథ్యంలో రవాణా అధికారులు బృందాలుగా ఏర్పడి తనిఖీలు విస్తృతం చేశారు. ఘటన జరిగిన మొదటి రెండు రోజుల్లో 12 వాహనాలపై కేసులు నమోదు చేసి రూ.2.42 లక్షల జరిమానా విధించగా, 3వ రోజు శనివారం అర్దరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు తనఖీలు కొనసాగాయి. సుమారుగా 50కి పైగా వాహనాలను తనిఖీలు చేసి 14 బస్సులపై ఉల్లంఘన కేసులు నమోదు చేశారు. ఇందుకు గాను రూ.72,050లు జరిమానా విధించి, పన్నులు చెల్లించకుండా తిప్పుతున్న వాహనాల నుంచి రూ.96 వేలు వసూలు చేశారు. తనిఖీల సందర్భంగా అనేక లోపాలు బయట పడ్డాయి. ప్రధాన ఉల్లంఘనలు ఇవే ... నిబంధనలకు విరుద్ధంగా సరుకులను అనధికారికంగా రవాణా చేస్తున్నారు. కాసులకు కక్కుర్తి పడి ప్రమాదకర వస్తువులను సైతం లగేజీ రూపంలో అనుమతిస్తున్నారు. ఇవే ప్రమాద తీవ్రతకు కారణమవుతున్నాయి. ఫైర్ అలారం అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వెంటనే మంటలను అర్పే యంత్రాలు ఉండడం లేదు. ప్రథమ చికిత్స కిట్లు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు అందుబాటులో ఉండక పోవడం, వాణిజ్య సరుకు రవాణా, పన్నుల ఎగవేత, సీట్లు ఆల్ట్రేషన్ చేయడం వంటి లోపాలు గత మూడు రోజులుగా బయట పడుతున్నాయి. తనిఖీల సందర్భంగా అధికారులు వాహన పర్మిట్లు, పన్నులు, ఎఫ్సీలు, బస్సుల్లో అత్యవసర ద్వారాలు, వాహన రికార్డులు వంటివి పరిశీలించి ఉల్లంఘనలు ఉంటే కేసులు నమోదు చేస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్ – బెంగుళూరు, కర్నూలు – కడప జాతీయ రహదారులపై తనిఖీలు కొనసాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా సిట్టింగ్ మార్పు, అత్యవసర నిష్క్రమణ ద్వారాలు ఉన్నాయా, లేదా అని పరిశీలించి కేసులు నమోదు చేస్తున్నారు. కొన్ని ట్రావెల్స్ బస్సులకు ఒరిజినల్ రికార్డులు అందుబాటులో లేకపోవడం, పరిమితికి మించి లగేజీ రవాణా, డ్రైవర్ల లైసెన్స్ గడువు ముగియడం, ప్రయాణికుల జాబితా లేకపోవడం వంటివి వెలుగు చూశాయి. మూడో రోజు అగ్నిమాపక పరికరాలు లేని ఆరు బస్సులపై కేసులు నమోదు కాగా, ఎమర్జన్సీ డోర్ లేని ఒక బస్సు పైన పర్మిట్ లేకుండా తిరుగుతున్న రెండు బస్సులు, పన్ను చెల్లించకుండా తిప్పుతున్న ఒక బస్సు, కిటికీ అద్దాలు సక్రమంగా లేకుండా ఉన్న మరో ఐదు బస్సులను గుర్తించి కేసులు నమోదు చేశారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలి. లేకుంటే అపరాధ రుసుం విధించడంతో పాటు బస్సును సీజ్ చేస్తాం, రహదారి భద్రతపై డ్రైవర్లకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నాం. ఉల్లంఘనలకు పాల్పడితే ఉపేక్షింది లేదు. తనిఖీలు నిరంతరాయంగా సాగుతాయి. – శాంతకుమారి, డీటీసీ -
పసుపు పంటపై విష ప్రయోగం
● వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యుడి పొలంపై దుండగుల దాష్టికంచాగలమర్రి: చిన్నవంగలి గ్రామానికి చెందిన రైతు, వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యుడు కంసాని లక్ష్మీ రెడ్డికి చెందిన పసుపు పంటపై గుర్తు తెలియని దండగులు గడ్డి మందు పిచికారీ చేశారు. లక్ష్మీరెడ్డి మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో పసుపు పంట సాగు చేశాడు. ఏపుగా పెరిగిన పసుపు పంటను చూసి ఓర్వ లేని దుండగులు శనివారం అర్ధరాత్రి సమయంలో 3 రకాల గడ్డి మందులను పొలం బోరు వద్ద ఉన్న డ్రిప్ ట్యాంకు నీటిలో కలిపి ఆ మందు సీసాలను ట్యాంకులోనే వేశారు. అలాగే ఆ మందులు కలిపిన నీటిని పసుపు పంటపై కొంత మేర పిచికారీ చేశారు. ఆది వారం ఉదయం రైతు లక్ష్మీరెడ్డి పసుపు పంట పొలం వద్దకు వచ్చి పరిశీలించగా, కొంత విస్తీర్ణంలో పసుపు మట్టలు కాలిపోయిన వర్ణంలో కనిపించాయి. అనుమానంతో డ్రిప్ ట్యాంకును పరిశీలించగా ట్యాంకులో గడ్డి మందు సీసా కనబడటంతో పంటపై విష ప్రయోగం జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
శ్రీశైలం నంద్యాల జిల్లాలోనే కొనసాగాలి
నంద్యాల(అర్బన్): రాయలసీమకు ప్రాణాధారమైన శ్రీశైలంను నంద్యాల జిల్లాలోనే కొనసాగించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక కార్యాలయంలో ఆదివారం ఆయన ముఖ్యనాయకులతో కలిసి మాట్లాడుతూ.. 12 జ్యోతిర్లింగాలలో ఒకరైన శ్రీశైలం మల్లికార్జునుడు, 18 మహాశక్తి పీఠాలలో ఒకరైన భ్రమరాంబిక దేవి ఒకే సన్నిధిలో వెలసిన ఏకై క క్షేత్రం శ్రీశైలం పుణ్యక్షేత్రమన్నారు. నూతనంగా ఏర్పాటు చేసే మార్కాపురం జిల్లాలో శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని కలపాలనే వదంతులతో సీమ వాసుల్లో తీవ్ర ఆందోళన నెలకొంటుందన్నారు. 60వేల ఎకరాల భూమిని సీమ ప్రజల త్యాగంతో నిర్మించుకున్నారన్న విషయాన్ని పాలకులు మరువవద్దన్నారు. సీమ ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన ఈ అంశంపై వస్తున్న వదంతులను ప్రభుత్వం ఖండిస్తూ ప్రకటన జారీ చేయాలన్నారు. రాయలసీమ ప్రజా ప్రతినిధులు ఈ విషయాన్ని అత్యంత బాధ్యతగా తీసుకొని శ్రీశైలం సీమలోని నంద్యాల జిల్లా పరిపాలన పరిధిలోనే కొనసాగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని రావాలన్నారు. కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షులు వైఎన్రెడ్డి, సభ్యులు సుధాకర్రావు పాల్గొన్నారు. -
ప్రైవేటీకరణను వెంటనే విరమించుకోవాలి
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డికర్నూలు (టౌన్): గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.వేల కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. కర్నూలు నగరంలోని పాతబస్టాండ్, 2వ వార్డు, 4వ వార్డు పరిధిలోని ప్రాంతాల్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా వైద్యాన్ని ప్రెవేటు వ్యక్తులకు ఇస్తే సహించేది లేదన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేద, సామాన్య, మద్య తరగతి వర్గాలు సైతం ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేసిందన్నారు. వాటిని ప్రైవేటీకరణ చేయాలని ప్రస్తుత ప్రభుత్వం దుర్మార్గంగా ఆలోచిస్తోందన్నారు. దాదాపు రూ.10 వేల కోట్లు విలువ చేసే ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఎకరాల కొద్దీ ప్రభుత్వ స్థలాలను కొట్టేసేందుకు కుట్రలు చేశారన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు, నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు ఉధృతం చేశామన్నారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే ఢిల్లీ స్థాయిలో ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్, 2వ వార్డు పరిధిలోని మైనార్టీ నాయకులు ఫిరోజ్, వలీ, నాగరాజు, రాము, ఆస్లామ్, పుర్ణా, 4వ వార్డు పరిధిలోని కార్పొరేటర్ ఆర్షియా ఫర్హీన్, విక్రమ సింహారెడ్డి, ఆనంద్ రెడ్డి, మహేంద్ర, రైస్ బాబా, రాము, చిట్టిబాబు, శ్రీకాంత్, శివ, గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఆంధ్రా ఉమెన్స్ టీ–20 కోచ్గా శ్రీనివాసులు
కర్నూలు (టౌన్): ఆంధ్రా ఉమెన్స్ అండర్–19 టీ 20 క్రికెట్ మ్యాచ్లకు ఫీల్డింగ్ కోచ్గా కర్నూలు నగరానికి చెందిన వాల్మీకి శ్రీనివాసులు నియమితులయ్యారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఉమెన్స్ అండర్–19 మ్యాచ్ బిహార్, ఆంధ్రప్రదేశ్ జట్ల మధ్య పోటీలు జరుగుతున్నాయి. ఈ మ్యాచ్లకు ఆయన కోచ్గా వ్యవహరించడంపై కర్నూలు క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా క్రికెట్ అసొసియేషన్ ప్రధాన కోచ్గా వ్యవహరిస్తున్న ఆయన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున అన్ని వయస్సుల క్యాటగిరీలకు ఫీల్డింగ్ కోచ్గా, టీమ్ మేనేజర్ గా వ్యవహరించినట్లు వెల్లడించారు. స్కేటింగ్ సాధనతోనే పతకాలు సాధ్యం కర్నూలు (టౌన్): ప్రతి రోజు స్కేటింగ్ను సాధన చేయడం ద్వారానే పతకాలు సాధ్యమని మానవత కన్వీనర్ యాని ప్రతాప్ అన్నారు. ఆదివారం స్థానిక బి. క్యాంపు లోని ఈట్ స్ట్రీట్లో జిల్లా స్థాయిలో స్కేటింగ్ పోటీలు నిర్వహించారు. మంచి ప్రతిభ చాటిన క్రీడాకారులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా అమె మాట్లాడుతూ.. చిన్నారులు అంతర్జాతీయ క్రీడను ఎంచుకోవడం సంతోషించదగ్గ విషయమన్నారు. స్కేటింగ్ క్రీడల్లో వ్యక్తిగతంగా గుర్తింపు రావాలంటే ప్రతి రోజు సాధన తప్పకుండా చేయాలన్నారు. అప్పుడే స్కేటర్లకు మంచి విజయాలు చేకూరుతాయన్నారు. స్కేటింగ్ అసోసియేషన్ సీఈవో సునీల్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లా స్థాయిలో స్కేటింగ్లో ప్రతిభ చాటి విజేతలుగా నిలిచిన క్రీడాకారులు వచ్చే నెల 1 వ తేదీ నుంచి కాకినాడలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి స్కేటింగ్ పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలోస్కేటింగ్ కార్యదర్శి అబూబకర్, సంయుక్త కార్యదర్శి పునీతా చౌదరి పాల్గొన్నారు. యువకుడి మృతి కోవెలకుంట్ల: స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఆదివారం ఓ యువకుడు మృతి చెందినట్లు ఎస్ఐ మల్లికార్జునరెడ్డి తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాలను మేరకు.. మండలంలోని బిజనవేములకు చెందిన దస్తగిరి(30) కొంతకాలంగా అనా రోగ్యంతో బాధపడుతున్నాడు. ఉదయం 11.30 గంటల సమీపంలో కోవెలకుంట్లకు వచ్చి సుష్మిత ఫర్టిలైజర్ షాపు పక్కన అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమా చారం అందించారు. పోలీసులు అక్కడి చేరుకుని పరిశీలించగా మృతి చెందినట్లు గమనించారు. మృతికిగల కారణాలు తెలియరాలేదు. మృతుని తల్లి నాగలక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. డిప్యూటేషన్పై డైట్కు అవకాశం కర్నూలు సిటీ: ప్రభుత్వ, జిల్లా, మున్సిపల్ యాజమాన్యాలకు చెందిన హైస్కూళ్లలోని స్కూల్ అసిస్టెంట్లు ఉపాధ్యాయులు డిప్యూటేషన్పై ప్రభుత్వ డైట్ (బి.తాండ్రపాడు)కాలేజీలో డిప్యూటేషన్పై పని చేసేందుకు దరఖాస్తు చేసుకోవాలని డైట్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆయూబ్ హూసేన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కాలేజీలో ఫిలాసఫి/సోషియాలజీ లెక్చరర్ ఒకటి, తెలుగు లెక్చరర్ ఒకటి, ఫైన్ ఆర్ట్స్ లెక్చరర్స్ రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈ నెల 29వ తేదీలోపు దరఖాస్తులను డైట్ కళాశాలలో అందజేయాలన్నారు. పూర్తి వివరాలకు డైట్ కాలేజీ జూనియర్ అసిస్టెంట్ ఉదయ్ 7661913634ను సంప్రదించాలన్నారు. -
గుంతలు దాటలేక..
