breaking news
Telangana
-
హైవేపై వాహనాల రద్దీ.. ట్రాఫిక్ డైవర్షన్స్ ఇలా..
సాక్షి, నల్లగొండ: సంక్రాంతి పండుగ ముగిసింది. నగరవాసులు.. ఒక్కొక్కరుగా పల్లెలను వీడుతున్నారు. సిటీ వైపు పరుగు తీశారు. దీంతో, రహదారులపై వాహనాల రద్దీ నెలకొంది. ఈ క్రమంలో హైవేలపై ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు.. పటుచోట్ల ట్రాఫిక్ మళ్లింపులు ఏర్పాటు చేశారు.సంక్రాంతి సెలవులు ముగియడంతో ప్రజలు.. హైదరాబాద్కు వస్తున్నారు. దీంతో, జాతీయ రహదారి-65పై హైదరాబాదు వైపు వాహనాలు పరుగులు తీస్తున్నాయి. శనివారం ఒక్కరోజే హైదరాబాద్ వైపు లక్షన్నర వాహనాలు వెళ్లినట్లు సమాచారం. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇక, ఏపీ నుంచి వచ్చే భారీ వాహనాలను కోదాడ నుంచి హుజూర్నగర్, మిర్యాలగూడ, హాలియా, మల్లేపల్లి, మాల్ మీదుగా హైదరాబాద్ డైవర్షన్ చేశారు. మరికొన్ని వాహనాలను టోల్ ఫ్లాజాల వద్ద నిలిపివేస్తున్నారు. ట్రాఫిక్ మళ్లింపు ఉన్నట్టు వాహనదారులకు సూచిస్తున్నారు. -
పోతే రూ.6వేలు.. వస్తే రూ.18 లక్షల ఇల్లు
నిజామాబాద్ జిల్లా: రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇటీవల తగ్గిపోవడంతో కొందరు తమ స్థిరాస్తిని విక్రయించేందుకు నయా ట్రెండ్ను ఫాలో అవుతున్నారు. మోర్తాడ్కు చెందిన ఓ వ్యక్తి రూ. 18 లక్షలు విలువ చేసే 110 గజాల తన ఇంటిని కేవలం రూ. ఆరు వేలకే లక్కీ డ్రాలో పొందవచ్చంటు కరపత్రాల ద్వారా ప్రచా రం చేస్తున్నాడు. 300 మందికి సభ్యత్వం కల్పిస్తూ రూ.18లక్షలు వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. మహాశివరాత్రి రోజున నిర్వహించే లక్కీ డ్రాలో బంపర్ ప్రైజ్గా రూ.18లక్షల విలువ చేసే ఇంటిని, 30 మందికి గృహోపకరణాలను బహుమతిగా ప్రకటించారు. ఇలా ఎంతో మంది తమ పాత కార్లు, ఇంటి స్థలాలను, ఇతర సామగ్రిని మార్కెట్లో విక్రయించుకోలే లక్కీ డ్రా ద్వారా మార్కెటింగ్ చేసుకునే పద్ధతిని ఎంచుకుంటున్నారు. లక్కీ డ్రా నిర్వహణపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నా కొందరు ఇలాంటి ప్రయత్నాలను మానడం లేదు.కఠిన చర్యలు తీసుకుంటాంఎవరైనా ప్రభుత్వ అనుమతి లేకుండా లక్కీడ్రాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. మోర్తాడ్లో లక్కీడ్రా విషయం మా దృష్టికి వచ్చింది. సదరు వ్యక్తిని హెచ్చరించాం. ప్రజలు లక్కీడ్రాలను నమ్మి మోసపోవద్దు. – రాము, ఎస్సై, మోర్తాడ్ -
ప్రియురాలి కోసం భార్యను చంపి..
కృష్ణా జిల్లా: తల్లిని తమ తండ్రి చంపటం జీర్ణించుకోలేక పోతున్నామని, తమ తండ్రికి కచ్చితంగా శిక్ష పడాలని మృతురాలు రేణుకాదేవి కుమార్తె, కుమారుడు ముక్కామల తేజశ్రీ, ముక్కామల నాగేష్ ఆవేదన వ్యక్తం చేశారు. పోరంకిలో శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ తమ తండ్రి ముక్కామల ప్రసాద్ చౌదరి ఆకునూరు ఝాన్సీతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, తమ తల్లి అడ్డుగా ఉందని పథకం ప్రకారం హత్య చేశారని తెలిపారు. తమ పట్ల తండ్రి కపటప్రేమ చూపాడని, తల్లి పేరున ఉన్న ఇంటిని నమ్మకంగా తన పేరున రాయించుకున్నాడని అన్నారు. తమ తండ్రి ఇంత దారుణానికి ఒడికడతాడని కలలో కూడా ఊహించలేదని తెలిపారు. సెల్ఫోన్ డేటా ఆధారంగానే తల్లి హత్య ఉదంతం వెలుగు చూసిందని అన్నారు. హత్య వెనుక పలువురు వ్యక్తుల ప్రమేయం ఉందని అనుమానాలు ఉన్నాయని దీనిపై పోలీసులు సమగ్ర విచారణ చేయాలని కోరారు. నన్ను కూడా చంపాలని చూశారు... తన తండ్రి ప్రసాద్చౌదరి, ఆయనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఝాన్సీ తనను కూడా హత్య చేయాలని చూశారని మృతురాలి కుమారుడు నాగేష్ ఆరోపించారు. తనకు ఇష్టం లేకపోయినా తనను యూకేకు బలవంతంగా పంపారని, తనను యూకేలోనే చంపాలని పథకం వేశారని అన్నారు. తాను యూకేకు వెళ్లిన 25 రోజుల్లోనే తల్లిని హత్య చేశారని చెప్పారు. దీంతో తాను ఇండియాకు వచ్చానన్నారు. ఇంత దారుణానికి పాల్పడిన తండ్రి ప్రసాద్చౌదరి, ఝాన్సీలకు శిక్షపడాలని అన్నారు. -
Wings India2026: హైదరాబాద్లో విమానాల జాతర
సాక్షి, న్యూఢిల్లీ: ఆసియాలోనే అతిపెద్ద సివిల్ ఏవియేషన్ షో కోసం హైదరాబాద్ మరోసారి వేదిక కానుంది. బేగంపేట ఎయిర్పోర్ట్లో ఈ నెల 28 నుంచి 31 వరకు వింగ్స్ ఇండియా–2026 నిర్వహించనున్నట్లు పౌర విమానయాన శాఖ ప్రకటించింది. పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపింది. గ్లోబల్ ఏరోహబ్గా భారత్ ఎదుగుతున్న వైనాన్ని ప్రపంచానికి చాటిచెప్పడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వివరించింది. భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ చేయనున్న గగనతల విన్యాసాలు ఈ షోకే హైలైట్గా నిలవనున్నాయి. వివిధ రకాల విమానాలను సందర్శకులు దగ్గరి నుంచి చూసేలా స్టాటిక్ డిస్ప్లేలు ఏర్పాటు చేయనున్నారు. కేవలం వినోదం, వ్యాపారమే కాదు.. యువతకు ఉపాధి కల్పించేలా ఈవెంట్ ప్లాన్ చేశారు. ఏవియేషన్ రంగంలో కెరీర్ను కోరుకునే యువత కోసం ప్రత్యేకంగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. పరిశ్రమ దిగ్గజాలను, నైపుణ్యం కలిగిన యువతను ఒకే వేదికపైకి తీసుకురానున్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేలా సివిల్ ఏవియేషన్ ఇన్నోవేషన్ చాలెంజ్ను కూడా నిర్వహించనున్నారు. 20కిపైగా దేశాల నుంచి ప్రతినిధులు, బృందాలు ఈ వేడుకలో పాల్గొననున్నాయి. విమానయాన సంస్థలు, తయారీదారులు, ఎయిర్పోర్ట్ డెవలపర్లు, పెట్టుబడిదారులు అంతా ఒకేచోట చేరనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్లోబల్ సీఈవోల ఫోరం, బిజినెస్ మీటింగ్స్ జరగనున్నాయి. డ్రోన్ టెక్నాలజీ, మహిళలకు విమానయాన రంగంలో అవకాశాలు, ఎయిర్ కార్గో వంటి 13 కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. -
నేటి నుంచి నాగోబా జాతర
సాక్షి, ఆదిలాబాద్: దేశంలో రెండో అతిపెద్ద గిరిజన జాతరగా ఖ్యాతిగాంచిన నాగోబా జాతర ఆదివారం ప్రారంభం కానుంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో కొలువైన నాగోబా ఆలయంలో అందు కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 25 వరకు జాతరను ప్రభుత్వం అధికారికంగా నిర్వ హించనుంది. 22న గిరిజన దర్బార్ జరగనుంది. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రానున్నట్లు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తెలిపారు. కేస్లాపూర్ వద్ద అన్ని రకాల అభివృద్ధి పనుల కోసం రూ. 22 కోట్లు కేటాయిస్తామని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం నిర్మల్లో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ ఇచ్చినట్లు బొజ్జు పటేల్ పేర్కొన్నారు. ఇప్పటికే ఇంద్రవెల్లి మండలం ముత్నూర్ నుంచి కేస్లాపూర్కు వచ్చే దారిలో 4 కిలోమీటర్ల పరిధిలో రూ. 15 కోట్లతో డబుల్ రోడ్డు పనులకు ఇటీవలే భూమిపూజ చేశారు. రూ. కోటితో ఆలయ ఆవరణలో భోజనాల కోసం షెడ్ను నిర్మించతలపెట్టారు. సంప్రదాయాలకు పెద్దపీట..నాగోబా జాతరలో మెస్రం వంశీయులు తమ ఆచారాలు, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. జాతరకు నెల ముందు పుష్య మాసం మొదలయ్యాక నెలవంకను చూడటంతో ఈ మహా ఘట్టానికి శ్రీకారం చుడుతారు. ఆ మరుసటి రోజు నుంచి మెస్రం వంశీయులు నివసించే ఏడు గ్రామాలను చుట్టిరావడం మొదలుపెడతారు. ఆ ప్రక్రియలో భాగంగా జాతర నిర్వహణపై ప్రచారం చేస్తారు. ఆ తర్వాత మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామంలోని హస్తినమడుగు నుంచి గోదావరి పవిత్ర జలాలను సేకరించేందుకు అదే ఏడు గ్రామాల మీదుగా మెస్రం వంశీయులు పాదయాత్రగా బయల్దేరుతారు. పూర్తిగా తెల్ల దుస్తులు ధరించి భక్తి శ్రద్ధలతో ఈ ప్రక్రియ చేపడతారు. గోదావరి జలాలతో తిరిగి ఇంద్రవెల్లిలోని ఇంద్రాదేవి ఆలయం మీదుగా కేస్లాపూర్ పొలిమేరలోని మర్రిచెట్టు వద్దకు చేరుకొని బస చేస్తారు. ఈ నెల 14న పాదయాత్ర పూర్తి చేసి మర్రిచెట్టు దగ్గరకు చేరుకున్న మెస్రం వంశీయులు శనివారం ఉదయం తూమ్ (కర్మకాండ) పూజలు పూర్తి చేశారు. ఆదివారం పుష్యమాస అమావాస్యను పురస్కరించుకొని నాగోబాకు మహాపూజలు నిర్వహించడం ద్వారా జాతరను ప్రారంభించనున్నారు. -
వరాహాల డిష్యుం.. డిష్యుం
మహబూబ్నగర్ జిల్లా: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వినూత్నంగా నిర్వహించిన వరాహాల పోటీలు విశేషంగా అలరించాయి. నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం నిడ్జింత గ్రామ శివారులో ఎరుకల సంఘం ఆధ్వర్యంలో శనివారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 24 గ్రామాల నుంచి యజమానులు పోటీల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో కోయిల్కొండ మండలం కొత్లాబాద్ గ్రామానికి చెందిన హరికృష్ణ వరాహం.. నారాయణపేట శివకు చెందిన వరాహం ఫైనల్లో హోరాహోరీగా తలపడ్డాయి. శివ వరాహం గెలుపొందగా నిర్వాహకులు రూ.5 వేల నగదు బహుమతి అందజేశారు. సమీప గ్రామాల నుంచి పెద్దఎత్తున జనాలు తరలివచ్చి పోటీలను ఆసక్తిగా తిలకించారు. -
వలకు చిక్కిన భారీ సొరచేప
సింగరాయకొండ: ప్రకాశం జిల్లా పాకల సముద్ర తీరంలో ఆదివారం పాకల పంచాయతీలోని చెల్లెమ్మగారి పట్టపుపాలేనికి చెందిన మత్స్యకారుడు కఠారి కృష్ణంరాజు వలకు భారీ సొరచేప పడింది. ఉదయం సముద్రంలో 15 కిలోమీటర్ల దూరం వెళ్లి వేట సాగించాడు. ఆ సమయంలో సొరచేప వలకు చిక్కింది. ఇది తల్లి చేప అని, పిల్లల్ని కనేదశలో ఉందని మత్స్యకారులు తెలిపారు. ఈ సొరచేప రింగు వలకు చిక్కుకోవటంతో అది మృతి చెందిందని, దీని బరువు 400 కేజీలు ఉంటుందన్నారు. బహిరంగ మార్కెట్లో దీని విలువ రూ.2 లక్షలు ఉంటుందని మత్స్యశాఖాధికారులు తెలిపారు. ఈ చేప గర్భంలో దాదాపు 30 వరకు పిల్ల సొరచేపలు లభించాయని తెలిపారు. ఈ చేపను కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో మత్స్యకారుడు శివ రూ.8 వేలకు ఈ చేపను దక్కించుకున్నాడు. -
22 రూపాయల కోసం హత్య
చేగుంట(మెదక్ జిల్లా): కేవలం 22 రూపాయల పాత బాకీ విషయంలో గొడవపడి, తోటి కార్మికుడిని హత్య చేసిన నిందితుడిని అరెస్టు చేసినట్లు తూప్రాన్ డీఎస్పీ నరేందర్గౌడ్ తెలిపారు. శనివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో ఆయన ఈ కేసు వివరాలు వెల్లడించారు. మెదక్ జిల్లా అనంతసాగర్ శివారులోని సప్తగిరి కెమికల్ పరిశ్రమలో పనిచేసే ఉత్తరప్రదేశ్కు చెందిన సిరాజ్ (30), అదే రాష్ట్రానికి చెందిన మహేశ్కుమార్ధర్మ ఒకే గదిలో ఉంటున్నారు. ఈ క్రమంలో ఈనెల 15న పండుగ రోజు మద్యం సేవించేందుకు ఇద్దరు స్నేహితులు బయటకు వెళ్లారు. గ్రామశివారులో మద్యం తాగుతూ సిరాజ్ తనకు బాకీ ఉన్న రూ.22 విషయంలో మహేశ్కుమార్ గొడవ పెట్టుకున్నాడు. మాటామాటా పెరగడంతో మహేశ్, సిరాజ్ తలను చెట్టుకు బాది, అనంతరం రాయితో తలపై గాయపరిచాడు. దీంతో సిరాజ్ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం మహేశ్కుమార్ అక్కడి నుంచి పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న తూప్రాన్ సీఐ రంగాకృష్ణ, చేగుంట ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో మాసాయిపేట శివారులో నిందితుడు మహేశ్కుమార్ను అదుపులోకి తీసుకొని విచారించగా హత్యకు దారితీసిన వివరాలు తెలిపాడు. నిందితుడిని రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. -
నేడు మేడారంలో కేబినెట్ భేటీ.. ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి ప్రతినిధి, వరంగల్/సాక్షి, హైదరాబాద్/ఎస్ఎస్ తాడ్వాయి: రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఓ మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క–సారలమ్మ సన్నిధిలో ఆదివారం సాయంత్రం 5 గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది. అక్కడి హరిత హోటల్ కేంద్రంగా కీలకాంశాలపై నిర్ణయం తీసుకోవడానికి సమాయత్తమైంది.షెడ్యూల్ ప్రకారం సీఎం రేవంత్రెడ్డి ఆదివారం పాలేరులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఖమ్మం పట్టణంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు చెప్పాయి. ఆ తర్వాత అక్కడే జరగనున్న సీపీఐ వందేళ్ల సభలో పాల్గొననున్నారు. ఆ తర్వాత పలువురు మంత్రులతో కలిసి హెలికాప్టర్లో బయలుదేరి సాయంత్రం 4 గంటలకల్లా మేడారానికి చేరుకోనున్నారు. మంత్రివర్గ సమావేశం అనంతరం మేడారంలోనే రాత్రి బస చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంత్రులతో కలిసి సోమవారం ఉదయం 6:30 గంటలకు నూతనంగా నిర్మించిన సమ్మక్క–సారలమ్మ గద్దెలను ప్రారంభించనున్నారు. వనదేవతలకు చీర, సారె, బెల్లంతో మొక్కులు సమర్పించుకుని తిరిగి హైదరాబాద్ బయలుదేరనున్నారు.భద్రత కట్టుదిట్టం..రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నేపథ్యంలో మేడారంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. సీఎం హెలిప్యాడ్ స్థలం, హరిత హోటల్, టెంట్ సిటీ, సాంస్కృతిక కార్యక్రమాల సభా ప్రాంగణం తదితర ప్రాంతాల వద్ద అదనపు బలగాలను మోహరించారు. డీజీపీ శివధర్రెడ్డి, ఐజీ చంద్రశేఖర్రెడ్డి భద్రతా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షించగా ములుగు ఎస్పీ సు«దీర్ రాంనాథ్ కేకన్ భద్రతా ఏర్పాట్లపై మేడారంలోని కమాండ్ కంట్రోల్ రూంలో సమీక్షించారు. బందోబస్తు విధుల కోసం 1,600 మంది పోలీసులను మోహరించినట్లు చెప్పారు.మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్సిగ్నల్! మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా స్థానిక సంస్థల్లో కో–ఆప్షన్ సభ్యులుగా ట్రాన్స్జెండర్లను నియమించే అంశంపై మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకొని ఆర్డినెన్స్ జారీకి ఆమోదం తెలుపనున్నట్లు సమాచారం. అలాగే మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు గ్రీన్సిగ్నల్ ఇవ్వనుందని అధికార వర్గాలు వెల్లడించాయి. ములుగు జిల్లాలోని రామప్ప చెరువుపై రూ. 103.22 కోట్ల అంచనా వ్యయంతో పొట్లాపూర్ ఎత్తిపోతల పథకం నిర్మించాలనే ప్రతిపాదనపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. కేబినెట్ భేటీలో సుమారు 15 అంశాలు చర్చకు రానున్నట్లు తెలిసింది. భూ కేటాయింపులు, మూడు యూనివర్సిటీల్లో కొత్తగా మూడు ప్రొఫెసర్ పోస్టుల మంజూరు, పురపాలక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అమలుపై స్టేటస్ నోట్లు కేబినెట్ ముందుకు రానున్నట్లు తెలియవచ్చింది. నీటిపారుదల శాఖ నుంచి చిన్న కాళేశ్వరం (ముక్తేశ్వర) ఎత్తిపోతల సవరించిన అంచనాల ఫైల్ కేబినెట్ ముందుకు రానుంది. సమ్మక్క–సారలమ్మ జాతరకు జాతీయ హోదా సాధన, నిర్వహణ కోసం నిధుల మంజూరు అంశాలపై మంత్రివర్గం చర్చించనున్నట్లు అలాగే రైతు భరోసా చెల్లింపులు, సీఎం దావోస్ పర్యటన, ఇతర సమకాలీన రాజకీయ అంశాలపై కేబినెట్లో చర్చకు రానున్నట్లు తెలిసింది.గిరిజన సంప్రదాయ వంటకాలతో విందు: మంత్రి సీతక్క మేడారంలో కేబినెట్ భేటీ కోసం వస్తున్న సీఎం, మంత్రులకు గిరిజన సంప్రదాయ వంటకాలతో విందు ఏర్పాటు చేసినట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఇప్పపువ్వు లడ్డూ, కరక్కాయ చాయ్, ఇప్పపువ్వు టీ, జావ, జొన్న రొట్టె, గోదావరి చేపలు, రొయ్యలు, బొంగు చికెన్ తదితర వంటకాలను వడ్డించనున్నట్లు చెప్పారు. జిల్లాలో లభించే పదార్థాలతోనే ఆహారాన్ని తయారు చేస్తున్నట్లు వివరించారు.ట్రాఫిక్ మళ్లింపులు.. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా మేడారం వచ్చే భక్తులకు ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయని ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ వెల్లడించారు. ఆదివారం మేడారం జాతరకు వన్వే అమలు చేస్తున్నట్టు తెలిపారు. వరంగల్ నుండి మేడారం వచ్చే భక్తులు. ములుగు పసర.. నార్లాపూర్ మీదుగా మాత్రమే మేడారం చేరుకోవాలి. తాడ్వాయి మీదుగా ప్రవేశం లేదు. ఆదివారం భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందువల్ల ట్రాఫిక్ నియంత్రణ చర్యలు పాటించి పోలీసులకు సహకరించాలన్నారు. తిరుగు ప్రయాణంలో భయక్కపేట భూపాలపల్లి.. పరకాల.. గూడెపాడు మీదుగా వరంగల్ చేరుకోవాలి. మేడారంలో సీఎం పర్యటన సందర్భంగా పోలీసుల అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాలు ఎగుర వేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
అనుమానిస్తున్నాడని అంతమొందించి..
మహబూబ్ నగర్ జిల్లా: తనను అనుమానిస్తూ.. వేధిస్తున్నాడనే కోపంతో భర్త తలపై పారతో కొట్టడంతో భర్త మృతిచెందాడు. గోపాల్పేట ఎస్ఐ జగన్మోహన్ కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా గోపాల్పేట మండలంలోని ఏదుట్ల గ్రామానికి చెందిన శానాపల్లి చిన్నమల్లయ్య (40), శివమ్మ భార్యాభర్తలు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. గొర్లు, మేకలు పెంచుకుని జీవనం సాగిస్తున్నారు. ఇంటివద్ద స్థలం లేకపోవడంతో జీవాలను మల్లయ్య తన బామ్మర్ది ఇంటివద్దే ఆపేవాడు. అయితే కొంతకాలంగా మల్లయ్య తన భార్యపై అనుమానం పెంచుకొని తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలోనే శనివారం మల్లయ్య, తన భార్య శివమ్మ గొర్లు నిలిపే ఇంటివద్దకు వెళ్లగా.. అప్పటికే మల్లయ్య మద్యం తాగి ఉండటంతో ఇద్దరికీ మాటామాటా పెరిగింది. దీంతో క్షణికావేశానికి లోనైన శివమ్మ ఇంటి ముందున్న పార తీసుకుని మల్లయ్య తలపై బాదడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఆ తర్వాత భర్త ఇంటి గడపమీద పడి మరణించాడని చెప్పి అందరినీ నమ్మించింది. మల్లయ్య అన్న వెంకటయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. శివమ్మను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో తాను పారతో కొడితేనే మృతిచెందాడని ఒప్పుకోవడంతో అదుపులోకి తీసుకున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు టీచర్లు మృతి
అర్వపల్లి, నల్లగొండ: సంక్రాంతి సెలవులు ముగిసి శనివారం పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు టీచర్లు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) ప్రత్యేక అధికారిణి మామిడాల కల్పన (43), తుంగతుర్తి మండలం రావులపల్లి జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయురాలు పోరెడ్డి గీత (48)తోపాటు తుంగతుర్తి జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడు అలువాల ప్రవీణ్కుమార్, తుంగతుర్తి మండలం అన్నారం జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడు అలువాల సునీతారాణి శనివారం ఉదయం గీతకు చెందిన కారులో నల్లగొండ నుంచి పాఠశాలలకు బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు అర్వపల్లి శివారులోని ముదిరాజ్కాలనీ వద్దకు రాగానే అదుపుతప్పి.. రోడ్డు పక్కన ఇంటి నిర్మాణం కోసం పోసిన ఇసుక కుప్పపై నుంచి వెళ్లి పల్టీలు కొడుతూ పొలాల్లోకి దూసుకెళ్లింది. అదే సమయంలో కారు ముందుభాగం ఎడమవైపు టైరు పేలింది. కారు పల్టీ కొట్టడంతోనే కల్పన రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడింది. ఆ తర్వాత సునీతారాణి, గీత ఎగిరి కిందపడ్డారు. ప్రవీణ్కుమార్ కారులో ఇరుక్కుపోగా స్థానికులు బయటకు తీశారు. కారు డ్రైవర్ నదిపల్లి గిరి స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. వారిని సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే కల్పన మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గీతను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. సునీతారాణి, ప్రవీణ్కుమార్ పరిస్థితి విషమంగా ఉండగా హైదరాబాద్కు తరలించారు. వీరిద్దరు అన్నాచెల్లెళ్లు. ఈ ప్రమాదం కారు డ్రైవర్ అతివేగం, అజాగ్రత్త వల్లే జరిగిందని పోలీసులు కేసు నమోదు చేశారు. నల్లగొండలోని లక్ష్మీనగర్ కాలనీలో నివాసముంటున్న గీత.. సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం రావులపల్లి ప్రభుత్వ పాఠశాలలో గెజిటెడ్ హెచ్ఎంగా పనిచేస్తున్నారు. ఈమె కుమారుడు సాయినితన్రెడ్డి ఎంఎస్ కోసం అమెరికా వెళ్లాడు. కూతురు సౌమికకు పెళ్లి అయి భర్తతో కలిసి అమెరికాలో ఉంటోంది. వచ్చే నెలలో కుమారుడికి కాన్వొకేషన్ ఉంది. దీంతో గీత ఫిబ్రవరిలో పిల్లల వద్దకు వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారు. కానీ, శనివారం పాఠశాలకు వెళ్తూ గీత రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. తల్లి మృతి విషయం తెలుసుకున్న కూతురు, కుమారుడు.. భారత్కు బయల్దేరారు. కాగా.. నల్లగొండలోని హనుమాన్నగర్లో నివాసం ఉండే లింగంపల్లి కల్పన తుంగతుర్తి కేజీబీవీలో ప్రత్యేకాధికారి(ఎస్ఓ)గా కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్నారు. సాయంత్రం త్వరగా వస్తానని చెప్పి.. రోజూ వచ్చే సమయం కంటే ముందుగానే శవమై వచ్చిందని ఆమె భర్త, పిల్లలు విలపించారు. గీత, కల్పన మృతదేహాలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నివాళులర్పించి మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. -
పేదలకు అండ.. శత వసంతాల ఎర్రజెండా!
సాక్షి, హైదరాబాద్/సాక్షిప్రతినిధి, ఖమ్మం: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) శత వసంతాల ముగింపు ఉత్సవాలకు కమ్యూనిస్టుల ఎర్రకోట ఖమ్మం ముస్తాబైంది. కాలపరీక్షకు తట్టుకొని రెపరెపలాడుతున్న ఎర్రజెండా నూరేళ్ల పండక్కి కమ్యూనిస్టు శ్రేణులు కదంతొక్కుతున్నాయి. ఆదివారం నుంచి ఈనెల 21 వరకు సీపీఐ వందేళ్ల ఉత్సవాలను ఖమ్మంలో నిర్వహించేందుకు పార్టీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఖమ్మంలో నిర్వహిస్తున్న ర్యాలీ, భారీ బహిరంగసభ ద్వారా ఎర్రజెండాకు పూర్వ వైభవం తీసుకురావాలని సీపీఐ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. బహిరంగసభకు ఆ పార్టీ జాతీయస్థాయి నేతలతోపాటు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరవుతున్నారు. ఈనెల 19 నుంచి 21 వరకు జరిగే సీపీఐ జాతీయ సమితి సమావేశాలు, ఇతర కార్యక్రమాల్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీల ప్రధాన కార్యదర్శులు డి.రాజా, ఎంఏ బేబీ సహా 40 దేశాలకు చెందిన వామపక్ష పార్టీల నేతలు పాల్గొనబోతున్నారు. భారత గడ్డపై ప్రస్థానం ఎంఎన్ రాయ్, అబానీ ముఖర్జీ వంటి నేతలు 1920లోనే తాష్కెంట్లోనే కమ్యూనిజానికి పునాదులు వేయగా, భారత గడ్డపై సత్యభక్త నేతృత్వంలో 1925 డిసెంబర్ 26న కాన్పూర్లో పార్టీ రూపుదిద్దుకుంది. ’సంపూర్ణ స్వరాజ్’ కావాలని కాంగ్రెస్ కంటే ముందే డిమాండ్ చేసిన ఘనత కమ్యూనిస్టులదే. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత సీపీఐ రాజకీయంగా బలమైన పార్టీగా ఎదిగింది. ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగింది. 1957లో కేరళలో ఈఎంఎస్. నంబూద్రిపాద్ నేతృత్వంలో ప్రపంచంలోనే తొలిసారిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడింది. ఇది భూ సంస్కరణలు, విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. 1964లో పార్టీ సీపీఐ, సీపీఎంగా చీలిన తరువాత నుంచి ఎర్రజెండా బలహీనపడటం మొదలైంది. రాజకీయ ప్రాధాన్యతలో క్రమక్రమంగా పార్టీ క్షీణిస్తూ వచ్చినప్పటికీ, పోరాటాల్లో ఆ పార్టీ ముద్ర ఇప్పటికీ బలంగా కనిపిస్తుంది. తెలంగాణ సాయుధ పోరాటం తెలుగు నేలపై కమ్యూనిస్టుల చరిత్ర అంటే అది రక్తం చిందించిన పోరాటాల చరిత్ర. నిజాం నవాబు ఆగడాలకు, దొరల గడీల అరాచకత్వానికి వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ పోరాటం (1946–1951) కమ్యూనిస్టుల అతిపెద్ద విజయం. పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, రావి నారాయణరెడ్డి వంటి ఉద్ధండులు ఈ పోరాటాన్ని ముందుండి నడిపారు. 1946 జూలై 4న కడివెండిలో దొడ్డి కొమరయ్య అమరత్వం ఈ పోరాటానికి నిప్పుకణిక అయింది. చాకలి ఐలమ్మ భూమిని కాపాడటానికి ’సంఘం’ (కమ్యూనిస్టులు) అండగా నిలిచింది. 3000 గ్రామాలను విముక్తం చేయడం, 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచడం ప్రపంచ చరిత్రలోనే ఒక అరుదైన ఘట్టం. దేశ చరిత్రలోనే అతిపెద్ద రైతాంగ పోరాటంగా నిలిచింది. దీనికి నాయకత్వం వహించింది కమ్యూనిస్టు పార్టీయే. ఉమ్మడి ఏపీలో, తెలంగాణలో ప్రస్థానం ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులోనూ, విశాలాంధ్ర ఉద్యమంలోనూ కమ్యూనిస్టులు అగ్రభాగాన నిలిచారు. 1952 ఎన్నికల్లో రాష్ట్రంలో కమ్యూనిస్టులు భారీ విజయాన్ని సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి వెళ్లారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో ఏళ్లపాటు సీపీఐ బలమైన ప్రతిపక్షంగా పనిచేసింది. చండ్ర రాజేశ్వరరావు, తరిమెల నాగిరెడ్డి, సురవరం సుధాకరరెడ్డి వంటి దిగ్గజ నాయకులు ఇక్కడి నుంచే జాతీయ స్థాయికి ఎదిగారు. సీహెచ్ రాజేశ్వర్ రావు, దేశిని చినమల్లయ్య, చాడా వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు వంటి నాయకులు రాష్ట్రంలో సీపీఐ ఎదుగుదలలో తమ వంతు పాత్ర పోషించారు. ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో సీపీఐ బలమైన రాజకీయశక్తిగా కొనసాగింది. పొత్తు రాజకీయాల్లో పార్టీ కుంచించుకుపోయినా, రాజకీయంగా పల్లెలు, పట్టణాల్లో ఎర్రజెండా ఉనికి ఇప్పటికీ చాటుతోంది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కూడా సీపీఐ తనదైన ముద్ర వేసింది. ఉమ్మడి రాష్ట్రంలో 2003లో జరిగిన విద్యుత్ ఉద్యమంలో కూడా సీపీఐ కీలక పాత్ర పోషించింది. లౌకికవాదాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా.. వందేళ్ల వేళ ఖమ్మం నగరం ఎర్రకోటను తలపిస్తోంది. దేశంలో మితవాద శక్తులు బలపడుతున్న తరుణంలో, లౌకికవాదాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా ఈ సభ జరుగుతోంది. ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణ, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభంపై గళమెత్తడం. రాబోయే రోజుల్లో వామపక్ష ఐక్యతను చాటడమే ఈ సభ ముఖ్య ఉద్దేశం. ––కూనంనేని సాంబశివరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పుదుచ్చేరి నుంచి సైకిల్పై.. ఖమ్మంమయూరి సెంటర్: సీపీఐ వందేళ్ల సభలో పాల్గొనేందుకు తమిళనాడుకు చెందిన పార్టీ నాయకులు సైకిల్ యాత్రగా ఖమ్మం చేరుకున్నారు. తమిళనాడు రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు దేవసహాయం, కార్యవర్గ సభ్యుడు శరవణన్ పుదుచ్చేరి నుంచి ఈనెల 8న సైకిళ్లపై బయలుదేరారు. రోజుకు 90 కి.మీ. మేర 750 కి.మీ. ప్రయాణించి శనివారం ఖమ్మం వచ్చారు. వీరికి కూనంనేని సాంబశివరావు, జిల్లా కార్యదర్శి దండి సురేష్ స్వాగతం పలికారు. -
పదేళ్లలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశారా? : సీఎం రేవంత్
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘ప్రజా సమస్యలు, ప్రాజెక్టులపై శాసనసభ వేదికగా చర్చించాలని సవాల్ విసిరా. రోజంతా చర్చ పెట్టినా ప్రతిపక్ష నాయకుడు రాకుండా పారిపోయారు. నిజంగా వారు తెలంగాణకు ప్రాజెక్టులు తెచ్చి ఉంటే.. సాగు నీరందించి సస్యశ్యామలం చేస్తే ఎందుకు పారిపోయారు? చర్చకు రాకుండా పారిపోయి మళ్లీ మమ్మల్ని ప్రశ్నిస్తారా? మీరు పదేళ్లలో ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశారా?’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిలదీశారు. జిల్లాల పర్యటనలో భాగంగా శనివారం మహ బూబ్నగర్కు వచ్చిన ఆయన రూ.1,284 కోట్ల వ్యయంతో చేపట్టిన ట్రిపుల్ ఐటీ భవన నిర్మాణాలు, భూగర్భ డ్రైనేజీ, తాగునీటి పునరుద్ధరణ, బలోపేతం వంటి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంవీఎస్ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ఎలా పాలించాలో మాకు తెలుసు ‘నేను సీఎం అయి రెండేళ్లు కాలేదు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు నన్ను దిగిపో దిగిపో అంటున్నారు. సీఎం కుర్చీ ఏమైనా మీ జాగీరా? మీ తాతలు ఇచ్చిన ఆస్తినా? 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఆశీర్వదించి నన్ను ఈ కుర్చీలో కూర్చోబెట్టారు. పాలన ఎలా చేయాలో.. సమస్యలు ఎలా పరిష్కరించాలో మాకు తెలుసు. ఇంకా పదేళ్లు మేమే ఉంటాం. నచ్చితే ఆశీర్వదించు. నచ్చకపోతే నీ ఫాంహౌస్లో విశ్రాంతి తీసుకో. శుక్రాచార్యులు, మారీచులు, సుబాహులు, రాక్షసులను కట్టడిచేసే సత్తా పాలమూరు బిడ్డకు ఉంది. గొప్పలు చెబుతున్న ప్రతిపక్షం ప్రతిపక్షంలో ఉన్నవారు మేము విజయాలు సాధించామని గొప్పలు చెబుతున్నారు. కానీ తెలంగాణ మొదటి సీఎం కేసీఆర్ మహబూబ్నగర్ జిల్లాకు ఏ ఒక్క కొత్త ప్రాజెక్టు అయినా మంజూరు చేసిండా? లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం మూడేళ్లలో కూళేశ్వరం అయింది. డిండి, బీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్, సంగంబండ, పాలమూరు–రంగారెడ్డి తదితర ప్రాజెక్టులను పూర్తి చేయలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశలో అప్పటి పాలమూరు ఎంపీ విఠల్రావు పాలమూరు పథకం గురించి నాటి సీఎం దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఆయన అకాల మరణం తర్వాత దీంతో పాటు జలయజ్ఞంలో ప్రారంభించిన ప్రాజెక్టులు ఆగిపోయాయి. 2014లో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ పదేళ్లుగా పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయలేదు. ఈ పథకానికి రూ.25 వేల కోట్ల బిల్లులను కాంట్రాక్టర్లకు చెల్లించి, ఉద్ధండాపూర్ నిర్వాసితులకు ఎందుకు పరిహారం ఇవ్వలేదు? కల్వకుర్తి ప్రాజెక్టు భూసేకరణకు ఎందుకు నిధులు ఇవ్వలేదు? బీమా–1లో భాగంగా సంగంబండ రిజర్వాయర్ కాల్వకు అడ్డుగా బండ ఉంటే.. దాన్ని తొలగించేందుకు రూ.12 కోట్లు కూడా ఇవ్వలేదు. నేను సీఎం అయిన తర్వాత వీటికి నిధులు మంజూరు చేశా. జూరాల వద్ద నూతన బ్రిడ్జి కావాలని అడిగితే రూ.123 కోట్లు మంజూరు చేశాం. కేసీఆర్ ఈ పనులు ఎందుకు చేయలేదు?..’ అని ముఖ్యమంత్రి నిలదీశారు. ఈ ప్రాంతంపై ఎందుకు వివక్ష? ‘మక్తల్–నారాయణపేట–కొడంగల్ పథకం ఆషామాషీగా రాలేదు. అప్పటి నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి.. అప్పటి సీఎం వైఎస్సార్తో మాట్లాడి ఈ ప్రాంతానికి నీళ్లు కావాలని, ఎత్తిపోతలు అవసరమని, బీమా ఎక్స్టెన్షన్ ప్రాజెక్టు కింద నిధులు ఇవ్వాలని కోరారు. కానీ వారి అకాల మరణంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. నేను కొడంగల్ ఎమ్మెల్యేగా గెలిచాక ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం వెంటపడటంతో రూ.1,500 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టాలని పేర్కొంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చివరి జీఓ 69 జారీ చేశారు. కానీ పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాంతానికి అన్యాయం చేసింది. ఈ ప్రాంతంపై ఎందుకు వివక్ష చూపించారు? గత ప్రభుత్వంలో సీఎంను కలిసి ప్రాజెక్టులను పూర్తి చేయాలని అడిగేందుకు ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు ధైర్యం చేయలేదు. మీరు ఇప్పుడు వచ్చి.. మేము పనులు చేస్తుంటే తప్పు పడుతుండడం మీ చేతగానితనం..’ అని రేవంత్ అన్నారు. రూ.20 లక్షల కోట్ల లెక్కలేవి? ‘కేసీఆర్ అధికారంలో ఉన్న పదేళ్లలో ఖర్చు చేసిన రూ.20 లక్షల కోట్ల వివరాలు చెప్పలేదు. తమ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, పరిశ్రమలు వచ్చాయని, ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్న మీరు ఈ రూ.20 లక్షల కోట్లు ఎక్కడ ఖర్చు చేశారనేది ఎందుకు చెప్పడం లేదు? పాలమూరులో ఐఐఎం! రేవంత్రెడ్డి పదేపదే ప్రధాని మోదీని కలుస్తున్నారని నేనంటే గిట్టనివాళ్లు కొందరు అంటున్నారు. తెలంగాణకు నిధులు, అనుమతులు సాధించుకునేందుకు ప్రధానిని కలిస్తే తప్పేంటి. హైదరాబాద్ రాష్ట్రానికి బూర్గుల రామకృష్ణారావు మొదటి సీఎం కాగా.. 75 ఏళ్ల తర్వాత పాలమూరు బిడ్డకు రెండోసారి రాష్ట్రానికి సీఎంగా అయ్యే అవకాశం దక్కింది. ఇక్కడి ఎంపీ డీకే అరుణతో కలిసి మోదీని కలుస్తాం. తెలంగాణకు ఐఐఎం ఇవ్వమని అడుగుతా. దీన్ని పాలమూరులో ప్రారంభించుకుందాం. ప్రభుత్వం వద్ద పంచడానికి భూములు లేవు. ఉచితంగా ఏమి ఇచ్చినా అది శాశ్వతం కాదు. విద్య ఒక్కటే శాశ్వతం. విజ్ఞానం ఉంటేనే రాష్ట్రాన్ని, దేశాన్ని ఏలగలిగే స్థాయికి చేరతాం. కాబట్టి విద్యార్థులు క్రమశిక్షణతో చదివి జీవితంలో పైకి రావాలి..’ అని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. -
20న షెడ్యూల్?.. కీలక ఘట్టం పూర్తి
సాక్షి, హైదరాబాద్: మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్ల సాధారణ ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలకమైన ఘట్టాన్ని పురపాలక శాఖ పూర్తి చేసింది. రాష్ట్ర స్థాయిలో పురపాలక శాఖ డైరెక్టర్ సమక్షంలో 121 మునిసిపల్ చైర్మన్, 10 మేయర్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ప్రక్రియ పూర్తి చేసినట్లు పురపాలక శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి ప్రకటించారు. ఇప్పటికే పోలింగ్స్టేషన్ల వారీగా ఫొటో ఓటరు తుది జాబితాను ప్రచురించారు. తాజాగా రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 20వ తేదీన మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. డ్రా పద్ధతిలో మహిళా రిజర్వేషన్లు అన్ని కేటగిరీలు కలిపి మహిళలకు 50 శాతం మునిసిపల్ చైర్మన్, మేయర్ పదవులు కేటాయించారు. నగరాలు, పట్టణాల వారీగా ఏ కేటగిరీకి ఏది రిజర్వు చేశారనే వివరాలను వెల్లడించారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో వివాదాలకు తావులేకుండా డ్రా పద్ధతిలో కేటగిరీల వారీగా మహిళా రిజర్వుడు స్థానాలను నిర్ణయించారు. రొటేషన్ పద్ధతిలో మునిసిపల్ చైర్మన్, మునిసిపల్ వార్డులు, మేయర్, డివిజన్ల రిజర్వేషన్లు ఖరారు చేశారు. జిల్లా స్థాయిలోనూ కలెక్టర్ల ఆధ్వర్యంలో రిజర్వేషన్లు నిర్ణయించారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఖరారు చేసిన రిజర్వుడు స్థానాల వివరాలతో గజిట్లు జారీ చేయడంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం పోర్టల్లో అప్లోడ్ చేశారు. ఇవే వివరాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మునిసిపల్ శాఖ కార్యదర్శి పంపించారు. వాటిని పరిశీలించి ముఖ్యమంత్రి ఆమోదం పొందిన తర్వాత ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాస్తారని పురపాలక శాఖ వర్గాలు వెల్లడించాయి. నేడు కేబినెట్ భేటీలో షెడ్యూల్పై చర్చ ఆదివారం మేడారంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్పై చర్చించే అవకాశముంది. కేబినెట్ ఆమోదంతో మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు మార్గం సుగమం కానుంది. ఈ నెల 19న పురపాలక సంఘాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారం¿ోత్సవాలు, శంకుస్థాపనల వంటివి ప్రభుత్వం చేపట్టనుంది. అనంతరం ఈ నెల 20న రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించే అవకాశమున్నట్లు సమాచారం. మునిసిపల్ ఎన్నికలు ఒకే విడతలో బ్యాలెట్ పద్ధతిలో జరగనున్నాయి. ఇప్పటికే బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ మెటీరియల్, సిబ్బందికి శిక్షణ వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. ఎస్సీ, ఎస్టీలకు ఒక్కో మేయర్ పదవి రాష్ట్రంలోని పది మేయర్ స్థానాలకు గాను గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) సహా మరో నాలుగు మునిసిపల్ కార్పొరేషన్లను అన్ రిజర్వుడు (జనరల్) కేటగిరీకి రిజర్వు చేశారు. ఈ కేటగిరీలో కేవలం గ్రేటర్ వరంగల్ ముసినిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) మినహా మిగతా నాలుగు కార్పొరేషన్లు..జీహెచ్ఎంసీ, ఖమ్మం, నిజామాబాద్, నల్లగొండను జనరల్ మహిళ కేటగిరీకి రిజర్వు చేశారు. బీసీలకు మూడు మేయర్ పదవులు రిజర్వు కాగా మంచిర్యాల, కరీంనగర్ బీసీ జనరల్, మహబూబ్నగర్ను బీసీ మహిళకు రిజర్వు చేశారు. ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు ఒక్కో మేయర్ పదవిని కేటాయించారు. కొత్తగూడెంను ఎస్టీ జనరల్, రామగుండంను ఎస్సీ జనరల్కు రిజర్వు చేశారు. 300 డివిజన్లతో కూడిన జీహెచ్ఎంసీ మేయర్ పదవి ప్రస్తుతం జనరల్ మహిళకు రిజర్వు అయ్యిందని, అయితే భవిష్యత్తులో జీహెచ్ఎంసీని ఎన్ని కార్పొరేషన్లుగా విభజిస్తారో తమకు ఇప్పటివరకు సమాచారం లేదని శ్రీదేవి చెప్పారు. ఇదిలా ఉంటే మునిసిపాలిటీల్లో బీసీలకు 38 మునిసిపల్ చైర్మన్ పదవులు రిజర్వు కాగా ఇందులో బీసీ జనరల్కు 19, బీసీ మహిళకు 19 చొప్పున కేటాయించారు. జనరల్ కోటాలో 61 కేటాయించగా అందులో జనరల్లో 30, జనరల్ మహిళలకు 31 మునిసిపల్ చైర్పర్సన్ స్థానాలను రిజర్వ్ చేశారు. ఎస్టీలకు 5 మునిసిపాలిటీలు కేటాయిస్తే... మహిళలకు రెండు, ఎస్టీ జనరల్కు మూడింటిని రిజర్వ్ చేశారు. ఎస్సీ కోటాలో మొత్తం 17 మునిసిపాలిటీలను కేటాయిస్తే.. 9 ఎస్సీ జనరల్, 8 ఎస్సీ మహిళలకు కేటాయించారు. -
జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకుల మృతి
సాక్షి, జగిత్యాల: జగిత్యాలలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికులను కలచివేసింది. సంక్రాంతి సెలవుల కోసం స్వగ్రామానికి వచ్చిన యువకులు తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురయ్యారు. పోరండ్ల వద్ద పార్టీ ముగించుకుని కారులో తిరుగు ప్రయాణం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అతివేగం కారణంగా కారు అదుపు తప్పి ముందుగా విద్యుత్ స్తంభానికి ఢీకొని, అనంతరం డివైడర్ను మోదింది. ఈ ప్రమాదంలో నవనీత్, సాయి తేజ ఘటన స్థలంలోనే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో యువకుడు సృజన్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన పరిస్థితులపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో జగిత్యాలలో విషాద వాతావరణం నెలకొంది. అతివేగం, మద్యం మత్తుతో పాటు యువకుల నిర్లక్ష్యమే ప్రమాదానికి ప్రధాన కారణమని సమాచారం.నల్లగొండ జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. కట్టంగూరు మండలం ముత్యాలమ్మ గూడెం వద్ద హైవేపై ఒక కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో నలుగురికీ గాయాల పాలైయ్యారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన జరిగింది. -
తెలంగాణలో పలువురు ఐఏఎస్ల బదిలీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్లు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫైనాన్స్ స్పెషల్ సెక్రటరీ కె.హరిత కుమురం భీం ఆసిఫాబాద్ కలెక్టర్గా బదిలీ అయ్యారు. విద్యాశాఖ స్పెషల్ సెక్రటరీగా వెంకటేష్ ధోత్రే, ఫిషరీస్ డైరెక్టర్గా ఫిషరీస్గా కే.నిఖిలా, యాదగిరిగుట్ట దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా భవానీ శంకర్ నియమితులయ్యారు. -
తెలంగాణలో పలువురు ఐపీఎస్ల బదిలీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పలువురు ఐపీఎస్ల బదిలీ అయ్యారు. తెలంగాణలో 20 మంది ఐపీఎస్ల బదిలీలు, పోస్టింగ్లు ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీఐజీగా అభిషేక్ మహంతిఆదిలాబాద్ క్రైమ్స్ డీసీపీగా చైతన్యకుమార్పీఅండ్ ఎల్ ఐజీగా గజరావ్ భూపాల్ప్యూచర్ సిటీ కమిషనరేట్ అడ్మిన్ అడిషనల్ సీపీగా దీప్తిహైదరాబాద్ ఇంటెలిజెన్స్ ఎస్పీగా కె.అపూర్వరావుఇంటెలిజెన్స్ సెల్ డీఐజీగా ఆర్.భాస్కరన్సైబరాబాద్ డీసీపీగా అన్నపూర్ణసీఐడీ ఎస్పీగా ఆర్. వెంకటేశ్వర్లుట్రాఫిక్-3 డీసీపీగా రాహుల్ హేగ్డేవిజిలెన్స్ అండ్ ఎన్పోర్స్ ఎస్సీగా బాలస్వామివిజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అదనపు ఎస్పీగా పి.అశోక్హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ ట్రాఫిక్-1 డీసీపీగా అవినాష్ కుమార్హైదరాబాద్ సిటీ ట్రాఫిక్-2 డీసీపీగా కాజల్సైబరాబాద్ ట్రాఫిక్–2 డీసీపీగా శేషాద్రిని రెడ్డిమల్కాజ్గిరి ట్రాఫిక్-I డీసీపీగా కంకనాల రాహుల్ రెడ్డి ఫ్యూచర్ సిటీ ట్రాఫిక్ డీసీపీగా శివమ్ ఉపాధ్యాయశ్రీనివాసులు, రంజన్ రాథన్ కుమార్, శ్యామ్ సుందర్, పి. అశోక్, ఎ. బాలకోటిలు బదిలీ అయినవారిలో ఉన్నారు. -
తెలంగాణలో రోహిత్ వేముల చట్టాన్ని తీసుకొస్తాం: భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వీలైనంత త్వరగా రోహిత్ వేముల చట్టాన్ని తీసుకువస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం ప్రజాభవన్లో జస్టిస్ ఫర్ రోహిత్ వేముల క్యాంపెయిన్ కమిటీ సభ్యులతో డిప్యూటీ సీఎం సమావేశం అయ్యారు. రాష్ట్రంలో రోహిత్ వేముల చట్టం తీసుకురావాలంటూ రాహుల్ గాంధీ సైతం సీఎం రేవంత్రెడ్డికి లేఖ రాశారని గుర్తు చేశారు.సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి రోహిత్ చట్టాన్ని తీసుకువచ్చేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని కమిటీకి తెలియజేశారు. కర్ణాటక రాష్ట్రంలో రోహిత్ వేముల చట్టం కోసం క్యాంపెయిన్ కమిటీ రూపొందించిన ముసాయిదాను కమిటీ సభ్యులు డిప్యూటీ సీఎంకు అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కొన్ని విజ్ఞప్తులు చేశారు. రోహిత్ వేముల కేసును పారదర్శకంగా విచారణ జరిపించాలని, న్యాయం చేయాలని కోరారు. రోహిత్ వేముల మరణం తర్వాత యూనివర్సిటీలో 50 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లపైన నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. వీటి నుంచి వారికి విముక్తి కల్పించాలని కోరారు. కర్ణాటక రాష్ట్రం తరహాలోనే తెలంగాణలోనూ రోహిత్ వేముల చట్టాన్ని తీసుకురావాలని కోరారు.సమావేశంలో కర్ణాటక ప్రతినిధుల తరఫున హులికుంటే మూర్తి, డా. ఆశ్నా సింగ్, వి.మృదుల, రాహుల్ పాల్గొన్నారు. హైదరాబాద్ ‘జస్టిస్ ఫర్ రోహిత్ వెముల’ ఉద్యమం తరఫున రాధికా వేముల, రాజా వేముల, ప్రొఫెసర్ భాంగ్య భుక్య, ప్రొఫెసర్ సౌమ్యా దేచమ్మ, ప్రొఫెసర్ తిరుమల్, ప్రొఫెసర్ రత్నం, వి. రఘునాథ్, డా డోంత ప్రశాంత్, తిరుపతి, వెన్నెల తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్
సాక్షి, మహబూబ్నగర్: బీఆర్ఎస్ పాలనలో పాలమూరు జిల్లాకు అన్యాయం చేశారని సీఎం రేవంత్రెడ్డి మండిపడ్డారు. ఉమ్మడి పాలమూరు జిల్లాను కేసీఆర్ వివక్షతో చూశారని.. పదేళ్లలో బీఆర్ఎస్ పాలమూరులోని ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదంటూ విమర్శించారు. బీఆర్ఎస్ చేతకానితనాన్ని కాపాడుకునేందుకు తమపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు మంజూరు చేసిన ప్రాజెక్టు జిల్లాలో ఒక్కటైనా ఉందా? అంటూ కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్ విసిరారు.సంగబండ పగలగొట్టేందుకు రూ.10 కోట్లు కూడా ఇవ్వలేదు. గత పాలకులు పదేళ్లు పాలమూరుకు అన్యాయం చేశారు. అసెంబ్లీకి వచ్చి చర్చించమంటే ముఖం చాటేశారు. త్వరలోనే తెలంగాణకు ఐఐఎం కోసం ఎంపీ డీకే అరుణతో కలిసి ప్రధాని మోదీని కలుస్తాం.. ఐఐఎంను కూడా పాలమూరులోనే పెడతాం.. ‘‘మా ఎంపీ డీకే అరుణను ఓడించాలని నేను 14 మీటింగులు పెట్టిన.. కానీ ఎన్నికల తర్వాత రాజకీయాలు లేవు.. పాలమూరు అభివృద్ధికి కలిసి పోతాం. విమర్శలు వస్తుంటాయి...దేశ ప్రధానిగా మోదీని అభివృద్ధి కోసం కలుస్తాం.. ఎన్నికలప్పుడు బరాబర్ కొట్లాడతాం. వరుస ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నాం. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ వారిని గెలిపించండి. అందరం కలిసి పాలమూరు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మేం తీసుకుంటాం’’ అని రేవంత్రెడ్డి అన్నారు. -
కొండాపూర్లో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: కొండాపూర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మై హోమ్ మంగళ అపార్ట్మెంట్ దగ్గర థర్మకోల్ గోదాంలో మంటలు చెలరేగాయి. ఐదు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. -
‘జీవితంలో సంగారెడ్డిలో ఎమ్మెల్యేగా పోటీ చేయను’
సంగారెడ్డి: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తాను జీవితంలో సంగారెడ్డిలో ఎమ్మెల్యేగా పోటీ చేయనన్నారు. సంగారెడ్డి మేధావులు తనను ఓడించారని అందుకే ఇక జీవితంలో ఇక్కడ నుంచి పోటీ చేయనని తేల్చిచెప్పారు. ‘రాహుల్ గాంధీ వచ్చి నన్ను గెలిపించాలని ప్రచారం చేస్తే, నన్ను ఇక్కడ ఓడించారు. రాహుల్ గాంధీని ఇన్సల్ట్ చేసినట్లు అయ్యింది. జగ్గారెడ్డిని గెలిపించాలని రాహుల్ గాంధీ అడిగితే.. నన్ను ఓడించారు. నా జీవితంలో ఇది మరిచిపోలేనిది. అందుకే సంగారెడ్డిలో జీవితంలో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నా. నా ఓటమికి కారణం పేద ప్రజలు కాదు..ఇక్కడి మేధావులు.. పెద్దలది. రేపు సంగారెడ్డిలో నా భార్య నిర్మలా పోటీ చేసిన కూడా నేను ప్రచారం చేయను.రాష్ట్రంలో నేను ఎక్కడికైన వెళ్ళి ప్రచారం చేస్తా కానీ.. సంగారెడ్డిలో ప్రచారం చేయను’ అని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. -
తెలంగాణలో వీధికుక్కల సామూహిక హత్యలు
తెలంగాణలోని పలు జిల్లాల్లో వీధికుక్కల పట్ల అత్యంత క్రూరమైన చర్యలు వెలుగులోకి వస్తున్నాయి. జంతు సంక్షేమ నిబంధనలను తుంగలో తొక్కి మెగ్నీషియం సల్ఫేట్ వంటి రసాయనాలను ఉపయోగించి కుక్కలను సామూహికంగా హతమారుస్తున్నట్లు జంతు పరిరక్షణ కార్యకర్తలు, పశువైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.విషప్రయోగం - అత్యంత బాధాకరమైన మరణంసాధారణంగా వ్యవసాయం, పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించే మెగ్నీషియం సల్ఫేట్ మార్కెట్లో తక్కువ ధరకు సులభంగా లభిస్తుంది. దీన్ని ద్రవ రూపంలోకి మార్చి నిపుణుల ద్వారా కుక్కల గుండెకు నేరుగా ఇంజెక్ట్ చేస్తున్నారని సమాచారం. ‘ఇది చాలా పాత, క్రూరమైన పద్ధతి. మెగ్నీషియం సల్ఫేట్ను నేరుగా గుండెకు ఇంజెక్ట్ చేయడం వల్ల జంతువులకు తక్షణమే అత్యంత బాధాకరమైన మరణం సంభవిస్తుంది. ఇది సాధారణ వ్యక్తులు చేసే పని కాదు, శిక్షణ పొందిన వారే ఇలా చేస్తున్నారు’ అని ఒక సీనియర్ పశువైద్యుడు వెల్లడించారు.విచ్చలవిడిగా రసాయనాల వాడకంకుక్కలను చంపడానికి కేవలం మెగ్నీషియం సల్ఫేట్ మాత్రమే కాకుండా ‘స్ట్రిక్నైన్ హైడ్రోక్లోరైడ్’ వంటి ప్రమాదకర రసాయనాలను కూడా వాడుతున్నట్లు తెలుస్తోంది. కేవలం 5 గ్రాముల స్ట్రిక్నైన్ హైడ్రోక్లోరైడ్ పొడితో వందలాది కుక్కలను చంపవచ్చు. దీన్ని మాంసంలో కలిపి ఎరగా వేస్తారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు సైనైడ్ ఉపయోగించి కూడా కుక్కలను చంపుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ‘కొంగ మందు’ అని పిలిచే సాంప్రదాయ మందులను కూడా ఆహారంలో కలిపి ఇచ్చి కుక్కల ప్రాణాలు తీస్తున్నారు.చట్టం ఏం చెబుతోంది?భారత జంతు సంక్షేమ బోర్డు (AWBI) నిబంధనల ప్రకారం, వీధికుక్కలను చంపడం నేరం. కేవలం నయం చేయలేని వ్యాధులు ఉన్నప్పుడు లేదా ప్రాణాంతక గాయాలైనప్పుడు మాత్రమే శాంతియుత మరణానికి ప్రత్యేక పద్ధతులు అనుసరించాలి. ఇందుకోసం ప్రభుత్వం, జంతు సంక్షేమ బోర్డు స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించాయి.దీని ప్రకారం, ప్రాణాంతక వ్యాధులు లేదా తీవ్రమైన గాయాలతో బాధపడుతున్న కుక్కలకు మాత్రమే అనుమతుల మేరకు పెంటనాల్ సోడియం, సోడియం థియోపెన్టోన్ వంటి మందులను ఉపయోగించి శాంతియుత మరణం ప్రసాదించాలి. అయితే, ప్రస్తుతం నిబంధనలకు విరుద్ధంగా మెగ్నీషియం సల్ఫేట్, సైనైడ్, స్ట్రిక్నైన్ హైడ్రోక్లోరైడ్ వంటి అత్యంత ప్రమాదకరమైన రసాయనాలను ఉపయోగించి కుక్కలను అక్రమంగా హతమారుస్తున్నారు.సులభంగా అందుబాటులో..ఈ మందుల లభ్యత విషయంలో కూడా చాలా అనుమానాలున్నాయి. పెంటనాల్ సోడియం వంటి మందులు కేవలం అధికారిక ప్రిస్క్రిప్షన్ ద్వారా మాత్రమే లభిస్తాయి. వీటి వినియోగంపై కఠినమైన నిఘా ఉంటుంది. దీనికి భిన్నంగా కుక్కలను చంపడానికి వాడుతున్న ఇతర రసాయనాలు సాధారణ రిటైల్ దుకాణాల్లో ఎటువంటి పరిమితులు లేకుండా ఎవరికైనా సులభంగా దొరుకుతున్నాయి. ఇది అసాంఘిక శక్తులకు, నిబంధనలు ఉల్లంఘించే వారికి వరంగా మారింది.నిబంధనల ప్రకారం, ఏదైనా జంతువుకు ప్రాణాపాయ స్థితిలో మందు ఇవ్వాల్సి వస్తే కచ్చితంగా అర్హత కలిగిన వెటర్నరీ డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే జరగాలి. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. నిపుణులు కాని వారిని నియమించి ఎటువంటి వైద్య పర్యవేక్షణ లేకుండా సామూహికంగా కుక్కలను చంపడం చట్టవిరుద్ధం. ఇలాంటి అక్రమ పద్ధతులు జంతు హింసను ప్రోత్సహించడమే కాకుండా చట్టంలోని నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించినట్లేనని గుర్తుంచుకోవాలి. ప్రభుత్వం తక్షణమే స్పందించి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, విష రసాయనాల విక్రయాలపై నియంత్రణ విధించాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.ఇదీ చదవండి: ఐపీఓ పెట్టుబడుల పేరుతో రూ.2.5 కోట్ల టోకరా! -
మున్సిపల్ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు
హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మున్సిపల్ చైర్మన్ పదవులకు రిజర్వేషన్లను ప్రభుత్వం శనివారం(జనవరి 17వ తేదీ) ఖరారు చేసింది. ఎస్టీలకు 5, ఎస్సీలకు 17, బీసీలకు 38, జనరల్ కేటగిరికి 61 స్థానాలు కేటాయించినట్టు ప్రభుత్వం వెల్లడించింది.ఎస్టీ కేటగిరీ1. కొల్లూరు: ఎస్టీ (జనరల్)2. భూత్పూర్: ఎస్టీ (జనరల్)3. మహబూబాబాద్: ఎస్టీ (జనరల్)4. కేశసముద్రం: ఎస్టీ (మహిళ)5. ఎల్లంపేట్ : ఎస్టీ (మహిళ)ఎస్సీ కేటగిరీ1. స్టేషన్ఘన్పూర్: ఎస్సీ (జనరల్)2. చొప్పదండి: ఎస్సీ (మహిళ)3. జమ్మికుంట: ఎస్సీ (జనరల్)4. హుజురాబాద్: ఎస్సీ (మహిళ)5. ఎదులాపురం: ఎస్సీ (మహిళ)6. డోర్నకల్: ఎస్సీ (జనరల్)7. లక్సింపేట్: ఎస్సీ (జనరల్)8. మూడుచింతలపల్లి: ఎస్సీ (జనరల్)9. నందికొండ: ఎస్సీ (జనరల్)10. మొయినాబాద్: ఎస్సీ (జనరల్)11. గడ్డపోతారం: ఎస్సీ (మహిళ)12. కోహిర్: ఎస్సీ (జనరల్)13. ఇంద్రేశం: ఎస్సీ (మహిళ)14. చేర్యాల: ఎస్సీ (మహిళ)15. హుస్నాబాద్: ఎస్సీ (జనరల్)16. వికారాబాద్: ఎస్సీ (మహిళ)17. మోత్కూరు: ఎస్సీ (మహిళ)బీసీ కేటగిరి1. ఇల్లెందు: బీసీ (మహిళ)2. జగిత్యాల: బీసీ (మహిళ)3. జనగాం: బీసీ (జనరల్)4. భూపాలపల్లి: బీసీ (జనరల్)5. లీజ: బీసీ (జనరల్)6. వడ్డేపల్లి: బీసీ(జనరల్)7. అలంపూర్: బీసీ (జనరల్)8. బిచ్కుంద: బీసీ (జనరల్)9. కామారెడ్డి: బీసీ (మహిళ)10. బాన్సువాడ: బీసీ (మహిళ)11. ఆసిఫాబాద్: బీసీ(జనరల్)12. కాగజ్నగర్: బీసీ (మహిళ)13. దేవరకద్ర: బీసీ (మహిళ)14. చెన్నూరు: బీసీ (మహిళ)15. మెదక్: బీసీ (మహిళ)16. ములుగు: బీసీ (మహిళ)17: కొల్లాపూర్: బీసీ (మహిళ)18. అచ్చంపేట: బీసీ (మహిళ)19. నాగర్కర్నూల్: బీసీ (జనరల్)20. దేవరకొండ: బీసీ (మహిళ)21. మద్దూరు: బీసీ (జనరల్)22. పెద్దపల్లి : బీసీ (జనరల్)23. మంథని: బీసీ (జనరల్)24. వేములవాడ: బీసీ (జనరల్)25. షాద్నగర్: బీసీ (జనరల్)26. జిన్నారం: బీసీ (జనరల్)27. జహీరాబాద్: బీసీ (జనరల్)28. గుమ్మడిదల: బీసీ (జనరల్)29. సిద్ధిపేట: బీసీ (జనరల్)30. గజ్వేల్: బీసీ (మహిళ)31. దుబ్బాక: బీసీ (మహిళ)32. హుజూర్నగర్: బీసీ (జనరల్)33. తాండూరు: బీసీ (జనరల్)34. పరిగి: బీసీ (మహిళ) 35. కొత్తకోట: బీసీ (మహిళ) 36. ఆత్మకూరు: బీసీ (మహిళ) 37. నర్సంపేట: బీసీ (మహిళ) 38. ఆలేరు: బీసీ (మహిళ) అన్రిజర్వుడ్1. ఆదిలాబాద్: మహిళ (జనరల్)2. అశ్వారావుపేట: మహిళ (జనరల్)3. పర్కాల్: అన్రిజర్వుడ్4. కోరుట్ల: మహిళ (జనరల్)5. రాయికల్: అన్రిజర్వుడ్6. మెట్పల్లి: అన్రిజర్వుడ్7. ధర్మపురి: మహిళ (జనరల్)8. గద్వాల: మహిళ (జనరల్)9. ఎల్లారెడ్డి: అన్రిజర్వుడ్10. సత్తుపల్లి: మహిళ (జనరల్)11. వైరా: మహిళ (జనరల్)12. మధిర: మహిళ (జనరల్)13. జడ్చర్ల: అన్రిజర్వుడ్14. తొర్రూర్: అన్రిజర్వుడ్15. మరిపెడ: మహిళ (జనరల్)16. ఖ్యాతన్పల్లి: మహిళ (జనరల్)17. బెల్లంపల్లి: మహిళ (జనరల్)18. రామాయంపేట: మహిళ (జనరల్)19. నర్సాపూర్: మహిళ (జనరల్)20. తుప్రాన్: మహిళ (జనరల్)21. అలియాబాద్: మహిళ (జనరల్)22. కల్వకుర్తి: మహిళ (జనరల్)23. చందూరు: అన్రిజర్వుడ్24. నకిరేకల్: అన్రిజర్వుడ్25. హాలియా: అన్రిజర్వుడ్26. మిర్యాలగూడ: మహిళ (జనరల్)27. చిట్యాల: మహిళ (జనరల్)28. నారాయణపేట: మహిళ (జనరల్)29. కోస్గి: అన్రిజర్వుడ్30. మక్తల్: అన్రిజర్వుడ్31. ఖానాపూర్: అన్రిజర్వుడ్32. భైంసా: అన్రిజర్వుడ్33. నిర్మల్: మహిళ (జనరల్)34. భీంగల్: మహిళ (జనరల్)35. ఆర్మూర్: మహిళ (జనరల్)36. బోధన్: అన్రిజర్వుడ్37. సుల్తానాబాద్: అన్రిజర్వుడ్38. సిరిసిల్ల: మహిళ (జనరల్)39. శంకరపల్లి: అన్రిజర్వుడ్40. చేవెళ్ల: అన్రిజర్వుడ్41. ఇబ్రహీంపట్నం: అన్రిజర్వుడ్42: ఆమన్గల్: అన్రిజర్వుడ్43. కొత్తూర్: అన్రిజర్వుడ్44. సదాశివపేట: మహిళ (జనరల్)45. నారాయణఖేడ్: అన్రిజర్వుడ్46. ఆందోల్-జోగిపేట: అన్రిజర్వుడ్47. సంగారెడ్డి: మహిళ (జనరల్)48. ఇస్నాపూర్: మహిళ (జనరల్)49. సూర్యాపేట: అన్రిజర్వుడ్50. తిరుమలగిరి: అన్రిజర్వుడ్51. కోదాడ: మహిళ (జనరల్)52. నేరేడుచర్ల: అన్రిజర్వుడ్53. కొడంగల్: అన్రిజర్వుడ్54. వనపర్తి: మహిళ (జనరల్)55. అమరచింత: అన్రిజర్వుడ్56. పెబ్బేరు: అన్రిజర్వుడ్57. వర్ధన్నపేట: అన్రిజర్వుడ్58. పోచంపల్లి: అన్రిజర్వుడ్59. యాదగిరిగుట్ట: మహిళ (జనరల్)60. భువనగిరి: మహిళ (జనరల్)61: చౌటుప్పల్: మహిళ (జనరల్) -
TG: 10 కార్పొరేషన్లలో రిజర్వేషన్ల ఖరారు
హైదరాబాద్: పది మున్సిపల్ కార్పొరేషన్లలో మేయర్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేసింది తెలంగాణ ప్రభుత్వం. మొత్తం 10 స్థానాల్లో మహిళలకు 5, బీసీలకు 3, ఎస్సీకి 1, ఎస్టీకి 1 చొప్పున రిజర్వేషన్ కేటాయించింది. ఇందులో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ల ఖరారు చేసింది. మేయర్ పదవుల రిజర్వేషన్లుఎస్టీ కేటగిరీ1. కొత్తగూడెం: ఎస్టీ (జనరల్)ఎస్సీ కేటగిరీ1. రామగుండం: ఎస్సీ (జనరల్)బీసీ కేటగిరీ1. మహబూబ్నగర్: బీసీ (మహిళ)2. మంచిర్యాల: బీసీ (జనరల్)3. కరీంనగర్ : బీసీ (జనరల్)అన్ రిజర్వుడ్1. ఖమ్మం: మహిళ (జనరల్) 2. నిజామాబాద్: మహిళ (జనరల్)3. జీడబ్ల్యూఎంసీ: అన్ రిజర్వుడ్4. జీహెచ్ఎంసీ: మహిళ (జనరల్)5. నల్లగొండ: : మహిళ (జనరల్) -
కుటుంబంలో చీకట్లు నింపిన సంక్రాంతి
కొమరంభీం జిల్లా: అందరి జీవితాల్లో సంక్రాంతి సంతోషాన్ని నింపగా.. ఓ కుటుంబంలో చీకటి అలుముకుంది. ఎదిగిన కొడుకు తమను పోషిస్తాడనుకున్న తల్లిదండ్రులకు తీరని విషాదం మిగిల్చింది. జీవితాంతం తోడుగా ఉంటానని హామీ ఇచ్చిన భర్త రెండు నెలలకే దూరమయ్యాడు. సంగారెడ్డి జిల్లా మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన రాపర్తి సంతోష్(32) దుర్మరణం చెందాడు. కెరమెరి మండల కేంద్రానికి చెందిన రాపర్తి తిరుపతి–గుణసుందరి దంపతులకు ఇద్దరు కూతుర్లు, కొడుకు సంతోష్ సంతానం. అతనికి నవంబర్ 13న రెబ్బెనకు చెందిన శ్రావణితో వివాహమైంది. సంతోష్ తన భార్యతో సంగారెడ్డిలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు.దైవ దర్శనానికి వెళ్లి..సంక్రాంతి పండుగ సందర్భంగా నలుగురు స్నేహితులతో కారులో మెదక్లోని ఏడుపాయలు, దుర్గమ్మ ఆలయాలను దర్శించుకునేందుకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో సంగారెడ్డి సమీపంలోని పోతిరెడ్డిపల్లె వద్ద ఎదురొచ్చిన గేదెను తప్పించే క్రమంలో కారు అదుపు తప్పి చెట్టుకు ఢీకొట్టింది. తర్వాత అది వరిపొలంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సంతోష్కు తీవ్ర గాయాలయ్యాయి. మిగిలినవారికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అతను ఇప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.భార్యను పుట్టింటికి పంపి..పెళ్లయిన తర్వాత వచ్చిన తొలి పండుగ కావడంతో భార్యను నాలుగు రోజుల క్రితం పుట్టింటికి పంపించాడు. శుక్రవారం వచ్చి తీసుకెళ్తానని చెప్పాడు. అంతలోనే ప్రమాదంలో మరణించడంతో కుటుంబంలో విషాదం అలుముకుంది. గడిచిన క్షణాలను గుర్తుచేసుకుంటూ భార్య, తల్లిదండ్రులు, అక్కచెల్లెళ్లు రోదిస్తున్న తీరు కంటతడి పెట్టించింది. -
ఐపీఓ పెట్టుబడుల పేరుతో రూ.2.5 కోట్ల టోకరా!
