breaking news
Telangana
-
స్థానిక ఎన్నికలకు బ్రేక్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు బ్రేకులు వేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీచేసిన నోటిఫికేషన్ను గురువారం సాయంత్రం హైకోర్టు నిలిపివేసింది. నాలుగు వారాల్లో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ తర్వాత మరో రెండు వారాల్లో రిప్లై కౌంటర్ వేయాలని పిటిషనర్లకు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. అప్పటివరకు ఎన్నికల నోటిఫికేషన్ను నిలిపివేస్తున్నట్లు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రెండురోజులపాటు ఇరుపక్షాల నుంచి సుదీర్ఘ వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి (సీజే) ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. నోటిఫికేషన్ నిలిపివేయటానికి గల కారణాలతో కాపీ వెలువరిస్తామని పేర్కొంది. స్థానికసంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 9ని సవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను విచారణకు అనుమతిస్తున్నామని ధర్మాసనం చెప్పింది. జీవో 9ని కొట్టివేయాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవాపూర్ గ్రామానికి చెందిన బుట్టెంగారి మాధవరెడ్డితో పాటు మరికొందరు పిటిషన్లు దాఖలు చేశారు. అలాగే మరో ప్రజాప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలైంది. ఈ పిటిషన్లలో తమ వాదనలూ వినాలని కోరుతూ కాంగ్రెస్ సహా కొందరు బీసీ నాయకులు దాదాపు 30 మంది ఇంప్లీడయ్యారు. ఈ పిటిషన్లపై సీజే జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం వాదనలు విన్నది. తిరిగి గురువారం మధ్యాహ్నం 2.15 గంటలకు మరోసారి విచారణ చేపట్టింది. అన్ని పార్టీల ఏకగ్రీవ నిర్ణయం.. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఏ.సుదర్శన్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. బీసీ రిజర్వేషన్లను ప్రభుత్వం ఎందుకు పెంచాల్సి వచ్చిందో స్పష్టంగా వివరించారు. ‘రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికి తిరిగి ప్రభుత్వం సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించింది. అందులో 98 శాతం మంది పాల్గొన్నారు. సర్వే తర్వాత 57.6 శాతం బీసీ జనాభా ఉన్నట్లు గణాంకాలు తేల్చాయి. దీనిపై నియామకమైన వన్మ్యాన్ కమిటీ పూర్తిగా పరిశీలించి ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని సిఫార్సు చేసింది. ఆ మేరకు రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీచేసి, అసెంబ్లీలో పెట్టి ఏకగ్రీవంగా ఆమోదించింది. మార్చిలో ఈ ఆర్డినెన్స్ను గవర్నర్కు పంపింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కలి్పంచేందుకు వీలుగా.. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018లోని సెక్షన్ 265(ఏ) సవరణకు రూపొందించిన ఆర్డినెన్స్ ముసాయిదాను జూలైలో గవర్నర్ ఆమోదం కోసం పంపించింది. ఆగస్టులో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సవరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆ బిల్లును కూడా గవర్నర్కు పంపగా.. ఇవన్నీ అక్కడ పెండింగ్లో ఉన్నాయి. గడువులోగా గవర్నర్ ఆమోదం తెలపకుంటే చట్టంగా భావించాలని సుప్రీంకోర్టు ఇటీవలే స్పష్టం చేసింది. సర్వే, రిజర్వేషన్ల పెంపు, బిల్లుపై ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా వ్యతిరేకత వ్యక్తం చేయలేదు’అని వివరించారు. సర్వేలో బీసీల శాతమేనా.. ఎస్సీ, ఎస్టీల జనాభా శాతాన్ని కూడా తేల్చారా? అని ధర్మాసనం ప్రశ్నించగా, అన్ని వర్గాలకు సంబంధించి ప్రభుత్వం సర్వే చేసిందని తెలిపారు. వెనుకబాటుతనాన్ని పోగొట్టేందుకే.. బీసీల్లో రాజకీయ వెనుకబాటుతనాన్ని గుర్తించే ప్రభుత్వం రిజర్వేషన్ల పెంపు నిర్ణయం తీసుకుందని ఏజీ తెలిపారు. ‘అధిక జనాభా ఉన్న వర్గాలకు పల్లెల్లో అధికారమిస్తే వారు లబ్ధిపొంది రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తుంది. ఇందిరా సాహ్నీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇక్కడ వర్తించదు. విద్య, ఉద్యోగ రంగాలకు సంబంధించి మాత్రమే ఆ తీర్పు అమలవుతుంది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై ఎలాంటి పరిమితి విధించలేదు. తమిళనాడు ప్రభుత్వం, సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఆర్టీనెన్స్ జారీచేసిన తర్వాత మళ్లీ నోటీఫై చేయాల్సిన అవసరం లేదు. అసెంబ్లీ చేసిన చట్టానికి సూత్రప్రాయ ఆమోదం ఉంది. ప్రజామోదం మేరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అడ్డుకోవద్దు. ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థలకు నోటిఫికేషన్ జారీ చేసింది (నోటిఫికేషన్ ప్రతులను సమర్పించారు). ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అడ్డుకోవడం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధం. ఈసీ అధికారాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకోవడం సరికాదు. ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయవద్దు’అని విజ్ఞప్తి చేశారు. 15 శాతం కులాలకు 33 శాతం ఓపెన్ కేటగిరీ ఉంటుంది... ప్రభుత్వం తరఫున మరో న్యాయవాది రవివర్మ వాదనలు వినిపిస్తూ.. ఎంఆర్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ కేసును ప్రస్తావించారు. ‘పిటిషనర్లకు రిజర్వేషన్లను సవాల్ చేస్తే ప్రాథమిక హక్కు లేదు. ఓటు వేయడం, ఎన్నికల్లో పోటీ చేయడం ప్రాథమిక హక్కు కాదు. రాజ్యాంగంలో రిజర్వేషన్లపై ఎక్కడా 50 శాతం సీలింగ్ లేదు. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు కలిపి 85 శాతం జనాభా ఉన్నారు. ఈ 85 శాతం జనాభాకు 67 శాతం మాత్రమే రిజర్వేషన్లు ఇస్తున్నారు. 15 శాతం ఉన్న ఇతర కులాలకు 33 శాతం ఓపెన్ కేటగిరీ ఉంటుంది. ఈ రిజర్వేషన్లతో ఫార్వర్డ్ కులాలకు వచ్చే నష్టం లేదు. పిటిషనర్లకు పిటిషన్లు వేసే అర్హత లేదు. వాటిని కొట్టివేయాలి’అని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఈసీ జారీచేసిన నోటిఫికేషన్పై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. కాగా, హైకోర్టు ధర్మాసనం ఇన్ప్యూన్డ్ నోటిఫికేషన్పై స్టే అని చెప్పడటంతో దేన్ని నిలిపివేశారనేదానిపై సందిగ్ధం నెలకొంది. అధికారిక ఉత్తర్వుల కాపీ వస్తేగానీ కోర్టు ఆదేశాలపై స్పష్టత రానుంది. -
‘బీసీ రిజర్వేషన్ బిల్లు ఆపడంలో వారి కుట్ర స్పష్టంగా కనిపించింది’
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకొచ్చిన జీవో నంబర్ 9పై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో బీజేపీ, బీఆర్ఎస్పై కాంగ్రెస్ మండిపడుతోంది. బీసీ రిజర్వేషన్ బిల్లు ఆపడంలో వారి కుట్ర స్పష్టంగా కనిపించిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ బీసీ రిజర్వేషన్ల బిల్లు ను ఆపింది బీజేపీ ప్రభుత్వం కాదా?, రిజర్వేషన్లు 50 శాతం మించకుండా చట్టం చేసింది బిఆర్ఎస్ కాదా? అని ప్రశ్నించారు. ఇక్కడ ఆ రెండు పార్టీల కుట్ర స్పష్టంగా కనబడుతుంది. 42 రిజర్వేషన్లు అమలు చేసి తీరుతాం... తెలంగాణ మోడల్ దేశం మొత్తం అమలు చేసేలా మా కార్యాచరణ ఉంటుంది.ఢిల్లీలో మేమంతా ధర్నా చేసిన రోజు బిఆర్ఎస్ నేతలు అంతా ఎక్కడ ఉన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కు చట్టబద్ధంగా చేయవలసిన పక్రియ అంతా ప్రభుత్వం చేసింది. సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థ ల ఎన్నికల పక్రియ మొదలు పెట్టాలని కోర్టు ఆదేశించింది. బీసీ రిజర్వేషన్లు పెంచే ఆలోచన గత బిఆర్ఎస్ ప్రభుత్వంకు ఉంటె ఎందుకు కులగణన చేయలేదు. బీసీలు అమాయకులు కాదు...బీసీ రిజర్వేషన్ల పెంపు ఎంత కఠినమైనదో తెలుసు. మా ప్రభుత్వం ఏర్పాటు కాగానే బీసీ రిజర్వేషన్ల పెంపు పక్రియ చేపట్టాం’ అని తెలిపారు.పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. ‘ హైకోర్టు తీర్పు కాపీ వచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. బీసీల రిజర్వేషన్ల పెంపు బీజేపీ, బిఆర్ఎస్ లకు ఏ మాత్రం ఇష్టం లేదు. 95 సంవత్సరాల తర్వాత బీసీ కులగణన జరిగింది బీసీ రిజర్వేషన్లు తగ్గించి బీసీ లను బిఆర్ఎస్ మోసం చేసింది. బీజేపీ, బిఆర్ఎస్ లోపాయకారి ఒప్పందం తో బీసీ ల నోటి కాడి ముద్ద లాక్కున్నారు. మేము ఢిల్లీ లో ధర్నా చేస్తే...బీజేపీ, బిఆర్ఎస్ నేతలు ఎక్కడ ఉన్నారు’ అని నిలదీశారు.రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్ మోసం తేటతెల్లమైంది కేటీఆర్బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసం తేటతెలలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఇన్నాళ్లపాటు అడ్డగోలు విధానాలతో 42 శాతం హామీ తుంగలో తొక్కారని, రేవంత్ రెడ్డి బీసీలను దారుణంగా మోసం చేశారని ధ్వజమెత్తారు. న్యాయస్థానంలో నిలబడని జీఓతో మభ్యపెట్టారని, కేంద్రంలో బీజేపీ కూడా వెన్నుపోటు పొడిచిందన్నారు. అందుకే ఎన్నికల ముంగిట బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ మోసం కోర్టు ఆపిందన్నారు. కాంగ్రెస్ పార్టీ తనపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతను ఎదుర్కోలేక… ఎన్నికల వాయిదా కోసం బిసి రిజర్వేషన్ల అంశాన్ని వాడుకుందని విమర్శించారు కేటీఆర్. బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. -
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. బీజేపీ అభ్యర్థి ఎంపికలో ఊహించని ట్విస్ట్
సాక్షి,హైదరాబాద్: జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై బీజేపీలో ట్విస్ట్ చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా, మాజీ మేయర్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బొంతు రామ్మోహన్ పేరును ఎంపీ అర్వింద్ ప్రతిపాదించారు. బొంతు రామ్మోహన్ను పార్టీలోకి తీసుకుని టికెట్ ఇవ్వాలని.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్రావుకు ఎంపీ అర్వింద్ విజ్ఞప్తి చేశారు. బొంతు రామ్మోహన్కు ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ ఉందని తెలిపారు.అర్వింద్ చేసిన ప్రతిపాదనపై బీజేపీ హైకమాండ్ ఎలా స్పందిస్తుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. జూబ్లీహిల్స్ అభ్యర్థిని ఖరారు చేసేందుకు బీజేపీ ఇప్పటికే త్రిసభ్య కమిటీని నియమించింది. మాజీ ఎంపీ పోతుగంటి రాములు, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, సీనియర్ నేత కోమల ఆంజనేయులుతో కూడిన కమిటీ ఇప్పటికే నియోజకవర్గ నేతలతో సుధీర్ఘంగా చర్చించి వారి అభిప్రాయాలు సేకరించింది. -
హైదరాబాద్లో రూ. 10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
హైదరాబాద్: నగరాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఎన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నా.. డ్రగ్స్ మూలాలు మాత్రం ఇంకా పూర్తిగా పోలేదు. తాజాగా హైదరాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టుబడటమే ఇందుకు ఉదాహరణ. సుమారు 10 కోట్ల విలువైన డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకన్నారు. ఎఫిడ్రిన్ అనే డ్రగ్స్ను పోలీసులు సీజ్ చేశారు. ఒక అపార్ట్మెంట్ వేదికగా ఐదురుగు కలిసి డ్రగ్స్ తయారీ చేస్తున్న సమాచారం అందుకున్న ఈగల్ టీమ్.. ఈ మేరకు సోదాలు నిర్వహించింది.జీడిమెట్ల పరిధిలోని సుచిత్రా క్రాస్ రోడ్స్ సమీపంలోని స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీలో సాయి దత్తా రెసిడెన్సీలో 220 కేజీల డ్రగ్స్ను ఈగల్ టీమ్ గుర్తించింది. ఈ ఘటనకు సంబంధించి నలుగుర్ని అరెస్ట్ చేయగా, ఒకరు పరారయ్యారు. ఈ డ్రగ్స్ విలువ స్థానిక మార్కెట్లో రూ. 10 కోట్లకు పైగానే ఉంటుందని అదే అంతర్జాతీయ మార్కెట్లో అయితే రూ. 70 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అపార్ట్మెంట్ వేదికగా డ్రగ్స్ తయారు చేస్తున్న వారిలో వాస్తవాయి శివరామకృష్ణ పరమ వర్మ, దంగేటి అనిల్, మద్దు వెంకట కృష్ణ, ఎం ప్రసాద్, ముసిని దొరబాబులు ఉన్నారు. వీరంతా కాకినాడ, తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాలకు చెందిన వారు కాగా, హైదరాబాద్లో ఉంటూ ఈ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది. -
‘వాగ్దానాలు నెరవేర్చడం చేతకాక.. బీసీలను వాడుకుంటున్నారు’
హైదరాబాద్: రేవంత్రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ అరవింద్ ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రభుత్వానికి వాగ్దానాలు నెరవేర్చడం చేతకాక, బీసీలను వాడుకుంటుందని మండిపడ్డారు. ఈరోజు (గురువారం, అక్టోబర్ 9వ తేదీ) బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అరవింద్ మాట్లాడుతూ.. ఈ-కార్ రేసులో బీఆర్ఎస్ నేతలను ఎందుక అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం కేసు ఏమైందని నిలదీశారు అరవింద్, ‘ హరీష్ పాల వ్యాపారం ఏమైంది ? కవిత రాజీనామా ఎందుకు ఆమోదించలేదు. ఇవన్నీ డైవర్ట్ చేయడానికి వెనకబడిన తరగతులను అడ్దం పెట్టుకొని దొంగ నాటకాలు చేస్తున్నారు. చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధ్యం అవుతుంది. కల్వకుంట్ల కుటుంబంతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా డ్రామాలు చేస్తున్నారు. వారి మధ్య దోస్తానాలో భాగంగానే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు’ అని విమర్శించారు. తెలంగాణ లోకల్ బాడీ ఎన్నికలు నిలిపివేత -
రైతుల న్యాయ పోరాటానికి కోర్టు అండ.. ఆర్డీవో కార్యాలయం జప్తు
సాక్షి,జగిత్యాల : జగిత్యాల కోర్టు ఆదేశాలతో అధికారులు ఆర్డీవో కార్యాలయ సామాగ్రి జప్తు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు రైతులకు సరైన పరిహారం చెల్లించలేదని కారణంతో ఆర్డీవో కార్యాలయ సామాగ్రి జప్తు చేసినట్లు తెలుస్తోంది.పెద్దపల్లి- నిజామాబాద్ రైల్వేలైన్ కోసం 2006లో రైతుల నుంచి సుమారు 100 ఎకరాలు భూమిని సేకరించారు. రైతులకు ఒక్క ఎకరాకు కేవలం రూ.లక్షా 30వేలు మాత్రమే అధికారులు చెల్లించారు. అయితే, అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు రైతులకు అండగా నిలిచింది. ఒక్కో ఎకరాకు రూ.లక్షా 30వేలు కాదని, 15లక్షల97 వేల200 చెల్లించాలని కోర్టు ఉత్తర్వులుజారీ చేసింది.కోర్టు ఉత్తర్వులు జారీ చేసినా రైతులకు పరిహారం చెల్లించే విషయంలో ఆర్డీఓ అధికారులు విఫలమయ్యారు. దీంతో ఆర్డీఓ అధికారులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.ఆర్డీవో కార్యాలయ సామాగ్రి జప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో అధికారులు ఆర్డీవో కార్యాలయా సామాగ్రిని జప్తు చేశారు. -
తెలంగాణ లోకల్ బాడీ ఎన్నికలు నిలిపివేత
సాక్షి,హైదరాబాద్: హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ లోకల్ బాడీ ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలపై స్టే విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జీవో 9 పై కూడా హైకోర్టు స్టే విధించింది. దీనిపై రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్కు ఆదేశాలు జారీ చేసింది. మరొకవైపు నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగా విచారణను ఆరు వారాలు వాయిదా వేసింది. హైకోర్టు నిర్ణయంతో రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. హైకోర్టు ఆర్డర్ను పరిశీలించిన తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి గురువారం(అక్టోబర్ 9వ తేదీ) హైకోర్టులో విచారణలో భాగంగా ఏజీ సుదర్శన్రెడ్డి తన వాదనలు వినిపిస్తూ.. ‘ 57.6 శాతం బీసీ జనాభా ఉందని సర్వేలో తేలింది. బీసీల సంఖ్యపై ఎలాంటి అభ్యంతరం లేనప్పుడు పిటిషనర్లకు రిపోర్ట్ ఎందుకు?, బిల్లుపై ఒక్క పార్టీ కూడా అభ్యంతరం తెలపలేదు. గవర్నర్ గడువులోగా ఆమోదించకపోతే చట్టంగా భావించాల్సి ఉంటుంది. తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రత్యేకంగా నోటిఫై చేయాల్సిన అవసరం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైందని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లిన ఏజీ సుదర్శన్ రెడ్డి. నోటిఫికేషన్ విడుదలయ్యాక కోర్టులు జోక్యం చేసుకోలేవు. కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణాను అనుసరిస్తూ కులం వివరాలను జనగణనలోకి తీసుకోనుంది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వేరు.. లోకల్ బాడీ ఎన్నికల రిజర్వేషన్లు వేరు. ఇందిరా సహాని కేసు విద్య, ఉద్యోగాలకు సంబంధించినది. మేం రాజకీయ రిజర్వేషన్ల కోసమే జీవో తెచ్చాం’ అని వివరించారు. ప్రభుత్వం తరఫున మరో న్యాయవాది రవివర్మ వాదనలు వినిపిస్తూ.. 50 శాతం రిజర్వేషన్లు మించకూడదని రాజ్యాంంగంలో ఎక్కడా లేదన్నారు. ‘ తెలంగాణలో ఏ రిజర్వేషన్లు లేని జనాభా 15 శాతం మాత్రమే. ఆ 15 శాతం మందికి 33 శాతం సీట్లు ఇస్తున్నాం’ అని హైకోర్టుకు తెలిపారు. అయితే ప్రభుత్వం తరఫున వాదనలు ముగిసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలపై స్టే విధించింది హైకోర్టు.ఇది కూడా చదవండి:తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టులో ఊరట -
తెలంగాణ: నామినేషన్లు షురూ.. ఎస్ఈసీ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఇవాళ రిలీజ్ అయ్యింది. మొదటి విడతలో 292 జడ్పీటీసీ, 2,964 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని అందులో పేర్కొంది. ఆ వెంటనే.. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్లు స్వీకరణ ప్రారంభం అయ్యింది. ఈ తరుణంలో.. నామినేషన్లు వేయాలనుకునేవాళ్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం(SEC) కీలక సూచనలు చేసింది.జడ్పీటీసీ నామినేషన్లను జిల్లా పరిషత్ కార్యాలయంలో, ఎంపీటీసీ నామినేషన్లను స్థానిక మండల పరిషత్ కార్యాలయంలోని సమర్పించాలి. జడ్పీటీసీ నామినేషన్ వేయాలనుకున్న జనరల్ కేటగిరీ అభర్థి.. రూ.5 వేలు, అదే రిజర్వేషన్ అభ్యర్థి అయితే రూ.2,500 డిపాజిట్ చేయాలి. ఎంపీటీసీ నామినేషన్ వేసే జనరల్ అభ్యర్థి రూ.2,500, రిజర్వేషన్ అభ్యర్థి రూ.1,250 డిపాజిట్ చేయాలి.ఎన్నికల నియమావలికి అనుగుణంగా నామినేషన్ సందర్బంగా దాఖలు చేసే వ్యక్తితో కలిపి ఐదుగురికి మించి కార్యాలయంలోకి రాకూడదు. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 5గం. వరకే నామినేషన్లు స్వీకరిస్తారు. ఆ తర్వాత అనుమతించరు.అభ్యర్థులు పూర్తి డాక్యుమెంటేషన్, ఫోటోలు, డిపాజిట్ రసీదుతో నామినేషన్ వేయాలి. 12న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఎన్నికల నియమావళిని పాటించని అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించబడే అవకాశం ఉంది. 15వ తేదీ మధ్యాహ్నాం 3గం.లోపు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. అలాగే.. ప్రచార నిబంధనలు, ఆచరణ నియమావళి త్వరలో విడుదల అవుతుంది.ఇదీ చదవండి: తెలంగాణ ఈ ఎమ్మెల్యేలకు వింత పరిస్థితి! -
నా అంతిమయాత్రకైనా దారివ్వండి
మెదక్: ఇంటికి వెళ్లేందుకు దారి ఇవ్వకుండా మూసివేసినా, తన సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ పురుగు మందు సేవించిన వ్యక్తి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మండల పరిధిలోని వాడి గ్రామానికి చెందిన బూర్గుపల్లి సుభాశ్రెడ్డి(44) కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన పాలివారు తన ఇంటి వద్దకు వెళ్లేందుకు దారి ఇవ్వకుండా మూసివేశారు. దీంతో మండల, జిల్లాస్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఈనెల 3న పురుగు మందు సేవించాడు. తాను మృతిచెందిన తర్వాత తన సమస్యను పరిష్కరించి, ఆ దారి వెంటే తన మృతదేహాన్ని తీసుకెళ్లాలంటూ అధికారులకు విన్నవించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గ్రామంలో ఉద్రిక్తత, భారీ బందోబస్తు సుభాశ్రెడ్డి మృతికి కారణమైన వారిని శిక్షించి సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ బంధువులు పెద్ద ఎత్తున గ్రామానికి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మృతికి కారణమైన వారిని శిక్షించి కుటుంబానికి న్యాయం చేయాలని పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న మెదక్ రూరల్ సీఐ జార్జ్, ఎస్ఐ నరేశ్ ముందస్తు జాగ్రత్తగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సుభాశ్రెడ్డి ఇంటి వద్దకు వెళ్లకుండా అడ్డంగా ఉంచిన గేట్ను తొలగించారు. మృతుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని హామీ ఇచ్చే వరకు అంత్యక్రియలు నిర్వహించమబోమంటూ మొండికేశారు. మృతుడికి భార్య అనూష, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
కుమారుడి అవయవాలు దానం చేసిన తల్లిదండ్రులు
జనగామ జిల్లా: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మండలగూడెం గ్రామానికి చెందిన గాదె మురళీధర్ శోభ దంపతుల కుమారుడు గాదె యుగంధర్(29) దసరా పండుగకు గ్రామానికి వచ్చి ఆదివారం రోజున తన మేనత్త కూమారుడు చందుతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రమంలో ఉప్పల్లో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యుగంధర్ను నగరంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. నాలుగు రోజులు చికిత్స అందించిన వైద్యులు నిన్న బ్రెయిన్ డెడ్ అయినట్లు ప్రకటించారు. ఎన్ని రోజులు ఐసియులో పెట్టి చికిత్సలు చేసినా ప్రయోజనం ఉండదని, అన్ని అవయవాలు పని చేస్తున్నందున అవయవాలు దానం చేయొచ్చని వైద్యులు సూచించారు. దీంతో తనయుడి 5 అవయవాలు దానం చేయడానికి తల్లిదండ్రులు అంగీకరించారు. వైద్యులు వెంటనే గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్ర పిండాలు, రెండు కళ్లు వేరు చేసి, వివిధ ఆసుపత్రులల్లో చికిత్స పొందుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికోసం గ్రీన్ ఛానల్ మార్గంలో తరలించి ఆరుగురు రోగులకు అమర్చారు. ఇలా ఆరుగురు జీవితాల్లో వెలుగు నింపిన గాదె మురళీధర్ శోభ దంపతులు ఆదర్శంగా నిలిచారు. మా కుమారుడు ప్రాణాన్ని కోల్పోయినా ఆరుగురికి ఊపిరి పోశాడని మురళీధర్ శోభలు కన్నీటి పర్యంతం అయ్యారు. అల్లారుముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కుమారుడు తమకు దూరమవడంతో వారు గుండెలవిసేలా రోదించారు. గ్రామంలో అందరితో కలిసిమెలిసి ఉండే యుగంధర్ మరణ వార్తతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
తెలంగాణ సర్కార్కు సుప్రీంకోర్టులో ఊరట
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గ్రూప్-1 పరీక్షలపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర తీర్పుపై జోక్యానికి సుప్రీం నిరాకరించింది. ఈనెల 15న విచారణ ఉన్న నేపథ్యంలో జోక్యం చేసుకోలేమన్న కోర్టు స్పష్టం చేసింది.కాగా, తెలంగాణలో గ్రూప్-1 ర్యాంకర్ల నియామకాలపై తెలంగాణ హైకోర్టు తీర్పును వేముల అనుష్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆయన పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్ మధ్యంతర తీర్పు ఇచ్చినందున ఈ దశలో జోక్యం చేసుకోలేమన్న ధర్మాసనం పేర్కొంది. హైకోర్ట్ డివిజన్ బెంచ్లో ఈనెల 15న విచారణ ఉన్న నేపథ్యంలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. ఇక, ఇప్పటికే రెండ్రోజుల క్రితం ఇదే కేసులో మరో పిటిషనర్ వేసిన పిటిషన్ సందర్భంగా హైకోర్టు తీర్పుపై జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. -
ఆలస్యంగా వచ్చారు.. రంగు డబ్బా తీసుకురండి
వేములవాడఅర్బన్: దసరా సెలవులు ముగిసిన తర్వాత విద్యాసంస్థలు శనివారం పున ప్రారంభమయ్యాయి. ఈక్రమంలోనే పలువురు విద్యార్థులు ఆలస్యంగా రావడంతో కళాశాల అధ్యాపకులు వారికి ఫైన్ వేశారు. పట్టణంలోని రెండో బైపాస్ రోడ్డులోని బాలికల గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థులు ఆలస్యంగా బుధవారం రావడంతో ఒక్కొక్కరికి ఒక్కో రంగుడబ్బా కొని అప్పగించాలని హుకూం జారీ చేశారు. దూరం నుంచి వచ్చామని తమ వద్ద డబ్బులు లేవని చెప్పినా అధ్యాపకులు వినిపించుకోకపోవడంతో వారు ఇబ్బంది పడ్డారు. ఈ విషయంపై కళాశాల వైస్ప్రిన్సిపాల్ అనురాధను ‘సాక్షి’ వివరణ కోరగా కళాశాల ప్రారంభమై ఐదు రోజులు గడుస్తున్నా విద్యార్థులకు ఫోన్ చేస్తే స్పందించడం లేదన్నారు. పరీక్షలు దగ్గర పడుతున్నందునా వారిలో క్రమశిక్షణ పెంచాలని తాము రంగుడబ్బాలు తీసుకురావాలని ఫైన్గా వేసినట్లు తెలిపారు. విద్యార్థులు కొనుగోలు చేసి తెచ్చిన రంగు డబ్బాలతోనే కళాశాల, పాఠశాల ఆవరణలో పెయింటింగ్ వేయిస్తామని స్పష్టం చేశారు. -
Telangana: పార్టీ మారిన ఎమ్మెల్యేలకు వింత పరిస్థితి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్థానిక సంస్థల ఎన్నికలు క్లిష్టంగా మారాయి. పార్టీ మారామని చెప్పుకోలేని పరిస్థితి ఓవైపు.. కొత్త కండువా వేసుకుని తమ అనుచరులకు మద్దతుగా ప్రచారం చేయలేని పరిస్థితి మరోవైపు వీరిని ఇబ్బంది పెడుతోంది. పార్టీ ఫిరాయింపుల కేసు, స్పీకర్ విచారణ ఇరకాటంలోకి నెట్టాయి. సంస్థాగతంగా పట్టుకోసం తమ అనుచరులను జెడ్పీటీసీ, ఎంపీటీసీలుగా బరిలోకి దించేందుకు ఇప్పటికే అధిష్టానానికి పలు పేర్లను సిఫార్సు చేసినప్పటికీ.. అభ్యర్థుల గెలుపుకోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం లేకుండాపోయింది. బీఆర్ఎస్ టికెట్పై గెలిచిన తర్వాత అధికార కాంగ్రెస్ గూటికి చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ వద్ద వీరిద్దరూ సీఎం సమక్షంలో కండువా కప్పుకొన్న ఫొటోలు మాత్రమే ఉన్నాయి. ఒకవేళ వీరు స్థానిక ఎన్నికల ప్రచారానికి వెళ్తే న్యాయస్థానంతో పాటు స్పీకర్కు నేరుగా సాక్ష్యం అందించిన వారవుతారనేది అక్షర సత్యం. అభివృద్ధి కోసం అటుఇటు..! చేవెళ్ల నియోజకవర్గంలో మెయినాబాద్, షాబాద్, శంకర్పల్లితో పాటు వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలంలోని పలు గ్రామాలున్నాయి. జిల్లా పరిధిలో నాలుగు జెడ్పీటీసీ, 45 ఎంపీటీసీ, 109 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య రాజకీయ ప్రస్థానం తన సొంత మండలమైన నవాబుపేట నుంచి ప్రారంభమైంది. కాంగ్రెస్ నుంచి ఎంపీపీ, జెడ్పీటీసీగా పనిచేశారు. అనంతరం 2014లో అదే పార్టీ నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత అధికార బీఆర్ఎస్లో చేరారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఫాంపై పోటీ చేసి రెండోసారి గెలుపొందారు. 2024లో కూడా అదే పార్టీ నుంచి పోటీ చేసి తిరిగి అధికార కాంగ్రెస్ గూటికి చేరారు. నియోజకవర్గ అభివృద్ధి పేరుతో కారు దిగి.. సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. అప్పటి నుంచి బీఆర్ఎస్కు దూరంగా ఉంటున్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిందిగా ప్రతిపక్ష బీఆర్ఎస్ కోర్టును ఆశ్రయించడం, బంతి స్పీకర్ కోర్టులోకి నెట్టడం, విచారణకు హాజరు కావాల్సిందిగా కోరుతూ సదరు ఎమ్మెల్యేకు స్పీకర్ నోటీసులు జారీ చేయడం తెలిసిందే. నెత్తిన అనర్హత కత్తి వేలాడుతున్న నేపథ్యంలోనే విడుదలైన స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఆయన్ను ఇబ్బందుల్లో పడేసింది. జెడ్పీ పీఠం కోసం.. ఈసారి జిల్లా పరిషత్ పీఠాన్ని ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడం తన నియోజకవర్గంలోని షాబాద్ ఎస్సీ మహిళకు, చేవెళ్ల, శంకర్పల్లి మండలాలు ఎస్సీ జనరల్కు రిజర్వ్ కావడంతో షాబాద్ లేదా చేవెళ్ల నుంచి తన కోడలిని నిలబెట్టి జెడ్పీ చైర్పర్సన్ సీటు దక్కించుకోవాలనే దిశగా అడుగులు వేస్తున్న ట్లు సమాచారం. కానీ కాంగ్రెస్ కండువా వేసుకుని నేరుగా ప్రచారం చేయలేని సంకటం ఎదురైంది. ప్రకాశ్గౌడ్దీ ఇదే పరిస్థితి.. రాజేంద్రనగర్, శంషాబాద్, గండిపేట మండలాల్లోని రాజేంద్రనగర్ మండలం పూర్తిగా జీహెచ్ఎంసీ పరిధిలోకి వెళ్లింది. గండిపేటలో ఒక కార్పొరేషన్, రెండు మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి. ఇక్కడ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు లేవు. కేవలం శంషాబాద్ మండలంలోనే స్థానిక సంస్థలున్నాయి. ఇక్కడ 21 గ్రామ పంచాయతీలు, తొమ్మిది ఎంపీటీసీ స్థానాలు, ఒక జెడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. రాజేంద్రనగర్ నుంచి వరుసగా నాలుగుసార్లు విజయం సాధించిన ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ సైతం రెండేళ్ల క్రితం బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరారు. ఇప్పటి వరకు తనను నమ్ముకుని, వెంట వచి్చన అనుచరులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. ఒకవేళ వీరికి అవకాశం వచి్చనా నేరుగా ప్రచారం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. -
ఆర్టీసీ క్రాస్రోడ్లో ఉద్రిక్తత
బీఆర్ఎస్ నేతల బస్భవన్ అప్డేట్స్.. వినతి పత్రం అందజేత..పెంచిన ఆర్టీసీ చార్జీలను తగ్గించాలని కోరిన బీఆర్ఎస్ నేతలు. ఆర్టీసీ ఎండీకి వినతి పత్రం ఇచ్చిన బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే ఇదేనా?: హరీష్ ఫైర్హరీష్ రావు కామెంట్స్..ప్రజా ప్రతినిధులను ఎక్కడిక్కడ హౌస్ అరెస్టులు చేయడం అత్యంత దుర్మార్గం.ఇది అప్రజాస్వామికం, కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశత్వానికి ఇది నిదర్శనం.నాయకులను, కార్యకర్తల్ని ఎందుకు అరెస్టులు చేస్తున్నారు.ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే ఇదేనా?వెంటనే అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.20 నెలల్లో 5 సార్లు బస్ ఛార్జీలు పెంచారు.భార్యకు ఫ్రీ అని భర్తకు టికెట్ డబుల్ చేశారు. విద్యార్థులకు డబుల్ చేశారు.ఇప్పటికే జీవో 53, 54 లతో కొత్త వాహనాలపై లైఫ్ ట్యాక్స్ పెంచి ప్రజలపై భారం వేసిండు.పేద, మధ్య తరగతి ప్రజలను దొంగ దెబ్బ కొట్టిండు రేవంత్ రెడ్డివాహన లైఫ్ టైం టాక్సులు, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచడం ద్వారా ప్రజల రక్తం పీల్చుతున్నడు రేవంత్ రెడ్డి.మెట్రో రైలును ఆగం చేసిండు.కాంగ్రెస్ పాలనలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేదా?ఇది ఇందిరమ్మ రాజ్యమా? ఎమర్జెన్సీ పాలనా?ఇది ప్రజా పాలనా లేక ప్రజా పీడననా?రేవంత్ రెడ్డి ఏం చేసినా ఎవ్వరూ అడగొద్దు అన్నట్లు ఉంది.ప్రజాస్వామ్య పాలన అని రాక్షస పాలన సాగిస్తున్నడు.మాటల్లో రాజ్యాంగ రక్షణ, చేతల్లో రాజ్యాంగ భక్షణ?టికెట్ ధరల పెంపు పై బస్సులో ప్రయాణించి ఆర్టీసి ఎండీని కలిసి వినతిపత్రం ఇచ్చే అవకాశం ప్రజా ప్రతినిధులకు లేదా?తెలంగాణలో హక్కులను కాలరాస్తున్న రేవంత్ రెడ్డి దుష్ట పాలన రాహుల్ గాంధీకి కనిపించడం లేదా?ప్రశ్నిస్తే కేసులు, గొంతెత్తితే దాడులు, ప్రజా ప్రతినిధుల హౌజ్ అరెస్టులు, మీడియా పై కఠిన ఆంక్షలు.ఇదేమి రాజ్యం రేవంత్ రెడ్డి?ఏడవ గ్యారంటీగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని డబ్బా కొట్టి ఇప్పుడు, ఉన్న ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశావు.ఎమర్జెన్సీ పాలనను తలపిస్తున్నావు.మీ అణచివేతలకు, మీ నిర్బంధాలకు, మీ దాడులకు బీఆర్ఎస్ పార్టీ అదరదు బెదరదు.ప్రజా క్షేత్రంలో మిమ్మల్ని అడుగడుగునా నిలదీస్తూనే ఉంటం, ప్రజల తరఫున పోరాటం చేస్తూనే ఉంటాం.అడ్డగోలుగా పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాంకమీషన్లు దంచుడు కాదు, పేదల కోసం పని చెయ్యినిరసన రాజ్యాంగం ఇచ్చిన హక్కు.ఆర్టీసీ ధరలు పెంచితే మెట్రో ఎక్కుతారు అని రేవంత్ ఆలోచన..ఆర్టీసీ అమ్మాలని,ప్రైవేట్ పరం చేసే కుట్ర కాంగ్రెస్ చేస్తుంది.ఎలక్ట్రానిక్ బస్ ల పేరుతో పెద్ద కుట్ర జరుగుతోంది..ఉప్పల్ మియాపూర్ వర్క్ షాప్స్ అమ్మకానికి పెట్టారు.బస్ స్టాండ్ లు కూడబెట్టి 1500 కోట్లు తెచ్చారు.ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడమేనా కాంగ్రెస్ పనికార్గో ను అమ్మి ప్రైవేట్ చేయాలని చూస్తుందిపేదల నడ్డి విరుస్తున్నారు.రాహుల్ గాంధీ రాజ్యాంగం గూర్చి మాట్లాడుతారు..రేవంత్ రెడ్డి రాజ్యాంగ భక్షణ జరుగుతుంది.ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి.ఆర్టీసీ ధరలు తగ్గించేవరకు బీఆర్ఎస్ ప్రజా ఉద్యమం చేస్తుంది.కాంగ్రెస్ సర్కార్ అడ్డగోలుగా పెంచిన ఆర్టీసీ బస్ చార్జీలను నిరసిస్తూ బీఆర్ఎస్ తరపున ఇవ్వాళ "చలో బస్ భవన్" కార్యక్రమానికి పిలుపునిచ్చినంమహిళలకు ఉచితం అని పురుషులకు టికెట్ల రేట్లు డబుల్ చేస్తే.. బస్ పాస్ ధరలు పెంచితే కుటుంబం మీద భారం పడదా?పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలని… pic.twitter.com/SPcfWGMspW— BRS Party (@BRSparty) October 9, 2025 ఆర్టీసీ క్రాస్రోడ్లో ఉద్రిక్తతబస్ భవన్కు వెళ్ళే మారాన్ని మూసేసిన పోలీసులుసంధ్య థియేటర్ దగ్గర బారీకేడ్స్ ఏర్పాటుకేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలను ఆపేసిన పోలీసులుఆర్టీసీ ఎండీని కలవటానికి ముగ్గురు బీఆర్ఎస్ నేతలకు అనుమతిపెంచిన ఆర్టీసీ చార్జీలు తగ్గించాలని ఆర్టీసీ ఎండీకి మెమొరాండం ఇవ్వనున్న కేటీఆర్, హరీష్ తోపులాటపోలీసులకు, బీఆర్ఎస్ కేడర్కు తోపులాట, వాగ్వివాదంబారికేడ్స్ తోసేసుకుని బస్ భవన్ వైపు వెళ్తోన్న బీఆర్ఎస్ నేతలు, క్యాడర్సీఎం డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్ కార్యకర్తల నినాదాలు 👉బస్ భవన్ బయలుదేరిని కేటీఆర్, హరీష్ రావు👉హైదరాబాద్లో ఆర్టీసీ చార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్(BRS Chalo Bus Bhavan) గురువారం ‘చలో బస్భవన్’ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు.. బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. గురువారం ఉదయమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో కోకాపేటలోని వారి నివాసాల వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు.👉ఇక, చలో బస్భవన్ కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, పద్మారావు, సబితా ఇంద్రారెడ్డి తదితరులు ఉదయం 9 గంటలకు రేతిఫైల్ బస్టాండ్కు చేరుకుని అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో ఆర్టీసీ బస్భవన్ వరకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. అనంతరం టీజీఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్కు వినతిపత్రం సమర్పించనున్నారు. ఇదేనా ప్రజాపాలన?ఆర్టీసీ బస్ ఛార్జీల పెంపు మీదనిరసన తెలుపకుండా అణచివేతకు పాల్పడుతున్న రేవంత్ సర్కార్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS సహా పలువురు బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్న పోలీసులు. pic.twitter.com/uwMIm6FhN7— BRS Party (@BRSparty) October 9, 2025👉ఈ సందర్భంగా కేటీఆర్ స్పందించారు.‘పెంచిన చార్జీలకు వ్యతిరేకంగా శాంతియుతంగా ఆర్టీసీ ఎండీ కార్యాలయానికి వెళ్లి లేఖ ఇద్దామని పార్టీ పిలుపునిచ్చింది. చార్జీలను వెనక్కి తీసుకోవాలని.. అందుకు కోరాలని అనుకున్నాము. ఆర్టీసీ బస్సులు ఎక్కి వెళ్తా అంటే భారీగా పోలీసులను ప్రభుత్వం ఇంటి ముందు మోహరించింది. ఒక వ్యక్తిని బస్సు ఎక్కకుండా ఆపడం కోసం ఇంతమంది పోలీసులను పంపారు. మమ్మల్ని నియంత్రించడంలో పోలీసులకు ఉన్న ఉత్సాహం రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జరుగుతున్న నేరాల అదుపులో చూపిస్తే మంచిది. ఎన్ని రకాల కుట్రలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సు చార్జీలను వెనక్కి తీసుకొనే దాకా నిరసన తెలుపుతూనే ఉంటాము. ఇలాంటి పోలీసు నిర్బంధాలు మాకు.. మా పార్టీకి కొత్త కాదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి.. ఎవరీ నవీన్ యాదవ్..?
సాక్షి, హైదరాబాద్: ఊహించినట్టే.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరు ఖరారైంది. కాంగ్రెస్ అధిష్టానం బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యమివ్వడంతో పాటు స్థానికుడికి అవకాశం కల్పించింది. అధికార పార్టీ కావడంతో పలువురు సీనియర్లు, హేమాహేమీలు పోటీ పడినప్పటికీ.. యువ నేత అభ్యర్థితానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది . గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసి ఓటమి పాలైన మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి కనబర్చడంతో ఆయనకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేసి.. ఎన్నికల బరి నుంచి తప్పించింది కాంగ్రెస్ అధిష్టానం. గత ఎన్నికలకు ముందు జూబ్లీహిల్స్ అసెంబ్లీ లేదా సికింద్రాబాద్ ఎంపీ సీటు హామీతో కాంగ్రెస్లో చేరిన నవీన్ యాదవ్కు లైన్ క్లియర్ అయింది. రెండుసార్లు పోటీ ⇒ ఇప్పటికే జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం నుంచి నవీన్ యాదవ్ రెండు పర్యాయాలు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పక్షాన పోటీ చేసి 41వేల 656 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. ⇒ ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో మజ్లిస్ ఎన్నికల బరికి దూరం పాటించడంతో.. ఆ పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయనకు 18వేల 817 ఓట్లు వచ్చాయి. ⇒ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరినా.. పార్టీ టికెట్ దక్కలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే మృతితో ఉప ఎన్నిక అనివార్యం కావడంతో ఇప్పుడు అవకాశం దక్కినట్లయింది. మజ్లిస్ మద్దతు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు మజ్లిస్ దూరం పాటిస్తున్న కారణంగా కాంగ్రెస్కు మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఉప ఎన్నికల్లో యువనేతను ఎన్నుకోవాలని పిలుపునివ్వడం, బీఆర్ఎస్పై విమర్శనాస్త్రాలు సంధించడంతో కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నట్లు పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్లయింది. అధికార కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అభివృద్ధి మంత్రంతో విజయావకాశాలను సుగమం చేసుకున్నా.. అభ్యర్థిత్వం ఖరారులో మాత్రం మజ్లిస్ పార్టీ జోక్యం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సీనియర్లను కాదని యువనేతకు అవకాశం కల్పించినట్లు కనిపిస్తోంది. -
కిడ్నాప్ చేసి...తుపాకీతో బెదిరించి..
వెంగళరావునగర్: రోడ్డుపై వెళుతున్న వ్యక్తిని ఆఫీసుకు తీసుకెళ్లి, అనంతరం కిడ్నాప్ చేసి తుపాకులతో బెదిరించి నగదు డిమాండ్ చేసిన సంఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన మనోజ్కుమార్ బాచుపల్లిలో నివాసం ఉంటున్నాడు. ఈనెల 6న తన స్నేహితుడితో కలిసి ఎల్లారెడ్డిగూడలో నడిచి వెళుతుండగా వెంకట్స్వరూప్ అనే వ్యక్తి అమీర్పేటలోని తన ప్లాట్కు రమ్మని మనోజ్కుమార్ను కారులో తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు మనోజ్కుమార్పై దాడిచేసి తుపాకులతో బెదిరించి ఎల్లారెడ్డిగూడలోని శివసాయి అపార్ట్మెంట్స్కు తీసుకెళ్ళారు. అక్కడ అతడిని బంధించి తమకు రూ.10 కోట్లు కావాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అతడి భార్య, కుటుంబ సభ్యులను చంపుతామని బెదిరించాడు. బాధితుడు తన భార్యకు ఫోన్ చేసి సమాచారం అందించడంతో ఆమె మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు గాలింపు చేపట్టగా వెంకటస్వరూప్ మరోసారి మనోజ్కుమార్ భార్యకు ఫోన్ చేసి మైత్రీవనం 1039 పిల్లర్ వద్దకు నగదు, తీసుకురావాలని చెప్పాడు. ఆమె పోలీసులతో కలిసి అక్కడికి వెళ్ళగా ముగ్గురు నిందితులు బైక్పై పారిపోగా మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మధురానగర్ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితులను మియాపూర్ పోలీసులకు అప్పగించారు. -
సైకిల్ కొంటాం.. రుణం ఇవ్వండి
ఝరాసంగం(జహీరాబాద్): సైకిల్ కొనుక్కుంటాం.. మాకు రుణం ఇవ్వండి. తాకట్టుగా తమ వద్ద ఉన్న బంగారం పెడుతామని చిన్నారులు బ్యాంకు మేనేజర్ను కోరారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలో జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. మండల పరిధిలోని బర్దీపూర్కు చెందిన దేవాన్ష్, రహస్య తల్లి సునీతతో కలిసి దసరా సెలవులలో అదే గ్రామంలోని కెనరా బ్యాంకుకు వెళ్లారు. వారి తల్లి.. బ్యాంకులో మహిళా సంఘం డబ్బులు తీసుకునేందుకు వచ్చారు. బ్యాంకులో డబ్బులు ఇస్తారన్న విషయం తెలుసుకున్న చిన్నారులు.. బ్యాంకు మేనేజర్ దగ్గరకు వెళ్లి.. ఆడుకునేందుకు సైకిల్ కొనుక్కుంటాం.. డబ్బులు ఇవ్వండని అడిగారు. ఆశ్చర్యానికి గురైన మేనేజర్.. తాకట్టుగా ఏం పెడతారని ప్రశ్నించగా.. తమ దగ్గర భూమి ఉంది.. బంగారం కూడా ఉందని సమాధానం ఇచ్చారు. మేనేజర్ నవ్వుతూ చిన్నారులను తిరిగి ఇంటికి పంపించారు. -
తెలంగాణ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. హైకోర్టు ఆదేశాలతో ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు ఎస్ఈసీ తెలిపింది. సెప్టెంబర్ 29న విడుదలైన ఎన్నికల నోటిఫికేషన్ సస్పెండ్ చేసింది. -
మరో రెండ్రోజులు మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 16వ తేదీ నాటికి పూర్తిస్థాయిలో ఉపసంహరణ ప్రక్రియ పూర్తవు తుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ సమయంలో రుతుపవనాల కదలికలు వేగంగా ఉండటంతో వర్షాలకు అనుకూల వాతావరణం ఉంటుందని చెబుతున్నారు. దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ, అంతర్గత తమిళనాడుల మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీంతో రానున్న రెండు రోజులు చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని అధికారులు వివరించారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుసాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్ (జూన్1 నుంచి)లో రాష్ట్రవ్యాప్తంగా 77.32 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 102.37 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాధారణం కంటే 32 శాతం అధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 7 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా.. 16 జిల్లాల్లో అధిక వర్షపాతం, 10 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. గతేడాది సీజన్తో పోలిస్తే ఈసారి 4 శాతం అధికవర్షపాతం నమోదైంది. పిడుగుపాటుకు ఇద్దరు మృతి యాచారం/మాడ్గుల: వేర్వేరు ఘటనల్లో పిడుగుపాటుకు గురై రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు మృతి చెందారు. వివరాలు.. యాచారం మండలం నల్లవెల్లికి చెందిన జోగు మనీశ్ (12) ఏడో తరగతి చదువుతున్నాడు. బుధవారం సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆడుకునేందుకు బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా పిడుగు పడటంతో బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే మాల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మాడ్గుల మండల పరిధిలోని అప్పారెడ్డిపల్లికి చెందిన బుచ్చయ్య (56) పశువులకు మేత వేయడానికి వెళ్లి పిడుగుపాటుకు గురై మృతిచెందాడు. -
సకుటుంబ సమేతంగా..
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ప్రముఖ ఓవర్ ది టాప్ (ఓటీటీ) స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లు అందించే కంటెంట్లో సరికొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గతంలో నేరప్రవృత్తితో కూడిన, అశ్లీల సంబంధ వెబ్ సిరీస్లను రూపొందించి ప్రసారం చేయడం ద్వారా వీక్షకులను ఆకర్షించిన ఓటీటీ ప్లాట్ఫామ్లు.. ఇటీవల కాలంలో మాత్రం కుటుంబ సమేతంగా చూడదగ్గ విభిన్న ఇతివృత్తాలతో ముందుకొస్తున్నాయి.సబ్స్క్రైబర్లను పెంచుకోవడంపై తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో దక్షిణాదితో పాటు ద్వితీయ, తృతీయశ్రేణి నగరాలు, పట్టణాలపై ఓటీటీలు ప్రత్యేక దృష్టిపెట్టి ఈ మేరకు మార్పుచేర్పులకు శ్రీకారం చుడు తున్నాయి. ఇందులో భాగంగా దక్షిణాది భాషలకు సంబంధించిన కంటెంట్కు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు కుటుంబ, స్నేహపూర్వక డ్రామాలు, ప్రేమకథలు, కామెడీలతో కూడిన కంటెంట్ను అందించడంపై దృష్టిపెట్టాయి. స్థానిక భాషల కంటెంట్కు డిమాండ్... ఓటీటీల్లో గతంలో ప్రసారమైన సినిమాలు, వెబ్సిరీస్లు ఆంగ్లం లేదా హిందీకే పరిమితమవగా ఇటీవల కాలంలో స్థానిక భాషల్లో కంటెంట్ను వీక్షించేందుకే ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. తమ సొంత సంస్కృతి, భాషను ప్రతిబింబించే షోలు, సినిమాలను వీక్షించాలని సబ్స్క్రైబర్లు కోరుకుంటున్నారు. దీంతో తెలుగు, తమిళం, మరాఠీ,బెంగాలీ సహా ఇతర భాషల్లో భిన్నమైన కంటెంట్ను అందించడానికి ఓటీటీ సంస్థలు ముందుకొస్తున్నాయి. ఇందుకోసం కంటెంట్ సృష్టికర్తలతో జతకడుతున్నాయి. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, జీ5, ఆభా, హోయిచాయ్ వంటి ప్లాట్ఫామ్లు ప్రాంతీయ భాషల్లో స్థానిక కంటెంట్తో షోలు, సినిమాలను అందించడంలో ముందువరసలో నిలుస్తున్నాయి. బెంగాలీ షోలకు ప్రసిద్ధి చెందిన హోయిచోయ్ భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిన బెంగాలీలను కూడా తన సరికొత్త కంటెంట్తో వీక్షకులను ఆకర్షించడం ద్వారా సబ్స్రై్కబర్ల సంఖ్యను పెంచుకుంది. చౌపాల్ పంజాబీ, హర్యాన్వి, భోజ్పురి ప్రేక్షకులకు ప్రాంతీయ అభిరుచులతో లోతుగా ప్రతిధ్వనించే కథలను అందిస్తోంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ స్థానిక భాషల్లో సినిమాలను నిర్మించడంతోపాటు సెలబ్రిటీలతో ఇంటర్వ్యూలు, టాక్ షోలను అందిస్తున్నాయి. ఈటీవీ విన్, సన్ నెక్ట్స్æ, ఆహా వంటి ఓటీటీలు తెలుగు, తమిళ కంటెంట్ను రూపొందించి విడుదల చేయడంపై దృష్టిపెడుతున్నాయి. ఇక జియో హాట్స్టార్, సోని లివ్ తదితర ఓటీటీలు సినిమాలు, డ్రామాలు, వెబ్ సిరీస్లతోపాటు క్రికెట్ సహా వివిధ క్రీడలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి.వచ్చే 12–18 నెలల్లో దక్షిణాది భాషల్లో ఒరిజినల్ స్ట్రీమింగ్ టైమింగ్ను జియో హాట్స్టార్ డబుల్ చేయనుంది. జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ సైతం దక్షిణాది సంబంధ కంటెంట్ను మరింతగా అందించడంపై దృష్టిసారిస్తోంది. బిగ్బాస్ సౌత్ ఓటీటీని నాలుగు దక్షిణాది భాషల్లో ప్రజలు 400 కోట్ల గంటలకుపైగా వీక్షించారంటే ప్రాంతీయ భాషల్లో షోలకు ఎంత ఆదరణ లభిస్తోందో స్పష్టమవుతోంది.ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంటే... ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది మీడియా ప్రసార మాధ్యమం. ఇందులో ఇంటర్నెట్ ద్వారా కంటెంట్ను అందిస్తారు. వీక్షకులు సంబంధిత యాప్లను నిర్ణీతరుసుము చెల్లించి సబ్స్రై్కబ్ చేసుకొని వాటిల్లోని సినిమాలు, సిరీస్లు సహాఆయా యాప్లలో ఉండే కంటెంట్ను ఎన్ని సార్లయినా చూడొచ్చు. -
జూబ్లీహిల్స్ కోసం బీఆర్ఎస్ వార్ రూమ్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించిన ప్రచార వ్యూహం అమలు, పార్టీ నేతలు, ప్రచార బృందాల నడుమ సమన్వయం తదితరాల కోసం ‘వార్ రూమ్’ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. వార్ రూమ్ ఇన్చార్జిలుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతో పాటు మాజీ మంత్రులు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, మహమూద్ అలీ వ్యవహరిస్తారు. ఈ నెల 12 నుంచి క్షేత్ర స్థాయిలో పార్టీ ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. పండితుల సూచనల మేరకు మంచి ముహూర్తం చూసుకుని మాగంటి సునీతా గోపీనాథ్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తారు. బుధవారం కేటీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కేటీఆర్తో పాటు మాజీ మంత్రులు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, డివిజన్ ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, దేవిరెడ్డి సుధీర్రెడ్డి, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు తక్కళ్లపల్లి రవీందర్రావు, దాసోజు శ్రవణ్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, పార్టీ నేత రావుల శ్రీధర్రెడ్డి తదితరులతో పాటు మాగంటి సునీత, మాగంటి గోపీనాథ్ సోదరుడు వజ్రనాథ్ కూడా హాజరయ్యారు. నేడు, రేపు బూత్ కమిటీలతో భేటీలుబీఆర్ఎస్ ప్రచార బృందాల పనితీరు, రోడ్ షోలు, రోజూ వారీ ప్రచార షెడ్యూలు తదితర అంశాలపై ఈ భేటీలో చర్చించారు. వార్ రూమ్ నుంచి అందే ఆదేశాలకు అనుగుణంగా ప్రచార వ్యూహానికి పదు ను పెట్టాలని నిర్ణయించారు. గురు, శుక్రవారాల్లో బూత్ కమిటీలతో డివిజన్ ఇన్చార్జిలుగా వ్యవహరి స్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశాలు నిర్వ హించి ప్రచార వ్యూహాన్ని వివరిస్తారు. ఈ నెల 10 వ తేదీలోగా బూత్కమిటీల సమావేశాలు పూర్తి చేసి 12వ తేదీ నుంచి ప్రచార పర్వంలో అడుగు పెట్టా లని కేటీఆర్ ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగని పక్షంలో ఇతర జిల్లాలకు చెందిన ఎమ్మెల్యే లు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలను కూడా ఉప ఎన్నిక ప్రచారంలో భాగస్వాములను చేస్తారు. ప్రచారం ముగింపులో పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షోలో పాల్గొనే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. -
అభ్యర్థులు స్థానిక ఓటరులై ఉండాలి
సాక్షి, హైదరాబాద్: తొలిదశ స్థానిక ఎన్ని కలకు గురువారం నోటిఫికేషన్లు జారీ కానుండగా, వెనువెంటనే నామినేషన్లు స్వీకరించనున్నారు. అయితే నామినేషన్ల దాఖలు విషయంలో అభ్య ర్థులు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.» ఫారం–4 (అనుబంధం–3)లో ఉన్న నమూనాలో నామినేషన్ పత్రం ఉండాలి» ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పోటీ చేసేవారు సంబంధిత ఓటర్ల జాబితాలో ఓటరుగా నమోదై ఉండాలి» పోటీ చేసే అభ్యర్థి, ప్రతిపాదించే వ్యక్తి ఇద్దరి పేర్లు మండల, జిల్లా పరిషత్ ఓటర్ల జాబితాల్లో ఉండాలి» ఒక స్థానానికి ఒక అభ్యర్థిని వివిధ వ్యక్తులు ప్రతిపాదించవచ్చు» ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో నామినేషన్ వేయొచ్చు కాని ఒక దాంట్లోనే పోటీ చేయాలి.» ఒక ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ స్థానంలో పోటీ చేయొచ్చు» రిటర్నింగ్ అధికారికి నిర్దేశిత ప్రదేశంలో నామినేషన్లు అందజేయాలి» గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీ లేదా రిజర్వ్డ్ చిహ్నం కలిగి రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీ ద్వారా పోటీ చేస్తున్న అభ్యర్థి, నోటిఫికేషన్ ఫారమ్–2లో ఆ పార్టీ పేరు నమోదు చేయాలి. రాజకీయ పార్టీ నుంచి పొందిన అభ్యర్థిత్వ ధ్రువీకరణ ఫారమ్–బీ నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ సాయంత్రం 3 గంటల లోగా సంబంధిత రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి» రిజర్వ్ గుర్తు లేని రిజస్టర్డ్ రాజకీయ పార్టీ అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు ఎస్ఈసీ సూచించిన రిజర్వ్ కాని (ఫ్రీ) చిహ్నాల జాబితా నుంచి ప్రాధాన్యతా క్రమంలో మూడు చిహ్నాలను ఎంపిక చేసుకుని నామినేషన్ పత్రంలో సూచించాలి నామినేషన్ ఫారానికి జత చేయాల్సిన డిక్లరేషన్లు» ఎస్సీ, ఎస్టీ, బీసీ హోదాకు సంబంధించిన డిక్లరేషన్లు» ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం రిజర్వ్ చేసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్ ఫారం (అనుబంధం–3తో సంబంధిత కులం, తెగ, తరగతికి చెందినవారిగా ధ్రువీకరణ పత్రం సమర్పించాలి.» ఎస్సీ, ఎస్టీ, బీసీఅభ్యర్థులు పోటీకి డిపాజిట్ చేసే మొత్తంలో రాయితీకి అర్హులు» రిటర్నింగ్ అధికారి ప్రతిరోజు తాను స్వీకరించిన నామినేషన్ల వివరాలను ఫారమ్–5లో ప్రచురించాలి. -
జూబ్లీహిల్స్కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్
సాక్షి, న్యూఢిల్లీ: జూబ్లీహిల్స్ శాసనసభ నియో జకవర్గ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ తన అభ్య ర్థిగా నవీన్యాదవ్ పేరును ప్రకటించింది. కొద్దిరోజులుగా అనేక ఊహాగానాలు వినిపించినా చివరకు యువ నాయకుడు నవీన్ యాద వ్ వైపే అధిష్టానం మొగ్గు చూపింది. ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) బుధవారం రాత్రి అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఈ ఉప ఎన్నిక అభ్యర్థిపై గత కొద్ది రోజులుగా పార్టీలో తీవ్రస్థాయిలో మంతనాలు జరి గాయి. పలువురు ఆశా వహులు ఢిల్లీ స్థాయిలో గట్టి లాబీయింగ్ నడిపారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం పలు సర్వేలు, స్థానిక నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంది. చివరకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదంతో నవీన్ యాదవ్ పేరును ఖరారు చేశారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం ప్రకటన విడుదల చేశారు.యువత, సామాజికవర్గం ఓట్లే లక్ష్యంగా..నియోజకవర్గంలో యువ నాయకుడిగా, స్థాని కంగా మంచి పట్టున్న నేతగా నవీన్ యాదవ్కు పేరుంది. ఆయన తండ్రి బంజారాహిల్స్ కార్పొ రేటర్గా పనిచేయడం, నియోజకవర్గంలోని ఓటర్లతో తన కుటుంబానికి సత్సంబంధాలు ఉండటం ఆయనకు కలిసివచ్చే అంశాలుగా పార్టీ అధిష్టానం భావించింది. యాదవ సామా జికవర్గానికి చెందిన వ్యక్తి కావడం, యువతలో మంచి ఆదరణ ఉండటంతో గెలుపు అవకాశా లు మెరుగ్గా ఉంటాయని హైకమాండ్ అంచనా వేసింది. ఈ సమీకరణాలన్నింటినీ బేరీజు వేసు కున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ జరుగనుండగా, నవంబర్ 14న ఫలితాలు వెలువడనున్నాయి. -
జేఈఈ సిలబస్ మార్చాల్సిందే..