ఆదోని అర్బన్: ఆదోని పట్టణంలోని మాధవరం రోడ్డు వ్యవసాయ మార్కెట్యార్డు సమీపంలో పత్తి దిగుబడులతో వస్తున్న వాహనం ఆదివారం వర్షపునీటిలో బోల్తా పడింది. చిన్న వర్షం వచ్చినా చెరువుగా మారే ఈ రహదారిలో రోజూ ఒక వాహనం, వ్యక్తులు పడిలేవడం నిత్యకృత్యంగా మారింది. ఆదివారం రైతు పత్తి దిగుబడులను అమ్మకానికి యార్డుకు తీసుకొస్తుండగా వాహనం బోల్తా పడి పత్తి దిగుబడి వర్షపునీటిలో తడిచి రైతుకు నష్టం వాటిల్లింది. ఆ రహదారిపై చిన్న వర్షానికే వర్షపు నీరు నిలిచి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరా యం కలుగుతోంది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు కనీస మరమ్మతులైనా చేయాలని రైతులు, వాహనాదారులు, స్థానికులు కోరుతున్నారు. -
శ్రీమఠంలో భక్తుల సందడి
మంత్రాలయం రూరల్: శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం కావడంతో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక భక్తులు భారీగా వచ్చారు. తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలు ఆచరించి ముందుగా గ్రామ దేవత మంచాలమ్మ దర్శనం చేసుకున్నారు. అనంతరం శ్రీరాఘవేంద్ర మూల బృందావనానికి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల దర్శనార్థం ప్రత్యేక క్యూలైన్లు శ్రీమఠం అధికారులు ఏర్పాటు చేశారు. శ్రీమఠం ప్రాంగణంలో రాఘవేంద్రుల మూలబృందవన ప్రతిమను బంగారు పల్లికీలో కొలువుంచి భక్తజనం మధ్య ఊరేగించారు. శ్రీమఠం కారిడార్లో భక్తుల కోలహలం -
చోరీ కేసులో నిందితుల అరెస్ట్
కోసిగి: మండల కేంద్రంలోని ఉరుకుంద క్రాస్ రోడ్డు సాయిబాబా కాలనీలో నివాసం ఉంటున్న జొల్లు లీలావతి ఇంట్లో ఈ నెల 6వ తేదీన చోరీకి పాల్పడిన వారిని అరెస్ట్ చేసినట్లు కోసిగి సీఐ మంజునాథ్, ఎస్ఐ హనుమంత రెడ్డి తెలి పారు. ఆదివారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో నిందితులను అరెస్ట్ చూపు తూ వివరాలను వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం రాయచూరుకు చెందిన అంజినయ్య, పరుశురాం కందుకూరు గ్రామ క్రాస్ రోడ్డు వద్ద అనుమానాస్పదంగా ఉండగా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారి వద్ద నుంచి 25 గ్రాముల బంగారం, 20 తులాల వెండి, రూ.6,300 నగదు రికవరీ చేసినట్లు తెలిపారు. పట్టుబడిన వ్యక్తులపై రాయచూరులో మర్డర్ కేసు, పలు చోరీ కేసులు నమోదై ఉన్నట్లు వివరించారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. దొంగలను పట్టుకునేందుకు కృషి చేసిన ఎస్ఐ హనుమంత రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ నజీర్, శ్రీనివాసులు, కానిస్టేబుళ్లను సీఐ అభినందించారు. ‘పాప దొరికింది’.. అలరించింది కర్నూలు కల్చరల్: టీజీవీ కళాక్షేత్రం ఆధ్వర్యంలో ప్రదర్శించిన ‘పాప దొరికింది’ హాస్య నాటిక అలరించింది. ఆదివారం సీక్యాంప్ కళాక్షేత్రంలో గుంటూరు ఆరాధన ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రదర్శించిన ఈ నాటిక హాస్య భరితంగా సాగింది. అనంతరం నాటిక కళాకారులను నిర్వాహకులు ఘనంగా సన్మానించి రూ. 20 వేల నగదు పారితోషికాన్ని అందించారు. ఈ సందర్భంగా కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య మాట్లాడుతూ.. ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహిస్తున్న సాంఘిక నాటికల ప్రదర్శనలో భాగంగా ఈ నాటిక ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సందేశాత్మకంగా సాగిన నాటిక ఆహుతులను అలరించిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయ మేనేజర్ చిన్నరాముడు, కళాక్షేత్రం మాజీ అధ్యక్షులు దస్తగిరి, కార్యదర్శి యాగంటీశ్వరప్ప, సభ్యులు సీవీ రెడ్డి, సంగా ఆంజనేయులు, రాజారత్నం, మహమ్మద్ మియ్యా, రమణ పాల్గొన్నారు. -
మోంథా తుఫానుపై అప్రమత్తంగా ఉండండి
● జూమ్ కాన్ఫరెన్స్లో డీబీసీడబ్ల్యూఈఓ కే ప్రసూనకర్నూలు(అర్బన్): మోంథా తుఫానుతో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున జిల్లాలోని ప్రభుత్వ బీసీ వసతి గృహాల్లోని విద్యార్థుల శ్రేయస్సు పట్ల జాగ్రత్తగా ఉండాలని జిల్లా బీసీ సంక్షేమ సాధికారత అధికారిణి కే ప్రసూన కోరారు. ఆదివారం మధ్యాహ్నం భోజన సమయంలో ఆమె జిల్లాలోని వసతి గృహ సంక్షేమాధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున పాత భవనాల్లో కొనసాగుతున్న వసతి గృహాలకు చెందిన హెచ్డబ్ల్యూఓలు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. అవసరమైతే విద్యార్థుల వసతికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. ఎలాంటి ఇబ్బందికరమైన సంఘటనలు ఎదురైనా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అందరు హెచ్డబ్ల్యూఓలు తాము పనిచేస్తున్న ప్రాంతంలోనే ఉండాలన్నారు. మూడు రోజులు వర్షాలు ఉన్నందున విద్యార్థుల మెనూకు అవసరమైన కూరగాయలు, ఆకుకూరలు, అవసరమైన నిత్యావసర సరుకులను నాలుగైదు రోజులకు సరిపడా నిల్వ ఉంచుకోవాలన్నారు. గ్యాస్ సిలిండర్లను కూడా అదనంగా నిల్వ ఉంచుకోవాలన్నారు. విద్యుత్ సరఫరా పట్ల జాగ్రత్తగా ఉండాలని, విద్యార్థులు వర్షంలో తడవకుండా చూడాలన్నారు. అలాగే హాస్టళ్ల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజన సౌకర్యాలను కల్పించాలన్నారు. ఈ నేపథ్యంలోనే పలు వసతి గృహాల విద్యార్థులతో ఆమె జూమ్ కాన్ఫరెన్స్లోనే వారికి అందుతున్న మెనూ, సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. -
పరిహారం కోసం వివరాలను తీసుకున్నాం
ఏపీ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ప్రకటించిన పరిహారం ఇచ్చే ప్రక్రియ మరింత ఆలస్యం కానున్నది. మృతి చెందిన కుటుంబ సభ్యులకు రూ.5లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల పరిహారాన్ని ప్రకటించింది. అయితే ఇందుకోసం బాధిత కుటుంబ సభ్యులు బ్యాంకు ఖాతాలు, ఆధార్, ఇతర వివరాలను తీసుకున్నాం. త్వరలోనే బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందుతుంది. – డాక్టర్ ఏ.సిరి, కర్నూలు జిల్లా కలెక్టర్ నా అల్లుడు శ్రీనివాసరెడ్డి బస్సు దహనంలో చనిపోయాడు. ఆయనకు సెంటు భూమి కూడా లేదు. క్రేన్ మెకానిక్గా పనిచేసి జీవనం చేసేవాడు. పనికోసం హైదారాబాద్కు వెళ్లాడు. అక్కడి నుంచి బెంగళూరులో పని కోసం కాల్ వస్తే వెళ్లాడు. అయితే మార్గమధ్యలో ప్రమాదం జరిగి చనిపోయాడు. శ్రీనివాసరెడ్డికి భార్య లక్ష్మీజ్యోతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలి. లేదంటే వారు రోడ్డున పడతారు. – అచ్చిరెడ్డి. రావులపాళెం, తూగో జిల్లా నా కుమారుడు ఆర్గ బంధోపాధ్యాయ చనిపోవడం చాలా బాధ ఉంది. నా భార్య, కుటుంబ సభ్యులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. మాది సొంతూరు కలకత్తా. అయితే ఉద్యోగం కోసం బెంగళూరు వచ్చాం. మా అబ్బాయి బెంగళూరు నుంచి స్నేహితుడు పిలిస్తే దీపావళి పండగకు హైదరాబాద్కు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో చనిపోవడం అన్యాయం. 23 ఏళ్లకే నూరేళ్లు నిండాయి. పెళ్లి కోసం ఎన్నో కలలు కన్నాం. అవన్నీ కల్లలయ్యాయి. – అభిజిత్ బంధోపాధ్యాయ, బెంగళూరు● -
ఆయుధ పాఠం
కర్నూలు: రకరకాల తుపాకులు, రైఫిళ్లు, మెటల్ డిటెక్టర్లు, రాకెట్ లాంఛర్లు, పిస్టళ్లు, మెషిన్గన్లు, అత్యాధునిక బైనాక్యులర్లు, సురక్షిత జాగిలాలు, అత్యంత నైపుణ్యత కలిగిన సిబ్బంది వెరసి జిల్లా పోలీసు కార్యాలయ మైదానంలో ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ అధరహో అనిపిస్తోంది. పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ ఏటా నిర్వహించే ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయ మైదానంలో అడిషనల్ ఎస్పీలు హుసేన్ పీరా, కృష్ణమోహన్ కలసి ప్రారంభించారు. రెండో రోజు సోమవారం కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుందని వారు ప్రకటించారు. శాంతిభద్రతల పరిరక్షణ నుంచి నేరస్థుల కట్టడి వరకు పోలీసులు వినియోగిస్తున్న అధునాతన ఆయుధాలను ప్రదర్శనకు ఉంచారు. ప్రజల నుంచి ప్రజాప్రతినిధుల రక్షణ వరకు ఎలాంటి ఆయుధాలు వినియోగిస్తున్నారు? అవి ఎలా ఉంటాయి? వాటి వినియోగం ఎలా? తదితర అంశాల గురించి విద్యార్థులకు అక్కడ విధులు నిర్వహించిన పోలీసు అధికారులు అవగాహన కల్పించారు. ప్రదర్శనలో వివిధ రకాల రైఫిళ్లు, పిస్టోల్, గన్లు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, డే విజన్ బైనాక్యులర్, బాంబ్ డిటెక్టర్, స్పీడ్ గన్ మిషన్, ట్రాఫిక్ సిగ్నల్ సైన్ బోర్డు, డ్రంకెన్ బ్రీత్ ఎనలైజర్ మిషన్, ఫింగర్ప్రింట్ ఐడెంటిఫికేషన్, డ్రోన్ కెమెరాలు, వజ్ర వాహనం, ఫాల్కన్, బాంబ్ సూట్, డాగ్ స్క్వాడ్ బృందాలు వినియోగించే ఆయుధాలు ఉంచారు. కార్యక్రమంలో ఆర్ఐలు పోతల రాజు, జావెద్, నారాయణ, ఆర్ఎస్ఐలు, పోలీసు సిబ్బంది, నగరంలోని గుత్తి పెట్రోల్ బంకు సమీపంలో ఉన్న ఇండస్ స్కూల్, బి.క్యాంప్లో ఉన్న బీసీ, ఎస్సీ హాస్టల్ విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. పోలీసు సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఓపెన్ హౌస్ ప్రారంభించిన అదనపు ఎస్పీలు పోలీసు ఆయుధాలపై విద్యార్థులకు అవగాహన -
