breaking news
Telangana
-
ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఆసక్తికర ట్వీట్
సాక్షి,హైదరాబాద్: సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘మన జీవితంలో కొన్ని కాలాలు చాలా గట్టి సమాధానాలు చెప్తాయి. గత కొన్ని నెలలు ఇలా గడిచాయా అనిపించింది. బాధాకరమైన విషయాల నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నాను. చాలా కష్టంగా ఉన్నప్పటికీ... నేను కోరుకుంటున్నాను. రోజువారీగా నెమ్మదిగా మనోధైర్యాన్ని తెచ్చుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు. ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ లాంగ్ లీవ్ పెట్టారు. సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ వరకు సెలవులు తీసుకున్నారు. కాగా స్మితా సబర్వాల్ స్థానంలో ఐఏఎస్ కాత్యాయనీ దేవికి ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. Sometimes the quietest seasons of our life, speak to us the loudest.A personal update:The past few months have been a slow, painful recovery from a vertebral artery dissection that shook my world!It’s been tough - but I’m healing. Building resilience. One day at a time. ❤️🩹 pic.twitter.com/NLwYtAf22p— Smita Sabharwal (@SmitaSabharwal) August 28, 2025 -
65 అడుగుల ఎత్తులో అద్భుతమైన కట్టడం
జడ్చర్ల: ఎంతో విశిష్టత గల ఆ ప్రాచీన ఆలయ చరిత్రను తెలుసుకుంటే గర్వంగా ఉంటుంది. ఆలయ ప్రాంగణంలోని శిథిలాలను చూస్తే అయ్యో అనిపిస్తుంది. ఇటుక మీద ఇటుకను పేర్చి నిర్మించిన ఆ అద్భుతమైన కట్టడం.. ఇప్పుడు గత వైభవానికి సాక్ష్యంగా నిలిచింది. తల తెగిన శిల్పాలు, గుప్త నిధుల వేటలో మిగిలిన శిథిలాలు.. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తాయి. శతాబ్దాల చరిత్ర కలిగిన గొల్లత్త గుడిపై కథనమిది.రాష్ట్ర కూటుల కాలం నాటి నిర్మాణం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపూర్–ఆల్వాన్పల్లి గ్రామాల మధ్య 167 నంబర్ జాతీయ రహదారిని ఆనుకుని.. దాదాపు 6 ఎకరాల విస్తీర్ణంలో గొల్లత్త గుడి ఆలయాన్ని నిర్మించారు. దీన్ని 8వ శతాబ్దంలో రాష్ట్రకూటులు నిర్మించినట్లు పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారులు చెబుతున్నారు. దాదాపు 65 అడుగుల ఎత్తులో.. నాలుగు అడుగుల మందంతో.. కేవలం ఇటుకపై ఇటుకను పేర్చి నిర్మించారు. మధ్యలో ఎలాంటి బంకమట్టి లేకుండా అంత ఎత్తు వరకు.. అత్యంత కళాత్మకంగా గుడి నిర్మాణం చేపట్టారు. ఈ తరహాలో నిర్మించిన గుడి దక్షిణ భారతంలోనే ఒకటి.. ఇలాంటిదే మరొకటి ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ భీతర్గావ్ శివారులో ఉంది.జైనుల ఆలయంగా ప్రసిద్ధి.. ఒకప్పుడు ఈ ప్రాంతంలో జైన మతం బాగా ప్రాచుర్యంలో ఉండేది. ఎంతో మంది జైన తీర్థంకరులు నడయాడిన నేలగా ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందినట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు. జైనీయుల స్థిర నివాసంగా, ధాన్య భాండాగారంగా గొల్లత్త గుడి పేరు గాంచింది. ఈ గుడిలో బంగారు కుండలు (Gold Pots) ఉండేవన్న ప్రచారం ఉంది. ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతానికి కాలి నడకన తరలివచ్చే జైన గురువులు.. దీన్ని సందర్శించేవారని అప్పటి శాసనాల ద్వారా గుర్తించారు. ఆలయం లోపల వర్ధమాన మహావీరుడు, పార్శ్వనాథుడి విగ్రహాలు ఉండేవి. భద్రత దృష్ట్యా ఇక్కడి నుంచి ఒకటి హైదరాబాద్లోని గోల్కొండకు, మరొకటి పాలమూరు పిల్లలమర్రిలోని మ్యూజియాలకు తరలించారు.శిథిలావస్థలో గుడి.. గొల్లత్త గుడి కాలక్రమేనా శిథిలావస్థకు చేరుకుంది. గుడి పైకప్పు కూలిపోయింది. వర్షాల కారణంగా చుట్టూ ఉన్న కొన్ని ఇటుకలు పట్టు తప్పిపోగా, కరిగిపోయాయి. దీంతో గుడి పటిష్టానికి పురావస్తుశాఖ అధికారులు.. కింద నుంచి దాదాపు 7 అడుగుల వరకు తాత్కాలికంగా సిమెంట్ పనులు చేయించారు. ఊడిన ఇటుకల స్థానంలో కొత్తగా చేర్చిన ఇటుకలు కరిగిపోగా.. శతాబ్దాల కిందటి ఇటుకలు చెక్కుచెదరక పోవడం గమనార్హం. ప్రస్తుత గుడి మాదిరిగానే.. చుట్టూ మరో ఐదు గుళ్లు ఉండగా.. కాలక్రమేణా కనుమరుగయ్యాయి. గుడి వెనుక దిబ్బలు గొల్లత్త గుడి (Gollatha temple) వెనుక భాగంలో రెండు ప్రధాన దిబ్బలు ఉన్నాయి. వీటిలో ఒక దిబ్బ కనుమరుగవగా.. ఈ దిబ్బ చుట్టూ పండుగల సందర్భంగా ఎడ్ల బళ్లతో వచ్చి జనం తిరిగేవారని చెబుతుంటారు. మరో దిబ్బ ఇప్పటికీ కనిపిస్తుంది. ఈ దిబ్బలో అప్పటి నిర్మాణాల ఆనవాళ్లు కనిపిస్తాయి. పాదాల గుట్టలో శిథిలావస్థలో ఎన్నో విగ్రహాలు కనిపిస్తాయి. ధ్వంసమైన నంది విగ్రహాలు చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తాయి. నాలుగు అడుగుల పొడవు, మూడు అడుగుల వెడల్పుతో మహిళల పాదముద్రలు చెక్కిన రాతి గుర్తులు ఉన్నాయి. గజ్జెలు, గొలుసులు, నాలుగు వేళ్లకు మెట్టెలతో చెక్కి ఉన్నాయి. అత్యంత సుందరంగా చెక్కిన ఈ పాదాలు అప్పటి శిల్పకళా నైపుణ్యానికి ప్రతీకగా పేర్కొనవచ్చు.గుప్త నిధుల కోసం తవ్వకాలు ఈ ప్రాంతంలో గుప్త నిధుల కోసం కొందరు విచ్చలవిడిగా తవ్వకాలు చేపట్టారు. వారి చేతుల్లో ఆలయ ప్రాంగణం చాలా వరకు ధ్వంసమైంది. గుడి పైకప్పులో సైతం తవ్వకాలు జరపడంతో కూలిపోయింది. గుడి దక్షిణ భాగంలో సైతం తవ్వకాలు జరిపారు. ప్రస్తుతం గుడి చుట్టూ ముళ్ల పొదలు, కంపచెట్లు ఏపుగా పెరగడంతో.. గుడి ఉనికికి ప్రమాదం ఏర్పడింది.పేరు వెనుక కథ ఈ గుళ్ల నిర్మాణం వెనుక స్థానికంగా ఓ కథ ప్రచారంలో ఉంది. పాలు, పెరుగు అమ్ముకునే ఈ ప్రాంతానికి చెందిన ఓ గొల్ల పడుచు.. తన ఆస్తినంతా వెచ్చించి ఈ గుళ్లని నిర్మించిందని.. అందుకే ఈ గుళ్లకు గొల్లత్త గుళ్లు అనే పేరు వచ్చిందని ఒక కథనం ప్రచారంలో ఉంది.చదవండి: మధ్యయుగ వైద్య చరిత్రలో మేటి.. అగ్గలయ్యరూ.2 కోట్లతో ప్రతిపాదనలు గొల్లత్త గుడిని పరిరక్షించేందుకు రాష్ట్ర పురావస్తు శాఖ మేనేజింగ్ డైరెక్టర్ విశాలాక్షి హయాంలో రూ.2 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసి కేంద్రానికి నివేదించారు. ఇప్పటికే కేంద్ర పురావస్తుశాఖ ఆధ్వర్యంలో రూ.54 లక్షల వ్యయంతో గుడి స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించారు.అమలుకాని ప్రతిపాదనలు గొల్లత్త గుడి అభివృద్ధికి కలెక్టర్ రొనాల్డ్రోస్ హయాంలో పురావస్తుశాఖ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. తదుపరి ఎలాంటి చొరవ లేకపోవడంతో ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి గొల్లత్త గుడి అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలి. – రాములు, మాజీ మండల ఉపాధ్యక్షుడు, గంగాపూర్పర్యాటకంగా అభివృద్ధి చేయాలి గొల్లత్త గుడిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలి. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ గుడిని కాపాడాలి. ఇప్పటికే గుప్త నిధుల కోసం వేటగాళ్లు ఈ ప్రాంతమంతా తవ్వేశారు. నాటి చరిత్రకు సంబంధించిన విగ్రహాలు, తదితర కట్టడాలు ధ్వంసమయ్యాయి. – శ్రీనివాసులు, గంగాపూర్ -
కామారెడ్డి జిల్లా: రేపు, ఎల్లుండి విద్యాసంస్థలకు సెలవు
సాక్షి, కామారెడ్డి: జిల్లాలో మరో రెండు రోజులు విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. భారీ వర్షాల నేపథ్యంలో రేపు, ఎల్లుండి(శుక్ర,శని) కలెక్టర్ సెలవు ప్రకటించారు. నిర్మల్ ఇంకా రెడ్ అలర్ట్లోనే ఉందని కలెక్టర్ అభినవ్ తెలిపారు. అత్యవసరం అయితే, తప్ప బయటకు రావొద్దన్నారు. పశువుల కాపరులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని.. నిర్మల్కు వరద ముప్పు పొంచి ఉందని తెలిపారు.తెలంగాణ డీజీపీ జితేందర్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు. ఇప్పటివరకు వేల మందిని రెస్క్యూ చేశామని.. ఎయిర్ ఫోర్స్, ఆర్మీ సహాయంతో రెండు హెలికాప్టర్ల ద్వారా రెస్క్యూ చేసినట్లు వెల్లడించారు. 2 వేల మంది సిబ్బందితో ఎస్డీఆర్ఎఫ్ను ఏర్పాటు చేసి రెస్క్యూ ఆపరేషన్లో పెట్టామని తెలిపారు.‘‘ఎన్డీఆర్ఎఫ్కు దీటుగా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పని చేస్తున్నాయని.. భారీ వర్షాలు కురుస్తున్నా.. ఎక్కడ కూడా ప్రాణాలు పోకుండా రెస్క్యూ చేస్తున్నామన్నారు. ఎస్డీఆర్ఎఫ్ గత ఏడాది నుంచి మంచి ఫలితాలను ఇస్తున్నాయి. అన్ని జిల్లాల ఎస్పీలకు ఆదేశాలిస్తూ నిరంతరం రివ్యూ చేస్తున్నాం. వర్షాకాలం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అవసరమైతేనే బయటకు రండి. ప్రజలు ప్రయాణాలు తగ్గించుకోవడం మంచిది’’ అని డీజీపీ చెప్పారు. -
స్థానిక సంస్థల ఎన్నికలపై కేటీఆర్ టెలికాన్ఫరెన్స్
సాక్షి,హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్ జాబితా రూపకల్పనలో ప్రభుత్వం అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో గురువారం స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా కేటీఆర్.. ఓటర్ జాబితాలో బీఆర్ఎస్ సానుభూతిపరుల ఓట్లు గల్లంతు కాకుండా చూసుకోవాలని పార్టీ నాయకులకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సంఘం ఇచ్చే ఓటర్ జాబితా ముసాయిదాను గ్రామస్థాయిలోనే పరిశీలించి అభ్యంతరాలను అధికారుల దృష్టికి వెంటనే తీసుకువెళ్లాలని సూచించారు. ఓటర్ జాబితాలో అక్రమాలు,అవకతవకలు జరిగితే కమిటీ దృష్టికి తీసుకువెళ్లాలని అన్నారు. ఇందుకోసం ఎమ్మెల్సీలు ఎల్.రమణ, డా.దాసోజు శ్రవణ్, లీగల్ సెల్ ఇంఛార్జ్ భరత్ కుమార్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసినట్లు కేటీఆర్ తెలిపారు. -
కేటీఆర్, బండి సంజయ్ ఆప్యాయ పలకరింపు
సాక్షి,సిరిసిల్ల: తెలంగాణ రాజకీయాల్లో నేతల మధ్య మాటల తూటాలు పేలడం కొత్తేమీ కాదు. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య మాటల యుద్ధం అనునిత్యం కొనసాగుతూనే ఉంటుంది. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించడం, రాజకీయ వేదికలపై ఘాటు విమర్శలు చేసుకోవడం సర్వ సాధారణం. అలా పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉండే ఈ రాజకీయ ప్రత్యర్థులు.. ఎదురుపడితే ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠకు తెరపడింది.గురువారం, తెలంగాణలోని సిరిసిల్ల జిల్లాలో వరద బీభత్సం నేపథ్యంలో కేటీఆర్ వరద బాధితులను పరామర్శించి తిరుగు ప్రయాణమయ్యారు. ఇదే సమయంలో, కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా వరద ప్రాంతాలను సందర్శించేందుకు అక్కడికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో కేటీఆర్కు బండి సంజయ్ ఎదురుపడ్డారు. వీరిద్దరూ రాజకీయ విభేదాలను పక్కనపెట్టి ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ హఠాత్ పరిణామం అక్కడ ఉన్నవారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నెటిజన్లు రాజకీయాలకు అతీతంగా వెల్లివిరిసిన మానవత్వం అంటూ కామెంట్లు కురిపిస్తున్నారు. విపత్తు సమయంలో నాయకుల మధ్య ఏర్పడిన ఈ సానుకూల పరిణామం, ప్రజల్లో మంచి సందేశాన్ని పంపించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.అంతకుముందు కేటీఆర్ మల్లారెడ్డిపేటలో వరద ప్రవాహాన్ని పరిశీలించి, సహాయక చర్యల్లో పార్టీ నేతలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. పంట నష్టానికి ఎకరానికి రూ.25,000, వరదల్లో మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. FLOOD POLITICS - BJP STYLE Interesting how MoS Home Bandi Sanjay rushed to Sircilla constituency and not to Medak and Kamareddy which are very severely affected! Before even Bandi Sanjay reached Sircilla, BRS working president and Sircilla MLA KTR was already touring his… pic.twitter.com/FyxYJBzYQ2— Revathi (@revathitweets) August 28, 2025 -
అలర్ట్గా ఉన్నాం.. 1,200 మందిని రక్షించాం: తెలంగాణ డీజీపీ
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో కుండపోత వానలు, వరదల నేపథ్యంలో కొనసాగుతున్న సహాయక చర్యలపై రాష్ట్ర డీజీపీ జితేందర్ స్పందించారు. వర్షాలు, వరదలపై పోలీస్ వ్యవస్థ అప్రమత్తంగానే ఉందని.. 24 గంటలుగా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయని తెలిపారు.గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. వర్షాలు, వరదలపై అన్నిప్రాంతాల్లో పోలీస్ వ్యవస్థ అలర్ట్గా ఉంది. ఇప్పటివరకు 1,200మందిని కాపాడాం. కామారెడ్డి, రామయంపేట్, నిర్మల్, మెదక్ జిల్లాలో వరద ఉధృతి తగ్గింది. అయినా రెస్క్యూ చేస్తూనే ఉన్నాం. పోలీసులు 24గంటలు రెస్క్యూ టీమ్తో కలిసి సహాయక చర్యల్లో పాల్గొంటూనే ఉన్నారు.ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బందితో కలిసి పోలీసులు పని చేస్తున్నారు. సకాలంలో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు స్పాట్కు చేరుకోవడంతో భారీ ముప్పు తప్పింది. కామారెడ్డిలో చాలా మందిని రక్షించాం. బోట్స్, లైఫ్ జాకెట్లతో రక్షించి సురక్షిత ప్రాంతాలకు చేర్చాం. వరదలపై కంట్రోల్ రూం నుంచి 24 గంటలు మానిటరింగ్ చేస్తూనే ఉన్నాం అని డీజీపీ జితేందర్ వెల్లడించారు.చిత్రాల కోసం క్లిక్ చేయండి👉 సముద్రం కాదహే.. కామారెడ్డి రోడ్లు!! -
సముద్రం కాదహే! కుండపోతతో మునిగిన కామారెడ్డి రోడ్లను చూశారా? (చిత్రాలు)
-
నర్మాలలో ఆర్మీ హెలికాప్టర్ ఆపరేషన్ సక్సెస్.. రైతులు సేఫ్
సాక్షి, సిరిసిల్ల: గంభీరావుపేటలో ఆర్మీ హెలికాప్టర్ రెస్య్కూ ఆపరేషన్ విజయవంతమైంది. ఆర్మీ హెలికాప్టర్ సాయంతో నర్మాలలో మానేరువాగు మధ్యలో చిక్కుకున్న ఐదుగురు రైతులను కాపాడారు. సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు. కాగా, పశువులు మేపేందుకు వెళ్లిన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటకు చెందిన రైతులు బుధవారం మధ్యాహ్నం వాగులో చిక్కుకుని ఎత్తైన గడ్డ మీద ఉన్నారు.ఈ క్రమంలో వీరికి డ్రోన్ ద్వారా అధికారులు ఆహారం అందించారు. రైతుల వద్దకు బోట్ల ద్వారా చేరుకోలేమని, హెలికాప్టర్ల ద్వారా మాత్రమే తీసుకొచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు.. మానేరు వరదలో ఇప్పటికే నాగయ్య(50) గల్లంతయ్యాడు. ఈ నేపథ్యంలో వరద సహాయక చర్యలపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్.. కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్తో ఫోన్లో మాట్లాడారు. కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లో వరదల్లో దాదాపు 30 మంది చిక్కుకున్నారని తెలిపారు. బాధితులను కాపాడేందుకు వైమానికదళ హెలికాప్టర్ పంపాలని కోరారు. బండి సంజయ్ విజ్ఞప్తిపై రాజ్నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించారు. ఈ క్రమంలో తాజాగా నర్మాలకు ఆర్మీ హెలికాప్టర్ చేరుకుంది. మరోవైపు.. తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ చేశారు. ఆర్మీ హెలికాప్టర్ నర్మాలలో సహాయక చర్యల్లో నిమగ్నమైన విషయాన్ని తెలిపారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా సహకరించేందుకు అవసరమైతే మరిన్ని NDRF టీంలను పంపేందుకు సిద్దంగా ఉన్నట్టు బండి సంజయ్ వెల్లడించారు. -
జేసీబీ, ట్రాక్టర్ సహాయంతో అంత్యక్రియలు
సాక్షి, మెదక్: కనీవినీ ఎరుగని రీతిలో మెతుకుసీమ చరిత్రలో లేనంతగా వరుణుడు వణికించేస్తున్నాడు. ఇప్పటికే పలు గ్రామాలు, తండాలు జలదిగ్బంధంలో ఉండిపోయాయి. మరో రెండు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. ఫ్లాష్ఫ్లడ్స్ హెచ్చరికల నేపథ్యంలో నీటి ఉపద్రవం తమను ముంచెత్తుతుందో అని జనాలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. భారీ వర్షాలతో మెదక్ ప్రజల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రేగోడ్ (మం) మర్పల్లి గ్రామంలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. అంత్యక్రియల కోసం ఓ కుటుంబం, గ్రామస్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. గొల్ల వాగు వరద నీటి ప్రవాహా ఉదృతితో జేసీబీ, ట్రాక్టర్ సహాయంతో అంత్యక్రియలు నిర్వహించారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.గత రెండు రోజులుగా మెదక్ జిల్లాలో తీవ్రమైన వర్షాలు నమోదయ్యాయి. గజ్వేల్, నారాయణఖేడ్, సిద్దిపేట ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. రోడ్లు దెబ్బ తినడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వరి, మక్క, కందుల పంటలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొన్ని మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఇప్పటికే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు.. రెవెన్యూ అధికారులు గ్రామాల్లో పర్యటించి నష్టం అంచనా వేస్తున్నారు. రాగల 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని జాగ్రత్తలు చెబుతోంది. -
వరద ప్రాంతాల్లో సీఎం రేవంత్ ఎరియల్ సర్వే
Heavy Rain Updates..వరద ప్రాంతాల్లో సీఎం రేవంత్రెడ్డి ఎరియల్ సర్వేశ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించిన సీఎం రేవంత్ సీఎంతో పాటు మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కు గోదావరి జలాలు గుండె కాయఘోష్ నివేదికపై అసెంబ్లీ చర్చకు పెట్టాం మామ అల్లుడు ఎన్ని కుట్రలు చేసినా.. చేసిన పాపాలు పోవుకాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు నింపుతే గ్రామాలు కొట్టుకపోతాయిమేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్ట్లో లోపాలు ఉన్నాయికాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో సాంకేతిక వైఫల్యం ఉంది.డిజైన్లు, నిర్మాణం, నిర్వహణ లోపం ఉందిఏరియల్ సర్వేకు బయల్దేరిన సీఎం రేవంత్రెడ్డికాసేపట్లో కామారెడ్డి,మెదక్ జిల్లా సీఎం రేవంత్రెడ్డి ఏరియల్ సర్వేసీఎం రేవంత్తో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి,మహేష్ గౌడ్ వరద ప్రభావిత పప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయనున్న సీఎం రేవంత్ ముందుగా ఎల్లంపల్లి సీఎం రేవంత్ ఏరియల్ సర్వే ఆ తర్వాత మెదక్కు వెళ్లనున్న తెలంగాణ సీఎం అనంతరం కామారెడ్డిలో వరదలతపై అధికారులతో సమీక్ష చేయనున్న సీఎంవర్షాల ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు..భారీ వర్షాలు, వరదలతో పలు రైళ్లు రద్దుకామారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలో భారీ వర్షాలు, వరదలతో పలు రైళ్లు రద్దుకొన్ని దారి మళ్లింపు, మరికొన్ని పాక్షికంగా రద్దు36 రైళ్లు రద్దు, 25 రైళ్లు దారి మళ్లింపు, పాక్షికంగా 14 రైళ్లు రద్దు వివరాలు వెల్లడించిన దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ Helpline Numbers provided at Kacheguda, Nizamabad, Kamareddi, Secunderabad Railway Stations in view of heavy trains for information on train operationsKacheguda - 9063318082NZB - 9703296714KMC - 9281035664SC - 040 277 86170@drmsecunderabad @drmhyb #HeavyRains #Telangana— South Central Railway (@SCRailwayIndia) August 28, 2025రేపటి నుంచి వర్షాలు తగ్గుముఖం: ఐఎండీరేపటి వరకు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు..ఇవాళ నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ.నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ.హైదరాబాద్ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం. డీజీపీ జితేందర్ కామెంట్స్.వరద ప్రభావిత ప్రాంతాల్లో పోలీసు ఫోర్స్ అప్రమత్తంగా ఉంది.24 గంటలుగా పోలీసు ఫోర్స్ రెస్య్కూ ఆపరేషన్లు చేస్తూనే ఉంది.బోట్స్, లైఫ్ జాకెట్లతో చాలా మందిని రక్షించగలిగాం.ఇప్పటి వరకు 1200 మందిని కాపాడాం.కామారెడ్డి, నిర్మల్, మెదక్, రామాయంపేటలో వరద తగ్గిందికంట్రోల్ రూమ్ నుంచి వరదలపై 24 గంటలు మానిటరింగ్ చేస్తున్నాం.కామారెడ్డిలో చాలా మందిని కాపాడగలిగాం.సకాలంలో ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ స్పాట్కి చేరుకోవడంతో ముప్పు తప్పింది.ఎస్డీఆర్ఎఫ్, స్థానిక పోలీసులు, ైఫైర్ సిబ్బంది కలిసి ెరెస్య్కూ ఆపరేషన్ చేశాం.అన్ని ప్రాంతాల్లో పోలీసు ఫోర్స్ అప్రమత్తంగా ఉంది.జాతీయ రహదారి-44పై ట్రాఫిక్ మళ్లింపుట్రాఫిక్ జామ్ నేపథ్యంలో పోలీసుల సూచనలు.. తెలంగాణలో భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న NH-44 నాగ్పూర్ హైవే..ప్రజల భద్రత కోసం ట్రాఫిక్ డైవర్షన్ అమలు..హెవీ వెహికిల్స్ డైవర్షన్ ఇలా..హైదరాబాద్-ఆదిలాబాద్ వెళ్తున్న లారీలు మేడ్చల్ చెక్పోస్ట్ వద్ద మళ్లింపు.మేడ్చల్-సిద్ధిపేట-కరీంనగర్-జగిత్యాల-కోరుట్ల-మెట్పల్లి-ఆర్మూర్-ఆదిలాబాద్ వెళ్ళాలిలైట్ వెహికిల్స్ డైవర్షన్ ఇలా..హైదరాబాద్-ఆదిలాబాద్ వెళ్తున్న కార్లు తూప్రాన్ వద్ద మళ్లింపు.మేడ్చల్-తూప్రాన్-సిద్ధిపేట-కరీంనగర్-జగిత్యాల-కోరుట్ల-మెట్పల్లి-ఆర్మూర్-ఆదిలాబాద్కామారెడ్డి-డిచ్పల్లి-ఆర్మూర్ మధ్య రహదారి వర్షంతో ప్రభావితం అయ్యింది..ఆదిలాబాద్ వెళ్లే ప్రయాణికులు ముందుగానే ప్రణాళిక చేసుకోవాలి: పోలీసులుహెవీ వెహికిల్స్ తప్పనిసరిగా డైవర్షన్ మార్గం పాటించాలి.ట్రాఫిక్ పోలీసులు, హైవే పెట్రోల్ సిబ్బంది డైవర్షన్స్ చూపుతారు. 🚦 TRAFFIC ADVISORY – NH44 (Nagpur Highway) 🚦Due to heavy rains and road damage on NH44, traffic diversions are in effect to ensure safety and smooth movement.📍 Diversion for Heavy VehiclesFrom Hyderabad → Adilabad (NH44), traffic will be diverted at Medchal Checkpost.… pic.twitter.com/KseVIcc9X6— Cyberabad Traffic Police (@CYBTRAFFIC) August 28, 2025రానున్న మూడు గంటల్లో భారీ వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక @balaji25_t Kamareddy present situation. At. Pedda cheruvu. Totally destroyed. #Kamareddy @Collector_KMR @revanth_anumula . Situation may. Get worse. Due. Upcoming. Rains and flooding.. so .. Take. Responsibility all Departments @TelanganaCMO @TelanganaCOPs pic.twitter.com/wJqtqLMOSF— KALKI .& SALAAR. ✨ (@MRSANJUYT1) August 28, 2025సిరిసిల్ల, కామారెడ్డిలో కేటీఆర్ పర్యటనబీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్భారీ వర్షాలు, వరదలపై కేటీఆర్ తీవ్ర ఆందోళనకార్యకర్త నుంచి ప్రజాప్రతినిధుల వరకు ప్రతి ఒక్కరూ సహాయ చర్యల్లో పాల్గొనాలివర్షాల వల్ల నష్టపోయిన వారికి తక్షణ సహాయం అందించాలితీవ్రమైన వరద ఉన్నచోట ఆహారం, తాగునీరు అందించాలిఅవసరమైతే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలిపారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించి, వ్యాధులు ప్రబలకుండా చూడాలసిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో పర్యటించనున్న కేటీఆర్వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రాంతాల్లో పర్యటనముందుగా సిరిసిల్ల జిల్లా నర్మలలో పర్యటించనున్న కేటీఆర్నర్మల పర్యటన తర్వాత కామారెడ్డికి రాక.Due to ongoing Massive rains, many parts of kamareddy district under flash floods, below 👇visuals of #Kamareddy to #Hyderabad route#KamareddyFloods #KamareddyRains pic.twitter.com/Uta0EdVzja— Eastcoast Weatherman (@eastcoastrains) August 28, 2025కామారెడ్డి పర్యటనకు బయల్దేరిన మంత్రి సీతక్క, షబ్బీర్ అలీభారీ వర్షాలు దృష్ట్యా కామారెడ్డిలో పరిస్థితిని పరిశీలించనున్న సీతక్కవరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించనున్న మంత్రి సీతక్కప్రజలకు అందుతున్న అత్యవసర సేవలపై సమీక్ష పొంగుతున్న వాగులు.. నిలిచిన రాకపోకలుకొణిజర్లలో పొంగుతున్న వాగులు.. నిలిచిన రాకపోకలుఖమ్మం జిల్లాలో పొంగుతున్న వాగులు..కొణిజర్ల మండలంలో నమోదై 120 మిల్లీమీటర్ల వర్షపాతంమండలంలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న పగిడేరు, నిమ్మ వాగు, జన్నారం ఏరు, రాళ్లవాగుపగిడేరు ఉద్ధృతితో నిలిచిన రాకపోకలుభువనగిరి భారీ వాహనాల రాకపోకలకు అనుమతిభువనగిరి చిట్యాల మార్గంలో నాగిరెడ్డిపల్లి వద్ద కల్వర్టుపై నుంచి ఉద్ధృతంగా సాగుతున్న వరద ప్రవాహంబుధవారం నిలిపివేసిన వాహనాల రాకపోకలుప్రవాహం తగ్గడంతో గురువారం ఉదయం నుంచి అనుమతించిన భారీ వాహనాల రాకపోకలు ఇళ్లు ఖాళీ చేస్తున్న ప్రజలుకామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలతో వచ్చిన వరదల వల్ల ఇళ్లు ఖాళీ చేస్తున్న ప్రజలుఇళ్లు ఖాళీ చేస్తున్న డోంగ్లి మండలంలోని సిర్పూర్, పెద్దటాక్లీ గ్రామాల ప్రజలుమద్నూర్ మండలం మీర్జాపూర్లోని ఆలయంలో తలదాచుకుంటున్న వృద్ధులు, చిన్నారులుపొరుగు గ్రామంలోని బంధువుల ఇళ్లకు వెళ్లిపోతున్న సిర్పూర్ గ్రామస్థులుడోంగ్లికి వెళ్లిపోయిన పెద్దటాక్లీలోని కొన్ని కుటుంబాలుజలదిగ్బంధంలో పిట్ల మండలం కుర్తి గ్రామంనిజాంసాగర్, కౌలాస్నాలా జలాశయం గేట్లు ఎత్తి నీటి విడుదలనీటి విడుదలతో ఆందోళనలో ముంపు గ్రామాల ప్రజలుమాజీ మంత్రి హరీష్ పర్యటన..మెదక్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో హరీష్రావు పర్యటనబూరుగుపల్లిలో తెగిపోయిన రహదారిని పరిశీలించిన హరీష్స్థానికులతో మాట్లాడిన మాజీ మంత్రిరాజాపేట, ధూప్సింగ్తండా వాసులను పరామర్శించిన హరీష్రావు బృందంనిన్నటి నుంచి జల దిగ్బంధంలో ఉన్న ధూప్సింగ్తండా సీఎం రేవంత్ ఏరియల్ సర్వే వాయిదా.. సీఎం ఏరియల్ సర్వేకు వర్షం అడ్డంకి.. వాతావరణం అనుకూలించకపోవడంతో ఏరియల్ సర్వే వాయిదావర్షాలపై సీఎం సమీక్ష..రాష్ట్రంలో వర్షాలు, వరదల పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్కతో సమావేశమైన సీఎం.వరద ప్రభావిత జిల్లాల్లోని అధికారులను అప్రమత్తం చేయటంతో పాటు తక్షణం చేపట్టాల్సిన సహాయక చర్యలపై సమీక్షఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మంత్రులు, అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు20 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలుబిక్కనూర్ టోల్ప్లాజా నుంచి 20 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలుబిక్కనూర్ టోల్ప్లాజా నుంచి కామారెడ్డి వరకు భారీగా ట్రాఫిక్ జామ్సుమారు 20 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలువాహనాలు భారీగా నిలవడంతో వాహనదారుల ఆందోళనమంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు..భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లాలో ముగ్గురు మృత్యువాత పడ్డారు.నేడు కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో హెలికాప్టర్ను అందుబాటులో ఉంచాం..నిరాశ్రయులైన ప్రజల కోసం ఆహారం, ఇతర వస్తువులు అందుబాటులో ఉంచాం..ఏరియల్ సర్వే ద్వారా పరిస్థితిని సీఎం సమీక్షిస్తారు.కామారెడ్డి జిల్లా అధికారులతో సమీక్ష చేస్తా.సాయంత్రం వరకు పంట, ప్రాణ, ఆస్తి నష్టంపై నివేదిక వస్తుంది. భారీ వర్షాలపై కేసీఆర్ ఆందోళన..భారీ వర్షాలు, వరదలతో రాష్ట్ర ప్రజలకు ఇబ్బందుల పట్ల మాజీ సీఎం కేసీఆర్ ఆందోళనవరద ప్రభావిత ప్రాంతాల పార్టీ నేతలతో మాట్లాడిన కేసీఆర్తమ వంతుగా పార్టీ శ్రేణులు సహాయక చర్యలు చేపట్టేలా చూడాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఆదేశంతెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్.. 25 జిల్లాలకు ఎల్లో అలర్ట్తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలుభద్రాద్రి, భూపాలపల్లి, ఆదిలాబాద్, కామారెడ్డి, మెదక్, నిర్మల్, కొమురంభీం,నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు జారీ చేశారు.ఈ ప్రాంతాల్లో ఆకస్మిక వర్షాలు, ఉరుములు, మెరుపులు వర్షాలు..తెలంగాణలో మొత్తం 25 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ11 జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం SEVERE RAINFALL WARNING ⚠️🌧️ NEXT 6HOURS FORECAST ⚠️ VERY HEAVY DOWNPOURS to continue in Kamareddy, Nizamabad, Nirmal, Jagitial. FLASH FLOOD WARNING for these districts ⚠️⚠️⚠️ HEAVY DOWNPOURS to continue in Karimnagar, Sircilla, Peddapalli, Adilabad, Asifabad Medak, Mulugu.…— Telangana Weatherman (@balaji25_t) August 28, 2025 వర్షాల ఎఫెక్ట్.. 11 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులుతాజాగా నల్లగొండ, యాదాద్రి, కరీంనగర్, సిద్దిపేట్ల, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలో విద్యాసంస్థలు బంద్ఇప్పటికే కామారెడ్డి, మెదక్, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ఇచ్చిన అధికారులు.కరీంనగర్, జగిత్యాల జిల్లాలోని అన్ని పాఠశాలకు సెలవుకరీంనగర్, జగిత్యాల జిల్లాలోని అన్ని పాఠశాలకు ఇవాళ సెలవుభారీ వర్షాల దృష్ట్యా సెలవు ప్రకటించిన జిల్లా విద్యాధికారులుNH-44 turns into a nightmare!20 KM traffic jam in #Kamareddy as heavy flooding brings vehicles to a standstill. #Telangana #NH44 pic.twitter.com/atBXc2bhuI— Mubashir.Khurram (@infomubashir) August 28, 2025 NH-44పై భారీగా ట్రాఫిక్ జామ్.. ఆదిలాబాద్ జిల్లా : భారీ వర్షాల దృష్ట్యా విద్యాసంస్థలకు సెలవుఅత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు వెళ్లొద్దని కలెక్టర్ సూచనరాత్రి నుంచి ఏకధాటి వర్షానికి జలమయమైన లోతట్టు ప్రాంతాలుఆదిలాబాద్ జిల్లా: వర్ష బీభత్సానికి విరిగిపడిన చెట్లు, తెగిన విద్యుత్ తీగలుభీంపూర్, తాంసి మండల్లోని 50 గ్రామాలకు రాత్రి నుంచి నిలిచిన విద్యుత్ సరఫరాఎన్హెచ్-44పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. లారీలు, వాహనాలు కిలోమీటర్ల మేర్ల బారులు తీరాయి. TELANGANA & HYDERABAD Update | 28 AUG 8AM ⚠️🔴 SEVERE DOWNPOURS Alert for Kamareddy, Medak, Sircilla, Karimnagar, Jagitial, Nizamabad, Nirmal, and Khammam districts.Peak LPA Effect is going on now in the above-mentioned districts. The LPA impact is likely to end tonight…— Hyderabad Rains (@Hyderabadrains) August 28, 2025 పెరుగుతున్న గోదావరి నీటిమట్టంభద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టంఉదయం 8 గంటలకు 34.9 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం #Kamareddy జిల్లాలోని సరంపల్లి గ్రామం దేవునిపల్లి పోలీస్ స్టేషన్ ఏరియాల లోని ST రెసిడెన్షియల్ విద్యార్థులు (300) జలదిగ్బంధంలో ఉన్న విషయం తెలుసుకొని వారిని కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించడం జరిగింది. @TelanganaCOPs @TelanganaDGP @TelanganaCMO @Collector_KMR pic.twitter.com/hnAsa0E75Q— SP Kamareddy (@sp_kamareddy) August 27, 2025మానేరు ఉగ్రరూపం.. మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో మానేరు ఉగ్రరూపంఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలుతెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాలతో ప్రజల అవస్థలుమెదక్, కామారెడ్డి జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో మానేరు ఉగ్రరూపంపాల్వంచ వాగు, కూడవెల్లి వాగుల నుంచి మానేరులోకి భారీగా వరదరాజన్నసిరిసిల్ల జిల్లాలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మానేరువాగునిండుకుండను తలపిస్తున్న నర్మాల వద్ద ఉన్న ఎగువ మానేరు జలాశయంఎగువ మానేరు జలాశయం నుంచి దిగువకు వరద విడుదలమానేరు ఉగ్రరూపంతో మిడ్ మానేరులోకి భారీగా వరద నీరువచ్చే 2 గంటల్లో కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం,మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, హనుమకొండ, వరంగల్, పెద్దపల్లిలో భారీ వర్షాలువచ్చే 2 గంటల్లో సిద్దిపేట, మెదక్, జనగాం, యాదాద్రి, మంచిర్యాలలో మోస్తరు వర్షాలువరంగల్ అతలాకుతలం.. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలుఉమ్మడి వరంగల్ జిల్లాలో పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలుములుగు జిల్లా తాడ్వాయిలో 15 సెం.మీ వర్షపాతంవెంకటాపూర్లో 12 సెం.మీ., గోవిందరావుపేటలో 11 సెం.మీ. వర్షపాతంములుగు జిల్లా: ఉద్ధృతంగా ప్రవహిస్తున్న జంపన్నవాగుమేడారం వద్ద బ్రిడ్జి ఆనుకుని పారుతున్న జంపన్నవాగుపసర నుంచి తాడ్వాయి మధ్యలో ఉన్న జలగలంచ వాగు ఉద్ధృతిపసర నుంచి తాడ్వాయి మధ్య వాహనాల రాకపోకల నిషేధంజలగలంచ వాగు ఉద్ధృతితో ప్రజలను పునరావాస కేంద్రానికి తరలింపుహనుమకొండ జిల్లాలో అలుగుపారుతోన్న కటాక్షపూర్ చెరువు వర్షాల ఎఫెక్ట్.. రైళ్లు రద్దు..భారీ వర్షాల వల్ల పలు రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వేరాష్ట్రంలో భారీ వర్షాల వల్ల పలు రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వేభారీ వర్షాల కారణంగా పలు రైళ్ల మళ్లింపు, రద్దు, పాక్షిక రద్దుభారీ వర్షం కారణంగా పట్టాలపై నుంచి ప్రవహిస్తున్న వరదవరద దృష్ట్యా రైళ్ల దారి మళ్లింపు సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారంఇవాళ నడవాల్సిన అకోల- అకోట, కాచిగూడ- నాగర్సోల్ రైళ్లు రద్దుఇవాళ నడవాల్సిన కాచిగూడ - కరీంనగర్, హెచ్.ఎస్ నాందేడ్ - మేడ్చల్ రైళ్లు రద్దుహైదరాబాద్-కామారెడ్డి మధ్య నిలిచిన పలు రైళ్ల రాకపోకలుభిక్కనూరు-తలమడ్ల స్టేషన్ల మధ్య పట్టాలపై చేరిన వర్షపు నీరుఅక్కన్నపేట్-మెదక్ స్టేషన్ల మధ్య పట్టాలపై చేరిన వర్షపు నీరుకరీంనగర్- కాచిగూడ, మెదక్- కాచిగూడ, బోధన్- కాచిగూడ రైళ్లు రద్దుకాచిగూడ-మెదక్, నిజామాబాద్- తిరుపతి, ఆదిలాబాద్- తిరుపతి రైళ్లు రద్దురేపటి కాచిగూడ - నర్కేర్ సర్వీస్ను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వేగజ్వేల్ - లక్డారం రైలు పట్టాలపై భారీగా ప్రహిస్తున్న వరద నీరుఇవాళ, రేపు మల్కాజిగిరి- సిద్దిపేట సర్వీసు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వేప్రయాణికుల కోసం హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేసిన దక్షిణ మధ్య రైల్వేకాచిగూడ స్టేషన్లో 9063318082 నంబర్ ఏర్పాటుసికింద్రాబాద్ స్టేషన్లో 040- 27786170 నంబర్ ఏర్పాటునిజామాబాద్ స్టేషన్లో 970329671 నంబర్ ఏర్పాటుకామారెడ్డి స్టేషన్లో 9281035664 నంబర్ ఏర్పాటుBulletin No.6 Cancellation/Diversions/Partial Cancellations of Trains due to heavy rains @drmhyb @drmsecunderabad @drmned pic.twitter.com/EIVsmpA2lU— South Central Railway (@SCRailwayIndia) August 27, 2025 వర్షాల రెడ్ అలర్ట్.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలుఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అప్రమత్తమైన అధికారులుఆదిలాబాద్: ఉరుములు, మెరుపులతో కురుస్తున్న వర్షంఇవాళ ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీం జిల్లాల్లో పాఠశాలలకు సెలవుకడెం ప్రాజెక్టు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలుకడెం ప్రాజెక్ట్ నాలుగు గేట్లు ఎత్తి 20వేల క్యూసెక్కుల నీరు విడుదల అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, నిర్మల్ జిల్లాల్లో కుంభవృష్టి కురిసింది. ఎకధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా కామారెడ్డి, మెదక్ జిల్లాల్లోని పలు గ్రామాలు నీటి మునిగాయి. భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి, మెదక్ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో గురువారం ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. మరోవైపు భారీ వర్షాల దృష్ట్యా తెలంగాణ వర్సిటీ పరిధిలో నేటి పరీక్షలు వాయిదా పడ్డాయి. శుక్రవారం యథాతథంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు వీసీ యాదగిరిరావు పేర్కొన్నారు.ఇక, కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండలో అత్యధికంగా 43.1 సెం.మీ వర్షం కురిసింది. నిర్మల్ జిల్లా అక్కాపూర్లో 32.3 సెం.మీ, మెదక్ జిల్లా సర్దానలో 30.2 సెం.మీ, కామారెడ్డి పట్టణంలో 28.9 సెం.మీ, కామారెడ్డి జిల్లా భిక్నూర్లో 27.9 సెం.మీ, నిర్మల్ జిల్లా వడ్యాల్లో 27.9 సెం.మీ, కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో 27.5 సెం.మీ, మెదక్జిల్లా నాగాపూర్ గ్రామంలో 26.6 సెం.మీ, కామారెడ్డి జిల్లా పాత రాజంపేటలో 24.6 సెం.మీ, లింగంపేటలో 22.5 సెం.మీ, దోమకొండలో 20.2 సెం.మీ, నిర్మల్ జిల్లా విశ్వనాథ్పేట్లో 24.1 సెం.మీ, ముజిగిలో 23.1 సెం.మీ, మెదక్ జిల్లా చేగుంటలో 20.2 సెం.మీల వర్షం పాతం నమోదైంది. -
నేడు వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలో ఏకధాటిగా కురుస్తున్న వానలకు జన జీవనం అస్తవ్యస్తమైంది. ఇళ్లలోకి వరద నీరు చేరింది. పంటలకు తీవ్ర నష్టం కలిగింది. మరోవైపు.. భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. నేడు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. ఉదయం 11 గంటలకు ఏరియల్ సర్వే ద్వారా మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ , నిర్మల్, సిరిసిల్ల జిల్లాలను సీఎం పరిశీలించనున్నారు. ఇక, కామారెడ్డిలో ముంపు ప్రాంతాల పరిశీలనకు ఇంఛార్జి మంత్రి సీతక్క, పీసీసీ ఛీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెళ్లనున్నారు. -
వరదల్లో చిక్కుకున్న బాధితులు.. రాజ్నాథ్ సింగ్కు బండి సంజయ్ ఫోన్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో వర్షం బీభత్సం నేపథ్యంలో సహాయక చర్యల్ని ముమ్మరం చేసేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నడుం బిగించారు. కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాలో వరదల్లో 30 మంది చిక్కుకున్న బాధితుల్ని రక్షించేలా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో ఫోన్లో సంప్రదింపులు జరిపారు. కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాలో వరదల్లో 30 మంది చిక్కుకున్నారని, బాధితులను కాపాడేందుకు ప్రత్యేక వైమానిక దళ హెలికాప్టర్ను పంపించాలని బండి సంజయ్ రాజ్ నాథ్ సింగ్ను కోరారు. అందుకు రాజ్నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించారు. బాధితులను కాపాడేందుకు ప్రత్యేక వైమానిక దళ హెలికాప్టర్ను పంపాలని హకీంపేటలోని డిఫెన్స్ అధికారులను కేంద్ర రక్షణ మంత్రి కార్యాలయం ఆదేశించింది. వరద సహాయక చర్యల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఎన్డీఆర్ఎఫ్ దళాలు సిద్ధంగా ఉన్నాయని బండి సంజయ్ వెల్లడించారు. -
మూసీ మాస్టర్ ప్లాన్.. సీఎం రేవంత్రెడ్డి కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: మూసీ రివర్ డెవలప్మెంట్పై జూబ్లీహిల్స్ నివాసంలో తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, సిఎం సెక్రటరీ మాణిక్ రాజ్, ఏంఎఅండ్యూడీ సెక్రటరీ (హెచ్ఎండీఏ ఏరియా) ఇలంబర్తి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఎఫ్సీడీఏ కమిషనర్ కె. శశాంక, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి ఎండీ అశోక్ రెడ్డి, ఎంఆర్డీసీఎల్ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, జెఎండీపీ గౌతమి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.మూసీ రివర్ డెవలప్మెంట్ మాస్టర్ ప్లాన్ను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గేట్ వే ఆఫ్ హైదరాబాద్, గాంధీ సరోవర్ అభివృద్ధితో పాటు జంక్షన్ల ఏర్పాటు, రోడ్ల అభివృద్ధిపై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. సిగ్నల్ రహిత జంక్షన్లను ఏర్పాటు చేయాలన్న సీఎం.. వచ్చే వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మూసీ నదీ పరివాహక అభివృద్ధి జరగాలన్నారు.గాంధీ సరోవర్ అభివృద్ధికి సంబంధించి పలు డిజైన్లను పరిశీలించిన సీఎం రేవంత్.. అభివృద్ధి పర్యావరణహితంగా ఉండేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. మీరాలం చెరువు అభివృద్ధి, ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణ ప్రణాళికలను సీఎంకు అధికారులు వివరించారు. వీలైనంత త్వరగా డీపీఆర్ సిద్ధం చేసి పనులు మొదలు పెట్టాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. -
భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో రేపు విద్యాసంస్థలకు సెలవు
సాక్షి, కామారెడ్డి: భారీ వర్షాలు నేపథ్యంలో కామారెడ్డి, మెదక్ జిల్లాలో రేపు(గురువారం) విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. జిల్లాల్లోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు కళాశాలల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని ఆ జిల్లాల కలెక్టర్లు ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నారు.ఎడతెరిపి లేకుండా వానలు కురవడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కామారెడ్డిలో రికార్డు స్థాయిలో 41 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో కొన్ని ప్రాంతాల్లో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పలుచోట్ల ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కామారెడ్డి-నిజామాబాద్ మధ్య రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది.నిజాంసాగర్ మండలం గోర్గల్ గ్రామంలోకి మంజీర వరద నీళ్లు చేరుతున్నాయి. గ్రామ శివారులో వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. వర్షాలు, వరదలు తగ్గించాలంటూ వేడుకొంటూ గంగమ్మ తల్లికి గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాంతించాలని కోరుతూ మంజీర నదిలో తెప్ప పడవను గ్రామస్తులు వదిలారు. -
పట్టాలపై నీళ్లు: పలు రైళ్ల రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాలు పలు జిల్లాలను అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేయగా, మరి కొన్నింటిని దారిమళ్లించింది. కాచిగూడ-నిజామాబాద్, నిజామాబాద్-కాచిగూడ, కరీంనగర్-కాచిగూడ, కాచిగూడ-మెదక్, మెదక్-కాచిగూడ, బోధన్-కాచిగూడ, ఆదిలాబాద్-తిరుపతి సర్వీసును రద్దు చేసినట్టు రైల్లే అధికారులు ప్రకటించారు.మహబూబ్నగర్-కాచిగూడ, షాద్నగర్-కాచిగూడ సర్వీసును పాక్షింగా రద్దు చేసినట్టు అధికారులు వెల్లడించారు. కామారెడ్డి-బికనూర్-తలమడ్ల, అక్కన్నపేట్ -మెదక్ రైల్వే ట్రాక్ పైనుంచి ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. Bulletin 4 - SCR PR No. 357 Dt. 27.08.2025 on "Cancellations/Partial Cancellation/Diversion/Rescheduling of Trains Due to Heavy Rains@drmhyb @drmsecunderabad @drmned @drmvijayawada @drmgtl @drmgnt pic.twitter.com/8mqMmUO6UQ— South Central Railway (@SCRailwayIndia) August 27, 2025 -
తెలంగాణలో వర్ష బీభత్సం.. బీహార్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్
సాక్షి,తెలంగాణ: ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షం హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో బీభత్స సృష్టిస్తోంది. వర్షం కారణంగా వాగులు,వంకలు,లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ ఎత్తున ఆస్తినష్టం సంభవించింది. వరద ధాటికి వరదనీరు పొంగిపొర్లుతుంది. వరద ప్రవాహాతో పలు ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని గడుపతున్నారు ఈ క్రమంలో రాష్ట్రంలో వర్ష బీభత్సంపై మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. భారీ వర్షాలతో తెలంగాణ నీట మునుగుతున్నది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రజలు సాయం కోసం అర్థిస్తున్నారు. సీఎం మాత్రం తీరిగ్గా బీహార్లో ఎన్నికల యాత్ర చేస్తున్నారు. ఎప్పుడొస్తాయో తెలియని బీహార్ ఎన్నికల కోసం..తెలంగాణకు సంబంధమే లేని బీహార్ ఎన్నికల కోసం తెలంగాణ సీఎం, మంత్రివర్గం కాంగ్రెస్ అధిష్ఠానం ముందు మోకరిల్లిందిఅధిష్ఠానం ఆశీస్సులతో.. పదవులు కాపాడుకుని ఖజానా కొల్లగొట్టే ధ్యాస తప్పితే ఆరు గ్యారంటీలు..420 హామీల అమలు గురించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయి లేదు. వరదలతో ప్రజలు..యూరియా దొరక్క రైతులు.. ఉద్యోగ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారుచాలా చోట్ల వరదనీటిలో మునిగి ప్రజలు హెలికాప్టర్ సాయం కోసం ఎదురుచూస్తున్నారు.తెలంగాణ ప్రజల సొమ్ముతో ప్రైవేట్ జెట్లలో ఊరేగుతున్న కాంగ్రెస్ సీఎం, మంత్రులకు ఓలా, ఊబర్, ర్యాపిడో క్యాబ్ల కన్నా అధ్వాన్నంగా 100 కిలోమీటర్ల లోపు ప్రభుత్వ కార్యక్రమాలకు హెలికాప్టర్ను వినియోగిస్తున్న ఈ నేతలకు ఇప్పుడైనా హెలికాప్టర్ పంపి ప్రజల ప్రాణాలు రక్షించే తీరిక ఉందో,లేదో ?కాంగ్రెస్ నేతలారా.ఓట్లు కాదు..ప్రజల పాట్లు చూడండి..ఎన్నికలు కాదు..ఎరువుల కోసం రైతుల వెతలు చూడండి. వరదల్లో చిక్కుకుపోయిన ప్రజలను రక్షించేందుకు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది’అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. భారీ వర్షాలతో తెలంగాణ నీట మునుగుతున్నదిప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రజలు సాయం కోసం అర్థిస్తున్నారుసీఎం మాత్రం తీరిగ్గా బీహార్ లో ఎన్నికల యాత్ర చేస్తున్నాడుఎప్పుడొస్తాయో తెలియని బీహార్ ఎన్నికల కోసంతెలంగాణకు సంబంధమే లేని బీహార్ ఎన్నికల కోసం తెలంగాణ సీఎం, మంత్రివర్గం… pic.twitter.com/AuZrpbwjN7— KTR (@KTRBRS) August 27, 2025 -
హవేలి ఘన్పూర్లో విషాదం.. వరదలో కొట్టుకుపోయిన కారు
సాక్షి, మెదక్: జిల్లాలో వరద బీభత్సం సృష్టిస్తోంది. వరద ప్రవాహంలో కారు కొట్టుకుపోయింది. హవేలి ఘన్పూర్ మండలం నక్కవాగులో ఘటన జరిగింది. భారీ వర్షాలు కారణంగా నక్కవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వద్దని స్థానికులు వారించినా పట్టించుకోని కారు డ్రైవర్.. అత్యుత్సాహంతో వరద ప్రవాహంలో కారు నడిపారు. దీంతో వాగులో కారు కొట్టుకుపోయింది. కారులో ఉన్నవారి వివరాల కోసం అధికారులు ఆరా తీస్తున్నారు.కాగా, హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా జిల్లాలోని ధూప్సింగ్ తండా జలమయమైంది. తండాను వరద నీరు ముంచెత్తడంతో ఇళ్లలోకి నీరు చేరుకుంది. జల దిగ్భంధంలో తండా ఉండటంతో తమ కాపాడాలంటూ స్థానికులు బిల్డింగ్పైకి ఆర్తనాదాలు చేస్తున్నారు.మరోవైపు.. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రాబోయే 2 గంటల్లో 8 జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని తెలిపింది. -
తెలంగాణలో నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్
తెలంగాణలో కుండపోత వర్షం.. అప్డేట్స్మెదక్ అంధకారం..పలు కాలనీల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయంపిల్లికొట్టాల్లో పసుపులేరు వాగు ఉధృతికి కొట్టుకుపోయిన సబ్ స్టేషన్కామారెడ్డిలో అంధకారంభారీ వర్షం నేపథ్యంలో విద్యుత్ సరాఫరాకు అంతరాయంజిల్లా కేంద్రంలోని గాంధీనగర్, అయ్యప్ప నగర్, బతుకమ్మ కుంట, రుక్మిణికుంట, పంచముఖి హనుమాన్ కాలనీ, గోపాలస్వామి రోడ్, షేర్ గల్లి తదితర ప్రాంతాల్లో అంధకారం.కరెంటు లేక ఇబ్బందులు పడుతున్న జిల్లా ప్రజలుజీఆర్ కాలనీలో సహాయ చర్యల కోసం వేచి చూస్తున్న కాలనీవాసులువరదలు ఉధృతంగా ఉన్న చెరువుల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులుకామారెడ్డి హౌసింగ్ బోర్డ్ కౌండిన్య కాలనీలో వరదలో చిక్కుకున్న బాధితులురక్షించేందుకు కామారెడ్డికి చేరిన బోట్లు.సుమారు 50 మంది పైగా చిక్కుకున్న కాలనీవాసులుజల దిగ్బంధంలో ఉన్న బాధితులను కాపాడేందుకు రంగంలోకి దిగిన రెస్క్యూ టీం మెదక్ జిల్లా: రేపు విద్యాసంస్థలకు సెలవుజిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలుప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించిన కలెక్టర్ తెలంగాణలో నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్వచ్చే మూడు గంటల్లో అతిభారీ వర్ష సూచననిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం మెదక్ రామాయంపేటలో రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్నీట మునిగిన మహిళా డిగ్రీ కళాశాలవిద్యార్థినులను రక్షించిన సహాయక బృందాలుసురక్షిత ప్రాంతానికి 300 మంది తరలింపు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట సమీపంలో ఎగువ మానేరులో చిక్కుకున్న కార్మికులు ఆరు గంటలుగా సాయం కోసం ఎదురు చూపులుస్వామి అనే కార్మికుడికి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్స్వామితోపాటు మిగిలిన నలుగురు బాధితులు పిట్ల మహేశ్, పిట్ల స్వామి, ధ్యానబోయిన స్వామి పరిస్థితిపైనా ఆరాబాధితులెవరూ భయపడొద్దని పూర్తిగా అండగా ఉంటామని భరోసా ఇచ్చిన బండి సంజయ్జిల్లా కలెక్టర్ సైతం అక్కడే ఉంటూ సహాయ చర్యల్లో పాల్గొంటున్నారని చెప్పిన కేంద్ర మంత్రిఅధికారులతో మాట్లాడి భోజనం అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడి వర్షాలపై రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షరాష్ట్రంలో నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి.కామారెడ్డి ,మెదక్ జిల్లాలో భారీ వర్షాలకు అలుగులు పొంగి పొర్లుతుండడం ,రోడ్లపై భారీ వరద నీరు వచ్చి చేరుతుండడం ఆర్టీసీ బస్సు డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి .హైదరాబాద్ లో వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద జీహెచ్ఎంసీ సిబ్బంది ఎప్పటికప్పుడు నీరు నిలువ లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి,భారీ వర్షాలకు వరదల వల్ల ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలిలోతట్టు ప్రాంతాల్లో ఏదైనా సమస్య ఉంటే వెంటనే వారిని అక్కడనుండి తరలించేలా చర్యలు తీసుకోవాలి .వర్షాల వల్ల గణేష్ మండపాల వద్ద ,ఇతర విద్యుత్ స్తంభాల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలి,ప్రమాదాలు చోటు చేసుకోకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి ఉమ్మడి నల్లగొండలో వాన బీభత్సంయాదాద్రి భీమలింగం కత్వా వద్ద వరద ఉధృతిచౌటుప్పల్ నాగిరెడ్డిపల్లి మధ్య రాకపోకల బంద్ ఇంకా వరదలోనే మెదక్ హవేలిఘన్పూర్ మండలంలోని దూప్సింగ్ తండాసాయం కోసం బిల్డింగ్ల మీదకు ఎక్కిన జనంరక్షించేందుకు అధికారుల ప్రయత్నాలు కామారెడ్డి కలెక్టర్తో మంత్రి సీతక్క టెలికాన్ఫరెన్స్కామారెడ్డి జిల్లా అంతటా భారీ వర్షాలు .. జలదిగ్బంధంలో పలుగ్రామాలుకలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో ఇన్చార్జి మంత్రి సీతక్క టెలికాన్ఫరెన్స్ తక్షణ సహాయక చర్యలు కొనసాగుతాయని హామీఅధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి :మంత్రి సీతక్క,ప్రతి గ్రామం, పట్టణంలోని పరిస్థితులను నిశితంగా పరిశీలించాలి :మంత్రి సీతక్కలోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టాలి :మంత్రి సీతక్కచెరువులు, వాగులు పొంగిపొర్లుతున్న ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ రాకపోకలను అనుమతించొద్దు :మంత్రి సీతక్కప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి :మంత్రి సీతక్కరక్షణ చర్యల్లో ఎక్కడా నిర్లక్ష్యం చోటుచేసుకోరాదు.. ప్రతి ఒక్క అధికారి తమ బాధ్యతను పూర్తిస్థాయిలో నిర్వర్తించాలి:మంత్రి సీతక్కవర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుంది:మంత్రి సీతక్క బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా బలపడిన వాయుగుండంరేపూ తెలంగాణ వ్యాప్తంగా కుండపోత వానలుకుండపోత వానతో రాష్ట్రమంతటా ఆగమాగంజనజీవనం అస్తవ్యస్తం భారీ వర్షాల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నేడు పలు రైళ్ల దారి మళ్లింపుకామారెడ్డి మీదుగా వెళ్ళే రైళ్లు నిజామాబాద్ మీదుగా మళ్లింపునిజామాబాద్ - తిరుపతి రాయలసీమ ఎక్స్ప్రెస్ ఈ రోజు రద్దుమెదక్ - కాచిగూడ రైలు ఈ రోజు పాక్షికంగా రద్దు కామారెడ్డి, మెదక్లకు రెడ్ అలర్ట్ రెండు జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షంరాజంపేట మండలం అర్గొండలో 31.9 సెం.మీ. అత్యధిక వర్షపాతంమెదక్ నాగపూర్లో 20.8 సెం.మీ. వర్షపాతంబిక్నూర్లో 19.1 సెం.మీటెక్మాల్ మండలంలో 18.03 సెంటీమీటర్ల వర్షపాతంపాత రాజంపేటలో 18, రామాయంపేటలో 16 సెం.మీలుచేగుంట 13.2 సెంమీ, మెదక్లో 11 సెం.మీ. కామారెడ్డి తలమట్ల దగ్గర రైల్వే ట్రాక్ నుంచి నీటి ప్రవాహం.. 12 రైళ్ల రాకపోకలకు అంతరాయం కామారెడ్డి, మెదక్ జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేసిన సీఎం రేవంత్రెడ్డివెంటనే సహాయక చర్యలు చేపట్టాలని.. అన్ని విభాగాల అధికారులు సిద్ధం చేయాలని ఆదేశంఎలాంటి విపత్కర పరిస్థితి ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉండండి :సీఎం రేవంత్రెడ్డిఅన్ని శాఖల అధికారులు.. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సాయం తీసుకోవాలని సీఎస్కు ఆదేశంఇరు జిల్లాల ఎమ్మెల్యేలతోనూ మాట్లాడిన సీఎంకలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని ఎమ్మెల్యేలకు సూచన భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లాలో పలు గ్రామాలు నీట మునడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరాకామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిపేట ఘటనపై కలెక్టర్ కు ఫోన్ చేసిన కేంద్ర మంత్రిప్రమాద బాధితులను ఆదుకునేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిద్ధంగా ఉందని చెప్పిన బండి సంజయ్అనంతరం ఎన్డీఆర్ఎఫ్ అధికారులతో మాట్లాడిన బండి సంజయ్ఎల్లారెడ్డిలో తక్షణమే అవసరమైన సాయం అందించాలని ఎన్డీఆర్ఎఫ్ ను కోరిన కేంద్ర మంత్రిజిల్లా కలెక్టర్ తో సమన్వయం చేసుకుని సహాయ చర్యల్లో నిమగ్నమవ్వాలని సూచంచిన కేంద్ర మంత్రి కామారెడ్డిలో భారీ వర్షాలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న తిమ్మారెడ్డిలోని కల్యాణి వాగు వాగుపై బొగ్గు గుడిసె సమీపంలో వరదలో చిక్కుకున్న ఆరుగురు కార్మికులు డీసీఎంలో అమర్చిన వాటర్ ట్యాంకర్ పైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూపులు ఈ వరద కారణంగా కామారెడ్డి- భిక్కనూర్ సమీపంలో రైలు పట్టాల కింద గండి.. రైళ్ల రాకపోకలు నిలిపివేతసిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో భారీ వర్షంఎగువ మానేరు నుంచి దిగువకు నీరు విడుదలనాగయ్య అనే పశువుల కాపరి గల్లంతు.. గాలిపు చేపట్టిన అధికారులుమానేరు వాగులో చిక్కుకున్న ఐదుగురు రైతులురక్షించేందుకు అధికారుల ప్రయత్నాలు -
ఆరేళ్లు కష్టపడితే 60 ఏళ్లు సుఖంగా జీవించవచ్చు..!