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ) సిలబస్లో మార్పులు తేవాలని కేంద్ర విద్యా శాఖకు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఏటా చేపట్టే ఈ పరీక్ష విద్యార్థుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉందని పేర్కొన్నాయి. పరీక్షా విధానం విద్యార్థుల్లో అనారోగ్యకరమైన పోటీకి దారితీస్తోందని తెలిపాయి. అనేక మంది కుంగు బాటుకు లోనవుతున్నారని స్పష్టం చేశాయి. ప్రైవేటు పాఠశాలల్లో ఇంటర్ వరకూ బట్టీ విధానంలో బోధన జరుగుతోందని, విద్యార్థులకు 90% పైగానే మార్కులు వస్తున్నాయని పలు రాష్ట్రాలు తెలిపాయి. అయినప్పటికీ జేఈ ఈలో చాలామంది అర్హత సాధించలేని పరిస్థితి ఏర్పడిందని కేంద్రం దృష్టికి తెచ్చాయి. ఎన్టీఏ పరీక్షకు, అకడమిక్ విద్యకు పొంతన లేని విధంగా ఉందని తెలిపాయి. ఇది పూర్తిగా కార్పొరేట్ విద్యా సంస్థల ఆధిపత్యానికి, ఫీజులు దండుకోవడానికి దారితీస్తోందనే అభిప్రాయం వ్యక్తం చేశాయి. జేఈఈ నిర్వహణపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో మార్పులకు అవసరమైన సూచనలు ఇవ్వాలని కేంద్రం కోరిన నేపథ్యంలో.. రాష్ట్రాల నుంచి తాజాగా ప్రతిపాదనలు వచ్చాయి. ఇలా అయితే కష్టం: ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్థుల్లో చాలా మంది జేఈఈ ర్యాంకుల్లో వెనుకబడుతున్నారు. సరైన అధ్యాపకులు లేకపోవడం, మౌలిక వసతులు ఉండని పరిస్థితి కాలేజీల్లో నెలకొంది. దీంతో ప్రైవేటు కాలేజీలకు వెళ్తేనే ర్యాంకులొస్తాయనే ఆలోచనల్లోకి విద్యార్థులు వెళ్తున్నారు. ఫలితంగా గత కొన్నేళ్ళుగా జేఈఈ పరీక్షను సీరియస్గా రాసే వారి సంఖ్య తగ్గుతోంది. గతంలో 16 లక్షల మంది దరఖాస్తు చేస్తే, 15.9 లక్షల మంది పరీక్ష రాసేవారు. మూడేళ్ళుగా 12 లక్షల మంది దరఖాస్తు చేస్తున్నా, పరీక్ష రాసేవారి సంఖ్య 11 లక్షలకు మించడం లేదు. ప్రశ్నలు తికమకగా ఉంటున్నాయని, సుదీర్ఘంగా ఇస్తున్నారనే అభిప్రాయం విద్యార్థుల నుంచి వ్యక్తమవుతోంది. అడ్వాన్స్డ్ సాధించాలంటే తీవ్ర స్థాయిలో కసరత్తు చేయాల్సి వస్తోంది. ఈ దిశగా కాలేజీలు విద్యార్థులను తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నాయని, ఐఐటీల్లో సీట్లు వచ్చినా విద్యార్థులు కుంగుబాటుకు గురవుతున్నారని రాష్ట్రాలు తెలిపాయి. సబ్జెక్టుల ప్రశ్నల్లో మార్పులు చేయాలిఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథ్స్లో కొన్ని చాప్టర్ల నుంచి ఇచ్చే ప్రశ్నలను సరళతరం చేయాలని రాష్ట్రాలు కేంద్రానికి సూచించాయి. కేంద్ర, రాష్ట్ర విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులు తేలికగా అర్థం చేసుకుని, సులభంగా జవాబు ఇచ్చేలా ప్రశ్నలు ఉండాలని తెలిపాయి. మోడ్రన్ ఫిజిక్స్లో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, డీ బ్రోగ్లై వేవ్లెంత్, అటమిక్ మోడల్స్ను మార్చాలని సూచించాయి. ఫ్లూయిడ్ మెకానిక్స్, థర్మోడైనమెట్స్ను సరళతరం చేయాలని పేర్కొన్నాయి. ఫిజికల్ కెమెస్ట్రీలో ఎలక్ట్రో కెమిస్ట్రీ, కెమికల్ నైటిక్స్, థర్మోడైనమిక్స్, ఇనార్గానిక్ కెమిస్ట్రీలో కో–ఆర్డినేషన్ కాంపౌండ్స్, పిరియాడిక్ ప్రాపర్టీస్ నుంచి సరళంగా ప్రశ్నలివ్వాలని సూచించాయి. ఆర్గానిక్ కెమెస్ట్రీలో రియాక్షన్ మెకానిజం, నేమ్ రియాక్షన్, స్టీరియో కెమిస్ట్రీ చాప్టర్లలో ప్రశ్నలను పరిశీలించాలని తెలిపాయి. మేథ్స్కు సంబంధించి కూడా ప్రశ్నలు విద్యార్థులు తేలికగా రాయగలిగేలా ఉండాలని రాష్ట్రాలు కోరాయి. -
ఎస్ఎల్బీసీ కాంట్రాక్ట్ రద్దు!
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగాల నిర్మాణంపై ప్రాజెక్టు నిర్మాణ సంస్థ అయిన జయప్రకాశ్ అసోసియేట్స్ లిమిటెడ్తో 2005 ఆగస్టు 25న చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని రాష్ట్ర నీటిపారుదల శాఖలోని స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ (ఎస్ఎల్ఎస్సీ) రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఆస్తులతో పోల్చితే అప్పులు మించిపోయి దివాలా తీయడంతో జయప్రకాశ్ అసోసియేట్స్ సంస్థ వ్యాపార దివాలా పరిష్కార ప్రక్రియ (సీఐఆర్పీ)ను చేపడుతూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) అలహాబాద్ బెంచ్ 2024 జూన్ 3న ఉత్తర్వులు జారీ చేసింది. దివాలా ప్రక్రియ కాలంలో జేపీ అసోసియేట్స్ కంపెనీ వ్యవహారాల పర్యవేక్షణకు రిజల్యూషన్ ప్రొఫెషనల్ (ఆర్పీ) అనే థర్డ్ పార్టీ ఏజెన్సీని ఎన్సీఎల్టీ నియమించింది. సొరంగం–1 నిర్మాణ విషయంలో కంపెనీ పనితీరుపై ఆర్పీ హామీ ఇవ్వడానికి ఇష్టపడకపోయినా, హామీ ఇచ్చే పరిస్థితిలో లేకున్నా.. ఎన్సీఎల్టీ అనుమతితో ఒప్పందాన్ని రద్దు చేసుకొని మిగిలిన పనుల పూర్తికి మళ్లీ టెండర్లు నిర్వహించాలని ఎస్ఎల్ఎస్సీ సిఫారసు చేసింది. పనితీరుపై ఆర్పీ రాతపూర్వకంగా హామీ ఇస్తే పలు షరతులతో జయ ప్రకాశ్ అసోసియేట్స్ ఆధ్వర్యంలోనే మిగిలిన పనులు జరిపించాలని మరో ప్రత్యామ్నాయాన్ని ఎస్ఎల్ఎస్సీ సూచించింది. సొరంగాల నిర్మాణం పనులను ముందుకు తీసుకెళ్లే అంశంపై నల్లగొండ సీఈ చేసిన పలు ప్రతిపాదనలపై గత నెల 12న నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) అధ్యక్షతన సమావేశమైన స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ విస్తృతంగా చర్చించి ఈ మేరకు రెండు ప్రత్యామ్నాయాలను సర్కారుకు సూచించింది. ఒక వేళ ఒప్పందాన్ని రద్దు చేస్తే కొత్త నిర్మాణ సంస్థతో పనులు చేయిస్తే తీవ్ర జాప్యంతోపాటు పెరిగిన మార్కెట్ ధరలకు అనుగుణంగా ఆర్థిక భారం సైతం పడనుందని తేల్చి చెప్పింది. అర్ధంతరంగా నిలిచిపోయిన సొరంగం నిర్మాణ పనులను చేపట్టే విషయంలో సాంకేతిక సమస్యలూ ఎదురవుతాయని స్పష్టం చేసింది. ఎస్ఎల్ఎస్సీ సిఫారసులను త్వరలో జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం చర్చించి కీలక నిర్ణయం తీసుకోనుంది. మళ్లీ అంచనాలను పెంచొద్దు ఒకవేళ జేపీ అసోసియేట్స్తోనే ఒకటో సొరంగం పనులు కొనసాగిస్తే రెండోసారి సవరించి అంచనాల మేరకు మిగుల పనుల వ్యయం రూ.1157.42 కోట్లకు మించకుండా సీలింగ్ విధించాలని స్టాండింగ్ కమిటీ సిఫారసు చేసింది. నవీకరించిన పనుల షెడ్యూల్ ప్రకారం పనులను గడువును 2028 జూన్ 30కి పెంచేందుకు ఓకే చెప్పింది. సీఈ, రిజాల్యూషన్ ప్రొఫెషనల్ పేరుతో సంయుక్తంగా నిర్వహించే ఎస్క్రో అకౌంట్కే బిల్లులు చెల్లించాలని సూచించింది. అత్యాధునిక టెక్నాలజీతో పనులు చేస్తాం..: జేపీ అసోసియేట్స్ ⇒ ప్రాజెక్టులో భాగంగా రెండు సొరంగాలను తవ్వాల్సి ఉండగా, 7.13 కి.మీ.ల రెండో సొరంగం తవ్వకాలు పూర్తి కాగా, 2.8 కి.మీల మేర లైనింగ్ పనులు జరగాల్సి ఉంది. ⇒ 43.93 కి.మీ.ల తొలి సొరంగం పనులకుగాను రెండు వైపుల నుంచి మొత్తం 34.38 కి.మీల మేర పనులు పూర్తయ్యాయి. మధ్యలో 9.541 కి.మీ.ల సొరంగం తవ్వకాలు జరగాల్సి ఉంది. ⇒ గత ఫిబ్రవరిలో సొరంగం కుప్పకూలి కారి్మకులు మృతిచెందడంతో పనులు నిలిచిపోయాయి. ⇒ రెండోసారి సవరించిన అంచనాల ప్రకారం ఒకటో సొరంగానికి సంబంధించి రూ.1157.42 కోట్లు, రెండో సొరంగానికి సంబంధించి రూ.57.08 కోట్లు విలువైన పనులు జరగాల్సి ఉంది. ⇒ ఇప్పటి వరకు టన్నెల్ బోరింగ్ మెషిన్ల(టీబీఎం)తో సొరంగాల తవ్వకాలు జరగగా, ఇటీవల జరిగిన ప్రమాద నేపథ్యంలో ఇతర అత్యాధునిక పద్ధతుల్లో ఇదే వ్యయంతో పనులు చేసేందుకు జేసీ అసోసియేట్స్ పలు షరతులతో సంసిద్ధత వ్యక్తం చేసింది. ⇒ 2028 ఆగస్టు 30 వరకు గడువు పొడిగించడంతో పాటు బిల్లుల చెల్లింపు షెడ్యూల్లో మార్పులు చేయాలని, బిల్లులను సమరి్పంచిన 24 గంటల్లోనే గ్రీన్ చానల్ ద్వారా చెల్లింపులు జరపాలని, రూ.35.14 కోట్ల పెండింగ్ బిల్లులు, రూ.104 కోట్ల విద్యుత్ చార్జీలు చెల్లించాలనే షరతులను విధించింది. -
నేడే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్లు
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తొలివిడత జరిగే మండల, జిల్లా ప్రజా పరిషత్ ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఇచ్చిన జీవో, రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ జారీపై అప్పటికప్పుడు స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడంతో, ముందుగా నిర్ణయించిన ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ఆటంకం లేకుండా పోయింది. దీంతో గురువారం.. తొలిదశలో ఎన్నికలు జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు జిల్లాల వారీగా అధికారులు ఎక్కడికక్కడ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. మొత్తం 31 జిల్లాల్లో (హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లాలు మినహాయించి) ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఖాళీల వివరాలతో అధికారులు ఇప్పటికే గెజిట్ విడుదల చేశారు. ఒక్కో దశకు ఆయా తేదీలకు అనుగుణంగా ఎక్కడికక్కడ రిటరి్నంగ్ అధికారులు ఆయా స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. ఈ ఎన్నికల నోటీసులు జారీ చేసిన రోజు కలిపితే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు మూడురోజుల పాటు అవకాశం ఉంటుంది. ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి: మొదటి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్ల ప్రక్రియ గురించి జిల్లా కలెకర్లు, ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ.రాణీకుముదిని బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తీరు, గురువారం ఉదయం నుంచి నోటిఫికేషన్ల జారీ, ఇతర అంశాలకు సంబంధించి తీసుకుంటున్న చర్యలు, చేసిన సన్నాహాల గురించి ఆరా తీశారు. అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని సూచించారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని, ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్ఈసీ ఆదేశాల మేరకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ, నోటిఫికేషన్ల జారీకి సిద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్లు తెలిపారు. ఇప్పటికే ఎన్నికల అధికారులకు శిక్షణ, పునఃశ్చరణ శిక్షణ కూడా పూర్తిచేశామన్నారు. 5 దశల్లో స్థానిక సమరం మొత్తం అయిదు దశల్లో జరిగే మండల, జిల్లా పరిషత్, గ్రామపంచాయతీ ఎన్నికలకు గాను..తొలి రెండు దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు (మొదటి విడత అక్టోబర్ 23న, రెండో విడత అక్టోబర్ 30న) జరగనున్నాయి. ఆ తర్వాత మూడు విడతల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు..సర్పంచ్, వార్డు సభ్యులకు (మొదటి దశ అక్టోబర్ 31న, రెండోదశ నవంబర్ 4న, మూడోదశ నవంబర్ 8న ) ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గత నెల 29న విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 9న మొదటి దశ మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీతో మొదలయ్యే స్థానిక ఎన్నికల ప్రక్రియ నవంబర్ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాల వెల్లడితో ముగియనుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల ఓట్ల కౌంటింగ్ నవంబర్ 11న (రెండు దఫాలకు కలిపి) జరగనుండగా.. సర్పంచ్, వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపు ఎప్పటికప్పుడు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు. హైకోర్టు స్టే ఉత్తర్వులకారణంగా ములుగు జిల్లా మంగపేట మండలంలోని 14 ఎంపీటీసీ స్థానాలకు, 25 గ్రామపంచాయతీలు, 230 వార్డులకు ఎన్నికలు జరగడం లేదు. అలాగే కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని కుర్మపల్లి, రామచంద్రాపూర్ పంచాయతీలరే, వీటిలోని 16 వార్డులకు కూడా ఎన్నికలు నిర్వహించడం లేదు. నోటిఫికేషన్లకు ఏర్పాట్లు పూర్తి 31 జిల్లాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ మొదటి దశ ఎన్నికలకు నోటిఫికేషన్ల జారీకి జిల్లా ఎన్నికల అధికారులు (కలెక్టర్లు) ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి దశలో మొత్తం 53 రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 292 మండలాల పరిధిలో ఉన్న 292 జెడ్పీటీసీ, 2,963 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీటీసీలకు మండల కార్యాలయాల్లో, జెడ్పీటీసీల కోసం జిల్లా పరిషత్కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరించనున్నారు. నాలుగైదు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు కలిపి ఒక రిటర్నింగ్ అధికారిని నియమించారు. మొదటి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ల జారీ, నామినేషన్లు స్వీకరణ, ఎన్నికల కోడ్ అమలు, భద్రతా ఏర్పాట్లపై బుధవారం జిల్లా కలెక్టర్లు.. జిల్లా అధికారులు, రిటర్నింగ్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. -
‘42 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు పోతాం’
హైదరాబాద్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్తోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళతామని మంత్రి పొన్నం ప్రబాకర్ ధీమా వ్యక్తం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ హైకోర్టులో విచారణ జరుగుతున్న తరుణంలో మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు పై ప్రభుత్వం తరపున మా వాదనలు బలంగా వినిపించాం. దేశంలో తొలి రాష్ట్రంగా 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికలకు వెళ్తున్నాం. సభలో మీరు మాట్లాడినప్పుడు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ,తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టంగా మద్దతు ఇచ్చారు. బలహీన వర్గాల సామాజిక న్యాయం అమలు దృశ్య రాజకీయాలకు పోకుండా ఐక్యంగా ఉండాలి. చర్చల్లో సభ ఏకగ్రీవ తీర్మానం పై జరిగింది. కోర్టులో అఫిడవిట్లు ఉండవు ఇంప్లీడ్ కావాలని కోరాం..ఎంపైరికల్ డేటా కు అనుగుణంగా డెడికేటెడ్ కమిషన్ వేసి సబ్ కమిటీ వేసుకొని 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ చట్టం చేసుకున్నాం. రాజకీయాలు పక్కన పెట్టీ సభలో ఏకగ్రీవంగా మద్దతు తెలిపినట్టు కోర్టులో బీజేపీ, బీఆర్ఎస్, ఏంఐఎం పార్టీలు ఇంప్లీడ్ కావాలి’అని పొన్నం కోరారు. ఇదీ చదవండి:బీసీ రిజర్వేషన్లు: ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్నల వర్షం -
గట్టు వామన్ రావు దంపతుల కేసులో సీబీఐ దూకుడు
సాక్షి,హైదరాబాద్: అడ్వకేట్స్ నాగమణి, వామన్ రావు జంట హత్యల కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఇవాళ వామన్ రావు అనుచరులు బొల్లంపల్లి సంతోష్, ఇనుముల సతీష్ను సీబీఐ అధికారులు విచారించారు. ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం 3 గంటల వరకు ప్రశ్నల వర్షం కురిపించిన అధికారులు.. వామన్ రావుతో సాన్నిహిత్యం, ఆయనతో కలిసి చేసిన ప్రయాణంలో పలు రకాల అంశాలపై ఆరా తీశారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ రెండో ఫ్లోర్లో విచారణ చేపట్టిన అధికారులు.. విచారణ కోసం ముందస్తు నోటీసులు అందించారు. గత 20 రోజుల నుంచి కొనసాగుతున్న సీబీఐ విచారణ కొనసాగుతుంది. ఇక తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో సీబీఐ అధికారులు మొత్తం 130మందిని విచారిస్తున్నట్లు సమాచారం. గతంలో తెలంగాణలో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, నాగమణి హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ కేసును తిరిగి దర్యాప్తు చేయాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. వామనరావు తండ్రి గట్టు కిషన్రావుకు భద్రత కల్పించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.తన కుమారుడు, కోడలి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని కిషన్రావు 2021 సెప్టెంబర్లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ ఎన్.కె. సింగ్లా ధర్మాసనం సీబీఐ విచారణకు ఆదేశించింది. కిషన్రావు తరఫున సీనియర్ న్యాయవాదులు మేనక గురుస్వామి, చంద్రకాంత్లు వాదనలు వినిపించారు. నడిరోడ్డుపై హత్య: పెద్దపల్లి జిల్లా మంథని సమీపంలోని కల్వచర్ల వద్ద కారులో వెళ్తున్న వామనరావు, నాగమణి దంపతులను 2021 ఫిబ్రవరి 17న దుండగులు అడ్డగించి నడిరోడ్డుపైనే కత్తులతో నరికి చంపారు. మొదట ఈ కేసును స్థానిక పోలీసులు దర్యాప్తు చేశారు. దానిని సీబీఐకి అప్పగించాలని కిషన్రావు అదే ఏడాది సెప్టెంబర్లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. విచారణలో భాగంగా హత్యకు సంబంధించిన వీడియోలు, పత్రాలు సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని గతంలో కోర్టు ఆదేశించింది.చనిపోయే ముందు వామనరావు ఇచ్చిన మరణ వాంగ్మూలం వీడియోపై అనుమానాలు వ్యక్తం కావడంతో ఎఫ్ఎస్ఎల్కి పంపించగా, అది అసలుదేనని ల్యాబ్ నివేదిక తేల్చింది. ఈ నివేదికతోపాటు అన్ని రికార్డులు పరిశీలించిన సుప్రీంకోర్టు.. కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగిస్తూ తీర్పు చెప్పింది. సీబీఐ దర్యాప్తుపై ఎలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు తెలియచేసింది. ఈ క్రమంలో వామన్రావు దంపతుల కేసు దర్యాప్తు చేపట్టాలని సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. దీంతో సీబీఐ అధికారులు వామన్ రావు కేసును విచారిస్తున్నారు. -
తెలంగాణ టి-ఫైబర్కు జాతీయ గుర్తింపు..
తెలంగాణ టి-ఫైబర్కు (Telangana T-Fiber ) జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2025లో టి-ఫైబర్ పైలట్ విలేజెస్ డిజిటల్ ఇన్క్లూజన్ విజయానికి ప్రశంసలు పొందాయి. కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ చొరవను "ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్" గా అభివర్ణించారు. గ్రామీణ బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీకి వినూత్న విధానాన్ని అవలంభిస్తున్నందుకు తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబును అభినందించారు.ఈ సందర్బంగా కేంద్ర సమాచార శాఖ మంత్రి అధ్యక్షతన జరిగిన ఐటీ మంత్రుల రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. భారత్ నెట్ అమలును వేగవంతం చేయడానికి, రైట్ ఆఫ్ వే (ఆర్ఓడబ్ల్యూ) సవాళ్లను పరిష్కరించడానికి, జాతీయ, రాష్ట్ర డిజిటల్ ఆస్తులను రక్షించడానికి సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్ వర్క్ లను బలోపేతం చేయడానికి కేంద్రంతో భాగస్వామ్యం కుదుర్చుకోవడానికి తెలంగాణ నిబద్ధతను పునరుద్ఘాటించారు.ప్రతి ఇల్లు, సంస్థ, వ్యాపారాలకు హై-స్పీడ్ కనెక్టివిటీని అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రధాన బ్రాడ్ బ్యాండ్ చొరవ అయిన టి-ఫైబర్ కింద సాధించిన పురోగతిని ఆయన వివరింంచారు. మంత్రితో పాటు టి-ఫైబర్ మేనేజింగ్ డైరెక్టర్ వేణు ప్రసాద్ పన్నీరు కూడా ఉన్నారు. పైలట్ గ్రామాల నుంచి రాష్ట్ర విజయగాథలు, డేటా-ఆధారిత ఫలితాలను ఆయన వివరించారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025 (India Mobile Congress- IMC) అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 11 వరకు నాలుగు రోజులపాటు జరగనుంది. డిజిటల్ టెక్నాలజీ, టెలికాం ఆవిష్కరణలకు భారతదేశ ప్రధాన వేదికగా విధాన రూపకర్తలు, పరిశ్రమ నాయకులు, ప్రపంచ నిపుణులను ఒకచోట చేర్చింది. -
ట్రైబల్ వర్సిటీ లోగోలో ప్రధాన ఆకర్షణలు ఇవే..
తెలంగాణలో సమ్మక్క– సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ లోగో విడుదలైంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ లోగోను విడుదల చేశారు. ఇందులో పలు విశేషాలు ఉన్నాయి.లోగోలో ప్రధాన ఆకర్షణలు.. ⇒ సమ్మక్క–సారలమ్మ ట్రైబల్ యూనివర్సిటీ లోగో మధ్య సమ్మక్క–సారలక్క గద్దెలు ⇒ సమ్మక్క దేవత కుంకుమకు చిహ్నంగా మధ్యలో ఎర్రటి సూర్యుడు ⇒ ప్రశాంతమైన ఆధ్యాత్మిక కోణాన్ని జోడించే పీఠాలపై ఆసీనులైన ఇద్దరు వన దేవతలు ⇒ గిరిజన ఆహార్యం, సౌందర్యానికి సూచికగా నెమలి ఈకలు ⇒ సాంస్కృతిక గౌరవం, ధైర్యం సంప్రదాయాన్ని సూచించే రెండు జంతువుల కొమ్ములతో కూడిన కిరీటం త్వరలో కొత్త క్యాంపస్కు శంకుస్థాపనసాక్షి, న్యూఢిల్లీ: త్వరలో తెలంగాణ సమ్మక్క– సారలమ్మ యూనివర్సిటీని సందర్శిస్తానని, కొత్త క్యాంపస్కు శంకుస్థాపన చేస్తానని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) చెప్పారు. ఆయన మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డితో కలిసి సమక్క– సారలమ్మ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ లోగోను ఆవిష్కరించారు.కార్యక్రమంలో వర్సిటీ వీసీ ప్రొఫెసర్ వైఎల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ విలేకరులతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలో.. సమ్మక్క– సారలమ్మ కేంద్ర విశ్వ విద్యాలయాన్ని సాధించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు.చదవండి: చొక్కా విప్పి.. చితిపై కప్పి -
రేపు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ హైకోర్టులో విచారణలు కొనసాగుతున్న సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందా? కాదా? అన్న ఉత్కంఠతకు తెరపడింది. గురువారం (అక్టోబర్9) రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని రేపు ఉదయం 10.30గంటలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. రెండు దశల్లో జెడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలు అక్టోబర్ 9 నుంచి తొలివిడుత నామినేషన్లుఅక్టోబర్ 13 నుంచి రెండో విడుత నామినేషన్లు అక్టోబర్ 23న మొదటిదశ ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 29న రెండో దశ ఎన్నికల పోలింగ్ -
‘నీ చొక్కా చాలా బాగుంది.. నాకు ఇవ్వన్నా..’
మిర్యాలగూడ అర్బన్: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నేత, 14వ వార్డు మాజీ కౌన్సిలర్ గంధం రామకృష్ణ సోమవారం గుండెపోటుతో మృతి చెందగా మంగళవారం అంత్యక్రియలు ముగిశాయి. అంత్యక్రియలకు హాజరైన మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (Bathula Laxma Reddy).. తాను ధరించిన చొక్కాను రామకృష్ణ చితిపై ఉంచారు.రామకృష్ణ బతికున్నప్పుడు.. తాను ధరించిన చొక్కాను చూసి ‘అన్నా.. నీ చొక్కా చాలా బాగుంది. నాకు ఇవ్వన్నా..’అని అంటుండేవాడని, తాను తప్పకుండా ఇస్తా.. అని చెప్పి.. ఇవ్వడం మరచిపోయేవాడినని ఎమ్మెల్యే కన్నీటిపర్యంతమయ్యారు. అనంతరం తన చొక్కాను తీసి చితిపై ఉంచి.. రామకృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించారు.చదవండి: తెలంగాణలో రెండు దగ్గు మందులపై నిషేధంనల్లగొండ పట్టణంలో దారుణంనల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. ఇంటర్ చదివే ఓ విద్యార్థినిపై ప్రేమ పేరుతో ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడి హత్య చేశాడు. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ మండలంలోని అన్నారెడ్డిగూడెం గ్రామానికి (Annareddygudem Village) చెందిన బాలిక(17) నల్లగొండలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అదే మండలం గుట్టకింద అన్నారం గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ గడ్డం కృష్ణతో ఆ విద్యార్థినికి ఆరు నెలలుగా పరిచయం ఉంది.'మంగళవారం ఉదయం కళాశాలకు బయల్దేరిన ఆ విద్యార్థినికి.. ప్రేమ పేరుతో కృష్ణ మాయమాటలు చెప్పి నల్లగొండలోని తన స్నేహితుడి రూమ్కు తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేశాడు. అనంతరం అతనే పోలీస్స్టేషన్కు వెళ్లి లొంగిపోయినట్టు తెలిసింది. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు నల్లగొండ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కృష్ణకు అతడి స్నేహితుడు సహకరించాడని బాలిక తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు నిందితుడిపై అత్యాచారం, హత్య కేసులతోపాటు పోక్సో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు ఎస్ఐ సైదులు తెలిపారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ పరిశీలించారు. -
తెలంగాణలో రెండు దగ్గు మందులపై నిషేధం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండు దగ్గు మందులపై నిషేధం విధిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిలీఫ్, రెస్పిఫ్రెష్ టీఆర్ కాఫ్ సిరప్లను బ్యాన్ చేసింది. ఈ రెండు దగ్గు మందుల్లోనూ కల్తీ జరిగినట్లు వైద్య అధికారులు గుర్తించారు. దగ్గు మందు వాడకంపై ఇప్పటికే ప్రజారోగ్య విభాగం ప్రజలకు పలు సూచనలు జారీ చేసింది.కాగా, రెండేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న చిన్నారులకు దగ్గు, జలుబు మందులను సూచించవద్దని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం ఒక అడ్వైజరీ జారీ చేసిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో దగ్గు సిరప్ తాగి 11 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) స్పందించింది. చిన్నారులకు దగ్గు సిరప్ సిఫారసు చేసే విషయంలో వైద్యులు జాగ్రత్తగా ఉండాలని కోరింది.సాధారణంగా ఐదేళ్లలోపు పిల్లలకు దగ్గు సిరప్లను సిఫారసు చేయవద్దని కోరింది. ఆపై వయస్సుండే చిన్నారులకు కూడా సరైన మోతాదు, నిర్ణీత కాలావధి, వైద్యుల సరైన పర్యవేక్షణ వంటి అంశాల ఆధారంగానే ప్రిస్క్రైబ్ చేయాలంది. అదేవిధంగా, వైద్యుల సలహాలను తీసుకోకుండా యథేచ్ఛగా దగ్గు సిరప్ను వాడరాదని తల్లిదండ్రులను కోరింది. -
రాహుల్.. నిరుద్యోగుల కాళ్లు పట్టుకుని వారినే మోసం చేశారు: కవిత
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాటలు నమ్మి నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని అన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. నిరుద్యోగుల కాళ్లు పట్టుకొని ఓట్లు అడిగి, వారినే మోసం చేశారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణ తెచ్చుకుందే నియామకాల కోసం.. నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు వాళ్లు తగిన బుద్ధి చెబుతారని కామెంట్స్ చేశారు.గ్రూప్ 1 పరీక్షల్లో అక్రమాలు, నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరుతూ తెలంగాణ జాగృతి ఆందోళన చేపట్టింది. గన్ పార్క్ వద్ద నిరుద్యోగులకు మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ధర్నాకు దిగారు. ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలు, గ్రూప్-1 అభ్యర్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. గ్రూప్-1 అభ్యర్థులకు ధైర్యం ఇవ్వాలని మేము గన్ పార్క్ ధర్నా కార్యక్రమం నిర్వహించాం. గ్రూప్-1 పరీక్ష రద్దు చేయాలని తెలంగాణ జాగృతి TGPSC ముట్టడి చేసినా ప్రభుత్వంలో చలనం లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకుల కుటుంబాలకు బోనస్ ఉద్యోగాలు ఇచ్చుకోండి కానీ.. బోగస్ ఉద్యోగాలు ఇవ్వొద్దు.రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి నిరుద్యోగుల కాళ్లు పట్టుకొని ఓట్లు అడిగి, వారినే మోసం చేశారు. జాబ్ క్యాలెండర్ ఇంతవరకు రిలీజ్ చేయలేదు. పాత ఉద్యోగాలు ఇచ్చి, ఉద్యోగాలు ఇచ్చాము అని గొప్పలు చెప్పుకుంటుంది ఈ ప్రభుత్వం. గ్రూప్-1 పరీక్షను తప్పుడుగా నిర్వహించారు. పరీక్ష రద్దు అయ్యే వరకు ప్రభుత్వం మెడలు వంచుతాము. తెలంగాణలో ఉన్న మేధావులు మౌనం వీడాలి. గ్రూప్-1 పరీక్షపై హరగోపాల్ సార్ మాట్లాడాలి. అవసరం అయితే నేను హరగోపాల్ సార్ను కలుస్తాను. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాటలు నమ్మి తెలంగాణ నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. నిరుద్యోగులను మోసం చేస్తున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరుద్యోగులే కూలగొడుతారు.త్వరలోనే రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తాం. తక్షణమే గ్రూప్ నియామకాలు రద్దు చేసి మళ్లీ గ్రూప్-1 పరీక్ష పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ తెచ్చుకుందే నియామకాల కోసం. సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించాలి, ప్రెసిడెంటల్ ఆర్డర్ ద్వారా 8 మంది ఆంధ్ర వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు. ప్రెసిడెంటల్ ఆర్డర్ పైన మేము ఉద్యమం చేస్తాం’ అని హెచ్చరించారు. -
సోషల్ వార్.. పొలిటికల్ పోరు
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్రంలో కొంత కాలంగా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న రాజకీయ యుద్ధం ఇప్పుడు మరింత తీవ్రం కానుంది. ఇప్పటికే కొన్ని యూట్యూబ్ చానెళ్లను పెయిడ్ చానెళ్లుగా మార్చిన పార్టీలు.. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో వైరి పార్టీలపై విమర్శలు, ప్రతివిమర్శల్ని మరింత ముమ్మరం చేయనున్నాయి.ఓవైపు తమ పార్టీలో జరుగుతున్న కార్యక్రమాల్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలిసేలా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్న రాజకీయ పార్టీలు.. ప్రత్యర్థి పార్టీ లోపాల్ని అంతకంటే వేగంగా ఎండగడుతున్నాయి. వాయువేగంతో అవి వాట్సప్ గ్రూపు ల్లోనూ షేర్ అవుతుండటంతో ఏ కామెంట్ ఎప్పుడు వైరల్గా మారుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ తమ పార్టీ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ భార్య సునీతను ప్రకటించింది. కాంగ్రెస్లో అభ్యర్థి ఎవరో ఇంకా తెలియదు. నామినేషన్ల దాఖలుకు కూడా ఇంకా సమయముంది. ఇంతెందుకు ఎన్నికల షెడ్యూలు వెలువడకముందే.. ఇప్పటికే కొంతకాలంగా బీఆర్ఎస్, కాంగెస్ర్ ఒకదానిపై మరొకటి సోషల్మీడియా వేదికగా తీవ్ర యుద్ధమే చేస్తున్నాయి. తమ పార్టీల పేరిట, పార్టీ సైన్యాల పేరిట ప్రత్యర్థులపై ఇవి విసురుతున్న విమర్శనా్రస్తాలు ప్రజల అరచేతిలోని మొబైల్కు తీరిక లేకుండా చేస్తున్నాయి.ఎవరి సత్తా వారిదే.. అధికార పార్టీ కాంగ్రెస్ తాము చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు తదితరాల అప్డేట్స్ను చేరవేయడంతో పాటు బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేసిన విధ్వంసాలు, నిర్వాకాలు అంటూ రూపొందించిన దృశ్యాల్ని ప్రజల్లోకి వెళ్లేలా చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఎప్పటినుంచో బలంగా ఉన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ను తూర్పారబడుతోంది. ‘అప్పుడెట్లుండె పాలన.. ఎప్పుడేమైంది? అంటూ ప్రజల్లో కాంగ్రెస్పై ప్రజల్లో వ్యతిరేకతను పెంచుతోంది. అంతేకాదు.. ప్రజాభిప్రాయాల పేరిట అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ రెండూ వేటికవిగా తమ అనుకూల చానెళ్ల ద్వారా తమ పారీ్టకే ప్రజలు మద్దతు ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నాయి. సొంతంగా వాట్సప్ చానెళ్లనూ నిర్వహిస్తున్నాయి. ఇన్ఫ్లూయెన్సర్లు, పెయిడ్ క్యాంపెయిన్లు, కంటెంట్ క్రియేషన్, రాజకీయ వ్యూహాల్లో ప్రధాన భాగమయ్యాయి. రీల్స్తో రిప్లయ్లు.. వీడియోలతో ప్రచారం, రీల్స్తో రిప్లయ్లు, ట్రెండ్గా మారాయి. ఇక ఆ పార్టీల సోషల్మీడియా టీమ్స్, వారియర్స్ నిరి్వరామంగా పని చేస్తున్నాయి. ఇదంతా రూ.కోట్ల మేర ప్రచారమని సంబంధిత రంగం గురించి తెలిసిన వారు చెబుతున్నారు. ఈనేపథ్యంలో సగటు ఓటర్లు సైతం సోషల్మీడియాకు ప్రభావితమవుతున్నారు. ఏ పార్టీ ప్రచారం విస్తృతంగా ఉంటే దాని వలలో పడే పరిస్థితి ఏర్పడింది. పారీ్టలకు సైతం గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్ కంటే సోషల్ మీడియా కామెంట్ సెక్షన్, ఫీడ్బ్యాక్, లైక్స్, కీలకంగా మారాయి. ఈ పరిణామాలతో జూబ్లీహిల్స్ రాజకీయాలు హ్యాష్ ట్యాగ్స్తో జరుగుతున్నాయి. ఓటర్లు స్క్రోల్స్, థంబ్నెయిల్స్తో నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏర్పడింది. -
ముగిసిన వివాదం.. అడ్లూరికి క్షమాపణలు చెప్పిన పొన్నం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో (Telangana Politics) ఇద్దరు మంత్రులు పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), అడ్లూరి లక్ష్మణ్ (Adluri Laxman) మధ్య మాటల వివాదం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్.. మంత్రి అడ్లూరికి వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పారు. ఐక్యంగా పోరాటం చేస్తాం, కలిసి ముందుకు సాగుతామని తెలిపారు. తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చొరవతో మంత్రులు మధ్య వివాదం ముగిసింది. తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్.. మంత్రి లక్ష్మణ్ కుమార్కు క్షమాపణ చెప్పారు. లక్ష్మణ్ బాధ పడిన దానికి నేను క్షమాపణలు కోరుతున్నా అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ. హస్తం పార్టీలో పుట్టి పెరిగిన వ్యక్తిగా నేను.. మంత్రి అడ్లూరి, పార్టీ సంక్షేమం తప్ప ఎటువంటి దురుద్దేశం లేదు. నేను ఆ మాట అనకపోయినా పత్రికల్లో వచ్చిన దాని ప్రకారం ఆయన బాధ పడిన దానికి నేను క్షమాపణలు కోరుతున్నాను. నాకు అలాంటి ఆలోచన లేదు.. నేను ఆ ఒరవడిలో పెరగలేదు. కాంగ్రెస్ పార్టీ నాకు ఆ సంస్కృతి నేర్పలేదు.సామాజిక న్యాయానికి పోరాడే సందర్భంలో వ్యక్తిగత అంశాలు పక్కన ఉంచి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయంలో బలహీనవర్గాల బిడ్డగా ఈరోజు రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి సూచన మేరకు 42 శాతం రిజర్వేషన్లకు పోరాటం జరుగుతుంది. మేమంతా ఐక్యంగా భవిష్యత్లో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం కోసం పని చేస్తాం’ అని తెలిపారు. సమస్య ముగిసింది: అడ్లూరిమంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ..‘అట్టడుగు సామాజిక వర్గాలకు కాంగ్రెస్ అండగా ఉంటుంది. జెండా మోసిన నాకు మంత్రిగా అవకాశం ఇచ్చారు. పార్టీ లైన్ దాటే వ్యక్తిని నేను కాదు. పొన్నం ప్రభాకర్ను గౌరవిస్తా.. కానీ, పొన్నం వ్యాఖ్యల పట్ల నా మాదిగ జాతి బాధపడింది. పొన్నం క్షమాపణ కోరడంతో ఈ సమస్య ఇంతటితో సమసిపోయింది అని చెప్పుకొచ్చారు. టీపీసీసీ కీలక వ్యాఖ్యలు.. అనంతరం, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ..‘పొన్నం ప్రభాకర్ చేశారన్న వ్యాఖ్యల పట్ల లక్ష్మణ్ నోచ్చుకోవడం, యావత్ సమాజం కొంత బాధపడింది. మంత్రుల మధ్య జరిగిన ఘటన కుటుంబ సమస్య. జరిగిన ఘటన పట్ల చింతిస్తూ మంత్రి ప్రభాకర్ క్షమాపణలు చెప్పారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కష్టపడి పైకొచ్చిన నేతలు. ఈ సమస్య ఇంతటితో సమసిపోవాలని యావత్ మాదిగ సామాజిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాను. సహచర మంత్రి వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నా.. ఎక్కడ మాట్లాడిన బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల పార్టీ’ అని తెలిపారు. -
బీసీ రిజర్వేషన్లు.. తెలంగాణ సర్కార్కు హైకోర్టు ప్రశ్నల వర్షం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు(Telangana BC Reservations) రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. గురువారం మధ్యాహ్నం 2.15వరకు వాయిదా వేస్తూ తీర్పును వెలువరించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై అన్ని పిటిషన్లను కలిపి హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ ప్రభుత్వం తరుఫున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ:తెలంగాణ హైకోర్టులో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన వాడివేడిగా కొనసాగాయి తెలంగాణ ప్రభుత్వం తరుఫును అభిషేక్ సింఘ్వి వాదనలురిజర్వేషన్ల పెంపు బిల్లు అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం పొందిందిఇప్పటి వరకూ రిజర్వేషన్ బిల్లును ఎవరూ ఛాలెంజ్ చేయలేదురిజర్వేషన్లు 50శాతం మించకూడదని కచ్చితమైన వివరణ రాజ్యాంగంలో ఎక్కడా లేదుకచ్చితమైన ప్రాదమిక,సామాజిక లబ్ధి అంశాలుంటే రిజర్వేషన్లు 50శాతానికి మించి ఉండొచ్చురిజర్వేషన్లు 50శాతానికి మించి ఉండకూడదనుకుంటే సరైన డేటా లేకుండా రిజర్వేషన్లు పెంచారనే వాదనకు అర్ధం లేదు’ అంటూ వాదనతెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ప్రశ్నల వర్షం సింఘ్వి వాదానాల అనంతరం తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్నల వర్షంబీసీ రిజ్వర్వేషన్ల ప్రక్రియ ఎలా నిర్విహించారు?ట్రిపుల్ టెస్టు విధానాన్ని అనుసరించారా?ప్రజల అభ్యంతరాలను తీసుకున్నారు?గవర్నర్ దగ్గర బిల్లు ఎప్పటి నుంచి పెండింగ్లో ఉందికమిషన్ రిపోర్టు పబ్లిష్ చేశారా? షెడ్యూల్ నోటిఫై అయ్యిందా? అని ఏజిని ప్రశ్నించిన హైకోర్టుఅందుకు ఇంకా వాదనలు ఉన్నాయి.. విచారణ రేపటికి వాయిదా వేయాలన్న ఏజీ ఇంక వాదనలు అవసరం లేదు.. విచారణ ముగిస్తున్నాం’అంటూ వ్యాఖ్యానించిన హైకోర్టుహైకోర్టు ప్రశ్నలు:అసెంబ్లీలో రిజర్వేషన్ల బిల్లు పాస్ ఎప్పుడైంది?.ఆమోదం కోసం గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉందా?.బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం అవసరం ఉందా?.గవర్నర్ పేరు మీద జీవో జారీ చేశారా?. రిజర్వేషన్ల బిల్లు చట్టంగా మారిందా?.పిటిషనర్ తరఫున వివేక్ రెడ్డి వాదనలు వినిపిస్తూ...నోటిఫికేషన్ విడుదలైనా.. రిజర్వేషన్లు 50 శాతం మించితే ఎన్నికలు రద్దవుతాయనే నిబంధన ఉందని పిటిషనర్ తెలిపారు. 42 శాతం బిల్లు పాస్ అయింది కానీ.. గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉందని పిటిషనర్ తరఫు లాయర్లు చెప్పారు. ట్రిపుల్ టెస్టు పాస్ కాకుండానే రిజర్వేషన్లను పెంచారు. కేవలం వన్ మ్యాన్ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లను పెంచారు. సుప్రీంకోర్టు తీర్పును అతిక్రమించారు అని తెలిపారు. రిజర్వేషన్ల బిల్లు పాస్ అయ్యింది కానీ, గవర్నర్ ఆమోదం తెలపలేదన్నారు. బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే. కానీ, రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎంపిరికల్ డేటా కూడా సరిగా లేదు. ఎన్నికలను నిలిపివేయాలని మేము కోరడం లేదు. రిజర్వేషన్ల పెంపుపై శాస్త్రీయ ఆధారాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించలేదు. ట్రిపుల్ టెస్టు మార్గదర్శకాలను బహిర్గతం చేయలేదు. 2021 డిసెంబర్లో ట్రిపుల్ టెస్టు మార్గదర్శకాలు విడదలయ్యాయి. 2018లో 34 శాతం బీసీ రిజర్వేషన్ల పెంపును హైకోర్టు తప్పు పట్టిందన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ట్రిపుల్ టెస్టును పాటించకుండా రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లపై చట్టం చేయలేవు. ట్రిపుల్ మార్గదర్శకాలను ప్రభుత్వాలు పాటించాలని సుప్రీంకోర్టు సూచించింది. మూడు స్థాయిల్లో పరీక్షల తర్వాత రిజర్వేషన్లు పెంచవచ్చిన సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి.అంతకుముందు.. రిజర్వేషన్లపై ప్రస్తుత పరిస్థితి ఏంటని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ సందర్భంగా రిజర్వేషన్లను 42 శాతం పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని లాయర్లు తెలిపారు. అలాగే, రిజర్వేషన్లపై పిటిషన్ను సుప్రీంకోర్టు సైతం తిరస్కరించిందని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో బీసీల 42% రిజర్వేషన్లు కల్పించే వ్యవహారంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనన్న సస్పెన్స్ నెలకొంది. -
రాయదుర్గం ‘రియల్’ సంచలనం.. సొంతింటి కల దూరమేనా?
సాక్షి, సిటీబ్యూరో: ఎకరం రూ.177 కోట్లు.. దుర్గం చెరువు పక్కనే ఉన్న కొండపై ఉన్న భూమి ధర ఇదీ. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని భూముల వేలం దేశ రియల్ ఎస్టేట్ మార్కెట్లో సంచలనం సృష్టించింది. గత ప్రభుత్వం హయాంలో కోకాపేటలోని నియోపొలిస్ వేలంలో ఎకరా రూ.100.75 కోట్లు పలికిన ధరే అందర్నీ షాక్కు గురి చేయగా.. సోమవారం టీజీఐసీసీ నిర్వహించిన రాయదుర్గం భూముల వేలం సరికొత్త రికార్డులను సృష్టించింది. పశ్చిమ హైదరాబాద్లోని బహుళ అంతస్తుల భవనాలే కాదు.. అక్కడి భూముల ధరలూ ఆకాశాన్నంటుతున్నాయని రియల్టీ రంగ నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర రాజధానిలో భూమి బంగారం కంటే ఖరీదైపోయింది. కొండలే కోట్లకు కోట్లు ధర పలుకుతున్నాయి. తాజాగా రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పనాసంస్థ (టీజీఐఐసీ) నాలెడ్జ్ సిటీలోని సర్వే నంబరు 83/1 ప్లాట్ నంబరు–19లో 11 ఎకరాలు, ఇదే సర్వే నంబరులో ప్లాట్ నంబరు–15ఏ/2లో 7.67 ఎకరాలు మొత్తం 18.67 ఎకరాలను వేలం వేసిన సంగతి తెలిసిందే. దీని ద్వారా ప్రభుత్వానికి రూ.3,135 కోట్ల ఆదాయం సమకూరింది. స్థానిక బిల్డర్లతో పాటు జాతీయ నిర్మాణ సంస్థలు పోటీపడి మరీ ధర రికార్డు స్థాయిని దాటేలా చేశారు. ఈ పరిణామాలు మార్కెట్లో సంచలనంగా మారాయి. హైదరాబాద్ మార్కెట్కు ఇంకా భవిష్యత్తు ఉందని, డిమాండ్ తగ్గలేదని మార్కెట్ పడిపోలేదు అనడానికి ఈ వేలమే నిదర్శనమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.సొంతింటి కల దూరమేనా..? భూముల వేలంలో వేలంవెర్రిగా ధర పలకడం స్థానిక రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం చూపుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ ధరల ప్రభావం చుట్టుపక్కల భూములు, అపార్ట్మెంట్లపై ఉంటుంది. దీంతో హైదరాబాద్కు ఉన్న అఫర్డబులిటీ దూరం అయ్యే ప్రమాదం ఉంటుంది. హైదరాబాద్ అనగానే సరసమైన ఇళ్లకు కేంద్రమని స్థిరాస్తి సంఘాలు ఎంతోకాలంగా చెబు తూ వస్తున్నాయి. వేలంలో రికార్డ్ ధరలు పలుకుతుండటంతో భూముల రేట్లు పెరుగుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతంలోని అపార్ట్మెంట్ల ధరలు పెరగక తప్పని పరిస్థితి. సామాన్యుడికి ఇంటి కల దూరమవుతోందని ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో.. ఎకరం భూమి రూ.177 కోట్లు పలకడంతో సంపన్నులు కూడా కొనలేని పరిస్థితి ఏర్పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకింత ధర? రాయదుర్గం నాలెడ్జ్ సిటీ లేఅవుట్ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసింది. ఐటీ కారిడార్లో ఉండటంతో గృహ నిర్మాణం, కార్యాలయాలకు అనువుగా ఉంది. భవనం ఎత్తుపై ఆంక్షలు లేకుండా అపరిమిత ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ)కు అవకాశం ఉండటంతో బిల్డర్లు ధరకు వెనకాడలేదు. వీటి దృష్ట్యా వేలంలో కొన్ని సంస్థలు పోటీపడ్డాయి. 470 ఎకరాల్లో విస్తరించి ఉన్న నాలెడ్జ్ సిటీలో వందకు పైగా ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలున్నాయి.బహుళ జాతి సంస్థల కార్యాలయాలు, ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలు, వినోద కేంద్రాలు, బహుళ అంతస్తుల భవనాలు, అంతర్జాతీయ మౌలిక సదుపాయాలతో రాయదుర్గం అభివృద్ధి చెందిన ప్రాంతం కావడంతో ఇక్కడి భూములకు డిమాండ్ అధికంగా ఉంది. ఇక్కడి నుంచి ఔటర్ రింగ్రోడ్డు, మెట్రో, విమానాశ్రయాలతో నగరం నలువైపులా సులువైన కనెక్టివిటీ ఉంది. రాయదుర్గం మెట్రో స్టేషన్కు 5 నిమిషాలు, ఔటర్ జంక్షన్కు 6 నిమిషాలు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్/విప్రో జంక్షన్కు, హెచ్ఐసీసీ/హైటెక్స్కు 15 నిమిషాలు, ఎయిర్పోర్ట్కు 40 నిమిషాలు ప్రయాణ వ్యవధి ఉంటుంది. దీంతో ఇక్కడి భూములకు డిమాండ్ అధికంగా ఉంది. -
సిరిసిల్ల కార్మికక్షేత్రం వెంకన్న రథోత్సవం పోటెత్తిన భక్తజనం (ఫొటోలు)
-
నల్లగొండ: హాలియా ఎస్బీఐలో అగ్నిప్రమాదం.. ఆన్లో ఉన్న కంప్యూటర్ వల్లే!
