breaking news
Kurnool
-
జలయజ్ఞంతో మారిన సాగు ముఖచిత్రం
● నిత్యం కరువుతో అల్లాడుతున్న పత్తికొండ నియోజకవర్గంలో హంద్రీనీవా కాలువ ఏర్పాటుతోకృష్ణాజలాలను పారించి సస్యశామలం చేశారు. ● కృష్ణగిరి, పందికోన రిజర్వాయర్లను ఏర్పాటు చేసి దాదాపుగా 80వేల ఎకరాలకు సాగు నీరు అందించే దిశగా చర్యలు చేపట్టారు. ● దేవనకొండ, తుగ్గలి, కృష్ణగిరి, డోన్ మండలంలోని 50 గ్రామాలకు, డోన్పట్టణానికి గాజులదిన్నె ప్రాజెక్టు ద్వారా రూ.55కోట్లతో తాగునీటిని అందించారు. ● హంద్రీనీవాలో భాగంగా వెల్దుర్తి మండలం మల్లెపల్లె వద్ద ఎత్తిపోతల పథకం, కృష్ణగిరి మండలంలో కృష్ణగిరి, కంబాలపాడు, ఆలంకొండ ఎత్తిపోతల పథకాలతోపాటు కృష్ణగిరి సమీపంలో 0.016 టీఎంసీలతో రిజర్వాయర్ నిర్మించి ఏడు గ్రామాల్లోని 5,100 ఎకరాలకు సాగునీటిని అందించారు. ● పత్తికొండ మండలంలోని పందికోన వద్ద ఒకటిన్నర టీఎంసీతో 60వేల ఎకరాలకు సాగునీరు పారించారు. ● లక్కసాగరం వద్ద, దేవనకొండ మండలం గుండ్లకొండ ఎత్తిపోతల పథకం సమీపంలో చానల్ కాలువలు ఏర్పాటు చేసి వీటి ద్వారా మరో 5,100 ఎకరాలను సస్యశ్యామలం చేశారు. -
మాటలకందని అభిమానం..
నంద్యాల పట్టణం పప్పుల బట్టి ప్రాంతంలోని నామలయ్య బడి దగ్గర వీడియో గేమ్స్ షాప్ యజమాని పేరు కృష్ణమూర్తి. భార్య పుష్పలత దేవి గృహిణి. వీరికి 2006లో కొడుకు శబరీష్ పుట్టాడు. ఏడాదిన్నర తర్వాత ఆ బాలుడికి సైగలు చేసినా స్పందించకపోవడం, మాటలు రాకపోవడంతో వైద్యుడిని సంప్రదించి, పరీక్షలు చేయించారు. పుట్టుకతో మూగ, చెవిటి వాడిగా తేలింది. దీంతో కృష్ణమూర్తి దంపతులు కృంగిపోయారు. చిన్న వయస్సులోనే సర్జరీ చేస్తే మాటలు, వినికిడి శక్తి వస్తుందని స్నేహితులు సలహానివ్వడంతో ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని 2009 ఫిబ్రవరిలోగుంటూరులోని కార్పొరేట్ ఆసుపత్రిలో చేరారు. శబరీష్కు అదృష్టవశాత్తూ ఆరోగ్యశ్రీ పథకం కింద కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేయడానికి రూ.6.50 లక్షలు మంజూరయ్యాయి. దీంతో సర్జరీ చేయడంతో వినికిడి, మాటలు వచ్చాయి. తమ కుమారుడు శబరీష్కు బంగారు భవిష్యత్తునిచ్చిన మహానేత వైఎస్ను వారు దైవంలా భావిస్తున్నారు. కృష్ణమూర్తి తనషాపులో దేవుళ్ల చిత్ర పటాల మధ్య మహానేత చిత్రాన్ని పెట్టి పూజిస్తున్నారు. తల్లిదండ్రులతో శబరీష్ (ఫైల్) -
వీడిన శేషన్న హత్య కేసు మిస్టరీ
కర్నూలు: కర్నూలు మండలం సూదిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన కురువ శేషన్న (62) హత్య కేసు మిస్టరీ వీడింది. కురువ శేషన్న తన కూతురు శకుంతల ఇంట్లో పడుకుని ఉండగా ఈనెల 1న రాత్రి అదే గ్రామానికి చెందిన కురువ ఎల్లయ్య అలియాస్ తెల్లన్న కుమారులు కురువ పరశురాముడు, కురువ విజయ్ కుమార్, కురువ గోవిందు, కురువ బీసన్నలు కలిసి ఇంట్లోకి చొరబడి కొడవళ్లు, కర్రలతో దాడి చేసి హత్య చేశారు. శేషన్న కుడి కాలిని నరికి బైకులో తీసుకుని ఊరంతా తిరుగుతూ భయోత్పాతం సృష్టించారని హతుని కూతురు శకుంతల ఫిర్యాదు మేరకు కర్నూలు అర్బన్ తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా కర్నూలు శివారులోని వెంగన్న బావి వద్ద శివాలయం వెనుక నిందితులు ఉన్నట్లు పక్కా సమాచారంతో ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. నేరానికి ఉపయోగించిన కత్తులు, బైకులను వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకుని కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ ఎదుట హాజరుపరిచారు. తాలూకా సీఐ శ్రీధర్, ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి సోమవారం డీఎస్పీ తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. నిందితుల్లో ఒకరైన పరశురాముడి భార్యతో శేషన్నకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు విచారణలో తేలిందని డీఎస్పీ వివరించారు. గ్రామాల్లో ఏవైనా సమస్యలు తలెత్తితే పోలీసులకు ఫిర్యాదు చేసి పరిష్కరించుకోవాలి తప్ప శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. వివాహేతర సంబంధం అనుమానంతో... హత్య చేసినట్లు దర్యాప్తులో తేల్చిన పోలీసులు -
సిఫార్స్ ఉన్న వారికేనా?
ఎమ్మిగనూరురూరల్: యూరియా పుష్కలంగా ఉందంటూ అఽధికారులు ఒక వైపు చెపుతున్నా రైతులు మాత్రం ఎరువుల బస్తాల కోసం నానా అవస్థలు పడాల్సి వస్తోంది. సోమవారం ఉదయం నుంచి డీసీఎంఎస్ వద్ద ఎరువుల కోసం క్యూలో నిల్చున్నా యూరియా అందకపోవటంతో సొసైటీ అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. రైతులకు కాకుండా ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి పీఏ చెప్పిన వారికి, పోలీసులు, ఇతర నాయకులు చెప్పిన వారికే ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం వరకు వేచి ఉన్నా ఇవ్వకుండా రేపు రమ్మంటున్నారని, అలాంటప్పుడు పర్మిట్లు ఎందుకు ఇవ్వాలని సొసైటీ అఽధికారులను ప్రశ్నించారు. సాయంత్రం యూరియా లోడ్ రావటంతో వాగ్వాదానికి దిగిన రైతులకు పంపిణీ మాత్రమే పంపిణీ చేయడంతో రైతులు శాంతించారు. ఎరువుల వివరాలు నమోదు చేయాలి కర్నూలు(అగ్రికల్చర్): రసాయన ఎరువుల అమ్మకాల పూర్తి వివరాలను డీలర్లు ఎప్పటికప్పుడు ఈ–పాస్ మిషన్లతో నమోదు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో అవసరమైనన్ని ఎరువులు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. అవసరం ఉన్నంతవరకు మాత్రమే యూరియా కొనుగోలు చేయాలన్నారు. డీఏపీ స్థానంలో మిశ్రమ ఎరువులు(ఎన్పీకే) 20–20–0–13, 16–20–0–13, 28–28–0, 14–35–14 ఎరువులను వినియోగించవచ్చన్నారు. జూలై నెలకు సంబంధించి 25,080 టన్నుల ఎరువులు రావాల్సి ఉందని, ఇప్పటి వరకు 2,801 టన్నులు వచ్చాయని తెలిపారు. రానున్న 3–4 రోజుల్లో యూరియా 1,896 టన్నులు రానుందని, కోరమాండల్ యూరియా 1,306, ఆర్పిఎఫ్ యూరియా 590 టన్నులు వస్తుందన్నారు. విద్యార్థిని మృతదేహానికి పోస్టుమార్టం ఎమ్మిగనూరురూరల్: మండల పరిధిలోని బనవాసి ఏపీ గురుకుల జూనియర్ కాలేజీలో ఆదివారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని రిషిత(16) మృతదేహానికి సోమవారం స్థానిక ప్రభుత్వాసుప్రతిలో వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించటంతో వారు తమ స్వగ్రామానికి అంత్యక్రియల నిమిత్తం తీసుకుకెళ్లారు. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. వీబీఆర్లోకి కొనసాగుతున్న ఇన్ఫ్లో వెలుగోడు: వెలుగోడు తెలుగుగంగ జలాశయంలోకి ఇన్ఫ్లో కొనసాగుతోంది. బానకచెర్ల క్రాస్ హెడ్ రెగ్యులేటర్ నుంచి 5,500 క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రస్తుత జలశాయంలో 251.94 మీటర్ల వద్ద 826.573 2.260 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలుగుగంగ ఏఈఈ శివనాయక్ తెలిపారు. -
ఆదిలోనే హంసపాదు!
డోన్: కూటమి నాయకుల ఒత్తిడి మేరకు ఆఘమేఘాల మీద ప్రజాభిష్టాన్ని లెక్కచేయకుండా పట్టణ నడిబొడ్డున ఉన్న సబ్రిజిస్ట్రార్ కారాలయాన్ని శివారు ప్రాంతంలోని టీడీపీ నాయకుని షాపింగ్ కాంప్లెక్స్ వద్దకు మార్చడం ఆదిలోనే హంసపాదులా మారింది. గత శుక్రవారం వరకు పోలీసుస్టేషన్ సమీపంలోని పాత సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో స్థిర, చర ఆస్తుల విక్రయాలు జరిగాయి. ఉన్నతాధికారుల ఒత్తిడి తాళలేక రాత్రికి రాత్రే శివారు ప్రాంతంలోని భవనంలోకి కార్యాలయాన్ని మార్చారు. కానీ భవనానికి ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో మరో మూడు, నాలుగు రోజులు క్రయ, విక్రయాలు బందయ్యే అవకాశాలున్నాయి. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడనుంది. మరోవైపు సబ్రిజిస్ట్రార్ కార్యాలయం చుట్టూ రెండంతస్తుల షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించిన టీడీపీ నాయకులు ఆ షాపులన్నీ స్టాంప్ వెండర్లు, డాక్యుమెంట్ రైటర్లకు అద్దెకు ఇచ్చారు. షాపులకు కూడా ఇంతవరకు విద్యుత్ మీటర్లు బిగించలేదు. దీంతో చీకట్లోనే పనులు చేసుకోవాల్సి వస్తోందని స్టాంప్ వెండర్లు, డాక్యుమెంట రైటర్లు వాపోతున్నారు. టీడీపీ నాయకుడి షాపింగ్ కాంప్లెక్స్ వద్దకు సబ్రిజిస్ట్రార్ కార్యాలయం మార్పు ఇంటర్నెట్ సౌకర్యం లేక ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు కాంప్లెక్స్కు విద్యుత్ సౌకర్యం లేక చీకట్లో మగ్గుతున్న వెండర్లు, డాక్యుమెంట్ రైటర్లు -
ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి
కర్నూలు(సెంట్రల్): పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.6400 కోట్లను వెంటనే విడుదల చేయాలని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు అఖండ, ఉపాధ్యక్షుడు రమణకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సోమవారం పీడీఎస్యూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. పీజీ విద్యార్థులకు ఉరితాడుగా మారిన జీఓ నంబర్ 77ను వెంటనే రద్దు చేయాలన్నారు. తద్వారా ప్రతి విద్యార్థి పీజీ చేయడానికి వెసులుబాటు వస్తుందన్నారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులను మెరుగుపరచాలని, విద్యార్థులకు ఇచ్చే కాస్మొటిక్, మెస్ చార్జీలను పెంచాలని కోరారు. విద్యారంగ సమస్యలను నిర్లక్ష్యం వహిస్తే పోరాటాలు తప్పవని హెచ్చరించారు. నాయకులు మల్లికార్జున, నరేష్, అస్లాంబాషా, కిరణ్, వీరేష్ పాల్గొన్నారు. -
15 నుంచి కేసీకి నీటి విడుదల
● హెచ్ఎన్ఎస్ఎస్ కింద 33 చెరువులకు నీటి సరఫరా ● ఐఏబీ సమావేశంలో తీర్మాణించిన ప్రజాప్రతినిధులు, అధికారులు ● ఐఏబీ సమావేశానికి మంత్రి టీజీ డుమ్మా! కర్నూలు(సెంట్రల్): ఈనెల 15 నుంచి కేసీ కెనాల్ కింద 3,763 ఎకరాకల ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేయనున్నట్లు కలెక్టర్ పి.రంజిత్బాషా తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో నీటిపారుదల సలహా మండలి(ఐఏబీ) సమావేశం జరిగింది. సమావేశానికి రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ డుమ్మా కొట్టగా కలెక్టర్ పి.రంజిత్బాషా, జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, పాణ్యం, ఆదోని, కోడుమూరు ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, పార్థసారథి, బొగ్గుల దస్తగిరి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్ఎల్సీ కింద ఆయకట్టుకు జూలై 18న సాగునీటిని విడుదల చేసేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. గుండ్రేవుల, వేదవతి ప్రాజెక్టుల నిర్మాణాలను చేపట్టేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. హంద్రీనీవా నుంచి కల్లూరు మండలం నాయకల్లు, కోడుమూరు మండలం లద్దగరి గ్రామాల వద్ద రెండు స్లూయిజ్లను ఏర్పాటు చేయాలని తీర్మానాలు ప్రభుత్వానికి పంపుతున్నామన్నారు. హంద్రీనీవా కాలువ సామర్థ్యం 3,850 క్యూసెక్కులకు పెంచుతూ చేపడుతున్న విస్తరణ పనులను పూర్తిచేసి జూలై 15 నుంచి నీటిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అదే రోజే గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి కూడా నీటిని విడుదల చేయాలని నీటిపారుదల అధికారులను ఆదేశించారు. హెచ్ఎన్ఎస్ఎస్ కింద 33 చెరువులను పూర్తిగా నింపాలని నిర్ణయించామన్నారు. చెరువుల్లో పూడిక తీత కోసం ఎన్ఆర్ఈజీఎస్ కింద పనులు చేపట్టేలా చర్య లు తీసుకోవాలని మైనర్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో యూరియా కృత్రిమ కొరతను సృష్టిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని వ్యవసాధికారులను ఆదేశించారు. సమావేశంలో జేసీ డాక్టర్ బి.నవ్య, ఆదోని సబ్కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఇరిగేష న్ ఎస్ఈ బాలచంద్రారెడ్డి, హంద్రీనీవా ఎస్ఈ పాండురంగయ్య, కర్నూలు ఆర్డీఓ సందీప్కుమార్, పత్తికొండ ఆర్డీఓ భరత్నాయక్, కేసీ కెనాల్ ఈఈ ప్రతాప్, మైనర్ ఇరిగేషన్ ఈఈ శ్రీనివాసులు పాల్గొన్నారు. ● హంద్రీనీవా నుంచి 77 చెరువులను ఎప్పటిలోగా నింపుతారని జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ప్రశ్నించగా.. విస్తరణ పనులు పూర్తయిన వెంటనే నింపడానికి చర్యలు తీసుకుంటామని హంద్రీనీవా అధికారులు వివరణ ఇచ్చారు. ● బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు మరమ్మతులను వెంటనే చేపట్టాలని, గాజులదిన్నె ప్రాజెక్టును ముందుగానే నింపాలని ఎమ్మెల్సీ బీటీ నాయుడు అధికారులను ఆదేశించారు. ● గుండ్రేవుల ప్రాజెక్టు విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తెలిపారు. హంద్రీనీవా నుంచి నీటిని విడుదల చేయగానే గాజులదిన్నె ప్రాజెక్టును నింపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నాయకల్లు, లద్దగిరి గ్రామాల వద్ద రెండు స్లూయిజ్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ● ఆదోని సబ్ డివిజన్లో మైనర్ ఇరిగేషన్ శాఖకు సంబంధించి 4 ఏఈ, ఒక్క డీఈ పోస్టు ఖాళీగా ఉండడంతో ప్రతిపాదనలు పంపడానికి ఇబ్బందిగా ఉందని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ బి.పార్థసారథి కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. అందుకు కలెక్టర్ స్పందించి డీఈ, ఏఈలను నియమించాలని ఇరిగేషన్ ఎస్ఈ బాలచంద్రారెడ్డిని ఆదేశించారు. ఆదోనికి నీటిని సరఫరా చేసే బసాపురం చెరువు మరమ్మతుల కోసం రూ.33 కోట్లతో ప్రతిపానలు పంపినట్లు కలెక్టర్ చెప్పారు. ● కేసీ కెనాల్, గాజులదిన్నె ప్రాజెక్టులకు నీరు ఎప్పుడిస్తారని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ప్ర శ్నించారు. గుండ్రేవుల కోసం తీర్మానం చేయాలని సూచించారు. అన్యాకాంత్రమైన బి.తాండ్రపాడు గంగమ్మ చెరువును కాపాడాలని కలెక్టర్ను కోరారు. -
ఉద్యోగాల పేరుతో మోసం
కర్నూలు: కర్నూలులోని ఒక పాఠశాలలో టీచర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి కర్నూలుకు చెందిన లక్ష్మయ్య రూ.6 లక్షలు తీసుకుని మోసం చేశాడని కర్నూలు తిలక్ నగర్కు చెందిన యువరాజు, బెంగళూరు ఇన్ఫో టెక్నాలజీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి అనంతపురానికి చెందిన బాబు రూ.2 లక్షలు తీసుకుని మోసం చేశాడని కర్నూలు ముజఫర్ నగర్కు చెందిన అభిలాష్ ఎస్పీ విక్రాంత్ పాటిల్కు ఫిర్యాదు చేశారు. కర్నూలు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పక్కనున్న క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఎస్పీ ప్రజా ఫిర్యాదుల పరిష్కారవేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 85 ఫిర్యాదులు రగా చట్ట పరిధిలో విచారించి పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా పాల్గొన్నారు. పీజీఆర్ఎస్కు వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని.. ● నకిలీ డెత్ సర్టిఫికెట్ సృష్టించి దొంగ రిజిస్ట్రేషన్తో ఆస్తి మొత్తాన్ని కాజేయడానికి ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తున్నారని, విచారణ జరిపి న్యాయం చేయాలని కర్నూలు కుమ్మరి వీధికి చెందిన రాకేష్ ఫిర్యాదు చేశారు. ● నంద్యాల ఆటో నగర్కు చెందిన కురువ ఈరన్న ధరణి ఆటో గ్యారేజీలో పనిచేస్తూ ట్రాక్టర్ ఇంజిన్కు నెలకు రూ.20 వేలు బాడుగ ఇస్తానని తీసుకెళ్లి 8 నెలలు అయిందని, ఎక్కడికి వెళ్లిపోయాడో ఇంతవరకు తెలియడం లేదని, ఫైనాన్స్ ఆఫీస్ వారు కంతులు కట్టాలని ఒత్తిడి చేస్తున్నారని, విచారణ జరిపి న్యాయం చేయాల్సిందిగా ఆదోని మండలం ఇస్వి గ్రామానికి చెందిన రామాంజనేయులు, మల్లప్ప ఫిర్యాదు చేశారు. ● ఎకరా 20 సెంట్ల తన పొలాన్ని సర్వేయర్ కొలతలు వేసినా కూడా ఉగాది జయన్న అనే వ్యక్తి దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని ప్యాలకుర్తికి చెందిన పెరుగు నగేష్ ఫిర్యాదు చేశారు. ● కర్నూలు వడ్డెగేరికి చెందిన ఖాజా ఖాన్ గ్లాస్ వర్క్ పనిచేస్తున్నాడని, ఇన్స్ట్రాగామ్లో తన భర్త పేరుతో నకిలీ ఐడీ సృష్టించి ప్రముఖులను దుర్భాషలాడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఈ విషయంపై విచారణ జరిపి న్యాయం చేయాలని కర్నూలుకు చెందిన ఫసియా ఫిర్యాదు చేశారు. ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితులు పీజీఆర్ఎస్కు 85 ఫిర్యాదులు -
కుంటుపడిన గిరిజన విద్య!
కర్నూలు(అర్బన్): జిల్లాలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. జూన్ 12న ప్రభుత్వ పాఠశాలలు పునః ప్రారంభమైనా, నేటికీ ఆయా ఆశ్రమ పాఠశాలలకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేయని పరిస్థితి. జిల్లాలోని కర్నూలు (బాలురు), తుగ్గలి (బాలికలు), ఆలూరు (బాలురు) ప్రాంతాల్లో ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలు నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలల్లో దాదాపు 600 మంది విద్యార్థులు విద్యతో పాటు వసతిని పొందుతున్నారు. అయితే ఈ పాఠశాలల్లో పలు ముఖ్యమైన సబ్జెక్టులను బోధించేందుకు కూడా ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థుల చదువులు కుంటుపడుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రధానంగా వివిధ సబ్జెక్టులకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్, సెకండరీ స్కూల్ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. ఫిజకల్ సైన్స్, బయలాజికల్ సైన్స్, తెలుగు, ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల బదిలీల్లో ఆయా పాఠశాలల్లో పనిచేసే పలువురు ఉపాధ్యాయులు ఇతర ప్రాంతాలకు వెళ్లడం వల్ల జిల్లాలోని మూడు గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఖాళీలు ఏర్పడినట్లు తెలుస్తోంది. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు ● కర్నూలులో స్కూల్ అసిస్టెంట్ (తెలుగు) టీచర్ మూడు నెలల వరకు మెడికల్ లీవ్లో వెళ్లినట్లు తెలిసింది. ఇదే స్కూల్లో ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ పోస్టు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. ● తుగ్గలి (రాతన)లో గ్రేడ్–2 హెడ్మాస్టర్ పోస్టుతో పాటు తెలుగు, మ్యాథ్స్ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇదే స్కూల్లో నాలుగు ఎస్జీటీ శాంక్షన్ పోస్టులు ఉండగా, ప్రస్తుతం ఒకరు మాత్రమే విధులు నిర్వహిస్తుండగా, మిగిలిన మూడు పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ● ఆలూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఒక ఫిజికల్ సైన్స్ టీచర్ పోస్టు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆశ్రమ పాఠశాలల్లో 10 మంది టీచర్ల కొరత -
బదిలీల్లో సిఫార్స్లకే పెద్దపీట
కర్నూలు(అగ్రికల్చర్): గ్రామ వ్యవసాయ సహాయకుల బదిలీలు అడ్డుగోలుగా జరుగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏకపక్షంగా జరుగుతున్న బదిలీలను నిరసిస్తూ వీఏఏలు జిల్లా వ్యవసాయ అధికారి చాంబరు ఎదుట బైఠాయించారు. సచివాలయ ఉద్యోగుల బదిలీలకు ఉద్దేశించిన జీఓను వ్యవసాయ అధికారులు పరిగణలోకి తీసుకున్న దాఖలాలే లేకపోవడం పట్ల సర్వత్రా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల వెలువడిన ఉత్తర్వుల్లో గత ఏడాది నవంబరు మాసంలో మరణించిన వీఏఏను దేవనకొండ మండలం తెర్నెకల్కు పోస్టింగ్ ఇవ్వడం గమనార్హం. కొన్ని నెలల క్రితం మరణించిన వీఏఏ ఎపుడు ఆప్షన్ ఇచ్చారో.. ఎలా బదిలీ చేశారో వ్యవసాయ యంత్రాంగానికే తెలియాలి. సిపారస్సు లేఖలు లేకపోతే ఆదోని, హాళహర్వి, కౌతాళం, పెద్దకడబూరు, హొళగుంద, ఆలూరు, కోసిగి మండలాలకు పంపుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎస్టీకి చెందిన శివనాయక్ ఇంతవరకు నంద్యాల జిల్లాలో పనిచేశారు. సీనియార్టీ జాబితాలో ఈయన పేరు 136, ర్యాంకు 4. ఈయనకు కౌన్సెలింగ్ ప్రకారం కర్నూలు పరిసర మండలాలు దక్కాలి. కానీ ఆలూరు మండలానికి పంపారు. సీనియారిటీ జాబితాలో 150పైన ఉన్న వారికి దగ్గరి మండలాలు దక్కాయి. కారణం సిపారస్సు లేఖలు తెచ్చుకోవడమేనని తెలుస్తోంది. నంద్యాల జిల్లాలో పనిచేసిన నాగహర్షిత గర్భిణి. ఈమెను ఆదోని మండలం మంత్రికి గ్రామానికి బదిలీ చేశారు. ఇలా వందల మంది వీఏఏలతో వ్యవసాయ యంత్రాంగం చెలగాటమడుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీఏఏలు జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో బైఠాయించినప్పటికీ పట్టించుకునే వారు లేకపోవడం గమనార్హం. జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయం ఎదుట వీఏఏల బైఠాయింపు -
అర్జీలు రీఓపెన్ కానివ్వొద్దు
కర్నూలు(సెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఇచ్చిన అర్జీలు రీఓపెన్ కాకుండా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిష్కారమైన సమస్యల ఫీడ్ బ్యాక్పై ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిని సరిదిద్దుకోవాలన్నారు. కర్నూలు డీఐ వద్ద 22, పత్తికొండ ఆర్డీఓ దగ్గర 19, కర్నూలు ఆర్డీఓ దగ్గర 15, ఆదోని సబ్కలెక్టర్ దగ్గర 15 కేసులు రీఓపెన్ అయినట్లు చెప్పారు. వీటిని త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. సీఎంఓ గ్రీవెన్స్లకు సంబంధించి ఆదోని సబ్ కలెక్టర్ దగ్గర 10, పత్తికొండ ఆర్డీఓ దగ్గర 3, కలెక్టరేట్ ఏఓ దగ్గర 3, ఉద్యాన శాఖ, సర్వే ఏడీ, జిల్లా రిజిస్ట్రార్, డీపీఓల దగ్గర ఒక్కో అర్జీ పెండింగ్లో ఉన్నాయని, వాటిని త్వరగా పరిష్కరించాలని సూచించారు. 10 రోజుల్లో బీఎల్ఓలను నియమించండి ప్రస్తుతం ఎన్నికల అంశాలకు సంబంధించి పనిచేసే బూత్ లెవల్ ఆఫీసర్(బీఎల్ఓలు) బదిలీ కావడంతో వారి స్థానాల్లో పది రోజుల్లో కొత్త వారిని నియమించాలని నియోజకవర్గాల ఈఆర్ఓలను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ డాక్టర్ బి.నవ్య, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, హౌసింగ్ పీడీ చిరంజీవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
రైతుల పాలిట వరం.. ఉచిత విద్యుత్
వైఎస్సార్.. ఈ పేరు వినిపిస్తే చాలు ప్రతిహృదయం పులకిస్తోంది. ప్రగతి స్వాప్నికుడు.. సంక్షేమ రథసారథి.. ప్రజలే ప్రాణంగా సాగించిన ప్రయాణంలో దూరమై 16 ఏళ్లు గడిచినా ప్రతి మదిలో రాజన్న స్థానం పదిలం. ఆయన పాలనలో ప్రతి ఇంటి ముంగిటా అభివృద్ధి వెలుగులే. ప్రతి పేద గుండెలో ఆ నిండైన రూపమే. బీడు బారిన నేల తల్లికి జల సిరులందించిన అపరభగీరథుడిలా.. దగాపడిన బడుగు జీవికి అభయహస్తమందించి.. లయ తప్పిన పేద గుండెకు ఊపిరులూదిన దైవంలా.. ఆసరా లేని వృద్ధాప్యానికి పెద్ద కొడుకుగా భరోసానిచ్చి.. ఆరుగాలం కష్టించినా ఉరితాడే దిక్కయిన పేద రైతు కష్టాలు ఒక్క సంతకంతో మాఫీ చేసిన‘మహా నేత’.. తెలుగుదనానికి నిలువెత్తు రూపమే వైఎస్సార్. అప్పట్లో అభివృద్ధి ఫలాలు పొందిన ప్రతి గుండె ఆ మహానేతను మనసారా స్మరిస్తోంది. నేడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి 76వ జయంతి సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.రైతుల పాలిట వరం.. ఉచిత విద్యుత్ 2004 సంవత్సరానికి ముందు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. నాటి పాలకులే వ్యవసాయం దండగని ప్రకటించడంతో రైతులకు చేయూత కరువైంది. వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఉమ్మడి జిల్లాలో ఉచిత విద్యుత్ కనెక్షన్లు 1.15 లక్షలు ఉండగా.. ఆయన మరణించే నాటికి 1,56,790 కనెక్షన్లకు చేరుకున్నాయి. అప్పట్లోనే ఉచిత విద్యుత్ ద్వారా రైతులకు ఏడాదికి రూ.50 వేల వరకు ప్రయోజనం లభించింది. మొట్ట మొదట ఇటు రైతులు, అటు పొదుపు మహిళలకు పావల వడ్డీకే రుణాలు ఇచ్చే విధానాన్ని తెచ్చారు. ఫలితంగా ఉమ్మడి జిల్లాలో 4.50 లక్షల మంది రైతులు, 3.25 లక్షల మంది పొదుపు మహిళలకు లబ్ధి చేకూరింది.వ్యవసాయ కూలీలు రైతులయ్యారువైఎస్ రాజశేఖర్రెడ్డి అమలు చేసిన భూపంపిణీ కార్యక్రమం వల్ల కూలీలు రైతులయ్యారు. వైఎస్ఆర్ హయాంలో ఉమ్మడి జిల్లాలో దాదాపు 1.20 లక్షల మంది రైతులకు 1.35 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేశారు. పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్ భూముల్లో ఉపాధిహామీ పథకం కింద డ్రైల్యాండ్ హార్ట్టికల్చర్ పేరుతో పండ్లతోటల పెంపకాన్ని చేపట్టి వారికి శాశ్వత ఆదాయ వనరులను సృష్టించారు. 2007లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్సింగ్తో కలసి ఓర్వకల్ మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించారు. ఉపాధి నిధులతో 2007–08, 2008–09 సంవత్సరాల్లో డ్రైల్యాండ్ హార్టికల్చర్ కింద 9వేల ఎకరాల్లో పండ్లతోటలు అభివృద్ధి చేశారు. నాడు వ్యవసాయ కూలీలుగా ఉన్న వారు భూపంపిణీ కార్యక్రమంతో రైతులుగా మారారు. ఉపాధి నిధులతో ఈ భూముల్లో పండ్లతోటలు అభివృద్ధి చేసుకున్నారు.రూ.15వేల కోట్ల రుణమాఫీౖవైఎస్సార్ హయాంలో విజయవంతంగా రుణమాఫీ చేయడం విశేషం. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న పంట రుణాలను మాఫీ చేయించారు. ఉమ్మడి జిల్లాలో 2.75 లక్షల మంది రైతులకు సంబంధించి రూ.15వేల కోట్లు మాఫీ అయ్యాయి. సక్రమంగా రుణాలు చెల్లించడం వల్ల మాఫీ వర్తించని రైతులకు ప్రోత్సాహకాల కింద రూ.5వేల ప్రకారం చెల్లించారు.● ఇందిరమ్మ ఇళ్ల పేరుతో హౌసింగ్లో సరికొత్త విప్లవం తెచ్చారు. వైఎస్సార్ హయాంలో నాలుగు దశల్లో ఉమ్మడి జిల్లాలో 3.25 లక్షల ఇళ్లు నిర్మించారు. వైఎస్సార్ హయాంలోనే కొత్త ఊళ్లు ఏర్పడ్డాయి. -
మెట్టకు ప్రాణం పోసిన అపర భగీరథుడు
ఆత్మకూరు: వర్షాధార పంటలు పండే మెట్ట భూములకు మహానేత వైఎస్సార్ ప్రాణం పోసి అపరభగీరథుడుగా మారారు. ఆత్మకూరు, నందికొట్కూరు నియోజకవర్గాల్లో ఒకే సారి ఐదు ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేసి మెట్ట భూములను ఆయకట్టుగా మార్చారు. జలయజ్ఞంలో భాగంగా సిద్దాపురం, చెలిమెళ్ల, లింగాల, శివపురం, ఇస్కాల ఎత్తిపోతల పథకాలతో దాదాపు 30 వేల ఎకరాలకు పైగా నీరందించారు. 2006లో ఈ పథకాలకు నిధులు మంజూరు చేయడంతో పథకాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం రైతులు రెండు పంటలు పండిస్తూ నేటికీ మహానేత మేలును తలుచుకుంటున్నారు.కోవెలకుంట్ల: రాయలసీమ జిల్లాలను సస్యశ్యామలం చేయాలన్న మహానేత సంకల్పం జలయజ్ఞంతో సాకారమైంది. రెండు టీఎంసీల సామర్థ్యం ఉన్న అవుకు రిజర్వాయర్ను రూ. 70 కోట్లతో నాలుగు టీఎంసీల సామర్థ్యానికి పెంచేందుకు 2005 నవంబర్లో శంకుస్థాపన చేశారు. శ్రీశైలం జలాశయం నుంచి అవుకు రిజర్వాయర్లోకి నీరు చేరేందుకు 30వ ప్యాకేజీ కింద రూ. 401కోట్లతో 12కి లోమీటర్ల మేర రెండు సొరంగ మార్గాలను ఏర్పాటు చేసి వీటి ద్వారా 20 వేల క్యూసెక్కుల వరద జలాలను రిజర్వాయర్లో నింపాల్సి ఉంది. 2010 నాటికే ఒక సొరంగం గుండా వైఎస్సార్ జిల్లా గండికోటకు నీటిని విడుదల చేయాలి. వైఎస్సార్ మరణం తర్వాత కిరణ్ సర్కార్, 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం జలయజ్ఞ పనులను నిర్లక్ష్యం చేయడంతో పది శాతం పనులు పెండింగ్లో ఉన్నాయి. 2019లో అధికారంలో వచ్చిన జగన్ సర్కార్ ఆ పనులను పూర్తి చేసి ఒక్కో సొరంగం ద్వారా పదివేల క్యూసెక్కుల నీటి విడుదలకు మార్గం సుగమం చేసింది. జిల్లాతోపాటు వైఎస్సార్, చిత్తూరు జిల్లాల ప్రజలకు శాశ్వితంగా తాగునీరు, సాగునీటి కష్టాలను తీర్చాలన్న ఉద్దేశంలో అవుకు రిజర్వాయర్కు అనుసంధానంగా గత ప్రభుత్వం రూ. 300 కోట్లతో 5.9 కిమీ పొడవునా మూడో సొరంగం నిర్మాణం చేపట్టింది. అవుకు రిజర్వాయర్‘జల’హో రాజన్న! -
నా ఎదుగుదల వైఎస్సార్ పుణ్యమే
నేను ఒకటవ తరగతి నుంచి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో, ఆరు నుంచి 10వరకు కంబాలపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకున్నా. 2001–08లో పదో తరగతిలో 510 మార్కులు సాధించా. అప్పుడే కొత్తగా ట్రిపుల్ ఐటీలు ప్రారంభించారు. వైఎస్సార్ జిల్లాలోని ఇడుపులపాయ ట్రిపుల్ఐటీలో ఇంటర్, బీటెక్ పూర్తయింది. క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం వచ్చింది. గత ఐదేళ్లుగా నెరోలాక్ పెయింట్స్లో ఇంజనీరుగా పనిచేస్తున్నా. ఇదంతా దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యమే. – కె.లక్ష్మీకాంతరెడ్డి, బోయబొంతిరాళ్ల భూమి ఉన్నంత వరకు వైఎస్సార్ గుర్తుంటారు హంద్రీనీవా కాలువ ద్వారా రిజర్వాయర్లోకి నీరు వస్తుంది. అక్కడి నుంచి మా గ్రామంలోని పొలాలకు నీరు అందుతుంది. ఒక్కప్పుడు నిత్యం కరువుతో అల్లాడుతున్న సమయంలో వైఎస్సార్ దేవుడిలా వచ్చారు. ఎక్కడో ప్రవహించే కృష్ణజలాలు ఎత్తిపోతల ద్వారా ఈ ప్రాంతానికి తీసుకరావడంతో మంచి పంటలు పండించుకుని అప్పుల నుంచి గట్టెక్కాం. ఈ భూమి ఉన్నంత వరకు వైఎస్సార్ ఇక్కడి ప్రజల గుండెల్లో కొలువై ఉంటారు. – కురువ నాగరాజు, రైతు, పుట్లూరు రెండు పంటలు పండిస్తున్నాం సిద్దాపురం చెరువు కింద రెండు పంటలు పండిస్తున్నాం. ఎత్తిపోతల పథకం మంజూరు కాకపోయుంటే కరువు కాటకాలతో ఇబ్బందులు పడేవాళ్లం. ప్రస్తుతం ఎత్తిపోతల పథకంతో సిద్దాపురం చెరువులో పూర్తి స్థాయిలో నీరు ఉంది. ఈ నీటితో రెండో పంటకు కూడా నీరందుతోంది. ఈ పథకం మంజూరు చేసిన దివంగత నేత వైఎస్ రాజశే ఖర్రెడ్డిని నిత్యం స్మరించుకుంటున్నాం. – యేసేబు, ఆత్మకూరు 4 శాతం రిజర్వేషన్తో డాక్టర్ అయ్యా ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ దే. ఈ రిజర్వేషన్ మాలాంటి వారికే ఎంతో ఉపయోగపడింది. వైద్యవిద్యను అభ్యసించేందుకు అవకాశం కలిగింది. కుప్పం పీఈఎస్ మెడికల్ కాలేజీలో (ఎమర్జెన్సీ మెడిసిన్), డీఎన్బీ విద్యను బెంగళూరులోని బాప్టిస్ట్ ఆసుపత్రిలో పూర్తి చేశా. మెడిసిన్ విద్యను పూర్తి చేయడంతోనే నా కల సాకారమైంది. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ వంటి వాటితో పాటు ఎన్నో సంక్షేమ పథకాలు వైఎస్సార్ అప్పట్లో అమలు చేశారు. ఎంతో మంది సామాన్యుల జీవితాల్లో మార్పు వచ్చి ప్రస్తుతం ఉన్నతంగా జీవిస్తున్నారు. – మహమ్మద్ రఫీ, చాబోలు, నంద్యాల మండలం ● -
సుంకేసులకు కొనసాగుతున్న వరద
కర్నూలు సిటీ: కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు భారీగా నీరు విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో తుంగభద్ర నదిపై నిర్మించిన సుంకేసుల బ్యారేజీ(కోట్ల విజయభాస్కర్ బ్యారేజీ)కి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. సోమవారం ఉదయం 6 గంటలకు 62,500 క్యుసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. సాయంత్రం 6 గంటలకు 57 వేల క్యుసెక్కులకు చేరుకుంది. దీంతో బ్యారేజీ నుంచి ఉదయం 17 గేట్ల ద్వారా 66,589 క్యుసెక్కులు.. సాయంత్రం 59,310 క్యుసెక్కులను 15 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఏడుగురు డిప్యూటీ ఎంపీడీఓలకు పోస్టింగ్లు కర్నూలు(అర్బన్): ఇటీవల పదోన్నతి పొందిన ఏడుగురు డిప్యూటీ ఎంపీడీఓలకు పోస్టింగ్ ఇచ్చినట్లు జిల్లా పంచాయతీ అధికారి జి.భాస్కర్ సోమవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. పదోన్నతి పొందిన జేమ్స్ కృపవరంను కర్నూలు, ఎ.నాగరాజును చిప్పగిరి, కె.నాగరాజును హాలహర్వి, ఎ.విజయలక్ష్మిని మద్దికెర, జి.మహేశ్వరిని సి.బెళగల్, పి.గోపాలను దేవనకొండ, జిఎంఏ కిషోర్ కుమార్ను కోడుమూరు మండలానికి నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. పీజీ, బీటెక్ సెమిస్టర్పరీక్షలు ప్రారంభం కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో సోమవారం పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీటెక్ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పీజీ నాల్గవ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలకు 489 మందికిగాను 415 మంది విద్యార్థులు హాజరుకాగా బీటెక్ 4, 6 సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ, 3, 5, 7 సప్లిమెంటరీ పరీక్షలకు 243 మందికిగాను 241 మంది విద్యార్థులు హాజరైనట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. వర్సిటీ వైస్చాన్స్లర్ ప్రొఫెసర్ ఉడతా వెంకట బసవరావు, రెక్టార్ ఆచార్య ఎన్టీకే నాయక్, రిజిస్ట్రార్ డాక్టర్ బోయ విజయ్కుమార్ నాయుడు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. 9న గురుకులాల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్ కర్నూలు(అర్బన్): జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాసంస్థల్లో 5వ తరగతి, ఇంటర్మీడియట్లో మిగిలిన సీట్ల భర్తీకి ఈనెల 9న కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఉమ్మడి జిల్లాల కోఆర్డినేటర్ డాక్టర్ ఐ.శ్రీదేవి తెలిపారు. సోమవారం సాయంత్రం ఆమె విలేకరులతో మాట్లాడుతూ 5వ తరగతిలో బాలురకు రెండు సీట్లు మాత్రమే ఉన్నాయని, అవి కూడా ఎస్టీ, బీసీలకు మాత్రమేనన్నారు. ఇంటర్మీడియెట్లో బాలురకు ఎంపీసీలో 6, బైపీసీలో 5, సీఈసీలో 36 సీట్లు భర్తీ చేయాల్సి ఉందన్నారు. 5వ తరగతిలో బాలికలకు 70, ఇంటర్మీడియెట్లో బాలికలకు ఎంపీసీలో 70, బైపీసీలో 26 సీట్లను భర్తీ చేయాల్సి ఉందన్నారు. ఈ కౌన్సిలింగ్కు గురుకుల ప్రవేశ పరీక్ష రాసిన బాలికలు మాత్రమే హాజరుకావాలన్నారు. 9న ఉదయం 10 గంటలకు 5వ తరగతి సీట్ల భర్తీకి (బాలురు, బాలికలు) దిన్నెదేవరపాడులోని అంబేద్కర్ బాలికల గురుకులంలో హాజరుకావాలన్నారు. -
కష్టపడిన ప్రతి కార్యకర్తకు తోడుంటాం
కోడుమూరు రూరల్: రానున్నది జగనన్న ప్రభుత్వమేనని, కష్టపడిన ప్రతి కార్యకర్తలకు అండగా నిలు స్తామని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి అన్నారు. బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా సోమవారం కోడుమూరులో వైఎస్సార్సీపీ నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ సతీష్, కుడా మాజీ చైర్మన్ కోట్ల హర్షవర్దన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ, కోడుమూరు, గూడూరు, సీ.బెళగల్, కర్నూలు మండలాల ప్రజాప్రతినిధులు, వైఎస్సా ర్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్వీ మోహన్రెడ్డి మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీల పేరిట సీఎం చంద్రబాబునాయుడు ప్రజలను దారుణంగా మోసం చేశాడన్నారు. హామీలపై ఎవరైనా ప్రశ్నిస్తే రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ కేసులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. చంద్రబాబు తనను గెలిపిస్తే గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మిస్తానని కోడుమూరు ప్రజలకు హామీ ఇచ్చాడన్నారు. అయితే ఏళ్లు గడిచినా ఆ హామీ ఏమైందో, గుండ్రేవుల ప్రాజెక్టు కోసం పార్టీ మారుతున్నానంటూ ఓ నేత మాటలు ఏమయ్యాయో ప్రజలందరికీ తెలుసన్నారు. సీఎం చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సాగిస్తున్న మోసపు పాలనను వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి తెలియజెప్పాలన్నారు. జెడ్పీటీసీ సభ్యులు రఘునాథ్రెడ్డి, మౌలాలి, గూడూరు ఎంపీపీ సునీత, మున్సిపల్ చైర్మన్ జులుపాల వెంకటేశ్వర్లు, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు ఎల్.వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శులు లాయర్ ప్రభాకర్, హనుమంతరెడ్డి, కార్యదర్శులు శ్రీనివాసరెడ్డి, మగ్బుల్, శివరాముడు, అధికార ప్రతినిధి ప్రభాకర్రెడ్డి, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు రమేష్నాయుడు, మోహన్బాబు, రామాంజినేయులు, సోమశేఖర్రెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి -
జగ్జీవన్ వర్ధంతిని విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వం
కర్నూలు (టౌన్): స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘసంస్కర్త బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని కూటమి ప్రభుత్వం విస్మరించడం దారుణమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. ‘కనీసం జిల్లా అధికారులకు దండలు వేసేంత సమయం కూడా లేదా’ అని ప్రశ్నించారు. అధికారులకు, ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని ఆదివారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. కర్నూలులోని ఆర్ఎస్ రోడ్డులో ఉన్న బాబు జగ్జీవన్రాం విగ్రహానికి పూలమాలలు వేసి ఎస్వీ మోహన్రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహనీయుల వర్ధంతులను కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. జయంతులను ఏ విధంగా నిర్వహిస్తారో.. వర్థంతులను కూడా అలాగే జరిపి, మహనీయుల గొప్ప త్యాగాలను ప్రజలకు తెలిపే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. బాబు జగ్జీవన్ రాం మన దేశానికి ఉపప్రధానిగా, భారత రాజ్యాంగ పరిషత్ సభ్యునిగా, వివిధ శాఖల్లో క్యాబినెట్ మంత్రిగా పనిచేశారని గుర్తు చేశారు. 1971 ఇండో–పాక్ యుద్ధ సమయంలో భారత రక్షణ మంత్రిగా పనిచేశారన్నారు. భారత దేశంలో హరిత విప్లవం రావడానికి ఎంతో కృషి చేశారన్నారు. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు కమతం పరశురాం, రాష్ట్ర ఎస్సీ సెల్ సంయుక్త కార్యదర్శి రైల్వే ప్రసాద్, జిల్లా కార్యదర్శి సర్వేశ్వర రెడ్డి, ఆర్టీఐ నగర అధ్యక్షులు గద్ద రాజశేఖర్, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు ప్రభుదాస్, ఉద్యోగుల సంఘం నగర అధ్యక్షులు సత్యరాజు, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు నవీన్, లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి రాజేష్, యువజన విభాగం కార్యదర్శులు యోగి, యోగేంద్ర కుమార్, చందు, ఏసు, వన్నేష్, రాజు, నాగరాజు, శ్రీకాంత్, అశోక్, తిమ్మన్న, శివ పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి -
నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ పి.రంజిత్బాషా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు అర్జీలు సమర్పించుకోవాలని సూచించారు. అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వాహనాల తనిఖీ కర్నూలు (టౌన్): జిల్లాలో ఆదివారం పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు వాహనచోదకులకు రోడ్డు భద్రత నిబంధనలపై అవగాహన కల్పించారు. హెల్మెట్ , సీట్ బెల్ట్ ధరించాలని, డ్రంకన్ డ్రైవింగ్లకు దూరంగా ఉండాలని సూచించారు. రోడ్డు సెఫ్టీ ఉల్లంఘనులపై చర్యలు తీసుకున్నారు. ట్రిపుల్ రైడింగ్, సెల్ ఫోన్ మాట్లాడుతూ ర్యాష్ డ్రైవింగ్ చేసే వారిని హెచ్చరించారు. నంబర్ ప్లేటు లేకుండా వాహనాలు నడిపేవారి వారికి జరిమానాలు విధించారు. నిలకడగా ఇన్ఫ్లో హొళగుంద: తుంగభద్ర డ్యాంకు ఇన్ఫ్లో నిలకడగా ఉండటంతో ఆదివారం 19 గేట్లతోనే నీటి విడుదల చేస్తున్నారు. జలాశయానికి 72,490 క్యూసెక్కులు (ఇన్ఫ్లో) వచ్చి చేరుతుండగా ఒక్కో గేటును రెండున్నర అడుగుల మేర ఎత్తి 56,333 క్యూసెక్కులు నదికి, మరో 6 వేల క్యూసెక్కులను కాలువలకు వదులుతున్నారు. డ్యాం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీల కాగా.. ప్రస్తుతం 77.343 టీఎంసీల నీరు ఉంది. -
తీరని దాహం.. తడవని పొలం
సాగు విస్తీర్ణం (ఎకరాల్లో) సాగునీటి వనరు విస్తీర్ణం కేసీ కెనాల్ 3,763 ఎల్ఎల్సీ 1,51,134 ఆలూరు బ్రాంచ్ కెనాల్ 14,255 హంద్రీనీవా 60,000 జీడీపీ 24,372 చిన్న నీటిపారుదల శాఖ పరిధిలో 27,707, లిఫ్ట్ల కింద 20 వేల ఎకరాల ఆయకట్టు ఉంది.● సాగునీటి కాలువలను పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం ● ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిన టీడీపీ నేతలు ● హంద్రీ–నీవా నీటి వాటాపై గందరగోళం ● 68 చెరువులకు నీటి విడుదలకు నిధులేవీ? ● నేడు సాగు నీటి సలహా మండలి సమావేశంకర్నూలు సిటీ: ‘ తాము అధికారంలోకి వస్తే సాగు నీటి ప్రాజెక్టులు చేపడతాం...పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం..స్థీరికరించిన ఆయకట్టుకు సమృద్ధిగా సాగు నీటిని అందిస్తాం’ అని ఎన్నికల సమయంలో కూటమి నేతలు మాట ఇచ్చారు. అధికారాన్ని చేపట్టి ఏడాది దాటినా సాగునీటి కాలువల మరమ్మతులు చేయలేకపోయారు. సాగునీటి ప్రాజెక్టులు అడుగు ముందుకు పడడం లేదు. జిల్లాలోని పశ్చిమ పల్లెల గొంతెండుతోంది. పంటలకు సాగు నీరు లేకపోవడంతో ఇప్పటికే వేలాది కుటుంబాలు పొట్టచేత పట్టుకొని వలస వెళ్లాయి. నేడు(సోమవారం) ఖరీఫ్లో ఆయకట్టుకు నీటి విడుదలపై చర్చించేందుకు సాగు నీటి సలహా మండలి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి జిల్లా మంత్రి టీజీ భరత్, ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు, ఆయా సాగునీటి ప్రాజెక్టు కమిటీల చైర్మెన్లు హాజరుకానున్నారు. రైతుల కష్టాలు, ప్రజల ఇబ్బందులపై ఈ సమావేశంలో చర్చిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇవీ సమస్యలు.. ● టీబీ డ్యాం గేటు గతేడాది కొట్టుకపోవడంతో జలాశయం సామర్థ్యాన్ని 105.6 టీఎంసీల నుంచి 80 టీఎంసీలకు తగ్గించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా డ్యాం నుంచి నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. అదే నీరు తుంగభద్ర దిగువ కాలువకు విడుదల చేస్తే జిల్లాలోకి పశ్చిమ పల్లె ప్రాంతంలోని ఆయకట్టుకు ప్రయోజనం ఉంటుంది. ● ప్రస్తుతం తుంగభద్ర నదికి వరద నీరు వస్తోంది. నదీ తీరంలో ఉన్న ఎత్తిపోతల పథకాల లిఫ్ట్లు పనిచేయడం లేదు. గురురాఘవేంద్ర లిఫ్ట్ల మరమ్మతులు చేయలేదు. ● జిల్లాలోని సాగు నీటి కాలువలు, ఎత్తిపోతల పథకాలు, మేజర్ చెరువుల తూములను ఏటా ఖరీఫ్కు ముందే మరమ్మతులు చేయాలి. కూటమి ప్రభుత్వం మొదటి ఏడాది పైసా కూడా నిధులు ఇవ్వలేదు. ● చెరువులు, గురురాఘవేంద్ర ఎత్తిపోతల పథకాలు, ఎల్ఎల్సీ నిర్వహణకు ఈ ఏడాది రూ.11.65 కోట్ల నిధులు మంజూరు చేసినా ఇప్పటి వరకు పనులు సగం కూడా మొదలు కాలేదు. జీఎస్టీ కారణంతో టెండర్ పనులు చేసేందుకు ఎవరు ముందుకు రావడం లేదు. ● హంద్రీ– నీవా పరిధిలో జిల్లాలో 80 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. గతేడాది సగం ఆయకట్టు కూడా నీరు ఇవ్వలేదు. ఈ ఏడాదైనా హంద్రీ–నీవాలో జిల్లా వాటా నీరు ఎంతో కూడా స్పష్టత లేదు. మొత్తం 68 చెరవులకు నీరిచ్చేందుకు చేపట్టిన పథకం నిర్వహణకు నిధులు కేటాయింపే లేదు. గతేడాదిలాగే ఈ ఏడాది కూడా చెరువులకు నీటి పంపింగ్ ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కరువు కనిపించదా? తుంగభద్ర, హగేరి నదులపై గుండ్రేవుల, వేదావతి, ఆర్డీఎస్ కుడికాల్వ ప్రాజెక్టులు నిర్మించాల్సి ఉంది. గుండ్రేవులపై గతేడాది అసెంబ్లీలో చర్చించినా హామీ మాత్రం ప్రభుత్వ నుంచి రాలేదు. హగరి నదిపై గత ప్రభుత్వం చేపట్టిన వేదావతి ప్రాజెక్టు పూర్తి కావాలంటే పెండింగ్లో ఉన్న భూసేకరణ పూర్తి చేయాలి. గతేడాది కేటాయించిన తాత్కాలిక, ఈ ఏడాది కేటాయించిన వార్షిక బడ్జెట్లో పైసా నిధులు కేటాయించలేదు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే జిల్లా పశ్చిమ ప్రాంతంలో 253 గ్రామాలకు తాగు, 80 వేల ఎకరాలకు నీరు అందుతుంది. ఆర్డీఎస్ కుడి కాలువ పనులను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రారంభించి కొంత పూర్తి చేసింది. ప్రస్తుత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు సైతం ఎలాంటి నిధులు కేటాయింపులు చేయలేదు. ఇవీ కేటాయింపులు ఈ ఏడాది తుంగభద్ర డ్యాం నీటి లభ్యత అంచనాలు వేసి ఎల్ఎల్సీకి 24 టీఎంసీలకుగాను 13.5 టీఎంసీలు, కేసీకి 10 టీఎంసీలకుగాను 5.6 టీఎంసీల నీటిని కేటాయించారు. -
కనుల పండువగా ‘తొలి’ వేడుక
జిల్లాలో తొలిఏకాదశి (ఆషాఢశుద్ధ ఏకాదశి) వేడుకలను ఆదివారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదోనిలో రుక్మిణి , పాండురంగస్వాముల విగ్రహాలతో రథోత్సవం నిర్వహించారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన గురజాల రామలింగేశ్వర స్వామి క్షేత్రంలో క్షేత్రపాలకుడు శ్రీవేద నారాయణ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. కర్నూలులోని గీతా ప్రచార ధామంలో సంపూర్ణ భగవద్గీత పారాయణం జరిగింది. జిల్లాలో పలుచోట్ల భజన కార్యక్రమాలు నిర్వహించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు -
పెండింగ్లో ఉన్నవి ఇవీ..
