breaking news
Kurnool
-
కనకదాసు విగ్రహం ధ్వంసం
ఆలూరు రూరల్: మండలంలోని మనేకుర్తి గ్రామంలోని హైవే–167 పక్కన ఏర్పాటు చేసిన భక్త కనకదాసు విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు. కనకదాసు వి గ్రహం ఎడమ చేయి విరగొట్టారు. విగ్రహ ధ్వంసా న్ని నియోజకవర్గ కురువ సామాజిక వర్గం నాయకులు ఖండించారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గురువారం ఆలూరు ఎస్ఐ మహబూబ్ బాషాకు ఫిర్యాదు చేశారు. విగ్రహ ధ్వంసాన్ని నిరసిస్తూ మాదారి,మాదాసి కురువ సంఘం నాయకులు స్థానిక అంబేడ్కర్ కూడలిలో గంట పాటు ధర్నా చేపట్టారు.కార్యక్రమంలో దేవేంద్రప్ప,అయ్యాళప్ప, మల్లికార్జున, మహానంది, లింగ,రాజు,నాగేంద్ర,మంగన్న, చంద్ర,ఉల్తేప్ప కురువ కులస్తులు పాల్గొన్నారు. దాడిని ఖండించిన ఎమ్మెల్యే విరూపాక్షి కనకదాసు విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై వైఎస్సార్సీపీ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఖండించారు. కనకదాసు విగ్రహాన్ని ధ్వంసం చేయడం దారుణమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. -
డిప్లమా కోర్సుల దరఖాస్తు గడువు పొడిగింపు
కర్నూలు(హాస్పిటల్): స్టేట్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ డిప్లమా కోర్సుల దరఖాస్తు గడువు పొడిగించినట్లు కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 27వ తేది సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు భర్తీ చేసిన దరఖాస్తులను కార్యాలయ పనిదినాల్లో కర్నూలు మెడికల్ కాలేజి కార్యాలయంలో రూ.100 రుసుము చెల్లించి నమోదు చేసుకోవాలన్నారు. పోస్టు ద్వారా వచ్చిన దరఖాస్తులు స్వీకరించబడవన్నారు. దరఖాస్తులు aprahpc.co.in వెబ్సైట్లో లభిస్తాయన్నారు. అక్టోబర్ 10వ తేదిన అభ్యర్థులకు కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. ఈ కోర్సులకు ఇంటర్, తత్సమాన విద్యార్హత కలిగిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇంటర్ బైపీసీ చదివిన విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని, తర్వాత మిగిలిన గ్రూపులకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. వైద్యం వికటించి గర్భిణి మృతి ఎమ్మిగనూరు రూరల్: స్థానిక ప్రైవేట్ నర్సింగ్హోంలో వైద్యం వికటించి గర్భిణి మృతి చెందిన ఘటన గురువారం చోటు చేసుకుంది. మంత్రాలయం మండలం సుగూరు గ్రామానికి చెందిన పార్వతి పెద్దపెండేకల్కు చెందిన నరసింహులకు ఇచ్చి కొన్ని సంవత్సరాల క్రితం వివాహాం జరిపించారు. రెండో కాన్పుకు పార్వతి పుట్టినిల్లు సూగురుకు వచ్చింది. బుధవారం సాయంత్రం నొప్పులు రావటంతో ఎమ్మిగనూరులోని ఓ ప్రైవేట్ నర్సింగ్హోంకు తీసుకొచ్చారు. రాత్రి నర్సింగ్ హోంలో అడ్మిట్ చేసుకొని గురువారం ఉదయం డెలివరి చేస్తామని థియోటర్లోకి తీసుకెళ్లారు. మత్తు ఇంజక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికి ఫిట్స్ రావటంతో పరిస్థితి బాగోలేదని ఆదోనికి పంపించారు. అక్కడికి వెళ్లిన కొద్దిసేపటికే మృతి చెందింది. సాయంత్రం నర్సింగ్ హోం దగ్గరకు మృతదేహం రావటంతో పెద్ద సంఖ్యలో బంధువులు చేరుకుని ఆందోళన చేపట్టారు. అయితే పెద్ద ఎత్తున పరిహారం ఇచ్చేందుకు ఆసుపత్రి యాజమాన్యం అంగీకరించడంతో ఆందోళన విరమించినట్లు తెలిసింది. అమరవీరుల సేవలు స్మరణీయం కర్నూలు కల్చరల్: అటవీ శాఖ అమరవీరుల సేవలు చిరస్మరణీయమని అటవీ శాఖ కర్నూలు డివిజన్ స్క్వాడ్ డీఎఫ్వో రవిశంకర్ అన్నారు. గురువారం అటవీ శాఖ సర్కిల్ కార్యాలయంలో జాతీయ అటవీ అమర వీరుల దినోత్సవం జరిగింది. డీఎఫ్వోతో పాటు కర్నూలు రేంజ్ ఎఫ్ఆర్వో విజయకుమార్, స్వ్క్వాడ్, సోషల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రమణారెడ్డి, సర్కిల్ కార్యాలయం ఏవోలు అబ్దుల్ సుభాన్, షానవాజ్, డివిజన్ కార్యాలయం ఏవో మహమ్మద్ ఏషన్, అటవీ శాఖ ఉద్యోగులు అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్క్వాడ్ డీఎఫ్వో రవిశంకర్ మాట్లాడుతూ కర్నులు సర్కిల్ పరిధిలో 23 మంది అటవీ శాఖ ఉద్యోగులు విధి నిర్వహణలో అమరులయ్యారన్నారు. వారి సేవలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగులు అడవుల సంరక్షణ బాధ్యతను మరువకూడదన్నారు. కార్యక్రమంలో అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
మద్యం విక్రేత అరెస్ట్
పగిడ్యాల: ‘బడి పక్కనే మద్యం దుకాణం’ శీర్షికన సాక్షిలో గురువారం ప్రచురితమైన కథనానికి పోలీసులు స్పందించారు. పడమర ప్రాతకోట ప్రాథమిక పాఠశాల (మెయిన్) పక్కన అక్రమంగా మద్యం విక్రయిస్తున్న పులికంటి మద్దిలేటిని అరెస్ట్ చేసినట్లు నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రమణ్యం గురువారం తెలిపారు. నందికొట్కూరు పట్టణంలోని వివిధ షాపుల్లో మద్యం తెచ్చుకుని అధిక ధరలకు గ్రామంలో విక్రయిస్తుండగా ఏఎస్ఐ శేషయ్య సిబ్బందితో నిఘా వేసి పట్టుకున్నామన్నారు. అతని వద్ద 30 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. -
విద్యుదాఘాతంతో బాలుడి మృతి
● ఎలుకలు తెచ్చిన తంటా!ఎమ్మిగనూరురూరల్: ఎలుకలు తెంపిన విద్యుత్ వైర్లను చూడకుండా తొక్కి విద్యుదాఘాతంతో గోపికృష్ణ(13) అనే బాలుడు మృతి చెందాడు. ఈ విషాదం ఎమ్మిగనూరు పట్టణంలోని ఎద్దుల మార్కెట్ సమీపంలోని కిరాణం దుకాణంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. వెంకటేష్, పద్మావతిలకు రామకృష్ణ, గోపికృష్ణ ఇద్దరు కుమా రులు ఉన్నారు. వీరి రెండో కుమారుడు గోపికృష్ణ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. గురువారం కిరాణం దుకాణానికి వచ్చిన వారికి సరుకులు ఇస్తూ చూసుకోకుండా కిందపడి ఉన్న విద్యుత్ వైర్పై కాలు పెట్టాడు. షాక్ గురై కుప్పకూలిపోయాడు. తల్లిదండ్రలు వెంటనే చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. విద్యుత్ వైర్లను ఎలుకలు తెంపడంతో విషాదం చోటుచేసుకుంది. కుమారుడు మృతి చెందటంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు టౌన్ సీఐ శ్రీనివాసులు తెలిపారు. -
పట్టుబడిన మద్యం ధ్వంసం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైలం ఒకటవ పోలీసు స్టేషన్ పరిధిలో గత రెండేళ్లుగా వివిధ కేసుల్లో పట్టుబడిన మద్యాన్ని ట్రాక్టర్తో తొక్కించి ధ్వంసం చేశారు. గురువారం శ్రీశైలంలోని డంపింగ్ యార్డ్ సమీపంలో నంద్యాల ఎకై ్సజ్ ఏఈఎస్ రాముడు, ఎకై ్సజ్ సీఐ మోహన్రెడ్డి, సీఐ ప్రసాదరావు, రెవెన్యూ అధికారుల సమక్షంలో మద్యం బాటిళ్లకు పంచనామా నిర్వహించి ధ్వంసం చేశారు. 15 నాటుసారా కేసుల్లో 186 లీటర్ల నాటు సారా, 17 కేసుల్లో పట్టుబడిన ఏపీ మద్యం 598 సీసాలు, 11 కేసుల్లో పట్టుబడ్డ తెలంగాణ మద్యం 599 సీసాలను ట్రాక్టర్తో తొక్కించారు. -
కేంద్రియ విద్యాలయంలో సీట్ల భర్తీ
డోన్ టౌన్: డోన్లో కొత్తగా ఏర్పాటైన కేంద్రియ విద్యాలయంలో 2025–26 విద్యా సంవత్సరానికి లాటరీ పద్ధతిలో విద్యార్థులకు సీట్లు కేటాయించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్ధికశాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రత్యేక చొరవతో డోన్లో కేంద్రియ విద్యాలయం ఏర్పాటైంది. 765 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా గురువారం ఎంపిక ప్రక్రియ కమిటీ కన్వీనర్ ప్రిన్స్పాల్ ఆధ్వర్యంలో రిజర్వేషన్ల ప్రకారం 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు సీట్లు కేటాయించారు. లాటరీ పద్ధతిలో ప్రతి తరగతికి 40 మంది విద్యార్థుల చొప్పున 200 మందికి ప్రవేశం కల్పించారు. ఎంపికై న అభ్యర్థుల వివరాలను కమిటీ స్కూల్ చైర్మన్ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో శుక్రవారం నోటీసు బోర్డులో ఉంచనున్నట్లు తెలిపారు. ఈ ఎంపిక పక్రియలో కమిటీ సభ్యులు టీచర్ల కేటగిరి నుంచి ఒకరు, ఎస్సీ, ఎస్టీ కేటగిరి నుంచి ఇద్దరు, కలెక్టర్ ఆదేశాల మేరకు మండల విద్యాధికారులు ప్రభాకర్, నాయక్ హాజరు కాగా అధికారుల సమక్షంలో వీడియో కెమెరా చిత్రీకరిస్తూ లాటరీ పద్ధతిలో విద్యార్థులను ఎంపిక చేశారు. కాగా ఎంపిక ప్రక్రియ ప్రారంభంలో కొంత గందరగోళం నెలకొంది. ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల నాయకులు కన్వీనర్ను ప్రశ్నించగా.. తుది జాబితా ప్రకటనలో ఏవైనా అనుమానాలు ఉంటే అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చునని సూచించారు. -
కర్నూలు సర్కిల్ అటవీ శాఖ కన్జర్వేటర్గా కృష్ణమూర్తి
● ఎన్ఎస్టీఆర్ ఎఫ్డీ పిటీగా విజయకుమార్కర్నూలు కల్చరల్/ఆత్మకూరురూరల్: కర్నూలు సర్కిల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(సీఎఫ్)గా ఐఎఫ్ఎస్ బీవీఏ కృష్ణమూర్తి నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఐఎఫ్ఎస్ బదిలీల్లో భాగంగా శ్రీశైలం ప్రాజెక్ట్ టైగర్ సర్కిల్ ఫీల్డ్ డైరెక్టర్గా ఉన్న ఈయనను కర్నూలుకు బదిలీ చేశారు. రాజమహేంద్రవరం ఏపీ స్టేట్ ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్గా ఉన్న బి. విజయకుమార్ను శ్రీశైలం ప్రాజెక్ట్ టైగర్ సర్కిల్ ఫీల్డ్ డైరెక్టర్గా బదిలీ చేశారు. ఆత్మకూరు ప్రాజెక్ట్ టైగర్ డిప్యూటీ డైరెక్టర్గా ఉన్న వి.సాయిబాబను తిరుపతి డీఎఫ్వోగా, అనంతపురం డీఎఫ్వో విగ్నేష్ అప్వావూను ఆత్మకూరు ప్రాజెక్ట్ టైగర్ డిప్యూటీ డైరెక్టర్గా బదిలీ చేస్తూ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో ఇరువర్గాల ఘర్షణ మంత్రాలయం రూరల్: భూ వివాదంతో ఏకంగా తహసీల్దార్ కార్యాలయంలోనే ఇరువర్గాల వారు ఘర్షణ పడ్డారు. ఈ ఘటన మంత్రాలయంలో గురువారం చోటు చేసుకుంది. మండల పరిధిలోని వగురూరు గ్రామంలో ఒక వ్యక్తి.. తనకు 28ఎకరాలు ఉండాల్సి ఉండగా ఒకటిన్నర ఎకర పొలం తక్కువగా ఉందని తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. సమస్యను పరిష్కారించడానికి ఇరువర్గాల వారు గురువారం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు దూషించుకున్నారు. పరస్పరం దాడులకు పాల్పడ్డారు. దీంతో అక్కడే ఉన్న ప్రజలు, రెవెన్యూ సిబ్బంది పరుగులు తీశారు. అధికారులు జోక్యం చేసుకుని ఇరువర్గాల వారిని మందలించి బయటకు పంపేశారు. దీంతో వారు పోలీస్టేషన్ చేరుకుని ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ముందస్తు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలకు ఏర్పాట్లు కర్నూలు(హాస్పిటల్): ప్రజలు క్యాన్సర్ వ్యాధిన పడకుండా ముందస్తు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అసంక్రమిత వ్యాధుల నివారణ అధికారి డాక్టర్ మహేశ్వరప్రసాద్ చెప్పారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆవరణలోని స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో గురువారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శిక్షణకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే సామాజిక అధికారులు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని ఆరోగ్య కార్యకర్తలు హాజరయ్యారు. నోటి క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ల స్క్రీనింగ్ గురించి పవర్పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా డాక్టర్ నాగరాజు వివరించారు. అనంతరం డాక్టర్ మహేశ్వరప్రసాద్ మాట్లాడుతూ.. క్యాన్సర్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. క్యాన్సర్ను తొలిదశలోనే గుర్తించి చికిత్స అందిస్తే ఈ వ్యాధిని నియంత్రించవచ్చన్నారు. కర్నూలులోని స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ప్రతి మంగళ, గురువారాల్లో ఓపీ నెం.222కు రెఫర్ చేయాలని తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు వెంకట సుబ్బనాగరాజు, సాహితి, జయరామ్, విజయభాస్కర్, హడస్కా, ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ సుధాకర్, ఆర్కేఎస్కే కన్సల్టెంట్ మల్లికార్జున, ఫైనాన్స్ కన్సల్టెంట్ అరుణ, ప్రొజెక్షనిస్టు ఖలీల్ పాల్గొన్నారు. కృష్ణమూర్తి, బి.విజయ్ కుమార్ -
అవినీతి దాహం తీరేలా!
సంజామల: పశువుల దాహం తీర్చేందుకు ఊరూరా ఏర్పాటు చేసిన నీటి తొట్లు అధికారులు, టీడీపీ నాయకుల అవినీతిని ఎత్తి చూపుతున్నాయి. నాసిరకంగా నిర్మించి బిల్లులు స్వాహా చేయడంతో ప్రారంభానికి ముందే పగుళ్లు ఇస్తున్నాయి. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద మండలానికి 19 నీటి తొట్లు మంజూరయ్యాయి. ప్రస్తుతానికి 15 పూర్తయ్యాయి. ఒక్కో తొట్టి నిర్మాణానికి రూ. 30 వేలు వెచ్చించారు. కాగా కొన్ని చోట్ల టీడీపీ నాయకులు, మరి కొన్ని చోట్ల అధికారులు నిర్మించిన నీటి తొట్లు నిరుపయోగంగా మారాయి. నాణ్యత లోపించి ప్రారంభానికి ముందే శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. -
వైద్య కళాశాలలపై బాబు కుట్ర
కర్నూలు (టౌన్): దేశ చరిత్రలో ఒకేసారి రాష్ట్రానికి 17 వైద్య కళాశాలలను తీసుకువచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ పేరు వస్తుందనే అక్కసుతోనే వాటిని సీఎం చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ చేస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీమోహన్ రెడ్డి ఆరోపించారు. రూ. 2 లక్షల కోట్ల అప్పు, రాజధాని నిర్మాణానికి మరో రూ. లక్ష కోట్లు ఖర్చు చేస్తున్న చంద్రబాబు. పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అందే ఉచిత వైద్యం కోసం రూ. 5 వేల కోట్లు ఖర్చు చేయ్య లేరా అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం ‘ఉన్న’ వర్గాలకే ఊడిగం చేస్తుందోని విమర్శించారు. కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్లోని తన చాంబర్లో గురువారం ఆయన మాట్లాడారు. జగనన్న హయాంలో నూతన వైద్య కళాశాలల ఏర్పాటుకు రూ. 8 వేల కోట్ల ఖర్చులో రూ. 3 వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. ఇప్పటికే పులివెందుల, పాడేరు ప్రాంతాల్లో వైద్య కళాశాలలు ప్రారంభమయ్యాయన్నారు. మిగతా వైద్య కళాశాలల నిర్మాణ పనులు వివిధ దశఽల్లో ఉన్నాయన్నారు. మంత్రి నారే లోకేష్ అనుచరుల కోసమే ఈ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తున్నారని విమర్శించారు. ప్రైవేటీకరణను అడ్డుకుంటాం వైద్య కళాశాలల స్థలాలు రూ. వందల కోట్ల విలువైనవని, అయితే ఎకరాకు రూ.100 ప్రకారం 66 సంవత్సరాలు లీజుకు ఇచ్చారని ఎస్వీ మోహన్రెడ్డి అన్నారు. మెడికల్ కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే వైద్యం పేరుతో ప్రజల నుంచి రూ. లక్షలు వసూలు చేసేందుకే కదా అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే టీడీపీ నేతలు ఇసుక, మద్యం, మైనింగ్, లిక్కర్ సిండికేట్తో రూ. వందల కోట్లు దోపిడీ చేశారని ఆరోపించారు. వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేసి మేనేజ్మెంట్ కోటాతో ఒక్కొక్క వైద్య విద్యార్థి నుంచి రూ. లక్షలు వసూలు చేసే అవకాశం ఉందన్నారు. తాము అధికారంలోకి వస్తే ప్రైవేటీకరణను రద్దు చేస్తామని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారన్నారు. కర్నూలు జిల్లాలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని, ఆందోళనలు చేస్తామమన్నారు. న్యాయస్థానాలను ఆశ్రయించి పోరాటం చేస్తామని ఎస్వీ స్పష్టం చేశారు. రూ. 5 వేల కోట్లు ఖర్చు చేస్తే వైద్య కళాశాలలు అందుబాటులోకి వస్తాయి మంత్రి నారా లోకేష్ అనుచరుల కోసమే ప్రైవేటీకరణ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి -
కర్నూలు జిల్లా కలెక్టర్గా డాక్టర్ ఏ.సిరి
కర్నూలు(సెంట్రల్): కర్నూలు జిల్లా నూతన కలెక్టర్గా డాక్టర్ అట్టాడ సిరి నియమితులయ్యారు. ఆమె సెంకడరీ హెల్త్ డైరక్టర్గా పనిచేస్తూ బదిలీపై కర్నూలుకు వస్తున్నారు. ఇక్కడ పనిచేస్తున్న పి.రంజిత్బాషాకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. జేఏడీలో రిపోర్టు చేసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2015 బ్యాచ్కు చెందిన ఎ.సిరి స్వామిత్వ ప్రత్యేక కమిషనర్గా, ఉమెన్ డెవలప్మెంట్అండ్ చైల్డ్ వెల్ఫేర్ డైరక్టర్గా, అనంతపురం జాయింట్ కలెక్టర్(వార్డు, గ్రామ సచివాలయాలు)గా, ఆప్కో వైస్ చైర్మన్ అండ్ ఎండీగా పనిచేశారు. కర్నూలు జిల్లా చరిత్రలో ఈమె రెండో మహిళా కలెక్టర్. గతంలో డాక్టర్ సృజన మొదటి కలెక్టర్గా జిల్లాలో సేవలందించారు. వీరిద్దరూ డాక్టర్లే కావడం విశేషం. ఎ.సిరి ఎక్కడ పనిచేసినా తనదైన మార్కును కనపరుస్తారనే ప్రచారం ఉంది. నూతన కలెక్టర్కు సవాళ్ల స్వాగతం ● ఉల్లి రైతులు మద్దతు ధర కోసం నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వం క్వింటా ఉల్లి మద్దతు ధర రూ.1200 ప్రకటించినా రైతులకు ఉపయోగం లేకుండా పోతోంది. ఈ క్రమంలో రైతులను ఏ విధంగా ఆదుకుంటారో వేచి చూడాలి. ● వేదవతి ప్రాజెక్టు భూసేకరణ, హెచ్ఎన్ఎస్ఎస్ విస్తరణ పనులు కూడా కూటమి ప్రభుత్వంలో ఒక్క అడుగు ముందుకు కదలడం లేదు. ● స్వర్ణాంధ్ర లక్ష్యాలను అధికారులు దాదాపు రూ.10 వేల కోట్లతో రూపొందించారు. వాటికి సంబంధించి ప్రభుత్వంతో మాట్లాడి నిధులు సమకూర్చాల్సి ఉంది. ● జిల్లాలో భూ సమస్యలు ఎక్కడికక్కడ పేరుకుపోయాయి. పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని ప్రతి సోమవారం పెద్ద ఎత్తున జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరలి వచ్చి అర్జీలు ఇచ్చుకుంటున్నారు. అధికార కూటమి నాయకులతో అంటకాగినట్లు ఆరోపణ సొంత జిల్లాలో కనిపించని తనదైన మార్కు -
ప్రైవేటులో ఫీజుల బాదుడు!
జ్వరం వచ్చిన వారు ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లే డెంగీ, మలేరియా ఉంటుందేమోనని పదిరకాలకు పైగా రక్తపరీక్షలు చేయిస్తున్నారు. ఒక్కో ఆసుపత్రిని బట్టి పరీక్షలు, చికిత్సకు అయ్యే మొత్తం ఖర్చు రూ.3వేల నుంచి రూ.5వేల వరకు ఉంటోంది. అది మలేరియా, డెంగీ లాంటి లక్షణాలుంటే మాత్రం ఆసుపత్రిలో నాలుగైదు రోజులు చేరి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం రూ.30వేల నుంచి రూ.50వేల దాకా వసూలు చేస్తున్నారు. ఆర్థికస్థోమత ఉన్న వారు వైద్యులు చెప్పిన మేరకు ఖర్చు చేస్తుండగా మరికొందరు ఇప్పుడే వస్తామంటూ అక్కడి నుంచి జారుకుని ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తున్నారు. ఆసుపత్రిలోని జనరల్ మెడిసిన్ ఓపీకి ప్రతిరోజూ 300 నుంచి 400 మంది రోగులు వస్తున్నారు. అందులో సగానికి పైగా జ్వరపీడితులే ఉంటున్నారు. ఎక్కువశాతం జలుబు, దగ్గు, ఒళ్లునొప్పులు, జ్వరంతో బాధపడుతున్న వారే ఉన్నారు. సీజనల్గా వచ్చే వైరల్ ఫీవర్లే ఉంటున్నాయి. జ్వరతీవ్రత 102 నుంచి 104 ఫారిన్హీట్ వరకు ఉంటోంది. అవసరమైన వారికి వైద్యనిర్ధారణ పరీక్షలు చేయించి మందులు ఇచ్చి పంపిస్తున్నాం. ఇందులో రోజూ 10 నుంచి 15 మంది అడ్మిషన్ చేస్తున్నాం. కొందరికి మలేరియా లక్షణాలు కనిపిస్తుండటంతో అందుకు సంబంధించిన వైద్యం అందిస్తున్నాం. –డాక్టర్ కె.సోమప్ప, అసోసియేట్ ప్రొఫెసర్, జనరల్ మెడిసిన్, జీజీహెచ్, కర్నూలు వర్షాలు బాగా కురిసి ఆగిపోవడంతో జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైరల్ ఫీవర్ల కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఐదు రోజులుగా జ్వరం ఉండి ఆసుపత్రికి వచ్చిన ప్రతి ఒక్కరికీ డెంగీ, మలేరియా కిట్స్ ద్వారా పరీక్షలు చేస్తున్నాం. పాజిటివ్ వస్తే అవసరమైన చికిత్స అందిస్తున్నాం. వీరిని ఫాలో అప్ చేయాలని క్షేత్రస్థాయి సిబ్బందికి చెబుతున్నాం. తగ్గకపోతే కర్నూలుకు రెఫర్ చేయాలని ఆదేశిస్తున్నాం. వర్షాల కారణంగా నీరు నిలిచిన చోట దోమలు వృద్ధి చెందకుండా క్రిమిసంహారక మందు పిచికారీ చేయిస్తున్నాం. డెంగీ, మలేరియా ప్రబలిన ప్రాంతాల్లో అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. –నూకరాజు, జిల్లా మలేరియా అధికారి, కర్నూలు ● ఆస్పరి మండలం బిల్లేకల్ ప్రాంతానికి చెందిన ఈరన్నకు వారం రోజులుగా జ్వరం తగ్గకపోవడంతో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వెళ్లాడు. వైద్యులు డెంగీ జ్వరంగా అనుమానించి చికిత్స అందించారు. వారం రోజులు చికిత్స అందించగా అతనికి బాగు కావడంతో డిశ్చార్జ్ చేశారు. ● కర్నూలు నగరంలోని రిటైర్డ్ ఉద్యోగి వెంకటేశ్వర్లు జలుబు, దగ్గు, జ్వరం రావడంతో సమీప ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోగా రూ.2వేలకు పైగా ఖర్చయ్యింది. ఇలాగే తన కుమారునికి కూడా జ్వరం రావడంతో మెడికల్షాపునకు వెళ్లి మందులు కొని వాడి తగ్గించుకున్నాడు. ● కర్నూలులోని సీతారామనగర్కు చెందిన నరేంద్రకుమార్కు తీవ్ర జ్వరం రావడంతో ఓ ప్రైవేటు వైద్యున్ని సంప్రదించాడు. అప్పటికప్పుడు మందులు రాసి పంపించారు. నాలుగురోజులైనా జ్వరం తగ్గకపోవడంతో మళ్లీ డాక్టర్ వద్దకు వెళ్లగా రక్తపరీక్షలు చేయించి వైరల్ ఫీవర్ అని తేల్చారు. వారం రోజులు మందులు వాడుతూ విశ్రాంతి తీసుకోవాలని సూచించి పంపించారు. కర్నూలు(హాస్పిటల్): వర్షాలు తగ్గుముఖం పట్టి మళ్లీ పడుతుండటంతో జ్వరపీడితుల కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. చాలా మంది ముందుగా మెడికల్షాపులకు వెళ్లి లక్షణాలు చెప్పి రెండు, మూడు రోజులు మందులు వాడుతున్నారు. అప్పటికీ తగ్గకపోతేనే వైద్యుల వద్దకు వెళుతున్నారు. అయినా కూడా జిల్లాలోని పీహెచ్సీలు, సీహెచ్సీలు, యుపీహెచ్సీలు, ఏరియా ఆసుపత్రులు, బోదనాసుపత్రులు జ్వరపీడితులతో కిటకిటలాడుతున్నాయి. గత పదిరోజులుగా కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఓపీ రోగుల సంఖ్య 3,200లు దాటుతోంది. సాధారణ రోజుల్లో ఈ సంఖ్య 2వేల నుంచి 2,500 మధ్య ఉండేది. అందులోనూ జనరల్ మెడిసిన్, చిన్నపిల్లల విభాగాల్లో రెట్టింపు సంఖ్యలో ఓపీ నమోదవుతోంది. వీటిలో సగం మంది జ్వరపీడితులేనని వైద్యులు చెబుతున్నారు. అందులోనూ ఎక్కువగా వైరల్ ఫీవర్లే ఉంటున్నాయి. ఈ జ్వరం ఇంట్లో ఒకరికి వస్తే క్రమంగా కుటుంబసభ్యులందరినీ వేధిస్తోంది. ముందుగా జలుబు, దగ్గు వచ్చి అనంతరం ఒళ్లునొప్పులు ప్రారంభమై తీవ్ర జ్వరం వేధిస్తోంది. మరోవైపు జిల్లాలో ఇప్పటి వరకు 2,198 మందికి డెంగీ లక్షణాలు ఉండగా అందులో 196 మందికి పాజిటివ్గా నమోదైంది. ‘ఓపి’క నశించి.. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఖర్చు చేయడానికి భయపడి ప్రభుత్వ ఆసుపత్రులకు వెళితే అక్కడ అరకొర వైద్యం అందుతోంది. పీహెచ్సీల్లో చాలా చోట్ల వైద్యులు ఉండకపోవడంతో అక్కడున్న నర్సులు, ఫార్మాసిస్టులే మందులు ఇస్తున్నారు. దీంతో సీహెచ్సీలు, ఏరియా ఆసుపత్రులు, కర్నూలు పెద్దాసుపత్రికి రోగులు వస్తున్నారు. సీమెచ్సీ, ఏరియా ఆసుపత్రుల్లో జ్వరలక్షణాలను బట్టి మందులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. అయినా జ్వరం తగ్గకపోవడంతో బతుకుజీవుడా అంటూ కర్నూలుకు జ్వరపీడితులు వస్తున్నారు. కర్నూలుకు రావడానికి సైతం ప్రయాణ ఇబ్బందులు తప్పడం లేదు. జ్వరపీడితులు సైతం కూర్చోవడానికి ఆర్టీసీ బస్సులు ఉండటం లేదు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఓపీ కోసం అరగంట, చికిత్స కోసం గంట, వైద్యపరీక్షలకు మరో గంట వేచి ఉండాల్సి వస్తోంది. మొత్తానికి ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు, నాలుగు గంటలు నిలబడితే గానీ పూర్తిస్థాయిలో వైద్యం అందని పరిస్థితి నెలకొంది. జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్ వంటి విభాగాలు రోగుల రద్దీ దృష్ట్యా మధ్యాహ్నం 1.30 గంటల వరకు కొనసాగిస్తున్నాయి. తేదీ(వారం) ఓపీ సంఖ్య జనరల్ మెడిసిన్ పీడియాట్రిక్స్ 1(సోమ) 3,339 425 295 2(మంగళ) 3,131 526 265 3(బుధ) 3,020 437 292 4(గురు) 2,167 311 210 5(శుక్ర) 1,955 253 186 6(శని) 2,795 395 306 7(ఆది) 831 0 0 8(సోమ) 3,420 412 308 9(మంగళ) 3,217 444 292తీవ్రమైన నొప్పులు... శరీరమంతా నిస్సత్తువ.. కళ్ల వెంట వస్తున్న నీళ్లు... వీడని జలుబు, దగ్గు.. ఈ లక్షణాలు ఇటీవల ఎక్కువ అయ్యాయి. జిల్లాలో ప్రతి ముగ్గురిలో ఒకరికి జ్వరం వస్తోంది. వైరల్ ఫీవర్ కావడంతో ఒకరి నుంచి మరొకరికి వస్తూ ప్రతి ఇంట్లో బాధితులు ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఇదిలా ఉండగా జిల్లాలో డెంగీ కేసులు సైతం విపరీతంగా పెరిగిపోతున్నాయి. జిల్లాలో ప్రతి ముగ్గురిలో ఒకరికి జ్వరం ఏ ఇంట్లో చూసినా బాధితులే! కిక్కిరిసిన ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు పెద్దాసుపత్రిలో పది రోజులుగా పెరిగిన ఓపీ మరోవైపు డెంగీ కేసుల పెరుగుదల -
కేఎంసీలో పెరిగిన మెడిసిన్ పీజీ సీట్లు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజిలోని జనరల్ మెడిసిన్ విభాగానికి అదనంగా తొమ్మిది పీజీ సీట్లు పెరిగాయి. ప్రస్తుతం 20 పీజీ సీట్లు ఉండగా, అదనంగా 9 సీట్లకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతిచ్చినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ తెలిపారు. పెరిగిన సీట్లు ఈ విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి వస్తాయని, ఈ సీట్ల కోసం ప్రత్యేకంగా జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ శ్రీరాములును ఢిల్లీకి పంపి ప్రక్రియ పూర్తి చేయించామన్నారు. ప్లాస్టిక్ సర్జరీ, క్యాన్సర్ మొదలైన విభాగాల్లో అదనపు పీజీ సీట్ల కోసం ప్రతిపాదనలు పంపించామని, వచ్చే విద్యాసంవత్సరం అవి కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.శని, ఆదివారాల్లో మార్కెట్కు సెలవుకర్నూలు(సెంట్రల్): శని, ఆదివారాల్లో కర్నూలు మార్కెట్ యార్డుకు సెలవు ఉండడంతో ఉల్లిని తాడేపల్లిగూడెంకు తరలించి అమ్ముకోవాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య గురువారం ఓ ప్రకటనలో సూచించారు. అక్కడ అమ్ముకున్నా క్వింటా ఉల్లికి రూ.1200 మద్దతు ధర ఉంటుందన్నారు. అయితే కర్నూలు జిల్లా నుంచి తాడేపల్లెగూడెంకు ఉల్లిని తీసుకెళ్తే ఇచ్చే మద్దతు ధర రవాణా ఖర్చులకే సరిపోతుందని రైతులు పేర్కొంటుండటం గమనార్హం. కాగా, తాడేపల్లెగూడెంకు వెళ్లే రైతులు ఆధార్, బ్యాంకు పాసుబుక్, ఈక్రాప్ నమోదు ఒరిజినల్ సర్టిఫికెట్, పొలం పాసు బుక్కు తీసుకెళ్లాలని ఆమె సూచించారు. కాగా, మే నుంచి జూన్ 15వ తేదీ వరకు ఉండి పక్వానికి వచ్చిన ఉల్లిని మాత్రమే కోయాలని సూచించారు. జూలైలో వేసిన పంటను అక్టోబర్ వరకు వేచి ఉండి కోయాలని పొలంలో కనీసం వందరోజులు ఉండాలని, కోసిన తరువాత బాగా అరబెట్టుకొని గ్రేడింగ్ చేసి మార్కెట్కు తీసుకొస్తే మద్దతు ధర లభిస్తుందని పేర్కొన్నారు.పెద్దాసుపత్రిలో డయాలసిస్ మిషన్లు ప్రారంభంకర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని నెఫ్రాలజి విభాగంలో రెండు అత్యాధునిక డయాలసిస్ మిషన్లను గురువారం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డయాలసిస్ రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కొత్తగా వచ్చిన ఈ రెండు యంత్రాల ద్వారా రోగులకు మరింత సమర్థవంతమైన వైద్యసేవలు అందించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది సమన్వయంతో రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సేవలు అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. భవిష్యత్లో మరిన్ని సౌకర్యాలు సమకూరుస్తామన్నారు. కార్యక్రమంలో ఇన్ఛార్జి సీఎస్ఆర్ఎంఓ డాక్టర్ వెంకటరమణ, నెఫ్రాలజి విభాగ వైద్యులు పీఎన్ జిక్కి, అనంత్, వెంకటపక్కిరెడ్డి, శ్రీధర్ శర్మ పాల్గొన్నారు.జీడీపీకి భారీగా వరద నీరుకర్నూలు సిటీ: భారీ వర్షాలతో గాజులదిన్నె ప్రాజెక్టు (జీడీపీ)కు వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఇంజినీర్లు ప్రాజెక్టు గేట్లు ఎత్తేందుకు సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 3.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గేట్లు ఎత్తితే హంద్రీ నదితీర ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేశారు.సుంకేసులలో..ప్రస్తుతం సుంకేసుల జలాశయంలో 78 టీఎంసీల నీరు నిల్వ ఉండగా 6 క్రస్టు గేట్లను ఎత్తి 26,676 క్యూసెక్కులు దిగువకు, కేసీ కెనాల్కు 2012 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.రేపు జాతీయ లోక్ అదాలత్కర్నూలు(టౌన్): జాతీయ లోక్ అదాలత్ను ఈనెల 13న కోర్టు ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని అన్ని న్యాయ స్థానాల్లో పెండింగ్లో ఉన్న సివిల్, క్రిమినల్, ప్రీ లిటిగేషన్ కేసులు పరిష్కరించుకోవాలన్నారు. కర్నూలు జిల్లా కోర్టు ఆవరణలో 5 బెంచీలు, ఇతర మండలాల్లో 15 బెంచీలు ఏర్పాటవుతాయన్నారు. కక్షిదారులు లోక్ అదాలత్ను వినియోగించుకుని తమ కేసులను రాజీపూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించారు. -
దిగుబడులకు ధరల్లేక రైతులు లబోదిబో
పత్తికొండ/కర్నూలు(అగ్రికల్చర్): రాష్ట్రంలో టమాటా, ఉల్లి ధరలు అమాంతం పడిపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. కష్టసమయంలో ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం సైతం పత్తా లేకుండా పోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఎంతో శ్రమించి పండించిన పంటను తామే పశువులకు వదిలేయాల్సిన పరిస్థితి రావడంతో కన్నీటిపర్యంతమవుతున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ ప్రాంతంలో ప్రధాన పంట అయిన టమాటా ధర దారుణంగా పతనమైంది. కనీసం కూలీల ఖర్చులు కూడా రావట్లేదు. పత్తికొండ మార్కెట్కు రైతులు తెచ్చిన 162 క్వింటాళ్ల టమాటా పంటకు గురువారం సాయంత్రం వేలం నిర్వహించగా.. కిలో రూ.2 మాత్రమే పలికింది. దీంతో రైతులు తీవ్ర మనస్తాపం చెందారు. ఇలాగైతే తాము బతికేదెలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోత ఖర్చులూ రాక.. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉల్లి బస్తాలు భారీగా పేరుకుపోతుండగా.. కోత ఖర్చులు కూడా రాకపోతుండడంతో అనేకమంది రైతులు పొలాల్లోనే పంట దిగుబడులను వదిలేస్తున్నారు. గురువారం మార్కెట్కు 14,083 క్వింటాళ్ల ఉల్లి పంట రాగా.. వ్యాపారులు క్వింటా కేవలం రూ.150 చొప్పున 4,755 క్వింటాళ్లను కొనుగోలు చేశారు. గిట్టుబాటు ధరలు రాకపోతుండడంతో రైతులు నష్టాలను మూటగట్టుకొని తీవ్ర ఆవేదనతో వెనుతిరుగుతున్నారు. -
భూ వివాదం: తహశీల్దారు ఎదుటే తన్నుకున్న రెండు వర్గాలు
కర్నూలు జిల్లా : తమ భూ వివాదానికి సంబంధించి తహశాల్దీర్ ఎదుట హాజరైన రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. సమస్యను పరిషక్రించుకోవడానికి తహశీల్దార్ ఎదుట హాజరైన ఆ రెండు వర్గాల మధ్య మాటామాటా పెరిగి పెద్దదైంది. దాంతో ఒకరిపై ఒకరరిపై దాడులు చేసుకోవడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటన మంత్రాలయం తహశీల్దార్ కార్యాలయంలో చోటు చేసుకుంది. మంత్రాలయం మండలం వగరూరులో ఉన్న 80 సెంట్లు పొలం తగాదా ఘర్షణకు దారి తీసింది. దాంతో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పీఎస్కు తరలించారు. -
‘నాన్నా... నాకు ఊపిరి ఆడటం లేదు’
సాక్షి,కర్నూలు: దేవనకొండలో మానవత్వాన్ని మంటగలిపే దారుణం చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో ఓ తండ్రి తన ఎనిమిది నెలల పసికందును నీటి డ్రమ్ములో ముంచి హత్య చేశాడు. తండ్రి చేతుల్లోనే ప్రాణాలు కోల్పోయిన ఆ చిన్నారి చివరి శ్వాస... ఊహించుకుంటేనే గుండె ద్రవించిపోతుంది. ‘నాన్నా... నాకు ఊపిరి ఆడటం లేదు’ అనే మాటలు చెప్పలేని వయసులో ఉన్నా, ఆ అమాయక బిడ్డ బాధ ప్రతి ఒక్కరి మనసును చివుక్కుమనిపిస్తోంది.పోలీసుల వివరాల మేరకు.. దేవనకొండకు చెందిన నరేష్ గురువారం పొలంలో తన ఎనిమిది నెలల కుమారుడిని నీటిడ్రమ్ములో ముంచి ప్రాణాలు తీశాడు. అనంతరం పోలంలో ఉన్న భార్య శ్రావణిని తీవ్రంగా గాయపరిచాడు. అప్రమత్తమైన బాధితురాలి అత్తమామలు అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రావణి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నరేష్కు నేరచరిత్ర ఉంది. ఇప్పటికే మొదటి భార్య హత్యకేసులో విచారణ ఎదుర్కొంటున్నాడు. అయితే, నరేష్ తల్లిదండ్రులు అతడికి రెండో వివాహం జరిపించారు. కానీ వివాహం జరిగిన కొద్దికాలానికే నరేష్ తన రెండో భార్య శ్రావణిపై అనుమానం పెంచుకున్నాడు. ఇదే విషయంపై భార్య,భర్తల మధ్య గొడవలు జరిగేవి.ఈ క్రమంలో భార్య శ్రావణిని హతమార్చేందుకు నరేష్ కుట్ర చేశాడు. ఇందులో భాగంగా ఇవాళ కుటుంబసభ్యులతో కలిసి పొలం వెళ్లిన నరేష్ ఘాతుకానికి ఒడిగట్టాడు. నెలల పసికందును నీటి డ్రమ్ములో ముంచి ప్రాణాలు తీశాడు. ఆపై భార్యపై మారణాయుధాలతో తెగబడ్డారు. నిందితుది దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ దారుణంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
సారా తయారీ మానుకున్న వారికి ప్రత్యామ్నాయ ఉపాధి
● నేర సమీక్షా సమావేశంలో ఎకై ్సజ్ నోడల్ డిప్యూటీ కమిషనర్కర్నూలు: సారా తయారీ, రవాణా విక్రయాలు మానుకున్న వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూడాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ నోడల్ డిప్యూటీ కమిషనర్ పి.శ్రీదేవి క్షేత్రస్థాయి అధికారులకు సూచించారు. తన కార్యాలయంలో కర్నూలు, నంద్యాల జిల్లాల ఎకై ్సజ్ అధికారులతో ఆమె నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. నాటుసారాను సమూలంగా నిర్మూలించడానికి ప్రవేశపెట్టిన నవోదయం 2పై ఎకై ్సజ్ స్టేషన్ల వారీగా సమీక్షించారు. ఇప్పటికే సారా రహిత గ్రామాలుగా ప్రకటించిన గ్రామాల్లో తిరిగి సారా తయారీ కాకుండా నిఘా ఉంచి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నోటిఫికేషన్ ఇచ్చిన రెండో విడత బార్లకు దరఖాస్తులు వచ్చేలా చూడండి... నూతన మద్యం బార్ పాలసీలో భాగంగా ఉమ్మడి జిల్లాలో మొదటి రౌండ్లో అనుమతి పొందిన 37 బార్లకు సంబంధించిన వారి చేత రిటైల్ ఎకై ్సజ్ ట్యాక్స్ కట్టించి బార్లు ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మొదటి విడతలో దరఖాస్తులు రాకుండా మిగిలిపోయిన 9 బార్లకు రీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ నెల 14వ తేదీ లోపు వాటికి అప్లికేషన్లు వచ్చే విధంగా గట్టిగా కృషి చేయాలన్నారు. పొరుగు రాష్ట్రాల మద్యం జిల్లాలోకి రాకుండా నిరంతరం తనిఖీలు, దాడులు కొనసాగించాలన్నారు. అసిస్టెంట్ కమిషనర్ రావిపాటి హనుమంతరావు, కర్నూలు, నంద్యాల జిల్లాల ఎకై ్సజ్ అధికారులు (ఈఎస్) మచ్చ సుధీర్ బాబు, రవికుమార్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ రామకృష్ణా రెడ్డి, రాముడు, రాజశేఖర్ గౌడుతో పాటు అన్ని స్టేషన్ల ఇన్స్పెక్టర్లు సమావేశంలో పాల్గొన్నారు. -
అక్టోబర్లోపు పెన్షనర్ల అసోసియేషన్ ఎన్నికలు
కర్నూలు(సెంట్రల్): జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అక్టోబర్ నాటికి రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం ఎన్నికలను పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎంవీ సుబ్రమణ్యం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మద్దిలేటి ఆదేశించారు. బుధవారం సీక్యాంపులోని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం కార్యాలయంలో సెప్టెంబర్ మాసానికి సంబంధించిన సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ఆదోనినియోజకవర్గానికి సంబంధించిన పెన్షనర్ల ఎన్నికలు అక్టోబర్ ఆఖరులోపు పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో పెన్షనర్ల సంక్షేమం, పెన్షనర్ల సంఘం భవన నిర్మాణంపై చర్చించినట్లు చెప్పారు. ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో శివారెడ్డి, రాజారావు,కోట్ల లింగన్న, క్రిష్టఫర్, మోహన్రావు, పాపారావు పాల్గొన్నారు.అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతికర్నూలు: గణేష్ నగర్లో నివాసముంటున్న వెంకట ప్రసాద్ (31) ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈయనది రుద్రవరం స్వగ్రామం. తండ్రి శ్రీనివాసులు వాణిజ్య పన్నుల శాఖలో పనిచేసేవారు. పదవీ విరమణ అనంతరం కర్నూలులోనే స్థిరపడ్డారు. ఈయనకు నలుగురు కుమారులు కాగా మూడో కుమారుడైన వెంకటప్రసాద్ బజాజ్ ఫైనాన్స్లో పనిచేసేవాడు. మద్యానికి బానిసై ఉద్యోగం మానుకుని స్నేహితులతో కలసి అల్లరిచిల్లరగా తిరిగేవాడు. రెండు నెలల క్రితం పచ్చ కామెర్లు సోకడంతో గణేష్ నగర్లోని ఒక గదిలో ఉంటున్నాడు. ఆదివారం నుంచి బయటకు రాకపోవడంతో స్నేహితులకు అనుమానం వచ్చి గదిలోకి వెళ్లి చూడగా అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉన్నాడు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. పచ్చ కామెర్ల వ్యాధితో బాధ పడుతుండగా మద్యం మానుకోమని చెప్పినప్పటికీ వినలేదని, వ్యాధి తీవ్రమై చనిపోయాడని తమ్ముడు వెంకటకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మూడో పట్టణ పోలీసులు తెలిపారు.డోన్లో అంతే!● అధికార పార్టీ అండతో రెచ్చిపోతున్న కొన్ని వ్యాపార సంఘాలుడోన్: మొన్న చికెన్ అతి తక్కువ ధరకు అమ్ముతున్నారని గెలాక్సీ చికెన్ సెంటర్పై దాడిచేసిన చికెన్ వ్యాపారుల సంగతి మరువక ముందే ఇటీవల కొత్తగా ప్రారంభించిన కేరళ మెన్స్వేర్ దుకాణం ఎత్తేసే వరకు డోన్ స్థానిక వ్యాపారులు నిద్రపోలేదు. ఇలాంటి జాడ్యం పట్టణంలో రోజురోజుకూ అధికమవుతుందనేందుకు మరో ఘటన చోటు చేసుకుంది. పట్టణంలో అనంతపురం జిల్లా గుత్తికి చెందిన నూర్బాషా అనే వ్యాపారి దానిమ్మ పండ్లను కేజీ రూ.120 అమ్మకుండా రూ.60కే అమ్ముతున్నాడనే కారణంతో పండ్ల వ్యాపారుల సంఘం నాయకులు రవి అతనిపై దాడిచేసి తక్కెడ, రాళ్లను ఎత్తుకెళ్లాడు. ఈ విషయంపై బాధితుడు నూర్ బాషా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, పండ్ల వ్యాపారులు పోలీసులను ఏమాత్రం లెక్కచేయకుండా ‘మీ ఇష్టం వచ్చిన పని చేసుకోండి’ అంటూ దురుసుగా ప్రవర్తించడం గమనార్హం. బయటి వ్యాపారులు పట్టణంలో వివిధ రకాల వస్తువులను, తినుబండారాలను తీసుకువస్తే ఇన్నాళ్లు జరిగిన తమ దోపిడీ విధానానికి ఎక్కడ తెరపడుతుందోనని సంఘాల ముసుగులో కొందరు వ్యాపారులు బరితెగించి ప్రవర్తిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
హెవీ మోటారు వెహికల్ డ్రైవింగ్ శిక్షణకు ఇంటర్వ్యూలు
కర్నూలు(అర్బన్): జిల్లాలోని షెడ్యూల్డు కులాలకు చెందిన యువతకు హెవీ మోటారు వెహికల్ డ్రైవింగ్లో శిక్షణ ఇప్పించేందుకు బుధవారం కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించారు. కర్నూలు జిల్లాకు సంబంధించి ఈ శిక్షణ పొందేందుకు మొత్తం 21 మంది ( సీ్త్రలు, పురుషులు ) దరఖాస్తు చేసుకోగా, స్థానిక ఎస్సీ కార్పొరేషన్లో నిర్వహించిన ఇంటర్వ్యూలకు 18 మంది హాజరయ్యారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కె.తులసీదేవి ఆధ్వర్యంలో డీటీసీ, ఆర్టీసీ ఒకటవ డిపో మేనేజర్, డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ ఇంటర్వ్యూలను నిర్వహించారు. ఇంటర్వ్యూకు హాజరైన వారిలో 10 మందిని ఎంపిక చేశామని, ఇందులో ఒక మహిళ కూడా ఉన్నట్లు ఈడీ తెలిపారు. అలాగే నంద్యాల జిల్లాకు సంబంధించి నంద్యాలలోని రవాణా శాఖ అధికారి చాంబర్లో ఇంటర్వ్యూలను నిర్వహించమన్నారు. మొత్తం 14 మంది దరఖాస్తు చేసుకోగా 12 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారని, 10 మందిని ఎంపిక చేయగా ఒకరు మహిళ ఉన్నట్లు వెల్లడించారు. రెండు జిల్లాల్లో జరిగిన ఇంటర్వ్యూల్లో ఎస్సీ కార్పొరేషన్ ఈఓ విజయలక్ష్మితో పాటు కమిటీ అధికారులు పాల్గొన్నారు. -
క్వింటా ఉల్లి రూ.200
● ఒక్క రైతుకూ జమకాని మద్దతు ధర ‘వ్యత్యాసం’ ఈ చిత్రంలోని రైతుపేరు సురేష్ చంద్ర. వెల్దుర్తి మండలం కాశాపురం గ్రామానికి చెందిన ఉల్లి రైతు. ఈయన 1.50 ఎకరాల్లో ఉల్లి సాగు చేశారు. దిగుబడి 70 క్వింటాళ్లు వచ్చింది. బుధవారం మార్కెట్ యార్డులో అమ్మకానికి పెట్టగా వ్యాపారులు క్వింటా రూ.200తో కొన్నారు. పెట్టుబడి రూ.1.20 లక్షల వరకు పెట్టారు. ఇంత భారీ పెట్టుబడి పెడితే రూ.14 వేలు వచ్చింది. ఈ మొత్తం ఉల్లి కోత కూలీలకు కూడా సరిపోని పరిస్థితి. -
ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి
కర్నూలు(అగ్రికల్చర్): ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. ఉక్కపోత తీవ్రం అవుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు జిల్లా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల వరకు నమోదవుతాయి. అయితే బుధవారం కర్నూలులో 35.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాత్రి ఉష్ణోగ్రత ఏకంగా 26 డిగ్రీలకు చేరుకుంది. ఉష్ణోగ్రతలు వేసవిని తలపించడం గమనార్హం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. వినియోగదారులకు మెరుగైన సేవలు ● డయల్ యువర్ ఎస్ఈ కార్యాక్రమంలో ఎస్ఈ ఉమాపతి కర్నూలు(అగ్రికల్చర్): వినియోగదారులకు విద్యుత్ అధికారులు, సిబ్బంది మెరుగైన సేవలు అందించడంపై దృష్టి సారించాలని విద్యుత్ శాఖ ఎన్ఈ ఉమాపతి తెలిపారు. బుధవారం ఆయన తన కార్యాలయం నుంచి డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కర్నూలు అర్బన్ నుంచే కాకుండా జిల్లాలోని వివిధ మండలాల నుంచి 14 మంది వినియోగదారులు తమ సమస్యలను ఎస్ఈ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రతి ఒక్కరూ జవాబుదారీతనంతో పనిచేయాలని కోరారు. వర్షాలు పడుతున్నందున ఏవైన సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే స్పందించాలని సూచించారు. కార్యక్రమం కమర్షియల్ డీఈఈ బాస్కర్ పాల్గొన్నారు. ఎంపీహెచ్ఏ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం కర్నూలు(హాస్పిటల్): కర్నూలులోని ప్రాంతీయ శిక్షణా కేంద్రం(ఫిమేల్)లో ఎంపీహెచ్డబ్ల్యు(ఫిమేల్)/ఏఎన్ఎం ఉచిత శిక్షణకు అర్హులైన మహి ళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ వై.జయలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల వయస్సు 17 సంవత్సరాలు దాటి ఉండాలని, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత(ఏ గ్రూపు అయినా ఫరవాలేదు), వొకేషనల్, వన్ సిట్టింగ్ ఉత్తీర్ణత పొందిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తులు ప్రభుత్వ వెబ్సైట్ https://cfw.ap.nic నుంచి లేదా ప్రాంతీయ శిక్షణా కేంద్రం(ఫిమేల్) కార్యాలయం నుంచి పొంది వాటిని పూర్తి చేసి ఈ నెల 30లోపు అక్కడే సమర్పించాలన్నారు. శిక్షణా కాలంలో శిక్షణా కేంద్రంలోనే ఉచిత హాస్టల్ వసతి, నెలసరి స్టయిఫండ్ ఉంటుందన్నారు. ఇతర వివరాలకు 85559 10104, 90593 27020, 99590 30873 నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు. పనుల వేగవంతానికి చర్యలు చేపట్టండి కర్నూలు(అర్బన్): గ్రామీణ ప్రాంతాల్లో నాబార్డు, పీఎంజీఎస్వై, ఏపీఆర్ఆర్పీ, ఎన్ఆర్ఈజీఎస్, ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపట్టిన పనులను నిర్ణీత సమయంలోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని పీఆర్ ఎస్ఈ ఐ.వేణుగోపాల్ కోరారు. బుధవారం స్థానిక జెడ్పీ ప్రాంగణం విశ్వేశ్వరయ్య భవన్లోని తన చాంబర్లో కర్నూలు డివిజన్కు చెందిన డీఈఈ, ఏఈలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ నాబార్డు నిధులు రూ.5.40 కోట్లతో చేపట్టిన ఐదు పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఏపీఆర్ఆర్పీ కింద మొత్తం 27 పనులు చేపట్టగా, ఇప్పటి వరకు 16 పనులను పూర్తి చేశారని, మిగిలిన 11 పనులను కూడా నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలన్నారు. కర్నూలు ఎంపీ నిధులు రూ.7.34 కోట్లతో వివిధ గ్రామాల్లో సీసీ రోడ్లు, ఇతరత్రా పనులు చేపడుతున్నామన్నారు. పనులను పూర్తి నాణ్యతతో పూర్తి చేయాలన్నారు. సమావేశంలో కర్నూలు ఈఈ మహేశ్వరరెడ్డి, పీఏ టు ఎస్ఈ బండారు శ్రీనివాసులు, డీఈఈలు రమేష్కుమార్రెడ్డి, నాగిరెడ్డి, కర్రెన్న, శేషయ్య, నాగిరెడ్డి, ఏఈఈలు పాల్గొన్నారు. -
మానవత్వం లేని ప్రభుత్వం
ఆస్పరి: గొప్పలు చెప్పుకునే కూటమి ప్రభుత్వానికి కనీస మానవత్వం కరువైందని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అన్నారు. గత ఆగస్టు 20వ తేదీన ఆస్పరి మండలంలోని చిగిళి గ్రామంలో 5వ తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థులు నీటి కుంటలో పడి మృతి చెందిన విషయం తెలిసిందే. బుధవారం ఎమ్మెల్యే చిగిళి గ్రామానికి వెళ్లి మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలను పరామర్శించారు. విద్యార్థుల తల్లులు మారుతమ్మ, జిలేకాబి, మమత, నాగవేణి, లక్ష్మి, మల్లమ్మలకు ఒక్కొక్కరికి రూ.50 వేలు చొప్పున మొత్తం రూ. 3లక్షల నగదును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకేసారి ఆరుగురు విద్యార్థులు మృతి చెందడం బాధాకరమన్నారు. ఘటన చోటు చేసుకొని 20 రోజులైనా ప్రభుత్వం స్పందించకపోతే ఎలాగని ప్రశ్నించారు. దుఃఖంలోని కుటుంబాలకు కూటమి నేతలు కనీసం మేమున్నామని భరోసా కల్పించలేకపోయారన్నారు. కూటమి ప్రభుత్వానికి పేదలంటే చులకన భావమన్నారు. పేదలను ఆదుకోవడానికి వారికి చేతులు రావన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాటలకే పరిమితం కానీ పేదలకు సహాయం చేసే గుణం లేదన్నారు. ఘటన జరిగిన నాటి నుంచి జిల్లా కలెక్టర్ రంజిత్బాషాను విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నానన్నారు. అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపించామని చెబుతున్నారే కానీ ఇప్పటి వరకు ఎలాంటి సహాయం చేయలేకపోయారన్నారు. విద్యార్థుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు తాను పోరాటం చేస్తానన్నారు. ప్రభుత్వం స్పందించకున్నా విద్యార్థి కుటుంబాలకు అండగా నిలిచిన ఎమ్మెల్యేను చిగిళి గ్రామస్తులు పూలమాలలు వేసి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ జయమ్మ, ఎంపీటీసీ రాధాక్రిష్ణ, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బసవరాజు తదితరులు పాల్గొన్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించని కూటమి నేతలు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తా చిన్నారుల తల్లిదండ్రులను ఓదార్చిన ఎమ్మెల్యే విరూపాక్షి తన వంతుగా ఒక్కో కుటుంబానికి రూ.50వేల ఆర్థిక సాయం -
27 నుంచి బన్ని ఉత్సవాలు
● ముహూర్తం ఖరారు చేసిన పురోహితులు ● అక్టోబర్ 2న మాళ మల్లేశ్వరాస్వామి కల్యాణోత్సవం హొళగుంద: దసరా పండుగ వచ్చిందంటే ఠక్కున గుర్తుకు వచ్చేది దేవరగట్టు శ్రీమాళమల్లేశ్వరస్వామి బన్నీ ఉత్సవం. రాష్ట్రంలోనే ప్రత్యేకత సంతరించుకున్న ఈ ఉత్సవాలు ఈనెల 27 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈమేరకు బుధవారం నెరణికి గ్రామంలో పురోహితులు ముహూర్తం ఖరారు చేశారు. ఉత్సవాల ఆహ్వాన ప్రతిని ఆలూరు సీఐ రవిశంకర్రెడ్డి, హొళగుంద ఎస్ఐ దిలీప్కుమార్తో కలిసి ఉత్సవ నిర్వాహకులైన నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు, ఆలయ పూజారులు విడుదల చేశారు. త్వరలోనే కరపత్రాలను ముద్రించి అన్ని ప్రాంతాలకు పంపిణీ చేయనున్నట్లు వారు తెలిపారు. బన్ని ఉత్సవాల నిర్వహణ ఇలా .. ● ఈనెల 27వ తేదీ శనివారం దేవరగట్టులో మాత మాళమ్మ మల్లేశ్వరునికి కంకణధారణం, నిశ్చితార్థం. ● అక్టోబర్ 2వ తేది గురువారం విజయదశమి రోజున కల్యాణోత్సవం, బన్ని ఉత్సవం, జైత్రయాత్ర. ● 3వ తేది శుక్రవారం భవిష్యవాణి (దైవవాణి) ● 4న శనివారం సాయంత్రం స్వామి వారి రథోత్సవం ● 5న ఆదివారం గొరవయ్యల ఆటలు, గొలుసు తెంపుట, సాయంత్రం దేవదాసీల క్రీడోత్సవం. ● 6న సోమవారం మాళమల్లేశ్వర స్వామి విగ్రహాలు నెరణికి గ్రామానికి చేరడంతో ఉత్సవాలు ముగుస్తాయి. -
సొంత ఆదాయ వనరులతో గ్రామాల అభివృద్ధి
కర్నూలు(అర్బన్): గ్రామాల్లో సొంత ఆదాయ వనరులను నిర్లక్ష్యం చేయకుండా ఉపయోగించుకుంటే గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేసుకోవచ్చని జిల్లా పంచాయతీ అధికారి జి.భాస్కర్ తెలిపారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్లోని డీపీఆర్సీ భవనంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులకు ‘ సొంత ఆదాయ వనరులు ’ అనే అంశంపై మూడు రోజుల శిక్షణా కార్యక్రమాలు కర్నూలు, నంద్యాల జిల్లాలకు వేర్వేరుగా నిర్వహించారు. ముందుగా జాతిపిత మహాత్మాగాంధీ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీపీఓ భాస్కర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో సొంత ఆదాయ వనరులైన పన్నులు, పన్నేతరములు, ఇతర మార్గాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఆదాయ వనరుల సమీకరణకు సంబంధించి ఉన్న చట్టాలను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలన్నారు. పంచాయతీల్లో ఖాళీ స్థలాలు ఉంటే వాటిని ఉపయోగంలోకి తీసుకురావడం ద్వారా ఆయా గ్రామ పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేసిన వారమవుతామన్నారు. కార్యక్రమంలో ట్రైనింగ్ మేనేజర్ గిడ్డేష్, టీఓటీలు వి.జేమ్స్ కృపావరం, వి.ప్రభాకర్, అస్రఫ్బాషా, పి.జగన్నాథం, డీకే దస్తగిరిబాషా తదితరులు పాల్గొన్నారు. -
కష్టం మట్టిపాలు!