హైదరాబాద్ నగరంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. స్టాక్ మార్కెట్, ఐపీఓలో పెట్టుబడుల పేరుతో అమాయకులను నమ్మించి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు. తాజాగా హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో వేర్వేరు ఘటనల్లో నలుగురు వ్యక్తులు సుమారు రూ.2.54 కోట్లు నష్టపోయినట్లు పోలీసులు వెల్లడించారు.రిటైర్డ్ బ్యాంకర్కు రూ.1.25 కోట్ల నష్టంసికింద్రాబాద్కు చెందిన 64 ఏళ్ల రిటైర్డ్ బ్యాంకర్ ఈ మోసానికి ప్రధాన బాధితురాలుగా ఉన్నారు. నేరగాళ్లు ముందుగా బాధితురాలిని ఓ వాట్సాప్ గ్రూప్లో చేర్చారు. అందులో సంస్థాగత ఐపీఓల ద్వారా వచ్చే భారీ లాభాల స్క్రీన్షాట్లను చూపి నమ్మించారు. ఒక యూఎస్ నంబర్ ద్వారా వచ్చిన లింక్ సహాయంతో బోగస్ ట్రేడింగ్ యాప్ను ఆమె డౌన్లోడ్ చేసుకునేలా చేశారు. డిసెంబర్ 29 నుంచి జనవరి 12 మధ్య ఆమె తన మూడు వ్యక్తిగత ఖాతాల నుంచి 11 వేర్వేరు బ్యాంక్ ఖాతాలకు 15 దఫాలుగా రూ.1.25 కోట్లు బదిలీ చేశారు. యాప్లో ఆమె బ్యాలెన్స్ రూ.1.9 కోట్లుగా కనిపిస్తున్నప్పటికీ విత్డ్రా చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు సాధ్యం కాలేదు. పైగా ‘క్లియరింగ్ ఛార్జీల’ పేరుతో మరో రూ.58.58 లక్షలు కట్టాలని ఒత్తిడి చేయడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు.మరో మూడు కేసులుజనవరి 14, 15 తేదీల్లో హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులకు ఇలాంటివే మరికొన్ని ఫిర్యాదులు అందాయి.మణికొండకు చెందిన 68 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగిని స్టాక్ బ్రోకరేజ్ విశ్లేషకులుగా నటించిన స్కామర్లు వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రలోభపెట్టారు. గత ఏడాది మార్చి-మే మధ్య ఆయన రూ.50.8 లక్షలు పోగొట్టుకున్నారు.76 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగి ఐపీఓ ట్రేడింగ్ సలహాలను నమ్మి డిసెంబర్ 30 నుంచి జనవరి 5 మధ్య రూ.46.25 లక్షలు నష్టపోయారు.మియాపూర్కు చెందిన 45 ఏళ్ల వ్యక్తి యూఎస్ స్టాక్స్లో పెట్టుబడుల పేరుతో నకిలీ యాప్ ద్వారా రూ.32.1 లక్షలు కోల్పోయారు.పోలీసుల హెచ్చరికలుఈ నాలుగు ఘటనలపై హైదరాబాద్, సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS), ఐటీ (IT) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అపరిచిత వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే పెట్టుబడి సలహాలను నమ్మవద్దని, అనధికారిక ట్రేడింగ్ యాప్లను డౌన్లోడ్ చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేసి సమాచారం తెలియాజేయాలని సూచించారు.ఇదీ చదవండి: మళ్లీ పెరుగుతోన్న బంగారు కొండ.. తులం ఎంతంటే.. -
తుగ్లక్ సర్కార్కు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెబుతాం
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వచ్చిన రెండేళ్లు పూర్తైనా ఒక్క ఫ్లైఓవర్ అయినా కట్టారా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ప్రశ్నించారు. నాటి వైఎస్సార్ హయాం నుంచి బీఆర్ఎస్ పాలన దాకా ఏనాడూ సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బ తీసే ప్రయత్నాలు జరగలేదని.. కానీ, ఇప్పుడు రేవంత్ ఆ పని చేస్తున్నాడని కేటీఆర్ మండిపడ్డారు. శనివారం తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో సికింద్రాబాద్ బచావో యాత్ర జరగాల్సి ఉంది. అయితే అర్ధరాత్రి ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు సమాచారం అందించారు. అయినప్పటికీ బీఆర్ఎస్ శ్రేణులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకునే ప్రయత్నాలు చేయగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తెలంగాణ భవన్ వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘‘తుగ్లక్ పేరు పుస్తకాల్లో చదువుకున్నాం.. ఇప్పుడు చూస్తున్నాం. TS నుంచి TG గా మారిస్తే ఎవరికి లాభం జరిగింది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చివేశారు. తెలంగాణ తల్లిని రూపుమాపి.. కాంగ్రెస్ తల్లిని ప్రతిష్టించారు. కాకతీయ కళాతోరణం తీసివేస్తున్నారు. అపసవ్య దిశలో పాలన సాగుతోంది. సికింద్రాబాద్, హైదరాబాద్ మధ్య విడదీయలేని బంధం ఉంది. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బ తీయాలనుకోవడం మంచిది కాదు. వైఎస్ఆర్ ఆనాడు ఎంసీహెచ్ను విస్తరించినా.. హైదరాబాద్ అస్థిత్వాన్ని ముట్టుకోలేదు. బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ అస్థిత్వాన్ని దెబ్బతీసేవిధంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2016లో జిల్లాలు ఎర్పాటు అయ్యి పాలన సెట్ అవుతున్న సందర్భంలో జిల్లాలను తొలగించాలని అనుకోవడం తుగ్లక్ చర్యే. తుగ్లక్ సర్కార్కు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెబుతాం. సికింద్రాబాద్ ప్రజల మనోభావాల్ని బీఆర్ఎస్ గౌరవిస్తుంది. మేం అధికారంలోకి వచ్చాక జిల్లాగా ఏర్పాటు చేస్తాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయ్యింది. ఆరు గ్యారెంటీలు అటకెక్కించారు. జంట నగరాల్లో ఒక్క ఫ్లైఓవర్ అయినా కట్టారా?. కనీసం.. ఒక్క రోడ్డు వేయలేదు. రేవంత్కు తెలిసింది ఒక్కటే.. విధ్వంసం. శాంతి ర్యాలీనీ అడ్డుకోవడం దుర్మార్గపు చర్య. మా పార్టీకి చెందిన 8 వేల మంది కార్యకర్తలను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయినవారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అధికారం ఎవరికి శాశ్వతం కాదు అనేది రేవంత్ గుర్తు పెట్టుకోవాలి. లేకుంటే.. కాంగ్రెస్ పార్టీ శాశ్వతంగా తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతుంది అని కేటీఆర్ అన్నారు. -
ఒక ప్రమాదం.. ఆరు ప్రాణాలు
ఒక ప్రమాదం నాలుగు ప్రాణాలను బలి తీసుకోగా.. ఆ ఆవేదనతో కుటుంబంలోని మిగిలిన ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనతో ఖమ్మం జిల్లా మిట్టపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.తల్లాడ మండలం మిట్టపల్లికి చెందిన గుత్తికొండ వినోద్-రేవతి దంపతులకు కవల పిల్లలు. గత ఏడాది ఏప్రిల్ 29వ తేదీన వాళ్ల ఇంట్లో గ్యాస్ సిలిండర్ ప్రమాదం జరిగింది. మంటలు వ్యాపించి వినోద్ కవల పిల్లలు తరుణ్, వరుణ్తోపాటు.. వినోద్ నాయనమ్మ గుత్తికొండ సుశీల, మేనకోడలు మృతి చెందారు. ప్రాణంగా పెంచుకున్న ఇద్దరు కొడుకులు ఒకేసారి చనిపోవడంతో ఆ దంపతులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. డిప్రెషన్లోకి వెళ్లిన రేవతి గత నెలాఖరున ఆత్మహత్యకు యత్నించింది. ఆమెను ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఈ నెల 1న కన్నుమూసింది. అటు పిల్లలు, నాయనమ్మ, మేనకోడలితోపాటు భార్య మృతి చెందడంతో తాను మాత్రం ఎందుకు బతకాలని పలువురితో చెబుతూ రోదించిన వినోద్.. ఈనెల 7వ తేదీన వినోద్ ఇంట్లో ఉరి వేసుకున్నాడు. కాసేపటికి గుర్తించిన చుట్టుపక్కల వారు కొనఊపిరి ఉన్నట్లు గుర్తించి ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. -
సికింద్రాబాద్ బచావోకు బ్రేకులు.. తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సర్కార్ సికింద్రాబాద్ పేరును మార్చేసి పెద్ద కుట్రకు తెర తీస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది తెలిసిందే. ఈ క్రమంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇవాళ చేపట్టాల్సిన సికింద్రాబాద్ బచావో ర్యాలీకి బ్రేకులు పడ్డాయి. ఉదయం నుంచే బీఆర్ఎస్ నేతల్ని ఎక్కడికక్కడే నిలువరిస్తున్న పోలీసులు.. ఈ ఉదయం తలసానిని కూడా అడ్డుకున్నారు. ఈ క్రమంలో తెలంగాణ భవన్ వద్ద నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీఆర్ఎస్ ర్యాలీ నేపథ్యంలో.. జంట నగరాల్లోని నేతలను పోలీసులు ఎక్కడికక్కడే నిలువరించారు. పలువురిని గృహ నిర్భందం చేశారు. ఈ క్రమంలో పోలీసుల చర్యను ఖండిస్తూ తెలంగాణ భవన్ వద్ద తలసాని మీడియాతో మాట్లాడారు. ‘‘రైల్వే స్టేషన్ నుంచి ఎంజీరోడ్డు దాకా సికింద్రాబాద్ బచావో పేరిట శాంతి ర్యాలీకి పోలీసులు అనుమతిచ్చారు. నల్ల జెండాలు, కండువాలతో ర్యాలీ చేయాలనుకున్నాం. నిన్న పోలీసులు మా ర్యాలీ రూట్ మ్యాప్ పరిశీలించారు. అయితే లష్కర్ సాధన సమితికి అనుమతి రద్దు చేస్తున్నట్లు రాత్రి 10.40 నిమిషాలకు మెసేజ్ పెట్టారు. నిన్ననే సమాచారం అందించి ఉంటే.. కోర్టుకు వెళ్లేవాళ్లం. మా ప్రాంతం పేరు లేకుండా.. మా అస్తిత్వం దెబ్బతీసే విధంగా చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే మల్కాజిగిరి, హైదరాబాద్, సైబరాబాద్ కార్పొరేషన్లు అంటున్నారు. మాకు సికింద్రాబాద్తో ఉన్నది మట్టి సంబంధం. ఇప్పటికే వేల మందిని అరెస్ట్ చేశారు. తాత్కాలికంగా శాంతిర్యాలీ అడ్డుకుని మీరు పైశాచిక ఆనందం పొందవచ్చు. న్యాయపరంగా కోర్టుకు వెళ్లి ర్యాలీ నిర్వహించి తీరతాం అని తలసాని అన్నారు. తలసానిని బయటకు పోనివ్వకుండా.. తెలంగాణ భవన్ వద్ద మీడియాతో మాట్లాడిన అనంతరం తలసాని బయటకు వచ్చారు. అయితే ఆయన్ని ఎటూ పోనివ్వకుండా పోలీసులు తమ వాహనాలను అడ్డుపెట్టారు. తాను ఇంటికి వెళ్తానని తలసాని చెప్పినా పోలీసులు వినలేదు. తమ వాహనంలో దిగబెడతామంటూ ఆయన చెప్పారు. దీంతో ఆయన మళ్లీ తెలంగాణ భవన్లోకే వెళ్లిపోయారు. ఈ క్రమంలో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. -
విక్టిమ్ ఎవరు? స్టేట్మెంట్ ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్: మంత్రి, ఐఏఎస్ అధికారిపై కథనాల ప్రసారానికి సంబంధించిన కేసులో.. హైదరాబాద్ సిటీ పోలీసులపై మెజిస్ట్రేట్ ప్రశ్నల వర్షం కురిపించారు. కేసులో ఫిర్యాదుదారు ఎవరు? విక్టిమ్ ఎవరు? బాధితుల స్టేట్మెంట్ ఎక్కడ? అని ప్రశ్నించారు. కేసు దర్యాప్తులో భాగంగా ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ ను, రిపోర్టర్లు పరిపూర్ణాచారి, సు«దీర్లను సుదీర్ఘంగా విచారించిన సీసీఎస్ పోలీసులు చారిని మధ్యలోనే పంపించేశారు. మిగతా ఇద్దరిని సుమారు 24 గంటలపాటు విచారణ పేరుతో అదుపులో పెట్టుకున్నారు.అనంతరం కింగ్కోఠిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షల తర్వాత తిరిగి సీసీఎస్కు తీసుకొచ్చారు. అక్కడ రిమాండ్ రిపోర్ట్లో అదనంగా మరో మూ డు సెక్షన్లు జోడించారు. బుధవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో మణికొండలోని మెజిస్ట్రేట్ ఇంటికి తరలించారు. ఒంటిగంట సమయంలో రమేశ్, సు«దీర్లను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ అడిగిన ప్రశ్నలకు పోలీసులు సమాధానం చెప్పలేకపోయారు. అసోసియేషన్ ఫిర్యాదు మేరకు విచారణ పోలీసులకు పలు ప్రశ్నలు వేసిన న్యాయమూర్తి..ఎఫ్ఐఆర్లో పెట్టిన సెక్షన్లకు, రిమాండ్ రిపోర్ట్లో ఉన్న అంశాలకు సంబంధం లేదని అన్నారు. దీంతో విక్టిమ్ ఎవరూ లేరని, విక్టిమ్ స్టేట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా లేరని, వాళ్ల అసోసియేషన్ ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నామని పోలీసులు చెప్పారు. సీనియర్ ఐఏఎస్ అధికారిపై అభ్యంతరకర వార్తలు ప్రసారం చేశారని, దాంతో వారి మనోభావాలు దెబ్బతిన్నాయని, సమాజంలో తలెత్తుకోలేకపోతున్నారని అన్నారు. ఈ కేసులో మరింత విచారణ జరపాల్సి ఉందంటూ రిమాండ్ విధించాలని పీపీ కోరారు. నిరాధారమైన ఆరోపణలతో అరెస్టు ఎన్టీవీ రిపోర్టర్ల తరఫు న్యాయవాదులు కిరణ్, జగదీశ్, శేరియార్ వాదిస్తూ..పోలీసులు చట్టవిరుద్దంగా చర్యలు చేపట్టడం దారుణమని అన్నారు. ఈ కేసులో పెట్టిన కొన్ని సెక్షన్లు ఏడేళ్ల లోపువే ఉన్నాయని, ఈ కేసులో బాధితుల పేర్లు లేవని, వారి నుంచి ఎలాంటి స్టేట్మెంట్ కూడా పోలీసులు రికార్డు చేయలేదని తెలిపారు. పోలీసులు ఎలాంటి విచారణ చేయకుండానే అరెస్టు చేశారన్నారు. అధికారిక పర్యటన కోసమే దొంతు రమేష్ విదేశాలకు వెళ్తున్నారని, కుటుంబాన్ని తీసుకుని ముందుగా బ్యాంకాక్ వెళ్లి, ఆ తర్వాత దావోస్లోని వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు వెళ్తున్న క్రమంలో అదుపులోకి తీసుకున్నారని చెప్పారు.నిరాధారమైన ఆరోపణలతో అరెస్టు చేశారని వాదించారు. ఈ వాదనలతో ఏకీభవించిన మేజి్రస్టేట్.. పోలీసుల రిమాండ్ రిక్వెస్ట్ను తిరస్కరిస్తున్నట్టు తెలిపారు. ‘విక్టిమే లేనప్పుడు కేసు ఎలా నమోదు చేశారు..? సెక్షన్లు ఎలా పెట్టారు..? సీనియర్ అయినా.. జూనియర్ అయినా.. ఐఏఎస్ అయినా.. అందరికీ ఒకే చట్టం వర్తిస్తుంది. సదరు అధికారుల కోసం ప్రత్యేక చట్టాలు ఏం లేవు. కాబట్టి రిమాండ్ రిక్వెస్ట్ను రిజెక్ట్ చేస్తున్నాం..’ అని మెజిస్ట్రేట్ స్పష్టం చేశారు. సు«దీర్, రమేష్ లకు బెయిల్ మంజూరు చేశారు. వారు తమ పాస్పోర్ట్లు సరెండర్ చేయాలని, రూ.20 వేల విలువైన రెండు షూరిటీలు సమరి్పంచాలని ఆదేశించారు. అరెస్టులు ఖండించిన జర్నలిస్టు సంఘాలు ఎన్టీవీ రిపోర్టర్లను అరెస్టు చేయడంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జర్నలిస్టుల అరెస్టును పలు జర్నలిస్టు సంఘాలు, పౌరహక్కుల సంఘాలు ఖండించాయి. పోలీసులు వ్యవహరించిన తీరును తప్పుబట్టాయి. ఐఏఎస్పై కథనానికి సంబంధించి ఈనెల 10న ఎన్టీవీ తోపాటు తెలుగు స్క్రైబ్, ఎమ్ఆర్ మీడియా తెలంగాణ, ప్రైమ్ 9, పీవీ న్యూస్, సిగ్నల్ టీవీ, వ్లోగా టైమ్స్, మిర్రర్ టీవీ, టీ న్యూస్ తెలుగు ఛానల్స్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ–1 గా ఎన్టీవీని చేర్చారు.ఆ తర్వాత ఇదే తరహా మరో కేసును కలిపి రెండు కేసుల దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు అప్పగిస్తూ డీజీపీ బి.శివధర్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ సిట్ దర్యాప్తు పర్యవేక్షణను హైదరాబాద్ సిటీ సీపీ వీసీ సజ్జనార్కు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఈనెల 13న రాత్రి 11 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దొంతు రమేష్ ను అరెస్టు చేసి నేరుగా సీసీఎస్కు తరలించారు. అదేరోజు రాత్రి 12 నుంచి 2 గంటల మధ్య మరో ఇద్దరు ఎన్టీవీ రిపోర్టర్లు సు«దీర్, పరిపూర్ణాచారిని వాళ్ల ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలోనే రిపోర్టర్ సు«దీర్ ఇంటి వద్ద హైడ్రామా నడిచింది. ఒక దశలో ఇంటి తలుపులు బద్ధలు కొడతామంటూ పోలీసులు బెదిరించినట్లు రిపోర్టర్లు చెప్పారు.చివరకు సు«దీర్, చారి, రమేష్ ముగ్గురిని బషీర్బాగ్ సీసీఎస్ కార్యాలయానికి తరలించారు. ఓ వైపు సీసీఎస్లో విచారణ జరుగుతుండగానే.. ఎన్టీవీ సీఈఓ ఇంటికి, యాంకర్ దేవి ఇంటికి మరికొన్ని పోలీస్ బృందాలను పంపారు. అక్కడ కూడా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించినట్లు జర్నలిస్టు వర్గాల సమాచారం. దేవి, రాజశేఖర్ ఎక్కడ అని ప్రశ్నిస్తూ.. అర్జెంట్గా తమ ముందు హాజరవ్వాలని.. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరించినట్లు తెలిసింది. సాక్షిగా స్టేట్మెంట్ ఇచి్చన యాంకర్ దేవిని కూడా ఇబ్బంది పెట్టినట్లు రిపోర్టర్లు తెలిపారు. కమిషనర్ సజ్జనార్ తీరుపై విస్మయం ఎన్టీవీ కథనంపై కేసు, రిపోర్టర్ల అరెస్టు వ్యవహారంలో నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ వ్యవహరించిన తీరుపై జర్నలిస్టు సంఘాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. రిపోర్టర్ల అరెస్టు విషయంలో ఆయన మీడియాతో ఆగ్రహంగా బెదిరించేలా మాట్లాడారనే విమర్శలు విన్పిస్తున్నాయి. ‘సిట్ అంటేనే దర్యాప్తు..ఎందుకు నోటీసులు ఇవ్వాలండి...కావాల్సిన వాళ్లను పిలిపిస్తాం. మేము పిలిస్తే రావాల్సిందే..మీ దగ్గర ఆధారాలు ఉంటే వచ్చి చూపండి.. ఎందుకు పారిపోతున్నారు? ఎక్కడ ఉన్నా పట్టుకుని వస్తా. చట్టం ముందు ప్రవేశపెడ్తా..’ అంటూ సజ్జనార్ ఆవేశంగా మాట్లాడటాన్ని పలువురు సీనియర్ జర్నలిస్టులు తప్పుపడుతున్నారు. కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే రిపోర్టర్లు తప్పు చేశారనే విధంగా తీర్పునిచ్చేలా మాట్లాడడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎడిటర్లు ఎక్కడ? ఇన్చార్జిలు ఎక్కడ? విచారణలో భాగంగా ఎన్టీవీ ఆఫీస్లోకి వెళ్లిన ఇన్స్పెక్టర్తో పాటు మరో ఆరుగురితో కూడిన బృందం.. ఎడిటర్లు ఎక్కడ? ఇన్చార్జిలు ఎక్కడ..? అంటూ సిబ్బందిని ప్రశ్నించారు. హార్డ్ డిస్్కలు, సీపీయూలు సీజ్ చేస్తామని, సర్వర్ వైర్లు లాగేస్తామని బెదిరింపులకు పాల్పడినట్లు అక్కడి సిబ్బంది తెలిపారు. సీఈఓ, దేవి, రాంబాబు.. ఎక్కడున్నారో చెప్పకపోతే, ఇక్కడున్న మిమ్మల్ని అదుపులోకి తీసుకోవాల్సి వస్తుందంటూ భయబ్రాంతులకు గురిచేశారని వారు వాపోయారు. సెర్చ్ వారెంట్ ఉందా..? అని గట్టిగా నిలదీయడంతో పోలీసులు వెనుదిరిగారని, కాసేపటికి తిరిగి వచి్చన పోలీసులు రిక్వెస్ట్ లెటర్ ఇచ్చి ఓ సీపీయూ సీజ్ చేశారని తెలిపారు. ఇలావుండగా తెలుగుదేశం సోషల్ మీడియా ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి బ్యాంకాక్ పారిపోయారంటూ దు్రష్పచారాన్ని ప్రారంభించింది. అయితే ఆయన మూడు రోజులుగా కార్యాలయానికి వస్తూనే ఉన్నారని ఎన్టీవీ రిపోర్టర్లు తెలిపారు. -
‘నల్లమల సాగర్’ ఆపితేనే చర్చలకు
సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ అధ్యక్షతన రెండు రాష్ట్రాల అధికారులతో ఇటీవల కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసిన కమిటీ ఈ నెల 30న మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని సీడబ్ల్యూసీ సమావేశ మందిరంలో సమావేశం కానుంది. ఈ మేరకు సీడబ్ల్యూసీలోని ప్రాజెక్టుల మదింపు విభాగ చీఫ్ ఇంజనీర్, కమిటీ సభ్య కార్యదర్శి రాకేశ్కుమార్ గత బుధవారం ఇరు రాష్ట్రాలకు మీటింగ్ నోటీస్ పంపించారు. అయితే పోలవరం–బనకచర్ల/నల్లమల సాగర్ డీపీఆర్ త యారీ ప్రక్రియతోపాటు ఆ ప్రాజెక్టు అక్రమ నిర్మాణానికి ఏపీ చేస్తున్న ప్రయత్నాలను, ఆ ప్రాజెక్టు ప్రీ ఫీజబిలిటీ రిపోర్ట్ మదింపును కేంద్రం జల సంఘం తక్షణమే విరమించుకుంటనే ఈ కమిటీ సమావేశానికి హాజరవుతామని తెలంగాణ రాష్ట్రం స్పష్టం చేసింది.కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన గత జూలై 16న ఢిల్లీలో తెలంగాణ, ఏపీ సీఎంలతో నిర్వహించిన సమావేశంలో సంప్రదింపుల ద్వారా జల వివాదాలను పరిష్కరించుకోవడానికి ఓ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల మధ్య నీటి విషయంలో అపరిష్కృతంగా ఉన్న ఆందోళనలపై సమగ్ర అధ్యయనం జరపడంతోపాటు వాటిని సాంకేతిక దృక్పథంతో పరిష్కరించి సమర్థవంతంగా, సమన్యాయంతో నీటి పంపకాలు జరిపేందుకు సాధ్యమైన పరిష్కారాలను సూచించడానికి ఈ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. మూడు నెలల్లోగా నివేదికను సమరి్పంచాలని కమిటీని కోరింది. ఇందుకోసం అవసరమైన ఇతర విభాగాల అధికారులు/నిపుణుల సేవలను వాడుకోవాలని కమిటీకి సూచించింది. మీటింగ్ ఎజెండాలో ... ⇒ ఏపీ, తెలంగాణ మధ్య నీటి పంపకాలకు సంబంధించిన కీలక సమస్యలను తదుపరి చర్చల కోసం ఇరు రాష్ట్రాలు కమిటీ ముందు ఉంచాలి. ⇒ కమిటీలో చర్చించేందుకు ఆయా అంశాలకు సంబంధించిన సమాచారాన్ని కృష్ణానది యాజమ్యాన బోర్డు (కేఆర్ఎంబీ), గోదావరినది యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) అందించాలి. ⇒ కమిటీ సహకరించడంతోపాటు కమిటీ కార్యకలాపాల్లో పాల్గొనడానికి నిపుణులు/అధికారులను ఎంపిక చేయాలి. ⇒ చైర్మన్ అనుమతితో ఇతర ఏ అంశాలపైనా కమిటీ చర్చిస్తుంది. సమావేశానికి హాజరు కావాలంటే.... పోలవరం–బనకచర్ల/ నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు డీపీఆర్ తయారీ ప్రక్రియతోపాటు ఆ ప్రాజెక్టు అక్రమ నిర్మాణానికి ఏపీ చేస్తున్న ప్రయత్నాలను, ఆ ప్రాజెక్ట్ ప్రీ ఫీజబిలిటీ రిపోర్ట్ మదింపునకు కేంద్ర జల సంఘం చేపట్టిన ప్రక్రియను తక్షణమే విరమించుకుంటేనే కమిటీ సమావేశానికి హాజరవుతామని తెలంగాణ రాష్ట్రం తేల్చి చెప్పింది. డీపీఆర్ తయారీ, పీఎఫ్ఆర్ మదింపు వంటి ప్రక్రియలు జరిగిపోయాక, చర్చలు జరిపినా ఫలితం ఉండదని, ఇలాంటి స్థితిలో సమావేశానికి రాలేమని స్పష్టం చేసింది. ఈ విషయంలో న్యాయపర చర్యలు తీసుకునేందుకు ఉన్న మార్గాలను అవసరమైతే పరిశీలిస్తామని తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఇటీవల కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాశారు.గత ఏడాది జులై 16న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఇరు రాష్ట్రాల సీఎంలతో జరిగిన సమావేశ ఎజెండాలో పోలవరం– బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుపై చర్చను చేర్చరాదని ఆ సమావేశానికి ముందే తాము లేఖ రాశామని తెలంగాణ గుర్తు చేసింది. కేంద్ర జలశక్తి శాఖ గత డిసెంబర్ 4న జారీ చేసిన సూచనలకు విరుద్ధంగా ఏపీ ప్రాజెక్టు నిర్మాణానికి అక్రమ చర్యలతోపాటు డీపీఆర్ తయారీ ప్రక్రియను చేపట్టడంతో తాము సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశామని తెలియజేసింది. కేంద్ర జల సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా ఈ ప్రాజెక్టు మదింపును సీడబ్లూసీ, కేంద్ర జలశక్తి శాఖ ఎలా చేపడతాయని తాము ఈ పిటిషన్లో సవాలు చేశామని పేర్కొంది.మరోవైపు ఏపీ పోలవరం–నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు డీపీఆర్ తయారీ ప్రక్రియను చేపట్టగా, సీడబ్ల్యూసీ ఆ ప్రాజెక్టు ప్రీఫీజిబిలిటీ రిపోర్ట్ మదింపు విషయంలో ముందడుగు వేసిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రక్రియలు పూర్తయితే వాటికి వ్యతిరేకంగా చర్చలు జరపడంలో అర్థం ఉండదని, అలా చేస్తే తమకు ఎలాంటి ఉపశమనం లభించదని స్పష్టం చేసింది. -
టీచర్లకు టార్గెట్
సాక్షి, హైదరాబాద్: టీచర్లకూ టార్గెట్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. విద్యార్థుల ఫలితాల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వనుంది. టెన్త్, ఇంటర్ పరీక్షల్లో విద్యార్థుల మార్కులను కొలమానంగా తీసుకోనుంది. ప్రభుత్వం నియమించిన విద్యాకమిటీ కూడా ఈ మేరకు సిఫార్సులు చేసేందుకు సిద్ధమైంది. పాఠశాల, కళాశాల స్థాయిలో విద్యా ప్రమాణాల మెరుగుకు ఈ చర్యలు అనివార్యమని కమిటీలోని సభ్యులు అభిప్రాయపడుతున్నారు. టీచర్లు, లెక్చరర్లలో మరింత జవాబుదారీ తనం పెంచాల్సిందేనని సీఎం సూచించినట్టు తెలిసింది.ఇటీవల భేటీ అయిన విద్యా కమిటీ ఈ అంశంపై లోతుగా చర్చించింది. ఇతర రాష్ట్రాల్లో ఈ తరహా విధానాలు అమలు చేస్తున్నారని కమిటీ సభ్యులు అంటున్నారు. దీనిపై కొంత అధ్యయనం చేయాలని నిర్ణయించారు. పూర్తి వివరాలతో ప్రాథమిక నివేదికను ఫిబ్రవరి మొదటి వారంలో ప్రభుత్వానికి సమర్విస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. మౌలిక వసతులు లేని ప్రభుత్వ స్కూళ్లల్లో వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోకుండా టార్గెట్లు పెడితే సహించేది లేదని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్ఈపీ ప్రామాణికం టీచర్స్ ఫెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండికేటర్స్ ఉండాలని జాతీయ విద్యా విధానం–2020 (ఎన్ఈపీ) సూచిస్తోంది. ఇప్పటి వరకూ ఎన్ఈపీని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయలేదు. పాఠశాల విద్యలో అనేక ఇబ్బందులున్నాయని చెబుతోంది. అయితే రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు దిగజారుతున్నాయనే విమర్శ ఎక్కువగా వస్తోంది. నేషనల్ అచీవ్మెంట్ సర్వేలోనూ ఇది వెల్లడైంది. టెన్త్ విద్యార్థులు సైతం ఇంగ్లిష్, మేథ్స్లో 70 శాతం వెనుకబడి ఉన్నారని తెలిపింది. ప్రాథమిక విద్యలో రెండంకెల లెక్కలు కూడా చేసే పరిస్థితి లేదని చెబుతున్నారు.రాష్ట్ర ప్రభుత్వం చేసిన అధ్యయనంలో ఇంటర్ విద్యలో విద్యార్థులు బట్టీ చదువులతో నెట్టుకొస్తున్నారు. 80 శాతం ప్రభుత్వ కాలేజీల్లో ఫలితాలు పడిపోతున్నాయి. ప్రాక్టికల్స్పై కనీస అవగాహన కూడా ఉండటం లేదని తేల్చారు. వీటిని సరిచేయడానికి ఎన్ఈపీలోని కొన్ని విధానాలు అనివార్యమని ప్రభుత్వం నియమించిన తెలంగాణ విద్యాపాలసీ కమిటీ అభిప్రాయపడుతోంది. అయితే ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపిన తర్వాత, పరిస్థితిని వివరించి ఈ విధానం తీసుకొస్తే మేలని కమిటీలోని పలువురు చెబుతున్నారు. ఫలితం లేకుంటే పాయింట్స్ డౌన్ పాఠశాల, కాలేజీ స్థాయిలో విద్యార్థుల సంఖ్య, వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత, అందులోనూ ర్యాంకులను కొలమానంగా తీసుకోవాలన్నది కమిటీ సిఫార్సుగా తెలుస్తోంది. దీనిని సబ్జెక్టుల వారీగా కూడా విడగొడతారు. కాలేజీ, స్కూల్లో ఫలితాలు 90 శాతం ఉంటే కొన్ని పాయింట్లు ఇస్తారు. కాలేజీ ప్రిన్సిపాల్, స్కూల్ హెచ్ఎంకు ఇది వర్తిస్తుంది. సబ్జెక్టుల వారీగా ఫలితాలను ప్రామాణికంగా తీసుకొని ప్రతీ టీచర్స్కు పాయింట్లు ఇస్తారు. బదిలీలు, పదోన్నతుల్లో వీటినే కొలమానంగా తీసుకుంటారు. ఎక్కువ పాయింట్లు వచ్చిన టీచర్కు ప్రాధాన్యం ఇస్తారు. ఐదేళ్లుగా సంబంధిత సబ్జెక్టులో 40 శాతం కన్నా తక్కువ ఫలితాలు వస్తున్న టీచర్కు తొలి దశలో కౌన్సెలింగ్ చేపట్టాలని సూచిస్తున్నారు. ఆ తర్వాత రెండేళ్లల్లో కూడా ఫలితాల పురోగతి పెరగకపోతే ఏ తరహా చర్యలు తీసుకోవాలనే అంశంపై కమిటీ సభ్యులు చర్చిస్తున్నారు. ఇంక్రిమెంట్లో కోత పెట్టడమా? భవిష్యత్లో ఇంక్రిమెంట్ ఇవ్వకుండా ఆపేయడమా? అనే అంశాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఇది మాల్ ప్రాక్టీస్కు దారి తీస్తుంది ఈ విధానం పాఠశాల, కళాశాలల్లో మాల్ ప్రాక్టీస్కు దారి తీస్తుంది. టార్గెట్లు పెడితే విద్యార్థులతో కాపీ కొట్టించే ప్రమాదం ఉంది. దీనివల్ల విద్యా ప్రమాణాలు మరింత తగ్గొచ్చు. అసలు టీచర్లకు స్వేచ్ఛగా పాఠం చెప్పే అవకాశం ఇవ్వడం లేదు. ఫిజిక్స్వాలా, ఖాన్ అకాడమీ వారి సాఫ్ట్వేర్ను ఫాలో అవ్వాల్సి వస్తోంది. టీచర్స్కు స్వేచ్ఛ ఇస్తే విద్యార్థి మానసిక పరిస్థితికి తగ్గట్టు పాఠం చెబుతాడు. టార్గెట్లు పెడితే తీవ్రంగా వ్యతిరేకిస్తాం. – చావా రవి, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు టీచర్ల ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది ప్రభుత్వ స్కూళ్లకు వచ్చే విద్యార్థులంతా పేద, బడుగు, బలహీన వర్గాల వారే. సామాజిక, ఆర్థిక పరిస్థితుల కారణంగా వారు రెగ్యులర్ రావడం లేదు. దీంతో వారికి పాఠం ఎలా అర్థమవుతుంది? వాస్తవ పరిస్థితిని తెలుసుకోకుండా టార్గెట్లు పెడితే ఉపాధ్యాయుల ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. ఈ విధానం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. – పుల్గం దామోదర్ రెడ్డి, పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం ప్రైవేట్ స్కూళ్లల్లో విద్యార్థులకు పరీక్ష పెట్టి మరీ తీసుకుంటారు. ప్రభుత్వ స్కూళ్లకు ఆ వెసులుబాటు ఉండదు. చురుకైన విద్యారి్థ, కాస్త వెనుకబడిన విద్యార్థి ఎవరైనా తీసుకోవాల్సిందే. వారికి పాఠాలు చెప్పాల్సిందే. ఇక్కడ డిటెన్షన్ విధానం కూడా లేదు. అలాంటప్పుడు ప్రభుత్వ స్కూళ్లల్లో గ్రేడింగ్ పెట్టడం ఎలా సాధ్యం? టీచర్లను వేధించే ఇలాంటి చర్యలకు ఏమాత్రం మద్దతు ఇవ్వం. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే ఆందోళన చేపడతాం. – పింగిలి శ్రీపాల్రెడ్డి, టీచర్స్ ఎమ్మెల్సీ -
ఇదే చివరి అవకాశం
సాక్షి, న్యూఢిల్లీ: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం 10 మంది ఎమ్మెల్యేల్లో చివరి ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్ల విచారణను అసెంబ్లీ స్పీకర్ ఇంకా ముగించకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే చివరి అవకాశమని.. మిగిలిన అనర్హత పిటిషన్లపై రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందేనంటూ అల్టి మేటం జారీ చేసింది.ఈ అంశంపై నిర్ణయం తీసుకోవడానికి 8 వారాల గడువు ఇవ్వాలంటూ స్పీకర్ కార్యాలయం చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. స్పీకర్ తీసుకోబోయే నిర్ణయాలతోపాటు ఇప్పటివరకు జరిగిన పురోగతిపై తదుపరి విచారణ నాటికి నివేదిక సమరి్పంచాలని స్పష్టం చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్రెడ్డి, కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం విచారణ చేపట్టిన జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా ఇరుపక్షాలు వాడీవేడిగా మిగతా వాదనలు వినిపించాయి. గడువు కోరిన ప్రభుత్వ న్యాయవాదులు బీఆర్ఎస్ నేతలు తమ పిటిషన్లలో ప్రతివాదులుగా పేర్కొన్న తెలంగాణ ప్రభుత్వం, స్పీకర్ కార్యాలయం తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, అభిõÙక్ మను సింఘ్వీ, నిరంజన్రెడ్డి వాదనలు వినిపించారు. ‘స్పీకర్ కంటి శస్త్రచికిత్స చేయించుకున్నారు. రెండు రోజులపాటు ఆస్పత్రిలో ఉన్నారు. అలాగే అసెంబ్లీ సెక్రటరీ జనరల్ కూడా మారారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అందువల్ల పిటిషన్ల విచారణలో జాప్యం జరిగింది. ఇప్పటికే కొన్ని అంశాలను పరిష్కరించాం. మరికొన్నింటిపై తీర్పును రిజర్వ్ చేశాం. మిగిలిన వాటిని పూర్తి చేయడానికి మరో 8 వారాల సమయం ఇవ్వండి’అని ముకుల్ రోహత్గీ ధర్మాసనాన్ని కోరారు. కావాలనే జాప్యం చేస్తున్నారు: బీఆర్ఎస్ తరఫు లాయర్లు ప్రభుత్వం తరఫు న్యాయవాదుల వాదనలను పిటిషనర్లు పాడి కౌశిక్రెడ్డి, కేటీఆర్ తరఫు వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు తీవ్రంగా ఆక్షేపించారు. ఇది ముమ్మాటికీ కోర్టు ధిక్కరణేనని ఆయన వాదించారు. ‘రెండు వారాల్లో తేల్చేస్తామని గతంలోనే కోర్టుకు హామీ ఇచ్చారు. కానీ మూడు నెలలైనా అతీగతీ లేదు. ఒక ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి గెలిచి ఆ తర్వాత అధికార పార్టీ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడేమో ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నానని చెబుతున్నారు.ఇది పచ్చి మోసం. ఇది ఓపెన్ అండ్ షట్ కేస్. దీనికి విచారణ పేరుతో కాలయాపన చేయడం సరికాదు. ట్రిబ్యునల్ (స్పీకర్) ఈ రోజు వరకు కేసును కనీసం తాకలేదు’అని శేషాద్రి నాయుడు కోర్టు దష్టికి తెచ్చారు. స్పీకర్ కార్యాలయం కావాలనే జాప్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఇరుపక్షాల వాదనల అనంతరం ధర్మాసనం స్పందిస్తూ.. రెండు వారాల్లో మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, సంజయ్ కుమార్లకు సంబంధించి దాఖలైన అనర్హత పిటిషన్లపై తీసుకున్న చర్యలను తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. అయితే కనీసం నాలుగు వారాల గడువైనా ఇవ్వాలని స్పీకర్ తరఫు న్యాయవాదులు కోరగా రెండు వారాల్లో పురోగతి చూపిస్తే నాలుగు వారాల సమయం ఇస్తామని చెబుతూ విచారణను వాయిదా వేసింది. -
మోదీని కలిస్తే తప్పేంటి?