గాజులదిన్నె ప్రాజెక్టు పైప్లైన్కు రంధ్రం
కృష్ణగిరి: గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి డోన్కు తాగునీటి కోసం ఏర్పాటు చేసిన పైప్లైన్కు కోయిలకొండ గ్రామ సమీపాన రంధ్రం పడి నీరు వృథాగా పోతోంది. నెల రోజులుగా పైప్లైన్కు రంధ్రం పడినా అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నీరు గ్రామానికి చెందిన చెరువు మాధవకృష్ణ పొలంలోకి వెళ్తున్నాయి. చివరి మజిలీకి దారి కష్టాలు కృష్ణగిరి: మండల పరిధిలోని టి.గోకులపాడు గ్రామంలో ముస్లింలకు సంబంధించిన శ్మశానవాటికకు వెళ్లే దారిలో హంద్రీ నది ఉండటంతో రాకపోకలు సాగించే పరిస్థితి దయనీయంగా ఉంది. ఆదివారం గ్రామంలో ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. హంద్రీ నదిలో పారే నడుము లోతు నీటిలోనే మృతదేహాన్ని తీసుకెళ్లి అవతలి ఒడ్డున అంతిమ సంస్కారాలు చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఈ హంద్రీపై రూ. 7.95 కోట్లతో వంతెన నిర్మాణానికి అప్పటి ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి శంకుస్థాపన చేశారు. అంతలోనే ఎన్నికలు రావడం, కూటమి ప్రభుత్వం రావడంతో వంతెన గురించి పట్టించుకోలేదు. దీంతో ముస్లిలు, గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. హాలహర్వి: మండలంలోని నిట్రవట్టి గ్రామం నుంచి ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో 40 కుటుంబాల ప్రజలు తెలంగాణ రాష్ట్రానికి, బెంగళూరు పట్టణాలకు ఆల్విన్ (టిప్పర్) వాహనంలో పిల్లాపాపలతో కలిసి వలస వెళ్లారు. గ్రామాల్లో సాగుచేసిన పంటలు వర్షాల ధాటికి నష్టం రావడంతో రోజూ కురుస్తున్న వర్షాలకు రబీ సీజన్లో వేసిన పప్పుశనగ, జొన్న, వాము పంటలు దెబ్బతిన్నాయన్నారు. దీంతో చేసేదేమి లేక స్థానికంగా పనులు లేక వలస వెళ్తున్నామని వ్యవసాయ కూలీలు, రైతులు తెలిపారు. స్థానికంగా ఉపాధి పనులు కల్పిస్తే ఇక్కడే పనులు చేసుకునేవారమని వారు చెప్పారు. శ్రీగిరి కిటకిట శ్రీశైలంటెంపుల్: కార్తీకమాసం పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు శ్రీగిరికి తరలివచ్చారు. ఆదివారం వేకువజాము నుంచే భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం మల్లన్న దర్శనానికి ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు బారులుదీరారు. భక్తుల రద్దీతో ఆలయ క్యూలైన్లు నిండిపోయాయి. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. పలువురు భక్తులు కార్తీకదీపారాధన చేసుకుని ప్రత్యేక నోములు నోచుకున్నారు. కార్తీక దీపారాధనకు దేవస్థానం విస్త్రత ఏర్పా ట్లు చేసింది. భక్తుల రద్దీతో ఆలయ పురవీధులన్నీ కిటకిటలాడాయి. కుందూ నదికి పోటెత్తిన వరద కోవెలకుంట్ల: స్థానిక వ్యవసాయ సబ్ డివిజన్తోపాటు ఎగువ ప్రాంతాల్లో ఐదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో కుందూనదికి వరదనీరు పోటెత్తింది. అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలతో వాగులు, వంకలు, పొలాల్లోని నీరంతా కుందూలోకి చేరడంతో నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మండలంలోని గుళ్లదూర్తి సమీపంలో నదికి అనుసంధానంగా ఉన్న కప్పల పాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. వాగు పరీవాహకంలో ఉన్న వరి పైర్లలోకి భారీగా వర్షపు నీరు చేరడంతో పంట నీట మునిగింది. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
పాణ్యం: కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారిపై తమ్మరాజుపల్లె సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, మరో 13 మంది గాయపడ్డారు. హైవే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మిడ్తూరు మండలం వీపనగండ్ల గ్రామానికి చెందిన కొందరు కార్తీక మాసం ఆదివారం సందర్భంగా పాణ్యం మండలంలోని ఎస్ కొత్తూరు శ్రీవల్లి సుబ్రమణ్యేశ్వరస్వామి దర్శనానికి ఆటోలో చేరుకున్నారు. స్వామి వారిని దర్శించుకుని తిరిగి ఆటోలో వెళ్తుండగా తమ్మరాజుపల్లె గ్రామం వద్ద వెనక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొంది. ఈ ఘటనలో ఆటో బోల్తాపడగా అందులో ఉన్న ప్రయాణికులు గాయపడ్డారు. వీపనగండ్ల గ్రామానికి చెందిన బోయ సరస్వతి (55), మహేశ్వరమ్మకు తీవ్ర గాయాలు కావడంతో 108లో కర్నూలు పెద్దాసుపత్రికి తరలించారు. అప్పటికే సరస్వతి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న ట్రైనీ ఎస్ఐ ధనుంజయ.. గాయపడిన ఆటో డ్రైవర్ బోయ రాఘవేంద్ర, లక్ష్మీదేవి, గౌతమ్నంద, లక్ష్మీదేవి, మద్దమ్మ, షేక్ షరీఫాబీ, షేక్ రేష్మా, పవిత్ర, శ్యామల, షేక్ రిజ్వాన్, రాణి, కె. భవ్యశ్రీని నంద్యాల జీజీహెచ్కు తరలించారు. మృతురాలి సరస్వతికి భర్త సుంకన్న, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. -
కోలుకుంటున్న బస్సు ప్రమాద బాధితుడు.. ఆస్పత్రిలో చేరిన ఎర్రిస్వామి
సాక్షి, కర్నూలు: కర్నూలు శివారులో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంలో తీవ్ర అస్వస్థతకు గురైన గుణసాయి అనే ప్రయాణికుడు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో కోలుకుంటున్నాడు. మచిలీపట్నంకు చెందిన ఈయన ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉంటున్నాడు. బస్సులో ప్రయాణిస్తుండగా మంటలు రావడంతో ఆ పొగ పీల్చి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఈ క్రమంలో అతని ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్కు గురయ్యాయి. దీంతో అతన్ని కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేరి్పంచారు. వైద్యులు అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆర్ఐసీయులో ఉంచి వైద్యం అందిస్తున్నారు. శనివారం వరకు విషమంగా ఉన్న అతని ఆరోగ్యం వైద్యుల కృషి ఫలితంగా ఆరోగ్యం మెరుగుపడింది. ఆస్పత్రిలో చేరిన ఎర్రిస్వామి.. బస్సు ప్రమాదంలో కీలక సాక్షిగా ఉన్న ఎర్రిస్వామి శనివారం రాత్రి ప్రభుత్వాస్పత్రిలో కడుపునొప్పితో చేరాడు. బైక్ నుంచి అతను కింద పడటంతో కడుపు వద్ద గీరుకుపోయింది. దీనికితోడు పలుచోట్ల నొప్పులు ఉండటంతో కుటుంబసభ్యుల కోరిక మేరకు పోలీసులు అతన్ని ఆసుపత్రిలో చేరి్పంచారు. అతనికి అ్రల్టాసౌండ్ స్కాన్, ఎక్స్రే, సీటీ స్కాన్ వంటి పరీక్షలు చేసిన వైద్యులు.. లోపల ఎలాంటి గాయాల్లేవని నిర్ధారించారు. మరికొన్ని పరీక్షలు చేసి కోలుకుంటే డిశ్చార్జ్ చేయనున్నట్లు తెలిసింది.స్వగ్రామానికి చేరిన తల్లీకుమార్తె మృతదేహాలుమరోవైపు.. బస్సు ఘటనలో సజీవ దహనమైన తల్లీకుమార్తె మృతదేహాలు ఆదివారం అర్ధరాత్రి స్వస్థలానికి చేరుకున్నాయి. డీఎన్ఏ పరీక్షల నిమిత్తం శుక్రవారం రాత్రి సంధ్యారాణి తల్లి, చందన తండ్రి నుంచి నమూనాలు సేకరించగా, ఆదివారం ఉదయం ఫలితాలు రావడంతో అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, వారు కర్నూలుకు వెళ్లారు. సాయంత్రం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించడంతో మెదక్ మండలం శివాయిపల్లికి తరలించారు. వాటిని చూసిన కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. సోమవారం అంత్యక్రియలు జరగనున్నాయి. -
ప్రభుత్వ తీరుకు నిరసనగా ఫ్రీ బస్సులో టికెట్ తీసుకున్న మహిళ
కర్నూలు (అగ్రికల్చర్): ‘ఉచిత బస్సు కావాలని ఎవరడిగారు. ఉల్లి సాగుచేసి నాశనమయ్యాం. క్వింటాలు ఉల్లిని రూ.200కు అడుగుతున్నారు. రైతుల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. ఏ పంటకూ గిట్టుబాటు ధరలు లేవు. రైతులను పట్టించుకునే వారు లేరు. 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్ ఇస్తామన్నారు. ఇంతవరకు కొత్త పింఛన్లే లేవు. ఉచిత బస్సు ప్రయాణం వద్దు. టికెట్ ఇవ్వండి’ అంటూ ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఓ మహిళ టికెట్ తీసుకున్నారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్న కొట్టాల గ్రామానికి చెందిన సుంకులమ్మ వెల్దుర్తి మండలంలోని బంధువుల ఇంటికి వచ్చారు. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో వెల్దుర్తిలో బస్సు ఎక్కి చిన్నటేకూరుకు డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకున్నారు. టికెట్ తీసుకునే సమయంలో ఉచిత బస్సు వద్దని, రైతుల్ని ఆదుకోవాలని ఆమె నినాదాలు చేశారు. -
నిజాలు దాచి.. ‘బెల్ట్’ ఫుటేజీ మాయం!
