Telangana
-
‘గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ హబ్గా హైదరాబాద్’
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ను ‘గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ హబ్’గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల(జీసీసీ)ను కేవలం ‘బ్యాక్ ఆఫీస్’ ఆపరేషన్లకే పరిమితం కాకుండా... స్ట్రాటెజిక్ ఇన్నోవేషన్స్, హై వాల్యూ ప్రొడక్టివిటీకి కేంద్రాలైన గ్లోబల్ వాల్యూ సెంటర్లు(జీవీసీ)గా మార్చేలా కాంప్రహెన్సివ్ రోడ్డు మ్యాప్ను సిద్ధం చేస్తున్నామన్నారు.ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బ్రూయింగ్ కంపెనీ హైనెకెన్(HEINEKEN) నానక్ రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ‘హైనెకెన్ బిజినెస్ సర్వీసెస్ ఇండియా’ పేరిట 76వేల చ.అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన జీసీసీని బుధవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... హైనెకెన్ లాంటి దిగ్గజ సంస్థలు హైదరాబాద్ను ఎంచుకోవడం ఇక్కడి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, రెడీ టూ కొలాబరేట్, రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిశీల విధానాలకు, పారిశ్రామిక ప్రగతికి నిదర్శనమన్నారు.హైదరాబాద్ను కేవలం ఐటీ డెస్టినేషన్గా కాకుండా, ప్రపంచ శ్రేణి వ్యాపార పరిష్కారాలకూ చిరునామాగా మారుతోందన్నారు. అంతర్జాతీయ ఐటీ దిగ్గజాల మొదలు... మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్యూమర్ గూడ్స్ కంపెనీల వరకు తమ వ్యూహాత్మక కేంద్రాల ఏర్పాటు కోసం హైదరాబాద్నే మొదటి ప్రాధాన్యతగా ఎంచుకుంటున్నాయన్నారు. ఆ జాబితాలో 150 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన హైనెకెన్ కూడా చేరడం వల్ల ప్రపంచ పటంలో ‘తెలంగాణ బ్రాండ్’ మరింత విశ్వవ్యాప్తమవుతుందన్నారు. మరిన్ని అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించేలా ‘రెడీ టూ వర్క్ ఫోర్స్’, ఇన్నోవేషన్ ఎకో సిస్టం బలోపేతంపై ప్రధానంగా దృష్టి సారించామన్నారు.తెలంగాణను కేవలం ఒక ఉత్పాదక కేంద్రంగానే కాకుండా, గ్లోబల్ నాలెడ్జ్ ఎకానమీలో కీలక భాగస్వామిగా నిలబెట్టాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. తాజాగా ప్రారంభమైన హైనెకెన్ జీసీసీ... ఫైనాన్స్, డిజిటల్, టెక్నాలజీ, అనలిటిక్స్ రంగాల్లో గ్లోబల్ సర్వీసులను అందించే ఒక స్ట్రాటజిక్ సెంటర్ గా పనిచేస్తుందన్నారు. ప్రస్తుతం 300 మందికి పైగా నిపుణులకు ఇక్కడ ఉపాధి లభిస్తుందని, రాబోయే రోజుల్లో ఈ సంఖ్య 1600కు చేరుకుంటుందన్నారు.హైనెకెన్ స్ఫూర్తితో తెలంగాణ పారిశ్రామికాభివృద్ధిలో భాగస్వామ్యమయ్యేందుకు ముందుకు రావాలని అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలను ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, హైనెకెన్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మెంబర్/సీఎఫ్ వో హెరాల్డ్ వాన్ డెన్ బ్రోక్, చీఫ్ పీపుల్ ఆఫీసర్ యోలాండా తలామో, చీఫ్ డిజిటల్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్ రోనాల్డ్ డెన్ ఎల్జెన్, హేనెకెన్ బిజినెస్ సర్వీసెస్ సీనియర్ డైరెక్టర్ ఆకోస్ మగ్యారీ, యూబీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ వివేక్ గుప్తా, చీఫ్ కార్పోరేట్ అఫైర్స్ ఆఫీసర్ గరీమా సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
ఖాకీల మంచి మనసు.. నిరాశ్రయులకు ఆశ్రయం
సాక్షి,హైదరాబాద్: పోలీసులంటే కేవలం శాంతిభద్రతల పరిరక్షణే కాకుండా సామాజిక బాధ్యతలోనూ ముందుంటారని చాదర్ఘాట్ పోలీసులు నిరూపించారు. రోడ్డు పక్కన నిరాశ్రయులుగా పడి ఉన్న ఐదుగురు వ్యక్తులను గుర్తించి, వారికి తగిన ఆశ్రయం కల్పించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు.బుధవారం (29.04.2026) ఉదయం సుమారు 11:00 గంటల సమయంలో మలక్పేట్ గంజ్ మార్కెట్ సమీపంలోని ఫుట్పాత్పై కొందరు అపరిచిత వ్యక్తులు నివాసం ఉంటున్నట్లు చాదర్ఘాట్ పెట్రోలింగ్ సిబ్బందికి సమాచారం అందింది. వెంటనే స్పందించిన పోలీసులు అక్కడికి చేరుకుని ఐదుగురు వ్యక్తులను గుర్తించారు. వారి వివరాలు.. వేణుగోపాల్ (46 సం),నరసింహ (60 సం),కృష్ణ (70 సం),భరత్ ఛెత్రి (35సం),అనిల్ (35 సం)లుగా గుర్తించారు.తీవ్రమైన ఎండలో, సరైన ఆహారం, వసతి మరియు ఆదరణ లేక ఇబ్బంది పడుతున్న వీరిని చూసి చలించిన పోలీసులు, మానవతా దృక్పథంతో తక్షణ సహాయం అందించారు. వారి గౌరవానికి భంగం కలగకుండా, సురక్షితమైన సంరక్షణ కోసం ఐదుగురిని నగరంలోని ఒక షెల్టర్ హోమ్కు తరలించారు. అక్కడ వారికి అవసరమైన వసతి మరియు వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకున్నారు. పోలీసుల ఈ చొరవను స్థానిక ప్రజలతో పాటు స్వచ్ఛంద సంస్థలు అభినందించాయి. ఖాకీల మంచి మనసుపై ప్రశంసలు కురిపించాయి. -
తెలంగాణలో పెట్రోల్, డీజీల్ కొరత.. కిషన్రెడ్డి క్లారిటీ
సాక్షి, హైదరాబాద్: మన దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా చూస్తున్నామని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పెట్రోల్ కొరతపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజీల్ను ఎవరూ ఇళ్లలో నిల్వ చేసుకోవద్దన్న కిషన్రెడ్డి.. చమురు నిల్వలు లేకపోతే ప్రభుత్వమే ప్రకటిస్తుందని తెలిపారు.ప్రజలు తప్పుడు ప్రచారం నమ్మొద్దు. పెట్రోలు ధరలు పెరుగుతాయని రాహుల్ స్టేట్మెంట్ ఇవ్వడం దురదృష్టకరం. కేంద్రం ముందు చూపుతో దేశంలో చమురు కొరత లేదు. తెలంగాణలో సరిపడా పెట్రోల్, డీజిల్ ఉంది. పానిక్తో ఎవరూ పెద్ద ఎత్తున పెట్రోల్ కొని నిల్వ చేసుకోవద్దు’’ అని కిషన్రెడ్డి సూచించారు. -
ములుగు ఫస్ట్.. హైదరాబాద్ లాస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో 99.30 శాతం ఉత్తీర్ణతతో ములుగు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. హైదరాబాద్ జిల్లా చివరి స్థానంతో సరిపెట్టుకుంది. ఇక్కడ 89.23 శాతం ఉత్తీర్ణత నమోదయింది. నాగర్ కర్నూలు (99.03), నిర్మల్ (98.96), జగిత్యాల (98.87), మహబూబాబాద్ (98.81) మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే మొత్తం 99.15 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. వీరిలో బాలురు 2,45,027 (94.04 శాతం), బాలికలు 2,46,747 (96.26 శాతం) మంది ఉన్నారు.రాష్ట్రవ్యాప్తంగా 5,16,815 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో 4,91,774 మంది విద్యార్థులు పాసయ్యారు. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 74,099 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, వీరిలో 66,115 మంది ఉత్తీర్ణులయ్యారు. ములుగు జిల్లాలో అత్యల్పంగా 3,287 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 3,264 మంది పాసయ్యారు. రంగారెడ్డి జిల్లాలో 52,946, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలో 48,855 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. (Telangana SSC Results 2026) ములుగు తర్వాత అత్యల్పంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 3,541 మంది పిల్లలు టెన్త్ పరీక్షలు రాశారు. వీరిలో 3,483 మంది పాసయ్యారు. జనగాం జిల్లాలో 6,443 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, 6,292 మంది ఉత్తీర్ణులయ్యారు. మంత్రి సీతక్క హర్షంపదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలవడం పట్ల మంత్రి సీతక్క హర్షం ప్రకటించారు. జిల్లా యంత్రంగానికి, విద్యాశాఖ అధికారులకు, టీచర్లకు విద్యార్థులకు అభినందనలు తెలిపారు. జిల్లాల వారీగా ఫలితాల వివరాలు -
పదో తరగతి ఫలితాలు విడుదల..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పదో పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం (ఏప్రిల్29) ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ నవీన్ నికోలస్లు పదో తరగతి ఫలితాలను విడుదల చేశారు. ఈసారి ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. టెన్త్ ఫలితాల్లో 95.15 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలు వెబ్సైట్లో ఫలితాలు అందుబాటులో ఉండనున్నాయి. ఈసారి ఫలితాల్లో కేవలం గ్రేడ్స్ కాకుండా మార్కులను కూడా ఫలితాల్లో వెల్లడించనున్నారు.👉 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. ఇక, తెలంగాణలో మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పదోతరగతి వార్షిక పరీక్షలు జరిగాయి. 5.17 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. మరో 10 వేల మంది ప్రైవేటు విద్యార్థులున్నారు. నెలరోజుల పాటు పరీక్షలు జరిగాయి. విద్యార్థులు ఫలితాలను 8096958096 వాట్సాప్ ద్వారా నంబర్ ద్వారా తెలుసుకోవచ్చు. 👉 sakshieducation.com👉 https://results.bsetelangana.org👉 https://results.bse.telangana.gov.in👉 https://bse.telangana.gov.in👉 https://schooledu.telangana.gov.in పదవ తరగతి పరీక్షా ఫలితాల వివరాలు ఉత్తీర్ణత శాతం -95.15శాతంబాలురు - 94.07శాతంబాలికలు -96.26 శాతం100శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలు -57310 శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలు -0699.30 శాతంతో ములుగు జిల్లా ఫస్ట్.89.23శాతంతో హైదరాబాద్ లాస్ట్సంక్షేమ పాఠశాలల్లో ఉత్తీర్ణత -99.10శాతంప్రభుత్వ పాఠశాలల్లో 86.18శాతంజిల్లా పరిషత్ పాఠశాల్లో 93.53శాతంమోడల్ స్కూల్స్లో 97.83శాతంకేజీబీవీల్లో 98శాతంప్రైవేట్ పాఠశాలాల్లో 95.81శాతంతో పాస్2065 జిల్లా పరిషత్ పాఠశాలల్లో 100శాతం పాస్ పర్సెంటేజ్మార్కుల రీ కౌంటింగ్ ,రీ వెరిఫికేషన్ ఈనెల 30 నుంచి మే 14 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు అధికారులుపదవతరగతి సప్లిమెంటరీ ..జూన్ 5 నుంచి 12 వరకు నిర్వాహాణ.ఈనెల 30 నుంచి మే 16 తేదీ లోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. -
తండ్రిని తిట్టి.. అమ్మ ఎలా అవుతావు?: కవితపై రాజగోపాల్ రెడ్డి ఫైర్
సాక్షి, యాదాద్రి భువనగిరి: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటనపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కవిత పార్టీ పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. కవిత సింగిల్గా పోటీ చేసిన డిపాజిట్ కూడా రాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది అని ప్రశ్నించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ కార్యాలయంలో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక కార్యక్రమంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్ను కవిత తిట్టడం బాధగా ఉంది. ఒక ఉద్యమకారుడి బిడ్డ అనే తనకు గుర్తు ఉంది. తండ్రి అంటే కూతురికి ప్రేమ ఉండాలి. తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది. తన మొదటి సమావేశంలో తండ్రిని తిట్టడంతో తను మర్యాద పోగొట్టుకుంది. తన అన్న మీద ఉన్న కోపం తండ్రి మీద తీయడం తప్పు.మద్యం కుంభకోణంలో తనకు ఇంకా క్లీన్ చిట్ రాలేదు.. కేసు పూర్తి కాలేదు. టీఆర్ఎస్ పేరు మీదనే పార్టీ పెట్టడం హాస్యాస్పదం. డబ్బులు ఉన్నాయని పార్టీ పెట్టడం పాన్ షాపు పెట్టినంత సులువు అయిపోయింది. పార్టీ కాదు తను సొంతంగా పోటీ చేసిన దగ్గర డిపాజిట్ కూడా రాదు. కాంగ్రెస్ అధిష్టానం నాకు హామీ ఇచ్చింది.. నాకు పదవి ఇస్తే కచ్చితంగా ఆ పదవికి న్యాయం చేస్తా’ అని తెలిపారు. -
పార్టీ మార్పు.. మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: పార్టీ మారబోతున్నారనే ప్రచారంపై మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. తానింకా బీఆర్ఎస్లోనే ఉన్నానని చెప్పారాయన. బుధవారం ఓ కార్యక్రమానికి హాజరైన ఆయనకు మీడియా నుంచి ఈ ప్రశ్న ఎదురైంది.. మోదీని కలిసినంత మాత్రాన పార్టీ మారినట్లు కాదు. నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను. వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చారు. మల్లారెడ్డి కుటుంబం ఇటీవల ప్రధాని మోదీని కలిసింది. అంతకు కొన్నిరోజులు ముందే.. ఆయన కోడలు ప్రీతిరెడ్డి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను పొగుడుతూ కామెంట్లు చేశారు. ఆ వెంటనే ఆమె బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. దీంతో పార్టీ మారబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. అయితే.. తాము మల్లారెడ్డి యూనివర్సిటీలో ప్రారంభించబోయే ఏఐ క్యాంపస్ ప్రారంభోత్సవం కోసం ప్రధానిని కలిశామని.. బీజేపీ మాత్రమే కాదు అన్ని పార్టీల నేతలనూ కలిసి ఆహ్వానిస్తామని ప్రీతిరెడ్డి తర్వాత క్లారిటీ ఇచ్చారు. రాజకీయాలకు తనకు ఇంకా టైం ఉందన్న ఆమె.. బీఆర్ఎస్ అంటే తమ కుటుంబానికి గౌరవం ఉందంటూ వ్యాఖ్యానించారు. -
ఏ ఒక్క ఐపీఎస్ అధికారిని వదిలిపెట్టం: హరీష్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం రేవంత్ ఆదేశాల మేరకే తమ ఫోన్లు ట్యాపింగ్, తమ ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాలు హ్యాకింగ్ చేస్తున్నారని అన్నారు. హ్యాకింగ్కి పాల్పడుతున్న ఏ ఒక్క ఐపీఎస్ అధికారిని వదిలిపెట్టమని హరీష్ హెచ్చరించారు.మాజీ మంత్రి హరీష్ రావు తాజాగా సాక్షితో మాట్లాడుతూ..‘కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లీగల్గా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడుతోంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తున్నందుకు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు. మా ప్రభుత్వం వచ్చాకా విచారణ జరిపిస్తాం. హ్యాకింగ్కి పాల్పడుతున్న ఏ ఒక్క ఐపీఎస్ అధికారిని వదిలిపెట్టం. చట్టానికి లోబడి ఫోన్ ట్యాపింగ్ చేయండి. కొంతమంది పోలీసు అధికారులు ముఖ్యమంత్రికి దగ్గర అవ్వాలని, పదోన్నతులు పొందాలని చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రధాని మోదీ ఇక్కడ సభలు పెట్టడం కాదు.. తెలంగాణకు జాతీయ ప్రాజెక్టులను ప్రకటించాలి’ అని డిమాండ్ చేశారు.ఇక, అంతకుముందు.. తెలంగాణలో పంటల కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ బహిరంగ లేఖ రాశారు. అందులో..‘ఎన్నికల వేళ చెప్పిందొకటి.. అధికారంలోకి వచ్చాక చేసేదొకటి. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్. తాలు పేరిట తరుగు తీస్తే తోలు తీస్తా అన్న సీఎం రేవంత్ రెడ్డి.. వడ్ల కొనుగోలు కేంద్రాల్లోకి వెళ్లి చూడు. కొనుగోలు కేంద్రాలకు వరి ధాన్యం కుప్పలు తెప్పలుగా వస్తున్నా ఇంకా కొనుగోళ్లు ఎందుకు మొదలుపెట్టలేదు?. మిల్లుల దగ్గర కూడా బస్తాకు కిలో, రెండు కిలోల తరుగు తీస్తూ రైతులను దోచుకుంటున్నారు. ఎండలో రైతులు మాడిపోతున్నా ప్రభుత్వానికి సోయి లేదా?. మాట ఇచ్చిన ప్రకారం సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ వెంటనే ధాన్యం డబ్బులతో పాటే ఇవ్వాలి అని పేర్కొన్నారు. -
పైలెట్ రోహిత్ రెడ్డి విడుదల
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పైలెట్ రోహిత్రెడ్డి బుధవారం ఉదయం జైలు నుండి బయటకు వచ్చారు. నిన్న హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల వ్యక్తిగత బాండ్తో పాటు ఇద్దరి పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. మొయినాబాద్ పీఎస్ ఎస్హెచ్ వో ఎదుట 8 వారాలు లేదా చార్జిషీట్ దాఖలు చేసే వరకు.. ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య హాజరుకావాలని షరతులు విధించింది. బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 483(2) లోని షరతులన్నీ పాటించాలని, పాస్పోర్టును ట్రయ ల్కోర్టుకు అందజేయాలని స్పష్టం చేసింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ అజీజ్నగర్లోని పైలెట్ రోహిత్రెడ్డికి చెందిన ఫామ్హౌస్లో గత నెల అను మతి లేకుండా భారీ మద్యం, డ్రగ్స్ పార్టీ జరుగుతు న్నట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించిన విషయం విదితమే. రోహిత్రెడ్డితో పాటు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్కుమార్ యాదవ్కు కూడా పోలీసులకు చిక్కారు. మొయినాబాద్ పోలీసులు నమోదు చేసిన ఈ కేసులో బెయిల్ కోరుతూ రోహిత్రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై వాదనలు పూర్తి చేసిన జస్టిస్ సుజన కళాసికం ధర్మాసనం ఈ నెల 21న తీర్పు రిజర్వు చేసింది. మంగళవారం రోహిత్రెడ్డి బెయిల్కు అనుమతిస్తూ తుది ఉత్తర్వులు జారీచేసింది. -
నేడు పదో తరగతి ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పదోతరగతి వార్షిక పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఎస్సీఈఆర్టీ క్యాంపస్లోని గోదావరి ఆడిటోరియంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితారాణా, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఇ.నవీన్నికోలస్ ఫలితాలను విడుదల చేస్తారు.రాష్ట్రంలో మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పదోతరగతి వార్షిక పరీక్షలు జరిగాయి. 5.17 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. మరో 10 వేల మంది ప్రైవేటు విద్యార్థులున్నారు. నెలరోజుల పాటు పరీక్షలు జరిగాయి. విద్యార్థులు ఫలితాలను 8096958096 వాట్సాప్ ద్వారా నంబర్ ద్వారా తెలుసుకోవచ్చు. https://results.bsetelangana.org, https://schooledu.telangana.gov.in, sakshieducation.com వెబ్సైట్లలో కూడా చూసుకోవచ్చు. -
అత్తకు భారీ షాక్.. ఐదేండ్లు జైలు శిక్ష..!
హైదరాబాద్: గృహ హింస కేసులో భర్తకు 5 ఏండ్లు, అత్తకు ఏడాది జైలు శిక్షతోపాటు రూ.1 లక్ష జరిమానా విధిస్తూ మంగళవారం నాంపల్లిలోని మనోరంజన్లో ఉన్న 15వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజి్రస్టేట్ కోర్టు జడ్జి డి.అజయ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనితాదేశ్ముఖ్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని పహాడిషరీఫ్కు చెందిన షభాన బేగంను అక్టోబర్ 10, 2014న చాంద్రాయణ గుట్టకు చెందిన అన్వర్పాషా వివాహం చేసుకున్నాడు. వరకట్నం కింద రూ.60 వేలు, 10 తులాల బంగారం, 30 తులాల వెండీ, రూ.5 లక్షల విలువైన వస్తువులను ఇచ్చారు. కొద్దికాలం అనంతరం అదనపు కట్నం తేవాలని భర్త, అత్త వేధింపులతో రూ.2 లక్షలు ఇచ్చారు. మళ్లీ వేధింపులకు గురిచేయడంతో ఆగష్టు 20, 2015లో రాజేంద్రనగర్ ఉమెన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై ఎసై బాలునాయక్, ఎన్.శ్రేయ విచారణ చేపట్టి పూర్తి సమాచారంతో చార్జిషిట్ను కోర్టులో అందజేశారు. బాధితురాలి తరుఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనితాదేశ్ముఖ్ కోర్టులో వాదనలు వినిపించారు. విచారణ చేపట్టిన 15వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజి్రస్టేట్ కోర్టు ఏపీపీ వాదనలను ఏకీభవిస్తూ నిందితులిద్దరికి శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
పెళ్లి ఇష్టం లేక.. చదువుపై మక్కువ వీడక..
మేడ్చల్ జిల్లా: నిశ్చయమైన పెళ్లి ఇష్టం లేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. మేడిపల్లి పోలీసుల కథనం ప్రకారం... మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూరు గ్రామానికి చెందిన బక్కతట్ల మునిత కుటుంబంతో కలిసి మేడిపల్లికి వలస వచ్చి సీపీఆర్ఐ సమీపంలో భార్యభర్తలిద్దరూ వాచ్మెన్గా పనిచేస్తున్నారు. వీరి పెద్ద కుమార్తె మమత(18) డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. కాగా, మమతకు మహబూబాబాద్కు చెందిన ఓ యువకుడితో పెళ్లి నిశ్చయించి మే 13న వివాహ ముహూర్తం కూడా ఖరారు చేశారు. అయితే ఉన్నత చదువులు చదువుకుంటానని, ఇప్పుడే వివాహం వద్దని మమత నిరాకరించినప్పటికీ తల్లిదండ్రులు బలవంతం చేశారు. ఈ నెల 23న సాయంత్రం కుటుంబమంతా కలిసి స్వగ్రామానికి వెళ్లేందుకు సిద్ధమైంది. మమత బాత్రూమ్కు వెళ్లి ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచి్చన చెల్లెలు వైష్ణవి తలుపు తట్టింది. స్పందన లేకపోవడంతో స్థానికుల సాయంతో తలుపులు పగులగొట్టి చూడగా మమత చున్నీతో ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించింది. వెంటనే ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు. మూడు రోజుల అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ మృత్యువుతో పోరాడుతూ సోమవారం తెల్లవారుజామున మమత చనిపోయింది. మృతురాలి తల్లి ఇచి్చన ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంధన కొరత సృష్టిస్తే కఠిన చర్యలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో చమురు అక్రమ, కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని హైదరాబాద్ కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల హెచ్చరించారు. పెట్రోల్, డీజిల్ కొరత రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ లభ్యత, నిల్వలు, సరఫరా పరిస్థితులపై ఏజెన్సీ నిర్వాహకులు, డి్రస్టిబ్యూటర్లతో సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ.. నీటి సరఫరా, ప్రభుత్వ వాహనాలు, అంబులెన్సులు, ఫైరింజిన్లకు ఇంధన కొరత లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్యాస్ సిలిండర్ల సరఫరా విషయంలో బుకింగ్, రీఫిల్లింగ్ నిబంధనలను కచి్చతంగా అమలు చేయాలని ఆదేశించారు. ఒకే సిలిండర్ కలిగిన కుటుంబాలకు ప్రాధాన్యమివ్వాలన్నారు. పౌరులు వదంతులను నమ్మవద్దని, అధికారిక సమాచారాన్ని మాత్రమే ఆధారంగా తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ రాజిరెడ్డి, జిల్లా సివిల్ సప్లై అధికారి శ్రీనివాస్, సంక్షేమ అధికారులు జి.ఆశన్న, ప్రవీణ్ కుమార్, ఇలియాస్ అహ్మద్, ఆర్టీఓ పురుషోత్తమ రెడ్డి తదితరులు పాల్గొన్నారు -
పోలీస్ బాస్.. పక్కా హైదరాబాదీ
సాక్షి, హైదరాబాద్: డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ).. రాష్ట్ర పోలీసు విభాగానికి బాస్.. యూనిఫాం ధరించిన ప్రతి ఐపీఎస్ అధికారి కల.. ఇంతటి కీలక పోస్టులో నియమితులైన సీవీ ఆనంద్ ఇక్కడే పుట్టి.. ఇక్కడే పెరిగి అన్నట్లు పూర్తిగా నగరంతో అనుబంధం పెనవేసుకున్నారు. ఆనంద్ తల్లిదండ్రులది నగర శివారులోని కుంట్లూరు. అయితే, ఆయన సిటీలోనే పుట్టారు. ఇక్కడే చదువుకున్నారు. ఈ ప్రత్యేకతకు తోడు.. ఐపీఎస్ అధికారిగా ఈస్ట్జోన్ డీసీపీ, సెంట్రల్ జోన్ తొలి డీసీపీగా, ఆపై ట్రాఫిక్ విభాగం అదనపు సీపీగా, సైబరాబాద్ పోలీసు కమిషనర్గా, రెండుసార్లు నగర కొత్వాల్గా పని చేశారు. ఇలా వివిధ హోదాల్లో, వివిధ విభాగాల్లో పనిచేసిన నేపథ్యంలో సిటీపై మంచి పట్టు ఉంది. నాలుగైదేళ్లు కేంద్ర సరీ్వసుల్లో డిప్యుటేషన్పై విధులు నిరి్వర్తించినా.. నగరం కేంద్రంగానే పని చేశారు. సీపీ టు డీజీపీ... ఇక అటు ఉమ్మడి రాష్ట్రంలో, ఇటు విభజన తర్వాత డీజీపీలుగా నియమితులైన వారిలో అత్యధికులకు సిటీతో ‘అనుబంధం’ ఉంటోంది. వీరిలో ఎక్కువమంది సిటీ పోలీస్ కమిషనర్లుగా పని చేసినవారే. ఈ పరంపరకు కొనసాగింపుగా మంగళవారం సీవీ ఆనంద్ను డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన పక్కా హైదరాబాదీ కావడం.. సుదీర్ఘ కాలం తర్వాత పూర్తి స్థాయి డీజీపీగా నియమితులు కావడం విశేషం. నాలుగు దశాబ్దాల్లో ..1986 నుంచి ఇప్పటివరకు అటు ఉమ్మడి రాష్ట్రం, ఇటు విభజన తర్వాత మహేందర్రెడ్డితో కలిపి మొత్తం 25 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులు డీజీపీ సీటులో కూర్చున్నారు. వీరిలో 14 మందికి నగర పోలీసు కమిషనర్లుగా పని చేసిన అనుభవం ఉంది. అనురాగ్ శర్మ, మహేందర్రెడ్డి నేరుగా ‘సిటీ కమిషనరేట్’ నుంచి ‘డీజీపీ కార్యాలయానికి’ వెళ్లగా... మిగిలిన వారిలో అత్యధికులు ‘వయా’ చేరుకున్నారు. ఏకే మహంతి రోడ్ సేఫ్టీ అథారిటీ నుంచి, అరవిందరావు, ప్రసాదరావు, అంజనీకుమార్ తదితర అధికారులు అవినీతి నిరోధక శాఖకు చీఫ్లుగా పని చేస్తూ డీజీపీలుగా నియమితులయ్యారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత డీజీపీలుగా నియమితులైన ఏడుగురిలో నలుగురు సిటీ నుంచే వెళ్లారు.ఆ అనుభవంతో లేక్ పోలీసు సృష్టి.. చిన్నతనంలో ఆనంద్ కుటుంబం ఆదర్శ్నగర్లో ఉండేది. అక్కడినుంచి తరచూ ట్యాంక్బండ్ నుంచి రాకపోకలు సాగించేవారు. ఆ సందర్భాల్లోనే హుస్సేన్సాగర్లో అనేక మంది ఆత్మహత్య చేసుకుంటున్న విషయం ఆయన దృష్టికి వచి్చంది. దీంతో సెంట్రల్ జోన్ డీసీపీగా పని చేస్తున్నప్పుడు 2002లో లేక్ పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేశారు. సాగర్ చుట్టూ నిఘా, గస్తీతో పాటు అవగాహన బోర్డులు, తొలిసారిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. నగర కొత్వాల్గా పని చేసినప్పుడు హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) సహా అనేక ఆవిష్కరణలు ఆనంద్ ఖాతాలోకే వెళ్తాయి. సీపీ టు డీజీపీలు వీరే.. సీజీ సల్దాన్హ ఆర్.ప్రభాకర్రావు టి.సూర్యనారాయణరావు ఎంవీ భాస్కర్రావు హెచ్జే దొర ఎస్ఆర్ సుకుమార పేర్వారం రాములు వి.దినేష్రెడ్డి ఏకే మహంతి బి.ప్రసాదరావు అనురాగ్శర్మ ఎం.మహేందర్రెడ్డి అంజనీకుమార్ సీవీ ఆనంద్ -
పెట్టుబడికి 'ఫ్యూచర్'
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న భారత్ ఫ్యూచర్సిటీ అంతర్జాతీయ పెట్టుబడులకు స్వర్గధామంగా నిలవబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నియుద్ధాలు వచ్చినా.. ఇక్కడ ఎలాంటి నష్టం ఉండదు. అన్ని రకాలుగా రక్షణతో కూడిన ప్రదేశం ఇదే. పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయి. భవిష్యత్తులో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది. న్యూయార్క్, టోక్యో వంటి ప్రపంచస్థాయి నగరాలతో పోటీపడుతుంది’అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి చెప్పారు. మీర్ఖాన్పేటలో ఫ్యూచర్సిటీ పోలీసు కమిషనరేట్ భవనానికి మంగళవారం ఆయన భూమిపూజ, శంకుస్థాపన చేశారు. మల్కాజ్గిరి కమిషనరేట్ భవనం సహా ఆక్టోపస్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, కుత్బుల్లాపూర్ డీసీపీ కార్యాలయ భవనాలకు సంబంధించిన శిలాఫలకాలనూ ఆవిష్కరించారు. గిరిదర్శక్ పథకంలో భాగంగా 20 మంది మాజీ మావోయిస్టులు, సానుభూతిపరులకు నియామక పత్రాలను అందజేశారు. అనంతరం రేవంత్రెడ్డి మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. తీర్మానం చేసి పంపండి.. మూసీనది పునర్నిర్మాణం, రీజినల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్సిటీ అభివృద్ధిలో ఏమాత్రం వెనక్కితగ్గం. శంషాబాద్ కేంద్రంగా అమరావతి మీదుగా చెన్నై వరకు, అటు బెంగళూరు, ఇటు పుణే నుంచి ముంబై ఇలా మూడు బుల్లెట్ రైళ్లు రాబోతున్నాయి. ఇక్కడే అతిపెద్ద బస్ టెర్మినల్ రాబోతోంది. అభివృద్ధిలో మనం స్ఫూర్తిగా తీసుకుంటున్న నగరాలతో పోటీగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయబోతున్నాం. 160 కి.మీ. ఔటర్ రింగ్రోడ్డు దేశంలో ఏ నగరానికీ లేదు. అదేస్థాయిలో రీజినల్ రింగ్రోడ్డును అందుబాటులోకి తేనున్నాం. కొంతమంది ప్రజాప్రతినిధులు తమ గ్రామాలను కూడా ఫ్యూచర్సిటీలో కలపాలని కోరుతున్నారు. తీర్మానం పంపితే అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం. స్థానిక సంస్థల నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధుల సహకారంతోనే ఫ్యూచర్సిటీ అభివృద్ధి చెందుతుంది. ఫ్యూచర్ సిటీ కార్యాలయంలో కూర్చొని ఒప్పందాలు చేసుకోవాలి. జూన్ 2లోపే ఆ కార్యక్రమం కూడా పూర్తవుతుంది. మీరు ఏడ్చుకుంటూ ఉండండి... శంషాబాద్, ఔటర్ రింగ్రోడ్డు, హైటెక్ సిటీలను నాడు అవహేళన చేశారు. ఊహాచిత్రంగా భావించి, అనుమానించారు. అదేవిధంగా నేడు కొంత మంది ఫ్యూచర్ లేని సీఎం ఫ్యూచర్ సిటీ కడతాడట అని విమర్శిస్తున్నారు. మీరు ఏడ్చుకుంటూ ఉండండి. నేను చేయాల్సింది చేసుకుంటూ పోతుంటా. మీ ఏడుపు నాకు శంకరాభరణంలోని సంగీతం విన్నట్లు ఉంటుంది. వారిది అసురజాతి. వాళ్లు పోయినా నష్టం లేదు. మీరు ఎన్ని కుట్రలు చేసినా.. రైతులను ఎంత రెచ్చగొట్టినా అభివృద్ధి విషయంలో వెనక్కి తగ్గం. లీగల్ చిక్కులకు అవకాశం లేకుండా పక్కాగా నోటిఫికేషన్లు ఇచ్చి, రైతులను ఒప్పించి, మెప్పిస్తాం. వారికి నచ్చిన విధంగా ఆర్థిక సహాయం అందించిన తర్వాతే ముందుకెళ్తాం. అభివృద్ధి పనుల కోసం ఈ రోజు కాకపోయినా రేపైనా భూసేకరణ తప్పదు. ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారాన్ని తీసుకుని వేరేచోట పెట్టుబడి పెట్టుకోండి. మీ పిల్లల భవిష్యత్తుకు, ఉద్యోగ అవకాశాలకు సహకరించండి. జనజీవన స్రవంతిలో కలవండి.. అన్నలూ అడవిని వీడి జనజీవన స్రవంతిలో కలవండి. మీ ప్రాణాలకు పూర్తి రక్షణ, ఆరోగ్య బాధ్యత మాది. ఆశయ సాధన పేరుతో అడవుల్లో ఉండి అసువులు బాసే కన్నా జనారణ్యంలో భాగస్వాములు కావడం ఉత్తమం. ఇటీవల లొంగిపోయిన గణపతి ఆరోగ్యం దెబ్బతిన్నట్లు తెలిసింది. ఆయన ప్రాణాలకు పూర్తి రక్షణ కల్పించడంతోపాటు మంచి వైద్యం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గిరిజన, ఆదివాసీ బిడ్డలను అభివృద్ధిలో భాగస్వాములను చేయాలనే ఆలోచనతోనే గిరిదర్శన్ పథకాన్ని తీసుకొచ్చాం’అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు డి.శ్రీధర్బాబు, జూపల్లి కృష్ణారావు, ఎంపీ అనిల్కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, అరికెపూడి గాం«దీ, డీజీపీ బి.శివధర్రెడ్డి, ఫ్యూచర్సిటీ సీపీ సుదీర్బాబు, మల్కాజ్గిరి సీపీ సుమతి తదితరులు పాల్గొన్నారు. అన్ని హంగులతో ఫ్యూచర్సిటీ: మంత్రి శ్రీధర్బాబు 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీయే తెలంగాణ లక్ష్యం. అన్ని హంగులతో భారత్ ఫ్యూచర్సిటీని తీర్చదిద్దబోతున్నాం. పరిశ్రమలు, వాణిజ్యం ముందంజలో ఉండటానికి పోలీసుల కృషి అభినందనీయం. డ్రగ్స్రహిత సమాజం కోసం పోలీసు శాఖ ఎంతగానో కృషిచేస్తోంది. సాంకేతిక వినియోగంలోనూ ముందంజలో ఉంది. 20 మంది గిరిదర్శక్ల నియామకం: డీజీపీ శివధర్రెడ్డి తెలంగాణలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అద్భుత అడ్వెంచర్లు ఉన్నాయి. పర్యాటకులకు వీటిని చూపించేందుకు ప్రభుత్వం గిరిదర్శన్ పేరుతో ప్రత్యేక గైడ్లను నియమించింది. అడవిబాటను వీడి జనం బాటపట్టిన గిరిజన, ఆదివాసీ యువకులను ఇందుకు ఎంచుకుంది. ఎత్తైన కొండలు, గుట్టలు, లోయలు, జలపాతాలను చూపించనుంది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం నుంచి 20 మంది ఆదివాసీలను గిరిదర్శక్లుగా నియమించి శిక్షణ ఇచ్చాం. ఉపాధి కల్పించి, వారి జీవితాల్లో వెలుగులు పూయిస్తాం. ప్రత్యేక యూనిఫాంలో ఉండే వీరు.. పోలీసులు, ఫారెస్ట్, టూరిజం శాఖల సమన్వయంతో పనిచేస్తారు. మిగిలిన మావోయిస్టులు కూడా లొంగిపోవాలి. ప్రభుత్వం వారికి అన్నివిధాలా అండగా ఉంటుంది. -
డేంజర్ జోన్లో సొరంగం!
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగం కుప్పకూలిన ప్రాంతానికి 6 కి.మీ.ల దూరంలో ‘నల్లవాగు’ మేజర్ ఫాల్ట్ జోన్ ఉన్నట్టు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. నల్లవాగుకి 2 కి.మీ.ల తూర్పు, పడమర దిశలోని సొరంగ మార్గంలో మరో రెండు ఫాల్ట్ జోన్లు కూడా ఉన్నాయి. భూ ఉపరితలం నుంచి 50–300 మీటర్ల లోతుల్లో దక్షిణ దిశగా వాలుతూ ఈ ఫాల్ట్ జోన్లు కనిపించాయి. అక్కడి పొరల నిర్మాణంలో చీలికలూ ఉన్నాయి. సొరంగ మార్గం వెంబడి భూగర్భ జలాల ప్రవాహానికి ఈ చీలికలు ప్రధాన మార్గంగా పనిచేస్తున్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలోని నల్లవాగు ప్రాంతం పరిధిలోనే సొరంగ నిర్మాణం జరుగుతుండడంతో ఈ ఫాల్ట్ జోన్లు ఏర్పడ్డాయి. సీఎస్ఐఆర్–నేషనల్ జియోఫిజికల్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తలు 2025 అక్టోబర్–నవంబర్ మధ్యకాలంలో అత్యాధునిక హెలీబోర్న్ వీటెమ్ సాంకేతికతతో ఆకాశం నుంచి భూగర్భంలో పరిశోధనలు నిర్వహించగా, పైన పేర్కొన్న రీతిలో పలు ఆందోళనకర అంశాలు బయటపడ్డాయి. ఈ సర్వే నివేదికను ఇటీవల ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. అత్యాధునిక పరికరాల ద్వారా విద్యుదయస్కాంత సంకేతాలను భూగర్భంలోకి పంపించి వాటి వ్యాప్తిని గమనించడం ద్వారా భూ పొరల్లో ఫాల్ట్స్, ఫ్రాక్చర్లు, షీర్ జోన్లతో పాటు భూగర్భ జలాల ప్రవాహాన్ని ఈ పరిశోధన ద్వారా నిర్థారిస్తారు. పగుళ్ల మధ్య ప్రవహిస్తున్న నీళ్లు సొరంగం కుప్పకూలిన ప్రాంతంలో 13.65– 13.95 కి.మీ.ల మార్గంలోని శిలల మధ్య తీవ్రమైన పగుళ్లు ఏర్పడి ఉండగా, వాటి మధ్య మట్టి నిక్షిప్తమై బలహీన నిర్మాణాన్ని కలిగి ఉంది. అక్కడి శిలలు చీలిపోయి నిటారున మడతపడి ఉండగా, పగుళ్ల మధ్య నీళ్లు ప్రవహిస్తున్నాయి. దీంతోనే సొరంగం కుప్పకూలినట్టు భావిస్తున్నారు. ⇒ సొరంగం కూలిన ప్రాంతానికి పక్కన తీవ్ర పగుళ్లతో మరో రెండు ప్రమాదకర జోన్లను కూడా గుర్తించారు. ఈ పగుళ్ల మధ్య కూడా భూగర్భ జల ప్రవాహం కొనసాగుతోంది. ⇒ సొరంగం మధ్య ప్రాంతంలో నల్లవాగు ఫాల్ట్ జోన్ ఉంది. ఇక ఉత్తర భాగంలో పగుళ్లు/చీలికలున్నాయి. ఉత్తరాన విద్యుదయస్కాంత క్షేత్రం ⇒ సొరంగం కూలిన ప్రాంతానికి ఉత్తరాన అసాధారణ రీతిలో అత్యల్ప విద్యుదయస్కాంత క్షేత్రం ఉన్నట్టు కనుగొన్నారు. (నల్లవాగు ఫాల్ట్ జోన్) ⇒ సొరంగ మార్గంలో 13.2 కి.మీలు, 13.6 కి.మీలు, 13.9కి.మీ.ల వద్ద పగుళ్లు, చీలికలు ఉన్నాయి. వీటి మధ్య జలాలు ప్రవహిస్తున్నాయి. ఇక్కడ జాగ్రత్తగా వ్యవహరించాలి ⇒ సొరంగ మార్గం 21–23 కి.మీ.ల మధ్య 250 మీటర్ల లోతుల్లో శిలల నిర్మాణం లోహ ఖనిజాల నుంచి గ్రనైట్కు మారుతోంది. దీంతో ఇక్కడ తవ్వకాల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నివేదిక స్పష్టం చేస్తోంది. ⇒ నల్లమలలోని తిరుమలపూర్కి ఉత్తరాదిన.. ఈశాన్యం నుంచి నైరుతి దిశగా మరో రెండు సమస్యాత్మక ప్రాంతాలున్నాయి. ⇒ సొరంగం తవ్వకాలు జరగాల్సిన ప్రాంతాల్లో పగుళ్లు, చీలికలు పలు దిశల్లో విస్తరించి ఉన్నాయి. ఉపరితలం నుంచి 250 మీటర్ల లోతు వరకు ఇలాంటి నిర్మాణాలుండగా, వీటి గుండా భూగర్భ జలాలు ప్రవహిస్తున్నాయి. -
ఏప్రిల్ 29న హెచ్సీఏ TG20 లీగ్ లోగో ఆవిష్కరణ
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) తన ప్రతిష్ఠాత్మక T20 లీగ్ ‘TG20’ ను ఏప్రిల్ 29న నగరంలో ఘనంగా ఆవిష్కరించనుంది. ఈ లీగ్ రాష్ట్రంలోని దేశీయ క్రికెట్కు కొత్త దిశను చూపే కీలక అడుగుగా భావిస్తున్నారు.గ్రాస్రూట్ స్థాయి నుంచి ప్రొఫెషనల్ క్రికెట్ వరకు వారధిగా TG20 రూపుదిద్దుకుంటోంది. పారదర్శకత, పోటీ వాతావరణం, ప్రతిభా వికాసం అనే లక్ష్యాలతో ఈ లీగ్ రూపొందించబడింది. Board of Control for Cricket in India (BCCI) దృష్టికోణానికి అనుగుణంగా, జిల్లా స్థాయి ఆటగాళ్లకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వంటి ఉన్నత స్థాయి వేదికల వరకు చేరుకునే మార్గాన్ని ఇది సృష్టిస్తుంది.ఫ్రాంచైజీ యాజమాన్యానికి సంబంధించిన ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ (EOI) ప్రక్రియకు కార్పొరేట్ వర్గాల నుంచి విశేష స్పందన లభించింది. తొలి సీజన్ జూన్–జూలై 2026లో ప్రారంభం కానుంది. మ్యాచ్ షెడ్యూల్ మరియు జట్ల వివరాలు త్వరలో ప్రకటించబడతాయి.అగ్రశ్రేణి లీగ్ల తరహాలో రూపొందించిన TG20, ఆటగాళ్లకు అధిక స్థాయి పోటీ వాతావరణాన్ని కల్పిస్తూ, వారి ప్రతిభను మెరుగుపరచడానికి మరియు గుర్తింపు పొందడానికి సహాయపడుతుంది.TG20 vs డొమెస్టిక్ లీగ్స్•పోటీ స్థాయి: TG20 – అధికం | క్లబ్ క్రికెట్ – మధ్యస్థం•మ్యాచ్ ఒత్తిడి: ప్రొఫెషనల్ | సెమీ-ప్రొఫెషనల్•గుర్తింపు (Exposure): విస్తృతం | పరిమితం•ఆటగాళ్ల అభివృద్ధి: వేగంగా | క్రమంగాఈ టోర్నమెంట్లో మొత్తం 8 ఫ్రాంచైజీ జట్లు పాల్గొని, 32 మ్యాచ్లు నిర్వహించబడతాయి. అన్ని మ్యాచ్లు ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రౌండ్-రోబిన్ మరియు ప్లేఆఫ్ పద్ధతిలో జరుగుతాయి.హెచ్సీఏ అధికారులు TG20 ను కేవలం లీగ్గా కాకుండా, జిల్లా స్థాయి ప్రతిభను గుర్తించి, పెంపొందించి, ప్రదర్శించే ఒక సమగ్ర ప్రతిభా వేదికగా అభివర్ణించారు.పారదర్శకత, నిష్పక్షపాతత, ప్రొఫెషనలిజం వంటి విలువలతో ఈ లీగ్ నిర్వహించబడనుంది. ఫ్రాంచైజీలు, స్పాన్సర్లు, మరియు ఇతర భాగస్వాముల నుంచి విస్తృత స్పందన లభించే అవకాశముంది.క్రికెట్కే పరిమితం కాకుండా, ప్రేక్షకులకు ఉత్సాహభరితమైన మ్యాచ్లు, వినోదాత్మక కార్యక్రమాలతో పండుగ వాతావరణాన్ని TG20 అందించనుంది. ఈ లీగ్లో విజయాన్ని సాధించాలంటే ప్రొఫెషనల్ సిద్ధత, క్రమశిక్షణ, మరియు స్థిరత్వం అత్యంత ముఖ్యమైనవి.ధన్యవాదాలుఎచ్ సి ఏ సెక్రటరీ మన్నె జీవన్ రెడ్డి -
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా డ్రగ్స్ పట్టివేత
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా డ్రగ్స్ను పట్టుకున్నారు. సుమారు రూ. 2.15 కోట్ల విలువ చేసే డ్రగ్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తి వద్ద నుంచే ఈ డ్రగ్స్ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వచ్చిన సదరు వ్యక్తి హైడ్రోపోనిక్ గంజాయితో పట్టుబడ్డాడు. 6.15 కిలోల ఈ హైడ్రోఫోనిక్ గంజాయి విలువ రూ. 2. 15 కోట్ల వరకూ ఉంటుందట. ఎయిర్ ఆసియా విమానంలో బ్యాంకాక్ నుంచి హైదరాబాద్కు వచ్చిన ఓ ప్రయాణికుడు దీన్ని 16 సీల్డ్ ప్యాకెట్లలో దాచిపెట్టి తెచ్చాడు. అంతకుముందు ఏప్రిల్ 2వ తేదీన కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇద్దరు ప్రయాణికుల వద్ద నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారిని ఎన్డీపీఎస్ చట్టం కింద అరెస్టు చేశారు. అది కూడా బ్యాంకాక్ నుంచే వచ్చింది. 25 కిలోల 45 గ్రాముల హైడ్రోఫోనిక్ గంజాయి తీసుకువచ్చారు. దాని విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.8.9 కోట్లు. -
తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ నియమితులయ్యారు. ఐపీఎస్ సీవీ ఆనంద్ను రాష్ట్ర డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పదవి నుంచి బదిలీ చేసింది.దీంతో హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్గా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించనున్నారు. యూపీఎస్సీ కమిటీ సిఫార్సుల మేరకు నియామకం జరిగింది. బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. ఐపీఎస్ 1991 బ్యాచ్కు చెందిన సీవీ ఆనంద్.. నక్సలైట్ ప్రాంతాల్లో పనిచేసిన అనుభవం, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్గా, ట్రాఫిక్ కమిషనర్గా, సైబరాబాద్ కమిషనర్గా, అలాగే హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విస్తృతమైన సేవా అనుభవం ఉంది. తన సర్వీస్ ఆరంభంలో వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఏఎస్పీ, ఎస్పీగా పనిచేసిన ఆయన నక్సలైట్ మావోయిస్టు సమస్యను ఎదుర్కొన్నారు. ఆయుధ సరఫరా గొలుసును అడ్డుకోవడంలో, యువతను నక్సలైట్ ప్రభావం నుంచి దూరం చేయడంలో కీలక పాత్ర పోషించారు.ప్రముఖ పదవులుకమిషనర్ ఆఫ్ పోలీస్, హైదరాబాద్కమిషనర్ ఆఫ్ పోలీస్, సైబరాబాద్ట్రాఫిక్ కమిషనర్, హైదరాబాద్ (ఇక్కడే డ్రంక్ డ్రైవింగ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రారంభించారు)డైరెక్టర్ జనరల్, యాంటీ-కరప్షన్ బ్యూరోస్పెషల్ చీఫ్ సెక్రటరీ, హోం శాఖ సంస్కరణలు-ఆవిష్కరణలు ఈ-చలాన్, స్పీడ్ గన్స్, రివర్సిబుల్ లేన్లు, "ఫ్రీ లెఫ్ట్" వంటి పద్ధతులు ప్రవేశపెట్టారు.సైబరాబాద్లో సీసీటీవీ, ఐటీ ఆధారిత పోలీసింగ్, షీ టీమ్స్, షీ షటిల్స్ వంటి మహిళా భద్రతా కార్యక్రమాలు ప్రారంభించారు.పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (PDS): ఆధార్ ఆధారిత రేషన్ వ్యవస్థ, GPS ట్రాకింగ్, ఆన్లైన్ చెల్లింపులు ప్రవేశపెట్టి రాష్ట్రానికి ₹2000 కోట్లు ఆదా చేశారు. అవార్డులుపోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీస్పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్టెలంగాణ స్టేట్ ఎక్సలెన్స్ అవార్డు -
కొరత లేదు.. కానీ ప్రజలు భయంతో ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు
-
పెట్రోల్, డీజిల్ కొరత.. స్టీఫెన్ రవీంద్ర క్లారిటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని సివిల్ సప్లయ్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల తర్వాత పెట్రోల్ ధరలు పెరుగుతాయనే అపోహలు ప్రజల్లో ఉన్నాయి. సోషల్ మీడియా ప్రచారాన్ని ప్రజలు నమ్మకండి. ఇంధనం ఎంత అవసరమో అంతే కొనుగోలు చేయండి అని వాహనదారులకు సూచించారు.తెలంగాణ సివిల్ సప్లయ్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తాజాగా సాక్షితో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో ఎక్కడ పెట్రోల్, డీజిల్ కొరత లేదు. పబ్లిక్ ఆందోళన వల్లే ఈ కొరత ఏర్పడింది. ఒక రోజుకు 13వేల కిలో లీటర్ల సప్లై చేసేది.. నిన్న ఒక్క రోజే 30వేల కిలో లీటర్ల సరఫరా చేశాం. పెట్రోల్ బంకుల్లో స్టాక్ ఉన్నప్పటికీ నో స్టాక్ పెట్టిన, రోజువారీ కంటే ఎక్కువ అమ్మకాలు జరిగాయి. ఎల్పీజీ, సీఎన్జీ, పెట్రోల్, డీజిల్ సరఫరాపై ఆన్లైన్లో మానిటరింగ్ చేస్తున్నారు. ధరలు పెరుగుతాయని భయంతో ప్రజలు ఇలా చేస్తున్నారు.దాదాపు 70, 80 రోజుల వరకు స్టాక్ అందుబాటులో ఉంది. ప్రజలకు ఇబ్బంది కలగకుండా జిల్లా కలెక్టర్లు మాకు సహకరిస్తున్నారు. గతవారం ఇండస్ట్రియల్ డీజిల్ ధరలు పెరగడంతో లాస్ తగ్గించుకోవడానికి రెగ్యులర్ బంకులలో డీజిల్ బయింగ్ చేయడం వల్ల మనకు కొరత ఏర్పడింది. సోషల్ మీడియా ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దు. ఇంధనం ఎంత అవసరమో అంతే కొనుగోలు చేయండి. క్రెడిట్ లిమిట్పై జరుగుతున్న ప్రచారం కరెక్ట్ కాదు. అందరు డీలర్లకు అన్ని రకాలుగా సరఫరా జరుగుతుంది. -
రేపు తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాలకు ముహూర్తం ఖరారైంది. రేపు ఏప్రిల్ 29వ తేదీన ఫలితాలు విడుదల కానున్నాయి. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు హాజరై ఫలితాలను విడుదల చేయనున్నారు.మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. సుమారు 5.15 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మూల్యాంకనం పూర్తి కావడంతో రిజల్ట్స్ రిలీజ్ కోసం ప్రభుత్వం ఆదేశాల కోసం విద్యా శాఖ ఎదురు చూసింది. ఈలోపు గ్రీన్ సిగ్నల్ రావడంతో పలితాలు విడుదల చేస్తోంది. -
రేవంత్.. వారితో ఫోన్లు హ్యాక్ చేయిస్తున్నావా?: హరీష్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రశ్నించే గొంతులపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూర్ఖత్వం హిట్లర్ను మించిపోయిందని ఎద్దేవా చేశారు. కొంత మంది ఐపీఎస్లు తమ ఫోన్లను హ్యాక్ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి హరీష్ రావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రైతులు, రాష్ట్ర ప్రజల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేదు. ఎవరు మాట్లాడితే వాళ్లపై కేసులు పెడుతున్నారు. మన్నే క్రిశాంక్తో పాటు ఏడుగురిపై అక్రమ కేసు పెట్టారు. ప్రశ్నించే గొంతులపై కాంగ్రెస్ అక్రమ కేసులు పెడుతుంది. ఓ కేసులో అనుముల హనుమంత రెడ్డి అనే వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అడిగితే కేసు పెడతారా?. రేవంత్ రెడ్డి అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు. కేసులతో గొంతు నొక్కలేవు. కొంత మంది ఐపీఎస్లు మా ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు. ఇంటి ముందు ఉన్న సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నారు. బెంగళూరు నుంచి హ్యాకర్లను తెచ్చి మాపై నిఘా పెడుతున్నారు. అలాంటి అధికారులు జాగ్రత్త. మీరు రిటైర్డ్ అయిన మిమ్మల్ని వదలం. రేవంత్ సగం కాలం పూర్తయ్యింది. ఇంకా మిగిలి ఉన్న సగ కాలం అయిన మంచిగా పని చేయాలి. రైతుల సమస్యలను రాష్ట్రంలో పట్టించుకునే నాధుడే లేడు. ఆనాడు తాలు తీస్తే తోలు తీస్తా అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎటు పోయాడు?. యాసంగి పంటకు బోనస్ ఇస్తారా లేదా రేవంత్ సమాధానం చెప్పాలి. రైతుల కష్టాలు ఈ ప్రభుత్వానికి పట్టవా?. జూబ్లీహిల్స్ ప్యాలెస్ ఏసీలో కూర్చుంటే సమస్యలు ఎలా తెలుస్తాయి?. రేవంత్ మళ్ళీ గెలిచేది లేదు. ఉన్నన్ని రోజులు అయిన మంచిగా పని చేయాలి’ అని వ్యాఖ్యలు చేశారు. -
వినాశకాలే విపరీత బుద్ధి : వీసీ సజ్జనార్ చీవాట్లు
సాక్షి, హైదరాబాద్: పెట్రోల్ బంక్ లాంటి అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంలో అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి బైక్ స్టంట్లు చేసిన వైనం నెట్టింట ఆగ్రహానికి తావిస్తోంది. ఇది సాహసం కాదు, పచ్చి మూర్ఖత్వం. ఇలాంటి ప్రదేశాలలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం, లేదా ఘర్షణలకు దిగడం ప్రాణాపాయానికి దారితీస్తుంది. దీనిపై హైదరాబాద్ సీపీ వీసీసజ్జనార్ స్పందించారు. ఇలాంటి మూర్ఖత్వపు సాహసాలు తగదు అంటూ యువతను హెచ్చరించారు. వినాశ కాలే విపరీత బుద్ధిః అని పెద్దలు ఊరికే అనలేదు అంటూ చురకలేశారు. ‘‘పెట్రోల్ బంక్ లాంటి అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంలో అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి బైక్ స్టంట్లు చేయడం సాహసం కాదు.. అది పచ్చి మూర్ఖత్వం! మీ ఒక్క క్షణపు షో కోసం అక్కడ ఉన్న అమాయకుల ప్రాణాలు బలి కావాలా!? గుర్తుంచుకోండి.. మీరు చేసే Wheelings ఇంట్లో మీ కోసం ఎదురుచూసే తల్లిదండ్రుల కళ్లలో కన్నీటి Feelings మిగల్చకూడదు. బాధ్యతగా ఉండండి!’’అంటూ ట్విటర్లో ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు. వినాశకాలే విపరీత బుద్ధి అని పెద్దలు ఊరికే అనలేదు.పెట్రోల్ బంక్ లాంటి అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంలో అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి బైక్ స్టంట్లు చేయడం సాహసం కాదు.. అది పచ్చి మూర్ఖత్వం! మీ ఒక్క క్షణపు షో కోసం అక్కడ ఉన్న అమాయకుల ప్రాణాలు బలి కావాలా!?గుర్తుంచుకోండి.. మీరు చేసే… pic.twitter.com/ud2iRpFVmW— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) April 28, 2026 -
ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న తండ్రి
మహబూబాబాద్: తొర్రూర్ పట్టణ శివారులో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తండ్రి తన ఇద్దరు కుమారులకు ఉరివేసి హత్య చేసి, అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.పోలీసులు కథనం ప్రకారం.. తండ్రి వలి తన ఇద్దరు కుమారులు విలాస్ (5), వికేష్ (3)లను పోలంలోకి తీసుకెళ్లి ఉరివేసి హత్య చేశాడు. అనంతరం అదే చోట తాను కూడా ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం వెలుగులోకి రావడంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. -
‘కోత’ల డ్రామాలతో సమస్య గట్టెక్కగలరా?