నిర్మల్: నరేంద్ర మోదీ తనకు బంధువేమీ కాదని, తనకు చుట్టరికం లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ‘నరేంద్ర మోదీని రేవంత్రెడ్డి పదేపదే కలుస్తుంటారని చాలామంది అంటున్నారు. ఆయన మన దేశానికి ప్రధానమంత్రి. ఆయన్ను కలిస్తే తప్పేంటి? ఆయన అనుమతిస్తే ఎయిర్పోర్టు వస్తుంది, పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి. నేను ఆయన్ను కలిసేందుకు వెళ్లినప్పుడు మంత్రులతో పాటు బీజేపీ ఎంపీలు కూడా నా వెంట ఉంటారు. రాష్ట్రానికి మేలు జరుగుతుందంటే ఎవరినైనా, ఎన్నిసార్లైనా కలుస్తా..’ అని సీఎం స్పష్టం చేశారు. శుక్రవారం నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ వద్ద గోదావరిపై నిర్మించిన సదర్మట్ బరాజ్ని ఆయన ప్రారంభించారు. సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, బీజేఎల్పీనేత మహేశ్వర్రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నిర్మల్ జిల్లా కేంద్రంలో ‘ప్రజాపాలన–ప్రగతిబాట’ బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. పాలమూరుతో సమానంగా ఆదిలాబాద్ అభివృద్ధి ‘కొమురం భీమ్, రాంజీ గోండ్ పుట్టిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పోరాటాల పురిటి గడ్డ. జల్ జంగిల్ జమీన్ పోరాటం ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. కానీ పదేళ్లలో ఈ ప్రాంతానికి తీరని అన్యాయం జరిగింది. ఒకప్పుడు ఎర్రబస్సు ఎరగని ఆదిలాబాద్ జిల్లాకు ప్రస్తుతం ఎయిర్బస్ తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నాం. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత పథకాన్ని ప్రారంభించి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించి తీరుతాం. ఆదిలాబాద్ జిల్లాలో పదివేల ఎకరాల్లో అతిపెద్ద పారిశ్రామికవాడ, నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం. నా సొంత జిల్లా పాలమూరుతో సమానంగా ఉమ్మడి ఆదిలాబాద్ను అభివృద్ధి చేస్తా. చనాఖా–కొరటాకు సి.రామచంద్రారెడ్డి పేరు, సదర్మట్ బరాజ్కు పొద్దుటూరి నర్సారెడ్డి పేరు పెడుతున్నాం..’ అని సీఎం ప్రకటించారు.వాళ్ల తప్పులు, అప్పులే ఉరితాడుగా మారాయి.. ‘గత పాలకులు చేసిన తప్పులు, అప్పులు రాష్ట్రానికి ఉరితాడుగా మారాయి. అప్పటి ప్రభుత్వం పదేళ్లలో చిన్న సమస్యలను కూడా పరిష్కరించకపోవడం, పట్టించుకోకపోవడంతోనే చనాఖా–కొరట, సదర్మట్ వంటి బరాజ్ల పనులు పెండింగ్లో ఉండిపోయాయి. మా ప్రభుత్వం వచ్చాక, ఉత్తమ్కుమార్రెడ్డి ఇరిగేషన్ మంత్రి అయ్యాక సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నాం. కానీ ఫామ్హౌస్లో ఉండేటాయన శుక్రాచార్యుడిలా తెరవెనుక ఉంటే, మారీచుడు, సుబాహుల్లా బావబామ్మర్దులు అడ్డుపడుతున్నారు. హైదరాబాద్లో 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ పేరిట గొప్ప నగరాన్ని నిర్మిస్తున్నాం. ప్రపంచంలోని ప్రతి కంపెనీ ఇక్కడ పెట్టుబడి పెడుతుంది. ముందుచూపుతో అభివృద్ధి చేపడుతుంటే రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంటున్నారు. అనుభవంతో అభివృద్ధికి సహకరించడం చేతకాకపోతే ఫామ్హౌస్లో మౌనంగా ఉండాలి..’ అని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు.సౌత్ కుంభమేళా మేడారం ‘ప్రపంచలోనే అతిపెద్ద గిరిజన జాతరైన సమ్మక్క, సారలమ్మ మేడారం జాతర.. సౌత్ కుంభమేళా లాంటిది. రూ.300 కోట్లతో నిర్మించిన అమ్మవార్ల గుడులను, చేసిన అభివృద్ధి పనులను ఈ నెల 19న ప్రారంభిస్తాం. ఆదిలాబాద్ జిల్లాలోని నాగోబా ఆలయ అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యే బొజ్జుపటేల్ అడిగిన మేరకు రూ.22 కోట్లు మంజూరు చేశాం..’ అని సీఎం తెలిపారు. మంచివాళ్లనే గెలిపించండి ‘రేపోమాపో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మంచివాళ్లను గెలిపించుకోవాలి. మున్సిపాలిటీలు అభివృద్ధి కావాలంటే పది ఖర్చు పెట్టి, వందలు వెనకేసుకునే వాళ్లను కాకుండా మంచోణ్ణి, మనోణ్ణి గెలిపించుకోవాలి. పంచాయతీ ఎన్నికల్లో 66 శాతం సర్పంచ్ స్థానాలను గెలుపొందాం. మేము పాలకులు కాదు..సేవకులం.. ప్రజల మనసులు గెలుస్తున్నాం..’ అని రేవంత్రెడ్డి అన్నారు.గోదావరి నీళ్లను వదులుకోం: ఉత్తమ్కుమార్రెడ్డి గోదావరి నదీ జలాల విషయంలో పదేళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేశాయని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. గోదావరి జలాల్లో ఒక్క చుక్క నీటిని కూడా తాము వదులుకోబోమన్నారు. పోలవరం–నల్లమలసాగర్ను వ్యతిరేకిస్తూ తాను, సీఎం రేవంత్రెడ్డి..కేంద్ర ప్రభుత్వాన్ని, ట్రిబ్యునల్ను కలిశామని ఉత్తమ్ వెల్లడించారు. చనాఖా–కొరాట కోసం రూ.100 కోట్లు విడుదల చేస్తామని మంత్రి తెలిపారు. దక్షిణ కశ్మీరాన్ని తలపించే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని మంత్రి జూపల్లి చెప్పారు. రూ.100 కోట్లతో బాసర అభివృద్ధికి మాస్టర్ప్లాన్ రూపొందిస్తున్నామని తెలిపారు. ఆదిలాబాద్ ఎంపీ నగేష్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి, ఎమ్మెల్యేలు రామారావు పటేల్, బొజ్జు పటేల్, భూపతిరెడ్డి, ఎమ్మెల్సీలు దండె విఠల్, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.రైతులను అడ్డుకున్న పోలీసులుఇబ్రహీంపట్నం (కోరుట్ల): సదర్మట్ ప్రాజెక్టు నుంచి గంగనాల ప్రాజెక్టుకు నిరంతరం నీళ్లు వచ్చేలా చూడాలని కోరుతూ సీఎంకు వినతిపత్రం ఇచ్చేందుకు జగిత్యాల జిల్లా రైతులు సిద్ధం అయ్యారు. అయితే పోలీసులు వారిని అనుమతించలేదు.చనాఖా–కొరట నుంచి నీళ్లు విడుదలసాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం హత్తిఘాట్లోని చనాఖా–కొరట పంప్హౌస్ వద్ద మీట నొక్కిన సీఎం రేవంత్రెడ్డి నీటిని ప్రధాన కాలువలోకి విడుదల చేశారు. అనంతరం కాలువలో పారుతున్న నీటికి పూజలు నిర్వహించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామని అన్నారు. మంత్రులు ఉత్తమ్, జూపల్లి, సుదర్శన్రెడ్డి, నగేష్తో పాటు ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జాదవ్Š ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
‘సీఎం కప్-2025 సెకండ్ ఎడిషన్’కు సర్వం సిద్దం
తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘సీఎం కప్-2025 సెకండ్ ఎడిషన్’ పోటీలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జనవరి 17 నుంచి ఫిబ్రవరి 26 వరకు గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయుల్లో మొత్తం 44 విభాగాల్లో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. మొట్టమొదటిసారిగా నియోజకవర్గ స్థాయిలో పోటీలు జరగనుండడం విశేషం.పోటీల షెడ్యూల్ ఇలా:గ్రామపంచాయతీ స్థాయి: జనవరి 17 నుంచి 22 వరకుమండల/మున్సిపాలిటీ స్థాయి: జనవరి 28 నుంచి 31 వరకుఅసెంబ్లీ నియోజకవర్గ స్థాయి: ఫిబ్రవరి 3 నుంచి 5 వరకుజిల్లా స్థాయి: ఫిబ్రవరి 9 నుంచి 12 వరకురాష్ట్ర స్థాయి: ఫిబ్రవరి 20 నుంచి 23 వరకుగ్రామ స్థాయిలో విజేతలను మండల స్థాయికి, అక్కడి నుంచి అసెంబ్లీ నియోజకవర్గం, జిల్లా, చివరకు రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు.గత ఏడాది గ్రాండ్ సక్సెస్2024లో నిర్వహించిన సీఎం కప్ పోటీల్లో దాదాపు మూడు లక్షల మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈసారి అసెంబ్లీ స్థాయి చేర్చడంతో పాల్గొనే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే రెండు లక్షల మంది క్రీడాకారులు ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు.క్రీడాజ్యోతి ర్యాలీలతో అవగాహన యువతలో క్రీడలపై అవగాహన పెంచేందుకు రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో క్రీడాజ్యోతి ర్యాలీలు నిర్వహించారు. యువ క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పల్లె ప్రతిభను గుర్తించడమే లక్ష్యం గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే సీఎం కప్ లక్ష్యమని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.2036 ఒలింపిక్స్లో తెలంగాణకు గర్వకారణంగా నిలిచే క్రీడాకారులను తయారు చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని చెప్పారు. గత ఏడాది సీఎం కప్ ఘన విజయాన్ని సాధించిందని, అదే స్ఫూర్తితో రెండో విడత నిర్వహిస్తున్నామని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి అన్నారు. గ్రామీణ క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.క్రీడా సంఘాలు, పీఈటీలు, ఫిజికల్ డైరెక్టర్లు, క్రీడాభిమానుల సమన్వయంతో పోటీలు విజయవంతమవుతాయని రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి తెలిపారు.ఆధునిక సాంకేతిక సహకారంసీఎం కప్–2025కు ఏఐ కాల్ సెంటర్, వాట్సాప్ బాట్, వెబ్సైట్, ఏఐ చాట్బాట్ ద్వారా సమగ్ర సమాచారం అందించనున్నట్లు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఎండీ డా. సోనీ బాలాదేవి తెలిపారు. పాల్గొనే ప్రతి క్రీడాకారి వివరాలను కంప్యూటరీకరించి భద్రపరిచే ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. -
జనగామ, యాదాద్రి జిల్లాల్లో రిజిస్ట్రేషన్ స్కామ్.. రూ.3.72 కోట్ల అవినీతి
వరంగల్: జనగామ-యాదాద్రి జిల్లాల్లో రిజిస్ట్రేషన్ స్కామ్ వెలుగు చూసింది. ధరణి, భూభారతి రిజిస్ట్రేషన్లలో రూ. 3.72 కోట్ల అవినీతి జరిగినట్లు వెల్లడైంది. ఈ మేరక 15 మంది నిందితులను జనగామ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అవినీతికి పాల్పడిన నిందితుల నంచి రూ. 63 లక్షల నగద, ఒక కారు, 2 ల్యాప్టాప్లు, 5 డెస్క్టాప్లు, 17 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని వరంగల్ సీపీ సన్ప్రీత్ సింగ్ వెల్లడించారు. ఇది ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టిన కేసుగా నిర్దారించారు. ఈ కేసుకు సంబంధించి మరో 9 మంది పరారైనట్లు తెలుస్తోంది. -
‘గ్లాస్’ గొడవ.. అన్నను చంపిన తమ్ముడు
సాక్షి, హైదరాబాద్: నాచారంలో దారుణం జరిగింది. అన్నను తమ్ముడు హత్య చేశాడు. మద్యం తాగే క్రమంలో గ్లాస్ కోసం గొడవ జరిగింది. మూడంతస్తుల భవనంపై నుంచి అన్నను తమ్ముడు తోసేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.వరంగల్లో..మరో ఘటనలో వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఈరియా తండాలో ఓ యువకుడిపై దాడికి పాల్పడ్డారు. బెల్ట్ షాప్ వద్ద మద్యం కోసం వచ్చిన గణేష్ అనే యువకుడిపై దంపతులు రోకలి బండతో దాడి చేశారు. గణేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరతలించారు. దాడి చేసిన దంపతులు ఇంటికి తాళం వేసి పరారయ్యారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. -
తెలంగాణ స్పీకర్కు సుప్రీంకోర్టు వార్నింగ్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభాకర్ రావు ఇంటరాగేషన్ పూర్తి చేయాలన్న ధర్మాసనం.. ఇంకెంతకాలం విచారణ కొనసాగిస్తారు?కేసులో ఇంకా ఏం మిగిలింది?. అంటూ ప్రశ్నించింది.‘‘ఇప్పటికే రెండు వారాలకు కస్టడీకి అనుమతించాం మే నుంచి ఆయనకు అరెస్టు నుంచి రక్షణ కల్పించాము. మీ పర్పస్ పూర్తయిందా లేదా? కేసు దర్యాప్తు దృష్టిలో ఉంచుకొని, ఆర్టికల్ 142 కింద మేము మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశాం. ప్రభాకర్ రావును మళ్లీ జైలులో పెట్టాలనుకుంటున్నారా? ముందస్తు బెయిల్ ఇచ్చినంత మాత్రాన.. ఆయనను పిలవకుండా ఉండలేరు. మళ్లీ పిలిచి విచారణ చేయొచ్చు. ఆయన దర్యాప్తుకు సహకరిస్తారు’’ అని కోర్టు వ్యాఖ్యానించింది.తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ప్రభాకర్రావుకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దంటూ వాదించారు. తదుపరి విచారణ వరకు మధ్యంతర రక్షణ పొడిగించిన సుప్రీంకోర్టు.. మార్చి 10కి వాయిదా వేసింది. -
శబరిమల యాత్రలో విషాదం.. తెలుగు దంపతుల మృతి
సాక్షి, మంచిర్యాల: శబరిమల నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం చోటుచేసుకుంది. కన్యాకుమారిలో లక్షేట్టిపేట దంపతుల మృతి చెందారు మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేటకు చెందిన జనరల్ స్టోర్ యజమాని పాలకుర్తి సత్యనారాయణ (63), ఆయన భార్య రమాదేవి (59) అయ్యప్ప మాలతో శబరిమల దర్శనానికి వెళ్లారు.తిరుగు ప్రయాణంలో కన్యాకుమారి బైపాస్ రోడ్డులో రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను కన్యాకుమారి ప్రభుత్వాసుపత్రికి తరలించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
స్పీకర్ కాదన్నారు.. ‘సుప్రీం’ ఏమంటుందో?
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారం ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. తమ పార్టీ సింబల్పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారని, వాళ్లపై స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ పార్టీ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. గత విచారణలో మూడు నెలల్లోపు స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే.. ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టు ఆదేశాలానుసారం తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకున్నారు. విచారణ జరిపి వాళ్ల నుంచి వివరణ తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ పది మందిలో ఏడుగురిపై దాఖలైన పిటిషన్లను కొట్టేశారు. టెక్నికల్లీ వాళ్లు పార్టీ మారలేదని.. బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారని తేల్చేశారు. ఇంక మిగిలిన ముగ్గురి భవితవ్యంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ వివరణ ఆల్రెడీ ఇచ్చారు. అయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలైతే ఇంకా స్పీకర్ ఎదుట హాజరై కనీస వివరణ కూడా ఇచ్చుకోలేదు. తమకు గడువు ఇవ్వాలన్న విజ్ఞప్తులపైనా స్పీకర్ ఇప్పటిదాకా ఎలాంటి బదులు ఇవ్వకపోవడం గమనార్హం. ఈ తరుణంలో.. శీతాకాల విడిది తర్వాత ఇవాళ ఫిరాయింపుల కేసు సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ల ధర్మాసనం పిటిషన్ను విచారణ జరపనుంది. ఫిరాయింపుల పిటిషన్లు కొట్టేస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ తరఫు లాయర్లు ఇవాళ్టి విచారణ సందర్భంగా వాదించే అవకాశం ఉంది. -
జోగు రామన్న హౌజ్ అరెస్ట్.. సీఎం రేవంత్ పర్యటనతో టెన్షన్
సాక్షి, అదిలాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పర్యటనను ఎలాగైనా అడ్డుకుని తీరతామంటూ బీఆర్ఎస్ శ్రేణులు హెచ్చరించిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. రెండు జిల్లాల ఎస్పీల నేతృత్వంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నేడు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనను అడ్డుకుంటామని బీఆర్ఎస్ సవాల్ చేసింది. దీంతో.. ఆ పార్టీ శ్రేణుల్ని ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు. మాజీ మంత్రి జోగు రామన్నను అర్ధరాత్రి హౌజ్ అరెస్ట చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు కూడా అటు వైపు రానివ్వకుండా ఆయన ఇంటి చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. సీఎం రేవంత్ తన పర్యటనలో భాగంగా.. అదిలాబాద్ నియోజకవర్గంలో కొరట చనక మ్యారేజ్ పంప్ హౌస్ను ప్రారంభిస్తారు. ఆపై నిర్మల్ జిల్లా మామడ మండలంలో సదర్ మార్ట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేస్తారు. అనంతరం.. నిర్మల్ టౌన్లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. -
ఖమ్మం జిల్లాలో పండుగ వేళ తీవ్ర విషాదం
హైదరాబాద్: ఖమ్మం జిల్లా వైరాలో సంక్రాంతి పండుగ వేళ విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటూ వెళ్లిన చిన్నారి సాంబార్లో పడి మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. ప్రమాదవశాత్తూ చిన్నారి రమ్మశ్రీ వేడి వేడి సాంబార్లో పడటంతో తీవ్ర గాయాలపాలైంది. దాంతో చిన్నారి రమ్మశ్రీని హైదరాబాద్కు తీసుకువచ్చి చికిత్స అందించారు. నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. దాంతో చిన్నారి తల్లి దండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బిడ్డను కోల్పోవడంతో వారి బాధ వర్ణనాతీతంగా ఉంది. -
ఆసుపత్రి పెట్టుబడుల పేరుతో భారీ మోసం
సాక్షి, హైదరాబాద్: ఆసుపత్రి పెట్టుబడుల పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ ఆసుపత్రి మాజీ ఎండీపై 14 మంది సీనియర్ డాక్టర్ల ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్లోని ప్రైవేట్ ఆసుపత్రి మాజీ ఎండీపై కేసు నమోదైంది. పెట్టుబడుల పేరుతో రూ.38 కోట్లకు పైగా మోసం చేశారంటూ ఎండీపై ఆరోపణలు ఉన్నాయి. భారీ లాభాల ఆశ చూపి డాక్టర్లను నమ్మించారని.. మోసానికి మాజీ ఎండీతో పాటు అతని సోదరుడి పాత్ర ఉందంటూ ఫిర్యాదు చేశారు.ప్లాస్టిక్ సర్జన్ డా. చొక్కా రాజేష్ వాసు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 2014–2015 మధ్య ఆసుపత్రి ఈక్విటీ పేరిట పెట్టుబడులు పెట్టగా.. మొత్తం రూ.100 కోట్ల మేరకు డాక్టర్ల నుంచి నిధుల సమీకరణ చేసినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఫిర్యాదు చేసిన 14 మంది డాక్టర్ల పెట్టుబడి రూ.38 కోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. హామీ ఇచ్చిన లాభాలు ఇవ్వకుండా మభ్యపెట్టినట్టు డాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఖాతాల్లో నష్టాలు చూపుతూ డాక్టర్లను తప్పుదోవ పట్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.రోగుల సంఖ్య బాగానే ఉన్నా నష్టాలంటూ లెక్కలు చూపినట్టు ఆరోపిస్తున్నారు. కోవిడ్ సమయంలో రోగుల నుంచి అధిక బిల్లుల వసూలు ఆరోపణలు ఉన్నాయి. ఆసుపత్రి ఆదాయాన్ని రియల్ ఎస్టేట్, బంగారానికి మళ్లించారని ఫిర్యాదులో పేర్కొనగా.. ఆసుపత్రి నిధుల ఉద్దేశపూర్వక దారి మళ్లింపు ఆరోపణలు ఉన్నాయి. పీఏసీ 406, 409, 477-A, 120-B సెక్షన్ల కింద సీసీఎస్ పోలీసులు కేసు చేశారు. మాజీ ఎండీ, అతని సోదరుడిపై లోతైన దర్యాప్తు చేపట్టారు. ఆధారాలపై తదుపరి చట్టపరమైన చర్యలు ఉంటాయని సీసీఎస్ స్పష్టం చేసింది. -
సికింద్రాబాద్ను ముక్కలు చేస్తే ఊరుకోం..!
సాక్షి, హైదరాబాద్: విస్తరిత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు కానున్న నేపథ్యంలో సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిందేనని, అందుకోసం ఆమరణ దీక్షకైనా వెనుకాడేది లేదని ఉద్యమానికి శ్రీకారం చుట్టిన బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ తన డిమాండ్ నెగ్గించుకుంటారా.. లేక వెనక్కు తగ్గుతారా? అన్నది నగరంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. డీలిమిటేషన్ సైతం ప్రజలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోకుండా అస్తవ్యస్తంగా చేశారని పేర్కొన్న ఆయన సికి ంద్రాబాద్ను ముక్కలుగా చేసి మల్కాజిగిరి కార్పొరేషన్లో కలిపితే చూస్తు ఊరుకోబోమనే డిమాండ్తో సికింద్రాబాద్కు చెందిన వివిధ వర్గాలను కలుపుకొని ఉద్యమానికి శ్రీకారం చుట్టడం తెలిసిందే. ఈ నెల 17న భారీ ర్యాలీ.. సికింద్రాబాద్ ఎప్పటినుంచో అటు జీహెచ్ఎంసీలో, ఇటు హైదరాబాద్ జిల్లాలో భాగంగానే ఉందని పేర్కొన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొత్తగా తాను మారుస్తున్నదంటూ ఏమీ లేదని ఇటీవల సచివాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. దీంతో సికింద్రాబాద్ పేరిట కార్పొరేషన్ ఏర్పాటు ఉండబోదనే చాలామంది భావిస్తున్నారు. తన డిమాండ్ సాధనకు ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేసుకున్న శ్రీనివాస్యాదవ్.. ఈ నెల 17వ తేదీన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎంజీరోడ్ గాంధీ విగ్రహం వరకు పదివేల మందితో భారీ ర్యాలీ సహా వివిధ కార్యక్రమాలు ప్రకటించారు. ముందుకా.. వెనకకా? ఉద్యమానికి శ్రీకారం చుడుతూ బాలంరాయి లీ ప్యాలెస్లో వివిధ వర్గాల వారితో ఏర్పాటు చేసిన తొలి సమావేశంలో సీఎంనుద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలు సికింద్రాబాద్ అస్తిత్వం కోసం ఆవేశంలో చేశానని, రాజ్యాంగ పదవుల్లో ఉన్న సీఎం అన్నా, మంత్రులన్నా తనకు గౌరవమేనన్నారు. తాను వ్యక్తిగతంగా మాట్లాడలేదని, పర్సనల్ అజెండా అంటూ లేదని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలపై అభ్యంతరాలుంటే తప్పకుండా ఉపసంహరించుకుంటానని వ్యాఖ్యానించారు. గట్టి గా మాట్లాడినంత మాత్రాన కొమ్ములొచ్చినట్లు కాదని, ఆత్మాభిమానం, అస్తిత్వం కోసమే తమ పోరాటమన్నారు. సికింద్రాబాద్ను కార్పొరేషన్గా కానీ, జిల్లాగా కానీ చేయాలని, లేని పక్షంలో ఉన్నది ఉన్నట్లుగానే ఉండాలనేదే తమ అభిమతమన్నారు. దీంతో ఏం జరగనుందన్నది నగర ప్రజల్లో ఆసక్తికరంగా మారింది. ఏం జరగనుందో చూద్దామనే ధోరణిలో వేచి చూస్తున్నారు. -
మరో ఇద్దరి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు డిస్మిస్
సాక్షి, హైదరాబాద్: మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు. కాలే యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డిలు పార్టీ మారారనడానికి తగిన ఆధారాలు లేవన్న స్పీకర్.. వారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తున్నట్లు స్పీకర్ తీర్పు వెలువరించారు. గతంలో ఐదుగురు ఎమ్మెల్యేల విషయంలోనూ ఇదే తీర్పు స్పీకర్ ఇచ్చారు. ముగ్గురు ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు పెండింగ్లో ఉంది. త్వరలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, సంజయ్ కేసులో కూడా స్పీకర్ తీర్పు చెప్పనున్నారు.పది మంది ఎమ్మెల్యేలలో.. ఐదుగురిపై దాఖలైన పిటిషన్లను శాసనసభ స్పీకర్ ఇదివరకే కొట్టేసిన సంగతి తెలిసిందే. ఇవాళ మరో ఇద్దరి వ్యవహారంపై తీర్పు ఇచ్చారు. తమ పార్టీ సింబల్పై నెగ్గిన ఎమ్మెల్యేలు కాలె యాదయ్య(చేవెళ్ల), పోచారం శ్రీనివాసరెడ్డి(బాన్సువాడ)లు ఫిరాయింపులకు పాల్పడ్డారంటూ బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లపై స్పీకర్ తీర్పు ఇచ్చారు.మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో సంజయ్(జగిత్యాల) కాకుండా దానం నాగేందర్(ఖైరతాబాద్), కడియం శ్రీహరి(స్టేషన్ ఘన్పూర్) ఇప్పటిదాకా స్పీకర్ను కలిసి వివరణ ఇచ్చుకోలేదు. దీంతో వీళ్ల విషయంలో ఎలాంటి తీర్పు ఉంటుందనే ఆసక్తి కొనసాగుతోంది.అంతకు ముందు.. గత నెలలో(డిసెంబర్ 17న) ఆరికెపూడి గాంధీ(శేరిలింగంపల్లి), తెల్లం వెంకట్రావు(ఖమ్మం), గూడెం మహిపాల్ రెడ్డి(పటాన్చెరు), బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి(గద్వాల్), టి. ప్రకాశ్ గౌడ్(రాజేంద్రనగర్) పిటిషన్లను స్పీకర్ కొట్టిపారేశారు. -
రూ.3,900 కోట్ల మద్యం బకాయిలు చెల్లించని ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, మద్యం సరఫరా చేసే కంపెనీలకు మధ్య బకాయిల వివాదం ముదురుతోంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సుమారు రూ.3,900 కోట్లకు పైగా ఉన్న దీర్ఘకాలిక బకాయిలను చెల్లించాలని ప్రముఖ ఆల్కహాలిక్ బేవరేజ్ (అల్కోబెవ్) పరిశ్రమ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BAI), ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ISWAI), కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బేవరేజ్ కంపెనీస్ (CIABC) సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశాయి.ఏడాది కాలంగా నిధులు పెండింగ్తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL) ద్వారా మద్యం సరఫరాదారులకు చెల్లించాల్సిన మొత్తం ప్రస్తుతం రూ.3,900 కోట్లు దాటిందని, ఇందులో రూ.900 కోట్లు గత ఏడాది కాలంగా పెండింగ్లో ఉన్నాయని సంఘాలు వెల్లడించాయి. ఒప్పందం ప్రకారం సరఫరా జరిగిన 45 రోజుల్లోపు చెల్లింపులు జరపాల్సి ఉండగా, ఆ నిబంధన అమలు కాకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశాయి.రికార్డు స్థాయిలో ఆదాయంగడచిన పదేళ్లలో రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయం కళ్లు చెదిరే రీతిలో పెరిగింది.2014 ఆదాయం: సుమారు రూ.9,000 కోట్లు.2023-24 ఆదాయం: దాదాపు రూ.38,000 కోట్లు (నాలుగు రెట్లు పెరుగుదల).అక్టోబర్ 2025: కేవలం రిటైల్ లైసెన్స్ దరఖాస్తు ఫీజుల ద్వారానే ప్రభుత్వం రూ.3,000 కోట్లు వసూలు చేసింది.డిసెంబర్ 2025: మద్యం విక్రయాల టర్నోవర్ చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరిందనే అంచనాలున్నాయి.రాష్ట్ర మొత్తం పన్ను ఆదాయంలో మూడో వంతు వాటా ఈ రంగం నుంచే వస్తోంది. నెలకు సగటున రూ.2,300 నుంచి రూ.2,600 కోట్ల ఆదాయాన్ని అందిస్తున్నప్పటికీ బకాయిలు చెల్లించకపోవడం సరఫరా వ్యవస్థను దెబ్బతీస్తుందని సంఘాలు హెచ్చరించాయి.తగ్గుతున్న పెట్టుబడులురాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులు గణనీయంగా తగ్గుతున్నాయని పరిశ్రమ వర్గాలు గణాంకాలతో సహా వివరించాయి. టీజీ ఐపాస్ కింద వచ్చిన అనుమతుల రూపేణా గత ఏడాది వచ్చిన పెట్టుబడులు రూ.28,100 కోట్లు ఉండగా, 2024-25లో అవి రూ.13,730 కోట్లకు (సుమారు 50% పైగా తగ్గుదల) పడిపోయాయి. త్వరలో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) దావోస్ సదస్సులో తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా ప్రదర్శించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో పాత ఒప్పందాలను గౌరవించి బకాయిలు చెల్లిస్తేనే అంతర్జాతీయ స్థాయిలో విశ్వసనీయత పెరుగుతుందని సంఘాలు సూచించాయి.‘బకాయిల చెల్లింపులో ఆలస్యం కొనసాగితే సరఫరా వ్యవస్థలో అంతరాయం కలగడమే కాకుండా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ రంగంపై ఆధారపడిన 70,000 మంది ఉద్యోగుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది’ అని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.ఇదీ చదవండి: పండగవేళ కరుణించిన కనకం.. వెండి మాత్రం.. -
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు
-
TG: ఇద్దరు ఎమ్మెల్యేలపై తీర్పు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల పంచాయితీ ఎంతకూ తెగడం లేదు. పది మంది ఎమ్మెల్యేలలో.. ఐదుగురిపై దాఖలైన పిటిషన్లను శాసనసభ స్పీకర్ ఇదివరకే కొట్టేసిన సంగతి తెలిసిందే. ఇవాళ అదీ సంక్రాంతి పండుగపూట.. మరో ఇద్దరి వ్యవహారంపై తీర్పు ఇవ్వబోతున్నారు. తమ పార్టీ సింబల్పై నెగ్గిన ఎమ్మెల్యేలు కాలె యాదయ్య(చేవెళ్ల), పోచారం శ్రీనివాసరెడ్డి(బాన్సువాడ)లు ఫిరాయింపులకు పాల్పడ్డారంటూ బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ మరికాసేపట్లో తీర్పు ఇవ్వనున్నారు. ఇంతకు ముందులాగే పిటిషన్లు డిస్మిస్ చేస్తారా?.. అనర్హత వేటేమైనా వేస్తారా?.. నిర్ణయం ఎలా ఉండబోతోందో చూడాలి. అయితే.. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో సంజయ్(జగిత్యాల) కాకుండా దానం నాగేందర్(ఖైరతాబాద్), కడియం శ్రీహరి(స్టేషన్ ఘన్పూర్) ఇప్పటిదాకా స్పీకర్ను కలిసి వివరణ ఇచ్చుకోలేదు. దీంతో వీళ్ల విషయంలో ఎలాంటి తీర్పు ఉంటుందనే ఆసక్తి కొనసాగుతోంది. అంతకు ముందు.. గత నెలలో(డిసెంబర్ 17న) ఆరికెపూడి గాంధీ(శేరిలింగంపల్లి), తెల్లం వెంకట్రావు(ఖమ్మం), గూడెం మహిపాల్ రెడ్డి(పటాన్చెరు), బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి(గద్వాల్), టి. ప్రకాశ్ గౌడ్(రాజేంద్రనగర్) పిటిషన్లను స్పీకర్ కొట్టిపారేశారు. ఈ ఐదుగురు సాంకేతికంగా ఇంకా బీఆర్ఎస్ సభ్యులుగానే కొనసాగుతున్నారని తీర్పు సందర్భంగా స్పష్టం చేశారాయన. అయితే స్పీకర్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్న బీఆర్ఎస్.. ఈ అంశంలో విచారణ ముగిశాక కోర్టును ఆశ్రయించే అవకాశం కనిపిస్తోంది. -
సరిలేరు మీకెవ్వరు..!
మంచిర్యాలఅర్బన్: ఎడ్లబండ్ల పోటీల్లో గెలవాలంటే బలమైన ఎద్దులు, నియంత్రించగలిగే నైపుణ్యం, వ్యూహం, వేగం, సమన్వయంతో సత్తాచాటాల్సి ఉంటుంది. వీటన్నింటిలో పాతమంచిర్యాలకు చెందిన తూముల వెంకట్రామయ్యది అందెవేసిన చేయి. ఎడ్లబండ్ల పోటీలు నిర్వహించడమే కాకుండా పందేల్లో గెలుపు ఇచ్చే ఆనందం కోసం పోటీలు జరిగిన ప్రతీ చోటకు వెళ్లి వచ్చాడు. వెంకట్రామయ్య స్థానిక సిమెంటు కంపెనీలో పని చేస్తూ ఉద్యోగ విరమణ పొందాడు. ఓ వైపు పని చేస్తూ వ్యవసాయం చేసేవాడు. 2013లో ఓసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ముంజంపల్లిలో బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు మొదటిసారి ఎడ్లబండ్ల పోటీలు చూశాడు. ఎడ్లకు ఎలాంటి శిక్షణ లేకుండా పోటీల్లో పాల్గొని ఓటమి చవిచూశాడు. ఆ తర్వాత ఎడ్లను ప్రత్యేకంగా పోషిస్తూ తర్ఫీదు ఇచ్చి పోటీల్లో సత్తా చాటాడు. జగిత్యాల జిల్లా లొత్తునూర్, రాపల్లి, సిల్వకోడూరు, గోవిందుపల్లి, చర్లపల్లి, నందిమేడారం ఇలా ఏ గ్రామంలో పోటీలు జరిగినా పాల్గొన్నాడు. 2015 నుంచి విజయపరంపరం కొనసాగింది. నాలుగేళ్లలో 36సార్లు గెలుపొందగా.. ద్వితీయ, తృతీయ స్థానాల్లో లెక్కలేనన్ని సార్లు విజయబావుటా ఎగురవేశాడు. పాత మంచిర్యాలలో ఎనిమిదేళ్లపాటు ఎండ్లబండ్ల పోటీలు నిర్వహించి తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడు.చిన్నప్పటి నుంచి ఎద్దులంటే ఇష్టం..ఎడ్ల శృతి కలవాలే. మన శృతి రెండూ ఉండాలే. మన చేతుల్లో మెదిలితేనే సులువుగా గెలువొచ్చు. ఎంతమంచి ఎడ్లనిచ్చినా ఇవన్నీ లేకుంటే గెలవడం కష్టం. ఓసారి చిన్నకోడూర్లో ఆ ఊరి పెద్ద మనిషి నీ ఎడ్లు ఇస్తే గెలుస్తా అన్నాడు. సరిగ్గా గీతకాడికి పోయినంక గెలువలేమని గ్రహించి వెనువెంటనే ఎడ్లబండి సవారీ నాకు ఇవ్వడంతో గెలిచా. వ్యవసాయం అంటే మక్కువ కావడంతో చిన్నప్పటి నుంచి ఎద్దులను ఇష్టంగా పెంచడం అలవాటైంది. అప్పట్లోనే నెలకు క్వింటాలు ఉల్వలు దాణాగా పెట్టేవాళ్లం. ఎద్దుల శిక్షణతోపాటు పది మందికి పోటీల్లో గెలుపొందడం ఎలా అనేదానిపై తర్ఫీదు ఇచ్చాను. వయస్సు పైబడడంతో పోటీలకు దూరంగా ఉంటున్న.– తూముల వెంకట్రామయ్య, జిల్లా ఎడ్లబండ్ల పోటీల అసోసియేషన్ అధ్యక్షుడు -
వందల కేజీల బంగారాన్ని దేశం కోసం ఇచ్చేసి సాదాసీదా జీవితం
రెండు రోజుల వ్యవధి.. ఇద్దరు మహానీయులు.. ఇద్దరూ రాజవంశాలకు చెందినవాళ్లే.. కన్నుమూసి ఓ యుగానికి తెరదించారు. హైదరాబాద్(తెలంగాణ)కు చెందిన రాజకుమారి ఇందిరాదేవి ధనరాజ్ గిర్, దర్భంగా(బీహార్) రాజవంశం చివరి మహారాణి కామసుందరి దేవి.. సేవలు, త్యాగం అనే విలువల్ని ప్రతిబింబిస్తుంది వీళ్లిద్దరి జీవితం. అధికారమనేది ప్రదర్శన కోసం కాదు.. బాధ్యత కోసం వినియోగించాలని ప్రేరణ ఇస్తుంది. ఇంతకీ దేశానికి వీళ్లు చేసిన సేవలు, త్యాగాలెంటో ఓసారి చూద్ధాం..1932 అక్టోబర్ 22న జన్మించిన కామసుందరి దేవి.. దర్భంగా మహారాజా కామేశ్వర్ సింగ్ మూడో భార్య. 1962లో ఇండియా–చైనా యుద్ధ సమయంలో ఆమె చేతుల మీదుగా దర్భంగా రాజవంశం 600 కిలోల బంగారంను భారత ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చింది. ఈ చర్య దేశవ్యాప్తంగా దేశభక్తి, విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. మహారాజా మరణించిన 1962 తర్వాత ఆమె సాదాసీదా జీవితం గడుపుతూ సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. విద్య, సామాజిక సేవ, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణలో మహారాణి కామసుందరి కీలక పాత్ర పోషించారు. కల్యాణి ఫౌండేషన్ ద్వారా విద్యా, సామాజిక కార్యక్రమాలకు మద్దతు ఇచ్చి.. మిథిలా ప్రాంతంలో సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడారు. మహారాణి కామసుందరి దేవి(93) జనవరి 12న బీహార్లోని దర్భంగా కల్యాణి నివాస్లో తుదిశ్వాస విడిచారు.దేశభక్తి చరిత్రదర్భంగా రాజశంశానికి దేశభక్తి చరిత్ర ఉంది. మహాత్మా గాంధీ దక్షిణ ఆఫ్రికా నుండి తిరిగి వచ్చినప్పుడు స్వదేశీ ఉద్యమానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. గాంధీజీ లేఖ అందుకున్న వెంటనే ఆ సమయంలో మహారాజుగా ఉన్న లక్ష్మేశ్వర్ సింగ్ భారీ ఆర్థిక సాయం అందించడమే కాకుండా.. మీడియా మేనేజ్మెంట్ బాధ్యతలను కూడా చూసుకున్నారు. ఆ లేఖ నేటికీ భద్రంగా ఉంది. ఇక.. 1962 చైనా యుద్ధం సమయంలో దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు.. దేశ రక్షణ కోసం 15 మణుగుల బంగారం (సుమారు 600 కిలోలు) దానం చేశారు. అంతేకాదు తమ సొంత మూడు విమానాలను, 90 ఎకరాల విస్తీర్ణంలోని ఎయిర్పోర్టును ప్రభుత్వానికి అప్పగించారు. నేటి దర్భంగా ఎయిర్పోర్ట్ ఉంది ఆ భూమిలోనే ఉంది. అంతకు ముందు.. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్(INC) వ్యవస్థాపకుడు ఏ.ఓ. హ్యూమ్కు 1880లలో ఏటా 10 వేల రూపాయల ఆర్థిక సాయం చేసేవారు. దేశంలో మొదటి విశ్వవిద్యాలయం ఏర్పాటుకు 230 ఎకరాల భూమిని దానం చేశారు.ఇందిర.. సాహిత్యం, కళల ప్రతీక1930 ఆగస్టు 17న హైదరాబాద్లోని జ్ఞాన్భాగ్ ప్యాలెస్లో జన్మించిన ఇందిరాదేవి.. రాజా ధనరాజ్గిర్జీ బహదూర్, రాణి ప్రేమిలా దేవి దంపతుల కుమార్తె. ఇంటి వద్దే ఆంగ్ల గవర్నెస్ ద్వారా విద్యాబోధన పొందిన ఆమె, ప్రముఖ కవి గుంటూరు శేషేంద్రశర్మతో వివాహం అనంతరం సాహిత్య, కళా రంగాల్లో తనదైన ముద్ర వేసింది. ఆంగ్లంలో కవిత్వం రాసిన ఆమె రచనలు Return Eternity (1965), Partings in Mimosa (1968), Memories of the Deccan (2008) వంటి పుస్తకాల రూపంలో వెలువడ్డాయి. 1973లో సాహిత్య విభాగంలో నోబెల్ బహుమతికి నామినేట్ కావడం ఆమె ప్రతిభకు అంతర్జాతీయ గుర్తింపు. కవి, సంపాదకుడు కృష్ణ శ్రీనివాస్ ఆమెను నామినేట్ చేశారు. అలా భారత దేశ చరిత్రలోనే మొట్టమొదటి భారతీయ మహిళా నోబెల్ నామినీగా ఆమెకు గుర్తింపు దక్కింది. ఆమె కవిత్వంలో హైదరాబాద్ సంస్కృతి, డెక్కన్ జ్ఞాపకాలు, వ్యక్తిగత అనుభవాలు ప్రతిబింబించేవి. చిత్రకళ, రచన, ఫోటోగ్రఫీ రంగాల్లోనూ విశేష కృషి చేసిన ఆమె, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో హిందీ అకాడమీకి ఛైర్పర్సన్గా పనిచేసి సాహిత్యాభివృద్ధికి తోడ్పడ్డారు. 13 జనవరిన హైదరాబాద్లోని జ్ఞాన్భాగ్ ప్యాలెస్లో 95 ఏళ్ల వయసులో ఆమె కన్నుమూశారు. ఇందిరాదేవి తన కవిత్వం, కళల ద్వారా హైదరాబాద్ సంస్కృతిని నిలబెట్టగా, కామసుందరి దేవి తన త్యాగం, సేవల ద్వారా దేశభక్తి, సామాజిక బాధ్యతను ప్రతిబింబించారు. ఈ ఇద్దరు మహనీయులు మనకు ఒకే సందేశం అందించారు: దేశం, సంస్కృతి, సమాజం కోసం చేసిన సేవలు, త్యాగాలు శాశ్వతంగా నిలుస్తాయి. ‘‘దేశభక్తి ఎప్పుడూ నినాదాల్లో, అధికార ప్రదర్శనలో ఉండదు. అది నిశ్శబ్ద త్యాగంలో, సమాజానికి చేసిన సేవలో, సంస్కృతిని కాపాడటంలో ఉంటుంది’’ అని ఓ కవి చెప్పిన మాటకు ఈ ఇద్దరే రాజవంశానికి చెందిన ఆడపడుచులే ప్రత్యక్ష తార్కాణాలు. -
ఐఏఎస్ ఎపిసోడ్.. దమ్ముంటే ఆధారాలు చూపెట్టాలి: మంత్రి పొన్నం
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని కొన్ని పత్రికలు, చానెల్స్.. రాజకీయ కుట్రతో తప్పుడు కథనాలు ఇస్తున్నాయని ఆరోపించారు మంత్రి పొన్నం ప్రభాకర్. దమ్ముంటే ఆధారాలు చూపెట్టాలని సవాల్ విసిరారు. ఇదే సమయంలో కేంద్రమంత్రి బండి సంజయ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.కరీంనగర్లోని గిద్దె పెరుమాళ్ళ స్వామి ఆలయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఈరోజు దర్శించుకున్నారు. ఈ సందర్బంగా తెలంగాణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం, మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ కుట్రలో భాగంగా మీడియాలో తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారు. దీని వెనుక ఉన్న కుట్రను ఛేదించేందుకు చట్టం తన పని తాను చేస్తుంది. దీని వెనుక ఎవరున్నా వదిలి పెట్టేది లేదు. మహిళలను, మహిళా అధికారులను, మహిళా జర్నలిస్టులను అవమానపరిచేలా కథనాలు ఇవ్వడం సరికాదు. దమ్ముంటే ఆధారాలతో బయటపెట్టాలి.మా ప్రభుత్వం రాకముందు కూలిపోయిన కాళేశ్వరం కూడా మేమే పేల్చామని అబద్ధం ప్రచారం చేస్తున్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతుంది. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉపాధి హామీ పథకాన్ని వెనుకేసుకొచ్చేలా మాట్లాడటం సరికాదు. జాతిపిత మహాత్మా గాంధీ పేరును తొలగించడం, ఉపాధి హామీ పథకానికి గండిపడేలా నిర్ణయాలు తీసుకోవడం ప్రజలు గమనిస్తున్నారు. దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు చెపడుతాం’ అని హెచ్చరించారు. -
తెలంగాణ మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారు
-
వీడియోలు తీసి.. బ్లాక్మెయిల్ చేసి..
కరీంనగర్రూరల్: వ్యాపారంలో నష్టం.. ఆర్థిక ఇబ్బందులు.. ఆపై ఈజీ మనీకోసం అలవాటు పడిన ఆ దంపతులు అడ్డదార్లు తొక్కారు. ఇందుకు సోషల్ మీడియాను వేదికగా మార్చుకున్నారు. ఇన్స్టాగ్రాంలో తన భార్య ఫొటోలు షేర్ చేస్తూ యువకులకు వలపు గాలం వేశాడో భర్త. ఆపై ఇంటికి పిలిచించి.. భార్యతో వారు ఏకాంతంగా ఉన్నప్పుడు రహస్యంగా వీడియోలు చిత్రీకరించాడు. బ్లాక్మెయిల్ చేస్తూ.. అందినకాడికి దండుకున్నారు. ఇలా రూ.లక్షల్లో మోసపోయిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో కరీంనగర్ రూర ల్ పోలీసులు విచారణ చేసి ఆ డర్టీ కపుల్స్ను అరెస్టు చేశారు. సీఐ నిరంజన్రెడ్డి కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లాకు చెందిన వ్యక్తి కరీంనగర్ వచ్చి మార్బుల్ వ్యాపారం ప్రారంభించాడు. ఈ క్రమంలో అదే జిల్లాకు చెందిన యువతి పరిచయం కావడంతో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. రెండేళ్లుగా ఆరెపల్లిలోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నారు. వ్యాపారంలో నష్టం రావడంతో ఇంటీరియల్ డెకరేషన్ ప్రారంభించి, బ్యాంకులో లోన్ తీసుకున్నాడు. అందులోనూ నష్టం రావడంతో ఈఎంఐలు ఇబ్బందిగా మారాయి. దీంతో ఇన్స్టాగ్రాంలో తన భార్య ఫొటో, సెల్నంబరు పెట్టి వలపువల వేశాడు. దాదాపు 100 మందికిపైగా యువకులు పలుమార్లు ఫ్లాట్కు వచ్చి భార్యతో గడిపి వెళ్లేవారు. అలా వచ్చినవారి ఫొటోలు, వీడియోలు చిత్రీకరించేవారు. ఆపై బెదిరించి డబ్బులు వసూలు చేసేవారు. ఏడాది క్రితం కరీంనగర్కు చెందిన ఓ వ్యాపారిని ఇలానే బెదిరించి ఫ్లాట్, కారు ఈఎంఐలు కట్టించారు. కొన్ని రోజుల నుంచి సదరు వ్యాపారి తమ వద్దకు రాకపోవడంతో రూ.5 లక్షలు ఇవ్వకుంటే నగ్న ఫొటోలు, వీడియోలు కుటుంబసభ్యులు పంపిస్తామని బెదిరించారు. భయపడి రూ.లక్ష ఇచ్చాడు. ఇలా రూ.14 లక్షలు ఇచ్చానని, వీడియోలు తొలగించాలని వ్యాపారి కోరగా మరో రూ.4 లక్షలు ఇవ్వాలని బెదిరించారు. దీంతో సదరు వ్యాపారి మంగళవారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఏసీపీ విజయ్కుమార్ ఆదేశాల మేరకు సీఐ నిరంజన్రెడ్డి బుధవారం బైపాస్రోడ్డులో అదుపులోకి తీసుకున్నారు. నేరాన్ని అంగీకరించడంతో కోర్టులో హాజరుపర్చారు. -
నోటీసుల గుబులు!
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల కేసు పలుజిల్లాల తహసీల్దార్లను వణికిస్తోంది. తమకు నోటీసులు వస్తాయేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా 2021 –2025 మధ్య కాలంలో జనగామ, యాదాద్రి, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పని చేసిన తహసీల్దార్లు, కార్యాలయ సిబ్బందిలో టెన్షన్ నెలకొంది. ఈ కేసును విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీలో ఏసీబీ అధికారులు కూడా ఉన్న నేపథ్యంలో.. తమకు నోటీసులు తప్పవనే భావనలో తహసీల్దార్లు ఉన్నారనే చర్చ రెవెన్యూ వర్గాల్లో జరుగుతోంది. ఈ కేసు విచారణలో భాగంగా రిజిస్ట్రేషన్ లావాదేవీలు నిర్వహించిన అనేకమంది రైతులకు ఇప్పటికే రెవెన్యూ శాఖ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆర్థిక పరమైన లావాదేవీల్లో అక్రమాలు జరగడం, పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పరిస్థితుల్లో మండల రెవెన్యూ అధికారుల్లో ఆందోళన కనిపిస్తోంది. గత రెండు, మూడు రోజులుగా జరుగుతున్న ఆడిట్లో భాగంగా.. తాము గతంలో పనిచేసిన కార్యాలయాల్లో జరిగిన లావాదేవీల్లో తేడాలేమైనా వచ్చాయా అనే కోణంలో తహశీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది ఆరా తీస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం తాము పనిచేస్తున్న చోట్ల తమకు తెలియకుండా జరిగిన ఏవైనా అక్రమాలు బయటకు వస్తాయోమేననే ఆందోళనా వ్యక్తమవుతోంది. పండుగ తర్వాత రంగంలోకి ఏసీబీ..? ఈ కేసుకు సంబంధించి సాంకేతిక, నేర పూరిత అక్రమాలకు సంబంధించిన ఆధారాలను రాబట్టడంలో ప్రభుత్వం నియమించిన కమిటీ నిమగ్నమైంది. అందులో భాగంగా క్షేత్రస్థాయిలో పోలీసుల విచారణ ఓవైపు, సాంకేతిక ఆధారాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ధరణి, భూభారతి లావాదేవీల ఆడిటింగ్ మరోవైపు జరుగుతున్నాయి. ఈ విచారణలు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత లభించే సమాచారాన్ని బట్టి సంక్రాంతి పండుగ తర్వాత ఏసీబీ రంగంలోకి దిగుతుందని, అప్పుడు అసలు విచారణ ప్రారంభమవుతుందనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది. కలెక్టర్లకు నివేదికలు.. సాంకేతిక ఆధారాల సమీకరణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆడిటింగ్ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. సోమ, మంగళవారాల్లో జరిగిన ఈ ఆడిటింగ్లో తేడా వచ్చిన లావాదేవీలకు సంబంధించిన వివరాలను భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయం నుంచి తహశీల్దార్లకు పంపారు. ఈ లావాదేవీల విషయంలో ఏం జరిగిందనే వివరాలు పంపాలని కోరగా, తహశీల్దార్లు ఆ మేరకు తమ జిల్లాల కలెక్టర్లకు సమాచారం పంపినట్టు తెలిసింది. కాగా కలెక్టర్లు ప్రతి లావాదేవీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రతి లావాదేవీ వారీగా వివరాలను ధ్రువీకరించుకుంటూ 90 శాతానికి పైగా లావాదేవీల వివరాలను తిరిగి సీసీఎల్ఏ కార్యాలయానికి పంపినట్టు సమాచారం. రెండు చలాన్లు, క్యాన్సిలేషన్ డీడ్ల విషయంలో అంతా సవ్యంగానే ఉందని, అక్కడక్కడా చిన్న చిన్న తేడాలు మినహా ప్రభుత్వ ఖజానా కొల్లగొట్టే స్థాయిలో ఈ రెండు లావాదేవీల్లో అక్రమాలు జరగలేదని తహశీల్దార్లు, కలెక్టర్ల ద్వారా సీసీఎల్ఏకు నివేదించినట్టు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. -
మళ్లీ.. కొత్త జిల్లాల లొల్లి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జిల్లాలు, మండలాల పునర్వ్యవస్థీకరణ అంశం ఇప్పుడు అన్నివర్గాల్లో హాట్టాపిక్గా మారింది. జిల్లాలు, మండలాల పునర్వ్యవస్థీకరణపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించడమే దీనికి కారణం. ఉద్యోగాల సాధన కోసం కసరత్తు చేస్తున్న నిరుద్యోగులతోపాటు ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు, స్థానిక రాజకీయ నాయకులు, విద్యార్థులు... ఇలా అన్ని వర్గాల్లో దీనిపై చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏవిధంగా ఉంటుందనే సందేహం కొందరిలో ఉంటే... ఈ తంతు ఎలాంటి సమస్యలకు దారితీస్తుందోననే ఆందోళన మరికొందరిలో వ్యక్తమవుతోంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన రెండేళ్లలో రాష్ట్రంలోని 10 జిల్లాలను అప్పటి ప్రభుత్వం 33 జిల్లాలకు పెంచింది. తొలుత 31 జిల్లాలుగా ఏర్పాటు చేసిన అనంతరం మరో రెండు జిల్లాలను కలిపి జిల్లాల సంఖ్యను 33కు పెంచింది. అలాగే, రెవెన్యూ డివిజన్లు 74కు పెరగగా, రెవెన్యూ మండలాల సంఖ్య 612కు చేరింది. ఆ తర్వాత ప్రభుత్వం 33 జిల్లాలను ఏడు జోన్లుగా, రెండు మల్టీజోన్లుగా వర్గీకరించింది. ఈమేరకు రాష్ట్రపతి ఆమోదంతో 2018 ఆగస్టు నుంచి నూతన జోనల్ విధానం అమల్లోకి వచ్చింది. దీంతో ప్రభుత్వ విభాగాల విభజన, ఉద్యోగుల కేటాయింపులు, స్థానికత నిర్ధారణ, ఉద్యోగ నియామకాలు... ఇలా పలురకాల అంశాల్లో పెద్దఎత్తున మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు దాదాపు ఐదేళ్లు పట్టగా... ఉద్యోగుల కేటాయింపుల్లో సమస్యలు, స్థానికతకు సంబంధించిన సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదు. ఈ తరుణంలో కొత్తగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ, మండలాల హేతుబద్ధీకరణ అంశాలు తెరపైకి రావడం గమనార్హం. మార్పుచేర్పులు చేసినా... జిల్లాలు, మండలాల రేషనలైజేషన్ అంశంపై ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడుతూ ‘రాష్ట్రంలో జిల్లాల సంఖ్య పెంపు లేదా తగ్గింపు అని అనను’అని పేర్కొన్నారు. సంఖ్యాపరంగా మార్పు ఉండదని చెప్పినప్పటికీ.. జనాభా ప్రాతిపదికన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలను హేతుబద్దీకరిస్తామని స్పష్టంచేశారు. దీంతో జిల్లాలు, మండలాల సరిహద్దుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. సీఎం ప్రకటన ఆచరణలోకి వస్తే ముందుగా తెరపైకి వచ్చేది స్థానికత అంశమే. ఇది కేవలం ఉద్యోగులకు సంబంధించినదే కాదు. నిరుద్యోగులు, విద్యార్థులు ఇలా అందరికీ సంబంధించింది. ఈ నిర్ణయంతో పాలన పరంగా మార్పులు చోటుచేసుకోవడంతోపాటు ఉద్యోగుల కేటాయింపులు, కొత్తగా ఉద్యోగ నియామకాలకు సంబంధించిన జోనల్, మల్టీజోనల్ పరిధుల్లో మార్పులు అనివార్యమవుతాయి. దీనికి రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి అవుతుంది. నిరుద్యోగులతోపాటు విద్యార్థులు చదువుతున్న విద్యాసంస్థల ప్రాంతాల వారీగా స్థానికత ఖరారు చేయాలి. ఈ స్థానికతే తదుపరి చదువులకు, ఉద్యోగాలకు అవసరమవుతుంది. స్థూలంగా చూస్తే ఏమాత్రం మార్పులు చేసినా అది అన్ని విభాగాల్లోనూ ప్రభావం చూపుతుందని సీనియర్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఎడతెగని పంచాయితీ... రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లోకి రాకముందు కేవలం రెండు జోన్లు మాత్రమే ఉండేవి. కానీ కొత్త జిల్లాల ఏర్పాటుతో జోన్ల సంఖ్య 7కు పెరగగా... కొత్తగా మల్టీజోన్లను ఏర్పాటు చేశారు. జోన్ల సంఖ్య పెంపుతో విద్యార్థులు, ఉద్యోగుల స్థానికతలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. నూతన జోనల్ విధానం అమలులో భాగంగా ఉద్యోగ కేటాయింపులకు సంబంధించి ప్రభుత్వం జీఓ 317 జారీ చేసింది. స్థానికతకు ప్రాధాన్యత ఇవ్వడం కంటే సీనియార్టీని ముందు వరుసలోకి తీసుకోవడంతో మెజార్టీ ఉద్యోగులు జిల్లాలు మారిపోయారు. దాదాపు 30 శాతం మంది సొంత ప్రాంతాలకు కాకుండా ఇతర ప్రాంతాలకు కేటాయించబడ్డారు. ప్రధానంగా జిల్లా కేడర్ ఉద్యోగుల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. పెద్ద సంఖ్యలో టీచర్లతోపాటు పోలీస్ కానిస్టేబుల్స్ ఇప్పటికీ ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ⇒ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీఓ 317 ద్వారా నష్టపోయిన ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆన్లైన్లో ఆర్జీలను స్వీకరించింది. ఏకంగా 1.5 లక్షల మంది ఆర్జీలు పెట్టుకున్నారు. ప్రాధాన్యత క్రమంలో కొన్నింటిని పరిష్కరించినా... మరికొందరికి తాత్కాలిక పద్ధతిలో ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం డెప్యూటేషన్ పద్ధతిని ఎంచుకుంది. కానీ ఈ ప్రక్రియ కూడా పూర్తికాలేదు. మరోవైపు ఉద్యోగ కేటాయింపులతో పట్టణ ప్రాంత జిల్లాల్లో ఖాళీలు లేకుండాపోగా... గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో పట్టణ ప్రాంత అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు భారీగా తగ్గిపోవడంతో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టాలనుకుంటున్న పునర్వ్యవస్థీకరణ ప్రక్రియతో ఈ సమస్యలన్నీ పునరావృతమవుతాయని ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. -
బీసీల వాటా 31.4%
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించి వార్డుల రిజర్వేషన్లు, చైర్పర్సన్, మేయర్ల పదవుల రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతులు, మహిళల వారీగావార్డులు, డివిజన్లు, చైర్మన్, మేయర్ పదవులు ఏ కేటగిరీకి ఎన్ని దక్కుతాయో వెల్లడించింది. రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు సంబంధించి పురపాలక శాఖ కార్యదర్శి డాక్టర్ టీకే శ్రీదేవి బుధవారం జీవో నంబర్ 14 జారీ చేశారు. మున్సిపల్ వార్డులు, డివిజన్లలో ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్ స్థానాలు కేటాయించారు. బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీలకు, 2019 తెలంగాణ మున్సిపల్ చట్టం ప్రకారం జనరల్ మహిళలకు రిజర్వుడు స్థానాల సంఖ్యను ఖరారు చేశారు. బీసీలకు మున్సిపాలిటీల్లో 31.4 శాతం, కార్పొరేషన్లలో 30 శాతం సీట్లు రిజర్వు చేశారు. 121 మున్సిపాలిటీల్లో బీసీలకు 38 చైర్మన్ పదవులు రిజర్వు చేయగా, ఇందులో బీసీ జనరల్కు 19, బీసీ మహిళకు 19 చొప్పున ఖరారయ్యాయి. 10 కార్పొరేషన్లకు గాను బీసీలకు మూడు మేయర్ పదవులు రిజర్వు చేయగా, ఇందులో బీసీ మహిళలకు ఒకటి, బీసీ జనరల్కు రెండు మేయర్ పదవులు దక్కనున్నాయి. -
తెలంగాణ మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 121 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డులు, చైర్పర్సన్, మేయర్ పదవులకు సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, అన్రిజర్వ్డ్ కేటగిరీలకు సీట్ల కేటాయింపునకు మార్గదర్శకాలను, డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లను ప్రభుత్వం ప్రకటించింది.మున్సిపాలిటీల్లో వార్డుల రిజర్వేషన్పైనా ప్రభుత్వం నోటిఫికేషన్లో మార్గదర్శకాలను పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు సీట్ల కేటాయింపుపై స్పష్టమైన మార్గదర్శకాలు ప్రకటించింది. మొత్తం రిజర్వేషన్లు 50% మించకూడదనే రాజ్యాంగ మార్గదర్శకాలను ప్రభుత్వం పాటించినట్లు స్పష్టం చేసింది.ముఖ్య మార్గదర్శకాలు జనాభా ఆధారంగా ఎస్సీ, ఎస్టీ సీట్ల కేటాయింపుబీసీ రిజర్వేషన్ డెడికేటెడ్ కమిషన్ సిఫారసుల మేరకు అమలుమహిళలకు మొత్తం సీట్లలో 50% రిజర్వేషన్లు.. మహిళా రిజర్వేషన్ లాటరీ విధానంలో ఖరారుతాజా జనగణన డేటా ఆధారంగా సీట్ల ఖరారుSEEEPC సర్వే–2024 డేటా ఆధారంగా బీసీ రిజర్వేషన్లుగత ఎన్నికల్లో రిజర్వ్ అయిన వార్డులు ఈసారి మినహాయింపుమున్సిపాలిటీల్లో వార్డులకు 2011 జనగణన ఆధారంగా ఎస్సీ, ఎస్టీ సీట్ల కేటాయింపుబీసీలకు ప్రత్యేక కమిషన్ సిఫార్సుల మేరకు రిజర్వేషన్మహిళలకు (జనరల్) 2019 టీఎం చట్టం ప్రకారం సీట్లుప్రతి మున్సిపాలిటీలో మొత్తం వార్డుల సంఖ్య ఖరారుఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, అన్రిజర్వ్డ్ సీట్ల స్పష్టమైన విభజనగ్రేటర్ కాకుండా అన్ని మున్సిపాలిటీలకు వర్తింపుజిల్లా వారీగా రిజర్వేషన్ పట్టికలు విడుదల -
‘జర్నలిస్టులపై కాంగ్రెస్ సర్కార్ తీరు అనైతికం’
హైదరాబాద్: జర్నలిస్టులపై కాంగ్రెస్ సర్కారు తీరు అనైతికమని కేంద్రమంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. నోటీసుల ఇవ్వకుండా అరెస్ట్ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఓ వార్తకు సంబంధించి ఎన్టీవీకి చెందిన పలువురు జర్నలిస్టులను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయడాన్ని కిషన్రెడ్డి ప్రశ్నించారు. విచారణ చేయకుండా చర్యలు తీసుకోవడం సరికాదని, జర్నలిస్టులను బెదిరించి భయపెట్టి చర్యలకు పాల్పడకూడదన్నారు. అరెస్ట్ చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేవారు కిషన్రెడ్డిఅర్థరాత్రి జర్నలిస్టుల అరెస్ట్ సరికాదు బండి సంజయ్ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అర్థరాత్రి జర్నలిస్టులను అరెస్ట్ చేయడం తగదన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. పోలీసులు చట్ట ప్రకారం నడుచుకోవాలన్నారు బండి సంజయ్పోలీసుల తీరు సమర్థనీయం కాదు కొమ్మినేనిఎన్టీవీకి చెందిన జర్నలిస్టులను అరెస్ట్ చేసే వ్యవహారంలో పోలీసుల తీరు సమర్థనీయం కాదన్నారు రాజకీయ విశ్లేషకులు కొమ్మినేని శ్రీనివాసరావు. సోదాల పేరుతో మీడియా సంస్థలన ఇబ్బంది పెట్టొద్దన్నారు కొమ్మినేని. జర్నలిస్టుల అరెస్ట్ను ఖండిస్తున్నాం: పల్లాజర్నలిస్టుల అరెస్ట్ను బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్రెడ్డి ఖండించారు. అర్థరాత్రి తలుపులు పగులగొట్టి జర్నలిస్టులన అరెస్ట్ చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ సర్కార చర్యలు ఎమెర్జెన్సీని తలపిస్తున్నాయని, అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు పల్లా. -
NTV జర్నలిస్టుల అరెస్టును ఖండించిన వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: NTV జర్నలిస్టుల అరెస్టులను వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖండించారు. ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.ఇది పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలపై ప్రత్యక్ష దాడి. పండుగ రోజు అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి.. బలవంతంగా జర్నలిస్టుల ఇళ్లలోకి చొరబడి..అరెస్టు చేయటం దారుణం. చట్టపరమైన ప్రక్రియను పాటించకుండా, కనీసం నోటీసులు జారీ చేయకుండా జర్నలిస్టులను అరెస్టు చేయటం సరికాదు. ఈ అరెస్టులు నిరంకుశ మనస్తత్వాన్ని ప్రతిబింబం. జర్నలిస్టులు నేరస్థులో, ఉగ్రవాదులో కాదు.అయినప్పటికీ వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇలాంటి చర్యల వలన జర్నలిస్టుల కుటుంబాలు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతాయి.మీడియా సోదరులలో భయాన్ని సృష్టిస్తాయి. అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలి. రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవించాలనీ, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను’ అని పేర్కొన్నారు. I strongly condemn the arrests of NTV journalists, which amount to a direct attack on the freedom of the press and democratic values. Forcefully entering journalists’ homes by breaking doors at midnight during this festival and arresting them without following due legal procedure…— YS Jagan Mohan Reddy (@ysjagan) January 14, 2026 -
వ్యవస్థలు వైఫల్యం చెందిన వేళ..