● ఆసుపత్రిలో ఇన్పేషంట్ డిపార్ట్మెంట్ భవనం నిర్మాణం ప్రారంభమై వేగంగా పనులు జరుగుతుండగా రూ.60.5కోట్లు ఖర్చు అయితే అప్పట్లో రూ.42కోట్లు చెల్లించారు. ఇంకా రూ.18.5కోట్లు పెండింగ్లో ఉంది. ● లెక్చరర్ గ్యాలరీకి, ఎగ్జామినేషన్ హాలుకు పనులు జరుగుతుండగానే బిల్లులు చెల్లించారు. ప్రస్తుతం ఎగ్జామినేషన్ హాలు దాదాపుగా పనులు పూర్తయి కేవలం ప్యాచ్ వర్క్ పెండింగ్లో ఉంది. దీనిని పూర్తి చేయలేక ఏడాది కాలంగా దీనిని మూసి ఉంచారు. ● ఆగిపోయిన డ్రగ్ కంట్రోల్ భవనాన్ని పూర్తి చేయించేందుకు నిధులు మంజూరు చేయించారు. ఈ మేరకు దానికి కేవలం రూ.46లక్షలు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. 98 శాతం పనులు పూర్తయిన ఈ భవనం మిగిలిన పనులు పూర్తిగాకపోవడం వల్ల ప్రారంభం వాయిదా పడుతూ వస్తోంది. ● ప్రస్తుతం ఐపీడీకి రూ.18.5కోట్లు, లెక్చరర్ గ్యాలరీకి 2.95కోట్లు, ఎగ్జామినేషన్ హాలుకు రూ.79లక్షలు, డ్రగ్ కంట్రోల్ భవనంకు రూ.46లక్షలు కలిపి మొత్తం రూ.22 కోట్ల 70లక్షలు మాత్రమే బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. -
బాబూ.. హామీని మరిచారు!
కర్నూలు(అర్బన్): తాము అధికారంలోకి వస్తే ఏకలవ్యుని జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మరిచారని ఎరుకలి హక్కుల పోరాట సమితి నేతలు విమర్శించారు. విలువిద్యలో ఏకలవ్యుని జీవితం నేటి యువతరానికి ఆదర్శమని, ఆయన జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. ఆదివారం ఏకలవ్యుని జయంతి సందర్భంగా స్థానిక వైహెచ్పీఎస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎరుకల రాజు, గౌరవాధ్యక్షులు ఎరుకలి కుమార్, మాజీ కార్పొరేటర్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి రోజున ఎరుకల ఆరాధ్య దైవమైన ఏకలవ్యుని జయంతి వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా అధ్యక్షులు ఎరుకలి హరి, ఏకలవ్య యూత్ జిల్లా అధ్యక్షులు ఎరుకల గోపి, ఎస్టీఎఫ్ జిల్లా అధ్యక్షులు కుశలన్న, హరి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఏకలవ్యుని జయంతిని అధికారికంగా నిర్వహించాలి -
తల్లిదండ్రులు మందలించారని విద్యార్థి బలవన్మరణం
ఆలూరు రూరల్: కురువళ్లి గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి విజేంద్ర (15) పొలంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ మహబూబ్ బాషా తెలిపిన వివరాల మేరకు.. కురువళ్లి గ్రామానికి చెందిన హనుమంతప్ప, అంపమ్మ దంపతుల కుమారుడు విజేంద్ర (15) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదవుతున్నాడు. సరిగా చదువుకోకుండా అల్లరిగా తిరుగుతున్నావని తల్లిదండ్రులు మందలించడంతో జూన్ నెల 29వ తేదీ ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. తల్లిదండ్రులు ఈ నెల 2వ తేదీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. కురువళ్లి గ్రామ సమీప పొలాల్లోని చెట్టుకు ఉరివేసుకుని వారం రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి చుట్టు పక్క పొలాల రైతులకు ఆదివారం కనిపించడంతో తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఎస్ఐ మహబూబ్ బాషా సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
దుకాణంలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్
కొలిమిగుండ్ల: కనకాద్రిపల్లె అయ్యప్ప స్వామి ఆలయం సమీపంలోని ప్రధాన రహదారి పక్కనే ఉన్న దుకాణంలోకి ఆదివారం ట్రాక్టర్ దూసుకెళ్లింది. వివరాలిలా ఉన్నాయి..తాడిపత్రి నుంచి ఇటుకల లోడుతో ట్రాక్టర్ కొలిమిగుండ్ల వైపు బయలు దేరింది. మార్గమధ్యలో కనకాద్రిపల్లె వద్దకు చేరుకోగానే ట్రాక్టర్ పెద్ద టైర్ పగిలి అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న దుకాణంలోకి దూసుకెళ్లింది. ప్రమాదాన్ని పసిగట్టిన దుకాణం యజమాని కిట్టు బయటకు పరుగు పెట్టడంతో ప్రమాదం తప్పింది. టైర్ పేలిన సమయంలో ఎదురుగా వాహనాలు రాక పోవడంతో ఓరకంగా ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు. కృష్ణ జింక మృతి ఆళ్లగడ్డ: బత్తలూరు వద్ద ఆదివారం ఓ కృష్ణ జింక మృతి చెందింది. విషయం తెలుసుకున్న రుద్రవరం రేంజి అధికారులు అక్కడికి చేరుకుని జింక కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేంజ్ అధికారి మూర్తుజా అదేశాల మేరకు.. డాగ్స్క్వాడ్ ఫారెస్టర్ ఖాన్, ఎఫ్బీఓ సురేంద్ర ఇరువురు కలిసి రుద్రవరం మండలం ఎర్రగుడిదిన్నె పశువైద్యాధికారి మనోరంజన్ ప్రతాప్తో పోస్టుమార్టం నిర్వహించారు. మృతి చెందిన జింకపై ఎలాంటి గాయాలు లేవని, గ్రామ సమీపంలోకి రావడంతో వీధికుక్కలు వెంబడించి ఉంటా య ని, ఆ భయంతోనే జింక మృతి చెంది ఉంటుందని నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం జింక కళేబరాన్ని దహనం చేశారు. యువకుడిపై హత్యాయత్నం కేసు ఆదోని రూరల్: మండలంలోని జాలిమంచి గ్రామానికి చెందిన వీరేష్పై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు పెద్దతుంబళం ఎస్ఐ మహేష్కుమార్ ఆదివారం తెలిపారు. గ్రామంలోని ఒక మహిళను యువకుడు వీరేష్ లైంగికంగా వేధించేశాడని, మహిళ ప్రతిఘటించడంతో హత్య చేసేందుకు పూనుకున్నాడన్నారు. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. విద్యుదాఘాతంతో యువకుడి మృతి ఆదోని రూరల్: మండలంలోని పెద్దతుంబళం గ్రామంలో బొడ్డ మహేష్(14) అనే యువకుడు ఇంటికి క్యూరింగ్ చేస్తుండగా విద్యుత్షాక్కు గురై మృతిచెందాడు. మృతుని తండ్రి బుడ్డ హనుమంతు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నా యి. ఇంటికి నీటిని కూలింగ్ చేస్తుండగా విద్యుత్ మోటార్ ద్వారా షాక్కు గురై మృతిచెందాడన్నారు. తనకు ముగ్గురు కుమారులు ఉండగా, పెద్ద కుమారుడు మహేష్ విద్యుత్ ప్రమాదంలో మరణించాడని బోరున విలపించాడు. కలప దుకాణంలో అగ్ని ప్రమాదం వెలుగోడు: పట్టణంలోని ఓ కలప దుకాణంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి 11 గంటల సమయంలో విద్యుత్ షార్ట్సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో దుకాణంలో విలువైన టేకు కలప, ఫర్నిచర్, పరికరాలు, షెడ్డు పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికులు గమనించి ఫైర్ స్టేషన్కు సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో రూ. 16 లక్షల ఆస్తినష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని దుకా ణ యజమాని జయరాజ్ తెలిపారు. -
విద్యతోనే అన్ని రంగాల్లో అభివృద్ధి
కర్నూలు(అర్బన్): విద్యతోనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు అవకాశాలు ఏర్పడతాయని పలువురు బ్రాహ్మణ నేతలు, అధికారులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక సంకల్బాగ్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో 10వ తరగతి, ఇంటర్మీడియట్లో 90 శాతానికి పైగా మార్కులు సాధించిన బ్రాహ్మణ విద్యార్థులను ప్రోత్సహించేందుకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సండేల్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వినియోగదారుల కోర్టు జడ్జి కే కిషోర్కుమార్, అఖిల భారతీయ బ్రాహ్మణ కరివేన నిత్యాన్నదాన సత్రం ప్రధాన కార్యదర్శి డా.వేణుగోపాల్, కే రంగనాథశర్మ, కేవీ సుబ్బారావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బ్రాహ్మణ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. ఈ సందర్భంగా అర్హత కలిగిన విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 4 వేలు నగదు, జ్ఞాపికతో పాటు శాలువా కప్పి సన్మానించా రు. సంఘం గౌరవాధ్యక్షులు చెరువు దుర్గాప్రసాద్, కార్యదర్శి చల్లా నాగరాజశర్మ, ఉపాధ్యక్షులు కంచుగంటల శ్యాంసుందర్, కోశాధికారి సీఎస్ ప్రసాదరావు, ఉప కార్యదర్శి నాగులవరం రాజశేఖర్, సలహాదారు రవిచంద్రశర్మ, నాయకులు మామిళ్లపల్లి రాజేష్, నాగేశ్వరరావు, శ్రీనివాసరాజు, ఫణి తదితరులు హాజరయ్యారు. -
ముగిసిన షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపిక
నంద్యాల(న్యూటౌన్): నంద్యాల పట్టణంలోని నందిపైప్స్ బ్యాడ్మింటన్ అకాడమీలో రెండు రోజులుగా జరుగుతున్న ఉమ్మడి జిల్లా స్థాయి షటిల్ బాడ్మింటన్ క్రీడాకారుల ఎంపిక పోటీలు ఆదివారం ముగిశాయి. విజేతలకు నందిగ్రూప్ ఆఫ్ అధినేత సుజల బహుమతులు అందజేశారు. ఉమ్మడి జిల్లా నుంచి 300 మందికి పైగా బాల,బాలికలు పాల్గొన్నట్లు ఏపీ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యాక్షులు వంశీధర్ తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఆగస్టులో 5వ తేదీ నుంచి విశాఖపట్నంలో అండర్ –19 పోటీలు, ఆగస్టులో 21 నుంచి నెల్లూరులో అండర్ –15 పోటీలు, అక్టోబర్ 1 నుంచి నుంచి అనంతపురంలో అండర్ –17 పోటీలు, అక్టోబర్ 23 నుంచి ఒంగోలులో అండర్ –13 పోటీలు, నవంబర్ 1 నుంచి కడపలో అండర్ –11 పోటీలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో అసోయేషన్ సభ్యులు శేషిరెడ్డి, సంజీవరెడ్డి, డాక్టర్ జనార్ధన్రెడ్డి, కోచ్లు నాగార్జున, చైతన్య తదితరులు పాల్గొన్నారు. -
పీర్లను దర్శించుకునేందుకు వెళ్తూ..
డోన్ టౌన్: సొంతూరులో నెలకొల్పిన పీర్లను దర్శించుకునేందుకు వెళ్తున్న వ్యక్తి ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. డోన్ పట్టణం ఇందిరానగర్లో నివాసముంటున్న ఇమామ్బాషా(34) సొంతూరు కొత్తబురుజు గ్రామం. డోన్ కంభాలపాడు సర్కిల్ వద్ద ఉన్న ఈద్గా మజీద్ ప్రాంతంలో బండిపై తినుబండారులు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. సొంతూరులో మొహర్రం సందర్భంగా నెలకొల్పిన పీర్లకు మొక్కులు చెల్లించేందుకు ఆదివారం బైక్పై బయలుదేరాడు. మార్గమధ్యలో యు.కొత్తపల్లె వద్ద ఉన్న భారత్దాబా ఎదురుగా జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచి బెంగుళూరు వైపు వెళుతున్న లారీ బైకును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇమామ్బాషా తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య షమీనా, ఇద్దరు కుమారులు ఉన్నారు. సంఘటనా స్థలానికి టౌన్ ఎస్ఐ శరత్కుమార్రెడ్డి చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేశారు. -
టీడీపీ కార్యాలయానికి తాళం
● టీడీపీ ఆలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ తేలేవరకు ఇంతే! ఆలూరు: అధికార పార్టీలో అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. ఆలూరులోని టీడీపీ కార్యాలయానికి తాళం వేసే వరకు వచ్చాయి. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ తేలేవరకు ఇంతే సంగతులు అంటూ ఆ పార్టీ నాయకులే నిట్టూర్చుతున్నారు. టీడీపీ నియోజకవర్గం ఇన్చార్జ్గా కొనసాగుతున్న బి. వీరభద్రగౌడుపై ఆపార్టీ నాయకుల్లో వ్యతిరేకత ఉంది. ఆస్పరి మండలం కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో శనివారం ఉదయం నిర్వహించిన తొలి అడుగు కార్యక్రమానికి కర్నూలు ఎంపీ బస్తిపాడు నాగరాజు, ఆలూరు టీడీపీ పరిశీలకులు పూల నాగరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ వీరభద్ర గౌడ్ అనుచరులు సమావేశాన్ని అడ్డుకున్నారు. ‘నియోజకవర్గ ఇన్చార్జ్ లేకుండా ఇక్కడ మీ పెత్తనం ఏంటని’ అంటూ నిలదీశారు. అనంతరం ఆలూరులో తొలి అడు గు కార్యక్రమానికి హాజరైన తిక్కారెడ్డిని గౌడ్ అనుచరుల అడ్డుకున్నారు. ఇన్చార్జి లేకుండా సమావేశం నిర్వహిస్తే ఒప్పుకునేది లేదని వేదిక ముందు బైఠాయించారు. తిక్కారెడ్డి డౌన్..డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలోనే అప్పటికప్పుడు అధిష్టానంతో మాట్లాడి ఆలూరు సమావేశంలోనే ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిగా వీరభద్రగౌడ్ను తొలగిస్తున్నట్లుగా ప్రకటించారు. దీంతో ఆదివారం ఆలూరు టీడీపీ ఆఫీసుకు తాళం వేసి నిరసన తెలిపారు. -
నేటి నుంచి పీజీ, బీటెక్ సెమిస్టర్ పరీక్షలు
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో సోమవారం నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీటెక్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. పీజీ నాల్గవ సెమిస్టర్ పరీక్షలు సోమవారం నుంచి ఈనెల 28వ తేదీ వరకు వర్సిటీ కళాశాల కేంద్రంలో జరుగుతాయన్నారు. 452 మంది రెగ్యులర్, 44 మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయనున్నట్లు పేర్కొన్నారు. బీటెక్ 4,6 సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ, 3,5,7 సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 31వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. 360 మంది రెగ్యులర్, 325 మంది సప్లిమెంటరీ పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. 8న పత్తికొండలో వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం తుగ్గలి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు పత్తికొండ నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం ఈనెల 8వ తేదీన ఉదయం 10 గంటలకు గోపాల్ప్లాజా మందిరంలో నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు జిట్టా నాగేష్ యాదవ్, మండల అధ్యక్షుడు అట్ల గోపాల్రెడ్డి ఆదివారం తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అధ్యక్షతన నిర్వహించనున్న సమావేశంలో ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’ క్యూ ఆర్ కోడ్ ద్వారా డాక్యుమెంటరీ విడుదల చేయనున్నట్లు చెప్పారు. సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి, పార్లమెంట్ పరిశీలకులు గంగుల ప్రభాకరరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవుతారన్నారు. నియోజకవర్గంలోని పార్టీ నేతలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, అభిమానులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. బ్రహ్మగుండంలో సినిమా షూటింగ్ వెల్దుర్తి: పట్టణ సమీపంలోని కామేశ్వరీదేవి సమేత బ్రహ్మగుండం క్షేత్రంలో ఆదివారం సినిమా షూటింగ్ జరిగింది. ఆర్ఎస్ క్రియేషన్స్ సమర్పణలో వెల్దుర్తికి చెందిన రోబో సుధాకర్ దర్శకత్వంలో, దివాన్ వలి రచయితగా లద్దగిరి శివ హీరోగా, ముంబై చెందిన తేజల్ హీరోయిన్గా నటిస్తున్న ‘ఉంటే ఇలాగే ఉండాలి’ సినిమా గత 15 రోజులుగా ఓర్వకల్లు మండంలం చింతలపల్లిలో చిత్రీకరణ జరుగుతోంది. సినిమా సన్నివేశాల్లో భాగంగా హీరో, హీరోయిన్ల పెళ్లి సనివేశాన్ని దర్శకుడు ఆదివారం బ్రహ్మగుండం క్షేత్రంలో చిత్రీకరించారు. పెళ్లి సన్నివేశాల్లో మ్యాడ్ సినిమాలోని ఓ హీరోయిన్ సునీతా మనోహర్, సీరియల్ నటి స్వప్న జబ్బర్దస్త్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. శిలాఫలకాల ధ్వంసం నంద్యాల(అర్బన్): నంద్యాల మండలం మిట్నాల గ్రామ సమీపంలో ఏర్పాటైన జగనన్న పాల వెల్లువ మహిళా డెయిరీ సహకార సంఘం భవనం ఏర్పాటు శిలా ఫలకం, మిట్నాల నుంచి గోస్పాడు మండలం జూలెపల్లె వరకు ఏర్పాటైన నిధులకు సంబంధించిన శిలాఫలకాలను ఆదివారం దుండగులు ధ్వంసం చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో రూ. 17.50 లక్షలతో ఏర్పాటైన పాల వెల్లువ శిలాఫలకం, రూ.1.25 కోట్లు పంచాయితీ రాజ్ నిధులతో ఏర్పాటైన బీటీ రోడ్డు శిలాఫలకాలను మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ప్రారంభించారు. శిలాఫలకాల ధ్వంసం వెనుక ‘కూటమి’ నేతల హస్తం ఉంటుందని స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు తిరుపతిరెడ్డి, గోపాల్రెడ్డిలు ఆరోపిస్తున్నారు. పోలీనులు పూర్తిస్థాయి విచారణ జరిపి ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని వారు కోరుతున్నారు. -
శాస్త్రోక్తంగా తొలి ఏకాదశి పూజలు
ఆళ్లగడ్డ: ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో తొలి ఏకాదశిని పురస్కరించుకుని ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున మూలమూర్తులను సుప్రభాతసేవతో మేలుకొలిపి దివ్యదర్శనం అనంతరం నిత్యపూజ లు నిర్వహించారు. ఉత్సవ మూర్తులైన శ్రీదేవి, భూదే వి సమేత ప్రహ్లాదవరద స్వాములను ఆలయ ముఖద్వార మండపంలో కొలువుంచి పంచామృతాలతో అభిషేకించి మంగళవాయిద్యాల మధ్య దూపదీపాలతో మహా మంగళహారతి అందించారు. రాత్రి విశేష అలంకరణలో స్వామి, అమ్మవార్లు పల్లకీలో కొలువుదీరి తిరువీధిలో విహరించారు. -
శ్రీశైలం పదో నంబర్ గేట్ వద్ద భారీగా వాటర్ లీకేజీ
సాక్షి, నంద్యాల: శ్రీశైలం జలాశయం పదో నంబర్ గేట్ వద్ద భారీగా వాటర్ లీకేజీ అవుతోంది. గత నెలలో ఈ గేటు వద్ద మరమ్మతులు నిర్వహించినప్పటికీ భారీగా నీరు లీకేజీ కావడం గమనార్హం. జలాశయం అధికారుల నిర్లక్ష్యంతోనే ఇలా లీకేజీ జరుగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు.వివరాల ప్రకారం.. శ్రీశైలం జలాశయం పదో నంబర్ గేట్ వద్ద గత నెలలో అధికారులు రబ్బర్ సీల్స్ మార్చారు. వాటర్ లీకేజీ కారణంగా మరమ్మతులు నిర్వహించారు. దీని కోసం ప్రభుత్వం.. సుమారు కోటి ముప్పై లక్షలు నిధులను కేటాయించింది. కానీ, తాజాగా మరోసారి అక్కడే వాటర్ లీకేజీ అవుతున్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో, నాసిరకంగా పనులు చేసినట్టు తెలుస్తోంది. లీకేజీ కావడంతో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఇక, జలాశయం అధికారుల నిర్లక్ష్యంతో ఇలా జరిగిందని పలువురు ఆరోపణలు చేస్తున్నారు.ఇదిలా ఉండగా.. శ్రీశైలం జలాశయానికి భారీ స్థాయిలో వరద కొనసాగుతోంది. జూరాల నుండి 1,09,277 క్యూసెక్కులు నీటి ప్రవాహం శ్రీశైల జలాశయానికి వచ్చి చేరుతోంది. సుంకేసుల నుండి 61,931 క్యూసెక్కులు నీరు వస్తోంది. ప్రస్తుతానికి శ్రీశైలం జలాశయానికి ఇన్ ఫ్లో 1,71,208 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 67,399 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 878.40 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు.. ప్రస్తుతం :179.8995 టీఎంసీలుగా ఉంది. కుడి గట్టు, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. జలాశయం గరిష్ట స్థాయికి చేరువలో ఉండటంతో గేట్లు ఎత్తే అవకాశం ఉంది. -
డాక్టర్ల వద్దకే మెడికల్ రిజిస్ట్రేషన్
కర్నూలు(హాస్పిటల్): రాష్ట్రంలో ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలులో భాగంగా కర్నూలు మెడికల్ కాలేజీలో డాక్టర్ల వద్దకే మెడికల్ రిజిస్ట్రేషన్లు తీసుకొచ్చినట్లు రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఏపీ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో కళాశాలలోని మెడికల్ ఎడ్యుకేషన్ యూనిట్లో రెండు రోజుల పాటు నిర్వహించే వైద్యుల సర్టిఫికెట్ల రెన్యువల్స్ను మంత్రి టీజీ భరత్ శనివారం ప్రారంభించారు. అనంతరం వైరాలజీ ల్యాబోరేటరీ(వీఆర్డీఎల్)కు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ సర్టిఫికెట్ల రిజిస్ట్రేషన్లో ఉన్న ఇబ్బందులను గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. గతంలో వైద్యులు రెండు, మూడు రోజులు సమయం కేటాయించి మెడికల్ సర్టిఫికెట్ల రిజిస్ట్రేషన్ చేసుకునే వారని, ఇప్పుడు వారి చెంతకే రిజిస్ట్రేషన్ ప్రక్రియ రావడం వల్ల గంటల్లో పని పూర్తవుతుందన్నారు. వీఆర్డీఎల్ భవనాన్ని త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ శ్రీహరిరావు, ఆదోని ఎమ్మెల్యే పార్థసారఽథి, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ, ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
14 మండలాల్లో వర్షాలు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలోని 14 మండలాల్లో శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. జిల్లా మొత్తంగా 6.5 మి.మీ వర్షపాతం నమోదైంది. కౌతాళంలో 38.2 మి.మీ, కోసిగిలో 34.2, ఎమ్మిగనూరులో 27.8, నందవరంలో 17.8, సి.బెళగల్లో 13.6, పెద్దకడుబూరులో 12.2, కోడుమూరులో 8.2, మంత్రాలయంలో 7.8 మిమీ ప్రకారం వర్షాలు కురిశాయి. జూలై నెల సాధారణ వర్షపాతం 90.7 మి.మీ ఉండగా.. మొదటి ఐదు రోజుల్లో 14.6 మి.మీ వర్షపాతం నమోదైంది. కాగా రానున్న నాలుగు రోజుల్లో వివిధ మండలాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. తెలుగుగంగ కాలువలకు గండ్లు ● పట్టించుకోని ప్రభుత్వం ● సొంత నిధులు వెచ్చించి గండ్లు పూడ్చేందుకు యత్నిస్తున్న రైతులు రుద్రవరం: మండల పరిధిలోని శ్రీరంగాపురం వద్ద 16వ బ్లాక్ ఉప ప్రధాన కాలువలో రెండు చోట్లా గండ్లు పడ్డాయి. గత రబీ సీజన్లో కాలువకు సాగునీరు విడుదల చేయడంతో నీటి ప్రవాహ ఉధృతికి రెండు చోట్లా గండ్లు పడి నీరు వృథాగా పంటలపై పారింది. అప్పట్లో రైతులు గండ్లను పూడ్చాలని తెలుగుగంగ అధికారులను కోరినా రబీ అయిపోయాకా వేసవిలో గండ్లను పూడ్చివేస్తామని చెప్పారు. అయితే గత రబీ సీజన్ పూర్తయ్యింది. వేసవి ముగిసింది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కూడా మొదలైంది. కానీ నేటి వరకు కూటమి ప్రభుత్వం గండ్లను పూడ్చలేదు. దీంతో ప్రభుత్వంపై ఆశలు వదులుకున్న రైతులు.. సొంత ఖర్చులతో జేసీబీతో గండ్లను పూడ్చుకున్నారు. పంటలను కాపాడుకునేందుకు తప్పని పరిస్థితుల్లో సొంత నిధులతో గండ్లు పూడ్చుకుంటున్నామని రైతు మధు తెలిపారు. -
నేడు పెంపుడు కుక్కలకు యాంటీ రేబిస్ టీకాలు
కర్నూలు(అగ్రికల్చర్): జంతవుల నుంచి మనుష్యులకు, మనుష్యుల నుంచి జంతవులకు సంక్రమించే వాటిని జూనోసిస్ వ్యాధులుగా వ్యవహరిస్తారు. దాదాపు 280 వ్యాధులను పశువైద్యులు గుర్తించారు. 1885 జూలై 6న పిచ్చికుక్క కాటుకు గురైన బాలుడికి జూనోసిస్ వ్యాధి రాకుండా లూయిస్పాశ్చర్ అనే శాస్త్రవేత్త మొదటిసారిగా టీకా మందు వేసి విజయవంతమయ్యారు. అప్పటి నుంచి ఏటా జూలై 6న ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని జిల్లా పశుసంవర్ధకశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జి.శ్రీనివాస్ తెలిపారు. చికిత్సకన్నా–నివారణే మిన్న అనే సూత్రాన్ని పాటిస్తూ పెంపుడు జంతవులకు క్రమం తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు వేయించాలన్నారు. . జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం కర్నూలులోని బహుళార్ధ పశువైద్యశాలతో పాటు ఉమ్మడి జిల్లాలోని అన్ని ఏరియా వెటర్నరీ హాస్పిటల్స్లో పెంపుడు కుక్కలకు యాంటి రేబిస్ వ్యాక్సిన్ ఉచితంగా వేసే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు 36,610 డోసుల యాంటి రేబిస్ వ్యాక్సిన్ వచ్చిందని, ఇందులో కర్నూలు జిల్లాకు 13,000 డోసులు, నంద్యాల జిల్లాకు 20,700 సరఫరా అయిందని, మిగిలిన వ్యాక్సిన్ జిల్లా పశు వ్యాధి నిర్ధారణ కేంద్రంలో బఫర్లో ఉంటుందని తెలిపారు. వారం రోజుల పాటు టీకాలు వేయనున్నామని పెంపకం దారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. -
దిగువకు వే‘గంగా’..
ఉమ్మడి కర్నూలు జిల్లాలో వర్షం ఒకచోట కురిసి మరో చోట కనిపించడం లేదు. కర్ణాటక రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో తుంగభద్ర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. టీబీ డ్యాం నుంచి వదిలిన నీరు సుంకేసుల డ్యామ్కు భారీగా వచ్చి చేరుతోంది. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 1.235 టీఎంసీ కాగా పూర్తిస్థాయిలో నిండింది. అయితే వచ్చిన నీటిని కేసీ కెనాల్కు, కర్నూలు నగర ప్రజల తాగునీటి అవసరాలకు వదలకుండా దిగువకు వదిలేస్తున్నారు. ఇందుకోసం సుంకేసుల జలాశయం అన్ని గేట్లు ఎత్తేశారు. కేసీ కాల్వకు నీరు వస్తే పంటలు వేసుకోవాలని రైతులు ఎదురు చూస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో సాగుపై ఆశలు వదులుకున్నారు. –సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలుసుంకేసుల డ్యామ్ గేట్లు ఎత్తడంతో దిగువకు ప్రవహిస్తున్న వరద నీళ్లు -
అంబులెన్స్ బహూకరణ
మంత్రాలయం రూరల్: శ్రీ రాఘవేంద్ర స్వామి భక్తులు శ్రీ మఠం ఆసుపత్రి అంబులెన్స్ను బహూకరించారు. శనివారం స్థానిక మఠం ఆవరణలో అంబులెన్స్కు పీఠాధిపతి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు ఇచ్చారు. బెంగళూరు సాఫ్ట్వేర్ ఏజీ కంపెనీకి వారి సౌజన్యంతో భక్తులు రవీంద్రనాయక్, కృష్ణ పురోహిత్ శ్రీ మఠం ఆసుపత్రి సుజయేంద్ర ఆరోగ్యశాలకు అంబులెన్స్ను అప్పగించారు. భక్తులకు ఫలపూలమాంత్రక్షాంతలతో శ్రీమఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు ఆశీర్వచనం చేశారు. కార్యక్రమంలో ఆసుపత్రి కో ఆర్డినేటర్ విజేయేంద్ర రావు, మెడికల్ ఆఫీసర్ సుదేంద్ర పాల్గొన్నారు. -
వాస్తవ సమాచారంతో పల్లెల పురోగతి
కర్నూలు(అర్బన్): గ్రామ పంచాయతీలు అన్ని రంగాల్లో పురోగతి సాధించాలంటే క్షేత్ర స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక స్థితిగతులపై వాస్తవ సమాచారాన్ని అందించాల్సి ఉంటుందని జిల్లా పరిషత్ సీఈఓ జీ నాసరరెడ్డి అభిప్రాయపడ్డారు. ఏపీఎస్ఐఆర్డీ అండ్ పీఆర్ కమిషనర్ ఉత్తర్వుల మేరకు శనివారం స్థానిక జెడ్పీ ప్రాంగణంలోని డీపీఆర్సీ భవనంలో గ్రామీణాభివృద్ధికి సంబంధించిన అధికారులు, ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శులకు ‘పంచాయతీ పురోగతి సూచిక’పై ఒక టీఓటీ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమానికి జిల్లా పంచాయతీ అధికారి జీ భాస్కర్, డ్వామా, డీఆర్డీఏ, ఐసీడీఎస్ పీడీలు వెంకటరమణయ్య, రమణారెడ్డి, పీ నిర్మల, పీఆర్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈలు వీ రామచంద్రారెడ్డి, బీ నాగేశ్వరరావు, డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ శాంతికళ, వ్యవసాయ శాఖ ఏడీ సాలురెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహిస్తున్న అధికారులు గ్రామాల పురోగతిపై పూర్తి స్థాయి సమాచారం పంపాలన్నారు. జిల్లా పంచాయతీ అధికారి జీ భాస్కర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం, జల జీవన్ మిషన్ వంటి పథకాలు పూర్తి స్థాయిలో వినియోగించబడితే వీటి ప్రభావం ప్రజల ఆర్థికపరమైన, సామాజిక స్థాయిని పెంపొందించే అవకాశం ఉంటుందన్నారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని మండల స్థాయిల్లో జరిగే శిక్షణా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత క్షేత్ర స్థాయిలో పంచాయతీ పురోగతి సూచిక వివరాలను పొందుపరచాలన్నారు. శిక్షణా కార్యక్రమంలో డీపీఆర్సీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ మంజులావాణి, ట్రైనింగ్ మేనేజర్ గిడ్డేష్, టీఓటీలు ఆస్రఫ్ బాషా, పీ జగన్నాథం, కే జ్యోతి తదితరులు పాల్గొన్నారు. జెడ్పీ సీఈఓ జీ నాసరరెడ్డి -
దివిటీల వెలుగులో పీర్ల ఊరేగింపు
కోవెలకుంట్ల: పట్టణంలోని బసిరెడ్డిబావి వీధిలో కొలువుదీరిన హజరత్ అబ్బాస్ పీరును శుక్రవారం అర్ధరాత్రి దివిటీల వెలుగులో ఘనంగా ఊరేగించారు. ఖర్భలా మైదానంలో యజీర్రాజుతో జరిగిన యుద్ధంలో మహమ్మద్ ప్రవక్త మనువడు ఇమాం ఉశేన్తోపాటు ఆయన కుటుంబ సభ్యుడు హజరత్ అబ్బాస్ మృతిచెందగా ఆయనను స్మరించుకుంటూ ఏటా మొహర్రం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మధ్య సరిగెత్తును పురస్కరించుకుని అర్ధరాత్రి వెయ్యి దివిటీల వెలుగులో హజరత్ అబ్బాస్ పీరును పురవీధుల గుండా ఊరేగించారు. కోవెలకుంట్ల, బనగానపల్లె, ఆళ్లగడ్డ తదితర ప్రాంతాల షియా మతస్తులు మాతం నిర్వహిస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు. హాజరత్ అబ్బాస్ పీరుకు భక్తులు ప్రత్యేక ఫతేహాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఘనంగా పెద్ద సరిగెత్తు బనగానపల్లె నియోజకవర్గంలో శనివారం పెద్దసరిగెత్తును ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని చిన్నబార్ ఇమాం, పెద్దబార్ ఇమాం, రంగరాజుపేట, బాబానగర్, జెండామాను వీధి, గుద్దేటి వీధి తదితర ప్రాంతాల్లోని చావిళ్లలో కొలువుదీరిన ఇమాంకాశీం, బీబీఫాతిమా, అజరత్ అలీ అక్బర్, దస్తగిరిస్వామి, మస్తాన్వలి, ఉద్దండ ఇమాంకాశీం పీర్లకు భక్తులు పూలదట్టీలు సమర్పించి మొక్కులు తీర్చున్నారు. ఆయా చావిళ్ల ఎదుట అగ్ని గుండాల చుట్టూ ప్రదక్షిణలు చేసి ఫతేహాలు నిర్వహించారు. ఆదివారం పీర్ల నిమజ్జనంతో మొహ్రరం ముగియనుంది. మాతం నిర్వహించిన షియా మతస్తులు ఘనంగా పెద్ద సరిగెత్తు -
సత్వర న్యాయమే లోక్ అదాలత్ లక్ష్యం
12,558 కేసుల పరిష్కారంకర్నూలు(సెంట్రల్): కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే లోక్ అదాలత్ లక్ష్యమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి అన్నారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎప్పటినుంచో పరిష్కారానికి నోచుకోని భూసేకరణ కేసుల్లో నష్టపరిహారం చెక్కులను ఈ సందర్భంగా అందజేశారు. ఈ సంవత్సరంలో రెండోసారి జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎల్వీ శేషాద్రి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 16 బెంచీలు ఏర్పాటు చేసి 12,558 కేసులు పరిష్కరించామన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి చొరవతో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందిందన్నారు. కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జిలు కమలాదేవి, వాసు, శ్రీవిద్య, అదనపు సబ్ జడ్జి దివాకర్, జూనియర్ సివిల్ జడ్జి సరోజనమ్మ, బార్ అసోసియేషన్ కార్యదర్శి వెంకటేశ్వర్లు, పోలీస్, బ్యాంకు, ఇన్సూరెన్స్ అధికారులు, కక్షిదారులు పాల్గొన్నారు. -
ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ పోరాటం
కల్లూరు: ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ పోరాటం చేస్తోందని ఆ పార్టీ నంద్యాల, కర్నూలు జిల్లాల అధ్యక్షులు కాటసాని రాంభూపాల్రెడ్డి, ఎస్వీ మోహన్రెడ్డి అన్నారు. కర్నూలు నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో శనివారం సాయంత్రం పాణ్యం నియోజకవర్గ స్థాయి విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘బూబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ’ పోస్టర్లను ఆవిష్కరించారు. చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ ‘క్యూఆర్ ’ కోడ్ను స్కాన్ చేస్తే ప్రతి కుటుంబం ఏడాది కాలంలో ఎంత నష్టపోయిందో తెలుస్తుందన్నారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ (పార్టీ నంద్యాల పార్లమెంటరీ పరిశీలకులు ) కల్పలత రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, నగర మేయర్ బీవై రామయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ‘సూపర్’ మోసం కాటసాని రాంభూపాల్రెడ్డి మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ హామీల పేరుతో ప్రజలను టీడీపీ అధినేత చంద్రబాబు మోసం చేశారన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది తర్వాత తల్లికి వందం పథకం ఇచ్చారని, అది కూడా అందరికీ అందలేదన్నారు. ఉచిత బస్సు, నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, అన్నదాత సుఖీభవ పథకాలు మరచిపోయారన్నారు. ‘రెడ్బుక్’ పేరుతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. గ్రీన్కో ప్రాజెక్టును పూర్తి చేసిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి, తనకు దుక్కుతుందన్నారు. గ్రీన్కో ప్రాజెక్టు భారతదేశంలో ప్రథమ స్థానంలో ఉందన్నారు. ‘స్థానిక’ ఎన్నికల్లో సత్తా చూపిద్దాం రాబోయే కాలంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు రానున్నాయని, అన్ని స్థానాల్లో విజయం సాధించి వైఎస్సార్సీపీ సత్తా చూపిద్దామని ఎస్వీ మోహన్రెడ్డి అన్నారు. ఏడాది కాలంలోనే కూటమి ప్రభుత్వం ప్రజల్లో వ్యతిరేకతను తెచ్చుకుందన్నారు. ‘కూటమి’ నేతల తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని, రాబోయే కాలంలో జగనన్న రాజ్యం వస్తుందని, ప్రజా సంక్షేమంతో పాటు నాయకులకు, కార్యకర్తలందరకీ న్యాయం జరుగుతుందన్నారు. మేనిఫెస్టోను మరచిపోయారు ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టోను టీడీపీ అధినేత చంద్రబాబు మరచిపోయారని ఎమ్మెల్సీ (నంద్యాల పార్లమెంటరీ పరిశీలకులు) కల్పలతరెడ్డి విమర్శించారు. 2014–2019 కాలంలో టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను వెబ్సైట్ను తీసివేసిందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చినా సుగాలిప్రీతి తల్లిదండ్రులకు న్యాయం జరగలేదన్నారు. జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి మాట్లాడుతూ.. శ్రీశైలం ప్రాజెక్టు నిండా నీళ్లు ఉన్నా హంద్రీనీవా కాలువకు, గోరుకల్లు రిజర్వాయర్కు నీళ్లు రాక రైతులు నష్టపోతున్నారన్నారు. మేయర్ బీవై రామయ్య మాట్లాడుతూ.. హామీలు అమలు చేయకుండా ఏడాది కాలంలో రాష్ట్ర ప్రజలకు రూ. 85 వేల కోట్లు మోసం చేశారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అంటే వెన్నపోటు, మోసం, అబద్ధాలు గుర్తుకు వస్తాయన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, ఎంపీపీలు, కల్లూరు అర్బన్ కార్పొరేటర్లు, వైఎస్సార్సీపీ వివిధ విభాగాల్లో పదవులు పొందిన వారు పాల్గొన్నారు. మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదు వైఎస్సార్సీపీ నంద్యాల, కర్నూలు జిల్లాల అధ్యక్షులు కాటసాని రాంభూపాల్రెడ్డి, ఎస్వీ మోహన్రెడ్డి -
అమ్మా వెళ్లొస్తా..!