తెలంగాణలో మంత్రుల జీతాలు సగానికి కోశారు. రాజకీయ డ్రామానా? ఆదర్శంగా నిలిచే ప్రయత్నమా? ఎమ్మెల్యేల జీతాల్లోనూ కోతలు పెట్టి తద్వారా మిగిలిన డబ్బును రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించేందుకు వాడతారని సమాచారం. మామూలుగానైతే ఈ చర్యలను అందరూ ప్రశంసించాల్సిందే కానీ... రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు, ఎమ్మెల్యేల జీతాల్లో కోతతో మిగిలే డబ్బును పరిగణలోకి తీసుకుంటే దీన్ని డ్రామా అనే అనాల్సి వస్తుంది. బకాయేమో కొండంత.. మిగిలేది పిసరంత మాత్రమే మరి. దేశంలోని పలు రాష్ట్రాలు ఇప్పుడు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ వంటి చోట్ల అప్పు చేయకపోతే రోజు గడవని స్థితి. అదే సమయంలో అధికారం కోసం ఇచ్చిన అడ్డమైన హామీల అమలు బరువూ ఆయా ప్రభుత్వాలపై పడుతోంది. ప్రజలను ఏమార్చి అధికారం సాధించిన తర్వాత అనేక పిల్లిమొగ్గలు వేయాల్సి వస్తోంది. తెలంగాణలో రిటైర్డ్, సాధారణ ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించవలసిన బకాయి సుమారు రూ.14 వేల కోట్లు మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు నెలకు రూ.పది కోట్లు కూడా కాకపోవచ్చు. ఇందులో సగం ఆపుకుని ఉద్యోగులకు చెల్లిస్తామని చెబితే హాస్యాస్పదం అనిపించదా? పోనీ వీరు పూర్తిగా తమ జీతాలు తగ్గించుకుంటే అది వేరే విషయం. అభినందించవచ్చు. కాని హిమాచల్ ప్రదేశ్ లో ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారుల జీతాలు ఆరు నెలలపాటు సగం తీసుకకోకుండా ఆగుతారట. అంటే ఆ తర్వాత మొత్తం బకాయిలతోసహా తీసుకుంటారనే కదా?. ఏపీలో తెలుగుదేశం తరపున భజన చేసే ఎల్లో మీడియాకు అక్కడి ప్రభుత్వం ఒక లీకు ఇచ్చింది. హిమాచల్లో మాదిరి సంక్షోభం రాకుండా ఉండాలంటే ఆర్థిక క్రమశిక్షణ అవసరమని ఆ మీడియా పేర్కొంది. ఇందుకోసం ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, సంక్షేమ స్కీములలో అనర్హుల ఏరివేత, దుబారా వ్యయం నియంత్రణ ఆవశ్యం అంటూ ఆ మీడియా ప్రచారం చేసింది. బహుశా ఆ మీడియా వారిని సంతోషపరచడానికో ఏమో కాని, ఏపీ కన్నా ముందుగా తెలంగాణలో దానిని పాటించడానికి రేవంత్ సర్కార్ సిద్దం అయిందన్న భావన కలుగుతోంది. అందులో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు కొంతకాలం సగం చొప్పునే తీసుకుంటారట. ఇతర ఆదాయ మార్గాలు కూడా అన్వేషించాలని తలపెట్టారు. అది తప్పు కాదు. కాని అసలు సమస్య తెలంగాణ లో కాంగ్రెస్, ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఇచ్చిన హామీల భారం అన్నది వాస్తవం కాదా? దానిని కప్పిపుచ్చుకోవడానికి తమకు మద్దతు ఇచ్చే మీడియాను అడ్డుపెట్టుకుని ప్రభుత్వాలు కొత్త డ్రామా నడపాలని చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. తెలంగాణ తర్వాత ఏపీలో కూడా ఈ తరహా సీన్ ను చూస్తామేమో తెలియదు. ఏపీలో ప్రభుత్వం సుమారు రూ.40 వేల కోట్ల మేరకు ఉద్యోగులకు బకాయిపడినట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో రిటైరైన వారికి రావల్సిన ఫైనల్ మొత్తాలు సకాలంలో చెల్లించకపోవడంపై హైకోర్టు కూడా పలుమార్లు ప్రభుత్వాన్ని ఆక్షేపించింది. అయినా ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలో తెలియని స్థితిలో ప్రభుత్వం ఉందనిపిస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ సిబ్బందికి, అలాగే అన్ని వర్గాల ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది. ఉదాహరణకు వృద్దాప్య ఫించన్ను రూ.రెండు వేల నుంచి రూ.నాలుగు వేలు చేస్తామని, ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.2500 చొప్పున చెల్లిస్తామని.. ఇలా అనేక వాగ్దానాలు చేసింది.పైగా ఇవన్ని వంద రోజుల్లో నెరవేర్చుతామని కూడా ప్రజలను నమ్మించే యత్నం చేసింది. ప్రజలు విశ్వసించారా? లేక ఇతర కారణాల వల్లనా అన్నది చెప్పలేం కాని, కాంగ్రెస్ అధికారంలోకి అయితే రాగలిగింది. ఆ తర్వాత అసలు కథ ఆరంభమైంది. గత కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని, మిగులు రాష్ట్రాన్ని లోటు రాష్ట్రంగా చేశారని, కాళేశ్వరంపై రూ.లక్ష కోట్లు వృథా చేశారని ఇలా పలు విధాలుగా సమస్యలను డైవర్ట్ చేయడానికి యత్నించారు. ఇవన్నీ తెలియకుండానే ఎన్నికల వాగ్దానాలు చేశారా? ఎల్ల కాలం అది సాగదు కదా? సడన్ గా ఆర్టీసీ సిబ్బంది రియాక్ట్ అయ్యారు. సమ్మెకు దిగారు. ఒక కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదంతా ప్రభుత్వానికి పెద్ద కళంకంగా మారింది.దాంతో రేవంత్ ప్రభుత్వం వేగంగా స్పందించాల్సి వచ్చింది. ప్రస్తుతానికి ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఒక పరిష్కారం కనుక్కున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి కమిటీ వేస్తామని చెప్పారు. ఇది కొంత సమయం తీసుకునే కసరత్తు తప్ప ఇంకొకటి కాకపోవచ్చు. ఇలాగే ఆయా వర్గాల వారు తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ ఆందోళనలకు దిగితే ప్రభుత్వానికి మరింత ఇరకాట పరిస్థితి ఏర్పడుతుంది. రైతులలో ఏర్పడిన అసంతృప్తిని కొంతైనా పొగొట్టాలని రేవంత్ సర్కార్ దశల వారిగా రైతు బంధు స్కీమ్ ను అమలు చేస్తోంది.రుణమాఫీని కొంత మేర చేశారు. అయినా ఇతర సమస్యలు వెంటాడుతూనే ఉంాయి. ఫీజ్ రీయింబర్స్ మెంట్ గురించి ప్రైవేట కాలేజీల వారు కొన్ని నెలల క్రితం ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. అక్కడికి హైదరాబాద్లో భూముల అమ్మకం వంటివాటి ద్వారా కొంత డబ్బు సంపాదిస్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు, వస్తున్న ఆదాయానికి సంబంధం ఉండడం లేదు. దానివల్లే ప్రభుత్వం వేల కోట్ల అప్పులు చేయవలసి వస్తోంది.ఈ ఏడాది కొత్త ఆర్థిక సంవత్సరంలో అంటే ఏప్రిల్ నుంచి జూన్ మధ్య రూ.18900 కోట్ల అప్పు చేయాలని ప్రబుత్వం నిర్ణయించుకుంది. ప్రతి నెల సగటున రూ.6300 కోట్ల అప్పు చేయాలన్నమాట. అంటే రోజుకు రూ.210 కోట్ల రుణం! రాష్ట్రం అప్పు ఇప్పటికే సుమారు రూ.ఎనిమిది లక్షల కోట్లకు చేరింది. ఈ ఏడాది ఇది ఇంకా పెరుగుతుంది.అయినా ఇచ్చిన హామీలన్నిటిని నెరవేర్చడం అసాధ్యం అని చెప్పక తప్పదు. ఒకప్పుడు ప్రధానిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి పాకిస్తాన్తో యుద్దం నేపథ్యంలో ‘‘జై జవాన్, జై కిసాన్’’ అన్న నినాదం ఇచ్చి ప్రజలు ఒక పూట ఉపవాసం ఉండి ,ఆ డబ్బును సైనికుల నిధి ఇవ్వాలని కోరారు. దానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. కోట్లాది మంది దానిని ఆచరించారు. ఆ రోజుల్లో ఆయన పాటించిన నిరాడంబరత, చిత్తశుద్ధి, దేశ భక్తి మొదలైనవి కారణాలుగా ఉన్నాయి. కాని ప్రస్తుతం ఒకపక్క రాష్ట్ర ప్రభుత్వాలు విలాసవంతమైన రీతిలో ఖర్చులు చేస్తున్నాయి. అవినీతికి కొదవే లేదు. ప్రజలను మభ్య పెట్టడానికి ఇష్టారీతిన ఎన్నికల ప్రణాళికలను ప్రకటించడం వంటివి చేస్తున్నాయి. అధికారంలోకి వచ్చాక చేతులు ఎత్తేస్తున్నాయి. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చాలా ఏళ్ల క్రితం అమెరికాలో చేసిన ఒక వ్యాఖ్య అర్థవంతమైందే అనుకోవాలి. మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నప్పుడు రాజకీయ నేతలుగా మేము చేయకుండా ఉంటామా? అని అన్నారు. చమత్కారం కోసం ఆ మాట చెప్పినా,అది అక్షరసత్యం!కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పోలీసుస్టేషన్కు వచ్చిన నాగుపాము
కరీంనగర్ జిల్లా: గన్నేరువరం పోలీస్స్టేషన్లో నాగుపాము హల్చల్ చేసింది. ఎస్సై నరేందర్రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. ఎస్సై సోమవారం పోలీసుస్టేషన్లోని తన గదిలో ఫిర్యాదుదారుతో మాట్లాడుతున్నాడు. ఎస్సై సీటు వెనుక ఉన్న కిటకిలోంచి గదిలోకి నాగుపాము ప్రవేశిస్తున్న క్రమంలో ఎదురుగా ఉన్న వ్యక్తి గమనించి పాము అని గట్టిగా అరిచాడు. ఎస్సై వెంటనే తన సీటు ముందున్న టేబుల్ పైనుంచి దూకడంతో ప్రమాదం తప్పింది. స్నేక్ క్యాచర్ పోచయ్యను పిలిపించి, పామును పట్టుకున్నారు. మూడు రోజులుగా పోలీస్స్టేషన్ అవరణలో పాము తిరుగుతున్నట్లు తెలిపారు. -
అషురెడ్డి ‘చీటింగ్’పై సీసీఎస్ విచారణ
సాక్షి, హైదరాబాద్: ప్రవాస భారతీయుడిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.9.35 కోట్ల మేర మోసం చేసిన కేసులో సినీ నటి అషురెడ్డికి (కొయ్య వెంకట అశ్విని రెడ్డి) త్వరలో నోటీసులు జారీ చేయాలని నగర సీసీఎస్ పోలీసులు నిర్ణయించారు. లండన్లో ఉంటున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ వైవీ ధర్మేంద్ర తరఫున ఆయన తండ్రి ఎనుముల సత్యనారాయణ మూర్తి ఇచి్చన ఫిర్యాదు మేరకు అషురెడ్డిపై ఈ కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్లోని వివరాల ప్రకారం... ధర్మేంద్ర 2018లో ఇక్కడ ఉన్నప్పుడు అషు రెడ్డిని కొందరు పరిచయస్తుల ద్వారా కలిశాడు. పరిచయమైన రెండు నెలల్లోనే ధర్మేంద్రను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని పేర్కొంది. ధర్మేంద్ర తనకు అప్పటికే వివాహమైందని, విడాకులు ప్రక్రియలో ఉన్నాయని చెప్పినా... అది సమస్య కాదని చెప్పిన అషురెడ్డి సంబంధాన్ని కొనసాగించింది. తన హెచ్1బీ వీసాలో కొన్ని సమస్యలు ఉన్నాయని, విద్యా రుణం ఉందని, తండ్రికి ఆర్థికంగా సహాయం చేయడానికే చదువును ఆపేశానని వివరించింది. తాను నటిగా ఎదగడానికి భారత్కు వచ్చి ఆర్థికంగా సహాయం చేయాలని ధర్మేంద్రను కోరింది. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అతడు నమ్మి ఆమె ఖర్చులను భరించడం మొదలెట్టాడు. కొన్నాళ్లకు అషురెడ్డి తన నెలవారీ ఖర్చులు, వ్యక్తిగత అవసరాలు, విలాసవంతమైన జీవనం కోసం డబ్బులు అడగటం మొదలుపెట్టింది. అలాగే కార్లు, బంగారం, ఆస్తులు తన పేరుతో కొనిపెట్టమని కోరింది. అయితే 2020 జూలైలో ధర్మేంద్ర పెళ్లి ప్రస్తావన తెచి్చనప్పుడు చేసుకోనని అషురెడ్డి చెప్పింది. అయితే తన డబ్బు తిరిగి ఇవ్వాలని ధర్మేంద్ర కోరాడు. అయితే రూ.70 లక్షలు తిరిగి ఇస్తానని అంగీకరించి ఖాళీ చెక్కులు ఇచ్చి ఆ తరువాత పట్టించుకోలేదు. కొద్ది రోజుల తరువాత మళ్లీ పెళ్లి ప్రస్తావన రావడంతో అతడు నమ్మి వారితో సంబంధాన్ని కొనసాగించాడు. భారీ మొత్తంలో డబ్బు, ఆస్తులు, దాదాపు ఐదు కిలోల బంగారం ధర్మేంద్ర నుంచి తీసుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులు కూడా అతడిని అల్లుడిగా సంబోధిస్తూ, వారి ఖర్చులు భరించమని ఒత్తిడి చేశారు. మొత్తం ఐదేళ్లలో సుమారు రూ.9.35 కోట్లు ఇలా ధర్మేంద్ర నుంచి తీసుకున్నారు. దీనికి అదనంగా అషురెడ్డి చెల్లెలు రూ.50 లక్షలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితుల ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు తొలుత ధర్మేంద్ర తండ్రి నుంచి అవసరమైన అన్ని పత్రాలు, బ్యాంక్ స్టేట్మెంట్లు, లావాదేవీల రికార్డులు తీసుకోవాలని నిర్ణయించారు. ఆపై ఈ కేసులో నిందితులుగా ఉన్న అషురెడ్డితో పాటు ఆమె తండ్రి, సోదరి, తల్లి తదితరులకు నోటీసులు జారీ చేయనున్నారు. -
ఐదు గంటలు వెంటాడి దొంగను పట్టుకున్న పోలీసులు
హైదరాబాద్: ఓ కరుడుగట్టిన దొంగను బంజారాహిల్స్ క్రైమ్ పోలీసులు సినీఫక్కీలో ఛేజింగ్ చేసి పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఫిలింనగర్లో నివసించే వినోద్కుమార్ బంజారాహిల్స్లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో హౌస్ కీపింగ్ పనిచేస్తుంటాడు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు విధులు ముగించుకుని ఆస్పత్రి బయటకు వచ్చాడు. అదే సమయంలో ఇద్దరు అపరిచితులు వినోద్కుమార్ వద్దకు వచ్చి అర్జెంటుగా ఫోన్కాల్ మాట్లాడాలని రిక్వెస్ట్ చేయడంతో తన ఫోన్ ఇచ్చాడు. అందులో ఒకరు ఫోన్ మాట్లాడుతూ క్యాన్సర్ ఆస్పత్రి ఎదురుగా ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లాడు. వినోద్ ఆగంతకుడిని అనుసరిస్తూ వెళ్లగా బీరు సీసాలతో దాడి చేశాడు. బెదిరించి, కొట్టి ఫోన్తోపాటు రూ.3 వేలు లాక్కొని కమాండ్ కంట్రోల్ సెంటర్ మీదుగా పరారయ్యాడు. వెంటనే బాధితుడు బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఎమ్మెల్యే కాలనీ రోడ్డులోని ఏసీబీ కార్యాలయం ఎదురుగా ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో నిందితుడు తిష్ట వేసినట్లుగా పోలీసులకు సమాచారం అందింది. పోలీసు బృందాలు అక్కడికి వెళ్లి రెండువైపుల నుంచి వెతుకుతుండగా ఒకచోట బీరు తాగుతూ కనిపించాడు. పట్టుకునేందుకు యత్నించగా బీరు బాటిల్ పగులగొట్టి పొడుస్తానంటూ.. కత్తితో బెదిరిస్తూ వారిని తప్పించుకుని ఎమ్మెల్యే కాలనీలోకి పరారయ్యాడు. ఐదు గంటల్లో పట్టివేత... రాత్రి ఏడు గంటల ప్రాంతంలో అక్కడ ఓ ఇంటి ప్రహరీ దూకి రోడ్డు వైపు వచ్చేందుకు ప్రయతి్నస్తుండగా పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడు గతంలో జవహర్నగర్ డంపింగ్యార్డు సమీపంలో ఉండేవాడని, అతడు పాత నేరస్తుడైన తురేకర్ అజయ్ అలియాస్ బబ్లూ(27)గా గుర్తించారు. ప్రస్తుతం సనత్నగర్ ప్రాంతంలో ఉంటున్నట్లుగా తేలింది. బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆరు దోపిడీ కేసుల్లో నిందితుడిగా ఉన్న బబ్లూ రెండు నెలల క్రితమే జైలు నుంచి విడుదలయ్యాడు. గంజాయికి, మద్యానికి బానిసై దోపిడీలకు పాల్పడుతున్నట్లు తేలింది. -
హైదరాబాద్లో పెట్రో బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. భారీ క్యూలు
సాక్షి, హైదరాబాద్: పెట్రోల్ దొరకదంట.. అర్జంట్గా పోయి ట్యాంకు ఫుల్ చేయించుకోవాలి అంటూ బంకు దగ్గరికి వెళ్లిన రామారావుకి జనం కాస్త ఎక్కువగా కనబడ్డారు. కాస్త ముందుకు వెళ్తే మరో బంక్ ఉంది కదా అనుకుని వెళ్తే.. మైండ్ బ్లాక్ అయ్యే దృశ్యం కనిపించింది. చూస్తే కిలోమీటర్పైగా బండ్లు క్యూ కట్టాయి. పోనీలే ఇంకో బంక్ అనుకుంటూ మరో రెండు కిలోమీటర్లు వెళ్లి చూస్తే అక్కడ ‘‘నో స్టాక్ బోర్డు’’.హైదరాబాద్లో సోమవారం నుంచి పెట్రో బంకుల వద్ద పరిస్థితి ఇది. మంగళవారం ఉదయం నాటికి అది తీవ్రతరంగా మారింది. పెట్రోల్ బంకుల ముందు ద్విచక్ర వాహనాలు, కార్లు భారీగా వరుస కట్టాయి. కొన్ని బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. మధ్యాహ్నం తర్వాతే పెట్రోల్, డీజిల్ అంటూ చెబుతున్నారు బంకు నిర్వాహకులు. కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో బంకుల వద్ద దృశ్యాలు ఇవే. తొలుత ఏపీలో కేవలం డీజిల్ కొరత మాత్రమే ఉందని చర్చ జరగ్గా.. ఆ వెంటనే అది పెట్రోల్కు కూడా పాకింది. ఆ వెంటనే తెలుగు రాష్ట్రాల సరిహద్దుల గుండా నెమ్మదిగా అంతటా ‘పెట్రో కొరత వైరస్’ వ్యాపించేసింది. కంపెనీల నిర్వాకమా?యుద్ధ ప్రభావంతో చమురు ధరలు పెరిగాయి. అయితే దేశీయంగా ఇంధన ధరలు పెరగకపోవడం వల్ల ఆయిల్ కంపెనీలు నష్టాలను భరించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని ప్రైవేట్ కంపెనీలు తమ రిటైల్ అవుట్లెట్లకు సరఫరాను తగ్గించగా.. మరికొన్ని ‘రేషన్’ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఫలితంగా ప్రభుత్వ రంగ సంస్థల బంకులపై అదనపు భారం పడుతోంది. ఒకేసారి డిమాండ్ పెరగడంతో గంటల తరబడి వాహనాలు క్యూ కడుతుండగా.. సాధారణంగా రెండు మూడు రోజులకు సరిపడే స్టాక్ కొన్ని గంటల్లోనే ఖాళీ అవుతోంది. ఈ పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తున్నది సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న పుకార్లు. ‘‘పెట్రోల్, డీజిల్ అయిపోతోంది’’, ‘‘ఇరాన్ యుద్ధం జరుగుతోంది కదా ఇక కష్టమే’’, ‘‘ధరలు పెరుగుతాయి” ఇలాంటి వదంతులతో ప్రజలు అవసరం లేకపోయినా ఫుల్ ట్యాంక్ చేయించుకోవడం, బాటిళ్లు, క్యాన్లలో నిల్వ చేసుకోవడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడుతోందని అధికారులు అంటున్నారు. ఫలితంగా.. అవసరం ఉన్న వాహనదారులు మాత్రమే కాదు వ్యవసాయ, వ్యాపార, పరిశ్రమ.. ఇతర రంగాలు కూడా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తోంది. ప్రభుత్వ వ్యవస్థలు ఫెయిల్!తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ కొరత నెలకొందనే ప్రచారం సోషల్ మీడియాకే పరిమితమైందని ప్రభుత్వం అంటోంది. అలాగే తగినంత నిల్వలు.. సరఫరా సాఫీగానే ఉందని సివిల్ సప్లై అధికారులు చెబుతున్నారు. కానీ, పరిస్థితి అందుకు విరుద్ధంగా కనిపిస్తూ వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులను రంగంలోకి దించినట్లు ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ, అది పూర్తి స్థాయిలో జరగడం లేదన్నది జనం మాట. ఈ విషయంలో ఇరు ప్రభుత్వాలు ఘోరంగా విఫలం అవుతున్నాయని తిట్టిపోస్తున్నారు. ఆయిల్ కంపెనీలు సరైన సమాచారం అందించి పంపిణీ వ్యవస్థను మెరుగుపరిస్తేనే ఈ భయాందోళనలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.Again I could see big queues at Petrol bunks #Hyderabad— Vinay (@vinay_a9) April 27, 2026Visited 3 petrol bunks in Hyderabad after 9PM, no service anywhere. Shortage again? 🤨#Hyderabad #PetrolShortage— Rishi. (@Rushiver_k) April 27, 2026Long queues in front of all petrol bunks in hyderabad . Shooting was interrupted today because of scarcity of diesel. 🙏🙏🙏— Sateesh Botta (@bkrsatish) April 27, 2026@TelanganaCMO @TelanganaCS @PetroleumMinToday almost all petrol Bunks in #Hyderabad have displayed "no stock" boards.And which bunk the stock is available have kilometres of Queue line for #petrol and #diesel.Is this a real shortage of fuel? pic.twitter.com/0xenXCN8dj— JALIGAMA PAVAN 🇮🇳 (@JaligamaPavan) April 27, 2026petrol crisis in hyderabad, most of the petrol bunks are closed and there's a huge rush wherever it's opened! pic.twitter.com/TjZws7nZwn— Vipul (@vipul_devis) April 27, 2026 -
ముఖ్యమంత్రి స్థాయిలో ఆ మాటలు, కూతలేంటి?
సాక్షి, హైదరాబాద్: ‘ఇది ఒక చిల్లర ప్రభుత్వం, ముఖ్యమంత్రి స్థాయిలో ఆ మాటలేంటి, ఆ కూతలేంటి? రాష్ట్రంలో ఏం జరుగుతోందో నాకు అర్ధం కావడం లేదు. బొందలో పడినట్లు అయిందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వానికి కనీసం ధాన్యం కొనుగోలు కూడా చేతకావడం లేదు. ధాన్యం కొనుగోలుపై మంత్రివర్గ ఉపసంఘం ఏ ర్పాటు అంటూ ప్రచారం చేసుకోవడం దుర్మార్గం. దళారుల ప్రమేయం లేకుండా వెంటనే వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. రైతుబంధు పథకాన్ని నిర్వీర్యం చేసి ఒక్కో దఫాలో ఒక్కో ఎకరాకు డబ్బులు ఇస్తూ రైతులను ప్రభుత్వం వంచిస్తోంది..’ అని కేసీఆర్ ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అభయహస్తం మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చేలా క్షేత్రస్థాయిలో ఒత్తిడి తెచ్చేందుకు పోరాటం కోసం నడుం బిగించాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను గుర్తించి వాటిపై పోరాటం ఉధృతం చేయాలన్నారు. భారత్ రాష్ట్ర సమితి 26వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో సోమవారం జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ పాల్గొన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ప్రజా ప్రతినిధులు సహా సుమారు 400 మంది పార్టీ ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. వారి నుంచి వివిధ అంశాలపై కేసీఆర్ సలహాలు, సూచనలు స్వీకరించారు. సుమారు రెండు గంటల పాటు నేతలను ఉద్దేశించి మాట్లాడారు. మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి ‘బీఆర్ఎస్కే తెలంగాణ పట్ల తడి, ఆర్తి ఉంది. తేజస్వీ సూర్య అనే వెధవ తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోలుస్తూ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినా కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఉత్సవ విగ్రహాల్లా నిశ్చలంగా మారారు. వారి ని్రష్కియాపరత్వం స్పష్టంగా కనిపించింది. అదే లోక్సభలో బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే రణరంగంగా మారేది. మహిళా రిజర్వేషన్ బిల్లును ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నట్లు కనిపించింది. బీజేపీ మహిళా బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టి దేశ ప్రజలను గందరగోళానికి గురి చేసింది. మహిళలకు చట్ట సభల్లో మూడింట ఒక వంతు రిజర్వేషన్లు కల్పించాలని గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం శాసనసభ, శాసన మండలిలో తీర్మానం చేసి పంపింది. మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలి. జై తెలంగాణ అనిపించేందుకే 2009లో టీడీపీతో పొత్తు తెలంగాణ ఉద్యమ సమయంలో నేను అనేక రకాలుగా అవమానాలు, క్షోభను అనుభవించా. హైదరాబాద్ లేని తెలంగాణకు అంగీకరిస్తే వెంటనే ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని కాంగ్రెస్ అధినేత సోనియా చెప్పినా నేను అంగీకరించలేదు. జై తెలంగాణ అనిపించేందుకే 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నా..’ అని కేసీఆర్ చెప్పారు. ‘సర్’లో అధికార పార్టీ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి ‘ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (సర్)పై పశ్చిమ బెంగాల్, బిహార్ తరహాలో లక్షలాది మంది ఓట్లు తొలగించిన నేపథ్యంలో బూత్ స్థాయిలో పార్టీ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సుమారు 15 వేల దొంగ ఓట్లు నమోదు కావడం వల్లే బీఆర్ఎస్ అభ్యర్థి ఓటమి పాలైనట్లు గుర్తించాం. ‘సర్’లో అధికార పార్టీ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలి. త్వరలో పార్టీ సభ్యత్వ నమోదు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం మినహా గ్రామ స్థాయి మొదలుకుని అన్నిరకాల కమిటీలు రద్దు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్లైన్, ఆఫ్లైన్ విధానంలో త్వరలో పార్టీ సభ్యత్వ నమోదు జరుగుతుంది. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత క్రియాశీల కార్యకర్తలు, నాయకులకు నియోజకవర్గానికి 200 మంది చొప్పున శిక్షణ ఇచ్చి తెలంగాణకు రక్షణ కవచంలా పని చేసేలా తీర్చిదిద్దుతాం. సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ప్రజలు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి. పనిచేసే వారికే భవిష్యత్తులో పార్టీ టికెట్లు ఇస్తాం. జీవన్రెడ్డి సేవలు వినియోగించుకుంటాం కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసి ఇటీవల పార్టీలో చేరిన టి.జీవన్రెడ్డిని కేవలం జగిత్యాలకు పరిమితం చేయకుండా ఇతర నియోజకవర్గాల్లోనూ ఆయన సేవలు వినియోగించుకుంటాం. రాజ్యసభ ఎంపీగా ఇటీవల రిటైరైన కేఆర్ సురేశ్రెడ్డి బాగా పని చేశారు..’ అంటూ కేసీఆర్ ప్రశంసించారు. ఆయనకు శాలువా కప్పి సన్మానం చేశారు. అంతకుముందు పార్టీ సమావేశంలో పాల్గొనేందుకు ఎర్రవల్లి నివాసం నుంచి సోమవారం మధ్యాహ్నం నందినగర్ నివాసానికి చేరుకున్న కేసీఆర్.. ఇటీవల పారీ్టలో చేరిన జీవన్రెడ్డితో కలిసి లంచ్ చేశారు. అనంతరం పార్టీ కార్యాలయానికి చేరుకుని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్నారు. -
గ్యాంట్రీ క్రేన్లు ఢీకొని ఐదుగురు మృతి
సాక్షి, రంగారెడ్డి జిల్లా/ శంకర్పల్లి: మూవబుల్ క్రేన్లు (గ్యాంట్రీ క్రేన్లు) ఢీకొన్న ఘటనలో ఐదుగురు కార్మీకులు మృతి చెందగా, మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులంతా ఇతర రాష్ట్రాల వారే. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మహాలింగాపురంలోని ఎన్సీసీ కన్స్ట్రక్షన్ కంపెనీలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బిహార్కు చెందిన ముఖేష్ (20), నాగేందర్ మాథూర్ (38), అలీ హుస్సేన్ (37), సాజిద్(36), ఉత్తరప్రదేశ్కు చెందిన సోనుచౌదరి (26) మరణించారు. సోమవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. అప్పటి వరకూ ఎండలో పనిచేసిన కార్మీకుల్లో సుమారు 18 మంది పక్కనే ఉన్న షెడ్డులోకి చేరుకున్నారు. దీనికి సమీపంలో నిలిపి ఉన్న రెండు మూవబుల్ క్రేన్లు, ఈదురు గాలులకు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఒక క్రేన్కు మూవింగ్ లాక్ లేకపోవడం, మరో క్రేన్కు లాక్ వేయకపోవడంతో భారీ ఈదురు గాలులకు ఒక క్రేన్ మరో క్రేన్ను ఢీకొని రెండూ కార్మీకులు ఉన్న షెడ్డును ఢీకొని పడిపోయాయి. అందులోని కార్మీకులు క్రేన్లు, షెడ్డు శిథిలాల మధ్య ఇరుక్కుపోయారు. విషయం తెలిసిన వెంటనే చేవెళ్ల డీసీపీ యోగేష్గౌతం, చేవెళ్ల ఏసీపీ కిషన్ హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను మార్చురీకి తరలించారు. క్షతగాత్రులందరినీ పట్టణంలోని లలిత, గాయత్రి ఆస్పత్రులకు తరలించారు. మృతులు, క్షతగాత్రుల బంధువుల రోదనలతో ఆస్పత్రి పరిసరాలు మిన్నంటాయి. కనీస ప్రమాణాలు పాటించలేదని... మహాలింగాపురంలోని ఎన్సీసీ కంపెనీలో ఫ్లైఓవర్లు, బ్రిడ్జీలకు సంబంధించిన మెటీరియల్ (విడిభాగాలు) తయారు చేస్తారు. ఫ్లైఓవర్లు, వంతెనలకు సంబంధించిన దెబ్బతిన్న భాగాలను ఇక్కడికి తీసుకొచ్చి మరమ్మతులు కూడా చేస్తారు. ఫ్యాక్టరీలో నిత్యం వంద మందికిపైగా కార్మికులు విధులు నిర్వర్తిస్తారు. వీరిలో బిహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్కు చెందినవారే అధికం. యాజమాన్యం కనీస ప్రమాణాలు కూడా పాటించలేదని అంటున్నారు. ఇంతపెద్ద ప్రమాదం జరిగినప్పటికీ విషయం బయటకు పొక్కకుండా కంపెనీ యాజమాన్యం గోప్యత ప్రదర్శించింది. కంపెనీ ప్రతినిధులపై డీసీపీ యోగేష్గౌతం ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రేన్లకు ఉన్న లాకులు గాలి దుమారానికి ఎలా ఊడిపోతాయని మండిపడ్డారు. కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి కార్మీకులకు న్యాయం జరిగేలా చూస్తానని స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య భరోసా ఇచ్చారు. -
కాసుల కోసమే కృత్రిమ కొరత?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మళ్లీ ఇంధన కొరత ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు, వ్యవసాయ అవసరాల కోసం రైతులు పెట్రోల్, డీజిల్ కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. హైదరాబాద్ సహా ప్రధాన పట్టణాలు, జిల్లాల్లోని పలు పెట్రోల్ బంకుల ముందు కార్లు, టూవీలర్ల క్యూలు కిలోమీటర్ల మేర కనిపిస్తున్నాయి. తెరిచిన పెట్రోల్ బంకుల వద్ద వాహనాలను క్రమబదీ్ధకరించేందుకు ట్రాఫిక్ పోలీసులు శ్రమిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ లిబర్టీ వద్ద గల ఓ పెట్రోల్ బంక్ వద్ద ఏకంగా ఎస్సై స్థాయి అధికారితోపాటు ట్రాఫిక్ పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ కనిపించారు. మరోవైపు పౌర సరఫరాల శాఖ పెట్రోల్, డీజిల్ కొరత లేదని చెబుతుండగా మరి బంకుల్లో ‘నో స్టాక్’బోర్డులు ఎందుకు దర్శనమిస్తున్నాయని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. డీలర్ల సంఘం మాత్రం చమురు కంపెనీల వల్లే పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిందని ఆరోపిస్తుంది. నష్టాలు తగ్గించుకొనే వ్యూహం? అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగ్గా దేశంలో మాత్రం ఐదు రాష్ట్రాల ఎన్నికల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం పెట్రో చార్జీల పెంపు జోలికి వెళ్లలేదు. దీంతో ప్రభుత్వరంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), హిందుస్తాన్ పెట్రోలియం (హెచ్పీ), భారత్ పెట్రోలియం (బీపీ) తీవ్ర నష్టాలు చవిచూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో రెండోదశ పోలింగ్ ప్రక్రియ ఈ నెల 29న సాయంత్రం ముగుస్తుండటంతో ఆ వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ సంకేతాలు ముందే అందడంతో చమురు సంస్థలు ఇప్పటి నుంచే నష్టాలను నివారించుకొనే ప్రయత్నం చేస్తున్నాయని.. అందులో భాగంగానే సరఫరాను తగ్గించి ‘కృత్రిమ కొరత’సృష్టిస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. డీలర్లు పెట్టిన ఇండెంట్ ప్రకారం కాకుండా కావాలనే తగ్గించి పెట్రోల్, డీజిల్ సరఫరా చేస్తున్నాయన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు ఏపీలో కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్కు తీవ్ర కొరత నెలకొనడంతో రాష్ట్రంలోని వాహనదారులు ముందుజాగ్రత్తగా తమ వాహనాలను ట్యాంక్ ఫుల్ చేయించుకోవడానికి బంకుల ముందు క్యూకట్టడం వల్ల కూడా ఇంధనం ముందే నిండుకుంది. దీంతో చాలా చోట్ల బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. డీలర్ల గోల్మాల్తో పెరిగిన కొరత.. రెండ్రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయనే ఉద్దేశంతో కొందరు డీలర్లు ఇంధన కొరత పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. బంకుల్లో స్టాక్ ఉన్నప్పటికీ ధరలు పెరిగాక విక్రయించి మరింతగా సొమ్ము చేసుకోవాలనే దురుద్దేశంతో కొందరు డీలర్లు కావాలనే పెట్రోల్, డీజిల్ను నిల్వ చేస్తున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్లో ఆదివారం వరకు లేని ఇంధన కొరత సోమవారం ఒక్కసారే కనిపించడం వెనుక డీలర్ల ‘ముందు చూపు’కూడా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు తాము డబ్బు చెల్లించినప్పటికీ చమురు సంస్థల నుంచి ఇంధనం రావట్లేదని డీలర్ల సంఘం నేత అమరేందర్రెడ్డి పేర్కొన్నారు. కంపెనీల సరఫరా గొలుసులో లోపాల వల్ల తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. ఇంధన కొరత లేదు: పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. సోషల్ మీడియాలోని తప్పుడు వార్తలు, వదంతులను నమ్మొద్దని.. ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని వివరించారు. పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో అధికారులు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో సమన్వయం చేసుకుంటూ సరఫరాలో అంతరాయం లేకుండా చూస్తున్నారని పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం 4 గంటల వరకు రాష్ట్రంలో 74.43 లక్షల లీటర్ల పెట్రోల్, 1.10 కోట్ల లీటర్ల డీజిల్ సరఫరా అయిందన్నారు. ప్రజలు భయాందోళనలకు గురికాకుండా బాధ్యతగా వ్యవహరించాలని.. అవసరానికి మించి ఇంధనం కొని నిల్వ చేయొద్దని సూచించారు. బంకుల సిబ్బంది, పోలీసులకు సహకరించి రద్దీని నివారించాలని కోరారు. కృత్రిమ కొరత, అక్రమ నిల్వలు లేదా భయాందోళనలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫిర్యాదులు, సమస్యల కోసం 1967 హెల్ప్లైన్ను సంప్రదించాలన్నారు. -
బీజేపీతో కలవబోనని దేవుడిపై ఒట్టేస్తారా?
సాక్షి, హైదరాబాద్: బీజేపీతో భవిష్యత్తులో కలవబోమని తాను నమ్మే దేవుడిపై ఒట్టేసి కేసీఆర్ చెప్పగలరా అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ప్రశ్నించారు. అసలు బయటకే రాకుండా ఫామ్హౌస్లో ఉన్న వ్యక్తికి రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుందని ఎద్దేవా చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం లేకపోతే బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయడం గురించి ఎందుకు చర్చ జరుగుతోందని, ఈ విలీనం గురించి కవిత మాటలకు కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. సోమవారం మండలి కాన్ఫరెన్స్ హాల్ లో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే... అంతా ఆ తానులోని ముక్కలే... ‘బీఆర్ఎస్కు గతం మాత్రమే... భవిష్యత్తు లేదు. అసలు పార్టీ ఉంటుందో, మూసేస్తారో... కొత్తగా వచ్చే పార్టీ గురించి మనకెందుకు? ప్రతి కదలికకు ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశం నెరవేరిన తర్వాత ఆ కదలిక నిస్తేజం అయిపోతుంది. తెలంగాణ ఏర్పాటు కోసం శ్రీకృష్ణ కమిటీ, రాష్ట్రానికి చెందిన మంత్రుల కమిటీలు కూడా అలాగే నిస్తేజం అయిపోయాయి. ఇప్పుడు బీఆర్ఎస్ది కూడా అదే పరిస్థితి. బీఆర్ఎస్ చచ్చిన శవంతో సమానం. శవానికి ఎంత అలంకరణ చేసినా లేచి వచ్చేది ఉండదు. 2001–14 వరకు ఆ పార్టీని ఉద్యమం, ఆ తర్వాత పదేళ్లు అధికారం బతికించాయి. ప్రజలు భరించలేనంత స్థాయికి వారి చెలాయింపు చేరుకున్నప్పుడు ఆ కుటుంబం, పార్టీ వద్దని ప్రజలు నిర్ణయించుకున్న తర్వాత 2023లో అధికారం నుంచి దించారు. కేసీఆర్ కుటుంబానికి ప్రజలతో సంబంధాలు తెగిపోయాయి. పంపకాల్లో తేడాలతోనే కుటుంబ కుంపటి వచ్చింది. వాళ్లంతా ఒకటే. ఆ తానులోని ముక్కలే. వాళ్ల దగ్గరున్న అధికారాన్ని గుంజుకున్నా... కేసీఆర్ కిందపడి దెబ్బతగిలితే గ్రీన్చానెల్ ఏర్పాటు చేసి ఆసుపత్రికి పంపించా. నేనే వెళ్లి పరామర్శించా. ఆయన అసెంబ్లీకి వస్తే వెళ్లి యోగక్షేమాలు కనుక్కున్నా. హిందూ సమాజంలో కుటుంబ పెద్ద చనిపోతే వారసులకు అధికార వారసత్వం వస్తుంది. కేసీఆర్ కుటుంబానికే ఆయన చావు అవసరం ఉంటుంది. కేసీఆర్ పోతే ఆయన ఆస్తి, పార్టీ, పార్టీ పేరిట ఉన్న ఆస్తులు, ఫామ్హౌజ్లు నాకు రావు. వాళ్ల దగ్గర ఉన్న అధికారాన్ని గుంజుకున్నా. ఇంకా ఆయన చావుతో నాకేం సంబంధం? కొడుక్కో, అల్లుడికో, కూతురికో ఉండొచ్చు. ఆయన బతికుంటే అధికారం రాదని, ఏదైనా చేద్దామని వారు అనుకుంటారేమో? ఆయన నాకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమే. శత్రువు కాదు. ఆయన ఆరోగ్యంగా ఉంటేనే మాకు ఈజీ. ఆయన విశ్రాంతి తీసుకుంటున్న ఓ ప్రజాప్రతినిధి. విశ్రాంతి తీసుకునే వారి చావును కోరుకునే మూర్ఖులు కాంగ్రెస్లో లేరు. కేసీఆర్కు మందులిచ్చే ఆయన సంతకం పెట్టించుకుంటే మిగిలిన ముగ్గురి ఆశలు గల్లంతే అవుతాయి. అందుకే వారిలో ఎవరితో ఎక్కువ ప్రమాదమన్నది కేసీఆరే విశ్లేషించుకోవాలి. కోర్టు ఏం చెప్పింది..? కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్పై కేసీఆర్, హరీశ్రావులు కమిషన్ ఏర్పాటు చట్టబద్ధం కాదని ప్రకటించాలని కోర్టును అడిగారు. కానీ కోర్టు చట్టబద్ధమేనని చెప్పింది. నోటీసులివ్వకుండా అభియోగాల నిర్ధారణ సరైంది కాదని, సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ విషయంలో మాత్రం సాంకేతికంగా వారికి సింఫుల్ రిలీఫ్ వచ్చింది. ఈ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టును అడిగారు. మా అడ్వొకేట్ జనరల్ స్వయంగా ఇదే విషయాన్ని కోర్టుకు చెప్పారు. ఇందులో వారికి లభించిన ఊరట ఏంటో అర్థం కాలేదు. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, పీసీ ఘోష్ కమిషన్ నివేదికల ఆధారంగా బాధ్యులెవరో విచారించాలని మేం సీబీఐని అడిగాం. వెంటనే విచారణ కోరుతూ నేను, మంత్రి ఉత్తమ్ సీబీఐ డైరెక్టర్ను కలుస్తాం. కేంద్రంపై ఒత్తిడి తెస్తాం. సీబీఐ విచారణ వద్దని బీజేపీని ప్రసన్నం చేసుకునేందుకు హరీశ్రావు ఢిల్లీ వెళ్లారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. మేడిగడ్డ బరాజ్ సందర్శన అధికారిక కార్యక్రమం. దీంతో సంబంధమున్న అధికారులంతా వస్తారు. కేంద్ర మంత్రులు పాల్గొనే అధికారిక కార్యక్రమాలకు రాష్ట్ర అధికారులు కూడా వెళ్తారు. అలా వెళ్లారని మేం కూడా సస్పెండ్ చేయాలా? ఫార్ములా–ఈ రేస్ కేసులో ఏసీబీ చార్జిషీట్ దాఖలు చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసు తొందరలోనే ఓ కొలిక్కి వస్తుంది. ఎలిమినేషన్ జరుగుతోంది రాష్ట్రంలో మాకు రాజకీయ ప్రత్యర్థి ఎవరన్నది ఇప్పుడే చెప్పలేం. ఎలిమినేషన్ ప్రాసెస్ జరుగుతోంది. వాళ్లలో కొట్టుకుని ఎవరు బయటకు వస్తారో రమ్మనండి. అప్పుడే మేం వారిని ఢీ కొంటాం. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి, ఇంకో కూటమి మధ్యనే పోటీ ఉంటుంది. మా కూటమిలో సీపీఐ, సీపీఎం, కోదండరాం పార్టీలుంటాయి. వాళ్ల కూటమిలో ఎవరుంటారో తెలియదు. మాది కార్మిక, కర్షక కూటమి. వాళ్లది ధృతరాష్ట్ర కూటమి. ఆ నాలుగు వేటికవే..! దేశంలో ఇప్పుడు నాలుగు అంశాలు చర్చలో ఉన్నాయి. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల డీలిమిటేషన్, లోక్సభ సీట్ల పెంపు, జమిలి ఎన్నికలపైనే అందరి దృష్టి ఉంది. మహిళా రిజర్వేషన్లు ఇప్పుడున్నది ఉన్నట్టు అమలు చేస్తే ఆరు నెలల్లో అమల్లోకి వస్తాయి. 2027 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు వర్తింపచేయొచ్చు. జనాభాను క్రమబదీ్ధకరిస్తూ ఆయా రాష్ట్రాల్లో ఇప్పుడున్న పార్లమెంటు స్థానాల పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్ కూడా ఏడాదిన్నరలో చేయొచ్చు. ఇక, లోక్సభ స్థానాల పెంపుపై కూడా ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ పెంపునకు ఎంచుకున్న విధానానికే మేం వ్యతిరేకం. విధివిధానాలు ఖరారు చేసి రాష్ట్రాల మధ్య అంతరం రాకుండా అన్ని రాజకీయ పక్షాలతో చర్చించాలి. శిఖండి రాజకీయాలు చేయొద్దు. లోక్సభలో 2/3 వంతు మెజార్టీ లేదని, రాదని తెలిసి కూడా బిల్లులు పెట్టి మా నెత్తిమీద టెంకాయలు కొడదామనుకున్నారు. బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఐదు రాష్ట్రాల ఎన్నికలు దీనికి రిఫరెండం అని చెప్పమనండి. అసలు 50 శాతం సీట్లు పెంచాలని కిషన్రెడ్డి, మోదీలకు ఏ దేవుడు చెప్పాడు. జమిలి ఎన్నికల విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. రాజ్యసభలో మాట్లాడొచ్చు కదా? బీజేపీ ఎంపీ తేజస్వీ వ్యాఖ్యలపై మా పార్టీ ఎంపీలు మాట్లాడింది బీఆర్ఎస్ వారికి కనిపించలేదా? వినిపించలేదా? మా ఎంపీలు చామల కిరణ్, కావ్య, మల్లురవి మాట్లాడారు. లోక్సభలో కుస్తీలు పట్టలేరు కదా? తేజస్వీ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎంపీలు రాజ్యసభలో మాట్లాడారు. మీ మధ్య చీకటి ఒప్పందం లేకుంటే విలీనం గురించి చర్చలు ఎందుకు చేస్తున్నారు? విలీనం గురించి కవిత చెప్పిన విషయాలపై ఎప్పుడైనా మాట్లాడారా? కేసీఆర్ మాటలు, చేతల గురించి కవిత లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పండి. మన మనిషి కాదు, మర మనిíÙ, ఆయన చుట్టూ పందికొక్కులు, దోపిడీ దొంగలున్నారన్న దానికి సమాధానం చెప్పండి. కవిత ఇంటిగుట్టు కుండబద్దలు కొట్టింది. తొలుత దానికి సమాధానం చెబితే కేసీఆర్ నిజాయితీ ఏంటో బయటపడుతుంది’ అని రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. -
వీళ్లు మాకొద్దు!
తిమ్మాపూర్: దంపతుల మధ్య విభేదాలు పిల్లలను వదిలించుకునే పరిస్థితికి వచ్చాయి. ఈ ఘటన కరీంనగర్ జిల్లా ఎల్ఎండీ పోలీస్ స్టేషన్లో జరిగింది. కరీంనగర్ కార్పొరేషన్ 8వ డివిజన్ పరిధిలోని తమిళకాలనీకి చెందిన రవికుమార్కు, నిజామాబాద్కు చెందిన లలితతో పదేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుళ్లు సంతానం. దంపతుల మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. లలిత పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. తర్వాత పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ జరిగినా సయోధ్య కుదరలేదు. రవికుమార్ ఇటీవల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు లలితను పిలిపించడంతో సోమవారం పిల్లలతో పోలీస్స్టేషన్కు వెళ్లింది. ఎస్సై అన్వర్ దంపతులకు కౌన్సెలింగ్ చేశారు. లలిత తనకు భర్త, పిల్లలు అవసరం లేదు అంటూ తాళి, మెట్టెలు తీసి టేబుల్పై పెట్టి పిల్లలను వదిలేసి వెళ్లిపోయింది. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. మొండిగా వ్యవహరించింది. రవికుమార్ కూడా తనకు భార్య, పిల్లలు అవసరం లేదని వదిలేసి వెళ్లాడు. ఠాణాలోనే ఇద్దరు గొడవ పడటం చూసి పిల్లలు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఠాణాకు వచ్చినవాళ్లు చిన్నారులను చూసి ఆందోళన చెందారు. ఎస్సై అన్వర్ చిన్నారుల నానమ్మ వివరాలు తెలుసుకొని ఆమెకు అప్పగించారు. -
పోలీసులకు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవానికి సెలవులు
సాక్షి, హైదరాబాద్: నిత్యం ఒత్తిడితో కూడిన ఉద్యోగంలో ఉండే పోలీసులకు ఊరటనిచ్చేలా తెలంగాణ పోలీస్శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సిబ్బంది వ్యక్తిగత జీవితం, ఉద్యో గం మధ్య సమ తుల్యత పెంపొందించాలనే లక్ష్యంతో వారి పుట్టిన రోజు, వివాహ వార్షి కోత్సవాల సందర్భంగా సెల వులు మంజూరు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు డీజీపీ బి.శివధర్రెడ్డి ఒక సర్క్యులర్ను విడుదల చేశారు. అందులో పేర్కొన్న ప్రకారం..పోలీస్ శాఖలో పనిచేసే సిబ్బంది అందరికీ వారి పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం రోజున కుటుంబ సభ్యులతో గడిపే అవకాశం కల్పించ డమే ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.అయితే ఇందుకు కొన్ని షరతులు ఉన్నట్టుగా సర్క్యు లర్లో తెలి పారు. ఈ సెలవులను హక్కుగా పరిగణించరాదు. అత్యవసర పరిస్థి తులు మినహా సాధ్యమైనంత వరకు మంజూరు చేయాలని యూనిట్ అధికారు లకు సూచించారు. సర్వీస్ రికార్డు ప్రకారం సరైన ధ్రువీక రణ ఉండాలి. అదేవిధంగా సెలవు కోరు తున్న సిబ్బంది ముందస్తు లిఖితపూర్వక అభ్యర్థన అవసరం. అత్యవసర పరిస్థితుల్లో సెలవు నిరాకరించే అధికారం అధికారులకు ఉంటుంది. కాగా, ఈ నిర్ణయం ద్వారా పోలీసు సిబ్బందిలో మనోధైర్యం పెంపొందడమే కాకుండా కుటుంబ బంధాలు బలపడతాయని అధికారులు భావిస్తున్నారు. -
22 మంది డీఎస్పీలు బదిలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా 22 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఈ మేర కు డీజీపీ శివధర్ రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన అధికా రు లను ఆయా యూనిట్ అధికారులు వెంటనే రిలీవ్ చేయాలని, అలాగే బదిలీ అయిన అధికారులు నూతన పోస్టింగుల్లో వెంటనే చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
డ్రగ్స్ కేసుల్లో ఎవర్నీ వదలొద్దు
సాక్షి, హైదరాబాద్: ‘మాదకద్రవ్యాలకు సంబంధించిన కేసు ల్లో ఎంత పెద్ద సెలబ్రిటీలు ఉంటే అంత వేగంగా స్పందించండి. ఈ రకమైన వ్యవహారాల్లో ఎంత పెద్ద వారున్నా, ప్రముఖులు ఉన్నా డోంట్ కేర్ ఎనీ వన్ (ఎవర్నీ ఖాతరు చేయకండి).. డోంట్ స్పేర్ ఎనీ వన్ (ఎవర్నీ వదిలిపెట్టకండి). సామాన్యులు వెయ్యి మందిని అరెస్టు చేయడం కన్నా ప్రముఖులు ఇద్దరిని జైల్లో వేస్తే ప్రజలకు బలమైన సందేశం ఇచ్చినట్లు అవుతుంది..’ అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. హైదరాబాద్ పోలీసు విభాగం కొత్తగా అమల్లోకి తీసుకు వచ్చిన ‘స్పందన’ బృందాలను సీఎం సోమవారం బంజారాహిల్స్లోని ఐసీసీసీ వద్ద ప్రారంభించి మాట్లాడారు.మహిళల భద్రతకు పెద్దపీట వేస్తే అభివృద్ధి: ‘వివిధ కేసుల్లో బాధిత మహిళలు, చిన్నారులకు సహాయ సహకారాలు అందించడానికి హైదరాబాద్ నగర పోలీసులు ఈ స్పందన బృందాలను ఏర్పాటు చేశారు. నేరగాళ్ల గుర్తింపు, వారికి శిక్ష పడేలా చేయడం కాలక్రమంలో జరిగినా.. బాధితులకు తక్షణ భద్రత కల్పించడానికి ఈ బృందాలు పని చేస్తాయి. మహిళా భద్రతకు సంబంధించిన ప్రతి కార్యక్రమానికీ నేను వస్తున్నానంటే..అది మహిళల భద్రతకు ప్రభుత్వం ఎంత ప్రాధాన్యం ఇస్తోందనే సందేశం, ఆదేశం అన్ని స్థాయిల అధికారులకు ఇవ్వడమే.ఏ దేశంలో మహిళల భద్రతకు పెద్దపీట వేస్తారో ఆయా దేశాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. తొలి ప్రధాని నెహ్రూ దేశ అభివృద్ధిలో మహిళలకు కీలక ప్రాధాన్యం ఇచ్చారు. అమెరికాకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అక్కడి మహిళలు ఓటు హక్కు సాధించుకోవడానికి 150 ఏళ్లు పట్టింది. కానీ మన దేశంలో రాజ్యాంగంలోనే మహిళలకు ఓటుహక్కు సంబంధిత అంశాలన్నీ పొందుపరిచాం. విద్యా, ఉద్యోగాలతో పాటు చట్ట సభల్లోనూ వారికి రిజర్వేషన్లు కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ 2013 లోనే బిల్లు ప్రవేశపెట్టింది..’ అని రేవంత్ చెప్పారు. పీస్ కమిటీలకు డ్రగ్స్ నియంత్రణ బాధ్యతలు: మత కలహాల సమయంలో పోలీసులకు సహకరించడానికి పీస్ కమిటీలు ఏర్పాటు చేశారు. అవి అద్భుతమైన పనితీరుతో పోలీసులకు చేదోడువాదోడుగా నిలిచాయి. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేకపోవడంతో వీరికి చేతి నిండా పని లేకుండా పోయింది. దీంతో వీరిని డ్రగ్స్, గంజాయి నియంత్రణకు వినియోగించుకోవాలని పోలీసు విభాగాన్ని ఆదేశిస్తున్నా. ఆయా ప్రాంతాల్లో జరిగే అంశాలపై సమాచారం సేకరణ, కొన్ని నిర్ణయాలను అమలు చేయడానికీ వీరి సహాయం తీసుకోండి. డీసీపీ, ఏసీపీ స్థాయిల్లో సమన్వయ సమావేశాలు పెట్టి ముందుకు వెళ్లండి. మహిళలపై జరిగే దారుణమైన నేరాల్లో అనేకం డ్రగ్స్, గంజాయి మత్తులో జరిగేవే. రాష్ట్రం నుంచి డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టాలి.దీనికోసమే ఈగల్ ఫోర్స్ ఏర్పాటు చేశాం. ఇటీవల అనేక మంది ప్రముఖులు, ప్రజా ప్రతినిధులను కూడా అరెస్టు చేశాం. ఈ అంశంలో తల్లిదండ్రుల సహకారం కూడా కావాలి. పాఠశాలల్లో అడ్మిషన్ సమయంలోనే ఎలాంటి డ్రగ్స్ తదితరాలను తీసుకోమనే అండర్టేకింగ్ ఇచ్చేలా అప్లికేషన్లో కాలమ్ ఉండాలని ఇటీవల గవర్నర్ సూచించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమలు చేస్తాం. రాష్ట్రంలో పెద్ద ఎత్తున రీహ్యాబ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం..’ అని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, ఎంపీలు వేం నరేందర్రెడ్డి, అనిల్కుమార్ యాదవ్, డీజీపీ బి.శివధర్రెడ్డి, నగర కొత్వాల్ వీసీ సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆమె కూడా మృతి
ఖమ్మం క్రైం: ఖమ్మం జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి భర్త, పెద్ద కుమార్తె అనుమానాస్పద మృతి కేసులో ఏకైక సాక్ష్యంగా ఉన్న భార్య కూడా మృతి చెందింది. ఖమ్మంలోని నివాసంలో కణతాల రాము, ఆయన పెద్దకుమార్తె దివ్యనైని మృతదేహాలను ఆదివారం రాత్రి గుర్తించగా అపస్మారక స్థితిలో ఉన్న ఆయన భార్య రమ్య, చిన్నకుమార్తె దీక్షిత ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటం తెలిసిందే. భర్త, పెద్ద కుమార్తె మృతదేహాలతో మూడు రోజులుగా ఇంట్లోనే ఉన్న రమ్య.. చిన్నకుమార్తెను సైతం హత్య చేయడానికి ప్రయత్నించినట్లు సమాచారం.ఈ ఘటనలను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు రమ్య కూడా కొద్ది మోతాదులో పురుగుల మందు తాగినట్లు తెలిసింది. దీంతో ఖమ్మం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను ఏసీపీ రమణమూర్తి, టూటౌన్ సీఐ బాలకృష్ణ విచారించగా పొంతనలేని సమాధానాలు చెప్పగా ఏదో విషయాన్ని దాస్తోందని వారు గుర్తించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి రమ్య పరిస్థితి విషమించి మృతి చెందింది.దీంతో చిన్న కుమార్తె మాత్రమే మిగిలినట్లయింది. ఈ మరణాలపై రాము సోదరుడు ఉపేందర్ ఫిర్యాదుతో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. రాము, దివ్యనైని శరీరంపై బలమైన గాయాలు ఉండటంతో రమ్యకు ఇంకెవరైనా సహకరించారా అనే కోణంలోనూ విచారణ చేపట్టారు. మరోవైపు నేలకొండపల్లి మండలం కోనాయిగూడెంలో కణతాల రాము, ఆయన కుమార్తె దివ్యనైని అంత్యక్రియలను బంధువులు సోమవారం నిర్వహించారు. -
ప్రేమ విఫలమైందని ఒంటికి నిప్పంటించుకున్న విద్యార్థి
లాలాపేట: ప్రేమలో విఫలమయ్యానన్న బాధతో ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఓయూ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్బాబాద్ జిల్లా గూడూరు మండలం గోవిందాపురం తండాకు చెందిన బోడ వినీష్కుమార్ (19) ఓయూ ఇంజనీరింగ్ కాలేజీలో బీఈ (మైనింగ్ ఇంజనీరింగ్) ఫస్టియర్ చదువుతున్నాడు. ఓయూ క్యాంపస్లోని హాస్టల్లో ఉంటున్నాడు.సోమవారం ఉదయం 9:30 గంటల సమయంలో క్యాంపస్లోని ఎల్లమ్మ దేవాలయం వద్ద ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. గమనించిన ఉమెన్స్ హాస్టల్ గార్డు స్థానికులను అప్రమత్తం చేయగా వారు మంటలు ఆర్పి వినీష్కుమార్ను 108 అంబులెన్స్ ద్వారా గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఘటనాస్థలిలో లభించిన సూసైడ్ నోట్ ఆధారంగా వినీష్కుమార్ తన క్లాస్మేట్తో ప్రేమ విఫలమై ఆత్మహత్యాయత్నం చేసినట్లు తేల్చారు. ప్రస్తుతం 70 శాతం కాలిన గాయాలతో వినీష్కుమార్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కాగా, వినీష్కుమార్ 3 నెలల నుంచి కాలేజీకి రావట్లేదని వర్సిటీ అధికారులు పేర్కొన్నారు. -
అమ్మను చంపి.. ఆపై ఉరివేసి..