గల్ఫ్ దేశంలో మృతి చెందిన ఓ కార్మికుడి మృతదేహాన్ని భారత్కు తరలించేందుకు అయ్యే ఖర్చును భరించలేమని కంపెనీ యాజమాన్యం, అలాగే ఇండియన్ ఎంబసీ కూడా చేతులెత్తేసిన పరిస్థితిలో… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఆ వ్యయాన్ని పూర్తిగా భరించిన అరుదైన మానవీయ ఘటన చోటు చేసుకుంది.నిజామాబాద్ జిల్లా, నవీపేట మండలం యామ్చా గ్రామానికి చెందిన గొల్ల అబ్బులు (తొగరి అబ్బయ్య) అనే 40 ఏళ్ల కార్మికుడు, నాలుగు నెలల క్రితం ఓమాన్ దేశంలోని సలాలా ప్రాంతంలో ఒక క్లీనింగ్ కంపెనీలో పని చేయడానికి వెళ్లాడు. యాజమాన్యం వైఖరి నచ్చక కంపెనీ నుంచి బయటకు వెళ్లిన కొంతకాలానికే, డిసెంబర్ 14న ఇబ్రి ప్రాంతంలో మృతి చెందాడు. అనుమతి లేకుండా కంపెనీ నుంచి వెళ్లిన కార్మికులను అక్కడి చట్టాల ప్రకారం ‘ఖల్లివెల్లి’ (అక్రమ నివాసి)గా పరిగణించడంతో, వారికి లభించాల్సిన కొన్ని హక్కులు, సౌకర్యాలు రద్దవుతాయి. ఈ నేపథ్యంలో, “అబ్బులు, కంపెనీ నుంచి వెళ్లిపోయాడు కాబట్టి అతనితో మాకు సంబంధం లేదు” అంటూ మృతదేహం తరలింపు ఖర్చును భరించబోమని కంపెనీ యాజమాన్యం స్పష్టం చేసింది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ (ఐసీడబ్ల్యూఎఫ్) నుంచి సహాయం అందిస్తారు. అయితే నిధుల కొరత ఉందని పేర్కొంటూ, మృతదేహం తరలింపుకు రూ.1.50 లక్షలు చెల్లించాలని మస్కట్లోని ఇండియన్ ఎంబసీ అధికారి ఒకరు కుటుంబానికి ఫోన్ చేసి తెలిపారు. ఆ మొత్తాన్ని చెల్లించలేని పరిస్థితిలో ఓమాన్లోనే అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేశారు.ఈ పరిస్థితుల్లో మృతుడి భార్య తొగరి చిన్న సావిత్రి తన కుమారుడు సంజయ్, యామ్చా గ్రామ సర్పంచ్ బేగారి సాయిలుతో కలిసి మంగళవారం (13.01.2026) హైదరాబాద్లోని సీఎం ప్రవాసీ ప్రజావాణిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరిట వినతిపత్రం సమర్పించారు. తన భర్త పార్థివదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి అయ్యే ఖర్చును సీఎం సహాయనిధి నుంచి మంజూరు చేయాలని ఆమె వేడుకున్నారు. కాగా ఆమె ఇదివరకే డిసెంబర్ 29న మెయిల్ ద్వారా సీఎంఓ కు వినతిపత్రం పంపారు. దీనికి స్పందనగా జీఏడి ఎన్నారై విభాగం ఇండియన్ ఎంబసీకి వైర్ మెసేజ్ పంపింది.ఇదిలా ఉండగా, అబ్బులు చిన్నాపూర్ కు చెందిన ఒక గల్ఫ్ సబ్ ఎజెంట్ కు రూ.1.20 లక్షలు చెల్లించి ఓమాన్ కు వెళ్ళాడు. ఎమిగ్రేషన్ క్లియరెన్స్ మాత్రం అస్సాం రాజధాని గౌహతి లోని ఒక రిజిస్టర్ రిక్రూటింగ్ ఏజెన్సీ ద్వారా జరిగింది. ప్రవాసీ భారతీయ బీమా యోజన (పిబిబివై) అనే రూ.10 లక్షల విలువైన ప్రమాదం బీమా పాలసీ కూడా జారీ అయింది. వలస కార్మికుడు విదేశాల్లో మరణించినప్పుడు మృతదేహాన్ని తరలించేందుకు అయ్యే ఖర్చును ప్రవాసీ పాలసీ ద్వారా పొందే అవకాశాన్ని మస్కట్ లోని ఇండియన్ ఎంబసీ ఎందుకు వినియోగించలేదన్నది పెద్ద ప్రశ్న. చట్ట ప్రకారం శవాన్ని తరలించే బాధ్యత రిక్రూటింగ్ ఏజెన్సీ తీసుకోవాలి. సమస్య 'మదద్' పోర్టల్ లో నమోదు అయిన తర్వాత కూడా ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ విషయం గురించి సరిగా పట్టించుకోలేదని స్పష్టం అవుతున్నది.తెలంగాణ ప్రభుత్వం నియమించిన ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, కమిటీ సభ్యుడు నంగి దేవేందర్ రెడ్డి, ప్రవాసీ ప్రజావాణి వాలంటీర్ మహమ్మద్ బషీర్ అహ్మద్ ఈ అంశాన్ని సీఎం ప్రజావాణి ఇంచార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డా. జి. చిన్నారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. సమస్య తీవ్రతను గుర్తించిన డా. చిన్నారెడ్డి తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం ముఖ్య కార్యదర్శి వి. శేషాద్రిని ఆదేశించారు.చలించిన ఐఏఎస్ అధికారిణిఇదే అంశాన్ని సీఎం ప్రజావాణి నోడల్ అధికారి, ఐఏఎస్ అధికారిణి దివ్యా దేవరాజన్కు వివరించగా, పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకొని వెంటనే స్పందించారు. ఓమాన్కు వెళ్లిన మూడు నెలలకే అబ్బులు మృతి చెందడం, నెలరోజులుగా ఆసుపత్రి శవాగారంలో మృతదేహం ఉండిపోవడం, భర్త పార్థివదేహం కోసం గ్రామం నుంచి హైదరాబాద్ వరకు వచ్చి మొరపెట్టుకున్న భార్య పరిస్థితి ఆమెను చలింపజేసింది.ఫలితంగా, ఓమాన్ నుంచి మృతదేహాన్ని భారత్కు తరలించేందుకు అవసరమైన రూ.1.50 లక్షలను ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి కొన్ని గంటల వ్యవధిలోనే చెక్కుగా జారీ చేసి మృతుడి భార్య చిన్న సావిత్రికి అందజేశారు. ఓమాన్లో ఇండియన్ ఎంబసీ గుర్తింపు పొందిన ఇండియన్ సోషల్ క్లబ్ – తెలంగాణ విభాగం అధ్యక్షులు గుండేటి గణేష్ ఈ వ్యవహారంలో సమన్వయం చేస్తూ సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.ఈ మానవీయ సహాయానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ బోధన్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డిని మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామ సర్పంచ్ బెగారి సాయిలు, మంద భీంరెడ్డి తదితరులు ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సహకరించిన మానాల మోహన్ రెడ్డి, అనిల్ ఈరవత్రి, నాగేపూర్ మహిపాల్ రెడ్డికి వారు కృతఙ్ఞతలు తెలిపారు. -
NTV రిపోర్టర్ల అరెస్టు.. కాంగ్రెస్ సర్కార్పై కేటీఆర్ ఆగ్రహం
సాక్షి,హైదరాబాద్: ఓ కథనానికి సంబంధించిన కేసులో హైదరాబాద్ పోలీసులు ముగ్గురు ఎన్టీవీ జర్నలిస్టులను అరెస్టు చేశారు. ఈ అక్రమ అరెస్టులను మాజీ మంత్రి కేటీఆర్ ఖండించారు. జర్నలిస్టుల అరెస్టుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు.కాంగ్రెస్ పాలన ప్రతిసారీ ఎమర్జెన్సీ రోజులను గుర్తుచేస్తోంది.జర్నలిస్టులను నేరస్తుల్లా చూడటం దురదృష్టకరం. నోటీసులు ఇచ్చి విచారణకు పిలవచ్చు కదా?. అర్థరాత్రి ఇళ్లల్లోకి వెళ్లి అతిగా ప్రవర్తించడం సరికాదు. అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలి’అని ఎక్స్ వేదికగా కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణలో ముగ్గురు జర్నలిస్టులను అత్యంత అమానవీయ పద్ధతిలో, చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేయడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వంపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు Dear @RahulGandhi,I hope you are taking note of how the Telangana branch of your "Mohabbat ki Dukan" is trampling upon constitutional rights of citizens. Last night, three journalists were abducted by state police. In once instance, police broke open the doors of a journalist's…— KTR (@KTRBRS) January 14, 2026 -
NTV రిపోర్టర్ల అరెస్ట్.. రేవంత్ సర్కార్పై జర్నలిస్టుల ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ముగ్గురు ఎన్టీవీ రిపోర్టర్లు అరెస్ట్ ఘటన తీవ్ర దుమారం లేపింది. ఈ నేపథ్యంలో పోలీసులు, ప్రభుత్వ తీరుపై జర్నలిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. ఒక వార్త విషయంలో విచారించాలంటూ మంగళవారం రాత్రి ఎన్టీవీ రిపోర్టర్లను ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇంట్లో నుంచి జర్నలిస్టులను పోలీసులు తీసుకెళ్లారు. ముగ్గురిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబంతో విదేశాలకు వెళ్తున్న జర్నలిస్టును కూడా ఎయిర్పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు, ప్రభుత్వ తీరుపై జర్నలిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, ఎన్టీవీ రిపోర్టర్ల అక్రమ అరెస్ట్పై జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికీ ముగ్గురు ఎన్టీవీ రిపోర్టర్లు పోలీసుల అదుపులోనే ఉండటం గమనార్హం. -
ఇది రేవంత్ సర్కార్ రాజకీయ వికృత క్రీడ
సాక్షి, హైదరాబాద్: పాలన చేతగాని సర్కారు.. పండగ పూట జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలకు దిగటం సిగ్గుచేటని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్రావు అన్నారు. తెలంగాణవ్యాప్తంగా మీడియా ప్రతినిధులను, డిజిటల్ జర్నలిస్టులను పోలీసులు టార్గెట్ చేయడంపై ఆయన మండిపడ్డారు. ఎలాంటి నోటీసులు లేకుండా అరెస్టు చేయడం అక్రమమని అన్నారు. ‘‘మీ రాజకీయ వికృత క్రీడల్లో తెలంగాణ ఉద్యమకారులైన జర్నలిస్టులను బలి చేస్తారా? ఇళ్లల్లో చొరబడి అర్ధరాత్రి వేళ అరెస్టులు చేయడానికి వాళ్లేమైన తీవ్రవాదులా? జర్నలిస్టుల వరుస అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దాడి. తెలంగాణ జర్నలిస్టుల ఆత్మగౌరవం పై పని గట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రత్యక్ష దాడి. .. జర్నలిస్టుల అరెస్టులు, మీడియా- డిజిటల్ మీడియా పై సిట్లతో ఎవర్ని కాపాడుతున్నారు? ఎవరిని వేటాడుతున్నారు? మీ స్వార్థ రాజకీయాల కోసం ప్రజాస్వామ్య హననానికి పాల్పడటం దుర్మార్గం. రేవంత్ రెడ్డి.. ఇదేనా నీ ప్రజాపాలన? ఇదేనా మీరు చెప్పిన ప్రజాస్వామ్య పునరుద్ధరణ? అరెస్ట్ చేసిన జర్నలిస్టులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారాయన. అంతేకాదు డీజీపీ శివధర్రెడ్ఢికి ఫోన్ చేసి జర్నలిస్టులను విడుదల చేయాలని కోరారు.పాలన చేతగాని సర్కారు.. పండగ పూట జర్నలిస్టులపై కక్ష్య సాధింపు చర్యలకు దిగటం సిగ్గుచేటు.మీ రాజకీయ వికృత క్రీడల్లో తెలంగాణ ఉద్యమకారులైన జర్నలిస్టులను బలి చేస్తారా?ఇళ్లల్లో చొరబడి అర్ధరాత్రి వేళ అరెస్టులు చేయడానికి వాళ్లేమైన తీవ్రవాదులా?జర్నలిస్టుల వరుస అరెస్టులను తీవ్రంగా…— Harish Rao Thanneeru (@BRSHarish) January 14, 2026ఈ అరెస్టులను తెలంగాణ పీసీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి ఖండించారు. ‘‘అర్ధరాత్రిళ్లు అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. సదరు జర్నలిస్టులకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకుని ఉంటే బాగుండేది. జర్నలిస్టుల అరెస్టుతో యుద్ధ వాతావరణం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఇది కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి మంచిది కాదు’’ అని అభిప్రాయపడ్డారు. ఓ మంత్రి-ఐఏఎస్ అధికారిణి అంటూ.. ప్రముఖ చానెల్లో కథనం ప్రసారం అయ్యింది. దాని ఆధారంగా అటు సోషల్ మీడియాలో విస్తృత కథనాలు ప్రసారం అయ్యాయి. ఈ ప్రచారాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. మంత్రి కోమటిరెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు ఆ ప్రచారాన్ని ఖండించారు. ఈ క్రమంలో సదరు ప్రముఖ మీడియా సంస్థకు చెందిన జర్నలిస్టులను గత అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి ఇంటికెళ్లి తలుపులు బద్ధలు కొట్టి మరీ అరెస్ట్ చేశారని.. ఎలాంటి ప్రొసీజర్, నోటీసులు ఫాలో కాలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో.. రాష్ట్రంలో మరికొన్ని చోట్లా పోలీసులు పాత్రికేయుల్ని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా పలు చానెల్స్, 40కి పైగా యూట్యూబ్ చానెల్స్పై పోలీసులు దృష్టిసారించినట్లు సమాచారం. అయితే అక్రమ అరెస్టులు.. పోలీసుల ప్రతాపంపై జర్నలిస్టుల సంఘాలతో పాటు పౌర హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. -
ఏపీలో సీజ్ ద కైట్!
పతంగులకు కట్టిన దారం.. ప్రాణాలు తీస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో చైనీస్ మాంజా ప్రమాదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే.. పలువురి ప్రాణాలు బలిగొందీ భూతం. ఈ పండుగ సీజన్లోనే ఇరు చోట్ల చైనీస్ మాంజా ధాటికి పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. దీంతో నిషేధిత మాంజా అమ్మకాలు, వాడకంపై కఠిన చర్యలు అమలు కావడం లేదనే విమర్శ బలంగా వినిపిస్తోంది. అటు పోలీసు శాఖలు చేపడుతున్న డ్రైవ్స్.. అరకొర ఫలితాలనే ఇస్తున్నాయి.. తెలంగాణలో చైనీస్ మాంజా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా.. నిజామాబాద్లో మాంజా చుట్టుకుని ఓ రైతు తీవ్ర గాయాలపాలయ్యాడు. హైదరాబాద్లో ఈ ప్రమాదాలు మరీ ఎక్కువగా జరుగుతున్నాయి. రోజుకొక ఘటన చోటు చేసుకుంటోంది. చైనా మాంజా అమ్మినా.. కొన్నా.. ఆఖరికి ఆ మాంజాతో గాలి పటాలు ఎగరేసినా కేసులు పెడుతామని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఆఖరికి పీడీ యాక్టు ప్రయోగిస్తామన్న ప్రయోజనం కనిపించడం లేదు. ఇదిలా ఉండగానే..హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్కు తెలంగాణ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. చైనీస్ మాంజా విషయంలో ఎలాంటి చర్యలు చేపట్టారు.. ఇప్పటిదాకా జరిగిన ప్రమాదాల తాలుకా వివరాలతో పూర్తి నివేదికను ఫిబ్రవరి 26వ తేదీలోపు అందజేయాలని కమిషన్ ఆయన్ని ఆదేశించింది.ఇటు ఏపీలోనూ చైనీస్ మాంజా విషయంలో పోలీసులు చేస్తున్న ప్రకటనలకు విరుద్ధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. చైనీస్ మాంజా అమ్మినా.. కొన్నా.. కఠిన చర్యలు తప్పవని పోలీసులు చేస్తున్న హెచ్చరికలను వ్యాపారులు బేఖాతరు చేస్తున్నారు. దీంతో 112కి డయల్ చేసి సమాచారం అందించాలని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. వైజాగ్ పోలీసులు మరో అడుగు ముందుకేసి.. చైనీస్ మాంజా ఉన్న 650 గాలి పటాలను సీజ్ చేశారు. మరికొన్ని జిల్లాల్లోనూ పోలీసులు అమ్మేవారిని ఏం చేయలేక.. కొనేవారిని, ఎగరేసే వారిని పట్టుకుని వాళ్ల చేతుల్లోని గాలి పటాలు సీజ్ చేస్తున్నట్లు ప్రచారం జరగుతోంది. చైనీస్ మాంజాలో.. సింథటిక్ పదార్థాలతో(నైలాన్, ప్లాస్టిక్) తయారు చేసి.. గాజు లేదంటే లోహపు పొరతో దారానికి పూత పూస్తారు. అందుకే ఇది తీవ్రమైన గాయాలు చేస్తుంది. పైగా ఇది పర్యావరణానికి హానికరం(బయోడిగ్రేడబుల్ కాదు). అందుకే భారత ప్రభుత్వం 2017లో చైనా మాంజా (Chinese Manjha)పై నిషేధం విధించింది. తొలుత ఇది చైనా నుంచి దిగుమతి అయ్యేది. అలా దానికి చైనీస్ మాంజా, చైనా మాంజా అనే పేర్లు స్థిరపడిపోయాయి. ఆ తర్వాతి కాలంలో మన దేశంలోనే దీనిని తయారుచేయడం మొదలుపెట్టారు. ఇండస్ట్రీయల్ అవసరాల కోసం తయారీకి మినహాయింపు ఇచ్చారు. ఇదే అదనుగా కాసుల కక్కుర్తితో చైనీస్ మాంజాను మార్కెట్లలోకి తెస్తున్నారు. చైనా మాంజా తయారీ.. నిల్వ.. విక్రయం(అమ్మడం) నేరం. ఉల్లంఘిస్తే ఐదు సంవత్సరాల జైలు శిక్ష లేదంటే రూ.1 లక్ష వరకు జరిమానా ఒక్కోసారి రెండూ విధించవచ్చు. వినియోగం పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం.. చైనీస్ మాంజా కారణంగా ప్రమాదాల బారిన పడ్డవాళ్లు పరిహారం కోసం కోర్టులను ఆశ్రయించవచ్చు. -
పండుగ వేళ విషాదం
మహబూబ్ నగర్ జిల్లా: సంక్రాంతి పండగను కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకొందామని గ్రామానికి వెళ్తుండగా.. ప్రమాదం రూపంలో ఆ కుటుంబాన్ని మృత్యువు వెంటాడింది. కళ్లముందే భార్య దుర్మరణం చెందగా.. మూడేళ్ల కూతురు చికిత్స పొందుతూ మృతి చెందింది. తండ్రితోపాటు మరో కూతురు గాయాలతో చికిత్స పొందుతున్నారు. రెండు రోజుల క్రితం భూత్పూర్ వద్ద బ్రిడ్జిపై కారు ప్రమాదంలో సంక్రాంతి పండగకని కూతురు వద్దకు తిరుపతి వెళ్తుండగా భార్యాభర్తలు మృతిచెందిన ఘటన మరువక ముందే మరో ప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన ఘటన వాహనదారులను కలిచివేసింది. వివరాలిలా.. ఏపీలోని నంద్యాల జిల్లా పగిడియాల మండలం మచ్చుమర్రికి చెందిన సూర్య తిరుపతయ్య, భార్య భాగమణి (25) చిన్న కూతరు యస్న(3), మరో కూతరు ప్రియాంచితో కలిసి హైదారాబాద్లోని అల్వాల్లో కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సంక్రాంతి పండగకని స్వగ్రామానికి బైక్పై మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరారు. మార్గమధ్యంలో భూత్పూర్ మండలం అన్నాసాగర్ సమీపంలోని గాజులపేట స్టేజీ జాతీయ రహదారిపై మోటర్ సైకిల్ అదుపు తప్పి రోడ్డుపక్కనే ఉన్న రేలింగ్ను బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో భార్య నాగమణి (25) అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. చిన్నకూతురు యస్న (3) జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. తిరుపతయ్యతోపాటు మరో కూతురు ప్రియాంచి గాయాలతో చికిత్స పొందుతున్నారు. నాగమణి తల్లి ఉస్సేనమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. రెండ్రోజుల్లో రెండో ప్రమాదం భూత్పూర్ వద్ద జాతీయ రహదారిపై బ్రిడి వద్ద రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఇద్దరు ఏపీ వాసులు భార్యాభర్తలు మృతిచెందారు. పండగవేళ తిరుపతిలోని కూతురు వద్దకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. -
ఆ ఇంటికి ‘పెద్ద’రాయుడు..
ములుగు: నల్లబెల్లి మండ ల పరిసర గ్రామాల్లో తిరుగుతూ గంగిరెద్దును ఆడించే పెద్ద వెంకటయ్యది మూడు తరాల చరిత్ర. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన వృత్తే అతడికి జీవనాధారం. వెంకటయ్య దగ్గర ఉన్న గంగిరెద్దు పేరు పెద్దరాయుడు. తెల్లటి శరీరం, నుదుట ఎర్రని చుక్క, మెడలో గంటలతో అడుగు పెడితే పిల్లలందరూ చుట్టుముడుతారు. ‘పెద్దరాయుడిని మేము ఎద్దులా చూడము. మా కుటుంబంలో నా కన్న బిడ్డలా చూసుకుంటాం’అని పెద్ద వెంకటయ్య చెప్పుతుంటే ఆయన కళ్లలో గర్వం, ప్రేమ కనిపించాయి. పెద్దరాయుడు గురించి ఆయన మాటల్లో.. కఠినమైన శిక్షణ.. ప్రేమతోనే సాధ్యంఒక ఎద్దును గంగిరెద్దుగా తీర్చిదిద్దడం వెనుక ఆరు నెలల నుంచి సంవత్సరం పాటు శిక్షణ ఉంటుంది. తిరుపతి కొండల్లో గురువు ప్రేమ సైగలతో శిక్షణ ఇస్తారు. డూడూ బసవన్న అంటే తల ఊపడం, కాళ్లతో తాళం వేయడం, యజమాని మాట ప్రకారం ఆశీర్వదించడం ఇవన్నీ నేర్పడానికి ఎంతో ఓర్పు ఉండాలి. ప్రతిరోజూ పెద్దరాయుడు (గంగిరెద్దు)కు స్నానం చేయించి ప్రత్యేకమైన ఆహారం అందిస్తూ కుటుంబ సభ్యులకంటే జాగ్రత్తగా కాపాడుకుంటున్నా. పండుగ సమయంలో గతంలో బియ్యం, ధాన్యం, కాసిన్ని డబ్బులు ఇచ్చేవారు. కానీ పట్టణీకరణ పెరగడం, ప్రజల్లో ఆసక్తి తగ్గడంతో ప్రస్తుతం ఆదరణ తగ్గింది. కుటుంబ పోషణతోపాటు ఎద్దు మేతకు కూడా ఇబ్బంది అవుతోంది. ప్రభుత్వం మమ్ముల్ని కళాకారులుగా గుర్తించి పింఛన్ ఇవ్వాలి. పశుపోషణకు సాయం చేస్తే ఈ కళను బతికించుకుంటాం. -
‘సీఎం, మంత్రి’ కేసుల దర్యాప్తునకు సిట్
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డి ఫొటోను అసభ్యంగా మార్ఫింగ్ చేయడం, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిపై అనుచిత కథనాల ప్రసారాన్ని పోలీస్ విభాగం సీరియస్గా తీసుకుంది. ఈ రెండు కేసుల్నీ దర్యాప్తు చేయడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటు చేస్తూ డీజీపీ బత్తుల శివధర్రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనార్ పర్యవేక్షణలో పనిచేసే ఈ సిట్కు సిటీ నార్త్ రేంజ్ జాయింట్ సీపీ ఎన్.శ్వేత నేతృత్వం వహిస్తారు. ఇందులో మొత్తం 8 మంది అధికారులను నియమించారు. ఇప్పటికే అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన అధికారిక సిట్ను సజ్జనారే పర్యవేక్షిస్తున్నారు. ⇒ సీఎం రేవంత్రెడ్డి ఫొటోను అసభ్యంగా మారి్ఫంగ్ చేసి, సోషల్ మీడియాలో పోస్టు చేయడంపై నారాయణపేట జిల్లా మద్దూరు పోలీస్స్టేషన్లో ఆదివారం కేసు నమోదైంది. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జి.నర్సింహ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోటకొండ గ్రామానికి చెందిన కావలి వెంకటేశ్ అసభ్యంగా మారి్ఫంగ్ చేశారని, దాన్ని ‘తెలంగాణ పబ్లిక్ టీవీ వాట్సాప్ గ్రూప్’లో పోస్టు చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ⇒ రాష్ట్ర కేడర్లో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారిణిని ప్రస్తావిస్తూ, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిపై జరిగిన దుష్ఫ్రచారానికి సంబంధించి ఐఏఎస్ అ«ధికారుల సంఘం కార్యదర్శి జయేశ్రంజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. ఇందులో టీవీ, యూట్యూబ్ చానళ్లతోపాటు వెబ్సైట్లు కలిపి తొమ్మిదింటిని నిందితుల జాబితాలో చేర్చారు. ఈ ఫిర్యాదు, కేసు ల్లో ఎక్కడా కోమటిరెడ్డి పేరు లేకపోయినా, ఆయన ఇటీవలే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆ కథనాలను ఖండించిన విషయం విదితమే. ఈ రెండు కేసుల్లోని అంశాలను తీవ్రంగా పరిగణించిన పోలీసు విభాగం సిట్ ఏర్పాటు చేసి, రెండు కేసుల్నీ అక్కడకు బదిలీ చేసింది. ఈ సిట్లో కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న సీసీఎస్ టీమ్–10 ఏసీపీ జి.గురు రాఘవేంద్రతోపాటు చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌతం, హైదరాబాద్ పరిపాలన విభా గం డీసీపీ కె.వెంకటలక్ష్మి, హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ వి.అరవింద్ బాబు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో పనిచేస్తున్న ఎస్పీ బి.ప్రతాప్ కుమార్, హైదరాబాద్ ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ సి.శంకర్రెడ్డి, షీ–సైబర్ సెల్ ఎస్సై పి.హరీశ్ సభ్యులుగా ఉన్నారు. ఈ రెండు కేసుల దర్యాప్తు పూర్తి చేసే సిట్ అభియోగపత్రాల దాఖలు వరకు బాధ్యత తీసుకోనుంది. సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్న సిట్ అధికారులు ఇప్పటికే కొన్ని చోట్ల సోదాలు సైతం చేశారు. -
‘విద్వేషం’పై ఉక్కుపాదం!
సాక్షి, హైదరాబాద్: విద్వేష పూరిత ప్రసంగాలు, వార్తల ప్రచారాన్ని కట్టడి చేయడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెడుతోంది. ప్రభుత్వంలో ఉండే కీలక వ్యక్తులు, అధికారులే లక్ష్యంగా ప్రధాన మీడియాలో, సోషల్ మీడియాలో ప్రసారమయ్యే నిరాధార ఆరోపణలు, విమర్శలకు చెక్ పెట్టేందుకు వీలుగా కర్ణాటక ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన బిల్లు (విద్వేష పూరిత ప్రసంగాలు, ద్వేష పూరిత నేరాల (నివారణ) బిల్లు, 2025) తరహాలో ప్రత్యేక చట్టం తేవాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అధికారవర్గాల సమాచారం. ఇప్పటికే ఈ అంశాలను పరిశీలించాలని పోలీస్ ఉన్నతాధికారులకు ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై ఆరోపణలతో ఓ న్యూస్ చానల్లో ప్రసారమైన వార్త, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫొటోను మార్ఫింగ్ చేసి వాట్సాప్ గ్రూప్లలో ప్రచారం చేయడంపై నారాయణపేట జిల్లా మద్దూర్ పోలీస్స్టేషన్లో వేర్వేరుగా రెండు కేసులు నమోదయ్యాయి.ఈ కేసుల దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పగిస్తూ డీజీపీ బి.శివధర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. విద్వేష పూరిత ప్రచారాలపై ప్రభుత్వం సీరియస్గా ఉందనే విషయం ఈ సిట్ ఏర్పాటుతో స్పష్టం అవుతోంది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఇలాంటి కేసులు ఏవైనా నమోదయ్యాయా అని సిట్ బృందం పరిశీలించే అవకాశం ఉంది. నిరాధార ఆరోపణలు చేయడానికి కారణాలు ఏంటి..? తెరవెనుక ఇంకెవరైనా వ్యక్తులు ఉండి చేయిస్తున్నారా? అన్నది నిగ్గు తేల్చే దిశగానే సీనియర్ ఐపీఎస్ వీసీ సజ్జనార్ పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు అయ్యిందని ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. సిట్ బృందం గుర్తించే అంశాలను ఆధారంగా చేసుకుని కర్ణాటక తరహాలో చట్టం తేవడానికి అవకాశం ఉందని ఆయన చెప్పారు. కర్ణాటక బిల్లులో ఏముంది..? కర్ణాటక ‘హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ నివారణ బిల్లు–2025’లో అనేక కీలక అంశాలున్నాయి. సమాజంలో మతం, కులం, జాతి, లింగం, భాష తదితర అంశాల ఆధారంగా విద్వేషాలు, ద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు, చర్యలను అరికట్టే ఉద్దేశంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల శాసనసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టింది. విద్వేష పూరిత ప్రసంగాలు, నేరాలను నియంత్రించడంతోపాటు అటువంటి నేరాలకు పాల్పడిన వారికి శిక్షలు విధించడం, బాధితులకు తగిన పరిహారం అందించడం లక్ష్యంగా దీనికి రూపకల్పన చేసినట్లు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది.బహిరంగ ప్రదేశాల్లో లేదా ఎల్రక్టానిక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా మాటలతో, రాతలతో, సంకేతాలతో లేదా దృశ్య రూపాల్లో వ్యక్తి లేదా వర్గంపై ద్వేషం, శత్రుత్వం, వైరం రెచ్చగొట్టే ఉద్దేశంతో చేసే వ్యాఖ్యలను ‘విద్వేష ప్రసంగం’గా పరిగణిస్తామని బిల్లులో పేర్కొన్నారు. మతం, జాతి, కులం, లింగం, లైంగిక అభిముఖ్యత, జన్మస్థలం, నివాసం, భాష, వైకల్యం, గిరిజన గుర్తింపు వంటి అంశాలపై పక్షపాతం చూపితే అది నేరంగా పరిగణిస్తారు. ఈ చట్టం కింద నమోదయ్యే కేసుల్ని కాగి్నజబుల్, నాన్ బెయిలబుల్ నేరాలుగా పరిగణిస్తారు.ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజి్రస్టేట్ కోర్టులో విచారణ జరుగుతుంది. ద్వేష నేరాలకు పాల్పడే అవకాశం ఉందని ముందుగానే గుర్తిస్తే ఎగ్జిక్యూటివ్ మేజి్రస్టేట్ లేదా డిప్యూటీ ఎస్పీ హోదాకు తక్కువ కాని పోలీసు అధికారి ముందస్తు చర్యలు తీసుకోవచ్చు. ద్వేషాన్ని ప్రోత్సహించే కంటెంట్ను సోషల్ మీడియా, ఎల్రక్టానిక్ మీడియా నుంచి తొలగించేందుకు లేదా బ్లాక్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ద్వేష నేరానికి ఏదైనా సంస్థ లేదా సంఘం పాల్పడితే, ఆ సంస్థతో పాటు దాని నిర్వహణ బాధ్యతల్లో ఉన్నవారిపై కూడా కేసులు నమోదు చేస్తారు.కఠిన శిక్షలు⇒ ద్వేష నేరానికి పాల్పడితే కనీసం ఒక సంవత్సరం నుంచి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధిస్తారు. ⇒ అదే నేరాన్ని పునరావృతం చేస్తే కనీసం రెండేళ్ల నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష మరియు రూ.1 లక్ష జరిమానా ఉంటుంది. ⇒ బాధితులకు నష్టం తీవ్రతను బట్టి న్యాయస్థానం తగిన పరిహారం ఇవ్వవచ్చు. -
కంటెంట్తగ్గింది గురూ!
సినిమా..భారతీయుల జీవితంలో ఒక భాగం. అతిపెద్ద వినోదం. అభిమాన తారలు, కథ, నటన, పాటలు, హిట్, ఫ్లాప్.. ఇలా సినిమా గురించి చర్చలేని కుటుంబమే లేదంటే అతిశయోక్తి కాదు. థియేటర్లో కిటకిటలాడే ప్రేక్షకులు, ఈలలు, చప్పట్లు, చెవులు చిల్లులుపడే శబ్దాల మధ్య మూవీ చూస్తే ఆ థ్రిల్లే వేరు. ఇదంతా గతం. ‘ఆ ఒక్కటి తగ్గింది పుష్ప’అని ఇప్పుడు ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. దేశ వ్యాప్తంగా 2019లో 146 కోట్ల మంది ప్రేక్షకులు వెండి తెర ముందు కూర్చుని సినిమాను ఆస్వాదించారు. 2024లో ఈ సంఖ్య 86 కోట్లకు వచ్చి చేరింది.అంటే అయిదేళ్లలో థియేటర్లకు వచ్చిన వీక్షకుల సంఖ్య 41% తగ్గిందని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎంఏఐ) నివేదిక వెల్లడించింది. 2025 జూన్–జూలైలో 14,688 మంది సినిమా ప్రేక్షకులపై ఈవై నిర్వహించిన సర్వే, అలాగే నిర్మాతలు, ఇతర భాగస్వాముల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం..140 కోట్లకుపైగా జనాభా ఉన్న మన దేశంలో ఏటా థియేటర్లకు వచ్చి మూవీని ఆస్వాదించేవారి సంఖ్య దాదాపు 15 కోట్లు మాత్రమే. – సాక్షి, స్పెషల్ డెస్క్కొద్ది రోజులకే ఓటీటీల్లో.. సినిమా కంటెంట్లో నాణ్యత తగ్గిందన్నది ప్రేక్షకుల మాట. అంతేకాదు మూవీస్ రిలీజైన కొద్ది రోజులకే ఓటీటీల్లో ప్రత్యక్షం అవుతున్నాయి. థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గడానికి ఇవే ప్రధాన కారణాలు. కంటెంట్ నాణ్యత పడిపోయిందని 55% ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఆకట్టుకునే కథ, సంగీతం, స్పెషల్ ఎఫెక్ట్స్ మెరుగుపడాలని 70% మంది ఆశిస్తున్నారు.థియేటర్లకు పరుగు తీయాల్సిన అవసరం లేదని..విడుదలైన ఎనిమిది వారాలలోపు స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లకు వస్తున్నాయని 81% మంది నమ్ముతున్నారు. థియేటర్లో రిలీజై ఓటీటీకి వచ్చేందుకు తక్కువ రోజులే ఉంటే సినిమా కోసం వేచి చూస్తామని మూడింట ఒకవంతు మంది చెబుతున్నారు. చేయి తిరిగిన రచయితలు, కథల కొరత ఉందని 78% నిర్మాతలు పేర్కొన్నారు. సగం మంది పైరసీతో.. భారత్లో మొత్తం స్క్రీన్ల సంఖ్య 2019లో 9,527 ఉండగా.. 2024 నాటికి స్వల్పంగా పెరిగి 9,927కి వచ్చి చేరింది. అంటే కేవలం 400 తెరలే కొత్తగా తోడయ్యాయి. 10 లక్షల మంది జనాభాకు స్క్రీన్లు 7.6 నుంచి 6.8కి తగ్గాయి. 10 లక్షల మందికి యునైటెడ్ స్టేట్స్లో 109, యూకేలో 66, చైనాలో 64 తెరలు ఉన్నాయి. భారత్లో 2018–24 నడుమ 1,000 దాకా సింగిల్ స్క్రీన్ థియేటర్లు కనుమరుగయ్యాయి.మల్టీప్లెక్సులు అయిదేళ్లలో పెట్టుబడులను 12% తగ్గించాయి. భారత్లోని దాదాపు 19,000 పిన్కోడ్స్కుగాను సుమారు 16,350 చోట్ల థియేటర్లే లేవు. సినీ పరిశ్రమను కోలుకోకుండా చేస్తున్న పైరసీ సైతం సమస్యను పెంచుతోంది. వీడియో కంటెంట్ యూజర్లలో 51% మంది పైరసీ సైట్లపై ఆధారపడుతున్నారు. వీరిలో నాలుగింట మూడొంతుల మంది 19 నుంచి 34 సంవత్సరాల వయస్సుగల వారు ఉండడం గమనార్హం. డిజిటల్ ప్లాట్ఫామ్స్లో సినిమాలు విడుదలైన తర్వాత పైరసీ పెరుగుతోంది.ఒత్తిడిలో పరిశ్రమ..ప్రేక్షకుల సంఖ్య తగ్గడం, పరిమిత స్క్రీన్స్, వీక్షణ అలవాట్లలో వేగవంతమైన మార్పుల కారణంగా చలనచిత్ర ప్రదర్శన రంగం నిరంతర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. మన దేశంలో మొత్తం మీడియా, వినోద రంగం, విస్తృత ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతూనే ఉన్నప్పటికీ.. 2019 నాటి గరిష్ట స్థాయి నుంచి థియేటర్ల రెవెన్యూ తగ్గుతోంది. 2019–24 మధ్య భారతదేశ థియేటర్ల ఆదాయాలు 0.2% వార్షిక రేటుతో క్షీణించాయి. ఇదే సమయంలో మీడియా, వినోద రంగం 5.42%, జీడీపీ 6.6% వృద్ధి చెందాయి. సినిమా ఆదాయం 2019లో రూ.19,100 కోట్ల నుంచి 2024లో రూ.18,746 కోట్లకు పడిపోయింది. 2019లో రూ.100 కోట్లకుపైగా బాక్సాఫీస్ కలెక్షన్లు అందుకున్న సినిమాలు 17 ఉంటే.. 2024లో ఇవి 10కి పరిమితం అయ్యాయి. -
అంతులేని దోపిడీ!
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో జరుగుతున్న అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. చలాన్ల ఎడిటింగ్ ద్వారా రూ. 50 కోట్ల ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టించిన వ్యవహారంపై జరుగుతున్న దర్యాప్తులో మరిన్ని విస్మయకర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి తదితర జిల్లాల్లో జరిగిన ఈ కుంభకోణంపై ఆరా తీసేందుకు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు రాష్ట్రవ్యాప్తంగా తాజాగా నిర్వహించిన ఆడిట్లో రెండు రకాల ప్రధాన లావాదేవీల్లో తేడాలు గుర్తించినట్లు తెలుస్తోంది. ఒకే రిజిస్ట్రేషన్ కోసం రెండు చలాన్లు కట్టే వెసులుబాటు ఉండటంతో తక్కువ మొత్తంలో కట్టిన చలాన్ను ప్రభుత్వానికి చెల్లించి ఎక్కువ మొత్తంలో కట్టిన చలాన్ను వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి మరల్చుకున్నారని ఆడిట్లో తేలినట్లు సమాచారం. అలాగే సేల్డీడ్ల రిజిస్ట్రేషన్ తర్వాత వాటిని రద్దు చేసుకున్నట్లు చూపి క్యాన్సిలేషన్ ఫీజు కింద రూ. 2 వేలు చెల్లించి అంతకుముందు చేసుకున్న రిజిస్ట్రేషన్ను కొనసాగిస్తున్నారా అనే సందేహం కూడా ఈ పరిశీలనలో తలెత్తింది. అయితే ఈ రెండు అంశాల్లో ఏ మేరకు ఏం జరిగిందన్న దానిపై ఉన్నతాధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ రెండు అంశాల్లో తేడాలున్న లావాదేవీల వివరాలను తహసీల్దార్లకు పంపి వివరణ కోరారు. ఒకవేళ తాజా ఆడిట్లో తేలిన ఈ రెండు అంశాల్లోనూ దోపిడీ జరిగినట్లు తేలితే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల కుంభకోణం విలువ రూ. వందల కోట్లలో ఉంటుందని రెవెన్యూ శాఖ వర్గాలు అంటున్నాయి. నాలుగు స్థానాలు... మూడు కోణాలు తాజా కుంభకోణం వెనుక నాలుగు స్థానాల్లో పనిచేసే సిబ్బంది, అధికారులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మీ–సేవా కేంద్రాల నిర్వాహకులు, పోర్టల్ ఆపరేటర్లు, సీసీఎల్ఏ సిబ్బంది పాత్రతోపాటు తహసీల్దార్ల నిర్లక్ష్యం వల్లే అక్రమాలు జరిగాయని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం, సాంకేతిక పరిజ్ఞాన దుర్వినియోగం, సిబ్బంది కుమ్మక్కు అనే మూడు కోణాల్లో దర్యాప్తు వేగవంతమవుతోందని.. స్కామ్ జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్న జనగామ, యాదాద్రి, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలతోపాటు మిగిలిన చోట్ల జరిగిన లావాదేవీలపైనా దర్యాప్తు జరుపుతున్నామని ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ వర్గాలు చెబుతున్నాయి. మరో 4–5 రోజుల్లో అన్ని అంశాలు కొలిక్కి వస్తాయని అంటున్నాయి. అయితే చలాన్ల ఎడిటింగ్ ద్వారానే అక్రమాలు జరిగాయన్నది ఉన్నతాధికారుల ప్రాథమిక అభిప్రాయమైనప్పటికీ అలా జరిగి ఉండకపోతే మాత్రం ఏకంగా పోర్టల్ను హ్యాక్ చేసి ప్రభుత్వ సొమ్మును కాజేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ కోణంలోనూ దర్యాప్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఒక చలాన్... ఎనిమిది ప్రశ్నలు 1 ఇష్టారాజ్యంగా స్లాట్ల బుకింగ్కు అనుమతి ఎలా? గతంలో ధరణి, ప్రస్తుత భూభారతి పోర్టల్ ద్వారా ఎవరు ఎక్కడి నుంచైనా స్లాట్ బుక్ చేసుకునే అవకాశం కల్పించడమే ఈ కుంభకోణానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. క్రయ, విక్రయదారులతో సంబంధం లేని ఫోన్ నంబర్లతో స్లాట్లు బుక్ చేసి, ఆ స్లాట్ ఐడీల ఆధారంగానే దోపిడీకి పాల్పడినట్టు తెలుస్తోంది. ఒకే ఫోన్ నంబర్పై 70 నుంచి 100 వరకు స్లాట్లను బుక్ చేసినట్లు సమాచారం. 2 ఆ ఉద్యోగులనే ఎందుకు కొనసాగించారు? ధరణి పోర్టల్ను టెర్రాసిస్ అనే ప్రైవేట్ సంస్థ నిర్వహించగా భూభారతి పోర్టల్ను ఎన్ఐసీకి అప్పగించారు. అయితే అప్పుడు, ఇప్పుడు పనిచేస్తున్న ఉద్యోగుల్లో 90 శాతం మంది వారే కావడం కూడా ఈ అక్రమాలు కొనసాగేందుకు ఊతమిచ్చిందన్న చర్చ నడుస్తోంది. వేతనాలు తక్కువగా ఉండే పోర్టల్ ఆపరేటర్లలో 60 శాతం మంది వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్లు బుక్ చేసి అదనపు ఆదాయం పొందుతుండటంతో మీ–సేవా కేంద్రాల నిర్వాహకులతోపాటు ఆపరేటర్ల పాత్రపైనా దర్యాప్తు జరుగుతోంది. 3 ఎడిట్ చేశారా.. హ్యాక్ చేశారా? స్లాట్ బుకింగ్ కోసం రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించేటప్పుడే చలాన్లను ఎడిట్ చేసినట్లు అధికారులు ప్రాథమిక అవగాహనకు వచ్చారు. మీ–సేవా నిర్వాహకులు లేదా ఆపరేటర్లు కట్టిన చలాన్లను సీసీఎల్ఏ కార్యాలయ సర్వర్ వద్ద ఉండే సిబ్బంది ఎడిట్ చేస్తేనే ఇది సాధ్యమవుతుందని అధికారులు చెబుతున్నారు. అలా జరగాలంటే మీ–సేవా, ధరణి ఆపరేటర్లు, సీసీఎల్ఏ సిబ్బంది కుమ్మక్కు కావాల్సి ఉంటుందని.. అది సాధ్యం కాదనుకుంటే చలాన్ దోపిడీ జరిగినప్పుడల్లా రిజిస్ట్రేషన్ పోర్టల్నే హ్యాక్ చేసి ఉంటారనే చర్చ జరుగుతోంది. 4 తహసీల్దార్లు ఏం చేస్తున్నట్లు? అసిస్టెంట్ సబ్రిజిస్ట్రార్ హోదాలో ఉండే తహసీల్దార్లకు కేవలం భూమి వివరాలు, క్రయ, విక్రయదారుల వ్యక్తిగత వివరాలు సరిచూసుకునే బాధ్యత తప్ప ప్రభుత్వానికి అందాల్సిన మొత్తాన్ని చెక్ చేసే వ్యవస్థ వారి వద్ద లేదని.. ధరణి పోర్టల్ నుంచే ఇది కొనసాగుతున్నప్పటికీ భూభారతి అమల్లోకి వచ్చినా కూడా దీన్ని మార్చలేదని తెలుస్తోంది. స్లాట్ బుకింగ్ చేసిన వారు ప్రింట్ రూపంలో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్కు జత చేసే చలాన్ జిరాక్స్ను చూసి తహసీల్దార్లు ఎలా సంతకాలు పెట్టారన్నది కూడా అనేక అనుమానాలకు తావిస్తోంది. 5 తనిఖీ వ్యవస్థ లేదా? సాధారణంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను సీనియర్ అసిస్టెంట్ హోదాలోని ఓ ఉద్యోగి చెక్ చేసి సబ్ రిజిస్ట్రార్కు పంపుతారు. సబ్రిజిస్ట్రార్ ఆయా డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించి ఫీజు, చలాన్ అంశాలను సరిచూసుకొని రిజిస్ట్రేషన్కు పంపుతారు. కానీ వ్యవసాయ భూముల విషయంలో ఒకసారి స్లాట్ బుక్ అయిన డాక్యుమెంట్ నేరుగా తహశీల్దార్లకే వెళ్తోంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యే సమయంలో ప్రింట్ తీశాకే చలాన్ ఎంత కట్టారన్నది రివర్స్ ఎండార్స్మెంట్లో కనిపిస్తోంది. 6 అప్పుడైనా చూడాలి కదా? తహసీల్దార్లు పనిఒత్తిడి వల్ల రివర్స్ ఎండార్స్మెంట్లో ఎంత చలాన్ వచ్చిందో చూడకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారని.. ఇది కచ్చితంగా వారి నిర్లక్ష్యమేనని దర్యాప్తు కమిటీ భావిస్తోంది. అలాగే తహసీల్దార్లకు తెలిసే ఇదంతా జరిగిందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తోంది. 7 ఫీజు ఎంత కడతారో తెలియదా? వ్యవసాయ భూములను గత ఆరేళ్లుగా రిజిస్ట్రేషన్ చేస్తున్న తహసీల్దార్లకు ఎంత భూమి రిజిస్ట్రేషన్కు ఎంత ఫీజు కడతారో కూడా తెలియదని.. 60 శాతం మంది తహసీల్దార్లు ఆఫీసు సిబ్బందిపైనే ఆధారపడి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని రెవెన్యూ వర్గాలే చెబుతున్నాయి. రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ఏ డాక్యుమెంట్లో ఏం రాశారో కూడా వారికి అర్థమయ్యే పరిస్థితి లేదని.. ఒకవేళ అర్థమైనా అలా చూసే తీరిక లేదని అంటున్నాయి. 8 లావాదేవీలను ఆడిట్ చేయలేదా? సాగు భూముల రిజిస్ట్రేషన్ లావాదేవీలకు సంబంధించి గత ఆరేళ్లలో ఒక్కసారి కూడా రాష్ట్రవ్యాప్త ఆడిట్ జరగలేదని, అలా జరిగి ఉంటే ఎక్కువగా అక్రమాలు జరిగాయని ప్రాథమికంగా తేలిన 2021, 2022లోనే ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చేదని తెలుస్తోంది. ‘నాలా’ఫీజు పెంపు గురించి వారికి 8 నెలల దాకా తెలియదట! గతంలో ధరణి పోర్టల్ నిర్వహణ పూర్తిగా ఉన్నతాధికారుల చేతుల్లోనే ఉండేదని తహసీల్దార్లు చెబుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి మినహా మిగిలిన జిల్లాల్లో వ్యవసాయ భూముల వినియోగ మార్పిడి (నాలా) ఫీజును 3 శాతం నుంచి 5 శాతానికి పెంచిన విషయం 7–8 నెలల వరకు తమకు తెలియలేదని వారంటున్నారు. నాలా ఫీజు కింద ఎంత భూమికి ఎంత చలానా కట్టాలో కూడా తమకు తెలిసే పరిస్థితి ఉండేది కాదని పేర్కొంటున్నారు. ఇక సాధారణ భూముల రిజిస్ట్రేషన్ల విషయంలోనూ ఫీజు ఎంత కట్టాలో, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో ఏముందో అరకొర శిక్షణ ఇస్తే ఎలా తెలుస్తుందని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ సొమ్మును అణాపైసాతో సహా వసూలు చేస్తాం ‘ఇష్టానుసారంగా భూముల రిజిస్ట్రేషన్లు చేసేందుకే గత ప్రభుత్వం ధరణి పోర్టల్ తెచ్చింది. కనీసం చలాన్ ఎంత కట్టారో కూడా సరిచూసుకోలేని విధంగా సాంకేతికతను సమకూర్చింది. తహసీల్దార్లకు సరైన శిక్షణ ఇవ్వకపోగా ఆడిట్ వ్యవస్థకు దిక్కేలేదు. ధరణి పోర్టల్ స్థానంలో మేం తెచ్చిన భూభారతి పోర్టల్కు సాంకేతిక సత్తువ సమకూర్చేందుకు కొంత సమయం పడుతుంది. ఈ క్రమంలోనే ధరణి దరిద్రాలు బయటపడుతున్నాయి. ప్రభుత్వ సొమ్మును అణాపైసాతో సహా తిరిగి తీసుకుంటాం. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం’ – మంత్రి పొంగులేటి -
Hyd: కూకట్పల్లిలో అగ్ని ప్రమాదం
హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లి రాజీవ్గాంధీ నగర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం( జనవరి 13వ తేదీ) రాత్రి సమయంలో ఈ ప్రమాదం చోటు చేసకుంది.గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా గ్యాస్ లీక్ కావడంతో మంటలు ఒక్కసారిగా ఎగసిపడ్డాయి. ఈ సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనాస్థలానికి వచ్చి మంటలను అదుపు చేస్తున్నారు. భారీ ఎత్తున మంటల ఎగిసి పడుతూ ఉండటంతో స్థానికంగా భయాందోళన నెలకొంది. -
ప్రముఖ కవయిత్రి రాజకుమారి ఇందిరాదేవి కన్నుమూత
రాజకుమారి ఇందిరాదేవి ధనరాజ్ గిర్ (96) ఈరోజు(మంగళవారం, జనవరి 13వ తేదీ) సాయంత్రం హైదరాబాద్లోని జ్ఞాన్భాగ్ ప్యాలెస్లో కన్నుమూశారు. ఆమె నిజాం కోర్టులో ప్రముఖ నోబెల్లో ఒకరైన రాజా ధనరాజ్ గిర్ కుమార్తె. ప్రముఖ కవి గుంటూరు శేషేంద్రశర్మ భార్య రాజకుమారి ఇందిరాదేవిరాజకుమారి ఇందిరాదేవి చిత్రకారిణి, రచయిత్రి, కవయిత్రి. ఆమె కవిత్వంలో హైదరాబాద్ సంస్కృతి, డెక్కన్ ప్రాంతపు జ్ఞాపకాలు, వ్యక్తిగత అనుభవాలు ప్రతిబింబిస్తాయి.జీవిత చరిత్రజననం: 1930 ఆగస్టు 17తల్లిదండ్రులు: రాజా ధనరాజ్గిర్జీ బహదూర్ , రాణి ప్రేమిలా దేవివిద్య: ఇంటి వద్ద ఆంగ్ల గవర్నెస్ ద్వారా శిక్షణ పొందారువివాహం: ప్రముఖ కవి గుంటూరు శేషేంద్రశర్మసాహిత్య కృషిఇందిరా దేవి ఆంగ్లంలో కవిత్వం రాశారు. ఆమె రచనలు:Return Eternity (1965)Partings in Mimosa (1968)-Memories of the Deccan (2008)సామాజిక సేవలుఅవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో హిందీ అకాడమీకి ఛైర్పర్సన్గా పనిచేశారు.సాహిత్యం, కళలు, ఫోటోగ్రఫీ రంగాల్లో విశేష కృషి చేశారు.వ్యక్తిగత విశేషాలుఆమె పూర్వీకులు మహారాష్ట్రలో పాలకులు.హైదరాబాద్లోని జ్ఞాన్బాగ్ ప్యాలెస్లో నివసించారు.తండ్రి క్రికెట్ను హైదరాబాద్కు పరిచయం చేసినవారిలో ఒకరు -
కూలూవెన్ వర్సిటీతో తెలంగాణ ఈసీ బృందం భేటీ
సాక్షి హైదరాబాద్: బెల్జియం అధికారిక పర్యటనలో భాగంగా ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీ) రాష్ట్ర బృందం ప్రపంచ ప్రసిద్ధ కూలూవెన్ యూనివర్సిటీతో కీలక చర్చలు నిర్వహించింది. ప్రజాస్వామ్య ప్రక్రియలు, ఎన్నికల నిర్వహణ విధానాలపై భారత్-బెల్జియం దేశాల మధ్య పోలికలు ప్రధాన అంశంగా ఈ భేటీ సాగింది.ఈ సందర్భంగా కూలూవెన్ యూనివర్సిటీలోని సోషల్ సైన్సెస్ విభాగం డీన్, ప్రొఫెసర్లు బెల్జియం ఎన్నికల వ్యవస్థ, ఓటింగ్ విధానాలు, సంస్థాగత భద్రతా చర్యలు, ఆధునిక సవాళ్లపై వివరాలను భారత బృందానికి సమగ్రంగా వివరించారు. అనంతరం భారత ప్రతినిధులు దేశంలోని ఎన్నికల వ్యవస్థ విస్తృతి, సామాజిక వైవిధ్యం, సమాఖ్య స్వరూపం వంటి విశిష్ట లక్షణాలను ప్రస్తావిస్తూ భారత ఎన్నికల ప్రక్రియపై తులనాత్మక సమీక్ష ప్రవేశపెట్టారు.అనంతరం తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సి. సుధర్శన్రెడ్డి మాట్లాడారు. ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలెక్షన్ మేనేజ్మెంట్ ఎన్నికల అధికారుల సామర్థ్య వృద్ధి, అంతర్జాతీయ అనుభవాల మార్పిడిలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. శిక్షణ, సంయుక్త పరిశోధనలు, గ్లోబల్ ఉత్తమ విధానాల పంచకంలో భాగస్వామ్యానికి కూ లూవెన్ యూనివర్సిటీ ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆయన ఆహ్వానించారు.ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్లో 99 కోట్ల మందికిపైగా ఓటర్ల విశ్వాసాన్ని నిలబెట్టేలా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అమలు చేస్తున్న కఠిన చర్యలు, పారదర్శకత, ఎన్నికల సమగ్రత పరిరక్షణ అంశాలను భారత బృందం ఈ సందర్భంగా వారికి వివరించింది.ఈ సమావేశంలో ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్రెడ్డితో పాటు అనుదీప్ దురిశెట్టి, బోయపాటి చెన్నయ్య, కె. అనంత్రెడ్డి, ధృవ కుమార్రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. -
బ్లాక్ మ్యాజిక్ ముగ్గులు గీస్తున్నారు..!