రోజూ ఉండే షాపు.. ఈ రోజులేదు లక్ష్మీపురం హైవేకు దగ్గరలో రోజూ ఉండే బెల్ట్ షాపు ఈ రోజు లేదు. పేపర్లో ఆ షాపు ఫొటో రావడంతో మూసేసి వెళ్లిపోయారు. బెల్ట్ షాపు తొలగించాలని ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం బెల్ట్ షాపులను నిషేధించాలి. – రాకేష్, లక్ష్మీపురంసాక్షి ప్రతినిధి కర్నూలు: లక్ష్మీపురంతోపాటు ఎన్హెచ్ 44 సమీపంలోని దాబాలు, ఇతర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించాం.. ఎక్కడా బెల్ట్షాపులు లేవ్..! తాజాగా ప్రభుత్వ ప్రకటన ఇదీ!! మా గ్రామంలో 24 గంటలు మందు అమ్ముతున్నారు.. వైన్ షాపు లేకున్నా, నాలుగు బెల్ట్ షాపులు మాత్రం అందుబాటులో ఉన్నాయి!! బెల్ట్ షాపుల ఎదుట నిలుచుని లక్ష్మీపురం వాసులు చెబుతున్న నిఖార్సైన నిజాలివీ!! కర్నూలు జిల్లాలో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం దుర్ఘటన కనివీని ఎరుగని పెను విషాదం. చిన్నారులు సైతం బుగ్గి కావడంపై దేశమంతా కన్నీరు పెట్టింది. మద్యం భూతమే ఈ విషాదానికి కారణ భూతమైంది. విచ్చలవిడిగా, వేళాపాళా లేకుండా దొరుకుతున్న మద్యమే 20 ప్రాణాలు గాలిలో కలిసిపోవటానికి ప్రధాన కారణం. అధికారులు సైతం దీన్ని ధ్రువీకరించారు. దీన్ని కప్పిపుచ్చుతూ... అది బెల్ట్ షాపు మద్యం కాదని, ప్రమాదానికి కారణమైన బైకర్లు లైసెన్స్డ్ మద్యమే సేవించారంటూ, అక్కడే కొనుగోలు చేశారంటూ ప్రభుత్వం నిస్సిగ్గుగా సమర్థించుకోవడం తీవ్ర విస్మయం కలిగిస్తోంది. పెద్దటేకూరు సమీపంలోని రేణుక ఎల్లమ్మ వైన్స్లో రాత్రి 7 గంటలకు, 8.20 గంటలకు రెండు దఫాలు మద్యం కొనుగోలు చేశారని, ఆ ప్రాంతంలో బెల్ట్షాపులే లేవని ఎక్సైజ్ శాఖ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే తమ ఊరిలో బెల్ట్ షాపులు ఉన్నాయని, గత రెండు రోజులుగా మాత్రమే మూసివేశారని లక్ష్మీపురం గ్రామస్తులే చెబుతున్నారు. దుర్ఘటన జరిగాక హడావుడిగా బెల్ట్ షాపులను మూసివేయడం, ఆ దుకాణాల ఎదుట సీసీ టీవీ ఫుటేజీని తొక్కిపెడుతుండటం పట్ల సర్వత్రా అనుమానాలు రేకెత్తుతున్నాయి. రెండు రోజులుగా బెల్ట్షాపు మూత.. మాయమైన సీసీ టీవీ ఫుటేజీ..! బైకర్లు శివశంకర్, ఎర్రిస్వామి ప్రమాదానికి ముందు అర్ధరాత్రి వరకూ ఇద్దరూ మద్యం సేవిస్తూనే ఉన్నారు. మూడోసారి పెద్దటేకూరు వైన్షాప్ వద్దకు వెళ్లే ఓపిక లేక లక్ష్మీపురంలోని బెల్ట్షాపులో మద్యం కొనుగోలు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదం జరగడం.. మద్యం సేవించి లక్ష్మీపురం నుంచి బైకర్లు బయలుదేరారని మీడియాలో రావడంతో అక్కడి బెల్ట్ షాపును శనివారం మూసేశారు. ఆదివారం కూడా దుకాణం తెరవలేదు! ‘సాక్షి’ ప్రచురించిన కథనం నేపథ్యంలో కొందరు అధికారులు లక్ష్మీపురం బెల్ట్షాపు వద్ద ఉన్న సీసీ ఫుటేజ్ని ఆగమేఘాలపై స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. రెండురోజులుగా బెల్ట్షాపు మూతపడటం, సీసీటీవీ ఫుటేజీలను అధికారులు తీసుకెళ్లడంతో లక్ష్మీపురం బెల్ట్షాపులోనే వారు మద్యం కొనుగోలు చేశారనే అనుమానాలు బలపడుతున్నాయి. లక్ష్మీపురంలో తన తల్లిని చూసేందుకు ఎర్రిస్వామి వెళుతుంటాడు. మూడో దఫా లక్ష్మీపురం బెల్ట్షాపులో మద్యం సేవించారా? లేదా? అనేది విచారణలో పోలీసులు తేల్చాల్సి ఉంది. లక్ష్మీపురంలో బెల్ట్షాపు ఉందా? లేదా? అని పరిశీలించేందుకు వెళ్లిన ‘సాక్షి’తో పలువురు మాట్లాడారు.పెట్రోల్ బంక్లో శివశంకర్ ఉన్న సీసీ ఫుటేజీ విడుదల చేసిన అధికారులు... లక్ష్మీపురంలో అతను మద్యం కొన్నాడని స్థానికులు చెబుతున్నా... అక్కడి సీసీ ఫుటేజీని బయటపెట్టలేరా? గుడి, బడి పక్కన బెల్ట్ షాపులు లక్ష్మీపురంలో హైవే, గుడి, బడి పక్కన బెల్ట్ షాపులున్నాయి. ఒకవైపు సీఎం బెల్ట్ షాపు పెడితే బెల్ట్ తీస్తానని చెబుతున్నారు. వాస్తవంగా అందుకు భిన్నంగా పరిస్థితులు ఉన్నాయి. మద్యం తాగి బైక్ నడపడంతోనే రోడ్డు ప్రమాదం జరిగి 20 మంది చనిపోయారు. – నారాయణరెడ్డి, లక్ష్మీపురం 24 గంటలు మందు అమ్ముతున్నారు మా గ్రామంలో 24 గంటలూ మందు అమ్ముతున్నారు. వైన్ షాపు లేకున్నా నాలుగు బెల్ట్ షాపులు అందుబాటులో ఉన్నాయి. చిన్న పిల్లలు కూడా మద్యం సేవిస్తున్నారు. రోడ్ల పక్కనే తాగుతుండడంతో రాకపోకల సమయంలో మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని పోలీసులు, ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యం. చంద్రబాబునాయుడు ఏపీని మద్యాంధ్ర ప్రదేశ్గా మార్చారు. – రాజమోహన్రెడ్డి, లక్ష్మీపురం మా ఊరి బెల్ట్ షాపుల్లో నిత్యం మందు దొరుకుతుంది మా గ్రామంలో ఉన్న బెల్ట్ షాపుల్లో నిత్యం మందు దొరుకుతుంది. అర్ధరాత్రైనా, మధ్యరాత్రైనా, తెల్లవారుజామునైనా మందుకు కరువు ఉండదు. అయినా అధికారులెవరూ పట్టించుకోవడంలేదు. – పేరిపోగు ప్రతాప్, లక్ష్మీపురంఎక్కడా తనిఖీలు చేయడం లేదుమా ఊరు పరిధిలో నాలుగు బెల్ట్ షాపులు ఉన్నాయి. గతంలో ఎక్సైజ్ వాళ్లు కంట్రోల్ చేసేవాళ్లు. ఇప్పుడు అవేమి జరగడంలేదు. నేరుగా వైన్ షాపు వారే మద్యాన్ని తెచ్చి బెల్ట్ షాపులకు ఇచ్చిపోతున్నారు. ఎక్కడ తనిఖీలు చేయడంలేదు. అందుబాటులో ఉండడంతో విచ్చల విడిగా మందు తాగుతున్నారు. బ్రిడ్జిలు, స్కూళ్లు, పార్కుల్లో తాగుతున్నారని ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించడంలేదు. – సత్యంరెడ్డి, గ్రామస్తుడు, లక్ష్మీపురం చిన్న పిల్లలు కూడా తాగుతున్నారు లక్ష్మీపురంలో మద్యం అమ్మకాలు పబ్లిక్గా జరుగుతున్నాయి. ఏకంగా వైన్ షాపు వారే వచ్చి ఇళ్లలో అమ్మే వారికి బాటిళ్లు ఇచ్చిపోతున్నారు. పోలీసులు పట్టించుకోవడంలేదు. చిన్న పిల్లలు కూడా మద్యం తాగి పెడదారి పడుతున్నారు. – నేసే శేఖర్, లక్ష్మీపురం ఈ రోజు తెరవలేదు... లక్ష్మీపురంలో నీళ్లకు ఇబ్బంది ఉంది కానీ మందుకు ఇబ్బంది లేదు. వైన్ షాపు లేకున్నా ఎప్పుడు చూసినా బెల్ట్ షాపులు అందుబాటులో ఉంటున్నాయి. మొత్తం నాలుగు బెల్ట్ షాపులు ఉన్నాయి. ఈ రోజు ఒక్క షాపు కూడా తెరవలేదు. – తెలుగు సుంకన్న, లక్ష్మీపురం బెల్ట్ షాపులను నిర్మూలించాలిమహిళల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని బెల్ట్ షాపులను నిర్మూలించాలి. ప్రభుత్వం తరచూ తనిఖీ చేస్తే కట్టడి చేయవచ్చు. ఆ పని చేయడంలేదు. తాగిన మైకంలో ఎవరు ఏం చేస్తున్నారో అర్థం కావడంలేదు. మందు తాగి బండి నడపడం వల్లే ప్రమాదం జరిగి 20 మంది చనిపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం బెల్ట్ షాపులపై పునరాలోచన చేయాలి. – దూడల తిరుపాలు, లక్ష్మీపురం అనర్థాలపై అవగాహన కల్పించాలి మద్యాన్ని ఎక్కువగా తీసుకోవడం ద్వారా కలిగే అనర్థాలపై అవగాహన కలి్పంచాలి. అదే సమయంలో బెల్ట్ షాపులను తొలగించాలి. పిల్లల నుంచి పెద్ద వారి వరకు మందు తాగుతుంటే కాలం ఎటు పోతుందో అర్థం కావడంలేదు. – మాసుంసాహెబ్, లక్ష్మీపురం మద్యం ఖాళీ సీసాలతో హంద్రీ కలుషితంపబ్లిక్ ప్లేసుల్లో మందు తాగడాన్ని అరికట్టాలి. హైవే పక్కన, స్కూళ్ల సమీపంలో మందు తాగడంపై నిఘా వేసి ఉంచాలి. ఇళ్ల మధ్య కూడా రాత్రిళ్లు తాగుతున్నారు. హంద్రీనది మద్యం ఖాళీ సీసాలతో కలుషితం అవుతోంది. – చంద్రశేఖర్, లక్ష్మీపురం -
వేమూరి కావేరి బస్సు ప్రమాదంపై రెండు ఎఫ్ఐఆర్లు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కావేరి బస్సు ప్రమాద ఘటనపై చిక్కుముడి వీడింది. బైక్, బస్సు ప్రమాదం ఒకటి కాదని.. రెండు వేర్వేరు ప్రమాదాలని పోలీసులు తేల్చారు. బైకర్స్ మద్యం సేవించి లక్ష్మీపురం నుంచి బయలుదేరగా చిన్నటేకూరు దాటిన తర్వాత వారి బైక్ డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో శివశంకర్ అక్కడికక్కడే మృతిచెందగా, వెనుక కూర్చున్న ఎర్రిస్వామి కిందపడిపోయాడు. ఈ ఘటన తర్వాత కొన్ని వాహనాలు ఇదే దారిలో వెళ్లాయి. 13 నిమిషాల తర్వాత వచి్చన కావేరి బస్సు డ్రైవర్.. ఆ బైక్ను గుర్తించడంలో విఫలమై ఢీకొట్టడంతో విషాదం చోటుచేసుకుంది.