కర్నూలు: ‘అమ్మా.. బాయ్.. బాయ్..’ అంటూ ఉదయం స్కూల్ బస్సులో వెళ్లిన చిన్నారి సాయంత్రం అదే బస్సులో తిరిగి వచ్చింది. బస్సులో బిడ్డను చూసి ఆ తల్లి కళ్లలో ఆనందం మెరిసింది. అయితే ఆ ఆనందం క్షణాల్లోనే మాయమైంది. కళ్ల ముందే బిడ్డపై బస్సు చక్రాలు వెళ్లడంతో ఆ తల్లి తల్లడిల్లింది. ఉదయం బడికెళ్తూ తన బిడ్డ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ గుండెలు బాదుకుంది. రక్తపుమడుగులో తడిసి విగతజీవిగా మారిన కుమార్తెను చూసి కన్నీరు మున్నీరుగా విలపించింది. బడి బస్సు ఆ చిన్నారి పాలిట మృత్యుశకటమైంది. ఈ విషాద ఘటన ఆళ్లగడ్డలో చోటు చేసుకుంది. పట్టణంలోని ఎంవీనగర్కు చెందిన శ్రీధర్, వనజ దంపతుల కూతురు హరిప్రియ (4) స్థానిక కీర్తన స్కూల్లో యూకేజీ చదువుతోంది. సోమవారం నుంచి స్కూల్కు వెళ్తుండగా రోజూ తండ్రి శ్రీధర్ వదిలి, తిరిగి తీసుకొచ్చేవారు. అయితే శుక్ర వారం నుంచి స్కూల్ బస్సులో పంపడం మొదలు పెట్టారు. స్కూల్ ముగించుకుని మొదటిసారిగా బస్సులో వస్తున్న కూతురుని దించుకుని ఇంటికి తీసుకెళ్లేందుకు సాయిబాబా గుడిదగ్గర తల్లి వనజ వేచి ఉంది. బస్సులో నుంచి అమ్మను చూసిన ఆ చిన్నారి ‘అమ్మా నేను దిగుతున్నా.. అని చెయ్యి ఊపుతూ’ ఇవతలి వైపున దిగింది. ఆ తర్వాత అవలి వైపున ఉన్న తల్లి దగ్గరకు వెళ్లేందుకు అడుగు ముందుకు వేసింది. అంతలోనే డ్రైవర్ బస్సు కదిలించడంతో చిన్నారి బస్సు చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. బిడ్డ మృతితో ఆ తల్లి రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. పట్టణ సీఐ యుగంధర్, ఎస్ఐ నగీన ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
డోన్ టౌన్: ఒకే కాలనీలో ఐదు డెంగీ కేసులు నమో దు అయ్యే వరకు ఏమి చేస్తున్నారు.. విధుల్లో నిర్ల క్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీఎంఅండ్హెచ్ఓ వెంకటరమణ వైద్య సిబ్బందిని హెచ్చరించారు. స్థానిక శ్రీనివాసనగర్లో డెంగీ కేసులు నమోదు కావడంతో శుక్రవారం ఆయన పట్టణంలో పర్యటించారు. ప్రజా ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. తరచూ కాలనీలో పర్యటిస్తూ ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రైడేను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. పలు కాలనీలో పారిశుద్ధ్యం లోపించడంతో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్తో మాట్లాడి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట మలేరియా ఇన్చార్జ్ సత్యనారాయణ, డాక్టర్ బాలాజీ మహర్షి, వైద్య సిబ్బంది మధుసూదన్, అనంద్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు ఉన్నారు. డీఎంఅండ్హెచ్ఓ వెంకటరమణ -
నేడు జాతీయ లోక్ అదాలత్
కర్నూలు (సెంట్రల్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో శనివారం జాతీయ లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎల్వీ శేషాద్రి తెలిపారు. సత్వర న్యాయం అందించాలనే ధ్యేయంతో ప్రతి మూడు నెలలకోసారి జాతీయ లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సంవత్సరం మార్చి తర్వాత శనివారం రెండోసారి జిల్లా లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 16 లోక్ అదాలత్ బెంచీలు ఏర్పాటు చేసి అధిక సంఖ్యలో కేసుల పరిష్కారం అయ్యే విధంగా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు న్యాయమూర్తులు వారివారి స్థానాల్లో ఉండి కేసుల పరిష్కారం చేస్తారన్నారు. అన్ని రకాల సివిల్, రాజీ కాగల క్రిమినల్, రోడ్డు ప్రమాద , చెక్ బౌన్స్, బ్యాంకు, మున్సిపల్ కేసులు, అలాగే భార్యాభర్తల వివాదాలు, ఇన్సూరెన్స్, ప్రభుత్వ సేవలకు సంబంధించిన కేసులను లోక్ అదాలత్లో పరిష్కారం చేస్తామని చెప్పారు. కక్షిదారులకు రాజీయే రాజమార్గమని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గడచిన సంవత్సర కాలం నుంచి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ది ఆధ్వర్యంలో ఐదుసార్లు జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించి వేలాది కేసుల పరిష్కారం చేసినట్లు ఆయన వివరించారు. -
నీటి వనరుల ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించండి
కర్నూలు(సెంట్రల్): హైకోర్టు ఆదేశాల మేరకు నీటి వనరుల ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించాలని అధికారులను జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆదోని, కోసిగి, సీ బెళగల్, కోడుమూరులో నీటి వనరుల స్థలాలు ఆక్రమణకు గురైనట్లు గుర్తించామన్నారు. ఇందుకు సంబంధించి హైకోర్టులో కేసులు ఉన్నాయని, ఎప్పటికప్పుడు నివేదికలు పంపాల్సి ఉంటుందన్నారు. ఆయా ప్రాంతాల్లో అక్రమణలపై తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేఽశించారు. నీటి వనరుల స్థలాల్లో తాత్కాలికంగా వేసే గుడిసెలను తొలగించాలన్నారు. కార్పొరేషన్, మునిసిపాలిటీలు, పంచాయతీల్లో నీటి వనరులున్న ప్రాంతాల్లో భవననిర్మాణలకు అనుమతులు ఇవ్వకూడదని డీపీఓ, మునిసిపల్కమిషనర్లను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదోని సబ్కలెక్టర్ మౌర్య భరద్వాజ్, పత్తికొండ ఆర్డీఓ భరత్ నాయక్, సమవేశంలో డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, కర్నూలు మునిసిపల్ కమిషనర్ రవీంద్రబాబు, కర్నూలు ఆర్డీఓ సందీప్కుమార్, సర్వే ఏడీ మునికన్నన్, తహసీల్దార్లు రవికుమార్, మేష్బాబు, వెంకటలక్ష్మీ పాల్గొన్నారు. అధికారులను ఆదేశించిన ఇన్చార్జ్ కలెక్టర్ బి.నవ్య -
పెద్దాసుపత్రిపై ‘పచ్చ’ రాబందు!
ఆదాయ వనరులపై దృష్టి ● కాంట్రాక్టులు మార్పు చేయాలని అధికారులపై ఒత్తిళ్లు ● సంబంధిత రికార్డులు ఇవ్వాలని ఆదేశాలు ● వివాదాస్పదంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధి తీరు ● ఇటీవల సెక్యూరిటీ కాంట్రాక్టు విషయంలో గొడవ సాక్షి టాస్క్ఫోర్స్: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ప్రధాన ఆదాయ వనరులపై ఓ ప్రజాప్రతినిధి కన్ను పడింది. ఆసుపత్రిలో ఆదాయం సమకూరే పనులన్నీ తమకే దక్కాలని ఆయన అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. వినకపోతే ఉన్నతాధికారులతో బెదిరింపులకు పాల్పడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ తంతు మొదలైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ముందుగా మూడు జనరిక్ మెడికల్ షాపులపై దృష్టి సారించారు. ఇందులో ఒకటి ఇప్పటికే టీడీపీ నేత కనుసన్నల్లో, మరో రెండు జిల్లా కలెక్టర్ ఆమోదంతో ప్రైవేటు సంస్థలు నిర్వహిస్తున్నాయి. ఈ మేరకు వాటి గడువు మరో రెండు, మూడేళ్లు ఉంది. అయినా సరే పాత అగ్రిమెంట్లను వెంటనే రద్దు చేసి తమకు ఇవ్వాలని ఓ ప్రజాప్రతినిధి ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఇలా చేయడం కుదరదని, ఏదైనా జరిగితే తాము కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నా సదరు ప్రజాప్రతినిధి పట్టించుకోని పరిస్థితి. ● దీంతో పాటు డైట్ కాంట్రాక్ట్, ఆరోగ్యశ్రీ డాక్యుమెంటేషన్, శానిటేషన్, సెక్యూరిటీ, పెస్ట్కంట్రోల్, లిక్విడ్ ఆక్సిజన్ కాంట్రాక్ట్లు ఎవరెవరికి ఇచ్చారు, ఎప్పటి నుంచి ఇచ్చారు.. ఇంకా ఎంత కాలం గడువు ఉంది, వాటి ద్వారా వచ్చే ఆదాయమెంత, ఇప్పటికిప్పుడు వాటిని తమ వారికి ఇవ్వలేరా అని ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ● ఇటీవలే సెక్యూరిటీ బాధ్యతలను ఈగల్ సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. దీనిని కూడా తమకు ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారని, కుదరకపోతే స్థానికులు కాని మీరు ఇక్కడ ఎలా పనిచేస్తారో చూస్తామని సదరు ఏజెన్సీ నిర్వాహకులను బెదిరించినట్లు విశ్వసనీయ సమాచారం. అందులో పనిచేసే వారంతా మా మనుషులే ఉండాలని కూడా హెచ్చరించినట్లు చర్చ జరుగుతోంది. ● లిక్విడ్ ఆక్సిజన్కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా టెండర్ దక్కించుకున్న సంస్థ కొన్నేళ్లుగా ఆసుపత్రికి లిక్విడ్ ఆక్సిజన్ను సరఫరా చేస్తోంది. ఎలాగైనా ఆ పనిని తమ వారికి ఇప్పించాలని స దరు నేత ఉన్నతాధికారులతో పాటు, ఆసుపత్రి అధికారులపైనా ఒత్తిళ్లు తెస్తున్నట్లు సమాచారం. ● కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైనా ప్రజాప్రతినిదులు వారి నిధుల్లో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, పైగా ఆసుపత్రిలోని ఆదాయ వనరులు తమ వారికే కావాలని ఎలా చెబుతారని, ప్రజాప్రతినిధులుగా వారికి ఆ మాత్రం బాధ్యత లేదా అని వైద్యులు చర్చించుకుంటున్నారు. ● ఇప్పటికే గతంలో ఓ నేత ఆసుపత్రి భవనాలపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెళ్ల కారణంగా భవనం చాలా చోట్ల పెచ్చులు ఊడిపోతోందని, ఈ కారణంగా పలు ఆపరేషన్ థియేటర్లు మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని.. ఆపరేషన్లు సైతం వాయిదా పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
కర్నూలు: మొహర్రం వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. గ్రామ పెద్దలు చిన్నాపెద్ద తేడా లేకుండా ఉత్తేజభరితంగా జరుపుకునే మొహర్రం వేడుకలలో అల్లర్లకు తావు ఉండరాదని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అందరూ సోదరభావంతో మొహర్రం వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. చట్ట విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు. మొహర్రం వేడుకలను దృష్టిలో పెట్టుకుని గ్రా మాల్లో ముందస్తు భద్రత ఏర్పాట్లు చేపట్టాలని పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. ఇంటర్ ఎస్సీ విద్యార్థులకు పోస్టల్ ఖాతాలు తప్పనిసరి కర్నూలు(అర్బన్): ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎస్సీ విద్యార్థులచే పోస్టల్ ఖాతాలను తెరిపించాలని జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారిణి బి.రాధిక తెలిపారు. తల్లికి వందనం 2వ విడత నిధులు విడుదలవుతున్న దృష్ట్యా సహాయ సంక్షేమాధికారులు, కళాశాల కోఆర్డినేటర్స్, వసతి గృహ సంక్షేమాధికారులు, గ్రామ/వార్డు సచివాలయాల్లోని వెల్ఫేర్ అసిస్టెంట్లు తమ పరిధిలో అర్హత కలిగిన ఎస్సీ మొదటి సంవత్సరం ఇంటర్ చదువుతున్న విద్యార్థులను గుర్తించి వారి పోస్టల్ ఖాతాల ఆధార్ నెంబర్లకు ఎన్పీసీఐ లింకు చేయించాలన్నారు. ఇప్పటికే ఖాతాలు ఓపెన్ చేసిన వారు ఎన్పీసీఐ లింకును పరిశీలించుకోవాలన్నారు. అలాగే 9, 10వ తరగతికి సంబంధించి ఇంకా 98 మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలకు ఎన్పీసీఐ పెండింగ్లో ఉందన్నారు. 257 మంది ఇంటర్ విద్యార్థుల మ్యాపింగ్ కూడా పెండింగ్లో ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 8లోగా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ చర్యలు చేపట్టాలన్నారు. ఇక ఇంటి నుంచే తపాలా సేవలు●● కర్నూలు డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ జీ జనార్దన్రెడ్డి కర్నూలు(అర్బన్): అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీ 2.0 తో అనేక రకాల సేవలను ఇంట్లోను, సెల్ఫోన్ల నుంచి పొందే సౌలభ్యాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కర్నూలు పోస్టల్ సూపరింటెండెంట్ జీ జనార్దన్రెడ్డి తెలిపారు. ఈ రకమైన సేవలను అమలు చేసేందుకు రాష్ట్రంలోని మచిలీపట్నం, విజయనగరంతో పాటు కర్నూలు డివిజన్ ఎంపికై ందన్నారు. శుక్రవారం స్థానిక హెడ్ పోస్టాఫీసులోని తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీ 2.0ను ఈ నెల 8తేదీన కర్నూలు డివిజన్ పరిధిలోని 242 పోస్టాఫీసుల్లో అమలు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఈ సేవలను ప్రారంభించేందుకు వీలుగా ఈ నెల 7వ తేదీన కర్నూలు హెడ్ పోస్టాఫీసుతో పాటు డివిజన్లోని 37 సబ్ పోస్టాఫీసులు, 204 బ్రాంచ్ పోస్టాఫీసుల్లో ఎలాంటి లావాదేవీలు నిర్వహించబోమన్నారు. అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీ 2.0ను సజావుగా, సమర్థవంతంగా ప్రజల్లోకి వెళ్తుందని నిర్ధారించుకునేందుకు తాత్కాలికంగా 7వ తేదీన అన్ని రకాల సేవలను నిలిపి వేస్తున్నట్లు తెలిపారు. వేగవంతమైన సర్వీస్ డెలివరీ, కస్టమర్కు స్నేహ పూర్వక సేవలు అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. పెరిగిపోతున్న సాంకేతికతకు అనుగుణంగా పోస్టల్ శాఖలో కూడా వినూత్నమైన సాంకేతిక పరిజ్ఞానంతో అనేక రకాల సేవలను అందించేందకు ‘ డాక్ సేవా ’ యాప్ కూడా అమల్లో ఉందన్నారు. జిల్లాలోని ఆదోని డివిజన్లో 192 పోస్టాఫీసులు ఉన్నాయని, అక్కడ ఈ నెల 22వ తేదీన ఏపీటీ 2.0 ప్రారంభం కానుందన్నారు. -
రోడ్లన్నీ జలమయం
కోసిగి: మండలంలో శుక్రవారం సాయంత్రం ఒక గంట పాటు ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. కోసిగిలోని పంచాయతీ కార్యాలయం, సబ్రిజిస్ట్రార్ కార్యాలయం ముందు భాగంలోని ప్రధాన రోడ్డులో, ఆర్టీసీ బస్టాండ్లో వర్షపు నీరు నిల్వ ఉండి రాకపోకలకు ఇబ్బండి పడ్డారు. అలాగే రైల్వే గేటు సమీపంలోని ఉరుకుంద ఆర్చ్ వద్ద ఉత్తుత్తి వాగు పొంగి పొర్లడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కోసిగి ప్రధాన రోడ్డులో వర్షపు నీరు నిల్వ ఉండకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు, వాహనదారులు కోరారు. -
ఆర్యూలో పరీక్షలంటేనే హడల్!
● ఆర్గానిక్ కెమిస్ట్రీలో 2వ సెమిస్టర్లో 10 మంది విద్యార్థులు ఫెయిల్ ● 3వ సెమిస్టర్లో అదే 10 మందితో పాటు మరో ఇద్దరు విద్యార్థులు ఫెయిల్ ● వీరందరికీ మొదటి సెమిస్టర్లో 8 పాయింట్స్ పైనే మార్కులు కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీలో పరీక్షలంటేనే హడలెత్తాల్సిన పరిస్థితి దాపురించింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ఒక సబ్జెక్టులో 90 శాతానికి పైగా ఉత్తీర్ణత శాతం ఉంటే మరో సబ్జెక్టులో 50 శాతం కూడా దాటదు. మెరిట్ విద్యార్థులు సైతం ఫెయిల్ కా వడం పరిపాటిగా మారడం లాంటి వింత పరిస్థితులు నిత్యకృత్యంగా మారాయి. నెల రోజుల్లో ఇవ్వాల్సిన పరీక్షల ఫలితాలు ఐదు నెలలైనా విడుదల చేయరు. తాజాగా ఆర్గానిక్ కెమిస్ట్రీ విద్యార్థులు సమస్య వెలుగులోకి వచ్చింది. వర్సిటీలోని ఆర్గానిక్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో మొదటి సంవత్సరం 33 మంది, ద్వితీయ సంవత్సరం 43 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరంలో ఉన్న విద్యార్థులు 2వ సెమిస్టర్లో ఒక పేపర్కు సంబంధించి 10 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. 3వ సెమిస్టర్లో సైతం అదే 10 మందితో పాటు మరో ఇద్దరు విద్యార్థులు ఫెయిల్ కావడం చర్చనీయాంశంగా మారింది. ఫెయిలైన విద్యార్థులందరికీ మొదటి సెమిస్టర్లో సరాసరి 8 పాయింట్స్ పైనే మార్కులు వచ్చాయి. అడ్వాన్స్ సప్లిమెంటరీ నిర్వహణ నిర్ణయంపై అసంతృప్తి 2, 3 సెమిస్టర్లలో ఫెయిలైన 10 మందికి పైగా విద్యార్థులు ఇటీవల వర్సిటీ వైస్చాన్సలర్ను కలిసి తమ సమస్యను విన్నవించుకున్నారు. తాము పరీక్షల్లో ఫె యిలయ్యే సమస్యే లేదు కావాలంట్ చాలెంజింగ్ వాల్యుయేషన్ చేయించండని వీసీతో వాదించారు. రీ వెరిఫికేషన్ రీ వాల్యుయేషన్కు అవకాశం ఇవ్వాల ని వేడుకున్నారు. రీవెరిఫికేషన్ రీ వాల్యుయేషన్కు అవకాశం లేదని అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు రా సేందుకు అవకాశం ఇస్తామంటూ వీసీ చెప్పడంతో విద్యార్థులు అసహనం వ్యక్తం చేశారు. తమ సమాధాన పత్రాలను మాకు చూయించండని ప్రశ్నించారు. వీసీని వేడుకున్నా, వాగ్వివాదం చేసినా అడ్వాన్స్ సప్లిమెంటరీ నిర్వహిస్తామని వీసీ చెప్పడంతో విద్యార్థులు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. అధికారులు న్యాయం చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి వచ్చి పీజీ చుదువుతున్న మేం పరీక్షలు బాగా రాశాం. అయినా 10 మందిని 2, 3 సెమిస్టర్లలో ఫెయిల్ చేశారు. మొదటి సెమిస్టర్లో అందరం 8 పాయింట్ల పైగా మార్కులతో ఉత్తీర్ణులమయ్యాం. 2, 3 సెమిస్టర్లలో ఫెయిల్ కావడంతో వీసీని కలిసి సమస్య విన్నవించినా, ప్రశ్నించినా ఎలాంటి పరిష్కారం దొరకలేదు. అడ్వాన్స్ సప్లిమెంటరీ నిర్వహిస్తాం రాయండని వీసీ చెబుతున్నారు. మరో రెండు మూడు రోజుల్లో పీజీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఓపెన్ చాలెంజ్ చేస్తున్నాం. మా సమాధా న పత్రాలను మా ముందర వాల్యుయేషన్ చేయించండి. మాకు న్యాయం చేయండి. – 2,3 సెమిస్టర్లు ఫెయిలైన విద్యార్థులు -
‘కార్పొరేట్’ కోసమే పీపీపీ విధానం
కర్నూలు(టౌన్): కార్పొరేట్ రంగాన్ని పెంచి పోషించేందుకే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పీపీపీ (పబ్లిక్, ప్రెవేటు, పార్టనర్షిప్) విధానాన్ని అమలు చేస్తోందని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి కటారు కొండ సాయి కుమార్ విమర్శించారు. ఈ విధానంతో రాష్ట్రంలో మెరిట్ ఉన్న పేద, మద్యతరగతి విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతారన్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి నేతలు ఈనెల 7వ తేదీన విజయవాడలోని ఎన్టీఆర్ యూనివర్సీటీలో ఉపకులపతిని కలిసి మెమోరాండం అందజేస్తున్నట్లు స్పష్టం చేశారు. కర్నూలు ఎస్వీ కాంప్లెక్స్లో వైస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కటికె గౌతమ్ మాట్లాడుతూ.. అన్ని అర్హతలు ఉన్న యువ వైద్యులు వారి హక్కు అయినా పీఆర్ (పర్మనెంట్ రిజిస్ట్రేషన్)ను అడిగితే పోలీసుల చేత అగౌరవపరిచారన్నారు. విద్యార్థి విభాగం కర్నూలు నగర అధ్యక్షులు అన్సర్ మాట్లాడుతూ విద్యార్థులపై జరుగుతున్న అన్యాయాలను సహించబోమన్నారు. సమావేశంలో విద్యార్థి సంఘం నాయకులు శ్రీకాంత్, కోడుమూరు నియోజకవర్గ నాయకులు శ్రీధర్, తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి కటారుకొండ సాయికుమార్ వెల్లడి -
గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి
కర్నూలు: కర్నూలు రైల్వే స్టేషన్ సమీపంలోని కేవీఆర్ కాలేజీ సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందారు. రోడ్డుపై అనా థ శవం పడి ఉన్నట్లు స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు రెండో పట్టణ పోలీసులు అక్కడికి చేరు కుని మృతదేహాన్ని పరిశీలించి పరిసర ప్రాంతాల్లో ఆరా తీశారు. ఈనెల 1వ తేదీ సాయంత్రం నుంచి మృతదేహం అక్కడే పడివున్నట్లు స్థానికులు తెలిపారు. సుమారు 65 సంవత్సరాల వయస్సు ఉండి తెలుపు, అడ్డు గీతలు కలిగిన టీషర్టు, నలుపు రంగు షార్ట్ ధరించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీ కేంద్రానికి తరలించి భద్రపరిచారు. ఆచూకీ తెలిసినవారు 91211 01060, 08518–220189కు ఫోన్ చేసి సమాచారం అందించాలని రెండో పట్టణ పోలీసులు విజ్ఞప్తి చేశారు. -
పెయ్య దూడల అభివృద్ధికి చర్యలు
● జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ కార్యనిర్వహణ అధికారి రాజశేఖర్ కర్నూలు(అగ్రికల్చర్): పెయ్య దూడల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు ఉమ్మడి జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ కార్యనిర్వహణ అధికారి డాక్టర్ రాజశేఖర్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కర్నూలు జిల్లాలో 23,200, నంద్యాల జిల్లాలో 30 వేల పశువులకు పెయ్య దూడలు పుట్టడం లక్ష్యంగా కృత్రిమ గర్భధారణ సూదులు వేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని శుక్రవారం నుంచి ప్రారంభించామన్నారు. ఒక డోసు వీర్య నాళికల పూర్తి ధరను రూ.300 ఉండగా 50 శాతం సబ్సిడీ ఇచ్చే విధంగా పశుసంవర్ధక శాఖ చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. ఆవులు, గేదెలు ఎదకు వచ్చినపుడు రూ.150 చెల్లించి లింగనిర్ధారిత వీర్య నాళికలతో కృత్రిమ గర్భాధారణ చేయించవచ్చని తెలిపారు. రైతుల అభివృద్ధికి ‘సహకార’ం గడివేముల: రైతుల అభివృద్ధికి సహకార సంఘాలు ఎంతో ఉపయోగపడతాయని జిల్లా సహకార అధికారి ఎన్ రామాంజనేయులు తెలిపారు. అంతర్జాతీయ సహకార వారోత్సవాల సందర్భంగా శుక్ర వారం గడివేముల జెడ్పీ పాఠశాలలో కార్యక్రమం నిర్వహించారు. జిల్లా సహకార అధికారి మాట్లాడుతూ.. సహకార సంఘాలతో అనేక మంది రైతులకు రుణాలతో పాటు వివిధ పథకాలు అందిస్తున్నామన్నారు. ఎస్డీఎల్ తిరుపాలయ్య, సూపరింటెండెంట్లు రాముడు, రషీద్ ఫకృద్దీన్, సంధాని, ఏజీఎం భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వృద్ధ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం
కర్నూలు: డైబ్బె ఏళ్ల వయస్సు పైబడి, అనారోగ్యంతో బాధ పడుతున్న ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తూ త్వరగా బెయిల్ మంజూరయ్యేలా కృషి చేస్తామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి తెలిపారు. శుక్రవారం ఆయన కర్నూలు శివారులోని పురుషుల కేంద్ర కారాగారం, నగరంలోని మహిళా కారాగారాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జైలు ఖైదీలకు ప్రిజన్ ఎయిడ్ క్లినిక్స్ గురించి వివరించారు. ఇందులో ఒక అడ్వకేట్, ఒక పారా లీగల్ వలంటీర్ ఉంటారని, వారు ఖైదీలకు న్యాయ సలహాలు అందిస్తారన్నారు. ఖైదీలు సత్ప్రవర్తనతో శిక్షను పూర్తి చేయాలని కోరారు. ఖైదీలకు అందించే ఆహారాన్ని, రేషన్, వారి ఆరోగ్య వివరాలను తెలుసుకున్నారు. లీగల్ సర్వీసెస్ హెల్ప్ లైన్ నెంబర్ 15100 గురించి అవగాహన కల్పించారు. -
వైభవంగా సుదర్శనమూర్తి జయంత్యుత్సవం
ఆళ్లగడ్డ: ప్రముఖ పుణ్యక్షేత్రం దిగువ అహోబిలంలో సుదర్శనమూర్తి జయంత్యుత్సవాన్ని శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ముందుగా కొలువైన మూలమూర్తులు శ్రీ ప్రహ్లాదవరదస్వామి, అమృతవల్లీ అమ్మవార్లను సుప్రభాత సేవతో మేలుకొలిపి దివ్యదర్శనం అనంతరం నిత్యపూజలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వామి, సుదర్శన మూర్తులను కొలు వుంచి నవకళశస్థాపన అనంతరం, పంచామృతాలతో అభిషేకించారు. అనంతరం శాస్త్రోక్తంగా తిరుమంజనం నిర్వహించి ఉత్సవమూర్తలను నూతన పట్టు వస్త్రాలతో ప్రత్యేకంగా అలకంరించి కొలువుంచి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అనంతరం ఉభయ దేవురులతో కొలువైన శ్రీ నృసింహస్వామి ఎదురుగా శ్రీ సుదర్శన మూర్తిని కొలువుంచి ఆస్థాన విద్వాంసుల మంగళ వాయిద్యాలు, వేద పండితుల వేదమంత్రోచ్చారణలు నడుమ సదర్శన హోమం శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతితో కార్యక్రమాన్ని ముగించారు. సుదర్శన హోమం ప్రత్యేకత సాధారణంగా నారసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున ఏడాది పొడవునా సుదర్శన హోమం నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఆషాఢ మాసంలో వచ్చే స్వాతి నక్షత్రానికి ముందు రోజు సుదర్శన మూర్తి జయంతి కావడంతో ఏడాదిలో ఈ ఒక్క రోజు సుదర్శన హోమం స్వాతి రోజు కంటే ముందు రోజు నిర్వహించడం జరుగుతుంది. సుదర్శన మూర్తి ఆరు చేతులతో ఆరు ఆయుధాలు కల్గి ఉండి వైష్ణవ దేవుళ్లను రక్షిస్తుంటారని విశ్వాసం. సుదర్శన మూర్తికి ఆదిదేవుడు శ్రీ లక్ష్మీనరసింహస్వామి కావడంతో ప్రతి స్వాతి వేడుకల్లో సుదర్శన హోమం నిర్వహించడం ఆనవాయితీ. స్వాతి నక్షత్రం సందర్భంగా శనివారం దిగువ అహోబిలంలో ఉత్సవ మూర్తులకు తెల్లవారుజామున జేష్టాభి షేక వేడుకలు నిర్వహించనున్నారు. -
మొహర్రం వేడుకల్లో గొడవలు వద్దు
● ఫ్యాక్షన్కు దూరంగా ఉండండి: డీఎస్పీ ఎమ్మిగనూరురూరల్: మొహర్రం వేడుకల్లో గొడవలు పెట్టుకోవాలని చూస్తే పోలీస్ చర్యలు చాలా కఠినంగా ఉంటాయని డీఎస్పీ ఉపేంద్రబాబు హెచ్చరించారు. కోటేకల్ గ్రామానికి ఉన్న ఫ్యాక్షన్ ముద్రను చెరిపేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. శుక్రవారం రాత్రి కోటేకల్ గ్రామస్తులతో డీఎస్పీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో గతేడాది మొహర్రం వేడుకలు సందర్భంగా తప్పిదం జరిగిందని, ఈ సారి అందరూ సంతోషంగా జరుపుకోవాలన్నారు. పీర్ల ఊరేగింపు, సాహుసోని ఆడేటప్పుడు అందరూ అన్నదమ్ముల్లా ఉండాలన్నా రు. రూరల్ సీఐ మధుసూదన్రావు, ఎస్ఐ శ్రీనివా సులు, పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. -
గోసంరక్షణనిధి పథకానికి రూ.లక్ష విరాళం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న గోసంరక్షణ నిధి పథకానికి శుక్రవారం నెల్లూరుకు చెందిన ఉప్పలపాటి నందీశ్వర రాయల్ రూ.1,00,116 విరాళాన్ని పర్యవేక్షకురాలు టీ.హిమబిందుకు అందజేశారు. విరాళాన్ని అందించిన దాతకు దేవస్థానం తరుఫున స్వామివారి శేషవస్త్రాన్ని, లడ్డూప్రసాదాలను, జ్ఞాపికను అందించి సత్కరించారు. అరుణాచల క్షేత్రానికి 10న ప్రత్యేక బస్సు కర్నూలు కల్చరల్: భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్ రోడ్డు రవాణా సంస్థ కర్నూలు – 2 డిపో నుంచి తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచల క్షేత్ర దర్శ నం, గిరి ప్రదక్షణకు సూపర్ లగ్జరీ బస్సు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ కేఎల్కే శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తేదీ ఉదయం 7 గంటలకు బయలు దేరి మార్గమధ్యలో కా ణికపాకం దర్శించుకొని అదే రోజు రాత్రి 8 గంటలకు అరుణాచలం చేరుకుంటుందని తెలిపారు. గిరి ప్రదక్షి ణ, అరుణాచలేశ్వర స్వామి దర్శనం ఉంటుంద ని పేర్కొన్నారు. 11వ తేదీ సాయంత్రం 4 గంటలకు బయలు దేరి వేలూరు గోల్డెన్ టెంపుల్ అమ్మవారిని దర్శించుకొని 12వ తేదీ శనివారం ఉదయం 6 గంటలకు కర్నూలు చేరుకుంటుందని తెలిపారు. సూపర్ లగ్జరీ బస్సులో రానుపోను రూ. 2000 ఛార్జీగా నిర్ణయించడం జరిగిందని పే ర్కొన్నారు. మరిన్ని వివరాలకు ట్రాఫిక్ అసిస్టెంట్ మేనేజర్ నం. 73828 71131, డిపో మేనేజర్ 9959225794 సంప్రదించాలని విజ్ఙప్తి చేశారు. పోతుగల్లులో వ్యక్తి అదృశ్యం కృష్ణగిరి: మండల పరిధి లోని పోతుగల్లు గ్రామాని కి చెందిన బోయ రాము డు అదృశ్యమయ్యాడు. గత నెల 26న ఉదయం బహిర్భూమికి అని వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు తెలిసిన చోటల్లా గాలించినా ఫలితం లేకపోయింది. శుక్రవారం బాధితుడి భా ర్య బోయ రంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి గాలింపు చేపట్టినట్లు ఎస్ఐ కృష్ణమూర్తి తెలిపారు. ఇతనికి 15 ఏళ్ల క్రితం పెళ్లి అయిందని కానీ పిల్లలు కాలేదన్నారు. ఇటీవల కాలంలో రాముడు అన్నకు బ్లడ్ క్యాన్సర్ రావడంతో సదురు విషయం గురించి బాధపడుతూ ఉండేవాడని బాధితుడి భార్య ఫిర్యాదులో పేర్కొంది. ఇద్దరు దొంగల అరెస్ట్ బనగానపల్లె రూరల్: స్థానిక కొండపేటలో గత నెలలో చోరీకి పాల్పడిన ఇద్దరు దొంగలను అరెస్టు చేసినట్లు బనగానపల్లె అర్బన్ సీఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీసు స్టేషన్లో నిందితుల వివరాలను వెల్లడించారు. వైఎస్సార్ కడప జిల్లా ఖాజీపేట మండలం తుడుములదిన్నె గ్రామానికి చెందిన కూకట్పల్లి భరత్కుమార్, అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని మారుతీ నగర్కు చెందిన వనార్చి మహేష్ పలు చోరీ కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ఈ క్రమంలో కొండపేటలో గత నెల 1వ తేదీన కాటసాని బలరామిరెడ్డి ఇంట్లో రూ.7.50 లక్షల విలువైన ఆభరణాలు అపహరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి సాంకేతిక పరిజ్ఞానంతో ఆచూకీ గుర్తించి శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇద్దరు నిందితుల నుంచి ఏడు తులాల బంగారు ఆభరణాలు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో తమ ప్రతిభను చూపించిన పోలీసులు సుబ్బరామకృష్ణ, నాగన్న, ప్రదీప్లను జిల్లా ఎస్పీ అభినందించినట్లు సీఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. సమావేశంలో ఎస్ఐ దుగ్గిరెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
● 12 గంటలు.. 23 ఎకరాలు
నందికొట్కూరు: పొలంలో అడుగు పెడితే మాకెదురు లేదు.. అంటూ నందికొట్కూరుకు చెందిన ఓ రైతు వృషభాలు రంకేసి చెబుతున్నాయి. 12 గంటల్లో 23 ఎకరాల్లో ఎద్దులతో విత్తనం వేసి ఓ రైతు రికార్డు సృష్టించాడు. పట్టణానికి చెందిన చంద్రశేఖర్రెడ్డి ఓ రైతుకు చెందిన 25 ఎకరాలను కౌలుకు తీసుకున్నాడు. ఇటీవల కురిసిన వర్షాలకు భూమి పదునెక్కడంతో మొక్కజొన్న విత్తనం వేసేందుకు పట్టణానికి చెందిన రైతు శ్రీను కాడెద్దులతో శ్రీకారం చుట్టారు. శుక్రవారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 23 ఎకరాల భూమిని కాడెద్దులతో విత్తనం వేశాడు. విషయం తెలుసుకున్న రైతులు, గ్రామస్తులు ఎద్దులను చూసేందుకు ఆసక్తి చూపారు. -
బాబూ.. పింఛన్ ఇవ్వండి!
సహాయకుడి సాయంతో నడుస్తున్న ఈ అవ్వ పేరు వడ్డె పెద్ద పాపమ్మ. నందవరం మండలం గంగవరం గ్రామానికి చెందిన ఈమెకు 77 ఏళ్ల ఉన్నాయి. భర్త వడ్డె పెద్ద రాముడు మృతి చెంది రెండు సంవత్సరాలైనా ఇప్పటి వరకు అవ్వకు పింఛన్ రాలేదు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి శుక్రవారం వస్తున్నారని తెలుసుకుని ఒంటరిగా ఆటోలో తన స్వగ్రామం నుంచి బయలు దేరి ఉదయం 10 గంటలకు నందవరానికి వచ్చారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎదురు చూసినా ఎమ్మెల్యే రాలేదు. దీంతో వృద్ధురాలు కన్నీరు పెట్టారు. పింఛన్ రావడం లేదు, బియ్యం కూడా వేయడం లేదని ఆమె విలపించారు. ఎమ్మెల్యే ఆలస్యంగా రావడంతో అప్పటికే వృద్ధురాలు పెద్దపాపమ్మ స్వగ్రామానికి వెళ్లారు. – నందవరం -
టీడీపీ నాయకుడి దౌర్జన్యం
అప్పు తిరిగివ్వమనడంతో రౌడీ మూకలతో దాడి ● గుండుపాపల గ్రామంలో ఉద్రిక్తతఆళ్లగడ్డ: తీసుకున్న అప్పులు తిరిగివ్వమని అడగటంతో టీడీపీ నాయకుడు రౌడీమూకలతో కలిసి దాడిచేసిన ఘటన దొర్నిపాడు మండలం గుండుపాపల గ్రామంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలివీ.. గుండుపాపల గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కాశీవిశ్వనాథర్రెడ్డి ఆళ్లగడ్డ పట్టణ పరిధిలోని రాజారెడ్డి దగ్గర అప్పుగా కొంత నగదు తీసుకున్నాడు. ఎన్నిరోజులైనా తిరిగి చెల్లించకపోవడంతో రాజారెడ్డి కుటుంబం అప్పు వసూలు చేసుకునేందుకు కొన్ని రోజులుగా గుండుపాపల గ్రామంలోనే ఉంటున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాజారెడ్డి భార్యతో కలిసి కాశీవిశ్వనాథర్రెడ్డి ఇంటి దగ్గరకు వెళ్లి అప్పు విషయమై గట్టిగా నిలదీశారు. దీంతో ఆగ్రహించిన కాశీవిశ్వనాథర్రెడ్డి రాత్రి సుమారు 10 మంది రౌడీలతో కలిసి ఫూటుగా మద్యం సేవించి రాజారెడ్డి ఉన్న ఇంటిమీదకు వెళ్లి రాళ్లతో దాడిచేస్తుండగా బయటకు వచ్చిన రాజారెడ్డిపై దాడిచేసి కొట్టారు. ఇది గమనించిన రాజారెడ్డికి ఆశ్రయం ఇచ్చిన శేఖర్రెడ్డి బయటకు వచ్చి సర్ది చెప్పేందుకు యత్నిస్తుండగా దీనికంతటికీ కారణం నువ్వే, నువ్వు ఆశ్రయం ఇవ్వడంతోనే వారు ఇక్కడ ఉండి నన్ను రోజూ అప్పు అడుగుతున్నారని శేఖర్రెడ్డి కుటుంబంపైనా దాడి చేశారు. ఈ విషయంపై దొర్నిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు గాయపడ్డ శేఖర్రెడ్డి, రాజారెడ్డిలు తెలిపారు. -
టీడీపీలో భగ్గుమన్న విభేదాలు.. ఏరాసుపై ఎమ్మెల్యే వర్గీయుల దాడి
సాక్షి, నంద్యాల: జిల్లా టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మాజీ మంత్రి, టీడీపీ నేత ఏరాసు ప్రతాప్రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహణపై పెద్ద రచ్చే జరిగింది. తొలి అడుగు కార్యక్రమం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డికి చెప్పకుండా ఎలా నిర్వహిస్తారంటూ బుడ్డా అనుచరులు రెచ్చిపోయారు.ఎంపీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ ఏరాసు ప్రతాపరెడ్డి ఇంటి అద్దాలను బుడ్డా వర్గీయులు ధ్వంసం చేశారు. బుడ్డా అనుచరులు.. ఏరాసుపై చేయి చేసుకున్నారు. ఆత్మకూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు. -
మా నాన్నకు 50 ఏళ్లు.. పింఛన్ ఎప్పుడిస్తారు!