సంక్రాంతి పండుగ వస్తోందంటే.. బడులు, కాలేజీల్లో ముగ్గుల పోటీలు నిర్వహించడం సాధారణమే..! సహజంగా అమ్మాయిలు పొంగల్, రథం, సంక్రాంతి గాలిపటాలు, హరిదాసుతో కూడిన రంగోళీలతో అలరించడం తెలిసిందే..! కానీ, ఇటీవలికాలంలో ట్రెండ్ మారింది. గడిచిన నాలుగైదు రోజులుగా హైదరాబాద్, శివారు ప్రాంతాల్లోని స్కూళ్లు, కాలేజీల్లో రంగోళీ పోటీలో వినూత్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అదేంటో తెలిస్తే.. మీరూ షాకవుతారు..! అందమైన రంగవల్లుల స్థానంలో చేతబడి ముగ్గులు వేస్తున్నారు కొందరు పిల్లలు. ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలను ముగ్గు మధ్యలో పెట్టినట్లుగా.. చేతబడి బొమ్మలు.. అదే వుడూలను ముగ్గులో పెడుతున్నారు.ఇటీవల హైదరాబాద్ శివార్లలోని ఘట్కేసర్ మండల పరిధిలో ఉన్న ఓ ప్రాథమిక పాఠశాలలో ముగ్గుల పోటీ జరిగింది. అంతకు ముందురోజు ఓ కుర్రాడు ముగ్గుల పోటీకి పేరు ఇచ్చాడు. టీచర్లు ఆశ్చర్యంతో.. అదేంట్రా? అమ్మాయిలు కదా? ముగ్గులు వేసేది? అని ప్రశ్నిస్తే.. నేను కూడా ముగ్గు వేస్తాను అంటూ సమాధానమిచ్చాడు. సరేనని అవకాశమిస్తే.. పోటీరోజున సీరియస్గా ముగ్గు వేశాడు.జడ్జిమెంట్కు టీచర్ల బృందం ఒక్కోముగ్గును పరిశీలిస్తూ.. ఆ కుర్రాడి ముగ్గు వద్దకు వచ్చి అవాక్కయ్యారు. కొందరైతే భయభ్రాంతులకు గురయ్యారు. కారణమేంటంటే.. అచ్చంగా క్షుద్ర పూజల్లో మాంత్రికులు వేసినట్లుగా ఆ కుర్రాడు చేతబడి ముగ్గు వేశాడు. అంతేకాదు..! ఆ ముగ్గు మధ్యలో ఓ చేతబడి బొమ్మను పెట్టి.. దాన్ని సూదులతో గుచ్చాడు. కంగారుపడ్డ టీచర్లు వెంటనే బకెట్ నీళ్లతో ఆ ముగ్గుని చెరిపివేయించారు. ఈ ఉదంతాన్ని మరవక ముందే.. తాజాగా.. చిక్కడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో ఉండే ఓ కాలేజీలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. జూనియర్ ఇంటర్ చదివే ఓ అమ్మాయి రంగోళీ పోటీలో ఇదేవిధంగా చేతబడి ముగ్గు వేసి.. భయభ్రాంతులకు గురిచేసింది. ఇక వికారాబాద్ జిల్లాలోనూ ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చినట్లు అక్కడి టీచర్లు ‘సాక్షి డిజిటల్’కు తెలిపారు. ఈ ఉదంతాలను గురించి వింటుంటే మీకేమనిపిస్తోంది? పిల్లల్లో చేతబడిపై ఆసక్తి పెరుగుతోందా? లేక.. ఈ మధ్యకాలంలో చిన్నాపెద్దా తేడా లేకుండా మూఢనమ్మకాలవైపు మొగ్గుచూపుతున్నారా? ఈ ప్రశ్నలకు సైకాలజిస్టులు అనేక కారణాలను చెబుతున్నారు. ముఖ్యంగా ఎన్విరాన్మెంట్.. అంటే.. చుట్టూ ఉన్న పరిసరాల ప్రభావం పిల్లలపై చాలా సులభంగా పడుతుందంటున్నారు. అంతేకాదు.. ఈ మధ్యకాలంలో వచ్చిన కొన్ని సినిమాల్లో చేతబడి సీన్లు ఎక్కువగా ఉండడంతో.. అనుకున్నది సాధించాలంటే.. ఇదొక్కటే షార్ట్కట్ అనే భావన పిల్లల్లో త్వరగా వస్తుందని వివరిస్తున్నారు. అంతేకాదు.. సినిమాల్లో మంచి కంటే.. చెడు అనేది చాలా త్వరగా పిల్లల్లో నాటుకుపోతుందని హెచ్చరిస్తున్నారు. కొన్ని సినిమాల్లో మంత్రగాళ్లు చదివే చేతబడి మంత్రాలను పిల్లలు వల్లెవేయడం వంటి కేసులు తమ వద్దకు వచ్చాయని చెబుతున్నారు.ఇక పేరెంటింగ్ నిపుణులు, స్కూల్ ఎడ్యుకేషన్ కౌన్సిలర్లు సైతం తప్పు తల్లిదండ్రులదేనని చెబుతున్నారు. పిల్లలను సరిగ్గా పర్యవేక్షించకుండా తమ పనుల్లో బిజీ అవుతున్నారని, చిన్నారులు ఏంచేస్తున్నారో చూసే తీరిక కూడా వారికి ఉండడం లేదని పేర్కొంటున్నారు. నిత్యం మొబైల్ గేమ్స్ ఆడుతూ.. రీల్స్ చూడడంలో బిజీగా మారిపోతున్న చిన్నారులు క్రమంగా ప్రతికూలాంశాలు ఎక్కువగా ఉండే యాప్స్, మంత్రసాధన సంబంధిత యాప్స్వైపు మొగ్గుచూపుతున్నట్లు వివరిస్తున్నారు. పిల్లలు ఇలా తయారవ్వడానికి ముమ్మాటికీ తల్లిదండ్రుల పర్యవేక్షణలోపమే కారణమంటున్నారు. -
మేడారం జాతరకు భారీగా ఏర్పాట్లు
హైదరాబాద్ : ఈనెల 28వ తేదీ నుండి 31 వ తేదీ వరకు జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు ఈసారి దాదాపు మూడు కోట్లమంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున ప్రభుత్వంలోని వివిధ శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర మంత్రులు అడ్లూరి లక్షణ్ కుమార్, దనసరి అనసూయలు అన్నారు. మేడారం జాతరపై నేడు డా. బీ.ఆర్ అంబేడ్కర్ సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో రాష్ట్ర గిరిజన, ఎస్సి సంక్షేమ, ... శాఖ మంత్రి అడ్లూరి లక్షణ్ కుమార్, రాష్ట్ర పంచాయితీరాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖామంత్రి దనసరి అనసూయ (సీతక్క) లు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అరవింద్ కుమార్, సవ్యసాచి ఘోష్, అడిషనల్ డీజీలు విజయ్ కుమార్, స్వాతి లక్రా, వివిధ శాఖ కార్యదర్శులు, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్షణ్ కుమార్ మాట్లాడుతూ, గత 2024 మేడారం జాతరకు కోటిన్నర మంది హాజరుకాగా, ఈసారి 2026 లో జాతరకు దాదాపు గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ. 150 కోట్ల నిధులను మంజూరు చేసి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నందున ఈసారి దాదాపు మూడు కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నామని వివరించారు. సమ్మక్క–సారలక్క జాతరను కుంభమేళాకు మించి అద్భుతంగా నిర్వహించి, రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ స్థాయిలో మంచి పేరు తీసుకురావాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులకు పిలుపునిచ్చారు. ఈ మహాజాతరను విజయవంతంగా నిర్వహించడం ప్రతి అధికారికి ఒక బాధ్యతగా తీసుకుని, ఏ చిన్న లోపం కూడా లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయన సూచించారు.దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ జాతరకు రూ.150 కోట్లకుపైగా నిధులు కేటాయించి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. ఈ నిధులతో మౌలిక వసతులు, భద్రత, రవాణా, పారిశుద్ధ్యం, వైద్య సేవలు వంటి అన్ని విభాగాల్లో సమగ్ర ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. ఏ ఒక్క భక్తుడికి కూడా ఇబ్బంది కలగకూడదన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసిన మంత్రి, జాతరకు వచ్చే భక్తులు సులభంగా గమ్యానికి చేరుకునేలా అన్ని ప్రధాన రహదారులు, అంతర్గత మార్గాల్లో స్పష్టమైన దిశా సూచిక బోర్డులు, బ్యానర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులు ఎలాంటి అయోమయానికి గురికాకుండా ట్రాఫిక్ నియంత్రణ పటిష్టంగా ఉండాలని, ప్రత్యేక రూట్ మ్యాప్లతో పాటు అవసరమైన చోట వన్వే వ్యవస్థ అమలు చేయాలని సూచించారు. ఈ జాతరపై క్యాబినెట్ మొత్తం ప్రత్యేక దృష్టి సారించిందని, మంత్రులందరూ సమన్వయంతో పనిచేస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారని మంత్రి అడ్లూరి తెలిపారు. ఇలాంటి స్థాయి సమిష్టి పర్యవేక్షణ గతంలో ఎప్పుడూ జరగలేదని ఆయన పేర్కొన్నారు.తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ సహా పలు రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున, అందుకు అనుగుణంగా వసతి, పార్కింగ్, రవాణా సౌకర్యాలను విస్తృతంగా ఏర్పాటు చేయాలని తెలిపారు. పార్కింగ్ విషయంలో వీఐపీలు–సామాన్య భక్తులు అనే తేడా లేకుండా, అందరికీ సమాన సౌకర్యాలు కల్పించాలని స్పష్టం చేశారు. రాష్ట్ర పంచాయితీ రాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) మాట్లాడుతూ, ఈసారి జాతర ఏర్పాట్లకు రూ. 150 కోట్లతో పాటు గద్దెల పునరుద్ధరణ పనులకు రూ. 101 కోట్లు మొత్తం 251 కోట్లను రాష్ట్ర ముఖ్యమంత్రి మంజూరు చేశారని వివరించారు. జాతరకు వచ్చే ప్రతీ భక్తులకు సాఫీగా దర్శనం లభించేలా ప్రాధాన్యత నిస్తున్నట్టు అన్నారు. ఇందుకు గాను ప్రతీ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. రాష్ట్ర స్థాయిలో వివిధ శాఖ కార్యదర్సులు, హెచ్.ఓ.డీ లతో ప్రత్యేకంగా వాట్స్-అప్ గ్రూప్ ను ఏర్పాటు చేసి జాతర నిర్వహణపై ప్రత్యేకంగా పర్యవేక్షించాలని సీతక్క సూచించారు. శానిటేషన్, తాగునీరు, రవాణా, భద్రతాలపై ప్రత్యేకంగా ద్రుష్టి సారించాలని, ప్రధానంగా టాయిలెట్ లను మరింత పెంచాలని కోరారు. జాతర సందర్భంగా గురు, శుక్ర వారాల్లోనే ప్రతి రోజు కనీసం 40 లక్షల మంది భక్తులు ఉంటారని, ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. మేడారం జాతరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2010 నుండి ప్రతీ సంవత్సరం వస్తున్నారని, వచ్చే వందేళ్లకు సరిపడా అభివృద్ధి కార్యక్రమాలకు మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారని సీతక్క గుర్తు చేశారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ కృష్ణ రావు మాట్లాడుతూ, జాతర నిర్వహణ ఏర్పాట్లపై రాష్ట్ర ముఖ్యమంత్రి నిరంతరం పర్యవేక్షిస్తున్నందున అన్ని శాఖల ఉన్నతాధికారులు జాతర పనులకు సకాలంలో పూర్తయ్యేలా ప్రత్యేక దృష్టి సాధించాలని పేర్కొన్నారు. జాతర సందర్బంగా భక్తులకు చేసిన ఏర్పాట్లు, రవాణా, ఇతర సౌకర్యాలు, భక్తులు పాటించాల్సిన సూచనలపై విస్తృత స్థాయిలో సమాచారాన్ని అందించాలని తెలిపారు. మేడారానికి వచ్చే ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ నియంత్రణకుగాను డ్రోన్ లను ఉపయోగించుకోవాలన్నారు. అదేవిధంగా, జాతర సమాచారాన్ని, నియమ నిబంధనలను తెలియచేసే ప్రత్యేక యాప్ ను/ క్యూ.ఆర్ కోడ్ రూపొందించి విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు. పార్కింగ్ ఏరియాలలో కూడా ప్రత్యేకంగా వాటర్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. శానిటేషన్, పరిశుభ్రతపై ప్రత్యేక ద్రుష్టి సాధించాలన్నారు. ప్రస్తుతం మేడారంలో జరుగుతున్న జాతర ఏర్పాట్లు, పురోగతి తదితర విషయాలను తెలియచేసే నివేదికను ప్రతీ రోజూ తమకు సమర్పించాలని సంబంధిత శాఖల కార్యదర్శులను కోరారు. ఈ సందర్బంగా, మేడారం జాతరకు వివిధ శాఖలు చేస్తున్న ఏర్పాట్లు, చేపట్టిన పనులు, వాటి పురోగతి పై ములుగు జిల్లా కలెక్టర్ దివాకర పవర్ పాయింట్ ప్రసెంటేషన్ ద్వారా వివరించారు. మేడారం జాతరపై ములుగు జిల్లా యంత్రాంగం రూపొందించిన ప్రత్యేక లోగో, యాప్, వీడియోలను మంత్రులు సీతక్క, లక్షణ్ కుమార్, సి.ఎస్ రామకృష్ణ రావు లు ఆవిష్కారించారు. -
యూరోపియన్ పార్లమెంట్ డీజీ మాంగోల్డ్తో తెలంగాణ సీఈవో భేటీ
ఎన్నికల సమయంలో తప్పుడు సమాచారం, సోషల్మీడియా ఆధారిత దుష్ప్రచారాన్ని అడ్డుకునే అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సి.సుదర్శన్రెడ్డి.. యూరోపియన్ పార్లమెంట్ డైరెక్టర్ జనరల్ ఫర్ కమ్యూనికేషన్ క్రిస్టియన్ మాంగోల్డ్తో మంగళవారం కీలక భేటీ నిర్వహించారు.ఈయూ ఎన్నికల వ్యవస్థ నిర్మాణం, ప్రజలతో కమ్యూనికేషన్ నిర్వహించే విధానం, ఫేక్ న్యూస్ వ్యాప్తిని నియంత్రించేందుకు యూరోపియన్ యూనియన్ తీసుకుంటున్న సాంకేతిక, విధానపరమైన చర్యలను మాంగోల్ ఈ సందర్బంగా సుదర్శన్ రెడ్డికి వివరించారు. డిజిటల్ వేదికలపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని గుర్తించి తక్షణమే స్పందించే ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థల వివరాలు ఆయనకు తెలిపారు.అనంతరం ఈవో సుదర్శన్రెడ్డి భారత ఎన్నికల విధానాన్ని సమగ్రంగా వివరించారు. వృద్ధులు, దివ్యాంగులు, వలస ఓటర్లు వంటి వర్గాలకు సులభంగా ఓటు హక్కు వినియోగించేలా భారత ఎన్నికల సంఘం అమలు చేస్తున్న నూతన కార్యక్రమాల వివరాలు ఆయనకు తెలిపారు. ఈ వివరాలు తెలుసకున్న మాంగోల్డ్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిర్వహిస్తున్న ఎన్నికల విధానంపై ప్రశంసలు వ్యక్తం చేసినట్లు తెలిపారు.2025 జనవరి నుంచి యూరోపియన్ పార్లమెంట్లో డైరెక్టర్ జనరల్ ఫర్ కమ్యూనికేషన్గా క్రిస్టియన్ మాంగోల్డ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఎన్నికల నిర్వహణలో అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేయడం, డిజిటల్ యుగంలో ఎన్నికల విశ్వసనీయతను పరిరక్షించడమే లక్ష్యంగా సీఈవో నేతృత్వంలోని తెలంగాణ బృందం యూరప్ పర్యటనలో ఉన్నారు. అందులో భాగంగా ఈ భేటీ జరిగినట్లు అధికారులు తెలిపారు. -
'మన శంకర వరప్రసాద్ గారు' కాస్త తగ్గితేనే మంచిది
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాకు మంచి స్పందన వస్తుంది. ఈ మూవీని చిత్ర నిర్మాతలు కూడా చాలా దూకుడుగా ప్రమోట్ చేస్తున్నారు. ఫస్ట్ డే రూ. 84 కోట్ల గ్రాస్ వచ్చినట్లు ప్రకటించారు. సినిమా బాగుందని టాక్ రావడంతో కుటుంబంతో కలిసి సినిమాకు వెళ్దామనుకునే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అయితే, రెండు తెలుగురాష్ట్రాల్లో టికెట్ ధరలు అధికంగా ఉండటం వల్ల ప్రేక్షకులు ఫ్యామిలీతో పాటు కలిసి థియేటర్కు వెళ్లేందుకు జంకుతున్నారు. దీంతో సినిమా కలెక్షన్స్పై ప్రభావం చూపవచ్చని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి.సంక్రాంతి సందర్భంగా చాలా సినిమాలు విడుదల కానున్నాయి. ఇప్పటికే ది రాజా సాబ్ రీవర్షన్ చేయడంతో బాగుందని టాక్ వచ్చింది. ఆపై రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి థియేటర్లోకి వచ్చేసింది. సినిమా బాగుందని టాక్ కనిపిస్తోంది. జనవరి 14న మరో రెండు సినిమాలు విడుదల కానున్నాయి. వీటికి కూడా మంచి టాక్ వస్తే.. టికెట్ ధరలు తక్కువ కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిన్న చిత్రాలవైపే మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. టికెట్ ధరలు తగ్గిన తర్వాత మన శంకర వర ప్రసాద్ గారు చూద్దాంలే అనుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇంతలో పండగ సందడి ముగుస్తుంది కాబట్టి ఆ తర్వాత ఎవరిపనుల్లో వారు పడిపోవడం సహజం. చిరు సినిమాకు మంచి టాక్ ఉంది కాబట్టి టికెట్ ధరల విషయంలో స్వల్ప సర్దుబాటు చేయడం వల్ల సినిమాకు మరింత ప్రయోజనం చేకూరుతుంది. టికెట్ ధరలను తగ్గించడం వల్ల సినిమాకు నష్టం వాటిల్లడం కంటే ఎక్కువ లాభాలు వచ్చే ఛాన్స్ ఉందని సోషల్మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.రెండు రాష్ట్రాల్లో టికెట్ ధరలు ఇలా..'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రానికి జనవరి 19 వరకు తెలంగాణలో టికెట్ ధరలు ఎక్కువగానే ఉంటాయి. ప్రస్తుతం ఉన్న ధరలకు సింగిల్ స్క్రీన్లో రూ.50 (జీఎస్టీతో కలిపి) మల్టీప్లెక్స్లలో రూ.100 (జీఎస్టీతో కలిపి) ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా జనవరి 22 వరకు అధిక ధరలు ఉంటాయి. ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలకు అధనంగా సింగిల్ స్క్రీన్లో రూ.100 (జీఎస్టీతో కలిపి) మల్టీప్లెక్స్లలో రూ.125 (జీఎస్టీతో కలిపి) ఉంటుంది.మన శంకరవరప్రసాద్ గారు బాక్స్ఆఫీస్ బద్దలుకొట్టేసారు 💥💥💥₹84 CRORES+ WORLDWIDE GROSS for#ManaShankaraVaraPrasadGaru (Premieres + Day 1) ❤️🔥❤️🔥❤️🔥ALL TIME RECORD OPENINGS EVERYWHERE 🔥🔥🔥#MegaBlockbusterMSGMegastar @KChiruTweetsVictory @VenkyMama@AnilRavipudi #Nayanthara… pic.twitter.com/qId5atqw8T— Shine Screens (@Shine_Screens) January 13, 2026 -
చైనా మాంజా.. సీపీ సజ్జనార్కు టీహెచ్ఆర్సీ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: చైనా మాంజాపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్కు తెలంగాణ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. అడ్వకేట్ రామరావు ఇమ్మానేని దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. నివేదిక కోరిన కమిషన్.. ఫిబ్రవరి 26వ తేదీలోపు రిపోర్ట్ అందజేయాలని టీహెచ్ఆర్సీ ఆదేశించింది.కాగా, నిషేధిత చైనా మాంజా నగరవాసుల ప్రాణాల మీదకు తెస్తోంది. వీటి వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. మనుషుల ప్రాణాలు పోతున్నాయి. కాగా తాజాగా, సంక్రాంతి పండుగ వేళ నిషేధిత చైనా మాంజా కారణంగా మరొకరు గాయపడ్డారు. ఉప్పల్ స్టేషన్ పరిధిలో చైనా మాంజా తగలడంతో ఏఎస్సై నాగరాజు గొంతు కోసుకుపోయింది. దీంతో తీవ్ర రక్తస్రావమైన ఏఎస్ఐని వెంటనే ఆస్పత్రికి తరలించారు. చైనా మాంజా అమ్మినా.. కొనుగోలు చేసినా.. ఆ మాంజాతో పతంగులు ఎగరేసినవాళ్లపైనా కేసులు పెడతామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. -
ఆ రెండు కేసులపై సజ్జనార్ నేతృత్వంలో సిట్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సీసీఎస్తో పాటు నారాయణపేట జిల్లా మద్దూర్లో నమోదైన కేసుల్లో సిట్ ఏర్పాటైంది. సీపీ సజ్జనార్ ఆధ్వర్యంలో డీజీపీ శివధర్ రెడ్డి సిట్ ఏర్పాటు చేశారు. 8 మంది సభ్యులతో సిట్ ఏర్పాటైంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫోటోలు అసభ్యకరంగా పోస్ట్ చేసిన వ్యవహారంలో తెలంగాణ పబ్లిక్ టివి వాట్సాప్ గ్రూప్లో కావలి వెంకటేష్ పై కేసు నమోదైంది. కాంగ్రెస్ నేత గూళ్ల నరసింహ ఇచ్చిన ఫిర్యాదుపై ఈ నెల 11న మద్దూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా మహిళా ఐఏఎస్ అధికారిని కించపరిచే వార్తలు టెలికాస్ట్ చేసిన వ్యవహరంలో సీసీఎస్లో కేసు నమోదైంది. రెండు తెలుగు న్యూస్ ఛానెల్స్ సహా ఏడు యూట్యూబ్ చానళ్లపై కేసు నమోదైంది. వీరిపై 75, 78, 79, 351(1), 352(2) BNS సెక్షన్లపై కేసు నమోదు చేశారు. ఐఏఎస్ అధికారుల సంఘం కార్యదర్శి జయేష్ రంజన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఈ రెండు కేసుల్లో సిట్ దర్యాప్తు చేయనుంది.సజ్జనార్ నేతృత్వంలో సిట్ సభ్యులుఎన్. శ్వేత, ఐపీఎస్ (జాయింట్ సిపి నార్త్ రేంజ్)యోగేష్ గౌతమ్, ఐసీఎస్ (డీసీపీ, చేవెళ్ల, ఫ్యూచర్ సిటీ)కె. వెంకట లక్ష్మి(డీసీపీ అడ్మిన్ హైదరాబాద్ సిటీ)వి. అరవింద బాబు (డీసీపీ, సైబర్ క్రైమ్స్, హైదరాబాద్ సిటీ)బి. ప్రతాప్ కుమార్ (అదనపు ఎస్పీ, విఅండ్ఇ)జి. గురు రాఘవేంద్ర (ఏసీపీ, సీసీఎస్, హైదరాబాద్ సిటీసి. శంకర్ రెడ్డి (ఇన్స్పెక్టర్, సీఐ సెల్)పి. హరీష్ (ఎస్ఐ, షీ సైబర్ సెల్) -
విజయవాడ హైవేపై ప్రమాదం.. ఆరు కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అబ్దుల్లాపూర్మెట్ ఇనాంగూడ వద్ద కర్రల లోడ్తో వెళ్తున్న ఓ లారీ బోల్తా పడింది. లారీ పల్టీ కొట్టిన కారణంగా రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. కర్రలు మొత్తంగా రోడ్డుపై పడిపోయాయి.ఈ కారణంగా హైవేపై సుమారు ఆరు కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇనాంగూడ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నారు. -
చార్మినార్ చుట్టూ మిలమిల!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ అనగానే గుర్తుకొచ్చే పేరు.. మదిలో మెదిలే చిహ్నం.. ఇరుగు పొరుగు జిల్లాలు, రాష్ట్రాలు, విదేశాల నుంచి హైదరాబాద్కు వచ్చే పర్యాటకులు తప్పనిసరిగా సందర్శించే పర్యాటక ప్రాంతం.. హైదరాబాద్ ఐకాన్గా ప్రసిద్ధి.. అదే చార్మినార్. దీని పరిసరాల్లో పర్యాటకులను ఆకట్టుకునేలా, ప్రత్యేకంగా కనిపించేలా వెలుగుజిలుగులతో స్పెషల్ లైటింగ్ ఏర్పాట్లు చేయాలని అధికారులు నిర్ణయించారు. చారి్మనార్ నాలుగువైపులా ఉన్న వీధిదీపాల స్థానే ఆకర్షణీయంగా కనిపించే విద్యుత్ స్తంభాలు, ప్రకాశవంతమైన స్పెషల్ ఎల్ఈడీ లైటింగ్ ఏర్పాట్లు చేయనున్నారు. చార్మినార్ చుట్టూ, పరిసరాల్లోని పత్తర్ఘట్టి, చార్కమాన్ ప్రాంతాల్లోనూ వీటిని ఏర్పాటు చేసేందుకు పాతబస్తీలో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్న కులీ కుతుబ్షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా) అధికారులు ఆర్ఎఫ్పీ టెండర్లు ఆహ్వానించారు. టెండర్ల దాఖలుకు ఈ నెల 27వ తేదీ వరకు గడువుంది. పాతబస్తీలో వివిధ పనులు చేసేందుకు వెనుకాడుతున్న కాంట్రాక్టు ఏజెన్సీలు ఈ పనులు చేసేందుకు ఏమేర ముందుకొస్తాయో వేచి చూడాల్సిందే. చారి్మనార్ పరిసరాల్లోనే ఆయా ప్రాంతాల ప్రత్యేకతలు తెలిసేలా క్యూఆర్ కోడ్లతో కూడిన డిజిటల్ సైన్బోర్డులు ఏర్పాటు చేసేందుకు కూడా టెండర్లు పిలిచి నెలలు గడుస్తున్నా ఇంతవరకు పనులు మొదలుకాలేదు. -
సీఎం రేవంత్పై వ్యాఖ్యలు.. క్లారిటీ ఇచ్చిన తలసాని
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ను మూడు కార్పొరేషన్లుగా చేయాలని భావించింది. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ను విభజించాలని సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా వ్యతిరేకించారు. అంతటితో ఆగకుండా సికింద్రాబాద్ను ముక్కలు చేయాలని చూస్తే నిన్ను ముక్కలు చేస్తాం అని సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.అనంతరం, తలసాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై తలసాని తాజాగా స్పందించారు. సాక్షితో మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని మాట్లాడుతూ..‘సీఎం రేవంత్పై చేసిన వ్యాఖ్యలను విత్డ్రా చేసుకోవడంతో నాకేమీ అభ్యంతరం లేదు. ఆవేశంలో ఉన్నప్పుడు కొన్ని మాటలు అలా వస్తాయి. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తులను గౌరవించే వ్యక్తిని నేను. సికింద్రాబాద్ ప్రాంతం మా ఎమోషన్. సికింద్రాబాద్ను మార్చట్లేదు అనుకుంటూనే ఇక్కడి ప్రాంతాలన్నీ మల్కాజ్గిరిలో కలుపుతున్నారు. పదవిలో ఉన్నామని ఇష్టమొచ్చినట్లు చేస్తే ప్రజలు బుద్ది చెబుతారు.గతంలో కేసీఆర్ శాస్త్రీయంగా జిల్లాల విభజన చేసి పోలీసు కమిషనరేట్లు చేశారు. ఇప్పుడు ఏ పోలీసు స్టేషన్ ఎవరికీ వస్తుందో అర్ధం కానీ పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పేవి అన్నీ అబద్దాలే. సికింద్రాబాద్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లు మల్కాజిగిరి జోన్లో కలిపింది వాస్తవం కాదా?. 17వ తేదీన నిర్వహించనున్న శాంతి ర్యాలీకి అనుమతి కోసం ఈ నెల 5న హైదరాబాద్ పోలీసు కమిషనర్కు దరఖాస్తు చేస్తే మల్కాజ్గిరి కమిషనర్ అనుమతి ఇవ్వాలంటూ సమాధానం ఇచ్చారు. సికింద్రాబాద్ పరిధిలోని పలు డివిజన్లను మల్కాజిగిరి జోన్ పరిధిలోని బోయిన్పల్లి సర్కిల్లోకి చేర్చారు. భవిష్యత్ తరాలకు నష్టం జరగకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత మన అందరిది. మన అస్తిత్వం, ఆత్మగౌరవంపై జరుగుతున్న దాడిని ప్రతిఘటించాలి. ఈ నెల 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి శాంతి ర్యాలీని ఎంజీ రోడ్లోని గాంధీ విగ్రహం వరకు సాగుతుంది. భారీ ర్యాలీలో అన్ని సంఘాలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి’ అని పిలుపునిచ్చారు. -
చైనా మాంజా.. ASI మెడకు తీవ్ర గాయం
సాక్షి, ఉప్పల్: హైదరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నా నిషేధిత చైనా మాంజా వాడకం మాత్రం తగ్గడం లేదు. సంక్రాంతి నేపథ్యంలో వరుస మాంజా ప్రమాదాలు.. వాహనదారులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ఉప్పల్లో మాంజా తగిలి.. ఏఎస్ఐ మెడకు తీవ్ర గాయమైంది. దీంతో, అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై వివరాల మేరకు.. నగరంలోని నల్లకుంట పోలీసు స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ నాగరాజు మాంజా కారణంగా గాయపడ్డారు. ఎగ్జిబిషన్ డ్యూటీ కోసం ఉప్పల్లోని తన ఇంటి నుంచి బయలుదేరిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఉప్పల్ పీఎస్ పరిధిలోని సౌత్ స్వరూప్ నగర్ వద్ద మాంజా ఆయన మెడకు చుట్టుకుని గొంతుకు తీవ్ర గాయామైంది. వెంటనే ఆయనను ఎల్బీనగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఇక, అంతకుముందు.. హైదరాబాద్లోని గచ్చిబౌలి నుంచి హఫీజ్పేటకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న చైతన్య అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ చేతికి మాంజా చుట్టుకోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఆయన చేయి తెగింది. గమనించిన స్థానికులు వెంటనే బాధితుడిని మాదాపూర్లోని ఆసుపత్రికి తరలించారు. అయితే, చైనా మాంజాను ప్రభుత్వం నిషేధించినప్పటికీ, అవగాహన లోపంతో కొందరు వినియోగిస్తుండటంతో ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు. పతంగులు ఎగురవేసే సమయంలో మాంజా తెగి రోడ్లపై గాలిలో వేలాడుతూ వాహనదారులకు ముప్పుగా మారుతోంది. చైనా మాంజా కారణంగా గతంలో పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. -
సీపీఎం రామారావు హత్య కేసు.. కాంగ్రెస్ నేతలకు పాలిగ్రాఫ్ టెస్టు
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో సంచలనం సృష్టించిన సీపీఎం సీనియర్ నాయకుడు సామినేని రామారావు హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రామారావు హత్య కేసులో ఆరుగురు కాంగ్రెస్ నేతలకు పోలీసులు పాలిగ్రాఫ్ టెస్టు చేస్తున్నారు. ఈ హత్య కేసులో పాలిగ్రాఫ్ టెస్టుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో పోలీసులు విచారణ జరుపుతున్నారు.కాగా, పాలిగ్రాఫ్ టెస్ట్ నిమిత్తం కాంగ్రెస్ నాయకులు బొర్రా ప్రసాదరావు, కాండ్ర పిచ్చయ్య, మద్దినేని నాగేశ్వరరావు, కంచుమర్తి రామకృష్ణ, కొత్తపల్లి వెంకటేశ్వరరావు, గుగ్గిళ్ళ రాధాకృష్ణ బెంగళూరుకు వెళ్లారు. ఇక, గతేడాది అక్టోబర్ 31న చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో సీపీఎం నేత సామినేని రామారావు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. మొదటి నుంచి రామారావు హత్య కేసులో కాంగ్రెస్ నేతల ప్రమేయం ఉందని సీపీఎం నేతలు ఆరోపిస్తున్నారు.కాంగ్రెస్ నాయకులే రాజకీయ కక్షతో రామారావును అంతమొందించారని ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. 70 రోజులు దాటినా.. కేసులో పురోగతి లేకపోవడంతో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఈనెల 5న శాసనసభలో ఈ విషయాన్ని లేవనెత్తారు. ఈ నేపథ్యంలో రామారావు హత్య కేసులో 24 మందికి పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని ఖమ్మంలో మూడో అదనపు ప్రధాన న్యాయమూర్తిని పోలీసులు కోరినట్లు తెలిసింది. వారిలో రామారావు కుటుంబీకులు సైతం ఉన్నట్లు సమాచారం. పాలిగ్రాఫ్ అనేది ఒక వ్యక్తి నిజం చెబుతున్నాడా..? అబద్ధమాడుతున్నారా..? అనే విషయాన్ని అంచనా వేయటానికి శాస్త్రీయంగా చేసే పద్ధతి. 24 మందికి న్యాయస్థానం నోటీసులు ఇవ్వగా ఆరుగురు మాత్రమే సమ్మతి తెలిపారు. -
దద్దరిల్లిన పంతంగి టోల్ప్లాజా.. మరో రికార్డు!
సాక్షి, యాదాద్రి: సంక్రాంతి నేపథ్యంలో చౌటుప్పల్ (మం) పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. టోల్ ప్లాజా నుంచి సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈసారి సంక్రాంతికి నాలుగు రోజులుగా రికార్డు స్థాయిలో వాహనాల రద్దీ పెరిగింది. హైదరాబాద్ టూ విజయవాడ నేషనల్ హైవేపై భారీ సంఖ్యలో వాహనాలు వెళ్లినట్టు టోల్ సిబ్బంది చెబుతున్నారు.మరోవైపు.. కొందరు పోకిరీలు టోల్ ప్లాజాల వద్ద విచ్చలవిడిగా అత్యవరస సైరన్స్(పోలీస్, అంబులెన్స్) దుర్వినియోగం చేస్తున్నారు. సైరన్తో న్యూసెన్స్ చేస్తున్నారు. టోల్ రుసుము తప్పించుకునేందుకు కొందరు పోకిరీలు ఇలా సైరన్ మోగిస్తూ హంగామా చేస్తున్నట్టు టోల్ సిబ్బంది గుర్తించారు. వీఐపీల్లా బిల్డప్ ఇస్తూ టోల్ ప్లాజా నిర్వాహకులకు టోకరా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సైరన్ చప్పుడుతో మిగతా వాహనదారులను హడలెత్తిస్తున్నారు.మూడు రోజులుగా సైరన్లతో పంతంగి, కొర్లపహాడ్ టోల్ గేట్లను దాటుకుంటూ వందలాది వాహనాలు వెళ్లినట్టు సిబ్బంది చెబుతున్నారు. ఫలానా ఎమ్మెల్యే బామ్మర్దిని, మంత్రి గారి బంధువును అంటూ ఫేక్ వీఐపీలు టోల్ సిబ్బందిని బురిడీ కొట్టిస్తున్నారు. దీంతో, పోకిరీల సైరన్స్ పోలీసులకు సవాల్గా మారాయి. -
Nalgonda: వామ్మో.. పూర్తిగా తిన్న తర్వాత..
సాక్షి, నల్గొండ జిల్లా: నల్గొండ పట్టణంలోని ప్రసాద్ ఉడిపి హోటల్ దారుణం జరిగింది. సాంబారులో జెర్రీ కనిపించింది. పూర్తిగా తిన్న తర్వాత సాంబారులో జెర్రీని గమనించిన ఓ వ్యక్తి.. హోటల్ సిబ్బందిని ప్రశ్నించగా.. పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. భారీగా రేట్లు తీసుకోవడమే కాదని.. ప్రజల ప్రాణాలను లెక్కలోకి తీసుకోవాలని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.ఈ తరహా ఘటనలు వరుసగా చోటు చేసుకోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇటీవల విజయవాడ సూర్యారావుపేటలోని కాకినాడ సుబ్బయ్య హోటల్ భోజనంలో జెర్రి రావడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఫుడ్ అండ్ అడల్ట్ట్రేషన్ కేసు నమోదు చేసి హోటల్ను సీజ్ చేశారు.మరోవైపు, తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రెస్టారెంట్, హోటల్ నిర్వాహకుల నిర్వాకాలు వెలుగులోకి వస్తున్నాయి. రోజుల తరబడి నిల్వచేసిన పదార్థాలు.. కుళ్లిన ఆహారాన్ని నిబంధనలు అతిక్రమించి విక్రయిస్తున్నారు. అధికారుల తనిఖీల్లోనూ వాస్తవాలు బట్టబయలవుతున్నాయి. కల్తీ, కుళ్లిన ఆహార పదార్థాలు తిని ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. -
సెలవుపై వెళ్లిన సీపీ తిరిగి వస్తారా..?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ పోలీస్ కమిషనర్ సీపీ గౌస్ ఆలంకు కోపమొచ్చింది. తన కిందిస్థాయి సిబ్బంది విషయంలో చర్యలు తీసుకుంటుంటే రాజకీయ నేతలు అడ్డుపడటంపై తీవ్ర అసహనానికి గురయ్యారు. ఉన్నతాధికారులకు చెప్పి సెలవుపై వెళ్లిపోవడం డిపార్ట్మెంట్లో చర్చనీయాంశంగా మారింది. డిపార్ట్మెంట్ అంతర్గత వ్యవహారంలో రాజకీయ జోక్యంతో కమిషనరేట్లో సీపీ.. వ్యవహారానికి కేంద్రబిందువుగా నిలిచిన ఎస్సై నలిగిపోతున్నారు. సెలవుపై వెళ్లిన సీపీ మళ్లీ వస్తారా..? లేక ఆయనపై బదిలీ వేటు వేస్తారా..? అనే విషయం హాట్టాపిక్గా మారింది. రాష్ట్రంలో ఇటీవల ఓ ఐఏఎస్ అధికారి విషయంలో సాగిన ప్రచారం దుమారం రేపిన విషయం మరువకముందే మరో సివిల్ సర్వెంట్ రాజకీయ నేతల కారణంగా మనస్తాపానికి గురవడం గమనార్హం.అసలేం జరిగింది?కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని ఓ స్టేషన్కు ఎస్హెచ్వోగా ఉన్న ఎస్సైపై ఫిర్యాదులు రావడంతో సీపీ విచారణకు ఆదేశించారు. ఎస్సైకి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు దొరకనప్పటికీ.. క్రమశిక్షణ ఉల్లంఘన కింద అటాచ్ చేసేందుకు సీపీ సిద్ధపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న ఓ అధికారపార్టీ నేత తాను పోస్టింగ్ ఇప్పించుకున్న ఎస్సైపై చర్యలు తీసుకోవద్దని హుకూం జారీ చేశారు. నొచ్చుకున్న సీపీ ఎస్సైని అటాచ్ చేశారు. ఇది తెలిసిన నేత.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెద్ద దిక్కు అయిన తూర్పు నేతను కలిశారు. ఎస్సైపై చర్యల విషయంలో సీపీకి.. డీజీపీకి ఫోన్ చేసి అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. తమ అంతర్గత విషయంలో సిబ్బందిపై చర్యలు తీసుకుంటుంటే అంతమంది అడ్డుపడటంపై సీపీ తీవ్రస్థాయిలో నొచ్చుకున్నారు. ఎస్సైని సస్పెండ్ చేసి సెలవుపై వెళ్లిపోయారు. తన అటాచ్మెంట్ విషయంలో రాజకీయ నేతలు జోక్యం చేసుకుని సస్పెండ్ అయ్యేలా చేయడంపై ఎస్సై మదనపడుతున్నారు. తనకు మద్దతుగా వచ్చి ఇప్పుడు తన కెరీర్నే ప్రమాదంలో పడేసిన నేతల తీరును చూసి ఎస్సై వణికిపోతున్నారు.డిపార్ట్మెంట్లో జోరుగా చర్చఅంతర్గత సిబ్బందిని క్రమశిక్షణలో ఉంచాలనుకున్న సీపీ విధులకు అడ్డు తగిలిన నేత అంతటితో ఆగి ఉంటే వ్యవహారం ఇంతదూరం వచ్చి ఉండేది కాదు. తన మాట కాదన్నాడన్న అహంతో పెద్దనేత వద్దకు వెళ్లి సీపీపై ఫిర్యాదు చేయడం.. ఆయన సీరియస్ అవడంతో ఎస్సై సస్పెన్షన్కు దారి తీసింది. ఈ వ్యవహారంపై ఇప్పుడు డిపార్ట్మెంట్లో జోరుగా చర్చ సాగుతోంది. తమ విషయాల్లో రాజకీయ నేతలు జోక్యం చేసుకుని, విషయాన్ని పెద్దది చేయడం నేతలకు తగదని హితవు పలుకుతున్నారు. అటాచ్మెంట్తో పోయే వ్యవహారాన్ని సస్పెన్షన్ వరకు తీసుకొచ్చి ఎస్సై భవిష్యత్తును గందరగోళంలో పడేసిన రాజకీయ నేతలపై మండిపడుతున్నారు. రాజకీయ జోక్యంతో ఇటీవల ఐఏఎస్ అధికారి, తాజాగా కరీంనగర్ సీపీ మనస్తాపానికి గురైన తీరును చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
త్రిముఖ వ్యూహం
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డి జిల్లాల పర్య టన ఈ దఫా త్రిముఖ వ్యూహంతో ముందుకు సాగనుంది. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో ప్రచారం, పలుచోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు ఉపాధి పథకం నుంచి మహాత్మాగాంధీ పేరును తొలగించడానికి నిరసనగా సభలు నిర్వహిస్తారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాల వారీగా రెండు దఫా ల పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. 16 నుంచి షురూ తొలి విడతలో ఈనెల 16, 17, 18 తేదీల్లో ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాలకు వెళ్తారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడంతోపాటు పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తారు. నిర్మల్, మహబూబ్నగర్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలకు హాజరవుతారు. 19వ తేదీన మేడారం వెళ్తారు. అదే రోజు సింగపూర్, అమెరికా దేశాల పర్యటనకు వెళ్తారు. ఫిబ్రవరి 1న హైదరాబాద్ తిరిగి వస్తారు. మరుసటి రోజు వీలును బట్టి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రెండో విడతలో ఆరు రోజులు ఫిబ్రవరి 3 నుంచి మలి విడత జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడతారని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు ఖరారైన షెడ్యూల్ ప్రకారం ఆయన ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ఆరు రోజుల పాటు ఆరు ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తారు. వరుసగా నల్లగొండ, కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్, మెదక్, నిజామాబాద్ జిల్లాలకు వెళతారు. తొలి దఫా తరహాలోనే వీలును బట్టి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు. కార్యకర్తలతో సమావేశాలు, కార్నర్ మీటింగ్ల ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఆయా ప్రాంతాల్లో బహిరంగ సభలకు హాజరవుతారు.ఇక ఉపాధి హామీ పథకం విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా పార్టీ ఆధ్వర్యంలో బహిరంగ సభలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభలను విజయవంతం చేసే బాధ్యతను స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఆయా జిల్లాల మంత్రులు, ఇన్చార్జి మంత్రులకు టీపీసీసీ అప్పగించనుంది. కాగా చివరి రోజు, రెండు రోజుల్లో సీఎం వెళ్లే మెదక్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన షెడ్యూల్ ఇంకా పూర్తి స్థాయిలో ఖరారు కావాల్సి ఉంది. -
మీ అధికారులది వక్రబుద్ధి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో భూనిర్వాసితులకు పరిహారం చెల్లించే విషయంలో రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారుల తీరుపై సుప్రీంకోర్టు నిప్పులు చెరిగింది. రైతుల పొట్టకొట్టేలా వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే హైకోర్టుకు కూడా విసుగొచ్చినట్లుందని వ్యాఖ్యానించింది. అధికారుల తీరును తప్పుబడుతూనే.. మూడున్నర దశాబ్దాలుగా న్యాయం కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఊరటనిచ్చేలా సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ‘మీ డిపార్ట్మెంట్లో కొంతమంది నిజాయితీ లేని అధికారులు ఉన్నారు. వారు ఏదో వ్యక్తిగత ప్రయోజనం ఆశించి, ఉద్దేశపూర్వకంగానే నిధులు విడుదల కాకుండా అడ్డుపడుతున్నారు. ఇది కచ్చితంగా దురుద్దేశంతో చేస్తున్న పనే. అధికారుల మోసపూరిత వైఖరి వల్లే పేదలకు అన్యాయం జరుగుతోంది’అంటూ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు నేపథ్యం ఇదీ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం జిల్లాలో సాగునీటి కాలువ నిర్మాణం కోసం 1989 జనవరి 2న జొన్నలగడ్డ కృపమ్మ, ఇతర రైతుల నుంచి ప్రభుత్వం భూమిని స్వా«దీనం చేసుకుంది. అయితే, ఆ తర్వాత ఏళ్ల తరబడి జాప్యం చేసి 1997లో భూసేకరణ ప్రక్రియను రికార్డుల్లో చూపించారు. ఇవి అసైన్డ్ భూములని, రైతులు సాగు చేయడం లేదని సాకులు చెబుతూ అధికారులు పరిహారం ఎగ్గొట్టే ప్రయత్నం చేశారు. దీనిపై బాధితులు హైకోర్టును ఆశ్రయించగా.. వారికి పరిహారం చెల్లించాల్సిందేనని తీర్పు వచ్చింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ, పరిహారం చెల్లించకుండా ఉండేందుకు ఖమ్మం జిల్లా కలెక్టర్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై సోమవారం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగీ్చలతో కూడిన ధర్మాసనం విచారించింది. భూమి లాక్కున్నాక సాకులు చెబితే కుదరదు: సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘మేము 1997లో భూములను వెనక్కి తీసుకున్నాం. అవి అసైన్డ్ భూములు కావడంతోపాటు, అప్పట్లో అవి సాగులో లేవు. అందుకే పరిహారం పెండింగ్లో ఉంది’అని వివరించే ప్రయత్నం చేశారు. ఈ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. ‘‘మీరు 1989లోనే భూమిని భౌతికంగా స్వాధీనం చేసుకున్నారు. భూసేకరణ చట్టం కింద ఒకసారి భూమిని తీసుకున్నాక.. అది సాగులో ఉందా? లేదా? అసైన్డ్ భూమా? అనేది అనవసరం. ‘యాజ్ ఈజ్ వేర్ ఈజ్’పద్ధతిలో పరిహారం చెల్లించాల్సిందే. భూమి తీసుకున్నాక.. ఇప్పుడు సాగులో లేదు కాబట్టి డబ్బులివ్వం అంటే కుదరదు’’అని జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. కోర్టులంటే లెక్కలేదా? ‘ఈ కేసులో హైకోర్టులో ఇప్పటికే రెండు రౌండ్ల విచారణ నడిచింది. కోర్టు ధిక్కరణ పిటిషన్లు వేసిన ప్రతిసారీ.. డబ్బు డిపాజిట్ చేస్తామని అధికారులు కోర్టులకు లిఖితపూర్వక హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ చిల్లిగవ్వ విదిల్చలేదు. కోర్టులంటే మీ అధికారులకు గౌరవం లేదు’అని ధర్మాసనం మండిపడింది. భూమిని స్వా«దీనం చేసుకున్న తేదీ (జనవరి 2, 1989) నుంచే పరిహారం లెక్కించాలని ఆదేశించింది. పాత చట్టం ప్రకారం నిర్ణయించిన పరిహారానికి సాంత్వన పరిహారంతోపాటు, ఏటా 15 శాతం వడ్డీ కలిపి చెల్లించాలని స్పష్టం చేసింది. మొత్తం బకాయిలను 4 వారాల్లోగా సంబంధిత రిఫరెన్స్ కోర్టులో ప్రభుత్వం డిపాజిట్ చేయాలని గడువు విధించింది. డబ్బు డిపాజిట్ చేసిన వెంటనే రైతులు ఆ మొత్తాన్ని ఎలాంటి షరతులు లేకుండా విత్డ్రా చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ పరిహారం తీసుకున్నంత మాత్రాన రైతులు హక్కులు కోల్పోరని, మరింత పరిహారం కోసం చట్టపరంగా పోరాడే హక్కు వారికి ఉంటుందని తేల్చి చెప్పింది. -
‘అపెక్స్’కు కృష్ణా వివాదం!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల కేటాయింపు అంశం కృష్ణా ట్రిబ్యునల్–2 పరిధిలో అపరిష్కృతంగా ఉన్న నేపథ్యంలో ఆలోగా తాత్కాలిక పంపిణీ వివాదాన్ని పరిష్కరించే బాధ్యతను అపెక్స్ కౌన్సిల్కు అప్పగించేలా కేంద్ర జలశక్తి శాఖను కోరుతూ మరోసారి తీర్మానం చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు తెలంగాణ ప్రభుత్వం సూచించింది. త్వరలో జరగనున్న 21వ కృష్ణా బోర్డు సమావేశం ఎజెండాలో చేర్చాల్సిన అంశాలను ప్రతిపాదిస్తూ రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా తాజాగా బోర్డుకు లేఖ రాశారు.ఏపీ, తెలంగాణ మధ్య 66:34 నిష్పత్తిలో కృష్ణా జలాల తాత్కాలిక సర్దుబాటును కొనసాగించాలని 19వ కృష్ణా బోర్డు సమావేశంలో నిర్ణయించినట్లు మినట్స్లో రికార్డు చేయడంపై లేఖలో తెలంగాణ అభ్యంతరం తెలిపింది. 50:50 నిష్పత్తిలో తాత్కాలిక పంపకాలు జరపాలని ఆ సమావేశంలో తాము గట్టిగా పట్టుబట్టామని గుర్తుచేసింది. కృష్ణా జలాల తాత్కాలిక పంపిణీ వివాదాన్ని అపెక్స్ కౌన్సిల్కు అప్పగించాలని 17వ బోర్డు సమావేశంలో తీర్మానించారని.. 21వ బోర్డు భేటీలో మళ్లీ తీర్మానించాలని ప్రతిపాదించింది. తెలంగాణ ప్రతిపాదించిన ఎజెండాలోని ఇతర కీలకాంశాలు.. పోతిరెడ్డిపాడు, బనకచర్లపై టెలీమెట్రీలు... రెండో విడత కింద ప్రతిపాదించిన టెలిమెట్రీ కేంద్రాలతోపాటు మూడో విడత కింద మరో 11 చోట్ల వాటిని ఏర్పాటు చేయాలి. ఇందుకోసం తెలంగాణ రూ. 4.15 కోట్లను కృష్ణా బోర్డుకు విడుదల చేసినా ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం బాధాకరం. శ్రీశైలం కుడి ప్రధాన కాల్వకు ఏపీ లైనింగ్ పనులు చేస్తుండటంతో పోతిరెడ్డిపాడు నుంచి ఆ రాష్ట్రం భారీ మొత్తంలో తరలించుకునే నీటిని కచి్చతంగా లెక్కించడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో పోతిరెడ్డిపాడు, బనకచర్ల కాంప్లెక్స్ అవుట్లెట్ల వద్ద టెలిమెట్రీ కేంద్రాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. పోలవరం విస్తరణను అడ్డుకోవాలి.. పోలవరం–నల్లమల్లసాగర్ అనుసంధాన ప్రాజెక్టు డీపీఆర్ తయారీకి ఏపీ టెండర్లు నిర్వహించకుండా అడ్డుకోవాలి. ప్రాజెక్టు ప్రీ–ఫీజిబులిటీ నివేదికను బోర్డు పరిశీలించరాదు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై అభ్యంతరాలను కృష్ణా బోర్డు, గోదావరి బోర్డు, కేంద్ర జలసంఘానికి తెలియజేశాం. శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు, హెచ్ఎన్ఎస్ఎస్, ఎస్ఆర్బీసీ, జీఎన్ఎస్ఎస్, తెలుగు గంగ, ఎస్కేప్ చానల్ నిప్పుల వాగు ద్వారా ఏపీ బేసిన్ వెలుపలి ప్రాంతాలకు తరలిస్తున్న జలాలను ఆ రాష్ట్ర వాటాల కింద లెక్కించాలి. శ్రీశైలానికి అత్యవసర మరమ్మతులు.. శ్రీశైలం జలాశయం ప్లంజ్పూల్కు ఏర్పడిన భారీ గుంతతో డ్యామ్ భద్రత ప్రమాదంలో పడిందని నిపుణుల కమిటీ నివేదిక ఇచి్చంది. రెండేళ్లు పూర్తయినా ఏపీ మరమ్మతులు చేపట్టలేదు. తక్షణమే డ్యామ్కు మరమ్మతులు నిర్వహించి పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలి. పనులను కృష్ణా బోర్డు పర్యవేక్షించాలి. పూర్తిగా శిథిలావస్థకు చేరిన ఆర్డీఎస్ ఆనకట్టకు మరమ్మతులు నిర్వహించాలి. ఆర్డీఎస్ కుడికాల్వ పనులు చేపట్టకుండా ఏపీని అడ్డుకోవాలి. ఎన్జీటీ తీర్పును ఉల్లంఘించి రాయలసీమ ఎత్తిపోతల పనుల విషయంలో ఏపీ ముందుకు పోతోంది. వాస్తవ పరిస్థితిపై బోర్డు నివేదిక తెప్పించుకోవాలి. అనుమతి లేకుండా ఏపీ చేపట్టిన ఎస్ఆర్ఎంసీ కాల్వ లైనింగ్ పనులపై నివేదిక కోరాలి. వచ్చే ఏడాది వాడుకోవడానికి అవకాశం ఇవ్వాలి నాగార్జునసాగర్ ఎడమ కాల్వలో నీటి నష్టాలను లెక్కిస్తేనే కాల్వ ద్వారా ఏపీ, తెలంగాణ వాడుకుంటున్న నీళ్లపై కచి్చతమైన గణాంకాలు తెలుస్తాయి. నష్టాలను లెక్కించడానికి గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు దీనిపై తక్షణమే కమిటీ ఏర్పాటు చేయాలి. తెలంగాణ నీళ్లను పొదుపుగా వాడుకొని వచ్చే నీటి సంవత్సరంలోని ప్రారంభ మాసాల అవసరాల కోసం నాగార్జునసాగర్ జలాశయంలో నిల్వ చేస్తోంది. ఇలా ఒక సంవత్సరంలో పొదుపు చేసిన జలాలను రాష్ట్రం వచ్చే ఏడాది వాడుకోవడానికి వీలు కల్పించాలి. తాగునీటి కోసం వాడుకుంటున్న జలాల్లో 20 శాతాన్నే లెక్కించి మిగిలిన 80 శాతాన్ని రిటర్న్ ఫ్లోగా పరిగణిస్తూ మినహాయింపు కల్పించాలి. సాగర్ను తెలంగాణకు అప్పగించాలి నాగార్జునసాగర్ నిర్వహణ బాధ్యతలను పూర్తిగా తెలంగాణకు తిరిగి అప్పగించాలి. 2023 నవంబర్ 29న ఏపీ బలవంతంగా సాగర్పై చొచ్చుకు వచ్చి కుడి రెగ్యులేటర్ ద్వారా నీళ్లను విడుదల చేసుకుంది. డ్యామ్ సేఫ్టీ చట్టంలోని సెక్షన్ 16 (1) ప్రకారం సాగర్ నిర్వహణ, పర్యవేక్షణ తెలంగాణ పరిధిలోకే వస్తుంది. మరమ్మతులు నిర్వహించేందుకు తెలంగాణ అధికారులను అనుమతించకపోవడంతో డ్యామ్ భద్రతకు తీవ్ర ముప్పు పొంచి ఉంది. -