నిమిషాల వ్యవధిలో జరిగిన ఈ ఘటనలపై పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఈ నెల 24న బైక్ను ఢీకొట్టి ప్రమాదానికి కారణమైన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సుపై సెక్షన్ 12(ఏ), 106(1) బీఎన్ఎస్ కింద కేసు నమోదు చేశారు. ఏ1గా వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్, ఏ2గా బస్సు యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. అయితే పోలీసుల విచారణలో రెండూ వేర్వేరు ఘటనలని తేలాక ఈ నెల 25న మరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. చాకలి ఎర్రిస్వామి ఫిర్యాదు మేరకు మృతిచెందిన బైకర్ శివశంకర్పై సెక్షన్ 281, 125(ఏ), 106(1) కింద కేసు నమోదు చేశారు. విచారణ ఇంకా కొనసాగుతోందని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. మృతదేహాలు అప్పగింత డీఎన్ఏ శాంపిల్స్ రిపోర్ట్ను ఎఫ్ఎస్ఎల్ (ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీ) జిల్లా కలెక్టర్కు పంపడంతో మృతదేహాలను బాధిత కుటుంబాలకు అందజేశారు. కర్నూలు జనరల్ ఆస్పత్రి మార్చురీ వద్ద భీతావహ వాతావరణంలో ఈ ప్రక్రియ పూర్తయింది. ఆదివారం 17 మృతదేహాలను బంధువులకు అప్పగించగా.. బిహార్ వాసి అమృత్కుమార్ మృతదేహాన్ని తాము తీసుకెళ్లలేమని, ఆనవాళ్లు కూడా లేని మాంసపు ముద్దకు ఇక్కడే అంత్యక్రియలు చేయాలని కుటుంబ సభ్యులు వేడుకున్నారు. దీంతో కర్నూలు కార్పొరేషన్ అధికారులు అమృత్కుమార్ అంత్యక్రియలు పూర్తిచేశారు. ఇక తమిళనాడు వాసి ప్రశాంత్ మృతదేహాన్ని సోమవారం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఆరాంఘర్లో బస్సు ఎక్కింది కుప్పం వాసి త్రిమూర్తి.. హైదరాబాద్లోని ఆరాంఘర్లో బస్సు ఎక్కిన ప్రయాణికుడిని కుప్పం నియోజకవర్గం గుడుపల్లె మండలం యామగానిపల్లెకు చెందిన త్రిమూర్తిగా గుర్తించడంతో డీఎన్ఏ పరీక్షల అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. చెక్కుల పంపిణీ పూర్తి చేసిన తెలంగాణ ప్రభుత్వం బస్సు ప్రమాదంలో మృతిచెందిన ఆరుగురు ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షలు చొప్పున పరిహారం అందజేసింది. గద్వాల ఆర్డీవో అలివేలు చెక్కులను బాధిత కుటుంబాలకు అందజేశారు. ఏపీ ప్రభుత్వం తరఫున హోంమంత్రి అనిత ప్రకటించినట్లుగా మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున పరిహారాన్ని త్వరలో అందజేస్తామని కర్నూలు కలెక్టర్ సిరి తెలిపారు. కోలుకుంటున్న బస్సు ప్రమాద బాధితుడు కర్నూలు (హాస్పిటల్): కర్నూలు శివారులో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంలో తీవ్ర అస్వస్థతకు గురైన గుణసాయి అనే ప్రయాణికుడు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో కోలుకుంటున్నాడు. మచిలీపట్నంకు చెందిన ఈయన ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉంటున్నాడు. బస్సులో ప్రయాణిస్తుండగా మంటలు రావడంతో ఆ పొగ పీల్చి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఈ క్రమంలో అతని ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్కు గురయ్యాయి. దీంతో అతన్ని కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేర్పించారు. వైద్యులు అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆర్ఐసీయులో ఉంచి వైద్యం అందిస్తున్నారు. శనివారం వరకు విషమంగా ఉన్న అతని ఆరోగ్యం వైద్యుల కృషి ఫలితంగా ఆరోగ్యం మెరుగుపడింది. ఆస్పత్రిలో చేరిన ఎర్రిస్వామి.. బస్సు ప్రమాదంలో కీలక సాక్షిగా ఉన్న ఎర్రిస్వామి శనివారం రాత్రి ప్రభుత్వాస్పత్రిలో కడుపునొప్పితో చేరాడు. బైక్ నుంచి అతను కింద పడటంతో కడుపు వద్ద గీరుకుపోయింది. దీనికితోడు పలుచోట్ల నొప్పులు ఉండటంతో కుటుంబసభ్యుల కోరిక మేరకు పోలీసులు అతన్ని ఆసుపత్రిలో చేరి్పంచారు. అతనికి అ్రల్టాసౌండ్ స్కాన్, ఎక్స్రే, సీటీ స్కాన్ వంటి పరీక్షలు చేసిన వైద్యులు.. లోపల ఎలాంటి గాయాల్లేవని నిర్ధారించారు. మరికొన్ని పరీక్షలు చేసి కోలుకుంటే డిశ్చార్జ్ చేయనున్నట్లు తెలిసింది. -
అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన కర్నూలు యువకుడు
రాంచీ వేదికగా జరిగిన నాలుగో దక్షిణాసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో (South Asian Athletics Championship 2025) ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన మొగలి వెంకట్రాం రెడ్డి (Mogali Venkatramreddy) సత్తా చాటాడు. 800 మీటర్ల పరుగు పోటీలో కాంస్య పతకం సాధించి దేశానికి, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచాడు. ఈ ఈవెంట్ను వెంకట్రాం రెడ్డి 1:52.37 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచాడు.ఈ గేమ్స్లో భారత్తో పాటు పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, అఫ్గానిస్తాన్ దేశాలకు చెందిన అథ్లెట్లు పాల్గొన్నారు.వెంకట్రాం రెడ్డి పతకం సాధించిన అనంతరం హైదరాబాద్లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) అథ్లెటిక్స్ కోచ్ డా. జి.వి. సుబ్బారావు స్పందించారు. "ఇది దేశానికి గర్వకారణం. వెంకట్రాం రెడ్డి అంతర్జాతీయ వేదికపై భారత జెండాను రెపరెపలాడించాడు. ఇది అతని శ్రమకు ఫలితమని అన్నాడు.వెంకట్రాం రెడ్డి ఇటీవల భువనేశ్వర్లో జరిగిన జూనియర్ నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో 800 మీటర్లు, 1500 మీటర్ల ఈవెంట్లలో స్వర్ణ పతకాలు సాధించి "గోల్డెన్ డబుల్" సాధించాడు. చదవండి: Women's CWC: అద్వితీయ ప్రస్థానం.. చరిత్ర తిరగేస్తే అంతా వారే..! -
కర్నూలు బస్సు ప్రమాదం..19 మృత దేహాలకు డీఎన్ఏ పరీక్షలు పూర్తి
సాక్షి,కర్నూలు: తెలుగు రాష్ట్రాల్లో పెను విషాదం నింపిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన 19 మృత దేహాలకు డీఎన్ఏ పరీక్షలు పూర్తయ్యాయి. ఈ పరీక్షలు కర్నూలు వైద్య కళాశాల ఫోరెన్సిక్ విభాగంలో జరిగాయి. ఇప్పటి వరకు డీఎన్ఏ పరీక్షలు పూర్తయిన మొత్తం మృతదేహాల రిపోర్ట్ వివరాల్ని వైద్యులు ఎస్పీకి అందించారు. వాటి ఆధారంగా అధికారులు భౌతిక కాయల్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించేలా అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు 14 మృత దేహాలను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో బిహార్ చెందిన ఆర్గా అనే వ్యక్తి మృతదేహానికి వారి కుటుంబ సభ్యులు కర్నూలు జోహరాపురంలో అంత్యక్రియలు చేశారు. బిహార్కు తీసుకుని వెళ్లేందుకు సమయం పట్టడంతో ప్రభుత్వ అనుమతితో అక్కడ అంత్యక్రియలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు బస్సు ప్రమాదంలో ఇంకా రెండు మృతదేహాల డిఎన్ఎ రిపోర్టు అందాల్సి ఉండగా.. ఇప్పటి దాకా 17 మృతదేహాల డీఎన్ఏ రిపోర్ట్లను అధికారులు పొందారు. ఈ రోజు రాత్రికి 19 మృతదేహాల్లో 18 మృతదేహాల్ని వారి కుటుంబ సభ్యులకు అందించనున్నారు. తమిళనాడుకు చెందిన మృతుడు ప్రశాంత్ కుటుంబ సభ్యులు రేపు కర్నూలుకి రానున్న నేపద్యంలో ఆ మృత దేహాన్ని రేపు అప్పగించనున్నారని సమాచారం. -
శోకసంద్రంలో అనూషారెడ్డి కుటుంబం
యాదాద్రి భువనగిరి జిల్లా: కర్నూలు జిల్లాలో జరిగిన ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో సజీవ దహనమైన గుండాల మండలం వస్తాకొండూర్ గ్రామానికి చెందిన మహేశ్వరం అనూషారెడ్డి ఇంటి వద్ద కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. మహేశ్వరం విజిత, శ్రీనివాస్రెడ్డి దంపతులకు ఇద్దరు కూతుర్లే కావడంతో అల్లారు ముద్దుగా పెంచి ఉన్నత చదువులు చదివించారని బంధువులు పేర్కొన్నారు. కూతుర్లే అండగా ఉంటారని ఆశించిన తమకు దేవుడు ఇంత పెద్ద శిక్ష వేశాడని అనూషారెడ్డి తల్లిదండ్రులు విలపించారు. చిన్నతనం నుంచి అనూషారెడ్డి తన తెలివితేటలతో తమకు వారసుడు లేడన్న ఆలోచన లేకుండా చేసిందని విలపిస్తున్న తీరును చూసి బంధువులు కంటతడి పెట్టారు. కాగా కాలిపోయిన మృతదేహాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించారు. మృతదేహాన్ని 48 గంటల తర్వాత కుటుంబ సభ్యులకు అందజేస్తామని అధికారులు తెలిపినట్లు బంధువులు చెప్పారు. -
కర్నూలు బస్సు ప్రమాదం.. ఆ ఇద్దరిపై కేసు నమోదు
కర్నూలు జిల్లా: చిన్న టేకూరు వద్ద జరిగిన కావేరీ ట్రావెల్ బస్సు ప్రమాద ఘటనపై ఉలిందికొండ పోలీస్ స్టేషన్లో ఇద్దరిపై కేసు నమోదైంది. ఏ1గా వి కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్, ఏ2గా వి కావేరి ట్రావెల్స్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం కొత్తపేటకు చెందిన ప్రయాణికుడు రమేష్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. డ్రైవర్తో పాటు యజమానిపై రెండు సెక్షన్ల కింద BNS 125(a), 106(1) సెక్షన్లు పోలీసులు నమోదు చేశారు.కాగా, 19 మంది సజీవ దహనానికి కారణమైన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మిరియాల లక్ష్మయ్య అర్హత లేకున్నప్పటికీ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. ప్రమాదం నేపథ్యంలో పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామానికి చెందిన లక్ష్మయ్య కుటుంబ నేపథ్యం, ప్రవర్తన, అలవాట్లపై అధికారులు ఆరా తీశారు. ఈయన 5వ తరగతి వరకే చదువుకున్నాడని, అయితే టెన్త్ ఫెయిల్ అయినట్లు సర్టిఫికెట్ ఇచ్చి, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడని గుర్తించారు.మొదట లారీ క్లీనర్గా, తర్వాత డ్రైవర్గా పని చేశాడు. 2004లో లారీ డ్రైవర్గా పని చేస్తున్నప్పుడు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి చెట్టుకు ఢీకొనడంతో అప్పట్లో లారీ క్లీనర్ మృతి చెందాడు. ఆ తర్వాత లారీ డ్రైవర్గా మానేసి కొన్నాళ్లు ట్రాక్టర్ కొని స్వగ్రామంలో వ్యవసాయం చేశాడు. తర్వాత ట్రావెల్స్ బస్సు డ్రైవర్గా ఏడెనిమిదేళ్ల నుంచి వెళ్తున్నాడని తెలిసింది. లక్ష్మయ్య తండ్రి రాములు రెండు నెలల కిందట మృతి చెందాడు. ఇతనికి భార్య, ఓ కుమారుడు, ఓ కుమార్తె, ఒక సోదరుడు, ఇద్దరు అక్కలు ఉన్నారు. లక్ష్మయ్యకు అప్పుడప్పుడు మద్యం సేవించే అలవాటు ఉందని సమాచారం. -
Kurnool: ప్రాణాల కంటే ఫొటోలే ముఖ్యమా?