తాండూరు రూరల్: మద్యం తాగేందుకు రూ.100 ఇవ్వలేదని ఆగ్రహానికి లోనైన కొడుకు కర్రతో కన్నతల్లిపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన తల్లి మృతిచెందడంతో, ఆమె శవాన్ని దూలానికి వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. కరన్కోట్ ఎస్ఐ వినోద్ వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం ఎల్మకన్నె గ్రామానికి చెందిన రుకియాబేగం (50)కు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు. అందరికీ వివాహాలు అయ్యాయి. రుకియాబేగం తాండూరు పట్టణంలోని ఓ హోటల్లో కూలి పనులు చేస్తూ జీవిస్తోంది.పెద్ద కుమారుడు మహబూబ్ సెంట్రింగ్ పనిచేస్తుంటాడు. మద్యానికి బానిసైన ఇతను ఆదివారం రాత్రి 9 గంటలకు గ్రామంలోని తల్లి వద్దకు వెళ్లి రూ.100 ఇవ్వమని అడిగాడు. ఇందుకు ఆమె నిరాకరించడంతో ఆగ్రహంతో తల, మెడ భాగంలో విచక్షణా రహితంగా కర్రతో దాడి చేశాడు. దీంతో రుకియాబేగం అక్కడికక్కడే మృతిచెందింది.తనపై కేసు అవుతుందని భయపడిన నిందితుడు ఓ చీర తీసుకుని తల్లి మెడకు కట్టి ఇంట్లోని దూలానికి వేలాడదీశాడు. సోమవారం ఉదయాన్నే తన తల్లి ఆత్మహత్య చేసుకుందని గ్రామస్తులు, బంధువులకు చెప్పాడు. సోదరి మునీరాబేగం వచ్చి పరిశీలించగా తల్లి ఒంటిపై గాయాలు కనిపించడంతో బంధువుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. -
‘కేసీఆర్ నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలి’
హనుమకొండ: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ కడియం కావ్య మండిపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికాదని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రజాప్రతినిధులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని స్పష్టం చేశారు.తెలంగాణ విభజన అంశంపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలను తాను పార్లమెంట్లోనే ఖండించినట్లు కడియం కావ్య గుర్తుచేశారు. ఒక తెలంగాణ ఎంపీగా, తెలంగాణ ఆడబిడ్డగా అవి అనుచిత వ్యాఖ్యలని నిలదీశానని తెలిపారు. అలాగే పార్లమెంట్ నుంచి ఆ వ్యాఖ్యలను తొలగించాలని కూడా డిమాండ్ చేసినట్లు చెప్పారు.ఈ అంశంపై కాంగ్రెస్ ఎంపీలు ముక్తకంఠంతో ఖండించడంతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా క్షమాపణలు చెప్పిన విషయాన్ని ఎంపీ ప్రస్తావించారు. ఈ పరిణామాలన్నీ మాజీ సీఎం కేసీఆర్ దృష్టికి చేరలేదని, లేదా ఆయన పూర్తిస్థాయి సమాచారం తెలుసుకోలేదని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.నిజానిజాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని కేసీఆర్కు కావ్య సూచించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించే వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని అభిప్రాయపడ్డారు.తెలంగాణ అభివృద్ధికి సంబంధించి నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఉంటే మాజీ సీఎం కేసీఆర్ ఇవ్వాలని కోరుతూ, ప్రజా సమస్యలపై చర్చలు జరపడం ద్వారా రాష్ట్రానికి మేలు చేకూరుతుందని కడియం కావ్య పేర్కొన్నారు. -
ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నా ఇందిరమ్మ ఇల్లు
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్లకు గతంలో దరఖాస్తు చేసుకోలేకపోయిన అర్హులైన నిరుపేదలు ఎప్పుడు దరఖాస్తు చేసుకున్నా వారికి ఇళ్లు మంజూరు చేసేందుకు సిద్ధమని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. అర్హులకు ఇళ్లు మంజూరు చేయటమనేది నిరంతర ప్రక్రియ అని ఆయన చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం మరింత వేగంగా జరిగేందుకు వీలుగా అధికార వికేంద్రీకరణతో జిల్లా కలెక్టర్లకు మరిన్ని అధికారాలు అప్పగిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకోవడంతోపాటు పనుల పురోగతిలో సమస్యలు రాకుండా చూడటానికి ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తున్నట్లు తెలిపారు.ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల ఇందిరమ్మ, రెవెన్యూ అంశాలపై ఇన్చార్జి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, గృహనిర్మాణ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి పొంగులేటి లోతైన సమీక్ష నిర్వహించారు. ఇళ్లు మంజూరై వివిధ కారణాలతో నిర్మాణా నికి సిద్ధంకాని వారు.. తమకు ఇల్లు అవసరం లేదని తెలిపితే వారి స్థానంలో ఇతర అర్హులకు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. వివిధ సాంకేతిక కారణాలతో బిల్లులు రానివారికి తక్షణమే విడుదల చేయాలన్నారు.గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్రూం ఇళ్లను పూర్తి చేయడంతోపాటు ఆయా కాలనీల్లో మౌలికవసతులు కల్పించాలని చెప్పారు. ఇంటి బేస్మెంట్ నిర్మాణం పూర్తయిన ఇళ్లకు రూ. లక్ష మంజురు చేశాక.. సాంకేతిక కారణాలతో బిల్లులు రాని వారికి తక్షణమే విడుదల చేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్రూం ఇళ్లను పూర్తి చేయాలని.. మౌలికవసతులు కల్పించి తక్షణమే లబ్ధిదారులకు కేటాయించాలన్నారు.భూ సర్వేతోనే వివాదాలకు శాశ్వత పరిష్కారం...భూ సర్వేతోనే భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి పొంగులేటి తెలిపారు. రాష్ట్రంలోని ఐదు మండలాల్లో ప్రయోగాత్మకంగా సర్వే మ్యాపుతో రిజిస్ట్రేషన్ చేస్తున్నామని.. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక సర్వే మ్యాపు నంబర్, భూధార్ నంబర్ కేటాయిస్తు న్నామని తెలిపారు. సాదాబైనామాలకు సంబంధించి వీలైనంత త్వరగా దరఖాస్తులను పరిష్క రిస్తామని వివరించారు. కొనుగోలుదారుడు ఒక్కడే డిక్లరేషన్ ఇస్తే సరిపోతుందని.. దరఖా స్తుల పరిష్కారం వేగవంతానికి ఆర్డీవోలకే అధికారాలు కల్పించినట్లు చెప్పారు.రాష్ట్రవ్యాప్తంగా దశల వారీగా తహసీల్దార్ కార్యాలయాలను నిర్మిస్తామని.. తొలివిడతలో శిథిలావస్థకు చేరిన చోట నిర్మిస్తామన్నారు. దశాబ్దాల నుంచి రెవెన్యూ, ఫారెస్టు, ఎండోమెంట్, వక్ఫ్ భూముల మధ్య సరిహద్దు వివాదాలున్నాయని.. ఉమ్మడి సర్వే నిర్వహించి ఆయా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఈ సమావేశాల్లో నిజామాబాద్ ఇన్చార్జి మంత్రి సీతక్క, ఆదిలాబాద్ ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి వివేక్, ప్రభుత్వ సలహాదారులు పి.సుదర్శన్రెడ్డి, పోచారం శ్రీనివా స్రెడ్డి, మహ్మద్ షబ్బీర్ అలీ, జిల్లా ఎంపీలు, ఎమ్మె ల్సీలు, ఎమ్మెల్యేలు, రెవెన్యూ కార్యదర్శి డి.ఎస్. లోకేశ్ కుమార్, గృహనిర్మాణ శాఖ కార్యదర్శి గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. -
కవిత పార్టీపై కేటీఆర్ స్పందన
హైదరాబాద్: కొత్తగా వచ్చే పార్టీలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణలో ఎన్నో పార్టీలు వచ్చాయి.. పోయాయి అంటూ కేటీఆర్ తనదైన శైలిలో పేర్కొన్నారు. కవిత పెట్టిన తెలంగాణ రాష్ట్ర సేన(టీఆర్ఎస్) గురించి మీడియా అడిగిన ప్రశ్నకు కేటీఆర్ స్పందిస్తూ.. పైవిధంగా పేర్కొన్నారు. ఈరోజు(సోమవారం, ఏప్రిల్ 27వ తేదీ) తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘ తెలంగాణలో కనీస మద్దతు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ సంక్షోభంపై బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో చర్చించాం. రైతుల పక్షాన నిలబడాలని నిర్ణయించాం’ అని తెలిపారు.‘బీజేపీ ఎంపీ తేజస్వి తెలంగాణను అవమానిస్తే కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడలేదు. మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంది. లోక్సభలో బీఆర్ఎస్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. లోక్సభలో బీఆర్ఎస్ ఉండి ఉంటే తేజస్వితో క్షమాపణలు చెప్పించేవాళ్లం’ అని పేర్కొన్నారు. -
సిట్టింగ్ ఎమ్మెల్యేలు అని కూడా చూడను: కేసీఆర్ ఆగ్రహం
హైదరాబాద్: బీఆర్ఎస్ సీనియర్ నేతలపై, సిట్టింగ్ ఎమ్మెల్యేలపై పార్టీ అధినేత కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఇంకా బీఎల్ఓ జాబితాను బీఆర్ఎస్ నేతలు సిద్ధం చేయకపోవడంపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. 31 నియోజకవర్గాల నుంచి జాబితా రాలేదని, సభ్యత్వ నమోదులో చురుగ్గా లేకుంటే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు కేసీఆర్. ఈరోజు(సోమవారం, ఏప్రిల్ 27వ తేదీ) తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బీఆర్ఎస్ ప్రతినిధులు హాజరయ్యారు. దీనిలో భాగంగా ఎస్ఐఆర్ ప్రక్రియపై బీఎల్ఓ జాబితాను కేసీఆర్ ప్రస్తావించారు. దీనికి బీఆర్ఎస్ నేతల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘15రోజుల్లో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరగాలి. టికెట్ కేటాయింపులకు సభ్యత్వ నమోదు ప్రామాణికం. సోషల్ మీడియాలో యాక్టివ్గా కాదు.. ఫీల్డ్లో యాక్టివ్గా ఉండాలి. సభ్యత్వ నమోదును పట్టించుకోకుంటే సీరియస్ యాక్షన్ ఉంటుంది,. సిట్టింగ్ ఎమ్మెల్యేలు అని కూడా చూడను.. టికెట్ ఇవ్వను. నేను ఒకసారి చెబితే.. వెయ్యి సార్లు చెప్పినట్లే’ అని హెచ్చరించారు. -
రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం
సాక్షి,హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. క్రేన్ కింద పడి ముగ్గురు కార్మికులు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. శంకర్ పల్లి మండలం, మహాలింగాపురంలో ఎన్సీసీ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఘటన చోటు చేసుకుంది. భారీ ఈదురు గాలులకు క్రేన్ కింద పడింది. క్రేన్ కిందపడి ముగ్గురు కార్మికులు మరణించారు. పదిమందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలంలో సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. గాయపడిన క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. -
Hyd: అంబర్పేట కార్ల షోరూమ్లో అగ్ని ప్రమాదం
హైదరాబాద్: నగరంలోని అంబర్పేటలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం( ఏప్రిల్ 27వ తేదీ) మధ్యాహ్న సమయంలో అంబర్పేటలోని మహేంద్ర, రెనాల్ట్ కార్ల షోరూమ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. కార్ల షోరూమ్లో మంటలు ఎగిసిపడుతూ ఉండటంతో చుట్టు పక్కల అంతటా పొగ భారీగా కమ్ముకుంది. ఈ అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. రెండు ఫైరింజన్లతో అక్కడకు చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది భారీగా ఎగిసిపడుతున్న అదుపులోకి తెచ్చే యత్నం చేస్తున్నారు. పొగ భారీగా వ్యాపించడంతో చుట్టుపక్కల నివాసాల వారిని ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. కార్ల పార్క్ చేసిన చోట ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. వాహనాలు పార్క్ చేసిన చోట అగ్ని ప్రమాదం జరగ్గా, ఆ మంటలు వేగంగా అన్ని కార్లకు వ్యాపించాయి. నిమిషాల వ్యవధిలోనే ప్రమాద తీవ్రత పెరిగినట్లు చెబుతున్నారు. -
కవిత కొత్త పార్టీపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్ : కొత్త పార్టీని పక్కన పెట్టండి. ఉన్న పార్టీ ఉంటుందో.. ఊడుతుందో. బీఆర్ఎస్కు గతం ఉంది.. భవిష్యత్తు లేదు. కేసీఆర్ నా రాజకీయ ప్రత్యర్థి.. నాకు శత్రువు కాదు’ అని అన్నారు సీఎం రేవంత్రెడ్డి. రాష్ట్రంలో ఇటీవల రాజకీయ పరిణామాలపై ఆయన సోమవారం మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఆ చిట్చాట్లో మాజీ ఎమ్మెల్సీ కవిత ఏర్పాటు చేసిన కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్), బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్పై సీఎం రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కొత్త పార్టీ పక్కన పెడితే.. ఉన్న పార్టీ ఉంటుందో.. ఊడుతుందో. బీఆర్ఎస్కు గతం ఉంది. భవిష్యత్తు లేదు. ఇప్పుడు ఎలిమినేషన్ ప్రాసెస్ నడుస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నా రాజకీయ ప్రత్యర్ధి. శత్రువు కాదు’ అని వ్యాఖ్యానించారు. ప్రతి పనికి పర్సస్ ఉంటుంది.. పర్పస్ అయిపోయాక దాంతో పనేముండదు. కేసీఆర్ పార్టీ మనుగడ ముగిసింది. చనిపోయిన శవానికి ఎంత అలంకరణ చేసినా మనిషి లేచి రాడు. బీఆర్ఎస్ పార్టీ చనిపోయిన శవంతో సమానం. బీఆర్ఎస్కు గతం ఉంది.. భవిష్యత్ లేదు.. ఉండదు. తెలంగాణ ఉద్యమంలో ఏం చేసినా చెల్లింది. దాడులు చేసినా, అవమానించినా పడ్డారు.. ఇప్పుడు కూడా అలా ఉంటామంటే కుదరదు. పదేళ్ల అధికారంలో ఆహంభావం, అధికారం తలకెక్కింది.అహంకారం పెరగడంతో 2023లో బీఆర్ఎస్ను ఓడగొట్టారు. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చారు. కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్తో ప్రజలకు సంబంధాలు తెగిపోయాయి. ఇప్పుడు పడే తాపత్రయం అంతా కుటుంబం కోసమే. కుటుంబ పంచాయితీల్లో వచ్చిన కొత్త సంస్థలను మాపై రుద్దకండి. ఒక్క చెరువు నుంచి వచ్చిన నీటికి రంగు రుచి మారదు. కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదు అనగానే పరామర్శించా. అసెంబ్లీకి కేసీఆర్ వస్తే యోగక్షేమాలు కనుక్కున్నది నేను. హిందూ సమాజంలో కుటుంబ పెద్ద చనిపోతే వారసులకు వారసత్వం వస్తుంది. ఔరంగజేబు వారసత్వం కోసమే అందరినీ చంపేశాడు. ఒకరు చనిపోవాలని నేను ఎందుకు కోరుకుంటా. వాళ్లు చనిపోతే ఆ పార్టీ, ఆపార్టీ ఆస్తులు నాకు రావు. కేసీఆర్ నా రాజకీయ ప్రత్యర్థి. నాకు శత్రువు కాదు. 2023 నుంచి అన్నీ ఎన్నికల్లో కేసీఆర్ను ఓడించాను. కేసీఆర్ మీద నాకు గెలుపు కొత్తకాదు’అని అన్నారు. -
తెలంగాణ భవన్కు మాజీ సీఎం కేసీఆర్
హైదరాబాద్: బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో భాగంగా పార్టీ అధినేత కేసీఆర్.. తెలంగాణ భవన్కు చేరుకున్నారు. అంతకుముందు ఎర్రవల్లి ఫాంహౌస్ నుంచి నందినగర్ నివాసానికి చేరుకున్న కేసీఆర్.. బీఆర్ఆర్ పార్టీ సెక్రటరీ జనరల్ జీవన్రెడ్డితో కలిసి లంచ్ చేశారు. అనంతరం జీవన్రెడ్డితో కలిసి తెలంగాణ భవన్కు చేరుకన్నారు కేసీఆర్. తెలంగాణ భవన్కు చేరుకున్న మాజీ సీఎం కేసీఆర్.. తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించారు. కాసేపట్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభం కానుంది. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు కేసీఆర్. -
హైదరాబాద్లో మహిళలకు రక్షణ ఉండదా?
సాక్షి, హైదరాబాద్: ‘‘మహిళలకు ఈ నగరం ఎంతో సురక్షితమనుకున్నా. కానీ, అది నిజం కాదని ఇవాళే తెలిసింది’’ అంటూ ఓ యువతి విడుదల చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఉదయాన్నే రన్నింగ్కు వెళ్లిన తనకు ఎదురైన భయానక అనుభవాన్ని ఆమె ఆ వీడియోలో పంచుకుంది. హైదరాబాద్ సైకిల్ ట్రాక్లో ఓ మహిళా రన్నర్కు వేధింపులు ఎదరయ్యాయి. ఓ వ్యక్తి ఆమెను వెంబడిస్తూ జుగుప్సాకరంగా వ్యవహరించబోయాడు. అయితే అప్రమత్తమైన ఆ యువతి అతన్ని వీడియో తీయబోగా.. నిక్కరు వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తన దుస్తుల్ని చూపిస్తూ.. ఇది హైదరాబాద్! మహిళలకు సురక్షితంగా ఉండకూడదా?. సూర్యోదయం కంటే ముందు నేను ఎప్పుడూ రన్నింగ్కు రాలేదు. ఎప్పుడూ సూర్యోదయం తర్వాతే వస్తా.. రన్నింగ్ దుస్తుల్లో వస్తే ఆటోవాలాలు, బైక్ రైడర్లూ తేడా చూపులు చూస్తారు. ఆఖరికి ఐదు పదుల వయసున్న అంకుల్స్ కూడా అందుకు మినహాయింపేం కాదని ఆమె వ్యాఖ్యానించింది. భయంతో, బాధతో ఆ యువతి చేసిన వీడియో సోషల్ మీడియాకు చేరింది. పలువురు ఆమెకు మద్ధతుగా పోలీసు వ్యవస్థను నిందిస్తున్నారు. సైకిల్ ట్రాక్పై పోలీసుల గస్తీ ఏమైందని ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియో విపరీతంగా వైరల్ కావడంతో.. ఆ వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం. This Is Hyderabad! Isn’t This Supposed To Be Safe?? A very agitated runner was seen asking in this video. She was running on the Hyderabad Cycle Track at 6am and a random sicko was behaving disgustingly. So, so, so…horrible!! Yes! Hyderabad is supposed to be a safe space… pic.twitter.com/TblHVLAM37— Revathi (@revathitweets) April 27, 2026 -
కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: భారతదేశ రాజకీయ చరిత్రలోనే పాతిక వసంతాలు పూర్తి చేసుకున్న పార్టీలు కొన్ని మాత్రమేనని.. అందులో భారత రాష్ట్ర సమితి ఒకటని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం తెలంగాణ భవన్లో జెండా ఎగరేసిన ఆయన.. అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘14 ఏళ్ల పాటు తెలంగాణ కోసం కేసీఆర్ పోరాటం చేసి తెలంగాణ సాధించారు. ఢిల్లీ మెడలు వంచిన పార్టీ బీఆర్ఎస్. గత రెండున్నరేళ్లుగా దుర్మార్గపు పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. తెలంగాణను మళ్లీ గాడిన పెట్టేందుకు పోరాడతాం. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ పునరంకితం అవుతుంది. కేసీఆర్ సైనికులుగా బలగంగ కలిసికట్టుగా కదం తొక్కుతాం. ‘‘మరికాసేపట్లో తెలంగాణ భవన్కు కేసీఆర్ రానున్నారు. నేతలకు దిశ నిర్దేశం చేస్తారు’’ అని కేటీఆర్ తెలిపారు. అదే సమయంలో టీఆర్ఎస్ అధినేత్రి కవిత చేసిన వ్యాఖ్యలపై మాట్లాడేందుకు ఆయన విముఖత ప్రదర్శించారు.నెత్తురు మండి ఒక జాతి ఎత్తిన జెండా…పాతికేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న పునరంకిత సందర్భం!స్వీయ రాజకీయ అస్తిత్వ పతాకం రెపరెపలాడుతూ ..సిల్వర్ జూబ్లీ ముగింపు వేడుకును జరుపుకుంటున్న సన్నివేశం!25 వసంతాల మైలురాయిని అధిగమించిన మహోజ్వల లాంగ్ మార్చ్!బీఆర్ఎస్ రాజకీయ… pic.twitter.com/1vrQbOtCqL— KTR (@KTRBRS) April 27, 2026 -
మనవళ్లతో ఆడుకోవాల్సిన వయసులో.. గర్భం దాల్చింది
సిద్దిపేట జిల్లా: శిశువు మరణానికి కారణమైన దంపతులతో పాటు వారికి సహకరించిన ఆర్ఎంపీని రిమాండ్కు పంపించారు. శనివారం హుస్నాబాద్ ఏసీపీ సదానందం, సీఐ శ్రీను కేసు వివరాలు వెల్లడించారు. 2025, జులై 29న మండల పరిధిలోని కేశనాయక్ తండా శివారులోని వాగులో గుర్తు తెలియని పసికందు శవం నీటి ప్రవాహంలో కొట్టుకొచ్చిందని పంచాయతీ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అక్కన్నపేట ఎస్ఐ సీహెచ్ ప్రశాంత్, హుస్నాబాద్ సీఐ శ్రీను విచారణ చేపట్టారు. తండాకు చెందిన బానోతు లక్ష్మికి లేటు వయస్సులో ప్రెగ్నెన్సీ రాగా అప్పటికే ఆమె కూతుర్లకు పెళ్లి కావడంతో విషయం బయటకు తెలిస్తే పరువుపోతుందనే భయంతో దంపతులు ఎవరికి తెలియకుండా అబార్షన్ చేసుకోవాలనుకున్నారు. అయితే కుందానవానిపల్లికి చెందిన ఆర్ఎంపీ వంశీ సహకారంతో అబార్షన్ టాబ్లెట్స్ వేసుకోగా బతికి ఉన్న శిశువు జన్మించింది. కాగా గ్రామంలో తెలిస్తే పరువుపోతుందనే భయంతో శిశువును ఎవరికి తెలియకుండా రహస్యంగా చంపాలని నిర్ణయించుకున్నారు. దీంతో వారి ఇంటి సమీపంలోని కాలువలో పడేయగా శిశువు నీటి ప్రవాహంలో మునిగి చనిపోయినట్టు విచారణలో నిర్దారణ అయిందని తెలిపారు. ఈ కేసులో చనిపోయిన శిశువు మరణానికి కారణమైన తల్లిదండ్రులు బానోతు లక్ష్మి, రాజు, ఆర్ఎంపీ వంశీలను అరెస్ట్ చేశారు. -
తల్లి కుట్ర: చిన్న కొడుకుతో పెద్ద కొడుకు హత్యకు ప్లాన్
మంథనిరూరల్: కన్న కొడుకునే మరోకొడుకుతో అంతం చేయాలని చూసిందో తల్లి.. అర్ధ రాత్రి నిద్రిస్తున్న అన్నపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసేందుకు యత్నించిన ఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలం లక్కేపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. మంథని మండలం లక్కేపూర్ గ్రామానికి చెందిన కొత్త రఘుపై అతడి తమ్ముడు అనిల్ పెట్రోల్ పోసి నిప్పంటించగా తీవ్రగాయాలు కావడంతో ఎంజీఎంకు తరలించారు. బాధితుడి సోదరి పాలడుగు సౌజన్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం ప్రకారం.. రఘు తండ్రి 15ఏళ్లక్రితం చనిపోయాడు. తల్లి జ్యోతి తన తమ్ముళ్లతో కలిసి గ్రామంలోనే ఉంటున్నారు. తల్లి ప్రవర్తన బాగా లేకపోవడంతో తరచూ పెద్ద తమ్ముడు గొడవ పడుతుండేవాడు. శుక్రవారం రాత్రి సైతం గొడవ జరగడంతో తనకు అడ్డుగా వస్తున్నాడని భావించిన తల్లి.. తన చిన్న కొడుకుతో పెద్ద కొడుకును చంపాలని పథకం వేసింది. ఈ క్రమంలో అంతకుముందే తెచ్చుకున్న పెట్రోల్ను నిద్రిస్తున్న రఘుపై పోసి నిప్పంటించాడు. మంటల తీవ్రతకు అరవడంతో స్థానికులు గమనించి వెంటనే కరీంనగర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. విచారణ జరిపి తన పెద్ద తమ్ముడిపై హత్యాయత్నం చేసి చిన్నతమ్ముడు అనిల్, తల్లి జ్యోతిపై తగిన చర్యలు తీసుకోవాలని సౌజన్య తన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్నట్లు మంథని పోలీసులు తెలిపారు. -
ఇంట్లోకెళ్ళి బలవంతంగా మహిళపై ఎస్సై లైంగికదాడి..!
చిగురుమామిడి పోలీస్స్టేషన్లో పనిచేసిన హెడ్ కానిస్టేబుల్ నీలం రామ్మోహన్ సొంతశాఖ ఉద్యోగులకు అందాల్సిన జీతాలను కాజేశాడు. ఈ ప్రక్రియకు కరీంనగర్ కమిషనరేట్ ఏవోస్థాయి అధికారి సహకరించడంతో రూ.కోట్లలో దండుకున్నారు. ఈ వ్యవహారంలో మొత్తం ఐదుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను జైలుకు పంపారు.జమ్మికుంట పోలీసుస్టేషన్ ఎస్సైగా ఇటీవల బాధ్యతలు తీసుకున్న కదిరె శ్రీకాంత్ ఓ మహిళను వేధించిన కేసులో చిక్కుకున్నాడు. శ్రీకాంత్కు ఫేస్బుక్లో పరిచయమైన ఓ వివాహిత ఇంటికి వెళ్లి లైంగికదాడికి పాల్పడ్డట్టు ఆరోపణలొచ్చాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈనెల 15న వరంగల్ కమిషనరేట్ పరిధిలోని సుబేదారి పోలీసుస్టేషన్లో శ్రీకాంత్పై కేసు నమోదైంది.వీణవంక పోలీస్స్టేషన్ పరిధిలో ఇసుక రవాణా ఎక్కువగా జరుగుతుంటుంది. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారినుంచి మామూళ్లు వసూలు చేయడంతో పాటు సివిల్ వివాదాల్లో తలదూర్చిన ఆరోపణలతో ముగ్గురు కానిస్టేబుళ్లపై ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు.కరీంనగర్ క్రైం: చట్టాన్ని కాపాడాల్సిన కొందరు పోలీసులు అడ్డదార్లు తొక్కుతున్నారు. ప్రజలకు రక్షణగా నిలవాల్సిన ఖాకీలు భక్షకులుగా మారుతున్నారు. న్యాయం కోసం పోలీసు స్టేషన్కు వెళ్లే బాధితులకు అక్కడి సిబ్బంది చేయి తడపనిదే పని జరగక పోగా.. ఇదేంది సారూ అని అడిగితే జులుం ప్రదర్శించడం పలువురు సిబ్బంది వంతవుతోంది. ఇటీవల కాలంలో కరీంనగర్ పోలీసు కమిషనరేట్ వరుస వివాదాలకు నెలవుగా మారుతుండగా, ఎస్సై నుంచి కానిస్టేబుల్ వరకు కొందరు చిక్కుల్లో పడుతున్నారు. ఈ ఒక్క నెలలో మూడు ఘటనలు జరగడం కలంకంగా మారాయి.రాజకీయ పలుకుబడితో..పలువురు సిబ్బంది రాజకీయ పలుకుబడితో వారికి నచ్చిన పోలీసు స్టేషన్లో పోస్టింగ్లు తెచ్చుకొని, ఉన్నతాధికారులు అంటే భయం లేకుండా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓ వైపు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నా.. పోలీసుశాఖలో అంతర్గత పర్యవేక్షణ వ్యవస్థ బలహీనపడిందా? లేక క్రమశిక్షణ లోపించిందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా పలువురు సిబ్బంది సివిల్ వివాదాల్లో తలదూర్చుతూ, ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. వివిధ కేసుల్లో స్టేషన్ బెయిల్ విషయంలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, ఇసుక వనరులు ఉన్నచోట్ల వసూళ్ల పర్వానికి తెరతీస్తున్నారని చెబుకుంటున్నారు. పోలీసుశాఖలో ఎక్కడ ఏంజరిగినా క్షణాల్లో తెలుసుకునే ఎస్బీ విభాగం ఏంపనిచేస్తుందనే విమర్శలు వస్తున్నాయి. ప్రజలకు రక్షణగా నిలవాలి్సనవారు అడ్డదారిలో వెళ్తే, అలాంటివారిపై వ్యవస్థలో పారదర్శకతను పెంచేలా చర్యలు చేపట్టా ల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. పోలీసు వ్యవస్థపై ప్రజా విశ్వాసాన్ని దెబ్బతీసే ఘటనలు పోలీసుశాఖలో పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. -
కోతులు వర్సెస్ కుక్కలు భీకర ఘర్షణ
పావు గంట సేపు కొట్లాట.. స్థానికుల బెంబేలు వరంగల్లోని 14వ డివిజన్ న్యూ లక్ష్మీ గణపతి కాలనీలో శనివారం ఉదయం ఇళ్ల నడుమ కోతులు, కుక్కల గుంపు కాళ్లు దువ్వుకున్నాయి. పదుల సంఖ్యలో చేరిన ఇరు జాతులు కొట్లాటకు దిగాయి. సుమారు పావుగంటపాటు వీటి ఆగ్రహావేశాలను చూసిన స్థానికులు ఇళ్లకు తలుపులు బిగించుకున్నారు. వీటి బారిన పడి మనుషులు గాయాలపాలవుతున్నా కార్పొరేషన్ అధికారులు కనికరం చూపడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తల్లడిల్లిన గోమాతప్లాస్టిక్ వ్యర్థాలు తినడంతో రెండు గంటలు నరకయాతనహనుమకొండ బస్టాండ్ సమీపంలో ఓ సూడి ఆవు రెండు గంటలు నరకయాతన పడింది. ఆ బాధ చూడలేక ఓ సెక్యూరిటీ గార్డు డయల్ 100కు ఫోన్ చేశాడు. సలహా ఇచ్చారే కానీ, ఎవరూ స్పందించలేదు. చివరికి తెలిసిన వారి నుంచి మడికొండ వెటర్నరీ అసిస్టెంట్ రమేశ్కు సమాచారం ఇవ్వగా.. ఆయన çఘటనా స్థలానికి చేరుకున్నాడు. ప్లాస్టిక్ కవర్లు తినడం వల్ల అజీర్తితో బాధపడుతున్నట్లు గు ర్తించి వైద్యం అందించాడు. కాగా, ఏప్రిల్ 25న పశు వైద్యుల దినోత్సవం.. హనుమకొండ పరిధి పశు వైద్యులకు ఫోన్ చేసినా స్పందించలేదని పలువురు వాహనదారులు చెప్పడం గమనార్హం. – హన్మకొండ చౌరస్తా -
తెలుగు రాష్ట్రాల్లో టెన్షన్.. బంకుల్లో నో స్టాక్ బోర్డులు..
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన కొరత వెంటాడుతోంది. పెట్రోల్, డీజిల్ కోసం కొన్నిచోట్ల వాహనదారులు బారులు తీరుతున్నారు. పలుచోట్ల పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో, వాహనదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా డీజిల్ సమస్య ఎక్కువగా ఉంది.ఏపీలో ఇంధన సంక్షోభం మరింత ముదిరింది. డీజీల్, పెట్రోల్ దొరకని పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా ‘నో స్టాక్’ బోర్డులే దర్శనమిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉన్న 4,510 బంకుల్లో 70 శాతానికిపైగా మూతబడ్డాయి. కొన్నిచోట్ల ఉన్న కొద్ది స్టాక్ను రేషన్ లెక్కన అందిస్తున్నారు. అందుకోసం కనుచూపుమేర వాహనాలు బారులుతీరాయి. గంటల తరబడి ఎదురు చూపుల తర్వాత అరకొర ఇంధనంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. డీజిల్ కార్లకు 10–15 లీటర్లకు మించి ఇవ్వడం లేదు. బైకులకు రూ.200 పెట్రోల్ మాత్రమే పోస్తున్నారు. ఇంధనం ఉన్న బంకుల్లో గరిష్టంగా 5 గంటలు మించి అమ్మకాలు జరగలేదు. శనివారం డీజిల్కు మాత్రమే తీవ్ర కొరత ఏర్పడగా, ఆదివారం అది పెట్రోల్కు కూడా అంటుకుంది. దీంతో బంకుల వద్ద వాహనదారులు ఆందోళన చేశారు.ఇదిలా ఉండగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రాష్ట్రంలో డీలర్లకు డిమాండ్లో 40 శాతం మాత్రమే సరఫరా చేస్తున్నాయి. ఇంధన ఉత్పత్తి పెంచామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా.. అది ఎక్కడా కనిపించడం లేదు. దీంతో సమస్య మరింత జఠిలమైంది. శనివారం మధ్యాహ్నం వరకు కొంత మేర తెరుచుకున్న బంకుల్లో పెట్రోల్ మాత్రమే అరకొరగా అమ్మకాలు సాగించారు. సాయంత్రానికి వాటిలోనూ ‘నో స్టాక్’ బోర్డులు పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ద్విచక్ర వాహనాలకు రూ.200 పెట్రోల్, కార్లకు 10–15 లీటర్లు డీజిల్/పెట్రోల్ మాత్రమే అందించారు. ఫుల్ ట్యాంక్, క్యాన్లలో విక్రయాలు ఆపేశారు.తెలంగాణలో పరిస్థితి ఇది.. తెలంగాణలో ఇంధన కొరత లేదు.. నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని పౌరసరఫరాలశాఖ చెబుతున్నప్పటికీ పలుచోట్ల పెట్రోల్ బంకుల్లో మాత్రం ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో డీజిల్, పెట్రోల్ కొరతతో పలు బంకులను తాత్కాలికంగా మూసివేశారు. ఖమ్మం నగరంతో పాటు అశ్వారావుపేట మండలం వినాయకపురం బంకు వద్ద.. కల్లూరు, మణుగూరు, సత్తుపల్లిలో పెట్రోల్ కోసం వాహనదారులు బారులుతీరారు. వేంసూరు ఐఓసీ బంకు దగ్గర అయితే పెద్దపెద్ద డబ్బాల్ని వరుసలో పెట్టారు.హైదరాబాద్లో హిమాయత్నగర్ సహా కొన్నిచోట్ల బంకుల్లో నో స్టాక్ బోర్డు పెట్టారు. మిగతాచోట్ల పరిస్థితి సాధారణంగానే ఉంది.సూర్యాపేట జిల్లాలో పదిహేనుకుపైగా పెట్రోల్ బంకులను తాత్కాలికంగా మూసివేసి నో స్టాక్ బోర్డు పెట్టారు. మిగతావాటిలో ఎక్కువ బంకుల్లో పెట్రోల్ ఉంటే డీజిల్ లేదు. డీజిల్ ఉంటే పెట్రోల్ లేదు. మద్దిరాలలోని ఓ బంకులో మూడ్రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ లేవు.కోదాడ పట్టణంలోని ఓ బంకు నిర్వాహకుడు రెండు ట్యాంకర్ల కోసం ఆయిల్ సంస్థకు సుమారు రూ.25 లక్షలు మూడ్రోజుల క్రితం చెల్లించారు. ఆదివారం నాటికీ ఇంధనం రాకపోవడంతో బంకును మూసేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో నాలుగు బంకులు ఉన్నాయి. డీజిల్, పెట్రోల్ కొరతతో వారంలో నాలుగురోజులే తెరిచి ఉంటున్నాయి. ఇప్పుడు ప్రధాన బంకు సహా రెండు తాత్కాలికంగా మూసి ఉన్నాయి.జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడులోని ఐవోసీ బంకులో శుక్రవారం సాయంత్రానికే స్టాకు అయిపోయింది. మళ్లీ సోమవారం స్టాకు వస్తుందని సిబ్బంది తెలిపారు. -
టీడీపీ నేత ఇంట్లో పెళ్లి రగడ.. ఇరు కుటుంబాలపై కేసులు
హైదరాబాద్: పెళ్లి సంబంధం విషయంలో తలెత్తిన వివాదంలో రెండు కుటుంబాలపై కేసులు నమోదయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. జూబ్లీహిల్స్ లో నివాసముంటున్న సుధాకర్ పెండ్యాల, అతని కుమారుడు సాయి అక్షయ్ కుమార్ దివీస్ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నారు. రాజేంద్రనగర్లో నివాసం ఉంటున్న టీడీపీ నేత, నోవా మెడికల్ కళాశాలల చైర్మన్ ముత్తంశెట్టి కృష్ణారావు, డా.విజయ నిర్మల కుమార్తెతో సాయి అక్షయ్ కుమార్కు వివాహం కుదిరింది. ఉన్నతస్థాయి ఉద్యోగం చేస్తున్నాడని నమ్మించడంతో రూ.1 కోటి వరకట్నంతో పాటు ఖరీదైన బహుమతులు, బీఎండబ్ల్యూ కారు, ఖరీదైన వాచీలు ఇచ్చారు. భారీగా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఆ తరువాత ఇరు కుటుంబాల మధ్య వివాదాలు మొదలయ్యాయి. ఉద్యోగం విషయంలో అబద్దాలు చెప్పారని ఆరోపించారు. దీంతో పెళ్లి రద్దు చేసుకుంటున్నామని సుధాకర్ తెలిపారు. తాము ఇచ్చిన కట్న కానుకలు, ఎంగేజ్మెంట్ కోసం పెట్టిన ఖర్చును వెనక్కి ఇవ్వాలంటూ కోరగా డబ్బులు వెనక్కి ఇవ్వకపోవడంతో పాటు తమ కుటుంబంపై తప్పుడు ప్రచారం ప్రారంభం చేస్తున్నారంటూ రెండ్రోజుల క్రితం నోవా మెడికల్ కాలేజ్ చైర్ పర్సన్ డా.విజయ నిర్మలతో పాటు సుమారు 70 మంది పెండ్యాల సుధాకర్ ఇంటివద్దకు వచ్చి హల్చల్ చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా బాధితులు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడ్డ పెళ్లి కూతురి తల్లి డా. విజయనిర్మలతో పాటు ఆమె అనుచరులపై చర్యలు తీసుకోవాలంటూ పెండ్యాల సుధాకర్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా విజయనిర్మల కూడా జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
ముఖ్యమంత్రి అయితే.. వారానికి మూడుసార్లు ఇదేనా?
హైదరాబాద్: మండిపోతున్న ఎండలు.. ఆపై మిట్టమధ్యాహ్నం.. ఔటర్ రింగ్ రోడ్డుపై అర్ధగంటకు పైగా వాహనాలను నిలిపివేయటంతో ప్రయాణికుల సహనం నశించింది. కొందరు కార్లలోంచి దిగి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అసలు విషయం ఏంటంటే.. ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జన్వాడలో ఓ వివాహానికి హాజరై తిరిగి వెళ్తున్న క్రమంలో పుప్పాలగూడ ఔటర్ టోల్గేట్తో పాటు మైహోం అవతార్ సర్కిల్లోనూ పోలీసులు ట్రాఫిక్ను నిలిపివేశారు. పది నిముషాల్లోనే వేలాది వాహనాలు బారులుతీరాయి. అర్ధగంట పాటు నిలిపివేయడంతో కొందరు కార్లలోంచి దిగి వచ్చి వాగ్వాదానికి దిగారు. ‘ముఖ్యమంత్రి అయితే వారంలో మూడు, నాలుగు సార్లు తమను ఇబ్బందులకు గురిచేస్తారా? హెలికాప్టర్లో తిరగమనండి. లేదంటే సామాన్యుడిలా ట్రాఫిక్లో వెళ్లాలని చెప్పండి. మండుతున్న ఎండలో మమ్మల్ని ఇంతసేపు నిల్చోపెడతారా’? అంటూ నిలదీశారు. అంతలోనే సీఎం కాన్వాయ్ వస్తుండగా ఒక్కసారిగా హారన్లను మోగించి ఆయనకు వినిపించేలా నిరసన తెలిపారు. అనంతరం సీఎం కాన్వాయ్ వెళ్లిపోవటం, ట్రాఫిక్ జాం సమస్య సమసిపోయింది. ఈ తతంగాన్ని మొత్తం ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో వైరల్ అయ్యింది. View this post on Instagram A post shared by Hyderabad Mail (@hyderabadmail) -
ఇటు బాధ్యతలు స్వీకరించి.. అటు సీఎంను కలిసి..
హైదరాబాద్ నూతన కలెక్టర్గా ప్రియాంక అల ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందజేశారు. విద్య, వైద్యానికి ప్రాధాన్యం: కలెక్టర్కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రియాంక అల మాట్లాడుతూ.. నగరంలో విద్య, వైద్య రంగాలకు తొలి ప్రాధాన్యమివ్వనున్నట్లు తెలిపారు. బస్తీ దవాఖానాలను బలోపేతం చేసి పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. పాఠశాల విద్య బలోపేతంతో ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రయతి్నస్తానన్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హుల దరిచేరేలా కృషి చేస్తానన్నారు. కలెక్టరేట్ పరిధిలో పనిచేసే అధికారులు, ఉద్యోగులు సమయపాలన పాటించి తమ విభాగాలో పెండింగ్ పైళ్లు లేకుండా చూసుకునే విధంగా చర్యలు చేపడతానని పేర్కొన్నారు కలెక్టరేట్, సీఎం ప్రజావాణితోపాటు ప్రస్తుతం జిల్లాలో నిర్వహిస్తున్న వాట్సాప్ గ్రీవెన్స్ సెల్ ద్వారా వస్తున్న దరఖాస్తులను పెండింగ్లో లేకుండా చూస్తానని ప్రియాంక అల స్పష్టంచేశారు. View this post on Instagram A post shared by Priyanka Ala (@priyankaala__ias) -
నాన్వెజ్ కర్రీ వండలేదని..
కామారెడ్డి టౌన్: మాంసాహారం విష యంలో భార్యాభర్తల మధ్య మొదలైన గొడవ.. ఇద్దరు చిన్నా రులను అనాథలను చేసింది. క్షణికావేశంలో కొడవలితో భార్య దాడి చేయడంతో భర్త అక్కడికక్కడే మృతిచెందాడు. ఆమె కటకటాల పాలయ్యింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టణ సీఐ నరహరి తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని గోసంగి కాలనీకి చెందిన కోదండ శివాజీ (30), అతడి భార్య లక్ష్మి మధ్య వారంరోజులుగా గొడవ జరుగుతున్నట్లు తెలిసింది.ఈ క్రమంలో శనివారం రాత్రి నాన్వెజ్ వండాలని శివాజీ కోరగా లక్ష్మి నిరాకరించింది. దీంతో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన లక్ష్మి పక్కనే ఉన్న కొడవలితో శివాజీపై దాడి చేసింది. గొంతు, మెడ భాగంలో లోతుగా తెగడంతో శివాజీ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. సమాచారం అందుకున్న పోలీసు లు ఘటన స్థలానికి చేరుకుని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. వీరికి ఏడాది, రెండేళ్ల వయసున్న ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. తండ్రి మరణించడం, తల్లి అరెస్ట్ కావడంతో ఆ చిన్నారులు అనాథలయ్యారు. -
నీట్–2026కు కౌంట్డౌన్
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్యలో ప్రవేశాలకు గేట్వేగా నిలిచే ‘నీట్–యూజీ 2026’ పరీక్షకు కౌంట్డౌన్ ప్రారంభమైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆధ్వర్యంలో ఈ పరీక్ష మే 3న దేశవ్యాప్తంగా జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఒకే షిఫ్ట్లో ఆఫ్లైన్ (పెన్–పేపర్) విధానంలో పరీక్ష జరగనుంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా దేశవ్యాప్తంగా 22 లక్షలకుపైగా విద్యార్థులు దరఖాస్తు చేశారు. ఎంబీబీఎస్, బీడీఎస్తో పాటు ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాలకు ఇదే ప్రధాన ప్రవేశ పరీక్ష. గత ఏడాది తెలంగాణ నుంచి 70 వేల మందికిపైగా విద్యార్థులు నీట్ పరీక్ష రాయగా, ఈసారి 75 వేల మంది హాజరయ్యే అవకాశం ఉందని వైద్య విద్య వర్గాలు చెబుతున్నాయి. నేడు 10 గంటల నుంచి..నీట్–2026 అడ్మిట్ కార్డులు సోమవారం (ఏప్రిల్ 27) ఉదయం 10 గంటల నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని ఎన్టీఏ వెల్లడించింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్ష కేంద్రం, సమయం వంటి కీలక వివరాలు అందులో ఉంటాయి. పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఎన్టీఏ పటిష్ట చర్యలు తీసుకుంటోంది. నిషేధిత వస్తువులు తీసుకొస్తే డిస్క్వాలిఫికేషన్ తప్పదని హెచ్చరించింది. అలాగే కేంద్రాల్లో ఫ్రిస్కింగ్ విధానం అమలు చేయనున్నారు. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లా కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.అవకతవకలకు తావులేకుండా.. నీట్–యూజీ పరీక్షను పారదర్శకంగా, ఎలాంటి అవకతవ కలకు తావులేకుండా నిర్వహించేందుకు కీలక చర్యలు చేప ట్టారు. దేశవ్యాప్తంగా ఈ పరీక్షను మే 3న నిర్వహించనున్నందున జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) ముందు జాగ్రత్తగా ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. మే 2, 3 తేదీల్లో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మెడికల్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు సెలవులు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. గతంలో నీట్ పరీక్షల సందర్భంగా చోటుచేసుకున్న ఇంపర్సనేషన్, చీటింగ్, ప్రశ్నపత్రాల లీక్ వంటి ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్ఎంసీ పేర్కొంది.ముఖ్యంగా మెడికల్ విద్యార్థుల ప్రమేయంతో జరిగే అవకతవకలను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. అయితే అత్యవసర పరిస్థితుల్లో సరైన కారణాలు ఉంటేనే సంబంధిత కాలేజీ యాజమాన్యాలు సెలవులు మంజూరు చేయొచ్చని మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ రెండు రోజుల్లో విద్యార్థులను కళాశాలల్లోనే ఉంచుతూ అకడమిక్ కార్యక్రమాలు లేదా ఇతర పనుల్లో నిమగ్నం చేయాలని సూచించింది. అవసరమైతే బోధన, నాన్–టీచింగ్ సిబ్బందిని కూడా విధుల్లో ఉంచాలని పేర్కొంది. -
‘సన్’డే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. సాధారణంగా మే నెలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానుండగా... ఈసారి ముందస్తుగానే నమోదవుతున్నాయి. ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటింది. అత్యధికంగా ఆదిలాబాద్లో 45.3 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇతర ప్రాంతాల్లోనూ 40 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చాలాచోట్ల సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు హెచ్చరించారు. మరోవైపు వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. సోమ, మంగళవారాల్లో ఆదిలాబాద్, కుమ్రుం భీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు నమోదు కావొచ్చని చెప్పింది. -
ప్లాస్టిక్ వ్యర్థాలతో పార్కిన్సన్కు మందు
రోజువారీ ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగకరమైన ఔషధాలుగా మార్చటం సాధ్యమేనని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ‘వాడేసిన ప్లాస్టిక్ సీసాలు ఎందుకు పనికొస్తాయి... నేల, నీటిని కలుషితం చేయడానికి తప్ప’అని అనుకుంటూ ఉంటాం. కానీ, అది నిజం కాదు. పాత ప్లాస్టిక్ సీసాలను ఉపయోగించి అద్భుతమైన ఔషధం తయారు చేసే పద్ధతిని కనుగొన్నారు. ఇంగ్లండ్కు చెందిన ఎడిన్బరో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు వృద్ధుల వ్యాధుల్లో ఒకటైన పార్కిన్సన్కు చెక్ చెప్పే అద్భుత ఔషధాన్ని ప్లాస్టిక్ వ్యర్థాలతో ప్రపంచంలో తొలిసారి తయారు చేశారు. నేచర్ సస్టయినబిలిటీ జర్నల్లో ఈ పరిశోధనా వ్యాసం ఇటీవల ప్రచురితమైంది. ప్లాస్టిక్ వ్యర్థాలు కేవలం పర్యావరణ భారం మాత్రమే కాదని, ప్లాస్టిక్ రసాయన నిర్మాణంలో బంధితమైన కార్బన్ అణువులను ఔషధాల తయారీకి వనరుగా వాడుకోవచ్చని పరిశోధకులు నిరూపించారు. జన్యుమారి్పడి చేసిన ఈ–కోలి సూక్ష్మక్రిమి ఈ కార్బన్ను మార్చగలదని పరిశోధకులు కనుగొన్నారు. ఈ ప్రక్రియ ద్వారా సాధారణంగా సీసాలు, ఆహార ప్యాకేజింగ్లో ఉపయోగించే పాలిథిలిన్ టెరెఫ్తాలేట్ (పీఈటీ)తో పార్కిన్సన్ వ్యాధి చికిత్సకు కీలకమైన లెవోడోపా మందును తయారు చేశారు. ప్రస్తుతం లెవోడోపా మందును ఉత్పత్తి చేసే ప్రక్రియ అనేక శిలాజ ఇంధన ఆధారిత రసాయన దశలపై ఆధారపడి ఉంటుంది. అధిక శక్తి వినియోగంతో కూడిన అధిక కార్బన్ను విడుదల చేసే ఖరీదైన ప్రక్రియ ఇది. ఈ సంప్రదాయ పద్ధతికి ప్రత్యామ్నాయంగా ప్లాస్టిక్ సీసాలతో మందులు తయారు చేయొచ్చని కనుగొన్నారు. అయితే ఎడిన్బరో విశ్వవిద్యాలయ పరిశోధకులే ప్లాస్టిక్తో పారాసెటమాల్ ట్యాబ్లెట్లను తయారు చేసే పద్ధతిని గతంలో కనిపెట్టారు. కేవలం 24 గంటల్లోనే ఒక లీటరు పీఈటీ సీసాలోని 90% వరకు ప్లాస్టిక్ను పారాసెటమాల్గా మార్చారు. 500 ఎంజీ పారాసెటమాల్ మాత్రలు నాలుగు తయారు చేయటానికి ఇది సరిపోతుంది.పార్కిన్సన్ బాధితులు కోటి వయోవృద్ధులకు వణుకు, కండరాలను బిగుతుగా మార్చేసే సమస్యలను కలిగించే జబ్బే పార్కిన్సన్. ప్రపంచవ్యాప్తంగా కోటిమంది దీని బారిన పడుతున్నారు. ఈ వ్యాధి ప్రధాన లక్షణాలను నియంత్రిచడానికి లెవోడోపా అత్యంత ప్రభావవంతమైన ఔషధంగా మారింది. వృద్ధుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఈ జబ్బును నయం చేసే ఔషధాల అవసరమూ పెరుగుతోంది. దీంతో లెవోడోపాను ఉత్పత్తి చేయటానికి సుస్థిరమైన మార్గాలను కనుగొనటం అత్యంత ఆవశ్యకమైంది. ప్రయోగశాలలో సాధించిన ఈ అద్భుత ఆవిష్కరణ ఎంత ఉత్తేజకరమైనదైనా, పారిశ్రామిక స్థాయిలో ప్లాస్టిక్ వ్యర్థాలతో ఔషధాలు ఉత్పత్తి ప్రారంభించే దశకు రావటం రాత్రికి రాత్రే జరగదు.ఇంజనీర్లు తక్కువ ఖర్చుతో కూడిన తయారీ ప్రక్రియలను అభివృద్ధి చేయాలి. అలాగే ఉత్పత్తులు కఠినమైన భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని నియంత్రణ సంస్థలు సంతృప్తి చెందాలి. ఇందుకు చాలా కాలమే పడుతుంది. పెట్టుబడి భారీగానే అవసరమవుతుంది. శాస్త్రవేత్తలు, పరిశ్రమదారులు, విధాన రూపకర్తల మధ్య సన్నిహిత సమన్వయం అవసరం. ఏదేమైనా ఈ అద్భుత ఆవిష్కరణ సమీప భవిష్యత్లోనే ప్లాస్టిక్ వ్యర్థాలను ఔషధాలుగా మార్చే ఉత్పత్తి ప్రారంభ దశకు చేరుతుందని ఆశిద్దాం. -
భర్త, కూతురిని చంపి.. మూడు రోజులుగా మృతదేహాలతో?