రాష్ట్ర ఉద్యోగులకు 3.64% డీఏ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు సంక్రాంతి సందర్భంగా శుభవార్త చెప్పింది. పెండింగ్లో ఉన్న ఐదు డీఏలకుగాను గతంలో ప్రకటించినట్లుగానే ఒక డీఏను మంజూరు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 3.64 శాతం డీఏను మంజూరు చేసింది. ఈ నెల వేతనంతోపాటు పెంచిన డీఏను ఫిబ్రవరిలో చెల్లింపులు చేయనుంది. ప్రస్తుతం సర్విసులో ఉన్న ఉద్యోగులకు డీఏ బకాయిలను జీపీఎఫ్లో జమ చేయనున్నారు.పెన్షనర్లకు మాత్రం 01–07–2023 నుంచి 31–12.2025 వరకు చెల్లించాల్సిన డీఆర్ బకాయిలను 30 సమాన వాయిదాల్లో చెల్లించనున్నట్లు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా సోమవారం జారీచేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ట్రెజరీ ద్వారా వేతనాలు పొందని వారికి జిల్లా పరిషత్, మునిసిపాలిటీల పెన్షన్ ఫండ్స్లో జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. పెంచిన డీఏ ప్రకారం రాష్ట్ర ఖజానాపై ఏటా దాదాపు రూ.2,180 కోట్ల భారం పడుతుందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం డీఏను పెంచడంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. -
సివిల్ దావా వేయండి
సాక్షి, న్యూఢిల్లీ: గోదావరిపై ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పోలవరం–నల్లమలసాగర్ సహా ఇతర ప్రాజెక్టుల విషయంలో అభ్యంతరం తెలుపుతూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలను ఆర్టీకల్ 32 (రిట్ పిటిషన్) కింద విచారించలేమని.. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరపాలంటే అన్ని సాక్ష్యాధారాలతో కూడిన ‘సివిల్ సూట్’దాఖలు చేసుకోవాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసింది. ఈ మేరకు కొత్తగా దావా వేసుకోవడానికి స్వేచ్ఛనిస్తూ ప్రస్తుత పిటిషన్పై విచారణను భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం ముగించింది. దీంతో తెలంగాణ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. ఏపీ వాటా 484 టీఎంసీలే.. అంతకు మించి వాడకూడదు: సింఘ్వీ అంతకుముందు సాగిన విచారణలో ఆద్యంతం తెలంగాణ తరఫు న్యాయవాది సింఘ్వీ ఏపీ తీరుపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ‘బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం గోదావరిలో ఏపీకి కేటాయించింది 484 టీఎంసీలే. అది వరద నీరైనా సరే అంతకుమించి వాడుకునే హక్కు ఆ రాష్ట్రానికి లేదు. కానీ ఏపీ ప్రభుత్వం 484 టీఎంసీలకు మించి నీటిని మళ్లించుకోవడం కోసం భారీ ఎత్తున ప్రాజెక్టులు నిర్మిస్తోంది. బచావత్ అవార్డు 1979–80 ప్రకారం వరద జలాల పేరుతోనైనా సరే దీనికి మించి ఒక్క చుక్క నీటిని మళ్లించినా అది చట్టవిరుద్ధమే. ఇది ఏపీ పునర్విభజన చట్టంలోని నిబంధనలకు, గోదావరి బోర్డు మార్గదర్శకాలకు విరుద్ధం’అని సింఘ్వీ బలమైన వాదనలు వినిపించారు. వాస్తవాలు తేలాల్సిందే: సీజేఐ సింఘ్వీ వాదనలను విన్న ధర్మాసనం జోక్యం చేసుకుంటూ అంతర్రాష్ట్ర జల వివాదాల్లో ఆర్టీకల్ 32 కింద నేరుగా రిట్ పిటిషన్ను విచారించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ‘ఇది కేవలం చట్టపరమైన అంశం కాదు. క్షేత్రస్థాయి వాస్తవాలతో ముడిపడి ఉంది. ఎవరు ఎంత నీటిని వాడుతున్నారు? ప్రాజెక్టుల సామర్థ్యం ఎంత? అన్నది తేలాలి. సాక్షులను విచారించాలి. ఇందులో మహారాష్ట్ర, కర్ణాటక ప్రమేయం కూడా ఉంటుంది కాబట్టి రిట్ పిటిషన్ ద్వారా ఇది సాధ్యం కాదు. మీరు సివిల్ సూట్ దాఖలు చేయడమే సరైన మార్గం’అని ధర్మాసనం సూచించింది. అందుకు వీలుగా ప్రస్తుత పిటిషన్ను డిస్మిస్ చేస్తామని పేర్కొంది. దీనిపై సింఘ్వీ స్పందిస్తూ ‘ఇది రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న అత్యంత సున్నితమైన రాజకీయ, జల వివాదం. డిస్మిస్ అనే పదం వాడితే మా వాదనలో పస లేకనే కోర్టు కొట్టేసిందన్నట్లుగా తప్పుడు సంకేతాలు వెళ్తాయి. దయచేసి ఆ పదాన్ని వాడొద్దు. పిటిషన్ను ఉపసంహరించుకుంటాం.. ‘డిస్పోజ్’చేసినట్లు ఉత్తర్వులివ్వండి’అని కోరారు. తెలంగాణ విజ్ఞప్తిని మన్నించిన ధర్మాసనం.. పిటిషన్ను డిస్మిస్ చేయకుండా ఉపసంహరణకు అనుమతిస్తూ ‘డిస్పోజ్’చేసింది. చట్టప్రకారం తగిన పరిష్కారం కోసం, లేవనెత్తిన అన్ని అభ్యంతరాలతో ‘సివిల్ సూట్’వేసుకునేందుకు తెలంగాణకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ పిటిషన్లో లేవనెత్తిన అన్ని అభ్యంతరాలను సివిల్ సూట్లోనూ ప్రస్తావించవచ్చని స్పష్టం చేసింది. -
ముందే ‘సెట్’ చేద్దాం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఇంజనీరింగ్ ఉమ్మడి ప్రవేశపరీక్ష నోటిఫికేషన్ ఇంకా విడుదల కానప్పటికీ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు మాత్రం ప్రవేశాల కోసం ఇప్పట్నుంచే హడావుడి చేస్తున్నాయి. అటానమస్, డీమ్డ్ యూనివర్సిటీలు ఇంజనీరింగ్ సెట్తో పనిలేకుండానే సీట్లు ఇస్తామంటున్నాయి. అనుబంధ గుర్తింపుతో నడిచే కాలేజీలు మాత్రం యాజమాన్య కోటా సీట్ల భర్తీపై దృష్టి పెడుతున్నాయి. టాప్–10 కాలేజీలు మినహా అన్ని కాలేజీలూ ఇదే దారిలో వెళ్తున్నాయి. ఇంజనీరింగ్ ఉమ్మడి ప్రవేశపరీక్ష మేలో జరుగుతుంది. మే నెలాఖరులో ఫలితాలు వెలువడతాయి. సాధారణంగా ఆగస్టులో ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఇదే క్రమంలో యాజమాన్య కోటా సీట్ల భర్తీకి అనుమతినిస్తారు. ప్రైవేటు కాలేజీలు మాత్రం ఈ షెడ్యూల్కు విరుద్ధంగా అనధికార అడ్మిషన్లు కొనసాగిస్తున్నాయి. విద్యార్థుల జాబితా సేకరణ ప్రతి ఇంటర్ కాలేజీ నుంచి సెకండియర్ విద్యార్థుల వివరాలను ఆయా ఇంజనీరింగ్ కాలేజీల తరఫున కన్సల్టెన్సీలు, పీఆర్వోలు సేకరిస్తున్నారు. అంతర్గతంగా జరిగే పరీక్షల్లో వారి మార్కులను పరిశీలిస్తున్నారు. జేఈఈ, ఇంజనీరింగ్ కోచింగ్ కోసం నిర్వహించే పరీక్షల్లో వచ్చే మార్కులను పరిశీలిస్తున్నారు. దీని ఆధారంగా విద్యార్థులను కేటగిరీలుగా విభజిస్తున్నారు. టాప్ ర్యాంకులు వస్తాయనుకునే విద్యార్థులను మినహాయించి ద్వితీయశ్రేణి విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. కోరుకున్న బ్రాంచీలో సీట్లు ఇస్తామని చెబుతున్నారు. డీమ్డ్, అటానమస్ కాలేజీలు మరో అడుగు ముందుకేస్తున్నాయి. ఇంజనీరింగ్ ఫైనలియర్లో క్యాంపస్ నియామకాలు ఉంటాయని.. ఉద్యోగం కచ్చితంగా లభిస్తుందని చెబుతున్నాయి. కొన్ని సంస్థలతో ఉపాధికి అవసరమైన నైపుణ్య శిక్షణ ఇప్పిస్తామంటున్నాయి. రంగంలోకి కన్సల్టెన్సీలు పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్లు, కన్సల్టెన్సీ సంస్థలు విద్యార్థుల తల్లిదండ్రులకు మెసేజ్లు పంపుతూ ముందే సీటు బుక్ చేసుకోవాలని కోరుతున్నాయి. కాలేజీల్లో చేరుస్తామని చెప్పే వారి నుంచి అడ్వాన్స్లు తీసుకుంటున్నాయి. మరికొందరి నుంచి సమ్మతి పత్రాలపై సంతకాలు పెట్టించుకుంటున్నాయి. సెట్కు ముందు చేరే విద్యార్థులకు రాయితీలతోపాటు కోరుకున్న బ్రాంచీల్లో సీట్లు ఇస్తామని హామీ ఇస్తున్నాయి. కన్సల్టెన్సీ సంస్థలకు కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు భారీ కమీషన్లు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. తల్లిదండ్రులు, విద్యార్థులను తమ వైపు తిప్పుకోవడంపై కొన్ని కాలేజీలు పీఆర్వోలకు ఏకంగా శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తున్నాయి. యాజమాన్య కోటా సీట్ల భర్తీని ఆన్లైన్లో నిర్వహించాలని ఉన్నత విద్యామండలి గతేడాది ప్రభుత్వానికి నివేదిక పంపగా దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఇప్పట్నుంచే కాలేజీలు విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. -
త్వరలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలను పునర్వ్యవస్థీకరించాల్సిన ఆవశ్యకత ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఎలాంటి శాస్త్రీయత పాటించకుండా ఏర్పాటు చేసిన జిల్లాలు, మండలాలతో ప్రజలు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేవలం రాజకీయ విభజన కోణంలో ఏర్పాటు చేసిన జిల్లాలను ప్రజల అభీష్టం మేరకు హేతుబద్ధీకరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. సోమవారం సచివాలయంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) డైరీని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. అప్పట్లో అడ్డగోలుగా విభజన ‘గత ప్రభుత్వం రాష్ట్రంలోని జిల్లాలు, మండలాలను ఇష్టానుసారంగా విభజించింది. ఒక జిల్లాలో ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఉంటే, మరో జిల్లాలో 14 ఉన్నాయి. ఇక మండలాలు, రెవెన్యూ డివిజన్ల విభజన అడ్డగోలుగా జరిగింది. జిల్లాల సంఖ్య తగ్గించడం, పెంచడం అని కాదు కానీ రేషనలైజేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా చేయాలి..ఒక మండలంలో ఎంత జనాభా ఉండాలి, ఒక డివిజన్లో ఎంత ఉండాలి, ఒక జిల్లాలో ఎంత ఉండాలనేది నిర్ణయించాలి. ప్రస్తుతం ఒక జిల్లాలో 3 లక్షల జనాభా ఉంటే ఒక జిల్లాలో కోటి జనాభా ఉంది. ఇలాంటప్పుడు పరిపాలన ఏవిధంగా చేస్తారు? ఇలాంటి సమస్యలు మా దృష్టికి వచ్చాయి. ఒక లీడర్ తనకు నచ్చిన 3, 4 గ్రామాలతో ఒక మండలాన్ని ఏర్పాటు చేసుకుంటే... మరొకాయన 2, 3 ఎంపీటీసీలతో ఒక మండలాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నేను ఎంపీగా ఉన్నప్పుడు మేడ్చల్ జిల్లా పరిషత్ సమావేశానికి వెళ్లా. వేదికపై చైర్మన్, వైస్ చైర్మన్ ఇద్దరు మాత్రమే కూర్చున్నారు. మరొకాయన రాలేదు. నాకు ఎవర్ని చూసి మాట్లాడాలో అర్థం కాలేదు. జిల్లా ఈ విధంగా ఉంటే ఎలా? ఇలాంటి తప్పిదాల వల్ల పాలనపై నమ్మకం పోతుంది. దీన్ని సరి చేయాలి..’ అని సీఎం అన్నారు. తొలుత మండలాల హేతుబద్ధీకరణ ‘ముందుగా మండలాలను హేతుబద్ధీకరించాలి. మండలంలో 10 శాతం ఎక్కువ జనాభా లేదా తక్కువ.. రెవెన్యూ డివిజన్, జిల్లాల్లో కూడా ఇదే ఫార్ములాతో విభజన జరగాలి. దీనిపై అసెంబ్లీలో డిబేట్ పెడతాం. అందరి సలహాలు, సూచనలు తీసుకుంటాం. మార్గదర్శకాలు రూపొందిస్తాం. కూలంకషంగా చర్చించిన తర్వాతే విధివిధానాలు ఖరారు చేసి నిర్ణయం తీసుకుంటాం. శాస్త్రీయ పద్ధతిలో వీటిని హేతుబద్ధీకరించాలనేది ప్రభుత్వ నిర్ణయం. ఇందుకోసం ప్రత్యేకంగా హైకోర్టు లేదా సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఆధ్వర్యంలో కమిషన్ను ఏర్పాటు చేస్తాం. ఇందులో రెవెన్యూ అధికారులతో పాటు సంబంధిత అధికారులంతా సభ్యులుగా ఉంటారు. ఈ కమిషన్ రాష్ట్రవ్యాప్తంగా ఆర్నెల్లు పర్యటించి ప్రజల అభిప్రాయాలను స్వీకరిస్తుంది. ఒక నివేదికను తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. దాని ఆధారంగా చర్యలు తీసుకుంటాం. రానున్న బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశంపై చర్చించి విధివిధానాలు ఖరారు చేస్తాం’ అని రేవంత్ తెలిపారు. సగటు మధ్య తరగతి ఉద్యోగి సంసారంలా.. ‘రాష్ట్ర ప్రభుత్వంలో 10.5 లక్షల మంది ఉద్యోగుల సైన్యం ఉంది. సీఎం, మంత్రులు, ప్రజా ప్రతినిధులు కేవలం నిర్ణయాలు మాత్రమే తీసుకుంటారు. వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ఉద్యోగులపైనే ఉంటుంది. ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల కలయికే ప్రభుత్వం. పదవీ విరమణ ప్రతి ఉద్యోగికీ వస్తుంది. ఆ రోజున తనకు అందాల్సిన ఆర్థిక లబ్ధి తీసుకోవడం అతని హక్కు. కానీ గత ప్రభుత్వం చేతకాక వయో పరిమితిని పెంచింది. అందువల్ల ఆ సమయంలో జరగాల్సిన రిటైర్మెంట్లు ఇప్పుడు జరుగుతున్నాయి. ఉద్యోగులకు గత ప్రభుత్వం రూ.11 వేల కోట్ల మేర బకాయి పెట్టింది. అలాగే కాంట్రాక్టర్ల బిల్లులకు రూ.42 వేల కోట్లు..ఇలా అన్నీ కలిపి రూ.1.11 లక్షల కోట్లు గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వానికి అప్పులు సంక్రమించాయి. ప్రస్తుతం క్రమ పద్ధతిలో పొదుపు చేస్తూ సగటు మధ్యతరగతి ఉద్యోగి సంసారం మాదిరి రెండేళ్లుగా శ్రమిస్తూ ఆర్థిక స్థితిని గాడిన పెడుతున్నాం. గతంలో ఉద్యోగులకు ఏ రోజున జీతాలు వచ్చాయి.. ఇప్పటి పరిస్థితి ఏమిటో సమీక్షించుకోవాలి. ఉద్యోగులకు పెద్దన్నగా ఓ తీపి కబురు ఉద్యోగులకు పెద్దన్న మాదిరిగా ఇక్కడికి వచ్చా. తీపి కబురు చెప్పకుండా ఉండడం సబబు కాదు. ప్రభుత్వ ఉద్యోగుల డీఏ ఫైలుపై సంతకం చేసి వచ్చా. ఉద్యోగుల ఆరోగ్య పథకం విధివిధానాలు రూపొందిస్తున్నాం. రూ.1.02 కోట్ల బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి పెడతాం. ఉద్యోగులు పన్నుల వసూళ్లు, ఇతర ఆదాయం విషయంలో మరింత కృషి చేస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత వేగంగా గాడిన పడుతుంది. ఉద్యోగ సంఘ భవనం ఏర్పాటుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది. ముందుగా హైదరాబాద్లో రాష్ట్ర కార్యాలయం నిర్మించుకోవాలి. ఉద్యోగ సంఘం ఎంత నిధి ఇస్తుందో.. అదే స్థాయిలో ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తుంది..’ అని సీఎం చెప్పారు. టీజీవో అధ్యక్ష కార్యదర్శులు ఏలూరు శ్రీనివాసరావు, బి.శ్యామ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా ఉద్యోగులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారని ఏలూరు.. సచివాలయంలో విలేకరులకు తెలిపారు. పెండింగ్ బిల్లుల కింద ప్రస్తుతం ఇస్తున్న రూ.700 కోట్లను ఏప్రిల్ నుంచి రూ.1,500 కోట్లకు పెంచుతామని చెప్పారన్నారు. ఉద్యోగులకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్న సీఎం, మంత్రులకు టీజీవో తరఫున ధన్యవాదాలు తెలిపారు. -
మానసిక వికలాంగురాలిపై 55 ఏళ్ల వృద్ధుడి అత్యాచారం
సాక్షి, హనుమకొండ: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో మానవత్వాన్ని కలిచివేసే ఘటన చోటు చేసుకుంది. ఓ మానసిక వికలాంగురాలిపై 55 ఏళ్ల వృద్ధుడు పోలేపాక ప్రభాకర్ అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామంలో జరిగిన ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను రిమాండ్కు తరలించారు. జరిగిన సంఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక మానసిక వికలాంగురాలిపై ఇలాంటి దారుణానికి పాల్పడిన నిందితుడికి కఠిన శిక్ష విధించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన మరోసారి మహిళల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. -
నల్లగొండలో భారీ దోపిడీకి పాల్పడ్డ రోహింగ్యాలు
నల్లగొండ: నల్లగొండలో రోహింగ్యాలు హల్చల్ చేశారు. నల్లగొండ సమీపంలో ఉన్న ఓ పైపుల కంపెనీలో చోరీకి పాల్పడ్డారు. బ్యాటరీలతో పాటు ఇతర సామాగ్రిని ఎత్తుకెళ్లారు రోహింగ్యాలు. ఈ చోరీకి పాల్పడిన రోహింగ్యాలు హమీద్ హుస్సేన్, జహంగీర్ ఆలం, షఫీక్ ఆలంను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. అరవై లక్షల విలువైన సామాగ్రితో పాటు ఆటో స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వీరు 2012-2013లో హైదరాబాద్ నగరానికి వచ్చారని, గతంలో ఓ కేసుకు సంబంధించి జైలుకు వెళ్లొచ్చారని, అయినప్పటికీ తీరు మారలేదని పోలీసులు అంటున్నారు. ఈ దొంగతనం కేసులో మరో నలుగురు రోహింగ్యాలు పరారీ అయినట్లు సమాచారం. -
అరైవ్-అలైవ్ అనేది కార్యక్రమం కాదు.. ఉద్యమం: డీజీపీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల మీద ప్రమాదాలు, మరణాలు తగ్గించడమే లక్ష్యంగా అరైవ్ అలైవ్ కార్యక్రమం చేపట్టింది పోలీస్ శాఖ. యూసుఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. దీనికి సీఎం రేవంత్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రబాకర్, డీజీపీ శివధర్రెడ్డి, పోలీస్ ఉన్నతాధికారులు సైతం పాల్గొన్నారు. ముందుగా అరైవ్ అలైవ్” థీమ్ సాంగ్ను సీఎం రేవంత్ ఆవిష్కరించారు. దీనిలో భాగంగా డీజీపీ శివధర్రెడ్డి మాట్లాడుతూ.. ‘ తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల మీద ప్రమాదాలు, మరణాలు తగ్గించడమే అరైవ్ అలైవ్ కార్యక్రమం ఉద్దేశం. అరైవ్ అలైవ్ అనేది ఒక కార్యక్రమం కాదు ఇది ఒక ఉద్యమం. ఈ కార్యక్రమం సీఎం చేతుల మీదుగా ప్రారంభించడం మరింత ఉత్తేజం ఇస్తోంది. ప్రజలందరు అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్లాలి. రాష్ట్రంలో సుమారు 30 వేల కిలోమీటర్ల రహదారి నెట్వర్క్ ఉంది. ఏడాదికి 27 వేల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. గత ఏడాది 800 హత్యలు జరిగితే 7500 మంది రోడ్ల ప్రమాదాల్లో మరణించారు. హత్యలో కన్నా రోడ్డు ప్రమాదాల్లో నే ఎక్కువగా మరణించారు.2025 మరణాలు తగ్గాయి యాక్సిడెంట్లు పెరిగాయి. రోడ్డు ప్రమాదాల పై చాలా మందికి సీరియన్ నెస్ ఉండటం లేదు. 72 శాతం ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురి అవుతున్నరు.. అందరూ బాధ్యతగా వ్యవహరిస్తే అరైవ్ అలైవ్ లక్ష్యం నెరవేరుతుంది. హెల్మెట్లు తప్పనిసరిగా ధరించాలి.. సీట్ బెల్ట్ పెట్టుకోవాలి.. డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ పోన్ వాడకూడదు. రేపటి నుండి 10 రోజుల వరకు అరైవ్ అలైవ్ కార్యక్రమం జరుగుతుంది’ అని స్పష్టం చేశారు. -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్. ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ సంక్రాంతి కానుక ప్రకటించారు. ఉద్యోగులకు మరో డీఏ ఇస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ సచివాలయంలో మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ ప్రకటన చేశారు. డీఏ ఫైల్ మీద సంతకం చేసి వచ్చా. రేపో మాపో డీఏ జీవో వస్తుంది’అని తెలిపారు. పెన్షనర్లకు డీఏ,డీఆర్ పెంపు తెలంగాణ ప్రభుత్వం పెన్షనర్లకు డీఏ,డీఆర్ పెంపు ప్రకటించింది. ఈ నిర్ణయం రాష్ట్రంలోని వేలాది మంది పెన్షనర్లకు ఉపశమనం కలగనుంది. ప్రస్తుతం అమలులో ఉన్న 30.03శాతం డీఆర్ను 33.67శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు 2018 జూలై 1 తర్వాత రిటైర్డ్ అయిన పెన్షనర్లకు వర్తించనుంది. 2020 రివైజ్డ్ పే స్కేల్స్ ప్రకారం పెన్షన్ పొందుతున్న వారికి ఇది ప్రత్యక్ష లాభం కలిగిస్తుంది.2018కి ముందు రిటైర్డ్ అయిన పెన్షనర్లకు కూడా డీఆర్ పెంపు వర్తించనుంది. 2015 పే స్కేల్స్ ప్రకారం పెన్షన్ పొందుతున్న వారికి డీఆర్ 68.628శాతం నుంచి 73.344శాతానికి పెరిగింది. 2016 పే స్కేల్స్ పెన్షనర్లకు డీఆర్ 42శాతం నుంచి 46శాతానికి పెంపు జరిగింది. UGC/AICTE 2006 పే స్కేల్స్ ప్రకారం పెన్షన్ పొందుతున్న వారికి డీఆర్ 221శాతం నుంచి 230శాతానికి పెరిగింది. ఈ పెంపు విద్యా రంగానికి చెందిన పెన్షనర్లకు గణనీయమైన లాభం కలిగించనుంది.పెరిగిన డీఆర్ 2023 జూలై 1 నుంచి అమలులోకి వస్తుంది. 2023 జూలై నుంచి 2025 డిసెంబర్ వరకు పెరిగిన డీఆర్ బకాయిలు చెల్లించనున్నారు. ఈ బకాయిలు మొత్తం 30 నెలవారీ వాయిదాల్లో చెల్లించబడతాయి. 2026 జనవరి నెల పెన్షన్తో పెరిగిన డీఆర్ చెల్లింపులు ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 2026లో పెన్షన్ మరియు డీఆర్ చెల్లింపులు పూర్తిగా అమలులోకి వస్తాయి. ఈ పెంపు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ గ్రాంట్స్ పొందుతున్న వారికి వర్తించదు. కేవలం పెన్షన్ పొందుతున్న వారికి మాత్రమే ఈ లాభం అందుతుంది.జిల్లాల పునర్విభజనపై సీఎం రేవంత్ కీలక ప్రకటనతెలంగాణలో జిల్లాల పునర్విభజనపై సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. త్వరలో ఈ అంశంపై కమిటీ ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. ‘జిల్లాల సరిహద్దులు మార్చాలని ప్రజల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. అందుకే జిల్లాల పునర్విభజన కోసం ఒక రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయనున్నాం. ఈ కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం.జిల్లాల పునర్విభజనపై అసెంబ్లీలో చర్చ జరిపి, సభ్యుల సలహాలు తీసుకున్నాకే తుది నిర్ణయం తీసుకుంటాం. ఈ అంశంపై అపోహలు పెట్టుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ముందుగా మండలాల రేషనలైజేషన్, తర్వాత రెవెన్యూ డివిజన్ల రేషనలైజేషన్, ఆ తర్వాతే జిల్లాల పునర్విభజన జరుగుతుంది’ అని తెలిపారు. -
‘వచ్చే ఎన్నికల్లో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే’
పాలమూరు: అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రెండేళ్లలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ధ్వజమెత్తారు కేటీఆర్. ఈరోజు( సోమవారం, జనవరి 12వ తేదీ) మహబూబ్నగర్ జిల్లాల పాలమూరులో పర్యటించిన కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల కాలంలో ఏ వర్గానికీ న్యాయం చేయలేదన్నారు. ‘రెండేళ్లలో ఏ వర్గానికి ప్రభుత్వం న్యాయం చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 14 పరిశ్రమలు ఎందుకు పారిపోయాయి. మూటలు కట్టి డబ్బులను ఢిల్లీకి తరలిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు. మనం సబ్జెక్ట్ మాట్లాడితే.. రేవంత్ బూతులు మాట్లాడుతున్నారు. సంస్కారం అడ్డొస్తుందని మేం తిట్టడం లేదు. అడ్డిమారి గుడ్డిదెబ్బలో రేవంత్రెడ్డి సీఎం అయ్యారు. వచ్చే ఎన్నికల్లో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ సొంత పార్టీ నేతలే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు’ అని ఆరోపించారు. -
సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్కు షాక్
సాక్షి, ఢిల్లీ: పోలవరం-నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు అర్హత లేదని సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. ఈ కేసుతో కర్ణాటక, మహారాష్ట్ర అంశాలు ముడిపడి ఉన్నాయి అంటూ వ్యాఖ్యలు చేసింది.అయితే, పోలవరం-నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. అనంతరం, తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు అర్హత లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ క్రమంలో ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పరిష్కారం పొందేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో, తమ పిటిషన్ ఉపసంహరించుకుంటున్నామని అభిషేక్ సింఘ్వీ తెలిపారు. రిట్ పిటిషన్ ఉపసంహరించుకుంది. అయితే, గోదావరి నది జలాల విషయంలో మహారాష్ట్ర, కర్ణాటక వాదనలు కూడా వినాల్సి ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నీటి కేటాయింపుల ఉల్లంఘనలపై అన్ని రాష్ట్రాల వాదనలు వినేందుకు సివిల్ సూట్ ఫైల్ చేయాలని ధర్మాసనం సూచనలు చేసింది. దీంతో, సివిల్ సూట్ ఫైల్ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం.. సుప్రీంకోర్టుకు తెలిపింది. -
జనవరి 18న రవీంద్ర భారతిలో ‘మాల్యద – ఆండాళ్ పవిత్ర మాల’
ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి రామ వైద్యనాథన్ నృత్య రూపకంగా *‘మాల్యద – ఆండాళ్ పవిత్ర మాల’*ను హైదరాబాద్లో ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమం జనవరి 18న సాయంత్రం 6:30 గంటల నుంచి రవీంద్ర భారతి వేదికగా జరుగుతుంది. ఈ ప్రదర్శనకు HCL Concerts మద్దతు అందించగా, రవీంద్ర భారతి సహకరిస్తోంది. ప్రజలకు ప్రవేశం ఉచితం మరియు ముందుగా వచ్చిన వారికి ముందు ప్రవేశం కల్పించబడుతుంది.ఈ నృత్య రూపకం జయసుందర్ డి రచించిన Maalyada: The Sacred Garland పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించబడింది. 9వ శతాబ్దానికి చెందిన తిరుప్పావైలోని అంతర్ముఖ ఆధ్యాత్మిక భావాలను, ఆండాళ్ తన స్నేహితులతో చేసే సహజ సంభాషణల ద్వారా ఈ రచన వివరిస్తుంది. ప్రాచీన శాస్త్రోక్తులను ప్రస్తావిస్తూ, ఆండాళ్ కవిత్వంలోని భక్తి, తత్వం, జ్ఞానాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది.పుస్తకానికి స్వరంగా నిలుస్తూ, నర్తకి మరియు కొరియోగ్రాఫర్ అయిన రామ వైద్యనాథన్, ఆండాళ్ మరియు ఆమె స్నేహితులు శ్రీకృష్ణుని అన్వేషణలో సాగించే ప్రయాణాన్ని నృత్య రూపంలో ఆవిష్కరిస్తారు. ఈ ప్రయాణం నవ విధ భక్తి — దైవ సాక్షాత్కారానికి దారి తీసే తొమ్మిది భక్తి మార్గాల అనుభూతిని ప్రతిబింబిస్తుంది.ఈ ప్రదర్శనకు సంగీతాన్ని సుధా రఘురామన్ అందించగా, గానం: సుధా రఘురామన్, వేణువు: జి. రఘురామన్, నట్టువాంగం: హిమాన్షు శ్రీవాస్తవ, మృదంగం: సుమోద్ శ్రీధరన్ మరియు సన్నిధి వైద్యనాథన్, లైట్స్: సూర్య రావు. నృత్యంలో రామ వైద్యనాథన్తో పాటు రేషిక శివకుమార్, సయాని చక్రబర్తి, శుభమణి చంద్రశేఖర్, వైష్ణవి ధోరే పాల్గొంటారు.ఈ ప్రత్యేక నృత్యావిష్కరణను ఆస్వాదించేందుకు నగర కళాభిమానులను నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు. -
బీఆర్ఎస్, ఎంఐఎంపై కిషన్రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఉపాధి హామీ పథకం మీద కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. నీతి ఆయోగ్ సూచనలతో కొత్త ఉపాధి హామీ పథకంలో మార్పులు తెచ్చినట్టు చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో బీఆర్ఎస్, ఎంఐఎంపై సంచలన విమర్శలు గుప్పించారు. ఎంఐఎం సూచనలు బీజేపీకి అవసరం లేదంటూ వ్యాఖ్యలు చేశారు.కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఉపాధి హామీ కొత్త చట్టంతో ఈ పథకంలో సాంకేతికత ఉపయోగించాం. పారదర్శకత, జవాబుదారీతనం తీసుకొచ్చాం. వంద రోజుల పని దినాలను 125కి పెంచాం. వ్యవసాయానికి అనుసంధానం చేస్తున్నాం. వ్యవసాయ పీక్ సీజన్లో కూలీల కొరత లేకుండా ఈ పథకంతో లబ్ది జరుగుతుంది. వ్యవసాయ సీజన్ లేనప్పుడు 125 పని దినాలు దొరికేలా కొత్త చట్టం చేశాం. రాష్ట్రాలకి అదనపు భారం వేయడమే కాదు.. కేంద్రం కూడా అదనంగా ఖర్చు పెడుతుంది. కేంద్రం కూడా 340 కోట్లు లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ రాష్ట్రానికి వస్తాయి.కూలీల పేరుతో నకిలీ జాబ్ కార్డులు తయారు చేసే దళారీ వ్యవస్థను నిర్మూలించడం జరిగింది. నీతి ఆయోగ్ సూచనలతో కొత్త ఉపాధి హామీ పథకంలో మార్పులు చేశాం. పథకాన్ని నీరుగార్చడం కాదు పటిష్ఠం చేశాం. కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు చేస్తోంది. రాష్ట్రాలు కూడా బాధ్యత కూడా తీసుకోవాలి. కాంగ్రెస్ దేశంలో రెండు మూడు చిన్న రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది అని చెప్పుకొచ్చారు.బీఆర్ఎస్కు కౌంటర్..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి..‘బీఆర్ఎస్ పని అయిపోయింది. పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి చూపించాం కదా. గాలివాటం అయితే దేశంలో మూడు సార్లు అధికారంలోకి వస్తామా?. మళ్లీ గెలిచి దేశంలో ప్రధానిగా మోదీ అధికారంలోకి వస్తారు. ఎవరిది గాలివాటమో ప్రజలకు తెలుసు’ అని అన్నారు.ఎంఐఎంపై వ్యాఖ్యలు..పాకిస్తాన్లో హిందువులు లేకుండా చేశారు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతున్నాయి. దేశంలో హిందువులు లేకుంటే ప్రజాస్వామ్యం ఉండదు. ముస్లిం మహిళ ప్రధాని కావాలని ఎంఐఎం నేత అనడంలో ఉద్దేశం ఏంటి?. దేశ ప్రజలను భయపెట్టే చర్యగా ఎంఐఎం నేతలు ఉన్నారు. అవగాహన లేకుండా దుందుడుకుగా వ్యవహరించడం అసద్కు అలవాటు. సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్ చేసి పాకిస్తాన్ భూభాగంలో ఉగ్రవాదులను మట్టుపెట్టారు. దేశం అభివృద్ధి చేసుకోవాలనే దృష్టి పెట్టాం. దేశ రక్షణకు మోదీ అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఎంఐఎం సూచనలు మాకు అవసరం లేదు అని ఘాటుగా విమర్శలు చేశారు. -
మాకు న్యాయం చేయాలి
హైదరాబాద్: న్యాయం కోసం పిల్లలతో కలిసి భర్త ఇంటి వద్ద భార్య నిరసన వ్యక్తం చేసింది. ఈ సంఘటన దమ్మాయిగూడ డివిజన్ పరిధిలోని అహ్మద్గూడలో చోటుచేసుకుంది. సాయిచరణ్ అనే వ్యక్తి ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. భార్య శిల్ప, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యభర్తల మద్య పలుమార్లు గొడవలు జరిగేవి. దీంతో 2020 సంవత్సరం నుండి దూరంగా ఉంటున్నారు. అప్పటినుండి సాయిచరణ్ కనిపించకుండా తిరుగుతుండేవాడు. సాయిచరణ్ కీసర అహ్మద్గూడలోని హిడెన్ గార్డెన్ అపార్టుమెంట్లో ఉంటున్నాడని తెలుసుకొని పిల్లలతో కలిసి భార్య శిల్ప తమకు న్యాయం చేయాలని నిరసనకు దిగింది. అనంతరం కీసర పోలీసులు వచ్చి ఆమెతో చర్చలు జరిపారు, తనకు న్యాయం జరిగేంతవరకు అక్కడి నుండి కదిలేది లేదని భీష్మించుకుకూర్చుంది. -
మాంజా చేసిన గాయం
హైదరాబాద్: పోలీసులు వద్దు వద్దంటున్నా కొందరు చైనా మాంజా వాడుతున్నారు. కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నా వాడుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ద్విచక్రవాహనాల్లో వెళుతున్న వారు అది తగిలి ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఊ బైక్పై వెళుతున్న ఓ యువకుడు చైనా మాంజా కారణంగా తీవ్రంగా గాయపడ్డాడు. బొటానికల్ గార్డెన్–కొత్తగూడ ఫ్లై ఓవర్పై ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. వైజాగ్కు చెందిన కుందుం సూర్య తేజ(33) మియాపూర్లోని ఎస్ఆర్ ఎస్టేట్లో నివాసం ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం ఇంటికి వెళుతుండగా బొటానికల్ గార్డెన్–కొత్తగూడ ఫ్లై ఓవర్పై చైనా మాంజా ఎడమ భుజానికి తాకింది. చూసుకునే లోపు అది తీవ్ర గాయం చేసింది. స్నేహితులకు ఫోన్ చేయడంతో హుటాహుటిన వచ్చిన వారు 108 అంబులెన్స్లో మాదాపూర్ యశోద హస్పిటల్కు తరలించారు. దాదాపు 15 సెంటీ మీటర్ల గాయం కాగా డాక్టర్లు శస్త్ర చికిత్స చేసినట్లు స్నేహితులు తెలిపారు. గచి్చబౌలి పోలీసులు వెంటనే యశోద ఆస్పత్రికి వెళ్లి బాధితుని స్టేట్మెంట్ రికార్డు చేసి కేసు నమోదు చేశారు. చైనా మాంజాలు వాడవద్దని, ఎవరైనా అమ్మినా, వాడినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ బాలరాజు హెచ్చరించారు. బాలుడికి తీవ్ర గాయాలు నాగోలు గణేష్నగర్ కాలనీ చెందిన వెల్టూరు గోపాల్ కుమారుడు మనోజ్(14) 9 వ తరగతి చదువుతున్నాడు. శనివారం సాయంత్రం స్కూల్ నుంచి బైక్పై వెనుక కూర్చుని ఇంటికి వస్తుండగా, రోడ్డుపై పడివున్న చైనా మాంజా దారం కుడి పాదానికి చుట్టుకోవడంతో తీవ్రంగా గాయమై రక్తస్రావం జరిగింది. కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి కాలి వేలుకు రక్తం సరఫరా చేసే నరం తెగిపోయిందని తెలిపారు. ఎనిమిది కుట్లు వేసి చికిత్స అందించారు. ప్రస్తుతం మనోజ్ అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని వైద్యులు తెలిపారు. -
పబ్లలో వల.. యువతులకు ఎర
హైదరాబాద్: పబ్లకు వచ్చే ఒంటరి యువతులను వలలో వేసుకుని మోసగిస్తున్న నిందితుడిని ఫిలింనగర్ పోలీసులు రిమాండ్కు తరలించారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. శంషాబాద్లోని సదమ్ మెగా టౌన్షిప్లో నివసించే రియల్ ఎస్టేట్ వ్యాపారి కంభంబెట్టు రాణాప్రతాప్రెడ్డి.. పబ్లకు అలవాటుపడి డబ్బుల కోసం యువతులను టార్గెట్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్నాడు. ఇటీవల అమెరికా నుంచి వచ్చిన ఓ యువతి తాను సంపాదించుకున్న డబ్బులతో హైదరాబాద్లో వ్యాపారం పెట్టుకోవడానికి సిద్ధమవుతున్న సమయంలో రాణాప్రతాప్రెడ్డి పరిచయమయ్యాడు. మాయ మాటలతో ఆమెను నమ్మించాడు. వ్యాపారంలో పెట్టుబడి పెడితే లాభాలు ఇప్పిస్తానని రూ.75 లక్షలు తీసుకున్నాడు. ప్రేమిస్తున్నట్టు నటించాడు. పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేశాడు. ఏడాది పాటు ఆమెతో కలిసి తిరిగాడు. ఈ నేపథ్యంలో రాణాప్రతాప్ అసలు స్వరూపం బాధిత యువతికి తెలియడంతో అతడిని నిలదీసింది. దీంతో నిందితుడు రాణాప్రతాప్ తన అసలు స్వరూపం చూపించాడు. పెళ్లికి నిరాకరించాడు. తీసుకున్న డబ్బులు ఇచ్చేది లేదంటూ తేల్చిచెప్పాడు. దీంతో బాధితురాలు ఫిలింనగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నిందితుడిపై చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇప్పటికే నిందితుడు చాలామంది యువతులకు వల వేసి ప్రేమ పేరుతో లోబర్చుకుని పబ్ల్లో, క్లబ్ల్లో తన కోరికలు తీర్చుకుంటూ వారిని బ్లాక్మెయిల్ చేస్తూ లక్షలాది రూపాయలు దండుకున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఫిలింనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
టోల్ప్లాజాల వద్ద కొనసాగుతున్న రద్దీ.. వాహనదారుల ఆగ్రహం!
సాక్షి, యాదాద్రి భువనగిరి: సంక్రాంతి పండుగ నేపథ్యంలో జాతీయ రహదారి-65పై వాహనాల రద్దీ కొనసాగుతోంది. సంక్రాంతికి ఇప్పటికే లక్షలాదిగా పట్నంవాసులు ఏపీకి తరలి వెళ్లారు. ఇవాళ రాత్రి వరకు కూడా వాహనాల రద్దీ కొనసాగే అవకాశం ఉంది. లక్షలాదిగా వాహనాలు ఏపీ వైపు వెళ్లడంతో టోల్ ప్లాజా నిర్వాహకులకు సైతం భారీగా ఆదాయం వస్తోంది. మరోవైపు.. ఆదాయం వస్తున్నా పంతంగి, కొర్లపహాడ్ టోల్ ప్లాజా నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయలేదని వాహనదారులు మండిపడుతున్నారు. -
‘మేడారం’ ప్రత్యేక బస్సుల్లో చార్జీలు 50 శాతం అదనం
సాక్షి, హైదరాబాద్: మేడారం జాతరకు ఈసారి ఆర్టీసీ నడిపే ప్రత్యేక బస్సుల్లో చార్జీలు 50 శాతం అదనంగా వసూలు చేయాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనబోతున్నందున, గతంతో పోలిస్తే బస్సుల సంఖ్య పెంచాలని భావించినా వాటి లభ్య త సమస్యగా మారింది. దీంతో అందుబాటులో ఉన్న బస్సులను తిప్పాలని నిర్ణయించింది. ప్రత్యేక పండుగలు, జాతరలు, ఇతర ఉత్సవాల సమయంలో నడిపే ప్రత్యేక బస్సుల్లో 50 శాతం వరకు చార్జీలు పెంచుకునేందుకు ఆర్టీసీకి అనుమతి ఉంది. దాన్ని వినియోగించుకోవటం ద్వారా సాధారణ చార్జీలను అంతమేర పెంచాలని నిర్ణయించింది. ‘ప్రత్యేకం’లోనూ మహిళలకు ఉచితమే.. జనవరి 28 నుంచి 31 వరకు మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతర జరగనుంది. గత జాతర సమయంలో 3,491 ప్రత్యేక బస్సులను నడిపితే అవి కీలక సమయాల్లో సరిపోలేదు. కొంత నిర్వహణ లోపాల వల్ల ఆర్టీసీ బస్సులను భక్తులు వాడుకోలేకపోయారు. వెరసి ఇబ్బందులు ఎదురయ్యాయని సంస్థ గుర్తించింది. దీంతో ఈసారి అంతకంటే ఎక్కువ బస్సులు నడపాలని నిర్ణయించింది. కానీ, బస్సుల సర్దుబాటు కష్టంగా మారటంతో ప్రస్తుతానికి 3,495 బస్సులను సిద్ధం చేసుకుంది. అవసరమైతే మరికొన్నింటిని సిద్ధం చేసుకోవాలని నిర్ణయించింది.ఈ బస్సులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మేడారానికి నడుస్తాయి. వీటిల్లో సాధారణ చార్జీకి 50 శాతం అదనపు మొత్తాన్ని జోడించి వసూలు చేయాలని సంస్థ నిర్ణయించింది. ఈ బస్సుల్లో కూడా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ (ఆర్డినరీ, ఎక్స్ప్రెస్) వసతి ఉన్నందున మహిళా ప్రయాణికులకు ఈ నిర్ణయం భారం కాబోదు. కానీ, పురుష ప్రయాణికుల జేబులపై మాత్రం భారం పడనుంది. వీఐపీ పాస్లను నియంత్రించాల్సిందే... గత జాతర సమయంలో అధికారులు అనాలోచిత నిర్ణయాలతో ఇబ్బడి ముబ్బడిగా వీఐపీ పాస్లు జారీ చేశారు. ఒకే సమయంలో ఎక్కువ మంది వీఐపీలు రావటం, వారి వాహన శ్రేణి జాతర వరకు అనుమతించడంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ చోటుచేసుకుంది. ఆయా సమయాల్లో పోలీసులు ఆర్టీసీ బస్సులను లోనికి అనుమతించలేదు. దీంతో బస్సులు శివారు ప్రాంతాల్లోనే నిలిచిపోయి సాధారణ భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈసారి ఆ పరిస్థితి రాకుండా, పాసుల జారీని నియంత్రించాలని ఆర్టీసీ అధికారులు ములుగు జిల్లా కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులను కోరారు. వచ్చే వీఐపీలు కూడా ఒకే సమయంలో రాకుండా నియంత్రించాలని కూడా కోరారు. ఆర్టీసీ బస్సులను నిలిపివేసి భక్తులకు ఇబ్బంది రాకుండా ప్రణాళికలు రూపొందించాలని కోరారు. -
తలసేమియా రహితంగా తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే తలసేమియా రహిత తొలి రాష్ట్రంగా తెలంగాణను మార్చేందుకు అందరం కలిసి పనిచేయాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పిలుపునిచ్చారు. 2035 నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకుందామని అన్నారు. తలసేమియా అండ్ సికిల్సెల్ సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని కమల హాస్పిటల్లో నిర్వహిస్తున్న ఏషియన్ తలసేమియా కాన్క్లేవ్లో ఆదివారం మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోగులు, దేశ, విదేశాల నుంచి వచ్చిన డాక్టర్లు, ఇతర నిపుణులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. తలసేమియా, సికిల్సెల్ ఎనీమియా, హీమోఫీలియా వంటి వ్యాధులు కేవలం వైద్యపరమైన సమస్యలు మాత్రమే కావని, అవి బాధిత కుటుంబాలను, సమాజాన్ని జీవితకాలం వెంటాడే తీవ్రమైన సవాళ్లని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.ముఖ్యంగా రక్తసంబంధీకుల మధ్య వివాహాలు (మేనరికం) చేసుకోవడం వల్ల తల్లిదండ్రుల నుంచి పిల్లలకు జన్యుపరమైన వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. దీనిని నివారించడానికి ముందస్తు స్క్రీనింగ్, కౌన్సెలింగ్, సామాజిక అవగాహన కలి్పంచడమే సరైన మార్గమని, నివారణే అత్యుత్తమ చికిత్స అని ఆయన అన్నారు. ఆరోగ్యశ్రీ కింద ఈ వ్యాధికి ఉచితంగా చికిత్స అందిస్తున్నామని, తలసేమియా, సికిల్సెల్ సొసైటీ సహకారంతో మహబూబ్నగర్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో విజయవంతంగా ప్రతి గర్భిణీకి పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. తలసేమియా బాధితులకు నిరంతర వైద్య సేవలు అందించేందుకు ఇప్పటికే ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో డే కేర్ సెంటర్లను నిర్వహిస్తున్నామని, త్వరలో ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్లలో అదనపు కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి వెల్లడించారు. 11 లక్షల మందికి స్క్రీనింగ్ రాష్ట్రంలో సికిల్సెల్ వ్యాధిని గుర్తించేందుకు ఇప్పటివరకు 11 లక్షల మందికి పైగా స్క్రీనింగ్ పూర్తి చేసి, వ్యాధి నిర్ధారణ అయిన వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స అందిస్తున్నట్లు మంత్రి దామోదర తెలిపారు. తలసేమియా, సికిల్సెల్, హిమోఫీలియా పేషెంట్లకు అవసరమైన అన్ని రకాల పరీక్షలను డయాగ్నస్టిక్స్ సెంటర్లలో ఉచితంగా చేయిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం, వైద్య నిపుణులు, స్వచ్ఛంద సంస్థలు కలిసికట్టుగా పనిచేసి తలసేమియా లేని తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. -
రహదారులు రద్దీగానే..
చౌటుప్పల్/భువనగిరిటౌన్/చిట్యాల/కేతేపల్లి/ సూర్యాపేటటౌన్: మూడోరోజూ రహదారులపై రద్దీ కొనసాగుతోంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఆదివారం కూడా ప్రజలంతా పట్నం నుంచి పల్లెబాట పట్టారు. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లాలోని హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారితోపాటు హైదరాబాద్– వరంగల్ రహదారిపై వాహనాలు బారులుదీరాయి. గంట సమయంలో చేయాల్సిన ప్రయాణం రద్దీ కారణంగా రెండు గంటలకు పైగా సమయం పట్టింది. చౌటుప్పల్ పట్టణంలో ట్రాఫిక్ స్తంభించింది. ఇదే మండల పరిధిలోని పంతంగి టోల్ప్లాజా వద్ద వాహనాలు కిలోమీటరు దూరం వరకు బారులుదీరాయి.టోల్ప్లాజా వద్ద 16 టోల్ బూత్లు ఉండగా సాధారణ రోజుల్లో ఇరువైపులా సమానంగా 8 బూత్ల చొప్పున కేటాయిస్తారు. ప్రస్తుత రద్దీ నేపథ్యంలో విజయవాడ మా ర్గంలో 12 బూత్లు, హైదరాబాద్ మార్గంలో 4 బూత్లను కేటాయించారు. శనివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు 46 వేల వాహనాలు రాకపోకలు సాగించాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు మరో 15వేల వరకు వాహనాలు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ⇒ నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్ప్లాజా హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు కిక్కిరిశాయి. సాధారణ రోజుల్లో రోజూ 18 వేల నుంచి 20 వేల వాహనాలు ఈ టోల్ప్లాజా నుంచి రాకపోకలు సాగిస్తుండగా ఆదివారం ఒక్కరోజే దాదాపు 40 వేల వాహనాలు వెళ్లినట్టు అధికారులు తెలిపారు. ⇒ యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని గూడూ రు టోల్ ప్లాజా వద్ద వాహనాలు నెమ్మదిగా కదిలాయి. ఒక వైపు సంక్రాంతి పండుగ సెలువులతోపాటు, మేడారం జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో హైదరాబాద్ నుంచి వరంగల్ దిశగా పట్నంవాసులు పెద్ద సంఖ్యలో ప్రయాణించడంతో రహదారి రద్దీగా మారింది. ⇒ సంక్రాంతి పండుగకు వెళ్తున్న ప్రయాణికుల వాహనాలు ఎక్కడా ట్రాఫిక్ జాం కాకుండా పోలీసులు నిరంతరం డ్రోన్ కెమెరాతో నిఘా ఏర్పాటు చేశారు. క్రేన్లు, అంబులెన్సులు, టోయింగ్ వాహనాలను సిద్ధంగా ఉంచారు. ⇒ హైదరాబాద్–విజయవాడ హైవేపై కార్లు, బస్సులతోపాటు పెద్ద వాహనాలు వేలాదిగా వెళుతుండటంతో నిత్యం ట్రాఫిక్జాం అవుతోంది. దీంతో కొందరు ప్రయాణికులు తమ కుటుంబసభ్యులతో బైక్లపై వెళుతున్నారు. -
తిండి తగ్గింది.. తీరు మారింది!