కర్నూలు(సెంట్రల్): ఎగిసిపడుతున్న అగ్ని కీలలు.. మరో వైపు ప్రయాణికుల ఆర్తనాదాలు.. కళ్ల ముందు భయానక వాతావరణం.. ఆ సమయంలో కొందరు వ్యక్తులు మృత్యువును సైతం ఎదిరించి కొందరి ప్రాణాలను కాపాడారు. కర్నూలు శివారులో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన బస్సు దుర్ఘటనలో ప్రయాణికులను కాపాడేందుకు వాహనదారులు ఎంతో ధైర్యంగా సాహసం చేసి మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించారు. బస్సులో కళ్లెదుటే మంటల్లో ఆహుతవుతున్నా ప్రయాణికులను కొందరు వాహనదారులు ప్రాణాలకు తెగించి కాపాడే ప్రయత్నం చేశారు. మంటల్లో దగ్ధమవుతున్న బస్సు డోర్లు, కిటికీలు, అద్దాలు పగలగొట్టి కొందరిని బయటకు లాగారు. ఫలితంగా 43 మంది ఉన్న కావేరి ట్రావెల్స్లో 24 మంది ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఎంత ప్రయతి్నంచినప్పటికీ 19 మందిని కాపాడలేకపోవడంతో అగ్నికి ఆహుతై బస్సులోనే ప్రాణాలను వదిలి వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చారు. ప్రమాద సమయంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న ధర్మవరానికి చెందిన హరీష్ అనే వ్యక్తి సహాయక చర్యల్లో కీలకంగా వ్యవహరించాడు. అతడిని చూసి ప్రేరణ పొందిన మరికొంతమంది తమలో మానవత్వాన్ని నిద్రలేపి ముందుకొచ్చారు. ఈ క్రమంలో మంటలు ఉద్ధృతమవుతున్న సమయంలో బస్సు కిటికీలు, అద్దాలను బద్దలు కొట్టి ఐదుగురును బయటకు లాగినట్లు తెలుస్తోంది. అంతేకాక వెంటనే పోలీసులు, ఫైర్, 108 అంబులెన్స్లకు సమచారం ఇచ్చారు. అయితే అప్పటికే అంబుల్సెన్లు చేరుకోకపోవడంతో తమ సొంత వాహనాల్లో ప్రమాదం నుంచి బయట పడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మరికొంత మందిని కాపాడే ప్రయత్నంలో ఉండగా ఒక్క ధాటిగా మంటలు ఎగిసిపడటంతో మిగతా వారిని కాపాడలేకపోయారు. కళ్ల ముందు కొందరు మంటల్లో ఆహుతి అవుతున్న వారిని చూసి బరువెక్కిన హృదయాలతో చలించిపోయారు. వెనక డోర్ను బద్దలు కొట్టి.. బస్సులోని వ్యక్తుల ప్రాణాలను కాపాడడంలో బస్సు రెండో డ్రైవరు, క్లీనరు కూడా కీలకంగా వ్యవహరించారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణికులను రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. వెనక డోర్ను బద్దలు కొట్టి దాదాపు 10 మంది దాకా బయటకు వెళ్లేలే చేశారని సమాచా రం. అప్పటికే కొంతమంది ప్రయాణికులు డోర్ను బద్దలు కొట్టేందుకు ప్రయతి్నస్తున్నా ఓపెన్ కాకపోవడంతో వారు పెద్ద రాడ్డు తీసుకొని బద్దలు కొట్టినట్లు తెలుస్తోంది. దీంతో చాలా మంది ప్రయాణికులు ప్రాణాలతో బయట పడ్డారు. వారు తమకేమి అనుకొని రన్నింగ్ డ్రైవర్ మాదిరిగా పారిపోయి ఉంటే మృతుల సంఖ్య మరింత పెరిగేది. కొందరు సోషల్ మీడియా కోసం తాపత్రయం... బస్సు ప్రమాద సమయంలో కొందరు మాత్రం తమలో మానవత్వం లేదనే విధంగా ఘటన స్థలంలో వ్యవహరించినట్లు ప్రత్యక్షంగా చూసిన వారు చెబుతున్నారు. కళ్లముందు మంటల్లో ప్రాణాలు కలిసి పోతుంటే కాపాడే ప్రయత్నం చేయకుండా సోషల్ మీడియా కోసం ఫొటోలు, వీడియోలు తీసి అప్లోడ్ చేస్తూ కనిపించారని చెప్పారు. ఆపదలో ఉన్న వారిని రక్షించడం కోసం ప్రతి ఒక్కరూ ప్రయతి్నంచి ఉంటే మరికొంతమంది ప్రాణాలతో బయటపడే అవకాశం ఉండేది. ఇప్పటికైనా ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకోవడానికి ప్రయతి్నంచాల్సిన అవసరం ఉంది. పత్తాలేని పెట్రోలింగ్ వాహనం.. 44వ జాతీయ రహదారిలో ఎన్హెచ్ఏఐ(నేషనల్ హై అథారిటీ ఆఫ్ ఇండియా) రోడ్డు భద్రతను గాలికొదిలినట్లు తెలుస్తోంది. ఏదైనా ప్రమాదం జరిగితే క్షణాల్లో అక్కడ ఉండాల్సిన పెట్రోలింగ్ వాహనం, అంబులెన్స్లు కనిపించలేదు. ఈ ప్రమాద ఘటనన జరిగిన ప్రదేశం నుంచి 30 కిలోమీటర్ల పరిధిలో పుల్లూరు టోల్ప్లాజా, 24 కిలోమీటర్ల పరిధిలో అమడగుంట్ల టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఆయా టోల్ ప్లాజాల పరిధిలో పెట్రోలింగ్ వాహనాలు, అంబులెన్స్లు అందుబాటులో ఉండాలి. అయితే ప్రమాద సంఘటనకు రెండు టోల్ ప్లాజాల నుంచి ఎలాంటి పెట్రోలింగ్ వాహనాలు రాలేదు. చివరికి అమడగుంట్ల టోల్ ప్లాజాకు సంబంధించి అంబులెన్స్ కూడా రాకపోవడంతో చిత్తూరు జాతీయ రహదారి 40కు చెందిన నన్నూరు టోల్ ప్లాజా అంబులెన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. దీనిని బట్టి టోల్ ఫీజులను వసూలు చేసేందుకు ఆసక్తి చూపుతున్న ఎన్హెచ్ఏఐ..రోడ్డులో వెళ్లే వాహనాలు, ప్రయాణికుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవడంలేదని తేటతెల్లమవుతోంది. ఎట్టా కాలిందో సూడు.. ఎంత నరకం చూశారో పాపం దగ్ధమైన బస్సును చూస్తూ వాహనదారుల దిగ్భ్రాంతి ప్రమాదంతో జిల్లా ప్రజల్లో విషాదం వెల్దుర్తి: కర్నూలు – బెంగళూరు జాతీయ రహదారిపై బస్సు ప్రమాద ఘటన నుంచి జిల్లా ప్రజలు ఇంకా తేరుకోలేక పోతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున చావుకేకతో ఉలిక్కిపడిన జనం శనివారం కూడా అదే ప్రమాద విషయాన్ని చర్చించుకుంటూ కనిపించారు. పత్రికలు, టీవీలు, సామాజిక మాధ్యమాల్లో వచ్చిన కథనాలపై విశ్లేషిస్తూ కనిపించారు. కాగా జాతీయ రహదారి మీదుగా వెళ్తున్న వాహనదారులు ప్రమాద ఘటన స్థలంలో నిలిచి పక్కనే దగ్ధమైన బస్సును పరిశీలిస్తున్నారు. ‘అబ్బా ఎట్టా కాలిపోయిందో సూడు బస్సు.. ఈ బస్సే ఇట్టయిందంటే ఆ మంటలకు బస్సులో చచ్చిపోయిన్నోళ్లు ఎంత నరకం అనుభవించింటారో కదా’ అంటూ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కనిపించారు. జాతీయ రహదారి మీదుగా వెళ్తున్న వివిధ రాష్ట్రాల ప్రయాణికులు, వాహనదారులు బస్సు దుర్ఘటను చూసి అయ్యో పాపం అంటూ వెళ్తున్నారు. బైక్ పడిన ప్రాంతం, చనిపోయిన బైకిస్ట్ గురించి, బస్సు ఈడ్చుకుంటూ వెళ్లిన ఆనవాళ్లు, పూర్తిగా దగ్ధమైన బస్సుపై వివిధ రకాలుగా వి చారు.‘ ఒక వ్యక్తి వల్ల ఇంత ఘోరం జరిగిందా? ప్రమాదానికి మద్యం కారణం’ అంటూ కొందరు ఘటనా స్థలంలో చర్చించుకుంటూ కనిపించారు. వెనుకాల వచ్చిన వాహనదారులు రోడ్డుపై పడిన బైక్ను పక్కకు తీసినా సరిపోయేదని.. ప్రైవేటు వాహనాల వేగాన్ని నియంత్రించాలని.. ప్రమాద సమయంలో వాహనదారులు ఇంకా స్పందించి ఉంటే బాగుండేది’ అని మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరో వైపు సంఘటన స్థలంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. బైక్ పడిన ప్రాంతం నుంచి బస్సు దగ్ధమైన చోటు వరకు చోటు చేసుకున్న పరిణామాలపై వివరాలు సేకరిస్తూ కనిపించారు. ప్రాణాల కంటే ఫొటోలే ముఖ్యమా? కొందరు ప్రాణాల కంటే ఫొటోలే ముఖ్యమన్నట్లుగా వ్యవహరించడం చాలా బాధాకరం. వారిలో మానవత్వం లేదు. మనిషి ప్రాణాలకు విలువ కనిపించలేదు. కళ్ల ముందే ప్రాణ భయంతో కాపాడండి అంటూ మహిళలు, పిల్లలు అరుపులు, కేకలు పెడుతున్నా పట్టించుకోకుండా వీడియోలు తీసుకొని సోషల్ మీడియాలో ప్రొజెక్టు చేసుకున్నారు. అయితే కొందరు మాత్రం వారిలో ఇంకా మానవత్వం చావలేదని నిరూపించారు. ప్రాణాలకు తెగించి కొందరిని కాలే బస్సు నుంచి బయటకు లాగారు. ధర్మవరానికి చెందిన హరీష్ అనే వ్యక్తి ఎంత మంచివాడంటే చెప్పలేం. అందరూ అతన్ని ఆదర్శంగా తీసుకొని సహాయక చర్యల్లో పాల్గొని కొందరిని ప్రాణాల నుంచి రక్షించారు. – హైమారెడ్డి, హైదరాబాద్, ప్రమాద ఘటన ప్రత్యక్ష సాక్షి -
మృత్యువును ఎదిరించి.. ప్రాణాలు కాపాడి!