ఖమ్మం క్రైం: తెలంగాణలోని ఖమ్మం బుర్హాన్పురంలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో తండ్రీ కుమార్తె మృతి చెందగా.. తల్లి, మరో కూతురు అపస్మారక స్థితిలో ఉండడాన్ని ఆదివారం రాత్రి పోలీసులు గుర్తించారు. నేలకొండపల్లి మండలం అనంతనగర్కు చెందిన కణతల రాము(29) ఓ దినపత్రికలో జర్నలిస్ట్ కాగా భార్య రమ్య, కుమార్తెలు దివ్య నైనీ(5), దీక్షితతో కలిసి బుర్హాన్పురంలో ఉంటున్నాడు. నాలుగైదు రోజులుగా రాముకు ఆయన కుటుంబ సభ్యులు ఫోన్చేసినా ఎత్తకపోగా.. ఆయన భార్య రమ్య ఫోన్ ఎత్తి ఆయనకు ఆరోగ్యం బాగా లేక తాను మాట్లాడుతున్నట్లు చెబుతోంది.ఆదివారం ఉదయం ఒక మహిళ రమ్య ఇంటికి వచ్చి పిలవగా.. రమ్య దుప్పటి కప్పుకుని బయటకు వచ్చి రాము అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినట్లు చెప్పింది. ఇంట్లో దుర్వాసనపై ఆరా తీయగా.. ఇంట్లో ఎవరికీ బాగాలేకపోవడంతో శుభ్రం చేయలేదని బదులిచ్చింది. కాగా, ఆదివారం రాత్రి రమ్య సోదరుడు వీరి ఇంటికి వచ్చి తలుపు కొట్టగా.. స్పందన లేకపోవడం, దుర్వాసన వస్తుండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఇంటి తలుపులు పగులగొట్టి చూడగా మంచం కింద రాము, కూతురు దివ్యనైనీ మృతదేహాలు కనిపించాయి. గది నిండా రక్తం ఉంది. అప్పటికే ఇద్దరి మృతదేహాలు కుళ్లిపోయాయి. మంచం పక్కనే రమ్య, చిన్నకూతురు దీక్షిత అపస్మారక స్థితిలో ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. మూడు రోజులపాటు మృతదేహాలతో ఇంట్లోనే రమ్య ఉన్నా అబద్ధం ఆడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. భర్త, కుమార్తెను హత్య చేసి గుట్టురట్టు కాకుండా ఎలుకల మందు కాస్త తాగి, చిన్న కూతురుకు కూడా తాగించి ఉంటుందని భావిస్తున్నారు. చిన్న కూతురు తలపై గాయాలు ఉండటంతో ఆమెను కూడా హత్య చేయడానికి పథకం రూపొందించి ఉంటుందని భావిస్తున్నారు. మూడు రోజుల క్రితమే వారు మృతి చెందితే భయపడి తాను బయటకు చెప్పలేదని అంగీకరించినా.. కారణాలు చెప్పలేదని తెలిసింది. -
చెరువులకు హెల్త్ చెకప్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని చిన్న నీటి వనరులను కాపాడేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ముఖ్యంగా గతంలో ఉన్న నీటి వినియోగదారుల సంఘాలను పునరుద్ధరించనుంది. ఈ మేరకు కొత్తగా నామినేటెడ్ పద్ధతిలో చెరువుల పరిరక్షణ కమిటీ (టీపీసీ)లను ఏర్పాటు చేసే దిశలో కీలక అడుగుపడింది. చిన్న నీటిపారుదల రంగంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఏం చేయాలన్న దానిపై అధ్యయనం చేసి రూపొందించిన నివేదికను తెలంగాణ రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ ఇటీవల ప్రభుత్వానికి సమర్పించింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ నివేదికలో పలు కీలకాంశాలను ప్రస్తావించిన కమిషన్.. సాగునీటి చెరువుల సమగ్ర పునరుద్ధరణ, నిర్వహణ, సంరక్షణ కోసం స్వయంసంవృద్ధితో కూడిన నమూనాను రూపొందించింది. ఏఐసీసీ కిసాన్ సెల్ జాతీయ నాయకుడు ఎం.కోదండరెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన రైతు కమిషన్ పలు సిఫారసులు చేసింది. ప్రభుత్వం త్వరలోనే కీలక నిర్ణయాలు తీసుకోనుంది. నివేదికలోని ముఖ్యాంశాలు ⇒ చెరువుల పరిరక్షణ కమిటీలను ప్రత్యేక జీవో ద్వారా ఏర్పాటు చేయాలి. ప్రతి మైనర్ ఇరిగేషన్ చెరువు, దాని ఆయకట్టు పరిధిలో ఈ కమిటీ పనిచేస్తుంది. సాగునీటి శాఖ చీఫ్ ఇంజనీర్ సలహా మేరకు జిల్లా కలెక్టర్లు ఈ కమిటీ సభ్యులను నామినేట్ చేస్తారు. చైర్మన్తోపాటు కన్వీనర్ లేదా మెంబర్ సెక్రటరీ, 9 మంది సభ్యులు ఉంటారు. పదవీకాలం రెండేళ్లు. ⇒ ఈ కమిటీ చెరువుల పూడికతీత, కట్ట పటిష్టం చేయడం, తూముల మరమ్మతులకు ప్రణాళికలు రూపొందిస్తుంది. సాంకేతికేతర పనుల కోసం సమాజ భాగస్వామం దిశలో శ్రమదానం నిర్వహణ, రైతుల మధ్య నీటి వివాదాల పరిష్కారం, ఆర్థిక లావాదేవీలు, నీటి వినియోగ రికార్డుల నిర్వహణ, పనుల సోషల్ ఆడిట్ నిర్వహించి గ్రామపంచాయతీలకు సమర్పించడం లాంటి విధులు నిర్వహిస్తాయి. ⇒ చెరువు గర్భం, ముంపు ప్రాంతాల్లో ఆక్రమణల నిరోధం కోసం ఈ కమిటీ చెరువు పోలీస్గా పనిచేస్తుంది. ఈ కమిటీతోపాటు వ్యవసాయ శాఖ నిర్దేశించిన విధంగా ఆ చెరువుల పరిధిలోని రైతులు పంటలు సాగు చేసుకోవాలి. చెరువుల్లో చెత్త, పూడిక వేయకుండా నివారించాలి. ఈ కమిటీలకు పంచాయతీరాజ్, వ్యవసాయ, నీటి పారుదలశాఖలు సహకరిస్తాయి. ⇒ చెరువులను నాలుగు రకాలుగా వర్గీకరించాలి. సాగునీటి చెరువు, బహుళ ప్రయోజన జీవనోపాధి చెరువు, పట్టణ శివారు/రీచార్జ్ చెరువు, ఎకోటూరిజం లేదా జీవవైవిధ్య చెరువులుగా వర్గీకరించి నిర్వహణ లక్ష్యాన్ని పెట్టుకుంటారు. ⇒ ప్రతి చెరువుకు ఆరోగ్య సర్వే నిర్వహిస్తారు. అంటే ఆయా చెరువుల్లో పూడిక, కట్ట పరిస్థితి, తూము లేదా అలుగు స్థితి నిర్ధారించేందుకు నీటిపారుదల శాఖతో కలిసి ఉమ్మడి సర్వే నిర్వహించాలి. డ్రోన్లు లాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చెరువు పూర్తిస్థాయి నీటి మట్టం (ఎఫ్టీఎల్), నీరు విస్తరించే ప్రాంతం, ఆయకట్టును డిజిటల్ మ్యాపింగ్ చేయాలి. ⇒ పోషకాలు అధికంగా ఉండే పూడిక మట్టిని స్థానిక రైతులకు ఉచితంగా ఇస్తారు. రవాణా ఖర్చులు రైతులు భరించాలి. ఇటుకబట్టీలు, రహదారుల నిర్మాణానికి పోషకాలు లేని మట్టిని ఉపయోగించుకోవచ్చు. పనికిరాని పూడిక విక్రయం ద్వారా వచ్చిన సొమ్మును టీపీసీ ఖాతాలో జమ చేయాలి. ⇒ చెరువు కట్టలకు మరమ్మతులు చేయడంతోపాటు కోతను నిరోధించేందుకు వెటివర్, ఇతర లోతైన వేర్లు కలిగిన గడ్డి మొక్కలను నాటాలి. తూము గేట్లు, అలుగులు, ఇన్లెట్, అవుట్లెట్ చానెళ్లకు మరమ్మతు చేయాలి. ⇒ పనుల పురోగతిని సమీక్షించేందుకు ప్రతి నెలా టీపీసీ సమావేశమవుతుంది. టీపీసీ స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను మండలపరిషత్ అధికారి నేతృత్వంలోని గ్రీవెన్స్ సెల్ పర్యవేక్షిస్తుంది. ⇒ అడాప్ట్ ఎ ట్యాంక్ విధానంలో చెరువు అభివృద్ధి కోసం కార్పొరేట్ సంస్థలు, ఎన్ఆర్ఐలు, స్వచ్ఛంద సంస్థలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లకు దత్తత ఇవ్వొచ్చు. విద్యాసంస్థల భాగస్వామ్యంతో చెరువుల పట్ల అవగాహన కల్పించడం, చెరువు రక్షణ దళం (స్టూడెంట్స్ క్లబ్) ఏర్పాటు చేయడం, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ లాంటి విభాగాల సహకారంతో మొక్కలు నాటడం, విశ్వవిద్యాలయాల ద్వారా మరిన్ని పరిశోధనలు, వార్షిక చెరువు మేళాల నిర్వహణ లాంటి కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుంది. -
బంధాలు తెగి బందీలుగా..
బైపోలార్ ఎఫెక్టివ్ డిజార్డర్ బారినపడిన పెద్దపల్లి జిల్లాకు చెందిన ఓ 35 ఏళ్ల వ్యక్తి 2024 సెప్టెంబర్ 27న మానసిక వైద్యశాలలో చేరారు. చికిత్స పూర్తి కావడంతో అదే ఏడాది నవంబర్ 20న డిశ్చార్జ్కు అర్హుడయ్యారు. చికిత్స పూర్తయ్యే సమయానికి తల్లి మరణించింది. కుటుంబంలో విభేదాలు వచ్చాయి. ఫలితంగా ఆయన్ను తీసుకువెళ్లడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆస్పత్రిలోనే ఉన్నారు.స్కిజోఫ్రీనియాతో బాధపడుతున్న నిజామాబాద్ జిల్లా నాగారం వాసి (38) 2024 మే 4న ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేరగా... అదే ఏడాది జూలై 22న చికిత్స పూర్తయింది. చికిత్స పొందిన తర్వాత ఆయనలో మెరుగుదల కనిపించినా... అవివాహితుడు కావడంతోపాటు తల్లిదండ్రులు మరణించడంతో సోదరులు తీసుకువెళ్లడానికి సిద్ధపడకపోవడంతో అక్కడే ఉండక తప్పలేదు.శ్రీరంగం కామేష్హైదరాబాద్ ఎర్రగడ్డలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ (ఐఎంహెచ్)లోని డిశ్చార్జ్ అండ్ క్యూర్ (డీసీ) వార్డులో ఏ బెడ్ వద్దకు వెళ్లినా ఇలాంటి దీనగాథలెన్నో బయటకు వస్తాయి. వైద్యశాస్త్రం ఎంత పురోగతి సాధించినా... సమాజంలో ఉన్న అంతరాన్ని అది చెప్పకనే చెప్తుంది. ఐఎంహెచ్లో మానసిక రోగిగా చేరి, వైద్యం పూర్తి అయి కోలుకుని, ఇంటికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కుటుంబీకులు.. బంధువుల తిరస్కారానికి గురవుతున్న 90 మంది డీసీ వార్డులోనే ఉండిపోవాల్సి వచ్చింది. వైద్యులు, సిబ్బంది ఈ వార్డులోని వారి కుటుంబీకులకు నచ్చజెప్పడానికి రోజూ ప్రయత్నిస్తూనే ఉన్నారు. దీనికోసం నిత్యం 25 నుంచి 30 ఫోన్ కాల్స్ చేస్తున్నారు, అయినప్పటికీ వాళ్లు మాత్రం ఇంటికి తీసుకెళ్లడానికి ముందుకు రావట్లేదు. చికిత్స పూర్తయిన వారిని కుటుంబీకులు, అధికారిక సంరక్షులకు మాత్రమే అప్పగించాల్సి ఉంటుంది. ఈ కారణంగా కోలుకున్న రోగుల్ని డిశ్చార్జ్ చేయలేక ఆస్పత్రి వర్గాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ దుస్థితికి కారణాలు అనేకం... డిశ్చార్జ్ అయిన రోగులు పెద్ద సంఖ్యలో డీసీ వార్డులోనే ఉండిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని అక్కడి వైద్యులు చెబుతున్నారు. వీరిలో అత్యధికులు స్కిజోఫ్రీనియా, బైపోలార్ డిజార్డర్ సహా ఇతర మానసిక వ్యాధులతో బాధపడిన వాళ్లే. వీళ్లు ఐఎంహెచ్లో చేరే వరకు వీరిపై శ్రద్ధ తీసుకున్న కుటుంబీకులు చనిపోవడం లేదా ఆయా కుటుంబాల్లో విభేదాలు రావడం ఓ ప్రధాన కారణంగా ఉంది. మరోపక్క పెళ్లికాని ఆడపిల్లలు, మగపిల్లలు ఉన్న ఇళ్లల్లోకి వీరిని తీసుకెళ్తే సమస్యలు వస్తాయని కుటుంబీకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో సరైన పెళ్లి సంబంధాలు రావనే కారణంగా వీరిని ఇక్కడే వదిలేస్తున్నారు. కొందరి సామాజిక, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో మందుల ఖర్చులు భరించలేక, భవిష్యత్తులో ఆ వ్యాధి మళ్లీ తిరగబెడుతుందనే భావనతో, ఆయా రోగుల సంరక్షణ చూసే వాళ్లు ఎవరూ లేకపోవడం వంటి కారణాలతో ఐఎంహెచ్లోనే వదిలేస్తున్నారు. ఏమాత్రం ‘ఛాయలు’ఉన్నా వదిలేస్తూ... ఐఎంహెచ్లో సాధారణ మానసిక రుగ్మతలు ఉన్న రోగులకు మూడు నెలల వరకు వైద్యం అందిస్తారు. దీర్ఘకాలిక మానసిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆరు నుంచి ఎనిమిది నెలల వరకు చికిత్స చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే డిశ్చార్జ్ కావడానికి అర్హత పొందుతారు. చికిత్స తర్వాత వైద్యులు, నిపుణులు పరీక్షించిన తర్వాతే డిశ్చార్జ్కు అనుమతి ఇస్తుంటారు. అయితే కొందరి విషయంలో అసలు మానసిక అనారోగ్య సమస్య తీరినా... కొన్ని ఛాయలు మాత్రం ఉంటాయి. సిర్పూర్కు చెందిన వ్యక్తి విషయాన్నే తీసుకుంటే ఈయన మానసిక స్థితి మెరుగుపడినా... ఇంకా మాటలు స్పష్టంగా చెప్పడంలో ఇబ్బంది (స్లర్డ్ స్పీచ్) పడుతున్నారు. అలాగే నడకలో కూడా కొంత ఇబ్బంది ఉంది. ఈ కారణాలతోనే కుటుంబం ఆయన్ను తమ వెంట తీసుకెళ్లడానికి అంగీకరించట్లేదు. వైద్యశాల ఎదుర్కొంటున్న సమస్యలెన్నో... రాష్ట్రంలో ఉన్న మానసిక ఆరోగ్య సమీక్ష బోర్డులు ఆయా రోగుల డిశ్చార్జ్ ప్రక్రియలను పర్యవేక్షిస్తాయి. డిశ్చార్జ్కు సిద్ధంగా ఉన్నప్పటికీ, కుటుంబాలు తీసుకెళ్లని రోగుల్లో అత్యధికుల్ని అనివార్యంగా ఆస్పత్రిలోనే ఉంచాల్సి వస్తోంది. దీనివల్ల తీవ్రమైన, కొత్తగా చేర్చుకోవాల్సిన రోగులకు బెడ్స్ కొరత వస్తోంది. దీనికితోడు వైద్యులు, సిబ్బందిపై అదనపు పని భారం పడి, తీవ్రమైన ఒత్తిడితో పని చేయాల్సి వస్తోంది. డీసీ వార్డులో ఉన్న కొంతమంది కోలుకున్న మానసిక రోగులకు జ్వరం, దగ్గు, రక్తపోటు, మధుమేహం వంటి ఇతర ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. దీంతో వీరిని ఉస్మానియా జనరల్ ఆస్పత్రితోపాటు ఇతర ఆసుపత్రులకు తీసుకెళ్లాల్సి రావడం మానసిక వైద్యశాల సిబ్బందికి తలకుమించిన భారంగా మారుతోంది. కోలుకున్న రోగి వెంట కనీసం ఒక సిబ్బంది అంబులెన్స్లో వెళ్లాల్సి వస్తోంది. దీంతో ఆస్పత్రిలో సిబ్బంది కొరత మరింత పెరుగుతోంది. ప్రజల్లో అపోహలు మానసిక రోగుల పట్ల ప్రజల్లో ఇప్పటికీ అనేక అపోహలు ఉన్నాయి. చాలా రకాలైన మానసిక వ్యాధులు సరైన చికిత్సతో నయం అవుతాయి. ఆ రోగులకు కుటుంబీకుల మద్దతు ఉంటే వారు పూర్తి సాధారణ జీవితాన్ని గడపగలరు. వ్యాధి నుంచి కోలుకున్నప్పటికీ కుటుంబీకుల తిరస్కారంతో ఐఎంహెచ్లోనే ఉండిపోతున్న రోగుల విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరిస్తున్నాం. కోలుకున్నప్పటికీ కుటుంబీకులు తీసుకెళ్లని వారిలో స్థితిగుతుల్ని బట్టి డీసీ వార్డులో ఉంచడం, రెస్క్యూ హోమ్స్, రీహ్యాబ్ సెంటర్లకు తరలించడం వంటి చర్యలు తీసుకుంటున్నాం. మానసిక ఆరోగ్య చట్టం–2017 ప్రకారం కోలుకున్న మానసిక రోగులకు సమాజంలో కలిసి జీవించే హక్కు ఉంటుంది. అనేక మంది కుటుంబీకులకు పదేపదే ఫోన్లు చేసినప్పటికీ వాళ్లు కోలుకున్న రోగిని తిరిగి తీసుకెళ్లేందుకు నిరాకరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లు మళ్లీ రుగ్మతకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. –డాక్టర్ అనిత రాయిరాల, సూపరింటెండెంట్, ఐఎంహెచ్ ⇒ సిర్పూర్కు చెందిన 45 ఏళ్ల వ్యక్తి బైపోలార్ ఎఫెక్టివ్ డిజార్డర్తో 2023 డిసెంబర్లో చేరి, 2024 ఏప్రిల్లో డిశ్చార్జ్కు అర్హుడయ్యారు. అయితే అనివార్య కారణాలతో కుటుంబం పట్టించుకోవట్లేదు. ⇒ పెదపల్లి ప్రాంతానికి చెందిన వ్యక్తి (46) కోర్టు ఆదేశాల మేరకు 2019లో ఐఎంహెచ్లో చేరి, 2020లో డిశ్చార్జ్కు అర్హుడయ్యారు. వైద్యులు అతను కోలుకున్నాడని చెబుతున్నా.. కుటుంబం మాత్రం తిరిగి తీసుకువెళ్లడానికి సిద్ధంగా లేదు. -
ఆర్టీసీ విలీనానికి ఏపీ నమూనా?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం వల్ల వారి జీతాల్లో పెరుగుదల నమోదు కానుంది. అయితే, ఈ మార్పు డిపో మేనేజర్ స్థాయి నుంచే ఉండే అవకాశం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం అనంతరం అక్కడ చోటుచేసుకున్న మార్పులను పరిశీలిస్తే ఇదే అవగతమవుతోంది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం చాలా క్లిష్టమైనది. దీనికి సంబంధించిన కసరత్తుకు భారీగా సమయం పట్టే అవకాశం ఉంది. కానీ, ఏపీలో విలీన ప్రక్రియ జరిగినందున, అక్కడి ప్రక్రియనే అనుసరిస్తే జాప్యం జరగదు. గతంలో ఉమ్మడి ఆర్టీసీలో భాగమైనందున, రెండు ఆర్టీసీల్లో పెద్ద తేడా లేదు. దీంతో ఇక్కడ కూడా ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం కోసం ఏపీ మోడల్నే అనుసరించే అవకాశం ఉంది. ప్రభుత్వంలో విలీనం జరిగినప్పుడు ఆర్టీ సీలోని ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగుల కేడర్లో ఫిక్స్ చేస్తారు. ఆర్టీసీ పోస్టుకు సరిసమానమైన ప్రభుత్వ పోస్టుల్లో కలిపేస్తారు. సరిసమాన పోస్టు లేనప్పుడు కాస్త అటూ ఇటూగా ఉన్న కేడర్తో అనుసంధానిస్తారు. ఆర్టీసీలో మేనేజింగ్ డైరెక్టర్ తర్వాత, పెద్ద పోస్టు అంటే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ)దే. ఈ పోస్టును అదనపు కమిషనర్ కేడర్గా మార్చారు. రీజినల్ మేనేజర్ పోస్టును జాయింట్ కమిషనర్ స్థాయిగా, డివిజినల్ మేనేజర్ (డిప్యూటీ మేనేజర్) పోస్టును డిప్యూటీ కమిషనర్ స్థాయిగా, డిపో మేనేజర్ పోస్టును అసిస్టెంట్ కమిషనర్ స్థాయిగా ఖరారు చేశారు. అసిస్టెంట్ మేనేజర్ స్థాయి నుంచి ఆ పైస్థాయి పోస్టులకు గెజిటెడ్ హోదా కల్పించారు. ప్రభుత్వంలో డ్రైవర్ పోస్టు ఉన్నందున ఆర్టీసీ డ్రైవర్ను డ్రైవర్ స్థాయిగానే పరిగణిస్తున్నారు. కానీ, ప్రభుత్వంలో కండక్టర్ పోస్టు లేనందున, కండక్టర్ పోస్టును జూనియర్ అసిస్టెంట్ స్థాయిగా గుర్తించారు. పెద్ద అధికారుల జీతాల్లో తగ్గుదల... కానీ.. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను ఫిక్స్ చేసిన తర్వాత ఆ స్థాయి స్కేల్ వర్తింపజేస్తారు. దీంతో ప్రభుత్వ స్కేల్కు ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు పెరుగుతాయి. కానీ, ఆర్టీసీలోని ఈడీ, ఆర్ఎం, డీవీఎం, చీఫ్ మెకానికల్ ఇంజినీర్ (సీఎంఈ), చీఫ్ పర్సనల్ మేనేజర్ (సీపీఎం), చీఫ్ మెడికల్ ఆఫీసర్, చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ (సీటీఎం), విజిలెన్స్ డైరెక్టర్, డిప్యూటీ మెకానికల్ ఇంజినీర్, సీనియర్ మెడికల్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్స్, విజిలెన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి వరకు జీతాలు ప్రస్తుతం ప్రభుత్వంలోని సమానమైన స్థాయి పోస్టుల కంటే ఎక్కువ ఉన్నాయి. దీంతో ఈ పోస్టుల జీతాల పెరుగుదల ఉండదు. ఆ తర్వాత ఉన్న డిపో మేనేజర్ పోస్టు నుంచి జీతాల పెరుగుదల నమోదవుతుంది. తక్కువ స్కేల్తో ఉన్న ఆర్టీసీ పోస్టుల జీతాలను ప్రభుత్వ స్కేల్కు సమానంగా పెంచుతున్నప్పుడు, ఎక్కువ జీతాలున్న పోస్టులను ప్రభుత్వ స్కేల్కు సమానం చేయాలంటే తగ్గించాల్సి ఉంటుంది. కానీ, ఏపీలో అలా తగ్గించకుండా ఉన్నది ఉన్నట్టుగా స్థిరీకరించారు. తదుపరి పీఆర్సీలతో ప్రభుత్వ కేడర్ స్కేల్ పెరిగి ఆర్టీసీ అధికారుల జీతాల కంటే ఎక్కువైనప్పుడే పెంచుతారు. అప్పటి వరకు కేవలం ఇంక్రిమెంట్లను మాత్రమే జత చేస్తారు. పే స్కేల్ ఇలా... ⇒ ఏపీఎస్ఆర్టీసీ విలీన సమయంలో డిపో మేనేజర్ వేతనం రూ.57,000–రూ.1,42,500గా ఉంది. దాన్ని రూ.57,100–రూ.1,47,760గా మార్చారు. ⇒ గ్రేడ్–1 డ్రైవర్ ప్రారంభ జీతం రూ.25,480 నుంచి రూ.29,980కు, గ్రేడ్–2 డ్రైవర్ ప్రారంభ జీతం రూ.21,390 నుంచి రూ.27,500కు, గ్రేడ్–1 కండక్టర్ ప్రారంభ జీతం రూ.21,670 నుంచి రూ.28,280కు, గ్రేడ్2 కండక్టర్ ప్రారంభ జీతం రూ.19,580 నుంచి రూ. 25,220కి పెరిగింది. గ్రేడ్2 మెకానిక్ ప్రారంభ జీతం రూ.20,300 నుంచి రూ.25,220కి పెరిగింది. ⇒ ప్రభుత్వ అధికారులతో పోలిస్తే ఆర్టీసీ ఉన్నతాధికారుల గ్రాట్యుటీ చాలా ఎక్కువగా ఉంది. ప్రభుత్వ అధికారుల గ్రాట్యుటీపై సీలింగ్ ఉంది. ఉన్నతాధికారుల గ్రాట్యుటీ దాదాపు రూ.50 లక్షలు, అంతకంటే ఎక్కువగానే తగ్గుదల నమోదు కావాల్సి ఉంటుంది. దీంతో దాన్ని ప్రొటెక్ట్ చేయాలని ప్రతిపాదించనున్నారు. ⇒ ప్రస్తుతం ఆర్టీసీలో గ్రేడ్ పే విధానం ఉంది. జీతానికి అదనంగా వారి పోస్టు స్థాయిని బట్టి ఈ మొత్తం జోడిస్తున్నారు. ఇది అసిస్టెంట్ డిపో మేనేజర్ స్థాయి నుంచి మొదలవుతుంది. ప్రభుత్వంలో గ్రేడ్ పే విధానం లేనందున దీన్ని తొలగిస్తారు. -
ప్రజా‘వాణి’ వినాలి
సాక్షి, హైదరాబాద్: ‘ప్రజలకు నమ్మకంగా ఉండేలా ప్రజావాణి సేవలు అందించాలి. ప్రతి ఫిర్యాదును నమోదు చేయాలి. సంబంధిత విభాగాలకు పంపించాలి. పరిష్కార పురోగతిని అర్జీదారునికి తెలియజేయాలి’అని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారానికి నిర్ణీత గడువు ఉండాలని, ఆలస్యం జరగకూడదని చెప్పారు. ఫిర్యాదుల నమోదు, ట్రాకింగ్, పరిష్కారానికి ఏకీకృత డిజిటల్ ప్లాట్ఫాం అభివృద్ధి చేయాలన్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో రియల్ టైమ్ మానిటరింగ్ ఉండాలని సూచించారు. డ్యాష్బోర్డ్ ద్వారా పరిష్కార పురోగతి తెలుసుకునే వీలుండాలని, ఎక్కడైనా ఆలస్యం జరిగితే సంబంధిత అధికారులను బాధ్యులను చేయాలని చెప్పారు. ఎంసీఆర్హెచ్ఆర్డీలో ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, సీఎంఓ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ప్రజల అర్జీలు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత పకడ్బందీగా అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా ఇకపై రెవెన్యూ డివిజన్ స్థాయికి, తర్వాత దశలో మండల స్థాయికి విస్తరించాలన్నారు. దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్కు, జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేకుండా ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలని చెప్పారు. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి అన్ని స్థాయిల్లో అధికారులకు పూర్తి అధికారాలు ఇవ్వాలని ఆదేశించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన మరుసటి రోజు 2023 డిసెంబర్ 8న మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్లో రాష్ట్ర స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. నాటి నుంచి ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రజావాణి నిర్వహిస్తున్నారు. అన్ని శాఖల అధికారులు అక్కడికక్కడే ప్రజల అర్జీలు, దరఖాస్తులను స్వీకరించి వేగవంతంగా వాటిని పరిష్కరించే చర్యలు చేపడుతున్నా రు. జిల్లా స్థాయిలోనూ కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రతివారం ప్రజావాణి నిర్వహిస్తున్నారు. పైఅధికారికి ఫిర్యాదు ఆటో ఎస్కలేషన్.. ప్రతిస్థాయిలో ప్రజావాణికి ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ప్రతి జిల్లాలోనూ, ప్రతి శాఖలో ప్రత్యేక ప్రజావాణి విభాగాలు ఏర్పాటు చేయాలన్నారు. ఒకస్థాయిలో పరిష్కారం కాకపోతే, పైస్థాయి అధికారికి అర్జీ అందేలా ఆటో ఎస్కలేషన్ వ్యవస్థను అమలు చేయాలని చెప్పారు. అవసరమైతే అప్పీల్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. పెండింగ్ ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఆలస్యమైతే అధికారులదే బాధ్యత అని చెప్పారు. ప్రజావాణి సేవలను వికేంద్రీకరించటంతో జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో పెండింగ్ అర్జీల సంఖ్య తగ్గుతుందని, కింది స్థాయిలోనే కొన్ని పరిష్కరించే వీలుంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. -
హైడ్రాపై ఎమ్మెల్యే రాజాసింగ్ ధ్వజం
హైదరాబాద్: హైడ్రా, మున్సిపల్ అధికారులపై ఎమ్మెల్యే రాజాసింగ్ ధ్వజమెత్తారు. గోషామహల్ నియోజకవర్గంలో ఫిష్ మార్కెట్ పక్కన ఉన్న డబ్బాలను తొలగించారని, తాను ఇక్కడ లేని సమయం చూసే వాటిని హైడ్రా తొలగించిందంటూ మండాపడ్డారు. కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ అధికారులు దౌర్జన్యంగా తొలగించారన్నారు. హైడ్రాకు దమ్ముంటే దారుసలాం, ఛార్మినార్ ముందు ఉన్న అక్రమ కట్టడాలు కూల్చి చూపెట్టాలని డిమాండ్ చేశారు. పేద ప్రజల ఉపాధి అవకాశాలపై దౌర్జన్యం సరికాదని, త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్కు తగిన బుద్ధి చెబుతారుని విమర్శించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఒక్క సీటు రాదన్నారు. రాష్ట్ర సీఎం హోదాలో ఉన్న రేవంత్రెడ్డిని ప్రజలు అసహ్యించుకుంటున్నారని రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అంబేద్కర్ జయంతి వారోత్సవాల ముగింపు వేడుకలు
హైదరాబాద్: బీజేపీ ఆధ్వర్యంలో నగరంలోని సోమాజిగూడలో జరిగిన అంబేద్కర్ జయంతి వారోత్సవాల ముగింపు వేడుకల్లో కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ వేడుకలకు భారీ ఎత్తున బీజేపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. దీనిలో భాగంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘అంబేద్కర్ జయంతిని గల్లీ నుండి ఢిల్లీ వరకు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. అంబేద్కర్ దేశ ప్రజలకి ఆశా జ్యోతి.. అందుకే దేశ వ్యాప్తంగా వారోత్సవాలు జరగుతున్నాయి. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా అంబేద్కర్ జయంతిని తూతూ మంత్రంగా జరుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని వారం రోజుల పాటు ప్రధాని మోదీ ఘనంగా నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్య సమితినే అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహిస్తుంది. మనం సుఖ సంతోషాలతో జీవిస్తున్నాం అంటే అది అంబేద్కర్ పెట్టిన భిక్షనే. అంబేద్కర్ చరిత్రని ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి. అడుగడుగునా అంబేద్కర్ ని అవమానించిన పార్టీ కాంగ్రెస్. డూప్లికేట్ గాంధీ కుటుంబ చరిత్రనే ప్రజలకి తెలియాలని కాంగ్రెస్ కుట్ర చేసింది.దేశ విభజన, 370 ఆర్టికల్ ని వ్యతిరేకించిన వ్యక్తి అంబేద్కర్. నెహ్రూ ఆగడాలు, అరాచకాలు తట్టుకోలేక అంబేద్కర్ రాజీనామా చేసి బయటికి వచ్చారు. అంబేద్కర్ కి భారతరత్న ఇవ్వడానికి కాంగ్రెస్ ఒప్పుకోలేదు. అంబేద్కర్ రాజకీయ చరిత్ర లేకుండా చేసింది కాంగ్రెస్. అప్పట్లో జనసంఘ్ పార్టీ అంబేద్కర్కి ఎంఎల్సీ ఇచ్చి గౌరవించింది. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ స్మృతి వనం కట్టలేదు’ అని విమర్శించారు. కిషన్రెడ్డి మాట్లాడుతూ.. ‘అంబేద్కర్ ఆలోచన విధానాలతో మోదీ ప్రభుత్వం ముందుకు వెళుతుంది. అంబేద్కర్ ఆలోచన విధానాలకి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వెన్ను పోటు పొడిచిందో ప్రజలోకి తీసుకెళ్లాలి. మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ ఏ విధంగా అడ్డుకుందో అందరికీ తెలుసు. అసెంబ్లీ, పార్లమెంట్లకు గిరిజనులు, దళితులు, మహిళలని వెళ్ళకుండా కాంగ్రెస్ అడ్డుకుంది. సీట్లు పెంపు ద్వారా అందరూ లబ్ది పొందేవారు. దక్షిణ భారతదేశంకి అన్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి, స్టాలిన్, రాహుల్ గాంధీ మాట్లాడారు. ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా ఒకే నిష్పత్తిలో సమాంతరంగా సీట్లు పెంచాలని మోదీ నిర్ణయం తీసుకున్నారు. రేవంత్ రెడ్డి, స్టాలిన్, రాహుల్ గాంధీ వల్ల దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరిగింది. కాంగ్రెస్ 50 ఏళ్ళు పాలించినపుడు ఏ రోజు కూడా బీసీలు గుర్తుకు రాలేదు’ అని మండిపడ్డారు.‘వచ్చే నెల పదోవ తేదీన తెలంగాణకు ప్రధాని మోదీ వస్తున్నారు. మూడోసారి ప్రధాని అయిన తరువాత మొదటి సారి హైదరాబాద్కి మోదీ వస్తున్నారు. ప్రధాని మోదీ తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడంతో పాటు జాతికి అంకితం చేస్తారు. వచ్చే నెల 10 వ తేదీ న పెరెడ్ గ్రౌండ్ లో నాలుగు గంటలకు ప్రధాని బహిరంగ సభలో పాల్గొంటారు’అని స్పష్టం చేశారు. -
‘రేవంత్ పేరు చెప్పాలంటేనే మొహం తిప్పుకుంటున్నారు’
సాక్షి,హైదరాబాద్: దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు అంతా ముందుకు వస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆదివారం హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి పలువురు తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో హుజూర్ నగర్లో భారీగా ఓట్లు వచ్చాయి. దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు అంతా ముందుకు వస్తున్నారు. హుజూర్నగర్లో గతంలో ఎమ్మెల్యే పార్టీ మారినా కార్యకర్తలు మారలేదు. కేసీఆర్ నాయకత్వంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిన నాయకుడు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. హుజూర్ నగర్ నియోజకవర్గంలో అనామకుడైన సైదిరెడ్డిని గెలిపించాం. 2023 శాసన సభ ఎన్నికల్లో ఓడిపోగానే పార్టీని వదిలిపెట్టి పోయారు. హుజూర్ నగర్లో దుర్మార్గమైన కాంగ్రెస్ వైఖరీని బీఆర్ఎస్ శ్రేణులు పోరాట స్పూర్తితో ఎదుర్కొంటున్నారు. సైదిరెడ్డి ఆయన సొంత ఊరులో సర్పంచ్ని గెలిపించుకోలేక పోయారు. ఆనాడు జలదృశ్యంలో గులాబీ జెండా ఎగిరింది. తెలంగాణ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగిరి 25 యేండ్లు పూర్తి చేసుకొని 26 వసంతంలోకి అడుగుపెడుతోంది. దేశంలో ఏ పార్టీకి లేని విశిష్టత ఒక్క బీఆర్ఎస్ పార్టీకే ఉంది.సీఎం రేవంత్రెడ్డికి ఐడెంటిటీ క్రైసిస్ ఉంది.. అందుకే కేసీఆర్ను విమర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి పేరును ఎవరూ గుర్తు పెట్టుకోవడం లేదు. రేవంత్ పేరు చెప్పాలంటేనే మొహం తిప్పుకుంటున్నారు. గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసింది. ఒక్కొక్క కాంగ్రెస్ నేత కమల్హాసన్ను మించి యాక్టింగ్ చేస్తున్నారు. వంద రోజుల్లోనే గ్యారెంటీలు అమలు చేస్తామని నమ్మించారు. బాండ్లు పేపర్లు రాసి, దేవుడి మీద ఒట్టు వేశారు. 420హామీలు, 13 డిక్లరేషన్లు ఏమయ్యాయి?. మాటలు ఆకాశన్నంటాయి.. చేసింది మాత్రం సున్నా.. కాంగ్రెస్కు ఓటేసి తప్పు చేశామని నల్గొండ రైతులు చెబుతున్నారు’అని తెలిపారు. -
‘పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్పై వదంతులు నమ్మొద్దు’
హైదరాబాద్: తెలంగాణలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ సరఫరాకు నిల్వలు సమృద్ధిగా ఉన్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు ఎటువంటి అపోహలకు గురి కావద్దని సూచించారు. రోజుకి 9,574 కిలోలీటర్ల పెట్రోల్, 14,457 కిలో లీటర్ల డీజిల్ మొత్తం 24 వేల కిలో లీటర్ల పైగా పెట్రోల్, డీజిల్ను బంకుల ద్వారా వాహనదారులకు పోస్తున్నట్లు తెలిపారు. అలాగే వినియోగదారులకు 2 లక్షల 22 వేల కు పైగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేస్తున్నట్లు తెలిపారు. పెట్రోల్,డీజిల్ సరఫరా, గ్యాస్ డెలివరీలపై పౌర సరఫరాల శాఖ టోల్ ఫ్రీ నెంబర్ 1967కు ఫోన్ చయొచ్చని కోరారు.కాగా, రెండు రోజులపాటు బంకుల్లో పెట్రోల్, డీజిల్ ఉండదన్న వదంతులతో ఖమ్మం నగరంలో వాహనదారుల పెట్రోల్ బంక్ల ముందు క్యూ కట్టారు. రాత్రి నుంచి వాహనదారులు పెట్రోల్ బంకుల ముందు నిలబడుతున్నారు. కొన్ని బంకులు మూసివేసి ఉండటంతో వాహనదారుల్లో ఆందోళన మొదలై బంకుల ముందు క్యూ కడుతున్నారు. పెట్రోల్, డీజిల్ దొరకదని అపోహలతో కొంతమంది వ్యక్తులు క్యాన్లలో నింపుకుని పోతున్న వీడియోలు వైరల్గా మారాయి. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ సహా పలు నగరాల్లోనూ ఇటువంటి ఘటనలే చోటుచేసుకున్న విషయం తెలిసిందే. -
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 26-మే 03)
-
విద్యార్థినిపై టీచర్ ప్రేమ.. ఆమె కోసం అర్ధరాత్రి..
సాక్షి, నల్లగొండ: ఉన్నత విలువలు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే తాను చదువు చెబుతున్న విద్యార్థినిపై ప్రేమ పెంచుకుని అర్ధరాత్రి వేళ ఆమె ఇంట్లోకి చొరబడేందుకు యత్నించాడు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి జరగగా.. శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. కనగల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని చండూరు పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. వేసవికాలం కావడంతో సదరు పాఠశాలకు సెలవులు ఇచ్చారు. అదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వ్యక్తి సదరు విద్యార్థినిపై ప్రేమ పెంచుకున్నాడు. ఎలాగైనా విద్యార్థినిని కలవాలని బుధవారం అర్ధరాత్రి ఆమె ఇంట్లోకి చొరబడ్డాడు. తలుపు తీస్తున్న క్రమంలో శబ్దం రావడంతో బయటే నిద్రిస్తున్న విద్యార్థిని తండ్రి టీచర్ను గుర్తించి పట్టుకునే ప్రయత్నం చేశాడు.దీంతో ఆ టీచర్ తప్పించుకొని సొప్ప చేను, గడ్డివాముల్లో తలదాచుకున్నాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులంతా ఏకమై గ్రామాన్ని జల్లెడ పట్టి సదరు టీచర్ను పట్టుకొని దొంగగా భావించి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి విచారించగా.. తాను దొంగను కాదని, విద్యార్థిని కోసమే వచ్చానని సదరు టీచర్ అసలు విషయం చెప్పాడు. ఈ ఘటనపై కనగల్ ఎస్ఐ రాజీవ్రెడ్డిని వివరణ కోరగా.. సదరు టీచర్ విద్యార్థిని కోసమే ఇంట్లోకి చొరబడినట్లు ఒప్పుకున్నాడని, విద్యార్థిని తల్లిదండ్రులు ఫిర్యాదు ఇస్తే కేసు నమోదు చేస్తామని తెలిపారు.ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వకుండా జాప్యం చండూరు పట్టణంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వగా.. సదరు ఉపాధ్యాయుడు చదువు చెప్పే పాఠశాలలో మాత్రం ఇప్పటివరకు ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వడం లేదు. ఈ విషయం అందరికీ తెలియడంతో.. ప్రోగ్రెస్ కార్డులకు వచ్చే తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యంపై తిరగబడే అవకాశం ఉండడంతోనే జాప్యం చేస్తున్నట్లు సమాచారం. -
కట్టుకోబోయేవాడే చంపాడు..
సాక్షి, మరిపెడ: ఇద్దరు ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించారు. వివాహ ముహూర్తానికి వారం రోజులే సమయం.. ఆలోగా కాబోయే భార్యపై అతనికి అనుమానం మొదలైంది. పక్కా ప్లాన్ప్రకారం పండుగ కోసం అని పిలిపించి ఓ బావిలో తోసి చంపాడు. ఈ ఘటనలో నిందితుడిని అరెస్ట్ చేసి పోలీసులు కటకటాల్లోకి పంపారు.మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్స్టేషన్లో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీఐ పవన్కుమార్ వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని కొత్తతండాకు చెందిన అజ్మీరా అరవింద్.. మరిపెడ మండలం ఇటుకలగడ్డతండాకు చెందిన భూక్య సంగీత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో కొంతకాలం దూరంగా ఉన్నారు. మళ్లీ మాట్లాడుకుని ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించారు. ఈనెల 29న పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు.కానీ, సంగీత వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందని అరవింద్ అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆమె అడ్డు తొలగించుకోవాలని ప్లాన్వేశాడు. ఈ క్రమంలో ఈ నెల 21వ తేదీన తన ఇంట్లో ఎల్లమ్మ పండుగ ఉందని చెప్పి సంగీతను ఇంటిదగ్గరే ఉండమని చెప్పి ఆమె కుటుంబ సభ్యులను కొత్తతండాకు పిలిపించాడు. అరవింద్ ఇటుకలగడ్డతండాకు బైక్పై వెళ్లి సంగీతను ఊరి చివరకు రమ్మని చెప్పాడు. వచ్చిన తర్వాత ఆమెను బైక్పై ఎక్కించుకొని ఇదే మండలం గారిపురం శివారు రోడ్డు వెంబడి ఉన్న బావి వద్దకు తీసుకెళ్లాడు.పథకం ప్రకారం మాటల్లో పెట్టి బావిలోకి తోసేశాడు. ఆమె చనిపోయేంతవరకు అక్కడే ఉన్నాడు. చనిపోయినట్లు నిర్ధారించుకుని తిరిగి కొత్తతండాకు వచ్చాడు. మొదట అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం కాబోయే భర్త అరవిందే నిందితుడిగా నిర్ధారించారు. అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చినట్లు సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్సైలు వీరభద్రరావు, కోటేశ్వరరావు పాల్గొన్నారు. -
హైదరాబాద్లో సొంత ఇల్లా.. అద్దెనా?
సాక్షి, సిటీ బ్యూరో: జనగణన– 2027లో భాగంగా కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్)లోని జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలతోపాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్కు నేటి (ఆదివారం) నుంచి మే 10 వరకు అవకాశం ఉంది. ఈ గడువులో https:// se. census. gov.in పోర్టల్ ద్వారా ప్రజలు ఉదయం 6 నుంచి రాత్రి 12 గంటల వరకు తమ ఇంటి వివరాలను తామే స్వయంగా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. జనగణనకు సంబంధించి సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ భారతి హోళికేరి, ‘క్యూర్’ పరిధి వరకు ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ శనివారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 33 ప్రశ్నలు.. 20 నిమిషాలు ఇందులో మొత్తం 33 పశ్ర్నలుండగా, నాలుగింటిని ఎన్యూమరేటర్లు నమోదు చేస్తారు. మిగతావాటికి ప్రజలే సమాధానం ఇవ్వొచ్చు. గుడిసెలు సహా అన్ని నివాస భవనాలను నమోదు చేయడం అధికారుల ప్రధాన విధి. ప్రశ్నలన్నీ ఇల్లు, మౌలిక సదుపాయాలు, వాహనాలు తదితరాలకు సంబంధించినవి. వాటిని కూడా ఉన్నదీ, లేనిదీ తెలియజేస్తే చాలు. అంతే తప్ప ఎన్ని వాహనాలున్నాయో తెలపాల్సిన పనిలేదు. కాకపోతే నివాస గృహం సొంతమా, అద్దెనా అన్నది తెలియజేయాలి. ఇక్కడ అద్దె ఇల్లు అయితే వేరే చోట సొంత ఇల్లు ఉందా అనే విషయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. ఈ నమోదు ప్రక్రియ మొత్తం దాదాపు 20 నిమిషాల్లో పూర్తవుతుందని వారు తెలిపారు.సబ్మిట్ చేశాక ప్రత్యేక సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడీ (ఎస్ఈ ఐడీ) జారీ అవుతుంది. ఈ ప్రక్రియలో ఆధార్ కానీ, ఇతరత్రా రుజువులు కానీ, ఫొటోలు కానీ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. కుటుంబ సభ్యులెవరైనా ఇంటి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయొచ్చు. సురక్షితమైన వెబ్ పోర్టల్ ద్వారా ఇంటి నుంచి కానీ, కార్యాలయం నుంచి కానీ లేదా ఎక్కడి నుంచైనా వివరాలు నమోదు చేయవచ్చు. ప్రస్తుతం ఎక్కడ నివాసం ఉంటున్నారో ఆ ఇంటి వివరాలే ఇవ్వాలని తెలిపారు. నమోదు విధానం ఇలా.. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రారంభించడానికి ముందు రాష్ట్రం పేరు, క్యాప్చా వంటివి నమోదు చేయాలి. ఆ తర్వాత కుటుంబ యజమాని పేరు, మొబైల్ నంబర్ ఇవ్వాలి. ఈమెయిల్ ఐడీ కూడా ఇవ్వవచ్చు. కుటుంబ యజమాని పేరు ఒకసారి నమోదు చేసిన తర్వాత మార్చడం కుదరదు. ఒక మొబైల్ నంబర్ను ఒక ఇంటి వివరాల నమోదుకు మాత్రమే వాడాల్సి ఉంటుంది. మొబైల్కు వచ్చిన ఓటీపీ నమోదు చేశాక, భాషను ఎంచుకోవచ్చు. 16 భాషల్లో సదుపాయం ఉంటుంది. తర్వాత జిల్లా, పిన్కోడ్, లొకాలిటీ, తదితర వివరాలతో తమ ఇంటిని మ్యాప్లో గుర్తించాలి. మ్యాప్లో కనిపించే మార్కర్ను తమ ఇంటిపైకి తీసుకెళ్లి లొకేషన్ కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. లొకేషన్ సరిగా గుర్తించకపోతే ఎన్యూమరేటర్కు డేటా అందకపోవచ్చు. నమోదు చేసిన వివరాలను సరి చూసుకునేందుకు అవకాశం ఉంటుంది.ఒకేసారి కాకపోతే అప్పటి వరకు భర్తీచేసిన వివరాలను సేవ్ చేసుకొని తర్వాత భర్తీ చేసే సదుపాయం కూడా ఉంటుంది. అన్నీ సరిచేసి, నిర్ధారించుకుని సబ్మిట్ చేశాక మార్చడం కుదరదు. సబ్మిట్ తర్వాత మొబైల్ నంబర్కు, మెయిల్ఐడీ ఇస్తే మెయిల్కు కూడా హెచ్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే 11 అంకెల ఎస్ఈ ఐడీ వస్తుంది. దాన్ని ఎన్యూమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు చూపిస్తే పరిశీలించి ధువ్రీకరిస్తారు. ఈ డేటా గోప్యంగా ఉంటుందని, ఎవరికీ సమాచారం వెళ్లదని స్పష్టం చేశారు. వివరాలిస్తే ప్రజలు తమకు అందుతున్న సంక్షేమ పథకాలు అందకుండా పోతాయని భయపడాల్సిన పనిలేదన్నారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రజలకు సదుపాయమే తప్ప, తప్పనిసరి కాదు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోకుంటే , ఎన్యూమరేటర్లే వివరాలు నమోదుచేస్తారు. గ్రేటర్లో సన్నాహాలు గేట్రర్లో 60 సర్కిళ్లు, కంటోన్మెంట్కు 61 మంది చార్జ్ ఆఫీసర్లను నియమించారు. 19,865 హౌస్లిస్టింగ్ బ్లాక్స్ను(హెచ్ఎల్బీ) గుర్తించి మార్కింగ్ పూర్తి చేసినట్లు జీహెచ్ఎంసీ తెలిపింది. 21,866 మంది ఎన్యూమరేటర్లు, 3,662 సూపర్వైజర్లు అవసరమని గుర్తించారు. ఇప్పటి వరకు 8,067 ఎన్యూమరేటర్లకు, 1379 మంది సూపర్వైజర్లకు శిక్షణ ఇచ్చారు. హెల్ప్లైన్ నంబర్: 1855. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు.సెల్ఫ్ఎన్యూమరేషన్ మహోత్సవ్ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జీహెచ్ఎంసీ సెల్ఫ్ఎన్యూమరేషన్ మహోత్సవ్ పేరిట 15 రోజులు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనుంది. మెట్రో పిల్లర్లు, బస్సులు, హోర్డింగ్స్, ప్రకటనల ద్వారా కూడా పచ్రారం చేయనున్నట్లు కర్ణన్ పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. -
తెలంగాణకు ప్రధాని మోదీ.. ముహూర్తం ఫిక్స్
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 9న తెలంగాణ పర్యటనకు రానున్నట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి. 4న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక రాష్ట్రానికి ఆయన వస్తారని వెల్లడించాయి. 9న వరంగల్లో మామునూరు ఎయిర్పోర్టు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించనున్న బహిరంగసభలో ఆయన పాల్గొననున్నారు.బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక తెలంగాణకు తొలిసారిగా మోదీ రానుండటంతో ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇందులో భాగంగా ఎంఎంటీఎస్ ఫేజ్–2ను జాతికి అంకితం చేయడంతోపాటు బీబీనగర్ ఎయిమ్స్ను కూడా జాతికి అంకితం చేసే అవకాశాలున్నాయి.కాగా, మల్లారెడ్డి ఏఐ యూనివర్సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోదీ పాల్గొంటారా? లేదా? అన్న దానిపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.గౌతంరావు వెల్లడించారు. బీజేపీ కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు తూళ్ల వీరేందర్గౌడ్, అశోక్ వేములతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ శనివారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్రంలో చోటుచేసుకున్న తాజా రాజకీయ పరిణామాలు, అంశాలపై చర్చించినట్టు తెలిపారు. -
‘ప్లేట్’ ఫిరాయించారు.. దొరికిపోయారు!