● ధరలేక ఉల్లి పంటను దున్నేసిన రైతు పత్తికొండ రూరల్: చెమటోడ్చి పండించిన రైతు కష్టం మట్టిపాలైంది. ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైంది. ఉల్లికి మద్దతు ధర ప్రకటన ఉత్తిదే అని తేలిపోయింది. మార్కెట్లో ధర లేక రైతులు పంటపై పెట్టుకున్న గంపెడు ఆశలు ఆవిరయ్యాయి. బుధవారం ఓ రైతు ఆవేదనతో రెండెకరాల్లో ఉల్లి పంటను తొలగించి, గొర్రెలకు వదిలేశాడు. మండల పరిధిలో ని పెద్దహుల్తి గ్రామ సర్పంచు విజయలక్ష్మి భర్త నాగరాజు రెండెకరాల్లో ఉల్లి పంట సాగుచేశాడు. సుమారు రూ.లక్షకు పైగానే ఖర్చుపెట్టాడు. ఇప్పుడు కోతకు, మార్కెట్కు తరలించేందుకు రవాణా చార్జీలు రూ.30వేల నుంచి రూ.40వేల వరకు ఖర్చవుతుంది. ప్రస్తుతం మార్కెట్లో కనీస ధర కూడా పలకని పరిస్థితి. క్వింటా ధర రూ.200 మించకపోవడం.. ప్రభుత్వం మద్దతు ధర రూ.1200 ప్రకటించినా కొనుగోలు చేసే నాథుడే లేకపోవడంతో ఇక లాభం లేదనుకున్నాడు. ఈ ధరలతో అమ్ముకుంటే కనీసం కూలీల ఖర్చులకు కూడా గిట్టుబాటు కాదని రెండెకరాల్లోని ఉల్లి పంటను ట్రాక్టర్తో దున్నేశాడు. విధిలేని పరిస్థితుల్లో గొర్రెల మందకు వదిలేయడం ఉల్లి రైతుల దీనావస్థకు అద్దం పట్టింది.నాణ్యతగా ఉన్న ఉల్లి గడ్డలు -
సెట్ల కౌన్సెలింగ్కు షెడ్యూల్ విడుదల
కర్నూలు కల్చరల్: రాష్ట్ర ఉన్నత విద్యా మండలి పలు సెట్లకు కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకటించింది. లాసెట్, పీజీఎల్సెట్, ఎడ్సెట్, పీఈసెట్, ఏపీ పీజీసెట్లలో కన్వీనర్ కోటా సీట్లను భర్తీ చేయనుంది ● లాసెట్/పీజీ ఎల్సెట్లో భాగంగా ఎల్ఎల్బీ (మూడేళ్లు, ఐదేళ్లు), ఎల్ఎల్ఎం (రెండేళ్లు) కోర్సుల్లో విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనుంది. ఈనెల 11వ తేదీ వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు, 9 నుంచి 12 వరకు ధ్రువపత్రాల పరిశీలన, 12 నుంచి 14 వరకు వెబ్ ఆప్షన్ల ఎంపిక, 15న వెబ్ ఆప్షన్ల మార్పులకు అవకాశ ం, 17న సీట్ల కేటాయింపు, 18,19 తేదీల్లో సంబంధిత కళాశాలల్లో విద్యార్థులు రిపోర్ట్ చేయాల్సి ఉంది. ● రెండేళ్లు బీఈడీ, బీఈడీ స్పెషల్ కోర్సులకు ఎడ్సెట్ ద్వారా సీట్లు కేటాయింపు చేయనున్నారు. ఈనెల 9 నుంచి 12వ తేదీ వరకు ఆన్లైణ్ రిజిస్ట్రేషన్, 10 నుంచి 13 వరకు ధ్రువపత్రాల పరిశీలన, 13 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్ల ఎంపిక, 16న వెబ్ ఆప్షన్ల మార్పు, 18న సీట్ల కేటాయింపు, 19, 20 తేదీల్లో కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంది. ● రెండేళ్ల బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో పీఈసెట్ ద్వారా సీట్లను కేటాయించనున్నారు. ఈనెల 10 నుంచి 13 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, 11 నుంచి 14 వరకు ధ్రు వ పత్రాల పరిశీలన, 14 నుంచి 16 వరకు వెబ్ ఆప్షన్ల ఎంపిక, 17న వెబ్ ఆప్షన్ల మార్పు, 19న సీట్ల కేటాయింపు, 22, 23 తేదీల్లో కళాశాలల్లో రిపోర్ట్ చేయాలి. ● రాష్ట్రలోని యూనివర్సిటీల్లో రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంకామ్) కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ పీజీసెట్ ద్వారా సీట్లను కేటాయించనున్నారు. ఈనెల 15వ తేదీ వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, 9 నుంచి 16 వరకు ధ్రువ పత్రాల పరిశీలన, 12 నుంచి 17 వరకు వెబ్ ఆప్షన్ల ఎంపిక, 18న వెబ్ ఆప్షన్ల మార్పు, 20న సీట్ల కేటాయింపు, 22, 23, 24 తేదీల్లో కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని షెడ్యూల్లో ప్రకటించారు. భార్యను హత్య చేసిన భర్త నంద్యాల: కుటుంబ కలహాలతో భార్యను భర్తే గొంతు కోసి చంపాడు. ఈ దారుణ ఘటన నంద్యాల పట్టణంలో చోటు చేసుకుంది. నంద్యాల టూటౌన్ సీఐ అస్రార్బాషా తెలిపిన మేరకు వివరాలు.. సాయినాథ్శర్మ, శిరీష దంపతులు పట్టణంలోని ఎన్జీఓస్ కాలనీలో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. కుమారుడు గత కొన్ని సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా కూతురు శ్రీహిత స్థానికంగా ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. అయితే, భార్య శిరీష (45) బయట అప్పులు చేయడం..ఈ కారణంతో రుణదాతలు తరచుగా ఇంటికి వస్తున్నారు. దీంతో ఆగ్రహించిన సాయినాథ్శర్మ మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో కత్తితో భార్య గొంతు కోసి హత్య చేశారు. ఈమేరకు కుమార్తె శ్రీహిత ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
వివాహిత అదృశ్యం
సంజామల: మండల పరిఽ దిలోని కానాల గ్రామానికి చెందిన ఓ వివాహిత అదృశ్యమైంది. సంజామ ల ఎస్ఐ రమణయ్య తెలిపిన వివరాల మేరకు..కానాల గ్రామానికి చెందిన సోము భాస్కర్రెడ్డి కుమార్తె సోము శశిరేఖకు నంద్యాలకు చెందిన శ్రీహరి రెడ్డితో 2023 సంవత్సరంలో వివాహమైంది. భార్యాభర్తల వ్యక్తిగత గొడవల కారణంగా సోము శశిరేఖ పెళ్లి అయిన కొన్ని నెలలకే తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. ఆ తర్వాత వారి నుంచి కూడా బయటకు వెళ్లిపోయింది. అయితే, తన భార్య కనిపించడం లేదని శ్రీహరి రెడ్డి మంగళవారం పోలీసులను ఆశ్రయించాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఆలయ హుండీలు చోరీ గడివేముల: మండల కేంద్రమైన గడివేములలోని కొత్త మూలపెద్దమ్మ ఆలయంతో పాటు బూ జునూరు గ్రామంలోని వెంకటేశ్వరస్వామి హుండీలను సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. ఆలయాలకు ఉన్న తాళాలలను పగలగొట్టి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. హుండీల్లోని సొమ్మంతా తీసుకుని ఊరి బయట వాటిని పడేసి వెళ్లారు. మంగళవారం ఆలయ నిర్వాహుకులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ చోరీపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగార్జునరెడ్డి తెలిపారు. కాగా హుండీల్లో దాదాపు రూ.2 లక్షల దాకా ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. అంగన్వాడీ టీచర్పై సీడీపీఓ వేధింపులు ఆలూరు రూరల్: ఐసీడీఎస్ సీడీపీఓ వేధింపులు తాళలేక ఓ అంగన్వాడీ టీచర్ తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరింది. బధితురాలు తెలిపిన వివరాల మేరకు . ఆలూరు మండలం కురువళ్లి గ్రామంలోని అంగన్వాడీ సెంటర్లో భువనేశ్వరి కార్యకర్తగా విధులు నిర్వహిస్తోంది. ఈ నెల 6వ తేదీన ఆలూరు ఐసీడీఎస్ సీడీపీఓ నరసమ్మ కురువళ్లి అంగన్వాడీ కేంద్రానికి తనిఖీకి వెళ్లి స్టాక్ రూం పరిశీలించారు. సరుకుల వివరాలు స్టాక్ రిజిస్టర్లో నమోదు చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్త చేస్తూ రూ. 4 వేలు డిమాండ్ చేసింది. ఈ మొత్తాన్ని ఫోన్ పే చేయమని సూచించగా అంగన్వాడీ కార్యకర్త పంపించలేదు. దీంతో సీడీపీఓ ఆమెను వేధించడం మొదలుపెట్టింది. మంగళవారం ఆలూరులోని ఐసీడీఎస్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన అంగన్వాడీల కార్యకర్తల సమావేశంలో భూమనేశ్వరిని టార్గెట్ చేసింది. అందరి ముందు సరుకులను అమ్ముకుంటున్నావని ఆరోపిస్తూ దురుసుగా మాట్లాడారు. డబ్బు ఇవ్వలేదని తనపై నింద వేయడంతో అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరినట్లు బాధితురాలు తెలిపారు. ఒక పక్క పని ఒత్తడి.. మరో పక్క అధికారుల వేధింపులు తాళలేకపోతున్నామని భువనేశ్వరి వాపోయారు. -
పండ్లతోటల అభివృద్ధిపై దృష్టి సారించండి
● సాంకేతిక సహాయకులకు డ్వామా పీడీ ఆదేశం కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో పండ్లతోటల తోటల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటరమణయ్య జాతీయ ఉపాధి హామీ పథకానికి చెందిన సాంకేతిక సహాయకులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని డ్వామా సమావేశ మందిరంలో పత్తికొండ, ఆదోని, ఆలూరు క్లస్టర్ల పరిధిలోని సాంకేతిక సహాయ సహాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పీడీ మండలాల వారీగా పండ్లతోటల టార్గెట్ ఎంత.. ఇప్పటి వరకు సాధించిన ప్రగతి తదితర వాటిపై సమీక్షించారు. వివిధ మండలాల్లో పురోగతి తక్కువగా ఉండటంతో సంబంధిత టీఏలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఈ ఏడాది 4500 ఎకరాల్లో ఉపాధి నిధులతో వందశాతం సబ్సిడీతో పండ్లతోటలు అభివృద్ధి చేయాలనేది లక్ష్యమని, ఇప్పటి వరకు 4220 ఎకరాలకు జిల్లా కలెక్టర్ పరిపాలన అనుమతులు ఇచ్చారని తెలిపారు. ఈ నెల చివరిలోపు లక్ష్యం మేరకు ప్లాంటేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే ఫాంపాండ్స్ తవ్వకాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. సమావేశంలో ఏపీడీలు లక్ష్మన్న, క్రిష్ణమోహన్, ప్లాంటేషన్ మేనేజర్ నందకిశోర్ తదితరులు పాల్గొన్నారు. -
పనిమనిషే హంతకురాలు
● శివలీల హత్య కేసును ఛేదించిన పోలీసులు ● సీసీ ఫుటేజీ ఆధారంగా గుర్తింపు ● వివరాలు వెల్లడించిన ఎస్పీ కర్నూలు : వృద్ధురాలు కాటసాని శివలీలను దారుణంగా హత్య చేసి ఒంటిపై ఉన్న సొత్తులను తస్కరించిన నిందితురాలిని సీసీ కెమెరాలు పట్టించాయి. గణేష్ నగర్ పక్కనున్న (కల్లూరు అర్బన్ 19వ వార్డు) సాయి వైభవ నగర్లో నివాసముంటున్న శివలీల (75) ఈనెల 1వ తేదీన దారుణ హత్యకు గురయ్యారు. మూడో పట్టణ పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని వారం రోజుల వ్యవధిలోనే ఛేదించారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న శివలీలపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలను తస్కరించి పరారయ్యారు. ఈ మేరకు అల్లుడు చంద్రశేఖర్రెడ్డి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టగా శివలీల ఇంట్లో పనిమనిషిగా ఉన్న కురువ వరలక్ష్మి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా గుర్తించారు. కల్లూరు మండలం చెట్లమల్లాపురం గ్రామంలో ఆమె అక్క ఇంట్లో తలదాచుకుని ఉన్నట్లు ఫోన్కాల్ డేటా ఆధారంగా నిర్ధారించుకుని అక్కడికి వెళ్లి ఆమెను అదుపులోకి తీసుకుని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఎదుట హాజరుపరిచారు. కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్, సీఐలు శేషయ్య, చంద్రబాబు నాయుడు, ఉలిందకొండ ఎస్ఐ ధనుంజయతో కలసి మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఎస్పీ వివరాలు వెల్లడించారు. హత్య చేసి తాపీగా గోడ దూకి... ప్యాపిలి మండలం గోపాల నగరం (గోపాల పురం) గ్రామానికి చెందిన వరలక్ష్మి ఉపాధి నిమిత్తం వలస వచ్చి కర్నూలులో నివాసముంటున్నారు. రెండు నెలల క్రితం కాటసాని శివలీల ఇంట్లో పనిమనిషిగా చేరింది. హత్యకు రెండు రోజుల ముందు పని మానేసింది. ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి చొరబడి ఆమె ఒంటిపై ఉన్న నగలు దోచుకెళ్లి స్థిరపడాలని పథకం పన్నింది. ఇందులో భాగంగా ఈనెల 1వ తేదీన స్వగ్రామం గోపాలపురంలో వరలక్ష్మి వితంతు పెన్షన్ తీసుకుని అక్కడి నుంచి డోన్ మీదుగా కర్నూలు వచ్చి గుత్తి పెట్రోల్ బంకు దగ్గర బస్సు దిగి అక్కడినుంచి ఆటోలో రైతుబజార్ మీదుగా శివలీల ఇంటి వద్దకు చేరుకుంది. ముఖానికి స్కార్ప్(బట్ట) కట్టుకుని శివలీల ఇంట్లోకి ప్రవేశించి మళ్లీ పనికి వస్తానమ్మా.. అంటూ మాటల్లో పెట్టి సమీపంలో ఉన్న రోకలి బండతో తలపై కొట్టింది. దీంతో ఆమె రక్తపు మడుగులో పడిపోగా మెడలో ఉన్న 6 తులాల బంగారు గొలుసు, 5 తులాల గాజులు, బెడ్ రూమ్లో ఉన్న రెండు బ్యాగులను తీసుకుని బయటకు వచ్చి ఇంటి వెనుక బాత్రూమ్ పక్కనుంచి కాంపౌండ్ వాల్ దూకి పారిపోయింది. పోలీసులు దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరాలను జల్లెడ పట్టగా నిందితురాలు పనిమనిషి అయిన కురువ వరలక్ష్మినే అని తేలింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా బంగారు నగల కోసమే హత్య చేసినట్లు అంగీకరించింది. ఆమె వద్ద నుంచి బంగారు నగలు, 6 చెక్బుక్లు, 7 బ్యాంకు పాస్ బుక్కులు, నేరానికి ఉపయోగించిన రోకలి బండను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. నిందితురాలిని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్కు ఆదేశించినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. కేసును ఛేదించిన దర్యాప్తు అధికారులతో పాటు పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించి నగదు రివార్డులు అందజేశారు. -
పత్తికొండలో అడుగడుగునా అడ్డంకులు
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు పత్తికొండలో నిర్వహించిన అన్నదాత పోరు కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టించింది. అయినప్పటికీ రైతుల తరఫున వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి, పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఆధ్వర్యంలో పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్రెడ్డి, మహిళ విభాగం రాష్ట్ర కార్యదర్శి శశికళ, మాజీ ఎంపీపీ నాగరత్నమ్మలతో కలసి ర్యాలీగా వచ్చి నాలుగు స్థంభాల కూడలిలో ధర్నా చేపట్టారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయానికి చేరుకోని ఆర్డీఓ భరత్నాయక్కు వినతిపత్రం అందజేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసులు అన్నదాత పోరుబాటపై ఆంక్షలు విధించారు. ర్యాలీని అనుమతి కోరినా చివరి వరకు ఇవ్వకుండా జాప్యం చేశారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి ఆమె నివాసం నుంచి ఆర్డీఓ కార్యాలయం చేరుకోగా.. ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి అంబేద్కర్ సర్కిల్ నుంచి ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లారు. నాయకులు అక్కడికి చేరుకోగానే మద్దతుగా అన్నదాతలు ఒక్కసారిగా కదలిరావడంతో ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణం కిక్కిరిసింది. ఈ కార్యక్రమాన్ని పోలీసులు డ్రోన్ కెమెరాతో చిత్రీకరించడం గమనార్హం. -
● కష్టమంతా జీవాలకు మేత!
గోనెగండ్ల: ఆరుగాలం కష్టపడి పండించిన ఉల్లిపంటకు ధర లేకపోవడంతో రైతులు తల్లడిల్లిపోతున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి నష్టాలు మూటగట్టుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు రైతులు చేతికి వచ్చిన పంటను పొలాల్లోనే వదులుతున్నారు. మండల కేంద్రం గోనెగండ్లకు చెందిన చాకలి బ్రహ్మయ్య అనే రైతు ఎన్నో ఆశలతో 2.50 ఎకరాల్లో ఉల్లి సాగుచేశాడు. రూ.1.50 లక్షలు పెట్టుబడి పెట్టాడు. పంట చేతికి వచ్చేసరికి క్వింటం ధర రూ.500 నుంచి రూ.600 పలుకుతుంది. ఈ ధరకు కూలీల ఖర్చు కూడా రాదని భావించి పంట కోయకుండా మంగళవారం గొర్రెలకు మేతగా వదిలాడు. తమ పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా పాలకులు పట్టించుకోవడం లేదని వాపోయారు. -
ప్రయాణికులకు విజ్ఞప్తి
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనంతపురం జిల్లా పర్యటన ప్రయాణికులకు శాపంగా మారింది. సీఎం పర్యటనకు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో బస్సులు కేటాయించారు. అన్ని రకాల సర్వీసులు కలుపుకొని మొత్తం 410 ఉండగా ఇందులో 280కు పైగా బస్సులు సీఎం టూర్కు వేశారు. దీంతో మంగళవారం మధ్యాహ్నం నుంచే వివిధ రూట్లకు ఆర్టీసీ అధికారులు బస్సు సర్వీసులు రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నంద్యాల, ఆళ్లగడ్డ, జమ్మలమడుగు, కర్నూలు, తాడిపత్రి, తదితర ప్రధాన రూట్లకు బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామాలకు వెళ్లే పల్లెవెలుగు బస్సులు లేకపోవడంతో మహిళలు , చిన్నపిల్లలు, వృద్ధులు, విద్యార్థులు గంటల తరబడి వేచి ఉన్నారు. చివరకు ఆటోలు, ఇతర ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి గమ్యస్థానాలకు చేరుకోవాల్సి వచ్చింది.ఇదిలా ఉంటే సీఎం పర్యటన సందర్భంగా బుధవారం రాత్రి వరకు వివిధ రూట్లలో బస్సు సర్వీసులు రద్దు చేశామని.. ప్రయాణికులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ఏకంగా అధికారులు కోవెలకుంట్ల బస్టాండ్లో నోటీస్బోర్డు అతికించడం గమనార్హం. – సాక్షి నెట్ వర్క్ -
ఉన్నది ఒకటే జిందగీ!
కర్నూలు(హాస్పిటల్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏదో ఒక చోట వ్యక్తులు ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు చేస్తూనే ఉన్నారు. బలవంతంగా తమ ప్రాణాలను తామే తీసుకుంటున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ప్రతి నెలా 30 నుంచి 40 మంది దాకా బలవంతంగా తనువు చాలిస్తున్నారు. ఇందులో పలువురు వివిధ కారణాలతో క్షణికావేశంతో ఆయువు తీసుకుంటున్నారు. మిగిలిన వారు ఆరోగ్య సమస్యలు, డిప్రెషన్, మానసిక సమస్యలు, ఆర్థిక కారణాలు, కుటుంబ సమస్యలు ఉంటున్నాయి. ఇలాంటి వారికి సమయానికి చెప్పే వారు లేకపోవడమే కారణం. ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవడం, చిన్నకుటుంబాలు ఏర్పడటం, వారికి ఏ చిన్న సమస్య వచ్చినా సర్ది చెప్పేవారు లేకపోవడం, భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేయడం, పిల్లలకు మంచి విషయాలు చెప్పేవారు లేకపోవడం, సోషల్ మీడియా, సినిమాలు, టీవీ సీరియళ్లు మొదలైన అంశాలు ఆత్మహత్యలు పెరిగేందుకు కారణమవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఆత్మహత్యతో మరణించే వారిలో ఎక్కువ మంది మానసిక ఆరోగ్య సమస్యలైన డిప్రెషన్, మత్తు–మద్యం వినియోగ రుగ్మత ఉన్న వారు, సైకోసిస్, పర్సనాలిటి డిసార్డర్స్ ఉన్నవారు ఉన్నారు. వీరితో పాటు ఆర్థిక సంక్షోభం, సంబంధాల వైఫల్యాలు, అవమానం, సన్నిహిత కుటుంబ సభ్యుడి మరణం, తీవ్రమైన అనారోగ్యం ఇవన్నీ ఆత్మహత్య దోరణిని పెంచుతున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. ఇటీవల కాలంలో ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇందులో 90 శాతం క్షణికావేశంతో చేసుకునేవే ఉంటున్నాయి. కారణాలేవైనా ఆత్మహత్య చేసుకోవాలనుకునేవారి పట్ల కొద్దిగా అప్రమత్తంగా ఉంటే చాలు నిరోధించవచ్చు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన వారి మానసిక సమస్యలు తెలుసుకుని, వారిలో ఆత్మహత్యకు సిద్ధమైన వారు ఉంటే అలాంటి వారిని ముందే గుర్తించి కౌన్సెలింగ్ నిర్వహించి అవసరమైన మందులు అందిస్తున్నాము. –డాక్టర్ ఎన్.నాగేశ్వరరావు, మానసిక వైద్యవిభాగాధిపతి, జీజీహెచ్, కర్నూలు చాలావరకు ఆత్మహత్యలు మానసిక ఒత్తిళ్లు, ఆర్థిక, కుటుంబ సమస్యలు, పరీక్షల్లో ఫెయిల్ కావడం, సంక్షోభాలు, జబ్బు నయం కాదనే భయంతోనే జరుగుతుంటాయి. కొందరు సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పెట్టినా తట్టుకోలేరు. ఆత్మహత్య ఆలోచన వచ్చిన వారు టెలిమానస్ 144169 అనే టోల్ఫ్రీ నెంబర్కు ఫోన్ చేస్తే వారు అలాంటి వారికి కౌన్సిలింగ్ చేసి ఆత్మహత్యకు సంబంధించిన ఆలోచనల నుంచి దూరం చేస్తారు. –డాక్టర్ ఎం. శివశంకర్రెడ్డి, మానసిక వైద్యులు, కర్నూలు ఆత్మహత్యలు వద్దు..బతికి సాధిద్దాం -
అమ్మానాన్నలు దూరమై..
ఆస్పరి: తండ్రి హత్యకు గుర య్యాడు..తల్లి జైలుకెళ్లింది. అభం శుభం తెలియని పిల్లలు అనాథలుగా మిగిలారు. ఇంటికి వచ్చిపోయే వారిని ఆ పిల్ల లు తదేకంగా చూస్తూ ఉన్నారు. మండలంలోని తొగలుగల్లు గ్రామంలో చోటు చేసుకున్న ఈ హృదయ విదారక దృశ్యం అందరినీ కలచివేస్తోంది. ఈనెల 3వ తేదీన తొగలుగల్లు గ్రామానికి చెందిన అహోబిలం (33) అనే వ్యక్తిని తోడుగా ఉండాల్సిన భార్యే తన ప్రియుడితో కలిసి హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే, మృతుడికి 7ఏళ్ల కుమారుడు భరత్ గ్రామంలోనే ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు. 5 ఏళ్ల వర్షిణి అనే కుమార్తె అంగన్వాడీ కేంద్రంలో చదువుతుంది. తండ్రిని హత్య చేసిన కేసులో తల్లి గంగావతి జైలుకెళ్లింది. కన్నతల్లిదండ్రులు దూరమై దిక్కులు చూస్తున్న పిల్లల భవిష్యతును తలుచుకొని నాయనమ్మ హనుమంతమ్మ కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది. ఇసుక దోపిడీని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా ఆదోని అర్బన్: తన నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక దోపిడీని సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే పార్థసారథి పేర్కొన్నారు. మంగళవారం నియోజకవర్గంలో ఇసుక తోలే టిప్పర్ల ఓనర్లు ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న ఇసుక దోపిడీని ఆపాలని ఇదివరకే సబ్కలెక్టర్, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేశానన్నారు. -
పేదల ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేయాలి
కర్నూలు: ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హత ఉన్న పేదవారికి చేరవేసి ప్రయోజనం కల్పించే దిశగా ఎన్జీఓలు (స్వచ్ఛంద సంఘాలు) పనిచేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి సూచించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి ఆదేశాల మేరకు మంగళవారం కర్నూలు న్యాయ సేవా సదన్లో ఉమ్మడి జిల్లా ఎన్జీఓలకు సెన్సిటైజేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఎడ్యుకేషన్, చైల్డ్ వెల్ఫేర్, డిజబిలిటీ, పోలీసు శాఖలకు సంబంధించిన అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలు, చిన్నపిల్లలు, సీనియర్ సిటిజన్లు, అక్రమ రవాణా బాధితులు, ట్రాన్జెండర్స్, గిరిజనులు, అసంఘటిత కార్మికుల ప్రయోజనాల కోసం పనిచేసే ఎన్జీఓలతో పాటు అన్ని ప్రభుత్వ శాఖలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే సెన్సిటైజేషన్ ప్రోగ్రాంను ఏర్పాటు చేసినట్లు లీలా వెంకటశేషాద్రి తెలిపారు. పేదలు, ప్రభుత్వ శాఖల మధ్య అనుసంధానకర్తలుగా ఎన్జీవోలు ఉండాలని కోరారు. సీనియర్ సిటిజన్ డిపార్ట్మెంట్ అడిషనల్ డైరెక్టర్ రయీస్ ఫాతిమా మాట్లాడుతూ తమ శాఖ ద్వారా సీనియర్ సిటిజన్లకు, ట్రాన్స్జెండర్లకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నామని తెలిపారు. నంద్యాల జిల్లా విద్యాశాఖాధికారి జనార్ధన్ మాట్లాడుతూ పేద పిల్లలను గుర్తించి, స్కూళ్లలో చేర్పించి విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఉమ్మడి జిల్లాల మండల విద్యాశాఖ అధికారులు కర్నూలు చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శారదా, స్వచ్ఛంద సంఘాల నిర్వాహకులు సుధారాణి, డాక్టర్ రాయపాటి శ్రీనివాసులు, బచ్చన్ బచావో ఆందోళన్ మౌనిక, నారాయణ, రామాంజినేయులు, విజయ, సుబ్బరాయుడు తదితరులు సదస్సులో పాల్గొన్నారు. -
ఉల్లి కొనుగోళ్లు అంతంతే!