పాతికేళ్ల నాటికీ, నేటికీ గ్రామీణ, పట్టణ భారతీయ కుటుంబాల వ్యయంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఆహారంపై ఖర్చు తగ్గి.. అనేక ఇతర ఖర్చులు పెరిగాయి. ప్రజలు మెరుగైన జీవనశైలులను కోరుకోవటమే ఇందుకు కారణం. కేంద్ర గణాంక శాఖ గృహ వినియోగ వ్యయ సర్వేలు, నేషనల్ శాంపిల్ సర్వేలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.దేశంలో పేదరికం ఏ స్థాయిలో ఉంది? ప్రభుత్వాలు ఎలాంటి సంక్షేమ పథకాలు తీసుకురావాలి? ప్రజల జీవన శైలి ఎలా మారుతోంది?... అనే విషయాలను తెలుసుకోవడానికి కేంద్ర గణాంక శాఖ ఎప్పటికప్పుడు గృహ వినియోగ వ్యయంపై సర్వే జరుపుతుంటుంది. భారతీయ కుటుంబాలు వివిధ వస్తువులు, సేవల కోసం చేసే ఖర్చుల వివరాలను అనేక దఫాలుగా (రౌండ్లుగా) సర్వే చేసి, ఆ వివరాలను గణాంకాల మంత్రిత్వ శాఖ వెల్లడిస్తుంది.ఈ క్రమంలో 2022–23, 2023–24లో జరిగిన సర్వేలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాలుగా విభజించి ఈ సర్వే నిర్వహిస్తుంది. ప్రజలు ఖర్చు చేసే ప్రతి రూ.100లో 2000 నాటికీ 2024 నాటికీ నెలవారీ తలసరి వ్యయంలో చాలా వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. (గమనిక ః తలసరి నెలవారీ వ్యయం (రూ.100 కి))⇒ నెలవారీ తలసరి ఆహార వ్యయం; తలసరి ఇంధనం, విద్యుత్పై చేసే వ్యయం అప్పటితో పోలిస్తే ఇప్పుడు తగ్గాయి. ⇒ అప్పట్లో మొత్తం వ్యయంలో సగం ఆహారం కోసమే ఉంటే.. ఇప్పుడది తగ్గడం విశేషం.⇒ ఇంటి అద్దె, ఇతర వస్తువులు, సేవల ఖర్చు మాత్రం అప్పటితో పోలిస్తే భారీగా పెరిగాయి. -
అన్ని వర్గాలను మోసం చేస్తున్నాడు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్/బండ్లగూడ: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిజాయితీ కలిగిన మోసగాడు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మోసం చేసేవారికే ప్రజలు అధికారం కట్టబెడతారని ముందే చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి.. ఇప్పుడు సరిగ్గా తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు. రెట్టింపు పెన్షన్లు, రైతుబంధు, దళితబంధు, రెండు లక్షల ఉద్యోగాలు, పీఆర్సీ ఇలా అనేక కార్యక్రమాలను ప్రకటించి, ఒక్కటీ అమలు చేయడం లేదన్నారు. రేవంత్రెడ్డి రైతులు, రైతు కూలీలు, కౌలుదారులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, ప్రభుత్వ ఉద్యోగులు ఇలా అందరిని మోసం చేశారని కేటీఆర్ అన్నారు. రేవంత్కు తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్ భాషలు రావు కానీ ఆయనకు వచ్చిన ఏకైక భాష బూతుల భాష అని ఎద్దేవా చేశారు. బండ్లగూడ మాజీ మేయర్ లతాప్రేమ్గౌడ్, వారి అనుచరులు ఆదివారం తెలంగాణభవన్లో కార్తీక్రెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. వీరికి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ నిరుద్యోగులు, విద్యార్థులకు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘కేసీఆర్ కనిపిస్తే ధైర్యం వస్తది అని ప్రజలు అనుకుంటున్నారు. రాష్ట్రంలో వ్యాపారాలు తగ్గడానికి, పరిస్థితులు దిగజారడానికి సన్నాసి రేవంత్రెడ్డి ప్రభుత్వమే కారణం. కాంగ్రెస్లో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ ఏమి అభివృద్ధి చూసి కాంగ్రెస్లో చేరిండో నియోజకవర్గ ప్రజలకు చెప్పాలి’అని కేటీఆర్ అన్నారు. బీజేపీ బలం గాలివాటమే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాబోదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 24 నెలల కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలనకు, గత పది సంవత్సరాల్లో జరిగిన అద్భుతమైన అభివృద్ధికి మధ్య ప్రజలు బేరీజు వేసుకుంటున్నారని, కచ్చితంగా మరోసారి బీఆర్ఎస్ వైపు నిలిచేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఆదివారం ఆదిలాబాద్, మెదక్ జిల్లాల అధ్యక్షులు, పార్టీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులతో జరిగిన పురపాలక ఎన్నికల సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. రెండు జిల్లాల్లో పార్టీ అనుసరించాల్సిన మున్సిపల్ ఎన్నికల వ్యూహం, ఇతర అంశాలపై కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పురపాలక ఎన్నికల్లో సమష్టిగా కలిసి కొట్లాడి కాంగ్రెస్పై ఘన విజయం సాధించేలా ప్రయత్నం చేయాలని సూచించారు. బీజేపీకి క్షేత్రస్థాయిలో బలం లేదని, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక మొదలు సర్పంచ్ల వరకు ప్రతి ఎన్నికల్లో బీఆర్ఎస్ వైపు ప్రజలు నిలబడ్డారన్నారు. రాష్ట్రంలో రెండు సంవత్సరాల కింద జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయం గాలివాటమే అని చెప్పారు. ఆనాడు దేశంలోని రాజకీయ పరిస్థితులతోనే బీజేపీ గెలిచిందే తప్ప, ఆ పార్టీకి తెలంగాణలో క్షేత్రస్థాయి బలం లేదన్నారు. అసెంబ్లీలో పోటీచేసిన ప్రతి ఒక్క బీజేపీ సీనియర్ నేతలు ఘోరమైన ఓటమి పాలయ్యారని, పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం గాలివాటంగా గెలిచారని చెప్పారు. ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లోని మున్సిపాలిటీలలో ఉన్న స్థానిక పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ఈ సమావేశంలో పాల్గొని అనేక అంశాలపై పార్టీ శ్రేణులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. -
రాష్ట్రాన్ని అప్పులపాలు చేయబోం: భట్టి
గోదావరిఖని/ములుగు: గత పాలకుల మాదిరిగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయనీయబోమని, అన్నిరంగాల్లో అగ్రగామిగా ముందుకు తీసుకెళ్లి 2047నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల అభివృద్ధి సాధించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో భట్టి ప్రసంగించారు. రాష్ట్రంలో 4.5 లక్షల మంది పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. ఇందుకోసం నియోజకవర్గానికి 3,500 మంది లబి్ధదారులను ఎంపిక చేశామన్నారు. కులం, మతం, పార్టీతో సంబంధం లేకుండా అర్హులైన పేదలందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్కు రాష్ట్ర కేబినెట్లో ఆమోదం లభించిందని స్పష్టం చేశారు. త్వరలోనే మళ్లీ వస్తామని, పవర్ ప్రాజెక్టు శంకుస్థాపన చేస్తానని చెప్పారు.సింగరేణి పరిరక్షణకు కృషి సింగరేణి సంస్థ అభివృద్ధి, పరిరక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని భట్టివిక్రమార్క అన్నారు. రామగుండం నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. ప్రజావసరాల కోసం నిత్యం తపిస్తున్న నాయకుడు రాజ్ఠాకూర్ అని ప్రశంసించారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు చేపట్టిన యాత్రలో నా వెంట నడిచిన రాజ్ఠాకూర్కు ఆనాడే ఇచ్చిన మాట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్కుమార్, కొండా సురేఖ, ప్రిన్సిపల్ ఎనర్జీసెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్రావు, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ప్రసాద్ పాల్గొన్నారు. రెండుమూడు రోజుల్లో మేడారం పనులు పూర్తి సమ్మక్క–సారలమ్మ వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా మేడారం జాతర నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు, కొండా సురేఖ, ధనసరి సీతక్క, అడ్లూరి లక్ష్మణ్తో ఆదివారం మధ్యాహ్నం 3:26 గంటలకు మేడారం చేరుకున్నారు. కాన్వాయిలో ఆర్టీసీ పాయింట్, జంపన్న వాగు వద్దకు చేరుకొని వాహనంలో నుంచే పనులు పర్యవేక్షించారు. 3:50 గంటలకు హరిత హోటల్కు చేరుకొని అధికారులతో సమీక్షించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మంత్రుల పర్యవేక్షణలో మేడారంలో అభివృద్ధి పనులు పూర్తికావొచ్చాయని తెలిపారు. రెండు మూడు రోజుల్లోగా మిగిలిన పనులు కూడా పూర్తి చేయనున్నట్టు వెల్లడించారు. సమావేశ అనంతరం గద్దెల వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. వారి వెంట మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, ఎస్పీ సు«దీర్ రాంనాథ్ కేకన్ పాల్గొన్నారు. -
యక్ష ప్రశ్నలు.. ముప్పు తిప్పలు
సాక్షి, హైదరాబాద్: అమెరికా విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్నాయి. కీలకమైన ఐ–20 పత్రాల జారీకి ముప్పు తిప్పలు పెడుతున్నాయి. చిన్న చిన్న కారణాలతో కాలయాపన చేస్తున్నాయి. విద్యార్థి సోషల్ మీడియా ఖాతాలను జల్లెడ పడుతున్నాయి. ఏ మాత్రం అనుమానం వచ్చినా పత్రాల జారీ ఆపేస్తున్నాయి. ఆర్థిక లావాదేవీల పత్రాలపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిణామాలతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఏటా దాదాపు 3 లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువు కోసం వెళ్తుంటారు. వీరిలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లేవారు లక్ష వరకు ఉంటారు. కాగా ఆగస్టులో మొదలయ్యే విద్యా సంవత్సరానికి ఆరు నెలల ముందే అనుమతులు పొందాల్సి ఉంటుంది. యూఎస్ వీసా తీసుకోవడం ఒక ఎత్తైతే, తాజాగా వర్సిటీల్లో ఐ–20 పత్రం పొందడం మరో ఎత్తవుతోంది. వీసా వచ్చినా ఐ–20 రాకపోతే యూఎస్ వెళ్లేందుకు వీలుండదు. ఐ–20 అంటే ఏమిటి? ఎంఎస్ కోసం అమెరికాకు వెళ్ళే విద్యార్థులు ముందుగా అక్కడి యూనివర్సిటీలను ర్యాంకు ఆధారంగా ఎంపిక చేసుకుంటారు. సీటివ్వడానికి ఒప్పుకున్న యూనివర్సిటీ సర్టిఫికెట్ ఆఫ్ ఎలిజిబిలిటీ (ఐ–20) పత్రం ఇవ్వాలి. ఇందులో విద్యార్థి ఎంపికైన కోర్సు, ఆ కోర్సు కాల వ్యవధి, ఫీజు వివరాలు, విద్యార్థి ఆర్థిక సామర్థ్యం వివరాలు ఉంటాయి. దీని ఆధారంగా యూఎస్లో యూనిక్ కోడ్ ఇస్తారు. వర్సిటీ ఇచ్చే వివరాల ఆధారంగా స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎస్ఈవీఐఎస్) అనే సంస్థ పూర్తి సమాచారాన్ని క్రోడీకరిస్తుంది. ఇది విద్యార్థికి చాలా కీలకం. విద్యార్థులకు ఇచ్చే ఎఫ్–1 వీసాకు దీన్ని ముఖ్యమైన డాక్యుమెంట్గా గుర్తిస్తారు. సమస్య ఎక్కడ? విద్యార్థులు చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే వర్సిటీలపైనే చర్యలు తీసుకుంటామని ట్రంప్ సర్కార్ ఇటీవల ప్రకటించింది. అవసరమైతే యూనివర్సిటీ గుర్తింపునే రద్దే చేస్తామని హెచ్చరించింది. దీంతో ప్రస్తుతం విశ్వవిద్యాలయాలు విద్యార్థుల ప్రతీ డాక్యుమెంట్ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి. ఈ క్రమంలో పాస్ట్పోర్టు వివరాల్లో తప్పులున్నా, అకడమిక్ వివరాల్లో స్పెల్లింగ్ తప్పిదాలున్నా, మార్క్ట్ తేదీల్లో తేడాలున్నా ఐ–20 పత్రాలు ఆపేస్తున్నాయి. యూఎస్లో కోర్సు చేసేందుకు వచ్చే విద్యార్థులకు ఫీజులు, జీవించడానికి అయ్యే ఖర్చుల అంచనాలను వర్సిటీలే లెక్కగడతాయి. ఆ మొత్తాన్ని బ్యాంకు బాలెన్స్గా చూపించాల్సి ఉంటుంది. కన్సల్టెన్సీలు ఈ మొత్తాన్ని విద్యార్థి ఖాతాలో వేయడం, విద్యార్థి అమెరికా వెళ్ళగానే తీసుకోవడం చేస్తుంటాయి. ప్రస్తుతం వర్సిటీలు కొత్తగా ఆరు నెలల బ్యాంక్ బ్యాలెన్స్, అది ఏ రూపంలో జమ అయ్యిందో చూస్తున్నాయి. వాటిని స్పాన్సర్ చేసిన వ్యక్తుల వ్యక్తిగత వివరాలు పరిశీలిస్తున్నారు. ఎంపిక చేసుకునే కోర్సులకు సంబంధించి భారత్లో విద్యార్థి చేసిన కోర్సు, సాధించిన మార్కులు, ఇంటర్న్షిఫ్లను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇందులో ఏ ఒక్కటి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా, అనుమానాస్పదంగా ఉన్నా పత్రాల జారీ నిలిపివేస్తున్నారు. సోషల్ మీడియాపై దృష్టి విద్యార్థి సామాజిక ఖాతాను లోతుగా విశ్లేషిస్తున్నారు. ఇన్స్టా, ఫేస్బుక్, ఇతర సామాజిక మాధ్యమ ఖాతాలు ఎన్ని ఉంటే అన్నింటి వివరాలు ఇవ్వాలని యూనివర్సిటీలు కోరుతున్నాయి. వీటిల్లో గత కొన్నేళ్ళుగా విద్యార్థి ఎలాంటి పోస్టింగ్లు పెట్టాడు? ఏయే సంస్థలతో లింక్ అయి ఉన్నాడు? అమెరికాలోని ఏయే వ్యక్తులతో అతనికి సంబంధాలున్నాయి? వాళ్ళ వ్యక్తిగత వివరాలు ఏమిటి? ఆర్థిక పరమైన లావాదేవీలు ఏమిటి? కుటుంబ నేపథ్యం ఏమిటి? అనే వివరాలను లోతుగా అధ్యయనం చేస్తున్నారు. అమెరికాకు వ్యతిరేకంగా ఒక్క పోస్టు కన్పించినా ఐ–20 పత్రం ఇవ్వడానికి వర్సిటీలు సాహసించడం లేదు. సదరు విద్యార్థితో సంబంధం ఉన్న వ్యక్తుల్లో ఎవరిలోనైనా యూఎస్ వ్యతిరేక భావజాలం ఉన్నట్టు కన్పించినా విచారణకు ఆదేశిస్తున్నారు. యూనిక్ ఐడీ ఇవ్వడానికి ఇదే కొలమానం ఏడాదిగా అమెరికా భద్రత వ్యవహారాల్లో యూనివర్సిటీల బాధ్యత పెంచారు. విదేశీ విద్యార్థులను రప్పించే క్రమంలో అన్ని వివరాలు పరిశీలిస్తున్నారు. అమెరికన్ చట్టాలకు వ్యతిరేకంగా ఎలాంటి కార్యకలాపాలకు విద్యార్థులు పాల్పడినా పరిణామాలు త్రీవంగా ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించింది. దీంతో మరింత జాగ్రత్త పడుతున్నారు. ఐ–20 పత్రాలు ఆలస్యం అవ్వడానికి ఇదే కారణం. – నవీన్ చావ్లా (యూఎస్ వర్సిటీలో భారతీయ అధ్యాపకుడు) విదేశీ స్నేహితుల వివరాలు అడిగారు అమెరికా యూనివర్సిటీలో సీటు వచ్చింది. ఆగస్టులో అక్కడికి వెళ్ళడానికి సిద్ధమయ్యాం. ఫేస్బుక్లో ఇతర దేశాల్లో ఉన్న స్నేహితులూ యాడ్ కావడంతో వాళ్ళ గురించిన వివరాలు అడిగారు. ఆ తర్వాత ఆర్థిక సంబంధమైన వివరాలు కోరారు. వీటిపై సమగ్ర విచారణ జరిపిన తర్వాతే పత్రాలు వస్తాయని కన్సల్టెన్సీ సంస్థలు చెబుతున్నాయి. – రోషన్ స్తపతి (హైదరాబాద్ విద్యార్థి) -
జగిత్యాల మున్సిపాలిటీలో రాత్రి వేళ ఓట్ల మార్పిడి అనుమానాలు
సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లా మున్సిపాలిటీలో ఆదివారం రాత్రి 10 గంటలకు అధికారులు గేటుకు తాళాలు వేసి లోపల కసరత్తులు జరుపుతున్నారనే వార్తలు స్థానికంగా పెద్ద చర్చకు దారితీశాయి. సెలవు రోజు రాత్రి వేళలో అధికారుల హడావుడి ఏంటన్న ప్రశ్నలు ప్రజల్లో ఉత్పన్నమవుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ఆశావహులు, అనుచరులతో కలిసి అధికారులు రహస్యంగా సమావేశమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఒక వార్డులోని ఓటర్లను మరో వార్డుకు షిఫ్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. తమకు అనుకూలమైన ఓటర్లను తమ పరిధిలో ఉంచుకుని, ప్రతికూలంగా ఉన్నవారిని పక్క వార్డులకు బదిలీ చేయడానికి రహస్యంగా కసరత్తు చేస్తున్నారనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో అధికారులు చీకటి దందాకు పాల్పడుతున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. రేపటితో ఓటర్ల నమోదు (Voter Enrollment) చివరి తేదీ కావడంతో అభ్యంతరాలు స్వీకరించడానికే రాత్రి వేళలో తాళాలు వేసి పని చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అయితే కొందరినే లోపలికి అనుమతించి మరికొందరిని బయటే నిలిపివేయడం ప్రజల్లో అనుమానాలను రేపింది. దాంతో ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో ఓట్ల మార్పిడి దందా జరుగుతోందన్న ప్రచారం ఊపందుకుంది. రాత్రి వేళలో తాళాలు వేసి అధికారులు చేసే ఈ రహస్య కసరత్తులు ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ ఘటనపై స్థానికులు స్పష్టత కోరుతున్నారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను కాపాడాలని ఓటర్ల హక్కులను కాపాడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
బీజేపీ Vs కాంగ్రెస్.. యాదగిరిగుట్టలో ఉద్రిక్తత
సాక్షి, యాదాద్రి భువనగిరి: యాదగిరిగుట్టలో రెండు గంటలుగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓ స్థలం విషయంలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య వివాదం నెలకొంది. ఇరు వర్గాల మధ్య మాటా మాట పెరగడంతో ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలకు గాయలైనట్టు తెలుస్తోంది.వివరాల మేరకు.. యాదగిరిగుట్టలో ఓ వ్యక్తికి చెందిన స్థలాన్ని కబ్జా చేసేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్కు బీజేపీ కార్యకర్తలు వెళ్లారు. ఇదే సమయంలో పోలీస్ స్టేషన్ ఎదుట బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు ఎదురుపడ్డారు. దీంతో, ఇరు వర్గాల మధ్య మాటా మాట పెరగడంతో ఘర్షణ చోటుచేసుకుంది.ఈ క్రమంలో పరిస్థితి చేయి దాటిపోవడంతో ఇరు పార్టీల కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. ఈ ఘర్షణలో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలైనట్టు తెలిసింది. కాంగ్రెస్ నేత భరత్ అనుచరులు దాడి చేశారంటూ పోలీస్ స్టేషన్ ఎదుట బీజేపీ శ్రేణుల ఆందోళనకు దిగాయి. దీంతో, బలవంతంగా వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
గాలిపటం ఎగరాల్సింది ఆకాశంలో.. సజ్జనార్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: చైనా మాంజా జనం ప్రాణాలు తీస్తున్నాయి. బాధిత కుటుంబాల్లో విషాదం నింపుతోంది. విచ్చలవిడిగా సాగుతున్న విక్రయాలతో పక్షులు, మనుషులకు ముప్పు వాటిల్లుతోంది. ప్రధానంగా ద్విచక్ర వాహన చోదకులు, పాదచారులు ప్రమాదాల బారినపడుతున్నారు. పతంగుల పండగ నేపథ్యంలో ‘గాలిపటం ఎగరాల్సింది ఆకాశంలో.. అమాయక ప్రాణాల్లో కాదు’ అంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ట్వీట్ చేశారు. చైనీస్ మాంజా దారం తెగదు.. కానీ మనుషుల మెడలు, పక్షుల రెక్కలు తెగ్గోస్తుంది. మీ క్షణికానందం.. మరొకరి ఇంట తీరని విషాదం కాకూడదు. నిషేధిత చైనా మాంజా అమ్మినా, వాడినా కఠిన చర్యలు తప్పవు. పండగని పండగలా జరుపుకోండి. ప్రాణాలు తీసి కాదు’ అంటూ సజ్జనార్ హెచ్చరించారు.కాగా, చైనా మాంజా విక్రయంపై నగర పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. దీని వినియోగాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2016లో, జాతీయ హరిత ట్రైబ్యునల్ 2017లో నిషేధించింది. అయినప్పటికీ విచ్చలవిడిగా సాగుతున్న విక్రయాలతో పక్షులు, మనుషులకు ముప్పు వాటిల్లుతోంది. ప్రధానంగా ద్విచక్ర వాహనచోదకులు, పాదచారులు ప్రమాదాల బారినపడుతున్నారు. దీంతో నెల రోజులుగా నిఘా ఉంచిన అధికారులు ఇప్పటి వరకు 103 కేసులు నమోదు చేసి, 143 మందిని అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.1.24 కోట్ల విలువైన 6226 బాబిన్ల మాంజా స్వాధీనం చేసుకున్నారు.గాలిపటం ఎగరాల్సింది ఆకాశంలో.. అమాయక ప్రాణాల్లో కాదు!చైనీస్ మాంజా దారం తెగదు.. కానీ మనుషుల మెడలు, పక్షుల రెక్కలు తెగ్గోస్తుంది.మీ క్షణికానందం.. మరొకరి ఇంట తీరని విషాదం కాకూడదు.నిషేధిత చైనా మాంజా అమ్మినా, వాడినా కఠిన చర్యలు తప్పవు.పండగని పండగలా జరుపుకోండి. ప్రాణాలు తీసి… pic.twitter.com/wrsYH1yXOr— V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 11, 2026ఇవాళ(జనవరి 11, ఆదివారం) హైదరాబాద్లో చైనా మాంజాకు మరో వ్యక్తి బలి అయ్యాడు. బైక్పై వెళ్తున్న సాయి వర్దన్ మెడకు మాంజా చుట్టుకోవడంతో అతడి చెయ్యి, మెడకి తీవ్ర గాయమైంది. దీంతో, వెంటనే సాయి వర్ధన్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటన ఉప్పల్ స్టేడియం మెట్రో స్టేషన్ సమీపంలో జరిగింది. -
ఎన్నికల నిర్వహణ ప్రక్రియ.. బెల్జియంకు తెలంగాణ సీఈఓ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సుదర్శన్ రెడ్డి ఎన్నికల నిర్వహణలో అనుభవాల మార్పిడి, ఉత్తమ విధానాల అధ్యయనం లక్ష్యంగా మూడు రోజుల అధికారిక పర్యటనకు బెల్జియంకు బయలుదేరారు. బెల్జియన్ ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ – ఇంటీరియర్ నుంచి వచ్చిన ఆహ్వానం మేరకు ఈ పర్యటన జరుగుతోంది.ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియల్లో పారదర్శకత, సమగ్రత, సామర్థ్యాన్ని మెరుగుపర్చే అంశాలపై రెండు దేశాల అధికారుల మధ్య విస్తృత స్థాయి చర్చలు జరగనున్నాయని అధికారులు తెలిపారు. సీఈఓ సుధర్శన్ రెడ్డి నేతృత్వంలోని బృందంలో ఖమ్మం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనుదీప్ దురిశెట్టి, సీఈఓ కార్యాలయ రాష్ట్ర శిక్షణ నోడల్ అధికారి, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బోయపాటి చెన్నయ్య, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఈఆర్వో కంకనాల అనంత రెడ్డి, నాంపల్లి నియోజకవర్గం పోలింగ్ స్టేషన్ నం.97 బూత్ స్థాయి అధికారి వేముల ధ్రువ కుమార్ రెడ్డి ఉన్నారు.పర్యటనలో భాగంగా బెల్జియన్ ఎఫ్పీఎస్ – ఇంటీరియర్, ఎఫ్పీఎస్ – ఫారిన్ అఫైర్స్ ఉన్నతాధికారులతో సమావేశాలు, కేయూ లూవెన్ యూనివర్సిటీ నిపుణులతో చర్చలు, బ్రస్సెల్స్లోని భారతీయ రాయబార కార్యాలయంలో సేవా ఓటర్లతో పరస్పర చర్యలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ (IIIDEM) ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్జాతీయ అవుట్రీచ్ కార్యక్రమంలో భాగమని అధికారులు తెలిపారు. -
చైనా మాంజా.. సిటీలో మరో వ్యక్తికి తీవ్రగాయాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో చైనా మాంజాకు మరో వ్యక్తి బలి అయ్యాడు. బైక్పై వెళ్తున్న సాయి వర్దన్ మెడకు మాంజా చుట్టుకోవడంతో అతడి చెయ్యి, మెడకి తీవ్ర గాయమైంది. దీంతో, వెంటనే సాయి వర్ధన్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటన ఉప్పల్ స్టేడియం మెట్రో స్టేషన్ సమీపంలో జరిగినట్టు తెలిసింది. మరోవైపు.. శుక్రవారం కూడా చైనా మాంజా కారణంగా గాయపడ్డారు. నల్గొండ జిల్లా తిరుమలగిరికి చెందిన సభావల్ మధు శుక్రవారం హైదరాబాద్ నుంచి తిరుమలగిరికి బైక్పై వెళ్తున్నారు. మార్గ మధ్యలో సాగర్ హైవేపై మాల్ మార్కెట్లో విద్యుత్ స్తంభానికి వేలాడుతున్న చైనా మాంజా చేతి వేళ్లకు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. గుర్తించిన స్థానికులు యాచారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించి.. చైనా మాంజా విక్రయిస్తున్న వ్యాపారి వివరాలపై ఆరా తీశారు. -
మొన్న అల్లు అర్జున్, ఇప్పుడు ప్రభాస్.. హరీశ్రావు సంచలన కామెంట్
తెలుగు చిత్ర పరిశ్రమ పట్ల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మాజీ మంత్రి హరీశ్రావు పలు విమర్శలు చేశారు. సినిమా రంగం అనేది తమ రాజకీయ కక్షలను తీర్చుకునేందుకు ఒక అడ్డాగా మార్చుకున్నారని ఆయన భగ్గుమన్నారు. ఒక సినిమాకు టికెట్ ధరలు పెంచి మరో సినిమాకు పెంచకపోవడం ఏంటి అంటూ ఆయన ప్రశ్నించారు. ఒకవైపు టికెట్ ధరలు పెంచుతూ జీవో వస్తుంది. మరోవైపు ఆ శాఖకు బాధ్యత వహించాల్సిన సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనకు తెలియదు.. ఆ జీఓ ఎలా వచ్చిందో అంటారు. అసలు తన దగ్గరికే ఫైల్ రాలేదని నిస్సహాయంగా చేతులెత్తేస్తారని హరీశ్రావు ఎద్దేవా చేశారు.వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అన్నందుకు ఒక హీరో సినిమాపై కక్ష కడితే.., మరో సంఘటనలో సీఎం పేరు మర్చిపోయినందుకు ఇంకో హీరోని జైలుకు పంపిస్తారని ఆయన మండిపడ్డారు. ఇప్పుడు మీకు నచ్చినోళ్లు అయితే టికెట్ ధర రూ. 600కు పెంచుకోవచ్చని అనుమతి ఇస్తారా..? ఆపై వారం రోజుల పాటు రేట్లు పెంచుకోవచ్చని రెడ్ కార్పెట్ వేస్తారా..? అంటూ హరీశ్రావు ప్రశ్నించారు. '50, 60 ఏళ్లుగా ఎంతోమంది కష్టపడి నిర్మించుకున్న చిత్ర పరిశ్రమ వాతావరణాన్ని.. మీ అహంకారంతో, మీ పిచ్చి చేష్టలతో, మీ పగ ప్రతీకారాలతో, మీ చిల్లర రాజకీయాలతో నాశనం చేస్తున్నారు.' అని ఆయన ఫైర్ అయ్యారు.తెర వెనుక ఏ రాజ్యాంగేతర శక్తి ఉంది..సినిమా టికెట్ రేట్ల విషయంలో శాఖ ఒకరిది.. పెత్తనం మరొకరిది.. జీవో ఇచ్చేది ఇంకొకరు.. అని హరీశ్రావు అన్నారు. సాక్షాత్తు ఒక క్యాబినెట్ మంత్రికి తెలియకుండానే.. ఆయన శాఖలో ఇంత పెద్ద నిర్ణయం జరిగిపోతుంటే.. అసలు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవరని ప్రశ్నించారు. 'మొన్న ఎన్నికల్లో ఓడిపోయి.. నేడు రాజ్యాంగేతర శక్తిగా ఎదిగి సినిమా టికెట్ల రేట్లను శాసిస్తున్న ఆ కనిపించని శక్తి ఎవరో..? ఒక్కో సినిమాకు కమిషన్ల రూపంలో ఎన్ని కోట్లు వసూలు చేస్తున్నారో..?.. ఆ వివరాలన్నీ త్వరలోనే బయటపెడతాం.' అని ఆయన హెచ్చరించారు. తెలంగాణలో ఇప్పుడు థియేటర్ల కంటే.. సచివాలయంలోనే ఒక పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోంది. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా.. ఉంటే ఎవరి కంట్రోల్లో ఉంది అనే అనుమానం ప్రతి ఒక్కరికీ కలుగుతోంది.ఒకవైపు టికెట్ ధరలు పెంచుతూ జీవో బయటికి వస్తుంది. మరోవైపు.. ఆ శాఖకు బాధ్యత… pic.twitter.com/2ADAbafJa6— Harish Rao Thanneeru (@BRSHarish) January 11, 2026 -
మమ్మీ.. డాడీ.. ఒంటరి చేశారు
పెద్దపల్లి జిల్లా: ‘మమ్మీ, డాడీ నన్ను ఒంటరిని చేసి వెళ్లిపోయారు. మమ్మీ.. పరీక్షలు దగ్గరపడుతున్నాయి మంచిగా చదువుకో అన్నావు.. డాడీ.. ఎంత ఖర్చయినా నీకు ఇష్టమున్న కాలేజీలో చదివిస్తానన్నావు.. పొద్దున్నే స్కూల్ టైం అవుతుంది.. తొందరగా రెడీ అవ్వు అని అల్లారుముద్దుగా బడికి పంపిస్తిరి.. ఇప్పుడు నాకు దిక్కెవ్వరు.. మీ ప్రేమ ఎవరి నుంచి దొరుకుతుంది.. నేను ఎందుకోసం చదవాలి.. నా మంచిచెడు ఎవరితో చెప్పుకోవాలి’ అంటూ ఆ కూతురు రోదన వర్ణనాతీతం. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన కందుల తిరుపతి–స్రవంతి దంపతులు. అన్యోన్యంగా ఆర్థిక పొదుపు పాటిస్తూ ఆదర్శంగా జీవించారు. వీరి కూతురు శివాణి ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది. మూడేళ్ల క్రితం మేడిపల్లి ఓపెన్కాస్టు మూతపడడంతో క్రమంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ క్రమంలో తిరుపతి ఏదో ఓ పని చేసుకుంటూ, స్రవంతి కుట్టుమిషన్తో ఎంతో కొంత సంపాదిస్తూ ఆనందంగా ఉన్నారు. ఈనెల 7న దంపతుల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. క్షణికావేశంలో భార్య బాత్రూమ్లోకి వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటిచుకోగా, భర్త మంటలు ఆర్పే ప్రయత్నంలో ఇద్దరూ 70శాతం కాలిపోయారు. స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, ఈనెల 8న తిరుపతి, 10న స్రవంతి మృతిచెందారు.చివరిచూపునకు నోచుకోక..క్షణికావేశానికి తల్లిదండ్రులు బలి కాగా, కూతురు రోదనలు మిన్నంటాయి. ‘మమ్మీ.. డాడీ’ అని ఎవరిని పిలవాలంటూ శివాణి రోదించిన తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది. తండ్రి చనిపోయిన విషయం తల్లికి తెలియదు.. తండ్రి అంత్యక్రియలు పూర్తవగానే తల్లి మరణం.. మళ్లీ తల్లికి అంత్యక్రియలు చేయడం.. మూడురోజులుగా ఆ కూతురు గుండెలవిసేల రోదించింది. పగోడికైనా ఇంతటి కష్టం రావద్దంటూ గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. తల్లి స్రవంతి శరీరం పూర్తిగా కాలిపోవడంతో మృతదేహాన్ని ప్యాక్ చేసి పంపించగా, కనీసం కడసారి చూపునకు కూడా నోచుకోలేకపోతున్నానంటూ శివాణి వెక్కివెక్కి ఏడ్వడం గుండెలను పిండేసింది. -
అటు ఇటు అన్నింటా.. నువ్వే జగమంతా..
స్త్రీశక్తి అపారం.. సూర్యోదయం కన్నా ముందే నిద్రలేచి.. సూర్యాస్తమయం తర్వాత కూడా పనిచేస్తూ దేశాభివృద్ధి.. కుటుంబ సంక్షేమంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. పారిశుధ్య కార్మికురాలిగా.. ఉపాధికూలీగా.. ఉద్యోగిగా.. డాక్టర్గా.. అధికారిణిగా నిరంతరం శ్రమిస్తున్నారు. అమ్మగా.. భార్యగా.. బిడ్డగా ఇంటిని తీర్చిదిద్ది.. విధుల్లో అలుపన్నదే లేకుండా కష్టపడుతున్నారు. కాలంతో పోటీ పడుతూ అన్ని పాత్రలకు వన్నె తెస్తున్నారు. వేకువజాము మొదలు రాత్రి పడుకునే వరకు ఆమె కష్టపడుతున్న తీరుపై ఈ వారం సండే స్పెషల్..!! పెద్దపల్లిలో కొడుకును పాఠశాలకు తీసుకెళ్తున్న తల్లి ప్రిన్సీతాముపడుతున్న కష్టం పిల్లలకు రావొద్దనుకుంటారు తల్లులు. ఉదయం 8 గంటలకు చిన్నపిల్లలైతే ఉగ్గుతినిపించి కడుపునింపుతున్నారు. స్కూల్కు వెళ్లే పిల్లలను తీసుకుని బడి‘బాట’పడుతున్నారు. అన్ని జాగ్రత్తలు చెప్పి వస్తున్నా రు. భర్తను ఆఫీసుకు పంపడం, అత్తమామలు, తల్లిదండ్రులకు సపర్యలు, ఇంటి పనుల్లో నిమగ్నమవుతున్నారు.పెద్దపల్లిలో పారిశుధ్య పనులు చేస్తున్న చింతల రాజేశ్వరిఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో నాలుగువేలకు పైగా మహిళా పారిశుధ్య కార్మికులున్నారు. నిత్యం ఉదయం 4 గంటల నుంచే విధుల్లో నిమగ్నమవుతున్నారు. విడతలవారీగా రహదారులు, వీధుల్లో పేరుకుపోయిన చెత్తను తొలగిస్తున్నారు. మురికి కాలువలు శుభ్రం చేస్తున్నారు. చలికి, ఎండకు, వానకు తట్టుకుంటూ.. నగరాలు, పట్టణాలను పరిశుభ్రంగాఉంచుతున్నారు.పెద్దపల్లి శాంతినగర్లో పాలు పితికిన కనకలక్ష్మిగ్రామాల్లో పాడిపరిశ్రమ, వ్యవ‘సాయం’లో మహిళలు ఎక్కువ భాగస్వాములవుతున్నారు. ఉదయం 5 గంటలకే పాడిపశువుల నుంచి పాలుపితకడం.. వ్యవసాయం చేసే మహిళలు తమ చేలలో పండిన కూరగాయలను మార్కెట్కు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. చిరువ్యాపారం చేసే వారు ఉదయాన్నే మార్కెట్కు వచ్చి విక్రయాలు ప్రారంభిస్తున్నారు. ఇంటి ఖర్చులు పోను.. ఆర్థికంగా బలపడుతున్నారు.సిరిసిల్లలో ఉదయం 6గంటలకు విధుల్లో కండక్టర్ పిల్లి రోజారాణిప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే మహిళలు ఎక్కువే ఉన్నారు. ఉదయం ఆరు గంటలకే ఫస్ట్ బస్ డ్యూటీ కోసం మహిళా కండక్టర్లు బయలుదేరుతారు. పొద్దంతా డ్యూటీ చేసి.. వచ్చిన ఆదాయాన్ని ఆర్టీసీకి అప్పగించి ఇంటికి చేరుతారు. ఉద్యోగ బాధ్యత పూర్తిచేసి కుటుంబానికి ఆసరాగా నిలుస్తారు. పలు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ సిబ్బంది ఉదయం ఆరు గంటలకే విధుల్లో ఉంటూ అత్యవసర సేవలు అందిస్తుంటారు.పెద్దపల్లి: గురాంపల్లిలో కొడుక్కి స్నానం చేయిస్తున్న లావణ్యవేకువజామునే పిల్లలను నిద్ర నుంచి లేపి పిల్లలకు స్నానం చేయిస్తా రు. 7 గంటల వరకే పాఠశాలకు సిద్ధం చేయిస్తారు. పిల్లలను స్నా నం మొదలు.. డ్రెస్.. జెడ ఇతర సపర్యలు చేస్తున్నంత సేపు బాగా చదువుకోవాలి. మంచి మార్కులు తెచ్చుకోవాలి. ఉన్నతంగా ఎదగాలని పిల్లలకు హితబోధ చేస్తా రు. అల్పాహారం సిద్ధం చేస్తారు.పెద్దపల్లిలో విధులకు వెళ్తున్న ప్రైవేటు టీచర్లు సుమలత, లతకుటుంబ ఆర్థిక అవసరాలు తీర్చేందుకు పలువురు మహిళలు ప్రైవేటు రంగాల్లో పని చేస్తున్నారు. ఉద యం 9 గంటలకు ప్రైవేటు, ప్రభు త్వ టీచర్లు, ఇతర ప్రైవేటు రంగా ల్లో పనిచేసే మహిళలు లంచ్ బాక్స్ పట్టుకొని చలో..చలో అంటూ కదులుతున్నారు. సాయంత్రం వరకు విధులు నిర్వహించి తిరిగి ఇంటి ముఖం పడుతున్నారు.సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ చేస్తున్న డాక్టర్ లహరిప్రభుత్వ ఉద్యోగిగా సేవలందించేందుకు 10 గంటలకే విధులకు హాజరవుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు, కార్యాలయాల్లో విధుల్లో ప్రజాసేవలో తరిస్తున్నారు. అధికా రులు.. అర్జీదారులకు వారధిగా ఉంటూ.. ప్రభుత్వపాలనలో మహిళా ఉద్యోగులు భాగస్వాములు అవుతున్నారు. కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉంటున్నారు.పెద్దపల్లిలో పిల్లలకు లంచ్ రెడీ చేస్తున్న గాదాసు శైలజపిల్లలను స్కూళ్లకు పంపి, భర్తలను ఉద్యోగానికి పంపిస్తూ కాసేపైనా విశ్రాంతి తీసుకోకుండా మధ్యాహ్నం భోజన తయారీకి సన్నద్ధం అవుతుంటారు. కుటుంబ ఆరోగ్యమే లక్ష్యంగా పౌష్టికాహారాన్ని వండుతుంటారు. రుచికరమైన వంటలు చేసి.. పిల్లలకు, భర్తకు భోజనం తయారు చేస్తుంటారు. లంచ్ బాక్స్ల్లో వడ్డించుకుని.. పాఠశాలల్లో ఉన్న పిల్లలకు తీసుకెళ్తుంటారు.పెద్దపల్లిలో పాఠశాలలో చిన్నారికి అన్నం తినిపిస్తున్న తల్లిఇంటి పని మొత్తం పూర్తి చేసుకుని.. పిల్లలకు లంచ్బాక్సులు రెడీ చేసుకుని పాఠశాలలకు వెళ్తుంటారు. అక్కడ చిన్నారులకు గోరుముద్దలు తినిపించుకుంటూ.. తరగతి గదుల్లో చెప్పిన పాఠాలను తెలుసుకుంటారు. గ్రామాల్లో వ్యవసాయకూలీలు పొలం పనుల్లో నిమగ్నమవుతూ.. పాటలు పాడుతూ సరదాగా సాగుతుంటారు.పెద్దపల్లిలో రాత్రివే చలి మంట కాగుతూ..పొద్దంతా కష్టపడి.. అలిసిపోయి.. కుటుంబసభ్యులతో కాసేపు సరదాగా గడుపుతుంటారు. రాత్రి తినేందుకు వంట సిద్ధం చేస్తుంటారు. ఆరోజు మిగిలిపోయిన పనులు పూర్తి చేసుకుంటారు. రోజూవారి కార్యక్రమాలు, కుటుంబ పరిస్థితి, అవసరాలు, ఆచరణలపై భర్త, ఇంటి పెద్దలతో చర్చిస్తుంటారు.పెద్దపల్లి మహిళా పోలీస్స్టేషన్లో విధుల్లో ఎస్సై అక్కల రాజమణిగృహిణులు తమ పిల్లలను పాఠశాల నుంచి ఇంటికి తీసుకొస్తుంటారు. హోంవర్క్ చేయిస్తూ.. అనుమానాలు నివృత్తి చేస్తూ టీచర్గా మారుతుంటూరు. పొ లం పనులకు వెళ్లినవారు చేలలో బిజీబిజీగా ఉంటారు. కొందరు అత్యవసర సేవల్లో పనిచేసే మహిళలు సమయంతో పనిలేకుండా ముందుకు సాగుతుంటారు.కొడుకు కూతురు శాన్వి, ఫర్నీత్లను నిద్రపుచ్చుతున్న తల్లి భైరి సుధచిన్నారులు.. కుటుంబసభ్యులకు భోజనాలు వడ్డించి మిగిలిపోయిన పనులు పూర్తిచేసుకుంటారు. రేపటి కోసం అవసరమైన పనులు సిద్ధం చేసుకుంటారు. చిన్నారులను లాలించి, నిద్రబుచ్చుతారు. కుటుంబ క్షేమమే తమ బాధ్యతగా ముందుకు సాగుతూ.. రోజంతా కష్టపడే మహిళలు.. ఆ ఇంట్లోని వారు అందరూ నిద్రపోయిన తరువాత విశ్రాంతి తీసుకుంటారు. ఫొటోలు: సాక్షి, ఫొటోగ్రాఫర్లు పెద్దపల్లి/రాజన్న సిరిసిల్ల -
నల్లగొండ: కొర్లపహాడ్ వద్ద హైవేపై రోడ్డు ప్రమాదం
నల్లగొండ: జిల్లాలోని కేతేపల్లి మండలం కొర్లపహాడ్ వద్ద రోడ్డ ప్రమాదం చోటు చేసుకుంది. కొర్లపహాడ్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి, ముందు వెళ్తోన్న వాహనాన్ని తిరువూరు డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ముందు వెళ్తున్న బస్సు డ్రైవర్ సడన్గా బ్రే్క్ వేయడంతో వెనుక వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టినట్లు తెలుస్తోంది. బస్సులు మెల్లగానే వెళ్తూ ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. పలువురు స్వల్ప గాయాలతోనే బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
గంజాయి విక్రయిస్తున్న ర్యాపిడో డ్రైవర్
హైదరాబాద్: గంజాయి విక్రయిస్తున్న ర్యాపిడో డ్రైవర్ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్–12లో గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అక్కడికి చేరుకున్న పోలీసులు సోదాలు నిర్వహించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్–10లోని ఇబ్రహీంనగర్లో నివాసం ఉండే ర్యాపిడో డ్రైవర్ మొహ్మమ్మద్ జునైద్ గుట్టుచప్పుడు కాకుండా గంజాయి విక్రయిస్తున్నట్లు గుర్తించాడు. అతని వద్ద నుంచి 137 గ్రాముల డ్రై గంజాయి, హోండా షైన్ ద్విచక్ర వాహనం, ఒప్పో మొబైల్ ఫోన్ను స్వాదీనం చేసుకున్నారు. నిందితుడు జునైద్ను అరెస్టు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అంబర్పేట ఎస్ఐ భానుప్రకాశ్రెడ్డికి రిమాండ్
అంబర్పేట (హైదరాబాద్): రికవరీ చేసిన బంగారాన్ని బాధితులకు అప్పగించకుండా తాకట్టు పెట్టిన ఎస్ఐ భానుప్రకాశ్రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. పోలీసుల కథనం ప్రకారం.. అంబర్పేట పోలీసు స్టేషన్లో భానుప్రకాశ్రెడ్డి డిటెక్టివ్ సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు. గత ఏడాది ఓ చోరీ కేసులో దొంగల నుంచి నాలుగున్నర తులాల బంగారాన్ని రికవరీ చేశాడు. అయితే దానిని బాధితులకు అప్పగించకుండా సొంత అవసరాలకోసం తాకట్టు పెట్టాడు. బాధితులు బంగారం కోసం ఉన్నతాధికారుల వద్దకు వెళ్లగా విషయం వెలుగులోకి వచి్చంది. దీంతో భానుప్రకాశ్ను సస్పెండ్ చేశారు. విచారణ తర్వాత అరెస్టు చేసి శనివారం కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. జాడ తెలియని సరీ్వస్ రివాల్వర్భానుప్రకాశ్ ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి జీవితాన్ని దుర్భరంగా చేసుకున్నాడు. ఏకకంగా సరీ్వస్ రివాల్వర్ను పొగొట్టుకున్నాడు. దీనిపై ఉన్నతాధికారులు ఎంత విచారించినా ఫలితం లేకుండా పోయిందని సమాచారం. చివరికి రైలులో ప్రయాణిస్తుండగా పోయినట్లు అతను తెలపడంతో ఆ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారని తెలిసింది. -
సంక్రాంతి ఎఫెక్ట్.. భారీ ట్రాఫిక్ జామ్
సాక్షి,హైదరాబాద్: విజయవాడ జాతీయ రహదారిపై వాహన రద్దీ భారీగా పెరిగింది. సంక్రాంతి పండుగకు ముందు శనివారం, ఆదివారం రావడంతో హైదరాబాద్లో నివసించే ప్రజలు తమ స్వగ్రామాల బాట పట్టారు. ఒకే సమయంలో వాహనాలు వేల సంఖ్యలో తరలిరావడంతో యాదాద్రి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు అర కిలోమీటరు మేర నిలిచిపోయాయి.ఒక దశలో ట్రాఫిక్ కిలోమీటరు మేర నిలిచిపోయింది. ఫాస్టాగ్ విధానం అమలులో ఉన్నప్పటికీ వాహనాలు పరిమితికి మించి రావడం, కొన్ని వాహనాల ఫాస్టాగ్లు స్కాన్ కాకపోవడంతోనే కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయని టోల్ ప్లాజా నిర్వాహకులు, పోలీసులు చెబుతున్నారు. రాచకొండ పోలీసులు, జీఎంఆర్ టోల్గేట్ సిబ్బంది వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తున్నారు.కేతేపల్లి మండలం కొర్లపహాడ్ వద్ద ఫాస్టాగ్ సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. టోల్ చెల్లింపులు సక్రమంగా జరగకపోవడంతో వాహనాలు నిలిచిపోయి, రద్దీ మరింత పెరిగింది. మరోవైపు జాతీయ రహదారి-65 పై వాహనాల జాతర కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో వాహనాల సంఖ్య పెరగడంతో రహదారి బ్లాక్ స్పాట్స్ వద్ద జాగ్రత్త చర్యలు కనిపించకపోవడం వాహనదారులను ఆందోళనకు గురి చేసింది.టోల్ ప్లాజా వద్ద ఆలస్యం, ఫాస్టాగ్ సమస్యలు, రహదారి బ్లాక్ స్పాట్స్ వద్ద జాగ్రత్త చర్యలు లేకపోవడం వల్ల వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. -
సైబర్ వలలో మాజీ జేడీ లక్ష్మీనారాయణ సతీమణి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మాజీ జేడీ లక్ష్మీ నారాయణ సతీమణి ఊర్మిళ సైబర్ నేరస్తుల వలలో చిక్కారు. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో భారీ లాభాలు ఆర్జించవచ్చన్న నేరస్తుల మాయమాటలను నమ్మి ఏకంగా రూ.2.58 కోట్లు మోసపోయారు. ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్లోని ఎమ్మెల్యే కాలనీలోని స్రవంతి రెసిడెన్సీలో నివాసం ఉంటున్న లక్ష్మీ నారాయణ భార్య ఊర్మిళకు గత నవంబర్ చివరి వారంలో గుర్తు తెలియని వ్యక్తి నుంచి వాట్సాప్లో సందేశం వచ్చింది.స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్కు చిట్కాలు ఇస్తామని, అధిక లాభాలు ఆర్జించవచ్చని ఆ సందేశం సారాంశం. అయితే ఆమెకు ట్రేడింగ్లో అనుభవం లేకపోయేసరికి.. తన భర్తను వాట్సాప్ గ్రూప్లో చేరమని సలహా ఇచ్చారు. దీంతో లక్ష్మీ నారాయణ నవంబర్ 29న ‘స్టాక్ మార్కెట్ ప్రాఫిట్ గైడ్ ఎక్సే్ఛంజ్ గ్రూప్–20’అనే పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్లో చేరారు. ఇందులో 167 మంది సభ్యులు ఉన్నారు. అమెరికాలో పీహెచ్డీ అంటూ.. దినేష్ సింగ్ అనే వ్యక్తి వాట్సాప్ గ్రూప్లో స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై సలహాలు ఇస్తూ మెసేజ్లు చేసేవాడు. ‘స్టాక్ మార్కెట్ ట్రెజరీ హంటింగ్ సీక్రెట్స్’ పేరుతో పుస్తకాన్ని కూడా ప్రచురించనున్నానని, ఈనెల 23న ముంబైలో ఈ కార్యక్రమం ఉంటుందని దినేష్ గ్రూప్ సభ్యులకు కల్లబొల్లి మాటలు చెప్పాడు. తాను ఐఐటీ బాంబే గ్రాడ్యుయేట్ని అని, అమెరికాలోని వార్టన్ వర్సిటీ నుంచి పీహెచ్డీ పూర్తి చేశానని, జేపీ మోర్గాన్లో 6 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన ఆస్తులను నిర్వహించిన ఈక్విటీ అనలిస్ట్నని చెబుతూ ఓ నకిలీ లింక్ను పంపించాడు. అది చూసిన గ్రూప్ సభ్యులు నిందితుడిని గుడ్డిగా నమ్మారు.ఇదే సమయంలో దినేష్ ‘ది వెల్త్ అలయెన్స్’ అనే కాన్సెప్్టను గ్రూప్ సభ్యులకు పరిచయం చేశాడు. ఒకేరకమైన ఆలోచనలు, లక్ష్యాలు ఉన్న గ్రూప్ సభ్యులు కలిసి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే 500 శాతం రాబడులు వస్తాయని.. అదే అలయెన్స్ లక్ష్యమని నమ్మించాడు. 5–6 వారాల్లో 200 శాతం లాభాలు అందిస్తానని హామీ ఇచ్చాడు. సభ్యులతో ఏకీకృత బ్రోకరేజ్ ఖాతాను తెరిచాడు. మెకన్లీ బ్రోకరేజ్ సర్విసెస్ ద్వారా మాత్రమే ఇండియన్ మార్కెట్ క్యూఐబీ ట్రేడింగ్, యూఎస్ మార్కెట్ క్యూఐబీ ట్రేడింగ్, ఐపీఓ సబ్స్రి్కప్షన్లను నిర్వహించాలని సూచించాడు. ఇందుకు కస్టమర్ సర్విసెస్ మేనేజర్ అంటూ ఖైతీ అనే మహిళను పరిచయం చేశాడు. సెబీ రిజిస్టర్డ్ సంస్థ అని నకిలీ గుర్తింపు పత్రాలను చూపాడు. భారత్తోపాటు అమెరికా, హాంకాంగ్లలో ట్రేడింగ్ చేయడానికి అధికారం ఉందని వివరించాడు. బంగారం మీద రుణం తీసుకొని మరీ.. గ్రూప్ సభ్యులను మూడు శ్రేణులుగా విభజించిన దినేష్.. రూ.20 లక్షల కంటే తక్కువ పెట్టుబడులు ఉన్నవారికి విక్టరీ వాన్ గార్డ్స్ టీమ్–1 అని, రూ.20 లక్షల కంటే ఎక్కువ పెట్టేవారిని విక్టరీ వాన్ గార్డ్స్ టీమ్–2 అని, అత్యధిక పెట్టుబడులు పెట్టేవారిని క్లోజ్డ్ డోర్ డిస్ప్లే టీమ్ అని పేర్లు పెట్టాడు. గ్రూప్ సభ్యులకు వ్యక్తిగతంగా ఒకరితో ఒకరు మార్గదర్శకత్వం అందిస్తామని మాయమాటలు చెప్పాడు. గ్రూప్ సభ్యులు అధిక లాభాలు పొందేందుకు పెట్టుబడులు పెంచాలని.. లేకపోతే లాభాలు కోల్పోతారని భయభ్రాంతులకు గురి చేశాడు. దీంతో ఊర్మిళ పెట్టుబడుల మొత్తాన్ని పెంచారు. ఈ2ఈ రైల్, గాబియన్ టెక్నాలజీస్ ఐపీఓలలో పాల్గొనాలని, పెద్ద మొత్తంలో డిపాజిట్ చేయాలని సూచించాడు. 300 శాతం లాభాలు వస్తాయని నమ్మించాడు.దీంతో గుడ్డిగా నమ్మిన ఊర్మిళ.. బంగారం మీద రుణం తీసుకొని మరీ పెట్టుబడులు పెట్టారు. ఒకవైపు అత్యాశ వద్దని భర్త హెచ్చరించినా పట్టించుకోకుండా ఆమె పెద్ద మొత్తంలో డిపాజిట్ చేయడం గమనార్హం. పెట్టుబడుల కోసం నిందితులు పశి్చమ బెంగాల్, అస్సాం, ఒడిశా, ఢిల్లీ వంటి రాష్ట్రాలకు చెందిన కరెంట్ ఖాతా నంబర్లను అందించారు. దీంతో అనుమానం కలిగిన ఊర్మిళ.. ఇంటర్నెట్లో సెర్చ్ చేశారు. వాట్సాప్ ఆధారిత పెట్టుబడి మోసాల గురించి పలు నివేదికలను చూశారు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోరి్టంగ్ పోర్టల్లో ఫిర్యాదు చేశారు. ఈనెల 6న సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బీఎన్ఎస్ చట్టం సెక్షన్ 111(2)(బీ), 318(4), 319(2), 336(3), 338, 340(2)లతో పాటు ఐటీ చట్టంలోని 66–సీ,డీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.ఒక్క రోజే రూ.38 లక్షలు..ఊర్మిళ తన భర్త పేరు, వివరాలతో ‘మెక్కీ సీఎం’ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకొని, ట్రేడింగ్ ఖాతాను ప్రారంభించారు. గ్రూప్లో ఇచ్చిన సూచనల మేరకు మెకిన్లీ ట్రేడింగ్ ఖాతాలోకి సొమ్మును బదిలీ చేశారు. గత డిసెంబర్ 24న తొలుత రూ.లక్ష పెట్టుబడి పెట్టారు. అప్పట్నుంచి ఈనెల 5 వరకు 19 దఫాలుగా మొత్తం రూ.2.58 కోట్లు పెట్టారు. డిసెంబర్ 26న ఒక్క రోజే ఏకంగా రూ.38 లక్షలు పెట్టారు. బాధితురాలి యాక్సిస్ బ్యాంక్ ఖాతా నుంచి నిందితులకు చెందిన సీబీఐ బ్యాంక్లోని కంపాకోలా బెవరేజెస్ ఖాతాకు ఈ సొమ్మును బదిలీ చేశారు. నిందితులు మాతారా ఎంటర్ప్రైజెస్, రిసోర్స్ గ్లోబల్ సర్వీసెస్, సమ్మిట్ ఆటోమేషన్ కంట్రోల్ సిస్టమ్ పేరుతో కరెంట్ ఖాతాలు నిర్వహిస్తున్నారు. -
మద్యప్రవాహానికి అడ్డుకట్టే లేదా?
ఆంగ్ల నూతన సంవత్సర ఆరంభ వేళ యావత్ భారతా వని సిగ్గుతో తలదించు కోవాల్సిన దృశ్యాలు దేశ వ్యాప్తంగా ఆవిష్కృతమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీ మొదలుకొని హైదరాబాద్, విజయవాడ వరకు నగరాలన్నీ ఒకే రకమైన అనాగరిక ప్రవర్తనకు వేదికలయ్యాయి. ఫుల్లుగా మద్యం సేవించిన మందుబాబులు రోడ్లపై వేసిన వీరంగం చూస్తే వెనుకబడిన దేశాల్లో కూడా ఇలాంటి వికృత చేష్టలు ఉండవేమోనన్న భావన కలుగుతుంది. పీకల దాకా తాగి తామేమి చేస్తున్నామో కనీస స్పృహ లేకుండా ఫుట్పాత్లపై పడిపోవడం, వాంతులు చేసుకోవడం, శాంతిభద్రతలు పరిరక్షించే పోలీసులతో వాగ్వాదానికి దిగడం వంటి దృశ్యాలు వీక్షకులకు తీవ్ర ఇబ్బంది కలిగించాయి. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించడం అంటే కేవలం మద్యం, గంజాయి, ఇతర మత్తు పదార్థాల్లో మునిగి పోవడమేనా? దేశంలోని 29 రాష్ట్రాల గణాంకాలను పరిశీలిస్తే, డిసెంబర్ 31న జరిగిన మద్యం అమ్మకాల్లో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్ ద్వితీయ స్థానాన్ని ఆక్రమించింది. డిసెంబర్ 30 నుంచి జనవరి 1 వరకు కేవలం మూడు రోజుల్లోనే తెలంగాణలో రూ. 1,671 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ వాటానే అత్యధికం. ఒక నిమిషానికి తెలంగాణలో 95 బాటిళ్లు, ఆంధ్రప్రదేశ్లో 93 బాటిళ్ల చొప్పున అమ్ముడయ్యాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పెట్టుబడుల ఆకర్షణలో పోటీ పడాల్సిన రాష్ట్రాలు, మద్యం అమ్మకాల్లో పోటీ పడటం శోచనీయం.యువత భవితవ్యం ప్రశ్నార్థకంమద్యం అలవాటు క్రమంగా గంజాయి, ఇతర ప్రమాదకర మత్తుపదార్థాల వైపు మళ్లుతోంది. విదేశీ వికృత సంస్కృతికి అద్దం పట్టే రేవ్ పార్టీలు ఇప్పుడు నగరాల శివార్లలోని ఫామ్హౌస్లలో గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతున్నాయి. పోలీసులు దాడులు చేసి కేసులు పెడుతున్నా, డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడం సాధ్యం కావడం లేదు. కేవలం మద్యం తాగడానికే పరిమితం కాకుండా, యువత మాదక ద్రవ్యాల చీకటి వ్యాపారంలో కూరుకుపోతోంది. అంతర్జాతీయ ముఠాల ప్రమేయంతో సరిహద్దులు దాటి మత్తు పదార్థాలు దేశంలోకి దిగుమతి అవుతున్నాయి.మరీ దారుణమైన విషయం ఏమిటంటే, స్కూల్ పిల్లలు ఇష్టంగా తినే చాక్లెట్లలో కూడా మత్తు పదార్థాలు కలిపి విక్రయిస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. భావి భారత పౌరులుగా ఎదగాల్సిన విద్యార్థులు పాఠశాల స్థాయిలోనే ఇలాంటి వ్యసనాలకు బానిసలైతే దేశ భవిష్యత్తు ఏమవుతుంది? తమ కష్టార్జితాన్ని పిల్లల చదువుల కోసం వెచ్చిస్తున్న తల్లిదండ్రులకు తమ బిడ్డలు మత్తులో జోగుతున్నారని తెలిస్తే వారి గుండెలు పగిలిపోవా?మాదక ద్రవ్యాల సరఫరాను అడ్డుకోవడానికి అత్యాధునిక సాంకేతికత, సుశిక్షితులైన పోలీసు యంత్రాంగం అవసరం. కానీ అనేక రాష్ట్రాల్లో అటువంటి ప్రత్యేక నియంత్రణ వ్యవస్థలు లోపించాయి. పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో వ్యవసాయం ముసు గులో గంజాయి సాగు చేస్తూ, దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసే కుట్రలు జరుగుతున్నాయి. మానవ వనరులను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా సాగుతున్న ఈ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది.ప్రభుత్వాల ద్వంద్వ ప్రమాణాలుమరోవైపు ప్రభుత్వాల ద్వంద్వ నీతి కూడా విమర్శలకు తావిస్తోంది. మాదక ద్రవ్యాల వినియో గానికి వ్యతిరేకంగా ర్యాలీలు, అవగాహన కార్యక్ర మాలు నిర్వహిస్తున్న ప్రభుత్వాలు, మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం కోసం ఎందుకు పాకులాడు తున్నాయి? మద్యం కూడా ఒక మత్తు పదార్థమే కదా! దానివల్ల కలిగే అనర్థాల గురించి ఎందుకు ప్రచారం చేయడం లేదు? ఆదాయం కోసం ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం ఏ రకమైన అభివృద్ధి?మత్తు పదార్థాల ద్వారా వచ్చే ఆదాయాన్ని రాబడిగా పరిగణించకూడదని భారత రాజ్యాంగం స్పష్టం చేస్తోంది. మద్యపానం మనిషి శారీరక, నైతిక, మేధాపరమైన పతనానికి దారితీస్తుందని మహాత్మాగాంధీ ఎప్పుడో హెచ్చరించారు. గాంధీ పుట్టిన గుజరాత్లో మద్యపాన నిషేధం అమలులో ఉన్నప్పటికీ, దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో మద్యం ఏరులై పారుతోంది.ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న మద్యంలో పదో వంతు భారతదేశంలోనే వినియోగం అవుతున్నట్లు ‘లాన్సెట్’ నివేదికలు చెబుతున్నాయి. కల్తీ సారా, గుడుంబా వంటి ప్రాణాంతక పదార్థాల వల్ల ఎంతో మంది అకాల మృత్యువాత పడుతున్నారు. మద్యం తయారీ పరిశ్రమ శీఘ్రగతిన అభివృద్ధి చెందుతోందని ‘అసోసియేషన్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ’ వెల్లడించడం దేశ ఆరోగ్య స్థితిగతులకు అద్దం పడుతోంది.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా స్పందించి, మత్తు ప్రవాహాన్ని అరికట్టడానికి ఉమ్మడి కార్యాచరణను రూపొందించాలి. లేనిపక్షంలో 2047 నాటికి మనం కలలుగంటున్న ‘వికసిత్ భారత్’ కాస్తా ‘మద్యపాన భారత్’గా మారే ప్రమాదం ఉంది. అభివృద్ధి అంటే కేవలం భవనాలు, పరిశ్రమలే కాదు, ఆరోగ్యవంతమైన సమాజం కూడా అని గుర్తించాలి. మన ప్రయాణం ఏ దిశగా సాగుతోందో ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లువ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, ఏపీ శాసన పరిషత్ సభ్యులు -
అతితక్కువ పనిదినాల్లో రెండోస్థానం
సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపా ధి హామీ పథకం కింద నమోదైన అత్యల్ప సగటు పనిదినాల్లో తెలంగాణ రెండోస్థానంలో నిలిచింది. ఉపాధి హామీ చట్టం 2025–26 సంవత్సరంలో 9 నెలల్లో 27 అత్యల్ప సగటు పనిదినాలతో ఉత్తరాఖండ్ ప్రథమ స్థానంలో నిలవగా, 28 రోజులతో తెలంగాణ రెండో స్థానంలో సాధించింది. 2025లో ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 31 దాకా... ప్రతి కుటుంబానికి సగటున 28 రోజుల సగటు పనులను నమోదు చేసింది. ఇదే సమయంలో 100 రోజుల పని పూర్తి చేసిన కుటుంబాల సంఖ్య కూడా తక్కువగానే ఉంది.తెలంగాణలో కేవలం ఆరు వేల కుటుంబాలు మాత్రమే వంద రోజుల పనిని సాధించాయి. మునుపటి సంవత్సరాలతో పోలిస్తే... ఉపాధి కల్పనలో సవాళ్లు పెరగడంతో పర్సన్ డేస్ గణనీయంగా తగ్గాయి. తెలంగాణలో దాదాపు 20 లక్షల కుటుంబాలు ఈ పథకంలో పాల్గొన్నాయి. తాజాగా 18 ప్రధాన రాష్ట్రాల నుంచి సేకరించిన డేటాను విశ్లేíÙంచగా వివిధ అంశాలు వెల్లడయ్యాయి. వచ్చే ఏప్రిల్ 1 నుంచి ఈ ఉపాధి పథకం ‘వికసిత్ భారత్–గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవిక మిషన్ (గ్రామీణ్) చట్టం’గా అమల్లోకి రానున్న విషయం తెలిసిందే. అంతకు ముందూ క్షీణతే... 2025లో ఆరునెలల కాలంలో (ఏప్రిల్ నుంచి సెపె్టంబర్ దాకా) మొత్తం ఉపాధి హామీ పని దినాల్లో 47.6 శాతం మేర (గత ఏడాదితో పోలిస్తే) తగ్గుదల నమోదైంది. తెలంగాణలో ఉపాధి కల్పన గణనీయ తగ్గుదల కనిపించే జూలై–ఆగస్టు నెలల్లోనే కాకుండా.. ఈసారి వేసవి తీవ్రత అధికంగా ఉండటంతో ఏప్రిల్–మే నుంచే ఈ క్షీణత ప్రారంభమైంది. ఈ తరువాతి నెలల్లోనూ పునరుద్ధరణ కాలేదు.ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య దేశవ్యాప్తంగా పనిదినాల తగ్గుదల 10.4% మాత్రమే ఉండగా, తెలంగాణలో మాత్రం దానికి నాలుగు రెట్లు అధికంగా ఉండటం ఆందోళనకరంగా మారింది. గత ఏడాది ఇదే సమయంలో ఉపాధి పొందిన కుటుంబాల సంఖ్య 25.33 లక్షల నుంచి 19.94 లక్షలకు (21.3% తగ్గుదల) తగ్గిపోయింది. అలాగే, ప్రతీ కుటుంబానికి లభించిన సగటు పని దినాలు 41 రోజుల నుంచి 27 రోజులకు పడిపోయాయి. ఒక కుటుంబానికి ఏడాదికి రూ.1,686 తక్కువ ఆదాయం (–19.4%) లభించింది. -
కార్లు మాట్లాడుకుంటాయి
రోడ్డు ప్రమాదాలు.. నిత్యం మనం వింటున్నవే. అయితే మారేది తీవ్రత మాత్రమే. కొత్త బండ్లు ఏ రీతిన పెరుగుతున్నాయో.. ప్రమాదాలు కూడా అదే స్థాయిలో అధికం అవుతున్నాయి. దేశవ్యాప్తంగా 2023లో 4,80,583 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వీటి కారణంగా 1,72,890 మంది మృత్యువాతపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రాణ నష్టం జరిగిన తర్వాత స్పందించే బదులుగా ప్రమాదం జరిగే అవకాశాలను తగ్గించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అన్ని విభాగాల్లో కలిపి దేశవ్యాప్తంగా గత ఆర్థిక సంవత్సరంలో 2,56,07,391 కొత్త వెహికల్స్ రోడ్డెక్కాయి.కొన్నేళ్లుగా ఏటా కోట్లాది వాహనాలు కొత్తగా వచ్చి చేరుతున్నాయి. ఇంకేముంది ప్రమాదాలూ పెరిగి లక్షలాది కుటుంబాలకు తీరని శోకం మిగిలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వెహికల్–టు–వెహికల్ (వీ2వీ) కమ్యూనికేషన్ టెక్నాలజీని భారత్లో ప్రవేశపెట్టాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తోంది. 2026 చివరి నాటికి ఈ వ్యవస్థను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రమాదం జరిగే అవకాశాలను తగ్గించేందుకు ఈ సాంకేతికత దోహదం చేస్తుందని ప్రభుత్వం ధీమాగా ఉంది. ఇంటర్నెట్ అవసరం లేకుండా..నెట్వర్క్, ఇంటర్నెట్ అవసరం లేకుండా వాహనాలు ఒకదానితో ఒకటి నేరుగా షార్ట్ రేంజ్ వైర్లెస్ సిగ్నల్స్ ద్వారా సంభాíÙంచుకోవడానికి ఈ సాంకేతికత వీలు కల్పిస్తుంది. రహదారుల మీద పార్క్ చేసిన వాహనాలను అదే మార్గంలో వేగంగా ప్రయాణించే ఇతర వాహనాలు ఢీకొట్టకుండా నివారించడంలో ఈ సాంకేతికత ప్రభావవంతంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. శీతాకాలంలో దట్టమైన పొగమంచు సమయంలో యాక్సిడెంట్లను నివారించడానికి కూడా ఇది సహాయపడుతుంది. ఈ వ్యవస్థ ద్వారా వాహనాలు సిగ్నల్స్ను ఒకదానితో మరొకటి ఇచ్చిపుచ్చుకుంటాయి.మరొక వాహనం ప్రమాదకరంగా దగ్గరగా వచ్చినప్పుడు డ్రైవర్లకు హెచ్చరికలను పంపుతాయి. వాహన స్థానం, కదలిక దిశ, వేగంలో మార్పులు, బ్రేకులు వేస్తున్న తీరు ఏవిధంగా ఉందో వంటి సమాచారం ఇతర వాహనాలకు చేరవేస్తుంది. ముందున్న వాహన వేగం నెమ్మదించడం వంటి ప్రమాదకర పరిస్థితిని గుర్తించినప్పుడు డ్రైవర్కు హెచ్చరిక పంపుతుంది. స్పందించే సమయం పరిమితంగా ఉన్నా, దారి కనిపించని పరిస్థితుల్లో కూడా ఇది ఉపయుక్తంగా ఉంటుంది. ఈ వ్యవస్థకు సాంకేతిక ప్రమాణాలు, కమ్యూనికేషన్ ప్రొటోకాల్స్ను ఖరారు చేయడానికి ప్రభుత్వం వాహన తయారీ సంస్థలతో కలిసి పనిచేస్తోంది. దేశవ్యాప్తంగా అమలుకోసం రేడియో స్పెక్ట్రమ్ ప్రత్యేకంగా కేటాయిస్తారు. వాహనాల మధ్య అడ్డంకులు లేని సమాచార మారి్పడి కోసం ప్రత్యేకంగా నిర్దిష్ట ఫ్రీక్వెన్సీలను అందుబాటులో ఉంచడానికి టెలికం శాఖ సంసిద్ధత వ్యక్తం చేసింది. రూ.5 వేల కోట్ల బడ్జెట్తో.. దేశంలో 36 కోట్లకుపైగా రిజిస్టర్డ్ వెహికల్స్ పరుగు తీస్తున్నాయి. ఈ స్థాయిలో వాహనాలున్న భారత్లో వీ2వీ సాంకేతికత అమల్లోకి వస్తే రోడ్డు భద్రత విషయంలో పెద్ద అడుగుపడ్డట్టే. ఇలాంటి సాంకేతికత ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ.5,000 కోట్లు ఖర్చవుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది.వీ2వీ కమ్యూనికేషన్ టెక్నాలజీ ప్రత్యేకతలివీ.. ⇒ ఈ వ్యవస్థ వాహనాల్లో ఇన్స్టాల్ చేసిన సిమ్ కార్డ్ లాంటి పరికరం ద్వారా షార్ట్ రేంజ్ వైర్లెస్ సిగ్నల్స్ ఆధారంగా పనిచేస్తుంది. ⇒ ఈ పరికరం ట్రాఫిక్ లైట్స్తో కమ్యూనికేట్ చేయగలదు. అత్యవసర వాహనాలకు ప్రాధాన్యం ఇస్తుంది. ⇒ వాహనదారులకు రూట్ మ్యాప్ ప్లానింగ్లో సహాయపడుతుంది. ⇒ మరొక వాహనం ఏ దిశ నుంచి అయినా చాలా దగ్గరగా వచ్చినప్పుడు.. రియల్ టైమ్లో హెచ్చరికలు అందుతాయి. పొగ మంచు అధికంగా కురుస్తున్నప్పుడు దారి ఏమాత్రం కనపడదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ⇒ చుట్టూ ఉన్న వెహికల్స్ ఎంత దూరంలో ఉన్నాయో అలర్ట్ చేస్తుంది. వాహనం సమీపిస్తున్నా, రోడ్డు పక్కన నిలిచి ఉన్నా డ్రైవర్లను హెచ్చరిస్తుంది. ⇒ వెహికల్కు 360 డిగ్రీల కోణంలో అన్ని వైపుల నుంచి సంకేతాలను అందిస్తుంది. ⇒ ప్రతి వాహనంలో ప్రత్యేక హార్డ్వేర్ ఏర్పాటుకు కొన్ని వేలు ఖర్చు అవుతుంది. కానీ ఈ ధరలు ఇంకా వెల్లడి కాలేదు. ⇒ 2026 చివరి నాటికి ఈ సాంకేతికతను నోటిఫై చేయడానికి రవాణా మంత్రిత్వ శాఖ కృషి చేస్తోంది. ⇒ తొలుత ఈ పరికరాలను కొత్త వాహనాల్లో (ప్లాంట్లలోనే) ఇన్స్టాల్ చేస్తారు. ⇒ ఇతర అన్ని వాహనాల్లో దశలవారీగా అమలు చేస్తారు. -
నెలాఖరులో తేలికపాటి వర్షాలు
సాక్షి, హైదరాబాద్: వాతావరణంలో మార్పులు వేగంగా నమోదవుతున్నాయి. చలి కాలం చివరి దశకు చేరుతుండడంతో ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలో నమోదవుతుండగా...రాత్రి పూట ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. బంగాళాఖాతంలో మారుతున్న వాతావరణ పరిస్థితులు, వాయుగుండాల ప్రభావం, రాష్ట్రానికి తూర్పు, ఈశాన్య దిశల నుంచి వీస్తున్న గాలులతో చలి తీవ్రత పెరుగుతోంది.చివరి వారంలో ఉత్తర, మధ్య తెలంగాణ, తూర్పు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు నమోదవుతాయని, ఆ సమయంలో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలో నమోదు కావొచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదవుతున్నాయి. రానున్న మూడు రోజులు ఇదే తరహాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. శనివారం గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 30.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్లో 8.2 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. -
ఆశావహ సంవత్సరమే..!