గచ్చిబౌలి: నంబర్ ప్లేట్ కనిపించకుండా మాగ్నెట్ అమర్చిన ఓ బైకిస్ట్ రాయదుర్గం ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డాడు. సైనిక్పురికి చెందిన కమ్రాన్ (28) ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని ఓ నిర్మాణ సంస్థలో సేల్స్మన్గా పని చేస్తున్నాడు. శనివారం బైక్పై వెళ్తుండగా ముందు వైపు నంబర్ ప్లేట్ లేకపోవడంతో బయోడైవర్సిటీ వద్ద రాయదుర్గం ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. వెనక వైపు బైక్ టీఎస్ 07ఈఈకే9777 నంబర్ ప్లేట్ ఉంది. ఎస్ఐ నాగరాజు బైక్ను క్షుణ్ణంగా పరిశీలించగా.. వెనక నంబర్ ప్లేట్కు కమ్రాన్ మాగ్నెట్ (అయస్కాంతం) అమర్చాడు. అవసరమైనప్పుడు నంబర్ ప్లేట్ పైకి వెళ్తుంది. దీంతో వెనక నంబర్ ప్లేట్ కూడా కనిపించకపోవడంతో ట్రాఫిక్ చలానాల నుంచి తప్పించుకుంటున్నాడు. రాయదుర్గం లా అండ్ ఆర్డర్ పీఎస్లో ఫిర్యాదు చేసినట్లు ట్రాఫిక్ ఎస్హెచ్ఓ పవన్ తెలిపారు. ట్రాఫిక్ చలానాలు తప్పించుకోవాలని.. గోల్కొండ: ట్రాఫిక్ చలానాలతో పాటు ఫైనాన్స్ రికవరీ ఏజెంట్ల నుంచి తప్పించుకునేందుకు ద్విచక్ర వాహనానికి నకిలీ రిజి్రస్టేషన్ నంబర్ ప్లేట్ను బిగించిన మహమ్మద్ మోహినుద్దీన్ను శనివారం ట్రాఫిక్ పోలీసుల పట్టుబడ్డాడు. టోలిచౌకీ–గచి్చబౌలి రోడ్డుపై వాహన తనిఖీలు చేస్తున్న క్రమంలో యాక్టివా వాహనంపై వస్తున్న వ్యక్తిని ఆపి ధ్రువీకరణ పత్రాలను తనిఖీ చేయగా.. ఆర్సీలో వాహన నంబర్ టీఎస్12ఈఆర్2466 ఉండగా.. నంబర్ ప్లేట్పై టీఎస్11ఈయూ5327 అని ఉంది. షేక్ రియాజ్ అనే వ్యక్తి నుంచి వాహనాన్ని కొనుగోలు చేసినట్లు మహమ్మద్ మోహినుద్దీన్ వివరించాడు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టోలిచౌకీ ఇన్స్పెక్టర్ ఎల్.రమేష్నాయక్ తెలిపారు. -
హైదరాబాద్ కలెక్టర్గా ప్రియాంక అల
సాక్షి, హైదరాబాద్: కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలోని పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ కావడం సంచలనంగా మారింది. కొంత కాలంగా పనితీరు బాగాలేని అధికారులను బదిలీ చేస్తామంటున్న ప్రభుత్వం.. తాజాగా జరిపిన ఐఏఎస్ల బదిలీల్లో నగరంతో సంబంధమున్న వారు పలువురుండటం హాట్ టాపిక్గా మారింది. రాష్ట్రంలోనే ఆర్థిక ఇంజిన్గా ఉన్న క్యూర్ పరిధిలోని అధికారులు బదిలీ కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన ఎల్ఈటీ అండ్ఎఫ్ డిపార్ట్మెంట్ సెక్రటరీగా బదిలీ కాగా.. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ప్రియాంక అల హైదరాబాద్ కలెక్టర్గా నియమితులయ్యారు. జోన్లకు జవసత్వాలు? క్యూర్లోని ఆరు జోన్ల జోనల్ కమిషనర్లను మార్చడం సంచలనంగా మారింది. ఆరోగ్యశ్రీ హెల్త్కేర్ ట్రస్ట్ సీఈఓ పి.ఉదయ్కుమార్ను గోల్కొండ జోనల్ కమిషనర్గా, నాగర్ కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్ను ఖైరతాబాద్ జోనల్ కమిషనర్గా, మిర్యాలగూడ సబ్కలెక్టర్ నారాయణ్ అమిత్ను శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్గా, బోధన్ సబ్కలెక్టర్ వికాస్ మహతోను ఎల్బీనగర్ జోనల్ కమిషనర్గా, కాటారం సబ్కలెక్టర్ మయాంక్సింగ్ను కూకట్పల్లి జోనల్ కమిషనర్గా నియమించారు. ప్రస్తుతం చారి్మనార్ జోనల్ కమిషనర్గా ఉన్న ఎస్. శ్రీనివాస్రెడ్డి (నాన్ క్యాడర్)ను రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్గా నియమించారు. గోల్కొండ జోనల్ కమిషనర్ ముకుందరెడ్డిని ఐఅండ్పీఆర్ స్పెషల్ సెక్రటరీగా బదిలీ చేశారు. ప్రతీక్ జైన్ను సంగారెడ్డి కలెక్టర్గా బదిలీచేశారు. బాన్స్వాడ సబ్కలెక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టిని రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్గా నియమించారు. క్యూర్ పరిధిలోని అధికారులు కొద్దికాలం గడవకముందే బదిలీ అవుతుండటంతో పాలన వ్యవస్థ గాడిన పడటం లేదు. మూడు కార్పొరేషన్లుగా మారాక ఇంకా బాలారిష్టాల్లోనే ఉన్న కొత్త కార్పొరేషన్ల పరిస్థితి మళ్లీ మొదటికొచ్చినట్లయింది. -
నేటి నుంచి ఉప్పల్ చౌరస్తా బంద్
హైదరాబాద్: ప్రతిరోజూ అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్ చౌరస్తాను ఆదివారం నుంచి మూసివేయనున్నారు. ఇక్కడి విద్యుత్ జంక్షన్ సమీపంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రింగ్రోడ్ నుంచి వరంగల్ వైపు వెళ్లే రహదారిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు శనివారం అధికారులు ప్రకటించారు. వరంగల్ వైపు వెళ్లే భారీ వాహనా హబ్సిగూడ చౌరస్తా నుంచి నాచారం, మల్లాపూర్, ఐఓíసీ, చెంగిచర్ల మీదుగా జాతీయ రహదారికి చేరుకోవాలి. చిన్న వాహనాలు ఉప్పల్ ఇందిరాగాం«ధీ పార్కు నుంచి లిటిల్ ఫ్లవర్ వెనక నుంచి వరంగల్ రహదారికి చేరుకోవచ్చు. అలాగే.. బోడుప్పల్ నుంచి వచ్చే వాహనాలు ఏషియన్ థియేటర్ వద్ద భగాయత్ లే అవుట్ నుంచి వచ్చే ద్విచక్ర వాహనదారులు నాగోల్ మెట్రో స్టేషన్ పిల్లర్లు 812, 813 నుంచి ఉప్పల్, సికింద్రాబాద్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. భారీ వాహనాలు నాగోల్ బ్రిడ్జీ కిందుగా యూ టర్న్ తీసుకుని ఉప్పల్ వైపు రావాల్సి ఉంటుందని జోనల్ కమిషనర్ రాధిక గుప్తా సూచించారు. ప్రస్తుతం ఉప్పల్ జోనల్ కార్యాలయం పక్కన ఉన్న వరంగల్, హనుమకొండ, యాదగిరిగుట్ట బస్సుల స్టాప్ను తాత్కాలికంగా నల్ల చెరువు కట్ట సమీపానికి మార్చినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం నుంచి వరంగల్, హనుమకొండ, యాదగిరిగుట్ట వెళ్లే ప్రయాణికులంతా నల్లచెరువు కట్ట వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్టాప్ నుంచి తమ గమ్యస్థానాలకు వెళ్లాల్సిందిగా సూచించారు. -
చార్మినార్ ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం!
సాక్షి, యాదాద్రి: చెన్నె నుంచి హైదరాబాద్ వెళ్తున్న చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు రైల్వే స్టేషన్ సమీపంలో, ఒక్కసారిగా S-5 (ఎస్-5) కోచ్లో మంటలు చెలరేగాయి. నిద్రలో ఉన్న ప్రయాణికులు మంటలు, దట్టమైన పొగను గమనించి భయంతో కేకలు వేస్తూ, గొలుసులాగి, కిందికి దూకడంతో పలువురికి గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే రైల్వే సిబ్బంది అప్రమత్తమై చర్యలు చేపట్టారు. మంటలు ఇతర కోచ్లకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, స్థానిక అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మంటలను అదుపు చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అదృష్టవశాత్తూ ప్రయాణికులందరూ అప్రమత్తంగా ఉండటంతో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. అయితే, ఈ అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. రైల్వే అధికారులు ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. -
రాష్ట్రంలో కర్కోటకుడి పాలన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (టీఆర్ఎస్) పేరిట కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్లోని అద్వయ కన్వెన్షన్ సెంటర్లో శనివారం కొత్త పార్టీ పేరు, జెండా, ఎజెండాపై కవిత ప్రసంగించారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమ రథం దారి తప్పి సామాజిక రథ చక్రం విరిగి ముక్కలైందన్నారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆత్మను కోల్పోయిందని, కేసీఆర్ మన మనిషిలా కాకుండా ‘మర మనిషి’లా తయార య్యాడన్నారు. బీఆర్ఎస్ కుటుంబ పాలనలో తాను భాగస్వామిగా ఉండటం పట్ల క్షమాపణలు కోరారు. తన తప్పును సరిదిద్దుకునేందుకు కొత్త పార్టీతో ప్రజల ముందుకొస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కుటుంబ పాలన, బంధుప్రీతి, అవినీతి, అవినీతిపై పాంచజన్యం పూరిస్తున్నట్లు కవిత ప్రకటించారు. ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే... ఈనాటి కేసీఆర్ మర మనిషి.. ‘గుంటనక్కలు, తోడేళ్ల నడుమ ఖైదీ అయిన కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదు.. మారిన మనిషి, ఆత్మలేని మర మనిషి. ప్రజలకు కష్టాలు వచ్చినా ఆ సారు.. రారు. గుంటనక్కలు, తోడేళ్ల నడుమ బందీ అయ్యారు. తెలంగాణ ప్రజలను పట్టించుకోకుండా జాతీయ పార్టీ అంటూ పంజాబ్, గుజరాత్, బిహార్కు వెళ్లారు. కేసీఆర్కు తెలంగాణ వచ్చిన తర్వాత అధికారం ముందు ప్రజల మీద మమకారం పోయిందా. కేసీఆర్ నాకు తండ్రి అయినా రాజకీయ పరిణతి కోల్పోయి మాట్లాడుతున్నారు, కేటీఆర్కు పెద్దగా ఏమీ తెలియదు. ప్రజలు తప్పు చేశారని అంటున్న కేసీఆర్.. రాష్ట్రంలో కర్కోటకుడి పాలన నడుస్తున్నా బయటకు రావడం లేదు. నా ప్రశ్నలకు బీఆర్ఎస్ సమాధానం చెప్పకపోతే ప్రజలే మిమ్మల్ని బయటకు లాగి చెప్పిస్తారు. ఉద్యమకారులకు జరిగిందే నాకు జరిగింది ‘నాడు ఉద్యమకారులకు జరిగిందే.. ఇప్పుడు నాకు జరిగింది. కేసీఆర్ కోసం ఇళ్లు, భూములు అమ్ముకున్న వాళ్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు. మనల్ని లాఠీలతో కొడితే తల్లి కోడిలా కాపాడుకోవాల్సిన కేసీఆర్ ఎక్కడ పోయిండు. అవినీతి పేరిట నన్ను సస్పెండ్ చేసి అవినీతి చేసిన పందికొక్కులను పక్కన పెట్టుకున్నారు. అందుకే కేసీఆర్కు ఎదురు నిలిచి కొట్లాడేందుకు పార్టీతో వస్తున్నా. ఇక ముందున్నది ముసళ్ల పండుగ. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల కలలు నిజం కాలేదు. రాజకీయ శక్తితో ప్రజాపోరాటాలు మిళితం చేసి సామాజిక న్యాయ తెలంగాణను సాధిస్తాం. బీఆర్ఎస్ అనే పార్టీ తెలంగాణ ఆత్మ కోల్పోయింది. అందుకే తెలంగాణ రాష్ట్ర సేన వచ్చింది. తెలంగాణలోని మూడున్నర కోట్ల మందికి ఒక అమ్మలాగా పరిణితి చెందాలని అనుకుంటున్నా. రాష్ట్రంలో కర్కోటకుడి పాలన రాష్ట్రంలో ఒక కర్కోటకుడి పాలన నడుస్తోంది. వెలుగుమట్లలో అనుమతులు ఉన్న ఇళ్లను కూలగొడితే గర్భిణికి అబార్షన్ అయింది. గురుకులాల్లో విషం పెట్టి పిల్లలను చంపితే సీఎం పట్టించుకోవడం లేదు. కర్ల రాజేశ్ మృతికి కారకులపై హోంమంత్రిగా ఉన్న సీఎం రేవంత్ కేసులు కూడా పెట్టించలేకపోయారు. కాంగ్రెస్ మీద కచ్చితంగా మనమే పోరాటం చేస్తాం. ఇప్పుడు మనమే ప్రధాన ప్రతిపక్షం. రెండేళ్ల తర్వాత అధికారంలోకి వస్తాం. రాహుల్ను ప్రధాని చేసేందుకు కాంగ్రెస్, పెద్దసారును ఫామ్హౌజ్కు పరిమితం చేసి చిన్నసారును సీఎం చేసేందుకు బీఆర్ఎస్, దేశంలో సామాజిక న్యాయాన్ని ఖతం చేసేందుకు బీజేపీ పనిచేస్తున్నాయి. తెలంగాణ రావడం ఇష్టంలేని బీజేపీ రాష్ట్ర ఏర్పాటును భారత్ పాక్ విభజనతో పోలుస్తున్నా రాష్ట్ర బీజేపీ బానిస ఎంపీలు మాట్లాడటం లేదు. పాంచజన్యం పూరిస్తున్నా.. తెలంగాణ రాష్ట్ర సేన ఐదు అంశాలపై పాంచజన్యం పూరిస్తోంది. ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తాం. ఊరికో బడి, తరగతికో ఉపాధ్యాయుడు ఉండేలా చూస్తా. మీ అమ్మలా జేబు చూడకుండా కడుపు చూస్తా. ప్రభుత్వ కార్యాలయాల్లో రైతులను గౌరవించే వ్యవస్థ ఉంటుంది. యువతకు రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు ఉపాధి కోసం ఆర్థిక సాయం అందిస్తా. అధికారంలోకి వస్తే ఒకే నోటిషికేషన్ ద్వారా 4 లక్షల ఉద్యోగాలు, ఉద్యమకారుల కోసం లక్ష సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టిస్తాం. సామాజిక న్యాయ తెలంగాణ సాధన కోసం పనిచేస్తాం’ అని కవిత చెప్పారు. పసుపు.. నీలం.. ఆకుపచ్చ కల్వకుంట్ల కవిత శనివారం తన కొత్త పార్టీ పేరుతోపాటు జెండాను కూడా ఆవిష్కరించారు. పార్టీ జెండాలో పసుపు, నీలం, అకుపచ్చ రంగుల్లో పార్టీ జెండా మధ్యలో తెలంగాణ భౌగోళిక చిత్రపటం పొందు పరిచారు. జెండా మధ్యలో ఇంగ్లిషు అక్షరాల్లో టీఆర్ఎస్ పేరును చేర్చారు. సుమారు 50 నిమిషాలపాటు కవిత ప్రసంగం సాగింది. కార్యకర్తలు ఇచ్చిన పాంచజన్యం (శంఖం)ను పూరించారు. సభలో పాల్గొనేందుకు వచ్చిన వారు ఏఐ టెక్నాలజీ సాయంతో గ్రీన్మ్యాట్పై కవితతో కలిసి ఉన్నట్లుగా ఫొటోలు దిగారు. కవిత కుమారుడు ప్రజల మధ్య కూర్చొని తల్లి ప్రసంగాన్ని ఏకాగ్రతతో వింటూ కనిపించారు. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన కార్యకర్తలు, సింగరేణి కార్మికులు సహా అన్నీ వర్గాల ప్రజలు ముఖ్యంగా మహిళలు, యువత నడుమ సభ ఉత్సాహభరితంగా సాగింది. ‘టీ’ ఆకారంలో ఏర్పాటు చేసిన సభా వేదిక ప్రజలను ఆకర్షించింది. సభకు వచ్చిన ప్రతినిధులకు తెలంగాణ వంటకాలతో భోజనాలు పెట్టారు. -
ఎకరా కనిష్టంగా రూ.6 లక్షలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరోమారు భూముల ప్రభుత్వ విలువల సవరణకు రంగం సిద్ధమవుతోంది. వచ్చే నెల మొదటి వారంలో సవరించిన భూముల విలువలను అమల్లోకి తేవాలని ఆదాయ వనరుల సమీకరణపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం తాజా ఆదేశాల నేపథ్యంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఇందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈసారి భూముల విలువల సవరణను సానుకూలతను బట్టి చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో విలువల సవరణకు ఉన్న డిమాండ్ ఆధారంగా కొత్త విలువలను నిర్ధారించాలని ఇప్పటికే క్షేత్రస్థాయి యంత్రాంగానికి సూచనలిచ్చింది. ఈమేరకు ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి ప్రతిపాదనలు వచ్చాయని, వీటిని థర్డ్ పార్టీ రూపొందించిన అంచనాలతో పోలుస్తున్న ఉన్నతాధికారులు సవరించిన విలువల నిర్ధారణలో తుది అంకానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఉదారంగా... ఉన్నఫళంగా కాకుండా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో జరుగుతున్న చర్చ ప్రకారం ఈసారి వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువలను ఉదారంగానే పెంచనున్నట్టు తెలుస్తోంది. మైదాన ప్రాంతాల్లో ప్రస్తుతం వ్యవసాయ భూమి ఎకరం కనిష్ట విలువ రూ.3 లక్షలుండగా, దాన్ని 100 శాతం పెంచి రూ.6 లక్షలుగా నిర్ధారించనున్నారు. వ్యవసాయ భూముల ప్రభుత్వ విలువల పెంపు విషయంలో బహిరంగ మార్కెట్లో ఉన్న రేట్లను పరిగణనలోకి తీసుకున్నారు. బహిరంగ మార్కెట్లో ఉన్న భూమి రేటులో 50–60 శాతంగా విలువను సవరించాలని నిర్ణయించారు. అయితే, బహిరంగ మార్కెట్లో ఎకరం భూమి విలువ రూ.20 లక్షలుంటే అందులో 50–60 శాతం అంటే ప్రభుత్వ విలువను కనీసం రూ.10–12 లక్షల వరకు నిర్ధారించాల్సి ఉంటుంది. కానీ, ఉదారంగా పెంచాల్సిన పరిస్థితుల్లోనూ ఉన్నఫళంగా ఎక్కువ పెంచకుండా, ప్రస్తుతం ఉన్న విలువలకు గరిష్టంగా 100 శాతం మించకుండా సవరించిన విలువలు నిర్ధారించనున్నారు. అంటే బహిరంగ మార్కెట్లో రూ.20 లక్షలున్న ఎకరం భూమి ప్రభుత్వ విలువను గరిష్టంగా ప్రస్తుతమున్న విలువ కంటే 100 శాతం అదనంగా నిర్ధారించనున్నారు. బహిరంగ మార్కెట్లో 50–60 శాతం, ప్రస్తుత విలువ కంటే 100 శాతంలో ఏది తక్కువ ఉంటే దాన్ని నిర్ధారించనున్నారు. కొన్నిచోట్ల 100 శాతం కంటే అనివార్యంగా పెంచాల్సి ఉంటే అందుకు గల కారణాలను ప్రత్యేకంగా ప్రస్తావించి పెంచనున్నట్టు తెలుస్తోంది. ఇక, ఓపెన్ ప్లాట్ల విలువలు కూడా భారీగానే సవరించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం చదరపు గజానికి ఉన్న విలువలో 30–50 శాతం వరకు విలువలు సవరించనున్నారు. 39 చోట్ల భారీగానే.. ఔటర్ రింగురోడ్డు (ఓఆర్ఆర్) పరిధిలోని 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అపార్ట్మెంట్లలోని ఫ్లాట్ల విలువలనూ భారీగానే పెంచనున్నారు. ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో ఎక్కువగా ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు జరగనున్న నేపథ్యంలో అవకాశాన్ని బట్టి కొత్త విలువలను నిర్ధారించనున్నారు. గ్రామీణ ప్రాంతాలతో సహా రాష్ట్రంలో ప్రస్తుతం అపార్ట్మెంట్ విలువ చదరపు అడుగు రూ.1,300 ఉండగా, దాన్ని రూ.1,600కు పెంచనున్నారు. ఓఆర్ఆర్ పరిధిలో రూ.2 వేల నుంచి రూ.9,800 వరకు అడుగు విలువ ఉండగా, దాన్ని కనీసం రూ.3వేల నుంచి రూ.12వేల వరకు పెంచే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద ఏటా రూ. 3వేల కోట్ల అదనపు ఆదాయమే లక్ష్యంగా ఈసారి రాష్ట్రంలో భూముల ప్రభుత్వ విలువలను సవరించనున్నట్టు రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. మొదటి వారంలో సాధ్యమేనా? రాష్ట్రంలో సవరించిన ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువలను మే నెల మొదటి వారం నుంచి అమల్లోకి తేవాలని కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన ఆదేశాల అమలు సాధ్యమవుతుందా అనే చర్చ రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాల్లో జరుగుతోంది. వాస్తవానికి, సవరించిన తుది విలువల నిర్ధారణ జరిగిన తర్వాత మున్సిపాలిటీలు, మండలాలు, జిల్లాల్లో ఏర్పాటు చేసిన కమిటీల ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. అనంతరం ప్రభుత్వ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి తోడు సబ్కమిటీ ఇచ్చిన ఆదేశాలు రెవెన్యూ మంత్రి దృష్టిలో ఉన్నాయా, లేదా అన్న సందేహాలు కూడా ఆ శాఖలో వ్యక్తమవుతున్నాయి. ఆ శాఖ కమిషనర్ ఎన్నికల విధుల్లో భాగంగా పశ్చిమబెంగాల్లో ఉండగా, ఆయన మే 5న రాష్ట్రానికి రానున్నారు. ఈ నేపథ్యంలో భూముల ప్రభుత్వ విలువల సవరణపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకున్నా, ఆమలుకు మాత్రం మరికొంత సమయం పడుతుందని తెలుస్తోంది. -
రాజకీయ కవితావేశం!
అంగ వంగ కళింగ రాజ్యాలను ఏకకాలంలో వచ్చేనెల నుంచి బీజేపీ పరిపాలించబోతున్నదని ఆ పార్టీ అగ్రనేత అమిత్ షా చెప్పారు. ఇప్పటికే అంగ (బిహార్), కళింగ (ఒడిషా) రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. మొన్న తొలివిడత పోలింగ్ జరిగిన వంగ (బెంగాల్) రాష్ట్రంలో కూడా తాము అధి కారంలోకి రాబోతున్నామని ఆయన తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. క్రీస్తుపూర్వం కాలంలో తూర్పు భారతాన ప్రవర్ధిల్లిన మూడు ముఖ్య రాజ్యాలను ఉటంకిస్తూ చారిత్రక కోణంలో ఆయనీ వ్యాఖ్యానం చేసి ఉంటారు. కళింగ యుద్ధంలో రక్తపుటే రులు పారించిన అనంతరం అశోక చక్రవర్తి తన దండయాత్రలకు స్వస్తిపలికి బౌద్ధ ధర్మ బోధనకు అంకితమయ్యారు. రికార్డు స్థాయిలో ఓట్ల వరద పారించిన వంగ యుద్ధంలో ఒకవేళ గెలిస్తే రాష్ట్రాలపై బీజేపీ దండయాత్రలు ముగిసిపోతాయా? అటువంటి అవకాశం ఏమాత్రం లేదని చెప్పవచ్చు.దక్షిణ భారతావని ఇంకా కాషాయ ఛత్రఛాయలోకి పూర్తిగా చేరనేలేదు. ఒక్క కర్ణాటకలో మాత్రమే బీజేపీ గెలుస్తూ, ఓడుతూ వస్తున్నది. ఈసారి తమిళనాడు ఎన్నికల్లో ఎన్డీఏ గెలుస్తుందని ప్రచారం చేసుకుంటున్నప్పటికీ ఆ కూటమిలో బీజేపీ జూనియర్ భాగస్వామి మాత్రమే. పైగా ఆ కూటమి గెలిచే అవకాశాలు కూడా అంతంతమాత్రమే. ఏపీ కూటమి సర్కార్లో కూడా బీజేపీది చిన్న వాటానే. తొలిదశలో పోలింగ్ జరిగిన కేరళం ఈసారి కూడా బీజేపీకి కొరుకుడు పడలేదని వార్తలొస్తున్నాయి. మహా అయితే ఒకటి రెండు సీట్లు గెలవవచ్చనే అభిప్రాయం వినబడుతున్నది. బీజేపీ టార్గెట్ లిస్ట్లో అంగ వంగ కళింగల తర్వాత త్రిలింగ రాష్ట్రమున్నదనే వార్తలు చాలాకాలంగా వినిపి స్తున్నాయి. తెలంగాణకు ఆ పేరు ఎలా వచ్చిందనే అంశంపై ఉన్న రకరకాల వాదనల్లో త్రిలింగ వాదన కూడా ఒకటి కావడం తెలిసిన విషయమే.దక్షిణాన తెలంగాణతో పాటు, ఉత్తరాన పంజాబ్ కూడా ఇప్పుడు బీజేపీకి తక్షణ లక్ష్యాలు. పంజాబ్లో బీజేపీ ఆపరేషన్ నిన్ననే బయటపడింది. అక్కడి పాలక పక్షమైన ఆప్ రాజ్యసభ సభ్యులకు గంపగుత్తగా గాలం వేసి లాగేసింది. తెలంగాణ ఆపరేషన్ ఏ రూపంలో ఉంటుందో ఇంకా తేలవలసి ఉన్నది. సరిగ్గా ఇదే సందర్భంలో ఈరోజు (శనివారం) కేసీఆర్ కుమార్తె కవిత తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ఈ పరిణామానికీ, బీజేపీ తెలంగాణ వ్యూహానికీ ప్రత్యక్ష సంబంధం ఉండకపోవచ్చు. కానీ కవిత పార్టీ కారణంగా బీఆర్ఎస్ పార్టీకి ఏ మేరకైనా నష్టం జరిగితే అంతవరకు ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశాలు బీజేపీకి మెరుగవుతాయి. కొత్త పార్టీ ప్రారంభ కార్యక్రమాన్ని కవిత ఘనంగానే నిర్వహించారు. ప్రారంభం రోజున అన్ని ప్రధాన దినపత్రికల్లో భారీ ప్రకటనలు కనిపించాయి. ముఖ్యమైన వార్తా ఛానెళ్లన్నీ ఆమె ప్రసంగాన్ని లైవ్గా కవర్ చేశాయి. ఎక్కడా పార్టీకి వనరుల కొరత ఉన్నట్టు అనిపించలేదు. బలమైన వ్యవస్థలే ఆమె వెనుక ఉండవచ్చన్న వ్యాఖ్యానాలు వినిపించాయి.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి కేసీఆర్తో రాజకీయ విరోధంతోపాటు వ్యక్తిగత వ్యతిరేకత ఉండే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేము. శాసన మండలి ఎన్నికల్లో ఎమ్మెల్యేల ఓట్లకోసం డబ్బులిస్తూ వీడియో సాక్షిగా రేవంత్, ఆడియో సాక్షిగా చంద్రబాబు దొరికిపోయిన ఉదంతం పాఠకులకు ఇంకా గుర్తుండే ఉంటుంది. తన ఏకైక కుమార్తె వివాహ నిశ్చితార్థం రోజున రేవంత్ జైల్లో ఉండాల్సి వచ్చింది. హైదరాబాద్పై పదేళ్ల ఉమ్మడి రాజధాని హక్కును వదిలేసుకొని చంద్రబాబు కరకట్ట నివాసానికి పరుగు పెట్టవలసి వచ్చింది. మధ్యవర్తుల మంత్రాంగంతో ఆ కేసు అప్పటితో ముగిసిపోయిందనుకున్నారు. కానీ చంద్రబాబు మాత్రం జరిగిన అవమానాన్ని మరిచిపోలేకపోయారు. కాంగ్రెస్ పార్టీతో, ముఖ్యంగా రాహుల్ గాంధీతో తనకున్న సన్నిహిత సంబంధాలను ఉపయోగించుకున్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ కర్ణాటక, గుజరాత్ ఎన్నికల సమయాల్లో కాంగ్రెస్కు ఆర్థిక సహాయం చేశారన్న వార్తలు కూడా వచ్చాయి.ఓటుకు నోటు కేసు చల్లబడిన కొన్నాళ్లకే చంద్రబాబుకు తెలంగాణ సహచరుడుగా ఉన్న రేవంత్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థి జగన్మోహన్రెడ్డిని ఇరుకున పెట్టడం కోసం ఆయన చెల్లెలు షర్మిల ఆశలను అవకాశంగా తీసుకొని తొలుత తెలంగాణలో రాజకీయ అరంగేట్రం చేయించి, కేసీఆర్ను నానాతిట్లు తిట్టించిన తర్వాత ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ప్రతిష్ఠించారనీ, జగన్మోహన్రెడ్డిపై తీవ్ర విమర్శలు చేయించారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపించింది. రేవంత్రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, తదనంతరం ముఖ్యమంత్రిగా పదవి స్వీకరించిన తర్వాత ఇన్నాళ్లకు కేసీఆర్ కూతురు తండ్రితో విభేదించి సొంతంగా పార్టీని ప్రకటించింది. ఈ పరిణామాన్ని రేవంత్ సర్కార్ సహజంగానే రాజకీయ అవకాశంగా మలుచుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ అలవికాని హామీలనిచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. దాదాపు సగం పుణ్యకాలం పూర్తయింది. గ్రామ ప్రాంతాల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తున్నదని వార్తలొస్తున్నాయి. అదే సందర్భంలో కేసీఆర్ పట్ల సానుభూతి కూడా వ్యక్తమవుతున్నదని చెబుతున్నారు. ఇటువంటి తరుణంలో కవిత సొంత పార్టీని స్థాపించి తండ్రిపైనే నేరుగా విమర్శలను ఎక్కుపెట్టడం కాంగ్రెస్ పార్టీకి అందివచ్చిన అవకాశంగానే భావించాల్సి ఉంటుంది. తాను రాజకీయంగా ఈ స్థాయికి ఎదగడానికి కారణమైన తండ్రిపైనే కవిత చేస్తున్న విమర్శలపై జనం ఎలా స్పందిస్తారనే ప్రశ్నకు కాలమే సమాధానం చెబుతుంది. కవితకు మంచి వాగ్ధాటి, విషయ పరిజ్ఞానం తండ్రి నుంచి వారసత్వంగా సంక్రమించాయి. ఇవే లక్షణాలు కేటీఆర్లో కూడా పుష్కలంగా ఉన్నాయి. కేసీఆర్ మేనల్లుడు హరీశ్రావు అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ఎదిగారు. తన కుటుంబం నుంచి ఇంతమంది సమర్థులైన నాయకులు రావడం కేసీఆర్కు లాభమా నష్టమా అనేసంగతి తేలవలసి ఉన్నది.ఒక మహిళ ధైర్యంగా ముందుకొచ్చి సొంతంగా ఒక రాజకీయ పార్టీని ప్రకటించడం, తన లక్ష్యాలను వివరించడం అభినందించదగ్గ విషయమే. ఈ పరిణామాన్ని ఆహ్వానించ వలసిందే. ఆమె పార్టీ స్థాపన వెనుక రహస్య ఎజెండా ఉన్నదా, ఆమె వెనుక ఎవరున్నారనే చర్చ ముందుగానే చేయడం అనవసరం. అటువంటివేమైనా ఉంటే కాలక్రమంలో అవే బయటకొస్తాయి. అయితే ఆమె ప్రకటించిన ఎజెండా అంశాల మీద, వాటి ఆచరణ సాధ్యాసాధ్యాల మీద చర్చ జరగవలసిందే. ఆమె తన తొలి ప్రసంగంలోనే అధికార పార్టీపై కంటే తన తండ్రి పార్టీపైనే ఎక్కువ దాడిని ఎందుకు చేశారనే విషయంలో విశ్లేషణలు చేయవచ్చు. బీఆర్ఎస్ను ఫినిష్ చేస్తే ఆ స్థానం తన పార్టీకి దక్కుతుందని ఆమె విశ్వసిస్తున్నారా? అదే స్థానం కోసం పావులు కదుపుతున్న బీజేపీకి ఆమె కళ్లెం వేయగలరా? ప్రతి పక్షాల మూడు ముక్కలాటలో అధికార పార్టీకి లాభం జరగడం ఆమెకు సమ్మతమేనా? కవిత జనంలోకి వెళ్తున్న క్రమంలో నెమ్మదిగా ఇటువంటి సందేహాలకు సమాధానాలు దొరకవచ్చు.ఇప్పుడు ప్రతిపక్షం మనమే, రెండేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చేది కూడా మనమేనని పార్టీ ఆవిర్భావ సభలో కవిత ప్రక టించారు. తన పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా నిర్ణయించడంలోనే ఆమె టార్గెట్ ఎవరో అర్థమవుతున్నది. పాత టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిన తర్వాత తెలంగాణ ఆత్మను కోల్పోయిందని, ఉద్యమ రథం దారి తప్పిందని, కేసీఆర్ ఇప్పుడు మరమనిషిగా మారిపోయారని ఘాటు విమర్శలు చేశారు. టీఆర్ఎస్ పేరు పెట్టుకోవడం వల్ల గత ఉద్యమ ఉత్తేజంతో కొత్త పార్టీ బలం పుంజుకుంటుందని ఆమె నమ్ముతుండవచ్చు. ఎవరి నమ్మకాలు వారివి! ప్రజలను నమ్మించడంలోనే ఆమె రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.తన లక్ష్యాలను వివరిస్తూ ఆమె పాంచజన్యం పూరించారు. తాను చేసిన ఐదు ప్రధాన హామీలకు ఆమె ‘పాంచజన్యం’ అనే పేరు పెట్టుకున్నారు. అందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం,ఒక్క నోటిఫికేషన్తో యువకులకు నాలుగు లక్షల ఉద్యోగాలు,అందులో ఉద్యమకారులకే లక్ష ఉద్యోగాలు, సామాజిక న్యాయంతో సబ్బండ వర్ణాల సంక్షేమం, వ్యవసాయంలో రైతునే రాజుగా చేయడం... ఆమె ప్రకటించిన పాంచజన్యంలోని ఐదు హామీలు. బీజేపీని రిమోట్ కంట్రోల్తో నడిపించే ఆరెస్సెస్ సిద్ధాంత గ్రంథం పేరు కూడా పాంచజన్యమే. వారి గురువు గోల్వాల్కర్ రాసిన ‘బంచ్ ఆఫ్ థాట్స్’ తెలుగు అనువాదం పేరు పాంచజన్యం. ఇప్పుడు బీఆర్ఎస్ను ఫినిష్ చేసి ఆ స్థానాన్ని ఆక్రమించాలని చూస్తున్న బీజేపీ పాంచ జన్యాన్ని మించి కవిత పాంచజన్య శంఖారావం వినిపించవలసి ఉంటుంది.ఐదు హామీలూ ఆకర్షణీయంగానే ఉన్నా వాటిని ఏరకంగా ఆచరణ సాధ్యం చేయగలరో వివరించి చెప్పవలసిన బాధ్యత కొత్త టీఆర్ఎస్ అధ్యక్షురాలిపై ఉంటుంది. రైతుబంధు, మిషన్ కాకతీయ వంటి కేసీఆర్ పథకాలను తెలంగాణ రైతాంగం ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. వాటి కంటే మిన్నగా ఏరక మైన ప్రతిపాదనను ఆమె ముందుకు తీసుకొని వస్తారో ఎదురు చూడవలసి ఉన్నది. సామాజిక న్యాయం అనేది రాజకీయ వర్గాల్లో ఇప్పుడొక అరిగిపోయిన రికార్డుగా మారింది. తెలంగాణలో అత్యధిక జనాభా గల కులంగా ఉన్న మాదిగ వర్గానికి చెందిన విశారదన్ మహారాజ్ తన ఎజెండాతో ఇప్పుడు ఎస్సీ లతోపాటు, ఎస్టీ, బీసీ యువతను విశేషంగా ఆకర్షించగలుగు తున్నారు. విశారదన్ కంటే విప్లవాత్మకమైన కార్యక్రమాన్ని కవిత రూపొందించగలిగితేనే ఆమె సామాజిక న్యాయ నినాదం సార్థకమవుతుంది. ఇటువంటి ఎన్నో సవాళ్లకు వెరవకుండా కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించిన కవితకు శుభాకాంక్షలు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీగా ఐఏఎస్ బదిలీలు చేపట్టారు. పలువురు అధికారులను బదిలీ చేయగా, మరికొందరికి కొత్తగా పో స్టింగ్లు ఇచ్చారు. ఈ మేరకు శనివారం రాత్రి సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 30 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్అండ్బీ ప్రత్యేక కార్యదర్శిగా ప్రావీణ్య, పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి ప్రత్యేక కార్య దర్శిగా దానకిషోర్, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా కృష్ణ ఆదిత్య, గిరిజన సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శిగా బి.ఎం. సంతోష్, ఇంటర్ బోర్డు డైరెక్టర్గా అభిలాష అభినవ్, పౌర సరఫరాల శాఖ డైరెక్టర్గా జి.వి శ్యామ్ప్రసాద్ లాల్ నియమితులయ్యారు. సంజయ్ కుమార్ (ఐఏఎస్ 1995) ప్రస్తుతం: పీఆర్&ఆర్డీ, ఆర్డబ్ల్యూఎస్ & ఆర్ఎస్ఏడీ శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బదిలీ: తెలంగాణ భవన్, న్యూఢిల్లీకి ప్రత్యేక అధికారిగాఎం.దాన కిషోర్ (ఐఏఎస్ 1996) ప్రస్తుతం: ఎల్ఈటీ&ఎఫ్ శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బదిలీ: పీఆర్ & ఆర్డీ, ఆర్డబ్ల్యూఎస్ & ఆర్ఎస్ఏడీ శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగాబి.విజియేందిర (ఐఏఎస్ 2006) ప్రస్తుతం: టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యదర్శి & ఎస్సీడీ కమిషనర్ బదిలీ: ఎస్సీడీ శాఖకు ప్రభుత్వ కార్యదర్శిగాహరిచందన దాసరి (ఐఏఎస్ 2010) ప్రస్తుతం: హైదరాబాద్ కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్ బదిలీ: ఎల్ఈటీ&ఎఫ్ శాఖకు ప్రభుత్వ కార్యదర్శిగాకృష్ణ ఆదిత్య ఎస్ (ఐఏఎస్ 2014) ప్రస్తుతం: ఇంటర్మీడియట్ విద్య డైరెక్టర్ & బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యదర్శి బదిలీ: పరిశ్రమలు & వాణిజ్య శాఖకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగాభావేష్ మిశ్రా (ఐఏఎస్ 2015) ప్రస్తుతం: ఐటీఈ&సీ శాఖకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి బదిలీ: నిర్మల్ కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్గాపి.ఉదయ్ కుమార్ (ఐఏఎస్ 2016) ప్రస్తుతం: ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓ బదిలీ: జీహెచ్ఎంసీ, గోల్కొండ జోనల్ కమిషనర్గా బధావత్ సంతోష్ (ఐఏఎస్ 2016) ప్రస్తుతం: నాగర్ కర్నూల్ కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్ బదిలీ: జీహెచ్ఎంసీ, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్గాజెండాగే హనుమంత్ కొండిబా (ఐఏఎస్ 2016) ప్రస్తుతం: పౌర సరఫరాల డైరెక్టర్ బదిలీ: ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓగాపి.ప్రవీణ్య (ఐఏఎస్ 2016) ప్రస్తుతం: సంగారెడ్డి కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్ బదిలీ: టీఆర్&బీ శాఖకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగాప్రియాంక అలా (ఐఏఎస్ 2016) ప్రస్తుతం: జీహెచ్ఎంసీ, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ బదిలీ: హైదరాబాద్ కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్గాసంతోష్ బి.ఎం. (ఐఏఎస్ 2017) ప్రస్తుతం: గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ బదిలీ: గిరిజన సంక్షేమ శాఖకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగాప్రతీక్ జైన్ (ఐఏఎస్ 2017) ప్రస్తుతం: నారాయణపేట్ కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్ బదిలీ: సంగారెడ్డి కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్గాదివాకర టీఎస్ (ఐఏఎస్ 2017) ప్రస్తుతం: ములుగు కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్ బదిలీ: ఖమ్మం కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్గాఅనుదీప్ దురిశెట్టి (ఐఏఎస్ 2018) ప్రస్తుతం: ఖమ్మం కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్ బదిలీ: ఐటీఈ&సీ శాఖకు ప్రభుత్వ సంయుక్త కార్యదర్శిగా అభిలాష అభినవ్ (ఐఏఎస్ 2018) ప్రస్తుతం: నిర్మల్ కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్ బదిలీ: ఇంటర్మీడియట్ విద్య డైరెక్టర్ & బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యదర్శిగాభోర్ఖాడే హేమంత్ సహదేవరావు (ఐఏఎస్ 2018) ప్రస్తుతం: జీహెచ్ఎంసీ, సెర్లింగంపల్లి జోనల్ కమిషనర్ బదిలీ: ములుగు కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్గాచెక్క ప్రియాంక (ఐఏఎస్ 2018) ప్రస్తుతం: ఐ&పీఆర్ ప్రత్యేక కమిషనర్ మరియు జీఏ(ఐ&పీఆర్) శాఖకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి బదిలీ: నారాయణపేట్ కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్గాజి.వి.శ్యాం ప్రసాద్ లాల్ (ఐఏఎస్ 2019) ప్రస్తుతం: నాగర్ కర్నూల్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బదిలీ: పౌర సరఫరాల డైరెక్టర్గాజి.ముకుంద రెడ్డి (ఐఏఎస్ 2019) ప్రస్తుతం: జీహెచ్ఎంసీ, గోల్కొండ జోనల్ కమిషనర్ బదిలీ: ఐ&పీఆర్ ప్రత్యేక కమిషనర్ మరియు జీఏ(ఐ&పీఆర్) శాఖకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగాహేమంత్ కేశవ్ పాటిల్ (ఐఏఎస్ 2019) ప్రస్తుతం: జీహెచ్ఎంసీ, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ బదిలీ: నాగర్ కర్నూల్ కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్గామండ మకరందు (ఐఏఎస్ 2020) ప్రస్తుతం: జీహెచ్ఎంసీ, రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్ బదిలీ: ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిగాఅపూర్వ్ చౌహాన్ (ఐఏఎస్ 2020) ప్రస్తుతం: జీహెచ్ఎంసీ, కూకట్పల్లి జోనల్ కమిషనర్ బదిలీ: సీసీఎల్ఏ కార్యాలయంలో సీఎంఆర్వో ప్రాజెక్ట్ డైరెక్టర్గాలెనిన్ వత్సల్ టోప్పో (ఐఏఎస్ 2021) ప్రస్తుతం: మహబూబాబాద్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బదిలీ: ఏటూరునాగారం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిగానారాయణ అమిత్ మాలెంపాటి (ఐఏఎస్ 2022) ప్రస్తుతం: నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్-కలెక్టర్ బదిలీ: జీహెచ్ఎంసీ, సెర్లింగంపల్లి జోనల్ కమిషనర్గావికాస్ మహతో (ఐఏఎస్ 2022) ప్రస్తుతం: నిజామాబాద్ జిల్లా బోధన్ సబ్-కలెక్టర్ బదిలీ: జీహెచ్ఎంసీ, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్గామయాంక్ సింగ్ (ఐఏఎస్ 2022) ప్రస్తుతం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్-కలెక్టర్ బదిలీ: జీహెచ్ఎంసీ, కూకట్పల్లి జోనల్ కమిషనర్గాకిరణ్మయి కొప్పిశెట్టి (ఐఏఎస్ 2022) ప్రస్తుతం: కామారెడ్డి జిల్లా బాన్సువాడ సబ్-కలెక్టర్ బదిలీ: రంగారెడ్డి అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గాయువరాజ్ మార్మట్ (ఐఏఎస్ 2022) ప్రస్తుతం: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ సబ్-కలెక్టర్ బదిలీ: కుమ్రంభీం ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గాఎస్.శ్రీనివాస్ రెడ్డి (నాన్-కేడర్) ప్రస్తుతం: జీహెచ్ఎంసీ, చార్మినార్ జోనల్ కమిషనర్ బదిలీ: జీహెచ్ఎంసీ, రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్గా -
ప్రభుత్వ అధీనంలోకి మెట్రో.. చైర్మన్గా సీఎస్ రామకృష్ణరావు
హైదరాబాద్ మెట్రోపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ అండ్ టీ మెట్రోపై 100 శాతం ఈక్విటీ ప్రభుత్వానికి బదిలీ అయింది. రూ.15,000 కోట్లతో హెచ్ఎంఆర్ఎల్ ద్వారా కొనుగోలు పూర్తయింది. ఎల్ అండ్ టీ నుంచి పూర్తిగా ప్రభుత్వ అధీనంలోకి మెట్రో వచ్చేసింది. కొత్త బోర్డ్ ఆఫ్ డైరెక్లర్ల నియామకం జరిగింది. మెట్రో చైర్మన్గా సీఎస్ రామకృష్ణ రావును నియమించారు. మెట్రో ఎండీగా సర్పరాజ్ అహ్మద్ కొనసాగుతారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కీలక డైరెక్టర్ పదవులు దక్కాయి. షేర్ హోల్డర్లకు ఒక్కో షేర్ కేటాయించారు. తెలంగాణ ప్రభుత్వానికి మెజారిటీ షేర్ హోల్డింగ్ ఉంటుంది. హెచ్ఎంఆర్ఎల్కు మిగిలిన షేర్లను కేటాయించారు. కాగా, ఎల్ అండ్ టీకి చెందిన 100 శాతం ఈక్విటీ వాటాను కొనుగోలు చేసేందుకు తెలంగాణ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ శుక్రవారం (ఏప్రిల్ ) జీవో నంబర్ 127ను విడుదల చేసిన విషయం తెలిసిందే. మెట్రోను టేకోవర్ చేసుకునేందుకు ఆర్థిక, పరిపాలనపరమైన అంశాలకు ఆమోద ముద్ర వేసింది. నిజానికి ఈ ఏడాది మార్చి 30 నాటికే టేకోవర్ ప్రక్రియను పూర్తిచేయాలని ప్రభుత్వం భావించింది, అయితే, పలు అంశాలు కుదరకపోవడంతో ఆలస్యం జరిగింది. హైదరాబాద్ మెట్రో రైళ్ల సర్వీసులు 2017 నవంబరులో ప్రారంభయ్యాయి. అయితే, ఎల్అండ్టీకి అప్పటి నుంచి నష్టాలే ఎదురవుతున్నాయి. చివరకు మెట్రో రైళ్లను నడపలేమని ఎల్అండ్టీ చెప్పేసింది. -
‘రాష్ట్రవ్యాప్తంగా వీరందరి పరిస్థితి దారుణంగా ఉంది’
రాజన్న సిరిసిల్ల జిల్లా: కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులందరి పరిస్థితి దారుణంగా ఉందని చెప్పారు. తంగళ్లపల్లి మండలం రామనపల్లిలో శనివారం అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆ మహానుభావుడి విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టమని తెలిపారు. 100 ఏళ్ల క్రితమే లండన్లో చదువుకున్న విశ్వ మేధావి అంబేద్కర్ అని చెప్పారు.‘అంబేద్కర్ చూపిన బాటలో 14 ఏళ్లుగా లక్షలాదిమందితో పోరాడి తెలంగాణ సాధించుకున్నాం. కాంగ్రెస్ పార్టీ 1952-54లో అంబేద్కర్ పార్లమెంటుకు రాకుండా ఓడించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి కాకుండా ఇతర పార్టీ నుంచే భారతరత్న వచ్చింది. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి కులానికి, మతానికి అండగా నిలిచాం. దురదృష్టవశాత్తు మనం ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నాం.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధును నెలకు ఒకసారి ఎకరానికి కిస్తుల ద్వారా ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి కోటి మందిని కోటీశ్వరులను చేస్తానన్నారు.. ఇప్పటికీ పింఛన్లు కూడా సరిగా ఇవ్వడం లేదు. అంబేద్కర్ రాజ్యాంగంలో అందరికీ ఓటు హక్కు కల్పించారు. ఆ ఓటు హక్కు వినిగించుకునేటప్పుడు ఆలోచించి వేయాలి.కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి. నెల రోజుల క్రితం వడ్లు తీసుకువచ్చి సెంటర్లలో వేసినా ఇప్పటివరకు ఒక గింజ కొన్న పాపాన పోలేదు. ప్రభుత్వం వడ్లు కొనాల్సి వస్తే మద్దతు ధరతో పాటు, బోనస్ ఇవ్వాల్సి వస్తుందని కొనుగోలులో జాప్యం చేస్తోంది. రైతులే వడ్లను దళారులకు అమ్ముకునే పరిస్థితిని వస్తోంది.రైతు ప్రభుత్వం అని చెప్పుకునే వీరు రైతుబంధు వేయడం లేదు.. కరెంట్ సరిగా ఇవ్వడం లేదు. వడ్లను కొనుగోలు చేయకపోవడంతో వర్షం కురుస్తుందనే భయంతో రైతులు పంటను కవర్లతో కాపాడుకోవాల్సి వస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా రైతులందరి పరిస్థితి దారుణంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఇంతటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఎన్నడూ చూడలేదు. వెంటనే వడ్ల కొనుగోలు ప్రక్రియ మొదలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నా’ అని అన్నారు. -
స్కై రూట్ ఏరో స్పేస్ కార్యక్రమంలో సీఎం రేవంత్
హైదరాబాద్: శంషాబాద్లోని జీఎంఆర్ ఏరోస్పేస్ పార్క్లో స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీకి చెందిన విక్రం-1 రాకెట్ ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు పాల్గొన్నారు. దీనిలో భాగంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘ఆనంద్ మహీంద్రా బోర్డు చైర్మన్గా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. ఏరో స్పేస్ విభాగం లో కూడా స్కిల్ యూనివర్సిటీ సేవలను వినియోగించుకోవాలి. ఏరో స్పేస్ రంగానికి కావాల్సిన మనవరులను యూనివర్సిటీ ద్వారా అందిస్తాం. స్కిల్స్ కు సంబంధించిన అన్ని విభాగాలను స్కిల్స్ యూనివర్సిటీ పరిధి లోకి తీసుకువస్తాం. స్కిల్స్ యూనివర్సిటీ ని అద్భుతం గా తీసుకువస్తున్నాం. మల్లేపల్లి ఏటీసీ సెంటర్ ని సందర్శించాలి. ఐటీఐలను టాటా గ్రూప్ సహకారం తో ఏటీసీలు గా మారుస్తున్నాం. సిలబస్ను కూడా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మారుస్తున్నాం. విద్యా వ్యవస్థను సమూలం గా మారుస్తున్నాం. విద్యా ప్రమాణాలతో పాటు మహులిక సదుపాయాలు పెంచబోతున్నాం. ప్రతి విద్యార్థి పైన లక్షా 8 వేల రూపాయలను ప్రభుత్వం ఖర్చు పెడుతోంది’ అని పేర్కొన్నారు. -
డీజీపీ ఎదుట భారీగా మావోయిస్టుల లొంగుబాటు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పోలీసుల ముందు భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. చత్తీస్గడ్కు చెందిన 47 మంది మావోయిస్టులు తెలంగాణ రాష్ట్ర పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరి వద్ద నుంచి 34 ఆయుధాలను సరెండర్ చేసుకున్నారు. వీరిని ఈరోజు(శనివారం, ఏప్రిల్ 25వ తేదీ) మీడియా ముందు ప్రవేశపెట్టారు తెలంగాణ డీజీపీ శివధర్రెడ్డి. ఈ మేరకు డీజీపీ మాట్టాడుతూ.. వారంతా చత్తీస్గడ్కు చెందిన మావోయిస్టులేనని పేర్కొన్నారు.డీజీపీ శివధర్రెడ్డి ఏమన్నారంటే..తెలంగాణ పోలీసుల ఎదుట మొత్తం 47 మంది అజ్ఞాత మావోయిస్టు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు. 32 తుపాకులను కూడా పోలీసులకు అప్పగించారు. లొంగిపోయిన వారిలో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (DKSZC) సభ్యుడు మరియు దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ ఇంర్జి అయిన హేమ్లా ఇతు అలియాస్ విజ్జా, డివిజనల్ కమిటీ సభ్యుడు మరియు 9వ ప్లాటూన్ కమాండర్ అయిన పోడియం లచ్చు అలియాస్ మనోజ్ వంటి ముఖ్య నాయకులు ఉన్నారు. లొంగిపోయిన మావోలు పోలీసులకు 32 ఆయుధాలతో పాటు వివిధ క్యాలిబర్లకు చెందిన 515 తూటాలను అప్పగించారు.పోలీసులకు సమర్పించిన ఆయుధాలు1 - LMG,4 - AK-47 రైఫిల్స్3 - SLR రైఫిల్స్,2 - INSAS రైఫిల్స్2 - 410 మస్కెట్ రైఫిల్స్,1 - 8mm రైఫిల్12 - సింగిల్-షాట్ గన్స్,1 - 9mm పిస్టల్1 - రివాల్వర్,2 - BGL గన్స్2 - ఎయిర్ గన్స్,1 - SBBL గన్దక్షిణ బస్తర్ డివిసి (DVC) కార్యదర్శితో సహా కీలక నాయకులు, సాయుధ కేడర్లు దాదాపు అందరూ ఈరోజు లొంగిపోవడంతో, ప్రస్తుతం దక్షిణ బస్తర్ డివిసి మొత్తం నిర్వీర్యం అంచుకు చేరుకుంది.లొంగిపోయిన 47 మంది క్యాడర్ల వారీగా వివరాలు PLGA బెటాలియన్: 4 మందిDKSZC: 28 మంది9వ & 30వ ప్లాటూన్, దక్షిణ బస్తర్ DVC: 15 మంది (మొత్తం: 47 మంది) లొంగిపోవడం జరిగింది.తెలంగాణకి చెందిన నలుగురు మావోయిస్టు ఇంకా అజ్ఞాతంలో ఉన్నారువారు కూడా తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోవాలని అభ్యర్థిస్తున్నాము‘జనజీవన స్రవంతిలో చేరి తెలంగాణ ప్రభుత్వ లొంగుబాటు మరియు పునరావాస విధానం ద్వారా లభించే అన్ని ప్రయోజనాలను పొందాలని విజ్ఞప్తి చేస్తున్నాం. గత రెండేళ్లలో 818 మంది తెలంగాణ పోలీసులు ముందు లొంగిపోయారు. గత రెండేళ్లలో 334 ఆయుధాలను మావోయిస్టుల నుండి స్వాధీనం చేసుకున్నాం’ అని డీజీపీ పేర్కొన్నారు.అజ్ఞాతంలో ఉన్న తెలంగాణ మావోయిస్టులు 1. లక్ష్మణరావు అలియాస్ గణపతి, కేంద్ర కమిటీ సభ్యులు2. పసునూరి నరహరి అలియాస్ సంతోషం కేంద్ర కమిటీ సభ్యులు3. జాడి రత్నా భాయ్ అలియాస్ సుజాత ,స్టేట్ కమిటీ మెంబర్4. వార్త శేఖర్ అలియాస్ మంగు, స్టేట్ కమిటీ మెంబర్ -
ఆర్టీసీ కార్మికుల విజయం శంకరన్నకు అంకితం
-
తెలంగాణ ప్రజలకు అమ్మగా మారాలనుకుంటున్నా.. కవిత పార్టీ ప్రకటన (ఫొటోలు)
-
అజారుద్దీన్, కోదండరాంలకు లైన్ క్లియర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నాయకులు అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరామ్కు ఊరట లభించింది. ఇద్దరు ఎమ్మెల్సీల అభ్యర్థిత్వాలకు ఆమోద ముద్ర పడింది. గవర్నర్ సంతకంతో ఇద్దరు ఎమ్మెల్సీల నియామకానికి లైన్ క్లియర్ అయ్యింది. కాగా, ఎమ్మెల్సీల విషయమై ఆగస్టు 30న ప్రభుత్వం తీర్మానం చేసి గవర్నర్కు పంపించింది. దీంతో, తాజాగా ఫైల్పై గవర్నర్ సంతకం చేశారు. ఎమ్మెల్సీ గురించి ఆలోచించడం మానేశా: కోదండరాంనిన్నటి వరకు ఎలా ఉన్నానో ఎమ్మెల్సీగా కూడా అలాగే ఉంటానని తెలంగాణ జనసమితి (టీజేఎస్) నాయకుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. తన ఎమ్మెల్సీ అభ్యర్థిత్వానికి గవర్నర్ ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో సాక్షి న్యూస్తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ''ఎమ్మెల్సీ పదవి గురించి ఆలోచించడమే మానేశాను. దాని గురించి ఎవరు అడిగినా సున్నితంగా ఆ విషయం వదిలేయమన్నాను. పదవులు శాశ్వతం కాదని అర్థమైంది. నన్ను విమర్శించే వాళ్ళకి ఏం చెప్పలేను. నా ఎమ్మెల్సీని ఆపి కొందరు సంతోష పడ్డార''ని ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. చదవండి: కేసీఆర్పై కవిత సంచలన వ్యాఖ్యలు -
కవిత కొత్త పార్టీపై బీఆర్ఎస్ సెటైర్లు
-
కవిత టీఆర్ఎస్ ప్రకటన.. బీఆర్ఎస్ రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి పొలిటికల్ హీట్ పెరిగింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పొలిటికల్ ప్రకటన రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. కవిత కొత్త పార్టీ పేరు టీఆర్ఎస్.. తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో కవిత పార్టీ పేరు ప్రస్తావన లేకుండానే బీఆర్ఎస్ సెటైరికల్గా వ్యాఖ్యలు చేసింది.టీఆర్ఎస్ పేరుతో కవిత ఏర్పాటు చేసిన పార్టీపై బీఆర్ఎస్ స్పందించింది. బీఆర్ఎస్ ట్విట్టర్ వేదికగా పోస్టు చేసి.. ఆ పార్టీ పేరు చెప్పకుండానే ట్రోలింగ్ చేసింది. ఇందులో ఒరిజినల్, నకిలీ కోల్గేట్, బిస్లరీ వాటర్ బాటిల్స్ ఫొటోలను పెట్టింది. ఈ సందర్భంగా ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే! అని కామెంట్ చేసింది. దీనిపై నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే! pic.twitter.com/YBlx20tlRf— BRS Party (@BRSparty) April 25, 2026అయితే, అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ పేరు మార్పుపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచిర్యాల జిల్లా క్యాతన పల్లిలో బీఆర్ఎస్ కారకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ పార్టీగా మార్చిన తర్వాత నష్టపోయాం. మళ్లీ టీఆర్ఎస్గా ఉండాలని కోరుకుంటున్నాం. ప్రజా సమస్యలపై పాదయాత్ర చేస్తా. మేం తప్పులు చేశాం.. అందుకే ఓడిపోయాం. తల్లిదండ్రులను సంతోష పెట్టకపోయినా పర్వాలేదు.. బాధపెట్టొద్దు. కొత్త పార్టీలు ఎన్ని వస్తే అంత మంచిది.. ఓట్లు వేయాలి కదా. మాకు ఏ పార్టీతో పొత్తులు ఉండవు’ అని స్పష్టం చేశారు. కేటీఆర్ ప్రకటన వచ్చిన కొద్ది రోజుల్లో కవిత ఇలా కొత్త పార్టీ పేరును టీఆర్ఎస్గా ముందుకు తీసుకు రావడం గమనార్హం. -
కేసీఆర్పై కవిత సంచలన వ్యాఖ్యలు
సాక్షి, మేడ్చల్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఆయన కూతురు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్(తెలంగాణ రాష్ట్ర సేన) పేరిట శనివారం కొత్త పార్టీ ప్రకటించిన ఆమె.. ఆయన మారిపోయారని, రాజకీయ పరిణతి కోల్పోయారంటూ వ్యాఖ్యానించారు. ఆనాటి కేసీఆర్ వేరు..ఈనాటి కేసీఆర్ వేరు. ఆనాటి కేసీఆర్ చేనేత కార్మికుల కోసం బిక్షాటన చేశారు. ఈనాటి కేసీఆర్ మన మనిషి కాదు.. మర మనిషి. ఏ కష్టమొచ్చినా ఆ సార్ ఇప్పుడు రారు.. ఎందుకంటే ఆయన మరమనిషి. గుంటనక్కలు, తోడేళ్ల చేతుల్లో కేసీఆర్ బందీ అయ్యారు. ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ సరిగా పాలించలేదు. అందుకే సరైన ఫలితాలు రాలేదు. ఇప్పుడు పేదల ఇళ్లు కూలగొడుతుంటే ఆదుకోవాల్సిన ఆయన ఏం చేస్తున్నారు?. గతంలో టీఆర్ఎస్ కోసం ఆస్తులు అమ్ముకుని పని చేశారు. వాళ్లంతా ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?. ఉద్యమకారుల్ని ఇబ్బంది పెడుతుంటే పార్టీ అధినేత ఆనాడు ఎందుకు స్పందించలేదు. కేసీఆర్ హయాంలో ఒక్క ఉద్యమకారుడికి కూడా పదవి దక్కలేదు. దీనిపై ఆనాడే నేను పోరాడాల్సి ఉండేది. అదే నా తప్పైంది. ఆనాడు ఉద్యమకారులకు జరిగిందే ఇవాళ నాకు జరిగింది.. బీఆర్ఎస్ పార్టీలో అమ్మతనం పోయింది.. మమకారం పోయింది. ఆయన మన కేసీఆర్ కాదు.. మారిన కేసీఆర్. మారిన కేసీఆర్ పంజాబ్ వెళ్లారు. మన కేసీఆర్ అయ్యింటే తెలంగాణ బిడ్డలు కష్టపడి బయటకు వచ్చేవారు. మారుతారామోనని చూశా కానీ నన్నే సస్పెండ్ చేశారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందనే నేను చెప్పడమే తప్పా?. తప్పు చేయని నన్ను పార్టీ నుంచి పంపించేశారు. నా బిడ్డ, కొడుకు తప్పు చేస్తే తీసేస్తానని ఆనాడు కేసీఆర్ చెప్పారు. అవినీతి జరిగిందన్నందుకు నన్నే బయటకు పంపించేసి.. అవినీతి చేసిన పందికొక్కుల్ని పక్కన పెట్టుకున్నారు. ఆయన మారిపోయారు కాబట్టే నేను యుద్ధం చేస్తున్నా. ఇది ఆరంభం మాత్రమే ముందుంది ముసళ్ల పండుగ’’ అంటూ కవిత ప్రసంగించారు.ఇదీ చదవండి: అందుకే మన పార్టీ పేరు టీఆర్ఎస్సీఎం రేవంత్పై.. ఇప్పుడు ఉన్న సీఎం కర్కోటకుడిలా వ్యహరిస్తున్నాడు. ఒక రాజకీయ నాయకుడిని అలా అనడం సరికాదు. కానీ గురుకులాల్లో పిల్లలు చనిపోతున్నా సీఎం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అందుకే అలా అనాల్సి వస్తోంది అంటూ సీఎం రేవంత్పై కవిత విమర్శలు గుప్పించారు. బీజేపీపై.. బీజేపీకి తెలంగాణ ఏర్పాటే ఇష్టం లేదు. మెడ మీద తలలేని ఓ ఎంపీ తెలంగాణ ఏర్పాటును పాక్తో పోల్చాడు. బీజేపీ బానిస ఎంపీలు ఈ విషయంపై కనీసం మాట్లాడలేదు. ఆ పార్టీ ఎంపీలకు చేతనైతే ఏపీలో విలీనమైన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలిపేలా చూడండి అంటూ సవాల్ విసిరారామె. -
కవిత కొత్త పార్టీ పేరు టీఆర్ఎస్
సాక్షి, మేడ్చల్: తెలంగాణలో మరో రాజకీయ పార్టీ పుట్టుకొచ్చింది. కల్వకుంట్ల కవిత శనివారం కొత్త పార్టీ ప్రకటించారు. తన పార్టీకి టీఆర్ఎస్(తెలంగాణ రాష్ట్ర సేన)గా ఆమె నామకరణం చేశారు. శనివారం మేడ్చల్ జిల్లా మునీరాబాద్లో జరిగిన ఆవిర్భావ సభ వేదికగా ఈ ప్రకటన వెలువడింది. పార్టీ ప్రకటన అనంతరం ఆమె మాట్లాడుతూ..‘‘తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించా. నాకు సింగరేణి అంటే చాలా ఇష్టం. తెలంగాణ ఆడబిడ్డలను ఏకం చేసిన ఘనత జాగృతిదే. బతుకమ్మతో తెలంగాణ సంస్కృతిని చాటాం. బతుకమ్మను ప్రపంచానికి పునఃపరిచయం చేసుకున్నాం. తెలంగాణ ఉద్యమానికి బలమైన సాంస్కృతి పునాది వేసింది జాగృతి. అయితే వచ్చిన తెలంగాణ ఎక్కడో దారి తప్పింది. .. 12 ఏళ్లు గడిచినా తెలంగాణ కలలన్నీ ఇంకా నిజం కాలేదు. సామాజిక తెలంగాణ రథచక్రం ఎక్కడో విరిగి ముక్కలైంది. తెలంగాణ ఆనాడు పాలించిన కుటుంబంలో నేను భాగమైనందుకు కొన్ని విషయాల్లో సిగ్గుపడుతున్నా. ఆనాడు ఇసుక మాఫియా ఎన్నో దారుణాలకు పాల్పడింది. అలాగే తెలంగాణ సాధించిన కుటుంబంలో ఉన్నందుకు మాత్రం గర్వపడుతున్నా. తెలంగాణ ప్రజలు నన్ను క్షమించాలి. కేసీఆర్ పాలనలో ఆశించిన ఫలితాలు రాలేదు. ఆ తప్పు సరిదిద్దుకునేందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్ర సేన(TRS)తో మీ ముందుకు వచ్చాను. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను కోల్పోయింది. మంచి చేయాలంటే రాజకీయ పార్టీ ఉండాలి. తెలంగాణలో ఉన్న మూడున్నర కోట్ల మందికి అమ్మగా మారాలనుకుంటున్నా. బిడ్డల కష్టం అమ్మకే తెలుస్తుంది. అప్పుడే రాష్ట్ర ప్రజల కష్టాలు తీరతాయి’’ అంటూ ప్రసంగించారామె. పాంచజన్య హామీలు..తెలంగాణలో ఉన్న మూడు పార్టీలు అధర్మం, అవినీతి, బంధు ప్రీతితో నిండిపోయాయి. ఎంతో మంది ఎన్నో మాట్లాడారు.. కానీ మనకు ఏమీ చేయలేదు. ఆ మూడు పార్టీలపై మన టీఆర్ఎస్(తెలంగాణ రాష్ట్ర సేన) తరఫున పాంచజన్యం పూరిద్దాం. ప్రస్తుతం మనమే ప్రధాన ప్రతిపక్షం. మరో రెండేళ్లలో మనదే అధికార పక్షం. వచ్చే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం. జీహెచ్ఎంసీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తాం. అవతలి వాడు మనవాడైనా సరే యుద్ధం చేస్తా. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి, సామాజిక న్యాయం.. ఈ ఐదు అంశాలపైనే నా పోరాటం అంటూ పాంచ్జన్యం పేరిట ఐదు హామీలను కవిత ప్రకటించారు.ఇదీ చదవండి: మళ్లీ టీఆర్ఎస్గా బీఆర్ఎస్.. కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు -
రైతు భరోసా సగమే… మిగిలిన డబ్బులు ఎప్పుడో?