మార్కెట్కు 14,325 క్వింటాళ్లు ● వ్యాపారులు కొనింది 6,749 క్వింటాళ్లు మాత్రమే కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉల్లి అమ్మకాల కోసం రైతులు వ్యాపారులు లేదా మార్క్ఫెడ్ అధికారుల కోసం ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది. మంగళవారం మార్కెట్ యార్డుకు 14,325 క్వింటాళ్ల ఉల్లి వచ్చింది. రెండు విడతలుగా వ్యాపారులతో ఈ–నామ్లో టెండ ర్లు వేయించినప్పటికీ 6,749 క్వింటాళ్లు మా త్రమే కొనుగోలు చేశారు. క్వింటాకు కనిష్టంగా రూ200, గరిష్టంగా రూ.1139 ధర పలికి ంది. రూ.1000 పైన ధర కేవలం నాలుగైదు లాట్లకు మాత్రమే లభించగా.. మిగిలిన లాట్లకు రూ.600–రూ.700 మాత్రమే ధర లభించింది. రైతులు తెచ్చిన ఉల్లిలో 7,576 క్వింటాళ్ల ఉల్లి మార్కెట్లోనే ఉండిపోవడం గమనార్హం. ఈ సరుకు మార్క్ఫెడ్ కొంటుందా లేదా అనే విషయమై సాయంత్రం 7 గంటల వరకు స్పష్టత కరువైంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రంజిత్బాషా, జేసీ నవ్య, ఎస్పీ విక్రాంత్పాటిల్ సాయంత్రం మార్కె ట్ యార్డుకు చేరుకున్నారు. ఉల్లిగడ్డల నాణ్యతను పరిశీలించారు. ఎట్టకేలకు మిగిలిపోయిన ఉల్లిగడ్డలను కొనుగోలు చేయాలని మార్క్ఫెడ్కు ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్ వెంట మార్కెటింగ్ శాఖ జేడీ రామాంజనేయులు, డీడీ లావణ్య, ఏడీఎం నారాయణ మూర్తి, సెక్రటరీ జయలక్ష్మి తదితరులు ఉ న్నారు. ఇదిలాఉంటే ప్రభుత్వం రూ.1200 మద్దతు ధర ప్రకటించిన నేపథ్యంలో ఉల్లిగడ్డలు రీసైక్లింగ్ జరుగుతున్నాయేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పరిశీలనకు జిల్లా యంత్రాంగం ఐదుగురు ఉద్యాన అధికారులతో ప్రత్యేక టీమ్ ఏర్పా టు చేసింది. ఇకపోతే బుధవారం మార్కెట్లో ఉల్లిగడ్డలను అమ్మకానికి పెట్టేందుకు మంగళవారం సాయంత్రం నుంచి ట్రాక్టర్లు వస్తున్నాయి. అయితే లోపల ఖాళీ లేకపోవడంతో వచ్చిన వాహనాలన్నిటినీ బయటనే నిలిపేయంతో ట్రాఫిక్ స్తంభించింది. -
ముమ్మాటికీ చంద్రబాబు రైతు వ్యతిరేకి
చంద్రబాబు మూమ్మాటికీ రైతు వ్యతిరేకి. అప్పట్లోనే ఆయన వ్యవసాయం దండగా అన్న విషయాన్ని మర్చిపోలేం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతాంగానికి బాసటగా నిలిచి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారు. రైతు భరోసా కేంద్రాలతో వ్యవసాయాన్ని సులభతరం చేశారు. కూటమి ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరించింది. కోడుమూరు మండలం, పోలకల్ రైతులపై కేసులు పెట్టడం దుర్మార్గం. మోసపూరిత హామాలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత ఉంది. అందుకే నేతలు ప్రజల్లో తిరగలేకపోతున్నారు. వచ్చేది జగనన్న ప్రభుత్వమే. – బి.వై.రామయ్య, కర్నూలు నగర మేయర్ రైతుల పక్షపాతిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి వారికి బాసటగా నిలిస్తే, చంద్ర బాబు రైతు వ్యతిరేకిగా మరోసారి నిరూపించుకున్నాడు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ఉల్లి రైతుల కన్నీళ్లు తుడిచేందుకు కూడా ఈ ప్రభుత్వానికి మనసు రావడం లేదు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా ఇప్పటికీ నిద్రమత్తులోనే ఉంది. విజనరీ ముఖ్యమంత్రికి రైతుల అవసరాలు కూడా తెలియకపోవడం శోచనీయం. ప్రభుత్వం దిగివచ్చే వరకు వైఎస్సార్సీపీ రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తుంది. – ఆదిమూలపు సతీష్, కోడుమూరు నియోజకవర్గ ఇన్చార్జి వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ‘అన్నదాత పోరు’ -
అనధికార నివాసాలపై మూకుమ్మడి దాడి
కర్నూలు(అర్బన్): నగరంలోని ఏ, బీ, సీ క్యాంపుల్లోని క్వార్టర్లలో అనధికారికంగా నివాసాలు ఉన్న వారిని ఖాళీ చేయించేందుకు సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది మూకుమ్మడిగా దాడులు నిర్వహించారు. ప్రధానంగా రెవెన్యూ, మున్సిపల్, ఆర్అండ్బీ, ఏపీఎస్పీడీసీఎల్, పోలీస్ శాఖలకు చెందిన అధికారులు ఈ దాడుల్లో పాల్గొన్నారు. మూడు క్యాంపుల్లో మొత్తం 953 క్వార్టర్లు ఉండగా, వీటిలో అధికారికంగా 367 మంది నివాసం ఉంటున్నారు. అలాగే 96 క్వార్టర్లు శిథిలావస్థకు చేరగా, మిగిలిన 490 క్వార్టర్లలో అనధికారికంగా నివాసాలు ఉంటున్నారు. అనధికారికంగా నివాసాలు ఉంటున్న వారందరూ ఖాళీ చేయాలని ఇప్పటికే పలుమార్లు నోటీసులు కూడా ఇచ్చామని, చివరి అవకాశంగా ఈ నెల 7వ తేది వరకు గడువు ఇచ్చినట్లు సంబంధిత శాఖల అధికారులు చెబుతున్నారు. అయితే అనధికారికంగా నివాసాల్లో ఉన్న వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆయా నివాసాలకు విద్యుత్, నీటి సరఫరాను నిలిపివేసినట్లు చెప్పారు. మూడు క్యాంపులకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి 127 గృహాలకు విద్యుత్, నీటి సరఫరాను నిలిపి వేయించినట్లు ఆర్అండ్బీ కర్నూలు ఈఈ సీవీ సునీల్రెడ్డి తెలిపారు. ఈ దాడులను ఆర్అండ్బీ ఎస్ఈ మహేశ్వరరెడ్డి, కర్నూలు ఆర్డీఓ సందీప్కుమార్తో పాటు ఆయా శాఖలకు చెందిన అధికారులు పర్యవేక్షించారు. ఏబీసీ క్యాంపుల్లో 127 గృహాలకు విద్యుత్, నీటి సరఫరా కట్ -
టీడీపీ నేత చెబితే వినాల్సిందే
బేతంచెర్ల: పట్టణంలోని సంజీవనగర్ కాలనీలో టీడీపీ సానుభూతి పరుడు ఎరుకలి సుంకన్న అలియాస్ (సింహాద్రి) ఆదివారం రాత్రి వీరంగం సృష్టించాడు. కాలనీకి చెందిన నల్లబోతుల వెంకటేశ్వర్లు మేకలు మేపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. అదే కాలనీకి చెందిన ఎరుకలి సుంకన్న ఏడాది క్రితం రూ. 4 వేలు డబ్బులు ఇచ్చి నల్ల బోతుల వెంకటేశ్వర్లు వద్ద రెండు మేక పిల్లలను కొనుగోలు చేసి తననే పెంచాలని అక్కడే వదిలేశాడు. కొన్నాళ్లకు అనారోగ్యంతో ఆ రెండు మేక పిల్లలు చనిపోయాయి. ఈ విషయంలో సుంకన్న తరచూ గొడవ పెట్టుకోవడంతో మేకలకు పిల్లలు పుడితే ఇస్తానని వెంకటేశ్వర్లు చెబుతుండేవాడు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో సుంకన్న మరో ఇద్దరిని వెంట బెట్టుకొని మేకల దొడ్డి దగ్గర నిద్రిస్తున్న వెంకటేశ్వర్లు, అతని భార్య మద్దమ్మతో కత్తితో బెదిరించి ఓ మేక పోతును వెంట పట్టుకెళ్లాడు. న్యాయం కోసం బాధితులు సోమవారం ఉదయం పోలీసులను ఆశ్రయించారు. అయితే ఎరుకలి సుంకన్నకు టీడీపీ మండల నాయకుడి మద్దతు ఉండటంతో అతనిపై కేసు నమోదు చేయకుండా పోలీసులు జాప్యం చేస్తున్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నా పోలీసులు సైతం అడ్డుకోలేక పోతుండటంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
మహానందిలో శాస్త్రోక్తంగా సంప్రోక్షణ పూజలు
మహానంది: రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనంతరం మహానందిలో సోమవారం ఉదయం సంప్రోక్షణ పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ వేద పండితులు బ్రహ్మశ్రీ చందూరి రవిశంకర అవధాని, ఉప ప్రధాన అర్చకులు మూలస్థానం శివశంకర శర్మ, అర్చకులు ప్రత్యేక పూజలు జరిపారు. తెల్లవారు జామున 4 గంటలకు ఆలయ తలుపులు తెరిచి గణపతి పూజ, పుణ్యాహవాచనం, సంప్రోక్షణ ఆలయ శుద్ధి పూజలు చేశారు. అనంతరం ఉదయం 6.30 గంటల నుంచి భక్తులకు యథావిధిగా శ్రీ కామేశ్వరీ దేవి సహిత మహానందీశ్వరస్వామి దర్శనం కల్పించారు. కార్యక్రమంలో ఆలయ సూపరిటెండెంట్ అంబటి శశిధర్రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ నాగమల్లయ్య తదితరులు పాల్గొన్నారు. సీ్త్ర, శిశు సంక్షేమంలో కాంట్రాక్టు పద్ధతిన పోస్టుల భర్తీ కర్నూలు(అర్బన్): మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని శిశు గృహ, బాలసదన్ల లో ఖాళీగా ఉన్న పోస్టులను కాంట్రాక్టు, పార్ట్టైం పద్ధతిన భర్తీ చేయనున్నట్లు ఐసీడీసీ పీడీ పి.విజయ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ● జిల్లా కేంద్రంలోని శిశు గృహలో సోషల్ వర్కర్ కమ్ ఎర్లీచైల్డ్ హుడ్ ఎడ్యుకేటర్, రెండు ఆయా పోస్టులు (ఈడబ్ల్యూఎస్ –1, ఓసీ మహిళ) ఖాళీగా ఉన్నాయన్నారు. ● పత్తికొండ బాల సదనంలో అవుట్ సోర్సింగ్ పద్ధతిన కుక్ –1 (ఎస్సీ మహిళ), హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ (ఎస్సీ మహిళ), పార్ట్టైం పద్ధతిన ఎడ్యుకేటర్ – 1 ( ఓసీ మహిళ ), ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్ (ఎస్సీ మహిళ), ఇన్స్స్ట్రక్చర్ కమ్ యోగా టీచర్ – 1 (ఓసీ మహిళ ) పోస్టులు ఉన్నాయన్నారు. ● పెద్దపాడు బాల సదనంలో ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ –1 (ఎస్సీ మహిళ ) పోస్టును పార్ట్టైం పద్ధతిన భర్తీ చేస్తామన్నారు. ● ఆయా పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులైన అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుందన్నారు. అభ్యర్థులు ఈ నెల 9 నుంచి 17వ తేదిలోగా ( కార్యాలయ పనిదినాల్లో మాత్రమే) ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు కలెక్టరేట్లోని సీ్త్ర శిశు సంక్షేమ శాఖ కార్యాలయం రూమ్ నెంబర్.122లో దరఖాస్తులను అందజేయాలన్నారు. విద్యార్హతలు, ఇతర వివరాల కోసం వెబ్సైట్ : htt p://k ur noo .a p.g-o-v.i nÌZ, కార్యాలయ నోటీసు బోర్డులో పరిశీలించాలని ఆమె పేర్కొన్నారు. -
మనస్పర్థ్ధలతోనే స్వర్ణకారుడి హత్య
కర్నూలు: బంగారు నగల తయారీదారుడు షేక్ ఇజహర్ అహ్మద్ (45) హత్య కేసు మిస్టరీ వీడింది. రెండు కుటుంబాల మధ్య గొడవలు, మనస్పర్థలే హత్యకు కారణమని పోలీసులు దర్యాప్తులో తేలింది. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు ఒకటో పట్టణ సీఐ పార్థసారధి, పీసీఆర్ సీఐ శివశంకర్, ఎస్ఐ తిమ్మారెడ్డితో కలసి సోమవా రం జిల్లా పోలీసు కార్యాలయంలో కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ వివరాలు వెల్లడించారు. కేసు ఛేదన ఇలా.. కర్నూలు కొత్తపేటలో షేక్ ఇజహర్ అహ్మద్ నివాసముంటున్నాడు. కొండారెడ్డిబురుజు వద్ద ఉన్న స్వర్ణలోక్ కాంప్లెక్స్లోని 29వ నంబర్ దుకాణంలో నగలు తయారు చేసేవాడు. రాధాకృష్ణ థియేటర్ సమీపంలోని మడ్గియాన్ కీ మసీదుకు తండ్రి షేక్ గౌస్ నిసార్ అహ్మద్తో కలసి ఈనెల 1వ తేదీన నమాజు ముగించుకుని బయటకు వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి పరారయ్యా రు. ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి వైద్యచికిత్సలు చేయించగా అదే రోజు రాత్రి 8 గంటలకు కోలుకోలే క మృతిచెందాడు. తండ్రి షేక్ గౌస్ నిసార్ అహ్మద్ ఫిర్యాదు మేరకు కర్నూలు ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా నిందితులు నగర శివారులోని జొహరాపురం పక్కి మసీదు వద్ద ఉన్నట్లు సమాచారం అందింది. కాపు కాసి కర్నూలు గనీగల్లీకి చెందిన షేక్ ఇమ్రాన్, మొగల్పుర వీధికి చెందిన ఎస్ఎండీ ఇర్ఫాజ్, ఖడక్పుర వీధికి చెందిన షేక్ జహీన్ అహ్మద్ అలియాస్ జహంగీర్లను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. రెండు కుటుంబాల మధ్య గొడవలు, మనస్పర్థలే హత్యకు కారణమని పోలీసులు దర్యాప్తులో తేల్చారు. హత్య కేసులో మొత్తం ఐదుగురు నిందితులు కాగా, ఇమ్రాన్, యూసుఫ్లు పరారీలో ఉన్నట్లు డీఎస్పీ వెల్లడించారు. నేరానికి ఉపయోగించిన కత్తులు, స్కూటీని సీజ్ చేసి నిందితులను కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్కు ఆదేశించినట్లు తెలిపారు. కేసును త్వరితగతిన ఛేదించి నిందితులను రిమాండ్కు పంపినందుకు దర్యాప్తు అధికారులను డీఎస్పీ అభినందించారు. వివరాలు వెల్లడించిన డీఎస్పీ -
ముస్లింలకు బాబు మోసం
కర్నూలు(సెంట్రల్):ముస్లింలకు న్యాయం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి సీఎం చంద్రబాబు మోసం చేస్తున్నారని వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు అహ్మద్ అలీఖాన్, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు టీఎండీ ఫిరోజ్ ఆరోపించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇమామ్లు, మౌజమ్లకు పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఇమామ్లకు రూ.10 వేలు, మౌజమ్లకు రూ.5 వేలు గౌరవ వేతనం ఇచ్చేవారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చా క పట్టించుకోవడం లేదన్నారు. 11 నెలల నుంచి గౌరవ వేతనాలు అందక ఇమామ్లు, మౌజమ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. -
కూటమి నేతల బరితెగింపు
డోన్: ‘మా ఊర్లో మీరు బతకడానికి వీలులేదు.. మీరు వ్యాపారాలు ప్రారంభిస్తే మా వ్యాపారాలు దెబ్బతింటాయి.. అనే జాడ్యం డోన్కు వ్యాపించింది. ఇందులో భాగంగా అధికార పార్టీకి చెందిన వస్త్ర దుకాణదారులు స్థానిక ప్రజాప్రతినిధి సహాయంతో కేరళ వ్యాపారికి ట్రేడింగ్ లైసెన్స్ ఇవ్వకుండా అడ్డుకున్న ఘటన వెలుగు చూసింది. గార్మెంట్స్ వ్యాపారులు చాలా ఏళ్ల నుంచి ఇక్కడ సిండికేట్గా ఏర్పడి ఇతరులు ఎవరూ ఈ రంగంలోకి రాకుండా అడ్డుకుంటున్నారు. ఫుట్పాత్పై రెడిమేడ్ దుస్తులను విక్రయించడాన్ని కూడా అడ్డుకొని దాడులు చేయించిన ఘటనలు ఉన్నాయి. ఈ క్రమంలో కేరళ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి స్థానిక బుగ్గన శేషారెడ్డి మార్గ్లో ఓ దుకాణం అద్దెకు తీసుకొని వస్త్ర దుకాణం ఏర్పాటు చేయాలనుకున్నాడు. సుమారు 20 లక్షల దుస్తులతో పాటు, రూ.5 లక్షలు వెచ్చించి దుకాణాన్ని ఫర్నిచర్తో సరికొత్తగా తీర్చిదిద్డాడు. అయితే వీరి రాకతో గార్మెంట్స్ వ్యాపారం దెబ్బతినే ప్రమాదం ఉందని ముందే పసిగట్టిన అధికార పార్టీకి చెందిన వ్యాపారులు ఇటీవల ఆ షాపుపై దాడిచేసి యజమానిని బెదిరించారు. అంతేకాకుండా పోలీసు, మున్సిపల్ అధికారులపై ఒత్తిడి తెచ్చి షాపు తెరవకుండా అడ్డుకున్నారు. స్థానిక ప్రజాప్రతినిధి చెప్పారంటూ మున్సిపల్ అధికారులు ఆ షాపునకు ట్రేడింగ్ లైసెన్స్ ఇవ్వడానికి నిరాకరించారు. ట్రేడింగ్ లైసెన్స్ ఉంటే షాపు తెరుచుకో.. లేదంటే లేదని పోలీసులు కూడా అధికార పార్టీ నేతలకు వంత పాడారు. దీంతో కేరళ వ్యాపారి దిక్కుతోచని స్థితిలో షాపును మరో ఊరికి మార్చేందుకు నిర్ణయించుకున్నారు. తెచ్చిన సరుకును తరలించేందుకు మూట గట్టారు. స్థానిక ఓ ప్రజా ప్రతినిధి చెబితేనే ట్రేడింగ్ లైసెన్స్ ఇవ్వలేదని మున్సిపల్ కమిషనర్ బాహాటంగా చెబుతుండటం గమనార్హం. కేరళ వ్యాపారి వస్త్ర దుకాణం ఏర్పాటు ఎమ్మెల్యేను ఆశ్రయించి అడ్డుకున్న స్థానిక వ్యాపారులు ట్రేడింగ్ లైసెన్స్ ఇవ్వకుండా అధికారులపై ఎమ్మెల్యే ఒత్తిడి దుకాణం ప్రారంభించకుండానే మూతేసిన వైనం -
ప్రజల అర్జీలపై ప్రత్యేక దృష్టి
కర్నూలు(సెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టిసారించాలని అధికారులను జేసీ డాక్టర్ బి.నవ్య ఆదేశించారు. కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో సోమవా రం ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. లాగిన్లో పరిష్కారం అయిన వాటిని ఎప్పటికప్పుడు ఆడిట్ చేయాలన్నారు. సీఎంఓ గ్రీవెన్స్లకు సంబంధించి ఆదోని సబ్ కలెక్టర్ దగ్గర 11, కర్నూలు ఆర్డీ ఓ దగ్గర 8, పత్తికొండ ఆర్డీఓ దగ్గర 4, కలెక్టరేట్ ఏఓ దగ్గర 3, సర్వే ఏడీ, విద్యాశాఖ, డీఆర్డీఏ పీడీ, ఏపీఐఐసీ జెడ్ఎంల దగ్గర ఒక్కో అర్జీ పెండింగ్లో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో డీఆర్వోసి.వెంకటనారాయణమ్మ, హౌసింగ్ పీడీ చిరంజీవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనురాధ పాల్గొన్నారు. అర్జీల్లో కొన్ని.. ● కర్నూలు మండలం పంచలింగాల సమీపాన ఉన్న స్కంద వెంచర్లో పార్కు కోసం కేటాయించిన 2 ఎకరాల స్థలాన్ని ఆక్రమణకు గురి కాకుండా కాపాడాలని అవాజ్ నగర కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు పి.ఇక్బాల్ హుస్సేన్, ఎస్ఎండీ షరీఫ్ జేసీ డాక్టర్ బి.నవ్యకు వినతిపత్రం ఇచ్చారు. ● తమకు ప్రత్యేకంగా రేషన్ కార్డు ఇవ్వాలని హిజ్రాలు అర్జీలు ఇచ్చారు. ● ప్రభుత్వ పాఠశాలల్లో ఆయాలుగా పనిచేస్తున్న వారికి మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న గౌరవ వేతనాలను వెంటనే చెల్లించాలని అర్జీ ఇచ్చారు. -
నేడు అన్నదాత పోరు
● జిల్లాలోని ఆర్డీఓ కార్యాలయాల ఎదుట నిరసన కర్నూలు (టౌన్): ‘అన్నదాత పోరు’ పేరుతో జిల్లాలోని అన్ని ఆర్డీఓ కార్యాలయాల ఎదుట మంగళవారం నిరసన నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి రైతులకు న్యాయం చేసేందుకు ఈ నిరసన చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, యూరియా కొరత తీర్చాలని, ఉల్లి రైతుల కష్టాలు తీర్చాలని, అన్నదాతల సమస్యలు పరిష్కారించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కర్నూలులోని చిల్డ్రన్స్ పార్కు సీఎస్ఐ చర్చి నుంచి కర్నూలు ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి వినతిపత్రం అందజేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గాల సమన్వయకర్తలు, రాష్ట్ర కమిటీ సభ్యులు, పార్టీ అనుబఽంధ విభాగాల అధ్యక్షులు, కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. -
శిథిల‘బడి’
కోడుమూరు మండలంలోని అమడగుంట్ల హైస్కూల్లో తరగతి గదులు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ పాఠశాలలో 325 మంది విద్యార్థినీ, విద్యార్థులు ఉండగా వీరికి 16 మంది ఉపాధ్యాయులు విద్యను బోధిస్తున్నారు. పాఠశాలలోని ఐదు గదుల్లోనే తరగతులు నిర్వహించడం కష్టంగా మారింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురిసన వర్షాలకు భవనం పై కప్పు నుంచి వర్షపు నీరు కారింది. గత నెల 17న హెచ్ఎం గదితో పాటు మరో రెండు తరగతి గదుల్లో భారీగా పెచ్చులూడిపడ్డాయి. ఆరోజు సెలవు వడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. తరగతి గదుల్లో భారీగా పెచ్చులూడిపడుతుండడంతో ప్రమాదాన్ని గ్రహించిన ఉపాధ్యాయులు ముందస్తుగా గదులను ఖాళీ చేయించి బాగున్న తరగతి గదుల్లోకి విద్యార్థులను తరలించి అక్కడ విద్యాబోధన చేస్తున్నారు. హైస్కూల్లోని తరగతులు పూర్తిగా శిథిలావస్థకు చేరిన విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రధానోపాధ్యాయుడు అనంతయ్య తెలిపారు. – కోడుమూరు రూరల్ -
తీరని యూరియా సమస్య
యూరియా.. యూరియా.. యూరియా .. ఏ రైతు నోట విన్నా ఇదే మాటే. కాని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం యూరియా కొరతే లేదని చెబుతున్నారు. వైఎస్సార్సీపీ నేతలే ఆందోళన చేస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు. కర్నూలు(అగ్రికల్చర్): ప్రకృతి వైపరీత్యాలతో ఈ ఏడాది సాగు విస్తీర్ణం తగ్గినా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు యూరియా అందించడంలో విఫలమైంది. గతేడాది ఖరీఫ్ సీజన్లో ఇదే సమయానికి 3.62 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. ప్రస్తుతం సాగు విస్తీర్ణం 3.46 లక్షల హెక్టార్లకే పరిమితం అయ్యింది. యూరియా కొరత ఏర్పడి రైతులు ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఎక్కడా యూరియా కొరత లేదని అబద్ధాలు చెబుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.దారి మళ్లించిఏప్రిల్ నుంచి జూలై వరకు యూరియాకు అంతగా డిమాండ్ లేదు. జూలై నెల వరకు 16 వేల టన్నులు వచ్చింది. కాని రైతులకు అందనేలేదు. పీఏసీఎస్లు, డీసీఎంఎస్లకు మార్క్ఫెడ్ ద్వారా ఇచ్చిన యూరియా టీడీపీ నేతలు దారి మళ్లించారు. ఒకరికి ఇచ్చి ఈపాస్ మిషన్లలో బయోమెట్రిక్ మాత్రం మరొకరితో వేయించారు. ప్రయివేటు డీలర్లు కూడా బ్లాక్లో విక్రయించి రైతులు కాని వారితో బయోమెట్రిక్ వేయించారు. బయోమెట్రిక్ వేసిన వారిలో 80 శాతం మంది యూరియానే తీసుకోలేదు. టీడీపీ నేతలు యూరియాను దారి మళ్లించడంతో కొరత ఏర్పడింది.డిమాండ్ ఎక్కువ... సరఫరా తక్కువఖరీఫ్ సీజన్ సెప్టెంబరు వరకు ఉంటుంది. ఖరీఫ్ సీజన్కు యూరియా 51 వేల టన్నులు అవసరం.. ఇందులో ఈ పాటికి కనీసం 40 వేలకుపైగా టన్నులు రావాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు జిల్లాకు వచ్చిన యూరియా కేవలం 25,505 టన్నులు మాత్రమే! ఖరీఫ్ సీజన్ మరో 24 రోజుల్లో ముగుయనున్నప్పటికీ 50 శాతం కూడ రాకపోవడం,. ఇందులో కూడా చాల వరకు టీడీపీ నేతలు దారిమళ్లించడంతో రైతులకు అందని పరిస్థితి ఏర్పడింది. కౌతాళం, పెద్దకడుబూరు, ఆదోని, హొళగొంద, హాలహర్వి, మంత్రాలయం, ఎమ్మిగనూరు, కొసిగి, పత్తికొండ, మద్దికెర, తుగ్గలి మండలాల్లో నెల రోజులుగా యూరియా కోసం నిత్యం ఆందోళన చేస్తున్నారు. సినిమా టికెట్ల మాదిరిగా యూరియా టోకన్ల కోసం రైతులు పోరాటం చేస్తోంది.ఇదీ అవసరం..కర్నూలు జిల్లాలో 13 వేల హెక్టార్లలో వరి సాగుకానుంది. వరి నాట్లు వేసే సమయంలో యూరియా వేస్తే పచ్చగా ఏపుగా పెరుగుతుంది. పిలకలు ఎక్కువగా వస్తాయి. వరి సాగు చేస్తున్న ఆదోని, కౌతాళం, మంత్రాలయం, హాలహర్వి, హొళగుద, కర్నూలు, సి.బెళగల్, గూడూరు మండలాల్లో వరి నాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ ప్రాంతాల్లోని సామాన్య రైతులకు బస్తా యూరియా లభించడం కష్టమైంది. బస్తా యూరియా ధర రూ.267 మాత్రమే.. అయితే కర్నూలు మండలంలోని వివిధ గ్రామాల రైతులు తెలంగాణ నుంచి బస్తా రూ.600 ధరతో తెచ్చుకుంటున్నారు.నెల జిల్లాకు వచ్చిందిఏప్రిల్ 1,562 2,549మే 3,871 821జూన్ 6,095 3,216జూలై 13,419 10,070ఆగష్టు 14,576 6,644సెప్టెంబరు 11,477 2,203మొత్తం 51,000 25,505ఇవీ అక్రమాలువిజిలెన్స్, పోలీసులు, రెవెన్యూ అధికారులు తనిఖీలు జరిపి 130 టన్నుల యూరియాను సీజ్ చేశారు. మరో 387 టన్నులపై స్టాప్ సేల్ ఇచ్చారు.దారి మళ్లిన ఎరువుకొంత మంది ప్రయివేటు డీలర్లు ఇతర జిల్లాల నుంచి రోడ్డు మార్గాన బ్లాక్లో యూరియా తెప్పించి అమ్మకాలు సాగిస్తున్నారు. ఇటీవల ఈ విషయం విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో వెలుగు చూసింది. ఇందుకు సంబందించి కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం మండలాల్లో ఒక్కొక్క క్రిమినల్ నమోదు చేశారు. ఒక డీలరు లైసెన్స్ సస్పెండ్ చేశారు. నలుగురుకి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. -
శోభాయమానంగా సీమోల్లంఘన
● ముగిసిన పీఠాధిపతి చాతుర్మాస దీక్ష ● కనులపండువగా స్వామిజీ ఊరేగింపు ప్రత్యేక వాహనంపై ఊరేగుతున్న పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల చాతుర్మాస దీక్ష ఆదివారం ముగిసింది. చాతుర్మాస దీక్ష విరమణలో భాగంగా సోమవారం సీమోల్లంఘన వేడుక చేపట్టారు. ఉదయం స్వామిజీ పవిత్ర తుంగభద్ర నదిలో దండకస్నానం ఆచరించి శాంతి, మృత్యుంజయ హోమాల్లో పూర్ణాహుతి గావించారు. సాయంత్రం సీమోల్లంఘన కార్యక్రమంలో భాగంగా పీఠాధిపతి వేలాది మంది భక్తజనుల మధ్య గ్రామ ప్రవేశం కానిచ్చారు. ముందుగా కొండాపురం ఆంజనేయస్వామి ఆలయం చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంపై కొలువుదీరగా భక్తజనులు జయజయధ్వానాలు పలికారు. మేళతాళాలు, కోలాటాలు, వేద మంత్రోచ్ఛారణలు, బాణా సంచా పేలుళ్లతో అడుగడుగునా భక్తజన సందోహం నీరాజనం పలికింది. రాఘవేంద్ర సర్కిల్ మీదుగా మధ్వకారిడార్ నుంచి స్వామిజీ ఊరేగింపు శ్రీమఠం చేరుకుంది. ఎంతో శోభాయమానంగా సాగిన ఊరేగింపు భక్తజన వాహినిని ఆకట్టుకుంది. వేడుకలో పండిత కేసరి గిరియాచార్, ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడు వై.సీతారామిరెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ భీమారెడ్డి, సర్పంచు తెల్లబండ్ల భీమయ్య, ఉప సర్పంచ్ హోటల్ పరమేష్, జోనల్ మేనేజర్ శ్రీపతిఆచార్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ శాఖల సమన్వయంతో పిల్లల సంరక్షణ
కర్నూలు: ప్రభుత్వ శాఖల సమన్వయంతో పిల్లల సంరక్షణ చేపట్టాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి సూచించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు బాలుర సంరక్షణ, చట్టాల అమలుపై జిల్లా స్థాయి అధికారులతో సోమవారం న్యాయ సేవా సదన్ నందు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి, న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ బాలల రక్షణ కేసులు నిర్వహించే పోలీసు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అవసరమన్నారు. పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, హెల్త్, రెవెన్యూ శాఖలు సమన్వయం చేసుకుని పిల్లలకు సంబంధించిన కేసులను త్వరగా పరిష్కారమయ్యేలా కృషి చేయాలని కోరారు. ఫోక్సో కోర్టు జడ్జి రాజేంద్రబాబు మాట్లాడుతూ పిల్లలపై లైంగిక వేధింపుల కేసులను త్వరగా పరిష్కరించాల్సిన అవసరముందని, వారు ద్వితీయ బాధితులుగా మారకుండా చూడాలన్నారు. లీలా వెంకటశేషాద్రి మాట్లాడుతూ పిల్లల ప్రయోజనాల కోసం అన్ని పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక చైల్డ్ హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయాలని సూచించారు. జ్యువైనల్ జస్టిస్ బోర్డు జడ్జి అనిల్ కుమార్ మాట్లాడుతూ పిల్లల వయస్సు నిర్ధారణలో జాప్యం లేకుండా చేస్తే కేసులను త్వరగా పరిష్కరించవచ్చన్నారు. జిల్లా రెవెన్యూ అధికారిణి వెంకట నారాయణమ్మ, సోషల్ వెల్ఫేర్ డీడీ రాధిక, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ జుబేదా బేగం, ప్రభుత్వ అబ్జర్వేషన్ హోం సూపరింటెండెంట్ హుసేన్ బాషా, జిల్లా ఇమ్యునై జేషన్ ఆఫీసర్ నాగప్రసాద్, నంద్యాల అడిషనల్ డీఎంహెచ్ఓ శారదా బాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ శారద, స్వప్న తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్ విద్యార్థి బలవన్మరణం
డోన్ టౌన్: బీసీ బాలుర కళాశాల వసతి గృహంలో ఉంటున్న ఇంటర్ విద్యార్థి శ్యాంసుందర్ (16) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పట్టణ సీఐ ఇంతియాజ్బాషా తెలిపిన వివరాల మేరకు.. అనంతపురం జిల్లా యాడికికి చెందిన చేనేత కార్మికులు రమేష్, సావిత్రి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు శ్యాంసుందర్ డోన్ పట్టణంలోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల స్వగ్రామానికి వెళ్లిన విద్యార్థి ఆదివారం తిరిగి వసతి గృహానికి చేరుకున్నాడు. సోమవారం తెల్లవారుజామున బాత్ రూంలో శ్యాంసుందర్ ఉరేసుకుని కనిపించాడు. ఉదయం కాలకృత్యాల కోసం బాత్రూంకు వెళ్లిన విద్యార్థులు గమనించి హాస్టల్ వార్డెన్ మేరీ సూర్యకుమారి, విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న సీఐ ఇంతియాజ్బాషా, ఎస్ఐలు శరత్కుమార్ రెడ్డి, నరేంద్రకుమార్, ఆర్డీఓ నరసింహులు, సాంఘిక సంక్షేమశాఖ అధికారులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. అనంతరం తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కాగా విద్యార్థి మృతిపై తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, బీజేపీ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమగ్ర దర్యాప్తు చేపట్టాలని హాస్టల్ ఎదుట ఆందోళన చేశారు. అన్ని కోణాల్లో విచారించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడతామని సీఐ తెలిపారు. తల్లి మందలించిందని కుమారుడి ఆత్మహత్య కోడుమూరు రూరల్: చెడు అలవాట్లకు బానిస కావొద్దు అని తల్లి మందలించడంతో కుమారుడు భాస్కర్ (22) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన కోడుమూరులోని బీసీ కాలనీలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. భాస్కర్ చిన్న చిన్న వయసులో ఉన్నప్పుడే తండ్రి రాముడు మృతి చెందాడు. దీంతో తల్లి కమలమ్మ కూలి పనులు చేసుకుంటూ ఒక్కగానొక్క కుమారుడిని పెంచారు. భాస్కర్ కూడా గౌండా పనిచేస్తూ తల్లికి చేదోడువాదోడుగా ఉండేవాడు. ఇటీవల భాస్కర్ చెడు అలవాట్లు బానిసై మద్యం తాగుతుండడంతో తల్లి కమలమ్మ మందలించింది. దీంతో మనస్తాపం చెందిన కుమారుడు భాస్కర్ సోమవారం ఉదయం తమ నివాసం పక్కనే ఉన్న మరో గుడిసెలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందాడని తెలిసి తల్లి కమలమ్మ శోకసంద్రంలో మునిగిపోయారు. కోడుమూరు పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సైబర్ నేరగాళ్లు నగదు కాజేశారు!
కర్నూలు: పీఎం కిసాన్ పేరుతో తన మొబైల్కు ఏపీకే ఫైల్ పంపి రెండు బ్యాంకు ఖాతాల నుంచి రూ.65 వేలు సైబర్ నేరగాళ్లు కాజేశారని, విచారణ జరిపి పోయిన డబ్బును రికవరీ చేసి ఇవ్వాలని కల్లూరుకు చెందిన సూర్యనారాయణ ఎస్పీ విక్రాంత్ పాటిల్కు ఫిర్యాదు చేశారు. కర్నూలు రెండో పట్టణ పోలీస్స్టేషన్ పక్కనున్న క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఎస్పీ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించి వారితో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పీజీఆర్ఎస్కు మొత్తం 98 ఫిర్యాదులు వచ్చాయి. వాటిపై చట్ట పరిధిలో విచారణ జరిపి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. పీజీఆర్ఎస్కు వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని... ● ఆర్మీలో పనిచేస్తున్న కుమారుడి దగ్గరికి వెళ్లిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఐదు నెలలుగా ఖాళీగా ఉన్న తన ఇంట్లో చేరి ఖాళీ చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి లక్ష్మీనగర్కు చెందిన జయరామిరెడ్డి ఫిర్యాదు చేశారు. ● తన పొలానికి రస్తా ఇవ్వకుండా కురువ నరసింహులు అనే వ్యక్తి ఇబ్బందులకు గురిచేస్తున్నాడని గోనెగండ్ల మండలం హెచ్.కై రవాడి గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ● కోడుమూరు రోడ్డులో ఉన్న 18 సెంట్ల స్థలాన్ని మురళీమోహన్, కాంట్రాక్టర్ జాన్ కలసి కబ్జా చేశారని, విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కర్నూలు షరాఫ్ బజార్కు చెందిన వెంకటనారాయణ ఫిర్యాదు చేశారు. ● అనంతపురం పట్టణానికి చెందిన జయచంద్ర బెంగళూరులో ప్రైవేటు ఉద్యోగం చేస్తూ తనకు కూ డా ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.లక్ష తీసుకుని మోసం చేశాడని ఒక వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితుడు పీజీఆర్ఎస్కు 98 ఫిర్యాదులు -
రైతులకు అండగా వైఎస్సార్సీపీ పోరాటం
● ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరూపాక్షి ఆలూరు: రెక్కల కష్టంతో పది మందికి అన్నం పెట్టే అన్నదాతలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రైతులకు అండగా ఉంటూ వైఎస్సార్సీపీ పోరాటం చేస్తోందని ఎమ్మెల్యే బుసినె విరూపాక్షి అన్నారు. పత్తికొండ ఆర్డీఓ కార్యాలయం ఎదుట మంగళవారం ‘అన్నదాత పోరు’ పేరుతో నిరసన చేపట్టనున్నామన్నారు. ఆలూరులో సోమవారం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. యూరియా దొరకక, పంటలకు గిట్టుబాటు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి రైతుల సమస్యలు తొలగించేందుకే నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు. రైతులు, వైఎస్సార్సీపీ రాష్ట్ర, జిల్లా, వివిధ మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున తరలిరావాలన్నారు. పత్తికొండ ఆర్అండ్బి అథితి గృహం సమీపంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళ్లు అర్పించిన అనంతరం ‘అన్నదాత పోరు’ ర్యాలీ ప్రారంభమవుతుందన్నారు. -
108లో మహిళ ప్రసవం
పాణ్యం: కొండజుటూరు గ్రామానికి చెందిన అనిత గర్భిణి 108లో ఆసుపత్రికి తరలిస్తుండగా అందులోనే ఆడ శిశువుకు జన్మనించింది. సోమవారం మహిళకు తెల్లవారుజామున పురిటి నొప్పులు రావవడంతో 108కు సమాచారం అందించారు. పాణ్యం 10 8సిబ్బంది గ్రామానికి చేరుకోని నంద్యాల జీజీహెచ్కు గర్భిణిని తరలిస్తుండగా 108లోనే ఆడ బిడ్డను ప్రసవించినట్లు ఈఎన్టీ తిమ్మయ్య, పైలెట్ చెన్నయ్య తెలిపారు. శిశువు, తల్లి ఆరోగ్యంగా ఉన్నారన్నారు. అనతరం వైద్య పరీక్షల కోసం నంద్యాల జీజీహెచ్కు తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.హత్యాయత్నం కేసులో నిందితుడికి ఏడేళ్లు జైలు శిరివెళ్ల: కోటపాడుకు చెందిన రాగిపోగుల నారాయణకు హత్యాయత్నం కేసులో ఏడేళ్ల జైలు శిక్ష పడినట్లు ఎస్ఐ చిన్న పీరయ్య సోమవారం తెలిపారు. ఎస్ఐ వివరాల మేరకు.. 2019 జూలై 21వ తేదీన పాత కక్షలను మనస్సులో పెట్టుకొని జాంబుల నడిపి ఓబులేసు అతని స్నేహితులతో గ్రామంలోని లింగమయ్య అరుగు వద్ద కాలక్షేమం కోసం మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో నారాయణ పాత కక్షలను మనస్సులో పెట్టుకుని ఓబులేసు వీపుపై, చేతిపై కత్తితో పొడవడానికి ప్రయత్నించాడు. తప్పించుకునే ప్రయత్నంలో ఓబులేసు ఎడమ చేతికి గాయమైంది. అప్పట్లో బాధితుడి ఫిర్యాదు మేరకు హత్నాయత్నం కేసు నమోదు చేశారు. ఆళ్లగడ్డ కోర్టులో జరిగిన పలు దఫాల విచారణలో సాక్షుల విచారణ మేరకు నిందితుడికి ఏడేళ్లు జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ జడ్పి తీర్పు ఇచ్చారని ఎస్ఐ తెలిపారు.15 నుంచి గాలికుంటు టీకాలుజూపాడుబంగ్లా: ఈనెల 15 నుంచి పశువులకు గాలి కుంటు టీకాలు వేయనున్నట్లు పశుసంవర్ధకశాఖ అసి స్టెంటు డైరెక్టర్ రామాంజినేయనాయక్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పశువులకు, జీవాలకు గాలికుంటు వ్యాధి వ్యాపించ కు ండా ముందుజాగ్రత్తగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేస్తున్నట్లు తెలిపారు. పశుగ్రాసం పెంచుకోవటానికి గాను రాయితీపై పశుగ్రాసం విత్తనాలు రైతుసేవా కేంద్రాలు, పశువైద్యశాలలో అందజేస్తున్నట్లు వివరించారు. సీఎస్హెచ్–24రకం పశుగ్రాసం ఐదుకిలోల విత్తనాల ప్యాకెట్ పూర్తి ధర రూ.460 కాగా రాయితీ రూ. 345 కాగా రైతులు కేవలం రూ.115 చెల్లించి విత్తనాలు పొందవచ్చునన్నారు. ఆఫ్రికల్టాల్ జొన్నరకం ఐదు కిలోల విత్తనాల ధర రూ.340 కాగా రాయితీ రూ.255 పోను రైతులు కేవలం రూ.85 చెల్లించి పొందవచ్చునన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. -
కాపర్ వైర్ల దొంగలు అరెస్ట్
సంజామల: రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ రైల్వేలైన్కు సంబంధించిన విద్యుత్ రాగి (కాపర్) వైర్లు అపహరించిన దొంగలను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఎస్ఐ రమణయ్య సోమవారం తెలిపిన వివరాల మేరకు..రాంకో సిమెంట్ ఫ్యాక్టరీకు సంజామల నుంచి కొలిమిగుండ్ల మండలం వరకు నూతన రైల్వేట్రాక్ పనులు జరుగుతున్నాయి. రెడ్డిపల్లె గ్రామ సమీపంలో గత నెల 23వ తేదీన రైల్వేలైన్కు చెందిన దాదాపు రూ.5.50 లక్షల విలువైన రాగి విద్యుత్ వైర్లు దొంగలించారు. ఫ్యాక్టరీ ఎలక్ట్రికల్ మేనేజర్ కృష్టమూర్తి ఫిర్యాదు మేరకు సంజామల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన ఎస్ఐ రమణయ్య సోమవారం ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా.. రాగి విద్యుత్ వైర్లు దొంగ లించినట్లు ఒప్పుకున్నారు. నిందితుల దగ్గర నుంచి రూ.4.40 లక్షల విలువైన 210 కేజీల వైర్లు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ రమణయ్య తెలిపారు. సమావేశంలో హెడ్కానిస్టేబుల్ రాముడు, మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
'మద్దతు'లేని ఉల్లి రైతు
కర్నూలు (అగ్రికల్చర్): ఉల్లికి మద్దతు ధర దక్కకపోతే ఆ తేడాను తాము రైతుకు ఇస్తామన్న కూటమి ప్రభుత్వ హామీ రైతుల్లో నమ్మకం కలిగించటంలేదు. ఈ రకంగానే గతంలో మాటలు చెప్పిన చంద్రబాబు రూ.6.5 కోట్లు రైతులకు ఎగ్గొట్టారని వారు గుర్తుచేసుకుంటున్నారు. మరోవైపు మార్కెట్లో వ్యాపారులు ఉల్లిని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. పెట్టుబడి వ్యయం కూడా రావడంలేదని రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. సిండికేట్ అయిన వ్యాపారులు చెప్పిందే ధరగా చలామణి అవుతోంది. మద్దతు ధర రూ.1,200 ఉండగా.. వ్యాపారులు అతి తక్కువ ధరకు మాత్రమే కొంటున్నారు. సోమవారం కర్నూలు మార్కెట్కు 157 లాట్ల ఉల్లి వచ్చింది. ఇందులో వ్యాపారులు 20 లాట్లకు మాత్రమే ఈ–నామ్లో ధరలు వేశారు. గరిష్ట ధర రూ.1,089 నమోదైంది. ఒకటి, రెండు లాట్లకు మాత్రమే రూ.వెయ్యికిపైగా ధర వేశారు. కొన్నింటికి కేవలం రూ.500 నుంచి రూ.600 మధ్య ధర వేశారు. 130 లాట్లకు రీటెండరు నిర్వహించారు. రీటెండర్లో కనీస ధర రూ.100గా నిర్ణయించారు. అయినా.. వ్యాపారులు కొన్ని లాట్లు మాత్రమే కొనుగోలు చేశారు. రూ.1,200 ధర గిట్టుబాటు కాదుప్రభుత్వం ప్రకటించిన రూ.1,200 మద్దతు ధర గిట్టుబాటు కాదని రైతులు స్పష్టం చేస్తున్నారు. ఎకరాకు పెట్టుబడి వ్యయం రూ.లక్ష అవుతోంది. ఉల్లిపాయల్ని మార్కెట్కు తరలించే ఖర్చు దీనికి అదనం. అధిక వర్షాల వల్ల కుళ్లిపోవడంతో చాలవరకు ఉల్లిని పారబోశారు. ఎకరాకు మిగిలింది 30 క్వింటాళ్ల నుంచి 75 క్వింటాళ్ల వరకు మాత్రమే. వ్యాపారులు రూ.300 నుంచి రూ.600 ధరతో కొంటుండటంతో పెట్టుబడిలో 20–30 శాతం కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది. మద్దతు ధర రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు ఉంటేనే కనీసం పెట్టుబడి చేతికొస్తుందని రైతులు చెబుతున్నారు. నాటి మోసం ఎలా మర్చిపోగలం?2016, 2017 సంవత్సరాల్లో చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటి మాదిరిగానే ఉల్లి ధరలు పడిపోయాయి. అప్పట్లో క్వింటాకు కనీస మద్దతు ధర రూ.700గా నిర్ణయించారు. ఈ మద్దతు ధర కంటే తక్కువ ధరకు అమ్ముకున్న రైతులకు గరిష్టంగా రూ.300 బోనస్ చెల్లిస్తామని చెప్పిన అప్పటి చంద్రబాబు ప్రభుత్వం.. వేలాదిమంది రైతులకు ఈ బోనస్ను ఎగవేసింది. ఉల్లి రైతులకు ఎగ్గొట్టిన మొత్తం రూ.6.50 కోట్ల వరకు ఉంది. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఈ తేడాను బోనస్ రూపంలో ఇస్తామని చెబుతుంటే రైతులు నమ్మలేకపోతున్నారు. గతంలో ఎగవేసిన చంద్రబాబు ఇప్పుడు ఇవ్వడం అనుమానమేనని పేర్కొంటున్నారు. వ్యాపారులతో సంబంధం లేకుండా మార్క్ఫెడ్ ద్వారా నేరుగా ప్రభుత్వం కొనుగోలు చేస్తేనే న్యాయం జరుగుతుందని ఉల్లి రైతులు చెబుతున్నారు. 160 ప్యాకెట్ల ఉల్లి పారబోశాం నాలుగెకరాల్లో ఉల్లి సాగుచేశాం. ఎకరాకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు పెట్టుబడి ఖర్చయింది. అధిక వర్షాల వల్ల కుళ్లిపోవడంతో పొలంలోనే 160 ప్యాకెట్లు పారబోశాం. 136 క్వింటాళ్లు మార్కెట్కు తెచ్చి అమ్మకానికి పెట్టాం. ఉల్లిలో నాణ్యత బాగా ఉంది. అయితే వ్యాపారులు ఉల్లిగడ్డలను కొనుగోలు చేయనేలేదు. ఈ ప్రభుత్వం ఉల్లి రైతులను పూర్తిగా విస్మరించింది. రూ.1,200 ధర ఏమాత్రం గిట్టుబాటు కాదు. – కె.లక్ష్మన్న, కున్నూరు గ్రామం, గోనెగండ్ల మండలం కొనేవారి కోసం ఎదురుచూపులు రెండెకరాల్లో ఉల్లి సాగుచేశాం. ఎకరాకు కోయడానికి రూ.14,500, నాట్లు వేయడానికి రూ.25 వేలు, విత్తనాలకు రూ.10 వేలు.. రసాయన ఎరువులు, పురుగుమందులు, కూలీ, రవాణా చార్జీలు కలిపి ఎకరాకు రూ.లక్షకుపైనే పెట్టుబడి అయింది. మార్కెట్కు 255 ప్యాకెట్ల ఉల్లిగడ్డలు తెచ్చి అమ్మకానికి పెట్టగా వ్యాపారులు కొనలేదు. రూ.1,200 ధర గిట్టుబాటు కాదు. మద్దతు ధర కనీసం రూ.2 వేలు ప్రకటించాలి. – రామలింగడు, దైవందిన్నె గ్రామం, ఎమ్మిగనూరు మండలంఉల్లి రైతు కంట కన్నీరు దేవనకొండ: కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో 1,100 నుంచి 1200 ఎకరాల్లో ఉల్లి సాగయింది. మార్కెట్లో ఉల్లి రేటు కనీసం క్వింటా రూ.500–600 కూడా లేకపోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. కొద్ది మంది రైతులు ఉల్లి పంటను పొలాల్లోనే వదిలేస్తుండగా మరికొందరు వేరే పంట వేసేందుకు ఉల్లిని తీసి గట్లపై వేస్తున్నారు. మండలంలోని తెర్నెకల్ గ్రామానికి చెందిన రాముడు అనే రైతు ఉల్లి ధర అమాంతం పడిపోవడంతో దాన్ని గ్రేడింగ్ చేసి మార్కెట్కి తరలించాలంటే భారీ ఖర్చుతో కూడుకున్నదని, వేరే పంట వేసేందుకు ఉల్లి పీకి గట్లపై వేస్తున్నాడు. ఉల్లి పంట ఎకరాకు తనకు రూ.లక్ష దాకా పెట్టుబడి పెట్టినా ఒక్క రూపాయి కూడా రాలేదని, అప్పులు మిగిలాయని వాపోయాడు. -
యూరియా, ఉల్లిపై తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు
● కర్నూలు కలెక్టర్, ఎస్పీ హెచ్చరిక కర్నూలు (సెంట్రల్): యూరియా, ఉల్లిపై తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కర్నూలు జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా, ఎస్పీ విక్రాంత్పాటిల్ హెచ్చరించారు. కలెక్టరేట్లో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఉల్లికి ప్రభుత్వం నిర్దేశించిన కేజీ రూ.12 ప్రకారం కచ్చితంగా కొనుగోలు చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ముందుగా ట్రేడర్స్ ద్వారా వేలం జరుగుతుందని, వారు రూ.12 కంటే తక్కువగా కొనుగోలు చేస్తే తక్కువైన మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. ఒకవేళ ట్రేడర్ కేజీ ఉల్లిని రూ.7కు కొనుగోలు చేస్తే తక్కువైన రూ.5ను ప్రభుత్వం రైతు ఖాతాలో జమ చేస్తుందన్నారు. ఇందుకోసం రైతుల నుంచి ఆధార్ నంబర్, బ్యాంక్ పాస్బుక్, భూమికి సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకాలను తీసుకుంటున్నట్టు చెప్పారు. జిల్లాలో యూరియా కొరత లేదని, ఇప్పటికే 3,200 టన్నుల యూరియా అందుబాటులో ఉందని చెప్పారు. రెండు రోజుల్లో 2,600 టన్నులు రానున్నట్టు తెలిపారు. యూరియాను పక్కదారి పట్టించిన మూడు షాపుల లైసెన్స్లు రద్దు చేశామని, 13 మందిపై 6ఏ కేసులు, ఐదుగురిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. నాలుగు షాపులకు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్టు చెప్పారు. యూరియా బదులుగా నానో యూరియా వాడాలని రైతులకు కలెక్టర్ సూచించారు. ఎస్పీ విక్రాంత్పాటిల్ మాట్లాడుతూ.. అధిక ధరకు యూరియా అమ్మేవారిపైన, తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల నుంచి అక్రమంగా సరఫరా చేసే వారిపైన 5 క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. అన్ని సరిహద్దు చెక్పోస్టులను అప్రమత్తం చేసి పోలీసు, రెవెన్యూ, ఎకై ్సజ్, విజిలెన్స్, వ్యవసాయ అధికారులతో తనిఖీలు చేయిస్తున్నట్టు చెప్పారు. -
ఫిజియోథెరపీ...అంతా హ్యాపీ!
డాక్టర్ ఆపరేషన్ చేసినా...ఆ తర్వాత మళ్లీ సాధారణ జీవితం గడపాలంటే మాత్రం ఫిజియోథెరపీ కొంత కాలం చేయించుకోకతప్పదు. పలు రకాల రుగ్మతలు, నొప్పులు, ఇబ్బందుల నుంచి ఇది ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. కొన్ని జబ్బులకు ఫిజియోథెరపీ కేంద్రాలకు వెళ్లి అక్కడి పరికరాలతో చికిత్స చేయించుకోవాల్సి రాగా, మరికొన్ని అక్కడి వైద్యుల సలహాతో ఇంటి వద్దే వ్యాయామాలు చేసుకునే అవకాశం ఉంటుంది. వారు చెప్పిన ప్రకారం ప్రతిరోజూ ఆచరిస్తే సమస్య పరిష్కారమవుతుంది. నేడు వరల్డ్ ఫిజియోథెరపీ డే సందర్భంగా ప్రత్యేక కథనం.కర్నూలు(హాస్పిటల్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ప్రస్తుతం 1200 మందికి పైగా ఫిజియోథెరపిస్ట్లు ఉన్నారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోనూ ఉచితంగా ఫిజియోథెరపీ చికిత్స అందిస్తున్నారు. ఇక్కడికి అవసరమైన పరికరాలను గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సమకూర్చడంతో దాదాపుగా అన్ని సమస్యలకు ఇక్కడ చికిత్స లభిస్తోంది. ఇక్కడికి ఆర్థోపెడిక్, న్యూరాలజి, న్యూరోసర్జరీ, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, ఈఎన్టీ, కార్డియాలజి తదితర విభాగాల నుంచి రోగులు ఫిజియోథెరపీ చికిత్స కోసం వస్తుంటారు. ఈ కేంద్రానికి రాలేని, బెడ్పైనే ఉన్న రోగులకు మాత్రమే ఫిజియోథెరపిస్టులే వెళ్లి చికిత్స అందిస్తుంటారు. ఇందులో టెన్స్, ఇంటర్ ఫెరిన్షియల్ థెరపి, అల్ట్రాసోనిక్ థెరపి, ఎలక్ట్రికల్ స్టిమిలేటర్, షార్ట్రేవ్ డయాటర్మి, సీపీఎం డివైస్, లేజర్, ట్రెడ్మిల్, బైసైకిల్ అర్బోమీటర్, క్వార్ర్డిసెట్స్ టేబుల్, పారలల్ బార్, షోల్డర్ వీల్, స్విస్ బాల్స్తో పాటు పలు వ్యాయామ పరికరాలున్నాయి. కర్నూలుతో పాటు నంద్యాల జిల్లా ఆసుపత్రిలో, ఆదోని ఏరియా ఆసుపత్రిలో, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఫిజియోథెరపిస్టులు రోగులకు ఉచిత వైద్యసేవలు అందిస్తున్నారు. ఫిజియోథెరపీతో అందే వైద్యం ఫిజియోథెరపీ చికిత్సలో భాగంగా 8 అంకైపె నడవడం, రెండు సరళ రేఖల మధ్య నడిపించి చికిత్స చేస్తారు. దీనివల్ల కీళ్లు బిగుతుగా మారకుండా కదలిక య థావిధిగా ఉండేలా కండరాలు బిగుతుగా మారకుండా, క్షీణించకుండా, రక్తప్రసరణ యథావిధిగా జరిగేలా ఉంటాయి. మంచంపై ఒకే స్థితిలో పడు కోకుండా అత్యధిక ఒత్తిడి కలిగిన ప్రాంతాలపై పుండ్లు/అల్సర్లు పెరగకుండా ఉండేందుకు పొజిషన్ చేంజింగ్, బెడ్ రోలింగ్ ఎక్సర్సైజ్లు చేయిస్తారు. ఇవే గాక వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్లు, న్యూరో డెవలప్మెంట్ ట్రైనింగ్, కో ఆర్డినేషన్ ఎక్సర్సైజ్లు, చేతి కి సంబంధించిన ఎక్సర్సైజ్లను ఫిజియోథెరపిస్ట్లు అందిస్తున్నారు. శరీర కదలికలు సాధారణ స్థితికిఏదైనా కారణం, ప్రమాదం వల్ల గాయం, వైకల్యం ఏర్పడితే శరీర భాగాల కదలిక ఇబ్బందిగా మారుతుంది. ఇలాంటి వారి శరీర భాగాల కదలికను సాధారణస్థితికి తెచ్చేందుకు ఫిజియోథెరపీ వైద్యం ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా పక్షవాతం, మెడనొప్పి, నడుమునొప్పి, మోకాళ్లనొప్పి, భుజంనొప్పి, వెన్ను సమస్యలు శస్త్రచికిత్సకు ముందు తర్వాత వాటి పనితీరును పునరుద్ధరించడానికి రిహాబిలిటేషన్ ఉపయోగపడుతుంది. నరాల బలహీనతలు, పనిచేసే చోట వచ్చే సమస్యలను అధిగమించేందుకు ఫిజియోథెరపీ ఎంతగానో దోహదపడుతుంది. నొప్పుల నుంచి ఉపశమనం పలు వ్యాధులకు మెరుగైన వైద్యం ప్రభుత్వాసుపత్రుల్లో ఉచిత థెరపీ చికిత్స ప్రైవేటులో పెరిగిన వైద్యులు నేడు వరల్డ్ ఫిజియోథెరపీ డే నొప్పుల నుంచి ఎంతో ఉపశమనం ఫిజియోథెరపి వైద్యం ద్వారా దీర్ఘకాలిక సమస్యలైన స్పాండిలైటిస్, ఫ్రోజెన్ షోల్డర్, టెన్నిస్ ఎల్బో తదితర ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇటీవల కాలంలో యువత, సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఫోన్లు, కంప్యూటర్లు వాడకంతో భుజాలు, మెడ, నడుము నొప్పులతో బాధపడుతున్నారు. ఇలాంటి వారికి ఫిజియోథెరపీ వైద్యం ద్వారా ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ లేకుండా ఉపశమనం కలిగిస్తున్నారు. గర్భిణులు తెలిసి తెలియకుండా వాడే కొన్ని మందులతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. వారికి జన్మించే పిల్లలు జన్యులోపంతో బాధపడుతున్నారు. గర్భం దాల్చిన సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి వ్యాయామం చేయాలి అనే దానిపై ఫిజియోథెరపిస్ట్ వైద్యులను సంప్రదించడం ఉత్తమం. ఫిజియోథెరపీ ద్వారా తల్లి కడుపులో పెరిగే బిడ్డతో మొదలు వయోవృద్ధుల వరకు ఎన్నో జబ్బులను తగ్గించవచ్చు. -
సచివాలయ ఉద్యోగుల ఉద్యమ బాట
కర్నూలు(అర్బన్): గ్రామ/ వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులపై రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పనిభారాన్ని పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. సర్వేల పేరుతో తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేందుకు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు శాంతియుత నిరసన కార్యాక్రమాలకు సచివాలయ ఉద్యోగులు శ్రీకారం చుట్టారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలన్నింటినీ పారదర్శకంగా ప్రజల ముంగిటికే చేర్చిన వలంటీరు వ్యవస్థను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నేపథ్యంలోనే గతంలో వలంటీర్లు నిర్వహించిన బాధ్యతలను ప్రస్తుతం గ్రామ / వార్డు సచివాలయ ఉద్యోగులతో చేయించేందుకు నిర్ణయం తీసుకుంది. మనమిత్ర – వాట్సాప్ ఈ గవర్నెన్స్ పేరుతో ఇంటింటికి వెళ్లి యాప్లో ఉన్న పౌర సేవలను ఇళ్ల యజమానులకు వివరించి వారిని భాగస్వామ్యులను చేయాలనే చర్యలను చేపట్టింది. ఇందుకు గ్రామ/ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను వినియోగించుకునేందుకు ఆదేశాలను జారీ చేసింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 50 ఇళ్లకు ఒక వలంటీరును నియమించి క్లస్టర్గా విభజించి బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు నాలుగైదు క్లస్టర్ల బాధ్యతలను ఒక సచివాలయ ఉద్యోగికి కేటాయించి సమాచార సేకరణ, ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. మనమిత్ర వాట్సాప్ లోని మొత్తం 709 సర్వీసుల్లో ప్రతి ఉద్యోగి ఒక్క సర్వీస్ అయినా ఆన్లైన్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ‘ మనమిత్ర ’ సర్వే వల్ల తమ ఆత్మగౌరవం దెబ్బ తింటుందని సచివాలయ ఉద్యోగులు ఉద్యమ బావుటా ఎగుర వేసేందుకు సిద్దం అయ్యారు. సచివాలయ ఉద్యోగులు చేస్తున్న సర్వేలు .. గ్రామ/ వార్డు సచివాలయ ఉద్యోగులు రెగ్యులర్గా తమ కార్యాలయాల్లో నిర్వహిస్తున్న విధులతో పాటు అనేక రకాల సర్వేలను ఇళ్ల వద్దకు వెళ్లి నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కౌశలం, బయోమెట్రిక్ అప్డేషన్, సిటిజన్ ఈకేవైసీ, పాపులేషన్ మేనేజ్మెంట్, హౌస్ హోల్డ్ మ్యాపింగ్, చైల్డ్ ఆధార్, ఫ్యామిటీ డీటైల్స్, మోబైల్ నెంబర్ అప్డేట్, ఫ్యామిలీ మైగ్రేషన్, అదర్ డిపార్టుమెంట్ ఈకేవైసీ, ఆధార్ సీడింగ్ ఫర్ వాహనమిత్ర, నాన్ ఏపీ రెసిడెంట్ తదితర సర్వేలను ఇంటింటికి తిరిగి చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ సర్వేను కూడా ఖచ్చితంగా చేయించాలని ఆదేశాలు జారీ చేయడం పట్ల సచివాలయ ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురై ఉద్యమ బాట పడుతున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి బలవంతంగా సర్వీసులను నమోదు చేయాలనే ఆదేశాల వల్ల ఉద్యోగులు అనేక రూపాల్లో ఇబ్బందులు పడాల్సి వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల తమ ఆత్మ గౌరవం దెబ్బతినే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తప్పని పరిస్థితుల్లో విధులు బహిస్కరించేందుకు కూడా వెనుకాడమని వారు హెచ్చరిస్తున్నారు. ఉద్యమానికి శ్రీకారం సచివాలయ ఉద్యోగులను మానసికంగా ఇబ్బంది పెట్టే కార్యక్రమానికి ప్రభుత్వం పూనుకున్న నేపథ్యంలోనే ఉద్యోగులు ఈ నెల 6వ తేదినే ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోని ఉద్యోగులు ముందుగా నల్లబాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. అలాగే తమ పరిధిలోని ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లకు వినతి పత్రాలు ఇచ్చారు. తమ ఆవేదన పట్ల ప్రభుత్వం స్పందించకపోతే ఏపీవీడబ్ల్యూఎస్ఈ జేఏసీ పిలుపు మేరకు ఉద్యమ కార్యాచరణను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. వలంటీర్ల బాధ్యతలను అప్పగించడంపై ఆందోళన ఆత్మ గౌరవాన్ని కాపాడుకునేందుకు సర్వత్రా నిరసన ఇప్పటికే నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరైన ఉద్యోగులు ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లకు వినతి పత్రాలు -
ఫిజియోథెరపిస్ట్ సూచనలు పాటించాలి
కొన్ని రకాల ఆపరేషన్ల అనంతరం ఫిజియోథెరపీ కీలకం అవుతుంది. ఆపరేషన్ తర్వాత వ్యాయామం లేకపోతే కండరాల్లో ఫైబ్రోసిస్ అభివృద్ధి చెంది వంకర్లు పోతాయి. ఎక్కువరోజులు మంచంపై ఉంటే కాళ్లలో రక్తం గడ్డకట్టి ఎంబాలిజం వచ్చి గుండె, మెదడుకు స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. ఆపరేషన్తో పాటు రోగి సాధ్యమైనంత తొందరగా మామూలు స్థితికి రావాలంటే ఫిజియోథెరపీ చాలా ప్రధానం. ఇటీవల కాలంలో బైపాస్ సర్జరీ చేయించుకున్న వారికి కూడా ఫిజియోథెరపీ చేయిస్తున్నారు. పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రుల్లో రోగులకు ఫిజియోథెరపీ ఒక భాగం చేశారు. ఈ నేపథ్యంలో ఫిజియోథెరపిస్ట్ అందించే సూచనలు పాటించాల్సి ఉంటుంది. –డాక్టర్ హనీఫ్, ఫిజియోథెరపిస్ట్, కర్నూలు ప్రస్తుత కాలంలో మనుషుల్లో శారీరక చురుకుదనం తక్కువై పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. యువత నుంచి వృద్ధుల వరకు చాలా మంది భుజం, మెడ, మోకాలు నొప్పి వంటి సమస్యలతో వస్తున్నారు. కండరాల బలహీనతలతో కూడిన నొప్పులను కేవలం మందులతో తాత్కాలికంగా తగ్గించవచ్చు గానీ మళ్లీ మళ్లీ రాకుండా ఉండాలంటే ఫిజియోథెరపీ చేయించుకోవాల్సి ఉంటుంది. నొప్పి ఉన్న ప్రాంతాన్ని నిశితంగా పరిశీలించి అవసరమైన శారీరక వ్యాయామాలతో పాటు సహాయక చికిత్సను సైతం అందిస్తారు. దీంతో పాటు ప్రతిరోజూ క్రమం తప్పక వ్యాయామం, నడక చేయాలి. –డాక్టర్ అర్షద్ అయూబ్, ఫిజియోథెరపిస్ట్, కర్నూలు -
ఉల్లి ధర మరింత పతనం
కర్నూలు(అగ్రికల్చర్): ఉల్లి ధర మరింత పతనం అయ్యింది. రైతులు కన్నీరుమున్నీరయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ నెల 5వ తేదీ రాత్రి కర్నూలు మార్కెట్కు 16,589 క్వింటాళ్ల ఉల్లి వచ్చింది. 6వ తేదీన అమ్మకానికి పెట్టారు. ఇందులో వ్యాపారులు 7,756 క్వింటాళ్లు మాత్రమే కొన్నారు. మిగిలిపోయిన ఉల్లి 8,842 క్వింటాళ్లను ఆదివారం అమ్మకానికి పెట్టగా గతంలో ఎపుడూ లేని విధంగా అతి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. కిలో ఉల్లికి రూపాయి ధర లభించడంతో రైతులు కన్నీళ్లతో ఇంటికి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. ఎకరా ఉల్లి సాగుకు రూ.లక్షకు పైగా పెట్టుబడి ఖర్చు వస్తోంది. ఎకరాకు కనిష్టంగా 30 క్వింటాళ్లు, గరిష్టంగా 80 క్వింటాళ్లు దిగుబడి వస్తోంది. క్వింటాలుకు రూ.100 ధర లభిస్తుండటంతో రైతులు ఆత్మహత్యాయత్నాలు చేసుకుంటున్నారు. వ్యాపారులు ఈ నామ్ ద్వారా 7,263 క్వింటాళ్లు కొన్నారు. కనిష్ట ధర రూ.100, గరిష్ట ధర రూ.619 మాత్రమే. ఉల్లిలో నాణ్యత బాగుంది. రెండు, మూడు రోజులుగా వర్షాలు లేవు. ఎండల తీవ్రత కూడా పెరిగింది. నాణ్యత బాగానే ఉన్నప్పటికీ క్వింటాలు ఉల్లికి రూ.100 ధర ఇవ్వడం కర్నూలు మార్కెట్ యార్డులో కలకలం రేపింది. 1,579 క్వింటాళ్ల ఉల్లిని వ్యాపారులు కొనకుండా చేతులెత్తేశారు. వ్యాపారులు కొనని ఉల్లిని మార్క్ఫెడ్ రూ.1,200 ధరతో కొనుగోలు చేసింది. రైతు ఆత్మహత్యాయత్నాలను బోగస్ అంటారా? గతంలో ఎన్నడూ లేని విధంగా ఉల్లి ధరలు పడిపోయాయి. పెట్టుబడిలో కనీసం 20 శాతం కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది. సి.బెళగల్ మండలం పోలకల్ గ్రామానికి చెందిన రైతులు వెంకటనాయుడు, కృష్ణ ఉల్లి సాగు చేసిన నష్టాలు మూట కట్టుకున్నారు. అప్పల బాధలను తట్టుకోలేక పొలంలోనే పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీనిని సాక్షాత్తూ ప్రభుత్వమే బోగస్గా పేర్కొనడంపై రైతుల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. బయట కిలో ఉల్లి రూ.20–25 ప్రకారం విక్రయిస్తున్నారు. మార్కెట్ యార్డులో మాత్రం రైతులు తెచ్చిన ఉల్లి కిలో రూపాయి ప్రకారం కొంటున్నారు. ఇంత అధ్వాన్నంగా ధరలు లభిస్తే రైతులు ఆత్మహత్యలు చేసుకోక తప్పదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మూన్నాళ్ల ముచ్చట రూ.1,200 మద్దతు ధరతో ఉల్లి కొనుగోళ్లు చేస్తామని ప్రభుత్వం చేసిన హడావుడి మూడు రోజులకే ముగిసింది. ఈ నెల 1 నుంచి 3వ తేదీ వరకు మూడు రో జులు మార్కెట్కు ఉల్లి గడ్డలు తక్కువగా వచ్చాయి. ఈ రోజుల్లో వచ్చిన ఉల్లి మొత్తాన్ని మార్క్ఫెడ్ కొనుగోలు చేసింది. ఈ నెల 6న మార్కెట్కు ఉల్లిగడ్డలు పోటెత్తడ ంతో కొనుగోలులో ప్రభుత్వం చేతులెత్తేసింది. దీంతో మద్దతు కొనుగోలు మూన్నాళ్ల ముచ్చటగా మారింది. రైతులతో మాట్లాడిన జిల్లా అధికారులు కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో జిల్లా కలెక్టర్ రంజిత్బాషా, ఎస్పీ విక్రాంత్ పాటిల్, జేసీ నవ్య పర్యటించారు. ఉల్లి రైతులతో మాట్లాడారు. కర్నూలు మార్కెట్లో ఉల్లి అమ్ముకున్న ప్రతి రైతుకు మద్దతు ధర రూ.1200 లభిస్తుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. వ్యాపారులు కొనిన ధరను మినహాయించి మిగిలిన ధరను ప్రభుత్వం చెల్లిస్తుందని రైతులకు చెప్పారు. వ్యాపారులు కొనని ఉల్లిని మార్క్ఫెడ్ కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. ఉల్లికి లభించిన ధరరకు సంబంధించి మార్కెట్ కమిటీ రసీదు కూడా ఇస్తుందని పేర్కొన్నారు. బారులు తీరిన ఉల్లి ట్రాక్టర్లుకర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులోని ఉల్లి బయటికి పోవడం లేదు. వ్యాపారులు ఉల్లి కొనుగోలు చేయడంలోను, కొన్నదానిని బయటికి తరలించడంలోను అంతులేని జాప్యం చేస్తున్నారు. అన్ని షెడ్లలోను ఉల్లి నిల్వలు పేరుకుపోయి ఉన్నాయి. సోమవారం మార్కెట్లో ఉల్లిగడ్డలను అమ్మకానికి పెట్టేందుకు ఆదివారం మధ్యాహ్నం నుంచి రావడం మొదలైంది. లోపల ఉన్న ఉల్లి బయటికి పోకపోవడంతో వచ్చిన లారీలను బయటనే నిలబెట్టారు. కర్నూలు అశోక్నగర్ నుంచి కొత్తబస్టాండ్, విద్యుత్ భవన్ వరకు ఉల్లి ట్రాక్టర్లు నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కిలోకు లభించిన ధర ఒక్క రూపాయి మాత్రమే! కన్నీరు మున్నీరవుతున్న రైతులు పెట్టుబడి ఎకరాకు రూ.లక్ష పైనే దక్కుతున్నది రూ.10 వేలు మాత్రమే ఉల్లి రైతుల ఆత్మహత్యాయత్నాలను బోగస్ అనడంపై నిరసన ఈ చిత్రంలోని రైతుపేరు గురురాజగౌడు. సి. బెళగల్ మండలం కొండాపురం గ్రామానికి చెందిన ఈయన మూడున్నర ఎకరాల్లో ఉల్లి సాగు చేశారు. ఎకరాకు రూ.లక్ష ప్రకారం పెట్టుబడి పెట్టారు. ఈ నెల 5వ తేదీ రాత్రి అమ్మకానికి 350 ప్యాకెట్ల ఉల్లి కర్నూలు మార్కెట్ యార్డుకు తెచ్చారు. దీనిని రెండు లాట్లగా అమ్మకానికి పెట్టారు. 200 ప్యాకెట్లు ఉన్న లాట్కు లభించిన ధర రూ.172 మాత్రమే. కిలోకు లభించిన ధర రూ.1.71 మాత్రమే. ధర ఇంత అధ్వానంగా లభిస్తే పెట్టిన పెట్టుబడిలో 10 శాతం కూడా దక్కలేదని రైతు ఆందోళన చెందుతున్నారు. -
అత్యవసర వైద్యానికి ‘డ్రోన్’ హారన్!