సి.బెళగల్: ‘యాభై ఏళ్లకే పింఛన్ ఇస్తామన్నారు.. మా నాన్నకు ఇంతవరకు పింఛన్ రాలేదు. పింఛన్ ఎప్పుడిస్తారు?’అంటూ కర్నూలు జిల్లా సి.బెళగల్లో ఓ ముస్లిం కుటుంబం కేడీసీసీ బ్యాంకు చైర్మన్, కోడుమూరు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి విష్ణువర్ధన్రెడ్డిని ప్రశ్నించింది. సి.బెళగల్లో టీడీపీ నాయకులు గురువారం తొలిఅడుగు కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కోట వీధిలోని అబ్దుల్ సత్తార్ ఇంటికి టీడీపీ నాయకులతో కలిసి వెళ్లిన విష్ణువర్ధన్రెడ్డిని అబ్దుల్ కుమార్తెలు తమ తండ్రికి 50 ఏళ్ల పింఛన్ ఎప్పుడు ఇస్తారో చెప్పాలని ప్రశ్నింనంచారు. దీనితో టీడీపీ నాయకులు కొంత ఇబ్బంది పడ్డారు.అదే విధంగా గ్రామ ప్రధాన రోడ్డు, మురికి కాలువలు, మంచినీటి ట్యాంక్ నిర్మాణాల వంటి డిమాండ్లూ గ్రామస్తుల నుంచి వచ్చాయి. కాగా, ఎంపిక చేసిన కొన్ని ఇళ్లను మాత్రమే టీడీపీ నాయకులు సందర్శిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొనకపోవడం చర్చనీయాంశంగా మారింది. -
రైతులకు విధిగా బిల్లులు ఇవ్వాలి
కర్నూలు(అగ్రికల్చర్): రైతులు కొనుగోలు చేసిన వాటికి విధిగా కంప్యూటరైజ్డ్ బిల్లులు ఇవ్వాలని, మాన్యువల్ బిల్లులు ఇవ్వరాదని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి తెలిపారు. మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యాపారం చేసుకోవాలని, ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కర్నూలు ఉద్యాన భవన్లో కల్లూరు రూరల్, అర్బన్ పరిధిలోని పురుగుమందులు, విత్తనాలు, రసాయన ఎరువుల కంపెనీల ప్రతినిధులు, డీలర్లతో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి డీలరు తమ షాపులో వ్యవసాయ శాఖ జారీ చేసిన లైసెన్స్ను బాగా కనిపించే విధంగా ప్రదర్శించాలన్నారు. రసాయన ఎరువులు, విత్తనాలకు సంబందించి ధరలు, స్టాక్ వివరాలను బోర్డుపై విధిగా నమోదు చేయాలని పేర్కొన్నారు. కర్నూలు సబ్ డివిజన్ ఏడీఏ సాలురెడ్డి, కల్లూరు మండల వ్యవసాయ అధికారి విష్ణువర్ధన్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డీఆర్సీ ఏడీఏ వెంకటేశ్వర్లు, సాంకేతిక ఏవో శ్రీవర్ధన్రెడ్డి , వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి -
ఉరుకుందలో 25 నుంచి శ్రావణ ఉత్సవాలు
కౌతాళం: ఉరుకుంద ఈరన్నస్వామి ఆలయంలో ఈనెల 25 నుంచి ఆగస్టు 23వ తేదీ వరకు శ్రావణమాస ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ విజయరాజు తెలిపారు. గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్సవాలకు హాజరయ్యే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. దేవాలయం లోపలి భాగంలో ఫిల్టర్ తాగునీటి కుళాయిలను ఏర్పాటు చేశామన్నారు. భక్తుల విడిది కోసం 168 గదులు ఉన్నాయన్నారు. భక్తులకు ఎక్కడా బురద అంటకుండా దేవాలయం చుట్టూ సీసీ ఫెవర్స్ పరుస్తున్నామన్నారు. ఆలయ ఉత్తరం ద్వారం వద్ద వీఐపీ లాంచ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అంతరాలయం దర్శనం కోసం రూ.వెయ్యి టిక్కెట్ పెడుతున్నట్లు చెప్పారు.. అలాగే స్లాట్ దర్శనం కూడ ఏర్పాటు చేస్తామన్నారు. అన్నదాన సత్రంలోనే కాక మరో రెండు చోట్ల భోజన వసతి ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మహిళల కోసం ప్రత్యేంగా మరుగుదొడ్లను నిర్మించినట్లు తెలిపారు. సమావేశంలో అర్చకులు శివన్నస్వామి, నాగరాజ్స్వామి, ఆలయ పర్యవేక్షకులు వెంకటేష్, మల్లికార్జున, ఇన్స్పెక్టర్ వీరేష్, సిబ్బంది కుమార్, కిరణ్ పలువురు పాల్గొన్నారు. ఆగస్టు 23 వరకు నిర్వహణ భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తాం ఆలయ డిప్యూటీ కమిషనర్ విజయరాజు -
అక్రమంగా డీఏపీ నిల్వ
● సీజ్ చేసిన వ్యవసాయాధికారులు ఆదోని రూరల్: పెద్దతుంబళం గ్రామంలోని నబీ ట్రేడర్స్లో అక్రమంగా నిల్వ ఉన్న డీఏపీ ఎరువును సీజ్ చేసినట్లు ఆదోని మండల వ్యవసాయ అధికారులు గురువారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గురువారం సాయంత్రం ఆకస్మికంగా దుకాణాన్ని తనిఖీ చేశామన్నారు. అనుమతులు లేకుండా కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమంగా తీసుకొచ్చిన డీఏపీ ఎరువు 76 బస్తాలు దుకాణంలో ఉన్నట్లు గుర్తించామన్నారు. దీని విలువ రూ.1,02,600 ఉంటుందన్నారు. నిల్వ ఉంచిన డీఏపీ ఎరువు అమ్మకాలు చేయకుండా నిలిపివేసినట్లు చెప్పారు. నాణ్యత పరీక్ష నిమిత్తం నమూనాలను సేకరించి, వాటిని ప్రయోగశాలకు పంపిస్తున్నట్లు తెలిపారు. పరీక్ష ఫలితాల అనంతరం దుకాణ యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. -
గంజాయి అక్రమ రవాణాపై పోలీసు నిఘా
కర్నూలు: నిషేధిత గంజాయి, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల అక్రమ రవాణాపై పోలీసులు నిఘాను తీవ్రతరం చేశారు. ఇందులో భాగంగా అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా ఆధ్వర్యంలో కర్నూలు రైల్వే స్టేషన్లో గురువారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈగల్ టీమ్, స్పెషల్ పార్టీ పోలీసులు, డాగ్ స్క్వాడ్ బృందాలు, రైల్వే ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు సంయుక్తంగా గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనకు రైల్వేస్టేషన్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కర్ణాటక నుంచి ఉత్తరాఖండ్కు కర్నూలు మీదుగా వెళ్లే యశ్వంత్పూర్–యోగి నగరి రిషికేశ్ రైలు (ట్రైన్ నెం.06597)లో జనరల్ బోగి నుంచి ఏసీ బోగిల వరకు అన్నింటినీ తనిఖీ చేశారు. జిల్లాకు ఒక ట్రైన్ను కేటాయించి రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించాలన్న పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రైల్వేస్టేషన్లోని పార్సిల్ కార్యాలయాల్లో కూడా డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు నిర్వహించారు. గంజాయి అక్రమ రవాణా నిర్మూలనకు ప్రత్యేకంగా టోల్ఫ్రీ నెంబర్ 1972ను ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ తెలిపారు. కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్, సీఐలు నాగరాజరావు, గుణశేఖర్ బాబు, ఎస్ఐ సతీష్ కుమార్ యాదవ్ తదితరులు తనిఖీ బృందాలకు నాయకత్వం వహించారు. -
వజ్రాల వంకను చూసేందుకు వచ్చి..
మహానంది: నల్లమలలోని వజ్రాల వంకలో వజ్రాలు దొరుకుతున్నాయని.. అందరూ అంటుంటే సరదాగా చూసేందుకు వచ్చిన ఇద్దరు కుమారులతో వచ్చిన తండ్రి ఓ కుమారుడిని పోగొట్టుకున్నాడు. ప్రమాదవశాత్తూ వాగులో పడి బాలుడు మృతి చెందాడు. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు...నంద్యాలలోని ఎస్బీఐ కాలనీకి చెందిన యాకూబ్ ఖాన్, ఆయన కుమారుడు అజ్మతుల్లా, మరో కుమారుడు నల్లమలలోని సర్వనరసింహస్వామి సమీపంలో ఉన్న వజ్రాల వాగు దగ్గరికి వచ్చారు. అక్కడ కాసేపు పిల్లలతో సరదాగా గడిపారు. అజ్మతుల్లా(15) బహిర్భూమికి అని వెళ్లి ప్రమాదవశాత్తు వాగులో పడ్డాడు. కుమారుడిని కాపాడేందుకు యాకూబ్ఖాన్, మరో కుమారుడు వెళ్లగా కాలువ లోతు ఎక్కువగా ఉండటం వల్ల వారు బయటికి రాలేకపోయారు. స్థానికులు ఆ ఇద్దరిని కాపాడారు. నీటిలో మునిగిపోయిన అజ్మతుల్లా కొద్ది సేపటి తర్వాత శవమై తేలాడు. విషయం తెలుసుకున్న రోడ్సేఫ్టీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనా స్థలం శిరివెళ్ల పోలీసు స్టేషన్ పరిధిలోకి వస్తుందని మహానంది ఎస్ఐ రామ్మోహన్రెడ్డి తెలిపారు. తమకు ఎలాంటి కేసు వద్దని తల్లిదండ్రులు పోలీసులకు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. వాగులో పడి బాలుడి మృతి -
అంకిరెడ్డిపల్లెలో పిచ్చికుక్క దాడి
కొలిమిగుండ్ల: అంకిరెడ్డిపల్లెలో గురువారం పిచ్చికుక్క దాడిలో 12 మంది గాయపడ్డారు. ఎస్సీ కాలనీ, ప్రధాన రహదారి, మెయిన్ ప్రాథమిక పాఠశాల సమీపంలోని కాలనీలతోపాటు పలు వీధుల్లో పిచ్చికుక్క సంచరించి రామాంజనేయులు, పల్లె శివరామిరెడ్డి, మూగెన్న తదితరులపై దాడి చేసింది. గ్రామంలో కొద్ది సేపు ప్రజలు భయాందోళనకు గురయ్యారు. చిన్న పిల్లలను బయటకు పంపకుండా ఇంట్లోనే ఉంచారు. ఆవుపై కూడా పిచ్చికుక్క దాడి చేసింది. అయితే కొందరు వ్యక్తులు పిచ్చి కుక్కపై కట్టెలతో దాడి చేసి చంపేశారు. గాయపడిన వారిని కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఆసుపత్రులకు తీసుకెళ్లారు. యువకుడి ఆత్మహత్య బండి ఆత్మకూరు: లింగాపురం గ్రామంలో ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ జగన్మోహన్ తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన పాతకోట చెన్నయ్య (30) మద్యానికి బానిసై అనారోగ్యానికి గురయ్యాడు. మానసికంగా కుంగిపోయి గురువారం తెల్లవారుజామున ఇంటిలో ఉరేసుకుని మృతి చెందాడు. మృతునికి భార్య అంకమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. చెట్టు పైనుంచి పడి వ్యక్తి మృతి కోసిగి: చెట్టు పై నుంచి కింద పడి కోసిగి హనుమంతు (27) అనే వ్యక్తి మృతి చెందాడు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గౌడుగల్లు గ్రామానికి చెందిన కోసిగి హనుమంతు గతనెల 28న తన పొలంలో ఉన్న నేరేడు పండ్లను రాల్చేందుకు చెట్టును ఎక్కాడు. పండ్లను రాల్చే సమయంలో కాలు జారి నుంచి కిందకు పడిపోయాడు. గాయాలు కావడంతో కోసిగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు హస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ కోలుకోలేక గురువారం మృతి చెందాడు. కోసిగి హనుమంతుకు భార్య నాగవేణి, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కోసిగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి కర్నూలు (అగ్రికల్చర్): కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుత్తి పెట్రోల్ బంకు వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం చెందారు. డోన్కు చెందిన లక్ష్మీదేవి, కుమారుడు సుదర్శన్ కర్నూలులోని వ్యవసాయ కార్యాలయంలో పని నిమిత్తం బైక్పై కర్నూలుకు వస్తుండగా మధ్యాహ్నం 12:45 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి హైదరాబాదు వెళ్లే రోడ్డులో గుత్తి పెట్రోల్ బంకు ఫ్లై ఓవర్ బ్రిడ్జి మొదట్లో పల్సర్ బైక్ సర్వీస్ రోడ్డులోకి వస్తుండగా వెనుక వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లీ, కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. కోలుకోలేక లక్ష్మీదేవి మృతిచెందింది. కారు డ్రైవర్ అతివేగంగా అజాగ్రత్తగా వచ్చి బైక్ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. వ్యక్తి అదృశ్యం ఓర్వకల్లు: మండలంలోని ఎన్.కొంతలపాడు గ్రామానికి చెందిన ఈడిగ వెంకటరాముడు(55) అదృశ్యమైనట్లు పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. మానసిక పరిస్థితి బాగోలేక గత నెల 29న ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి ద్యర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు ఎస్ఐ నంబరు 9121101067కు సమాచారం ఇవ్వాలన్నారు. -
విద్యుత్ కోతలు.. ఎండుతున్న పంటలు
బనగానపల్లె: అప్రకటిత విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బనగానపల్లె మండలం ఇల్లూరుకొత్తపేట విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలో తరచూ విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. విద్యుత్ అధికారులు నివారణ చర్యలు చేపట్టడం లేదు. ఈ సబ్స్టేషన్ పరిధిలో ఇల్లూరుకొత్తపేట, మిట్టపల్లి, తమ్మడపల్లి విద్యుత్ ఫీడర్లు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం తొమ్మిది గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలల పరిఽధిలో 250 వ్యవసాయ బోర్లు ఉండగా 1,300 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. ఎక్కువ విస్తీర్ణంలో మొక్కజొన్న సాగు చేయగా.. మిగతా పొలాల్లో మినుము, పత్తిని విత్తారు. మరి కొన్ని రోజుల్లో రైతులు మిరప కూడా సాగు చేయాల్సి ఉంది. గత కొన్ని రోజులుగా వర్షాలు కురవకపోవడం, గాలులు ఎక్కువగా ఉండటంతో మొక్కదశలో ఉన్న పైర్లు ఎండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో సక్రమంగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో రైతులు దిక్కులు చూస్తున్నారు. ఇదీ సమస్య.. ● గత కొద్ది రోజులుగా మిట్టపల్లి విద్యుత్ ఫీడర్లో బ్రేకర్ సమస్యలు వస్తున్నాయి. ● త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా లేక ప్రజలకు మంచినీరు అందడం లేదు. ● విద్యుత్ సమస్య కారణంగా పొలాల్లో మోటార్లు పనిచేయక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ● కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ బిల్లులు మాత్రం ఉహించని విధంగా వస్తున్నాయని, కరెంట్ సరఫరా సక్రమంగా ఉండటం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. చర్యలు చేపడుతున్నాం కొన్ని సందర్భాల్లో సాంకేతిక లోపాలతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. సాంకేతిక లోపాలను తొలగించే చర్యలు చేపడుతున్నాం. రైతులకు ఎటువంటి ఇబ్బందులేకుండా విద్యుత్ సరఫరాను అందిస్తాం. –గర్జప్ప, బనగానపల్లె విద్యుత్ రూరల్ ఏఈ మొక్కజొన్న సాగు చేసిన రైతులకు తప్పని తిప్పలు ఇబ్బందిగా ఉంది రెండు వ్యవసాయ బోర్ల కింద 15 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. పైరు మొలకెత్తదశలో ఉండటంతో సాగునీరు అందించాలి. విద్యుత్ అందకపోవడంతో ఇబ్బందిగా ఉంది. పగలు సమయంలోనే త్రీఫేజ్ విద్యుత్ అందించాలి. – పి వెంకటేశ్వర్లు, కాపులపల్లి విద్యుత్ సరఫరాలో అంతరాయం వ్యవసాయబోర్ల ఆధారంగా కొద్ది రోజులుగా మొక్కజొన్న సాగు చేశాం. పైరుకు సాగునీ రు అవసరం. కనీసం తొమ్మిది గంటల పాటు విద్యుత్ అందించాలి. గత కొద్ది రోజులుగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. ఇలాగైతే పైర్లు ఎండిపోతాయి. – చంద్రశేఖర్రెడ్డి, ఇల్లూరుకొత్తపేట -
డిగ్రీ ప్రవేశాలు ఇంకెప్పుడు!
● రెండు నెలల క్రితం ఇంటర్ ఫలితాలు విడుదల ● డిగ్రీ అడ్మిషన్లకు నోటిఫికేషన్ ఇవ్వని కూటమి ప్రభుత్వం ● మేజర్ సబ్జెక్ట్ విధానంపై నిర్ణయంలో జాప్యం ● ప్రైవేట్ కళాశాలలకు క్యూ కడుతున్న విద్యార్థులుజిల్లాలో డిగ్రీ కళాశాలల వివరాలు.. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు 11 ప్రైవేటు డిగ్రీ కళాశాలలు 28 మొత్తం 39 ప్రభుత్వ డిగ్రీ విద్యను అభ్యసిస్తున్న బాలురు 1,814 బాలికలు 1,841 మొత్తం 3655 ప్రైవేటు డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు బాలురు 1,343 బాలికలు 1,544 మొత్తం 2,987 నంద్యాల(న్యూటౌన్): డిగ్రీ కోర్సుల్లో నూతన అడ్మిషన్లు ఎప్పుడు ప్రారంభమవుతో తెలియక పోవడంతో విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారు. ఇప్పటికే 1 నుంచి 10వ తరగతి, ఇంటర్మీడియెట్ కోర్సుల్లో ప్రవేశాలు పూర్తయి తరగతులు ప్రారంభమయ్యాయి. డిగ్రీలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు డిగ్రీ ప్రవేశాలపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. జిల్లాలోని శ్రీశైలం, ఆత్మకూరు, నంద్యాలతో పాటు జిల్లా వ్యాప్తంగా 11 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. 55 ప్రైవేటు కళాశాలలు ఉండగా 66 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. డిగ్రీ విద్యార్థులకు అడ్మిషన్ల ప్రక్రియను సులువుతరం చేసేందుకు గత వైఎస్సార్సీపీ సర్కారు 2022–23లో ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా సులువుగా ఆన్లైన్ విధానంలో అడ్మిషన్లు పొందేవారు. కూటమి ప్రభుత్వం ఆన్లైన్ విధానాన్ని రద్దు చేసి తిరిగి ఆఫ్లైన్లో అడ్మిషన్లు చేపట్టేందుకు కుట్ర పన్నుతున్నట్టు తెలుస్తోంది. ఇందు కోసమే అడ్మిషన్ల ప్రక్రియ ఇంకా ప్రారంభించలేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. డిగ్రీ తరగతులపై గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది. గతంలో ఉన్న మూడు సబ్జెక్టుల విధానాన్ని రద్దు చేసి సింగిల్ మేజర్ సబ్జెక్టు విధానాన్ని అమలు చేసింది. జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సింగిల్ మేజర్ లేదా డబుల్ మేజర్ సబ్జెక్టుల విధానం అమలు గురించి ఉన్నత విద్యా మండలి సవివరంగా ప్రభుత్వానికి నివేదించింది. అయితే ఈ విషయంపై కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేక జాప్యం చేస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రైవేటు కళాశాలకు అనుకూలం.. అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదలలోజరుగుతున్న జాప్యాన్ని ప్రైవేటు కళాశాలలు తమకు అనుకూలంగా మార్చుకున్నాయి. రెండు నెలల క్రితమే ఇంటర్ ఫలితాలు వెలువడిన వెంటనే జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో విద్యార్థులను చేర్చుకోవడంతో పాటు మార్కుల జాబితాను, టీసీ, ఇతర సర్టిఫికెట్లను ప్రైవేట్ కళాశాలలు సేకరించాయి. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే ఇప్పటికే చేరినవారిని దరఖాస్తు చేయించి తమ కళాశాలలను ఆప్షన్లుగా ఎంచుకునే విధంగా ఏర్పాట్లు చేసుకున్నాయి. ఇటీవల ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు కూడా విడుదలయ్యాయి. అయినా కూడా డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించినా అది నెలకు పైగా సాగుతుంది. గతంలో రెండు నెలల సమయం వరకు షెడ్యూల్ ఇచ్చి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ప్రక్రియ నిర్వహించే వారు. అయితే కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు షెడ్యూలే ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తోంది. తొలి విడతలో మిగిలిన సీట్లను భర్తీ చేసేందుకు మరో రెండు విడతలు ప్రక్రియ నిర్వహించాలి. ఇదంతా జరిగి క్లాసులు ప్రారంభమయ్యే సరికి ఆగస్టు నెల వచ్చేస్తుందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. నోటిఫికేషన్ విడుదల చేయాలి కూటమి ప్రభుత్వం విద్యార్థుల పట్ల అలసత్వ వైఖరి చూపించడం సరికాదు. డిగ్రీ కళాశాలలు ప్రారంభమై చాలా రోజులు అవుతున్నా ఇంత వరకు అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ ఇవ్వకపోవడం దారుణం. ప్రైవేట్ కళాశాలలకు మేలు చేకూర్చేందుకు కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అడ్మిషన్ల ప్రక్రియను ఆలస్యం చేస్తోంది. వెంటనే అడ్మిషన్ల నోటిఫికేషను విడుదల చేయాలి. లేని పక్షంలో ఆందోళనలు చేపడతాం. – సురేష్యాదవ్, వైఎస్సార్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు, నంద్యాల జిల్లా -
‘నిషా’ చరులు!
మందుబాబులపై నెలవారీగా నమోదైన కేసులు ఫిబ్రవరి 1,976 మార్చి 1,041 ఏప్రిల్ 1,926 మే 1,435 జూన్ 1,762 మొత్తం 8,140కర్నూలు: బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే వారు ఎక్కువయ్యారు. జిల్లా వ్యాప్తంగా గత ఐదు నెలల కాలంలో మద్యంబాబులపై 8,140 కేసులు నమోదయ్యాయి. బహిరంగ ప్రదేశాలు, రోడ్లు, నడకదారులు, పార్కులు, వ్యాపార సముదాయాలు, శివారు ప్రాంతాలు అడ్డాలుగా చేసుకుని మద్యం తాగుతున్న వారిపై పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిఘా వేసి కేసులు నమోదు చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ ప్రజలకు అసౌకర్యం కల్గిస్తే చర్యలు ఉంటాయని పోలీసులు తనిఖీల సందర్భంగా హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ నడకదారులు, పార్కులు, శివారు ప్రాంతాలను అడ్డాగా చేసుకుని మద్యం తాగడమే కాక ప్రజా జీవనానికి ఆటంకం కలిగిస్తున్నారు. పోలీసుల నిఘా తీవ్రం చేసి పబ్లిక్ న్యూసెన్స్ కింద చర్యలు తీసుకుంటున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగి ప్రజలకు అసౌకర్యం కల్గిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. ఓపెన్ డ్రింకింగ్పై తనిఖీలు కొనసాగుతాయని హెచ్చరించారు. ఐదు నెలల కాలంలో 8,140 కేసుల నమోదు -
యూఎల్బీల ఎంపికలో ప్రభుత్వం వివక్ష
కర్నూలు(టౌన్): యూఎల్బీలను(అర్బన్ లోకల్ బాడీ) బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని 25 మున్సిపాల్టీలను ఎంపిక చేసింది. ఎంపిక చేసిన కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజా ప్రతినిధులైన మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, చైర్ పర్సన్లకు ఈ నెల 3, 4 తేదీల్లో హర్యానా రాష్ట్రంలోని గుర్గ్రామ్లో రెండు రోజులపాటు జాతీయ స్థాయి సదస్సు నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల బలోపేతం దిశగా నిర్వహిస్తున్న ఈ సదస్సులో పాల్గొనేందుకు ప్రభుత్వం ఇప్పటికే జీవో 643 జారీ చేసింది. అయితే అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించిన ప్రభుత్వం ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒక్క మున్సిపాల్టీని కూడా ఎంపిక చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఎంపిక చేసిన వాటిల్లో ఇటీవల వైఎస్సార్సీపీ నుంచి తెలుగుదేశం కండువా కప్పుకున్న మున్సిపల్ చైర్మన్లు, చైరపర్సన్లకు పెద్దపీట వేసింది. అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డ చైర్మన్, డోన్ వైస్ చైర్మన్లు వైఎస్సార్సీపీ నుంచి టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ రెండు మున్సిపాల్టీలను సైతం విస్మరించారు. ప్రభుత్వ ‘పచ్చ’పాత ధోరణిపై స్థానిక మంత్రులు కూడా నోరు మెదపకపోవడం గమనార్హం. ఇదిలాఉంటే ఉమ్మడి జిల్లాలను పూర్తిగా విస్మరించడంపై డోన్ మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయమై రాష్ట్ర మున్సిపల్ మంత్రి నారాయణకు లేఖ రాశారు. ఇది మంచి సంప్రదాయం కాదని, స్థానిక సంస్థల అభివృద్ధికి వైఎస్సార్సీపీ ఎంతో కృషి చేస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కేవలం రాజకీయం కోణంలో ఈ ప్రభుత్వం యుఎల్బీలను ఎంపిక చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. -
ఏడాది పాలనకే ప్రజలు విసుగెత్తిపోయారు
పాణ్యం: ఏడాది కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు విసిగెత్తిపోయారని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి అన్నారు. గురువారం పాణ్యం పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలు మొత్తం అమలు చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఆక్రమణలు, అక్రమార్జనే ధ్యేయంగా పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. హామీలు అమలు చేయకపోగా.. తొలి అడుగు అంటూ ఊర్లకు వస్తున్న ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తున్నారన్నారు. గొప్పగా రూ. 4 వేలు పింఛన్ ఇచ్చామని చెప్పి మరో వైపు 3 లక్షల పింఛన్లు కోత పెట్టడం చంద్రబాబుకు చెల్లిందన్నారు. తల్లికి వందనం అందక రోజూ ప్రజలు కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నారన్నారు. బాబూ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ‘బాబూ ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ కార్యక్రమం చేపట్టామన్నారు. ‘ప్రభుత్వం తొలి అడుగు’ పేరుతో ఇంటింటికీ వచ్చే ఎమ్మెల్యేలు, మంత్రులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల బాండ్లను చూపి నిలదీయాలన్నారు. గత ప్రభుత్వం వేసిన శిలాఫలకాలకు రంగులు మార్చి అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నామని హడావుడి చేస్తున్నారన్నారు. శ్రీశైలానికి వరద వచ్చినా పోతిరెడ్డిపాడు గేట్లు ఎందుకు ఎత్తడం లేదు వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే కాటసాని -
సర్వ దర్శనాలకు ప్రత్యేక క్యూలైన్
మంత్రాలయం: శ్రీమఠంలో సర్వదర్శనాలకు గురువారం ప్రత్యేక క్యూలైన్ను ఏర్పాటు చేశారు. దళారుల దందాను అరికట్టేందుకు శ్రీమఠం అధికారులు ఈ విధానాన్ని ఆచరణలోకి తెచ్చారు. సెక్యురిటీ గార్డులు, ఇతర సిబ్బంది క్యూలైన్ల దరిదాపుల్లోకి రాకుండా అధికారులే ప్రత్యక్ష పర్యవేక్షణకు దిగారు. మఠం ప్రధాన ముఖ ద్వారం ముంగిట కారిడార్లో స్టాఫర్లతో క్యూలైన్ విధానం అమల్లోకి తెచ్చారు. మఠం మేనేజర్లు, సూపరింటెండెంట్స్ పర్యవేక్షణలో దర్శనాలకు అనుమతించారు. ఇక సేవా భక్తులు, గ్రామ భక్తులకు మాత్రం 6,7 నంబర్ల గేట్ల క్యూలైన్లలో దర్శనాలకు అవకాశం కల్పించారు. భక్తులు ఎవ్వరూ మోసపోకుండా ఉండేందుకు ఈ విధానం దోహదపడుతోందని స్థానికులు పేర్కొంటున్నారు.ఉమ్మడి జిల్లాలో 184 వ్యవసాయ ప్రదర్శన క్షేత్రాలు కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(ఆత్మ) ఆధ్వర్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 184 వ్యవసాయ ప్రదర్శనా క్షేత్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రాజెక్టు డైరెక్టర్ రత్నప్రసాద్ తెలిపారు. ఈ ప్రదర్శనా క్షేత్రాలను వ్యవసాయ శాఖ రెగ్యులర్ ఏడీఏల ద్వారా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఒక్కో ప్రదర్శన క్షేత్రానికి రూ.4 వేల ప్రకారం రూ.7.33 లక్షలు ఏడీఏలకు విడుదల చేసినట్లు గురువారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలు, ఆదోని సబ్ డివిజన్లో 18, ఎమ్మిగనూరు, ఆలూరు, పత్తికొండ సబ్ డివిజన్లలో 17, డోన్, నందికొట్కూరు, ఆత్మకూరు, నంద్యాల, ఆళ్లగడ్డ, కోవెలకుంట్ల సబ్ డివిజన్లలో 16 ప్రకారం వ్యవసాయ ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆయా సబ్ డివిజన్లలో సాగు చేసే ప్రధాన పంటల్లో వీటిని నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కర్నూలు అర్బన్ బ్యాంక్ సీఈఓ తొలగింపు కర్నూలు(అగ్రికల్చర్): ది కర్నూలు అర్బన్ కో–ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సీఈఓగా పనిచేస్తున్న ఎస్ఏ రఫీక్ను విధుల నుంచి తొలగించినట్లు అఫీషియల్ పర్సన్ ఇన్చార్జ్ కమిటీ చైర్మన్ నాగరమణయ్య తెలిపారు. ఈ నెల 2వ తేదీన సాక్షి దినపత్రికలో ‘రూ.2.42 కోట్ల ప్రజాధనం స్వాహా’ శీర్షికన వార్త ప్రచురితం కావడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. సొసైటీలో జరిగిన అక్రమాలపై నిర్వహించిన సెక్షన్ 51 విచారణలో ఎస్ఏ రఫీక్ పేరు కూడా ఉన్నందున విధుల నుంచి పూర్తిగా తొలగించినట్లు నాగరమణయ్య తెలిపారు. సంఘంలోని సభ్యులు, డైలీ డిపాజిట్ చేసే వారు.. ఇతరులు ఎవ్వరైన ఈయనకు ఎలాంటి నగదు చెల్లించవద్దని సూచించారు. ఎవ్వరైనా ఈయనకు నగదు చెల్లిస్తే సంఘం ఎలాంటి బాధ్యత వహించదని పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ డీడీగా బి. రాధిక కర్నూలు(అర్బన్): సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్గా బి.రాధిక గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ జేడీగా విధులు నిర్వహించిన జె.రంగలక్ష్మిదేవి అమరావతి డైరెక్టరేట్కు బదిలీ కాగా, ఆమె స్థానంలో ఇప్పటి వరకు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కె.తులసీదేవి డీడీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తు వచ్చారు. అన్నమయ్య జిల్లా సాంఘిక సంక్షేమం, సాధికారత అధికారిణిగా విధులు నిర్వహిస్తున్న బి.రాధికను ప్రభుత్వం గత నెల 6న ఇక్కడకు బదిలీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆమె డీడీగా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా జిల్లాలోని సహాయ సంక్షేమాధికారులు, వసతి గృహ సంక్షేమాధికారులు కలిసి అభినందనలు తెలిపారు. -
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం
శ్రీశైలం రిజర్వాయర్లో ప్రస్తుతం నీటిమట్టం 875 అడుగులకు పైగా చేరుకుంది. తుంగభద్ర, హంద్రీ నది నుంచి వరదనీరు వస్తుండటంతో రిజర్వాయర్లో 167.48 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పోతిరెడ్డిపాడు గేట్ల నుంచి వారం రోజుల క్రితమే సాగునీటిని విడుదల చేసే అవకాశం కలిగింది. శ్రీశైలం డ్యాంలో 854 అడుగులకు నీటిమట్టం చేరిన తర్వాత పోతిరెడ్డిపాడు నుంచి నీరిచ్చేందుకు అవకాశమున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. పక్క రాష్ట్రానికి చెందిన ప్రభుత్వానికి భయపడి, కేఆర్ఎంబీ నిర్ణయం సాకు చూపించి, ప్రజలకు కనీసం తాగునీటికి సైతం విడుదల చేయలేపోయింది. కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లె ప్రజలు తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. -
చుట్టూ నీరు ఉన్నా ‘చుక్క’ అందని దుస్థితి. బిరబిరా కృష్ణా నది పరుగులు తీస్తున్నా.. తుంగభద్ర నది పరవళ్లు తొక్కుతున్నా.. పంట కాలువలకు సాగునీరు అందని దౌర్భాగ్యం. రైతుకు మేలు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం స్వప్రయోజనాలకు ‘గేట్లు’ ఎత్తింది. పొలాలను తడిపి పైర్లకు జ
తుంగభద్ర డ్యాం నుంచి దిగువకు విడుదల అవుతున్న నీరు● సాగునీటి ప్రాజెక్టుల నుంచి ఆయకట్టుకు అందని నీరు ● యథేచ్ఛగా దిగువకు వదిలేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ● శ్రీశైలం ప్రాజెక్టులో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి ● గేట్ల భద్రత సాకుతో టీబీ డ్యాంలో తగ్గిన 80 టీఎంసీల నీరు ● టీబీడ్యాం 12 గేట్లు పైకెత్తిన ఇంజినీర్లు -
ఎలాంటి పామో తెలుసుకుని చికిత్స
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని క్యాజువాలిటీ (ఎమర్జెన్సీ మెడిసిన్) విభాగానికి ప్రతి నెలా 22 నుంచి 25 మంది పాముకాటుతో చికిత్స కోసం వస్తుంటారు. కొందరు మెడలో పాములు వేసుకుని వస్తే మరికొందరు బతికున్న పామును, చంపిన పాములతో వస్తుంటారు. ఏ పామో తెలిస్తే సరైన చికిత్స అందిస్తారని వారి ఉద్దేశం. అయితే వ్యక్తికి కాటేసింది ఎలాంటి పామో తెలిస్తే చాలు. వారి లక్షణాలు, పాము కాటేసిన ప్రాంతంలో ఉన్న ఛాయలను బట్టి వైద్యం అందిస్తాం. కొన్నిసార్లు ఏ లక్షణాలు లేకపోయినా 24 గంటల పాటు పరిశీలనలో ఉంచుకుని బాగున్నారంటే ఇంటికి పంపిస్తాం. – డాక్టర్ పి.సుబ్రహ్మణ్యం, ఎమర్జెన్సీ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్, జీజీహెచ్, కర్నూలు పాముకాటుకు నాటు మందు ప్రమాదకరం చాలా మంది పాముకాటు వేసిన వెంటనే నాటు మందు వాడుతుంటారు. ఇది చాలా ప్రమాదకరం. పాము కుట్టిన చోట నీలం, ఎరుపు రంగులో మారుతుంది. కట్లపాము, నాగుపాము కాటువేస్తే అది నాడీ వ్యవస్థపై ప్రభావం చూపి శ్వాస తీసుకోకుండా చేసి వ్యక్తి కోమాలోకి వెళ్తాడు. కళ్లు సరిగ్గా కనిపించవు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కావడం వల్ల గొంతులో కండరాలు బిగుసుకుపోయి నోట్లో నురగ వస్తుంది. ఫిట్స్ కూడా వస్తాయి. రక్తపింజరి కాటు వేయడం వల్ల రక్తం పల్చగా మారి మూత్రం, చిగుళ్లలో రక్తస్రావం జరుగుతుంది. కాబట్టి పాముకాటు వేయగానే నాటు మందు జోలికి వెళ్లకుండా ప్రథమ చికిత్స చేసి వెంటనే ఆసుపత్రికి తీసుకురావాలి. – డాక్టర్ రవికళాధర్రెడ్డి, జనరల్ ఫిజీషియన్, కర్నూలు ● -
సుంకేసులకు దిక్కెవరు?
● తుంగభద్ర నదికి వారం రోజుల్లో వరదలొచ్చే అవకాశం ● బ్యారేజీకీ ఏడాదికిపైగా ఏఈఈ లేరు ● అదనపు బాధ్యతలతోనే నెట్టుకొస్తున్న పరిస్థితి ● 12 మంది తాత్కాలిక ఉద్యోగులతోనే సరి ● కేసీ కెనాల్ కర్నూలు సబ్ డివిజన్కు ఏడాదిగా డీఈఈ పోస్టు ఖాళీ ● ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోకుండా అడ్డుకుంటున్న ఇంజనీర్ కర్నూలు సిటీ: దక్షిణ భారత దేశంలోనే అత్యంత పురాతనమైనది కర్నూలు–కడప కాలువ (కేసీ కెనాల్). ఈ కాలువకు నీటిని మళ్లించేందుకు తుంగభద్ర నదిపై నిర్మించిన సుంకేసుల బ్యారేజీ ఎంతో కీలకమైంది. అలాంటి బ్యారేజీ నిర్వహణను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గాలికి వదిలేసింది. దేశంలో అత్యంత నమ్మకంగా నీటి లభ్యత కలిగిన నదుల్లో తుంగభద్ర ఒకటి. ఈ నదికి ఏటా వరదలు వస్తుంటాయి. వరదల సమయంలో సుంకేసుల బ్యారేజీ వద్ద పర్యవేక్షణ చేసేందుకు రెగ్యులర్ సిబ్బంది, ఏఈఈ ఇంజినీర్ లేరు. చాలా ఏళ్లుగా రెగ్యులర్ సిబ్బంది లేక 12 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు. దీంతో పాటు ఏడాదికిపైగా రెగ్యులర్ ఏఈఈని నియమించకపోవడంతో ఆ పోస్టు ఖాళీగానే ఉంది. ఖరీఫ్ సీజన్ మొదలు కావడంతో తుంగభద్ర నదికి ఇప్పటికే రెండు, మూడు సార్లు వరద నీరొచ్చింది. ఈ బ్యారేజీ నుంచి ఏటా 150 నుంచి 450 టీఎంసీలకుపైగా వరద నీరు ప్రవహిస్తుంది. అంత కీలకమైన చోట రెగ్యులర్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, రెగ్యులర్ డీఈఈ పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. దీంతో ఏఈఈ బాధ్యతలు తాత్కాలికంగా మరో ఇంజినీర్తో చేయించుకుంటున్నారు. కాలువకు నీరు వదిలితే సదరు ఇంజినీర్ తన రెగ్యులర్ విధులతో పాటు, అదనపు భాద్యతలు నిర్వహించడం భారంగానే ఉంటుంది. రెగ్యులర్ ఏఈఈ లేకపోవడంతో బ్యారేజీపై పర్యవేక్షణ కరువై.. నిర్వహణ పనులను సైతం సక్రమంగా చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. రెగ్యులర్ డీఈఈ నియామకాన్ని అడ్డుకుంటున్నదెవరు? కర్నూలు–కడప కాలువ కర్నూలు సబ్ డివిజన్లో డీఈఈగా పనిచేస్తున్న రఘు రామిరెడ్డి గతేడాది నాణ్యత నియంత్రణ విభాగానికి బదిలీ అయ్యారు. ఆ తరువాత హంద్రీనీవా సుజల స్రవంతి డివిజన్–3లో డీఈఈగా పనిచేస్తున్న ప్రసాద్రావుకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. రెగ్యులర్ విధులతో పాటు, అదనపు బాధ్యతలను ఏడాది పాటు నిర్వహించారు. అయితే ఈ ఏడాది మార్చి తరువాత హంద్రీ – నీవా విస్తరణ పనులు మొదలు కావడంతో అదనపు బాధ్యతల నిర్వహణ కష్టంగా మారింది. ఇటీవల జరిగిన బదిలీల్లో ప్రసాద్రావు హంద్రీ – నీవా సర్కిల్–2 పరిధిలోని అనంతపురం బత్తులపల్లికి బదిలీ అయ్యారు. అదనపు బాధ్యతలు చూసే డీఈఈ బదిలీ అయినా ఇంతవరకు రెగ్యులర్ డీఈఈని నియమించలేదు. తుంగభద్ర నదికి వరదలు వస్తున్న సమయంలో బ్యారేజీకి ఏఈఈ, డీఈఈలు, ఇద్దరు రెగ్యులర్ అధికారులు లేకపోవడంతో నిర్వహణ పర్యవేక్షణపై ఆందోళన నెలకొంది. వాస్తవానికి కేసీ కర్నూలు సబ్ డివిజన్కి రెగ్యులర్ డీఈఈని నియమించకుండా ఏడాదిగా ఓ ఇంజినీర్ సొమ్ములిచ్చి కూటమి నేతల ద్వారా అడ్డుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇన్చార్జ్ బాధ్యతలు చూస్తున్న డీఈఈ సైతం పక్క జిల్లాకు బదిలీ అయినా తన బాధ్యతలు కొనసాగేలా ఓ మంత్రి ద్వారా ప్రయత్నిస్తున్నట్లు జల వనరుల శాఖలో చర్చ జరుగుతుంది. ఈ విషయంపై జల వనరుల శాఖ కర్నూలు సర్కిల్ పర్యవేక్షక ఇంజినీర్ బాలచంద్రారెడ్డిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. -
విష సర్పాలతో జాగ్రత్త!
● వర్షాలకు బయటకు వస్తున్న పాములు ● ఇప్పటికే పలువురికి పాముకాటు ● పొలాలు, పొదలు, తుప్పల్లో పొంచి ఉన్న విషనాగులు ● జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యులు● బేతంచర్ల మండల పరిధిలోని ఆర్ఎస్ రంగాపురం గ్రామంలో రంగమ్మ (46) గత నెల 2వ తేదీన వేరుశనగ పంట తొలగింపు పనులకు వెళ్లి పైరును తొలగిస్తుండగా చేతికి పాముకాటు వేసింది. కుటుంబసభ్యులు ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం బేతంచర్ల సీహెచ్సీకి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించగా పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్దారించారు. ● ఆదోని పట్టణంలోని ఎరుకల కాలనికి చెందిన అభిరామ్ అనే బాలుడు రెండో తరగతి చదువుతున్నాడు. గత నెల 24వ తేదీన ఇంట్లో భోజనం చేస్తుండగా కాలు వద్ద ఏదో కుట్టినట్లు అనిపించి తల్లిదండ్రులకు చెప్పాడు. వెంటనే ఆదోని ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యులకు చూపించగా పాము కాటేసిందని గుర్తించి వైద్యం అందిస్తుండగా కోలుకోలేక మృతి చెందాడు.కర్నూలు(హాస్పిటల్): వర్షాలు కురుస్తున్నందున భూమి పొరల్లో నుంచి విష పురుగులు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో పలువురు ఇప్పటికే పాముకాట్లకు గురై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా నెల రోజుల్లో ఇద్దరు మరణించారు. పొదలు, తుప్పలు, రాళ్ల కుప్పల్లో పొంచి ఉన్న పాములను గుర్తించకుండా వెళ్లడంతో కాటువేస్తున్నాయి. వాటి కాటుకు గురైన వారు సమీపంలోని పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా ఆసుపత్రులు, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు చికిత్స కోసం వస్తున్నారు. అన్ని చోట్లా యాంటీ స్నేక్ వీనమ్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉంటున్నాయి. సకాలంలో వచ్చిన వారికి ప్రథమ చికిత్స చేసి వీటిని వేసి మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు పంపిస్తున్నారు. అయితే చాలా మంది పాముకాటుకు గురైన చాలా సేపటికి ఆసుపత్రికి వైద్యం కోసం వస్తుండటంతో ఆలస్యమై వారి ప్రాణాల మీదకు తెస్తోంది. పాము కాటు వేసిన వెంటనే ఆందోళనకు గురికావడం, ప్రథమ చికిత్సపై అవగాహన లేకపోవడం, ఆసుపత్రికి తరలించడంలో ఆలస్యం కావడం వంటి కారణాలతో విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. త్రాచు పాము, కట్ల పాము వంటి 15 శాతం పాములే ప్రమాదకరమైనవి. అన్ని పాముకాట్లు ప్రమాదకరమైనవి కావని వైద్యులు చెబుతున్నారు. -
దంపతుల ప్రాణాల మీదకు తెచ్చిన మద్యం
గోనెగండ్ల: భర్త మద్యం అలవాటు ఆ దంపతుల ప్రాణాల మీదకు తెచ్చింది. వివరాలు.. గోనెగండ్లలోని కురువ పేటకు చెందిన పెద్ద ఈరన్న, ఉరుకుందమ్మకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. వ్యవసాయం, కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మద్యానికి బానిసైన ఈరన్న డబ్బుల కోసం భార్యను వేధించేవాడు. బుధవారం రాత్రి ఇదే విషయమై దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. డబ్బులు ఇవ్వకపోతే పురుగు మందు తాగి చస్తానని ఈరన్న బెదిరించాడు. ఆగ్రహానికి లోనైన భార్య ఉరుకుందమ్మ తానే పురుగు మందు తాగి చస్తానని చెబుతూ పొలం కోసం తెచ్చిన పురుగు మందు తాగింది. అయోమయానికి లోనైన ఈరన్న డబ్బాలో మిగిలిన పురుగు మందు తాగేశాడు. ఇద్దరు స్పృహ కోల్పోయారు. కాలనీవాసులు వారిని గోనెగండ్ల ప్రభుత్వ ఆస్పత్రికి అక్కడినుంచి ఎమ్మిగనూరు ఆస్పత్రికి తర్వాత కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై సీఐ విజయభాస్కర్ మాట్లాడుతూ.. భార్యభర్తలు పురుగు మందు తాగినట్లు తెలిసిందని, బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తే ఆ మేరకు విచారణ చేస్తామని వెల్లడించారు. -
వర్షంలో తడవకుండా షెడ్డులోకి వెళ్లి..