కర్నూలు(సెంట్రల్): ఎగిసిపడుతున్న అగ్ని కీలలు.. మరో వైపు ప్రయాణికుల ఆర్తనాదాలు.. కళ్ల ముందు భయానక వాతావరణం.. ఆ సమయంలో కొందరు వ్యక్తులు మృత్యువును సైతం ఎదిరించి కొందరి ప్రాణాలను కాపాడారు. కర్నూలు శివారులో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన బస్సు దుర్ఘటనలో ప్రయాణికులను కాపాడేందుకు వాహనదారులు ఎంతో ధైర్యంగా సాహసం చేసి మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించారు. బస్సులో కళ్లెదుటే మంటల్లో ఆహుతవుతున్నా ప్రయాణికులను కొందరు వాహనదారులు ప్రాణాలకు తెగించి కాపాడే ప్రయత్నం చేశారు. మంటల్లో దగ్ధమవుతున్న బస్సు డోర్లు, కిటికీలు, అద్దాలు పగలగొట్టి కొందరిని బయటకు లాగారు. ఫలితంగా 43 మంది ఉన్న కావేరి ట్రావెల్స్లో 24 మంది ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఎంత ప్రయత్నించినప్పటికీ 19 మందిని కాపాడలేకపోవడంతో అగ్నికి ఆహుతై బస్సులోనే ప్రాణాలను వదిలి వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చారు. ప్రమాద సమయంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న ధర్మవరానికి చెందిన హరీష్ అనే వ్యక్తి సహాయక చర్యల్లో కీలకంగా వ్యవహరించాడు. అతడిని చూసి ప్రేరణ పొందిన మరికొంతమంది తమలో మానవత్వాన్ని నిద్రలేపి ముందుకొచ్చారు. ఈ క్రమంలో మంటలు ఉద్ధృతమవుతున్న సమయంలో బస్సు కిటికీలు, అద్దాలను బద్దలు కొట్టి ఐదుగురును బయటకు లాగినట్లు తెలుస్తోంది. అంతేకాక వెంటనే పోలీసులు, ఫైర్, 108 అంబులెన్స్లకు సమచారం ఇచ్చారు. అయితే అప్పటికే అంబుల్సెన్లు చేరుకోకపోవడంతో తమ సొంత వాహనాల్లో ప్రమాదం నుంచి బయట పడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మరికొంత మందిని కాపాడే ప్రయత్నంలో ఉండగా ఒక్క ధాటిగా మంటలు ఎగిసిపడటంతో మిగతా వారిని కాపాడలేకపోయారు. కళ్ల ముందు కొందరు మంటల్లో ఆహుతి అవుతున్న వారిని చూసి బరువెక్కిన హృదయాలతో చలించిపోయారు. వెనక డోర్ను బద్దలు కొట్టి.. బస్సులోని వ్యక్తుల ప్రాణాలను కాపాడడంలో బస్సు రెండో డ్రైవరు, క్లీనరు కూడా కీలకంగా వ్యవహరించారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణికులను రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. వెనక డోర్ను బద్దలు కొట్టి దాదాపు 10 మంది దాకా బయటకు వెళ్లేలే చేశారని సమాచా రం. అప్పటికే కొంతమంది ప్రయాణికులు డోర్ను బద్దలు కొట్టేందుకు ప్రయత్నిస్తున్నా ఓపెన్ కాకపోవడంతో వారు పెద్ద రాడ్డు తీసుకొని బద్దలు కొట్టినట్లు తెలుస్తోంది. దీంతో చాలా మంది ప్రయాణికులు ప్రాణాలతో బయట పడ్డారు. వారు తమకేమి అనుకొని రన్నింగ్ డ్రైవర్ మాదిరిగా పారిపోయి ఉంటే మృతుల సంఖ్య మరింత పెరిగేది. కొందరు సోషల్ మీడియా కోసం తాపత్రయం... బస్సు ప్రమాద సమయంలో కొందరు మాత్రం తమలో మానవత్వం లేదనే విధంగా ఘటన స్థలంలో వ్యవహరించినట్లు ప్రత్యక్షంగా చూసిన వారు చెబుతున్నారు. కళ్లముందు మంటల్లో ప్రాణాలు కలిసి పోతుంటే కాపాడే ప్రయత్నం చేయకుండా సోషల్ మీడియా కోసం ఫొటోలు, వీడియోలు తీసి అప్లోడ్ చేస్తూ కనిపించారని చెప్పారు. ఆపదలో ఉన్న వారిని రక్షించడం కోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నించి ఉంటే మరికొంతమంది ప్రాణాలతో బయటపడే అవకాశం ఉండేది. ఇప్పటికై నా ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకోవడానికి ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. పత్తాలేని పెట్రోలింగ్ వాహనం.. 44వ జాతీయ రహదారిలో ఎన్హెచ్ఏఐ(నేషనల్ హై అథారిటీ ఆఫ్ ఇండియా) రోడ్డు భద్రతను గాలికొదిలినట్లు తెలుస్తోంది. ఏదైనా ప్రమాదం జరిగితే క్షణాల్లో అక్కడ ఉండాల్సిన పెట్రోలింగ్ వాహనం, అంబులెన్స్లు కనిపించలేదు. ఈ ప్రమాద ఘటనన జరిగిన ప్రదేశం నుంచి 30 కిలోమీటర్ల పరిధిలో పుల్లూరు టోల్ప్లాజా, 24 కిలోమీటర్ల పరిధిలో అమడగుంట్ల టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఆయా టోల్ ప్లాజాల పరిధిలో పెట్రోలింగ్ వాహనాలు, అంబులెన్స్లు అందుబాటులో ఉండాలి. అయితే ప్రమాద సంఘటనకు రెండు టోల్ ప్లాజాల నుంచి ఎలాంటి పెట్రోలింగ్ వాహనాలు రాలేదు. చివరికి అమడగుంట్ల టోల్ ప్లాజాకు సంబంధించి అంబులెన్స్ కూడా రాకపోవడంతో చిత్తూరు జాతీయ రహదారి 40కు చెందిన నన్నూరు టోల్ ప్లాజా అంబులెన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. దీనిని బట్టి టోల్ ఫీజులను వసూలు చేసేందుకు ఆసక్తి చూపుతున్న ఎన్హెచ్ఏఐ..రోడ్డులో వెళ్లే వాహనాలు, ప్రయాణికుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవడంలేదని తేటతెల్లమవుతోంది. కొందరు ప్రాణాల కంటే ఫొటోలే ముఖ్యమన్నట్లుగా వ్యవహరించడం చాలా బాధాకరం. వారిలో మానవత్వం లేదు. మనిషి ప్రాణాలకు విలువ కనిపించలేదు. కళ్ల ముందే ప్రాణ భయంతో కాపాడండి అంటూ మహిళలు, పిల్లలు అరుపులు, కేకలు పెడుతున్నా పట్టించుకోకుండా వీడియోలు తీసుకొని సోషల్ మీడియాలో ప్రొజెక్టు చేసుకున్నారు. అయితే కొందరు మాత్రం వారిలో ఇంకా మానవత్వం చావలేదని నిరూపించారు. ప్రాణాలకు తెగించి కొందరిని కాలే బస్సు నుంచి బయటకు లాగారు. ధర్మవరానికి చెందిన హరీష్ అనే వ్యక్తి ఎంత మంచివాడంటే చెప్పలేం. అందరూ అతన్ని ఆదర్శంగా తీసుకొని సహాయక చర్యల్లో పాల్గొని కొందరిని ప్రాణాల నుంచి రక్షించారు. – హైమారెడ్డి, హైదరాబాద్, ప్రమాద ఘటన ప్రత్యక్ష సాక్షి బస్సు దుర్ఘటనలో వెలుగులోకి వాహనదారుల సాహసం డోర్లు పగలగొట్టి ఐదారుగురిని కాపాడినట్లు సమాచారం బస్సు రెండో డ్రైవరు, క్లీనర్ తెగింపుతో ఎనిమిది మంది సేఫ్ కొందరు వీడియోలు, ఫొటోలు తీస్తూ బాధ్యత విస్మరించిన వైనం -
ఎన్సీసీ ప్రవేశాలకు ఎంపిక
కర్నూలు సిటీ: క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కాలేజీలో శనివారం మొదటి సంవత్సరం విద్యార్థులకు ఎన్సీసీలో ప్రవేశాలు కల్పించేందుకు ఎంపిక ప్రక్రియ చేపట్టారు. ఆ కాలేజీ ప్రిన్సిపాల్ డా.ఇందిరాశాంతి అధ్యక్షతన జరిగిన ఈ ఎంపిక ప్రక్రియకు ఎన్సీసీ 28 ఆంధ్రా బెటాలియన్ ఆఫీసర్ లెఫ్లినెంట్ కల్నల్ శశికుమార్ హాజరయ్యారు. విద్యార్థులకు శారీరక దృఢత్వ పరీక్షలు నిర్వహించారు. పారామిలటరీ సైనిక, రక్షణ రంగ, పోలీసు, ఇతర ఉద్యోగాలలో ఎన్సీసీ విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుందని కాలేజీ ప్రిన్సిపాల్ అన్నారు. కాలేజీ నుంచి 32 మంది అబ్బాయిలు, 20 మంది అమ్మాయిలు ఎన్సీసీకి ఎంపికయ్యారు. కార్యక్రమంలో ఎన్సీసీ ఆఫీసర్ డా.ఆర్ కామల్లీ నాయక్ పాల్గొన్నారు. -
ఉద్యమాలతో కార్మికుల బతుకుల్లో మార్పులు
● సీఐటీయూ 13వ జిల్లా మహాసభలు ప్రారంభంకర్నూలు(సెంట్రల్): ఉద్యమాలతోనే కార్మికుల బతుకల్లో మార్పులు వస్తాయని, ఉద్యమాలకు బలమైన పునాది వేయాల్సిన బాధ్యత సీఐటీయూపై ఉందని మాజీ ఎమ్మెల్యే, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఏ గఫూర్ పిలుపునిచ్చారు. శనివారం కార్మిక, కర్షక భవన్లో సీఐటీయూ జిల్లా 13వ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా సీఐటీయూ జెండా ను మెడికల్ రెప్స్ యూనియన్ నాయకులు, సీఐటీ యూ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి కళాకారులు సీఐటీ యూ జెండా ఔన్నత్యంపై గేయాలను ఆలపించారు. అనంతరం సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు ఎంఏ గఫూర్ అమరవీరులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సభా ప్రారంభానికి ముందుగా సీఐటీయూ విస్తరణ కోసం విశేష కృషి చేసిన నాయకులు బి.రాజగోపాల్, బి.మహానందరెడ్డి, జేఎన్శేషయ్యల చిత్రపటాలకు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభకు పీఎస్ రాధాకృష్ణ, పి.నిర్మల, ఈరన్న అధ్యక్షత వహించగా ఎంఏ గఫూర్ మాట్లాడుతూ.. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం కార్మిక వ్యతరేకమన్నారు. కార్మికుల 8 గంటల పని విధానాన్ని మోదీ 10–13 గంటల వరకు పెంచారన్నారు. లేబర్ కోడ్లను తెచ్చి కార్మిక చట్టాలకు తూట్లు పొడిచారని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు బి.రామాంజనేయులు, నారాయణస్వామి, ప్రభాకర్, సాయిబాబా, విజయరామాంజనేయులు, ఉమాదేవి, రఘుబాబు, దివాకర్, నరసింహులు, అబ్దుల్దేశాయ్, పీఎస్ గోపాల్, రాముడు, మధు పాల్గొన్నారు. -
మహిళపై టీడీపీ నాయకుడి దాడి
పగిడ్యాల: ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని పడమర ప్రాతకోట గ్రామంలో ఓ మహిళపై టీడీపీ నాయకుడు సగినేల రమణ దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి భర్త ప్రతాప్ తెలిపిన వివరాల మేరకు.. ప్రతాప్ కొంత కాలంగా అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నాడు. ఆ ఇంటి ఆవరణలోని జామ చెట్టుకు ఉన్న కాయలను టీడీపీ నాయకుడు సగినేల రమణ తెంచుకుని, మళ్లీ తన అల్లుడు వినయ్ను పంపించాడు. ఆ సమయంలో ప్రతాప్ కొడుకు పార్థు.. తెంపొద్దు అని మందలించాడు. దీంతో కోపోద్రేక్తులైన మామా, అల్లుళ్లు ప్రతాప్ కుటుంబీకులపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో అతని భార్య జ్యోతి కిందపడటంతో కాలికి గాయం కావడంతో నందికొట్కూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఎముక విరిగిందని చెప్పడంతో కర్నూలుకు తరలించారు. ఈ మేరకు ముచ్చుమర్రి స్టేషన్లో ప్రతాప్ ఫిర్యాదు చేయగా.. కేసు విచారించి చర్యలు తీసుకుంటామని ఎస్ఐ నరేంద్ర తెలిపారు. మృతుల కుటుంబాలకు అతిథి గృహంలో విడిది కర్నూలు(సెంట్రల్): కల్లూరు మండలం చిన్నటేకూరు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున దహనమైన బస్సులో మృతి చెందిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో విడిది ఏర్పాటు చేశారు. వారికి అక్కడే భోజనం, వసతిని అధికారులు కల్పించారు. కాగా, చనిపోయిన 19 మందిలో 18 మంది కుటుంబీకులు డీఎన్ఏ శాంపిల్స్ ఇచ్చారు. 48 గంటల తరువాత ఆ డీఎన్ఏలకు సంబంధించి ఫలితాలు రానుండడంతో అంత వరకు వచ్చిన కుటుంబసభ్యులకు అధికార యంత్రాంగమే విడిది ఏర్పాటు చేసింది. నీటి కుంటలో పడి బాలుడి మృతి చాగలమర్రి: గొట్లూరు గ్రామానికి చెందిన దూదేకుల ధర్మతేజ(15) శనివారం ప్రమాదవశాత్తూ నీటి కుంటలో పడి మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన దూదేకుల బాల దస్తగిరి, సిద్దేశ్వరి దంపతులకు కుమార్తె, ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు ధర్మతేజ శనివారం ఉదయం గ్రామ పొలిమేరలోని బీడు పొలాలో పశువులను మేపేందుకు వెళ్లాడు. అక్కడ తోటి స్నేహితులతో ఆడుకుంటూ పక్కనే ఉన్న కుంటలో ప్రమాదవశాత్తూ కాలుజారి పడిపోయాడు. కుంటలో నీరు నిండుగా ఉండటంతో నీళ్లలో మునిగి పోయాడు. వెంటనే స్నేహితులు పరుగున వెళ్లి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్తులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని నీళ్లలో ముగినపోయిన ధర్మతేజను బయటికి తీశారు. వెంటనే చికిత్స నిమిత్తం చాగలమర్రిలోని కేరళ వైద్యశాలకు తరలించారు. అక్కడ వైద్యులు పరిశీలించి బాలుడు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. స్థానిక ఎస్ఐ సురేష్ ఆసుపత్రికి చేరుకొని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. న్యూసెన్స్ కేసులో జైలు శిక్ష శిరివెళ్ల: బోయిలకుంట్లకు చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తికి న్యూసెన్స్ కేసులో 14 రోజుల జైలు శిక్ష పడిందని ఎస్ఐ చిన్న పీరయ్య శనివారం తెలిపారు. మద్యం తాగి గ్రామంలో న్యూసెన్స్ సృిష్టించి ప్రజలకు ఇబ్బందులకు గురి చేయడంతో కేసు నమోదు చేసి ఆళ్లగడ్డ కోర్టులో హాజరు పరిచామన్నారు. విచారణ చేసి జడ్జి నిందితుడికి జైలు శిక్ష విధించారన్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం, అల్లర్లు సృష్టించడం, ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. -
కౌశల్ క్విజ్ పోటీలకు వేళాయె!