కర్నూలు (సిటీ): ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫాక్చరింగ్(ట్రిపుల్ ఐటీ డీఎం) సాంకేతిక విద్య, పరిశోధనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. దేశంలో ప్రముఖ ట్రిబుల్ ఐటీగా గుర్తింపు పొందింది. సరికొత్త ఆవిష్కరణలతో దూసుకెళ్తోంది. డ్రోన్ టెక్నాలజీతో దేశంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు ట్రిపుల్ఐటీడీఎంలో నూతన ఆవిష్కరణచేశారు. ఇన్క్యుబేట్ అయిన ట్రిగుణ్ రోటోటిక్స్ సిస్టమ్ ప్రైవేటు లిమిటెడ్ స్టార్టప్ కింద డ్రోన్ ఆధారిత ఆరోగ్య పర్యవేక్షణ అనే సరికొత్త వ్యవస్థను రూపొందించారు. ఈ వ్యవస్థ రూపకల్పనలో ట్రిపుల్ఐటీ ఈసీఈ ఆచార్యులు డాక్టర్ కృష్ణ నాయక్, డాక్టర్ ఎం. రవికుమార్(మెకానికల్ ఇంజినీరింగ్), రాయలసీమ యూనివర్సిటీకి చెందిన ఖాసిఫా అంజుమ్ కీలక పాత్ర పోషించారు. అనువుకాని స్థలంలో అత్యవసరమైన సమయంలో ఈ విధానంతో సులువుగా వైద్యసేవలు అందించవచ్చు. ఏదైనా పెద్ద ప్రమాదం జరిగిన సమయంలో క్షతగాత్రులను చికిత్స కోసం తరలించే సమయంలో రోడ్లలో డ్రోన్ ద్వారా హారన్ కొడుతూ ట్రాఫిక్ క్లియర్ చేయవచ్చు. డ్రోన్లను ఉపయోగించి రోగుల ఆరోగ్యాన్ని డాక్టర్ పర్యవేక్షించేందుకు చక్కగా ఉపయోపడుతుంది ఈ వ్యవస్థ. ఇది మందులు, వైద్య పరికరాలను సుదూర ప్రాంతాలకు సరఫరా చేయడానికి ఉపయోగపడుతుంది. అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందించడానికి, కొండల్లో ఉన్న ఆరోగ్య కేంద్రాలకు మందులు, అత్యవసరమైన సమయంలో రక్తం వంటివి పంపించడానికి ఉపయోగించబడుతుంది. ఈ వ్యవస్థలను భారతదేశంలోనే మొట్టమొదటిసారి కర్నూలు ట్రిపుల్ ఐటీడీఎం ఆచార్యులు రూపొందించారు. ఈ వ్యవస్థ సుదూర గ్రామీణ ప్రాంతాలకు ఆరోగ్య సేవలను అందించడంలో కీలకపాత్ర పోషించనున్నాయి. దీని పని తీరుపై ప్రస్తుతం డెమో ఇచ్చారు. ఉపయోగాలు ఇవీ.. డ్రోన్ను పూర్తిగా ఆటో మేటిక్, మాన్యువల్ క్యాంట్రోల్ మోడ్లో నడపవచ్చు. డాక్టర్ ఆసుపత్రి నుంచే అంబులెన్స్లోని రోగి స్థితిని పర్యవేక్షణ చేసి, సూచనలతో అంబులెన్స్ ఆపరేటర్ రోగికి ఫస్ట్ ఎయిడ్ అందించగలరు. రోగిని సరైన ఆసుపత్రికి తక్షణ తరలింపుకు ఈ వ్యవస్థ సాయం చేస్తుంది. సుదూర ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాలకు మందులు, రక్తం వంటి ముఖ్యమైన వైద్య సామాగ్రిని డ్రోన్ల ద్వారా వేగంగా చేర్చవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో, ప్రజల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి, సహాయాన్ని అందించడానికి డ్రోన్లను ఉపయోగించవచ్చు. వైద్య లాజిస్టిక్ను సమర్థవంతంగా నిర్వహించడానికి డ్రోన్ ఆధారిత ఆరోగ్య సంరక్షణ అవసరం. డ్రోన్ల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసరమైన సేవలు అందించేందుకు, అంతరాయం కలుగుతుందని ప్రజలకు తెలియజేసేందుకు డప్పు కొట్టేందుకు సైతం చక్కగా ఉపయోగపడుతుంది. కర్నూలు ట్రిపుల్ఐటీడీఎం రూపొందించిన సరికొత్త వ్యవస్థ డ్రోన్ ఆధారిత హెల్త్ కేర్ మానిటరింగ్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టం తయారు దేశంలోనే మొదటిసారి వినూత్న వ్యవస్థను ఆవిష్కరించిన ట్రిపుల్ఐటీ ప్రొఫెసర్లు అత్యవసరమైన సమయంలో ఉపయోగంగా సరికొత్త వ్యవస్థ -
గతంలో టీడీపీ నేతల దుశ్చర్య ఇదీ..
ఆలూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతల భూ కబ్జాలు పెరిగిపోయాయి. రైతుల నుంచి బలవంతంగా భూములు సేకరిస్తున్నారు. ఆలూరు నియోజకవర్గంలో పవర్గ్రిడ్, విండ్ పవర్, సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి భూ సేకరణ చేస్తున్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం ఆస్పరి, చిప్పగిరి, ఆలూరు, హాలహర్వి మండలాల్లో 2,500 ఎకరాలు సేకరించాల్సి ఉండగా ఇప్పటికే 1,500 ఎకరాలు తీసుకున్నారు. విండ్ పవర్ కోసం ఆస్పరి మండలంలో 350 ఎకరాల్లో ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. పవర్గ్రిడ్ కోసం మనేకుర్తి గ్రామంలో 200 ఎకరాలు సేకరించాల్సి ఉంది. టీడీపీ నేతల చౌక బేరానికి రైతులు అడ్డు చెబుతున్నారు. రంగంలోకి దిగిన అమాత్యుడు! పవర్గ్రిడ్ కోసం మనేకుర్తి గ్రామంలో రెండు వందల ఎకరాల భూములను సేకరిస్తున్నారు. ఇక్కడ మార్కెట్ ధర రూ. 4 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు పలుకుతోంది. అయితే ప్రవర్ గ్రిడ్ అధికారులు ఎకరాకు రూ. 15 లక్షల నుంచి రూ. 18 లక్షల వరకు చెల్లి స్తామని చెబుతున్నారు. అయితే రైతులు తమ భూ ములు ఇచ్చేది లేదని చెబుతున్నారు. నిరసనలు, ఆందోళనలు కూడా చేశారు. రైతుల నుంచి ఎలాగైనా భూములు తీసుకోవాలని రెవెన్యూ అధికారులపై టీడీపీకి చెందిన ఒక మంత్రి ఒత్తిడి తీసుకువస్తున్నా రు. అధికారులు చెబుతున్నా భూములు ఇవ్వడానికి రైతులు అంగీకరించడం లేదు. కొద్ది పాటి భూములను అమ్ముకుంటే జీవనాధారం కోల్పో యే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. ప్రలోభాలు ఇలా.. మార్కెట్ ధర ఎకరాకు కేవలం రూ. 6 లక్షలు అని, కోర్టుకు వెళ్లినా అంతే పరిహారం వస్తుందని రైతులకు కొందరు అధికారులు చెబుతున్నారు. మంచి ధర వస్తుందని, భూములను ఇవ్వాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. ప్రభుత్వమే తీసుకుంటుందని, పరిహారం కూడా రాదని బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. విండ్ పవర్ కోసం 351 ఫ్యాన్లును ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందు కోసం ఎకరాకు రూ. 4 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు ఇచ్చి టీడీపీ నేతలు 350 ఎకరాల భూములు కొనుగోలు చే శారు. రైతుల వద్ద నుంచి చౌక ధరలకు భూములను కొట్టేశారు. మనేకుర్తి గ్రామంలో భూములను ఇలా కొట్టేయడానికి చూస్తున్నారు. దీంతో ఆ గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. -
ప్రశాంతంగా అటవీశాఖ పరీక్షలు
కర్నూలు(సెంట్రల్): అటవీశాఖలో అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన స్క్రీనింగ్ టెస్టు ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు 33 కేంద్రాల్లో అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షకు 89.75 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 12,919 మంది అభ్యర్థులకుగాను 10,820 మంది హాజరుకాగా 2,099 మంది గైర్హాజరయ్యారు. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించిన సెక్షన్ ఆఫీసర్ స్క్రీనింగ్ టెస్టు కోసం మూడు కేంద్రాలను ఏర్పాటు చేయగా 81.20 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 2,255 మంది అభ్యర్థులకుగాను 1,831మంది హాజరు కాగా 424 మంది గైర్హాజరయ్యారు. కాగా, ఉదయం శంకరాస్ డిగ్రీ కాలేజీలో జరిగిన స్క్రీనింగ్ టెస్టును ఏపీపీఎస్సీ జిల్లా కోఆర్డినేటర్, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చారు. -
అ‘పూర్వ’సమ్మేళనం
కలుసుకున్న పూర్వ విద్యార్థులు ఆదోని సెంట్రల్: పట్టణంలోని నెహ్రూ మెమోరియల్ పురపాలక ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు 52 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. 1973–1974 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులతు ఆదివారం పాఠశాలలో సమావేశమై అప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఇక్కడ చదువుకుని ఉరువకొండ మాజీ ఎమ్మెల్యేగా, ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్న వై.శివరామిరెడ్డి కూడా సమావేశానికి హాజరయ్యారు. ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుని యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను గుర్తు చేసుకున్నారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడం సంతోషంగా ఉందని సీపీఎం నాయకులు రామాంజనేయులు, రెహమాన్ తెలిపారు. అనంతరం తమకు చదువు చెప్పిన గురువులు దస్తగిరి, శ్రీనివాసరావు, నాగరాజుతోపాటు ప్రస్తుత పాఠశాల హెచ్ఎం ఫయాజుద్దీన్ను సన్మానించారు. -
రైతు ఆత్మహత్యలు ప్రభుత్వానికి కనిపించడం లేదా?
కర్నూలు (టౌన్): పంటలు పండక, పండించిన పంటలకు గిట్టు బాటు ధర లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. రైతులకు బాసటగా ఈనెల 9వ తేదీ మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఆర్డీఓ కార్యాలయాల వద్ద అన్నదాత పోరుపేరుతో నిరసన కార్యక్రమాలు చేపడతామని, అనంతరం అధికారులకు వినతిపత్రాలు అందజేస్తామని చెప్పారు. కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్లోశనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. వైఎస్సార్సీపీ నేతలతో కలిసి అన్నదాత పోరు పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్వీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ..రెండు నెలలుగా యూరియా కోసం రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. జిల్లాలో రైతులు ఆందోళనలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదని విమర్శించారు. జగనన్న హయాంలో రైతులు ఎప్పుడైనా రోడ్డు మీదకి వచ్చారా? గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎప్పుడైనా రైతులు రోడ్ల మీదకు వచ్చారా అని ఎస్వీ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ధరల స్థికరణకు రూ. 3 వేల కోట్ల నిధి ఉంచారని, కోవిడ్ సమయంలోను చీనీ, పత్తి రైతులను ఆదుకున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి... క్యాలెండర్ ప్రకారం ఐదేళ్లు రైతు సంక్షేమాన్ని అమలు చేశారన్నారు. రైతులను ఆదుకోవడం చేత కాక కూటమి ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు. రాష్ట్రంలో పండించిన పంటకు గిట్టుబాటుఽ ధరలు లేక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. మామిడి, చీనీ, ఉల్లి, పత్తి, టమాటా, మిర్చి, రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వీ విజయ మనోహరి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేందర్ రెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్, బీసీ సెల్ అధ్యక్షుడు రాఘవేంద్ర నాయుడు, యువజన విభాగం అధ్యక్షులు శివారెడ్డి, పాటిల్ తిరుమలేశ్వర రెడ్డి, పాటిల్ హనుమంత రెడ్డి, కిషన్ కార్పొరేటర్లు విక్రమసింహారెడ్డి, రాజేశ్వరరెడ్డి, షాషావలీ పాల్గొన్నారు. రూ. కోట్ల దోపిడీ? రాష్ట్రానికి 6 నుంచి 7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వస్తే ఎక్కడికి పోయిందని ఎస్వీ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం మార్కెఫెడ్లకు, 50 శాతం ప్రెవేటు డీలర్లకు యూరియా అందించాల్సి ఉందన్నారు. యూరియా మొత్తం ప్రైవేటు డీలర్లకు అందించి టీడీపీ నేతలు రూ. కోట్లు దొపిడీ చేశారన్నారు. యూరియా బస్తా ధర రూ. 270 నుంచి రూ. 450కు పెంచి టీడీపీ నేతలు అమ్ముకుంటున్నా విజిలెన్స్ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. యూరియా అందించని దీన స్థితితో ఉన్నారా? రైతులకు బాసటగా 9న అన్నదాత పోరు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి -
పోలీసు శాఖకు నూతన ‘హంటర్’
● పేలుడు పదార్థాలను గుర్తించడంలో దిట్ట అయిన జాగిలం కర్నూలు: కేసుల ఛేదన, నేరస్తులను గుర్తించడంలో జిల్లా పోలీసు శాఖ మరింత బలోపేతమయ్యేందుకు ప్రభుత్వం నూతన జాగిలాన్ని పంపింది. మంగళగిరి పోలీస్ హెడ్ క్వాటర్స్ ఆరో బెటాలియన్లో పది నెలల పాటు పేలుడు పదార్థాలపై ఈ కొత్త డాగ్ హంటర్ శిక్షణ పొంది శనివారం జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకుంది. ఇప్పటివరకు పోలీసు శాఖలో 8 జాగిలాలు ఉండగా హంటర్ రాకతో ఆ సంఖ్య తొమ్మిదికి చేరింది. ఇది బెల్జియం మలనాయిస్ జాతికి చెందినది. ఈ సందర్భంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ నూతన జాగిలాన్ని పరిశీలించారు. వాటి సంరక్షణపై డాగ్ స్క్వాడ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. కేసుల ఛేదనలో జాగిలాలు కీలకపాత్ర పోషిస్తున్నందున వాటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. డాగ్ స్క్వాడ్ మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు వాటి సంరక్షణ దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్ఐ జావెద్, డాగ్ స్క్వాడ్ ఇన్చార్జి ఏఆర్ కానిస్టేబుల్ రాజు, డాగ్ హ్యాండ్లర్ ఏఆర్ కానిస్టేబుల్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
రైతుకు వి‘పత్తి’
● వైరస్ సోకి ఎండిపోతున్న పత్తి పొలాలు ● లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంట ● పూర్తిగా తగ్గనున్న దిగుబడి ● పెట్టుబడులు కూడా రాని దుస్థితి కృష్ణగిరి: కొన్ని రోజులు వర్షాలు లేకపోవడం.. ఉన్నట్టుండి వానలు భారీగా పడటంతో పత్తి పొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వైరస్ సోకి ఎర్రగా మారాయి. లక్షల ఎకరాల్లో పంట దెబ్బతినింది. దిగుబడిి పూర్తిగా తగ్గి పెట్టుబడులు కూడా రాని దుస్థితి నెలకొంది. జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు 4.22 లక్షల హెక్టార్లు ఉండగా.. అత్యధికంగా 2,19,636 హెక్టార్లలో పత్తి సాగైంది. పంటంతా ఎర్రగా మారి.. గతేడాది వేరుశనగ సాగు చేయగా దిగుబడులు అంతంత మాత్రంగా వచ్చాయి. దీంతో ఈ యేడాది రైతులు అధికంగా పత్తి వైపు మొగ్గు చూపారు. మే నెల చివరల్లో కురిసిన వర్షాలకు చాలా మంది విత్తనం వేశారు. అలాగే జూన్ నెలలో కూడా లక్షల ఎకారాల్లో పత్తి సాగు చేశారు. ఆశించిన మేర వర్షాలు పడటంతో పంట ఏపుగా వచ్చి కాయలు వచ్చాయి. అయితే జూలై నెలంతా బెట్ట రావడంతో పంట ఎండుపోయే దుస్థితికి వచ్చింది. ఈ సమయంలో ఆగస్టు నెలలో ఒక్కసారిగా భారీ వర్షాలు రావడంతో ఏపుగా వచ్చినట్లు వచ్చిన పత్తి పంటకు వైరస్ సోకింది. పంటంతా కళ్లేదుటే ఎర్రగా మారింది. పెట్టుబడి మట్టిపాలు ఇంటికి తెల్లబంగారం(పత్తి) వస్తుందని ఆశించిన రైతులకు కన్నీరే మిగిలింది. అధిక వర్షాలతో జిల్లా వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పత్తి దెబ్బతినడంతో కోట్ల రూపాయల పెట్టుబడి మట్టిపాలైంది. విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, సేద్యపు తదితర వాటి కింద ఎకరాకు రూ. 40వేల వరకు ఖర్చు చేశారు. ఎర్ర, నల్లరేగడి భూముల్లో సాగు చేసిన పత్తి పంట కాయ దశకు వచ్చే సమయానికి వైరస్ సోకింది. పంట ఎర్రగా మారి ఎకరాకు రెండు నుంచి మూడు క్వింటాళ్ల దిగుబడి కూడా అందని స్థితిలో ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది కూడా ఇదే తెగులు రావడంతో కనీస దిగుబడి కూడా అందలేదని, రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందించి అదుకోవాలని కోరుతున్నారు. వరుసగా 15రోజులు వర్షాలు వచ్చి అధిక తేమ పొలంలో ఉండటంతో పత్తిని వైరస్ అశించింది. ఇది బాక్టీరియల్ బ్లైట్. దీనిని కోణీయ ఆకు మచ్చ తెగులు అని కూడా పిలుస్తారు. వైరస్ సోకిన పత్తి చెట్ల అవశేషాలను నాశనం చేస్తే దీన్ని నివారించవచ్చు. ఆమ్ల–డిలింట్ చేసిన విత్తనాలు వాడి, సరైన నీటిపారుదల పద్ధతులు నిర్వహిస్తే ఈ వైరస్ రాదు. – మహేంద్ర, ఏఓ, కృష్ణగిరి గతేడాది పొగాకు సాగు చేశాం. మంచి దిగుబడి వచ్చినా మద్దతు ధర లేక చాలా నష్టపోయా. ఈ ఏడాది నాకున్న ఎనిమిది ఎకరాల్లో పత్తి సాగుచేశా. కాయదశకు వచ్చే సరికి వర్షాలు అధికంగా రావడంతో తేమ అధికమై పంటకు వైరస్ సోకి ఎర్రగా మారింది. ఎకరాకు రూ. 40వేల ప్రకారం రూ.3 లక్షల పెట్టుబడులు పెట్టా. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలి. –బజారి, పత్తి రైతు, ఎస్హెచ్ ఎర్రగుడి నాకున్న 15 ఎకరాల్లో పత్తి సాగుచేశా. పంట వస్తే అప్పులు కట్టుకోవచ్చని ఆశ పడ్డాను. భారీ వర్షాలతో 8 ఎకరాల పొలానికి వైరస్ వచ్చి పంట ఎర్రగా మారడం ప్రారంభించింది. దీని నివారణకు మందులు వాడినా ఫలితం లేకుండా పోయింది. చెట్టుకు ఉన్న నాలుగైదు కాయలు మాత్రమే చేతికి వచ్చేలా కనపడుతోంది. పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొంది. పత్తి రైతును ప్రభు త్వం ఆదుకోవాలి. –నాగేశ్వరరావు, పత్తి రైతు, రామకృష్ణాపురం -
రోడ్డు ప్రమాదంలో క్లీనర్ మృతి ● మరో ముగ్గురికి గాయాలు
శిరివెళ్ల: ఆళ్లగడ్డ– నంద్యాల జాతీయ రహదారిపై గోవిందపల్లె– కాండ్ల పల్లె మధ్య కార్తికేయ గోడౌన్ వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐచర్ వాహన క్లీనర్ మృతి చెందాడు. ఆళ్లగడ్డ నుంచి నంద్యాల వైపు వెళ్తున్న లారీ డ్రైవర్ మద్యం మత్తులో సడన్గా నిలపడంతో అదే సమయంలో వెనుక వస్తున్న ఐచర్ వాహనం వేగంగా వచ్చి ఢీ కొనింది. ఈ ప్రమాదంలో ఐచర్ వాహనంలో ఉన్న క్లీనర్ మహానంది మండలం బొల్లారానికి చెందిన కురువ కుమార్ పీటర్ (42)తీవ్రంగా గాయపడి ఇరుక్కపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన బాలాంజనేయులు, రాజోలి మల్లి, మహమ్మద్ బాషాలకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తంగా నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతునికి భార్య, ఇరువురు సంతానం ఉన్నారు. మృతుని భార్య సువర్ణ ఫిర్యాదు మేరకు ఎస్ఐ చిన్న పీరయ్య కేసు నమోదు చేసి దర్యాస్తు చేస్తున్నారు. -
ఖాళీ కడుపుతో చదువుకునేదెట్టా!
● మధ్యాహ్న భోజన ఏజెన్సీనైనా మార్చండి.. టీసీలైనా ఇవ్వండి ● కొమ్మూరు కొట్టాల పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల మొర బేతంచెర్ల: మధ్యాహ్న భోజనం అరకొరగా పెడుతున్న బడిలో తమ పిల్లలు చదువుకోలేరని, టీసీలు ఇస్తే ఏదైనా బడిలో చేర్పిస్తామని కొమ్మూరు కొట్టాల ప్రాథమిక పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు మొర పెట్టుకుంటున్నారు. ఏజెన్సీని మార్చాలని మొరపెట్టుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ శనివారం వారు ఎంఈఓ సోమశేఖర్కు వినతి పత్రం అందజేశారు. భోజన ఏజెన్సీకి సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులు సూచించిన వారిని కాకుండా అధికార పార్టీ నాయకులు తమకు నచ్చిన వారిని ఎక్కించుకొని రాజకీయం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించకుండా గతంలో ఉన్న నాగలక్ష్మమ్మను తొలగించి ఆమె స్థానంలో కొమ్ము మహాలక్ష్మికి ఏజెన్సీని కట్టబెట్టారన్నారు. ఆ ఏజెన్సీ వాళ్లు విద్యార్థులకు సరిగా అన్నం పెట్టకపోవడంతో అర్ధాకలితో చదువుకోలేక ఈ పాఠశాలలో 35 మంది విద్యార్థులు ఉండగా ప్రస్తుతం ఐదుగురు మాత్రమే బడికెళ్తున్నారు. దాదాపు రెండు నెలలుగా విద్యార్థులు పాఠశాలకు వెళ్లకున్నా పట్టించుకునేవారు లేరు. జిల్లా కలెక్టర్, డీఈఓకు ఫిర్యాదు చేసినప్పటికీ రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో సమస్య పరిష్కారం కాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మధ్యాహ్న భోజనం నిర్వహణపై ఓ వర్గం పెత్తనం చెలాయిస్తోందని, అయితే ఆ వర్గం పిల్లలను మాత్రం ఈ బడికి పంపడం లేదనే గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వారి మాట వినకపోతే కేసులు పెట్టిస్తామని బెదిరిస్తున్నారన్నారు. ఈ విషయంపై ఎంఈఓ సోమశేఖర్ను వివరణ కోరగా అందరూ కాకుండా విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలకు సంబంధించి దరఖాస్తు చేసుకుంటే.. టీసీల మంజూరుకు చర్యలు తీసుకుంటామన్నారు. మధ్యాహ్న భోజనం అరకొరగా పెడుతున్నారని పిల్లలు ఇంటికి వచ్చి చెబుతున్నారు. మధ్యాహ్న భోజనం చూడటానికి తల్లిదండ్రులను పాఠశాల వద్దకు రానీయడం లేదు. మేము వెళ్లి చూడాలంటే పోలీసులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. మా పిల్లలను ఏవిధంగా స్కూలుకు పంపించాలి. 30 మంది పిల్లలకు టీసీలు ఇస్తే వేరే పాఠశాలలో చేర్పించుకుంటాం. – మద్దిలేటి మా పిల్లలకు మధ్యాహ్న భోజనం సక్రమంగా పెట్టడం లేదని ఫిర్యాదు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీనికి తోడు అధికార పార్టీ నాయకులు చెప్పినట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. మెజార్టీగా ఉన్న తల్లిదండ్రుల విన్నపాన్ని పట్టించుకోవడం లేదు. మా పిల్లలు సక్రమంగా పాఠశాలకు వెళ్లడం లేదు. జిల్లా అధికారులు చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించాలి. – మదన గోపాలు, విద్యార్థి తండ్రి -
పల్లెకు పోదాం.. సమస్యలు పరిష్కరిద్దాం
● జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషాకల్లూరు: గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలను పరిష్కరించేందుకే పల్లెకు పోదాం కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా తెలిపారు. కల్లూరు మండలం పర్ల గ్రామంలో శనివారం పల్లెకు పోదాం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఓహెచ్ఎస్ఆర్, అంగన్వాడీ కేంద్రం, ఆస్పత్రి, గ్రామ సచివాలయం, సాంఘిక సంక్షేమ ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేశారు. గ్రామంలో సీసీ రోడ్లు వేయాలని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కాంపౌండ్ వాల్ నిర్మించాలని, కిచెన్ షెడ్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పర్ల నుంచి సింగవరం వెళ్లే ఆర్అండ్బీ రోడ్డుపై ఉన్న కల్వర్టు బ్రిడ్జి నిర్మించాలని అధికారులకు సూచించారు. సాంఘిక సంక్షేమ ప్రభుత్వ బాలుర వసతి గృహంలో నిర్మాణంలో ఆగిపోయిన భవనాలను పూర్తి చేస్తామన్నారు. బాగా చదువుకుని మంచి పేరు తెచ్చుకోవాలని పదో తరగతి విద్యార్థులకు సూచించారు. ఓవర్హెడ్ స్టోరేజ్ ట్యాంక్ను ప్రతి రోజు క్లోరినేషన్ చేయాలని ఆర్డబ్ల్యూఎస్ ఏఈని ఆదేశించారు. క్లోరినేషన్ పరీక్షలకు గడువు తీరిన కిట్లను ఎందుకు వినియోగిస్తురాని ఇంజినీరింగ్ అసిస్టెంట్లపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసి, వివరణ కోరాలని ఎంపీడీఓను ఆదేశించా రు. పత్తి పంటను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఎంపీడీఓ జీఎన్ఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆందోళన బాటలో 104 ఉద్యోగులు
కర్నూలు (హాస్పిటల్): సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 9వ తేదీ వరకు వివిధ రూపాల్లో ఆందోళన చేయనున్నట్లు 104 అంబులెన్స్ ఉద్యోగులు చెప్పారు. ఈ మేరకు శనివారం సాయంత్రం డీఎంహెచ్ఓ డాక్టర్ పి.శాంతికళను కలసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నూతన యాజమాన్యం భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ వారు గతం నుంచి పనిచేస్తున్న ఉద్యోగులందరికీ వేతనాలను తగ్గించిందన్నారు. దీనిపై వివరణ అడుగగా మూడు నెలల నుంచి సరైన సమాధానం ఇవ్వడం లేదని, యాజమాన్యాన్ని కలవనివ్వటం లేదన్నారు. తమ సమస్యలపై రాష్ట్ర ఉన్నతాధికారులకు అనేక వినతిపత్రాలు ఇచ్చినా ఎలాంటి స్పందన లేదన్నారు. దీంతో 9వ తేదీ వరకు వివిధ రూపాల్లో ఆందోళన చేస్తామని, అప్పటికీ పరిష్కారం కాకపోతే మరింత ఉధృతం చేస్తామన్నారు. తగ్గించిన జీతాలు బకాయిలతో సహా ఇవ్వాలని, ఉద్యోగులందరికీ వేతనాలు పెంచాలని, పూర్వ సంస్థ బకాయిలను చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఔట్ సోర్సింగ్ జీతాలు ఇవ్వాలని తదితర డిమాండ్లతో డీఎంహెచ్ఓకు వినతిపత్రం అందజేశామన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో 104 ఉద్యోగుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కళ్యాణి, ఇలియాస్, హాసన్, షరీఫ్, మంజుల, వినోద్, మల్లికార్జున, మధు, అజం ఉన్నారు. -
టిడ్కో గృహ రుణాల రద్దు కుదరదు..
కర్నూలు(సెంట్రల్): టిడ్కో గృహ రుణాలను రద్దు చేయడం కుదరదని మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. శనివారం కర్నూలులో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా టిడ్కో గృహాల్లో నివాసముంటున్న పేద మహిళలు తాము గృహాల రుణాలను కట్టలేకపోతున్నామని, బ్యాంకులు వేధిస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నామని, వాటిని రద్దు చేయాలని నారాయణకు మొరపెట్టుకున్నారు. దీనిపై మంత్రి స్పందిస్తూ..‘అదేమీ కుదరదు. బ్యాంకులకు రుణం కట్టాల్సిందే. లేకపోతే ఇబ్బందులు పడతారు’ అని అన్నారు. దీంతో మహిళలంతా షాక్ తిన్నారు. నారాయణ మాట్లాడుతూ 2026 మార్చి ఆఖరిలోపు 7 లక్షల టిడ్కో గృహాలను పూర్తి చేస్తామని చెప్పారు. కర్నూలు టిడ్కో గృహాల సముదాయంలో 10 ఎకరాలను టీజీ భరత్కు ఇస్తామని, ఆయన అక్కడ ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేసి 1,000 మందికి ఉద్యోగాలు ఇస్తారని తెలిపారు. ‘కూడా’ పరిధిలో మునిసిపల్ ఆస్తుల వేలం ప్రభుత్వంపై భారం లేకుండా పాలన చేసేందుకుగాను కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ ఆథారిటీ (కూడా) పరిధిలోని మునిసిపల్ ఆస్తుల వేలానికి మంత్రి నారాయణ అనుమతిచ్చారని టీజీ భరత్ చెప్పారు. వేలం ద్వారా వచ్చే ఆదాయంతో కర్నూలు మునిసిపల్ కార్పొరేషన్లో అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. -
632 బస్తాల ఎరువులు సీజ్
గడివేముల: మండల కేంద్రం గడివేములలో శుక్రవారం విజిలెన్స్ అధికారులు ఎరువులు దుకాణాలపై దాడులు చేసి 632 ఎరువుల బస్తాల్ సీజ్ చేశారు. ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు సమాచారం అందడటంతో విజిలెన్స్ సీఐ పవన్ కుమార్, డీసీటీఓ వెంకటరమణ తదితరులు మూడు దుకాణాల్లో తనిఖీలు చేశారు. ధనలక్ష్మీ ఎరువుల దుకాణంలో యూరియా బస్తా అధిక ధరకు విక్రయిస్తున్నట్లు గుర్తించి 266 బస్తాలు సీజ్ చేసి కేసు నమోదు చేశారు. అదే విధంగా వెంకటేశ్వర ట్రేడర్స్లో 20.20.0.13 బస్తాలు 220, దుర్గ భవాని దుకాణీలో 146 బస్తాలు సీజ్ చేశామన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కొందరు వ్యాపారులు యూరియాను నిల్వ ఉంచి అధిక ధరలకు అమ్మే ప్రయత్నాలు చేస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. -
డాక్టర్.. ఉద్యోగాల్లేవ్!
● నిష్ప్రయోజనంగా మారిన ఫార్మా–డి కోర్సు ● ఉమ్మడి జిల్లాలో 1400 మందికి పైగా నిరుద్యోగులు కర్నూలు(హాస్పిటల్): డాక్టర్ ఆఫ్ ఫార్మసి (ఫార్మా–డి) కోర్సును పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు దొరకడం లేదు. దీంతో వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ కోర్సును 2008లో అప్పటి యుపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ కోర్సు చేసిన వారికి డాక్టర్తో సమానంగా హోదా లభిస్తుందని చెప్పడంతో అప్పట్లో విద్యార్థులు చాలా మంది ఆసక్తి చూపించారు. కర్నూలు జిల్లాలో రెండు, నంద్యాల జిల్లాలో రెండు ఫార్మసి కాలేజీల్లో ఒక్కో దాంట్లో 30 సీట్ల చొప్పున కోర్సును ప్రారంభించారు. అప్పట్లో ఎంబీబీఎస్లో సీటు రాని వారు డెంటల్ లేదా ఫార్మా–డి కోర్సును ఎంచుకునేవారు. కొత్త పోస్టులు లేవు ఎంబీబీఎస్తో సమానంగా ఈ కోర్సు ఆరు సంవత్సరాలు(5 ప్లస్ 1 సంవత్సరం ఆసుపత్రిలో ఇంటర్నిషిప్) చదవాల్సి ఉంది. క్లినికల్ ఓరియంటెడ్ ప్రొఫెషనల్ డాక్టోరల్ ప్రోగ్రామ్, హ్యూమన్ అనాటమి అండ్ ఫిజియాలజీ, ఫార్మకాలజి మొదలైన వాటితో పాఠ్యాంశాలు బోధించారు. ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ఆధారంగా రోగులకు హేతుబద్ధమైన డ్రగ్ థెరపిని అందించేందుకు డ్రగ్ జ్ఞానాన్ని వర్తింపజేసేందుకు సహాయపడుతుంది. క్లినికల్ ఫార్మాసిస్ట్ల పాత్ర అభివృద్ధి చెందిన దేశాల్లో బాగా గుర్తించారు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఈ కోర్సును ఆమోదించింది. ఒక విధంగా చెప్పాలంటే పేరు ముందు డాక్టర్ అని రాసుకోవచ్చని అప్పట్లో విద్యార్థులను ఊరించారు. ఈ కోర్సు చదివిన వారికి ఫార్మా కంపెనీల్లో రీసెర్చ్ విభాగంలో ఉద్యోగంలో చేరవచ్చని చెప్పారు. అయితే వీరిని ఉపయోగించేందుకు కొత్త పోస్టులు సృష్టించలేదు. చెల్లని చెక్కులా మారిన ఫార్మా–డి పట్టా కళాశాలల్లో ఆరేళ్ల పాటు ఎంబీబీఎస్తో సమానంగా చదివిన ఫార్మ్–డి విద్యార్థులు పట్టా చేతిలో తీసుకుని బయటకు వస్తే వారికి ఎక్కడ చూసినా చీకటే కనిపిస్తోంది. ఈ పట్టాతో ఎవ్వరూ ఉద్యోగం ఇవ్వడం లేదు. ప్రభుత్వం సైతం ప్రత్యేకంగా వీరి కోసం పోస్టులను సృష్టించలేదు. ప్రైవేటుకు వెళితే మీ కంటే బి.ఫార్మసి వారిని తీసుకుంటే మేలని, వారి కంటే మీది ఉన్నతమైన అర్హత అవుతుందని, మీ లాంటి వారితో పనిచేయించుకోవడం కష్టమని దెప్పి పొడిచారు..ఇంకా పొడుస్తున్నారు. 2013 తర్వాత పట్టా తీసుకుని ఇప్పటి వరకు 1400 మంది దాకా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఫార్మ్–డి నిరుద్యోగులు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు ఇటీవల రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ను కలిసి తమకు న్యాయం చేయాలని విన్నవించారు. -
ముగిసిన గణపతి నవరాత్రోత్సవాలు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో గత నెల 27వ తేదీన ప్రారంభమైన గణపతి నవరాత్రోత్స వాలు శుక్రవారంతో ముగిశాయి. ఈ ముగింపు కార్యక్రమంలో భాగంగా రత్నగర్భ గణపతికి, సాక్షిగణపతికి, యాగశాలలో నెలకొల్పిన పంచలోహ వరసిద్ధి వినాయక స్వామికి, సాక్షిగణపతి ఆలయంలో నెలకొల్పిన మృత్తికా గణపతికి వ్రతకల్పపూర్వక పూజలు చేపట్ట్టారు. గణపతి, జయాదిహోమం నిర్వహించారు. అధికారులు, అర్చకులు, వేదపండితులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గణపతి నవరాత్రోత్సవాల సందర్భంగా సాక్షిగణపతి ఆలయంలో నెలకొల్పిన మృత్తికా గణపతిని శుక్రవారం సాయంత్రం నిమజ్జనం చేశారు. -
ఎక్కువ చదివారని ఉద్యోగం ఇవ్వడం లేదు
ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో మేం ఫార్మా–డి కోర్సును పూర్తి చేశాం. ఎంబీబీఎస్తో సమానంగా సబ్జెక్టులు చదివి, ఒక సంవత్సరం ఇంటర్న్షిప్ పూర్తి చేసి పట్టా తీసుకుని బయటకు వచ్చాం. ఇప్పుడు మాకు ఉద్యోగం ఇచ్చేవారే కరువయ్యారు. బి.ఫార్మాసీ అర్హతతో ఉన్న ఉద్యోగాలకు వెళితే మీరు చాలా ఎక్కువ చదివారని, ఈ ఉద్యోగం మీకివ్వలేమని చెబుతున్నారు. మాలాంటి వారి సేవలను ప్రభుత్వం ఉపయోగించుకోవాలి. – డాక్టర్ ఎస్. లక్ష్మీకాంత్, ప్రెసిడెంట్ అసోసియేషన్ ఆఫ్ డాక్టర్ ఆఫ్ ఫార్మసీ, ఏపీ -
పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
కోడుమూరు రూరల్: ఆర్టీసీ బస్సు గేర్ రాడ్ విరిగిపోవడంతో అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన శుక్రవారం మండల ంలోని వెంకటగిరి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. కోడుమూరు నుంచి వెల్దుర్తికి 21 మంది ప్రయాణికులతో డోన్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శుక్రవారం ఉదయం బయలుదేరింది. అయితే వెంకటగిరి గ్రామం దాటిన తర్వాత అనుగొండ రోడ్డులో బస్సుకు సంబంధించిన గేర్ రాడ్ ఒక్కసారిగా విరిగిపోయింది. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లి ఆగిపోయింది. ఈ ప్రమాదం నుంచి బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులందరు క్షేమంగా బయటపడ్డారు. 13న నర్సెస్ అసోసియేషన్ సమావేశం కర్నూలు(హాస్పిటల్): ఆంధ్రప్రదేశ్ నర్సెస్ అసోసియేషన్ ఉమ్మడి కర్నూలు జిల్లా సర్వసభ్య సమావేశం ఈ నెల 13వ తేదిన నిర్వహించనున్నట్లు ఆ సంఘం అధ్యక్షులు ఎం. లీలావతి చెప్పారు. శుక్రవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యదర్శి సి.బంగారి, ట్రెజరర్ కె.లక్ష్మీనరసమ్మలతో కలిసి ఆమె మాట్లాడారు. ఈ సర్వసభ్య సమావేశం ఆసుపత్రిలోని ఓల్డ్ క్లినికల్ లెక్చరర్ గ్యాలరీలో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. సమావేశానికి అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్.రాధమ్మ, జనరల్ సెక్రటరి ఎస్. కోటమ్మ హాజరవుతారన్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాలోని సభ్యులందరూ తప్పకుండా సమావేశానికి హాజరుకావాలని కోరారు. ‘పల్లెకు పోదాం’ను విజయవంతం చేయండి కర్నూలు(సెంట్రల్): జిల్లాలో నేటి (శనివారం) నుంచి ‘పల్లెకు పోదాం’ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి.రంజిత్బాషా అధికారులను ఆదేశించారు. ఇందుకోసం 79 మంది ప్రత్యేకాధికారులను నియమించినట్లు చెప్పారు. శుక్రవారం ఆయన మండలాల ప్రత్యేకాధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మునిసిపల్ కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్స్లో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పల్లెలను బాగు చేయాలన్న ఉద్దేశంతో పల్లెకు పోదాం కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ప్రతి మండలంలో 3 గ్రామాలు చొప్పున 79 గ్రామాలను ఎంపిక చేశామని, ఇందుకోసం 79 మంది అధికారులను నియమించినట్లు చెప్పారు. వారు ఏ గ్రామాలకు వెళ్లాలనే విషయాన్ని వారికి తెలిపినట్లు చెప్పా రు. వీరంతా శనివారం ఉదయం 9 గంటలకు నిర్ధేశించిన గ్రామానికి చేరుకొని పాఠశాలలు, అంగన్వాడీ సెంటర్లు, హాస్పిటళ్లు, హాస్టల్ తదితర ప్రభుత్వ సంస్థలు ఎలా పనిచేస్తున్నాయో పరిశీలన చేస్తారు. తాగునీటి సరఫరా, వైద్య సేవలు, ఇళ్ల నిర్మాణాలు, రోడ్ల సదుపాయాలు, మధ్యాహ్న భోజన పథకం, పారిశుద్ధ్యం కార్యక్రమాలను పరిశీలిస్తారన్నా రు. నిర్దేశించిన గ్రామాలకు తహసీల్దార్, ఎంపీడీఓ, ఈఓఆర్డీ తమ బృందాలతో స్పెషల్ ఆఫీసర్ వెంట వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని మొక్కుబడిగా కాకుండా సహృదయంతో నిర్వహించాలన్నారు. స్వచ్ఛాంధ్ర అ వార్డులకు సంబంధించి ఆయా శాఖలు సమాచారాన్ని 9లోపు పంపాలన్నారు. జెడ్పీ సీ ఈఓ నాసరరెడ్డి, డీపీఓ భాస్కర్ పాల్గొన్నారు. -
గోబీ సరుకులు తీసుకొస్తూ...
– రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి చిప్పగిరి: గోబీ సరుకుల తీసుకొస్తూ రోడ్డు ప్రమాదంలో ఓ యవకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అలూరులో గోబీ వ్యాపారం చేస్తూ జీవనం సాగించే అసిఫ్ అక్బర్ వలి (31) సరుకుల కోసం గుంతకల్లు వెళ్లాడు. సరుకులు తీసుకుని గురువారం రాత్రి మోటారు సైకిల్పై తిరిగి వస్తున్నాడు. అదే సమయంలో చిప్పగిరి గ్రామానికి చెందిన ఇబ్రహీం అనే యువకుడు కుందగుర్తి నుంచి సొంత ఊరికి మోటారు సైకిల్పై వస్తున్నాడు. చిప్పగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో రెండు మోటారు సైకిళ్లు ఢీ కొనడంతో అక్బర్ వలికి తీవ్ర గాయాలయ్యాయి. ఇబ్రహీంకు స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108 కు సమాచారం ఇవ్వడంతో ఇబ్రహీంను గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తలించారు. అక్బర్వలి పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు అసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక శుక్రవారం ఉదయం మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఏపీ శ్రీనివాసులు తెలిపారు. మార్కెట్ యార్డులో రూ.12కే కిలో ఉల్లి కర్నూలు(సెంట్రల్): కర్నూలు మార్కెట్ యార్డులో రూ.12కే కిలో ఉల్లి లభ్యమవుతోందని, వ్యాపారులు, హోటళ్ల యజమానులు సద్వినియోగం చేసుకోవాలని జేసీ డాక్టర్ బి.నవ్య సూచించారు. ఆమె శుక్రవారం మినీ కాన్ఫరెన్స్ హాలులో హోటళ్ల యజమానులు, చిరు వ్యాపారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కర్నూలు మార్కెట్ యార్డులో, నగరంలోని రేషన్ షాపుల్లోనూ ఉల్లిని అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఈమేరకు ప్రజలకు అవగాహన కల్పించాలని డీఎస్ఓ, ఆహార నియంత్రణాధికారులను ఆదేశించారు. -
అదృశ్యమైన మహిళ శవమై తేలి..