మహానంది: వర్షానికి తడవకుండా రేకుల షెడ్డు కిందకు వెళ్లిన యువకుడు విద్యుత్దాఘాతానికి గురై మృతి చెందిన సంఘటన తమ్మడపల్లెలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన కోల శేషాద్రి (19) బంధువుల ఇంటికి వెళ్లాడు. బయటికి రాగా వర్షం పడుతుండటంతో పక్కనే ఉన్న రేకుల షెడ్డు కిందకు వెళ్లాడు. షెడ్డుపైన తీగలు తెగిపడి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యింది. పైపులకు కరెంటు సరఫరా కావడంతో వాటిని పట్టుకుని నిలబడిన యువకుడు విద్యుత్ షాక్కు గురై పడిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా కోలుకోలేక మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు, బంధుమిత్రులు శోక సంద్రంలో మునిగారు. విషయం తెలుసుకున్న విద్యుత్శాఖ ఏఈ ప్రభాకర్రెడ్డి, గ్రామ నాయకుడు జనార్ధన్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విద్యుత్ షాక్తో యువకుడు మృతి -
పాము కరవగానే ఇలా చేయాలి
● పాము కరవగానే భయాందోళనకు గురిగాకుండా ధైర్యంగా ఉండాలి. బంధుమిత్రులు కూడా వారికి ధైర్యం చెప్పాలి. ● ఆ పాము విష సర్పమో కాదో గుర్తించే ప్రయత్నం చేయాలి. దానివల్ల చికిత్స మరింత కచ్చితంగా అందించవచ్చు. ● నాటు వైద్యం, మంత్రతంత్రాల జోలికి వెళ్లకుండా సాధ్యమైనంత తొందరగా దగ్గరలోని ఆసుపత్రికి రోగిని నడిపించకుండా తీసుకెళ్లాలి. ఇలా చేయకూడదు ● పాముకాటు వేయగానే కొందరు ఆ గాయాన్ని మరింతగా కోస్తే రక్తంతోపాటు విషం వచ్చేస్తుందని కత్తితో, బ్లేడుతో గాటు పెడతారు. అలా చేయడం వల్ల ఒక్కోసారి పాముకాటు కన్నా ఈ గాయం ప్రమాదకరంగా మారవచ్చు. శాసీ్త్రయమైన చికిత్స సాధ్యమైనంత త్వరగా అందించడమే ఉత్తమం. ● మరికొందరు పాము కరిచిన ప్రదేశంలో గాటుపెట్టి నోటితో విషం పీల్చేస్తుంటారు. పాముకాటు వేయగానే విషం రక్తం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు, గుండెకు చేరుకుంటుంది. కాబట్టి దీనివల్ల ప్రయోజనం ఉండదు. ఒక్కోసారి హాని కలగవచ్చు కూడా. ● అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పాముకాటుకు ఉచిత చికిత్స లభిస్తుంది. వైద్యునికి రోగి గురించి సమాచారాన్ని ముందే అందజేస్తే త్వరగా మెరుగైన చికిత్స అందజేసే వీలుంది. -
భర్త చేష్టలు భరించలేక గడప దాటిన ఇల్లాలు
మంత్రాలయం: భర్త చేష్టలను భరించలేక ఓ ఇల్లాలు తన పిల్లలతోపాటు ఇంటినుంచి వెళ్లిపోయింది. నాలుగు రోజులపాటు శ్రీమఠం ముంగిట పిల్లలతో గడిపింది. బాధను ఎవరికీ చెప్పుకోలేక కన్నీళ్లు దిగమింగుతూ వెల్లదీసింది. భక్తులను యాచిస్తూ పిల్లలకు ఆకలి దప్పులు తీర్చింది. వివరాలివి.. కర్ణాటకలోని రాయచూరు జిల్లా, కలమల గ్రామం, మారుతి నగర్కు చెందిన శివమ్మకు భర్తతో సరిపోక కూతురు వర్షిణి, కుమారుడు నాగరాజతో కలిసి నాలుగు రోజుల క్రితం మంత్రాలయం వచ్చింది. అక్కడ భక్తులను అడుక్కుంటూ పిల్లలను పోషించింది. భార్యాపిల్లలు కనబడకపోవడంతో భర్త బసవరాజు రాయచూరులోని నేతాజీనగర్ పోలీస్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా బుధవారం స్థానిక ఎస్ఐ శివాంజల్కు సమాచారం రావడంతో ఫొటోలు తెప్పించుకుని ఊరంతా వెతికారు. కానిస్టేబుల్ రంగస్వామి శ్రీమఠం ప్రాంగణంలో ఆ తల్లీబిడ్డలను గుర్తించి స్థానిక పోలీసు స్టేషన్కు తీసుకెళ్లారు. విచారణ సమయంలో ఆమె తన భర్త బసవరాజుతో వెళ్లేందుకు విముఖత వ్యక్తం చేసింది. ఎస్ఐ శివాంజల్ వారిని రాయచూరు పోలీసులకు అప్పగించారు. ఏదేమైనా తల్లీబిడ్డలు సురక్షితంగా దొరకడంతో అటు రాయచూరు పోలీసులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇద్దరు పిల్లలతో మంత్రాలయం చేరుకున్న తల్లి నాలుగు రోజులుగా శ్రీమఠం ముంగిట యాచిస్తూ పొట్టనింపుకున్న వైనం -
పోలీసుల అదుపులో హత్యకేసు నిందితులు
కర్నూలు: కర్నూలు మండలం సూదిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన కురువ శేషన్న (62)ను హత్య చేసిన దుండగులను కర్నూలు అర్బన్ తాలూకా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శేషన్న లారీ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈయన ఇంటి వెనుక ఉన్న అదే సామాజిక వర్గానికి చెందిన తెల్లన్న కుమారులు గోవిందప్ప అలియాస్ చౌదరి, బీసన్న, కుమార్, పరుశురాముడు కలిసి మంగళవారం రాత్రి శేషన్న ఇంట్లోకి దూరి కత్తులతో దాడి చేసి హత్య చేశారు. విషయం తెలిసిన వెంటనే కర్నూలు అర్బన్ తాలూకా పోలీసులు గ్రామానికి చేరుకుని ఉద్రిక్త పరిస్థితిని అదుపు చేశారు. నిందితుల్లో ఒకరు శేషన్న కాలును నరికి తీసుకెళ్లి పోలీసులకు లొంగిపోగా మిగతా ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పరశురాముడు భార్యను కొంతకాలంగా శేషన్న వేధిస్తుండటం వల్లే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు విచారణలో నిందితులు అంగీకరించినట్లు సమాచారం. శేషన్న కూతురు శకుంతల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అనాథ పిల్లలకు వైద్యపరీక్షలు కర్నూలు(హాస్పిటల్): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ వాత్సల్య ప్రోగ్రాంలో భాగంగా జిల్లాలోని అనాథ పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు రాష్ట్రీయ బాలస్వాస్త్య కార్యక్రమ జిల్లా నోడల్ అధికారి డాక్టర్ మహేశ్వర ప్రసాద్ చెప్పారు. ఆయన బుధవారం మాట్లాడుతూ.. జిల్లాలోని పెద్దపాడులో 49 మంది, పత్తికొండలో 33 మంది, కర్నూలులోని స్పెషల్ అడాప్షన్ ఏజెన్సీలో ముగ్గురు, చైల్డ్ హోమ్స్, చైల్డ్ ఇన్స్టిట్యూట్లలో 131 మంది అనాథ పిల్లలు ఉన్నట్లు గుర్తించామన్నారు. వీరికి డిస్ట్రిక్ట్ అర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ (డైస్) వైద్య బృందం వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స అందిస్తారన్నారు. అలాగే ఈ నెల 10న ప్రతి ప్రభుత్వ పాఠశాలలో పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో 1,459 ప్రభుత్వ పాఠశాలలో 3,14,892 మంది విద్యార్థులు ఉన్నారని, వారికి ఏఎన్ఎం, ఎంఎల్హెచ్పీలు వైద్య పరీక్షలు చేస్తారన్నారు. ముందుగా హాస్టళ్లలో ఈ కార్యక్రమం నిర్వహించి, అనంతరం ఈ ఏడాది చివరిలోపు తొలి విడత స్క్రీనింగ్ పూర్తి చేస్తామని చెప్పారు. ఉద్యోగం పేరిట సైబర్ మోసం గోనెగండ్ల: సైబర్ మోసగాళ్ల ఉచ్చులో పడి హెచ్.కై రవాడి గ్రామానికి చెందిన కురువ వీరేష్ రూ.45 వేలు మోసపోయాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. హెచ్.కై రవాడికి చెందిన కురువ వీరేష్ డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో జూన్ 26న ఓ మొబైల్ యాప్లో ఉద్యోగ నోటిఫికేషన్ లింక్ను క్లిక్ చేశాడు. హీరో హోండా షోరూంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు అప్లికేషన్ కోసం రూ.3 వేలు పంపాలని చూపడంతో అక్కడ సూచించిన ఖాతాకు డబ్బు ట్రాన్స్ఫర్ చేశాడు. మరుసటి రోజు ఉద్యోగం కావాలంటే కంపెనీ బాండ్ కోసం మరో రూ.3 వేలు చెల్లించాలని చూపడంతో నగదు పంపాడు. తర్వాత 28న బ్యాంకు ఖాతా ఓపెన్ చేసేందుకు రూ.5 వేలు పంపాలని, బ్యాంకు అకౌంట్కు ఆధార్ లింక్ చేసేందుకు మరో రూ.5 వేలు పంపాలని సూచించడంతో అలాగే చెల్లించాడు. తర్వాత మీరు ఇప్పటివరకు కట్టిన డబ్బు తిరిగి మీ అకౌంట్లో జమ కావాలంటే రూ.10 వేలు చెల్లించాలని సూచించడంతో నగదు ట్రాన్స్ఫర్ చేశాడు. ఇలా 5 రోజుల్లో రూ.45 వేలు జమ చేశాడు. మళ్లీ సోమవారం అలాగే ఫోన్ రావడంతో తండ్రికి విషయం చెప్పాడు. దీంతో మోసపోయినట్లు గ్రహించి గోనెగండ్ల పోలీస్ స్టేషన్కు వెళ్లగా వారి సూచన మేరకు కర్నూలులోని సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు. -
‘పోతిరెడ్డిపాడు గేట్లు మేమే ఎత్తేస్తాం’
పాములపాడు: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేయకపోతే తామే గేట్లను ఎత్తుతామని ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. బుధవారం స్థానిక నెమలి వెంకటరెడ్డి సీపీఎం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. శ్రీశైలం ప్రాజెక్టులో ప్రస్తుతం 875 అడుగుల నీటి మట్టం ఉందన్నారు. నీటి మట్టం 851 అడుగులు దాటితే పోతిరెడ్డిపాటు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటిని విడుదల చేసి జిల్లాలోని వెలుగోడు, గోరుకల్లు రిజర్వాయర్లు నింపవచ్చన్నారు. అలాగే తెలుగుగంగ, జీఎన్ఎస్ఎస్ కాలువల ద్వారా జిల్లాలోని అన్ని ప్రాజెక్టులు, చెరువులకు నీటిని సరఫరా చేయవచ్చన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం 875 అడుగులకు చేరినా అధికారులు ఎందుకు అలసత్వం వహిస్తున్నారని ప్రశ్నించారు. మే నెలలో కురిసిన వర్షాలకు రైతులు విత్తనాలు వేశారని, జూన్లో వర్షాలు కురవకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు నీటి విడుదలకు చర్యలు తీసుకోకపోతే ఈ నెల 4న తామే పోతిరెడ్డిపాడు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తామని స్పష్టం చేశారు. కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు స్వామన్న, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బాలయ్య, సీఐటీయూ నాయకులు రాజు తదితరులు పాల్గొన్నారు. స్పష్టం చేసిన ఏపీ రైతు సంఘం నాయకులు అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంపై ఆగ్రహం -
వైఎస్సార్సీపీ జిల్లా బూత్ కమిటీల నియామకం
కర్నూలు (టౌన్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లావ్యాప్తంగా బూత్ కమిటీల నాయకులను నియమించింది. వైఎస్సార్సీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా కమిటీలను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలియజేసింది. బూత్ కమిటీ ఉపాధ్యక్షులుగా జియం.క్రాంతికిరణ్ (కర్నూలు), వి.అమర్నాథ్ రెడ్డి (పత్తికొండ), ప్రధాన కార్యదర్శులుగా రమేష్ (ఆలూరు), జి.పరుశురాముడు (మంత్రాలయం), తులసీ రెడ్డి (కోడుమూరు), సీ.విశ్వనాథ్ (ఆదోని), యం.శివ (కర్నూలు), కె.రమేష్ (ఎమ్మిగనూరు), కార్యదర్శులుగా మోనీ నారాయణ (ఎమ్మిగనూరు), వి.చంద్రశేఖర్ (పత్తికొండ), రామలింగ (ఆలూరు), కె.నాగరాజు (మంత్రాలయం), ఎస్.మారుతి (ఆదోని), ఎ.మహేష్ (కర్నూలు), విద్యాసాగర్ (కోడుమూరు), ఎస్.గఫూర్ (కర్నూలు), కార్యానిర్వహక సభ్యులుగా బి.శివభూషణ రెడ్డి (ఎమ్మిగనూరు), ఏ.రవిశేఖర్ రెడ్డి (పత్తికొండ), నందీష్ (ఆలూరు), యు.రమేష్ (మంత్రాలయం), యం.ఎల్లప్ప (ఆదోని), యంసి.నాగరాజు, ఎస్.నజీర్ (కర్నూలు), రమేష్ (కోడుమూరు) నియమితులయ్యారు. జిల్లా డాక్టర్ల విభాగం కమిటీ జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ల కమిటీని నియమించారు. ఉపాధ్యక్షులుగా పి.రంగారెడ్డి (పత్తికొండ), జె.ఈరన్న (మంత్రాలయం), ప్రధాన కార్యదర్శులుగా చంద్రశేఖర్ (ఆలూరు), ఎస్.నరహరి రెడ్డి (ఎమ్మిగనూరు), కార్యదర్శులుగా బండ్ల శివరాముడు (ఎమ్మిగనూరు), సి.జయక్రిష్ణ (పత్తికొండ), క్రిష్ణమూర్తి (ఆలూరు), యం.మహబూబ్బాషా ( మంత్రాలయం), కార్యనిర్వహక సభ్యులుగా చెన్నప్ప (ఎమ్మిగనూరు), కె.మనోహర్ ఆచారి (పత్తికొండ), ఎస్.మోహన్ రెడ్డి (ఆలూరు), వి.రాగరాజు (మంత్రాలయం)ను పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. -
ఇంటింటా చేదు అనుభవం
కర్నూలు(హాస్పిటల్): ‘ఇంటింటికీ సుపరిపాలన’ పేరుతో కర్నూలు ప్రజల వద్దకు వెళ్లిన మంత్రి టీజీ భరత్, ఎంపీ బస్తిపాటి నాగరాజుకు ఇంటింటా చేదు అనుభవం ఎదురైంది. ప్రభుత్వ పథకాలు అందడం లేదంటూ ప్రజలు నిలదీశారు. పింఛన్ ఇవ్వట్లేదని, గ్యాస్ సబ్సిడీ అందడం లేదని, తల్లికి వందనం డబ్బులు పడలేదంటూ మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి టీజీ భరత్, ఎంపీ నాగరాజు బుధవారం ఉదయం నగరంలోని బుధవారపేటలో పర్యటించారు. ప్రజల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ఆరా తీశారు. వారు తిరిగిన ఇళ్లల్లో అత్యధిక శాతం మంది తమకు సంక్షేమ పథకాలేవీ అందడం లేదని జవాబులివ్వడంతో.. టీడీపీ నేతలు కంగుతిన్నారు.పింఛన్ ఎందుకివ్వట్లేదు?పింఛన్ కోసం దరఖాస్తు చేసుకొని ఏడాదైనా ఇప్పటికీ మంజూరు చేయలేదని సుంకులమ్మ అనే వృద్ధురాలు ప్రశ్నించింది. తనకు పదేళ్ల క్రితం ప్రమాదంలో కాళ్లు పోయాయని.. అయినా వికలాంగుల పింఛన్ ఎందుకు ఇవ్వట్లేదని సందెపోగు రఘు అనే వృద్ధుడు నిలదీశాడు. కనీసం వృద్ధాప్య పింఛన్ కూడా ఇవ్వట్లేదని మండిపడ్డాడు. పదో తరగతి చదువుతున్న తనకు తల్లికి వందనం డబ్బులు పడలేదని మేరి కుమారి అనే విద్యార్థిని వాపోయింది. తమకు ఉచిత గ్యాస్ పథకం ఎందుకు వర్తింపజేయలేదంటూ విజయ్కుమార్ అనే వ్యక్తి టీడీపీ నేతలను నిలదీశారు. తాను బీటెక్ పూర్తి చేశానని.. ఉద్యోగం ఇప్పించాలని మంత్రిని దీపిక అనే యువతి కోరారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాగానే ఉద్యోగం ఇప్పిస్తానంటూ మంత్రి భరత్ జవాబివ్వడంతో ఆమె షాక్కు గురైంది. మంత్రి మీడియాతో మాట్లాడుతూ..ఎవరో ఒకరిద్దరు పథకాలు అందలేదని చెబితే ‘సాక్షి’లో అవే చూపిస్తారంటూ అక్కసు వెళ్లగక్కారు.వితంతు పింఛన్లు ఎప్పుడిస్తారు?జి.సిగడాం: ‘ఎంపీ బాబూ.. మా ఇంటి పెద్ద దిక్కు మరణించి ఏడాది కాలమైనా ఇంత వరకు వితంతువుల పింఛన్లు ఎందుకు ఇవ్వడం లేదు. మేమంతా అనాథలుగా ఉన్నాం. వీటితోపాటు తల్లికి వందనం కింద రూ.15 వేలు అన్నారు. రూ.13 వేలు మాత్రమే మా ఖాతాలో జమ చేశారు. ఇదేనా సుపరిపాలన?’ అంటూ వితంతువులు విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడును శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం, ఆనందపురం గ్రామాల్లో నిలదీశారు. -
కూటమి పాలనలో అంతా చీకట్లు
● చంద్రబాబు మోసాలను క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజల్లో తీసుకెళ్దాం ● ఏడాది పూర్తయినా అభివృద్ధి, సంక్షేమం లేదు ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఆలూరు: కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా పేదల జీవితాల్లో చీకట్లు నింపిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే బి.విరూపాక్షి విమర్శించారు. ఆలూరులోని స్థానిక ఉమా కల్యాణ మండపంలో ఆవరణలో మంగళవారం వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు కె. మల్లికార్జున ఆధ్వర్యంలో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అథితులుగా ఎస్వీ, ఎమ్మెల్యేతోపాటు వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు తెర్నెకల్ సురేంద్రరెడ్డి, జనార్దన్నాయుడు, జనరల్ సెక్రటరీ షరీఫ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్వీ మోహన్రెడ్డి, విరూపాక్షి మాట్లాడుతూ.. అధికారం కోసం చంద్రబాబునాయుడు ప్రజల ను హామీలతో మోసం చేశారన్నారు. గత వైఎస్సా ర్సీపీ ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేసి పేదల ఇళ్లకు నవరత్నాలు చేర్చారన్నారు. అనంతరం ‘చంద్రబాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ పేరుతో క్యూర్ కోడ్ పోస్టర్లను ఆవిష్కరించారు. స్మార్టు ఫోన్ ద్వారా కూటమి ఇచ్చిన హామీలు ఎన్నీ.. ఎగ్గొట్టినవి ఎన్ని.. అనేది చూసుకునే అవకాశం ఉందన్నారు. ఈనెల 10 నుంచి 18వ తేదీ వరకు మండల స్థాయిలో నాయకులు గ్రామాల్లో పర్యటించి సీఎం చంద్రబాబు నాయుడు మోసాలను ప్రజలకు వివరించాలన్నారు. రెడ్ బుక్లకు భయపడేది లేదు.. రెడ్ బుక్లు ఎన్నో చూసి రాజకీయాల్లో కొనసాగుతున్నామని ఎస్వీ మోహన్రెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు ఇలాంటి బుక్లు అమలు చేసి ఉంటే టీడీపీలో ఎవరూ ఉండేవారు కాదన్నారు. ఈ విషయం సీఎం చంద్రబాబు, మంత్రి నారాలోకేష్కు కూడా బాగా తెలుసునన్నారు. అబద్దాలతో పాలన కొనసాగించడం ప్రజలను మోసం చేయడమేనని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నెకల్ సురేంద్రరెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా నిరుద్యోగులకు చేసిందేమీ లేదన్నారు. సమావేశంలో పీఆర్ వింగ్, ఎస్సీ సెల్, కళాకారుల వింగ్ సంయుక్త కార్యదర్శులు ఓబులేసు, మహానంది, శేషప్ప, వీరేశప్ప, జిల్లా దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు రామాంజనేయులు, మేధావుల సంఘం కార్యదర్శి శివానంద, జిల్లా అధికార ప్రతినిధి మల్లికార్జున, యువజన రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్, మైనార్టీ సెల్ కార్యదర్శి ఇమ్రాన్, జిల్లా కార్యదర్శులు శ్రీనివాసులు, ఈరన్న, ఉపాధ్యక్షులు గిరి, పెద్దయ్య, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు మారయ్య, రామిరెడ్డి, షఫి ఉల్లా, రామకృష్ణ, బసవరాజ, జెడ్పీటీసీ సభ్యులు దొరబాబు, నాయకులు శ్రీరాములు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
క్వాలిటీ కంట్రోల్ డీఈఈగా మధుసూదన్
కర్నూలు(అర్బన్): గ్రామీణ నీటి సర ఫరా విభాగం ఉమ్మ డి కర్నూలు జిల్లా క్వాలిటీ కంట్రోల్ డీఈఈగా బీవీ మధుసూదన్ స్థానిక జెడ్పీ ప్రాంగణంలో ని క్యూసీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు క్యూసీ డీఈఈగా విధులు నిర్వహించిన కుష్కుమార్రెడ్డి గత జూన్ 30న పదవీ విరమణ పొందారు. ఈ నేపథ్యంలో నంద్యాల జిల్లా బనగానపల్లె ఆర్డబ్ల్యూఎస్ డీఈఈగా విధులు నిర్వహిస్తున్న మధుసూదన్కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు, మూడు రోజుల్లో క్యూసీలో పనిచేస్తున్న ఇంజనీర్లు, సిబ్బందితో సమావేశం నిర్వహించి జిల్లాలో కొనసాగుతున్న పనులపై చర్చిస్తామన్నారు. అనంతరం జిల్లాలో ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న పనుల్లో నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ఆరాధన ఉత్సవాల నిర్వహణపై సమీక్ష మంత్రాలయం : ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో వచ్చే నెల 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఆరాధన ఉత్సవాలు జరగనున్నాయి. మంగళవారం స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో వివిధ శాఖల అధికారులు, శ్రీమఠం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో ఆరాధన ఉత్సవాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, శాంతి భద్రతలు, భక్తుల సౌకర్యాలు, నది తీరంలో భక్తుల స్నానాలు, వసతులు, ప్రసాదాలు వంటి అంశాలతో మధ్యారాధన, రథోత్సవం రోజు తీసుకోవాలసిన భద్రతపై పోలీసు, రెవెన్యూ, ఎండోమెంట్, ఫైర్ సిబ్బంది తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. అలాగే గ్రామ సర్పంచ్ బాధ్యతీసుకుని స్వచ్ఛతపై దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలని శ్రీమఠం మేనేజర్ ఎస్కే శ్రీనివాస్రావు సూచనలు చేశారు. స్పౌజ్ పింఛన్ల పంపిణీలో చేతులెత్తేసిన ప్రభుత్వం కర్నూలు(అగ్రికల్చర్): స్పౌజ్ పింఛన్ల పంపిణీపై కూటమి ప్రభుత్వం వితంతు మహిళలను తీవ్ర మానసిక వేదనకు గురి చేస్తోంది. ముందుగా జూన్ 12న పంపిణీ చేస్తున్నామంటూ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది. నిధులు కూడా బ్యాంకులకు విడుదల చేసినట్లు ప్రకటించింది. అయితే ఆ రోజు పింఛన్లు పంపిణీ చేయలేక చేతులెత్తేసింది. జూలై నెల పింఛన్లతో పాటు స్పౌజ్ పింఛన్లను కూడా పంపిణీ చేస్తామని ఇటీవల ప్రకటించారు. అయితే మంగళవారం పింఛన్ల పంపిణీ సమయానికి స్పౌజ్ పింఛన్ల పంపిణీని నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వితంతు మహిళల్లో ఆందోళన నెలకొంది. దాదాపు నెల రోజుల క్రితం నుంచి వేలాది మంది మహిళలను కూటమి ప్రభుత్వం ఊరిస్తోంది. కర్నూలు జిల్లాలో 2,319, నంద్యాల జిల్లాలో 2,463 ప్రకారం స్పౌజ్ పింఛన్లు మంజూరు చేసినా, పంపిణీలో మొండిచేయి చూపుతుండటం విమర్శలకు తావిస్తోంది. పింఛన్ల పంపిణీలో 19వ స్థానం పింఛన్ల పంపిణీలో మంగళవారం సాయంత్రం 6 గంటల సమయానికి కర్నూలు జిల్లా రాష్ట్రంలో 19వ స్థానం, నంద్యాల జిల్లా 16వ స్థానంలో నిలిచాయి. ఎక్కువ భాగం సచివాలయాలు, రచ్చబ ండల వద్దే పింఛన్ల పంపిణీ చేపట్టడం గమనార్హం. -
మా పాఠశాలలోనే చదువుకుంటాం!
కర్నూలు(సెంట్రల్): ‘మా పాఠశాల మాకే కావాలి.. వేరే పాఠశాలకు వెళ్లమని’ కర్నూలు నగరంలో ని బి.క్యాంప్ నగరపాలక ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు కలెక్టరేట్ ఎదుట భీష్మించారు. మంగళవార ఉదయమే విద్యార్థులు కలెక్టరేట్కు చేరుకొని తమను అదే పాఠశాలలో కొనసాగించాలని కోరుతూ నిరసన చేపట్టారు. ప్రస్తుతం ఆ పాఠశాలలో ఒకటి నుంచి 8వ తరగతి వరకు తరగుతులు ఉన్నాయి. అయితే 6, 7, 8 తరగతులను సమీపంలోని బి.క్యాంపు బాలురు, బాలికల ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం విలీనం చేసింది. దీనిపై ఆగ్రహించిన విద్యార్థులు తాము మరో పాఠశాలకు వెళ్లమని, అదే పాఠశాలలో చదువుకుంటామని చెప్పారు. కాగా, అటుగా వెళ్తున్న డీఈఓ శామ్యూల్పాల్ విద్యార్థుల వద్దకు వచ్చి పాఠశాలకు వెళ్లాలని కోరారు. అయితే వారు మా పాఠశాలకే వెళ్తామని, విలీన పాఠశాలకు వెళ్లమని చెప్పడంతో ఆయన ఏమీ చెప్పలేక అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, విద్యార్థుల ఆందోళనకు ఏఐడీఎస్ఓ, పీడీఎస్యూ, బీఎస్యూ విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. -
జాడలేని వరుణుడు
● రైతులను ఊరించిన ముందస్తు వర్షాలు ● ఇప్పటికే లక్ష హెక్టార్లలో పంటల సాగు ● జూన్ నెలలో దాదాపు 20 మండలాల్లో అత్యల్ప వర్షపాతం ● దెబ్బతింటున్న పత్తి, ఉల్లి, వేరుశనగ తదితర పంటలు మంచి పదునులోనే విత్తనం వేసుకోవాలి ఖరీఫ్ సీజన్కు సంబంధించి అంతంతమాత్రం తేమలో విత్తనం విత్తుకోవద్దు. నల్లరేగడి నేలల్లో 75 మి.మీ వర్షపాతం ఒక్క రోజులో నమోదైనా, లేదా వరుసగా మూడు రోజుల్లో నమోదైనప్పుడు మాత్రమే విత్తనం వేసుకోవాలి. ఎర్ర నేలల్లో కనీసం మూడు రోజులు లేదా ఒక్కరోజులో 50 మి.మీ వర్షపాతం నమోదైనప్పుడు మాత్రమే విత్తనం వేసుకోవడం మంచింది. అంతంతమాత్రం తేమలో విత్తనం వేసుకుంటే మొలక సరిగా రాదు. రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. – సుజాతమ్మ, ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త కోడుమూరు మండలం వర్కూరు వద్ద వాడు పట్టిన పత్తి పంటమాకున్న 8 ఎకరాల పొలం ఉంటే ఆరు ఎకరాల్లో పత్తి సాగు చేశాం. ఇప్పటికే రెండు సార్లు మందులు పిచికారీ చేశాం. బిటీ విత్తన ప్యాకెట్లు, ఎరువులు, ఎద్దుల బాడుగలు తదితరాలకు ఎకరాకు రూ.20వేల వరకు పెట్టుబడి పెట్టాం. జూన్ నెలలో వర్షాలు లేక పత్తి పంట దెబ్బతినింది. మా గ్రామంలో 75 శాతం పత్తి సాగు చేస్తాం. ప్రభుత్వం అన్నదాత సుఖీభవ, పంటల బీమాతో ఆదుకుంటే తప్ప రైతులు కోలుకునే పరిస్థితి లేదు. – మోహన్రెడ్డి, జాలవాడి గ్రామం, పెద్దకడబూరు మండలం కర్నూలు(అగ్రికల్చర్): వరుణుడి జాడలేకపోవడంతో ఖరీఫ్ సాగు ఆందోళన కలిగిస్తోంది. ముందస్తు రుతుపవనాలు సంతోషం కలిగించినా నాలుగైదు రోజులకే పరిమితమైంది. సీజన్లో నెల గడచిపోతున్నప్పటికీ పంటల సాగు ఎక్కడికక్కడే నిలిచిపోయింది. జూన్ నెలలో పురోగమించాల్సిన వ్యవసాయం తిరోగమన దిశగా పయనిస్తోంది. 2024–25లో అధిక వర్షాలు, అనావృష్టితో వ్యవసాయం కలసిరాక రైతులు తీవ్రంగా నష్టపోయారు. 2025–26 సంవత్సరానికి రుతుపవనాలు మే నెల చివరి వారంలోనే విస్తరించాయి. ముందస్తు రుతుపవనాలతో రైతులు సంతోషించారు. అయితే కొద్ది రోజులకే రుతుపవనాలు ప్రభావం చూపకపోవడంతో సాగు ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది. ఖరీఫ్ సాధారణ సాగు 4,22,540 హెక్టార్లు ఉండగా.. వ్యవసాయ శాఖ అధికారుల లెక్కల ప్రకారం 1,15,423 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఇప్పటికే దాదాపు 2లక్షల హెక్టార్లలో పంటలు సాగైనట్లు తెలుస్తోంది. మే నెల సాధారణ వర్షపాతం 40.1 మి.మీ ఉండగా.. రికార్డు స్థాయిలో 106.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో పత్తి సాగు భారీగా పెరిగింది. జూన్ నెల సాధారణ వర్షపాతం 77.1 మి.మీ ఉండగా.. 74.3 మి.మీ వర్షపాతం కురిసింది. దాదాపు 20 మండలాల్లో అత్యల్ప వర్షాలు కురిశాయి. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండాల్సిన మే నెలలో విస్తారంగా వర్షాలు కురిశాయి. వర్షాలు కురవాల్సిన జూన్ నెలలో ఎండలు, గాలుల తీవ్రత పెరిగింది. ఫలితంగా నెలల్లో తేమ ఆరిపోతుండటంతో పంటలు దెబ్బతింటున్నాయి. ఆదోని, ఆలూరు, ఆస్పరి, పెద్దకడుబూరు, పత్తికొండ, మద్దికెర, హాలహర్వి, మంత్రాలయం, దేవనకొండ, సి.బెళగల్, కోడుమూరు, కల్లూరు తదితర మండలాల్లో పత్తి, ఉల్లి సాగు ఎక్కువగా ఉంది. జూన్ మాసంలో వర్షాలు తేలికపాటికే పరిమితం కావడంతో పంటల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కన్నీరు పెడుతున్న ఆస్పరి పశ్చిమ ప్రాంతంలోని ఆస్పరి మండలంలో దయనీయమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మండలంలో జూన్ నెల సాధారణ వర్షపాతం 91.8 మి.మీ. అయితే మూడు రోజులు మాత్రమే వర్షం కురిసింది. 26 రోజులు చినుకు జాడ లేకుండాపోయింది. జూన్ 12న ఒక మోస్తరుగా 35 మి.మీ వర్షపాతం నమోదైంది. 21న తూతూమంత్రంగా 2.2, 23న 6.0 మి.మీ ప్రకారం కేవలం 43.2 మి.మీ వర్షపాతం మాత్రమే కురిసింది. సాధారణ వర్షపాతంలో కనీసం 50 శాతం కూడా వర్షాలు లేని పరిస్థితి. దీంతో ఈ మండలంలో సాగు చేసిన పత్తి, ఉల్లి, టమాట తదితర పంటలు తేమ లేక దెబ్బతింటున్నాయి. ఖరీఫ్ గట్టెక్కడం అనుమానమే! పత్తి పంట ఎండుతోంది ముందస్తు వర్షాలతో రైతులు ఉత్సాహంగా పంటలు సాగు చేశారు. ఒక రోజు మధ్యాహ్నం వరకు ఒక కాడి బాడుగకు తీసుకోవాలంటే రూ.2వేల నుంచి రూ.2,500 వరకు చెల్లించాల్సి ఉంది. ఉల్లి విత్తనాలు కిలో ధర రూ.1,500 వరకు ఉంది. పత్తి 450 గ్రాముల ప్యాకెట్ ధర రూ.900. సబ్సిడీపై పంపిణీ చేస్తున్న వేరుశనగ క్వింటా పూర్తి ధర రూ.9,300. రసాయన ఎరువుల ధరలు షాక్ కొడుతున్నాయి. ఉల్లి, పత్తి, వేరుశనగ, కంది సాగులో ఇప్పటికే సగటున రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు పెట్టుబడి పెట్టా రు. జూన్ మాసంలో వర్షాలు లేకపోవడంతో జిల్లాలో సాగు చేసిన పంటలన్నీ దెబ్బతినే పరిస్థి తి ఏర్పడింది. వర్షాభావ పరిస్థితులతో పెట్టిన పెట్టుబడులు మట్టిపాలయ్యాయి. వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తే ఖరీఫ్ గట్టెక్కడం అనుమానమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ చిత్రం.. రైతు కన్నీటి కష్టానికి నిదర్శనం. పంపుసెట్తో పత్తి మొక్కలకు నీటిని పిచికారీ చేస్తున్న రైతు పేరు బంద. ఊరు గోనెగండ్ల. నాలుగు ఎకరాల్లో సాగు చేసిన పత్తి పైరు వానల్లేక ఎండిపోతుండటంతో కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నాడు. -
7న ఐఏబీ సమావేశం
కర్నూలు సిటీ: సాగునీటి సలహా మండలి సమావేశం ఈనెల 7న నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ అనుమతించారని జల వనరుల శాఖ కర్నూలు సర్కిల్ పర్యవేక్షక ఇంజనీర్ బాలచంద్రారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు ప్రధాన జల వనరు తుంగభద్ర జలాలు. కర్ణాటక రాష్ట్రంలోని తుంగభద్ర జలాశయంలో నీటి లభ్యత ఆశించిన స్థాయి కంటే ఎక్కువగానే ఉండడంతో పాటు, డ్యాం ఎగువన ఉన్న నరీ పరీవాహక ప్రాంతంతో పాటు, పశ్చిమ కనుమల్లో వర్షాలు కురుస్తుండడంతో డ్యాంలోకి వరద నీరు భారీగానే వచ్చి చేరుతోంది. దీంతో కర్ణాటక నీటిపారుదల సలహా సమితి(ఐసీసీ) గత నెల 27న బెంగళూరులో సమావేశమై కాలువలకు నీటిని విడుదల చేసేందుకు నిర్ణయించారు. ఆ మేరకు ఈ నెల 10వ తేది నుంచి తుంగభద్ర దిగువ కాలువకు నీటిని విడుదల చేయనున్నారు. అందులో భాగంగానే కర్ణాటక వాటా నీటితో కలిపి ఏపీ కోటా నీటి విడుదలకు టీబీ బోర్డుకు ఇండెంట్ పెట్టనున్నారు. 2025–26 నీటి సంవత్సరంలో టీబి డ్యాం నీటి లభ్యత 120 టీఎంసీలుగా అంచనా వేశారు. ఈ మేరకు ఎల్ఎల్సీ కాలువకు 13.585 టీఎంసీల నీరు, కేసీ కాలువకు 5.66 టీఎంసీల నీటిని కేటాయించారు. జిల్లాలో ఎల్ఎల్సీ, కేసీ కాలువ, ఏబీసీ, జీడీపీ, గురురాఘవేంద్ర ప్రాజెక్టు, హంద్రీనీవా, పులికనుమ రిజర్వాయర్లు ఉండగా, వీటి పరిధిలో సుమారు 3లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. -
దేవదాయ శాఖ డీఈఈగా శ్రీనివాసులు
కర్నూలు కల్చరల్: దేవదాయ శాఖ కర్నూలు సబ్ డివిజన్ డీఈఈగా సీహెచ్ శ్రీనివాసులు నియమితులయ్యారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఎం.శ్రీనివాస ప్రసాద్ సోమవారం పదవీ విరమణ పొందారు. దీంతో గుంటూరు సబ్ డివిజన్ డీఈఈగా విధులు నిర్వహిస్తున్న సీహెచ్ శ్రీనివాసులుకు కర్నూలు డీఈఈగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. దరఖాస్తుల ఆహ్వానం కర్నూలు సిటీ: జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారి నుంచి జాతీయ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ ఎస్.శ్యామూల్ పాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన ఉపాధ్యాయులు ఈ నెల 13వ తేదీలోపు https:// nationalawardstoteachers. gov. in/ Login. aspx అనే వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ పేర్కొన్నారు. కనీస వేతనం ఇవ్వాలి కర్నూలు(సెంట్రల్): పాఠశాలల్లో పనిచేస్తున్న ఆయాలు, నైట్ వాచ్మన్కుల కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి జే.నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ఐదు నెలల నుంచి పెండింగ్లో ఉన్న జీతాలను ఇవ్వాలన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల ఆయాల పేరుతో ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకంలో ప్రతి విద్యార్థి నుంచి రూ.2 వేలు జమ చేసుకుందని, ఆ నిధులతో వారికి వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ఆయాలకు గ్రూపు ఇన్సూరెన్స్ చేయించాలని కోరారు. ఆయాలు బజారమ్మ, సుశీలమ్మ, లక్ష్మీదేవి పాల్గొన్నారు. కేఎంసీలో పాథాలజీ రాష్ట్రస్థాయి సదస్సు కర్నూలు(హాస్పిటల్): ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పాథాలజీ అండ్ మైక్రోబయాలజీ ఆధ్వర్యంలో కర్నూలు మెడికల్ కాలేజీలో త్వరలో 7వ రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ చెప్పారు. ఈ మేరకు సోమవారం ఆమె పాథాలజీ విభాగాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సదస్సుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రముఖ వైద్యులు పాల్గొంటారన్నారు. ఆమె వెంట డాక్టర్ హేమలత, డాక్టర్లు రేవతి, సునీత, షహనాజ్, విష్ణు పాల్గొన్నారు. వజ్రం లభ్యం మద్దికెర: మండల పరిధిలోని బసినేపల్లి గ్రామ సమీపంలోని పొలంలో వ్యవసాయ కూలీకి సోమవారం వజ్రం లభ్యమైంది. ఓ వ్యాపారి రూ.2 లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఆర్టీసీలో పదోన్నతులు కల్పించాలి కర్నూలు సిటీ: ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, దీర్ఘకాలికంగా పెంగింగ్లో ఉన్న పదోన్నతులు వెంటనే చేపట్టాలని ఏపీ జిల్లా ప్రజా రవాణా ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మద్దిలేటి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రంగస్వామి, ఏవీ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 4,5 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా ధర్నాలు చేయనున్నట్లు ప్రకటించారు. -
టీబీ డ్యాంకు తగ్గిన ఇన్ఫ్లో
హొళగుంద: కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి ఉన్నట్టుండి ఇన్ప్లో తగ్గిపోవడంతో క్రస్టుగేట్ల ఎత్తివేత మరింత ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఆదివారం డ్యాంకు 65వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా.. సోమవారం దాదాపు 40 వేల క్యూసెక్కులకు పడిపోయింది. జలాశయం ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పాటు డ్యాంపై నిర్మించిన శివమొగ్గలోని అప్పర్ తుంగా ప్రాజెక్టు(గాజనూరు జలాశయం) నుంచి దిగువకు నీటి నిడుదలను నిలిపివేశారు. దీంతో టీబీ డ్యాంకు వచ్చే వరద సగానికి తగ్గింది. ప్రస్తుతం డ్యాంలో 74 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అయితే 80 టీఎంసీలకు చేరితే క్రస్టు గేట్లు ఎత్తి నీటిని నదికి వదులుతారు. ఈ లెక్కాన గేట్లు ఎత్తడానికి మరో రెండు, మూడు రోజులు పట్టవచ్చని తెలుస్తోంది. ఇదిలాఉంటే ఈ నెల 10న తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ)కు నీటిని విడుదల చేయనుండడంతో రైతులు వరిసాగుకు సిద్ధమయ్యారు. -
అమ్మానాన్న కోసం..