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగితేనే భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ రాజునాయక్ అన్నారు. మంగళవారం వీఎస్టీ ఫంక్షన్హాల్లో న్యూఎరా కళాశాల ఆధ్వర్యంలో సంకల్ప్ దివాస్ పేరిట పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ... లక్ష్యం లేని చదువులు వృథా అవుతాయని అన్నారు. ఆరేళ్లు కష్టపడి చదివితే 60 ఏళ్లు సుఖంగా జీవించొచ్చని అన్నారు. సెల్ఫోన్లకు కేటాయించే సమయాన్ని చదువు, ఆటలపైన కేటాయించాలని సూచించారు. ప్రేమ మత్తులోపడి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. కళాశాల ప్రిన్సిపల్ శ్రావణ్కుమార్ మాట్లాడుతూ... క్రమశిక్షణ పట్టుదల ఉన్న ఏ విద్యార్థి ఓడిపోడని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. -
మైనర్ బాలికతో డెలివరీ బాయ్ సహజీవనం
బంజారాహిల్స్(హైదరబాద్): తాను హాస్టల్లో ఉంటున్నానని, నెల రోజులుగా తల్లిదండ్రులను నమ్మించిన ఓ బాలిక తల్లిదండ్రులు వచ్చి చూసేసరికి గదిలో ఓ అబ్బాయితో ఉన్న ఘటన ఫిలింనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్నగర్కు చెందిన బాలిక (16) ఏడాది క్రితం తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని తల్లిదండ్రులతో గొడవ పడి హైదరాబాద్కు వచి్చంది. ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో రిసెప్షనిస్ట్గా పని చేస్తోంది. హాస్టల్లో ఉంటున్నానని తల్లిదండ్రులకు చెప్పేది. అయితే ఈ నెల 25న తల్లిదండ్రులకు ఫోన్ చేసి గత నెల రోజులుగా తాను డెలివరీ బాయ్ (19)గా పనిచేస్తున్న యువకుడితో ఫిలింనగర్లో ని ఓ గదిలో సహజీవనం చేస్తున్నానని, వారం రోజుల నుంచి సదరు యువకుడు తనను తీవ్రంగా కొడుతున్నాడని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు కుమార్తె చెప్పిన అడ్రస్ను వెతుక్కుంటూ నగరానికి వచ్చారు. మైనర్ బాలికను లోబర్చుకుని సహజీవనం చేస్తున్న యువకుడిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఫిలింనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పీవీ నర్సింహారావు ఎక్స్ప్రెస్ వేపై కారు బోల్తా
రాజేంద్రనగర్: వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి పీవీ నర్సింహారావు ఎక్స్ప్రెస్ వేపై పల్టీ కొట్టింది. డివైడర్ను ఢీకొట్టి స్ట్రీట్ లైట్ స్తంభాన్ని నెలకూల్చి అవతలి రోడ్డుపై పడింది. అయితే అదృష్టవశాత్తు కారులోని ఎయిర్ బ్యాగ్లో ఓపెన్ కావడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనతో ఎక్స్ప్రెస్ వేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వివరాల్లోకి వెళితే..గుడిమల్కాపూర్ మహేంద్ర షోరూమ్లో మెకానిక్గా పని చేస్తున్న మహ్మద్ ఖలీల్ మంగళవారం సాయంత్రం షోరూమ్కు చెందిన కారును ట్రయల్ కోసమని పీవీ నర్సింహారావు ఎక్స్ప్రెస్ వే మీదుగా ఆరాంఘర్ వరకు వెళ్లి తిరిగి మెహిదీపట్నం వైపు పయనమయ్యాడు. పిల్లర్ నంబర్ 212 వద్దకు రాగానే అతి వేగం కారణంగా కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. రోడ్డు మధ్యలో స్ట్రీట్ లైట్ స్తంభాన్ని కూల్చి పల్టీ కొడుతూ పక్క రోడ్డుపైకి వచ్చి బోల్తా కొట్టింది. ఈ సంఘటనలో ఎయిర్బ్యాగ్ ఓపెన్ కావడంతో ఖలీల్తో పాటు మరో వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ సంఘటనతో ఎక్స్ప్రెస్వేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గురైన వాహనాన్ని పక్కకు తొలగించి ట్రాఫిక్ను క్రమబద్దీకరించారు. -
అందుకే ఫుట్బాల్ తీసుకొచ్చా: కొండా విశ్వేశ్వర్రెడ్డి
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ బీజేపీ ఫుట్ బాల్ పాలిటిక్స్లో ట్విస్ట్ చోటు చేసుకుంది. చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి యూటర్న్ తీసుకున్నారు. ఆయన వ్యాఖ్యల ఆధారంగా ప్రచురితమవుతున్న అసంతృప్తి కథనాలను తోసిపుచ్చుతూ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ బీజేపీ వ్యవహారంపై అసంతృప్తితోనే తాను ఫుట్బాల్ గిఫ్ట్ ఇచ్చినట్లు వస్తున్న కథనాలను చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి ఖండించారు. ఎన్నికల్లో కాంగ్రెస్తో ఫుట్బాల్ ఆడాలనే తీసుకొచ్చానంటూ ప్రకటించారు. ‘‘తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయింది. కాంగ్రెస్తోనే బీజేపీకి పోటీ. రేవంత్ మంచి ఫుట్బాల్ ప్లేయర్. అందుకే ఎలా ఆడుకోవాలో తెలియజేయడానికే ఫుట్బాల్ తీసుకొచ్చా. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్తో ఫుట్బాల్ ఆడుతాం అని అన్నారాయన. ఇదిలా ఉంటే.. బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీకి కానుకగా ఫుట్బాల్ ఇవ్వడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పార్టీ వ్యవహారంపై విశ్వేశ్వర్రెడ్డి గుర్రుగా ఉన్నారని.. అధిష్టానం పెద్దలు ఒకరి దగ్గరకు వెళ్తే.. మరొకరి దగ్గరికి వెళ్లమంటూ ఫుట్బాల్ ఆడుకుంటున్నారని.. ఈ నేపథ్యంలోనే ఇలా ఫుట్బాల్ ఇచ్చి నిరసన తెలిపారనే చర్చ నడిచింది.ఈ పరిణామంపై మాజీ బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం స్పందిస్తూ.. కొండా విశ్వేశ్వర్రెడ్డికి మద్దతు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఫుట్బాల్స్ బయటకు వస్తాయంటూ తెలంగాణ బీజేపీ నేతలను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఈలోపే కొండా విశ్వేశ్వర్రెడ్డి ఖండనకు దిగడం గమనార్హం.‘ఏదైనా విషయంపై మిమ్మల్ని కలిస్తే పార్టీ అధ్యక్షుడు రామచందర్రావును కలవమని, ఆయన్ను కలిస్తే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి అభయ్పాటిల్ను కలవమని చెబుతూ నన్ను ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. అందుకే మీకు అదే బహుమానంగా ఇస్తున్నాను.. మంగళవారం కొండా చేసిన వ్యాఖ్యలు..ఇదీ చదవండి: ఎంత బాధ ఉంటే ఆయన అలా చేస్తారు? -
మెదక్ జిల్లాలో కుంభవృష్టి.. బిల్డింగ్ ఎక్కి కాపాడాలంటూ ఆర్తనాదాలు..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా జిల్లాలోని ధూప్సింగ్ తండా జలమయమైంది. తండాను వరద నీరు ముంచెత్తడంతో ఇళ్లలోకి నీరు చేరుకుంది. జల దిగ్భందంలో తండా ఉండటంతో తమ కాపాడాలంటూ స్థానికులు బిల్డింగ్పైకి ఆర్తనాదాలు చేస్తున్నారు. మరోవైపు.. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రాబోయే 2 గంటల్లో 8 జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని తెలిపింది.🚨 EXTREME RAIN ALERT 🚨Kamareddy & Medak hit by 400+ mm rain in 12 hrs. Historic flooding risk ⚠️ More 100+ mm expected.📍 Danger zones: Kamareddy, Medak, Siddipet (next 4 hrs).👉 Stay indoors, avoid travel, follow admin alerts.#Telangana #FloodAlert #BreakingNews #rains pic.twitter.com/cM2UDeLieG— weatherman telugu (@RamRam888943524) August 27, 2025తెలంగాణలోని పలు జిల్లాలో మంగళవారం నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. హైదరాబాద్లోని మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గం, జూబ్లీహిల్స్, అమీర్పేట, నాంపల్లి, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, హయత్నగర్, మేడ్చల్, శామీర్పేట్, నగరంలోని లింగంపల్లి, మియాపూర్, గచ్చిబౌలి, తదితర ప్రాంతాల్లో మంగళవారం రాత్రి నుంచి వర్షం కురుస్తోంది.Telangana should be on High Alert 🚨 Argonda village in Kamareddy district recorded *287.8 mm* of rainfall in just four hours. Several other locations across the districts of Medak, Kamareddy, Siddipet, Sircilla, and Sangareddy also experienced heavy to extremely heavy… pic.twitter.com/Bp0SPfE24L— Naveen Reddy (@navin_ankampali) August 27, 2025ఉమ్మడి మెదక్లో కుండపోత.. మెదక్ జిల్లా టెక్మాల్లో అత్యధికంగా 19.1 సెం.మీ వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్లో 18 సెం.మీ, సంగారెడ్డి జిల్లా నిజాంపేట్లో 16.48 సెం.మీ, యాదాద్రి జిల్లా భువనగిరిలో 14.93 సెం.మీ, మహబూబ్నగర్లోని భూత్పూర్లో 9 సెం.మీ వర్షపాతం నమోదైంది. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, మిరుదొడ్డి, తొగుట, దుబ్బాక, దౌల్తాబాద్లో వర్షం కురుస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. మంజీరా నదికి భారీగా వరద రాబోతుందని అంచనా వేసింది.Flash floods 🌊🚨 in #TelanganaDue to very heavy rains lashed in Medak district more than 250mm rains last 12 hours record floods in Ramayampet 🌊🌊 pic.twitter.com/RPqeECAv3h— Warangal Weatherman (@tharun25_t) August 27, 2025ఉమ్మడి నల్గొండ జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. నల్గొండ, సూర్యాపేట, భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు, రాజపేట, మోటకొండూర్, తుర్కపల్లి, బొమ్మలరామారంలో వర్షం కురుస్తోంది. భువనగిరి మండలం నందనంలో భారీ వర్షం కురిసింది. సింగిరెడ్డిగూడెం రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి వద్ద వర్షపు నీరు నిలిచింది.వికారాబాద్ జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. కోట్పల్లి ప్రాజెక్టు అలుగు పారడంతో భారీగా వరద ప్రవహిస్తోంది. దీంతో చుట్టుపక్కల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లాలో పలుచోట్ల వర్షం కురుస్తోంది. దోమకొండ, బీబీపేట, మాచారెడ్డి, బిక్కనూర్, పాల్వంచ, పిట్లం, నిజాంసాగర్, భిక్కనూరు, లింగంపేటలో వర్షం కురుస్తోంది. ఎల్లారెడ్డి మండలం లక్ష్మాపూర్ వద్ద కల్వర్టు తెగింది. దీంతో రోడ్డు దెబ్బతిని ట్రాఫిక్ స్తంభించిపోయింది.వాతావరణ శాఖ అలర్ట్.. హైదరాబాద్, కామారెడ్డి, మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఇళ్లల్లో సురక్షితంగా ఉండాలని, ముఖ్యంగా పిల్లలు వినాయక మంటపాలకు వెళ్లేటపుడు తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని అధికారులు సూచించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో లైటింగ్ సెట్లు, విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. -
కిషన్రెడ్డికి ఆ అవసరమేంటి?.. రాజాసింగ్ హాట్ కామెంట్స్
తెలంగాణ బీజేపీ నేతలపై గోషామహల్(హైదరాబాద్) ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి హాట్ కామెంట్లు చేశారు. తెలంగాణలో బీజేపీకి బీఆర్ఎస్, కాంగ్రెస్తో పోటీ లేదని.. బీజేపీలో బీజేపీ నేతలతోనే పోటీ నడుస్తోందని, అలాంటి పార్టీని ఇక్కడి నేతలే నట్టేట ముంచుతున్నారని వ్యాఖ్యానించారాయన. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫుట్ బాల్ గిఫ్ట్ ఇవ్వడంపై స్పందిస్తూ రాజాసింగ్ ఓ వీడియో వీడియో విడుదల చేశారు. ఎంత బాధలో ఉంటే కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ అగ్ర నాయకులకు ఫుట్ బాల్ గిఫ్ట్ ఇస్తారు?. ఆయనతోనే కాదు.. గత 11 ఏళ్లుగా నాతో కూడా బీజేపీ నేతలు ఫుట్ బాల్ ఆడుకున్నారు. రానున్న రోజుల్లో మరింత మంది ఎంపీ ఎమ్మెల్యేలు, జిల్లా ముఖ్య నాయకులు ఇదే మాదిరిగా పార్టీ నేతలకు ఫుట్ బాల్ గిఫ్ట్ ఇవ్వడం ఖాయం. కొండా విశ్వేశ్వర్ రెడ్డి మంచి నాయకుడు. భారీ మెజార్టీతో గెలిచిన వ్యక్తి. అటువంటి వ్యక్తి పార్లమెంట్లో మీ వ్యక్తులను పెట్టి ఆయన్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు?. నా అసెంబ్లీ పరిధిలో కూడా కిషన్ రెడ్డి మనుషులను పెట్టీ నన్ను ఇబ్బంది పెట్టారు. వారికి నా ఏరియాలో పెట్టాల్సినటువంటి అవసరం కిషన్ రెడ్డికి ఏముంది?. తెలంగాణలో ఇక్కడున్న నేతలే బీజేపీని ముంచుతున్నారు. దీనిపై బిజెపి జాతీయ నాయకత్వం ఒక్కసారి రివ్యూ చేయాలి. మాకు బిఆర్ఎస్, కాంగ్రెస్ తో పోటీ కాదు. మా నాయకులతో మేమే కొట్లాడాల్సిన పరిస్థితి తెలంగాణ బీజేపీలో ఉంది. .. ఇతర పార్టీల మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలు బీజేపీలో చేరతారని రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అంటున్నారు. ఇది మంచి విషయమే అయినప్పటికీ మరి బీజేపీలో ఉన్నటువంటి కార్యకర్తల పరిస్థితి ఏంటి?. ఇతర పార్టీల నుంచి నాయకులను చేర్చుకోవాల్సిన అవసరం బిజెపికి లేదు. బిజెపిలో ఉన్న కార్యకర్తలకు ఫండ్ ఇచ్చి లోకల్ బాడీ ఎన్నికల్లో గెలిపించుకుని మంచి నాయకులను తయారు చేస్తే సరిపోతుంది కదా!. బిజెపి కార్యకర్తలు నిరంతరం పార్టీ కోసం కష్టపడి లేబర్ గానే బతకాలా? అని రాజాసింగ్ ఆ వీడియోలో చెప్పారు.చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వినూత్న రీతిలో మంగళవారం నిరసనకు దిగారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు, ఆయా జిల్లాల్లోని పార్టీ వ్యవహారాలను పట్టించుకోవడం లేదని కొంతకాలంగా బీజేపీ అధిష్టానంపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. ఈ విషయమై చర్చించేందుకు స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్ రావును కలిశారు. పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారిని కలవమని కొండాకు రాంచందర్ రావు సూచించారు. ఆయన్ను కలిస్తే రాష్ట్ర ఇన్ చార్జ్ అభయ్ పటేల్ను కలవాలని సూచించినట్టు తెలిసింది. అభయ్పటేల్ను కలిస్తే ఆయన మళ్లీ రాంచందర్ రావు, తివారిని కలవాలని చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలోనే మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసుకు వచ్చి తివారికి ఫుట్ బాల్ ఇచ్చి నిరసన తెలిపారని చర్చ నడిచింది. -
ఖైరతాబాద్ గణపతి తొలి పూజలో పాల్గొన్న గవర్నర్
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ విశ్వశాంతి మహాశక్తి గణపతికి తొలిపూజ జరిగింది. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తొలిపూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ బడా గణపతి వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. లక్షల మంది గణపయ్యను చూడటానికి వస్తుంటారు కాబట్టి ప్రభుత్వం అన్ని భద్రతాపరమైన ఏర్పాట్లు చేసింది. ఇక, ఖైరతాబాద్ బడా గణేశుడు 69 అడుగులు 28 వెడల్పుతో భక్తులను ఆశీర్వదించునున్నాడు. -
తెలంగాణలో భారీ వర్షాలు.. సీఎం కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. వినాయక చవితి సందర్భంగా.. ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.తెలంగాణలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పురాతన ఇళ్లల్లో ఉన్నవారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, హైదరాబాద్లో హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, పోలీసు సిబ్బంది సమన్వయం చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే, నదులు, వాగులపై ఉన్న లోతట్టు కాజ్వేలు, కల్వర్టులపై నుంచి నీటి ప్రవాహాలు ఉంటే అక్కడ రాకపోకలు నిషేధించాలని సీఎం ఆదేశించారు.HYDERABAD UPDATE 🌧️ | 27 AUG, 8 AM🔔 NON-STOP MODERATE RAINS to continue across HYDERABAD City for the NEXT 3 HOURS ⚠️⚠️⚠️🌧️ Strong rain bands are moving straight from Medak towards Hyderabad.📍 Kamareddy & Medak will continue to witness HEAVY DOWNPOURS.➡️ Thankfully, the… pic.twitter.com/6RerpSc2OT— Hyderabad Rains (@Hyderabadrains) August 27, 2025వినాయక చవతి ఉత్సవాలు మొదలైన నేపథ్యంలో వినాయక మండపాల సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లతో భక్తులకు ప్రమాదం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాన్స్ కో సిబ్బందిని ఆదేశించారు. మరోవైపు.. చెరువులు, కుంటలకు గండి పడే ప్రమాదం ఉన్నందున నీటి పారుదల శాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున సిబ్బంది అప్రమత్తంగా ఉండి నిల్వ నీటిని తొలగించడంతో పాటు ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని, వైద్యారోగ్య శాఖ సిబ్బంది ఆసుపత్రుల్లో సరిపడా మందులు అందుబాటులో ఉంచుకోవాలని, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. -
ఒక్క తెలంగాణలోనే ఎస్ఐఆర్ ఎందుకు?
బీహార్లో మాదిరిగా తెలంగాణలోనూ ఓటరు జాబితాపై స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) జరుగుతుందన్న కేంద్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత జి.కిషన్ రెడ్డి ప్రకటన కీలకమైందే. రాజధాని హైదరాబాద్లోనే మూడు నుంచి నాలుగు లక్షల డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని, సవరించేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తోందని ఆయన తెలిపారు. తద్వారా ఎన్నికల వ్యవస్థలో ఉన్న అవ్యవస్థను ఆయన అంగీకరించినట్లయింది. బీహారులో ఎస్.ఐ.ఆర్ పేరుతో సుమారు 65 లక్షల ఓట్లు తొలగించడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆధార్ కార్డును పరిగణనలోకి తీసుకోకుండా ఓట్లను మాయం చేశారన్నది విపక్షం ఆరోపణ. తమకు అనుకూలంగా ఉన్న వారి ఓట్లను తొలగించారని ఆర్జేడీ, కాంగ్రెస్లు ఆరోపిస్తూంటే... ఇతరదేశాల వారు అక్రమంగా ఓటర్ల జాబితాలోకి చేరి ఎన్నికలను ప్రభావితం చేస్తున్నారని బీజేపీ, మిత్రపక్షాలు అంటున్నాయి. నిజానికి ఈ రెండింటిలో ఏది జరిగినా అది ప్రజాస్వామ్య బలహీనతలకు ఉదాహరణలవుతాయి. ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ ఓట్చోరీపై మీడియా సమావేశంలో వెల్లడించింది మొదలు దేశంలో రాజకీయంగా వేడి పుంజుకుంది. ఓటర్ల జాబితాలోని లోపాలను ప్రజలకు ఎత్తి చూపే లక్ష్యంతో రాహుల్ బీహార్లో ఓట్ అధికార్ యాత్ర కూడా చేస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఓట్ల నమోదులో జరిగిన పలు అక్రమాలను వెలుగులోకి తీసుకు వచ్చారు. మహారాష్ట్రలో ఎన్నికలకు ముందు దాదాపు కోటి ఓట్లు అదనంగా చేర్చారని, అవన్ని బోగస్ ఓట్లని ఆయన ఆరోపించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులోఇన మహదేవపుర అసెంబ్లీ నియోజజకవర్గాన్ని నమూనాగా తీసుకుని ఆయన అక్కడ ఏ రకంగా లక్షకుపైగా ఓట్లను చేర్చింది సోదాహరణంగా వివరించారు. ఈ బోగస్ ఓట్లతోనే బీజేపీ, మహారాష్ట్ర అసెంబ్లీ, కర్ణాటక లోక్సభ ఎన్నికల్లో అధిక సీట్లు సాధించగలిగిందని రాహుల్ ఆరోపించారు. రాహుల్ విమర్శలకు ఎన్నికల సంఘం నేరుగా జవాబు ఇవ్వలేకపోయిందనే చెప్పాలి. అదే టైమ్లో బీహారులో తొలగించిన ఓట్లపై సుప్రీంకోర్టులో కూడా విచారణ జరిగింది. ప్రత్యేక విస్తృత ఓట్ల రివిజన్ను ఆమోదిస్తూనే సుప్రీంకోర్టు ఆధార్ కార్డును కూడా ఓటు నమోదుకు పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించింది. ఆయా రాజకీయ పక్షాల వారు ఎవరైతే ఓటు హక్కు కోల్పోయారని చెబుతున్నారో వారితో మళ్లీ దరఖాస్తు చేయించుకోవాలని సలహ ఇచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా ఓట్ల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుందని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇది రాజకీయ వివాదం అయ్యే అవకాశం ఉంది. ప్రత్యేకించి కాంగ్రెస్, ఎంఐఎంలు దీనిని వ్యతిరేకించవచ్చు. అయితే.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కనుక ఈ రివిజన్ జరుగుతున్న సమయంలో అప్రమత్తంగా ఉండే అవకాశం కూడా లేకపోలేదు. బీజేపీ సహజంగా ఎంఐఎం ఓట్లపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. పాతబస్తీలో పలు చోట్ల డబుల్ ఓట్లు ఉన్నాయని బీజేపీ ఆరోపిస్తుంటుంది. అందులో కొంత నిజం ఉండవచ్చు కూడా. పాతబస్తీలో అధికారులు ఏ మార్పు తీసుకు వచ్చినా చాలా ఇబ్బంది పడుతుంటారు. ఉదాహరణకు గతంలో అక్కడ విద్యుత్ బిల్లులు చెల్లించని వారి ఇళ్ల విద్యుత్ కనెక్షన్లు తొలగించాలని ప్రయత్నిస్తే పెద్ద ఆందోళన వచ్చింది. స్థానికులు కొందరు అధికారులపై తిరగబడ్డారు. ఓట్ల విషయానికి వస్తే బంగ్లాదేశ్ నుంచి వచ్చి అక్రమంగా స్థిరపడ్డ రోహింగ్యాల వంటివారు, పాకిస్తాన్ చెందినవారు కూడా పాతబస్తీలో అధికంగా ఉన్నారని, వారికి కూడా ఓట్లు ఉన్నాయని,వాటిని తొలగించాలని బీజేపీ చెబుతుంటుంది. నిజంగానే ఇతర దేశాలకు చెందినవారు కాని, అనర్హులైనవారు కాని ఓటర్ల జాబితాలో ఉంటే ఆ పేర్లను తొలగించడం తప్పు కాదు. కానీ ఆ ముసుగులో బీజేపీకి ఓటు వేయరన్న అనుమానం ఉన్న అర్హులైన ఓటర్లను కూడా తొలగిస్తే తప్పు అవుతుంది. తెలంగాణలో శాసనసభ ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ల గడువు ఉంది. ఇప్పుడు ఓట్ల రివిజన్ జరిగినా పెద్ద ఇబ్బంది ఉండదు. ఎందుకంటే రాజకీయ పార్టీలు దీనిపై దృష్టి పెట్టి అర్హులైన వారు ఎవరైనా ఓటు కోల్పోతే మళ్లీ చేర్చవచ్చు. బీజేపీ మతపరమైన విమర్శలను చేస్తుంటుంది. ఆ ప్రాతిపదికన ఓట్లు తొలగిస్తుందేమో అన్న భయం ఇతర పార్టీలకు ఉంది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది కనుక, కింది స్థాయి అధికారులు వారి అదీనంలో ఉంటారు కనుక అలా ఇష్టం వచ్చినట్లు ఓట్లు తీసివేయడమో, చేర్చడమో జరుగుతుంటే పట్టుకోవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా ఓట్ల జాబితాను తమకు అనకూలంగా ఉండే విధంగా మార్చే ప్రయత్నిస్తే అది మరో వివాదం అవుతుంది. ఎన్నికల సంఘం నిజంగా ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయదలిస్తే ముందుగా కొన్ని చర్యలు తీసుకోవాలి. ప్రజలలో, ప్రతిపక్ష పార్టీలలో ఉన్న అనుమానాలు తీర్చాలి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో గత శాసనసభ ఎన్నికలలో పోలింగ్ నాటికన్నా కౌంటింగ్ నాడు సుమారు 49 లక్షల ఓట్లు అధికంగా లెక్కించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈవీఎంలపై అనుమానాలు చెలరేగాయి. కొందరు హైకోర్టుకు వెళ్లినా తేలలేదు. రాజకీయంగా కూడా ఫిర్యాదు చేసిన ఒక మాజీమంత్రిని దానిపై మరింత గొడవ చేయకుండా మేనేజ్ చేశారన్న అభియోగమూ లేకపోలేదు. వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో ఒక బృందం ఇందుకు సంబంధించిన ఆధారాలతో సహా వినతిపత్రం సమర్పించింది. కౌంటింగ్ నాడు అసంబధ్దంగా పెరిగిన 12.5 శాతం ఓట్ల ప్రభావం 88 నియోజకవర్గాలపై ఉందని వారు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్, కేంద్ర ప్రభుత్వానికి కాని ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా, ఆయా రాష్ట్రాలలో ఇలాంటి ఆరోపణలపై స్పందించాలి. అందులో నిజం లేదని బహిరంగంగా రుజువు చేయాలి. ఈవీఎంలపై నిర్దిష్ట అనుమానాలు వచ్చాయి. ఈవీఎంలు, వీవీప్యాట్ స్లిప్పులను పోల్చి లెక్కించడం, బ్యాటరీ ఛార్జ్లో అనుమానాలు రావడం, సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు అధిక పోలింగ్ జరిగిందన్నట్లుగా లెక్కలు రావడం, దానికి సంబంధించిన సీసీ ఫుటేజీ ఇవ్వడానికి నిరాకరించడం, వీవీప్యాట్ స్లిప్పులను పది రోజుల్లోనే దగ్దం చేయడం వంటివి ఎన్నికల కమిషన్ నిజాయితీని శంకించేవిగా ఉన్నాయి. ఏపీ, తెలంగాణల్లో దొంగ ఓట్లు చేర్చడం అన్నది కొత్త కాదు. లక్షల మంది హైదరాబాద్లో నివసిస్తూ ఏపీలో ఓటు హక్కు కలిగి ఉంటున్నారు. వారికి తెలంగాణలో కూడా ఓట్లు ఉంటున్నాయి. ఎన్నికల రోజున వందల బస్సుల్లో, వేల కార్లలో హైదరాబాద్ నుంచి ఏపీకి బయల్దేరి వెళ్లడం ఇందుకు నిదర్శనం. అనేక జిల్లాలు, రాష్ట్రాలలో డబుల్ ఓట్ల సమస్య ఉంది. దీనికి శాశ్వత పరిష్కారం వెతక్కుండా ఎన్నికల కమిషన్ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలకు అనుగుణంగా వ్యవహరించడం పెద్ద సమస్యగా ఉంది. వారు కోరిన విధంగా ఎన్నికల సమయాల్లో పోలీసు అధికారులను బదిలీ చేయడం, కావల్సిన వారిని నియమించుకోవడం వంటివి కూడా జరిగాయి. ఇలాంటివాటి వల్ల ఎన్నికల కమిషన్ విశ్వసనీయత దెబ్బతింటోంది. ఒక్క తెలంగాణలో మాత్రమే స్పెషల్ రివిజన్ ఎందుకు చేయాలని తలపెట్టారో కిషన్ రెడ్డి చెప్పాలి. ఏపీ, ఒడిశా, మహారాష్ట్ర, హర్యానా వంటి రాష్ట్రాలలో కూడా చేస్తారా? అదనంగా చేరాయన్న దొంగ ఓట్లను తొలగిస్తారా? లేదా? లేక తమకు అనుకూలంగా లేని ఓటర్లను జాబితా నుంచి తొలగించడానికి ఈ రివిజన్ను వాడుతారా? ఏపీలో తెలుగుదేశం పార్టీకి ఈ ఓటర్ల జాబితాలను తమకు అనుకూలంగా మలచుకోవడంలో చాలా అనుభవం ఉందని ప్రత్యర్ధి రాజకీయ పార్టీలు చెబుతుంటాయి. పశ్చిమ బెంగాల్లో బంగ్లా దేశీయులు అనేక మంది ఓటర్ల జాబితాలో చేరారని ఆ రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ ఆరోపిస్తుంటుంది. ఏ రాజకీయ పార్టీ ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా, దొంగ ఓట్లను చేర్చకుండా, లేదా అసలైన ఓటర్లను తొలగించకుండా ఏమి చేయాలన్న దానిపై ఎన్నికల సంఘం నిర్దిష్ట ప్రతిపాదనలు చేయాలి. ఆధార్ కార్డును విదేశీయులకు జారీ చేశారన్న ఆరోపణలను ఎన్నికల సంఘం చేస్తోంది. అంటే మన దేశంలో ఒక వ్యవస్థకు, మరో వ్యవస్థకు సమన్వయం కొరవడుతోందన్నమాట. అమెరికా వంటి దేశాలలో కాన్పు జరిగి పుట్టిన రోజునే గుర్తింపు కార్డు ఇచ్చే సిస్టమ్ ఉంటుంది. మన దేశంలో కూడా అలాంటి పద్దతి వస్తే మంచిది. పుట్టిన రోజు సర్టిఫికెట్ ఆధారంగా వారికి నిర్ణీత ఏజ్ వచ్చాక ఆటోమాటిక్గా ఓటింగ్ హక్కు ఇచ్చే విధంగా సాఫ్ట్వేర్ సిద్ధం చేసుకోవడం వంటివి చేయవచ్చేమో పరిశీలించాలి. ఓటర్ల జాబితాలలో అక్రమాలు నిజంగా ఎక్కడ జరిగినా తప్పే.వీటన్నిటిని అరికట్టడానికి ఒక స్పష్టమైన విదానాన్ని రూపొందించనంత కాలం ఓటర్ల జాబితాపై ఆరోపణలు వస్తూనే ఉంటాయి. మరి దీనికి పరిష్కారం ఎప్పటికి వస్తుందో!::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
Hyderabad: కారు పార్కింగ్ కోసం 20 ఏళ్ల పోరాటం
సిటీ కోర్టులు : ఓ వ్యక్తి 20 ఏళ్లుగా కారు పార్కింగ్ కోసం కోర్టులో పోరాటం చేసి విజయం సాధించాడు. దీంతో బాధితుడికి ప్రతివాది కారు పార్కింగ్కు బదులు రూ.10 లక్షలు చెల్లించాడు. జాతీయ స్థాయిలో కూడా పిటిషనర్కు అనుకూలంగా తీర్పు రావడంతో ఇటీవల రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం పిటిషన్ను ముగించింది. వివరాల్లోకి వెళితే.. కే.శివరావు అనే వ్యక్తి ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. 2008లో కారు పార్కింగ్ విషయమై కేసు దాఖలు చేసిన అతను 20 ఏళ్ల తర్వాత విజయాన్ని సాధించాడు. 2006లో శివరావు మలేషియన్ టౌన్షిప్, రెయిన్ ట్రీ పార్క్ , ఏ బ్లాక్ లో ప్లాటు కొనుగోలు చేశాడు. కారు పార్కింగ్ కోసం డబ్బులు విడిగా చెల్లించినా అతడికి పైపులు లీకయ్యే చోట ఇరుకు, అసౌకర్యమైన పార్కింగ్ను కేటాయించారు. తన పార్కింగ్ను మార్చాలని పలుమార్లు నిర్వాహకులను కోరినా పట్టించుకోలేదు. దీంతో ప్రతివాది ఏపీహెచ్ బీ. ఐజేఎమ్ టూ జాయింట్ వెంచర్ అయిన సిట్కో ప్రైవేట్ లిమిటెడ్ పై 2008 లో రంగారెడ్జి వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు దాఖలు చేశాడు. జిల్లా కమిషన్ 2011 ఏప్రిల్ 21న ఫిర్యాది కి అనుకూలంగా తీర్పు చెప్పింది. ప్రతివాది రాష్ట్ర కమిషన్లో అప్పీలు చేయగా 2013 అక్టోబర్ 11న రూ.10 వేల జరిమానా విధిస్తూ అప్పీలు కొట్టివేయడంతో సిట్కో జాతీయ వినియోగదారుల కమిషన్ లో రివిజన్ పిటీషన్ దాఖలు చేసింది. అక్కడ కూడా 2020 అక్టోబర్ 27 న శివరావు స్వయంగా వాదించి విజయం సాధించాడు. స్టేట్ కమిషన్ తీర్పు తర్వాత 2014 తీర్పు అమలు పిటీషన్ వేసినా రివిజన్ పిటీషన్ మూలంగా అమలు వాయిదా పడుతూ వచి్చంది. ఈ పిటీషన్ కూడా 11 ఏళ్లు నడిచి ఆగసుŠట్ 11న ముగిసింది. కారు పార్కింగ్ కేటాయించే అవకాశం లేనందున ప్రత్యామ్నాయ పరిష్కార మార్గం గా రూ.10 లక్షలు చెల్లించేందుకు అంగీకరిస్తూ ప్రతివాది ఆ డబ్బు శివరావు ఖాతాలో జమ చేయడంతో రంగారెడ్డి కమిషన్ ప్రెసిడెంట్ లతాకుమారి, సభ్యుడు జవహర్ బాబు తీర్పు అమలు కావడంతో పిటీషన్ను ముగించారు. న్యాయస్థానాలపై నమ్మకమే గెలిపించింది.. –కే.శివరావు న్యాయస్థానాలపై నమ్మకంతోనే నేను ఇంత వరకు పోరాడి విజయం సాధించగలిగాను. నా నమ్మకం వృథా కాలేదు. నాకు జరిగినా అన్యాయానికి ఎప్పటికైనా న్యాయం దక్కుతుందని ఈ 20 ఏళ్లుగా ఒంటరిగా పోరాటం చేశాను. జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి కోర్టు వరకు పోరాడ గలిగాను అంటే అది కేవలం న్యాయ స్థానాలు బాధితుల పట్ల తీసుకునే ప్రత్యేక శ్రద్ధ అని నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. న్యాయస్థానాలకు ప్రత్యేక కృతజ్ఞతలు. -
ఖైరతాబాద్ గణపయ్య సిద్దం..
సాక్షి, హైదరాబాద్: నేడు వినాయక చవితి. విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో పూజలు అందుకోవడానికి ఖైరతాబాద్ వినాయకుడు సిద్ధమయ్యాడు. నేటి వినాయక చవితి ఉత్సవాలు మొదలుకానున్నాయి. సర్వాంగ సుందరంగా మహాగణపతి దర్శనమిస్తున్నాడు. ఇప్పటికే ఖైరతాబాద్ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతోంది. కొందరు భక్తులు బడా గణేశ్ వద్ద సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు. ఈ ఏడాది 69 అడుగుల ఎత్తు, 28 ఆడుగుల వెడల్పుతో శాంతమూర్తిగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రిశక్తి సమేతుడిగా గణనాథుడు రూపుదిద్దుకుంటున్నాడు. గణపయ్యకు ఇరువైపులా పూరి జగన్నాథుడు సుభద్ర, బలరాముడి సహా లక్ష్మీ సమేత హయగ్రీవస్వామి, ఖైరతాబాద్ గ్రామదేవతగా పిలువబడే గజ్జెలమ్మ అమ్మవారిని తీర్చిదిద్దుతున్నారు.ఖైరతాబాద్ గణేశునికి 71 ఏళ్ల చరిత్ర ఉంది. వినాయక చవితి రోజున ఉదయం 6 గంటలకు తొలి పూజ ఉంటుంది. ఆ తర్వాత 10 గంటలకు కలశ పూజ, ప్రాణ ప్రతిష్ట చేస్తారు. ప్రాణ ప్రతిష్టకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ దిష్ణు దేవ్ వర్మ హాజరు కానున్నారు. 20 మంది సిద్ధాంతిలు కలశపూజ, ప్రాణప్రతిష్ఠ నిర్వహిస్తారు. 1954లో ఒక అడుగుతో మొదలైన ఖైరతాబాద్ వినాయకుడి ప్రస్థానం.. 60 ఏళ్ల పాటు ప్రతి ఏటా ఒక్కో అడుగు పెరుగుతూ.. ఆపై 2014 నుంచి ప్రతియేటా ఒక్కో అడుగు తగ్గిస్తూ వచ్చారు.ఇక, గణపతికి తొమ్మిది రోజులు తొమ్మిది రకాల హోమాలు చేస్తారు.. అదేవిధంగా కాశీ నుంచి లక్ష రుద్రాక్షలు తీసుకువచ్చి గణపతి మెడలో వేస్తారు. వినాయకుడి కళ్యాణంతో పాటు పదవి విరమణ చేసిన ప్రభుత్వ పురోహితులచే లక్ష వినాయక నామార్చన చేయనున్నారు. ఖైరతాబాద్ గణేషుడికి 60 అడుగుల భారీ చేనేత నూలు కండువా, 60 అడుగుల గాయత్రి యజ్ఞోపవీతాన్ని చేనేత కార్మికులు ప్రత్యేకంగా తయారు చేయించి సమర్పిస్తారు.మహా గణపతి వద్ద పోలీసులు భారీ బందోబస్తుతో భారీ కేడ్లు ఏర్పాటు చేశారు. 600 మంది పోలీసులతో పాటు, 60 సీసీ కెమెరాలతో భద్రతా పర్యవేక్షణ చేయనున్నారు. 100 మంది ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది, అంబులెన్సులు కూడా సిద్ధం చేశారు. సెప్టెంబర్ 6 సాయంత్రం వరకు ప్రతిరోజూ ఉదయం 6 నుండి రాత్రి 11 గంటల వరకు భక్తులు దర్శనం చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భక్తుల రద్దీని బట్టి ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని ట్రాఫిక్ అధికారులు అంటున్నారు. -
రింగ్ రైలు @ రూ. 28 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డును ఆనుకొని నిర్మించాలని భావిస్తున్న ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా పెరిగింది. తొలుత రూ. 12,408 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసిన రైల్వేశాఖ తాజాగా దాన్ని రూ. 28 వేల కోట్లకుపైగా ఖర్చవుతుందని అంచనా వేస్తూ కొత్త నివేదికను సిద్ధం చేసింది. ఇందుకోసం కొత్తగా 60 మీటర్ల వెడల్పుతో 3,600 హెక్టార్ల భూసేకరణ చేపట్టాల్సి ఉంటుందని ప్రతిపాదించింది. రింగు రోడ్డు కంటే మీటరున్నర ఎత్తుతో నిర్మాణం... రీజినల్ రింగురోడ్డును 5 మీటర్ల ఎత్తుతో నిర్మించనుండగా దానికి బయటి వైపు ఔటర్ రింగురైలును మరో మీటరున్నర ఎత్తుతో నిర్మించనున్నారు. అంటే భూమి నుంచి ఆరున్నర మీటర్ల ఎత్తుతో రైల్వే లైన్ నిర్మిస్తారన్నమాట. ఒకేసారి రెండు లైన్ల నిర్మాణం చేపడతారు. భవిష్యత్తులో అవసరమైతే లైన్ల సంఖ్య పెంచేలా కొంత భూమిని వదలాలని భావిస్తున్నారు. ఇందుకోసం 60 మీటర్ల వెడల్పుతో అలైన్మెంట్ను సిద్ధం చేయనున్నారు. ఇంత ఎత్తుతో కట్ట నిర్మించాలంటే పైనుంచి భూమి వైపు వచ్చేకొద్దీ అది వాలుగా ఉంటుంది. అంటే పైన ట్రాక్ నిర్మించే భాగం కంటే, కింద భూమి వద్ద అలైన్మెంట్ పరిధి 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. రెండు లైన్ల ట్రాక్ నిర్మాణానికి 15 మీటర్ల స్థలం అవసరం. దాని వాలుతో కలుపుకొంటే 45 మీటర్ల భూమిని సేకరించాల్సి ఉంటుంది. భవిష్యత్తులో అదనంగా మరో లైన్ నిర్మించేంత స్థలం కావాలంటే 60 మీటర్ల వెడల్పుతో స్థలాన్ని సేకరించాలని భావిస్తున్నారు. ఇంటర్ ఛేంజ్ లైన్లుగా రైల్ వంతెనలు... ఔటర్ రింగు రైలు ఆరు ప్రాంతాల్లో వివిధ మార్గాల నుంచి వచ్చే రైల్వే లైన్లను క్రాస్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆరు చోట్ల రైల్ ఓవర్ రైల్ వంతెనలు నిర్మించాలని నిర్ణయించారు. ఈ వంతెనలు ఇంటర్ ఛేంజ్ లైన్లుగా ఉంటాయి. అంటే ఆ ఆరు లైన్ల నుంచి ఔటర్ రింగ్ రైలు అనుసంధానం అవుతుంది. అటూఇటూ రైళ్లు మారేలా ఉంటాయి. అందుకోసం క్రాసింగ్కు ఐదు కి.మీ. దూరం నుంచి మెట్రో రైలు తరహాలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు. అలాగే 26 నుంచి 30 కొత్త స్టేషన్లను కూడా నిర్మించాల్సి ఉంది. రింగురోడ్డు ఉన్నందున స్టేషన్ భవనాలను కూడా మెట్రో రైలు తరహాలోనే నిర్మించాల్సి ఉంటుందని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన డిజైన్లు త్వరలో సిద్ధం చేయనున్నారు. రోజువారీ ప్రయాణికుల సంఖ్య 9 లక్షలకు పెరిగే అవకాశం ప్రస్తుతం హైదరాబాద్–ఇతర ప్రాంతాల మధ్య నిత్యం రైళ్ల ద్వారా 4 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఔటర రింగ్ రైల్ అందుబాటులోకి వచ్చిన ఐదారేళ్లలో ఆ సంఖ్య 9 లక్షలకు చేరుతుందని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. అదనపు రూట్ అందుబాటులోకి రావడం, పరస్పర లైన్ల అనుసంధానం వల్ల రైళ్ల సంఖ్య కూడా భారీగా పెరగనుంది. ప్రస్తుతం హైదరాబాద్ మీదుగా నిత్యం 130 సరుకు రవాణా రైళ్లు తిరుగుతుండగా ఔటర్ రింగ్ రైలు వచ్చాక ఐదారేళ్ల కాలంలో ఆ సంఖ్య 250కి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. -
సాదా బైనామాకు లైన్క్లియర్..
సాక్షి, హైదరాబాద్: సాదా బైనామాలకు ఎట్టకేలకు లైన్క్లియర్ అయింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసి క్రమబద్ధీకరణకు అనుమతిచ్చింది. సాదా బైనామాల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం 2020, అక్టోబర్ 12న జారీ చేసిన జీఓ నంబర్ 112ను సవాల్ చేస్తూ నిర్మల్ జిల్లా లింబా కె.కుంటాలకు చెందిన షిండే దేవిదాస్ హైకోర్టులో అదే ఏడాది ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. విచారణ చేపట్టిన సీజే ధర్మాసనం సాదా బైనామాల క్రమబద్ధీకరణ ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత అందిన దరఖాస్తులు పరిశీలించవద్దని ప్రభుత్వాన్ని 2020లోనే ఆదేశించింది. కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత పాత చట్టం ప్రకారం క్రమబద్ధీకరణ చేయడాన్ని తప్పుబట్టింది. కొత్త చట్టం రాక ముందు (2020, అక్టోబర్ 29) వరకు 2,26,693 దరఖాస్తులు వచ్చాయని, ఆ తర్వాత 6,74,201 దరఖాస్తులు వచ్చాయని ప్రభుత్వం కోర్టుకు తెలపగా, గడువుకు ముందు వచ్చిన దరఖాస్తులపై నిర్ణయం కూడా తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. సన్న, చిన్నకారు రైతులకు ప్రయోజనం.. ఈ పిల్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఏ.సుదర్శన్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం విధించిన గడువులోగా 9.24 లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. రాష్ట్రంలో తెలంగాణ భూ భారతి (భూమిపై హక్కుల రికార్డు) చట్టం 2025 అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పిల్ చెల్లదని వాదించారు. ఈ చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం 2014, జూన్ 2 ముందు 12 ఏళ్లపాటు భూమి తమ అ«దీనంలో ఉన్నట్లు చూపిన సన్నకారు రైతులకు క్రమబద్దీకరణకు అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు. 2020, అక్టోబర్ 12 నుంచి 2020 నవంబర్ 10 వరకు తెలంగాణ భూమి హక్కులు, పట్టాదార్ పాస్ బుక్స్ చట్టం–1971 ప్రకారం దరఖాస్తు చేసుకున్న వారికి క్రమబద్దీకరించుకోవడానికి అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు కొత్త చట్టం వచ్చినందున 2020లో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు రద్దు చేయాలని కోరారు. స్టే ఎత్తివేస్తే 6,74,201 దరఖాస్తుల క్రమబద్దీకరణకు ప్రభుత్వం ప్రక్రియ ప్రారంభిస్తుందని విన్నవించారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది జె.ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ.. పాత చట్టానికి బదులుగా కొత్త చట్టంలోని నిబంధనను సవాల్ చేస్తూ సవరణ పిటిషన్ దాఖలు చేశామని, వాదనలకు అనుమతించాలని కోరారు. ఈ విజ్ఞప్తిని సీజే తోసిపుచ్చారు. కొత్త చట్టాన్ని సవాల్ చేస్తూ మరో పిటిషన్ వేసుకోవాలని, అలాగే పలుమార్లు వాయిదా కోరడం సరికాదని సూచించారు. కొత్త చట్టం వచ్చిన తర్వాత కూడా పాత దరఖాస్తులనే అనుమతిస్తున్నారని, కొత్త వాటిని స్వీకరించడం లేదని.. ఇది వివక్షేనని ప్రభాకర్ పేర్కొన్నారు. దీనికి అంగీకరించని సీజే.. కొత్త చట్టంతో సన్న, చిన్నకారు రైతులు సాదా బైనామాలను క్రమబదీ్ధకరించుకనే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో 2020లో ఇచ్చిన స్టేను ఎత్తివేస్తున్నామని ప్రకటించారు. -
సెప్టెంబర్ 2న ఓటర్ల తుది జాబితాల ప్రచురణ
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి...రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) సన్నాహాలు వేగవంతం చేసింది. ఎన్నికలకు సన్నద్ధం కావడంలో భాగంగా పంచాయతీల్లో ఓటరు జాబితా సవరణకు షెడ్యూల్ను విడుదల చేసింది. ఇందుకు అనుగుణంగా జాబితాలను సిద్ధం చేయాలని జిల్లా పంచాయతీ అధికారులను (డీపీవో) ఆదేశిస్తూ మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ.రాణీకుముదిని నోటిఫికేషన్ జారీచేశారు.2025 జూలై 1న అందుబాటులోకి వచ్చిన అసెంబ్లీ నియోజకవర్గాల ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాలను తు.చ. తప్పకుండా అనుసరిస్తూ వార్డుల విభజన చేస్తూ తామిచ్చిన షెడ్యూల్ను అనుసరించాలని స్పష్టం చేశారు. డీపీవోలతో పాటు అదనపు జిల్లా ఎన్నికల అధికారులు, ఎంపీడీవోలు, సహాయ జిల్లా ఎన్నికల అధికారులు, సీఈవోలు, అదనపు జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లకు (హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలు మినహా), పీఆర్ ఆర్డీ డైరెక్టర్, పంచాయతీరాజ్శాఖ ముఖ్యకార్యదర్శికి దీని ప్రతులను పంపించారు.ఎస్ఈసీ జారీచేసిన షెడ్యూల్...⇒ గురువారం (ఆగస్ట్ 28న) గ్రామపంచాయతీలు, వార్డుల వారీగా ముసాయిదా ఫొటో ఓటర్ల జాబితాను రూపొందించి గ్రామపంచాయతీలు, మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో ప్రదర్శించాలి. ⇒ శుక్రవారం (29న) జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీలప్రతినిధులతో జిల్లా ఎన్నికల అధికారుల (జిల్లా కలెక్టర్లు) సమావేశం ⇒ శనివారం (30న) మండల స్థాయిలో సంబంధిత ఎంపీడీవోల ఆధ్వర్యంలో రాజకీయ పారీ్టల ప్రతినిధుల సమావేశం ⇒ గురువారం నుంచి శనివారం దాకా (28 నుంచి 30వ తేదీ వరకు) గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల రీఅరేంజ్మెంట్కు (వార్డుల వారీగా గ్రామపంచాయతీ ఓటర్ల జాబితా) సంబంధించి అభ్యంతరాల స్వీకరణ ⇒ ఆదివారం (31న) ఈ అభ్యంతరాలపై డీపీవోల ద్వారా పరిష్కారం ⇒ సెప్టెంబర్ 2న గ్రామపంచాయతీల్లో వార్డుల వారీగా ఫొటోలతో కూడిన ఓటర్ల తుది జాబితాలను డీపీవోల ద్వారా ప్రచురణ. -
30 నుంచి అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 30 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. శాసనసభతో పాటు మండలి సమావేశాలు సైతం జరగనుండగా, ఎన్నిరోజులు సమావేశాలు నిర్వహించాలనే దానిపై బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ సమర్వించిన విచారణ నివేదికపై సభలో చర్చించే అవకాశం ఉంది.కాగా అదేరోజు రాష్ట్ర మంత్రివర్గం కూడా సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం ఒంటి గంటకు కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడంలో ఎదురవుతున్న ఆటంకాలు, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తదితర అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనపై ప్రత్యేక దృష్టి ఒకవైపు సెపె్టంబర్ 30 లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు విధించిన గడువు సమీపిస్తోంది. మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ రాష్ట్ర శాసనసభలో ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా రాష్ట్రపతి పరిశీలన కోసం పంపించారు.బీసీ రిజర్వేషన్లకు సంబంధించి మరో ప్రయత్నంగా ఆర్డినెన్స్లను రూపొందించి పంపగా వాటిని సైతం గవర్నర్ రాష్ట్రపతికి సిఫారసు చేయడంతో ప్రభుత్వం తీవ్ర ఇరకాటంలో పడింది. ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల నిర్వహణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తదితర అంశాలపై కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనుంది. కాళేశ్వరం కమిషన్ నివేదిక, యూరియా కొరత తదితరాలపై.. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ సమర్వించిన విచారణ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి చర్చించాలని భావిస్తున్న నేపథ్యంలో.. దీనిపై సైతం మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోనుంది. అలాగే రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరత, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ గృహాల నిర్మాణం, ఉద్యోగుల సమస్యలు, ఉద్యోగ నియామకాలు తదితర అంశాలను కూడా మంత్రివర్గం పరిశీలించే అవకాశం ఉంది. -
‘క్లినిక్’లతో లక్షలాది ఆర్మీ కుటుంబాలకు లబ్ధి
సాక్షి, హైదరాబాద్: ఉచిత న్యాయ సేవల క్లినిక్తో దేశవ్యాప్తంగా లక్షలాది ఆర్మీ కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని టీఎస్ఎల్ఎస్ఏ పాట్రన్ ఇన్ చీఫ్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్ అన్నారు. సైనికులపట్ల న్యాయవ్యవస్థకు ఉన్న నిబద్ధతకు ఈ క్లినిక్లు నిదర్శనమని చెప్పారు. వీర పరివార్ సహాయత యోజన–2025 కింద దేశవ్యాప్తంగా ఉచిత న్యాయ సేవల క్లినిక్ల ద్వారా సేవలు అందించాలని నేషనల్ లీగల్ సర్విసెస్ అథారిటీ (నల్సా) నిర్ణయించిన విషయం తెలిసిందే.ఇందులో భాగంగా హైకోర్టు ఆవరణలోని లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆన్లైన్ ద్వారా 8 జిల్లాల్లో క్లినిక్లను టీఎస్ఎల్ఎస్ఏ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ పి.శామ్ కోషితో కలసి సీజే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని సాయుధ దళాల సభ్యులు, వారి కుటుంబాలకు న్యాయ సాయం అందించడంలో ఇదో కీలక ముందడుగు అన్నారు. గతంలో ఏర్పాటు చేసిన రెండు క్లినిక్లతో కలిపి ఉమ్మడి జిల్లాలవారీగా కేంద్రాలు ఏర్పాటయ్యాయని.. మిగిలిన జిల్లాలకు కూడాక్లినిక్లను విస్తరిస్తామని చెప్పారు. న్యాయ సాయంతోపాటు న్యాయ సూచనలు కూడా ఈ క్లినిక్లలో అందిస్తామని వివరించారు. గత నెల 26న రెండు క్లినిక్లు ప్రారంభమవగా తాజాగా మరో 8 క్లినిక్లు ఏర్పాటు కావడం అథారిటీ చొరవకు నిదర్శనమని కొనియాడారు. అనంతరం జస్టిస్ శామ్ కోషి మాట్లాడుతూ రక్షణ సిబ్బంది, మాజీ సైనికులు, వారి కుటుంబాలకు సమగ్ర న్యాయ సాయం అందించడమే క్లినిక్ల లక్ష్యమన్నారు.ఆస్తి, కుటుంబ వివాదాలు, పింఛన్, సంక్షేమ పథకాలు పొందడంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారంలో క్లినిక్లు కీలకపాత్ర పోషిస్తాయని చెప్పారు. ప్రతి మొదటి, నాలుగో శనివారం ఈ క్లినిక్లు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ సందర్భంగా తెలుగులోకి అనువదించిన నల్సా థీమ్ సాంగ్ ‘ఏక్ ముఠ్టీ ఆస్మాన్’ను న్యాయమూర్తులు విడుదల చేశారు. కార్యక్రమంలో రిజి్రస్టార్ గోవర్ధన్రెడ్డి, అథారిటీ సభ్య కార్యదర్శి సీహెచ్ పంచాక్షరీ నేరుగా హాజరుకాగా జిల్లా ప్రిన్సిపల్ జడ్జీలు, ప్రాంతీయ సైనిక్ వెల్ఫేర్ బోర్డుల అధికారులు, మాజీ సైనికులు, సైనిక్ వెల్ఫేర్ కార్యాలయ సిబ్బంది ఆన్లైన్ ద్వారా పాల్గొన్నారు. -
స్థానిక ఎన్నికలపై డైలమా!
సాక్షి, హైదరాబాద్/ న్యూఢిల్లీ: రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికల విషయంలో డైలమా ఏర్పడింది. వాయిదా వేద్దామా? ప్రభుత్వ పరంగా బీసీలకు 42% కోటాపై జీవో ఇచ్చి ముందుకు వెళదామా అన్న దానిపై అధికార కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. ఈ అంశంపై జాతీయ స్థాయి న్యాయ నిపుణులతో పాటు పార్టీ హైకమాండ్తో కూడా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం చర్చలు జరిపినప్పటికీ ఇంకా స్పష్టత రాలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పీసీసీ నియమించిన మంత్రుల బృందం ఇచ్చే నివేదిక కీలకం కానుంది. మంత్రుల బృందం చేసే సిఫారసును ఈ నెల 30వ తేదీన జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మరోసారి కూలంకషంగా చర్చించిన తర్వాతే దీనిపై ఓ స్పష్టత వస్తుందని ప్రభుత్వ, కాంగ్రెస్ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎటూతేల్చుకోలేక..!: పంచాయతీ ఎన్నికలను సెప్టెంబర్ 30లోగా పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు అంశం ఎంతకీ తేలకపోవడం ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి సమస్యగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో పాటు మెజారిటీ మంత్రులు ఎన్నికలకు వెళ్దాం అనే ఆలోచనలో ఉన్నారు. కానీ పార్టీలోని బీసీ నాయకత్వం రిజర్వేషన్ల కల్పనపై మాట నిలబెట్టుకుని ఎన్నికలకు వెళ్తే బాగుంటుందని సూచిస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ మొదటి నుంచి 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలనే ఆలోచనతో ఉన్నారు. ఈ తర్జనభర్జనల నేపథ్యంలోనే న్యాయనిపుణుల సలహాలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయించింది. అందులో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు పీసీసీ నియమించిన ఐదుగురు మంత్రుల బృందం ఢిల్లీలో పర్యటించి న్యాయ నిపుణులతో పాటు పార్టీ హైకమాండ్తో కూడా స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించినట్టు తెలుస్తోంది. పార్టీ పరంగా ఇస్తే బూమరాంగ్ ఖాయం విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం..కులగణన చేస్తామని, ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రజలకు వాగ్దానం చేసి, ఇప్పుడు పార్టీ పరంగా ఇస్తామని చెబితే బూమరాంగ్ కావడం ఖాయమని కాంగ్రెస్ హైకమాండ్ తేల్చిచెప్పింది. అవసరమైతే ఎన్నికల నిర్వహణకు కోర్టును మరింత సమయం కోరాలని సూచించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి పంపిన రెండు బిల్లులతో పాటు, 50% రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ తెచ్చిన ఆర్డినెన్స్పై కేంద్ర ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడాన్ని తప్పుపడుతూ.. క్షేత్రస్థాయిలో బీజేపీని ఎండగట్టే కార్యక్రమాలు చేపట్టాలని చెప్పినట్లు తెలిసింది. సోమవారం ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కేసీ వేణుగోపాల్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీలతో చర్చలు జరిపిన సీఎం, మంత్రుల బృందం.. మంగళవారం బిహార్లో ఓటర్ అధికార యాత్ర నిర్వహిస్తున్న రాహుల్గాందీతోనూ సమాలోచనలు జరిపినట్లు తెలిసింది. బీజేపీని ఎండగట్టాల్సిందే.. ‘పార్గీ పరంగా సాధ్యం కాదు. ఒకవేళ ఇచ్చినా మళ్లీ గత అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితే రావొచ్చు. ఓడిపోయే సీట్లను బీసీలకు కేటాయించొచ్చు. ఇది బీసీలను మోసం చేయడమే..’ అని కుండబద్ధలు కొట్టినట్లు సమాచారం. ‘బీసీలకు రిజర్వేషన్ల అమలు ఇప్పుడు ఒక్క తెలంగాణ అంశమే కాదు.. యావత్ దేశానిది. రిజర్వేషన్లు అమలు చేయకుండా ఒకట్రెండు ధర్నాలు చేసి చేతులు ముడుచుకుంటే మొదటికే మోసం వస్తుంది. కాబట్టి బీజేపీని మరింతగా ఎండగట్టాలి. బీసీ రిజర్వేషన్లపై కేంద్రం తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలి..’ అని హైకమాండ్ పెద్దలు గట్టిగా చెప్పినట్లు తెలిసింది.ఈ పరిస్థితుల్లోనే ప్రభుత్వ పరంగా బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతూ జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్లే అంశం తెరపైకి వచ్చింది. అయితే ఇది కోర్టులో నిలబడుతుందా లేదా? అనే సందేహం కూడా కాంగ్రెస్ నేతలను వెంటాడుతోంది. కోర్టును గడువు అడగండి..మళ్లీ ఆర్డినెన్స్ పంపండి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో న్యాయ కోవిదుల అభిప్రాయాలను తీసుకుని నివేదిక సమర్పించేందుకు గాను టీపీసీసీ నియమించిన మంత్రుల బృందం ఆదివారం ప్రజాభవన్లో రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ఎ.సుదర్శన్రెడ్డితో సమావేశమై ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలు, న్యాయపరంగా ఉన్న ఇబ్బందులపై చర్చించింది. తాజాగా సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీ, ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీతో సమావేశమైంది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఆలోచనలను కూడా వివరించింది. ఈ నేపథ్యంలో 42 శాతం రిజర్వేషన్లను అధికారికంగా అమలు చేయాలనే కోణంలోనే ముందుకు వెళ్లాలనుకుంటే ఎన్నికలను మూడు నెలల పాటు వాయిదా వేయాలని సూచించినట్టు తెలిసింది. అదే విధంగా 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ తెచ్చిన ఆర్డినెన్స్ కాలపరిమితి 3 నెలలు ముగిసిన తర్వాత మళ్లీ ఆర్డినెన్స్ చేసి, మరోమారు ఆమోదం కోసం గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపాలని చెప్పినట్లు సమాచారం. ఈలోపు హైకోర్టులో ఉన్న కేసులో ఆరు వారాల గడువు కోరుతూ కౌంటర్ దాఖలు చేయాలని, తద్వారా సుప్రీంకోర్టులో ఉన్న కేసుకు బలం చేకూరుతుందని, రెండోసారి మంత్రివర్గం పంపిన ఆర్డినెన్స్ను రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారు ఆమోదించాల్సి ఉంటుందని ఆయన వివరించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అసెంబ్లీ సమావేశాల నిర్ణయంపై చర్చ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను ఈ నెల 30వ తేదీ నుంచి నిర్వహించాలన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. అసెంబ్లీ నిర్వహణకు, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధం లేనప్పటికీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండటం సాధ్యం కాదనే కోణంలోనే వీలున్నంత త్వరగా అసెంబ్లీ సమావేశాలను పూర్తి చేయాలన్న యోచనతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ఇదే నిజమైతే 30వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతూ జీవో విడుదల చేయాలని మంత్రివర్గం నిర్ణయిస్తుందని తెలుస్తోంది. ఒకవేళ ఎన్నికల వాయిదాకు కనుక మొగ్గు చూపితే హైకోర్టును గడువు అడిగే విధంగా కేబినెట్ నిర్ణయం ఉంటుందని సమాచారం ఏది ఏమైనా ఈ నెల 30వ తేదీన జరిగే రాష్ట్ర మంత్రివర్గ భేటీలో..అన్ని అంశాలను క్రోడీకరించి మంత్రుల బృందం ఇచ్చే సిఫారసుపై చర్చించిన అనంతరమే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయా? వాయిదా పడతాయా? అన్నదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. రాహుల్ యాత్రలో సీఎం, రాష్ట్ర నేతలు కేంద్ర ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడుతోందంటూ బిహార్లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ చేపట్టిన ‘ఓటర్ అధికార్ యాత్ర’లో సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ అనిల్కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్తో కలిసి రేవంత్రెడ్డి రోడ్షోలో పాల్గొన్నారు. రోడ్షోకు హాజరైన పార్టీ నేత ప్రియాంకగాం«దీని కూడా రాష్ట్ర నేతలు కలిశారు. -
అటూ ఇటుగా.. ఆరు నెలలు
సాక్షి, హైదరాబాద్: సాదాబైనామాల క్రమబద్ధికరణ విషయంలో హైకోర్టులో ఉన్న అడ్డంకి తొలగిపోవడంతో రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాలకు ఊరట లభించనుంది. రాష్ట్రవ్యాప్తంగా 9.26 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉండగా, దాదాపు 10 లక్షల ఎకరాల భూమి ఈ దరఖాస్తుల పరిధిలో ఉంటుందని, ఈ మేరకు ఆ భూములన్నింటికీ త్వరలోనే విముక్తి లభిస్తుందని రెవెన్యూ వర్గాలంటున్నాయి.అయితే, ఈ ప్రక్రియ పూర్తయ్యే సరికి అటూఇటుగా ఆరునెలల సమయం పట్టే అవకాశముంది. భూభారతి పేరుతో రాష్ట్రంలో అమల్లో ఉన్న ఆర్వోఆర్ చట్టం ప్రకారం ఈ దరఖాస్తులను పరిష్కరించాల్సి ఉంటుంది. రెవెన్యూ వర్గాల సమాచారం ప్రకారం ఈ ప్రక్రియ ఎలా ఉంటుందంటే...! ⇒ హైకోర్టు తీర్పునకు అనుగుణంగా సాదాబైనామాల ద్వారా పెండింగ్లో ఉన్న దరఖాస్తుల పరిష్కారానికి తొలుత ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలి. ⇒ ఈ నోటిఫికేషన్ మేరకు పెండింగ్లో ఉన్న 9.26 లక్షల దరఖాస్తుదారులకు, సాదాబైనామాల ద్వారా ఆ భూమిని అమ్మిన వారికి ఆర్డీవో నోటీసులు జారీ చేస్తారు. ఈ నోటీసుల జారీకి కనీసం నెలరోజుల సమయం పడుతుందని అంచనా. ⇒ ఈ నోటీసుల ఆధారంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తారు. ఆ భూమికి సంబంధించి తెల్ల కాగితంపై రాసుకున్న సాదాబైనామా లావాదేవీ సరైందా లేదా అన్నది పరిశీలించడంతోపాటు చుట్టుపక్కల ఉన్న రైతుల అభిప్రాయాలు కూడా తీసుకుంటారు. ⇒ అప్పుడు సదరు భూమిని అమ్మింది, కొన్నది వాస్తవమే అని తేలితే ప్రత్యేక ఆర్డర్ ఇచ్చి రిజి్రస్టేషన్ ఫీజు, స్టాంపు డ్యూటీ కట్టి క్రమబద్ధికరించుకునే అవకాశం కల్పిస్తారు. ⇒ అలా స్టాంపు డ్యూటీ కట్టిన తర్వాత ఓ సర్టీఫికెట్ ఇస్తారు. ఈ సరి్టఫికెట్ను రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కింద పరిగణనలోకి తీసుకుంటారు. ⇒ దీని ఆధారంగా ఆ భూమికి పాసు పుస్తకాలు వస్తాయి. ఈ సరి్టఫికెట్ ద్వారానే క్రయవిక్రయ లావాదేవీలు జరుగుతాయి. ⇒ గతంలో సాదాబైనామాల క్రమబద్ధీకరణ ఉచితంగా చేసేవారు. కానీ, భూభారతి చట్టంలో మార్చిన నిబంధన ప్రకారం స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి. ⇒ హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు 2020లో దరఖాస్తు చేసుకుని పెండింగ్లో ఉన్న దరఖాస్తులను మాత్రమే క్రమబద్ధీకరిస్తారు. ⇒ రాష్ట్రంలో ఇప్పటివరకు 13సార్లు సాదాబైనామాలను క్రమబద్ధికరించారు. 2020లో 14వ సారి జారీ చేసిన సాదాబైనామా ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు ఆ ప్రక్రియకు మోక్షం కలగనుంది. ⇒ దీని తర్వాత సాదాబైనామాల క్రమబద్ధికరణకు ఆస్కారం ఉండదు. ఈ మేరకు భూభారతి చట్టంలో స్పష్టంగా పొందుపరిచారు. 2020లో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించిన తర్వాత మళ్లీ సాదాబైనామాల దరఖాస్తులను తీసుకునే వీల్లేదని పేర్కొన్నారు. మళ్లీ సాదాబైనామాల క్రమబద్ధికరణ చేపట్టాలనుకుంటే ఆ చట్టాన్ని సవరిస్తే కానీ సాధ్యం కాదు. కోర్టు నిర్ణయం సంతోషకరంతెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటైన ధరణి పోర్టల్ పునరి్నర్మాణ కమిటీ సమావేశాల్లో కూడా ఈ సాదాబైనామాలపై చాలాసార్లు చర్చించాం. అయితే, గతంలో అమల్లో ఉన్న ధరణి చట్టంలో సాదాబైనామాల పరిష్కార నిబంధనను పొందుపర్చలేదు. దీంతోనే కోర్టు కొట్టివేసింది. కొత్తగా తెచ్చిన భూభారతి చట్టంలో ఆ నిబంధన పెట్టాం. ఇప్పుడు ఇదే నిబంధన ఆధారంగా కోర్టు సానుకూల తీర్పునిచ్చింది. ఇప్పటికైనా దీర్ఘకాలిక సమస్య పరిష్కారమైనందుకు సంతోషంగా ఉంది. – భూమి సునీల్, రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు -
జ్వరాల సీజన్ వచ్చేసింది.. జర భద్రం
హైదరాబాద్ : శీతాకాలం రాక ముందే హైదరాబాద్ నగరంలో సీజనల్ జ్వరాలు ఎక్కువవుతున్నాయి. వర్షాలు వచ్చి, తగ్గిన తర్వాత ఉన్న పొడి వాతావరణంలో పలు రకాల వైరస్లు పెరిగి అనేక జ్వరాలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా డెంగ్యూ, ఇన్ఫ్లూయెంజా, చికన్ గున్యా లాంటి జ్వరాలు ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటినుంచి నగరవాసులు తమను తాము కాపాడుకోవాలని.. వాటి లక్షణాలు గమనించుకుని జాగ్రత్త వహించాలని కామినేని ఆస్పత్రి జనరల్ మెడిసిన్ విభాగాధిపతి, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ ఎం. స్వామి అన్నారు. “వర్షాలు వస్తూ, తగ్గుతూ ఉన్న ఈ తరుణంలో పలు రకాల జ్వరాలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ఇన్ఫ్లూయెంజా, డెంగ్యూ, చికన్ గున్యా లాంటివి కనిపిస్తున్నాయి. వీటి లక్షణాలు కూడా ఇంతకుముందులా లేకుండా విభిన్నంగా కనిపించడం ఈసారి ప్రత్యేకత. డెంగ్యూలో మామూలుగా అయితే చేతులు, కాళ్ల నొప్పులు, ప్లేట్లెట్లు పడిపోవడం లాంటివి ఉంటాయి. కానీ, ఈ సీజన్లో వస్తున్నవాటిలో ముందుగా విరేచనాలు అవుతున్నాయి. ఒకటి రెండురోజుల తర్వాత జ్వరం వచ్చి అప్పుడు ప్లేట్లెట్లు పడిపోవడం లాంటివి కనిపిస్తున్నాయి. ఇన్ఫ్లూయెంజా కేసులు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. వారానికి కనీసం ఐదు కేసుల వరకు ఒక్క కామినేని ఆస్పత్రికే వస్తున్నాయి. అలాగే చికన్ గున్యా కేసులూ విజృంభిస్తున్నాయి.నగరంలో వాతావరణ మార్పులు, వర్షపునీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడం లాంటివి ఈ జ్వరాల వ్యాప్తికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. దానికితోడు వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరిగిపోవడంతో ఇప్పటికే ఎలర్జీలు లేదా సీఓపీడీ (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్) లాంటివి ఉన్న వారికి అయితే సమస్య చాలా తీవ్రంగా వస్తోంది. నగర ట్రాఫిక్లో ఒక్కసారి అలా బయటకు వెళ్లి వస్తే వెంటనే తీవ్రమైన దగ్గు, ఆయాసం లాంటివాటితో వారు బాధపడుతున్నారు. తీవ్రమైన జ్వరంతో పాటు ఊపిరితిత్తుల సమస్య కూడా వారిని వేధిస్తోంది” అని డాక్టర్ ఎం.స్వామి తెలిపారు.డాక్టర్ హరికిషన్ మాట్లాడుతూ, “ఈ సమస్యలన్నింటి నుంచి నగరవాసులు తమను తాము రక్షించుకోవాలి. అందుకు ముందుగా అసలు ఎలాంటి జ్వరం లేకముందే ఫ్లూ టీకాలు గానీ, క్వాడ్రలెంట్ టీకాలు (నాలుగు రకాల వైరస్లపై పోరాడేవి) గానీ తీసుకోవాలి. మామూలుగా అయితే వాటి సామర్థ్యం 6-8 నెలల పాటు పనిచేస్తుంది. కానీ, తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఏడాది వరకు మళ్లీ టీకా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా రద్దీ ప్రదేశాలకు వెళ్లడం మానుకోవాలి. ఇళ్లలోను, కార్యాలయాల్లోను ఎయిర్ ఫిల్టర్లు అమర్చుకోవడం మంచిది. రోజూ తప్పనిసరిగా ఆరేడు గ్లాసుల కాచి, చల్లార్చిన నీరు తాగాలి. నీరు బుడగలు వచ్చేవరకు కాచి, తర్వాత ఒక గంట చల్లార్చి వాటిని గాజు లేదా స్టీలు సీసాలో పోసుకుని తాగుతుండాలి. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు వాడడం కూడా మానేయాలి. బయటి ఆహారం వీలైనంత వరకు మానుకోవాలి. ఇంట్లో వేడిగా చేసుకున్న, తాజా ఆహార పదార్థాలను మాత్రమే తినాలి. దానివల్ల గ్యాస్ట్రో ఎంటరైటిస్ రాకుండా ఉంటుంది. రద్దీ ప్రదేశాలకు వెళ్లడం వీలైనంత వరకు మానుకోవాలి. బయటకు వెళ్లినప్పుడు తప్పకుండా మాస్కు ధరించాలి. ఏమైనా తినేముందు చేతులు శుభ్రం చేసుకోవాలి” అని చెప్పారు.డాక్టర్ శ్రీకృష్ణ రాఘేవంద్ర, డాక్టర్ ప్రదీప్ కుమార్ పటేల్ మాట్లాడుతూ, “చాలామంది జ్వరం వచ్చినప్పుడు మొదటి రెండు మూడు రోజలు ఇంటివద్దే డోలో లాంటి టాబ్లెట్లు వేసుకుని తగ్గకపోతే అప్పుడు ఆస్పత్రికి వస్తున్నారు. దీనివల్ల తగిన పరీక్షలు చేయడానికి సమయం దాటిపోతుంది. అలా కాకుండా ఈ సీజన్లో వచ్చే జ్వరాలకు మాత్రం వీలైనంత వరకు వెంటనే వైద్యులను సంప్రదించాలి. అప్పుడు లక్షణాలు చూసి, అవసరమైన రక్తపరీక్షలు చేయించి వాటికి తగిన మందులు ఇవ్వడానికి వీలుంటుంది. డెంగ్యూ, చికన్ గున్యా, ఇన్ఫ్లూయెంజా లాంటి వేర్వేరు రకాల సమస్యలకు వేర్వేరుగా మందులు వాడాల్సి ఉంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే నగర పౌరుల ఆరోగ్యం భద్రంగా ఉంటుంది” అని సూచించారు. -
‘నా భర్తను కాపాడండి.. నా చివరి కోరిక తీర్చండి’
సాక్షి,మహబూబ్ నగర్: యశోద అనే మహిళ రేబిస్ వ్యాధి సోకిందన్న అనుమానంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై, తన మూడేళ్ల కుమార్తెను చంపి తానూ ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు తాను పడుతున్న మనోవేధనను, చివరి కోరికను ఇంట్లో బ్లాక్ బోర్డుపై రాసింది.నా భర్తను కాపాడండి.. రేబిస్ ఉంది. వ్యాక్సిన్కు తగ్గదు. చెట్టు మందు తినిపించండి. మీరు చేయించండిలక్కీని ఆస్పత్రిలో చూపించు వాడికి రేబిస్ ఉంది.నా చివరి కోరి ధారూర్(వికారాబాద్)లో చెట్టు మందు తాగు.. లేట్ చేయకు.. అంటూ బాధితురాలు తన చివరి క్షణాల్లో కుటుంబం గురించి ఆలోచించి తనువు చాలించింది. మహబూబ్ నగర్ జిల్లా మొనప్పగుట్టలో హృదయవిదారకర ఘటన చోటు చేసుకుంది. యశోద అనే మహిళ రేబిస్ వ్యాధి సోకిందన్న అనుమానంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై, తన మూడేళ్ల కుమార్తెను చంపి తానూ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర దిగ్భ్రాంతిని గురి చేస్తోంది.పోలీసుల వివరాల మేరకు..యశోద గత జూన్ నెలలో తన ఇంటి ఆవరణలో పల్లీలు,డ్రై ఫ్రూట్స్ ఆరబెట్టింది. అవే పల్లీలు,డ్రై ఫ్రూట్స్ను వంటకాల్లో వాడింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులందరికీ అనారోగ్య సమస్యలు తలెత్తాయి. కుటుంబ సభ్యులకు రేబిస్ సోకిందని అనుమానం పెట్టుకుంది.ఆ అనుమానంతోనే ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ యాంటీ రేబిస్ ఇంజక్షన్ చేయించింది. నాటు వైద్యం చేయించుకునేలా బలవంతం చేసింది. కుటుంబ సభ్యులందరికీ రేబిస్ సోకిందని మానసికంగా కుంగిపోయింది. ఈ క్రమంలో తన మూడేళ్ల కుమార్తెను చంపి తానూ ఆత్మహత్య చేసుకుంది.ఘటన జరిగిన సమయంలో ఆఫీస్కు వెల్లిన యశోద భర్త.. ఇంటికి ఫోన్ చేశాడు. అమ్మ బెడ్రూంలోకి వెళ్లి డోర్ తీయడం లేదని చెప్పాడు. దీంతో భయపడిపోయిన నరేష్ పక్కింటి వారికి ఫోన్ చేసి అప్రమత్తం చేశాడు. దీంతో పక్కింటి వారు బెడ్రూం రూమ్ బలవంతంగా ఓపెన్ చేసి చూడగా.. తల్లి,కుమార్తె విగతజీవులుగా కనిపించారు. కాగా, భర్త, కొడుకు మందులు వాడుతూ జాగ్రత్తగా ఉండాలని ఆత్మహత్య చేసుకునే ముందు యశోద గోడపై రాయడం గమనార్హం. యశోద తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వీధి కుక్కల స్వైర విహారం
భద్రాద్రి కొత్తగూడెంజిల్లా: వీధి కుక్కల స్వైర విహారంతో ప్రజలు బెంబేతెత్తుతున్నారు. ఇంట్లో ఉన్న పసిపాపలపై కూడా దాడికి ఎగబడుతున్నాయి. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారు. ఎక్కడైనా చిన్నారులు, వృద్ధులపై దాడులు చేస్తే తప్ప అధికారుల్లో చలనం రావడం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం వెంకట్రావుపేట గ్రామంలో సోమవారం సాయంత్రం వీధి కుక్కులు ఓ చిన్నారిని గాయపరిచాయి.వెంకట్రావుపేట గ్రామానికి చెందిన సౌందపు ఈశన్విక్.. ఏడాది వయస్సు ఉన్న బాబును వీధిలోకి వచ్చిన ఓ పిచ్చికుక్క విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. బాబును ఇంటి వరండాలో ఉంచి తల్లి ఇంటి పని చేసుకుంటుండగా పిచ్చి కుక్క వచ్చి దాడి చేసినట్లు తండ్రి సంతోష్ తల్లి వెన్నెల తెలిపారు. బాబును హుటాహుటిన మణుగూరు అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం భద్రాచలం తరలించి వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. -
కడియం శ్రీహరిపై మరోసారి తాటికొండ రాజయ్య వివాదస్పద వ్యాఖ్యలు
సాక్షి, జనగామ జిల్లా: స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నకిలీ ఎన్కౌంటర్లకు స్పెషలిస్ట్ కడియం శ్రీహరి అంటూ వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో ఏఒక్కటి తన మార్క్ అని చెప్పడానికి లేని టాల్మాన్ అంటూ విమర్శలు గుప్పించారు. ఓర్వలేని తనంతో లెక్కచేయనితనంతో ఫ్రస్టేషన్కు లోనై ఏం మాట్లాడుతున్నాడో తెలియని స్థితిలో ఉన్నాడని ఎద్దేవా చేశారు.బీజేపీలోకి రమ్మని పిలిచిన వెళ్లే జంపు జలానీలు తండ్రీ కూతుర్లని మండిపడ్డారు. అభివృద్ధి నినాదం అయితే ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య 1560 కోట్లు, హనుమకొండ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి 6000 కోట్లు తీసుకొస్తే, అభివృద్ధి కోసం పార్టీ మారినని చెప్పుకుంటున్న కడియం శ్రీహరి 800 కోట్లు తెచ్చానని చెప్పుకోవడం కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందన్నారు.ఓడిపోతాడనే భయంతో తక్కువ మెజారిటీతో మూడుసార్లు ఎమ్మెల్యే గెలవడం ప్రజా నాయకుడు అనిపించుకోడన్నారు. నియోజకవర్గంలో ఇక నుండి కడియం శ్రీహరి ఎత్తులు జిత్తులు, కుళ్ళు కుతంత్రాలు సాగవన్నారు. ఉప ఎన్నికలు వస్తాయని నేను అనుకోవడం లేదని, నువ్వే అనుకుని ఆగమాగం అవుతూ.. ఈరోజు లింగాల ఘన్పూర్లో మా పార్టీ కార్యక్రమాలను పోలీసుల ద్వారా రద్దు చేయించడం కడియం శ్రీహరి దుర్బుద్ధికి నిదర్శనం అంటూ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. -
బాచుపల్లి మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విద్యాసంస్థల్లోకి మత్తు భూతం చొరబడిపోయింది. బాచుపల్లి మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం సృష్టించింది. డ్రగ్స్ తీసుకుంటున్న విద్యార్థులను ఈగల్ టీం రెడ్హ్యాండెడ్గా పట్టుకుంది. ఇద్దరు విద్యార్థులతో సహా మొత్తం నలుగురిని నార్కోటిక్ బ్యూరో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మత్తుకు బానిసలైన మరో 50 మంది విద్యార్థులను విచారించేందుకు సిద్ధమైంది. బహదూర్పల్లి బాచుపల్లి మహీంద్రా యూనివర్సిటీలో గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్, గంజాయి దందా నడుస్తోంది. ఈ సమాచారంతో తెలంగాణ యాంటీ నార్కోటిక్ విభాగం మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. గంజాయి సేవిస్తున్న విద్యార్థులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించింది. ఈ క్రమంలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. మణిపూర్కు చెందిన ఓ విద్యార్థిని ఢిల్లీకి చెందిన ఓ ముఠా నుంచి కొరియర్ ద్వారా ఓజీ కుష్ డ్రగ్ను తెప్పించుకుంటున్నాడు. దానిని గంజాయితో కలిపి సిగరెట్లు తయారు చేసి మిగతా స్టూడెంట్స్కు విక్రయిస్తున్నాడు. దీంతో సదరు విద్యార్థిని మరో విద్యార్థితో పాటు ఇద్దరు డగ్ర్ పెడ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల నుంచి కిలోకి పైగా గంజాయి, 47 ఓజీ కుష్ డ్రగ్స్ను స్వాధీనం చేసుకుంది. యూనివర్సిటీలో కొంతమంది విద్యార్థులు వీటికి బానిసలైనట్లు గుర్తించారు. ఈ పరిణామంపై కాలేజీ యాజమాన్యం స్పందించాల్సి ఉంది. -
సారీ నాన్నా.. నరేష్ను వదలిపెట్టకు.!
ఖమ్మం జిల్లా: ప్రేమించి పెళ్లి చేసుకున్నాక ఒంటరిగా వదిలేయడాన్ని తట్టుకోలేక తిరుమలాయపాలెం మండలంలోని ఎర్రగడ్డ గ్రామానికి చెందిన రమ్య(20) వైజాగ్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె అంత్యక్రియలు సోమవారం గ్రామంలో నిర్వహించగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామానికి చెందిన కొర్లపుడి బాసు కుమార్తె రమ్య(20), ఇదే గ్రామానికి చెందిన మేడ చిన్న బొందయ్య కుమారుడు నరేష్ ప్రేమించుకున్నారు. కులాలు వేర్వేరు కావడంతో కుటుంబాల్లో గొడవలు జరిగాయి. ఆపై రమ్య చదువు మానేసి హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోం చేస్తుండగా నరేష్ ఏడాది క్రితం మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయినా రమ్యతో ప్రేమ కొనసాగిస్తూ 15 రోజుల క్రితం ఆమెను వైజాగ్ తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. ఇంతలోనే తన కొడుకు కానరావడం లేదని నరేష్ తండ్రి చిన్న బొందయ్య ఈనెల 13న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న నరేష్ రమ్యను వదిలించుకోవాలని ఆమె వద్ద నగదు, నగలు, సెల్ఫోన్ తీసుకుని ఇంటికి వచ్చేశాడు. దీంతో మోసపోయానని గమనించిన రమ్య వైజాగ్లోని అద్దె ఇంట్లో ఆదివారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ‘నన్ను క్షమించండి.. నా చావుకు కారణం నన్ను ఇంత దూరం తీసుకొచ్చి నమ్మించి మోసం చేసి వెళ్లిపోయిన వాడి పేరు నరేష్. నా తల్లిదండ్రులకి, ఇక్కడి వాళ్లకు నా చావుకు ఎలాంటి సంబంధం లేదు. నాన్న సారీ.. నాన్న వాడిని మాత్రం అసలు వదిలిపెట్టకు. తమ్ముడు జాగ్రత్త. నా కోసం ఆలోచించకండి. లవ్యూ నాన్న. నేను ఎన్ని తప్పులు చేసినా నన్ను క్షమించావు. నీ లాంటి తండ్రి ఏ కూతురికి ఉండడు’ అంటూ రాసిన లేఖను స్వాధీనం చేసుకున్న వైజాగ్ టూటౌన్ పోలీసులు పోస్టుమార్టం చేసి రమ్య మృతదేహాన్ని ఎర్రగడ్డకు పంపించారు. ఈమేరకు నరేష్ ఇంటి ఎదుట మృతదేహంతో ఆమె కుటుంబీకులు ఆందోళనకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆపై తిరుమలాయపాలెం ఎస్ఐ జగదీష్తో పాటు కూసుమంచి, ముదిగొండ, నేలకొండపల్లి పోలీసులతో రమ్య అంత్యక్రియలు పూర్తయ్యే వరకు బందోబస్తు నిర్వహించారు. కాగా, నిందితుడు నరేష్ను వైజాగ్ పోలీసులకు అప్పగించారు. -
నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపేయండి..!
హైదరాబాద్: జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ)లో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపేయాలని ఎన్జీటీ ఆదేశించింది. పర్యావరణ అనుమతులు లేకుండా పనులు చేయొద్దని ఎన్జీటీ తన తాజా ఆదేశాల్లో స్సష్టం చేసింది. ఇప్పటికే ప్రాజెక్టుకు సంబంధించి భూ సర్వేలు పూర్తయ్యాయి, ప్యాకేజీ-1, ప్యాకేజీ-2లుగా విభజించి పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అధికారులకు పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ నేపథ్యంలో దానికి పర్యావరణ అనుమతులు లేవన్న ఎన్జీటీ.. ఆ ప్రాజెక్ట్ పనులను నిలిపివేయాలని స్పష్టం చేసింది. ఈ పరిణామం నేపథ్యంలో, ప్రాజెక్టు భవితవ్యం పర్యావరణ అనుమతులపై ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వానికి ఇప్పుడు ఎన్జీటీ ఆదేశాలను పాటిస్తూ, అవసరమైన అనుమతులు పొందే దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
ఈ తీర్పు సమాజానికి ఓ హెచ్చరిక
సాక్షి నల్లగొండ: మైనర్ బాలికపై అత్యాచారం కేసులో సంచలన తీర్పు వెలువడింది. నిందితుడు మహ్మద్ కయ్యుమ్కు 50 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ మంగళవారం నల్లగొండ పోక్సో POCSO కోర్టు ఇన్ఛార్జి రోజారమణి తీర్పు వెల్లడించారు.పోక్సో చట్టం కింద 20 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద మరో 20 సంవత్సరాలు, కిడ్నాప్ కేసుకుగానూ మరో పదేళ్లు.. మొత్తం 50 సంవత్సరాల కఠిన జైలు శిక్ష విధిస్తున్నట్లు జడ్జి రోజారమణి ప్రకటించారు.బాలికలపై జరిగే అఘాయిత్యాలను అరికట్టేందుకు కఠిన శిక్షలు అవసరం. ఈ తీర్పు సమాజానికి హెచ్చరికగా నిలవాలి అని ఆమె అభిప్రాయపడ్డారు.కేసు నేపథ్యం.. బాధిత బాలికపై లైంగిక దాడి జరిగినట్లు తిప్పర్తి పోలీస్ స్టేషన్లో మహ్మద్ కయ్యుమ్ అనే వ్యక్తి మీద 2021లో కేసు నమోదైంది. 2022 నుంచి నల్లగొండ జిల్లా కోర్టులో విచారణ కొనసాగింది.వాదనలు, సాక్ష్యాలు, ఫోరెన్సిక్ ఆధారాల ఆధారంగా న్యాయమూర్తి నిందితుడిని దోషిగా తేల్చారు. ఈ కేసు తెలంగాణలో POCSO చట్టం కింద అత్యధిక శిక్ష విధించిన కేసులలో ఒకటిగా చరిత్రలో నిలిచే అవకాశం కనిపిస్తోంది. -
తెలంగాణ అసెంబ్లీ స్పెషల్ సెషన్కు ముహూర్తం ఖరారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ హీటెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. కాళేశ్వరం నివేదిక సహా ఇతర అంశాలపై చర్చించేందుకు అసెంబ్లీ ప్రత్యేకంగా సమాచారం కానుంది. ఈ నెల 30 నుంచి ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 29న తెలంగాణ కేబినెట్ భేటీలో స్పెషల్ సెషన్కు సంబంధించిన ఎజెండా ఖరారు కానుంది. మూడు లేదంటే ఐదు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. కాళేశ్వరం కమిటీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికతో పాటు బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించే యోచనలో ప్రభుత్వం ఉంది.ఇదిలా ఉంటే.. కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ రూపొందించిన నివేదికను అసెంబ్లీలో చర్చించాకే తదుపరి చర్యలు ఉంటాయని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. నివేదికపై చర్చ నేపథ్యంలో కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. -
‘ప్రభుత్వం రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు పోయే సత్తా మీకుందా?’
కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో సైతం ఓట్ల చోరీ జరిగిందన్న పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్పై కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధానంగా దొంగ ఓట్లతోనే బండి సంజయ్ గెలిచారన్న పీసీసీ చీఫ్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. కరీంనగర్ ఓటర్లను మహేష్ గౌడ్ అవమానించారన్నారు. ఈరోజు(మంగళవారం, ఆగస్టు 26వ తేదీ) కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. వార్డు మెంబర్గా కూడా మహేష్ గౌడ్ గెలవలేరని చురకలంటిచారు. అసలు మహేష్ గౌడ్ను కరీంనగర్ ప్రజలు గుర్తుపట్టరని, అటువంటి వ్యక్తి బీజేపీ ఓట్ల చోరీ చేసిందా? అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాదని, ఒకవేళఆ పార్టీ మరొకసారి అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం చేస్తానంటూ సవాల్ చేశారు. కరీంనగర్లో ఒక్కో మైనార్టీ ఇంట్లో 200 ఓట్లు ఉన్నాయంటూ బండి సంజయ్ ఆరోపించారు.‘పీసీసీ అధ్యక్షుడు ఓట్ల గురించి కాదు సీట్ల చోరి గురించి సమాధానం చెప్పాలి. ఒక్కసారి వార్టు మెంబర్ కూడ గెలవని వారి మాటలకి నేను స్పందించను. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలి. ప్రభుత్వం రద్దు చేసి ఓట్లని సరిచేసి మళ్ళీ ఎలక్షన్ పోయే సత్తా ఉందా.?, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలు రాళ్ళతో కొట్టే స్థితి కి దిగజారారు. ప్రజలని కలవకుండా రాత్రి పూట పాదయాత్ర చేయడం ఏంటో?, కరీంనగర్ ప్రజలు పిసిసి అధ్యక్షుడుని గుర్తు పడతారా?, కరీంనగర్ లొని మైనారిటి దొంగ ఓట్లు ఉన్నాయని మేము ఫిర్యాదు చేసాం.. అయినా కూడ కరీంనగర్లో కాంగ్రెస్ లో గెలవలేదు. బిసి రిజర్వేషన్ల ఇయ్యమని అడిగితే ముస్లీం రిజర్వేషన్లు ఇస్తున్నారు. ఓట్ల చోరి జరిగి ఉంటే మిగితా ఎనిమిది సీట్లు మేమే గెలచేవారం. బండిసంజయ్ని తిడితే పెద్ద నాయకుడు అవుతాడని అనుకుంటున్నారు. ఎన్నికలు ఉన్నా లేకున్నా బిజేపి దేశం కొసం, ధర్మం కొసం కొట్లాడుతుంది’ అని స్సష్టం చేశారు. -
భక్తులకు అలర్ట్.. ఖైరతాబాద్ గణేషుడి దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: వినాయకచవితి, నిమజ్జనం వేడుకల నేపథ్యంలో.. 11 రోజులపాటు ఖైరతాబాద్ గణేషుడి పరిసర ప్రాతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేపటి నుంచి (27 బుధవారం) సెప్టెంబర్ 6వరకూ ఇవి అమల్లో ఉండనున్నాయి. బడా గణేషుడి దర్శనానికి భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందునే ఈ అంక్షలు విధించినట్లు నగర పోలీసులు ప్రకటించారు. ఖైరతాబాద్ గణేషుడి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఆరు చోట్ల పార్కింగ్ ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే.. భక్తులు తమ సొంత వాహనాల్లో వచ్చి ఇబ్బందులు పడకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్టును వినియోగించుకోవాలని కోరుతున్నారు. ట్రాఫిక్ అంక్షల నేపథ్యంలో ప్రత్యామ్నాయ రహదారుల గుండా వెళ్ళాలని పోలీసులు సూచిస్తున్నారు. డైవర్షన్లు ఇవే..ఖైరతాబాద్ నుంచి మింట్ కాంపౌండ్ వైపు వచ్చే వాహనాలు.. నిరంకారి జంక్షన్ వైపు మళ్ళింపుఓల్డ్ సైఫాబాద్ పీఎస్ నుంచి రాజ్ దూత్ వైపు వచ్చే వాహనాలు ఇక్బాల్ మినార్ వైపు మళ్ళింపుఇక్బాల్ మినార్ నుంచి ఐమ్యాక్స్ వైపు వచ్చే వాహనాలు సెక్రటేరియట్ మీదుగా తెలుగుతల్లి జంక్షన్ వైపు మళ్లింపునెక్లెస్ రోటరీ నుంచి మింట్ కాంపౌండ్ వైపు వచ్చే వాహనాలు తెలుగుతల్లి జంక్షన్ , ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీదుగా మళ్ళింపుఖైరతాబాద్ పోస్ట్ఆఫీస్ నుంచి నిరంకారి నుంచి భవన్ వైపు వచ్చే వాహనాలు ఓల్డ్ సైఫాబాద్ పిఎస్ జంక్షన్ వైపు మళ్ళింపు -
ఏపీ, తెలంగాణకు వెదర్ అలర్ట్.. ఈ జిల్లాల్లో కుండపోత వానలు
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రేపు వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. దీంతో తెలంగాణ, ఏపీ వాతావరణ కేంద్రాలు హెచ్చరికలు జారీ చేశాయి.ఏపీలో ఉత్తర కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. మూడు రోజులపాటు భారీ వర్షాలు ఉంటాయని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాలకు కుండపోత తప్పదని తెలిపింది. మరోవైపు.. ఆవర్తన ప్రభావంతో దక్షిణ కొస్తా, రాయలసీమలో తేలికపాటి వర్షాలు ఉంటాయని తెలిపింది.ఇక.. తెలంగాణకు రెండు రోజులపాటు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఇవాళ, రేపు.. పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. హైదరాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లాలకు కుండపోత తప్పదని హెచ్చరించింది. వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బలపడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఉపరితల ఆవర్తనంతో ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో ఇప్పటికే పలుచోట్ల భారీ వర్షాలు పడుతుండగా మరో మూడు రోజులు అవి కొనసాగుతాయని పేర్కొంది. గత రాత్రి నుంచే ఉమ్మడి విశాఖను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. సోమవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. శ్రీకాకుళం జిల్లా నందిగం మండలం మదనపురంలో 3.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అదే మండలంలోని నందిగంలో 2.7 సెంటీమీటర్ల వర్షం పడింది. పార్వతీపురం జిల్లా గుమ్మలక్ష్మీపురం, శ్రీకాకుళం జిల్లా పాలకొండలో రెండు సెంటీమీటర్ల వర్షం కురిసింది.40-50 కిమీ వేగంతో ఉండనున్న ఈదురు గాలులు వీస్తాయని విపత్తుల శాఖ పేర్కొంది. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున ఈ నెల 27 వరకూ ఉత్తరాంధ్ర జిల్లాల్లోని మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ అధికారులు హెచ్చరించారు.తెలుగు రాష్ట్రాలల్లో ఇప్పటిదాకా కురిసిన వానలకు, ఎగువన కురుస్తున్న వర్షాలకు పలు ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. మహబూబ్నగర్ జురాల, నంద్యాల శ్రీశైలం జలాయశంకు వరద పోటెత్తుతోంది. -
నేషనల్ బెస్ట్.. పవిత్ర టీచర్
పెన్పహాడ్ (సూర్యాపేట): జీవ శాస్త్రంలో ఆమె బోధన వినూత్నంగా ఉంటుంది. ప్రతి పాఠ్యాంశాన్ని విద్యార్థుల కళ్లకు కట్టినట్టుగా వివరిస్తారు. వారితో ప్రయోగాలు చేయిస్తారు. ఇందుకోసం సాంకేతికతను విని యోగిస్తారు. విద్యార్థులు తాను చెప్పే విషయంలో లీనమయ్యేలా చేస్తారు. సూర్యా పేట జిల్లా పెన్పహాడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జీవశాస్త్రం బోధిస్తున్న ఉపాధ్యాయురాలు మారం పవిత్ర అనుసరిస్తున్న బోధన పద్ధతులు, విద్యార్థులను తీర్చిదిద్దుతున్న తీరు ఆమెకు జాతీయ స్థాయి గుర్తింపును తీసుకువచ్చాయి. జాతీయ స్థాయిలో ఏటా ప్రతిష్టాత్మకంగా అందించే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు కేంద్ర ప్రభుత్వం మారం పవిత్రను ఎంపిక చేసింది. దేశ వ్యాప్తంగా 44 మంది ఉపాధ్యాయులను ఈ అవార్డు కోసం ఎంపిక చేయగా, తెలంగాణ నుంచి మారం పవిత్రను ఈ అవార్డు వరించింది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సెపె్టంబర్ 5న ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఆమె ఈ అవార్డు స్వీకరిస్తారు. మారం పవిత్రకు జాతీయ ఉపాధ్యాయ అవార్డు–2025 లభించడంపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికొలస్ అభినందనలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 150 మంది దరఖాస్తురాష్ట్ర వ్యాప్తంగా 150 మంది ఉపాధ్యా యులు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తు చేసుకోగా, రాష్ట్ర జ్యూరీ కమిటీ 15 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసింది. ఢిల్లీ స్థాయిలో పలు అంశాలపై ఇంటర్వ్యూ చేసిన తర్వాత.. అందులో టాప్ ఆరుగురిని నలుగురు సభ్యులతో కూడిన నేషనల్ జ్యూరీ ఆగస్టు 13న ఢిల్లీలోని డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి గూగుల్ మీట్ ద్వారా ఇంటర్వ్యూ చేసింది. అనంతరం ఒక్కొక్క ఉపాధ్యాయుడికి 10 నిమిషాల చొప్పున సమయం ఇచ్చి వారు చేసిన ప్రయోగాల ప్రదర్శనకు అవకాశం ఇచ్చారు. ఆ టాప్ 6 ఉపాధ్యాయుల్లో ఒకరిని (మారం పవిత్ర) అవార్డుకు ఎంపిక చేశారు. భర్త ప్రోత్సాహంతో.. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం తడకమళ్ల గ్రామానికి చెందిన మారం పవిత్ర పదో తరగతి వరకు వేములపల్లి, తడకమళ్ల ప్రభుత్వ పాఠశాలల్లో చదివారు. ఇంటర్, డిగ్రీ మిర్యాలగూడలోని ప్రైవేట్ కళాశాలలో చదివారు. కాగా చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరికి చెందిన టీచర్ నాతాల మన్మథరెడ్డితో ఆమెకు వివాహమైంది. భర్త ప్రోత్సాహంతో బీఈడీ, డీఈడీ పూర్తి చేసి 2008 డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్గా ఉద్యోగం సాధించారు. 2009లో మొదటగా ఆత్మకూర్(ఎస్) మండలం రామన్నగూడెం యూపీఎస్లో జీవశాస్త్ర ఉపాధ్యాయురా లిగా విధులు చేపట్టారు. 2012 నుంచి 2015 వరకు గోరెంట్ల జెడ్పీహెచ్లో, ఆ తర్వాత గడ్డిపల్లి జెడ్పీహెచ్ఎస్లో ప్రస్తు తం పెన్పహాడ్లో పనిచేస్తున్నారు.విద్యార్థులను సైంటిస్టుల్ని చేయడమే లక్ష్యం –మారం పవిత్రనా ఉద్యోగ జీవితంలో కనీసం ఒకరిద్దరు విద్యార్థులనైనా శాస్త్రవేత్తలుగా తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నా. విద్యార్థులు సిద్ధాంతపరంగా నేర్చుకున్న విషయాలు ప్రయోగపూర్వకంగా నిర్ధారణ చేసుకునే అవకాశం, పరిస్థితులను ఉపాధ్యాయులు కలి్పంచాలి. సైన్స్ అభ్యసనంలో ప్రయోగాత్మకతకు ఎక్కువ ప్రాధాన్యమిస్తే విద్యార్థులకు నేర్చుకోవడం సులువు అవుతుంది.ఎన్నో వినూత్న బోధనలు.. జాతీయ స్థాయిలో సీఐఈటీ, ఎన్ఐసీఆర్టీ యూట్యూబ్ చానల్ ద్వారా 2020–21లో ఉపాధ్యాయులకు ఉపయోగపడే ఐసీటీ టూల్స్పై పవిత్ర అవగాహన తరగతులు అందించారు. 2019లో విద్యా విధానంపై జాతీయ స్థాయి సెమినార్లో ‘సైన్స్ టీచింగ్ త్రూ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్’అనే అంశంపై ప్రసంగించారు. 2017 నుంచి ఇప్పటివరకు స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ (ఎస్ఐఈటీ) ద్వారా జీవశాస్త్రంలో 14 డిజిటల్ పాఠాలను బోధించారు. తెలంగాణ పాఠ్యపుస్తకాల్లో 6, 7 తరగతులు, సామాన్య శాస్త్రం 8, 9, 10 తరగతుల జీవశాస్త్రం పాఠ్యపుస్తకాలలో ఉన్న క్యూ ఆర్ కోడ్లలో కంటెంట్ తయారీకి ఎస్సీఈఆర్టీ దీక్ష ఆధ్వర్యంలో 60 వీడియోలు, 16 క్వశ్చన్ సెట్లను తయారు చేశారు. వాటిని ఎస్సీఆర్టీ క్యూ ఆర్ కోడ్లో పబ్లిష్ చేశారు. ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో తొమ్మిదో తరగతి విద్యార్థులకు వర్క్షీట్ల తయారీ, పదోతరగతి విద్యార్థులకు పరీక్షలపై ఒత్తిడి తగ్గించడానికి ఎస్సీఈఆర్టీ రూపొందించిన జీవశాస్త్ర అభ్యసన దీపికల్లో పాల్గొన్నారు. జీవశాస్త్ర శిక్షణ, అభ్యసనఫలితాలకు సంబంధించి 2016–19, 2020–21 సంవత్సరాల్లో రాష్ట్రస్థాయి సెమినార్లలో పాల్గొన్నారు. కోవిడ్ సమయంలో యూట్యూబ్ చానల్ ద్వారా 50 వీడియోలు రూపొందించి వాట్సాప్ ద్వారా విద్యార్థులకు అందించారు. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ యూట్యూబ్ చానల్ ద్వారా పదో తరగతి విద్యార్థుల కోసం సైన్స్ అండ్ టెక్నాలజీ, హోమ్సైన్స్ పాఠాలు బోధించారు. అందుకున్న అవార్డులు ఇవే... 2019లో అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా ఉత్తమ టీచర్ అవార్డు. ఠి 2021లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు. ఠి టెక్ మహీంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం నిర్వహించిన సైన్స్ ఉపాధ్యాయ పోటీల్లో ట్రాన్స్ఫారి్మంగ్ అవార్డు. ఠి 2023లో నేషనల్ సైన్స్ డే సందర్భంగా సారాబాయి టీచర్ సైంటిస్ట్ నేషనల్ అవార్డును జమ్మూకాశీ్మర్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ రవిశంకర్ చేతుల మీదుగా అందుకున్నారు. ఠి 2023–24లో రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు పొందారు. ఠి ప్రస్తుతం (2025) జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. -
చివరి చూపునకూ నోచుకోకపోతిమి బిడ్డా..
వికారాబాద్ జిల్లా: భర్త చేతిలో కిరాతకంగా హత్యకు గురైన ఐదు నెలల గర్భిణి స్వాతి అంత్యక్రియలను సోమవారం రాత్రి స్వగ్రామంలో నిర్వహించారు. రాత్రి 10:30 గంటలకు అంబులెన్స్లో హైదరాబాద్ నుంచి వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చేరుకున్న స్వాతి మృతదేహాన్ని (శరీరభాగాల మూట) నేరుగా గ్రామంలోని శ్మశానవాటికకు తరలించారు. ఆ మూటను విప్పకుండా అలాగే చితిపై పెట్టి నిప్పంటించారు. తండ్రి రాములు కూతురుకు తలకొరివి పెట్టారు. చివరి చూపునకు కూడా నోచుకోలేకపోతిమి బిడ్డా.. అంటూ కుటుంబ సభ్యులు చేసిన రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. భారీ పోలీసు బందోబస్తు మధ్య స్వాతి అంత్యక్రియల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇదిలా ఉండగా నిందితుడు మహేందర్రెడ్డి తరఫు వారెవరూ శ్మశానవాటిక వద్దకు రాలేదు. నిందితుడి ఇంటి వద్ద మృతురాలి బంధువుల ఆందోళన వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన మహేందర్రెడ్డి అదే గ్రామానికి చెందిన స్వాతిని కులాంతర ప్రేమ వివాహం చేసుకుని, అనుమానంతో హత్య చేసిన విషయం తెలిసిందే. దీంతో నిందితుడి తల్లిదండ్రులు ఆదివారమే ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. కాగా, స్వాతి అంత్యక్రియలను మహేందర్రెడ్డి కుటుంబ సభ్యులే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆమె బంధువులు నిందితుడి ఇంటి ఎదుట టెంట్ వేసుకుని ఆందోళన చేపట్టారు. అయితే ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భయాందోళనలో ఉన్న నిందితుడి తల్లిదండ్రులు గ్రామానికి వచ్చేందుకు భయపడటంతో గ్రామ పెద్దలు కలి్పంచుకుని స్వాతి తల్లిదండ్రులను శాంతింపజేసి.. అంత్యక్రియలు నిర్వహించేలా ఒప్పించారు.స్వాతి శరీర భాగాలకోసం కొనసాగుతున్న గాలింపు మరో పక్క బోడుప్పల్ ఈస్ట్ బాలాజీహిల్స్ కాలనీలో జరిగిన స్వాతి హత్యకేసులో శరీర భాగాల కోసం ప్రతాప సింగారం మూసీకాలువలో రెండో రోజు సోమవారం కూడా డీఆర్ఎఫ్ బృందాలు బోట్లతో గాలింపు కొనసాగించాయి. సుమారు 10 కిలోమీటర్ల మేర వెతికినా మృతురాలి శరీర భాగాలు దొరకలేదని మేడిపల్లి పోలీసులు తెలిపారు. -
అదే కోటా... అదే తీర్మానం?
సాక్షి, హైదరాబాద్: ‘మరో 15 రోజుల్లో కోదండరాంను ఎమ్మెల్సీని చేస్తా. ఎవరు ఆపుతారో చూస్తా’అంటూ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. కోదండరాంతోపాటు కాంగ్రెస్ నేత ఆమేర్ అలీఖాన్ల శాసనమండలి సభ్యత్వాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో సీఎం చెప్పినట్లు మళ్లీ కోదండరాంను ఎలా ఎమ్మెల్సీ చేస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. అయితే మళ్లీ గవర్నర్ కోటాలో, రాష్ట్ర మంత్రివర్గ తీర్మానంతోనే ఆయన్ను మరోసారి ఎమ్మెల్సీ చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారని.. అందుకే ఆయనకు పదవిపై ఘంటాపథంగా మాట్లాడారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సుప్రీం ఏమంటుందో? గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమితులైన ప్రొఫెసర్ కోదండరాం, ఆమేర్ అలీఖాన్లను అనర్హులుగా ప్రకటిస్తూ ఈ నెల 13న సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చింది. దీంతో వారు పదవులను కోల్పోవాల్సి వచ్చింది. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ సోమవారం ఓయూలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారుడికి తాము పదవి ఇస్తే పెద్దపెద్ద లాయర్లను పెట్టి కుట్రలు చేసి దింపేయాలని ప్రయత్నాలు చేశారని చెప్పారు. మళ్లీ ఆయన్ను ఎమ్మెల్సీని చేస్తానని ప్రకటించారు. దీనివెనుక గట్టి నిర్ణయమే ఉందని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. కోదండరాంను మళ్లీ ఎమ్మెల్సీగా పంపేందుకు పార్టీ అధిష్టానం కూడా గ్రీన్సిగ్నల్ ఇచి్చందని, గవర్నర్ కోటాలో మళ్లీ కేబినెట్ ఆయన పేరును సిఫారసు చేస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే సుప్రీంకోర్టు వచ్చే నెల 17న ఈ కేసుపై తదుపరి విచారణ చేపట్టనున్న నేపథ్యంలో ఈ నెల 29న జరిగే కేబినెట్లో తీర్మానం చేస్తారా లేక సెపె్టంబర్ 17న సుప్రీం ఏం చెబుతుందో పరిశీలించి ఆ తర్వాత జరిగే కేబినెట్లో ఆమోదిస్తారా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉందంటున్నాయి. గవర్నర్ కోటాలో మళ్లీ నామినేట్ చేసేందుకు ఆ ఇద్దరూ ప్రాతినిధ్యం వహించిన స్థానాలను మండలి వర్గాలు ఖాళీగా చూపిన తర్వాత ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుందని.. నోటిఫికేషన్ వచ్చాకే కేబినెట్ తీర్మానం చేస్తుందని.. అప్పటికి కేసు పెండింగ్లో ఉన్నా కోదండరాం పేరును మళ్లీ సిఫార్సు చేసేందుకు సుప్రీంకోర్టే వెసులుబాటు ఇచ్చినందుకు ఇబ్బందులేవీ ఉండవని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. అయితే కోదండరాంను ఒక్కరినే మళ్లీ గవర్నర్ కోటాలో నామినేట్ చేస్తారా లేక ఆమేర్అలీఖాన్ పేరునూ జతచేస్తారా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. -
జలాశయాలకు జలకళ.. చెరువులు వెలవెల..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో జలాశయాలు జలకళ సంతరించుకోగా, చెరువులు మాత్రం వెలవెలబోతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 34,701 చెరువులుండగా, 12,701 చెరువులు మాత్రమే పూర్తి స్థాయి లో నిండి అలుగుపోస్తున్నాయి. మరో 10,240 చెరువులు 75–100% వరకు నిండి జలకళను సంతరించుకున్నాయి. మిగిలిన చెరువుల్లో 5,682 చెరువులు 50–75%, 3,302 చెరువులు 25–50% నిండగా, 2,816 చెరువులు 0–25 శాతమే నిండాయి. చెరువుల్లో నిల్వలపై నీటిపారుదల శాఖ తాజాగా రూపొందించిన ఓ నివేదికలో ఈమేరకు వెల్లడించింది. జలవనరుల సమర్థ నిర్వహణ, పర్యవేక్షణ కోసం నీటిపారుదల శాఖ నిర్వహిస్తున్న ఇరిగేషన్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ (ఐడీఎస్సీ) డ్యాష్ బోర్డుకి ఇప్పటివరకు రాష్ట్రంలోని 21,500 చెరువులను మ్యాపింగ్ చేశారు. వాటి మొత్తం నిల్వ సామర్థ్యం 253.8 టీఎంసీలు కాగా, 119.23 టీఎంసీల నిల్వలు (47శాతం) కలిగి ఉన్నాయి. ఈ చెరువులు మొత్తం 3098.85 చదరపు కి.మీ. ప్రాంతంలో విస్తరించి ఉండగా, 1321.44 చ.కి.మీ. ప్రాంతాని(42.6శాతం)కే నీటి నిల్వలు పరిమితమయ్యాయి. నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లో కరువే.. గత ప్రభుత్వం నీటిపారుదల శాఖను 19 ప్రాదేశిక ఈఎన్సీలు/చీఫ్ ఇంజనీర్లుగా విభజించింది. శాఖ నివేదిక ప్రకారం రాష్ట్రంలో గజ్వేల్ ఈఎన్సీ పరిధిలో అత్యధిక చెరువులు పూర్తిగా నిండి మత్తడి దూకుతున్నాయి. గజ్వేల్, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో వానాకాలం ముగిసేలోగా కురవనున్న వర్షాలతో చెరువులు పూర్తిగా నిండే అవకాశం ఉంది. అయితే, చెరువుల్లో నీటి నిల్వలపరంగా అత్యంత కరువు పరిస్థితులు నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లో ఉన్నాయి. నల్లగొండ సీఈ పరిధిలో 1628 చెరువులుండగా, కేవలం 183 చెరువులే పూర్తిగా నిండాయి. పొరుగునే ఉన్న సూర్యాపేట, కొత్తగూడెం జిల్లాల్లో పరిస్థితి మెరుగ్గానే ఉంది. నిజామాబాద్ సీఈ పరిధిలో 997 చెరువులుండగా, 55 చెరువులే పూర్తిగా నిండాయి. జలాశయాల్లో 75% నిల్వలు రాష్ట్రంలో కృష్ణా, గోదావరి పరీవాహకంలో మొత్తం 1069.34 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో 87 జలాశయాలుండగా, సోమవారం నాటికి 802.92 టీఎంసీల (75శాతం) నిల్వలున్నాయి. ఎగువ నుంచి రెండు నదులకూ వరదలు కొనసాగుతుండటంతోపాటు ప్రస్తుత వానాకాలం ముగిసేలోగా మరికొన్ని దఫాలు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో జలాశయాలు 100శాతం నిండే అవకాశం ఉంది. పరీవాహక ప్రాంతాల వారీగా చూస్తే గోదావరి పరిధిలో 419.81 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో 57 జలాశయాలుండగా, ప్రస్తుతం 223.67 టీఎంసీలకు నిల్వలు చేరాయి. కృష్ణా పరిధిలో 649.53 టీఎంసీల సామర్థ్యంతో 30 జలాశయాలుండగా, నిల్వలు 579.25 టీఎంసీలకు చేరాయి. జలాశయాలు, చెరువులు కలిపి మొత్తం 1323.14 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉండగా, ప్రస్తుతం 922.15 టీఎంసీలకు నిల్వలు చేరాయి. -
డ్రైవర్ ఆవలిస్తే అలర్ట్ చేస్తుంది!
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదాలను నివారించే ఉద్దేశంతో తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో దేశంలో మరే రోడ్డు రవాణా సంస్థల్లో లేని సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేçయనున్నారు. ఎదురుగా రోడ్డుపై ప్రమాదం పొంచి ఉన్నా, డ్రైవర్ అప్రమత్తంగా లేక ప్రమాదానికి కారణం అయ్యేలా ఉన్నా, చివరకు డ్రైవర్ ఆవలించినా ఈ వ్యవస్థ అప్రమత్తం చేస్తుంది. తద్వారా డ్రైవర్ ప్రమా దాన్ని తప్పించేలా చేస్తుంది. ఒకవేళ అప్రమత్తం చేసిన తర్వాత కూడా డ్రైవర్ నిర్లక్ష్యం కొనసాగుతుంటే.. ఆర్టీసీ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఫోన్ కాల్ ద్వారా మరోసారి అప్రమత్తం చేస్తుంది. డ్రైవర్ మానిటరింగ్ సిస్టం (డీఎంఎస్), అడ్వాన్స్డ్ డ్రైవర్ అలర్ట్ సిస్టం (ఏడీఏఎస్)..అనే ఈ రెండింటితో కూడిన వ్యవస్థ కృత్రిమ మేధ (ఏఐ) ఆధారంగా పని చేస్తుంది. ప్రయోగాత్మకంగా తొలుత 200 బస్సుల్లో దీనిని ఏర్పాటు చేయనున్నారు. ఫలితాలను విశ్లేషించిన తర్వాత అన్ని దూరప్రాంత సర్వీసుల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం టెండర్లు పిలవగా 4 సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. వాటిల్లో రెండింటిని తిరస్కరించిన ఆర్టీసీ.. మిగతా రెండింటి సాంకేతిక పనితీరును పరిశీలిస్తోంది. ఇప్పటికే ఒక్కో సంస్థ రెండు చొప్పున బస్సుల్లో ఈ పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేసి ట్రయల్ ప్రారంభించాయి. వీటిల్లో మెరుగైన సాంకేతికతను అందించే సంస్థతో ఆర్టీసీ ఒప్పందం చేసుకోనుంది. ఆ వెంటనే 200 బస్సుల్లో ఈ వ్యవస్థ ఏర్పాటు కానుంది. ఎప్పటికప్పుడు బీప్ శబ్దాలతో.. ఎంపిక చేసిన బస్సుల్లో ముందువైపు రెండు ప్రత్యేక సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. ఇందులో ఒకటి డ్రైవర్ను, మరోటి రోడ్డును పరిశీలిస్తుంటాయి. అయితే ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉంటాయి. రోడ్డును పరిశీలించే కెమెరా ఏడీఏఎస్తో అనుసంధానమై ఉంటుంది. రోడ్డుపై ఉన్నట్టుండి వ్యక్తులు, వాహనాలు అడ్డుగా వచ్చినప్పుడు వెంటనే డ్యాష్బోర్డుపై ఉండే సిస్టం నుంచి బీప్ శబ్దం వెలువడుతుంది. డ్రైవర్ను అప్రమత్తం చేస్తుంది. డ్రైవర్ వేగంతో ప్రమేయం లేకుండా రోడ్డు లేన్ను నిర్లక్ష్యంగా మార్చినా, వరసగా ఆవలిస్తున్నా, నిద్రమత్తులో ఉన్నా, తరచూ రెప్ప వాలుస్తున్నా కూడా బీప్ అలర్టులు వస్తాయి. బస్సు నడుపుతూ ఇతరులతో ముచ్చటిస్తున్నా, సెల్ఫోన్లో మాట్లాడుతున్నా, ఇయర్ ఫోన్లు పెట్టుకుని మాట్లాడుతున్నా కూడా అలెర్ట్ చేస్తుంది. ఇక డీఎంఎస్తో అనుసంధానమై ఉండే రెండో కెమెరా డ్రైవర్ను పరిశీలిస్తుంటుంది. ఈ కెమెరా ద్వారా డ్రైవర్ బస్సు నడుపుతున్న తీరును రియల్ టైమ్లో చూసే వీలు అధికారులు, సిబ్బందికి కలుగుతుంది. ఇది బస్భవన్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానమై ఉంటుంది. డ్రైవర్ నిర్లక్ష్యం కొనసాగుతుంటే, కమాండ్ కంట్రోల్ సెంటర్ సిబ్బందిని ఈ వ్యవస్థ అప్రమత్తం చేస్తుంది. ఆ వెంటనే సిబ్బంది డ్రైవర్కు ఫోన్ చేసి అప్రమత్తం చేస్తారు. అధికారి సెల్ఫోన్తోనూ అనుసంధానం డీఎంఎస్ పంపే రియల్ టైమ్ ఫీడ్ను నేరుగా సంబంధిత అధికారి సెల్ఫోన్తో కూడా అనుసంధానిస్తారు. తద్వారా ఆ అధికారి డ్రైవర్ బస్సును నడుపుతున్న తీరును పరిశీలించొచ్చు, అవసరమైతే ఆయనే నేరుగా డ్రైవర్కు ఫోన్చేసి అప్రమత్తం చేయొచ్చు. పరిహార భారం నుంచి విముక్తి! బస్సులకు సంబంధించిన రోడ్డు ప్రమాదాల్లో కొన్ని డ్రైవర్ తప్పిదం వల్ల జరుగుతుంటే, మరికొన్ని ఇతర వాహన డ్రైవర్ల తప్పిదాలతో జరుగుతున్నాయి. అలాంటప్పుడు మృతులు, బాధితుల కుటుంబాలకు ఆర్టీసీ భారీ ఎత్తున పరిహారం అందిస్తోంది. సాలీనా రూ.80 కోట్ల వరకు చెల్లిస్తోంది. ఇది ఆర్టీసీకి పెద్ద భారంగా మారింది. అయితే చాలా సందర్భాల్లో ఆర్టీసీ డ్రైవర్ తప్పు లేనప్పటికీ, ఆర్టీసీ పరిహారం చెల్లిస్తోంది. ప్రమాదాలకు సంబంధించి సరైన సాక్ష్యాధారాలు లేకపోవటంతో ఇది జరుగుతోంది. ఇప్పుడు అడ్వాన్స్డ్ డ్రైవర్ అలర్ట్ సిస్టం వల్ల ప్రమాదానికి కారణాలు స్పష్టంగా తెలుస్తాయి. ఇది ఆర్టీసీపై అనవసర భారం పడకుండా ఉపయోగపడుతుంది. ప్రమాదాలు నివారిస్తే సంస్థ పురోగతికి, కొత్త బస్సుల కొనుగోలుకు ఆ నిధులను వినియోగించేందుకు వీలుంటుంది. -
కొన్నోళ్లే కన్నోళ్లు!
సాక్షి, న్యూఢిల్లీ: ‘కొనుగోలు చేసిన తల్లిదండ్రులకే ఆ పిల్లలను తిరిగి ఇచ్చేయండి’ అంటూ సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దత్తత పేరుతో పిల్లలను తీసుకుని పెంచిన ఆ తల్లిదండ్రులది కడుపుకోతనే అని చెప్పింది. పిల్లలను కొనుగోలు చేసిన తల్లిదండ్రులకే ఇవ్వమని కొద్దిరోజుల క్రితం ఆదేశాలు జారీ చేసినా.. ఇవ్వకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను పాటించకపోతే కోర్టు ధిక్కరణ ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులను హెచ్చరించింది. మంగళవారం ఉదయం 11 గంటలకల్లా పిల్లలను ఆ తల్లిదండ్రులకు అప్పగించాలని ఆదేశిస్తూ.. సెప్టెంబర్ 2న వర్చువల్గా సంబంధిత అధికారులంతా తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. హైకోర్టు నుంచి సుప్రీం కోర్టుకు..: తమ పిల్లల్ని తమకు ఇవ్వాలని కొనుగోలు చేసిన 9 మంది తల్లిదండ్రులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో కొనుగోలు చేసిన తల్లిదండ్రులకు అనుకూలంగా సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ.. మాతా, శిశు సంక్షేమ శాఖ డివిజన్ బెంచ్కు అప్పీల్కు వెళ్లింది. ఇందులో డివిజన్ బెంచ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో గత ఫిబ్రవరిలో పిల్లలను కొనుగోలు చేసిన దాసరి అనిల్ కుమార్ కుటుంబంతోపాటు మరో ముగ్గురు దంపతులు సుప్రీంకోర్టులో అప్పీల్చేశారు. ఈ పిటిషన్లపై సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం.. కొనుగోలు చేసిన తల్లిదండ్రులకే 14వ తేదీలోగా పిల్లల్ని ఇవ్వాలని ఈ నెల 12న తుది తీర్పును వెలువరించింది. అయితే, సుప్రీం తీర్పును అధికార యంత్రాంగం పాటించడం లేదంటూ ఆ తల్లిదండ్రులు ఈనెల 18న ధిక్కరణ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను సోమవారం జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. తాము ఇటీవల ఇచ్చిన తీర్పును అమలు చేయకపోవడంపై జస్టిస్ నాగరత్న అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈరోజు (సోమవారం) సాయంత్రం 5 గంటల లోపు కొనుగోలు చేసిన తల్లిదండ్రులకు పిల్లలను ఇచ్చేయాలని ధర్మాసనం అధికారులను ఆదేశించింది. అయితే, తమకు మంగళవారం ఉదయం 11గంటల వరకు సమయం ఇవ్వాలని ప్రభుత్వం తరపు ఏఎస్జీ కోరారు. ‘సరే ఈ ఒక్కసారికి అవకాశమిస్తున్నాం, మంగళవారం ఉదయం 11గంటలకల్లా తల్లిదండ్రుల చేతిలో ఆ పసికందులు ఉండాలి’అని జస్టిస్ నాగరత్న ఆదేశించారు. ఇదిలాఉండగా.. సోమవారం సాయంత్రంలోపే పిల్లలను ఆ తల్లిదండ్రులకు అధికారులు అప్పగించడం గమనార్హం. ఇదీ జరిగింది.. గత ఏడాది మేలో మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో పిల్లల అక్రమ రవాణా, విక్రయం వ్యవహారం బట్టబయలైంది. మహిళా ఆర్ఎంపీ ఈ తతంగాన్ని నడుపుతున్నట్లు గుర్తించి పోలీసులు 11 మందిని అరెస్ట్చేశారు. వారు మొత్తం 16 మంది చిన్నారులు (నలుగురు మగ, 12 మంది ఆడ పిల్లల్ని) అమ్మినట్లు గుర్తించారు. ఏడుగురు చిన్నారులను అమ్మకం దశలోనే పట్టుకోగా, మరో 9 మందిని కొనుగోలు చేసిన తల్లిదండ్రుల నుంచి తీసుకొని మాతా, శిశు సంక్షేమ శాఖకు అప్పగించారు. వీరిని సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ (కారా) ద్వారా ప్రభుత్వం దత్తత ప్రక్రియలో పెట్టింది. వీరిలో అమ్మకం దశలో దొరికిన ఆరుగురు చిన్నారులను పేరెంట్స్ దత్తత తీసుకున్నారు. అలాగే కొనుగోలు చేసిన తల్లిదండ్రుల నుంచి తీసుకొచ్చిన 9 మంది చిన్నారులను కూడా పిల్లలు లేని తల్లిదండ్రులు ఎంపిక చేసుకొని, తదుపరి రోజు తీసుకోవాల్సి ఉండగా, హైకోర్టు ఆదేశాలతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. అప్పటి నుంచి ఈ కేసు కొనసాగుతోంది. ఇందులో నలుగురు మాత్రమే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరికి మాత్రమే తాజా తీర్పు వర్తిస్తుందని జస్టిస్ నాగరత్న స్పష్టం చేశారు. మిగిలిన ఐదుగురికి సంబంధించిన కేసు ఈ నెల 28న హైకోర్టు ముందుకు రానుంది. -
‘కోటా’ చిక్కుముడి విప్పేదెలా?
సాక్షి, న్యూఢిల్లీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలుపై చట్టపరంగా ఎదురయ్యే చిక్కుముళ్లను విప్పేందుకు మంత్రుల బృందం పార్టీ పెద్దలు, న్యాయ నిపుణులతో భేటీ అయింది. రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఆమోదించిన రెండు బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్లోనే ఉన్నందున దీనిని చట్టపరిధిలో పరిష్కరించే మార్గాలపై సమాలోచనలు చేసింది. ఒకవేళ జీవోలు ఇస్తే ఎదురయ్యే సవాళ్లు, దీనిని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన కార్యాచరణ, కులగణన ద్వారా వచ్చిన ఎంపిరికల్ డేటాను న్యాయవ్యవస్థల ముందుంచే అంశాలపై క్షుణ్ణంగా చర్చించింది. 50శాతానికి మించి రిజర్వేషన్లు అమలవుతున్న రాష్ట్రాలు, వాటిపై గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పులు, రాజ్యాంగ నిబంధనలన్నింటిపైనా చర్చలు జరిపింది. రిజర్వేషన్లపై మార్గాన్వేషణ: 42 శాతం రిజర్వేషన్ల అమలు అంశంపై ఏర్పాటైన మంత్రుల కమిటీ సభ్యులు భట్టి విక్రమార్క, ఉత్తమ్కుమార్రెడ్డి, శ్రీధర్బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్ సోమవారం ఢిల్లీలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్రెడ్డి, సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో గంటపాటు భేటీ అయ్యారు. ఇప్పటికే విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ ఆమోదించిన రెండు బిల్లులు రాష్ట్రపతి కోసం వేచి చూస్తున్న విషయాలతోపాటు, 2018లో చంద్రశేఖర్ రావు రిజర్వేషన్లను 50శాతానికి పరిమితి చేస్తూ చేసిన చట్టాన్ని తొలగించాలన్న ఆర్డినెన్స్పైనా చర్చించారు. ఈ బిల్లుల ఆధారంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 263 ప్రకారం బీసీ రిజర్వేషన్లను 42శాతానికి పెంచుతూ జీవో ఇవ్వడమా?, ఇస్తే ఈ ఉత్తర్వుల అమలును ఇతరులెవరూ కోర్టుకు వెళ్లి అడ్డుకోకుండా ముందుగానే కేవియట్ దాఖలు చేయడమా? అన్న అంశాలపై మంత్రులు సమాచాలోచనలు చేశారు. ఒకవేళ కోర్టులు అభ్యంతరం చెబితే కులగణన సర్వే ద్వారా సేకరించిన డేటాతో బీసీల జనాభా, వెనకబాటుతనాన్ని నిరూపించే అవకాశాలపైనా చర్చించారు. ఇప్పటికే 10శాతం ఈడబ్ల్యూస్ రిజర్వేషన్ల కోసం చేసిన 103వ రాజ్యాంగ సవరణతో విద్య, ఉద్యోగాల్లో మొత్తం రిజర్వేషన్లు 50శాతం దాటడాన్ని సుప్రీంకోర్టు సమర్ధించిన దృష్ట్యా, సర్వే డేటాలోని అంశాలు తమకు కలిసి వస్తాయనే అభిప్రాయం వ్యక్తమైంది. 50 శాతం రిజర్వేషన్లు దాటితే సమానత్వపు హక్కు ఉల్లంఘన జరిగినట్లేనని, అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే 50శాతం పరిమితిని దాటవచ్చని సుప్రీంకోర్టు.. గతంలో మరాఠాల రిజర్వేషన్లపై తీర్పుఇచ్చిన నేపథ్యంలో ఎంపిరికల్ డేటాను ఎంతవరకు ప్రామాణికంగా చూపవచ్చనే అంశంపైనా చర్చించారు. హైకోర్టు విధించిన గడువు సెపె్టంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితుల్లో అదనపు గడువు కోరే అవకాశాలపైనా చర్చలు జరిగాయి. అయితే ఈ నెల 29న జరిగే కేబినెట్ భేటీలో చర్చించి తుది నిర్ణయం చేయనున్నారు. నేడు బిహార్కు సీఎం, మంత్రులు రానున్న బిహార్ ఎన్నికలకు ముందు జాతీయ ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడుతోందంటూ ఏఐసీసీ అగ్రనేత తలపెట్టిన ‘ఓటర్ అధికార్ యాత్ర’లో మంగళవారం సీఎం రేవంత్రెడ్డితోపాటు మంత్రులు పాల్గొననున్నారు. ఓట్ల చోరీపై రాహుల్ చేస్తున్న పోరాటానికి రాష్ట్ర నేతలు సంఘీభావం తెలపనున్నారు. రోడ్షోలో ఏఐసీసీ అగ్రనేత ప్రియాంకగాంధీ సైతం పాల్గొనే అవకాశాలున్నాయి. -
ఆక్స్ఫర్డ్లా ఓయూ!: సీఎం రేవంత్
ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వ వైభవానికి కృషి చేద్దామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. ఆక్స్ఫర్డ్, స్టాన్ఫర్డ్ వర్సిటీల మాదిరి తీర్చిదిద్దుదామని అన్నారు. ఓయూను అన్ని విధాలుగా అభివృద్ధి పరిచేందుకు ఇంజనీర్ల కమిటీని నియమించాలని అధికారులను ఆదేశించారు. ఓయూకు ఎంత ఇచ్చినా తక్కువేనంటూ, ఏమేమి కావాలో ప్రణాళికను తయారు చేయాలని సూచించారు. డిసెంబర్లో ఆర్ట్స్ కాలేజీ ఎదుట సభ ఏర్పాటు చేస్తే వస్తానని, అధ్యాపక ఉద్యోగాల సమస్యతో పాటు అన్ని సమస్యల పరిష్కారానికి అక్కడే వెంటనే జీవోలు జారీ చేయిస్తానని చెప్పారు. సోమవారం యూనివర్సిటీ క్యాంపస్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో కలిసి ఆయన పర్యటించారు. వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించిన పీజీ విద్యార్థుల దుందుభి, ఇంజనీరింగ్ విద్యార్థుల భీమా హాస్టల్ భవనాలను సీఎం ప్రారంభించారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ నిధులతో నిర్మించనున్న మరో రెండు హాస్టల్ భవనాలకు, రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించే డిజిటల్ లైబ్రరీ రీడింగ్ రూంలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఠాగూర్ ఆడిటోరియంలో వీసీ ప్రొఫెసర్ కుమార్ అధ్యక్షతన జరిగిన సదస్సులో ‘తెలంగాణ విద్యా రంగంలో రావాల్సిన మార్పులు, ప్రభుత్వ ప్రణాళిక’ అనే అంశంపై ప్రసంగించారు. ఓయూ విశిష్టతను, ఉద్యమాల చరిత్రను వివరించారు. తెలంగాణ ఉద్యమంలో ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి, యాదయ్య, ఇషాంత్రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి తదితర విద్యార్థులను స్మరించుకున్నారు. ఓయూ అంటేనే తెలంగాణ ‘ఓయూ అంటేనే తెలంగాణ. రెండింటి మధ్య విడదీయలేని సంబంధం ఉంది. 1935లో వందేమాతరం, 1938లో సాయుధ రైతాంగ పోరాటం, తెలంగాణ తొలి దశ, మలిదశ ఉద్యమాల్లో ఓయూ విద్యార్థుల పాత్ర కీలకం. మలి దశ తెలంగాణ ఉద్యమం విద్యార్థుల ఆత్మ బలిదానాలతోనే విజయం సాధించింది. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్, మర్రి చెన్నారెడ్డి, జార్జిరెడ్డి, జైపాల్రెడ్డి, గద్దర్ తదితరులను అందించిన ఘనత ఓయూది. చదువుతో పాటు తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు విద్యార్థులు ఎదిరించి పోరాడారు. యువతే దేశ సంపద. 21 ఏళ్లకు ఐఏఎస్లు, ఐపీఎస్లు అవుతున్నారు. యువకులు రాజకీయాల్లోకి ప్రవేశించి ఎమ్మెల్యేలు కావాలి..’ అని సీఎం ఆకాంక్షించారు. నేనూ మీలో ఒకడినే.. ఓయూలో 60 ఏళ్లకు పైబడిన పాత భవనాలు ఉన్నాయని, కొత్త భవనాల నిర్మాణం, 2,500 మందికి సరిపడ కన్వెన్షన్ హాల్, ఇతర అవసరాలకు నిధులు మంజురు చేయాలని వీసీ కుమార్ చేసిన విజ్ఞప్తిపై స్పందిస్తూ..ఇంజినీర్ల కమిటీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ‘ప్రజలకు పంచేందుకు భూములు లేవు.. ఇచ్చేందుకు డబ్బులు లేవు. నాణ్యమైన విద్యను మాత్రమే ఇవ్వగలం. ఈ సంవత్సరం విద్యకు రూ.40 వేల కోట్లు వెచ్చించనున్నాం. విద్యార్థులు బాగా చదువుకోవాలి. ఓయూలోనే చదివిన దయాకర్ ఎమ్మెల్సీ అయ్యాడు, బాలలక్ష్మీ, చారకొండ వెంకటేష్ ప్రభుత్వంలో భాగస్వాములయ్యారు. నేనూ మీలో ఒకడినే. తెలంగాణలోనే పుట్టా..ఇక్కడే పెరిగా. ఇక్కడే చదువుకున్నా. జెడ్పీటీసీ సభ్యుడు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ అయ్యా. మీరు చేస్తేనే సీఎం కూడా అయ్యా. మంత్రులు, ఎమ్మెల్యేలు మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. అపోహలకు, అబద్ధాల సంఘాలకు నమ్మి మోసపోకండి. డిసెంబర్లో ఒక పోలీసు కూడా లేకుండా ఆర్ట్స్ కాలేజీ ఎదుట సభను ఏర్పాటు చేయండి. నా రాకను అడ్డుకునేవారు అడిగే అన్ని ప్రశ్నలకు జవాబు చెబుతా..’ అని రేవంత్ పేర్కొన్నారు. కేసీఆర్, కేటీఆర్లకు అభివృద్ధి కన్పించడం లేదు.. ‘పొలిటికల్ జేఏసీ చైర్మన్గా తెలంగాణ కోసం పోరాడిన ప్రొ.కోదండరాం ఎమ్మెల్సీ పదవిని బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్డు వరకు వెళ్లి రద్దు చేయించి పైశాచిక ఆనందం పొందారు. ఆయన్ను 15 రోజుల్లో తిరిగి ఎమ్మెల్సీని చేస్తాం. హెచ్సీయూ భూముల్లో ఏఐ టెక్నాలజీతో ఏనుగులు, సింహాలు పెట్టారు. తెలంగాణలో సింహాలు, ఏనుగులు లేవు.. మానవ మృగాలే ఉన్నాయి. తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దినా కేసీఆర్, కేటీఆర్కు కనిపించడం లేదు. నాపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ అంతానికి ఈగల్ ఫోర్సును, అక్రమ కట్టడాల నిర్మూలనకు హైడ్రాను ఏర్పాటు చేస్తే బీఆర్ఎస్ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. మరోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఓయూ భూములను ప్లాట్లు చేసి అమ్ముకుంటారు..’ అని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. సీఎం రీసెర్చ్ ఫెలోషిప్లు ప్రారంభం ఓయూలో 2025–26 విద్యా సంవత్సరం నుంచి ప్రవేశపెట్టిన సీఎం రీసెర్చ్ ఫెలోషిప్ను, విదేశాలలో పరిశోధనలకు వెళ్లే పీజీ, పీహెచ్డీ విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన ఫెలోషిప్ను సీఎం ప్రారంభించారు. విద్యార్థుల పరిశోధనలకు.. సింగరేణి కాలరీస్, ఓయూ, ప్రభుత్వం, హెచ్ఎండీఏ ఆర్థిక సహకారంతో ఈ ఫెలోషిప్లు అందజేయనున్నట్లు తెలిపారు. నెలకు రూ.5 వేల చొప్పున చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ను ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమాల్లో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, కాలేజీ విద్య కమిషనర్ శ్రీదేవసేన, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్, తదితర నేతలతో పాటు పలువురు ఓయూ అధికారులు పాల్గొన్నారు. -
సార్.. మమ్ముల్ని ఉపయోగించుకోండి.. మీ వెనకాలే ఉంటాం: ఎంపీ అరవింద్
నిజామాబాద్: బీజేపీలో కొత్త వారిని చేర్చుకోవాల్సిన అవశ్యకత ఉందని ఎంపీ ధర్మపురి అరవింద్ అభిప్రాయం వ్యక్తం చేశారు. నిజామాబాద్ అంటేనే బీజేపీ బలంగా ఉన్న పార్లమెంట్.. రామ్ చందర్ రావు విద్యావేత్త కాబట్టి ఆయనకు అభద్రతా భావం ఉండదన్నారు. ఈరోజు(సోమవారం, ఆగస్టు 25) నిజామాబాద్లో జరిగిన బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ.. ‘ పార్టీలో కొత్త వారిని చేర్చుకోండి. సార్.. మీరు మమ్మల్ని ఉపయోగించుకోండి. మేము మీ వెనకాలే ఉంటాం. నిజామాబాద్ అంటేనే బీజేపీ బలంగా ఉన్న పార్లమెంట్. రాష్ట్ర పార్టీలో జాయినింగ్ పెంచి పార్టీనీ బలోపేతం చేసే బాధ్యత రామచంద్ర రావుపై ఉంది. రాకేష్ రెడ్డి గెలిచే వ్యక్తి అని ఆనాడే పార్టీ పెద్దలకు నేను చెప్పి కాషాయ పార్టీలో జాయిన్ అవ్వాలని ఇన్వైట్ చేశా. పార్టీలో చేరాలని రాకేష్ రెడ్డి కుటుంబంతో సహా ఢిల్లీ వచ్చారు. ఆయన మర్డర్ చేశాడని ఎవరో అప్పటి జనరల్ సెక్రటరీకి కంప్లైంట్ చేశారంట. దీంతో ఆయన చేరిక ఆ రోజు ఆగింది. మళ్లీ వారు ఎంక్వైరీ చేస్తే రాకేష్ రెడ్డిపై ఎటువంటి మర్డర్ కేసు లేదని తేలింది. ఆనాడు MLA రాకేష్ రెడ్డి జాయినింగ్ ను కొంత మంది అడ్డుకునే కుట్ర చేశారు. పార్టీని ఎవడి అయ్యా కోసం కాదు.. కార్యకర్తల కొరకు అధికారంలోకి తేవాలి. పార్టీని ఎదగకుండా ఆపే వాడు అంటే నాకు పడదు’ అని పేర్కొన్నారు.ఇదీ చదవండి:మరి మీ ఎంపీలు కూడా ఓట్ చోరీతోనే గెలిచారా?: బీజేపీ -
అభిషేక్ సింఘ్వీతో తెలంగాణ మంత్రుల బృందం భేటీ
న్యూఢిల్లీ: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశానికి సంబంధించి న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటుంది తెలంగాణ ప్రభుత్వ మంత్రుల బృందం. దీనిలో ఈరోఉ(సోమవారం, ఆగస్టు 25వ తేదీ) ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ మంత్రులు.. కాంగ్రెస్ ఎంపీ, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీతో సమావేశమయ్యారు. దీనిలో భాగంగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ‘ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశంపై అభిషేక్ సింగ్వితో తెలంగాణ మంత్రుల బృందం చర్చలు జరిపింది. న్యాయ కోవిదుడు అభిషేక్ సింగ్వి సలహాలు తీసుకున్నాం. ఈ అంశంపై అధ్యయనం జరిపి ఆయన సలహాలు ఇచ్చారు. హైదరాబాద్ వెళ్లిన తర్వాత క్యాబినెట్కు మా నివేదిక అందజేస్తాం’ అని తెలిపారు. -
‘మోసం చేసిందనిపిస్తే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పండి’
సాక్షి,హైదరాబాద్: కాంగ్రెస్ హామీలపై బీజేపీ ఎంపీలు ఎందుకు మాట్లాడటం లేదని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మాట్లాడారు.ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లేనిపోని హామీ ఇచ్చింది. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ మాటలు నమ్మి ఆగం కావొద్దని ముందే చెప్పాం. అధికారంలోకి 100 రోజుల్లో ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. వాటి సంగతి ఏమైందని ప్రశ్నించారు. రైతు బంధు లేదు,రైతు భీమా లేదు. కాంగ్రెస్ మోసం చేసిందని భావిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పండి ’ అని పిలుపునిచ్చారు. -
మరి మీ ఎంపీలు కూడా ఓట్ చోరీతోనే గెలిచారా?: బీజేపీ
నిజామాబాద్: తెలంగాణలో సైతం ఓట్ చోరీ జరిగిందంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామ్ చందర్ రావు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. మహేష్ కుమార్ ఓట్ చోరీ అంటున్నారు కదా.. ఇది ఓట్ చోరీ కాదు.. రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరీ అంటూ మండిపడ్డారు. ఏ ఓటర్ లిస్టుతో కాంగ్రెస్ అధికారం చేపట్టిందో అదే ఓటర్ లిస్ట్తోనే బీజేపీ కూడా గెలిచిందన్నారు. ఈరోజు(సోమవారం, ఆగస్టు 25) నిజామాబాద్ బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రామ్ చందర్రావు.. కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. ప్రధానంగా లోక్సభ ఎన్నికల్లో ఓట్ చోరీ జరిగిందనే అంశాన్ని ఇక్కడ రామ్ చందర్రావు ప్రస్తావించారు. మరి కాంగ్రెస్ ఎంపీలు సైతం దొంగ ఓట్లతో గెలిచారా? అంటూ ప్రశ్నించారు. ‘ ముస్లింలకు రిజర్వేషన్లు పెంచి బీసీల రిజర్వేషన్లు తగ్గించే కుట్ర కాంగ్రెస్ చేస్తోంది. రాష్ట్రంలో కృత్రిమ యూరియా కొరతకు కాంగ్రెస్ కుట్రలు చేస్తుంది. దీనిపై మంత్రులు , కాంగ్రెస్ పార్టీ నాయకులు, సృష్టిస్తున్న కృత్తిమ కొరత. రాష్ట్రం లో కాంగ్రెస్ నేతలు యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. యూరియా సమస్య పై కాంగ్రెస్ పార్టీ రైతులను రెచ్చ కొడుతుంది. ఓటమి భయం తో.. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం భయ పడుతుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తోడు దొంగలు..ఈ రెండు పార్టీలకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు. పసుపు బోర్డు నిజామాబాద్ లో ఏర్పాటు చేయటం మామూలు విషయం కాదు’ అని రామ్ చందర్ రావు స్పష్టం చేశారు.కాగా, నిన్న(ఆదివారం, ఆగస్టు 24) టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణలోనూ దొంగ ఓట్లున్నాయి.దొంగ ఓట్లతోనే ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గెలిచారు. దొంగ ఓట్లు లేకపోతే బండి సంజయ్ గెలిచేవారు కాదు. బండిసంజయ్ బీసీ కాదు.. దేశ్ముఖ్. కులం మతం లేకపోతే బీజేపీ గెలవదు. దేవుడి పేరుతో మేం ఎన్నడూ ఎన్నికలప్పుడే దేవుడే గుర్తుకొస్తాడు. బీఆర్ఎస్ మూడు ముక్కలైంది.నాల్గవ ముక్క కోసం ఇంకొకరు ఎదురుచూస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్కు తప్ప.. వేరే పార్టీకి అవకాశం లేదు’అని వ్యాఖ్యానించారు. -
భూదాన్ భూములు అన్యాక్రాంతం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా యాచారంలో భూదాన్ భూములు అన్యాక్రాంతమైనట్లు వచ్చిన వార్తలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ నేపథ్యంలో విచారణకు ఆదేశించారు. 250 ఎకరాల భూదాన్ భూముల ఆక్రమణతో పాటు ఔషద పరిశ్రమ భూ సేకరణ కింద పరిహారం పొందిన ఆరోపణలపై వెంటనే విచారణ జరపాలని కోరారు. విచారణ అనంతరం నిజానిజాలపై తనకు నివేదిక అందించాలని రెవెన్యూ సెక్రటరీని ఆదేశించారు. -
‘బండి సంజయ్ సహా బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతో గెలిచారు’
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతో గెలిచారని సంచలన ఆరోపణలు చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్రంలో బీజేపీ ఎంపీల గెలుపుపై తమకు అనుమానాలు ఉన్నాయని అన్నారు. అలాగే, బీహార్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది అంటూ జోస్యం చెప్పారు.టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తాజాగా సాక్షి టీవీతో మాట్లాడుతూ.. తెలంగాణలో బండి సంజయ్ సహా, బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతో గెలిచారు. ఆ మాటకు నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నారు. మాకు తెలంగాణ బీజేపీ ఎంపీల గెలుపుపై అనుమానాలున్నాయి. ఎలక్షన్ కమిషన్కు లేఖ రాస్తాం. మా నిజామాబాద్ జిల్లాలోనూ దొంగ ఓట్లున్నాయి. అది నేను నిరూపిస్తాను. మహారాష్ట్రలో కోటి దొంగ ఓట్లు నమోదు చేశారు.నిజామాబాద్లోనూ మహారాష్ట్ర ప్రజలకు ఓట్లు ఉన్నాయి. కరీంనగర్లోనూ ఓ డబల్ బెడ్ రూమ్ ఇంట్లో 69 ఓట్లు ఉన్నట్టు మా దృష్టికి వచ్చింది. ఓట్లు చోరీ చేసే అవసరం కేవలం బీజేపీకే ఉంది. బీహార్ ఎన్నికల్లోనూ అవకతవకలకు ఆస్కారం లేకుండా ప్రజల్ని చైతన్యపర్చేందుకే రాహూల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. రాహుల్ పాదయాత్రకు అనూహ్య స్పందన వస్తోంది. బీహార్లో కాంగ్రెస్ ప్రభంజనం రాబోతుంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
అహో మహా గణపతి!
హైదరాబాద్: ఒక వైవిధ్యభరితమైన వేడుక. శతాబ్దాల సాంçస్కృతిక ఉత్సవం. కులమతాలకు అతీతంగా ఒక్కటైన ఉత్సాహం. విభిన్న జీవన సంస్కృతుల ఆవిష్కరణ భాగ్యనగరం. ప్రతి మనిషి సమూహమయ్యే వేడుక. మహోన్నతమైన భాగ్యనగర సాంçస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే వినాయక వేడుకలు భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. తొమ్మిది రోజుల పాటు విభిన్న ఆకృతులలో భక్తకోటిని మంత్రముగ్ధులను చేసే వినాయక చవితి ఉత్సవాలు ఈ నెల 27 నుంచి సంబరంగా జరుపుకొనేందుకు నగరం సిద్ధమవుతోంది.శతాబ్దాలుగా లంబోదరుడు భక్తజనుల పూజలను అందుకుంటూనే ఉన్నాడు. శాతవాహనులు, రాష్ట్రకూటులు, చాళుక్యుల కాలం నుంచే ప్రజలు విఘ్నేశ్వరుడి పండగ చేసుకున్నట్లు చరిత్ర చెబుతోంది. ప్రజల్లో దేశభక్తిని, జాతీయతను పెంచేందుకు ఛత్రపతి శివాజీ వినాయక వేడుకలను ఘనంగా జరిపేవాడని చెబుతారు. కానీ.. అప్పటికి ఇంకా ఈ వేడుక సామూహికం కాదు. 1818 నుంచి 1892 వరకు గణపతి నవరాత్రి ఉత్సవాలు కేవలం ఇళ్లకే పరిమితమయ్యాయి. ఎవరి ఇంట్లో వాళ్లు గణనాథుడికి పూజలు చేసి, భక్తితో కొలిచేవారు. 1893 తర్వాతే సామూహిక ఉత్సవమైంది. ప్రజలను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు, స్వాతంత్య్రోద్యమాన్ని బలోపేతం చేసేందుకు లోకమాన్య బాల గంగాధర తిలక్ లాల్బాగ్లో తొలిసారి నవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఇలా మహారాష్ట్రలో ప్రారంభమైన ఈ వేడుకలు అనతి కాలంలోనే హైదరాబాద్లోనూ మొదలయ్యాయి. వేడుకలు ఇలా మొదలు.. నిజాం నిరంకుశత్వానికి ఎదురు నిలిచిన ఆర్య సమాజ్ నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించింది. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో బహదూర్యార్జంగ్, ఖాసీం రజ్వీ నేతృత్వంలో జరిగిన అకృత్యాలను తిప్పికొట్టేందుకు ఆర్యసమాజ్ వాడవాడలా వినాయక మండపాలను నెలకొల్పి విగ్రహాలను ఏర్పాటు చేసింది. పండిత్ నరేంద్రజీ నేతృత్వంలో వేలాది మంది కార్యకర్తలు నగరంలో నవరాత్రి ఉత్సవాలను నిర్వహించారు. భజనలు, దేశభక్తి గీతాలతో, వివిధ రకాల ఆటల పోటీలతో తొమ్మిది రోజులు గడిచేవి. కానీ అప్పటికి ఇంకా చిన్నచిన్న మట్టి ప్రతిమలే పెట్టేవాళ్లు. 1950 అనంతరం ఈ వేడుకలు అన్ని చోట్లా ఘనంగా జరిగాయి. బాలాపూర్, లాల్దర్వాజా, మీరాలం ట్యాంక్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో అందమైన బొజ్జగణపయ్యలు కొలువుదీరారు. నిజాం కాలంలో లక్ష్మయ్య, ఎంకమయ్య, మరికొందరు భక్తులు కలిసి హుస్సేనీ ఆలం బారాగల్లీలో చిన్న వినాయకుడి విగ్రహాన్ని ప్రతిబించారు. మీరాలంమండి వినాయకుడికి 150 సంవత్సరాల చరిత్ర ఉన్నట్లు స్థానికులు చెబుతారు. ఇక 1953లో అప్పటి స్వాంతంత్య్ర సమరయోధుడు శంకర్ ఖైరతాబాద్లో ఒక్క అడుగు ఎత్తు వినాయకుడితో వేడుకలను ప్రారంభించారు. సామూహిక నిమజ్జనం ఇలా.. ఆ రోజుల్లో హైదరాబాద్లో వందల సంఖ్యలోనే మండపాలు వెలిసేవి. సఫిల్గూడ, సరూర్నగర్, మీరాలంట్యాంకు, రాజన్న బావి తదితర చెరువుల్లో నిమజ్జనం చేసేవాళ్లు. 1979 నాటి నిమజ్జనోత్సవానికి కంచి శంకరాచార్యులు ముఖ్య అతిథిగా విచ్చేశారు. చారి్మనార్ స్వాగత వేదికపై నుంచి ప్రసంగించారు. విగ్రహాలను ట్యాంక్బండ్లోనే నిమజ్జనం చేయాలని నిర్ణయించారు. వందేమాతరం రామచంద్రయ్య నేతృత్వంలో ఆలె నరేంద్ర, బద్దం బాల్రెడ్డి, దత్తాత్రేయ, భరత్సింగ్, డాక్టర్ భగవంత్రావు తదితరులు 1980లో భాగ్యనగర గణేశ్ ఉత్సవ సమితిని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి నగరంలోని అన్ని ప్రాంతాలకు చెందిన వినాయక విగ్రహాలు హుస్సేన్సాగర్ బాట పట్టాయి.నేడు నేత్రోనిలనంఖైరతాబాద్: ఈసారి ఖైరతాబాద్ మహాగణపతి 69 అడుగుల ఎత్తులో 28 అడుగుల వెడల్పుతో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి భక్తులకు దర్శనమిచ్చేందుకు సిద్ధమయ్యాడు. మహా గణపతిని పూర్తిగా మట్టితోనే తీర్చిదిద్దినట్లు శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ తెలిపారు. దేశంలోనే మట్టితో ఇంత ఎత్తులో విగ్రహాన్ని తయారు చేసి ఊరేగించి.. నిమజ్జనం చేయ డం ఖైరతాబాద్ వినాయకుడి ఘనత అని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 27న వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయని, సెపె్టంబరు 6న నిమ జ్జనం జరుగుతుందన్నారు. సోమవారం ఉదయం మహా గణపతి ప్రతిమకు కంటిపాపను (నేత్రోనిలనం) అమర్చడం ద్వారా ప్రాణ ప్రతిష్ఠ చేసినట్లవుతుందని శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ తెలిపారు. -
వివాహిత అనుమానాస్పద మృతి..!
భద్రాద్రి జిల్లా: ఓ వివాహిత అనుమానా స్పదంగా మృతి చెందిన ఘటనపై ఆదివారం ఆమె భర్తతో పాటు మరో ముగ్గురిపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. స్థానిక ఎస్సైటి.యయా తీ రాజు కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ముచ్చవరం గ్రామ పంచాయతీ విశ్వనా థపురం గ్రామానికి చెందిన పూల లక్ష్మీప్రసన్న(33)కు, మండలంలోని ఖాన్ఖాన్పేటకు చెందిన పూల నరేష్బాబుతో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి మూడేళ్ల కుమార్తె, ఒక కుమారుడు ఉన్నాడు. కాగా, గత కొన్నేళ్లుగా వీరిమధ్య కుటుంబ కలహాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ గొడవల నేపథ్యంలోనే మూడేళ్ల క్రితం నరేష్బాబు తన సొంత అక్క దాసరి విజయలక్ష్మి స్వగ్రామమైన అశ్వారావుపేట పట్టణంలోని కోనేరుబజార్లో ఉన్న ఇంట్లో కలిసి ఉంటున్నారు. ఈక్రమంలో ఆదివారం తెల్లవారుజామున లక్ష్మీప్రసన్న ఇంట్లో పనిచేస్తుండగా జారిపడి తల, నుదిటి భాగాల్లో గాయపడినట్లు ఆమె కుటుంబీకులకు భర్త సమాచారం ఇచ్చి స్థానిక ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పరీక్షించిన వైద్యులు ఏపీలోని రాజమండ్రికి రిఫర్ చేయగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు.మృతిపై అనుమానాలు.?లక్ష్మీ ప్రసన్న కిందపడి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు భర్త నరేష్బాబు, అతడి బంధువులు ఇచ్చిన సమాచారంతో మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు రాజమండ్రిలోని ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రిలో ఐసీయూ విభాగంలో వెంటిటేటర్పై విగతజీవిగా పడిఉన్న లక్ష్మీప్రసన్న శరీరంపై ఉన్న గాయాలతో పాటు శారీరకంగా కుశించుకుపోయి కనిపించడంతో మృతిపై అనుమానాలు వచ్చాయి. దీంతో తన కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నట్లు తండ్రి ముదిగొండ వెంకటేశ్వరరావు స్థానిక పోలీస్ స్టేషన్లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. దీంతో ఆమె భర్తతో పాటు పూల విజయలక్ష్మి, దాసరి భూలక్ష్మి, దాసరి శ్రీనివాసరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
నాగార్జునసాగర్ వద్ద బోటింగ్ పర్యాటకుల సందడి..(ఫొటోలు)
-
రుమటైడ్ ఆర్థ్రరైటిస్ వ్యాధిగ్రస్తులు ఆందోళన చెందవద్దు
రుమటైడ్ ఆర్థ్రరైటిస్ వ్యాధిగ్రస్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యాధి నిర్ధారణతో పాటు వైద్యంలో అధునాతన టెక్నాలజీలు అందుబాటులో ఉన్నాయని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. ఆదివారం నోవాటెల్ హోటల్లో సౌత్ జోన్ ఇండియన్ రుమటాలజీ అసోసియేషన్(సిజ్రికాన్)2025లో భాగంగా డాక్టర్ విజయ ప్రసన్న నిర్వహించిన పేషంట్ సపోర్ట్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాధి నిర్ధారణ అయిందని బాధ పడవద్దని పాజిటీవ్ థింకింగ్తో ముందుకు సాగాలని ప్రతీ సమస్యకు పరిష్కారం ఉంటుందని ఒకప్పుడు క్యాన్సర్ వస్తే చనిపోయే వారని అంతటి ప్రాణాంతక వ్యాధులకు కూడా ఇప్పుడు అధునాతన వైద్యం అందుబాటులోకి వచ్చి విజయవంతంగా రోగాన్ని జయిస్తున్నారని అన్నారు. తాను కూడా తన తల్లి కోమటిరెడ్డి సుశీల ఫౌండేషన్ పేరుతో రోగులకు సహాయ సహకారాలు అందిస్తున్నానని అన్నారు. శ్రీమంతులు అయి ఉండి, సమాజంలో మంచి పొజీషన్లో ఉన్న వారు పేద వాళ్ళకు ఏదో ఒకటి చేయకపోతే అదో నేరంగా తాను భావిస్తానని అన్నారు. రుమటాలజీ సీనియర్ డాక్టర్ లీజా రాజశేఖర్ మాట్లాడుతూ రుమటాలజి వ్యాధుల గురించి చాలా మందికి అవగాహన లేదని ప్రాథమిక దశలోనే గుర్తించి మంచి వైద్యం అందించి వారిని మామూలువారిగా తయారు చేయవచ్చునని దాన్ని నిర్ధారించే లోపే చాలా మందిలో అది ముదిరిపోతున్నదని అది మరింత ప్రమాదకరంగా మారుతున్నదని అన్నారు. ఈ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం నుంచి, స్వచ్ఛంద సంస్థల నుంచి సహకారం కావాలని, అలాగే ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఇబ్బందులు పెడుతున్నాయని వారితో కూడా ప్రభుత్వం చర్చించాలని అన్నారు. ఈ సందర్భంగా వ్యాధిగ్రస్తులు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఈ సందర్భంగా వైద్యుల దృష్టికి, ఇన్సూరెన్స్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రుమటాలజి అసోసియేషన్ అద్యక్షుడు డాక్టర్ చంద్రశేఖర, డాక్టర్ రాజ్ కిరణ్, డాక్టర్ రాజేంద్ర వర ప్రసాద్, డాక్టర్ వినోద్ రవీంద్రన్, డాక్టర్ పని కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నేను ఓయూకు ఎందుకు రావొద్దు.. ఆర్ట్స్ కాలేజీలో మీటింగ్ పెట్టండి: రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా విద్యార్థులే కీలక పాత్ర పోషించారని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉస్మానియా లేకపోతే తెలంగాణ లేదన్నారు. ఎంతో మంది గొప్ప వ్యక్తులను దేశానికి ఓయూ అందించిందని గుర్తు చేసుకున్నారు. కుట్ర పూరితంగా ఓయూను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు అంటూ ఆరోపించారు. తాను మళ్లీ ఓయూకు వస్తానని.. విద్యార్థులతో మాట్లాడతానని చెప్పుకొచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్ భవనాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అలాగే, గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్, లైబ్రరీ రీడింగ్ రూమ్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం, ఆడిటోరియంలో ముఖ్యమంత్రి రేవంత్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఏ సమస్య వచ్చినా, సంక్షోభం వచ్చినా మొట్టమొదట ఉద్యమానికి పునాది పడేది ఉస్మానియా నుంచే. తెలంగాణలో ఏ సమస్య వచ్చినా, సంక్షోభం వచ్చినా మొట్టమొదట ఉద్యమానికి పునాది పడేది ఉస్మానియా నుంచే. ఎంతో మంది గొప్ప వ్యక్తులను దేశానికి ఓయూ అందించింది. ఉస్మానియా నుంచే పీవీ ధిక్కార స్వరాన్ని వినిపించారు. ఓ జార్జిరెడ్డి, ఓ గద్దర్ను అందించిన గడ్డ ఈ ఉస్మానియా వర్సిటీ. మన యూనివర్సిటీలకు మన తెలంగాణ పోరాట యోధుల పేర్లు పెట్టుకున్నాం. సామాజిక న్యాయంతో వీసీలను నియమించాం.మీటింగ్ పెట్టండి.. డిసెంబర్లో ఆర్ట్స్ కాలేజీలో మీటింగ్ పెట్టండి. నేను కూడా వస్తాను. విద్యార్థుల సమస్యలు తీర్చాలని అనుకుంటున్న నేను ఓయూకు ఎందుకు రావద్దు. మీ సమస్యలు ఏమున్నా చెప్పండి.. ఏమేం కావాలో చెప్పండి. మీ సమస్యలు తీరుస్తాను. మరోసారి ఓయూకు వస్తాను.. ఒక్క పోలీసును పెట్టకండి. అప్పటికప్పుడు మీకు జీవోలు ఇస్తాను. ఆరోజు ఒక్క పోలీసు కూడా క్యాంపస్లో ఉండడు. అప్పుడు విద్యార్థులు నిరసనలు తెలిపినా నేను ఏమీ అనను. విద్యార్థులు అడిగే ప్రతీ ప్రశ్నకు సమాధానం చెప్పే చిత్తశుద్ది నాకు ఉంది. కొంత మంది రాజకీయ నాయకులకు అధికారం పోయిన కడుపు మంట ఉంటది. మీరు ఆశీర్వదిస్తేనే తెలంగాణకు ముఖ్యమంత్రిని అయ్యాను అని చెప్పుకొచ్చారు.చట్ట సభలకు కోదండరాం.. తెలంగాణలో ఏనుగులు లేవు.. మృగాలు లేవు. ప్రొఫెసర్ కోదండరాంను 15 రోజుల్లో చట్ట సభకు పంపుతా. ఎవరు అడ్డం వస్తారో చూస్తా. ప్రొఫెసర్ ఎమ్మెల్సీగా ఉంటే వచ్చిన తప్పేంటి?. మీ కుటుంబానికే అన్ని పదవులు ఉండలా? అని ప్రశ్నించారు.విద్యార్థులదే కీలక పాత్ర..తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా విద్యార్థులే కీలక పాత్ర పోషించారు. మలిదశ ఉద్యమంలో శ్రీకాంత చారి అమరుడై చైతన్యం అందించాడు. యాదయ్య, వేణుగోపాల్ రెడ్డి తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించారు. చైతన్యం అందించిన ఓయూను కాలగర్భంలో కలపాలని చూశారు. తెలంగాణ ఉద్యమానికి అండగా నిలబడిన ఉస్మానియా కళా విహీనంగా మారిన పరిస్థితి ఏర్పడింది. కుట్ర పూరితంగా ఓయూను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు.నేను వచ్చాక ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నాను. యువ నాయకత్వం ఈ దేశానికి అవసరం. యువతే దేశానికి అతి పెద్ద సంపద. మనలో అసహనం పెరిగిపోయింది.. అశాంతి ఎక్కువైంది. చిన్న చిన్న కాలేజీల్లో కూడా విద్యార్థులు గంజాయి సేవిస్తున్నారు. గంజాయి, డ్రగ్స్ యువతను పట్టి పీడిస్తున్నాయి. పేదలకు పంచేందుకు భూములు లేవు.. పేదల తలరాతను మార్చేది విద్య ఒక్కటే. సామాజిక, సాంకేతిక అంశాలపై చర్చ జరగాలి అని వ్యాఖ్యలు చేశారు. -
హైదరాబాద్లో మొదలైన వినాయక చవితి సందడి (ఫొటోలు)
-
ముక్కలు చేసి మూసీలో పడేసి.. భర్త కిరాతకం
సాక్షి, హైదరాబాద్/మేడిపల్లి/అనంతగిరి: భాగ్యనగరంలో మరోసారి ‘మీర్పేట్’తరహా కిరాతకం వెలుగుచూసింది. గతేడాది కులాంతర ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువకుడు భార్యపై అనుమానంతో ఘాతుకానికి పాల్పడ్డాడు. ఐదు నెలల గర్భిణి అనే కనికరం కూడా లేకుండా భార్యను పక్కా పథకం ప్రకారం హతమార్చి ఆపై మృతదేహాన్ని హాక్సా బ్లేడ్తో ముక్కలు చేసి పలు భాగాలను మూసీలో పడేశాడు. అనంతరం ఏమీ ఎరుగనట్లు భార్య కనిపించట్లేదంటూ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. నిందితుడిని ఆదివారం అరెస్టు చేసిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆర్య సమాజ్లో కులాంతర వివాహం: మల్కాజ్గిరి డీసీపీ పద్మజారెడ్డి, హతురాలి కుటుంబీకుల కథనం ప్రకారం వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన సామల మహేందర్రెడ్డి (27) అదే గ్రామానికి చెందిన స్వాతి అలియాస్ జ్యోతి (21) ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి గతేడాది జనవరిలో కూకట్పల్లిలోని ఆర్య సమాజ్లో కులాంతర వివాహం చేసుకున్నారు. ఆపై రాజీపడిన కుటుంబీకులు గ్రామంలో మరోసారి వివాహ తంతు నిర్వహించారు. పెళ్లయ్యాక బోడుప్పల్కు వచ్చి శ్రీనివాస్ నగర్లో కాపురం పెట్టారు. మహేందర్రెడ్డి బైక్ ట్యాక్సీ డ్రైవర్గా పనిచేస్తుండగా అతని భార్య పంజగుట్టలోని ఓ కాల్ సెంటర్లో పనిచేసేది. అయితే నెలపాటు సజావుగా సాగిన వారి కాపురంలో కుటుంబ కలహాలు మొదలయ్యాయి. భార్యపై అనుమానం పెంచుకున్న మహేందర్రెడ్డి పదేపదే సూటిపోటి మాటలతో వేధించడంతో స్వాతి ఉద్యోగం మానేసింది. అయినప్పటికీ వేధింపులు ఆపకపోవడంతో గతేడాది ఏప్రిల్ 22న భర్తపై వికారాబాద్ మహిళా ఠాణాలో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇరువురికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. అలాగే గ్రామ పెద్దలు సైతం భార్యాభర్తల మధ్య రాజీ కుదిర్చారు. దీంతో గతేడాది జూన్ నుంచి మళ్లీ ఇరువురూ కలిసి గత నెల వరకు వికారాబాద్లోనే ఉన్నారు. దాదాపు 20 రోజుల క్రితం మళ్లీ నగరానికి వచ్చిన ఈ జంట.. శ్రీనివాస్ నగర్లోని అదే ఇంట్లో అద్దెకు దిగింది. ప్రస్తుతం ఐదు నెలల గర్భిణి అయిన స్వాతి వైద్య పరీక్షల నిమిత్తం ఈ నెల 27న వికారాబాద్ వెళ్లి ఆపై పుట్టింటికి వెళ్లి ఉంటానని భర్తకు చెప్పింది. దీనికి మహేందర్ అంగీకరించకపోవడంతో ఇరువురి మధ్యా వాగ్వాదం జరిగింది. అప్పటికే ఆమెపై కక్ష పెంచుకున్న మహేందర్రెడ్డి ఈ పరిణామంతో భార్యను చంపాలని నిర్ణయించుకున్నాడు. తన పథకాన్ని అమలు చేయడం కోసం బోడుప్పల్లోని ఓ హార్డ్వేర్ షాపు నుంచి హాక్సా బ్లేడ్ కొని ఇంట్లో దాచాడు. గొంతు నులిమి చంపి, ముక్కలు చేసి... శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన మహేందర్రెడ్డి.. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తిరిగి వచ్చి భార్యతో మరోసారి గొడవపడి ఆపై గొంతునులిమి చంపేశాడు. మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి హాక్సా బ్లేడ్తో కాళ్లు, చేతులు, తలను మొండెం నుంచి వేరు చేశాడు. మొండాన్ని ప్లాస్టిక్ కవర్లో పెట్టి గదిలోనే దాచి మిగిలిన శరీర భాగాలను మరో కవర్తోపాటు బ్యాక్ప్యాక్లో పెట్టుకున్నాడు. రాత్రి 7 గంటల ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై బయలుదేరి ప్రతాప్సింగారం ప్రాంతంలోని మూసీ వంతెన పైనుంచి వాటిని నదిలో పడేసి ఇంటికి తిరిగి వచ్చాడు. ఆపై తన సోదరికి ఫోన్ చేసి భార్య కనిపించట్లేదని.. ఉప్పల్ ఠాణాకు వెళ్లి ఫిర్యాదు చేస్తానని చెప్పాడు. అనుమానించిన మేడిపల్లి పోలీసులు... ఉప్పల్ ఠాణాకు వెళ్లిన మహేందర్రెడ్డి తాము ఉంటున్న ప్రాంతంలో ఆ పోలీసుస్టేషన్ పరిధిలోకి రాదని తెలిసి వెనక్కు వచ్చాడు. అదే సమయానికి అతడి సోదరి సమీప బంధువుకు సమాచారం ఇచ్చింది. అప్పటికే కుటుంబ కలహాలు, రాజీలు ఉండటంతో ఆందోళన చెందిన ఆయన.. మహేందర్రెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నాడు. అయితే అతన్ని లోపలకు రానివ్వని మహేందర్రెడ్డి.. మేడిపల్లి ఠాణాకు వెళ్లి మిస్సింగ్ కంప్లయింట్ ఇద్దామంటూ తీసుకువెళ్లాడు. వారి నుంచి ఫిర్యాదు స్వీకరించే క్రమంలో మేడిపల్లి పోలీసులు మహేందర్రెడ్డి, స్వాతి పూర్వాపరాలు అడిగారు. అవి తెలియడంతో అతనిపై అనుమానం వచ్చి ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో శ్రీనివాస్ నగర్లోని ఇంటికి తీసుకువచ్చారు. తాళం తీయించి లోపలకు వెళ్లగా గదిలోని కవర్లో ఉన్న మొండెం కనిపించడంతో కంగుతిన్నారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని పోలీసుస్టేషన్కు తీసుకెళ్లి విచారణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే హత్యానంతరం శరీర భాగాలను మూసీలో పడేసినట్లు నిందితుడు చెప్పడంతో అతన్ని మూసీ వద్దకు తీసుకెళ్లి అవశేషాల కోసం గాలించారు. ఇటీవలి భారీ వర్షాల ప్రభావంతో మూసీ ఉదృతంగా ప్రవహిస్తుండటంతో పోలీసులకు అక్కడ ఎలాంటి ఆనవాళ్లు లభించలేదు. మహేందర్రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు మొండాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. దీన్నుంచి డీఎన్ఏ నమూనాలు సేకరించి స్వాతి తల్లితో పోల్చి చూడాలని నిర్ణయించారు. తిండి కూడా పెట్టేవాడు కాదన్న తల్లి... గర్భవతి అయిన భార్య వివరాలు చెబితే నమోదు చేసుకుంటామని స్థానిక ఆశావర్కర్లు గతంలో పలుమార్లు అడిగినా మహేందర్రెడ్డి స్పందించలేదని తెలిసింది. కడుపుతో ఉన్న తన బిడ్డకు అల్లుడు అన్నం కూడా పెట్టేవాడు కాదని... తిండి కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నానని కుమార్తె పలుమార్లు చెప్పుకొని బాధపడిందని స్వాతి తల్లి స్వరూప విలపిస్తూ చెప్పింది. పెళ్లయిన రెండు నెలలకే స్వాతి గర్భం దాల్చగా మహేందర్రెడ్డి బలవంతంగా అబార్షన్ చేయించినట్లు మృతురాలి కుటుంబీకులు పేర్కొన్నారు. ఈ విషయమై నిలదీసేందుకు మీ తల్లిదండ్రులు మా ఇంటికి వెళ్తే అంతుజూస్తానంటూ మహేందర్రెడ్డి పలుమార్లు స్వాతిని హెచ్చరించాడని సమాచారం. కాగా, వ్యవసాయం చేసుకుంటూ గ్రామంలోనే నివసించే మహేందర్రెడ్డి తల్లిదండ్రులు సోమిరెడ్డి, భారతమ్మ కుమారుడు చేసిన దురాగతం నేపథ్యంలో ఇంటికి తాళం వేసి పారిపోయారు. -
మీ అభిప్రాయం ఏంటి?
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంలో కాంగ్రెస్ పార్టీ నియమించిన మంత్రుల కమిటీ కసరత్తు ప్రారంభించింది. ఆదివారం ప్రజాభవన్లో కమిటీ సమావేశమై రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్రెడ్డి అభిప్రాయం తీసుకుంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, శ్రీధర్బాబులు హాజరయ్యారు. కరీంనగర్ పర్యటనలో ఉన్న మరో మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోన్లో కమిటీతో తన అభిప్రాయాన్ని పంచుకోగా, ఇంకో మంత్రి సీతక్క గైర్హాజరయ్యారు. సమావేశంలో భాగంగా కులగణన నుంచి బీసీ బిల్లును రాష్ట్రపతికి పంపేంతవరకు జరిగిన కార్యాచరణ, న్యాయపరంగా ఈ బిల్లు ఆమోదానికి తీసుకోవాల్సిన చర్యలు, రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసి ఎన్నికలకు వెళితే.. ఎదురయ్యే అడ్డంకులు తదితర అంశాలపై ఏజీ సుదర్శన్రెడ్డితో కమిటీ చర్చించింది. ఆయన అభిప్రాయాలను విన్న కమిటీ సోమవారం కులగణనపై నియమించిన నిపుణుల కమిటీ చైర్మన్ జస్టిస్ సుదర్శన్రెడ్డితోపాటు అభిషేక్ మనుసింఘ్వి తదితర ఢిల్లీలోని న్యాయ కోవిదుల అభిప్రాయాలను కూడా తీసుకొని ముందుకెళ్లాలని నిర్ణయించింది. ఈ కమిటీ ఈనెల 26వ తేదీకల్లా టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్కు నివేదిక సమర్పించాల్సి ఉంది. ఈ నివేదిక అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల్లో తన వైఖరిని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించనుంది. ఆ తర్వాత ఈనెల 29న జరిగే కేబినెట్ భేటీలో ప్రభుత్వ నిర్ణయం వెల్లడి కానుంది. -
సురవరం పేరును శాశ్వతం చేస్తాం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్/హిమాయత్నగర్/గాంధీ ఆస్పత్రి: తెలంగాణ ప్రజలకు ఆదర్శంగా నిలిచిన వ్యక్తులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుందని, అందులో భాగంగానే దివంగత కమ్యూనిస్టు అగ్రనేత సురవరం సుధాకర్రెడ్డి పేరు శాశ్వతంగా నిలిచిపోయేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ప్రకటించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును ఉద్యాన వర్సిటీకి, జైపాల్రెడ్డి పేరును పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పెట్టామని, అలాగే సురవరం విషయంలో కూడా మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. శనివారం రాత్రి మరణించిన సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్రెడ్డి భౌతికకాయానికి ఆదివారం మఖ్దూమ్ భవన్లో సీఎం నివాళులర్పించారు. అనంతరం సీపీఐ నేతలు నారాయణ, చాడ వెంకట్రెడ్డి, కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర మంత్రి సీతక్క, ఎమ్మెల్యే బాలూనాయక్, కాంగ్రెస్ నేతలు చిన్నారెడ్డి, అంజన్కుమార్యాదవ్లతో కలిసి మీడియాతో మాట్లాడారు. సురవరం మృతి తెలంగాణకు తీరని లోటు అని విచారం వ్యక్తంచేశారు. నిరాడంబర జీవితం గడిపిన సుధాకర్రెడ్డి ఏనాడూ తన సిద్ధాంతాలను విడిచిపెట్టలేదని కొనియాడారు. బూర్గుల రామకృష్ణారావు, సూదిని జైపాల్రెడ్డి తరహాలోనే సురవరం సుధాకర్రెడ్డి కూడా మహబూబ్నగర్ జిల్లాకు వన్నె తెచ్చారని అన్నారు. విద్యార్థి దశ నుంచి చివరి శ్వాస వరకు విలువలకు కట్టుబడి జీవించిన గొప్ప నాయకుడు సురవరం సుధాకర్రెడ్డి అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో సురవరం సుధాకర్రెడ్డి ఆలోచనలు ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు, హరియానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ నేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, వినోద్ కుమార్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు సురవరం భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమంలో తనవంతు పాత్ర పోషించి చిరస్మరణీయ ముద్ర వేసుకున్న సురవరం సుధాకర్రెడ్డి మరణం తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని కేటీఆర్ అన్నారు. దేశం గొప్ప నాయకుడిని కోల్పోయిందని బండారు దత్తాత్రేయ నివాళులర్పించారు. అధికార లాంఛనాలతో.. సురవరం సుధాకర్రెడ్డికి సీపీఐ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆదివారం ఘనంగా వీడ్కోలు పలికారు. పార్టీ రాష్ట్ర కార్యాలయం మఖ్దూమ్భవన్లో సురవరంకు ప్రభుత్వం అధికార లాంఛనాలతో గౌరవ వందనం సమర్పించింది. అనంతరం మధ్యాహ్నం 3.20 గంటలకు ఆయన అంతిమయాత్ర మఖ్దూమ్భవన్ నుంచి నారాయణగూడ చౌరస్తా, చిక్కడపల్లి, ముషీరాబాద్ మీదుగా సికింద్రాబాద్లోని ప్రభుత్వ గాంధీ మెడికల్ కాలేజీకి చేరింది. అంతిమయాత్రలో ముందు భాగంలో పోలీసు కవాతు ఉండగా, అనంతరం సీపీఐ వలంటీర్లు ఎర్ర జెండాల కవాతు, ప్రజానాట్య మండలి కళాకారుల విప్లవ తీతాలాపనల మధ్య యాత్ర కొనసాగింది. అనంతరం సుధాకర్రెడ్డి పార్థీవ దేహాన్ని ఆయన సతీమణి డాక్టర్ బి.వి.విజయలక్ష్మి, కుమారులు కపిల్, నిఖిల్ కలిసి గాంధీ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఇందిర, ప్రొఫెసర్ రమాదేవి, ప్రొఫెసర్ సుధాకర్కు అప్పగించారు. సురవరం భౌతికకాయానికి ఎంబామింగ్ (రసాయనాల పూత) చేసి భద్రపరుస్తామని.. వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం వినియోగిస్తామని చెప్పారు. సురవరం తన కళ్లను ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి దానం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నేతలు డి.రాజా, కె.నారాయణ, సయ్యద్ అజీజ్ పాషా, చాడ వెంకట రెడ్డి, కూనంనేని సాంబశివరావు, నెల్లికంటి సత్యం, పల్లా వెంకట్రెడ్డి, కె.శ్రీనివాస్రెడ్డి, తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, బీఆర్ఎస్ నేతలు హరీశ్రావు, శ్రీనివాస్గౌడ్, ఎంపీ పెద్దిరాజు రవిచంద్ర, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆధార్లో 'తెలంగాణ' ఉంటేనే... ఉచిత ప్రయాణమట!
సాక్షి, హైదరాబాద్: ఆధార్ సవరణ కేంద్రాలకు ఉన్నట్టుండి మహిళలు క్యూ కడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న ఆధార్ కార్డుల్లో ఇంటి చిరునామాలో ఆంధ్రప్రదేశ్ స్థానంలో తెలంగాణ అని మార్చుకుంటున్నారు. కొందరు ఫొటోలను అప్డేట్ చేసుకుంటున్నారు. మీసేవ కేంద్రాలు, పోస్టాఫీస్ ఆధార్ సెంటర్లు, ఆధార్ సవరణ కేంద్రాలు.. ఇలా ఎక్కడ వీలుంటే అక్కడ ఆధార్ కార్డులను సవరించుకునేందుకు మహిళలు పోటెత్తుతున్నారు. ఆధార్ కార్డులోని ఇంటి చిరునామాపై తెలంగాణ బదులు ఏపీ అని ఉంటే ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు ఉండదని, కచ్చితంగా టికెట్ కొనాల్సిందేనంటూ కొందరు కండక్టర్లు అత్యుత్సాహంతో చేసిన ప్రచారం ఫలితమిది. – మహేశ్వరం సమీపంలోని ఓ కాలనీకి చెందిన మహిళ తుక్కుగూడ నుంచి చాంద్రాయణగుట్ట వెళ్లేందుకు మహేశ్వరం డిపో బస్సు ఎక్కారు. ఆధార్ కార్డులో తెలంగాణ బదులు ఏపీ అని ఉండటంతో జీరో టికెట్ ఇచ్చేందుకు కండక్టర్ నిరాకరించారు. చేసేది లేక రూ.25 టికెట్ కొని ప్రయాణించాల్సి వచ్చింది. ‘దీనిపై మహేశ్వరం డిపో అధికారులకు ఫిర్యాదు చేస్తే, చిరునామాలో తెలంగాణ బదులు ఏపీ అని ఉంటే ఉచిత ప్రయాణానికి అనుమతించబోమని తేల్చి చెప్పారు’అని ఆమె కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. – నాలుగు రోజుల క్రితం బూర్గంపహాడ్ ఇంటి చిరునామా ఉన్న ఆధార్కార్డుతో ఓ మహిళ నగరంలోని మెహిదీపట్నంలో బస్కెక్కగా, కండక్టర్ ఉచిత ప్రయాణానికి అనుమతించలేదు. ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న ఆధార్కార్డు కావటంతో దానిపై తెలంగాణ బదులు ఆంధ్రప్రదేశ్ అని ఉండటమే కారణం. దీంతో ఆ మహిళ ఆ బస్సు దిగి మరో బస్సు ఎక్కాల్సి వచ్చింది. ఇలా నిత్యం కొన్ని ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లు జీరో టికెట్లను నిరాకరిస్తుండటంతో ఇప్పుడు అలజడి రేగింది. కొన్ని బస్సుల్లో కండక్టర్లు నోటీసులు అతికించి మరి ఆధార్ కార్డులను అప్డేట్ చేయించుకోవాలని, లేని పక్షంలో మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతి ఉండదని రాసి ఉన్న సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు. అలాంటి ఆదేశాలు లేకున్నా... ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న ఆధార్ కార్డులను చాలామంది ఇప్పటికీ అలాగే వాడుతున్నారు. ఇళ్లు మారినవారు, ఫోన్నంబర్లు మారినవారు ఆధార్ కార్డుల్లో ఆ మేరకు మార్పుల వివరాలను సవరించుకుంటుండగా, ఎలాంటి మార్పులు జరగనివారు పాత ఆధార్కార్డులనే వాడుతున్నారు. ఏపీ పేరున్న ఆధార్ కార్డులు అన్నిచోట్లా చెల్లుబాటు అవుతుండగా, ఒక్క ఆర్టీసీ బస్సుల్లోనే అభ్యంతరాలు వ్యక్తం అవుతుండటం విశేషం. దీనిపై ఆర్టీసీ ఉన్నతాధికారులను ప్రశ్నిస్తే, తాము డిపో మేనేజర్లకు అలాంటి ఆదేశాలు ఏమీ ఇవ్వలేదని, ఉమ్మడి రాష్ట్రంలో పొందిన ఆధార్ కార్డుల్లో తెలంగాణ బదులు ఆంధ్రప్రదేశ్ అని ఉన్నా, వాటిని అనుమతించాల్సి ఉంటుందని పేర్కొనటం విశేషం. ఉచిత ప్రయాణ పథకం అమలులోకి వచ్చిన కొత్తలో మాత్రం రెండుమూడు పర్యాయాలు, ఆధార్ కార్డులను అప్డేట్ చేసుకోవాలన్న ప్రకటన వెలువడిందని, ఇప్పుడు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. కానీ, ఒకరిని చూసి మరొకరుగా ఆధార్ కార్డుల్లో ఆంధ్రప్రదేశ్ అని ఉంటే అనుమతించడం లేదు. కొందరు టికెట్ చెకింగ్ సిబ్బంది కూడా తెలంగాణ అని లేకపోతే తప్పుపడుతున్న సందర్భాలూ ఉన్నాయి. చిన్ననాటి ఫొటో ఉంటే మార్చుకోవాల్సిందే.. ఆధార్ కార్డులు అమలులోకి వచ్చిన 15 ఏళ్ల క్రితం, అప్పటి చిన్నారుల కార్డులు ఇప్పటికీ కొందరు వాడుతున్నారు. వాటిపై చిన్ననాటి ఫొటోలే ఉన్నాయి. ఇప్పుడు వారి వయసు పెరిగిన నేపథ్యంలో, ఆ కార్డు వారిదా కాదా అని ధ్రువీకరించుకోవటం కండక్టర్లకు పెద్ద సమస్యగా మారింది. ఇలాంటి కార్డుల్లో ఫొటోలను అప్డేట్ చేయించుకోవాల్సి ఉంది. కానీ, ఆంధ్రప్రదేశ్ అని ఉంటే అనుమతించకపోవటం ఇప్పుడు పెద్ద వివాదంగా మారుతోంది. -
ఫీజుల పెంపా?కుదింపా?
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ఫీజుల పెంపు అంశాన్ని రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఎఫ్ఆర్సీ) సోమవారం నుంచి తిరిగి పరిశీలించనుంది. అన్ని డాక్యుమెంట్లతో హాజరవ్వాలని ఇప్పటికే 180 కాలేజీలకు నోటీసులు పంపింది. తొలి రోజు 20 కాలేజీలతో చర్చించేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ ప్రక్రియ వచ్చే నెల 3వ తేదీ వర కు కొనసాగుతుంది. 2025–28 బ్లాక్ పీరియడ్కు ఇంజనీరింగ్ కాలేజీల్లో వివిధ కోర్సులకు ఫీజులను ఖరారు చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ ఆరు నెలల క్రితమే మొదలైంది. కాలేజీల డాక్యుమెంట్లు, ఆడిట్ రిపోర్టులను కమిటీ పరిశీలించింది. కాలేజీలతో చర్చించి ప్రతిపాదిత ఫీజులతో నివేదికను ప్రభుత్వానికి పంపింది. ప్రభుత్వం అందుకు అంగీకరించకుండా ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి నేతృత్వంలో ప్రత్యేక కమిటీని వే సింది. ఈ కమిటీ సూచనల మేరకు కాలేజీల ఫీజుల వ్యవహారాన్ని మరోసారి ఎఫ్ఆర్సీ విచారిస్తోంది. ప్రైవేటు కాలేజీలకు టెన్షన్ కాలేజీల్లో నాణ్యత ప్రమాణాలను కొత్తగా మార్గదర్శకాలుగా తీసుకుంటున్నారు. ఇందుకు జాతీయ, అంతర్జాతీయ ర్యాంకులు ఉన్న కాలేజీలను గుర్తించాల్సి ఉంటుంది. దీనిపై కాలేజీ యాజమాన్యాల్లో గుబులు మొదలైంది. కొన్ని కాలేజీలకు జాతీయ, అంతర్జాతీయ ర్యాంకులు ఉన్నా గతంలో ఎప్పుడూ ఫీజుల పెంపునకు వీటిని కొలమానంగా తీసుకోలేదు. ఈ ర్యాంకులు లేకున్నా, తక్కువ స్థాయిలో ఉన్నా నిర్ణీత ఫీజుకు కత్తెర కూడా వేసే అవకాశం ఉందని యాజమాన్యాలు భయపడుతున్నాయి. కొన్ని కాలేజీలు న్యాక్ ర్యాంకు కోసం కూడా ప్రయత్నించలేదు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకులు టాప్ కాలేజీలకు మాత్రమే వస్తున్నాయని యాజమాన్యాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద కాలేజీలకే న్యా యం జరుగుతుందని, చిన్న కాలేజీలు నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఆడిట్ లెక్కలపై సందేహాలు గత మూడేళ్ల జమా ఖర్చులను కాలేజీలు ఎఫ్ఆర్సీకి ఇప్పటికే సమర్పించాయి. వీటిని ఆడిట్ విభాగాలు పరిశీలించాయి. అయితే, కాలేజీల్లో ఆడిట్ చేసినవారితో ఎఫ్ఆర్సీ ఆడిటర్లకు సంబంధాలున్నాయని, ఇప్పుడు వారిని మార్చే అవకా శం ఉందని చెబుతున్నారు. మౌలిక వసతులకు చే సిన ఖర్చు, ఫ్యాకల్టీకి చెల్లించిన వేతనాలు డిజిటల్ విధానంలో చూపించా లని ఎఫ్ఆర్సీ కోరే అవ కాశం ఉంది. అయితే దాదా పు 85 కాలేజీల వద్ద ఇలాంటి ఆధారాలు లేవని సమాచారం. దీంతో ఈ కాలేజీల ఫీజుల్లో కోత పడుతుందా? అనే సందేహాలు యాజమాన్యాల్లో కలుగుతున్నాయి. లే»ొరేటరీ లు, ప్లేస్మెంట్లను కూడా ఫీజుల పెంపునకు కొల మానంగా తీసుకోబోతున్నారని తెలిసింది. అయితే, కొన్నేళ్లుగా కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించడం లేదు. ఆఫ్ క్యాంపస్ నియామకాలే జరుగుతున్నాయి. పెద్ద కాలేజీల్లో విద్యార్థు లు క్యాంపస్ ఉద్యోగాలకు ప్రయత్నించడం లేదు. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని ఎంతవరకు పరిగణనలోనికి తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. భవిష్యత్ కార్యాచరణపై కాలేజీల కసరత్తు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎఫ్ఆర్సీ ముందు హాజరైనా.. భవిష్యత్ కార్యాచరణపై ఉమ్మడిగా ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు భావిస్తున్నాయి. షెడ్యూల్ ప్ర కారం మొదటి వారం రోజులు ఎఫ్ఆర్సీ ముందు హాజరయ్యే వాటిల్లో ఒక మోస్తరు కాలేజీలున్నాయి. వీటి పట్ల కమిటీ ఎలా వ్యవహరిస్తుంది? ఏయే అంశాలను పరిగణనలోనికి తీసుకుంటుంది? ఫీజులు పెంచుతారా? తగ్గిస్తారా? అనే అంశాలను పరిశీలించాలని నిర్ణయించాయి. దీని ఆధారంగా వచ్చేవారం సమావేశమై చర్చించాలని నిర్ణయించినట్టు ఓ కాలేజీ ప్రతినిధి తెలిపారు. అవసరమైతే న్యాయ పోరాటం చేయడమా? ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడమా? ఏదీ కాకపోతే సమ్మెకు వెళ్లడమా? అనే అంశాలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. -
బై ఎలక్షన్లతో కాంగ్రెస్కు బైబై
మియాపూర్: రాష్ట్రంలో త్వరలోనే అసెంబ్లీ ఉప ఎన్నికలు రానున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వానికి అవే బైబై ఎన్నికలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు దమ్ముంటే తమ పదవులకు రాజీనామా చేసి ఉపఎన్నికల్లో పోటీచేసి గెలవాలని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఉప ఎన్నికలకు వెళ్లే దమ్ముందా? అని సవాల్ విసిరారు. మియాపూర్ నరేన్ గార్డెన్లో శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ శంభీపురం రాజు, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రూ.2.80 లక్షల కోట్ల అప్పుచేసి అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను చేపడితే.. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు గడవకముందే రూ.2.20 లక్షల కోట్ల అప్పుచేసి ఒక్క మంచిపని కూడా చేయలేదని విమర్శించారు. కేసీఆర్ పాలనలో హైదరాబాద్ను మహా నగరంగా తీర్చిదిద్దామని చెప్పారు. కరోనా సమయంలో ఏడాదిపాటు ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా ఆదాయం రాకపోయినా అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆగకుండా కొనసాగించామని తెలిపారు. ఇప్పుడు 20 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పుతో 42 ప్లైఓవర్లు, నాలుగు అత్యాధునిక ఆస్పత్రులు, 36 మురుగునీటి శుద్ధి కేంద్రాలు నిర్మించిందని వెల్లడించారు. రేవంత్ ప్రభుత్వం ఒక్క కొత్త వంతెన గానీ మోరీని గానీ నిర్మించిందా? అని ప్రశ్నించారు. హైడ్రా అరాచకంతో హైదరాబాద్ అతలాకుతలం కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన హైడ్రావల్ల హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుప్పకూలిందని కేటీఆర్ విమర్శించారు. హైడ్రా అరాచకాలతో నగరమంతా అతలాకుతలమైందని ఆరోపించారు. దుర్గంచెరువులో కాంగ్రెస్ హయాంలో సీఎం రేవంత్రెడ్డి అన్న తిరుపతిరెడ్డి అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చే దమ్ము హైడ్రాకు ఉందా? అని సవాల్ చేశారు. పేదల ఇళ్లు కూలగొడుతున్న హైడ్రా.. పెద్దల జోలికి మాత్రం వెళ్లడం లేదని మండిపడ్డారు. 20 నెలల్లో హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకం సృష్టించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు తాము ఏ పార్టీలో ఉన్నామో కూడా చెప్పుకోలేకపోతున్నారని, ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఈ కార్యక్రమానికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రోజాదేవి రంగారావు, సిం«ధూ ఆదర్శ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆదివాసీ బాలికపై అఘాయిత్యం?
పాల్వంచ రూరల్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పెద్దమ్మతల్లి ఆలయ సమీపంలో శనివారం రాత్రి ఓ ఆదివాసీ బాలిక ఒంటిపై గాయాలు, చిరిగిన దుస్తులతో కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన గురించి ఐసీడీఎస్ సీడీపీవో ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలానికి చెందిన ఓ బాలిక ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కుంటలో ఉన్న బంధువుల ఇంటికి వారం క్రితం వెళ్లింది. తిరిగి శనివారం తన సోదరులు ఉంటున్న చింతూరు మండలం గొల్లగుప్పకు వెళ్లేందుకు కుంట బస్టాండ్కు చేరుకుంది. ఆ సమయంలో బస్సులు లేకపోవడంతో అటుగా వెళ్తున్న ఓ ట్రాలీ ఆటో ఎక్కింది. అందులోని ఇద్దరు యువకులు మధ్యలో ట్రాలీ నిలిపి మద్యం సేవించారని.. తనకు కూడా మత్తుమందు కలిపిన డ్రింక్ను బలవంతంగా తాగించడంతో స్పృహ కోల్పోయానని బాలిక తెలిపింది. తనకు మెలకువ వచ్చేసరికి పాల్వంచ మండలం పెద్దమ్మతల్లి ఆలయం వద్ద ఉన్నానని చెప్పింది. ఆలయ వాచ్మన్ లింగపంపల్లి శ్రీను అందించిన సమాచారంతో బాలికను వెంటనే కొత్తగూడెంలోని బాలిక సంరక్షణ అధికారుల పర్యవేక్షణలో ఉంచారు. ఆమె సోదరులకు సమాచారం అందించామని సీడీపీవో లక్ష్మీప్రసన్న తెలిపారు. బాలికకు కొత్తగూడెం ఏరియా ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించి పాల్వంచ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. బాలిక శరీరంపై గాయాలు ఉండగా.. దుస్తులు కూడా చిరిగిపోయాయని చెప్పారు. బాలికపై అత్యాచారం జరిగిందా లేదా అనేది వైద్య నివేదిక వస్తే తెలిసే అవకాశం ఉందని.. సీడీపీవో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పాల్వంచ సీఐ సతీశ్ పేర్కొన్నారు. -
పొడిచి చంపి.. పెట్రోల్ పోసి తగలబెట్టి
మహబూబ్నగర్ క్రైం: ప్రేమించి పెళ్లాడిన భార్య ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందనే కారణంతో భర్త కిరాతకుడిగా మారాడు. సోమశిల చూసొద్దామ ని ఆమెను నమ్మించి అడవిలోకి తీసుకువెళ్లి చున్నీతో గొంతు నులిమి ఆపై కత్తితో పొడిచి హతమార్చాడు. అనంతరం మృతదేహంపై పెట్రోల్ పోసి తగలపెట్టాడు. నాగర్కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్–మారేడు మానుదిన్నె అటవీ ప్రాంతంలో నాలుగు రోజుల కిందట జరిగిన ఈ ఘటన నిందితుడి లొంగుబాటుతో వెలుగులోకి వచ్చింది. రాంగ్ నంబర్తో కలిసి.. ప్రేమపెళ్లి చేసుకొని మహబూబ్నగర్ టూటౌన్ సీఐ ఇజాజుద్దీన్ కథనం ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం రాయవరం గ్రామానికి చెందిన శ్రీశైలం, మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం గోటూర్కు చెందిన శ్రావణి (27)కి రాంగ్ నంబర్ ద్వారా ఫోన్లో పరిచయం ఏర్పడింది. తరచూ ఫోన్లో మాట్లాడుకొనే క్రమంలో ప్రేమలో పడి 2014లో పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక బాబు, పాప ఉన్నారు. అయితే తొలి నుంచీ శ్రావణి ప్రవర్తనపై శ్రీశైలం అనుమానం పెంచుకున్నాడు. పెళ్లయిన కొంతకాలానికి భర్త, పిల్లలను వదిలేసి శ్రావణి తన అక్క భర్తతో వెళ్లిపోయింది. ఏడాది క్రితమే మళ్లీ భర్త వద్దకు రాగా ఆమెను భార్యగా శ్రీశైలం అంగీకరించాడు. దీంతో శ్రావణి ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ అంబేడ్కర్నగర్లో ఇద్దరు పిల్లలతో నివసిస్తుండగా.. శ్రీశైలం హైదరాబాద్లోని యూసుఫ్గూడలో హాస్టల్లో ఉంటూ దినసరి కూలీగా జీవనం కొనసాగిస్తున్నాడు. భార్య పద్ధతి మార్చుకోకపోవడంతో.. శ్రావణి తరచూ ఫోన్లు మాట్లాడటం, చాటింగ్ చేయడం గమనించిన శ్రీశైలం ఆమెతో గొడవపడ్డాడు. పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు చెప్పినా వినకపోవడంతో పథకం ప్రకారం ఆమెను హత్య చేసేందుకు ఈ నెల 21న హైదరాబాద్ నుంచి మహబూబ్నగర్కు చేరుకున్నాడు. ఆమెకు ముందురోజు రాత్రి ఫోన్ చేసి ఉదయం సోమశిలకు వెళ్దామని చెప్పాడు. ఆమె పిల్లలిద్దరినీ బడికి పంపగా స్నేహితుడి ద్విచక్ర వాహనం తీసుకొచ్చిన శ్రీశైలం.. తన భార్యతో కలిసి సోమశిలకు పయనమయ్యాడు. పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్కు చేరుకున్నాక సీతాఫలం పండ్లు ఉంటాయని చెప్పి భార్యను సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లాడు. అక్కడే చున్నీని ఆమె మెడకు చుట్టి గొంతు నులిమాడు. ఆ తర్వాత వెంట తెచ్చుకున్న కత్తితో పలుమార్లు పొడిచాడు. భార్య మృతి చెందిందని నిర్ధారించుకున్నాక వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసి తగలపెట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. తన కూతురు కనిపించట్లేదని శ్రావణి తండ్రి చంద్రయ్య మహబూబ్నగర్ టూటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అంతలోనే శ్రీశైలం లింగాల పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోవడంతో హత్యోదంతం వెలుగులోకి వచి్చంది. అక్కడి పోలీసులు ఈ సమాచారాన్ని పెద్ద కొత్తపల్లి పోలీసులకు అందించగా వారు వెళ్లి నిందితుడిని విచారిస్తున్నారు. -
ఎక్కడ ప్లస్.. ఎక్కడ మైనస్!
సాక్షి, హైదరాబాద్: వివిధ ప్రభుత్వ శాఖల్లో కేడర్వారీగా మంజూరైన పోస్టులు, పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య, ఖాళీలు, డిప్యుటేషన్, సెలవులపై వెళ్లిన ఉద్యోగులు.. ఇలా వివిధ కోణాల్లో రాష్ట్ర సర్కారు సమగ్ర సమీక్ష చేపట్టనుంది. ప్రధానంగా పనిభారానికి తగినట్లుగా పోస్టులున్నాయా? లేనట్లయితే డిమాండ్ ఎలా ఉంది? అనే అంశాల ప్రాతిపదికన సమీక్ష నిర్వహించనుంది. ఇందుకోసం మాజీ సీఎస్ శాంతికుమారి నేతృత్వంలో ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో గత నెలలో కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. శాఖలవారీగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతోపాటు శాఖాధిపతులతో సమీక్షలు నిర్వహించాలని కమిటీని ఆదేశించింది. కమిటీకి స్పష్టమైన సమాచారాన్ని అందించాలని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా అన్ని విభాగాల హెచ్ఓడీలకు గత వారం సర్క్యులర్ జారీ చేశారు. ఈ నెలాఖరుకల్లా సమీక్షలు పూర్తి చేసి నివేదిక సమర్పించాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. త్వరలో ప్రభుత్వం ప్రకటించనున్న జాబ్ క్యాలెండర్ సైతం ఈ నివేదికపైనే ఆధారపడనున్నట్లు విశ్వసనీయ సమాచారం. డిమాండ్ అండ్ సప్లై తరహాలో... ప్రభుత్వ కార్యక్రమాల అమల్లో ఉద్యోగుల పాత్రే అత్యంత కీలకం. ప్రతి కార్యక్రమం సజావుగా జరగాలంటే డిమాండ్కు తగ్గట్లు పోస్టులు మంజూరు చేయాలి. ఒకవేళ ఖాళీలుంటే వెంటనే భర్తీ చేయాలి. ప్రస్తుతం కొన్ని శాఖల్లో డిమాండ్కు సరిపడా ఉద్యోగులు లేరు. దీంతో సంక్షేమ కార్యక్రమాల అమలు ఇబ్బందికరంగా ఉంటోంది. ఉదాహరణకు బీసీ సంక్షేమ శాఖ పరిధిలో కొత్తగా 11 ఆర్థిక సహకార సంస్థలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఆయా కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించినా ఉద్యోగుల పోస్టులు మంజూరు చేయలేదు. దీంతో ఆయా విభాగాల్లో కార్యక్రమాల అమలు గందరగోళంగా ఉంది. ఇలాంటి పరిస్థితిని అధిగమించేలా డిమాండ్కు సరిపడా కొలువులు నిర్దేశించేందుకు వ్యూహాత్మక కార్యాచరణను సర్కారు రూపొందిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం డిమాండ్కు సరిపడా పోస్టులు లేని శాఖలను గుర్తిస్తూనే ఎక్కువ పోస్టులున్న శాఖలను గుర్తించి వాటిని సమతౌల్యం చేసేలా కమిటీ సూచనలు చేసే అవకాశం ఉంది. కమిటీ పరిశీలించనున్న అంశాలు... ⇒ ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టం (ఐఎఫ్ఎంఐఎస్) ఆధారంగా ప్రతి విభాగంలో మంజూరైన శాశ్వత, తాత్కాలిక పోస్టులు, వాటిల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఖాళీల వివరాలు. ⇒ ప్రభుత్వం అనుమతించిన డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు, భర్తీ కోసం గుర్తించిన పోస్టులు, నియామకాలు పూర్తి చేసిన తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగుల సంఖ్య. ⇒ శాశ్వత ప్రాదిపదికన ఉద్యోగాలు భర్తీ చేశాక తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న వారి తొలగింపు వివరాలు. ⇒ ప్రభుత్వ శాఖల్లో డిమాండ్కు తగినట్లు అదనపు పోస్టుల ప్రతిపాదనలు, కొత్తగా ప్రతిపాదించిన పోస్టుల నియామకాల వల్ల పడే ఆర్థికభారం అంచనా. ⇒ ఆర్థిక భారం తగ్గించుకోవడానికి గతంలో పోస్టులు మంజూరు చేసి పెండింగ్లో పెట్టిన పోస్టుల సమాచారం. ⇒ ప్రభుత్వ శాఖల్లో అనుమతి లేకుండా తాత్కాలిక పద్ధతిన పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు.త్వరలో నూతన జాబ్ కేలండర్ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నూతన జాబ్ కేలండర్ విడుదల చేయాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించి కసరత్తు కూడా ముమ్మరం చేసింది. గతేడాది విడుదల చేసిన జాబ్ కేలండర్కు ఎస్సీ వర్గీకరణ అంశం ప్రతిబంధకంగా మారడంతో అమలు సాధ్యపడలేదు. ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణ కొలిక్కి రావడంతో నూతన జాబ్ కేలండర్ జారీ అవసరమైంది. దీంతో ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల పరిశీలనకు నిర్దేశించిన కమిటీ సమర్పించే నివేదిక ఆధారంగా కొత్త ఉద్యోగాల గుర్తింపుపై స్పష్టత రానుంది. ఆ తర్వాత ప్రభుత్వ శాఖల ప్రతిపాదనలను ఆర్థిక శాఖ ఆమోదించాక నూతన జాబ్ కేలండర్ ఖరారు కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
‘సినీ పరిశ్రమకు పూర్తి సహకారం అందిస్తాం’
సాక్షి,హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా పరిశ్రమను ఉంచడమే తన ధ్యేయమని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ఇవాళ(ఆదివారం) జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్రెడ్డితో తెలుగు సినిమా నిర్మాతలు, దర్శకులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ..సినిమా పరిశ్రమలో పని వాతావరణం బాగా ఉండాలి.సినిమా కార్మికులను కూడా పిలిచి మాట్లాడుతా.ప్రభుత్వం నుంచి సినిమా పరిశ్రమ కు పూర్తి సహకారం ఉంటుంది. పరిశ్రమలోకి కొత్త గా వచ్చే వారికి నైపుణ్యాలు పెంచేలా చర్యలు తీసుకోవాలి. పరిశ్రమలో వివిధ అంశాల్లో నైపుణ్యాల పెంపు కోసం ఒక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది.స్కిల్ యూనివర్సిటీ లో సినిమా పరిశ్రమ కోసం కావాల్సిన ఏర్పాట్లు చేస్తాం. తెలుగు సినిమా పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి వెళ్లింది.తెలంగాణలో ముఖ్యమైన పరిశ్రమ సినిమా పరిశ్రమ. పరిశ్రమలో వివాదం వద్దనే కార్మికుల సమ్మె విరమణకు చొరవ చూపించాను. పరిశ్రమలో నిర్మాతలు,కార్మికుల అంశంలో సంస్కరణలు అవసరం. కార్మికుల విషయంలో నిర్మాతలు మానవత్వంతో వ్యవహరించాలి.నిర్మాతలు,కార్మికులు,ప్రభుత్వం కలిసి ఒక పాలసీ తీసుకువస్తే బాగుంటుంది. సినీ కార్మికులను,నిర్మాతలను కూడా మా ప్రభుత్వం కాపాడుకుంటుంది. సినిమా పరిశ్రమకు మానిటరింగ్ అవసరం. పరిశ్రమకు ఏం కావాలో ఒక కొత్త పుస్తకాన్ని రాసుకుందాం. పరిశ్రమలో వ్యవస్థలను నియంత్రిస్తామంటే ప్రభుత్వం సహించదు. అందరూ చట్ట పరిధిలో పని చేయాల్సిందే.పరిశ్రమ విషయంలో నేను న్యూట్రల్గా ఉంటా. హైదరాబాద్లో అంతర్జాతీయ సినిమాల చిత్రీకరణ కూడా జరుగుతోంది.తెలుగు సినిమాల చిత్రీకరణ ఎక్కువ గా రాష్ట్రంలోనే జరిగేలా చూడాలి. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా పరిశ్రమ ను ఉంచడమే నా ధ్యేయం’ అని వ్యాఖ్యానించారు. -
బండి సంజయ్పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘తెలంగాణలోనూ దొంగ ఓట్లున్నాయి.దొంగ ఓట్లతోనే ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గెలిచారు. దొంగ ఓట్లు లేకపోతే బండి సంజయ్ గెలిచేవారు కాదు. బండిసంజయ్ బీసీ కాదు.. దేశ్ముఖ్. కులం మతం లేకపోతే బీజేపీ గెలవదు. దేవుడి పేరుతో మేం ఎన్నడూ ఎన్నికలప్పుడే దేవుడే గుర్తుకొస్తాడు. బీఆర్ఎస్ మూడు ముక్కలైంది.నాల్గవ ముక్క కోసం ఇంకొకరు ఎదురుచూస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్కు తప్ప.. వేరే పార్టీకి అవకాశం లేదు’అని వ్యాఖ్యానించారు. -
‘దేవుడు గొప్ప డిజైనర్.. ప్రకృతి ఉత్తమ గురువు’
హైదరాబాద్: దేవుడు గొప్ప డిజైనర్, ప్రకృతి ఉత్తమ గురువు అన్నారు సీఎం రేవంత్రెడ్డి. ఈరోజు(ఆదివారం, ఆగస్టు 24వ తేదీ) నగరంలోని ఏఐజీ ఆస్పత్రి వేదికగా ఆసియా-పసిఫిక బయోడిజైన్ ఇన్నోవేషన్-2025 సమ్మిట్ను సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘బయోడిజైన్ ఉపయోగించి వైద్య ఉత్పత్తుల ఆవిష్కరణల సదస్సులో పాల్గొనడం ఆనందంగా ఉంది. దేనినైనా మనం రూపొందిస్తే దాని ప్రయోజనం , పనితీరు, రూపం ప్రాథమిక అంశాలుగా ఉంటాయి. దేవుడు గొప్ప డిజైనర్. ప్రకృతి ఉత్తమ గురువు. మనం మంచి విద్యార్థులమా లేదా అన్నదే ప్రశ్న.లైఫ్ సైన్సెస్లో, వైద్యంలో, ప్రకృతి ఉత్తమ గురువు. మనం ప్రకృతి నుంచి నేర్చుకుంటే, మనం తప్పు చేయొద్దు. కృత్రిమ మేధస్సు బయోడిజైన్కు మంచి ఉదాహరణ. మానవులు కృత్రిమ మెదడును సృష్టించడానికి సహజ మెదడును ఉపయోగించారు.మేము తెలంగాణ రైజింగ్ 2047 అనే ప్రయాణాన్ని ప్రారంభించాము. 2034 నాటికి తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నాం. దేశం 100 సంవత్సరాల స్వాతంత్ర్యదినోత్సవాన్ని జరుపుకునే 2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ గా మారుస్తాం..తెలంగాణ లైఫ్ సైన్సెన్స్కు కేంద్రం గా ఉంది..తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను సాధించడంలో వైద్య పరికరాలు, మెడ్టెక్ కీలకమైనవి’ అని ఆయన పేర్కొన్నారు. -
‘నాలాగ పనిచేసే ఎమ్మెల్యే దొరకడం కష్టం’
హన్మకొండ జిల్లా: ఎవరు కుళ్లుకున్నా తన పని తాను చేసుకుపోవడమే తనకు తెలుసని ఎమ్మెల్యే కడియం శ్రీహారి స్పష్టం చేశారు. పని చేయని వారు దొంగలాగ పారిపోతారని, తాను పని చేశాను కాబట్టే ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానన్నారు. అభివృద్ధికి ప్రజలు సహకరించాలని ప్రజలకు సూచించారు.ఈరోజు(ఆదివారం, ఆగస్టు 24వ తేదీ) జిల్లాలోని ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాలలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ‘ నాలాగ పనిచేసే ఎమ్మెల్యే దొరకడం కష్టం. నేను ఒక్క రూపాయి లంచం తీసుకున్నట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. అవినీతికి కాకుండా అభివృద్ధికి సహకరించండి’ అని ప్రజలకు పిలుపునిచ్చారు. -
‘హత్య తర్వాత నటన’.. స్వాతి తల, చేతులు, కాళ్లు మూసీలో.. మిగిలినవి ఇంట్లో!
సాక్షి,హైదరాబాద్: ఒళ్లుగగూర్పొడిచే రీతిలో చోటు చేసుకున్న హైదరాబాద్ బోడుప్పల్ స్వాతి మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అనుమానం పెనుభూతమై, నిండు గర్భిణి అయిన భార్య స్వాతిని భర్త మహేందర్రెడ్డి అత్యంత దారుణంగా హత్య చేసినట్లు మల్కాజ్గిరి డీసీపీ పద్మజా రెడ్డి వెల్లడించారు.బోడుప్పల్ మర్డర్ కేసుపై డీసీపీ పద్మజారెడ్డి మీడియాతో మాట్లాడారు. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన స్వాతి, మహేందర్రెడ్డిలది ఒకే గ్రామం. ఏడాదిన్నర క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. స్వాతి పంజాగుట్టా కాల్ సెంటర్లో జాబ్ చేస్తోంది. మహేందర్రెడ్డి క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. 25రోజుల క్రితమే హైదరాబాద్కు వచ్చి బోడుప్పల్లోని ఈస్ట్ బాలాజీ హిల్స్లో ఉంటున్నారు.పెళ్లైన మూడు,నాలుగు నెలల నుంచి చిన్న చిన్న విషయాలకే గొడవపడేవారు. స్వాతి కాల్సెంటర్లో పనిచేస్తోంది.నిత్యం ఫోన్లోనే ఉంటుందని అనుమానం వ్యక్తం చేశాడు. ఆ అనుమానంతోనే మొదటి సారి గర్భం వస్తే తీయించాడు. రెండో సారి గర్భం వచ్చినప్పుడు స్వాతిపై ఉన్న అనుమానం మహేందర్రెడ్డికి పెను భూతమైంది.స్వాతి గర్భవతి. మెడికల్ చెకప్ తీసుకుకెళ్లమని అడిగింది.ఈ విషయంలో గొడవమొదలైంది. అది చిలికిచిలికి పెద్దదయ్యింది. ఈనెల 22న కూడా గొడవపడ్డారు. స్వాతిని హత్య చేయాలని ప్లాన్ చేశాడు. హత్యకు ముందే బోడుప్పల్లో హాక్సాబ్లేడ్ కొనుగోలు చేశాడు. ఇరువురు ఘర్షణలో మహేందర్రెడ్డి భార్య స్వాతిని కొట్టాడు. మహేందర్రెడ్డి కొట్టడం స్వాతి స్పృహ కోల్పోయింది. అనంతరం, ఆమెను గొంతు నులుమి హత్య చేశాడు.చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత డెడ్బాడీని మాయం చేసేందుకు శతవిధాల ప్రయత్నించాడు. ప్రయత్నాలు విఫలం కావడంతో కాళ్లు,చేతులు,మొడెం ఇతర శరీర భాగాలు ముక్కలు ముక్కలుగా కట్ చేశాడు. శరీర భాగాల్ని కవర్లో ప్యాక్ చేశాడు. శరీర భాగాలున్న కవర్లను మూడుసార్లు మూసినదిలో పడేశాడు.అనంతరం చెల్లికి ఫోన్ చేశాడు. తన భార్య అదృశ్యమైందని చెప్పాడు.ఫోన్ రావడంతో బావ మహేందర్రెడ్డి ఇంటికి వెళ్లాడు.చెల్లెలి భర్తకు మహేందర్రెడ్డిపై అనుమానం వచ్చింది. మహేందర్ కూడా మేడిపల్లిలో భార్యపై మిస్సింగ్ కంప్లయింట్ ఇచ్చి.. ఏమీ ఎరుగనట్టుగా ఉందామని యాక్టింగ్ చేశాడు. కానీ మా ఇన్స్పెక్టర్కు మహేందర్రెడ్డిపై అనుమానం వచ్చింది. మహేందర్రెడ్డిని ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ నిందితుడి ఇంట్లో మృతదేహం లభ్యమైంది. తల,కాళ్లు,చేతులు,ఇతర శరీర భాగాలు లేని మొండాన్ని గుర్తించాం. ఆ మొండాన్ని డీఎన్ఏ టెస్టుకు పంపించి నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నాం. మా విచారణలో మహేందర్రెడ్డి తాను నేరం చేసినట్లు అంగీకరించాడు. మృతదేహం ముక్కలు ముక్కలు చేసినట్లు నిందితుడు పోలీసులకు చెప్పాడు. తల, కాళ్లు, చేతులు మూసీ నదిలో పడేసినట్లు ఒప్పుకున్నాడు. మూసీ నది వద్దకు నిందితుడిని తీసుకొచ్చి సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశాం. మూసీలో స్వాతి శరీరభాగాల ముక్కల కోసం వెతుకుతున్నాం’అని అన్నారు. -
సీఎం రేవంత్కు కేటీఆర్ సవాల్
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ చేశారు. తన పాలనను రెఫరెండంగా ఉపఎన్నికలకు వెళ్లేదమ్ము రేవంత్కు ఉందా? అని ప్రశ్నించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలవాలి’అని డిమాండ్ చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ‘బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో ఎన్నడూ రియల్ ఎస్టేట్లో నాయకులు వేలు పెట్టలేదు. కానీ 20 నెలల్లోనే హైడ్రా పేరుతో కాంగ్రెస్ నాయకులు అరాచకం సృష్టించారు. కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా పట్టించుకోకుండా పేదల ఇళ్లు కూల్చివేశారు. బీఆర్ఎస్ పదేళ్లలో రెండు లక్షల 85 వేల కోట్ల అప్పు చేస్తే, రేవంత్ రెడ్డి 20 నెలల్లోనే రెండు లక్షల 20 వేల కోట్ల అప్పు చేశారని విమర్శించారు. కేసీఆర్ ఆ అప్పుతో హైదరాబాద్ లో 42 ఫ్లైఓవర్లు, అత్యాధునిక ఆసుపత్రులు, మురుగునీటి శుద్ధి కేంద్రాలు కట్టారని, కానీ రేవంత్ ఒక్క కొత్త బ్రిడ్జి కానీ, మోరీ కానీ కట్టారు. కేసీఆర్ 70 లక్షల మంది రైతు ఖాతాల్లో 70 వేల కోట్లు వేస్తే, రెండు లక్షల కోట్ల అప్పు చేసిన రేవంత్ ఏం చేశారని నిలదీశారు. 200 ఉన్న పెన్షన్ను కేసీఆర్ ప్రభుత్వం 2000 చేస్తే, రేవంత్ ఏం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే ప్రజలకు మంచి చేసి ఉంటే, ఉప ఎన్నికల్లో పోటీ చేసి మళ్లీ గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. ఉత్త టైంపాస్ ముచ్చట్లు చెబుతూ, ఒకరోజు కేసీఆర్ మీద, ఇంకోరోజు తన మీద కేసులంటూ రేవంత్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ మహానగరానికి రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదని కేటీఆర్ తేల్చి చెప్పారు. నాయకులు మోసం చేసినా, కార్యకర్తలు మాత్రం గులాబీ జెండాను వదల్లేదని కేటీఆర్ ప్రశంసించారు. -
నల్లగొండ ఎంతో నచ్చింది
నాకు నల్లగొండ ఎంతో నచ్చింది అంటున్నాడు ఫ్రాన్స్ దేశానికి చెందిన ఆడ్రిన్. వారం క్రితం నల్లగొండకు వచ్చిన ఆయన శివాజీనగర్ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఉంటూ వివిధ ప్రదేశాల్లో సందడి చేస్తున్నాడు. ఇక్కడి వారితో కలిసిపోయి అందరితో సరదాగా గడుపుతున్నాడు. శనివారం ఆయనను ‘సాక్షి’ పలకరించగా.. దేశ పర్యటన విశేషాలను పంచుకున్నాడు. వివరాలు ఆయన మాటల్లోనే..రామగిరి(నల్లగొండ) : నాకు పర్యటనలు అంటే ఎంతో ఇష్టం. ఎంఎస్ కార్పొరేట్ ఫైనాన్స్ పూర్తి చేసిన నేను ఫ్రాన్స్ రైల్వేస్లో డేటా మేనేజర్గా పని చేస్తున్నాను. 2011లో మొదటిసారి ఢిల్లీలోని భీంటెక్ కంపెనీకి స్టడీ ఎక్ఛ్సేంజ్ కార్యక్రమానికి ఇండియా వచ్చాను. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు నాకు ఎంతో నచ్చాయి. ఇప్పటికి ఎనిమిది సార్లు ఇండియాలో పర్యటించాను. నేపాల్ దేశాన్ని కూడా సందర్శించాను. ఇండియాలోని 14 రాష్ట్రాలు తిరిగాను. ఎక్కువగా ఆధ్యాత్మిక ప్రదేశాలను వీక్షించాను. ఇక్కడి హిమాచల్ప్రదేశ్, రాజస్థాన్, లడక్, టిబెట్ అంటే నాకు ఎంతో ఇష్టం.ధ్యానం ఇష్టంఈ ఏడాది జూలైలో ఢిల్లీకి వచ్చాను. రాజస్థాన్లోని జైపూర్, లడక్, కార్గిల్ను సందర్శించాను. అమర్నాథ్ యాత్రకు వెళ్లాను. ఆగస్టులో హైదరాబాద్ వచ్చి.. అక్కడి నుంచి నాగార్జునసాగర్ విపాసన ధ్యాన కేంద్రానికి వెళ్లాను. వారం రోజుల పాటు అక్కడ ధ్యానంలో శిక్షణ తీసుకున్నాను. అక్కడికి వలంటీర్గా వచ్చిన నల్లగొండ మండలం కంచనపల్లికి చెందిన నితిన్తో పరిచయం ఏర్పడింది. అతని ఆహ్వానం మేరకు ఆగస్టు 17న కంచనపల్లికి వచ్చాను.ఇండియా గొప్ప దేశంఇండియా గొప్ప దేశం. ఇక్కడ ప్రతి రాష్ట్రంలో ఒక విభిన్నమైన సంస్కృతి ఉంది. అనేక భాషలు మాట్లాడుతారు. పర్యాటక ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఇటీవల వెళ్లిన అమర్నాథ్ యాత్ర ఎంతో అనుభూతిని ఇచ్చింది. ఇండియాలో నేను ఎక్కువగా నార్త్ ఇండియా సందర్శించాను. ఇప్పుడు మొదటిసారి సౌత్ ఇండియాకు వచ్చాను. ఇండియాలో నేర్చుకున్న ధ్యానం జీవనానికి, ఉద్యోగరీత్యా చాలా ఉపయోగపడుతుంది. హిందూ, బుద్ధిజం అంటే ఇష్టపడతాను. తీరిక సమయాల్లో రామాయణం, భగవద్గీత చదువుతాను.నిత్య జాతీయ గీతాలాపన బాగుంది..నల్లగొండ పట్టణం చాలా బాగుంది. వారం రోజులు ఇక్కడ గడిపాను. రోజూ ఉదయం బీజేపీ కార్యాలయంలో యోగా శిక్షణకు హాజరవుతున్నాను. ఇక్కడ అందరూ ఇష్టంగా నాతో సెల్ఫీలు దిగుతున్నారు. నల్లగొండలోని బిర్యానీ, దోశ, చాయ్ బాగున్నాయి. పానగల్ ఆలయాన్ని సందర్శించాను. కంచనపల్లి గ్రామంలో నాట్లు వేసే కూలీలతో సరదాగా గడిపాను. నాకు భారతదేశ సంస్కృతి ఎంతో ఇష్టం. నల్లగొండలో రోజూ ఉదయం జాతీయ గీతాలాపన చేయడం నాకు ఎంతో నచ్చింది. నేను కూడా భారతదేశ జాతీయ జెండా పట్టుకుని జాతీయ గీతం ఆలపించాను. -
నిజామాబాద్: మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం..
సాక్షి, నిజామాబాద్: ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. సీనియర్, జూనియర్ మెడికోలు ఘర్షణకు దిగారు. ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్న రాహుల్ను సీనియర్లు వేధించారు. దీంతో ఎదురు తిరిగి ప్రశ్నించినందుకు రాహుల్ను సీనియర్లు చితకబాదారు. గాయాలపాలైన రాహుల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఆసుపత్రిలో అర్ధరాత్రి వరకు పంచాయితీ జరిగింది. బాధితుడు.. కళాశాల అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు.. ర్యాగింగ్ విషయం బయటపడకుండా దాచే ప్రయత్నం చేస్తున్నారు. బాధితుడికి న్యాయం చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. -
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 24-31)
-
ప్రామిస్ ఇదే లాస్ట్ పెళ్లి.. సంబంధం చూడండి..!
సూర్యాపేటటౌన్: బాలికను నాల్గో వివాహం చేసుకున్న కానిస్టేబుల్పై సూర్యాపేట రూరల్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. శనివారం ఎస్ఐ బాలునాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. చివ్వెంల మండల పరిధిలోని తుల్జారావుపేట గ్రామ పంచాయతీకి చెందిన బానోతు కృష్ణంరాజు నడిగూడెం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. గతంలో మూడు పెళ్లిళ్లు చేసుకున్న కృష్ణంరాజు 2023 డిసెంబర్లో సూర్యాపేట మండలంలోని సపావట్తండాకు చెందిన మైనర్ బాలికను నాలుగో వివాహం చేసుకున్నాడు. ఇటీవల అతడు ఐదో పెళ్లికి కూడా సిద్ధమవ్వగా.. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ మునగాల సీఐ రామకృష్ణారెడ్డిని విచారణ అధికారిగా నియమించారు. విచారణ అనంతరం కానిస్టేబుల్ కృష్ణంరాజును సస్పెండ్ చేస్తూ ఈ నెల 12న ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే సపావట్తండాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు భూక్య నారాయణ వదిన కొడుకే కృష్ణంరాజు కాగా.. నారాయణ, బాలిక తల్లి కలిసి.. ఆమెను కృష్ణంరాజుకు ఇచ్చి వివాహం చేశారని బాలిక తండ్రి సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్లో శనివారం ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కానిస్టేబుల్ కృష్ణంరాజుపై పోక్సో కేసు నమోదు చేయడంతో పాటు వివాహాన్ని ప్రోత్సహించిన బాలిక తల్లి, ప్రభుత్వ ఉపాధ్యాయుడు నారాయణపై చైల్డ్ మ్యారేజీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ బాలునాయక్ తెలిపారు. -
ప్రేమ వివాహం.. గర్భిణి స్వాతి హత్యలో వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని బోడుప్పల్ దారుణ ఘటన చోటుచేసుకుంది. భర్త తన భార్యను ముక్కలుగా నరికి హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. తన భార్య గర్భవతి అని తెలిసినప్పటి నుంచి ఆమెపై భర్త అనుమానం పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఆమెను హత్య చేసేందుకే తనను వికారాబాద్ నుంచి బోడుప్పల్కు తీసుకువచ్చినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లాలోని కామారెడ్డిగూడకు చెందిన స్వాతి, మహేందర్ ప్రేమ వివాహం చేసుకొని బోడుప్పల్లో నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ ఒకే గ్రామానికి చెందినవారు. కాగా, వారిద్దరూ 25 రోజుల క్రితమే హైదరాబాద్కు వచ్చి బోడుప్పల్లోని ఈస్ట్ బాలాజీ హిల్స్లో ఉంటున్నారు. అయితే, ఏం జరిగిందో ఏమో తెలియదు.. మహేందర్ రెడ్డి.. తన భార్యను అత్యంత కిరాతంగా హత్య చేశాడు. గర్భవతైన భార్యను చంపి మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. అనంతరం శరీరభాగాలను కవర్లో ప్యాక్ చేసి.. బయటకు తీసుకెళ్లి మూసీ నదిలో పడేశాడు. అయితే, గది నుంచి శబ్దాలు రావడంతో పొరుగింటి వ్యక్తులు వెళ్లి చూశారు. దీంతో విషయం బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు మహేందర్రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.ప్లాన్ ప్రకారమే హత్య..అయితే, స్వాతి గర్భవతి అయినప్పటి నుంచే మహేందర్ ఆమెపై అనుమానం పెట్టుకున్నాడు. దీంతో, ప్లాన్ ప్రకారమే ఆమెను వికారాబాద్ నుంచి బోడుప్పల్కు తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆమెను హత్య చేశాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.తల్లి సంచలన ఆరోపణలు.. మరోవైపు.. పెద్దల్ని కాదని మహేందర్ రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్న స్వాతి కాపురం మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిందని ఆమె తల్లి మీడియా ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. మహేందర్ గురించి ఆమె షాకింగ్ విషయాలు బయటపెట్టారు. పెళ్లై 19 నెలలు గడిచినా.. ఒక్కసారి కూడా మహేందర్.. జ్యోతిని పుట్టింటికి పంపలేదని వాపోయారు. భర్తకు తెలియకుండా తమ కూతురు అప్పుడప్పుడు తమతో ఫోన్లో మాట్లాడేదని, పెళ్లైన కొన్నాళ్లకే మహేందర్ వేధించడం మొదలు పెట్టాడని చెప్పేదన్నారు. మహేందర్ రెడ్డి ప్రవర్తనపై చుట్టుపక్కల వారు కూడా అనుమానం వ్యక్తం చేశారు. తమ కూతుర్ని చెప్పి మరీ చంపేశారని జ్యోతి తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ముక్కలు చేసిన శరీర భాగాల్లో కొన్నింటిని మూసీ నదిలో పడేసినట్లు మహేందర్ పోలీసులకు చెప్పగా.. వాటి కోసం ప్రతాప్ సింగారం సమీపంలో నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. -
పుస్తకాలు వదిలి.. పాఠశాలకు కదిలి
ఖమ్మం సహకారనగర్: ప్రతీనెల నాలుగో శనివారం ‘నో బ్యాగ్ డే’ అమలు చేయాలన్న ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశాలతో.. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ వారం కార్యక్రమం మొదలైంది. ఈ సందర్భంగా అన్ని పాఠశాలల విద్యార్థులు బ్యాగ్లు లేకుండానే వచ్చారు. ఈ మేరకు పాఠశాలల్లో విద్యార్థులకు చిత్రలేఖనం, క్విజ్, వ్యాసరచన, కవితల పోటీలు నిర్వహించి విజేతలను అభినందించారు.మట్టితో గణపతి ప్రతిమలు, ఆకులు, పేపర్లతో కళారూపాల తయారీ, పర్యావరణ పరిరక్షణ అంశాలపై ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు. పుస్తకాలు లేకుండా రావడం.. రోజంతా ఆటపాటలు నిర్వహించడంతో విద్యార్థులు ఉత్సాహంగా గడిపారు. కలెక్టర్ అనుదీప్ పలు పాఠశాలల్లో కార్యక్రమాన్ని పరిశీలించడమే కాక.. కొన్ని పాఠశాలల విద్యార్థులను కలెక్టరేట్కు పిలిపించి కార్యాలయ కార్యకలాపాలపై అవగాహన కల్పించారు. -
అంతరాలు!
డైనింగ్ టేబుల్పై నోరూరించే వంటకాలు ఘుమఘుమలాడుతున్నాయి. ఓ తాత, ఆయన మనవడు.. నిశ్శబ్దంగా సాగుతోంది వారి భోజనం. తనతో ఈరోజైనా ఏమైనా మాట్లాడతాడేమోనని ఆ పెద్దాయన ఎదురు చూపులు. 21 ఏళ్ల ఆ కుర్రాడు మాత్రం తన ప్రపంచంలో తాను ఫోన్ లో ఎప్పటిలాగే నిమగ్నమయ్యాడు. ఇద్దరిదీ ఒకేగూడు.. అయినా ఇరువురి మధ్య దూరం. ఇలాంటి దృశ్యాలు.. ఏ ఒక్క కుటుంబానికో పరిమితం కాలేదు. దేశంలోని లక్షలాది ఇళ్లల్లో ఇదే పరిస్థితి.దేశ జనాభాలో 15–29 సంవత్సరాల మధ్య వయసు గల యువత దాదాపు 29% ఉన్నారని అంచనా. అంటే దాదాపు 42 కోట్ల మంది! ఈ ఏడాది చివరినాటికి దేశ జనాభాలో 60 ఏళ్లు, ఆపై వయసుగలవారు 12 శాతం వరకు ఉంటారు. 2050 నాటికి ఇది 19 శాతానికి చేరుతుంది. వీరి జనాభా 25 ఏళ్లలో రెండింతలవుతుందని అంచనా. ఇది మనదేశంలో రెండు ప్రధాన తరాల ముఖ చిత్రం.మనసుల మధ్య ఎడంసాధారణంగా తరాల మధ్య అంతరం ఉంటుంది. కానీ, ఇటీవల వ్యక్తుల మధ్యే కాదు.. మనసుల మధ్య కూడా ఎడం ఉంటోంది. జనరేష¯Œ –జడ్.. పెద్దలను గౌరవిస్తారు. కానీ ఒంటరి వారని, తమపై ఆధారపడతారన్న చులకన భావమూ ఉంటోందని సుప్రసిద్ధ ఎన్జీవో ‘హెల్పేజ్ ఇండియా’ దేశవ్యాప్తంగా చేపట్టిన అధ్యయనం చెబుతోంది. పెద్దలతో యువతరానికి ఉన్న పరిమిత బంధాలు, కుటుంబాల్లో మూస పద్ధతులు.. వెరసి అభిమానం ఉన్నా ఇరువురి మధ్య దూరం ఉంటోందని వివరించింది. తరాలున్న కుటుంబాల్లో 18–24 ఏళ్ల వయసున్న యువతకు.. తాతయ్య, అమ్మమ్మ, నానమ్మలతో ఆత్మీయ అనుబంధం ఎక్కువ.వృద్ధులతో యువత ఎలా మమేకం అవుతున్నారంటే.. -
భర్తను చంపిన భార్య
మొయినాబాద్: డెయిరీ ఫామ్లో పనిచేస్తున్న ఓ మహిళ మరో వ్యక్తితో కలిసి భర్తను హత్య చేసింది. శవాన్ని బావి పక్కన పడేసి, సెల్ఫోన్ స్విచ్ఛాప్ చేసి పరారైంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్నగర్లో శనివారం రాత్రి వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. అజీజ్నగర్కు చెందిన సామ రాజిరెడ్డి రెండు నెలల క్రితం డెయిరీ ఫామ్ ప్రారంభించారు. ఇక్కడ పనిచేసేందుకు ఓ జంట కావాలని బిహార్కు చెందిన పవన్ను సంప్రదించాడు. అతని ద్వారా నెల క్రితం రాజేశ్కుమార్, పూనందేవి దంపతులను పనికి కుదుర్చుకున్నాడు.గత గురువారం రాజిరెడ్డి డెయిరీ ఫామ్కు వెళ్లగా రాజేశ్కుమార్ దంపతులతోపాటు మరో వ్యక్తి కనిపించాడు. అతను తమ బంధువని చెప్పడంతో సరేనని ఊరుకున్నాడు. శుక్రవారం ఫామ్కు వెళ్లిన యజమానికి రాజేశ్ కనిపించలేదు. ఎక్కడికి వెళ్లాడని పూనందేవిని అడగగా మద్యం తాగివచ్చి, తనతో గొడవ పడి ఎక్కడికో వెళ్లాడని చెప్పింది. సాయంత్రం ఫామ్ వద్దకు వెళ్లిన రాజిరెడ్డికి పనివాళ్లెవరూ కనిపించలేదు.ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో శనివారం ఏజెంట్కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత తిరిగి ఫోన్ చేసిన పవన్.. పూనందేవి, మహేశ్సాని అలియాస్ గుడ్డు అనే వ్యక్తి కలిసి రాజేశ్ను చంపి, బావి వద్ద పడేశారని చెప్పాడు. రాజిరెడ్డి వెళ్లి చూడగా రాజేశ్కుమార్ మృతదేహం కనిపించింది. రాయితో తలపై కొట్టి చంపినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కేబినెట్ భేటీ ఈనెల 29కి వాయిదా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈనెల 29వ తేదీకి వాయిదా పడింది. వాస్తవానికి 25న మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని అనుకున్నప్పటికీ శనివారం జరిగిన కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహణ విషయంలో ఆ పార్టీ వైఖరి స్పష్టం కాలేదు.ఎన్నికలకు వెళ్లాలని ఆలోచన ఉన్నప్పటికీ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపేందుకు కాంగ్రెస్ పార్టీ మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీ నివేదిక ఇచ్చిన అనంతరం పార్టీ తన వైఖరిని అధికారికంగా ప్రకటించనుంది ఈ నేపథ్యంలో పార్టీ వైఖరి స్పష్టమైన తర్వాతే కేబినెట్ భేటీ జరిపి స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి భావిస్తున్నట్టు సమాచారం. -
శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద
దోమలపెంట/నాగార్జునసాగర్: ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతోంది. శనివారం రాత్రి 7 గంటల సమయంలో జూరాల ప్రాజెక్టు నుంచి స్పిల్వే, విద్యుదుత్పత్తి ద్వారా 4,16,629, సుంకేసుల నుంచి 53,313, హంద్రీ నుంచి 250 మొత్తం 4,70,192 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలంకు వస్తోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు పది గేట్లు ఒక్కొక్కటి 18 అడుగుల మేర ఎత్తి.. స్పిల్వే ద్వారా 4,19,314 క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు. మరోవైపు ఎడమగట్టు భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 26,087.. మొత్తం 61,402 క్యూసెక్కుల నీటిని అదనంగా నాగార్జునసాగర్కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 881.7 అడుగుల వద్ద 197.4617 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 24 గంటల వ్యవధిలో పోతిరెడ్డిపాడు ద్వారా 30,000, హెచ్ఎన్ఎస్ఎస్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 2,818, ఎంజీకేఎల్ఐ ద్వారా 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎడమగట్టు భూగర్భ కేంద్రంలో 16.480 మిలియన్ యూనిట్లు, కుడిగట్టు కేంద్రంలో 13.750 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేశారు. కాగా, నాగార్జున సాగర్ ప్రాజెక్టు 26 క్రస్ట్గేట్ల ద్వారా స్పిల్వే మీదుగా 3,61,322 క్యూసెక్కులు, విద్యుదుత్పాదనతో 33,414 క్యూసెక్కులు మొత్తం 3,94,736 క్యూసెక్కుల వరద నీటిని అధికారులు దిగువ కృష్ణా నదిలోకి విడుదల చేస్తున్నారు. -
యూరియాపై ఆందోళన వద్దు
సాక్షి, హైదరాబాద్: యూరియా సరఫరా ను పెంచేందుకు మా ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుందని, ప్రతిపక్షాల దుష్ప్రచారంతో రైతులు ఆందోళనకు గురి కావొద్దని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్బాబు విజ్ఞప్తి చేశారు. రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్) యాజమాన్యం, వ్యవసాయ, పరిశ్రమల శాఖల ఉన్నతాధికారులతో శనివారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా ఆర్ఎఫ్సీఎల్లో ఉత్పత్తి నిలిచిపోవడానికి గల కారణాలపై మంత్రులు ఆరా తీశారు.ఈ సీజన్లో 145 రోజుల్లో 40 రోజులు మాత్రమే ప్లాంట్ పనిచేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తరచూ ఇలాంటి పరిస్థితులు తలెత్తుతుంటే శాశ్వత చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆర్ఎఫ్సీఎల్ సీఈవో అలోక్ సింఘాల్ను మంత్రులు ప్రశ్నించారు. ‘మిమ్మల్ని మేం కేవలం వ్యాపారవేత్తలుగా మాత్రమే చూడటం లేదు. రాష్ట్రాభివృద్ధిలో మాతో కలిసి నడిచే భాగస్వామిగా చూస్తున్నాం’అని స్పష్టం చేశారు. ప్లాంట్ పునరుద్ధరణకు రూపొందించిన యాక్షన్ ప్లాన్ను సమీక్షించి మార్గనిర్దేశం చేశారు. ఇతర రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణను చూడొద్దన్నారు. రామగుండంలో ఉత్పత్తి ప్రారంభమయ్యే వరకు ఆర్ఎఫ్సీఎల్ మాతృసంస్థ ఎన్ఎఫ్ఎల్కు సంబంధించిన ఇతర ప్లాంట్ల నుంచి తెలంగాణకు ప్రతీరోజు ఒక రేకు యూరియాను సరఫరా చేసేలా చొరవ చూపాలని కోరారు. ఈ విషయంలో మీకేమైనా ఇబ్బందులుంటే కేంద్రంతో మాట్లాడి పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. సమీక్షలో స్పెషల్ సీఎస్ సంజయ్కుమార్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, ఆర్ఎఫ్సీఎల్ యూనిట్ హెడ్, జీఎం రాజీవ్ పాల్గొన్నారు. -
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయింపునకు పాల్పడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసే ప్రక్రియను స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ ప్రారంభించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై అక్టోబర్ 31లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు శాసనసభ స్పీకర్కు సూచించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసుల జారీ ప్రక్రియను స్పీకర్ ప్రారంభించారు. నోటీసులు అందుకున్న వారు నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని పేర్కొన్నట్లు తెలిసింది. ఇప్పటివరకు ఐదుగురు ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి (గద్వాల), ప్రకాశ్గౌడ్ (రాజేంద్రనగర్), అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి), గూడెం మహిపాల్రెడ్డి (పటాన్చెరు), తెల్లం వెంకటరావు (భద్రాచలం)కు స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు జారీ అయినట్లు తెలిసింది. తనకు నోటీసులు వచి్చన విషయం వాస్తవమేనని కృష్ణమోహన్రెడ్డి ‘సాక్షి’కి వెల్లడించారు. అయితే హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లోని తన చిరునామాకు నోటీసులు వచ్చాయని, తాను గద్వాలలో ఉన్నందున వ్యక్తిగతంగా స్వీకరించలేదని వెల్లడించారు. సోమవారం హైదరాబాద్కు వెళ్లి నోటీసులు స్వయంగా తీసుకున్న తర్వాత తన ప్రతిస్పందన ఉంటుందన్నారు. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ (ఖైరతాబాద్), కడియం శ్రీహరి (స్టేషన్ ఘనపూర్), పోచారం శ్రీనివాస్రెడ్డి (బాన్సువాడ)కి నోటీసులు సిద్ధమైనట్లు తెలిసింది. స్పీకర్ ఢిల్లీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో తిరిగి వచ్చిన తర్వాత నెలాఖరులోగా మిగతా ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ (జగిత్యాల), కాలె యాదయ్య (చేవెళ్ల)కు కూడా నోటీసుల జారీ ప్రక్రియ కొనసాగుతుందని సమాచారం. ఫిర్యాదులు, ఆధారాలు తదితరాలను క్షుణ్ణంగా పరిశీలించి చట్టపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ స్పీకర్ నోటీసులు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఢిల్లీకి స్పీకర్ ప్రసాద్కుమార్ ఢిల్లీలో జరిగే ఆలిండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్లో పాల్గొనేందుకు శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ నేతృత్వంలోని బృందం శనివారం శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరింది. స్పీకర్తోపాటు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ నరసింహాచార్యులుతోపాటు పలువురు అసెంబ్లీ అధికారులు ఈ బృందంలో ఉన్నారు. 1925లో భారతదేశ సెంట్రల్ లేజిస్లేటివ్ అసెంబ్లీకి స్పీకర్గా ఎన్నికైన మొదటి భారతీయుడు విఠల్ బాయి పటేల్ బాధ్యతలు స్వీకరించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆగస్టు 24, 25 తేదీల్లో ఢిల్లీలో స్పీకర్ల సదస్సును నిర్వహిస్తున్నారు. ఇటీవలే కంటి శస్త్ర చికిత్స చేయించుకున్న శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ భేటీకి హాజరుకావడం లేదని మండలి వర్గాలు చెప్పాయి. -
సెప్టెంబర్తొలి వారంలో పదవుల బొనాంజా !
సాక్షి, హైదరాబాద్: క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలకు వినాయక నిమజ్జనంలోపే పదవు ల బొనాంజా అందనుంది. ఈ మేరకు సెప్టెంబర్ మొదటివారంలోనే కార్పొరేషన్లకు డైరెక్టర్లు, బోర్డు సభ్యుల నియామకాలను పూర్తి చేయాలని సీఎం రేవంత్ సమక్షంలో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పీఏసీ భేటీ కంటే ముందు శనివారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్లోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్రెడ్డి రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. పార్టీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్తోపాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్బాబు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్లు ఈ భేటీలో పాల్గొన్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ గురించి చర్చించారు. ఇప్పటికే జిల్లా పార్టీ ఇన్చార్జ్ల నుంచి వచ్చిన జాబితా వడపోతను త్వరితగతిన పూర్తిచేసి పలు కార్పొరేషన్లకు డైరెక్టర్లు, బోర్డు సభ్యుల నియామకాలను వినాయక నిమజ్జనం పూర్తయ్యేసరికి ప్రకటించాలని నిర్ణయించారు. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన గురించి కాంగ్రెస్ పార్టీ ముందున్న ఆప్షన్లపై కూడా నేతలు చర్చించారు. హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయడంతోపాటు అసెంబ్లీ సమావేశపర్చడం, పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లను ప్రకటించి ముందుకెళ్లడం తదితర అంశాలపై చర్చించిన నేతలు పీఏసీ సమావేశంలో సభ్యుల ముందు ప్రతిపాదించాల్సిన అంశాలు, ఎజెండాపై నిర్ణయం తీసుకున్నారు. అండగా ఉందాంముఖ్య నేతల భేటీ అనంతరం 10 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ గురించి చర్చించేందుకుగాను మరో సమావేశం జరిగింది. ఈ భేటీలో సీఎం రేవంత్రెడ్డి, శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్కుమార్గౌడ్లు పాల్గొన్నారు. ఫిరాయింపు కేసు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు, తదనుగుణంగా స్పీకర్ ప్రసాద్కుమార్ పలువురు ఎమ్మెల్యేలకు జారీ చేసిన నోటీసులు, పార్టీపరంగా తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చ జరిగినట్టు సమాచారం. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచేందుకు నమ్మకంతో వచ్చిన వారికి పార్టీ కూడా అండగా ఉండాలని, ఈ కేసు విషయంలో కాంగ్రెస్ పార్టీపరంగా ఎలా ముందుకెళ్లాలన్న దానిపై న్యాయ నిపుణులతో చర్చించాలని సూచించినట్టు తెలిసింది. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలతో మాట్లాడాలని, వారికి భరోసా కల్పించడంతోపాటు కేసు విచారణ విషయంలో అవసరమైన అన్ని రకాల సాయాన్ని అందించాలని కూడా సీఎం రేవంత్ చెప్పినట్టు సమాచారం. -
తెల్లవారకముందే లైన్లోకి..
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో యూరియా కష్టాలు కొనసాగుతు న్నాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి పీఏసీఎస్కు యూరియా వస్తుందని తెలుసుకున్న రైతులు శనివారం కార్యాలయం తీయకముందే ఆధార్ కార్డులు లైన్లో పెట్టి వేచి ఉన్నారు. డోర్నకల్ మండలం కస్నాతండా సమీపంలోని పీఏసీఎస్ కార్యాలయం ఎదుట రైతులు క్యూ కట్టారు. రైతులు భారీ సంఖ్యలో తరలిరావడంతో పోలీసుల సమక్షంలో యూరియా పంపిణీ చేశారు. గూ డూరు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహ కార సంఘం ఎదుట తెల్లవారు జామున 4 గంటలకే క్యూ లో నిలబడ్డారు. మహబూబాబాద్లో రైతులు మధ్యా హ్నం సమయంలో తమకు బస్తాలు వస్తాయో రావో అనే దిగులుతో ఏఓ తిరుపతి రెడ్డితో వాగ్వాదానికి దిగారు. కరీంనగర్ జిల్లాలో...కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్కెపల్లి సహకార సంఘం గోదాంకు శనివారం మధ్యాహ్నం లారీలో 230 బస్తాలు వచ్చాయి. 500 మందికి పైగా గోదాం వద్దకు చేరుకున్నారు. మహిళలు, వృద్ధులు క్యూలో నీరసించారు. సహకార సిబ్బంది ఒక్కరికి ఒక బస్తా చొప్పున టోకెన్లు ఇచ్చారు. శంకరపట్నం మండలం లింగాపూర్ గోదాంకు లారీ యూరియా వచ్చింది. 15 రోజుల క్రితం ఆధార్ కార్డు ఇచ్చిన వారికే టోకెన్లు ఇవ్వడంతో ఓ రైతు యూరియా ఇవ్వకుంటే షట్టర్ మూసివేస్తానని సిబ్బందితో వాదనకు దిగాడు.పోలీసు బందోబస్తుతో 450 బస్తాలను రైతులకు అందించారు. చిగురుమామిడి మండలం ఇందుర్తికి శనివారం యూరియా లోడ్ వచ్చింది. ఆదివారం పంపిణీ చేస్తామని నిర్వాహకులు చెప్పడంతో రైతులు తమ చెప్పులను క్యూలో విడిచి వెళ్లారు.300 బస్తాలు వచ్చాయి.. 102 మందికి పంపిణీశనివారం ఆత్మకూర్ పీఏసీఎస్ వద్ద తెల్లవారుజాము నుంచే రైతులు క్యూ కట్టారు. మధ్యాహ్నం 3:30 గంటలకు 300 బస్తాలతో లోడ్ కావడంతో ఒక్కసారిగా ఎగబడ్డారు. పోలీసుల భద్రత మధ్య సాయంత్రం వరకు 102 మందికి పంపిణీ చేశారు.యూరియా కోసం నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) వద్ద రైతులు శనివారం తెల్లవారుజాము నుంచే వరుసలో నిల్చున్నారు. శుక్రవారం రాత్రి యూరియా లారీ లోడ్ వచి్చందన్న సమాచారంతో భారీగా తరలివచ్చారు. గోదాము తెరవకముందే వచ్చి వరుసలో నిలబడి నిరీక్షించారు. పోలీసుల బందోబస్తు నడుమ ఒక్కో రైతుకు ఒక బస్తా యూరియాను పంపిణీ చేశారు. -
‘స్థానిక’o పై కమిటీ
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలను వీలున్నంత త్వరగా నిర్వహించడానికే కాంగ్రెస్ పార్టీ మొగ్గుచూపుతోంది. ఈ విషయంలో కోర్టులకు వెళ్లి కేసులు వేయడం వల్ల కాలయాపన తప్ప ప్రయోజనం లేదని ఆ పార్టీలోని కీలక నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు శనివారం సాయంత్రం గాందీభవన్లో జరిగిన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ), సలహా కమిటీల సమావేశంలో ఈ అంశంపై విస్తృతంగా చర్చ జరిగింది. సమావేశంలో భాగంగా పలువురు సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు కొందరు పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు వెళదామని సూచించగా, మరికొందరు మాత్రం అధికారికంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తేనే మంచిదనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఇదే అంశంపై సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ హైకోర్టు ఇచి్చన గడువులోపు స్థానిక ఎన్నికలు పూర్తిచేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అధికారికంగా ఇవ్వగలమా లేదంటే పార్టీపరంగా ప్రకటించి ఎన్నికలకు వెళ్లాలా అనే అంశంపై న్యాయ నిపుణులతో సలహాలు, సంప్రదింపులు జరిపి పార్టీకి నివేదిక ఇచ్చేందుకుగాను ఐదుగురు మంత్రులతో ప్రత్యేక కమిటీని నియమించాలని పీఏసీ నిర్ణయించింది. ఈ నిర్ణయం మేరకు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్రెడ్డిలతో చర్చించిన అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ ఈ కమిటీని అధికారికంగా ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, డి.శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్కలు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని, దేశంలోని న్యాయ నిపుణులు, పార్టీ నాయకులతో కమిటీ విస్తృతంగా చర్చించి ఈ నెల 26వ తేదీలోపు నివేదికను ఇస్తుందని మహేశ్గౌడ్ వెల్లడించారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపిన బిల్లు ప్రకారం అధికారికంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించగలమా? లేదా పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించి ముందుకెళ్లాలా అనే అంశాలపై ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఆరు ప్రధాన అంశాలే ఎజెండాగా భేటీ సమావేశంలో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికలు, హైకోర్టు కోర్టు తీర్పు నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలు, ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు గల ఆప్షన్లు, ఏఐసీసీ పిలుపు మేరకు ఓట్ చోరీ, గద్దీ చోడ్ ఉద్యమాన్ని రాష్ట్రంలో విస్తృతంగా చేపట్టడం, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలు, రాష్ట్రంలో యూరియా కొరత, రాజకీయ పరిణామాల గురించి చర్చించారు. సమావేశానికి ముందు ఏఐసీసీ చేపట్టిన ఓట్చోరీ ప్రచార లోగోను సీఎం రేవంత్రెడ్డి ఆవిష్కరించారు. ఇండియాకూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్రెడ్డిని ఎంపిక చేయడం పట్ల సమావేశం హర్షం వ్యక్తం చేసింది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్గౌడ్, సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, దామోదర రాజనర్సింహ, పార్టీ సీనియర్ నేతలు జానారెడ్డి, వీహెచ్, కేకే, జీవన్రెడ్డి, జగ్గారెడ్డి, మధుయాష్కీగౌడ్, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్లతోపాటు పలువురు మంత్రులు, పీఏసీ సభ్యులు పాల్గొన్నారు. లోతుగా చర్చించి నిర్ణయం తీసుకున్నాం: డిప్యూటీ సీఎం భట్టి పీఏసీ భేటీ అనంతరం సీనియర్ మంత్రి ఉత్తమ్, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్లతో కలిసి భట్టి విక్రమార్క విలేకరులతో మాట్లాడారు. బీసీలకు స్థానిక సంస్థలతోపాటు విద్య, ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్ల కల్పన, 50 శాతం రిజర్వేషన్ల పరిమితి గురించి పీఏసీ లోతుగా చర్చించిందని చెప్పారు. సెప్టెంబర్ 31 వరకు స్థానిక ఎన్నికల నిర్వహణపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై సుదీర్ఘంగా పలువురు సభ్యుల అభిప్రాయాలను తీసుకున్నామన్నారు. బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో అధికారికంగా వెళ్లాలా... పార్టీ పరంగా వెళ్లాలా అనే అంశాలపై చర్చించడంతోపాటు, న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలని, ఇందుకోసం కమిటీని నియమించాలని, ఈనెల 28వ తేదీలోపు కమిటీ నివేదిక ఇవ్వాలని పీఏసీ నిర్ణయించిందని చెప్పారు. కమిటీలో సభ్యులపై టీపీసీసీ అధ్యక్షుడు అధికారికంగా నిర్ణయం తీసుకుంటారన్నారు. న్యాయ నిపుణులతో కమిటీ చర్చించి పార్టీకి నివేదిక ఇచ్చిన అనంతరం కేబినెట్లో నిర్ణయం తీసుకొని స్థానిక ఎన్నికల విషయంలో ముందుకు వెళతామని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అన్ని రాజకీయ పార్టీలు జస్టిస్ సుదర్శన్రెడ్డికి మద్దతు తెలపాలని కోరుతూ పీఏసీలో తీర్మానించినట్టు వెల్లడించారు. దేశంలోని పౌరుల ఓటు హక్కును కాపాడడం, ఓట్ల చోరీని అరికట్టేందుకు బిహార్లో రాహుల్గాంధీ చేపట్టిన పాదయాత్రపై పీఏసీలో చర్చ జరిగిందని, ఆ పోరాటానికి పీఏసీ సంపూర్ణంగా మద్దతు తెలిపిందన్నారు. ఈనెల 26న పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు వెళ్లనున్నట్టు చెప్పారు. విస్తృతంగా చర్చిస్తాం: మంత్రి ఉత్తమ్ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు, అటు విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల గురించి ఎలా ముందుకెళ్లాలన్న దానిపై మూడు ఆప్షన్లను పీఏసీ భేటీలో చర్చించామని చెప్పారు. ఈ విషయంలో విస్తృత స్థాయిలో పార్టీ నేతలతోపాటు న్యాయ నిపుణులతో మాట్లాడుతామని వెల్లడించారు. అభిషేక్ మనుసింఘ్వి, జస్టిస్ సుదర్శన్రెడ్డిలతోపాటు రాష్ట్ర అడ్వొకేట్ జనరల్లను అధికారికంగా అభిప్రాయం అడుగుతామని తెలిపారు. ఘన విజయానికి అవకాశం: పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్కుమార్గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాపాలన అద్భుతమైన ఫలితాలనిస్తోందని, జనహిత పాదయాత్రలో భాగంగా వెళ్లినప్పుడు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించే అవకాశం ఇప్పుడు పార్టీకి ఉందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, పార్టీ గెలుపు కోసం ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలని చెప్పారు. బీసీలకు మేలు జరగాల్సిందే: సీఎం రేవంత్ పీఏసీ సమావేశంలో భాగంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ గతంలో కేసీఆర్ తెచి్చన చట్టం ప్రకారం ఒక్కశాతం కూడా అదనంగా బీసీలకు రిజర్వేషన్ రాదని, కానీ బీసీలకు మేలు జరగాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు. అందు కోసమే చట్టాన్ని సవరించి ఆర్డినెన్సు తెచ్చామని, ఆ ఆర్డినెన్సును గవర్నర్కు పంపితే ఆయన రాష్ట్రపతికి పంపారని చెప్పారు. రాష్ట్రపతికి పంపిన బిల్లులను 90 రోజుల్లో ఆమోదించాలన్న అంశంపై సుప్రీంకోర్టులో మన వాదనలను వినిపించేందుకు ఇద్దరు న్యాయవాదులను నియమించామని చెప్పారు. ఆ కేసులోనే రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్న బీసీ బిల్లు అంశం కూడా వస్తుందని, ప్రత్యేకంగా సుప్రీంకోర్టుకు వెళ్లే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని చెప్పారు. ఒకవేళ అలా వెళ్లే కేసు లిస్టు కావడానికే చాలా సమయం పడుతుందన్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్రెడ్డిని ఎంపిక చేసినందుకుగాను మల్లికార్జున ఖర్గే, సోనియా, రాహుల్గాం«దీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈనెల 26న బిహార్లో రాహుల్గాంధీ నిర్వహిస్తున్న ఓట్చోరీ పాదయాత్రకు హాజరవుతానని, రాష్ట్రంలో కూడా ఓట్చోరీ ఉద్యమాన్ని విస్తృతంగా చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలో యూరియా కొరతపై బీఆర్ఎస్, బీజేపీలు కలిసి డ్రామాలు ఆడుతున్నాయని, యూరియా ఇచ్చే పార్టీకే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిస్తానని కేటీఆర్ చెప్పడంలోనే వారి తీరు అర్థమవుతోందన్నారు. యూరియా కోసం తాను నాలుగుసార్లు కేంద్ర మంత్రులు నడ్డా, అనుప్రియా పటేల్లను కలిశానని వెల్లడించారు. -
మహిళా భక్తులకేదీ ‘మహాలక్ష్మి’?
సాక్షి, యాదాద్రి: ఆర్టీసీ బస్సుల్లో యాదగిరిగుట్టపైకి వచ్చే మహిళా భక్తులకు సైతం దేవస్థానమే టికెట్ డబ్బులు చెల్లిస్తోంది. ఆర్టీసీ 2022 మార్చి 23 నుంచి కొండపైకి అద్దె ప్రాతిపదికన బస్సులు నడుపుతోంది. ఇందుకుగాను దేవస్థానం అద్దె చెల్లిస్తోంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. గుట్టపైకి వచ్చే మహిళా భక్తులకు సైతం ఆర్టీసీకి ప్రతి నెలా దేవస్థానం డబ్బులు చెల్లిస్తోంది. కొండపైకి బస్సులను నడిపినందుకు ఇప్పటి వరకు దేవస్థానం ఆర్టీసీకి సుమారు రూ.25 కోట్ల వరకు చెల్లించిందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇంత మొత్తం ఖర్చుచేసిన దేవస్థానం సొంత బస్సులను కొనుగోలు చేయలేకపోయిందన్న విమర్శలున్నాయి. బస్సుల కొనుగోలుతో కొందరికి ఉపాధి కల్పించడంతోపాటు, భక్తుల సొమ్ము ఖర్చు కాకుండా మిగిలేదని స్థానికులు అంటున్నారు. ఉద్ఘాటన తర్వాత పెరిగిన భక్తులుయాదగిరిగుట్ట ప్రధానాలయ ఉద్ఘాటన 2022 మార్చి 28న జరిగింది. దేవాలయ పునర్నిర్మాణం తర్వాత అప్పటి సీఎం కేసీఆర్ కొండపైకి వచ్చే భక్తులకు ఉచిత ప్రయాణం ప్రకటించారు. ఇందుకోసం దేవస్థానం డబ్బులు చెల్లిస్తే యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో నుంచి బస్సులను కొండపైకి నడిపేలా ఒప్పందం కుదుర్చుకుంది. భక్తుల నుంచి ఎలాంటి టికెట్ తీసుకోరు. 2022 ఏప్రిల్ 1వ తేదీ నుంచి యాదగిరికొండపైకి ఉచిత బస్సులను భక్తుల కోసం 35 నుంచి 40 ట్రిప్పులను నడిపించారు. 2023 వరకు నడిపిన మినీ బస్సుల్లో ఒక్కో బస్సులో 40 మంది వరకు ప్రయాణించారు. ఇందుకోసం ప్రతినెలా రూ.60 లక్షల నుంచి రూ. 70 లక్షల వరకు ఆర్టీసీకి దేవస్థానం డబ్బులు చెల్లించింది. 2023 –2024 మధ్య కాలంలో పెద్ద బస్సులు 15 వరకు నడిపారు. గత సంవత్సరం నుంచి కొండపైకి ఆటోలను అనుమతించడంతో ఆరు బస్సులను మాత్రమే ఆర్టీసీ ప్రతిరోజూ నడిపిస్తోంది. భక్తుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులను నడుపుతున్నారు. ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించాలిప్రభుత్వం యాదగిరిగుట్టకు ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించాలని భక్తులు కోరుతున్నారు. రాష్ట్రమంతా ఈవీ బస్సులను నడుపుతున్నారు. అద్దె బస్సులకు దేవస్థానం ఆర్టీసీకి చెల్లిస్తున్న డబ్బులతో ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయొచ్చు కదా అని భక్తులు అంటున్నారు. -
ఇష్టానుసారం ఇచ్చేసి... ఇక్కట్ల పాల్జేసి..
సాక్షి, హైదరాబాద్: సాగుకాలం కరిగిపోతుండగా.. రైతులకు యూరియా వ్యథలు తప్పడం లేదు. రాష్ట్రంలో కొన్నేళ్లుగా కనిపించని దృశ్యాలు ఇప్పుడు పల్లెల్లో గోచరిస్తున్నాయి. యూరియా కోసం సూర్యోదయానికి ముందు నుంచే రైతులు వ్యవసాయ సహకార సొసైటీల వద్ద, ప్రైవేటు డీలర్ల వద్ద క్యూలు కడుతున్నారు. నిలబడలేని రైతులు పట్టా పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు, చెప్పులు క్యూల్లో పెట్టి సొసైటీలు తెరిచి యూరియా ఇచ్చేంత వరకు ఎదురుచూస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఒక్కో రైతుకు ఒక బస్తా చొప్పున ఇస్తుంటే, కొన్ని జిల్లాల్లో ఎకరానికి ఒక బస్తా చొప్పున ఇస్తున్నారు. రాష్ట్రంలో జూన్ నుంచే ఖరీఫ్ సాగు మొదలు కాగా, జూలై నెలాఖరు నుంచి యూరియా కష్టాలు మొదలయ్యాయి. ఈనెలలో అవి తీవ్రమై, ఎకరాకు ఒక బస్తా ఇచ్చినా చాలు అనే స్థితికి చేరుకుంది. యూరియా కష్టాలకు అధికార యంత్రాంగం పర్యవేక్షణ లోపమే ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు. యూరియా విక్రయాలపై జవాబుదారీతనం లేకుండా మొదట్లో ఇష్టానుసారం విక్రయించినందునే ఇప్పుడు కొరత ఏర్పడిందని కేంద్రం కూడా భావిస్తోంది. గత ఏడాది కన్నా ఈసారి అధికంగానే విక్రయించినప్పటికీ, కొరత రావడానికి ప్రధాన కారణం అధికారులు యూరియా అమ్మకాలపై దృష్టి పెట్టకపోవడమేనని తెలుస్తోంది. 7.28 ఎల్ఎంటీలు సరఫరా: కేంద్రం ఈ ఖరీఫ్ సీజన్లో కేంద్రం కేటాయించిన యూరియాలో ఆగస్టు వరకు 8.30 లక్షల మెట్రిక్ టన్నులు (ఎల్ఎంటీ)రావాల్సి ఉండగా, ఇప్పటివరకు 5.38 ఎల్ఎంటీ మాత్రమే వచ్చినట్లు వ్యవసాయ శాఖ చెపుతోంది. అయితే కేంద్ర ఎరువుల మంత్రిత్వ శాఖ మాత్రం గత రబీలో మిగిలిన 1.92 ఎల్ఎంటీని కూడా కలుపుకొని ఇప్పటివరకు 7.28 ఎల్ఎంటీ సరఫరా చేశామని చెబుతోంది. ఇందులో ప్రస్తుతం మార్క్ఫెడ్, సొసైటీలు, ప్రైవేటు డీలర్లు, గోదాములన్నింటా కలుపుకొని అందుబాటులో ఉన్న యూరియా కేవలం 41వేల మెట్రిక్ టన్నులు. అంటే ఈ సీజన్లో ఇప్పటివరకు 6.87 ఎల్ఎంటీల విక్రయాలు జరిగాయి. ఇదే గత ఏడాది ఇదే సమయంలో 6.10 ఎల్ఎంటీ అమ్మకాలే జరిగినట్లు కేంద్రం చెబుతోంది. దీన్ని బట్టి గత సంవత్సరం కన్నా 77వేల మెట్రిక్ టన్నుల యూరియా అధికంగా విక్రయించారు. అంటే గత సీజన్తో పోలిస్తే యూరియా విక్రయాలు ఎక్కువ జరిగినప్పటికీ, కొరత మాత్రం చాలా ఎక్కువగా ఉండటం గమనార్హం. గత సంవత్సరం ఖరీఫ్తో పోలి్చనా, ఈసారి యూరియా విక్రయాలు అధికంగానే జరిగినట్లు చెబుతున్న కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ లోపం, బ్లాక్ మార్కెటింగ్ వల్లనే ఈ సమస్య ఉత్పన్నమైనట్లు చెబుతోంది. పెద్ద రైతులు ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయడం, వ్యాపారులు బ్లాక్ మార్కెటింగ్కు తరలించడం కూడా యూరియా రాద్ధాంతానికి కారణమైందన్న ఆరోపణలు ఉన్నాయి. ఎవరెవరికి ఎంత విక్రయించారు? రాష్ట్రంలో ఖరీఫ్ కోసం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ప్రతి నెలా కేంద్రం యూరియా కోటా పంపిస్తుంది. మార్క్ఫెడ్ ద్వారా, ప్రైవేటు డీలర్ల ద్వారా (50:50 ప్రాతిపదికన) జరిగే విక్రయాలను పర్యవేక్షించకుండా వ్యవసాయ శాఖ గాలికి వదిలేసింది. కేంద్రం నుంచి వచ్చిన యూరియాను రాష్ట్రంలోని 14 వేల మంది డీలర్లు మే నెలాఖరు నుంచే విక్రయిస్తారు. ఇక సొసైటీలు, ఇతర వ్యవసాయ సేవా కేంద్రాల ద్వారా జూన్ నుంచి విక్రయిస్తారు. అయితే ఈ విక్రయాలపై ఎలాంటి పర్యవేక్షణ లేదు. ఏ సొసైటీలో ఏ రైతుకు ఎంత యూరియా విక్రయించారనే లెక్కలు కేవలం 10 రోజుల వరకే ఉంటాయి. తరువాత మళ్లీ రైతులు వెళ్లి యూరియా తీసుకోవచ్చు. ఇక ప్రైవేటు డీలర్లు జరిపే యూరియా విక్రయాలపై ఎలాంటి నిఘా లేదు. లెక్కలూ లేవు. రూ. 270 చొప్పున విక్రయించాల్సిన యూరియాను రూ.400 వరకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అదే సమయంలో వ్యవసాయేతర అవసరాలకూ యూరియాను డీలర్లు పెద్దఎత్తున విక్రయిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. రంగుల కంపెనీలు, వార్నిష్, ప్లైవుడ్, యాడ్–బ్లూ ద్రావణం తయారీ పరిశ్రమలతోపాటు గుడుంబా, కోళ్లు, పశువుల దాణా, చేపలు, రొయ్యల చెరువుల్లో సైతం యూరియాను వినియోగిస్తున్నట్లు సమాచారం. ఇతర రాష్ట్రాల వారు కూడా రాష్ట్రంలోని ప్రైవేటు డీలర్ల నుంచి అధిక ధరలకు యూరియాను పెద్దఎత్తున కొనుగోలు చేసి తీసుకెళ్తారని మార్క్ఫెడ్కు చెందిన ఓ అధికారి తెలిపారు. ప్రస్తుతం ఒక్కో రైతుకు రేషన్ విధానంలో ఎకరాకు ఒక బస్తా చొప్పున ఇస్తున్నట్లుగా ఖరీఫ్ ఆరంభం నుంచే అమలు చేసి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని నిపుణులు అంటున్నారు. సాగు విస్తీర్ణం పెరగడం కూడా... రాష్ట్రంలో యూరియా అధిక వినియోగానికి చెపుతున్న కారణాల్లో ఒకటి ఈసారి ఖరీఫ్ సీజన్ సాధారణం కన్నా ముందే రావడమైతే, రెండోది పంట సాగు విస్తీర్ణం గతం కన్నా గణనీయంగా పెరగడం. గత ఖరీఫ్ సీజన్లో ఆగస్టు మూడో వారానికి 91.21 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా, ఈసారి 118 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇందులో వరి విస్తీర్ణమే గత ఖరీఫ్ కన్నా 23 లక్షల ఎకరాలు ఎక్కువగా ఉంది. గత సంవత్సరం ఈ సమయానికి 31.60 లక్షల ఎకరాల్లో వరి సాగైతే, ఈసారి 54.79 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇక పత్తి 42 లక్షల ఎకరాల నుంచి 45 లక్షలకు పెరిగింది. మొక్కజొన్న గత ఖరీఫ్లో 4.55 లక్షల ఎకరాలు సాగైతే ఈసారి 6.48 లక్షల ఎకరాలు సాగైంది. యూరియా అధికంగా వినియోగించే ఈ మూడు పంటల సాగు విస్తీర్ణం పెరగడం వల్ల కూడా కొరత ప్రభావం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రతిపాదనలకు అనుగుణంగా సరఫరా... ఖరీఫ్, రబీ మొదలు కావడానికి ముందే... వ్యవసాయ శాఖ ఆయా సీజన్లకు అవసరమైన ఎరువుల ప్రణాళిక రూపొందిస్తుంది. ఆ మేరకు కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రిత్వ శాఖకు నివేదిక పంపిస్తే, రాష్ట్రాల వారీగా కోటాను విడుదల చేస్తారు. ఈ ఖరీఫ్ సీజన్కు 9.80 ఎల్ఎంటీల కోటాకు కేంద్రం ఆమోదం తెలిపింది. రెండేళ్లుగా ఇదే కోటా ఇస్తోంది. దాని ప్రకారం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ప్రతి నెలా 1.60 ఎల్ఎంటీకి తగ్గకుండా పంపించాలి. ఈ మేరకు దేశంలోని ఎరువుల కంపెనీలకు కోటా విడుదల చేస్తే ఆయా కంపెనీల ద్వారా 50 శాతం కోటాను రైల్వే రేక్ పాయింట్ల ద్వారా మార్క్ఫెడ్కు, మరో 50 శాతం కోటా ప్రైవేటు డీలర్లకు పంపిస్తారు. ఈ లెక్కన ఇప్పటివరకు కేంద్రం పంపిన 5.18 ఎల్ఎంటీ యూరియాలో సగం అంటే 2.59 ఎల్ఎంటీ ప్రైవేటు డీలర్లకు వెళ్లింది. గత రబీకి సంబంధించిన ఓపెనింగ్ స్టాక్తో కలిపితే మొత్తం 3.61 ఎల్ఎంటీలు రాష్ట్రంలోని 14వేల ప్రైవేటు డీలర్లకు చేరింది. అయితే ప్రస్తుతం 18వేల మెట్రిక్ టన్నులు మాత్రమే వారి వద్ద ఉంది. అంటే 3.43 ఎల్ఎంటీలు విక్రయించారు. కానీ ఎవరికి ఎంత మేర విక్రయించారనే లెక్కలు వ్యవసాయ శాఖ దగ్గర లేకపోవడం గమనార్హం. భారీగా పెరిగిన వాడకం రాష్ట్రంలో యూరియా వినియోగం శాస్త్రవేత్తలు సూచిస్తున్న మోతాదుకన్నా రెండింతలు అధికంగా వినియోగిస్తున్నారు. శాస్త్రవేత్తలు సూచించిన ప్రకారం వరికి ఎకరాకు పంట కాలంలో 120 కిలోలు వినియోగిస్తే సరిపోతుంది. కానీ ఎకరాకు ఒకటిన్నర బస్తాల చొప్పున (బస్తా 45 కిలోలు) మూడు సార్లు వినియోగిస్తున్నారు. అలాగే మొక్కజొన్న, పత్తి పంటలకు కూడా మోతాదుకు మించి వినియోగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. సాధారణంగా వరికోసం నాట్లు పడిన 10 నుంచి 15 రోజులకు ఎకరాకు బస్తా నుంచి రెండు బస్తాల చొప్పున యూరియాను కాంప్లెక్స్ ఎరువుతో కలిపి వినియోగిస్తుంటారు. ఆ తరువాత పొట్ట దశలో 45 రోజులకు, మరోసారి రెండు బస్తాల చొప్పున, మూడోదఫా 90 రోజుల్లో మరోసారి బస్తా చొప్పున వినియోగిస్తున్నారు. మొక్కజొన్నకు పంట కాలంలో కొన్ని జిల్లాల్లో మూడుసార్లు యూరియాను వాడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎకరాకు ఒక్కోసారి రెండు బస్తాల చొప్పున వినియోగిస్తారు. పత్తి పంట కోసం కూడా ఎకరాకు ఒకటిన్నర బస్తాలకు తగ్గకుండా వినియోగించడంతో ఖరీఫ్లో యూరియా డిమాండ్ పెరుగుతోంది. అదే యాసంగి (రబీ) సీజన్లో పత్తి లేకపోవడంతో డిమాండ్ అంతగా లేదని అధికారులు అంటున్నారు. -
అధికారిక లాంఛనాలతో నేడు సురవరం అంతిమయాత్ర
సాక్షి, హైదరాబాద్/గచ్చిబౌలి: సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్రెడ్డి అంతిమయాత్ర ఆదివారం నిర్వహించనున్నారు. అమెరికా నుంచి ఆయన పెద్దకుమారుడు రావాల్సి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రిలో పలువురు సీపీఐ జాతీయ, రాష్ట్ర నేతలు సుధాకర్రెడ్డికి నివాళులు అర్పించారు. శనివారం ఉదయం వారంతా ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్పాషా, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి, జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి, తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి నరసింహ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఛాయాదేవి పాల్గొన్నారు. మాజీమంత్రి శ్రీనివాస్గౌడ్, ఇతర బీఆర్ఎస్ నేతలు సురవరం కుటుంబసభ్యులను ఖాజాగూడలోని గ్రీన్గ్రేస్ అపార్ట్మెంట్స్లో కలిసి పరామర్శించారు. ఆయన్ను కలిసిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు. మాజీ ఎంపీ కేవీపీ.రామచందర్రావు కూడా సురవరం కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆదివారం ఉదయం 9 గంటలకు కేర్ ఆస్పత్రి నుంచి సురవరం భౌతిక కాయాన్ని సీపీఐ రాష్ట్ర కార్యాలయమైన మఖ్దూంభవన్కు తరలిస్తారు. ప్రజల సందర్శనార్థం అక్కడే ఉంచుతారు. సాయంత్రం అక్కడి నుంచే సురవరం అంతిమయాత్ర గాంధీమెడికల్ కాలేజీ వరకు సాగుతుంది. వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ మెడికల్ కాలేజీకి సురవరం భౌతిక కాయాన్ని అప్పగిస్తారు. ఇప్పటికే ఆయన కళ్లను ఎల్వీప్రసాద్ కంటి ఆస్పత్రికి ఇచ్చారు. సురవరం అంతిమయాత్రకు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ఏర్పాట్లు చేస్తోంది. నేడు నివాళులు అర్పించనున్న సీఎం రేవంత్రెడ్డి ఆదివారం ఉదయం 10 గంటలకు మఖ్దూమ్భవన్కు చేరుకొని సురవరం సుధాకర్రెడ్డి భౌతిక కాయం వద్ద సీఎం రేవంత్రెడ్డి నివాళులు అర్పిస్తారు. సీఎంతోపాటు పలువురు మంత్రులు కూడా పాల్గొంటారు. సురవరం సుధాకర్రెడ్డి మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తున్నదని సీపీఎం సీనియర్ నేత పాటూరి రామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అణగారిన వర్గాల కోసం తపించిన నేత సురవరంఅణగారిన వర్గాల కోసం అనేక సామాజిక ఉద్యమాలు నిర్వహించి, జీవితాంతం పేదల కోసం పరితపించిన మహానీయుడు సురవరం సుధాకర్రెడ్డి అని సీపీఐ నేతలు కొనియాడారు. మఖ్ధూంభవన్లో సురవరం చిత్రపటానికి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, నేతలు చాడ వెంకట్రెడ్డి, కూనంనేని సాంబశివరావు, తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, ఈటీ.నరసింహ తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అవిశ్రాంత యోధుడు... సౌమ్యుడు.. మృదుస్వభావిసురవరం మృతిపట్ల పలువురి సంతాపంసాక్షి, హైదరాబాద్: సురవరం సుధాకరరెడ్డి మృతిపట్ల కేంద్రమంత్రులు జి.కిషన్రెడ్డి, బండి సంజయ్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు తదితరులు సంతాపం తెలిపారు. సౌమ్యుడు, మృదుస్వభావి, పీడిత వర్గాల అభివృద్ధి కోసం తుది శ్వాస వరకు పనిచేసిన నాయకుడు సురవరం అని కిషన్రెడ్డి కొనియాడారు. సుధాకరరెడ్డి మరణం తెలుగు ప్రజలకు తీరనిలోటని బండి సంజయ్, బండారు దత్తాత్రేయ, ఎన్.రాంచందర్రావు పేర్కొన్నారు. సురవరం సుధాకర్రెడ్డి కమ్యూనిస్టు వేగుచుక్క అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి కొనియాడారు. సురవరం బలహీనవర్గాల హక్కులకోసం అవిశ్రాంతంగా పోరాడారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ పేర్కొన్నారు. మతోన్మాదం పెరిగిపోతున్న ఈ తరుణంలో సురవరం మృతి వామపక్ష ఉద్యమాలకు, ప్రజాస్వామ్య హక్కులకు తీరని నష్టమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ విచారం వ్యక్తం చేశారు. -
హాస్టల్లో హుక్కా
కేశంపేట: రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల పరిధి లోని కొత్తపేటలోని సాంఘిక సంక్షేమశాఖ హాస్టల్ లో కొందరు విద్యార్థులు హుక్కాకు అలవాటు పడ్డారు. ఏకంగా యూట్యూబ్లో చూసి అవసరమైన సామగ్రి ఆన్లైన్లో, తెలిసినవారి నుంచి సమకూర్చుకొని స్వయంగా హుక్కా తయారు చేశారు. హాస్టల్లో ఉండే కొత్తపేటకు చెందిన ఇంటర్ విద్యార్థికి షాద్నగర్లోని ఓ హోటల్లో పనిచేసే మిత్రుడు ఉన్నాడు. ఇతని ద్వారా హుక్కా పీల్చడం అలవాటు చేసుకున్నాడు. మరో ఇద్దరు విద్యార్థులకు అలవాటు చేశాడు. అలా పదోతరగతి లోపు చదువుతున్న 20 మంది హుక్కాకు బానిసలుగా మారారు. ఇదంతా ఓ నాలుగో తరగతి విద్యార్థి గమనించగా, అతడిని కొట్టి బలవంతంగా హుక్కా తాగించారు. విషయం తెలుసుకున్న వార్డెన్ ఇద్దరు విద్యార్థులను హాస్టల్ నుంచి ఇంటికి పంపించారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి హుక్కా పీల్చేందుకు గుర్తు తెలియని వ్యక్తి హాస్టల్ గోడ దూకి, విద్యుత్ దీపాలు ఆర్పివేశాడు. దీంతో మిగిలిన విద్యార్థులు రాత్రంతా భయంభయంగా గడిపి శనివారం ఉదయమే హాస్టల్ సిబ్బందికి తెలిపారు. హాస్టల్లో తనిఖీ చేయగా హుక్కా మిషన్తోపాటు సామగ్రి లభించాయి. ఇంటర్ విద్యార్థిని పోలీస్ స్టేషన్కు తరలించినట్టు విశ్వసనీయ సమాచారం -
వాట్సాప్ సందేశాలతో‘అట్రాసిటీ’ చెల్లదు
సాక్షి, హైదరాబాద్: వాట్సాప్, ఈ–మెయిల్ ద్వారా ప్రైవేట్గా పంపిన సందేశాలతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. అవమానించే ఉద్దేశంతో అందరి ముందు కులం పేరుతో దూషించనప్పుడు ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు పెట్టడం కుదరదంటూ పిటిషనర్లపై కేసును కొట్టివేసింది. ఆ చట్టంలోని సెక్షన్ 3(1)(ఆర్), సెక్షన్ 3(1)(ఎస్) ప్రకారం.. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వ్యక్తులను అవమానించడమే లక్ష్యంగా అందరి ఎదుట దూషిస్తేనే దాన్ని బహిరంగంగా జరిగిన ఘటనగా భావించాలని చెప్పింది. క్రాంతికిరణ్ (ఎస్సీ), నిరుపమా దాడి (కాపు) క్లాస్మేట్స్. వేర్వేరు కులాలకు చెందినవారు. వీరు 2014లో వివాహం చేసుకున్నారు. తర్వాత పలు కారణాలతో వారు విడిపోయారు. ఈ క్రమంలో నిరుపమ, ఆమె కుటుంబ సభ్యులు తనను కులం పేరుతో దూషించారని, తన దుస్తులను తగలబెట్టారని, తర్వాత విడాకులు కోరుతూ సందేశాలు, ఈ మెయిల్ ద్వారా బెదిరించారని క్రాంతి ఫిర్యాదు చేశారు. దీంతో నిరుపమ, ఆమె తండ్రి అనుపమ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనేపథ్యంలో ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ వారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ ఈవీ వేణుగోపాల్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రజల మధ్య దూషణలు జరగలేదని, ఇది కేవలం వారి కుటుంబ వివాదం మాత్రమేనని వాదించారు. ఇంకా సాక్షులను విచారించాల్సి ఉన్నందున ఎఫ్ఐఆర్ను కొట్టివేయొద్దని క్రాంతి తరఫు న్యాయవాది, ఏపీపీ కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. కుల దూషణ బహిరంగంగా జరిగినట్లు బయటి వ్యక్తులెవరూ వెల్లడించలేదని, ఇది వారి కుటుంబ వివాదం మాత్రమేనని స్పష్టంచేశారు. విచారణ కొనసాగించడం చట్టపరమైన ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనన్నారు. పిటిషనర్లపై నమోదైన అట్రాసిటీ కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చారు. -
యూరియా కొరతపై బీజేపీ, బీఆర్ఎస్లు డ్రామాలు: సీఎం రేవంత్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి యూరియా కొరతపై బీజేపీ, బీఆర్ఎస్లు కలిసి డ్రామాలాడుతున్నాయని సీఎం రేవంత్రెడ్డి మండిపడ్డారు. యూరియా ఇచ్చే పార్టీకే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తామని కేటీఆర్ అనడంలోనే వాళ్ల తీరు అర్థమవుతోందని విమర్శించారు. యూరియా కోసం నాలుగుసార్లు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అనుప్రియా పటేల్ను కలిశానని సీఎం రేవంత్ తెలిపారు. యూరియా పంపిణీ అంశానికి సంబంధించి క్షేత్రస్థాయిలో మానిటరింగ్ను పెంచాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఈరోజు(శనివారం, ఆగస్టు 23 వ తేదీ) గాంధీ భవన్లో మూడు గంటల పాటు జరిగిన పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్ మాట్లాడారు. ‘ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి ప్రకటించినందుకు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ధన్యవాదాలు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజ్యాంగ పరిరక్షణ కోసం, పౌర హక్కులను కాపాడటం కోసం పని చేశారు. రాహుల్ గాంధీ, పార్టీ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో కులగణన చేపట్టాo. బీసీలకు విద్యా, ఉద్యోగాలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తు మంత్రి వర్గంలో ఆమోదించి అసెంబ్లీలో బిల్ పాస్ చేసుకున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తు విడిగా మరో బిల్ తీసుకొచ్చాం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం మించకుండా కేసీఆర్ చట్టం తెచ్చారు. ఈ అడ్డంకిని తొలగించడానికి ఆర్డినెన్స్ తెచ్చాం. కేసీఆర్ తెచ్చిన చట్టాన్ని సవరించడానికి ఆర్డినెన్సు తెచ్చాం.. దాన్ని గవర్నర్ కేంద్రానికి పంపారు. బీసీ లకు మేలు జరగాల్సిందే. రాహుల్ గాంధీ మాట నిలబడాలి. 90 రోజులలో రాష్ట్రపతి బిల్లులను ఆమోదించాలన్న అంశం పైన సుప్రీంకోర్టు లో మన రాష్ట్ర వాదనలు వినిపించడం కోసం ఇద్దరు న్యాయవాదులను నియమించాం. బీహార్ లో రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న ఓట్ చోరీ పాదయాత్రకు ఈ నెల 26వ తేదీన హాజరవుతా’ అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. -
ఏసీబీకి అడ్డంగా దొరికిన సీఐ..
సాక్షి, మహబూబాబాద్ జిల్లా: లంచం తీసుకుంటూ డోర్నకల్ సీఐ రాజేష్ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. బెల్లం వ్యాపారి నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా శనివారం రెడ్ హ్యండెడ్గా పట్టుబడ్డారు.ఓ అక్రమ కేసులో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు బేతోలు ప్రాంతానికి చెందిన వ్యాపారి వద్ద సీఐ రాజేష్ రూ.50 వేలు డిమాండ్ చేయగా.. వ్యాపారి రూ.30 వేలు ఇచ్చేందుకు అంగీకరించాడు. వ్యాపారి ఏసీబీని ఆశ్రయించగా.. సీఐ ఇంట్లో వ్యాపారి నగదు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సీఐ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. -
రియల్ ఎస్టేట్ మళ్లీ పుంజుకుంటోంది..
రాష్ట్రాభివృద్ధి కసం ప్రభుత్వం చేసే పనులు, అవలంభించే విధానాలు ప్రజలకు తెలిస్తేనే మరింత సక్సెస్ అవుతాయి. రాబోయే తరాల భవిష్యత్తును మార్చేసే అలాంటి కీలక ప్రాజెక్ట్లకే ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. హైటెక్ సిటీ, ఎయిర్ పోర్ట్, ఔటర్ రింగ్లతో సుమారు మూడు దశాబ్దాలుగా రాష్ట్ర ముఖచిత్రం ఎలా మారిపోయిందో అంతకు రెట్టింపు స్థాయిలో మూసీ సుందరీకరణ, ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్లతో తెలంగాణ దశదిశలు మారిపోతాయి. ఎయిర్పోర్ట్తో హైదరాబాద్ నుంచి ప్రపంచం మొత్తానికి తలుపు తెరిచినట్టే.. ఔటర్తో తెలంగాణ మొత్తానికి కనెక్టివిటీ పెరిగింది. ఇప్పుడిదే స్థాయిలో ప్రపంచ దేశాలను ఆకర్షించే ఈ మూడు గేమ్ చేంజర్ ప్రాజెక్ట్లు రాష్ట్రాభివృద్ధిని మార్చనున్నాయని భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య(క్రెడాయ్) తెలంగాణ ప్రెసిడెంట్ కే.ఇంద్రసేనారెడ్డి అన్నారు. – సాక్షి, సిటీబ్యూరోవరుస ఎన్నికలు, కొత్త ప్రభుత్వ విధానాలు వంటి హనీమూన్ పీరియడ్ ముగిసింది. దీంతో స్థిరాస్తి రంగం మళ్లీ పుంజుకుంటోంది. 18 నెలల్లో నగరంలో 2 కోట్ల చ.అ. ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరగడమే ఇందుకు ఉదాహరణ. వంద చ.అ.కు ఒక జాబ్ చొప్పున 2 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చాయి. దీంతో గృహాలకు డిమాండ్ ఏర్పడింది. పాత ప్రభుత్వాలు కేవలం పశ్చిమ హైదరాబాద్ మీదనే దృష్టి పెట్టాయి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం పాతబస్తీలో మెట్రో విస్తరణ, దక్షిణ హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్.. ఇలా ఎక్కడికక్కడ అభివృద్ధి ప్రణాళికలు చేస్తోంది. గ్రీన్ఫీల్డ్ రోడ్లు, ఓఆర్ఆర్– ట్రిపుల్ ఆర్ మధ్య కొత్త ప్రాంతాలలో భూములు అందుబాటులోకి వస్తాయి. వ్యాపార అవకాశాలూ పెరుగుతాయి. రోడ్లను వెడల్పు చేస్తే కార్ల సంఖ్య పెరగడమే తప్ప పెద్దగా ప్రయోజనం ఉండదు. మెట్రో విస్తరణ దూరాలు దగ్గరవుతాయి. ప్రజా రవాణా పెంచితేనే సిటీ అభివృద్ధి, దూరం పెరుగుతుంది. దీంతో కస్టమర్లు ఎక్కడికక్కడ ఇళ్లు కొనుగోలు చేయవచ్చు.హైడ్రా లాగే రెరా.. ప్రస్తుతం దేశంలో సుమారు 1.10 లక్షల మంది బిల్డర్లు ఉన్నారు. నిర్మాణ రంగంలో అసంఘటిత బిజినెస్ ఎక్కువగా ఉంటుంది. నకిలీ బిల్డర్లు, మధ్యవర్తుల మాయమాటలు నమ్మి, తక్కువ ధరకు వస్తుందనే ఆశతో వారి చేతిలో కస్టమర్లు మోసపోతున్నారు. గృహ కొనుగోలుదారులకు భరోసా, వారి పెట్టుబడులకు భద్రత కల్పించే పదునైనా అస్త్రం రెరా. దీన్ని గత ప్రభుత్వం విస్మరించింది. దీంతో ప్రీలాంచ్, సాఫ్ట్లాంచ్ల పేరుతో అమాయక కస్టమర్ల కష్టార్జితాన్ని కాజేశారు. కస్టమర్లు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అనుమతులు లేకుండా, రూపాయి పన్ను చెల్లించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించే నకిలీ బిల్డర్లను హైడ్రా తరహాలో కఠినంగా వ్యవహరించాలి. ఈమేరకు రెరాను మరింత బలోపేతం చేయాలి.ఏటా లక్ష కార్మికులకు నైపుణ్య శిక్షణ.. దేశీయ నిర్మాణ రంగంలో వచ్చే పదేళ్లలో 4.5 కోట్ల మంది నైపుణ్య కార్మికులు అవసరం. ఒడిశా, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర్ప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల నుంచి సుమారు 18 లక్షల మంది కార్మికులు తెలంగాణ నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారు. వీరిలో చాలా మంది నైపుణ్య కార్మికులు నెలకు రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకూ సంపాదిస్తున్నారు. కొడంగల్, నిజామాబాద్, పరిగి, కరీంనగర్, వరంగల్ వంటి మన తెలంగాణ నుంచి యువత ముంబై, ఎన్సీఆర్–ఢిల్లీ, దుబాయ్, గల్ఫ్ వంటి దేశాలకు వలస వెళ్తున్నారు. నెలకు రూ.25–రూ.30 వేలకు పనిచేస్తున్నారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో సుమారు వెయ్యి ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ కాలేజీలున్నాయి. ఆయా విద్యా సంస్థలు అకడమిక్ స్థాయిలో బాగానే ఉన్నా ఆన్సైట్ ప్రాక్టికల్ శిక్షణలో వెనుకబడి ఉన్నాయి. 12 తరగతిలోపు, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు 180 రోజుల పాటు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాం. 90 రోజుల పాటు క్లాస్రూమ్ శిక్షణ, 90 రోజులు ఆన్సైట్ ట్రెయినింగ్ ఉంటుంది. ఈమేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. త్వరలోనే జరగనున్న క్రెడాయ్ స్టేట్కాన్ సదస్సులో సీఎం రేవంత్రెడ్డితో చర్చించనున్నాం.త్వరలోనే ఫ్యూచర్ సిటీ చాప్టర్..ప్రస్తుతం క్రెడాయ్ తెలంగాణలో 15 చాప్టర్లు, వెయ్యి మంది సభ్యులు ఉన్నారు. వీటిని 25 చాప్టర్లకు విస్తరించాలన్నది లక్ష్యం. త్వరలోనే ఫ్యూచర్ సిటీ క్రెడాయ్ చాప్టర్ను ప్రారంభించనున్నాం. కనీసం ఒక్క ఆక్యుపెన్సీ సర్టిఫికెట్(ఓసీ) పొందిన, నాణ్యమైన 30 మంది సభ్యులతో ఈ చాప్టర్ను తెరవనున్నాం. కోడ్ ఆఫ్ కండక్ట్ విధిగా పాటించే సభ్యులతో ఆ తర్వాత సంగారెడ్డి, జహీరాబాబాద్ చాప్టర్లు కూడా రానున్నాయి. ప్రభుత్వం, బిల్డర్లకు మధ్య క్రెడాయ్ వారధిలా పనిచేస్తుంది. ప్రభుత్వ పాలసీలు, పన్నులు తదితరాలపై బిల్డర్లకు అవగాహన కల్పిస్తుంది. -
సహస్ర తల్లి సంచలన ఆరోపణలు.. వాళ్ల పాత్ర కూడా ఉంది!
సాక్షి, హైదరాబాద్: తమకు న్యాయం చేయాలంటూ సహస్ర తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించారు. రాస్తారోకో చేయడానికి సహస్ర తల్లిదండ్రులు ప్రయత్నించారు. పోలీసులు నచ్చజెప్పారు. ఈ క్రమంలో కూకట్పల్లి పోలీస్స్టేషన్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కూకట్పల్లి రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కూకట్పల్లి నుంచి ఎర్రగడ్డ వరకు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.తమకు న్యాయం చేయకపోతే సూసైడ్ చేసుకుంటామంటూ సహస్ర తల్లి హెచ్చరించారు. న్యాయం చేసేవరుకు రోడ్డుపై నుంచి కదిలేది లేదని.. నిందితుడిని తమ ముందుకు తీసుకురావాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఒక్క బ్యాట్ కోసం ఇంత దారుణం చేస్తారా? తమ కుమార్తె హత్య వెనుక బాలుడి తల్లిదండ్రుల పాత్ర కూడా ఉందని సహస్ర తల్లి ఆరోపిస్తోంది.బాలిక సహస్ర తండ్రి మీడియాతో మాట్లాడుతూ.. ఆ అబ్బాయికి కొంచెం కూడా భయం లేదని.. అతడికి ఉరిశిక్ష వేస్తేనే తన కూతురికి ఆత్మ శాంతి కలుగుతుందన్నారు. తన కూతురిని హత్య చేసి పోలీసులనే పక్క దారి పట్టించే ప్రయత్నం చేశాడన్నారు. ‘‘నా కూతురిని చంపేసి.. నా కొడుకును ఓదార్చుతున్నాడు. ఇతనే చంపాడని నేను కూడా నమ్మలేదు. అసలు ఈ భూమి మీద అతడు ఉండకూడదు. కఠిన శిక్ష విధించాలి’’ అని సహస్ర తండ్రి డిమాండ్ చేశారు. సహస్ర హత్య కేసులో కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. బాలుడే హత్య చేశాడని అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. దొంగతనం కోసం నెల రోజుల ముందే ప్లాన్ చేసినట్టు చెప్పుకొచ్చారు. బాలిక హత్యకు వాడిన కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నట్టు స్పష్టం చేశారు. బ్యాట్ కోసం ఇదంతా జరిగినట్టు తేలిందన్నారు.కూకట్పల్లి సహస్ర హత్య కేసుకు సంబంధించి సీపీ అవినాష్ మహంతి వివరాలను వెల్లడించారు. ఈ సందర్బంగా సీపీ మహంతి మాట్లాడుతూ..‘ఈనెల 18వ తేదీన బాలిక హత్య జరిగింది. మూడు రోజుల వరకు సరైన క్లూ దొరకలేదు. శుక్రవారం బాలుడిని పట్టుకున్నాం. పక్కింట్లో ఉన్న 14 ఏళ్ల బాలుడే సహస్రను హత్య చేశాడు. క్రికెట్ బ్యాట్ దొంగలించేందుకే సహస్ర ఇంటికి బాలుడు వెళ్లాడు. బ్యాట్ తీసుకుని వెళ్తుంటే సహస్ర చూసింది.వెంటనే దొంగ దొంగ అని అరిచింది. దీంతో, సహస్రను బెడ్రూంలోకి తోసి ఆమెపై కత్తితో దాడి చేశారు. బాలికను తోసేసి కళ్లు మూసుకుని కత్తితో పొడిచాడు. ఇంట్లో ఎవరూ లేరు అనుకుని దొంగతనానికి వెళ్లాడు.. కానీ, బాలిక ఉండేసరికి ఆమెపై దాడి చేశాడు. ఈ కేసులో బాలుడిని ప్రశ్నిస్తే విచారణను తప్పుదారి పట్టించే సమాధానాలు చెప్పాడు. బాలిక హత్యకు వాడిన కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నాం. బాలుడే హత్య చేశాడని అన్ని ఆధారాలు ఉన్నాయి. -
నెల క్రితమే ప్లాన్.. హత్య అలా జరిగింది: సీపీ మహంతి
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసులో కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. బాలుడే హత్య చేశాడని అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. దొంగతనం కోసం నెల రోజుల ముందే ప్లాన్ చేసినట్టు చెప్పుకొచ్చారు. బాలిక హత్యకు వాడిన కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నట్టు స్పష్టం చేశారు. బ్యాట్ కోసం ఇదంతా జరిగినట్టు తేలిందన్నారు. కూకట్పల్లి సహస్ర హత్య కేసుకు సంబంధించి సీపీ అవినాష్ మహంతి వివరాలను వెల్లడించారు. ఈ సందర్బంగా సీపీ మహంతి మాట్లాడుతూ..‘ఈనెల 18వ తేదీన బాలిక హత్య జరిగింది. మూడు రోజుల వరకు సరైన క్లూ దొరకలేదు. శుక్రవారం బాలుడిని పట్టుకున్నాం. పక్కింట్లో ఉన్న 14 ఏళ్ల బాలుడే సహస్రను హత్య చేశాడు. క్రికెట్ బ్యాట్ దొంగలించేందుకే సహస్ర ఇంటికి బాలుడు వెళ్లాడు. బ్యాట్ తీసుకుని వెళ్తుంటే సహస్ర చూసింది. వెంటనే దొంగ దొంగ అని అరిచింది. దీంతో, సహస్రను బెడ్రూంలోకి తోసి ఆమెపై కత్తితో దాడి చేశారు. బాలికను తోసేసి కళ్లు మూసుకుని కత్తితో పొడిచాడు. ఇంట్లో ఎవరూ లేరు అనుకుని దొంగతనానికి వెళ్లాడు.. కానీ, బాలిక ఉండేసరికి ఆమెపై దాడి చేశాడు. ఈ కేసులో బాలుడిని ప్రశ్నిస్తే విచారణను తప్పుదారి పట్టించే సమాధానాలు చెప్పాడు. బాలిక హత్యకు వాడిన కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నాం. బాలుడే హత్య చేశాడని అన్ని ఆధారాలు ఉన్నాయి. దొంగతనానికి సంబంధించి ప్లాన్ మొత్తం ఓ నోట్లో రాసుకున్నాడు. దొంగతనం కోసం నెల రోజుల ముందే ప్లాన్ చేశాడు. బ్యాట్ కోసం సహస్ర తమ్ముడితో ఒకసారి గొడవ పడ్డాడు. నిందితుడికి క్రైమ్ సీన్స్ చూసే అలవాటు ఉంది. క్రైం సినిమాల ద్వారా ఎలా తప్పించుకోవాలో తెలుసుకున్నాడు. ఓటీటీలో క్రైమ్ సినిమాలు, సీన్స్ చూసి ప్రభావితం అయ్యాడు. ఈ ఘటనలో తల్లికి అనుమానం వస్తే ఆమెపై ప్రామిస్ చేసి బాలుడు నమ్మించాడు. బాలుడే హత్య చేశాడని అన్ని ఆధారాలు దొరికాయి. కత్తిని బాలిక ఇంట్లోనే కడిగేశాడు. రక్తపు మరకులు ఉన్న బట్టలను వాషింగ్ మెషీన్లో వేశాడు. చాలా సంక్లిష్టమైన కేసు ఇది. విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. పిల్లల ప్రవర్తన పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. నిందితుడిని జువైనల్ హోంకు తరలించాం. నిందితుడి కోసం ఐదు బృందాలు గాలించాయి’ అని చెప్పుకొచ్చారు. బాలిక తండ్రి ఆవేదన.. మరోవైపు.. బాలిక సహస్ర తండ్రి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఆ అబ్బాయికి కొంచెం కూడా భయం లేదు. అతడిని ఉరిశిక్ష వేస్తేనే నా కూతురు ఆత్మ శాంతి. అతను బాలుడు కాదు.. మేజర్ ఆలోచన చేశాడు. అతను మేజర్. పక్కా ప్లాన్ ప్రకారమే నా కూతుర్ని హత్య చేశాడు. పోలీసులనే పక్క దారి పట్టించే ప్రయత్నం చేశాడు. నా కూతురిని చంపేసి నా కొడుకును ఓదార్చుతున్నాడు. ఇతనే చంపాడని నేను కూడా నమ్మలేదు. అసలు ఈ భూమి మీద అతడు ఉండకూడదు. ప్రభుత్వం అతడిని కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. -
కూకట్పల్లి కేసు.. ప్లాన్ ప్రకారమే హత్య.. విచారణలో విస్తుపోయే నిజాలు!
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సహస్ర హత్య కేసులో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. పక్కా ప్లాన్ ప్రకారమే సహస్రను హత్య చేసినట్టు తెలుస్తోంది. యూట్యూబ్లో క్రైమ్ సీన్స్ చూసి బాలిక హత్య. ఈ సందర్భంగా బాలుడు సైకోలా ప్రవర్తించినట్టు సమాచారం. పోలీసుల విచారణలో క్రిమినల్ ఇంటెలిజెంట్గా వ్యవహరించిన బాలుడు. హత్య చేసి ఆధారాలు మాయం చేయడం నేర్చుకున్న తెలిసింది. మరోవైపు.. బాలిక సహస్ర తండ్రి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఆ అబ్బాయికి కొంచెం కూడా భయం లేదు. అతడిని ఉరిశిక్ష వేస్తేనే నా కూతురు ఆత్మ శాంతి. అతను బాలుడు కాదు.. మేజర్ ఆలోచన చేశాడు. పక్కా ప్లాన్ ప్రకారమే నా కూతుర్ని హత్య చేశాడు. పోలీసులనే పక్క దారి పట్టించే ప్రయత్నం చేశాడు. అతడిని కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. సహస్ర హత్య కేసులో నిందితుడైన బాలుడిని జువైనల్ హోంకు తరలించారు పోలీసులు. అంతకుముందు అతడిని జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించిన వివరాలను సీపీ వెల్లడించనున్నారు.ఇది కూడా చదవండి: సహస్ర హత్యపై సీపీ మహంతి.. సంచలన విషయాలు వెల్లడి.. ఇక, కూకట్పల్లి దయార్గూడలో ఈ నెల 18న సహస్ర (11) అనే బాలికను పదో తరగతి బాలుడు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. పోలీసులను తప్పుదోవపట్టిస్తూ, ముప్పతిప్పలు పెట్టిన నిందితుడు.. ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోలీసులకు ఇచ్చిన సమాచారంతో చిక్కాడు. క్రికెట్ బ్యాట్ చోరీ కోసం వచ్చిన అతడు.. బాలిక చూడటంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. కేసు విచారణలో భాగంగా బాలానగర్, కూకట్పల్లి పోలీసులు, ఎస్వోటీ సిబ్బంది నాలుగు రోజులుగా వందలాది సీసీ టీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించడం.. సాఫ్ట్వేర్ ఉద్యోగి..‘హత్య జరిగిన రోజు ఓ బాలుడు గోడదూకి అపార్ట్మెంట్లోకి రావడాన్ని గమనించానంటూ’ కూకట్పల్లి పోలీసులకు సమాచారమివ్వడంతో ఆ దిశగా విచారించారు.అనంతరం బాలుడిని ప్రశ్నించడంతో నిజం అంగీకరించినట్టు సమాచారం. ‘హత్య చేసింది తానేనని, హత్య అనంతరం కత్తిని అక్కడే కడిగి ఇంటికి తీసుకొచ్చి రిఫ్రిజిరేటర్పై ఉంచానని, రక్తపు మరకలు అంటిన టీషర్ట్ను వాషింగ్ మెషిన్లో వేశానని’ పోలీసులకు చెప్పినట్టు తెలిసింది. ఇక, అంతకుముందు దొంగతనం ఎలా చేయాలి.. ఎలా తప్పించుకోవాలో ఆన్లైన్లో శోధించాడు. ఈ వివరాలన్నీ బాలుడు కాగితంపై రాసుకున్నట్లు సమాచారం. -
తెలంగాణ : ప్రసిద్ద వెంకటేశ్వర ఆలయం రత్నాలయం.. తప్పక వెళ్లాల్సిందే (ఫొటోలు)
-
తెలుగు సెంటిమెంట్ పండుతుందా?
మోకాలికి... బోడిగుండుకు ముడిపెట్టడం అంటే ఇదే. రెండు లక్షల టన్నుల యూరియా సరఫరా చేసి రైతులను ఆదుకునే పక్షానికే తాము ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతి ఇస్తామని బీఆర్ఎస్ చెప్పడం, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఆమల్లోకి రావాలంటే కాంగ్రెస్ అధ్వర్యంలో ఇండియా కూటమి అభ్యర్థి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి, జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డికి మద్దతివ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నారు. తెలుగువాడైన జస్టిస్ సుదర్శన రెడ్డిని గెలిపించుకోవడానికి తెలుగు రాష్ట్రాల ఎంపీలు అందరూ కలిసి రావాలని కూడా ఆయన కోరారు. గతంలో పీవీ నరసింహారావు ప్రధాని అయినప్పుడు ఆయన లోక్ సభకు ఎన్నిక అవ్వడానికి అప్పటి టీడీపీ అధినేత ఎన్టీ రామారావు మద్దతిచ్చిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేస్తున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో సెంటిమెంట్ రాజకీయాలు పనిచేసే అవకాశం తక్కువే. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు కూడా అనుకూలంగా లేవు. కాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అప్పాయింట్మెంట్ ఇస్తే తాను కలిసి మద్దతు కోరతానని రేవంత్ రెడ్డి అంటే, కాంగ్రెస్ ఒక చిల్లరపార్టీ అని, రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన అభ్యర్ధికి మద్దతిచ్చే ప్రసక్తి లేదని బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ తేల్చేశారు. మరో వైపు తాము బీఆర్ఎస్ మద్దతు కోరలేదని కేంద్ర మంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్తో సంబంధాలు పెట్టుకోవడానికి బీజేపీ ఇష్టపడడం లేదన్నమాట. తెలంగాణలో సొంతంగా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో బీజేపీ ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో కేసీఆర్ను సంప్రదించలేదని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.మరోవైపు జస్టిస్ సుదర్శనరెడ్డి.. టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తనకు సత్సంబధాలు ఉన్నట్టుగా మాట్లాడడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బీఆర్ఎస్ తెలంగాణకు చెందిన పార్టీ. ఆ రాష్ట్రానికే చెందిన ప్రముఖుడు ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్నప్పుడు ఆయనకు మద్దతివ్వడం ఒక నైతిక బాధ్యత. జస్టిస్ సుదర్శనరెడ్డి పట్ల వీరికి వ్యతిరేకత కూడా ఉండదు కానీ ఆయన కాంగ్రెస్ కూటమి పక్షాన పోటీలో ఉండడం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం తామే అన్నట్టుగా బీఆర్ఎస్ పోటీపడుతోంది. అలాంటి సమయంలో రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన అభ్యర్ధికి మద్దతు ఇస్తే, కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కు అయ్యాయన్న బీజేపీ ఆరోపణలకు బలం చేకూర్చినట్లవుతుందన్నది వారి భయం కావచ్చు.అలాగని బీజేపీ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్కు మద్దతిస్తే బీజేపీ, బీఆర్ఎస్లు కలిసిపోయాయన్న కాంగ్రెస్ ప్రచారానికి బలం చేకూరినట్టు అవుతుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్కు ఉన్న నాలుగు ఓట్లు ఎవరికి పడతాయన్నది ఆసక్తికరంగా మారింది. తటస్థంగా ఉండే అవకాశం ఉంది. పీవీ నరసింహరావు నంద్యాల నుంచి లోక్సభకు పోటీ చేసినప్పుడు టీడీపీ ఆయనకు మద్దతిచ్చిన మాట వాస్తవమే కానీ.. తరువాతి కాలంలో పీవీ తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు టీడీపీని చీల్చి ఏడుగురు ఎంపీలను కాంగ్రెస్లో చేర్చుకున్నారు. పైగా... పీవీ ప్రధానిగా ఉండగా.. ఆ తరువాత కూడా కాంగ్రెస్ పార్టీ ఆయనకు తగిన గౌరవం ఇవ్వలేదన్న విషయాన్ని బీజేపీ, బీఆర్ఎస్లు ఇప్పుడు ఎత్తి చూపుతున్నాయి. పీవీ మరణాంతరం ఆయన భౌతిక కాయాన్ని ఏఐసీసీ ఆఫీస్ ఆవరణలోకి అనుమతించలేదని ఆ పార్టీలు వ్యాఖ్యానిస్తున్నాయి. వీటికి కాంగ్రెస్ సమాధానం ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకో విషయం. ప్రముఖ నేత నీలం సంజీవరెడ్డి తొలిసారి కాంగ్రెస్ అధికారిక అభ్యర్ధిగా రాష్ట్రపతి పదవికి పోటీ చేసినప్పుడు ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ పార్టీ నిర్ణయాన్ని కాదని స్వతంత్ర అభ్యర్ది వీవీ గిరికి మద్దతిచ్చారు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ నీలం సంజీవరెడ్డికి కాకుండా వీవీ గిరికి మద్దతిచ్చింది. ఆ సమయంలో కాసు బ్రహ్మానందరెడ్డి సీఎంగా ఉన్నారు. అప్పుడు కూడా తెలుగు సెంటిమెంట్ పట్టించుకోలేదన్నమాట. నీలం సంజీవరెడ్డి రెండోసారి జనతా పార్టీ అభ్యర్థిగా ఏకగ్రీవంగా రాష్ట్రపతి పదవికి ఎన్నికయ్యారు.తెలుగువాడైన వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి పదవికి పోటీ చేసినప్పుడు తెలంగాణ కాంగ్రెస్ సపోర్టు చేసిందా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అప్పట్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ గోపాలకృష్ణ గాంధీని బలపరిచింది. ఇక ఏపీ విషయాన్ని చూస్తే రెండు సభలలో కలిపి తెలుగుదేశం కు 17 మంది ఎంపీల బలం ఉంది. జనసేనకు ఇద్దరు ఎంపీలు ఉన్నారు. బీజేపీకి ఆరుగురు సభ్యులు ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్కు 11 మంది ఎంపీలున్నారు. తమకు మద్దతివ్వాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాద్ సింగ్ వైసీపీ అధ్యక్షుడు జగన్ ను కోరారు. రాజ్యాంగ పదవులకు ఎన్నిక జరిగినప్పుడు అనుసరించడానికి జగన్ ఒక పద్దతి పెట్టుకున్నారు. ఆ ప్రకారమే ఎన్డీయేకు మద్దతిస్తున్నట్లు శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇక టీడీపీ, జనసేనలు ఎన్డీయేలోనే ఉన్నందున అవి సుదర్శనరెడ్డికి ఓటు వేసే పరిస్థితి లేదు.చంద్రబాబుకు, రేవంత్ రెడ్డి కు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ రాజకీయంగా ఉప రాష్ట్రపతి ఎన్నికలో కాంగ్రెస్ కూటమికి టీడీపీ మద్దతు ఇవ్వలేదు. కాకపోతే జస్టిస్ సుదర్శనరెడ్డి తనకు చంద్రబాబుతో ఉన్న సంబంధాల గురించి వ్యాఖ్యానించిన తీరు ఆసక్తికరంగా ఉంది. చంద్రబాబుతో ప్రత్యేక అనుబంధం ఉందని కాని, సంబంధం లేదని కానీ చెప్పలేనని ఆయన అంటున్నారు. 1995లో ఎన్టీఆర్, చంద్రబాబుల మధ్య జరిగిన న్యాయ పోరాటానికి సంబంధించి తీర్పు ఇచ్చిన బెంచ్లో తాను కూడా సభ్యుడనని ఆయన వెల్లడించారు. చంద్రబాబు మంచి, చెడు బెరీజు వేసుకోవచ్చని, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆయన సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. సుదర్శనరెడ్డి వ్యూహాత్మకంగా మాట్లాడినా చంద్రబాబు ఇప్పటికిప్పుడు ఎన్డీయేను కాదనే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఒక ప్రకటన చేస్తూ సుదర్శనరెడ్డికి మద్దతు ఇచ్చి తన కృతజ్ఞత తెలుపుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుపై ఆశలు పెంచుకుంటున్నట్లుగా ఉంది. బీహారు శాసనసభ ఎన్నికలలో బీజేపీ కూటమి ఓడిపోతే, కేంద్రంలో మోడీ ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉందని, చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకు వస్తారని కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు అల్కా లాంబా జోస్యం చెప్పారు. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో చెప్పలేం కాని చంద్రబాబుతో కాంగ్రెస్కు ఉన్న రహస్య సంబంధాలను ఆమె తెలియచేసినట్లుగా ఉంది.రేవంత్ రెడ్డి ద్వారా రాహుల్ గాంధీతో చంద్రబాబు హాట్ లైన్ పెట్టుకున్నారని ఇప్పటికే మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తెలంగాణ వరకు చూస్తే లోక్ సభలో కాంగ్రెస్కు ఎనిమిది, రాజ్యసభలో ముగ్గురు సభ్యులు ఉన్నారు. బీజేపీకి 8 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు. ఎంఐఎంకు ఒకటి, బీఆర్ఎస్కు నాలుగు రాజ్యసభ స్థానాలూ ఉన్నాయి. ఈ రకంగా చూస్తే సుదర్శనరెడ్డికి కేవలం ఈ 12 మంది మద్దతు మాత్రమే లభించే పరిస్థితి ఉంది. కాగా తెలుగు సెంటిమెంట్ను రేవంత్ రెడ్డి వాడితే, బీజేపీ కూటమి తమిళ సెంటిమెంట్ వాడే అవకాశం ఉంటుంది. అక్కడ మెజార్టీ స్థానాలు డీఎంకే పార్టీకి ఉన్నాయి. కాంగ్రెస్, డీఎంకేలు ఒకే కూటమిలో ఉన్నాయి. అక్కడ బీజేపీ పక్షాన ఒక్క ఎంపీ కూడా లేరు. అన్నాడీఎంకేకు మాత్రం ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. మిగిలిన వారు డీఎంకే, కాంగ్రెస్ కూటమికి చెందినవారే. అయినప్పటికీ తమిళనాడుకు చెందిన బీజేపీ నేతను ఉప రాష్ట్రపతి పదవికి పోటీలో దించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ ఈ ఎంపిక చేసి ఉండవచ్చు. పోటీచేస్తున్న రాధాకృష్ణన్ తన సొంత రాష్ట్రమైన తమిళనాడులో, సుదర్శనరెడ్డి తెలుగు రాష్ట్రాల నుంచి మెజార్టీ మద్దతు పొందలేరన్నమాట. కాగా బీసీ రిజర్వేషన్ల అంశాన్ని పదే,పదే ప్రస్తావిస్తున్న కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి రెడ్డి అగ్రవర్ణాలకు చెందిన ప్రముఖుడిని అభ్యర్ధిగా ఎలా పెడతారని బీజేపీ, బీఆర్ఎస్లు ప్రశ్నిస్తున్నాయి. సుదర్శనరెడ్డి గెలిస్తే బీసీ రిజర్వేషన్లకు కేంద్రంలో ఆమోదం తెలిపే అవకాశం ఉంటుందని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇది కూడా మోకాలికి, బోడు గుండుకు ముడిపెట్టడమే. కాగా ఎన్డీయే అభ్యర్థి రాధాకృష్ణన్ బీసీ వర్గానికి చెందినవారని బీజేపీ ప్రచారం చేస్తోంది. అందువల్ల కాంగ్రెస్ బీసీ కార్డు ఈ సందర్భంగా పనిచేసే అవకాశం ఉండదు. మొత్తం మీద జస్టిస్ సుదర్శనరెడ్డిని ఎంపిక చేయడం ద్వారా కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి తన పరపతి పెంచుకునే అవకాశం ఉంది.అంతకు తప్ప ఆయన ప్రయోగించిన తెలుగు సెంటిమెంట్ కాని, బిసి రిజర్వేషన్ ల వాదన కాని ఫలించే పరిస్థితి కనిపించడం లేదు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు.. బీఆర్ఎస్కు ప్లస్?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ తాజాగా నోటీసులు ఇచ్చారు. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలలో నిన్న ఐదుగురికి నోటీసులు పంపించారు. నేడు మరో ఐదుగురికి నోటీసులు ఇవ్వనున్నట్టు సమాచారం.కాగా, సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. కాగా, న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. స్పీకర్ నోటీసులతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏం చేస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. దీంతో, తెలంగాణ రాజకీయాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. అయితే, స్పీకర్ నోటీసులతో ఫిరాయింపు నేతలు తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరుతారా? లేక రాజీనామా చేస్తారా? అనేది తేలాల్సి ఉంది.ఇక, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి స్పీకర్ నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదులపై వెంటనే వివరణ ఇవ్వాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు. అదేవిధంగా మరో నలుగురు ఎమ్మెల్యేలకు కూడా స్పీకర్ నుంచి నోటీసులు అందినట్లుగా సమాచారం. అయితే, స్పీకర్ ప్రసాద్ కుమార్ నోటీసులపై ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. తనకు వచ్చిన నోటీసులకు త్వరలోనే సమాధానమిస్తానని అన్నారు. తాను అసలు పార్టీ మారలేదని.. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లలేదని స్పష్టం చేశారు. గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశానని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నానని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అన్నారు.మరోవైపు.. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్కు ఇంకా స్పీకర్ నోటీసులు అందలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగి జగిత్యాల ఎమ్మెల్యేగా గెలుపొందిన సంజయ్. ఆ తర్వాత కాంగ్రెస్తో కలిసి పనిచేస్తున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్. అయితే, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకోకపోవడంతో ఎమ్మెల్యేకి నోటీసులపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటివరకూ బీఆర్ఎస్కు రాజీనామా చేయని సంజయ్. దీంతో, సంజయ్కు నోటీసులు ఇస్తారా? లేదా? అని స్థానికంగా చర్చ నడుస్తోంది. -
రేవంత్.. సినీ కార్మికుల సమ్మెపై చొరవకు ధన్యవాదాలు: కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు చేపట్టిన సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం జోక్యం చేసుకుంది. ఫిల్మ్ చాంబర్ , ఫెడరేషన్ నేతలతో చర్చించి సమస్యను పరిష్కరించాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సమస్యకు ముగింపు పలకాలని సూచించారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి చొరవకు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్బంగా కేతిరెడ్డి ఓ ప్రకటనలో ముఖ్యమంత్రి నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి.. తన చొరవతో సినీ పరిశ్రమలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న సమ్మె సంక్షోభం ఎట్టి పరిస్థితుల్లో 24 గంటలలో ముగింపు పలకలని అధికారులను ఆదేశించి, తన పరిపాలన దక్షతను చాటుకున్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను ఎవ్వరు చెడగొట్టాలని ప్రయత్నించినా సహించేది లేదన్న సంకేతం ఇచ్చారు. హైదరాబాద్ని ఇంటర్నేషనల్ సినిమా హబ్ చేయాలన్న తన కోరికకు ఈ సమ్మె ఒక అడ్డంకిగా ఉందని ఇటీవల బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ తదితరులతో కూడా ముఖ్యమంత్రి చర్చించారు.అదేవిధంగా ఎన్నో రోజులుగా సతమతమవుతున్న సినీ కార్మికుల సమస్యలు, చిత్రపురి కాలనీ వ్యవహారంలో గతంలో జరిగిన, ప్రస్తుతం జరుగుతున్న అన్యాయాలపై విచారణకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో నేరం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం సినిమాలో ఉన్న ట్రేడ్ యూనియన్ల పేరుతో లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు. సొసైటీస్ రిజిస్టర్ వద్ద లెక్కలు సమర్పించకుండా ఉన్న వారిపై, దొంగ సభ్యులను చేర్చుకొని వారికి గుర్తింపు కార్డులు ఇచ్చి వాటిని సొసైటీస్ రిజిస్టర్ వద్ద సమర్పించని ట్రేడ్ యూనియన్ సంఘాలపై విచారణ చేపట్టాలన్నారు. వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఏసీబీకి చిక్కిన వనస్థలిపురం సబ్రిజిస్ట్రార్
వనస్థలిపురం: వనస్థలిపురం కార్యాలయంలో రూ.70 వేలు లంచం తీసుకుంటున్న సబ్ రిజిస్టార్ ఎస్.రాజేష్ కుమార్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. తుర్కయాంజాల్ పరిధిలోని 200 గజాల స్థల విషయం వివాదాస్పదంగా మారింది. దీని రిజిస్టేషన్కు సబ్రిజిస్ట్రార్ రూ.లక్ష డిమాండ్ చేయడంతో బాధితుడు రూ.70 వేలు ఇస్తానన్నాడు. ఈ మేరకు శుక్రవారం సబ్ రిజిస్ట్రార్ తన సహాయకుడు, డాక్యుమెంట్ రైటర్ వద్ద టైపిస్ట్గా పని చేసే రమేష్ ద్వారా రూ.70 వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్కుమార్ మాట్లాడుతూ.. కార్యాలయంలో జరిగే అవినీతిపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. అధికారులు ఎవరైనా అవినీతికి పాల్పడితే టోల్ ఫ్రీ నెం. 1064కు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. -
Hyderabad: ప్రభుత్వ స్తంభాలపై ప్రైవేటు ఆధిపత్యం
సాక్షి, హైదరాబాద్ : సరఫరా చేసే ప్రతి యూనిట్ను పక్కాగా లెక్కించే సామర్థ్యం కలిగి ఉన్న దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ.. తన అ«దీనంలో ఉన్న విద్యుత్ స్తంభాలపై ఇప్పటికీ ఓ స్పష్టత లేకపోవడం అనేక అనుమానాలకు ఆస్కారం కల్పిస్తోంది. ఏ సర్కిల్ పరిధిలో ఎన్ని విద్యుత్ స్తంభాలు ఉన్నాయి? ఎన్ని మీటర్ల దూరం విస్తరించి ఉన్నాయి? ఏ స్తంభంపై ఏయే కంపెనీలకు చెందిన ఎన్ని కేబుళ్లు వేలాడుతున్నాయి? వంటి కనీస వివరాలను సేకరించకపోవ డాన్ని పరిశీలిస్తే.. ఆడిట్ విషయంలో డిస్కం ఇంజినీర్ల నిర్లక్ష్యం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కుంగిపోతున్న స్తంభాలు గ్రేటర్లో 33/11కేవీ సబ్స్టేషన్లు 498 ఉండగా, పవర్ ట్రాన్స్ఫార్మర్లు 1,022 ఉన్నాయి. 33కేవీ యూజీ కేబుల్ లైన్లు 1,280 కిలోమీటర్లు విస్తరించి ఉండగా, 33 కేవీ ఓవర్హెడ్లైన్లు 3,725 కిలోమీటర్లు, 11 కేవీ ఓవర్హైడల్ లైన్లు 21,643 కిలోమీటర్లు, 11కేవీ యూజీ కేబుల్ లైన్లు 957 కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి. డి్రస్టిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు 1,50,992 ఉండగా, వీటి పరిధిలో 63 లక్షలకుపైగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఫీడర్ నుంచి డి్రస్టిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్కు వచ్చే 11 కేవీ స్తంభాలు ఎన్ని ఉన్నాయో తెలియదు. ట్రాన్స్ఫార్మర్ నుంచి గృహానికి విద్యుత్ సరఫరా చేసే 11 కేవీ ఎల్టీ స్తంభాలు ఎన్ని ఉన్నాయో కూడా సరైన లెక్కలేదు. High Court Orders Removalనిజాం కాలంలో ఏర్పాటు చేసిన ఇనుప స్తంభాలు 12 మీటర్లకుపైగా ఉండేవి. సిమెంట్ పోల్స్ వచి్చన తర్వాత ఎత్తు తగ్గించారు. వాటికి సపోరి్టంగ్ వైర్లను కూడా తొలగించారు. సాధారణంగా 11 కేవీ విద్యుత్ స్తంభం ఎత్తు తొమ్మిది మీటర్లపైగా ఉండగా అదే 33 కేవీ స్తంభం పది మీటర్లకుపైగా ఎత్తు ఉంటుంది. మెజార్టీ సరీ్వసు ప్రొవైడర్లు ఐదారు మీటర్ల ఎత్తు నుంచే వైర్లను రోడ్డుకు అటు ఇటుగా ఉన్న గృహాలకు లాగుతున్నారు. లైన్ వేయగా మిగిలిన వైర్లను ఉండలుగా చుట్టూ స్తంభాలకు వేలాడదీస్తున్నారు. ఇలా ఒక్కో స్తంభానికి 500 కేజీల బరువు ఉన్న తీగలు వేలాడుతున్నాయి. సామర్థ్యానికి మించిన బరువును తట్టుకోలేక ఆయా స్తంభాలు ఏదో ఒక వైపు వంగి కన్పిస్తున్నాయి. పర్యవేక్షణ లేదు.. ప్రమాణాలు పాటించరుకరెంట్ సరఫరా, లైన్లు పర్యవేక్షణ, రెవెన్యూ వసూళ్లపై ప్రత్యేక ఆడిట్ ఉంది. గ్రేటర్లో స్టార్ కేబుళ్లు, ఇంటర్నెట్ ప్రొవైడర్ సరీ్వసు ఆపరేటర్లు 30 మందికిపైగా ఉన్నట్లు అంచనా. నిజానికి విద్యుత్ సంస్థ కంటే ఇంటర్నెట్, స్టార్ కేబుళ్ల ఆదాయం ఎక్కువ. లైన్లు, కేబుళ్ల ఏర్పాటు విషయంలో విద్యుత్ సంస్థకు కొన్ని కచి్చతమైన ప్రమాణాలు, నియమ నిబంధనలు ఉన్నాయి. కానీ కేబుల్ ఆపరేటర్లకు, సరీ్వసు ప్రొవైడర్లకు కనీస భద్రత ప్రమాణాలు, నియమ నిబంధనలు లేవు. వీరి పని తీరుపై పర్యవేక్షించే ప్రభుత్వ యంత్రాంగం కూడా లేదు. మార్కెట్లో తక్కువ ధరకు లభించే నాసిరకం కేబుళ్లు కొనుగోలు చేసి విద్యుత్ స్తంభాలపై వేలాడదీస్తున్నారు. ఈదురు గాలితో కూడిన వర్షాలకు తరచూ తెగిపడుతుండటంతో వాటికి సపోరి్టంగ్ కోసం జే వైర్లతో అనుసంధానిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా స్తంభాలకు జంక్షన్ బాక్సులను ఏర్పాటు చేయడంతో పాటు వాటికి అక్రమంగా కరెంట్ వాడుతున్నారు. ఈ విషయం ఇటు క్షేత్రస్థాయి ఇంజినీర్లు మొదలు..సీఎండీ వరకు తెలుసు కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క ఆపరేటర్పై కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. తాజాగా రామంతాపూర్, అంబర్పేట్, బండ్లగూడ ఘటనలతో అప్రమత్తమైన డిస్కం.. స్తంభాలకు వేలాడుతున్న వైర్లను తొలగించే పని మొదలు పెట్టింది. అయితే.. ఇప్పటికే డిస్కం నిర్ణయించిన చార్జీలు చెల్లించి, స్తంభాల ద్వారా కేబుళ్లను ఏర్పాటు చేసుకున్న సరీ్వసు ప్రొవైడర్లు డిస్కం ఇంజినీర్ల తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండా అన్ని అనుమతులు తీసుకున్న తమ కేబుళ్లను కూడా తొలగించడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. 1.73 లక్షల స్తంభాలకే అనుమతులు.. నగరంలో ఎల్టీ 11కేవీ, 33 కేవీ సహా అన్ని రకాల విద్యుత్ స్తంభాలు 20 లక్షలకుపైగా ఉన్నట్లు డిస్కం ప్రకటించింది. వీటిలో 1.73 స్తంభాల వినియోగానికి మాత్రమే ఆయా సరీ్వసు ప్రొవైడర్లకు అనుమతి ఉన్నట్లు పేర్కొంది. ఆప్టికల్ ఫైబర్ కేబుల్, కో–యాక్సిల్ (లోపల మెటల్ కండక్టర్తో ఇన్సులేషన్ ఉన్న కేబుల్ టీవీ వైర్) కేబుల్స్ వాడుతున్నట్లు తెలిపింది. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ను విద్యుత్ స్తంభాలపై వేయడం సహా భద్రతా చర్యలను అమలు చేయడం ఆయా ఏజెన్సీదే పూర్తి బాధ్యత. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేసిన విద్యుత్ స్తంభాలను సులభంగా గుర్తించేందుకు వాటిపై పెయింటింగ్ తప్పనిసరిగా చేయాలి. విద్యుత్ స్తంభాలపై బ్యాక్హాల్ ఎక్విప్మెంట్ వంటి అదనపు పరికరాలను ఇన్స్టాల్ చేయరాదు. అనుమతించిన సంఖ్యకు మించి స్తంభాలను ఉపయోగించకూడదు. సమీపంలోని లైన్ల నుంచి విద్యుత్ సరఫరాను డైరెక్ట్ ట్యాపింగ్ చేయరాదు. కానీ.. అనేక ప్రదేశాలలో కేబుల్స్ కిందికి 5 అడుగుల ఎత్తులో వదిలేస్తున్నారు. కాంక్రీట్ మిక్సర్ వాహనాలు, బోర్ డ్రిల్లింగ్ వంటి భారీ వాహనాలు రోడ్డును దాటేటప్పుడు తక్కువ ఎత్తులో వేయబడిన ఈ కేబుల్స్ వల్ల విద్యుత్ నెట్వర్క్కు భారీ నష్టం వాటిల్లుతోంది. ఐఎస్పీలు, కేబుల్ ఆపరేటర్లు కొత్త కనెక్షన్ కోసం కేబుల్ వేస్తున్నారే కానీ ఇప్పటికే పాడైన, వినియోగంలో లేని కేబుల్స్ను తొలగించట్లేదు. ఇవి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అనుమతి తీసుకున్న కేబుళ్లను కూడా గుర్తించే పరిస్థితి లేకపోవడంతోనే అన్ని తీగలను తొలగించాల్సి వస్తోందని డిస్కం స్పష్టం చేస్తోంది. -
టెన్త్ క్లాస్ కిల్లర్!
సాక్షి, హైదరాబాద్/మూసాపేట: ఆ బాలుడికి క్రికెట్ బ్యాట్పై మక్కువ... ఎన్నిసార్లు అడిగినా తల్లిదండ్రులు కొనివ్వలేదు... పక్క భవనంలోని స్నేహితుడి ఇంటి నుంచి ఆ బ్యాట్ చోరీకి స్కెచ్ వేశాడు. ఒకవేళ బ్యాట్ కనిపించకపోతే అందినకాడికి డబ్బు దోచుకొని ఆ సొమ్ముతో బ్యాట్ కొనుక్కుందామనుకున్నాడు. చోరీ అనంతరం ఇంటిని గ్యాస్ లీక్తో తగలబెట్టాలని వచ్చీరాని ఆంగ్లంలో ఓ పేపర్పై రాసుకొని మరీ కుట్రపన్నాడు.అయితే చోరీ చేస్తుండగా ఆ ఇంటి యజమాని కుమార్తె చూడటంతో తప్పించుకోవడం కోసం ఆమెను దారుణంగా హతమార్చాడు. కూకట్పల్లి దయార్గూడలో ఈ నెల 18న సహస్ర (11) అనే బాలికను చంపిన పదో తరగతి బాలుడి వ్యవహారమిది. పోలీసులను తప్పుదోవపట్టిస్తూ, ముప్పతిప్ప లు పెట్టిన నిందితుడు.. ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోలీసులకు ఇచ్చిన సమాచారంతో చిక్కాడు.పుట్టిన రోజున వచ్చి కేక్ తినిపించి...పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని ఒంగోలుకు చెందిన భార్యాభర్తలు తమ కుమారుడితో కలిసి దాదాపు రెండేళ్ల క్రితం హైదరాబాద్ వలసవచ్చి కూకట్పల్లి దయార్గూడలోని ఓ భవనం నాలుగో అంతస్తులో నివసిస్తున్నారు. భర్త గతంలో చిరుద్యోగం చేసి మానేయగా భార్య కొన్నాళ్ల క్రితం వరకు కిరాణా దుకాణం నిర్వహించి ప్రస్తుతం ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. స్థానిక పాఠశాలలో పదో తరగతి చదివే వారి కుమారుడు (15) సక్రమంగా బడికి వెళ్లకుండా టీవీ, ఓటీటీల్లో వచ్చే క్రైమ్, హారర్ చిత్రాలు, వెబ్ సిరీస్లు, సీరియల్స్ ఎక్కువగా చూసేవాడు.కొన్నాళ్లుగా ధ్రువ్ రాఠీ అనే యూట్యూబర్కు చెందిన చానల్ వీక్షిస్తున్నాడు. తమ ఇంటికి ఆనుకొని ఉన్న మూడంతస్తుల భవనంపై ఉన్న పెంట్ హౌస్లో సహస్ర అనే బాలిక తన తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి సింగిల్ బెడ్రూం ఇంట్లో నివసిస్తోంది. పక్కపక్క భవనాల్లో ఉండటంతోపాటు ఆమె సోదరుడు కూడా బాలుడు చదివే పాఠశాలలోనే చదువుతుండటంతో ఇరు కుటుంబాల మధ్య పరిచయం ఉంది. మార్చిలో జరిగిన సహస్ర పుట్టిన రోజు వేడుకకు సైతం హాజరైన బాలుడు.. ఆమెకు కేక్ కూడా తినిపించాడు.క్రికెట్ కిట్ కొనివ్వని కారణంగా...సహస్ర సోదరుడితోపాటు కాలనీలో ఉండే పిల్లలతో కలిసి బాలుడు తరచూ క్రికెట్ ఆడేవాడు. కొన్నాళ్ల క్రితమే సహస్ర సోదరుడు ఎంఆర్ఎఫ్ కంపెనీకి చెందిన ఓ క్రికెట్ బ్యాట్ కొనుక్కోవడంతో తనకు కూడా క్రికెట్ బ్యాట్ కొనివ్వాలని తల్లిదండ్రుల్ని పలుమార్లు అడిగాడు. వారు కొనకపోవడంతో సహస్ర ఇంట్లో చోరీకి స్కెచ్చేశాడు. తరచూ సహస్ర ఇంటికి వెళ్లి వస్తుండటం వల్ల ఆ ఇంట్లో ఏవి ఎక్కడు న్నాయో తెలిసిన బాలుడు.. ఆ ఇంట్లో ఎవ్వరూ లేనివేళ బ్యాట్ కాజేసి.. ఆపై సాక్ష్యాధారాలు లేకుండా చేసేందుకు గ్యాస్ లీక్ ద్వారా ఇంటికి నిప్పంటించాలని కుట్ర పన్నా డు. ఇందుకోసం వచ్చీరాని ఆంగ్లంలో ఓ పేపర్పై రాసుకొని చివర్లో ‘మిషన్ డన్’ అని రాశాడు. పాఠశాలకు సెలవులు కావడంతో...చోరీ కోసం పథకం వేసిన బాలుడు ఈ నెల 18న సహస్ర, ఆమె సోదరుడు స్కూళ్లకు వెళ్లిపోతారని.. తండ్రి మెకానిక్ షాపుకి, తల్లి విధులకు వెళ్తుందని భావించాడు. అయితే సహస్ర చదువుతున్న బోయిన్పల్లి కేంద్రీయ విద్యాలయాలో స్పోర్ట్స్ మీట్ ఉండటంతో నాలుగు రోజులు పాఠశాలకు సెలవులు ఇచ్చారు. దీంతో ఆమె మాత్రం ఇంట్లోనే ఉండిపోయింది. ఈ విషయం తెలియని బాలుడు.. తమ భవనం నాలుగో అంతస్తు నుంచి మూడో అంతస్తుకు వచ్చి సైడ్ వాల్ మీదుగా సహస్ర కుటుంబం ఉంటున్న భవనం మూడో అంతస్తులోకి వెళ్లాడు. అక్కడి పెంట్హౌస్కు చేరుకున్నాడు.తలుపు తీసి ఉండటంతో నేరుగా లోపలకు వెళ్లి చోరీకి ప్రయత్నించాడు. అదే సమయంలో లోపల గదిలోంచి హాల్లోకి వచ్చిన సహస్ర బాలుడిని చూసింది. ఆమె అరిస్తే పట్టుపడతాననే భయంతో బాలుడు ఆమె నోరు నొక్కి తన వద్ద ఉన్న కత్తితో నేరుగా ఆమె గొంతులో పొడిచాడు. దీంతో సహస్ర అరవలేక అక్కడే కూలిపోయింది. అయినప్ప టికీ చావలేదని భావించిన నిందితుడు.. ఆమెను విచక్షణారహితంగా దాదాపు 20 పోట్లు పొడిచి వచ్చిన మార్గంలోనే తన ఇంటికి పారిపోయాడు. బయట ఆరేసిన దుస్తులు తన మీద వేసుకొని రక్తం మరకలు తల్లిదండ్రులకు కనిపించకుండా ఇంట్లోకి వెళ్లాడు.కత్తి, లేఖను దాచి... రక్తం మరకలు దుస్తుల్ని వాషింగ్ మెషీన్లో పడేసి ఆన్ చేశాడు. ఆపై ఏమీ ఎరగ నట్లు తండ్రితో కలిసి పెంపుడు కుందేలును పశువైద్యుడి వద్దకు తీసుకెళ్లాడు. సోమవారం మధ్యాహ్నం 12 గంట ప్రాంతంలో లంచ్ బాక్స్ కోసం ఇంటికి వచ్చిన సహస్ర తండ్రి.. కుమార్తె రక్తపుమడుగులో మృతిచెంది ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.పోలీసులనూ తప్పుదోవ పట్టించి..ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఈ కేసు దర్యాప్తు జటిలంగా మారింది. దర్యాప్తులో భాగంగా పోలీసులు చుట్టుపక్కల అందరితోపాటు ఈ బాలుడినీ విచారించారు. అయితే పోలీసులను తప్పుదోవ పట్టించేలా అతను.. సహస్ర ఇంటి నుంచి డాడీ, డాడీ అంటూ అరుపులు వినిపించాయని చెప్పి బాలిక తండ్రినే అనుమానితుడిగా చేశాడు. దీంతో ఆమె తండ్రిని విచారించిన పోలీసులు.. క్షుద్రపూజల అంశాన్నీ పరిగణనలోకి తీసుకొని దర్యాప్తు చేశారు.ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచి్చన సమాచారంతో... స్థానికంగా నివసించే ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్కు ఈ బాలుడి వ్యవహార శైలిపై అనుమానం వచి్చంది. దీంతో ఆయన ఆ సమాచారాన్ని పోలీసులకు అందించారు. శుక్రవారం ఉదయం ఆ బాలుడు చదివే పాఠశాలకు వెళ్లిన పోలీసులు సహస్ర హత్య విషయమై ప్రశ్నించారు. అతడు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ఇంటికి తీసుకెళ్లి తల్లిదండ్రుల సమక్షంలో సోదాలు చేశారు.దీంతో కత్తి, రక్తం మరకలతో ఉన్న దుస్తులు, లేఖ లభించాయి. బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆంగ్లంలో 11 లైన్లలో రాసి ఉన్న ఆ లేఖలో ‘ఫస్ట్ గో హోం... అండ్ టేక్ గ్యాస్ అండ్ ఎ టేబుల్ అండ్ నెక్ట్స్ కీప్ ఎట్ ద డోర్ అండ్ ఫైర్ ద గ్యాస్’అంటూ లేఖలో రాసి ఉంది. దీన్ని పరిశీలించిన పోలీసులు చోరీ తర్వాత ఆధారాలు దొరక్కుండా ఇంటిని గ్యాస్ లీక్ చేసి కాల్చాలని కుట్రపన్నినట్లు భావిస్తున్నారు. ఈ ఉదంతంపై శనివారం అధికార ప్రకటన చేయనున్నారు. -
కుటుంబంలో చిచ్చు పెట్టిన సీరియల్..
బయ్యారం: పచ్చని కుటుంబంలో టీవీ సీరియల్ చిచ్చుపెట్టింది. సీరియల్ చూస్తూ తన ను పట్టించుకోవడంలేదని ఆవేదనకు గురైన భర్త.. భార్యతో ఘర్షణకు దిగాడు. దీంతో ఆమె పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయడాన్ని గమనించిన కొడుకు కూడా పురుగు మంది తాగాడు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోడిపుంజుల తండాలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. కోడిపుంజుల తండాకు చెందిన ధరావత్ రాజుకు మహబూబాబాద్ మండలం సాలార్ తండాకు చెందిన కవితతో పది సంవత్సరాల క్రితం రెండో విహమైంది.అప్పటికే కవితకు వివాహం జర గగా మున్న (11) అనే కుమారుడు ఉన్నాడు. కొడుకుతో సహా ఆమె రాజుతో కోడిపుంజులతండాలో ఉంటోంది. ఈ క్రమంలో ఆ జంటకు కుమార్తె భవ్యశ్రీ జన్మించింది. కాగా, గురువారం రాత్రి రాజు అన్నం పెట్టమని అడుగగా.. కవిత టీవీలో సీరియల్ చూస్తూ.. కొంత సమయం ఆగమని చెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైన రాజు భార్య కవితతో వాదనకు దిగి చేయి చేసుకోవడంతో వివాదం పెద్దదైంది. ఇరుగు, పొరుగువారు వచ్చి సర్దిచెప్పడంతో అప్పటికి వివాదం సద్దుమణిగింది.శుక్రవారం ఉదయం ఆత్మహత్య చేసు కుంటానని కవిత తమ వ్యవసాయబావి వద్దకు వెళ్లగా స్థానికులు ఆమెను అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చారు. తర్వాత రాజు వ్యవసాయబావి వద్దకు వెళ్లగా, ఇంట్లో ఉన్న కవిత గడ్డిమందు తాగింది. ఇది చూసి ఆమె కుమారుడు మున్న కూడా గడ్డిమందు తాగాడు. స్థానికులు ఈ విషయం గమనించి ఇద్దరినీ మహబూబాబాద్లోని ఓ ఆసుపత్రికి తరలించారు. కాగా, బాలుడు మున్న పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు తెలిపారు. -
25న రాష్ట్ర కేబినెట్ భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈ నెల 25వ తేదీ మధ్యా హ్నం 2 గంటల కు సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్ని కలు, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, కాళేశ్వరం కమిషన్ నివే దిక తదితర అంశాలపై ప్రధానంగా చర్చ జరగనుంది. అదేవిధంగా ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరిగిన నష్టంపై చర్చించి, పంటలు కోల్పోయిన రైతులకు పరిహారం అందించే విషయంపై నిర్ణ యం తీసుకోనున్నట్లు తెలిసింది. యూరియా కొరతపై కూడా చర్చించనున్నట్లు సమా చారం.ముఖ్యంగా హైకోర్టు తీర్పు మేరకు వచ్చే నెలాఖరు నాటికి స్థానిక సంస్థల ఎన్నిక లు నిర్వహించాల్సి ఉన్నందున.. ఈ ఎన్నికల తేదీలను మంత్రివర్గం ఖరారు చేసే అవ కాశం ఉంది. శనివారం జరిగే కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో వెల్లడయ్యే అభిప్రాయాలకు అనుగుణంగా కేబినెట్లో స్థానిక ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తేదీలు కూడా ఈ సమావే శంలోనే ఖరారు కానున్నాయి. ఈ నెల 29 నుంచి లేదంటే సెప్టెంబర్ మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ సమావేశాలు వారం పాటు నిర్వహిస్తారని, కాళేశ్వరం ప్రాజెక్టు పై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన అంశాలే ఎజెండాగా సమావేశా లు ఉంటాయని తెలిసింది. ఘోష్ కమిషన్ నివేదికపై తీసుకోవాల్సిన చర్యలు, హైకోర్టు లో కౌంటర్ దాఖలుపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. -
యూరియా పక్కదారిపై బదులివ్వాలి: కిషన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేంద్రం నుంచి తెలంగాణకు పంపుతున్న యూరియా పక్కదారి ఎలా పడుతోందో, ఎలా బ్లాక్ మార్కెట్లోకి వెళ్తోందో సమాధానం చెప్పాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒక్క బస్తా కూడా అధిక ధరలకు అమ్మకుండా చూడాలని.. బ్లాక్ మార్కెట్ను అరికట్టడానికి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ యూరియా సరఫరా విషయంలో కేంద్రాన్ని బద్నాం చేసే దురుద్దేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలని హితవు పలికారు.రైతులకు సక్రమంగా యూరియా సరఫరా అయ్యేలా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే తెలంగాణలో 2.04 లక్షల టన్నుల యూరియా ఖరీఫ్ సీజన్ కోసం ఓపెనింగ్ స్టాక్గా ఉందని కిషన్రెడ్డి చెప్పారు. అయితే ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో రైతులు విత్తనాలు వేయక ముందే రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రం యూరియా సరఫరా చేయడం లేదని ప్రకటించి భయానక వాతావరణాన్ని సృష్టించిందని మండిపడ్డారు. ఇతర దేశాల్లో ఎరువుల ధరలు మూడు రెట్లు పెరిగినప్పటికీ కేంద్రం 11 ఏళ్లుగా రైతులపై భారం వేయకుండా రాష్ట్రానికి సుమారు రూ. 80 వేల కోట్ల ఎరువుల సబ్సిడీని భరించిందన్నారు.రూ. 2,650 విలువైన ఒక్కో యూరియా బస్తాను రూ. 265 సబ్సిడీ ధరకే రైతులకు అందిస్తుంటే దాన్ని రూ. 400కి వారు కొనాల్సిన పరిస్థితి ఎందుకొస్తోందని కిషన్రెడ్డి ప్రశ్నించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటోందని ప్రశ్నించారు. అసలు కుట్ర ఎవరిదో బదులివ్వాలని నిలదీశారు. పెద్ద రైతులు వారి దగ్గర ఎక్కువ యూరియా ఉంచుకోవద్దని.. అవసరమైన యూరియాను అందుబాటులోకి తెస్తామని భరోసా ఇచ్చారు. సచివాలయం వద్ద నిరసనలకు భయమెందుకు? కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఏటా సెపె్టంబర్ 17న ‘తెలంగాణ లిబరేషన్ డే’ను హైదరాబాద్లో నిర్వహిస్తోందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చెప్పారు. ఈ ఏడాది కూడా తెలంగాణ విముక్తి దినాన్ని కేంద్రం తరఫున ఘనంగా నిర్వహిస్తామన్నారు. గ్రేటర్ హైదరాబాద్లోని ప్రజాసమస్యలు, నగరాభివృద్ధి అంశాలపై బీజేపీ ఆధ్వర్యంలో సచివాలయం ఎదుట నిరసన చేపడితే రాష్ట్ర ప్రభుత్వానికి ఉలికిపాటు, భయం ఎందుకని ఆయన ప్రశ్నించారు. బీజేపీ నేతలను అదుపులోకి తీసుకోవడం, హౌస్ అరెస్టులు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు.హైదరాబాద్లో మౌలిక సమస్యల పరిష్కారానికి జైలుకెళ్లేందుకైనా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ హామీల మేరకు ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. సెపె్టంబర్ 1 నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు చేసే పోరాటానికి బీజేపీ రాష్ట్రశాఖ పూర్తి మద్దతు ప్రకటిస్తోందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కొత్త పీఆర్సీని ప్రకటించి 6 నెలల లోపు సిపార్సులను అన్నీ అమలు చేస్తామని ఇచి్చన హామీ అటకెక్కిందని విమర్శించారు.ఉద్యోగుల కాంట్రిబ్యూషన్తో అన్ని రకాల జబ్బులకు అన్ని ఆసుపత్రుల్లో వైద్యం అందించేవిధంగా హెల్త్ కార్డులు ఇస్తామన్న ప్రభుత్వం మరిచిపోయిందన్నారు. ప్రస్తుతం సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానం అమలు చేస్తామన్న హామీ అతీగతీ లేదన్నారు. కాంగ్రెస్ పాలనలో రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి మరీ దయనీయంగా మారిందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగుల జీపీఎఫ్ మొత్తాల విత్డ్రాపైనా మారిటోరియం విధించడం దారుణమన్నారు. -
సమాజం సిగ్గుతో తలదించుకోవాలి
సాక్షి, హైదరాబాద్: పుట్టిన రోజునే తండ్రికి కొడుకు తలకొరివి పెట్టాల్సిన పరిస్థితి చోటుచేసుకున్నందుకు సమాజం సిగ్గుతో తలదించుకోవాలని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. తల్లిదండ్రులతో కేక్ కట్ చేయాల్సిన తొమ్మిదేళ్ల బాలుడు కన్నీటిపర్యంతం కావడం తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేసింది. బాలుడి హృదయం పగిలిపోయిందని.. దీనికి బాధ్యులెవరో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రతి ఒక్కరూ దీనికి బాధ్యత వహించాల్సిందేనని అభిప్రాయపడింది. వైర్లతో విద్యుత్ స్తంభాలు, మామూళ్లతో కొందరి జేబులు బరువెక్కి కిందకు వంగుతున్నాయని చురకలంటించింది. అనుమతి లేని కేబుళ్లను వెంటనే తొలగించాలని ఆదేశించింది.అనుమతి ఉన్నా ప్రమాదకరంగా ఉంటే వాటిని కూడా తీసేయాలని స్పష్టం చేసింది. హైదరాబాద్లోని రామంతాపూర్లో శ్రీకృష్ణుడి శోభాయాత్ర సందర్భంగా భక్తులు లాగుతున్న రథానికి విద్యుదాఘాతం జరిగి ఐదుగురు మృతి చెందడం, పాతబస్తీలో మరో నలుగురు మృతిచెందిన నేపథ్యంలో విద్యుత్ స్తంభాలపై ప్రమాదకరంగా ఉన్న కేబుల్ వైర్ల తొలగింపునకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం తెలిసిందే. దీన్ని సవాల్చేస్తూ భారతీ ఎయిర్టెల్ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై జస్టిస్ నగేశ్ భీమపాక శుక్రవారం మరోసారి విచారణ చేపట్టారు. కరెన్సీ నోట్లు మాత్రం కనిపిస్తాయ్.. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.రవి వాదనలు వినిపిస్తూ అనుమతులు తీసుకున్నాకే స్తంభాల ద్వారా కేబుళ్లు తీసుకున్నామని.. ప్రభుత్వం నోటీసు జారీ చేయకుండా నగరమంతా కేబుళ్లను కట్ చేయడం సరికాదన్నారు. టీజీఎస్పీడీసీఎల్ తరఫున శ్రీధర్రెడ్డి వాదిస్తూ నగరంలో దాదాపు 20 లక్షలకుపైగా స్తంభాలుంటే 1.70 లక్షల స్తంభాలపైనే కేబుళ్ల ఏర్పాటుకు అనుమతులున్నాయన్నారు.పరిమితికి మించి కేబుళ్ల వల్ల స్తంభాలు వంగిపోతున్నాయన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ మామూళ్లతో కొందరి జేబులు కూడా బరువెక్కి వంగిపోతున్నాయని వ్యాఖ్యానించారు. అనుమతులున్న కేబుల్ ఏజన్సీలు అనధికారిక కేబుళ్ల తొలగింపు విషయంలో విద్యుత్ సిబ్బందికి సహకరించాలని ఆదేశించారు.స్తంభాలపై అన్ని వైర్లు నల్లగా ఉన్నందున ఏవి అనుమతులున్నవో ఏవి లేనివో గుర్తుపట్టడం కష్టంగా ఉందన్న వాదనను తోసిపుచ్చారు. అనుమతులు తీసుకోని సంస్థలు ఇచ్చిన కరెన్సీ నోట్లు మాత్రం అక్రమార్కులకు బాగా కనిపిస్తాయని చురకంటించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే హక్కు ఎవరికీ లేదన్నారు. ఆరు కుటుంబాలు అనుభవిస్తున్న వేదనకు సమష్టి బాధ్యత వహించాలన్నారు. తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది. ఆలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. -
చర్చించాకే చర్యలు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి, చర్చించిన తర్వాతే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు శుక్రవారం అఫిడవిట్ దాఖలు చేసింది. దీంతో కమిషన్ నివేదికపై స్టే ఇస్తూ, రద్దు చేస్తూ ఆదేశాలు అవసరం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. నివేదికపై అసెంబ్లీలో చర్చించాలని మంత్రిమండలి నిర్ణయించినప్పుడు.. అంతకుముందే మీడియాకు వివరాలు వెల్లడించడాన్ని తప్పుబట్టింది.పిటిషనర్లు ఆరోపిస్తున్నట్లు ఒకవేళ నివేదికను అధికారిక వెబ్సైట్ లో పెడితే వెంటనే తీసివేయాలని ఆదేశించింది. కమిషన్ 8బీ, 8సీ కింద నోటీసులు జారీ చేయకుండా పిటిషనర్లను నిందితులుగా చూపడం సరికాదని పేర్కొంది. పిటిషనర్లు లేవనెత్తిన అన్ని అంశాలపై పూర్తి వివరాలతో మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ తదుపరి వారంలోగా సమాధాన కౌంటర్ వేయాలని పిటిషనర్లకు స్పష్టం చేసింది.తదుపరి విచారణను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కమిషన్ నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, అమలు చేయకుండా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు.వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు న్యాయవాదులు ఆర్యమ సుందరం, దామ శేషాద్రినాయుడు, ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్రెడ్డి, కమిషన్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్రెడ్డి వాదనలు వినిపించారు. అనంతరం ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మీడియా భేటీ వెనుక దురుద్దేశం ఉందన్న పిటిషనర్లు ‘కాళేశ్వరం ప్రాజెక్టుపై 2024, మార్చి 14న విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 6 జారీ చేసింది. పిటిషనర్లు సహా పలువుర్ని కమిషన్ విచారించింది. ఈ ఏడాది జూలై 31న సర్కార్కు నివేదిక సమర్పించింది. అయితే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952లోని సెక్షన్ 8బీ, 8సీ ప్రకారం తమ నోటీసులు జారీ చేయలేదని పిటిషనర్లు పేర్కొన్నారు. నివేదికలోని అంశాలు తమ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని, ఈ నెల 4న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చెప్పడంతో తమ పరువుకు భంగం వాటిల్లిందని పేర్కొన్నారు.నిబంధనలు పాటించకుండా ప్రభుత్వం మీడియాకు వివరాలు వెల్లడించిందని తెలిపారు. ఈ మేరకు సెక్షన్ 8బీ, 8సీకి సంబంధించి కిరణ్ బేడీ వరెŠస్స్ కమిటీ ఆఫ్ ఎంక్వైరీ, స్టేట్ ఆఫ్ బిహార్ వర్సెస్ ఎల్కె అద్వానీ తీర్పు కాపీలను కూడా అందజేశారు. నివేదిక కాపీని తమకు అందించకుండా పదే పదే వివరాలు వెల్లడించడం ఏకపక్షం, చట్టవిరుద్ధమని.. దీని వెనుక దురుద్దేశం ఉందని.. సహజ న్యాయ సూత్రాలను సర్కార్ ఉల్లంఘించిందని పేర్కొన్నారు. జీవో 6ను రద్దు చేయాలని, కమిషన్ నివేదిక పిటిషనర్ల పరువుకు నష్టం కలిగించేదిగా ఉందని ప్రకటించాలని కోరారు..’ అని హైకోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అసెంబ్లీలో చర్చకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్న ఏజీ ‘కమిషన్ సమర్పించిన నివేదికను అధ్యయనం చేయడానికి, పరిశీలనాంశాలను మంత్రిమండలికి సమర్పించడానికి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శితో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసిందని ఏజీ తెలిపారు. తమ నివేదిక సారాంశాన్ని ఈ కమిటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో పాటు మంత్రిమండలి పరిశీలనకు సమర్పించిందని చెప్పారు.కాగా కమిషన్ నివేదికను ఆమోదించాలని, చర్చ కోసం అసెంబ్లీ ముందుంచాలని ఈ నెల 4న కేబినెట్ నిర్ణయించిందని వివరించారు. అయితే అసెంబ్లీలో చర్చకు ముందే ఏవైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అని గురువారం ఏజీని అడిగాం. అసెంబ్లీలో చర్చ తర్వాతే నివేదికపై తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఇచి్చన లిఖిత పూర్వక వివరణను ఏజీ శుక్రవారం కోర్టుకు సమర్పించారు. రిపోర్టును అసెంబ్లీలో పెట్టేందుకు 6 నెలల గడువు ఉందని తెలిపారు’ అని హైకోర్టు తన ఉత్తర్వుల్లో వివరించింది. స్టే, రద్దు ఉత్తర్వులివ్వని ధర్మాసనం ‘నివేదికలోని అంశాలను మీడియాకు వెల్లడించడం ద్వారా ప్రభుత్వం పక్షపాత వైఖరితో వ్యహరించిందన్నది పిటిషనర్ల ఆరోపణ. అధికారిక వెబ్సైట్లో కూడా నివేదిక ఉంచినట్లు పేర్కొన్నారు. కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చ చేపట్టే ముందు, నివేదికను మంత్రిమండలి ఆమోదించి, చర్చ కోసం అసెంబ్లీ ముందు ఉంచాలని నిర్ణయించుకున్న తర్వాత నివేదికను బహిర్గతం చేయడం సరికాదు. నివేదికను ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్లయితే, దానిని తొలగించాలి. 8బీ, 8సీ కింద నోటీసులు ఇవ్వకుండా, సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించి పిటిషనర్ల ప్రతిష్టను కించపరిచేలా కమిషన్ నివేదికలోని ఆంశాలు ఉంటే అంటే అది సరికాదు. లాగే, అసెంబ్లీలో చర్చించిన తర్వాతే చర్యలు తీసుకుంటామని సర్కార్ చెబుతున్నందున పిటిషనర్లకు ‘ముందస్తు చర్యలు’ అనే భావన అవసరం లేదు. నివేదికపై స్టే ఇస్తూ, రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేయవలసిన అవసరం లేదు. కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి చట్టం వీలు కల్పిస్తుంది. అక్కడ దానిని చర్చించాలి. పిటిషనర్లు లేవనెత్తిన అంశాలపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, నీటిపారుదల శాఖ కార్యదర్శిని ఆదేశిస్తున్నాం. మూడు వారాలు సమయం ఇస్తున్నాం..’ అని హైకోర్టు తెలిపింది. ఈ మేరకు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. -
సనత్నగర్: వ్యభిచారం గృహంపై పోలీసుల దాడి
హైదరాబాద్: వ్యభిచారం గృహంపై దాడి చేసి ఇద్దరు నిర్వాహకులతో పాటు ఒక విటుడిని సనత్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. మరో యువతిని రిహబిలిటేషన్ సెంటర్కు పంపించారు. పోలీసులు తెలిపిన మేరకు.. కడప జిల్లా అరవీడు కూర్మయ్యగారిపల్లికి చెందిన పల్లపు నరేష్ (34) నగరానికి వలస వచ్చి మూసాపేట భవానీనగర్లో ఉంటున్నాడు. చిత్తూరు జిల్లాకు చెందిన కొండా నాగరాజు (51)తో కలిసి అద్దెకు తీసుకున్న ఇంటిని వ్యభిచార గృహంగా మార్చి రెండు నెలలుగా యువతులతో వ్యభిచారం చేయిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు సనత్నగర్ పోలీసులు బుధవారం రాత్రి దాడులు నిర్వహించగా నరేష్ నాగరాజులతో పాటు మూసాపేట రాఘవేంద్రకాలనీకి చెందిన గుణశేఖర్ (26) అనే విటుడిని అరెస్టు చేశారు. అలాగే మరో యువతిని పునరావాస కేంద్రానికి తరలించారు. వారి వద్ద నుంచి మూడు సెల్ఫోన్లను స్వాదీనం చేసుకున్నారు. -
కొత్త కార్డులకు రేషన్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో కొత్త ఆహార భద్రత (రేషన్)కార్డుదారులకు శుభవార్త. వీరికి వచ్చే నెల నుంచి రేషన్ సరుకులు అందనున్నాయి. పాత కార్డుదారులతో పాటు కొత్తగా రేషన్ కార్డులు మంజూరైన కుటుంబాలకు కూడా నెలవారీ రేషన్ కోటా విడుదలైంది. పౌరసరఫరాల గోదాంల నుంచి ప్రభుత్వ చౌకధరల దుకాణాలకు ఇండెంట్ ప్రకారం బియ్యం స్టాక్ సరఫరా ప్రారంభమైంది. సెపె్టంబర్ నుంచి సుమారు లక్షకు పైగా కొత్త కార్డుదారులకు బియ్యం అందనున్నాయి. పౌరసరఫరాల శాఖ గత ఐదు నెలల నుంచి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తూ వస్తోంది. ఈ నెల 20 వరకు మంజూరైన కార్డుదారులకు సెపె్టంబర్ కోటా కేటాయించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పాత కార్డుదారులకు జూన్ నెలలోనే ఒకేసారి మూడు నెలల కోటా కింద రేషన్ బియ్యం పంపిణీ జరిగింది. అయితే.. మే 20 వరకు మంజూరైన కొత్త కార్డుదారులకు కూడా మూడు నెలల కోటా ఒకేసారి అందజేశారు. అప్పటి నుంచి కొత్త రేషన్ కార్డు మంజూరు ప్రక్రియ కొనసాగుతున్నా... రేషన్ కోటా మాత్రం కేటాయించలేదు. మూడు నెలల కోటా గడువు ముగియడంతో తాజాగా పాత కార్డుదారులతో పాటు కొత్తవారికి కూడా సెపె్టంబర్ కోటా కేటాయించారు. గ్రేటర్లో 13.76 లక్షలకుపైగా కార్డులు గ్రేటర్ పరిధిలో సుమారు 13.76 లక్షల కార్డులు ఉండగా, అందులో దాదాపు 60.01 లక్షల యూనిట్లు (లబి్ధదారులు) ఉన్నారు. ప్రతి కార్డులోని యూనిట్కు ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం కోటా కేటాయించారు. ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా వచ్చే నెల 1 నుంచి 15 వరకు నెలవారీ కోటా పంపిణీ చేస్తారు. లబ్ధి కుటుంబాలు సెలవులు మినహా మిగతా రోజుల్లో నెలవారీ కోటాను డ్రా చేసుకోవచ్చు. రేషన్ కార్డు కలిగిన కుటుంబాల్లోని సభ్యులు(కార్డులో పేరు ఉన్న సభ్యులు) ఒకరు ప్రభుత్వ చౌక ధరల దుకాణానికి వెళ్లి బయోమెట్రిక్ ఇచ్చి కుటుంబానికి కేటాయించిన సరుకుల కోటాను డ్రా చేయవచ్చు సన్న బియ్యం మాత్రమే ఉచితంగా పంపిణీ చేస్తారు. మిగతా సరుకులు సబ్సిడీపై కొనుగోలు చేయాల్సి ఉంది. -
ఏడు బ్లేడ్లు మింగిన ఆటోడ్రైవర్
హైదరాబాద్: సికింద్రాబాద్ గాందీఆస్పత్రి వైద్యులు అరుదైన వైద్యసేవలను అందించి ఏడుబ్లేడ్లు మింగిన వ్యక్తికి పునర్జన్మను ప్రసాదించారు. డిప్యూటీ సూపరింటెండెంట్, జనరల్ సర్జరీ ప్రొఫెసర్ సునీల్కుమార్ తెలిపిన మేరకు.. మౌలాలికి చెందిన రియాజుదీ్థన్ పాషా (36) ఆటోడ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా మానసిక రుగ్మతలతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఈనెల 16న ఏడు బ్లేడ్లను మింగాడు. తీవ్రమైన కడుపునొప్పితో అదే రోజు గాంధీ అత్యవసర విభాగంలో అడ్మిట్ అయ్యాడు. పలు రకాల వైద్యపరీక్షలు నిర్వహించి, ఎక్స్రే తీయగా కడుపులో ఏడు బ్లేడ్లు కనిపించాయి. సర్జరీ చేసి బ్లేడ్లు బయటకు తీయడం ప్రాణాపాయమని భావించిన వైద్యులు గ్య్రాస్టోఎంట్రాలజీ ఎండోస్కోపీ ద్వారా ప్రయత్నించాలని నిర్ణయించారు. బ్లేడ్లు జీర్ణాశయంలో ఉండడంతో బయటకు తీసే క్రమంలో అన్నవాహిక ఇతర సున్నితమైన భాగాలకు గాయాలు అయ్యే అవకాశం ఉండడంతో ఎండోస్కోపీ పద్ధతిని విరమించుకున్నారు. లిక్విడ్ డైట్, ఐవీప్లూయిడ్స్, కడుపులోని ఆమ్లాలను తగ్గించే మందులు ఇచ్చి నిరంతరం అబ్జర్వేషన్లో ఉంచారు. ఈరకమైన వైద్యవిధానం సత్ఫలితాలు ఇచ్చింది. జీర్ణాశయంలో ఉన్న ఏడు బ్లేడ్లు మెల్లగా చిన్న ప్రేగుకు, అక్కడి నుంచి పెద్దపేగుకు చేరుకుని రెండు రోజుల తర్వాత మలద్వారం నుంచి వచ్చేలా చేశారు. పదునైన వస్తువులు మింగిన క్రమంలో జీర్ణాశయంతోపాటు ఇతర అవయవాలకు తగిలి అంతర్గతగాయాలు, రక్తస్రావం జరిగి ప్రాణాలకు ముప్పు ఉంటుందని, ఈ కేసులో ఎటువంటి ప్రమాదం జరగలేదని ప్రొఫెసర్ సునీల్కుమార్ వివరించారు. అరుదైన కేసులో అత్యంత ప్రతిభావంతమైన వైద్యసేవలు అందించి బాధితునికి పునర్జన్మ ప్రసాదించిన గాంధీ వైద్యులను సూపరింటెండెంట్ ప్రొఫెసర్ సీహెచ్ఎన్ రాజకుమారి అభినందించారు. -
టోకెన్ల వారీగా యూరియా
సాక్షి, హైదరాబాద్: రైతులకు టోకెన్లు జారీచేసి యూరియా సరఫరా చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో డీలర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలన్నారు. యూరియా డిమాండ్ అధికంగా ఉన్న జిల్లాలకు నిల్వలున్న జిల్లాల నుంచి తక్షణమే తరలించి రైతులకు అందుబాటులోకి తేవాలని మంత్రి సూచించారు. జిల్లాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న యూరియా నిల్వలు, సరఫరాపై శుక్రవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి తుమ్మల కీలక సమావేశం నిర్వహించారు. ఈ విషయంలో కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ, రవాణాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.పట్టాదార్ పాస్ పుస్తకాలను అనుసంధానం చేసి యూరియాను పంపిణీ చేసే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు. రాష్ట్ర అవసరాల దృష్ట్యా కేంద్రం 50 వేల మెట్రిక్ టన్నులు ఈ నెలలో సరఫరా చేస్తామని చెప్పినా, 28,600 మెట్రిక్ టన్నులు మాత్రమే కేటాయించి, అందులో 13,000 మెట్రిక్ టన్నులు సరఫరా చేసిందన్నారు. ఎర్ర సముద్రం నౌకాయానంలో ఇబ్బందులతో మన దేశానికి దిగుమతి కావాల్సిన యూరియా సకాలంలో అందుబాటులోకి రాకపోవడానికితోడు, రామగుండం ఎరువుల కార్మాగారం(ఆర్ఎఫ్సీఎల్)లో యూరియా ఉత్పత్తి అనుకున్న స్థాయిలో లేకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని చెప్పారు.రాష్ట్రాలకు యూరియా కేటాయింపులు, సరఫరా పూర్తిగా కేంద్రానిదని, కానీ రాష్ట్రంలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. రైతుల ప్రయోజనాలకంటే రాజకీయ స్వార్థంతో విమర్శలు చేయడం, క్యూలైన్లో చెప్పులు పెట్టించి సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని బద్నాం చేస్తుండటంపై తుమ్మల మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడా యూరియా కొనుగోలు కేంద్రాల వద్ద క్యూ లైన్లు లేకుండా చూడాలని, టోకెన్ పద్ధతిలో స్టాక్ను బట్టి రైతులకు యూరియా బస్తాలు అందించాలని అధికారులకు సూచించారు.ఆర్ఎఫ్సీఎల్లో ఉత్పత్తి ఆగిపోయి..రాష్ట్రానికి కేటాయించిన స్వదేశి యూరియాలో ఆర్ఎఫ్సీఎల్ లో ఉత్పత్తి ఆగిపోయి, దాదాపు 63 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయలేదని తుమ్మల చెప్పారు. ఈ 63 వేల మెట్రిక్ టన్నుల యూరి యా వెంటనే సరఫరా చేసేలా చొరవ తీసుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ని ఫోన్లో తుమ్మల కోరారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన యూరియా సరఫ రాపై కేంద్రమంత్రి కిషన్రెడ్డితోనూ ఫోన్లో మాట్లాడారు.దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. ఆర్ఎఫ్సీఎల్ లో తెలంగాణకు కేటాయించిన యూరియా సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాల ని పరిశ్రమలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ను తుమ్మల ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, డైరెక్టర్ గోపి, కోఆపరేటివ్ కమిషనర్ సురేంద్రమోహన్, మార్క్ఫెడ్ ఎండీ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
కష్టాలు వరుస కట్టాయి..
సాక్షి, మహబూబాబాద్ / మిరుదొడ్డి / ఆత్మకూర్: యూరియా కోసం రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. సరిపడా స్టాక్ ఉందని అధికారులు చెబుతుండగా, టోకెన్లు ఇచ్చి వారం దాటినా యూరియా ఇవ్వడం లేదని రైతులు రోడ్డెక్కారు. పలుచోట్ల రైతులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో పోలీస్ పహారా మధ్య యూరియా బస్తాలు, టోకెన్లు ఇచ్చారు. ⇒ మహబూబాబాద్లోని సర్వేపల్లి రాధాకృష్ణ సెంటర్లో శుక్రవారం రైతులు ఆందోళనకు దిగారు. వందలాది మంది రైతులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ ధర్నాలో రైతులకు మద్దతుగా ఎమ్మెల్సీ సత్య వతి రాథోడ్ పాల్గొన్నారు. చివరకు టోకెన్లు ఇచ్చి త్వరలో యూరియా అందజేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఆపై బందోబస్తు మధ్య టోకెన్లు పంపిణీ చేశారు.⇒ కురవి, సీరోలు మండల కేంద్రాల్లో యూరియా పంపిణీ కేంద్రం వద్దకు పెద్దఎత్తున రైతులు రావడంతో పోలీస్ పహారా మధ్య పంపిణీ చేశారు. ⇒ సకాలంలో యూరియా ఇవ్వడం లేదని కేసముద్రం మండలం బేరువాడ, దనసరి, ఇనుగుర్తి, డోర్నకల్ మండలం మన్నెగూడెం ప్రాంతాల్లో రైతులు ఆందోళనకు దిగారు. ⇒ సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి పీఏసీఎస్కు శుక్రవారం యూరి యా లారీ వస్తుందని సమాచారం అందుకున్న పలు గ్రామాలకు చెందిన రైతులు అర్ధరాత్రి నుంచే క్యూ లైన్ కట్టారు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి రైతులు చెప్పుల ను క్యూలో పెట్టి బయటకు వెళ్లారు. ఒకేసారి 3 వేల మంది రైతులు బారులు తీరడంతో టోకెన్లు ఇవ్వడంతో అధి కారులకు సైతం తిప్పలు తప్పలేదు. మొత్తానికి యూరి యా లారీ రావడంతో టోకెన్లు అందుకున్న రైతులకు రెండు బస్తాల చొప్పున యూరియా పంపిణీ చేశారు. ⇒ వనపర్తి జిల్లా ఆత్మకూర్లోని పీఏసీఎస్ కార్యాలయం వద్ద రైతుల కుటుంబసభ్యులందరూ పడిగాపులు కాస్తు న్నారు. శుక్రవారం సొసైటీకి 700 బస్తాల యూరియా రాగా.. గురువారం టోకెన్లు తీసుకున్న 72 మంది అందజేశారు. శుక్రవారం మరో 70 మంది రైతులకు టోకెన్లు ఇచ్చారు. అయితే తమ వంతు ఎప్పుడు వస్తుందేమోనని తెల్లవారుజాము నుంచే రైతులు పీఏసీఎస్ కార్యాలయం వద్ద చెప్పులను క్యూలైన్లో పెట్టి ఎదురు చూస్తున్నారు. ఇంటివద్ద నుంచి భోజనం తెచ్చుకొని అక్కడే తింటున్నారు. అలసిపోయి చెట్టు నీడన నిద్రపోతున్నారు.టోకెన్ ఇచ్చి ఐదురోజులు..నాకున్న ఎకరంతోపాటు మూడు ఎకరాల పొలం మునాబాకు తీసుకు న్నా. పొలం నాటేసిన వెంటనే యూ రియా వేయాలి. నాటేసి నెలరోజు లైనా యూరియా వేయలేదు. యూరియా కోసం వస్తే వారం క్రితం టోకెన్లు ఇచ్చారు. ఇప్పటి వరకు బస్తా కూడా ఇవ్వలేదు. – అజ్మీర చక్రు, రోటిబండ తండా, మహబూబాబాద్అదును దాటితే ఇబ్బందే.. వరి, మొక్కజొన్న సాగు చేశా. వర్షా లు పడుతున్నాయి. ఇప్పుడు యూ రియా వేస్తేనే దిగుబడి వస్తుంది. ఐదురోజుల నుంచి ఇద్దరం తిరుగు తున్నా ఒక్క బస్తా దొరకలేదు. అదును దాటిన తర్వాత యూరియా వేసినా లాభం లేదు. పంట దిగుబడి తక్కువ వస్తుంది. – భూక్య హుస్సేన్, సికింద్రాబాద్ తండా, మహబూబాబాద్ -
జనవరి 15కల్లా ‘యాదాద్రి’ జాతికి అంకితం
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని వచ్చే ఏడాది జనవరి 15 నాటికి జాతికి అంకితం చేస్తామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇప్పటికే రెండు యూనిట్లను అందుబాటులోకి తెచ్చామని.. గ్రీన్ పవర్ ఉత్పత్తిలో తెలంగాణను దేశంలోనే ముందు వరుసలో నిలబెడతామన్నారు. యాదాద్రి విద్యుత్ కేంద్రం పరిధిలో భూములు కోల్పోయిన 500 మందికి ప్రజాభవన్లో భట్టి శుక్రవారం ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్ ఉండదన్న దు్రష్పచారాన్ని తిప్పికొట్టామన్నారు.‘కాంగ్రెస్ అంటేనే కరెంట్... కరెంట్ అంటేనే కాంగ్రెస్’అని వ్యాఖ్యానించారు. వాస్తవానికి యాదాద్రి పవర్ ప్లాంట్కు 2022 అక్టోబర్లోనే పర్యావరణ అనుమతులపై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచి్చందని.. అయినా గత ప్రభుత్వ పాలకులు ప్లాంట్ నిర్మాణ పనుల్లో చేసిన జాప్యం వల్ల ప్రాజెక్టుపై తీవ్ర ఆర్థిక భారం పడిందన్నారు. తాము అధికారంలోకి రాగానే తిరిగి పర్యావరణ అనుమతులు తీసుకొచ్చి నిర్మాణ పనుల్లో వేగం పెంచామని చెప్పారు.కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 1978లోనే జపాన్ సంస్థ మిత్సుబిషి సాంకేతికతను ఉపయోగించి పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ఉత్పత్తి తీసుకొచ్చామని చెప్పారు. విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నప్పటికీ రాష్ట్రంలో రెప్పపాటు కూడా విద్యుత్ అంతరాయం లేకుండా చూస్తున్నామని భట్టి అన్నారు. రాష్ట్రంలోని 29 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు, 51 లక్షల మంది పేదలకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్కు అయ్యే రూ. 17 వేల కోట్ల మొత్తాన్ని విద్యుత్ సంస్థలకు ప్రభుత్వమే చెల్లిస్తోందని వివరించారు.ఆలస్యం వల్ల ఆర్థిక భారం.. ప్రతి మండలానికీ అంబులెన్స్ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధుల నుంచి పవర్ ప్లాంట్ పరిసర గ్రామాల్లోని వారికి విద్య, వైద్యాన్ని ఉచితంగా అందిస్తామని భట్టి తెలిపారు. ప్రతి మండలానికీ ఒక అంబులెన్స్ను ఏర్పాటు చేస్తామన్నారు. సీసీ రోడ్లు, ఫ్లై ఓవర్లు నిర్మిస్తామని, భూసేకరణకు అవసరమైన నిధులను ఇస్తామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి హయాంలోనే లక్షలాది మంది గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు అందాయని భట్టి గుర్తుచేశారు. వారిలో చాలా మంది భూ నిర్వాసితులు ఇప్పుడు ఉద్యోగాలు పొందారన్నారు. జెన్కో విధుల్లో ఉండి ప్రాణాలు కోల్పోయిన 159 మంది కుటుంబ సభ్యులకు రెండోసారి కారుణ్య నియామక ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి, ఉన్నతా ధికారులు నవీన్ మిత్తల్, హరీశ్ పాల్గొన్నారు. -
‘స్థానిక’ ఎన్నికలకు ఎలా వెళ్లాలి?
సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్ పార్టీ శనివారం కీలక భేటీ నిర్వహించనుంది. స్థానిక ఎన్నికల అంశంలో నిర్ణయం తీసుకునేందుకు వీలుగా టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీతోపాటు సలహాకమిటీ సమావేశాన్ని కూడా సంయుక్తంగా నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సాయంత్రం 5 గంటలకు గాంధీభవన్లో జరగనున్న ఈ కీలక సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో పార్టీపరంగా ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై నిర్ణయం తీసుకొని తమ వైఖరిని అధికారికంగా ప్రకటించనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్లతోపాటు రాష్ట్ర మంత్రులు, రాజకీయ వ్యవహారాలు, సలహా కమిటీ సభ్యులు హాజరుకానున్నారు. ఎజెండా ఇదే....!గాంధీభవన్ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం ఐదారు కీలకాంశాలపై రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు చర్చించనున్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే విషయంలో హైకోర్టు తీర్పు నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యల గురించి నిర్ణయం తీసుకోనున్నారు. దీనికి ముడిపడి ఉన్న బీసీల రిజర్వేషన్లను అమలు చేసే విషయంలో పార్టీ ఎలాంటి వైఖరి తీసుకోవాలన్న దానిపై కూడా నేతలు చర్చించనున్నారు. అయితే, బీసీలకు రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గేది లేదని, చట్టపరంగా కల్పించలేని పక్షంలో పార్టీపరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. బీసీ రిజర్వేషన్ల విషయంలో తమ చిత్తశుద్ధిని ప్రజలకు వివరించడంతోపాటు ప్ర«తిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలు అనుసరిస్తున ద్వంద్వ, అస్పష్ట వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరోమారు అసెంబ్లీని సమావేశపర్చాలని ప్రభుత్వాన్ని కోరే అంశాన్ని కూడా చర్చించనున్నారు. అయితే, ఈ విషయంలో పీఏసీలోని అందరి సభ్యుల అభిప్రాయాలను తీసుకొని, మెజారిటీ సభ్యుల అభిప్రాయం మేరకు పార్టీ పరంగా నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే టీపీసీసీ నిర్ణయించింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, ఏఐసీసీ పిలుపు మేరకు ఓటు చోరీ అంశంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహాలు, పార్టీ సంస్థాగత బలోపేతం, పెండింగ్లో ఉన్న గ్రామ, మండల, జిల్లా పార్టీ కమిటీల నియామకం, రాష్ట్రంలో యూరియా కొరత, ప్రతిపక్ష పార్టీల వైఖరి తదితర అంశాలపై కూడా సమావేశంలో చర్చ జరగనుందని సమాచారం. -
సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్రెడ్డి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్/మహబూబ్నగర్/ నల్లగొండ: కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) అగ్రనేత సురవరం సుధాకర్రెడ్డి(83) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతోసుధాకర్రెడ్డి మరణించినట్లు కుటుంబసభ్యులు, పార్టీ నాయకులు తెలిపారు. ఆయనకు భార్య విజయలక్ష్మీ, ఇద్దరు కుమారులు ఉన్నారు. సుధాకర్రెడ్డి గతంలో పార్టీలో అత్యున్నత పదవి అయిన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు.నల్లగొండ నుంచి రెండుసార్లు ఎంపీగా విజయం సాధించారు. సురవరం మృతిపై సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ సీఎం కేసీఆర్, ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఇతర నేతలు, ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా..రెండుసార్లు ఎంపీగా సుధాకర్రెడ్డి 1942 మార్చి 25న ప్రస్తుత నాగర్కర్నూల్ జిల్లాలోని కొండ్రావుపల్లిలో సురవరం వెంకట్రామ్రెడ్డి, ఈశ్వరమ్మ దంపతులకు జన్మించారు. అయితే ఆయన సొంతూరు జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలంలోని కంచుపాడు. ప్రాథమిక విద్యాభ్యాసం అనంతరం కర్నూలు జిల్లాలోని ఉస్మానియా కళాశాలలో బీఏ చదివారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ లా కళాశాలలో ఎల్ఎల్బీ పూర్తి చేశారు. విద్యార్థి దశ నుంచే వామపక్ష ఉద్యమాలతో అనుబంధమై ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.సీపీఐ అనుబంధ ఆల్ ఇండియా విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) నుంచి ఆయన ప్రస్థానం మొదలైంది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో క్రమంగా ఎదుగుతూ ప్రధాన కార్యదర్శి కూడా అయ్యారు. అంతకుముందు 1966లో ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి, 1970లో జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. 1972లో ఏఐవైఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1971లో సీపీఐ జాతీయ కమిటీ సభ్యుడిగా.. 1974 నుంచి 1984 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు. 1984, 1990లలో నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1994లోనూ కర్నూలులోని డోన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు.అయితే 1998 (12వ లోక్సభ), 2004 (14 లోక్సభ)లో నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఈ క్రమంలో సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2007లో హైదరాబాద్లో జరిగిన పార్టీ జాతీయ సమావేశాల్లో ఉప ప్రధాన కార్యదర్శిగా, 2012లో పాటా్నలో జరిగిన జాతీయ సమావేశాల్లో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కూడా ఆయననే ప్రధాన కార్యదర్శిగా పార్టీ ఎన్నుకుంది. ఈ నేపథ్యంలో 2012 నుంచి 2019 వరకు ఆ పదవిలో కొనసాగారు. 2004లో ఎంపీగా ఎన్నికైన తర్వాత పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ (కారి్మక) చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించారు. విద్యుత్ చార్జీల ఆందోళనలో కీలక పాత్ర 2000 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో అప్పటి ప్రభుత్వం విద్యుత్ బిల్లులు పెంచగా.. దీనిపై వామపక్షాలు పెద్దయెత్తున పోరాటం నిర్వహించాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ఆందోళనల్లో సురవరం కీలక పాత్ర పోషించారు. ఎంపీగా పార్లమెంటులో కారి్మకులు, రైతులు, కూలీలు, పేదల సమస్యలపై గళమెత్తారు. వ్యవసాయ సంక్షోభం, కార్మిక హక్కులు, ఆర్థిక విధానాలపై నిరంతరం స్వరం వినిపించారు. ప్రజలు, కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవారు. నిరాడంబర జీవనశైలి, ఆచరణాత్మక రాజకీయ దృక్పథం ఆయన ప్రత్యేకత. దేశంలో వామపక్ష శక్తుల ఐక్యత కోసం ఎల్లప్పుడూ కృషి చేసిన నాయకుడిగా గుర్తింపు పొందారు. తెలంగాణ వైతాళికుడిగా పేరుగాంచిన సురవరం ప్రతాపరెడ్డి ఈయనకు పెదనాన్న. మహబూబ్నగర్లో జననం..నల్లగొండతో అనుబంధం సురవరం సుధాకర్రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జని్మంచినా నల్లగొండతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది. పార్టీ కార్యక్రమాలైనా, రాజకీయాలైనా నల్లగొండ గడ్డ నుంచే క్రియాశీలంగా వ్యవహరించారు. నల్లగొండ లోక్సభ స్థానం నుంచి రెండుసార్లు ఎంపీగా గెలుపొంది సేవలందించారు. ఉద్యమాల పురిటిగడ్డ నల్లగొండ జిల్లా కేంద్రంగా అనేక వామపక్ష పోరాట కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 2024 డిసెంబర్లో నల్లగొండలో నిర్వహించిన సీపీఐ శతాబ్ది ఉత్సవాల బహిరంగసభలో పాల్గొన్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ కూడా ఆయన సభలో పాల్గొని మాట్లాడారు. జాతీయ నాయకులతో కలిసి వేదికపై ప్రసంగించారు. చిరస్మరణీయుడు సురవరం సురవరం సుధాకర్రెడ్డి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. సీపీఐ పార్టీకే, తెలంగాణకు, దేశ వామపక్ష రాజకీయ రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు. కమ్యూనిస్టు ఉద్యమానికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని సీపీఐ నేతలు నివాళులు అర్పించారు. గొప్ప నాయకుడిని కోల్పోయాం: సీఎం రేవంత్ సురవరం సుధాకర్రెడ్డి మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రారి్ధంచారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సుధాకర్రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి జాతీయ స్థాయి నేతగా ఎదిగిప గొప్ప నాయకుడని, వామపక్ష ఉద్యమాలు, ఎన్నో ప్రజా పోరాటాల్లో పాలు పంచుకున్నారని గుర్తు చేసుకున్నారు. రెండుసార్లు ఎంపీగా గెలిచి దేశ రాజకీయాల్లో తన దైన ముద్ర వేశారని కొనియాడారు. కేసీఆర్, సీపీఐ నేతల సంతాపం మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు సురవరం మృతి పట్ల సంతాపం ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయనతో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ స్మరించుకున్నారు. శోకతప్తులైన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. జాతీయ కార్యదర్శి కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర పార్టీ నేతలు చాడ వెంకట్రెడ్డి, నర్సింహ, కలవేణ శంకర్, మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు తదితరులు సంతాపం ప్రకటించారు. కాంగ్రెస్ నేతల సంతాపం సుధాకర్రెడ్డి మృతిపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తమ తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. కమ్యూనిస్టు నాయకుడిగా దేశ రాజకీయాల్లో తనదైన చెరగని ముద్ర వేసిన సుధాకర్ రెడ్డి మరణం రాజకీయ రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వేర్వేరు ప్రకటనల్లో ఆకాంక్షించారు. మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ తదితరులు సంతాపం ప్రకటించారు. -
కేకు కోయాల్సిన బాలుడు తలకొరివి పెట్టడం కలిచి వేసింది: హైకోర్టు
హైదరాబాద్: నగరంలో విద్యుత్ స్తంబాలకు వేలాడదీసి కేబుల్ వైర్లు తొలగింపు అంశానికి సంబంధించి భారతీ ఎయిర్టెల్ పిటిషన్పై ఈరోజు(శుక్రవారం, ఆగస్టు 22వ తేదీ) విచారణ జరిగింది. దీనిలో భాగంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ బీమాపాక కీలక ఆదేశాలు జారీ చేశారు. లైసెన్స్ తీసుకున్న కేబుల్ తప్ప మిగతా ఏవీ ఉండకూడదని ఆదేశించారు. దీనిలో భాగంగా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు రామాంతాపూర్లో విద్యుత్ షాక్ కారణంగా పలువురు మరణించిన ఘటనను జడ్జి నగేష్ ప్రస్తావించారు. బర్త్డే రోజే తండ్రికి తలకొరివి పెట్టిన బాలుడి ఉదంతాన్ని ఇక్కడ ఉదహరిస్తూ ఉద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు. కేకు కోయాల్సిన తొమ్మిదేళ్ల బాలుడు.. తలకొరివి పెట్టడం కలిచి వేసిందన్నారు. విద్యుత్ ప్రమాదంపై ఎవరి వారు చేతులు దులుపుకుంటే ఎలా అని, ప్రజల ప్రాణాలకు బాధ్యులు ఎవరని ఆయన ప్రశ్నించారు. ‘ఆ ఘటనతో ప్రతి హృదయం పగిలిపోయింది.. దీనికి అందరం బాధ్యులేమేనా?, ఈ ఘటనతో సమాజం సిగ్గుతో తలదించుకోవాలి’ అని జస్టిస్నగేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. రామంతాపూర్లో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లోభాగంగా ఊరేగింపు రథానికి కరెంట్ తీగలు తగిలి ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. తొలుత ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, ఆపై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మరణించారు.రామంతాపూర్లో అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. దీంతో విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లు కట్ చేసే పనిని ప్రభుత్వం చేపట్టింది. అయితే ఈ అంశానికి సంబంధించి భారతీ ఎయిర్టెల్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు సోమవారానికి వాయిదా పడింది. -
కూకట్పల్లి సహస్ర కేసు.. వెలుగులోకి నమ్మలేని నిజాలు
సాక్షి, హైదరాబాద్: ఐదు రోజులుగా పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన కూకట్పల్లి సహస్ర హత్య కేసులో నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. రెండేళ్ల క్రితమే సహస్ర ఇంటి పక్కన ప్లాట్లోకి వచ్చిన బాలుడు కుటుంబ సభ్యులు.. ఇదే ప్రాంతంలో కిరాణా షాప్ నడుపుతున్నారు. బాలుడు స్వస్థలం ఒంగోలు జిల్లా. కొద్దిరోజుల క్రితమే సహస్ర పుట్టిన రోజు వేడుకలు జరగ్గా.. ఆమె బర్త్ డే వేడుకలకు బాలుడు హాజరయ్యాడు. సహస్రకి కేక్ కూడా తినిపించి విషెస్ చెప్పాడు. అయితే, టెన్త్ క్లాస్ విద్యార్థి ఇంత కిరాతకానికి ఎలా తెగించాడు? అనే దానిపై పోలీసులు కూడా షాక్కు గురవుతున్నారు.బాలికను హత్య చేసిన బాలుడు సైకో అవతారం ఎత్తాడు. యూట్యూబ్ వీడియోలు చూడటం, క్రైమ్ సీన్స్ చూసి హత్యకు పాల్పడ్డాడు. పక్క పథకం ప్రకారం క్రైమ్ సీన్ రచించిన బాలుడు.. 10వ తరగతి దశలోనే క్రైం చేయడం నేర్చుకున్న బాలుడు.. హత్య చేసి ఆధారాలు మాయం చేయడం ఎలాగో నేర్చుకున్నాడు. బాలుడిని పదుల సంఖ్యలో పోలీసులు విచారించారు. పోలీసుల విచారణలో క్రిమినల్ ఇంటిలెజెంట్గా బాలుడు వ్యవహరించాడు.బాలుడు రెగ్యులర్గా కత్తి పట్టుకుని తిరుగుతాడని పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. తండ్రి తాగుబోతు, తల్లి ఓ ప్రైవేట్ ఉద్యోగి.. కుమారుడిని సరైన మార్గంలో పెంచలేకపోయారు. కొడుకును పట్టించుకోకపోవడంతో ఆ బాలుడు క్రైమ్ సీన్లకు అలవాటుపడ్డాడు. బాలుడి తల్లిదండ్రులను డీసీపీ విచారిస్తున్నారు. ఓటీటీ, యూట్యూబ్ వీడియోలు పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో అనడానికి ఇదో ఉదాహరణ.. ఓటీటీలో క్రైం సీరియల్స్ చూసి దొంగతనానికి ప్లాన్ చేశాడు. హత్యకు రెండు రోజుల ముందే పేపర్ మీద ప్లాన్ ఆఫ్ యాక్షన్ బాలుడు రాసుకున్నాడు.హత్య జరిగిన రోజున కూడా పోలీసులను బాలుడు తప్పుదోవ పట్టించాడు. సహస్ర ఇంట్లోంచి గట్టిగా అరుపులు వినిపించాయంటూ.. ఏమీ ఎరగనట్లు హత్య జరిగిన రోజున పోలీసులకు చెప్పాడు. బాలుడి మాటలతో ఇతరులు చంపి ఉంటారన్న అనుమానంతో ఎస్వోటీ, కూకట్పల్లి పోలీసులు విచారణ చేపట్టారు. బాలికను చంపేసాక ఆ బాలుడు గ్యాస్ లీక్ చేయాలనుకున్నాడని పోలీసుల విచారణలో తేలింది. -
సూర్యాపేట జిల్లాలో ముగ్గురిపై హత్యాయత్నం
సూర్యాపేట: జిల్లా కేంద్రంలో మరో సుపారీ మర్డర్కు ప్లాన్ చేసిన ఘటన స్థానకంగా కలకలం రేపింది. ఓ బైక్పై వెళ్తున్న ముగ్గురిని హత్య చేసేందుకు ఒక సుపారీ గ్యాంగ్ కారులో వెంబడించింది. దాంతో అప్రమత్తమైన ఆ ముగ్గురు బైక్ దిగి వైన్స్లోకి పరిగెత్తడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు ఆ ముగ్గురు. సుపారీ గ్యాంగ్ను వైన్స్లో ఉన్నవాళ్లు వెంబడించడంతో వారు వచ్చిన కారులోనే పరారయ్యారు. రెండు నెలల క్రితం కూడా ఇదే తరహా ఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఓ వ్యక్తిని హత్య చేసేందుకు యత్నించగా, తాజాగా మరోసారి హత్యాయత్నం పథకం జరగడంతో సూర్యాపేటలో కలకలం రేగింది. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అనే ప్రశ్న స్థానికంగా జీవిస్తున్న వారిలో మొదలైంది. -
మానసిక ఆరోగ్యంపై మధుమేహ ప్రభావం
హైదరాబాద్: మధుమేహం ప్రభావం శారీరకమైందే కాకుండా మానసికంగానూ ఉంటుందని హైదరాబాద్లోని ఆలివ్ సర్వోదయ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. మధుమేహం - మానసిక ఆరోగ్యాల మధ్య సంబంధాలపై ఏర్పాటు చేసిన ఒక సదస్సులో వైద్యులు ఈ అంశంపై చర్చించారు. కన్సల్టెంట్ ఫిజీషియన్ డాక్టర్ వికాసుద్దీన్ సారథ్యంలో జరిగిన ఈ సదస్సులో పలువురు వైద్యులు తమ క్లినికల్ అనుభవాలను పంచుకున్నారు. మధుమేహ రోగుల సంరక్షణ ప్రాముఖ్యతను వివరించారు. డాక్టర్ వికాసుద్దీన్ మాట్లాడుతూ.. కేవలం రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిచండం, మందులను సక్రమంగా వేసుకోవడంతోనే మధుమేహ నియంత్రణ ఆగిపోదని, మధుమేహ రోగులో ఓ అదృశ్య భారానికి లోనవుతూంటారని అన్నారు. డాక్టర్ల వద్దకు వచ్చే ముందు వారు చెప్పుకోలేని ఆందోళనకు గురవుతూంటారని, మధుమేహాన్ని నిత్యం పర్యవేక్షిస్తూండాల్సిన అవసరంతో ఒత్తిడికి గురై ఉంటారని, ఫలితంగా చాలామంది రోగులు డిప్రెషన్కు లోనై ఉంటారని, సామాజిక ఒత్తిళ్ల పుణ్యమా వీరి జీవితం తాలూకూ నాణ్యతపై ప్రభావం పడి ఉంటుందని వివరించారు. శారీరక లక్షణాలకు చికిత్స తీసుకున్న విధంగానే మధుమేహ రోగులు మానసిక సమస్యల పరిష్కారానికీ ప్రాధాన్యమివ్వాలని సూచించారు. అప్పుడే వారి దైనందిన జీవితం మరింత ఆహ్లాదకరంగా ఉంటుందని అనానరు.100 మిలియన్లకు పైబడి... ఇరవై ఏళ్ల క్రితం దేశంలో మధుమేహం జీవనశలి సంబంధిత జీవక్రియల వ్యాధి అనుకునేవారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) అంచనాల ప్రకారం, 1995లో భారతదేశంలో మధుమేహుల సంఖ్య 2.6 కోట్ల మంది మధుమేహులు ఉంటే ఇప్పుడు వారి సంఖ్య పది కోట్లకు మించిపోయింది. ICMR–INDIAB, 2023 అధ్యయనం ప్రకారం, ప్రతి నలుగురు డయాబెటిస్ రోగులలో ఒకరు ఆందోళన లేదా డిప్రెషన్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. నేటి ఉరుకులు, పరుగుల జీవితంలో మధుమేహం, మానసిక ఆరోగ్యాల మధ్య ఉన్న సంబంధాని విస్మరించలేమని, పట్టణీకరణ, అధిక పని సమయం, శారీరక శ్రమ తగ్గిపోతూండటం, ఒంటరితనం వంటివి సమస్యను మరింత జటిలం చేస్తున్నాయని వైద్య నిపుణులు వివరించారు. ఆధునిక వైద్యంలో డయాబెటిస్ సంరక్షణ, మానసిక ఆరోగ్య నిపుణులు, కుటుంబం పాత్ర, ఆరోగ్య సంరక్షకుల సమన్వయం కూడా అవసరమని డాక్టర్ వికాసుదీన్ స్పష్టం చేశారు. -
‘ కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తుందనడానికి ఇదొక ఉదాహరణ’
ఢిల్లీ: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామన్న తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ప్రశ్నించారు. బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందనడానికి ఇదొక ఉదాహరణ అని పేర్కొన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామికంగా వ్యవహరించిందని విమర్శించారు ఎంపీ లక్ష్మణ్. ఇంకా ఆయనేమన్నారంటే.. ‘పీవీ నరసింహారావు , టి అంజయ్యను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా అవమానించింది. ఈ అవమానాన్ని తట్టుకోలేక తెలుగు ఆత్మగౌరవం బయటికి వచ్చింది. నాడు వెంకయ్య నాయుడుని ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ ఎందుకు సమర్థించలేదు? అని ప్రశ్నించారు. ‘ బ్లాక్ మార్కెట్ వల్ల యూరియా కొరత ఏర్పడింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం కారణం. మార్వాడి గో బ్యాక్ నినాదం మంచిది కాదు. ఎవరు ఎక్కడైనా పని చేసుకునే అవకాశం ఉంది. ఏవైనా సమస్యలు ఉంటే అక్కడికక్కడే పరిష్కరించుకోవాలి .. పెద్దవి చేయకూడదు’ అని ఆయన స్పష్టం చేశారు. -
తెలంగాణ సర్కార్ గుడ్న్యూస్.. ఆ శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆరోగ్య శాఖలో 1623 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని హాస్పిటల్స్లో 1616, ఆర్టీసీ హాస్పిటల్లో 7 పోస్టులు భర్తీర చేయనున్నారు. దరఖాస్తులకు సెప్టెంబర్ 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ ప్రభుత్వం గడువు నిర్ణయించింది. పోస్టుల భర్తీతో తెలంగాణ వైద్య విధాన పరిషత్లోని హాస్పిటళ్లలో స్పెషలిస్ట్ డాక్టర్ల సంఖ్య పెరగనుంది.జిల్లా, ఏరియా హాస్పిటళ్లు, కమ్యునిటీ హెల్త్ సెంటర్లలో వైద్య సేవలు మరింత మెరుగుపడనున్నాయి. స్పెషాలిటీ వైద్య సేవలు.. పల్లెలకు చేరువ అవనున్నాయి. ఆరోగ్యశాఖలో ఇప్పటికే సుమారు 8 వేల పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం.. మరో 7 వేల పోస్టులకు భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. -
Hyderabad: చివరి దశకు ఖైరతాబాద్ గణపతి పనులు
సాక్షి,హైదరాబాద్: ఈ ఏడాది ఖైరతాబాద్ మహా గణపతి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నాడు. వినాయక చవితికి మరో అయిదు రోజులే ఉండటంతో మహాగణపతి తయారీ పనులు చివరి దశకు చేరుకున్నాయి. 71వ సంవత్సరం సందర్భంగా 69 అడుగుల ఎత్తుతో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి భక్తులకు దర్శనమివ్వనున్నాడని దివ్యజ్ఞాన గురూజీ విఠల్ శర్మ తెలిపారు. ఈ నెల 25న మహాగణపతికి నేత్రోనిలన కార్యక్రమం ఉంటుందని శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ తెలిపారు. -
కూకట్పల్లి బాలిక సహస్ర కేసు.. టెన్త్ విద్యార్థే హంతకుడు
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసును పోలీసులు ఛేదించారు. సహస్రను పదో తరగతి బాలుడు హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. సహస్ర ఇంటి పక్కన బిల్డింగ్లోనే బాలుడు ఉంటున్నాడు. బాలుడిని కూకట్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగతనం కోసం సహస్ర ఇంట్లోకి చొరబడిన బాలుడు.. చోరీ చేశాడు. దొంగతనానికి వచ్చేటప్పుడు కత్తి తెచ్చుకున్న బాలుడు.. ఆ కత్తితో ఆమెపై విచక్షణా రహితంగా పొడిచి ప్రాణాలు తీశాడు. దొంగతనం ఎప్పుడు? ఎక్కడ ఎలా చేయాలి?. చేసే సమయంలో ఏదైనా ఆపద వస్తే ఏ విధంగా తప్పించుకోవాలో పక్కాగా ప్లాన్ చేసిన బాలుడు.. బాలిక ఇంట్లో చొరబడి రూ. 80 వేలు దొంగతనం చేశాడు. ఇంకా డబ్బులు కాజేసేందుకు ఇంట్లో దేవుడి దగ్గర ఉన్న హుండీని పగులగొట్టేందుకు ప్రయత్నం చేశాడు. అదే సమయంలో బాలుడిని చూసి సహస్ర కేకలు వేయడంతో ఆమెపై దాడి చేశాడు. ఎట్టి పరిస్థితుల్లో బతకకూడదని సహస్రపై విచ్చలవిడిగా కత్తిపోట్లు పొడిచాడు.హత్య చేసిన తర్వాత పక్క బిల్డింగ్లో 15 నిమిషాల పాటు బాలుడు దాక్కున్నాడు. ఈ సమాచారాన్ని స్థానికంగా ఉండే ఓ ఐటీ ఉద్యోగి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఐటీ ఉద్యోగి సమాచారం ఆధారంగా బాలుడిని పోలీసులు విచారించారు. పోలీసులు విచారణలో బాలుడూ ఎంతకీ నోరు విప్పకపోవడంతో అతని ఇంట్లో సోదాలు నిర్వహించారు. బాలుడు చదువుకుంటున్న స్కూల్కు వెళ్లి కూడా ఎస్వోటీ పోలీసులు విచారించారు.ఇక బాలిక కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు స్థానికుల ఇళ్లల్లో తనిఖీలు చేపట్టారు. తనీఖీల్లో బాలుడి తీరు అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. బాలుడి ఇంట్లో జరిపిన సోదాల్లో సహస్రను హత్య చేసేందుకు ఉపయోగించిన కత్తి, రక్తంతో తడిచిన దుస్తులు, ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు. వచ్చీరాని ఇంగ్లీష్లో దొంగతనం ఎలా చేయాలో బాలుడు నేర్చుకున్నాడు. హౌటూ ఓపెన్ డోర్, హౌటూ ఓపెన్ గాడ్ హుండీ ఇలా నెట్ నుంచి సేకరించిన సమాచారాన్ని ఓ పేపర్ మీద రాసుకున్నాడు. ప్లాన్ అంతా ఒక పేపర్ పై రాసి పెట్టుకుని అమలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. -
వెయిట్ లాస్ సర్జరీ కోసం యూకే నుంచి భారత్కు వచ్చిన మహిళ
హైదరాబాద్: ఎక్కడో లండన్లో ఉంటూ బ్లాక్ టాక్సీ డ్రైవర్గా పనిచేసుకుంటున్న ఓ బ్రిటిష్ మహిళ.. బరువు తగ్గాలన్న ఉద్దేశంతో భారతీయ డాక్టర్ను వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చి ఇక్కడ బేరియాట్రిక్ శస్త్రచికిత్స చేయించుకున్నారు. 102 కిలోల నుంచి శస్త్రచికిత్స అనంతరం 70 కిలోలకు వచ్చారు. ఇందుకు సంబంధించిన వివరాలను గచ్చిబౌలి కిమ్స్ ఆస్పత్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో.. ఆస్పత్రి మెటబాలిక్, బేరియాట్రిక్ సర్జరీ విభాగం క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ కేశవరెడ్డి మన్నూర్ తెలిపారు.“అలెగ్జాండ్రియా ఫాక్స్ అనే 59 ఏళ్ల మహిళ భర్త జేన్ ఫాక్స్కు 2023లో లండన్లో ఉండగా బేరియాట్రిక్ శస్త్రచికిత్స చేశాను. ఆయన 64 కిలోల బరువు తగ్గారు. ఫలితంగా కీళ్ల నొప్పులు తగ్గిపోయాయి, మధుమేహం, రక్తపోటు కూడా అదుపులోకి వచ్చాయి. ఆ ఫలితంతో ఆయన చాలా సంతోషించారు. దాంతో 102 కిలోల బరువు ఉన్న అలెగ్జాండ్రియా తాను కూడా బరువు తగ్గాలని నిర్ణయించుకుని, అందుకు భారతీయ వైద్యుడైన డాక్టర్ కేశవరెడ్డి దగ్గరకే వెళ్లాలని వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చారు. ఆమెకు ఊబకాయంతో పాటు అధిక రక్తపోటు, కిడ్నీ వైఫల్యం, థైరాయిడ్ లాంటి సమస్యలున్నాయి. దాంతో తన భర్తతో కలిసి హైదరాబాద్ వచ్చేశారు.ఆమెకు స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అనే శస్త్రచికిత్స చేశాం. ముందుగా మత్తుమందుకు సంబంధించిన పరీక్షలు చేశాం. ఎలాంటి సమస్యలు లేకపోవడంతో శస్త్రచికిత్స చేసి, ఉదరభాగంలో 2/3 వంతు తొలగించాం. దాంతో కడుపు చిన్నగా అయిపోయింది. దీనివల్ల ఆమె మధుమేహం, రక్తపోటు అదుపులోకి వచ్చాయి. దాంతోపాటు కిడ్నీ వైఫల్యం కూడా తగ్గింది. ఆమెకు చాలా సానుకూల దృక్పథం ఉండడంతో 24 గంటల్లోనే కోలుకున్నారు. దాంతో శస్త్రచికిత్స అయిన మర్నాడే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశాం. రెండురోజుల్లోనే తన హోటల్ గదిలో ఆమె అటూ ఇటూ హాయిగా తిరిగేస్తున్నారు. త్వరగా కోలుకుని తన పనులు తాను చేసుకుంటున్నందుకు ఆమె చాలా సంతోషంగా ఉన్నారు. మూడు రోజుల్లో తిరిగి ఇంగ్లండ్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.అలెగ్జాండ్రియా ఇంగ్లండ్లో బ్లాక్ టాక్సీ డ్రైవర్గా పనిచేస్తుంటారు. అది అక్కడ చాలా గౌరవప్రదమైన, కష్టమైన వృత్తి. దానికి ముందుగా మూడేళ్ల శిక్షణ తీసుకోవాలి. లండన్ నగరంలోని ప్రతి వీధి బాగా తెలిసి ఉండాలి. ఈ టాక్సీలను అక్కడ చాలా గౌరవనీయంగా చూస్తారు. ఇంత గౌరవప్రదమైన పని చేసేటప్పుడు తనకు ఆరోగ్య సమస్యలు ఉండకూడదని భావించడం వల్లే అలెగ్జాండ్రియా ఇక్కడివరకు వచ్చి శస్త్రచికిత్స చేయించుకున్నారు.స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అనేది చాలా సులభమైన శస్త్రచికిత్స. ఇందులో సరికొత్త పరిశోధనలు కూడా చేసి ఉదరభాగం మళ్లీ వ్యాకోచించకుండా ఉండేలా చేస్తున్నాం. దీనివల్ల దీర్ఘకాలం పాటు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ శస్త్రచికిత్స తర్వాత మధుమేహం, రక్తపోటు, నిద్రలేమి లాంటి చాలా సమస్యలు తగ్గిపోతాయి. జీవన ప్రమాణం కూడా మరో పదేళ్లు పెరుగుతుంది. ఇది చాలా సురక్షితమైన శస్త్రచికిత్స. బరువు తగ్గడానికి మందులు వాడడం కంటే ఇది చేయించుకోవడం చాలా మంచిది” అని డాక్టర్ కేశవరెడ్డి వివరించారు. -
‘మార్వాడీ గో బ్యాక్’.. పలు జిల్లాలో దుకాణాలు బంద్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం ఊపందుకుంది. మార్వాడీ వ్యాపారాలతో స్థానికుల ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయన్న కారణంతో పలుచోట్ల వ్యాపారులు బంద్కు పిలుపునిచ్చారు. నిన్నటి వరకు సోషల్ మీడియాలో మొదలైన ఈ నినాదం ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోకి వెళ్లింది. దీంతో, పలు జిల్లాలో బంద్ కొనసాగుతోంది.👉నల్లగొండ జిల్లాలో మార్వాడీ వ్యాపారస్తులకు నిరసనగా మిర్యాలగూడలో వ్యాపారస్తుల బంద్. దుకాణ సముదాయాలు బంద్ చేసి నిరసన తెలిపిన స్థానిక వ్యాపారులు.👉యాదాద్రి భువనగిరి జిల్లాలో మోత్కూర్, ఆత్మకూర్ (ఎం) మండల కేంద్రాల్లో స్వచ్ఛంద బంద్లో పాల్గొంటున్న వర్తక వ్యాపారులు. బంద్కు మద్దతుగా స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి నిరసన తెలుపుతున్న వ్యాపారస్తులు. మార్వాడీ గోబ్యాక్ అంటూ చౌటుప్పల్లో వాణిజ్య సముదాయాలు బంద్ చేసి మద్దతు తెలుపుతున్న వ్యాపారస్తులు.👉మార్వాడీ గో బ్యాక్ పేరుతో ఓయూ జేఏసీ ఆగస్టు 22న తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఓయూ జేఏసీ పిలుపు మేరకు పలు జిల్లాల్లో బంద్ కొనసాగుతోంది. కరీంనగర్ జిల్లాలో మార్వాడి గో బ్యాక్ బంద్ పిలుపు నేపథ్యంలో జమ్మికుంటలో భారీగా మోహరించాయి పోలీసు బలగాలు.👉జమ్మికుంట పట్టణంలో బంద్ పాటిస్తున్నారు వ్యాపారులు. బంద్ సందర్భంగా పలువురు స్థానిక వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పట్టణంలో పలుచోట్ల పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. 👉సిద్దిపేట జిల్లాలో మార్వాడీ గో బ్యాక్ నినాదంతో దుబ్బాక జేఏసీ నాయకుల పిలుపు మేరకు విద్యా సంస్థలు, దుబ్బాక బంద్ కొనసాగుతోంది.👉రంగారెడ్డి జిల్లా అమనగల్లో మార్వాడీ వ్యాపారస్తులకు వ్యతిరేకంగా ఓయూ జేఏసీ పిలుపునకు మద్దతుగా కిరాణా, వర్తక, వస్త్ర, స్వర్ణకార్ల షాప్లు బందు పాటిస్తున్నారు.👉ఇక, తెలంగాణలో మార్వాడీలు ముఠాగా ఏర్పడి స్థానిక వ్యాపారస్థుల పొట్ట కొడుతున్నారని.. ఎదగనీయటం లేదని.. మార్వాడీలు తెలంగాణ నుంచి వెళ్లిపోవాలని ఒక రాజకీయ యుద్ధమే మొదలైంది. ఎక్కడి నుంచో వచ్చిన మార్వాడీలు దాడులు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓయూ జేఏసీ పిలుపు మేరకు మార్వాడీలకు వ్యతిరేకంగా బంద్ పాటిస్తున్నారు వ్యాపారులు. పట్టణాల్లో షాపులను బంద్ చేస్తున్నారు. బంద్ పిలుపుతో చాలా చోట్ల భారీగా పోలీసులు మోహరించారు. 👉ఓయూ జేఏసీ పిలుపుతో షాపులు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. మార్వాడీ గో బ్యాక్ అంటూ వ్యాపారులు నినాదాలు చేస్తున్నారు. ఎక్కడ నుంచో వచ్చి తమ ఉపాధి దెబ్బతీస్తున్నారని వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మార్వాడీ గో బ్యాక్’ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ క్యాంపెయిన్ని నిర్వహిస్తున్న పృథ్విరాజ్ యాదవ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా మార్వాడీలకు బీజేపీ నేతలు బండి సంజయ్, రాంచందర్ రావు, రాజాసింగ్ మద్దతుగా నిలిచారు. -
ఆర్థిక ప్రణాళికల్లో తెలంగాణ టాప్
దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడంలో తెలంగాణ ప్రజలు ముందుంటున్నారని ఇన్సూరెన్స్ ఎవేర్నెస్ కమిటీ (ఐఏసీ–లైఫ్), ఐఎంఆర్బీ కాంటార్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. దీని ప్రకారం రాష్ట్రంలో 94 శాతం మంది జీవితంలో తలెత్తే అనూహ్య పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తుగా ప్రణాళికలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.జీవిత బీమా అనేది పొదుపు, రక్షణ సాధనంగా ఉపయోగపడుతుందని రాష్ట్రంలో 100 శాతం అవగాహన ఉంది. వచ్చే 3 నెలల్లో జీవిత బీమా కొనాలని 38 శాతం మంది భావిస్తున్నారు. సబ్సే పెహ్లే లైఫ్ ఇన్సూరెన్స్ 2.0 ప్రచారానికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఐఏసీ–లైఫ్ కో–చెయిర్పర్సన్ వెంకటాచలం ఈ విషయాలు తెలిపారు.రాష్ట్రంలో టర్మ్, చైల్డ్, పొదుపు ప్లాన్లతో పాటు ఇతర బీమా పథకాల గురించి ప్రాంతీయంగా టీవీ, డిజిటల్ తదితర మాధ్యమాల ద్వారా ఇన్ఫ్లుయెన్సర్లతో ప్రచార కార్యక్రమాలను మరింతగా నిర్వహించనున్నట్లు వివరించారు.అధ్యయనం ముఖ్యాంశాలు94% మంది తెలంగాణ ప్రజలు అనూహ్య పరిస్థితులకు ముందుగానే ప్రణాళికలు వేసుకోవడం అలవాటు చేసుకున్నారు.100% అవగాహన జీవిత బీమా గురించి ఉంది — ఇది పొదుపు మరియు రక్షణ సాధనంగా ఉపయోగపడుతుందని ప్రజలు అర్థం చేసుకున్నారు.38% మంది వచ్చే 3 నెలల్లో జీవిత బీమా కొనాలని భావిస్తున్నారు.87% మంది పొదుపు ప్లాన్లను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇవి గ్యారంటీడ్ లంప్సమ్ లేదా నెలవారీ ఆదాయాన్ని అందించే ప్లాన్లు.90% మంది టీవీ ద్వారా జీవిత బీమా గురించి తెలుసుకుంటే 56% మంది ఇన్సూరెన్స్ ఏజెంట్ల ద్వారా సమాచారం పొందారు.84% మంది దీర్ఘకాలిక పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నారు.87% మంది త్వరగా రిటైర్ కావాలనే లక్ష్యంతో పొదుపు అలవాటు చేసుకుంటున్నారు. ఇది సర్వే చేసిన మెట్రో మార్కెట్లలో అత్యధిక శాతం. -
సచివాలయం వద్ద ఉద్రికత్త.. బీజేపీ నేతలు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయం మరోసారి హీటెక్కింది. తెలంగాణ సచివాలయం ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. సేవ్ హైదరాబాద్ పేరుతో బీజేపీ నేతలు నిరసనలకు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో సచివాలయం వద్దకు బీజేపీ నేతలు రావడంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.జీహెచ్ఎంసీ పరిధిలోని ఆరు జిల్లా బీజేపీ నేతలు నిరసనల్లో పాల్గొన్నారు. బీజేపీ నేతలు పెద్ద సంఖ్యలోనే సచివాలయం వద్దకు చేరుకున్నారు. అయితే, బీజేపీ నేతల నిరసనల నేపథ్యలంలో సచివాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నిరసనలకు దిగిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసు వాహనాల్లో వారిని అక్కడి నుంచి తరలించారు.ఇక, హైదరాబాద్లో కరెంట్ తీగలు తగిలి ఇటీవల మరణాలు, డ్రైనేజీ సమస్యలు, గుంతల రోడ్ల అంశాలపై బీజేపీ నిరసనకు దిగింది. జీహెచ్ఎంసీ, హైడ్రా, జలమండలి విభాగాల మధ్య కో-ఆర్డినేషన్ లేక ఎక్కడి సమస్యలు అక్కడే అంటూ బీజేపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. నిరసనల నేపథ్యంలో ఇప్పటికే గ్రేటర్ పరిధిలో పలువురు బీజేపీ కార్పొరేటర్లు, నేతలను పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. -
కేసీఆర్, హరీష్కు హైకోర్టులో చుక్కెదురు..
సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై మధ్యంతర ఉత్తర్వులకు హైకోర్టు నిరాకరించింది. ఈ సమయంలో స్టే అవసరం లేదని పేర్కొంది. అనంతరం విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ సందర్బంగా పూర్తి కౌంటర్ దాఖలు చేయాలని ఏజీని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు.. ఘోష్ కమిషన్ రిపోర్టు అసెంబ్లీలో చర్చించిన తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. కేసీఆర్, హరీష్ ఇద్దరూ ఎమ్మెల్యేలు కాబట్టి అసెంబ్లీలో చర్చించాకే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తరఫున ఏజీ చెప్పుకొచ్చారు.హైకోర్టులో ప్రభుత్వం నిర్ణయాన్ని తెలిపిన ఏజీ..కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. శుక్రవారం వాదనల్లో భాగంగా.. ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టుకు ఏజీ వివరించారు. ప్రభుత్వం నిర్ణయాన్ని కాపీ రూపకంగా అందజేశారు. అసెంబ్లీలో చర్చించిన తర్వాతే నివేదికపై ముందుకు వెళ్తామన్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ఆరు నెలలు సమయం ఉంటుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇదే సమయంలో కమిషన్ నివేదికను వెబ్సైట్లలో పెట్టడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఈ క్రమంలో వెబ్సైట్లలో నివేదిక ఉంటే వెంటనే తొలగించాలని ఆదేశించింది. గురువారం జరిగింది ఇదే.. ఇదిలా ఉండగా.. కాళేశ్వరం కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు వేసిన పిటిషన్లపై నేడు మరోసారి తెలంగాణ హైకోర్టులో విచారణ చేపట్టింది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, అమలు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ విచారణ చేపట్టారు.ఇక, వీరిద్దరి పిటిషన్లపై గురువారం విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక ప్రశ్నలు సంధించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించాలని నిర్ణయించినప్పుడు మీడియా భేటీలో ఎందుకు బహిర్గతం చేశారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అధికారికంగా నివేదికను మీడియాకు అందజేశారా?. మీరు విడుదల చేయకుంటే మీడియాకు కాపీ ఎలా వచ్చింది? అసెంబ్లీలో చర్చించారా?.. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునే ఉద్దేశం ఉందా?.. అని అడిగింది. కమిషన్ నివేదికను అధికారికంగా విడుదల చేయలేదని, అసెంబ్లీలో ఇంకా చర్చించలేదని అడ్వొకేట్ జనరల్ సుదర్శన్రెడ్డి బదులిచ్చారు. ప్రధాన న్యాయమూర్తి అడిగిన వివరాలతో పూర్తి స్థాయి కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని కోరారు. దీంతో ధర్మాసనం తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది. -
హైదరాబాద్ ‘ట్రాఫిక్’ బండి..అదిరెనండి!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని ప్రధాన జంక్షన్ల వద్ద కనిష్టంగా ఇద్దరు, గరిష్టంగా ముగ్గురు చొప్పున ట్రాఫిక్ పోలీసులు విధుల్లో ఉంటారు. వీళ్లు ఆయా జంక్షన్లలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూస్తుంటారు. ఇలాంటి రెండు జంక్షన్ల మధ్య ఉన్న మార్గంలో ఇబ్బంది ఏర్పడితే! అప్పుడు స్పందించాల్సింది ఎవరు? ఆ మార్గాన్ని పర్యవేక్షించడం ఎలా? ఈ ప్రశ్నలకు సమాధానంగా సిటీ పోలీసులు ప్రత్యేకంగా ట్రాఫిక్ టాస్్కఫోర్స్ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (హెచ్సీఎస్సీ) సౌజన్యంతో తొలి దశలో 50 అవెంజర్ వాహనాలను ఖరీదు చేసి, వీటికి అత్యాధునిక ఉపకరణాలు ఏర్పాటు చేశారు. వీటిని నగర కొత్వాల్ సీవీ ఆనంద్ గురువారం ఆవిష్కరించారు. వాహనాల హంగులిలా.. ఎనిమిది గంటల పాటు నిర్వరామంగా సంచరించినా చోదకుడు అలసిపోకుండా ఉండేందుకు బజాజ్ కంపెనీకి చెందిన తెలుపు రంగు అవెంజర్ 220 క్రూయిజ్ వాహనాన్ని ఎంపిక చేశారు. వీటిపై హెచ్సీఎస్సీ, సిటీ, ట్రాఫిక్ పోలీసు లోగోలు ముద్రించారు. ఈ వాహనం నిర్వహణ టాస్్కఫోర్స్ సిబ్బంది బాధ్యత. దశలవారీగా మరో 100 వాహనాలు కొనుగోలు చేయనున్నారు. జంక్షన్ల మధ్య జామ్స్ లేకుండా చూడటం, అక్రమ పార్కింగ్, క్యారేజ్ వే ఆక్రమణలు తొలగించడం, ప్రమాదాలు జరిగినప్పుడు స్పందించడం, బ్రేక్ డౌన్ అయిన వాహనాల గుర్తింపు ఈ టాస్్కఫోర్స్ విధులు. బ్రేక్ డౌన్ అయిన భారీ వాహనాలు తొలగింపునకు మూడు అత్యాధునిక క్రేన్లు సమీకరించుకున్నారు. నంబర్ల వారీగా ఇలా..1పబ్లిక్ అడ్రస్ సిస్టం: ఈ వాహనానికి ముందు భాగంలో రెండు మైకులు ఉంటాయి. వీటిలో ఒకటి సైరన్ కాగా.. మరొకటి పబ్లిక్ అడ్రస్ సిస్టం. 2 కాలర్ మైక్రోఫోన్: దీనిపై సంచరించే సిబ్బంది ఈ పబ్లిక్ అడ్రస్ సిస్టం ద్వారా ప్రకటన చేయడానికి ఆగాల్సిన అవసరం లేదు. దీనికి అనుసంధానించి ఉండే కాలర్ మైక్రోఫోన్ను చేతితో పట్టుకోవాల్సిన అవసరం లేకుండా వాడవచ్చు. 3 వాకీటాకీకి మైక్రోఫోన్: క్షేత్రస్థాయిలో విధుల్లో ఉండే ట్రాఫిక్ పోలీసులు సమాచార మారి్పడికి వాకీటాకీ అనివార్యం. వాహచోదకుడు తన వాకీటాకీనీ చేత్తో పట్టుకోవాల్సిన అవసరం లేకుండా మైక్రోఫోన్ సౌకర్యం ఉంది. 4 డ్యాష్బోర్డ్ కెమెరా: ఈ వాహనాన్ని నడిపే ట్రాఫిక్ టాస్్కఫోర్స్ సిబ్బంది దారిలో కనిపించిన ఉల్లంఘనల్ని ఫొటో తీయడానికి చేతిలో ఉండే కెమెరాలు అవసరం లేదు. వాహనం హ్యాండిల్ పైన ప్రత్యేకంగా డ్యాష్బోర్డ్ కెమెరా ఏర్పాటు చేశారు. ఇది తీసిన ఫొటోలు నేరుగా కంట్రోల్ రూమ్కు చేరతాయి. అక్కడ నుంచి ఈ–చలాన్ జారీ అవుతుంది. 5 జీపీఎస్ ట్రాకింగ్: ట్రాఫిక్ టాస్్కఫోర్స్ వాహనాలను అవసరాన్ని బట్టి ఏ ప్రాంతానికైనా మోహరిస్తారు. దీనికోసం అవి ఎక్కడ ఉన్నాయో కంట్రోల్ రూమ్ సిబ్బంది తెలుసుకోవడానికి జీపీఎస్ పరిజ్ఞానంతో పని చేసే ట్రాకింగ్ డివైజ్ ఉంది. 6 ఫస్ట్ ఎయిడ్ కిట్: అత్యవసర సమయంలో క్షతగాత్రులకు ప్రథమ చికిత్స చేయడానికి ఫస్ట్ ఎయిడ్ కిట్, అందులోనే కమ్యూనికేషన్ కోసం ట్యాబ్ ఉంటుంది. 7 ట్రాఫిక్ ఎక్యూప్మెంట్ బాక్స్: వర్షం కురిసినప్పుడు అసరమైన చోట విధులు నిర్వర్తించడానికి రెయిన్ కోట్, షూస్తో పాటు రిఫ్లెక్టివ్ జాకెట్ ఉండే పెట్టె ఉంది. 8 బాడీ వార్న్ కెమెరా: టాస్క్ఫోర్స్ సిబ్బంది సంచరించే మార్గాలు, అక్కడి పరిస్థితులతో పాటు ప్రజలతో నడుచుకునే తీరు పరిశీలించడానికి బాడీ వార్న్ కెమెరా ఉంది. ఇది నేరుగా కంట్రోల్ రూమ్కు కనెక్ట్ అయి ఉంటుంది. అక్కడ దీని ఫీడ్ మొత్తం రికార్డు అవుతుంది. 9యుటిలిటీ బాక్స్: రెస్క్యూ సమయంలో వాహన చోదకుడు తన హెల్మెట్, సెల్ఫోన్తో పాటు ఇతర పరికరాలు భద్రపరుచుకోవడానికి ఈ బాక్స్ ఉపకరిస్తుంది. -
రెండు నగరాల జంట కథ.. ముఖ్యమంత్రుల వింత వ్యథ!
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆశలన్నీ ఇప్పుడు రెండు నగరాలపైనే ఉన్నాయి. ఫ్యూచర్ సిటీపై రేవంత్, అమరావతిపై ఏపీ సీఎం చంద్రబాబు గంపెడు ఆశలతో ఉన్నారు. అయితే, ఈ రెండు కొత్త నగరాల ప్రతిపాదనలను పరిశీలిస్తే రేవంత్ రెడ్డి పరిస్థితే కొంత మేలు అనిపిస్తుంది.ఇటీవల రియల్ ఎస్టేట్ వ్యాపారులతో జరిగిన ఒక సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..‘కొంతమంది ఫ్యూచర్ సిటీని ఫోర్ బ్రదర్స్ సిటీ అని అంటున్నారు.. మీరంతా నాకు సోదరులే. మీ అందరి ప్రయోజనం కోసమే దాన్ని డిజైన్ చేస్తున్నాను. ఇతరుల వ్యాఖ్యలు పట్టించుకోను’ అని వ్యాఖ్యానించారు. దీన్నిబట్టే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ లావాదేవీలు పుంజుకోవడానికి రేవంత్ ప్రభుత్వం ఎన్ని కష్టాలు పడుతోందో అర్థం చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే ఫ్యూచర్సిటీ అని రేవంత్ ధైర్యంగా చెప్పగలిగారు కానీ.. చంద్రబాబు మాత్రం ఇప్పటికీ రైతు ప్రయోజనాల కోసమే అమరావతి అన్న బిల్డప్ను కొనసాగిస్తున్నారు. కానీ అందరూ దాన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగానే పరిగణిస్తున్నారు.వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి భూముల అమ్మకం ద్వారా ఆ రుణాలు తీరుస్తామన్న ప్రభుత్వం వ్యాఖ్యలు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అచ్చంగా సరిపోతుంది కూడా. అయితే చిన్న చినుకుకే చిత్తడై పోతూ.. చెరువులను తలపిస్తున్న అమరావతి ప్రాంతం సహజంగానే పలు రకాల సందేహాలకు తావిస్తుంది. ఈ విషయాలపై మాట్లాడిన వారిపై కేసులు పెట్టి అణగదొక్కేందుకు చేస్తున్న ప్రయత్నాలనూ అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఒక పక్క వరద లేదని ప్రభుత్వం చెబుతుంటే.. మరోపక్క మంత్రి నారాయణ వరద ఏ రకంగా ఉందో చెప్పకనే చెప్పారు.అమరావతి నగరం ఎప్పటికి పూర్తి అవుతుంది? అందుకోసం ఎన్ని లక్షల కోట్లు వ్యయం చేయాల్సి ఉంటుంది? రాష్ట్ర ప్రజలందరిపై పడే అప్పుల భారం ఎంత? అన్న చింత ఏపీలోని ఆలోచనాపరుల్లో కనిపిస్తోంది. అమరావతికి సంబంధించి ఊహా చిత్రాలు అంటూ గ్రాఫిక్స్ ప్రదర్శించి ప్రజలను తన అనుకూల మీడియా ద్వారా టీడీపీ మభ్యపెట్టాలని యత్నిస్తే, ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ ఊహా చిత్రాలను ప్రచారంలోకి తేవడం విశేషం. ఫ్యూచర్ సిటీ నిర్మాణం కూడా అంత తేలిక కాకపోవచ్చు. ఎంత ఖర్చు అవుతుందన్న అంచనాలు తెలియాల్సి ఉంది. అయినా ఇక్కడి భూ స్వభావం, వరదల వంటి సమస్యలు లేకపోవడం, ఇప్పటికే అభివృద్ది చెందిన హైదరాబాద్ చెంతనే ఉండడం కలిసి రావచ్చు. దానికి తోడు ఫార్మా సిటీ కోసం గత కేసీఆర్ ప్రభుత్వం సమీకరించిన 14 వేల ఎకరాల భూమి అదనపు అడ్వాంటేజ్ కావచ్చు.నిజానికి ఏ ప్రభుత్వం కూడా కొత్త నగరాలను నిర్మించదు. ప్రజలకు అవసరమైన సదుపాయాలను కల్పించి నగరాభివృద్దికి దోహదపడతాయి. ఈ క్రమంలో నగరాభివృద్ది సంస్థలు ఆయా చోట్ల భూములు సేకరించి, కొత్త రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను తయారు చేస్తుంటాయి. ఉదాహరణకు హైదరాబాద్లో హెచ్ఎండీఏ ప్రభుత్వ భూములను కొన్నిటిని తీసుకుని, లేదా ప్రైవేటు భూములను సమీకరించి ప్లాట్లు వేసి వేలం నిర్వహిస్తుంటుంది. ఇది గత కొన్ని దశాబ్దాలుగా ఉన్న అనుభవమే. గత టర్మ్లో ఏపీలో అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం కూడా ఆయా పట్టణాలు, నగరాలలో ప్రభుత్వపరంగా ఇలాంటి వెంచర్లు వేసి మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరలలో స్థలాలను సమకూర్చాలని ప్లాన్ చేసింది. అందుకోసం భూములు కూడా తీసుకున్నారు. ఇది ఒక క్రమ పద్దతిలో జరిగితే స్కీములు సక్సెస్ అవుతాయి. లేదంటే విఫలమవుతాయి. పారిశ్రామిక అవసరాల కోసం ప్రత్యేకంగా వసతుల కల్పన సంస్థలు ఉన్నాయి.అవి ఆయా చోట్ల, అంతగా పంటలు పండని భూములను సేకరించి రోడ్లు, విద్యుత్, నీరు తదితర వసతులు కల్పించి పరిశ్రమలకు అనువైన రీతిలో తయారు చేసి విక్రయిస్తుంటాయి. తెలంగాణ, ఏపీలలో పలుచోట్ల ఇండస్ట్రియల్ ఎస్టేట్లు ఉన్నాయి. కొన్ని ఇతర చోట్ల కూడా పరిశ్రమలు భూములు కొనుగోలు చేసుకుని యూనిట్లను పెట్టుకుంటాయి. ఇదంతా నిరంతరం జరిగే ఒక ప్రక్రియ. అయితే ఏపీ విభజన తర్వాత చంద్రబాబు తానే కొత్త రాజధాని నగరం నిర్మిస్తానంటూ 33 వేల ఎకరాల భూమిని సమీకరించారు. మరో 20 వేల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. ప్రభుత్వ భూమిలో తమకు అవసరమైన కార్యాలయాల భవనాలు నిర్మించడం కాకుండా, ఆయన వేల ఎకరాలను రైతుల నుంచి సమీకరించి వారికి అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని ప్రతిపాదించారు. ప్రభుత్వం అన్ని సదుపాయాలతో ప్లాట్లు ఇస్తే బాగా రేట్లు వస్తాయని ఆశపడ్డ రైతులు తమ భూములను పూలింగ్ కింద ఇచ్చారు.కానీ, ఇప్పటికీ పదేళ్లు అయినా వారికి ప్లాట్లు దక్కలేదు. వసతుల కల్పన జరగలేదు. పైగా మరో 44 వేల ఎకరాల భూమిని అదనంగా సమీకరిస్తామని ప్రభుత్వం చెప్పడంపై రైతులలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ లక్ష ఎకరాల భూమి ఎప్పటికి అభివృద్ది కావాలి? అక్కడకు ఏ తరహా పరిశ్రమలు ఎప్పటికి వస్తాయి? నవ నగరాల పేరుతో గతంలో చేసిన హడావుడి ఇప్పుడు కూడా చేస్తారా?. అమరావతిలో భూములు కొంటే కోట్ల రూపాయల లాభం వస్తుందని భావించి అనేకమంది పెట్టుబడి పెడితే రేట్లు పడిపోయి వారంతా అయోమయంలో చిక్కుకున్నారు. రైతులకు తమ ప్లాట్లు వస్తే అమ్ముకోవచ్చని అనుకుంటే దానికి పలు షరతులను అధికారులు పెడుతున్నారు. వెయ్యి గజాలు, రెండువేల గజాల ప్లాట్లు వచ్చిన రైతులు అవి కాగితం మీదే ఉన్నా, వాటిని విభజించుకోవడానికి లేదన్న కండిషన్ వారిని ఆందోళనకు గురి చేస్తోంది. పలువురు రైతులు తమకు ఈ కాగితాల ఆధారంగా అప్పులు పుట్టడం లేదని, భూములు అమ్ముదామన్నా అవి ఎక్కడ ఉన్నాయో చూపలేక పోతున్నామని వాపోతున్నారు.ఇన్ని సమస్యలు ఒకవైపు ఉంటే, మరోవైపు ఓ మోస్తరు వర్షం కురిసినా ఆ ప్రాంతం అంతా నీటిమయం అవుతోంది. భూమి చిత్తడిగా మారుతోంది. ఈ భూమి భారీ నిర్మాణాలకు అనువు కాదని శివరామకృష్ణ కమిటీ, ప్రపంచ బ్యాంక్లు కూడా చెప్పినా చంద్రబాబు ప్రభుత్వం మొండిగా ముందుకు వెళుతోంది. ఈ సమస్యలన్నీ సర్దుకుని నిర్మాణాలు సాగితే ఫర్వాలేదు కాని, లేకుంటే ప్రభుత్వం రైతుల ఆగ్రహాన్ని చవి చూడాల్సి రావచ్చు. ఈ నేపథ్యంలో అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు పుంజుకోవడం కోసం ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేస్తోంది. అక్కడకు పలు సంస్థలు వచ్చేస్తున్నట్లు, ఏఐ వ్యాలీ, క్వాంటమ్ వ్యాలీ, స్పోర్ట్స్ సిటీ, కొత్త విమానాశ్రయం ఏర్పాటు, వంటివి జరగబోతున్నట్లు హడావుడి చేస్తున్నారు. అయినా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొనుగోలుదార్లు.. అవన్నీ అయినప్పుడు చూద్దాంలే అన్నట్టు వేచి చూసే ధోరణిలోనే ఉంటున్నారు.ఇక, ఫ్యూచర్ సిటీ విషయానికి వస్తే ఇక్కడ కూడా భూ సేకరణపై కొంత నిరసన వ్యక్తమవుతోంది. అధిక వాటా, అనాసక్తి వంటి కారణాలతో రైతులు కొంతమంది ప్రభుత్వానికి సహకరించడం లేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల తరువాత హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం బాగా మందగించింది. ఇప్పటికీ పరిస్థితిలో మార్పులేదు. ఫ్యూచర్ సిటీ ప్రతిపాదన వల్ల ఆ ప్రాంతంలో భూముల రేట్లు కొంత పెరిగిన మాట నిజమే కాని, రకరకాల సందేహాల వల్ల ఇప్పుడు అంత ఊపు లేదు అంటున్నారు. దానిని పారదోలడానికి రేవంత్ సర్కార్ కష్టపడుతోంది. వదంతులు నమ్మవద్దని, ఫ్యూచర్ సిటీకిగాని, హైదరాబాద్కు కాని రియల్ ఎస్టేట్ తదితర రంగాలలో మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రభుత్వం అంటోంది. ఇప్పటికే స్కిల్ యూనివర్శిటీని ఏర్పాటు చేసింది. ప్లాన్డ్గా అభివృద్ది ఉంటుందని అధికారులు వివరిస్తున్నారు.అయితే ఆయా గ్రామాల మధ్య శ్రీశైలం రోడ్డు, సాగర్ రోడ్డుల మధ్య ఈ సిటీ అభివృద్దికి ఎన్నో ఆటంకాలు కూడా రావచ్చన్న అనుమానం ఉంది. హైడ్రాను స్థాపించడం వల్ల రేవంత్ సర్కార్కు కొంత కీర్తి, మరికొంత అపకీర్తి వచ్చింది. చెరువుల శిఖం భూములనో, మరొకటనో, కొత్తగా నిర్మిస్తున్న పలు భవనాలు, అపార్టెమెంట్లు కూల్చడం వల్ల మధ్య తరగతి ప్రజలు కొంత నష్టపోయారు. వారు ఇప్పుడు కొత్తగా కొనుగోలు చేయడానికి సందేహిస్తున్నారు. అయితే చెరువుల పునరుద్ధరణ, ఆక్రమణల తొలగింపు వంటి వాటి వల్ల కొంత పేరు కూడా వచ్చింది. ఇందులో కూడా పక్షపాతంగా కొన్ని జరిగాయన్న విమర్శలూ ఉన్నాయి. ఇక ఓవరాల్ ఆర్ధిక వ్యవస్థ దెబ్బతిని ఉండడం, ఐటీ రంగంలో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడడం, ఉద్యోగుల లేఆఫ్ల ప్రభావం హైదరాబాద్ రియల్ ఎస్టేట్పై కూడా ఉందని అంటున్నారు.హైదరాబాద్లోనే పరిస్థితి ఇలా ఉంటే, ఏ అభివృద్ది లేని అమరావతిలో రియల్ ఎస్టేట్ పుంజుకోవడం అంత తేలిక కాదని అంచనా. తాజాగా హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలో ఏడు ఎకరాల ప్లాటును గోద్రోజ్ కంపెనీ 547 కోట్లకు కొనుగోలు చేయడం రేవంత్ ప్రభుత్వానికి ఒక సానుకూల అంశం. చంద్రబాబు, రేవంత్లు అలవికాని హామీలు ఇచ్చి వాటిని అమలు చేయలేక సతమతమవుతున్నారు. ఏపీ సర్కార్ రికార్డు స్థాయిలో అప్పులు చేస్తే, తెలంగాణ ప్రభుత్వం కూడా అప్పుల ఊబిలో దిగుతోందన్న విమర్శలు ఉన్నాయి. ఈ స్థితిలో రెండు కొత్త నగరాల నిర్మాణం వీరికి అవసరమా?. ఇతర ప్రజా సమస్యలను పక్కనపెట్టి రియల్ ఎస్టేట్ కోసం ఇంత రిస్క్ అవసరమా? అని ఎవరైనా అడిగితే ఎవరి వ్యూహం వారిది అని తప్ప ఇంకేమీ చెప్పగలం.!-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మీరు నా వద్దకు రావొద్దు.. నేను వేరొక మహిళతో..!
పెద్దపల్లిరూరల్: పరాయి మహిళ మోజులో పడి కట్టుకున్న భార్య, కన్నబిడ్డలను పట్టించుకోని భర్తకు సఖి కేంద్రం నిర్వాహకులు కౌన్సెలింగ్కు యతి్నంచినా సహకరించలేదు. ఆగ్రహించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. జిల్లా సంక్షేమ శాఖ ఇన్చార్జి అధికారి వేణుగోపాలరావు బుధవారం విలేకరులకు ఈ వివరాలు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రాంతానికి చెందిన రవీందర్ (ఓదెల పీహెచ్సీలో ఫార్మసిస్ట్) కు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొంత కాలంగా పరాయి స్త్రీ మోజులో పడిన రవీందర్.. భార్యాబిడ్డల పోషణ పట్టించుకోవడం మానేశాడు. పోషణ భారం కావడంతో ఆయన భార్యాపిల్లలు ఇటీవల ప్రజావాణిలో కలెక్టర్ కోయ శ్రీహర్షకు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్.. ఆయనకు కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబంతో కలిసి ఉండేలా చూడాలని జిల్లా సంక్షేమశాఖ, సఖి కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు. వారు పలుమార్లు కౌన్సెలింగ్ పిలిచినా సహకరించలేదు. ఉద్యోగం చేసే పీహెచ్సీకి వెళ్తే.. “మీరు నా వద్దకు రావొద్దు.. నేను వేరొక మహిళతో సహజీవనం చేస్తే తప్పేంటి’ అని దబాయించాడు. అవసరమైతే కోర్టుకు వెళ్లొచ్చంటూ నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చాడు. ఈ వ్యవహారంపై స్త్రీ, శిశు సంక్షేమశాఖ ద్వారా కలెక్టర్కు సమగ్ర నివేదిక అందించారు. ఆగ్రహించిన కలెక్టర్.. ప్రభుత్వ ఉద్యోగుల పరివర్తన నియమావళి చట్టం ప్రకారం రవీందర్ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. -
ప్యాషన్ప్లస్ బైక్లో కట్లపాము
నాగర్కర్నూల్ జిల్లా: మండలంలోని ఎల్లూరుకుకి చెందిన యువకుడు గణేశ్ బైక్లో కట్లపాము దాక్కుంది. ఎల్లూరు నుంచి కొల్లాపూర్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు గణేశ్ ప్యాషన్ప్లస్ బైక్పై గురువారం ఉదయం భయలుదేరాడు. పట్టణంలోని ద్వారకా లాడ్జ్ ముందు రోడ్డుపై వెళ్తుండగా బైక్ ముందు భాగంలో ఏదో కదులుతున్నట్లు కనిపించింది. అనుమానం వచ్చి బైక్ను ఆపుకొని చూడగా కట్ల పాము కనిపించింది. దాన్ని భయటకు తీసేందుకు కొద్దిసేపు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో సమీపంలోని మెకానిక్ షాపు వద్దకు తీసుకెళ్లాడు. మెకానిక్ సద్దాం బైక్ పార్ట్స్ విప్పి పామును భయటికి లాగాడు. ఈ పాము దాదాపు మూడున్నర ఫీట్ల మేర పొడవు ఉంది. రాత్రి ఇంటిముందు పార్కుచేసిన సమయంలో బైక్లోకి పాము ఎక్కి ఉండొచ్చని గణేశ్ చెప్పాడు. పామువల్ల ఎటువంటి ప్రమాదం సంభవించకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. -
చెల్లి లవ్ మ్యారేజ్.. అసూయతో ఆ అక్క..
ఆదిలాబాద్టౌన్: చెల్లి ప్రేమ వివాహం చేసుకోవడాన్ని ఓర్వలేక ఓ అక్క ఆమెను కిడ్నాప్ చేసినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. గురువారం టూటౌన్ పోలీస్స్టేషన్లో వివరాలు వెల్లడించారు. చెల్లె భగత్ మనీషా ప్రేమ వివాహం చేసుకోగా, తనకు పెళ్లి కాలేదని తలమడుగుకు చెందిన విజయ ఆమైపె కక్ష పెంచుకుంది. ఆమె భర్త నుంచి విడదీసేందుకు పన్నాగం పన్నింది. ఆమెను మహారాష్ట్రలోని కిన్వట్లో బంధించింది. బాధితురాలి భర్త అలుగంటి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కిడ్నాప్నకు సహకరించిన తలమడుగుకు చెందిన భగత్ విజయ, భగత్ సునంద, భగత్ ప్రగతి, తాంసికి చెందిన షబ్బీర్, ఓ మైనర్ బాలుడితో పాటు కిన్వట్కు చెందిన ప్రతీన్పై కేసు నమోదు చేశారు. కిడ్నాప్కు గురైన బాధితురాలి ఆచూకీ తెలుసుకుని ఆమెను కిన్వట్ నుంచి తీసుకువచ్చారు. కాగా, మనీషా ఇటీవల భగత్ శ్రీనివాస్తో ప్రేమ వివాహం చేసుకుని ఆదిలాబాద్ పట్టణంలోని సంజయ్నగర్లో నివాసముంటోంది. ఈ పెళ్లి ఇష్టం లేకనే ఆమె అక్క కిడ్నాప్నకు పాల్పడినట్లు సీఐ తెలిపారు. సోషల్ మీడియాలో పోలీసులపై దుష్ప్రచారం చేస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీస్ వ్యవస్థ మహిళలపై గౌరవంగా వ్యవహరిస్తుందని తెలిపారు. టూటౌన్ ఎస్సై విష్ణుప్రకాశ్ ఉన్నారు. -
రైల్వే కీమెన్కు జీపీఎస్
గతేడాది సెప్టెంబర్ ఒకటో తేదీ.. భారీ వర్షం కురిసింది. కేసముద్రం–ఇంటెకన్నె సెక్షన్ల మధ్య అర్ధరాత్రి వేళ రైల్వే కీమెన్ ట్రాక్ పెట్రోలింగ్లో ఉన్నాడు. ఎడతెగని వర్షం వల్ల అయోధ్యపురం చెరువులోకి వరద పోటెత్తి కట్ట తెగింది. దీంతో రైల్వే ట్రాక్ వద్ద మట్టి కొట్టుకుపోతున్న విషయాన్ని కీమెన్ గుర్తించి వెంటనే వైర్లెస్ సెట్ ద్వారా అధికారులకు సమాచారం అందించాడు. సరిగ్గా అదే సమయంలో సంఘమిత్ర ఎక్స్ప్రెస్ రైళ్లు (అప్ అండ్ డౌన్ ట్రాక్ మీద వెళ్లే రెండు రైళ్లు) కేసముద్రం స్టేషన్కు చేరుకున్నాయి. వెంటనే అధికారులు వాటిని నిలిపేశారు. కాసేపటికే ట్రాక్ కింద మట్టి కొట్టుకుపోయింది. ఆరోజు కీమెన్ అప్రమత్తంగా ఉండటం వల్ల భారీ ప్రమాదం తప్పింది.. అదే కీమెన్ నిర్లక్ష్యంగా వ్యవహరించి ఉంటే... ?సాక్షి, హైదరాబాద్ : పట్టాలపై రైళ్లు సురక్షితంగా పరుగుపెట్టడం వెనుక దేశవ్యాప్తంగా వేలమంది కీమెన్ (గ్యాంగ్మెన్) నిర్విరామ పహారానే ప్రధాన కారణం. అత్యంత కిందిస్థాయి ఉద్యోగులే అయినా.. రైల్వే భద్రతలో వీరిదే కీలక భూమిక. ప్రకృతి విపత్తులు, సంఘ విద్రోహ శక్తుల వల్ల రైళ్లకు పొంచి ఉండే ప్రమాదాన్ని తప్పించేది వీరే కావటంతో ఇప్పుడు వీరి విధులపై రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కీమెన్ విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉంటున్నదీ లేనిదీ తెలుసుకునేందుకు వారిని నిరంతరం ట్రాక్ చేసే విధానాన్ని ప్రారంభించింది. ఇందుకోసం పేజర్ తరహాలో ఉండే జీపీఎస్ ఉపకరణాన్ని వారికి ఏర్పాటు చేశారు. వారు విధి నిర్వహణలో ఉన్నప్పుడు ఆ ఉపకరణాన్ని వెంటపెట్టుకొని వెళ్లాలి. వారు ఏయే మార్గాల్లో, ఏయే సమయాల్లో విధుల్లో ఉన్నారో ఆ ఉపకరణం ద్వారా డివిజన్ హెడ్ క్వార్టర్స్లో ఉండే కంట్రోల్ సెంటర్ నుంచి ట్రాక్ చేస్తారు. ఇందుకోసం కంట్రోల్ సెంటర్లో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశారు. 24 గంటలపాటు ట్రాకింగ్ కోసం సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నారు. ఫలితంగా కీ మెన్ ఏమాత్రం నిర్లక్ష్యం లేకుండా విధుల్లో ఉండేందుకు ఇది దోహదం చేస్తుంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో...దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ప్రస్తుతం 2,800 మంది ట్రాక్ పర్యవేక్షణ విధుల్లో ఉన్నారు. వీరిలో 1,800 మంది కీమెన్ కాగా, ప్రత్యేక పెట్రోలింగ్ విధుల్లో మిగతా వారుంటారు. ఇప్పుడు వీరిలో 1,600 మందిని తాజాగా జీపీఎస్తో అనుసంధానం చేశారు. మిగతా వారిని మరో నెల రోజుల్లో దాని పరిధిలోకి తేనున్నారు. వాస్తవానికి ట్రాక్ కీమెన్లో అప్రమత్తత పెంచేందుకు వారిని జీపీఎస్ ట్రాకింగ్ పరిధిలోకి తీసుకురావాలన్నది 2018లో తీసుకున్న నిర్ణయం. కానీ, దాన్ని అమలులోకి తేవటంలో తీవ్ర జాప్యం జరిగింది. కొన్ని రైల్వే జోన్లలో పాక్షికంగా అమలులోకి తె చ్చినా, పూర్తిస్థాయిలో జీపీఎస్ ట్రాకింగ్ విధానం ఏర్పాటు చేయలేకపోయారు. భారీ వర్షాలప్పుడు మరింత అవసరం భారీ వర్షాలప్పుడు ఏర్పడే మెరుపు వరదలు రైల్వేను అతలాకుతలం చేస్తున్నాయి. చెరువులు, వాగులు, గుట్ట దిగువన ఉండే ట్రాక్కు ఈ వరదలు ప్రమాదకరంగా మారుతాయి. దీంతో 24 గంటలు ట్రాక్పై నిఘా అవసరం. గత సంవత్సరం కేసముద్రం సమీపంలో ట్రాక్ దిగువన మట్టి కొట్టుకుపోయిన విషయాన్ని సకాలంలో గుర్తించటంతో భారీ ప్రమాదం తప్పింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన రైల్వే శాఖ, వీలైనంత తొందరలో కీమెన్, పెట్రోలింగ్ మెన్కు జీపీఎస్ ఏర్పాటు చేయాలని నిర్ణయించి వేగంగా కసరత్తు పూర్తి చేసింది. ఈ వర్షాకాలం నాటికి మూడొంతుల మందిని ట్రాకింగ్ పరిధిలోకి తీసుకొచ్చారు. -
31 అర్ధరాత్రి నుంచి ‘ఆరోగ్యశ్రీ’ బంద్
సాక్షి, హైదరాబాద్: పది రోజుల్లో బకాయిలు చెల్లించడంతో పాటు వైద్య సేవలకు నిర్ణయించిన ధరలను ప్రభుత్వం పునఃసమీక్షించని పక్షంలో ఈ నెల 31 అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయాలని నిర్ణయించినట్లు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (తన్హా) తెలిపింది. గత జనవరిలో ఇచ్చిన హామీల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. తమ నిర్ణయాన్ని తెలియజేస్తూ ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్కుమార్కు గురువారం నోటీసు పంపించినట్లు తన్హా అధ్యక్షుడు డాక్టర్ వద్దిరాజు రాకేష్ తెలిపారు. ఆరోగ్యశ్రీతో పాటు ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్), జర్నలిస్టుల ఆరోగ్య పథకం (జేహెచ్ఎస్) కింద అందిస్తున్న సేవలకు గాను ప్రభుత్వం నుంచి చెల్లింపులు జరగడం లేదని, ఈ పరిస్థితుల్లో ఆసుపత్రుల నిర్వహణ కష్టంగా మారిందని పేర్కొన్నారు. రూ.1,000 కోట్లకు పైగా బకాయిలు ఆరోగ్యశ్రీ పథకం కింద రాష్ట్రంలో 471 ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి. వీటన్నిటికీ కలిపి ప్రభుత్వం సుమారు రూ.1,000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నట్లు సమాచారం. 2023 డిసెంబర్ 8వ తేదీ వరకు రూ.723.97 కోట్ల మేర బకాయిలు ఉండగా, కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతినెల సగటున రూ.100 కోట్లకు తగ్గకుండా చెల్లింపులు చేస్తూ వస్తున్నట్లు ఆరోగ్యశాఖ చెపుతోంది. ఈ నేపథ్యంలో గత జూన్ 9 నాటికి బకాయిలు రూ.981 కోట్లకు చేరాయి. తాజాగా ఈ బకాయిలు రూ.1,000 కోట్లకు పైగానే పేరుకుపోయినట్లు తెలుస్తోంది. ఇంత భారీ మొత్తంలో బకాయిలు ఉన్నా ప్రభుత్వం నుంచి తగిన స్పందన లేకపోవడంతో ఈ నెల 31వ తేదీ అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిరవధికంగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు రాకేష్ వివరించారు. గత జనవరిలో సేవలు నిలిపివేత ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలనే డిమాండ్తో గత జనవరిలో వైద్య సేవలను నిలిపివేస్తూ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వం స్పందించి రూ.117 కోట్లు విడుదల చేసింది. అయితే అప్పట్లో ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ముఖ్యమైన ప్యాకేజీల సవరణ, క్రమం తప్పకుండా బకాయిల చెల్లింపు, ఒప్పందాల పునరుద్ధరణ వంటి అంశాలను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆక్షేపిస్తూ తాజాగా మరోసారి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయాలని అసోసియేషన్ నిర్ణయించింది. -
అప్పటి హైజాక్కు ఇప్పుడు కంగారు!
శంషాబాద్: అప్పుడెప్పుడో 27 ఏళ్ల కిందట పాకిస్తాన్లో ఓ విమాన హైజాక్ ఘటన జరిగితే శంషాబాద్ ఎయిర్పోర్టు అధికారులు మాత్రం తెగ కంగారు పడిపోయి ఇప్పుడు కేసు పెట్టారు!! పోలీసులు కూడా పూర్వాపరాలు తెలుసుకోకుండానే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేశారు!! ఇదేం విచిత్రం అనుకుంటున్నారా? విషయం ఏమిటంటే.. 1998 మే 28న జరిగిన పాక్ విమాన హైజాక్ ఉదంతం, హైజాకర్ల అరెస్టును ప్రస్తావిస్తూ ఓ నెటిజన్ ఈ నెల 14న తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశాడు. అయితే ఆ పోస్ట్లో హైదరాబాద్ ఎయిర్పోర్టు అనే పేరు పలుమార్లు రావడంతోపాటు హైజాకర్లు, ఢిల్లీ తదితర పదాలు ఉండటంతో శంషాబాద్ ఎయిర్పోర్టు ప్రెడిక్టివ్ ఆపరేషన్స్ సెంటర్ (ఏపీఓసీ) ఉపయోగిస్తున్న ఓ ఏఐ ఆధారిత టూల్ పొరబడింది. ‘ఎక్స్’ వేదికగా ‘బెదిరింపు సందేశం’ వచ్చిదంటూ అధికారులను అప్రమత్తం చేసింది. దీంతో ఏసీఓసీకి చెందిన రాకేశ్ కుమార్ శర్మ అనే సెక్యూరిటీ, విజిలెన్స్ అధికారి.. పూర్వాపరాలు చూసుకోకుండానే అదే రోజు ఆర్జీఐఏ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని వివిధ సెక్షన్లతోపాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్నామని.. ‘ఎక్స్’లో ఆ పోస్ట్ పెట్టిన వ్యక్తిని గుర్తించే పనిలో ఉన్నామని ఆర్జీఐఏ పోలీసులు పేర్కొనడం గమనార్హం. నిజాంల కాలంలో మన భాగ్యనగరం పేరును అన్ని రకాల సమాచార సందేశాల్లో హైదరాబాద్ అని కాకుండా హైదరాబాద్ (డెక్కన్) అని సంబోధించేవారు. అలాగే ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న మరో హైదరాబాద్ నగరాన్ని హైదరాబాద్ (సింధ్)గా పిలుస్తున్నారు.నాడు జరిగింది ఇదీ..బలోచ్ హైజాకర్లు పాక్ విమానాన్ని ఢిల్లీ మళ్లించాలని డిమాండ్ చేయగా అంతదూరం వెళ్లేందుకు ఇంధనం సరిపోదంటూ హైజాకర్లను విమాన కెప్టెన్ ఉజెయిర్ ఖాన్ బురిడీ కొట్టించాడు. కావాలంటే తొలుత గుజరాత్లోని భుజ్ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయి ఇంధనం నింపుకున్నాక ఢిల్లీ తీసుకెళ్తానంటూ వారిని నమ్మించాడు. హైజాక్ ఉదంతాన్ని సింధ్ ప్రావిన్స్లో ఉన్న హైదరాబాద్ ఎయిర్పోర్టుకు కోడ్ భాషలో పంపాడు. వారు సైతం భారత అధికారులుగా హైజాకర్లను భ్రమింపజేస్తూ భుజ్లో విమాన ల్యాండింగ్కు అనుమతిస్తున్నట్లు రిప్లై ఇచ్చారు. చివరకు విమానం అక్కడి హైదరాబాద్ ఎయిర్పోర్టులో ల్యాండ్ అవగా తాము భారత భూభాగంలోకి ప్రవేశించామని హైజాకర్లు నమ్మారు. ఆ వెంటనే పాక్ కమాండోలు విమానంలోకి చొరబడి హైజాకర్లను అరెస్టు చేయడంతో కథ సుఖాంతమైంది. ఆ ఘటనలో ప్రయాణికులెవరూ ప్రాణాలు కోల్పోలేదు. ఆ ఉదంతం జరిగిన 17 ఏళ్లకు.. అంటే 2015 మే 28న హైజాకర్లను పాక్ ప్రభుత్వం ఉరితీసింది.