● అనుమానం వ్యక్తం చేస్తున్న బంధువులు పాములపాడు/కర్నూలు(రూరల్): ఐదు రోజుల క్రితం అదృశ్యమైన కర్నూలు మండలం పూడూరు గ్రామానికి చెందిన మైథిలీ (24) శుక్రవారం బానకచెర్ల గ్రామ సమీపంలోని కేసీ కెనాల్ పవర్హౌస్ వద్ద శవమై కనిపించింది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల మేరకు.. రెండేళ్ల క్రితం మైథిలీకి వివాహం కాగా.. ఏడాది క్రితం భర్తతో విడిపోయి పుట్టింటికి చేరింది. కర్నూలు నగరంలో ఓ కర్రీ పాయింట్లో రొట్టెలు చేస్తూ జీవనం సాగిస్తోంది. అక్కడే ఓ ప్రైవేటు హాస్టల్లో ఉంటోంది. కాగా గత నెల 31వ తేదీ సాయంత్రం 5 గంటల సమయంలో పూడూరు గ్రామంలో కేసీ కెనాల్ వద్ద దుస్తులు ఉతికేందుకు వెళ్లి తిరిగి రాలేదు. ఆమె సోదరి భారతి కేసీ కెనాల్ వద్దకు వెళ్లి చూడా మైథిలీ కనిపించ లేదు. అక్కడ మెట్ల వద్ద కేవలం ఒక డబ్బా మాత్రమే కనిపించింది. ఆ సమయంలో కొందరు వ్యక్తులు మద్యం సేవించి అటుగా వెళ్లినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా మైథిలీ మొబైల్ అదృశ్యమైన రెండు రోజులకు ఒక వ్యక్తికి ఆమె ఫోన్ దొరకగా మరో వ్యక్తి ద్వారా కుటుంబ సభ్యులకు పంపించారు. మొబైల్లో సిమ్ కార్డు లేకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈనెల 1వ తేదీన మైథిలీ తండ్రి బోరెల్లి ఫిర్యాదు మేరకు కర్నూలు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం బానకచెర్ల గ్రామ సమీపంలోని కేసీ కెనాల్ పవర్హౌస్ వద్ద శవమై కనిపించింది. మృతదేహం బాగా ఉబ్బిపోయి గుర్తు పట్టని విధంగా మారడంతో ఆమె ధరించిన దస్తులను బట్టి కుటుంబీకులు మైథిలీగా గుర్తించారు. సమాచారం అందుకున్న కర్నూలు తాలుకా పోలీసు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. గ్రామానికి చెందిన ఓ యువకుడిని అదుపులోకి పోలీసులు విచారించినట్లు తెలుస్తోంది. -
రక్త పరీక్షలు చేయించండి
జూపాడుబంగ్లా: జ్వరాల బారిన పడిన వారికి రక్త పరీక్షలు చేయించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ వైద్య సిబ్బందికి సూచించారు. శుక్రవారం ఆయన జూపాడుబంగ్లా ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆసుపత్రిలో మౌలిక వసతులను గురించి డాక్టర్ గంగాధర్ను అడిగి తెలుసుకున్నారు. విషజ్వరాలు వ్యాపించకుండా నిరంతరం ఆశ, ఆరోగ్య కార్యకర్తలతో ఇంటింటికి వెళ్లి సమాచారం సేకరించాలన్నారు. గ్రామీణ ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేదిలేదని ఆయన హెచ్చరించారు. అనంతరం సమీపంలోని కస్తూర్బా పాఠశాలను పరిశీలించి అందులోని విద్యార్థుల ఆరోగ్యస్థితిగతులపై ఆరా తీశారు. ఎవ్వరికై నా జ్వరం, వాంతులు, విరేచనాలు, దగ్గు, జలుబు, జ్వరం, డెంగూ, మలేరియా వంటి జ్వరాలు వ్యాపించినట్లయితే వెంటనే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో రక్తపరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈయన వెంట హెల్త్సూపర్వైజర్లు విజయలక్ష్మమ్మ, రాముడు, ల్యాబ్అసిస్టెంటు చెంచన్న, వైద్యసిబ్బంది ఉన్నారు. -
ఉపాధ్యాయుల కృషి ఎనలేనిది
సమాజాభివృద్ధిలో కర్నూలు(సెంట్రల్): సమాజాభివృద్ధిలో ఉపాధ్యాయుల కృషి ఎనలేనిదని, వారిని గౌరవించే సంప్రదాయం వర్ధిల్లాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని గురుపూజోత్సవం(జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం) కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్తో పాటు ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించి ఉప రాష్ట్రపతి, రాష్ట్రపతి అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమన్నారు. జీవితంలో ఏ స్థాయికి ఎదిగినా గురువులను గౌరవించుకోవాలన్నారు. కేవలం చదువే కాకుండా నైతిక విలువలతో కూడిన జీవనం అలవర్చాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. త్వరలోనే ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు అవసరమైన కొత్త స్టూడియోను ఏర్పాటు చేస్తామన్నారు. తాను సిల్వర్ జూబ్లీ కాలేజీలో బీఈడీ పూర్తి చేసి ఉపాధ్యాయుడిగా స్థిరపడాలని అనుకున్నానని, అయితే మరో ఉద్యోగం రావడంతో కాలేకపోయానన్నారు. బోధనపై ఉన్న ఆసక్తితో బీఈడీ చేసే సమయంలోనే డిగ్రీ విద్యార్థులకు గణితం బోధించాని, డీఎస్సీ విద్యార్థులు కోచింగ్ ఇచ్చినట్లు గుర్తు చేసుకున్నారు. డీఈఓ శామ్యూల్ పాల్ మాట్లాడుతూ ఉపాధ్యాయుడిని చూసి సుగుణాలను పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. తల్లిదండ్రుల నుంచి ఆస్తులు సంక్రమించినట్లు ఉపాధ్యాయుల నుంచి విద్యార్థులకు క్రమశిక్షణ, నైపుణ్యాలు అలవడుతాయన్నారు. ఉపాధ్యాయులు దైవంతో సమానమని, వారిని గౌరవించడం ఎప్పుడూ ఆనందమేనన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు, 17వ వార్డు కార్పొరేటర్ పద్మలతారెడ్డి, రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతీ, రాష్ట్ర బొందిలి వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధారనగర్ విక్రమ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి పాఠశాలకు రెండు కంప్యూటర్లు ఎంపీ లాడ్స్ నుంచి జిల్లాలోని ప్రతి పాఠశాలకు రెండు కంప్యూటర్లను ఇస్తాం. నేను కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకొని ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించా. ఆ తర్వాతే ఎంపీ అయ్యాను. బస్తిపాటి నాగరాజు, కర్నూలు ఎంపీ ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికై న 45 మంది గురువులను శాలువా కప్పి పూలమాల వేసి సన్మానించి మెమొంటోతో పాటు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఇందులో 31 మంది ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు కాగా, 14 మంది జూనియర్ కళాశాలల్లో బోధన చేసే అధ్యాపకులు. కాగా, మరో ఆరుగురు పాఠశాలల పీడీలను స్పోర్ట్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డుల కింద సన్మానించారు. అంతకముందు శారద నృత్య కళాశాల విద్యార్థులు దివ్యాన్స్, హిమ వర్షిణి నృత్యం ఆకట్టుకోగా కలెక్టర్, ఎంపీ వారిని సన్మానించి మెమొంటోలను అందజేశారు. ఆహ్వానం పంపినా గైర్హాజరు జిల్లాలోని కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు గురు పూజోత్సవం ఆసక్తి చూపకపోవడం విమర్శలకు తావిస్తోంది. పాణ్యం ఎమ్మెల్యే ప్రసంగం చేసి మధ్యలోనే వెళ్లిపోయారు. ఇక మంత్రి టీజీ భరత్, కోడుమూరు ఎమ్మెలే బొగ్గుల దస్తగిరి, ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ బి.పార్థసారథి, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్బాబు, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆహ్వానాలు పంపినా హాజరు కాకపోవడం గమనార్హం. ప్రజాప్రతినిధుల తీరు పట్ల టీచర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నృత్యం చేస్తున్న విద్యార్థినులు -
వీధి కుక్కల దాడిలో 12 మంది గాయాలు
పత్తికొండ: వీధి కుక్కల దాడిలో 12 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఒక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఆదోని మండలం మదిరె గ్రామానికి చెందిన చాకలి అయ్యమ్మ అనే మహిళ పని నిమి త్తం పత్తికొండకు వచ్చారు. ఆమెతోపాటు మరో 11 మంది రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా అక్కడే ఉన్న వీధి కుక్కలు దాడి చేశాయి. అక్కడ ఉన్న స్థానికులు గమనించి కుక్కలను తరిమారు. గాయపడిన వారిని వైద్య చికిత్సల నిమిత్తం పత్తికొండ ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. పత్తికొండ పట్టణంలోని అన్ని కాలనీల్లో వీధి కుక్కల బెడద అధికంగా ఉందని వాటిని అరికట్టేందుకు గ్రామ పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.మోటార్ల దొంగలను వెంటాడి పట్టుకున్న రైతు ఆత్మకూరురూరల్: మోటార్ల దొంగలను వెంటాడి పట్టుకున్న ఘటన ఆత్మకూరు మండలంలోని సిద్దపల్లె – పెద్దనంతాపురం మద్య గురువారం రాత్రి జరిగింది. ముష్టపల్లె గ్రామానికి చెందిన కౌలు రైతు శివాజి నాయక్ సిద్దాపురం చెరువు ఎడమ కాల్వ నీటిపై ఆధారపడి పొలం సాగు చేసుకుంటున్నాడు. పొలంలో మోటార్ను తస్కరించి దొంగలు ద్విచక్రవాహనంపై పారిపోతుండగా రైతు శివాజీ నాయక్ తన మోటార్ సైకిల్ను అడ్డుగా నిలిపి వారిని పట్టుకున్నారు. దొంగతనానికి పాల్పడింది సిద్దపల్లె గ్రామానికి చెందిన సుబ్బారాయుడు, మధుగా గుర్తించారు. చుట్టు పక్కల రైతులు వీరిద్దరినీ పోలీసులకు అప్పగించారు. ఇదిలా ఉండగా మోటార్ల దొంగలపై ఎలాంటి కేసులేకుండా వదలి వేయాలని టీడీపీ నాయకులు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. 47 మంది ఆసుపత్రి పాలు కర్నూలు(హాస్పిటల్): కర్నూలు నగరంలో గురు, శుక్రవారాల్లో జరిగిన వినాయక నిమజ్జనంలో అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. వివిధ కారణాలతో అస్వస్థతకు గురై 47 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఇందులో బైక్ ప్రమాదాలు, వివిధ రకాల రోడ్డు ప్రమాదాలు, తోపులాటలో కింద పడటం, వాహనాలపై నుంచి పొరపాటుగా కిందపడటం, ఘర్షణల్లో గాయపడటం వంటివి ఉన్నాయి. వీరంతా కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని క్యాజువాలిటీకి వచ్చి చికిత్స చేయించుకుని వెళ్లిపోయారు. ఇలాంటి ఘటనలు జరిగి అధిక సంఖ్యలో క్షతగాత్రులు వస్తారన్న ఉద్దేశంతో ఆసుపత్రి అధికారులు ఎక్కువ మంది వైద్యులు, సిబ్బందిని క్యాజువాలిటీలో ఉంచారు. ఈ మేరకు వచ్చిన వారికి వచ్చినట్లు ప్రథమ చికిత్స అందించి పంపించారు. 45 మంది ఓపీ డిశ్చార్జ్ కాగా ఒకరికి ఫ్యాక్షర్ కావడంతో అడ్మిట్ చేశారు. ఒకరు కత్తిపోట్లకు గురికావడంతో అత్యవసరంగా ఆపరేషన్ నిర్వహించారు. -
సురవరం స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు
● సురవరం సుధాకర్రెడ్డికి నివాళి అర్పించిన వివిధ రాజకీయ పార్టీల నేతలు కర్నూలు(అర్బన్): పేద ప్రజల కోసం జరిగిన అనేక ఉద్యమాలకు సురవరం సుధాకర్రెడ్డి నాయకత్వం వహించారని, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ప్రజా ఉద్యమాలు చేపడతామని వక్తలు అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ భవనంలో సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభను సీపీఐ జిల్లా అధ్యక్షులు కే గిడ్డయ్య అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ముందుగా సురవరం సుధాకర్రెడ్డి చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ మాట్లాడుతూ రెండు సార్లు ఎంపీగా విజయం సాధించినా సురవరం నిరాడంబరమైన జీవితాన్ని గడిపారన్నారు. ధనిక కుటుంబంలో జన్మించిన సురవరం పేదల పక్షాన నిలిచిన వామపక్ష యోధుడని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ కొనియాడారు. నేటి తరానికి సురవరం ఎంతో ఆదర్శమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్రెడ్డి మాట్లాడుతూ కర్నూలులో విద్యార్థి దశ నుంచే సురవరం సుధాకర్రెడ్డి ఉద్యమ బాట పట్టారన్నారు. అంచెలంచెలుగా ఎదిగి సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పీ రామచంద్రయ్య మాట్లాడుతూ జిల్లాలోని మొలగవెళ్లి గ్రామంలో జరిగిన భూపోరాటంలో 1100 ఎకరాలను పేదలకు పంపిణీ చేయించడంలో సురవరం కీలక పాత్ర పోషించారన్నారు. సీనియర్ నాయకులు సూర్యనారాయణరెడ్డి, కే రామాంజనేయులు, ఎస్ మునెప్ప, పీ రామక్రిష్ణారెడ్డి, నాగన్న, సీపీఐ ఎంఎల్ నాయకులు సుంకన్న, బస్తిపాడు రామక్రిష్ణారెడ్డి, కేవీ సుబ్బారెడ్డి, రవిగువేరా తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న ఎస్వీ మోహన్రెడ్డి -
రైతుల ఉసురుకు కూటమి కొట్టుకుపోతుంది!
● టీడీపీ నాయకులకే యూరియా ● ఈ కష్టాలు రైతులకు ఎప్పుడూ రాలేదుబొమ్మలసత్రం: రైతుల ఉసురు పోసుకుని కూటమి ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో కొట్టుకుపోతుందని ఎమ్మెల్సీ ఇషాక్బాషా విమర్శించారు. నంద్యాల మాజీ ఎమ్యెల్యే శిల్పా రవిచంద్రకిషోర్రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. రైతులు వ్యవసాయ పనులు చేసుకోనివ్వకుండా కూటమి ప్రభుత్వం యూరియా కోసం రోడ్డెక్కేలా చేసిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కష్టాల్లో ఉన్న రైతులను పరామర్శించేందుకు వెళ్తే రైతులపై కేసులు పెట్టి కక్షపూరితంగా వ్యవహరించడం తగదన్నారు. రాష్ట్రానికి అరకొరగా వచ్చిన యూరియాను సీఎం చంద్రబాబు ఇచ్చిన దోచుకో.. దాచుకో.. పిలుపు మేరకూ టీడీపీ నాయకులు యూరియాను దోచుకోవడం, బ్లాక్ మార్కెట్కు తరలించడం జరుగతుందన్నారు. సెప్టెంబర్ నెలలో 1.55 లక్షల టన్నుల యూరియా రాష్ట్రానికి అవసరం కాగా 94 వేల టన్నులు మాత్రమే పంపిణీ జరిగిందన్నారు. తక్కువ నిల్వలను కూడా కావాల్సిన వారికి ఇచ్చుకుంటున్నారని విమర్శించారు. మినుములు ప్రభుత్వం రూ.8 వేలు గిట్టుబాటు ధర కల్పిస్తుందని చెబుతున్నా రూ. 4 వేలు మాత్రమే లభిస్తుందన్నారు. రైతుల సమస్యల పరిష్కరించాలని వైఎస్సార్సీపీ పిలుపు మేరకూ జిల్లా కలెక్టర్కు ఈనెల 9న వినతి పత్రం అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో పుష్కలంగా యూరియా.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో రైతులకు యూరియా పుష్కలంగా లభించేదని పీఏసీఎస్ మాజీ ప్రెసిడెంట్ రామసుబ్బారెడ్డి గుర్తుచేశారు. కూటమి అధికారం చేపట్టినప్పటి నుంచి రైతులు సాగునీటి, ఎరువుల కోసం రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. యూరియా సరఫరాలో విఫలమైన చంద్రబాబు.. యూరియా వాడితే క్యాన్సర్ వస్తుందని వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. సకాలంలో పంటలకు యూరియా వేయకపోతే ఎలా అని ప్రశ్నించారు. సమావేశంలో మాజీ మార్కెట్యార్డు చైర్మన్లు పురుషోత్తంరెడ్డి, విజయశేఖర్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు దాల్మిల్ అమీర్, సెక్రెటరీ సోమశేఖర్రెడ్డి, పార్టీ మండలాధ్యక్షులు బసవేశ్వరరెడ్డి, కౌన్సిలర్ ఆరిఫ్నాయక్, ఎర్రన్న తదితరులు పాల్గొన్నారు. -
మెనూ పాటించకపోతే చర్యలు తప్పవు
కర్నూలు(అర్బన్): జిల్లాలోని ప్రభుత్వ బీసీ సంక్షేమ వసతి గృహాల్లో మెనూ పాటించకపోతే చర్యలు తప్పవని జిల్లా బీసీ సంక్షేమం, సాధికారత అధికారిణి కె.ప్రసూన హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం ఆమె నగరంలోని రెండు బీసీ కళాశాల బాలికల వసతి గృహాలు, ఒక ప్రీ మెట్రిక్ బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా వసతి గృహాల్లోని పరిసరాలను పరిశీలించి మరింత శుభ్రంగా ఉంచుకోవాలని వసతి గృహ సంక్షేమ అధికారులను ఆదేశించారు. అలాగే వంట గది, స్టోర్ రూమ్ను తనిఖీ చేసి విద్యార్థుల కోసం వండిన వంటకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని పలు హాస్టళ్లలో మెనూ సక్రమంగా పాటించడం లేదనే ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. తాను చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో ఎక్కడైనా విద్యార్థుల నుంచి ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయా వసతి గృహాల్లోని విద్యార్థినులతో హాస్టళ్లలో అందుతున్న సౌకర్యాలపై ప్రత్యేకంగా ఆరా తీశారు. సమైక్యతను చాటారు.. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి ● జిల్లా ప్రజలకు ఎస్పీ విజ్ఞప్తి కర్నూలు: కర్నూలు, ఆదోనిలో గణేశ్ నిమజ్జన వేడుకల సందర్భంగా సమైక్యతను, సమగ్రతను చాటి చెప్పారని, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా భవిష్యత్తులో కూడా జిల్లా ప్రజలు ఇదే స్ఫూర్తిని కొనసాగించి పోలీసు శాఖకు సహకరించాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ విజ్ఞప్తి చేశారు. జిల్లా ప్రజలు, మత పెద్దలు, రాజకీయ పార్టీలు, గణేశ్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు, యువత, మీడియాకు ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. సమాజ కర్తవ్యం, అంకిత భావంతో నిమజ్జన బందోబస్తు విధుల్లో పాల్గొన్న పోలీసు అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. ‘ఫారెస్ట్’ పోస్టుల భర్తీకి రేపు స్క్రీనింగ్ టెస్ట్ కర్నూలు (సెంట్రల్): ఫారెస్ట్ శాఖలోని అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం ఆదివారం స్క్రీనింగ్ టెస్ట్ను నిర్వహిస్తున్నట్లు డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ తెలిపారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఏపీపీఎస్సీ నిర్వహించే అటవీ శాఖ పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో శుక్రవారం సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆయా పరీక్షల కోసం జిల్లాలో 33 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉదయం అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పరీక్షలు 10 నుంచి 12:30 గంటల వరకు, మధ్యాహ్నం సెక్షన్ ఆఫీసర్ పోస్టుకు సంబంధించిన పరీక్షను 3 నుంచి 5:30 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఆధార్ కార్డు, లేదంటే ఏదైనా గుర్తింపు కార్డులను హాల్టిక్కెట్తో పాటు తెచ్చుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని 15 నిమిషాలకు ముందుగానే సూచించారు. పరీక్ష కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోరన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదల పెంపు జూపాడుబంగ్లా: ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ నుంచి నీటి విడుదలను 30 వేల నుంచి 32 వేల క్యూసెక్కులకు పెంచినట్లు ఏఈ విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయంలోకి 1,16,422 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండగా డ్యాంలో 883.60 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు తెలిపారు. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ 2, 4, 5, 6,7 గేట్ల అడుగు మేర ఎత్తి 32 వేల క్యూసెక్కుల నీటిని ఎస్సారెమ్సీ కాల్వలోకి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ నీటిని బానకచర్ల నీటినియంత్రణ వ్యవస్థ నుంచి తెలుగుగంగ కాల్వకు 13 వేల క్యూసెక్కులు, ఎస్సార్బీసీ (జీఎన్ఎస్ఎస్) కాల్వకు 13 వేలు, కేసీ ఎస్కేప్ కాల్వకు 6వేల క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నట్లు బానకచర్ల ఏఈ దేవేంద్ర తెలిపారు. -
శాంతి.. ఐక్యత... భక్తి
కర్నూలు(అర్బన్): ముస్లింల పవిత్ర పర్వదినం, ప్రవక్త హజ్రత్ మహమ్మద్ జన్మదినం సందర్భంగా మిలాద్ – ఉన్ – నబీ పండుగను శుక్రవారం ముస్లింలు పవిత్రంగా జరుపుకున్నారు. దర్గాల్లో ప్రత్యేక ప్రార్థన చేశారు. అన్ని ప్రాంతాల్లో శాంతి, ఐక్యత, భక్తి వెల్లివిరిసింది. సెంట్రల్ మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో మసీదులైన రోజా దర్గా, హజ్రత్ లతీఫ్ లౌబాలీ దర్గా, లాల్ మస్జీద్, కలీ కరీం మస్జీద్, మచ్చివాలే సాహెబ్ నివాసం తదితర ఆధ్యాత్మిక కేంద్రాల్లో జియారత్ – ఏ – ఆసార్ – ఏ – ముబారక్ నిర్వహించారు. సయ్యద్ షా షఫీ పాషా ఖాద్రీ నేతృత్వంలో హజ్రత్ లతీఫ్ లౌబాలీ దర్గా నుంచి రాజ్విహార్ సెంటర్ వరకు శోభాయాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో ముస్లిం మత పెద్దలు సజ్జాదగాహ్, ముషాయిఖీన్తో పాటు పెద్ద సంఖ్యలో ముస్లింలు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. ఈ ర్యాలీలో చిన్నారులు ఇస్లామిక్ జెండాలు ఊపుతు, తమ చిన్న సైకిళ్లపై రావడంతో ర్యాలీ మరింత అందంగా మారింది. ఈ నేపథ్యంలోనే ర్యాలీలో పాల్గొన్న ప్రజలు దరూర్ షరీఫ్ చదువుతూ లాల్ మసీద్ రోడ్డులో మిఠాయిలు పంపిణీ చేశారు. మహమ్మద్ ప్రవక్త చూపిన మార్గాన్ని అనుసరించాలి కర్నూలు రాజ్ విహార్ సెంటర్ వద్ద ఉన్న దర్గా ప్రాంతంలో బహిరంగ సభ నిర్వహించారు. మత పెద్దలు ముక్దూమ్ సాహెబ్, అమ్మద్ నక్శ్బంది, సయ్యద్ మహ్మద్ సాహెబ్ ఖాద్రీ పీర్ తాహెరీ రిజ్వీ, సయ్యద్ దాదా బాషా ఖాద్రీ, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి, నగర మేయర్ బీవై రామయ్య, మాజీ ఎమ్మెల్యే హఫీజ్ఖాన్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, ఉస్మానియా కళాశాల ప్రిన్సిపాల్ సయ్యద్ ముజంమిల్, డీఎస్పీ బాబుప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత పెద్దలు మాట్లాడుతూ.. మహమ్మద్ ప్రవక్త జన్మించి 1500 సంవత్సరాలు పూర్తి అయ్యిందన్నారు. హింస, అరాచకాలు, రక్తపాతం, రాక్షసత్వం కలిగిన సమయంలో వాటిని నిర్మూలించేందుకు మహమ్మద్ ప్రవక్త జన్మించారన్నారు. తల్లి పాదాల చెంతే స్వర్గం ఉందని, తండ్రి ద్వారం లాంటి వాడని చెప్పారు. ఇదే రోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువు గొప్పతనాన్ని కూడా వివరించారు. మహమ్మద్ ప్రవక్త చూపిన మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సెంట్రల్ మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన లక్కీడ్రాలో విజేతలైన ముగ్గురికి ఉమ్రా టికెట్లు, ఐదు మందికి అజ్మీర్ షరీఫ్ యాత్ర టికెట్లను బహుమతిగా అందించారు. శుభాకాంక్షలు తెలిపిన వైఎస్సార్సీపీ నేతలు మిలాద్ ఉన్ నబీ పండుగను పురస్కరించుకొని రాజ్ విహార్ సెంటర్లోని దర్గా ప్రాంతంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్రెడ్డి, నగర మేయర్ బీవై రామయ్య, మాజీ ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ తదితరులు పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలను తెలిపారు. నగరంలోని అన్ని మతాలు, వర్గాలకు చెందిన వారు ఐక్యంగా, సంతోషంగా ఉండాలని వారు ఆకాంక్షించారు. ఆధ్యాత్మికతను నింపిన మిలాద్ – ఉన్ – నబీ దర్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు హాజరైన మేయర్ బీవై రామయ్య, మాజీ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్రెడ్డి, హఫీజ్ఖాన్ -
టమాటా ధర ఢమాల్
ప్యాపిలి, పత్తికొండ: వరి.. మిర్చి.. పత్తి.. ఉల్లి.. చీని.. అరటి.. మినుము.. ఉల్లి.. వేరుశనగ.. ఇప్పుడు టమాటా! రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కక అన్నదాతలు తీవ్రంగా నష్టపోతుండగా తాజాగా టమాటా ధరలు దారుణంగా పతనమయ్యాయి. నిన్నటిదాకా కిలో రూ.50 దాకా పలికిన టమాటా ఇప్పుడు రూ.ఐదుకూ కొనే నాథుడు లేక రైతన్నలు అల్లాడుతున్నారు. కర్నూలు జిల్లాలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి.నంద్యాల జిల్లా ప్యాపిలిలో సీజను ప్రారంభంలో 25 కిలోల బాక్స్ రూ.1,300 పలకగా ఇప్పుడు ధర అమాంతం పతనమైంది. నాణ్యత సాకుతో వ్యాపారులు రూ.150 కంటే తక్కువకు అడుగుతున్నట్లు వెంగళాంపల్లి రైతు వేల్పుల సుధాకర్ వాపోయాడు. దీంతో శుక్రవారం మార్కెట్లో టమాట పారబోసి నిరసన వ్యక్తం చేశాడు. ఓ వైపు కారుచౌకగా అడుగుతున్న వ్యాపారులు వేలం ముగిశాక రూ.50 మినహాయించుకుంటున్నారని, కనీసం రవాణా ఖర్చులు కూడా దక్కడం లేదని కన్నీరు మున్నీరయ్యాడు. ప్యాపిలి మార్కెట్కు భారీగా టమాట వస్తోంది. ఇక్కడి నుంచి మహారాష్ట్ర, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. కొద్ది రోజులుగా మహారాష్ట్రలోనూ టమాటా మార్కెట్ ప్రారంభమైనట్లు వ్యాపారులు చెబుతున్నారు. దీంతో కొనుగోలుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. హైదరాబాద్ మార్కెట్కు మూడు రోజులు పాటు సెలవు కావడంతో సరుకంతా దెబ్బ తింది. దీంతో వ్యాపారులు ధరలు తగ్గించేశారు. శుక్రవారం సాయంత్రం కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్కు రైతులు తెచ్చిన టమాట 20 కేజీల జత గంపలు రూ.100 నుంచి రూ.200 మాత్రమే పలకడంతో హతాశులయ్యారు. గత నెల రోజులు పాటు జత గంపలు రూ.1,500 నుంచి రూ.2 వేల దాకా పలకగా ప్రస్తుతం ధరలు దారుణంగా పతనమయ్యాయి. రాష్ట్రంలో మదనపల్లె తరువాత టమాట విక్రయాల్లో పత్తికొండ మార్కెట్ రెండో స్థానంలో ఉంది. -
పల్లె ‘పోరు’కు సన్నాహాలు
● తాత్కాలిక షెడ్యూల్ను ప్రతిపాదించిన ఎస్ఈసీకర్నూలు(అర్బన్): గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సన్నాహాలను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఈ నెల 3న తాత్కాలిక షెడ్యూల్ను జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయానికి పంపింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల పాలన 2021 ఏప్రిల్ 3వ తేదీ నుంచి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే గ్రామ పంచాయతీల పాలకవర్గం పదవీ కాలం 2026 ఏప్రిల్ 2వ తేదీతో ముగియనుంది. దీంతో ముందస్తుగానే గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు వీలుగా చేపట్టాల్సిన ప్రక్రియలను పూర్తి చేసుకునేందుకు తాత్కాలిక షెడ్యూల్లో ఏ తేదిల్లోగా ఎలాంటి కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలో ఎన్ని గ్రామ పంచాయతీల్లో ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది? ఆయా గ్రామ పంచాయతీల్లో వార్డుల వివరాలు? జనాభా, సామాజిక వర్గాల వివరాలను సేకరించడం తదితర పనులు ప్రారంభమయ్యాయి. తాత్కాలిక షెడ్యూల్లో సూచించిన మేరకు.. ● ఈ ఏడాది అక్టోబర్ 15వ తేదీ నాటికి మున్సిపాలిటీలు, నగర పంచాయతీలుగా అప్గ్రేడేషన్ అయ్యే గ్రామ పంచాయతీల వివరాలు, సమీపంలోని మున్సిపాలిటీల్లోకి విలీనం అయ్యే వాటిని పూర్తి చేసుకోవాలి. ● అక్టోబర్ 16 నుంచి నవంబర్ 15లోగా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచురించిన ఎలక్ట్రోల్స్ ప్రకారం గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఫొటో ఎలక్ట్రోల్స్ను రూపొందించుకోవాలి. ● నవంబర్ 16 నుంచి 30లోగా పోలింగ్ కేంద్రాల తుది ప్రచురణ పూర్తి కావాలి. అలాగే బ్యాలెట్ బాక్సుల రిపేర్లతో పాటు ఈవీఎంల ద్వారా ఎన్నికలను నిర్వహించాలని ప్రతిపాదనలు వస్తే ఈవీఎంలను మొదటి దశలో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ● డిసెంబర్ 15లోగా రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. ● డిసెంబర్ చివరి వారంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించాలి. ● 2026 జనవరిలో ఎన్నికలను నిర్వహించేందుకు తాత్కాలిక షెడ్యూల్ను ఎస్ఈసీ ప్రకటించింది. -
గ‘మ్మత్తు’ టానిక్.. గప్చుప్ పోలీస్!
కర్నూలు: టానిక్... కర్నూలు ఐదు రోడ్ల కూడలిలో కార్పొరేట్ తరహాలో ఏర్పాటు చేసిన లైసెన్స్డ్ మద్యం దుకాణం. వ్యాపార లావాదేవీలు ఇక్కడే జరగాలి. ఈ దుకాణానికి సంబంధించిన మద్యం మరో చోట అక్రమంగా నిల్వ చేసి విక్రయాలు జరపరాదు. అయితే దుకాణ యజమానులు అధికార పార్టీకి చెందిన వారు కావడంతో తమ వ్యాపారం అక్రమమా.. సక్రమమా.. అని అడిగేవారు ఎవరనే ధీమాతో నిబంధనలు ఉల్లంఘించారు. వినాయక నిమజ్జనం పురస్కరించుకుని కర్నూలు నగరంలో ఎకై ్సజ్ అధికారులు డ్రై డే ప్రకటించినప్పటికీ టానిక్ దుకాణం నుంచి రాత్రికి రాత్రే భారీగా మద్యాన్ని తరలించి రహస్యంగా నిల్వ చేసి విక్రయాలు జరుపుతూ ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు అడ్డంగా దొరికిపోయా రు. కర్నూలులోని బిర్లా కాంపౌండ్ రైల్వే గేటు వద్ద నివాసముంటున్న వెంకటేష్ ఇంట్లో అక్రమంగా భారీగా మద్యం నిల్వ ఉన్నట్లు ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు సమాచారం అందింది. గురువారం ఉదయం ఆ ప్రాంతంలో నిఘా వేసి వెంకటేష్ ఇల్లు గుర్తించి సోదాలు చేయడంతో ఒక్కొక్క బాక్సులో 48 బాటిళ్ల చొప్పున 6 బాక్సుల ఏపీ మద్యం, 5 బాక్సుల కర్ణాటక మద్యం పట్టుబడింది. పట్టుబడిన మద్యం ఏ లైసెన్స్డ్ షాపునకు చెందినదో అధికారులు ఎకై ్సజ్ యాప్ ద్వారా తెలుసుకున్నారు. పట్టుబడిన మద్యం బాటిళ్ల లేబుళ్లను స్కాన్ చేసి యాప్లో తనిఖీ చేయ గా ‘టానిక్’ దుకాణానికి సరఫరా చేసిన మద్యంగా బయటపడింది. అయితే ఆ దుకాణంపై కేసు నమో దు చేయడానికి అధికారులు తటపటాయిస్తున్నారు. ఆ దుకాణం అధికార పార్టీకి చెందిన నాయకులది కావడమే కారణమని తెలుస్తోంది. అర్ధరాత్రి వరకు కొనసాగిన వ్యాపారం గణేష్ నిమజ్జనం పురస్కరించుకుని ముందురోజు రాత్రి 10 గంటలకే కర్నూలు నగరంలో ఎకై ్సజ్ అధికారులు దుకాణాలు మూయించి సీల్ వేశారు. అయితే టానిక్ దుకాణంలో మాత్రం అర్ధరాత్రి వరకు వ్యాపారం సాగింది. ఎకై ్సజ్ అధికారులకు ఈ విషయం తెలిసినప్పటికీ అటువైపు కన్నెత్తి కూడా చూడలేదని మద్యం వ్యాపారుల్లో చర్చ జరుగుతోంది. సాధారణ రోజుల్లో టానిక్ దుకాణంలో రోజుకు రూ.8 లక్షల వరకు వ్యాపారం సాగుతోంది. అయితే బుధవారం అర్ధరాత్రి వరకు ‘టానిక్’లో విక్రయాలు జరిపినట్లు మద్యం వ్యాపారుల్లో చర్చ జరుగుతోంది. కర్నూలు నగరంలో 23 మద్యం దుకాణాలు ఉన్నాయి. డ్రై డే సందర్భంగా వాటిని మూయించడంతో టానిక్ దుకాణంలో రూ.30 లక్షలకు పైగా వ్యాపారం సాగినట్లు తోటి వ్యాపారుల్లో చర్చ జరుగుతోంది. గతంలోనూ చర్యలు శూన్యం బెల్టు షాపుల్లో పట్టుబడిన మద్యం ఏ దుకాణందో గుర్తిస్తే మొదటిసారి రూ.2 లక్షల జరిమానా, రెండోసారి పట్టుబడితే షాపు లైసెన్స్ రద్దు చేయాలి. జిల్లాలో బెల్టు షాపుల్లో మద్యం పట్టుబడిన కేసులు నమోదవుతున్నప్పటికీ ఇప్పటివరకు ఒక దుకాణానికి కూడా జరిమానా విధించింది కానీ, లైసెన్స్ రద్దు చేయడం కానీ జరగలేదు. ఇందుకు కారణం 90 శాతం దుకాణాలు అధికార పార్టీకి చెందిన వారివి కావడమే కారణమని ఎకై ్సజ్ అధికారులే అనధికారిక చర్చల్లో అంగీకరిస్తున్నారు. మద్యం ప్రియులకు ఎలాంటి లోటు లేకుండా... కొత్త మద్యం పాలసీ... 24 గంటలూ అందుబాటులో మద్యం... డ్రై డే కూడా మద్యం ప్రియులు మనసారా తాగేశారు. కర్నూలులో గణేష్ నిమజ్జన వేడుకలో మద్యం ప్రధాన భూమిక పోషించింది. నిషేధిత రోజు అయినప్పటికీ వ్యాపారులు ముందు రోజే మద్యాన్ని మరో ప్రాంతంలో నిల్వ చేసి మద్యం ప్రియులకు ఎలాంటి లోటు లేకుండా విక్రయాలు జరిపించారు. కర్నూలు నగరంలో 23 మద్యం దుకాణాలు ఉండగా అవి మూతపడినప్పటికీ అందులో పనిచేసే ఉద్యోగులు విక్రయాలు చేపట్టారు. ప్రధానంగా పాతబస్టాండ్, గాంధీ నగర్, బిర్లా జంక్షన్, చెన్నమ్మ సర్కిల్, సంతోష్ నగర్, నంద్యాల చెక్పోస్టు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో ఉన్న దుకాణం వద్ద మద్యం విక్రయాలు జోరుగా సాగించారు. కోరిన మద్యం అందుబాటులో లభించడంతో మందుబాబులు ఊరేగింపులో పాల్గొని పలుచోట్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగించారు. ‘టానిక్’ దుకాణం నిర్వాహకుడి అక్రమ వ్యాపారం కేసు నమోదుకు తటపటాయిస్తున్న అధికారులు దుకాణం టీడీపీ నాయకుడిది కావడమే కారణం 6 బాక్సులు ఏపీ, 5 బాక్సుల కర్ణాటక మద్యం సీజ్ -
ఉల్లి.. కుళ్లి‘పాయె’!