వికారాబాద్: రైతుల ఎదురు చూపులు ఫలించి ఎట్టకేలకు సాగు సాయం డబ్బులు ఖాతాల్లో జమ కాగా, ఆ సంతోషం సగం వద్దే ఆగిపోయింది. గడిచిన యాసంగి సీజన్కు సంబంధించిన పెట్టుబడి సాయం డబ్బులు ఖాతాల్లో జమవడం ప్రారంభమై నెల గడుస్తున్నా ప్రక్రియ పూర్తికాలేదు. ఇప్పటి వరకు కేవలం అరవై శాతం భూమికే సాగు సాయం అందింది. మరో నలభై శాతం భూమికి సంబంధించిన రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. తొలి విడతగా ప్రతీ రైతుకు ఎకరానికి డబ్బులు జమ చేసిన ప్రభుత్వం, మూడు రోజుల క్రితం రెండెకరాలలోపు వారందరికీ నగదు వేసింది. రెండు విడతల్లో కలిపి రెండెకరాల వరకు 2,82,509 మంది రైతులకు రూ.231.82 కోట్ల నిధులు జమయ్యాయి. మిగిలిన వారికి ఎప్పుడో? జిల్లాలో మొత్తం రైతు భరోసాకు అర్హులైన రైతులు 3,27,561 మంది ఉండగా, వీరు 6,45,145 ఎకరాల వ్యవసాయ భూమి కలిగి ఉన్నారు. ఇందులో ఒక్కో రైతుకు రెండెకరాల వరకు డబ్బులు అందాయి. మరో 2.8 లక్షల మందికి రూ.155.25 కో ట్లు జమ కావాల్సి ఉంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో మూడు నెలలైనా ప్రక్రియ పూర్తయ్యే అవకాశం లేదు. అప్పటికీ ఖరీఫ్ పంటల సాగు కూ డా పూర్తవుతుందని కర్షకులు ఆవేదన వ్యక్తంచేస్తు న్నారు. ఇదిలా ఉండగా అర్హులైన వారందరికీ చెల్లించాల్సిన మొత్తంపై బిల్లులు పూర్తి చేసిన వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే ట్రెజరీకి పంపించారు. ముంచుకొస్తున్న ఖరీఫ్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పేరుతో ఈ పథకాన్ని అమలు చేయగా ప్రస్తుత గవర్నమెంట్ దీన్ని రైతు భరోసాగా మార్చింది. సర్కారు ఏదైనా పంటలు సాగు చేసే సమయంలో రైతులకు సాయం అందడం లేదు. ఖరీఫ్ సమీపిస్తున్నా రబీ డబ్బులే రాలేదు.. ఖరీఫ్ సాయం అందే సరికి ఇంకెంత కాలం పడుతుందోనని విమర్శిస్తున్నారు. -
తుది దశకు మెట్రో టేకోవర్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోరైల్ మొదటిదశ ప్రాజెక్టు సర్కారు స్వా«దీన ప్రక్రియ కీలకదశకు చేరుకుంది. ఎల్అండ్టీ సంస్థకు చెందిన 100% ఈక్విటీ వాటాను కొనుగోలు చేసేందుకు వీలుగా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ శుక్రవారం జీవో నంబర్ 127ను విడుదల చేసింది. మెట్రో టేకోవర్కు సంబంధించిన ఆర్థిక, పరిపాలనపరమైన అంశాలకు ఆమోదం తెలిపింది. దీంతో ఈ నెలాఖరుకు మెట్రో ప్రాజెక్టు ప్రభుత్వ స్వా«దీనంలోకి రానుంది. మార్చి 30 నాటికే టేకోవర్ ప్రక్రియను పూర్తిచేయాలని భావించినప్పటికీ కొన్ని సాంకేతిక అంశాలతో పాటు, ఐఆర్ఎఫ్సీ (ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్)తో స్పష్టమైన ఒప్పందం ఖరారు కాకపోవడం వల్ల జాప్యం చోటుచేసుకుంది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతాధికారుల కమిటీ పలు దఫాలుగా ఐఆర్ఎఫ్సీతో, ఎల్అండ్టీ సంస్థ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపింది. చివరకు మంత్రివర్గం ఆమోదించడంతో మెట్రో టేకోవర్ తుదిదశకు చేరుకుంది. ఏడాది పాటు ఉద్యోగుల కొనసాగింపు మెట్రో మొదటి దశ ప్రాజెక్టు (69.2 కి.మీ) కొనుగోలు విలువను మొత్తం రూ.15 వేల కోట్లుగా నిర్ధారించారు. ఇందులో భాగంగా ఎల్అండ్టీకి ఉన్న సుమారు రూ.13,615 కోట్ల రుణ భారాన్ని ఐఆర్ఎఫ్సీ రుణం ద్వారా ప్రభుత్వం చెల్లించనుంది. మిగతా రూ.1,385 కోట్లను హెచ్ఎండీఏ ద్వారా సమకూర్చాలని నిర్ణయించింది.టేకోవర్ ఇలా.. ప్రస్తుతం ఎల్అండ్టీ మెట్రోలో పనిచేస్తున్న 115 మంది ఉద్యోగులను ఏడాది పాటు కొనసాగిస్తారు. మెట్రో కార్యకలాపాలపై సలహాల కోసం ఎల్అండ్టీకి చెందిన ఏడుగురు ఉన్నతాధికారుల సేవలను కూడా 6 నెలల పాటు వినియోగించుకోనున్నారు. ఐఆర్ఎఫ్సీ నుంచి తీసుకునే రుణాన్ని 20 ఏళ్ల కాలపరిమితిలో చెల్లించనున్నారు. మెట్రో నుంచి వచ్చే ఆదాయంతోనే ఈ రుణాన్ని చెల్లించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ భారీ రుణం కోసం ప్రభుత్వం ఐఆర్ఎఫ్సీకి గ్యా రెంటీ ఇవ్వనుంది.అలాగే ఆర్బీఐ ద్వారా డైరెక్ట్ డెబిట్ మాండేట్కు అంగీకరించింది. ఈ మేరకు ఆ సంస్థతో చేసుకోనున్న ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసేందుకు హెచ్ఎంఆర్ఎల్ ఎండీకి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శికి ప్రభుత్వం పూర్తి అధికారాలు కలి్పంచింది. ఈ ప్రక్రియ పూర్తయితే హైదరాబాద్ మెట్రో పూర్తిస్థాయిలో ప్రభుత్వ రంగ సంస్థగా మారనుంది.రెండో దశకు మార్గం సుగమంనగరంలోని వివిధ మార్గాల్లో మెట్రో రెండోదశ విస్తరణకు ప్రభుత్వం ఏడాదిన్నర క్రితమే సమగ్రమైన ప్రాజెక్టు నివేదికలను రూపొందించి కేంద్రానికి అందజేసింది. కానీ మెట్రో మొదటిదశ, రెండోదశల మధ్య సమన్వయంపై కేంద్రం లేవనెత్తిన పలు కీలకమైన అంశాలతో మొదటి దశ ప్రాజెక్టు చర్చనీయాంశంగా మారింది. ఎల్అండ్టీ భాగస్వామ్యాన్ని కేంద్రం ప్రశ్నించింది. ఈ క్రమంలోనే మొదటి దశ ప్రాజెక్టు నుంచి తప్పుకోనున్నట్లు గతేడాది ఎల్అండ్టీ ప్రకటించింది. తాము స్వా«దీనం చేసుకొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అనంతరం టేకోవర్ ప్రక్రియ వివిధ దశల్లో కొనసాగింది. -
ఇంకా చాలా సమయం ఉంది..!
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) చంద్రశేఖర్ తివారీతో శుక్రవారం మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సీహెచ్ మల్లారెడ్డి కోడలు ప్రీతీరెడ్డి భేటీ అయ్యారు. బీజేపీలో చేరేందుకే ఆమె వచ్చారంటూ ఊహాగానాలు సాగాయి. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఏఐ యూనివర్సిటీ ప్రారం¿ోత్సవానికి ఆహ్వానం అందించేందుకే వచ్చాన న్నారు. ఇందులో రాజకీయ ప్రాధాన్యం లేదని స్పష్టం చేశారు. అయితే భవిష్యత్లో ఏమైనా జరగొచ్చని వ్యాఖ్యానించారు. ఎంపీ టికెట్ కోసం తాను రాలేదని, ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని చెప్పారు. మామ మల్లారెడ్డి రాజకీయాల్లో ఉన్నారని, ఆయన తమలో ఎవరినైనా పోటీ చేయమంటే సిద్ధమని స్పష్టం చేశారు. -
నూతన డీజీపీగా సీవీ ఆనంద్?
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ నూతన డీజీపీ ఎవరన్న ఉత్కంఠకు దాదాపు తెరపడింది. నూతన డీజీపీగా 1991 బ్యాచ్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ నియమితులు కానున్నట్టు సమాచారం. ప్రస్తుతం హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న సీవీ ఆనంద్ స్థానంలో 1994 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి శిఖాగోయల్ను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సీవీ ఆనంద్ డీజీపీగా నియమితులవడంపై స్పష్టత వచ్చినట్లయింది అంటున్నారు. ప్రస్తుతం ఇన్చార్జి డీజీపీగా కొనసాగుతున్న బి.శివధర్రెడ్డి ఈనెల 30న పదవీ విరమణ పొందనున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి డీజీపీ నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఆరుగురు సీనియర్ ఐపీఎస్ల జాబితా నుంచి ముగ్గురిని ఎంపిక చేసి కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఆ జాబితాను పంపింది. అందులో సీవీ ఆనంద్తోపాటు 1994 బ్యాచ్కు చెందిన కేంద్ర సర్వీస్లో ఇంటెలిజెన్స్ బ్యూరో స్పెషల్ డైరెక్టర్గా పనిచేస్తున్న వినాయక్ ప్రభాకర్ ఆప్టే, జైళ్లశాఖ డీజీగా పనిచేస్తున్న సౌమ్యామిశ్రా పేర్లు ఉన్నాయి. అయితే ఈ ముగ్గురి నుంచి రాష్ట్ర కేడర్లో అత్యంత సీనియర్ అయిన సీవీ ఆనంద్ను డీజీపీగా నియమించనున్నట్టు తెలుస్తోంది. -
కవిత ప్రసంగంపై ఉత్కంఠ
తెలంగాణలో మరో ప్రాంతీయ రాజకీయ పార్టీ ఆవిర్భవించబోతోంది. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కుమార్తె కవిత ఇవాళ కొత్త పార్టీని ప్రకటించబోతున్నారు. పార్టీ జెండా, ఎజెండాను శనివారం మేడ్చల్ జిల్లా మునీరాబాద్లో జరిగే సభలో ఆవిష్కరించనున్నారు. సాక్షి, హైదరాబాద్: సబ్బండ వర్గాల సంక్షేమం కోసం.. రేపటి తెలంగాణ భవిష్యత్తు కోసం.. కొత్త రాజకీయ శక్తిగా వస్తున్నాం అనే ప్రచారంతో కవిత ముందుకు వచ్చారు. ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరిట పార్టీ ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. ఉదయం 10గం. ఇందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ జాగృతి సంస్థ కవిత పార్టీ ప్రకటన సభ కోసం అట్టహాసంగా ఏర్పాట్లు చేసింది. నగరంలో పలు చోట్ల బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించింది. కొత్త పార్టీ ప్రకటనకు మేడ్చల్ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర అద్వయ కన్వెన్షన్ ఇందుకు వేదిక కానుంది. 20 ఎకరాల విస్తీర్ణంలో సభకు ఏర్పాట్లు చేయగా.. ప్రాంగణంకు సెంటిమెంట్గా ‘ప్రొఫెసర్ జయశంకర్ సార్’గా నామకరణం చేశారు. సభ కోసం వచ్చే శ్రేణుల కోసం భోజనాలు, ఇతరత్రా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఉదయం బంజారాహిల్స్ నివాసం నుంచి కవిత గన్ పార్క్కు చేరుకుని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించనున్నారు. అక్కడి నుంచి సభకు ఆమె చేరుకోనున్నారు. పార్టీ ప్రకటన, జెండా ఆవిష్కరణ, ప్రసంగం అనంతరం తిరిగి ర్యాలీగా లిబర్టీ చౌరస్తాకు చేరుకుంటారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించి బంజారాహిల్స్ నివాసానికి చేరుకుంటారు. తెలంగాణ ఉద్యమంతో.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో కేసీఆర్ బిడ్డగా కల్వకుంట్ల కవిత పోరాటంలో పాల్గొన్నారు. 2006లో ఉద్యమానికి సాంస్కృతిక కోణాన్ని జోడించి తెలంగాణ జాగృతిని నెలకొల్పారు. బతుకమ్మ సంబురాలతో సాంస్కృతికంగా, బీఆర్ఎస్ తరఫున రాజకీయ కార్యకలాపాల ద్వారా క్రియాశీలంగా పనిచేశారు. 2014లో బీఆర్ఎస్ తరఫున నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఓటమి అనంతరం.. 2020లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2024 మార్చిలో ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన కేసులో అరెస్టై సుమారు 5 నెలల పాటు ఢిల్లీ తీహార్లో జైలు జీవితం గడిపారు. ఆగస్టులో విడుదల కాగా.. ఇటీవలె సీబీఐ కోర్టు ఈ కేసులో ఆమెకు క్లీన్చిట్ ఇచ్చింది. కవిత ప్రసంగంపై ఉత్కంఠ.. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాల నిర్వహణ, పార్టీ అధినేత ప్రసంగంలో లోపాలను ఎత్తిచూపుతూ తాను తండ్రికి రాసిన లేఖ లీక్ కావడంపై కవిత కిందటి ఏడాది మే నెలలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా లేఖ లీక్ కావడానికి కేసీఆర్ చుట్టూ చేరిన దెయ్యాలే కారణమంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అప్పటి నుంచి నుంచి పార్టీపై, నాయకత్వంపై విమర్శల డోసు పెంచుకుంటూ వచ్చారు. ఒకానొక టైంలో.. హరీష్రావు, సంతోష్రావు, జగదీశ్ రెడ్డిలపై విమర్శలు, తీవ్ర ఆరోపణలు చేసిన ఆమె.. సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కూ చురకలు అంటించారు. దీంతో పార్టీ గీత దాటారన్న కారణం చెబుతూ బీఆర్ఎస్ సెప్టెంబర్ 2వ తేదీన ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ పరిణామంతో కలత చెందిన ఆమె.. పలు సంచలన విషయాలను వెల్లడిస్తూ కంటతడి నడుమ పార్టీకి, ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా ప్రకటన చేశారు. అప్పటి నుంచి రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రయత్నాలు చేస్తున్నారామె. మధ్యలో(అక్టోబర్లో) జాగృతి జనం బాట పేరిట నాలుగు నెలుల పాదయాత్ర చేశారు కూడా. ఈ నేపథ్యంలో కవిత పార్టీ పేరుతో పాటు ఆమె ప్రసంగంపై ఉత్కంఠ నెలకొంది. సుమారు గంటన్నర పాటు ఆమె మాట్లాడతారని సమాచారం. -
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించారు. శనివారం ఉదయం షిఫ్ట్ నుంచే బస్సులు నెమ్మదిగా రోడ్డెక్కడం ప్రారంభించాయి. ఆర్టీసీ జేఏసీ సంఘాలతో నిన్న రాత్రి దాకా మంత్రుల సబ్ కమిటీ భేటీ జరిపింది. కీలకమైన మూడు డిమాండ్లు సహా అన్నింటికీ ప్రభుత్వం అంగీకరించింది. ఆ చర్చలు ఫలవంతం కావడంతో విధులకు హాజరవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు నిర్ణయించారు.తొలుత 32 డిమాండ్లపై ఆర్టీసీ సంఘాల నేతలు సచివాలయంలో ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. అనంతరం మంత్రుల సబ్ కమిటీతో భేటీ అయ్యి చర్చించారు. కొన్నింటిపై సులువుగానే సమ్మతి రాగా, ప్రధాన డిమాండ్లపై మంత్రుల నుంచి సానుకూలత వ్యక్తం కాలేదు. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, 2021, 2025 వేతన సవరణలు, ఆర్టీసీలో కార్మీక సంఘాల పునరుద్ధరణ.. ఈ మూడు డిమాండ్లపై ప్రతిష్టంభన నెలకొంది. దీంతో ఏకంగా 13 గంటలపాటు చర్చలు జరిగాయి. కొద్దిసేపు మంత్రులు, కార్మిక సంఘాల నేతలు విడివిడిగా వాళ్లలో వాళ్లే చర్చించుకున్నారు. ప్రధాన డిమాండ్లపై సయోధ్య కుదరకపోవటం, వేతన సవరణ ఫిట్మెంట్ శాతం మీద ఏకాభిప్రాయం రాకపోవటంతో చర్చల్లో అర్ధరాత్రి వరకు ప్రతిష్టంభన కొనసాగింది. అర్ధరాత్రి సమయంలో వీటికి మంత్రులు ఓకే చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో మూడొంతులు పూర్తయిన... ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీన ప్రక్రియను పూర్తి చేసేందుకు అంగీకరించారు. 2021 వేతన సవరణకు సంబంధించి ఏడు శాతంతో మొదలై చివరకు 10 శాతం మేరకు మంత్రులు ప్రతిపాదించిన ఫిట్మెంట్కు కార్మీక సంఘాల నేతలు సమ్మతించారు. కార్మిక సంఘాలను పునరుద్ధరించి ఎన్నికలు జరిపేందుకు కూడా మంత్రులు అంగీకరించారు. మిగతా డిమాండ్లను ఆర్టీసీ బోర్డు, ఎండీ ఆధ్వర్యంలో పరిష్కరిస్తారని మంత్రులు పేర్కొనటంతో కార్మిక సంఘాల సమ్మె విరమణకు అంగీకరించాయి. చివరకు రాత్రి 12.30కు సయోధ్య కుదరటంతో సమ్మె విరమణ ప్రకటన చేశారు. దీంతో మూడు రోజులపాటు బస్సుల్లేక అవస్థలు ఎదుర్కొన్న ప్రయాణికులకు ఊరట లభించినట్లైంది. -
సొరంగం.. ఇక వేగిరం
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగం తవ్వకాలు మళ్లీ వేగిరం కానున్నాయి. తవ్వకాలు జరపాల్సిన భూగర్భ మార్గం ఎంత మేరకు సురక్షితమైనది? ఎక్కడెక్కడ ప్రమాదకర జోన్లు ఉన్నాయి? భూగర్భంలో ఊట నీటి ప్రవాహం ఉందా? ఇప్పటికే తవ్వన సొరంగం పైకప్పు పటిష్టత ఎలా ఉంది? అనే అంశాలపై కీలకమైన సమాచారంతో కూడిన నివేదికను నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఎన్జీఆర్ఐ) ప్రధాన శాస్త్రవేత్త హెచ్వీఎస్ సత్యనారాయణ శుక్రవారం సచివాలయంలో మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డికి అందజేశారు. 26 మీటర్ల వ్యాసం కలిగిన ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ లూప్ను హెలికాప్టర్ ద్వారా సొరంగమార్గం ఉపరితలంపై వేలాడదీస్తూ ముందుకు సాగడం ద్వారా నిర్వహించి సర్వే ఆధారంగా ఈ నివేదికను ఎన్జీఆర్ఐ రూపొందించింది.ఈ సర్వేలో ఎన్జీఆర్ఐ సిస్మిక్ ఇమేజింగ్, ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ టోమోగ్రఫీ (ఈఆర్టీ) వంటి అధునాతన జియోఫిజికల్ సాంకేతికతను ఎన్జీఆర్ఐ రూపొందించింది. భూగర్భంలోకి పంపిన తరంగాలు దేనినైనా ఢీకొని పరివర్తనం చెందుతున్నాయా? లేదా? అనే అంశాన్ని పసిగట్టి 2డీ, 3డీ చిత్రాలను సిస్మిక్ ఇమేజింగ్ టెక్నాలజీ ద్వారా రూపొందిస్తారు. ఇదే తరహాలో భూమి లోపల విద్యుత్ను పంపించి విద్యుత్ వాహక స్థితిగతులను అంచనా వేయడం ద్వారా లోపలి పరిస్థితులపై 2డీ, 3డీ చిత్రాలను ఈఆర్టీ టెస్టు ద్వారా రూపొందిస్తారు. భూగర్భంలో ఖాళీలు, బలహీన ప్రాంతాలు, నీటి ప్రవాహాన్ని గుర్తించడానికి ఈ పరీక్షలు ఉపయోగపడతాయి. సొరంగం తవ్వాల్సిన మార్గంలో భూగర్భ పరిస్థితులను సమగ్రంగా విశ్లేషించి తవ్వకాల సందర్భంగా ఎలాంటి ప్రమాదాలకు తావు కల్పించకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ సమాచారం కీలకం కానుంది. గతేడాది ఫిబ్రవరి 22న ఎస్ఎల్బీసీ సొరంగం పైకప్పు కుప్పకూలి కార్మీకులు గల్లంతైన విషయం తెలిసిందే. దీంతో సొరంగం తవ్వకాలను నిలుపుదల చేసిన ప్రభుత్వం ఏడాది విరామం తర్వాత గత నెలలో డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ టెక్నాలజీతో పునరుద్ధరించింది. రెండు వైపుల నుంచి నెల రోజుల్లో సుమారు 151.5 మీటర్ల మేర సొరంగం తవ్వకాలను పూర్తి చేశారు.నెలకు చెరో వైపు నుంచి 200 మీటర్ల తవ్వకాలు సొరంగం తవ్వకాల్లో కార్మీకుల సంక్షేమానికి పెద్దపీట వేశామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. తవ్వకాలు పూర్తి చేసేందుకు ఎన్జీఆర్ఐ నివేదికలోని సమాచారం కీలకం కాబోతోందన్నారు. ఎన్జీఆర్ఐ పనితీరును ప్రశంసించిన మంత్రి .. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల పునరుద్ధరణకు నిర్వహిస్తున్న భూగర్భ పరీక్షల్లో సహకరించాలని సూచించారు. ఎన్జీఆర్ఐ నివేదికను సమగ్రంగా అధ్యయనం జరిపి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. దేశ, విదేశాల నుంచి యంత్రాలను సమీకరించి సొరంగం తవ్వకాలను వేగిరం చేయాలని ఆదేశించారు. నెలకు చెరో వైపు నుంచి 200 మీటర్ల మేర సొరంగం తవ్వకాలు జరిగేలా వేగాన్ని నెలరోజుల్లోగా పెంచాలని, ఇందుకు అవసరమైన ఎలక్రి్టక్ లోడర్లు, హెవీ డంపర్లు వంటి భారీ యంత్రాలను సమీకరించాలని ఆదేశించారు. -
ఆర్టీఏ సర్వర్ డౌన్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీఏలో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా రెండు రోజులుగా పౌరసేవలు నిలిచిపోయాయి. దీంతో గ్రేటర్ హైదరాబాద్లోని ప్రాంతీయ రవాణా కార్యాలయాలు, డ్రైవింగ్ టెస్ట్ట్రాక్లలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొంతమంది వాహనదారులకు వాహన్సారథి పోర్టల్లో స్లాట్ల నమోదుకు ఆటంకాలు తలెత్తాయి. ఫీజుల చెల్లింపులకు సైతం ఇబ్బంది ఏర్పడింది. ఇలా రెండు రోజులపాటు గంటల తరబడి పౌర సేవలు స్తంభించడంతో వేల సంఖ్యలో లెర్నింగ్, డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల నమోదు, బదిలీలు, ఫిట్నెస్ పరీక్షలు తదితర సేవలు నిలిచిపోయాయి.దీంతో వాహనదారులు ఆర్టీఏ కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చింది. అదే సమయంలో ఫీజులు, త్రైమాసిక పన్నులు వంటి చెల్లింపులకు ఇ–సేవ కేంద్రాల వద్ద నిరీక్షించాల్సి వచి్చంది. ఇ–సేవలో ఏర్పడిన సాంకేతిక సమస్య వల్లనే ఈ పరిస్థితి ఎదురైందని, శుక్రవారం సాయంత్రం అన్ని రకాల సేవలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించామని హైదరాబాద్ జేటీసీ రమేశ్ తెలిపారు. పటిష్టంగా వాహన్ సేవలు: మరోవైపు గత నెలలో ప్రవేశపెట్టిన వాహన్ పోర్టల్ను సాంకేతికంగా మరింత పటిష్టం చేసేందుకు చర్యలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 23,750 వాహనాలకు ఈ పోర్టల్ ద్వారా నమోదు సదుపాయం కల్పించారు. ఫ్యాన్సీ నంబర్లతో పా టు, వాహనాలకు సంబంధించిన అన్ని రకాల కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్టు పేర్కొన్నారు. కొన్ని సాంకేతిక సమస్యలను అధిగమించాల్సి ఉందని, మరో 15 రోజుల్లో వాహన్ సాంకేతిక సామ ర్థ్యం పూర్తిస్థాయిలో మెరుగవుతుందని చెప్పారు. -
భూముల సవరణ విలువలు మే నుంచే అమలు
సాక్షి, హైదరాబాద్: భూముల మార్కెట్ విలువలను సవరించి మే మొదటి వారం నుంచి అమలు చేయాలని రిజి్రస్టేషన్ శాఖ అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని వనరుల సమీకరణ మంత్రివర్గ ఉప సంఘం ఆదేశించింది. వనరుల సమీకరణలో భాగంగా తీసుకున్న నిర్ణయాలను అధికారులు స్పష్టంగా అమలు చేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలని చెప్పారు. అశ్రద్ధ చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని సబ్ కమిటీ శుక్రవారం సచివాలయంలో సమావేశమైంది. మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, శ్రీధర్బాబు, జూపల్లి కృష్ణారావు, పారిశ్రామిక ఎస్టేట్ల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రజాస్వామ్యయుతంగా హిల్ట్ పి హిల్ట్ పి (హైదరాబాద్ ఇండ్రస్టియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ)ని వేగంగా అమలు చేస్తామని భట్టి విక్రమార్క చెప్పారు. హైదరాబాద్తో పాటు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తెచ్చిన ఈ పాలసీని ప్రజాస్వామ్యయుతంగా అమలు చేస్తామని అన్నారు. కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు బయటకు తరలించే విషయంలో అందరి అభిప్రాయాలను తీసుకుని ముందుకు వెళ్తామని తెలిపారు. ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్ మధ్య ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేస్తే మంచిదని, చైనా తరహాలో ప్రత్యేకంగా పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాలని ఇండ్రస్టియల్ ఎస్టేట్స్ ప్రతినిధులు చేసిన సూచనలను స్వాగతిస్తున్నామన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు బాగా నడవాలని, హిల్ట్ పి విషయంలో ప్రభుత్వం చాలా ఓపెన్గా ఉందని పరిశ్రమల మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. హిల్ట్ పాలసీ అమలుకు గడువివ్వండి హిల్ట్ పాలసీని స్వాగతిస్తున్నామని చర్లపల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్ అధ్యక్షుడు డి.శ్రీనివాస్రెడ్డి చెప్పారు. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య పారిశ్రామికవాడలను అభివృద్ధి, అభివృద్ధి చెందని భూములుగా పరిగణనలోకి తీసుకుని పారిశ్రామిక వేత్తలకు సహకరించాలని కోరారు. ఓఆర్ఆర్ బయట ఏర్పాటు చేసే ఇండ్రస్టియల్ పార్కుల్లో కారి్మకులు, ఉద్యోగులకు కనీస వసతి సౌకర్యాలు క ల్పిం చాలని విజ్ఞప్తి చేశారు. పాలసీ అమలుకు ఆరు నెలల గడువు కావాలన్నారు. కన్వర్షన్ చార్జీలను తగ్గించాలని ఉప్పల్ పారిశ్రామికవాడ కార్యదర్శి సత్యనారాయణ కోరారు. సబ్సిడీలు లేకపోయినా ‘ప్యూర్’లో పారిశ్రామికవాడలను ఏర్పాటు చేయాలని జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంత అధ్యక్షుడు నరేంద్రబాబు సూచించారు. సమావేశంలో సీఎస్ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, ఉన్నతాధికారులు శశాంక, కృష్ణభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
వాట్సాప్లో విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ పాలనలో మరో కీలక ముందడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఐదు నుంచి 9వ తరగతి విద్యార్థుల వార్షిక ప్రోగ్రెస్ కార్డులు వాట్సాప్ ద్వారా తల్లిదండ్రులకు చేరాయి. ఐటీ శాఖ పరిధిలోని మీ సేవ ద్వారా 18 లక్షల మందికి పైగా విద్యార్ధుల తల్లిదండ్రులకు ప్రోగ్రెస్ కార్డులు జారీ అయ్యాయి.దీనిద్వారా విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులు విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్కు వెళ్లకుండానే వేగంగా, సురక్షితంగా, పేపర్లెస్ విధానంలో తల్లిదండ్రులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ కార్డుల్లో మార్కులతో పాటు, హాజరుశాతం వివరాలు కూడా ఉన్నాయి. ప్రతీ విద్యార్థి, తల్లిదండ్రులకు సాంకేతిక సేవలు చేరాలనే లక్ష్యంతో వాట్సాప్ ద్వారా రిపోర్ట్ కార్డులు అందించినట్లు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు ఒక ప్రకటనలో వెల్లడించారు. దీని ద్వారా ఆయా కుటుంబాలకు సమ యం, ఖర్చు ఆదా అవుతుందని తెలిపారు. -
తెలంగాణ ప్రజా జాగృతి
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నాయకత్వంతో విభేదించి బయటకు వచ్చిన.. పార్టీ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కుమార్తె కవిత శనివారం సొంత పార్టీని ప్రారంభిస్తున్నారు. గత ఏడాది ఏప్రిల్లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాల నిర్వహణ, పార్టీ అధినేత ప్రసంగంలో లోపాలను ఎత్తిచూపుతూ తాను తండ్రికి రాసిన లేఖ లీక్ కావడంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా లేఖ లీక్ కావడానికి కేసీఆర్ చుట్టూ చేరిన దెయ్యాలే కారణమంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.ఆనాటి నుంచి పార్టీపై, నాయకత్వంపై విమర్శనా్రస్తాలు సంధిస్తూ ఆరోపణలు రోజురోజుకు పెంచుతుండడంతో పాటు.. పార్టీలో కీలక నేతలు హరీశ్రావు, సంతోష్ రావులపై తీవ్రమైన ఆరోపణలు చేసి పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారంటూ గత సెప్టెంబర్ 2న కవితను బీఆర్ఎస్ సస్పెండ్ చేసింది. అయితే ఆ మరుసటి రోజునే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కవిత ప్రకటించారు. అప్పటి నుంచి సొంత పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తూ వచి్చన కవిత.. ‘తెలంగాణ ప్రజా జాగృతి’పేరిట ఏర్పాటు చేస్తున్న కొత్త పార్టీ జెండా, ఎజెండాను శనివారం మేడ్చల్ జిల్లా మునీరాబాద్లో జరిగే సభలో ఆవిష్కరించనున్నారు. ఉదయం నుంచే సంబురాలు ఉదయం 8 గంటలకే అక్కడి ఓ ప్రైవేటు కన్వెన్షన్ సెంటర్లో ఈ మేరకు సంబురాలు ప్రారంభం కానున్నాయి. కవిత ఉదయం 7.30కు బంజారాహిల్స్లోని తన నివాసం నుంచి బయలుదేరి 8.15కు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరుల స్థూపం వద్ద నివాళి అర్పిస్తారు. 9.30కు మునీరాబాద్ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. 10 గంటలకు వేదిక పక్కనే ఏర్పాటు చేసిన గద్దెపై పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు.కన్వెన్షన్ సెంటర్తో పాటు పక్కనే ఉన్న 20 ఎకరాల విస్తీర్ణంలో సభకు ఏర్పాట్లు చేశారు. ఈ ప్రాంగణానికి తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్తగా పేరొందిన ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టారు. స్వాగత ద్వారాలకు, భోజనశాలలకు కూడా పేర్లు పెట్టారు. సభ అనంతరం ర్యాలీగా లిబర్టీ చౌరస్తాకు చేరుకుంటారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అరి్పంచిన అనంతరం కవిత తిరిగి బంజారాహిల్స్ నివాసానికి చేరుకుంటారు. ఢిల్లీ లిక్కర్ కేసులో 5 నెలలు జైల్లో.. 2024 మార్చిలో ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన కేసులో అరెస్టై సుమారు 5 నెలల పాటు ఢిల్లీ తీహార్లో జైలు జీవితం గడిపారు. ఆగస్టులో విడుదల కాగా ఇటీవల సీబీఐ కోర్టు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మరికొందరితో పాటు కవితకు కూడా ఈ కేసులో క్లీన్చిట్ ఇచి్చంది.తెలంగాణ ఉద్యమానికి సాంస్కృతిక కోణం కవిత తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో అమెరికా నుంచి తిరిగి వచ్చారు. 2006లో ఉద్యమానికి సాంస్కృతిక కోణాన్ని జోడించారు. బతుకమ్మ సంబురాలతో పాటు ఇతర సాంస్కృతిక, రాజకీయ కార్యకలాపాల ద్వారా క్రియాశీలంగా పనిచేశారు. 2014లో నిజామాబాద్ ఎంపీగా గెలిచారు. 2019లో ఓటమి అనంతరం 2020లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. -
వడదెబ్బకు పొగ పెడదామా?
వేసవి ఠారెత్తిస్తోంది. ఏప్రిల్లోనే ఎండలు మండిపోతున్నాయి. హీట్ వేవ్ వార్నింగులు, జాగ్రత్తలు పాటించాలంటూ సూచనలు కోకొల్లలుగా వచ్చేస్తున్నాయ్. ఇప్పుడే ఇలా ఉంటే మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ చర్చోపచర్చలు కూడా సాగిపోతున్నాయ్. ఈ నేపథ్యంలో ఈ వడగాలులు మన శరీరంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? వాటిని ఎలా ఎదుర్కోవాలో ఓ లుక్కేద్దాం రండి.వడగాలులు అంటే..? సింపుల్గా చెప్పాలంటే వేడి గాలులు. వాతావరణం ఎగువన (9,800–24,900 అడుగులు) ఉన్న అధిక పీడన ప్రాంతం బలపడి.. కొన్ని రోజుల నుంచి కొన్ని వారాల వరకు ఒక ప్రాంతంపై నిలిచి ఉన్నప్పుడు వడగాలులు ఏర్పడతాయి. 1950లలో నుంచి భూమిపై దాదాపు ప్రతి ప్రాంతంలోనూ వేడిగాలులు అంతకంతకూ పెరుగుతున్నాయ్. వాతావరణ మార్పుల వల్ల 2024 నుంచి ఇవి మరింత తీవ్రతరం అయ్యాయి. అనేక ప్రాంతాలు 45 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలను చవిచూస్తున్నాయ్.మనపై ఎలాంటి ప్రభావం?ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ మానవ శరీరం ఒత్తిడికి గురవుతుంది. సాధారణంగా మన శరీరం 37 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద చక్కగా పనిచేస్తుంది. ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్ దాటిన తర్వాత శ్వాస వేగవంతమవుతుంది. హృదయ స్పందన రేటు పెరుగుతుంది. 40 డిగ్రీల సెల్సియస్ వద్ద శరీరం చల్లగా ఉండటానికి చాలా కష్టపడుతుంది. దీనివల్ల శక్తి వినియోగం దాదాపు 35% పెరుగుతుంది. శరీర అంతర్గత ఉష్ణోగ్రత కొంతసేపు స్థిరంగా ఉన్నప్పటికీ, ఎక్కువసేపు ఈ వేడికి గురికావడం ప్రమాదకరం. 42 డిగ్రీల సెల్సియస్ దాటిన ఉష్ణోగ్రతలు తీవ్రమైన హానిని కలిగిస్తాయి.అందువల్ల మన శరీర ఉష్ణోగ్రతను 37 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద స్థిరంగా ఉంచడానికి మన మెదడులో ఉండే హైపోథాలమస్ అనే భాగం పనిచేస్తుంటుంది. అయితే, బయట మరీ వేడి వాతావరణం ఉంటే మన శరీరం ఆ వేడిని నిరంతరాయంగా గ్రహిస్తుండటం వల్ల చల్లబరచడం కష్టమవుతుంది. మన శరీరంపై ఏర్పడిన చెమట ఆవిరయ్యే పరిస్థితిపై ఇది ఆధారపడి ఉంటుంది.పొడి వాతావరణంలో చెమట త్వరగా ఆవిరై మన శరీరంలోని అధిక వేడిని వెంటనే తొలగిస్తుంది. అదే తేమతో కూడిన రోజులలో తేమ గాలిలో నిండి ఉండటం వల్ల చెమట ఆవిరి కావడం నెమ్మదిస్తుంది. దీంతో శరీరం వేగంగా వేడెక్కడానికి, వడదెబ్బకు గురికావడానికి కారణమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో శరీరం తన అంతర్గత వేడిని నియంత్రించుకోవడానికి అధికంగా కష్టపడాల్సి వస్తుంది. అప్పుడు గుండె, మూత్రపిండాలు అధిక ఒత్తిడికి లోనవుతాయి.మెదడుకూ ముప్పే.. అధిక వేడి శరీరంపైనే కాకుండా నాడీ సంబంధిత ముప్పుగానూ పరిణమిస్తోంది. మెదడుపై ఇది చూపించే ప్రభావం.. మైగ్రేన్లు, మూర్చల నుంచి మానసిక రుగ్మతలు, పక్షవాతం రావడం వరకు కారణమవుతోంది. మనం ఆలోచిస్తున్నప్పుడు, ఏదైనా పని చేస్తున్నప్పుడు, దేనికైనా ప్రతిస్పందించినప్పుడు మెదడు కొంచెం వేడిని విడుదల చేస్తుంది. అప్పుడు శరీరం దానిని చల్లబరుస్తుంటుంది. ఇది నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా ఈ ప్రక్రియ ఫెయిలైతే మొత్తం శరీర వ్యవస్థ అదుపు తప్పుతుంది. వేడి వాతావరణం మనం నిర్ణయాలు తీసుకునే సామర్థ్యంపైనా ప్రభావం చూపిస్తుంది.అంతేకాకుండా మధుమేహం లేదా మూత్రపిండాల వ్యాధి వంటి సమస్యలు ఉన్నవారిలో అధిక వేడి సమయంలో వడదెబ్బ, కండరాల నొప్పుల నుంచి తీవ్రమైన డీహైడ్రేషన్, వడదెబ్బ వరకు సంభవించవచ్చు, వడదెబ్బ వల్ల అధిక చెమట, నీరసం, వికారం, కండరాల నొప్పులు కలుగవచ్చు. శరీర ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ దాటి.. తీవ్రమైన వడదెబ్బగా మారితే.. అది గందరగోళం, మూర్ఛలు, అవయవ వైఫల్యానికి కూడా దారితీయవచ్చు. అధిక చెమట పట్టడం వల్ల నిర్జలీకరణం (డీహైడ్రేషన్), అవసరమైన లవణాల నష్టం కూడా జరగవచ్చు, దీనివల్ల తల తిరగడం, స్పృహ కోల్పోయే ప్రమాదం పెరుగుతుంది.అత్యధిక వేడి జీర్ణవ్యవస్థ పనితీరును కూడా నిశ్శబ్దంగా దెబ్బతీస్తుంది. ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు.. శరీరం ప్రధాన ప్రాధాన్యం చల్లగా ఉండటమే. ఇందుకోసం చెమట ద్వారా వేడిని విడుదల చేయడానికి శరీరం చర్మానికి ఎక్కువ రక్తాన్ని పంపుతుంది. ఈ మార్పు వల్ల జీర్ణవ్యవస్థకు రక్త ప్రసరణ తగ్గి, జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. ఫలితంగా కడుపులో భారంగా అనిపించడం, ఆకలి తగ్గడం, యాసిడ్ రిఫ్లక్స్ లేదా సాధారణ అజీర్ణం వంటి సమస్యలను ఎదుర్కోవచ్చు. శరీరంలో నీటి శాతం తగ్గడం వల్ల ఇది మరింత తీవ్రమవుతుంది. శరీరంలో తగినంత ద్రవాలు లేనప్పుడు, జీర్ణక్రియ మరింత మందగిస్తుంది, దీనివల్ల మలబద్దకం, కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఈ లక్షణాలు ముఖ్యంగా వృద్ధులలో, వేడి వాతావరణంలో తగినంత నీరు తాగని వారిలో సర్వసాధారణంగా కనిపిస్తాయి.ముప్పు తప్పాలంటే ఏం చేయాలి? సాధ్యమైనంత వరకు ఇంటి లోపలే ఉండాలి. ముఖ్యంగా మధ్యాహ్నం 12–3 గంటల మధ్యలో బయటకు వెళ్లొద్దు. దాహం లేకున్నా ఎప్పటికప్పుడు నీళ్లు తాగుతూ ఉండాలి. తేలికపాటి కాటన్ దుస్తులు ధరించాలి. ఎండలో కష్టసాధ్యమైన పనులు చేయకూడదు. ఓఆర్ఎస్, లస్సీ, నిమ్మకాయ నీళ్లు, మజ్జిగ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. అధిక ప్రొటీన్ ఉన్న, నిల్వ ఉన్న ఆహారాన్ని తీసుకోకూడదు.పిల్లలు, జంతువులను పార్క్ చేసి ఉన్న వాహనాల్లో వదిలిపెట్టకూడదు. ఆల్కహాల్, టీ, కాఫీ వంటివి తాగకూడదు. వడదెబ్బకు గురైన వ్యక్తిని వెంటనే చల్లని నీడ ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లాలి. శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి తడి గుడ్డతో తుడవాలి లేదా మామూలు నీళ్లను తలపై చల్లాలి. ఓఆర్ఎస్, నిమ్మకాయ నీళ్లు లేదా గంజి వంటి రీహైడ్రేట్ పానీయాలు అందించాలి. వెంటనే వైద్య చికిత్స కోసం ఆస్పత్రికి తరలించాలి. -
‘ఆర్టీసీ’ విలీనానికి ఓకే..
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనంతోపాటు, కార్మీక సంఘాల గుర్తింపునకు ప్రభుత్వం ఎట్టకేలకు అంగీకరించటంతో మూడు రోజులుగా సాగుతున్న ఆర్టీసీ కార్మీకుల సమ్మె ముగిస్తున్నట్టు కార్మీక సంఘాల నేతలు ప్రకటించారు. శుక్రవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, వివేక్, లక్ష్మణ్కుమార్లతో కూడిన మంత్రుల బృందం ఆర్టీసీ కార్మీకులతో సుదీర్ఘంగా చర్చించింది. 32 డిమాండ్లపై మంత్రులు చర్చించారు. కొన్నింటిపై సులువుగానే సమ్మతి రాగా, ప్రధాన డిమాండ్లపై మంత్రుల నుంచి సానుకూలత వ్యక్తం కాలేదు.ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, 2021, 2025 వేతన సవరణలు, ఆర్టీసీలో కార్మీక సంఘాల పునరుద్ధరణ.. ఈ మూడు డిమాండ్లపై ప్రతిష్టంభన నెలకొంది. చివరకు అర్ధరాత్రి సమయంలో వీటికి మంత్రులు ఓకే చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో మూడొంతులు పూర్తయిన... ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీన ప్రక్రియను పూర్తి చేసేందుకు అంగీకరించారు.2021 వేతన సవరణకు సంబంధించి ఏడు శాతంతో మొదలై చివరకు 10 శాతం మేరకు మంత్రులు ప్రతిపాదించిన ఫిట్మెంట్కు కార్మీక సంఘాల నేతలు సమ్మతించారు. కార్మీక సంఘాలను పునరుద్ధరించి ఎన్నికలు జరిపేందుకు కూడా మంత్రులు అంగీకరించారు. మిగతా డిమాండ్లను ఆర్టీసీ బోర్డు, ఎండీ ఆధ్వర్యంలో పరిష్కరిస్తారని మంత్రులు పేర్కొనటంతో కార్మిక సంఘాల సమ్మె విరమణకు అంగీకరించాయి. దీంతో బుధవారం తెల్లవారుజాము నుంచి శుక్రవారం వరకు జరిగిన సమ్మె ముగిసింది. శనివారం ఉదయం మొదటి షిఫ్ట్ నుంచి బస్సులు యథావిధిగా రోడ్డెక్కుతాయని ప్రకటించారు. ప్రభుత్వంలో విలీనమే ప్రధాన డిమాండ్... గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయించి ప్రక్రియ ప్రారంభించింది. అప్పటికే ఆంధ్రప్రదేశ్ ఈ విలీన ప్రక్రియ జరగ్గా, తెలంగాణలో మాత్రం జరగలేదు. కార్మిక సంఘాల నుంచి కూడా పెద్దగా డిమాండ్ లేకపోవటంతో దాని ఊసే లేదు. కానీ ఎన్నికలకు ముందు నాటి ప్రభుత్వం ఉన్నట్టుండి ఆ ప్రక్రియ ప్రారంభించింది.గవర్నర్ ఆమోదంతో గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ అయ్యింది. అపాయింటెండ్ డేట్ ప్రకటించకుండా, విలీన ప్రక్రియ ఎలా జరగాలో తేల్చే పేరుతో ప్రభుత్వం సీనియర్ అధికారుల కమిటీ ఏర్పాటు చేసింది. ఆ వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావటంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. అప్పటి నుంచి కార్మీకులు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నా... ప్రభుత్వం మాత్రం దాని ఊసెత్తలేదు. ఎన్నికల సందర్భంగా, ఆ ప్రక్రియను పూర్తి చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పినా, అధికారంలోకి వచి్చన తర్వాత మాత్రం పట్టించుకోలేదు. చివరకు కార్మీక సంఘాలు సమ్మెకు దిగటం, సమ్మె రెండో రోజే ముగ్గురు కార్మీకులు ఆత్మహత్యలకు యత్నించటం, అందులో డ్రైవర్ శంకర్గౌడ్ మృతి చెందటంతో ప్రభుత్వం దిగి వచి్చంది. చాలా దీర్ఘకాల డిమాండ్లను పరిష్కరిస్తూ వచి్చనా, కార్మీక సంఘాలు సమ్మెకు దిగటాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం తొలుత కఠినంగానే వ్యవహరించాలని భావించింది. కానీ, శంకర్గౌడ్ ఆత్మహత్య, మరో ఇద్దరు కార్మీకుల ఆత్మహత్య యత్నంతో ప్రభుత్వం తీరు మార్చుకుంది. 13 గంటల పాటు చర్చలు... ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో సమ్మె పరిష్కార చర్చలు ఏకంగా 13 గంటలపాటు సాగాయి. శుక్రవారం ఉదయం 11.30కు తొలుత ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు వికాస్రాజ్, దానకిశోర్, ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిలతో కూడిన అధికారుల కమిటీ సచివాలయంలో ¿బేటీ అయింది. నాలుగు రోజుల క్రితం ఇదే కమిటీతో జరిగిన చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. ఆ చర్చలు విఫలమైన మరుసటిరోజు తొలి షిఫ్టు నుంచే సమ్మె మొదలైంది. శుక్రవారం ఈ కమిటీతో చర్చలు మధ్యాహ్నం భోజన విరామ సమయం వరకు జరిగాయి.భోజనానంతరం మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, వివేక్, లక్ష్మణ్కుమార్లతో ప్రారంభమయ్యాయి. ఏకబిగిన ఆ చర్చలు అర్ధరాత్రి 12.30 వరకు కొనసాగటం విశేషం. తొలుత రెండు జేఏసీల ప్రతినిధులతో, ఆ తర్వాత సంఘాల వారీగా, మధ్యలో జేఏసీ ప్రతినిధుల వారీగా చర్చలు జరిపారు.కొద్దిసేపు మంత్రులు వారిలోవారు విడిగా చర్చించుకోగా, కార్మీక సంఘాల నేతలు వారిలో వారు చర్చించుకున్నారు. ప్రధాన డిమాండ్లపై సయోధ్య కుదరకపోవటం, వేతన సవరణ ఫిట్మెంట్ శాతం మీద ఏకాభిప్రాయం రాకపోవటంతో చర్చల్లో అర్ధరాత్రి వరకు ప్రతిష్టంభన కొనసాగింది. చివరకు రాత్రి 12.30కు సయోధ్య కుదరటంతో సమ్మె విరమణ ప్రకటన చేశారు. అయితే ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు చర్చల ప్రణాళిక వెనుక..శంకర్గౌడ్ అంత్యక్రియలకు ఆర్టీసీ కార్మీక సంఘాల నేతలు హాజరు కావొద్దన్నదేనన్న చర్చ నడుస్తోంది. నేతలు అంత్యక్రియలకు వెళితే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొని, అది రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సమ్మెపై ప్రభావం చూపుతుందన్నది ప్రభుత్వ అనుమానమన్న చర్చ కార్మీక సంఘాల్లో జరుగుతోంది. -
తెలంగాణ ఐపీఎస్ అధికారుల బదిలీలు : మల్కాజిగిరి సీపీగా బి.సుమతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఐఏఎస్లను భారీగా బదిలీ చేసింది. ఈమేరకు ఐపీఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్స్ పై ఒక ప్రకటన జారీ చేసింది. ఈ ఏడాది మే 1 నుంచి ఈ నియామకాలు అమల్లోకి రానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ప్రకటించిన భారీ IPS అధికారుల బదిలీలలో భాగంగా, డాక్టర్ తరుణ్ జోషి 'ఫ్యూచర్ సిటీ' పోలీస్ కమిషనర్గా నియమితులయ్యారు. అలాగే బి. సుమతి మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు.హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా శిఖా గోయల్ నియమితులయ్యారు. దీంతొ పాటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో, ఫోరెన్సిక్ ల్యాబ్ అదనపు బాధ్యతలు కొనసాగుతాయి. విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ డీజీగా దేవేంద్ర సింగ్ చౌహాన్ బదిలీ అయ్యారు. మల్టీ జోన్-2 ఐజీపీగా నియమితులైన షాహ్నవాజ్ ఖాసిమ్కు పర్సనల్ ఐజీపీ అదనపు బాధ్యతలు అప్పగించారు. సుధీర్ బాబు పదవీ విరమణ నేపథ్యంలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్గా తరుణ్ జోషి నియమితులయ్యారు. అవినాష్ మహంతి డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీగా బదిలీ కాగా, ఏసీబీ డైరెక్టర్ అదనపు బాధ్యతలను నిర్వర్విస్తారు. కార్తికేయ ఐజీపీ ఇంటెలిజెన్స్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా, ప్రస్తుతం SIB (ఇంటెలిజెన్స్) IGPగా ఉన్న బి. సుమతి నియమితులు కావడం విశేషం. -
తెలంగాణలో డిజిటల్ విప్లవం.. వాట్సాప్కే విద్యార్థుల వార్షిక రిపోర్ట్ కార్డులు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ పాలనలో మరో కీలక ముందడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా గవర్నమెంట్ పాఠశాలల్లో చదువుతున్న 5వ తరగతి నుండి 9వ తరగతి విద్యార్థుల వార్షిక రిపోర్ట్ కార్డులు నేరుగా తల్లిదండ్రులకు చేరాయి. 18 లక్షలకుపైగా విద్యార్ధుల ప్రోగ్రెస్ కార్డులు మీ సేవ ద్వారా నేరుగా పేరెంట్స్ వాట్సాప్ నెంబర్కు విజయవంతంగా పంపిణీ చేసింది.ఈ విప్లవాత్మక కార్యక్రమాన్ని ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ ఆధ్వర్యంలో మీ సేవ ద్వారా అమలు చేశారు. దీనిద్వారా విద్యార్థుల అకడమిక్ రికార్డులు స్కూల్కు వెళ్లకుండానే.. తక్షణం, సురక్షితంగా, పేపర్లెస్ విధానంలో తల్లిదండ్రులకు అందుబాటులోకి వచ్చాయి.ఈ రికార్డు ముఖ్యాంశాలు• 18,00,000+ విద్యార్థుల రిపోర్ట్ కార్డులు డిజిటల్గా పంపిణీ.• 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు రాష్ట్రవ్యాప్తంగా గవర్నమెంట్ పాఠశాలలు.•సబ్జెక్టుల వారీగా మార్కులతో పాటు, హాజరుశాతం కూడా నమోదు.•స్కూల్కి వెళ్లాల్సిన అవసరం లేకుండా సౌకర్యం.•పూర్తిగా పేపర్లెస్, సురక్షిత విధానం.ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ప్రతీ విద్యార్థి, తల్లిదండ్రులకు సాంకేతిక సేవలు చేరాలనే లక్ష్యంతో వాట్సాప్ ద్వారా రిపోర్ట్ కార్డులు అందించామని వెల్లడించారు. దీని ద్వారా ఆయా కుటుంబాలకు సమయం, ఖర్చు ఆదా అవుతుందని, ఇది తెలంగాణ డిజిటల్ గవర్నెన్స్కు నిదర్శనమని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ప్రజలకు సులభంగా, వేగవంతమైన సేవలను అందించడంలో మరోసారి విజయవంతం అయిందని ఆయన అన్నారు. -
ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. డిపోలకే పరిమితమైన బస్సులు (ఫొటోలు)
-
శంకర్ గౌడ్ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం
సాక్షి,వరంగల్: నర్సంపేట డిపోలో ఆర్టీసీ డ్రైవర్ కోల్ శంకర్గౌడ్ మృతదేహానికి నర్సంపేట ఆర్డీవో ఉమారాణి నివాళులర్పించారు. ప్రభుత్వం తరపున శంకర్ గౌడ్ కుటుంబానికి పరిహారం అందిస్తున్నట్లు తెలిపారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం తరుపున రూ.10లక్షల ఎక్స్గ్రేషియా,మృతుడి కుమారుడికి ఆర్టీసీలో ఉద్యోగం ఇస్తున్నట్లు ప్రకటించారు.నర్సంపేట ఎమ్మెల్యే దొంతిరెడ్డి మాధవరెడ్డి రూ.5లక్షలు సహాయం చేశారు.తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ కార్మికుల చర్చలు కొనసాగుతున్నాయి. ఈ చర్చల్లో 29 డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అయితే మిగిలిన మూడు హామీల విషయంలో తమకు కొంత సమయం కావాలని ప్రభుత్వం తరుఫు అధికారులు ఆర్టీసీ జేఏసీని విజ్ఞప్తి చేశారు. మూడు డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇవ్వాలని ఆర్టీసీ జేఏసీ పట్టుబడుతోంది.చర్చల్లో ఆర్టీసీ జేఏసీ మూడు డిమాండ్లు ఇవేఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి. గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలి. గత ప్రభుత్వం రద్దు చేసిన సంఘాలను పునరుద్ధరించాలి. 2021 వేతన సవరణ 30శాతం ఫిట్మెంట్తో అమలు చేయాలి.2025 వేతన సవరణ అమలు చేయాలి’అని డిమాండ్లు చేస్తున్నారు.వరంగల్ జిల్లా నర్సంపేట డిపోలో ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్గౌడ్ ఆత్మహత్యకు యత్నించాడు. సమ్మెలో భాగంగా రెండో రోజు డిపో వద్ద కార్మీకులు చేస్తున్న ఆందోళన వద్ద గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. గమనించిన తోటి ఉద్యోగులు మంటలను ఆర్పారు. అప్పటికే తీవ్రగాయాలు కావడంతో వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి అంబులెన్స్లో తరలించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని కంచన్బాగ్ డీఆర్డీఓ అపోలో ఆసుపత్రికి తరలించారు. 80 శాతానికిపైగా కాలిన గాయాలతో చికిత్స పొందుతూ మరణించారు.కాగా తమ డిమాండ్లను పరిష్కరించాలని రెండు రోజులుగా రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ఆర్టీసీ యాజమాన్యం ప్రైవేటు డ్రైవర్లతో బస్సులను నడుపుతుండటాన్ని నిరసిస్తూ శంకర్గౌడ్ ఒంటికి నిప్పంటించుకున్నట్లు తోటి ఉద్యోగులు చెప్పారు.ముత్తోజీపేటలో తీవ్ర ఉద్రిక్తతముత్తోజీపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ భౌతికకాయాన్ని తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. శంకర్గౌడ్ భౌతికకాయాన్ని నర్సంపేట డిపో దగ్గరకు తీసుకెళ్తామని ఆర్టీసీ కార్మికులు పట్టుబడుతుండగా.. అందుకు పోలీసులు ఒప్పుకోలేదు. దీంతో పోలీసులు కార్మికుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అదే సమయంలో తన వాహనంలో భౌతికకాయాన్ని తీసుకెళ్లేందుకు బండి సంజయ్ ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు బండిసంజయ్ వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన బండి సంజయ్ పోలీసులే అంత్యక్రియలు చేయండంటూ ఫైర్ అయ్యారు. కుమార్తె ఇంటికి శంకర్ గౌడ్ మృతదేహం తరలించారు. -
శంకర్ గౌడ్ మృతదేహాన్ని తరలించే యత్నం.. తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, వరంగల్: నర్సంపేట మండలం ముత్తోజిపేట గ్రామంలో శుక్రవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ భౌతిక కాయానికి నివాళులర్పించి.. ఆయన కుటుంబాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ పరామర్శించారు. ఆ సమయంలో శంకర్ మృతదేహాన్ని డిపో వరకూ తీసుకెళ్తామని కార్మికులు ఆయనతో అన్నారు. అయితే పోలీసులు అందుకు ఒప్పుకోకపోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదే విషయమై ఆర్టీసీ కార్మికులకు ఉదయం పోలీసులు అభ్యంతరం చెప్పారు. ఆ సమయంలోనూ ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. కార్మికులను అరెస్ట్ చేసిన పోలీసులు.. శంకర్గౌడ్ ఇంటి వద్ద వేసిన టెంట్ను సైతం తొలగించారు. కాసేపటికి కేంద్ర మంత్రి బండి సంజయ్ అక్కడికి వచ్చారు. ఆ సమయంలోనూ కార్మికులు అదే డిమాండ్ చేశారు. డిపో వద్ద తమ తోటి కార్మికుడి మృతదేహానికి నివాళులర్పించేందుకు అనుమతించాలని పోలీసులను కోరారు. అందుకు అనుమతి ఇవ్వకపోవడంతో పోలీసుల వైఖరిని బండి సంజయ్ తప్పుబట్టారు. ఎవరు అడ్డుకుంటారో చూస్తాం.. మీరు తీసుకెళ్లండి అని కార్మికులతో అన్నారాయన. ఆ సమయంలో పోలీసులు భారీగా మోహరించడంతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మరోవైపు కొందరు కార్మికులు, బీజేపీ కార్యకర్తలు పోలీసులను దాటుకుని రోడ్డుపై శంకర్ గౌడ్ మృతదేహాన్ని నెట్టుకుంటూ తరలించే ప్రయత్నం చేశారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. నిన్న సమ్మె రెండు రోజు జరగ్గా.. నర్సంపేట డిపోలో డ్రైవర్గా పని చేసే కోలా శంకర్గౌడ్ ప్రభుత్వ తీరుకు నిరసగా పెట్రోల్ పోసుకుని నిప్పటించుకున్నాడు. తీవ్ర గాయాలతో(80 శాతం) హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి సమయంలో కన్నుమూశాడు. పోస్ట్మార్టం అనంతరం శంకర్ గౌడ్ మృతదేహాన్ని స్వస్థలం ముత్తోజీపేట పోలీసులు తరలించారు. -
బీజేపీ ఆఫీస్కు మల్లారెడ్డి కోడలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఇవాళ ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి బీజేపీ కార్యాలయాన్ని సందర్శించారు. ఇది హాట్ చర్చకు దారి తీసింది.ప్రీతిరెడ్డి ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు గుప్పించారు. బీజేపీ పార్టీ విధానాలపై సానుకూలంగా మాట్లాడారు. దీంతో ఆమె బీజేపీ వైపు అడుగేస్తారనే చర్చ మొదలైంది. ఈ ఊహాగానాల నడుమ శుక్రవారంనాడు ప్రీతిరెడ్డి బీజేపీ పార్టీ ఆఫీస్కు వెళ్లి.. సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారిని కలిశారు. అయితే.. ఇది మర్యాదపూర్వక భేటీనేనని చెబుతూ ప్రచారాలకు ప్రీతిరెడ్డి తెర దించారు. ‘‘మల్లారెడ్డి యూనివర్సిటీలో ఏఐ క్యాంపస్ ఓపెనింగ్కు ప్రధాని మోదీని ఆహ్వానించాం. మోదీని ఆహ్వానించాం కాబట్టే ఆ పార్టీ నేతలను ఇప్పుడు కలుస్తున్నాం. బీజేపీనే కాదు.. అన్ని పార్టీల నేతలను కలిసి ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం కోసం మొన్న మంత్రి శ్రీధర్బాబును కూడా కలిశాం. నేను బీజేపీలో చేరడం లేదు. మల్లారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. మాకు బీఆర్ఎస్ అంటే గౌరవం ఉంది. విద్యావేత్తగా అందరితో కలిసి ఉండడంలో తప్పేముంది? దయచేసి ఈ ప్రచారానికి ఇంతటితో ఆపండి’’ అని అన్నారామె. సాక్షితో చిట్చాట్లో.. ఏఐ క్యాంపస్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించాంబీజేపీ నేతలను కలిసి ఇదే విషయం తెలియజేశాంబీఆర్ఎస్ నేతలను, కాంగ్రెస్ వాళ్లనూ ఆహ్వానిస్తాం అన్ని పార్టీల నేతలను కలుస్తాంఇప్పుడ రాజకీయాల్లోకి రావాలని లేదుమహిళా రిజర్వేషన్లు వచ్చి ఉంటే బాగుండేదిమల్లారెడ్డి ఇటీవల కుటుంబంతో సహా ప్రధాని మోదీని కలిశారు. దీంతో ఆయన కూడా బీజేపీలో చేరతారనే ప్రచారం జోరుగా నడిచింది. అయితే ఆ కథనాలపై ఆయన స్పందించారు. మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ యూనివర్సిటీలో దేశంలోనే మొట్టమొదటి డీజిటల్ ఏఐ ఏజెన్సీ క్యాంపస్ను గూగుల్తో కలిసి త్వరలో ప్రారంభించబోతున్నారు. ఇది ఆసియాలోనే అతిపెద్దదైన ఏఐ-ఏజెన్సీ క్యాంపస్ కానుంది. అందుకే ప్రధాని నరేంద్రమోదీని ఆ కార్యక్రమానికి ఆహ్వానించినట్టు మల్లారెడ్డి మీడియాకు వివరణ ఇచ్చారు. -
ఆర్టీసీ విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్.. దొందూ దొందే
సాక్షి, కరీంనగర్: కాంగ్రెస్ ప్రభుత్వ మొండి వైఖరి వల్లే ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నాడని బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆర్టీసీ కార్మికుల విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు అన్యాయమే చేశాయని విమర్శించారాయన. కార్మికుల కోసమే శంకర్ బలిదానం అయ్యాడని.. ఇది ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యేనని బండి సంజయ్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వలన నర్సంపేటకి అర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. కార్మికుల కొసం శంకర్ గౌడ్ బలిదానం అయ్యాడు. ఇది ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వం హత్యనే. కాంగ్రెస్ ప్రభుత్వం బెదిరింపులకు దిగడం సరికాదు. ఆర్టీసీలో 39 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. వాళ్లు దుర్భర జీవితం గడుపుతున్నారు. రిటైర్డ్ కార్మికులకు వచ్చే ఫించన్ కూడా చాలా తక్కువ. బీఆర్ఎస్ హయాంలో కార్మికులు సమ్మెకు దిగితే ఎస్మా ప్రయోగించారు. ఆ సమ్మెలో 20 మంది చనిపోయారు. అయినా బీఆర్ఎస్ కనికరించలేదు. కార్మికులు 52 రోజులపాటు సమ్మె చేశారు. ఆ సమయంలో కార్మికుల కోసం పోరాడి మేం జైలుకు వెళ్లాం. మా పోరాటం ఫలితంగానే బీఆర్ఎస్ దిగి వచ్చింది. కాంగ్రెస్ది అభయ హస్తం కాదు.. భస్మాసుర హస్తం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టింది. ఆర్టీసీ పునరుద్ధరణకు సహకరిస్తామని చెప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే ఆ హామీని నెరవేరుస్తామని చెప్పింది. కానీ, 900 రోజులు అవుతున్నా ఆ డిమాండ్లు నెరవేరలేదు. ఆ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలనే ఇవాళ కార్మికులు అడుగుతున్నారు. గత ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం వ్యవహారిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ.. కేంద్రాన్ని అడిగి మీ మేనిఫెస్టో రూపకల్పన చేశారా? బీఅర్ఎస్ పార్టీ మోసం చేసిందనే కదా మీకు ఓటు వేసింది. అలాంటప్పుడు కమిటీల పేరుతో కాలయాపన ఎందుకు?. రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి సమస్యని పరిష్కారించాలి. మంత్రుల యాభై శాతం జీతం కోత వలన ఏం ప్రయోజనం?. డిల్లీ, తమిళనాడు, కేరళ,అస్సాం రాష్ట్రాలకి తెలంగాణ నుండే డబ్బులు పోతున్నాయి. మంత్రులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆస్తుల్లో సగం అమ్మినా కార్మికుల బాధలు పొతాయి అని విమర్శలు గుప్పించారాయన. ఆర్టీసీ కార్మికుల దీక్షకి బీజేపీ సంపూర్ణ మద్దతు ఉందన్న బండి సంజయ్.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా లైసెన్స్, శిక్షణ లేనివారిని తాత్కాలిక ఉద్యోగాలు ఇవ్వడం ఏంటని నిలదీశారు. అలాగే తొందరపడవద్దని.. కలిసి కొట్లాడుదామని ఆర్టీసీ కార్మికులకు ఆయన పిలుపు ఇచ్చారు. -
ఆ ఫోన్ కాల్స్ ఎత్తొద్దు.. చాలా డేంజర్
సాక్షి, హైదరాబాద్: ఆర్బీఐ, ట్రాయ్ అధికారుల పేరిట ఫోన్ కాల్స్ చేస్తూ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు హెచ్చరించారు. +97,+85 తో మొదలయ్యే నంబర్లతో వచ్చే ఫోన్కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆ రెండు నంబర్ల కోడ్తో మొదలయ్యే ఫోన్ నంబర్లు మోసపూరితమైనవి గ్రహించాలని, ఆ నంబర్ల నుంచి వస్తే ఫోన్ ఎత్తవద్దని పేర్కొన్నారు. ఒకవేళ ఈ తరహా ఫోన్కాల్స్వల్ల మోసపోయినట్టు గుర్తిస్తే వెంటనే సైబర్ సెక్యూరిటీ బ్యూరో టోల్ఫ్రీ నంబర్ 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.కాగా, అవాంఛిత, మోసపూరిత కాల్స్, సందేశాలు సవాల్గా మారాయి. వ్యక్తుల భద్రతకు ముప్పుగా పరిణమించడంతోపాటు ఆర్థిక నష్టాలకూ ఇవి కారణం అవుతున్నాయి. మన దేశంలో 95 శాతం మంది మొబైల్ యూజర్లకు ప్రతిరోజూ స్పామ్ కాల్స్, సందేశాలు వెల్లువెత్తుతున్నాయంటే సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. 2024 సెప్టెంబర్ నుంచి 2026 జనవరి మధ్య 7,100 కోట్ల స్పామ్ కాల్స్, 290 కోట్ల స్పామ్ సందేశాలను గుర్తించినట్లు ఎయిర్టెల్ ఇటీవల ప్రకటించింది.8 లక్షలకుపైగా మోసపూరిత లింక్స్ను బ్లాక్ చేసినట్లు వెల్లడించింది. సైబర్ నేరగాళ్లు ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ కాల్ సెంటర్లతో వ్యవస్థీకృతంగా మోసపూరిత కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలిపింది. సైబర్ నేరగాళ్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 92.7 లక్షల కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని భారతీ ఎయిర్టెల్ చీఫ్ రెగ్యులేటరీ ఆఫీసర్ రాహుల్ వాట్స్ వెల్లడించారు. 250కిపైగా కొలమానాలను పరిగణనలోకి తీసుకొని స్పామ్ కాల్స్, సందేశాలను గుర్తిస్తున్నట్టు చెప్పారు. -
హైదరాబాద్లో కొత్త పార్క్.. ఈ వేసవి సెలవుల్లో ఓ లుక్కేయండి (ఫొటోలు)
-
భర్త అక్రమ సంబంధం.. బట్టబయలు చేసిన భార్య!
సాక్షి, నిజామాబాద్: భర్త అక్రమ సంబంధాన్ని భార్య బట్టబయలు చేసిన ఘటన జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కాలేజీ రోడ్డులో జరిగింది. గుత్పకు చెందిన శివ రంజనితో తన భర్త శ్రవణ్ కుమార్.. అక్రమ సంబంధం పెట్టుకున్నాడని బాధిత మహిళా సంధ్య ఆరోపిస్తోంది. ప్రియురాలు శివ రంజనితో భర్త శ్రవణ్ కుమార్ షాపింగ్ చేసి వస్తుండగా భార్య సంధ్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ఇద్దరికీ దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించింది. వారి సెల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు.భర్త శ్రవణ్, అతని ప్రియురాలు శివరంజని ఇంటి ముందు భార్య సంధ్య ఆందోళనకు దిగింది. తాను ఉండగా మరో మహిళ తో అక్రమ సంబంధం పెట్టుకుని దుబ్బ రోడ్డులో సంసారం చేస్తున్నారంటూ బాధిత మహిళ ఆరోపిస్తుంది. తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు పోలీసుల కాళ్లు పట్టుకుంది. సంఘటన స్థలానికి వచ్చిన ప్రియురాలి భర్త శ్రీధర్పై శ్రవణ్కుమార్ దాడికి పాల్పడ్డారు. ప్రియురాలి భర్త శ్రీధర్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
శంకర్గౌడ్ కుటుంబాన్ని ఆదుకుంటాం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ బలవన్మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శంకర్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటామని.. ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని.. కుటుంబ సభ్యులకు ధైర్యం, మనోబలం కలగాలని ప్రార్థించారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబాన్ని దు:ఖసాగరంలో ముంచిందని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరుపుతుందని, వారి సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు.కాగా, వరంగల్ జిల్లా నర్సంపేట డిపోలో ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్గౌడ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమ్మెలో భాగంగా రెండో రోజు డిపో వద్ద కార్మీకులు చేస్తున్న ఆందోళన వద్ద గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.గమనించిన తోటి ఉద్యోగులు మంటలను ఆర్పారు. అప్పటికే తీవ్రగాయాలు కావడంతో వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి అంబులెన్స్లో తరలించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని కంచన్బాగ్ డీఆర్డీఓ అపోలో ఆసుపత్రికి తరలించారు. 80 శాతానికిపైగా కాలిన గాయాలతో చికిత్స పొందుతు మృతిచెందారు. -
ముగిసిన ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్ గౌడ్ అంతిమయాత్ర
తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె తీవ్ర రూపం దాల్చే పరిస్థితి కనిపిస్తోంది. నర్సంపేట డిపోకు చెందిన శంకర్ గౌడ్ అనే డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సమ్మెను మరో రూపంలో ముందుకు తీసుకెళ్లాలని ఆర్టీసీ జేఏసీ భావిస్తున్నట్లు సమాచారం. -
నేటి నుంచి బడులకు సెలవులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాఠశాలలకు శుక్రవారం సెలవులు ప్రారంభం అవుతున్నాయి. జూన్ 12న పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. కాగా పదవ తరగతి ఫలితాలు వచ్చే నెల 4 లేదా 5వ తేదీన వెలువడే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ఈనెల 16వ తేదీన ముగిసాయి.ఎస్ఎస్సీ బోర్డు మూల్యాంకనం వేగవంతం చేసి.. త్వరగా ఫలితాలు వెల్లడించేందుకు కసరత్తు ముమ్మరం చేసినట్లు అధికారవర్గాల సమాచారం. అధికారులు మాత్రం ఫలితాలు వెల్లడించే కచి్చతమైన తేదీని అధికారికంగా ఇప్పటి వరకు ప్రకటించలేదు. -
అల్ట్రా శ్రీమంతులు!
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరంలో ‘అతి భారీ సంపన్నుల’సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 30 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ సంపద కలిగిన వ్యక్తులను అల్ట్రా హైనెట్వర్త్ ఇండివిడ్యుయల్స్గా (యూహెచ్ఎన్డబ్ల్యూఐ) వ్యవహరిస్తారు. భారత్లో ఈ అల్ట్రా శ్రీమంతుల జనాభాలో హైదరాబాద్ వాటా 6.3 శాతంగా ఉంది. 2015లో ఇది 5 శాతంగా ఉంది. ఇలాంటి సంపన్నుల్లో అత్యధికంగా ముంబై వాటా 35.4 శాతంగా ఉందని గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ఫ్రాంక్ గురువారం విడుదల చేసిన ‘ది వెల్త్ రిపోర్ట్’20వ ఎడిషన్లో వెల్లడించింది. భారత్లో శ్రీమంతులు ప్రపంచవ్యాప్తంగా అల్ట్రా శ్రీమంతుల ర్యాంకింగ్స్లో భారత్ ఆరో స్థానంలో ఉంది. అల్ట్రా శ్రీమంతులు మన దేశంలో ఈ ఏడాది 19,877 మంది ఉండగా.. 2031 నాటికి 27 శాతం వృద్ధి రేటుతో 25,217కు చేరుతుందని అంచనా. 2021లో ఈ సంఖ్య 12,161గా ఉంది. మన దేశంలో సంపన్నుల సంఖ్య పెరగడం దాని ఆర్థిక పరిణామాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రైవేట్ మూలధన నిధులు, అధునాతన ఆర్థిక మార్కెట్లు, వ్యవస్థీకృత పెట్టుబడిదారుల సంఖ్య పెరగడం, డిజిటలైజేషన్, లిస్టెడ్ ఈక్విటీలు, కుటుంబ యాజమాన్యంలోని వ్యాపారాలు వంటివి ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. నగరంలో 1 మిలియన్ డాలర్లతో 498 చ.మీ. స్థలం హైదరాబాద్లో విలాసవంతమైన గృహాల మార్కెట్ గణనీయంగా పెరుగుతోంది. నైట్ఫ్రాంక్ ప్రైమ్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ ఇండెక్స్ (పీఐఆర్ఐ) ప్రకారం.. హైదరాబాద్లో రూ.9.4 కోట్ల (1 మిలియన్ డాలర్లు)తో 498 చ.మీ. నివాస స్థలాన్ని కొనుగోలు చేయొచ్చని అధ్యయనంలో తేలింది. 2024లోని ఇది 503 చ.మీ.గా ఉంది. ప్రపంచంలో అత్యంత ఖరీదైన నివాస నగరంగా ఉన్న మొనాకోలో 1 మిలియన్ డాలర్లతో కేవలం 16 చ.మీ. నివాస స్థలాన్ని మాత్రమే కొనుగోలు చేయొచ్చు. ఆ తర్వాతి స్థానాల్లో హాంకాంగ్ 23 చ.మీ., జెనీవా 28 చ.మీ. ఉన్నాయి. -
కర్రెగుట్టల్లో రయ్.. రయ్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: రెండేళ్ల క్రితం వరకూ మావోయిస్టు ప్రభావిత జిల్లాలుగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఉన్నాయి. అయితే ఈ రెండు జిల్లాల సరిహద్దులో విస్తరించిన కర్రె గుట్టల వద్ద చేపట్టిన ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్తో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. మావోయిస్టులు పూర్తి ఆత్మరక్షణలోకి వెళ్లిపోయారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి మావోయిస్టుల ఉనికి లేకుండా పోయింది. అయితే, భవిష్యత్లోనూ ఎలాంటి ఇబ్బందులు రాకుండా కర్రె గుట్టల దగ్గర అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తెలంగాణ–ఛత్తీస్గఢ్ సరిహద్దులో తెలంగాణ–ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఉన్న కర్రె గుట్టలే కేంద్రంగా మావోయిస్టులు ఆయుధ తయారీ కేంద్రం, ఆయుధ నిల్వాగారం, ఆస్పత్రి, శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నారు. ఆపరేషన్ కగార్ పతాక స్థాయికి చేరాక గాయపడిన కేడర్ నుంచి కేంద్ర కమిటీ సభ్యుల వరకు ఇక్కడి రక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. దీంతో మావోయిస్టులను తుదుమట్టించే లక్ష్యంతో గతేడాది ఏప్రిల్ 21న 5వేల మందికి పైగా బలగాలు, మూడు హెలికాప్టర్లతో కర్రెగుట్టల గాలింపు చర్యలను ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పేరిట కేంద్రం చేపట్టింది. 21 రోజుల పాటు జరిగిన ఆపరేషన్లో 31 మంది మావోయిస్టులు చనిపోగా, ఇక్కడ ఆశ్రయం పొందుతున్న మరో 700 మంది మావోలు ఈ ప్రాంతాన్ని వీడి వెళ్లక తప్పలేదు. ఆపై శిక్షణ కేంద్రాలు, ఆయుధ నిల్వలను భద్రతా దళాలు ధ్వంసం చేశాయి. క్యాంపులతో కట్టడి ఎత్తయిన కొండలు, ఎక్కడిక్కడ జలపాతాలు, లోయలు వంటి సహజ వనరులు కర్రె గుట్టల ప్రాంతంలో మెండు. ఇక్కడ జనసంచారం తక్కువ కావడంతో ఈ గుట్టలను సైనిక దుర్గంగా మావోయిస్టులు మార్చుకున్నారు. ఐదు వేల అడుగుల ఎత్తులో 50 కి.మీ పొడవు, 15 కి.మీ వెడల్పుతో రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ఈ గుట్టలను ఖాళీగా వదిలేస్తే భవిష్యత్లో ఇబ్బందులు వస్తాయని నిఘా వర్గాలు అంచనాకు వచ్చాయి. దీంతో ఏడాది కాలంగా కర్రె గుట్టల చుట్టూ తెలంగాణలో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఛత్తీస్గఢ్లో బీజాపూర్ వైపు కొత్త క్యాంపుల ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేశారు. జనసంచారం పెంచేలా భౌగోళికంగా కర్రె గుట్టలకు తెలంగాణ వైపు ములుగు జిల్లా, ఛత్తీస్గఢ్ వైపు బీజాపూర్ జిల్లా ఉంటుంది. ఈ రెండు జిల్లాల మధ్య ఎత్తయిన కర్రె గుట్టలు ఉండడంతో బీజాపూర్ జిల్లాలోని పూజారి కాంకేర్, గుంజపర్తి, పెద్ద ఊట్ల, కస్తూరిపాడు తదితర గ్రామాల ప్రజలు దూరమైనా, తమ అవసరాల కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్లపై ఎక్కువగా ఆధారపడుతుంటారు. అందుకే ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం మండలాల కంటే కూడా చర్లపై మావోయిస్టులు ఎక్కువ ప్రభావం చూపించగలిగారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో జన సంచారం పెంచే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. 32 కి.మీ రోడ్డు బీజాపూర్ జిల్లాలోని నంబీ నుంచి తెలంగాణలోని వాజేడు మండలం మురుమూరు వరకు కర్రె గుట్టల మీదుగా 32 కి.మీ. మేర రోడ్డు నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఇప్పటికే మురుమూరు నుంచి పామునూరు వరకు 14 కి.మీ మేరకు ఘాట్లో మట్టి రోడ్డు నిర్మించారు. వేసవి ముగిసేలోగా దీన్ని తారు రోడ్డుగా మార్చాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. తద్వారా వాజేడు వైపు నుంచి కర్రె గుట్టల మీదకు సులువుగా వాహనాల్లో చేరుకోవడం సాధ్యమవుతుంది. వానాకాలం ముగిశాక పామునూరు నుంచి కర్రె గుట్టల మీదుగా ఛత్తీస్గఢ్ వైపు దిగుతూ నంబి–పూజారికాంకేర్ రోడ్డును తాకేలా మరో 18 కి.మీ రోడ్డు అందుబాటులోకి తెస్తారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయ్యాక ఎకో టూరిజం అభివృద్ధి చేయాలనేది లక్ష్యంగా ఉంది. కర్రె గుట్టల్లో రోడ్డు నిర్మాణం జరిగితే చర్ల, దుమ్ముగూడెం మండలాలు పూర్తి స్థాయిలో మావోయిస్టు ప్రభావం నుంచి బయటపడతాయి. -
ఇంగ్లిష్ పై పట్టు సాధించారు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు ఇంగ్లిష్ అబ్బేలా ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి చేసిన వినూత్న ఆలోచన విజయవంతమైంది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1–5వ తరగతుల విద్యార్థుల కోసం అమలు చేసిన ‘ఎవ్రీ చైల్డ్ రీడ్’తో ఏడు నెలల్లోనే అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. అక్షరాలు నేర్చుకోవడం నుంచి ప్రారంభించి, పదాలు రాయడం, వాక్యాల నిర్మాణం.. పూర్తిగా చదివేలా చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా 26 వేల మంది విద్యార్థుల్లో నైపుణ్యం పెరిగింది. అలా మొదలై.. విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచే ఆంగ్లంపై పట్టు పెంచాలన్న సంకల్పంతో ఖమ్మం కలెక్టర్ అనుదీప్ 2025 అక్టోబర్లో ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తొలినాళ్లలో ఒకటి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థుల్లో చాలామందికి పూర్తిగా ఇంగ్లిష్ పదాలు, వాక్యాలు చదవడం రాలేదు. అయితే ఆరు నెలల తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది. జిల్లా స్థాయిలో అభివృద్ధి చేసిన ఈసీఆర్ (ఎవ్రీ చైల్డ్ రీడ్) యాప్ ద్వారా ప్రతీవారం సుమారు 26వేల విద్యార్థుల ఇంగ్లిష్ పఠన స్థాయిని ఉపాధ్యాయులు నమోదు చేశారు. ప్రతీ విద్యార్థి ఏ స్థాయిలో ఉన్నారో నమోదు చేస్తుండగా, కలెక్టర్, ప్రతీ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ పర్యవేక్షణతో పురోగతి కనిపించింది. ఒక్కో మెట్టుతో ముందుకు.. మొదటి వారంలో కేవలం 11 శాతం మంది విద్యార్థులు మాత్రమే వాక్య స్థాయిలో చదవగా, 21వ వారానికి 85 శాతం మంది విద్యార్థులు వాక్యాల స్థాయికి చేరితే, అక్షరాల దశలో కేవలం ఒక శాతమే ఉన్నారు. వాక్య పఠనంలో ఈ ఏడాది 2వ తరగతిలో 53 శాతం, 3వ తరగతిలో 71 శాతం, 4వ తరగతిలో 73 శాతం, 5వ తరగతిలో 86 శాతం పురోగతి నమోదైంది. ఎవ్రీచైల్డ్ రీడ్స్ను ఖమ్మం జిల్లాలో ప్రారంభించాక మిగిలిన జిల్లాల్లోనూ అమలు చేశారు. నూరుశాతం పఠనా నైపుణ్యాలను సాధించాలి ఆంగ్ల భాషపై విద్యార్థులు పట్టు సాధించేందుకు ఎవ్రీచైల్డ్ రీడ్స్ కార్యక్రమాన్ని చేపట్టాం. ఉపాధ్యాయుల కృషితో ప్రభుత్వ పాఠశాలల్లో 26 వేల మంది విద్యార్థులు పూర్తి పఠన నైపుణ్యం సాధించారు. ప్రారంభంలో కేవలం 12–13 శాతం మందే వాక్యాలు చదవగలిగితే, ప్రస్తుతం అది 84 శాతానికి పెరిగింది. ప్రతిరోజూ ఒక గంట సమయం కేటాయించగా మంచి ఫలితాలు వచ్చాయి. – అనుదీప్ దురిశెట్టి, కలెక్టర్, ఖమ్మం -
స్త్రీనిధిలో నిజామాబాద్ టాప్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మహిళా సంఘాలకు స్త్రీనిధి రుణాల పంపిణీ.. తిరిగి రికవరీలో నిజామాబాద్ జిల్లా గత పది సంవత్సరాలుగా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. వరుసగా పదేళ్ల పాటు ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తూ వస్తోంది. ప్రభుత్వం ప్రతి ఏడాది నిర్ణయిస్తున్న లక్ష్యాన్ని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ తేలికగా దాటడంతోపాటు లక్ష్యాన్ని మించి రుణాలు అందజేస్తోంది. జారీ చేసిన రుణాలను రికవరీ చేసే విషయంలోనూ నిజామాబాద్ జిల్లా ప్రథమంగా నిలుస్తోంది. దీంతో ఏటా నిజామాబాద్ జిల్లాకు స్టేట్ ఫస్ట్ అవార్డులు అందుతున్నాయి. » స్త్రీనిధి రుణాలను స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.50 వేల నుంచి మొదలుకొని రూ.5 లక్షల వరకు ప్రభుత్వం అందజేస్తోంది. వివిధ వ్యాపారాలు, పరిశ్రమలకు, సోలార్ యూనిట్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, ఇతర స్వయం ఉపాధి యూనిట్లకు రుణాలు అందజేస్తూ మహిళలను ప్రోత్సహిస్తున్నారు. గడిచిన పదేళ్లలో (2016–2026) రూ.1,372.12 కోట్లు స్వయం సహాయక గ్రూపుల మహిళా సభ్యులకు పంపిణీ చేశారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 108.06 శాతం రుణాలు అందజేసి రాష్ట్రంలో ఉత్తమ జిల్లాగా అవార్డు దక్కించుకుంది. రికవరీలోనూ 93–99 శాతం వసూలు చేసి పదేళ్లు వరుసగా సత్తా చాటి ప్రత్యేకత సాధించింది. ఉత్సాహాన్ని కొనసాగిస్తాం స్త్రీనిధి రుణాల పంపిణీలో నిజామాబాద్ జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలబెట్టే విషయంలో స్వయం సహాయక సంఘాల మహిళల సహకారం చాలా ఉంది. రుణాలు అందజేయడం, రికవరీ విషయంలో సిబ్బంది కృషి సైతం చాలా ఉంది. పదేళ్లుగా వరుసగా సాధిస్తున్న అవార్డులు జిల్లాకు గర్వకారణం. – రాందాస్ –స్త్రీనిధి ఆర్ఎం -
అన్నదాతకు వరి గోస
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఆరుగాలం శ్రమించి వేసిన పంట కళ్ల ముందే ఎండిపోతుండటంతో రైతన్న తల్లడిల్లుతున్నాడు. భూగర్భ జలాలు అడుగంటిపోయి, బోర్లు ఎత్తిపోవ డంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అయినా పట్టు వదలకుండా రూ.లక్షలు వెచ్చించి సాగునీటి కోసం ప్రయ త్నం చేస్తూనే ఉన్నాడు. చేతికొచ్చే దశలో ఉన్న వరి పంటను కాపాడుకునేందుకు చేయ ని ప్రయత్నం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 51.48 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. పలు చోట్ల ప్రస్తుతం వరికోతలు కొనసాగుతుండగా, నల్లగొండ, మెదక్, వరంగల్, మహబూబ్నగర్ తదితర జిల్లాల్లో పంటలు ఎండిపోతున్నాయి. దీంతో పంటను కాపాడుకునేందుకు బోర్లు వేయిస్తున్నా నీరు పడకపోగా, అప్పుల్లో కూరుకుపోతున్నారు. నల్లగొండ జిల్లా చందంపేట మండలంలోని పొగిల్ల గ్రామ రైతులు సాగు నీటికి చేస్తున్న భగీరథ ప్రయత్నాలు. గ్రామంలో బోర్లు వేసినా నీళ్లు పడకపోవడంతో దాదాపు 60 మంది రైతులు తమ పంట పొలాలు కాపాడుకునేందుకు నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్లో మోటార్లు పెట్టుకొని 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొలాలకు నీటిని తీసుకెళ్తున్నారు. చిన్న ట్రాన్స్ఫార్మర్, హైస్పీడ్ మోటారు, పైపులైన్, విద్యుత్ కోసం ఒక్కో రైతు రూ.8 లక్షల వరకు ఖర్చు చేశారు.వాటర్ ట్యాంకర్తో వరి పొలానికి నీరు పెడుతున్న రైతు ఎల్లారెడ్డి. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చెందిన ఆయన ఎకరంన్నరలో వరి సాగు చేశారు. లోఓల్టేజీ కరెంటుతో నీరందక పంట వాడిపోతోంది. మండే ఎండలకు భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో బోరులో నీరు సరిగ్గా రావడం లేదు. చేతికొచ్చే పంటను కాపాడుకునేందుకు రూ. 20 వేలు వెచ్చించి వాటర్ ట్యాంకర్లతో నీటిని అందిస్తున్నారు.ఎండిపోయిన వరి చేలో నిల్చున్న ఈయన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్కు చెందిన ఆర్ల రాంరెడ్డి. తనకున్న ఆరెకరాల్లో వరి సాగు చేశాడు. ఇప్పటికే రూ.1.85 లక్షలు పెట్టుబడి పెట్టారు. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో మరో రూ.1.20 లక్షలు వెచ్చించి బోరు వేశాడు. అయినా నీరు పడలేదు. దీంతో ఇప్పటికే 3 ఎకరాల పంట ఎండిపోయింది. మిగిలిన వరి పంటను కాపాడుకునేందుకు రూ. 25 వేలు వెచ్చించి ట్యాంకర్లతో పంటను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. మహిళా రైతు భగీరథ యత్నం జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం తమ్మడపల్లికి (జి) మహిళా రైతు కన్న రాధిక తనకున్న ఆరెకరాల భూమిలో వేసిన వరి, మొక్కజొన్న పంటలను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతోంది. ఉన్న ఒక్క బోరుతో ఇబ్బంది అవుతుండటంతో మరో నాలుగు బోర్లు వేయించింది. అయినా వాటిల్లో నీరు పడలేదు. గత్యంతరం లేక రూ.3.40 లక్షలు వెచ్చించి పాత బోరుకే కిలోమీటరు లోతులో మరో 140 పైపులు వేయించి పంటలను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నం చేసింది. అయినా నీరు సరిపోక రెండెకరాల వరి పంట ఎండిపోవడంతో వదిలేసి, మిగతా పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. కాళేశ్వరం నీళ్లు రాక.. గోదావరి ఎండిపోయి మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం గోదావరి తీరప్రాంత రైతులు అంతా గోదావరి జలాలపై ఆధారపడి వరి సాగు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు వినియోగంలో లేకపోవడంతో నది ఎడారిలా మారింది. దీంతో గత్యంతరం లేక గోదావరి మధ్యలోనే బోర్లు వేసి, పైపుల ద్వారా నీటిని తరలించేందుకు చర్యలు చేపట్టారు. అయినా ఒక్కోసారి బోర్లు కూడా ఎండిపోతుండటంతో అప్పులపాలు కావాల్సి వస్తోందని వాపోతున్నారు.బోరు అడుగంటిపోవడంతో.. బోరు వట్టిపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. వాటిని దక్కించుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. మెదక్ జిల్లా హవేళిఘనాపూర్ గ్రామానికి చెందిన కుమ్మరి రాములు తాను వేసిన వరి పంట ఎండిపోతుండటంతో ట్యాంకర్తో నీటిని అందిస్తున్నారు. ఒక్కో వాటర్ ట్యాంక్కు రూ.500 చొప్పున చెల్లిస్తున్నారు. రామాయంపేట మండలం రాయిలాపూర్లో మరోరైతు నర్సాగౌడ్ బోరుసైతం సైతం ఎండి పోవటంతో ట్యాంకర్ద్వారా నీటిని తెచ్చి పోస్తున్నారు. రెండేళ్లలో ఎనిమది బోర్లలో చుక్క నీరు పడలే జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కేశిరెడ్డిపల్లికి చెందిన బద్దిపడగ అనిల్రెడ్డి అనే రైతు 12 ఎకరాల్లో వరి సాగు చేశాడు. పంటను కాపాడుకునేందుకు రెండేళ్లలో 8 బోర్లు వేశాడు. ఒక్కదాంట్లో కూడా నీరు పడలేదు. యాసంగి సీజన్లో 10 ఎకరాల్లో సాగు చేసిన వరి పంటను కాపాడుకునేందుకు సమీపంలో ఉన్న మినీ డ్యాం నుంచి రూ.లక్ష వరకు ఖర్చు చేసి కిలోమీటరున్నర మేర పైపు లైన్ వేసి నీటిని అందించాల్సి వస్తోందని వాపోయాడు. నీటి కోసం రూ. 8 లక్షలకు పైగా వెచ్చించాబోర్లు పడకపోవడంతో సాగర్ వెనుక జలాల నుంచి నీటిని తరలించేందుకు రూ.8లక్షలకు పైగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ట్రాన్స్ఫార్మర్కు రూ.80 వేలు, మోటారుకు రూ.లక్ష, కేబుల్ వైర్కు రూ.లక్ష అవుతోంది. కృష్ణా అడుగుభాగం నుంచి నీటిని తోడేందుకు పైప్నకు రూ.1,05,000 వరకు ఖర్చు అవుతోంది. 3 కిలోమీటర్ల పొడవునా పైపులకు రూ. 4 లక్షలు, పైప్లైన్ గుంత తీసినందుకు జేసీ బీకి రూ.లక్ష, గుంతను మూసివేయించేందుకు రూ.30వేల ఖర్చు అవుతోంది. – జటావత్ మంగులాల్, పొగిళ్ల, చందంపేట, నల్లగొండ -
రైతులంతా టెక్ నిపుణులు కాదు
సాక్షి, హైదరాబాద్: రైతులందరూ సాంకేతిక నిపుణులు కారని, అందరి వద్దా స్మార్ట్ ఫోన్ ఉండదని.. యాప్లో యూరియా ఎలా బుక్ చేసుకుంటారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఇలాంటి యాప్లు తీసుకొచ్చినప్పుడు ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా సర్కార్దేని స్పష్టం చేసింది. హోర్డింగ్లు, ప్రింట్ అండ్ ఎల్రక్టానిక్ మీడియా ద్వారానో.. గ్రామ కార్యాలయాల్లో బుకింగ్ విధానాన్ని అందుబాటులో ఉంచడం ద్వారానో ప్రచారం కల్పించాలని పేర్కొంది. సబ్సిడీ యూరియాను ఎవరెవరికి ఇస్తున్నారు? ప్రస్తుతం ఎంత అందుబాటులో ఉంది? యుద్ధం వేళ ఇబ్బందులు రాకుండా ఏవైనా చర్యలు తీసుకున్నారా? ఒక రైతుకు.. ఎన్ని ఎకరాలకు ఎంత యూరియా ఇస్తారు? తదితర సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. తదుపరి విచారణ వేసవి సెలవుల తర్వాతకు వాయిదా వేసింది. రాష్ట్రంలో రైతులకు యూరియా కొరత, బుకింగ్ సమస్యను సవాల్ చేస్తూ నల్లగొండ జిల్లా రైతు బంధు సమితి మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి సహా మరికొందరు రైతులు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. తాము అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా, ధర్నా నిర్వహించినా పట్టించుకోకపోవడంతో తప్పనిస్థితిలో న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. తొలుత రిజిస్ట్రీ నంబర్ కేటాయించేందుకు నిరాకరించగా, సీజే ఆదేశంతో నంబర్ నమోదు చేసింది. ఈ పిల్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. కౌలు, అసైన్డ్ రైతులకు ఇవ్వడం లేదు పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. యూరియా కొనుగోలులో సమస్యలను రైతులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, వారు పట్టించుకోలేదన్నారు. రైతుల్లో ఎక్కువ మంది నిరక్షరాస్యులు కావడంతో అధికారులు, నెట్ సెంటర్ల చుట్టూ తిరగాల్సి వస్తోందన్నారు. ‘రైతులకు ఎలాంటి ఆటంకాలు లేదా ఇబ్బందులు కలగకుండా ఉండేలా, ప్రస్తుత ఆన్లైన్ యాప్ ద్వారా యూరియా బుకింగ్ను తప్పనిసరి కాకుండా ఐచ్ఛికంగా మార్చేలా సాంకేతికంగా మెరుగుపరచాలి. స్మార్ట్ఫోన్న్లు లేని రైతులకు, అలాగే ఆన్లైన్ యాప్ ద్వారా యూరియాను బుక్ చేసుకోవడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం లేని వారికి సౌకర్యం కల్పించేందుకు, అ«దీకృత ఎరువుల డీలర్లు, వ్యవసాయ కార్యాలయాలు, రైతు వ్యవసాయ సహకార సంఘాల ద్వారా ఆఫ్లైన్ వ్యవస్థలో పంపిణీ చేయడానికి తగినంత పరిమాణంలో యూరియాను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలి. కౌలు రైతులకు కూడా యూరియాను నిరాకరించకుండా అందించేలా ఉత్తర్వులు జారీ చేయాలి’అని కోరారు. మెరుగైన సరఫరాకే యాప్.. జీపీ మోహనారెడ్డి వాదనలు వినిపిస్తూ.. యూరియాపై ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోందని.. మెరుగైన సరఫరాకే యాప్ను అందుబాటులోకి తెచ్చిందన్నారు. బస్తా ధర రూ.3 వేలు ఉండగా, రూ.266కే రైతుకు అందిస్తున్నామని.. ఇది కేవలం రైతుకు దక్కాలన్నది సర్కార్ ఉద్దేశమన్నారు. పాస్బుక్ నంబర్, ఎకరాల ఆధారంగానే సరఫరా చేస్తున్నామని చెప్పారు. గతంలో కంటే అధిక మొత్తంలోనే అందజేస్తున్నామన్నారు. యాప్పై అవగాహన లేని వారికి యూరియా కేంద్రంలోని వలంటీర్లు సాయం చేస్తారన్నారు. అసైన్డ్ భూమి ఉన్న రైతులకు ఇవ్వడం లేదని పిటిషనర్ న్యాయవాది పేర్కొనగా.. వివరాలు తెలుసుకొని సమర్పిస్తానని జీపీ తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఇలాంటి యాప్లు తీసుకొచ్చినప్పుడు రైతుల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. హోర్డింగ్లు ఏర్పాటు చేయడం, ప్రింట్, ఎల్రక్టానిక్ మీడియాలో బుకింగ్పై ప్రచారం కల్పించాలని ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేసింది. -
మేలో నామినేటెడ్, పార్టీ పదవుల భర్తీ పూర్తి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్న నామినేటెడ్, పార్టీ సంస్థాగత పదవుల భర్తీ ప్రక్రియ మేలో పూర్తికానుందని టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. గురువారం ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేత, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు, సంస్థాగత నిర్మాణం, ప్రభుత్వ పనితీరుతోపాటు కులగణన తదితర కీలక అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలను వెల్లడించారు. పార్టీ కేడర్కు గుర్తింపు.. పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పిస్తామని మహేశ్గౌడ్ తెలిపారు. అందులో భాగంగానే టీపీసీసీ పూర్తిస్థాయి కార్యవర్గ నియామకంతోపాటు వివిధ కార్పొరేషన్లు, బోర్డులకు సంబంధించిన నామినేటెడ్ పదవుల భర్తీపై రాహుల్ గాందీతో విస్తృతంగా చర్చించినట్లు చెప్పారు. ఈ నియామకాల ప్రక్రియను మేలో పూర్తి చేయాలని నిర్ణయించినట్లు వివరించారు. పార్టీని బూత్ స్థాయి నుంచి మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని.. ప్రభుత్వానికి, పార్టీకి మధ్య మెరుగైన సమన్వయం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని మహేశ్గౌడ్ చెప్పారు. ఏఐసీసీ ఓబీసీ భేటీ హైదరాబాద్లో జరపాలి.. బీసీల సాధికారతపై కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధిని దేశవ్యాప్తంగా చాటేలా రాబోయే ఏఐసీసీ జాతీయ ఓబీసీ సలహా మండలి సమావేశాన్ని హైదరాబాద్లో నిర్వహించాలని రాహుల్ గాంధీని కోరినట్లు మహేశ్గౌడ్ తెలిపారు. దేశవ్యాప్తంగా బీసీల హక్కుల కోసం కాంగ్రెస్ చేస్తున్న పోరాటానికి తెలంగాణ వేదికగా మరింత మద్దతు కూడగట్టేందుకు ఈ సమావేశం ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే మహిళా రిజర్వేషన్ల బిల్లులో బీసీ రిజర్వేన్ల అంశాన్ని కూడా జోడించాలని రాహుల్కు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ ఎదుగుదలకు కాంగ్రెస్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని, ఏ దశలోనూ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కేసీఆర్లా ఒక్కరోజు సర్వే కాదు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వేపై ప్రతిపక్షాల విమర్శలను మహేశ్గౌడ్ ఖండించారు. సర్వే ప్రక్రియలో ఎక్కడా లోపం జరగలేదని.. అత్యంత శాస్త్రీయంగా వివరాల నమోదు జరిగిందని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ హడావుడిగా ఒక్క రోజులోనే సర్వే చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అలా చేయలేదని.. ఎన్యూమరేటర్లు నేరుగా ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి క్షుణ్ణంగా వివరాలు సేకరించారని వివరించారు. ఈ వాస్తవ డేటా ఆధారంగానే భవిష్యత్తులో బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి అవసరమైన విధానాలను రూపొందిస్తామని ఆయన చెప్పారు. సమాజంలో ప్రతి వర్గానికి సామాజిక న్యాయం దక్కాలన్న రాహుల్ గాంధీ ఆశయాన్ని తెలంగాణలో 100 శాతం అమలు చేసి తీరుతామని మహేశ్గౌడ్ ఉద్ఘాటించారు. -
బీజేపీ ‘మహిళా ఆగ్రహ యాత్ర’
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్నందుకు నిరసనగా గురువారం రాష్ట్ర బీజేపీ ‘మహిళా ఆగ్రహ యాత్ర’(జన ఆక్రోష్ పాదయాత్ర) నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో మహిళలు, పార్టీనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్తోపాటు ’ఇండి’ కూటమి పక్షాల మహిళా వ్యతిరేక వైఖరిని నిరసిస్తూ ఈ యాత్ర సాగింది. కాంగ్రెస్ కొన్నేళ్లుగా మహిళా రిజర్వేషన్లను అడ్డుకుంటోందంటూ ఈ సందర్భంగా నినాదాలు చేశారు. ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. గగన్మహల్లోని ఏవీ కాలేజీ వద్ద నుంచి పెద్దసంఖ్యలో మహిళలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు జాతీయ జెండాలు చేతబూని పాదయాత్రగా ఇందిరాపార్కుకు చేరుకున్నారు. ఈ పాదయాత్రలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి సతీమణి కావ్యారెడ్డి, మహిళా నేతలు బంగారు శ్రుతి, బండారు విజయలక్ష్మీ, జూటూరు కీర్తిరెడ్డి, ప్రభాగౌడ్, జీహెచ్ఎంసీ మహిళా కార్పొరేటర్లు, బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు, కేంద్రమంత్రులు జి.కిషన్రెడ్డి, బండి సంజయ్, ఎంపీ డా.కె.లక్ష్మణ్, బీజేఎల్పినేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ మల్క కొమురయ్య ముందుండి నడిచారు. ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, ఇతర ముఖ్యనేతలు పాల్గొని మహిళా లోకానికి సంఘీభావాన్ని ప్రకటించారు. బీజేపీ మహిళా మోర్చా, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద సభ నిర్వహించారు. పల్లెపల్లెనా ఎండగట్టాలి: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మహిళా రిజర్వేషన్ల బిల్లును కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏకమై అడ్డుకోవడం ఆ పార్టీల మహిళా వ్యతిరేక వైఖరికి నిదర్శనమని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మండిపడ్డారు. ఈ అప్రజాస్వామిక ధోరణిని పల్లె పల్లెనా ఎండగట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా సర్పంచులు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు , మహిళా సంఘాలు ఏకమై కాంగ్రెస్ కపట బుద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. మహిళా లోకానికి అన్యాయం చేయాలని చూసిన కాంగ్రెస్ నేతలు రాహుల్ గాం«దీ, రేవంత్ రెడ్డితోపాటు మిత్రపక్షాల నేతలు స్టాలిన్, అసదుద్దీన్ ఒవైసీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. రేవంత్... మహిళాద్రోహి : బండి సంజయ్ మహిళా రిజర్వేషన్లను అడ్డుకోవడంతోపాటు వారికిచ్చి న హామీలను అమలు చేయకుండా మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి ముమ్మాటికీ మహిళా ద్రోహి అని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు. మహిళా బిల్లును అడ్డుకున్న రేవంత్ను గద్దె దించాలన్నారు. రాబోయే ఎన్నికల్లోపే మహిళా రిజర్వేషన్లను అమలు చేయడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఆ పార్టీలు మహిళా వ్యతిరేక శక్తులు: రాంచందర్రావు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మహిళా వ్యతిరేక శక్తులని బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు మండిపడ్డారు. రాజకీయ ఉనికి కోసం మహిళా బిల్లును అడ్డుకుంటూ.. ఈ అంశాన్ని ఉత్తర–దక్షిణ భారతాల మధ్య విభజన రాజకీయంలా మార్చడం దారుణమన్నారు. పార్లమెంటులో మహిళా బిల్లుపై కాంగ్రెస్ నేతలు వ్యవహరించిన తీరును చూస్తుంటే మహాభారతంలోని కౌరవుల సభ గుర్తుకు వస్తోందన్నారు. -
100 రోజుల్లో ‘రిటైర్డ్’ బకాయిలు!