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది పట్ల భారతీయుల్లో ఆశావహ దృక్పథం వ్యక్తమవుతోంది. కుటుంబ శ్రేయస్సు, వ్యక్తిగత పరివర్తన, ఆప్తులకు ప్రాధాన్యం, కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఎక్కువ సమయం గడిపేందుకు మొగ్గుచూపనున్నారు. ఇటీవల నిర్వహించిన ఇప్సాస్ గ్లోబల్ ప్రిడిక్షన్స్– 2026 సర్వేలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఈ అధ్యయనంలో భాగంగా అత్యంత ఆశావహ వైఖరిని కనబరిచిన వారిలో 90 శాతంతో ఇండోనేసియన్లు ప్రథమ స్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో కొలంబియా–89%, చీలి, థాయ్లాండ్, పెరు 86%తో కాస్త ముందంజలో ఉండగా, ఇండియన్లు 81 %గా నిలిచారు.భారత్లో జరిపిన పరిశీలనలో పాల్గొన్న వారిలో...పది మందిలో 8 మంది 2026 మెరుగ్గా ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. 30 దేశాల్లో నిర్వహించిన ఈ అధ్యయనంలో ప్రధానంగా రాబోయే జీవితం, కొత్త సంవత్సరంలో ఎదురయ్యే సవాళ్లు, ఆర్థిక దృక్పథాలు కుటుంబానికి వెచి్చంచే సమయం, వ్యక్తిగత వృద్ధి, ప్రపంచ ఫుట్బాల్ పట్ల ఆసక్తి, ఏఐ విస్తృత వినియోగంలోకి వస్తున్న నేపథ్యంలో ఉద్యోగాలు, ఉపాధిపరంగా ఎదురయ్యే కష్టనష్టాలు, ఆందోళనలు తదితరాలపై అభిప్రాయాలు సేకరించారు. 2026 గురించి ఇలా... వ్యక్తిగత ప్రాధాన్యాలకు మించి ప్రపంచ, జాతీయ పరిణామాలకు అధిక ప్రాధాన్యం ఏర్పడిందని సర్వేలో పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు. పది మందిలో ఎనిమిది మంది భారతీయులు 2026లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని చెప్పగా, ఇండోనేసియా, మలేసియా, థాయ్లాండ్, చిలీ పౌరులు కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవించారు.⇒ సుదీర్ఘ కాలంగా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధం 2026లో ముగియాలని ఇద్దరు భారతీయులలో ఒకరు కోరుకుంటున్నారు. ఇతర దేశాల్లోని ప్రజల అభిప్రాయాలతో సరిపోల్చిస్తే, 2026లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి రావొచ్చని భారతీయులు సైతం అంచనా వేస్తుండడం విశేషం. ⇒ పది మందిలో ఆరుగురు భారతీయులు 2026లో ప్రపంచ ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. అయితే వారి ఆందోళన స్థాయి ఇండోనేసియా, సింగపూర్ పౌరుల కంటే తక్కువగా ఉంది. ఆ దేశాల్లో పది మందిలో తొమ్మిది మంది పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ను అంచనా వేస్తున్నారు. ఇద్దరు భారతీయుల్లో ఒకరు 2026లో తీవ్రమైన వాతావరణ సంఘటనలకు భయపడుతున్నారు. ⇒ భారతీయుల ప్రాధాన్యతలు వ్యక్తిగత శ్రేయస్సు, కుటుంబ సంబంధాలపై బలంగా కేంద్రీకృతమై ఉన్నాయి. ఈ ఏడాది కుటుంబం, స్నేహితులతో ఎక్కువ సమయం గడపాలని 82% కోరుకుంటున్నారు. ఈ భావన ఇండోనేసియా, రొమేనియా, మలేసియా వంటి దేశాల్లోనే కనిపించింది. ⇒ పది మందిలో ఎనిమిది మంది భారతీయులు వ్యాయామాని కి అధిక ప్రాధాన్యం ఇచ్చి, ఎక్కువ సేపు ఇందులో గడపాలని భావిస్తున్నారు. 2025లో దీనిని నిర్లక్ష్యం చేశామన్న అపరాధ భావం కారణంగా కొత్త సంవత్సరంలో ఆ విధంగా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమైంది. ⇒ భారత్లో సర్వేలో పాల్గొన్న వారిలో ఎక్కువ శాతం మంది గతేడాదితో పోల్చిస్తే 2026లో సోషల్ మీడియాకు వెచి్చంచే సమయాన్ని గణనీయంగా తగ్గించడంతోపాటు సమతుల్యత, వ్యక్తిగత శ్రేయస్సు, మెరుగుదల దిశలో మరింత కృషి సాగించాలని భావిస్తున్నారు. సర్వే ముఖ్యాంశాల్లో మన దేశానికి సంబంధించి... అధిక ఆశావాదం: భారతీయుల్లో అధిక స్థాయిల్లో ఆశావాదం వ్యక్తమైంది. 2026 మెరుగ్గా ఉంటుందని 81% మంది ఆశిస్తున్నారు ప్రాధాన్యాలు: ఈ ఏడాది కీలకమైన భారతీయ ప్రా ధాన్యతలలో కుటుంబ సమయం (82%), ఫిట్నెస్, వ్యక్తిగత శ్రేయస్సు వంటి వాటికి పెద్దపీట వేశారు.ఏఐ ఆందోళనలు: 62% మంది ఇండియన్లు ఏఐ వల్ల ఉద్యోగ నష్టాలు ఎదురు కావొచ్చునంటున్నారు. అయితే 57% మంది కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందని భావిస్తున్నారు రక్షణ–భద్రతా భయాలు: వ్యక్తిగత రక్షణ, భద్రతల విషయంలో ఒకింత నిరాశావాదం వ్యక్తమైంది. తమ ప్రాంతం తక్కువ సురక్షితంగా మారుతుందని 55% మంది భావిస్తున్నారు. పెద్ద ఉగ్రవాద దాడి జరగొచ్చునని 53% మంది భయపడుతున్నారు ⇒ 2026లో అనేక సంభావ్య ముప్పులను కూ డా గుర్తించారు. వీటిలో పెద్ద ఉగ్రవాద దా డి భయాలతో పాటు ఆర్థిక మాంద్యం సంభావ్యత, ప్రజల్లో అశాంతి, అక్రమ వలసలకు సంబంధించిన ఆందోళనలు ఉన్నాయి. ⇒ గతేడాది దేశానికి, సొంత కుటుంబాలకు నష్టదాయకంగా పరిణమించిందని కొందరు అభివర్ణించారు.గతేడాది కఠినమే2025 పలువురు భారతీయులకు కఠినమైన సంవత్సరంగా నిలిచింది. ఆర్థిక ఒత్తిళ్లు, ఆపరేషన్ సిందూర్ ద్వారా పూర్తిస్థాయి యుద్ధం, తీవ్రమైన వాతావరణ ప రిస్థితులు, ట్రంప్ సుంకాల విధింపు–ఉద్యోగాల కోత లు, ఇతర సవాళ్ల నేపథ్యంలో ఇండియన్లు 2026 పట్ల ఆశావాద దృక్పథాన్ని కనబరుస్తున్నారు. 2025 కంటే 2026 మెరుగ్గా ఉంటుందని నమ్ముతున్నారు. కుటుంబం, స్నేహితులతో బంధానికి అధిక ప్రాధాన్యం, వ్యక్తిగత శ్రేయస్సుపై దృష్టి కేంద్రీకరణ, ఈ ఏడాది జరిగే ఫిఫా వరల్డ్కప్పై అధిక ఆసక్తి వంటివి వెల్లడయ్యాయి. – సురేశ్ రామలింగం, సీఈఓ, ఇప్సాస్ ఇండియా -
నేను సోషల్ డాక్టర్! : సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: డాక్టర్లు కేవలం వైద్య నిపుణులే కాదు.. సమాజానికి దిక్సూచి వంటివారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ‘నేను డాక్టర్ను కాదు.. కానీ సోషల్ డాక్టర్ను. ప్రజల ఆరోగ్యమే నా బాధ్యత’ అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో శనివారం ఫెలోస్ ఇండియా సదస్సులో భాగంగా ఇంటర్నేషనల్ కార్డియాలజీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఫౌండేషన్ (ఐసీఆర్టీఎఫ్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రేవంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. హైదరాబాద్లో ఇలాంటి అంతర్జాతీయ స్థాయి వైద్య సదస్సును నిర్వహించడం గర్వకారణమని చెప్పారు. ఈ సదస్సుకు భారత్తోపాటు ఆగ్నేయాసియా దేశాల నుంచి 500 మందికి పైగా యువ కార్డియాలజిస్టులు హాజరుకావడాన్ని ఆయన అభినందించారు. ఇప్పటికే సక్సెస్ఫుల్ కార్డియాలజిస్టులైన డాక్టర్లు కూడా జ్ఞానం, నైపుణ్యాలను మరింతగా అభివృద్ధి చేసుకోవాలనే సంకల్పంతో ఈ సదస్సుకు రావడం అభినందనీయమన్నారు. నిరంతరం నేర్చుకోవడమే అతిపెద్ద విజయ రహస్యమని, కొత్త విషయాలు తెలుసుకోవడం, స్కిల్స్ను అప్డేట్ చేసుకోవడం మానేస్తే కెరీర్కు ముగింపు పలికినట్టేనని పేర్కొన్నారు. సాంకేతికత అతివేగంగా మారుతున్న నేపథ్యంలో వైద్య రంగం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి వాటితో ముడిపడుతోందన్నారు. అందుకే ఆధునిక సాంకేతికతపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. అయితే, ప్రజల నాడి పట్టుకోవడాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దని హితవు పలికారు. హెల్త్కేర్ హబ్గా హైదరాబాద్ లైఫ్ సైన్సెస్, ఫార్మా, హెల్త్ కేర్ అనుబంధ రంగాల్లో హైదరాబాద్ ఆవిష్కరణల కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. డాక్టర్లు కావాలని చాలామంది ఆశపడతారని, కానీ అందరికీ ఆ అవకాశం దక్కదని చెప్పారు. అందుకే డాక్టర్లు సమాజంలో ఒక ప్రత్యేక వర్గమని, ప్రజల ప్రాణాలు కాపాడే గొప్ప బాధ్యత మీపైన ఉందని గుర్తుచేశారు. ప్రజా ఆరోగ్య సంరక్షణకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాల కోసం హెల్త్ పాలసీలను మెరుగుపరచడంలో వైద్యుల సహకారం కీలకమని, మీ సలహాలు, సూచనలతో కలిసి పనిచేయడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. గుండె జబ్బులపై అవగాహన కల్పిస్తే... ఇటీవలి కాలంలో గుండె జబ్బులతో మరణాలు పెరుగుతున్నాయని సీఎం రేవంత్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గుండె జబ్బులను నివారించే మిషన్లో అందరూ భాగస్వాములవ్వాలని వైద్యులకు పిలుపునిచ్చారు. విద్యార్థులకు సీపీఆర్ శిక్షణను స్వచ్ఛందంగా అందించేందుకు కార్డియాలజిస్టులు ముందుకొస్తే అనేక ప్రాణాలను కాపాడగలమని చెప్పారు. చాలా సందర్భాల్లో నివారణపై నిర్లక్ష్యం చేస్తామని, కానీ ప్రజలకు అవగాహన కల్పిస్తే సమాజం మొత్తంగా లాభపడుతుందన్నారు. క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్ విషయంలో అందరూ కృషి చేయాలని, ఆరోగ్య సంరక్షణలో భారత్.. వరల్డ్ బెస్ట్గా నిలవాలని ఆకాంక్షించారు. ప్రతీ వైద్యుడు ఉత్తమంగా ఎదగాలన్నదే తన కోరికని సీఎం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫెలోస్ ఇండియా ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ డాక్టర్ శరత్ రెడ్డి, మెడికవర్ సీఎండీ డాక్టర్ అనిల్ కృష్ణ, మెడికవర్ సీఈవో డాక్టర్ హరికృష్ణ, మాజీ సీఎస్ఐ అధ్యక్షుడు పీసీ రథ్ పాల్గొన్నారు. -
Siddipet: విషాదం.. చెక్ డ్యామ్లో పడి తల్లీకొడుకుల మృతి
సాక్షి, సిద్ధిపేట: చిన్నకోడూరు మండలం కస్తూరిపల్లిలో విషాదం జరిగింది. చెక్ డ్యామ్లో పడి ముగ్గురు మృతి చెందారు. చేపల వేటకు వెళ్లి మృత్యువాత పడ్డారు. మృతుల్లో తల్లీ కొడుకులు ఉన్నారు. కుమారులను కాపాడే ప్రయత్నంలో తల్లి మృతి చెందింది. బతుకు దెరువు కోసం బీహార్ నుంచి ఐదు రోజుల కిందటే కస్తూరిపల్లికి రెండు కుటుంబాలు వచ్చాయి. మృతి చెందిన వారంతా వలస కూలీలు. కూలీల మృతిపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
ఐఏఎస్ ఎపిసోడ్.. టీపీసీసీ చీఫ్ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై ఓ మీడియా సంస్థలో ప్రసారమైన కథనం పట్ల కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మంత్రులు కోమటిరెడ్డి, సీతక్క ఖండించారు. ఇక, తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కూడా మండిపడ్డారు. వ్యక్తుల ప్రైవేట్ జీవితాలపై చర్చ చేయడం బాధాకరమని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ..‘వ్యక్తులకు సంబంధించి తప్పుడు కథనాలు ప్రసారం చేయడం కరెక్ట్ కాదు. వాస్తవాలకు దూరంగా ఇలాంటి వార్తలు వస్తున్నాయి. ఎంతో కష్టపడి మంత్రులు, అధికారులు ఈ స్థాయికి చేరుకుంటారు. అలాంటి వారిపై నిరాధారమైన వార్తలు ప్రచురించడం మానేయాలి అని హితవు పలికారు.ఇదే సమయంలో బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాముడికి బీజేపీలో సభ్యత్వం ఉందా? అని ప్రశ్నిస్తూ.. రాముడి పేరును వాడుకునే హక్కు బీజేపీకి ఎక్కడిది? అని నిలదీశారు. రాజకీయాల్లోకి దేవుడిని లాగడం మంచిది కాదని, ఓట్ల కోసం దేవుడిని వాడుకోవడం సరికాదన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో బీఆర్ఎస్ నేతలు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మేము రెండేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో 70 శాతం స్థానాలు సాధించామని, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 90 శాతం స్థానాలు గెలుస్తామని’ చెప్పుకొచ్చారు. -
నిరంతరం నేర్చుకోవడమే అతిపెద్ద విజయ రహస్యం: రేవంత్
సాక్షి, హైదరాబాద్: తాను డాక్టర్ను కాదు.. కానీ సోషల్ డాక్టర్నని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. హెచ్ఐసీసీలో ఫెలోస్ ఇండియా కాన్ఫరెన్స్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్లో ఫెలోస్ ఇండియా కాన్ఫరెన్స్ జరగడం సంతోషమన్నారు.‘‘భారతదేశంతో పాటు ఆగ్నేయాసియా దేశాల నుంచి 500 మందికి పైగా యువ కార్డియాలజిస్టులు వచ్చారు. మీరంతా సక్సెస్ ఫుల్ కార్డియాలజిస్టులు. అయినా మీ నాలెడ్జ్ని ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ చేసుకోవడంతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఈ కాన్ఫరెన్స్ కు వచ్చారు. నిరంతరం నేర్చుకోవడమే అతిపెద్ద విజయ రహస్యం’’ అని రేవంత్రెడ్డి పేర్కొన్నారు...కొత్త విషయాలను తెలుసుకోవడం, నైపుణ్యాన్ని పెంచుకోవడం మానేస్తే మీ కెరీర్కు ముగింపు పలికినట్లే. ఈ కాన్ఫరెన్స్ హైదరాబాద్లో జరగడం ఎంతో గర్వకారణం. లైఫ్ సైన్సెస్, ఫార్మా, హెల్త్ కేర్ అనుబంధ రంగాలలో ఆవిష్కరణల కేంద్రంగా హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. చాలా మంది డాక్టర్లు అవ్వాలనుకున్నా అందుకు అర్హత సాధించలేరు. మీరంతా సమాజంలో ఒక ప్రత్యేక గ్రూప్. డాక్టర్లు ప్రాణాలు కాపాడతారని మేం బలంగా నమ్ముతాం. మనుషులపట్ల, సమాజం పట్ల మీ బాధ్యతను ఎప్పటికీ మరచిపోవద్దు...ప్రజల ఆరోగ్య సంరక్షణకు మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ప్రజల ప్రయోజనాల కోసం మా పాలసీని మెరుగుపరచడానికి మీలాంటి వైద్యులతో కలిసి పనిచేయడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. ఆ దిశగా మీ సలహాలు, సూచనలు ఇచ్చి మాకు సహకరించండి. విజ్ఞానం, సాంకేతికత ప్రపంచాన్ని చాలా వేగంగా మారుస్తున్నాయి. క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర సాంకేతికతలతో ఆరోగ్య సంరక్షణ హై టెక్నాలజీతో ముడిపడి ఉంది. అందుకే లేటెస్ట్ టెక్నాలజీ పై మిమ్మల్ని మీరు అప్ గ్రేడ్ చేసుకోండి.. కానీ ప్రజల నాడిని పట్టుకోవడం మరిచిపోవద్దు...ఈ మధ్య కాలంలో గుండె జబ్బులతో చాలా మంది చనిపోతున్నారని మీకు తెలుసు. గుండె జబ్బులను నివారించే మిషన్లో మనమందరం భాగస్వాములం అవుదాం. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు మనమందరం కలిసి పనిచేద్దాం. విద్యార్థులకు సీపీఆర్ నేర్పించడానికి మీరు స్వచ్ఛందంగా ముందుకు రాగలిగితే.. మన దేశంలో చాలా మంది ప్రాణాలను కాపాడగలం. క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్ గురించి అంతా కృషి చేయాలని మీ అందరినీ కోరుతున్నా. ఆరోగ్య సంరక్షణలో మనం వరల్డ్ బెస్ట్ అవ్వాలని, ప్రతి ఒక్కరూ ఉత్తమ వైద్యుడిగా ఎదిగేందుకు ప్రయత్నించాలి’’ అని రేవంత్ అన్నారు. -
మిసెస్ ఇండియా పోటీల్లో మెరిసిన తెలంగాణ క్వీన్స్ (ఫోటోలు)
-
మహిళా ఐఏఎస్ ఎపిసోడ్.. మంత్రి సీతక్క సీరియస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మహిళా ఐఏఎస్ అధికారులపై అసభ్య, అనుచిత ప్రచారంపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. మహిళల గౌరవం, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.మంత్రి సీతక్క తాజాగా మాట్లాడుతూ..‘మహిళా అధికారుల గౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. బాధ్యతాయుతంగా పనిచేస్తున్న మహిళా ఐఏఎస్లను లక్ష్యంగా చేసుకోవడం ఆందోళనకరం. మహిళలు ఉన్నత స్థాయికి చేరితే తట్టుకోలేని ఫ్యూడల్ మానసిక స్థితే.. దుష్ప్రచారాలకు కారణం. మహిళా అధికారుల వ్యక్తిత్వాన్ని కించపరిచే ప్రచారాన్ని సహించబోము. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలనే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉంది.మహిళా ఐఏఎస్ అధికారులు ధైర్యంగా, నిబద్ధతతో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మహిళా అధికారుల వెనుక రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా నిలుస్తుంది. అసభ్య వ్యాఖ్యలు, దూషణలు చేసిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయి. మహిళలపై ద్వేషపూరిత ప్రచారానికి సమాజం మొత్తం వ్యతిరేకంగా నిలవాలి. మహిళల గౌరవం, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిది’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
'మన శంకర వరప్రసాద్గారి'పై హైకోర్టులో పిటిషన్
తెలంగాణలో మన 'శంకర వర ప్రసాద్గారు' చిత్రానికి టికెట్ ధరలను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, తాజాగా దానిని తప్పుబడుతూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. సినిమా టికెట్ ధరల పెంపు అంశాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది విజయ్ గోపాల్ తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం టికెట్ ధరలను పెంచుతుందని తన పిటిషన్లో పేర్కొన్నారు. కానీ, తను వేసిన హౌస్ మోషన్ పిటిషన్ను హైకోర్టు పక్కనపెట్టింది. న్యాయస్థానం పనివేళల్లో మాత్రమే పిటిషన్ దాఖలు చయాలని కోరింది. దీంతో సంక్రాంతి తర్వాత జనవరి 19న మరోసారి పిటిషన్ దాఖలు చేయనున్నారు.చిరంజీవి నటించిన 'మన శంకరవరప్రసాద్ గారు' చిత్రానికి టికెట్ ధరలు పెంచుతూ తాజాగా తెలంగాణ ప్రభుత్వం జీఓ విడుదల చేసిన విషయం తెలిసిందే. 11వ తేదీన వేసే ప్రీమియర్ల ఒక్కో టికెట్ రూ.600గా నిర్ణయించారు. అలానే 12వ తేదీ నుంచి ఏడు రోజుల పాటు ఒక్కో టికెట్పై సింగిల్ స్క్రీన్లలో రూ.50, మల్టీప్లెక్స్ల్లో రూ.100 పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. -
TS: లక్షల్లో పెట్టి కేసులు పరేషాన్ లో పోలీసులు
-
మియాపూర్లో హైడ్రా భారీ ఆపరేషన్
సాక్షి, హైదరాబాద్: మియాపూర్లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. 3 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. 15 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా.. మియాపూర్ విలేజ్ మక్తా మహబూబ్పేటలో ఆక్రమణలను తొలగించింది.కాగా, గత ఏడాది నవంబర్లో నగరంలోని గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ సమీపంలో అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు తొలగించిన సంగతి తెలిసిందే. ఇక్కడి ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారంటూ హైడ్రాకు ఫిర్యాదు అందడంతో అధికారులు పరిశీలించారు. అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు గుర్తించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఔట్ లో అక్రమ కట్టడాలను నేలమట్టం చేసింది. అనుమతులు లేని షేడ్స్ కట్టడాలను హైడ్రా సిబ్బంది తొలగించారు. -
సంక్రాంతికి పల్లె బాట.. ఒక్కసారిగా పెరిగిన వాహనాల రద్దీ
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరవాసులు పల్లెలకు క్యూ కట్టారు. ఏపీకి వెళ్లే వారి వాహనాలతో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. ఇవాళ సాయంత్రం ఒక్కసారిగా వాహనాల రద్దీ పెరిగిపోయింది. యాదాద్రి జిల్లా పంతంగి టోల్ ప్లాజా దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పంతంగి టోల్ప్లాజా దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోయాయి.ఇబ్రహీంపట్నం సర్కిల్ వద్ద..ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సర్కిల్ వద్ద వాహనాల రద్దీ పెరిగింది. ట్రాఫిక్ జామ్తో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాద్... విజయవాడ హైవే ఇబ్రహీంపట్నం వద్ద వాహనాలు నిదానంగా కదులుతున్నాయి. ట్రాఫిక్ ఆంక్షలతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేడు, రేపు(శని, ఆది) ట్రాఫిక్ మరింత పెరిగే అవకాశం ఉందని.. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని సీఐ చంద్రశేఖర్ అన్నారు.హైదరాబాద్లో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్..హైదరాబాద్లో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సిటీ కాలేజీ, ఎంజే మార్కెట్, బేగంబజార్, హైకోర్టు, ఆఫ్జల్గంజ్, నయాపూల్ భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. వీకెండ్ సంక్రాంతి సెలవులు, ఎగ్జిబిషన్ కారణంగా రద్దీ నెలకొంది.విజయవాడలో..పండిట్ నెహ్రూ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. సంక్రాంతికి సొంత గ్రామాలకు ప్రజలు ప్రయాణమయ్యారు. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు కావడంతో రద్దీ పెరిగింది. ఇవాళ ఉదయం నుండి ప్రయాణికులతో బస్టాండ్లు రద్దీగా మారాయి. -
Komatireddy: వాళ్లను దేవుడే శిక్షిస్తాడు.. నాకు తెలియకుండానే టికెట్ రేట్లు పెంచారు
-
సంక్రాంతి రద్దీ.. హైదరాబాద్-విజయవాడ మధ్య 10 స్పెషల్ ట్రైన్స్
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండగ నేపథ్యంలో రైళ్లన్నీ ఫుల్ అయ్యాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్-విజయవాడ మధ్య 10 స్పెషల్ ట్రైన్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఛైర్ కార్, జనరల్ బోగీలతో నడిచే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిసిన దక్షిణ మధ్య రైల్వే.. పండగకు ముందు, తర్వాత రోజుల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని పేర్కొంది.ఈ నెల 11, 12, 13, 18, 19 తేదీల్లో ఉదయం 6.10 గంటలకు హైదరాబాద్ నుంచి విజయవాడకు.. ఈ నెల 10, 11, 12, 17, 19 తేదీల్లో మధ్యాహ్నం 2.40 గంటలకు విజయవాడ నుంచి హైదరాబాద్కు ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. ఛైర్ కార్ బోగీల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కల్పించారు. రైళ్లలో సగానికి పైగా జనరల్ బోగీల ఏర్పాటు చేశారు.In order to clear the extra rush of passengers, it is decided to arrange to run #SpecialTrains during #Sankranti festival between Hyderabad andSirpur Kaghaznagar & Hyderabad and Vijayawada with the dates as under: pic.twitter.com/JzzDcDAbZ5— South Central Railway (@SCRailwayIndia) January 10, 2026కాగా, తెలంగాణలోని జంట నగరాల నుంచి ఏపీలోని ముఖ్యపట్టణాలకు బయలుదేరే ప్రయాణికులతో ఇప్పటికే నడుస్తున్న రెగ్యూలర్ రైళ్లు రిజర్వేషన్లు పూర్తయ్యి వెయిటింగ్ లిస్ట్ భారీగా పెరిగిపోయింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే సంక్రాంతి పండుగ కోసం అదనపు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. విజయవాడ మీదుగా ఇప్పటికే 150 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడుపుతోంది. హైదరాబాద్, సికింద్రాబాద్ల నుంచి ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, నర్సాపూర్, శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో ఆ మార్గంలో నడిచే రైళ్లలో తీవ్ర రద్దీ నెలకొంది. దీంతో దక్షిణ మధ్య రైల్వే ఈ నెల 21 వరకు 150 సంక్రాంతి ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరుగుతుండటంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సంఖ్యను తగ్గించేందుకు సమీపంలోని సికింద్రాబాద్తో పాటు కాచిగూడ, నాంపల్లి, చర్లపల్లి, లింగంపల్లి, వికారాబాద్ నుంచి విజయవాడ మీదుగా కొన్ని ప్రత్యేక రైళ్లు నడుపుతుండటంతో పాటుగా హైటెక్ సిటీ, లింగంపల్లి, చర్లపల్లి స్టేషన్లలో పలు ఎక్స్ప్రెస్ రైళ్లకు తాత్కాలికంగా స్టాపేజీ సదుపాయం కల్పించారు. -
మీర్పేట తల్లీబిడ్డ కేసులో బిగ్ ట్విస్ట్!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మీర్పేటలో బిడ్డకు విషమించి.. తాను బలవన్మరణానికి పాల్పడిన వివాహిత సుష్మిత కేసుపై వివాదం నెలకొంది. ఉస్మానియా మార్చురీ వద్ద సుష్మిత, ఆమె భర్త యశ్వంత్ తరఫు బంధువులు పరస్పరం వాగ్వాదానికి దిగారు. తమ మధ్య గొడవలేం లేవని యశ్వంత్ చెబుతుండగా.. ఆత్మహత్య కాదంటూ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సుష్మ తరఫు బంధువులు. మా మధ్య విబేధాలు లేవు. ఆత్మహత్య చేసుకునేంత గొడవలేం కూడా జరగలేదు. సుష్మ క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉండొచ్చు. నా బాబుకి మా అత్తే విషమిచ్చి ఉండొచ్చు అని యశ్వంత్ అంటున్నాడు. అయితే.. తమ కూతురు చనిపోయాక పక్కనే ఉండి తమకు వెంటనే ఎందుకు సమాచారం ఇవ్వలేదని తల్లిదండ్రులు, ఆమె తరఫు బంధువులు నిలదీశారు. పోలీసులు వచ్చిన తర్వాతే సుష్మ చనిపోయిందని మాకు చెప్పారు. చనిపోయే ముందు అరగంట ఏదో జరిగిందనేది మా అనుమానం. ఆ అరగంట ఏం జరిగిందో పోలీసులే తేల్చాలి. ఫ్యాన్ ఒక రెక్కకు ఉరి ఎలా వేసుకుంటారు. రెక్క సుష్మ బరువు ఆపుతుందా?. ఆస్తి కోసమే ఇదంతా చేశారనిపిస్తోంది. యశ్వంత్, అతని బంధువులే సుష్మను మానసికంగా వేధించారు. అందుకే ఆధారాలు మార్చేసి ఉంటారు అని సుష్మ బంధువులు అంటున్నారు. అయితే మీడియా ఎదుటే జరిగిన ఆ వాగ్వాదంలో జోక్యం చేసుకున్న పోలీసులు వాళ్లకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా రామన్నపేట ప్రాంతానికి చెందిన యశ్వంత్రెడ్డి చార్టెడ్ అకౌంటెంట్. అదే ప్రాంతానికి చెందిన సుస్మిత(27)తో మూడేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులు నగరంలోని హస్తినాపురం జయకృష్ణ ఎన్క్లేవ్లో నివాసం ఉంటున్నారు. వీరికి అశ్వంత్ నందన్రెడ్డి (11 నెలలు) కుమారుడు ఉన్నాడు. అయితే.. గురువారం ఉదయం భర్త ఆఫీస్కు వెళ్లి, తిరిగి ఇంటికి వచ్చే సరికి భార్య పడకగదిలో చీరతో ఫ్యాన్కు ఉరేసుకొని కన్పించడంతో పాటు, కుమారుడు మృతిచెంది ఉన్నాడు. వారితో పాటే ఉండే సుస్మిత తల్లి లలిత(50) సైతం అపరస్మారక స్థితిలో ఉండగా ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మొదట బాబుకు విషమిచ్చిన సుస్మిత, తర్వాత ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని భావించారు. అయితే.. సుస్మితను భర్త వేధించేవాడని, బయటకు వెళ్లనీయకపోవడంతో పాటు ఎవరితోనూ మాట్లాడనిచ్చేవాడు కాదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఆందోళనల నడుమే.. తల్లీకొడుకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించినట్లు వెల్లడించారు. -
సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు.. మంత్రి కోమటిరెడ్డి ఆవేదన
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియా, ఛానెల్స్లో మహిళా అధికారులపై పనికట్టుకుని వార్తలు ప్రసారం చేయడాన్ని, రాయడాన్ని ఖండిస్తున్నట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పుకొచ్చారు. ఐఏఎస్ అధికారుల బదిలీ మంత్రి చేయలేరు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అసభ్యకర వార్తలు వస్తే ఇంట్లో వాళ్లు ఇబ్బందులు పడతారు. బాధ పడుతారని ఆలోచన చేయాలంటూ హితవు పలికారు. ఇదే సమయంలో తాను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం బంద్ చేశాను అంటూ వ్యాఖ్యలు చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. అధికారుల బదిలీలు సీఎం, సీఎస్ పరిధిలో మాత్రమే ఉంటుంది. ఐఏఎస్ అధికారుల బదిలీ మంత్రి చేయలేరు. ఐఏఎస్, IPS కావాలంటే ఎంతో కష్టపడాలి. ఐఏఎస్ అధికారులకు సెలవులు ఉండవు. ఐఏఎస్, IPS అధికారుల బదిలీలు సర్వసాధారణం. మీడియాకు విజ్ఞప్తి చేస్తున్న.. మీకు కుటుంబాలు ఉంటాయి. రాసే వారికి భార్య పిల్లలు, మీ ఇంట్లో మహిళలు ఉంటారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సర్వసాధారణం. ఐఏఎస్ అధికారులకు కుటుంబాలు ఉంటాయి.. మానసికంగా ఇబ్బందులకు గురిచేయడం కరెక్ట్ కాదు. సోషల్ మీడియాలో సీఎం పై విమర్శలు వచ్చాయి.. లిమిట్ లేకుండా పోయింది.ఆ ఐఏఎస్ అధికారి స్థానంలో ఉండి మీరు ఆలోచన చేసుకోండి. మహిళలు ఉద్యోగాలు చేయడమే తప్పా!. మంత్రుల ఇళ్లలో ఇబ్బందులు పెట్టి.. మహిళా అధికారులను ఇబ్బంది పెట్టి ఏం సాధిస్తారు. మమ్మల్ని ఇబ్బందులు పెడతాం అనుకుంటే వేసుకోంది. ఫోన్ మాట్లాడకపోతే.. ఫోన్ ఎత్తకపోతే అసత్య వార్తలు రాస్తారా?. ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటే అధికారులతో రివ్యూ ఎప్పుడు చేయాలి. మీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నా... ఇలాంటి వార్తల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటారు. ఎదుటివాడు బాధపడితే స్పందించే గుణం నాది. నాలాంటి వాడిని ఏడుపిస్తా అనుకుంటే ఏడిపించండి. ఇప్పటికే కొడుకును కోల్పోయి ఏడుస్తున్నాను.సినిమాపై క్లారిటీ.. నేను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం బంద్ చేశాను. పుష్పా సినిమా వివాదం తర్వాత ప్రీమియం షోలకు అనుమతి ఇవ్వడం బంద్ చేసాను. రాజాసాబ్, చిరంజీవి సినిమా టికెట్ల రేట్లు, ప్రీమియం షో అనుమతి ఫైల్ నా దగ్గరకి రాలేదు. నాకు తెలియకుండానే రెండు సినిమాల జీవోలు వచ్చాయి. నేను సినిమా ఇండస్ట్రీపై దృష్టి పెట్టలేదు.. పెట్ట దల్చుకోలేదు. నిప్పులాగా బతికిన వాడిని ఇలా మానసికంగా బాధ పెడుతున్నారు. తప్పు చేసిన వాళ్లను దేవుడే శిక్షిస్తాడు. జిల్లా మంత్రిగా రివ్యూ పెడితే అధికారులు పక్కన కూర్చోవడం తప్పా?. ఎన్నో విమర్శలు వచ్చినా ఆరుసార్లు గెలిచాను. వెంకట్ రెడ్డి ఉండొద్దు అంటే ఇంత విషం ఇచ్చి చంపండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. -
మహిళా అధికారులపై దుష్ప్రచారం.. ఐపీఎస్ సంఘం ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని మహిళా ఐఏఎస్ అధికారులను లక్ష్యంగా చేసుకుని, కొన్ని మీడియా సంస్థలు సాగిస్తున్న అసత్య ప్రచారాలపై తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రస్థాయిలో మండిపడింది. మహిళా అధికారుల వ్యక్తిత్వ హననానికి పాల్పడటం అత్యంత హేయమైన చర్య అని సంఘం ఆరోపించింది. ఈ విషయంలో ఐఏఎస్ అధికారుల సంఘానికి తమ సంపూర్ణ సంఘీభావాన్ని ఐపీఎస్ అసోసియేషన్ ప్రకటించింది. నిరాధారమైన ఆరోపణలతో ప్రభుత్వ అధికారుల ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నాలను తీవ్రంగా ఖండించింది.ఐపీఎస్ అసోసియేషన్ అధ్యక్షుడు డీజీపీ బి. శివధర్ రెడ్డి, ఇతర సభ్యులు ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. మహిళా అధికారులు ఎంతో చిత్తశుద్ధి కలిగి, ధైర్యంతో, వృత్తి నైపుణ్యంతో సమాజం కోసం విధులు నిర్వర్తిస్తున్నారని, వారిపై ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సరికాదని వారు పేర్కొన్నారు. ఇటువంటి చర్యలు అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా, ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరుస్తాయని అసోసియేషన్ ఆ ప్రకటనలో పేర్కొంది.సదరు మీడియా సంస్థలు తక్షణమే తమ తప్పును సరిదిద్దుకోవాలని ఐపీఎస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. చేసిన తప్పును అంగీకరిస్తూ, బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని, సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫారమ్లలోని అభ్యంతరకర కంటెంట్ను తక్షణమే తొలగించాలని ఆదేశించింది. సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన మీడియా, మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికింది. ఇటువంటి అసత్య ప్రచారాలను ఇకపై ఉపేక్షించే ప్రసక్తే లేదని తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం హెచ్చరించింది.ఇది కూడా చదవండి: చలికి గడ్డకట్టిన ఢిల్లీ.. స్థంభించిన జనజీవనం -
ఈసారి బాబు పప్పులు ఉడకలేదు!
ఎవరైనా మీతో అభ్యంతరకరంగా మాట్లాడితే ఏం చేస్తారు? వెంటనే ఆయనకు ధీటుగా జవాబిస్తారు. అలా కాకుండా మీ పక్కనున్న వ్యక్తిని తిట్టారనుకోండి.. దానిని ఏమంటారు? ఏదో భయంతో అలా చేసి ఉంటారని అనుకోవడం సహజమే కదా! ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు అదే పని చేశారు. తాను కోరితేనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపేశారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటిస్తే చంద్రబాబు జవాబు ఇవ్వకపోగా... వైఎస్సార్ కాంగ్రెస్పై, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై విమర్శలు చేశారు. అసలు రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు అవసరం లేదన్నట్టుగా మాట్లాడారు.. మంత్రులతో మాట్లాడించారు. అంతేకాక మొత్తం ఇష్యూని డైవర్ట్ చేయడానికి పోలవరం ప్రాజెక్టు సందర్శన పెట్టుకుని, గోదావరి జలాల గురించి, రాష్ట్రాల మధ్య సహకారం గురించి సుద్దులు చెప్పారు. పోనీ చంద్రబాబు నిజంగానే అంత చిత్తశుద్దితో ఈ విషయాలు మాట్లాడారా అంటే అదీ కనిపించదు. ఆయన విపక్షంలో ఉంటే ఒక రకం, అధికారంలో ఉంటే మరో రకం. చంద్రబాబు గత చరిత్ర అంతా ఇలా వైరుధ్యాలతోనే సాగుతోంది. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న రోజుల్లో 2011లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతోపాటు బీజేపీ ఎమ్మెల్యే ఒకరు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికలలో కొన్నిచోట్ల టీడీపీ కూడా పోటీచేసింది. ప్రజలలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కుంటున్నందున గెలిచే అవకాశాలు లేవన్న అంచనాకు వచ్చారు. అందువల్ల పార్టీ అభ్యర్ధులకు మద్దతుగా ప్రచారం చేసే సానుకూల పరిస్థితులు లేవని భావించిన చంద్రబాబు వెంటనే డైవర్షన్ రాజకీయం చేశారు. మహారాష్ట్రలో కట్టిన బాబ్లి ప్రాజెక్టు వల్ల తెలంగాణకు నష్టం జరుగుతోందని, రెండు రాష్ట్రాల ఒప్పందానికి వ్యతిరేకంగా నిర్మించారని ఉమ్మడి ఏపీ రాజకీయ పార్టీలు ఆరోపించేవి. ఆ వివాదాన్ని చంద్రబాబు వ్యూహాత్మకంగా తన భుజాన వేసుకుని ఆ ప్రాజెక్టుపై పోరాటం ప్రకటించారు. పొరుగు రాష్ట్రంలో ఉన్న ఈ ప్రాజెక్టును సందర్శించి హడావుడి చేయడానికి సిద్దమయ్యారు. తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సుమారు 75 మందిని వెంటబెట్టుకుని దండయాత్ర మాదిరి మహారాష్ట్రకు బయల్దేరారు. ఆ రాష్ట్ర పోలీసులు దానిని అడ్డుకున్నారు. వారు పెట్టిన బారికేడ్లను తోసుకుని ముందుకు వెళ్లే యత్నం చేశారు. దాంతో పోలీసులు వారిని అరెస్టు చేసి ధర్మాబాద్ పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. ఆ తర్వాత పోలీసులు వారిని వదలిపెట్టేశారు. అయినా తమను బాబ్లి ప్రాజెక్టు వద్దకు మీడియాతో సహా అనుమతించాలని డిమాండ్ చేస్తూ అక్కడే భైఠాయించారు. ఒక దశలో లాఠీ ఛార్జ్ కూడా జరిగింది. దీనికి ముందు రాష్ట్ర సరిహద్దులో దాదాపు గంటన్నర సేపు వీరంతా ధర్నా చేశారు.మహారాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు విమర్శించారు. పొరుగు రాష్ట్రానికి రావాలంటే పాస్ పోర్టు కావాలా అని కూడా ఆయన ప్రశ్నించారు. తాము యుద్దం చేయడానికి రాలేదంటూనే అంటూనే పోలీసుల సూచనలు పట్టించుకోకుండా హంగామా సృష్టించారు. దాంతో పోలీసులు చంద్రబాబుతో సహా ఆందోళనకారులపై కేసు పెట్టి అరెస్టు చేశారు.వారందరిని ఒక కాలేజీ ఆవరణలో ఉంచారు. .ఆ సమయంలో కొందరు నేతలు అక్కడనుంచి వచ్చేసినా, ఎక్కువమంది కేసులో ఇరుక్కున్నారు. కేసు రిజిస్టర్ కావడంతో టిడిపి నేతలు ఆందోళనకు గురయ్యారు. ఆ తరుణంలో అప్పటి ముఖ్యమంత్రి రోశయ్యకు పరిస్థితిని టీడీపీ నేతలు వివరించడంతో ఆయన ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి ఏపీకి తీసుకువచ్చారు. ఆ కేసు ధర్మాబాద్ కోర్టుకు వెళ్లింది. కోర్టులో విచారణకు వచ్చే సమయానికి చంద్రబాబు విభజిత ఏపీకి సీఎం కావడంతో బిజీ షెడ్యూల్స్ అంటూ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు. అక్రమంగా నిర్మించిన బాబ్లి ప్రాజెక్టు వల్ల ఉత్తర తెలంగాణలో 18 లక్షల ఎకరాలకు నీటి సంక్షోభం వస్తుందని ఆరోపించేవారు. తీరా చూస్తే ఆ ప్రాజెక్టు ద్వారా వచ్చేది రెండు,మూడు టీఎంసీలే కావడం విశేషం. విపక్షంలో ఉండగా చంద్రబాబు వ్యవహరించిన తీరు అది. అప్పుడు రాష్ట్రాల మధ్య రాజకీయాలు వద్దని అనలేదు. ఏపీ ప్రయోజనాలే ముఖ్యమని అనేవారు. భావోద్వేగాలు రెచ్చగొడుతున్నట్లు ఆయన ఫీల్ కాలేదు. ఇప్పుడేమో రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ వల్ల వచ్చేవి 22 టీఎంసీలే అంటూ అర్ధం లేని వాదన తీసుకువచ్చారు. అది నిజమే అయితే రేవంత్ కు ఆ మాటే చెప్పి ఉండవచ్చు కదా! ఈ స్కీమ్ వల్ల రాయలసీమకు పెద్దగా కలిసి వచ్చేది లేదని, అందువల్ల తెలంగాణ ప్రభుత్వం అడ్డుపడనవసరం లేదని లేఖ రాసి ఒప్పించి ఉండవచ్చు కదా! రేవంత్ తో కుమ్మక్కై చీకటి ఒప్పందం చేసుకున్నారన్న అభిప్రాయం ఏర్పడినా చంద్రబాబు మాత్రం దానిని ఖండించలేకపోయారు. దీంతో రేవంత్ చెప్పిందంతా నిజమేనని, ఆయన డిమాండ్కు తలొగ్గి రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ను చంద్రబాబు నిలిపివేశారని ఏపీ ప్రజలకు అర్థమైంది. తన శిష్యుడుగా పేరొందిన రేవంత్ ను ఒక్క మాట అనలేకపోవడంతో ఈయనలో ఏదో భయం ఉందన్న భావన రాజకీయవర్గాలలో ఏర్పడింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి టైమ్ లోనే రాయలసీమ లిఫ్ట్ స్కీమ్కు స్టే వచ్చిందని తొలుత ప్రచారం చేశారు. అయినా జగన్ పనులు ఎక్కడా ఆపకుండా 85 శాతం పూర్తి చేశారని వీడియోలతో సహా కధనాలు రావడంతో ఆత్మరక్షణలో పడ్డ చంద్రబాబు, ఆయన మంత్రులు ఇప్పుడు ఏకంగా ఆ ప్రాజెక్టే అవసరం లేదన్నట్లు మాట్లాడి మరింత తప్పు చేశారు.ఒక తప్పును కవర్ చేసుకోబోయి మరిన్ని తప్పులు చేశారన్నమాట. పోనీ అన్ని ప్రాజెక్టులు అనుమతులతోనే ఆరంభం అవుతున్నాయా అంటే ఏ రాష్ట్రంలో అలా జరగదు.చంద్రబాబు చేపట్టిన పట్టిసీమ, పురుషోత్తం పట్నం, చింతలపూడి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఉన్నాయా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్ హయాంలో తెలుగు గంగ వంటి ప్రాజెక్టులను అలాగే చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పోలవరం ప్రాజెక్టు అనుమతులు కేంద్రం నుంచి సాధించే ప్రయత్నంలో ఉన్న సమయంలోనే కుడి, ఎడమ కాల్వలను తవ్వించారు. కుడి కాల్వకు టిడిపి వారే అడ్డుపడడానికి యత్నించిన సంగతి అందరికి తెలిసిందే. తెలంగాణ ప్రాజెక్టులకు తాను అడ్డు పడడం లేదని చంద్రబాబు ఏపీలో ఆయా సభలలో చెప్పడాన్ని ఎద్దేవ చేస్తూ తెలంగాణకు చెందిన 16 ప్రాజెక్టులపై ఎపి ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసిన విషయాన్ని ఆ మీడియా వెల్లడించింది.పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 2015-2017 మధ్య ఐదుసార్లు చంద్రబాబు ప్రభుత్వం లేఖలు ఎలా రాశారని ఆ మీడియా ప్రశ్నించింది. ఇదే కాదు..ఓటుకు నోటు కేసు సమయంలో హైదరాబాద్లో సెక్షన్ 8 అమలు చేయాలని, గవర్నర్ శాంతిభద్రతలు పర్యవేక్షించాలని, ఏపీ ప్రభుత్వం కూడా హైదరాబాదఃలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవచ్చని చంద్రబాబు బృందం వాదించేది. మరో విశేషం ఏమిటంటే ఓటుకు నోటు కేసు గురించి చెప్పమంటే, కేసీఆర్ టెలిఫోన్ టాపింగ్ ఎలా చేస్తారని ఎదురు ప్రశ్నించేవారు. ఏపీలో కేసీఆర్పై కేసులు పెట్టించారు.ఆత్మరక్షణలో పడిన ప్రతిసారి ఇలా డైవర్షన్ రాజకీయాలు చేయడంలో చంద్రబాబు సిద్దహస్తుడని చరిత్ర చెబుతోంది. అయినా ఈసారి రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ విషయంలో మాత్రం డైవర్షన్ రాజకీయం ఫలించలేదు.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
గుత్తాజ్వాల మంచి మనసు.. 30 లీటర్ల తల్లిపాలు దానం
బ్యాడ్మింటన్ స్టార్ గుత్తాజ్వాల ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చారు. తన బిడ్డకు పాలు పట్టగా మిగిలిన పాలను ప్రభుత్వ ఆస్పత్రులకు దానం చేశారు. తల్లిపాల ప్రాధాన్యతను గుర్తించిన గుత్తాజ్వాల దాదాపు 30 లీటర్ల వరకు ప్రభుత్వ ఆస్పత్రులకు అందజేశారు. ఇలా చేయడం ద్వారా పాలుపడని తల్లుల పిల్లల ప్రాణాలను కాపాడగలిగారు. గుత్తాజ్వాల తనలో ఉన్న మాతృహృదయాన్ని చాటడంతోపాటు తల్లిపాలకు ఎంత ప్రాధాన్యం ఉందో సమాజానికి చెప్పగలిగారు. ఇలాంటి తల్లులు మరింత మంది ముందుకొస్తే అమ్మపాలు దొరకని శిశువుల ప్రాణాలు కాపాడే అవకాశముంది. ప్రభుత్వం సైతం మిల్్కబ్యాంక్లు ఏర్పాటు చేస్తోంది.తల్లి ఒడిలో హాయిగా పడుకొని పాలు తాగాల్సిన నవజాత శిశువులు అమ్మ అమృతధార కోసం పోరాడాల్సిన పరిస్థితి. పౌష్టికాహార లేమి.. అనారోగ్య సమస్యతో తల్లికి పాలు పడక అప్పుడే పుట్టిన చిన్నారులకు అమృతధారలు అందడం లేదు. ఫలితంగా నవజాత శిశుమరణాలు పెరుగుతున్నాయి. పాలు పడని తల్లుల పిల్లల ప్రాణాలు నిలిపేందుకు పలువురు తల్లులు తమ పాలను ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. ఇలా ముందుకొచి్చన మాతృమూర్తుల అమృతధారలను నిల్వ చేసే మిల్్కబ్యాంక్ కేవలం కరీంనగర్ జిల్లా కేంద్రంలోనే ఉంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మిల్్కబ్యాంకులు ఎక్కడా లేకపోవడంతో ఆయా ప్రాంతాల్లోని నవజాత శిశువులు పాల కోసం తల్లడిల్లుతున్నారు. రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లోనూ మిల్్కబ్యాంక్లు ఏర్పాటు చేస్తే చాలా మంది తల్లులు తమ పాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈమేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి్సన అవసరం ఉంది. పాలు ఎంతో ఉపయోగపడ్డాయినాకు పాలు పడకపోవడంతో బిడ్డ ఆరోగ్యం ఏమవుతుందోనని భయపడ్డా. కానీ మరో తల్లి నుంచి సేకరించిన పాలను నా బిడ్డకు పట్టించారు. ఆ పాలు నా బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడాయి. – లావణ్య, పోతారం, హుస్నాబాద్తల్లిపాలతోనే ఆరోగ్యంతల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారం అందిస్తాయి. శిశువు రోగనిరోధక శక్తిని పెంచి వ్యా ధుల నుంచి కాపాడుతాయి. మేధస్సు, శారీరక ఎదుగుదలకు తల్లిపాలు ఎంతో సహాయపడుతాయి. తల్లి శిశువు మధ్య ప్రేమానూబంధాన్ని మరింత బలపరుస్తాయి.– డాక్టర్ నవీనా, ఆర్ఎంవో, కరీంనగర్కరీంనగర్: కరీంనగర్ ప్రభుత్వ మాతా, శిశు ఆస్పత్రిలో అత్యాధునిక సదుపాయాలతో మదర్ మిల్్క బ్యాంక్ను ఏర్పాటు చేశారు. వివిధ కారణాలతో తల్లిపాలు అందని నవజాత శిశువులకు ఈ బ్యాంక్ ద్వారా పాలు అందించడమే లక్ష్యంగా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని 2023 మార్చి 8న ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ మిల్క్ బ్యాంక్లో బ్రెస్ట్ పంప్ ద్వారా తల్లుల నుంచి పాలు సేకరించి, భద్రపరచి అవసరమైన శిశువులకు అందించేలా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా అకాల ప్రసవాలు, తక్కువ బరువుతో పుట్టిన శిశువులు, అనారోగ్యంతో ఉన్న చిన్నారులకు ఈ మిల్్కబ్యాంక్ ఎంతో ఉపయోగపడుతుంది. శిశుమరణాలు తగ్గించడంతోపాటు నవజాత శిశువుల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడమే లక్ష్యంగా సేవలందిస్తున్నారు.శిశు మరణాలు అరికట్టడమే లక్ష్యంగా..తల్లిపాలు బిడ్డ ఎదుగుదల, సంపూర్ణ ఆరోగ్యానికి దోహదపడతాయి. అతిసారం, న్యుమోనియా నివారించవచ్చు. తల్లివద్ద పాలు లేకపోతే ఆ శిశువులు ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారు. ఈ విషయంపై దృష్టి సారించిన ప్రభుత్వం తల్లి పాల బ్యాంకులను ప్రారంభించింది. ఎక్కువగా పాలు ఉన్న తల్లుల నుంచి సేకరించి పాలు అందని పిల్లలకు అందిస్తూ కాపాడుతున్నారు. ఈ ఏడాది ఎంసీహెచ్వో 4,754 డెలివరీలు జరగగా.. 114 మంది శిశువులు వివిధ కారణాలతో మృత్యువాత పడ్డారు. అయితే ఈ సంఖ్య గతంతో పో లిస్తే తగ్గినట్లు వైద్యులు చెబుతున్నారు. నెలలు నిండకుండా పుట్టినా.. తక్కువ బరువుతో పుట్టిన శిశువుల కు ఎంసీహెచ్లో ఏర్పాటు చేసిన తల్లిపాల బ్యాంకు, ఎస్ఎన్సీయూ వారి ప్రాణాలకు భరోసా కల్పిస్తుంది.12 గంటలపాటు నిల్వతల్లి నుంచి సేకరించిన పాలను 12 గంటల పాటు ప్రత్యేక గదిలో ఏర్పాటు చేసిన ఫ్రిజ్లో నిలువ చేసే అవకాశం ఉంది. కానీ ఏ రోజు కూడా అంత సమయం నిలువ ఉంచే పరిస్థితి రాలేదని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మిల్్క బ్యాంక్లో పాలను సేకరించే తల్లులకు పూర్తి అవగాహన కల్పించడంతోపాటు, వైద్యుల పర్యవేక్షణలోనే పాలసేకరణ, పంపిణీ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రం ప్రారంభించినప్పటి నుంచి ప్రతీ నెల 300 మంది తల్లుల నుంచి పాలు సేకరించి ప్రతీ రోజు 5 నుంచి 8 మంది పిల్లలకు అందిస్తున్నారు. అప్పుడే పుట్టిన పిల్లలకు తల్లిపాలు అందని వారికి ఈ బ్యాంకు ద్వారా అందించి ప్రాణాలు కాపాడుతున్నారు.పాల బ్యాంకు వరంనా భార్య డెలివరీ తర్వాత పాపకు పాలు అందకపోవడంతో మిల్క్ బ్యాంకు నుంచి సేకరించిన పాలు అందిస్తున్నారు. పాలు అందని పిల్లలకు మాతాశిశు ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన తల్లి పాల బ్యాంకు ఒక వరం. – చంద్రశేఖర్, జగిత్యాలశిశువుల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంతల్లిపాలతోనే శిశువులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. ఆ పాలను కూడా అన్ని రక్షణ చర్యలు తీసుకుని మిగతా శిశువులకు అందించేలా మిల్్కబ్యాంకులో ఏర్పాటు చేశాం. హెచ్ఐవీ, హెపటైటిస్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చిన తల్లుల పాలు మాత్రమే తీసుకుంటాం. – డాక్టర్ వీరారెడ్డి, జీజీహెచ్ సూపరింటెండెంట్, కరీంనగర్ -
ఒకే ఇంటి నంబర్పై 92 ఓట్లు!
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో ఒక ఇంటి నంబర్పై 92 ఓట్లకు పైగా ఉండగా.. మరో వార్డులో ఒకే ఇంటి నంబర్పై 20కి పైగా ఓట్లు ఉన్నా యి. మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే క్రమంలో ఇటీవల అధికారులు ఓటరు ముసాయిదా జాబితా విడుదల చేశారు. ఇందులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలు తెలపాలని కోరారు. జాబితాలను పరిశీలిస్తే.. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని 6వ వార్డులోని 3–133 ఇంటి నంబర్తో పాటు.. అదే ఇంటికి బై నంబర్లతో సుమారు 92 ఓట్లు ఉన్నాయి. 9వ వార్డులో సైతం 4–223 ఇంటి నంబర్పై 20 ఓట్ల వరకు నమోదయ్యాయి. దీనిపై ఇటీవల ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత.. భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు దృష్టికి తీసుకువెళ్లారు. యువజన నేత నవీన్కుమార్ కూడా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై సిబ్బందితో విచారణ చేయిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ లింగస్వామి తెలిపారు.