● వర్షాలకు దెబ్బతిన్న ఉల్లి పంట ● కోత కోసి ఆరబెట్టిన దక్కని ప్రయోజనం ● మార్కెట్లో ధర లేక పొలంలోనే వదిలేస్తున్న రైతులుసి.బెళగల్: ఖరీఫ్లో ఉల్లి సాగు చేసిన రైతులు కన్నీరు పెడుతున్నారు. చేతికొచ్చిన దిగుబడిని కాపాడుకోలేక, మార్కెట్లో విక్రయించలేక నష్టాలు మూటగట్టుకుంటున్నారు. తుంగభద్ర నదితీర గ్రామాలైన తిమ్మందొడ్డి, సంగాల, గుండ్రేవుల, కొండాపురం, పల్దొడ్డి, ముడుమాల గ్రామాల్లో రైతులు అత్యధికంగా ఉల్లి సాగు చేశా రు. అదేవిధంగా బోర్లు, బావులు, ఎత్తిపోతల పథకం నీటి వనరుల ద్వారా పోలకల్, మారందొడ్డి, బురాన్దొడ్డి, బ్రాహ్మణదొడ్డి, సి.బెళగల్, కంబదహాల్ గ్రామాల్లో సైతం ఉల్లి పంటలను రైతులు సాగు చేశారు. మొత్తం మండల వ్యాప్తంగా 2,630 ఎకరాల్లో సాగు చేశారు. కాగా పంట చేతికి దిగుబడులు వచ్చేసరికి మార్కెట్లో కనీస మద్దతు ధర లభించకపోవడం, అధిక వర్షాలతో రైతులు నష్టాలపాలయ్యారు. ప్రస్తుతం ఉల్లి పంట కోతలు పూర్తికావడంతో దిగుబడి నిల్వలను రైతులు పొలాలు, కల్లాలు ఇలా ఎక్కడ పడితే అక్కడ నిల్వ చేసుకున్నారు. కనీసం రవాణా చార్జీలు వచ్చే పరిస్థితి లేకపోవడం, కొన్నాళ్ల పాటు నిల్వ చేసుకునే ఏర్పాట్లు ప్రభుత్వం కల్పించకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో దిగుబడులను ఎక్కడ పడితే వదిలేస్తున్నారు. దీంతో ఉల్లిగడ్డలు కుళ్లిపోయి గ్రామాల్లో దుర్వాసన వస్తోంది. ఉల్లి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. -
వైద్య విద్యార్థులకు అన్ని సౌకర్యాలు
● జిల్లా కలెక్టర్ రాజకుమారిగోస్పాడు: నంద్యాల మెడికల్ కళాశాలలోని విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. నంద్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో రూ.8.70 లక్షలతో నూతనంగా నిర్మించిన ఆర్వో ప్లాంట్ను గురువారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల కోరిక మేరకు రైల్వే సీఎస్ఆర్ నిధులతో రూ.8.70 లక్షలతో ఆర్వో ప్లాంట్ను నిర్మించామన్నారు. మెడికల్ కళాశాల లోపల కేసీ కెనాల్ వెళ్తోందని ఆ ప్రాంతంలో పచ్చదనం, బెంచీలు ఏర్పాటు చేసి విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామనప్నారు. ఇందుకు రూ.40 లక్షల ఖర్చు చేసి పక్షం రోజుల లోపల పనులు పూర్తి చేస్తామన్నారు. పెద్దాసుపత్రిలో... నంద్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని తనిఖీ చేసిన సమయంలో థైరాయిడ్ తదితర టెస్టులు నిర్వహించేందుకు, అవసరాలకు ఆర్వో ప్లాంట్ కావాలని అక్కడి వైద్యులు అడిగారని జిల్లా కలెక్టర్ తెలిపారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.5.45 లక్షలతో ప్యూరిఫైడ్ వాటర్ సిస్టంను ఏర్పాటు చేసి ప్రారంభించామన్నారు. ఆయా కార్యక్రమాల్లో మెడికల్ కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, వైద్యులు పాల్గొన్నారు. -
డ్రోన్తో ఆరోగ్య పర్యవేక్షణ
● రూపొందించిన కర్నూలు ఐఐఐటీడీఎం కర్నూలు(సెంట్రల్): అత్యవసర సమయాల్లో డ్రోన్ ద్వారా రోగుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు కర్నూలు ఐఐఐటీడీఎం రూపొందించిన ప్రత్యేక వ్యవస్థను జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా పరిశీలించారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో డ్రోన్ను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఇన్బిల్ట్గా మైక్రోఫోన్, స్పీకర్, తక్కువ శబ్ధం కలిగిన ప్రొఫెల్లర్లతో డ్రోన్ను రూపొందించాలన్నారు. సాధ్యమైతే డ్రోన్ పరిమాణాన్ని మరింత తగ్గించి సామర్థ్యాన్ని పెంపొందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ట్రిపుల్ ఐటీడీఎం ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ కె.కృష్ణ నాయక్, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ రవికుమార్, రాయలసీమ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఖాసిఫా అంజుమ్ పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా రేణుక కర్నూలు (టౌన్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా సిద్ధారెడ్డి రేణుకను నియమించారు. ఆమె కర్నూలు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్గా గత నాలుగున్నర సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఆమెకు జిల్లా అధ్యక్ష పదవి కేటాయించారు. అలాగే జిల్లా అధ్యక్షురాలిగా పనిచేస్తున్న శశికళ కృష్ణమోహన్ను రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు గురువారం రాత్రి పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.31.16 కోట్లు విడుదల కర్నూలు(అర్బన్): జిల్లాలోని గ్రామ పంచాయతీలకు ఆరు నెలలు ఆలఽస్యంగా 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి. 2024–25 ఆర్థిక సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం మొదటి విడత నిధులు గత ఏడాది నవంబర్లో విడుదలయ్యాయి. 2వ విడత నిధులు ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి విడుదల కావాల్సి ఉంది. అయితే రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థలకు విడుదల కావాల్సిన ఆర్థిక సంఘం నిధులను విస్మరించింది. వివిధ రూపాల్లో వినతులు, ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో ఎట్టకేలకు ఆరు నెలల ఆలస్యంగా జిల్లాలోని 482 గ్రామ పంచాయతీలకు రూ.31,16,31,031 విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే 2024–25 మొదటి విడత నిధులు విడుదల కాని ఐదు గ్రామ పంచాయతీలకు ( సాంబగల్లు, బాపులదొడ్డి, హెచ్ మురవణి, కంబాలదిన్నె, రాంపల్లి ) రూ.30,70,278 విడుదలయ్యాయి. 36 గ్రామాల్లో రూ.11.52 కోట్లతో పంచాయతీ భవనాలు కర్నూలు(అర్బన్): జిల్లాలోని గ్రామ సచివాలయాలు లేని 36 గ్రామాల్లో రూ.11.52 కోట్లతో పంచాయతీ భవన నిర్మాణాలు మంజూరయ్యాయని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ వర్గాలు తెలిపాయి. ఒక్కో భవన నిర్మాణానికి రూ.32 లక్షలు వెచ్చించనున్నారు. ఇందులో రాష్ట్రీయ గ్రామీణ్ స్వరాజ్ అభియాన్ (ఆర్జీఎస్ఏ) రూ.25 లక్షలు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు రూ.7 లక్షలతో ఈ పను లను చేపట్టనున్నారు. ఎన్ఆర్ఈజీఎస్ నియమ నిబంధనల మేరకు ఈ నిర్మాణాలను చేపట్టాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. 7న ఫారెస్టు అసిస్టెంట్ బీట్, సెక్షన్ ఆఫీసర్ల స్రీనింగ్ టెస్టు కర్నూలు(సెంట్రల్): ఫారెస్టు శాఖలో భర్తీ చేయనున్న అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు ఆదివారం(7వ తేదీ) స్క్రీనింగ్ టెస్టు ఆఫ్లైన్లో నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ జిల్లా కోర్డినేటర్, డీఆర్వో సి.వెంకట నారాయణమ్మ తెలిపారు. 13 జిల్లాల్లో 791 పోస్టుల భర్తీకి మొత్తం 1.30 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి 12,920 మంది హాజరు కానున్నట్లు తెలిపారు. వీరందరికీ 13వ తేదీన కర్నూలులో స్క్రీనింగ్ టెస్టుకు 33 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు అసిస్టెంట్ బీట్ ఆఫీససర్, మధ్యాహ్నం 3 నుంచి 5.30 గంటలకు సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు స్క్రీనింగ్ టెస్టులను నిర్వహిస్తామన్నారు. -
మద్యం అక్రమ విక్రయదారుడి అరెస్టు
స్థానిక బిర్లాగడ్డ దగ్గర అక్రమంగా మద్యం నిల్వ ఉంచి విక్రయాలు జరుపుతున్న బోయ వెంకటేశ్వర్లును గురువారం ఎకై ్సజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్కు అందిన సమాచారం మేరకు అసిస్టెంట్ సూపరింటెండెంట్ రాజశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి 472 బాటిళ్లు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, 275 డ్యూటీ పెయిడ్ లిక్కర్ను స్వాధీనం చేసుకుని విక్రయదారుడిని అరెస్టు చేశారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా నగరంలో డ్రై డే ప్రకటించినందున అక్రమ మద్యం అమ్మకాలు నిరోధించే లక్ష్యంతో ఎన్ఫోర్స్మెంట్ సీఐ జయరామ నాయుడు, ఎస్ఐలు రవితేజ, మారుతి ప్రసాద్ సిబ్బంది నిఘా పెట్టారు. ఈ క్రమంలో మద్యం అక్రమ విక్రయాలపై సమాచారం అందడటంతో బిర్లాగడ్డ దగ్గర ఉన్న బోయ వెంకటేశ్వర్లు ఇంటిపై దాడి చేసి ఒక స్కూటీతో పాటు అట్టపెట్టెలు, ప్లాస్టిక్ సంచుల్లో దాచివుంచిన మద్యాన్ని సీజ్ చేసి స్టేషన్కు తరలించారు. అలాగే విక్రయదారుడు వెంకటేశ్వర్లును అరెస్టు చేసి కేసు నమోదు నిమిత్తం కర్నూలు ఎకై ్సజ్ స్టేషన్ అధికారులకు అప్పగించారు. పట్టుబడిన మద్యం ఏ దుకాణం నుంచి సరఫరా అయిందనే విషయంపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. అయితే మద్యం సరఫరా చేసిన దుకాణాన్ని వదిలేసి కేవలం విక్రయదారుడిపై మాత్రమే కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారన్న చర్చ జరుగుతోంది. ఈ దాడుల్లో ఎస్ఐ రవితేజ, సిబ్బంది మధు, వెంకటరాముడు, రామాంజినేయులు, అల్లస్వామి, షేక్షావలి, జయచంద్ర తదితరులు పాల్గొన్నారు. -
● బలపంపై గురువులు
విద్యావేత్త సర్వేపల్లే రాధాకృష్ణణ్ జయంతి సందర్భంగా శుక్రవారం నిర్వహించే జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ బలపం ముక్కపై గురువుల సూక్ష్మ చిత్రాలను గీసి అబ్బుర పరిచారు. మైక్రో బ్రష్ ద్వారా గురువు గొప్ప తనాని బలపం ముక్కపై చూపించారు. చిత్రంలో త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు.. ఈశ్వరుల స్వరూపమే గురువు అన్నట్లు సర్వేపల్లె రాధాకృష్ణన్ను చిత్రీకంచారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గురుబ్రహ్మ, గురువిష్ణు, గురుదేవో మహేశ్వరా, గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువేనమః అంటారన్నారు. – నంద్యాల(అర్బన్) -
‘గురు’ స్మరణీయులు
● జిల్లాలో 47 మంది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ● ముగ్గురికి రాష్ట్ర స్థాయి పురస్కారాలు కర్నూలు సిటీ: ఆన్లైన్ పాఠాల సంస్కృతి పెరుగుతున్న నేటి ఆధునిక కాలంలో వారు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించారు. అక్షరాలను దిద్దించడమే కాదు..అజ్ఞాన తెరలను తొలగించారు. భావి భారత పౌరులకు ఉజ్వల భవిష్యత్తును అందించారు. విద్యార్థుల వ్యక్తిత్వ నిర్మాణంలో కీలకంగా మారిన ఉపాధ్యాయుల కృషికి ప్రశంసలు వచ్చాయి. గురుపూజోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లాలో 47 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందించనున్నారు. వీరిలో 14 మంది జూనియర్ లెక్చరర్లు ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో జిల్లాకు చెందిన జూనియర్ కాలేజీ విభాగంలో ఒక్కరికి, పాఠశాల విభాగంలో ఇద్దరికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు వచ్చాయి. జిల్లా స్థాయి అవార్డుల ప్రదానోత్సవం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నారు. రాష్ట్ర స్థాయి అవార్డులు విజయవాడలో జరగనున్న కార్యక్రమంలో అందుకోనున్నారు. జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులు వీరే.. పాఠశాల విభాగంలో కె.ఎస్ ఆదాం బాషా(ఎంఈఓ–2, సి.బెళగల్), షేక్ ఉస్మాన్ బాషా(జెడ్పీహెచ్ఎస్, టి.గోకులపాడు, కృష్ణగిరి మండలం), కె.వెంకటేశ్వర్లు(జెడ్పీ హైస్కూల్, పి.కోటకొండ, దేవనకొండ), పి.మనోరమ(ఎంపీపీఎస్(స్పెషల్)గూడురు), డి.సూర్యప్రకాష్ రెడ్డి(ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఉర్దూ, కర్నూలు), జి.చిన్న బసవరాజు(ఎంపీపీఎస్, ఎస్సీ గాజులదిన్నె, గోనెగండ్ల), వి.సుబ్రమణ్య శర్మ(జెడ్పీహెచ్ఎస్, కౌతాళం), ఎస్.వి సౌభాగ్యరాణి(జెడ్పీహెచ్ఎస్, గుండ్లకొండ, దేవనకొండ), ఎం.నిరంజన్కుమార్(మున్సిపల్ హైస్కూల్, ఆదోని), ఎం.ఏ హలీం సిద్ధిఖి(మున్సిపల్ ఉర్దూ బాలిక హైస్కూల్, కర్నూలు), జి.జే సునీల్ రాజ్ కుమార్(ఎన్.ఎం.ఎం, హైస్కూల్, ఆదోని), కె.గోపాల్(జెడ్పీహెచ్ఎస్, కపటి, ఆదోని), పున్న లక్ష్మీ రంగన్న(జెడ్పీ హెచ్ఎస్, ముజఫర్ నగర్, కర్నూలు), ఎ.చంద్రమోహన్(ఎంపీపీఎస్, లక్ష్మీతాండ, తుగ్గలి), కె.పురుషోత్తం ఆచారి(జెడ్పీహెచ్ఎస్, కపటి, ఆదోని)కె.ఎం నాగేంద్రకుమార్(జెడ్పీహెచ్ఎస్, కనకవీడు,నందవరం), టి.వి.ఎల్ పద్మావతి(జెడ్పీహెచ్ఎస్, ముజఫర్ నగర్), బి.హసీనా(జెడ్పీహెచ్ఎస్, దొడ్డనగేరి, ఆదోని), వి.శ్రీనివాసులు(డా.బి.ఆర్ ఆంబేడ్కర్ గురుకులం ఆరికేర), యు.ఎస్ అయ్యప్ప(జెడ్పీహెచ్ఎస్, కౌతాళం), ఎం.మారుతి(పులికొండ), ఎం.బాలచంద్రుడు(డా.బి.ఆర్ ఆంబేద్కర్ గురుకులం ఆరికేర),ఎం.శోభాదేవి(ఎంపీపీఎస్, ఈర్నపాడు), కళ్యాణికుమారి(ఎంపీపీఎస్, జే.ఎం తాండ, పత్తికొండ), కె.అరుణజ్యోతి(ఎంపీపీఎస్ కన్నడ, బదినేహాల్),ఎం.రామ్మెహన్(ఎంపీపీఎస్, మాధవరం), డా.శ్రీదేవి(డీసీఓ, ఏపీఎస్డబ్ల్యూఆర్ఎస్), యమున(డీసీఓ, మహత్మజ్యోతిరావుఫూలే స్కూల్స్), డి.దుర్ధానా ఫర్హీన్(ఎంపీపీఎస్, బీ.ఎస్, గోనెగండ్ల). జూనియర్ కాలేజీ విభాగంలో.. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పని చేస్తున్న అధ్యాపకులకు 14 మందికి జిల్లా స్థాయి అవార్డులు ఇవ్వనున్నారు. కర్నూలు టౌన్ కాలేజీకి చెందిన అధ్యాపకులు జి.గీత(కెమిస్ట్రీ), వి.లావణ్య(హిస్టరీ), వి.నాగరాజు(బోటనీ), జి.ప్రమీలా(ఎకనామిక్స్), కెవిఆర్ కాలేజీకి చెందిన అధ్యాపకులు షేక్ రేష్మ(బోటనీ), షేక్ షాహీనా బేగం(ఫిజిక్స్),జి.శ్రీనివాసులు(జువాలజీ), కె.సువర్ణదేవి(హిస్టరీ), ఎస్.అఫ్రోజ్ సుల్తానా(కెమిస్ట్రీ), జే.వి రమణ గుప్తా(ఇంగ్లీషు), యు.మధుసూదన్(తెలుగు), ఆర్.సురేష్(హిస్టరీ, గోనెగండ్ల), ఈ.మల్లన్న(కామర్స్, మంత్రాలయం), కె.సుధీయేంధ్రకుమార్(మైనార్టీ కాలేజీ, కర్నూలు)లకు అవార్డులు వచ్చాయి. రాష్ట్రస్థాయి అవార్డులకు ఎంపికై న వారు.. పాఠశాల విభాగంలో పత్తికొండ మండలం హోసూరు ఎంపీపీఎస్(డబ్ల్యూ)లో పనిచేస్తున్న సెకండ్ గ్రేడ్ టీచర్ జి.వినూత, సి.బెళగల్ మండలం బురాన్దొడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన తెలుగు టీచర్ ముతూకురి గోపాల ఆచార్యులుకు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. కౌతాళం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జువాలజీ లెక్చరర్గా పని చేస్తున్న ఎం.సంతోష్కుమార్ రాష్ట్ర స్థాయి ఉత్తమ టీచర్ అవార్డు అందుకోనున్నారు. -
వదినను చంపిన మరిది
పగిడ్యాల: వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో సొంత వదినను మరిది హత్య చేసిన ఘటన ఎం. ఘణపురం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన శేఖర్ నాయక్, సుగాలి నాగమ్మ(60) నలుగురు పిల్లలు. వారంతా పెళ్ళిళ్లు చేసుకుని హైదరాబాద్లో స్థిరపడ్డారు. 15 ఏళ్ల క్రితమే శేఖర్ నాయక్ మృతి చెందగా నాగమ్మ గ్రామంలో ఒక్కతే ఒంటరిగా ఉంటోంది. కాగా రైతుపల్లె గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని ఆమె మరిది లోక నాయక్ అనుమానిస్తూ తరచూ హెచ్చరిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో బుధవారం ఇంటి నుంచి వెళ్లిన ఆమె గురువారం ఉదయం తిరిగి చేరింది. ఇది పసిగట్టిన లోక నాయక్ ఆమెను అడ్డుకుని మందలించాడు. ఇద్దరి మధ్య మాటామాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. దీంతో కోపోద్రేక్తుడైన అతను రాడ్తో తల వెనుక భాగంలో కొట్టగా వెంటనే అక్కడికక్కెడే కుళాయి పైప్లైన్పై పడిపోయి మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న బ్రాహ్మణకొట్కూరు ఎస్ఐ తిరుపాలు, నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రమణ్యం సంఘటన స్థలానికి చేరుకున్నారు. మహిళ మృతిపై స్థానికులను విచారించి ఆధారాల సేకరణకు క్లూస్ టీంను రప్పించారు. మృతురాలి మరో మరిది కుమారుడు చంద్రనాయక్ ఫిర్యాదు మేరకు ముచ్చుమర్రి స్టేషన్ ఏఎస్ఐ శేషయ్య కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడి లోక నాయక్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు● వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని.. -
రేపటి నుంచి వేరుశనగ మార్కెట్ ప్రారంభం
● పైలట్ ప్రాజెక్టు కింద వారం రోజులపాటు పాసింగ్ లేకుండా కొనుగోలు ఆదోని అర్బన్: పది రోజుల నుంచి ఆదోని వ్యవసాయ మార్కెట్యార్డులో స్తంభించిన వేరుశనగకాయల క్రయవిక్రయాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. సబ్కలెక్టర్ కార్యాలయంలో గురువారం వ్యాపారస్తులు, కమీషన్ ఏజెంట్లు, యార్డు అధికారులతో సబ్కలెక్టర్ మౌర్యభరద్వాజ్ నిర్వహించిన చర్చలు సఫలమయ్యా యి. పైలట్ ప్రాజెక్టు కింద వారం రోజులపాటు పాసింగ్ లేకుండా వ్యాపారస్తులు టెండర్ వేసి కొనుగోలు చేయాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు. దీంతో వ్యాపారస్తుల అసోసియేషన్ అధ్యక్షుడు శరణబసప్ప, సభ్యులు మస్తాన్వలి, నాగరాజు తదితరులు రైతులు తెచ్చిన వేరుశనగ దిగుబడులను ఆరబోస్తే తాము పరిశీలించి లాభసాటి అయిన ధరలను వేసుకుంటామని సబ్ కలెక్టర్కు విన్నవించారు. దీంతో సబ్కలెక్టర్ రైతులకు నష్టం కలిగించకుండా చూడాలన్నారు. వారం రోజులపాటు పైలట్ ప్రాజెక్టు కింద పాసింగ్ లేకుండా వ్యాపారస్తులు కొనుగోలు చేయాలని, వారం రోజుల్లో ఏదైనా సమస్య వస్తే మళ్లీ చర్చలు జరిపి సమస్యను పరిష్కరిస్తానన్నారు. ఇందుకు వ్యాపారస్తులు ఒప్పుకున్నారు. సమావేశంలో యార్డు సెక్రటరీ కల్పన, అసిస్టెంట్ సెక్రటరీ శాంతకుమార్, సూపర్వైజర్లు, కమీషన్ ఏజెంట్ల అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రకాంత్రెడ్డి, సభ్యులు రాజాగౌడ్, శ్రీరాములు, నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు. -
ఆపరేషన్ సింధూర్కు అంకితం
గణేష్ ఉత్సవాలకు రాష్ట్రంలోనే పేరుగాంచిన కర్నూలు నగరంలో గురువారం వినాయక నిమజ్జనం కనులపండువగా సాగింది. 45వ ఏడాది దాదాపు 1,700 విగ్రహాలతో నిర్వహించిన శోభాయాత్ర ఆఽధ్యాత్మిక ఆనందాన్ని పంచింది. కుల మతాలకు అతీతంగా నిర్వహించిన వేడుకను ఆపరేషన్ సింధూర్కు అంకితమివ్వడం విశేషం.కర్నూలు కల్చరల్: తొమ్మిది రోజుల పాటు విశేష పూజలందుకున్న గణనాథుని నిమజ్జనోత్సవం గురువారం కర్నూలు నగరంలో కనుల పండువగా సాగింది. ఓల్డ్సిటీలోని రాంబొట్ల ఆలయం వద్ద నిమజ్జన శోభాయాత్ర పూజను జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా, ఎస్పీ విక్రాంత్ పాటిల్, నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరి, వీహెచ్పీ రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ ప్రారంభించారు. వేలాది భక్తుల హర్షధ్వానాల మధ్య శోభాయాత్ర ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా నగరం నడి మధ్యలో కేసీ కెనాల్లో విఘ్నేశ్వరునికి ఘనంగా వీడ్కోలు పలికారు. కేసీ కెనాల్కు ఇరువైపుల పది ఘాట్లలో ఏడు క్రేన్లు, స్టాంటన్ పురం మమతా నగర్ వద్ద ఘాట్లో ఒక క్రేన్తో, సంతోషనగర్ హైవే తుంగ భద్రా నది బ్రిడ్జి వద్ద నిమజ్జనం వైభవంగా నిర్వహించారు. వినాయక ఘాట్లో జ్యోతి ప్రజ్వలన, ధ్వజారోహణ, భరతమాత పూజ, వినాయక పూజలు చేసి కలెక్టరేట్ పరిపాలనా విగ్రహం, నగర పాలకం సంస్థ ఆధ్వర్యంలోని వినాయక విగ్రహాలతో నిమజ్జనం మొదలైంది. ఆర్ఎస్ఎస్ ప్రాంత సహ కార్యవాహక ఎం.శ్రీనివాసరెడ్డి ముఖ్య వక్తగా హాజరై సందేశమిచ్చారు. ప్రజలను సమైక్యం చేసేందుకే 1893లో బాల గంగాధర్ తిలక్ గణేష్ సామూహిక ఉత్సవాలను ప్రారంభించారన్నారు. దేవాలయాలు ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలుగా నిలుస్తున్నాయన్నారు. కొందరు సనాతన ధర్మాన్ని అంతం చేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారని.. అయితే అది అంత సులువు కాదన్నారు. నేటి తరానికి సనాతన ధర్మ, సంస్కృతి సంప్రదాయాలు తెలియజెప్పేందుకు వినాయక చవితి ఉత్సవాలు దోహదం చేస్తున్నాయన్నారు. సుమారు 1,700 విగ్రహాలు 2వేల మంది పోలీస్ల బందోబస్తు, 2వేల మంది స్వచ్ఛంద సేవకుల నడుమ వినాయక నిమజ్జనం ప్రశాంతంగా సాగింది. సంప్రదాయబద్ధంగా శోభాయాత్ర ఓల్డ్సిటీ కుమ్మరి వీధిలోని రాంబొట్ల ఆలయం వద్ద మొదటి విగ్రహానికి పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. అక్కడ వినాయక లడ్డూ ప్రసాదానికి వేలం నిర్వహించగా నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఐదో ఏడాది రూ.6,01,000లకు దక్కించుకున్నారు. శోభా యాత్ర సంప్రదాయ బద్ధంగా మేళతాళాలు, డ్రమ్ములు, కోలాటాలు, కర్రల విన్యాసాలు, చెక్క భజనల నడుమ సాగింది. స్వామి వివేకానంద సంస్కృత పాఠశాల, కేశవ మెమోరియల్ పాఠశాల విద్యార్థుల ఘోష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాంస్కృతిక కార్యక్రమాలు చంద్రశేఖర శర్మ, కొట్టే చెన్నయ్య, ఎలమర్తి రమణయ్య, రామకృష్ణ శర్మ, యాగంటీశర్పప్ప, గురప్ప, గైరబోని వెంకటరాముడు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. వినాయక ఘాట్ ప్రధాన వేదికపై పలు విద్యా సంస్థల విద్యార్థులు, సంగీత, నృత్య కళాశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకంగా నిలిచాయి. వినాయక్ ఘాట్లో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను సమన్వయం చేస్తూ ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా వేడుకలను పర్యవేక్షించారు. ‘స్వచ్ఛంద’ సేవ మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, కల్కి సేవా ట్రస్ట్ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. కార్పొరేటర్ సత్యనారాయణమ్మ ఆధ్వర్యంలో అల్పాహారం అందజేశారు. నగర పాలక సంస్థ, సత్యసాయి సేవా ట్రస్ట్, వీరశైవ సంఘం, భవసార క్షత్రియ సంఘం తదితర స్వచ్ఛంద సేవా సంస్థలు తాగునీరు, అన్నదానం నిర్వహించారు.నృత్య నివేదన వినాయక ఘాట్పై భరత నాట్యం చేస్తున్న చిన్నారి దేదీప్యమానం: వినాయక ఘాట్ వద్ద హారతి ఇస్తున్న పండితులుప్రథమ పూజ్యం: నిమజ్జనోత్సవాన్ని ప్రారంభిస్తున్న ప్రజాప్రతినిధులుఐక్యతా భావం.. జాతీయ జెండాతో నృత్యం చేస్తున్న విద్యార్థినులు‘మోత’ మోగించారు! ప్రమాదకర స్థాయిలో డీజేలు కర్నూలు(సెంట్రల్): వినాయక నిమజ్జనోత్సవంలో డీజే(డిస్క్జాక్) మ్యూజిక్ సిస్టమ్ మోత మోగింది. వీటితో పాటు అధిక శబ్ధ తరంగాలు విడుదల చేసే డ్రమ్స్, బాణసంచా పేలుళ్లతో నగరవాసుల చెవులకు చిల్లులు పడ్డాయి. ప్రతి వినాయక విగ్రహం ఊరేగింపు వాహనం ఎదుట డీజే సిస్టమ్ కోసం మరో ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. సాధారణంగా 65 డెసిబుల్స్ శబ్ధం వరకు ఎలాంటి ప్రమాదం ఉండదు. అయితే గురువారం నిర్వహించిన నిమజ్జనోత్సవంలో 140 డెసిబుల్స్ వరకు శబ్ద కాలుష్యం చేరుకోవడంతో గందరగోళానికి తావిచ్చింది. ఇళ్లలో ఉన్న వాళ్లు శభ్దానికి ఎక్కడ కూలిపోతాయోనన్న భావన కలిగింది. నగరంలో గురువారం వివిధ ప్రాంతాల్లో నమోదైన శబ్ధకాలుష్యం ప్రాంతం శబ్ధకాలుష్యం (సరాసరి) డీబీలు కొండారెడ్డి బురుజు 110 రాజ్విహార్ 125 బుధవారపేట 135 కలెక్టరేట్ 136 వినాయక ఘాట్ 110 కర్నూలు నగరంలో ఆధ్యాత్మిక పరవళ్లు రాంబొట్ల దేవాలయం వద్ద తొలిపూజ వందలాది విగ్రహాలతో పండుగ వాతావరణం ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు కేసీ కెనాల్లో కనుల పండువగా నిమజ్జనం గట్టి పోలీసు బందోబస్తు మధ్య వీడ్కోలు అడుగడుగునా స్వచ్ఛంద సంస్థల సేవలు -
ఉద్యోగం కోసం తండ్రిని చంపిన తనయుడు
కర్నూలు జిల్లా: తండ్రి చేస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఉద్యోగం తనకు కావాలంటూ కన్న కొడుకే రోకలిబండతో తలపై దారుణంగా కొట్టి హతమార్చిన ఘటన బుధవారం తెల్లవారుజామున కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలోని పులకుర్తిలో జరిగింది. గ్రామానికి చెందిన రామాచారి (58) ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాడు. భార్య విరుపాక్షమ్మతో పాటు, కుమారుడు వీరస్వామి, ఒక కుమార్తె సంతానం. రామాచారి పిల్లలిద్దరికీ పెళ్లిళ్లు చేశాడు. డిగ్రీ వరకు చదివిన వీరస్వామి కొంతకాలం ప్రైవేట్ ఉద్యోగాలు చేసిన అనంతరం గ్రామం చేరుకుని జులాయిగా తిరుగుతున్నాడు. తండ్రి రామాచారి చేస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఉద్యోగం తనకిప్పించాలంటూ కొంతకాలంగా వీరస్వామి తరచూ గొడవ పడేవాడు. ఈ నేపథ్యంలో బుధవారం తెలవారుజామున ఉద్యోగం విషయంలో తండ్రితో గొడవ పెట్టుకుని రోకలిబండతో తలపై బలంగా కొట్టి హత్య చేశాడు. గమనించిన గ్రామస్తులు కోడుమూరు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. మృతుడి భార్య విరుపాక్షమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
రైతులను నట్టేట ముంచిన కూటమి ప్రభుత్వం
కర్నూలు (టౌన్): రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్లో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు నెలలుగా యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదని ఆరోపించారు. ప్రభుత్వంలో చలనం తీసుకు వచ్చేందుకు ఈనెల 9న తమ పార్టీ అధ్వర్యంలో జిల్లాలొని అన్ని ఆర్డీఎ కార్యాలయాల వద్ద రైతులతో కలిసి ఆందోళనలు, నిరసన కార్యకార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కర్నూలులోని స్థానిక చిల్డ్రన్స్ పార్కు నుంచి రైతులతో కలిసి పాతబస్టాండ్ కొండారెడ్డి బురుజు మీదుగా ఆర్డీవో కార్యాలయానికి ప్రదర్శనగా వెళతామన్నారు. వేల కోట్లు దోపీడీ.. రాష్ట్ర ప్రభుత్వం 16 నెలల వ్యవధిలో రూ. 2.09 లక్షల కోట్లు అప్పులు చేసిందని, అయితే రైతులకు ధరల స్టీరికరణ కోసం రూ.3 వేల కోట్ల కేటాయించలేదని ఎస్వీ విమర్శించారు. అమరావతికి ఎన్ని కోట్లు ఖర్చు చేశారని ప్రశ్నించారు. రేషన్ బియ్యం, మద్యం, ఇసుక, మైనింగ్లలో వేల కోట్లు టీడీపీ నేతలు దోపీడీ చేస్తున్నారని ఆరోపించారు. రైతుల యూరియాను సైతం బ్లాక్ మార్కెట్ కు తరలించి అమ్ముకుంటున్నారన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏనాడైనా రైతులు రోడ్ల మీదకు వచ్చారా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వాన్ని నిలదీసే రోజులు వచ్చాయన్నారు. వైఎస్సార్సీపీ కోడుమూరు నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ ఆదిమూలపు సతీష్ మాట్లాడుతూ.. రైతుల సమస్యలు పరిష్కరించడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందన్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికై నా రైతు సంక్షేమానికి పాటుపడాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేందర్ రెడ్డి అన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు, పార్టీ నాయకులు షరీఫ్, జుబేర్, షేక్ అహమ్మద్, పాటిల్ హనుమంతరెడ్డి, తిరుమలేశ్వర రెడ్డి, కిషన్, ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు. ఉల్లి క్వింటా ధర రూ. 2,500 చేయాలిఉల్లి పంటకు గిట్టుబాటు ధరలేక రైతులు ఆందోళనలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న దాఖాలాలు లేవని ఎస్వీ విమర్శించారు. ఉల్లి రైతుల ఇబ్బందులు తెలిసి మార్కెట్ యార్డుకు వెళ్లి తాను పరామర్శించిన తర్వాత మార్కెట్ యార్డు ఆధికారులు, కలెక్టర్, మంత్రి మార్కెట్ యార్డును సందర్శించారన్నారు. ఉల్లి క్వింటా ధర రూ.1,200 ప్రకటించారని, దానిని రూ. 2,500 చేయాలన్నారు. యూరియా కోసం రైతులు రోడ్ల మీద పడిగాపులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం రైతులను బిచ్చగాళ్లను చేస్తోందని విమర్శించారు. గిట్టుబాటు ధర లేక, పెట్టుబడి రాక ఉల్లి, పత్తి, టమాటా, మిర్చి, రైతులు అప్పుల పాలవుతున్నారన్నారు. మిర్చి, పత్తి, ఉల్లి పంటలకు గిట్టుబాటు ధర లేదు 9న ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిరసన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి -
వామ్మో.. జ్వరాలు!
రోగులు కిక్కిరిసిన ఆలూరు ఆసుపత్రివారం రోజుల నుంచి జ్వర పీడితులు పెరుగుతున్నారు. వాతావరణంలో మార్పులతో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులతో చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రభుత్వ ఆసుపత్రుల బాటపడుతున్నారు. గడిచిన నాలుగు రోజుల్లోనే వెయ్యి మందికి పైగా ఓపీ నమోదైనట్లు ఆలూరు సీహెచ్సీ వైద్యులు వెల్లడించారు. ఇది కేవలం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోగల సంఖ్య మాత్రమే. ఆయా గ్రామాల్లోని ఆర్ఎంపీలు, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లిన రోగుల సంఖ్య ఎక్కవగా ఉంది. సోమవారం నుంచి బుధవారం వరకు రోజు 450 మందికి పైగా రోగులు ఆసుపత్రికి వచ్చారు. బుధవారం ఉదయం 10 గంటలకు ఒక్కసారిగా 200 మందికి దాకా రోగులు ఓపీకి వచ్చారు. ఆరుగురు వైద్యుల్లో ముగ్గురు సెలవుపై వెళ్లారు. ఉన్న ముగ్గురులో ఒకరు చిన్న పిల్లల వైద్యులు, ఒకరు జనరల్ మెడిసిన్, ఇంకో వైద్యురాలు గైనకాలజిస్టు మాత్రమే విధుల్లో ఉన్నారు. జ్వరంతో బాధపడుతున్న వారికి ఆసుపత్రి ఓపీలో కూర్చోవడానికి సరైన సౌకర్యాలు లేక ఉన్న ఇద్దరు డాక్టర్ల వద్ద వైద్యం కోసం వేచి ఉండలేక ఇబ్బంది పడ్డారు. – ఆలూరు రూరల్ రోగులతో కిక్కిరుస్తున్న ప్రభుత్వ ఆసుపత్రులు నాలుగు రోజుల్లో వెయ్యికి పైగా కేసులు నమోదు -
ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు
కర్నూలు: ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. ఎరువులు, పురుగు మందుల దుకాణాలు, అనుబంధ గోదాములను జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు తనిఖీ చేస్తున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోడుమూరు మండలం బైన్దొడ్డి గ్రామానికి చెందిన బోయ చిన్న వీరన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోడుమూరు పోలీసులు స్థానిక శ్రీలక్ష్మి ఫర్టిలైజర్ షాపును తనిఖీ చేసి ఎరువుల సంచులు, బిల్లు బుక్కులను పరిశీలించారన్నారు. ఎమ్మార్పీ కంటే అధిక రేట్లకు విక్రయిస్తున్నట్లు తేలడంతో దుకాణ యజమాని పట్నం కృష్ణమూర్తిపై కోడుమూరు ఎస్ఐ ఎర్రిస్వామి చీటింగ్ కేసు నమోదు చేశారన్నారు. స్టాక్ వివరాలు రైతులకు అర్థమయ్యే రీతిలో నోటీసు బోర్డుపై ప్రదర్శించాలని, ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పీఆర్ ఎస్ఈగా వేణుగోపాల్ బాధ్యతల స్వీకరణ కర్నూలు(అర్బన్): పంచాయతీరాజ్ పర్యవేక్షక ఇంజనీర్గా ఐ.వేణుగోపాల్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆయన జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషాను గౌరవపూర్వకంగా కలిశారు. గతంలో ఇక్కడ రెగ్యులర్ ఎస్ఈగా విధులు నిర్వహించిన వి.రామచంద్రారెడ్డి గత ఆగస్టు 31న పదవీ విరమణ చేశారు. ప్రకాశం జిల్లా ఈఈగా విధులు నిర్వహిస్తున్న వేణుగోపాల్కు ఎస్ఈగా పదోన్నతి కల్పించి కర్నూలుకు పోస్టింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన ఇక్కడ ఎస్ఈగా బాధ్యతలు స్వీకరించారు. ఖరీఫ్ సీజన్లో సాగు తక్కువే! కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ పంటల సాగులో పురోగతి కరువైంది. ముందస్తుగా వర్షాలు కురిసినప్పటికీ ఆగస్టు నెల మొత్తం వర్షాలు కురిసినా సాగు తక్కువగానే ఉండటం గమనార్హం. ఖరీఫ్ సాధారణ సాగు 4.22 లక్షల హెక్టార్లు ఉండగా.. ఇప్పటి వరకు 3.46 లక్షల హెక్టార్లలోనే పంటలు సాగయ్యాయి. గత ఏడాది ఇదే సమయానికి 3.62 లక్షల హెక్టార్లలో సాగు కావడం విశేషం. ఽ 2024 ఖరీఫ్తో పోలిస్తే.. 2025లో సాగు భారీగా తగ్గడం ఆందోళన కలిగించే విషయం. గిట్టుబాటు ధరలు లేకపోవడం వల్ల వేరుశనగ, మిర్చి, పొగాకు సాగు తగ్గింది. అత్యధికంగా పత్తి 2,19,636 హెక్టార్లలో సాగయింది. వేరుశనగ 28,453, ఉల్లి 11056, మిర్చి 5546, టమాట 1767, కంది 39531. ఆముదం 9306, సజ్జ 5749. మొక్కజొన్న 7201, కొర్ర 2858 హెక్టార్లలో సాగు చేశారు. ఇద్దరు సీఐలకు పదోన్నతి కర్నూలు(టౌన్): కర్నూలు రేంజ్ పరిధిలో ఇద్దరు సీఐలకు పదోన్నతి లభించింది. ఎమ్మిగనూరు రూరల్ సర్కిల్ సీఐగా పనిచేస్తున్న బీవీ మధుసూదన్ రావు, అలాగే మరో సీఐ బి.వి.శ్రీనివాసులుకు డీఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ బుధవారం డీజీపీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. -
మాన్యం భూమిలో అక్రమ మైనింగ్
బనగానపల్లె: కూటమి ప్రభుత్వంలో పేదలు, ప్రభుత్వ భూములకే కాదు.. దేవుడి భూములకూ రక్షణ లేదు. కూటమి నేతలు దర్జాగా ఆక్రమించి యథేచ్ఛగా మైనింగ్ చేస్తున్నా అడిగేనాథుడు లేరు. మాన్యం భూమిలో అక్రమ మైనింగ్ అడ్డుకోవాలని వినతులు ఇస్తున్నా బుట్టదాఖలవుతున్నాయి. నాపరాయి మైనింగ్కు జిల్లాలోనే పలుకూరు ప్రసిద్ధి. గ్రామం చుట్టు పక్కల వేలాది ఎకరాల్లో నాపరాయి మైనింగ్ కొన్నేళ్లుగా జరుగుతోంది. ఈ క్రమంలో కూటమి నేతలు గ్రామంలోని రామేశ్వరస్వామి ఆలయ మాన్యం భూమిని ఆక్రమించి యథేచ్ఛగా మైనింగ్ చేస్తున్నారు. రామేశ్వరస్వామి ఆలయానికి సర్వే నంబరు 308లో నాలుగు ఎకరాల భూమి ఉంది. ఇందులో మైనింగ్ నిక్షేపాలు పుష్కలంగా ఉండటంతో అధికారపార్టీ నాయకుల కన్ను ఈ భూమిపై పడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఈ భూమి ఆక్రమణకు గురైంది. ఎటువంటి అనుమతులు లేకుండానే ఆక్రమణదారులు నాపరాతి మైనింగ్ పనులు చేపడుతున్నారు. మార్కెట్లో ప్రస్తుతం చదరం నాపరాయి విలువ సుమారు రూ.600 ఉంది. ఈ క్రమంలో రోజుకు 40–50 చదరాల నాపరాయి ఆలయ మాన్యం భూమిలో ఉత్పత్తి అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా నెలకు సుమారు రూ.10 లక్షల వరకు నాపరాయి విక్రయం ద్వారా ఆక్రమణదారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఆలయ మాన్యం భూమిలో అక్రమ మైనింగ్పై ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఆలయ ప్రధాన అర్చకులు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. రక్షణ ఒట్టి మాటలేనా.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దేవదాయ శాఖ భూములకు రక్షణ కల్పించే బాధ్యత తీసుకుంటుందని, ఆలయ భూములు భగవంతుడి భూములుగా భావించాలని, దేవదాయశాఖ భూముల జోలికి వెళ్తే సహించేది లేదని, ఆక్రమణ భూములు వెనక్కి తీసుకుంటామని ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సభల్లో భారీ ఉపన్యాసాలు ఇచ్చారు. ఇప్పుడు ఆ పార్టీ నేతలు ఆక్రమణలకు పాల్పడుతున్నా అడిగేవారు లేరు. పలుకూరులో అక్రమ మైనింగ్ విషయం దేవదాయ, మైనింగ్ శాఖ అధికారులకు తెలిసినా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దేవుడి భూమికే రక్షణ లేకపోతే ఎలా అంటూ గ్రామస్తులు విమర్శిస్తున్నారు. యథేచ్ఛగా కూటమి నేతల తవ్వకాలు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం -
ప్రారంభించరు.. పెళ్లిళ్లు జరగవు
డోన్: సన్నాయి రాగాలు.. మేళ తాళాలు.. వేద పండితుల పెళ్లి మంత్రాలు వినిపించాల్సిన ఆ కల్యాణ మండపాల్లో నిశబ్దం అలుముకుంది. వివాహాలతో కళకళలాడాల్సిన ఆ భవనాలు కూటమి నేతల పచ్చపాత పాలనతో ప్రారంభానికి నోచుకోవడం లేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం డోన్ నియోజకవర్గంలో నిర్మించిన రెండు తిరుమల తిరుపతి దేవస్థాన కల్యాణ మండపాలు రెండేళ్లయినా దేవదాయ, ధర్మదాయ శాఖ స్వాధీనం చేసుకోకుండా అధికార పార్టీ నేతలు అడ్డుపడుతున్నారు. దీంతో సుమారు రూ.8.50 కోట్లతో నిర్మించిన మండపాలు ప్రారంభానికి నోచుకోవడం లేదు. నియోజకవర్గ కేంద్రం డోన్తో పాటు మండలంలోని ప్రసిద్ధ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ ప్రాంగణంలో ప్రజల సౌకర్యార్థం కల్యాణ మండపాలను నిర్మించింది. వీటిని ప్రారంభిస్తే మంజూరుకు విశేష కృషి చేసిన రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డికి మరింత పేరు వస్తుందనే దురుద్దేశంతో కూటమి నేతలు అడ్టు తగులుతున్నారు. టీటీడీ నుంచి ఈ మండపాలను దేవదాయ శాఖ స్వాధీనం చేసుకోకుండా పచ్చ పార్టీ నేతలు అడ్డుకోవడం విడ్డూరంగా ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు. గతంలో కూడా ఇలాగే ఓ సంఘటన చోటు చేసుకుంది. గత టీడీపీ పాలనలో 2014 –19 మధ్యలో నియోజకవర్గానికి టీటీడీ కల్యాణ మండపాలు మంజూరైనా అప్పటి దేవదాయ శాఖ మంత్రి కేఈ కృష్ణ అడ్డుకున్నారు. ఆ సమయంలో డోన్ నుంచి బుగ్గన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తుండటం కారణమని అప్పట్లో చర్చ జరిగింది. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడంతో నియోజకవర్గం అభివృద్థి పథంలో ఉరకలు వేసింది. ఊరూరా రహదారులు, తాగునీటికి శాశ్వత పరిష్కారం చూపడం, ప్రభుత్వ విద్యాసంస్థలు మంజూరు కావడం జరిగింది. ఈ క్రమంలోనే డోన్, ఎస్. గుండాలలో కల్యాణ మండపాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గుండాల గ్రామంలో వెలసిన శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ ఆవరణలో రూ.3 కోట్లతో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి టీటీడీ పాలక మండలి అధ్యక్షులు వైవీ సుబ్బారెడ్డితో కలిసి కల్యాణ మండప నిర్మాణం ప్రారంభించారు. అలాగే డోన్ శివారులో కర్నూలుకు వెళ్లే 44వ జాతీయ రహదారి పక్కన రెండు ఎకరాల విస్తీర్ణంలో రూ.3కోట్ల వ్యయంతో నిర్మించిన టీటీడీ కల్యాణ మండపం కూడా ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు.ఆధునిక వసతులతో నిర్మాణంరెండు కల్యాణ మండపాలలో సుమారు వెయ్యి మంది కూర్చునేందుకు సువిశాలమైన హాలుతో పాటు పెళ్లికూతురు, పెళ్లికుమారుడికి విడిది గదులు, 10 నుంచి 20 మందికి సరిపడే సూట్లు, ఆధునిక వసతులతో కిచెన్, టాయ్లెట్స్, ముందు భాగం సువిశాలమైన పార్కింగ్ స్థలం, గార్డెనింగ్ ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఈ కల్యాణ మండపాలను టీటీడీ అధికారులు అప్పగించేందుకు ముందుకు వస్తున్నా దేవదాయ శాఖ రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి స్వాధీనం చేసుకునేందుకు వెనకడుగు వేస్తోంది. నిరుపయోగంగా రెండు టీటీడీ కల్యాణ మండపాలు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ. 8.50 కోట్లతో నిర్మాణం ప్రారంభించేందుకు అడ్డుతగులుతున్న కూటమి ప్రభుత్వం పాలకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు -
మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి
కర్నూలు: గణేష్ నిమజ్జన కార్యక్రమంలో భక్తులు, ప్రజల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, అత్యుత్సాహం ప్రదర్శించవద్దని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీసులకు సూచించారు. కర్నూలులో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో విధులు నిర్వహించాలన్నారు. బందోబస్తు విధులకు వచ్చిన పోలీసు అధికారులు, సిబ్బందితో ఎస్పీ బుధవారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయ పెరేడ్ మైదానంలో సమావేశమై దిశా నిర్దేశం చేశారు. హైదరాబాద్ తర్వాత గణేష్ నిమజ్జనం కర్నూలులోనే అత్యంత ప్రాధాన్యతగా జరుగుతుందన్నారు. విధుల పట్ల ఎవరూ అలసత్వం ప్రదర్శించకుండా కార్యక్రమం పూర్తిగా ముగిసే వరకు కేటాయించిన స్థానాల్లోనే ఉండాలన్నారు. కేసీ కెనాల్, వినాయక ఘాట్ పరిసర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించి అక్కడి సిబ్బందికి పలు సూచనలు చేశారు. నిమజ్జనం ప్రశాంతంగా ముగిసేందుకు మత పెద్దలు, రాజకీయ పార్టీలు, యువకులు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
ఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని సోమప్పనగర్ సమీపంలోని లక్ష్మీనరసింహ కాలనీలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కాగా తమ కుమారుడిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని యువకుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వారు తెలిపిన వివరాల మేరకు.. లక్ష్మీనరసింహ కాలనీకి చెందిన బోయ రాజు, లక్ష్మి దంపతులకు ముగ్గురు కుమారులు. వీరిలో రెండవ కుమారుడు వీరేంద్ర (19) ఆటో నడుపుతున్నాడు. ఎల్ల బీడు ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయిని గత కొన్ని నెలలుగా ప్రేమిస్తున్నాడు. ఇదే విషయంపై చాలా సార్లు అమ్మాయి, అబ్బాయి కుటుంబాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వీరేంద్ర తల్లిదండ్రులు తిరుమలకు వెళ్లారు. అయితే ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న వీరేంద్రకు మంగళవారం రాత్రి అమ్మాయి తరుఫు వారు ఫోన్ చేసి బయటకు రమ్మని చెప్పి తీసుకెళ్లారని, దాడి చేసి చంపేసి, ఆ తర్వాత తమ ఇంటి సమీపంలో ఉన్న షెడ్లో ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారని యువకుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఎల్ల బీడు ప్రాంతానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారే తన కుమారుడిని చంపేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ వద్ద యువతితో మాట్లాడిన వాయిస్ రికార్డ్స్ ఉన్నాయని చెబుతున్నారు. యువకుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని టౌన్ ఎస్ఐ మధుసూదన్రెడ్డి విలేకరులకు తెలిపారు. -
ప్రభుత్వ శాఖల సమన్వయంతో పిల్లల సంరక్షణ
కర్నూలు: ప్రభుత్వ శాఖల సమన్వయంతో పిల్లల సంరక్షణ చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీల వెంకట శేషాద్రి సూచించారు. జిల్లా న్యాయ సేవా సదన్లో పిల్లల కోసం స్నేహ పూర్వక న్యాయ సేవల పథకం–2024పై బుధవారం వర్కుషాపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలోని పిల్లల సంరక్షణ, రక్షణ బాధ్యత సంబంధిత ప్రభుత్వ శాఖలు తీసుకోవాలన్నారు. ప్రతి బిడ్డకు న్యాయం, గౌరవం దక్కేలా చూడాలన్నారు. లీగల్ సర్వీసెస్ యూనిట్ మెంబర్, శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్ మాట్లాడుతూ.. బాల్య వివాహాలను అరికట్టాలని సూచించారు. దివ్యాంగులైన పిల్లలను గుర్తించి వైద్య సేవలు అందిస్తున్నట్లు రిసోర్స్ పర్సన్, కర్నూలు డిజేబులిటీ డిపార్టుమెంట్ అసిస్టెంట్ డైరక్టర్ రైస్ ఫాతిమా చెప్పారు. నంద్యాల అడిసినల్ డీఎంహెచ్ఓ శారదాబాయి మాట్లాడుతూ.. అవసరమైన పిల్లలకు చికిత్సలు, ఉచితంగా మందులు అందిస్తున్నట్లు చెప్పారు. బడికి వెళ్లని పిల్లలను గుర్తించి స్కూళ్లలో చేర్పిస్తున్నట్లు ఐసీడీఎస్ పీడీ విజయ తెలిపారు. సమస్యలు ఉంటే చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ 1098కి ఫోన్ చేయవచ్చన్నారు. పిల్లలకు జెడ్పీ పాఠశాలల్లో సకల వసతులతో ఉచిత విద్యను అందిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి తెలిపారు. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సాంబశివరావు, గవర్నమెంట్ అబ్జర్వేషన్ హోం సూపరింటెండెంట్ హుస్సేన్బాషా, కర్నూలు డైస్ సెంటర్ మేనేజర్ ఇర్ఫాన్బాషా తదితరులు పాల్గొన్నారు. -
సత్తా చాటిన వెంకటగిరి వృషభాలు
కృష్ణగిరి: పుట్లూరు గ్రామంలో శ్రీ మాతా మారెమ్మ ఉత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన అంతర్ రాష్ట్ర స్థాయి పాల పళ్ల ఎద్దుల బండలాగుడు పోటీల్లో కోడుమూరు మండలం వెంకటగిరి గ్రామ శ్రేషాంక్ శ్రేయ వృషభాలు మొదటి స్థానంలో నిలిచాయి. రెండవ స్థానంలో నంద్యాల జిల్లా బేతంచెర్లకు చెందిన మేకల బానుఖా, వెంకటగిరి శ్రేషాంక్ శ్రేయల కు చెందిన వృషభాలు ఉమ్మడిగా నిలిచాయి. మూడవ స్థానంలో ఉయ్యాలవాడ మండలం నర్సిపల్లెకు చెందిన ఉప్పరి లక్ష్మీదేవి, సంజామల మండలం ముక్క మల్ల గ్రామానికి చెందిన ముసాని చంద్రశేఖర్రెడ్డి వృషభాలు ఉమ్మడిగా నిలిచాయి. నాల్గవ స్థానంలో తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం కంచుపాడుకు చెందిన వడ్డేమాను అంజనేయరెడ్డి వృషభాలు, ఐదవస్థానంలో సీ. బెళగల్ మండలం యనకండ్లకు భద్ర విజయభాస్కర్ వృషభాలు గెలుపొందినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలి పారు. ఈ పోటీల్లో 11 జతల ఎద్దులు పాల్గొనట్లు తెలిపారు. గెలుపొందిన ఎద్దుల యజమానులకు దాతలు సహకారంతో వరుసగా రూ. 25 వేలు, రూ. 20వేలు, రూ. 15 వేలు, రూ. 12వేలు, రూ.10వేలు అందజేశారు. నేడు న్యూ కేటగిరీ విభాగంలో.. బ్రహోత్సవాల్లో భాగంగా గురువారం న్యూ కేటగిరి విభాగంలో అంతర్ రాష్ట్ర బండలాగుడు పోటీలు ఉంటాయని కమిటీ సభ్యులు తెలిపారు. పోటీల్లో గెలు పొందిన వాటికి వరుసగా రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలను దాతల సహకారంతో అందిస్తున్నట్లు వారు తెలిపారు. -
తొగలగల్లులో వ్యక్తి దారుణహత్య
ఆస్పరి: తొగలగల్లు గ్రామానికి చెందిన అహోబిలం (33) అనే వ్యక్తి బుధవారం రాత్రి దారుణహత్యకు గురయ్యాడు. గ్రామస్తులు, ఆస్పరి సీఐ గంగాధర్ చెప్పిన వివరాలు మేరకు.. గ్రామానికి చెందిన అహోబిలం అనే వ్యక్తి పక్కనే ఉన్న కలపరి గ్రామంలో వివాహం చేసుకున్నాడు. ఆ గ్రామంలో మాల పున్నమి పండగ ఉండడంతో బుధవారం ఉదయం భార్య పిల్లలతో కలిసి వెళ్లాడు. అక్కడే భార్యను విడిచి రాత్రి స్వగ్రామానికి కాలినడకన తిరిగి ప్రయాణమయ్యాడు. మార్గమధ్యలో తొగలగల్లు – దొడగొండ గ్రామాల మధ్య గుర్తు తెలియని దుండగులు అహోబిలం గొంతు కోసి హత్య చేశారు. రోడ్డు పక్కన ఉన్న మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించడంతో హత్య వెలుగులోకి వచ్చింది. సంఘటనా స్థలానికి తొగలగల్లు గ్రామస్తులు తరలి వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు హత్య జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతుడుకి భార్య గంగమ్మ, కుమార్తె, కుమారుడు ఉన్నారు. -
రాజకీయ వివక్ష తగదు
కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక వసతులతో నిర్మించిన టీటీడీ కల్యాణ మండపాలు నిరుపయోగంగా ఉండటం దురదృష్టకరం. పేద, మధ్య తరగతి ప్రజలకు కల్యాణ మండపాలను అందుబాటులోకి తీసుకురాకుండా నిర్లక్ష్యం చేయడం కూటమి నేతల రాజకీయ వివక్షతకు నిదర్శనం. – మల్యాల భాస్కర్ రెడ్డి, రైతు, మల్యాల గ్రామం, డోన్ మండలం పేద ప్రజలు తమ పిల్లల వివాహాలను ప్రైవేటు ఫంక్షన్ హాళ్లలో నిర్వహించాలంటే ప్రస్తుతం ఖర్చు కూడన్నది. కొందరు సీజన్ అంటూ అధిక ధరలు వసూలు చేస్తున్నారు. టీటీడీ కల్యాణ మండపాలను వెంటనే వినియోగంలోకి తేవాలి పేద, మధ్యతరగతి ప్రజలపై భారం తగ్గుతుంది. – నరసింహారెడ్డి, యాపదిన్నె గ్రామం, డోన్ మండలం టీటీడీ చేపట్టే ధార్మిక కార్యక్రమాలలో భాగంగా గుండాలలో రూ.5 కోట్లతోనూ, పట్టణంలో రూ.3.5 కోట్లతో కల్యాణ మండపాలను నిర్మించింది. రాజకీయ విబేధాలు పక్కకు పెట్టి వీలైనంత త్వరగా వాటిని ప్రజలకు అందుబాటులోకి తేవాలి. – పోస్టు ప్రసాద్, వైఎస్సార్సీపీ జిల్లా వలంటీర్ విభాగం అధ్యక్షులు -
తెలుగు ఉపాధ్యాయుడికి రాష్ట్ర అవార్డు
సి.బెళగల్: బురాన్దొడ్డి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు సబ్జెక్టును బోధిస్తున్న ముతుకూరి గోపాలచార్యులు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. ఆయనను ఎంఈఓలు జ్యోతి, ఆదామ్బాషా, పాఠశాల హెచ్ఎం అబ్దుల్ హకీమ్, పాఠశాలలో సహచర ఉపాధ్యాయులు అభినందించారు. ముతుకూరి గోపాలచార్యులు స్వగ్రామం గోరంట్ల కాగా.. వీరి తండ్రి ఎంవీ రమణాచార్యులు ప్రసిద్ధ కవి. వీరి కుటుంబంలో ఆరుగురు ఉపాధ్యాయులు పనిచేయడం మరో విశేషం. ముతుకూరి గోపాలచార్యులు ఎంటెక్ పూర్తి చేసి హెచ్ఎంటీ లిమిటెడ్లో జీఎంగా (జనరల్ మేనేజర్గా) పని చేసేవారు. సర్వీస్ ఉన్నప్పటికీ దానిని వదిలేసి, ఎంఏ తెలుగు, టీపీటీ, ఎంఏ సంస్కృతం పూర్తి చేసి 2003లో ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించారు. . విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో పాఠాలను బోధించి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక అయ్యారు. -
మద్యం మత్తులో తండ్రి హత్య
కరప: కూటమి ప్రభుత్వంలో ఏరులై పారుతున్న మద్యం బంధాలను చిదిమేస్తోంది. మద్యం మత్తు తండ్రీకొడుకుల మధ్య ఘర్షణకు దారి తీసి, చివరికి తండ్రిని తనయుడు కడతేర్చేలా చేసిన ఘటన కాకినాడ జిల్లా కరప పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మొండి గ్రామానికి చెందిన కాలాడి సూర్యచంద్రరావు(50)కు నలుగురు కుమారులు. పెద్ద కుమారుడు ధనుంజయ్కు వివాహం కాగా వేరు కాపురం పెట్టాడు. భార్య అనారోగ్యంతో మరణించగా, తండ్రి మిగిలిన ముగ్గురి కుమారులతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో సూర్యచంద్రరావు మద్యానికి బానిసయ్యాడు. రెండో కుమారుడు చంద్రశేఖర్ పనిచేస్తూ, అన్నీ చూసుకుంటూ, వంట చేసి పెడుతుంటాడు. చిన్నకుమారుడు మహేష్ ఫిట్స్ వ్యాధిగ్రస్తుడు. ఈ నేపథ్యంలో మంగళవారం మహేష్ కు మందులు తీసుకురమ్మని తండ్రికి చంద్రశేఖర్ రూ.500 ఇచ్చాడు. సూర్యచంద్రరావు ఆ డబ్బుతో మద్యం తాగి వచ్చాడు. దీంతో అప్పటికే మద్యం తాగి ఉన్న చంద్రశేఖర్ తండ్రితో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున తండ్రి తలపై గొడ్డలి తిరగేసి దాడి చేయడంతో సూర్యచంద్రరావు మృతి చెందాడు. సమాచారం అందుకున్న కాకినాడ రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
దైవదర్శనానికి వెళ్తూ తిరిగిరాని లోకాలకు..