సాక్షి, హైదరాబాద్: రిటైర్డ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడిన రూ.8 వేల కోట్ల పైచిలుకు పదవీ విరమణ ప్రయోజనాలను వచ్చే 100 రోజుల్లోగా ఎలా చెల్లించాలనే అంశంపై ప్రణాళిక సిద్ధం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. వనరుల సమీకరణపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘానికి ఈ బాధ్యతను అప్పగించింది. వచ్చే నెల 4న జరగనున్న తదుపరి మంత్రివర్గ సమావేశంలో మంత్రివర్గ ఉప సంఘం సిఫారసులపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని తీర్మానించింది. గురువారం సచివాలయంలో సీఎం ఎ.రేవంత్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశమైంది. రిటైర్డ్ ఉద్యోగులకు రూ.8 వేల కోట్లు, ఇన్ సర్వీస్ ఉద్యోగులకు మరో రూ.6,200 కోట్లు కలిపి మొత్తం రూ.14,200 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని అధికారులు నివేదించారు. దీంతో పాటు ఇతర అంశాలు చర్చించిన మంత్రివర్గం పలు నిర్ణయాలు తీసుకుంది. భేటీ అనంతరం రాష్ట్ర సమాచార, ప్రజాసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి..సహచర మంత్రులు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి, వాకిటి శ్రీహరితో కలిసి వివరాలు వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం బకాయిలు మిగిల్చిపోయింది.. ‘ఉమ్మడి ఏపీలో ఉద్యోగులు రిటైరైన కొన్ని నెలలకే పదవీ విరమణ ప్రయోజనాలను చెల్లించే వారు. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్లు పాలించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.వేల కోట్ల బకాయిలను మిగిల్చిపోయింది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది రిటైర్డ్ ఉద్యోగులకు బిల్లులు చెల్లించలేకపోయాం. కానీ గత 14 నెలలుగా ప్రతి నెలా రూ.750 కోట్ల నుంచి రూ.800 కోట్లను చెల్లించుకుంటూ వస్తున్నాం. అయితే రిటైర్డ్ ఉద్యోగులు ఆఫీసులు, సచివాలయం చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతుండటంపై మంత్రివర్గం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే రెగ్యులర్ ఉద్యోగుల బకాయిలను సైతం సత్వరమే చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాలనే ఆలోచన చేసింది. ప్రజా ప్రతినిధుల జీతాల నుంచి 50% కోత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా బకాయిలను వెంటనే చెల్లించలేని పరిస్థితి ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయ మార్గాలన్నీ అన్వేషించి, అవసరమైన నిధులు సర్దుబాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. సీఎం, మంత్రులతో పాటు ప్రజా ప్రతినిధుల జీతాల నుంచి 50 శాతం నిధులను కోత పెట్టి రిటైర్డ్ ఉద్యోగుల బిల్లుల చెల్లింపులకు వినియోగించాలని తీర్మానించింది. బకాయిల చెల్లింపులపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘాలతో చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి సూచనలు చేయాలని వనరుల సమీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘానికి కేబినెట్ సూచించింది..’ అని పొంగులేటి తెలిపారు. బరాజ్లపైనే సీబీఐ విచారణ కోరుతున్నాం: మంత్రి ఉత్తమ్ సీఎం రేవంత్తో పాటు త్వరలో సీబీఐ డైరెక్టర్ను కలిసి కాళేశ్వరం బరాజ్ల నిర్మాణంలో అవకతవకతలపై విచారణ చేపట్టాలని కోరతామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్, ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ నివేదికలను ఇప్పటికే సీబీఐకు పంపించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని కోరి 9 నెలలు గడుతుస్తున్నా స్పందన లేదు. మళ్లీ త్వరలోనే ఈ నివేదికలను సీబీఐ డైరెక్టర్కు కూడా అందజేస్తాం..’ అని అన్నారు. కేవలం బరాజ్లపై మాత్రమే విచారణ కోరుతున్నామంటూ మంత్రి ఓ ప్రశ్నకు బదులిచ్చారు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై సీబీఐ విచారణ చేస్తే చేయమనండి అని అన్నారు. వారి ఆరోపణలతో కోర్టు ఏకీభవించలేదు.. కాళేశ్వరంపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై తాజాగా రాష్ట్ర హైకోర్టు వెలువరించిన తీర్పు సారాంశాన్ని అడ్వకేట్ జనరల్ సుదర్శన్రెడ్డి మంత్రివర్గానికి వివరించినట్టు ఉత్తమ్ తెలిపారు. ఘోష్ కమిషన్ నియామకాన్ని, కమిషన్ ఇచ్చిన నివేదికను కూడా హైకోర్టు తప్పు బట్టలేదని అన్నారు. కేసీఆర్, హరీశ్రావు, ఎస్కే జోషి, స్మిత సబర్వాల్ తమ పిటిషన్లలో చేసిన ఆరోపణలతో న్యాయస్థానం ఏకీభవించలేదని చెప్పారు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్టంలోని సెక్షన్ 8బీ కింద పిటిషనర్లకు నోటీసులు ఇవ్వలేదనే సాంకేతికపర అంశాన్నే తప్పు బట్టిందని, నివేదికలో చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మాత్రమే ఆదేశించిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ కేసును వాదించిన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీతో అడ్వకేట్ జనరల్ సమావేశమై హైకోర్టు తీర్పు నేపథ్యంలో తీసుకోవాల్సిన తదుపరి కార్యాచరణను ఖరారు చేస్తారని వెల్లడించారు. హైకోర్టు సూచించిన రీతిలో మళ్లీ సెక్షన్ 8బీ కింద నోటీసులు ఇచ్చిన విచారించడానికి వీలుగా ఘోష్ కమిషన్ గడువును పొడిగించాలా? లేక హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలా? అన్న అంశంపై న్యాయ నిపుణులతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇతర కీలక నిర్ణయాలు..ఆమోదాలు – పదవీ కాలం ముగిసిన ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలకు త్వరలో నామినేషన్ పద్ధతిన పాలకవర్గాలను నియమించాలని మంత్రివర్గం నిర్ణయించింది. – గచ్చిబౌలి స్టేడియాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్íÙప్ (పీపీపీ) పద్ధతిలో అభివృద్ధి చేయాలని నిర్ణయం. స్టేడియం 76 ఎకరాల్లో విస్తరించి ఉండగా, రతన్ టాటా పేరుతో రూ.700 కోట్ల సీఎస్ఆర్ నిధులతో 64 ఎకరాల్లో స్టేడియం అభివృద్ధి బాధ్యతలను టాటా గ్రూప్కు అప్పగించాలని మంత్రివర్గం నిర్ణయించింది. – మంథని నియోజకవర్గ ప్రాంత ప్రజల చిరకాల కోరిక చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుకు దాదాపు 2,427 ఎకరాల భూమి అవసరం. ఇప్పటివరకు 1,020 ఎకరాలు సేకరించారు. మిగిలిన భూసేకరణకు అవసరమయ్యే రూ.166.67 కోట్ల ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. – శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిసరాల్లో మంచిర్యాల జిల్లా హాజీపూర్ రెవెన్యూ పరిధిలో ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. -
శంకర్ గౌడ్ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే: బండి సంజయ్
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్ గౌడ్ పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని చికిత్స పొందుతూ మరణించిన ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బండి సంజయ్ మాట్లాడుతూ.. శంకర్ గౌడ్ మరణం ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే. ఆర్టీసీ కార్మికులు ఎన్నో సమస్యలతో అల్లాడుతున్నారు. కానీ రెండేళ్లుగా ప్రభుత్వం పట్టించుకోకుండా గాలికొదిలేయడం, వారిని బెదిరింపులకు గురిచేయడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రామచంద్రరావు మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులకు అండగా నిలవాలని బీజేపీ నిర్ణయించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో నేడు(శుక్రవారం) నర్సంపేటలో జరగనున్న శంకర్ గౌడ్ అంత్యక్రియలకు బండి సంజయ్ హాజరుకానున్నారని ప్రకటించారు. ఆర్టీసీ కార్మికులెవరూ ఆత్మహత్యలకు పాల్పడొద్దని బీజేపీ నేతలు కార్మికులకు విజ్ఝప్తి చేశారు -
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెలో విషాదం.. శంకర్ గౌడ్ మృతి
సాక్షి, వరంగల్: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న హామీ నెరవేరడం లేదన్న ఆవేదనతో వరంగల్ (D) నర్సంపేట ఆర్టీసీ డిపోలో గురువారం మధ్యాహ్నం ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి యత్నించిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ చికిత్సపొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనలో శంకర్ గౌడ్కు ఊపిరితిత్తులు పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. 80 శాతం కాలిన గాయాలతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న శంకర్ గౌడ్ను వరంగల్ MGM నుంచి హైదరాబాద్కు తీసుకొస్తుండగా కర్మాన్ఘాట్ దగ్గర కన్నుమూశారు. ప్రస్తుతం కంచన్బాగ్ DRDO అపోలో ఆస్పత్రిలో ఆయన మృతదేహం ఉన్నట్లు తెలుస్తోంది.తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్రిక్తతలు దారితీస్తోంది. తమ డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతూ రెండు రోజులుగా సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వానికి, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే, ఈ చర్చల్లో పురోగతి కనిపించలేదు. ఈ క్రమంలో నర్సంపేట డిపోలో ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్న శంకర్ మానకిక ఒత్తిడికి గురయ్యారు. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. ఇక శంకర్ గౌడ్ మరణవార్త తెలియడంతో ఆర్టీసీ కార్మికులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలు డిపోల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు ప్రభుత్వం చర్చలకు సిద్ధమని ప్రకటిస్తున్న తరుణంలో శంకర్ గౌడ్ ఇలా బలవన్మరణం చెందడం కార్మిక వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఓ నిబద్ధత కలిగిన కార్మికుడిని కోల్పోయామంటూ తోటి ఉద్యోగులు భావోద్వేగానికి లోనైయ్యారు. ఈ ఘటనపై ప్రభుత్వం కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. అయితే తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం మాత్రం ఆపేది లేదని యూనియన్ నేతలు స్పష్టం చేస్తున్నారు.నేడు నర్సంపేట బంద్కు పిలుపునర్సంపేటలో ఉద్రిక్తతఆర్టీసీ డిపో ముందు మోహరించిన పోలీసులుఅర్ధరాత్రి అవుతున్న డిపో కి భారీగా చేరుకున్న ఆర్టీసీ కార్మికులు -
తెలంగాణ ఆర్టీసీ జేఏసీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటన
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్రరూపం దాల్చే అవకాశం కనబడుతోంది. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం చేసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వ పెద్దలు చర్చలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించినప్పటికీ ఆర్టీసీ జేఏసీ తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించింది. ముందుగా శంకర్ గౌడ్కు ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అంటూ హెచ్చరించిన ఆర్టీసీ జేఏసీ.. రేపటి నుంచి అన్ని డిపోల ఎదుట మౌన దీక్షలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. సమ్మెపై తెలంగాణ ఆర్టీసీ జేఏసీ భవిష్యత్ కార్యాచరణ ఇదే..రేపటి నుంచి అన్ని డిపోల ఎదుట ఆర్టీసీ జేఏసీ మౌనదీక్షలుఈ నెల 25 నుంచి అన్ని డిపోల్లో వంటా వార్పు26వ అన్ని జిల్లాలో ఆర్టీసీ కార్మికుల కవాతుఈనెల 27వ తేదీ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలకు వినతి పత్రాలు28వ తేదీన మహిళా ఉద్యోగులతో డిపోల వద్ద బతుకుమ్మలతో నిరసన29వ తేదీన అన్ని డిపోల ఎదుట కార్మికుల అర్ధనగ్న నిరసనలు -
Hyd: నకిలీ టీ పొడి తయారీ ముఠా గుట్టురట్టు
హైదరాబాద్: నకిలీ టీ పొడి తయారీ ముఠా గుట్టురట్టు చేసింది హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్. నగరవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో ఏకకాలంలో ఆకస్మిక దాడులు నిర్వహించింది. కల్తీ టీ పొడిని తయారుచేస్తూ, విక్రయిస్తున్న తయారీ కేంద్రాలే లక్ష్యంగా సాగిన ఈ ఆపరేషన్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అధిక లాభాల కోసం నిందితులు తక్కువ నాణ్యత గల టీ పొడికి కృత్రిమ రంగులు గడువు ముగిసిన ముడి పదార్థాలను కలిపి వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కల్తీ పొడిని రోడ్డు పక్కన ఉండే టీ స్టాళ్లతో పాటు కొన్ని ప్రముఖ విక్రయశాలలకు కూడా సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న పది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో కొంపల్లికి చెందిన పరేశ్ రాజన్ (రంగుల సరఫరాదారు), పెట్లాబుర్జుకు చెందిన సంజు అలియాస్ పతి (రంగులు కలిపే వ్యక్తి), ముషీరాబాద్కు చెందిన సతీష్, బౌయిన్ పల్లికి చెందిన నవీన్, ఆసిఫ్ నగర్ కు చెందిన నరసింహ (250 గ్రాముల ఇల్లీగల్ ప్యాకెట్ల తయారీదారు), రాజేంద్రనగర్ కు చెందిన చున్నిలాల్ చౌదరి, బోరబండకు చెందిన నరసింహులు, పెట్లాబుర్జుకు చెందిన రాజేష్, బీదర్కు చెందిన రవీందర్ మరియు మల్లేపల్లికి చెందిన వసీం ఉన్నారు. వీరంతా రంగులు కలపడం, ప్యాకేజింగ్ మరియు సరఫరాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు నిర్ధారించారు.విచారణ వివరాల ప్రకారం, నిందితులు కోల్కతా, కేరళ మరియు అస్సాం వంటి రాష్ట్రాల నుండి తక్కువ నాణ్యత గల టీ పొడిని సేకరించి, దానికి ఆకర్షణీయమైన రంగు రావడానికి సన్సెట్ ఎల్లో, టార్ట్రాజైన్ వంటి హానికరమైన రంగులతో పాటు బెల్లం పాకం, వాడేసిన టీ పొడి మరియు ఎక్స్పైరీ అయిన టీ పొడిని కలుపుతున్నారు. ఈ హానికరమైన మిశ్రమాలను ప్రసిద్ధ బ్రాండ్ల పేరుతో రీ-ప్యాకేజింగ్ చేసి మార్కెట్లోకి వదులుతున్నారు. ఇటువంటి కల్తీ టీ పొడి సేవించడం వల్ల కడుపు సంబంధిత వ్యాధులు, అలర్జీలు మరియు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఈ దాడుల్లో సుమారు 3,000 కిలోల కల్తీ టీ పొడి, 1500 కిలోల ఎక్స్పైరీ టీ పొడి, 100 కిలోల బెల్లం మరియు భారీగా కృత్రిమ రంగులను సీజ్ చేశారు.ఈ సందర్భంగా ప్రజలకు ముఖ్య గమనిక జారీ చేస్తూ, టీ పొడిని కేవలం గుర్తింపు పొందిన విక్రేతల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలని అధికారులు సూచించారు. ఆహార కల్తీకి సంబంధించి ఎటువంటి అనుమానం ఉన్నా వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరారు. తయారీదారులు ఆహార భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే భారతీయ న్యాయ సంహిత, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ ప్రకారం కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడులను టాస్క్ ఫోర్స్ డీసీపీ శ్రీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, ఐ.పి.ఎస్. గారి పర్యవేక్షణలో, H-FAST ఇన్స్పెక్టర్లు ఎన్. రంజిత్ కుమార్ గౌడ్, ఎం. అంజయ్య మరియు వారి బృందం విజయవంతంగా నిర్వహించింది. -
‘రేపు ఆర్టీసీ సంఘాలతో చర్చలు జరుపుతాం’
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కార్మికులు ఎవరూ అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దని పొన్నం విజ్ఞప్తి చేశారు. కేబినెట్ స్థాయిలో చర్చ జరగాలని కొంత ఆలస్యమైందని, కార్మికుల సమస్యల పరిష్కారానికి మంత్రుల ఆధ్వర్యంలో సబ్ కమిటీ వేస్తామన్నారు. కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు మంత్రి పొన్నం. దీనిలో భాగంగా రేపు(శుక్రవారం, ఏప్రిల్ 24వ తేదీ) ఆర్మీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్,. తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులు మీడియాతో మాట్లాడారు. మరో మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులు సంయమనం పాటించి... సమ్మె విరమించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తప్పకుండా చర్చలు జరుపుతుందని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులు ఎలాంటి తొందర పాటు నిర్ణయాలు తీసుకోవద్దని, ప్రాణాలు తీసుకునే అనాలోచిత చర్యలకు పాల్పడి మీ కుటుంబాలకు అన్యాయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. క్షణికావేశంతో కొత్త సమస్యలు వస్తాయని, ప్రేరేపిత శక్తుల ఒత్తిడికి బలి కావొద్దని కోరారు. కార్మికుల సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, వెంటనే చర్చలకు ముందుకు రావాలని కార్మిక సంఘాల నేతలకు పిలుపునిచ్చారు. కార్మికులు ఆత్మనిబ్బరంతో ఉండాలని... ప్రభుత్వంతో చర్చల ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. -
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై రాష్ట్ర మంత్రి వర్గంలో చర్చ జరిగింది. ఈ చర్చలో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఆర్టీసీ కార్మికులు ఎలాంటి తొందర పాటు నిర్ణయాలు తీసుకోద్దు. ప్రాణాలు తీసుకోవడం వల్ల సమస్య పరిష్కారం కాదు. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో దృష్టి పెట్టింది’ అని వ్యాఖ్యానించారు.కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని స్పష్టం చేసిన సీఎం రేవంత్.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రులు రేపు ఆర్టీసీ కార్మిక సంఘాలను పిలిచి మాట్లాడాలని చెప్పారు. -
జియో హవా.. జాతీయ స్థాయిలో ఆధిపత్యం!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ టెలికాం సర్కిల్లో ప్రధాన డిజిటల్ కనెక్టివిటీ ప్రొవైడర్గా రిలయన్స్ జియో తన స్థానాన్ని మరింత బలపరుచుకుంది. 2026 మార్చి నెలలో వైర్లెస్ అండ్ బ్రాడ్బ్యాండ్ విభాగాల్లో గణనీయమైన సబ్స్క్రైబర్ పెరుగుదలను నమోదు చేసింది.టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) విడుదల చేసిన తాజా డేటా ప్రకారం.. అత్యాధునిక బ్రాడ్బ్యాండ్ సేవలు అందించడంలో జియోకు సాటి లేకుండా ముందంజలో ఉంది. అంతే కాకుండా.. సంప్రదాయ మొబైల్ సేవల్లో కూడా వేగంగా ఎదుగుతోంది.ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జియోలో అత్యంత ఆకర్షణీయమైన ప్రదర్శన హై-స్పీడ్ హోమ్ అండ్ ఎంటర్ప్రైజ్ బ్రాడ్బ్యాండ్ విస్తరణలో కనిపిస్తోంది. ఈ సర్కిల్లో వైర్లైన్ వృద్ధిని దాదాపు పూర్తిగా జియోనే సాధిస్తోంది. 2026 మార్చిలో జియో 31,000 కొత్త వైర్లైన్ కనెక్షన్లు సాధించి, మొత్తం ఫిక్స్డ్ లైన్ వినియోగదారుల సంఖ్యను 2.02 మిలియన్లకు పెంచింది. అదే సమయంలో భారతి ఎయిర్టెల్ కేవలం 7,648 కనెక్షన్లు మాత్రమే సాధించింది.వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ విభాగంలో కూడా జియో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 5G ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ (FWA)లో జియో అగ్రస్థానంలో ఉంది. ఒకే నెలలో 22,003 కొత్త 5G FWA సబ్స్క్రైబర్లను జోడించి మొత్తం సంఖ్యను 7,33,617కు తీసుకెళ్లింది. దీనితో పోలిస్తే ఎయిర్టెల్ 6,103 మందిని మాత్రమే చేర్చి 3,26,398 వద్ద నిలిచింది.తన ప్రత్యేక సాంకేతిక సామర్థ్యాన్ని చూపిస్తూ, అన్లైసెన్స్డ్ బ్యాండ్ రేడియో (UBR) FWA సేవలను అందిస్తున్న ఏకైక ఆపరేటర్గా కూడా జియో నిలుస్తోంది. ఈ విభాగంలో 18,991 కొత్త వినియోగదారులను చేర్చి మొత్తం సంఖ్యను 3,53,145కు పెంచింది. మొత్తం కలిపి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో జియోకు 1.08 మిలియన్లకు పైగా ప్రత్యేక FWA కనెక్షన్లు ఉన్నాయి. ఇది ప్రాంతీయ డిజిటల్ మార్పుకు ప్రధాన శక్తిగా నిలుస్తోంది. సాంప్రదాయ వైర్లెస్ మొబైల్ విభాగంలో కూడా జియో బలమైన ప్రదర్శన కనబరిచింది. 2026 మార్చిలో 1,49,464 కొత్త మొబైల్ వినియోగదారులను జోడించి మొత్తం సంఖ్యను 32.22 మిలియన్లకు పెంచింది.జాతీయ స్థాయిలో ఆధిపత్యంప్రాంతీయ విజయంతో పాటు.. జియో జాతీయ స్థాయిలో కూడా అగ్రగామిగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా వైర్డ్ మరియు వైర్లెస్ కలిపి 523.44 మిలియన్ల బ్రాడ్బ్యాండ్ వినియోగదారులతో జియో అతిపెద్ద సేవా ప్రదాతగా నిలిచింది. ఇది భారత బ్రాడ్బ్యాండ్ మార్కెట్లో దాదాపు 49.11 శాతం వాటాను కలిగి ఉంది.వైర్లెస్ మొబైల్ విభాగంలో కూడా జియో దేశవ్యాప్తంగా 3.22 మిలియన్లకు పైగా కొత్త వినియోగదారులను చేర్చి మొత్తం సంఖ్యను 496.33 మిలియన్లకు పెంచింది. ఇది 39.21 శాతం మార్కెట్ వాటాతో ముందంజలో నిలిచింది. అదేవిధంగా ఫైబర్, ఫిక్స్డ్ లైన్ సేవల విస్తరణలో భాగంగా, మార్చి నెలలో దేశవ్యాప్తంగా అత్యధికంగా 1,88,698 వైర్లైన్ కనెక్షన్లను జియో జోడించింది. -
ప్రభుత్వం కీలక నిర్ణయం.. పీసీ ఘోష్ నివేదికపై సుప్రీంలో ఛాలెంజ్
సాక్షి, హైదరాబాద్: పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాలని కేబినెట్ భేటీలో ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం జరుగుతున్న కేబినేట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకుంది. కేబినేట్ భేటీ కొనసాగుతుంది ప్రస్తుతం నడుస్తున్న ఆర్టీసీ సమ్మోతో అదేవిధంగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామాకం జరిపే అంశం, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపైన మంత్రివర్గం చర్చించనున్నట్లు సమాచారం. ఇందిరమ్మ కుటుంబ భీమా విధానాలు, మెట్రో స్వాధీన పరుచుకోవడంతో పాటు దాని నిర్వహణపై చర్చ జరుగనున్నట్లు తెలుస్తోంది. -
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ హెల్త్ బులిటెన్ విడుదల
సాక్షి, వరంగల్: నర్సంపేట ఆర్టీసీ డిపోలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆరోగ్య పరిస్థితిపై వరంగల్ ఎంజీఎం వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.శంకర్ గౌడ్ పరిస్థితి నిలకడగా ఉంది. 60 నుండి 80 శాతం కాలిన గాయాలయ్యాయి. మంటల వల్ల ఊపిరితిత్తులు డ్యామేజ్ అయ్యాయి. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తున్నాం. ఒళ్ళంతా మంటల వల్ల ఎడిమా వచ్చింది. వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నాం. మాట్లాడే పరిస్థితి లేదు, చికిత్సకు స్పందిస్తున్నారు’ అని ఎంజీఎం ఆర్ఎం డాక్టర్ అశ్విన్ తెలిపారు. నర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తతనర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. అప్రమత్తమైన తోటి ఆర్టీసీ కార్మికులు డ్రైవర్ శంకర్కు అంటుకున్న మంటల్ని ఆర్పేశారు. అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శంకర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్రిక్తతలు దారితీస్తోంది. తమ డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతూ రెండు రోజులుగా సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వానికి, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే, ఈ చర్చల్లో పురోగతి కనిపించలేదు. ఈ క్రమంలో నర్సంపేట డిపోలో ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్న శంకర్ మానకిక ఒత్తిడికి గురయ్యారు. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. -
బ్యాంకుల్లో ఆ ఖాతాలు ఉంటే.. వీసీ సజ్జనర్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: బ్యాంకు అధికారులు కేవలం ఖాతాల ఓపెనింగ్ టార్గెట్స్ వెంట పడకుండా, కస్టమర్ల భద్రతకు పెద్దపీట వేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ సూచించారు. ఒక్క కస్టమర్ కూడా సైబర్ నేరాల బారిన పడకుండా చూడటమే ప్రాథమిక లక్ష్యంగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బంజారాహిల్స్లోని టీజీఐసీసీసీలో గురువారం మ్యూల్ ఖాతాల నియంత్రణపై బ్యాంకు అధికారులతో ఆయన సమన్వయం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ చిన్మయ్ కుమార్, అడిషనల్ సీపీ ఎం. శ్రీనివాసులుతో పాటు 45 ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు చెందిన 75 మంది ఉన్నతాధికారులు హాజరయ్యారు.ఈ సందర్భంగా సీపీ సజ్జనర్ మాట్లాడుతూ.. సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న మ్యూల్ ఖాతాలను అరికట్టేందుకు 'సేఫ్ కస్టమర్ చాలెంజ్'ను బ్యాంకులు స్వీకరించాలని కోరారు. ఈ క్రమంలో ప్రతి బ్యాంకు శాఖ 'జీరో మ్యూల్ అకౌంట్స్' లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఏ బ్యాంకు శాఖలోనూ సైబర్ బాధితులు ఉండకూడదని, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP)లో నమోదయ్యే ఫిర్యాదుల ఆధారంగా ఆయా బ్రాంచీల పనితీరును అంచనా వేసుకోవాలని స్పష్టం చేశారు.బ్యాంకు మేనేజ్మెంట్లు ఖాతాల సంఖ్యను కాకుండా, కస్టమర్ల భద్రతనే ఉద్యోగుల కీలక పనితీరు సూచికగా (KPIs) పరిగణించాలని హితవు పలికారు. 'ఆపరేషన్ ఆక్టోపస్ 2.0లో భాగంగా 850 కేసుల్లో రూ. 150 కోట్ల మోసాన్ని గుర్తించామని, మ్యూల్ ఖాతాల ఓపెనింగ్లో సహకరించిన 32 మంది బ్యాంకు అధికారులను అరెస్ట్ చేశామని వెల్లడించారు.కంబోడియా, వియత్నాం, దుబాయ్ వంటి దేశాల నుంచి సాగుతున్న అంతర్జాతీయ సైబర్ ముఠాలు.. స్థానిక బ్యాంకు అధికారులతో కుమ్మక్కై ఈ నేరాలకు పాల్పడుతున్నాయని వివరించారు. కేవైసీ (KYC) నిబంధనలను ఉల్లంఘించే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా, వారిని బ్యాంకింగ్ రంగం నుంచే బ్లాక్లిస్ట్ చేయాలని సూచించారు. బ్యాంకుల్లో 'మ్యూల్ ఖాతాలు' ఉంటే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవన్నారు. ముఖ్యంగా ఫిక్స్డ్ డిపాజిట్లను ముందస్తుగా క్లోజ్ చేసేందుకు వచ్చే కస్టమర్ల విషయంలో బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సైబర్ నేరగాళ్ల ఒత్తిడితోనే వారు డబ్బు విత్డ్రా చేస్తున్నారా? అన్నది గమనించి వారిని కాపాడాలని కోరారు.మ్యూల్ ఖాతాలను గుర్తించేందుకు 'మ్యూల్ హంటర్' వంటి ఆధునిక సాంకేతిక పరికరాలను వాడాలని, 1930 హెల్ప్లైన్ నంబర్పై కస్టమర్లకు విస్తృత అవగాహన కల్పించాలని బ్యాంకర్లకు సూచించారు. సైబర్ నేరగాళ్ల నెట్వర్క్ను పూర్తిగా తుడిచిపెట్టే వరకు ఆపరేషన్ ఆక్టోపస్ కొనసాగుతుందని, బ్యాంకులు పోలీసులతో సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో సైబర్ క్రైమ్స్ డీసీపీ అరవింద్ బాబు, ఏసీపీ శివమారుతి, బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. -
12 ఏళ్లుగా సుక్క ముట్టని ఆదర్శ గ్రామాలు
పుట్టిన రోజైనా.. పెళ్లి రోజైనా.. స్నేహితుడు కలిసినా.. బంధువు వచ్చినా.. శుభవార్త విన్నా.. చెడు కబురు అందినా.. ముచ్చట ఏదైనా.. మందు తాగుడు కామన్ అయింది. ఇక వీకెండ్ వచ్చిందంటే ఎంజాయ్ అంటూ పార్టీలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే మందు తాగడానికి కారణాలు వెతుక్కునే పరిస్థితి.. ఈ సంస్కృతి ఇప్పుడు గ్రామాలకూ విస్తరించింది. యువకుల నుంచి ముసలి వాళ్ల వరకు కారణం దొరికితే ముక్క, సుక్కతో దావత్ చేసుకుంటున్నారు. ఇలాంటి రోజుల్లో తానూరు మండలంలోని మూడు గ్రామాలు.. మద్యానికి దూరంగా ఉంటున్నాయి. ఆయా గ్రామాల్లో జరిగిన సంఘటనలు అందరినీ ఆవైపు నడిపించాయి. ఆధ్యాత్మికబాట పట్టించాయి. మద్యనిషేధం తర్వాత గ్రామాలు ప్రశాంతంగా ఉంటున్నాయి.తానూరు: నిర్మల్ జిల్లా తానూరు మండలం మూడు గ్రామాల వాసులు మద్యపాన నిషేధంతో ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలు అయిన ఝరి(బి), హిప్నెల్లితండా, మొగ్లి, మొగ్లి అనుబంధ మసల్గాతండా గ్రామస్తులు ఐక్యంగా మద్యనిషేధం అమలు చేస్తున్నారు. మద్యం దుకాణాలను మూసివేశారు. కట్టుబాటు పెట్టుకుని కఠినంగా నిషేధం అమలు చేస్తున్నారు. యువకులు, మహిళలే దీనికి నాయకత్వం వహిస్తున్నారు. కట్టుబాటు ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తూ మద్య రహితంగా మార్చారు.గురువు ఉపదేశంతో.. ఝరి(బి)లో 12 ఏళ్లుగా మద్యనిషేధం అమలవుతోంది. మహారాష్ట్ర పర్భణి జిల్లాకు చెందిన శేషేరావ్ మహరాజ్ గ్రామానికి వచ్చి ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తూ ఉండేవారు. ఆయన ఉపదేశంతో మద్యపాన నిషేధం ప్రారంభమైంది. ఇక మొగ్లి, మసల్గాతండల్లో రెండేళ్లుగా, హిప్నెల్లితండాలో ఆరు నెలలుగా మద్యనిషేధం కొనసాగుతోంది. మండల కేంద్రం నుంచి 14 కి.మీ. దూరంలోని ఈ గ్రామాల్లో మద్యం తాగి వచ్చినవారికి రూ.వెయ్యి నుంచి రూ.5 వేల వరకు జరిమానా విధిస్తున్నారు. మద్యం అమ్మకుండా చూడాలని పోలీసులకు వినతిపత్రాలు ఇచ్చారు. పోలీసులు కూడా వీరికి మద్దతుగా ఉన్నారు. ఆత్మహత్యల కారణంగా.. గ్రామాల్లో మద్య నిషేధం అమలుకు ప్రధాన కారణం.. మద్యానికి బానిసైన వారు ఆత్మహత్యలు చేసుకోవడం. మద్యం మత్తులో ఏ పని చేయకుండా ఉండేవారు. దీంతో కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులతోపాటు గొడవలు జరిగేవి. ఈ కారణంగా పంచాయితీలు నిర్వహించారు. కుటుంబ కలహాల కారణంగా యజమానులు ఆత్మహత్య చేసుకునేవారు. కుటుంబాలు రోడ్డున పడి, పిల్లల చదువులు ఆగిపోయాయి. ఒక్క హిప్నెల్లి తండాలో ఏడేళ్లలో 25 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇక మొగ్లిలో ఓ వ్యక్తి మద్యం మత్తులో మహిళపై లైంగికదాడి చేశాడు. ఈ దుర్ఘటన కలకలం రేపి మద్య నిషేధానికి దారితీసింది.ప్రశాంతంగా పల్లెలు.. మద్యనిషేధం అమలులో మహిళా సంఘాల సభ్యులు, యువకులే కీలక పాత్ర పోషించారు. గ్రామ పెద్దలను ఒప్పించి ఊరందరితో మద్యం తాగమని ప్రతిజ్ఞ చేయించారు. మద్యం అమ్మకాలు నిలిపివేయించారు. హిప్నెల్లితండాలో అయితే మద్య నిషేధం తర్వాత గ్రామస్తులంతా కలిసి జగదాంబదేవి ఆలయం నిర్మించుకున్నారు. మద్యనిషేధం తర్వాత పల్లెల్లో క్రమంగా పరిస్థితులు మెరుగయ్యాయి. గొడవలు తగ్గాయి. ఆత్మహత్యలు ఆగిపోయాయి. యువకులు కూడా చదువుపై శ్రద్ధ పెట్టారు. చదువు పూర్తయినవారు పనులు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులకు తోడుగా వ్యవసాయ పనులు చేస్తున్నారు. యువకులు గ్రామ శుభ్రత, అభివృద్ధిపై దృష్టి పెట్టారు. ఝరి(బి)లో శ్రమదానాలు జరిపి చెత్తను తొలగించారు. డ్వాక్రా సమూహాలు పర్యవేక్షణలో గ్రామాలు ప్రశాంతంగా ముందుకు సాగుతున్నాయి.మద్య నిషేధ మాలలు..మహారాష్ట్ర పర్భణి జిల్లాకు చెందిన శేషేరావ్ మహరాజ్ గ్రామాలకు వచ్చినప్పుడు మద్యం అలవాటు ఉన్నవారికి మద్య నిషేధ మాలలు వేస్తున్నారు. ఈ మాల వేసుకున్నవారు మద్యంతోపాటు మాంసం కూడా ముట్టరు. ఝరి(బి) గ్రామంలో చాలా మంది యువకులు మాల ధరించారు. దీంతో మద్యం, మాంసానికి దూరంగా ఉంటున్నారు. ఆధ్యాత్మిక బాటలో పయనిస్తున్నారు.భోజాబాయి ఝరి(బి) గ్రామానికి చెందిన ఈమె భర్త తాగుడుకు బానిసయ్యాడు. 14 ఏళ్ల క్రితం మద్యం మత్తులో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కుటుంబం రోడ్డున పడింది. భోజాబాయి కూలీ పనులు చేస్తూ పిల్లలను పెంచి పెద్ద చేసింది. ఇద్దరు కూతుళ్లకు పెళ్లి చేసింది. ఇలాగే ఈ గ్రామంలో చాలా మంది మద్యానికి బానిసై ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో గ్రామంలో 12 ఏళ్ల క్రితం మద్య నిషేధం విధించారు. ఉత్తం...హిప్నెల్లి తండాకు చెందిన ఇతను గ్రామంలో మద్యనిషేధం అమలులో కీలకపాత్ర పోషించాడు. యువకులు మద్యానికి బానిపై పనీపాట లేకుండా పెడదారి పడుతున్నట్లు గుర్తించాడు. మద్యం మత్తులో ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి తలెత్తడంతో గ్రామంలో మద్య నిషేధం అమలుకు ఊరంతటినీ ఏకతాటిపైకి తెచ్చాడు. అందరూ మద్యనిషేధానికి అంగీకరించారు. దీంతో ఆరు నెలలుగా గ్రామంలో మద్యం అమ్మకాలు నిలిపేశారు.తానూరు మండలం మొగ్లి గ్రామంలో రెండేళ్ల క్రితం మద్యం మత్తులో గ్రామస్తుడు ఓ మహిళపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన గ్రామస్తులను ఆందోళనకు గురిచేసింది. మద్యం కారణంగా యువత చెడుమార్గంలో పయనిస్తోందని గుర్తించారు. దీంతో గ్రామస్తులంతా ఓ నిర్ణయానికి వచ్చారు. గ్రామంలో మద్యం అమ్మకాలు నిషేధించారు. మొగ్లి స్ఫూర్తితో సమీపంలోని మసల్గ తండావాసులు కూడా మద్య నిషేధం అమలు చేస్తున్నారు. -
ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. శవంపై బంగారం మాయం
సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో దారుణం జరిగింది. చనిపోయిన వృద్ధురాలికి ఉన్న బంగారు కమ్మలు మాయమయ్యాయి. కొడిమ్యాల మండలం నాచుపల్లికి చెందిన వృద్ధురాలు అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో ఆమెను బంధువులు.. ఐసీయూలో చేర్చారు.చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం వృద్ధురాలు ఉదయం మృతి చెందింది. వృద్ధురాలి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లిన తర్వాత కమ్మలు కనిపించలేదు. ఆసుపత్రి సిబ్బందిపై వృద్ధురాలి బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సిబ్బందే తీసేశారంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి వద్ద బంధువులు ఆందోళనకు దిగారు. -
ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే కుట్ర: రామచందర్ రావు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో ప్రభుత్వం మొండి వైఖరితో ముందుకి వెళ్లడం సరికాదన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు. ఈరోజు జరిగే కేబినెట్ సమావేశంలో ఆర్టీసీ సమ్మెపై చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, ఆర్టీసీ కార్మికులకు బీజేపీ అండగా ఉంటుందన్నారు.బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో భగీరథ మహర్షి జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా భగీరథ మహర్షి చిత్ర పటానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు నివాళులు అర్పించారు. అనంతరం, ఆయన మాట్లాడుతూ..‘ఆర్టీసీ, కార్మికుల నాయకులను ప్రభుత్వం పిలిచి వారి డిమాండ్లను ఒప్పుకోవాలి. 41 రోజుల ముందే ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారు. అయినా ప్రభుత్వం స్పందించకుంటే ఆర్టీసీ జేఏసీ తరపున సమ్మె తలపెట్టారు. ప్రభుత్వం మొండి వైఖరితో ముందుకి వెళ్లడం సరికాదు. 2017 నుంచి రావాల్సిన పీఆర్సీ బకాయిలు.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని న్యాయమైన కోరికలు అడుగుతున్నారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. అందుకే ప్రైవేట్ వ్యక్తులతో ఆర్టీసీ బస్సులను నడిపిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ 63 మంది కార్మికుల మరణానికి కారణమైంది. గతంలో ఆర్టీసీ సమ్మెకు రేవంత్ రెడ్డి మద్దతు ఇచ్చిన వీడియోను అందరూ చూడండి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వంలో విలీనం చేస్తానన్ని మూడేళ్లు అయ్యింది. రాష్ట్రంలో కొత్త బస్సులు లేవు, ఉన్న బస్సులను ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతోంది. ఆర్టీసీ కార్మికులకు బీజేపీ అండగా ఉంటుంది. బీజేపీ నేతలు ఎక్కడిక్కడ ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలిపి అండగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్న. రెండు పార్టీలు ఆర్టీసీ కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నాయి’ అని మండిపడ్డారు. -
మౌనికకు అదనపు ఎస్పీగా ప్రమోషన్
ఆదిలాబాద్టౌన్: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అడ్మిన్ ఏఎస్పీగా విధులు నిర్వహిస్తున్న పి.మౌనిక అదనపు ఎస్పీగా ప్రమోషన్ పొందారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అఖిల్ మహాజన్ ఆమెను అభినందించారు. ఆమె భుజంపై అదనపు ఎస్పీ హోదా చిహ్నాలు అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. మౌనిక ప్రమోషన్ పొందినప్పటికీ ఆమె ప్రస్తుతం నిర్వహిస్తున్న అడ్మిన్ అదనపు ఎస్పీ హోదాలోనే కొనసాగుతారని పేర్కొన్నారు. అధికారులు, సిబ్బంది ఆమెను కలిసి అభినందనలు తెలిపారు. అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) సురేందర్రావు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాస్, ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్రెడ్డి, సీసీ కొండరాజు, పలువురు ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
RTC Strike: ప్రైవేట్ వాహనాల నిలువు దోపిడీ
సాక్షి, హైదరాబాద్ : సిటీబస్సు స్తంభించింది. బుధవారం మొదటి రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం స్పష్టంగా కనిపించింది. నగరంలోని వివిధ రూట్లలో అద్దె, ఎలక్ట్రిక్ బస్సులను నడిపినప్పటికీ.. బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉదయం విద్యార్థులు, ఉద్యోగులు, చిరు వ్యాపారులు తదితర వర్గాల ప్రయాణికులు ఇబ్బందుల పాలయ్యారు. వస్త్ర దుకాణాలు, ప్రైవేట్ కార్యాలయాలు, షాపింగ్ కేంద్రాలు, మాల్స్, ఐటీ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, హౌస్కీపింగ్ సిబ్బందిపై సమ్మె ప్రభావం స్పష్టంగా కనిపించింది. గ్రేటర్ పరిధిలోని 25 డిపోలకు చెందిన సుమారు 3 వేల బస్సుల్లో 90 శాతం డిపోలకే పరిమితమయ్యాయి. రూ.6 కోట్ల నష్టం.. ప్రయాణికుల రద్దీ, డిమాండ్ ఎక్కువగా ఉండే మార్గాల్లో ఆర్టీసీ అద్దె, ఎలక్ట్రిక్ బస్సులు నడిచాయి. సుమారు 450 ఎలక్ట్రిక్ బస్సుల్లో 400 వరకు నడిపినట్లు అధికారులు తెలిపారు. వివిధ డిపోల్లోని 260 అద్దె బస్సుల్లో 180 వరకు నడిచాయి. ఇవి కాక ఔట్సోర్సింగ్ డ్రైవర్లతో మరో 120 బస్సులను అందుబాటులోకి తెచి్చనట్లు అధికారులు పేర్కొన్నారు. వీటిలో 35 వేల మందికిపైగా రాకపోకలు సాగించినట్లు అంచనా. సాధారణ రోజుల్లో సుమారు 23 లక్షల మంది ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటారు. సమ్మెతో ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్కు రూ.6 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా. మహాత్మాగాంధీ, జేబీఎస్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, ఉప్పల్, కూకట్పల్లి, ఏఎస్రావునగర్ తదితర ప్రాంతాల నుంచి తెలుగు రాష్ట్రాలకు రాకపోకలు సాగించే బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సి వచి్చంది. క్యాబ్లు, మ్యాక్సీ క్యాబ్లు, మినీబస్సులు, కార్లు తదితర వాహనాల్లో అడ్డగోలు చార్జీలు వసూలు చేశారు. ఉప్పల్ నుంచి హన్మకొండకు రూ.500 నుంచి రూ.700 వరకు తీసుకున్నట్లు ప్రయాణికులు చెప్పారు. అన్ని వైపులా ఇదే తరహా దోపిడీ కొనసాగింది. హైదరాబాద్ నుంచి దూర ప్రాంతాలకు కూడా కొన్ని ఎలక్ట్రిక్, అద్దె బస్సులను నడిపినప్పటికీ ఇబ్బందులు తప్పలేదు. ఓలా, ఉబర్, ర్యాపిడో తదితర క్యాబ్ సంస్థలు సైతం సమ్మెను సొమ్ము చేసుకున్నాయి. చార్జీలను రెట్టింపు చేశాయి. మెహిదీపట్నం నుంచి సికింద్రాబాద్ వరకు ఓలా ఆటోలో సాధారణంగా రూ.150 వరకు చార్జీ అవుతుంది. బుధవారం రూ.350 వరకు వసూలు చేశారు. బైక్లు, క్యాబ్లలోనూ రెట్టింపు వసూళ్ల పర్వం కొనసాగింది. కిక్కిరిసిన మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లు.. ప్రయాణికులు మెట్రోరైళ్లు, ఎంఎంటీఎస్లను ఆశ్రయించడంతో కిక్కిరిసిపోయాయి. మరోవైపు హెచ్ఎంఆర్ఎల్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. 56 రైళ్లను అదనంగా నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. సాధారణ రోజుల్లో మెట్రోల్లో 4.8 లక్షల మంది పయనించగా బుధవారం 5 లక్షల మందికి పైగా మెట్రో సేవలను వినియోగించుకున్నట్లు అంచనా. -
యాచకులకో షెల్టర్
హైదరాబాద్: నగరంలోని యాచకులకు షెల్టర్ హోమ్స్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లలో బెగ్గర్స్ రిహాబిలిటేషన్ కల్పించారు. నగరంలోని రైల్వే స్టేషన్లు, బస్టేషన్లు, ప్రధాన చౌరస్తాలు, దేవాలయ ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి 107 మంది యాచకులను గుర్తించారు. వీరిలో 37 మందిని చౌటుప్పల్ సమీపంలోని అమ్మా– నాన్న అనాథాశ్రమానికి తరలించారు. మరో 40 మందిని జీహెచ్ఎంసీ పరిధిలోని వివిధ షెల్టర్ హోమ్స్లో చేరి్పంచారు. మిగతా వారికి కౌన్సెలింగ్ ఇచ్చి స్వస్థలాలకు పంపించినట్టు అధికారులు తెలిపారు. -
జర్నీ జామ్ ఫుల్.. ఆర్టీసీ సమ్మెతో ప్రయాణికుల నిలువు దోపిడీ, ఇక్కట్లు (ఫొటోలు)
-
HYD: పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు
సాక్షి, హైదరాబాద్: మరోసారి మహానగరంలో పెట్రోల్ బంకులు ‘డ్రై’ (నిల్వలు లేని)గా మారుతున్నాయి. కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ సరఫరాలో తీవ్ర జాప్యం నెలకొంటోంది. కొన్ని పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు చూసి వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. చమురు సంస్థలు ఇంధన సరఫరాను గణనీయంగా తగ్గించడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని తెలుస్తోంది. సాధారణంగా పెట్రోల్ బంకుల డీలర్లు ముందుగానే నగదు చెల్లించి తమకు కావాల్సిన పరిమాణంలో ఇంధనాన్ని (ఇండెంట్) పొందుతుంటారు. ప్రస్తుతం డీలర్లు నగదు మొత్తాన్ని చెల్లించినప్పటికీ ఇండెంట్లో కనీసం సగం కూడా సరఫరా కాని పరిస్థితి నెలకొంది. చమురు సంస్థల టెర్మినళ్లలో సరిపోను నిల్వలు ఉన్నా.. కఠినమైన కోటాను అమలు చేస్తుండటంతో ప్రైవేటు బంకులతోపాటు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే జైళ్ల, పౌరసరఫరాల శాఖ బంకులూ రెండు రోజులకోసారి బంకులు ‘డ్రై’ స్థితికి చేరుకుంటున్నాయి. -
ఆర్టీసీ సమ్మె.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజు హైలైట్స్.. ఆర్టీసీ సమ్మె.. ప్రభుత్వం కీలక నిర్ణయం!ఆర్టీసీ సమ్మెపై కీలక నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వం.మంత్రులతో సబ్ కమిటీ లేదా కమిటీ వేసే యోచనలో సర్కార్.నేటి కేబినెట్ సమావేశం తర్వాత ప్రకటన ఉండే అవకాశం.ఇప్పటికే ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసిన ప్రభుత్వం ఆర్టీసీ సమ్మె.. పోలీసుల కీలక ఆదేశాలుఆర్టీసీ కార్మికుల సమావేశాలకు కన్వెన్షన్ సెంటర్లు ఇవ్వొద్దని పోలీసుల ఆదేశం.ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అనుమతి లేదు: వికారాబాద్ పోలీసులుసమ్మెకు సహకరిస్తే చర్యలు తప్పవు. నిజామాబాద్..ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 645 బస్సులకు గాను 206 నడుస్తున్న బస్ సర్వీసులుపోలీసులు పహారాలో అద్దె బస్సులతో నడుపుతున్న ఆర్టీసీ యాజమాన్యంనేటి నుండి నిరవధిక దీక్షలు చేస్తామని ప్రకటించిన కార్మిక సంఘాలుఔట్ సోర్సింగ్, ప్రైవేట్ ఉద్యోగుల ద్వారా నడిపిస్తున్న యాజమాన్యం మహబూబాబాద్ జిల్లా..మహబూబాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట మహబూబాబాద్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు.డిపో నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరిన ఆర్టీసీ బస్సులు.పోలీసుల బందోబస్తు నడుమ కదిలిన బస్సులు.బస్టాండ్కి చేరుకుంటూన్న ప్రయాణికులు.పోలీస్ వలయంలో మహబూబాబాద్ బస్టాండ్.హన్మకొండ, ఇల్లందు, భద్రాచలం, ఖమ్మం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులు.ఆర్టీసీ బస్సులో ప్రయాణికులతో కలిసి వెళ్తున్న పోలీస్ కానిస్టేబుల్. జనగామ జిల్లాజనగామ ఆర్టీసీ డిపో వద్ద హృదయవిదారక దృశ్యాలు.జనగామలో పోలీసుల కాళ్లు మొక్కిన ఆర్టీసీ కార్మికులు.సమ్మెలో భాగంగా బస్సులను అడ్డుకున్న కార్మికులు.పోలీసులు కార్మికులను అడ్డుకోవడంతో భావోద్వేగానికి లోనయ్యారు.తమ పొట్ట కొట్టొద్దంటూ కొందరు కార్మికులు పోలీసుల కాళ్లు మొక్కి ప్రాధేయపడటం అక్కడి వారిని కలిచివేసింది.ఈ ఘటనతో డిపో పరిసరాల్లో ఉద్విగ్న వాతావరణం నెలకొంది.పోలీసులు వారిని సముదాయించి బందోబస్తు మధ్య బస్సులను పంపించారు.సూర్యాపేట జిల్లాబస్ డిపో ఎదుట పోలీసులకు, కార్మికులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం.పోలీస్ పహారాలో డిపో నుంచి బస్సులను బయటకు తీసుకెళ్తుండగా అడ్డుకున్న కార్మికులుసమ్మె చేస్తుండగా బస్సులను ఎలా బయటకు తీసుకెళ్లారంటూ కార్మికుల ఆందోళన బస్సుకో కానిస్టేబుల్తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన యాజమాన్యంఅద్దె బస్సులు, ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్లతో నడిపించే ప్రయత్నంఅడ్డుకుంటున్న కార్మిక సంఘాలుపోలీసుల భద్రత మధ్య నడుస్తున్న బస్సులుబస్సుకో కానిస్టేబుల్ను ఏర్పాటు చేయిస్తున్న వైనం కరీంనగర్ జిల్లారెండో రోజూ కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె..ఉమ్మడి జిల్లాలోని 11 డిపోల్లో మొత్తం వెయ్యి బస్సులకు గాను డిపోలకే పరిమితమైన సగానికి పైగా బస్సులుప్రైవేట్ డ్రైవర్లతో ప్రధాన రూట్లలో బస్సులు నడుపుతున్న ఆర్టీసీమరికొన్ని ఊళ్లకు బస్సులు లేక, ఉన్నా సరిపడా రాకపోవడంతో బస్టాండ్లలో ప్రయాణీకుల నిరీక్షణఆర్టీసీ ఉద్యోగులు వర్సెస్ సర్కార్ ప్రతిష్ఠంభనతో ప్రయాణీకుల ఇక్కట్లు.ఆర్టీసీ సమ్మెతో ఇష్టారాజ్యంగా ప్రైవేట్ వాహనాల దందా.అధిక ధరలు వసూళ్లు.సూర్యాపేట జిల్లా :రెండవ రోజు కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెసూర్యాపేట డిపో ఎదుట బైటాయించి కార్మికుల ధర్నాబస్సులను బయటకు వెళ్లకుండా అడ్డుకున్న ఆర్టీసీ కార్మికులు కొనసాగుతున్న సమ్మె.. తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె.ఆర్టీసీ సమ్మెతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు.వీలైనన్ని ఎక్కవ బస్సులు నడుపుతున్నామంటున్న అధికారులు.ప్రైవేటు విద్యాసంస్థల డ్రైవర్లు, తాత్కాలిక డ్రైవర్ల సమీకరణ.సిబ్బందిని అడ్డుకుంటే పీడీపీపీ చట్టం కింద కేసులు.నల్లగొండ జిల్లామిర్యాలగూడలో రెండవ రోజు కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెఔట్ సోర్సింగ్ సిబ్బందితో బస్సులను నడిపిస్తున్న అధికారులుబస్టాండ్లో భారీగా మోహరించిన పోలీసులుబస్టాండ్ వద్దకు చేరుకొని ఆందోళనలకు దిగిన కార్మికులుహైదరాబాద్..నేడు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ..ఆర్టీసీ సమ్మె, కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై చర్చించనున్న కేబినెట్..ఇందిరమ్మ కుటుంబ భీమా విధివిధానాలపై నిర్ణయం తీసుకోనున్న కేబినెట్..ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక, అజారుద్దీన్-కోదండరాం ఎమ్మెల్సీల అభ్యర్థిత్వంపై చర్చించనున్న కేబినెట్..మెట్రో స్వాధీన ప్రక్రియ, నిర్వహణపై చర్చించనున్న కేబినెట్..