● ముంబై నుంచి ఆదోనికి వచ్చిన యువకుడుఆదోని సెంట్రల్: ఎప్పుడో నాలుగేళ్ల వయస్సులో తప్పిన పోయి.. ఇప్పుడు 32 ఏళ్ల వయస్సుల్లో అమ్మానాన్నలను చూసేందుకు ముంబై నుంచి ఒక యువకుడు ఆదోనికి వచ్చాడు. సోమవారం సబ్కలెక్టర్ మౌర్యభరద్వాజ్ను కలిసి తన తల్లిదండ్రుల వివరాలు చెప్పి, వారి దగ్గరికి తనను చేర్చాలని కోరారు. వివరాలు.. ఆదోనికి చెందిన వీరేష్ నాలుగేళ్ల వయస్సులో ఆడుకుంటూ ఆదోని రైల్వేస్టేషన్ చేరుకుని అక్కడ రైలులో కూర్చొని తమిళనాడు చేరుకున్నాడు. అక్కడ రెండేళ్లు అనాథ బాలల కేంద్రంలో ఉన్నాడు. అక్కడి నుంచి ముంబై చేరుకుని వెయిటర్గా పనిచేసుకుంటూ జీవనం సాగించేవాడు. 32 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత తన గ్రామం ఆదోని అని తెలసుకుని తల్లిదండ్రులను చూసేందుకు ఆదోనికి చేరుకున్నాడు. ఆదోని పట్టణంలోని ఏరియా ఆసుపత్రి ప్రాంతంలో ఉన్నట్లు, తన తండ్రి జనార్దన్, తన అమ్మమ్మ అంజనమ్మగా చెబుతున్నాడు. వీరేష్కు తెలుగు రాదు మరాఠీలో మాత్రమే మాట్లాడుతున్నాడు. ఆదోనికి వచ్చిన యువకుడికి తల్లిదండ్రులను చూపించాలని పురపాలక సిబ్బందిని సబ్కలెక్టర్ ఆదేశించారు. -
వక్ఫ్ బచావో.. దస్తూర్ బచావో
వక్ఫ్ బోర్డు చట్టంలో సవరణలను తక్షణం ఉపసంహరించుకోవాలని కోరుతూ సోమవారం కర్నూలు ఎస్టీబీసీ కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహించారు. ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సభకు ముస్లింలు వేలాదిగా తరలివచ్చారు. ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ముస్లింలకు చంద్రబాబు మోసం చేశారన్నారు. టీడీపీలో పనిచేస్తున్న ముస్లింలు బయటకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా టీడీపీని, జనసేన పార్టీలను ఘోరంగా ఓడించాలన్నారు. – కర్నూలు టౌన్ -
హామీ నిలబెట్టుకోవాలి
చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరికీ వృద్ధాప్య పింఛన్లు ఇస్తామని ప్రకటించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది దాటిపోయింది. మాది నిరుపేద కుటుంబం. మూడు ఎకరాల భూమి ఉన్నా పంటలు పండటం లేదు. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పొషించుకుంటున్నాం. ఇప్పుడు నా వయస్సు 58 ఏళ్లు. బీసీ సామాజిక వర్గం. ఎన్నికల సమయంలో ప్రకటించిన మేరకు నాకు వృద్ధాప్య పింఛనుకు అర్హత ఉంది. ఈ ప్రభుత్వం నాలాంటి వాళ్లను ఆదుకోవాలి. – నామాల దేవేంద్ర, రామాపురం,. తుగ్గలి మండలం -
విద్యార్థుల ఆకలి కేకలు
ఎమ్మిగనూరుటౌన్: మధ్యాహ్న భోజనం అందక పోవడంతో విద్యార్థులు ఆకలితో కేకలు వేశారు. ఎమ్మిగనూరు ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో సోమవారం ఖాళీ ప్లేట్లతో ఆందోళన నిర్వహించారు. నిబంధనల మేరకు మధ్నాహ్నం 12.40గంటలకు మధ్యాహ్న భోజనం వడ్డించాల్సి ఉంది. అయితే మధ్యాహ్నం 2 గంటలైనా స్పందించకపోవడంతో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేశారు. పాఠశాలకు, కళాశాలకు ఒకే వంట ఏజెన్సీ ఉండటంతో ఆకలితో అలమటించే పరిస్థితి వస్తోందని విద్యార్థులు వాపోయారు. సకాలంలో మధ్యాహ్న భోజనం వడ్డించాలని కోరారు. విద్యార్థి సంఘ నాయకులు నాగరాజు, వీరాస్వామి, రాజు, రంగన్న, హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఖాళీ ప్లేట్లతో ఆందోళన -
పదవీ విరమణ సమస్యలుంటే నేరుగా కలవండి
కర్నూలు: పదవీ విరమణ ప్రయోజనాలకు సంబంధించిన సమస్యలు ఉంటే నేరుగా తనను కలవచ్చని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. జిల్లా పోలీసు శాఖలో వివిధ హోదాల్లో సుదీర్ఘ కాలం పనిచేసిన తొమ్మిది మంది సిబ్బంది సోమవారం పదవీ విరమణ పొందారు. జిల్లా పోలీసు కార్యాలయ సూపరింటెండెంట్ భాగ్యలక్ష్మి, పత్తికొండ ఎస్ఐ ఎస్టీ జమీర్, ఆదోని పీసీఆర్ ఎస్ఐ బి.శ్రీరాములు, కర్నూలు డీటీసీ ఎస్ఐ సి.వెంకటరమణ, ఏఆర్ఎస్ఐలు బి.శ్రీనివాసులు, ఎం.బందే నవాజ్, కర్నూలు పీసీఆర్ ఏఎస్ఐ పీఆర్ సులోచన రాణి, ఏఆర్ హెడ్ కానిస్టేబుళ్లు వి.గోవిందరాజులు, డి.హుసేనయ్య తదితరులను పదవీ విరమణ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో ఎస్పీ శాలువ, పూలమాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఇకపై కుటుంబాలతో శేష జీవితాన్ని సంతోషంగా గడపాలని, పదవీ విరమణ సమస్యలేవైనా ఉంటే నేరుగా తనను సంప్రదించవచ్చని తెలిపారు. సత్కారం అనంతరం వారికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, ఏఆర్ డీఎస్పీ భాస్కర్ రావు, స్పెషల్ బ్రాంచ్ సీఐలు కేశవరెడ్డి, తేజమూర్తి, ఆర్ఐలు జావెద్, నారాయణ, సోమశేఖర్ నాయక్, జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు నాగరాజు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
అభ్యంతరాలు.. ఆందోళనలు
కర్నూలు(హాస్పిటల్): అభ్యంతరాలు, ఆందోళనల మధ్య గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే గ్రేడ్–3 ఏఎన్ఎంలకు సోమవారం బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో కర్నూలు మెడికల్ కాలేజీలోని న్యూ ఆడిటోరియంలో ఉదయం 7.30 గంటల నుంచి కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన 750 మందికి పైగా ఏఎన్ఎంలకు బదిలీ కౌన్సిలింగ్ చేయాల్సి ఉంది. వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి.శాంతికళ, ఏవో అరుణ, సూపరింటెండెంట్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించిన బదిలీల కౌన్సెలింగ్లో సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు వచ్చాయి. కౌన్సెలింగ్ నిర్వహించకుండానే కొందరు ఏఎన్ఎంలకు ఉద్యోగాలు ఎలా కట్టబెడతారని పలువురు ఆందోళన చేశారు. వందకు పైగా ఎమ్మెల్యే సిఫార్సు లేఖలు రావడం, అందులోనూ కొన్ని సచివాలయాలకు ఎక్కువ మందికి లేఖలు ఇవ్వడంతో అధికారులు అయోమయానికి గురయ్యారు. ఈ లేఖలతో పలు సంఘాల లేఖలను సైతం పక్కన బెట్టి ర్యాంకు ఆధారంగా సాయంత్రం 200 మందికి మాత్రమే కౌన్సెలింగ్ చేశారు. అర్ధరాత్రి వరకు కొనసాగించి, మిగిలిన వారికి మంగళవారం కూడా కౌన్సెలింగ్ చేస్తామని అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో కొందరు ఏఎన్ఎంలు ఇతర పీహెచ్సీలకు గాకుండా పక్క పీహెచ్సీలోని సచివాలయాలకు బదిలీ చేయాలని నినాదాలు చేశారు. దీంతో అధికారులు భోజన విరామాన్ని ప్రకటించి ఉన్నతాధికారుల వివరణ తీసుకుని పక్క పీహెచ్సీలకు సచివాలయ ఉద్యోగులను బదిలీ చేసేందుకు అంగీకరించారు. గందరగోళంగా ఏఎన్ఎంల బదిలీల ప్రక్రియ -
మద్యం మత్తులో శాశ్వత నిద్రలోకి..
చంద్రగిరి: మద్యం మత్తు ఇద్దరు అన్నదమ్ములను బలితీసుకుంది. మద్యం సేవించి కారులో నిద్రపోయిన వారిద్దరూ.. చివరకు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తిరుపతి రూరల్ మండలం తిరుచానూరులోని రంగనాథ రోడ్డులో జరిగింది. పోలీసులు కథనం మేరకు.. తిరుపతి జిల్లా బుచి్చనాయుడుకండ్రిగ, గోవిందప్ప కండ్రిగలకు చెందిన దిలీప్(25), వినాయక అలియాస్ వినయ్(20) వరుసకు అన్నదమ్ములు.గ్యాస్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్న దిలీప్ తిరుచానూరులోని రంగనాథ రోడ్డులో భార్య, కుమారుడితో కలిసి నివసిస్తున్నాడు. వినయ్ టీటీడీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తూ అన్నమయ్య సర్కిల్ వద్ద ఉంటున్నాడు. ఆదివారం మధ్యాహ్నం వీరిద్దరూ మద్యం తాగారు. రాత్రి సమయంలో దిలీప్ ఇంటి సమీపంలోని కారులోకి మకాం మార్చారు. అందులోనే మద్యం సేవించి.. ఏసీ ఆన్ చేసుకొని నిద్రపోయారు. కొంతసేపటికి పెట్రోల్ అయిపోవడంతో కారు ఇంజిన్ ఆగిపోయింది. అద్దాలు మూసిఉండటంతో మత్తులో ఉన్న వారిద్దరూ ఊపిరాడక మరణించారు. కారుపై కవర్ కప్పి ఉండటంతో ఎవరూ గుర్తించలేకపోయారు. -
బాబు, పవన్ను ఓడిద్దాం.. ముస్లింలకు అసదుద్దీన్ పిలుపు
కర్నూలు (టౌన్): బీజేపీకి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ మద్దతుగా నిలిచి ముస్లింలను దగా చేశారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. సోమవారం రాత్రి కర్నూలు ఎస్టీబీసీ కళాశాల మైదానంలో ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో ‘వక్ఫ్ బచావో.. దస్తూర్ బచావో’ నినాదంతో బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా ఒవైసీ మాట్లాడుతూ వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇచ్చి మోసం చేసిన చంద్రబాబును ముస్లింలు ఎన్నటికీ మరువరన్నారు. టీడీపీలో పనిచేస్తున్న ముస్లింలు, ప్రజాప్రతినిధులు, నాయకులు బయటకు రావాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వక్ఫ్ బోర్డు సవరణల్ని వ్యతిరేకించారని గుర్తు చేశారు.వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఏ ఎన్నికలు వచి్చనా టీడీపీ, జనసేన పార్టీలను చిత్తుగా ఓడిద్దామని పిలుపునిచ్చారు. అమరావతి అభివృద్ధి పేరుతో చంద్రబాబు రూ.వేల కోట్లను ఆయన వర్గీయులు, బంధువులకు ధారాదత్తం చేస్తున్నారన్నారు. వక్ఫ్ అమలుకు ప్రతి ముస్లిం ప్రాణాలు అర్పించేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఉగ్రవాదుల ఏరివేత ముసుగులో ముస్లింలను బీజేపీ ఇబ్బందులు, వేధింపులకు గురి చేస్తోందన్నారు. పహల్గాంలో అమాయకులను ఊచకోత కోసిన నిందితులను మోదీ ప్రభుత్వం ఎందుకు పట్టుకోలేకపోతోందని ప్రశ్నించారు.ఆర్ఎస్ఎస్ దేశంలో పేట్రేగిపోతోందని, మసీదులు, దర్గాలను టార్గెట్ చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫర్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి, కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ముస్లిం మతపెద్దలు, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు పాల్గొన్నారు. -
రైతులపై ఎందుకింత కక్ష?
పీసీపల్లి/ కర్నూలు(సెంట్రల్): కూటమి ప్రభుత్వ తీరుపై కడుపు మండిన పొగాకు రైతులు రోడ్డెక్కారు. సోమవారం కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. ఏపీ రైతు సంఘంతో కలిసి పొగాకు బేళ్లను రోడ్డుపై వేసి ధర్నా చేశారు. రైతులపై ఎందుకింత కక్ష అని ప్రభుత్వాన్ని నిలదీశారు. రూ.లక్షల పెట్టుబడి పెట్టి పండించిన పంటలను.. కనీసం కొనుగోలు చేయలేని ప్రభుత్వం తమకు వద్దంటూ నినదించారు. సీఎం చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయుడు పొగాకు కొనుగోలు చేశామని చెప్పడం దారుణమన్నారు.వారు చెబుతున్నట్లుగా కంపెనీలు గానీ, ప్రభుత్వం గానీ కర్నూలు జిల్లాలో ఒక్క ఆకును కూడా కొనలేదని ఏపీ రైతుసంఘం రాష్ట్రకార్యదర్శి కె.ప్రభాకరరెడ్డి మండిపడ్డారు. కొనుగోలు చేయకపోతే ఆత్మహత్యలు తప్ప మరో దారి లేదన్నారు. బేళ్లకు నిప్పంటించి.. ఆ మంటల్లో దూకేస్తాం‘లోగ్రేడ్ పొగాకు కొంటేనే వేలంలో పాల్గొంటాం. లేదంటే పొగాకు బేళ్లకు నిప్పంటించి.. ఆ మంటల్లో దూకి ఆత్మహత్య చేసుకుంటాం’ అని పొగాకు రైతులు బోర్డు అధికారులకు తెగేసి చెప్పారు. ప్రకాశం జిల్లా కనిగిరి పొగాకు బోర్డు పరిధిలోని పెద్ద అలవలపాడు క్లస్టర్ రైతులు లోగ్రేడ్ పొగాకును బయ్యర్లు కొనడం లేదంటూ రెండు రోజుల నుంచి పొగాకు లోగ్రేడ్ పొగాకు కొంటేనే వేలం జరుగుతుందని.. లేదంటే పొగాకుకు నిప్పుపెట్టి.. ఆ మంటల్లో దూకి ఆత్మహత్య చేసుకుంటామని రైతులు తెగేసి చెప్పారు. -
14 రోజుల బాలింతను పొట్టనబెట్టుకున్న అధికారులు
ఆదోని అర్బన్(కర్నూలు): ఆదోని పట్టణంలోని 36వ వార్డు, మేదరి గేరీలో మహిళా పోలీసుగా విధులు నిర్వహిస్తున్న దివ్య (26) బదిలీ ఒత్తిడితో అనారోగ్యానికి గురై మృతి చెందింది. ఆమె కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు.. ఈ నెల 15వ తేదీన పట్టణంలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆ రోజు నుండి మెటర్నిటీ సెలవులో ఉంది. ఈ క్రమంలో కర్నూలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం సచివాలయ మహిళా పోలీసులకు బదిలీల ప్రక్రియ నిర్వహించారు. అధికారుల ఆదేశాల మేరకు శిశువుతో 8 ఉదయం గంటలకు అక్కడికి చేరుకుంది. అయితే తన పరిస్థితి వివరించి త్వరగా కౌన్సెలింగ్కు పంపాలని అక్కడ విధుల్లో ఉన్న అధికారులను వేడుకుంది. తాను బాలింతను అని, సిజేరియన్ జరిగిందని వివరించినా ఎవరూ పట్టించుకోలేదు. అర్ధరాత్రి 1 గంటల సమయంలో కౌన్సెలింగ్ పూర్తి కావడం, ఆమెకు ఆస్పరి మండలం అలిగేరికి బదిలీ చేశారు. అప్పటి వరకు కార్యాలయం ఆవరణలో ఉన్న తన బిడ్డకు పాలు ఇచ్చేందుకు లోపలకి, బయటకు తిరిగి అలసిపోయింది. అలాగే దూర ప్రాంతానికి బదిలీ కావడంతో ఆందోళనకు గురైంది. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆదోనికి చేరుకున్న దివ్య కొద్ది సేపటి తర్వాత తీవ్ర అస్వస్థతకు గురైంది. కుటుంబీకులు వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని కర్నూలుకు రెఫర్ చేశారు. మార్గమధ్యంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో దివ్య మృత్యుఒడి చేరారు. మానవత్వం లేకుండా అధికారులు వ్యవహరించడంతో తన బిడ్డ మృతి చెందిందని దివ్య తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. -
రాఘవుడి దర్శనానికి దారేది?
● సింగిల్ ఎంట్రెన్స్తో భక్తుల నిరీక్షణ ● తోపులాటలతో ఉక్కిరి బిక్కిరి.! మంత్రాలయం : శ్రీమఠం అధికారుల తీరు భక్తుల తోపులాటకు దారి తీసింది. సింగిల్ ఎంట్రన్స్తో భక్తులకు ముచ్చెమటలు తెప్పించింది. వృద్ధులు, చిన్నారులను కన్నీళ్లు పెట్టించింది. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠానికి భక్తుల తాకిడి రోజురోజుకు పెరుగుతోంది. గురు, శని, ఆదివారాలు భక్తులు పోటెత్తుతున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీమఠం అధికారులు ఏర్పాట్లు చేయడంలో కాస్త అలసత్వం కనబడుతోంది. మొన్నటి వరకు శ్రీమఠం ప్రాంగణంలోకి ప్రవేశించాలంటే చుట్టూరా మూడు ప్రధాన ద్వారాలతోపాటు, ప్రధాన ద్వారం ఇరువైపులా చిన్న ద్వారాలు నుంచి అవకాశం కల్పించేవారు. ద్వారాలతో రద్దీ తక్కువగానే ఉన్న క్యూలైన్లలో భక్తుల బారులు తీరే పరిస్థితి. క్యూలైన్లు పెంచాల్సి వస్తుందేమోనని.. లేక ప్రాంణగంలో రద్దీ తగ్గించాలనో.. కొత్త పద్ధతిని ఆచరణలోకి తెచ్చారు. ఆదివారం దర్శనాలకు వచ్చిన భక్తులను కేవలం ప్రధాన ద్వారం నుంచి ప్రవేశం కల్పించారు. పోలీసులు, సెక్యురిటీగార్డులతో రోప్ ఏర్పాటు చేసి భక్తులకు బ్రేకులు వేస్తూ వచ్చారు. అయితే రోప్తో భక్తులు చాలా ఇబ్బందులు పడ్డారు. శ్రీమఠంలోకి వచ్చేందుకు తోసుకుంటూ ఎగబడ్డారు. తోపులాటతో వృద్ధులు, చిన్నారులు కన్నీళ్లు సైతం పెట్టుకున్నారు. లక్షలాది మంది భక్తులకు ఒకే ఎంట్రెన్స్ పెట్టడంతోనే ఇబ్బందులు తలెత్తాయి. ఇన్నాళ్లూ ఇలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులు ఆయా ద్వారాల నుంచి సాఫీగా మఠంలోకి వెళ్లి వచ్చే పరిస్థితి. ఈ అనాలోచనతో దర్శనాలకు బాగానే సమయం పట్టింది. కూలైన్లతో భక్తులకు ఎలాంటి వసతు లు కూడా లేకపోవడంతో తలలు పట్టుకున్నారు. కనీసం క్యూలైన్లతో తాగునీటి సౌకర్యమైనా కల్పించాలని భక్తులు కోరుతున్నారు. ఇక అన్నపూర్ణ భోజనశాలలోనూ అదే పరిస్థితి. గంటల తరబడి భక్తులు క్యూలైన్లలోనే కూర్చుండిపోయారు. సాధారణ రోజుల్లోనే ఇలా ఉంటే రాఘవేంద్రుల ఆరాధనోత్సవాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయోనని భక్తులు వాపోయారు. -
వక్ఫ్ చట్ట సవరణను వెనక్కి తీసుకోవాలి
కర్నూలు(సెంట్రల్): నరేంద్రమోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని సేవ్ వక్ఫ్..సేవ్ రాజ్యాంగం జేఏసీ కన్వీనర్ మౌలానా సయ్యద్ జాకీర్ అహ్మద్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై నేటి (సోమవారం) సాయంత్రం 5 గంటలకు ఎస్టీబీసీ కళాశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. ఈసభకు రాజకీయాలకు అతీతంగా హాజరై మద్దతు తెలపాలన్నారు. మంగళవారం మౌర్య ఇన్కు ఎదురుగా ఉన్న మసీదులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన కో కన్వీనర్లు ఎంఏ హమీద్, ఎస్ఎండీ షరీఫ్లతో కలసి మాట్లాడారు. బహిరంగ సభకు ఎంతో ప్రాముఖ్యత ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లను పకడ్బందీగా చేసినట్లు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముస్లిం సంస్థల వక్ఫ్ భూములను స్వాధీనం చేసుకోవడంతో చట్టానికి సవరణలు చేశారని విమర్శించారు. ఆయన అధికారంలోకి వచ్చాక మసీదులు, మదరసాలు, కబరస్తాన్ల భూములు లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. మరోవైపు ఇప్పటికే ముస్లింలకు రాజ్యాంగం కల్పించిన పది రకాల చట్టాలను రద్దు చేసినట్లు చెప్పారు.ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ చర్యలను ముక్తకంఠంతో ఖండిస్తూ చేపట్టే బహిరంగసభను జయప్రదం చేయాలని ఆయన రాజకీయ పార్టీలు, ప్రజా, విద్యార్థి, యువజన, మహిళ సంఘాల ప్రతినిధులను కోరారు. -
ముగిసిన రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలు
కర్నూలు (టౌన్): నగర శివారులోని ఆదర్శ విద్యా మందిర్ క్రీడా మైదానంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి రగ్బీ జూనియర్ అండర్–18 బాల, బాలికల చాంపియన్ పోటీలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. బాలుర విభాగంలో ప్రకాశం (ప్రథమ), కర్నూలు (ద్వితీయ), విశాఖపట్నం (తృతీయ), బాలికల విభాగంలో గుంటూరు (ప్రథమ), అనంతపురం (ద్వితీయ), తూర్పు గోదావరి (తృతీయ) స్థానాల్లో నిలిచాయి. విజేతలకు ఆదర్శ విద్యా మందిర్ డైరెక్టర్ డాక్టర్ బి. హరికిషన్, రాష్ట్ర రగ్బీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు ట్రోఫీలు, పతకాలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని చాటి పదిమందికి ఆదర్శంగా నిలిచారన్నారు. కార్యక్రమంలో రగ్బీ ఇండియా ప్రతినిధి నోయల్ మ్యాథ్య్సు, రగ్బీ, క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
జమిలి ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
● ఏడాది పాలనలో ప్రజలకు చేసింది ఏమీ లేదు ● ‘సూపర్ సిక్స్’ అంటూ వంచన చేశారు ● మేనిఫెస్టో అమలు చేయలేదు ● జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరించాలి ● విడతల వారీగా ‘బాబూ ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ కార్యక్రమం ● వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితీవ్ర ఇబ్బందుల్లో రైతులు ● జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి మాట్లాడుతూ.. సంవత్సరం కాలంగా చంద్రబాబు ప్రభుత్వం కాలయాపన చేసిందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందన్నారు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటి వరకు అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నేరవేర్చేంత వరకు ఈ ప్రభుత్వాన్ని వదిలేది లేదన్నారు. ● పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన విధానాన్ని ఎండగడదామని పిలుపునిచ్చారు. ఐదేళ్ల జగనన్న పాలనలో ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరిందన్నారు. చంద్రబాబు ఏడాది పాలనలో సంక్షేమ పథకాలు ఎక్కడ అని ప్రశ్నించారు. అన్ని వివరాలు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ● ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ.. అధికారం కోసం చంద్రబాబు నాయుడు అన్ని వర్గాల ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేశారన్నారు. ఈ ప్రభుత్వంపై మహిళలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. అదే జగనన్న ఉంటే ఎన్నో సంక్షేమ పథకాలు అందేవని భావిస్తున్నారన్నారు. కర్నూలు(టౌన్): ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా మోసాలకు చిరునామా మారారని రాష్ట్ర మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రాంచంద్రా రెడ్డి విమర్శించారు. ఏడాది పాలనలో రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. ఎన్నికల సమయంలో ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ’ అని మాటఇచ్చి నేడు ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’గా మారారన్నారు. కర్నూలు బిర్లా సర్కిల్లోని శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాలులో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీమోహన్ రెడ్డి అధ్యక్షతన జిల్లా స్థాయి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో, బాబు ష్యూరీటీ– మోసం గ్యారెంటీ’ పేరుతో క్యూఆర్ కోడ్ అవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు చేసిన మోసాలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన వీడియోను సమావేశంలో ప్రదర్శించారు. మహిళలకు ఉచిత బస్సు ఏదీ? వైఎస్సార్సీపీ పార్లమెంట్ పరిశీలకులు గంగుల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. జగనన్న అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అని తేలిపోయిందన్నారు. చంద్రబాబు మాటలు నమ్మి పేదలు, మహిళలు మోసపోయామని అర్థమైందన్నారు. జగనన్న హయాంలో ఏటా రూ. 70 వేల కోట్లు ప్రతి పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజలు, మహిళలకు నేరుగా వారి అకౌంట్లలో జమ చేశారని గుర్తు చేశారు. ఏడాది పాలనలో ఏ ఒక్క హామీ అమలు చేయకుండా చంద్రబాబు మోసం చేశారన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇప్పటికీ అమలులోకి రాలేదని విమర్శించారు. ఇంటింటికీ మోసం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇంటింటికీ మోసం చేశారన్నారు. మోసాలను గ్రామా గ్రామానా వివరిద్దామన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు రూ. 1500 ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను రూ. 4 వేలు పెన్షన్, నిరుద్యోగులకు రూ. 3 వేలు, అన్నదాత సుఖీభవ పేరుతో రూ. 20 వేలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. త్వరలోనే స్థానిక ఎన్నికలు వస్తున్నాయని, గ్రామ స్థాయిలో కమిటీల నియామకాన్ని పూర్తి చేయాలన్నారు. ఎన్నికలు వచ్చినా వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉందన్నారు. బాబు ష్యూరీటీ మోసం గ్యారెంటీ పేరుతో ఇంటింటికి తిరిగి ప్రభుత్వ మోసాలను వివరిస్తామన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ హామీల పేరుతో ఇంటింటికి రూ.2.40 లక్షల లబ్ధి పొందుతారని చెప్పి దగా చేశారని విమర్శించారు. హాజరైన ఎమ్మెల్యేలు సమావేశంలో మంత్రాలయం ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, కర్నూలు నగర మేయర్ బీవై రామయ్య, మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, హఫీజ్ఖాన్, ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ బుట్టా రేణుక, కోడుమూరు నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదిమూలపు సతీష్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేందర్ రెడ్డి ,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మద్దూరు సుభాష్ చంద్రబోస్, గడ్డం రామక్రిష్ణారెడ్డి, రుద్రగౌడ్, పార్టీ ఉపాధ్యక్షులు అహమ్మద్ అలీఖాన్, షరీఫ్, అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుక, కల్లా నాగవేణి రెడ్డి, గాజుల శ్వేతారెడ్డి, మంగమ్మ, భారతి, వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుట్టా ప్రతుల్, కార్పొరేటర్లు షేక్ యూనిస్ బాషా, సిట్రా సత్యనారాయణమ్మ, షేక్ ఆర్షియా ఫర్హీన్, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.జమిలీ ఎన్నికలు 2027 సంవత్సరంలో వస్తున్నాయని, పార్టీ శ్రేణులు మరింత ఉత్సాహంతో పనిచేసి జగనన్నను గెలిపించుకుందామని మాజీ మంత్రి, పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పిలుపునిచ్చారు. చంద్రబాబు ఏడాది పాలనపై అన్ని వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. ‘సూపర్ సిక్స్’ అంటూ ప్రజలను వంచన చేశారని, ఈ విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఎన్నికల సమయంలో 143 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. రైతులకు, మహిళలకు, విద్యార్థులకు ఆశలు కల్పించి దగా చేశారని విమర్శించారు. అరకొరగా తల్లికి వందనం నిధులు వేసి ఎవరైనా ఈ పథకం గురించి మాట్లాడితే నాలుక మడత పెడతామంటూ బెదిరించడం ముఖ్యమంత్రి స్థాయిలో తగదన్నారు. ప్రజలు చూస్తూ ఊరుకోబోరన్న విషయాన్ని చంద్రబాబు గుర్తించాలన్నారు. ముఖ్యమంత్రి చేసిన మోసాలను జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామస్థాయిలో ప్రజలకు వివరించాలన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏడాదిలో ప్రజలకు ఎలాంటి లబ్ధిని చేకూర్చిందో తెలియజేయాలన్నారు. -
జూలైలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభలు
కర్నూలు(సెంట్రల్): ఏపీ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) కర్నూలు జిల్లా మహాసభలను జూలై మూడో వారంలో నిర్వహించనున్నట్లు ఆ సంఘం కన్వీనింగ్ కమిటీ నిర్ణయించింది. ఆదివారం టీజీవీ కళా క్షేత్రంలో నగర అధ్యక్షుడు ఎం.శివశంకర్ అధ్యక్షతన సంఘ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర నాయకులు గోరంట్లప్ప, కేబీ శ్రీనివాసులు, ఫొటోగ్రాఫర్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు డి.హుస్సేన్. జిల్లా కన్వీనర్ నాగేంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా మహాసభల నిర్వహణపై చర్చించి జూలై మూడో వారంలో జరపాలని నిర్ణయించారు. ఈ మహాసభలకు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులను ఆహ్వానించాలని నిర్ణయించారు. కాగా, మహాసభల నిర్వహణ కోసం ఆహ్వాన సంఘాన్ని ఎనుకున్నారు. కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి ఎర్రమల, ఆదోని డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు బసప్ప, చంద్రమోహన్, ఎమ్మిగనూరు డివిజన్ గౌరవాధ్యక్షుడు దేవేంద్రమూర్తి, అధ్యక్షుడు షబ్బీర్, ఆలూరు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కృష్ణ, కర్నూలు జిల్లా నాయకులు సునీల్కుమార్, బ్రహ్మయ్య, ఫొటోగ్రాఫర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వడ్డె శ్రీనివాసులు, నగర ఉపాధ్యక్షుడు బాబు పాల్గొన్నారు. -
అమ్మవారికి పల్లకీ సేవ
శ్రీశైలంటెంపుల్: శ్రీభ్రమరాంబామల్లికార్జున స్వామివార్ల ఉత్సవమూర్తులకు ఆదివారం సందర్భంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో పల్లకీ సేవ నిర్వహించారు. ముందుగా ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో ఉత్సవమూర్తులు ఆశీనులుగావించి వేదమంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు చేసి, మేళతాళాలతో ఆలయ ప్రదక్షిణ చేశారు. పూజా కార్యక్రమాల్లో దేవస్థాన అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. మద్దిలేటి స్వామి ఆలయ నీటి గుండంకు కంచె ఏర్పాటు బేతంచెర్ల: మండల పరిధిలోని వైష్ణవ పుణ్యక్షేత్రమైన శ్రీ మద్దిలేటి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలోని నీటి గుండం చుట్టూ కంచె ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ప్రతి శుక్ర, శనివారం అధిక సంఖ్యలో స్వామి, అమ్మవార్ల దర్శనానికి భక్తులు తరలివస్తుంటారు. ఈక్రమంలో కోనేరులో కాకుండా నీటి గుండంలోకి ఈతకు వెళ్లి ఏడాదికి ఇద్దరు లేదా ముగ్గురు మృత్యువాతపడుతున్నారు. ఈక్రమంలో ఆలయ ఉప కమిషనర్, ఈఓ రామాంజనేయులు ఆలయ నీటి గుండం వద్ద ప్రమాదాల నివారణకు కంచె ఏర్పాటు చేయించారు. బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో బంగారు పతకం నంద్యాల(న్యూటౌన్): పట్టణానికి చెందిన మహంకాళి జశ్వంత్ జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ డబుల్స్లో గోల్డ్ మెడల్, సింగిల్స్లో బ్రాంజ్ మెడల్ సాధించినట్లు బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ద్వారకానాథ్, సెక్రటరీ అంకమ్మ చౌదరి తెలిపారు. ఆదివారం వారు మాట్లాడుతూ ఈనెల 28వ తేదీన గోవాలో అండర్–13 ర్యాంకింగ్ నేషనల్ బ్యాడ్మింటన్ పోటీలు జరిగాయన్నారు.ఇందులో జశ్వంత్ ప్రతిభ చాటి బంగారు పతకంతో పాటు ట్రోఫీ అందుకున్నట్లు వారు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ క్రీడాకారుడిని ఆదివారం ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ నంద్యాల జిల్లా సెక్రటరీ వంశీధర్, కోచ్ నాగార్జున పాల్గొన్నారు. మంటల్లో చిక్కుకున్న లారీ తుగ్గలి: లారీ టైర్లు వేడెక్కి మంటలు వ్యాపించిన ఘటన ఆదివారం సాయంత్రం మండలంలోని చెర్వుతండ వద్ద చోటు చేసుకుంది. ముంబై నుంచి చైన్నెకు బెల్లం పానకం ట్యాంకర్తో వెళుతున్న లారీ మార్గమధ్యంలో చెర్వుతండ బ్రిడ్జి కిందికి రాగానే టైర్లు హీటెక్కి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో ఆ లారీ ఎక్కడ పేలుతుందోనని అక్కడ గుమికూడిన జనం బెంబేలెత్తి పోయారు. ఈ ప్రమాదంలో లారీ ముందు భాగం కాలి పోయింది. స్థానికులు సమాచారం అందించడంతో పత్తికొండ నుంచి ఫైర్ ఇంజిన్ వెళ్లి మంటలను ఆర్పేయడంతో ప్రమాదం తప్పింది. రైల్వే బ్రిడ్జి కింద లారీకి మంటలు వ్యాపించడంతో రైల్వే అధికారులు సైతం అప్రమత్త మయ్యారు. ప్రమాదంతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్కు కాసేపు అంతరాయం కలిగింది. -
కొండల్ని కొల్లగొట్టి.. ఎర్రమట్టి దోపిడీ
ఎమ్మిగనూరురూరల్: కొండల్లో ఎర్రమట్టి దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. ప్రభుత్వానికి రుసుం చెల్లించకుండా కాంట్రాక్టర్లు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నా అటవీశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఎమ్మిగనూరు మండలంలోని మాచుమాన్దొడ్డి, నవోదయ పాఠశాల ఎదురుగా, బనవాసి ఫారెస్ట్, ఎస్.నాగాలపురం, హనుమాపురం, వెంకటగిరి గ్రామ కొండల్లో ఎర్రమట్టిని తరలిస్తున్నారు. బనవాసి ఫారంలో చాలా చోట్ల గోతులు తవ్వి మట్టిని తరలించారు. కొన్ని చోట్ల ప్రొక్లెయిన్లు ఉపయోగిస్తున్నారు. లక్షల రూపాయలు విలువ చేసే అటవీ సంపదను తరలిపోతుంది. అక్రమార్కులకు ఆర్థిక వనరుగా.. కొండలకే పరమితమైన తవ్వకాలు ఇప్పుడు నేరుగా బనవాసి ఫారంలో టేకు చెట్లు పెంచుతున్న వనంలోకి వచ్చాయి. టేకు చెట్లు అడుగు వరకు ఉన్న మట్టిని తీస్తున్నారు. చెట్ల నరికివేసి వాటిని కూడా ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. కళకళాడిన బనవాసి ఫారం నేడు అక్రమార్కులకు ఆర్థిక వనరుగా మారిపోయింది. గతంలో ఇక్కడ పనిచేసి వలంటీర్లు ఇప్పుడు లేకపోవటంతో కాంట్రాక్టర్లు టాక్టర్లలో ఎర్రమట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పట్టించుకోని అధికారులు అటవీకి ప్రాంతంలో యఽథేచ్ఛగా ఎర్రమట్టిని తరలిస్తూ చెట్లను నరికివేస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదు. అటవీశాఖ అధికారులు ఆదోని, కర్నూలు ప్రాంతాల్లో ఉండటంతో పర్యవేక్షణ లోపించింది. రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమార్కులు బరితెగించారు. బనవాసి ఫారెస్ట్ పరమాన్దొడ్డికి వెళ్లే దారి సమీపంలోని స్మార్ట్ సిటీ దగ్గర ఎర్ర చందనం చెట్లను నరికివేశారు. ఎవరు గుర్తించకపోతే వాటని రాత్రికి రాత్రే తరలిస్తున్నారు. ఎర్ర చందనం చెట్లు నరికివేతకు గురైనా ఫారం అధికారులకు కనిపించకపోటం గమనార్హం.కఠిన చర్యలు తీసుకుంటాం అక్రమంగా ఎర్రమట్టిని తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఫారంలో ఇంతకు ముందే మట్టిని తరలించరాదని చెప్పాం. తరలిస్తున్నట్లు మాకు సమాచారం ఇస్తే పట్టుకుంటాం. కాంట్రాక్టర్లు తరలిస్తే కేసులు నమోదు చేస్తాం. – శ్రీనివాసులు, రూరల్ ఎస్ఐ -
పట్టు వదలని ‘విత్తు’ మార్కుడు
అన్నదాత ఆశలను అడియాసలు చేస్తు వరుణుడు ముఖం చాటేయడంతో రైతులకు కన్నీళ్ల కష్టాలు మొదలయ్యాయి. వర్షాలు కురుస్తాయనే నమ్మకంతో రైతులు ఖరీఫ్లో వర్షాధారం కింద పంటలు సాగు చేశారు. అయితే వర్షం జాడలేక పంటలు వాడు ముఖం పడుతున్నాయి. పెట్నికోటకు చెందిన రైతు గొంగటి వెంకట్రామిరెడ్డి ఆదివారం ట్యాంకర్తో పత్తి పంటకు నీరు అందించాడు. నెల రోజుల క్రితం నాలుగు ఎకరాల్లో పత్తి విత్తనాలు వేశాడు. సగం భూమిలో మొలకెత్తగా మిగిలిన చోట్ల మొలకెత్తలేదు. దీంతో ట్యాంకర్తో విత్తనం మొలకెత్తని చోట పైపుతో నీళ్లు పడుతూ కనిపించాడు. వర్షం లేకనే ఈ పరిస్థితి ఏర్పడిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. – కొలిమిగుండ్ల -
సెలవు రోజూ తప్పని తిప్పలు
కర్నూలు(అర్బన్): గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలను ఈ నెల 30వ తేదీలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆదివారం సెలవు అయినా ఇబ్బందులు ఎదుర్కొంటూ సచివాలయ ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లా పరిషత్ సమావేశ భవనంలో పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ –6 ( డిజిటల్ అసిస్టెంట్ ) బదిలీలకు సంబంధించిన కౌన్సిలింగ్ను నిర్వహించారు. కర్నూలు జిల్లాలో మొత్తం డిజిటల్ అసిసెంట్లు 375 మంది ఉండగా, వీరిలో ఐదు సంవత్సరాలు ఒకే ప్రాంతంలో సర్వీసును పూర్తి చేసుకున్న వారు 207 మంది, రిక్వెస్ట్ బదిలీలు కోరుతు 71 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికి జిల్లా పంచాయతీ అధికారి జీ భాస్కర్, కర్నూలు డీఎల్పీఓ టీ లక్ష్మి, కార్యాలయ ఏఓ ప్రతిమ కౌన్సెలింగ్ నిర్వహించి ఉద్యోగుల ఆప్షన్స్ తీసుకున్నారు. అలాగే నంద్యాల జిల్లాలో పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ –6 ( డిజిటల్ అసిస్టెంట్లు ) మొత్తం 404 మంది ఉండగా, ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారు 258, రిక్వెస్ట్ బదిలీలకు దరఖాస్తు చేసుకున్నా వారు 30 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా కౌన్సెలింగ్కు హాజరయ్యారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయ సమావేశ భవనంలో జరిగిన నంద్యాల జిల్లా ఉద్యోగుల కౌన్సిలింగ్ డీపీఓ లలితాబాయి ఆధ్వర్యంలో నిర్వహించారు. కాగా, గ్రేడ్ –5 కార్యదర్శుల బదిలీలను ఈ నెల 28వ తేదిన పూర్తి చేశారు. విశ్వేశ్వరయ్య భవన్లో ... పీఆర్ ఎస్ఈ కార్యాలయం విశ్వేశ్వరయ్య భవన్లో ఇంజినీరింగ్ అసిస్టెంట్ల బదిలీలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 728 మంది ఇంజినీరింగ్ అసిస్టెంట్లు ఉండగా, వీరిలో ఐదు సంవత్సరాలు ఒకే ప్రాంతంలో విధులు నిర్వహించిన వారు 477 మంది ఉన్నారు. ఈ నెల 28వ తేదిన రాత్రి వరకు ఐదేళ్లు పూర్తి అయిన వారికి, స్పెషల్ కేటగిరి ( మెడికల్, స్పౌస్ తదితరాలు ) వారికి బదిలీలు నిర్వహించారు. ఆదివారం రిక్వెస్ట్ బదిలీలు కోరుతు దరఖాస్తు చేసుకున్న వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఆర్ ఎస్ఈ వీ రామచంద్రారెడ్డి, డీఈఈలు రవీంద్రరెడ్డి, నివాసులు, నాగిరెడ్డి, ధనిబాబు, కర్రెన్న, డీఏఓలు, ఏఈలు పాల్గొన్నారు. జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ... ఉమ్మడి కర్నూలు జిల్లాలోని వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ల బదిలీలకు సంబంధించిన కౌన్సెలింగ్ జీ పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియం హాల్లో నిర్వహించారు. ఈ ఏడాది మే 31వ తేదీ నాటికి జిల్లాలోని ఒకే ప్రాంతంలో ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారు 570 మంది, రిక్వెస్ట్ బదిలీలను కోరుతూ 131 మంది దరఖాస్తు చేసుకున్నారు. కౌన్సెలింగ్ ప్రక్రియ సాంఘిక సంక్షేమ శాఖ డీడీ కే తులసీదేవి ఆధ్వర్యంలో కొనసాగింది. సహాయ సంక్షేమాధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇంజనీరింగ్, డిజిటల్ అసిస్టెంట్లతో కిక్కిరిసిన జెడ్పీ -
ఒకటి మంత్రికి.. రెండోది ఎమ్మెల్యేకు!
కర్నూలు(సెంట్రల్): సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో నిబంధనలకు పాతరేసి అధికారులు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. మంత్రి, ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు ఉన్న వారికి అనువైన స్థానాలు ఇస్తున్నారు. ఎవరైనా ఆ స్థానాలను కోరుకుంటే వాటిలో మంత్రి చెప్పిన వ్యక్తి ఉన్నారని, ఎమ్మెల్యే సూచించిన వారికి ఇవ్వాల్సి ఉందని, మరో స్థానం కోరుకోవాలని నేరుగా చెబుతున్నారు. దీంతో ఆదివారం చేపట్టిన వీఆర్వోలు, సర్వేయర్ల బదిలీల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఇదంతా అధికారుల తీరుతోనే జరుగుతోందని, ఇందులో కొందరు అధికారులు, టీడీపీ ప్రజాప్రతినిధులు, వారి అనుచరులు పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడంతోనే జరుగుతోందని చెబుతున్నారు. అధికారుల తీరుపై సర్వేరయర్ల ఆగ్రహం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో కర్నూలు, నంద్యాల డీఆర్వోలు సి.వెంకటనారాయణమ్మ, రామునాయక్ ఆధ్వర్యంలో వీఆర్వోలకు బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. సునయన ఆడిటోరియంలో కర్నూలు, నంద్యాల సర్వే ఏడీలు మునికన్నన్, జయరాముడు ఆధ్వర్యంలో సర్వేయర్లకు బదిలీల కౌన్సెలింగ్ చేపట్టారు. ముందుగా స్పౌజ్, అరోగ్యం, ఒంటరి మహిళ, మ్యూట్వువల్ విభాగాల్లో ర్యాంకుల ఆధారంగా వీఆర్వోలు, సర్వేయర్లను కౌన్సెలింగ్ పిలిచారు. వచ్చిన వారిలో ర్యాంకుల ఆధారంగా పిలిచి...మూడు ఆప్షన్లు ఇచ్చిన అధికారులు.. ‘మూడింటిలో ఒక స్థానం మంత్రి సిఫారసు ఉంది.. మరొక స్థానం ఎమ్మెల్యే మనిషికి ఇవ్వాలి.. ఇంకో స్థానం కోరుకో’ అని చెబుతుండడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఫార్సు లేఖల పేరిట ఫోకల్ స్థానాలను రిజర్వ్ చేసినట్లు చేయడం అన్యాయమని వాపోయారు. సిఫార్సు అంటే ఒకటో..రెండో ఉండాలి తప్ప.. ఎక్కువ స్థానాలను వారికే కేటాయించేలా చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిఫార్సులు లేని వారికి నాన్ఫోకల్ పోస్టులను ఇస్తుండడంపై ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటప్పుడు కౌన్సెలింగ్ ఎందుకు నిర్వహించాలని ప్రశ్నించారు. ఎవరికీ కావాల్సిన స్థానాలు వారికి ఇచ్చుకుంటే సరిపోతుంది కదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వరకు.. సర్వేయర్లలో బదిలీల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. 800 మందిలో 294 మందికి ఐదేళ్ల సర్వీ సు పూర్తి కాగా...మిగిలిన వారు రిక్వెస్టు జాబితాలో దరఖాస్తు చేసుకున్నారు.అలాగే వీఆర్వోల్లో గ్రేడు–2లో మొత్తం 77 మంది దరఖాస్తు చేసుకొగా ఇద్దరు హాజరు కాలేదు. ఇందులో ఐదేళ్ల సర్వీసు పూర్తైన వారు 30మంది ఉన్నారు. గ్రేడు–1 వీఆర్వోలో 14 మంది దరఖాస్తు చేసుకోగా 9 మంది మాత్రమే హాజరయ్యారు. కాగా, వీఆర్వోల బదిలీల కౌన్సెలింగ్ మధ్యాహ్నం 3 గంటలకే ముగిసింది. అయితే సర్వేయర్లు భారీ సంఖ్యలో ఉండడంతో రాత్రి వరకు కొనసాగింది. కాగా, సాయంత్రం 5 గంటల ప్రాంతంలో సిఫార్సు లేఖల నేపథ్యంలో సర్వేయర్లు కౌన్సెలింగ్ను బహిష్కరించారు. దీంతో అధికారులు వారికి సర్దిచెప్పి నిబంధనలకు మేరకు ఖాళీలను చూపుతామని చెప్పి అర్ధరాత్రి వరకు కొనసాగించారు. ముగిసిన కౌన్సెలింగ్ కర్నూలు (టౌన్): ఉమ్మడి జిల్లాకు సంబంధించి సచివాలయాల కార్యదర్శుల బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ ఆదివారం సాయంత్రం ముగిసింది. ప్లానింగ్ కార్యదర్శులు 155 మంది, ఎమినీటీస్ కార్యదర్శులు 170 మందికి ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ రవీంద్రబాబు మాట్లాడుతూ.. ఒకే చోట ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారికి ప్రస్తుత వార్డు, సొంత వార్డు మినహా ఇతర వార్డులకు ఎంపిక చేసుకునే అవకాశం కల్పించామన్నారు. అదనపు కమిషనర్ ఆర్జీవీ క్రిష్ణ,డిప్యూటీ కమిషనర్ సతీష్కుమార్ రెడ్డి పాల్గొన్నారు. మూడు ఆప్షన్లు ఇచ్చి వీఆర్వో, సర్వేయర్ల బదిలీల కౌన్సెలింగ్ లేఖలు లేని వారిని దూర ప్రాంతాలకు బదిలీ చేసిన అధికారులు అర్ధరాత్రి వరకు కొనసాగిన సర్వేయర్ల బదిలీల ప్రక్రియ -
పౌరాణికాలకు ఆదరణ తగ్గలేదు
కర్నూలు(హాస్పిటల్): ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో పౌరాణిక నాటకాలకు ఆదరణ తగ్గలేదని పారిశ్రామిక వేత్త, సినీనటులు బీవీ రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి స్థానిక సి.క్యాంపులోని టీజీవీ కళాక్షేత్రంలో స్వేచ్ఛ నాటక ప్రదర్శనలో భాగంగా శ్రీకృష్ణ రాయబారంలోని ఒక సన్నివేశం ప్రదర్శన జరిగింది. సభ ప్రారంభంలో శ్రీకృష్ణ రాయబారంలోని పడక సీను సన్నివేశాన్ని శ్రీకృష్ణునిగా భాస్కరయాదవ్, అర్జునుడిగా కేవీ రమణ, దుర్యోధనుడిగా చల్ల నవీన్కుమార్ నటించారు. ఈ సందర్భంగా బీవీ రెడ్డి మాట్లాడుతూ తన చిన్నతనంలో రాత్రి 10 గంటలకు నాటకం ప్రారంభమైతే ఉద యం 6 గంటల వరకు కొనసాగేవన్నారు. ఎన్టీ రామారావుతో పాటు ఎందరో సినీనటులతో తనకు పరిచయం ఉందని, సినిమాలకు ఆదరణ క్రమేపీ తగ్గడం విచారకరమన్నారు. రవీంద్ర విద్యాసంస్థల అధినేత జి.పుల్లయ్య మాట్లాడుతూ కొత్తతరం నటులను తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో కళాక్షేత్రం అధ్యక్షులు పత్తిఓబులయ్య, బలగం సినిమా ఫేమ్ సురభి లలిత మంజు గోవర్దన్రెడ్డి, కళాకారులు బీవీ రెడ్డి, బీసీ సంఘం నాయకులు నక్కలమిట్ట శ్రీనివాసులు, దస్తగిరి, పి.రాజారత్నం, మహమ్మద్మియ్య పాల్గొన్నారు. -
ఽఢణాపురం దళిత సర్పంచ్ ఘటనపై తీవ్ర వాగ్వాదం
ఇటీవల ఆదోని మండలం ఽఢణాపురం గ్రామంలో చోటు చేసుకున్న దళిత సర్పంచ్కు జరిగిన అవమానంపై ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, ఆస్పరి జెడ్పీటీసీ దొరబాబు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దళితుల పట్ల ఎమ్మెల్యే పార్థసారథి చిన్న చూపు చూస్తున్నారని, ఎమ్మెల్యే తప్పు చేసినందునే క్షమాపణ చెప్పారని దొరబాబు అన్నారు. తాను తప్పు చేయకపోయినా, దళిత ఉద్యమాల్లో పనిచేసిన వ్యక్తిగా క్షమాపణ చెప్పానని ఎమ్మెల్యే అన్నారు. వైఎస్సార్సీపీ వారికి దళితులంటే చిన్న చూపు ఉన్నందునే గడచిన ఎన్నికల్లో వారిని పక్కన కూర్చోబెట్టారని ఎమ్మెల్యే చెప్పారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలంటే అమితమైన ప్రేమ ఉన్నందునే కోట్ల రూపాయలు వెచ్చించి రాష్ట్ర రాజధానిలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయించారని దొరబాబు చెప్పారు. -
పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలి
కర్నూలు(సెంట్రల్): జిల్లా కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని హైకోర్టు జడ్జి(జిల్లా ఫోర్టుపోలియో జడ్జి) జస్టిస్ బీఎస్ భానుమతి అన్నారు. శనివారం జిల్లాకోర్టు హాలులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.కబర్ది ఆధ్వర్యంలో న్యాయమూర్తులకు శిక్షణ తరగతులను నిర్వహించారు. సివిల్ దావాల్లో సెక్షన్9 సీపీసీ, లోక్అదాలత్ అవార్డుల్లో తీసుకోవాల్సిన చర్యలను ముఖ్య అతిథిగా హాజరైన హైకోర్టు జడ్జి జస్టిస్ బీఎస్ భానుమతి వివరించారు. హైకోర్టు విశ్రాంత జడ్జి వీఆర్కే కృపాసాగర్, విశ్రాంత జిల్లా జడ్జి టి.వేణుగోపాల్ శిక్షణ తరగతులను కొనసాగించారు. హైకోర్టు విశ్రాంత జడ్జి వీఆర్కే కృపాసాగర్ను బార్ అసోసియేషన కార్యాలయంలో సన్మానించారు. జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పి.హరినాథ్ చౌదరి, ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు , న్యాయవాదులు పాల్గొన్నారు. హైకోర్టు జడ్జి జస్టిస్ బీఎస్ భానుమతి -
ఏపీఎంఎస్ఐడీసీ ఈఈగా చిరంజీవులు
కర్నూలు(హాస్పిటల్): ఏపీ ఎంఎస్ఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఎం.చిరంజీవులు నియమితులయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ తాడేపల్లి గూడెంలో ఈఈగా పనిచేస్తున్న ఆయన డిప్యుటేషన్పై కర్నూలుకు వచ్చారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం వెదుళ్లచెరువు గ్రామానికి చెందిన ఆయన 1990లో ఆచార్య ఎన్జీ రంగ యూనివర్సిటీ(తిరుపతి)లో ఏఈగా ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత హైదరాబాద్లోని హార్టికల్చరల్ యూనివర్సిటీలో డీఈగా పనిచేశారు. 2014 నుంచి వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీలో ఈఈగా కొనసాగుతున్నారు. -
జీఓ నం.4 దివ్యాంగ క్రీడాకారులకు వరం
● న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ నంద్యాల(న్యూటౌన్): జీఓ నం.4 దివ్యాంగ క్రీడాకారులకు వరమని న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫ రూక్ అన్నారు. పారా స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్వరరావు, కార్యదర్శి రామస్వామి ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ప్రారంభమైన పారా స్పోర్ట్స్ చైతన్య రథయాత్ర శనివారం నంద్యాలకు చేరుకుంది. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాల్లో 3 శాతం క్రీడా కోటలో దివ్యాంగ క్రీడాకారులకు అవకాశం కల్పించిందన్నారు.అనంతరం జాతీయ స్థాయి పథకం సాధించిన దివ్యాంగ క్రీడాకారుడు వెంకట్ను అసోసియేషన్ నాయకులతోపాటు మంత్రి ఫరూక్ అభినందించారు. పారా స్పోర్ట్స్ జిల్లా అధ్యక్షుడు రవికృష్ణ, దివ్యాంగుల సంక్షేమ సంఘం నాయకుడు పీవీ రమణయ్య, తదితరులు పాల్గొన్నారు. -
బదిలీల కౌన్సెలింగ్ గందరగోళం
● సచివాలయాల ఉద్యోగుల్లో ఆందోళన ● టీడీపీ నేతల సిఫార్సులకే యంత్రాంగం మొగ్గుకర్నూలు (టౌన్): సచివాలయాల ఉద్యోగుల కౌన్సెలింగ్లో గందరగోళం నెలకొంది. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ ‘టిక్ పెట్టండి.. వెళ్లిపోండి’ అంటూ చెప్పడంతో సచివాలయాల ఉద్యోగులు అవాక్కుయ్యారు. ‘ఇదేం కౌన్సిలింగ్ తీరు’ అంటూ వాగ్వావాదానికి దిగారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మున్సిపాలిటీల్లో పనిచేసే సచివాలయాల ఉద్యోగులకు రెండు రోజుల్లో కౌన్సెలింగ్ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో హడావుడిగా కర్నూలు కార్పొరేషన్ ఆధికారులు శనివారం సుంకేసుల రోడ్డులో ఉన్న నగరపాలక సంస్థ నూతన కౌన్సిల్ హాలులో కౌన్సిలింగ్ ప్రక్రియ నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా.. ఉమ్మడి జిల్లాలో 308 సచివాలయాలు ఉన్నాయి. ఒకే చోట పనిచేస్తూ ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారిలో 173 ఆడ్మిన్ కార్యదర్శలు, 235 ఎడ్యుకేషన్ కార్యదర్శులు, 248 మంది వెల్ఫేర్ కార్యదర్శులు, 208 శానిటేషన్ కార్యదర్శులు ఉన్నారు. వీరందరికీ రెండు రోజుల పాటు కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉంది. మొదటి రోజు ఉదయం 8 నుంచి 10.30 గంటల వరకు వార్డు శానిటేషన్ ఎన్విరాన్ మెంటల్ కార్యదర్శులకు, 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు వార్డు ఎడ్యుకేషన్ కార్యదర్శులకు, సాయంత్రం 5 నుండి 7.30 గంటల వరకు వెల్ఫేర్ కార్యదర్శులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. వచ్చిన వారు మూడు ఆప్షన్లు ఎంచుకొని వెళ్లాలని కమిషనర్ చెప్పడంతో సచివాలయాల ఉద్యోగులు జేఏసీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. నేడు ప్లానింగ్ కార్యదర్శుల కౌన్సెలింగ్ బహిష్కరణ ఈనెల 29వ తేదీ ఆదివారం వార్డు ప్లానింగ్, ఎమినిటీ స్ కార్యదర్శులకు బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించా రు. ఈ కౌన్సెలింగ్ను బహిష్కరిస్తున్నట్లు సచివాలయాల ఉద్యోగుల సంఘం నాయకులు శివప్రసాద్, ఆలీ, భా స్కర్, జ్యోత్న్స, తారకేశ్వర్ రెడ్డి, అమర్ నాథ్, ప్రసాద్ తెలిపారు. కర్నూలు కార్పొరేషన్ ఆధికారులు అన్యాయంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారని ఆరోపించారు. కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల ఆందోళన కర్నూలు కమిషనర్ రవీంద్రబాబు తమకు అన్యాయం చేస్తున్నారంటూ సచివాలయాల ఉద్యోగులు శనివారం రాత్రి భారీగా కలెక్టరేట్కు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో డీఆర్ఓ వెంకట నారాయణమ్మకు వినతిపత్రం ఇచ్చారు. అయితే జర్నలిస్టులు రావడంపై అమె చిందులు తొక్కారు. ఎందుకు మీడియాకు చెప్పారంటూ సచివాలయాల ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల సిఫార్సులకే మొగ్గు..ఎక్కడా లేని విధంగా కర్నూలులో బదిలీల కౌన్సెలింగ్ గుట్టుగా చేయడం ఏంటని కొందరు సచివాలయ ఉద్యోగులు ప్రశ్నించారు. కేవలం టీడీపీ నేతలు సిఫార్సు చేసిన వారు మాత్రమే కర్నూలు అర్బన్, పాణ్యం అర్బన్, కోడుమూరు అర్బన్లో కొనసాగే విధంగా అధికారులు చర్యలు చేపట్టారన్న విమర్శలు వస్తున్నాయి. సిఫార్సు లేని వారికి ఎక్కడ పడితే అక్కడ బదిలీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
దర్శనం దందా!
● దర్శనం పేరుతో భక్తులకు గాలం ● అడ్డదారుల్లో జేబులు నింపుకుంటున్న దళారులు ● ఆలస్యంగా మేలుకున్న శ్రీ మఠం అధికారులు అమాయక భక్తులు దొరికితే చాలు.. ఇక్కడి దళారులకు పండగే. అడ్డదారుల్లో దర్శనాలు చేయించి అందినకాడికి దోచుకోవడం వీరికి అలవాటే. ఏకంగా శ్రీ మఠం అధికారుల అండదండలతోనే ఈ వ్యవహారం నడుస్తుండటం ఆశ్చర్యకరం. ఇంతటి అపచారం రాఘవేంద్రుని సన్నిధిలో కొంతకాలంగా జరుగుతుండటం మహా అపచారం. – మంత్రాలయం మంత్రాలయం ఆధ్యాత్మిక క్షేత్రం ఎంతో పేరెన్నిక గన్నది. ఇక్కడ కొలువుదీరిన శ్రీరాఘవేంద్రస్వామి, గ్రామ దేవత మంచాలమ్మలను దర్శించుకునేందుకు ఏపీ, తెలంగాణ, మహరాష్ట్ర, తమిళనాడు, కేరళ ప్రాంతాలతో పాటు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. దీనినే ఆసరాగా చేసుకున్న కొంత మంది దళారులు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. క్షేత్రస్థాయి ఉద్యోగుల్లో కొంత మంది ప్రైవేటు వసతి గృహాలను లీజుకు నడుపుతున్నారు. ఆన్లైన్, ఆఫ్లైన్లో గదులు కేటాయించే సమయంలో గదుల అద్దెతో పాటు దర్శన సౌకర్యం, పరిమళ ప్రసాదం ప్యాకేజీగా మాట్లాడుకుంటున్నారు. సాధారణ రోజుల కంటే బుధ, గురు, శని, ఆది వారాల్లో లక్షకు పైగా భక్తులు మంత్రాలయం దర్శన నిమిత్తం వస్తుంటారు. తమ వసతి గృహాల్లో బస చేసిన వారు శ్రీ మఠం చేరుకోగానే 6, 7 గేటు నెంబర్ల వద్దకు వెళ్లి మన వారే అంటే చాలు క్షణాల్లో దర్శనం అయిపోతుంది. సాధారణ భక్తులకు మాత్రం గంటల కొద్ది సమయం పడుతుంది. అంతేగాకుండా ఇక్కడ లభించే పరిమళ ప్రసాదం తరహాలోనే కొంత మంది వ్యాపారులు కొన్ని రకాల మిఠాయిలను తయారు చేసి ప్రసాదం పేరుతో విక్రయాలు జరుపుతున్నారు. ఈ తంతు ఇటీవల కాలంలో శ్రీ మఠం విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో బయటపడింది. ఆలస్యంగా స్పందించిన అధికారులు శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో స్వామి వారి దర్శన దందా బాగోతంపై శ్రీ మఠం అధికారులు ఆలస్యంగా మేల్కొన్నారు. మేనేజర్ ఎస్.కె.శ్రీనివాసరావు, శ్రీపతి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తుల సౌకర్యం కోసం ప్రత్యేక క్యూలైన్లో ఏర్పాటు చేశామని, ఎవ్వరూ కూడా డబ్బు కట్టి మోసపోవద్దని మైకుల ద్వా రా సూచనలు చేయించినట్లు తెలిపారు. ఎవరైనా డబ్బు వసూలు చేసినట్లైతే తమ దృష్టికి తీసుకు వస్తే చర్యలు తీసుకుంటామన్నారు. పరిమళ ప్రసాదం తరహాలోనే ప్రసాద విక్రయాలు జరుగుతున్నాయని తమ దృష్టికి రాగానే విజిలెన్స్ విభాగం వారు తనిఖీలు చేపట్టి నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. ఇక మీదట ఎవరైనా నకిలీ పరిమళ ప్రసాదం విక్రయిస్తే షాపు లీజు రద్దు చేయడమే కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
839 మంది మహిళా పోలీసులకు స్థానచలనం
కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లాలో 839 మంది గ్రామ/వార్డు సచివాలయ మహిళా పోలీసులకు స్థానచలనం కలిగింది. ర్యాంకింగ్ ఆధారంగా మహిళా పోలీసులను బదిలీ చేశారు. కౌన్సిలింగ్ నిర్వహించారు. కర్నూలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం సచివాలయ మహిళా పోలీసులకు బదిలీల ప్రక్రియ నిర్వహించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ దగ్గరుండి పర్యవేక్షించారు. మొత్తం 839 మంది కౌన్సెలింగ్కు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ప్రక్రియ రాత్రి పొద్దుపోయే వరకు సాగింది. ర్యాంకింగ్ ఆధారంగా ఖాళీ ఉన్న సచివాలయాల ఆప్షన్లను కంప్యూటర్ తెరపై చూపి కోరుకున్న స్థానానికి బదిలీ చేశారు. దృష్టి లోపం, అంధత్వం ఉన్నవారికి (విజువల్ ఛాలెంజ్), మేధో వైకల్యం (మెంటల్లీ డిసేబుల్డ్), ట్రైబ్స్ దివ్యాంగులు, మెడికల్, స్పౌజ్, జనరల్ కేటగిరీల కింద ఉన్నవారిని వరుస క్రమంలో వ్యాస్ ఆడిటోరియంలోకి పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. కంప్యూటర్ తెరపై ప్రదర్శించిన ఆప్షన్లకు అనుగుణంగా కోరుకున్న స్థానానికి నియమించారు. బదిలీల ప్రక్రియ పూర్తయినప్పటికీ జులై 1న పింఛన్ల పంపిణీ ఉన్నందున ఎక్కడివారు అక్కడే ఉండాలని పోలీసు అధికారులు తెలిపారు. పింఛన్ల పంపిణీ పూర్తయ్యేవరకు అక్కడే కొనసాగి కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం బదిలీ ప్రొసీడింగ్స్ విడుదల చేస్తామన్నారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, మహిళా పీఎస్ డీఎస్పీ శ్రీనివాసాచారి, పోలీస్ వెల్ఫేర్ డాక్టర్ స్రవంతి, సీఐలు తేజమూర్తి, ఆదిలక్ష్మి, విజయలక్ష్మి, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, డీపీఓ సిబ్బంది పాల్గొన్నారు. ‘కౌన్సెలింగ్’ పాట్లు! ఆదోనికి చెందిన లక్ష్మీదేవి మహిళా పోలీస్గా పనిచేస్తోంది. ఆరు నెలలుగా మెటర్నిటీ లీవ్లో ఉంది. మూడు రోజుల కిందట శిశువుకు జన్మనిచ్చింది. అయితే ఇదే సమయంలో శనివారం సచివాలయ ఉద్యోగుల బదిలీలు నిర్వహిస్తుండటంతో ఏకంగా తన చంటిబిడ్డను తీసుకుని జిల్లా పోలీసు కార్యాలయంలో కౌన్సెలింగ్కు హాజరైంది. అలాగే మరికొంత మంది కడుపుతో ఉన్న ఉద్యోగినులు, ఇంకొందరు చంటిబిడ్డలతో వచ్చి అక్కడే ఊయలలు కట్టిన దృశ్యాలు కౌన్సెలింగ్ కేంద్రం వద్ద చర్చనీయాంశమయ్యాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ సాఫీగా సాగింది. అయితే ప్రస్తుతం ఈ ప్రక్రియ ప్రహసనంగా మారడంతో ఉద్యోగులకు అవస్థలు తప్పడంలేదు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు -
సరిహద్దు చెక్ పోస్టు వద్ద నగదు పట్టివేత
మంత్రాలయం/ఎమ్మిగనూరురూరల్: మంత్రాలయం మండలం మాధవరం గ్రామ శివారులో ఉన్న సరిహద్దు చెక్పోస్టు వద్ద ఎకై ్సజ్ అధికారులు రూ.39 లక్షల నగదును పట్టుకున్నారు. రాయచూరు నుంచి బళ్లారి వెళ్లే కర్ణాటక ఆర్టీసీ బస్సులో ఆదోనిలోని విక్టోరియా పేటకు చెందిన నాగరాజు అనే వ్యక్తి వద్ద నుంచి రూ.39 లక్షల నగదును గుర్తించి స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. ఎలాంటి బిల్లులు లభ్యం కాకపోవడంతో నగదును కర్నూలు ఇన్కంట్యాక్స్ అధికారులకు అప్పగించినట్లు ఎకై ్సజ్ సీఐ రమేష్రెడ్డి, చెక్పోస్ట్ సీఐ రాయుడు తెలిపారు. ఏఎన్ఎంల జాబితాపై గందరగోళం కర్నూలు(హాస్పిటల్): గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఏఎన్ఎంలకు బదిలీలకు సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం రాత్రి విడుదల చేసిన జాబితాపై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. సచివాలయాల్లో అన్ని కేటగిరిలకు బదిలీలను ర్యాంకు ఆధారంగా చేస్తుండగా వైద్య ఆరోగ్యశాఖలో మాత్రం డేట్ ఆఫ్ జాయినింగ్ను ఎలా తీసుకుంటారని దాదాపు 30 మందికి పైగా ఏఎన్ఎంలు శనివారం వారి అభ్యంతరాలను కార్యాలయ అధికారులకు అందజేశారు. తాజా జాబితాలోనూ ర్యాంకు ఎక్కువగా ఉన్న వారు పై భాగాన ఎలా ఉంటారని ప్రశ్నిస్తున్నారు. కొందరు ఏఎన్ఎంలకు 2019 అక్టోబర్ 2న జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారని, ఆ రోజున గాంధీ జయంతి ఉండటం వల్ల సెలవు అని, ఆ తేదీని ఎలా పరిగణనలోకి తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. అధికారులు విడుదల చేసిన జాబితాలోనూ పలు తప్పులు ఉన్నాయని, అధికారులు వీటిని సరిచేసి ర్యాంకు ఆధారంగా జాబితా తయారు చేసి కౌన్సెలింగ్ నిర్వహించాలని వారు కోరుతున్నారు. చిన్నారిపై కుక్కదాడి కొత్తపల్లి: ఇంటి బయట ఉన్న 9 నెలల చిన్నారి పై కుక్క దాడి చేసి గాయపరిచింది. ఈ ఘటన ముసలిమడుగు గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన విష్ణు, చిన్నారి దంపతులు తమ తొమ్మిది నెలల కూతురిని ఇంటి బయట ఉన్న అరుగు వద్ద కూర్చోబెట్టి తల్లి ఇంట్లోకి వెళ్లిది. అంతలోనే ఓ కుక్క చిన్నారిపై ఒక్కసారిగా దాడి చేసింది. చెవికి, ముక్కుకు రక్తగాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రథమచికిత్స అనంతరం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. పీఏసీఎస్లకు త్రీమెన్ కమిటీలు కర్నూలు(అగ్రికల్చర్):ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రాథమిక సహకార పరపతి సంఘాలకు ముగ్గురు సభ్యుల నాన్ అఫీషియల్ పర్సన్ ఇన్చార్జీ కమిటీలను ఏర్పాటు దిశగా కూటమి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఇన్చార్జీలు తమ పరిధిలోని పీఏసీఎస్లకు త్రీమెన్ కమిటీలను ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి జాబితాలు అందజేశారు. త్రీమెన్ కమిటీలో ఒకరు చైర్మన్, ఇద్దరు సభ్యులు ఉంటారు. ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజక ఇన్చార్జీలు ఇచ్చిన జాబితాలను సహకార శాఖకు పంపింది. ఇందులో భాగంగా సహకార శాఖ కమిషనర్ ఆయా జిల్లాల సహకార అధికారులకు జాబితాలను పంపారు. కర్నూలు జిల్లాలో 43 పీఏసీఎస్లు ఉండగా 28 పీఏసీఎస్లు.. నంద్యాల జిల్లాలో 56 పీఏసీఎస్లు ఉండగా 28 సంఘాలకు త్రీమెన్ కమిటీల నియామకానికి వెరిఫికేషన్కు సహకార శాఖ కమిషనర్ ఆదేశించారు. ఈ మేరకు డీసీవోలు చర్యలు చేపట్టారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కర్నూలు: స్థానిక సంతోష్ నగర్ వద్ద లోకాయుక్త ఆఫీస్ ఎదురుగా 44వ నంబర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో సయ్యద్ ఇస్మాయిల్ (38) అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతపురం జిల్లా గుంతకల్లు తిలక్ నగర్కు చెందిన ఇస్మాయల్ ప్రస్తుతం కర్నూలు శివారులోని గీతాముఖర్జీ నగర్లో నివాసముంటూ కూలీ పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఇతనికి ఇద్దరు కొడుకులు, కూతురు సంతానం. శుక్రవారం రాత్రి లోకాయుక్త కార్యాలయం వద్ద రోడ్డు దాటుతుండగా హైదరాబాదు నుంచి బెంగళూరు వైపు వెళ్లే గుర్తు తెలియని కారు ఢీకొంది. తలకు, కాళ్లకు బలమైన గాయాలై అపస్మారక స్థితిలో పడివుండగా స్థానికులు 108 అంబులెన్స్లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్యాజువాలిటీ వార్డులో డాక్టర్లు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీ కేంద్రానికి తరలించారు. భార్య షెహనాజ్ బేగం ఫిర్యాదు మేరకు ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
కర్నూలులో చిరుత టెన్షన్
సాక్షి, కర్నూలు: చిరుత సంచారంతో కౌతాళం మండలం తిప్పలదొడ్డి గ్రామ ప్రజలు భయాందోళనలో ఉన్నారు. దానిని పట్టుకునేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఈ క్రమంలో..జనసంచారం నుంచి పోలాల్లోకి వెళ్ళే క్రమంలో కోల్మాన్ పేటకు చెందిన లక్ష్మయ్య అనే యువకుడిపై చిరుత దాడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో గాయపడిన లక్ష్మయ్య ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. చిరుతను బంధించేందుకు ప్రత్యేక బోనులు ఏర్పాటు చేసినట్లు ఫారెస్టు అధికారులు చెబుతున్నారు. -
తొలగని
‘దారి’ద్య్రంగ్రామీణ ప్రాంతాలకు చెందిన రోడ్లు పూర్తి స్థాయిలో ఛిద్రం అయ్యాయి. పల్లె ప్రజలు అవస్థల మధ్య ప్రయాణాలను సాగిస్తున్నారు. ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో రోడ్లపై తట్టెడు మట్టి కూడా వేయలేదని ఆరోపణలు చేసిన కూటమి నేతలు నేడు పల్లె రోడ్ల గురించి పట్టించుకున్న పాపాన పోవడం లేదనే విమర్శలను ఎదుర్కొంటున్నారు. పల్లెలకు సంబంధించిన రోడ్లు అస్తవ్యస్తంగా మారడంతో పలు బస్సు సర్వీసులు కూడా రద్దు అయినట్లు తెలుస్తోంది. కోడుమూరు నుంచి గూడురు వరకు (వయా చనుగొండ్ల ) రోడ్డు పూర్తి అయినా నేటికీ బస్సు సర్వీసు ఏర్పాటు చేయలేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఎమ్మిగనూరు, కోసిగి, కౌతాళం, పెద్దకడుబూరు తదితర మండలాల్లోని గ్రామాలకు చెందిన రోడ్లు పూర్తి అధ్వానంగా తయారయ్యాయి. ● ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని రుద్రవరం – శిరివెళ్ల రోడ్డు పూర్తి స్థాయిలో ఛిద్రమైంది. గుంతలమయంగా మారిన ఈ రోడ్డుపై 15 గ్రామాలకు చెందిన ప్రజలు అవస్థల ప్రయాణం చేస్తున్నారు. ● గ్రామాల్లో డ్రైనేజీలను ఏర్పాటు చేయకుండా సీసీ రోడ్లను నిర్మించడంతో అనేక ఇబ్బందులను ప్రజలు ఎదుర్కొంటున్నారు. జూపాడుబంగ్లాతో పాటు తంగడంచె ఎస్సీ, బీసీ కాలనీలు, పారుమంచాల ఎస్సీ కాలనీతో అంతర్గత రహదారులు నిర్మించినా డ్రైనేజీలను ఏర్పాటు చేయలేదు. వర్షపు నీరు రోడ్లపైనే నిలిచి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. -
విధి ‘పరీక్ష’లో విగతజీవిగా!
● బైక్ చక్రంలో బురక ఇరుక్కుని కింద పడిన మహిళ ● వెనక వస్తున్న ట్యాంకర్ ఆమైపె వెళ్లడంతో దుర్మరణం పాణ్యం: టీచర్ ఉద్యోగం సాధించాలన్నది ఆమె కల. ప్రభుత్వ కొలువు సాధించి కుటుంబానికి అండగా నిలవాలనుకుంది. కల సాకారం చేసుకునేందుకు పరీక్షకు సైతం హాజరైంది. విధి ఆ కలతో పాటు ఆమెను ఛిద్రం చేసింది. పాణ్యం సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం చెందింది. పాణ్యం ఎస్ఐ నరేంద్రకుమార్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. ఓర్వకల్లు మండలం కాల్వ గ్రామానికి చెందిన ఎస్ షబానా (30) పాణ్యం సమీపంలో ఆర్జీఎం కళాశాలలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన డీఎస్సీ పరీక్షకు హాజరైంది. పరీక్ష రాసిన తర్వాత భర్త ఇద్రూస్బాషాతో కలసి బైక్పై స్వగ్రామానికి బయలుదేరారు. మార్గ మధ్యలో పాణ్యం వద్ద ఎస్సార్బీసీ కాల్వ దాటగానే షబానా ధరించిన బురక బైక్ వెనుక చక్రంలో ఇరుక్కుపోవడంతో ఆమె కింద పడింది. అదే సమయంలో వారి వెనుక వస్తున్న ట్యాంకర్ ఆమైపె వెళ్లడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే దుర్మరణం చెందింది. హైవే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ట్యాంకర్ను పోలీసు స్టేషన్కు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల జీజీహెచ్కు తరలించారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం కాగా.. ఇద్రూస్ బాషా పాలిష్ కటింగ్ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. -
నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం
జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన శనివారం ఉదయం 11 గంటలకు సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ జీ నాసరరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సమావేశంలో ముందుగా కోఆప్షన్ సభ్యునిగా ఎన్నికై న వారిని జెడ్పీ స్థాయీ సంఘ కమిటీల్లో సభ్యునిగా నియమించేందుకు ఎన్నిక నిర్వహిస్తామన్నారు. అనంతరం వ్యవసాయం – అనుబంధ శాఖలు, వైద్యం – ఆరోగ్యం, పారిశుద్ధ్యం, విద్యపై సమీక్ష ఉంటుందని పేర్కొన్నారు. సమావేశాని కంటే ముందు ఉదయం 9 గంటలకు జెడ్పీలోని మినీ సమావేశ భవనంలో 1వ స్థాయీ సంఘ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు సీఈఓ తెలిపారు. -
నేరాల నియంత్రణకు ‘చెక్ డివైజ్’
కర్నూలు: నేరాల నియంత్రణకు జిల్లా వ్యాప్తంగా రాత్రి గస్తీ విధుల్లో ఉంటే పోలీసులు మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైజ్ (ఎంఎస్సీడీ) తప్పనిసరిగా ఉపయోగించాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. అనుమానాస్పదంగా కనిపించే వారి వేలి ముద్రలను సేకరించి నేర రికార్డులతో వాటిని సరిపోల్చి నేరస్తులను పట్టుకోవాలన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో శుక్రవారం జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నేర సమీక్ష నిర్వహించారు. కర్నూలు, పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు సబ్ డివిజన్లలో కేసులు పెండింగ్కు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. నేరస్తులను పట్టుకునేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగించాలని సూచించారు. పెండింగ్ కేసులను తగ్గించే విధంగా కృషి చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలు నివారించాలి దొంగతనాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. డయల్ 100కు వచ్చే కాల్స్కు వెంటనే స్పందించాలన్నారు. పోక్సో కేసుల్లో నివేదికలు త్వరగా సిద్ధం చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సమస్యాత్మక ప్రాంతాల్లో రేడియం స్టిక్కర్లు, బారికేడ్స్, జిగ్జాగ్ డ్రమ్స్, స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలన్నారు. డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలన్నారు. మహిళలపై జరిగే నేరాల పట్ల పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. సచివాలయ మహిళా పోలీసుల సేవలను సద్వినియోగం చేసుకునే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. గత నెలలో వివిధ కేసుల్లో ప్రతిభ కనపరచిన పోలీసు అధికారులకు, పోలీసు సిబ్బందికి ప్రశంసాపత్రాలను అందజేశారు. అడ్మిన్ ఏఎస్పీ హు సేన్ పీరా, లీగల్ అడ్వైజర్ మల్లికార్జునరావు, డీఎస్పీలు వెంకటరామయ్య, ఉపేంద్ర బాబు, హేమలత, బాబు ప్రసాద్, భాస్కర్రావు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. అనుమానాస్పదంగా కనిపించే వారి వేలిముద్రలు సేకరించాలి నేర సమీక్షలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ -
సార్.. మాకెందుకు పుస్తకాలు ఇవ్వరు?
● డీఈఓ కార్యాలయం దగ్గర విద్యార్థుల నిరసనకర్నూలు సిటీ: ‘సార్..మాకెందుకు పుస్తకాలు ఇవ్వడం లేదు’ అంటూ విద్యార్థులు శుక్రవారం కర్నూలు డీఈఓ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఉపాధ్యాయులు రావడం లేదని, పాఠాలు చెప్పే వారు కరువయ్యారని.. ఇలాగైతే ఎలా చదువుకోవాలని ప్రశ్నించారు. కర్నూలు బీక్యాంపులో ఉన్న నగరపాలక సంస్థ ప్రాథమికోన్నత పాఠశాలలో 1 నుంచి 8వ తరగతి వరకు ఉంది. ఈ స్కూల్లో మొత్తం 418 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాల పునఃవ్యవస్థీకరణతో ఆ స్కూల్ను మోడల్ ప్రైమరీ పాఠశాలగా మార్పు చేశారు. అందులో 6,7,8 తరగతులకు చెందిన 183 మంది విద్యార్థులను సమీపంలోని ప్రభుత్వ పాఠశాలకు మ్యాపింగ్ చేశారు. మ్యాపింగ్ చేసిన స్కూల్కు వెళ్లకుండా పాత పాఠశాలలోనే తరగతులకు విద్యార్థులు హాజరవుతున్నారు. పుస్తకాలు ఇవ్వకపోవడంతో పాటు మధ్యాహ్న భోజనం కూడా పెట్టకపోవడంతో విద్యార్థులు శుక్రవారం డీఈఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. -
మండలాల వారీగా సమస్యలు ఇవీ..
● మండల కేంద్రమైన వెల్దుర్తి ప్రజలను తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. వైఎస్సార్సీపీ పాలనలో రూ.3.5 కోట్లు ఖర్చు చేసి కృష్ణగిరి రిజర్వాయర్ ద్వారా రోజుకు 9 లక్షల లీటర్ల నీటిని మూడు సంపుల ద్వారా వెల్దుర్తికి నీటిని సరఫరా చేసేవారు. ప్రస్తుతం ఈ రిజర్వాయర్ గురించి పట్టించుకోకపోవడంతో చుక్క నీరు రావడం లేదు. అలాగే గత ప్రభుత్వంలో వెల్దుర్తి మండలంలోని రామళ్లకోట, గోవర్ధనగిరి గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మంజూరు అయ్యాయి. సొంత భవనాలు లేకపోవడంతో వైద్య సిబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. సొంత భవనాలను నిర్మిస్తే దాదాపు 39 గ్రామాల ప్రజలకు వైద్య సేవలు అందే అవకాశాలు ఉంటాయి. ● కోడుమూరు సబ్ డివిజన్ పరిధిలో 40 వేల ఎకరాలు ఎల్లెల్సీ ఆయకట్టు ఉన్నా, ప్రస్తుతం 400 ఎకరాలకు కూడా నీరందని పరిస్థితి నెలకొనింది. అలాగే కోడుమూరు నుంచి పులకుర్తి, కల్లపరి మీదుగా సీ బెళగల్ వరకు నడుస్తున్న ఆర్టీసీ బస్సు రద్దు కావడంతో ప్రజలు, ద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ● గాజులదిన్నె డ్యాం పక్కనే ఉన్నా మండల కేంద్రమైన గోనెగండ్లను తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. తుంగభద్ర కెనాల్లో నీటిని ఎస్ఎస్ ట్యాంకకు లిఫ్ట్ చేసి కుళాయిల ద్వారా నీటిని అందించాల్సి ఉంది. అయితే కెనాల్లో నీరు తగ్గిపోవడంతో రోజుకు 30 నుంచి 45 నిమిషాలు మాత్రమే నీటిని సరఫరా చేయడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ● పెద్దకడుబూరు మండలంలోని బసలదొడ్డి, గవిగట్టు, పీకలబెట్ట, కంబదహాల్ గ్రామాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొనింది. పులికనుమ రిజర్వాయర్ నుంచి నీరు సక్రమంగా సరఫరా చేయకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు బోర్లపైనే అధారపడి ఇబ్బందులు పడుతున్నారు. నెదర్ల్యాండ్ స్కీం ఉన్నా కోసిగి మండలంలోని పలు గ్రామాల ప్రజలకు కూడా తాగునీరు అందని పరిస్థితి నెల కొనింది. ఈ స్కీం నుంచి 16 గ్రామాలకు నీరు అందించాల్సి ఉండగా ప్రస్తుతం నాలుగైదు గ్రా మాలకు మించి నీరు అందని పరిస్థితి నెలకొంది. ● మద్దికెర మండలం బరుజుల గ్రామ ప్రజలకు తాగునీరు అందడం లేదు. గ్రామంలోని బోర్లే వీరికి దిక్కవుతున్నాయి. తాగునీటిని 10 కిలోమీటర్ల దూరంలోని పత్తికొండ నుంచి తెచ్చుకుంటున్నారు. గుంతకల్ నుంచి పెరవలి మీదుగా ఆర్టీసీ బస్సులను నడపాలని ప్రజలు కోరుతున్నారు. -
నేడు, రేపు పంచాయతీ కార్యదర్శుల బదిలీలకు కౌన్సెలింగ్
కర్నూలు(అర్బన్): ఉమ్మడి జిల్లాలోని పంచాయతీ కార్యదర్శి ( గ్రేడ్ – 5 ), డిజిటల్ అసిస్టెంట్ ( గ్రేడ్ – 6 ) బదిలీలకు ఈ నెల 28, 29వ తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి జీ భాస్కర్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 28వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు స్థానిక జిల్లా పరిషత్ ప్రాంగణంలోని మండల పరిషత్ సమావేశ భవనంలో పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ –5 ఉద్యోగులకు కౌన్సెలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాగే 29వ తేదీన ఉదయం 10 గంటలకు డిజిటల్ అసిస్టెంట్లకు జిల్లా పరిషత్ సమావేశ భవనంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. కౌన్సిలింగ్కు హాజరయ్యే వారు తమ కేటగిరీలకు సంబంధించిన ఒరిజినల్ ధ్రువపత్రాలను తీసుకురావాలన్నారు. -
పేద విద్యార్థులకు అందని ఉచిత విద్య
● అడ్మిషన్లకు నిరాకరిస్తున్న ప్రయివేట్ పాఠశాలలు ● బకాయిలు చెల్లించాలని మొండిపట్టు ● విద్యాశాఖ నోటీసులకూ స్పందించని యాజమాన్యాలు ● అడ్మిషన్లకు నేటితో ముగియనున్న గడువు ● డీఈఓ కార్యాలయాన్ని ముట్టడించిన తల్లిదండ్రులు కర్నూలు సిటీ: కూటమి ప్రభుత్వంలో ఉచిత విద్య అందని ద్రాక్షగా మారింది. దరఖాస్తు ప్రక్రియ పూర్తయి పాఠశాలల కేటాయింపు చేపట్టినా ఇప్పటికీ అడ్మిషన్ల ప్రక్రియ కొలిక్కిరాని పరిస్థితి. పాఠశాలలు ప్రారంభమై ఇరవై రోజులు దాటుతున్నా ఇప్పటికీ తమ పిల్లలకు ప్రయివేట్ పాఠశాలలు అడ్మిషన్ ఇవ్వకపోవడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. జిల్లా కలెక్టర్ ఆదేశిస్తున్నా, డీఈఓ చర్చలు సాగిస్తున్నా ప్రయివేట్ పాఠశాలల యాజమాన్యాలు మెట్టు దిగిరాని పరిస్థితి. అదేమంటే.. ఈ ప్రభుత్వం ఫీజులు చెల్లిస్తుందో, లేదోనని తమకు అనుమానంగా ఉందని చెబుతుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో శుక్రవారం వందలాది మంది తల్లిదండ్రులు విద్యార్థి సంఘాల ప్రతినిధులతో కలిసి డీఈఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఉచిత విద్యపై కొరవడిన చిత్తశుద్ధి కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లలో పేదింటి పిల్లలు చదువుకునే అవకాశాన్ని 2022–23 నుంచి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కల్పించారు. మూడేళ్లు ఎక్కడ కూడా ఉచిత విద్యకు ఎంపికై న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చదువులు సాఫీగా సాగిపోయాయి. అయితే గతేడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించారు. ఆ సందర్భంగా ప్రభుత్వం సరైన వాదనలు వినిపించకపోవడంతో కోర్టు జీఓ 24 రద్దు చేసింది. అయితే 2024–25 విద్యా సంవత్సరం విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా జీఓను కొనసాగిస్తూ తీర్పునిచ్చింది. 2025–26 విద్యా సంవత్సరంలో 12(1)సీ ప్రకారం సరైన విధివిధానాలు లేకుండా సీట్ల భర్తీ ప్రక్రియ చేపట్టారు. ఫస్ట్, సెకెండ్ జాబితాలు విడుదల చేసి, ఎంపికై న వారి వివరాలను ఆయా స్కూళ్లకు పంపించారు. అయితే మెజార్టీ స్కూళ్ల యాజమాన్యాలు అడ్మిషన్ చేసుకోకుండా తల్లిదండ్రులను తిప్పిపంపుతున్నారు. నోటీసులను లెక్కచేయని యాజమాన్యాలు ఆయా ప్రయివేట్ పాఠశాలల్లో ఉచిత విద్య కింద సీటు పొందినప్పటికీ అడ్మిషన్ ఇవ్వని పరిస్థితిపై జిల్లా విద్యా శాఖ నోటీసులు జారీ చేసింది. అయినప్పటికీ స్పందించకపోవడంతో మరోసారి నోటీసులు జారీ చేస్తూ పాఠశాల గుర్తింపు రద్దు చేస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రయివేట్ పాఠశాలల యాజమాన్యాలు డీఈఓతో సమావేశమై బకాయిలు చెల్లించకపోతే అడ్మిషన్లు ఇవ్వలేమని తేల్చిచెప్పారు. ఆయన సర్దిచెప్పినప్పటికీ అడ్మిషన్లు ఇవ్వని పరిస్థితి. ఇదే సమయంలో రెండో విడత సీట్ల కేటాయింపు జరిగిపోయింది. ఈ విద్యార్థులు కూడా ఆయా పాఠశాలలకు వెళ్లగా అడ్మిషన్కు నిరాకరించడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. డీఈఓ కార్యాలయం చుట్టడి ప్రయివేట్ పాఠశాలల తీరుతో విసిగిపోయిన తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలతో కలిసి శుక్రవారం డీఈఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆ సమయంలో డీఈఓ లేకపోవడంతో అక్కడే మెట్లపై కూర్చొని నిరసన తెలిపారు. డీఈఓ వచ్చాక ఆయనను చుట్టుముట్టి అడ్మిషన్ ఇవ్వని ప్రయివేట్ పాఠశాలలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. పిల్లలకు అన్యాయం చేయకండిని చేతులెత్తి మొక్కారు. ఈ నేపథ్యంలో డీఈఓ స్పందిస్తూ శనివారం సాయంత్రంలోపు సీట్లు పొందిన విద్యార్థులందరినీ పాఠశాలల్లో చేర్పించుకునేలా చూస్తామన్నారు. లేనిపక్షంలో ఏ కారణంచేత తిరస్కరించారో స్పష్టంగా నివేదిక ఇవ్వాలని ఎంఈఓను ఆదేశించారు. 122 పాఠశాలల్లో సీట్లు పొందిన విద్యార్థులు జిల్లాలోని ప్రయివేట్ స్కూళ్లు .. 7691,110 ఉచిత విద్యను అందించేందుకు మొదటి విడతలో దరఖాస్తు చేసుకున్న పాఠశాలలు 384 262 పాఠశాలల్లో అడ్మిషన్కు నిరాకరించిన విద్యార్థుల సంఖ్య 1,179 ఉచిత విద్య కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సంఖ్య 173 స్కూళ్లలో రెండో విడత సీట్లు దక్కించుకున్న విద్యార్థులు 1,056 2,289 -
సీమ రైతులపై చంద్రబాబుది కపట ప్రేమ
జూపాడుబంగ్లా: రాయలసీమ రైతులపై సీఎం చంద్రబాబు నాయుడు కపట ప్రేమ ఒలకబోస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు, రైతులు విమర్శించారు. పోతిరెడ్డి పాడు నుంచి నీటి విడుదలకు ఆస్కారం ఉన్నా పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. వెంటనే నీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలంటూ వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంగల భరత్కుమార్రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి, సర్పంచ్ నాగార్జునరెడ్డి, జిల్లా జాయింట్ సెక్రటరీ కోసిక తిరుమలేశ్వరరెడ్డితో పాటు పలువురు రైతులు, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షుడు తోకల కృష్ణారెడ్డి తదితరులు శుక్రవారం పోతిరెడ్డిపాడును సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శ్రీబాగ్ ఒడంబడిక, బచావత్ తీర్మాన ప్రకారంగా శ్రీశైలం జలాశయంతో 854 అడుగుల నీటిమట్టం చేరితే పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా సాగు, తాగునీటిని విడుదలకు అనుమతి ఉన్నా అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. హెడ్రెగ్యులేటర్కు అనుసంధానంగా ఉన్న తెలుగుగంగ, జీఎన్ఎస్ఎస్, కేసీ ఎస్కేప్ కాల్వల కింద 6.20 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందన్నారు. ముందస్తు వర్షాలకు ఖరీఫ్ సీజన్ కింద మొక్కజొన్న, పత్తి, మినుము, కంది, తదితర పంటలను సుమారు లక్ష ఎకరాల మేర రైతులు పంటలను చేసుకున్నారన్నారు. ప్రస్తుతం వర్షాలు లేక పంటలు ఎండుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. డ్యాంలో 854 అడుగుల నీటిమట్టం దాటి వారం రోజులైనా నీటిని విడుదల చేయకపోవటంతో రైతులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ నుంచి రాయలసీమ రైతాంగానికి సాగు, తాగునీటినివ్వకుండా సీఎం చంద్రబాబునాయుడు రైతులను మభ్యపెట్టడం తగదన్నారు. ముందుగా రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తిచేయకుండా పోలవరం నుంచి బానకచర్ల వరకు గోదావరి జలాలను తరలిస్తామని పేర్కొనటం సబబుకాదన్నారు. 70 శాతం పూరైన ప్రాజెక్టును గాలికొదిలేసి.. రూ.81వేల కోట్ల నిధులతో గోదావరి జలాలను బనకచర్లకు తరలిస్తామనటం విడ్డూరంగా ఉందన్నారు. ఆందోళనలో వైఎస్సార్సీపీ నాయకులు గోపాల్రెడ్డి, నరేష్రెడ్డి, తరుణ్కుమార్రెడ్డి, హర్షవర్ధన్రెడ్డి, నాగశేనారెడ్డి, చిన్నమల్లయ్య, చిన్న ఎర్రన్న, భాస్కర్రెడ్డి, సుధాకర్రెడ్డి, వివిధ గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. ‘పోతిరెడ్డిపాడు’ నుంచి నీటి విడుదల చేయండి -
మద్యం మత్తులో భార్యను చంపిన భర్త
మంత్రాలయం: కట్టుకున్న భార్యనే ఒక భర్త మద్యం మత్తులో కడతేర్చాడు. నూరేళ్ల బంధాన్ని మధ్యలోనే తెంచుకున్నాడు. మంత్రాలయం మండలం సూగూరు గ్రామంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బోయ హనుమంతును 28 ఏళ్ల క్రితం ఎమ్మిగనూరు మండలం గుడేకల్ గ్రామానికి చెందిన బి.లక్ష్మిదేవి(45) వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొన్ని రోజు లుగా హనుమంతు మద్యం తాగుతూ తిరిగేవాడని గ్రామస్తులు చెబుతున్నారు. అనుమానంతో భార్యను వేధిస్తూ వచ్చాడు. పెద్దలు ఎంతగా నచ్చజెప్పినా ఫలితం లేకపోయింది. శుక్రవారం వేకువ జామున 3.30 గంటల సమయంలో గాఢ నిద్రలో ఉన్న భార్య పై ఇంట్లోని గుంటక మేడిగుంజతో విచక్షణ రహితంగా దాడికి చేశాడు. తల్లి అరుపులు విన్న కుమారుడు, కుమార్తె అడ్డుకోబోయారు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను చికిత్స నిమిత్తం బొలెరో వాహనంలో ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యుడు అప్పటికే ఆమె ప్రాణాలు విడిచినట్లు నిర్ధారించారు. కళ్లెదుటే తల్లి మృతి చెందడంతో కుమారుడు, కుమార్తె బోరున విలపించారు. భార్యను హతమార్చిన హనుమంతు ఊర్లోనే రోకలిబండ పట్టుకుని తిరుగుతూ ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఎస్ఐ శివాంజల్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
జూలై 10న ఎల్లెల్సీకి నీటి విడుదల
హొళగుంద: కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం నుంచి జూలై 10న ఎల్లెల్సీకి కర్ణాటక కోటా నీటి విడుదలకు కర్ణాటక నీటి సలహా మండలి(ఐసీసీ) నిర్ణయం తీసుకుంది. శుక్రవారం బెంగళూరులోని విధానసౌధలో జరిగిన 124వ నీటి సలహా మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం టీబీ డ్యాంలో 1,620 అడుగుల వద్ద 60 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అయితే ఈ ఏడాది ముందుగానే డ్యాంకు వరదలు రావడం, ఇంకా ఆగస్ట్ 15 వరకు వర్షాలు కురిసే అవకాశాలు ఉండడంతో కాలువలకు నీటి విడుదలపై సమావేశం నిర్వహించారు. ప్రస్తుత నిల్వ ఆధారంగా నీటి విడుదలపై నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రకారంగా ఖరీఫ్కు జూలై 10 నుంచి నవంబర్ 30 వరకు కర్ణాటక దిగువ కాలువకు 650 క్యూసెక్కుల ప్రకారం నీరు విడుదల చేయనున్నారు. ఇక ఆంధ్ర అధికారులు తమ కోటా నీటిలో ఇండెంట్ ఇస్తే అదే రోజు ఇరు రాష్ట్రాల కోటా నీటిని (దాదాపు 1,400 క్యూసెక్కులు) వదలనున్నారు. ఇదిలాఉంటే ఎల్లెల్సీ 155 కి.మీ, 205కి.మీ నుంచి 250 కి.మీ వరకు కాలువలో గత నెలన్నర రోజులుగా ఆధునికీకరణ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులు పూర్తి మందకొడిగా సాగుతుండటంతో నీటి విదుదల నాటికి పూర్తవుతాయో లేదోననే ఆందోళన వ్యక్తమవుతోంది. అదేవిధంగా టీబీ డ్యాం 33 కొత్త క్రస్టు గేట్లను అమర్చే పనులు డ్యాంకు వచ్చే వరదను బట్టి డిసెంబర్ నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగా టీబీ డ్యాం నుంచి వివిధ కాలువలతో పాటు దిగువ కాలువ(ఎల్లెల్సీ) కింద కేవలం ఖరీఫ్కు మాత్రమే సాగుకు నీరిచ్చేందుకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. బెంగళూరులో జరిగిన ఐసీసీలో నిర్ణయం -
30న వక్ఫ్ బచావో బహిరంగ సభ
కర్నూలు (టౌన్): నగరంలోని ఎస్టీబీసీ కళశాల క్రీడా మైదానంలో ఈనెల 30వ తేదీ సాయంత్రం 5 గంటలకు ‘వక్ఫ్ బచావో– దస్తూర్ బచావో’ పేరుతో నిర్వహిస్తున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి పిలుపు నిచ్చారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బహిరంగ సభకు సంబంధించిన పోస్టర్లను శుక్రవారం సాయంత్రం ఎస్వీ కాంప్లెక్స్లో ముస్లిం నేతలతో కలిసి ఎస్వీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింల అభివృద్ధి కోసం వక్ఫ్ బోర్డు పనిచేస్తోందన్నారు. ఈ బోర్డు కింద లక్షలాది ఎకరాల భూములు ఉన్నాయన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్టంలో సవరణలు చేసిందన్నారు. ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. తాహుఫజ్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు హమీద్, వైఎస్సార్సీపీ ముస్లిం మైనార్టీ నగర అద్యక్షులు పత్తా బాషా, అవాజ్ కమిటీ నగర అధ్యక్షుడు షరీఫ్, అమానుల్లా మౌలానా సాహెబ్, సౌఖత్ ఆలీ తదితరులు పాల్గొన్నారు. పోస్టర్లను ఆవిష్కరించిన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి -
ప్రైవేటు దిగిరాక.. అడ్మిషన్లు అందక!
● ఓర్వకల్లు మండలం నన్నూరుకు చెందిన మద్దయ్యకు ఇద్దరు మనవళ్లు. ఒకరు నన్నూరులోనే చదువుతున్నారు. మరో మనవుడు కురువ అనిల్ కుమార్ 1వ తరగతికి ఉచిత విద్య కోసం దరఖాస్తు చేశారు. వీరికి ఢిల్లీ పబ్లిక్ స్కూల్(కేజేఎఫ్ సిటీ, చిన్నటేకూరు)లో సీటు కేటాయించారు. ఈ స్కూల్ గతంలో నన్నూరు పరిధిలో ఉంది. ప్రస్తుతం కల్లూరు మండలం చిన్నటేకూరుకు మార్చారు. యాజమాన్యం ఈ స్కూల్ చిరునామాను మార్చకపోవడంతో ఆన్లైన్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ను ఎంపిక చేసుకున్నారు. అడ్మిషన్ కోసం స్కూల్కు వెళితే మీరు అర్హులు కాదని వెనక్కి పంపించారు. కల్లూరు ఎంఈఓ ఆ స్కూల్కి నోటీసులు ఇచ్చి చేర్చుకోవాలని సూచించారు. అయినప్పటికీ యాజమాన్యం పెడచెవిన పెడుతుండటంతో తల్లిదండ్రులు వారం రోజులుగా డీఈఓ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ● కర్నూలు నగరంలోని బంగారుపేటకి చెందిన సి.శిరీషా, రామాంజనేయులు దంపతులకు ఇద్దరు సంతా నం. చిన్న కూతురు సి.యామినికి ఉచిత విద్య కింద దరఖాస్తు చేయగా కొత్తపేటలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో సీటు వచ్చింది. అయితే అడ్మిషన్ కోసం వెళితే ప్రభుత్వం మాకు డబ్బులు ఇస్తుందనే నమ్మకం లేదని, ఫీజులు ప్రభుత్వం ఇవ్వకపోతే మేమే చెల్లిస్తామని రాతపూర్వకంగా ఆ స్కూల్ యాజమాన్యం రాయించుకుంది. అయినప్పటికీ సీటు ఇవ్వకుండా తిప్పుకుంటున్నారు. ● కల్లూరు మండలం కస్తూరి నగర్లో నివాసం ఉంటున్న బండారి శివాజీకి ఒక కూతురు సంతానం. చిరుద్యోగం చేసుకొని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఒకటో తరగతిలో ప్రవేశానికి విద్యాహక్కు చట్టం కింద ఉచితంగా దరఖాస్తు చేయగా అబ్బాస్ నగర్లోని రవీంద్ర స్కూల్లో సీటు వచ్చింది. అయితే మీరు నివాసం ఉంటున్న కాలనీ నుంచి మా స్కూల్కి రావాలంటే హైవేరోడ్డు ఉందని, రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని అడ్మిషన్కు నిరాకరించారు. మొదటి, రెండో విడతలోనూ సీటు కేటాయించిన యాజమాన్యాం అడ్మిషన్ ఇవ్వడం లేదని ఆయన వాపోతున్నాడు. ● ...జిల్లాలో వందలాది మంది తల్లిదండ్రులు పరిస్థితి ఇదేవిధంగా ఉంది. ఉచిత విద్యకు ఎంపికై నా ప్రయివేట్ పాఠశాలల యాజమాన్యాలు అడ్మిషన్ ఇవ్వకుండా చుక్కలు చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ సమస్యను ఎవరికి చెప్పుకోవాలో తెలియక తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. -
శ్రావణంలో శ్రీరాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు
మంత్రాలయం: సద్గురు శ్రీరాఘవేంద్రస్వామి ఆరాధన ఉత్సవాలు శ్రావణ మాసంలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం 354వ సప్తరాత్రోత్సవాలకు సంబంధించి ఆహ్వాన కార్డుకు ప్రత్యేక పూజలు చేపట్టారు. మఠం మేనేజర్ శ్రీనివాసరావు, ధార్మిక మేనేజర్ శ్రీపతి ఆచార్ నేతృత్వంలో రాఘవేంద్రులు, వాదీంద్రతీర్థుల మూల బృందావనాలతో ఉంచి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. ప్రముఖులకు ఈ ఆహ్వాన కార్డుల ద్వారా ఆహ్వానం పలుకనున్నారు. కారు అద్దాలు పగులగొట్టి .. ● రూ. 7 లక్షలు అపహరణ ఆళ్లగడ్డ: సినీ ఫక్కీలో కారు అద్దాలు పగలగొట్టి పట్టపగలే రూ. 7 లక్షలు చోరీ చేసిన ఘటన ఆళ్లగడ్డలో శుక్రవారం జరిగింది. అహోబిలం గ్రామానికి చెందిన నరేష్ పట్టణంలోని ఓ బ్యాంకులో రూ. 7 లక్షలు డ్రా చేసుకుని నగదు బ్యాగ్ను కారులో పెట్టుకున్నాడు. అక్కడి నుంచి విశ్వశాంతి స్కూల్లో చదువుతున్న పిల్లల దగ్గరకు వెళ్లాడు. స్కూల్ ఎదుట కారు ఆపి తరగతి గదిలోని పిల్లల దగ్గరకు వెళ్లాడు. అంతలోనే కారు వెంట బైక్పై ఫాలో అవుతూ వచ్చిన ఇద్దరు వ్యక్తులు అందరూ చూస్తుండగానే కారు అద్దాలు పగులగొట్టి రూ. 7 లక్షలు ఉన్న బ్యాగును దొంగిలించి పారిపోయారు. గమనించిన వ్యక్తులు కేకలు వేస్తూ వెంటపడగా నిమిషాల్లోనే కనిపించకుండా పారిపోయారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వైఎస్సార్సీపీ నేత అనుమానాస్పద మృతి
సాక్షి, నంద్యాల జిల్లా: వైఎస్సార్సీపీ నేత మునగాల రామసుబ్బారెడ్డి అనుమానాస్పదంగా మృతి చెందారు. మహానంది మండలం మసీదుపురం గ్రామ శివారులోని బావిలో రామసుబ్బారెడ్డి మృతదేహం లభ్యమైంది. ఆయన తల, శరీరంపై దెబ్బలను పోలీసులు గుర్తించారు. ఇది ముమ్మాటికీ హత్యేనని మృతుని కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నాయకులు అంటున్నారు. టీడీపీ నేత వంటెద్దు ప్రవీణ్కుమార్ రెడ్డి హత్య చేయించారనే ఆరోపణలు వస్తున్నాయి.రామసుబ్బారెడ్డి కుటుంబాన్ని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి పరామర్శించారు. రెడ్బుక్ రాజ్యాంగం వల్లే శ్రీశైలం నియోజకవర్గంలో మూడు హత్యలు జరిగాయని శిల్పా చక్రపాణిరెడ్డి మండిపడ్డారు. గ్రామాల్లో మద్యం ఏరులై పారుతుండడమే ఈహత్యలకు కారణమన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారించి హత్యకు కారకులను శిక్షించాలని శిల్పా డిమాండ్ చేశారు. మహానంది పోలీసులు.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. -
పోక్సో కేసులో యువకుడికి 20 ఏళ్ల జైలు
కర్నూలు: నంద్యాల జిల్లా బనగానపల్లెలో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి 20 సంవత్సరాల కారాగార శిక్ష, రూ.50 వేలు జరిమానా విధిస్తూ కర్నూలు పోక్సో కోర్టు న్యాయమూర్తి ఇ.రాజేంద్రబాబు గురువారం తీర్పు చెప్పారు. 2020 అక్టోబర్ 22న బాధిత బాలిక (4) ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా అదే గ్రామానికి చెందిన గుడిసె రుద్రేశ్ (22) అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు బనగానపల్లె పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ నరసింహారెడ్డి కేసు విచారించి నిందితుడిపై కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి నిందితుడికి శిక్ష విధించారు. జరిమానా మొత్తాన్ని బాధిత బాలికకు చెల్లించాలని న్యాయమూర్తి తీర్పులో ఆదేశించారు. -
ఐజీ గుర్తింపుతో అంతర్జాతీయ మార్కెటింగ్
ఎమ్మిగనూరుటౌన్: చేనేత కార్మికులు ఉత్పత్తి చేస్తున్న టవళ్లు, బెడ్షీట్లకు భౌగోళిక గుర్తింపు(ఐజీ) వస్తే అంతర్జాతీయంగా మార్కెటింగ్ పెరగుతుందని రెసెల్యూట్ బి2బి సంస్థ లీగల్ కౌన్సిల్ ప్రతినిధి శ్రీవత్సవ తెలిపారు. ఎమ్మిగనూరులోని వైడబ్లూసీఎస్ కార్యాలయంలో చేనేత కార్మికులు ఉత్పత్తి చేసిన బర్డ్ ఐ టవళ్లు, జిందగీ బెడ్షీట్లను చేనేత జౌళిశాఖ డీఓ నరసింహారెడ్డి, స్థానిక సంఘ కార్యదర్శి, ఏడీ అప్పాజిలతో కలిసి ఆయన పరిశీలించారు. చేనేత కార్మికులతో సమావేశమై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పద్మశ్రీ మాచాని సోమప్ప ప్రారంభించిన సొసైటీ ద్వారా ఉత్పత్తి అయిన టవళ్లు, బెడ్షీట్లకు భౌగోళిక గుర్తింపునకు తాము పరిశీలించామన్నారు. సేకరించిన వివరాలను కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని అక్కడ వారు పరిశీలించిన తరువాత ఐజీ గుర్తింపు వచ్చేందుకు అవకాశం ఉందన్నారు. ఐజీ గుర్తింపు వస్తే ఎమ్మిగనూరులో మాత్రమే ఆయా ఉత్పత్తులు చేయాల్సి ఉంటుందన్నారు. తద్వార ఉత్పత్తుల విక్రయాల మార్కెటింగ్ పెరగడంతో పాటు ఆయా ఉత్పత్తుల ధరలు కూడా 15 నుంచి 30 శాతం పెరిగే అవకాశం ఉందన్నారు. ఇక్కడి టవళ్లు, బెడ్షీట్లకు జీఐ గుర్తింపు వస్తే ఆయా ఉత్పత్తులను వేరొకరు ఉత్పత్తి చేసేందుకు అవకాశం ఉండబోదన్నారు. ఎమ్మిగనూరు చేనేతకు మంచి పేరు ఎమ్మిగనూరు ప్రాంతంలో పత్తి సాగు ఎక్కువగా ఉండటంతో పద్మశ్రీ మాచాని సోమప్ప 1938లో వైడబ్ల్యూసీఎస్ను ప్రారంభించారని సొసైటీ కార్యదర్శి, ఏడీ అప్పాజి తెలిపారు. ఎన్హెచ్డీసీతో నాణ్యమైన ముడిసరుకు తీసుకొని ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు చెప్పారు. ఎమ్మిగనూరు చేనేత ఉత్పత్తులకు మంచి పేరుందన్నారు. సొసైటీ డిజైనర్ రవికుమార్, వైడబ్ల్యూసీఎస్ సిబ్బంది, చేనేత కార్మికులు పాల్గొన్నారు. టవళ్లు, బెడ్షీట్లను పరిశీలించిన రెసెల్యూట్ బి2బి సంస్థ ప్రతినిధి -
కమిటేషన్ రికవరీ సుప్రీం తీర్పునకు వ్యతిరేకం
కర్నూలు(అగ్రికల్చర్): విశ్రాంత ఉద్యోగుల సమస్యలను సత్వరం పరిష్కరించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కర్నూలు విశ్రాంత ఉద్యోగుల సంఘం నేతలు జిల్లా కలెక్టర్ రంజిత్బాషాను కోరారు. గురువారం కలెక్టర్ను ఆయన చాంబర్లో కలసి వివిధ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు రంగారెడ్డి మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులు తీసుకున్న కమిటేషన్ రికవరీ 11 సంవత్సరాల 3 నెలల్లో పూర్తవుతుందన్నారు. అందువల్ల ఇక రికవరీ చేయరాదని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని, ఇందుకు అనుగుణంగా ఆరు నెలల పాటు కమిటేషన్ రికవరీ నిలిపేశారన్నారు. అయితే గత నెల నుంచి మళ్లీ రికవరీ చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. ఒక్కో విశ్రాంత ఉద్యోగి పెన్షన్లో రూ.5వేల నుంచి రూ.10 వేల వరకు ప్రభుత్వం మళ్లీ రికవరీ మొదలు పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని.. 11 ఏళ్ల 3 నెలలు కమిటేషన్ రికవరీ చేసి ఉంటే అలాంటి వారికి మినహాయింపు ఇవ్వాలని కోరారు. కలెక్టర్ను కలిసిన వారిలో సంఘం జనరల్ సెక్రటరీ జయచంద్రారెడ్డి, ఇతర నాయకులు గోవిందరాజులు, రామచంద్రరావు, జేసీ నాథ్, ఇనయతుల్లా, విజయకుమార్రెడ్డి, సూర్యనారాయణ, పుల్లారెడ్డి తదితరులు ఉన్నారు. -
శ్రీమఠంలో భక్తుల రద్దీ
మంత్రాలయం: శ్రీరాఘవేంద్రస్వామి దర్శనానికి గురువారం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. దీంతో మంత్రాలయ క్షేత్రం కళకళలాడింది. భక్తులు ముందుగా గ్రామ దేవత మంచాలమ్మ, తర్వాత రాఘవేంద్రుల మూల బృందావన దర్శనం చేసుకున్నారు. సుమారు రెండున్నర గంటల సమయం పట్టింది. అన్నపూర్ణ భోజనశాల, పరిమళ ప్రసాదం కౌంటర్లతో భక్తుల రద్దీ కనిపించింది. పాఠశాలకు వచ్చి.. విద్యార్థులతో మాట్లాడి ● కె.సింగవరంలో తెలంగాణ విజిలెన్స్ డీజీ సి.బెళగల్: తెలంగాణ రాష్ట విజిలెన్స్ డీజీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తన స్వగ్రామమైన కె.సింగవరానికి గురువారం వచ్చారు. గ్రామంలోని యూపీ స్కూల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ కావడంతో అక్కడికి చేరుకుని విద్యార్థులతో గడిపారు. ఈ సందర్భంగా స్కూల్ హెచ్ఎం రాధ, సర్పంచ్ రవీంద్రరెడ్డి, ఎంఈఓ ఆదామ్బాషా, స్కూల్ టీచర్లు, విద్యార్థులతో కలసి ఆయన పాఠశాల ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట విజిలెన్స్ డీజీని పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు సన్మానించారు. కార్యక్రమంలో గ్రామ పెద్ద నాగేశ్వరెడ్డి, ఉపాధ్యాయులు లక్ష్మన్న, క్రిష్ణారెడ్డి, వెంకటేశ్వర్లు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ ఏడీఏల బదిలీలు కొలిక్కి కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ శాఖలో ఎట్టకేలకు ఏడీఏల బదిలీలు కొలిక్కి వచ్చాయి. ఈ మేరకు వ్యవసాయ శాఖ కమిషనర్ డిల్లీరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇది వరకు ఎమ్మిగనూరు భూసార పరీక్ష కేంద్రానికి డోన్ ఏడీఏ అశోక్వర్ధన్రెడ్డి, శైలకుమారీలను నియమించారు. తాజాగా అశోక్వర్ధన్రెడ్డిని భూసార పరీక్ష కేంద్రం ఏడీఏగా నియమించారు. శైలకుమారికి పోస్టింగ్ ఇవ్వలేదు. మొదట పలమనేరులో ఏడీఏగా పనిచేస్తున్న అన్నపూర్ణను ఎమ్మిగనూరు సీడ్ టెస్టింగ్ ల్యాబ్ ఏడీఏగా నియమించారు. తాజా ఉత్తర్వుల్లో ఈమె పేరు లేదు. కర్నూలు డీఆర్సీలో ఏడీఏగా పనిచేస్తున్న గిరీష్ ఎలాంటి ఆప్షన్ ఇవ్వలేదు. అయినప్పటికీ నందికొట్కూరు ఏడీఏగా బదిలీ చేశారు. అయితే ఈ పోస్టులో ఎవ్వరినీ నియమించలేదు. ఈ పోస్టు కోసం అన్నపూర్ణ కూటమి పార్టీ నేతల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలిన ఏడీఏల బదిలీల్లో ఎలాంటి మార్పులు లేవు. ఆషాఢమాసం ఎఫెక్ట్ మహానంది: ఆషాఢమాసం ప్రారంభం కావడంతో మహానందికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. వేసవిసెలవులతో పాటు శుభముహూర్తాలు ఉన్నందున గత నెలరోజులుగా నిత్యం వేలాది మంది భక్తులతో కళకళలాడిన మహానందీశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం భక్తులు లేక వెలవెలబోతూ కనిపించింది. -
ఇదేమి ‘తీరు’వా?
బకాయిలు వసూలు చేయమన్నాం కాలువల ద్వారా సాగునీటిని పంటల సాగుకు వాడుకుంటున్న రైతుల నుంచి బకాయి పడ్డ పన్నులను వసూలు చేయాలని వీఆర్వోలకు తెలిపాం. అయితే మైక్ల ద్వారా ప్రచారం చేస్తున్నట్లు మా దృష్టికి రాలేదు. అన్నదాత సుఖీభవ పథకాలు వంటిపై ప్రచారం చేస్తున్న విషయంపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు. సాగునీరు సక్రమంగా రాకున్నా పన్నులు ఎలా చెల్లించాలని కొందరు రైతులు తన దృష్టికి తెచ్చారు. – ఎజాజ్ అహ్మద్, చిప్పగిరి తహసీల్దార్ ఆలూరు: ‘‘ఆయకట్టు భూములకు సాగునీరు అంద కున్నా మాకు సంబంధం లేదు. మీరు పెండింగ్లో ఉన్న నీటి తీరువా బకాయిలు చెల్లించాలి. ఈకేవైసీ చేసుకోవాలి. లేదంటే అన్నదాత సుఖీభవ పథకం అమలు కాదు’’ అంటూ రైతులపై వీఆర్వోలు ఒత్తిళ్లు తెస్తున్నారు. తుంగభద్ర ఎగువ, దిగువ కాలువ కింద పొలాలు ఉన్న రైతులు నీటితీరువా వెంటనే చెల్లించాలని మైక్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. హాలహర్వి మండలం ఎం.కె.పల్లి, శ్రీధర్హాళ్, బాపురం, కొక్కెరచేడు, చింతకుంట, చిప్పగిరి మండలం బెల్డోణ, రామదుర్గం, ఖాజీపురం, తిమ్మాపురం, ఆలూరు మండలం హత్తిబెళగళ్ గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. అలాగే ఇంగదహాళ్, ఏ.గోనెహాళ్, వందవాగిలి, గజ్జహళ్లి, హొళగుంద, కోకిలతోట గ్రామాల్లో రైతుల వద్దకు వెళ్లి పెండింగ్ బకాయిలను చెల్లించాలంటున్నారు. వీఆర్వోలతోపాటు టీడీపీ నాయకులు కూడా వెళ్తున్నారు. రైతులపై ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో తహసీల్దార్ కార్యాలయానికి ఫిర్యాదు అందింది. ఎంకేపల్లి గ్రామంలో మైక్ ద్వారా నీటి తీరువా చెల్లించాలని ప్రచారం చేయడం బహిర్గతమైంది. ఏడాదికి ఎకరాకు రూ. 120 ఆలూరు నియోజకవర్గంలో చిప్పగిరి మండలం కమ్మకొట్టాల గ్రామాల నుంచి హెచ్చెల్సీ ప్రారంభమై ఆలూరు మండలం హత్తిబెళగళ్ గ్రామం వరకు సాగుతుంది. ఈకాలువ పరిధిలో 19 డీపీల కింద 14,555 ఎకరాలకు కాను 250 క్యూసెక్కుల సాగునీరు విడుదల కావాల్సి ఉంది. అయితే కాలువ పటిష్టతను కోల్పోవడంతో సాగనీరు అంతా వృథా అవుతోంది. కాలువ కింద కేవలం 4వేల నుంచి 6 వేల ఎకరాలకు సాగునీరు మించి అందటంలేని రైతులు చెబుతున్నారు. నీరు అందినా, అందకున్నా ఏడాది ఎకరాకు రూ.120 ప్రకారం చెల్లించాలని కొందరు వీఆర్వోలు టీడీపీ నాయకులతో కలసి రైతులపై ఒత్తిడి చేస్తున్నారు. ఎల్లెల్సీ కింద ఆలూరు నియోజకవర్గంలో చింతకుంట, బాపురం, హొళగుంద మూడు సెక్షన్లు ఉన్నాయి. చివరి ఆయకట్టు రైతులకు సక్రమంగా సాగునీరు అందడం లేదు. అయినా నీటి పన్ను చెల్లించాలని రెవెన్యూ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. సాగునీరు అందకున్నా పన్ను చెల్లించాలా? ఆందోళన చెందుతున్న రైతులు -
డ్రగ్స్తో జీవితాలను నాశనం చేసుకోవద్దు
కర్నూలు(సెంట్రల్): డ్రగ్స్ బారిన పడి యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని కలెక్టర్ పి.రంజిత్బాషా అన్నారు. గంజాయి, గుట్కా, ఇతర మత్తు పదార్థాల రవాణా, వినియోగంపై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు నిషేధం విధించినట్లు చెప్పారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమరవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతముందు రాజ్ విహార్నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. హోర్డింగ్లు ఏర్పాటు చేస్తాం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే దుష్ఫలితాలపై కళాశాలలు, పాఠశాలలు, మూనివర్సిటీ సమీపంలో హోర్డింగ్లను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి పాఠశాల, కళాశాలలో ఈగల్ టీంలను విద్యార్థులతో ఏర్పాటు చేశామన్నారు. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ.. విద్యార్థులు డ్రగ్స్ అలవాటు పడకుండా వాటితో కలిగే అనర్థాలపై తల్లిదండ్రులు వివరించాలన్నారు. జిల్లాలో మాదక ద్రవ్యాల రవాణాపై పటిష్ట నిఘా ఉన్నట్లు డీఐజీ కోయ ప్రవీణ్ చెప్పారు. ఇంట్లో ఒక్కరూ డ్రగ్స్ తీసుకుంటే ఆ కుటుంబం మొత్తం నాశనం అవుతుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి అన్నారు. కళాశాలలు, పాఠశాలల్లో ఎవరైనా మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్నట్లు తెలిస్తే టోల్ ఫ్రీ నంబర్ 1972కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ఎస్పీ విక్రాంత్పాటిల్ సూచించారు. కర్నూలు నగర మేయర్ బీవై రామయ్య మాట్లాడుతూ.. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిఘా వేసి ఉంచాలన్నారు. అనంతర డ్రగ్స్ వినియోగానికి దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో కేర్ కమిటీ సభ్యుడు రాజేంద్రప్రసాద్, స్ఫూర్తి రిహాబిలిటేషన్ సంస్థ ప్రతినిధి శివశంకర్, సైకియాట్రిస్టు డాక్టర్ చైతన్య కుమార్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా -
రాజ్యాంగంపై అవగాహన ఉండాలి
కర్నూలు(హాస్పిటల్): యువత రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా యువజన సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ కె.వేణుగోపాల్ సూచించారు. జిల్లా యువజన సంక్షేమ శాఖ, సాంస్కృతిక పర్యాటక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం డాక్టర్స్ కాలనీలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో ‘సంవిధాన్ హత్య దివస్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కె.వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఎమర్జెన్సీ (అత్యవసర పరిస్థితి) 1975 జూన్ 25 నుంచి 1977 మార్చి 21వ తేది వరకు 21 నెలల పాటు కొనసాగిందన్నారు. అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధి అత్యవసర పరిస్థితి విధించి 50 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో సంవిధాన్ హత్య దివస్గా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం గెజిట్ను విడుదల చేసిందని చెప్పారు. ఎమర్జెన్సీ సమయంలో ఎన్నో బాధలు అనుభవించిన వారిని స్మరించుకునే ఉద్దేశంతో, రాజ్యాంగ దుర్వినియోగానికి వ్యతిరేకంగా పోరాడిన వారందరికీ నివాళులర్పించేందుకు, ప్రజలకు భారత రాజ్యాంగ విశిష్టత తెలియపరిచే అవగాహన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం కావాలన్నారు. జిల్లా సాంస్కృతిక పర్యాటక శాఖ అధికారి విజయ, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిరాశాంతి మాట్లాడుతూ.. ఎమర్జెన్సీతో అప్పటి ప్రధాని మంత్రి ఇందిరాగాంధీ తన ప్రాబల్యాన్ని కోల్పోవాల్సి వచ్చిందని చెప్పారు. ప్రధాన వక్త రమేష్ మాట్లాడుతూ దేశంలో ఇప్పటివరకు మూడుసార్లు ఎమర్జెన్సీ విధించారని, అందులో రెండుసార్లు యుద్ధాల కారణంగా విధిస్తే 1975 జూన్ 25న ఇందిరాగాంధీ తెచ్చిన ఎమర్జెన్సీ చరిత్ర పుటలలో నిలిచిపోయిందన్నారు. -
బీసీ హెచ్డబ్ల్యూఓస్ అసోసియేషన్ ఎన్నిక
కర్నూలు(అర్బన్): జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వసతి గృహ సంక్షేమాధికారుల సంఘం ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. బుధవారం స్థానిక బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో జరిగిన ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా పెద్దకడుబూరు వసతి గృహ సంక్షేమాధికారి పాలెగార్ సత్యనారాయణరాజు, ప్రధాన కార్యదర్శిగా పత్తికొండ కళాశాల బాలుర వసతి గృహం సంక్షేమాధికారి పి.శ్రీనివాసులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే అసోసియేట్ ప్రెసిడెంట్గా ఎస్.ప్రమీల, కోశాధికారిగా కనకలత, ఉపాధ్యక్షులుగా సీ.శంకర్కుమార్, రాజశేఖర్రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎన్.గిరిజాదేవి, సంయుక్త కార్యదర్శులుగా నరసప్ప, హారతీదేవి, ఎల్లమ్మ, కార్యవర్గ సభ్యులుగా గోపాల్, బసవరాజు, ప్రసన్నబాబు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ.. జిల్లాలోని బీసీ వసతి గృహాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా వసతి గృహ సంక్షేమాధికారులందరూ ఐకమత్యంగా విధులు నిర్వహించాలన్నారు. నూతన కార్యవర్గాన్ని సహచర వసతి గృహ సంక్షేమాధికారులు అభినందించారు. -
మల్లన్న సేవలో మంచు విష్ణు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల భ్రమరాంబా, మల్లికార్జునస్వామి వార్లను సినీ హీరో మంచు విష్ణు బుధవారం దర్శించుకున్నారు. రాజగోపురం వద్దకు చేరుకున్న ఆయనకు అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం మంచు విష్ణు మల్లికార్జున స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం చేయగా, అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం మంచు విష్ణు మాట్లాడుతూ.. శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున స్వామివారిని దర్శించుకోవడంతో 12 జ్యోతిర్లింగాల యాత్ర పూర్తయ్యిందని చెప్పారు. తాను నటించిన కన్నప్ప సినిమా ఈ నెల 27న రిలీజ్ అవుతుందని, ప్రేక్షకులందరూ ఆదరించాలని కోరారు. -
వృద్ధ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం
నంద్యాల(వ్యవసాయం): అనారోగ్యంతో బాధపడుతున్న ఖైదీలకు, అలాగే 70 ఏళ్లు పైబడిన వృద్ధ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ది, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ లీలా వెంకట శేషాద్రిలు తెలిపారు. నంద్యాలలోని జిల్లా ప్రత్యేక ఉపకారాగారాన్ని బుధవారం వారు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఖైదీలతో సమావేశం ఏర్పాటు చేశారు. లోక్ అదాలత్తో ఉచిత న్యాయం పొందవచ్చన్నారు. ఆన్లైన్ 15100 ద్వారా సేవలు అభ్యర్థించవచ్చని తెలిపారు. జైల్ సూపరింటెండెంట్ గురుప్రసాదరెడ్డి, న్యాయవాది నాయక్, లోక్ అదాలత్ సిబ్బంది పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ పోరాటంతోనే జీఆర్పీ టెండర్లు
ఎమ్మిగనూరుటౌన్: వైఎస్సార్సీపీ పోరాటంతోనే ప్రభుత్వం గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకం (జీఆర్పీ) పనులకు టెండర్లు పిలిచినట్లు వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం లక్ష్మినారాయణరెడ్డి స్పష్టం చేశారు. ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టి సాగునీరు అందివ్వాలని కోరుతూ ఈ నెల 19న స్థానిక జీఆర్పీ కార్యాలయాన్ని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రైతులు ముట్టడించడంతో ప్రభుత్వంలో కదలిక వచ్చిందన్నారు. ప్రాజెక్ట్ కింద ఎమ్మిగనూరు నియోజకవర్గంతో పాటు మంత్రాలయం నియోజకవర్గ పరిధిలోని ఎత్తిపోతల పథకం కింద 7 పనులను మొదలెట్టేందుకు ఈ నెల 21న టెండర్ ప్రక్రియను ప్రారంభించినట్లు వివరించారు. ఇందులో చిలకలడోన ఎత్తిపోతల పథకం–1కు రూ.16,75,250, రెండవ పథకానికి రూ.16,60,270, సోగనూరు పథకం –1కు రూ.16,68,360, రెండవ దానికి రూ.16,66,938, పూలచింత పథకం కింద ఒక పనికి రూ.16,68,360, రెండవ దానికి రూ.16,60,270 కేటాయించడం వివరించారు. జూలై 1న టెండర్లను ఓపెన్ చేసే అవకాశం ఉందని, పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ 6 నెలల్లో పనులను పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. పనులు వేగంగా పూర్తి చేయాలి గురురాఘవేంద్ర ఎత్తిపోతల పథకం పనులను వేగంగా పూర్తి చేయాలని గడ్డం లక్ష్మినారాయణరెడ్డి డిమాండ్ చేశారు. ఆయన బుధవారం పట్టణంలో జీఆర్పీ ఆయకట్టు రైతులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. టెండర్లు పొందిన కాంట్రాక్టర్లు ముందుగా ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లకు 15 రోజుల్లో మరమ్మతులు చేయాలన్నారు. మిగతా జీఆర్పీ పనులను అధికారులు వెంటనే పూర్తి చేయించి సాగునీరందించాలని కోరారు. సర్పంచ్లు నరసింహులు, కోటేశ్వరరావు, ప్రకాష్రెడ్డి, పార్టీ ప్రచార విభాగం అధ్యక్షుడు చాంద్బాషా, ఎస్సీ సెల్ అధ్యక్షుడు శాంతిరాజు, చుక్కామల్లేష్, వెంకటేష్, గోవిందు, ప్రభాకర్, సోమన్న, శివ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆగకుండా.. ఆటంకం లేకుండా..!
● ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు కార్యాచరణ ● ప్రజల చేతిలో కర్నూలు ట్రాఫిక్ వాట్సాప్ నంబర్ ● త్వరలో ప్రారంభించేందుకు పోలీసుల కసరత్తు కర్నూలు: ట్రాఫిక్.. కర్నూలు నగరంలో ఇదో పరిష్కారం దొరకని సమస్య. సగటు జీవి సహనానికి పరీక్ష.. దీని పరిష్కారానికి కొన్నేళ్లుగా పోలీసు అధికారులు చేయని ప్రయత్నం.. ప్రయోగమంటూ లేదు. ప్రజలు, వాహనదారులే కాదు.. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ఎదుర్కొంటున్న చికాకులు అన్నీ ఇన్నీ కావు. మళ్లీ ఇన్ని రోజులకు మరో కొత్త ఆలోచనతో పోలీసులు ముందుకొచ్చారు. ప్రజల చేతిలో కర్నూలు టాఫిక్ పేరుతో సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టనున్నారు. అవస్థలు... కర్నూలు మున్సిపాలిటీ స్థాయి నుంచి నగరపాలక సంస్థగా, కుడాగా రూపాంతరం చెందినప్పటికీ ట్రాఫిక్ సమస్య పరిష్కారం కాలేదు. ఏడాదికేడాది వాహనాల సంఖ్య పెరగడం, రోడ్ల విస్తరణ లేకపోవడం, ఉన్నవి సైతం ఆక్రమణ వల్ల కుచించుకుపోవడం తదితర కారణాలతో నానాటికీ ట్రాఫిక్ సమస్య జఠిలమవుతోంది. దీనికి తోడు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో సిబ్బంది కొరత వేధిస్తోంది. ఎక్కడైనా వాహనాలు జామ్ అయినా క్రమబద్దీకరించేందుకు గంటలకొద్దీ సమయం పడుతోంది. వాహనాల నియంత్రణ, ఓవర్ లోడ్, రాంగ్ రూట్ ప్రయాణం, ఇతర ట్రాఫిక్ సమస్యల పరిష్కారంలో ప్రజలను భాగస్వామ్యం చేస్తే బాగుంటుందని పోలీసులు ఆలోచించారు. ప్రజల చేతిలో కర్నూలు ట్రాఫిక్ వాట్సప్ నంబర్ అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. త్వరలో ట్రాఫిక్ వాట్సప్ నంబర్ను అందుబాటులోకి తెస్తున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు. ఫొటోలు తీసి గ్రూప్లో పోస్ట్ చేయాలి కర్నూలు నగరం నలుదిక్కులా ఎక్కడ ట్రాఫిక్ సమస్య తలెత్తినా, వాహనాలు ఆగిపోయినా స్థానికులు ఫొటోలు తీసి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయాల్సి ఉంటుంది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితులను చక్కదిద్దుతారు. ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ పార్కింగ్, మొబైల్ మాట్లాడుతూ వాహనం నడపటం, డ్రంకెన్ డ్రైవ్, ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం, సీటు బెల్టు లేకుండా కారు నడపటం వంటి ఉల్లంఘనలపై ఫొటోలు తీసి వాట్సప్లో పోస్ట్ చేయవచ్చు. అలాగే వాహనాల చిత్రాలు, వీడియోలు కూడా తీసి షేర్ చేయవచ్చు. ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఫొటోలు, వీడియోల రూపంలో వాట్సప్కు షేర్ చేస్తే పోలీసులు వాటిపై విచారణ జరిపి నిర్ధారించుకుని వారికి జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ట్రాఫిక్ అధికారులు వెల్లడించారు. నగర సమాచారం కర్నూలు నగర జనాభా సుమారు ఆరు లక్షలు ట్రాఫిక్ స్టేషన్కు అవసరమైన సిబ్బంది 100 మంది ప్రస్తుతమున్న సిబ్బంది 60 మంది నగరంలో ఉన్న ట్రాఫిక్ పాయింట్లు – 36 ట్రాఫిక్ సిగ్నల్స్ – 13 ద్విచక్ర వాహనాలు సుమారు 2 లక్షలు ఆటోలు 25 వేలకు పైగా కార్లు 50 వేలకు పైగా బస్సులు – 2 వేలు లారీలు, జీపులు – 2 లక్షలు ఇతర రాష్ట్రాలు, ప్రాంతాలు, జిల్లాల నుంచి వచ్చి వెళ్లే అన్ని రకాల వాహనాలు సుమారు 2 లక్షలు గతంలో ట్రాఫిక్ నియంత్రణ పేరుతో వెబ్సైట్ కర్నూలు నగరంలో ట్రాఫిక్ క్రమబద్దీకరణ కోసం గతంలో ట్రాఫిక్ మిత్ర పేరుతో వెబ్సైట్ను ప్రారంభించారు. అయితే అప్పటి ఎస్పీ సిద్ధార్థ కౌశల్ బదిలీపై వెళ్లడంతో ట్రాఫిక్ మిత్ర కార్యక్రమం అటకెక్కింది. కర్నూలు నగరంలో సుమారు ఆరు లక్షలకు పైగా జనాభా ఉంది. రోజురోజుకూ కాలనీలు విస్తరిస్తున్నాయి. వాహనాల సంఖ్య కూడా పెరుగుతోంది. ట్రాఫిక్ క్రమబద్దీకరణకు ప్రధాన రహదారుల్లో సుమారు 36 పాయింట్లు ఉన్నాయి. ట్రాఫిక్ స్టేషన్లో ప్రస్తుతం 60 మంది మాత్రమే సేవలుందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ క్రమబద్దీకరణకు సిబ్బంది కొరత వేధిస్తున్న నేపథ్యంలో పౌరులను భాగస్వాములను చేసేందుకు పోలీస్ వాట్సప్ నంబర్ను అందుబాటులోకి తేనున్నారు.