● దరఖాస్తుకు నేడు తుది గడువునంద్యాల(న్యూటౌన్): విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక పట్ల ఆసక్తి పెంపొందించేందుకు 2025 రాష్ట్రస్థాయి సైన్స్ ప్రతిభాన్వేషణ (కౌశల్ క్విజ్) పోటీలు సమీపిస్తున్నాయి. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు వివిధ రకాల పోటీలు నిర్వహిస్తుంటాయి. వాటిలో భారతీయ విజ్ఞాన మండలి(బీవీఎం), ఆంధ్రప్ర దేశ్ శాస్త్ర సాంకేతిక మండలి (ఏపీకాస్ట్) సంయుక్త ఆధ్వర్యంలో ఏటా జరిపే కౌశల్ క్విజ్ పోటీలు ఒకటి. వీటిని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మాత్రమే నిర్వహిస్తారు. పిల్లల్లో సైన్స్ పరిజ్ఞానాన్ని తెలుసుని, భావి శాస్త్రవేత్తలను తయారు చేయడం ఈ పోటీల ప్రధాన లక్ష్యం. కౌశల్ సైన్స్ 2025 పరీక్ష దరఖాస్తుకు నేటి (ఈనెల 26వ తేదీ)తో గడువు ముగుస్తోంది. అర్హులు: అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 8, 9, 10 తరగతుల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. రిజిస్ట్రేషన్ ఇలా: తొలుత అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సైన్స్ సబ్జెక్టుల టీచర్ల ద్వారా విద్యార్థులను ఎంపిక చేసి ఈనెల 26వ తేదీ లోపు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీవీఎంఏపీ.ఓఆర్జీల రిజిస్ట్రేషన్ చేయాలి. పరీక్ష ఇలా: కౌశల్ సైన్స్ క్విజ్ ప్రాథమిక స్థాయి ఆన్లైన్ పరీక్షను నవంబర్ 1న 8వ తరగతికి, 3న తొమ్మిదో తరగతికి, 4న 10వ తరగతికి నిర్వహిస్తారు. జిల్లా స్థాయి పోటీలకు సంబంధించి 8, 9 తరగతులకు నవంబర్ 27న, 10వ తరగతికి 28న జరుగుతుంది. రాష్ట్ర స్థాయి పోటీల తేదీని తర్వాత ప్రకటిస్తారు. మొబైల్, ట్యాబ్, ల్యాప్ టాప్, డెస్క్టాప్ ద్వారా రాయవచ్చు. మరిన్ని వివరాలకు: జిల్లా కో ఆర్డినేటర్ కేవీ సుబ్బారెడ్డి 9948605546 నంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. బహుమతులు: జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతిగా రూ.7,500, ద్వితీయ బహుమతిగా రూ.6వేలు, తృతీయ బహుమతిగా రూ.4,500, కన్సోలేషన్ బహుమతుల కింద రూ.3 వేలు అందజేస్తారు. రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతిగా రూ.15 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.12 వేలు, తృతీయ బహుమతిగా రూ.9 వేలు అందించనున్నారు. రాష్ట్ర స్థాయిలో కన్సోలేషన్ బహుమతులుగా రూ.6 వేల వంతున ప్రదానం చేస్తారు. -
వంతెనను ఢీకొని లారీ డ్రైవర్ మృతి
● ఘాట్ రోడ్డులో ఆరు గంటలు ట్రాఫిక్ జామ్మహానంది: నంద్యాల నుంచి గిద్దలూరు వెళ్లే నల్లమల ఘాట్రోడ్డులో శనివారం ఉదయం పురాతన రైల్వే వంతెన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ లారీ డ్రైవర్ దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు...నంద్యాల వైపు నుంచి గిద్దలూరుకు మొక్కజొన్న ధాన్యం బస్తాలతో వెళుతున్న లారీ మార్గమధ్యలో బొగద వంతెన దాటిన తర్వాత ఉన్న పురాతన రైల్వే వంతెనను ఢీకొంది. భారీ మలుపు ఉండటంతో పాటు ఎదురుగా వస్తున్న ఓ వాహనాన్ని తప్పించబోయి ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఈ సంఘటనలో నంద్యాల మండలం కానాల గ్రామానికి చెందిన డ్రైవర్ బాలహుసేని(50) క్యాబిన్లో ఇరుక్కుపోయి ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంతో గిద్దలూరు వైపు నుంచి నంద్యాల, నంద్యాల వైపు నుంచి గిద్దలూరు, విజయవాడ వెళ్లే వాహన దారులు ఇబ్బందులు పడ్డారు. కార్లు, బైకులు మాత్రమే వెళుతుండగా లారీలు, బస్సులు అధిక సంఖ్యలో ఇరువైపులా ఆగిపోయాయి. అరటికాయలతో వెళుతున్న వాహనాలతో పాటు ఇతర వాహనాల రాకపోకలు కష్టంగా మారింది. సుమారు ఆరు గంటల పాటు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న గిద్దలూరు పోలీసులు క్రేన్ల సాయంతో రోడ్డుకు అడ్డుగా ఉన్న లారీని తప్పించడంతో యథావిధిగా వాహనాల రాకపోకలు కొనసాగాయి. ప్రమాద ఘటన గిద్దలూరు పరిధిలోకి రావడంతో అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్
● 12 ప్రైవేటు ట్రావెల్స్పై కేసులు నమోదు ● రూ.2.42 లక్షల జరిమానా కర్నూలు: కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద కావేరి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటన నేపథ్యంలో రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచి పలు ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై ప్రత్యేక నిఘా ఉంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఐదు రవాణా శాఖ కార్యాలయాలు ఉన్నాయి. ఆ శాఖ డిప్యూటీ కమిషనర్ శాంతకుమారి పర్యవేక్షణలో రెండు రోజులుగా మోటర్ వాహన తనిఖీ అధికారులు (ఎంవీఐ, ఏఎంవీఐలు) బృందాలుగా ఏర్పడి విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా తిప్పుతున్నట్లు బయటపడిన వాహనాలపై కేసులు నమోదు చేశారు. కర్నూలులో బెంగుళూరు జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహించి 12 వాహనాలు నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించి కేసులు నమోదు చేశారు. ఇందులో రెండు బస్సులకు సక్రమంగా రికార్డులు లేకపోవడం, ఏడు ట్రావెల్స్ బస్సుల్లో అగ్నిమాపక పరికరాలు లేనట్లు గుర్తించారు. అలాగే ఒక బస్సుకు ఎమర్జెన్సీ బటన్స్, అలారం పనిచేయకపోవడం, మరో బస్సుకు ఎమర్జెన్సీ డోర్ పనిచేయకపోవడం, ఒక బస్సుకు పర్మిట్ లేకపోవడం, పన్ను చెల్లించకుండా తిప్పుతున్న మరో బస్సుపై కేసులు నమోదు చేసినట్లు డీటీసీ శాంతకుమారి తెలిపారు. రెండు బస్సులు షీల్డ్ గ్లాసులు (అద్దాలు) లేకుండా ఉన్నట్లు గుర్తించి కేసులు నమోదు చేశారు. తనిఖీల్లో 12 వాహనాలపై కేసులు నమోదు చేసి రూ.2.42 లక్షలు జరిమానా విధించినట్లు డీటీసీ వెల్లడించారు. -
రైతుల అభ్యున్నతికి పట్టుదలతో పనిచేస్తాం
● జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి కర్నూలు(అగ్రికల్చర్): రైతుల అభ్యున్నతికి, వ్యవసాయ పథకాల పకడ్బందీ అమలుకు పట్టుదలతో పనిచేస్తామని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి తెలిపారు. శనివారం జాయింట్ డైరెక్టర్ హోదాలో జిల్లా వ్యవసాయ అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు డిప్యూటీ డైరెక్టర్ హోదాలో ఉమ్మడి జిల్లాలో జేడీఏగా, విభజన తర్వాత జిల్లా వ్యవసాయ అధికారిగా విధులు నిర్వహించారు. ఇటీవలనే ఈమెకు జాయింట్ డైరెక్టర్ అఫ్ అగ్రికల్చర్గా పదోన్నతి లభించింది. డీడీఏ బాధ్యతలు అగ్రానమీ ఏడీఏ రాజశేఖర్కు అప్పగించి జేడీఏ హోదాలో జిల్లా వ్యవసాయ అధికారిగా విధుల్లో చేరారు. జేడీఏగా పదోన్నతి పొందిన జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మిని అగ్రానమీ ఏడీఏ రాజశేఖర్, ఏవోలు అల్లీపీర, రాఘవేంద్ర, ఉషారాణి, మణిమాలిక, శారదమ్మ తదితరులు అభినందించారు. రేపు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులను సమర్పించుకోవాలని సూచించారు. కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తామన్నారు. వైద్య విద్యార్థిని ఆత్మహత్య కర్నూలు: కర్నూలు శివారు నంద్యాల చెక్పోస్టు సమీపంలోని వెంకటాద్రి నగర్లో నివాసముంటున్న రఘునాథ రెడ్డి కూతురు బొమ్మిరెడ్డి గిరిజ (25) ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈమె ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని మహారాష్ట్రలో పీజీ చదువుతోంది. కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు రెండు రోజుల క్రితం కర్నూలుకు వచ్చింది. శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గదిలో ఫ్యాన్కు ఉరేసుకుంది. కుటుంబ సభ్యులు గుర్తించి కిందకు దింపి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. చదువు ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఆలూరు: అభివృద్ధి చేయకుండా, సంక్షేమ పథకాలు అమలు చేయకుండా టీడీపీ నేతలు కల్లబొల్లి మాటలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఆలూరు నియోజకవర్గ అబ్జర్వర్ గుండం ప్రకాష్రెడ్డి అన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆలూరు మండలం మొలగవెల్లి, హత్తిబెళగళ్ గ్రామాల్లో శనివారం నిర్వహించిన రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. అనంతరం నిర్వహించిన గ్రామ సభల్లో ఆయన మాట్లాడుతూ.. ఉల్లి, టమాట, మిర్చికి కనీసం గిట్టుబాటు ధర కల్పించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. రైతుల దయనీయ పరిస్థితిని పట్టించుకోకుండా సీఎం చంద్రబాబు పరిశ్రమలు వస్తున్నాయని అబద్ధాలు చెబుతున్నారన్నారు. మృతులకు సంతాపం చిన్నటేకూరు వద్ద జరిగిన ప్రమాదంలో ప్రైవేట్ బస్సు దగ్ధమై 19 మంది ప్రయాణికులు మృతి చెందగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ వైఎస్సార్సీపీ నేతలు సంతాపం తెలిపారు. గ్రామ సభల్లో రెండు నిమిషాల పాటు మౌనం వహించారు. ఎమ్మెల్యే బుసినె విరూపాక్షి, పార్టీ పరిశీలకులు గడ్డం ప్రకాష్రెడ్డి, వైఎస్సార్సీపీ దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మహేంద్రరెడ్డి, నాయకులు అనిల్రెడ్డి, రంగన్న, చిన్న ఈరన్న, నాగప్ప తదితరులు పాల్గొన్నారు. కర్నూలు (టౌన్): క్రీడలతో మానసిక ఆరోగ్యం లభిస్తుందని జిల్లా విద్యాశాఖాధికారి శామ్యూల్ పాల్ అన్నారు. కర్నూలులోని స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్ అండర్–14, అండర్–17 విభాగాల్లో ఎంపిక పోటీలు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. క్రికెట్లో ప్రతిభ చాటి ఎంతో మంది క్రీడాకారులు స్పోర్ట్స్ కోటాలో ఎంబీబీఎస్లో సీట్లు సంపాదించారన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు. ఎస్జీఎఫ్ కార్యదర్శి క్రిష్ణ, ఎస్జీఎఫ్ సభ్యులు శేఖర్, పరమేష్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