● ఆటో బోల్తా పడి మహిళ దుర్మరణం ● మరో ముగ్గురికి గాయాలు మద్దికెర: దైవదర్శనానికి వెళ్తున్న ఓ మహిళ ఆటో బోల్తా పడిన ఘటనలో తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. మద్దికెరకు చెందిన లలితమ్మ(55)తోపాటు పలువురు అరుణాచలం దేవస్థానానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా మంగళవారం మద్దికెర నుంచి గుంతకల్లు రైల్వే స్టేషన్కు రెండు ఆటోల్లో బయలుదేరారు. రైల్వే స్టేషన్ సమీపంలోని మలుపు వద్ద ఓ ఆటో బోల్తా పడింది. ప్రమాదంలో నలుగురు మహిళలు గాయపడడంతో చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించారు. లలితమ్మ కోలుకోలేక మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలికి భర్త శ్రీనివాసులు, ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. -
పెద్దాసుపత్రి సూపరింటెండెంట్కు పదోన్నతి
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లుకు పదోన్నతి లభించింది. ప్రొఫెసర్గా ఉన్న ఆయనకు అడిషనల్ డీఎంఈగా పదోన్నతి కల్పిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ బాబు మంగళవారం జీవో జారీ చేశారు. డాక్టర్ వెంకటేశ్వర్లు గుంటూరులో ఎంబీబీఎస్ను, తిరుపతి స్విమ్స్లో ఆర్థో పీజీని అభ్యసించారు. ఆ తర్వాత కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో ఆర్థోపెడిక్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా, అసోసియేట్ ప్రొఫెసర్గా, ప్రొఫెసర్గా, హెచ్ఓడీగా పనిచేశారు. గత సంవత్సరం అక్టోబర్ 29న ఆయన ఆసుపత్రి సూపరింటెండెంట్గా ఫుల్ అడిషనల్ చార్జి(ఎఫ్ఏసీ)తో నియమితులయ్యారు. ప్రస్తుతం పదోన్నతితో రెగ్యులర్ సూపరింటెండెంట్గా కొనసాగనున్నారు. -
7న జిరాక్స్, ఇంటర్నెట్ కేంద్రాలను మూసివేయండి
కర్నూలు(అర్బన్): ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నియామకాలకు స్క్రీనింగ్ పరీక్ష నేపథ్యంలో ఈ నెల 7న ఆయా పరీక్ష కేంద్రాల పరిసరాల్లోని జీరాక్స్, ఇంటర్నెట్ కేంద్రాలను మూసి వేయాలని ఉప కార్మిక కమిషనర్ కె.వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయా పరీక్షలను ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జిల్లాలోని వివిధ పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు ఆయన మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పరీక్షా కేంద్రాల పరిసరాల్లోని జిరాక్స్, నెట్ సెంటర్లను ఆయా సమయాల్లో మూసివేయాలని, లేని పక్షంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 19న పోస్టల్ కార్యాలయంలో ఫిర్యాదుల స్వీకరణ కర్నూలు(అర్బన్): తపాల శాఖ కార్యాలయాల్లో ప్రజలకు అందించే సేవలకు సంబంధించిన ఫిర్యాదులను ఈ నెల 19న స్వీకరిస్తామని కర్నూలు డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ జి.జనార్దన్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోస్టు ద్వారా ఫిర్యాదులను పంపే వారు కవర్పై డాక్ అదాలత్ అని పెద్ద అక్షరాలతో రాసి ఈ నెల 15వ తేది లేదా అంతకు ముందే తమకు చేరేలా పంపాలన్నారు. ఫిర్యాదుదారులు నేరుగా 19న ఉదయం 11 గంటలకు నిర్వహించే డాక్ అదాలత్కు హాజరు కావచ్చన్నారు. ఫిర్యాదును పరిశీలించిన అనంతరం అర్జీ పరిష్కార లెటర్, ఈ మెయిల్ ద్వారా తెలియజేస్తామన్నారు. కర్నూలు సర్కిల్ ఎస్ఈకి అదనపు బాధ్యతలు కర్నూలు సిటీ: జల వనరుల శాఖ కర్నూలు సర్కిల్ పర్యవేక్షక ఇంజనీర్గా పని చేస్తున్న బి.బాల చంద్రారెడ్డికి శ్రీశైలం డ్యాం నిర్వహణ పర్యవేక్షక ఇంజనీర్గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ మంగళవారం ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జి.సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీశైలం డ్యాం నిర్వహణ పర్యవేక్షక ఇంజనీర్ పోస్టు రెండున్నర నెలలుగా ఖాళీగా ఉంది. జూన్ నెలలో అక్కడ పర్యవేక్షక ఇంజనీర్గా పని చేస్తున్న పి.శ్రీరామచంద్రమూర్తి పదోన్నతిపై కడప ప్రాజెక్ట్స్ సీఈగా వెళ్లారు. అప్పటి నుంచి ఆయన అదనపు బాధ్యతలు నిర్వహిస్తూ గత నెల 31న పదవీ విరమణ పొందారు. దీంతో ఆ స్థానంలో బి.బాల చంద్రారెడ్డికి అదన పు బాధ్యతలు అప్పగించారు. ఉర్దూ వర్సిటీ పీజీ సెమిస్టర్ ఫలితాలు విడుదల కర్నూలు కల్చరల్ : డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ వర్సిటీలో గత ఏప్రిల్ నెలలో జరిగిన పీజీ రెండు, నాలుగో సెమిస్టర్ ఫలితాలను మంగళవారం ఇన్చార్జ్ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ పీఎస్ షావలి ఖాన్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.లోకనాథ్ విడుదల చేశారు. ఎంఏ ఉర్దూ, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ ఎకనా మిక్స్, ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్, ఎమ్మెస్సీ బా టనీ, ఎమ్మెస్సీ జువాలజీ, ఎమ్మెస్సీ, ఇండస్ట్రియ ల్ కెమిస్ట్రీ, ఎంబీఏ, ఎంసీఏ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు రిజిస్ట్రార్ పేర్కొన్నారు. విద్యార్థులు తమ ఫలితాలను యూనివర్సిటీ వెబ్సైట్ https:// ahuuk. ac. in/ నుంచి పొందగలరని తెలిపారు. ఫలితాల విడుదలకు కృషి చేసిన ఎగ్జామినేషన్ విభాగం సిబ్బందిని వారు అభినందించారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.మహబూబ్ బాషా, ఎగ్జామినేషన్ విభాగం సైన్స్ కో–ఆర్డినేటర్ డాక్టర్ ఎం.నబియా సుల్తానా, ఆర్ట్స్ కో–ఆర్డినేటర్ డాక్టర్ బి.వెంకటప్ప, సిబ్బంది బి.మురళి, మరియా ఖాతున్ పాల్గొన్నారు. 4, 5 తేదీల్లో కర్నూలు మార్కెట్ యార్డుకు సెలవు కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డుకు 4, 5 తేదీల్లో సెలవు ప్రకటించినట్లు మార్కెట్ కమిటీ సెక్రటరీ జయలక్ష్మి తెలిపారు. ఈనెల 4వ తేదీ వినాయక నిమజ్జనం, 5వ తేదీన మిలాద్–ఉన్–నబి ఉన్నందున మార్కెట్ యార్డుకు సెలవు ఉంటుందని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయా రోజుల్లో మార్కెట్ యార్డులో ఉల్లిగడ్డలతో సహా ఎలాంటి పంటలను కొనుగోలు చేయడం జరగదన్నారు. 6వ తేదీ నుంచి యథావిధిగా అన్ని పంటల క్రయవిక్రయాలు కొనసాగుతాయన్నారు. -
ఐక్యతకు ప్రతీక గణేష్ మహోత్సవాలు
కర్నూలు కల్చరల్: గణేష్ ఉత్సవాలు ఐక్యతకు ప్రతీక గా నిలుస్తున్నాయని, సంఘటితంగా ప్రశాంత వాతా వరణంలో జరుపుకుందామని శ్రీగణేష్ మహోత్సవ కేంద్ర సమితి జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ అన్నారు. మంగళవారం వినాయక్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మూడు, ఐదు రోజుల్లో వినాయక నిమజ్జనం విజయవంతమైందన్నారు. ఈనెల 4వ తేదీన కర్నూలు నగరంలో ఉద యం 9 గంటలకు ఓల్డ్సిటీలోని రాంబొట్ల ఆలయం వద్ద నుంచి వినాయక నిమజ్జన మహోత్సవ శోభాయా త్ర ప్రారంభమవుతుందన్నారు. నాలుగు దశాబ్దాల క్రితం రెండు విగ్రహాలతో ప్రారంభమైన ఉత్సవాలు క్రమంగా 2,200 విగ్రహాలకు చేరుకున్నాయన్నారు. ● ఉత్సవ సమితి జిల్లా సంఘటనా కార్యదర్శి మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్కు ఉత్సవాలను అంకితమిస్తున్నామన్నారు. ఎలాంటి అసాంఘిక, అశ్లీలతకు తావులేకుండా సంప్రదాయ బద్ధంగా వినాయక శోభాయాత్రను, నిమజ్జన వేడుకను జరుపుకుందామన్నారు. రాత్రి 7 గంటలకు ప్రత్యేకంగా గంగాహారతి ఉంటుందన్నారు. ● సమితి నగర అధ్యక్షుడు రంగస్వామి మాట్లాడుతూ కేంద్ర సమితి సూచనలు పాటించి ఎలాంటి ఘర్షణ వాతావరణం లేకుండా నిమజ్జనోత్సవం ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు వినాయక ఘాట్లో నిమజ్జనం ప్రారంభ మవుతుందన్నారు. మొత్తం 8 ఘాట్లలో 10 క్రేన్లతో 2వేల మంది వలంటీర్లతో నిజమ్జన కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఆర్ఎస్ఎస్ ప్రాంత సహ కార్యవాహ ఎం.శ్రీనివాసరెడ్డి సందేశమిస్తారన్నారు. ● సమావేశంలో ఉత్సవ సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి గోరంట్ల రమణ, నగర ప్రధాన కార్యదర్శి సీవీ గిరిరాజవర్మ, నగర ఉపాధ్యక్షులు కాశీవిశ్వనాథ్, సమన్వయ కార్యదర్శి బాను ప్రకాష్, ప్రచార ప్రముఖ్ అక్కెం విశ్వనాథ్, తదితరులు పాల్గొన్నారు. -
గుంతలో దిగబడి..రేషన్ దందా పట్టుబడి
● పత్తి కొండ సమీపంలో రేషన్ బియ్యం లారీ పట్టివేత ● కర్ణాటకకు తరలిస్తుండగా గుంతలో దిగబడిపోయిన లారీ పత్తికొండ: పేదలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యాన్ని కొందరు అధికార పార్టీ నాయకులు బ్లాక్మార్కెట్కు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఏడాది కాలంగా ఈ దందా యథేచ్ఛగా సాగుతున్నా అధికారులు పట్టుకోలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రహదారిపై పడిన గుంతలే మంగళవారం లారీ రేషన్ బియ్యాన్ని పట్టించాయి. వివరాల్లోకి వెళితే.. పత్తికొండ పట్టణం నుంచి వెళ్లే ఆదోని రహదారి గుంతలమయంగా మారింది. ఎప్పటిలాగే ఈ దారిలో అక్రమార్కులు సేకరించిన రేషన్బియ్యాన్ని లారీలో కర్ణాటకకు తరలిస్తున్నారు. గోపాల్ ప్లాజా దగ్గర మొయిన్ రోడ్డు మార్గమధ్యలో టైరు గుంతలో ఇరుక్కుపోయి లారీ ఒరిగింది. ఆ సమయంలో బియ్యం కింద రాలడంలో అనుమానం వచ్చిన స్థానికులు వెంటనే ఆర్డీఓ భరత్నాయక్కు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఆయన సిబ్బందితో అక్కడికి చేరుకొని పరిశీలించి లారీని పోలీసు స్టేషన్కు తరలించారు. అనంతరం పంచనామా కోసం రేషన్ బియ్యం నిల్వ ఉంచే స్టాకు పాయింట్ గోడౌన్కు పంపారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకోవడంతో పాటు 200 రేషన్ బియ్యం సంచులను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఆర్డీఓ తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. -
అభిమానం.. సజీవం!
● కర్నూలు నగరంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ శ్రేణులతో కలిసి స్థానిక ఎస్వీ కాంప్లెక్స్ నుంచి వైఎస్సార్ సర్కిల్ వరకు ప్రదర్శనగా వెళ్లి దివంగత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళుర్పించారు. పార్టీ నగర అధ్యక్షుడు అహమ్మద్ ఆలీఖాన్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేందర్ రెడ్డి, పార్టీ నేతలు పాల్గొన్నారు. ● కల్లూరులోని శరీన్ నగర్లో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో పాణ్యం మాజీ ఎమ్మెల్యే, నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళుర్పించారు. జోహార్ వైఎస్సార్ అంటూ పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు. పార్టీ రీజినల్ అధ్యక్షురాలు గాజుల శ్వేతారెడ్డి, డిప్యూటీ మేయర్ సిద్దారెడ్డి రేణుక, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ● పెద్దటేకూర్లో వైఎస్సార్సీపీ నాయకుడు హనుమంతురెడ్డి ఆధ్వర్యంలో ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.అతిథిగా మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి హాజరయ్యారు. ● పత్తికొండ నియోజవర్గం తుగ్గలిలో మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ శ్రేణలతో కలిసి స్థానిక వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంక్షేమానికి మారుపేరుగా వైఎస్సార్ ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నారన్నారు. ● ఆదోని పట్టణంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. వైఎస్సార్సీపీ శ్రేణులు, పార్టీ కార్యకర్తలు స్థానిక ఎస్కేడీ కాలనీలోని వైఎస్సార్ కార్యాలయం నుంచి మెయిన్ రోడ్డు గోషాసుపత్రి వద్దనున్న వైఎస్సార్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ పాల్గొన్నారు. వైఎస్సార్ ఆశయాలను సాధిద్దామని పిలుపునిచ్చారు. కల్లూరులో వైఎస్సార్ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి, నాయకులుకర్నూలు ఆర్ఎస్ రోడ్డులో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్నమాజీ ఎమ్మెల్యే ఎస్వీమోహన్రెడ్డిసంక్షేమానికి మారుపేరుగా నిలిచిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి భౌతికంగా దూరమై 16 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ ఆయన ప్రజల గుండెల్లో సజీవంగా ఉన్నారు. ఊరూవాడా ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాల వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు, అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన పాలనను గుర్తు చేసుకోవడంతో పాటు పార్టీలు, కులమతాలకు అతీతంగా కలిగిన లబ్ధిని స్మరించుకున్నారు. పారే నీటిలో ఆయన రూపమే కనిపిస్తుంది.. లక్షలాది గుండెల్లో ఆయన పేరు వినిపిస్తోంది.. ఒక్కో పథకం ఓ చరిత్ర. మంగళవారం మహానేత వర్ధంతి నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నివాళులర్పించారు. జోహార్ వైఎస్సార్ నినాదాలను హోరెత్తించారు. ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలతో పాటు పార్టీ కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు. సేవా కార్యక్రమాలు చేపట్టి వైఎస్సార్పై అభిమానం చాటుకున్నారు. – కర్నూలు(టౌన్)అందరివాడు వైఎస్సార్ పాణ్యం:దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి అందరివాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి అన్నారు. వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం కల్లూరు మండల పరిధిలోని శరీన్నగర్లో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాటమీద నిలబడే వ్యక్తిత్వం వైఎస్సార్ సొంతమన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో కొలువయ్యారన్నారు. రాయలసీమకు తలమానికమైన గోరుకల్లు జలాశయంతో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారన్నారు. 1.92లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు గాలేరునగరి ద్వారా చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాలకు తాగునీరు అందిస్తున్న ఘనత ఆయనదేనన్నారు. రైతు భరోసాతో పాటు ఉచిత విద్యుత్ను అందించి అన్నదాతకు అండగా నిలిచారన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రెడ్బుక్తో వైఎస్సార్సీపీ శ్రేణులను భయపెట్టాలని చూస్తోందన్నారు. 1979లోనే ఇలాంటి బుక్లను ఎన్నో చూశామని, భయపడే ప్రసక్తే లేదన్నారు. అన్నింటికీ స్వస్తి పలికి ప్రజల కోసమే జీవిస్తున్నామన్నారు. పార్టీ శ్రేణులకు అన్నివిధాల అండగా నిలుస్తామని భరోసా కల్పించారు. వైఎస్సార్ స్ఫూర్తిని కొనసాగిద్దాం కర్నూలు(టౌన్): ప్రజల గుండెల్లో కొలువైన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి స్ఫూర్తిని కొనసాగించేందుకు ప్రతిన బూనుదామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన ఎస్వీ కాంప్లెక్స్ సమీపంలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదల ఆర్థికాభివృద్ధికి వైఎస్సార్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు. కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించి వేలాది ప్రాణాలను కాపాడారని గుర్తు చేశారు. ఆయన అడుగు జాడల్లో నడుస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండింతలు ఎక్కువగా సంక్షేమాన్ని ప్రజల ఇళ్లకే చేర్చారన్నారు. -
మరికొందరికి జీవితాన్నిస్తూ!
మట్టిలో కలిసిపోతూ ● అవయవ దానం పట్ల పెరుగుతున్న అవగాహన ● కర్నూలు జీజీహెచ్, రెండు ప్రైవేటు ఆసుపత్రులకు అవయవ మార్పిడికి అనుమతి ● బ్రెయిన్ డెడ్ తర్వాతే అవయవాల సేకరణ రక్తదానం, నేత్రదానంతో పాటు బ్రెయిన్డెడ్ అయిన వారి నుంచి అవయవాలను సేకరించి ఇతరులకు అమర్చేందుకు ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ద్వారా అవసరమైన క్యాంపెయిన్ చేస్తున్నాము. ఇప్పటికే 30వేల మందితో అంగీకార పత్రాలు తీసుకున్నా ము. జిల్లాలో లక్ష మందితో అంగీకార పత్రాలు తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. యూరప్ దేశా ల్లో మాదిరిగా ఇక్కడ కూడా బ్రెయిన్డెడ్ అయిన వారికి ప్రత్యేక ఐసీయూ ఉంటే బాగుంటుంది. –డాక్టర్ కేజీ. గోవిందరెడ్డి, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ జిల్లా ఛైర్మన్, కర్నూలు బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి మాత్రమే అవయవాలను సేకరించి ఇతరులకు అమరుస్తారు. కిడ్నీలైతే బ్రెయిన్ డెడ్ అయిన వారి(కెడావర్),జీవించి ఉన్న వ్యక్తుల(లై వ్) నుంచి ఒక కిడ్నీని సేకరించి అవసరమైన వారికి అమరుస్తారు. ఇలా కిడ్నీ ఆపరేషన్ చేయించుకున్న వారు కొంత కాలం పాటు ఇన్ఫెక్షన్ రాకుండా జాగ్రత్త పడితే జీవితాంతం హాయిగా జీవించవచ్చు. –డాక్టర్ అబ్దుల్ సమద్, యురాలజిస్టు, కర్నూలు నేను కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మేల్ స్టాఫ్నర్సుగా విధులు నిర్వహిస్తూ 2023లో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ కో ఆర్డినేటర్గా శిక్షణ పొందాను. ఇప్పటి వ రకు ఐదుగురికి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్లో అవయవాలు ఇచ్చేలా వారి కుటుంబాలను కౌన్సిలింగ్ చేసి ఒప్పించాము. ఒక బ్రెయిన్డెడ్ అయిన వ్యక్తి ద్వారా సేకరించిన అవయవాలతో 8 మంది జీవితాలలో వెలుగు నింపవచ్చు. –టి.సంపత్, మేల్ స్టాఫ్నర్సు, జీజీహెచ్, కర్నూలు కర్నూలు(హాస్పిటల్): అవయవదానమంటే ఇప్పటి కీ చాలా మందిలో అపోహలున్నాయి. మన అవ యవాలను బతికున్నప్పుడే సేకరించి ఇతరులకు అమరుస్తారని కొందరు, మరణించాక అవయవాలను తీస్తే వచ్చే జన్మలో సంబంధిత అవయవాలు లేకుండా జన్మిస్తారన్న మూఢనమ్మకంతో మరికొందరు అవయవదానానికి ముందుకు రావడం లేదు. ఇలాంటిి అపోహలను ఒకవైపు జీవనదాన్ ట్రస్ట్, మరోవైపు ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీలు తమ వంతుగా అవగాహన కల్పిస్తున్నాయి. ఈ మేరకు ఇటీవల కాలంలో అవయవదానం చేయడానికి చాలా కుటుంబాలు ముందుకు వస్తున్నాయి. ఈ మేరకు దాతలు ముందుకు వచ్చి తమ శరీర భాగాలను మరణానంతరం దానం చేసేందుకు అంగీకార పత్రాలు ఇస్తున్నారు. మరికొందరు వివిధ ప్రమాదాలు, అనారోగ్యాల సందర్భంగా బ్రెయిన్ డెడ్ కావడంతో వారి కుటుంబ సభ్యుల అనుమతితో వారి అవయవాలను సేకరిస్తున్నారు. మరికొందరు రక్తసంబంధీకుల కోసం వారి అవయవాలను దానం చేస్తున్నారు. ఈ మేరకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతో పాటు కర్నూలు కిమ్స్ హాస్పిటల్, మెడికవర్ హాస్పిటల్లకు అవయవాల సేకరణ, మార్పిడిలకు అనుమతి లభించింది. ఈ మేరకు ఆయా ఆసుపత్రుల్లో అవయవదాన, మార్పిడి ఆపరేషన్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రామాంజనేయులు, ఎస్తేరిరాణి, మల్లికార్జున, ఈరన్న, గిరిధర్లకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేశారు. కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఇటీవల చేసిన కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతం అయినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు చెప్పారు. మంగళవారం ఆయన తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆసుపత్రిలో ఇప్పటి వరకు ఐదుగురికి కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు నిర్వహించినట్లు తెలిపారు. కిడ్నీతో పాటు గుండె, ఊపిరితిత్తుల మార్పిడికి సైతం అనుమతి వచ్చిందన్నారు. త్వరలో ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. జీవన్దాన్ ట్రస్ట్ ద్వారా అవగాహన ఎవరైనా ఓ వ్యక్తి మరణించినా అతని గుండె స్పందిస్తుంది. ఊపిరితిత్తులు శ్వాసిస్తుంటాయి. నేత్రాలు వీక్షిస్తుంటాయి. మూత్రపిండాలు మరొకరిలో రక్తశుద్ధి చేస్తూనే ఉంటాయి. మరణించిన వ్యక్తి మన మధ్య లేకపోయినా అతని శరీరంలోని అవయవాలు మరొకరికి పునర్జన్మను ప్రసాదిస్తున్నాయి. మట్టిలో కలిసిపోతూ అవయవదానంతో మరొకరి జీవితాన్ని నిలుపుతుండటంతో ప్రస్తుతం అన్ని దానాల్లో కన్నా అవయవదానం గొప్పదిగా నిలిచింది. అవయవదాన అవగాహన పై ప్రత్యేక కథనం. అవయవదానాలనుప్రోత్సహించేందుకు ప్రభు త్వం ఆధ్వర్యంలో జీవన్దాన్ ట్రస్ట్ పనిచేస్తుంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో బ్రెయిన్డెడ్ అయిన వ్యక్తుల సమాచారాన్ని ఈ ట్రస్ట్కు అందిస్తే వారు అవయవాలను సేకరించి అవసరం ఉన్న రోగులకు అమరుస్తారు. అయితే ఎవ్వరికై నా అవయవాలు కావాల్సి వస్తే ముందుగా ఈ ట్రస్ట్లో పేరు నమోదు చేసుకోవాలి. ప్రాధాన్యత క్రమాన్ని బట్టి సేకరించిన అవయవాలను నిపుణుల పర్యవేక్షణలో అవసరమైన వారికి అమరుస్తారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోనూ జీవన్దాన్ ట్రస్ట్ ప్రతినిధులను ఏర్పాటు చేశారు. వీరు ఎవరైనా బ్రెయిన్డెడ్ అయితే వారి కుటుంబ సభ్యులను అవయవదానానికి ఒప్పిస్తారు. కానీ ఇప్పటికీ చాలా మందికి బతికున్నప్పుడు అవయవాలను సేకరిస్తారనే అపోహ ఉంది. ఇది తప్పు. జీవించిఉన్నప్పుడు అవయవాలు తీయరు. -
ఎరువుల దుకాణాల తనిఖీ
ఎమ్మిగనూరు రూరల్: పట్టణంలోని సాయిరాం సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ దుకాణంలో మంగళవారం మండల వ్యవసాయాధికారి మదిరెపల్లి శివశంకర్, పట్టణ ఎస్ఐ మధుసూదన్రెడ్డి తనిఖీలు నిర్వహించారు. ఎరువుల అమ్మకాలు, రికార్డులు, పురుగు మందులను పరిశీలించారు. మాట్లాడుతూ దుకాణంలోని రికార్డులను, స్టాక్ను పరిశీలించగా ‘ఓ’ ఫామ్ ఇన్క్లూడ్ చేయకుండా మందులు విక్రయిస్తున్నట్లు గుర్తించి రూ.6,83,303 విలువ చేసే 13.129 మెట్రిక్ టన్నుల ఎరువుల విక్రయాలు నిలిపేశారు. డీలర్లు ఓ ఫామ్ ఇంక్లూడ్ చేయకుండా రసాయన, పురుగు మందుల ఎరువుల విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏఓ శివశంకర్ హెచ్చరించారు. కోడుమూరులో.. కోడుమూరు రూరల్: స్థానిక ఎరువుల దుకాణాలపై ఎస్ఐ ఎర్రిస్వామి తన సిబ్బందితో మంగళవారం దాడులు నిర్వహించారు. ఎరువుల దుకాణాల్లోని స్టాక్, సేల్స్ రికార్డులతోపాటు గోదాముల్లోని ఎరువుల నిల్వలను పరిశీలించారు. యూరియా, ఇతర ఎరువులను బ్లాక్ చేసి, అధిక ధరలకు విక్రయిస్తున్న దుకాణదారుల రికార్డులను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కాగా రికార్డులను స్వాధీనం చేసుకోవడాన్ని నిరసిస్తూ ప్రైవేట్ ఏజెన్సీలు, దుకాణదారులు తమ దుకాణాలను మూసివేసి నిరసన తెలిపారు. ఎన్నడూ లేని విధంగా ఎరువుల దుకాణాల్లో పోలీసుల సోదాలు ఏమిటని వాపోయారు. -
ఏడి‘పింఛన్’
● ఇంటి వద్దనే పింఛన్ల పంపిణీ ఉత్తిదే ● సచివాలయాల వద్ద లబ్ధిదారుల పడిగాపులు కోవెలకుంట్ల: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామ సచివాలయాలు, ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులతో లబ్ధిదారులకు ఇళ్ల వద్దే పింఛన్లు అందజేస్తున్నామని గొప్పలు చెబుతోంది. కొన్నిచోట్ల ఆచరణలో అమలు చేయకపోవడంతో లబ్ధిదారులు పింఛన్ల కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. కోవెలకుంట్ల మేజర్ పంచాయతీలో సెప్టెంబర్ నెల పింఛన్లు తీసుకునేందుకు లబ్ధిదారులు రెండవ రోజు మంగళవారం అవస్థలు పడాల్సి వచ్చింది. కొందరు సిబ్బంది తొలిరోజున ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయకపోవడంతో రోజంతా ఎదురు చూసిన లబ్ధిదారులు.. మంగళవారం గ్రామ సచివాలయం వద్దకు చేరుకుని పడిగాపులు కాశారు. ఉదయం 10 గంటల తర్వాత సిబ్బంది గ్రామ సచివాలయంలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయడంతో అక్కడి నుంచి ఇళ్లకు వెళ్లిపోయారు. -
లక్ష్యం దిశగా అడుగులేయాలి
● అంతర్జాతీయ క్రికెటర్ అంజలి శర్వాణి ఆదోని సెంట్రల్: ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకుని ప్రణాళికా బద్ధంగా కృషి చేస్తే విజయం సొంతమవుతుందని అంతర్జాతీయ క్రికెటర్ అంజలి శర్వాణి సూచించారు. ఆరెకల్లు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు ఉషారాణి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో అంజలి శర్వాణి మాట్లాడుతూ తాను ఈ స్థాయికి రావడానికి గురువుల శిక్షణతో పాటు తల్లిదండ్రుల సహకారం ఎంతో ఉందన్నారు. ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడల్లో పాల్గొనాలన్నారు. క్రీడల పేరుతో చదువును నిర్లక్ష్యం చేయరాదన్నారు. అనంతరం అంజలి శర్వాణిని ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమములో వ్యాయామ ఉపాధ్యాయుడు మహేంద్ర పాల్గొన్నారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి డోన్ టౌన్: పట్టణంలోని రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాం–3పై గుర్తుతెలియని వ్యక్తి (36)మృతి చెందినట్లు రైల్వే ఎస్ఐ బిందుమాధవి మంగళవారం తెలిపారు. కొద్ది రోజులుగా రైల్వే స్టేషన్ చుట్టు పక్కల తిరిగుతండేవాడని, అనారోగ్యంతో మృతి చెంది ఉంటాడని ఎస్ఐ తెలిపారు. మృతుదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించామన్నారు. వివరాలు తెలిసిన వారు స్థానిక రైల్వే స్టేషన్లో సమాచారం ఇవ్వాలన్నారు. యూరియా స్వాధీనం హాలహర్వి: ఆస్పరి నుంచి కర్ణాటక రాష్ట్రానికి అక్రమంగా ఆటోలో తరలుతున్న యూరియాను క్షేత్రగుడి చెక్పోస్టు వద్ద మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి రశీదులు లేకపోవడంతో డ్రైవర్ను విచారిస్తున్నారు. -
గ్రేడింగ్ పేరుతో రైతుకు అన్యాయం
కర్నూలు(అగ్రికల్చర్): ఉల్లికి మద్దతు ధర కల్పిస్తున్నామంటూనే గ్రేడింగ్ పేరుతో ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేస్తోంది. ఓ రైతు మంగళవారం కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డుకు 95 ప్యాకెట్ల ఉల్లి తెచ్చాడు. ఉల్లిలో నాణ్యత లేదని నాలుగు సార్లు గ్రేడింగ్ చేయించి 35 ప్యాకెట్లు పక్కన పోశారు. మిగతా 60 ప్యాకెట్లకు మాత్రమే మద్దతు ధర రూ.1,200 చొప్పున మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేశారు. ఇష్టారాజ్యంగా గ్రేడింగ్ చేయిస్తుండటం వల్ల మద్దతు ధర కల్పించినా ప్రయోజనం లేదని రైతులు వాపోతున్నారు. ఉల్లిలో నాణ్యత ఉండాల్సిందేనని, అయితే ఒకసారి గ్రేడింగ్ చేయిస్తే సరిపోతుందని, మూడు, నాలుగు సార్లు గ్రేడింగ్ చేయిస్తుండటం సరికాదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్క్ఫెడ్ మద్దతు ధరతో ఉల్లి కొనుగోలు చేయాలంటే ముందుగా ఉద్యాన, మార్కెటింగ్ శాఖ అధికారులు నాణ్యతను ధ్రువీకరించాలి. నాణ్యత లేకపోతే గ్రేడింగ్ చేయించాలి. అయితే ఎక్కువ సార్లు గ్రేడింగ్ చేయించడం వల్ల రైతులు నష్టపోవాల్సి వస్తోంది. -
ఆయుష్లో కాంపౌండర్లే డాక్టర్లు!
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ఆయుష్ విభాగంలో ఉన్న ఆయుర్వేదిక్, హోమియో డిస్పెన్సరీలలో వైద్యుల కొరత వేధిస్తోంది. కొన్ని నెలలుగా ఆయుర్వేదంలో మెడికల్ ఆఫీసర్ పోస్ట్ ఖాళీగా ఉంది. అలాగే హోమియో విభాగంలోనూ మెడికల్ ఆఫీసర్ మెడికల్ లీవ్ పెట్టారు. ఈ కారణంగా రెండు విభాగాల్లో వైద్యులు లేకపోవడంతో రోగులు వచ్చి వెనుదిరిగి పోతున్నారు. కొంతమందికి అక్కడ ఉన్న కాంపౌండర్లే పాత వ్యాధిగ్రస్తులతో పాటు కొత్త వ్యాధిగ్రస్తులకు వ్యాధి లక్షణాలను బట్టి మందులు ఇచ్చి పంపుతున్నారు. ఈ రెండు విభాగాల్లో గతంలో ప్రతిరోజూ 60 నుంచి 80 మంది దాకా చికిత్స కోసం వచ్చేవారు. వైద్యులు లేకపోవడంతో ప్రస్తు తం వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ఆయుష్ విభాగం పట్ల కూటమి ప్రభుత్వం ఎంతగా శ్రద్ధ చూపిస్తుందో అర్థమవుతోంది. – కర్నూలు(హాస్పిటల్) -
రూ.6.39 లక్షల ఎరువుల సీజ్
మంత్రాలయం/కర్నూలు: అక్రమంగా నిల్వ ఉంచిన ఎరువుల గుట్టు రట్టయ్యింది. విజిలెన్స్ దాడుల్లో రూ.6,39,800 విలువైన ఎరువులు సీజ్ చేసి, ఒక ఒక దుకాణంపై 6ఎ కేసు నమోదు చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆదోని, మంత్రాలయం, ప్యాపిలి ప్రాంతాల్లో మంగళవారం విజిలెన్స్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. మంత్రాలయం మండలం కాచాపురం గ్రామంలోని శ్రీరామ్ ట్రేడర్స్, గురురాజ ట్రేడర్స్లో అక్రమంగా 300 బస్తాల యూరియా, 400 బస్తాల 20:20:0:13 రకం ఎరువులను నిల్వ చేశారు. మంగళవారం రాత్రి విజిలెన్స్ ఎస్ఐ వెంకట ప్రసాద్, డీసీటీఓ వెంకటరమణ ఆధ్వర్యంలో దాడులు చేపట్టారు. రూ.79,800 విలువ జేసే యూరియా, రూ.5.60 విలువైన 20:20:0:13 ఎరువులను గుర్తించి సీజ్ చేశారు. కూటమి ప్రభుత్వంలో ఓ వైపు యూరియా దొరక్క రైతులు నానా అవస్థలు పడుతున్నారు. అయితే హోల్సేల్ డీలర్ ఇంత మొత్తంలో యూరియాను నిల్వ ఉంచడం గమనార్హం. దాడుల్లో స్థానిక సీఐ రామాంజులు, మాధవరం ఎస్ఐ విజయ్కుమార్, వ్యవసాయాధికారి గణేష్, ఎంపీఈఓ బసవ పాల్గొన్నారు. -
ప్రకృతి వ్యవసాయంపై అవగాహన పెంచండి
● జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయంలో పెట్టుబడి వ్యయాన్ని తగ్గించుకునేందుకు, నాణ్యమైన దిగుబడులు పొందేందుకు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి తెలిపారు. మంగళవారం మద్దూరునగర్లోని ప్రకృతి వ్యవసాయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో భూమి సారవంతమవుతుందన్నారు. ఫలితంగా దిగుబడులు నాణ్యతతో ఉంటాయన్నారు. విచ్చిలవిడిగా రసాయన ఎరువులు వాడటం వల్ల భూమి ఆరోగ్యం దెబ్బతిని, పంటలకు చీడపీడల బెడద పెరుగుతోందన్నారు. నేలను సారవంతం చేసేందుకు ఘన, ద్రవ జీవామృతంతో పాటు నవధాన్యాలు సాగు చేయాలని సూచించారు. ప్రధాన పంటల్లో అంతరపంటలు సాగు చేయాలన్నారు. ప్రకృతి వ్యవసాయంలో విశేషంగా రాణిస్తున్న 12 మందికి ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. సమావేశంలో ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ మాధురీ, సీనియర్ కన్సల్టెంట్ రాజేశ్వర్, జిల్లా కన్సల్టెంట్ లక్ష్మయ్య, ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ సంజీప్కుమార్ పాల్గొన్నారు. -
చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీద్దాం
కర్నూలు(టౌన్): అఽధికారం కోసం అబద్దాలు చెప్పిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని నిలదీద్దామని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి పిలుపు నిచ్చారు. సోమవారం కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా జోనల్ సదస్సు పార్టీ జిల్లా అధ్యక్షురాలు శశికళ అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ మహిళల పక్షపాతి వైఎస్ జగన్మోహన్రెడ్డి అయితే మహిళా వ్యతిరేకి చంద్రబాబు అన్నారు. ఎన్నికల ముందు మహిళలకు ఎన్నో హామీలు ఇచ్చి ఏడాదిన్నర గడిచినా ఒక్కటీ అమలు చేయలేకపోయాడన్నారు. సూపర్ సిక్స్ హామీలన్నీ సూపర్ ఫెయిల్యూర్ అన్నారు. దేశంలోనే అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర పాలనలో ప్రజా వ్యతిరేకత కూడగట్టుకున్న ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. సంపద సృష్టిస్తామని చెప్పిన చంద్రబాబు ఏడాదిన్నర కాలంలోనే రూ.2 లక్షల కోట్లు అప్పు చేశాడన్నారు. జగనన్న వల్లే మహిళా సాధికారత సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో ఆయననే ముఖ్యమంత్రిగా గెలిపించుకుందామన్నారు. రాష్ట్రంలో 24 శాతం మద్యం అమ్మకాలు పెరగడంతోనే మహిళలపై దాడులు, అత్యాచారాలు అధికమయ్యాయన్నారు. ● వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వీ విజయమనోహరి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో వైఎస్సార్సీపీ నేతలపై కేసులు పెట్టడం పరిపాటిగా మారిందన్నారు. జైళ్లకు పంపిస్తే భయపడే ప్రసక్తే లేదన్నారు. జగనన్న కోసం మరింత నిబద్ధతతో పనిచేస్తామన్నారు. ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తామని, మహిళలకు ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాలను వివరిస్తామన్నారు. ● ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అబద్దాలు, మోసాలు చేసి అధికారంలోకి వచ్చిందన్నారు. ఇచ్చిన హమీలు అమలు చేయడం లేదని తెలిసే జగనన్న ఆదేశాల మేరకు బాబు ష్యూరీటీ – మోసం గ్యారెంటీ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అందోళనలు చేపట్టామన్నారు. ప్రభుత్వం దిగి వచ్చి అరకొరగా ఒకటి, రెండు పథకాలు అమలు చేసిందన్నారు. జగనన్న హయంలో మహిళలు బంగారం కొనుగోలు చేస్తే, ఈ ప్రభుత్వంలో బంగారాన్ని అమ్ముకునే పరిస్థితులు ఉన్నాయన్నారు. శాంతి భద్రతలు క్షీణించినా హోంమంత్రి అని చోద్యం చూస్తుండటం శోచనీయమన్నారు. ● మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి మాట్లాడుతూ మహిళల సంక్షేమానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ సీఎం జగనన్న ఎంతో కృషి చేశారన్నారు. రాజకీయంగా 50 శాతం పదవులు మహిళలకు కేటాయించారన్నారు. ఎన్నికల్లో నామినేషన్లు వేయకుండా, ఓట్లు వేయకుండా పులివెందులలో టీడీపీ అరాచకాలు చేసి గెలుపోందడం సిగ్గుచేటన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ జగన్ సింగిల్గానే వస్తాడని, చంద్రబాబుకు ఇతర పార్టీలు ఉంటే తప్ప ఎన్నికల్లో గెలవలేడన్నారు. ● వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా మహిళా అధ్యక్షురాలు శశికళ మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం కన్నా అంతకు మించి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం నిలువునా మోసం చేసిందన్నారు. ఏడాదిలోనే టీడీపీ, జనసేన, బీజెపీ నేతల కుమ్ములాటలు పెరిగిపోయాయన్నారు. జనసేన నేతల అవినీతికి అడ్డు లేకుండా పోయిందన్నారు. నిత్యం మహిళలపై లైంగిక దాడులు చేస్తున్నా అధికార పార్టీ నేతల ఆగడాలు హోంమంత్రికి కనిపించవా అని ప్రశ్నించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శశికళా రెడ్డి, పార్టీ మాజీ జిల్లా అధ్యక్షురాలు సిట్రా సత్యనారాయణమ్మ, రీజినల్ అధ్యక్షురాలు గాజుల శ్వేతారెడ్డి, డిప్యూటీ మేయర్ సిద్దారెడ్డి రేణుక, స్టాండింగ్ కమిటీ సభ్యులు మునెమ్మ, రేణుకా, కల్లా నాగవేణి రెడ్డి, భారతి, మంగమ్మతో పాటు నంద్యాల జిల్లా అధ్యక్షులు ఆర్.సుజాతమ్మ కడప జిల్లా అధ్యక్షురాలు తెలుగుపల్లి వెంకట సుబ్బమ్మ, అనంతపురం జిల్లా అధ్యక్షురాలు బి.శ్రీదేవి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగవేణి, సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు సి.నాగమణి, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి చంద్రబాబు మోసాలు వివరించాలని పిలుపు మహిళా సాధికారత జగనన్నతోనే సాధ్యం మహిళా జోనల్ సదస్సులో వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి -
గుండె గుడిలో వైఎస్సార్
ప్రజల అవసరాలు తెలుసుకుని అందుకు అనుగుణంగా పాలన అందించిన మహానేత వైఎస్సార్. ప్రభుత్వాలు మారినప్పటికీ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి చేపట్టిన అనేక సంక్షేమ పథకాలు నేటికీ అమలులో ఉన్నాయి. ప్రజలు తమ గుండెలో వైఎస్సార్కు గుడికట్టుకున్నారు. నల్లకాల్వలో ఏర్పాటు చేసిన స్మతి వనానకి పోటెత్తుతున్నారు. రాజాన్నా.. నిన్ను మేం మరువలేం అంటున్నారు. నేడు మంగళవారం మహానేత వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంసో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రజలు స్వచ్ఛందంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి పాలనా కాలన్ని స్వర్ణయుగంగా భావించవచ్చు. ముఖ్యమంత్రిగా 2004లో ప్రమాణ స్వీకరం చేసిన వెంటనే ఉచిత విద్యుత్ ఫైల్ మీద మొదటి సంతకం చేసి రైతులకు భరోసా ఇచ్చారు. ఆ కాలంలోనే ఉమ్మడి జిల్లాలో 2 లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చి వ్యవసాయాన్ని పండుగ చేశారు. ఆరోగ్య శ్రీ పేరుతో సామాన్యులకు కార్పొరేట్ వైద్యశాలల్లో వైద్యం అందుబాటులోకి తెచ్చారు. జలయజ్ఞం చేపట్టి రైతులకు సాగునీటి సదుపాయం కల్పించారు. పోతిరెడ్డిపాడు రిజర్వాయర్ ప్రాణం పోశారు. వైఎస్సార్ హయాంలోనే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జిల్లాలో కార్యరూపం దాల్చింది. ఈ పథకాన్ని నాటి ప్రధాని మన్మోహన్సింగ్తో కలసి ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లిలో శ్రీకారం చుట్టారు. ‘ఉపాధి’ నిధులతో డ్రైల్యాండ్ హార్టికల్చర్ కింద పండ్లతోటల సాగును ప్రోత్సహించారు. అప్పట్లోనే 8000 ఎకరాల్లో పండ్లతోటలు అభివృద్ధి చేశారు. జిల్లాలో భూమిలేని నిరుపేదలకు ఆరు విడుతలగా 32 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని పంపిణీ చేశారు. సూక్ష్మసేద్యం అమలుకు ప్రత్యేకంగా ఏపీఎంఐపీని ఏర్పాటు చేశారు. ఫీజు రీయింబర్స్మెంటుతో ఉమ్మడి జిల్లాలో 2000 మంది ఉన్నత స్థానాలు పొందారు. వైఎస్సార్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు ఇప్పటికీ అమలు అవుతున్నాయి.ప్రజల జీవితాల్లో వెలుగులుఉమ్మడి కర్నూలు జిల్లా కరువు, కాటకాలకు నెలవుగా ఉండేది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో 2023 ఏప్రిల్ 9న పాదయాత్రకు వైఎస్సార్ శ్రీకారం చుట్టారు. మొత్తం 1460 కిలో మీటర్లు నడచి ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను కళ్లారా చూశారు. ఉమ్మడి జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో 150 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగింది. ఉమ్మడి రాష్ట్రానికి 2004లో ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టడంతోనే రైతులు, ఇతర అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు పరుచుకున్నాయి. ఐదున్నర ఏళ్లలో ఉమ్మడి జిల్లాలో వైఎస్సార్ 29 సార్లు పర్యటించి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.‘జల’సిరులుజలయజ్ఞంలో భాగంగా రెండు టీఎంసీల సామర్థ్యం ఉన్న అవుకు రిజర్వాయర్ను రూ. 70కోట్లతో నాలుగు టీఎంసీల సామర్థ్యానికి పెంచేందుకు 2005 నవంబర్లో వైఎస్సార్ శంకుస్థాపన చేశారు. 2010 నాటికి పనులన్నీ పూర్తి కావడంతో 4టీఎంసీల నీళ్లు నింపుతూ వచ్చారు. రైతులు కాల్వల ద్వారా రెండు కార్లు పంటలు పండించుకుంటున్నారు. రిజర్వాయర్ ఏర్పాటుతో నంద్యాల, వైఎస్సార్ జిల్లాల్లో 42,509 లక్షల ఎకరాలకు సాగు నీరు, అనేక గ్రామాలకు తాగునీరు అందుతోంది.నిత్యం కరువుతో అల్లాడుతున్న పత్తికొండ నియోజకవర్గంలో హంద్రీ–నీవా కాలువ ఏర్పాటు చేసి కృష్ణాజలాలతో సస్యశామలం చేశారు. కృష్ణగిరి, పందికోన రిజర్వాయర్లను ఏర్పాటు చేసి 80వేల ఎకరాలకు సాగు నీరు అందించే దిశగా చర్యలు తీసుకున్నారు. దేవనకొండ, తుగ్గలి, కృష్ణగిరి, డోన్ మండలంలోని 50 గ్రామాలకు, డోన్పట్టణానికి గాజులదిన్నె ప్రాజెక్టు ద్వారా రూ. 55కోట్లతో తాగునీరు అందించారు.నందికొట్కూరు నియోజకవర్గంలో మల్యాల, ముచ్చుమర్రి, నాగటూరు ఫేస్–1, ఫేస్–2, తాటిపాడు, ఇస్కాల, చెల్లిమిల, లింగాల, శివపురం, సంగమేశ్వరం ఎత్తిపోతల పథకాలను వైఎస్సార్ మంజూరు చేశారు. దీంతో మొట్ట భూములు సస్యశ్యామలంగా మారాయి.పోత్తిరెడ్డిపాడు నుంచి 12 వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే గతంలో తరలించేవారు. వైఎస్సార్ పాలనలో పోతిరెడ్డిపాడును వెడల్పు చేసి 40 వేల క్యూసెక్కల నీటిని తరలించి రైతులకు రెండు పంటలకు సాగునీరు అందించారు. -
పట్టపగలే మహిళ దారుణ హత్య
కర్నూలు: కర్నూలు శివారులోని గణేష్ నగర్ పక్కనున్న (కల్లూరు అర్బన్ 19వ వార్డు) సాయి వైభవ నగర్లో నివాసముంటున్న శివలీల(75) దారుణ హత్యకు గురయ్యారు. ఈమె భర్త కాటసాని సాంబ శివారెడ్డి ఏడాదిన్నర క్రితం మరణించాడు. వీరికి కూతురు ఉమామహేశ్వరమ్మ, కొడుకు గంగాధర్ రెడ్డి సంతానం. కుమారుడు అమెరికాలో డాక్టర్ వృత్తిలో స్థిరపడ్డాడు. కూతురు ఉమామహేశ్వరమ్మ కేవీ సుబ్బారెడ్డి కళాశాలలో ఫ్యాకల్టీగా పనిచేస్తోంది. ఈమె భర్త చంద్రశేఖర్రెడ్డి రిటైర్డ్ ఏసీటీఓ. వీరు వెంకటరమణ కాలనీలో నివాసముంటున్నారు. అయితే కూతురు ఉమామహేశ్వరమ్మ ప్రతిరోజూ తల్లి ఇంటికి వచ్చి చూసుకుని వెళ్లేది. సోమవారం ఉదయం కూడా తల్లి ఇంటి వద్ద నుంచే కళాశాలకు వెళ్లింది. ఇంట్లో వంట రూంలో ఒంటరిగా ఉన్న శివలీలపై మధ్యాహ్నం గుర్తు తెలియని దుండగులు పదునైన కత్తితో దాడి చేశారు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉండగా దుండగులు ఆమె ఒంటిపై ఉన్న బంగారు గొలుసు, గాజులతో పాటు బీరువాలో ఉన్న కొంత నగదును మూటకట్టుకుని ఉడాయించారు. అల్లుడు చంద్రశేఖర్ రెడ్డి మధ్యాహ్నం ఇంటి వద్దకు వెళ్లిచూడగా ఆమె రక్తపు మడుగులో పడివుండగా వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్, డీఎస్పీ బాబు ప్రసాద్, సబ్ డివిజన్ పరిధిలోని పలువురు సీఐలు, ఎస్ఐలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్యకు కారణాలపై కూతురు, అల్లుడుతో మాట్లాడారు. అయితే పనిమనిషి వరలక్ష్మి రెండు రోజుల క్రితం పని మానేసిందని, ఆమైపెనే అనుమానం ఉన్నట్లు పోలీసుల దృష్టికి తెచ్చారు. మృతురాలు శివలీల ఫోన్ కాల్ డేటా, పనిమనిషి వరలక్ష్మి ఎవరెవరితో మాట్లాడిందన్న కాల్ డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
బస్సుల కోసం విద్యార్థులు, అధ్యాపకులు నిరీక్షణ
హొళగుంద: స్థానిక జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులు, లెక్చరర్లు సోమవారం ఆర్టీసీ బస్సుల కోసం గంటల తరబడి పడిగాపులు కాశారు. సాయంత్రం కళాశాల తరగతులు ముగిసిన తరువాత ఆదోని మార్గంలో హెబ్బటం, లింగంపల్లి, వందవాగిలి తదితర గ్రామాలకు చెందిన దాదాపు 30 మందికి పైగా విద్యార్థులతో పాటు ఆదోనికి వెళ్లే లెక్చరర్లు కళాశాల వద్ద బస్సుల కోసం నిరీక్షించాల్సి వచ్చింది. ప్రతిరోజు ఈ మార్గంలో తిరుగుతున్న టెన్ సింగిల్, కోగిలతోట సర్వీస్ బస్సులు సోమవారం మరమ్మతులకు గురై తిరగలేదు. దీంతో కాలేజీ వదిలిన తర్వాత విద్యార్థులు చీకటి పడినా బస్సు కోసం అక్కడే ఉండాల్సి వచ్చింది. 7 గంటల తరువాత బస్సు రావడంతో ఎట్టకేలకు విద్యార్థులు తమ గ్రామాలకు బయలుదేరారు. ఈ సమస్య చాలా సార్లు ఎదురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని హొళగుంద–ఢణాపురం రోడ్డు దారుణంగా ఉండడంతో బస్సులు చెడిపోతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. లింగంపల్లికి చెందిన విద్యార్థులు లింగంపల్లి క్రాస్లోనే దిగి అక్కడి నుంచి గ్రామం చేరుకోవడానికి దాదాపు రెండు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుందని ఇలా చీకటి పడినా బస్సులు రాకపోతే పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సకాలంలో బస్సులు లేకపోవడంతో ఉదయం వేళ విద్యార్థులు కొన్ని తరగుతులు హాజరు కాలేకపోతున్నారు. ఆర్అండ్బీ, ఆర్టీసీ అధికారులు స్పందించి రోడ్డును బాగు చేసి వేళకు బస్సులు నడపాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.కుక్కకు మత్తు బిస్కెట్లు వేసి.. ఇంటి తాళాలు పగులగొట్టి ఆదోని అర్బన్: పట్టణంలోని ఆర్టీసీ కాలనీలోని సింహపురి ఎస్టేట్లో చోరీ జరిగింది. కోసిగి పీహెచ్సీలో జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న వంశీకృష్ణ శనివారం ఇంటికి తాళాలు వేసి గుంతకల్లులో ఉన్న తన భార్య వద్దకు వెళ్లారు. కాపౌండ్లో కుక్కను వదిలి వెళ్లాడు. కాగా ఇంటి తలుపులు పగిలి ఉండటాన్ని ఆదివారం సాయంత్రం గమనించిన స్థానికులు వెంటనే వంశీకృష్ణకు సమాచారం ఇచ్చారు. దొంగలు కాపౌండ్లో ఉన్న కుక్కకు మత్తు బిస్కెట్లు వేసి, తర్వాత దానిని కట్టేసి ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాలో ఉన్న ఆరు తులాల బంగారు ఆభరణాలు, రూ.45 వేలు విలువ చేసే వెండి వస్తువులు దొంగలించారు. అలాగే స్థానికంగా మరో రెండు ఇళ్లల్లో చోరీకి యత్నించారు. ఓ ఇంటిలో ఎవరూ నివాసం లేకపోవడం, మరో ఇంటికి సెంట్రల్ లాక్ కారణంగా తాళాలు తెరుచుకోక పోవడంతో దుండగులు వెనుదిరిగినట్లు తెలిసింది. బాధితుడు వంశీకృష్ణ ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బడికి తాళం.. చర్చిలో పాఠం
కోసిగి: సాతనూరు కొట్టాల గ్రామ ప్రాథమిక పాఠశాల పైకప్పు పెచ్చులూడి పడటంతో విద్యార్థుల క్షేమం దృష్ట్యా బడిని చర్చిలోకి మార్చారు. ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పిన విషయం అందిరికీ తెలిసిందే. సోమ వారం ఉదయం పాఠ శాలకు చేరుకున్న విద్యార్థులు, ఉపాధ్యాయుడు అరుణ్కుమార్ గదిలో పడిన సిమెంట్ పెచ్చులు చూసి భయాందోళన చెందారు. పైకప్పు ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. పాఠశాలకు ఒకే గది ఉండడంతో హెచ్ఎం పాఠశాలకు తాళం వేసి గ్రామస్తుల సహకారంతో పక్కనే ఉన్న చర్చి ప్రాంగణంలో పాఠాలు బోధించాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న ఎంఈఓ–2 శ్రీనివాసులు గ్రామానికి చేరుకుని పాఠశాల పరిస్థితిని సమీక్షించారు. చాలా కాలం క్రితం నిర్మించిన పాఠశాల పూర్తిగా శిథిలావస్థకు చేరిందని గుర్తించారు. ఇకపై పాఠశాలలో తరగతులు నిర్వహించొద్దని హెచ్ఎంకు సూచించారు. గత ప్రభుత్వంలో నాడు–నేడు రెండవ విడత కింద పాఠశాల ఎంపికై ందని, అయితే ఎన్నికల కోడ్ రావడంతో పనులు మొదలు పెట్టలేకపోయామని ఏఈ రంగరాజు తెలిపారు. జిల్లా అధికారులు స్పందించి పాఠశాలకు నూతన భవనాన్ని నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
శివయ్యా.. నీవే దిక్కు!