సాక్షి, నల్లగొండ: హాలియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లో మంగళవారం అర్ధరాత్రి దాటాక అగ్నిప్రమాదం చోటు చేసుకుంది(Haliya SBI Fire Accident). అయితే స్థానికంగా ఒకరు సకాలంలో స్పందించడంతో ప్రాణ నష్టం కూడా తప్పింది. ఘటన గురించి సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఓ అంచనాకి వచ్చారు.హాలియా ఎస్బీఐలో అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దట్టంగా మంటలు.. పొగ రావడాన్ని గమనించిన స్థానిక మిల్క్ డిస్ట్రిబ్యూటర్ ఒకరు ఆ అపార్ట్మెంట్ పైన నివసిస్తున్న వాళ్లను అప్రమత్తం చేశారు. దీంతో ప్రాణనష్టం తప్పింది. ఫైర్ స్టేషన్కు సమాచారం అందించడంతో వాళ్లు వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనలో కంప్యూటర్లు, ఫర్నీచర్, ఇతర సామాగ్రి బూడిద అయ్యాయి. ష్యూరిటీ పత్రాలు, నగదు పరిస్థితి ఏంటన్నది తేలియాల్సి ఉంది. అయితే.. బ్యాంకు సిబ్బంది ఓ కంప్యూటర్ షట్ డౌన్ చేయకుండా వదిలేశారు. ఆ కంప్యూటర్ వద్దే రాత్రి సమయంలో షార్ట్ సర్క్యూట్(Computer Short Circuit) జరిగి మంటలు రాజుకున్నాయి. అలా.. ఒక్కసారిగా మంటలు బ్యాంకు మొత్తం వ్యాపించాయి. అంతకంతకు పెరిగి బ్యాంకును దగ్ధం చేశాయి’’ అని అధికారి ఒకరు తెలిపారు.ఇదీ చదవండి: రేషన్ కార్డులు.. అందరికీ కాదు! -
బీసీ రిజర్వేషన్ల ఉద్యమం బలంగా జరగాలి
సాక్షి, హైదరాబాద్: ‘బీసీ రిజర్వేషన్ల కోసం తెలంగాణ ఉద్యమం కంటే పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలి. పదు నెక్కిన తీర్మానాలు రచించాలి. ఇదేదో ఒక్కరిద్దరి కోసం కాదు. యావత్తు తెలంగాణ బీసీల భవిష్యత్ అని గుర్తించా లి. ప్రతి ఒక్కరు యుద్ధవీరులు కావాలి. ఇప్పటి వరకు ఇతరుల కోసం పోరాటాలు చేశాం. ఇప్పుడు మన కోసం పోరాటాలు చేయక తప్పదు. పల్లె నుంచి పట్నం వరకు ప్రతి ఒక్కరు కదలివస్తేనే మన హక్కులను సాధించుకుంటాం. భూకంపం సృష్టిస్తేనే.. ప్రభుత్వాలు దిగి వస్తాయి. ఇవ్వా ల్సిన బీజేపీ ఇవ్వడం లేదు.పోరాడాల్సిన కాంగ్రెస్ పోరాటం చేయడం లేదు. నిరసనలు చేస్తామన్న బీఆర్ఎస్ పట్టించుకోవడం లేదు. కేవలం బీసీల ఓట్ల కోసం అన్ని రాజకీయ పార్టీలు తమ ఎత్తుగడలు చేస్తున్నాయి. అన్నీ ఉన్న మనం మన రిజర్వేషన్లు ఎందుకు సాధించుకోలేకపోతున్నాం. ఇదే చిట్ట చివరి అవకాశం. ఒక తెలంగాణ కోసం పోరాటం చేస్తేనే ఇన్ని వచ్చాయి. రిజర్వేషన్లు అమలైతే దానికి రెట్టింపు ఫలితాలు పొందుతాం అని బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం కోరింది. మంగళవారం హైదరాబాద్లోని సోమాజీగూడ ప్రెస్క్లబ్లో బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన ‘బీసీలకు 42శాతం రిజర్వేషన్లు– న్యాయ వివాదాలు పరిష్కారం’పై బీసీ సంఘాల సమాలోచన కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీమంత్రి శ్రీనివాస్గౌడ్, జాతీయ ఓబీసీ చైర్మన్ జస్టిస్ వి.ఈశ్వ రయ్యగౌడ్, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ టి.చిరంజీవులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ చైర్మన్ డా.విశారదన్ మహరాజ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగౌని బాల్రాజ్ గౌడ్, రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్తోపాటు అనేక బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ⇒ శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లు సాధించేందుకు నిరాహారదీక్ష చేయడానిౖనా సిద్ధమన్నారు. బీఆర్ఎస్ పరంగా మద్దతు ఇస్తామని చెప్పారు. ⇒ జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ రాష్ట్రపతి ఆమోదం పొందే వరకు పోరాటం చేయాలన్నారు. యుద్ధం ఆపేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్రెడ్డి బీసీ జాతిని సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు. క్రెడిట్ అంతా మాకే రావాలని రెండు బిల్లులు చేసి పంపిన కాంగ్రెస్.. దాని అమలు కోసం చిత్తశుద్ధి ఏది అని ప్రశ్నించారు. హైకోర్టు జడ్జిమెంట్ రాక ముందే ప్లాన్ఆప్ యాక్షన్ చేసుకోవాలని హితవు పలికారు. ⇒ చిరంజీవులు మాట్లాడుతూ రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తామన్న బీఆర్ఎస్ ఏమీ చేయడం లేదని, బీసీల ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. ఒక్కరిద్దరు మాత్రమే రిజర్వేషన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అన్నట్టుగా రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేయాలన్నారు. ⇒ విశారదన్ మాట్లాడుతూ రేవంత్ తన గెలుపు కోసం 420 హామీలు ఇచ్చారని, అందులో బీసీ రిజర్వేషన్లు అనే ఒక ఆయుధంతో బీసీలను ఆటాడిస్తున్నారన్నారు. తనకు ఇష్టం వచ్చినట్టు ఆ ఆయుధాన్ని వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. రిజర్వేషన్లు అమలు చేయాల్సిన బాధ్యత సీఎం రేవంత్రెడ్డి, కేంద్రమంత్రి కిషన్రెడ్డిల మీదే ఉందని, అవి అమలు కాకపోతే వారిద్దరని సంఘ బహిష్కరణ చేయాలన్నారు. -
కాకి లెక్కలతోనే క్రాప్ బుకింగ్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులు పండించే పంటలకు సంబంధించి ప్రతి సీజన్లో అనుసరించే క్రాప్ బుకింగ్ (పంటల నమోదు) విధానం లోపభూయిష్టంగా మారిందనే విమర్శలు విన్పిస్తున్నాయి. శాస్త్రీయ పద్ధతిలో, జియో ట్యాగింగ్ ద్వారా పంటలు నమోదు చేయాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం ఏడాదిన్నర క్రితం ప్రకటించినప్పటికీ..ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి ప్రయత్నం జరగలేదు. క్రాప్ బుకింగ్తో పాటు వివిధ పంటలకు ఆశించే తెగుళ్లు, నివారణ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు సెక్టార్ల వారీగా నియమించిన వ్యవ సాయ విస్తరణాధికారులు (ఏఈవోలు) ఇచ్చే నివేదికల పైనే ప్రభుత్వం ఆధారపడుతోంది.రైతు పంటలు వేసినప్పుడే ఎన్ని ఎకరాల్లో ఏ పంట వేశారనే వివరాలను నమోదు చేసి ప్రభుత్వానికి పంపిస్తే, కచ్చితమైన సాగు విస్తీర్ణం, సాగైన పంటల వివరాలు తెలుస్తాయి. తదనుగుణంగా ఎరువుల పంపిణీ, మద్దతు ధరకు కొనుగోళ్లు, అందుకయ్యే నిధులు సమకూర్చుకోవడం వంటి ప్రక్రియ సజావుగా జరిగే వీలుంటుంది. కానీ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. క్రాప్ బుకింగ్ అంతా కాకి లెక్కలతో సరిపెడుతున్నారని, ఎరువుల పంపిణీ మొదలుకొని పంటల సేకరణ వరకు అంతా లోపభూయిష్టంగానే సాగుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఈ సీజన్లో 60శాతం మించని క్రాప్ బుకింగ్రాష్ట్రంలో ఖరీఫ్ (వానాకాలం) సీజన్ గత నెల 30వ తారీఖుతో పూర్తయింది. ఆనాటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 133.25 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయినట్లు వ్యవసాయ శాఖ నివేదిక చెబుతోంది. ఇవి కాకుండా ఎర్ర మిర్చి, పసుపు 1.34 లక్షల ఎకరాల్లో సాగయినట్లు చెపుతున్నారు. అయితే అధికారికంగా పంటల నమోదు మాత్రం సెప్టెంబర్ 30 నాటికి 70 లక్షల ఎకరాల (53 శాతం) మేరకే పూర్తయింది. సెప్టెంబర్ 30 నుంచి ఈనెల 7 వరకు వారం రోజుల్లో మరో ఏడు శాతం క్రాప్ బుకింగ్ అయిందనుకున్నా, 60 శాతం మించలేదు. ఒకవైపు వరి కోతలు ప్రారంభం కాగా, మరోవైపు పత్తి ఏరడం కూడా ప్రారంభమైంది. అయితే ఇప్పటివరకు వరి క్రాప్ బుకింగ్ 53 శాతం, పత్తి పంట నమోదు 57 శాతం మాత్రమే పూర్తయింది.చేతులు దులుపుకొంటున్నారా?ఒక గ్రామంలో ఒక ఖరీఫ్ సీజన్లో సాగైన పంటల విస్తీ ర్ణం ఆధారంగా మరుసటి సంవత్సరం పంట నమోదును కొంత అటు ఇటుగా నమోదు చేస్తున్నారనే విమర్శలు వ్యవసాయ శాఖలోనే ఉన్నా యి. గత ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో యూరియా కొరత అత్యంత తీవ్ర రూపం దాల్చడానికి సరైన క్రాప్ బుకింగ్ డేటా లేకపోవడమే కారణమ నే అభి ప్రాయం వ్యక్తమైంది. రైతులు పంటలు సాగు చేసి నప్పుడే ఆయా పంటలను కచ్చితమైన విస్తీర్ణంతో నమోదు చేస్తే, ఏ గ్రామానికి ఏ పంటలకు ఎంత యూరియా, ఇతర ఎరువులు అవ సరమవుతాయనే అంచనాలకు అవకాశం ఉంటుంది. కానీ అది జర గడం లేదు. అలాగే వరి ధాన్యం విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు రైతులు వచ్చినప్పుడు కూడా ఈ సమస్య ఉత్పన్నమవుతోంది.పత్తి, జొన్నలు విక్రయించే సమయాల్లో వేసే లెక్కలకు పొంతన ఉండడం లేదు. పంటల నమోదు ప్రక్రియ శాస్త్రీయ పద్ధతిలో ఉంటే ఈ పరిణామాలు ఉత్పన్నం కావని వ్యవసాయ, మార్కెటింగ్అధికారులు చెపుతున్నారు. వ్యవ సా య విస్తరణాధికారులకు జిల్లా, మండల స్థాయిలో చేయాల్సిన వ్యవసాయ పనులు అప్పగించడం వల్ల పంట నమోదు కాకుండా ఇతర పనులపైనే ఎక్కు వ సమయం గడిపే పరిస్థితి ఉందంటున్నారు. ఈ కారణంగానే గత ఏడాది అదే సీజన్లో నమోదు చేసిన పంటలకు కొంత ఎక్కువ, తక్కు వగా నమోదు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. -
పత్తి.. ఎంతైనా కొంటాం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో పత్తి రైతులు ఎంత పండిస్తే అంత పత్తిని కొనుగోలు చేస్తామని.. పత్తి చివరి కిలో వరకూ సేకరించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్సింగ్ భరోసా ఇచ్చారు. రాష్ట్రంలోని పత్తి రైతులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రైతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం క్రూరంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. బాధ్యతల నుంచి పారిపోతోందని ఆరోపించారు. రాష్ట్ర రైతాంగానికి మద్దతుగా తెలంగాణ ప్రభుత్వం ఉండాలని సూచించారు. మంగళవారం ఢిల్లీలోని ఉద్యోగ్ భవన్లో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి నేతృత్వంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తదితరుల బృందం రాష్ట్ర పత్తి రైతుల సమస్యలను వివరించేందుకు గిరిరాజ్ సింగ్తో సమావేశమైంది. అనంతరం గిరిరాజ్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ ‘తెలంగాణలో 20 లక్షల మంది పత్తి రైతులు 18 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పత్తిని సాగు చేస్తుండగా వారి నుంచి సీసీఐ 80 శాతం పత్తిని కొనుగోలు చేస్తోంది. గతంలో ఎంత సేకరించామో అంతకు మించి సేకరించేందుకు సిద్ధంగా ఉన్నాం. రైతుల కమిటీలను ఏర్పాటు చేసి వారి సమస్యలను పారదర్శకంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం. పత్తిలో తేమ శాతం తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అవగాహన కల్పించాల్సి ఉండగా అలా చేయట్లేదు. ఉపాధి హామీ పథకం నిధులను ఉపయోగించుకొని పత్తిని ఆరబెట్టి ఆ తర్వాతే కొనుగోలు కేంద్రాలకు పంపాల్సి ఉన్నప్పటికీ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కేంద్రంపై మాత్రం నిందలు వేస్తోంది. ఇది సరికాదు’అని పేర్కొన్నారు. రైతులు ప్రైవేటు వ్యక్తులకు పంట విక్రయించొద్దు: కిషన్రెడ్డి పత్తి రైతులు ప్రైవేటు వ్యక్తులకు పంటను విక్రయించొద్దని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కోరారు. తేమ శాతం ఎక్కువుందన్న పేరుతో ప్రైవేటు వ్యక్తులు ధర తగ్గించి కోనుగోలు చేయడం వల్ల రైతులకే నష్టం జరుగుతుందని చెప్పారు. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్తో సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘పత్తి కొనుగోళ్లలో ఏటా కొన్ని సమస్యలు వస్తుంటాయి. ఇప్పుడు కూడా వాటిని పరిష్కరించేందుకే కేంద్ర మంత్రితో సమావేశమయ్యాం. సీసీఐ చైర్మన్తోనూ పలు విషయాలు చర్చించాం. పత్తిలో 12 శాతం తేమ ఉన్నా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పంటను సీసీఐ కొనుగోలు చేస్తోంది. పత్తి రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు జరపాలని గిరిరాజ్ సింగ్ను కోరాం. హై డెన్సిటీ కాటన్ ప్లాంటేషన్ ద్వారా రైతుల ఆదాయం మూడింతలు అవుతోంది. తెలంగాణలో ఎందుకు ఆ విత్తనాలను వినియోగించట్లేదని గిరిరాజ్సింగ్ అడిగారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. 122 సెంటర్లలోని రైతు కమిటీల ప్రతినిధులు, అధికారులకు సమస్యలను చెబితే వారు వెంటనే పరిష్కరిస్తారు. తేమ శాతాన్ని కచి్చతత్వంతో కొలిచే ఆధునిక మెషీన్లను అందుబాటులోకి తెచ్చాం’అని తెలిపారు. -
32 అడుగుల ఎత్తు.. 45 కి.మీ. నిడివి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలానికి వెళ్లే మార్గంలో సుమారు 32 అడుగుల ఎత్తు, 45 కి.మీ. నిడివితో నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. దాదాపు ఏడాదిన్నర నుంచి పెండింగ్లో ఉన్న ఈ ప్రతిపాదనను అంగీకరిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించింది. మన్ననూరు నుంచి తెలంగాణ పరిధి ఉన్న పాతాళగంగ వరకు 62.40 కి.మీ. మేర రోడ్డును విస్తరించాలని నిర్ణయించగా అందులో వన్యప్రాణులు సంచరించే 45.42 కి.మీ. మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మించి మిగతా భాగాన్ని దానికి అప్రోచ్ రోడ్డుగా నిర్మించనుంది. ఈ ప్రాజెక్టుకు రూ. 7,690 కోట్లు ఖర్చవుతుందని గతంలో అంచనా వేయగా అందులో సగం వ్యయం భరిస్తామని అప్పట్లోనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలియజేసింది. ప్రస్తుతం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సవరించిన అంచనాలను తయారు చేయాల్సి ఉంది. ప్రస్తుత అంచనాల ప్రకారం నిర్మాణ వ్యయం రూ. 8 వేల కోట్లకు చేరుతుందని భావిస్తున్నారు. అందులో రూ. 4 వేల కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. విస్తరణ జరగక పెరిగిన ట్రాఫిక్.. శ్రీశైలం క్షేత్రానికి వెళ్లే రోడ్డును గతంలో మన్ననూరు వరకు విస్తరించగా అక్కడి నుంచి దట్టమైన అడవి ఉండటం.. అదే మార్గంలో అమ్రాబాద్ పులుల అభయారణ్యం కూడా ఉండటంతో రోడ్డు విస్తరణకు కేంద్రం అనుమతించలేదు. దీంతో మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు సాధారణ రోడ్డే కొనసాగుతోంది. దీనికితోడు వన్యప్రాణుల కదలికల దృష్ట్యా నిత్యం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతుండటం వల్ల ఉదయం వేళల్లో ట్రాఫిక్ పెరిగిపోతోంది. దీంతో రోడ్డు విస్తరణ తప్పనిసరైంది. అయితే భూఉపరితలంలో విస్తరణ సాధ్యం కానందున వన్యప్రాణులకు అంతరాయం కలగని రీతిలో ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదన ఏడాదిన్నర క్రితం తెరపైకి వ చ్చింది. కానీ దాని బదులు కేబుల్ కార్ నిర్మిస్తే రూ. 2,270 కోట్లు ఖర్చవుతుందన్న ఉద్దేశంతో ఆ మేరకు ప్రతిపాదన సమర్పించా లని కేంద్రం రాష్ట్రాన్ని ఆదేశించింది. అలాగే సొరంగ మార్గం ప్రతిపాదన కూడా తెరపైకి వ చ్చింది. ఎట్టకేలకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇ చ్చింది. కారిడార్కు ఇరువైపులా ఇనుపకంచెలు, నాయిస్ బ్యారియర్లు.. వన్యప్రాణులకు ఆటంకం కలగని విధంగా ఎలివేటెడ్ కారిడార్ను చేస్తున్నారు. వాహనాల చప్పుడు ఎక్కువ వినిపించకుండా ఉండేందుకు, జంతువులు రోడ్డుపైకి రాకుండా ఉండేందుకు 32 అడుగుల ఎత్తులో వంతెన నిర్మించనున్నారు. వాహనాలు కింద పడకుండా.. వాహనదారులు కింద ఉండే అటవీ ప్రాంతంలోకి చెత్త విసరకుండా రోడ్డుకు ఇరువైపులా ఎత్తయిన ఇనుప కంచెలు ఏర్పాటు చేయనున్నారు. అదే సమయంలో వాహనాల శబ్దంతో జంతువులు ఇబ్బంది పడకుండా రోడ్డుకు ఇరువైపులా నాయిస్ బ్యారియర్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. -
బూత్ల వారీగా ప్రచార బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ కీలక నేతలు మంగళవారం భేటీ అయ్యారు. నందినగర్ నివాసంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో మాజీ మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్తోపాటు ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు. ఉప ఎన్నికలో పార్టీ పరంగా అనుసరించాల్సిన ప్రచార వ్యూహంపై ప్రాథమికంగా చర్చించినట్లు తెలిసింది.స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో బుధవారం హైకోర్టు వెలువరించే తీర్పు ఆధారంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార వ్యూహానికి తుది రూపు ఇవ్వాలని నిర్ణయించారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే పక్షంలో హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలకు ప్రచార, సమన్వయ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. బూత్లవారీగా ప్రచార బాధ్యతలు అప్పగించే అవకాశముంది. స్థానిక సంస్థల ఎన్నికలపై కోర్టు ప్రతికూలంగా స్పందిస్తే ఇతర ప్రాంత నేతలకు కూడా జూబ్లీహిల్స్లో పార్టీ తరపున బాధ్యతలు అప్పగించే అవకాశముంది. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు బాధ్యతలు ఇచ్చిన రీతిలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ ఇతర జిల్లాలకు చెందిన పార్టీ నేతలను ప్రచార పర్వంలో మోహరించాలని నిర్ణయించినట్లు తెలిసింది.నేడు మరోమారు భేటీజూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచార వ్యూహానికి తుదిరూపు ఇచ్చేందుకు బుధవారం బీఆర్ఎస్ కీలక నేతలు మరోమారు భేటీ కావాలని నిర్ణయించినట్లు సమాచారం. కేటీఆర్ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో మాజీ మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, దేవిరెడ్డి సుధీర్రెడ్డి, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు తక్కళ్లపల్లి రవీందర్రావు, దాసోజు శ్రవణ్, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డితోపాటు ఒకరిద్దరు కీలక నేతలు కూడా పాల్గొంటారు. ఇప్పటికే పార్టీ అభ్యర్థిని ఖరారు చేసినందున ప్రచారంలో భాగంగా రోడ్ షోలు, హాల్ మీటింగ్స్ ఏర్పాటుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ షెడ్యూల్పై చర్చిస్తారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొనే ఉప ఎన్నిక ప్రచార షెడ్యూల్ను ఖరారు చేసే అవకాశముంది.ఆర్టీసీ ప్రైవేటీకరణకు యత్నంఆర్టీసీని ప్రైవేటుపరం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ‘ఇన్నోవేటివ్ థింకింగ్’ పేరిట ఆర్టీసీ బస్సుల్లో భార్యకు ఫ్రీ టికెట్ ఇస్తూ భర్త నుంచి డబుల్ చార్జీలు వసూలు చేస్తున్నారని, అలాగే పిల్లల బస్పాస్ల రేట్లు పెంచారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. చార్జీల పెంపు ద్వారా మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీకి జరుగుతున్న నష్టాన్ని ప్రభుత్వం భర్తీ చేసుకుంటోందని విమర్శించారు. చార్జీల పెంపుతో ఒక్కో కుటుంబంపై 20 శాతం మేర అదనపు భారం పడుతోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేందుకు రేవంత్ ప్రభుత్వం మార్గం సుగమం చేసుకుంటూ ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తోందన్నారు. హైదరాబాద్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఒక్క అసెంబ్లీ స్థానం కూడా దక్కనందునే ప్రజలపై కక్ష తీర్చుకునేందుకు చార్జీలు పెంచిందని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో చార్జీల పెంపునకు కాంగ్రెస్ పార్టీ ప్రతిఫలాన్ని అనుభవిస్తుందని కేటీఆర్ దుయ్యబట్టారు. -
ఏడాదిలో మేడిగడ్డ పునరుద్ధరణ
సాక్షి, హైదరాబాద్: నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ సిఫారసులకు అనుగుణంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ను ఏడాదిలోగా పునరుద్ధరిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన బరాజ్ల పునరుద్ధరణకు డిజైన్ల రూపకల్పనతోపాటు ఇతర సాంకేతిక అంశాల్లో సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ)కు సహకారం అందించడానికి కన్సల్టెన్సీ సేవల కోసం ఇప్పటికే ఆసక్తి వ్యక్తీకరణ(ఈఓఐ)ను ఆహ్వానించామన్నారు. ఐఐటీ లేదా ఇతర ప్రతిష్టాత్మక సంస్థను కన్సల్టెంట్గా నియమించి.. డిజైన్ల రూపకల్పన, బరాజ్లకు జియోఫిజికల్, జియోటెక్నికల్ వంటి పరీక్షలతో పాటు పునరుద్ధరణ పనులు నిర్వహిస్తామని చెప్పారు. కుంగిపోయిన మేడిగడ్డ బరాజ్ 7వ నంబర్ బ్లాక్కు మరమ్మతులు నిర్వహించాలా? దానిని పూర్తిగా తొలగించి కొత్త బ్లాక్ను పునర్నిర్మించాలా? అనే అంశంపై సైతం కన్సల్టెన్సీ సహకారం తీసుకుంటామన్నారు. నీటిపారుదల శాఖపై మంగళవారం ఉత్తమ్ సచివాలయంలో సమీక్షించారు. 6 నెలల్లో కృష్ణా ట్రిబ్యునల్ విచారణ పూర్తి ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీ విషయంలో కేంద్రం జారీ చేసిన అదనపు మార్గదర్శకాలు (టరŠమ్స్ ఆఫ్ రిఫరెన్స్) ఆధారంగా జస్టిస్ బ్రిజేశ్కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్–2 నిర్వహిస్తున్న విచారణ మరో ఆరు నెలల్లో పూర్తికావొచ్చని మంత్రి ఉత్తమ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ వాదనలు పూర్తయిన తర్వాత రిజాయిండర్ వాదనలు వినిపించేందుకు సన్నద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. ప్రాణహితకు రెండు అలైన్మెంట్లు ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మించి తీరుతామని మంత్రి ఉత్తమ్ అన్నారు. తుమ్మిడిహెట్టి నుంచి 71.5 కి.మీ.ల గ్రావిటీ ద్వారా మైలారానికి నీటిని తీసుకొచి్చ, అక్కడి నుంచి 14 కి.మీ.ల సొరంగ మార్గం ద్వారా సుందిళ్ల బరాజ్కు నీటిని తరలించాలనే ఓ ప్రతిపాదన ఉందని చెప్పారు. మైలారం వద్ద పంప్హౌస్ నిర్మించి అక్కడి నుంచి ఎల్లంపల్లి బరాజ్లోకి నీటిని ఎత్తిపోయాలనే మరో ప్రతిపాదనను సైతం పరిశీలిస్తున్నామన్నారు. ఈ రెండు అలైన్మెంట్లలో సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంపిక చేసి ఈ నెల 22లోగా సిఫారసు చేయాలని నీటిపారుదల శాఖ సలహాదారుడు ఆదిత్యనాథ్దాస్ నేతృత్వంలోని కమిటీని ఆదేశించారు. త్వరలో ఎస్ఎల్బీసీ పనుల పునరుద్ధరణ శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగం పనులు 2027 డిసెంబర్ 9లోగా పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ పునరుద్ఘాటించారు. వర్షాలు ముగిసిన వెంటనే పనులు ప్రారంభించాలని, ప్రతి 15 రోజులకోసారి పురోగతిని సమీక్షిస్తామన్నారు. సొరంగం తవ్వాల్సిన ప్రాంతంలో భూగర్భంలోని స్థితిగతులను తెలుసుకోవడానికి నిర్వహించనున్న హెలికాప్టర్ ఆధారిత సర్వేకు త్వరలో పౌర విమానయాన శాఖ డీజీ (డీజీసీఏ) నుంచి అనుమతులు వస్తాయన్నారు. సమ్మక్కపై సీడబ్ల్యూసీ అనుమానాలను నివృత్తి చేయాలి సమ్మక్క–సారక్క ప్రాజెక్టు కింద ప్రతిపాదించిన ఆయకట్టు విషయంలో సీడబ్ల్యూసీ లేవనెత్తిన అనుమానాలను సత్వరంగా నివృత్తి చేసి ఆ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులను పొందా లని అధికారులకు సూచించారు. దేవాదుల ప్రాజెక్టు ప్యాకే జీ–6 అంచనాల పెంపుతోపాటు అదనంగా మూడో దశ పనులకు అనుమతించామని చెప్పారు. ప్రాజెక్టు పనులు వేగవంతం చేసేందుకుగాను తక్షణమే భూసేకరణకు రూ.33 కోట్లు విడుదల చేయాలన్నారు. సమీక్షలో శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా, సలహాదారుడు ఆదిత్యనాథ్దాస్, ఈ ఎన్సీ (జనరల్) అంజాద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. -
ఈ దశలో జోక్యం చేసుకోలేం
సాక్షి, న్యూఢిల్లీ: గ్రూప్–1 సర్వీసుల నియామకాల వివాదంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మంగళవారం ఊరట లభించింది. ఈ అంశంపై దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. ప్రధాన అప్పీళ్లు హైకోర్టులో ఈ నెల 15న విచారణకు రానున్నందున ఈ దశలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. అయితే ఈలోగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే నియామకాలన్నీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉండాలని తేల్చిచెప్పింది. అదే సమయంలో ఆయా పోస్టుల్లో నియమితులైన వారికి ఎలాంటి సమానత్వ హక్కులు వర్తించవని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జొయ్మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ సందర్భంగా స్పష్టం చేసింది. ఈ అంశంపై వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించాలని హైకోర్టుకు సూచించింది.వివాద నేపథ్యం ఇదీ..తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల మార్కులు, ర్యాంకింగ్ జాబితాను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి ఈ ఏడాది సెప్టెంబర్ 9న తీర్పు ఇచ్చారు. సమాధాన పత్రాలను సరైన మోడరేషన్తో తిరిగి మూల్యాంకనం చేయాలని లేదా కొత్తగా మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ తీర్పును తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్తోపాటు ఎంపికైన కొందరు అభ్యర్థులు హైకోర్టులోని డివిజన్ బెంచ్ ముందు సవాల్ చేశారు. ఈ అప్పీళ్లను విచారించిన డివిజన్ బెంచ్.. సింగిల్ జడ్జి తీర్పుపై స్టే విధిస్తూ సెప్టెంబర్ 24న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రభుత్వం ఒకవేళ నియామకాలు చేపడితే అవి రిట్ అప్పీళ్ల తుది తీర్పునకు లోబడి ఉండాలని షరతు విధించింది. డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ఆర్టీసీ డ్రైవర్లు, శ్రామిక పోస్టుల భర్తీకి నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: టీజీఎస్ ఆర్టీసీలో డ్రైవర్లు, శ్రామిక్ పోస్టుల నియామకానికి బుధవారం (అక్టోబర్ 8 ) ఉదయం 8 గంటల నుంచి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) చైర్మన్ వీవీ శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తుతోపాటు ఎస్సీ కమ్యూనిటీ అభ్యర్థులు తమ కమ్యూనిటీ సర్టిఫికెట్లను కొత్త నిర్దేశిత ఫార్మాట్లో (నిర్దిష్ట గ్రూప్ అంటే గ్రూప్– ఐ /గ్రూప్– ఐఐ / గ్రూప్– ఐఐఐ యొక్క ఉప–వర్గీకరణతో) ఆన్లైన్ దరఖాస్తుతో పాటు అప్లోడ్ చేయాలని సూచించారు. అభ్యర్థులు సకాలంలో కొత్త సర్టిఫికెట్ను పొందలేకపోతే, వారి వద్ద ఇప్పటికే అందుబాటులో ఉన్న ఎస్సీ కమ్యూనిటీ సర్టిఫికెట్ను అప్లోడ్ చేయవచ్చని సూచించారు. అయితే, ఆయా అభ్యర్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో కొత్త ప్రొఫార్మాలో కమ్యూనిటీ సర్టిఫికెట్ను సమర్పించాలని స్పష్టం చేశారు. అలా చేయకపోతే ఎస్సీ కేటగిరీ కింద పరిగణించబోమని వెల్లడించారు. కాగా, టీజీఎస్ ఆర్టీసీలోని మొత్తం వెయ్యి డ్రైవర్ పోస్టులకు, 743 శ్రామిక్ పోస్టుల భర్తీకి టీఎస్ఎల్పీఆర్బీ సెప్టెంబర్ 17న నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో డ్రైవర్పోస్టుకు పేస్కేల్ రూ.20,960 నుంచి రూ.60,080 కాగా, శ్రామిక్ పోస్టులకు రూ.16,550 నుంచి రూ. 45,030గా ఉన్నట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు వివరాల కోసం టీఎస్ఎల్పీఆర్బీ వెబ్సైట్లో ఠీఠీఠీ.్టజpటb. జీnలో చూడాలని శ్రీనివాసరావు పేర్కొన్నారు. -
మూడంచెల వ్యూహం
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం మూడంచెల వ్యూహంతో ముందుకెళ్లనుంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా అనుసరించిన వ్యూహాన్ని అమలు చేయాలని, బుధవారం హైకోర్టులో విచారణ సందర్భంగా సమర్థమైన వాదనలు వినిపించాలని నిర్ణయించింది. కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే యథా విధిగా ఎన్నికలకు వెళ్లిపోవాలని, ప్రతికూలంగా వస్తే వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించి నట్టు తెలిసింది. అదే విధంగా కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇస్తే మళ్లీ కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశముంది కాబట్టి.. అక్కడ కూడా బలమైన వాదనలను వినిపించడం ద్వారా ఎట్టి పరిస్థితుల్లో ఈ జీవో అమలయ్యేలా చూడటం ద్వారా ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం. సీఎం కీలక భేటీ బీసీ రిజర్వేషన్ల జీవోపై బుధవారం హైకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి జూబ్లీహిల్స్లోని తన నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్కుమార్గౌడ్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ఉత్తమ్కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అడ్వకేట్ జనరల్ సుదర్శన్రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ, ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీతో కూడా మాట్లాడారు. హైకోర్టులో సమర్థ వాదనలు వినిపించేందుకు హాజరు కావాలని సింఘ్వీని కోరగా, ఆయన వర్చువల్గా హాజరవుతానని తెలిపారు. దీంతో హైకోర్టులో ప్రభుత్వం తరఫున వాదించాల్సిన అంశాలపై వివరణ ఇచ్చారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో పేర్కొన్న అన్ని నిబంధనలను అమలు చేసిన తర్వాతే బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ జీవో ఇచ్చామని తెలిపారు. సుప్రీంతీర్పును ఎక్కడా ఉల్లంఘించడం లేదనే విషయం కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో జీవోను కోర్టు నిలిపివేయకుండా ఉండేలా బలమైన వాదనలు వినిపించాలని, ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆయన ఏజీ సుదర్శన్రెడ్డికి సూచించినట్టు సమాచారం. కాగా బుధవారం హైకోర్టు ఇచ్చే తీర్పును బట్టి సాయంత్రం మరోమారు సమావేశమై భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. కాంగ్రెస్ బీసీ నేతల భేటీ సీఎంతో భేటీ ముగిసిన అనంతరం కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ నేతలు రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి అధికారిక నివాసంలో మంగళవారం సాయంత్రం మళ్లీ సమావేశమయ్యారు. పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, మాజీ ఎంపీ వీహెచ్, ప్రభుత్వ సలహాదారు కేశవరావు, ఎంపీలు సురేష్ షెట్కార్, అనిల్కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకరయ్య, రాజ్ ఠాకూర్, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్షి్మ, పీసీసీ నేతలు లక్ష్మణ్ యాదవ్, చరణ్కౌశిక్ యాదవ్, ఇందిరా శోభన్, ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కూడా హైకోర్టులో వినిపించాల్సిన వాదనలపై చర్చించినట్టు తెలిసింది. బుధవారం కోర్టులో జరగనున్న విచారణకు రాష్ట్రంలోని బీసీ మంత్రులు హాజరు కావాలని నిర్ణయించారు. బీసీ సంఘాలు, ప్రజాప్రతినిధుల తరఫున అడ్వకేట్లను పెట్టి కోర్టు అడిగే ప్రతి ప్రశ్నకు బదులిచ్చేలా సమర్థ వాదనలు వినిపించాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. -
పొన్నంకు ‘లక్ష్మణ’ రేఖ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇద్దరు మంత్రుల మధ్య మాటల వివాదం చినికిచినికి గాలివానగా మారుతోంది. ఒక మంత్రి.. మరో మంత్రిని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు రావడం, బాధిత మంత్రి..ఆ వ్యాఖ్యలపై క్షమాపణలకు డిమాండ్ చేయడం, అవసరమైతే పార్టీ అధిష్టానం పెద్దల్ని కలుస్తానంటూ హెచ్చరించడం దుమారం రేపుతోంది. ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఓ సమావేశానికి ఆలస్యంగా వచ్చిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ను ఉద్దేశించి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభ్యంతరకర పదజాలం ఉపయోగించారన్నది ఆరోపణ. కాగా దీనిపై మంత్రి లక్ష్మణ్కుమార్ స్పందించకపోవడంతో వివాదం సద్దుమణిగినట్టేనని అందరూ భావించారు. కానీ మంగళవారం ఉదయం ఆయన మరో వ్యక్తితో ఫోన్లో మాట్లాడిన వీడియో వైరల్ అయింది. అందులో లక్ష్మణ్ మాట్లాడుతూ.. పొన్నం ప్రభా కర్ ఇంకా తప్పు తెలుసుకోకపోవడం సమంజసం కాదని, బుధవారంలోగా ఆయన తనకు క్షమాపణలు చెప్పకపోతే తదుపరి పరిమాణాలకు ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. పొన్నం తననుద్దేశించి మాట్లాడిన సమయంలో అక్కడే ఉన్న మరో మంత్రి జి.వివేక్ వెంకటస్వామి పట్టించుకోక పోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఆయనపై కూడా ఆ వీడియోలో లక్ష్మణ్ ఘాటైన వ్యాఖ్య లు చేశారు. అవసరమైతే రాహుల్గాందీ, సోనియా గాందీని కూడా కలుస్తానని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇద్దరు మంత్రుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ రంగంలోకి దిగారు. ఇద్దరితో మాట్లాడిన ఆయన సంయమనం పాటించాలని సూచించారని, వివాదం సమసిపోయినట్టేనని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ ప్రకటన అనంతరం ఎమ్మెల్యే క్వార్టర్స్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యేలు వీరేశం, మందుల శామేల్, కాలె యాదయ్య పీసీసీ చీఫ్తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పొన్నం ప్రభాకర్ తప్పు తెలుసుకుంటాడని అనుకున్నా.. తనకు ఫోన్ చేసిన వ్యక్తితో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడినట్టుగా రికార్డయిన ఓ వీడియో మంగళవారం ఉదయం బయటకు వచ్చింది. ఆ వీడియోలో మంత్రులు పొన్నం, వివేక్లనుద్దేశించి అడ్లూరి వ్యాఖ్యలు చేశారు. ‘పొన్నం ప్రభాకర్ తప్పు తెలుసుకుంటాడని అనుకున్నా. అక్కడ మా వర్గానికి చెందిన మరో మంత్రి వివేక్ ఉండి ఆయన వస్తాడా రాడా? ఆయన వస్తే నేను వెళ్లిపోతా అని నన్ను ఉద్దేశించి అనడం ఇంకా అవమానించడమే. ఇద్దరం ఒకే వర్గం నుంచి వచ్చిన వాళ్లం. ఆయన కష్టసుఖాల్లో ఉన్నా. ఆయన కుమారుడు ఎంపీగా నిలబడితే మీదేసుకుని గెలిపించాం. ఆయన తండ్రి సమయం నుంచి మా తండ్రితో స్నేహితం ఉంది. పెద్దపల్లి నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలుగా ఆ కుటుంబానికి ఓట్లేసి గెలిపించడంలో మా పాత్ర ఉంది. నన్ను అంటుంటే వివేక్ ఒక్క మాట అనడా? తోటి మంత్రి ఆ మాట అంటుంటే మా వాడిని దున్నపోతు అని ఎలా అంటావని వివేక్ ఒక్క మాట అనడా? మైనార్టీలకు సంబంధించి ఆ శాఖ మంత్రిగా నేను ఆ కార్యక్రమానికి వెళ్లాలి. వక్ఫ్బోర్డు చైర్మన్ నాకు ఫోన్ చేసి మీ కోసం ఇద్దరు మంత్రులు వెయిట్ చేస్తున్నారని అంటే.. వాళ్లు నేను వచ్చేంతవరకు ఆగరు. మీరు కార్యక్రమం ప్రారంభించండి. నేను జాయిన్ అవుతా అని చెప్పా. నేను సామాన్య కార్యకర్తను. డబ్బు ఉన్నవాడిని కాదు. మా తండ్రి కేంద్ర మంత్రి కాడు. సామాన్య కార్యకర్త నుంచి ఈ స్థాయికి వచ్చా. కష్టాలు తెలిసిన వ్యక్తిని. పొన్నం అలా మాట్లాడతాడని ఊహించలేదు.. పొన్నం ప్రభాకర్లాగా ఉద్రేకపూరితంగా మాట్లాడేంత శక్తిమంతుడిని కాదు. చిన్న స్థాయి వ్యక్తిని నేను. ఆయన ఆ విధంగా మాట్లాడతాడని నేను కలలో కూడా ఊహించలేదు. ఆ కార్యక్రమానికి నేను కేవలం 15 నిమిషాలు మాత్రమే ఆలస్యంగా వెళ్లా. వారితో సమానంగా డాక్టర్ వివేక్ పక్కన నేను కూర్చోవడం వారికి ఇష్టం లేదు. మొదటి నుంచి మా వర్గీకరణను ఆయన వ్యతిరేకిస్తారు. ఆ వర్గానికి చెందిన వాడు నా పక్కన కూర్చుంటాడా? వాడి లెక్కంత అనే ఆలోచనతోనే నేను వెళ్లిపోతా అన్నాడు. పొన్నం ఇప్పటివరకు ఫోన్ కూడా చేయలేదు.. పొన్నం నన్ను ఉద్దేశించి ఒక మాట అన్నాడంటే నన్ను కాకపోవచ్చులే అనుకున్నా. అదే విషయాన్ని చెప్పా. ఒక పార్టీ జెండా కింద పనిచేసేటప్పుడు పొరపాట్లు జరుగుతాయి. నాతో కూడా పొరపాట్లు అవుతాయి. కానీ పొరపాట్లను సరిదిద్దుకోవచ్చు. నాకు ఫోన్ చేసి.. అన్నా పొరపాటున ఒక మాట అన్నా. మనిద్దరి స్నేహితంతో దాన్ని మనసులో పెట్టుకోకు. ఇద్దరం ఒక్క జిల్లా వాళ్లమంటూ ఒక్క మాట అయినా మాట్లాడతాడని అనుకున్నా. ఇంతవరకు నాకు ఒక్క ఫోన్ కూడా చేయలేదు. ఎవరు ఫోన్ చేసి అడిగినా నేను ఆయన్ను అనలేదు అంటున్నాడు. నేను కాంగ్రెస్ జెండాను నమ్ముకుని కార్యకర్త స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చా. నా జాతిని తిట్టడం కరెక్ట్ కాదు.. ప్రజలకు, పేదలకు అందుబాటులో ఉండి మంత్రిగా పనిచేస్తున్నా. ఆవేశపడే విధంగా ఎక్కడా తప్పు చేయడం లేదు. అయినా లక్ష్మణ్కుమార్ను ఏమైనా అనొచ్చు. కానీ నా జాతిని తిట్టడం కరెక్ట్ కాదు. నేను మాదిగ సామాజిక వర్గానికి చెందిన వాడిని కాబట్టే నాకు మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పటికైనా వేచి చూస్తా. రేపటి వరకు (బుధవారం) చూస్తా. ఆయనలో మార్పు వస్తే ఫర్వాలేదు. అప్పటికీ నన్ను అనలేదు ఇంకా ఎవరినో అన్నాను అంటే మాత్రం రేపటి నుంచి జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలి. మాదిగ సామాజికవర్గంలో పుట్టి మంత్రిని కావడం నేను చేసిన పొరపాటా? ఆ సామాజికవర్గంలో పుట్టి ఇన్ని అవమానాలు భరించాల్సి వస్తోందన్న విషయాన్ని మల్లికార్జున ఖర్గే దృష్టికి తీసుకెళ్తా. మీనాక్షి నటరాజన్కు ఇప్పటికే లేఖ రాశా. రాహుల్గాం«దీని కలుస్తా. సోనియాగాంధీని కూడా కలుస్తా..’ అని లక్ష్మణ్ అన్నారు. ఇది మా ఇంటి సమస్య: పీసీసీ చీఫ్ దళిత ఎమ్మెల్యేలతో సమావేశం అనంతరం పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇది తమ ఇంటి సమస్య’ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో అన్ని కులాలకు సముచిత గౌరవం ఉంటుందని చెప్పారు. ఇద్దరు మంత్రులతో తాను ఫోన్లో మాట్లా డానని, మరో మంత్రి శ్రీధర్బాబు కూడా మాట్లాడారని, ఇద్దరినీ బుధవారం పిలిపించి మాట్లాడతానని వెల్లడించారు. పీసీసీ చీఫ్కు చెప్పిందే ఫైనల్: మంత్రి పొన్నం అడ్లూరి లక్ష్మణ్ వ్యాఖ్యలపై తాను మాట్లాడేదేమీ లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ విషయమై తనతో పీసీసీ చీఫ్ మాట్లాడారని, రహ్మత్నగర్లో ఏం జరిగిందో ఆయనకు వివరించానని, అదే ఫైనల్ అని మంగళవారం మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. పార్టీ పరంగా మహేశ్గౌడ్ ఆదేశాలు తమకు శిరోధార్యమని చెప్పారు. -
‘పొన్నం ప్రభాకర్ వెంటనే క్షమాపణలు చెప్పాలి’
హైదరాబాద్: మాదిగ సామాజిక వర్గానికి చెందిన మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ అవమానించేలా వ్యాఖ్యలు చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కళాశాల ముందు నిర్వహించిన మీటిలో మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గానికి చెందిన పొన్నం ప్రభాకర్ మాదిగ సామాజిక వర్గానికి చెందిన లక్ష్మణ్ ను ఉద్దేశించి దున్నపోతు అనే మాటను ఉపయోగించి మాట్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి అహంపూరిత వ్యాఖ్యల వల్ల దళితులు , బలహీన వర్గాల మధ్య దూరం పెరుగుతుందని అన్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకొని జరిగిన తప్పును సరిసిద్దుకునే విధంగా వెంటనే పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని వారు తప్పు జరిగింది వాస్తవమేనని అంగీకరించి పున్నం గారి చేత క్షమాపణ చెప్పించే విధంగా చూస్తామని తెలిపారని అన్నారు. పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కార్యచరణను తీసుకోవలసి వస్తుందని అన్నారు మాకు ఆత్మగౌరవమే ముఖ్యమని అన్నారు ఆత్మగౌరవ విషయంలో రాజీ పడే ప్రసక్తి ఉండదు అనే విషయం స్పష్టం చేశారు.కార్యక్రమం మైనార్టీ వర్గాలకు చెందిన ఆయనప్పటికీ ఆ శాఖ మంత్రిగా అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ఉండగా వాటి మీద పొన్నం ప్రభాకర్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోక్యం ఎందుకు అలాగే కార్మిక శాఖ మంత్రి ఉన్న వివేక్ జోక్యం ఎందుకు జరిగిందో ముఖ్యమంత్రి పరిశీలన చేయాలన్నారు. బీసీ సంక్షేమ శాఖలో వేరే మంత్రులు జోక్యం చేసుకుంటే పొన్నం సహించగలుగుతాడా అలాగే కార్మిక శాఖలో వేరే మంత్రులు జోక్యం చేసుకుంటే వివేక వెంకట్ స్వామి సహించగలుగుతారా తెలుసుకోవాలని అన్నారు. లక్ష్మణ్ కుమార్ దూషిస్తున్న సమయంలో పక్కనే ఉన్న వివేక్ మౌనంగా ఉండడం ఆయన దుర్మార్గమైన మనస్తత్వానికి అద్దం పడుతుందని అన్నారు నిజంగా వివేక్ లో దళిత సృహ ఉంటే సాటి దళిత మంత్రిని అలా అనకూడదని వెంటనే ఖండించాల్సిన అవసరం ఉండేది కానీ వివేకలో ఆస్పృహ లేదని అర్థమైంది. వివేక్ వెంకటస్వామి మాదిగలను పోర్చుకోలేకపోతున్నాడని అన్నాడు కాక జయంతి వేడుకల్లో అన్ని వర్గాలను ఆహ్వానించిన వివేక్ వెంకటస్వామి.. ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి అయిన లక్ష్మణ్ కుమార్ను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. వివేక్లో దళిత సోదర సోదర భావం కనుమరుగైందని అన్నారు. ఉమ్మడిగా దళితులకు రావలసిన హక్కులను సాధించడం కోసం అందని కలుపుకోవాల్సిన బాధ్యత ఉన్న వివేక్ సోయి లేకుండా వ్యవహరిస్తున్నాడని అన్నారు.బీసీలకు ఇస్తున్న 42 శాతం రిజర్వేషన్లను మాదిగ జాతి సంపూర్ణంగా స్వాగతిస్తుందని అన్నారు ఎంఆర్పీఎస్ ఉద్యమం మొదటి నుండి బీసీలకు 50 శాతం వాటా రావాలని కోరుతుందని అన్నారు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల ఐక్యతను కోరుకుంటున్నామని అన్నారు. అగ్రకుల పేదలకు రిజర్వేషన్లు ఇవ్వడాన్ని స్వాగతించినట్లుగానే బీసీలకు ఇస్తున్న 42 శాతం రిజర్వేషన్లను సమాజంలోని అన్ని వర్గాలు స్వాగతించాలని పిలుపునిచ్చారు.సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ మీద జరిగిన దాడిని ఖండిస్తున్నామని అన్నారు. గవాయ్ దళితుడు కావడం వలనే కొన్ని ఆధిపత్య శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయని అందులో భాగంగానే చెప్పులతో దాడికి తెగబడే పరిస్థితికి వచ్చారని, ఆ స్థానంలో ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారు ఉంటే ఈ దాడి జరిగి ఉండేది కాదని అన్నారు. -
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్కు లైన్ క్లియర్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్కు లైన్ క్లియర్ అయ్యింది. ఇవాల నిర్వహించిన జూమ్ మీటింగ్లో నవీన్ వైపే సీఎం రేవంత్రెడ్డి మొగ్గు చూపింనట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి రేస్లో నుంచి తప్పుకున్నట్లు బొంతు రామ్మోహన్ ప్రకటించారు. జూబ్లీహిల్స్ అభ్యర్థిని కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయిస్తుందని.. ఉప ఎన్నికలో పార్టీ గెలుపు కోసం పనిచేస్తానంటూ బొంతు రామ్మోహన్ తెలిపారు.అధికార కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. హైదరాబాద్లో పార్టీ బలహీనపడిందనే అంచనాల మధ్య అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికను గెలుచుకున్న ఆ పార్టీ.. జూబ్లీహిల్స్లోనూ గెలుపే మంత్రంగా ముందుకెళ్లనుంది. సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ చీఫ్ బి.మహేశ్కుమార్గౌడ్లు దీనిపై ఇప్పటికే ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.మంత్రులు గడ్డం వివేక్, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్లతో పాటు పెద్ద సంఖ్యలో కార్పొరేషన్ చైర్మన్లు, సీనియర్ నేతలు రంగంలోకి దిగి పని మొదలు పెట్టారు. బీసీ అభ్యర్థిని నిలబెట్టాలనే ఆలోచనతో పార్టీ నేతలు నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, పేర్లను పరిశీలించారు.. అయితే సీఎం రేవంత్ నవీన్ వైపే ఆసక్తి చూపించినట్లు తెలిసింది. -
అడ్లూరినేం అనలేదు.. ఇది బీఆర్ఎస్ కుట్ర: పొన్నం
తెలంగాణ రాజకీయాన్ని కాంగ్రెస్ (Congress) మంత్రుల మధ్య విభేదాలు హీటెక్కించాయి. తనను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), వివేక్పై (G.Vivek) సంచలన ఆరోపణలకు దిగారు. ఈ క్రమంలో.. మంత్రి పొన్నం స్పందించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వీడియో(Adluri Laxman Kumar) నేపథ్యంలో తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోన్ ద్వారా స్పందించారు. ‘‘అడ్లూరిపై నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. నా వాఖ్యలు వక్రీకరించారు. ఇదంతా బీఆర్ఎస్ కుట్ర. ఆ పార్టీ సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు’’ అని అన్నారాయన. ఇదిలా ఉంటే.. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఇప్పటికే ఇద్దరు మంత్రులతో మాట్లాడినట్లు తెలుస్తోంది. అదే సమయంలో మంత్రి శ్రీధర్ బాబు పొన్నం వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు.అడ్లూరి వీడియోలో.. ‘నేను పక్కన ఉంటే వివేక్ ఓర్చుకోవడం లేదు. పొన్నం ప్రభాకర్ మాదిరిగా నాకు అహంకారంగా మాట్లాడటం రాదు. నా వద్ద డబ్బులు లేవు. పొన్నం ఆయన తప్పు తెలుసుకుంటాడు అని అనుకున్నాను. నేను కాంగ్రెస్ జెండా నమ్ముకున్న వాడిని. మంత్రిగా మూడు నెలల పొగ్రెస్ చూసుకోండి. నేను మాదిగను కాబట్టి నాకు మంత్రి పదవి వచ్చింది. పొన్నం మారకపోతే జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలి. నేను మంత్రి కావడం, మా సామజిక వర్గంలో పుట్టడం తప్పా?.. .. నేను త్వరలోనే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ని కలుస్తా. నేను పక్కన కూర్చుంటే వివేక్ లేచి వెళ్లిపోతున్నాడు. నేను పక్కన ఉంటే వివేక్ ఓర్చుకోవడం లేదు. ఇది ఎంత వరకు కరెక్ట్’ అంటూ ప్రశ్నలు సంధించారు. దళితులు అంటే చిన్న చూపా? అని ప్రశ్నించారు. దీంతో, కాంగ్రెస్ పార్టీలో ఆయన వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టించాయి.పొన్నం పేరిట వైరల్ అయిన వీడియోలో.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఇన్చార్జి మంత్రులు మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశానికి అందరూ వచ్చారు. కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే చెందిన సహచర మంత్రి ఒకరు సమయానికి రాలేకపోయారు. దీంతో పొన్నం అసహనానికి లోనయ్యారు. పక్కనే ఉన్న మంత్రి వివేక్ చెవిలో.. ‘మనకు టైం అంటే తెలుసు.. జీవితమంటే తెలుసు.. వారికేం తెలుసు ఆ..దున్నపోతు గానికి’ అంటూ పొన్నం అన్నట్లు ఉంది. ఇదీ చదవండి: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ.. బిగ్ ట్విస్ట్ -
HYD: కొండాపూర్, కూకట్పల్లిలో ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో(Hyderabad) మరోసారి ఐటీ అధికారులు తనిఖీలు(IT Raids) చేపట్టారు. కొండాపూర్, కూకట్పల్లి ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కొండాపూర్లోని అపర్ణా హోమ్స్లో ఉంటున్న వెంకట్ రెడ్డి అనే వ్యక్తి నివాసంలో మంగళవారం ఉదయం నుంచి అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఐటీ సోదాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
కాంగ్రెస్లో బిగ్ ట్విస్ట్.. వివేక్, పొన్నంపై మంత్రి అడ్లూరి సంచలన ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్.. సహచర మంత్రులు వివేక్, పొన్నం ప్రభాకర్పై సంచలన ఆరోపణలు చేశారు. తాను పక్కనే కూర్చుంటే వివేక్ లేచి వెళ్లిపోవడమేంటని ప్రశ్నించారు. పొన్నం తన తీరు మార్చుకోకపోతే జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో పొన్నం ఎపిసోడ్పై మంత్రి అడ్లూరి వీడియోను విడదల చేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తాజాగా మాట్లాడుతూ..‘నేను పక్కన ఉంటే వివేక్ ఓర్చుకోవడం లేదు. పొన్నం ప్రభాకర్ మాదిరిగా నాకు అహంకారంగా మాట్లాడటం రాదు. నా వద్ద డబ్బులు లేవు. పొన్నం ఆయన తప్పు తెలుసుకుంటాడు అని అనుకున్నాను. నేను కాంగ్రెస్ జెండా నమ్ముకున్న వాడిని. మంత్రిగా మూడు నెలల పొగ్రెస్ చూసుకోండి. నేను మాదిగను కాబట్టి నాకు మంత్రి పదవి వచ్చింది. పొన్నం మారకపోతే జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలి.నేను మంత్రి కావడం, మా సామజిక వర్గంలో పుట్టడం తప్పా?. నేను త్వరలోనే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జునఖర్గే, ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ని కలుస్తాను. నేను పక్కన కూర్చుంటే వివేక్ లేచి వెళ్లిపోతున్నాడు. ఇది ఎంత వరకు కరెక్ట్ అంటూ ప్రశ్నలు సంధించారు. దళితులు అంటే చిన్న చూపా? అని ప్రశ్నించారు. పొన్నం అంటుంటే సహచర మంత్రిగా ఉన్న వివేక్ కనీసం ఖండించలేదు. వివేక్ కొడుకును దగ్గరుండి ఎంపీగా గెలిపించాం కదా?. ఇది కూడా గుర్తులేదా?. కాకా వెంకటస్వామి నుంచి ఆ కుటుంబంతో అనుబంధం ఉంది. కానీ, వివేక్ది ఇదేం పద్ధతి అని ప్రశ్నిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో, కాంగ్రెస్ పార్టీలో ఆయన వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టించాయి. రాజకీయంగా ఆయన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. జూబ్లీహిల్స్ లో మంత్రులు పెట్టిన ప్రెస్ మీట్ లో లేటుగా వచ్చినా అడ్లూరి లక్ష్మణ్ ను “దున్నపోతు” అంటున్నా పొన్నం అన్న మనకి టైం అంటే తెలుసు ఆ..దున్నపోతు గాడికి టైం గురించి ఎం తెలుసు... pic.twitter.com/g0F8wq38vL— Arshad (@Iamarshad46) October 5, 2025Video Credit: Arshadటీపీసీసీ చీఫ్ ఫోన్.. మరోవైపు.. కాంగ్రెస్ నేతల మధ్య జరుగుతున్న పరిణామాలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దృష్టి సారించారు. విషయం తీవ్రతరం కాకుండా రంగంలోకి దిగి.. తాజాగా మంత్రులు పొన్నం, అడ్లూరికి ఫోన్ చేసి మాట్లాడినట్టు తెలిసింది. ఇద్దరు నేతలు సమన్వయంతో కలిసి పనిచేయాలని సూచించినట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. మంత్రి పొన్నం వ్యాఖ్యలను మంత్రి శ్రీధర్ బాబు తప్పుబట్టారు. ఇలాంటి వ్యాఖ్యలు పార్టీకి, ప్రభుత్వానికి మంచిది కాదంటూ శ్రీధర్ బాబు సూచించారు. ఇక, తన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం క్లారిటీ ఇచ్చారు. తన వక్రీకరించారని తెలిపారు. అడ్లూరిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని చెప్పుకొచ్చారు. -
డ్రైవింగ్ సమయంలో ఇలా చేస్తున్నారా?.. శిక్ష తప్పదు: సజ్జనార్ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సిటీలో వాహనాల డ్రైవర్లకు సీపీ వీసీ సజ్జనార్(CP Sajjanar) హెచ్చరికలు జారీ చేశారు. డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్లో వీడియోలు చూడటం, ఇయర్ ఫోన్లు(Traffic Violations) ఉపయోగించడం నేరమని అన్నారు. ఇది ప్రమాదకరం.. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ తాజాగా ట్విట్టర్ వేదికగా.. ఇటీవలి కాలంలో ఆటో, క్యాబ్ డ్రైవర్స్(Cab Drivers), బైక్ టాక్సీలు నడిపేవారు డ్రైవింగ్ సమయంలో తరచుగా మొబైల్ ఫోన్లో వీడియోలు చూడటం, ఇయర్ఫోన్స్ వినియోగించడం చేస్తున్నారు. ఇలాంటివి చేయడం నేరం. ఇది ప్రమాదకరమైంది.. శిక్షార్హమైన నేరం. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అలాంటి ఉల్లంఘనదారులపై కఠిన చర్యలు తీసుకుంటారు అని హెచ్చరించారు. ఇదే సమయంలో వాహనదారుల స్వీయ రక్షణ, ప్రయాణీకులు, తోటి రోడ్డు వినియోగదారుల భద్రత చాలా ముఖ్యమైనది. ఏ పరధ్యానం కూడా ప్రాణానికి విలువైనది కాదు. ఇలాంటి వాటి దృష్టి పెట్టండి, సురక్షితంగా ఉండండి’ అని సూచించారు. 🚦 Many drivers, including auto-rickshaw and cab/bike taxi drivers, are often seen watching videos or using earphones while driving. This is dangerous and a punishable offence. Hyderabad Traffic Police will take strict action against such violators.Safety of self, passengers,… pic.twitter.com/n87ZCbu3Ip— V.C. Sajjanar, IPS (@SajjanarVC) October 7, 2025 -
జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ కాంగ్రెస్కు బిగ్ షాక్!
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ కీలక నేత నవీన్ యాదవ్పై(Naveen Yadav) క్రిమినల్ కేసు నమోదైంది. నవీన్ యాదవ్ ఓటరు కార్డులను పంపిణీ చేయడంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ(Election Code) ఆయనపై కేసు నమోదు చేశారు.వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికల షెడ్యూల్ సోమవారం విదులైన విషయం తెలిసిందే. కాగా, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న క్రమంలో నియోజకవర్గ పరిధిలో ఓటర్లకు నవీన్ యాదవ్ ఓటరు కార్డులను పంపిణీ చేశారు. దీంతో ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆయనపై అధికారులు సీరియస్ అయ్యారు.అనంతరం, దీన్ని ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యగా భావిస్తూ.. జూబ్లీహిల్స్ ఎన్నికల అధికారి రజినీకాంత్ రెడ్డి మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నవీన్ యాదవ్పై బీఎన్ఎస్ యాక్ట్లోని సెక్షన్ 170,171,174 ప్రజాప్రాతినిధ్య చట్టం కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు. నవీన్ యాదవ్ కాంగ్రెస్లో కీలక నేతగా ఉన్నారు. ఇక, తాజాగా ఆయనపై క్రిమినల్ కేసు నమోదు కావడంతో అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది. -
కొందరికే కొత్త రేషన్కార్డులు!
సాక్షి, సిటీబ్యూరో: సాక్ష్యాత్తు రాష్ట్ర రాజధానిలో(GHMC) కేవలం సుమారు 2.31 లక్షల కుటుంబాలకు మాత్రమే కొత్త రేషన్ కార్డులు(Telangana Ration Cards) మంజూరయ్యాయి. సగానికి పైగా దరఖాస్తులు పెండింగ్లో మగ్గుతున్నాయి. ఫలితంగా నిరుపేద కుటుంబాలకు కొత్త రేషన్ కార్డు అందని ద్రాక్షగా తయారైంది. రెండు నెలల నుంచి కొత్త రేషన్న్కార్డు దరఖాస్తులపై క్షేత్ర స్థాయి విచారణ, ఆమోదం ప్రక్రియ అంతంత మాత్రంగా మారింది. కేవలం మధ్యవర్తుల ప్రమేయం, ఇతరాత్ర సిఫార్సుల ఉన్న దరఖాస్తులకు మాత్రమే మోక్షం లభిస్తోంది.వాస్తవంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో మీ సేవా కేంద్రాల నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించడంతో నిరుపేదలు పెద్ద ఎత్తున నమోదు చేసుకున్నారు. ఒకటి రెండు నెలల వ్యవధిలోనే కొత్త కార్డుల మంజూరు ప్రక్రియ ప్రారంభమైంది. క్షేత్ర స్థాయి విచారణ కోసం ప్రత్యేక బృందాలను కూడా రంగంలోకి దించారు. ఏకంగా ఆగస్టు మొదటి వారంలో మంత్రులు సైతం నియోజకవర్గాల వారిగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి కొత్త కార్డుల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. రేషన్కార్డుల మంజూరు నిరంతర ప్రక్రియ అని ప్రకటించిన పౌరసరఫరాల శాఖ.. ఆ తర్వాత కొత్త కార్డులు మంజూరును తగ్గించింది. ఆరు లక్షలపైనే దరఖాస్తులు గ్రేటర్ పరిధిలో సుమారు ఆరు లక్షల పైనే కుటుంబాలు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. అందులో మంజూరు 30 శాతం మించలేదు. కనీసం దరఖాస్తులపై క్షేత్ర స్థాయి విచారణ కూడా ముందుకు సాగడం లేదు. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకునే ఎఫ్ఎస్సీ ఆన్లైన్ లాగిన్కు నాలుగేళ్ల తర్వాత మోక్షం లభించినా మంజూరు మాత్రం కొందరికి పరిమితమవుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2021 ఫిబ్రవరిలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల చేసుకునే పౌరసరఫరా శాఖ వెబ్సైట్ ఆన్లైన్ లాగిన్ నిలిచిపోయింది.అప్పటి వరకు ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను 360 డిగ్రీల స్థాయిలో వడబోసి అదే ఏడాది జూలై చివరి వారంలో కొత్త కార్డులు మంజూరు చేసింది. మొత్తం దరఖాస్తుల్లో 40 శాతం మాత్రమే క్లియర్ కాగా..మిగతా దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. అప్పటి నుంచి నాలుగేళ్ల పాటు కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ లేకుండా పోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరిలో పునరుద్ధరించారు. దీంతో దరఖాస్తుల నమోదు నిరంత ప్రక్రియగా సాగుతున్నా మంజూరు నత్తనడకన సాగుతోంది. కార్డు లేని కుటుంబాలు పది లక్షల పైనే.. గ్రేటర్లో రేషన్ కార్డులు లేని కుటుంబాలు 10 లక్షలపైనే ఉన్నాయి. సుమారు కోటిన్నర జనాభా కలిగిన మహానగరంలో సుమారు 40 లక్షల కుటుంబాలు ఉండగా అందులో దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలు 27.21 లక్షలు ఉన్నట్లు అంచనా. ప్రస్తుతం 17.21 లక్ష కుటుంబాలు మాత్రమే తెల్లరేషన్ కార్డులు కలిగి ఉన్నాయి. మిగతా కుటుంబాలు రేషన్ కార్డులు లేక వివిధ సంక్షేమ పథకాల వర్తింపు కోసం తల్లడిల్లుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం ప్రజా పాలనలో పేద కుటుంబాలు ఆరు గ్యారంటీల పథకాలతో పాటు ప్రత్యేకంగా కొత్త రేషన్ కార్డుల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నాయి.హైదరాబాద్ మహానగర పరిధిలో సుమారు 5.73 లక్షల కుటుంబాల నుంచి దరఖాస్తులు వచ్చి చేరాయి. అయితే ప్రభుత్వం వాటిని పక్కకు పెట్టి ఇటీవల జరిగిన సమగ్ర కుటుంబ సర్వేలో రేషన్ కార్డులు లేని కుటుంబాలను గుర్తించి విచారణ జరిపింది.అయితే అది కాస్త విమర్శలకు దారితీయడంతో తిరిగి ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరిస్తోంది. -
తెలంగాణలో ఈ జిల్లాల్లో ఇవాళ, రేపు వానలు, ఏపీలో ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో కొన్నిరోజులుగా భిన్నవాతావరణం నెలకొంటోంది. పగలంతా ఎండ ఉంటూ.. సాయంత్రం ఆకస్మికంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ తరుణంలో.. వాతావరణ శాఖ తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో.. తెలంగాణలోని 17 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది(Telangana Yellow Alert). భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిసింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదుపు గాలులు వీస్తాయని, పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. అయితే రేపు మాత్రం మహబూబ్నగర్, నల్లగొండ, వరంగల్, సిద్ధిపేట, మేడ్చల్, జనగాం, యాదాద్రి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఇక రాజధాని హైదరాబాద్ నగరంలో ఇవాళ సాయంత్రం సమయంలో, అలాగే రేపు కుండపోత కురిసే అవకాశముందని(Hyderabad Rains) వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు.. ఏపీలో వాతావరణం దాదాపుగా పొడిగా ఉండొచ్చని ఇక్కడి వాతావరణశాఖ చెబుతోంది. అయితే.. రాయలసీమ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది(AP Rains News). ఉదయం, సాయంత్రం ఆకస్మిక వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.అక్టోబర్ నెలలో 10+10+11.. అక్టోబర్ నెలలోనూ మొత్తం మూడు దశల్లో వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అక్టోబర్ 1–10 మధ్య ఉత్తర, తూర్పు తెలంగాణలో భారీ వర్షాలు.. అక్టోబర్ 10–20 మధ్య ఓ మోస్తరు వర్షాలు, అక్టోబర్ 21–31 మధ్య ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో మళ్లీ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతోంది.ఇదీ చదవండి: ఇక నుంచి డిజిటల్ పాస్లు -
సికింద్రాబాద్-కాజీపేట మధ్య ఫోర్ లైన్ రైల్వే కారిడార్.. కేంద్రం గ్రీన్సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: ఒకటి కాదు రెండు కాదు, సికింద్రాబాద్(secunderabad) నుంచి ఏకంగా రోజుకు కనీసం 150 అదనపు రైళ్లు నడిపేందుకు వీలు కలిగించే కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. సికింద్రాబాద్ నుంచి కాజీపేట(Kazipet) వరకు ఉన్న రెండు వరుసల రైల్వే మార్గాన్ని నాలుగు లైన్లకు(Four Line Railway Route) విస్తరించబోతోంది. ఉత్తర–దక్షిణ భారత్లను రైల్వే మార్గంతో జోడించే గ్రాండ్ ట్రంక్ రూట్తో ఇది అనుసంధానం కాబోతోంది.గ్రాండ్ ట్రంక్ రూట్లో మూడో లైన్ నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చినందున త్వరలో అందుబాటులోకి రానుంది. ఆ మార్గాన్ని నాలుగు లైన్ల రూట్గా మార్చాలని కేంద్రం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో, దానికి అనుసంధానమయ్యే సికింద్రాబాద్–కాజీపేట మార్గాన్ని నాలుగు వరుసలకు విస్తరించాలని నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఒకేసారి రెండు అదనపు లైన్లను నిర్మించేందుకు రూ.2,837 కోట్లు అవసరమవుతాయని దక్షిణ మధ్య రైల్వే రూపొందించిన డీపీఆర్లో పేర్కొంది. అదనంగా రెండు లైన్లను నిర్మించేందుకు దాదాపు నాలుగేళ్ల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రస్తుతం హైదరాబాద్ మీదుగా నిత్యం నడుస్తున్న 200 రైళ్లకు (గూడ్సు సహా)అదనంగా మరో 150 రైళ్లను నడపొచ్చు.సామర్థ్యానికి మించి రైళ్లు.. దేశంలో అతి కీలక లైన్లు అయిన హైలీ యుటిలైజ్డ్ నెట్వర్క్ (హెచ్యూఎన్)లలో సికింద్రాబాద్–కాజీపేట మార్గం ఒకటి. ఈ మార్గంలో సామర్థ్యానికి మించి రైళ్లు నడుస్తున్నాయి. ప్రస్తుతం ఆ సాంద్రత 150 శాతంగా ఉంది. ఇది ప్రమాదకర పరిస్థితిగా భావిస్తారు. సిగ్నలింగ్కు సంబంధించి ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా భారీ ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. ఈ తరుణంలో కొత్త రైళ్లను ప్రవేశపెట్టడం దాదాపు అసాధ్యంగా మారింది. హైదరాబాద్ నుంచి బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లకు రోజుకు అదనంగా 40కి పైగా రైళ్లు అవసరమున్నాయి.ఆయా ప్రాంతాలకు చెందిన వలస కూలీలు రాష్ట్రంలో అధికసంఖ్యలో పనిచేస్తుండటమే దీనికి కారణం, ఇక ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, తదితర ప్రాంతాలకు కూడా అధికంగా రైళ్ల అవసరం ఉంది. తిరుపతి, విజయవాడలకు కూడా మరిన్ని రైళ్లు తిప్పాల్సి ఉంది. వెరసి కనీసం మరో వందకుపైగా రైళ్లు నడపాల్సిన డిమాండ్ ఉన్నా, ట్రాక్ సామర్థ్యం సరిపోక నడపటం లేదు. ఇప్పుడు మూడు, నాలుగు లైన్లు అందుబాటులోకి వస్తే ఆ కొరత తీరిపోతుంది. ఎంఎంటీఎస్–2కు వెసులుబాటు ప్రస్తుతం ఎంఎంటీఎస్ రెండో దశ పనులు జరుగుతున్నాయి. నగరం నుంచి ఘట్కేసర్కు వరకు రెండు మార్గాల్లో కలిపి నాలుగు లైన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రధాన మార్గంలో రెండు లైన్లు, అమ్ముగూడ మీదుగా నిర్మించిన బైపాస్ లైన్లో రెండు లైన్లు ఉన్నాయి. ఘట్కేసర్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ ప్రాజెక్టులో భాగంగా మూడో లైన్ నిర్మిస్తున్నారు. ఇప్పుడు కాజీపేట వరకు ప్రధాన లైన్ను నాలుగు వరుసలకు విస్తరించనున్నందున, ఎంఎంటీఎస్కు నాలుగో లైన్ కూడా అందుబాటులోకి వచ్చినట్టవుతుంది. అటు వాడీ, ఇటు బల్లార్షా, విజయవాడ.. నాలుగు లైన్లతో.. కాజీపేట నుంచి బల్లార్షా, కాజీపేట నుంచి విజయవాడ మధ్య మూడో లైన్ నిర్మాణం పూర్తి కావచ్చింది. ఇది గ్రాండ్ ట్రంక్ రూట్ అయినందున, ఈ మార్గంలో నాలుగో లైన్ కూడా నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఇక సికింద్రాబాద్–వాడీ మధ్య ఒకేసారి మూడో, నాలుగో లైన్లు మంజూరయ్యాయి. త్వరలో పనులు మొదలవుతాయి. వెరసి ఈ కీలక మార్గాల్లో నాలుగో లైన్ వస్తున్నందున, విరివిగా రైళ్లను పరిగెత్తించే వీలుంది. దానికి సమతూకం చేయాలంటే సికింద్రాబాద్ నుంచి కాజీపేట మధ్య కూడా నాలుగో లైన్ అవసరమవుతుంది. అప్పుడు హైదరాబాద్ మీదుగా అటు బల్లార్షా నుంచి ఢిల్లీ వైపు, విజయవాడ మీదుగా చెన్నై, ఒడిశా, బెంగాల్ వైపు, వాడీ మీదుగా ముంబై వైపు వీలైనన్ని రైళ్లను నడపొచ్చు. 160 కి.మీ. వేగంతో... పస్తుతం ఉన్న రెండు లైన్ల మీద రైళ్ల గరిష్ట వేగం 130 కి.మీ. మాత్రమే. ఇప్పుడు కొత్తగా ప్రతిపాదించిన రెండు లైన్లను 160 కి.మీ. వేగ సామర్థ్యంతో నిర్మించనున్నారు. అప్పుడు ఈ మార్గంలో నడిచే వందేభారత్ రైళ్లు తమ గరిష్ట వేగాన్ని (160కి.మీ.) అందుకొని ప్రయాణిస్తాయి. దీంతో మరింత తొందరగా గమ్యం చేరుకుంటాయి.పచ్చజెండా ఊపేందుకు సిద్ధం రైళ్ల రద్దీ పెరిగి రూట్ ఇరుకుగా మారిన నేపథ్యంలో సికింద్రాబాద్–కాజీపేట మధ్య మూడో లైన్ నిర్మించాలని దాదాపు పదిహేనేళ్లుగా ప్రతిపాదనలు మూలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 2023లో ప్రాజెక్టు మంజూరై సర్వేకు సూచించారు. ఆ సమయంలోనే ఒకేసారి మూడు, నాలుగు లైన్లను నిర్మించాలని కేంద్రం భావించి ఆ సంవత్సరం జూలైలో ఫైనల్ లొకేషన్ సర్వే మంజూరు చేసింది. సర్వే పూర్తి చేసి గత ఏప్రిల్లో రైల్వే బోర్డుకు డీపీఆర్ సమర్పించారు. దాన్ని పరిశీలించిన కేంద్రం ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపినట్టు తెలిసింది.త్వరలో అధికారిక ఆదేశాలు వెలువడనున్నాయి. అదనపు రెండు లైన్ల నిర్మాణానికి 124 హెక్టార్ల భూమిని సేకరించాలని నిర్ణయించారు. త్వరలో ఆ మేరకు నోటిఫికేషన్ జారీ కానుంది. ఈ రైల్వే లైన్ తెలంగాణలోని మేడ్చల్ – మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, జనగామ, హనుమకొండ జిల్లాల మీదుగా సాగుతుంది. ఈ రైలు మార్గంలో రెండు రైల్వే ఓవర్ బ్రిడ్జీలు (ఆర్ఓబీ), 27 రైల్వే అండర్ బ్రిడీŠుజ్ల (ఆర్యూబీ) ఉన్నాయి. ఘట్కేసర్, కాజీపేటతో సహా మొత్తం 16 స్టేషన్లు ఈ రూట్లో ఉన్నాయి. -
స్థానిక ఎన్నికల వేళ.. బీజేపీలో బిగ్ ట్విస్టు!
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల వేళ.. పార్టీలో వివిధ స్థాయి నేతల మధ్య సమన్వయలేమి బీజేపీ(Telangana BJP) నాయకత్వానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఈ ఎన్నికల్లో కనీసం 15 జెడ్పీలు గెలిచి రాజకీయంగా సత్తా చాటాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకోగా.. దీని సాధనకు పార్టీ పూర్తిస్థాయిలో సంసిద్ధమై ఉందా ఉన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.వచ్చే అసెంబ్లీ ఎన్నికల కల్లా.. రాష్ట్రంలో పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో బలపడేందుకు స్థానిక ఎన్నికలు ఏ మేరకు ఉపయోగపడతాయన్న దానిపై నాయకుల్లో స్పష్టత కొరవడింది. పార్టీలో కొంతకాలంగా అంటే గత అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల తర్వాత నుంచి పాత–కొత్త నాయకులు, వివిధ స్థాయి నాయకుల మధ్య సమన్వయ సమస్యలు ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై ఆదివారం జరిగిన రాష్ట్ర పదాధికారుల సమావేశంలోనూ ముఖ్యనేతల మధ్య సమన్వయలేమి, అంతర్గత సమస్యలు మరోసారి బయటపడ్డాయి.మూడునాలుగేళ్లుగా పలువురు ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా గెలుపొందినా కూడా ఇంకా పార్టీలో పాత–కొత్తల వివాదం కొనసాగుతుండడంపై ముఖ్యనేతలు సైతం పెదవి విరుస్తున్నారు. అంతేకాకుండా జిల్లా నుంచి మండల, గ్రామస్థాయి వరకు నాయకులు, కార్యకర్తల సమన్వయం, ఆయా జిల్లాల్లోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జిల్లా అధ్యక్షులు, ముఖ్యనేతలకు ఉన్న స్నేహపూర్వక సంబంధాలు, ఒకరికి ఒకరు సహకరించుకోకపోవడం వంటివి ప్రస్తుతం చర్చనీయాంశమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం జరగనుంది. ఆ లోగా అందరికీ సర్ది చెప్పే ప్రయత్నాల్లో నాయకత్వం నిమగ్నమైంది. జిల్లాల్లోనూ అంతే..జిల్లా పార్టీలో సరైన సమన్వయం లేదంటూ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి(Konda Vishweshar Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమాల నిర్వహణ, తదితరాల విషయంలో తన ఎంపీ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పార్టీ అధ్యక్షుల తీరుపై నాయకత్వానికి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పధాదికారుల సమావేశంలో నిలదీశారు. ఈ నేపథ్యంలో వెంటనే ఈ జిల్లాల అధ్యక్షులపై వచ్చిన ఫిర్యాదులపై మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, పార్టీనేత గోలి మధుసూదన్ రెడ్డిలతో ఓ కమిటీని అధ్యక్షుడు రామచందర్రావు ఏర్పాటు చేసినట్టు సమాచారం. పార్టీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా గెలిచిన ప్రజాప్రతినిధులతో జిల్లా నేతలకు సరైన సమన్వయం లేదని పధాదికారుల సమావేశంలోనే కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి వాపోయారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కూర్చొని కార్యక్రమాలు నిర్ణయించడం తప్ప క్షేత్ర స్థాయిలో అసలు అవి ఏ విధంగా అమలు చేస్తున్నారనేదే నాయకత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఎమ్మెల్యే చేసిన విమర్శలు, లేవనెత్తిన అంశాలను సైతం సీరియస్గా తీసుకున్న నాయకత్వం.. నేతల మధ్య సమన్వయం, జిల్లాల్లో పార్టీ కార్యక్రమాలు, తదితర అంశాలపైనా దృష్టి పెట్టినట్టు పార్టీవర్గాల సమాచారం. -
‘జూబ్లీహిల్స్’ ఉప ఎన్నిక.. విజయశాంతి సంచలన ఆరోపణ!
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్(Jubilee Hills by-election) ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని తేలడంతో బీఆర్ఎస్(BRS Party) పార్టీ అనైతిక అవగాహన కుదుర్చుకునేందుకు కుట్రలు చేస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి(Vijaya Shanthi) ఆరోపించారు. ‘జూబ్లీహిల్స్ ఎన్నికలో బీజేపీ పోటీ చేస్తున్న కారణంగా మిత్ర ధర్మం కోసం ఈ ఎన్నికల్లో పోటీ నుంచి వైదొలగుతున్నట్టు తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. బీజేపీ(BJP) డమ్మీ అభ్యర్థిని బరిలోకిదింపి తన రహస్య మిత్రపక్షమైన బీఆర్ఎస్ను గెలిపించేందుకు వ్యూహాలు రచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. పైకి బీజేపీకి మద్దతిస్తున్నట్టు టీడీపీ ప్రకటించినా, రహస్యంగా బీఆర్ఎస్ గెలుపు కోసం తెలుగుదేశం కార్యకర్తలు పనిచేయాలని సందేశం పంపినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బతీయాలనే కుట్రతో టీడీపీ మద్దతు బీఆర్ఎస్కు లభించే విధంగా బీజేపీ రహస్య అవగాహన కుదిర్చినట్టు సమాచారం. బీఆర్ఎస్, బీజేపీ, టీడీపీల అవకాశవాద రాజకీయాన్ని జూబ్లీహిల్స్ ఓటర్లకు వివరించే బాధ్యతను స్థానికంగా ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తీసుకోవాలని కోరుతున్నాను’అని సోమవారం విజయశాంతి ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఊప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని తేలడంతో బిఆర్ఎస్ పార్టీ అనైతిక అవగాహన కుదుర్చుకునేందుకు కుట్రలు చేస్తున్నట్లువార్తలు వస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బిజెపి పోటీ చేస్తున్న కారణంగా కమలం పార్టీతో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ మిత్ర ధర్మం కోసం ఈ… pic.twitter.com/lZmuxZIK7X— VIJAYASHANTHI (@vijayashanthi_m) October 6, 2025 -
ఉప ఎన్నికకు సై
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో రసవత్తర రాజకీయ పోరుకు తెరలేచింది. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో అన్ని ప్రధాన రాజకీయ పక్షాలు దీనిపై దృష్టి కేంద్రీకరించాయి. ఈ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉండేందుకే ఎక్కువ అవకాశం ఉంది. సిట్టింగ్ పార్టీ బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్తో పాటు బీజేపీ బరిలో ఉండే అవకాశాలున్నాయి. అయితే అభ్యర్థుల ఎంపిక, ఎంఐఎం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఈ లెక్కలు మారతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కంటోన్మెంట్ను కైవసం చేసుకున్నట్టే.. అధికార కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. హైదరాబాద్లో పార్టీ బలహీనపడిందనే అంచనాల మధ్య అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికను గెలుచుకున్న ఆ పార్టీ.. జూబ్లీహిల్స్లోనూ గెలుపే మంత్రంగా ముందుకెళ్లనుంది. ఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ చీఫ్ బి.మహేశ్కుమార్గౌడ్లు దీనిపై ఇప్పటికే ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. మంత్రులు గడ్డం వివేక్, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్లతో పాటు పెద్ద సంఖ్యలో కార్పొరేషన్ చైర్మన్లు, సీనియర్ నేతలు రంగంలోకి దిగి పని మొదలు పెట్టారు. బీసీ అభ్యరి్థని నిలబెట్టాలనే ఆలోచనతో పార్టీ నేతలు నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, అంజన్ యాదవ్ల పేర్లను పరిశీలిస్తోంది. అయి తే ఏఐసీసీకి పంపిన జాబితాలో కార్పొరేటర్ సీఎన్ రెడ్డి పేరు ఉండటం గమనార్హం. రేసులో ‘కారు’జోరు నియోజకవర్గంలో ఉన్న పార్టీ సంస్థాగత బలంతో పాటు, మాగంటి గోపీనాథ్ కుటు ంబంపై ఉన్న సానుభూతి, ప్రభుత్వంపై ఉన్న ఎంతో కొంత వ్యతిరేకత సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేలా చేస్తుందని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీతను అభ్యర్థిగా ఇప్పటికే ఖరారు చేయడం ద్వారా మిగిలిన పక్షాల కంటే ముందంజలో ఉంది.పార్టీ సీనియర్ నేతలతో పలు దఫాలుగా భేటీ అయిన కేసీఆర్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహంపై దిశా నిర్దేశం చేశారు. తాజాగా షెడ్యూలు వెలువడిన నేపథ్యంలో మంగళవారం ఎర్రవల్లి నివాసంలో కీలక భేటీ నిర్వహిస్తున్నట్లు సమాచారం. కాగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుమారు నెల రోజుల నుంచే పార్టీ కేడర్ను సన్నద్ధం చేసే పనిలో ఉన్నా రు. ఎన్నికల ప్రచారాన్ని సమన్వయం చేసే ందుకు ఆరు డివిజన్లకు పార్టీ ఇన్చార్జిలను ఇప్పటికే నియమించారు. హైదరాబాద్లో సత్తా చాటేందుకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో హైదరాబాద్లో సత్తా చాటేందుకు వచ్చిన మంచి అవకాశాన్ని సది్వనియోగం చేసుకోవాలని, హిందూత్వ ఎజెండాతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, బీఆర్ఎస్ బలహీనతలను ఆసరాగా చేసుకుని జూబ్లీహిల్స్పై కాషాయ జెండా ఎగురవేయాలని కమలనాథులు ఆశపడుతున్నారు. ఈ పార్టీ టికెట్ కోసం గత ఎన్నికల్లో పోటీ చేసిన లంకెల దీపక్రెడ్డితో పాటు, అట్లూరి రామకృష్ణ, జూటూరి కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ, బండా రు విజయలక్ష్మీ, సినీనటి జయసుధ, ఆకుల విజయ పోటీ పడుతున్నారు.ఒకట్రెండు రోజుల్లో రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఆధ్వర్యంలో రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశమై అభ్యరి్థని ప్రకటించనున్నట్టు సమాచారం. కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో జూబ్లీహిల్స్ ఉండడంతో ఈ ఎన్నిక ఆయనకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఎంఐఎం కార్యాచరణపై మాత్రం ఇంతవరకు స్పష్టత రావడం లేదు. గత ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా కాంగ్రెస్ అభ్యర్థి ఓటమికి కారణమైన మజ్లిస్ ఈసారి ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇక సీపీఐ, సీపీఎం, జనసమితిలు అధికార కాంగ్రెస్ వైపే నిలబడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. -
స్థానిక ఎన్నికల్లో ‘సిరా’ చుక్కపై ఎస్ఈసీ స్పష్టత
సాక్షి, హైదరాబాద్: ఈనెల 23, 27 తేదీల్లో (రెండుదశల్లో) ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఆ తర్వాత గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఓటింగ్ సందర్భంగా వేలిపై సిరా చుక్క వేసే విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) స్పష్టతను ఇచి్చంది. ఈ నెల 23న తొలిదశ మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో భాగంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఓటింగ్ సందర్భంగా ఓటర్ ఎడమచెయ్యి చూపుడు వేలుపై వేసిన ఓటుకు గుర్తుగా సిరా చుక్క వేయాలని ఎన్నికల అధికారులకు తెలిపింది.ఆ తర్వాత ఈ నెల 31, నవంబర్ 4, 8 తేదీల్లో జరగనున్న మూడుదశల గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటరు మధ్యవేలుపై సిరాచుక్క వేయాలని పేర్కొంది. ఎస్ఈసీ కార్యదర్శి మంద మకరందు ఈ మేరకు ఓ సర్క్యులర్ ద్వారా జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, అదనపు కలెక్టర్లు (స్థానికసంస్థలు), జెడ్పీ సీఈవోలు, డీపీవోలు, ఎంపీడీవోలు, రిటరి్నంగ్ అధికారులకు సమాచారం పంపించారు. -
ముందు హైకోర్టుకు వెళ్లండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టును కాదని నేరుగా తమ వద్దకు రావడాన్ని తప్పుబట్టింది. సరైన న్యాయ ప్రక్రియను పాటించాల్సిందేనంటూ, ముందు హైకోర్టుకు వెళ్లమని సూచించింది. పిటిషన్ను ఉపసంహరించుకునేందుకు అనుమతించింది. ఇక్కడికి ఎందుకొచ్చారో చెప్పండి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన జీవోపై వంగా గోపాల్రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలి సిందే. కాగా ఈ అంశంపై అత్యవసర విచారణ జరపాలని ఆయన కోరారు. అయితే సోమవారం జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. రాజ్యాంగంలోని ఆర్టీకల్ 32 కింద దాఖలు చేసిన రిట్ పిటిషన్ను విచారణకు స్వీకరించాలని కోరారు. ఈ అంశంపై ఇప్పటికే హైకోర్టులో రెండు కేసులు పెండింగ్లో ఉన్నాయని, మరికొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానుండటంతో అత్యవసరంగా విచారించాలని అభ్యరి్థంచారు. ఆయన కేసు వివరాల్లోకి వెళ్ళకముందే, జస్టిస్ విక్రమ్నాథ్ ఆయన్ను అడ్డుకున్నారు. ‘ముందు మీరు ఆర్టీకల్ 32 కింద ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి?’అని సూటిగా ప్రశ్నించారు. అయినప్పటికీ ఆయన ధర్మాసనాన్ని ఒప్పించేందుకు తీవ్రంగా ప్రయతి్నంచారు. తమ క్లయింట్ను ఇబ్బంది పెట్టేందుకే తెలంగాణ ప్రభుత్వం పని దినాల్లో చివరి రోజైన శుక్రవారం నాడు కీలకమైన సర్క్యులర్ జారీ చేసిందంటూ వాదించారు. తాము అత్యవసర విచారణ కోసం సాయంత్రం 6 గంటలకు హైకోర్టు న్యాయమూర్తి నివాసానికి కూడా వెళ్లా మని, కానీ అక్కడ ఉపశమనం లభించలేదని నివేదించారు. ఇక 9వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని, ఇప్పుడు కోర్టు జోక్యం చేసుకోకపోతే తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. దీంతో జస్టిస్ విక్రమ్నాథ్ జోక్యం చేసుకున్నారు. తొలుత ఆ అడ్డంకిని దాటండి ‘ముందు మీరు ఆ అడ్డంకిని దాటండి, ఆ తర్వాతే కేసు యోగ్యతపై (మెరిట్స్) మేము వాదనలు వింటాం’అని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. హైకోర్టులో అనుకూలమైన ఉత్తర్వులు రానంత మాత్రాన, సుప్రీంకోర్టును ప్రత్యామ్నాయంగా వాడుకోవాలని చూడటాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. న్యాయవాదిని ఉద్దేశించి.. ’మీ క్లయింట్లకు మీరు సరైన సలహా ఇచ్చి ఉండాల్సింది..’అని జస్టిస్ విక్రమ్నాథ్ వ్యాఖ్యానించారు. పిటిషన్ను ఉపసంహరించుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టును ఆశ్రయి ంచేందుకు స్వేచ్ఛ ఇచ్చారు.ఈ పరిణామంతో తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు సిద్ధమైన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీకి ఆ అవసరం లేకుండా పోయింది. కాగా సుప్రీం నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వానికి తాత్కాలికంగా ఊరట లభించినట్టయ్యింది. సుప్రీంకోర్టులో పిటిషన్ నేపథ్యంలో సోమవారం ఏం జరుగుతుందో, కోర్టు ఏం చెబుతుందో, స్థానిక ఎన్నికలు జరుగుతాయో లేదో అనే ఉత్కంఠ నెలకొంది. సర్వోన్నత న్యాయస్థానం పిటిషన్ను విచారించేందుకు నిరాకరించడంతో ఇక ఈ నెల 8వ తేదీన హైకోర్టులో జరిగే విచారణ, తీర్పు కీలకంగా మారనుంది. -
కొండ చరియలు.. విరిగిపడుతున్నాయ్!
కొండచరియలు విరిగిపడి పలువురి మృతి.. నిలిచిపోయిన రాకపోకలు.. యాత్రికుల అష్టకష్టాలు.. ఇలాంటి వార్తలు ఇటీవల ఎక్కువగా చూస్తున్నాం. కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనల్లో ప్రాణ, ఆస్తి నష్టం భారీగానే జరుగుతోంది. అందుకే దేశవ్యాప్తంగా ముప్పు ఉండే ప్రాంతాలను గుర్తించడంతోపాటు నష్ట నివారణ చర్యలను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. – సాక్షి, స్పెషల్ డెస్క్ పశ్చిమ బెంగాల్లోని మిరిక్, డార్జిలింగ్ హిల్స్లో కుండపోత వర్షాలకు కొండచరియలు విరిగిపడి అక్టోబరు 5న 20 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇళ్లు ధ్వంసమయ్యాయి. రహదారులు దెబ్బతిన్నాయి.⇒ ఆగస్టు నెలాఖరులో కురిసిన భారీ వర్షాలకు వైష్ణోదేవీ ఆలయ సమీపంలో కొండ చరియలు విరిగిపడి సుమారు 30 మంది మరణించారు. ⇒ జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్, హిమా చల్ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడితే కొండచరియలు విరిగి పడటం చాలాసహజం. ఆ సమయాల్లో ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతుంటారు. ⇒ 2024 జూలైలో కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు కూలిన ఘటనల్లో ఏకంగా 260కిపైగా చనిపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.మ్యాపింగ్ చేసిన జీఎస్ఐకొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ఎతై ్తన కొండ ప్రాంతాలను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) దేశవ్యాప్తంగా మ్యాపింగ్ చేసింది. 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 4.3 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ ముప్పు ప్రాంతాలు విస్తరించాయి.ముప్పును బట్టి..కొండచరియలు విరిగిపడే ముప్పు తీవ్రతను బట్టి తక్కువ, మధ్య, అధిక ప్రాంతాలుగా జీఎస్ఐ విభజించింది. ఇందులో 63 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అధిక ప్రమాద జోన్లో ఉందని తేలింది. అలాగే 1,26,000 చ.కి.మీ. మధ్యస్థంగా, 2,45,000 చ.కి.మీ. తక్కువ ప్రమాదం ఉన్న ప్రాంతంగా వెల్లడించింది. హిమాచల్ ప్ర దేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, లద్దాఖ్.. అధిక ప్ర మాదాన్ని ఎదుర్కొంటున్న ప్రాంతాలుగా ప్రకటించింది.అధిక స్పష్టతతో..రిమోట్ సెన్సింగ్, క్షేత్రస్థాయి సిబ్బంది ఆధారంగా కొండచరియలు విరిగిపడ్డ 91,000 సంఘటనల సమాచారాన్ని జీఎస్ఐ సేకరించింది. 33,904 ఘటనలను ధ్రువీకరించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి గుర్తించిన 200 కీలక ప్రాంతాల్లో మరింత అధునాతన మీసో–స్కేల్ మ్యాపింగ్కు శ్రీకారం చుట్టింది. వీటిలో ఈ ఏడాది మార్చి నాటికి 160 ప్రాంతాల్లో మ్యాపింగ్ పూర్తిచేసింది. 2028లోగా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తారు. పెళుసైన కొండ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల ప్రణాళిక, జోనింగ్ నిబంధనలు, కమ్యూనిటీ భద్రతకు ఈ అధిక స్పష్టత కలిగిన మ్యాప్స్ ఎంతో ఉపయోగపడతాయి.ముందస్తు హెచ్చరికలుప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కొండచరియల ముప్పు అంచనా సామర్థ్యాలను పెంచుతోంది. వాతావరణ శాఖ, ఇతర సంస్థల సహకారంతో జీఎస్ఐ అభివృద్ధి చేసిన ‘ప్రాంతీయ కొండచరియల అంచనా వ్యవస్థ (ఆర్ఎల్ ఎఫ్ఎస్)’.. వర్షపాతం, వాతావరణ పరిస్థితుల ఆధారంగా ముందస్తు హెచ్చరికలను అందిస్తోంది. జీఎస్ఐ ఈ సంవత్సరం రుతుపవనాలు ప్రారంభం కాగానే ఎనిమిది రాష్ట్రాల్లోని 21 జిల్లాల్లో చేపట్టాల్సిన కార్యాచరణతోపాటు కొండచరియలు విరిగిపడే ముప్పు ఉందని హెచ్చరించింది. ఈ జాబితాలో తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, కర్ణాటక ఉన్నాయి.దేశంలో కొండచరియల ముప్పు తీవ్రతను బట్టి విస్తీర్ణ శాతంతక్కువ 56మధ్యస్థం 29అధికం 15 -
ఎల్ లిల్లీ @ రూ 9వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఫార్మా రంగంలో ప్రపంచంలోనే దిగ్గజ కంపెనీ ఎల్ లిల్లీ తెలంగాణలో భారీ పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. దేశంలో తొలిసారిగా హైదరాబాద్లో తమ మాన్యుఫాక్చరింగ్ హబ్ (తయారీ కర్మాగారం)ను నెలకొల్పుతున్నట్లు వెల్లడించింది. దీని కోసం సుమారు రూ.9 వేల కోట్లు (ఒక బిలియన్ డాలర్లు) వెచ్చించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా తమ ఔషధాల సరఫరా సామర్థ్యాన్ని విస్తరించనుంది. సోమవారం ఎల్ లిల్లీ కంపెనీ ప్రతినిధులు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో భేటీ అయ్యారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు, ఎల్ లిల్లీ సంస్థ ప్రెసిడెంట్ ప్యాట్రిక్ జాన్సన్, సంస్థ ఇండియా ప్రెసిడెంట్ విన్సెలో టుకర్, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి సంజయ్ కుమార్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీ అనంతరం తమ విస్తరణ ప్రణాళికలు, రాష్ట్రంలో భారీ పెట్టుబడులపై ఎల్ లిల్లీ కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో దేశంలో అధునాతన తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. క్వాలిటీ హబ్ ఏర్పాటు హైదరాబాద్లో ఏర్పాటు చేసే మాన్యుఫాక్చరింగ్, క్వాలిటీ హబ్ తమకు అత్యంత కీలకమని ఎల్ లిల్లీ కంపెనీ ప్రకటించింది. ‘సంస్థ హైదరాబాద్ నుంచి దేశంలో ఉన్న ఎల్ లిల్లీ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ నెట్వర్క్కు సాంకేతిక పర్యవేక్షణ, నాణ్యత నియంత్రణ, అధునాతన సాంకేతిక సామర్థ్యాలను అందిస్తుంది. కొత్త హబ్ ఏర్పాటుతో తెలంగాణతో పాటు దేశంలో ఫార్మా రంగంలో పని చేస్తున్న వేలాది మంది ప్రతిభావంతులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. త్వరలో కెమిస్టులు, అనలిటికల్ సైంటిస్టులు, క్వాలిటీ కంట్రోల్, మేనేజ్మెంట్ నిపుణులు, ఇంజనీర్ల నియామకాలు చేపడతాం..’ అని తెలిపింది. ‘అమెరికాకు చెందిన ఎల్ లిల్లీ 150 ఏళ్లుగా ప్రపంచ వ్యాపంగా ఔషధాల తయారీ రంగంలో విశేషమైన సేవలను అందిస్తోంది. ఈ క్రమంలో మేక్ ఇన్ ఇండియా లక్ష్యానికి అనుగుణంగా దేశంలో తొలిసారిగా ఏర్పాటు చేస్తున్న ఈ అధునాతన యూనిట్ తెలంగాణను అత్యాధునిక ఆరోగ్య పెట్టుబడుల గమ్యస్థానంగా నిలబెడుతుంది. ప్రధానంగా డయాబెటిస్, ఓబెసిటీ, అల్జీమర్స్, క్యాన్సర్, ఇమ్యూన్ వ్యాధులకు సంబంధించిన ఔషధాలు, కొత్త ఆవిష్కరణలపై ఈ కంపెనీ పని చేస్తుంది. భారత్లో ఇప్పటికే గురుగ్రామ్, బెంగళూరులో ఎల్ లిల్లీ కంపెనీ కార్యకలాపాలున్నాయి..’ అని సంస్థ ప్రతినిధులు వివరించారు. జీనోమ్ వ్యాలీలో ఏటీసీ సెంటర్: సీఎం రేవంత్ ఫార్మా కంపెనీలను ప్రోత్సహించే ఫార్మా పాలసీని రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. జీనోమ్ వ్యాలీలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. జీనోమ్ వ్యాలీకి కావాల్సిన సాంకేతిక సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ‘హైదరాబాద్లో ఆగస్టు 4న ఎల్ లిల్లీ తన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ను ప్రారంభించింది. విస్తరణలో భాగంగా భారీ పెట్టుబడులకు ముందుకు రావటం తెలంగాణకు గర్వ కారణం. పెట్టుబడులతో వచ్చే కంపెనీలు, పరిశ్రమలకు మా ప్రభుత్వం అన్ని రకాలుగా మద్దతు ఇస్తుంది. హైదరాబాద్ ఇప్పటికే ఫార్మా హబ్గా పేరొందింది. ఎల్ లిల్లీ పెట్టుబడితో ఇప్పుడు ప్రపంచం దృష్టిని కూడా ఆకర్షిస్తుంది. 1961లో ఐడీపీఎల్ స్థాపించినప్పటి నుంచే హైదరాబాద్ దిగ్గజ ఫార్మా కంపెనీలకు చిరునామాగా మారింది. ప్రస్తుతం 40 శాతం బల్క్ డ్రగ్స్ హైదరాబాద్లోనే ఉత్పత్తి అవుతున్నాయి. కోవిడ్ వ్యాక్సిన్లు ఇక్కడే తయారయ్యాయి..’ అని సీఎం చెప్పారు. హైదరాబాద్లో ఎల్ లిల్లీ పెట్టుబడులు తెలంగాణలో పరిశ్రమల విస్తరణ తీరును ప్రతిబింబిస్తుందని మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
యువతకు ఆచరణాత్మక వ్యవసాయ శిక్షణ
సమీకృత ప్రకృతి వ్యవసాయాన్ని పూర్తి స్థాయి వృత్తిగా చేపట్టాలని భావించే యువతకు సరైన సమాచారంతో పాటు కొద్ది నెలల పాటు ఆచరణాత్మక శిక్షణ కూడా అవసరం. అటువంటి యువతకు ఆచరణాత్మక ప్రకృతి వ్యవసాయ జ్ఞానం అందించడానికి తెలంగాణలో రెండు సంస్థలు ఈ నెలలోనే ప్రత్యేక శిక్షణా శిబిరాలను ప్రారంభించనున్నాయి.సేంద్రియ పశుపోషణ, సమీకృత సేంద్రియ వ్యవసాయంలో 15 ఏళ్ల అనుభవం గల అక్షయకల్ప సంస్థ 3 నెలల ఉచిత ఫెలోషిప్ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనుంది. యువకులను రైతు పారిశ్రామికవేత్తలుగా లేదా రైతు విస్తరణ నిపుణులుగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా 19–27 ఏళ్ల మధ్య వయస్కులకు రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం ఈదులపల్లిలోని అక్షయకల్ప రీజనరేటివ్ వ్యవసాయ పరిశోధన–అభివృద్ధి కేంద్రంలో 3 నెలల రెసిడెన్షియల్ శిక్షణ ఇస్తారు. భోజన వసతులతో పాటు స్టైపెండ్ కూడా ఇస్తారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 2,300 మంది ప్రకృతి/సేంద్రియ రైతులకు శిక్షణ ఇచ్చి, నెలకు రూ. 1.2 లక్షలకు పైగా సంపాదించేలా ప్రాక్టికల్గా మార్గదర్శనం చేశామని అక్షయకల్ప ప్రతినిధి డాక్టర్ తేజేశ్వర్ రెడ్డి తెలిపారు. 30 మందితో త్వరలో ఒక బ్యాచ్ను ప్రారంభించనున్నామన్నారు. ఇతర వివరాలకు.. 89043 96761, 91132 03476.చౌహన్ క్యు సేద్యంపై 12 నెలల శిక్షణదక్షిణ కొరియాకు చెందిన డా. చౌహన్ క్యు ప్రకృతి వ్యవసాయ పద్ధతిపై న్యూ లైఫ్ ఫౌండేషన్(హైదరాబాద్) 12 నెలల పాటు యువతకు ఉచిత ఆచరణాత్మక శిక్షణ ఇవ్వనుంది. శాశ్వత ఎత్తుమడులపై ఉద్యాన పంటలను సాగు చేస్తూ అత్యంత తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించటం ఎలాగో నేర్పిస్తామని ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శివ సిందే తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ సమీపంలోని క్షేత్రంలో ఉచిత భోజన వసతులతో 12 నెలల పాటు శిక్షణ ఇస్తామని, పూర్తి చేసిన వారికి ధ్రువపత్రం ఇస్తామని అన్నారు. వ్యవసాయ డిప్లొమా విద్యార్థులకు స్టైపెండ్ ఇస్తామన్నారు.కనీస చదువు: 10 తరగతి. కనీస వయసు: 18 ఏళ్లు. ఇతర వివరాలకు.. 98660 73174. -
బైక్ ఈఎంఐ కట్టలేక వ్యక్తి మృతి
కరీంనగర్ జిల్లా: శంకరపట్నం మండలం ముత్తారం గ్రామానికి చెందిన సుమంత్ (24) అనే వ్యక్తి మద్యం మైకంలో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. MGM ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.సుమంత్ మద్యానికి బానిసై, తన బైక్ EMI కట్టలేక చనిపోయాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. -
హైదరాబాద్ భూముల వేలంలో సరికొత్త రికార్డు.. ఎకరా రూ.177 కోట్లు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో రికార్డులు బద్దలయ్యాయి. భూముల వేలంలో సరికొత్త రికార్డు ధర లభించింది. రాయదుర్గం నాలెడ్జ్ సిటీ భూముల వేలానికి ఊహించని స్పందన వచ్చింది. రాయదుర్గంలో ఎకరా భూమి ధర రూ.177 కోట్లు పలికింది. అత్యధిక ధరకు 7.6 ఎకరాల భూమిని ఓ రియల్ ఎస్టేట్ సంస్థ సొంతం చేసుకుంది. ఎకరా రూ.177 కోట్ల చొప్పున రియల్ ఎస్టేట్ సంస్థ వేలం పాట పాడింది.TGIIC నిర్వహించిన వేలంలో 7.67 ఎకరాల ల్యాండ్ పార్సిల్ను MSN రియాల్టీ దక్కించుకుంది. ప్రారంభ ధర ఎకరాకు రూ.101 కోట్లు ఉండగా, MSN రియాల్టీ ఏకంగా ఎకరా భూమిని రూ.177 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ లావాదేవీ మొత్తం విలువ సుమారు రూ.1356 కోట్లుగా ఉందని అధికారులు తెలిపారు. -
బస్సులకు డిజిటల్ పాస్లు.. యాప్లో బుకింగ్
హైదరాబాద్: తెలంగాణ ప్రజా రవాణా వ్యవస్థ మరింత స్మార్ట్గా మారుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (ఈఎస్డీ) విభాగం నిర్వహిస్తున్న ‘మీటికెట్’ యాప్ ద్వారా త్వరలో టీజీఆర్టీసీ ఇంటర్సిటీ బస్సు సేవలు & క్యూ ఆర్ ఆధారిత డిజిటల్ బస్ పాస్లు అందుబాటులోకి రానున్నాయి.స్టేట్ స్మార్ట్ మొబిలిటీ ప్రణాళికలో భాగంగా చేపట్టిన ఈ విస్తరణతో ప్రయాణికులకు మరింత సౌకర్యం లభించనుంది. ఇక నుంచి బస్సు టికెట్లు, నెలవారీ పాస్లు మొబైల్లోనే పొందవచ్చు. 2025 జనవరి 9న ప్రారంభమైన మీటికెట్ యాప్ ఇప్పటికే మంచి ఆదరణ పొందుతోంది. ఇప్పటి వరకు 1.35 లక్షల డౌన్లోడ్లు, 2.6 లక్షల టికెట్ బుకింగ్స్, రూ.2 కోట్లకు పైగా లావాదేవీలు నమోదయ్యాయి. యాప్ రేటింగ్ 3.5కు పైగా ఉండగా, ప్రస్తుతం 221 ప్రదేశాల్లో సేవలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ మెట్రో, 123 పార్కులు, 16 దేవాలయాలు, ఆరు మ్యూజియాలు, ఖుత్బ్ షాహీ సమాధులు వంటి ప్రదేశాలు ఈ సేవల్లో ఉన్నాయి.టీజీఆర్టీసీ సేవలు చేర్చడంతో ఇకపై సాధారణ, మెట్రో డీలక్స్, మెట్రో ఎక్స్ప్రెస్, గ్రీన్ మెట్రో లగ్జరీ (ఎసీ), పుష్పక్ ఎసీ బస్సులకు కూడా డిజిటల్గా టికెట్లు, పాస్లు పొందవచ్చు. ఇది విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు వంటి ప్రయాణికులకు మరింత సౌకర్యంగా ఉంటుంది. మొబైల్ యాప్ ద్వారా చెల్లింపు చేసుకోవచ్చు. దీంతో క్యూలలో నిలబడాల్సిన అవసరం ఉండదు.ప్రస్తుతం మీటికెట్ పరిధిలో 98 అటవీ ప్రదేశాలు, 52 పర్యాటక బోటింగ్ సెంటర్లు, 16 దేవాదాయ శాఖ దేవాలయాలు, 9 వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్ర పురావస్తు మ్యూజియం, గాంధీ సెంటెనరీ మ్యూజియం వంటి ప్రదేశాలను కూడా ఈ యాప్లో చేర్చారు. పర్యాటకులు, స్థానికులకు ఇది సులభతరం అవుతుందని అధికారులు తెలిపారు. టీజీఆర్టీసీ సేవల అధికారిక ప్రారంభ తేదీ త్వరలో ప్రకటించనున్నట్లు ఈఎస్డీ విభాగం వెల్లడించింది. ఇది రాష్ట్రంలో పౌర సౌకర్యాలను పెంచుతూ, డిజిటల్ గవర్నెన్స్ వైపు తెలంగాణ మరో ముందడుగు అని అధికారులు పేర్కొన్నారు. -
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: బిహార్ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ను ఈసీ విడుదల చేసింది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల 13 నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 21 వరుకు గడువు ఇచ్చింది. ఈ నెల 22న నామినేషన్ల పరిశీలన జరగనుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించింది. మాగంటి గోపీనాథ్ భార్య సునీతను బరిలోకి దించిన బీఆర్ఎస్.. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉంది.జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,99,000 కాగా, జూలై 1, 2025ను అర్హత తేదీగా తీసుకుని సవరించిన జాబితాలో 2,07,382 మంది పురుషులు, 1,91,593 మంది మహిళలు, 25 మంది ట్రాన్స్జెండర్ ఓటర్లు ఉన్నారు. లింగ నిష్పత్తి ప్రతి వెయ్యి పురుషులకు 924 మహిళలుగా ఉంది. ఈ జాబితాలో 6,106 మంది యువ ఓటర్లు (18–19 సంవత్సరాలు), 2,613 మంది వృద్ధులు (80 ఏళ్లు పైబడిన వారు), అలాగే 1,891 మంది వికలాంగులు ఉన్నారు.వీరిలో 519 మంది చూపు కోల్పోయిన వారు, 667 మంది కదలికల లోపం ఉన్న వారు, 311 మంది వినికిడి/మాట లోపం కలిగిన వారు, మిగతా 722 మంది ఇతర కేటగిరీలకు చెందినవారు. విదేశీ ఓటర్లు 95 మంది ఉన్నారు. సెప్టెంబర్ 2న విడుదలైన ప్రాథమిక జాబితాలో 3,92,669 ఓటర్లు ఉన్నారు. నిరంతర సవరణల తరువాత 6,976 మంది కొత్తగా చేర్చబడ్డారు, 663 మంది తొలగించబడ్డారు. దీంతో మొత్తం సంఖ్య 3,98,982కి చేరింది. సేవా ఓటర్లను కలుపుకుని తుది సంఖ్య 3,99,000గా నమోదైంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉపఎన్నిక నిర్వహణకు 139 కేంద్రాల్లో 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. -
బిహార్లో రెండు విడతల్లో ఎన్నికలు
సాక్షి,న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆసక్తిరేపుతోన్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రెండుదశల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఈ రోజు సాయంత్రం (అక్టోబరు 6న) 4 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ బిహార్ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల నవంబర్ 6న తొలిదశ ఎన్నికల పోలింగ్నవంబర్ 11 రెండోదశ ఎన్నికల పోలింగ్నవంబర్ 14న కౌంటింగ్ తొలిదశ ఎన్నికకు ఈ నెల 10న నోటిఫికేషన్ విడుదలబిహార్ అసెంబ్లీ స్థానాలు, ఓటర్ల వివరాలు బిహార్లో 243అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలుమొత్తం ఓటర్లు 7.42కోట్లు జూన్ 24నుంచి ఓటర్ల అభ్యంతరాలను స్వీకరించాంఆగస్టు 1న తుది జాబితా ప్రకటించాంనామినేషన్ల కంటే 10 రోజల ముందు వరకు ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోవచ్చుబీహార్లోని 243 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నవంబర్ 22 నాటికి పూర్తవుతాయి. 22ఏళ్ల తర్వాత బిహార్లో ఓటర్ల జాబితాను పూర్తిస్థాయిలో సంస్కరించాం. 90వేల 712కేంద్రాల్లో ఎన్నికల పోలింగ్ 14లక్షల మంది కొత్త ఓటర్లు100ఏళ్లకు పైబడిన ఓటర్లు మొత్తం 14వేలఎన్నికల్లో 17 సంస్కరణలు బిహార్ ఎన్నికల నుంచి 17 కొత్త సంస్కరణలు తీసుకొచ్చాంప్రతి పోలింగ్ స్టేషన్లో ఓటర్ల సంఖ్యను 1,200కి పరిమితం చేశాంగతంలో నలుపు, తెలుపు రంగులో ఉండే సీరియల్ నంబర్ ఫాంట్ను వినియోగించాం. అభ్యర్థుల ఫోటోలు ఇప్పుడు రంగులో ఉంటాయి. -
42 శాతం బీసీ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను కొట్టేసిన సుప్రీం
-
సుప్రీంకోర్టు తీర్పు శుభపరిణామం: కాంగ్రెస్ నేతలు
సాక్షి, హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట దక్కింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు స్పందిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు శుభపరిణామం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. హైకోర్టులో కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు.టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ..‘సుప్రీంకోర్టు తీర్పు శుభ పరిణామం. 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఆపాలని సుప్రీంకోర్టులో వేసిన కేసును కోర్టు కొట్టి వేయడాన్ని స్వాగతిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో అన్ని రకాలుగా పోరాటాలు చేసి సాధిస్తాం. ఇప్పటికే ప్రభుత్వం మూడు చట్టాలు, ఒక ఆర్డినెన్స్ ఒక జీవో ఇచ్చి బీసీ రిజర్వేషన్లు అమలు చేసేందుకు కృషి చేసింది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్లు రిజర్వేషన్ల అమలు కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. ఎనిమిదో తేదీన హైకోర్టులో కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నాము. బీసీలకు రాజకీయంగా 42 శాతం రిజర్వేషన్లు అమలు కోసం అన్ని వర్గాలు ప్రభుత్వానికి సహకరించాలి’ అని కోరారు.మరోవైపు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ..‘ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించాం. ఈ క్రమంలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వేసిన పిటిషన్ కొట్టేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం. రిజర్వేషన్ల కోసం జీవో కూడా విడుదల చేశాం’ అని చెప్పుకొచ్చారు. -
బీసీ రిజర్వేషన్లు.. తెలంగాణ సర్కార్కు సుప్రీంకోర్టులో ఊరట
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో(Supreme Court) ఊరట దక్కింది. తెలంగాణ స్థానిక ఎన్నికల్లో బీసీలకు(Telangana BC Reservations) 42 శాతం రిజర్వేషన్లను సవాల్ చేస్తూ వంగ గోపాల్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఈ సందర్భంగా హైకోర్టుకు(Telangana High Court) వెళ్లి తేల్చుకోవాలని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం.. పిటిషనర్కు సూచించింది.తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంలో గోపాల్ రెడ్డి పిటిషన్పై విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించిందన్న పిటిషనర్ తరఫు లాయర్ వివరణ ఇచ్చారు. అనంతరం, ధర్మాసనం రిజర్వేషన్లపై హైకోర్టులో స్టే నిరాకరిస్తే ఇక్కడికి వస్తారా? అని ప్రశ్నించింది. ఈ క్రమంలో హైకోర్టుకే వెళ్లాలని ఆదేశించింది. దీంతో, పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నట్టు చెప్పడంతో తన పిటిషన్ను వెనక్కి తీసుకునేందుకు పిటిషనర్ తరఫు న్యాయవాది అంగీకరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. అంతకుముందు.. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో-9 అమలుపై స్టే ఇవ్వాలని పిటిషన్లో గోపాల్రెడ్డి విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటుతున్నాయని పిటిషన్లో తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఇతర రిజర్వేషన్లు అన్నీ కలిపి కూడా 50 శాతం రిజర్వేషన్ దాటవద్దని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని ప్రస్తావించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన సీలింగ్ను ఎత్తివేస్తూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఎస్సీలకు15 శాతం రిజర్వేషన్, ఎస్టీలకు 10 శాతం, బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ 42 శాతంతో కలుపుకుంటే మొత్తం రిజర్వేషన్లు 67 శాతం అవుతున్నదని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే జీవో 9ను తక్షణమే రద్దుచేయాలని కోరారు. ఇది ముమ్మాటికీ పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285కు విరుద్ధమని పిటిషన్లో తెలిపారు. -
LBnagar Metro: ఎల్బీనగర్ మెట్రోస్టేషన్ ఫుల్.. కిలోమీటర్ క్యూ
సాక్షి, ఎల్బీనగర్: ఎల్బీనగర్ మెట్రో స్టేషన్(LbNagar Metro) వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దసరా తర్వాత సొంతూళ్ల నుంచి అందరూ సిటీకి చేరుకున్నారు. అనంతరం, ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు మెట్రోలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపించడంతో మెట్రో స్టేషన్ వద్ద భారీగా సందడి నెలకొంది.అయితే, ఒక్కసారిగా మెట్రో వద్దకు ప్రయాణికులు చేరుకోవడంతో టికెట్ కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. రద్దీ ఎక్కువగా ఉండటంతో మెట్రో రైలు సిబ్బంది.. ప్రయాణికులను క్యూ పద్దతిలో పంపిస్తున్నారు . ఈ క్రమంలో కిలోమీటర్ మేర ప్రయాణికులు లైన్ కట్టిన పరిస్థితి ఉంది. క్యూలైన్ల నుంచి ప్లాట్ఫామ్కు చేరుకోడానికి దాదాపు రెండు గంటలు పడుతోంది. ఈ కారణంగా మెట్రో సిబ్బంది తీరుపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. Shameless @HyderabadMetroR #LT @hydcitypolice@HYDTP@CPHydCity@ZC_LBNagar@lbnagarps@TheSiasatDaily@TimesNowNo proper security management to maintain the crowd. #Stampede at #LBNagar #MetroStationl pic.twitter.com/cr9OJNk53N— Citizen's Right (@citizensri8) October 6, 2025మరోవైపు.. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై వరుసగా రెండో రోజూ భారీగా ట్రాఫిక్జామ్ ఏర్పడింది. నల్గొండ జిల్లా చిట్యాల నుంచి పెద్దకాపర్తి వరకు సుమారు 4 కిలోమీటర్ల మేర రాకపోకలు స్తంభించిపోయాయి. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పెద్దకాపర్తి, చిట్యాల వద్ద వంతెన నిర్మాణ పనుల వల్ల ఈ సమస్య ఏర్పడింది. దసరా సెలవుల తర్వాత ప్రయాణికులు నగర బాట పట్టడంతో వాహనాల రద్దీ నెలకొంది.Huge traffic today too!People are returning to the city after the Bathukamma and Dussehra festivals, leading to huge traffic jams at Choutuppal on the National Highway. Large number of passengers are lined up at LB Nagar station as they travel back into the city. pic.twitter.com/DaBC4pjoo0— Revanth Chithaluri (@RevanthCh_) October 6, 2025ఇక, పంతంగి టోల్ ప్లాజాతో పాటు చౌటుప్పల్, దండు మల్కాపురం వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పోలీసులు వాహనాల రద్దీని క్రమబద్ధీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎల్బీనగర్ చింతలకుంట నుంచి కొత్తపేట వరకు భారీగా ట్రాఫిక్జామ్ ఏర్పడింది. చింతలకుంట పైవంతెనపై ట్రావెల్స్ బస్సులు నిలిచిపోయాయి. ట్రాఫిక్జామ్ కారణంగా కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు.Roads jammed, metro crammed#MondayMood #hyderabadmetro #traffic pic.twitter.com/83cxsfdy2Z— Kruthivarsh Koduru (@Kruthiivarsh) October 6, 2025 -
బీసీల రిజర్వేషన్లపై సస్పెన్స్.. ఢిల్లీలో మంత్రుల మంతనాలు
ఢిల్లీ: తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై(Telangana BC Reservations) అంశంపై నేడు సుప్రీంకోర్టులో(Supreme Court) విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు.. సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ఢిల్లీలో మంతనాలు జరుపుతున్నారు. న్యాయవాదులతో చర్చిస్తున్నారు. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యారు.తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Batti Vikramarka) ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున బీసీ రిజర్వేషన్ల కల్పన కోసం అభిషేక్ మనుసింఘ్వీతో వాదనలు వినిపిస్తాం. బీసీ రిజర్వేషన్ల కల్పనకు సుప్రీంకోర్టు అంగీకరిస్తుందని మాకు నమ్మకం ఉంది. ఇందిరా సహానీ కేసు తీర్పు ఆధారంగా తెలంగాణలో రిజర్వేషన్లు కల్పించవచ్చు. సీపెక్ సర్వే ద్వారా సమగ్రమైన జన గణన వివరాల ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తున్నాం. రిజర్వేషన్ల కల్పన కోసం హైకోర్టు, సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం వాదనలు వినిపిస్తుంది’ అని చెప్పుకొచ్చారు.బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) మాట్లాడుతూ..‘బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవద్దు. ఇతరుల రిజర్వేషన్లను మేము లాక్కోవడం లేదు. ఈ అంశంపై సుప్రీంకోర్టులో బలంగా వాదనలు వినిపిస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నదే మా ఉద్దేశం’ అని తెలిపారు. -
హౌరా ఎక్స్ప్రెస్లో సాంకేతిక లోపం.. గంటకుపైగా నిలిపివేత
సాక్షి, నల్గొండ: హౌరా-సికింద్రాబాద్ హౌరా ఎక్స్ప్రెస్(Howrah Express) రైలు ఇంజిన్లో సాంకేతిక లోపం ఏర్పడింది. ఈ క్రమంలో రైలును మిర్యాలగూడ (Miryalaguda) రైల్వేస్టేషన్ నిలిపివేశారు. టెక్నికల్ సమస్య కారణంగా రైలు.. రైల్వేస్టేషన్ ప్లాట్ఫామ్-1పై గంటలకు పైగా నిలిచిపోయింది. దీంతో, ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాంకేతిక సమస్య కారణంగా రామన్నపేట నుంచి మరో ఇంజిన్ తెప్పించేందుకు రైల్వే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
బీసీ రిజర్వేషన్లపై ఉత్కంఠ.. నేడు సుప్రీంకోర్టులో విచారణ
ఢిల్లీ: నేడు సుప్రీంకోర్టులో(Supreme Court) తెలంగాణ స్థానిక ఎన్నికల్లో(Telangana Elections) బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పిటిషన్పై(BC Reservations) విచారణ జరగనుంది. వంగ గోపాల్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ చేపట్టనుంది. తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ గోపాల్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో-9 అమలుపై స్టే ఇవ్వాలని పిటిషన్లో గోపాల్రెడ్డి విజ్ఞప్తి చేశారు. వంగా గోపాల్రెడ్డి పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం విచారించనున్నది. గోపాల్రెడ్డి ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటుతున్నాయని పిటిషన్లో తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఇతర రిజర్వేషన్లు అన్నీ కలిపి కూడా 50 శాతం రిజర్వేషన్ దాటవద్దని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని ప్రస్తావించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన సీలింగ్ను ఎత్తివేస్తూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఎస్సీలకు15 శాతం రిజర్వేషన్, ఎస్టీలకు 10 శాతం, బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ 42 శాతంతో కలుపుకుంటే మొత్తం రిజర్వేషన్లు 67 శాతం అవుతున్నదని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే జీవో 9ను తక్షణమే రద్దుచేయాలని కోరారు. ఇది ముమ్మాటికీ పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285కు విరుద్ధమని పిటిషన్లో తెలిపారు.ఇక, ఇప్పటికే హైకోర్టులో అదే అంశంపై పిటిషన్ విచారణలో ఉన్నందున హైకోర్టులో తేల్చుకోండని, అక్కడ తేలకపోతే ఇక్కడికి రావాలని సుప్రీంకోర్టు చెప్తుందా? లేదా ఇంకా ఏమైనా కీలక వ్యాఖ్యలు చేస్తుందా? అనే అంశంపై బీసీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. న్యాయంగా అయితే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాల్సిందేనని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.మరోవైపు.. ఈ ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు జారీచేసిన జీవోపై సుప్రీంకోర్టులో జరగనున్న విచారణపై ఉత్కంఠ నెలకొంది. ఈ జీవో చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్రెడ్డి ఇటు అధికారులను, అటు పార్టీ నేతలను ఆదేశించారు. -
సతాయిస్తోందంటూ.. అత్తను చంపిన కోడలు
మహబూబ్ నగర్ జిల్లా: ఇంట్లో నిత్యం గొణుగుతూ తనను సతాయిస్తోందంటూ వృద్ధురా లైన అత్తను ఓ కోడలు రాడ్డుతో కొట్టి చంపింది. ఈ అమానుష ఘటన వనపర్తి జిల్లా రేవల్లి మండలంలోని నాగపూర్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. రేవల్లి ఎస్సై రజిత కథనం ప్రకారం నాగపూర్ గ్రామానికి చెందిన ఎల్లమ్మ (73), దసరయ్య దంపతులకు నలుగురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఎల్లమ్మ భర్త దసరయ్య కొన్నాళ్ల క్రితం మృతిచెందడంతో కుమారుడు మల్ల య్య వద్ద ఎల్లమ్మ ఉంటోంది. అయితే కోడలు బొగురమ్మతో తరచూ ఆమె గొడవ పెట్టుకొనేది. దీంతో ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమ యంలో ఎల్లమ్మను బొగురమ్మ రాడ్డుతో కొట్టగా ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలియజేయడంతో వారు ఘటనాస్థలికి చేరుకొని నిందితురాలిని అరెస్ట్ చేశారు. తనను ఇబ్బందులకు గురిచేస్తుండటంతో తానే చంపానని బొగురమ్మ పోలీసుల ఎదుట నేరం అంగీకరించింది. ఈ ఘటనపై ఎల్లమ్మ రెండో కూతురు బచ్చమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
సినీ నటిపై దాడి.. యువకుడిపై కేసు
హైదరాబాద్: తన అపార్ట్మెంట్ ముందు పార్కింగ్ స్థలంలో ఓ వ్యక్తి బహిరంగ మూత్ర విసర్జన చేస్తుండగా ఇదేమిటని అడిగినందుకు ఆ యువకుడు కోపంతో సినీనటితో పాటు ఆమె పీఏపై దాడి చేసి గాయపర్చిన ఘటన పంజగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎల్లారెడ్డిగూడలో నివసించే సినీ నటి ఈ నెల 1వ తేదీన దైవ దర్శనం చేసుకుని ఇంటికి వస్తుండగా అపార్ట్మెంట్ ముందు పార్కింగ్ స్థలంలో దేవేందర్ అనే వ్యక్తి బహిరంగ మూత్ర విసర్జన చేస్తున్నాడు. దీంతో నటి పీఏ బయటకు వచ్చి దేవేందర్ను ఇదేమి పద్ధతి అని నిలదీశాడు. దీంతో దేవేందర్ ఆగ్రహంతో ఊగిపోతూ మరో ఇద్దరు మహిళలతో కలిసి న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ దాడికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో దేవేందర్ తనపై కూడా దాడి చేశాడని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ బాధిత నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పంజగుట్ట పోలీసులు దాడికి పాల్పడ్డ నిందితుడిపై బీఎన్ఎస్ సెక్షన్ 74, 115 (2), 79, 292 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
యూనిఫాం తీసేసి పబ్స్లో ఎంజాయ్..!
సాక్షి, సిటీబ్యూరో: రాజధానిలోని పబ్ కల్చర్ యువతలోనే కాదు.. ఐపీఎస్లు, అత్యున్నత అధికారుల్లోనూ పెరిగిపోయింది. వీకెండ్ వచి్చందంటే చాలు అనేక మంది యూనిఫాం తీసేసి పబ్స్లో వాలిపోతున్నారు. ఈ పరిణామం స్థానిక పోలీసులకు.. ప్రధానంగా స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఆ అధికారులకు అవసరమైన ప్రొటోకాల్ సేవలు చేయడంతో పాటు బిల్లులు విషయంలోనూ నానా తంటాలు పడుతున్నారు. ఇప్పుడు కింది స్థాయి పోలీసు వర్గాల్లో ఇదే హాట్ టాపిక్గా మారడంతో నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఒకప్పుడు ఆదాయ మార్గాలుగా.. రాజధానిలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో పని చేసే కొందరు అధికారులకు అనేక ‘ఆదాయ మార్గాలు’ ఉంటాయి. అలాంటి వాటిలో భూ వివాదాలతో పాటు వైన్షాపులు, బార్లు, పబ్స్ కూడా ఉంటాయి. ఈ కారణంగానే ఇవి ఎక్కువగా ఉన్న పోలీసుస్టేషన్లకు మంచి డిమాండ్ ఉంటుంది. అక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్గా (ఎస్హెచ్ఓ) పోస్టింగ్ పొందడానికి ఏ స్థాయి పైరవీ చేయడానికైనా సిద్ధమవుతుంటారు. ఇటీవల కాలంలో పబ్స్ ఉన్న పోలీసుస్టేషన్ల ఎస్హెచ్ఓల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రధానంగా హైదరాబాద్తో పాటు సైబరాబాద్ కమిషనరేట్లోని కొన్ని ఠాణాల్లో పని చేస్తున్న వారి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. వీకెండ్ వచ్చిందంటే చాలు వీరికి నిద్రపట్టట్లేదు. అధికారుల తాకిడే ప్రధాన కారణం.. ఒకప్పుడు ఎస్హెచ్ఓలకు తన బ్యాచ్మేట్స్, స్నేహితులు, పరిచయస్తుల నుంచే పబ్లకు సంబంధించిన సిఫార్సులు వచ్చేవి. తామో, తమ సంబం«దీకులో ఫలానా పబ్కు వెళ్తున్నారని, బిల్లులో ఎంతో కొంత తగ్గించేలా చూడాలని కోరేవారు. అలా వచ్చే వాళ్లు కూడా కొన్ని పబ్స్కే వెళ్లడానికి ఆసక్తి చూపించడం ఎస్హెచ్ఓలకు తలనొప్పిగా మారేది. కొన్నాళ్లుగా కొన్ని పబ్స్కు పోలీసు విభాగానికే చెందిన అత్యున్నత అధికారుల తాకిడి పెరిగింది. వీకెండ్ వచ్చిందంటే చాలా వీళ్లు తమ స్నేహితులు, సన్నిహితులతో వాలిపోతున్నారు. పబ్స్లో ప్రత్యేక కార్యక్రమాలు, కొందరి ఆర్కెస్ట్రాలు ఉన్నప్పుడు ఎంట్రీకి భారీ డిమాండ్ ఉంటుంది. అలాంటి సమయాల్లోనూ తాము వస్తున్నామని, తొలి వరుసలో, ప్రత్యేకంగా సీట్లు కావాలంటూ ఆయా అధికారులు హుకుం జారీ చేస్తుండటం స్థానిక అధికారులకు ఇబ్బందికరంగా మారుతోంది. తగ్గింపు కాదు పూర్తిగా ‘భరింపు’... పబ్స్కు వస్తున్న పోలీసు ఉన్నతా«ధికారులకు ప్రొటోకాల్ సంబంధిత మర్యాదలూ స్థానిక పోలీసులకు తప్పట్లేదు. సాధారణంగా ఆయా అధికారులు ఆలస్యంగా వస్తుంటారు. దీంతో వారిని రిసీవ్ చేసుకోవడానికి, సపర్యలు చేయడానికి కనీసం ఓ హోంగార్డుని కేటాయించాల్సి వస్తోంది. ఇంత వరకు సర్దుకుపోతున్నా.. బిల్లుల వద్దకు వచ్చేసరికి కొందరు అధికారుల తీరు ఎస్హెచ్ఓలకు కొత్త తలనొప్పులు తెస్తోంది. ఆయా అధికారులకు ఆ పబ్లో లభించే అతి ఖరీదైనవే సరఫరా చేయాల్సి ఉంటుంది. వాటికి సంబంధించిన బిల్లుల్లో రాయితీ కోరితే కొంత వరకు ఇబ్బంది ఉండదు. అయితే కొందరు అధికారులు అసలు బిల్లులే చెల్లించకుండా వెళ్లిపోతున్నారు. దీంతో పబ్స్ యజమానుల నుంచి ఒత్తిడి పెరిగడంతో ఎస్హెచ్ఓలే వాటిని చెల్లించాల్సి వస్తోంది. కొన్ని పోలీసుస్టేషన్లకు చెందిన ఎస్హెచ్ఓలు నెలకు గరిష్టంగా రూ.2 లక్షల వరకు తమ ‘కష్టార్జితం’ ఇలాంటి చెల్లింపుల కోసం వెచి్చంచాల్సి వస్తోంది. సమయం మీరినా కొనసాగింపు... ఇలాంటి అత్యున్నత అధికారులు పబ్స్కు వచ్చినప్పుడు అతిథి మర్యాదలు, బిల్లుల చెల్లింపులతో పాటు సమయం అనేదీ ఎస్హెచ్ఓలకు ఇబ్బందికరంగా ఉంటోంది. తమ దైనందిన విధులు, ఇతర కార్యకలాపాలు ముగించుకునే ఆయా అధికారులు చాలా ఆలస్యంగా పబ్స్కు వస్తున్నారు. వాటి సమయం ముగిసినప్పటికీ తమ పారీ్టలు పూర్తికాలేదంటూ కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఎస్హెచ్ఓల ద్వారా పబ్ నిర్వాహకులు, యజమానులపై ఒత్తిడి చేస్తున్నారు. దీంతో గత్యంతరం లేక ప్రధాన ద్వారాలు మూసేసి, ఇతరుల్ని పంపించేసి కొన్ని పబ్స్ నడిపించాల్సి వస్తోంది. సాధారణ సమయంలో సమయం మీరినా, పరిమితికి మించి మ్యూజిక్ పెట్టినా కేసులు నమోదు చేస్తుంటామని, అలాంటిది ఇలాంటి ఉన్నతాధికారుల కోసం తాము ఉల్లంఘనలు చేయిస్తే మరోసారి కేసులు ఎలా నమోదు చేస్తామంటూ ఎస్హెచ్ఓలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇది కింది స్థాయి అధికారుల్లో హాట్టాపిక్గా మారడంతో నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. -
గ్రేటర్ హైదరాబాద్ ప్రయాణికులపై చార్జీల మోత
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో పెంచిన ఆర్టీసీ చార్జీలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి. అదనపు చార్జీల వల్ల ప్రయాణికులపై ప్రతి నెలా దాదాపు రూ.15 కోట్ల వరకు భారం పడనుంది. ప్రస్తుతం నగరంలో ప్రతి రోజు సుమారు రూ.2.5 కోట్లు టికెట్లపై నగదు రూపంలో లభిస్తుండగా, మరో రూ.4 కోట్ల వరకు మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు అందజేసే ఉచిత ప్రయాణ సదుపాయం నుంచి రీయింబర్స్మెంట్ ఆర్టీసీ ఖాతాలో జమ అవుతున్నాయి. మొత్తంగా ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్లో ప్రతిరోజూ రూ.6.5 కోట్లు లభిస్తున్నాయి. పెంచిన చార్జీలు రోజుకు రూ.50 లక్షల చొప్పున నెలకు రూ.15 కోట్ల వరకు ఆదాయం లభించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆర్టీసీ లెక్కల ప్రకారం నగరంలో నిత్యం సుమారు 25 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. వీరిలో 16 లక్షలకు పైగా మహిళా ప్రయాణికులు. 9 లక్షల మంది పురుషులు ప్రయాణిస్తున్నారు. దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సులు.. నగరంలోని 25 డిపోల నుంచి 3,100 బస్సులు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. వీటిలో ప్రస్తుతం 265 ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. ఈ ఏడాది చివరి నాటికి మరో 275 ఈవీ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. దశలవారీగా గ్రేటర్లో 2027 నాటికి 2,800 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఎలక్ట్రిక్ బస్సులకు చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు హైటెన్షన్ కనెక్షన్ల కోసం రూ.8 కోట్ల వరకు ఖర్చవుతోంది. రానున్న రోజుల్లో 2,800 కొత్త ఎలక్ట్రిక్ బస్సుల కోసం 19 డిపోల్లో చార్జింగ్ కేంద్రాల ఏర్పాటును లక్ష్యంగా చేసుకొని ప్రస్తుతం టికెట్ చార్జీలు పెంచినట్లు అధికారులు తెలిపారు. నిర్వహణ ఖర్చులే అధికం.. గ్రేటర్ ఆర్టీసీకి రోజుకు రూ.6.5 కోట్లు లభిస్తున్నప్పటికీ నిర్వహణ వ్యయం కూడా అదే స్థాయిలో ఉన్నట్లు అధికారుల అంచనా. ప్రస్తుతం గ్రేటర్లోని 25 డిపోల్లో సుమారు 1,5000 మంది పని చేస్తున్నారు. వీరిలో 7,000 మంది కండక్టర్లు. 5,700 మంది డ్రైవర్లు. మిగతా వారిలో మెకానిక్లు, శ్రామిక్లు మొదలుకొని డిపోల్లో వివిధ స్థాయిల్లో పని చేసే అధికారులు, ఉద్యోగులు ఉన్నారు. ఆర్టీసీకి లభించే ఆదాయంలో సుమారు 50 శాతం సిబ్బంది జీతభత్యాలకే ఖర్చవుతోంది. మరో 25 శాతం ఇంధనం కోసం విని యోగిస్తుండగా, వివిధ అవసరాల కోసం మిగతా మొత్తాన్ని వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఎలాంటి లాభనష్టాల్లేకుండా బస్సులను నడపడమే ఆర్టీసీకి సవాల్గా మారింది. ఈ క్రమంలో తాజాగా పెంచిన చార్జీలతో ప్రయాణికులకు భారమే అయినా ఆరీ్టసీకి మాత్రం కొంత ఊరటగా చెప్పవచ్చు. చార్జీల పెంపు మచ్చుకు ఇలా.. సిటీ ఆర్డినరీ, మెట్రోఎక్స్ప్రెస్, ఈ–ఆర్డినరీ, ఈ–ఎక్స్ప్రెస్ బస్సుల్లో మొదటి మూడు స్టేజీలకు రూ.5 చొప్పున పెంపు. 4వ స్టేజి నుంచి రూ.10 అదనపు చార్జీ. మెట్రో డీలక్స్, ఈ– మెట్రో ఏసీ సరీ్వసుల్లో మొదటి స్టేజీకి రూ.5 చొప్పున పెంచారు. రెండో స్టేజీ నుంచి రూ.10 చొప్పున పెంపు. ఈ లెక్కన ప్రస్తుతం రూ.20 చెల్లించి ప్రయాణం చేసేవారు ఇక నుంచి రూ.30 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఈసీఐఎల్ నుంచి సికింద్రాబాద్ వరకు ఇప్పటి వరకు రూ.30 ఉండగా, సోమవారం నుంచి రూ.40 చొప్పున చార్జీ ఉంటుంది. అలాగే.. మెహిదీపట్నం నుంచి సికింద్రాబాద్ వరకు రూ.25 నుంచి రూ.35 వరకు పెరగనుంది. మియాపూర్ –అమీర్పేట్ల మధ్య రూ.60 నుంచి రూ.70కి పెరగనుంది. -
మూసీలోకి భారీ వరద
సాక్షి, సిటీబ్యూరో/మణికొండ : మూసీలోకి వరద ప్రవాహం పెరిగింది. జంట జలాశయాల 10 గేట్లు 3 అడుగుల చొప్పున ఎత్తి దిగువకు సుమారు ఐదు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండటంతో వరద ఉద్ధృతి పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి ఉస్మాన్సాగర్, హిమాయత్ సాగర్లకు వరద ప్రవాహం పెరిగింది. ఇప్పటికే రెండు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం వరకు నీరు చేరడంతో ఆదివారం ఎగువ నుంచి వచి్చన వరదను దిగువకు విడుదల చేశారు. దీంతో దిగువ ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. ఉస్మాన్ సాగర్ (గండిపేట) 8 గేట్లను మూడు అడుగుల మేర ఎత్తి మూసీ నదికి 2,704 క్యూసెక్కుల వరద నీటిని వదిలారు. దీంతో నార్సింగి, హైదర్షాకోట్, మంచిరేవుల నుంచి మూసీ నది పొంగి ప్రవహిస్తోంది. హిమాయత్ సాగర్కు పైనుంచి 1,600 క్యూసెక్కుల వరద వస్తుండటంతో రెండు గేట్లను మూడు అడుగుల మేర ఎత్తి 1,981 క్యూసెక్కుల నీటిని ఈసీ నదికి వదిలారు. లంగర్హౌస్లో మూసీ నదిలో కలవటంతో అక్కడి నుంచి మరింత ఉద్ధృతంగా నీరు ప్రవహిస్తోంది. గండిపేట నుంచి 8 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తుండటంతో నార్సింగి మున్సిపాలిటీ కేంద్రం నుంచి మంచిరేవులకు, ఔటర్ ఓ వైపు సరీ్వసు రోడ్ల మీదుగా నీరు పారటంతో రాకపోకలను నిలిపివేశారు. పరీవాహక ప్రాంతం నుంచి వచ్చే వరదను బట్టి మరిన్ని గేట్లను తెరవటం, మూయటం చేస్తామని మూసీ నదీ పరీవాహకంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలమండలి, రెవెన్యూ, పోలీసు అధికారులు సూచించారు. జలాశయాల నీటి విడుదలతో స్థానికులు కొందరు గాలాలతో చేపలు పడుతూ కనిపించారు. -
చికాగోలో హైదరాబాద్ యువకుడి దుర్మరణం
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో మరో తెలుగు వ్యక్తి దుర్మరణం పాలయ్యారు(Telugu Man Dies in US Chicago). చికాగోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసి మరణించినట్లు సమాచారం. మృతుడిని హైదరాబాద్ చంచల్గూడకి చెందిన షెరాజ్ మెహతాబ్ మొహమ్మద్(25)గా గుర్తించారు. ఆదివారం ఇల్లినాయిస్ ఈవెన్స్టన్ వద్ద జరిగిన ప్రమాదంలో షెరాజ్(Sheraz Chicago Road Accident) అక్కడిక్కడే మరణించినట్లు తెలుస్తోంది. ఈ వార్తతో హైదరాబాద్లోని అతని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఉన్నత స్థాయి అవకాశాల కోసం తమ కుమారుడు దేశంకాని దేశం వెళ్లి ఇలా మరణించడంటూ ఆయన తండ్రి అల్తాఫ్ మొహమ్మద్ చెబుతున్నారు. మృతదేహాన్ని ఇక్కడికి రప్పించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే.. డల్లాస్లో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో చంద్రశేఖర్ పోలే అనే హైదరాబాదీ యువకుడు మరణించిన ఘటన తెలిసిందే. 48 గంటలు తిరకగ ముందే మరో నగరవాసి రోడ్డు ప్రమాదంలో మరణించడం అక్కడి భారతీయ కమ్యూనిటీలో ఆందోళన రేకెత్తిస్తోంది. -
ఓటీటీ వీక్షకులు @ 60 కోట్లు
సకుటుంబ సపరివార సమేతంగా... టీవీ ముందు కూర్చుంటున్నారు. అది కేబుల్ కనెక్షన్ టీవీ కాదు.. ‘కనెక్టెడ్ టీవీ’. అందులో తమకు నచ్చిన సినిమా లేదా వెబ్ సిరీస్ లేదా షో చూస్తున్నారు. సంప్రదాయ టీవీ చానళ్లలో కాదు.. ఓటీటీ వేదికల్లో. ఇదే ఇప్పుడు ట్రెండ్. ఇది కరోనా తరవాత రికార్డు స్థాయిలో దేశమంతా పాకేసింది. దేశంలో ఓటీటీ చూస్తున్న ప్రేక్షకుల సంఖ్య రికార్డు స్థాయిలో 60 కోట్లకు ఎగబాకిందన్న అంచనాలే ఇందుకు నిదర్శనం. అంటే దేశ జనాభాలో 40 శాతానికిపైగా ఓటీటీలకు అలవాటుపడ్డారన్నమాట.టీవీ కొనాలంటే.. వందసార్లు ఆలోచించడం లేదు. హాల్లోకి సరిపోయే పెద్ద సైజు టీవీని.. అది కూడా స్మార్ట్ టీవీనే కొనేస్తున్నారు. ‘మార్డోర్ ఇంటెలిజెన్స్’ అంచనా ప్రకారం 2025లో దేశీయ స్మార్ట్ టీవీ మార్కెట్ విలువ 22.39 బిలియన్ డాలర్లు. 2023లో ఇది సుమారు 11 బిలియన్ డాలర్లే. స్మార్ట్ టీవీల కొనుగోళ్లు ఎంతలా పెరిగాయో చెప్పడానికి ఈ అంకెలే నిదర్శనం. అంత ఖరీదైన టీవీ కొన్నాక.. సాధారణ కేబుల్ టీవీ ఒక్కటే ఉంటే ఏం బాగుంటుంది? అందుకే, ఏదో ఒకటి లేదా అంతకుమించి ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసేసుకుంటున్నారు. అంతే, ఎంచక్కా ఇక సకుటుంబ సపరివార సమేతంగా సినిమాలు, వెబ్ సిరీస్లు, షోలు చూస్తున్నారు. దేశంలో ఇటీవలి కాలంలో ఈ ధోరణి పెరిగింది.కనెక్టెడ్ టీవీలో..: ఒకప్పుడు కేబుల్ టీవీ ప్రతి ఇంటా సర్వసాధారణంగా ఉండేది. ఇప్పుడు దాని స్థానాన్ని కనెక్టెడ్ టీవీ ఆక్రమిస్తోంది. కనెక్టెడ్ టీవీ అంటే ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యే టీవీ. ఇది మధ్య తరగతి, ఆపై స్థాయి కుటుంబాల్లో సర్వసాధారణం అయిపోయింది. మీడియా కన్సల్టింగ్ సంస్థ ఆర్మాక్స్ మీడియా ‘ఓటీటీ ఆడియన్స్ రిపోర్ట్ 2025’ ప్రకారం.. కనెక్టెడ్ టీవీ వీక్షకుల సంఖ్య 2024లో 6.97 కోట్లు మాత్రమే ఉండేది. 2025లో అది ఏకంగా 12.92 కోట్లకు పెరిగింది. అంటే.. దాదాపు రెట్టింపు అయిందన్నమాట.ఆకట్టుకునే కంటెంట్అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, జియో హాట్స్టార్ వంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో విభిన్నమైన కంటెంట్తో వెబ్సిరీస్లు, సినిమాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కంటెంట్కు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. ఆర్మాక్స్ అంచనా ప్రకారం.. దేశంలో ఓటీటీ వీక్షకుల (నెలలో కనీసం ఒక్కసారైనా ఓటీటీ వీడియో చూసినవారు) సంఖ్య 60 కోట్లకుపైనే. 2024తో పోలిస్తే ఇది దాదాపు 10 శాతం ఎక్కువ. దేశ జనాభాలో ఇది 40 శాతానికిపైనే. వీక్షకులు పెరగడంతో ఓటీటీల్లో దేశీయ భాషల్లో వచ్చే వెబ్సిరీస్ల సంఖ్య కూడా పెరుగుతోంది. ఓటీటీల్లోనే విడుదల చేసే సినిమాలూ పెరుగుతున్నాయి. సెలవు రోజుల్లోనూ... రాత్రుళ్లు భోజన సమయాల్లోనూ కుటుంబ సభ్యులతో అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, ఆహా, జీ5, సోనీ లివ్.. ఇలాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో నచ్చిన సినిమా లేదా రియాలిటీ షో లేదా వెబ్సిరీస్ చూడటం సర్వసాధారణం అయిపోయింది.దేశంలో ఓటీటీ చందాదారుల సంఖ్య (సుమారుగా)⇒ జియో హాట్స్టార్ 30 కోట్లు⇒ అమెజాన్ ప్రైమ్ 2.8 కోట్లు⇒ నెట్ఫ్లిక్స్ 1.23 కోట్లుఆర్మాక్స్ మీడియా నివేదిక ప్రకారం.. 2025 జనవరి–జూన్ మధ్య ప్రసారమైన ఒరిజినల్స్లో వీక్షకులు అత్యధికంగా చూసినవి వెబ్ సిరీస్లే. వీక్షకుల పరంగా టాప్–50 ఒరిజినల్స్లో 80 శాతం వాటా వెబ్ సిరీస్లు కైవసం చేసుకోవడం విశేషం. ఆ తరవాతి స్థానంలో సినిమాలు, రియాలిటీ షోలు ఉన్నాయి. -
నాలుగు పేర్లతో ఏఐసీసీకి జూబ్లీహిల్స్ లిస్ట్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక కోసం కాంగ్రెస్ పార్టీ షార్ట్లిస్ట్ను సిద్ధం చేసినట్టు తెలిసింది. ఆదివారం ప్రజా భవన్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సన్నాహక సమావేశంలో నలుగురి పేర్లతో కూడిన జాబితాను ఖరారు చేసినట్లు సమాచారం. పోటీ రేసులో దానం నాగేందర్, గడ్డం రంజిత్రెడ్డి, బొంతు రామ్మోహన్, అంజన్కుమార్ యాదవ్, నవీన్ యాదవ్, కంజర్ల విజయలక్ష్మి యాదవ్, సీఎన్రెడ్డి, మురళీగౌడ్ల పేర్లు వినిపించాయి. వాటి నుంచి మూడు పేర్లతోపాటు మరో కొత్తపేరును జోడించి నలుగురి పేర్లతో జాబితాను ఏఐసీసీకి పంపినట్లు సమాచారం.అయితే, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే అభ్యర్థి ప్రకటన ఉంటుందని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. కాగా, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి ఎంపికైన మాజీ క్రికెటర్ అజారుద్దీన్ మనస్సు మార్చుకుని తనకు జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు తెలిసింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఇక్కడ పోటీ చేసేందుకు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడినట్లు ప్రచారం జరిగింది. అయితే, తాను రాజీనామా చేయట్లేదు ఆయన ప్రకటించారు.గెలిచి తీరాలన్న పట్టుదలతో..బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు అయిన జూబ్లీహిల్స్ స్థానంలో కచ్చితంగా గెలిచి తీరాలని అధికార కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. త్వరలో వెలువడే బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్తోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ కూడా వస్తుందనే అంచనాల నేపథ్యంలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇప్పటికే మంత్రులు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లను రంగంలోకి దింపి పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించింది. ఆదివారం జరిగిన కీలక సమావేశానికి ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ హాజరై 22 మంది పరిశీలకులకు మార్గదర్శనం చేశారు.టికెట్ ఎవరికి వచ్చినా కలిసి పని చేయాలని స్పష్టంచేశారు.పోలింగ్ బూత్ స్థాయి ఇన్చార్జీలకు కూడా మీనాక్షి దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ తదితరులు కూడా పాల్గొన్నారు. పోలింగ్ బూత్లవారీగా పార్టీ పరిస్థితిని సమీక్షించారు. సర్వేలు సానుకూలంగా ఉన్నాయని, అభ్యర్థి ఎంపిక తర్వాత ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని మీనాక్షి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించి పార్టీని గెలిపించాలని కోరారు. -
దక్షిణాదిపై బీజేపీ వివక్ష: హరీశ్
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొదటి నుంచి దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపుతోందని, మనం పండించే వడ్ల కన్నా, ఉత్తర భారతంలో పండించే గోధు మలకు ధర ఎక్కువ ఉండడమే ఇందుకు నిదర్శనమని మాజీమంత్రి టి హరీశ్రావు అన్నారు. కామారెడ్డి జిల్లా లోని నాగిరెడ్డిపేట, గాంధారి మండలాల్లో ఆదివారం ఆయన పర్యటించారు. నాగిరెడ్డిపేట మండలం బంజర శివారులో మంజీర ప్రవాహంతో మునిగిన పంటలను పరిశీలించారు.అనంతరం గాంధారి మండల కేంద్రంలో బీఆర్ఎస్లో బీజేపీ నేతల చేరిక కార్యక్రమంలో హరీశ్రావు పాల్గొని మాట్లా డారు. 2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకేసారి అధికారంలోకి వచ్చాయని, అప్పుడు వడ్లు క్వింటాల్కు మద్దతు ధర రూ.1,400, గోధుమలు క్వింటాల్కు మద్దతు ధర రూ.1,400 ఉండేవని, ఇప్పుడు వడ్ల ధర రూ.2,369 ఉంటే, గోధుమల ధర రూ.2,585 కు చేరిందన్నారు. ఉత్తర భారతంలో గోధుమలు పండించడం వల్లే ధర ఎక్కువగా ఇస్తూ, దక్షిణాన ముఖ్యంగా తెలంగాణలో పండించే వడ్లకు తక్కువ ధర ఉండడం కేంద్రం వివక్ష కాదా అని ప్రశ్నించారు. వరద బాధితులకు సాయం ఏదీ..ఇటీవల కామారెడ్డి జిల్లాలో వరదలు సంభవిస్తే, స్వయంగా వచ్చి చూసిన సీఎం పదిహేను రోజుల్లో రివ్యూ చేస్తానని చెప్పి నెల రోజులు గడిచినా రివ్యూ లేదని, మొహం చాటేశాడన్నారు. కాంగ్రెస్ పాలనపై తెలంగాణ ప్రజలు విసిగిపోయారని, కేసీఆర్ రావాలని ఊరూరా కోరుకుంటున్నారని చెప్పారు. -
నగర ప్రజలపై కక్షతోనే బస్సు చార్జీల భారీ పెంపు
సాక్షి, హైదరాబాద్: జంట నగరాల్లో సిటీ బస్సు కనీస చార్జీల పెంపు నిర్ణయం హైదరాబాద్ ప్రజలపై కాంగ్రెస్ కక్ష సాధింపు చర్య అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు ఆరోపించారు. గత ఎన్నికల్లో జంట నగరాల్లో కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారన్న కసితోనే ఈ చర్యలకు దిగుతున్నారని విమర్శించారు. పేద, మధ్యతరగతి ప్రయాణికుల జేబులను గుల్ల చేసేందుకే జంట నగరాల్లో సిటీ బస్సు కనీస చార్జీలను ఏకంగా రూ.10 పెంచాలని రేవంత్రెడ్డి సర్కారు నిర్ణయం తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇప్పటికే అల్లాడుతున్న ప్రజలపై ఈ చార్జీల పెంపు పిడుగులాంటిదని, ప్రతి ప్రయాణికుడిపై నెలకు కనీసం రూ.500 అదనపు భారం పడుతుందన్నారు. సిటీలో బస్సు చార్జీల పెంపు నిర్ణయాన్ని ఖండిస్తూ కేటీఆర్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. బస్సు చార్జీల పెంపు రేవంత్ అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు. ఉచిత బస్సు పథకంతో ఆర్టీసీని దివాలా తీయించిన కాంగ్రెస్, ఇప్పుడు సామాన్యుల నడ్డి విరవాలని చూస్తోందని ఆయన ధ్వజమెత్తారు. -
బీసీ రిజర్వేషన్ల సాధన ప్రజాప్రభుత్వ లక్ష్యం
సాక్షి, హైదరాబాద్ /లక్డీకాపూల్: రాష్ట్రంలోని వెనుకబడిన తరగతులకు విద్య, ఉద్యోగ, స్థానిక రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి అసెంబ్లీలో బీసీ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించిందన్నారు. దాన్ని రాష్ట్రపతికి పంపించామని, ఆర్డినెన్స్ జారీ చేసి రాష్ట్ర గవర్నర్కు పంపించామని, అయితే వాటికి ఆమోదం రాకపోవడం బాధాకరమని చెప్పారు. సీఎం రేవంత్రెడ్డి బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కానప్పటికీ, బీసీ రిజర్వేషన్ల విషయంలో చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు.ఆదివారం లక్డీకాపూల్లోని ఓ హోటల్లో జాతీయ బీసీ సంఘం ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీల ప్రజాప్రతినిధులు, కుల సంఘాలు, మేధావుల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అధ్యక్షతన జరిగిన సమావేశానికి వాకిటి శ్రీహరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ ‘బీసీ రిజర్వేషన్లు సాధించాలన్న కసి మనందరికీ ఉంది. ఇప్పుడు సాధించకుంటే భవిష్యత్లో సాధించడం అసాధ్యమనిపిస్తోంది. రిజర్వేషన్ల సాధనకు పార్టీలకతీతంగా బీసీ ప్రజాప్రతినిధులు, మేధావులు కలిసి ఉద్యమించాలి. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిందంతా చేసింది. గతంలో తమిళనాడులో జయలలిత బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా, ఆమోదం తెలిపింది.ఇప్పుడు బిల్లు ప్రవేశపెట్టి 6 నెలలు కావొస్తున్నా కేంద్రం నుంచి స్పందన లేదు. కొందరు ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వంపై బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీ బిల్లు ఆమోదానికి కేంద్రంపై ఒత్తిడి తేవాలి. బీసీలకు న్యాయం జరగాలని బండి సంజయ్ ఇంటికి వెళ్లి మరీ కలిసి పోరాటం చేద్దామన్నాను. కాంగ్రెస్ పార్టీకే క్రెడిట్ వస్తుందని మద్దతు తెలపడం లేదు’అని చెప్పారు. ⇒ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ ‘బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రక్రియ రాజ్యాంగ సవరణతోనే సాధ్యమవుతుంది. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చిన తర్వాతే రిజర్వేషన్ల అమలు సాధ్యమవుతుంది. ఈ విషయం తెలిసినా, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తోంది’అని చెప్పారు. ⇒ ఎంపీ ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ ‘వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు దక్కాలంటే తెగించి పోరాడాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్తమ అడ్వొకేట్లను నియమిస్తే కేసు తప్పకుండా గెలిచే అవకాశం ఉంది’ అన్నారు. ⇒ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య మాట్లాడుతూ ‘రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రభుత్వం చెప్పింది. ఆ మేరకు రిజర్వేషన్లు అమలు చేయాలి. బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. విద్య, ఉద్యోగ, వైద్య రంగంలో బీసీలకు ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేయాలి’అన్నారు.ఈ సమావేశంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్గౌడ్, మాజీ ఎంపీ వీహెచ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
సంపన్న దేశాల.. ఆహార విధ్వంసం
ప్రపంచంలోని సంపన్న దేశాల ఆహారపుటలవాట్లు మారితే.. చాలావరకు కాలుష్యం తగ్గిపోతుంది! చెప్పాలంటే 30 శాతం సంపన్నుల వల్ల.. 70 శాతం ఆహార సంబంధ పర్యావరణ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి!! ప్రపంచ ప్రసిద్ధ ‘ఈఏటీ – లాన్సెట్ కమిషన్’ వెల్లడించిన వాస్తవమిది. ఇటీవలి కాలంలో ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ ఆహార తయారీలో వాడుతున్న రసాయనాలు, ప్లాస్టిక్స్, పురుగుమందులు.. ఇవన్నీ పెనుముప్పును తెచ్చిపెట్టనున్నాయి అని ఆందోళన వ్యక్తం చేసింది. ఆహార వ్యవస్థలు మారకపోతే భవిష్యత్తులో మానవాళికి ఆరోగ్యకరమైన ఆహారం కలగా మారిపోతుందని హెచ్చరించింది.ఈఏటీ – లాన్సెట్ కమిషన్లో.. 6 ఖండాల్లో ఉన్న అనేక దేశాల్లోని పోషకాహార, వాతావరణ, ఆర్థిక, ఆరోగ్య, సామాజిక శాస్త్రాలకు చెందిన అంతర్జాతీయ నిపుణులు సభ్యులు. ‘ఆహార ఉత్పత్తి, వినియోగం ద్వారా ఉత్పన్నమయ్యే ఉద్గారాలు.. శిలాజ ఇంధనాల కంటే ప్రమాదకరమైనవి’ – వీళ్లంతా ముక్తకంఠంతో చెబుతున్న మాట ఇది. ఇప్పటికిప్పుడు శిలాజ ఇంధనాల వాడకాన్ని పూర్తిగా ఆపేసినా.. ప్రస్తుత ఆహార వ్యవస్థలు ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీల సెల్సియస్కు పెంచగలవని వీరు హెచ్చరిస్తున్నారు. ఆహార వ్యవస్థల వల్ల ఏటా 16 – 17.7 గిగా టన్నుల కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలోకి విడుదల అవుతోంది. ఇవి మొత్తం భౌగోళిక ఉద్గారాల్లో 30 శాతం!5 లక్షల కోట్ల డాలర్లు!ఇప్పుడున్న ఆహార వ్యవస్థలు ఇలాగే కొనసాగితే.. ఏటా 15 లక్షల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లుతుందని.. అనేక దేశాల శాస్త్రవేత్తలు సభ్యులుగా ఉన్న ‘ఫుడ్ సిస్టమ్ ఎకనామిక్స్ కమిషన్’ అంచనా వేసింది. అదే, ఈ ఆహార వ్యవస్థలకు కొత్త రూపు ఇస్తే ఆరోగ్యకరమైన సమాజం, పర్యావరణ వ్యవస్థల పునరుజ్జీవం వంటి పరిణామాల వల్ల ఏటా 5 లక్షల కోట్ల డాలర్లు ఆర్థిక వ్యవస్థలోకి వస్తాయని చెబుతోంది. ఈ మార్పులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా రెడ్ మీట్ ఉత్పత్తి, ప్రాసెసింగ్, పంపిణీ వంటివి 33 శాతం తగ్గాలని తెలిపింది. పండ్లు, కూరగాయలు, గింజల ఉత్పత్తి 63 శాతానికి పెరగాలని సూచించింది. ఇందుకోసం కమిషన్ మరో 8 పరిష్కార మార్గాలనూ ప్రపంచ దేశాల ముందు ఉంచింది. ఇవన్నీ అమలు జరిగితేనే.. 2050 నాటికి క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ భూమిపై ఉండే 960 కోట్ల జనాభాకూ ఆరోగ్యకరమైన ఆహారం అందుతుందని తెలిపింది.అష్ట పరిష్కారాలు⇒ ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులో ఉంచడం⇒ సంప్రదాయ వంటకాలు / ఆహారాలను పరిరక్షించడం⇒ సుస్థిర ఉత్పత్తి పద్ధతులు అమలు చేయడం⇒అడవుల వంటి చెక్కుచెదరని పర్యావరణ వ్యవస్థలను కాపాడటం⇒ ఆహార వృథాను అరికట్టడం⇒ గౌరవప్రదమైన వృత్తి లేదా పని, తద్వారా గౌరవప్రదమైన సంపాదన⇒ అణగారిన వర్గాలపై వివక్ష చూపకుండా ఉండటం⇒ అణగారిన వర్గాల వారికి అన్ని అవకాశాలూ కల్పించడంపీహెచ్డీ ఆహారంప్రపంచ ప్రజల ఆరోగ్య సమస్యలకు, వాతావరణ సమస్యలకు పరిష్కారంగా ‘ప్లానెటరీ హెల్త్ డైట్ (పీహెచ్డీ)’ ఆహారాన్ని ఈఏటీ – లాన్సెట్ కమిషన్ సూచించింది. ఇందులో మొక్కల నుంచి వచ్చే ఆహారం పాళ్లు ఎక్కువగా, జంతువుల నుంచి వచ్చే ఆహారం చాలా తక్కువగా ఉంటుంది. చక్కెరలు, సంతృప్త కొవ్వులు, ఉప్పు చాలా మితంగా ఉంటాయి. పీహెచ్డీ ఆహారం వల్ల టైప్ 2 మధుమేహం, హృద్రోగాలు, కేన్సర్ల వంటి తీవ్ర అనారోగ్య సమస్యలు తగ్గుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది ఆరోగ్యానికీ, పర్యావరణానికీ మంచిదని రుజువైంది. ఆహార వ్యవస్థల వల్ల వచ్చే ఉద్గారాలు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయంటే..⇒ మూడో వంతు వ్యవసాయం నుంచి⇒ మూడో వంతు భూ వినియోగ మార్పిడి ద్వారా⇒ మూడో వంతు ప్రాసెసింగ్, రవాణా, రిటైల్ వంటి సరఫరా వ్యవస్థల వల్ల -
బిగ్ఫిక్స్ రాకుంటే 'బైబై'
సాక్షి, హైదరాబాద్: సంప్రదాయ కోడింగ్తో కొలువులు నెట్టుకొస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులకు టెక్నాలజీ రంగంలో తెరపైకి వచ్చిన ‘బిగ్ఫిక్స్’ సవాల్ విసురుతోంది. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత టూల్ కోడింగ్కు అనుగుణంగా నైపుణ్యాలకు పదునుపెట్టుకోని వారి ఉద్యోగాలకు ఎసరు పెడుతోంది. ఇప్పటికే కొన్ని బహుళజాతి కంపెనీలు ‘అప్డేట్’ కాని ఉద్యోగులకు లేఆఫ్లు (ఉద్యోగాల నుంచి తొలగించడం) ప్రకటించగా మరికొన్ని సంస్థలు అదే బాటలో పయనిస్తున్నాయి. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీలు (నాస్కామ్) ఇటీవల బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ)తో కలిసి ఏఐపై చేపట్టిన అధ్యయనంలో ఈ ఆశ్చర్యకర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సర్వే ప్రకారం దేశవ్యాప్తంగా ఏటా ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్న దాదాపు 12 లక్షల మంది విద్యార్థుల్లో 68 శాతం మంది ఎమర్జింగ్ కోర్సులు చేస్తుండగా వారిలో 5 లక్షల మందే ఉద్యోగాలు పొందుతున్నారు. అలా కొలువులు సాధించిన వారిలోనూ ఏఐ ఆధారిత ఉద్యోగాలు చేస్తున్నది 3 లక్షల మందే. వాళ్లలోనూ సామర్థ్యాలను మెరుగుపరుచుకోనందుకు దాదాపు 1.20 లక్షల మంది ఏడాది తిరగకుండానే లేఆఫ్ లేఖలు అందుకుంటున్నారు. మిగతా వాళ్లలో 20 శాతం మందే సుమారు రూ. 40 లక్షల వార్షిక వేతనం అందుకుంటున్నారు. ఏమిటీ ‘బిగ్ఫిక్స్’? విలువైన డేటాతో నిక్షిప్తమయ్యే లేదా బిడ్ డేటా సెంటర్లకు అనుసంధానమయ్యే కంప్యూటర్లు, సర్వర్లు, ల్యాప్టాప్ల వంటి పరికరాలను ఆటోమేటిక్గా మేనేజ్ చేయడాన్నే బిగ్ఫిక్స్ అంటారు. ప్రస్తుతం సాఫ్ట్వేర్ కంపెనీలు సెక్యూరిటీ కోసం సరికొత్త కోడింగ్, మాడ్యూల్స్ను అనుసరిస్తున్నాయి. సాధారణ కోడింగ్ నుంచి ఏఐ టూల్ కోడింగ్కు అప్డేట్ అయితే తప్ప బిగ్ఫిక్స్ తేలికగా అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. ఈ రూట్లో వెళ్లలేని సీనియర్ టెకీలు ఇప్పుడు లేఆఫ్లకు గురవుతున్నారు. బిగ్ డేటా కేంద్రాలపై ఆధారపడే బహుళజాతి సంస్థలు సరైన శిక్షణ ఇవ్వకపోవడం కూడా ఇందుకు సమస్యగా మారుతోంది. సమీకృత ఏఐ ఆటోమేషన్లో సర్వర్ల స్థితి, సెక్యూరిటీ లాగ్స్, రిసోర్స్ యూజ్లను ట్రాక్ చేయడానికి మారుతున్న కోడింగ్ కీలకంగా నిలుస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఏఐ కోడ్ జనరేషన్పై ఎప్పటికప్పుడు ఆప్డేట్ అయితే తప్ప ఉద్యోగంలో అభివృద్ధి కనిపించదని అంటున్నారు. కోడింగ్ కొత్తగా.. ఏఐ రంగంలో ఎప్పటికప్పుడు గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గతంలోలాగా ఒకే మోడల్ కాకుండా మల్టీ ఏజెంట్స్ కొలాబరేషన్తో ఏఐ పనిచేస్తోంది. మారుతున్న ఈ మోడల్స్ను ఏఐ ఏజెంట్ సిస్టమ్గా పిలుస్తున్నారు. ఉదాహరణకు మెటా కోడ్ ఏజెంట్పై 2024 నుంచి అనేక పరిశోధనలు చేశారు. ఇప్పుడిది ఇంటెలిజెన్స్ డేటా సెంటర్లో కోడ్ రాసే స్థాయికి ఎదిగింది. ఈ కోడ్ను ప్రాక్టికల్గా పరీక్షించడం, తప్పులు సరిచేయడం చేస్తుంది. ‘ఆటోడెవ్’ ఫ్రేమ్వర్క్ కొన్ని మోడల్స్తో కలిసి కొత్త సాఫ్ట్వర్ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోంది. ఐఐటీ మద్రాస్, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, యూరోపియన్ ఏఐ అలయన్స్ కొత్తగా ఎథికల్ ఏఐ కోడ్ జనరేషన్, ట్రాన్స్ఫరెన్స్ ఏఐ రైటింగ్ కోడ్, ఏఐ జనరేటెడ్ అకౌంటబులిటీ ఫ్రేమ్వర్క్ను తీసుకొచ్చాయి. దీంతో వాటి మూలాలు, పనిచేసే విధానం, వాటికి మెరుగైన ప్రోగ్రామింగ్ ఇవ్వడంలో మెళకువలు ఉన్న ఏఐ నిపుణులు మాత్రమే ఈ వేగాన్ని అందుకొనే పరిస్థితి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎమర్జింగ్ కోర్సుల్లో కొత్తదనం ఏదీ? కొన్ని కాలేజీలు ఇంకా దశాబ్దకాలం నాటికి సీ, సీ ప్లస్ కోడింగ్తోనే ఎమర్జింగ్ కోర్సులు మొదలు పెడతున్నాయి. ఐఐటీలు, ఎన్ఐటీలు కొన్ని ఆధునిక కోడ్ను అనుసరిస్తున్నాయి. ఏఐ మోడల్స్ స్వయంగా అల్గోరిథంను అనుసరిస్తున్నాయి. ఉదాహరణకు ఇంటర్నెట్లో ఏదైనా సెర్చ్ చేస్తే దానికి సంబంధించిన సమాచారం ఆటోమేటిక్గా వస్తోంది. 600కుపైగా ప్రోగ్రాములతో రూపొందించిన కోడ్ టీ5 ప్లస్, స్టార్ కోడ్ 2 వంటి జనరేటివ్ మోడల్స్ ఇప్పటికీ ఐఐటీలకే పరిమితం అవుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లో బోధిస్తున్న ఎమర్జింగ్ కోర్సుల్లో ఈ తరహా మోడల్స్ ఉండటంలేదు. దీంతో ఏఐఎంఎల్, డేటా సైన్స్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు సైతం టెక్నాలజీ రౌండ్, కోడింగ్ రౌండ్లలో ప్రతిభ చూపలేకపోతున్నారు. ఫలితంగా ఫ్రెషర్స్ ఏఐ కోర్సుల ద్వారా ఆశించిన ఉద్యోగాలు పొందలేని స్థితి నెలకొంది. మారాల్సిందే ఎమర్జింగ్ కోర్సులు చేస్తున్న విద్యార్థులతోపాటు సాఫ్ట్వేర్ ఉద్యోగులు సైతం మారుతున్న ఏఐ కోడ్కు అప్డేట్ కావాలి. లేకపోతే ఈ రంగంలో నిలదొక్కుకోవడం కష్టం. కొన్ని బహుళజాతి కంపెనీలు ఈ దిశగా శిక్షణ ఇస్తున్నాయి. ఆన్లైన్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా విద్యార్థులు, ఉద్యోగులు నైపుణ్యం సాధించాలి. – డాక్టర్ కేపీ సుప్రీతి, కంప్యూటర్ సైన్స్ విభాగం అధిపతి, జేఎన్టీయూహెచ్ లేఆఫ్లు తప్పట్లేదు టెక్ రంగంలో అనుభవం ఉన్నవాళ్లు కూడా పరిమిత కాలంలో ఏఐ కోడింగ్ను నేర్చుకోవడం, కొత్త కోడింగ్లో నైపుణ్యం పొందడంలో విఫలమవుతున్నారు. వారికి ప్రాజెక్టులు అప్పగించడం కంపెనీలకు కష్టంగా ఉంది. ఎందుకంటే డేటా సెంటర్తో అనుసంధానమయ్యే కంపెనీ సమాచారాన్ని కాపాడే సామర్థ్యం వారికి ఉండటం లేదు. అందుకే లేఆఫ్లు ఇవ్వడం అనివార్యమవుతోంది. – పరిమళ సిద్ధార్థ్, ఓ ఏఐ సంస్థ హెచ్ఆర్ మేనేజర్ -
కోటా.. ఉత్కంఠ!
సాక్షి, హైదరాబాద్/ సాక్షి, న్యూఢిల్లీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ల అంశం రాజకీయంగా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 9 జారీ చేయడం, అనంతరం స్థానిక ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇచ్చిన దరిమిలా హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులోనూ జీవో కొట్టివేయాలని కోరుతూ పిటిషన్లు దాఖలైన విషయం విదితమే. కాగా వాటిపై విచారణ జరగనుండటంతో కోర్టులు ఏం చెబుతాయోనన్న చర్చ పార్టీల్లో జరుగుతోంది. ముఖ్యంగా రిజర్వేషన్లు 50 శాతం మించకూడదంటూ గతంలో సుప్రీంకోర్టు పరిమితి విధించగా..ఇప్పుడదే సర్వోన్నత న్యాయస్థానంలో సోమవారం బీసీ రిజర్వేషన్ల సంబంధిత పిటిషన్ విచారణకు రానుండడంతో.. న్యాయస్థానం ఏం తీర్పునిస్తుంది? ఆ తీర్పు భవిష్యత్తులో రిజర్వేషన్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆసక్తి నెలకొంది. ఒకవేళ హైకోర్టులో కూడా కేసు ఉన్నందున తొలుత అక్కడ విచారణ కొనసాగనివ్వాలని సుప్రీంకోర్టు చెపితే ఈ నెల 8వ తేదీన విచారణ సందర్భంగా హైకోర్టులో ఏం జరుగుతుంది? బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పన ఓకే అవుతుందా? అసలు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయా..? వాయిదా పడతాయా..? అనే చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అటు ప్రభుత్వం.. ఇటు కాంగ్రెస్ బిజీ బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయాలనే పట్టుదలతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, అధికార కాంగ్రెస్ పార్టీ.. సుప్రీం విచారణ నేపథ్యంలో అప్రమత్తమయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి నివాసంలో కీలక భేటీ జరిగింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బి.మహేశ్కుమార్గౌడ్లు పాల్గొన్నారు. సుప్రీంకోర్టులో వాదనలకు సంబంధించిన కార్యాచరణపై సీఎం ఈ సందర్భంగా దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించేలా చూడాలని ఆయన సూచించినట్లు తెలిసింది. రిజర్వేషన్ల పరిమితి విషయంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను ప్రభుత్వం అనుసరించిందనే విషయంతో పాటు రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్రపతి, గవర్నర్కు పంపిన ఆర్డినెన్సు, బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, ప్రభుత్వ ఆలోచనకు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు అసెంబ్లీ సాక్షిగా మద్దతిచ్చాయని, ఈ విషయంలో రాజకీయ ఏకాభిప్రాయం ఉందనే విషయాన్ని స్పష్టంగా సుప్రీం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పినట్టు తెలిసింది. మరోవైపు సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించనున్న సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సంఘ్వీ, సిద్దార్ధ దవేలతో కూడా ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గడువు విధించడాన్ని, ఇతర అంశాలను ఆయన వివరించినట్లు తెలిసింది. కాంగ్రెస్ కార్యాచరణ ఈ సమావేశం అనంతరం ప్రజాభవన్లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్తో భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, మహేశ్గౌడ్తో పాటు మంత్రి వాకిటి శ్రీహరి సమావేశమయ్యారు. పార్టీ పరంగా ఏం చేయాలన్న దానిపై చర్చించారు. సుప్రీంకోర్టులో తమ వాదనలు కూడా గట్టిగా వినిపించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఢిల్లీలో సమన్వయం చేసుకునే బాధ్యతలను డిప్యూటీ సీఎంకు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఆయనతో పాటు ఇద్దరు మంత్రులు ఆదివారం రాత్రికే హస్తినకు చేరుకున్నారు. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన వెంటనే ఢిల్లీకి చేరుకున్న బీసీ సంక్షేమ శాఖకు చెందిన అధికారుల బృందంతో కలిసి న్యాయవాదులతో కూలకషంగా చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను సవాల్ చేస్తూ వంగా గోపాల్రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నెల 4న ఆయన ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరపనుంది. అఖిల పక్షం భేటీ బీసీల రిజర్వేషన్లపై హైదరాబాద్ వేదికగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. అధికార కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్, బీజేపీ, ప్రజా సంఘాల ప్రతినిధులు హాజరై బీసీల రిజర్వేషన్లకు మరోమారు మద్దతు ప్రకటించారు. బీసీలకు రిజర్వేషన్ల కల్పనను వ్యతిరేకిస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్లో ఇంప్లీడ్ కావాలని ఇప్పటికే నిర్ణయించిన బీసీ సంఘాలు.. సుప్రీంకోర్టులో జరిగే విచారణకు కూడా హాజరు కానున్నాయి. మరోవైపు బీసీల రిజర్వేషన్లను అడ్డుకుంటే రాష్ట్రంలో అగ్గిరాజేస్తామని ఆ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. తమకు అందివచ్చిన రిజర్వేషన్లను అడ్డుకుంటే సహించేది లేదని, ఈ నెల 7వ తేదీన పూలే విగ్రహాల వద్ద నిరసనలు తెలియజేస్తామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఇలావుండగా సుప్రీంకోర్టు తీర్పును బట్టి కార్యాచరణ రూపొందించుకునేందుకు బీసీ సంఘాల జేఏసీ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో సమావేశం కావాలని నిర్ణయించింది. అందరి దృష్టీ దీనిపైనే.. కోర్టులు ఇచ్చే తీర్పులకు అనుగుణంగా రాజకీయంగా ఎలా ముందుకెళ్లాలనే కార్యాచరణ రూపొందించుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీలు సిద్ధమవుతున్నాయి. ఒకవేళ బీసీ రిజర్వేషన్లను సాధించలేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వంపై మూకుమ్మడి దాడికి ప్రణాళిక రూపొందించుకుంటున్నాయి. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల్లో కూడా టెన్షన్ నెలకొంది. ఇంకోవైపు కోర్టుల తీర్పుల అనంతరం రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ఎలా ముందుకెళ్లాలన్న దానిపై ఎన్నికల సంఘం కూడా ఇప్పటికే కార్యాచరణ రూపొందించుకోవడం గమనార్హం. మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో సోమవారం సుప్రీంకోర్టు విచారణ అనంతరం స్పష్టత వస్తుందా? ఈ నెల 8న హైకోర్టు విచారణ వరకు వేచి ఉండాల్సి వస్తుందా? అనే దానిపై సందిగ్ధత నెలకొంది. రిజర్వేషన్లు అడ్డుకునే ప్రయత్నాలు విరమించుకోవాలి: మంత్రి పొన్నం ఢిల్లీ వెళ్లడానికి ముందు శంషాబాద్ విమానాశ్రయంలో మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయత్నాలను విరమించుకోవాలని కోరారు. సుప్రీంకోర్టు కేసులో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు కూడా ఇంప్లీడ్ కావాలని, అసెంబ్లీలో చెప్పిన అభిప్రాయాలను కోర్టుకు వెల్లడించాలని విజ్ఞప్తి చేశారు. తాము కూడా అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో రిజర్వేషన్ల పెంపు బిల్లును ఆమోదించిందన్న విషయాన్ని కోర్టుకు తెలియజేస్తామని చెప్పారు. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని అన్నారు. -
అమానుషం.. యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన గ్రామస్తులు
సాక్షి,హైదరాబాద్: మెదక్ జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది. బైక్లను దొంగిలించాడనే నెపంతో ఓ దొంగను చెట్టుకు కట్టేసిన గ్రామస్తులు అతడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. ఈ దుర్ఘటనలో 90 శాతం కాలిన గాయాలతో బాధితుడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.పోలీసుల వివరాల మేరకు.. మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామంలో దారుణం జరిగింది. బైక్ దొంగతనం చేయబోయిన ఇద్దరు యువకుల్లో ఒకరిపై గ్రామస్తులు పెట్రోల్ పోసి నిప్పంటించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.చిన్నశంకరంపేట మండలం జంగరాయి గ్రామానికి చెందిన మహిపాల్, యవాన్ అనే ఇద్దరు యువకులు. పార్క్ చేసిన బైక్లను చోరీ చేసి మార్కెట్లో అమ్ముకుని జీవనం కొనసాగిస్తుంటారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి వడియారం గ్రామంలో ఓ బైక్ను దొంగతనం చేశారు. దొంగతనానికి వస్తూ వస్తూ..అక్కరకొస్తుందని ఓ బాటిల్ పెట్రోల్ను వెంట తెచ్చుకున్నారు.అయితే దొంగిలించిన బైక్లో పెట్రోల్ లేకపోవడంతో నిర్మానుష్య పప్రాంతానికి తీసుకెళ్లి బండిలో పెట్రోల్ నింపాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా బండిని కొంతదూరం నెట్టుకుని వెళ్లారు. సరిగ్గా అదే సమయంలో దుర్గామాత నిమజ్జనోత్సవానికి వెళుతున్న యువకులు బైక్ చోరీ చేసిన నిందితుల్ని గుర్తించారు. యువకులు దాడి చేసేందుకు ప్రయత్నించగా.. మహిపాల్ పరారయ్యాడు. యవాన్ను స్తంభానికి కట్టారు. అతని జేబులో ఉన్న పెట్రోల్ను తీసుకుని తగలబెట్టారు. యవాన్ 90 శాతం కాలిన గాయాలతో తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు బాధితుణ్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిపాల్ను అదుపులోకి తీసుకున్నారు. యవాన్పై దారుణానికి తెగబడ్డ గ్రామస్తులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోనున్నారు. -
Hyderabad: ఓఆర్ఆర్.. వరుసగా ఢీకొన్న ఏడు కార్లు
సాక్షి,హైదరాబాద్: రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఏడు కార్లు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కార్లు దెబ్బతిన్నాయి. అందులోని ప్రయాణికులకు గాయాలయ్యాయి. కార్లలోని ప్రయాణికులతో పాటు ఇతర వాహనదారులు గాయపడ్డారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ప్రమాదం ఆదివారం(అక్టోబర్ రాజేంద్రనగర్ నుంచి అప్పా జంక్షన్ వైపు వస్తుండగా జరిగింది.ఓ కారు డ్రైవర్ మితిమీరిన వేగంతో వెళ్లి ఒక్కసారి బ్రేక్ వేశాడు. దీంతో దాని వెనుక వస్తున్న ఏడుకార్లు వరుసగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని అత్యవసర చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
6.53 కిలోల భారతీయ పాంగోలిన్ స్కేల్స్ స్వాధీనం
హన్మకొండ: చట్టవిరుద్ధంగా పాంగోలిన్ స్కేల్స్ వ్యాపారం నిర్వహిస్తున్న నిందితులను తెలంగాణలోని హన్మకొండలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు పట్టుకున్నారు. వారి నుంచి 6.53 కిలోల భారతీయ పాంగోలిన్ స్కేల్స్ను స్వాధీనం చేసుకున్నారు.పాంగోలిన్ అనేది చెదపురుగులను తినే ఒక ప్రత్యేక తరహా క్షీరదం. దీని పొలుసులకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. సంప్రదాయ చైనీస్ వైద్యంలో పాంగోలిన్ స్కేల్స్ ఉపయోగిస్తారు. ప్రపంచంలో అత్యధికంగా అక్రమంగా రవాణా చేసే క్షీరదాలలో పాంగోలిన్లు ఒకటి. కాగా చట్టవిరుద్ధంగా పాంగోలిన్ స్కేల్స్ వ్యాపారాన్ని కొందరు నిర్వహిస్తున్నారనే నిర్దిష్ట నిఘా సమాచారం మేరకు డీఆర్ఐ హైదరాబాద్ జోనల్ యూనిట్ అధికారులు తెలంగాణలోని హన్మకొండలో నిఘా వేసి, నలుగురు వ్యాపారులను పట్టుకున్నారు. వారి నుండి మొత్తం 6.53 కిలోల భారతీయ పాంగోలిన్ స్కేల్స్ను స్వాధీనం చేసుకున్నారు.పాంగోలిన్లను ప్రధానంగా చైనా, ఆగ్నేయాసియాలో వేటాడుతుంటారు. వాటి విలువైన పొలుసుల కోసమే ఈ వేట సాగుతుంది. వన్యప్రాణుల (రక్షణ) చట్టం, 1972 షెడ్యూల్-Iలో జాబితాలో ఇండియన్ పాంగోలిన్ ఉండటంతో పాటు ఇటువంటి జంతువుల వేటపై నిషేధం అమలులో ఉంది. కాగా ఈ 6.53 కిలోల పొలుసులు సుమారు ఐదు భారతీయ పాంగోలిన్ల నుండి సేకరించారని అంచనా. కాగా వీటి వ్యాపారం నిర్వహిస్తున్న నిందితులను డీఆర్ఐ అధికారులు తదుపరి దర్యాప్తు కోసం హన్మకొండలోని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కు అప్పగించారు. -
Yadagirigutta: యాదగిరిగుట్ట ఆలయానికి పోటెత్తిన భక్తులు
యాదగిరిగుట్ట: దసరాకు సొంతూళ్లకు వెళ్లిన హైదరాబాద్ వాసులు తిరుగు ప్రయాణంలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వస్తున్నారు. ఆదివారం యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహా స్వామి దర్శనానికి భారీగా తరలివస్తున్న భక్తులు. దసరా సెలవులు నేటితో ముగుస్తుండటంతో ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. భక్తులు అధికంగా రావడంతో ధర్మ దర్శనానికి 3గంటలకు పైగా సమయం పడుతుంది , వీఐపీ దర్శనానికి గంట సమయం. (నిన్న) శనివారం స్వామివారిని 40వేలకు పైగా భక్తులు దర్శించుకొని తమ మొక్కులను తీర్చుకున్నారు. వివిధ పూజలతో నిత్యాదాయం రూ.41,31,970 వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు.నూతన తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. -
ఐదుకి మించి చలాన్లు ఉన్నాయా?.. వాహనదారులకు షాకిచ్చిన కేంద్రం
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసే వాహనదారులకు హెచ్చరిక. ట్రాఫిక్ రూల్స్(Traffic Rules) విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఇకపై తగిన మూల్యం చెల్లించక తప్పదు. చలాన్ల(Traffic Challans) చెల్లింపు విషయంలో కేంద్రం కీలక సవరణలను ప్రతిపాదించింది. దీని ప్రకారం.. 45 రోజుల్లోగా చలాన్లు కట్టాలి.. వాహనాలపై ఐదుకు మించి చలాన్లు ఉంటే ఏకంగా లైసెన్స్ సైతం రద్దు కావచ్చు. ఇకపై వాహనదారులు అప్రమత్తంగా ఉండాల్సిందే.వివరాల ప్రకారం.. సెంట్రల్ మోటారు వెహికిల్స్ రూల్స్-1989లో(Motor Vehicles Act) కేంద్ర రవాణాశాఖ ఈ కీలక సవరణలను ప్రతిపాదించింది. ఈ క్రమంలో చలాన్లపై చర్యల విషయమై కొత్తగా పలు కఠిన నిబంధనల్ని కేంద్ర రవాణాశాఖ తీసుకొచ్చింది. ఈ మేరకు డ్రాఫ్ట్ రూల్స్ నోటిఫికేషన్ను తాజాగా విడుదల చేసింది. చలాన్ల జారీ, చెల్లింపు, అప్పీల్ చేయడం వంటి అంశాలను డిజిటల్ మానిటరింగ్, ఆటోమేషన్ ఆధారంగా వేగవంతం చేయాలని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనదారుకు సంబంధిత అధికారులు మూడురోజుల్లోగా ఎలక్ట్రానిక్ రూపంలో నోటీసు జారీ చేయాలని, ఫిజికల్ రూపంలో 15 రోజుల్లోగా నోటీసు పంపాలని స్పష్టం చేసింది.కొత్త రూల్స్ ప్రకారం.. 👉ఎంవీ(మోటారు వెహికిల్) యాక్టు ప్రకారం.. ఒక వాహనంపై ఐదు, అంతకంటే ఎక్కువ చలాన్లు ఉంటే.. డ్రైవింగ్ లైసెన్సును సంబంధిత అథార్టీ సస్పెండ్ చేసే అధికారం ఉంది.👉అంతేకాకుండా లైసెన్స్ విషయంలో ఇప్పటికే ఉన్న నిబంధనలు కూడా అలాగే కొనసాగుతాయి.👉కొత్త నిబంధనల ప్రకారం.. చలాన్ చెల్లింపు గడువును 45 రోజుల్లో కట్టాల్సిందే. ప్రస్తుతం 90 రోజుల్లోగా చలాన్ చెల్లించాలి.👉చలాన్ కట్టకపోతే వాహనాన్ని స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు ఉంటుంది.👉ఒకవేళ చలాన్ల చెల్లింపు సకాలంలో జరగకపోతే.. సదరు వాహనంపై రవాణాశాఖ ఎలాంటి లావాదేవీలను అనుమతించదు.👉ఈ కారణంగా వాహనం అమ్మకం, కొనుగోలు వంటి జరగలేవు. లైసెన్సులో చిరునామా, పేరు మార్పుతోపాటు రెన్యువల్ కూడా కుదరదు.👉ప్రస్తుతం చలాన్లు వాహన యజమాని పేరుతో జారీ అవుతున్నాయి.👉కొత్త రూల్ ప్రకారం.. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో యజమాని వాహనం నడపలేదని నిరూపిస్తే.. డ్రైవింగ్ చేసిన వ్యక్తి బాధ్యుడు అవుతారు.అభ్యంతరాల స్వీకరణ..కేంద్ర రవాణా శాఖ ప్రతిపాదించిన ముసాయిదా నిబంధనలపై అభ్యంతరాలు, సూచనలు ఉంటే ఢిల్లీలో రహదారి రవాణా మంత్రిత్వశాఖలోని అదనపు కార్యదర్శికి పంపవచ్చని కేంద్రం తెలిపింది. comments-morth@gov.in కు ఈ-మెయిల్ కూడా చేయవచ్చని సూచించింది. -
యువతి ప్రేమకథ విషాదాంతం
గద్వాల జిల్లా: ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో అందరి నీ ఎదిరించింది. పెళ్లి చేసుకోవాల్సిందేనని ఒత్తిడి తీసుకు వచ్చింది. రెండు నెలలుగా ఆ యువకుడి ఇంట్లోనే మకాం వేసింది. చివరికి విషపు గుళికలను తీసుకొని తనువు చాలించింది. కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన ప్రియాంక (32), జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలం చిన్నోనిపల్లె గ్రామా నికి చెందిన రఘునాథ్గౌడ్ను ప్రేమించింది. హైదరాబాద్లో కానిస్టేబుల్ ఉద్యోగం కోసం కోచింగ్ తీసుకుంటున్న సమయంలో వీరిద్దరూ ప్రేమించుకున్నారు. అనంతరం రఘునాథ్గౌడ్కు కానిస్టేబుల్గా ఉద్యోగం వచ్చింది. ఈ క్రమంలో రెండు నెలల కిందట తనను పెళ్లి చేసుకోవాలని ప్రియాంక చిన్నోనిపల్లె గ్రామానికి వచ్చి రఘునాథ్గౌడ్ను కోరింది. అయితే రఘునాథ్ గౌడ్, అతని కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. దీంతో యువతి తనను పెళ్లి చేసుకోవాల్సిందేనని ఒత్తిడి తీసుకువచ్చింది. ఆమె వారి ఇంట్లోనే మకాం వేయడంతో రఘునాథ్గౌడ్, అతని కుటుంబ సభ్యులు ఇల్లు వదిలి వెళ్లిపోయారు. కాగా, అప్పట్లోనే ప్రియాంక నిద్రమాత్రలు వేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించగా గ్రామస్తులు ఆమెను వెంటనే గద్వాల ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందించడంతో ప్రాణా పాయం తప్పింది. అనంతరం ప్రియాంక రఘునా థ్గౌడ్తోపాటు కుటుంబ సభ్యులపై గట్టు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా జూలైలో కేసు నమోదు చేశారు. తర్వాత ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుగా సెక్షన్ మార్పు చేసి, రఘునాథ్ను రిమాండ్కు తరలించగా ఇటీవలే బెయిల్పై విడుదల అయ్యాడు.మరోసారి ఆత్మహత్యాయత్నం.. ఈ క్రమంలో ప్రియాంక శుక్రవారం గుళికల మందు తీసుకున్నట్లు పోలీసు లకు సమాచారం అందింది. దీంతో పోలీసులు హుటాహు టిన చిన్నోనిపల్లె గ్రామానికి చేరుకొని చికిత్స నిమిత్తం ఆమెను గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శనివారం ఉదయం ఆమె మృతిచెందింది. ఇదిలా ఉండగా రఘునాథ్గౌడ్, అతని కుటుంబ సభ్యులు తమ కూతురుకు కరెంట్ షాక్ ఇచ్చి చంపినట్లుగా ఆమె తల్లి దండ్రులు ఆస్పత్రి వద్ద ఆరోపించారు. రఘునాథ్తో పాటు అతని కుటుంబ సభ్యులపై ప్రియాంక తల్లి పోలీసులకు ఫి ర్యాదు చేశారు. కాగా, ప్రియాంక మృతికి కారణమైన రఘు నాథ్గౌడ్ను ఉద్యోగం నుంచి తొలగించినట్లు ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. ప్రియాంక ఆత్మహత్య ఘటనకు సంబంధించి 22 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మల్లేశ్ వెల్లడించారు. మరో పక్క దళిత యువతి మృతికి కారణమైన రఘునాథ్గౌడ్పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా, కుల సంఘాల నాయకులు ఆస్పత్రి వద్ద ఆందోళన నిర్వహించారు. -
హైదరాబాద్లో భారీ వర్షం.. రెండు గంటల పాటు జాగ్రత్త
తెలంగాణలో వర్షం అప్డేట్స్..మరో రెండు గంటల్లో మెదక్, కామారెడ్డి, సిద్దిపేట, జనగామ, సిరిసిల్ల, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, హన్మకొండ, వరంగల్, ఖమ్మంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. SEVERE THUNDERSTORMS ALERT ⚠️⛈️ MASSIVE DOWNPOURS across Medak, Kamareddy, Siddipet to further cover Jangaon, Sircilla, Nizamabad, Jagitial, Mancherial, Hanmakonda, Warangal, Khammam in next 2hrs. STAY ALERT ⚠️⛈️ Hyderabad - Break as of now for next 2-3hrs. More DOWNPOURS…— Telangana Weatherman (@balaji25_t) October 5, 2025👉ఆదివారం ఉదయం హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి రోడ్లు జలమయం అయ్యాయి. బేగంపేట వద్ద రోడ్డుపై నీరు నిలిచిపోయింది. Waterlogging Alert 🚧Waterlogging has been reported at Chikoti Gardens, Begumpet due to rainfall. Commuters are requested to avoid the area or proceed with caution.🛣️ Advisory: Use alternate routes where possible Video Courtesy Hyderabad Traffic Police pic.twitter.com/9z3SKjOORL— Shakeel Yasar Ullah (@yasarullah) October 5, 2025హైదరాబాద్లో(Hyderabad Rains) మళ్లీ వర్షం ప్రారంభమైంది. ఆదివారం ఉదయం నుంచి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, ఎస్ఆర్ నగర్, మెహిదీపట్నం, మాసబ్ట్యాంక్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, బాలానగర్, మూసాపేట, కూకట్పల్లి సహా పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. మరో రెండు గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. TELANGANA RAINFALL FORECAST | 05 OCT ⚠️POWERFUL DOWNPOURS ahead for many parts of Telangana ⛈️⚠️West, Central & South Telangana to witness more intense spells with 100mm+ rainfall likely in some areas.HYDERABAD: After early morning spells, Sun Coming out now, SCATTERED HEAVY…— Hyderabad Rains (@Hyderabadrains) October 5, 2025 HyderabadRains ALERT 1 ⚠️⛈️ Dear people of Hyderabad. GET READY FOR MORNING THUNDERSTORM. North, West HYD towards Patancheru, RC Puram, Serlingampally, Gachibowli, Miyapur, Kukatpally, Gajularamaram, Nizampet, Qutbullapur, Jeedimetla, Suchitra, Alwal, Malkajgiri, Kapra,…— Telangana Weatherman (@balaji25_t) October 5, 2025మరోవైపు.. తెలంగాణలోని సంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్లగొండ, నాగర్ కర్నూల్ సహ పలు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 7:00 AM Update ⛈️⛈️Scattered Rains across districts next 2hrs— Sangareddy— Medchal— Yadadri— Vikarabad— Rangareddy— Mahabubnagar— Nalgonda— Nagarkurnool— Weatherman Karthikk (@telangana_rains) October 5, 2025EAR BREAKING THUNDERSTORMS IN SOUTH HYDERABAD ⚠️🤯⛈️Just now woke up with some huge thunders now. MODERATE - HEAVY RAINS to continue in South HYD towards Rajendranagar, Balapur, Chandrayangutta, Meerpet, Lb Nagar, Charminar, Bahadurpura, Kishanbagh stretch during next…— Telangana Weatherman (@balaji25_t) October 4, 2025 -
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై ‘ప్లాన్ బీ’ సిద్ధం... కోర్టుల్లో ప్రతికూల తీర్పులు వస్తే పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు
-
Hyderabad: యువతి ఆత్మహత్య
కుషాయిగూడ: కుటుంబంలోని విభేదాలతో మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన శనివారం చర్లపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఇన్స్పెక్టర్ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. చర్లపల్లిలోని మధుసూదన్రెడ్డినగర్కు చెందిన బత్తుల గోపాల్, ప్రసన్న దంపతులు గత మే నెలలో విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో వారి కుమార్తె సృష్టిత (21) తల్లి ప్రసన్నతో కలిసి మధుసూదన్రెడ్డినగర్లో ఉంటుండగా...భర్త వేరుగా ఉంటున్నాడు. సృష్టిత డిగ్రీ చదువుతుండగా, తల్లి ప్రైవేటుగా ఉద్యోగం చేస్తుంది. శుక్రవారం ప్రసన్న రోజులానే ఉద్యోగానికి వెళ్లింది. ఆ సమయంలో కూతురు సృష్టిత ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆ రోజు మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో తల్లి కుమార్తెతో ఫోన్లో మాట్లాడింది. తిరిగి సాయంత్రం 6:30 గంటలకు మరోమారు ఫోన్ చేస్తే సృష్టిత ఫోన్ లిఫ్ట్ చేయలేదు. పలుమార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఆందోళన చెందిన తల్లి ఇంట్లో కిరాయిదారులకు ఫోన్ చేసి కూతురు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడాన్ని తెలిపి ఇంటికి వెళ్లి చూడమని కోరింది. వారు తలుపు తట్టి ప్రయతి్నంచినా ఎలాంటి సమాధానం రాలేదు. తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా సృష్టిత తన గదిలో ఫ్యాన్కు వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. దీంతో విషయాన్ని తల్లి ప్రసన్నకు తెలిపారు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కాగా తల్లిదండ్రుల మధ్య ఉన్న విభేదాల వల్లే మనస్థాపం చెంది యువతి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని భావిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
ప్రాణం తీసిన మూఢనమ్మకం
చంచల్గూడ: మూడ నమ్మకమనే పెనుభూతం ఒక చిన్నారి ప్రాణం బలితీసుకుంది. అనారోగ్యంతో కన్న కూతురు చనిపోతే..అందుకు కారణం చేతబడే అని నమ్మి, అందుకు తోడు ఆస్తి వివాదం కొనసాగుతుండటంతో సోదరి కూతుర్ని చంపేశాడో కిరాతకుడు. శనివారం మాదన్నపేట పీఎస్లో సౌత్ ఈస్ట్ అదనపు డీసీపీ శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం..చావణీలో నివాసం ఉండే మీర్ సమీ అలీ స్థానికంగా వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్నాడు. అతని భార్య యాస్మీన్ బేగం గృహిణి. కాగా సమీ కుమార్తె గతేడాది నవంబర్లో అనారోగ్యంతో మృతి చెందింది. దీనికి చేతబడే కారణమని సమీ అనుమానించాడు. దీనికి తోడు సమీకి సోదరి, సోదరులతో ఆస్తి వివాదం ఏర్పడింది. తన తల్లి ఆస్తిని తన పేరున రాయించుకుని సోదరి, సోదరులకు కొంత డబ్బులు ఇస్తానని సమీ హామీ ఇచ్చాడు. కానీ ఇవ్వకపోవడంతో వారంతా ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలో తన కూతురు చేతబడి వల్లే మృతి చెందిందని ధృఢంగా నమ్మిన సమీ..లోలోపల తన సోదరి షబానా బేగంపై ప్రతీకారంతో రగిలిపోయాడు. గత మంగళవారం మధ్యాహ్నం షబానా బేగం తన కుమార్తె ఉమ్మేహని సుమయ (7)తో కలిసి తల్లి ఇంటికి వచి్చంది. బాలికను వదిలేసి షాపింగ్కు చారి్మనార్ వెళ్లింది. ఇదే అదునుగా భావించిన సమీ దంపతులు సుమయను ఆడుకుందామని నమ్మించి పిలిచి..బెడ్షీట్తో వెనక నుంచి చేతులు కట్టేసి బిల్డింగ్ మీదకు తీసుకెళ్లి బతికుండగానే వాటర్ ట్యాంక్లో పడేసి మూత పెట్టి వెళ్లిపోయారు. చిన్నారి కనిపించకపోవడంతో తల్లి పీఎస్లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఇంట్లో పరిశీలించగా వాటర్ ట్యాంక్లో శవమై కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులను విచారించగా సమీ దంపతులు నేరాన్ని అంగీకరించారు. భార్యా భర్తలిద్దర్నీ పోలీసులు రిమాండ్కు తరలించారు. సమావేశంలో సైదాబాద్ ఏసీపీ వెంకట్రెడ్డి, మాదన్నపేట ఇన్స్పెక్టర్ ఆంజనేయులు, సిబ్బంది ఉన్నారు. -
మళ్లీ తెరపైకి అజహరుద్దీన్!?
సాక్షి,సిటీబ్యూరో/బంజారాహిల్స్: అధికార కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక ఉత్కంఠ రేపుతోంది. ముగ్గురు మంత్రులను రంగంలోకి దింపి అభివృద్ధి మంత్రం జపిస్తున్న కాంగ్రెస్ పార్టీకి సీటు కోసం తీవ్రపోటీ ఉండటంతో అభ్యర్థి ఎంపిక కత్తిమీద సాముగా తయారైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలైన అజహరుద్దీన్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి కనబర్చగా.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గవర్నర్ కోటాలో ఆయనను ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేసి బరి నుంచి తప్పించింది. తాజాగా ఆశావహుల జాబితా తయారు చేసేందుకు కసరత్తు చేస్తున్న సమయంలో.. తిరిగి అజహరుద్దీన్ పేరు తెరపైకి రావడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గవర్నర్ కోటా నాన్ పొలిటికల్ కేటగిరీ కింద అజహరుద్దీన్ను ఎంపిక చేసినప్పటికీ.. ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎంపీగా ఎన్నిక కావడంతో పాటు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో సైతం పోటీ చేసి ఉండటంతో న్యాయపరమై చిక్కులతో పదవికి గండం తప్పదని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఆయనకు కూడా ఆ అనుమానం వెంటాడుతోంది. మరోవైపు ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆయన అభిమానుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. తాజాగా శనివారం బంజారాహిల్స్లోని అజహరుద్దీన్ నివాసానికి మైనారిటీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి పోటీ చేయాలంటూ పట్టుబట్టారు. వారం రోజులుగా కార్యకర్తల ఒత్తిళ్లు పెరుగుతుండటంతో ఆయన రెండు మూడు రోజులుగా ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే తలంపుతో ఉన్నట్లు తెలుస్తోంది. రంగంలోకి మీనాక్షీ నటరాజన్ తాజా రాజకీయ పరిణామాలతో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ రంగంలోకి దిగారు. అభ్యర్థి ఎంపిక వ్యవహారంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. అధికార పక్షం కావడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సీటు కోసం తీవ్ర పోటీ నెలకొంది. మాజీ ఎంపీ అంజన్ కుమార్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, యువనేత నవీన్ యాదవ్లు తీవ్రంగా పోటీ పడుతున్నారు. మరోవైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి తదితరుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మాజీ ఎంపీ అంజన్ కుమార్ మాత్రం తనకు ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాల్సిందేనని పట్టు పడుతున్నారు. ఇప్పటికే ఉప ఎన్నికకు అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ బాధ్యతలను ఇన్చార్జి మంత్రులకు అప్పగించారు. మజ్లిస్ కలిసి వస్తున్నందుకు.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ కలిసి వస్తుండటంతో కాంగ్రెస్కు విజయావకాశాలపై ధీమా మరింత పెరిగింది. ఇప్పటికే ముగ్గురు రాష్ట్ర మంత్రులు, 18 మంది కార్పొరేషన్ చైర్మన్లు రంగంలో దిగి అభివృద్ధి మంత్రం జపిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ప్రతి కుటుంబానికి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఏదో ఒక విధంగా లబ్ధి చేకూర్చేవిధంగా ప్రయతి్నస్తున్నారు. నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీ ఓటర్లు అధికంగానే ఉన్నారు. తాజాగా మజ్లిస్ కూడా ఉప ఎన్నికల బరి నుంచి దూరం పాటిస్తున్నట్లు, కాంగ్రెస్తో కలిసి నడిచేందుకు సిద్ధమైనట్లు పరోక్షంగా సంకేతాలు ఇచి్చంది. ఆశావహుల్లో మరింత ఆసక్తి పెరిగింది. దీంతో టికెట్ కోసం పోటీ తీవ్రంగా మారింది. ఎమ్మెల్సీ పదవికి ఎంపికైనప్పటికీ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే హైదరాబాద్ మైనారిటీ కోటాలో మంత్రి పదవీ దక్కవచ్చని అజహరుద్దీన్ కూడా యూ టర్న్ తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. -
హైదరాబాద్లో బస్సు చార్జీల పెంపు
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలోని సిటీ బస్సుల చార్జీలను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పెంచింది. వచ్చే రెండేళ్లలో హైదరాబాద్లో డీజిల్ బస్సుల స్థానంలో పూర్తిగా విద్యుత్ బస్సులనే తిప్పనుండటంతో అందుకయ్యే మౌలికవసతుల కల్పనకు కావాల్సిన నిధుల కోసం సిటీ బస్సు చార్జీలను పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్టీసీ చేసిన ప్రతిపాదనకు ప్రభుత్వం తాజాగా అనుమతించింది. దసరా వేళ చార్జీలు పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉండటంతో పండుగ రద్దీ ముగిశాక పెంచాలని నిర్ణయం తీసుకుంది. చార్జీల పెంపు సోమవారం తెల్లవారుజామున తొలి సర్వీసు నుంచి అమల్లోకి రానుంది. పెంపు ఇలా... ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఎలక్ట్రిక్ ఆర్డినరీ, ఎలక్ట్రిక్ ఎక్స్ప్రెస్ బస్సుల్లో తొలి మూడు స్టేజీల వరకు ప్రస్తుత టికెట్ ధరపై రూ. 5 పెరగనుంది. ప్రస్తుతం ఆర్డినరీ బస్సుల్లో కనీస చార్జి రూ. 10గా ఉండగా ఇకపై రూ. 15 కానుంది. నాలుగో స్టేజీ నుంచి ప్రస్తుత చార్జీపై రూ. 10 అదనంగా పెరుగుతుంది. ఇక మెట్రో డీలక్స్, ఎలక్ట్రిక్ మెట్రో ఏసీ బస్సుల్లో మొదటి స్టేజీ వరకు రూ. 5, రెండో స్టేజీ నుంచి రూ. 10 చొప్పున పెరుగుతుంది. ఈ పెంపు వల్ల ఆర్టీసీకి నిత్యం రూ. 20 లక్షల వరకు అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. డీజిల్ బస్సుల స్థానంలో విద్యుత్ బస్సుల కోసం.. హైదరాబాద్లో డీజిల్ బస్సుల వల్ల వాతావారణ కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ బస్సులను వాడాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గతంలో నిర్ణయించారు. ప్రస్తుతం తిరుగుతున్న 2,800 డీజిల్ బస్సులను ఔటర్ రింగ్రోడ్డు అవతల ఉన్న డిపోలకు తరలించి వాటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను తిప్పాలని ఆదేశించారు. ఇందుకోసం ఆర్టీసీ కేంద్ర ప్రభుత్వ పథకం పీఎం ఈ–డ్రైవ్ కింద దరఖాస్తు చేసుకోగా కేంద్రం సానుకూలంగా స్పందించి బస్సులను మంజూరు చేసింది. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ సహా మొత్తం 11 నగరాలకు బస్సుల సరఫరాకు టెండర్లు పిలిచింది. ఎంపికైన ప్రైవేటు సంస్థకు కేంద్రం రాయితీ అందిస్తుంది. ఆ సంస్థ బస్సులను సమకూర్చుకొని ఆరీ్టసీకి అద్దెకిస్తుంది. ‘ఫేమ్’పథకం కింద గతంలో హైదరాబాద్కు 500 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరయ్యాయి. వాటిల్లో 225 బస్సులు ఇప్పటికే సమకూరగా మరో రెండు నెలల్లో మిగతావి అందనున్నాయి. పీఎం ఈ–డ్రైవ్ కింద వచ్చే బస్సులతో కలిపి అప్పుడు మొత్తం 3,300 విద్యుత్ బస్సులు నగర రోడ్లపైకి వస్తాయి. ప్రభుత్వం ఆదుకోకపోవడంతో.. ప్రస్తుతం నగరంలో 25 బస్సు డిపోలున్నాయి. ఎలక్ట్రిక్ బస్సులకు పవర్ చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నందున అందుకు కొంత స్థలం అవసరమవుతుంది. ప్రస్తుతం డీజిల్ బస్సుల తరహాలో ఒక్కో డిపోలో 100 అంతకుమించి బస్సులకు స్థలం సరిపోదు. 3,300 బస్సులకు సరిపోవాలంటే అదనంగా మరో 10 కొత్త డిపోలను, ఎలక్ట్రిక్ చార్జింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందుకోసం ఒక్కో డిపోపై రూ. 7–8 కోట్ల భారం పడనుంది. ఇంటర్మీడియట్ స్టేషన్ల ఏర్పాటుకు మరో రూ. 6 కోట్లు ఖర్చవుతుంది. ఇప్పటికే కొన్ని డిపోలకు ఏర్పాటు చేయగా, మరో 19 డిపోలకు ఏర్పాటు చేయాల్సి ఉంది. కొత్తగా ప్రతిపాదించిన 10 డిపోలతో కలిపి ఇప్పుడు 29 డిపోలకు ఈ వ్యవస్థ ఏర్పాటు కావాలి. ఇందుకు రూ. 392 కోట్లు అవసరమవుతుందని ఆర్టీసీ అంచనా వేసింది. ఈ మొత్తాన్ని ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి ప్రతిపాదించగా ప్రభుత్వం చేతెలెత్తేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో సిటీ బస్సుల ప్రయాణికులపై చార్జీల భారం మోపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. బస్సు చార్జీలను సవరించడం ద్వారా వచ్చే రెండేళ్లలో ఆ మొత్తాన్ని సమకూర్చుకోవాలని నిర్ణయించింది. -
అతివేగంతోనే.. అత్యధిక ప్రమాదాలు!
దేశంలో 2023లో జరిగిన ప్రమాదాల్లో 4.44 లక్షల మంది మరణించారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు, రైల్వే ప్రమాదాలు, రైల్వే క్రాసింగ్ ప్రమాదాల వంటి ‘ట్రాఫిక్ ప్రమాదాల్లో’ 1.98 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 45.8 శాతం ద్విచక్ర వాహనాల వల్లే జరిగాయి. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం.. అతివేగమే. ఇలా మొత్తం 2.81 యాక్సిడెంట్లలో 1.02 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా 20.7 శాతం సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల్లోపే జరిగాయి. ప్రకృతి వైపరీత్యాల వల్ల 2023లో 6,444 మంది ప్రాణాలు కోల్పోయారు.మహారాష్ట్రలో అత్యధికంగా 69,809 మంది ప్రమాదాల్లో మరణించగా, ఆ తరువాతి స్థానాల్లో మధ్యప్రదేశ్ (43,320), ఉత్తరప్రదేశ్ (43,207) ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 19,949 ప్రమాదాల్లో 17,039 మరణించగా, తెలంగాణలో 22,903 ప్రమాదాల్లో 13,374 మంది ప్రాణాలు కోల్పోయారు.ట్రాఫిక్ మరణాలు..: రోడ్డు ప్రమాదాలు, రైల్వే ప్రమాదాలు, రైల్వే క్రాసింగ్ ప్రమాదాలు.. వీటిలో ప్రాణాలు కోల్పోయిన వారిని ‘ట్రాఫిక్ మరణాల’ కింద పరిగణించారు. 2019లో ఇలా 1.81 లక్షల మంది మరణిస్తే.. 2023 నాటికి ఈ సంఖ్య 1.98 లక్షలకు పెరిగింది. తెలంగాణలో 23,673 ట్రాఫిక్ ప్రమాదాల్లో 8,345 మంది మరణించగా.. ఏపీలో 21,078 కేసుల్లో 9,284 మంది ప్రాణాలు కోల్పోయారు.టూ వీలర్లే అత్యధికంమొత్తం రోడ్డు ప్రమాదాల్లో 45.8 శాతం ద్విచక్ర వాహనాల వల్లే జరిగాయి. కారు, జీపు, ఎస్యూవీల వల్ల 14.3 శాతం జరగ్గా.. ఆటోల వంటి త్రీవీలర్ల వల్ల 4.1 శాతం సంభవించాయి.అతివేగం అనర్థదాయకంరోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం పరిమితికి మించిన వేగంతో వెళ్లడమే. ఇలా 58.6 శాతం ప్రమాదాలు జరిగాయి. మొత్తం 2.81 యాక్సిడెంట్లలో 1.02 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్, ఓవర్ టేకింగ్ వంటి వాటివల్ల 23.6 శాతం యాక్సిడెంట్లు సంభవించాయి. మాదక ద్రవ్యాలు, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల 2.1 శాతం ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 60.2 శాతం (2.80 లక్షల కేసులు) గ్రామీణ ప్రాంతాల్లో నమోదు కాగా.. 39.8 శాతం (1.84 లక్షలు) పట్టణాల్లో జరిగాయి.రాత్రిపూటే అధికంమొత్తం రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా 20.7 శాతం (95,984) సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల్లోపే సంభవించాయి. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల్లోపు 17.3 శాతం, మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల్లోపు 15 శాతం సంభవించాయి. -
మనకు నచ్చకపోతే వినేదే లేదు
మనకు ఇష్టమైనదే వింటాం. ఏమాత్రం అసౌకర్యంగా అనిపించినా, ప్రతికూలంగా ఉన్నా ఆ సమాచారాన్ని వినడానికి కూడా ఇష్టపడం. కనీసం అటువైపు కూడా చూడం. తెలియనిది తమకు హాని కలిగించదని చాలామంది అనుకుంటారు. ఇది పెద్దవారిలో ఒక సాధారణ ప్రవర్తన అని మనస్తత్వ శాస్త్రవేత్తలు అంటున్నారు. దీన్ని ‘ఆస్ట్రిచ్ ఎఫెక్ట్’ టారు. షికాగో విశ్వవిద్యాలయం చేపట్టిన కొత్త అధ్యయనం ప్రకారం యుక్త వయసుకు రాకముందే ఈ ధోరణి అభివృద్ధి చెందుతోందట.చాలామందికి ఆసుపత్రికి వెళ్లాలంటే భయం. అక్కడ ఏ టెస్టు చేస్తే ఏ సమస్య బయటపడుతుందో అని లోపల ఒక తెలియని ఆందోళన. అందుకే, ‘నువ్వు, ఈ మధ్య టెస్టులు చేయించుకున్నావా’ అని ఎవరైనా అడిగితే.. సంభాషణను వేరే విషయాలవైపు మళ్లిస్తుంటారు. కొన్ని కంపెనీలు లేదా సంస్థలు.. ఉచిత వైద్య శిబిరాలు పెట్టినప్పుడు కొందరు కనీసం అటువైపు కూడా చూడంది అందుకే. ఆస్ట్రిచ్ ఎఫెక్ట్గా పిలిచే ఈ ధోరణి పెద్దలతో పాటు పిల్లల్లోనూ ఉంటోందట.చిన్న పిల్లల్లోనూ..షికాగో విశ్వవిద్యాలయానికి చెందిన రాధిక సంతాన గోపాలన్ నేతృత్వంలోని పరిశోధకుల బృందం.. పిల్లల్లో వయసు పెరిగే కొద్దీ కొత్త సమాచారాన్ని స్వీకరించని మనస్తత్వ ధోరణి పెరుగుతున్నట్టు గుర్తించింది. ముఖ్యంగా ఇది 7–10 ఏళ్ల పిల్లల్లో ఎక్కువగా ఉందట. అసలు చాలామంది.. కొత్త విషయాన్ని లేదా జ్ఞానాన్ని నేర్చుకునే విషయంలో ఎందుకు విముఖత చూపుతారో 5 కారణాలను ఈ బృందం గుర్తించింది.తప్పించుకునే ధోరణిఐదారేళ్ల పిల్లలు మరింత జ్ఞానం సంపాదించాలని ఉత్సాహంగా ఉన్నారు. 7 నుంచి 10 ఏళ్ల చిన్నారుల్లో కొందరు మాత్రం ఇందుకు కాస్త భిన్నంగా ఉన్నారు. వీళ్లు సమాచారం నుంచి తప్పించుకునే ధోరణులను ప్రదర్శించడం ప్రారంభిస్తున్నారు. ‘ఉదాహరణకు, ప్రతి ఒక్కరినీ తమకు ఇష్టమైన, తక్కువ ఇష్టమైన క్యాండీ ఏంటో చెప్పండని అడిగాం. ఆ క్యాండీ వారి దంతాలకు ఎందుకు చెడ్డదో వివరించే వీడియో చూడాలని అనుకుంటున్నారా అని అడిగాం. ఆసక్తికరంగా.. వారికి నచ్చే దాని గురించి వారు ‘అది ఎందుకు చెడ్డదో’ తెలుసుకోడానికి ఇష్టపడలేదు. కానీ తక్కువ ఇష్టమైన క్యాండీ ఎందుకు చెడ్డదో తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు’ అని వివరించారు రాధిక.అన్ని వేళలా మంచిది కాదు‘కొన్ని సందర్భాల్లో సమాచారం నుంచి తప్పించుకోవడం మంచిదే. అతి సర్వత్రవర్జయేత్ అన్నారు కదా! అయితే ప్రతిసారీ వద్దనుకునే ధోరణి మంచిది కాదు. అప్పటికి మనకు నచ్చనిది లేదా మనసుకు ఇబ్బందిగా అనిపించేది తరవాత విలువైనదని తేలవచ్చు. మనుషులకు అనిశ్చితిని లేదా ఒక సమస్యను పరిష్కరించుకోవాలనే కోరిక ఉంటుంది. కానీ పరిష్కారం, సమాచారం తమకు ఇబ్బందికరంగా లేదా ముప్పుగా ఉన్నప్పుడు తప్పించుకోవడానికే మొగ్గు చూపుతారు. కాస్త చొరవ, ధైర్యం చూపెడితే చాలు.. దీన్నుంచి సులభంగా బయటపడవచ్చు’ అంటారు రాధిక.ఏమిటీ ఆస్ట్రిచ్ ఎఫెక్ట్?యూనివర్సిటీ ఆఫ్ జెరూసలేంలోని ఇద్దరు ప్రొఫెసర్లు డాన్ గలాయ్, ఓర్లీ సేడ్.. మొట్టమొదట ‘ఆస్ట్రిచ్ ఎఫెక్ట్’ అనే పద బంధాన్ని ప్రయోగించారు. ఇజ్రాయెల్లోని క్యాపిటల్ మార్కెట్లలో పెట్టుబడిదారులు.. ఎప్పటికప్పుడు నష్ట సమాచారాన్ని వెల్లడించే మార్గాల కంటే.. తమకు నష్టం వచ్చినా ఫర్వాలేదని ఆ విషయం బయటకు చెప్పని మార్గాల్లోనే పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడుతున్నట్టు గుర్తించారు.ఈ ధోరణిని ఆస్ట్రిచ్ ఎఫెక్ట్గా అభివర్ణించారు. ఆస్ట్రిచ్ పక్షి తనకు ఏదైనా ప్రమాదం వస్తుందనిపిస్తే.. వెంటనే తన తలను ఇసుకలో దాచేస్తుందని దీని అర్థం. నిజానికి ఆస్ట్రిచ్ అలా చేయదు. కానీ, ఇది మాత్రం మానసిక వైద్య శాస్త్రంలో ‘ఆస్ట్రిచ్ ఎఫెక్ట్’గా స్థిరపడిపోయింది.ఎందుకు తప్పించుకుంటారు?⇒ ఆందోళన లేదా నిరాశ వంటి ప్రతికూల భావోద్వేగాలను నివారించడం⇒ ఇతరులు మన ఇష్టాయిష్టాలను, సామర్థ్యాలను ఎలా అర్థం చేసుకుంటారో అనే ఆందోళన, భయం⇒ మన నమ్మకాలను సవాలు చేసే ఆలోచనలు, వాస్తవాల నుంచి తప్పించుకునేందుకు⇒ మన ప్రాధాన్యతలకు ఇబ్బంది కలగకుండా చూసుకునేందుకు⇒ స్వార్థం లేదని నిరూపించుకునే క్రమంలో.. వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం -
స్థానిక ఎన్నికల కోసం కాల్సెంటర్
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన సమాచారం, ప్రజల సందేహాల నివృత్తి, ఫిర్యాదుల స్వీకరణ కోసం కేంద్రీకృత కాల్సెంటర్ను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాటు చేసింది.ఇప్పటికే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఎస్ఈసీ జారీ చేసిన నేపథ్యంలో... ప్రజలు సంబంధిత అధికారుల ద్వారా అవసరమైన సమాచారం తెలుసుకు నేందుకు 9240021456తో ఎస్ఈసీ కార్యాల యంలో కాల్సెంటర్ను ఏర్పాటు చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామపంచాయతీ ఎన్నిక లకు సంబంధించి సమాచారాన్ని ప్రజలకు తెలిపేందుకు ఈ కాల్సెంటర్ను ఏర్పాటు చేసినట్టు ఎస్ఈసీ కార్యదర్శ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. -
‘స్థానిక’ రిజర్వేషన్లపై ప్రీంకోర్టులో సవాల్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించరాదన్న సర్వోన్నత న్యాయస్థానం తీర్పునకు ఇది విరుద్ధమని పేర్కొంటూ దాఖలు చేసిన ఈ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. తెలంగాణలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయనుందని, ఇది సుప్రీంకోర్టు నిర్దేశించిన 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఉల్లంఘించడమేనని వంగ గోపాల్రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టులో సెప్టెంబర్ 29న పిటిషన్ దాఖలు చేశారు.అంతేగాక స్థానిక ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులను గోపాల్రెడ్డి సవాల్ చేశారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఏ వర్గానికి కేటాయించే రిజర్వేషన్లు అయినా మొత్తం 50 శాతానికి మించకూడదని, కానీ తెలంగాణ ప్రభుత్వం ఈ నిబంధనను అతిక్రమిస్తోందని పిటిషన్లో ఆయన ఆరోపించారు. ఈ పిటిషన్ను సోమవారం జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారించనుంది. దీంతో ఈ విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
ప్రభుత్వ ఆసుపత్రుల్లో తిరోగమనంలో వైద్యం
చైతన్యపురి (హైదరాబాద్): కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యం తిరోగమనంలో ఉందని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. బీఆర్ఎస్ పాలనలో తాము ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలను 30 నుంచి 70 శాతానికి పెంచితే నేటి రేవంత్ సర్కార్లో అది 55 శాతానికి పడిపోయిందని విమర్శించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్రెడ్డి, కాలేరు వెంకటేశ్, వివేకానందగౌడ్, చింత ప్రభాకర్లతో కలిసి శనివారం ఆయన ఎల్బీనగర్ నియోజకవర్గంలోని కొత్తపేటలో టిమ్స్ హాస్పిటల్ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ తప్పుడు చర్యల వల్ల రాష్ట్ర ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు.కోవిడ్ సమయంలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్లో హెల్త్సిటీ, హైదరాబాద్లో నాలుగు వైపులా నాలుగు మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాన్ని ప్రారంభించిందన్నారు. కొత్తపేటలో వెయ్యి పడకల ఆసుపత్రి కోసం సెల్లార్ ప్లస్ అరు అంతస్తులు నిర్మాణం చేశామని గుర్తు చేశారు. అయితే రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఈ రెండేళ్లలో పనులు నత్తనడకన నడుస్తున్నాయని, కేవలం ఐదు అంతస్తులు మాత్రమే నిర్మాణం చేశారని విమర్శించారు. అంతేకాక తమ ప్రభుత్వం ఈ ఆసుపత్రికి 24 అంతస్తులకు అనుమతి ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 14 అంతస్తులకు కుదించిందని మండిపడ్డారు.కేసీఆర్ ప్రభుత్వం ఉంటే ఇప్పటికే పనులు పూర్తయి, పేద ప్రజలకు వైద్యసేవలు అందుబాటులోకి వచ్చేవన్నారు. రాష్ట్రంలో పేద ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోని రేవంత్రెడ్డి ప్రభుత్వం, కేసీఆర్కు మంచి పేరు వస్తుందనే దురుద్దేశంతో ఆసుపత్రుల నిర్మాణాన్ని గాలికి వదిలేసిందని హరీశ్రావు విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆసుపత్రుల నిర్మాణాలను ఆరునెలల్లో పూర్తి చేయాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి తిట్లమీద ఉన్న శ్రద్ధ ఆరోగ్య కిట్లమీద లేదని విమర్శించారు. పేద ప్రజలకు ఉపయోగ పడే టిమ్స్ నిర్మాణాలను రాజకీయాల కోసం ఆపవద్దని హితవు చెప్పారు. -
పరిమితి వేలల్లో.. ఖర్చు లక్షల్లో
సాక్షి, హైదరాబాద్: జమీన్ ఆస్మాన్ ఫరక్.. అంటే భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా అనేది నానుడి. గత కొన్నేళ్లలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఎన్నికల వ్యయం ఊహించలేనంతగా పెరిగిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల పరిస్థితి కూడా అలాగే తయారవుతోంది. స్థాని క ఎన్నికల్లో పోటీ చేయటం అభ్యర్థులకు తలకు మించిన భారంగా మారుతోంది.వార్డు సభ్యుడు మొదలు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పోటీ చేయాలంటే భూము లు ఇతర ఆస్తులు కూడా అమ్ముకోవాల్సి వస్తోంది. ఎన్నికల సంఘం అభ్యర్థులకు విధిస్తున్న వ్యయ పరిమితికి, వాస్తవంగా చేస్తున్న ఖర్చుకు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటోంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం గ్రామ వార్డు సభ్యుడు మొదలు జెడ్పీటీసీ వరకు పోటీచేసే అభ్యర్థుల గరిష్ట ఎన్నికల ఖర్చు వివరాలు చూద్దాం..గరిష్ట వ్యయపరిమితి (2011 జనాభా లెక్కల ప్రకారం..)⇒ 5 వేల కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామపంచాయతీలో వార్డు సభ్యుడిగా పోటీ చేసే అభ్యర్థి రూ.30 వేల వరకే ఖర్చు చేయాలి.⇒ 5 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామపంచాయతీలో వార్డు సభ్యుడిగా పోటీ చేసే అభ్యర్థి గరిష్టంగా రూ.50 వేల వరకే ఖర్చు చేయాలి.⇒ 5 వేల కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామపంచాయతీలో సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకే ఖర్చు చేయాలి.⇒ 5 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామపంచాయతీలో సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థి గరిష్టంగా రూ.2.5 లక్షల వరకే ఖర్చు చేయాలి.⇒ ఎంపీటీసీ అభ్యర్థి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకే ఖర్చు చేయాలి.⇒ జెడ్పీటీసీ అభ్యర్థి గరిష్టంగా రూ.4 లక్షల వరకే ఖర్చు చేయాలి.అభ్యర్థులు చేయాల్సినవి...⇒ ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు, సర్పంచ్, వార్డు సభ్యుడిగా పోటీచేసే వారు ఇద్దరు సాక్షులతో కూడిన తమ స్వీయ ప్రకటన (సెల్ఫ్ డిక్లరేషన్)ను నామినేషన్ పత్రంతో రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి. ⇒ అభ్యర్థులపై ఒకవేళ క్రిమినల్ కేసులు ఉంటే స్వీకరించిన కేసులు (కాగ్జినెన్స్ టేకన్) మాత్రమే రాయాలి.⇒ శిక్ష పడిన కేసు వివరాలు రాయాలి.⇒ అభ్యర్థి లేదా భాగస్వామి, అభ్యర్థిపై ఆధారపడిన వారి చర, స్థిరాస్తులు (విదేశీ ఆస్తులతో సహా) పొందుపరచాలి.⇒ ఉమ్మడి ఆస్తిలోని వాటాను కూడా తెలపాలి.⇒ ఉమ్మడిగా కలిగి ఉన్న భూములు, భవనాలు, ఆపార్ట్మెంట్ వివరాలు వేర్వేరుగా పొందుపరచాలి.⇒ వ్యవసాయ భూమికి సంబంధిత భూమి సర్వే నంబర్, ఊరు, మండలం, జిల్లా, రాష్ట్రం, మొత్తం విస్తీర్ణం పొందుపరచాలి. వారసత్వమా కాదా అనేది కూడా తెలపాలి.⇒ బాండ్లు,షేర్లు, డిబెంచర్ల విలువ, తత్సంబంధిత కంపెనీ స్టాక్ ఎక్సె్చంజీ జాబితాలో ఉంటే ప్రస్తుత మార్కెట్ విలువ, జాబితాలో లేని కంపెనీల వివరాలు పుస్తకాలలో పేర్కొన్న ప్రకారం చూపాలి.⇒ ఆధారపడటం అంటే ఓ వ్యక్తి పూర్తిగా అభ్యర్థి ఆదాయంపైనే ఆధారపడినట్టు అర్థం.⇒ ప్రతి పెట్టుబడి, ఎంత మొత్తంలో ఆ పెట్టుబడి పెట్టారో వివరాలు తెలపాలి.⇒ చేతిలో నగదు, అభ్యర్థికి సంబంధించిన నగదు, భార్య/భర్తకు సంబంధించిన నగదు, ఆధారపడిన వారి వద్ద ఉన్న నగదు వివరాలు తెలియజేయాలి.⇒ అభ్యర్థి, భార్య/భర్త, వారిపై ఆధారపడిన వారి బ్యాంకు ఖాతాలు, వాటిలో ఉన్న మొత్తం నిల్వ, బ్యాంకు పేరు, బ్రాంచి పేరు, అకౌంట్ నంబర్లు, ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్లు, టర్మ్ డిపాజిట్లు ఉంటే వాటి వివరాలు తెలపాలి.⇒ అభ్యర్థి, భార్య/భర్త, వారిపై ఆధారపడిన వారికి ఉన్న బంగారం, వెండి ఆభరణాలు, వజ్రాలు, ఇతర ఆభరణాలు వాటి బరువు ఒక్కొక్కటిగా పేర్కొనాలి.⇒ అభ్యర్థి, భార్య/భర్తకు సంబంధించిన వృత్తి, వ్యాపార వివరాలు పొందుపరచాలి.⇒ అభ్యర్థికి సంబంధించిన విదార్హతల సర్టిఫికెట్లు, కోర్సు పూర్తి చేసిన సంవత్సరం, ఇతర వివరాలు ఇవ్వాలి.⇒ అభ్యర్థుల స్వీయ ప్రకటనను ఇద్దరు సాక్షులతో సంతకాలు చేయించి, వారి పూర్తిపేరు, చిరునామా స్పష్టంగా రాయకపోతే నామినేషన్ తిరస్కరణకు గురవుతుంది. -
లైవ్లో అమ్మేస్తున్నారు!
వ్యాపారం చేయాలంటే ఓ భారీ స్థాయి మాల్ కాకపోయినా.. చిన్న దుకాణం అయినా పెట్టుకోవాలి. లేదా రోడ్డుపై తోపుడు బండి అయినా నిర్వహించాలి. అదీ కాదంటే వాహనం ఆసరాగా చేసుకుని విక్రయాలు సాగించాలి. ఇదంతా సంప్రదాయ పోకడ. ఆన్ లైన్ రాకతో ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ మోడల్ పూర్తిగా మారిపోయింది. సోషల్ మీడియా కాస్తా ‘సోషల్ కామర్స్’ అయిపోయింది. అంటే ప్రత్యక్షంగా దుకాణాలు పెట్టాల్సిన అవసరం లేకుండానే సామాజిక మాధ్యమాలను ఆసరాగా చేసుకుని వ్యాపారాలు పుట్టుకొస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు.. కోట్ల మందికి ఇప్పుడీ ప్లాట్ఫామ్స్ బిజినెస్ అడ్డాలుగా అవతరించాయి.ఆన్ లైన్ లో ఉత్పత్తుల తాలూకు వీడియోలు, ఫొటోలు షేర్ చేయడం.. ఓ ఫోన్ నంబర్ ద్వారా వ్యాపారం చేయడం సాధారణం. ఈ–కామర్స్లో ఇప్పుడు లైవ్ స్ట్రీమింగ్ కొత్త ట్రెండ్. విక్రేతలు యూట్యూబ్ లైవ్, ఫేస్బుక్ లైవ్, ఇన్స్టాగ్రామ్ లైవ్ ద్వారా రియల్ టైమ్లో ఉత్పత్తులను ప్రమోట్ చేస్తున్నారు. వీక్షకులు తమ కామెంట్స్ ద్వారా హోస్ట్తో సంభాషించవచ్చు. లైవ్ పోల్స్ నిర్వహించేందుకు హోస్ట్కు వీలవుతుంది.తెలివైన విక్రేతలు తాము తదుపరి వారం/తేదీన పరిచయం చేయబోయే ఉత్పత్తి గురించి ముందుగానే కొన్ని వివరాలను టీజర్ రూపంలో వెల్లడించి వీక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నారు. అంతేగాక 24 గంటల కౌంట్డౌన్ నిర్వహించి తమ ఫాలోవర్లలో ఉత్సాహాన్ని నింపుతున్నారు. తద్వారా ఎక్కువ మంది వీక్షకులను చేరుకుంటున్నారు. సోషల్ కామర్స్ భారత్లో 2025లో సుమారు రూ.1,80,000 కోట్ల వ్యాపారం చేస్తుందని అంచనాలు ఉన్నాయి. దేశంలో 90 కోట్లకుపైగా ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. వీరిలో 25 శాతానికిపైగా ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్నారు.స్మార్ట్ఫోన్ ఉంటే చాలు.. వర్ధిల్లు వ్యాపారాలుతాము సొంతంగా తయారు చేసిన ఉత్పత్తులు, పిండి వంటలు, కళాఖండాలు, అల్లికలు, పెయింటింగ్స్.. ఒకటేమిటి, వ్యాపారానికి ఏదీ అనర్హం కాదు. వ్యాపారం చేయాలంటే ఈ రోజుల్లో ఓ స్మార్ట్ఫోన్ ఉంటే చాలు. ఔత్సాహికులు తక్కువ పెట్టుబడితో తమ కాళ్లమీద తాము నిలబడవచ్చు. చేతిలోని సెల్ఫోన్ తో వీడియోలు, ఫొటోలే కాదు.. లైవ్ స్ట్రీమింగ్ నిర్వహించి తాము విక్రయించే ఉత్పాదనను ప్రపంచానికి పరిచయం చేయవచ్చు. లైవ్ వీడియో చేయాలంటే పెద్దగా సాంకేతికంగా అవగాహన కూడా అవసరం లేదు. ఎడిటింగ్ భారం అసలే లేదు.దశాబ్దాల నుంచి..వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తులు, సేవలను ప్రచారం చేయడానికి, ప్రజల్లో అవగాహన కల్పించడానికి వీడియోలు ఉపయోగిస్తున్నాయి. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో వీడియోలు, షార్ట్స్ చూడటం పెరిగింది. ముఖ్యంగా ఉత్పత్తులు, సేవల గురించి తెలుసుకోవడానికి వీడియోలను చూసే ధోరణి ఊపందుకుంది. ఈ నేపథ్యంలో లైవ్ స్ట్రీమింగ్ ప్రాధాన్యత సంతరించుకుంది. లైవ్ స్ట్రీమింగ్తో షాపింగ్ ఎక్స్పీరియెన్స్ మారుతుందని ఈ–కామర్స్ దిగ్గజం అలీ ఎక్స్ప్రెస్ చెబుతోంది.వాయిదాలకు ఫుల్స్టాప్ఈ–కామర్స్ వెబ్సైట్లలో చాలామంది కస్టమర్లు తాము చూసిన ఉత్పాదనను తరువాత కొనొచ్చులే అని కార్ట్లో నిక్షిప్తం చేస్తారు. చాలా సందర్భాల్లో అవి కార్ట్కే పరిమితం అవుతాయి. అదే లైవ్లో అయితే.. నచ్చగానే ఆర్డర్ పెట్టేయొచ్చు. హోస్ట్ మీద, ఉత్పత్తి మీద నమ్మకం ఏర్పడితే.. వెంటనే ఆర్డర్ చేసేలా మనస్సు కూడా వీక్షకులను ప్రేరేపిస్తుంది అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. తరచూ వాయిదాలు వేసే కస్టమర్ల విషయంలో విక్రేతలకు లైవ్ స్ట్రీమింగ్ కలిసి వస్తుందని వారు చెబుతున్నారు.ప్రత్యక్షంగా వీక్షించి..ఆన్ లైన్ వ్యాపారంలో భాగంగా విక్రేతలు ఉత్పత్తుల తాలూకు వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేయడం సర్వసాధారణం. అయితే ప్రత్యక్ష ప్రసారాన్ని నిర్వహించే వ్యక్తి (హోస్ట్) లైవ్ వీడియోలో ఉత్పత్తి గురించి పూర్తి వివరాలు వెల్లడించేందుకు వీలవుతుంది. లైవ్లో వచ్చే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ద్వారా లక్షలాది మంది ఫాలోవర్లకు ప్రత్యక్షంగా అవి చేరతాయి. సందేహాలు ఉంటే నివృత్తి అవుతాయి. హోస్ట్ ఇచ్చే ప్రెజెంటేషన్ ఇక్కడ కీలకం. ప్రసంగం ఆకట్టుకునేలా ఉంటే ఉత్పత్తి పట్ల కస్టమర్లలో సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. ఉత్పత్తి ఎలా పనిచేస్తుంది, ప్రత్యేకతలు, వారంటీ, గ్యారంటీ, ధర, మార్కెట్లో లభించే ఇతర ఉత్పత్తులతో పోలిస్తే తాము విక్రయించే ప్రొడక్ట్ విశేషాలను కస్టమర్లతో నేరుగా పంచుకోవచ్చు. -
బోనస్ బకాయి రూ.1,159.64 కోట్లు
సన్నధాన్యం పండించే రైతులకు క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తున్నాం. ఈ వానాకాలం సీజన్లో 80 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని భావిస్తున్నాం. అందులో 40 నుంచి 45 ఎల్ఎంటీ సన్నరకాలే. వీరందరికీ బోనస్ ఇస్తాం. – మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సన్నధాన్యం పండించిన రైతులకు క్వింటాల్కు రూ.500 చొప్పున బోనస్ చెల్లిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఒక్క సీజన్కే పరిమితమైంది. గత (2024– 25) వానాకాలం సీజన్లో 24 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం పండించిన సుమారు నాలుగున్నర లక్షల మంది రైతులకు రూ.1,200 కోట్ల వరకు చెల్లించింది. యాసంగి సీజన్కు సంబంధించిన బోనస్ ఇప్పటి వరకు రూపాయి కూడా చెల్లించలేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణా ప్రాంత రైతులు ఏకంగా పోరుబాట పట్టారు. బోనస్ చెల్లించకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతులంతా మూకుమ్మడగా పోటీ చేసి నిరసన తెలియజేయాలని నిర్ణయించారు. నిజామాబాద్, నల్లగొండ తదితర జిల్లాల్లో సైతం రైతులు యాసంగి బోనస్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ ఏడాది వానకాలం సీజన్ కోతల ప్రక్రియ ప్రారంభమైనా గత యాసంగి బోనస్ను విడుదల చేయకపోవడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైతులకు రావలసిన బోనస్ రూ.1,159.64 కోట్లు యాసంగి సీజన్లో 74.22 ఎల్ఎంటీ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందులో దొడ్డురకం ధాన్యం 51.03 ఎల్ఎంటీ కాగా, సన్న ధాన్యం 23.19 ఎల్ఎంటీ. ఈ మొత్తం ధాన్యానికి రూ.17,198.58 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం రైతులకు చెల్లించింది. సన్నధాన్యం పండించిన 4,09,031 రైతులకు 1,159.64 కోట్ల మొత్తాన్ని చెల్లించాల్సి ఉంది. ధాన్యం కొనుగోళ్లు పూర్తయి మూడు నెలలు దాటినా బోనస్ విడుదల చేయలేదు. బోనస్ కోసం పోరుబాట పట్టిన మక్తల్ రైతులను మంత్రి వాకిటి శ్రీహరి సముదాయించే ప్రయత్నం చేశారే తప్ప బోనస్పై హామీ ఇవ్వలేదు. ఇటీవల పదవీ విరమణ చేసిన పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ సైతం బోనస్ అంశాన్ని ప్రభుత్వం ప్రకటిస్తుందని వారం క్రితం మీడియా సమావేశంలో తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.500 బోనస్ను దృష్టిలో ఉంచుకొని పెద్ద ఎత్తున రైతులు యాసంగిలో కూడా సన్నాలు సాగు చేశారు. నిజామాబాద్ జిల్లాలో 8 లక్షల ఎల్ఎంటీ ధాన్యాన్ని సేకరిస్తే, అందులో 7.15 లక్షల ఎల్ఎంటీ సన్నాలే ఉన్నాయి. నల్లగొండ, నారాయణపేట, జగిత్యాల, నిర్మల్, సిద్దిపేట, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున సన్న ధాన్యాన్ని పండించారు. ప్రస్తుత వానకాలం సీజన్లో సాగు చేసిన 67.33 లక్షల ఎకరాల్లో 60 శాతానికి పైగా సన్నధాన్యమే పండించినట్లు లెక్కలు చెపుతున్నాయి. ఈసారి కొనుగోలు కేంద్రాలకు 80 ఎల్ఎంటీ ధాన్యం వస్తుందని పౌరసరఫరాల శాఖ అంచనా వేసింది. ఇందులో 40 నుంచి 45 ఎల్ఎంటీ సన్నధాన్యం మార్కెట్కు వస్తుందని భావిస్తున్నారు. ఈ మొత్తానికి బోనస్ క్వింటాల్కు రూ.500 చొప్పున చెల్లిస్తే రూ.2,200 కోట్లు అవుతుంది. ఇప్పటికే ఉన్న బాకాయి 1,159.64 కోట్లు కలిపితే దాదాపు రూ.3,400 కోట్ల వరకు బోనస్ చెల్లించాల్సి ఉంటుంది. నాకు రూ.5.60 లక్షల బోనస్ రావాలి నాకు ఉన్న 5 ఎకరాల పొలంతోపాటు కొంత కౌలుకు తీసుకొని రబీలో వరి సాగు చేశాను. 2,800 బస్తాలు పండించాను. మొత్తం 1,120 క్వింటాళ్ల ధాన్యాన్ని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో విక్రయించాను. రూ.5.60 లక్షల బోనస్ రావాల్సి ఉంది. ఇప్పటికీ ప్రభుత్వం బోనస్ ఇవ్వలేదు. – వాడ్వాట్ తిమ్మన్న, రైతు, గుడే బల్లూరు గ్రామం. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తానన్న బోనస్ డబ్బులు ఇవ్వక పోవడంతో బాధిత రైతులమంతా కలిసి ఓ నిర్ణయం తీసుకున్నాం. వచ్చే ఎన్నికల్లో జెడ్పీటీసీకి రైతులందరం రాజకీయాలకు ఆంతీతంగా పోటీ చేయాలని నిర్ణయించాం. – చెవిటోళ్ల వెంకటేష్, రైతు, గుడే బల్లూరు గ్రామం -
స్థానికంపై ‘ప్లాన్ బీ’!
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో న్యాయపరమైన చిక్కులు ఎదురైతే.. అందుకు అనుగుణంగా వ్యూహాన్ని మార్చుకుని ‘ప్లాన్ బీ’ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు సమాచారం. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన, మొత్తంగా 50 శాతం పరిమితికి మించి రిజర్వేషన్ల అమలుపై న్యాయస్థానాల్లో ప్రతికూల తీర్పులు వస్తే.. ఏం చేయాలనే దానిపై పంచాయతీరాజ్ శాఖ ప్రణాళికను సిద్ధం చేసినట్టు తెలిసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లు ఈ నెల 6న సుప్రీంకోర్టులో, 8వ తేదీన రాష్ట్ర హైకోర్టులో విచారణకు రానున్నాయి. కోర్టుల వైపు అందరి చూపు.. పంచాయతీరాజ్ చట్ట సవరణ, బీసీలకు రిజర్వేషన్ల పెంపునకు సంబంధించిన బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉండగా.. ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ జీవోను కొట్టేయాలని గత నెల 27న ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి విదితమే. ఆ పిటిషన్పై ఈ నెల 8న హైకోర్టు విచారణ జరపనుంది. నాటి విచారణలో బిల్లు ఇంకా గవర్నర్ వద్ద పెండింగ్లో ఉండగా జీవో ఎలా జారీ చేస్తారని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. ఈ దశలో రిజర్వేషన్ల పెంపుదలను ఆమోదించలేమని, అదేవిధంగా ఎలాంటి నిలిపివేత ఆదేశాలు జారీ చేయలేమని తెలిపింది. ఒకవేళ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ జారీచేసినా.. పిటిషన్లు ముందే దాఖలు చేసినందున మెరిట్ ఆధారంగా విచారణ చేస్తామని తెలిపింది. తాము ఇచ్చే తీర్పు మేరకే స్థానిక ఎన్నికలు జరుగుతాయని తేల్చి చెప్పింది. దీంతో 8న కోర్టు ఏం తేలుస్తుందన్నదానిపై ఆసక్తి నెలకొంది. పాత రిజర్వేషన్ల ప్రకారమూ సిద్ధమే... సుప్రీం, హైకోర్టుల్లో వ్యతిరేక తీర్పులు వస్తే పాత రిజర్వేషన్ల పద్ధతిలోనే (50 శాతానికి లోబడి) ఎన్నికలు నిర్వహించేందుకు కూడా పీఆర్ శాఖ సన్నాహాలు చేసుకుంటున్నట్టు చెబుతున్నారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్టీ, ఎస్సీల రిజర్వేషన్లను ఖరారు చేసినందున, వాటిని అలాగే ఉంచి గతంలో మాదిరిగా బీసీలకు 23 శాతం రిజర్వేషన్ల కల్పనకు మొగ్గుచూపే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఓటర్ల జాబితాల ఆధారంగా గ్రామపంచాయతీల్లోని వార్డులవారీగా ఫొటోలతో కూడిన ఓటర్ జాబితాలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. కోర్టుల తీర్పు మేరకు ప్రభుత్వం మళ్లీ బీసీ కోటాపై తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా బీసీ, అన్ రిజర్వ్డ్ రిజర్వేషన్లను ఖరారు చేసి, వారంలోనే మరోసారి ఎన్నికల షెడ్యూల్ జారీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే ఎస్ఈసీ జారీచేసిన ఎన్నికల షెడ్యూల్స్ మార్చి వారం రోజుల అంతరంతో నిర్వహించేలా మరోసారి షెడ్యూల్ను జారీచేసే అవకాశాలున్నాయనే చర్చ జరుగుతోంది. అవసరమైన మార్పులు చేశాక మండల, జిల్లా పరిషత్ ఎన్నికల తొలివిడత నోటిఫికేషన్ 9వ తేదీకి బదులు 16న జారీచేసి, ఎన్నికలను 23వ తేదీకి బదులు 30న నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇలా మిగతా నాలుగు విడతలకు కూడా వారం రోజుల అంతరంతో నోటిఫికేషన్, మిగతా దశల ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నట్టు తెలిసింది. ఇలా గతంలో ప్రకటించిన విధంగా నవంబర్ 11కు బదులు 18న ఎన్నికల ప్రక్రియను ముగించే అవకాశం ఉందని చెబుతున్నారు. మరో నెల వేచి చూస్తే ఎలా ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే పట్టుదలతో ఉన్న పక్షంలో అసెంబ్లీ ఆమోదం పొందిన బిల్లుపై గవర్నర్ నిర్ణయం తీసుకునే గడువు వరకు వేచి ఉండే అవకాశం లేకపోలేదని అధికారపార్టీ నేతలు చెబుతున్నారు. పెండింగ్ బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్లు మూడు నెలల్లోగా తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాలని, లేదంటే అవి ఆమోదం పొందినట్టు భావించాలని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. కాగా, మొదటి రెండు పర్యాయాలు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు, ఆర్డినెన్స్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్నాయి. ఆ తర్వాత స్థానిక ఎన్నికల్లో 50 శాతం పరిమితికి మించి రిజర్వేషన్ల అమలుపై (పీఆర్ చట్టానికి సవరణలతో) అసెంబ్లీ ఆమోదించిన బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉంది. మరో 25 రోజులైతే ఆ బిల్లును పంపి 90 రోజులు అవుతుంది. అందువల్ల దీనితోపాటు సుప్రీంకోర్టు, రాష్ట్రపతి నుంచి వచ్చే స్పందనల కోసం మరో నెల వేచి చూస్తే ఎలా ఉంటుందనే చర్చ కూడా అధికార వర్గాల్లో సాగుతోంది. -
TG: ఆర్టీసీకి లాభాల పంట.. దసరా ఆదాయం రూ.110 కోట్లు
సాక్షి, హైదరాబాద్: దసరాకి పెంచిన చార్జీలతో తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ)కి భారీగా ఆదాయం సమకూరింది. రూ.110 కోట్లు ఆదాయం ఆర్జించింది. 50 శాతం అదనపు ఛార్జీలను ఆర్టీసీ వసూలు చేసింది.కాగా, బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 5,300 స్పెషల్ బస్సులు నడిపింది. వీటిలో కొన్ని సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించింది. ఈ నెల 20 నుంచి అక్టోబర్ 2 వరకు ఈ ప్రత్యేక బస్సులను నడిపింది. తిరుగు ప్రయాణానికి సంబంధించి అక్టోబర్ 5, 6 తేదీల్లోనూ రద్దీకి అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేసింది.ఈ ప్రత్యేక బస్సులను హైదరాబాద్లోని ఎంజీబీఎస్, జేబీఎస్తోపాటు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే కేపీహెచ్బీ కాలనీ, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, ఆరాంఘర్ తదితర ప్రాంతాల నుంచి నడిపింది. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలకు సర్వీసులు నడిపింది. దసరా స్పెషల్ బస్సుల్లో రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 16 ప్రకారం టికెట్ ధరలను సవరించారు. అక్టోబర్ 5, 6 తేదీల్లో స్పెషల్ బస్సుల్లోనూ సవరణ చార్జీలు అమలు చేస్తోంది. -
ప్రయాణికులకు TGSRTC బిగ్ షాక్.. బస్సు ఛార్జీల పెంపు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక భారం మోయలేని తరుణంలో.. జంట నగరాల్లో ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచాలని నిర్ణయించుకుంది. పెరిగిన ఈ ఛార్జీలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నట్లు శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. సిటీ బస్సుల్లో సోమవారం(అక్టోబర్ 6వ తేదీ నుంచి) పెంచిన ఛార్జీలను.. అదనపు చార్జీల రూపంలో వసూలు చేయనున్నారు. మొదటి మూడు స్టేజీల వరకు రూ.5 పెంపు, నాలుగో స్టేజ్ నుంచి రూ.10 పెంపు వర్తించనుంది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఈ-ఆర్డినరీ, ఈ-ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ పెంచిన ఛార్జీలు వసూలు చేస్తారు. అలాగే.. మెట్రో డీలక్స్, ఈ-మెట్రో, ఏసీ సర్వీసుల్లో మొదటి స్టేజీకి రూ.5, రెండో స్టేజీ నుంచి రూ.10 అదనపు ఛార్జీ వసూలు చేస్తారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో నడిచే అన్ని బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో 2,800 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను సమకూర్చుకునేందుకు టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం చర్యలు ప్రారంభించింది. రాబోయే రెండేళ్లలో దశల వారీగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనుంది. ఎలక్ట్రిక్ బస్సుల మౌలిక సదుపాయాల వ్యయాన్ని సమకూర్చుకునేందుకు సిటీ బస్సుల్లో అదనపు ఛార్జీని విధించేందుకు సర్కార్ అనుమతి ఇచ్చింది.ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 25 డిపోలు ఉన్నాయి. అందులో 6 డిపోల పరిధిలో 265 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తుండగా.. ఈ ఏడాదిలో అందుబాటులోకి రానున్న మరో 275 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక భారాన్ని మోయలేం.. అందుకే చార్జీలు పెంచాల్సి వస్తోందని టీజీఎస్ఆర్టీసీ అంటోంది. -
జూబ్లీహిల్స్ బైపోల్: కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఎవరంటే..
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను (Jubilee Hills Bypoll) అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. బీఆర్ఎస్ ఈ విషయంలో చాలా ముందుంది. ఇప్పటికే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా ప్రకటించింది. కేటీఆర్ ఆధ్వర్యంలో ప్రచారం కూడా ముమ్మరంగా చేసుకుంటోంది. కాంగ్రెస్ దాదాపుగా మహమ్మద్ అజారుద్దీన్ను ఖరారు చేసినట్లే చేసి.. ఎమ్మెల్సీకి నామినేట్ చేస్తూ ట్విస్ట్ ఇచ్చింది. ఇక బీజేపీ సరైన అభ్యర్థినే ఎన్నుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలో.. ఇప్పటికే హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో అభ్యర్థుల పరిశీలన జరిగింది. ఇవాళ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ నేతృత్వంలో జరిగిన జూమ్ మీటింగ్లోనూ ఈ ఉప ఎన్నిక అంశం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ఇక.. రేసులో ముగ్గురు అభ్యర్థులతో కూడిన జాబితాను సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిని త్వరలోనే పీసీసీకి సమర్పించబోతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. అన్నీ కుదిరితే.. ఈ నెల 6వ తేదీన పీసీసీ స్క్రీనింగ్ కమిటీ భేటీ అయ్యి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది(Jubilee Hills Congress Candidate). ఇక ఈ లిస్టులో లోకల్ యంగ్ లీడర్ నవీన్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా.. అనూహ్యంగా రెహమత్ నగర్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి పేరు వచ్చి చేరినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే గత గ్రేటర్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు గ్రాండ్ విక్టరీకి కారణమైన మైనంపల్లి హనుమంతరావు పేరు కూడా తెర మీదకు రావడం గమనార్హం. మరోవైపు.. బీజేపీ పార్టీ కూడా ఆపరేషన్ జూబ్లీహిల్స్ను ముమ్మరం చేసింది(Jubilee Hills BJP Candidate). ఇందుకోసం త్రీమెన్ కమిటీ వేసింది. ఇందులో మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, మాజీ ఎంపీ రాములు, అడ్వకేట్ కోమల ఆంజనేయులుకు చోటు కల్పించారు. వీళ్లు గ్రౌండ్ లెవల్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా అతిత్వరలో అభ్యర్థిని ఖరారు చేస్తారని సమాచారం. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన లంకా దీపక్రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, పీవీ మనవడు ఎన్వీ సుభాష్, సామాజిక కార్యకర్త మాధవీలత, డాక్టర్ పద్మ విప్పర్తి, కీర్తి రెడ్డి.. ఇలా పలు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఆ రెండు పార్టీలు వారం, పదిరోజుల్లో అభ్యర్థిపై స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. -
మెడికల్ విద్యార్థులకు అలర్ట్.. పీజీ మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్
వరంగల్: మెడికల్ పీజీ మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 4వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకూ దరఖాస్తులను స్వీకరించనున్నట్లు యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు.నీట్-పీజీ అర్హత సాధించిన అర్హత సాధించిన విద్యార్థులు OCI, NRI అభ్యర్థులు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ నమోదు కేవలం మేనేజ్మెంట్ కోటా సీట్ల కోసం రాష్ట్ర మెరిట్ స్థానం నిర్ణయించేందుకు వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. మెరిట్ జాబితా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో అప్లోడ్ చేసిన సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం తాత్కాలిక మెరిట్ జాబితా ప్రకటిస్తారు.సీట్ల వివరాలు 2025-26 విద్యా సంవత్సరానికి మేనేజ్మెంట్ కోటా కింద అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య వెబ్సైట్లో వెబ్ ఆప్షన్లకు ముందు ప్రకటిస్తారు. https://pvttspgmed.tsche.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకుని, స్కాన్ చేసిన ఒరిజినల్ సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాలి. -
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (అక్టోబర్ 04-11)
-
అమెరికా డల్లాస్లో కాల్పులు.. తెలంగాణ విద్యార్థి మృతి
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో గన్ కల్చర్ మరో నిండు ప్రాణం బలి తీసుకుంది. టెక్సాస్ స్టేట్ డల్లాస్ నగరంలో జరిగిన కాల్పుల ఘటనలో తెలంగాణకు చెందిన చంద్రశేఖర్ పోలే(27) కన్నుమూశాడు(Telangana Student Dies Dallas Gun Fire). భారత కాలమానం ప్రకారం.. శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. చంద్రశేఖర్ పోలే స్వస్థలం హైదరాబాద్ ఎల్బీనగర్ బీఎన్ రెడ్డి. బీడీఎస్ పూర్తయ్యాక 2023లో ఉన్నత చదువుల కోసం చంద్రశేఖర్ డల్లాస్ వెళ్లాడు. ఆరు నెలల కిందటే అతని మాస్టర్స్ డిగ్రీ పూర్తైంది. అయితే ఫుల్టైం ప్లేస్మెంట్ కోసం ఎదురు చూసే క్రమంలో స్థానికంగా ఓ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లో జాబ్ చేస్తున్నాడు. అమెరికా కాలమానం ప్రకారం.. శుక్రవారం రాత్రి విధుల్లో ఉన్న అతనిపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో బుల్లెట్ గాయాలతో చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో బీఎన్ రెడ్డిలోని చంద్రశేఖర్ కుటుంబం నివాసం ఉండే కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటన గురించి సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్రావు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అనంతరం ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారాయన. ‘‘బీడీఎస్ పూర్తి చేసి.. ఉన్నత పై చదువుల కోసం అమెరికా (డల్లాస్) వెళ్ళిన ఎల్బీనగర్ కు చెందిన దళిత విద్యార్థి చంద్ర శేఖర్ పోలే ఈరోజు తెల్లవారు జామున దుండగులు జరిపిన కాల్పులో మృతి చెందటం విషాదకరం. ఉన్నత స్థాయిలో ఉంటాడనుకున్న కొడుకు ఇక లేడు అన్న విషయం తెలిసి తల్లిదండ్రులు పడుతున్న అవేదన చూస్తే గుండె తరుక్కు పోతున్నది.... వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని చంద్ర శేఖర్ పార్థీవ దేహాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి తరలించేందుకు కృషి చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం’’ అని అన్నారాయన.బీడీఎస్ పూర్తి చేసి, పై చదువుల కోసం అమెరికా (డల్లాస్) వెళ్ళిన ఎల్బీనగర్ కు చెందిన దళిత విద్యార్థి చంద్ర శేఖర్ పోలే ఈరోజు తెల్లవారు జామున దుండగులు జరిపిన కాల్పులో మృతి చెందటం విషాదకరం. ఉన్నత స్థాయిలో ఉంటాడనుకున్న కొడుకు ఇక లేడు అన్న విషయం తెలిసి తల్లిదండ్రులు పడుతున్న అవేదన… pic.twitter.com/RJy8BdteiD— Harish Rao Thanneeru (@BRSHarish) October 4, 2025సీఎం రేవంత్ విచారంఅమెరికాలో హైదరాబాద్కు చెందిన చంద్రశేఖర్ మృతి చెందడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘అమెరికాలో పోలే చంద్రశేఖర్ మరణం ఆవేదన కలిగించింది. చంద్రశేఖర్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. అతని మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు సహకారం అందిస్తాం అని ఒక ప్రకటనలో తెలిపారు. -
ఇల్లు కొనేవాళ్లకు భరోసా.. అక్రమ డెవలపర్లకు కొరడా!
ప్రీలాంచ్లు, సాఫ్ట్ లాంచ్ల పేరుతో ప్రాజెక్ట్ను స్టార్ట్ చేయకముందే కస్టమర్లు నుంచి ముందస్తుగా డిపాజిట్లు సేకరించడం, వసూలు చేసిన సొమ్ము వ్యక్తిగత అవసరాలకు మళ్లించడం, న్యాయపరమైన చిక్కులతో నిర్మాణ అనుమతులు రాకపోవడం, ఒకవేళ వచ్చినా నిర్మాణ వ్యయ భారంతో నిర్మాణ పనులను మధ్యలోనే ఆపేయడం, సంవత్సరాల కొద్దీ నిర్మాణ పనులు కొనసాగిస్తుండటం.. ఇలా ఒకట్రెండు కాదు సొంతింటి కలకు సవాలక్ష సవాళ్లు. కానీ, ఇవన్నీ రెరా కంటే ముందు మాట. దేశంలో రెరా చట్టం అమలులోకి వచ్చిన తర్వాత డెవలపర్లలో స్థిరాస్తి రంగంలో పారదర్శకత, ఆర్థిక క్రమశిక్షణ పెరిగింది. దీంతో గృహ కొనుగోలుదారులు, పెట్టుబడిదారుల్లో విశ్వాసం నెలకొంది. – సాక్షి, సిటీబ్యూరోదేశంలో 2016లో అమలులోకి వచ్చిన రెరా.. రియల్ ఎస్టేట్ రంగంలో ఒక కీలకమైన ఘట్టం. దశాబ్దాలుగా అనిశ్చితి దేశీయ స్థిరాస్తి రంగాన్ని సంఘటితంగా, పారదర్శక, జవాబుదారీతనంగా మార్చింది మాత్రం రెరానే. విక్రయాలు, ప్రాజెక్ట్ డెలివరీ, స్థిరమైన ధరల పెరుగుదలను తీసుకురావడంతో పాటు రియల్టీలోకి సంస్థాగత, ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులకు అవకాశాలను కల్పించిందని నైట్ఫ్రాంక్, నరెడ్కో సంయుక్త నివేదిక వెల్లడించింది. అయితే రెరా అమలు అన్ని రాష్ట్రాల్లో ఏకరీతిగా లేకపోయినప్పటికీ.. చట్టం ప్రధాన ఉద్దేశం మాత్రం విప్లవాత్మకమైనదే. దేశం పట్టణీకరణ, ఆర్థిక వృద్ధి ప్రయాణాన్ని కొనసాగిస్తున్న ప్రస్తుత తరుణంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో రెరా స్థిరమైన, సమానమైన అమలు సాగడం అత్యవసరం.1.50 లక్షల ప్రాజెక్ట్ల నమోదు..ఇప్పటి వరకు మన దేశంలో నాగాలాండ్ మినహా 27 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో రెరా నోటిఫై అయ్యింది. దేశవ్యాప్తంగా రెరాలో 1.50 లక్షలకు పైగా ప్రాజెక్ట్లు, లక్ష కంటే ఎక్కువ మంది ఏజెంట్లు నమోదయ్యారు. ఇప్పటి వరకు 1.50 లక్షలకుపైగా ఫిర్యాదులు పరిష్కృతమయ్యాయి.ఎస్క్రో అకౌంట్..దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ విలువ 648 బిలియన్ డాలర్లకు చేరింది. ఇందులో 52 శాతం వాటా ఉన్న నివాస సముదాయం విభాగంలో పారదర్శకత అత్యవసరం. కస్టమర్ల నుంచి వసూలు చేసే సొమ్ములో 70 శాతాన్ని ప్రత్యేకంగా ఎస్క్రో బ్యాంక్ ఖాతా తెరిచి అందులో వేయాలి. ఆయా సొమ్మును కేవలం నిర్ధిష్ట ప్రాజెక్ట్ నిర్మాణ పనుల కోసం మాత్రమే వెచ్చించాలి.తెలంగాణ రాష్ట్రంలో..2016లో రెరా అమలులోకి వచ్చినప్పటి నుంచి మహారాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (మహారెరా) ముందంజలో ఉంది. పారదర్శకత, సామర్థ్యం, చురుకైన అమలుతో దేశంలో అత్యధిక ప్రాజెక్ట్లు, ఏజెంట్ల నమోదులో ఇతర రాష్ట్రాల కంటే తొలిస్థానంలో నిలిచింది. మహా రెరాలో ఇప్పటి వరకు 50 వేలకు పైగా ప్రాజెక్ట్లు, 52 వేల మంది ఏజెంట్లు రిజిస్టరయ్యారు. ఆ తర్వాత తమిళనాడు, గుజరాత్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. ప్రస్తుతం టీజీ రెరాలో 10,123 ప్రాజెక్ట్లు, 4516 ఏజెంట్లు రిజిస్టరయ్యారు. 2,340 ఫిర్యాదులు అందగా.. 1,566 పరిష్కృతమయ్యాయి.రెరా ఎందుకొచ్చిందంటే?గత దశాబ్దంలో దేశీయ ఆర్థిక వ్యవస్థ రియల్ ఎస్టేట్ రంగంలో వేగవంతమైన విస్తరణకు కారణమైంది. రెరా కంటే ముందు రియల్టీ పరిశ్రమలో అనిశ్చితి ఉంది. ప్రత్యేక నియంత్రణ వ్యవస్థ అంటూ లేదు. డెవలపర్లను, లావాదేవీలను నియంత్రించడానికి నిర్ధిష్టమైన చట్టాలు లేవు. ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్, బెంగళూరు, హైదరాబాద్, పుణె, చెన్నై, అహ్మదాబాద్, కోల్కతా వంటి ప్రధాన మెట్రో ప్రాంతాలలోనే రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నాయి.ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో పెద్దగా రియల్టీ మార్కెట్ ఉండేది కాదు. డెవలపర్లు తరచూ ఊహాజనిత పెట్టుబడులపై ఆధారపడేవారు. లావాదేవీలలో పారదర్శకత లోపించేది. దీంతో అధిక పరపతి, విస్తృత రుణ డిఫాల్ట్లు, ప్రాజెక్ట్ డెలివరీలో తీవ్ర జాప్యం, వ్యయాల పెరుగుదల, గృహ కొనుగోలుదారుల నిధులను ఇతర అవసరాలకు మళ్లించడం వంటివి జరిగేవి. ఈ వ్యవస్థాగత వైఫల్యాలతో అనేక ప్రాజెక్ట్లు మధ్యలోనే నిలిచిపోయాయి. దీంతో కొనుగోలుదారుల విశ్వాసం దెబ్బతింది. లక్షలాది మంది కస్టమర్లు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుపోయారు. స్థిరాస్తి మార్కెట్ కార్యకలాపాలు క్షీణించాయి.దీంతో విధానపరమైన జోక్యం, కఠిన నిబంధనల అమలు అత్యవసరమయ్యాయి. 2016లో రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ మరియు అభివృద్ధి చట్టం(రెరా)కు దారి తీసింది. స్థిరాస్తి రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం, క్రమబదీ్ధకరణతో పాటు పెట్టుబడిదారులు, కొనుగోలుదారులకు ఆర్థిక భరోసా కల్పిచడమే లక్ష్యంగా రెరా అమలులోకి వచ్చింది.ఏ దేశంలో ఏ రకమైన నిర్మాణ రంగం చట్టాలంటే?1920: దక్షిణాఫ్రికా, ది హౌసింగ్ యాక్ట్1937: అమెరికా, యునైటెడ్ స్టేట్స్ హౌసింగ్ యాక్ట్1960: సింగపూర్, హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డ్(హెచ్డీబీ)1965: యూఎస్ఏ, డిపార్ట్మెంట్ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ (హెచ్యూడీ)1985: యూకే, హౌసింగ్ యాక్ట్1994: చైనా, అర్బన్ రియల్ ఎస్టేట్ అడ్మినిస్ట్రేషన్ లా2007: దుబాయ్, యూఏఈ, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ ఏజెన్సీ(రెరా)2016: ఇండియా, రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్) యాక్ట్ఇదీ చదవండి: ఇల్లు కొనేవాళ్లకు డబుల్ ధమాకా.. -
లండన్లో తెలుగు విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా : జిల్లాలోని మేడిపల్లి మండలం దమ్మనపేట్లో విషాదచాయలు అలుముకున్నాయి. దమ్మనపేట్కు చెందిన ఎనుగు మహేందర్ రెడ్డి (26) అనే అనే విద్యార్థి లండన్లో దుర్మరణం చెందాడు. ఉన్నత విద్యను అభ్యసించడానికి లండన్కు వెళ్లిన మహేందర్రెడ్డికి గుండెపోటు రావడంతో మృత్యువాత పడినట్లు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. నిన్న(శుక్రవారం, అక్టోబర్ 3వ తేదీ) రాత్రి మహేందర్రెడ్డి చనిపోయిన విషయాన్ని అతని స్నేహితులు తండ్రి రమేష్రెడ్డికి తెలియజేశారు. ఉన్నత చదువుల కోసం రెండేళ్ల క్రితం లండన్కు వెళ్లాడు మహేందర్రెడ్డి. కుమారడు ప్రయోజకుడు అవ్వడానికి లండన్ వెళ్లి ఇలా మృతి చెందడం కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో తండ్రి శోకసంద్రంలో మునిగిపోయారు. -
‘గడ్డం’ బ్రదర్స్ దూరం.. దూరం!
మంచిర్యాల జిల్లా: దసరా వేడుకల వేళ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో గురువారం రాత్రి ఆసక్తికర, ఆశ్చర్యకరమైన సన్నివేశం చోటు చేసుకుంది. విజయదశమి వేడుకల్లో భాగంగా సింగరేణి తిలక్ స్టేడియంలో హిందు ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రావణాసుర వధ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్తో పాటు ఆయన సోదరుడు స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. రాత్రి 7.15గంటల ప్రాంతంలో మంత్రి వివేక్ స్టేడియంకు రాగా.. ఎమ్మెల్యే వినోద్ పాల్గొనకపోవడం సభికులను ఆశ్చర్యానికి గురి చేసింది. కొంతసేపటి తర్వాత మంత్రి వివేక్ తన ప్రసంగం ముగించి 7.35గంటలకు మందమర్రిలో నిర్వహించే రాంలీల కార్యక్రమానికి హాజరు కావాలంటూ సభికులకు దసరా శుభాకాంక్షలు తెలియజేసి వేదిక దిగి వెళ్లిపోయారు. మంత్రి వెళ్లిపోయిన విషయాన్ని కొందరు సమాచారం ఇవ్వడంతో అరగంట తేడాతో ఆయన సోదరుడు వినోద్ మైదానానికి చేరుకున్నారు. అప్పటివరకు బాలికల సాంస్కృతిక కార్యక్రమాలతో సభికులు కదలకుండా చూశారు. తమ్ముడు హాజరైన కార్య క్రమానికి అందుబాటులో ఉండి కూడా ఎమ్మెల్యే హాజరు కాకపోగా.. క్యాంపు కార్యాలయానికి వెళ్లి అన్నను తమ్ముడు కలువకపోవడం సభికులు, పుర ప్రజలను విస్మయానికి గురి చేసింది. ఈ సంఘటన తోబుట్టువుల మధ్య నెలకొన్న అసమ్మతికి నిదర్శనమని పలువురు పేర్కొనడం గమనార్హం. ఇద్దరి మధ్య ఎందుకు పొరపొచ్చాలు వచ్చాయో తెలియ దు కానీ ముఖ్య అతిథులుగా హాజరు కావాలి్సన వినోద్, వివేక్ దూరం దూరంగా ఉండడం సర్వత్రా చర్చనీయాంశమైంది. వీరి తీరుపై పురప్రజలు పలు రకాలుగా చర్చించుకోవడం వినిపించింది. ఈ ఘటన కాంగ్రెస్ శ్రేణులను కూడా గందరగోళానికి గురి చేసి చర్చనీయాంశంగా మారింది. -
ఆ శ్రీనుగాడి వల్లే.. నన్ను క్షమించు మమ్మీ!
మేడ్చల్ జిల్లా: మమ్మీ నన్ను క్షమించు.. నాకు బతకాలని లేదు.. నీకు కూడా తెలుసు ఆ శ్రీను గాడు.. వాళ్ల అమ్మ, నాన్నలు.. మనకు మనశాంతి లేకుండా చేస్తున్నారు.. రోజూ ఇంటి వద్ద జరిగే గొడవ భరించలేకపోతున్నా.. అంటూ ఓ మైనర్ బాలిక సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన పేట్బషిరాబాద్ పోలీస్స్టేషన్ (petbasheerabad police station) పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు.. కొంపల్లి (Kompally) పోచమ్మగడ్డకు చెందిన అనూరాధకు ఇద్దరు ఆడపిల్లలు. ప్రైవేట్ ఫైనాన్స్లో అప్పు తీసుకున్న ఆమె భర్త వారి వేధింపులు భరించలేక చనిపోయాడు. అనూరాథ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. తండ్రి చేసిన అప్పులతో ఫైవ్ స్టార్ ఫైనాన్స్ సిబ్బంది బకాయి చెల్లించాలని ఇటీవల వేధింపులకు గురి చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో అనురాధ బావ శ్రీను ఎలాగైనా అనురాధ, ఇద్దరు కుమార్తెలను కుటుంబాన్ని ఇంటి నుండి గెంటేయాలని కొద్ది రోజులుగా వేధింపులకు గురి చేస్తున్నాడు. దసరా పండుగ రోజు అనూరాధ ఇంట్లోని లేని సమయంలో వచ్చిన శ్రీను తనకు రావల్సిన డబ్బులు ఇవ్వాలని గొడవ చేశాడు. అవమానకరంగా మాట్లాడటంతో మానసికంగా కుంగిపోయిన మైనర్ బాలిక ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన చావుకు కారణమైన శ్రీనును కఠినంగా శిక్షించాలని సూసైడ్ నోట్లో పేర్కొంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.చదవండి: బెడ్రూంలో సీక్రెట్ కెమెరా పెట్టి.. గలీజు పనులు -
దసరా తర్వాతే పెద్దబతుకమ్మ
నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంతోపాటు చాలా మండలాల్లో దసరా తర్వాత మహిళలు సద్దుల బతుకమ్మ ఆడడం ఆనవాయితీగా వస్తోంది. ఓ వైపు భైంసాలో మహాలయ అమావాస్య మరుసటి రోజు సద్దుల బతుకమ్మ ఆడడం ప్రత్యేకత కాగా.. నిర్మల్ ప్రాంతంలో పండుగ తర్వాత సద్దుల సందడి కొనసాగుతూ ఉండడం ఇక్కడి స్పెషల్. పూలను పూ జించే ఈ పండుగలో ఇక్కడ కాగితంతో బతుకమ్మలను చేయడం మరో ప్రత్యేకత. దసరా సెలవులు పూర్తవుతున్నా.. చాలామంది యువతులు, విద్యార్థినులు సద్దుల బతుకమ్మ కోసం ఆగడం విశేషం.పౌర్ణమి దాకా ఆటపాటలే...తెలంగాణ వ్యాప్తంగా దసరాకు ముందే బతుకమ్మ పండుగ ముగుస్తుంది. కానీ.. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న జిల్లా మాత్రం ఎన్నో ప్రత్యేకతలను చాటుకుంటోంది. ఒక్కో గ్రామంలో ఒక్కోరోజు పండుగలా సద్దులబతుకమ్మను తీసుకెళ్తుంటారు. నిర్మల్ ప్రాంతంలో దసరా తర్వాత మొదలయ్యే సద్దుల బతుకమ్మల సందడి ఒక్కో ఊళ్లో ఒక్కోరోజు ఉంటుంది. ఈ రోజు(శనివారం) నుంచి ఇలా పౌర్ణమి వరకు రోజూ బతుకమ్మల ఆటపాటలు సాగుతూనే ఉంటాయి. ప్రతీసాయంత్రం గ్రామాలతో పాటు జిల్లాకేంద్రంలోనూ పండుగ వాతావరణం కనిపిస్తుంటుంది. కాగితంతో బతుకమ్మ..జిల్లాలో బతుకమ్మకు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఎక్కడా లేనివిధంగా ఇక్కడ రంగురంగుల కాగితాలతో బతుకమ్మలను తయారు చేస్తారు. పూలను పూజించే ప్రకృతి పండుగలతో ఇలా కాగితాలతో బతుకమ్మలను చేసి ఆడడం ఏంటని చాలామంది ప్రశ్నిస్తుంటారు. గతంలో కరువు పరిస్థితులు ఉన్నప్పుడు నిమజ్జనానికి నీళ్లు లేకపోవడం, అలాగే పువ్వులు లభించకపోవడం తదితర కారణాలతో కాగితపు బతుకమ్మలతో ఆడడం ప్రారంభమై ఉండొచ్చన్న అభిప్రాయం ఉంది.మనదిక్కు పండుగైనంకనే..‘ఓ.. నా చిన్నప్పటి సంది సూస్తున్న. కరీంనగర్, వరంగల్ దిక్కు దసరా పండుక్కు ముందురోజే సద్దుల బతుకమ్మ ఆడుతరు. మనక్కడ మాత్రం పండుగైనంకనే ఆడుతం. ముందటి సంది బొడ్డెమ్మ పండుగ అట్లనే అస్తున్నది..’ అని నిర్మల్కు చెందిన 80ఏళ్ల రాం ముత్తమ్మ చెబుతోంది.మానాయి ఉన్నందునే...కరీంనగర్, వరంగల్ వైపు దసరాకు ముందురోజే సద్దుల బతుకమ్మ ఆడుతారు. కానీ.. మాదిక్కు మానాయి(మహర్నవమి) పెద్దపండుగగా చేసుకుంటాం. ఆ రోజు ఇంట్లో నుంచి పసుపుకుంకుమలు, మంగళహారతి సహా ఏ వస్తువునూ బయటకు తీసుకెళ్లం. అందుకే సద్దుల బతుకమ్మను దసరా తర్వాతనే చేసుకుంటాం.–ఏనుగుల విమల, నిర్మల్బతుకమ్మ కోసమే...దసరా పండుగంటే చాలా ఇష్టం. అందులోనూ బతుకమ్మ అంటే ఇంకా ఇష్టం. రోజూ అమ్మవాళ్లతో కలిసి పాడుతూ ఆడుతూ నేర్చుకుంటాం. ఇక దసరా తర్వాత సద్దుల బతుకమ్మ కోసమే హైదరాబాద్ వెళ్లకుండా నిర్మల్లోనే ఉంటా.– అనన్య, సాఫ్ట్వేర్ ఇంజినీర్, నిర్మల్ -
ఉదయాన్నే హైడ్రా కూల్చివేతలు.. మీడియాకు అనుమతి నో..
హైదరాబాద్: నగరంలోని కొండాపూర్లోగల బిక్షపతి నగర్లో శనివారం ఉదయం నుంచే హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ప్రభుత్వ స్థలంలోని అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నట్లు హైడ్రా సిబ్బంది పేర్కొన్నారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కాగా కూల్చివేతల వద్దకు మీడియాను కూడా పోలీసులు అనుమతించడం లేదు. రెండు కిలోమీటర్ల దూరంలోనే మీడియాను, స్థానికులను పోలీసులు అడ్డుకుంటున్నారని సమాచారం.కాగా, హైదరాబాద్లో గత కొన్నేళ్లుగా అక్రమ నిర్మాణాలు భారీస్థాయిలో చేపట్టారు యథేచ్ఛగా అక్రమార్కులు నిబంధనలని ఉల్లంఘిస్తున్నారు. అక్రమ నిర్మాణాలతో పలు ప్రాంతాలు వర్షాకాలంలో వరదలకు గురవుతున్నాయి. ఈ సమస్యపై హైడ్రా ఫిర్యాదులు వస్తోండటంతో అక్రమ నిర్మాణాలను కూల్చివేసే చర్యలు చేపట్టింది.దీనిలో భాగంగా గత నెలలో గాజులరామారంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. దాదాపు 300 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జాదారులు ఆక్రమించారు. దాంతో చర్యలు చేపట్టింది హైడ్రా. గాజులరామారంలో ప్రభుత్వ స్థలాన్ని కబ్జాదారులు ఆక్రమించారు. 15వేల కోట్ల విలువైన భూమి ఆక్రమణకు గురికావడంతో దీనిపై హైడ్రాకు స్థానికులు ఫిర్యాదులు చేశారు. అనంతరం, హైడ్రా రంగంలోకి దిగింది. కబ్జాల చెర నుంచి 300 ఎకరాలకు పైగా భూమికి విముక్తి కల్పించారు. కబ్జాదారులు 60 నుంచి 70 గజాల్లో ఇళ్లను నిర్మించి రూ.10 లక్షల చొప్పున స్థానికులకు విక్రయించినట్టు అధికారులు గుర్తించారు. హైడ్రా కూల్చివేతల సందర్బంగా అక్రమార్కులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. -
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు ఎంఐఎం దూరం!!
సాక్షి,హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు మజ్లిస్ పార్టీ దూరం పాటించనుందా? అనే ప్రశ్నకు సమాధానం ఔననే వస్తోంది. రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్ సెగ్మెంట్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ‘ఎన్నికల్లో స్థానికుడు, సమర్థుడు, ప్రజా సమస్యల పరిష్కరానికి తపించే యువ నేతను ఎన్నుకోవాలి’ అని పిలుపునివ్వడం ఇందుకు బలం చేకూర్చుతోంది. ఏకంగా ఒవైసీ.. బీఆర్ఎస్పై విమర్శనాస్త్రాలు సంధించారు. గత పదేళ్లు ప్రాతినిధ్యం వహించిన ప్రజాప్రతినిధి పార్టీ అధికారంలో ఉన్నప్పటికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని.. తాను బాధ్యతాయుతంగా చెబుతున్నానంటూ అనడమే కాకుండా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి నియోజకవర్గ అభివృద్ధి పనులు తీసుకెళ్లినప్పుడు తనకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. దీంతో కాంగ్రెస్కు మజ్లిస్ మద్దతు యోచన ఉన్నట్లు పరోక్షంగా వెల్లడించినట్లైంది. మరోవైపు బీజేపీ బలోపేతం కాకుండా నిలువరించాల్సి అవసరం ఉందని, మధ్యలో ఓట్లు చీల్చేందుకు కొన్ని కత్తెర పారీ్టలు రావ్చని, ఆలోచించి యువనేతను ఎన్నుకోవాలని సూచించడాన్ని బట్టి ఉప ఎన్నికల్లో పోటీకి దూరం పాటిస్తున్నట్లు పరోక్షంగా స్పష్టం చేసినట్లయింది. పార్టీ పరంగా అధికారికంగా ఒకటి రెండు రోజుల్లో తుది నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అధికారపక్షంతో కలిసి నడిచేందుకు.. మజ్లిస్ పార్టీ వ్యూహంలో భాగంగా తాము ప్రాతినిధ్యం వహించే అసెంబ్లీ సెగ్మెంట్లలో అభివృద్ధి పనుల కోసం రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో కలిసి నడిచే అనవాయితీ ఉంది. అందులో భాగంగానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని సూత్రపాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా హైదరాబాద్ పాతబస్తీలో ఎదురులేని రాజకీయ శక్తిగా తయారైన మజ్లిస్ పార్టీ గత మూడు పర్యాయాలుగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్పై పాగా వేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. తెలంగాణ ఆవిర్భావ సమయంలో బరిలో దిగి ఢీ.. అంటే ఢీ అనే విధంగా పోటీ పడి స్పల్ప ఓట్ల తేడాతో రెండో స్థానంతో సరిపెట్టుకుంది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అప్పటి అధికార పక్షం బీఆర్ఎస్ దోస్తీ కోసం బరిలోకి దిగలేదు. అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేసినప్పటికీ పరాజయం తప్పలేదు. తాజాగా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చెందడటంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుతం అధికార కాంగ్రెస్తో సత్ససంబంధాలు కలిగి ఉండటంతో ఉప ఎన్నికలకు దూరం పాటించాలని భావిస్తోంది.సెగ్మెంట్లో మజ్లిస్ ప్రస్థానం తొలిసారిగా 2014లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన మజ్లిస్ గట్టి పోటీ ఇచి్చంది. అప్పటో మజ్లిస్ తరఫున రంగంలో దిగిన బీసీ సామాజిక వర్గానికి చెందిన నవీన్ యాదవ్ తొమ్మిది వేల ఓట్లతో తేడాతో రెండో స్థానంలో నిలిచి ఓటమి పాలయ్యారు. 2018లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేయకుండా అప్పటి మిత్రపక్షమైన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి సిట్టింగ్ ఎమ్మెల్యేకు మద్దతు ప్రకటించింది. దీంతో నవీన్ యాదవ్ మజ్లిస్కు రాజీనామా చేసి ఇండిపెండెంట్గా పోటీ చేసి సుమారు 18 వేల పై చిలుకు ఓట్లు సాధించారు. 2023లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చిన మజ్లిస్ పార్టీ.. జూబ్లీహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యేపై స్నేహపూర్వక పోటీకి దిగింది. ముస్లిం మైనారిటీ ఓట్లు కాంగ్రెస్ పారీ్టకి మళ్లకుండా చేసి అధికార బీఆర్ఎస్కు సహకరించేందుకు ఆ పార్టీ బరిలో దిగినట్లు ప్రచారం సాగింది. అంతా ఊహించినట్లే బీఆర్ఎస్కు లాభం చేకూరింది. కానీ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం చేజారగా.. కాంగ్రెస్ గద్దెనెక్కింది. ఆ తర్వాత కాంగ్రెస్తో మజ్లిస్ స్నేహం కుదిరింది. తాజాగా ఉప ఎన్నికల్లో దూరం పాటించేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. -
మమ్మీ నన్ను క్షమించు.. నాకు బతకాలని లేదు
మేడ్చల్ జిల్లా: మమ్మీ నన్ను క్షమించు.. నాకు బతకాలని లేదు.. నీకు కూడా తెలుసు ఆ శ్రీను గాడు.. వాళ్ల అమ్మ, నాన్నలు.. మనకు మనశాంతి లేకుండా చేస్తున్నారు.. రోజూ ఇంటి వద్ద జరిగే గొడవ భరించలేకపోతున్నా.. అంటూ ఓ మైనర్ బాలిక సూసైడ్నెట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన పేట్బషిరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు.. కొంపల్లి పోచమ్మగడ్డకు చెందిన అనూరాధకు ఇద్దరు ఆడపిల్లలు. కాగా ప్రైవేట్ ఫైనాన్స్లో అప్పు తీసుకున్న ఆమె భర్త వారి వేధింపులు భరించలేక చనిపోయాడు. అనూరాథ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. తండ్రి చేసిన అప్పులతో ఫైవ్ స్టార్ ఫైనాన్స్ సిబ్బంది బకాయి చెల్లించాలని ఇటీవల వేధింపులకు గురి చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో అనురాధ బావ శ్రీను ఎలాగైనా అనురాధ, ఇద్దరు కుమార్తెలను కుటుంబాన్ని ఇంటి నుండి గెంటేయాలని కొద్ది రోజులుగా వేధింపులకు గురి చేస్తున్నాడు. దసరా పండుగ రోజు అనూరాధ ఇంట్లోని లేని సమయంలో వచి్చన శ్రీను తనకు రావల్సిన డబ్బులు ఇవ్వాలని గొడవ చేశాడు. అవమానకరంగా మాట్లాడటంతో మానసికంగా కుంగిపోయిన మైనర్ బాలిక ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన చావుకు కారణమైన శ్రీను ను కఠినంగా శిక్షించాలని సూసైడ్ నోట్లో పేర్కొంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పూటకో మాట.. రోజుకో తీరు
సాక్షి, హైదరబాద్: తెలంగాణ తల్లి ఫ్లై ఓవర్ బోర్డుకు సంబంధించి జీహెచ్ఎంసీ తీరు ప్రజలకు అంతుచిక్కడం లేదు. ఫ్లై ఓవర్ ఒకవైపు (పాత సచివాలయం వైపు) ప్రవేశ మార్గంలో గత మంగళవారం ప్రజలకు దర్శనమిచ్చిన బోర్డును సాయంత్రానికి అక్షరాలు కనిపించకుండా తెర వేశారు. తెలుగుతల్లిగా ఉన్న పేరును తెలంగాణ తల్లిగా మార్చడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో జీహెచ్ఎంసీ చేసిన ఆ పనితో పలు సంశయాలు వెల్లువెత్తాయి. సోషల్మీడియాలో వైరల్గా మారడంతో ఫ్లై ఓవర్ రెండో వైపు(లోయర్ట్యాంక్బండ్) ప్రవేశమార్గంలో కూడా బోర్డు ఏర్పాటు చేశాక రెండింటినీ కలిపి ఒకేసారి ప్రారంభిస్తామని జీహెచ్ఎంసీ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. రెండు రోజుల్లో రెండింటినీ కలిపి ఒకేసారి ప్రారంభిస్తామని పేర్కొంది. కానీ.. రెండో వైపు బోర్డు ఏర్పాటు కాకుండానే సచివాలయం వైపు బోర్డుకు వేసిన తెరను తొలగించి, తిరిగి అక్షరాలు కనిపించేలా చేసింది. ఇంతమాత్రానికి ఈ తతంగమంతా ఎందుకు? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. తొలుత ఒకవైపు మాత్రమే ఏర్పాటు చేస్తే ఎవరైనా కాదన్నారా? ఎందుకు మూసేశారు? రెండోవైపు ఏర్పాటు కాకున్నా మళ్లీ ఎందుకు తెర తీశారు? రెండూ ఒకేసారి ప్రారంభిస్తామని ఎందుకు ప్రకటించారు? అంటూ పలువురు జీహెచ్ఎంసీ చర్యల్ని తప్పుపడుతున్నారు. -
జీఎస్టీ జోరుకు కళ్లెం
సాక్షి, హైదరాబాద్: ఐదు నెలలుగా జోరు మీద ఉన్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ)కు కళ్లెం పడింది. ఇటీవల కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2025 సెప్టెంబర్లో తెలంగాణ జీఎస్టీ రాబడులు రూ.4,998 కోట్లకు పరిమితమయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.5వేల కోట్లకు తక్కువగా జీఎస్టీ ఆదాయం నమోదు కావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. గత ఏడాది సెప్టెంబర్తో పోల్చినా ఇది తక్కువే. 2024 సెప్టెంబర్లో రూ.5,267 కోట్లు జీఎస్టీ ఆదాయం రాగా, ఈసారి అంతకంటే రూ.269 కోట్లు (5 శాతం) తక్కువగా వచ్చిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.దేశమంతా రాబడులు పెరిగినా తెలంగాణలో తక్కువగా రావడం గమనార్హం. దేశంలో రెండు, మూడు రాష్ట్రాల్లో మాత్రమే ఈ ఏడాది సెప్టెంబర్లో జీఎస్టీ ఆదాయం పడిపోయింది. మణిపూర్ (1 శాతం), ఢిల్లీ (1 శాతం), హిమా చల్ప్రదేశ్ (4శాతం)లో రాబడులు తగ్గాయి. మధ్య ప్రదేశ్లో 21 శాతం, బిహార్లో 17, ఉత్తరప్రదేశ్లో 11, రాజస్తాన్లో 10 శాతం మేర జీఎస్టీ పెరిగింది. దక్షిణాది విషయానికొస్తే కేరళలో 13 శాతం, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో (4 శాతం), కర్ణాటకలో 7 శాతం జీఎస్టీ పెరిగింది. కానీ, తెలంగాణలో మాత్రం గత సెప్టెంబర్తో పోలిస్తే ఈ సెప్టెంబర్లో తక్కువ ఆదాయం వచ్చిందిఆగస్టు వరకూ పైపైకే...:ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ మినహాయిస్తే మిగిలిన ఐదు నెలల జీఎస్టీ రాబడులు రాష్ట్రంలో ఆశాజనకంగానే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే వరుసగా ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకూ పెరుగుతూనే ఉన్నాయి. అయితే, ఈ ఏడాదిలో చూస్తే మాత్రం ప్రతి నెలా (ఒక్క జూలై మినహా) తగ్గుతూనే ఉన్నాయి. 2025లో ఏప్రిల్లో అత్యధికంగా రూ. 6,983 కోట్లు వచ్చిన జీఎస్టీ రాబడులు ఆ తర్వాతి నెలలో రూ.5,310 కోట్లకు పడిపోయాయి. జూన్లోనూ అంతకంటే తక్కువగా నమోదు కాగా, జూలైలో మాత్రం రూ.300 కోట్ల పెరుగుదల కనిపించింది. ఇక, ఆగస్టు, సెప్టెంబర్లో మళ్లీ తగ్గుదలే నమోదైంది.కారణాలేంటి?దేశవ్యాప్తంగా జీఎస్టీ రాబడులు పెరగ్గా.. రాష్ట్రంలో మాత్రం తగ్గేందుకు కారణాలేంటన్న దానిపై వాణిజ్య వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, జీఎస్టీ అధికారులు మాత్రం ఇందుకు చెప్పుకోదగిన కారణాలేవీ లేవని, సాంకేతిక కారణాలతోనే అలా జరిగి ఉంటుందని అంటున్నారు. ఈ తగ్గుదల యాదృచ్ఛికమేనని చెబుతున్నారు. తెలంగాణలో లగ్జరీ వస్తువుల వినియోగం ఎక్కువగా ఉంటుందని, సెప్టెంబర్ రిటర్న్స్ వచ్చే నెలలో ఆ వస్తువుల కొనుగోళ్లు తగ్గి ఉండటం, కేంద్రం నుంచి వచ్చిన పాత బకాయిలు, పరిహారం లాంటివి ఇతర రాష్ట్రాలకు ఎక్కువగా వచ్చి ఉండొచ్చని, లేదంటే ఆయా రాష్ట్రాల్లో పెద్ద స్థాయిలో వచ్చిన డిమాండ్ ఈనెలలో కార్యరూపం దాల్చి ఉంటుందని అంటున్నారు. అంతేతప్ప జీఎస్టీ రాబడుల్లో తెలంగాణలో ప్రత్యేక తగ్గుదల లేదని వారు చెబుతుండటం గమనార్హం. -
ప్రపంచ ఫ్యాక్టరీగా భారత్
సాక్షి, హైదరాబాద్: బొమ్మల నుంచి యుద్ధ ట్యాంకుల వరకు అన్నీ భారత్లోనే తయారవుతున్నాయని, మన దేశం ప్రపంచ ఫ్యాక్టరీగా ఎదిగే రోజు ఎంతో దూరంలో లేదని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ అన్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం ప్రారంభమైన ‘జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (జిటో) కనెక్ట్ 2025’మూడు రోజుల సదస్సును కేంద్రమంత్రి కిషన్రెడ్డితో కలిసి రాజ్నాథ్సింగ్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థలో జైన సముదాయ వాటా అసాధారణమన్నారు.దేశ జనాభాలో జైన సముదాయం కేవలం 0.5 శాతం ఉన్నా, మొత్తం పన్ను సేకరణలో వారి సహకారం 24 శాతంగా ఉందని చెప్పారు. కఠిన శ్రమ, సంపన్నతకు ప్రపంచవ్యాప్తంగా జైన సమాజం గుర్తింపు పొందిందని ప్రశంసించారు. జైన సముదాయ తాత్వికత భారతీయ సంస్కృతిలో లోతుగా పాతుకుపోయి ఉందని, దాని చరిత్ర భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రయాణంలో అమూల్యమైన పాఠమని పేర్కొన్నారు. ఫార్మా, ఏవియేషన్, విద్యా రంగాల్లో జైన సముదాయం ముందంజలో ఉందని తెలిపారు. ‘పురాతన తీర్థంకరుల నుంచి ఆధునిక కాల నాయకుల వరకు, జైన సిద్ధాంతం భారతదేశ నైతిక, ధార్మిక ఆకృతిని రూపొందించింది. జైన సముదాయ ముద్ర ప్రతిచోటావిలువలతో కూడిన వృద్ధికి చిరునామా: శ్రీధర్బాబుతెలంగాణ విలువలతో కూడిన వృద్ధికి చిరునామాగా నిలుస్తూ దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్గా మారిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. పారిశ్రామికాభివృద్ధికి అత్యంత అనుకూలంగా ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను కోరారు. ఒకప్పుడు పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాలిచ్చే రాయితీలు, ప్రోత్సాహకాలను చూసే పెట్టుబడులు పెట్టేవారన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు వారి ఆలోచన తీరు కూడా మారిందని చెప్పారు.జైన సమాజం సేవా స్ఫూర్తిని, తెలంగాణలో ఆవిష్కరణల వాతావరణంతో అనుసంధానిస్తే ప్రపంచం కోరుకుంటున్న నైతిక వృద్ధి నమూనా ఆవిష్కృతం అవుతుందని చెప్పారు.రెండేళ్లకో మారు రొటేషన్ ప్రాతిపదికన జరిగే జిటో సదస్సు ఈసారి హైదరాబాద్లో జరుగుతుండగా, ప్రపంచ నలుమూలల నుంచి 50 వేలకుపైగా ప్రతినిధులు హాజరవుతారని నిర్వా హకులు తెలిపారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు, యోగాగురువు రాందేవ్ బాబా, జిటో హైదరాబాద్ చాప్టర్ ప్రతినిధులు రోహిత్ కొఠారి, లలిత్ చోప్రా, విశాల్ అంచాలియా, జిటో కన్వీనర్ బీఎల్ భండారీ, సుశీల్ తదితరులు పాల్గొన్నారు. కాగా జిటో సదస్సుకు వచ్చిన రాజ్నాథ్ సింగ్కు బేగంపేట విమానాశ్రయంలో స్వాగతం పలికిన వారిలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు, ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్రెడ్డి ఉన్నారు. -
ఉత్తమ లక్షణాలతో.. దీర్ఘాయుష్మాన్భవ!
మంచి వ్యక్తిత్వ లక్షణాలు ఉన్నవారు మంచివారు అనిపించుకోవడమే కాదు.. దీర్ఘాయుష్మంతులు అని పిలిపించుకునే అదృష్టం కూడా దక్కుతుందట. చురుగ్గా ఉండటం, నలుగురికీ సాయపడే మనస్తత్వం, సమయపాలన, ఏ పనినైనా ఒక పద్ధతి ప్రకారం చేయడం, కష్టపడే వ్యక్తిత్వం, మనస్సాక్షికి అనుగుణంగా నడుచుకునేవారు..ఈ లక్షణాలు లేనివారితో పోలిస్తే ఎక్కువ కాలం బతుకుతారని జర్నల్ ఆఫ్ సైకోసోమాటిక్ రీసెర్చ్లో ప్రచురించిన ఓ పరిశోధన వెల్లడించింది. తరచుగా ఒత్తిడికి గురికావడం, ఆందోళన చెందడం, అసంతృప్తిగా ఉండటం వల్ల జీవితకాలం తగ్గిపోతుందట.ఆరోగ్యం అనగానే మనకు గుర్తుకొచ్చేవి..మంచి పోషకాహారం, వ్యాయామాలే. ఇవే దీర్ఘాయుష్షుకు చిట్కాలు అనుకుంటాం. కానీ, కొన్ని విశిష్ట వ్యక్తిత్వ లక్షణాలు కూడా మనం సుదీర్ఘకాలంపాటు ఆరోగ్యంగా బతికేలా చేస్తాయని, మరణ భయాన్ని తగ్గిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. చెరపకురా చెడేవు.మంచి లక్షణాలతో..సాధారణంగా రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి వాటి ఆధారంగా వ్యాధులు లేదా రోగాలను అంచనా వేస్తారు. వ్యక్తుల ఆలోచనల తీరు, అనుభూతి చెందుతున్న విధానం, వారి ప్రవ ర్తన వంటివి.. భవిష్యత్తులో రాబోయే రోగా లు లేదా వ్యాధులను అంచనా వేయడానికి వైద్యులు సాధనాలను అభివృద్ధి చేయడంలో సహాయపడతాయని ప్రముఖ మనస్తత్వవేత్త రెనే మోటస్ తెలిపారు. మనుషులు తమ వ్యక్తిత్వ లక్షణాలను మార్చుకోవడం ద్వారా మరింత ఎక్కువ కాలం బతికేందుకు అవకా శం ఉందని అధ్యయన ఫలితాలు సూచిస్తు న్నాయని ఆయన అన్నారు. ఈ నిర్దిష్ట వ్యక్తిత్వ లక్షణాలకు, మరణానికి సంబంధం ఉందని వెల్లడించారు. ‘ఆందోళన, నిరాశ, కోపం వంటి ప్రతికూల భావోద్వేగాలను తరచుగా, తీవ్రంగా అనుభవించే ధోరణిని కలిగి ఉండడ మే న్యూరోటిసిజం. ఈ లక్షణాలను మార్చడం కష్టం. దీనికంటే వ్యక్తిత్వ లక్షణాలు మార్చడం సులభం. తద్వారా న్యూరోటిసిజం కూడా నయమవుతుంది’ అని ఆయన అన్నారు.అవి వద్దు.. ఇవి ముద్దుఆందోళనకర మానసిక స్థితి, ప్రశాంతత లేనివారి ఆయుష్షు రోజురోజుకీ క్షీణి స్తుంటుంది. అలాగే అధిక కొవ్వుతో బాధపడుతున్నవారు, ధూమపానం చేసేవా రికి సైతం ముప్పు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వీరితో పోలిస్తే మనస్సాక్షి ని నమ్మి, దానికి అనుగుణంగా పనిచేసేవారిలో.. మెరుగైన ఆరోగ్య నిర్వహణ, అధిక స్వీయ–క్రమశిక్షణ, బాధ్యత, ఉల్లాసభరితమైన జీవితం వంటి ఆరోగ్యకర మైన అలవాట్లు ఉండే అవకాశం ఎక్కువగా ఉందని అధ్యయనం తెలిపింది. విశాల దృక్పథం, స్నేహపూర్వకంగా ఉండే మనస్తత్వం, ఎప్పుడూ ఉల్లాసంగా, చురుగ్గా ఉండటం వంటి లక్షణాలు జీవితకాలాన్ని పెంచుతాయని పేర్కొంది.వ్యక్తిత్వమూ కీలకమే‘ఆయుష్షు విషయంలో వ్యక్తిత్వం కీలక పాత్ర పోషిస్తుందని మా పరిశోధనలో తేలింది. కానీ వైద్యరంగం, ప్రపంచం.. ఆరోగ్యం విషయంలో దీనికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు’ అని ఐర్లాండ్లోని లిమెరిక్ విశ్వవిద్యాలయంలో మన స్తత్వశాస్త్ర అసోసియేట్ ప్రొఫెసర్, నివేదిక సహ రచయిత పారిక్ ఓ సూలివా¯Œ వ్యాఖ్యానించారు. ‘సమయపాలన పాటించేవారు, ఏ పనినైనా పద్ధతిగా చేసేవారు జీవితాన్ని చక్కగా ప్లాన్ చేసుకుంటారు. వీరికి క్రమశిక్షణతో కూడిన దినచర్య ఉంటుంది. సమయాన్ని అనవసర విషయాలకు వ్యర్థం చేయడం వీరికి నచ్చదు. అందువల్ల ఆరోగ్య సంబంధ విషయాల్లోనూ వీరు మిగతావారితో పోలిస్తే మరింత జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంటుంది. తద్వారా వీరు మిగతావారికంటే ఎక్కువ కాలం జీవించడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి’ అని అన్నారు.28 ఏళ్లపాటు అధ్యయనం⇒ పరిశోధనలో 22,000 మంది పాలుపంచుకున్నారు. 6 నుంచి 28 ఏళ్లపాటు వీరిపై అధ్యయనం చేశారు. వ్యక్తిత్వ లక్షణాలను మరణానికి అనుసంధానించిన ఈ అధ్యయనంలో.. పరిశోధకులు ప్రధాన వ్యక్తిత్వ లక్షణాలను పరిశీలించి వీరి మరణ కాలాలను అంచనా వేశారు.⇒ మనస్సాక్షికి విలువ ఇచ్చి, అందుకు అనుగుణమైన విశి ష్ట వ్యక్తిత్వ లక్షణాలు ఉన్నవారు.. ఈ లక్షణాలు లేనివారి తో పోలిస్తే వేగంగా చనిపోయే అవకాశాలు 15శాతం తక్కువ.⇒ సమయపాలన పాటిస్తూ, ఏ పనినైనా ఒక పద్ధతిగా చేసే లక్షణాలున్న వారు.. తొందరగా మరణించే అవకాశం 14 శాతం తక్కువ.⇒ బాధ్యతాయుతంగా ఉండే వ్యక్తులూ ఎక్కువ కాలం బతుకుతారు. బాధ్యతారాహిత్యంతో ఉండేవారితో పోలిస్తే వీరు వేగంగా మరణించే అవకాశాలు 12 శాతం తక్కువ.⇒ కష్టపడి పనిచేసే మనస్తత్వం లేదా లక్షణాలు ఉన్నవారిలో మరణ అవకాశాలు 15 శాతం తక్కువ. -
సర్వేజనా సుఖినోభవంతే.. భారతీయ సంస్కృతి
సాక్షి, హైదరాబాద్: భారతీయ సంస్కృతి ‘సర్వేజనా సుఖీనోభవంతు’తో ముడిపడి ఉందని గవర్నర్ డా.జిష్ణుదేవ్వర్మ అన్నారు. భారత్లో ఒక ప్రాంతం, మరో ప్రాంతం, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి పండుగలు, ఆచారాల వంటివి మారినా భిన్నత్వంలో ఏకత్వం మాదిరిగా సంస్కృతి, సంప్రదాయాలు కలగలిసి పోయాయన్నారు. శుక్రవారం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో అలయ్ బలయ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మార్గదర్శకత్వంలో చైర్పర్సన్ బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘దసరా సమ్మేళనం’లో గవర్నర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అలయ్ బలయ్ని ఈ ఏడాది ప్రత్యేకంగా ’ఆపరేషన్ సింధూర్’ వీరులకు శ్రద్ధాంజలి, సైనికుల త్యాగాలను స్మరించే కార్యక్రమంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జిషు్టదేవ్వర్మ మాట్లాడుతూ అలయ్ బలయ్ వంటి అసాధారణమైన వేడుకల తర్వాత మానవ సంబంధాలు మరింత బలపడతాయని చెప్పారు. జమ్మిచెట్టును పూజించడం ద్వారా పర్యావరణం, ప్రకృతిని ప్రేమించాలనే పురాతన ధర్మాన్ని నేటికీ చాటి చెబుతున్నారన్నారు. ⇒ మేజర్ జనరల్ అజయ్మిశ్రా (సెంట్రల్ ఆఫీసర్ కమాండ్) ప్రసంగిస్తూ ‘కేవలం 88 గంటల్లో ముగిసిన ఆపరేషన్ సింధూర్ భారత మిలటరీ చరిత్రలో గొప్ప ఆపరేషన్. ఇది చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద చర్యలకు ఆపరేషన్ సింధూర్ ఒక సమాధానం’అన్నారు. ⇒ మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ‘దేశాన్ని కులం, మతం, ప్రాంతం పేరుతో చీల్చే ప్రయత్నాలు సాగవు. నేపాల్లో ఏదో జరిగిందని, భారత్లోనూ అలాంటిది జరుగుతుందని ఆశించేవారి ఆశలు నెరవేరవు, భిన్నత్వంలో ఏకత్వమే భారత్ బలం’అన్నారు. ⇒ కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ ‘దేశానికి ఏ సమస్య వచ్చిన అందరం ఏకం కావాలి. అదే నిజమైన అలయ్ బలయ్’అని అన్నారు. ⇒ కేంద్ర న్యాయ శాఖమంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ ప్రసంగిస్తూ...‘మనుషులు ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకుంటే మనస్సులు పరిశుభ్రమవుతాయి. రాజస్తాన్లోని బికనీర్ ప్రాంతంలోనూ అలయ్ అంటూ జానపదగీతం ఉంది (పాడి వినిపించారు). జాతీయ సమైక్యతకు ఒక రూపం, చిహ్నంగా అలయ్ బలయ్ నిలుస్తోంది’అన్నారు. ⇒ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ‘తెలంగాణ సాధనకు అందరం ఐక్యంగా పోరాటం చేశాం. బయట కత్తులు దూసుకునే వారు ఇక్కడకు రాగానే అలయ్ బలయ్ చేసుకుంటారు’అని చెప్పారు. ⇒ సినీనటుడు నాగార్జున మాట్లాడుతూ ‘అలయ్ బలయ్’లో సత్కారం చేయించుకోవడం తొలిసారి. చాలా కొత్తగా ఉంది. ఇరవై ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండడం గొప్పవిషయం’అని చెప్పారు. ⇒ ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ప్రసంగిస్తూ ‘అలయ్ బలయ్ అంటే హృదయపూర్వకంగా ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకోవడం. ఇది మన పూర్వికుల నుంచి వస్తోంది’అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్రావు, మంత్రులు డి.శ్రీధర్బాబు, డా.వివేక్ వెంకటస్వామి, సీపీఐ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డా.కె.నారాయణ, ఎమ్మారీ్పఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణమాదిగ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు, ఎంపీలు డా.కె.లక్ష్మణ్, ఆర్.కృష్ణయ్య, డీకే.అరుణ, కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఎం.రఘునందన్రావు, అనిల్కుమార్ యాదవ్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్, ఎమ్మెల్సీలు సి.అంజిరెడ్డి, మల్క కొమురయ్య, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎంపీలు ఏపీ జితేందర్రెడ్డి, వి.హనుమంతరావు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, గాయకులు విమలక్క, మంగ్లీ, వందేమాతరం శ్రీనివాస్, పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని అలయ్ బలయ్ ఫౌండేషన్ ప్రతినిధులు చింతలరామచంద్రారెడ్డి, డా.శిల్పారెడ్డి నిర్వహించారు. బాక్స్ ఐటమ్ గా వాడాలి ఆచారాలను పునరుజ్జీవింపజేసేందుకే ‘అలయ్ బలయ్’: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సాక్షి, న్యూఢిల్లీ: ఆచారాలను పునరుజ్జీవింపజేసేందుకే ‘అలయ్ బలయ్’కార్యక్రమమని రాష్ట్రపతి ద్రౌపదిముర్ము అన్నారు. ఇది సోదరభావాన్ని పెంపొందించే సాంస్కృతిక ఉత్సవమని కొనియాడారు. బండారు దత్తాత్రేయ ప్రారంభించిన అలయ్ బలయ్ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని తెలిపారు. ఇంత గొప్ప వేడుకకు అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నానంటూ రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు.‘హైదరాబాద్లో అక్టోబర్ 3న అలయ్ బలయ్ పండుగ ఎంతో ఉత్సాహంగా జరుపుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది. బతుకమ్మ నృత్యాలు, జానపద కళలకు ప్రతీక. నవరాత్రి ఉత్సవాల సమయంలో నిర్వహించే అన్ని వర్గాలను ఒకచోటకు చేర్చే ఘనమైన వేడుక. తెలంగాణ సంస్కృతి, ప్రజల్లోని ఐక్యత, సమాజ విలువల వ్యాప్తికి ఇదో సామాజిక సమావేశంగా ఉపయోగపడుతుంది. అలయ్ బలయ్ పండుగ విజయవంతం కావాలని కోరుకుంటూ, తెలంగాణ ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు.‘అని ద్రౌపది ముర్ము తన సందేశంలో తెలిపారు. -
ప్రచారం.. వారమే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఈ నెల 9న మండల, జిల్లా పరిషత్ తొలిదశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ప్రకటన వెలువడిన రోజు నుంచి మూడురోజుల్లో నామినేషన్ల దాఖలు ముగియనుంది. ఇక ఉపసంహరణలు పూర్తయ్యాక పోటీలో ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికి వారం రోజుల సమయమే కేటాయించారు. ఈ కాలంలో వారు ఓటర్లకు అవగాహన కల్పన, ఎన్నికల ప్రచారానికి, కార్యకర్తలు, ఏజెంట్లకు శిక్షణ ఇచ్చేందుకు ఉపయోగించుకోవచ్చు. అయితే పోలింగ్ ముగియడానికి నిర్ణయించిన సమయానికి 48 గంటల ముందు ఎలాంటి ప్రచారం నిర్వహించడానికి అవకాశం లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ⇒ రాత పూర్వక అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్లు వాడొద్దు..అదీ నిర్ణీత సమయం వరకే అనుమతి ఉంటుందని పేర్కొంది. ⇒ సమావేశాలు, ర్యాలీల నిర్వహణలో ఆయా ప్రదేశాలకు అనుమతి కూడా తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ⇒ అభ్యర్థులు ఉపయోగించే వాహనాల వివరాలు ముందుగానే కలెక్టర్లు, ఎన్నికల అధికారికి తెలియజేయాల్సిఉంటుంది. ప్రచారానికి ఉపయోగించే కరపత్రాలు, పోస్టర్లు మొదలైన వాటి ముద్రణపైనా ఆంక్షలున్నాయని, వీటి ముద్రణదారుల వివరాలు, అడ్రస్ వంటివి తప్పకుండా వాటిపై పేర్కొనాలని తెలిపింది. ⇒ ప్రచారం నిర్వహించేటప్పుడు నైతికతకు ప్రాధాన్యతనిస్తూ, స్నేహపూర్వక పోటీ వాతావరణాన్ని దెబ్బతీసేలా అభ్యర్థులు వ్యవహరించొద్దని సూచించింది. ⇒ ఎన్నికల సమయంలో ఎలాంటి అనైతిక కార్యకలాపాలకు తావు లేకుండా అభ్యర్థులు, ఏజెంట్లు, కార్యకర్తలు వ్యవహరించాలని పేర్కొంది. ⇒ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎన్నికల ప్రక్రియ ఆగిపోవచ్చు. ఓటర్లకు ఏ రకంగానూ లంచం ఇచ్చేందుకు, అనుచిత ప్రవర్తనతో ఓటర్లను బెదిరించడం, భయపెట్టడం, దొంగ ఓట్లను ప్రోత్సహించేలా వ్యవహరించొద్దని ఎస్ఈసీ స్పష్టం చేసింది. ⇒ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఏదైనా వాహనంలో పోలింగ్ కేంద్రానికి ఓటర్లను తీసుకెళ్లేందుకు ప్రయతి్నంచొద్దు. ⇒ ఎస్ఈసీ విధించిన అభ్యర్థుల వ్యయ పరిమితి మాత్రం పూర్వకాలం నాటిదే కొనసాగుతోంది. జెడ్పీటీసీగా పోటీచేసే వారి వ్యయ పరిమితి రూ.4 లక్షలుగా ఉంది. విద్వేష భావాలు రెచ్చగొడితే అంతే... ఎన్నికల లబ్ధి కోసం అభ్యర్థి లేదా అతడి అనుమతితో ఏజెంట్, ఇతరులు మతం, జాతి, కులం, వర్గం లేదా భాషా ప్రాతిపదికన ప్రజల మధ్య విభేదాల సృష్టి, వ్యక్తుల మధ్య విద్వేష పూరిత భావాలు లేదా దేశంలోని వివిధ తరగతుల మధ్య విద్వేష భావాలు రెచ్చగొట్టడం వంటి వాటిని కూడా అవినీతి చర్యగానే పరిగణిస్తామని ఎస్ఈసీ స్పష్టం చేసింది. విద్వేషాలతో రెచ్చగొట్టిన వారు ఒకవేళ గెలిచినా సభ్యత్వం రద్దయ్యే పరిస్థితి ఎదురవుతుంది. ఎన్నికల నేరంగా పరిగణిస్తే మూడేళ్ల వరకు పొడిగించే జైలుశిక్ష, జరిమానా రెండూ విధిస్తారు. ఏదో ఒక నామినేషనే ఉంచుకోవాలి ఆయా ప్రాదేశిక నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు వేసి ఉంటే, అందులో ఏదో ఒకటి ఎంచుకొని మిగిలిన వాటిని ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. లేనిపక్షంలో అభ్యర్థులు సమర్పించిన అన్ని నామినేషన్లు తిరస్కరణకు గురై ఎక్కడి నుంచైనా పోటీకి అనర్హులుగా మిగిలిపోతారు. ఉదాహరణకు రెండు చోట్ల ఎంపీటీసీగా లేదా రెండు చోట్ల జెడ్పీటీసీగా నామినేషన్లు వేసి విత్ డ్రా చేసుకోకపోతే అనర్హులు అవుతారు. ఒక చోట ఎంపీటీసీగా, మరో చోట జెడ్పీటీసీగా పోటీ చేసినా, ఆ నామినేషన్లు చెల్లుబాటు అవుతాయి. -
మన మాటే ఆయుధం
సాక్షి, హైదరాబాద్: ‘అయుధం అంటే ఏకే–47, ఆటంబాంబులే కాదు... అంతకంటే శక్తివంతమైంది మన మాట’అని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, హ్యూమన్ రైట్స్ లా నెట్వర్క్ వ్యవస్థాపకులు కొలిన్ గొన్సాల్వేస్ అన్నారు. ఏ సమస్య అయినా అది ప్రజల్లో విస్తృత చర్చ జరగాలన్నా... ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నా దానిపై గొంతెత్తి నినదించాలని చెప్పారు. అప్పుడే దాని తీవ్రత తెలుస్తుందని, సమస్యకు పరిష్కారం దొరుకుతుందని వివరించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని శిల్పకళావేదికలో నిర్వహించిన ‘మంథన్ సంవాద్–2025’కార్యక్రమంలో పలు అంశాలపై మేధావులు, నిపుణులు ప్రసంగించారు.ఇందులో కొలిన్ గొన్సాల్వేస్ మాట్లాడుతూ.. లద్దాక్లో ప్రజలు చేస్తున్న ఆందోళనలో యువత పాత్ర ప్రధానంగా ఉందన్నారు. మణిపూర్లో 2022లో ప్రారంభమైన హింస నేటికీ చల్లారలేదని ఆందోళన వ్యక్తం చేశారు. హింసలో మరణించిన వారి కుటుంబాలకు కనీస పరిహారం దక్కలేదని, నిరాశ్రయులైన వారికి పునరావాసం కలి్పంచాలని సుప్రీంకోర్టు ఆదేశించినా అమలు కాలేదన్నారు.ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల నిర్మూలన పేరిట గిరిజనులను తరలించే యత్నం జరుగుతోందని, గిరిజన ఆవాసాల్లో ఉన్న అత్యంత విలువైన ఖనిజాలను తవ్వేందుకే ఈ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం తలపెట్టిందని మండిపడ్డారు. కేంద్ర హోంమంత్రి అత్యంత దారుణంగా మాట్లాడుతూ హింసాత్మకమైన వ్యాఖ్యలు చేస్తున్నారని, దీనిపై ప్రతీ పౌరుడు గొంతెత్తాలని పిలుపునిచ్చారు. వ్యంగ్యంతో కూడిన విమర్శలకు తీవ్ర ప్రభావం: వీర్ దాస్, నటుడు ఏదైనా సమస్యపై వ్యంగ్యంతో కూడిన విమర్శలు చేసినప్పుడు అవి తీవ్ర ప్రభావం చూపడమేకాక... అంతే వేగంతో వాటికి పరిష్కారం కూడా లభిస్తుంది. అలాంటి విమర్శలు చేయాలంటే భావప్రకటనా స్వేచ్ఛ అవసరం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేనట్లు కనిపిస్తోంది. విమర్శలపై ప్రభుత్వం సహనాన్ని కోల్పోతోంది. వారిని అరెస్టు చేసి జైల్లో పెట్టడం పరిపాటిగా మారింది. హాస్యం అనేది సమాజానికి అద్దంలాంటిది. అందులో కనిపించే వ్యంగ్యం సమాజంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను బయటకు చూపుతుంది. ఆర్థిక అసమానతలు: ప్రొఫెసర్ రతిన్ రాయ్ దేశంలోని చాలా రాష్ట్రాల మధ్య ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరుగుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థలో ఉత్తరాది రాష్ట్రాల కంటే దక్షిణాది రాష్ట్రాల వాటా ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం ఢిల్లీ కంటే రెట్టింపుగా ఉంది. ఇక తమిళనాడు, కేరళ రాష్ట్రాల వృద్ధి ఇండోనేసియా దేశం కంటే ఎక్కువ. జనాభా పరంగా పెద్ద రాష్ట్రాలైన ఉత్తర్ప్రదేశ్, బిహార్లో నేపాల్ వృద్ధి కంటే చాలా తక్కువ. దేశంలోని రాష్టాల మధ్య సమానత్వంతో కూడిన ఆర్థిక విధానాలుండాలి. లేకుంటే పేదలు, మధ్యతరగతి వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందవు. ఆర్థిక విధానాలను సరిచేసుకుంటేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. నిజాయితీ జర్నలిజం కావాలి: ఆర్ఫా ఖానమ్ శేర్వానీ, సీనియర్ ఎడిటర్, ది వైర్ ప్రజాస్వామ్య రక్షణలో మీడియా పాత్ర కీలకం. నాలుగో స్తంభంగా పిలిచే మీడియా ప్రభుత్వాలకు మద్దతుగా ప్రచారం చేయడం కంటే ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మీడియా స్వేచ్ఛను నియంత్రిస్తే అది ప్రజాస్వామ్యానికి ఎంతో ప్రమాదం. సమాజంలో సమస్యలు, ప్రభుత్వ లొసుగులను మీడియా బయటకు చెప్పకుంటే ప్రజలు తప్పుదోవ పట్టే ప్రమాదం ఉంది. అందుకే నిజమైన వార్తలను నిజాయితీగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత పాత్రికేయులపై ఉంది. సైన్యాన్ని బలపరిస్తే సరిపోదు: ప్రవీణ్ సావ్నీ, ఎడిటర్, ఫోర్స్ మేగజైన్ దేశం సురక్షితంగా ఉండాలంటే కేవలం సైన్యానికి అధిక నిధులు కేటాయిస్తే సరిపోదు. ఆర్థిక, సాంకేతికంగా ప్రత్యేక దృష్టి సారించి బలపర్చాలి. ఇప్పటివరకు యుద్ధమంటే సైనికులు మాత్రమే చేసేవారు. ఇకపై జరిగే ఆధునిక యుద్ధాలు సాంకేతిక పరిజ్ఞానంతో జరిగేవే. ఇక అమెరికా–భారత్ విషయంలోనూ ఇబ్బందికర వాతావరణం కనిపిస్తోంది. చైనా, పాకిస్తాన్ అనుసరిస్తున్న వ్యూహాలు భారత్పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అంతర్జాతీయంగా బలమైన వ్యవస్థగా ఎదగాలంటే సరైన స్పృహతో ప్రభుత్వం పాలన సాగించాలి. నైతికత, సహనంతోనే భవిష్యత్తు: రుద్రాంగ్షు ముఖర్జీ, చరిత్రకారులు, అశోకా వర్సిటీ చాన్స్లర్ నైతికత, సహనం, జ్ఞానంతోనే యువతకు మెరుగైన భవిష్యత్తు సాధ్యమవుతుంది. మహాత్మా గాం«దీ, రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలోచనలు ఈ అంశాలను ప్రస్ఫుటం చేస్తాయి. నేటి సమాజంలో ప్రజల్లో విభజన భావాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితి దేశ సమగ్రతకు పెనుముప్పుగా మారే ప్రమాదం ఉంది. ఇలాంటి ఆలోచనల నుంచి సరైన మార్గంలో నడిపించేందుకు సరైన విద్యావిధానం అవసరం. స్వతంత్రంగా ఆలోచనలు చేసే విధంగా, మానవతా విలువలు పెంపొందించేలా విద్యావిధానం ఉండాలి. -
‘లక్ష’ణంగా ఖజానా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ రాబడులు రూ. లక్ష కోట్లకు చేరవయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి ఐదు నెలలకుగాను రాష్ట్ర ఖజానాకు రూ. 96,654.25 కోట్లు సమకూరినట్లు కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గణాంకాలు వెల్లడించాయి. ఈ ఏడాది ఆగస్టు 31 వరకు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ, వ్యయాలపై కాగ్ ఇచి్చన నివేదిక మేరకు రెవెన్యూ రాబడులు రూ. 63 వేల కోట్లు దాటగా అప్పులు రూ. 33 వేల కోట్ల మార్కు చేరాయి. పన్నుల ఆదాయం రూ. 60 వేల కోట్లకు చేరువ కాగా గతేడాదితో పోలిస్తే ఒక శాతం మేర పన్ను రాబడులు తగ్గాయి. భారీగా అప్పుల పద్దు కాగ్ లెక్కల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 54 వేల కోట్లకు పైగా అప్పులు సమకూర్చుకోవాలని రాష్ట్ర బడ్జెట్లో పొందుపర్చగా అందులో 61.87 శాతం అంటే రూ. 33,434 కోట్లు ఈ ఐదు నెలల్లో సమకూరాయి. అయితే ఈ లెక్క ఆగస్టు వరకు మాత్రమే. గత నెలలో ప్రభుత్వం రూ. 15 వేల కోట్ల మేర అప్పులు తీసుకుంది. ఈ అప్పులతో కలిపితే రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలతో పోలిస్తే మరో ఆరు నెలలు మిగిలి ఉండగానే అప్పులు దాదాపు 90 శాతానికి చేరనున్నాయి. గతేడాదితో పో లిస్తే అప్పులు ఈసారి కూడా ఎక్కువేనని ‘కాగ్’లెక్కలు చెబుతున్నాయి. గతేడాది ఆగస్టు 31 నాటికి ఆ ఏడాది బడ్జెట్ ప్రతిపాదనలతో పోలిస్తే 59.79 శాతం అప్పులు తీసుకోగా ఈసారి అది మరో రెండు శాతం పెరిగింది. పన్ను ఆదాయం ఇలా... ఈ ఆర్థిక సంవత్సరంలోని ఐదు నెలల రాబడులను పరిశీలిస్తే గతేడాది కంటే కొంచెం తగ్గినా అటూఇటుగానే పన్ను ఆదాయం వస్తోందని ‘కాగ్’వెల్లడించింది. ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి జీఎస్టీ కింద రూ. 21,144 కోట్లు, రిజి్రస్టేషన్ల శాఖ ద్వారా రూ. 6,218 కోట్లు, అమ్మకపు పన్ను పద్దు కింద రూ. 14,079 కోట్లు, ఎక్సైజ్ రూపంలో రూ. 7,758 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటా కింద రూ. 7,413 కోట్లు, ఇతర పన్నులు, డ్యూటీల ద్వారా రూ. 3,352.82 కోట్లు వచ్చాయి. వాటికి అదనంగా పన్నేతర ఆదాయం కింద రూ. 1,578 కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో రూ. 1,673 కోట్లు సమకూరాయి. -
కోచింగ్ సెంటర్ల వ్యాపారం చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, మెడికల్, సివిల్స్, గ్రూప్స్, టోఫెల్.. ఇలా రంగం ఏదైనా, ఎలాంటి పోటీ పరీక్షకైనా శిక్షణ ఇచ్చేందుకు దేశవ్యాప్తంగా వెలిసిన కోచింగ్ సెంటర్లు ఏటా రూ. వేల కోట్ల వ్యాపారం సాగిస్తున్నట్లు ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఇన్ఫీనియం తాజా నివేదికలో పేర్కొంది. 2022 నాటికి దేశవ్యాప్తంగా రూ. 58 వేల కోట్లుగా ఉన్న కోచింగ్ సెంటర్ల వ్యాపారం.. ఈ ఏడాది నాటికి ఏకంగా రూ. 70 వేల కోట్లకు చేరిందని వెల్లడించింది. అలాగే 2028 నాటికి రూ. 1.38 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేసింది.కోవిడ్ తర్వాత ఆన్లైన్, డిజిటల్ కోచింగ్ (Digital Coaching) విధానం బాగా పెరగడం వల్ల కోచింగ్ కేంద్రాల వ్యాపారం పెరుగుదలకు దోహదపడుతోందని తెలిపింది. వ్యాపార మార్కెట్ను మరింత పెంచుకోవడానికి వీలుగా ప్రచారంపై ఏటా రూ. 150 కోట్లకుపైనే కోచింగ్ సెంటర్లు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొంది. అయితే దేశంలోని 78 శాతం కోచింగ్ కేంద్రాల్లో కనీస నాణ్యతా ప్రమాణాలు లేవని కేంద్ర విద్యాశాఖ గుర్తించింది. ఆయా కేంద్రాల్లో నిపుణులైన అధ్యాపకులు ఉండట్లేదని.. సూక్ష్మ బోధన విధానం తప్ప సబ్జెక్టుపై దృష్టి పెట్టడం లేదని కనుగొంది. ఫలితంగా జేఈఈ, నీట్లో వివిధ రూపాల్లో ప్రశ్నలు వస్తే విద్యార్థులు సమాధానం ఇవ్వలేకపోతున్నారని అభిప్రాయపడింది. విద్యార్థులపై ఒత్తిడి.. దేశవ్యాప్తంగా ఏటా జేఈఈ మెయిన్కు (JEE Main) సుమారు 13 లక్షల మంది, నీట్కు 22 లక్షల మంది పోటీ పడుతుండటంతో కోచింగ్ సెంటర్లు రూ. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. దీనికితోడు మొత్తం విద్యార్థుల్లో మెరిట్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందిస్తూ మిగతా వారికి పెద్దగా నాణ్యత లేని ఫ్యాకల్టీతో కోచింగ్ ఇస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో పోటీ పరీక్షల్లో ర్యాంకులు రాని విద్యార్థులు తీవ్ర మానసిక వేదనకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ లెక్కల ప్రకారం 2013లో 8,423 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోగా 2022 నాటికి ఈ సంఖ్య 13,044కు పెరిగింది. 2025 చివరి నాటికి ఈ సంఖ్య 13 శాతం పెరగొచ్చని అంచనా వేసింది. ర్యాంకుల కోసం కోచింగ్ కేంద్రాలు, తల్లిదండ్రుల ఒత్తిడి, విద్యార్థుల్లో పెరిగిన ఆందోళన, ఒంటరితనం ఆత్మహత్యలకు కారణమని ఎన్సీఆర్బీ తెలిపింది. కట్టడికి కార్యాచరణ మొదలైనా.. కోచింగ్ సెంటర్ల ఒత్తిడి వల్ల విద్యార్థులకు జరుగుతున్న నష్టాన్ని నివారించాలని నిర్ణయించిన కేంద్ర విద్యాశాఖ.. ఇందుకోసం ఈ ఏడాది మొదట్లో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. కేంద్ర ఉన్నత విద్యా కార్యదర్శి వినీత్ జోషి చైర్మన్గా ఉన్న ఈ కమిటీలో సీబీఎస్ఈ చైర్మన్, పాఠశాల ఉన్నత విద్య విభాగాల సంయుక్త కార్యదర్శులు, ఐఐటీ మద్రాస్, తిరుచ్చి, కాన్పూర్ ఎన్ఐటీ, ఐఐటీ, ఎన్సీఈఆర్టీ (NCERT) ప్రతినిధులు సహా మరికొందరిని ఇందులో సభ్యులుగా చేర్చింది.కోచింగ్తో పనిలేకుండా విద్యార్థులు పోటీ పరీక్షలకు ఎలా సన్నద్ధమవ్వాలనే కోణంలో పరిశీలించి నివేదిక ఇవ్వడంతోపాటు ప్రైవేటు కోచింగ్ సెంటర్ల ప్రచార, నాణ్యతా ప్రమాణాలను పరిశీలించాలని ఈ కమిటీని కేంద్రం ఆదేశించింది. పాఠశాల విద్యలో లోపాలు, క్రిటికల్ థింకింగ్ విధానాలు, పాఠశాల విద్య నుంచే పోటీ పరీక్షల సన్నద్ధత, కాలేజీల్లో కెరీర్ గైడెన్స్, ఒత్తిడి లేని సిలబస్ తీసుకురావడంపై కమిటీ అధ్యయనం చేయాలని సూచించింది. అయితే ఈ కమిటీ ఇప్పటివరకు సరైన మార్గదర్శకాలను సూచించలేదు. ఉన్నత విద్యామండలి సిఫార్సులివి.. కోచింగ్ కేంద్రాల వల్ల జరిగే నష్టాన్ని కట్టడి చేయడానికి చట్టబద్ధ నియంత్రణ అవసరమని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి ప్రభుత్వానికి ఇటీవల నివేదించారు. ‘సాక్షి’కి ప్రత్యేకంగా అందిన ఈ నివేదికలోని పలు సిఫార్సులు ఇవి.. ⇒ కోచింగ్ సెంటర్లపై బలమైన నియంత్రణ వ్యవస్థ ఉండాలి. ⇒ శిక్షణా కేంద్రాలకు గుర్తింపును తప్పనిసరి చేయాలి. ⇒ డేటా ప్రైవసీ చట్టాల పరిధిలోకి వాటిని తేవాలి. ⇒ ఆయా సెంటర్లపై ఫీజుల నియంత్రణ ఉండాలి. విదేశీ విద్యా కన్సల్టెంట్లు, ఆన్లైన్ విద్యా వేదికలు, సాఫ్ట్వేర్, టెక్నాలజీ ప్రొవైడర్లు నియంత్రణ పరిధిలో ఉండాలి. ⇒ ఉన్నత విద్యా మండలి వద్ద కోచింగ్ కేంద్రాలు అనుమతి పొందేలా ఉండాలి. ఆయా కేంద్రాలను పర్యవేక్షించి ఏటా నాణ్యతను అధికారికంగా నిర్ణయించాలి. ⇒ ఉన్నత విద్యలో తృతీయ పక్షం జోక్యం వల్ల నాణ్యత దెబ్బతింటోంది. ⇒ ఆన్లైన్ వేదికలు, సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అందిస్తున్న కోచింగ్ పారదర్శకంగా ఉండట్లేదు. గుర్తింపు లేని కోర్సులు, అర్హతలేని బోధకులు, పాత సిలబస్ వల్ల విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. కోచింగ్ కేంద్రాలు లాభాలే తప్ప నాణ్యత పట్టించుకోవడం లేదు. అకడమిక్ పాఠాలతో ఒత్తిడి లేకుండానే విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. తల్లిదండ్రులూ కారణమే ర్యాంకులే తప్ప విద్యార్థుల సామర్థ్యాన్ని తల్లిదండ్రులు అంచనా వేయడం లేదు. అత్యున్నత నాణ్యతా ప్రమాణాల ప్రకారమే బోధించాలని పట్టుబడుతున్నారు. దీనివల్ల సగటు విద్యార్థులు మానసిక ఒత్తిడి గురవుతున్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను తీర్చిదిద్దితే కోచింగ్తో పనే లేదు. – ఎంఎన్ రావు (జేఈఈ కోచింగ్ నిపుణుడు) చట్టం తేవాల్సిందే కోచింగ్ కేంద్రాల నియంత్రణకు పకడ్బందీ చట్టం తేవాలి. నాణ్యత లేని, నిపుణులు లేని కేంద్రాలపై చర్యలు తీసుకోవాలి. విద్యార్థులపై ఒత్తిడి పెంచి ర్యాంకులతో ప్రచారం చేసుకొనే కోచింగ్ కేంద్రాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలి. ఈ అంశాన్ని శాసనమండలిలో లేవనెత్తుతా. చట్టం తెచ్చేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా. – పింగిలి శ్రీపాల్రెడ్డి (ఉపాధ్యాయ ఎమ్మెల్సీ) -
అల్లరి చేస్తోందని.. చేతులు విరిచి.. ట్యాంకులో పడేసి.. ఏడేళ్ల బాలిక హత్య
సాక్షి,హైదరాబాద్: మాదన్న పేట బాలిక హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఏడేళ్ల బాలిక అల్లరి చేస్తుందనే కారణంతో మేనమామ,అత్త కిరాతకంగా ప్రాణాలు తీసినట్లు పోలీసులు గుర్తించారు. ఇంట్లో అల్లరి చేస్తుందన్న కారణంతో బాలికను నోటికి ప్లాస్టర్ వేసి, కాళ్లు చేతులు కట్టేసి వాటర్ ట్యాంక్లో పడేశారు. అయితే, బాలిక తల్లితో నిందితులకు గత కొంతకాలంగా ఆస్తి పంపకాల విషయంలో గొడవలు జరుగుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఓ వైపు ఆస్తి పంపకాల విషయంలో గొడవలు, పాప అల్లరి చేయడం తట్టుకోలేక విచక్షణ కోల్పోయిన నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టారు. పోలీసుల వివరాల మేరకు.. ఒవైసీ కంచన్ బాగ్ ప్రాంతానికి చెందిన ఏడేళ్ల బాలిక గత వారం తన తల్లితో కలిసి మాదన్నపేటలో నివసించే అమ్మమ్మ ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో మొన్న సాయంత్రం ఇంట్లో నుండి బయటకి వెళ్లిన బాలిక ఆచూకీ గల్లంతయ్యింది. చీకటి పడుతున్న పాప ఆచూకీ లభ్యం కాకపోవడంతో బాలిక తల్లి, అమ్మమ్మ, ఇతర కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే.. బాలిక మృతదేహం నీళ్ల ట్యాంక్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.ప్రమాదవ శాత్తూ బాలిక నీళ్ల ట్యాంకులో పడిపోయిందా.. లేదంటే ఎవరైనా హత్య చేసి అందులో పడేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంటి వాటర్ ట్యాంక్లో నీర్జీవంగా ఉన్న బాలిక మెడ, నోరు, చేతులు అనుమానాస్పద గుర్తులు ఉండటం, చేతులు వెనక్కి విరిచి ఉండడంపై పోలీసులు బాలికది హత్యేనని ప్రాథమిక దర్యాప్తులో విచారణలో నిర్ధారించారు. కుటుంబ సభ్యుల్ని సైతం అదుపులోకి తీసుకున్నారు. ఈ విచారణలో బాలిక మేనమామ,అతని భార్య తీరు అనుమానాస్పదంగా పొంతనలేని సమాధానాలు చెప్పారు. పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేపట్టగా దారుణం వెలుగులోకి వచ్చింది. బాలికను హత్య చేసింది మేనమామ,అత్తేనని గుర్తించారు. -
రాడిసన్ బ్లూ ప్లాజాకు టూరిజం ఎక్సలెన్స్ అవార్డు
బంజారా హిల్స్లో రాడిసన్ బ్లూ ప్లాజా, క్లాసిఫైడ్ హోటల్స్ - 5 స్టార్ కేటగిరీ కింద.. తెలంగాణ ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక టూరిజం ఎక్సలెన్స్ అవార్డు 2025 పొందింది. హైదరాబాద్లో జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ అవార్డును అందుకుంది.టూరిజం ఎక్సలెన్స్ అవార్డును.. రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ తరపున సౌత్ ఇండియా ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ సందీప్ జోషి, రాడిసన్ బ్లూ ప్లాజా బంజారా హిల్స్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ రాజర్షి భట్టాచార్జీ అందుకున్నారు. ఆతిథ్యంలో అత్యుత్తమ ప్రతిభ, అత్యుత్తమ సేవా నాణ్యత ఈ అవార్డు నిదర్శనం. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఈ అవార్డును అందుకోవడం మాకు ఎంతో గౌరవంగా ఉందని జోషి పేర్కొన్నారు. -
TG: రికార్డ్ స్థాయిలో మద్యం అమ్మకాలు
హైదరాబాద్: తెలంగాణలో మద్యం అమ్మకాలు మరోసారి రికార్డు స్థాయికి చేరాయి. దసరా పండుగ సందర్భంగా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. ప్రధానంగా సెప్టెంబర్ 30, అక్టోబర్ ఒకటవ తేదీల్లో మద్యం కొనుగోళ్లు భారీగా పెరిగాయి. ఈ రెండు రోజుల్లో దాదాపు రూ.419 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఇందులో సెప్టెంబర్ 30వ తేదీన రూ. 333 కోట్ల మద్యాన్ని మందుబాబులు కొనుగోలు చేయగా, అక్టోబర్ 1వ తేదీన రూ. 86 కోట్ల మద్యం సేల్స్ జరిగాయి సాధారణ రోజులతో పోలిస్తే సెప్టెంబర్ 26 నుంచి మద్యం అమ్మకాలు రెట్టింపు అయ్యాయి అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా మద్యం అమ్మకాలతోపాటు మాంసం దుకాణాలు కూడా బంద్ కావడంతో మళ్లీ శుక్రవారం నుంచి మద్యం విక్రయాలు ఊపందుకున్నాయి. ఈ ఒక్కరోజు రూ. 300 కోట్ల మద్యం బిజినెస్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇదీ చదవండి: నా స్థానంలో పోటీ చేసేది ఎవరంటే?.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు -
‘కేంద్ర ప్రభుత్వ ఇమేజ్ పెంచే ప్రయత్నం చేయాలి’
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ ఇమేజ్ పెంచే ప్రయత్నం చేయాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి. నగరంలో ఈరోజు(శుక్రవారం, అక్డోబర్ 3వ తేదీ) బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లీగల్ సెల్ సమావేశమైంది. ఈ కార్యక్రమానికి కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవల్ ముఖ్య అతిథిగా హాజరు కాగా, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ఎంపీలు కె. లక్ష్మణ్, రఘునందన్రావు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావులు పాల్గొన్నారు. దీనిలో భాగంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ.. ‘ కేంద్ర ప్రభుత్వం ఇమేజ్ను పెంచేందుకు పార్టీలోని ప్రతీ ఒక్కరూ కృషి చేయాలి. కేంద్ర పాలసీలకు అనుగుణంగా కోర్టలల మనం వాదిస్తామనేది కీలకం రానున్న మూడేళ్లు కీలకం. అందుకు ప్రత్యేకమైన శిక్షణ తరగతులు నిర్వహించాలి.కేంద్ర ప్రభుత్వ స్టాండ్ బలంగా వినిపించేందుకు ఎఫర్ట్ పెట్టాలి. తెలంగాణ లో అధికారంలో బీజేపీ రావాలి అంటే అందరం కలసి కట్టుగా పని చేయాలి. అర్జున్ రామ్ మేఘవల్ ఐఏఎస్గా ఉన్నప్పటికీ రాజీనామా చేసి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు. ప్రతి శాఖ అనేక రిఫార్మ్స్ తీసుకువస్తుంది. కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాటిని సమర్ధవంతంగా ఎదుర్కోవాలి.బ్రిటిష్ చట్టాలు ఇప్పటికి అమలు అవుతున్నాయి. వర్తమాన ప్రజల ఆలోచనలకు అనుగుణంగా చట్టాలు తేవాలని మోదీ ఆలోచన’ అని పేర్కొన్నారు.ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ‘ కాలం చెల్లిన చట్టాలను మోదీ రద్దు చేశారు దేశాన్ని ఆర్థికంగా విచ్ఛిన్నం చేసేందుకు ఇతర దేశాలు కుట్రలు పన్నుతున్నాయి. మోదీ విజనరీ లీడర్ కాబట్టి సూక్ష్మంగా స్పందిస్తున్నారు. జీఎస్టీ తగ్గిపుతో దీపావళి వెలుగులు పేదల ఇళ్లల్లో నింపుతున్నారు. అగ్రదేశాల అడ్డగోలు టారిఫ్లతో తో భారతదేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేయాలని చూస్తున్నాయి.ఇండియా ఎదుగుదలను చాలా దేశాలు జీర్ణించుకోలేక పోతున్నాయి. స్వదేశీ వస్తువుల వినియోగించడం ద్వారా.. మన ఆదాయం ఇతర దేశాలకు వెళ్లకుండా ఉంటుంది. పెట్టుబడులు పెరుగుతాయి. ఇతరులకు ఉపాధి కలుగుతుంది’ అని స్పష్టం చేశారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు మాట్లాడుతూ. ‘ త్వరిగతిన న్యాయం దక్కాలని గత చట్టాలను రద్దు చేసి.. భారత న్యాయ సంహిత చట్టాలు మోదీ సర్కార్ తెచ్చింది. హైదరాబాద్ నడి రోడ్డుపై న్యాయవాది దంపతులను నరికి చంపారు. కేసు వేసిన వాళ్లను వెనక్కి తీసుకోకపోతే హత్య చేశారు. సీబీఐ దర్యాప్తు ప్రస్తుతం జరుగుతుంది. న్యాయవాదులకు భద్రత కల్పించే చట్టాలు రావాలి’ అని పేర్కొన్నారు. ఇదీ చదవండి: త్వరలో ఆపరేషన్ సిందూర్ 2.0 -
'ఐబొమ్మ' వార్నింగ్.. స్పందించిన తెలంగాణ ప్రభుత్వం
సినిమా పైరసీ రాకెట్ను ఛేదించిన హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులపై చాలామంది ప్రశంసలు కురిపించారు. ఈ మూఠాకు చెందిన ఐదుగురిని అరెస్టు చేసి, వారి వద్ద డెబిట్కార్డులు, హార్డ్డిస్క్లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ వార్తలు వచ్చిన కొన్ని గంటల్లోనే సినిమా పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ పేరుతో తెలంగాణ పోలీసులకు హెచ్చరికలు అంటూ ఒక పోస్ట్ వైరల్ అయింది. తాజాగా వాటిని తెలంగాణ ప్రభుత్వం ఖండించింది. ఈ అంశంపై వచ్చిన బెదిరింపుల వార్తలు అవాస్తం అంటూ తెలంగాణ ప్రభుత్వ ఫ్యాక్ట్చెక్ (Fact Check) టీమ్ చెప్పింది.ఐ బొమ్మ గురించి తెలంగాణ ప్రభుత్వ ఫ్యాక్ట్చెక్ పేజీ తమ ‘ఎక్స్’లో ఓ పోస్టు పెట్టింది. 'కొన్ని మీడియా కథనాలు, సోషల్ మీడియా పోస్టుల ప్రకారం, సినిమా పైరసీ సైట్ ఐబొమ్మ (iBomma) తెలంగాణ పోలీసులకు హెచ్చరిక జారీ చేసి, గోప్యమైన ఫోన్ నంబర్లను లీక్ చేస్తామని బెదిరించిందని చెబుతున్నారు. అయితే, ప్రసారం అవుతున్న స్క్రీన్షాట్లు 2023 నాటివి. అవి కూడా పోలీసులకు కాకుండా తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించినవే. దీనిని స్పష్టం చేస్తూ, తెలంగాణ పోలీసులకు ఇలాంటి ఎటువంటి బెదిరింపు రాలేదని తెలియజేస్తున్నాం. ప్రజలు సోషల్ మీడియాలో పోస్టు చేసే, షేర్ చేసే విషయాల్లో జాగ్రత్త వహించాల్సిందిగా మనవి.' అని తెలిపింది.#అలర్ట్: కొన్ని మీడియా కథనాలు మరియు సోషల్ మీడియా పోస్టుల ప్రకారం, సినిమా పైరసీ సైట్ iBomma తెలంగాణ పోలీసులకు హెచ్చరిక జారీ చేసి, గోప్యమైన ఫోన్ నంబర్లను లీక్ చేస్తామని బెదిరించిందని చెబుతున్నారు. అయితే, ప్రసారం అవుతున్న స్క్రీన్షాట్లు 2023 నాటివి మరియు అవి పోలీసులకు కాకుండా… pic.twitter.com/gkcoqYtIqg— FactCheck_Telangana (@FactCheck_TG) October 3, 2025 -
నా స్థానంలో పోటీ చేసేది ఎవరంటే?.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, సంగారెడ్డి: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటూ దసరా ఉత్సవాల్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డిలో తన భార్య నిర్మల బరిలో ఉంటారని తెలిపారు. తాను మరో పదేళ్ల తర్వాతే పోటీ చేస్తానంటూ చెప్పుకొచ్చారు.గత ఏడాది దసరా వేడుకల్లో కూడా జగ్గారెడ్డి ఇదే విషయాన్ని బహిరంగంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. గత జూన్లో కూడా తెలంగాణలో ముఖ్యమంత్రి స్థానంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మూడేళ్లు సీఎంగా రేవంత్ రెడ్డి ఉంటారు.. ఆయన దిగిపోయాక నేను సీఎం కావడానికి ప్రయత్నం చేస్తాను అంటూ కామెంట్స్ చేశారు.బీజేపీ నుంచి సంగారెడ్డి మున్సిపాలిటీకి కౌన్సిలర్గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన జగ్గారెడ్డి.. 2004లో టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి 2009లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో లోక్సభ ఉప ఎన్నికల కోసం మళ్లీ బీజేపీలో చేరి ఓడిపోయారు. 2015లో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు.కాగా, సంగారెడ్డి జిల్లా కేంద్రం దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. జగ్గారెడి దాదాపు రెండున్నర దశాబ్దాలుగా ప్రతి ఏటా ఈ వేడుకలను తన సొంత ఖర్చులతో నిర్వహిస్తున్నారు. తాను మున్సిపల్ చైర్మన్గా పనిచేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏటా ఈ వేడుకలను స్వయంగా పర్యవేక్షిస్తారు. పండగను పురస్కరించుకుని పాత బస్టాండ్ రాంమందిర్ నుంచి శోభాయత్ర జరిగింది. అంబేద్కర్ స్టేడియంలో రావణ దహణ కార్యక్రమం నిర్వహించారు. -
బేగం బజార్లో భారీ అగ్నిప్రమాదం
సాక్షి,హైదరాబాద్: బేగంబజార్ కనిష్క జ్యువెల్లరీ షాపులో గురువారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరిగినదా లేదా అనే విషయంపై ఇంకా అధికారిక సమాచారం అందాల్సి ఉంది. -
రేవంత్కు ఆశ లావు.. పీక సన్నమైంది!
తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ప్రధానంగా మూడు అంశాలపై చర్చోపచర్చలు జోరందుకుంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ గురువు బాటలోనే తలపెట్టిన ‘ఫ్యూచర్ సిటీ’, హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణ బాధ్యతలు ఎల్ అండ్ టీ నుంచి ప్రభుత్వం చేతుల్లోకి మారిపోవడం.. కేసీఆర్ ప్రభుత్వం రూ.లక్ష కోట్లతో చేపట్టిన కాళేశ్వరం మాదిరిగానే రేవంత్ ప్రభుత్వం రూ.35 వేల కోట్ల ప్రాణహిత చేవెళ్ల పథకం నిష్ప్రయోజనం కానుందా? అన్నవి ఆ మూడు అంశాలు.ఫ్యూచర్ సిటీ విషయంలో రేవంత్ పట్టుదలతోనే ఉన్నారు. అభివృద్ధి సంస్థ నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. అయితే ఆ ప్రాంతానికి ఒక పేరు పెట్టి తామే నగరాన్ని నిర్మిస్తామని చెప్పడమే విస్మయం కలిగిస్తుంది. కులీకుతుబ్ షా మాదిరి రేవంత్ కూడా నగర సృష్టి చేయనున్నారని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పొగడటం బాగానే ఉన్నా.. ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని కార్యాచరణకు దిగడం మంచిది అనిపిస్తుంది. అంతర్జాతీయ కంపెనీలూ, ఫార్చ్యూన్ 500 కంపెనీలు అనేకం ఇప్పటికే హైదరాబాద్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. మరిన్ని వచ్చిన తగినంత భూమి ప్రభుత్వం ఉంది. వచ్చిన ప్రతిపాదనలకు తగ్గట్టుగా ఆయా ప్రాంతాల్లో భూ సేకరణ చేయవచ్చు కూడా. ఇదో నిరంతర ప్రక్రియ.అయితే, ఒకవైపు ప్రభుత్వ భూములను వేలం పెడుతూ, మరోవైపు కొత్త నగరం పేరిట రైతుల నుంచి భూములను సమీకరించడం ఎంతవరకు అవసరమన్నది ఆలోచించుకోవాలి. ఫ్యూచర్ సిటీని న్యూయార్క్ నగరంతోనో, లేక టోక్యో, దుబాయి వంటి నగరాలతో పోల్చి, అక్కడి వారు కూడా ఇక్కడకు వచ్చి చూసి వెళ్లాలన్న ఆకాంక్ష తప్పు కాదు కానీ రేవంత్ ఇలాంటి విషయాలు చెబుతుంటే గతంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ను డల్లాస్ నగరంగా మార్చేస్తానని, హుస్సేన్ సాగర్ నీళ్లను కొబ్బరి నీళ్ల మాదిరి చేసేస్తామని చెప్పిన కబుర్లు గుర్తుకు వస్తాయి. హుసేన్ సాగర్ను ఎండగట్టి శుభ్రం చేయాలన్న కేసీఆర్ ప్రతిపాదించినప్పటికీ విపరిణామాలపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తరువాత ఈ ప్రణాళిక ముందుకు పోలేదు. హైదరాబాద్ డల్లాస్గా మారలేదు. కాకపోతే ఆ తరువాతి కాలంలో ప్రాక్టికల్గా ఆలోచించి నగరంలో పలుచోట్ల వంతెనలు, రోడ్ల వెడల్పు చేయడం, రేడియల్ రోడ్ల నిర్మాణం వంటివి చేశారు.ఇక, ఏపీలో చంద్రబాబు అమరావతి పేరుతో అవసరం లేకపోయినా లక్ష ఎకరాలు తీసుకుని లక్షల కోట్లు వెచ్చించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోవడంతో వారంత ఆందోళన చెందుతున్నారు. అందుకే ఒకప్పటి మద్దతుదారులైన అమరావతి రైతులే ఇప్పుడు బాబకు నిరసన చెప్పడం మొదలుపెట్టారు. రాజధాని నిర్మాణం పేరుతో పలు నగరాలు సందర్శించిన చంద్రబాబు ఏ దేశమెళితే అక్కడి మాదిరిగా అమరావతిని కట్టేస్తానని ఊదరగొట్టేవారు. ఇప్పటికే వేల కోట్ల రూపాయలు వ్యయం చేసినా పది శాతం కూడా పూర్తి కాలేదని మంత్రి నారాయణే చెబుతున్నారు. ఫ్యూచర్ సిటీ గురించి వింటున్నప్పుడు కేసీఆర్ కబుర్లు, చంద్రబాబు డాంబికాలను కలగలిపి మరీ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారా అన్న సందేహం వస్తుంది. ఏ అవసరాల కోసం ఈ నగరాన్ని నిర్మించదలిచారు? పారిశ్రామిక అవసరాలకా? లేక పాలన కోసమా? రైతుల నుంచి భూములు ఏ పద్దతిలో తీసుకుంటారు?.అవుట్ ఆఫ్ కోర్టు ద్వారా రైతులు భూముల పరిహారం సెటిల్ చేసుకోవాలని రేవంత్ చెబుతున్న తీరు వారిని బుజ్జగించడమా? లేక బెదిరించడమా?. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫార్మా సిటీ భవిష్యత్తు ఏమిటి?. ఆ భూములను రైతులకు తిరిగి ఇచ్చేస్తామని అప్పట్లో కాంగ్రెస్ వారు చెబుతుండేవారు. మరి ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కోసం కొత్తగా భూములు తీసుకో తలపెట్టారు. ఇదంతా రియల్ ఎస్టేట్ విలువలు పెరిగి భూముల లావాదేవీలు పుంజుకోవాలన్న లక్ష్యంతో చేస్తున్నారా?. కాంగ్రెస్ పార్టీనే తీసుకు వచ్చిన 2013 భూ సేకరణ చట్టం గురించి ఎందుకు మాట్లాడడం లేదు?. ఆయన మాటలు వింటుంటే రైతులకు కొంతవరకు నష్టం తప్పదేమో అనిపిస్తుంది. ఈ విషయాలే భవిష్యత్తులో సమస్యలుగా మారవచ్చు. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బుల్లెట్ రైలు వస్తుందని చెబుతున్న తీరు అచ్చంగా చంద్రబాబు నాయుడు చెప్పే అతిశయోక్తుల మాదిరే అనిపిస్తాయి. అక్కడి ప్రజలను ఊరించడానికా, లేక వారిలో నమ్మకం పెంచడానికా? ఏది ఏమైనా రేవంత్ ఫ్యూచర్ సిటీపై గట్టి ఆశతో ఉన్నారా? లేక వేరే లక్ష్యంతో హైప్ చేస్తున్నారా అన్నది తేలడానికి మరికొంత కాలం పడుతుంది. హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణ నుంచి ఎల్ అండ్ టీ తప్పుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతో (పీపీపీ) జరిగే ప్రాజెక్టులన్నీ సఫలమవుతాయన్న గ్యారెంటీ లేదనేందుకు ఈ ప్రాజెక్టు ఒక నిదర్శనం. ప్రైవేట్ సంస్థలు తమకు నష్టం వస్తుందనుకుంటే కాడి పడేస్తాయని ఈ అనుభవం చెబుతుంది. చివరికి తెలంగాణ ప్రభుత్వం నెత్తి మీదకు రూ.15వేల కోట్ల భారం పడుతోంది. ఈ ప్రాజెక్టు కింద 300 ఎకరాల విలువైన భూములు ఉన్నాయని, వాటిని ప్రైవేటు వారికి కట్టబెట్టడానికి ప్రభుత్వం ప్లాన్ చేసిందని బీఆర్ఎస్ ఆరోపిప్తోంది. ఆ భూముల అమ్మకం ద్వారా 15వేల కోట్లను సమీకరించాలని ప్రభుత్వం యోచిస్తోందా? లేక ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టిందా అన్నది తెలియదు.మెట్రో రైల్ రెండో దశ ప్రాజెక్టును ఏ రకంగా తీసుకువెళతారో తెలిస్తే ఎల్ అండ్ టీ నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకోవడం ఉపయోగమా? కాదా? అన్నది తేలుతుంది. చంద్రబాబుకు సంబంధించిన తెలుగుదేశం మీడియా రేవంత్కు సహకరిస్తోంది కాబట్టి సరిపోయింది కానీ, లేకుంటే ఈ పాటికి హైదరాబాద్ను విధ్వంసం చేశారని, ఎల్ అండ్ టీని తరిమేశారని విపరీతంగా ప్రచారం చేసేది. ఆర్థికంగా స్థోమతు ఉంటే ఫ్యూచర్ సిటీ నిర్మించవచ్చు. మెట్రో స్వయంగా నడపవచ్చు. కొత్తగా మెట్రో రైలును పొడిగించవచ్చు. ప్రాణహిత-చేవెళ్ల స్కీమ్ను వేల కోట్లతో చేపట్టవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు గుదిబండ అని చెబుతున్న రేవంత్ ప్రభుత్వం దానిని పక్కనబెట్టి ప్రాణహిత స్కీమ్ను ఎలా తీసుకు వస్తుందన్నది ఆసక్తికరమే. అది అంత తేలిక కాకపోవచ్చు.ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రుణ భారం మోయలేనంతగా రూ.6.72 లక్షల కోట్లకు చేరింది. ఈ ప్రభుత్వం వచ్చాక సుమారు లక్షన్నర కోట్ల అప్పు చేశారని లెక్కలు చెబుతున్నాయి. హైదరాబాద్ ఆదాయం, భూముల అమ్మకం, ఎక్సైజ్ ఆదాయం వంటి వాటి ద్వారా ప్రభుత్వం నడుస్తున్నప్పటికీ, అప్పులు సైతం తక్కువేమీ లేవు. ఈ ఆర్ధిక సంవత్సరంలో అనుమతించిన అప్పులలో ఇప్పటికే ప్రభుత్వం 85 శాతం తీసేసుకుంది. ప్రభుత్వానికి రూ.54009 కోట్ల అప్పునకు అవకాశం ఉంది. ఇందులో రూ.45900 కోట్ల రుణాలు తీసేసుకున్నారు. మిగిలిన ఆరు నెలలకు అప్పులు చేయాలనుకున్నా వచ్చేది 8109 కోట్లే.మరోవైపు కాంట్రాక్టర్ల బిల్లులు వేల కోట్లలో ఉన్నాయని అంటున్నారు. ఆ మధ్య సచివాలయంలో కూడా నిరసనకు దిగారు. ఆర్టీసీకి ఫ్రీ బస్ స్కీమ్ కింద రూ.మూడు వేల కోట్ల బకాయిపడ్డారట. ఇంకా పలు హామీలను నెరవేర్చవలసి ఉంది. ఈ నేపథ్యంలో ముందుగా ఆర్ధిక పరిస్థితి చక్కబరచుకోకుండా ఆశ లావు, పీక సన్నం అన్న చందంగా కొత్త, కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లాలనుకుంటే అది ఆకాశానికి నిచ్చెనలు వేసినట్లు అవుతుందేమో! జాగ్రత్త సుమా!.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
తెలంగాణ సాంస్కృతికోత్సవం.. అలయ్ బలయ్
అలయ్ బలయ్.. ఒక ఆలింగన వేడుక.. అందరం బాగుండాలనే ఆకాంక్ష.. కులమతాలకు అతీతంగా, పారీ్టలు, సిద్ధాంతాలు, భావజాల సంఘర్షణలను పక్కన పెట్టి ‘మనమంతా ఒక్కటే’ననే సమైక్యత భావన స్ఫూర్తిని అందజేసే పండుగ.. ఆనందోత్సాహాలతో చేసుకొనే దసరా ఉత్సవాలకు ముగింపు వేడుక.. సద్దుల బతుకమ్మ, దసరా వేడుకల మాదిరే అలయ్ బలయ్ కూడా తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచింది. తెలంగాణకే ప్రత్యేకమైన వంటకాలతో, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు తెలంగాణ జన జీవితాన్ని ప్రతిబింబించే కళారూపాలకు వేదికగా నిలుస్తోంది. రెండు దశాబ్దాలుగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈనెల 3వ తేదీన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో 20వ సంవత్సర అలయ్బలయ్ ఉత్సవాలు జరుగుతాయి. ప్రస్తుత హర్యానా మాజీ గవర్నర్, బీజేపీ నేత బండారు దత్తాత్రేయ ఈ వేడుకలను 2005లో ప్రారంభించారు. ప్రతి సంవత్సరం దసరా మరుసటి రోజు ఘనంగా నిర్వహించే అలయ్ బలయ్ ఉత్సవాలకు ఆయన కూతురు బండారు విజయలక్ష్మి ఆరేళ్లుగా సారథ్యం వహిస్తున్నారు.తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించింది..ఈ ఉత్సవం ‘మాయమైపోతున్న మనిషిని’ నిలబెట్టింది. ఆ మనిషి చుట్టూ అల్లుకున్న సామాజిక బంధాలకు, అనుబంధాలకు విలువనిచ్చింది. తెలంగాణ ఆత్మగౌరవానికి పట్టం కట్టింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు, ఉద్యమకారులు, రాజకీయ పారీ్టలు, నాయకులందరినీ ఒక్కతాటి మీదకు తెచ్చేందుకు అలయ్బలయ్ ఎంతో దోహదం చేసింది. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా, భారతీయ జనతా పార్టీ క్రియాశీలమైన నేతగా సుదీర్ఘమైన అనుభవం ఉన్న బండారు దత్తాత్రేయ పారీ్టలకు, సిద్ధాంతాలకు అతీతంగా అందరికీ ‘దత్తన్న’గా చేరువయ్యారు. ఆ సమైక్యతాభావాన్ని సంఘటితం చేయాలనేదే దత్తన్న ఆకాంక్ష కూడా.. అందుకే ప్రతి సంవత్సరం అలయ్ బలయ్ వేడుకల్లో పాల్గొనాలని ఆహ్వానిస్తూ కనీసం 10 వేల మందిని ఆయన సాధరంగా ఆహ్వానిస్తారు. మాన్యుల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరినీ ఆయన స్వయంగా స్వాగతిస్తారు.600 మందికి పైగా కళాకారులు.. అలయ్బలయ్ 20 ఏళ్ల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు బండారు విజయలక్ష్మి తెలిపారు. ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఆలయ్బలయ్ కార్యనిర్వాహక కమిటీ నెల రోజులుగా ఈ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ఈ వేడుకలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన సుమారు 600 మందికి పైగా కళాకారులు తరలి వస్తారు. బతుకమ్మ, బోనాలు, పోతరాజులు, సదర్ ఉత్సవాలతో పాటు ఆదివాసీ, గిరిజన సంప్రదాయ కళారూపాలను ప్రదర్శించనున్నారు. ఈసారి వేడుకల్లో అతిథులకు వడ్డించేందుకు 85 రకాల తెలంగాణ ప్రత్యేక వంటకాలను సిద్ధం చేశాం. వెజ్, నాన్ వెజ్ వంటలతో పాటు వివిధ రకాల పిండివంటలు, స్వీట్లు వడ్డించనున్నాం. తెలంగాణకే ప్రత్యేకమైన అంబలి, జొన్న గట్క, సర్వపిండి, మలీదముద్దలు, తలకాయ, బోటి, మటన్, చికెన్లలో రకరకాల వెరైటీలతో పాటు పచ్చిపులుసు, రకరకాల ఆకుకూరలు, కూరగాయలతో చేసిన శాఖాహార వంటలను కూడా వడ్డించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. – బండారు విజయలక్ష్మి (చదవండి: శక్తిరూపం అభినయ'దీపం'..! అమ్మవారిలా మెప్పించడం..) -
ఆ గ్రామంలో ఎవరైనా చనిపోతే.. ఇంటికో కట్టె.. అసలేంటీ ఈ కథ?
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: ఆ ఊరిలో ఎవరైనా చనిపోతే శవ దహనానికి అవసరమైన కట్టెలను ఇంటికి ఒకటి చొప్పున సేకరిస్తారు. అంత్యక్రియలు పూర్తయ్యేదాకా ఇంటికొకరైనా ఉంటారు. ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ మృతుల కుటుంబాలకు మేమున్నామన్న భరోసా ఇస్తున్నారు కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని ఎర్రాపహాడ్ గ్రామానికి చెందిన రెడ్డి కులస్తులు. ఎర్రాపహాడ్ గ్రామంలో రెడ్డి కులస్తులతోపాటు ఒకటి రెండు కులాల వారు మాత్రమే మృతదేహాలను దహనం చేస్తారు. మిగతా కులాల వారు ఖననం చేస్తారు. ఈ గ్రామంలో 201 రెడ్డి కుటుంబాలున్నాయి. ఇక్కడ ఎవరు చనిపోయినా దహన సంస్కారాలు చేయడానికి ఇంటికో కర్ర (కట్టె) జమ చేస్తారు. తాతల కాలం నుంచీ వస్తున్న ఈ ఆనవాయితీ.. ప్రస్తుతం కూడా కొనసాగుతోంది. కులస్తులు ఎవరు చనిపోయినా వెంటనే ఎవరో ఒకరు ట్రాక్టర్ను రెడ్డి కుటుంబాలు నివసించే కూడలి వద్దకు తీసుకెళతారు. పశువుల కొట్టాల దగ్గరనో, ఇంటి పెరడులోనో ఉంచిన కట్టెల నుంచి తలా ఒక కట్టెను పట్టుకొని వచ్చి ట్రాక్టర్లో వేస్తారు. ట్రాక్టర్ నిండగానే తీసుకెళ్లి శ్మశానవాటికలో కాడు పేరుస్తారు. అంత్యక్రియలు పూర్తయ్యేదాకా అందరూ ఉంటారు. అందుబాటులో లేకపోతే, అనారోగ్యంతో బాధపడుతుంటే, ఇత ర ఇబ్బందులు ఏమైనా ఉంటే మినహాయింపు ఉంటుంది. అలా కుల కట్టుబాటు చేసుకున్నారు. మొత్తం కార్యక్రమం పూర్తయిన తర్వాతే ఎవరి ఇళ్లకు వారు వెళతారు. అమెరికాలో ఉంటున్న అదే గ్రామానికి చెందిన ఏనుగు ప్రభాకర్రెడ్డి తన తండ్రి లక్ష్మారెడ్డి జ్ఞాపకార్థం వైకుంఠ రథాన్ని అందించా రు. ఎవరు చనిపోయినా మృతదేహాన్ని వైకుంఠ రథం ద్వారా శ్మశాన వాటికకు తీసుకెళతారు. అయితే శవయాత్ర జరుగుతున్నపుడు అందరూ శవం వెనకాలే నడవాలని పెద్దమనుషులు చెప్పడంతో అది కూడా పాటిస్తున్నారు. -
కేటీఆర్ దసరా శుభాకాంక్షలు.. వీడియో విడుదల
సాక్షి, హైదరాబాద్: దసరా సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ విజయ దశమి నాడు తెలంగాణ ప్రజలందరికీ తాము చేపట్టే పనులలో సకల విజయాలు కలగాలని ఆకాంక్షించారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయమే విజయ దశమి. దసరా అంటేనే తెలంగాణ ప్రజలకు ఒక ప్రత్యేక పండగ. తమ సొంత ఊళ్ళల్లో, సొంత ప్రదేశాలలో ఇంటిల్లిపాదులు ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకునే గొప్ప వేడుక దసరా. బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు కలుసుకొని తమ కష్టసుఖాలు పంచుకునే ఆత్మీయ సంబురం దసరా.ఈ విజయ దశమి నాడు తెలంగాణ ప్రజలందరికీ తాము చేపట్టే పనులలో సకల విజయాలు.. ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు చేకూరాలని ఆ జగన్మాతను ప్రార్ధిస్తున్నాను. రాష్ట్ర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు’ అని వీడియో పోస్టు చేశారు. చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయమే విజయ దశమి.దసరా అంటేనే తెలంగాణ ప్రజలకు ఒక ప్రత్యేక పండగ. తమ సొంత ఊళ్ళల్లో, సొంత ప్రదేశాలలో ఇంటిల్లిపాదులు ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకునే గొప్ప వేడుక దసరా. బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు కలుసుకొని తమ కష్టసుఖాలు పంచుకునే ఆత్మీయ సంబురం దసరా.… pic.twitter.com/o0k5tk9OW6— KTR (@KTRBRS) October 2, 2025 -
శాఖాహారం ఆర్డర్ చేస్తే మాంసాహారం
సిటీ కోర్టులు: ‘బిగ్ బౌల్ స్పెషల్ చాప్సూయ్‘ రెస్టారెంట్ నుంచి శాఖాహారాన్ని ఆర్డర్ చేస్తే మాంసాహారాన్ని పంపడం ముమ్మాటికీ రెస్టారెంట్ తప్పేనని రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ అభిప్రాయపడింది. అందుకు బాధితుడికి రూ. 20 వేల నష్టాపరిహారాన్ని అందజేయాలని ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ మొత్తాన్ని 45 రోజుల్లోపు చెల్లించాలని పేర్కొంది. వివరాల్లోకి వెళితే.. కొండాపూర్కు చెందిన వెంకటశరత్ అనే వ్యక్తి జొమోటో ద్వారా ‘బిగ్ బౌల్ స్పెషల్ చాప్సూయ్‘ రెస్టారెంట్ నుంచి శాఖాహారాన్ని ఆర్డర్ చేశాడు. అయితే జొమోటో నుంచి అసంపూర్తిగా ఉన్న శాఖాహారం వచ్చింది. వెంటనే సంబంధిత రెస్టారెంట్కు ఫిర్యాదు చేయగా వారు క్షమాపణలు చెప్పి తిరిగి ఆర్డర్ డెలివరీ చేశారు. అప్పుడు వచి్చన ఆర్డర్ తీసుకొని తింటూ ఉండగా అది శాఖాహారం కాదని, మాంసాహారమని గుర్తించిన అతను రెస్టారెంట్ నిర్వాహకులకు ఫిర్యాదు చేసేందుకు ఎంత ప్రయత్నించినా వారు ఫిర్యాదును తీసుకోకపోవడమే కాకుండా కనీసం ఎలాంటి చర్యలు కూడా చేపట్టలేదు.దీంతో బాధితుడు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరంలో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై విచారణ చేపట్టిన కమిషన్ మొదట్లో అసంపూర్తిగా ఉన్న శాఖాహారాన్ని పంపిన రెస్టారెంట్ తర్వాత శాఖాహారం కాకుండా మాంసహారం ఎలా పంపుతారని ప్రశ్నించిన. ఇంతటి నిర్లక్ష్యానికి పాల్పడిన రెస్టారెంట్, జొమోటో కంపెనీలు ఒక్కొక్కరూ రూ.5 వేలు చొప్పున నష్టపరిహారాన్ని అదేవిధంగా కోర్టు ఖర్చుల నిమిత్తం చెరో రూ.5 వేలు ఫిర్యాదు దారుడికి 45 రోజుల్లోపు చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఆ లోపు చెల్లించకుంటే కోర్టు ఆర్డర్కు రెట్టింపు అంటే ఒక్కొక్కరూ రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది. భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అంతేకాకుండా వినియోగదారుల రక్షణ చట్టం 2019లోని సెక్షన్ 39(1)(డీ) ప్రకారంగా ఒక్కొక్కరు రూ.15 వేల చొప్పున మొత్తం రూ.30 వేలను వినియోగదారుల సంక్షేమ నిధికి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.