పెద్దసత్రంలో నివాసగృహాలుపెద్దసత్రంలో నిరసన తెలుపుతున్న మహిళలుశ్రీశైలంటెంపుల్: మల్లన్న చెంత నివాసముంటున్న దేవస్థాన కాంట్రాక్ట్ బేసిక్, ఔట్ సోర్సింగ్, శానిటేషన్ సిబ్బంది, ప్రైవేటు వ్యక్తులకు గూడు కరువై రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. దేవస్థానం పరిధిలోని పెద్దసత్రం, పొన్నూరు సత్రం, శివసదనం భవనాలు శిథిలావస్థకు చేరుకోవడంతో ఆయా భవనాల తొలగింపునకు దేవస్థానం చర్యలు చేపట్టింది. దీంతో అందులో నివాసముంటున్న వారిని ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేయడంతో అందరిలో ఆందోళన నెలకొంది. ప్రత్యామ్నాయం చూపకుండా ఎలా పంపిస్తారని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు. దాదాపు 50 ఏళ్ల క్రితం శ్రీశైల ఆలయ సిబ్బంది వసతి గృహాల కోసం దేవస్థానం పెద్దసత్రం, శివసదనం, పొన్నూరు సత్రాల పేరుతో గృహ సముదాయాలను నిర్మించింది. ఈ మూడింటిలో 223 నివాసాలు ఉన్నాయి. కాలక్రమేణ దేవస్థాన అధికారులు, సిబ్బందికి మరొక గృహ సముదాయాలను నిర్మించడం, ఆయా వసతి గృహాలకు ఉద్యోగులు తరలివెళ్లారు. దీంతో పెద్దసత్రం, పొన్నూరు సత్రం, శివసదనంలో దేవస్థాన కాంట్రాక్ట్ బేసిక్, ఔట్ సోర్సింగ్, శానిటేషన్ సిబ్బంది, మరికొంత మంది ప్రైవేట్ వ్యక్తులు నివాసం ఉంటున్నారు. అయితే ఆయా భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వాటిని నివాసితులు అడపాదడపా మరమ్మతులు చేయించుకుని అలాగే నివసిస్తున్నారు. ఈ భవనాల నిర్ధిష్ట ఆయుర్థాయ కాలపరిమితి (బిల్డింగ్ లైఫ్ స్పాన్) ముగింపు దశకు చేరుకుందని రహదారులు–భవనాలు (ఆర్అండ్బీ), పంచాయతీరాజ్ శాఖల సాంకేతిక నిపుణులు పరిశీలించి, దేవస్థానానికి నివేదిక సమర్పించారు. నివాసితుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు భవనాలలో నివాసితులను ఖాళీ చేయించి, భవనాలను తొలగించాలని దేవస్థానం నిర్ణయించింది. నివాసితులకు నోటీసులు.. పెద్దసత్రం, పొన్నూరు సత్రం, శివసదనంలో నివసిస్తున్న దేవస్థాన ఉద్యోగులకు, ఇతర నివాసితులకు దేవస్థానం నోటీసులు జారీ చేస్తుంది. నోటీసులు అందిన ఒక నెలలో వారి నివాసాలను ఖాళీ చేయాలని లిఖితపూర్వకమైన నోటీసులు ఇస్తున్నారు. ఈ విషయమై నివాసితులందరు కూడా దేవస్థానానికి సహకరించాలని తెలియజేస్తున్నారు. అయితే నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన అధికారులను పెద్దసత్రం నివాసితులు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఇద్దరు, ముగ్గురికి నోటీసులు ఇచ్చిన అధికారులు నిరసనతో వెనుదిరిగి వెళ్లారు. పెద్దసత్రం, శివసదనం, పోన్నూరు సత్రంలో గృహాలు ఎప్పుడో 60 ఏళ్ల క్రితం నిర్మించినవి. తక్షణమే ఖాళీ చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఆయా గృహ సముదాయంలో ఉన్న దేవస్థానం ఉద్యోగులకు ప్రత్యామ్నాయం చూపేందుకు ఇంజినీరింగ్, రెవెన్యూ అధికారులతో కమిటీ వేశాం. వారిని ఖాళీ చేస్తే వారికి మంచిగా ఏమి చేయాలో కమిటీ నిర్ణయిస్తుంది. ఆయా గృహా సముదాయాల్లో ప్రైవేట్ వ్యక్తులు సైతం ఉన్నారు. అందరికి నోటీసులు ఇచ్చి, అందరిని ఖాళీ చేయిస్తాం. – ఎం.శ్రీనివాసరావు, శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీశైలంలో శిథిలావస్థకు చేరిన పలు గృహా సముదాయాలు పెద్దసత్రం, శివసదనం, పొన్నూరు సత్రాల్లో సుమారు 223 గృహాలు గృహాలను ఖాళీ చేయాలని సూచించిన సాంకేతిక నిపుణులు నివాసితులకు దేవస్థానం నోటీసులు ప్రత్యామ్నాయం చూపాలంటున్న బాధితులు -
రూ. 50 కోట్లతో పాణ్యం రైల్వేస్టేషన్
పాణ్యం: పాత దాన్ని తొలగించి రూ. 50కోట్ల పైగా నిధులతో నూతనంగా పాణ్యం రైల్వే స్టేషన్ను నిర్మించారు. సోమవారం ప్రత్యేక రైలులో సీఆర్ఎస్ మాధవి ఇక్కడికి వచ్చి నూతన రైల్వే స్టేషన్ను ప్రారంభించారు. స్టేషన్లో ఉన్న సిగ్నల్ సిస్టిమ్, స్టేషన్ విస్తీర్ణం, నూతంగా చేపట్టిన పనులు, ప్రయాణికులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. ఇది వరకే పాణ్యం– బేతంచెర్ల వరకు డబుల్ ట్రాక్ పనులు పూర్తి చేయగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పెండింగ్లో ఉన్న పాణ్యం–నంద్యాల మధ్య పనులు పూర్తి కావడంతో ప్రత్యేక ట్రాలీలో సీఆర్ఎస్ మాధవి పరిశీలించి, వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇదిలా ఉండగా పాణ్యం రైల్వే స్టేషన్లో ఔరంగబాద్–గుంటూరు రైలును ఆగేలా చూడాలని సీఆర్ఎస్ మాధవికి ప్రజలు వినతి పత్రం అందించారు. త్వరలోనే చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆమె తెలిపారు. గుంటూరు డీఆర్ఎం సుదేష్ణషేన్, గుంతకల్లు డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా, రైల్వే టెక్నికల్ ఇంజినీర్లు, రైల్వే ఇంజనీర్లు అధికారులు పాల్గొన్నారు. ప్రారంభించిన సీఆర్ఎస్ మాధవి నంద్యాల–పాణ్యం మధ్య డబుల్ ట్రాక్కు గ్రీన్ సిగ్నల్ -
ఆ రోజు ఏం జరిగిందంటే..
సరిగ్గా 16 ఏళ్ల క్రితం.. 2009 సెప్టెంబర్ 2వ తేదీన చిత్తూరు జిల్లా అనుపల్లి గ్రామంలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అప్పటి సీఎం వైఎస్రాజశేఖర్రెడ్డి హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం నుంచి బెల్ 420 హెలికాప్టర్లో బయలు దేరారు. కొంత సమయం తర్వాత హెలికాప్టర్ కనిపించకపోవడంతో ఆందోళన మొదలైంది. అప్పటి ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లా అనుపల్లికి చేరకపోవడంతో రాష్ట్ర ప్రజలందరిలో నరాలు తెగే ఉత్కంఠ ప్రారంభమైంది. హెలికాప్టర్ ప్రమాదంలో నల్లమలలోని నల్లకాల్వ సమీపంలో ఉన్న పావురాలగుట్టలో వైఎస్సార్ మృతి చెందినట్లు సెప్టెంబర్ 3న వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర ప్రజలు తమ ఆరాధ్య నేతను గుండెల్లో దాచుకున్నారు. మహానేతను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో చూసుకుంటున్నారు. -
చుక్కలతో రాజన్న చిత్రం
నంద్యాల(అర్బన్): పట్టణ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ చుక్కలతో రాజన్న చిత్రాన్ని గీచారు. మైక్రో పెన్నుతో డ్రాయింగ్ చార్ట్పై చుక్కలు పెట్టుకుంటూ వైఎస్సార్ కొట్రాయిట్ చిత్రాన్ని వేశారు. ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ.. మహానేత అనేక సంక్షేమ పథకాల చేపట్టి ప్రజల మన్ననలు పొందారు. శరణు కోరిన వారికి కరుణ చూపించే మంచి వ్యక్తిగా, ఎప్పుడు నవ్వుతూ.. నవ్విస్తూ ఆప్యాయంగా పలకరించే దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా కొలువై ఉన్నారంటూ చిత్ర నివాళులు అర్పించారు.అక్కను చూసేందుకు వచ్చి.. ఫిట్స్తో కాల్వలో పడి వ్యక్తి మృతిమహానంది: మహానందిలో గత కొంత కాలం నుంచి యాచిస్తూ జీవనం సాగిస్తున్న తన అక్కను చూసేందుకు వచ్చిన తమ్ముడు మూర్ఛకు గురై కాల్వలో పడి మృతి చెందిన విషాద ఘటన సోమవారం మహానందిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...బనగానపల్లె మండలం ఇల్లూరి కొత్తపేట గ్రామానికి చెందిన సుంకన్న(50) అక్క సుబ్బలక్ష్మమ్మ గత కొద్ది నెలలుగా మహానందిలో ఉంటుంది. విషయం తెలుసుకుని ఆమెను చూసేందుకు ఇక్కడికి వచ్చాడు. కరివేన సత్రం సమీపంలో ఉన్న కోనేరు నీరు బయటికి వచ్చే కాల్వ వద్ద కూర్చుని ఉండగా మూర్ఛకు గురై కాల్వలో పడిపోయాడు. ఎవరూ గుర్తించకపోవడంతో ఊపిరాడక మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు మహానందికి చేరుకుని సుంకన్న మృతదేహాన్ని ఆటోలో తరలించారు.అప్పుల బాధతో రైతు ఆత్మహత్యనందికొట్కూరు: కొనేటమ్మపల్లె గ్రామంలో అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కాటం సుధాకర్ (60) అనే వ్యక్తి 2020 నుంచి దాదాపు ఆరు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. గత ఐదేళ్లుగా పంటల సాగు కోసం బ్యాంకు, తెలిసిన బంధువులు, స్నేహితులు, గ్రామస్తుల వద్ద దాదాపు రూ.15 లక్షల మేర అప్పులు చేసినట్లు తెలిపారు. అయితే ఐదేళ్లుగా వరుసగా నష్టాలు రావడంతో అప్పులు పెరిగి పోయాయి. అప్పుల బాధతో తీవ్ర మనస్తాపం చెందిన సుధాకర్ శనివారం తెల్లవారుజామున పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. భార్య నీలమ్మ గుర్తించి వెంటనే 108లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే సోమవారం మధ్యాహ్నం కోలుకోలేక మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు బ్రాహ్మణకొట్కూరు పోలీసులు తెలిపారు. -
ట్రిబుల్ ఐటీలో ‘ఇస్రో’ ప్రదర్శన
● ప్రారంభించిన ఆర్యూ వీసీ ● ఆసక్తిగా తిలకించిన విద్యార్థులు కర్నూలు సిటీ: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్(ట్రిబుల్ ఐటీడీఎం)లో ‘ఇస్రో స్పేస్ ఆన్ వీల్స్’ అనే పేరుతో సోమవారం ప్రదర్శన నిర్వహించారు. ఈ ఎగ్జిబిషన్ను రాయలసీమ యూనివర్సిటీ వీసీ ఆచార్య వి.వెంకట బసవ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రయాన్–3 విజయంతో ప్రపంచంలోని దేశాలన్నీ భారతదేశం వైపు చూశాయన్నారు. అంతరిక్ష పరిజ్ఞానాన్ని ప్రజలకు విద్యార్థులకు తెలియజేసేందుకు స్పేస్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని ట్రిబుల్ ఐటీడీఎంలో ఏర్పాటు చేశామని ఇస్రో సైంటిస్టులు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలతో విద్యార్థుల్లో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం పట్ల ఆసక్తి, అవగహన పెరుగుతుందన్నారు. అంతరిక్షం గురించి తెలియజేసేందుకు ప్రదర్శన ఉపయోగపడుతుందన్నారు. రూ.10 కోట్ల ఖర్చు ఇస్రో ప్రత్యేకంగా రూ.10 కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులో 50 ఏళ్ల నుంచి ఇస్రో సాధించిన విజయాల నుంచి చంద్రయాన్ వరకు సాధించిన విజయాల గురించి విద్యార్థులకు తెలియజేసేందుకు ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసింది. జిల్లాలోని 33 స్కూల్స్, కాలేజీలకు చెందిన 2 వేల మంది విద్యార్థులు ఈ ప్రదర్శనకు ఉపయోగపడనుంది. బస్సుల్లోని రాకెట్ల నమూనాలు, చంద్రయాన్ల గురించి ట్రిబుల్ఐటీ విద్యార్థులు, ఇస్రో ప్రతినిధులు వివరించారు. స్కూల్, కాలేజీల విద్యార్థులు ఎంతో ఆసక్తితో రాకెట్లను స్వయంగా చూసి అడిగి తెలుసుకున్నారు. నేడు(మంగళవారం)ఇస్రో బస్సు కేవీఆర్ మహిళ డిగ్రీ కాలేజీలో ప్రదర్శన ఉన్నట్లు ఇస్రో ప్రతినిధులు తెలిపారు. ట్రిబుల్ ఐటీ రిజిస్ట్రార్ రాజ్కుమార్, ఆర్యూ రిజిస్ట్రార్ బి.విజయ్కుమార్, ఆచార్యులు డీన్స్ నరేష్, సత్యబాబు, ఆర్డినేటర్ డా.వినయ్ తీవారీ, ఇస్రో రిటెర్డ్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి టీజీ భరత్కు నిరసన సెగ
సాక్షి,కర్నూలు: వ్యవసాయ మార్కెట్ యార్డులో రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు నిరసన సెగ తగిలింది. ఉల్లికి గిట్టుబాటు ధర రావడంలేదని రైతులు నిలదీశారు. ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర సరిపోదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఖర్చులకు కూడా రావడం లేదని రైతులు ఆగ్రహానికి గురయ్యారు. ఉల్లికి కనీసం రూ.2వేలు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. కనీసం ఖర్చులకు కూడా గిట్టుబాటు కాదని వాపోయారు. అంతా అయిపోయిన తరువాత ధర పెంచితే ప్రయోజనం ఏముంటుందని రైతులు ప్రశ్నించారు. అయితే, టీజీ భరత్ మాత్రం రైతుల సమస్యల్ని పట్టించుకోకుండా తిరిగి వెళ్లిపోయారు. -
జత్వానీ కేసులో ఉన్న శ్రద్ధ సుగాలి ప్రీతి కేసుపై ఉండదా?: వరుదు కల్యాణి
సుగాలి ప్రీతి కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో చట్టపరమైన న్యాయం జరిగిందని.. కానీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారంలో ఉండి కూడా ఏం చేయలేకపోతున్నారని, పైగా మొదటి నుంచి ఈ కేసును తన రాజకీయం కోసమే వాడుకుంటున్నారని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విమర్శించారు. సాక్షి, కర్నూలు: సుగాలి ప్రీతి కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో చట్టపరమైన న్యాయం జరిగిందని.. కానీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారంలో ఉండికూడా ఏం చేయలేకపోతున్నారని.. మొదటి నుంచి ఈ కేసును తన రాజకీయం కోసమే వాడుకుంటున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి విమర్శించారు. సోమవారం కర్నూలులో ఆమె మాట్లాడుతూ.. ‘‘2017 ఆగస్టు 19వ తేదీన గిరిజన బాలిక సుగాలి ప్రీతిపై అత్యాచారం, హత్య జరిగాయి. చంద్రబాబు హయాంలోనే ఈ ఘటన జరిగింది. న్యాయం జరగలేదు సరికదా.. పరిహారం కూడా అందలేదు. అప్పటి నుంచి తల్లిదండ్రులు న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. కానీ, వైఎస్ జగన్ హయాంలో చట్టపరమైన న్యాయం చేశారు... 2024 ఎన్నికల ముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కేసును ప్రచారానికి ఉపయోగించుకున్నారు. అధికారంలోకి వచ్చినా కూటమి ప్రభుత్వం ఈ ఏడాది పాలనలో సుగాలి ప్రీతిని పట్టించుకోలేదు. రుషికొండ భవనాలు చూడానికి వెళ్ళిన డిప్యూటీ సీఎం పవన్కి.. సుగాలి ప్రీతి కేసు కనిపించ లేదా?. ముంబై నటి కాదంబరీ జత్వానీ కేసు మీద పెట్టిన శ్రద్ద.. ఈ గిరిజన బాలిక గురించి పట్టదా?. న్యాయం కోసం నిలదీస్తే.. నా చేతిలో ఏం లేదని పవన్ చెప్పడం అసలు ఏంటి?. న్యాయ పోరాటం చేస్తున్న కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు?. చంద్రబాబు అరెస్టై జైలుకు వెళ్లాక.. రాజ్యాంగం పట్టుకుని లోకేష్ న్యాయం చేయాలంటూ ధర్నా చేశారు. మరి ఆయనకు ఈ కేసు కనిపించడం లేదా?. నారా లోకేష్ రెడ్ బుక్లో సుగాలి ప్రీతి నిందితుల పేర్లు లేవా? మహిళలకు రక్షణ కల్పిస్తామని చెప్పి చంద్రబాబు.. ఎప్పుడు ఎక్కడ ఉన్నారు?. ఈ కేసును కేవలం రాజకీయంగా కూటమి ప్రభుత్వం, పవన్ కల్యాణ్ వాడుకున్నారు. పవన్ మాటలకు చేతలకు స్పష్టంగా తేడా కనిపిస్తోంది. న్యాయం సంగతి పక్కనపెడితే.. జనసేన ఎమ్మెల్యేలు తిరిగి ఆమె కుటుంబం పైనే ఎదురుదాడికి పాల్పడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఈ కేసు విషయంలో నిర్లక్ష్యం విడనాడి కుటుంబానికి న్యాయం చేయాలి. సిట్, అవసరమైతే సీబీఐతో విచారణ జరిపించాలి. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది అని వరుదు కళ్యాణి అన్నారు.ఇదీ చదవండి: వామ్మో.. చింతమనేని! -
మోటారు సైకిల్ను ఢీకొట్టిన కారు
● భార్య మృతి..భర్తకు తీవ్ర గాయాలు కోడుమూరు రూరల్/సి.బెళగల్: కె.నాగలాపురం పోలీస్స్టేషన్ పరిధిలోని పెద్దపాడు వద్ద మోటారు సైకిల్ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందారు. ఈ దుర్ఘటన ఆదివారం చోటు చేసుకుంది. సి.బెళగల్ మండలం పోలకల్కు చెందిన వెంకటేశ్వరరెడ్డి, భార్య అరుణమ్మ(50)తో కలిసి బైక్పై కర్నూలు వెళుతుండగా, ఇదే సమయంలో కర్నూలు నుంచి పెద్దపాడు వైపు వస్తున్న కారు శ్రీరామ వెంచర్ వద్ద ఢీకొట్టింది. ప్రమాదంలో మహిళ అరుణమ్మ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందగా, వెంకటేశ్వరరెడ్డికి గాయాలయ్యాయి. గాయపడిన వెంకటేశ్వరరెడ్డిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కె.నాగలాపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో సోమేశ్వర గ్రామైఖ్య సంఘానికి దాదాపు పదేళ్లుగా అరుణమ్మ వీఓఏగా పనిచేస్తున్నారు. అరుణమ్మ మృతి విషయం తెలుసుకున్న మండల వెలుగు ఏపీఎం రామేశ్వర్, పలు గ్రామాల వీఓఏలు కర్నూలు ఆసుపత్రికి చేరుకుని సంతాపం తెలిపి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
ఐటీబీపీ కానిస్టేబుల్కు కన్నీటి వీడ్కోలు
బేతంచెర్ల: ఆర్ఎస్ రంగాపురం గ్రామానికి చెంది న ఐటీబీపీ(జీడీ) కానిస్టేబుల్ జగదల నరేంద్ర నాథ్ (32) మృతదేహా న్ని ఆదివారం పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. విశాఖ పట్నం జిల్లా ఆనందపురం మండలం, పందల పాకలోని 56 బెటాలియన్ ఐటీబీపీ(జీడీ) కానిస్టేబుల్ గా పని చేస్తూ శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతదేహాన్ని ఆదివారం స్వగ్రామైన ఆర్ఎస్ రంగాపురం గ్రామానికి చేరుకోవడంతో ఐటీబీపీ పోలీసులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నివాళులర్పించారు. అనంతరం ఐటీబీపీ పోలీసుల లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. గత కొంత కాలంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతూ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రామానికి చెందిన సూర్యనారాయణ, లక్ష్మి దంపతుల కుమారుడు నరేంద్రనాథ్ 2014లో ఐటీబీపీ కానిస్టేబుల్గా ఎంపికయ్యాడు. మృతుడికి భార్య స్వాతితో పాటు కుమార్తె, కుమారుడు ఉన్నారు. -
బై బై గణేశా!
‘దండాలయ్యా.. ఉండ్రాలయ్యా.. నీ అండాదండా ఉండాలయ్యా’.. అంటూ బొజ్జ గణపయ్యకు ఘన వీడ్కోలు పలికారు. వినాయక చవితి సందర్భంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో కొలువుంచిన గణేశుడి ప్రతిమలను ఐదో రోజు ఆదివారం నిమజ్జనం చేశారు. ఆదోని, కర్నూలు, నంద్యాల, ఆళ్లగడ్డ, డోన్, నందికొట్కూరు తదితర ప్రాంతాల్లో భక్తిశ్రద్ధలతో పూజలు చేసి నిమజ్జన శోభా యాత్ర చేపట్టారు. భక్త జనం ఉత్సాహంగానృత్యాలు చేస్తుండగా.. ఓ వైపు బాణా సంచా పేలుళ్లు.. మరో వైపు డప్పుల హోరు.. ఇంకోవైపు డీజేల ధ్వనులు హోరెత్తాయి. చెరువులు, నీటి కాల్వల్లో విగ్రహాలను నిమజ్జనం చేసి ‘వినాయకా.. వెళ్లిరావయ్యా’ అంటూ వీడ్కోలు పలికారు. – సాక్షి నెట్వర్క్ వెంకటాపురం చెరువులో వినాయకుడిని నిమజ్జనం చేస్తున్న దృశ్యం -
27 ఏళ్ల తర్వాత సొంతూరుకు..
● బాలుడిగా వెళ్లి భార్యాబిడ్డలతో తిరిగి వచ్చాడు.. ఆదోని రూరల్: తల్లిదండ్రులు దూరమయ్యారు.. ఆ బాలుడిని పట్టించుకునే దిక్కు లేదు. కాలే కడుపు చేత పట్టుకుని ఆ 13 ఏళ్ల పిల్లోడు రైలెక్కాడు. ఎవరూ తెలియని ఊరిలో దిగి బతుకుదెరువు కోసం చిన్న చితకా పని చేసుకుంటూ పెద్దయ్యాడు. అక్కడే పెళ్లి చేసుకుని భార్యా పిల్లలతో జీవిస్తుండగా అనుకోని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో సొంతూరుపై మమకారం పెరిగింది. 27 ఏళ్ల తర్వాత అతను తిరిగి వచ్చాడు. వివరాల్లోకి వెళితే.. ఆదోని మండలం దిబ్బనకల్ గ్రామానికి చెందిన పెద్దరంగన్న, నాగలక్ష్మి దంపతులకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం. కొంత కాలానికి ఆ దంపతులు మృతి చెందగా ఆ పిల్లలను ఆదరించే వారు కరువయ్యారు. రెండో కుమారుడైన లక్ష్మన్న 13 ఏళ్ల వయస్సులో దిబ్బనకల్ గ్రామం నుంచి నడుచుకుంటూ ఆదోని రైల్వేస్టేషన్కు చేరుకున్నాడు. రెండు రోజులు అక్కడే ప్రయాణికులు ఇచ్చే వాటితో కడుపు నింపుకున్నాడు. ఏమి చేయాలో తెలియక ఓ రైలెక్కగా అది పంజాబ్కు చేరుకుంది. అక్కడ లక్ష్మన్న చిన్న వయస్సులో నానా ఇబ్బందులు పడ్డాడు. బతకడానికి మెకానిక్ షెడ్లో పనిచేసుకుంటూ, లారీ క్లీనర్గా పనిచేశాడు. ఆ తర్వా త లారీ డ్రైవర్ అయ్యాడు. ఈ క్రమంలో హర్యానా రాష్ట్రానికి చెందిన అనాథ అయిన రీనాను పెళ్లి చేసుకున్నాడు. వారికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం కలిగారు. లారీ డ్రైవర్గా పనిచేస్తూ లక్ష్మన్న కుటుంబాన్ని పోషిస్తుండగా ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స పొంది ప్రాణాలతో బయటపడ్డాడు. తన భార్య, పిల్లలను దృష్టిలో పెట్టుకుని డ్రైవర్ వృత్తి వద్దనుకుని సొంత గ్రామమైన ఆదోని మండలం దిబ్బనకల్ గ్రామానికి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. ఇందులో భాగంగా ఐదు రోజుల క్రితం భార్య రీనా, పిల్లలతో కలిసి గ్రామానికి చేరుకున్నాడు. అయితే ఊరిలో లక్ష్మన్నను ఎవరూ గుర్తు పట్టలేదు. పంజాబీ భాష మాట్లాడుతుండడంతో ఎవరికీ అర్థంగాక అనుమానించారు. తల్లిదండ్రుల పేర్లు చెప్పి ఆధార్కార్డులో తండ్రి పేరును చూపించడంతో తన బంధువులు గుర్తించారు. ఎప్పుడో చిన్నప్పుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడని, తమ వాడేనని గ్రామస్తులకు వివరించారు. సొంత అన్న హైదరాబాద్కు, ఇద్దరు తమ్ముళ్లు బెంగళూరుకు వలస వెళ్లారు. ప్రస్తుతానికి లక్ష్మన్న చిన్న తమ్ముడు ఇంట్లో నివాసముంటున్నాడు. తన పిల్లలను కుటుంబానికి, బంధువులకు దగ్గర చేయాలని, సొంత వాళ్లతో కలసి బతకాలని నిర్ణయించుకుని సొంతూరుకు తిరిగి వచ్చానని లక్ష్మన్న చెబుతున్నాడు. -
నేత్రదానం పుణ్యకార్యక్రమం
నేత్రదానం చేయడం పుణ్యకార్యక్రమంతో సమానం. ప్రపంచంలో 4 నుంచి 6 శాతం మంది కార్నియా జబ్బుతో బాధపడుతున్నారు. ఇందులో 0.36శాతం భారతీయులే ఉన్నారు. దీనిని ఈ ఏడాది చివరి నాటికి 0.25శాతానికి తీసుకురావాలన్నది ప్రభుత్వ సంకల్పం. దేశంలో ఏటా 47,676 మంది నుంచి కార్నియా సేకరిస్తున్నారు. వాటిలో 29,057 వినియోగిస్తున్నారు. మిగిలినవి వివిధ కారణాల వల్ల నిరుపయోగమవుతున్నాయి. నేత్రదానం సమయంలో మొత్తం కన్ను గాకుండా నల్లగుడ్డు (కార్నియా) మాత్రమే తీస్తారు. దాని స్థానంలో కృత్రిమ కళ్లను మరణించిన వారికి అవయవలోపం కనిపించదు. దాతలు ఇచ్చిన నేత్రాలను విక్రయించడం, కొనడం జరగదు. ఇతరులకు ఉచితంగా అమరుస్తారు. – డాక్టర్ పి. వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్, ప్రాంతీయ ప్రభుత్వ కంటి ఆసుపత్రి, కర్నూలు -
పీఆర్ క్యూసీ డీఈఈగా భాస్కరరెడ్డి
కర్నూలు(అర్బన్): పంచాయతీరాజ్ క్వాలిటీ కంట్రోల్ విభాగం డివిజన్ –1 ఇన్చార్జ్ ( పూర్తి అదనపు బాధ్యతలు) డీఈఈగా ఎన్వీ భాస్కరరెడ్డి నియమితులయ్యారు. ఇప్పటివరకు రెగ్యులర్ డీఈఈగా విధులు నిర్వహించిన వీ.రవీంద్రారెడ్డి ఆదివారం పదవీ విరమణ చేశారు. ఈ నేపథ్యంలోనే కార్యాలయంలోనే అసిస్టెంట్ ఇంజినీర్గా విధులు నిర్వహిస్తున్న భాస్కర్రెడ్డికి ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించాలని పీఆర్ ఈఎన్సీ బాలునాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతోఆదివారం స్థానిక జెడ్పీలోని క్యూసీ కార్యాలయంలో డీఈఈగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఏఈ అమర్నాథ్, కార్యాలయ సీనియర్ సహాయకులు బీ.గిడ్డమూర్తి పాల్గొన్నారు. -
క్వింటా ఉల్లి రూ.1,200 ప్రకారం కొనుగోలు చేయాలి
● టెలీకాన్ఫరెన్స్లో అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషాకర్నూలు(సెంట్రల్): మార్క్ఫెడ్ ద్వారా క్వింటా ఉల్లిని రూ.1,200 ప్రకారం కొనుగోలు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. మార్కెటింగ్, హార్టికల్చర్, మార్క్ఫెడ్, మార్కెట్ యార్డు సెక్రటరీలతో ఉల్లి కొనుగోలుపై ఆదివారం ఉదయం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆదివారం మార్కెట్లకు వచ్చిన ఉల్లి నిల్వలు, సోమవారం ఎన్ని క్వింటాలు వచ్చే అవకాశం ఉందన్న వివరాలను తెలుసుకున్నారు. సోమవారం 1,200 నుంచి 1,500 క్వింటాళ్లు మార్కెట్కు వచ్చే అవకాశం ఉందని సెక్రటరీ వివరించారు. ఆదివారం నుంచే మార్కెట్కు వచ్చిన ఉల్లిని క్వింటా రూ.1200 ప్రకారం కొనుగోలు చేయాలని ఆదేశించారు. కర్నూలు, పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు, కోసిగి మార్కెట్లలో ఉల్లిని ఆరబెట్టుకునేందుకు తగిన సదుపాయాలు కల్పించాలన్నారు. టెలీకాన్ఫరెన్స్లో జేసీ డాక్టర్ బి.నవ్య, జిల్లా ఉద్యాన శాఖాధికారి రామాంజనేయులు, మార్క్ఫెడ్ డీఎం రాజు, మార్కెటింగ్ ఏడీ నారాయణమూర్తి, కర్నూలు మార్కెట్ సెక్రటరీ జయలక్ష్మి పాల్గొన్నారు. కర్నూలు, పత్తికొండలలో ఉల్లి కొనుగోలు కర్నూలు, పత్తికొండ మార్కెట్ యార్డుల్లో రైతుల నుంచి కిలో రూ.12 ప్రకారం ప్రభుత్వమే ఉల్లిని కొనుగోలు చేయనున్నట్లు జేసీ డాక్టర్ బి.నవ్య తెలిపారు. ఆదివారం రాత్రి ఆమె కర్నూలు మార్కెట్ యార్డును సందర్శించారు. అక్కడ ఇద్దరు రైతులతో మాట్లాడారు. క్వింటా రూ.1200 ప్రకారం ప్రభుత్వమే ఉల్లిని కొనుగోలు చేస్తుందని చెప్పడంతో వారు అంగీకరించారు. అయితే నాణ్యత ప్రమాణాల మేరకు గ్రేడింగ్ చేసుకోవాలని సూచించారు. జేసీ వెంట మార్కెట్ సెక్రటరీ జయలక్ష్మీ, మార్కెటింగ్ ఏడీ నారాయణమూర్తి, మార్కెఫెడ్ డీడీ గద్వాల్ నాగరాజు పాల్గొన్నారు. -
పెచ్చులూడి పడిన పాఠశాల పైకప్పు
● విద్యార్థులు లేకపోవడంతో తప్పిన ప్రమాదం కోసిగి: మండల పరిధిలోని సాతనూరు కొట్టాల గ్రామంలో ప్రాథమిక పాఠశాల పై కప్పు పెచ్చులూడి పడి పోయింది. ఆదివారం సెలవు దినం కావడంతో అందులో విద్యార్థులు లేక పోవడంతో పెను ప్రమాదం తప్పింది. గ్రామ ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరరగతి వరకు 35 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాల చాతా కాలం క్రితం కట్టించడంతో మరమ్మతులు చేపట్టలేదు. ఇటీవల కురిసిన వర్షాలకు పాఠశాల పైకప్పు ఉబ్బిపోయి శిథిలావస్థకు చేరింది. ఆదివారం ఓ మోస్తరు వర్షం కురుస్తుండడంతో ఒక్కసారిగా భారీ శబ్దంతో పైకప్పు పెచ్చులూడి కిందకు పడిపోయింది. గ్రామస్తులు గమనించి పాఠశాలకు వెళ్లి చూస్తే తరగతి అంతటా చెల్లాచెదురుగా పెంకులు ఊడిపడ్డాయి. పాఠశాల లేక పోవడంతో పిల్లలకు ప్రమాదం తప్పిందని గ్రా మస్తులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు స్పందించి పాఠశాలకు మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరారు. ఆగస్టులో అధిక వర్షాలు కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో ఆగస్టు నెల అధిక వర్షపాతం నమోదైంది. దీంతో వ్యవసాయ, ఉద్యాన పంటలకు అపారనష్టం వాటిల్లింది. ఆగస్టు నెల సాధారణ వర్షపాతం 116.2 మి.మీ. ఉండగా 208.9 మి.మీ. (80 శాతం అధికం) నమోదైంది. కర్నూలు అర్బన్, కర్నూలు రూరల్, ఆదోని, క్రిష్ణగిరి, వెల్దుర్తి తదితర మండలాల్లో అధిక వర్షాలు కురిశాయి. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు 10 మండలాల్లో వర్షాలు కురిశాయి. కల్లూరులో 12.8 మి.మీ., కర్నూలు అర్బన్లో 11.8, మంత్రాలయంలో 11.4, కోసిగిలో 11.2, కర్నూలు రూరల్లో 11.2, కౌతాళంలో 6.4 మి.మీ. ప్రకారం వర్షాలు కురిశాయి. మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు శ్రీశైలం టెంపుల్: శ్రీశైలంలో వెలసిన శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. అదివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు శ్రీగిరి చేరుకుని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. వేకువ జామున పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి క్యూ లైన్లలో బారులు తీరారు. భక్తుల శివ నామ స్మరణతో శ్రీశైల ఆలయం మారుమోగింది. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులు కిటకిటలాడుతున్నాయి. పొలాల్లో చిరుతపులి కూన సంచారం డోన్ టౌన్: పంట పొలాల్లో చిరుతపులి కూన సంచరిస్తూ ఉండటం దొరపల్లె, సీసంగుంతల గ్రామస్తులను భయాందోళనలకు గురి చేసింది. ఆదివారం పొలం పనులకు వెళ్లిన వారు చిరుత కూనను చూసి వీడియో తీశారు. చిరుత పిల్లతో పాటు తల్లి చిరుత ఉంటుందని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న ఫారెస్టు బీట్ అధికారిణి భారతి దొరపల్లె, సీసంగుంతల గ్రామాలకు వెళ్లారు. చిరుత పులి కూన సంచారం విషయం తెలుసుకొని ప్రజలను అప్రమత్తం చేస్తూ దండోరా వేయించారు. పొలాలకు ఒంటరిగా వెళ్లకూడదని, నలుగురు అంతే కంటే ఎక్కువ మంది గుంపులుగా ఉండాలని సూచించారు. ఆన్లైన్లో రూ. 23 లక్షల మోసం కర్నూలు(సెంట్రల్): ఆన్లైన్ ట్రేడింగ్ అంటూ గుర్తు తెలియని మోసగాళ్ల ఉచ్చుకు జోహరాపురం కుర్రాడు బలయ్యాడు. ఏకంగా రూ.23.70 లక్షలు పెట్టుబడి మోసం పోయాడు. కర్నూలు అర్బన్ మండల పరిధిలోని జోహరాపురానికి చెందిన శ్రావణ్కుమార్ అధిక వడ్డీలకు ఆశపడి ఆన్లైన్లో రూ.23.70 లక్షలు పెట్టబడి పెట్టారు. సైబర్ మోసగాళ్ల సెల్ఫోన్లు స్విచ్ఛాఫ్ కావడంతో మోసపోయానని తెలుసుకొని ఆదివారం పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమో దు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
మీరూ కోర్టుకు వెళ్లండి
కర్నూలు(అగ్రికల్చర్): గ్రామ వ్యవసాయ సహాయకుల(వీఏఏ) బదిలీల వ్యవహారం మళ్లీ మొదటికి రావడంతో వ్యవసాయ శాఖలో ప్రతిష్టంబన నెలకొంది. హైకోర్టు ఆదేశాలతో రీ కౌన్సెలింగ్ అనివార్యమైంది. ఈనేపథ్యంలో కోర్టుకు వెళ్లిన వారు మినహా మిగిలిన వీఏఏలు ఇప్పటికే కొత్త స్థానాల్లో చేరిపోయారు. బదిలీల్లో చాలా మంది వీఏఏలు పెద్ద ఎత్తున ముడుపులు ఇచ్చుకొని కీలకమైన స్థానాలు దక్కించుకున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వీరు డబ్బు ఎలా సంపాదించుకోవాలనే విషయంపైనే దృష్టి సారిస్తూ.. విధి నిర్వహణ గాలికొదిలేసినట్లు తెలుస్తోంది. రీ కౌన్సెలింగ్ విషయమై వ్యవసాయ శాఖ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయని పరిస్థితి. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు వీఏఏల బదిలీలు అనివార్యమైతే జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టాలనే ఉద్దేశంతో కలెక్టర్ ఉన్నట్లు తెలుస్తోంది. వీఏఏల బదిలీల వ్యవహారంలో జిల్లా పరువు గంగలో కలవడం పట్ల వ్యవసాయ శాఖపై జిల్లా కలెక్టర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. మరోసారి విమర్శలకు తావు లేకుండా జేసీకి వీఏఏల బదిలీల బాధ్యత అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే మండల వ్యవసాయాధికారులుగా నియమితులైన వారిలో 90 శాతం మంది కూటమి పార్టీల నేతలకు ముడుపులు ఇచ్చుకొనే వచ్చారనే చర్చ ఉంది. కనిష్టంగా రూ.5 లక్షల నుంచి గరిష్టంగా రూ.30 లక్షల వరకు ముడుపులు ఇచ్చుకున్నట్లు తెలుస్తోంది. డబ్బులు ఖర్చు పెట్టుకొని స్థానాలు పొందిన వారందరూ ఇప్పుడు ఆ మొత్తాన్ని సంపాదించుకునే పనిలో ఉన్నట్లు సమాచారం. ఈ పరిస్థితి పశ్చిమ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ముందుకు సాగని ఈ–క్రాప్ బుకింగ్ ఖరీఫ్ సీజన్ మరో 40 రోజుల్లో ముగియనున్నా ఈ–క్రాప్ బుకింగ్ ముందుకు సాగని పరిస్థితి. ఇప్పటి వరకు జిల్లాలో 3.38 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. మామూలుగా అయితే ఇప్పటికే 50–60 శాతం వరకు ఈ–క్రాప్ బుకింగ్ పూర్తి కావాల్సి ఉంది. అయితే 3.6 శాతం మాత్రమే చేయడం గమనార్హం. సగం మండలాల్లో ఈ–క్రాప్ బుకింగ్ ఊసే కరువైంది. బదిలీలు మళ్లీ మొదటికి రావడంతో పోస్టింగ్ ఎక్కడికి పడుతుందోనన్న ఆందోళన వీఏఏల్లో వ్యక్తమవుతోంది. అన్నదాత సుఖీభవ గ్రీవెన్స్ తీసుకునేదెవరు? అన్నదాత సుఖీభవ కింద వేలాది మందికి అన్ని అర్హతలున్నా సాయం అందలేదు. బ్యాంకు ఖాతాలకు ఎన్పీసీఐ లింక్ కాని ఖాతాలు వేలల్లో ఉన్నాయి. ఈ లిస్ట్లను గ్రామ రైతు సేవా కేంద్రాలకు పంపారు. వివరాలు రైతులకు చెప్పేందుకు వీఏఏలు అందుబాటులో లేని పరిస్ధితి ఏర్పడింది. ఇదే సమయంలో రైతుల నుంచి అన్నదాత సుఖీభవకు సంబంధించి గ్రీవెన్స్ తీసుకునే వారు కరువయ్యారు. తీసుకున్న గ్రీవెన్స్ను పరిశీలించి పరిష్కరించే దిక్కు లేకుండా పోయింది. నిర్వీర్యమైన రైతు సేవా కేంద్రాలు అన్నదాతలకు విశేష సేవలందించిన రైతుభరోసా కేంద్రాలు నేడు ఉండీ లేనట్లుగా తయారయ్యాయి. గతంలో 877 రైతు భరోసా కేంద్రాలు ఉండగా.. కూటమి ప్రభుత్వం 689కి తగ్గించింది. రేషనలైజేషన్ పేరిట 188 రైతు సేవా కేంద్రాలను మూసివేసింది. ఎట్టకేలకు బదిలీల ప్రక్రియ పూర్తయి పాలన గాడిన పడుతోందని భావిస్తున్న తరుణంలో హైకోర్టు వీఏఏల బదిలీలను రద్దు చేసింది. మళ్లీ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేపట్టాలని ఆదేశాలు ఇవ్వడంతో వ్యవసాయ శాఖలో ప్రతిష్టంభన నెలకొంది. ఈ సారి పత్తి, కంది తదితర పంటలు సాగు చేశాం. గతంలో ఆగస్టు 15లోపే ఈ–క్రాప్లో పంటలను నమోదు చేసేవాళ్లు. ఈ సారి ఆగస్టు నెల గడుస్తున్నా ఆ ఊసే కరువైంది. ఇక్కడ పనిచేసే గ్రామ వ్యవసాయ అసిస్టెంట్ను బదిలీ చేశారు. ఆ స్థానంలో ఎవ్వరినీ నియమించలేదు. 2023–24 వరకు రైతులకు అన్ని రకాల సేవలు ఆర్బీకే ద్వారా అందాయి. ఇప్పుడు ఎలాంటి సేవలు అందించడం లేదు. ఈ–క్రాప్ నమోదు చేస్తారో లేదో కూడా తెలియని పరిస్థితి. – ఉమేష్, జి.హొసల్లి, ఆదోని మండలం కోర్టుకు వెళ్లిన 40 మంది కోసం అందరినీ బదిలీ చేయాలా.. మీరూ కోర్టుకు వెల్లండి.. అని కొంతమంది అధికారులు వీఏఏలను రెచ్చగొడుతున్నట్లు సమాచారం. హైకోర్టు ఆదేశాల మేరకు రీకౌన్సెలింగ్ అనివార్యం కావడంతో ముడుపులు, సిఫారసులతో అనుకూలమైన స్థానాలు దక్కించుకున్న వీఏఏలు తమ పరిస్థితి ఏంటని నాయకులు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. దాదాపు 100 మందికిపైగా వీఏఏలు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు ముడుపులు ఇచ్చుకొని స్థానాలు పొందారు. ఒక వీఏఏ కోరుకున్న స్థానం కోసం రూ.2 లక్షలు ముడుపులు ఇచ్చుకున్నట్లు తెలుస్తోంది. స్థానాలు మారితే ఇచ్చిన డబ్బు తిరిగివ్వాలని కోరుతున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో 40 మంది కోసం అందరినీ బదిలీ చేయడం ఏంటి, మీరు కూడా కోర్టుకు వెళ్లండని రెచ్చగొడుతున్నట్లు తెలుస్తోంది. రేషనలైజేషన్ వల్ల నంద్యాల నుంచి 40 మంది వీఏఏలు కర్నూలు జిల్లాకు రావడం తప్పనిసరి. కోర్టుకు వెళ్లిన 40 మందికి వేరే పోస్టింగ్ ఇచ్చినా.. మరో 40 మంది పశ్చిమ ప్రాంతంలోని సరిహద్దు మండలాలకు వెళ్లడం తప్పనిసరి. విధి నిర్వహణలో అంటీముట్టనట్లుగా వీఏఏలు -
టీడీపీ నేతల అ‘ధన’పు వసూళ్లు
● ప్రతి నెలా ఇన్చార్జి డీలర్షిప్లలో మార్పులు ● ఒక్కో ఇన్చార్జి డీలర్షిప్నకు రూ.50 వేల వరకు వసూలుకర్నూలు(సెంట్రల్): పౌర సరఫరాల శాఖలో టీడీపీ నాయకుల అ‘ధన’పు వసూళ్లు ఎక్కువయ్యాయి. ప్రతి నెలా ఖాళీగా ఉన్న డిలర్షిప్ల స్థానంలో ఇన్చార్జ్ల కోసం సిఫార్సులు చేస్తుండడంతో అధికారులు ఏమి చేయలేకపోతున్నారు. జిల్లాలో 201 డీలర్షిప్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయా స్థానాల్లో ఇన్చార్జ్లను టీడీపీ నేతలు రెండు, మూడునెలలకు ఒక్కసారి మారుస్తున్నారు. జిల్లాలోని కర్నూలు డివిజన్లో 76, ఆదోని డివిజన్లో 80, పత్తికొండ డివిజన్లో 45 డీలర్ పోస్టులలు ఖాళీగా ఉన్నాయి. ఈ క్రమంలో ఖాళీ పోస్టుల్లో ఇన్చార్జిలను నియమించుకొని పచ్చనేతలు పబ్బం గడుపుకుంటున్నారు. ఒక్కో ఇన్చార్జి కోసం రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారు. కర్నూలు నగరంలో అయితే ఆ వసూలు మరింత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అధికారులు, ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పి టీడీపీ చోటామోటా నేతలు వసూలు చేస్తున్నారు. కొన్ని చోట్లా నేరుగా ప్రజాప్రతినిధులే వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కర్నూలు, ఆదోనిలో భలే డిమాండ్ ఇన్చార్జ్ డీలర్షిప్లకు కర్నూలు, ఆదోనిలలో ఎక్కువగా డిమాండ్ ఉంది. అక్కడ నేరుగా వినియోగదారులకు కేజీకి రూ.10–12 ఇచ్చి తంబ్ వేయించుకొని దోపిడీ చేసేందుకు ఎక్కువగా అవకాశం ఉంది. ఆయా ప్రాంతాల్లో ఎక్కువగా ఉద్యోగులు, వ్యాపారులు, ఇతర పనులు చేసే వారు అధికంగా ఉంటుండడంతో వారు బియ్యం తీసుకోరు. డీలర్లే నేరుగా వినియోగదారుల నుంచి బియ్యం కొనుగోలు చేసి అమ్మకాలు చేసుకుంటూ ఉంటారు. దీంతో ఆ రెండు ప్రాంతాల్లో ఎక్కువగా రేషన్ డీలర్ల ఇన్చార్జ్లకు డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. డీలర్షిప్ల ప్రక్రియను అర్ధాంతరంగా నిలిపివేసిన ప్రభుత్వం జిల్లాలో 201 డీలర్ పోస్టులను శాశ్వత ప్రతిపాదికన భర్తీ చేసేందుకు అధికార యంత్రాంగం 2024 డిసెంబర్ 23వ తేదీన నోటిఫికేషన్ను విడుదల చేసింది. కర్నూలు డివిజన్లో 76, ఆదోని డివిజన్లో 80,పత్తికొండ డివిజన్లో 45 డీలర్ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ చేశారు. 2024 డిసెంబర్ 23 నుంచి డిసెంబర్ 30వ తేదీ వరకు డీలర్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించారు. మొత్తం 1,648 దరఖాస్తులు రాగా అందులో కర్నూలు డివిజన్లో 874, ఆదోని డివిజన్లో 512, పత్తికొండడివిజన్లో 262మంది దరఖాస్తు చేసుకున్నారు. 2025 జనవరి 5వ తేదీన డివిజన్ కేంద్రాల్లో రాత పరీక్షను నిర్వహించారు. రాత పరీక్షకు 80 మార్కులు, ఇంటర్వ్యూకు 20 మార్కులు కేటాయించారు. ఒకటి, రెండు రోజుల్లో ఫలితాలు విడుదల చేసి భర్తీ చేస్తారనున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రక్రియను నిలిపివేసింది. దీంతో అప్పటి నుంచి పరీక్ష రాసిన అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. కాగా, డీలర్షిప్ పోస్టుల భర్తీ ప్రక్రియను ఎందుకు నిలిపివేశారో ఇప్పటికీ ఎవరికీ అర్థం కావడంలేదు. -
సమస్యలు తలెత్తితే నేరుగా కలవండి
● పదవీ విరమణ ఉద్యోగులకు ఎస్పీ హామీ కర్నూలు: పదవీ విరమణ అనంతరం రావాల్సిన ప్రయోజనాలకు సంబంధించిన సమస్యలు ఏవైనా తలెత్తితే తనను నేరుగా కలవాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. కర్నూలు పీసీఆర్ ఎస్ఐ నిర్మలాదేవి, ఏఆర్ఎస్ఐ పురుషోత్తం తదితరులు పోలీసు శాఖలో సుదీర్ఘకాలం పనిచేసి పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా శనివారం జిల్లా పోలీసు శాఖ తరపున ఎస్పీ విక్రాంత్ పాటిల్ శాలువా కప్పి పూలమాలలతో సత్కరించి వీడ్కోలు పలికారు. శేష జీవితం కుటుంబాలతో సంతోషంగా గడపాలని సూచించారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, ఏఆర్ డీఎస్పీ భాస్కర్రావు, ఎస్బీ సీఐ కేశవరెడ్డి, ఆర్ఐ నారాయణ, జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు నాగరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
అనుమానిత ఆంత్రాక్స్ కేసులపై విచారణ
ఎమ్మిగనూరుటౌన్: పట్టణంలోని శివన్న నగర్ ప్రాంతంలో ముగ్గురికి ఆంత్రాక్స్ అనుమానిత వ్యాధి లక్షణాలున్నాయన్న సమాచారంతో శనివారం అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో జిల్లా పశుసంవర్థక శాఖ డిప్యుటీ డైరెక్టర్ పీవీ రమణ, ఏడీ సుబ్రమాణ్యేశ్వర ఆచారి స్థానిక శివన్న నగర్ అర్బన్ హెల్త్ సెంటర్కు వచ్చి వైద్యాధికారిణి వీణతో మాట్లాడారు. అర్బన్ హెల్త్ సెంటర్కు ఎవరైనా వచ్చి ఆంత్రాక్స్ అనుమానిత లక్షణాలున్న వారు ప్రథమ చికిత్స చేయించుకున్నారా.. అని ఆరా తీయగా.. అలాంటి వారెవరూ చికిత్స చేయించుకోలేదని ఆమె వారికి తెలిపారు. అదేవిధంగా ఏఎన్ఎంలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా ఆంత్రాక్స్ వ్యాధి లక్షణాలతో వస్తే వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. అంతకుమునుపు కందనాతి గ్రామంలో గొర్రెలను పరిశీలించారు. ఎమ్మిగనూరులో ఎలాంటి అనుమానిత ఆంత్రాక్స్ కేసులు నమోదు కాలేదని వైద్య సిబ్బంది చెప్పడంతో పశుసంవర్ధక శాఖ అధికారులు ఊపిరి పీల్చుకొన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అదేవిధంగా మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ గంగిరెడ్డిని కలిసి మాట్లాడారు. వారి వెంట పశుసంవర్ధక శాఖ వీఏఎస్ డాక్టర్ దినకర్, ఎంపీహెచ్ఈఓ విజయకృష్ణలు పాల్గొన్నారు. -
కూటమి ప్రభుత్వం అన్నింటా విఫలం
ఆలూరు: కూటమి ప్రభుత్వం అన్నింటా విఫలమైందని వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కురుబ శశికళ విమర్శించారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. మహిళలకు ఉచిత బస్సును ప్రవేశపెట్టిన ప్రభుత్వం అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయకపోవడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సెప్టెంబర్ 1న ఉదయం 10 గంటలకు కర్నూలు ఎస్వీ కాన్వెన్షన్ హాల్లో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి, రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రసిడెంట్ ఎస్వీ విజయ మనోహరి ఆధ్వర్యంలో జిల్లా వైఎస్సార్సీపీ మహిళా విభాగం కార్యకర్తల కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశానికి అన్ని నియోజకవర్గాల నుంచి మహిళా ప్రజా ప్రతినిధులు, పార్టీ పదవులు పొందిన వారు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు.