Telangana
-
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) తీపి కబురు అందించింది. తమ బ్యాంకులో శాలరీ అకౌంట్ కలిగిన ఆర్టీసీ సిబ్బందికి సామాజిక భద్రతను మరింత పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కేవలం ప్రమాదవశాత్తూ జరిగే మరణాలకు మాత్రమే వర్తిస్తున్న బీమా సౌకర్యాన్ని, ఇప్పుడు సహజ మరణాలకు (Natural Death) కూడా వర్తింపజేస్తున్నట్లు ప్రకటించింది.యూనియన్ బ్యాంక్లో శాలరీ అకౌంట్ కలిగి ఉన్న ఉద్యోగి సహజంగా మరణించినా, వారి కుటుంబానికి రూ. 10 లక్షల ఉచిత బీమా సొమ్ము అందుతుంది. ఏప్రిల్ 1 నుండి అమలు: ఈ నూతన నిబంధన 2026, ఏప్రిల్ 1వ తేదీ నుండి అమల్లోకి వచ్చింది. ఈ సౌకర్యం కోసం ఉద్యోగులు రూపాయి కూడా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా బ్యాంకే భరిస్తుంది. గతంలో ఉన్న రూ. 1 కోటి ప్రమాద బీమా సౌకర్యం యథాతథంగా కొనసాగుతూనే, ఈ సహజ మరణ బీమా అదనంగా చేరింది. దాదాపు 38వేలపైగా ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించనుంది. -
ఏఐ స్కిల్స్పై స్కాలర్షిప్ టెస్ట్
తెలంగాణకు చెందిన స్టార్టప్ 'కాగ్నిటివ్స్కోర్.ఏఐ' విద్యను మార్కుల ఆధారిత మూల్యాంకనం నుండి మేధోశక్తి వైపు మళ్లించే లక్ష్యంతో 'కాగ్నిచాంప్ ఇండియా స్కాలర్షిప్ — తెలంగాణ ఎడిషన్' అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. కీర్తి కుమార్ జైన్, విక్రమ్ సింగ్ నేగి స్థాపించిన ఈ కార్యక్రమం, ఏఐ-ఆధారిత ప్రపంచంలో అవసరమైన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే నైపుణ్యాలను గుర్తించి, పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.3 నుండి 18 సంవత్సరాల వయస్సు గల విద్యార్థుల కోసం ఉద్దేశించిన ఈ స్కాలర్షిప్లో, 20 నిమిషాల ఆన్లైన్, గేమిఫైడ్, అడాప్టివ్ అసెస్మెంట్ ఉంటుంది. ఇది మే 2 లేదా 3, 2026న జరగనుంది. దీనికి రిజిస్ట్రేషన్లు ఏప్రిల్ 26న ముగుస్తాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇందులో పాల్గొనడం ఉచితం కాగా, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు రూ.499 చెల్లించి నమోదు చేసుకోవచ్చు.సాంప్రదాయ పరీక్షలకు భిన్నంగా, కాగ్నిచాంప్ మేధోశక్తి, ఉన్నత స్థాయి ఆలోచనా సామర్థ్యం, ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాశాస్త్రం, ఇంకా సృజనాత్మకత, సమస్య పరిష్కారం వంటి 21వ శతాబ్దపు కీలక నైపుణ్యాలను మూల్యాంకనం చేస్తుంది. దీని ద్వారా విద్యార్థులు గుర్తింపు, 12వ తరగతి వరకు 100% ట్యూషన్ ఫీజు మద్దతుతో కూడిన స్కాలర్షిప్లు, వారి బలాబలాలపై వ్యక్తిగత అంతర్దృష్టుల వంటి అవకాశాలను పొందుతారు.ఈ కార్యక్రమం, జాతీయ విద్యా విధాన చట్రానికి అనుగుణంగా, విద్యార్థుల అభ్యసనం, అభివృద్ధిపై పాఠశాలలకు, తల్లిదండ్రులకు ఆచరణాత్మకమైన అంతర్దృష్టులను కూడా అందిస్తుంది. ఈ ప్రారంభంతో, భారతదేశంలో భవిష్యత్తుకు సిద్ధమైన, జ్ఞానాత్మక ఆధారిత విద్యలో అగ్రగామిగా నిలవాలని తెలంగాణ లక్ష్యంగా పెట్టుకుంది. -
ఏంటి కిరణ్.. ఇలా చేశావ్?
అదనపు కట్నం డిమాండ్ చేస్తూ ఓ యువకుడు పెళ్లికి రెండ్రోజుల ముందు పరారయ్యాడు. దీంతో పెళ్లి కాస్తా ఆగిపోయింది. తమకు న్యా యం చేయాలంటూ పురుగుల మందు డబ్బా పట్టుకుని ఆ యువకుడి ఇంటి ఎదుట అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్లో మంగళవారం చోటు చేసుకుంది.బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్కు చెందిన వీరబోయిన రాజయ్య రెండో కుమారుడు కిరణ్కు, ఎల్కతుర్తి మండలం దండేపల్లికి చెందిన పొన్నాల రాజయ్య కూతురితో వివాహం నిశ్చయమైంది. వరకట్నంగా రూ.26 లక్షలు, రెండున్నర తులాల బంగారం ఇచ్చే ఒప్పందంతో నిశ్చితార్థం చేసుకుని మార్చి 6న వివాహ ముహూర్తం పెట్టుకున్నారు. నిశ్చితార్థ సమయంలో రూ.10 లక్షల నగదు, అరతులం బంగారు ఉంగరం, రూ.72 వేల విలువ గల గొర్రెలు ముట్టజెప్పారు. ఆ తర్వాత తనకు అదనంగా మరో రూ.9 లక్షలు కావాలని కిరణ్ డిమాండ్ చేశాడు.తాము అంత ఇచ్చుకోలేమని చెప్పడంతో పెళ్లికి రెండ్రోజుల ముందు మార్చి 4న కిరణ్ పరారయ్యాడని అతడి తల్లిదండ్రులు తమకు చెప్పడంతో మార్చి 6న జరగాల్సిన పెళ్లి ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అదనపు కట్నం కోసమే కిరణ్ను తల్లిదండ్రులే దాచిపెట్టారని అమ్మాయి తల్లిదండ్రులు ఆరోపించారు. కాగా, మార్చి 4న కిరణ్పై కమలాపూర్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైనట్లు ఇన్స్పెక్టర్ నవీన్ తెలిపారు. ఈ ఘటనపై ఎల్కతుర్తి ఎస్సై ప్రవీణ్కుమార్ను వివరణ కోరగా ఫిర్యాదు అందలేదని తెలిపారు. చదవండి: పిట్ట ముట్టడం లేదని.. చెట్టును పెంచాడు! -
రైల్వే బ్రిడ్జిలో ఇరుకున్న కార్మికులు.. పరిస్థితి విషమం
కుమురం భీం ఆసిఫాబాద్ : కాగజ్నగర్ పెద్దవాగు రైల్వే బ్రిడ్జిపై ప్రమాదం చోటు చేసుకుంది. థర్డ్ లైన్ పనుల్లో భాగంగా నిర్మిస్తున్న బాక్స్ బ్రిడ్జ్ లో పనులు చేస్తుండగా దురదృష్టవశాత్తు ఇద్దరు కార్మికులు బ్రిడ్జిలో ఇరుక్కపోయారు. దీంతో వారిలో ఒకరిని బయిటకు తీసి ఆసుపత్రికి తరలించారు. మరోకరు మాత్రం అందులోనే చిక్కుకోగా సహాయక చర్యలు అందిస్తున్నారు. వైద్యుల సమక్షంలో అక్కడే ఆక్సిజన్ ద్వారా చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతనిని తీవ్ర రక్త స్రావమై పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
కాళేశ్వరం కమిషన్పై తీర్పు వాయిదా
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో విచారణ జరిపిన జస్టిస్ ఘోష్ కమిషన్పై దాఖలైన పిటిషన్లపై తుది తీర్పు వాయిదా పడింది. మెగా ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, నిర్వహణల్లో అవకతవకలపై విచారణ నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి టి.హరీశ్రావు, ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్, ఐఏఎస్ మాజీ అధికారి ఎస్.కె.జోషిలు విడివిడిగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టి మార్చి 12న తీర్పు వాయిదా వేసింది. ఇవాళ తుది తీర్పు వెల్లడించాల్సి ఉంది. అయితే.. ఇవాళ విచారణ జరగ్గా తీర్పును ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది ధర్మాసనం. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవకతవకలు జరిగాయంటూ.. జస్టిస్ పి.సి.ఘోష్ కమిషన్ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం 2024 మార్చి 14న జీవో 6ను జారీ చేసింది. కమిషన్ చేపట్టిన విచారణ ప్రక్రియలో ఉల్లంఘనలు జరిగాయని, అభియోగాలు మోపే ముందు తమ వాదనను పరిగణనలోకి తీసుకోలేదని పిటిషనర్లు పేర్కొన్నారు. విస్తృత ప్రజాప్రయోజనాల దృష్ట్యా కమిషన్ వేశామంటూ మరొకరి పరువు ప్రతిష్ఠలు దెబ్బతీయడం సరికాదన్నారు. మరోవైపు ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ... ప్రజాప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని కమిషన్ వేసినట్లు తెలిపారు. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక రికార్డుల ఆధారంగానే ఇచ్చిందన్నారు. ఇందులో భాగంగా పిటిషనర్లతోపాటు పలువురికి నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టిందని.. కాబట్టి పిటిషన్లను కొట్టివేయాలని కోరారు. -
17న నల్లబ్యాడ్జీలతో విధులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తున్నా ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం దొరకలేదని, ఇప్పటికే పలుమార్లు వినతులు సమర్పించినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఈ నెల 17న రాష్ట్రవ్యాప్తంగా నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరు కావాలని నిర్ణయించినట్లు తెలంగాణ ఉద్యోగ ఐక్య కార్యాచరణ సమితి (టీజీఈజేఏసీ) తెలిపింది. ఆరోజు భోజన విరామ సమయంలో నిరసనలు తెలియజేస్తామని వెల్లడించింది. మే 5వ తేదీన అన్ని జిల్లా కేంద్రాలు, కలెక్టరేట్ కాంప్లెక్స్లు, ధర్నాచౌక్ల వద్ద దీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. ఆలోపు ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రాకుంటే మే 14వ తేదీన జేఏసీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు ప్రకటించారు. మంగళవారం మూసారాంబాగ్లోని రెవెన్యూ భవన్లో జేఏసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, ప్రాథమిక కార్యాచరణను వారు మీడియాకు వెల్లడించారు. ఇప్పటికే రెండేళ్ల పీఆర్సీ నష్టపోయాం.. ‘సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల పీఆర్సీ ప్రభుత్వం అమలు చేయలేదు. ఇప్పటికే రెండున్నరేళ్లు నష్టపోయాం. తాజాగా పీఆర్సీ గడువును పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కమిటీ నివేదిక తీసుకోకుండా గడువును పొడిగించడం సరికాదు. చనిపోయినా అందని రిటైర్మెంట్ బెనిఫిట్లు పెండింగ్ బిల్లుల విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోంది. నెలవారీగా నిధులిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా.. ప్రతినెలా జరిగే రిటైర్మెంట్లతో బకాయిలు తగ్గడం లేదు. పదవీ విరమణ పొందిన వారిలో ఇటీవల 260 మంది చనిపోయారు. అయినప్పటికీ వారికి రిటైర్మెంట్ బెనిఫిట్లు అందలేదు. సీపీఎస్ రద్దుపై కమిటీ ఏదీ? కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పింది. కానీ ఇప్పటివరకు కనీసం కమిటీ ఏర్పాటు చేయలేదు. ఈ డిమాండ్ల సాధన కోసమే నిరసనలు, దీక్షలకు దిగుతున్నాం..’అని జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావు చెప్పారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న డీఏ బకాయిలు కూడా విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. కాగా పాత పింఛన్ విధానాన్ని ఉద్యోగులందరికీ పునరుద్ధరించాలని ఈ భేటీలో పాల్గొన్న కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ (సీపీఎస్ఈయూ) ప్రతినిధి నాగులవంచ నరేందర్రావు డిమాండ్ చేశారు. లక్షలాది ఉద్యోగులతో ముడిపడి ఉన్న ఈ అంశం పరిష్కారమయ్యేంతవరకు పోరాటాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. జేఏసీ డిమాండ్లు ఇవీ.. ⇒ 2వ పీఆర్సీ కమిషన్ నివేదిక తెప్పించి జూన్ 2 లోగా అమలు చేయాలి. పీఆర్సీ గడువు ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించకూడదు. ⇒ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు రూ.700 కోట్లు విడుదల చేసినప్పటికీ, వాస్తవ అవసరం రూ.1,500 కోట్లకు పైగా ఉంది. రాష్ట్రంలో నెలకు సగటున 600 మంది ఉద్యోగులు రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. దీంతో బకాయిలు భారీగా పేరుకుపోతున్నాయి. మిగిలిన మొత్తం విడుదల చేయడంతో పాటు ప్రతి నెలా విడుదల చేసే మొత్తం రూ.1,500 కోట్లకు పెంచాలి. ⇒ ఉద్యోగుల ఆరోగ్య పథకం వెంటనే అమలు చేస్తామని సీఎస్ చెప్పినప్పటికీ ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించడం లేదు. ఈహెచ్ఎస్ లేక ఉద్యోగులు పెన్షనర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పథకం విధివిధానాలను వెంటనే ఖరారు చేసి, మే 1వ తేదీ నుంచి వైద్య సేవలు అందించాలి. ⇒ కాంట్రిబ్యూషన్ పెన్షన్ (సీపీఎస్) రద్దుచేసి పాత పెన్షన్ స్కీంను పునరుద్ధరించాలి. ⇒ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు సాధారణ బదిలీలు చేపట్టాలి. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని త్వరితగతిన ఏర్పాటు చేయాలి. ⇒ ఉపాధ్యాయ సంఘాల కో–ఆర్డినేషన్ సమావేశం ఏర్పాటు చేయాలి. ఉపాధ్యాయులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. లేకుంటే టీజీఈజేఏసీ క్షేత్రస్థాయిలో అతనికి తగిన శాస్తి చేస్తుంది. ⇒ కొన్ని జిల్లాల కలెక్టర్లు, ప్రధానంగా జనగామ జిల్లా కలెక్టర్ అక్కడి ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం విచారణ చేయించాలి. -
రేవంత్ ఆలోచనలన్నీ పేదల భూములపైనే
సాక్షి, హైదరాబాద్: సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్లు సీఎం రేవంత్రెడ్డి ఆలోచనలన్నీ పేదల భూములపైనే ఉన్నాయని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. దళిత, గిరిజన, బలహీనవర్గాల భూములపై గద్దల్లా వాలుతూ ఇందిరమ్మ పాలనలో ఇచ్చిన పట్టాలను లాక్కుంటున్నారని మండిపడ్డారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం కాళ్లాపూర్, రాపోల్లో పారిశ్రామిక పార్కు మూలంగా భూములు కోల్పోతున్న రైతులను పరామర్శించేందుకు మంగళవారం కోకాపేటలోని తన నివాసం నుంచి హరీశ్ బయలుదేరి వెళ్లారు.ఈ సందర్భంగా హరీశ్రావు మీడియాతో మాట్లాడుతూ పచ్చటి పొలాల్లో పరిశ్రమల పేరిట రైతుల జీవితాలతో రేవంత్ ప్రభుత్వం ఆడుకుంటోందన్నారు. రేవంత్ రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్నారని, ఇది గడీల పాలన, బేడీల పాలన, నిర్బంధాల పాలన, దుర్మార్గపు పాలన అని, రైతులను పరామర్శించడానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. తాము అరెస్టులు చేయమని,, తమది ప్రజాపాలన అని ఆదిలాబాద్ జిల్లా సభలో సీఎం చెప్పి 24 గంటలు కాకముందే ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులను అరెస్టు చేయడం దౌర్జన్యమన్నారు. ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఒక్కటి కూడా అమలు చేయకుండా అన్యాయంగా పేద రైతుల భూములు లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, పరిశ్రమల పేరిట 40 వేల ఎకరాలు లాక్కునేలా ప్రణాళికలు చేస్తోందని హరీశ్రావు ఆరోపించారు.ప్రభుత్వానికి ఎందుకంత భయం?భూములు కోల్పోతున్న రైతులను పరామర్శించేందుకు వెళ్తుంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని హరీశ్ ప్రశ్నించారు. రేవంత్ పాలనలో ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్యం ఇస్తామని చెప్పి నేడు ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేస్తున్నారన్నారు. ప్రజా సమస్యలు మాట్లాడితే అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తున్నారని, రాష్ట్రంలో నడుస్తున్న పోలీసు రాజ్యం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. రెండు మూడు పంటలు పండే పచ్చని భూముల్లో పరిశ్రమలు పెట్టాలనుకోవడం దారుణమని, కాళ్లాపూర్, రాపోలులో భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేసేంత వరకు పోరాటం ఆగదన్నారు. రేవంత్ పాలన అంతా బోగస్ మాటలు, బోగస్ గ్యారంటీలు. రేవంత్ను మించిన రావణాసురుడు రాష్ట్రంలో మరొకరు లేరన్నారు. వచ్చే ఎన్నికల్లో రేవంత్ గెలిచే పరిస్థితి లేదని, కాంగ్రెస్కు సింగిల్ డిజిట్ సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు. రేవంత్ మళ్లీ గెలవడం పగటి కల అని, వచ్చేది రామరాజ్యం, కేసీఆర్ రాజ్యమేనని హరీశ్రావు వ్యాఖ్యానించారు.హరీశ్రావు తదితరులు అరెస్టు..విడుదలపరిగి ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతులను కలిసేందుకు బయల్దేరిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్ రావును నార్సింగి అప్పా జంక్షన్ వద్ద పోలీసులు అడ్డగించి అదుపులోకి తీసుకున్నారు. ఆయన వెంట బయలుదేరిన మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి తదితరులను లారీలు అడ్డుపెట్టి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అరెస్టు చేసిన నేతలను ఔటర్ రింగు రోడ్డు మీదుగా శంషాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. మంగళవారం ఉదయం నుంచే హరీశ్రావు నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దీంతో ఆయన నివాసానికి పెద్ద ఎత్తున చేరుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. శంషాబాద్ పోలీసు స్టేషన్ ఎదుట కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు బైఠాయించారు. మంగళవారం మధ్యాహ్నం హరీశ్రావు, సబితా ఇంద్రారెడ్డి తదితరులను పోలీసులు విడుదల చేశారు. -
కేరళ, తెలంగాణ మధ్య ఎన్నికలు కావివి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు కేరళ, తెలంగాణల మధ్య కాదని, కేరళలోని యూడీఎఫ్, ఎల్డీఎఫ్ల మధ్య జరుగుతున్నాయన్న వాస్తవాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయన్ గ్రహించాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను విజయన్ ఎప్పుడైనా వచ్చి పరిశీలించవచ్చని పేర్కొన్నారు. ‘పినరయి విజయన్తో పాటు కేరళ కమ్యూనిస్టు మహిళా నేతలను కూడా నేను తెలంగాణకు ఆహా్వనిస్తున్నా. రాష్ట్రంలోని ఏ మూలకైనా వెళ్లి మేం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించవచ్చు. అతిథులుగా మీకు అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఎప్పుడైనా వచ్చి మా రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు..’అంటూ సవాల్ విసిరారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చివరి రోజు మంగళవారం..కోవలం, మాలవిక్కర, పతానపురం నియోజకవర్గాల్లో యూడీఎఫ్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ రేవంత్ రోడ్షోలు నిర్వహించారు. ఈ రోడ్షోల్లో అలాగే అక్కడి మీడియాతో ముఖ్యమంత్రి మాట్లాడారు. విజయన్ హయాం ముగిసింది..: ‘కేరళలో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసిన ఘనత కాంగ్రెస్ సీఎంలు కరుణాకరన్, ఉమెన్ చాందీలదే. పినరయి విజయన్ హయాం ముగిసింది. ఆయన 120 నెలల పాలన వైఫల్యానికి ప్రతీకగా నిలిచింది. ఆయన వైదొలిగే సమయం ఆసన్నమైంది. మూడింట రెండొంతుల మెజార్టీతో కేరళలో యూడీఎఫ్ పాలన రాబోతోంది. విజయన్ గాడ్ఫాదర్ నరేంద్ర మోదీ ఢిల్లీలో ఉన్నారు. ఆయనే విజయన్ను కేసుల నుంచి ర క్షిస్తున్నారు. దేశం కోసం జీవితాలు, ఆస్తులను త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని, కేజ్రీవాల్తో సహా అనేక మంది నేతలను వేధిస్తున్న కేంద్రం.. విజయన్ జోలికి ఎందుకు వెళ్లడం లేదు? మోదీ, విజయన్ల మధ్య అవగాహనతోనే కేసులు, అరెస్టులు లేవు. వారిద్దరి బంధాన్ని కేరళ ప్రజలు అర్థం చేసుకున్నారు. పోలింగ్ బూత్కు వెళ్లి సరైన నిర్ణయం చెపుతారు..’అని సీఎం రేవంత్ అన్నారు. కొనసాగుతున్న లేఖల యుద్ధం కేరళ సీఎం విజయన్, తెలంగాణ సీఎం రేవంత్ల మధ్య మాటల యుద్ధం లేఖల రూపంలో సాగుతూనే ఉంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ కేరళ వెళ్లి చేసిన వ్యాఖ్యలకు ‘ఎక్స్’వేదికగా విజయన్ కౌంటర్ ఇవ్వగా, విజయన్కు లేఖ రాస్తూ రేవంత్ అంతే ధీటుగా స్పందించారు. దీనికి మరోమారు విజయన్ లేఖ రూపంలో స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వగా రేవంత్ మరోసారి ప్రతి లేఖ రాశారు. ‘కేరళ ప్రభుత్వ పనితీరుపై నేను గౌరవంగా, హుందాగా స్పందించాలని అనుకున్నా. కానీ మీ ప్రతిస్పందనలో అభ్యంతరకరమైన భాషను వాడారు. నేనెప్పుడూ ప్రత్యర్థుల తొందరపాటు వ్యాఖ్యలపై ఆవేశపూరితంగా స్పందించను. అయితే మీరు నీతి ఆయోగ్ ఇచ్చిన 2023–24 నివేదికను ఉదహరిస్తున్నారు. ఆ సమయంలో మేం అధికారంలో లేము. అది బీఆర్ఎస్, బీజేపీల పదేళ్ల దుష్పరిపాలనలో చివరి దశ. మేం అధికారంలోకి వచ్చిన 28 నెలల్లో ఏం జరిగిందనే దాన్ని ఆధారంగా చేసుకుని మమ్మల్ని అంచనా వేయండి. తలసరి ఆదాయం, జీఎస్డీపీ తదితర ఆర్థిక సూచీల్లో ఆర్బీఐ హ్యాండ్బుక్ 2024–25 గణాంకాల ప్రకారం కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలను తెలంగాణ అధిగమించింది. దేశంలోనే ముందు స్థానంలో నిలిచింది. బంగారం స్మగ్లింగ్ కేసు ఏమైంది? నీతి ఆయోగ్ ఇచ్చిన అవినీతి ర్యాంకులను కూడా నేను గౌరవిస్తాను. కానీ మీ ప్రభుత్వం స్వచ్ఛమైనది అయితే బంగారం స్మగ్లింగ్ కేసు ఎందుకు అపరిష్కృతంగా మిగిలిపోయింది. మీ కార్యాలయంలోని ఉన్నతాధికారులు, కీలక వ్యక్తులకు సంబంధాలున్నాయని ఆధారాలతో సహా బయటపడినా చర్యలేవి? శబరిమల అయ్యప్ప ఆలయం నుంచి 4.5 కిలోల బంగారం అక్రమ తరలింపు ఆరోపణలకు ఎందుకు జవాబు చెప్పడం లేదు? మా ప్రభుత్వం తెలంగాణ రైజింగ్–2047 దార్శనికతతో ముందెకెళుతోంది. అలాగే కేరళలో రాబోయే కొద్ది రోజుల్లో ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వం ’నవ కేరళ’దార్శనికతను అమలు చేస్తుందని నేను బలంగా విశ్వసిస్తున్నాను. కేరళ ప్రజలు త్వరలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకుంటారు. జరగాల్సింది కూడా అదే..’అని రేవంత్ ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా కేరళ ఎన్నికల ప్రచారం ముగించిన సీఎం హైదరాబాద్ చేరుకున్నారు. -
పల్లె స్ఫూర్తి.. కావాలి దీప్తి!
మహబూబాబాద్ జిల్లా కురవిమండలం తిర్మలాపురం గ్రామంలోని జనాభా 765. గ్రామంలో 75 ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. గతంలో రోడ్డు ప్రమాదాల బారినపడి పలువురు మృతి చెందారు. మరోసారి గ్రామస్తులు ప్రమాదాలకు గురి కావొద్దని, ప్రమాదవశాత్తు పడినా తలకు గాయం కాకుండా ఉండేందుకు ద్విచక్ర వాహనం ఉన్న ప్రతీ ఒక్కరు హెల్మెట్ ధరించి వాహనం నడపాలని గ్రామ సభలో తీర్మానం చేశారు. గ్రామ సర్పంచ్ కనకటి అచ్చమ్మ తన సొంత డబ్బులతో అందరికీ హెల్మెట్లు కొనుగోలు చేసి అందజేశారు. ఇప్పుడు ఆ గ్రామంలో హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనం పడిపేవారు లేరు.సాక్షి, మహబూబాబాద్: నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా హెల్మెట్ వాడకంపై హైదరాబాద్ మహానగరంలో కూడా చాలామంది పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ మారుమూల పల్లెల్లో మాత్రం హెల్మెట్ తప్పనిసరని తీర్మానం చేసుకొని అమలుచేయడం విశేషం. మహబూబాబాద్ జిల్లాకు ఇటీవల వచ్చిన ఎస్పీ శబరీష్ రోడ్డు ప్రమాదాల నివారణకు వినూత్నంగా ఆలోచించారు. కొత్తగా ఎంపికైన గ్రామ సర్పంచ్లు, మున్సిపల్ కౌన్సిలర్లతో గత నెల 17న జిల్లా కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేశారు. మన ఊరు–మన బాధ్యత పేరుతో చేపట్టిన కార్యక్రమం గురించి వివరించారు. సర్పంచ్లు, మున్సిపల్ కౌన్సిలర్ల సలహాలు, సూచనలు తీసుకున్నారు. వారితో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి పలుమార్లు మీటింగ్లు పెట్టి కార్యక్రమం ప్రాధాన్యత వివరించారు. దీంతో మూడు అంశాలపై ప్రతీ గ్రామంలో తీర్మానం చేశారు. ఈ ఫొటోలో ద్విచక్రవాహనదారుడికి పోలీసు హెల్మెట్ పెడుతున్న దృశ్యం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం వెంకటగిరి గ్రామంలోనిది. సర్పంచ్ భూక్య జ్యోతి గ్రామ సభ నిర్వహించి ద్విచక్ర వాహనదారులందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తీర్మానం చేశారు. గ్రామంలో 164 ద్విచక్ర వాహనాలు ఉండగా.. తీర్మానం చేసిన వెంటనే 93 మంది హెల్మెట్లు కొనుగోలు చేశారు. మిగిలిన 71 మందికి దాతల సహకారంతో పోలీసులు హెల్మెట్లు కొనుగోలు చేసి ఇచ్చారు. మొదటి విడత 36 పంచాయతీలు,15వార్డులు జిల్లాలో మొత్తం 482 గ్రామాలు, 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. అయితే అన్ని గ్రామాల్లో ఒకేసారి హెల్మెట్ధరించడం, గంజాయి నిర్మూలించడం, సీసీ కెమెరాల ఏర్పాటు వీలు కాదని గ్రహించారు. ముందుగా ప్రతీ మండలానికి రెండు గ్రామాల చొప్పున 36 పంచాయతీలు, ఐదు మున్సిపాలిటీల నుంచి 15 వార్డులను ఎంపిక చేసుకుని గ్రామ సభలు పెట్టి తీర్మానాలు చేశారు. ఇప్పుడు ఆయా గ్రామాలు, వార్డుల్లో ద్విచక్ర వాహనదారులందరూ హెల్మెట్ ధరించి వాహనం నడిపేలా చర్యలు తీసుకున్నారు. గ్రామస్థాయి నుంచిమార్పురావాలని.. ప్రతీ సంవత్సరం రోడ్డు భద్రతావారోత్సవాలు, గంజాయి నిర్మూలన కార్యక్రమాలు, సీసీ కెమెరాల ఉపయోగంపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాం. అయితే గ్రామస్థాయి నుంచి మార్పు వస్తే ఇది శాశ్వతంగా ఉంటుందని భావించాం. కొత్తగా ఎంపికైన సర్పంచ్లు, వార్డుకౌన్సిలర్లతో సమావేశం పెట్టగా.. మంచిస్పందన వచ్చింది. మొదటి విడత ఎంపిక చేసిన గ్రామాల్లో వందశాతం హెల్మెట్ ధరించి వాహనాలు నడుపుతున్నారు.దశలవారీగా జిల్లా మొత్తం అమలయ్యేలా ముందుకెళ్తున్నాం. -
రెండ్రోజుల్లో 2,322 పోస్టులు భర్తీ
సాక్షి, హైదరాబాద్/లక్డీకాపూల్/గన్ఫౌండ్రి : రెండేళ్లలో ఒక్క వైద్య శాఖలోనే 10,327 ఉద్యోగాలు భర్తీ చేశామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. మరో రెండ్రోజుల్లో ఇంకో 2,322 పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. మంగళవారం ఉస్మానియా మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్ట్) పోస్టులకు ఎంపికైన డాక్టర్లకు మంత్రి దామోదర నియామక పత్రాలు అందజేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయడంతో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించగలమన్న నమ్మకం కలుగుతోందన్నారు. రాష్ట్రంలో వైద్యుల కొరత లేకుండా, ప్రజలకు సరైన సమయానికి నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు చెప్పారు. రెండేళ్లలో 10,327 పోస్టులను భర్తీ చేయగా ఇంకా 6,512 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. అందులో 2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు, 1,000 స్పెషలిస్ట్ డాక్టర్, 475 అసిస్టెంట్ ప్రొఫెసర్, 732 ఫార్మసిస్ట్, ఇతర పోస్టులు ఉన్నాయన్నారు. ఈ నియామకాలన్నీ సమయానికి పూర్తి చేసి ప్రతి హాస్పిటల్ను బలోపేతం చేస్తామని మంత్రి చెప్పారు. నియామకాలతోపాటు ఆసుపత్రు ల్లో మౌలిక వసతులు, యంత్ర పరికరాలు, మందులు, డయాగ్నస్టిక్ సేవలను సమకూరుస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నియామక పత్రాలు అందుకున్న వైద్యులకు కొన్ని సూచనలు చేశారు. ‘సేవా భావంతో పనిచేయండి. ప్రతి రోగిని మానవత్వంతో చూడండి. నైతిక విలువలను పాటించండి. హైదరాబాద్లోనే ఉండాలి.. పట్టణాల్లోనే పోస్టింగ్ కావాలనే ధోరణి మార్చుకోండి. కొంతకాలమైనా జిల్లాల్లో పని చేయండి. మీ జ్ఞానం, మీ సేవ లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేస్తాయి’అని చెప్పారు. ప్రజారోగ్యమే సమాజాభివృద్ధికి బలమైన పునాది.. : ప్రజారోగ్యమే సమాజాభివృద్ధికి బలమైన పునాది అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. ఆరోగ్యం అంటే వ్యాధులు లేకపోవడం మాత్రమే కాదని.. శారీరకంగా, మానసికంగా, సామాజికంగా కూడా ఆరోగ్యంగా ఉండటమన్నారు. మంగళవారం రవీంద్రభారతిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రపంచ ఆరోగ్య దినోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతానికి తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని.. డయాలసిస్ సేవలను విస్తరిస్తూ కొత్తగా 79 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రూ. 1,100 కోట్లతో నాలుగు స్థాయిల ట్రామా కేర్ వ్యవస్థను అమలు చేయడంతోపాటు 109 ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేసి అత్యవసర సేవలను బలోపేతం చేస్తామని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులను కాపాడేందుకు ప్రతి 35 కిలోమీటర్లకు ఒక ట్రామాకేర్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. త్వరలో 213 నూతన అంబులెన్స్లను అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రతి పౌరుడికి హెల్త్ ప్రొఫైల్ను రూపొందించే దిశగా చర్యలు ప్రారంభించామని చెప్పారు. ఉద్యోగులు, పెన్షనర్ల కోసం కొత్త ఆరోగ్య పథకాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో 80 శాతం వైద్య అవసరాలు తీర్చే లక్ష్యంతో సెకండరీ హెల్త్ కేర్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అనంతరం మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందికి అవార్డులను అందజేశారు. నిమ్స్లో కేన్సర్ చికిత్స యంత్రం, ఎర్రగడ్డలో డీ–అడిక్షన్ సెంటర్ ప్రారంభం నిమ్స్లో రేడియేషన్ ఆంకాలజీ విభాగంలో అత్యాధునిక హై ఎనర్జీ లీనియర్ యాక్సిలరేటర్ యంత్రాన్ని మంత్రి దామోదర మంగళవారం ప్రారంభించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆరోగ్య మహిళా కేన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని కూడా మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్లతో కలిసి ఆయన ప్రారంభించారు. అలాగే ఎర్రగడ్డలోని ప్రభుత్వ మానసిక వ్యాధుల చికిత్సాలయం ప్రాంగణంలో నిర్మించిన ‘డీ–అడిక్షన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ను మంత్రి దామోదర ప్రారంభించారు. మానసిక సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సమయానికి గుర్తించి చికిత్స పొందడం అవసరమని.. దీనిపై సమాజంలో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు. -
కంటి ఇన్ఫెక్షన్లలో మందుల నిరోధకత పైపైకి
సాక్షి, హైదరాబాద్: కంటి ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టీరియాల్లో యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ (మందు పనిచేయని లక్షణం) వేగంగా పెరుగుతున్నట్లు సీసీఎంబీ, ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. రోగుల నుంచి సేకరించిన నమూనాలను పరిశీలించగా 45 శాతం కంటే ఎక్కువ బ్యాక్టీరియా ఒకటి కంటే ఎక్కువ యాంటీబయోటిక్స్కు స్పందించకుండా ఉన్నట్లు గుర్తించారు. ఈ పరిస్థితి కారణంగా వైద్యులు ముందుగా వేసుకున్న అంచనాల ఆధారంగా మందులు ఇవ్వడం (ఎంపిరికల్ ట్రీట్మెంట్) సరైన ఫలితాలు ఇవ్వకపోవచ్చని నిపుణులు హెచ్చరించారు. అందుకే మైక్రోబయాలజీ పరీక్షల ఆధారంగా చికిత్స అందించడం అత్యవసరమని సూచించారు. కంటి ఇన్ఫెక్షన్లు కేవలం కంటికే పరిమితం కాకుండా పరిసరాల్లో ఉన్న సూక్ష్మజీవాల పరిస్థితిని కూడా ప్రతిబింబిస్తున్నాయని పరిశోధకులు తెలిపారు. కాబట్టి యాంటీబయోటిక్స్ వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవడం, ఆసుపత్రుల్లో ఆధునిక పరీక్షా విధానాలను పెంపొందించడం అవసరమని సూచించారు. ప్రత్యేకంగా తీవ్రమైన కంటి ఇన్ఫెక్షన్లలో సరైన పరీక్షలు చేయకుండా మందులు వాడితే సమస్య మరింత పెరగొచ్చని పేర్కొన్నారు. -
ఈవీ రాయితీలు రూ.1,450 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ)కు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాల మొత్తం రూ.1,450 కోట్లకు చేరుకుంది. 2024 నవంబర్ 16న ఈవీ పాలసీ సవరించాక కొనుగోలు చేసిన ఎలక్ట్రిక్ వాహనాలకు ఇచ్చిన రాయితీనే రూ.967 కోట్లుగా ఉండటం విశేషం. పన్నుల రూపంలో ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన మొత్తం మిగులుతుండటంతో ఈవీల కొనుగోలుపై ప్రజలు మక్కువ చూపుతున్నారు. ఫలితంగా కేవలం 15 నెలల కాలంలో ఏకంగా 1.20 లక్షల వాహనాలు అమ్ముడయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఈవీల సంఖ్య 2.90 లక్షలకు చేరుకుంది. ఈ ఏడాది డిసెంబర్తో రాయితీ గడువు ముగియనుంది. రాయితీల వల్లనే ఈవీల కొనుగోలు భారీగా పెరిగిన నేపథ్యంలో, మరికొంతకాలం రాయితీలను పొడిగించే యోచనలో ప్రభుత్వం ఉంది. దీంతో ఈవీల సంఖ్య భారీగా పెరుగుతుందని భావిస్తున్నారు. -
సిలిండర్కు పోలీసు సెక్యూరిటీ
గ్యాస్ సిలిండర్ల కొరతతో పంపిణీ ప్రక్రియ రోజురోజుకు క్లిష్టంగా మారుతోంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఇదే పరిస్థితి నెలకొనగా పోలీసు పహారా నడుమ సిలిండర్లు పంపిణీ చేయాల్సి వచ్చింది. నేలకొండపల్లిలోని ఏజెన్సీకి మంగళవారం 60 సిలిండర్లు వచ్చాయి. బుకింగ్ చేసుకున్న దాదాపు 200 మంది రావడం, అందరికీ అందే పరిస్థితి లేకపోవడానికి తోడు ఎండతీవ్రతతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యాలయంలోకి చొరబడడంతో గందరగోళం నెలకొంది. ఈమేరకు పోలీసులు చేరుకుని అందరినీ బయటకు పంపించారు. అయితే, రోజుల తరబడి సిలిండర్ల కోసం చూస్తుండగా, ఇంకెన్నాళ్లు తిరగాలని నిర్వాహకులు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చివరకు పోలీసులు అందరి నుంచి గ్యాస్కనెక్షన్ పుస్తకాలు తీసుకుని బుకింగ్ ఆధారంగా క్రమపద్ధతిలో పిలుస్తూ 60మందికి సిలిండర్లు సరఫరా చేయించారు. మిగిలినవారికి మరో దఫా రాగానే అందిస్తామని నచ్చచెప్పడంతో నిరాశగా వెనుదిరిగారు. -
అప్పర్ భద్రకు లైన్క్లియర్ !
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)–1 ఒక్క నీటి చుక్కను కేటాయించకపోయినా.. కేడబ్ల్యూడీటీ–2 తీర్పు అమల్లోకి రాకపోయినా 29.9 టీఎంసీల నీటిని తరలించి 5.57 లక్షల ఎకరాలకు నీళ్లందించే లక్ష్యంతో కర్ణాటక సర్కార్ అక్రమంగా చేపట్టిన అప్పర్ భద్రకు కేంద్రం లైన్క్లియర్ చేసింది. గత నెల 20న కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు అధ్యక్షతన సమావేశమైన కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ)లోని సాంకేతిక సలహామండలి (టీఏసీ) సుప్రీంకోర్టు విచారణలో ఉన్న ఆ ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయాన్ని రూ.21,167.93 కోట్లుగా ఆమోదించింది. దీనికి సంబంధించిన సమావేశ మినిట్స్ వివరాలను సీడబ్ల్యూసీ విడుదల చేసింది. ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ 2023, ఫిబ్రవరి 7న సుప్రీంకోర్టులో నాటి ఏపీలోని వైఎస్ జగన్ సర్కార్ వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పెండింగ్లో ఉండగానే కేంద్రం అనుమతులు జారీ చేయడం గమనార్హం. ఇప్పటికే ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచేసి 130 టీఎంసీల కృష్ణా జలాలను మళ్లించడానికి కర్ణాటక సర్కార్ శరవేగంగా అడుగులు వేస్తోంది. తాజాగా అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో తెలుగు రాష్ట్రాల్లో శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులపై ఆధారపడిన రైతాంగానికి తీవ్ర నష్టం కలిగించనుంది. ప్రధానంగా తుంగభద్ర జలాలపై ఆధారపడిన ఉమ్మడి మహబూబ్నగర్లోని రాజోళిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్) రైతాంగానికి పెద్దదెబ్బ అని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ట్రిబ్యునళ్ల తీర్పులకు విరుద్ధంగా... తుంగభద్ర డ్యామ్కు ఎగువన 295 టీఎంసీలకు మించి కర్ణాటక వాడుకోవడానికి వీల్లేదని కేడబ్ల్యూడీటీ–1 స్పష్టం చేస్తే.. 1980–81 నాటికే 319.558 టీఎంసీలను కర్ణాటక వినియోగిస్తున్నట్టు కేడబ్ల్యూడీటీ–2 తేల్చింది. 29.9 టీఎంసీలు (ఆవిరి నష్టాలు పోనూ) తరలించేలా అప్పర్భద్ర ప్రాజెక్టును 2015లో కర్ణాటక చేపట్టింది. 2019, మార్చి నాటికే రూ.4,830 కోట్లను ఈ ప్రాజెక్టుకు వ్యయం చేసి అప్పర్తుంగ నుంచి భద్ర ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోసేలా ఎత్తిపోతలు, ప్రధాన కాలువలతోపాటు భద్ర నుంచి వాణివిలాస రిజర్వాయర్కు నీటిని తరలించే ప్రధాన కాలువ పనులను కర్ణాటక పూర్తి చేసింది. అప్పర్భద్ర ద్వారా 2019–26 వరకు 3.80 టీఎంసీలను వాణివిలాస రిజర్వాయర్కు తరలించింది. నీటి కేటాయింపులేని ప్రాజెక్టుకు జాతీయ హోదా అప్పర్భద్రకు సాంకేతిక అనుమతి ఇవ్వాలంటే.. బేసిన్ పరిధిలోని మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ అభిప్రాయాలను సీడబ్ల్యూసీ తీసుకోవాలి. కానీ..రాష్ట్రాల అభిప్రాయం తీసుకోకుండానే 2020, డిసెంబర్24న సీడబ్ల్యూసీ సాంకేతిక అనుమతి ఇచ్చేసింది. విజయనగర చానళ్లు, తుంగ, భద్ర ఆనకట్టల ఆధునికీకరణ వల్ల ఎలాంటి నీటి మిగులు లేదని.. బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి రాలేదని.. ఈ నేపథ్యంలో సాంకేతిక అనుమతి ఇవ్వడమంటే కోర్టు ధిక్కరణకు పాల్పడటమేనని పేర్కొంటూ వైఎస్ జగన్ నేతృత్వంలోని గత ఏపీ ప్రభుత్వం సీడబ్ల్యూసీకి 2020 డిసెంబర్ 30న లేఖ రాసింది. ఈ అభ్యంతరాలను సీడబ్ల్యూసీ తోసిపుచ్చింది. సీడబ్ల్యూసీ నివేదిక ఆధారంగా అప్పర్భద్రకు 2018–19 ధరల ప్రకారం రూ.16,125 కోట్లతో చేపట్టేందుకు 2021, మార్చి 25న కేంద్ర జల్శక్తి శాఖ పెట్టుబడి అనుమతి ఇచ్చింది. ఈ ప్రాజెక్టుకు జాతీ య హోదా కల్పించాలని కేంద్రానికి కర్ణాటక ప్రతిపాదించింది. దీనిపై కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శి నేతృత్వంలోని హైపవర్ కమిటీ 2021, నవంబర్ 6న సమావేశం నిర్వహించింది. ఆ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులే లేవని.. దానికి జాతీయ హోదా ఇవ్వకూడదని నాటి కేసీఆర్ సర్కార్తోపాటు వైఎస్.జగన్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. కానీ.. వాటిని బుట్టదాఖలు చేసి 2022, ఫిబ్రవరి 15న అప్పర్భద్రకు జాతీయ హోదా కల్పించింది. వర్షాభావంలో రాష్ట్రానికి కష్టమే.. : అప్పర్ భద్ర ప్రాజెకు పూర్తయితే.. తుంగభద్ర డ్యామ్కు, శ్రీశైలానికి వరద ప్రవాహం రావడంతో మరింత జాప్యం జరుగుతుంది. వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే.. దిగువకు వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉండదు. -
మీ మినట్స్తో మాకు తీవ్ర నష్టం
సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ అధ్యక్షతన ఇరు రాష్ట్రాల అధికారులతో కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ గత జనవరి 30న ఢిల్లీలో తొలిసారిగా సమావేశమై చర్చించిన అంశాలతో సీడబ్ల్యూసీ రూపొందించిన మినట్స్లో అవాస్తవాలు, సత్యదూరమైన అంశాలున్నాయని తెలంగాణ ఆగ్రహం వ్యక్తం చేసింది.ఆ సమావేశంలో సీడబ్ల్యూసీ సభ్యకార్యదర్శి, కృష్ణాబోర్డు సభ్యులు ఇచ్చిన ప్రజెంటేషన్లలో వెల్లడించిన పలు అభిప్రాయాలు అవాస్తవమని..న్యాయస్థానాలు, ట్రిబ్యునళ్లు వాటిని పరిగణనలోకి తీసుకుంటే తమ రాష్ట్ర వాదనలకు తీవ్ర నష్టం కలిగిస్తాయని పెదవి విరిచింది. కేంద్రం/ ఏ రాష్ట్రం/ఇతర ఏ సంస్థ కూడా మినట్స్లో పేర్కొన్న అసంపూర్ణ చర్చలను ఏ న్యాయస్థానంలో చర్చ, ఉత్తర ప్రత్యుత్తరాల కోసం వాడకూడదని తేల్చి చెప్పింది. మినట్స్లోని పేరా 8 (1), (2)తో మినహా ఇతర అంశాలతో అంగీకరించడం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి ఇ.శ్రీధర్ తాజాగా సీడబ్ల్యూసీలోని ప్రాజెక్టు అప్రైజల్ అథారిటీ (పీఏఓ)కి లేఖ రాశారు. ఈ లేఖపై ఏపీ అభిప్రాయాన్ని సీడబ్ల్యూసీ కోరింది. తెలంగాణ లేఖలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.. గోదావరి జలాల కేటాయింపులు జరగలేదనడం తప్పు గోదావరి జలాలను రాష్ట్రాలకు నిర్దిష్ట పరిమాణంలో కేటాయింపులు జరపలేదని మినట్స్లో సీడబ్ల్యూసీ పేర్కొనడం అసంపూర్ణ వ్యాఖ్య. ఇది తెలంగాణ వాదనలకు నష్టం కలిగిస్తుంది. రాష్ట్రాల మధ్య జరిగిన వివిధ అంతర్రాష్ట్ర ఒప్పందాల ఆధారంగా గోదావరి ట్రిబ్యునల్ పరీవాహక ప్రాంత రాష్ట్రాలకు నిర్దేశిత ప్రాంతాల వద్ద నీటి లభ్యత ఆధారంగా సరైన నాణ్యత, పరిమాణంతో కూడిన నిబంధనల రూపంలో కేటాయింపులు జరిపింది. గోదావరి ట్రిబ్యునల్ తీర్పునకు జత చేసిన అనుబంధం–బీలో వివిధ సబ్ బేసిన్లలోని నీటి వినియోగాన్ని స్పష్టీకరించింది. » తెలంగాణలోని కాళేశ్వరం, సీతమ్మసాగర్, సీతారామ ఎత్తిపోతల వంటి ఎన్నో ప్రాజెక్టులతో పాటు ఇతర రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు..75 శాతం లభ్యత ఆధారంగా ట్రిబ్యునల్ నిర్దేశించిన నీటి పరిమాణాల ఆధారంగా సీడబ్ల్యూసీ అనుమతులిచ్చింది. మినట్స్లో నమోదు చేసిన అంశాల్లో వాస్తవికత లోపించిందని ఈ అంశాలు పేర్కొంటున్నాయి. వాటిని సరిచేయాలి. కృష్ణా బోర్డు ప్రాథమిక బాధ్యతను మరిచింది... మిగులు జలాలపై హక్కులను కోరకుండా వాటిని వాడుకునే స్వేచ్ఛను ఉమ్మడి ఏపీకి కృష్ణా ట్రిబ్యునల్–1 కేటాయించింది. దీని ఆధారంగా ఉమ్మడి ఏపీలో ఎన్నో ప్రాజెక్టులు చేపట్టారు. ప్రస్తుత ఏపీలో అలాంటి ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తయ్యాయి. లేదా చివరి దశలో ఉన్నాయి. మరోవైపు ఉమ్మడి ఏపీ ప్రభుత్వం తెలంగాణలో చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకం వంటి బేసిన్ లోపలి ప్రాజెక్టులు పెండింగ్లో ఉండిపోగా, వాటిని ప్రస్తుత ఏపీ అడ్డుకుంటోంది. కృష్ణా ట్రిబ్యునల్–1 ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీల నుంచి ఎస్ఆర్బీసీ, భీమా తదితర ప్రాజెక్టులకు పునఃకేటాయింపులు చేస్తూ సీడబ్ల్యూసీ అనుమతులిచ్చింది. ఈ ప్రాతిపదికనే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును చేపట్టి అనుమతుల కోసం సీడబ్ల్యూసీకి డీపీఆర్ సమర్పిం చాం. ఈ పరిస్థితుల నేపథ్యంలో అనుమతులు లేని ప్రాజెక్టులకు అనుమతుల జారీకి విరుద్ధంగా కృష్ణా బోర్డు చేసిన వ్యాఖ్య ఏమాత్రం సరికాదు. మినట్స్ నుంచి తొలగించాలి టెలిమెట్రీ కేంద్రాల నిర్వహణను చేపట్టేందుకు నిరాకరిస్తూ కృష్ణాబోర్డు మినట్స్లో పేర్కొన్న కారణాలు ఏమాత్రం సరికాదు. కృష్ణా ట్రిబ్యునల్–1 తీర్పు, రాష్ట్ర పునర్విభజన చట్టం–2014తో పాటు అపెక్స్ కౌన్సిల్, కృష్ణా బోర్డుల నిర్ణయాలకు విరుద్ధమని కృష్ణాబోర్డు పేర్కొంది. నీటి వినియోగాన్ని నియంత్రించడమే ప్రాథమిక బాధ్యత కలిగిన చట్టబద్ధ సంస్థ అయిన కృష్ణాబోర్డు ఇలాంటివి చెప్పకూడదు. తెలంగాణ వాదనలకు మినట్స్లో చోటు ఇవ్వలేదు గోదావరి జలాలను కృష్ణా బేసిన్కు తరలించి అక్కడి నుంచి పెన్నా బేసిన్కు తరలించుకోవడానికి ఏపీ చేసిన ప్రతిపాదనలు జాతీయ, అంతర్జాతీయ న్యాయసూత్రాలతో పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని సమావేశంలో తెలంగాణ నొక్కి చెప్పింది. ఏపీ ప్రతిపాదించిన పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తరహా వరద జలాల ఆధారిత ప్రాజెక్టులను మధించి అనుమతులు జారీ చేసేందుకు ఎలాంటి నిబంధనలు లేవని పేర్కొంది. ఈ విషయాన్ని మినట్స్లో సీడబ్ల్యూసీ నమోదు చేయలేదు. -
దేశంలోనే మా ఆడిటింగ్ నెంబర్వన్
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ ఆడిటింగ్లో అ త్యుత్తమ ప్రమాణాల తో తెలంగాణ ఆడిట్ శాఖ దేశంలోనే నెంబర్ వ న్గా నిలిచిందని, వరు సగా మూడు సార్లు మొదటి ర్యాంకు సాధించిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్ర మార్క తెలిపారు. తెలంగాణలోని అన్ని ప్రభు త్వ వ్యవస్థలు బలంగా పనిచేస్తున్నా యని చెప్పారు. రాష్ట్రంలో అమల్లో ఉన్న ఆన్లైన్ ఆడిటింగ్ వ్యవస్థను పరిశీలించేందుకు రెండు రోజుల కిందట వచ్చిన గుజరాత్ ఆడిట్ శాఖ ఉన్నతాధికారుల బృందం మంగళవారం సచివాలయంలో భట్టితో భేటీ అయింది. ఈ సందర్భంగా వారికి సాదర స్వాగతం పలికిన భట్టి.. ఆన్లైన్ ఆడిటింగ్ అధ్యయనానికి అవస రమైన సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందజేస్తామని తెలిపారు. గుజరాత్ అధికా రులు మాట్లాడుతూ రాష్ట్రంలోని పలు గ్రామ పంచాయతీలను సందర్శించి ఆన్లైన్ ఆడిటింగ్ను అధ్యయనం చేస్తున్నామని, రాష్ట్రంలో ఆడిటింగ్ విధానం పారదర్శకంగా, సమర్థవంతంగా కొనసాగుతోందని కితాబి చ్చారు. సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఆడిట్ శాఖ డైరెక్టర్ నరసింహన్ తదితరులు పాల్గొన్నారు. -
కదం తొక్కిన కరెంట్ కార్మికులు
సాక్షి, హైదరాబాద్/హనుమకొండ: తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని, ఆర్టీజన్లను రెగ్యులర్ ఉద్యోగులుగా మార్చాలని, అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు, బిల్ కలెక్టర్లు, పీస్ రేట్ వర్కర్లను ఆర్టీజన్లుగా కన్వర్షన్ చేయాలనే డిమాండ్తో తెలంగాణ విద్యుత్ ఆర్టీజన్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం హనుమకొండలోని టీజీఎన్పిడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించారు. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టిజన్ ఉద్యోగులు, అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు, ఇతర కార్మికులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఎనీ్పడీసీఎల్ ప్రధాన కార్యాలయం ముందు ప్రధాన రహదారి మొత్తం విద్యుత్ ఉద్యోగులతో నిండిపోయింది. ఈ నెల 8వ తేదీ ఉదయం 9 గంటల నుంచి తాము సమ్మెకు వెళ్లనున్నట్లు ఆర్టీజన్ ఉద్యోగుల జేఏసీ నాయకులు ప్రకటించారు. ప్రతి ఆర్టీజన్, అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్, బిల్ కలెక్టర్లు, పీస్ రేట్ వర్కర్లు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొనాలని, డివిజన్, సర్కిల్ కార్యాలయాల వద్ద శిబిరాలు ఏర్పాటు చేసి దీక్ష చేపట్టాలని పిలుపునిచ్చారు. సమ్మెకు రెగ్యులర్ ఉద్యోగుల సంఘాల నాయకులు సైతం మద్దతు ప్రకటించారు. అవసరమైతే తాము కూడా సమ్మెలోకి వస్తామన్నారు. ప్రభుత్వం వెంటనే జేఏసీ నాయకులను చర్చలకు పిలిచి సమ్మెను నివారించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పవర్ జేఏసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్, టీఎస్ఈఈయూ–1104 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు, టీఆర్వీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కె.వి.జాన్సన్, తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నె శశికుమార్, టీఎస్ఈఈయూ రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్ రావు, తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఎస్.సతీష్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ సమ్మెకు వెళ్లేలా ప్రభుత్వం పరిస్థితులు క ల్పించిందన్నారు. ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. కాగా, ఎస్పీడీసీఎల్ పరిధిలో ఈ సమ్మెను అడ్డుకోవడానికి సమ్మెను నిషేధిస్తూ ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పరిశ్రమలో ప్రశాంతవాతావరణం క ల్పించడానికి ‘ఎస్మా’ను అమలులోకి తీసుకుని వస్తున్నామని, ఆరు నెలలపాటు ఎలాంటి సమ్మెలు చేయకుండా నిషేధం విధిస్తున్నట్లు సీఎండీ వెల్లడించారు. ఆర్టిజన్స్ సమ్మె నేపథ్యంలో క్షేత్రస్థాయిలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎండీ ఆదేశించారు. -
‘పేదల కోసం పనిచేసే పార్టీ మాది’
మహబూబ్నగర్: గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబమని, పేదల కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయితే జిల్లా సస్య శ్యామలం అవుతుందన్నారు. కేంద్రంలో కాంగ్రేస్ అదికారంలోకి వచ్చిన 3 నెలల్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తెస్తామన్నారు. కేటీఆర్, హరీష్ రావు తప్పుడు,అబద్దాలు ప్రచారం చేస్తున్నారని,రేవంత్ కోట్ల రూపాయల విదేశి పెట్టుబడులు తీసుకొచ్చారని, కష్టపడి పని చేసే వారికి కాంగ్రెస్లో పదవులు వస్తాయన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో ఆర్దిక విద్వంసం జరిగిందని, అప్పుల పాలు చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నాసిరకంగా పనులు చేయటం వల్ల కూలేశ్వరంగా మారిపోయిందని ఎద్దేవా చేశారు మహేష్కుమార్ గౌడ్. -
కొండా శ్రేయాన్ష్ మురళీ కృష్ణ పటేల్ ప్రపంచ రికార్డు
అత్యంత పిన్న వయస్సులోనే చదరంగంలో ప్రపంచ రికార్డు సాధించిన బాలుడిగా కొండా శ్రేయాన్ష్ మురళీ కృష్ణ పటేల్ నిలిచాడు. రెండు సంవత్సరాల 11 నెలల వయసులో ఈ ఘనత సాధించాడు. రాయ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రెండు అసాధారణ రికార్డులను నెలకొల్పి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (లండన్) స్థానం సాధించిన కొండా శ్రేయాన్ష్ కృష్ణ పటేల్ నిలిచాడు. 15 నిమిషాల 52 సెకండ్స్ లలో 93 బ్యాక్ ర్యాంక్ చెక్ మేట్స్ ను పరిష్కరించడంతో పాటు, 1 గంట 9 నిమిషాల 9 సెకండ్స్ లలో 21 చెస్ బోర్డ్ లను అమర్చి రెండు ప్రపంచ రికార్డులను సాధించి చరిత్ర సృష్టించాడు.జూబ్లీహిల్స్లోని ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ కాలనీ కల్చరల్ సెంటర్లో మంగళవారం వేడుకగా ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి హాజరయ్యారు.శ్రేయాన్ష్ కృష్ణ పటేల్ ప్రపంచ రికార్డ్ సాధించి, భరతమాత ముద్దు బిడ్డగా, అపార మేధస్సు కలిగిన స్వామి వివేకానందునిగా అవతరించాడని మంత్రి వాకిటి శ్రీహరి ప్రశంసించారు. మరోవైపు.. తన మనవడి ప్రతిభను చూసి మంత్రి సురేఖ మురిసిపోయారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ, శ్రీయాన్ష్ తల్లి కొండా సుస్మిత పటేల్ ఉద్వేగంతో ఆనంద భాష్పాలు రాల్చారు.కాగా రాయ్ చెస్ అకాడమీ తరఫున క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కొండా శ్రేయాన్ష్ పటేల్కు ట్రోఫీలు, సర్టిఫికెట్ లను ప్రదానం చేశారు. త్వరలో వరల్డ్ బుక్ ఆఫ్ లండన్ ద్వారా బ్రిటిష్ పార్లమెంట్లో సత్కారంతో పాటు సర్టిఫికెట్ను శ్రేయాన్ష్ కృష్ణ పటేల్ పొందనున్నాడు. -
‘రేవంత్.. మళ్లీ గెలవడం కాదు.. సింగిల్ డిజిటే మీకు’
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి హరీష్రావు ధ్వజమెత్తారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందంటూ సీఎం రేవంత్ చేసే వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ విమర్శలు గుప్పించారు హరీష్రావు. కాంగ్రెస్ మళ్లీ గెలవడం కాదు.. సింగిల్ డిజిట్కే పరిమితం అంటూ ఎద్దేవా చేశారు. ఈరోజు(మంగళవారం, ఏప్రిల్ 7వ తేదీ) పరిగి పర్యటనకు వెళ్తున్న హరీష్రావును పోలీసులు అరెస్ట్ చేసి శంషాబాద్ పీఎస్కు తరలించారు. దీనిలో భాగంగా ఆయన్ను విడుదల చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు హరీష్. ‘మీరు మళ్లీ గెలవడం కాదు కదా.. ఈసారి సింగిల్ డిజిటే మీకు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ సింగిల్ డిజిట్కే పరిమితం అవ్వడం ఖాయం. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా?, పరిగిలో రైతులను పరామర్శించేందుకు వెళ్తుంటే మమ్మల్ని అరెస్టు చేశారు. రేవంత్ రెడ్డి పాలన.. గడీల పాలన... బేడీల పాలన గుడ్డి పాలన. సాగుకు పనికిరాని భూముల్లో పరిశ్రమలు పెట్టండి. ఎస్సీ ఎస్టీ రైతులు సాగు చేసుకుంటున్నా భూములను ఎందుకు లాక్కుంటున్నారు. మీ పాలన అంతా బోగస్ మాటలు బోగస్ పాలన. రేవంత్ రెడ్డికి మించిన రావణాసురుడు ఎవరైనా ఉన్నారా?, పరిగిలో భూముల లాక్కొని తన అన్య కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 6 గ్యారెంటీలు 100 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు 900 రోజులైనా ఎందుకు పూర్తి చేయలేదు?, వచ్చే ఎన్నికల్లో రాబోయే కేసీఆర్ రాజ్యమే’ అని హరీష్ స్పష్టం చేశారు. -
IPL: ప్రిడిక్షన్ పేరిట ఆన్లైన్ బెట్టింగ్ ఉచ్చు.. జాగ్రత్త
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 ఎడిషన్ ఇప్పటికే ఆరంభమైంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్గా పేరొందిన ఈ టీ20 లీగ్ను క్యాష్ చేసుకునేందుకు మాయగాళ్లు బెట్టింగ్ పేరిట ఉచ్చు బిగుస్తూ ఉంటారు. ఈసారి కూడా ‘ఐపీఎల్ ప్రిడిక్షన్ పేరిట ఆన్లైన్ బెట్టింగ్ ఉచ్చు.. జాగ్రత్త’ అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ క్రికెట్ ప్రేమికులను హెచ్చరించారు.ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా.. ‘‘ఐపీఎల్ క్రికెట్ ఫీవర్ను ఆసరాగా చేసుకుని సోషల్ మీడియాలో కొందరు మోసపూరిత ప్రకటనలతో విరుచుకుపడుతున్నారు. కేవలం డబ్బు కోసం కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు అసత్య ప్రచారాలు చేస్తూ సామాన్యులను తప్పుదోవ పట్టిస్తున్నారు.టాస్ ఎవరిది!? మ్యాచ్ ఏ టీమ్ గెలుస్తుంది!? అని ముందే చెబుతామంటూ మిమ్మల్ని తమ ఛానెల్స్లో సబ్స్క్రైబ్ చేయించుకుని, నిలువునా ముంచే బెట్టింగ్ ఊబిలోకి లాగుతున్నారు. ఇలాంటి ఫేక్ ప్రిడిక్షన్ ఛానెళ్ల మాటలు నమ్మి మీ కష్టార్జితాన్ని పోగొట్టుకోవద్దు.ఇలాంటి ప్రమోషన్ల విషయంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం కఠినంగా వ్యవహరిస్తోంది. గత నెల రోజుల్లోనే 494 పెయిడ్ ప్రకటనలను, వాటిని ప్రచారం చేస్తున్న 129 సోషల్ మీడియా ప్రొఫైళ్లను బ్లాక్ చేయించాం. ఈ నిఘా నిరంతరం కొనసాగుతుంది. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.ఇలాంటి మోసపూరిత యాడ్స్ మీ దృష్టికి వచ్చినా లేదా మీరు మోసపోయినా, వెంటనే 1930 నంబరుకు కాల్ చేయండి లేదా http://cybercrime.gov.in పోర్టల్లో ఫిర్యాదు చేయండి’’ అని సజ్జనార్ ట్వీట్ చేశారు.ఐపీఎల్ ప్రిడిక్షన్ పేరిట ఆన్లైన్ బెట్టింగ్ ఉచ్చు.. జాగ్రత్త!!ఐపీఎల్ క్రికెట్ ఫీవర్ను ఆసరాగా చేసుకుని సోషల్ మీడియాలో కొందరు మోసపూరిత ప్రకటనలతో విరుచుకుపడుతున్నారు. కేవలం డబ్బు కోసం కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు అసత్య ప్రచారాలు చేస్తూ సామాన్యులను తప్పుదోవ పట్టిస్తున్నారు. టాస్… pic.twitter.com/nmRQUkEF0X— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) April 7, 2026 -
ఏబీఎన్ ఎదుట వైఎస్సార్సీపీ ఆందోళన.. పోలీసుల ఓవరాక్షన్
సాక్షి, హైదరాబాద్: ఏబీఎన్ రాధాకృష్ణ బూతు రాతలపై వైఎస్సార్సీపీ ఆందోళన నిర్వహించింది. హైదరాబాద్లోని ఏబీఎన్ ఆఫీసును వైఎస్సార్సీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముట్టడించారు. ఆంధ్రజ్యోతి చెత్త రాతలపై రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఏబీఎన్ వద్దకు చేరుకున్న పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ఓవరాక్షన్కు దిగారు.ఏబీఎస్ ఆఫీసు బయట శాంతియుతంగా నిరసనలు చేపట్టిన వైఎస్సార్సీపీ నేతలపై అడ్డుకునే ప్రయత్నం చేశారు. అంతటితో ఆగకుండా నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. ఓ పోలీసు.. చంద్రశేఖర్ గొంతు పట్టుకుని ఆయనను పక్కకు లాగే ప్రయత్నం చేశారు. అలాగే, పలువురు నేతల చొక్కాలు పట్టుకుని తోసేసే విధంగా ప్రవర్తించారు. దీంతో, పోలీసుల తీరు పట్ల వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనల్లో వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతూ..‘ఏబీఎన్ రాధాకృష్ణ రాతలు జర్నలిజానికి మాయని మచ్చ. విలువలు దిగజార్చేలా ఏబీఎన్ రాధాకృష్ణ రాతలు ఉన్నాయని చెప్పారు. మహిళలను రాధాకృష్ణ అవమానించారు. రాధాకృష్ణది జర్నలిజం కాదని, బ్రోకరిజం. మహిళలకు ఏబీఎన్ రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాలి. రాధాకృష్ణ అన్నం తింటున్నాడా? గడ్డి తింటున్నాడా?. ఏబీఎన్ రాధాకృష్ణ రాజకీయ వ్యభిచారి. చంద్రబాబుది, ఏబీఎన్ రాధాకృష్ణది ఒకే అజెండా. మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసేది మీరే. ఏబీఎన్ రాధాకృష్ణ రాతలకు మేము భయపడము. ఏబీఎన్ రాధాకృష్ణ ఒక చీటర్’ అంటూ మండిపడ్డారు. బూతులు రాసిన ఏబీఎన్ రాధాకృష్ణను వదిలేసి.. వైయస్ఆర్సీపీ దళిత ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గొంతు పట్టుకున్న పోలీస్🚨హైదరాబాద్లో ఏబీఎన్ ఆఫీస్ను ముట్టడించిన వైయస్ఆర్సీపీ నేతలు.. నియంత్రించే క్రమంలో హద్దులు దాటిన పోలీసులు#BanABNSaveAP#SadistChandraBabu pic.twitter.com/4jc2705E2g— YSR Congress Party (@YSRCParty) April 7, 2026 -
ఏబీఎన్ ఆఫీసును ముట్టడించిన వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, హైదరాబాద్: ఏబీఎన్ రాధాకృష్ణ బూతు రాతలపై వైఎస్సార్సీపీ ఆందోళన నిర్వహించింది. హైదరాబాద్లోని ఏబీఎన్ ఆఫీసును ముట్టడించింది. ఏబీఎన్ ఆఫీస్ ఎదుట మాజీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు నిరసనకు దిగారు.ధర్నాలో వైసీపీ నేతలు అంబటి రాంబాబు, ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున, లక్ష్మీ పార్వతి, విశ్వరూప్, శ్రీకాంత్ రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, మార్గాని భరత్, కారుమూరి, ఇజ్రాయిల్ తదితరులు పాల్గొన్నారు.ఏబీఎన్ రాధాకృష్ణ రాతలు జర్నలిజానికి మాయని మచ్చ అని వైఎస్సార్సీపీ నేతలు అన్నారు. విలువలు దిగజార్చేలా ఏబీఎన్ రాధాకృష్ణ రాతలు ఉన్నాయని చెప్పారు. మహిళలను రాధాకృష్ణ అవమానించారని తెలిపారు. రాధాకృష్ణది జర్నలిజం కాదని, బ్రోకరిజమని చెప్పారు. మహిళలకు ఏబీఎన్ రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘రాధాకృష్ణ అన్నం తింటున్నాడా? గడ్డి తింటున్నాడా? ఏబీఎన్ రాధాకృష్ణ రాజకీయ వ్యభిచారి. చంద్రబాబుది, ఏబీఎన్ రాధాకృష్ణది ఒకే అజెండా. మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసేది మీరే. ఏబీఎన్ రాధాకృష్ణ రాతలకు మేము భయపడము. ఏబీఎన్ రాధాకృష్ణ ఒక చీటర్’ అని అన్నారు. -
తమ్ముడికి రూ.26 లక్షల అప్పు ఇచ్చిన అక్క..!
హైదరాబాద్: తమ్ముడు తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వకపోవడంతో ఓ వివాహిత అదృశ్యమైంది. మేడిపల్లి పోలీసులు తెలిపిన మేరకు.. బోడుప్పల్కు చెందిన లావ్యణ్య(35) తన తమ్ముడు స్వామికి ఇతరుల వద్ద అప్పుచేసి రూ.26 లక్షలు ఇచ్చింది. అయితే ఆ డబ్బు స్వామి తిరిగి ఇవ్వక పోవడంతొ లావణ్య తీవ్ర ఒత్తిడికి గురైంది. దీంతో ఈనెల 4న పుట్టింటికి వెళ్లి డబ్బులు ఇవ్వాలని అడిగినా వారు స్పందించలేదు. దీంతో లావణ్య మనస్తాపానికి గురైంది. ఆదివారం రాత్రి భర్త ప్రపాద్ డ్యూటీ నుంచి ఇంటికి తాళంవేసి ఉంది. లోపలకు వెళ్లి చూడగా ఓ లేఖ లభించింది. తమ్ముడికి ఇచ్చిన రూ.26 లక్షలు తిరిగి రాకపోవడంతో జీవితంపై విరక్తి చెందుతున్నా.. అని రాసిఉంది. దీంతో భర్త ప్రసాద్ సోమవారం మేడిపల్లి పోలీసులకు పిర్యాదు చేశారు.వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి అదృశ్యం శ్రీనగర్కాలనీ: యువతి అదృశ్యమైన ఘటన మధురానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎన్.రమ్య(20) మధురానగర్ లక్కీ లేడీస్ హాస్టల్లో ఉంటుంది. ఈనెల 3న ఫ్రెండ్ను కలవడానికి వెళ్తున్నానని సోదరుడు నవీన్కు ఫోన్ చేసింది. యువతి ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో పాటు హాస్టల్కు కూడా తిరిగి రాకపోవడంతో నవీన్ మధురానగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.మరో ఘటనలో గ్యాస్ డెలివరీ బాయ్.. వ్యక్తిఅదృశ్యమైన ఘటన మధురానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బ్రహ్మశంకర్నగర్కు చెందిన మహేశ్(38) గ్యాస్ డెలివరీ బాయ్గా పనిచేస్తుంటాడు. మార్చి 28న మద్యం మత్తులో ఇంటికి వచ్చి భార్య బ్రహ్మణితో గొడవ పడి ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. బంధువులు, స్నేహితులతో పాటు పలు ప్రదేశాల్లో వెతికనా ఆచూకీ లభించకపోవడంతో ఆదివారం మధురానగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు -
Hyderabad: బిర్యానీ ఆర్డర్ చేసుకుంటున్న వారికి షాక్
హైదరాబాద్: మూడు రోజుల క్రితం తయారుచేసిన బిర్యానీని ఫ్రిడ్జ్లో భద్రపరిచి ఆర్డర్ రాగానే ఓవెన్లో వేడి చేసి డెలివరీ చేస్తున్న హోటల్ యజమానిపై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్–2లోని వెంకటరమణకాలనీలో నివసించే కొండారెడ్డి ఆదివారం ఉదయం జొమాటోలో చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. రోడ్ నెంబర్–2లోనే ఉన్న లక్కీ బిర్యానీ షవర్మ రెస్టారెంట్ నుంచి డెలివరీబాయ్ చికెన్ బిర్యానీ తీసుకుని కొండారెడ్డికి అందించాడు. పొట్లం విప్పి చూడగా బిర్యానీ నుంచి దుర్వాసన వచి్చంది. పరిశీలించగా కొంత కుళ్లిపోయి కనిపించింది. వెంటనే ఆయన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు లక్కీ బిర్యానీ సెంటర్కు వెళ్లి తనిఖీలు నిర్వహించగా ఫ్రిడ్జ్లో 80 బిర్యానీ ప్యాకెట్లు ఉన్నాయి. జీడిమెట్లలో సదరు హోటల్ యజమాని ఇర్ఫాన్ ఈ బిర్యానీని తయారుచేసి ఇక్కడి అవుట్లెట్లో భద్రపరుస్తూ ఆర్డర్ రాగానే ఓవెన్లో వేడి చేసి ప్యాక్ చేసి సరఫరా చేస్తున్నట్లు తేలింది. అంతేకాకుండా ఒక ఫ్రిడ్జ్ను తెరిచి చూడగా అందులో ఎలుకలు తిరగడం కూడా పోలీసులు గుర్తించారు. జీడిమెట్లలో మూడు రోజుల క్రితం తయారుచేసిన బిర్యానీని ఇర్ఫాన్ ప్యాకెట్లుగా తయారుచేసి బంజారాహిల్స్లోని తనకు చెందిన లక్కీ బిర్యానీ సెంటర్లో భద్రపరుస్తున్నట్లుగా తేలింది. దుర్వాసనలతో కూడిన బిర్యానీని సరఫరా చేసిన ఇర్ఫాన్పై పోలీసులు కేసు నమోదు చేసి హోటల్ను సీజ్ చేశారు. ఈ హోటల్ మొత్తం ఎలుకలు, బొద్దింకలు, దుర్వాసనలు, దుర్గంధంతో అపరిశుభ్రతకు కేరాఫ్ అడ్రెస్గా ఉన్న విషయాన్ని కూడా పోలీసులు నిర్థారించారు. ఫుడ్సేప్టీ అధికారులు కూడా హోటల్లో తనిఖీలు నిర్వహించారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రోజుకు 1 జీబీ
సాక్షి, స్పెషల్ డెస్క్: భారత్లో రెండేళ్లుగా స్మార్ట్ఫోన్ల అమ్మకాలు ఏటా 15 కోట్ల యూనిట్లు దాటుతున్నాయి. సామాజిక మాధ్యమాల వినియోగమూ అంతకంతకూ పెరుగుతోంది. ఇంకేముంది ఇంటర్నెట్ వాడకం జోరు మీద ఉంది. ఒక్కో మొబైల్ యూజర్ సగటున రోజుకు 1.02 గిగాబైట్స్ (జీబీ) డేటా వినియోగిస్తు న్నాడు. నాలుగేళ్లలో ఇది దాదాపు రెండింతలైందంటే మనవాళ్ల వాడకం ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం అవుతోంది. మెట్రోలే కాదు పల్లెల్లోనూ జనం ఎంచక్కా ఇంటర్నెట్లో విహరిస్తూ మొబైల్కు గంటల తరబడి అతుక్కుపోతున్నారు.ప్రపంచంలో రెండవ స్థానంలో భారత్ ⇒ 5జీ చందాదారుల సంఖ్యలో (40కోట్లు)⇒ 5జీ డేటా వినియోగంలో (నెలకు 12.9 ఎక్సాబైట్స్)⇒ 5జీ ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ చందాదారుల సంఖ్యలో (2026 ఫిబ్రవరికి 1.19 కోట్లు) నివేదిక హైలైట్స్..⇒ దేశవ్యాప్తంగా గత ఏడాది 13.7 కోట్ల 5జీ ఫోన్లు అమ్ముడయ్యాయి.⇒ వినియోగంలో ఉన్న 89.2 కోట్ల యూనిట్ల 4జీ ఫోన్లలో 38.3 కోట్ల యూనిట్లు 5జీ సపోర్ట్ చేస్తాయి.⇒ మెట్రో నగరాల్లో మొత్తం ఇంటర్నెట్ వాడకంలో 5జీ వాటా 58%.ఆధారం: నోకియా ఇండియా మొబైల్ బ్రాడ్బ్యాండ్ ఇండెక్స్–2026 నివేదిక -
కల్తీరాయుళ్లపై పీడీ యాక్టు
ఖైరతాబాద్/అమీర్పేట: ఫుడ్ సేఫ్టీపై అవగాహన కల్పిస్తూ ‘ఈట్ రైట్..స్టే హెల్తీ’అనే నినాదంతో సోమవారం నెక్లెస్ రోడ్డులో నిర్వహించిన వాకథాన్ను వైద్య ఆరోగ్య శాఖామంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. జలవిహార్ నుంచి ఐమాక్స్ పక్కనున్న హెచ్ఎండిఏ మైదానం వరకు ఈ వాకథాన్ను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రాజనర్సింహ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా ప్రజల ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయని, ఫాస్ట్ ఫుడ్ వినియోగం పెరిగిందని, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1.41 లక్షల ఫుడ్ బిజినెస్ సంస్థలు ఉన్నాయన్నారు.వీటిలో 80శాతం పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయన్నారు. ఈ పరిస్థితిని కొంత మంది దుర్వినియోగం చేస్తూ ప్రతీ ఆహార పదార్థంలో కల్తీకి పాల్పడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. గత రెండేళ్లలో 11వేలకుపైగా తనిఖీలు నిర్వహించి, కల్తీకి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకున్నామని తెలిపారు.ఫుడ్ సేఫ్టీ కోసం ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారని, శాస్త్రీయ అధ్యయనం అనంతరం త్వరలోనే కొత్త వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చి ఆహార కల్తీ కేటుగాళ్లపై పీడీ యాక్ట్ వంటి కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఈ వాకథాన్లో ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చోంగ్తు, సీపీ సజ్జనార్, ఫుడ్ సేఫ్టీ కమిషనర్ సంగీత సత్యనారాయణ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందనతో పాటు విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కల్తీ ఆహారంతో ఆరోగ్యం దెబ్బతింటుంది మనం తీసుకునే ఆహారంలో కల్తీ జరగకుండా చూసుకోవాలని, కల్తీ ఆహారం తీసుకుంటూ వెళ్తే ప్రజల ఆరోగ్యం దెబ్బ తింటుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర అన్నారు. ప్రజా పాలన ప్రగతి పణాళికలో భాగంగా ఫుడ్ సేఫ్టీ ఆధ్వర్యంలో ఆహార భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. అమీర్పేట నేచర్ క్యూర్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ’ఈట్ రైట్’మేళాను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ కల్తీని నిరోధించడానికి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పారు. -
చావడమో.. చంపడమూ
మార్చి 31వరంగల్ జిల్లాకు చెందిన స్రవంతి తన భర్త వేధింపులు తాళ లేక ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంది. ఇదే రోజు రంగారెడ్డి జిల్లాకు చెందిన బాణావత్ రాందాస్ నాయక్ తాగిన మైకంలో గొడవకు దిగి భార్య, కొడుకు, కూతురుపై రోకలి, చాకుతో దాడి చేశాడు. ఈ ఘటనలో భార్య, కొడుకు మృతి చెందారు. ఏప్రిల్ 3కరీంనగర్ జిల్లాకు చెందిన శ్రీశైలం కవల ఆడపిల్లలు పుట్టారని తరచూ భార్యతో గొడవ పడేవాడు. ఏప్రిల్ 3వ తేదీన ఇద్దరు పిల్లలకు గడ్డిమందు తాగించి బావిలో పడేశాడు. దీంతో ఇద్దరూ మృత్యువాత పడ్డారు. ఏప్రిల్ 4పటాన్చెరుకు చెందిన పరమేశ్వరరావు తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఏప్రిల్ 4వ తేదీన కూరగాయలు కోసే కత్తితో గొంతు కోసి చంపాడు. సాక్షి, హైదరాబాద్: మన దేశంలో కుటుంబ ఆత్మహత్యలు, హత్య–ఆత్మహత్యల సంఘటనలు ఒక తీవ్రమైన ప్రజారోగ్య, సామాజిక సంక్షోభాన్ని సూచిస్తున్నాయి. ఒంటరితనం, కుంగుబాటు, కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు, చదువు, ఒత్తిడి వంటి కారణాలతో మరణం తప్ప మరోమార్గం లేదని... హింసాత్మక ప్రవృత్తితో ఇతరులను చంపడమో, తాము ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఇటీవలి పోకడలను గమనిస్తే ఇవి కేవలం విడివిడి సంఘటనలే కాకుండా... తీవ్రమైన ఆర్థిక, సామాజిక, మానసిక క్షోభకు దారితీసే లక్షణాలుగా కనిపిస్తున్నాయి.కుటుంబ సంబంధిత సమస్యల కారణంగా దంపతులు పిల్లలతో సహా ఆత్మహత్యలు చేసుకోవడమో లేదా పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య చేసుకోవడమో, భార్యాపిల్లలను హత్య చేసి భర్త ఆత్మహత్య చేసుకోవడం లాంటి ఘటనలతో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. 2022–2026 మధ్యకాలంలో ఆత్మహత్యల సంఖ్య పెరిగింది. ముఖ్యంగా అప్పులు, పేదరికం, నిరుద్యోగం, వివాహేతర సంబంధాలు అనేవి కుటుంబాలు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. రోజువారీ కూలీలు, ఆ తర్వాత గృహిణులు, స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తుల్లో ఆత్మహత్యల రేటు అత్యధికంగా ఉండడం వారి ఆర్థిక దుర్బలత్వాన్ని సూచిస్తోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో (తెలంగాణతో సహా) అప్పులు లేదా గృహ సమస్యల కారణంగా పిల్లలతో సహా మొత్తం కుటుంబం విషం తాగడం లేదా ఉరి వేసుకోవడం వంటి సంఘటనలు, సామూహిక ఆత్మహత్యలు పెరుగుతున్నాయి.కుటుంబ కలహాలు, ఆర్థిక ఒత్తిళ్లు లేదా మానసిక అనారోగ్యం వంటి కారణాల వల్ల, ఒక కుటుంబ సభ్యుడు ఇతరులను (భార్య/భర్త పిల్లలను) చంపి ఆత్మహత్య చేసుకునే కేసులు ఇటీవల గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా బాధితుల్లో గణనీయమైన సంఖ్యలో ‘గృహిణులు’ఉంటున్నారు. వీరి ఆత్మహత్యలు తరచుగా వ్యక్తిగత సమస్యలు, గృహ హింస లేదా తీవ్రమైన ఆర్థిక సమస్యలు, గృహ ఒత్తిడితో ముడిపడి ఉన్నట్టుగా వెల్లడైంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) డేటా ప్రకారం 2023లో ఆత్మహత్య బాధితులలో 66% మంది అత్యల్ప ఆదాయ వర్గానికి (సంవత్సరానికి రూ.1 లక్ష లేదా అంతకంటే తక్కువ సంపాదించేవారు) చెందినవారు ఉన్నారు. చావులు పరిష్కారం కాదనే అవగాహన, మ్యారేజీ కౌన్సెలింగ్ పెంచాలి నేటి సమాజంలో యువత, దంపతులకు తాహతుకు మించి ఆశలు పెరుగుతున్నాయి. తమ జీవితం, ఆర్థిక పరిస్థితులు, సమాజం తదితరాల పట్ల స్పష్టమైన అవగాహన లేక ప్రతిష్టకు పోయి సమస్యల్లో కూరుకుపోతున్నారు. నేటితరం ఆడంబరంగా పెళ్లిళ్లు, ఆ తర్వాత ఖర్చుతో కూడుకున్న ట్రిప్లు, పెద్దపెద్ద ఇళ్లు, ఖరీదైన ఫోన్లు, వాహనాలు...ఇలా లెక్కకుమిక్కిలి ఖర్చులతో ఆర్థికపరంగా చిక్కుల్లో కూరుకుపోతున్నారు. దీంతో అక్రమ మార్గాల్లో ఆదాయం పెంచుకోవడంపై దృష్టితో తాగుడు, డ్రగ్స్, చెడు వ్యసనాలు, బెట్టింగ్లకు బానిసలై హింసా ప్రవృత్తితో హత్యలకు, కుంగుబాటుతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ పరంగా హత్యలు, ఆత్మహత్యలు పరిష్కారం కాదనే అవగాహనతోపాటు మ్యారేజీ కౌన్సెలింగ్ విస్తృతం చేయాలి. కుంగుబాటు, మానసిక ఒత్తిళ్లు పెరుగుదల వంటి వాటిని ముందుగానే గుర్తించి కౌన్సెలర్లను సంప్రదిస్తే సమస్యల పరిష్కారానికి అవకాశం కలుగుతుంది. డిజిటల్ యుగంలో సెల్ఫోన్తో ఎవరితోనైనా ఎక్కడి నుంచైనా సులభంగా కనెక్ట్ అవుతున్నారు. ‘పోర్న్’కూడా యువత, ఇతర వర్గాలను విపరీతంగా ప్రభావితం చేస్తోంది. - సి.వీరేందర్, సైకాలజిస్ట్ కుటుంబ ఆధారిత వ్యవస్థ, సోషల్ సపోర్ట్ సిస్టమ్ ఏది ? ఇప్పుడు కుటుంబ ఆధారిత వ్యవస్థ, సోషల్ సపోర్ట్ సిస్టమ్ కనుమరుగవుతోంది. సమస్యలు, కుంగుబాటు వంటివి తలెత్తితే ఇంట్లోని పెద్దవారు సరిదిద్దేవారు. కుటు ంబ సంబంధాలు, ఆర్థిక సమస్యలు, ఇతర రూపాల్లో సవాళ్లు ఎదురైనప్పుడు వాటిని ఎలా అధిగమించాలో చాలామందికి తెలియడం లేదు. చదువు పూర్తి కాగానే ఏడ ంకెల జీతాలు, విలాసాలతో కూడుకున్న జీవనం, సౌకర్యాలు కోరుకుంటున్నారు.దానికి తగ్గట్టుగా విద్యార్హతలు, తాహతు లేకపోతే కుంగుబాటుకు గురికావడం, వ్యక్తిగత సంబంధాల్లో భేదాభిప్రాయాలు, భాగస్వాముల మధ్య స్పర్థలు, కోపా లు, ఆవేశాలు పెరిగిపోయి హత్యలు, ఆత్మహత్యలే శరణ్యమనే స్థాయికి చేరుకుంటున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా మనుషులను కనెక్ట్ చేయడానికి బదులు ఏకాకులను చేయడానికే ఎక్కువ ఉపయోగపడుతోంది. రోజులో ఎక్కువ సమయం సెల్ఫోన్లు, టీవీల్లో మునిగి మనుషుల్లో ఏకాకితనం పెరుగుతోంది. - డా. నిశాంత్ సైకియాట్రిస్ట్ -
సీపీఎస్ ఉద్యోగులకు ‘ప్రాన్’ భయం
మార్చి 14వ తేదీన లాంగ్వేజ్ పండిట్ ధరమ్సింగ్ ప్రాన్ ఖాతాలో రూ.18,88,500 ఉండగా, మార్చి 31వ తేదీ నాటికి రూ.18,17,933కు పడిపోయింది. కేవలం రెండు వారాల వ్యవధిలో ఆయన ఖాతాలో రూ.70,567 తగ్గింది.కల్వల్ శ్రీకాంత్ ఖాతాలో మార్చి 18వ తేదీన రూ.20,93,640 ఉండగా, మార్చి 31వతేదీ నాటికి రూ. 20,51,936 ఉంది. కేవలం 12రోజుల వ్యవధిలో రూ.41,704 కోత పడింది.సాక్షి, హైదరాబాద్: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) పరిధిలోని ఉద్యోగుల ప్రాన్ ఖాతాల్లో సొమ్ము ఆవిరవుతోంది. అమెరికా–ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకుల ఫలితంగా వారి పెన్షన్ ఖాతా సొమ్ము క్రమంగా పతనమవుతోంది. ఒక్కో ఉద్యోగి ప్రాన్ (పీఆర్ఏఎన్–పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్) ఖాతా నుంచి సగటున 4 నుంచి 7 శాతం మేర పతనం కావడం ఇప్పుడు ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు ఇచ్చే పెన్షన్ ప్రభుత్వం నేరుగా ఇవ్వకుండా, ప్రత్యేక సంస్థ పరిధిలో నిర్వహిస్తుంది.ఉద్యోగి, ప్రభుత్వం ఇచ్చే వాటాను సదరు సంస్థలు మార్కెట్లో పెట్టుబడులు పెడతాయి. ప్రస్తుతం యుద్ధ వాతావరణంతో దాదాపు నెలరోజులుగా మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఒక్కసారిగా మార్కెట్ పతనం అవుతున్నా..తిరిగి సాధారణ స్థితికి చేరుకునే అవకాశాలు ఏ మాత్రం కనిపించకపోవడంతో ఉద్యోగులు భయాందోళన చెందుతున్నారు. వాస్తవానికి ప్రాన్ ఖాతాల్లో ఉండే సొమ్మును ఉద్యోగులు ఉద్యోగ విరమణ సమయంలో విత్డ్రా చేసుకుంటారు. అయితే తాము జమ చేసుకుంటున్న సొమ్ము రిటైర్మెంట్కు ముందే భారీగా కరిగిపోతుండడంతో అయోమయానికి గురవుతుండగా..ఉద్యోగ సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఉద్యోగి భవిష్యత్ను స్టాక్ మార్కెట్లో పెడతారా?సీపీఎస్ విధానంలో ఉద్యోగి భవిష్యత్ అత్యంత ప్రమాదకరంగా మారింది. తాజా పరిస్థితులు మరింత స్పష్టం చేస్తున్నాయి. ఎక్క డో యుద్దం జరుగుతుంటే..ఇక్కడ సీపీఎస్ ఉద్యోగి ప్రాన్ ఖాతా లో నిధులు ఆవిరవుతున్నాయి. ఉద్యోగి సొంతంగా అందులో పెట్టుబడి పెడితే నష్టాన్ని భరిస్తాడు. కానీ యుద్ధం ఎక్కడ జరుగుతుంది.. పెట్టుబడి ఎవరు పెడుతున్నారు.. ఎవరు నష్టపోతున్నారు ? ప్రభుత్వం ఆలోచించాలి. సీపీఎస్ కింద ఉద్యోగి వాటా 10%తో పాటు ప్రభుత్వం చెల్లిస్తున్న 10% వాటా కూడా ప్రజలు చెల్లించిన పన్నుల రూపంలో వచి్చన ప్రజా ధనమే. ఇంతటి భారీ మొత్తాన్ని కార్పొరేట్ కంపెనీల లాభనష్టాల మీద ఆధారపడేలా చేయడం ప్రజలను, ఉద్యోగులను వంచించడమే. ప్రభుత్వోద్యోగుల పెన్షన్పై కార్పొరేట్ పెత్తనం సాగనివ్వొద్దు. తక్షణమే సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తేనే ఉద్యోగి ప్రశాంతంగా జీవిస్తాడు. – స్థితప్రజ్ఞ, తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు (టీఎస్సీపీఎస్ఈయూ)ఉద్యోగుల బతుకులు నిత్యం టెన్షన్లోనేపెన్షన్ అనేది ఉద్యోగికి అవసరాల కోసమే కాదు... ఉద్యోగి కుటుంబ సభ్యుల భవిష్యత్కు సంబంధించినది కూడా. దానిని స్టాక్ మార్కెట్తో ముడిపెట్టడంతో ఉద్యోగి బతుకులు నిత్యం టెన్షన్తోనే గడుస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ అమలు చేస్తానని చెప్పింది. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోవాలి. మార్కెట్ ఒడిదుడుకుల వల్ల మా పిల్లల భవిష్యత్, మా వృద్ధాప్య భద్రతను బలి చేయొద్దు. – కల్వల్ శ్రీకాంత్, టీఎస్సీపీఎస్ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
మీ డేటా పాతది
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డి, కేరళ సీఎం విజయన్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ చేసిన వ్యాఖ్యలకు ఎక్స్ వేదికగా విజయన్ ఘాటుగా స్పందించగా, ఆ వ్యాఖ్యలకు దీటుగా బదులిస్తూ రేవంత్ మరింత ఘాటైన లేఖ రాశారు. అను భవజ్ఞులైన రాజకీయ నాయకుడనే గౌరవంతో ఎక్స్ వేదికగా మీ స్పందనను చదివానని, అందులో తప్పుదారి పట్టించే అంశాలతోపాటు ముఖ్యాంశాల్లో లోపాలు కనిపించాయని, రెండు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాల దృష్ట్యా నిజాలను తెలియజేయడం తన బాధ్యతగా భావిస్తూ ఈ లేఖ రాస్తున్నట్టు పేర్కొన్నారు. అన్ని అంశాలపై చర్చించేందుకు ఈనెల 7న త్రివేండ్రంకు వస్తానని, అన్ని విషయాలపై గణాంకాలతో సహా చర్చ జరుపుదామని విజయన్ను ఆహ్వానించారు. లేఖలో ఏముందంటే...⇒ నేను కేరళ వ్యవస్థలను ఎక్కడా తప్పుపట్టలేదు. మీ ఎల్డీఎఫ్ పాలనలోని లోపాలను మాత్రమే ఎత్తిచూపాను. ⇒ మీరు నీతిఆయోగ్ ఇచ్చిన ఎస్డీజీ 2023–24 గురించి మాట్లాడారు. కానీ ఆ డేటా పాతది. తెలంగాణను వినాశనం చేసిన బీఆర్ఎస్ పదేళ్ల పాలన చరమాంకంలో ఇచ్చిన గణాంకాలను పట్టుకుని మా ప్రభుత్వం గురించి చెబుతున్నారు. 2023, డిసెంబర్లో ఆ పాలన అయిపోయింది. ⇒ 2025 తర్వాతి కాలంలో దేశంలోనే సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా కేరళ నిలుస్తుందని మీ పోస్ట్లో చెప్పారు. మరి ఇప్పుడు 2026, ఏప్రిల్ నడుస్తోంది. మీ రాష్ట్రం 100 శాతం అక్షరాస్యత సాధించిందా? ⇒ కేరళలో పేదరికం తెలంగాణ కంటే తక్కువ స్థాయిలో ఉందన్నది వాస్తవమే. కానీ అది 60 కంటే ఎక్కువ సంవత్సరాల ప్రగతిశీల పాలన ద్వారా సాధ్యమైంది. గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన గణనీయ సంపద ద్వారా జరిగింది. 12 ఏళ్ల తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ–బీఆర్ఎస్ ద్వారా వారసత్వంగా పేదరికం వచ్చింది. అయితే, 60 ఏళ్ల తర్వాత మీరెక్కడున్నారు... అధికారంలోకి వచ్చిన 28 నెలల్లో మేమేం సాధించామన్నది ప్రశ్న.⇒ కాంగ్రెస్ పార్టీనే బీజేపీకి బీ–టీం అని అసంబద్ధ ఆరోపణ చేశారు. 2020లో జరిగిన కేరళ బంగారం కుంభకోణంలో స్వయంగా మీ ముఖ్య కార్యదర్శిని ఈడీ అరెస్టు చేసింది. కీలక నిందితుడు నేరుగా మీ కార్యాలయ ప్రమేయం గురించి దర్యాప్తు సంస్థలకు చెప్పాడు. ఈ విషయంలో ఈడీ జరిపిన సోదాలు, సీబీఐ విచారణలో ఎక్కడా కేరళ సీఎం కార్యాలయానికి ఉన్న లింకుల గురించి ప్రస్తావనకు రాలేదు. కానీ గాంధీ కుటుంబాన్ని మాత్రం ఢిల్లీ పెద్దలు నిత్యం వేధిస్తున్నారు. ఎవరు ఎవరికి బీ–టీం అనేది కేరళ ప్రజల విజ్ఞతకు వదిలేస్తున్నా. ⇒ మా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తున్నాం. బీజేపీ–బీఆర్ఎస్ల వాట్సాప్ అభిప్రాయాలను వల్లించకుండా మేం జీతాలు ఇస్తున్నామో లేదో తెలుసుకునేందుకు ఓ బృందాన్ని పంపి స్వతంత్రంగా విచారించుకోండి. ⇒ తలసరి ఆదాయంలో మాది దేశంలోనే రెండో స్థానం. దక్షిణాదిలోనే కాదు పెద్ద రాష్ట్రాల్లోనూ మేమే నంబర్వన్. దేశంలో భౌగోళికంగా 3.5 శాతం, జనాభా పరంగా 3 శాతం కూడా లేని తెలంగాణ జీడీపీలో 5 శాతం పాలుపంచుకుంటోంది. ⇒ మీ రాష్ట్రంలో చురుకైన యువత ఉండటం మీకు అదనపు వనరు. సుమారు 35 లక్షల మంది కేరళీయులు విదేశాల్లో ఉంటున్నారు. ఏటా 1.5 లక్షల కోట్లు వారి ద్వారా వస్తున్నాయని అంచనా. పశ్చిమాసియా భగ్గుమంటున్నా గల్ఫ్ దేశాల్లో ఉన్న మలయాళీల్లో ఒక్కరూ తిరిగి రాష్ట్రానికి రాలేదంటే కారణం మీ రాష్ట్రంలో ఉద్యోగాలు లేకపోవడమే.⇒ మీరు ఆరోపించినట్టు బుల్డోజర్లు ఏ పేద కుటుంబాన్నీ నష్టపర్చలేదు. బుల్డోజర్ బాధితులంటూ మీరు ఆరోపణలు చేసిన వారికి డబుల్బెడ్రూం ఇళ్లు, ఆర్థిక సాయం, మార్కెట్విలువ కంటే ఎక్కువ పరిహారం చెల్లించాం. ⇒ చివరగా మీ పాలన వద్దని,∙కాంగ్రెస్ మోడల్ను కేరళ ప్రజలు కోరుకుంటున్నారు. -
రూ.3 వేల కోట్ల విలువైన భూములను కొల్లగొట్టే కుట్ర
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘అసైన్డ్ భూములకు పట్టాలిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆ తర్వాత కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చి.. సెటిల్మెంట్లకు దిగుతోంది. ఇప్పటికే నాదర్గుల్లోని రూ.7 వేల కోట్ల విలువైన భూములను కొల్లగొట్టేందుకు యత్నించిన ప్రభుత్వ పెద్దలు.. తాజాగా కోహెడలోని మరో రూ.3 వేల కోట్ల విలువ చేసే 200 ఎకరాల పండ్ల మార్కెట్ భూములను కూడా తమ అనుయాయులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు’అని మాజీమంత్రి హరీశ్రావు ఆరోపించారు. ఎమ్మెల్యేలు పి.సబితారెడ్డి, దేవిరెడ్డి సుధీర్రెడ్డి, కాలేరు వెంకటేశ్, బండారు లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నేత క్యామ మల్లేశ్తో కలిసి సోమవారం ఆయన కోహెడలో పర్యటించారు. అనంతరం హరీశ్రావు మాట్లాడారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే.. భూములను కొల్లగొట్టేందుకే‘కొత్తపేటలోని గడ్డి అన్నారం పండ్ల మార్కెట్లో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కోహెడలో అంతర్జాతీయ ప్రమాణాలతో పండ్ల మార్కెట్ను కట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. ఆ మేరకు 2020లో జీఓ నంబర్ 11 తీసుకొచ్చి మార్కెట్ను నోటిఫై చేశాం. భూములు కోల్పోయిన రైతులకు రూ.10 కోట్ల నష్టపరిహారం కూడా చెల్లించాం. జీఓ నంబర్ 216 ద్వారా మార్కెట్ ఖాతాలో రూ.350 కోట్లు జమ చేశాం.రూ.1,000 కోట్ల అంచనాలతో అత్యాధునిక మార్కెట్ యార్డ్కు డీపీఆర్ కూడా సిద్ధం చేశాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటింది. ఇప్పటి వరకు తట్టెడు మట్టి తీయలేదు. టీజీఐఐసీ పేరుతో విలువైన ఈ భూములను తమ అనుయాయులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇది పూర్తిగా రైతుల సమస్య. ఏ ప్రభుత్వమైనా రైతుల కోసం పని చేయాలి. కానీ సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కమీషన్ల కోసం పనిచేస్తోంది. ‘దిల్’భూములను మార్కెట్కెలా కేటాయిస్తారు?ఇక్కడ భూములకు ప్రత్యామ్నాయంగా దిల్ భూముల్లో మార్కెట్ కట్టిస్తాం అంటున్నారు. ఏపీ హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలోని డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(దిల్) భూములపై అనేక వివాదాలు ఉన్నాయి. వీటిలో ఏపీ వాటా అడుగుతోంది. ఈ భూములపై కోర్టు కేసులు కూడా ఉన్నాయి. పలువురు పేద రైతులు ఈ భూములపై ఆధారపడి ఉన్నారు. ఎలాంటి వివాదాలు లేని భూములను అనుయా యులకు అప్పగించి.. వివాదాస్పద దిల్ భూములను మార్కెట్కు ఎలా కేటాయిస్తారు? రేవంత్రెడ్డి ప్రభుత్వం కన్ను కోహెడ భూములపై పడింది. ఇప్పటికే లీలా హోటల్ కేంద్రంగా కేరళకు చెందిన నలుగురు దళారులు వీటిని కొల్లగొట్టే ప్రయత్నం మొదలు పెట్టారు. 30 వేల మంది రైతులు కావాలో? లేక ముగ్గురు దళారులు కావాలో? ప్రభుత్వమే తేల్చుకో వాల్సి ఉంది. ఇక్కడ మార్కెట్ నిర్మించకపోతే ఎంత దూరమైనా పోరాడుతాం. రైతుల పక్షాన కొట్లాడుతాం’అని హరీశ్రావు స్పష్టం చేశారు. -
బెంగాల్ ఎన్నికలు దేశద్రోహులు, బీజేపీకి మధ్య యుద్ధం
దూద్బౌలి (హైదరాబాద్): బెంగాల్లో జరగబోయే ఎన్నికలు దేశద్రోహులకు, బీజేపీకి మధ్య యుద్ధమని... ఈ యుద్ధంలో బీజేపీ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. సోమవారం హైకోర్టు సమీపంలోని శ్రీ మురళీధర్ దేవాలయంలో ఘాన్సీబజార్ బెంగాలీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం చొరబాటుదారులకు సహకరిస్తూ వారికి ఓటర్ గుర్తింపు కార్డులను కల్పించి అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.బెంగాల్ ఎన్నికల్లో తమ కుటుంబీకులు, బంధువులు బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని బండి సంజయ్ స్థానిక బెంగాలీలను కోరారు. శనివారం పాతబస్తీలో అక్రమ నిర్మాణాలను కూల్చివేయడానికి వచ్చిన జీహెచ్ఎంసీ, పోలీసు అధికారులపై ఎంఐఎం దాడులకు దిగితే వారిపై ఎలాంటి చర్యలు లేవని.. దీనిపై సీఎం వెంటనే సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణలో హిందూ సమాజం ప్రమాదంలో ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి డ్రగ్స్ను నిరోధిస్తున్నామని చెబుతున్నారని.. కానీ రాష్ట్రంలో డ్రగ్స్ విచ్చలవిడిగా లభిస్తున్నాయన్నారు. -
కేరళకు సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం రాత్రి కేరళ వెళ్లారు. ఆయన మంగళవారం మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.ఉదయం 8.30 గంటలకు కోవలం నియోజకవర్గంలో రోడ్ షో, 10.30 గంటలకు మావెలికరలో రోడ్ షో, మధ్యాహ్నం 2 గంటలకు పతానపురం రోడ్ షోలో రేవంత్ పాల్గొంటారని ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. -
‘గ్రీన్ఫీల్డ్ రేడియల్’పై వివరాలు సమర్పించండి
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్లు వద్ద మీర్ఖాన్పేట నుంచి ఔటర్ రింగ్ రోడ్ మీదుగా రీజినల్ రింగ్ రోడ్ వరకు గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణంలో భూసేకరణను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వేసవి సెలవులు తర్వాతకు వాయిదా వేసింది. యాచారం మండలం కుర్మిద్ద గ్రామం, కడ్తల్ మండలంలోని కడ్తల్, ముద్విన్ గ్రామాలు, ఆమనగల్లు మండలంలోని ఆమనగల్లు, అకుతోటపల్లి గ్రామాల్లో 554.34 ఎకరాల భూమికి సంబంధించి ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ 98 ఏళ్ల వృద్ధురాలు అహల్యదేవి సహా మరో 30 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. భూసేకరణ చట్ట ప్రకారం పరిహారం చెల్లించకుండా, పిటిషనర్ల వ్యక్తిగత విచారణ జరపకుండా భూసేకరణ ప్రక్రియ ప్రారంభించారన్నారు. సర్కార్ నిర్ణయం చట్టవిరుద్ధమైనదిగా, ఏకపక్షమైనదిగా, దురుద్దేశపూరితమైనదిగా ప్రకటించాలని కోరారు. విచారణ జరపకుండానే పిటిషనర్ల అభ్యంతరాలను తిరస్కరించడం సరికాదన్నారు. పిటిషనర్ల 61.24 ఎకరాల భూమికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తరఫున ఏజీ ఏ.సుదర్శన్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. సేకరిస్తున్న మొత్తం 554.34 ఎకరాల్లో 200 ఎకరాలు మాత్రమే వివాదాస్పదంగా ఉన్నాయని, 26 ఎకరాల ప్రాంతంలోని ఆస్తులకు ఇప్పటికే పరిహారం మంజూరు చేశామన్నారు. భూసేకరణ ప్రక్రియపై స్టే విధించొద్దని కోరారు. పరిహారం మంజూరు చేసే వరకు పిటిషనర్లను వారి భూముల నుంచి ఖాళీ చేయించమన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేశారు. -
రసాభాసగా ‘మూసీ’పై అభిప్రాయ సేకరణ
బండ్లగూడ: రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో భూ సేకరణ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు, గాంధీ సరోవర్ ప్రాజెక్టు అభివృద్ధి నిమిత్తం భూ సేకరణ చట్టం సెక్షన్ 11(2) అనుసరించి కిస్మత్పూర్లోని రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయంలో పోలీసుల బందోబస్తు మధ్య ప్రజాభిప్రాయ సేకరణ సోమవారం జరిగింది. ఈ సభ గొడవకు దారి తీయగా, భూ బాధితులు, మధుపార్క్ అపార్ట్మెంట్వాసులు అధికారులను నిలదీశారు. రాజేంద్రనగర్ ఆర్డీవో వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి మధు అపార్ట్మెంట్ ప్రాంతాలకు చెందిన బాధి తులు, హిమాయత్సాగర్, కిస్మత్పూర్, గంధంగూడ తదితర ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చారు. ప్రాజెక్టు అసలు లక్ష్యం ఏంటనే దానిపై అధికారులు క్లారిటీ ఇవ్వడం లేదని, ఇది కేవలం గాంధీ సరోవర్ కోసమా? లేక మూసీ బ్యూటిఫికేషన్ కోసమా? అన్నది స్పష్టం చేయాలని వారు డిమాండ్ చేశారు. కష్టపడి సంపా దించుకున్న ఇళ్లను ఎందుకు ఇవ్వాలి? బఫర్ జోన్, ఎఫ్టీఎల్ అని ఏ ప్రాతిపదికన నిర్ధారించారు? అని అధికారులను నిలదీశారు. బాధితుల ప్రధాన ప్రశ్నలు...: పన్నుల చెల్లింపు క్రమం తప్పకుండా ప్రాపర్టీ టాక్స్, ఇతర పన్నులు కడుతున్నప్పుడు తమ ఇళ్లను అక్రమ కట్టడాలుగా ఎలా చిత్రీకరిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. తామంతా ఆఫీసులకు సెలవులు పెట్టి ఈ అభిప్రాయ సేకరణకు రావాలా? సరైన ప్రణాళిక లేకుండా మమ్మల్ని పిలవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు వల్ల ప్రజలకు కలిగే ఉపయోగం ఏమిటో చెప్పకుండా, అడ్డగోలుగా భూములు, ఇళ్లు ఎలా తీసుకుంటారని నిలదీశారు. బాధితులంతా ఒక్కసారిగా ఆర్టీవో వద్దకు దూసుకెళ్లి నిరసన తెలపడంతో కార్యాలయంలో తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి అదుపుతప్పుతుండడంతో అక్కడే మోహరించిన పోలీసు బలగాలు బాధితులను అడ్డుకున్నాయి. తాము ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదని, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ఇళ్లు ఇచ్చే ప్రసక్తే లేదని గాంధీ సరోవర్ ప్రాంత బాధితులు కుండబద్దలు కొట్టినట్లు అధికారులకు తేల్చిచెప్పారు. బాధితులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో సభలో తీవ్ర ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకట్రెడ్డి, గండిపేట మండల ఎమ్మార్వో శ్రీనివాస్రెడ్డి, రెవెన్యూ అధికారులు, భూ బాధితులు తదితరులు పాల్గొన్నారు. -
‘భవ్య బాసర’కు భూమిపూజ
నిర్మల్: దేశంలోని ఏకైక సరస్వతీ క్షేత్రమైన బాసరను భవ్యమైన ఆలయంగా పునరాభివృద్ధి చేసేందుకు రూ.225 కోట్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. ఆ పనులకు సోమవారం భూమిపూజ నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్, బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అలాగే ముధోల్ నియోజకవర్గంలో రూ.200 కోట్లతో నిర్మించే యంగ్ ఇండియా స్కూల్కు సీఎం శంకుస్థాపన చేశారు.కుటుంబసభ్యులు, మంత్రులతో కలిసి..ముఖ్యమంత్రి ఉదయం 11.42 గంటలకు సతీమణి గీతారెడ్డి, కుమార్తె, అల్లుడు, మనవడు రియాన్ష్ , మంత్రులతో కలిసి రెండు హెలికాప్టర్లలో బాసరకు చేరుకున్నారు. ముందుగా ఆలయంలో అమ్మవారి ఎదుట వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య రియాన్ష్ కు తన సతీమణితో కలిసి అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం సరస్వతీ, మహాలక్ష్మీ, మహంకాళీ అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ అర్చకుల నుంచి వేద ఆశ్వీరచనం, దేవాదాయ శాఖ అధికారుల సత్కారం స్వీకరించారు. తర్వాత మంత్రులతో కలిసి ఆలయ ప్రాంగణంలో తూర్పు ముఖద్వారం పక్కన మాస్టర్ప్లాన్ ప్రకారం చేపట్టనున్న విశాలమైన నూతన ఆలయానికి భూమిపూజ నిర్వహించారు.అక్కడే యంగ్ ఇండియా స్కూల్కు కూడా శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎంపీలు గొడం నగేశ్, వేం నరేందర్రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, ఖానాపూర్ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్, ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి, ఎమ్మెల్సీలు దండె విఠల్, చిన్నమైల్ అంజిరెడ్డి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీ షర్మిల, ఆలయ ఇన్చార్జి ఈవో విజయరామారావు తదితరులు పాల్గొన్నారు.ముఖ్యమంత్రి మౌనంబాసర పర్యటనలో సీఎం రేవంత్రెడ్డి ఎక్కడా మాట్లాడలేదు. మీడియాను ఆలయంలోకి అనుమతించలేదు. బాసరలోనే ఉన్న ట్రిపుల్ ఐటీ సమస్యలపై స్పందిస్తారని, నిర్మల్ జిల్లాలో ఏర్పాటు చేస్తానన్న యూనివర్సిటీ గురించి ముఖ్యమంత్రి మాట్లాడతారని భావించినా భూమిపూజ, మనవడి అక్షరాభ్యాస కార్యక్రమాలకే పరిమితమయ్యారు. లంచ్ టైమ్లో కాసేపు నిర్మల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో మాట్లాడారు. -
సమస్యలు పరిష్కరించకపోతే మెరుపు సమ్మె
హిమాయత్నగర్ (హైదరాబాద్): తెలంగాణలోని 600 గ్యాస్ ఏజెన్సీలలో పనిచేస్తున్న 60 వేల మంది కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే వారం రోజుల్లో సమ్మె చేస్తామని తెలంగాణ కుకింగ్ గ్యాస్ డెలివరీ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు నకిరేకంటి శ్రీనివాస్ గౌడ్ హెచ్చ రించారు. సోమవారం బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయన మాట్లా డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఎల్పీజీ గ్యాస్ సరఫరా సజావుగా అందించాలని ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తే అందుకు విరుద్ధంగా రాష్ట్రంలోని డిస్ట్రిబ్యూ టర్స్, డీలర్స్ వ్యవహరిస్తున్నారని అన్నారు. డెలివరీ బాయ్స్తో అక్రమంగా రీఫిల్లింగ్ సిలిండర్లు సరఫరా చేయాలని వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పోలీసులు డెలివరీ బాయ్స్ని అరెస్టు చేస్తూ యాజ మాన్యాలను వదిలేస్తున్నారని ఆరోపించారు. గత 12 ఏళ్ల నుంచి గ్యాస్ డెలివరీ బాయ్స్గా పనిచేస్తున్న ఏ ఒక్క కార్మికుడికి కార్మిక చట్టం ప్రకారం యాజమాన్యాలు జీతా లు, వసతులు కల్పించడం లేదన్నారు. సమస్యలపై సీఎం రేవంత్రెడ్డి, కార్మిక శాఖ మంత్రి వివేక్, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి సంబంధిత అధికారు లతో రివ్యూ చేయించి పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో గౌరవ సలహాదారు కె.వి.గౌడ్ పాల్గొన్నారు. -
2026లో ప్రపంచంలో ఆయిల్, గ్యాస్ కొరతే
సాక్షి, హైదరాబాద్: ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన హెచ్చరికలపై హైదరాబాద్లోని ఇరాన్ కాన్సులేట్ తీవ్రంగా స్పందించింది. ‘మంగళవారం పవర్ప్లాంట్ డే’ అని ట్రంప్ చేసిన హెచ్చరికకి అక్షరాలా అర్థం.. ‘బుధవారం పశ్చిమాసియాలో విద్యుత్ సరఫరా స్తంభించిపోతుంది, 2026లో ప్రపంచంలో ఆయిల్, గ్యాస్ కొరత నెలకొంటుంది’ అనేనని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా సోమవారం పరోక్ష హెచ్చరికలు జారీ చేసింది. విశ్వశాంతి, ఇంధన భద్రతకు ట్రంప్ ముప్పుగా పరిణమించాడని విమర్శించింది.అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్పై బాంబుల వర్షం కురిపిస్తుండగా, ఇరాన్ పశ్చిమాసియా దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలతో పాటు ఇజ్రాయెల్పై బాలిస్టిక్ క్షిపణులతో ప్రతిదాడులు చేస్తున్న విషయం తెలిసిందే. హార్మూజ్ జలసంధిని సోమవారంలోగా తెరవకుంటే నరకానికి పంపిస్తానని ఆదివారం ఇరాన్ను హెచ్చరించిన ట్రంప్.. మంగళవారం మరో అడుగు ముందుకేసి ఆ దేశంలోని విద్యుత్ కేంద్రాలు, వంతెనలతో పాటు ఇతరత్రా అన్నింటిపై దాడులు చేస్తామని హెచ్చరించారు. దీనికి ఇరాన్ కాన్సులేట్ స్పందిస్తూ పశ్చిమాసియా దేశాల్లోని విద్యుత్ కేంద్రాలతో పాటు చమురు కేంద్రాలపై ప్రతిదాడులకు దిగుతామని పరోక్ష హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. -
గ్రాండ్ ట్రంక్ రూట్లో 120 కొత్త రైళ్లు!
సాక్షి, హైదరాబాద్: దక్షిణ–ఉత్తర భారత్లను జోడించే ప్రధాన గ్రాండ్ ట్రంక్ కారిడార్ అయిన బల్లార్షా–విజయవాడ మార్గంలో 120కిపైగా కొత్త రైళ్లు పట్టాలెక్కేందుకు వెసులుబాటు కలిగింది. బల్లార్షా–కాజీపేట–విజయవాడ–గూడూరు మధ్య మూడో లైన్ నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. మరో 38 కి.మీ. నిడివిలో మాత్రమే పనులు మిగిలి ఉన్నాయి. ఈ ఏడాది చివరి నాటికి అవి కూడా పూర్తయి మొత్తం కారిడార్ సిద్ధం కానుంది. ఇప్పటికే సిద్ధమైన 700 కి.మీ. మూడో లైన్ వినియోగంలోకి రావడంతో గత ఏడాది కాలంలో ప్రయాణికులకు విడతల వారీగా 36 కొత్త రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. మరో 50 గూడ్సు రైళ్లు కూడా పట్టాలెక్కాయి. మిగతా పనులు పూర్తయితే మరో 50 రైళ్లు కొత్తగా పట్టాలెక్కించేందుకు రైల్వే బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ఇక, ఆ కారిడార్ మొత్తాన్ని వందేభారత్ రైళ్లు గరిష్ట వేగంతో దూసుకుపోయేలా 130–150 కి.మీ. వేగాన్ని తట్టుకునే సామర్థ్యానికి ట్రాక్ను బలోపేతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మూడో లైన్, ట్రాక్ బలోపేతం పనుల్లో జాప్యం లేకుండా తాజాగా రైల్వే శాఖ దక్షిణ మధ్య రైల్వేకు భారీగానే నిధులు కేటాయించింది.రూ.13,026 కోట్ల నిధులు...ఇటీవలి కేంద్ర బడ్జెట్లో దక్షిణ మధ్య రైల్వేకు మౌలిక వసతుల మెరుగు కోసం రూ.13,026 కోట్లు కేటాయించింది. ఇది అంతకుముందు బడ్జెట్ కేటాయింపు రూ.11,012 కంటే 18% అధికం కావడం విశేషం. బడ్జెట్ సమయంలో ఈ వివరాలను వెల్లడించని రైల్వే అధికారులు తాజాగా ఆ అంకెలను విడుదల చేశారు. ఈ మొత్తం నుంచి కొత్త లైన్ల కోసం రూ.1,315 కోట్లు , డబ్లింగ్ కోసం రూ.5083 కోట్లు, ట్రాక్ పునరుద్ధరణ కోసం రూ.1,908 కోట్లు, ట్రాఫిక్ వసతుల అప్గ్రెడేషన్ కోసం రూ.403 కోట్లు, రోడ్డు భద్రతా పనుల కోసం రూ. 683 కోట్లు ప్రకటించారు. » గత ఏడాది కాలంలో జోన్ పరిధిలో కొత్తగా 194.57 కిలోమీటర్ల మేర ట్రాక్ ఏర్పాటు చేయగా, ఈ సారి ఆ నిడివి మరింత ఎక్కువ ఉండనుంది. » బాసర–నవీపేట మధ్య 17 కి.మీ. మధ్య డబ్లింగ్ పూర్తి కాగా, కాజీపేట వద్ద బైపాస్ లైన్ (21.46 కి.మీ.), వాడి వద్ద బైపాస్ లైన్ (22.70 కి.మీ.) , తాండూరు వద్ద ‘వై’ఆకృతి బైపాస్ అనుసంధానం (1.95కి.మీ), పెద్దపల్లి వద్ద బైపాస్ లైన్ ( 2.17 కి.మీ).» బల్హార్షా –మాణిక్ఘర్ మ«ధ్య మూడో లైన్(6.91 కి.మీ.), రెచ్ని రోడ్ –బెల్లంపల్లి మధ్య( 9.636 కి.మీ.), బెల్లంపల్లి–మందమర్రిమధ్య(7.52 కి.మీ.), మోట మర్రి– మధిర (5.80 కి.మీ.)మధ్య, మహబూబాబాద్ – నెక్కొండ (30.416 కి.మీ.) మధ్య, ఖమ్మం –డోర్నకల్ (19.59 కి.మీ.) మధ్య మూడో లైన్ పూర్తయింది. » ఏడాది కాలంలో 325 కిలోమీటర్ల మేర ట్రాక్ విద్యు దీకరణ కూడా పూర్తయింది. గత రెండేళ్లలో పనుల్లో వేగం వల్ల గూడూరు –విజయవాడ– కాజీపేట– బల్హా ర్షా మధ్య 700 కి.మీ. మూడో లైన్ అందుబాటులోకి వచ్చింది. పెదవడ్లపూడి – కృష్ణా కెనాల్ మధ్య 7 కి.మీ., డోర్నకల్–మహబూబాబాద్ మధ్య 20 కి.మీ., సిర్పూర్ కాగజ్నగర్–ఆసిఫాబాద్ మధ్య 11 కి.మీ. మేర పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కొత్త బడ్జెట్ నిధులు మెరుగ్గానే ఇవ్వడంతో ఈ పనులు ఈ ఏడాది చివరిలోపే పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.మరింత వేగంగా రైళ్లు...వందేభారత్ రైలు 160 కి.మీ. వేగంతో దూసుకెళ్లే అవకాశం ఉన్నా, ట్రాక్ పటుత్వం తక్కువగా ఉండడంతో ప్రస్తుతం సగటు వేగం 90 కి.మీ.లోపే. దీంతో ట్రాక్ సామర్థ్యాన్ని 130–160 కి.మీ. వేగాన్ని తట్టుకునేలా పటిష్టపరచాల్సి ఉంది. కానీ, రెండు లైన్లు మాత్రమే ఉండి, నిరంతరం వచ్చిపోయే రైళ్లతో బిజీగా ఉండటంతో పనులు చేపట్టేందుకు వీలు కలగలేదు. ఇప్పుడు మూడో లైన్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుండడంతో, రైళ్లను రెండు లైన్లకు పరిమితం చేస్తూ మూడో లైన్ను పటిష్ట పరిచేందుకు వీలు కలగనుంది. -
పూర్తయిన 692 స్పెషలిస్ట్ డాక్టర్ల ఎంపిక
సాక్షి, హైదరాబాద్: డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ (టీవీవీపీ) పరిధిలోని ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న 692 సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్ట్) పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ ఆర్బీ) సోమవారం సాయంత్రం విడుదల చేసింది. ఈ నియామకాల్లో అనస్తీషియా 226, గైనకాలజీ 247, పీడి యాట్రిక్స్ 219 పోస్టులున్నాయి. మొత్తం 692 పోస్టులకు ఎంపిక పూర్తయింది. మంగళవారం (ఏప్రిల్ 7) వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ఎంపికైన డాక్టర్లకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నియామక పత్రాలు అందజేయనున్నారు. గతేడాది ఎంహెచ్ఎస్ ఆర్బీ 1,616 సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్ట్), 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో భాగంగా గైనకాలజీ, అనస్తీషియా, పీడియా ట్రిక్స్ విభాగాలకు సంబంధించిన 692 పోస్టుల భర్తీ పూర్తవడంతో ఫలితాలు విడుదలయ్యా యి. మిగిలిన 924 స్పెషలిస్ట్ పోస్టుల భర్తీ ప్రక్రియ మే నెలలో పూర్తికానుంది. ఇక 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల్లో గైనకాలజీ, అనస్తీషియా, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్ విభా గాలకు చెందిన 174 పోస్టుల ఎంపిక ప్రక్రియ ఇటీవల పూర్తై, ఫలి తాలు విడుదలయ్యాయి.వీరికి కూడా నియామక పత్రాలు ఇవ్వనున్నారు. ఆరోగ్యశాఖలో ఖాళీల భర్తీపై దృష్టి సారించిన ప్రభుత్వంం గత రెండున్నరేళ్లలో డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు వంటి 9,572 పోస్టులను భర్తీ చేసింది. ప్రస్తుతం మరో 7,562 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతుండగా, అందులో 866 పోస్టుల నియామకాలు కూడా తాజాగా పూర్తయ్యాయి. అలాగే 2,312 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల ఫలితాలు మరో వారం రోజుల్లో విడుదల చేయనున్నట్లు బోర్డు ఇప్పటికే ప్రకటించింది. దీంతో మొత్తం భర్తీ చేసిన పోస్టుల సంఖ్య 12,750కు చేరనుంది. -
జైళ్ల శాఖ మంత్రిగా చేశా.. మీ సమస్యలు నాకు తెలుసు!
కుషాయిగూడ (హైదరాబాద్): మత్తు పదార్థాల దుర్వినియోగం తీవ్రమైన సామాజిక, ప్రజా ఆరోగ్య సమస్యగా నిలుస్తోందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా చెప్పారు. తన రాజకీయ జీవితంలో అనేకసార్లు జైళ్లను సందర్శించిన అనుభవం ఉందని ఖైదీలు, జైలు సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు తాను అర్థం చేసుకోగలనని పేర్కొన్నారు. గతంలో యూపీలో జైళ్ల శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో జైళ్లలో పరిస్థితుల మెరుగుదలకు, సి బ్బంది సంక్షేమానికి ఎన్నో చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. పోలీసు కానిస్టేబుళ్లకు, జైలు వార్డర్లకు సమాన వేతనాలు కల్పించేందుకు కృషి చేసినట్లు చెప్పారు. ఖైదీలకు మానవీయ వాతావరణం కల్పించేందుకు జైళ్లలో ఫ్యాన్లు, టీవీ వంటి సౌకర్యాలు ప్రవేశపెట్టినట్లు గుర్తు చేశారు. భవిష్యత్లో కూడా సంస్కరణాత్మక కారాగార వ్యవస్థను బలోపతం చేయడంలో తన మద్దతు కొనసాగుతుందని స్పష్టంచేశారు. సోమవారం చర్లపల్లి కేంద్ర కారాగారంలో ‘నివృత్తి’మత్తు విముక్తి కేంద్రాన్ని శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్తు విముక్తి కేంద్రాల వంటి కార్యక్రమాలు నషా ముక్త్ భారత్ అభియాన్ వంటి జాతీయ పథకాల లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయన్నారు. తెలంగాణ కారాగార శాఖ సంస్కరణాత్మక, మానవీయ దృక్పథంతో ముందుకు సాగుతుండటం అభినందనీయమని చెప్పారు. పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఏరియా 77 నేచర్ క్యాంప్, అడ్వెంచర్ పార్క్ ప్రాజెక్టు ఓపెన్ ఎయిర్ జైలు ఖైదీలు, విడుదలైన ఖైదీలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయన్నారు. వినోదాత్మక, శిక్షణాత్మక కార్యకలాపాల ద్వారా పునరావాసానికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని పేర్కొన్నారు. జీవనోపాధి కార్యక్రమాల ద్వారా ఖైదీల్లో నైపుణ్యాభివృద్ధి మెరుగుపరచడంతోపాటు బాధ్యతాభావాన్ని పెంపొందించవచ్చని చెప్పారు. కీలక మైలురాయిగా నివృత్తి: డీజీ సౌమ్యా మిశ్రా చర్లపల్లి జైల్లో ‘నివృత్తి’మత్తు విముక్తి కేంద్రం జైలు సంస్కరణల దిశగా ఓ కీలకమైన మైలురాయిగా నిలుస్తుందని తెలంగాణ జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్యా మిశ్రా అన్నారు. ఈ కేంద్రాలు చంచల్గూడ, చర్లపల్లి, సంగారెడ్డి, నిజామాబాద్ సెంట్రల్ జైలుతోపాటు హైదరాబాద్ మహిళా ప్రత్యేక జైలులో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఖైదీలు గౌరవప్రదంగా తమ జీవితాలను పునర్నిర్మించుకునే అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమశాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, వికలాంగుల, వృద్ధుల సంక్షేమశాఖ డైరెక్టర్ శైలజ, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
12 రంగాలు ప్రైవేటుకు..
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ధనీకరణ (మానిటైజేషన్) విధానాన్ని మరింత విస్తృతం చేయాలని నిర్ణయించింది. రానున్న ఐదేళ్లలో 12 కీలక రంగాలకు సంబంధించిన ఆస్తులతో పాటు సేవలు, వ్యవస్థలను ప్రైవేటీకరించడం ద్వారా రూ.16.72 లక్షల కోట్లు సమకూర్చుకోనుంది. ‘నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ 2.0’ పేరుతో నీతి ఆయోగ్ ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. దీని ప్రకారం జాతీయ రహదారులు, రైల్వేలు, విద్యుత్, పెట్రోలియం, సహజవనరులు, పౌర విమానయానం, పోర్టులు, వేర్హౌసింగ్, పట్టణ మౌలిక సదుపాయాలు, బొగ్గు, గనులు, టెలికాం, పర్యాటక రంగాలకు సంబంధించిన ఆస్తులు, సేవలను కేంద్రం ప్రైవేటు పరం చేయనుంది. తద్వారా వాటి విలువను నగదు రూపంలోకి మార్చుకోనుంది. రాష్ట్ర ఆదాయం సంచిత నిధికి జమ ధనీకరణ అమలుకు డిజైన్, బిల్డ్, ఆపరేట్, మెయింటెయిన్ (డీబీవోఎం), డిజైన్, బిల్డ్, ఆపరేట్ (డీబీవో) డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ (డీబీఎఫ్వోటీ), ఆపరేట్, మెయింటెయిన్, ట్రాన్స్ఫర్ (ఓఎంటీ), పబ్లిక్ ప్రైవేట్ భాగస్వా మ్యం (పీపీపీ), పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో/ఎఫ్పీవో) పద్ధతులను అవలంబించనుంది. ఈ పద్ధతుల్లో భాగంగా కొన్ని సందర్భాల్లో ప్రాజెక్టు పూర్తయిన తర్వాత కూడా ఆయా ఆస్తులు ప్రైవేటు సంస్థల చేతుల్లోనే ఉండేలా ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రాలకు ఆదాయం లభిస్తే దాన్ని ఆయా రాష్ట్రాల సంచిత నిధి (కన్సాలిడేటెడ్ ఫండ్)కి జమ చేయనుంది. కొన్ని సందర్భాల్లో మాత్రం ప్రభుత్వం యాజమాన్య హక్కును నిలుపుకుంటూ, ఆస్తులను ఒక నిర్ణీత కాలానికి లీజుకు ఇస్తుంది. కీలక రంగాల మానిటైజేషన్ ఇలా.. అధిక నగదు సృష్టే లక్ష్యం రైల్వే ప్రైవేటీకరణతో పాటు రైల్వే పీఎస్యూల్లో పాక్షిక పెట్టుబడుల ఉపసంహరణ కూడా చేయనుంది. వికసిత భారత్ లక్ష్యానికి అనుగుణంగా కొత్త రంగాలతో ధనీకరణను విస్తృతం చేయడం, 2026–27 నుంచి 2030–31 వరకు జీడీపీకి సహాయకారిగా ఉండేలా ఎక్కువ మొత్తంలో నగదును సృష్టించడం ఈ మానిటైజేషన్ లక్ష్యాలని, కేబినెట్ సెక్రటరీ పర్యవేక్షణలో ఉండే ఒక అధికారిక కమిటీ అసెట్ మానిటైజేషన్ డాష్బోర్డ్ ద్వారా పర్యవేక్షిస్తూ ఈ ప్రాజెక్టును అమలు చేస్తుందని నీతిఆయోగ్ వెల్లడించింది. -
తగ్గని సిలిం'డర్'!
సాక్షి, హైదరాబాద్: ‘వంట గ్యాస్కు ఎలాంటి ఇబ్బంది లేదు. బుక్ చేసుకున్న ప్రతీ ఒక్కరికి సిలిండర్ పంపిణీ చేస్తాం. ఆందోళన వద్దు’.. ఇది ఇరాన్– ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ప్రారంభమైన మొదటి వారంలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి, ఆ శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర చేసిన ప్రకటన. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. బుకింగ్ చేసి 15, 20 రోజులు దాటినా సిలిండర్లు ఇంటికి చేరడం లేదని గృహిణులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీంతో గ్యాస్ ఏజెన్సీలు, గోడౌన్ల వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూలు కడుతున్నారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ వంటి నగరాల్లోనే కాదు, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. ఉదయం నుంచే గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూలు కడుతున్న ప్రజలు ‘ఒక్క సిలిండర్ ఇప్పించండి’అంటూ వేడుకుంటున్నారు. కొందరు వినియోగదారులు నేరుగా గోడౌన్కు వెళ్లి ఏజెన్సీలకు అదనంగా సొమ్ములు చెల్లించి సిలిండర్ తీసుకుంటున్న పరిస్థితి ఉంది. పెండింగ్లో లక్షల బుకింగ్లు రాష్ట్రవ్యాప్తంగా లక్షల సంఖ్యలో బుకింగ్లు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. రోజువారీ సరఫరా జరుగుతున్నప్పటికీ డిమాండ్కు సరిపడా పంపిణీ జరగడం లేదని వినియోగదారులు చెబుతున్నారు. సింగిల్ సిలిండర్ మాత్రమే ఉన్నవారితోపాటు కుటుంబాలకు దూరంగా హైదరాబాద్ వంటి నగరాల్లో సింగిల్ రూముల్లో ఉండి ఉద్యోగాలు చేసుకుంటున్న యువతీ యువకులు వంట గ్యాస్ దొరకక పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. హైదరాబాద్లోని చర్లపల్లిలో ఉన్న భారత్, ఇండేన్, హెచ్పీ గ్యాస్ ఫిల్లింగ్ ప్లాంట్లలో గ్యాస్ సిలిండర్ల రీఫిల్లింగ్ పెద్దఎత్తున జరుగుతోందని చెబుతున్నప్పటికీ వినియోగదారులకు సకాలంలో అందడం లేదు. దీంతో చాలామంది ఎలక్ట్రిక్, ఇండక్షన్ స్టవ్లను కొనుగోలు చేస్తున్నారు. కమర్షియల్ సెక్టార్లో తీవ్ర సంక్షోభం హోటళ్లు, చిన్న వ్యాపారులు గ్యాస్ కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. బ్యాచ్లర్లుగా, హాస్టళ్లలో భోజనాలు చేస్తున్న వారి పరిస్థితి సంకటంగా మారుతోంది. కమర్షియల్ సిలిండర్లు లభించకపోవడంతో హోటళ్లలో టిఫిన్లు, భోజనాలకూ ఆంక్షలు విధిస్తున్నారు. కాగా, 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర భారీగా పెరిగి రూ. 2,300కు చేరింది. ప్రైవేటు ఏజెన్సీలు కిలో ఎల్పీజీని రూ. 250కి విక్రయిస్తున్నాయి. అది కూడా దొరకకపోవడంతో బ్లాక్లో ఒక్కో సిలిండర్కు రూ.7వేల వరకు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. సకాలంలో గ్యాస్ అందించేందుకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
2034 వరకు మా సర్కారే: సీఎం రేవంత్
సాక్షి, ఆదిలాబాద్: ‘మళ్లీ వచ్చేది మా ప్రభుత్వమే.. 2034 వరకు ప్రజా ప్రభుత్వమే కొనసాగుతుంది.. మీ బాగోతం ప్రజలు చూశారు.. మళ్లీ గడీల పాలన కావాలని ఎవరూ కోరుకోరు. పదేళ్లలో మీరు చేయ లేని ఎన్నో గొప్ప పనులు మా ప్రభుత్వం చేసింది.. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి..’ అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ‘అడ్డు పడడానికి ఊరూరా తిరగడం కాదు.. ఎంతసేపూ లొల్లి పెట్టాలి.. యాగీ చేయాలనే దృక్పథంతోనే వెళ్తున్నారు..’ అంటూ విపక్ష బీఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పదేళ్లలో ఇలాంటి సంప్రదాయం చూశారా? ‘పీసీసీ అధ్యక్షుడిగా అప్పట్లో నిర్మల్లో నిరసన తెలిపినా, ఇంద్రవెల్లిలో దండోరా పెట్టినా.. భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నిర్వహించినా.. ప్రజా సమస్యలను పరిష్కరించాలనే ఉక్కు సంకల్పంతోనే పోరాటం కొనసాగించాం. ఎన్ని కేసులు పెట్టినా కొట్లాడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాం. ఎన్నికలప్పుడే రాజకీయాలు.. అభివృద్ధి విషయంలో అందరినీ కలుపుకొని ముందుకెళ్తాం. అందుకే పార్టీలకు అతీతంగా ఈ సభలకు ఆహ్వానించాం. గత పదేళ్లలో తెలంగాణలో ఇలాంటి సాంప్రదాయం ఎప్పుడైనా చూశారా?. ఇక్కడ కాంగ్రెస్ శాసనసభ్యులు లేకపోయినా బోథ్లో, నిర్మల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను మంజూరు చేశాం. మా ఎమ్మెల్యేలు లేకపోయినా ప్రజలు నష్టపోకూడదని అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నాం. పార్టీలు చూడకుండా, ప్రజల కష్టాలు చూసి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. జూన్ 2 నాటికి ఎయిర్పోర్టుకు శంకుస్థాపన బాసర జ్ఞాన సరస్వతి ఆలయ అభివృద్ధికి రూ.225 కోట్లు మంజూరు చేశాం. అవసరమైతే మరిన్ని నిధులు మంజూరు చేస్తాం. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును తిరిగి ప్రారంభిస్తాం. త్వరలోనే వీలైతే జూన్ 2 నాటికి ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు నిర్మాణానికి శిలాఫలకం వేసేలా చూస్తాం. ఆదిలాబాద్ ప్రాంతాన్ని పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. ఆదిలాబాద్లో యూనివర్సిటీకి సంబంధించి భూసేకరణ చేపట్టాం. త్వరలోనే శంకుస్థాపన చేస్తాం. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు అభ్యర్థన మేరకు గూడెం సత్యనారాయణస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం. డిసెంబర్లో ఇందిరమ్మ చీరలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఏమేం కావాలో అంచనాలు సిద్ధం చేస్తున్నాం. తెలంగాణ ఆడపడుచులకు వచ్చే డిసెంబర్లో ఇందిరమ్మ చీరలు అందజేస్తాం.. చిలుకపచ్చ రంగు చీరలు అందిస్తాం. పేదల కళ్లల్లో ఆనందం చూడాలన్నదే మా ప్రయత్నం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సన్న బియ్యం పంపిణీ ‘రాష్ట్రంలో రూ.22,500 కోట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం. ఇప్పటివరకు దాదాపు రూ.5,400 కోట్లు ఆ ఇళ్లు కట్టుకునే పేదల ఖాతాల్లో వేశాం. ఎన్నడైనా గత ప్రభుత్వం ఇలాంటి ఆలోచన చేసిందా?. సన్న బియ్యంతో పేదల కడుపు నింపాలనే ఆలోచన ఎప్పుడైనా చేసిందా?. దేశంలోనే ఎక్కడా లేని విధంగా మా ప్రభుత్వం సన్న బియ్యం అందిస్తోంది. మా ఆడబిడ్డల ఉచిత బస్సు ప్రయాణానికి రూ.10 వేల కోట్లు ఖర్చు చేశాం. మహిళా స్వయం సహాయక సంఘాలు (ఎస్హెచ్జీలు) తయారు చేసిన ఉత్పత్తుల మార్కెటింగ్కు హైటెక్ సిటీలో షాపులు కేటాయించాం..’ అని సీఎం తెలిపారు. పిప్రిలో సభ సీఎం ఆలోచనే: డిప్యూటీ సీఎం ‘పిప్రిలో బహిరంగ సభ నిర్వహించాలన్నది సీఎం రేవంత్రెడ్డి ఆలోచనే.. నా ఆలోచన కాదు..’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలకు సంబంధించి చర్చిస్తున్న క్రమంలో.. ప్రభుత్వం నిర్వహిస్తున్న 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా భారీ బహిరంగ సభ నిర్వహిద్దామని సీఎం అన్నారని చెప్పారు. పిప్రి నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేపట్టి ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు వాటిని మంజూరు చేసి అమలు చేయాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారని వెల్లడించారు. ఆనాడు మండుటెండలో తనతో నడిచి పాదయాత్రను విజయవంతం చేశారని, ఈరోజు కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేశారని అన్నారు. ఇది రాజకీయ సభ కాదని ఆనాడు ప్రజలతో ఏర్పర్చుకున్న అనుబంధానికి నిదర్శనం ఈ సభ అని భట్టి చెప్పారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో మంత్రులందరం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని, అంతరాలు లేని సమాజ నిర్మాణమే తమ లక్ష్యమని చెప్పారు. ఆనాడు టీపీసీసీ అధ్యక్షుడిగా సీఎం రేవంత్రెడ్డి, సీఎల్పీ నేతగా మల్లుభట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రలు, బహిరంగ సభలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి దోహద పడ్డాయని ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ అన్నారు. అప్పట్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ తెలంగాణను మేటి రాష్ట్రంగా నిలుపుతున్నారని అభినందించారు. వచ్చే ఎన్నికల్లో వందకు పైగా సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. భట్టి పాదయాత్రకు మూడేళ్లు పూర్తి ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క, సీఎల్పీ నేతగా రాష్ట్రంలో చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మూడేళ్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని.. ఆనాడు భట్టి పాదయాత్ర ప్రారంభించిన పిప్రిలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక బహిరంగ సభను ప్రభుత్వం నిర్వహించింది. కాగా అప్పట్లో ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి రూ.614 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం, డిప్యూటీ సీఎంలు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఎస్హెచ్జీల మహిళలకు వడ్డీలేని రుణాలు పంపిణీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ ఎంపీ వేం నరేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రేమ్సాగర్రావు, వెడ్మ బొజ్జు, మాలోత్ రాందాస్, ఎమ్మెల్సీ దండే విఠల్, ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, విజయరమణారావు, బీజేపీ ఎంపీ గొడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి, కేంద్ర మాజీమంత్రి వేణుగోపాలచారి తదితరులు పాల్గొన్నారు. -
తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం
-
బాసరలో రేవంత్ ప్రత్యేక పూజలు.. మనవడికి అక్షరాభ్యాసం
సాక్షి, నిర్మల్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్మల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబంతో కలిసి బాసరలోని శ్రీజ్ఞాన సరస్వతీ దేవి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు సీఎంకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం దంపతులు తమ మనవడు రియాన్ష్కు అక్షరాభ్యాసం చేయించారు.ఇక, దర్శనం అనంతరం బాసర ఆలయ విస్తరణ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి భూమి పూజ చేయనున్నారు. బాసర పుణ్యక్షేత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూ.225 కోట్లతో పునర్ నిర్మాణ పనులకు నేడు శ్రీకారం చుట్టనుంది. ప్రాచీన ఆలయం కావడం, ఏటేటా పెరుగుతున్న భక్తుల సంఖ్యకు తగినట్లు అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో బాసర ఆలయ అభివృద్ధి చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో సంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధి పనులు చేపట్టేందుకు అధికారులు మాస్టర్ ప్లాన్ రూపొందించారు.బాసర పర్యటన ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా పిప్రి చేరుకోనున్నారు. భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా పిప్రిలో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగిస్తారు. -
ఇక గ్యాస్ అవసరం లేదా? డీజిల్ స్టవ్తో సంచలనం!
జనగామ జిల్లా: ‘అవసరమే ఆవిష్కరణకు మూలం’ అని మరోసారి నిరూపితమైంది. పెరిగిపోతున్న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలతో బతుకు బండిని లాగలేక ఇబ్బంది పడుతున్న ఒక హోటల్ నిర్వాహకుడు, తన స్వయంకృషితో ఒక వినూత్న పరిష్కారాన్ని కనుగొన్నాడు. డీజిల్తో పని చేసే ప్రత్యేక స్టవ్ తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ఫాస్ట్ఫుడ్ హోటల్ నడపుతున్న గుండు వసంత్ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు ఆకాశాన్నంటుతుండడంతో హోటల్ నిర్వహణ భారంగా మారిందని ఆవేదన చెందాడు. దీనికి ప్రత్యామ్నాయంగా సుమారు రూ.1,300 ఖర్చుతో, రెండు రోజులపాటు శ్రమించి ఈ డీజిల్ పొయ్యిని రూపొంచాడు. ఈ వినూత్న పొయ్యిలో విద్యుత్తో నడిచే బ్లోయర్ను అమర్చారు. ఆ బ్లోయర్ మోటార్ ద్వారా వచ్చే గాలిని ఒక పైపు ద్వారా, డీజిల్ను మరో పైపు ద్వారా పొయ్యి వద్దకు పంపించి మంట వచ్చేలా అమర్చాడు. అవసరాన్ని బట్టి మంటను పెంచుకోడానికి లేదా తగ్గించుకోవడానికి వీలుగా బ్లోయర్లో రెగ్యులేటర్ కూడా అమర్చారు. సాధారణ గ్యాస్ సిలిండర్తో పోలిస్తే ఈ డీజిల్ పొయ్యి వల్ల ఖర్చు కూడా సగానికి పైగా తగ్గుతుందని వసంత్ చెబుతున్నారు. లీటర్ డీజిల్తో గంట నుంచి రెండు గంటలపాటు నిరంతరంగా పోయి మండుతుందని ఆయన తెలిపారు. వసంత్ ఆవిష్కరణను చూసిన మరి కొందరు హోటల్ నిర్వాహకులు తమ కోసం కూడా ఇలాంటి పొయ్యిలను తయారు చేయించుకోవడం విశేషం. సామాన్యుడి మేధస్సుతో పుట్టిన ఈ దేశీ ఆవిష్కరణ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.గ్యాస్ కొరతను అధిగవిుంచాను.. పొరుగు దేశాల్లో యుద్ధం నేపథ్యంలో నిత్యావసర సరుకులతోపాటు ఎల్పీజీ గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో హోటల్ నిర్వహణ కష్టంగా మారింది. ఖర్చులు పెరుగుతుండడంతో కొత్త మార్గం కోసం ఆలోచించాను. అప్పడు డీజిల్తో పని చేసే పొయ్యి తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. తక్కువ ఖర్చుతో రెండు రోజుల్లోనే తయారు చేసాను. లీటర్ డీజిల్ సాయంతో సుమారు రెండు గంటలపాటు పొయ్యి మండుతుంది. ఇప్పుడు ఖర్చు తగ్గింది. పని సులభమైంది. – గుండు, వసంత్,ఫాస్ట్ఫుడ్ హోటల్ నిర్వాహకుడు -
బాలభీముడి జననం.. డాక్టర్లకే ఆశ్చర్యం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో బాలభీముడు జన్మించాడు. మండ లంలోని అచ్యుతాపురం గ్రామానికి చెందిన ముంగర మమత కాన్పు కోసం ప్రభుత్వ ఆస్ప త్రికి రాగా, వైద్యులు ఆమెకు సాధారణ ప్రస వం చేశారు. ఆమె 4.5కిలోల బరువు ఉన్న మగ శిశువు జన్మించాడు. సహజంగా అప్పుడే జన్మించే శిశువులు రెండు నుంచి మూడున్నర కిలోల బరువు ఉంటారని, 4.5కిలోల బరువు ఉండటం అరుదైన ఘటనగా ఆస్పత్రి గైనకాల జిస్టు మౌనిక తెలిపారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. -
Madhapur: మైండ్స్పేస్ వద్ద ఘోరప్రమాదం
హైదరాబాద్: మాదాపూర్ మైండ్స్పేస్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వచి్చన ఓ డీసీఎం డ్రైవర్ స్కూటీపై వెళుతున్న దంపతులను ఢీకొట్టాడు. అనంతరం స్కూటీని జూబ్లీహిల్స్ (దాదాపు ఐదు కిలోమీటర్లు) వరకు డీసీఎం లాక్కెళ్లింది. ఈ ప్రమాదంలో భార్య మృతి చెందగా భర్త గాయపడ్డాడు. శనివారం అర్థరాత్రి రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. మహేశ్వరంలో నివాసముంటున్న అబ్దుల్ బాసిత్ (26), అతని భార్య హనియా అయేషా (22)లు కూకట్పల్లిలో సినిమా చూసి శనివారం అర్ధరాత్రి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. మాదాపూర్ మైండ్స్పేస్ వద్ద ఓ డీసీఎం అతివేగంగా వచ్చి వీరిని ఢీకొంది. ఈ ప్రమాదంలో అయేషా తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే అసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు తెలిపారు. భర్త అబ్దుల్ బాసిత్కుగాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డీసీఎం కింద ద్విచక్రవాహనం ఇరుక్కుపోయిన విషయాన్ని డ్రైవరు గమనించకుండా 5 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లాడు. కొందరు గిగ్ వర్కర్లు గమనించి డీసీఎంను ఆపడంతో డ్రైవర్ పరారయ్యాడు. డ్రైవర్ సహాయకుడు పట్టుబడటంతో అతనికి దేహశుద్ధి చేశారు. చూస్తే డ్రైవర్ అసలు స్పృహలో ఉన్నాడా, లేడా అని అనుమానం వ్యక్తం చేశారు. జూబ్లిహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో డీసీఎం, ద్విచక్రవాహనాన్ని స్వా«దీనం చేసుకున్నారు. -
బీఆర్ఎస్ బంద్.. గజ్వేల్లో ఉద్రిక్తత..
గజ్వేల్ బంద్ అప్డేట్స్..గజ్వేల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. డీసీసీ అధ్యక్షులు ఆంక్షా రెడ్డి ఇంటి ముట్టడికి బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించారు. దీంతో, పోలీసులు.. వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ స్వల్ప వాగ్వాదం, తోపులాట జరిగింది. అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ నేతలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు.కాగా, గజ్వేల్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడికి నిరసనగా బీఆర్ఎస్ నేడు బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో దుకాణాలు మూతపడ్డాయి. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ బస్ డిపో ముందు బైఠాయించి ఆందోళన చేపట్టిన బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. గజ్వేల్లోని కేసీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.ఇక, రెండ్రోజుల క్రితం మాజీ సీఎం కేసీఆర్ క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టారు. అదే సమయంలో క్యాంప్ ఆఫీస్ కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు. కాంగ్రెస్ నేతలే క్యాంప్ ఆఫీస్ పై దాడి చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. తాము సీఎం ఫోటో పెట్టడానికే వెళ్ళాం.. దాడి చేయలేదని కాంగ్రెస్ నాయకుల వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల ఫిర్యాదుతో డీసీసీ ప్రెసిడెంట్ ఆంక్షా రెడ్డి సహా 42 మందిపై గజ్వేల్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
సమ్మర్ సెలవులు.. టికెట్ల కోసం ప్రయాణికుల పోరాటం
సాక్షి, హైదరాబాద్: పిల్లలకు వేసవి సెలవుల దృష్ట్యా సొంత ఊళ్లకు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో వివిధ మార్గాల్లో నడిచే రైళ్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. కానీ ఇందుకనుగుణంగా రైళ్లు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే అన్ని రెగ్యులర్ రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ దర్శనమిస్తోంది. పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడిపేందుకు చర్యలు తీసుకున్నప్పటికీ అరకొర రైళ్లే అందుబాటులో ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి నిత్యం 2.20 లక్షల మందికిపైగా.. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి– షాలిమార్, సికింద్రాబాద్– చెన్నై, సంత్రాగచి్చ– చెన్నై, చర్లపల్లి–సంత్రాగచి్చ, సికింద్రాబాద్– శ్రీకాకుళం మార్గాల్లో కొన్ని ప్రత్యేక రైళ్లను నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. విశాఖ, తిరుపతి, కాకినాడ తదితర ప్రాంతాలకు వెళ్లే రెగ్యులర్ రైళ్లలో ఇప్పటికే ఏసీ,నాన్ ఏసీ కోచ్లలో రిజర్వేషన్లు నిండిపోయాయి. పాటా్న, భువనేశ్వర్, కోల్కతా, జైపూర్ తదితర దూరప్రాంతాలకు వెళ్లే రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ పెరిగింది. సాధారణ రోజుల్లో సికింద్రాబాద్ నుంచి నిత్యం 1.85 లక్షల మంది రాకపోకలు సాగిస్తారు. వేసవి సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య 2.20 లక్షలు దాటినట్లు అంచనా. చర్లపల్లి, నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి స్టేషన్ల నుంచి ఇప్పటికే రాకపోకలు భారీగా పెరిగాయి. పుణ్య క్షేత్రాలకు రైళ్లేవీ? తిరుపతికి రోజూ 5 రైళ్లు నడుస్తున్నా డిమాండ్ ఎక్కువగానే ఉంది. ఒక్కో రైల్లో 100 నుంచి 150కిపైగా వెయిటింగ్ లిస్టు కనిపిస్తోంది. హైదరాబాద్ నుంచి తిరుపతికి మరిన్ని ప్రత్యేక రైళ్లు నడపాల్సిన అవసరం ఉంది. ఇక సికింద్రాబాద్ నుంచి షిర్డీకి వెళ్లేందుకు అజంతా ఎక్స్ప్రెస్ మాత్రమే ఉంది. రెట్టింపు సంఖ్యలో ప్రయాణికులున్నారు. రూట్లో రెగ్యులర్గా ఒక ట్రైన్ అదనంగా నడపాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ నుంచి విశాఖ, కాకినాడ, బెంగళూరు, ముంబై, పుణె నగరాల మధ్య సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ప్రయాణాలు కూడా పెరిగాయి. వేసవి దృష్ట్యా హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు బంధుమిత్రుల రాకపోకలు కూడా గణనీయంగా పెరిగాయి. ఇందుకు తగినట్లుగా రైళ్లు మాత్రం అందుబాటులో లేకుండాపోయాయి. -
చలానాలు కట్టకుండా.. రికార్డ్ క్రియేట్ చేశాడు!
హైదరాబాద్: సుమారు 95 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు పెండింగ్లో ఉన్న కారును ఆదివారం పట్టుకున్నట్లు ఎల్బీనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. విజయవాడ వెళ్లే రహదారిపై ట్రాఫిక్ ఎస్ఐ రవికుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు చేస్తుండగా.. పోలదాస్ సురేష్కు చెందిన కారుపై 95 ట్రాఫిక్ చలానాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. మొత్తం రూ.36,600 వేల జరిమానాలు పెండింగ్లో ఉన్నాయని, కారు యజమాని గతంలో మూడుసార్లు ట్రాఫిక్ పోలీసులను తప్పించుకున్నాడని తెలిపారు. కేసు నమోదు చేసి కారును స్వా«దీనం చేసుకున్నామన్నారు. 464 మంది ‘నిషా’చరులకు చెక్ సాక్షి, సిటీబ్యూరో: మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై నగర ట్రాఫిక్ విభాగం అధికారులు వీకెండ్స్తో ప్రత్యేక డ్రైవ్లు కొనసాగిస్తున్నారు. గత శుక్ర, శనివారాల్లో నగర వ్యాప్తంగా డ్రంకన్ డ్రైవింగ్లో 464 మంది పట్టుబడినట్లు ట్రాఫిక్ చీఫ్ డి.జోయల్ డెవిస్ ఆదివారం వెల్లడించారు. వీరిలో 408 మంది ద్విచక్ర, 30 మంది త్రిచక్ర, 26 మంది తేలికపాటి వాహనాల చోదకులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు.వీరికి కౌన్సెలింగ్ నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరుపర్చనున్నట్లు చెప్పారు. -
రేపే.. ‘పైలట్’ అప్పు
సాక్షి, హైదరాబాద్: ఈ ఆర్థిక సంవత్సరంలో అప్పులు తీసుకునే ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్వారా బాండ్లను తనఖా పెట్టనున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఏడో తేదీన బహిరంగ మార్కెట్లో రుణం తీసుకోనుంది. ఆర్బీఐ తొలిసారి ప్రవేశపెడుతోన్న బీఐఎస్ అనే పైలట్ పద్ధతిలో ఈ అప్పును తీసుకోనుండడం గమనార్హం. ఈనెల ఏడో తేదీన దేశంలోని 4 రాష్ట్రాలకు రూ. 15,500 కోట్లను ఆర్బీఐ రుణాల రూపంలో సమకూర్చనుంది. అందులో 16–20 సంవత్సరాల కాల పరిమితితో రూ.2 వేల కోట్లు, 25 కంటే ఎక్కువ సంవత్సరాల కాల పరిమితితో రూ.1,900 కోట్లు రుణం తీసుకునేందుకు తెలంగాణకు అనుమతి లభించింది. ఈ మేరకు తొలి మూడు నెలల కాలంలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు బహిరంగ మార్కెట్లో ఇప్పించే రుణాల షెడ్యూల్ను ఆర్బీఐ తాజాగా విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ ఏడో తేదీన రూ.3,900 కోట్లతోపాటు అదే నెల 21వ తేదీన మరో రూ.2 వేల కోట్లను రుణం తీసుకోవడం ద్వారా తొలి మాసంలోనే రూ.6 వేల కోట్లను తెలంగాణ ప్రభుత్వం సమకూర్చుకోనుంది. ఇక, మే, జూన్ నెలల్లో కూడా రెండు దఫాల్లో రూ.5,250 కోట్ల చొప్పున మొత్తం రూ.16,400 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం రుణాల కింద తీసుకోనుంది. తొమ్మిదింటిలో మనం కూడా.. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం నుంచి ఆర్బీఐ పైలట్ పద్ధతిని అమలు చేయాలని నిర్ణయించింది. ప్రామాణాత్మక జారీ వ్యూహం (బీఐఎస్) పద్ధతిలో దేశంలోని తొమ్మిది రాష్ట్రాలకు బహిరంగ మార్కెట్లో రుణాలు ఇప్పించనుంది. ఇందులో తెలంగాణతోపాటు ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, ఛత్తీస్గఢ్, బిహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలున్నాయి. బాండ్లను తనఖా పెట్టుకోవడం ద్వారా అప్పులిచ్చే పెట్టుబడిదారులకు ఈ తొమ్మిది రాష్ట్రాలపై మరింత నమ్మకం కలిగేలా ప్రణాళిక రూపొందించింది. మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నా, ఈ రుణాల చెల్లింపులకు నిర్ణీత గడువు (మెచ్యూరిటీ బకెట్)ను నిర్ధారించడం ద్వారా దీర్ఘకాలంలో రాష్ట్రాలకు భారంగా మారకుండా చూడడమే దీని ఉద్దేశమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు పెట్టుబడిదారులకు వెంటనే రిటర్న్లు వచ్చే విధంగా ఆయా రాష్ట్రాలు చెల్లింపుల షెడ్యూల్ను ఈ పద్ధతిలో నిర్ణయించనున్నందున అప్పులిచ్చే వారికి కూడా వెసులుబాటు ఉండేలా ఆర్బీఐ ఈ పద్ధతిని ఎంచుకుందని అంటున్నారు. -
కాంగ్రెస్ పెద్దల చెరలో 373 ఎకరాలు: హరీశ్రావు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నాదర్గుల్లో రూ.7 వేల కోట్ల విలువైన భారీ భూ కుంభకోణం జరుగుతోందని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ఆరోపించారు. ప్రభుత్వ భూమిపై కన్నేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కుటుంబం 373 ఎకరాల భూమిని ఆక్రమించిందన్నారు. తెలంగాణభవన్లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్రావు మాట్లాడారు. నాదర్గుల్లోని సర్వే నంబర్ 613 (కొత్త సర్వే నంబర్ 119)లో ఉన్న 373 ఎకరాల భూమి ప్రభుత్వానికి చెందినదేనని గతంలోనే స్పష్టమైందన్నారు. ఈ భూములను ప్రభుత్వ భూములుగా డిక్లేర్ చేయాలని ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు లేఖ రాయగా, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో వీటిని ప్రభుత్వ భూములుగా అసెంబ్లీలో ప్రకటించి ఏపీఐఐసీకి అప్పగించారని తెలిపారు.2022 అక్టోబర్ 13న హైకోర్టు సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ కూడా ఈ భూముల క్రయవిక్రయాలు చెల్లవని స్పష్టం చేశాయని వివరించారు. విక్రయాల్లో పాల్గొన్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించిందన్నారు. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో జస్టిస్ పంకజ్మిట్టల్, జస్టిస్ ప్రసన్న ధర్మాసనం ముందు ఈనెల 7న విచారణకు ఉందని తెలిపారు. సుప్రీంకోర్టులో ఎలాంటి స్టే లేదని, కాబట్టి హైకోర్టు తీర్పే అమల్లో ఉందని చెప్పారు. ల్యాండ్ సీలింగ్ చట్టానికి విరుద్ధంగా విక్రయాలు ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రకారం ఒక వ్యక్తికి 373 ఎకరాలు ఉండే అవకాశం లేదని, అయినా శివరాజ్ బహదూర్ 2016లో ఈ భూములను ఆల్ఫా, ఒమేగా, యునిటెక్ కంపెనీలకు విక్రయించాడని ఆరోపించారు. సెక్షన్ 8, 17 ప్రకారం డిక్లరేషన్ లేకుండా విక్రయం చెల్లదని, సెక్షన్ 22ఏ కింద ఈ భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయని కందుకూరు ఆర్డీఓ స్పష్టం చేశారని చెప్పారు. ఈ భూముల్లో సుమారు 600 మంది పేద రైతులు తాతముత్తాతల కాలం నుంచి సాగు చేస్తున్నారని వివరించారు. ప్రస్తుతం వారిని భూముల్లోకి రానివ్వకుండా బౌన్సర్లు, రౌడీలను పెట్టి దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. మహిళా రైతులు కౌసల్య, మమతలను బెదిరిస్తూ, రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు ఆఫర్ చేసి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, బోర్లు, కంచెలను ధ్వంసం చేశారని చెప్పారు. మంత్రి పొంగులేటి కుటుంబ హస్తం ఈ కబ్జాల వెనుక సాక్షాత్తూ మంత్రి పొంగులేటి కుటుంబం ఉందని హరీశ్రావు ఆరోపించారు. శిల్పా ఇన్ఫ్రా, శిల్పా రాఘవ ఎల్ఎల్పీ, ఎక్యూ స్కై్వర్ రియల్టర్స్ వంటి సంస్థల్లో మంత్రి కుమారుడు హర్షారెడ్డి తదితరులు డైరెక్టర్లుగా ఉన్నారన్నారు. కోహినూర్ గ్రూప్, శిల్పా ఇన్ఫ్రా, మెగా కంపెనీ పేర్లతో బోర్డులు మారుస్తూ భూములను ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. ‘చెరువులను కాపాడుతున్నానని చెప్పే సీఎం రేవంత్రెడ్డికి ఈ ఆక్రమణలు కనిపించవా? ప్రతిపక్షాలపై సిట్లు వేస్తారు కానీ ఇక్కడ ఎందుకు స్పందించరు’అని ప్రశ్నించారు. తక్షణమే హైడ్రా ద్వారా అక్రమ కాంపౌండ్ వాల్ను కూల్చాలని, ఆక్రమణదారులను అరెస్ట్ చేయాలని, రైతులను తిరిగి భూముల్లోకి అనుమతించాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. రేపు ఉదయం వరకు హైడ్రా కమిషనర్ చర్యలు తీసుకోకపోతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి నాదర్గుల్కు వెళ్లి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. -
సమానత్వ పథంలో తెలంగాణ
గన్¸ఫౌండ్రి (హైదరాబాద్): భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలతో తెలంగాణ రాష్ట్రం సమానత్వ పథంలో నడుస్తోందని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆదివారం రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బషీర్బాగ్ చౌరస్తాలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. మహనీయుల జయంతి ఉత్సవాలను కేవలం స్మరణ కోసమే కాకుండా దళిత ఆత్మగౌరవ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లే సంకల్ప దినంగా మార్చాలని పేర్కొన్నారు. కాచిగూడ నింబోలి అడ్డాలో రూ.30 కోట్ల వ్యయంతో బాబు జగ్జీవన్ రామ్ భవనాన్ని నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే లోయర్ ట్యాంక్బండ్ వద్ద రూ.100 కోట్లతో 10 అంతస్తుల అంబేడ్కర్ నాలెడ్జ్ టవర్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. దళిత విద్యార్థుల అభ్యున్నతికోసం ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1, 2, 3 వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చే కేంద్రాలను త్వరలో ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. మంత్రి ఫొటో ఎందుకు లేదు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ కాలం నుంచి నేటి వరకు దళితులకు అడుగడుగునా అవమానాలే ఎదురవుతున్నాయని అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల కోసం రాష్ట్ర ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చుపెట్టి పెద్ద ఎత్తున ప్రకటనలు ఇస్తే ఆ ప్రకటనలలో ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి ఫొటో ఎందుకు లేదని ప్రశ్నించారు. కోదాడ ప్రాంతంలో ఎస్సీ యువకుడు లాకప్ డెత్లో మరణిస్తే నేటి వరకు అక్కడి ఎస్ఐపై చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఈ ఘటనపై స్పందించాలని మంత్రిని కోరగా వచ్చేవారం కోదాడకు వెళ్తానని హామీ ఇచ్చారు. ప్రముఖుల నివాళి.. బషీర్బాగ్ చౌరస్తాలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి, ఎంపీ మల్లు రవి, శాసన సభ్యులు సత్యనారాయణ, మందుల సామేల్, నాగరాజు, శాసనమండలి విప్ అద్దంకి దయాకర్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, ఓయూ ప్రొఫెసర్ కాసీం, దళిత జాతీయ నాయకుడు జేబీ రాజుతోపాటు వివిధ ఉద్యోగ, కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
‘మోర్ దేన్ ఫ్రెండ్స్’ డ్రగ్స్ పార్టీ
సాక్షి, హైదరాబాద్: కొండాపూర్లో ఉన్న ‘క్వేక్ అరేనా పబ్’లో గురువారం రాత్రి జరిగిన ‘బ్లాక్ కాఫీ’ఈవెంట్లో పాల్గొన్న 64 మందికి పరీక్షలు నిర్వహించగా ఎనిమిది మంది డ్రగ్స్ వాడినట్లు పాజివిట్ వచ్చింది. ఇది జరిగిన రెండు రోజులకే శనివారం రాత్రి గోల్కొండ సమీపంలోని తారామతి బారాదారి వంతు వచ్చింది. ‘మోర్ దేన్ ఫ్రెండ్స్’పేరుతో నిర్వహించిన ఈవెంట్పై ఈగల్, హెచ్–న్యూ బృందాలు సంయుక్తంగా దాడి చేశాయి. ఇక్కడ 35 మందికి పరీక్షలు చేయగా ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. వీరిలో ఈవెంట్ నిర్వాహకుడైన అంతర్జాతీయ డీజే, భార్యభర్తలు, మోడల్ ఉండడం గమనార్హం. దీని నిర్వాహ కుల్లో ప్రముఖ అంతర్జాతీయ డీజే జాసన్ డైలాన్ కూడా ఉన్నారు. ఈ ఖరీదైన పార్టీకి సంబంధించి వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమానికి నలుగురి నుంచి పది మంది వరకు గ్రూపులుగానూ హాజరుకావచ్చంటూ రూ.1.25లక్షల నుంచి రూ.50 వేల వరకు రేటు నిర్దేశించారు. శనివారం సాయంత్రం 4 గంటలకు ఈవెంట్ ప్రారంభమైంది. దీనిపై సమాచారం అందుకున్న ఈగల్ అధికారులు నిర్వాహకులతో పాటు అతిథుల వివరాలను సేకరించి విశ్లేషించారు. ఈవెంట్ నిర్వాహకుల్లో కీలకంగా ఉన్న అంతర్జాతీయ డీజే జాసన్కు డ్రగ్స్ వినియోగించిన చరిత్ర ఉండడంతో అప్రమత్తమయ్యారు. హెచ్–న్యూ పోలీసులతో కలిసి ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ టీమ్స్ ‘మోర్ దేన్ ఫ్రెండ్స్’పై ఆకస్మిక దాడి చేశాయి.ఈవెంట్కు హాజరైన వారి సమాచారాన్ని సమగ్రంగా సేకరించి, అధ్యయనం చేసిన బృందాలు అనుమానితులుగా ఉన్న 35 మందిని గుర్తించాయి. వీరి నుంచి లాలాజలం, మూత్రం నమూనాలు సేకరించి పరీక్షలు చేయగా ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. వీళ్లు గంజాయితో పాటు కొకైన్ వాడినట్లు నిర్ధారించి హైదరాబాద్ నార్కోటిక్స్ ఠాణాలో కేసు నమోదు చేశారు. పాజిటివ్ వచ్చిన వారిలో అంతర్జాతీయ డీజే జాసన్, మోడలింగ్తో పాటు యాక్టింగ్ చేసే సర్వర్, ట్రేడింగ్ వ్యాపారి నిహార్, ఈయన భార్య ఆషి, వ్యాపారి యోగేశ్వర్, ఫార్మా కంపెనీలో ఎనలిస్ట్ అభినాష్ ఉన్నారు. వీరిపై నమోదు చేసిన కేసులో ఎన్డీపీఎస్ యాక్ట్లోని సెక్షన్ల కింద ఆరోపణలు జోడించారు. నిందితులకు తల్లిదండ్రులు, సంబం«దీకుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చిన అధికారులు నోటీసులు జారీ చేసి విడిచిపెట్టారు. ఈ డ్రగ్ ఎక్కడ నుంచి ఖరీదు చేశారనే అంశంపై లోతుగా ఆరా తీస్తున్నారు. -
జూరాలపై బ్రిడ్జి కమ్ బరాజ్
సాక్షి, హైదరాబాద్: జూరాల ప్రాజెక్టుకు ఎగువన కృష్ణానదిపై బ్రిడ్జి కమ్ బరాజ్ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి ఆదివారం జలసౌధలో ఆ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ అంశంపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. బ్రిడ్జి కమ్ బరాజ్ను నిర్మించే ప్రాంతాన్ని ఎంపిక చేయాలని ఉత్తమ్ ఆదేశించారు. జూరాల ప్రాజెక్టుకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేయాలన్నారు. ప్రాజెక్టులో 1.66 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, నారాయణపూర్ జలాశయం నుంచి 0.5 టీఎంసీల ఊట నీరు వచ్చే అవకాశముందని అధికారులు వివరించారు. సకాలంలో ఈ నీరు రాకుంటే తాగునీటి అవసరాలకు 0.5 టీఎంసీల కొరత ఏర్పడే అవకాశం ఉందన్నారు. గతేడాది కర్ణాటక నుంచి ఒక టీఎంసీ నీటిని విడుదల చేయించుకున్న విషయాన్ని గుర్తు చేశారు. చివరిదశలో ఉన్న ఆయకట్టు పంటలకు భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల నుంచి సాగునీరు అందించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. పంటల సాగునీటి అవసరాలు తీర్చడానికి ప్రణాళికాబద్ధంగా నీటిని సమర్థ రీతిలో వినియోగించాలని, ఈ బాధ్యత ఆయా ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లు స్వయంగా తీసుకోవాలని చెప్పారు. ఆయకట్టు పంటలతోపాటు జలాశయాల్లో మిగిలి ఉన్న నిల్వలను తాగునీటి అవసరాలకు రక్షించాలని ఆదేశించారు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద 6.3 లక్షల ఎకరాల పంటల సాగు దాదాపుగా ముగిసిందని, అవసరమైన చోట సాగునీటి సరఫరా చేయాలని సూచించారు. ప్రస్తుత సీజన్లో కాల్వలకు నీటి సరఫరాను నిలుపుదల చేయడానికి ముందే తాగునీటి అవసరాలకు చెరువులను నింపుకోవాలని ఆదేశించారు. అన్ని ప్రాజెక్టుల్లో పూడిక తొలగింపు రాష్ట్రంలోని అన్ని జలాశయాల్లో పూడిక తొలగింపునకు చర్యలు చేపట్టాలని మంత్రి ఉత్తమ్ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులు, చెరువుల్లో పూడిక తొలగింపునకు సాధ్యాసాధ్యాలతో ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు. పూడిక మట్టిని తరలించడానికి మార్గమున్న ప్రాంతాల్లో రైతులకు ఉచితంగా తీసుకెళ్లి పంట పొలాల్లో ఎరువుగా వినియోగించుకోవడానికి అవకాశం కల్పించాలని సూచించారు. మార్గం లేని ప్రాజెక్టుల నుంచి శాఖ ఆధ్వర్యంలో పూడిక తొలగింపు కోసం రెండు రోజుల్లో ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. పూడికతో జలాశయాల నిల్వ సామర్థ్యం 30–40శాతం తగ్గిపోయిందని సర్వేలు పేర్కొంటున్నాయని గుర్తు చేశారు. భారీ పంప్హౌస్లకు సంబంధించిన పంపులను మాటిమాటికి ఆన్ ఆఫ్ చేస్తే చెడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్ల పునరుద్ధరణకు సంబంధించిన డిజైన్లను సత్వరమే సిద్ధం చేయాలన్నారు. ఈ సమీక్షలో నీటిపారుదల శాఖ కార్యదర్శి ఈ.శ్రీధర్, సొరంగాల నిపుణులు కల్నల్ పరీక్షిత్ మెహ్రా, సలహాదారులు ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ (జనరల్) రమేశ్బాబు పాల్గొన్నారు. -
రాజ్యాంగం సజీవం
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగం సజీవంగా ఉండాలంటే న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు ఒకే లక్ష్యంతో పనిచేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో నిర్మించే నూతన హైకోర్టు జోన్–2 భవన నిర్మాణ పనులకు ఆదివారం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితోపాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎస్వీ భట్టి, జస్టిస్ అలోక్ అరాధే, హైకోర్టు సీజే జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్తో కలసి భూమిపూజ నిర్వహించారు. అనంతరం సీజేఐ మాట్లాడారు. ఈ కార్యక్రమం లాంఛనం కాదని.. రాజ్యాంగ విధి అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దశాబ్ద కల కార్యరూపం దాలుస్తోందని చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వ సహకారం అభినందనీయమన్నారు. మౌలిక సదుపాయాల కల్పన తప్పనిసరి..: ‘న్యాయవ్యవస్థలో నా సుదీర్ఘ వృత్తి జీవితంలో నేను ఒకటి నమ్ముతాను. ప్రతి కార్యానికి మూడు దశలు ఉంటాయి. ప్రారంభం ఉద్దేశాన్ని వెల్లడిస్తుంది. మధ్యభాగం పట్టుదలను ప్రదర్శిస్తుంది. ముగింపు వాగ్దానం నెరవేరిందా లేదా అనేది తెలియజేస్తుంది. ప్రజలంతా న్యాయపీఠం, చిహ్నం, కార్యకలాపాలను మాత్రమే చూస్తారు. అదే మనకు కనిపించే న్యాయవ్యవస్థ. కానీ ప్రతి కోర్టు గది వెనుక దాన్ని నడిపించే ఓ ప్రపంచం ఉంటుంది. అక్కడే న్యాయమూర్తులు నివసిస్తారు.. శిక్షణ పొందుతారు.. తీర్పులు భద్రపరుస్తారు.. ఈరోజు దానికి మనం పునాది వేస్తున్నాం. మనం ఇక్కడికి రావడం లాంఛనం కాదు.. రాజ్యాంగ విధి. న్యాయం అందరికీ అందుబాటులో ఉండాలన్న సూత్రాన్ని రాజ్యాంగ నిర్మాతలు విశ్వసించారు. ప్రతి రాష్ట్రంలో ఓ హైకోర్టు ఏర్పాటు చట్టపరమైన అవసరమే కాకుండా గణతంత్ర రాజ్య నిబద్ధతగా ఎప్పుడూ భావిస్తాను. అలాంటి నిబద్ధతకు.. అందుకు ఆధారమైన మౌలిక సదుపాయాలు ఉన్నంత వరకే అర్థం ఉంటుంది. అది లేకుంటే కేవలం కాగితాల్లోనే మిగిలిపోతుంది. తెలంగాణలో అది నిర్ధిష్ట రూపాన్ని సంతరించుకుంటోంది. జోన్–1లో పనులు చురుగ్గా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆ భవనాలు ఓపక్క రూపుదిద్దుకుంటుండగానే జోన్–2 మొదలవుతోంది. న్యాయవ్యవస్థ, రాష్ట్ర ప్రభుత్వం సమాంతరంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాయి. అది సరైనదే. ప్రస్తుత భవనం చారిత్రాక కట్టడం అయినప్పటికీ ప్రస్తుత అవసరాలకు సరిపోవడం లేదు. రాబోయే వందేళ్ల అవసరాలు తీర్చే మౌలిక సదుపాయాలను కల్పించడం ఓ లక్ష్యం మాత్రమే కాదు.. తప్పనిసరి. కోర్టు గదులతోపాటు జోన్–2 కూడా అంతే ముఖ్యం. చెట్టులో మనకు కొమ్మలు, ఎత్తు మాత్రమే కనిపిస్తాయి. కానీ తుపాను వచ్చినప్పుడు వేర్లు మాత్రమే దాన్ని కాపాడతాయి. జోన్–2 న్యాయవ్యవస్థకు వేర్లలాంటింది’అని పేర్కొన్నారు. దశాబ్దం తర్వాత కార్యరూపం.. ‘హైకోర్టు రోజువారీ కార్యకలాపాలు తన నియంత్రణలో లేని ఏర్పాట్లపై ఆధారపడి ఉంటుంది. ఈ 100 ఎకరాల ప్రాంగణం ఆ పరిస్థితిని మారుస్తుంది. సంస్థాగత స్వయం సమృద్ధిని సిద్ధాంతం నుంచి ఆచరణలోకి తీసుకొచ్చినప్పుడు అది ఇలానే కనిపిస్తుంది. ఇక్కడ నిర్మించబోయే ఆడిటోరియంలో న్యాయవ్యవస్థకు శిక్షణా కార్యక్రమాలు, పౌరుల కోసం న్యాయ అవగాహన శిబిరాలు నిర్వహించడం శుభ పరిణామం. సెంట్రల్ రికార్డ్ రూమ్.. తీర్పులను భద్రపర్చడం అత్యంత ప్రాధాన్యం. ప్రస్తుత హైకోర్టులో 2009లో చోటుచేసుకున్న ఓ అగ్నిప్రమాదం కొత్త భవన నిర్మాణానికి బీజం వేసింది. ఫుల్ కోర్టు ఆమోదం, హైకోర్టు చీఫ్ జస్టిస్ల ప్రస్తావనతో దశాబ్దం తర్వాత కార్యరూపం దాల్చింది. తెలంగాణతోపాటు పలు రాష్ట్రాలు న్యాయ వ్యవస్థకు సదుపాయాల కల్పనకు ముందు వస్తున్నాయి. అత్యంత అవశ్యకం అని గుర్తిస్తున్నాయి. ఇది గొప్ప విషయం. రూ. 2,583 కోట్లతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వ సహకారాన్ని అభినందిస్తున్నా. న్యాయవ్యవస్థ, కార్యనిర్వహక వ్యవస్థ ఒకే లక్ష్యంతో పనిచేస్తే రాజ్యాంగం నిజంగా సజీవంగా నిలుస్తుంది. ఇక్కడి నుంచి తీసుకునే ప్రతి నిర్ణయం భవిష్యత్తుకు మార్గదర్శకం కావాలి’అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఆకాంక్షించారు. రాబోయే వందేళ్లకు న్యాయ వేదిక: సీఎం రేవంత్రెడ్డి ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడుతూ ‘ఇదో ప్రత్యేకమైన రోజు. మన దేశంలో దేవాలయం, మసీదు, చర్చి, గురుద్వారా నిర్మించడం గొప్ప విషయం. కానీ న్యాయం కోసం ఓ ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడమంటే అన్ని మతాల ప్రజల కోసం ఓ పవిత్ర స్థలాన్ని నిర్మించినట్లే. మన ప్రజాస్వామ్యంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు పరస్పర ఆధారితంగా, గౌరవంగా పనిచేస్తాయి. సామాన్య పౌరుడికి కోర్టు ఓ చివరి ఆశ. తెలంగాణ కోసం కొత్త హైకోర్టు నిర్మాణాన్ని ప్రారంభించడం మా ప్రభుత్వానికో గొప్ప అవకాశం. ఈ భవనం సమాజానికి, ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలుస్తుంది. రాబోయే వందేళ్లపాటు పేదలు, బలహీనులు న్యాయం కోసం వచ్చే వేదికగా సేవలందిస్తుంది. ఇది మా ప్రభుత్వ ప్రజాస్వామ్య విలువలకు ప్రతిబింబం. వ్యవస్థలు పరస్పర గౌరవంతో, సహకారంతో పనిచేయాలి. ఈ భవనం దేశంలోని అతిపెద్ద హైకోర్టు సముదాయాల్లో ఒకటి మాత్రమే కాదు.. అత్యాధునిక, మౌలికవసతుల ప్రమాణంగా ప్రఖ్యాతి చెందుతుంది. అందుకే ప్రభుత్వం ఏర్పడగానే రాజేంద్రనగర్లో 100 ఎకరాల భూమిని కేటాయించాం. జోన్–1 పనులు శరవేగంగా సాగుతున్నాయి. జోన్–2 పనులను కూడా 2027 డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేస్తాం. తీర్పులకే కాదు.. న్యాయ వ్యవస్థ అభిప్రాయాలకూ అత్యున్నత గౌరవం ఇస్తాం’అని వెల్లడించారు. ప్రతి వ్యక్తికి భరోసా కల్పించాలి: జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్ మాట్లాడుతూ ‘ప్రధాన కోర్టు సముదాయం, కార్యాలయ భవనాల జోన్–1 ఇప్పటికే ప్రారంభమైంది. ఇప్పుడు నివాస బంగళాలు, అనుబంధ నిర్మాణాలు, ఆడిటోరియం, సెంట్రల్ రికార్డ్ రూమ్.. జోన్–2ను ఇప్పుడు ప్రారంభించుకుంటున్నాం. కోర్టులు ఆస్పత్రుల్లా పనిచేయాలని సీజేఐ ఇటీవల చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యం. అక్కడికి వచ్చే ప్రతి వ్యక్తికీ భరోసా, విశ్వాసం కల్పించే ప్రదేశాలుగా ఉండాలి. న్యాయం అందించడమే కాదు.. దాన్నిపౌరులు అనుభూతి పొందాలి’అని అభిలíÙంచారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా తమ అనుభవాలను వివరించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, రిజిస్టార్లు, ఏజీ సుదర్శన్రెడ్డి, పీపీ పల్లె నాగేశ్వర్రావు, హెచ్సీఏఏ అధ్యక్షుడు ఎస్.సురేందర్రెడ్డి, ఏఏజీలు ఇమ్రాన్ఖాన్, తేరా రజనీకాంత్రెడ్డి, హెచ్సీఏఏ ఉపాధ్యక్షుడు డీఎల్ పాండు, కార్యదర్శులు శ్రావణ్కుమార్గౌడ్, నిరంజన్రెడ్డి, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. -
‘స్టార్టప్ స్టేట్’ తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: భారతదేశంలో అత్యంత విజయవంతమైన ‘స్టార్టప్ స్టేట్’తెలంగాణ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు అన్నారు. తెలంగాణ ప్రస్థానం అంటే ఆత్మగౌరవం, ఆకాంక్ష, పురోగతికి నిదర్శనమని చెప్పారు. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ప్రతిష్టాత్మక కొలంబియా బిజినెస్ స్కూల్లో జరిగిన 21వ వార్షిక ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్లో ఆదివారం ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ సాధించిన ప్రగతిని వివరించారు.సుదీర్ఘ పోరాటం ద్వారా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పరిపాలన, ఆవిష్కరణలు, ఆర్థిక వృద్ధిలో దేశానికే దిక్సూచిగా నిలిచిందన్నారు. ‘మేము అవకాశాల కోసం ఎదురుచూడలేదు. వాటిని అందిపుచ్చుకోవడానికి అద్భుతమైన పాలసీలను తయారు చేశాం. మౌలిక సదుపాయాలను కల్పించాం. తద్వారా పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని కలిగించి వృద్ధిని సాధించాం’అని కేటీఆర్ వివరించారు.2027లో భారత్ 80వ స్వాతంత్య్ర దినోత్సవానికి సిద్ధమవుతున్న వేళ కేవలం పదేళ్లలోనే తెలంగాణ సాధించిన ఆర్థిక ప్రగతి గర్వకారణమన్నారు. రాష్ట్రాన్ని, దేశాన్ని నడిపే నాయకత్వానికి స్పష్టత ఉంటే జవాబుదారీతనం పెరుగుతుందని.. తద్వారా అభివృద్ధి వేగవంతమవుతుందని చెప్పారు. భవిష్యత్తు గురించి కేవలం మాటలు చెప్పడం కంటే, దానిని మనమే సృష్టించడం ఉత్తమమైన మార్గమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రాలే దేశాభివృద్ధికి ఇంజన్లు.. దీన్ని కేంద్రం గుర్తించాలి.. భారతదేశ సమాఖ్య స్ఫూర్తిని కేటీఆర్ ప్రస్తావిస్తూ దేశాభివృద్ధి కేవలం ఒకే రకమైన విధానాల వల్ల కాకుండా ప్రతి రాష్ట్రం తనకున్న ప్రత్యేక బలాలను వినియోగించుకోవడం ద్వారా సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ‘భారత్ 28 ఇంజన్లుగల ఒక ఫార్ములా–1 రేసింగ్ కార్ లాంటిది. ప్రతి రాష్ట్రం తనదైన శైలిలో అభివృద్ధి చెందుతూ దేశ ప్రగతికి తోడ్పడాలి. అంతర్జాతీయ పెట్టుబడి నిర్ణయాలు చివరికి రాష్ట్రాలు, నగరాల స్థాయిలోనే జరుగుతాయి’అని కేటీఆర్ గుర్తుచేశారు. ఐటీ, పారిశ్రామిక రంగంలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని తెలిపారు.2014 నుండి 2023 మధ్య కాలంలో తెలంగాణ సాంకేతిక రంగం సాధించిన గణాంకాలను కేటీఆర్ వివరించారు. ప్రభుత్వ వేగవంతమైన నిర్ణయాలు, పటిష్టమైన ఎకో సిస్టమ్ కారణంగానే హైదరాబాద్ గ్లోబల్ ఐటీ దిగ్గజాలకు చిరునామాగా మారిందన్నారు. హైదరాబాద్లో అమెజాన్ ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్ను ఏర్పాటు చేసిందని, గూగుల్, ఆపిల్, మెటా, సేల్స్ ఫోర్స్, ఉబర్, మైక్రాన్ టెక్నాలజీ వంటి సంస్థలు తమ కీలక కార్యకలాపాలను ఇక్కడ నిర్వహిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆవిష్కరణలకు చిరునామా తెలంగాణ మారిందన్నారు. టీ–హబ్, వీ–హబ్, టీ–వర్క్స్, టాస్క్ వంటి సంస్థల ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరణలకు పెద్దపీట వేసిందని కేటీఆర్ వివరించారు. స్కైరూట్ ఏరోస్పేస్, డారి్వన్ బాక్స్, జెనోటి, హైరేడియస్ వంటి యూనికార్న్ సంస్థలు హైదరాబాద్ నుంచి పుట్టుకురావడమే తెలంగాణ సత్తాకు నిదర్శనమన్నారు. ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా తెలంగాణ.. తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రపంచానికే వ్యాక్సిన్ రాజధానిగా ఎదిగిందని.. ప్రపంచ వ్యాక్సిన్లలో మూడో వంతు ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయని కేటీఆర్ వెల్లడించారు. ఏటా 10 బిలియన్ డోసుల టీకాలను తెలంగాణ ఉత్పత్తి చేస్తోందని.. దేశీయ బల్క్ డ్రగ్ ఉత్పత్తిలో 40 శాతం వాటా తెలంగాణదేనని చెప్పారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పుల గురించి ప్రస్తావిస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీపర్పస్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం ద్వారా 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందని వివరించారు.ఏఐ, లైఫ్ సైన్సెస్, ఫిన్టెక్, అగ్రిటెక్ వంటి రంగాల సమ్మేళనంతోనే తదుపరి వృద్ధి సాధ్యమని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. విదేశాల్లో ఉన్న విద్యార్థులు, నిపుణులు భారత అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ‘కేవలం ఆలోచనల దగ్గర ఆగిపోకుండా వాటిని సాధించేందుకు నిబద్ధతతో కూడిన ప్రణాళికలను రూపొందించండి. పెట్టుబడులను ఆకర్షించడమే కాదు.. ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని నిర్మించండి. నేటి సమస్యల పరిష్కారమే కాదు.. రేపటి అవసరాలకు తగిన సామర్థ్యాన్ని పెంపొందించుకోండి’అని పిలుపునిస్తూ కేటీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు. -
కొత్త వెలుగుల వ్యాసపురి
సాక్షి, హైదరాబాద్: వేదవ్యాసుడు స్వయంగా ప్రతిష్ఠించారని భక్తులు భావించే జ్ఞాన సర స్వతీ దేవాలయం పూర్తి కొత్తరూపు సంతరించుకోబోతోంది. వ్యాసుడి పేరుతో వ్యాసపురిగా మొదలై ప్రస్తుతం బాసరగా పిలుచుకుంటున్న సరస్వతీ దేవాలయానికి దేశవ్యాప్తంగా ఖ్యాతి ఉంది. దక్షిణ భారతదేశంలో ఇదే అతిపెద్ద సరస్వతీ దేవాలయం. చిన్నారులకు ఇక్కడ అక్షరాభ్యాసం చేయిస్తే చదువులో రాణిస్తారన్న నమ్మకంతో దేశవ్యాప్తంగా భక్తులు ఇక్కడ పిల్లలకు ఓనమాలు దిద్దిస్తా రు. క్రమంగా భక్తుల రాక పెరుగుతుండటంతో దేవాలయం ఇరుకుగా మారింది.గర్భాలయం పురాతనమైంది కావటంతో మండపంలోని భక్తులకు అమ్మవారి విగ్ర హం పూర్తిస్థాయిలో కనిపించటం లేదు. చిన్న తలుపు ఉండటమే దీనికి కారణం. గర్భాలయం కూడా చిన్నదిగా ఉంది. దీంతో ఆలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయా లని ప్రభుత్వం నిర్ణయించింది. గత బీఆర్ ఎస్ ప్రభుత్వం తొలుత ఆలయ పునరి్నర్మాణానికి నిర్ణయించి రూ.50 కోట్లు మంజూరు చేసింది. కానీ, పనులు మొదలు కాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా రూ.225 కోట్లతో ఈ ఆలయానికి కొత్తరూపు ఇవ్వనుంది. తొమ్మిదంతస్తుల భారీ రాజగోపురం, కోనేరు పునరుద్ధరణ, ధ్యాన మందిరం... ఇలా కొంగొత్త ఆకర్షణలతో చదువులతల్లి కోవెల భక్తులను ఆకట్టుకోబోతోంది. దేవాలయ పనులను సీఎం రేవంత్రెడ్డి సోమ వారం భూమిపూజ చేసి ప్రారంభిస్తారు. భక్త పారవశ్యం... చెంతనే విశాల గోదావరి ప్రవాహం... చుట్టూ దట్టమైన అడవితో కూడిన ప్రకృతి శోభ..తీరంలో చిన్న గ్రామం.. స్వయంగా వ్యాసమహర్షి తపస్సు చేశారని చెప్పుకొనే గుట్ట.. దాని దిగువనే దేవాలయం.. వెరసి ఈ ప్రాంతానికి వస్తే భక్తులు ఆనందపారవశ్యంలో మునిగితేలుతారు. వ్యాస మహర్షితో అనుబంధం ఉందన్న గాథ వారిలో భక్తి భావాన్ని నింపుతుంది. అందుకే ఇక్కడ అక్షరాభ్యాసాలకు అంత ప్రాధాన్యం.వసంత పంచమి లాంటి ప్రత్యేక సందర్భాల్లో దేశ నలుమూలల భక్తులు వస్తుంటారు. కొంతమంది భక్తులు అక్కడ మూడు, ఐదు, ఏడు, తొమ్మిదిరోజులపాటు ఉండి ధ్యానం చేసుకుంటూ మాధవ కవలం రూపంలో బాసరలోని భక్తులు పంచే అన్నప్రసాదం స్వీకరిస్తూ గడిపే ఆనవాయితీ ఉంది. గతంలో ఆలయం పూర్తి రాతి నిర్మాణంతో అలరారేది. ఆలయం పక్కనే భారీ కోనేరు.. సమీపంలో మంచినీళ్లు తోడుకునే పెద్ద బావి ఉండేది. ఆ తర్వాత అభివృద్ధి పనుల్లో్ల భాగంగా అవి కాలగర్భంలో కలిసి పోయాయి. ఇప్పుడు మళ్లీ కోనేరును పునరుద్ధరించనున్నారు. శృంగేరీ పీఠాధిపతుల ఆధ్వర్యంలో... ఈ ఆలయ పునరి్నర్మాణానికి ప్రభుత్వం ముందుగా శృంగేరీ పీఠాధిపతులను సంప్రదించింది. పునరి్నర్మాణంలో చేపట్టే పనులు, వాటి ప్రత్యేకతలను వారికి వివరించి సూచనలు తీసుకుంది. వారి సూచనల ఆధారంగానే ఇప్పుడు పనులు జరుగుతాయని అధికారులు చెబుతున్నారు. గర్భాలయం, అర్ధ మండపం, రాజ గోపురం, ఇతర గోపురాలు, మాడ వీధులు, కోనేరు, ఉత్తర ద్వారాల నిర్మాణాలకు సంబంధించి పీఠాధిపతుల అనుమతులు తీసుకున్నారు. వారి సూచనలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. మూడు రెట్లు పెరగనన్న ఆలయ ప్రాంగణం ప్రస్తుతం ఆలయ గర్భాలయం, అర్ధమండపం కేవలం 2 వేల చదరపు అడుగుల్లోనే ఉంది. వాటిని 5 వేల చదరపు అడుగులకు విస్తరిస్తారు. 9 అంతస్తుల ఉత్తర రాజగోపురం, మిగిలిన మూడు దిక్కుల్లో 7 అతంస్తుల గోపురాలు, 33 అడుగుల వెడల్పుతో నాలుగు దిక్కుల మాడ వీధులు, ఉత్తర ద్వారం నిర్మిస్తారు. ప్రస్తుతం ఆలయం మొత్తం విస్తీర్ణం 20 వేల చదరపు అడుగుల మేర ఉండగా, ఇప్పుడు దాన్ని ఏకంగా 62 వేల చదరపు అడుగులకు పెంచనున్నారు. ఆలయ పునర్నిర్మాణంలో సిమెంటు బదులు శిలనే వాడుతారు.ఆరువేల మంది భక్తులకు సరిపడా అన్ని వసతులతో (ఫీడింగ్ రూమ్, ఫుడ్ స్టాల్స్, టాయిలెట్స్ తదితరాలతో) 70 వేల చదరపు అడుగులతో క్యూ కాంప్లెక్స్లు నిర్మిస్తారు. 200 మంది ఏకకాలంలో కూర్చుని ధ్యానం చేసుకునేలా ధ్యాన మందిరం, 20 వేల చదరపు అడుగుల వైశాల్యంతో వంటశాల, భోజన శాలలు, ప్రసాద పంపిణీ కేంద్రం, ఈశాన్య దిక్కున కోనేరు... తూర్పు దిక్కున ఆధ్యాత్మికత పరిఢవిల్లేలా అద్భుతమైన తోరణాలు, సమాచార కేంద్రం, దేవాలయానికి ఉత్తర, తూర్పు దిక్కుల్లో వీధుల అభివృద్ధి, దేవాలయం నుంచి ఆవతలి వైపు వెళ్లేందుకు అండర్ పాస్, ఆవతలి వైపున సోలార్ రూప్టాప్తో వాహనాల పార్కింగ్, దేవాలయ ప్రాంగణంలో ఆహ్లాదకరమైన మొక్కలతో పుష్పవనం... ఇలా ఎన్నో నిర్మాణాలు కొలువు దీరనున్నాయి. ఆలయ ప్రాంగణం ఆవల హెల్త్సెంటర్ ఏర్పాటు చేస్తారు. భవిష్యత్లో ఆలయం వెనుక భాగం భారీ వృక్షాలతో ఆలరారేలా మొక్కలు నాటుతారు. . పుష్కరాలకు వచ్చే వారికి... వచ్చే ఏడాది జూన్లో జరిగే గోదావరి పుష్కరాలకు భారీ సంఖ్యలో భక్తులు రానున్నందున, బాసరలో వారి కోసం భారీగా వసతులు కల్పించాలని నిర్ణయించారు. ఆ పనులను కూడా ఇప్పుడు మాస్టర్ ప్లాన్లో చేర్చటం విశేషం. భక్తులు ఏ స్థాయిలోనూ ఇబ్బందులకు గురికాకుండా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. -
యువతను తిరిగి క్రీడలవైపు రప్పించాలి
సాక్షి, హైదరాబాద్: క్రీడామైదానం వదిలి దేశ యువత పెద్ద తప్పు చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభిప్రాయపడ్డారు. మైదానం వదిలి పబ్లు, డ్రగ్స్ సంస్కృతి వైపు వెళ్తున్న యువతను తిరిగి క్రీడా మైదానాల్లోకి రప్పించడానికి ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. డ్రగ్స్ కేసుల్లో పట్టుబడుతున్న వారిలో చదువుకున్న యువతే ఎక్కువ ఉంటోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పుడు వీరుల భూమి అయిన పంజాబ్లో ఇప్పుడు డ్రగ్స్ పెరిగాయని.. పంజాబ్లా మరే రాష్ట్రం కావొద్దన్నారు. యువతను సరైన దారిలో పెట్టకపోతే దేశ భవిష్యత్తుకు ప్రమాదమని హెచ్చరించారు.ఆదివారం సాయంత్రం హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన బీఎన్ ముల్లిక్ స్మారక అఖిల భారత పోలీసు ఫుట్బాల్ చాంపియన్ షిప్–2026 పోటీల ముగింపు వేడుకలో సీఎం రేవంత్రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం తన ఆటతో ఆకట్టుకున్నారు. సీఐఎస్ఎఫ్, గోవా జట్ల మధ్య జరిగిన ఎగ్జిబిషన్ ఫుట్బాల్ మ్యాచ్లో గోవా టీం తరఫున రేవంత్రెడ్డి వరుసగా మూడు గోల్స్ కొట్టి జట్టును గెలిపించారు.అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ భారత ఫుట్బాల్ చరిత్రలో హైదరాబాద్కు గొప్ప పేరుందన్నారు. 1950 నుంచి 1960ల వరకు నర్సరీ ఆఫ్ ఇండియన్ ఫుట్బాల్గా హైదరాబాద్ను పిలిచేవారని.. భారత ఫుట్బాల్ జట్టుకు అగ్రశ్రేణి క్రీడాకారులను ఈ నగరం అందించిందని సీఎం గుర్తుచేశారు. స్పై మాస్టర్గా పేరుగాంచిన బీఎన్ ముల్లిక్ పేరిట నిర్వహించిన ఈ టోర్నమెంట్తో దేశంలోని వివిధ పోలీసు బలగాల మధ్య సమన్వయం పెంచడం అభినందనీయమన్నారు. జాతీయ స్థాయిలో ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన తెలంగాణ పోలీసులను అభినందిస్తున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ క్రీడల్లో దేశం పేరు నిలబెట్టాలి నాలుగు కోట్ల మంది జనాభా ఉన్న దక్షిణ కొరియా ఒలింపిక్స్లో 30కిపైగా పతకాలు సాధిస్తే 140 కోట్లకుపైగా కోట్ల జనాభాగల భారత్ నుంచి ఒక్క పతకం రాకపోవడం బాధాకరమని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో దేశం పేరు నిలబెట్టేలా క్రీడాకారులను తయారు చేసేందుకు తెలంగాణలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని చెప్పారు ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంలో ఏర్పాటు చేసిన ఈ యూనివర్సిటీలో పుల్లెల గోపీచంద్, కపిల్దేవ్ వంటి ఎందరో గొప్ప క్రీడాకారులు బోర్డు సభ్యులుగా ఉన్నారన్నారు.‘మహిళా బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్కు డీఎస్పీ ఉద్యోగంతోపాటు రూ. 2 కోట్ల నగదు పురస్కారం ఇచ్చాం. టీం ఇండియా క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్ 12వ తరగతి తప్పినా నిబంధనలు పక్కనపెట్టి అతన్ని డీఎస్పీని చేశాం. చదువుకుంటే జాబ్లు వస్తాయో లేదో కానీ మీరు క్రీడాకారులుగా రాణిస్తే మీకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా’అని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.తెలంగాణ యువతకు మార్గదర్శనం చేసేందుకే దిగ్గజ ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీని తెలంగాణకు తీసుకువచ్చానని తెలిపారు. సైబర్ నేరాలు, డ్రగ్స్ను అరికట్టేందుకు పోలీసులు కృషి చేయాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ అందరూ క్రికెట్ క్రేజ్తో ఫుట్బాల్ను మరిచిపోతున్న తరుణంలో భారీ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహణతో తెలంగాణ పోలీసులు గర్వపడేలా చేశారన్నారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన సీఎం 12 రోజులపాటు జరిగిన మ్యాచ్లలో 34 జట్లు పాల్గొన్నాయని డీజీపీ శివధర్రెడ్డి తెలిపారు. విజేతలను, మ్యాచ్ నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన అధికారులను ఆయన అభినందించారు. ఈ టోర్నమెంట్ విజేతలుగా పురుషుల జట్టు నుంచి సీఐఎస్ఎఫ్, మహిళల జట్టు నుంచి అస్సాం రైఫిల్స్ నిలిచాయి. విజేత జట్లతోపాటు మహిళల నుంచి గోల్డెన్ బూట్ గెలుచుకున్న క్రీడాకారిణి ప్రియా సాసా, పురుషుల నుంచి గోల్డెన్ బూట్ గెలుచుకున్న క్రీడాకారుడు విజయ్ బెహారేలకు సీఎం రేవంత్రెడ్డి ట్రోఫీలను బహూకరించారు. కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ బ్యూరో స్పెషల్ డైరెక్టర్ స్వప్న తివారీ, సైబరాబాద్ సీపీ డా. రమేశ్రెడ్డి, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్, సాట్ చైర్మన్ శివసేనారెడ్డి, పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. -
నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం పర్యటన
భైంసా/బాసర/కైలాస్నగర్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. మొదట ఆయన బాసర శ్రీజ్ఞాన సరస్వతి ఆలయానికి రానున్నారు. ఈ నేపథ్యంలో నిర్మల్ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. సీఎం పర్యటనను విజయవంతం చేయడానికి అన్నిశాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేసినట్లు నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. బాసర మాస్టర్ ప్లాన్లో భాగంగా రూ.225 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. తర్వాత మధ్యాహ్నం ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం పిప్పిరి గ్రామంలో బహిరంగసభలో పాల్గొంటారు. సీఎం పర్యటన షెడ్యూల్ ఇలా.. ⇒ ఉదయం 10:20 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో బాసరకు బయల్దేరతారు. ⇒ ఉదయం 11 గంటలకు బాసర హెలీప్యాడ్కు చేరుకుని అక్కడ నుంచి రాజన్న గెస్ట్హౌస్కు వెళతారు. ⇒11:10 నుంచి 12:10 వరకు బాసర శ్రీజ్ఞాన సరస్వతి ఆలయంలో అమ్మవారి దర్శనం చేసుకుంటారు. ⇒మధ్యాహ్నం 12:15 నుంచి 12:30 వరకు ఆలయ పునర్నిర్మాణ పనులకు భూమిపూజ చేస్తారు.⇒ మధ్యాహ్నం 12:30 నుంచి 1:30 వరకు రిజర్వ్ టైమ్ ⇒ మధ్యాహ్నం 1:45 గంటలకు బాసర నుంచి ఆదిలాబాద్ జిల్లాకు వెళ్తారు. ⇒ మధ్యాహ్నం 2.15 గంటలకు పిప్పిరికి చేరుకుంటారు. ⇒ 2.20 నుంచి 2.30 వరకు వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ⇒ 2.30 నుంచి సాయంత్రం 4.10 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు.⇒ సభ అనంతరం ఐఎస్వో సరి్టఫికెట్లు, వడ్డీలేని రుణాల చెక్కులను లబి్ధదారులకు అందజేస్తారు. అలాగే సీఎం కప్ విజేతలకు ట్రోఫీని బహూకరిస్తారు. ⇒ 4.20 గంటలకు హైదరాబాద్కు తిరిగి పయనమవుతారు. -
మైనర్ బాలిక ఆత్మహత్య.. రెండవ భర్తపై ఫిర్యాదు చేసిన తల్లి
సాక్షి, సిద్ధిపేట: సిద్ధిపేట జిల్లా దుబ్బాకలోని రెండు పడకల గృహ సముదాయంలో దుర్ఘటన చోటుచేసుకుంది. 9వ తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో ప్రాంతంలో విషాదం నెలకొంది. జరిగిన ఘటనపై బాలిక తల్లి నిర్మల తన రెండవ భర్త అశోక్పై అనుమానం వ్యక్తం చేసింది. ఈ మేరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్థానికులు ఈ సంఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులోనే బాలిక ప్రాణాలు తీసుకోవడం సమాజాన్ని కలచివేసింది. పోలీసులు పూర్తి వివరాలు సేకరించి, బాలిక ఆత్మహత్యకు గల కారణాలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. -
Hyd: దారుణం.. మహిళను, స్కూటీని ఈడ్చుకెళ్లిన ట్రక్
హైదరాబాద్: నగరంలో మాదాపూర్లో శనివారం అర్ధరాత్రి దాటాక ఓ డీసీఎ వ్యాన్ బీభత్సం సృష్టించింది,. ఈ ఘటనలో స్కూటీపై వెళ్తున్న దంపతుల్లో భార్య చనిపోగా, భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. మూవీ చూసి స్కూటీపై వెళ్తున్న దంపతుల్ని డీసీఎం ఢీకొట్టింది. ఆ దంపతుల్లో భార్య కూడా స్కూటీతో వ్యాన్లో చిక్కుకుపోయింది. అనంతరం ఆ స్కూటీని అలాగే కిలో మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. వ్యాన్ పక్క నుంచి వెళ్తున్న నగర వాసులు ఈ విషయాన్ని గమనించి ఆ డీసీఎం వ్యాన్ను అడ్డగించారు. అనంతరం లారీ డ్రైవర్, క్లీనర్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే.. హనియ్యా ఆయేషా (22), అబ్దుల్ బాసిత్(26)లు భార్యభర్తలు. వీరిది కేరళ రాష్ట్రం. బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్కు వచ్చారు. జ్యూయలరీ వర్క్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరు నిన్న రాత్రి మూవీ చూడటానికి వెళ్లారు. అయితే వీరిని తిరిగి వస్తుండగా డీసీఎం ఢీకొట్టింది. డీసీఎం ఢీకొట్టడంతో వారిలో భర్త రోడ్డు పక్కకు పడిపోగా, భార్య మాత్రం డీసీఎం వ్యాన్లో చిక్కుకుపోయింది. ఇలా కిలో మీటర్లు వెళ్లిన తర్వాత ఇది గమనించిన కొంతమంది వ్యాన్ అడ్డగించి ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భార్య మృతి చెందగా, తీవ్రగాయాలైన భర్తకు చికిత్స అందిస్తున్నారు. అయితే వారిని ఢీకొట్టిన డీసీఎం వ్యాన్ డ్రైవర్కు ప్రమాదం జరిగిన విషయం తెలిసినా ఆపకుండా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఆ స్కూటీ ఆ వ్యాన్ కింద చిక్కుకున్నా అలానే వెళ్లిపోయాడు. ఇలా కిలో మీటర్లు దాటి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని ఒక చోట గమనించిన కొంతమంది ఆ వ్యాన్ను అడ్డగించి డ్రైవర్ను పట్టుకున్నారు. ఆ మహిళను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వ్యాన్ డ్రైవర్ను, క్లీనర్నుపోలీసులకు అప్పగించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసుల దర్యాప్తు చేపట్టారు. కర్ణాటకకు చెందిన ఆ వ్యాన్ను పోలీసులు సీజ్ చేశారు. -
రిసార్టులో దాడులు.. అరెస్టయిన వారిలో సినీనటుడు
సాక్షి హైదరాబాద్: గోల్కొండ తారామతిలోని ఓ రిసార్టులో గత రాత్రి డ్రగ్స్ పార్టీ నిర్వహించగా పోలీసులు దాడులు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఈగల్ టీమ్ ఓ ప్రకటన చేసింది. ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశామని తెలిపింది. తారామతిలో పోలీసులు, నార్కోటిక్స్ టీమ్స్తో సంయుక్త దాడులు నిర్వహించామని చెప్పింది. ఇంటర్నేషనల్ డీజే మోర్ దెన్ ఫ్రెండ్స్ పేరుతో పార్టీ నిర్వహించినట్లు వివరించింది. మెుత్తం 35 మందికి డ్రగ్స్ టెస్టులు నిర్వహించగా, అందులో ఆరుగురికి పాజిటివ్ వచ్చిందని తెలిపింది. అరెస్టయిన వారిలో వ్యాపారులు, డీజే ప్లేయర్, మోడల్, బాలీవుడ్ నటుడు, సర్వర్ ఉన్నట్లు చెప్పింది. -
లచ్చమ్మ కుంట చెరువు.. హైడ్రాకు హరీష్ సవాల్
సాక్షి, హైదరాబాద్: భూముల విషయంలో పెద్దలే గద్దలుగా మారితే ఎలా అని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. నాదర్గూల్ భూముల ఆక్రమణ వెనుక మంత్రి పొంగులేటి సభ్యులే ఉన్నారని ఆరోపించారు. హైదరాబాద్ నడిబొడ్డున 7000 కోట్ల భూ కుంభకోణం జరుగుతోందని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి హరీష్ రావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘దళితుల భూములను కాంగ్రెస్ భక్షించే ప్రయత్నం జరుగుతోంది. నాదర్గూల్ భూముల కుంభకోణం జరిగింది. పేదల భూముల్లోకి వారిని పోకుండా అడ్డుకుంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. నాదర్గూల్ భూముల కోసం చాలా ఏళ్లుగా పోరాటం జరుగుతుంది. ఈ భూమి తనదేనని రాజ్ బహుదూర్ కోర్టులో పోరాటం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ భూములను నిషేధిత జాబితాలో చేర్చడం జరిగింది. ప్రస్తుతం ఈ భూముల వ్యవహారం సుప్రీంకోర్టులో ఉంది.రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూ భారతి పోర్టల్లో ఈ ల్యాండ్ ప్రభుత్వ భూమిగా పేర్కొంది. ఈ భూములను కాపాడాల్సిన బాధ్యత ఆర్డీవోది. దీనిపై అక్కడి రైతులు రెవెన్యూ అధికారులకి, హైడ్రా కమిషనర్కి ఫిర్యాదు చేసినా ఎందుకు స్పందించడం లేదు. నాటి ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన భూమిని రేవంత్ రెడ్డి లాకుంటున్నారు. స్వయంగా రెవెన్యూ మంత్రే ఈ భూముల ఆక్రమణ వెనుక ఉంటే అధికారులు ఎలా చర్యలు తీసుకుంటారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో భూములను ఆక్రమిస్తే ఎవర్ని వదలను అన్న సీఎం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఈ భూములపై హైడ్రా ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు.లచ్చమ్మ కుంట చెరువును అక్కడ పెద్దలు ఆక్రమిస్తుంటే హైడ్రా కమిషనర్ ఏం చేస్తున్నారు?. చెరువులను కాపాడుతా అనే హైడ్రాకు కళ్లు కనబడటం లేదా?. హైడ్రా కమిషనర్కి సవాల్ చేస్తున్నా. రేపు హైడ్రా కమిషనర్ రావాలి లేదా మా ఎమ్మెల్యేలతో నేనే వెళ్తాను. మరోవైపు 80 ఎకరాల గుట్టలు మాయం చేస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు. ఈ నెల 7న ఈ భూములపై సుప్రీంకోర్టులో విచారణ ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వారంలోనే ఈ భూమి కోహినూర్కి చెందింది అని బోర్డు పెట్టారు. శిల్పా ఇన్ఫ్రా పొంగులేటి కుమారుడిది. ఈ భూముల వెనుక పొంగులేటి కుటుంబ సభ్యులే ఉన్నారు అంటూ’ వ్యాఖ్యలు చేశారు. -
ఖానాపూర్ మున్సిపాలిటీ.. బీజేపీ-బీఆర్ఎస్ కైవసం
సాక్షి, నిర్మల్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ వీడింది. ఖానాపూర్ మున్సిపాలిటీ పీఠాన్ని బీజేపీ-బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్పర్సన్గా బీజేపీ కార్పొరేటర్ మౌనిక ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్గా బీఆర్ఎస్ మహమ్మద్ షోయబ్ ఎన్నికయ్యారు.ఇదిలా ఉండగా.. శనివారం చైర్మన్ ఎన్నిక సందర్భంగా చేతులు ఎత్తే క్రమంలో కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అధికారులతో ఎమ్మెల్యే బొజ్జు, కాంగ్రెస్ కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే సమావేశం నుంచి ఎమ్మెల్యే బయటకు వెళ్లిపోయారు. మరోవైపు మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ, బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారులను ఆయన బెదిరిస్తున్నారని ఆక్షేపించారు.ఖానాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 12 కౌన్సిలర్ స్థానాలు ఉన్నాయి. ఇటీవల ఎన్నికల్లో బీఆర్ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 3, స్వతంత్రులు ఒకరు గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థి, ఎక్స్ అఫీషియో ఓటుతో కాంగ్రెస్ బలం ఐదుకు చేరింది. ముందుగా చైర్పర్సన్ ఎన్నిక వేళ బీజేపీ అభ్యర్థి మౌనిక పేరును అధికారులు ప్రతిపాదించారు. దీనిపై ఎమ్మెల్యే బొజ్జు అభ్యంతరం వ్యక్తం చేశారు. ముందుగా బీజేపీ అభ్యర్థి పేరు ఎలా ప్రతిపాదిస్తారంటూ ఆందోళనకు దిగారు. ఈ గందరగోళం నడుమే చైర్మన్ ఎన్నికను అధికారులు ఆదివారానికి వాయిదా వేశారు. -
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 05-12)
-
ప్రధాని మోదీని మెప్పించిన వంటలక్క యాదమ్మ..!
ఏదైన శుభకార్యానికి వెళ్లొస్తే మొదటగా అందరూ మాట్లాడుకునేది వడ్డించిన వంటల గురించే.. వెజ్ అయినా.. నాన్వెజ్ అయినా.. వంటకం ఎలా ఉంది..? ఎన్ని రకాలు వడ్డించారు? ఇలా ఓ చర్చే జరుగుతుంది. అయితే ఈ వంటలక్క చేయి పడితే రుచి చూడడం అవసరం లేదు. నాన్వెజ్లో బగారా, చికెన్, మటన్, ఫిష్, తలకాయ, బోటీతో పాటు వెజ్లో పచ్చిపులుసు, భక్షాలు, పప్పుచారు, పులిహోరాతో పాటు పంచభక్ష పరమాన్నాలు లొట్టలేసుకుని తింటారు. సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోదీతో శభాష్ అనిపించుకున్న కరీంనగర్లోని సప్తగిరికాలనీకి చెందిన ప్రముఖ క్యాటరింగ్ నిర్వాహకురాలు గూళ్ల యాదమ్మ చేతి వంటను రాష్ట్రంలోని ప్రముఖ రాజకీయ నాయకులందరూ రుచిచూశారు. ఒకప్పుడు రూ.15కు దినసరి కూలీగా చేసి, ప్రస్తుతం వందల మందికి ఉపాధి కల్పిస్తున్న యాదమ్మ చేతివంటపై సండే స్పెషల్..!!విద్యానగర్(కరీంనగర్): యాదమ్మది సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గౌరవెల్లి. చిగురుమామిడి మండలం కొండాపూర్కు చెందిన చంద్రయ్యతో పదిహేనేళ్ల వయసులోనే వివాహమైంది. కొడుకు పుట్టిన మూడు నెలలకే చంద్రయ్య ఓ ప్రమాదంలో మరణించాడు. దీంతో కొడుకును తీసుకుని కరీంనగర్కు వలసొచ్చారు. కొన్ని రోజులు స్కూల్లో ఆయాగా పని చేశారు. తరువాత మంకమ్మతోటకు చెందిన వెంకన్న వద్ద వంటపనిలో హెల్పర్గా చేరారు. అందుకు రోజూ రూ.15 కూలీ తీసుకునేవారు. కాలక్రమేణ చిన్నచిన్న ఫంక్షన్లలో వంటచేస్తూ మన్ననలు పొందారు. క్రమేనా పెద్దపెద్ద ఫంక్షన్లకు క్యాటరింగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు 50 వేల మందికైనా ఒంటిచేత్తో వంటచేసేలా ప్రావీణ్యం సంపాదించారు.మోదీ మెచ్చిన వంటలు2022లో హైదరాబాద్లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని మోదీతో పాటు పాల్గొన్న వందలాది మంది ప్రముఖులకు యాదమ్మ తన చేతి వంటలు రుచి చూపించి శభాష్ అనిపించుకున్నారు. హైదరాబాద్లోని నోవాటెల్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ వంటలు రుచిచూసిన ప్రధాని యాదమ్మను ప్రత్యేకంగా అభినందించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం పలుమార్లు యాదమ్మ వంటలను మెచ్చుకున్నారు. కేటీఆర్ నిర్వహించిన మూడు బహిరంగసభలు, వేములవాడ శివరాత్రి ఉత్సవాలు, కొండగట్టు హనుమాన్ జయంతి, గోదావరి పుష్కరాల్లో వేలాది మందికి వంటలు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూతురు పెళ్లిలో 30వేల మందికి, కరీంనగర్ తీగల వంతెన ప్రారంభం అప్పుడు 20వేల మందికి వంటలు చేశారు. కేంద్రమంత్రి బండి సంజయ్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసాల్లో జరిగిన ఫంక్షన్లకూ యాదమ్మ క్యాటరింగ్ చేశారు. గతనెల 27న కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో 25వేల మందికి రుచికరమైన వంటకాలు చేసిపెట్టారు.వందలాది మందికి ఉపాధికిరాయి పెంకుటిళ్లు నుంచి ఇప్పుడు సప్తగిరికాలనీలో తనకంటూ ఒక మంచి సొంతిళ్లు నిర్మించుకుని దుర్గా నిలయంగా పేరు పెట్టుకున్నారు. ఒక్కగానొక్క కొడుకును చదివించి రూ.12 లక్షలు ఖర్చు చేసి అమెరికా పంపింపారు. అక్కడి వాతావరణం పడక అనారోగ్యం పాలు కావడంతో స్వదేశానికి వచ్చి అతనూ క్యాటరింగ్ చేస్తున్నాడు. యాదమ్మ వద్ద దాదాపు 200 మంది వంటలు నేర్చుకుని సొంతంగా క్యాటరింగ్లు నిర్వహిస్తున్నారు. మీర్జాపూర్కు చెందిన 20 మంది మహిళలు వంటలు నేర్చుకుని స్వయం ఉపాధి పొందుతున్నారు. సీజన్లో 200మందికి ఉపాధి కల్పిస్తున్నారు. మిగతా రోజుల్లో నిత్యం 10 నుంచి 20 మంది యాదమ్మ వంటకు సాయంగా ఉంటారు.ఈ జన్మలో కలిగిన భాగ్యంకరీంనగర్లోని మారుమూల పల్లెలో పుట్టిన నేను ఈ దేశ ప్రధానికి నా చేతి వంట రుచి చూపిస్తానని కలలో కూడ అనుకోలేదు. శాకాహారమే కాకుండా నాన్ వెజ్ వంటకాలు కూడా బాగా చేస్తాను. గంగుల కమలాకర్, బండి సంజయ్లు నన్ను బాగా ప్రోత్సహిస్తున్నారు. వారి ఇంట్లో, రాజకీయ పార్టీలకు, కాలేజీ ఫంక్షన్లకు, రాజకీయ సభలకు దాదాపు 20 నుంచి 30వేల మందికి వంట చేయగలను. నా వద్ద ప్రస్తుతం 40మంది వరకు పని చేస్తారు. నా దగ్గర పని నేర్చుకున్న వారు స్వయంగా క్యాటరింగ్ నిర్వహిస్తున్నారు. వారి పిల్లలను అమెరికా సైతం పంపించారు. – గూళ్ల యాదమ్మ -
పాఠశాల నుంచి వస్తూ.. అనంత లోకాలకు
హైదరాబాద్ : తండ్రితో బైక్పై వస్తున్న ఎనిమిదో తరగతి విద్యార్థిని స్కూల్ బ్యాగ్ ఆర్టీసీ బస్సుకు తట్టుకోవడంతో కిందపడి ఆ బాలిక అక్కడికక్కడే మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. తన కళ్లెదుటే కూతురు మృత్యువాత పడటంతో ఆ కన్నతండ్రి కన్నీరుమున్నీరుగా విలపించారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం, రోడ్డుపై నీరు పేరుకుపోవడం.. పక్కనే కారు పార్క్ చేయడంతో.. బైక్ను తప్పించబోవడంతో ప్రమాదానికి కారణమైందని భావిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం ఊదురు గ్రామానికి చెందిన కంచి ప్రసాద్, సునీత దంపతులు రెండేళ్ల క్రితం నగరానికి వచ్చారు. జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–58లోని ప్లాట్నెంబర్ 1143లో వాచ్మెన్లుగా పని చేస్తున్నారు. వీరి కూతురు కీర్తిక (14) వెంగళరావునగర్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి, కుమారుడు సాయి (11) ఆరో తరగతి చదువుతున్నారు. రోజూ మాదిరిగానే ప్రసాద్ శనివారం కూతురు, కొడుకును మధ్యాహ్నం స్కూల్ నుంచి ఇంటికి బైక్పై తీసుకువస్తున్నాడు. బైక్ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ 1556 వద్దకు రాగానే గుంతలు తేలిన రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తుండడంతో పక్కకు వెళ్లాడు. అక్కడ కారు పార్క్ చేసి ఉన్న కారును తప్పించేందుకు అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. ఇదే సమయంలో వెనుక నుంచి మితిమీరిన వేగంతో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు దూసుకొచి్చంది. బస్సుకు కీర్తిక స్కూల్ బ్యాగ్ తట్టుకోవడంతో ఆమె కిందపడింది. టైరు బాలిక తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ప్రసాద్కు, సాయికి గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ తిరుపతిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం.. జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–5లోని మెట్రో స్టేషన్ రోడ్డంతా గుంతలమయమై మురుగునీరు పారుతుండడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గుంతలు పూడ్చకపోవడం, మురుగు సమస్యకు చెక్ పెట్టకపోవడంతో శనివారం రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృత్యువాత పడింది. దీనికి తోడు రోడ్డు పక్కన అక్రమంగా పార్కింగ్ చేసిన కారు కూడా ఈ ఘటనకు కారణమైందని, జీహెచ్ఎంసీ అధికారులపైనా కేసు నమోదు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
నవ వధువు ఆత్మహత్య.. ఏం జరిగింది?
సాక్షి, మాక్లూర్: పెళ్లి అయిన నెలకే నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లాలోని మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.బాన్సువాడకు చెందిన అఖిల (25)కు ఆలూర్ మండలం కల్లేడ గ్రామానికి చెందిన శ్రీకాంత్తో మార్చి 5న వివా హం జరిగింది. కొద్ది రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిన ఆమె, శుక్రవారం రాత్రి అత్తారింటికి చేరుకుంది. శనివారం ఉదయం భర్త పని నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో, ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అఖిల ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ పేర్కొన్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. కాగా, పెళ్లైన నెల రోజులకే అఖిల బలవన్మరణానికి పాల్పడటం కుటుంబ సభ్యులు, బంధువులు జీర్ణించుకోలేక పోతున్నారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు -
అప్పీల్కు అవకాశమేదీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థలో కీలకమైన భూభారతి చట్టం అమల్లోకి వచ్చి ఏడాది అవుతున్నా ముఖ్యమైన సమస్యలకు పరిష్కారం లభించడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఆ చట్టంలో పేర్కొన్న విధంగా అప్పీల్ వ్యవస్థ ఇంతవరకు అందుబాటులోకి రాలేదు. దీంతో రెవెన్యూ అధికారులు తీసుకున్న నిర్ణయాలపై ఉన్నతాధికారుల వద్దకు వెళ్లే అవకాశమే లేకుండా పోతోందని రైతులు వాపోతున్నారు. మొదటి అప్పిలేట్ అథారిటీ అయిన ఆర్డీవో నుంచి జిల్లా కలెక్టర్, తర్వాత సీసీఎల్ఏ వరకు అప్పీల్ చేసుకునే మాడ్యూల్ భూభారతి పోర్టల్లో పనిచేయకపోవడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. పొరపాటునో, గ్రహపాటునో కింది స్థాయి అధికారులు ఏదైనా తప్పు నిర్ణయం తీసుకున్నా, తగిన డాక్యుమెంట్లు లభించక తిరస్కరణకు గురైన దరఖాస్తులకు మళ్లీ డాక్యుమెంట్లు సమర్పించి పరిష్కరించుకోవాలనుకున్నా అవకాశం ఉండడం లేదు. అప్పీల్ కోసం సంబంధిత కార్యాలయాల వద్దకు వెళ్లినా ఫలితం లేకుండా పోతోంది. ఆన్లైన్లో అవకాశమివ్వలేదని, తామేమీ చేయలేమని అధికారులు చెçపుతుండడంతో చేసేదేమీ లేక రైతులు వెనుదిరగాల్సి వస్తోంది. అయితే, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు కనీసం ఆ మాడ్యూల్ వైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు వస్తున్నాయి. భూభారతి పోర్టల్లో వచ్చే అన్ని సమస్యలకూ ఏకకాలంలో పరిష్కారం చూపే అవకాశం లేకపోయినా కనీసం అప్పీల్ చేసే అవకాశం ఇవ్వాలనే ఆలోచన కూడా చేయకపోవడంతో క్షేత్రస్థాయిలో రైతాంగం ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సాదాబైనామాలదీ ఇదే పరిస్థితి.. భూముల విషయంలో సాధారణంగా వచ్చే సమస్యలకు ప్రత్యేకమైన పరిస్థితుల్లో కూడా అప్పీల్కు అవకాశం ఇవ్వకపోవడం గమనార్హం. ముఖ్యంగా సాదాబైనామాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే, అమ్మినవారు కూడా అఫిడవిట్ ఇవ్వాలనే నిబంధనను తొలుత విధించడంతో చాలా దరఖాస్తులు తిరస్కారానికి గురయ్యాయి. నోటీసుల గడువు ముగిసినా అఫిడవిట్ ఇచ్చేందుకు అమ్మినవారు ముందుకు రావడం లేదన్న కారణంతో చాలా దరఖాస్తులను తిరస్కరించారు. మొత్తం 9 లక్షలకు పైగా దరఖాస్తుల్లో దాదాపు 30 శాతం వరకు అనేక కారణాలతో తిరస్కరించగా, వాటిలో ఎక్కువగా అఫిడవిట్ విషయంలోనే తిరస్కారానికి గురయ్యాయి. ఇప్పుడు అమ్మిన వారు అఫిడవిట్ ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వమే తేల్చింది. ఈ మేరకు ప్రత్యేక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో గతంలో అమ్మిన వారు అఫిడవిట్ ఇవ్వలేదనే నిబంధనతో తిరస్కరించిన దరఖాస్తులపై కలెక్టర్లకు అప్పీల్ చేసుకునే వెసులుబాటును భూభారతి చట్టం కల్పిస్తోంది. కానీ, పోర్టల్లో మాత్రం అప్పీల్ మాడ్యూల్ పనిచేయకపోవడంతో దాదాపు 2 లక్షలకు పైగా దరఖాస్తుదారులు ఈ అప్పీల్ వ్యవస్థ కోసం నిరీక్షించాల్సి వస్తోందని రెవెన్యూ వర్గాలే చెబుతున్నాయి. అప్పీల్ వ్యవస్థను ఆన్లైన్లో ఏర్పాటు చేస్తేనే సాధారణ దరఖాస్తులతో పాటు సాదాబైనామాలకు కూడా అప్పీల్ చేసుకునే అవకాశం లభిస్తుందని వారంటున్నారు. -
వాళ్లు పెట్టారు.. వీళ్లు తీశారు
గజ్వేల్/సాక్షి, హైదరాబాద్: సిద్దిపేట జిల్లా గజ్వేల్లో మాజీ సీఎం, స్థానిక ఎమ్మెల్యే కేసీఆర్ కార్యాలయాన్ని కాంగ్రెస్ నేతలు ముట్టడించి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫొటో పెట్టడంపై వివా దం రేగింది. ఆగ్రహించిన బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్కు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేపట్టారు. దీంతో శనివారం పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రధాన రహదారి గుండా కేసీఆర్ క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించి లోపలికి ప్రవేశించారు. ఈ సందర్భంగా కార్యాలయం ప్రధాన ద్వారం అద్దాలు పగిలిపోయాయి. కాంగ్రెస్ శ్రేణులు వారి వెంట తెచ్చుకున్న రేవంత్రెడ్డి చిత్రపటాన్ని అక్కడ పెట్టి కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గజ్వేల్ సమస్యలను పట్టించుకోని కేసీఆర్కు ఒక్క నిమిషం కూడా పదవిలో కొనసాగే అర్హత లేదంటూ ఆంక్షారెడ్డి ధ్వజమెత్తారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని కాంగ్రెస్ శ్రేణులను అక్కడి నుంచి పంపించారు. సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అక్కడికి చేరుకొని కాంగ్రెస్ వైఖరిపై విరుచుకుపడ్డారు. అనంతరం బీఆర్ఎస్ శ్రేణులతో ర్యాలీ నిర్వహించి కాంగ్రెస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పోలీస్స్టేషన్లో కాంగ్రెస్ నేతలపై ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నేతలు క్యాంపు కార్యాలయంలో రేవంత్రెడ్డి ఫొటోను తొలగించారు. ఈ సందర్భంగా కేసీఆర్ కార్యాలయం వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అధికార మదంతోనే దాడి: హరీశ్రావు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే గజ్వేల్లోని కేసీఆర్ క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార మదంతో విర్రవీగుతూ ప్రజాస్వామ్యంపై దాడి చేస్తూ కాంగ్రెస్ నాయకులు బిహార్ గ్యాంగ్ను తలపిస్తున్నారన్నారు. ఓ వైపు విద్వేష ప్రసంగాల బిల్లు పేరిట ప్రజలు, ప్రతిపక్షాల నోర్లు మూయిస్తూ మరోవైపు గూండా రాజ్యం నడుపుతున్నారని మండిపడ్డారు. ‘సీఎం, మంత్రులు పొలిటికల్ టూర్లు చేస్తూ ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కానీ తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కార్యాలయాలపై దాడులు చేస్తూ ఎమర్జెన్సీ రోజులు తలపిస్తున్నారు. దాడులు ఆపకపోతే ప్రజలే వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి వస్తుంది’అని హరీశ్రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ దాడిని బీఆర్ఎస్ మాజీ మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఖండించారు. -
ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు డెడ్లైన్!
సాక్షి, హైదరాబాద్: విద్యాసంస్థల్లో ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బందికి తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ డెడ్లైన్ విధించింది. మైనార్టీ జూనియర్ కాలేజీల్లో పనిచేసే ఔట్సోర్సింగ్ సిబ్బందిని మార్చి 31 నుంచే విధుల నుంచి తొలగించిన అధికారులు.. ఈ సొసైటీ పరిధిలోని గురుకుల పాఠశాలల్లో పనిచేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఈ నెల 23వ తేదీన చివరి పనిదినంగా ప్రకటిస్తూ ఆ మరుసటి రోజు నుంచి విధులకు రావొద్దని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వారి పనిదినాల గడువును ఉటంకిస్తూ, తగిన చర్యలు తీసుకోవాలని మైనార్టీ గురుకుల సొసైటీ కార్యదర్శి రెండ్రోజుల క్రితం అన్ని జూనియర్ కాలేజీలు, పాఠశాలల ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు జారీ చేశారు. తాజా ఆదేశాలతో ఈ సొసైటీ పరిధిలో దాదాపు 2,250 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు విధుల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యా సంవత్సరం ముగియడంతో వారి సేవలను నిలిపివేస్తున్నట్లు సొసైటీ కార్యదర్శి స్పష్టం చేశారు. దీంతో నిర్దేశించిన గడువు నాటికే వారికి వేతనాలు చెల్లిస్తారు. తదుపరి ఈ ఉద్యోగులు సర్వీసుకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఎలాంటి స్పష్టత లేదు. సొసైటీ అవసరాలకు అనుగుణంగా తదుపరి చర్యలుంటాయని అధికారులు చెబుతున్నారు. 12 వేల మందికి పైమాటే.. ప్రస్తుతం మైనార్టీ గురుకుల సొసైటీ పరిధిలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సేవలను నిలిపివేసినప్పటికీ.. ఇతర గురుకుల సొసైటీల పరిధిలోనూ ఇదే తరహా చర్యలు మొదలయ్యాయి. ఇప్పటికే గురుకుల జూనియర్ కాలేజీలకు సెలవులు ప్రకటించడంతో.. అందులో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది సేవలు నిలిచిపోయాయి. ఈనెల 23వ తేదీతో ఆయా గురుకుల పాఠశాలల్లోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా చెక్పడనుంది. ఈమేరకు ఇప్పటికే మౌఖికంగా ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ, తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ, మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీల పరిధిలో దాదాపు 12 వేల మంది ఉద్యోగులు ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. వీరందరి సేవలను ఈనెల 23తో నిలిపివేస్తున్నప్పటికీ, తదుపరి సర్వీసుకు సంబంధించి స్పష్టత ఇవ్వకపోవడంతో వారిలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులకు కేవలం 10 నెలల వేతనాలు మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో వేసవి సెలవుల్లో వారు జీవనంకోసం ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ అంశంపై ఇప్పటికే పలుమార్లు మంత్రులు, ఉన్నతాధికారులను కలిసి 12 నెలల వేతనం ఇవ్వాలని కోరినప్పటికీ.. ప్రభుత్వం నుంచి స్పందన లేదని ఉద్యోగులు చెపుతున్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలి ప్రభుత్వ కార్యాలయాల్లో రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నప్పటికీ వేతనాలు అంతంతమాత్రమే ఇస్తున్నారు. కనీసం ఉద్యోగ భద్రత కూడా లేదు. విద్యా సంస్థల్లో పనిచేసే వారి పరిస్థితి మరింత దారుణం. వారికి కేవలం 10 నెలల జీతాలు మాత్రమే ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఏడాదిలో 10 నెలలు ఇక్కడ పనిచేసి మిగిలిన రెండు నెలలు ఎక్కడ పనిచేయాలి. ఈ రకమైన వివక్షను ప్రభుత్వం వీడాలి. మానవీయకోణంలో ఆలోచన చేసి ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కల్పించాలి. – పులి లక్ష్మయ్య, అధ్యక్షుడు, రాష్ట్ర ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం -
వాటర్.. మరో మీటర్..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూగర్భ జలాల సగటు మట్టం తీవ్రంగా పడిపోతోంది. నెల రోజుల వ్యవధిలో మీటర్కి పైగా లోతుల్లోకి జారిపోయిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వేసవి తీవ్రత పెరగడంతో రాష్ట్రంలో భూగర్భజలాల వినియోగం విపరీతంగా పెరిగింది. ప్రధానంగా బోరుబావుల కింద యాసంగి పంటల సాగుకోసం యథేచ్ఛగా నీటిని తోడేస్తుండటంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో 7.25 మీటర్ల లోతుల్లో లభ్యమైన భూగర్భ జలాలు మార్చి నాటికి 8.22 మీటర్ల లోతుల్లోకి దిగజారాయి. కాగా, జనవరిలో 6.28 మీటర్ల లోతుల్లోనే జలాలు లభ్యమయ్యాయి. వాస్తవానికి గత వర్షాకాలంలో సాధారణానికి మించి 37 శాతం వర్షపాతం నమోదు కావడంతో ప్రస్తుత నీటి సంవత్సరం 2025–26లో రికార్డు స్థాయిలో భూగర్భ జలాలు వృద్ధి చెందాయి. గతేడాది సెప్టెంబర్లో రాష్ట్ర భూగర్భ జలాల సగటు మట్టం 4.41 మీటర్ల లోతుల్లోనే ఉంది. ప్రస్తుతం వేసవి ప్రారంభం కావడంతో మార్చి నాటికి 8.22 మీటర్ల లోతుల్లోకి పడిపోయాయి. గతేడాది మార్చిలో రాష్ట్ర భూగర్బ జలాలు 9.91 మీటర్ల లోతుల్లోకి పడిపోగా, ఈ ఏడాది మార్చిలో కొంత మెరుగ్గా 8.22 మీటర్ల లోతుల్లోనే లభ్యమవుతున్నాయి. గత వర్షాకాలంలో సాధారణానికి మించి వర్షాలు కురవడమే దీనికి కారణం. రాష్ట్ర భూగర్భ జల శాఖ ఫిబ్రవరిలో రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో భూగర్భ జలాల స్థితిగతులను పరిశీలించి రూపొందించిన నివేదికలో ఈ అంశాలను వెల్లడించింది. వికారాబాద్లో ఆందోళనకరం..ఖమ్మం జిల్లాలో 4.52 మీటర్ల లోతుల్లోనే భూగర్భ జలాల లభ్యత ఉండగా, వికారాబాద్ జిల్లాలో మాత్రం 13.72 మీటర్ల లోతుల్లో లభిస్తున్నాయి. రాష్ట్రంలోని జిల్లాలను సగటు భూగర్భ జలమట్టం 0–5 మీటర్లు, 5–10 మీటర్లు, 10 మీటర్లపైన లోతు.. అనే మూడు కేటగిరీలుగా వర్గీకరిస్తారు. భూగర్భ జలాలు 0– 5 మీటర్లలోపు లోతులో ఉంటే సురక్షిత స్థాయిలో ఉన్నట్టు భావిస్తారు. రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాలుండగా, కేవలం 2 జిల్లాల్లోనే 0–5 మీటర్ల లోతుల్లో భూగర్భ జలాలు లభిస్తున్నాయి. 21 జిల్లాల్లో 5–10 మీటర్ల లోతుల్లో, 10 జిల్లాల్లో 10 మీటర్లకి మించిన లోతుల్లో భూగర్భ జలాలున్నట్టు తేలింది. 10 మీటర్లకన్నా లోతుకు భూగర్భ జలాలు పడిపోయిన జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు భావిస్తారు. ఈ నేపథ్యంలో వేసవి ప్రారంభంలోనే 10 జిల్లాల్లో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయికి పడిపోయినట్టు ఈ గణాంకాలు పేర్కొంటున్నాయి.వికారాబాద్ జిల్లాలో 13.72, కామారెడ్డి జిల్లాలో 12.35 మీటర్లు, సంగారెడ్డి జిల్లాలో 11.95 మీటర్లు, మెదక్ జిల్లాలో 11.86 మీటర్లు, నిజామాబాద్ జిల్లాలో 11.67 మీటర్లు, సిద్దిపేట 11.13 మీటర్లు, భూపాలపల్లి జిల్లాలో 10.80 మీటర్లు, మేడ్చల్ 10.78 మీటర్లు, సిరిసిల్ల 10.6 మీటర్లు, రంగారెడ్డి 10.06 మీటర్ల లోతుల్లోకి భూగర్భ జలాలు పడిపోయాయి.85 మండలాల్లో దశాబ్దకాలం కంటే లోతుల్లోకి రాష్ట్రంలో 536 మండలాల్లో (86శాతం) భూగర్భ జలాల మట్టం గత దశాబ్ద కాల సగటు కంటే మెరుగైన స్థితిలో ఉంది. ఈ మండలాల్లో 0.01–19.24 మీటర్ల మేర దశాబ్ద కాల వృద్ధి నమోదైంది. మిగిలిన 85 మండలాల్లో(14శాతం) దశాబ్ద కాల సగటు కంటే 0.01 నుంచి 13.4 మీటర్ల మేరకు లోతుల్లో భూగర్భ జలాలు పడిపోయాయి.ఎండిపోతున్న పంటలు..కొన్ని జిల్లాల్లో భూగర్భ జలాలు బాగా ఇంకిపోవడంతో బోరుబావుల కింద సాగుచేస్తున్న యాసంగి పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు ట్యాంకర్లతో పంటలకు నీళ్లు అందించడానికి తంటాలు పడుతున్నారు. ఎండిపోయిన పంటలను పశువులకు మేత కోసం వదిలేస్తున్నారు. -
కట్టుకున్నవారే కాలయముళ్లు
అడ్డాకుల/పటాన్చెరు టౌన్: రక్షణ గా ఉండాల్సిన భర్తలే భార్యల పాలిట కాలయముళ్లు అయ్యారు. వేర్వేరు జిల్లాల్లో జరిగిన ఈ సంఘ టనలు కలకలం రేపాయి. ఒకచోట ప్రేమించి పెళ్లి చేసుకున్న ఎనిమిది నెలలకే మనస్పర్థలతో భార్య ప్రా ణం తీస్తే.. మరోచోట అనుమానంతో పెళ్లయిన ఏళ్ల తర్వా త భార్యను కిరాతకంగా గొంతు కోసి చంపాడొక భర్త. వివరా లివి. మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం పోల్కంపల్లి గ్రామానికి చెందిన నర్సు కె.శ్రీదేవి (21).. అదే గ్రామా ని కి చెందిన చందుతో ప్రేమలో పడింది. కులాలు వేరైనా ఎని మిది నెలల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. తర్వాత పెద్దలను ఒప్పించి గ్రామంలో చందు ఇంట్లోనే ఉంటూ కాపు రం చేస్తున్నారు. ఇటీవల భార్యభర్తల మధ్య మనస్పర్థలు పెరిగాయి. చందు నిత్యం తన భార్యను హింసించేవాడు. ఈక్రమంలో శుక్రవారం రాత్రి భార్యను కొట్టి గొంతు నులిమి చంపాడు. పొలం వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసు కుందనేలా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. చివరికి గ్రామస్తు ల సమాచారంతో ఎస్ఐ ఎం.వేణు పొలం వద్దకు చేరుకుని విచారణ చేపట్టారు. మృతురాలి భర్త చందును అదుపులోకి తీసుకుని విచారించారు. యువతి మృతదేహానికి జిల్లా ఆస్ప త్రిలో శనివారం పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత సాయంత్రం గ్రామానికి తీసుకొచ్చారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడింది. చందు అక్కడికి వచ్చే వరకు అంత్యక్రియలు నిర్వహించేది లేదని మృతురాలి బంధువులు పట్టుబట్టారు. మహబూబ్నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు గ్రామానికి చేరుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పారు. ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా అడ్డాకుల, దేవరకద్ర ఎస్ఐలు శ్రీనివాస్, నాగన్న బందోబస్తు చేపట్టారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు చందుపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎం.వేణు తెలిపారు. అనుమానమే పెనుభూతమై..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోనసీ మ జిల్లా, అల్లవరం మండలం మొగలమూరుకు చెందిన పరమేశ్వరరావు, లీలా వతి (54) దంపతులు పటా న్చెరు ఏపీఆర్ కాలనీలో కుమారుడు మహావీర్ ఆరు ద్ర, కోడలు సుజాతతో కలి సి ఉంటున్నారు. కాగా కొంతకాలంగా పరమేశ్వరరావు, లీలావతి పై అనుమానం పెంచుకొని తరచూ గొడవ పడుతు న్నాడు. శనివారం ఉదయం కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. కుమారుడు, కోడలు తమ కుమారునికి వ్యాక్సిన్ వేయించేందుకు ఉదయం 10 గంటల సమయంలో బయటికి వెళ్లారు. ఈ క్రమంలో పరమేశ్వరరావు కూరగా యలు కోసే కత్తితో లీలావతి గొంతుకోసి పరారయ్యాడు. కుమారుడు, కోడలు వచ్చి చూసేసరికి లీలావతి రక్తపు మడు గులో చనిపోయి ఉండటంతో అరుస్తూ బయటికి వచ్చారు. సమాచారం అందుకున్న సీఐ రాజు సిబ్బందితో కలిసి ఘట నా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. క్లూస్ టీం బృందాన్ని రప్పించి ఆధారాలు సేకరించారు. పరారైన పరమేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
చుట్టూ వారు మన ఏజ్ బారు
సాక్షి, హైదరాబాద్: మన చుట్టూ ఉండే వ్యక్తులు మన మనసుపై మాత్రమే కాదు, శరీర ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతారని నిపుణులు ఎప్పటినుంచో చెబుతుండగా.. తాజా అధ్యయనం దీన్ని మరింత బలపరుస్తోంది. ఎప్పుడూ ఒత్తిడి కలిగించే లేదా ప్రతికూల (నెగెటివ్) ధోరణితో ప్రవర్తించే (టాక్సిక్) వ్యక్తులతో ఎక్కువ సమయం గడిపితే వృద్ధాప్యం త్వరగా వచ్చే అవకాశం ఉందని ఈ పరిశోధన స్పష్టం చేసింది. న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుడు బ్యుంక్యులీ సారథ్యంలో ఈ అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయన ఫలితాలు ప్రముఖ శాస్త్రీయ జర్నల్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (పీఎన్ఏ)లో ప్రచురితమయ్యాయి. అధ్యయనంలో భాగంగా 18–104 ఏళ్ల మధ్య వయసు ఉన్న 2300 మందికి పైగా వ్యక్తులను పరిశీలించారు. వారి సామాజిక సంబంధాలు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, నెట్వర్క్ను విశ్లేషించారు. ముఖ్యంగా ఎవరి వల్ల ఎక్కువగా భావోద్వేగ ఒత్తిడికి గురవుతున్నారో లేదా సమస్యలు ఎదురవుతున్నాయో గుర్తించారు. పాల్గొన్న వారి లాలాజలం నమూనాలను తీసుకుని డీఎన్ఏ మైథెలేషన్ అనే విధానం ద్వారా ‘బయోలాజికల్ ఏజ్’ను కొలిచారు. సాధారణంగా మన పుట్టిన తేదీ ఆధారంగా చెప్పే వయసు క్రోనాలాజికల్ ఏజ్ కాగా, శరీర కణాల స్థితి ఆధారంగా చెప్పే వయస్సును బయోలాజికల్ ఏజ్ అంటారు. ఇది ఆరోగ్య పరిస్థితిని ప్రతిబింబిస్తుందన్న మాట. అధ్యయనం తేల్చిన కీలకాంశాలివే.. ఒక వ్యక్తి జీవితంలో కీలకంగా లేదా అత్యంత సన్నిహితంగా ఎవరైనా టాక్సిక్ వ్యక్తి ఉంటే వృద్ధాప్య వేగం సుమారు 1.5% పెరుగుతుంది. అటువంటి సంబంధాలు ఉన్నవారి బయోలాజికల్ వయస్సు సగటున 9 నెలలు ఎక్కువగా కనిపించింది. ముఖ్యంగా స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో ఉన్న నెగటివ్ సంబంధాలు శరీరంపై ఎక్కువ ప్రభావం చూపాయని పరిశోధకులు గుర్తించారు. టాక్సిక్ వ్యక్తులు దీర్ఘకాలిక ఒత్తిడికి (క్రానిక్ స్ట్రెస్)కు కారణమవుతారు. దీనివల్ల కార్టిసోల్ వంటి హార్మోన్లు పెరిగి శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. దీర్ఘకాలంలో ఇది కణాల నష్టం, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి వాటికి కారణమై అంతిమంగా వేగవంతమైన వృద్ధాప్యం ప్రాప్తించేందుకు కారణమవుతుంది. మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం... టాక్సిక్ వ్యక్తులతో ఎక్కువ సమయం గడపడం వల్ల కేవలం శరీర ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఆందోళన, నిరాశ, భావోద్వేగ అలసట వంటి మానసిక సమస్యలు పెరిగే ప్రమాదం ఉంది. దీని ప్రభావంతో నిద్రలేమి, రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు కూడా మీద పడవచ్చు. మన చుట్టూ ఉన్న సంబంధాలు భావోద్వేగాలపై అంతిమంగా శరీర వృద్ధాప్య ప్రక్రియపై ప్రభావం చూపుతాయని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. సానుకూల సంబంధాలే ఆరోగ్యానికి మేలు పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. మంచి సంబంధాలు కలిగి, మద్దతు ఇచ్చే వ్యక్తులతో కలిసి జీవించడం ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. ఆరోగ్యంగా, ప్రశాంతంగా జీవించాలంటే టాక్సిక్ వ్యక్తులతో సంబంధాలను తగ్గించుకుని సానుకూల సంబంధాలను పెంపొందించుకోవడం ఎంతో ముఖ్యం. నెగటివ్ ఆలోచనలతో ఉండే వ్యక్తులకు దూరంగా ఉండడం, అవసరమైన చోట భావోద్వేగ హద్దులు పెట్టుకోవడం, వ్యాయామం, ధ్యానం వంటి కార్యకలాపాలతో ఒత్తిడిని తగ్గించుకోవాలని, సానుకూల ఆలోచనలు కలిగిన వ్యక్తులతో ఎక్కువ సమయం గడపాలని సూచిస్తున్నారు. -
బీభత్సం సృష్టించిన వడగళ్ల వాన
బోధన్: నిజామాబాద్ జిల్లా మంజీర నది తీర ప్రాంతంలోని గ్రామాల్లో శనివారం సాయంత్రం ఈదురు గాలులు, వడగళ్ల వర్షం బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో భీతావహ వాతావరణం ఏర్పడింది. సాలూర మండల కేంద్రం, ఖాజాపూర్, హున్సా, మందర్నా గ్రామా ల్లో వరి, మొక్కజొన్న, అరటి, కూరగాయల పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. ఈ గ్రామాల్లో యాసంగి సీజన్లో వేలాది ఎకరాల్లో వరి, మొక్కజొన్న సాగు చేశారు. పంటలు కోత దశకు చేరాయి. వర్షానికి మొక్కజొన్న నేలవాలింది. వరిపంట గింజ రాలిపోయింది. సాలూర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం రైతు సేవా కేంద్రం ఆవరణలో, అంతర్రాష్ట్ర బైపాస్ రోడ్డు మార్గం, ఖాళీ ప్రదేశాల్లో ఆరబెట్టిన వరి ధాన్యం వర్షానికి తడిసిపోయింది. -
ఆర్థిక ఇబ్బందుల్లేకుంటే కారుణ్య ఉద్యోగానికి అర్హులు కారు
సాక్షి, హైదరాబాద్: మరణించిన ప్రభుత్వ ఉద్యోగి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో లేకున్నా, అతను లేకుండా దీర్ఘకాలంగా జీవనం సాగిస్తున్నా వారు కారుణ్య ఉద్యోగానికి అనర్హులని హైకోర్టు స్పష్టం చేసింది. 25 ఏళ్ల మహిళ దాఖలు చేసిన అప్పీల్ను కొట్టివేసింది. ఎంజీఎం ఆస్పత్రిలో మేల్ నర్స్గా పని చేసి మరణించిన తండ్రి ఉద్యోగాన్ని తనకు ఇవ్వాలంటూ వరంగల్కు చెందిన ఓ యువతి అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. వారు తిరస్కరించడంతో, ఆకస్మిక ఆర్థిక సంక్షోభంలో ఉన్న కుటుంబాలకు తక్షణ ఉపశమనం కల్పించడానికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చేలా ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. తండ్రి మరణం తర్వాత ఆ కుటుంబం చాలా కాలం జీవనం సాగించిందని, తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లేవంటూ పిటిషన్ను సింగిల్ జడ్జి కొట్టివేశారు. పిటిషనర్ తల్లి రెండో వివాహం చేసుకున్న తర్వాత ఆమె తండ్రికి చట్టబద్ధమైన వారసురాలిగా పొందిన సివిల్ డిక్రీ కేవలం ఆస్తి విషయాలకు మాత్రమే వర్తిస్తుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగానికి చట్టపరమైన హక్కు కల్పించదని చెప్పారు. దీన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన అప్పీల్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. సింగిల్ జడ్జి అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే తీర్పునిచ్చారంటూ ఆ ఉత్తర్వులను సమర్థించింది. ఉద్యోగం కోసం చేసిన మొదటి దరఖాస్తును సరైన కారణాలతో తిరస్కరించారని పేర్కొంది. ఐదేళ్ల తర్వాత రెండో దరఖాస్తును పరిగణనలోకి తీసుకోలేమని స్పష్టం చేసింది. -
ఆప్షన్ ఇచ్చి తరలండి!
సాక్షి, హైదరాబాద్: నగరం నుంచి ఆర్టీసీ సిబ్బంది తరలింపునకు సంబంధించిన ప్రక్రియ మొదలైంది. ఎవరు ఏ రీజియన్లో పనిచేయదలుచుకున్నారో ఆప్షన్ల ద్వారా చెప్పాలని ఆర్టీసీ ఎండీ ఆదేశించారు. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ జోన్కు ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 15లోగా ఆప్షన్లను సేకరించి అందజేయాల్సిందిగా అందులో పేర్కొన్నారు. దీన్ని అత్యవసర ప్రక్రియగా భావించాలని స్పష్టం చేయటం విశేషం. త్వరలో ఔటర్ రింగురోడ్డు లోపల ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే తిప్పాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించి, అందుకు తగ్గట్టుగా ఎలక్ట్రిక్ బస్సులను సమకూర్చుకోవాలని ఆర్టీసీని ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ బస్సులు వచ్చే కొద్దీ తత్సమాన సంఖ్యలో డీజిల్ బస్సులను జిల్లాలకు బదిలీ చేస్తారు. ఈ ఎలక్ట్రిక్ బస్సులను గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు (జీసీసీ) విధానంలో ఆర్టీసీ అద్దెకు తీసుకుంటుంది. రెండు సంస్థలు వాటిని నిర్వహిస్తాయి. అప్పుడు నగరంలోని డిపోలన్నింటిని వాటికే అప్పగించనున్నారు. అద్దె ప్రాతిపదికన నిర్వహించనున్నందున వాటిల్లో డ్రైవర్లు, మెకానిక్ సిబ్బందిని ఆయా సంస్థలే నియమించుకోవాల్సి ఉంటుంది. కండక్టర్లు మాత్రమే ఆర్టీసీ సిబ్బంది ఉంటారు. డిపోల్లో డీఎంలు, అసిస్టెంట్ డీఎంలు, అకౌంట్స్ సిబ్బంది, కండక్టర్లు...లాంటి వారు మాత్రమే ఆర్టీసీ వైపు నుంచి పనిచేస్తారు. మిగతా ఆర్టీసీ సిబ్బందిని వేరే ప్రాంతాలకు తరలించాల్సిందే. ఈ క్రమంలోనే సిబ్బంది కోరుకున్న ప్రాంతానికి వెళ్లేందుకు ఆప్షన్ ఇచ్చుకునే వెసులుబాటును ఆర్టీసీ కల్పించింది. » హైదరాబాద్ జోన్ (గ్రేటర్ హైదరాబాద్ పరిధి వెలుపలి దక్షిణ తెలంగాణ ప్రాంతం), కరీంనగర్ జోన్ల పరిధిలో డిప్యుటేషన్ పద్ధతిలో పనిచేయాల్సి ఉంటుంది. » పదోతరగతి, అంతకంటే ఎక్కువ విద్యార్హత ఉన్న డ్రైవర్లు నగరంలో కండక్టర్లుగా పనిచేసేందుకు వెసులుబాటు కల్పించింది. దీనికి కూడా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించింది. » మెకానిక్లు వారి విద్యార్హత ఆధారంగా ఏడీఎస్లుగా, బస్పాస్ కౌంటర్ సిబ్బందిగా, భారీ వాహన డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు పార్కింగ్ డ్రైవర్లుగా ఓడీతో పనిచేసేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. » డ్రైవర్లు, గ్యారేజీ సిబ్బంది కలిపి నగరంలో దాదాపు 8 వేల మంది వరకు పనిచేస్తున్నారు. వీరందరినీ తరలించాల్సి ఉంది. » ప్రస్తుతం 2 వేల డ్రైవర్ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ, నగరంలో కొత్తగా 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు వచ్చిన తర్వాత ఏకంగా 4 వేల మంది డ్రైవర్లు అదనంగా మారనున్నారు. ఇక ప్రస్తుతం 2 వేల కండక్టర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో ఇటీవల 1,700 మంది ఔట్సోర్సింగ్ సిబ్బందిని ఆ విధుల్లోకి తీసుకున్నారు. ఎలక్ట్రిక్ బస్సులు వచ్చే నాటికి మరిన్ని పోస్టులు ఖాళీ అవుతాయి. ఆ ఖాళీని అదనంగా మారే డ్రైవర్లకు కండక్టర్ పోస్టు ఇవ్వటం ద్వారా భర్తీ చేస్తారు. » కండక్టర్ పోస్టులు భర్తీ అయిన తర్వాత కూడా అదనంగా ఉండే డ్రైవర్ల నుంచి ఆప్షన్లు తీసుకుని వారి సొంత జిల్లాలు, వారు కోరిన ఇతర జిల్లాలకు బదిలీ చేస్తారు. -
రెస్పెక్ట్ ఏదిరా?
గంగాధర: తమకు గౌరవం ఇవ్వడం లేదని పదో తరగతి విద్యార్థులు 9వ తరగతి విద్యార్థులను చితకబాదారు. కరీంనగర్ జిల్లా గంగాధరలోని మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ బాలుర గురుకుల విద్యాలయంలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. శుక్రవారం రాత్రి పది గంటలు దాటిన తరువాత వాచ్మన్, డ్యూటీలో ఉండే ఉపాధ్యాయుడు నిద్రపోయారు. పదో తరగతి విద్యార్థులు 25 మంది కలిసి తొమ్మిదో తరగతి చదువుతున్న 15 మందిని, ఒక్కొక్కరిగా తమ గదిలోకి పిలుస్తూ చితకబాదారు. దెబ్బలు తిన్న విద్యార్థులు శనివారం ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.దెబ్బలు తిన్న వారిలో ఓ విద్యార్థి పుట్టిన రోజు కావడంతో.. శనివారం అతని తల్లి పాఠశాలకు వచ్చినప్పుడు విషయం వెలుగులోకి వచ్చింది. తరువాత బాధిత విద్యార్థుల తల్లిదండ్రులందరూ పాఠశాలకు చేరుకోగా, సిబ్బంది లోపలికి అనుమతించలేదు. దీంతో పోలీసులకు సమాచారమిచ్చారు. మండల విద్యాధికారి ఏనుగు ప్రభాకర్రావు, ఎస్ఐ వంశీకృష్ణ, పాఠశాలకు చేరుకొని విచారణ జరిపారు. బాధిత విద్యార్థులకు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. ఇద్దరిని కరీంనగర్ తరలించారు.అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు ఘటనపై తహసీల్దార్ అంబటి రజితకు ఫిర్యాదు చేశారు. దాడి జరుగుతున్నా డ్యూటీలో ఉన్న వాచ్మన్, ఉపాధ్యాయుడు పట్టించుకోలేదని, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. తహసీల్దార్ రజిత విచారణ చేపట్టి దాడి చేసిన పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి, ఇంటికి పంపించారు. వాచ్మన్, ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులను బదిలీ చేయాలని ఉన్నతాధికారులకు సిఫారసు చేశారు.గదిలో బంధించి ర్యాగింగ్7వ తరగతి విద్యార్థిని కొట్టిన టెన్త్ విద్యార్థులుకారేపల్లి: గురుకులం విద్యార్థులు సాయంత్రం వేళ ఆడుకుంటున్న సమయంలో తలెత్తిన గొడవ ఏడో తరగతి విద్యార్థిపై దాడికి దారితీసింది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గాంధీనగర్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయంలో శనివారం సాయంత్రం కొందరు పదో తరగతి విద్యార్థులు ఓ గదిలో 7వ తరగతి విద్యార్థిని బంధించి ర్యాగింగ్ చేస్తూ దాడికి పాల్పడ్డారు.ఈ సమయాన ఉపాధ్యాయులెవరూ లేకపోగా, విద్యార్థి అరుపులు విన్న సమీపంలోని డబుల్ బెడ్రూం వాసులు చేరుకుని విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్లో సమాచారం ఇచ్చారు. గాయపడిన విద్యార్థిని 108 అంబులెన్స్లో ఇల్లెందు ఆస్పత్రికి తరలించారు. ఇంతలోనే చేరుకున్న విద్యార్థి కుటుంబీకులు, స్థానికులు దాడి చేసిన టెన్త్ విద్యార్థులను తమకు అప్పగించాలని ఆందోళన చేపట్టారు. అనంతరం ఉపాధ్యాయులు చేరుకుని 10వ తరగతి విద్యార్థులను ఓ గదిలో ఉంచి.. ఉదయం మాట్లాడదామని నచ్చజెప్పినా వినకపోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ మేరకు సమాచారం అందుకున్న కారేపల్లి పోలీసులు చేరుకుని పర్యవేక్షిస్తున్నారు. -
ఆ ముగ్గురు ఐఏఎస్లు హాజరుకావాలి
సాక్షి, హైదరాబాద్: నీటిపారుదల శాఖలో గతంలో పనిచేసిన ఏడుగురు ఉద్యోగులకు సంబంధించి తాము గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ధిక్కరణ పిటిషన్లో ప్రతివాదులైన ఆర్థిక, నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శులతో పాటు నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్, వరంగల్ ఎస్ఈ, కొత్తగూడెం డివిజన్ ఈఈ, ఖమ్మం జిల్లా కలెక్టర్.. తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. వీరిలో ముగ్గురు ఐఏఎస్ అధికారులున్నారు. తదుపరి విచారణ ఈనెల 13కు వాయిదా వేసింది.తమను క్రమబద్దీకరించకపోవడాన్ని, పింఛన్ సహా ఇతర ప్రయోజనాలు కల్పించకపోవడాన్ని సవాల్ చేస్తూ ఖమ్మం జిల్లాకు చెందిన నీటిపారుదల శాఖ ఉద్యోగులు (గతంలో) జగన్నాథం సహా పలువురు హైకోర్టులో పిటిషన్ వేశారు. సింగిల్ జడ్జి వీరికి అనుకూలంగా ఉత్తర్వులిచ్చారు. దీన్ని సవాల్ చేస్తూ అధికారులు అప్పీల్ వేశారు. అప్పీల్ను ద్విసభ్య ధర్మాసనం పాక్షికంగా అనుమతించింది. ఖమ్మం జిల్లాకు చెందిన జగన్నాథం సహా మరికొందరి సేవలను 1993, నవంబర్ 25 నుంచి అన్ని ప్రయోజనాలతో క్రమబద్ధీకరించాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవరించి, బి.శ్రీనివాస్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు పింఛన్ సహా ఇతర ప్రయోజనాలు కల్పించాలని 2023, సెప్టెంబర్ లో ఆదేశించింది. అయినా ప్రభుత్వం ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో జగన్నాథం సహా మరికొందరు బాధితులు 2024లో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ ధిక్కరణ పిటిషన్పై జస్టిస్ శామ్కోషి, జస్టిస్ అనిల్కుమార్ జూకంటి ధర్మాసనం విచారణ చేపట్టింది. ధిక్కరణ పిటిషన్ను పరిశీలించిన ప్రతివాదులను తదుపరి విచారణకు తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. -
నేను సీఈవో.. నేను సీఎఫ్వో..
సాక్షి, హైదరాబాద్: వ్యాపార సంస్థల అధినేతలు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ), చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) వంటి అధికారులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు సరికొత్త వాట్సాప్ మోసాలకు పాల్పడుతున్నారు. సంస్థల అధికారిక ఈ–మెయిల్స్కు మోసపూరిత ఫిషింగ్ లింకులు పంపించి, తద్వారా సంస్థ అధికారుల కంప్యూటర్లు, ల్యాప్టాప్ వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాల్లోకి మాల్వేర్ను ప్రవేశపెడుతున్నారు. దీంతో ఆయా ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై సైబర్ నేరగాళ్లు పూర్తిస్థాయి రిమోట్ యాక్సెస్ను సాధించి అక్రమాలకు తెరలేపుతున్నారు. ఇటీవల ఈతరహా కేసులు వెలుగు చూస్తున్నాయని, అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సూచిస్తున్నారు. ఎలా చేస్తారంటే?ఎలక్ట్రానిక్ ఉపకరణాలు నేరస్తుల నియంత్రణలోకి వచ్చిన తర్వాత అందులో యాక్టివ్గా ఉన్న వాట్సాప్ వెబ్ సెషన్లను నేరగాళ్లు చాకచక్యంగా వినియోగిస్తారు. సీఈఓ, సీఎఫ్ఓల పేరుతో అకౌంటెంట్లకు తప్పుదారి పట్టించే సందేశాలను పంపిస్తారు. తాము అత్యవసర సమావేశంలో ఉన్నామని, ఫోన్ ఎత్తడం వీలుపడదని, తాము సూచించిన ఖాతాలకు నగదు బదిలీ చేయాలన్న సారాంశంతో అకౌంటెంట్లకు సెల్ఫోన్, వాట్సాప్ సందేశాలను పంపిస్తారు. పై అధికారుల నంబర్ల నుంచే సందేశాలు వస్తుండటంతో అకౌంటెంట్లు కూడా నిజమేనని కోట్లాది రూపాయల నగదు బదిలీ చేస్తారు. సొమ్మును ఎలా మళ్లిస్తారంటే?కంపెనీకి సంబంధించి ఉన్నతాధికారుల ముసుగులో అకౌంటెంట్లకు నకిలీ సందేశాలను పంపించి, వారి నుంచి కొట్టేసిన సొమ్మును నేరస్తులు సోషల్ ఇంజనీరింగ్ వ్యూహాలతో తక్షణమే వందలాది మ్యూల్ అకౌంట్లకు బదిలీ చేసుకుంటారు. గంటల వ్యవధిలోనే ఆసొమ్ము తమ వ్యక్తిగత ఖాతాలకు మళ్లించుకుంటారు. వాట్సాప్లో ఉన్నతాధికారుల పేరుతో వచ్చే ఆర్థిక అభ్యర్థనలను గుడ్డిగా నమ్మకుండా, వెంటనే ఆ అధికారులకు నేరుగా ఫోన్ చేసి ఆ సందేశం నిజమేనా కాదా అని ధ్రువీకరించుకోవాలని సజ్జనార్ సూచించారు.సంస్థలు ఏం చేయాలంటే?⇒ కార్యాలయాలు, ఉన్నతాధికారులు వినియోగించే ఎలక్ట్రానిక్ ఉపకరణాలలో నాణ్యమైన ఫైర్వాల్స్, యాంటీ వైరస్ సాఫ్ట్వేర్లను నిరంతరం అప్డేట్ చేసుకోవాలి.⇒ కంప్యూటర్లు, ల్యాప్టాప్లలో వాట్సాప్ వెబ్ వాడిన ప్రతిసారి తప్పనిసరిగా లాగౌట్ చేయాలి.⇒ ఎలాంటి భద్రతా ప్రమాణాలు లేకుండా, పబ్లిక్ వైఫైలను వినియోగించకూడదు.⇒ సాంకేతిక భద్రతా ప్రమాణాలను పాటించడం ద్వారానే ఈ తరహా సైబర్ నేరస్తుల దాడులను ఎదుర్కోగలమన్న విషయాన్ని విస్మరించరాదు.⇒ ఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 హెల్ప్లైన్ నంబర్కు కాల్ చేయాలి. -
ఔషధ ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలి
సాక్షి, హైదరాబాద్: మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు అంతర్జాతీయ వాణిజ్య రూపు రేఖలను మారుస్తున్నాయని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ అన్నారు. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులు భారతీయ ఔషధ రంగంపై కొంత మేర ప్రభావం చూపుతున్నాయన్నారు. అయితే ఈ రంగంలో సవాళ్లను అధిగమించేందుకు వినూత్న ఆవిష్కరణలు, పరిష్కార మార్గాలపై ఫార్మా వర్గాలు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఫార్మా ఎగుమతుల వృద్ధికి ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని భరోసా ఇచ్చారు. భారత ఫార్మాస్యూటికల్స్ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఫార్మెక్సిల్) సహకారంతో కేంద్ర వాణిజ్య శాఖ ఏర్పాటు చేసిన ‘చింతన్ శివిర్’ను రాజేశ్ అగర్వాల్ శనివారం ప్రారంభించారు.దేశీయ మార్కెట్ లక్ష్యంగా ఔషధాలు‘ప్రపంచ జనాభాలో 18 నుంచి 19 శాతం భారత్లోనే ఉండటం ఫార్మా రంగానికి అతిపెద్ద మార్కెట్గా నిలుస్తోంది. జనరిక్స్ తయారీలో భారత్ అగ్రస్థానంలో ఉన్నా ఏపీఐ, ఇంటర్మీడియెట్ల తయారీని స్థానికంగా పెంచడం ద్వారా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలి. ప్రపంచ వ్యాప్తంగా 190 దేశాలకు భారతీయ ఔషధాలు ఎగుమతి అవుతున్నా అనేక దేశాలకు 10శాతం కంటే తక్కువ ఎగుమతులు ఇక్కడ నుంచి జరుగుతున్నాయి.ఫార్మా రంగంలో బయోలాజిక్స్, బయోసిమిలర్స్ వంటి కొత్త పోకడలకు అనుగుణంగా మారాలి. కొత్త పేటెంట్ల అభివృద్ధిలో భాగస్వామ్యం వహించడంతోపాటు ఆవిష్కరణలపై మరింత దృష్టి పెట్టాలి. భౌగోళికంగా విచ్ఛిన్న పరిస్థితులున్న నేపథ్యంలో దిగుమతుల సరఫరా గొలుసును సురక్షితంగా ఉంచడానికి ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు ప్రత్యామ్నాయ మార్గాలు కూడా అన్వేషిస్తున్నాం. 38 దేశాల ఆర్థిక వ్యవస్ధతో అనుసంధానమయ్యేలా 9 విదేశీ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుని కొత్త మార్కెట్లకు విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నాం’ అని రాజేశ్ అగర్వాల్ వెల్లడించారు.సీఈఓలతో సమావేశంచింతన్ శివిర్లో భాగంగా ఫార్మా సీఈఓలతో ముఖాముఖి సమావేశం జరిగింది. మార్కెట్ అవకాశాలను ఉపయోగించుకోవటం, నియంత్రణ– నిబంధనల అమలు, ఎగుమతుల వృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. ఢిల్లీలో వచ్చే సెప్టెంబర్ 7 నుంచి 9 వరకు జరగనున్న 12వ అంతర్జాతీయ ఫార్మా, హెల్త్కేర్ ఎగ్జిబిషన్ ఐపెక్స్–2026 షెడ్యూల్ను ఈ సందర్భంగా ప్రకటించారు. ఫార్మెక్సిల్ డైరెక్టర్ జనరల్ రాజ భాను అధ్యక్షతన జరిగిన ప్రారంభ కార్యక్రమంలో ఫార్మెక్సిల్ చైర్మన్ నమిత్ జోషి, కేంద్ర వాణిజ్య శాఖ సంయుక్త కార్యదర్శులు మోహిత్ యాదవ్, సత్యప్రకాశ్ టీఎల్ పాల్గొన్నారు. -
ఔషధాలపై యుద్ధం దెబ్బ
సాక్షి, హైదరాబాద్: పశ్చిమాసియాలో యుద్ధం ఔషధ రంగాన్ని తీవ్రంగా కుదిపేస్తోంది. మందుల తయారీలో వినియోగించే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రిడియంట్ (ఏపీఐ)తోపాటు సాల్వెంట్స్, ఎక్సిపియెంట్స్ ముడిసరుకుల ధరలు 200 నుంచి 300 శాతం వరకు పెరిగాయి. వీటికితోడు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) ఏటా చేసే ధరల సాధారణ సవరణతో ఈనెల నుంచి 760కి పైగా మందుల ధరలు 0.65 శాతం పెరిగాయి. దీంతో 900కు పైగా అత్యవసర ఔషధాల ధరలు 20 నుంచి 200 శాతం వరకు పెరగబోతున్నాయి. ఇది సామాన్యులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిపై తీవ్ర ఆర్థిక భారం మోపనుంది. మందుల ధరలపై యుద్ధం ప్రభావంపశ్చిమాసియా సంక్షోభం వల్ల పెట్రోకెమికల్ సరఫరా గొలుసు దెబ్బతిన్నది. ఇంధన ధరలు, రవాణా ఖర్చులు పెరిగాయి. భారత ఫార్మా రంగం తయారు చేసే మందులకు సంబంధించి 70–80 శాతం ముడి సరుకులు చైనా, పశ్చిమాసియా దేశాలపైనే ఆధారపడుతోంది. దీంతో పారాసెటమాల్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రిడియెంట్ (ఏపీఐ) ధర కిలోకు రూ.250 ఉండగా, ఇప్పుడు రూ.450–600కు చేరింది. గ్లిజరిన్, ప్రొపైలిన్ గ్లైకాల్ వంటి సహాయక పదార్థాలు కూడా భారీగా పెరిగాయి. దీంతో సిరప్లు, ఓరల్ డ్రాప్స్ తయారీ ఖర్చు గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలో ఇప్పటికే కొంతమంది ఫార్మా తయారీదారులు ఉత్పత్తి ఆపేస్తున్నట్లు ప్రకటించారు.యుద్ధం తర్వాత ఉత్పత్తి అవుతున్న వాటిపై...ఫార్మా రంగ వర్గాల సమాచారం మేరకు సుమారు 900 రకాల అత్యవసర మందుల ధరలు భారీగా పెరగనున్నాయి. కొత్త స్టాక్ వచ్చిన తర్వాతే ఈ పెరుగుదల పూర్తిగా అమలవుతుంది. ప్రస్తుత స్టాక్ (యుద్ధం ముందు తయారైనది) ఇప్పటికీ పాత ధరల్లోనే ఉంది. ఇందులో సాధారణంగా శరీరానికి అవసరమైన ప్రొటీన్+మినరల్స్ కలయికతో ఉండే ప్రొటీన్ గ్లూకోనెట్ అనే సప్లిమెంట్ ధరలు 200 శాతం వరకు పెరిగినట్లు తెలుస్తోంది. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు ఉపయోగించే అమాక్సిలిన్ యాంటీ బయోటిక్ మందు ప్రధాన ఔషధ ధర 50 శాతం పెరిగింది.అలాగే పారాసెటమాల్ క్యాప్సుల్స్, ఆక్స్బార్, విక్బార్, గమ్ బెటల్ క్యాప్యూల్స్ వంటి నొప్పి నివారణ మందులు, ఇన్సులిన్, స్టెరాయిడ్లు, గుండె సంబంధిత వ్యాధులతోపాటు కేన్సర్, డయాబెటిక్ ఔషధాల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. యుద్ధం తర్వాత ఉత్పత్తి అవుతున్న మందులు మార్కెట్లోకి వస్తే భారీగా ధరలు పెరిగే అవకాశం ఉందని ఫార్మసిస్టులు చెబుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులైన డయాబెటిస్ (మెట్ఫార్మిన్, ఇన్సులిన్), హైపర్టెన్షన్, హృద్రోగం, కేన్సర్ వంటి వ్యాధులకు ఔషధాలు వాడేవారి నెలవారీ ఖర్చు 20–50 శాతం పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. పాత ధరలకు సరఫరా చేయలేంప్రభుత్వ ఆసుపత్రులకు టీజీఎస్ఎంఐడీసీ ద్వారా మందులు సరఫరా చేసే కాంట్రాక్టర్లు ‘ఒప్పందం ప్రకారం పాత రేట్లకు మందులు సరఫరా చేయలేం. ధరలు పెంచడానికి అనుమతి ఇవ్వాలి’ అని లేఖ రాసినట్లు తెలిసింది. ఫార్మా తయారీదారుల సంఘాలు సబ్సిడీలు, దిగుమతి రిబేట్, స్థానిక ఏపీఐ తయారీకి ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరుతున్నాయి. కొన్ని పెట్రోకెమికల్ సాల్వెంట్స్పై కస్టమ్స్ డ్యూటీని మూడు నెలలు మినహాయించినప్పటికీ, ఇది సరిపోదని నిపుణులు చెబుతున్నారు. -
‘బాసర’కు రూ. 225 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానాల తరహాలో నియమ నిబంధనలు అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. రాజకీయ పార్టీల సభలు, జెండాలు, ఎలాంటి ప్రదర్శనలు లేకుండా కేవలం ఆధ్యాత్మీకతకు పెద్ద పీట వేయాలని స్పష్టం చేశారు. రూ. 225 కోట్లతో బాసర దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. బాసర జ్ఞాన సరస్వతి దేవాలయ అభివృద్ధికి సంబంధించి శనివారం ఆయన తన నివాసంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, సీఎస్ రామకృష్ణారావు, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. తొలుత బాసర ఆలయ అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ను అధికారులు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి వివరించారు. ఆలయ అభివృద్ధి పనులకు రూ.225 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు తెలియజేశారు. మాస్టర్ ప్లాన్ను పరిశీలించిన సీఎం పలు మార్పులు సూచించారు. సంప్రదాయాలు, శాస్త్రాలను పరిగణనలోకి తీసుకొని భక్తుల విశ్వాసాలకు పెద్దపీట వేస్తూ.. బాసర ఆలయ అభివృద్ధి పనులు చేపట్టాలని సీఎం సూచించారు. భవిష్యత్ అవసరాలు, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాలమైన రోడ్లు నిర్మించాలని ఆదేశించారు. ఆలయ ప్రాంగణం భవిష్యత్లో భారీ వృక్షాలతో అలరారేలా అవసరమైన మొక్కలను నాటాలని సూచించారు. ఆలయం సమీపంలో హెల్త్ సెంటర్ నిర్మించాలని, పుష్కరాలు, ఇతర ఉత్సవాల రోజుల్లో అక్కడ తగిన సంఖ్యలో వైద్యులు, వైద్య సిబ్బంది ఉండి భక్తులకు సేవలు అందించేందుకు అనువుగా దానిని నిర్మించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కాగా, ఎంతటి ప్రముఖుల వాహనాలైనా ఆలయ ప్రాంగణానికి బయటే నిలిచిపోవాలని, ఆలయ ప్రాంగణంలోకి కేవలం ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) ద్వారానే చేరుకునేలా చూడాలని సీఎం చెప్పారు. వాహనాల పార్కింగ్ ప్రదేశంలో సోలార్ రూఫ్టాప్ ఏర్పాటు చేయాలన్నారు. అభివృద్ధి పనుల సమయంలో ఆలయ పవిత్రతకు ఎటువంటి భంగం కలగకుండా జాగ్రత్త పడాలని సీఎం చెప్పారు. అభివృద్ధి పనుల నాణ్యతలో రాజీపడితే ఏమాత్రం సహించేది లేదని హెచ్చరించారు. ఈ సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. -
పెళ్లికి ముందు సూది మందు
సాక్షి, హైదరాబాద్: పెళ్లికి ముందు బరువు తగ్గే సులభమైన మార్గాల వెతుకులాటలో యువతీ యువకులు నిమగ్నమవుతున్నారు. వెయిట్లాస్కు సంబంధించిన ప్రత్యేక ఇంజెక్షన్లు, మందులపై ఆసక్తి చూపుతున్నారు. దీంతో భారత్లో వీటి వినియోగం వేలంవెర్రిగా పెరిగిపోతోంది. పెళ్లికి ముందు వ్యాయామం, ఆహార నియమాలతో ఆశించిన ఫలితాలు రాలేదంటూ సడన్గా బరు వు తగ్గేందుకు ‘మౌంజారో’(టిర్జెపాటైడ్) ఇంజెక్షన్ తీసుకోవడం ఇటీవల పెళ్లీడు యువతలో బాగా పెరిగింది. పెళ్లి రోజు న నాజూగ్గా, అందంగా కనిపించాలనే తాపత్రయం కారణంగా భారత్లో ఇదొక కొత్త ట్రెండ్గా మారింది. ఇది ఎక్కడివరకు వెళ్లిందంటే... ఢిల్లీలోని ఓ క్లినిక్ ఏకంగా ‘మౌంజారో బ్రైడ్’పేరిట ఓ ప్రత్యే క ప్యాకేజీని ప్రకటించింది. మరికొన్ని క్లినిక్లు.. చర్మ, కేశాలంకరణతోపాటు ఈ ఇంజెక్షన్లను ప్రీ–వెడ్డింగ్ ప్యాకేజీల్లో చేర్చే వరకు పరిస్థితి ఏర్పడింది. మనదేశంలో మధుమేహం, బరువు తగ్గుదల కోసం అను మతి పొందిన తొలి జీఎల్పీ–1 మందు ‘మౌంజారో. దీన్ని ఎలి లిల్లీ సంస్థ ఉత్పత్తి చేసి విక్రయిస్తోంది. దీని పోటీ దారు నోవో నార్డిస్క్ తయారుచేసిన ‘వెగోవీ’కూడా అందుబాటులోకి వచ్చింది. శారీరక రూపానికి ప్రాధాన్యంతో... భారత్లో సంప్రదాయ వివాహాల్లో వధువు, వరుడి శారీరక రూపం, ఆర్థిక స్థితికి సంబంధించి అధిక ప్రాధాన్యతను కలిగి ఉంటున్నాయి. పెళ్లిలో ఒక నిర్దిష్ట పద్ధతిలో కనిపించాలనే సామాజిక ఒత్తిడి దీనికి కారణం. గతేడాది భారత్లో ఈ రెండు సంస్థలు తమ ఊబకాయ నివారణ మందులను విడుదల చేయగా, కొన్ని నెలల్లోనే మౌంజారో అమ్మకాలు రెట్టింపయ్యాయి. ఈ మందులోని క్రియాశీల పదార్ధమైన సెమాగ్లుటైడ్ పేటెంట్ గడువు ముగియడంతో, భారతీయ ఔషధ తయారీదారులు ఇటీవల నోవో మందు చౌక వెర్షన్ల విక్రయాలు ప్రారంభించి, దాని లభ్యతను విస్తృతం చేశారు. ఈ మందులు ఊబకాయం ఉన్నవారిగా వర్గీకరించిన పెద్దలు లేదా మధుమేహం, అధిక రక్తపోటు లేదా స్లీప్ అప్నియా వంటి బరువు సంబంధిత వైద్య పరిస్థితితో అధిక బరువు ఉన్నవారి కోసం ఉద్దేశించినవిగా ఉన్నాయి. భారత్లో మౌంజారో ఇంజెక్షన్ పెన్ అత్యల్ప డోస్ ధర నెలకు రూ.13,125, గరిష్ట డోస్ ధర రూ. 25,781గా ఉంది. వెగోవీ అత్యల్ప డోస్ను నెలకు రూ.5,660, గరిష్ట డోస్ను రూ.16,400కి విక్రయిస్తున్నారు. ఇమ్యునో డిప్రెషన్ బారిన పడే ప్రమాదం ఎలాంటి వెయిట్లాస్ చికిత్స అయినా మెటబాలిక్ సిండ్రోమ్తో సడన్గా బరువు తగ్గితే రోగ నిర్ధారణ శక్తికి నష్టం జరుగుతుంది. అందువల్ల వైద్యుడిని సంప్రదించకుండా ‘ఓవర్ ద కౌంటర్’గా ఈ మందులు తీసుకోవడం అత్యంత ప్రమాదకరం. ఈ ఇంజెక్షన్లను మెడిసిన్గా వాడాలే తప్ప జ్వరం, ఒళ్లు నొప్పులకు క్రోసిన్ టాబ్లెట్గా వాడకూడదు. ఈ మందులతో సడన్గా బరువు తగ్గితే తీవ్రమైన ఇమ్యునో డిప్రెషన్తో క్షయ, ఇతర ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదముంది. సడన్ వెయిట్లాస్తో యాంగ్జయిటీ ట్రమెర్స్, తీవ్రమైన వెన్నునొప్పుల బారిన కూడా పడే అవకాశాలున్నాయి. ఈ బరువు తగ్గుదల మందులు కూడా శాశ్వత పరిష్కారంకాదు. ఈ ఇంజెక్షన్లను తీసుకోవడం ఆపేస్తే వెంటనే బరువు పెరుగుతారు. సాధారణంగా అయితే 6 నెలల నుంచి ఏడాది వరకు ఈ మందులను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ మెడిసిన్ మార్కెట్లోకి వచ్చి ఏడాదే అవుతోంది. అందువల్ల వీటి దీర్ఘకాల ప్రభావాలు, దు్రష్పభావాలు ఏమిటనేది ఇంకా పూర్తిస్థాయిలో తెలియడం లేదు. తగిన డైట్, వ్యాయామానికి ఇది ప్రత్యామ్నాయం కాదని గుర్తించాలి. –డా. బూర నర్సయ్యగౌడ్, బేరియాట్రిక్ సర్జన్ -
ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి బీఆర్ఎస్ కైవసం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/ఇబ్రహీంపట్నం/ఖానాపూర్: పెండింగ్లో ఉన్న మూడు మున్సిపాలిటీల్లో రెండుచోట్ల చైర్మన్ ఎన్నిక ముగిసింది. ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి పీఠాలను బీఆర్ఎస్ కైవసం చేసుకోగా, ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్గా బీఆర్ఎస్ కౌన్సిలర్ గొడిసల సంధ్యారాణి, వైస్చైర్పర్సన్గా సీపీఐ కౌన్సిలర్ మిట్టపల్లి సరిత ఎన్నికయ్యారు. శనివారం జరిగిన ఎన్నికల్లో మొత్తం 22 మంది కౌన్సిలర్లకు గాను బీఆర్ఎస్, సీపీఐకి చెందిన 14మంది హాజరయ్యారు. కోరం ఉండడంతో ఎన్నిక సజావుగా పూర్తయింది.ఏడుగురు కాంగ్రెస్, ఓ స్వతంత్ర అభ్యర్థి, ఎక్స్అఫీషియో సభ్యులుగా ఉన్న మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ ఎన్నికకు దూరంగా ఉన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కోవ లక్ష్మీ, మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు, సీపీఐ నాయకులతో కలసి విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ చైర్పర్సన్ పీఠం గెలుచుకోకుండా మంత్రి వివేక్ కుట్ర చేసి జైలుకు పంపారని ఆరోపించారు. చెన్నూరు ఎమ్మెల్యే, మంత్రి వివేక్ స్పందిస్తూ తాము ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక జరిగేలా చూస్తే రెండు సార్లు బీఆర్ఎస్ నాయకులే ఆటంకం కలిగించారని తెలిపారు. ఇబ్రహీంపట్నంలో... ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్–చైర్పర్సన్ పీఠం ఎన్నికపై చిక్కుముడి వీడి పోయింది. 50 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత శనివారం ఎట్టకేలకు ఎన్నిక ప్రక్రి య ముగిసింది. నాటకీయ పరిణామాల మధ్య రెండుసార్లు ఎన్నికల ప్రక్రియ వాయిదాపడటం.. వివాదం కోర్టుకు చేరడం తెలిసిందే. ఈ క్రమంలో కోర్టు ఆదేశాల మేరకు శనివారం భారీ పోలీసు బందోబస్తు మధ్య ఎన్నిక నిర్వహించారు. కాంగ్రెస్ కౌన్సిలర్లు, ఎక్స్అఫీíÙయో సభ్యుడు, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సమావేశం నుంచి వాకౌట్ చేశారు. బీఆర్ఎస్కు చెందిన టేకుల సుదర్శన్రెడ్డి చైర్మన్గా, బీజేపీకి చెందిన ముత్యాల శ్యామల వైస్–చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. ఖానాపూర్లో వాయిదా నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మూడోసారి వాయిదా పడింది. గతంలో బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు గైర్హాజరవడంతో కోరం లేక అధికారులు ఎన్నిక నిర్వహించలేదు. తాజాగా శనివారం మూడోసారి చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో చేతులెత్తే క్రమంలో కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అక్కడున్న అధికారులతో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, కాంగ్రెస్ కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు. అధికారులు మొదట సంతకాల సేకరణ చేపట్టగా, కొందరు కౌన్సిలర్లు కాంగ్రెస్ కౌన్సిలర్ సత్యంకు మద్దతుగా చేతులు ఎత్తారు. అయితే తాము సంతకాలు సేకరిస్తున్నామని, తర్వాత ఓటింగ్ నిర్వహిస్తామని తెలిపారు. తర్వాత బీజేపీ అభ్యర్థి అంకం మౌనిక పేరును అధికారులు ముందుగా ప్రతిపాదించారు. దీంతో వెడ్మ బొజ్జు అభ్యంతరం తెలిపారు. దీంతో గందరగోళం నెలకొంది. బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు బారికేడ్లు తోసుకుంటూ కార్యాలయంలోకి వెళ్లారు. ఈ క్రమంలో బీజేపీ కౌన్సిలర్ సత్యవతి స్పృహ కోల్పోవడంతో అధికారులు ఎన్నికలను ఆదివారానికి వాయిదా వేశారు. సత్యవతిని ఆస్పత్రికి తరలించారు.‘వీ లవ్ యూ వివేక్’..: బాల్క సుమన్రామకృష్ణాపూర్: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక అనంతరం మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని ఉద్దేశిస్తూ..‘వీ లవ్ యూ వివేక్.. గతంలో మంత్రి నన్ను తమ్ముడిగా భావిస్తున్నానని చెప్పారు. ఇప్పుడు తమ్ముడిగానే నేనొక విజ్ఞప్తి చేస్తున్న. క్యాతనపల్లి అభివృద్ధికి పూర్తి సహకారం అందించాలి’అని వ్యాఖ్యానించారు.శనివారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలోని తన నివాసంలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్షి్మతో కలిసి సుమన్ విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలప్పుడు రాజకీయాలుండాలి తప్ప ఆ తర్వాత ప్రజల అభివృద్ధి కోసం అన్ని పార్టీ లు కలిసికట్టుగా పని చేయాల్సిన అవస రం ఉందన్నారు. సమావేశంలో మాజీ ఎ మ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు, మాజీ ఎ మ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, మాజీ మేయర్ రవీందర్సింగ్, ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, సీపీఐ రాష్ట్ర కా ర్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్, రామడుగు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
కేరళలో కమ్యూనిజం పోయి.. గూండాయిజం వచ్చింది
సాక్షి, హైదరాబాద్: కేరళలో పాలన, మానవీయ విలువలు దారుణంగా పడిపోయాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విమర్శించారు. కేరళ అంటే కమ్యూనిజం, మార్క్సిజం గురించి మాట్లాడుతారు కానీ అది నేడు పక్కకు పోయి గూండాయిజం మాత్రమే కనిపిస్తోందని దుయ్యబట్టారు. గత ఎన్నికల ముందు ఎల్డీఎఫ్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ఈనెల 9న జరుగనున్న ఎన్నికల్లో యూడీఎఫ్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.శనివారం ఆయన కేరళ రాష్ట్రంలోని పత్థనంతిట్ట అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం, ర్యాలీల్లో పాల్గొన్నారు., ‘శబరిమల ఆలయంలో కుంభకోణం జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి, నిరుద్యోగం భారీగా పెరిగిపోయింది, పొట్ట చేత పట్టుకొని కేరళ యువత ప్రపంచం నలుమూలలకు వలస పోతుండగా ఇక్కడ సీనియర్ సిటిజన్స్కు సరైన సంక్షేమం, ఆదరణ లేకుండా పోయింది’అని భట్టి స్థానిక పరిస్థితులను ఓటర్లకు వివరించారు. ‘కేరళ అంటే సెక్యులరిజం, ఉన్నత విద్యావంతులు, గొప్ప మానవీయ కోణం ఉంటుందని అంతా భావిస్తాం కానీ ఈరోజు కేరళలో ఆ తరహా పరిస్థితులు కనిపించకుండా పోయాయి’అని ఆవేదన వ్యక్తం చేశారు. మా దగ్గర ఉచిత బస్సు..: తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఏ మూల నుంచి ఏ మూలకైనా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించామని, రాష్ట్రంలో 1.15 కోట్ల కుటుంబాలు ఉంటే ఇందులో 1.06 కోట్ల కుటుంబాలకు సన్నబియ్యం అందజేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. విద్యపై కేరళ కంటే తెలంగాణ ఎక్కువ వ్యయం చేస్తోందని భట్టి విక్రమార్క తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ సభ్యుడు రుద్రరాజు తదితరులు పాల్గొన్నారు. -
‘భవ్య బాసర’ దిశగా..
నిర్మల్: తొలి అక్షరాలను దిద్దించే చదువుల తల్లికి అద్భుతమైన ఆలయం నిర్మాణం కానుంది. రాష్ట్రంలో యాదాద్రి, వేములవాడ, భద్రాచలం తరహాలో బాసర జ్ఞాన సరస్వతీదేవి కోవెలను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. ఇందులో భాగంగా నూతన గర్భాలయం, అర్ధమండపం, అనివేటి మండప నిర్మాణాలను కృష్ణశిలలతో చేపట్టనున్నారు. ఆలయ ప్రాంగణాన్ని ప్రస్తుతం ఉన్నదాని కంటే రెండున్నర రెట్లు పెంచనున్నారు. నలువైపులా రాజగోపురాలతో ద్వారాలను నిర్మిస్తారు. ఉత్తరం వైపు తొమ్మిది అంతస్తులతో, మిగిలిన మూడు దిక్కుల్లో ఏడు అంతస్తులతో రాజగోపురాలు నిర్మితం కానున్నాయి. ఆలయానికి నలుదిక్కులా దాదాపు 33 అడుగుల వెడల్పుతో నాలుగు మాడవీధులు నిర్మించనున్నారు.సుమారు 7 వేల అడుగులతో దాదాపు 6 వేల మంది భక్తులకు అనువుగా క్యూకాంప్లెక్స్లు, టాయిలెట్లు, ఫుడ్స్టాల్స్.. ఇలా అన్నివసతులు సమకూర్చనున్నారు. ఇవేకాక దాదాపు 200 మంది ఒకేసారి కూర్చుని ధ్యానం చేసుకునేలా ధ్యానమందిరం నిర్మించనున్నారు. ప్రస్తుతం ఇరుకుగా ఉన్న ప్రసాద పంపిణీ కేంద్రం స్థానంలో 20 వేల అడుగుల విస్తీర్ణంలో ప్రసాద పంపిణీ కేంద్రం, నూతన వంటశాల, భోజనశాలను నిర్మించనున్నారు. ఆలయానికి ఈశాన్యాన నూతన కోనేరు నిర్మాణం, దేవాలయానికి వచ్చే వాహనాలకు సరిపడా పార్కింగ్, సోలార్ విద్యుత్, ఆహ్లాదకర వాతావరణం కోసం పుష్పవనాలను ఏర్పాటు చేయనున్నారు. -
ఈగల్ టీం దాడులు.. పలువురికి డ్రగ్స్ టెస్ట్
సాక్షి హైదరాబాద్: గోల్కోండ తారామతిలో రిసార్టులో ఈగల్ టీమ్, టాస్క్ఫోర్స్ ఆకస్మిక దాడులు చేపట్టింది. అక్కడి నిర్వహిస్తున్న జాక్ జాన్సన్ ఈవెంట్లో పాల్గొన్న మెుత్తం 36 మందికి పోలీసులు డ్రగ్స్ టెస్టులు నిర్వహించగా అందులో ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. ఈవెంట్కు పలువురు సినీ నటులు హజరయినట్లు తెలుస్తోంది. అయితే ఈ దాడులపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
బీఆర్ఎస్లోకి జీవన్ రెడ్డిని ఆహ్వానించనున్న కేటీఆర్
జగిత్యాల జిల్లా: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఈ నెల 12న మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వద్దకు వెళ్లనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి ఆదిలాబాద్ పర్యటన అనంతరం మార్గమధ్యంలో కేటీఆర్ జగిత్యాలలో జీవన్ రెడ్డిని కలువనున్నారు. బీఆర్ఎస్లోకి రావాలని జీవన్ రెడ్డిని కేటీఆర్ ఆహ్వానించనున్నారు. ఈ నెల 27న జగిత్యాల లేదా కరీంనగర్లో బీఆర్ఎస్ ప్లీనరీ కోసం ప్లాన్ చేస్తున్నారు. పశ్చిమాసియాలో యుద్ధం వేళ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్లీనరీ నిర్వహణపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మల్లగుల్లాలు పడుతున్నారు. ప్లీనరీ కంటే ముందే బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు జీవన్ రెడ్డి. రాబోయే బీఆర్ఎస్ ప్లీనరీలో కేసీఆర్ పక్కన ప్రత్యేక ఆకర్షణగా జీవన్ రెడ్డి నిలవనున్నారు.కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. నాలుగు దశాబ్దాల ప్రయాణానికి సెలవు పలికారు. కాంగ్రెస్లో ఉండలేకపోతున్నానని ఆయన చెప్పారు. రేవంత్ రెడ్డి ప్లాన్ ప్రకారమే పార్టీలో చేరి సీఎం అయ్యారని అన్నారు. ఆయన బీఆర్ఎస్లో చేరతారని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. -
SHOCKING CCTV FOOTAGE: వామో ఏంటి ఇది కొట్టులో విక్స్ కొనడానికి వచ్చి...
-
‘నాపై కాదు.. సీపీ ఇల్లీగల్ దందాలపై విచారణ చేయాలి’
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి సీఐడీ విచారణ ముగిసింది. కరీంనగర్ సీపీపై అభ్యంతరకర వ్యాఖ్యలు, పోలీస్ విధులకు ఆటంకం కల్గించారనే ఆరోపణలపై కౌశిక్రెడ్డిని సీఐడీ విచారించింది. దీనిలో భాగంగా విచారణ అనంతరం ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి మాట్లాడుతూ.. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, సీపీ మతమార్పిడి చేస్తున్నారని తాను అనలేదని, ఆధారలన్నీ సీఐడీకి ఇచ్చానని, మళ్లీ ఎప్పుడు పిలిచినా వెళ్తానన్నారు. తనపై విచారణ చేయడం కాదని, సీపీ ఇల్లీగల్ దందాలపై విచారణ చేయాలన్నారు కౌశిక్రెడ్డి.‘కౌశిక్ రెడ్డి కుటుంబంపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు. హుజురాబాద్ లో డంపింగ్ యార్డు ఎందుకు పెట్టారు?, కరీంనగర్, వరంగల్ నుంచి చెత్త తీసుకొచ్చి హుజురాబాద్ లో ఎలా వేస్తారు. కౌశిక్ రెడ్డి దీక్షకు కూర్చుంటాడని సీఐడీ నోటీస్లు ఇచ్చారు. నా మీద కోపం ఉంటే ఊరేయండి...హుజురాబాద్ మీద కక్ష ఎందుకు?, డంపింగ్ యార్డు రద్దు చేయకపోతే 7 వ తారీఖు నుంచి 8 వ తారీఖు వరకు దీక్షకు కూర్చుంట. నాపై వేసిన కేసు పోలీసులకే ఉచ్చు బిగిస్తుంది. ఈ కేసుకు సీఐడీకి ఏం సంబంధం.కరీంనగర్ పోలీస్ కమిషనర్ మత మార్పిడి చేస్తున్నాడని నేను అనలేదు. అలా అన్నానని ఒక్క వీడియో అయినా చూపించగలరా?, చూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా’ అని తెలిపారు. -
ఉద్రిక్తత: ఖానాపూర్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా
నిర్మల్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంలో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. మ్యాజిక్ ఫిగర్ 7పై గందరగోళం నెలకొంది. బీజేపీ అభ్యర్థి మౌనికకు ఏడుగురు కౌన్సిలర్ల మద్దతు ఇవ్వడంతో చైర్మన్గా ప్రకటించాలని బీజేపీ డిమాండ్ చేసింది. అయితే ఎన్నికల సమయంలో తమకు ఏడుగురు మద్దతు తెలిపారని కాంగ్రెస్ ఎక్స్ అఫీషియో మెంబర్ వెడ్మ బొజ్జు నిరసనకు దిగారు. దాంతో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో ఎన్నికను రేపటి వాయిదా వేశారు ఎన్నికల అధికారులు. ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికను వాయిదా వేయడం పట్ల బీఆర్ఎస్, బీజేపీ నాయకులు మున్సిపల్ కార్యాలయంలో బైఠాయించి ఆందోళన చేపట్టారు. బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థిని చైర్మన్ ఎన్నుకోవడానికి సరిపడ కోరం ఉన్న ఎన్నికను నిర్వహించకుండా అధికారులు ఎన్నికను వాయిదా వేయడం ఏంటని ప్రశ్నించిన కౌన్సిలర్లు. వారికి మద్దతుగా బైఠాయించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు రితీష్ రాథోడ్, బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజక వర్గం ఇంచార్జ్ జాన్సన్ నాయక్. కలెక్టర్ వచ్చి ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికను నిర్వహించాలి, లేదంటే ఇక్కడనే చస్తాం కానీ లేవమాని తేల్చి చెప్పారు కౌన్సిలర్లు. దాంతో పోలీసులు, బీజేపీ నేతల మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ క్రమంలోనే మున్సిపల్ కార్యాలయంలో బైఠాయించిన బీజేపీ 8 వార్డ్ కౌన్సిలర్ బొప్పారావు సత్యవతి కళ్లుతిరిగి కిందపడిపోయారు. సాటి కౌన్సిలర్లు ఆమెకు నీళ్లు ముఖంపై కొట్టి మంచి నీళ్లు అందించారు. -
రెండు నెలల శిశువుకు అరుదైన గుండె శస్త్రచికిత్స
హైదరాబాద్, ఏప్రిల్ 4, 2026: రెండు నెలల శిశువుకు అరుదైన గుండె సమస్యకు అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి పునర్జన్మ ప్రసాధించారు కిమ్స్ కడల్స్ కొండాపూర్ వైద్యులు. ఖమ్మం జిల్లాకు చెందిన ఈ శిశువు రెండు నెలల వయస్సులో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, గుండె వైఫల్య లక్షణాలతో ఆసుపత్రికి తీసుకువచ్చారు. పరీక్షల్లో గుండెలో రంధ్రం ఉందని తేలింది. పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డా. సుదీప్ వర్మ నిర్వహించిన ఎకోకార్డియోగ్రామ్లో ఏఆర్ సిఏపిఏ, అంటే సాధారణంగా గుండెకు శుభ్రమైన రక్తాన్ని అందించే రక్తనాళం (కొరోనరీ ఆర్టరీ) ఒక ప్రత్యేక మార్గం (ఏఓర్టా) నుంచి రావాలి. కానీ ఈ చిన్నారిలో అది తప్పుగా ఊపిరితిత్తులకు వెళ్లే రక్తనాళం (పల్మనరీ ఆర్టరీ) నుంచి వస్తోంది. తరువాత ఏఓర్టోగ్రామ్ ద్వారా దీనిని నిర్ధారించారు. అనంతరం చిన్నారికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేశామని వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్సలో భాగంగా, రైట్ కొరోనరీ ఆర్టరీని పల్మనరీ ఆర్టరీ నుండి వేరు చేసి, ప్రత్యేక “హుడ్” టెక్నిక్ సహాయంతో ఏఓర్టాకు అనుసంధానం చేశారు. దీంతో గుండెకు సరైన ఆక్సిజన్తో కూడిన రక్త ప్రవాహం పునరుద్ధరించబడింది. శస్త్రచికిత్స అనంతరం రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు లో కావాల్సిన మందులు అందించామనీ, అపరేషన్ తరువాత శిశువును నీయోనేటల్ ఐసీయూలో ఉంచి వెంటిలేటర్ సపోర్ట్, ఇనోట్రోప్స్ సహాయం, అవసరమైన చోట పెరిటోనియల్ డయాలిసిస్ వంటి చికిత్సలు అందించారు.ఇంత చిన్న వయస్సు ఉన్న శిశువులపై గుండె శస్త్రచికిత్స చేయడం సవాలుతో కూడుకున్నదని. రక్తనాళాలు చాలా చిన్నగా ఉండటం, శరీర సామర్థ్యం పరిమితంగా ఉండటం, శస్త్రచికిత్స సమయంలో రక్త ప్రసరణ, శరీర ఉష్ణోగ్రత నియంత్రణ వంటి అంశాలు కష్టతరమనీ, కానీ అన్ని సవాళ్లను అధిగమిస్తూ ఈ శస్త్రచికిత్స విజయవంతమై, ప్రస్తుతం శిశువు ఆరోగ్యంగా ఉండి నీయోనేటల్ ఐసీయూ నుండి డిశ్చార్జ్ చేశామని వెల్లడించారు. ఈ శస్త్రచికిత్సలో సీనియర్ పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డా. అనిల్, కార్డియాక్ అనస్థీషియాలజిస్ట్ డా. నాగరాజన్, డా. సి. అపర్ణ (క్లినికల్ డైరెక్టర్) నేతృత్వంలోని నీయోనటాలజీ బృందం డా. విశ్వనాథ్, డా. అమిత్, డా. ఇషిత, డా. రాజశేఖర్ పాల్గొన్నారు.ఏఆర్ సిఏపిఏ అనేది చాలా అరుదైన గుండె లోపం (సుమారు 0.25% కేసుల్లో మాత్రమే కనిపిస్తుంది). ఇది తీవ్రమైన సందర్భాల్లో ఆకస్మిక శిశు మరణానికి కూడా దారితీసే ప్రమాదం ఉంది. ఈ ఘటన ద్వారా పుట్టుకతో వచ్చే గుండె లోపాలను త్వరగా గుర్తించడం, సరైన సమయంలో చికిత్స అందించడం ఎంత ముఖ్యమో మరోసారి స్పష్టమైంది. ఆధునిక నీయోనటల్ కార్డియాక్ కేర్ సౌకర్యాలు అందుబాటులో ఉండటం వల్ల ఇలాంటి ప్రాణాపాయ పరిస్థితుల్లో చిన్నారుల ప్రాణాలు కాపాడవచ్చని డా. అపర్ణ తెలిపారు. -
అబద్దాలు చెప్పడంలో రేవంత్కు ఆస్కార్: బండి సంజయ్
సాక్షి, కరీంనగర్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్కు అబద్దాలు చెప్పడంలో ఆస్కార్ ఇవ్వొచ్చని అన్నారు. తెలంగాణలో ఆరు గ్యారంటీలు అమలు కావడం లేదని స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీలపై చర్యలు సిద్ధమా అని బండి సంజయ్ సవాల్ విసిరారు.కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హుజురాబాద్లో డంపింగ్ యార్డ్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..‘సెంట్రల్ యూనివర్సిటీలో అరాచకం చేశారు. అలా ఇక్కడ చేయవద్దు. నెమళ్లు, పక్షులు, ఉన్నాయి పర్యావరణాన్ని రక్షించాలి. డంప్ యార్టుకు బీజేపీ వ్యతిరేకం కాదు.. ప్రజలకు దూరంగా ఉన్న దగ్గర నిర్మించాలి. హుజురాబాద్లో డంపింగ్ యార్డ్ గురించి సీఎంకు తెలిసే మాట్లాడాడు. ఓసారి డంపింగ్ యార్డ్ నిర్మాణ స్థలాన్ని సీఎం పరిశీలించాలి లేదా నివేదిక తెప్పించుకోవాలి. లాఠీ దెబ్బలు అయినా తింటాం కానీ హుజురాబాద్లో డంప్ యార్డును అడ్డుకుంటాం.బీహార్, మహారాష్ట్ర, హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే కారణం. కేరళంలో కూడా అదే పరిస్థితి ఉంటుంది. ఆరు గ్యారంటీలు తెలంగాణలో అమలు కావడం లేదు. నిరుద్యోగ భృతి, పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు డబ్బులు ఇవ్వడం లేదు. హామీలు అమలవుతున్నాయని నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా లేదంటే సీఎం రాజీనామా చేయాలి. ఢిల్లీకి పోయి డబ్బు మూటలు స్పెషల్ ఫ్లైట్లలో ఇచ్చారు. కేరళ మీడియా వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారంటీల అమలు గురించి తెలుసుకోవాలి. ఆరు గ్యారంటీలపై చర్చకు సవాలు చేస్తున్నా.. నా సవాలుకు సీఎం సిద్ధమా?’ అని ప్రశ్నించారు. -
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం
సాక్షి, ఇబ్రహీంపట్నం: తెలంగాణలో బీఆర్ఎస్కు మరో ఘన విజయం దక్కింది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్గా సుదర్శన్ రెడ్డి ఎన్నికయ్యారు. వైఎస్ చైర్పర్సన్గా బీజేపీ కౌన్సిలర్ శ్యామలను ఎన్నుకున్నారు. ఇక, చైర్మన్ ఎన్నిక ప్రక్రియను కాంగ్రెస్ దూరంగా ఉంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ వాకౌట్ చేసింది.ఇక, అంతకుముందు.. మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎరిగింది. క్యాతనపల్లి మున్సిపల్ చైర్ పర్సన్గా బీఆర్ఎస్ కౌన్సిలర్ గొడిశెల సంధ్యారాణి ఎన్నికయ్యారు. ఇక్కడ బీఆర్ఎస్, సీపీఐ మైత్రితో అధికార కాంగ్రెస్ పార్టీకి చెక్ పడింది. ఇదిలా ఉండగా.. ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్పర్సన్గా బీజేపీ కౌన్సిలర్ మౌనిక ఎన్నికయ్యారు. ఇక్కడ వైఎస్ చెర్మెన్గా బీఆర్ఎస్ కౌన్సిలర్ మహ్మద్ షోయబ్ ఎన్నికయ్యారు. రాష్ట్రంలో వాయిదా పడుతూ వస్తున్న ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికల ప్రక్రియ నేడు జరిగింది. ఈ సందర్భంగా ఈ మూడు మున్సిపాలిటీల్లో శనివారం ఉదయం 11 గంటలకు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, మధ్యాహ్నం 12:30 గంటలకు ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ క్రమంలో క్యాతనపల్లి మున్సిపాలిటిలో మున్సిపల్ చైర్ పర్సన్గా బీఆర్ఎస్ కౌన్సిలర్ గొడిశెల సంధ్యారాణి ఎన్నిక కాగా.. వైస్ చైర్ పర్సన్గా సీపీఐ కౌన్సిలర్ మిట్టపల్లి సరితను ఎన్నుకున్నారు. -
గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి
సాక్షి, సిద్ధిపేట: గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి జరిగింది. క్యాంప్ ఆఫీస్లో కిటికీ అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఘటనకి ముందు సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో ర్యాలీగా బయలుదేరిన డీసీసీ ప్రెసిడెంట్ ఆంక్షా రెడ్డి, కాంగ్రెస్ నాయకులు.. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఫోటో పెట్టారు.కాంగ్రెస్ నాయకులే క్యాంప్ ఆఫీస్పై దాడి చేశారంటూ బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. తాము క్యాంప్ ఆఫీస్లో సీఎం ఫోటో పెట్టాము.. కానీ దాడి చేయలేదని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద పోలీసులు మోహరించారు.ఈ ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందిస్తూ.. ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ముమ్మాటికీ ఇది సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జరిగిన దాడి. ప్రజాస్వామ్యంపై సీఎం చేయించిన దాడి. పట్టపగలు అధికార మదంతో విర్రవీగుతూ సోయి మరచి వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నాయకుల తీరు బీహార్ గ్యాంగ్ను తలపిస్తోందంటూ హరీష్రావు మండిపడ్డారు.‘‘ఏకంగా ప్రజా ప్రతినిధుల క్యాంపు కార్యాలయాలపైనే ముప్పేట దాడులు చేస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్లా లేనట్లా?. కాంగ్రెస్ పాలనలో ప్రజా ప్రతినిధులపై దాడులు, ప్రజా సంఘాలపై దాడులు, మీడియాపై దాడులు.. నిత్యకృత్యం కావడం సిగ్గుచేటు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు యంత్రాంగం కాంగ్రెస్ పార్టీకి ప్రైవేట్ సైన్యంలా మారిపోయారా? ఎందుకు అడ్డుకోవడం లేదు?’’ అంటూ హరీష్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బీఆర్ఎస్దే విజయం.. క్యాతనపల్లి మున్సిపాలిటీపై గులాబీ జెండా
సాక్షి, మంచిర్యాల: తెలంగాణలో బీఆర్ఎస్కు ఘన విజయం దక్కింది. మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎరిగింది. క్యాతనపల్లి మున్సిపల్ చైర్ పర్సన్గా బీఆర్ఎస్ కౌన్సిలర్ గొడిశెల సంధ్యారాణి ఎన్నికయ్యారు. ఇక్కడ బీఆర్ఎస్, సీపీఐ మైత్రితో అధికార కాంగ్రెస్ పార్టీకి చెక్ పడింది.రాష్ట్రంలో వాయిదా పడుతూ వస్తున్న ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికల ప్రక్రియ నేడు జరిగింది. ఈ సందర్భంగా ఈ మూడు మున్సిపాలిటీల్లో శనివారం ఉదయం 11 గంటలకు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, మధ్యాహ్నం 12:30 గంటలకు ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ క్రమంలో క్యాతనపల్లి మున్సిపాలిటిలో మున్సిపల్ చైర్ పర్సన్గా బీఆర్ఎస్ కౌన్సిలర్ గొడిశెల సంధ్యారాణి ఎన్నిక కాగా.. వైస్ చైర్ పర్సన్గా సీపీఐ కౌన్సిలర్ మిట్టపల్లి సరితను ఎన్నుకున్నారు.ఇక, క్యాతనపల్లి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు కాంగ్రెస్ దూరంగా ఉంది. ఎట్టకేలకు క్యాతనపల్లి మున్సిపాలిటీపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పంతం నెగ్గించుకున్నారు. కాగా, క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్, సీపీఐ పొత్తు పెట్టుకోగా 22 వార్డులకుగాను 10 వార్డుల్లో బీఆర్ఎస్, 4 వార్డుల్లో సీపీఐ అభ్యర్థులు గెలుపొందారు. బీఆర్ఎస్-సీపీఐ కూటమికి స్పష్టమైన బలం ఉన్నది. కాంగ్రెస్ అభ్యర్థులు ఏడు స్థానాల్లోనే గెలిచారు. కానీ, మంత్రి వివేక్, కాంగ్రెస్ నేతల అరాచకాల వల్ల గతంలో చైర్మన్, వైస్చైర్మన్ ఎన్నిక ప్రక్రియ నిలిచిపోయింది. తీవ్ర ఉత్కంఠ నేపథ్యంలో చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్లుగా పొత్తు ధర్మంలో ఇద్దరు మహిళలు ఎన్నికయ్యారు. -
20 గుంటల భూమిలో 8 స్తంభాలు.. నాగలి ఎలా తిరుగుతుంది?
జగిత్యాల జిల్లా: మల్లాపూర్కు చెందిన వృద్ధురాలు ముష్కరి గంగామణి గ్రామసభలో నా 20 గుంటల వ్యవసాయ భూమిలో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా 8 విద్యుత్ స్తంభాలు వేసిండ్రు అంటూ తన ఆవేదనను వెల్లడిస్తూ ట్రాన్స్కో ఏఈ వినీత్రెడ్డిని వేడుకుంటున్న కథనం శుక్రవారం ‘సాక్షి’లో ‘‘కాల్మొక్త సారూ.. కనికరించండి’ శీర్షికన ప్రచురితమైంది. ఈ కథనాన్ని టీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎం, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు ట్విట్ చేశారు. విద్యుత్శాఖ మంత్రి భట్టి గారూ.. ఈ సమస్యకు పరిష్కారం చూపండి అంటూ 20 గుంటల భూమిలో ఇష్టరీతిన స్తంభాలు వేస్తే సాగుకి నాగలి ఎట్టా తిరుగుతది? పంట ఎట్ల పండుతది? అంటూ డిప్యూటీ సీఎం బట్టితో పాటు మాజీ మంత్రి కేటీఆర్కు, సీఎంవో కార్యలయానికి పోస్టు చేశారు. https://t.co/DVI3Vih9iy pic.twitter.com/RxNNnb7QLj— Kalvakuntla Vidyasagar Rao (@Vidyasagarrao_K) April 4, 2026 -
‘బ్లాక్ కాఫీ డీజే నైట్’లో డ్రగ్స్
హైదరాబాద్: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని కొండాపూర్లో ఉన్న ‘క్వేక్ ఎరీనా పబ్’లో గురువారం అర్ధరాత్రి ఈగల్ బృందాలు దాడులు చేశాయి. అంతర్జాతీయ కళాకారుడితో ‘బ్లాక్ కాఫీ’ పేరుతో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఈవెంట్లో పాల్గొన్న ఎనిమిది మంది మాదకద్రవ్యాలు సేవించి చిక్కారు. వీరిపై గచ్చిబౌలి పోలీస్టేషన్లో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఈగల్ అధికారులకు అప్పగించింది. ఈ ఈవెంట్లో పాల్గొన్న స్పెయిన్ కళాకారులు అలెగ్జాండర్, క్వేక్ అరేనా పబ్ డీజే కేవీలకు నెగెటివ్ వచ్చినట్లు ఈగల్ శుక్రవారం ప్రకటించింది. గురువారం రాత్రి ప్రారంభమైన ‘బ్లాక్ కాఫీ’లో పాల్గొన్న కొందరు డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు ఈగల్కు సమాచారం అందింది. దీంతో ఆ విభాగంలోని టాస్్కఫోర్స్, సైబరాబాద్ నార్కోటిక్స్ పోలీసుస్టేషన్, గచ్చిబౌలి పోలీసులతో కూడిన బృందాలు రాత్రి 12 గంటల ప్రాంతంలో దాడులు చేశారు. 64 మంది అనుమానితులను గుర్తించి వీరి లాలాజలం, మూత్రం నమూనాలు సేకరించి పరీక్షలు చేయగా.. తొలుత నలుగురికి, ఆ తర్వాత మరో నలుగురిని పాజిటివ్ వచ్చింది. దీంతో వీళ్లు గంజాయి, మెతాంఫెటమైన్, బెంజోడియాజిపిన్ సేవించినట్లు గుర్తించారు. వీరిపై గచ్చిబౌలి పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇందులో ఎన్డీపీఎస్ యాక్ట్తో పాటు బీఎన్ఎస్లోని సెక్షన్లను జోడించారు.ఈ కేసులో నిందితులుగా ఉన్న మోనిష్ ఉమేష్ (వ్యాపారి), పృథి్వరాజ్ (కాంట్రాక్టర్), అభిషేక్ (సాఫ్ట్వేర్ ఇంజనీర్) రిషబ్ (వ్యాపారి), హరిత్ (సాఫ్ట్వేర్ ఇంజనీర్), రితేష్ (మొబైల్ దుకాణం నిర్వాహకుడు), జ్యోతిరాదిత్య, ఆకెళ్ల హరిత సారంగ్లను ఎర్రగడ్డలోని ఈఎస్ఐ ఆస్పత్రికి తరలించి వారి రక్తనమూనాలను వైద్యుల ద్వారా సేకరించారు. కాగా.. ఈ కేసులో 8 మంది నిందితులు ఈగల్ ఎదుట స్వచ్ఛందంగా డ్రగ్స్ వినియోగాన్ని అంగీకరించారు. నిందితులకు గచి్చ»ౌలి పోలీసులు శుక్రవారం వారి తల్లిదండ్రులు/సంరక్షకుల్ని పిలిచి కౌన్సెలింగ్ నిర్వహించారు. వీరికి గతంలో డ్రగ్స్ తీసుకున్న చరిత్ర లేకపోవడంతో నోటీసులు జారీ చేసి విడిచిపెట్టారు. డీ–అడక్షన్ ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు స్పష్టం చేశారు. -
‘మూడింతలు’.. ముప్పుతిప్పలు
సాక్షి, హైదరాబాద్: ఒకేసారి మూడు నెలల ( ఏప్రిల్, మే, జూన్) ఉచిత రేషన్ బియ్యం పంపిణీ ప్రక్రియ ప్రహసనంగా మారింది. ఈ– పోస్ సాఫ్ట్వేర్ అప్డేట్ కాకపోవడంతో కాలయాపన జరుగుతోంది. గతంలో కరోనా సంక్షోభ సమయంలో ఇదే తరహాలో మూడు నెలల బియ్యం పంపిణీ చేసినప్పుడు ప్రభుత్వం సాఫ్ట్వేర్లో మార్పులు చేసి ఒకే బయోమెట్రిక్ అథెంటికేషన్తో పంపిణీని సులభతరం చేసింది. ప్రస్తుతం పంపిణీలో సాఫ్ట్వేర్ అప్డేట్ కాకపోవడంతో పాత పద్ధతినే అనుసరిస్తున్నారు. ప్రతి కార్డుదారు మూడు విడతల బియ్యం కోసం ఈ–పోస్ యంత్రంపై మూడుసార్లు వేలిముద్ర వేయాల్సి వస్తోంది. వేయింగ్ మిషన్పైనా మూడుసార్లు తూకం వేయడం అనివార్యమైంది. ఒక్కొక్కరికి పది నిమిషాలు.. తప్పని నిరీక్షణ సాధారణంగా ఒక కార్డుదారుడికి రేషష్ పంపిణీ చేయడానికి రెండు నిమిషాల సమయం సరిపోతుంది. ప్రస్తుతం సాంకేతిక చిక్కులతో ఒక్కో కార్డుకు కనీసం 10 నిమిషాల సమయం పడుతోంది. వేలిముద్రలు పడకపోయినా, సర్వర్ నెమ్మదించినా ఈ సమయం మరింత పెరుగుతోంది. ఈ పోస్ యంత్రంతో అనుసంధానమైన వేయింగ్ మిషన్పై తూకం వేయడం తప్పనిసరి. మొదటి నెల కోటా తూకం పూర్తై రసీదు వచ్చాక, మళ్లీ రెండో నెల కోసం బయోమెట్రిక్ వేయాలి, ఆపై మళ్లీ తూకం వేయాలి. ఇలా మూడుసార్లు చేయాల్సి వస్తోంది. గడువు ఉన్నా రద్దీ ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా ఈ నెలలో మూడు నెలల బియ్యం పంపిణీ ప్రక్రియ ఈ నెల 30 వరకు కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేసినప్పటికీ లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. ‘ముందు వెళ్తేనే బియ్యం దొరుకుతాయి.. లేదంటే స్టాక్ అయిపోతుంది’ అన్న భయం కార్డుదారులను తెల్లవారుజాము నుంచే రేషన్ షాపుల వద్ద క్యూ కట్టేలా చేస్తోంది. ఇప్పటికైనా∙సాఫ్ట్వేర్లో తగిన మార్పులు చేస్తే తప్ప ఈ రద్దీ తగ్గేలా కనిపించడం లేదని డీలర్లు అభిప్రాయపడుతున్నారు. -
ఇంటి వద్దే ఎఫ్ఐఆర్.. ఇదొక మంచి అడుగు!
నేరాలకు గురైన బాధితుల ఇంటి వద్దే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని తెలంగాణ పోలీసులు ఇటీవల ప్రకటించారు. ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ లేదా ప్రాథమిక (నేర) సమాచార నివేదిక. నేరం జరిగినప్పుడు ప్రాథమికంగా బాధితులు తెలిపిన సమాచారం: నేర వివరాలు, నేరస్థుడి పేరు, నేరం జరిగిన సమయం, తేదీ దీనిలో ఉంటాయి. కాబట్టి దీనిని ఎఫ్ఐఆర్ అంటారు. కానీ ఈ మాటను ఎక్కడా చట్టంలో నిర్వచించలేదు.ప్రతి పోలీస్ స్టేషన్కు కూడా భౌగోళిక పరిధి ఉంటుంది. ఆ పరిధిలో జరిగిన నేరాలపై మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని నేర పరి శోధన చేసే అధికారం ఉంటుంది. అయితే, 2012లో ఢిల్లీలో ‘నిర్భయ’ ఉదంతం తర వాత కేంద్ర ప్రభుత్వం నేర చట్టాలను బలోపేతం చేయడానికి నియమించిన ‘వర్మ కమిషన్’ ముఖ్య సూచనలు చేసింది. తీవ్ర మైన లేదా హేయమైన నేరాలు జరిగిన ప్రదేశం తమ పరిధిలో లేకున్నా బాధితులు ఇచ్చిన నేర సమాచారాన్ని ఏ పోలీస్ స్టేషన్ అయినా ఎఫ్ఐఆర్గా నమోదు చేయాలనీ, అందుకు అప్పుడు అమలులో ఉన్న క్రిమినల్ ప్రొసీజర్ కోడ్–1973లో తగిన సవరణలను చేయాలనీ సిఫారసు చేసింది.తీవ్రమైన నేరాలు జరిగినప్పుడు, బాధితులు, ప్రత్యేకించి స్త్రీలు ఒక పోలీస్ స్టేషన్ నుంచి మరో పోలీస్ స్టేషన్ వెతుకుతూ వెళ్లాల్సిన ఆగత్యం పట్టవద్దనేది ‘జీరో ఎఫ్ఐఆర్’ ముఖ్యోద్దేశం. ప్రతి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ప్పుడు దాని వివరాలను జనరల్ డైరీలో రాస్తూ, దానికి ఒక నంబర్ వేస్తారు. కానీ ‘జీరో ఎఫ్ఐఆర్’కు నంబర్ కేటాయించాల్సిన అవసరం లేదు. అందుకే దానిని ‘జీరో ఎఫ్ఐఆర్’ అంటారు. దీన్ని నమోదు చేసిన తరువాత, నేరం జరిగిన ప్రదేశానికి సంబంధిత పోలీస్ స్టేషన్కు ఆ నేర సమాచారాన్ని వెంటనే పంపించాలి. సంబంధిత పోలీస్ స్టేషన్, ఆ ఎఫ్ఐఆర్కు ఒక నంబర్ వేసి నియమాల ప్రకారం దర్యాఫ్తు చేయాలి.చదవండి: జేఈఈ మెయిన్స్ ఆఫ్లైన్లో పెట్టలేరా?క్రిమినల్ ప్రొసీజర్ చట్టంలో ఇది భాగం కానందున, ఇది సరిగ్గా అమలు కాలేదు. అయితే ‘భారతీయ నాగరిక్ సురక్ష సంహిత –2023’ లోని సెక్షన్ 173, తీవ్రమైన నేరాలు జరిగినప్పుడు సమాచారాన్ని తీసుకోవడానికి అన్ని పోలీస్ స్టేషన్లకు చట్టబద్ధమైన అధికారాన్ని కల్పించింది. తెలంగాణ పోలీస్ శాఖ ఇంకొక అడుగు ముందుకు వేస్తూ, పోలీసులే బాధితుల ఇళ్లకు వెళ్ళి ఫిర్యాదు / నేరాన్ని నమోదు (Home Based FIR) చేయాలని నిర్ణయించింది. ఇది మంచి పరిణామం. ఈ ప్రక్రియ కూడా జీరో ఎఫ్ఐఆర్ కోవలోకే వస్తుంది.– కె. ఎస్. హరీష్ కుమార్విశ్రాంత అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (లా), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా -
తెలంగాణపై కావ్య మారన్ చిన్న చూపు
సాక్షి, హైదరాబాద్: దేశవాళీ క్రికెట్ పోటీల్లో సత్తా చాటుతున్న తెలంగాణ ప్లేయర్లను సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ఎందుకు చిన్న చూపు చూస్తోందో ఆ జట్టు యజమాని కావ్య మారాన్ సమాధానం చెప్పాలని తెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘం (టీడీసీఏ) వ్యవస్థాపక అధ్యక్షుడు, శాట్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం బంజారాహిల్స్లోని ఎస్ఆర్హెచ్ కార్యాలయం ముందు విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి ధర్నా చేశారు. అనంతరం ఎస్ఆర్హెచ్ ప్రతినిధి నగేష్కు వినతిపత్రం సమర్పించారు. ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో పాల్గొనేందుకు తెలంగాణ నుంచి సుమారు 100 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకోగా ఒక్కరిని కూడా కొనుగోలు చేయకపోవడం అన్యాయమని విమర్శించారు. ఆరోన్ జార్జ్, అమన్రావు వంటి తెలంగాణ యువ ప్లేయర్లను ఎందుకు వేలంలో ఎస్ఆర్హెచ కొనుగోలు చేయలేదని నిలదీశారు. ఎస్ఆర్హెచ్కు తెలంగాణ డబ్బులు, మౌలిక వసుతులు కావాలి కానీ, ఇక్కడి స్థానిక ప్లేయర్లకు కనీస అవకాశాలు ఇవ్వరా? అని ప్రశ్నించారు. తెలంగాణపై ఎస్ఆర్హెచ్ సవతి తల్లి ప్రేమను కట్టిపెట్టాలని అన్నారు. ధర్నాలో విద్యార్థి సంఘాల నాయకులు రాజేష్ ప్రశాంత్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ అబ్బాయి.. శ్రీలంక అమ్మాయి
నిజామాబాద్ రూరల్: ఆ ఇద్దరి మధ్య చిగురించిన ప్రేమ ఎల్లలు లేవని నిరూపించింది. శ్రీలంక అమ్మాయి.. తెలంగాణ అబ్బాయి ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. శనివారం మూడుముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారు. నిజామాబాద్ రూరల్ మండలం లింగితండాకు చెందిన బొంత వెంకటేశ్ 2019లో దుబాయికి వెళ్లాడు. అక్కడ ఎల్టన్ ప్రాపర్టీ అనే కంపెనీలో ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. అదే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న శ్రీలంక దేశానికి చెందిన ఉమేక తారుషి వెంకటేశ్ల మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వారు తల్లితండ్రుల సమక్షంలోనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో తమ ప్రేమ విషయాన్ని వెంకటేశ్ శ్రీలంకకు వెళ్లి తారుషి తల్లితండ్రులకు చెప్పి ఒప్పించాడు. ఇటు వెంకటేశ్ తల్లితండ్రులు ఒప్పుకున్నారు. దీంతో తారుషి, ఆమె తల్లితండ్రులు సేనాదిపతిగే నిలంతి పెరీరా, గలాని గమగె జనక ప్రియదర్శన సిల్వా లింగి తండాకు పది రోజుల క్రితం చేరుకున్నారు. శుక్రవారం ఇరు కుటుంబాల సంతోషాల మధ్య హల్దీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శనివారం వీరి వివాహానికి లింగి తండా వేదికగా మారనుంది. తమ ప్రేమ వివాహాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెంకటేశ్ ‘సాక్షి’తో తెలిపారు. -
మేమేం పాపం చేశాం నాన్న..
కరీంనగర్ రూరల్: ఆడపిల్లలుగా పుట్టడమే ఆ చిన్నారుల పాలిట శాపంగా మారింది. కన్నతండ్రే కాలయముడుగా మారి కవల పిల్లలకు గడ్డిమందు తాగించి చంపి వ్యవసాయబావిలో పడేసిన సంఘటన సంచలనం సృష్టించింది. కరీంనగర్ మండలం జూబ్లీనగర్కు చెందిన కచ్చు శ్రీశైలంకు మానకొండూరు మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మౌనికతో ఆరేళ్ల కిందట వివాహమైంది. వీరికి కవల ఆడపిల్లలు గీతాన్శ్రీ, గీతాన్విక (4) ఉన్నారు. శ్రీశైలం ప్రస్తుతం సమీపంలోని ప్రతిమ ఆస్పత్రిలో పనిచేస్తుండగా మౌనిక వ్యవసాయ పనులకు వెళ్తోంది. కవల ఆడపిల్లలు పుట్టారని శ్రీశైలం భార్యతో తరచూ గొడవ పడుతుండేవాడు. కుటుంబసభ్యులు పలుమార్లు పంచాయితీ నిర్వహించి, భార్యాభర్తలకు సర్ది చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు భార్యతో గొడవ పడిన శ్రీశైలం ఇద్దరు పిల్లలను ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్లి గడ్డిమందు తాగించి సమీపంలోని వ్యవసాయ బావిలో పడేశాడు. పిల్లల గురించి మౌనిక ప్రశ్నించడంతో ఇద్దర్ని చంపి బావిలో పడేశానని శ్రీశైలం చెప్పడంతో స్థానికులతో కలిసి బావి వద్దకు వెళ్లింది. సమాచారం అందుకున్న రూరల్ ఏసీపీ విజయ్కుమార్, సీఐ నిరంజన్రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బావిలో దిగి గాలించగా పెద్ద పాప గీతాన్శ్రీ మృతదేహం లభించింది. పిల్లల్ని చంపారనే కోపంతో శ్రీశైలంపై స్థానికులు దాడి చేయగా.. పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. గజ ఈతగాళ్ల సాయంతో బావిలో గాలించగా రాత్రి 8.30 గంటలకు గీతాన్విక మృతదేహం దొరికింది. -
బీరు తాగించించి మహిళపై లైంగిక దాడికి ప్రయత్నం..!
హైదరాబాద్: మహిళా చెఫ్పై హెడ్ చెఫ్ లైంగిక దాడికి యత్నంచిన ఘటన ఫిలింనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గచ్చిబౌలిలోని ఓ హోటల్లో చెఫ్గా పని చేస్తున్న మహిళ అనారోగ్యం కారణంగా ఇటీవల విధులకు వెళ్లడం లేదు. ఇదే హోటల్లో హెడ్ చెఫ్గా పని చేస్తున్న శ్యాం.. డ్యూటీకి సంబంధించిన మీటింగ్ ఉందని తన ఇంటికి రమ్మన్నాడు. గురువారం సాయంత్రం ఫిలిం నగర్లోని బీజేఆర్ నగర్లో ఉంటున్న శ్యాం ఇంటికి ఆమె వెళ్లింది. ఇప్పుడే వస్తానంటూ బయటకు వెళ్లిన అతను.. బీరు, బ్రాందీ సీసాలు పట్టుకు వచ్చాడు. బీరు తాగాలని ఆమెను బలవంతం చేశాడు. తాగనంటూ ఆమె నిరాకరించినా.. బలవంతంగా తాగించి లైంగిక దాడికి యత్నించాడు. అక్కడి నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు యత్నంచగా.. ఆమెను తీవ్రంగా కొట్టాడు. పొత్తి కడుపుపై కాలితో తన్నాడు. ఆమెను నిర్బంధించి కొన్ని అసభ్యకరమైన వీడియోలు చూపించాడు. ఎట్టకేలకు తప్పించుకున్న బాధితురాలు నేరుగా వెళ్లి ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. -
100 ఎకరాల్లో ఆర్టీసీ భారీ టెర్మినల్
సాక్షి, హైదరాబాద్: శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్లో ఆర్టీసీ మరో భారీ బస్ టెర్మినల్ నిర్మాణానికి సిద్ధమవుతోంది. నగరంలో ప్రధాన బస్ టెర్మినల్గా ఉన్న మహాత్మాగాంధీ బస్స్టాండ్ (ఎంజీబీఎస్) స్థాయిలో దీనిని నిర్మించే యోచనలో ఉంది. అంతర్రాష్ట్ర బస్సు సర్విసులకు ఒక టెర్మినల్, సిటీ బస్సుల కోసం మరో టెర్మినల్, ఎలక్ట్రిక్ బస్సుల కోసం బస్ డిపో, బ్యాటరీ బస్సుల కోసం భారీ చార్జింగ్ సెంటర్.. ఇలా సమీకృత కేంద్రంగా ఇది రూపొందనుంది. దీని నిర్మాణానికి జీడిమెట్ల ప్రాంతంలో ప్రభుత్వం 100 ఎకరాల భూమిని కేటాయించింది. దశలవారీగా దీనిని అభివృద్ధి చేసే దిశగా ఆర్టీసీ సమాయత్తమవుతోంది. రోడ్లపై బస్సులు ఆగకుండా.. కేపీహెచ్బీ చుట్టుపక్కల ప్రాంతాల్లో వందల సంఖ్యలో కాలనీలు పుట్టుకొచ్ఛాయి. కొత్త కాలనీలు శరవేగంగా రూపొందుతున్నాయి. నిత్యం ఈ ప్రాంతం నుంచి వేల సంఖ్యలో ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో వందల సంఖ్యలో బస్సులు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో రోడ్లమీదనే ఆగుతూ ప్రయాణికులను ఎక్కించుకుంటున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి, రాష్ట్రంలో మెదక్ రీజియన్ నుంచి అంతర్రాష్ట్ర, రాష్ట్ర సర్విసులు వచ్చి రోడ్ల మీదనే ఆగుతున్నాయి.భవిష్యత్లో దూర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు నగరంలోకి వెళ్లకుండా ఇక్కడే నిలిచిపోయేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికీ చాలా బస్సులు పటాన్చెరు, బీహెచ్ఈఎల్, లింగంపల్లి తదితర ప్రాంతాల్లో ఆగిపోతున్నాయి. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ చిక్కులు నెలకొంటున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని, బస్సులు రోడ్లమీద ఆగకుండా ప్రత్యేకంగా ఓ టెర్మినల్ నిర్మించి అందులోనే ఆగేలా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 30 ఎకరాల్లో అంతర్రాష్ట్ర బస్సుల కోసం టెర్మినల్ నిర్మించనున్నారు. నైట్హాల్ట్ బస్సుల కోసం జగద్గిరిగుట్ట వద్ద దాదాపు 60 వరకు బస్సులు నైట్హాల్ట్లో ఉంటున్నాయి. వాటిని నిలిపేందుకు సరైన చోటు లేకపోవటంతో రోడ్ల మీదనే ఆపుతున్నారు. నైట్హాల్ట్ బస్సు సిబ్బంది పడుకునేందుకు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. సిటీ సర్వీసులకు సిటీ టెర్మినల్ కూకట్పల్లి, కేపీహెచ్బీ, బీహెచ్ఈఎల్, బాచుపల్లి, గండిమైసమ్మ, గాజులరామారం... ఇలా ఈ సమీపంలోని చాలా ప్రాంతాల్లో ఉన్న వందల సంఖ్యలోని కాలనీలకు వెళ్లి వచ్చే సిటీ బస్సులకు కూడా టెర్మినల్ అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో అంతర్రాష్ట్ర సర్వీసులతోపాటు సిటీ బస్సులకు కూడా ఇక్కడ సిటీ టెర్మినల్ నిర్మించాలని నిర్ణయించారు. 20 ఎకరాలలో సిటీ టెర్మినల్ నిర్మించనున్నారు. ఎలక్ట్రిక్ బస్సు డిపో భవిష్యత్లో నగరంలో ఆర్టీసీ సర్వీసులన్నీ ఎలక్ట్రిక్ బస్సులే ఉండనున్నాయి. పీఎం ఈ–డ్రైవ్ పథకం కింద తెలంగాణ ఆరీ్టసీకి కేంద్రం 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. మరో ఆరు నెలల నుంచి ఏడాదిన్నర కాలంలో ఆ బస్సులు సమకూరనున్నాయి. వాటి కోసం ప్రస్తుతం ఉన్న డిపోలు కాకుండా కొత్తగా పది డిపోల వరకు నిర్మించాలని ఆర్టీసీ ప్రతిపాదిస్తోంది. ఇక్కడ భారీ డిపోను నిర్మించాలని ఆర్టీసీ నిర్ణయించింది. 10 ఎకరాల విస్తీర్ణంలో ఆ డిపో ఉండనుంది. చార్జింగ్ స్టేషన్ ఎలక్ట్రిక్ బస్సుల బ్యాటరీలను ఛార్జ్ చేసేందుకు ఛార్జింగ్ స్టేషన్ అవసరం. ఇక్కడి డిపో బస్సులతోపాటు, అంతర్రాష్ట్ర బస్సులు, ఇతర బస్సులకు ఛార్జింగ్ వసతి కలి్పంచేలా ఇక్కడ 15 ఎకరాలలో ఛార్జింగ్ స్టేషన్ నిర్మించాలని భావిస్తున్నారు. మల్టీలెవల్ పార్కింగ్ యార్డ్ టెర్మినల్కు నిత్యం వేల సంఖ్యలో ప్రయాణికులు రానున్నందున ఇక్కడ ఓ మల్టీలెవల్ పార్కింగ్ యార్డు కూడా రూపొందనుంది. దాన్ని భూగర్భంలో నిర్మించే యోచనలో ఉన్నారు. -
ప్రేమ విఫలమైతే అది మోసం కాదు
సాక్షి, హైదరాబాద్: పెళ్లి చేసుకుంటానని ప్రేమించి విఫలమైతే అది మోసపూరితం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. మోసం చేయాలన్న ఉద్దేశం ఉందని సాక్ష్యం ఉంటేనే నేరంగా పరిగణించాల్సి వస్తుందని అభిప్రాయపడింది. మోసపూరిత ఉద్దేశం లేనపుడు అది వాగ్దానం మాత్రమేనని గతంలో ఓ కేసులో తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు చెప్పిన వ్యాఖ్యలను గుర్తు చేసింది. ఈ కేసులోనూ ఐదేళ్లు ప్రేమలో ఉన్నారని, ఇది హామీలో విఫలం కావడమే తప్ప మోసం కాదంది.పిటిషనర్పై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చి పాటించలేదంటూ ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసు కొట్టివేయాలంటూ రామగుండం జిల్లా పొట్యాలకు చెందిన సంతోష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ ఎన్.తుకారాంజీ ధర్మాసనం విచారణ చేపట్టింది. వ్యక్తిగత సంబంధాలు దెబ్బతినడం నేరం కిందకు రాదని గతంలో ఇదే కోర్టు చెప్పిందని పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి యువతిని ప్రేమకు ఒప్పించాడని ఆమె తరఫు న్యాయవాది వాదించారు. -
పెట్రో, లిక్కర్... పన్నులు బేఫికర్
సాక్షి, హైదరాబాద్: పన్నుల వసూళ్లలో పెట్రోల్, మద్యం పోటీ పడుతున్నాయి. ఈ రెండు ఉత్పత్తుల అమ్మకాల కారణంగానే రాష్ట్ర ఖజానాకు రూ. 33,288 కోట్లు సమకూరాయని గణాంకాలు చెబుతున్నాయి. పెట్రోల్ అమ్మకాలపై విధించే వ్యాట్ ద్వారా రూ. 16,346 కోట్లు సమకూరగా, లిక్కర్పై రూ. 16,942 కోట్లు వచ్చాయి. 2025–26 ఆర్థిక సంవత్సరానికి వచ్చిన పన్ను వసూళ్లలో 42 శాతం పెట్రో, లిక్కర్ అమ్మకాలపై విధించిన వ్యాట్ ద్వారానే రావడం గమనార్హం. పన్నుల శాఖ గణాంకాల ప్రకారం 2025–26లో జీఎస్టీ, వ్యాట్, వృత్తి పన్ను రూపంలో ఖజానాకు రూ. 78,706 కోట్లు సమకూరాయి.అంతకుముందు ఏడాది కంటే అన్ని రకాల పన్ను వసూళ్లలో 5 శాతం వృద్ధి నమోదైంది. 2024–25లో అన్ని రకాల పన్నులు కలిపి రూ.75,129 కోట్లు వచ్చాయి. కాగా, 2025 ఏప్రిల్ 1 నుంచి 2025 సెస్టెంబర్ 30 వరకు 1.2 శాతం ఎక్కువగా పన్ను వసూళ్లు రాగా, 2025 అక్టోబర్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు 8.1 శాతం వృద్ధి నమోదైంది.ఇక, జీఎస్టీ కేటగిరీలో గత ఏడాది కంటే రూ.2 వేల కోట్లు ఎక్కువ వచ్చాయి. అదేవిధంగా గత ఏడాది మార్చిలో జీఎస్టీ కింద రూ. 3,574 కోట్లు, పెట్రోల్పై వ్యాట్ ద్వారా రూ. 1,248 కోట్లు, మద్యం అమ్మకాల ద్వారా రూ. 1,324 కోట్లు వసూలయ్యాయి. అదే ఈ ఏడాది మార్చిలో జీఎస్టీ కింద రూ.4,230 కోట్లు, పెట్రోల్పై వ్యాట్ ద్వారా రూ. 1,221 కోట్లు, మద్యం అమ్మకాల ద్వారా రూ. 1,437 కోట్లు వచ్చాయి. జీఎస్టీలో ఏకంగా 18 శాతం వృద్ధి నమోదు కావడం గమనార్హం. -
విద్యార్థుల నుంచే వసూలు చేసుకోండి
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్కు అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేసుకోవాలని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు హైకోర్టు తేల్చిచెప్పింది. అయితే, ఈ ఉత్తర్వులు కేవలం వచ్చే విద్యా సంవత్సరం 2026–27 నుంచే వర్తిస్తాయని స్పష్టం చేసింది. ప్రభుత్వం చెల్లించిన తర్వాత సదరు విద్యార్థులకు వెనుక్కు ఇచ్చేయాలని ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులోని వాస్తవాలు, పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న మీదట అనేక ఏళ్లుగా కాలేజీలకు సర్కార్ నుంచి రూ.వేల కోట్లు బకాయి ఉందని పేర్కొంది. టోకెన్లు జారీ చేసినా విడుదలలో విపరీత జాప్యం కారణంగా ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వాల్సి వస్తోందని వ్యాఖ్యానించింది.ఆయా కాలేజీల నిర్వహణ, కార్యకలాపాలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొంది. ఇతర చర్యలు ఈ పిటిషన్లలో ఇచ్చే తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయని చెప్పింది. ఇప్పటివరకు పేరుకుపోయిన రూ.వేల కోట్ల బకాయిలపై కౌంటర్ దాఖలు చేయాలని అధికారులను ఆదేశిస్తూ, తదుపరి విచారణ ఈనెల 30కి వాయిదా వేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీతోపాటు మైనారిటీ విద్యార్థులకు సంబంధించి ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద తమకు చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కేశవ్ మెమోరియల్ సహా పలు కళాశాలలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై జస్టిస్ జువ్వాడి శ్రీదేవి ధర్మాసనం విచారణ చేపట్టింది. జీతాలు ఇచ్చే పరిస్థితీ లేదు.. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు ఎల్.రవిచందర్, అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. విద్యార్థుల నుంచి నేరుగా ఫీజులు వసూలు చేయకుండా 2008, 2009లో రాష్ట్ర ప్రభుత్వం పలు జీవోలు జారీ చేసిందన్నారు. ఈ నిషేధం తర్వాత ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోయినట్లు చెప్పారు. ఇంజనీరింగ్ కళాశాలలకు సుమారు రూ.1,500 కోట్ల ట్యూషన్ ఫీజు బకాయిలను విడుదల చేయడంలో ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. ఒక ప్రైవేట్ వ్యక్తి నుంచి ఇంత పెద్ద మొత్తాలు రావాల్సి ఉంటే కోర్టులు అతన్ని డిఫాల్టర్గా పేర్కొని, శిక్షించేవన్నారు.చెల్లింపులపై టోకెన్లు జారీ చేసి ఐదేళ్లయినా విడుదల చేయడం లేదన్నారు. ఒక్క కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకే రూ.56 కోట్లు బకాయి ఉందని తెలిపారు. 2024లో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులకు బడ్జెట్ ఆమోదం ఉందని, అనుమతి పొందిన తర్వాత చెల్లించకపోవడం సబబుకాదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కాలేజీలు ఆర్థికంగా కుదేలయ్యాయని, బోధన, బోధనేతర సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేని స్థితికి చేరాయన్నారు. దైనందిన కార్యకలాపాల నిర్వహణకూ ఆదాయాన్ని సమకూర్చుకోలేక పోతున్నాయని, బకాయిలు వెంటనే చెల్లించేలా ఆదేశించాలని కోరారు. బకాయిలు మరింతగా పేరుకుపోకుండా ఉండేందుకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.నిర్వహణ కష్టంగా మారడంతో...పిటిషనర్లు సమరి్పంచిన గణాంకాలు సరైనవి కావని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నందున టోకెన్లు జారీ చేసిన మొత్తాల చెల్లింపునకు సమయం కావాలని కోరారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూ ర్తి.. ఏళ్లుగా పేరుకుపోయిన బకాయిలను చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని అభిప్రాయపడ్డారు. కాలేజీల నిర్వహణ కష్టంగా మారిన నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల నుంచే ఫీజులు వసూలు చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేస్తున్నామన్నారు. -
కుటుంబ కలహాలతో సర్పంచ్ ఆత్మహత్య
కడెం: కుటుంబ కలహాలతో విసిగిపోయిన ఓ మహిళా సర్పంచ్ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లా కడెం మండలంలో జరిగింది. ఎస్సై సాయికిరణ్ కథనం ప్రకారం.. మండలంలోని నర్సాపూర్కు చెందిన లహరిక (31), మాసా యిపేటకు చెందిన ఆర్ఎంపీ రాజేశ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆరు నెలలుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇంతలో గతేడాది డిసెంబర్లో పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. మహిళా రిజర్వేషన్ కావడంతో రాజేశ్ లహరికను సర్పంచ్గా నిలబెట్టగా విజయం సాధించింది. అయితే వారి ఇంట్లో గొడవలు మాత్రం సద్దుమణ గలేదు.దీంతో లహరిక ఇటీవల పుట్టింటికి వెళ్లింది. ఇంతలో ప్రభుత్వం అన్ని గ్రామాల్లో సభలు నిర్వ హించాలని నిర్ణయించింది. దీంతో రాజేశ్ నర్సా పూర్కు వెళ్లి లహరికను ఈనెల 1న తీసుకు వచ్చా డు. గురువారం గ్రామ సభలో సర్పంచ్ లహరిక పాల్గొన్నారు. అయితే శుక్రవారం ఉద యం తన ఏడేళ్ల కొడుకు ప్రజ్వల్ను తీసుకుని గ్రామ సమీపంలోని తోట వద్దకు వెళ్లి పురుగుల మందుతాగింది. అనంతరం ఇంటికి చేరు కున్నారు. ఇంతలో ప్రజ్వల్ తన తండ్రికి ఫోన్చేసి విషయం చెప్పడంతో హుటాహుటిన ఇంటికి వచ్చిన రాజేశ్ లహరికను ఖానాపూర్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. -
‘రిజిస్ట్రేషన్’లో నయాదందా
సాక్షిప్రతినిధి, వరంగల్: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతి, అక్రమాలపర్వం కొనసాగుతూనే ఉంది. వరంగల్లో ట్రెండ్ మార్చిన ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు ఏకంగా వాట్సాప్ కాల్, చాటింగ్ల ద్వారా కథ నడిపించిన వైనం ఏసీబీ తనిఖీల్లో వెల్లడైంది. అక్రమ వెంచర్లు, ప్రభుత్వ, అసైన్డు భూములు.. ఇలా ఒక్కో భూమి రిజిస్ట్రేషన్కు ఒక్కోరేటు మాట్లాడుకుని అక్రమాలకు పాల్పడ్డారన్న ఫిర్యాదుల మేరకు గురు, శుక్రవారం ఏసీబీ చేపట్టిన తనిఖీలతో గుట్టురట్టయ్యింది. ఏసీబీ వరంగల్ రేంజ్ డీఎస్పీ సాంబయ్య కథనం ప్రకారం.. మొదట వడ్డెపల్లిలోని రిజిస్ట్రేషన్ కార్యాలయంలోని సబ్ రిజిస్ట్రార్ 1, 2 చాంబర్లలో తనిఖీలు చేశారు.సోదాల సమయంలో కార్యాలయంలో 20 మంది అనధికార ఏజెంట్లు/డాక్యుమెంట్ రైటర్లు ఉండగా, లెక్కకు చూపని రూ.47,450 నగదుతో పాటు 70 నమోదుకాని పత్రాలను స్వాదీనం చేసుకున్నారు. డాక్యుమెంట్ రైటర్ మొబైల్ ఫోన్లను తనిఖీ చేయగా సబ్ రిజిస్ట్రార్–1 జమాలపురం రామనరసింహారావు, సబ్ రిజిస్ట్రార్–2 దావులూరి ఆనంద్ల మధ్య జరిగిన అనేక వాట్సాప్ చాట్లు బయటపడ్డాయి.గత సంవత్సర కాలంలో పత్రాలు రాసిన వారితో సుమారు రూ.42,03,125ల విలువైన ఫోన్పే లావాదేవీలు జరిగినట్లు గుర్తించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. శుక్రవారం ఏకకాలంలో సబ్రిజిస్ట్రార్ల ఇళ్లలో సోదాలు జరిపినట్లు డీఎస్పీ సాంబయ్య తెలిపారు. ఈ సందర్భంగా సబ్రిజిస్ట్రార్ దావులూరి ఆనంద్ నుంచి రూ.24,61,540ల నికర నగదు, 819.500 గ్రాముల బంగారు ఆభరణాలు, 2.600 కిలోగ్రాముల వెండి ఆభరణాలు, కపిల్ చిట్స్లో రూ.30,10,000లు విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లు స్వా«దీనం చేసుకున్నారు. -
ఐస్క్రీం బండి..రావొద్దండి
డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో తోపుడు బండ్లపై ఐస్క్రీం అమ్మితే నేరమే అని పంచాయతీ పాలకవర్గాలు అంటున్నాయి. ఈ మేరకు వరుస తీర్మానాలు కూడా చేస్తున్నాయి. తమ ఆదేశాలను కాదని ఐస్క్రీంలు విక్రయిస్తే బండ్ల నిర్వాహకుల వద్ద రూ.5 వేలు జరిమానా వసూలు చేస్తామని పోస్టర్లు కూడా ఏర్పాటు చేశారు. ఇదంతా తమ పిల్లల ఆరోగ్యం కోసమేనని పంచాయతీ పాలకవర్గాలు చెబుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లోకి ఐస్క్రీం బండ్లకు అనుమతి లేదంటూ గ్రామ పంచాయతీలు వరుసగా తీర్మానాలు చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ⇒ తాజాగా డిచ్పల్లి మండలం సుద్దపల్లి, మాక్లూర్ మండలం మందాపూర్, డొంకేశ్వర్ మండలం గాదేపల్లి, అన్నారం, నూత్పల్లి, తొండాకూర్ గ్రామాలు కూడా అదే బాటలో నడిచాయి. ఐస్క్రీం తినడం వల్ల పిల్లలకు తలనొప్పి, దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులతోపాటు, వాటిలో కలిపే రంగులు, రసాయనాల వల్ల భవిష్యత్లో కేన్సర్ వంటి ప్రమాదకర జబ్బులు వచ్చే అవకాశం ఉందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. దీంతో గ్రామ సభలు నిర్వహించి మరీ తమ గ్రామంలోకి ఐస్క్రీం బండ్లు నిషేధిస్తూ.. తీర్మానాలు చేస్తున్నారు. ⇒ నందిపేట్ మండలంలోని డొంకేశ్వర్, అయిలాపుర్, చింరాజ్పల్లి, వెల్మల్, తొండాకూర్, గాదేపల్లి ఆర్మూర్ మండలంలో పిప్రి, ఆర్మూర్, ముప్కాల్, వేల్పూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో తోపుడు బండ్లపై ఐస్క్రీం అమ్మకాలను నిషేధిస్తూ జీపీలు ఏకగ్రీవంగా తీర్మానాలు చేశాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.5,000 వరకు జరిమానా విధిస్తామని పంచాయతీ పాలకవర్గాలు గ్రామ ముఖద్వారం వద్ద, గ్రామాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద బోర్డులు (ఫ్లెక్సీలు) ఏర్పాటు చేశాయి. ఏప్రిల్ 2 నుంచి నిషేధం.. గ్రామస్తులు, గ్రామాభివృద్ధి కమిటీ సహకారంతో ఏప్రిల్ 2వతేదీ నుంచి సుద్దపల్లిలో ఐస్క్రీం తోపుడు బండ్లను నిషేధించాం. గ్రామసభ లో పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసింది. గ్రామ ముఖద్వారంతో పాటు అన్ని ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాం. ఈ తీర్మానాన్ని కాదని ఎవరైనా ఐస్క్రీం విక్రయిస్తే రూ.5వేలు జరిమానా విధిస్తాం. – పానుగంటి రూప, సర్పంచ్ సుద్దపల్లిపిల్లల ఆరోగ్యం కోసమే.. తోపుడు బండ్లపై అమ్మే ఐస్క్రీంలు తినడం వల్ల పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారు. ఐస్క్రీంలో కలిపే రంగులు, రసాయనాల వల్ల ఆరోగ్యం దెబ్బతింటోంది. ఈ విషయాన్ని గమనించి గ్రామసభలో ఐస్క్రీం తోపుడు బండ్లు గ్రామంలోకి రావద్దని పంచాయతీ పాలకవర్గం తీర్మానించింది. దీనికి వీడీసీతో పాటు గ్రామ యువత, గ్రామస్తులు సంపూర్ణ మద్దతు తెలిపారు. – వినోద్రెడ్డి.. సుద్దపల్లి గ్రామస్తుడుమనం చాక్లెట్ అంటే పడి చావడం లేదు!!చాక్లెట్ అంటే అందరికీ ఇష్టమే. కానీ ఎంత ఇష్టమన్నదే ఇక్కడ పాయింట్. యూరప్, యూఎస్లో చాక్లెట్ అంటే పడి చస్తుంటే.. ఆసియాలో మాత్రం చాక్లెట్ కన్నా.. స్థానిక మిఠాయిలనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ప్రపంచంలో జర్మనీ వాసులు అత్యధికంగా చాక్లెట్ను తింటున్నారు. తాజా అధ్యయనం ప్రకారం అక్కడ ఒక్కో వ్యక్తి ఏడాదికి 8.1 కిలోల చాక్లెట్ను తింటున్నాడట. తర్వాతి స్థానంలో స్విట్జర్లాండ్ ఉంది. చివరి స్థానాల్లో భారత్, చైనాలు ఉన్నాయి. ఓసారి ఆ లెక్కలేంటో చూసేద్దామా.. -
బడి సేవలు సులభతరం!
సాక్షి, హైదరాబాద్: పాఠశాల సేవలు సులభతరం కానున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థుల సేవలను ఆన్లైన్ పద్ధతిలో అందించాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ యోచిస్తోంది. ప్రస్తుతం మాన్యువల్ పద్ధతిలో అందే సర్విసులను ఇకపై ఆన్లైన్ ఆధారితంగా అందించనుంది. ప్రస్తు తం పాఠశాలల్లో ట్రాన్స్ఫర్ సర్టీఫికెట్ (టీసీ), బోనఫైడ్, విద్యార్థి వివరాల్లో సవరణలు, పదోతరగతిలో వివరాల అప్డేషన్ తదితర సర్వీసులు అందుతున్నాయి. వీటి కోసం విద్యార్థులు సదరు పాఠశాలలో నేరుగా సంప్రదించాల్సి వస్తోంది.ఈ క్రమంలో పాఠశాల హెచ్ఎంలు అందుబాటులో లేకపోవడం లాంటి కారణాలతో సేవలు పొందడంలో ఆలస్యమవుతోంది. ఇకపై జాప్యానికి అవకాశం లేకుండా పాఠశాల విద్యాశాఖ నేరుగా ఆన్లైన్లోనే ఈ సర్విసు లు అందించాలని భావిస్తోంది. దీంతో ఈ సర్విసులను పారదర్శకతతోపాటు నిర్దిష్ట సమయంలో అందించడం, డిజిటల్ పద్ధతిలో రికార్డుల నిర్వహణకు అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో పాఠశాల విద్యాశాఖ ఆలోచన చేస్తోంది. మీసేవ కేంద్రాలతో లింకు : విద్యార్థులకు డూప్లికేట్ మెమోలు జారీ చేసేందుకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(బీఎస్ఈ) ఇప్పటికే ఆన్లైన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ సర్విసు ప్రయోగ దశలో ఉంది. గతంలో డూప్లికేట్ మెమో కావాలనుకుంటే విద్యార్థులు నేరుగా బోర్డు కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకోవాల్సి ఉండేది. దరఖాస్తు చేసుకోవడం ఒక ఎత్తయితే... సర్టీఫికెట్ పొందేందుకు పట్టే సమయం...అందుకు పలుమార్లు కార్యాలయం చుట్టూ తిరగాల్సి రావడం..చివరకు పాఠశాలకు వచ్చే వరకు సుదీర్ఘ సమయం పట్టేది. ఇకపై అలాంటి ఆలస్యం లేకుండా ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇదే తరహాలో పాఠశాల సర్విసులు కూడా ఆన్లైన్లో అందించే ఆలోచనలో పాఠశాల విద్యాశాఖ ఉంది.అయితే ఈ సేవలను మీసేవ కేంద్రాలకు అనుసంధానం చేయనుంది. ట్రాన్స్ఫర్ సర్టీఫికెట్ లేదా బోనఫైడ్ ఇతర పాఠశాల సేవలు పొందాలనుకుంటే ముందుగా మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తు నేరుగా జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి చేరుతుంది. ఆ వినతికి అనుగుణంగా సదరు మండల విద్యాధికారి/పాఠశాల ప్రిన్సిపల్ లాగిన్లో ప్రత్యక్షమవుతుంది. అక్కడి నుంచి ధ్రువీకరణ అందిన వెంటనే మీసేవ కేంద్రంలో సర్టీఫికెట్ ప్రత్యక్షమవుతుంది. ఏటా విద్యార్థుల వివరాలు అపార్లో అప్డేట్ అవుతుంటాయి. అపార్ వివరాల ఆధారంగా ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తారు. ప్రస్తుతం పాఠశాల విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తుండగా, అతి త్వరలో సీఎం అనుమతి తీసుకున్న తర్వాత ఈ సేవలను అందుబాటులోకి వచ్చే అవకాశముందని సమాచారం. -
ఆరు గ్యారంటీలేవీ?
నారాయణపేట: ‘ఆరు గ్యారంటీల అమలు ఎక్కడ జరుగుతున్నాయి. పిల్లలు పుడితే గానీ కల్యాణలక్ష్మి రావడం లేదు. ‘పాలమూరు బిడ్డలను మోసం చేసి గద్దెనెక్కావు. నీ సొంత నియోజకవర్గంలో ఏ గ్రామంలోనైనా వందశాతం రుణమాఫీ చేపట్టావా.. కొడంగల్కు రా చర్చించుకుందాం’అంటూ సీఎం రేవంత్రెడ్డికి మాజీ మంత్రి హరీశ్రావు సవాల్ విసిరారు. నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండల పరిధిలోని తిమ్మారెడ్డిపల్లిలో గురులోకా మసంద్ బావాజీని శుక్రవారం ఆయన దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండలంలోని ఎక్కామెడ్ శివారులో మీడియాతో మాట్లాడారు.రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని అసెంబ్లీలో నిలదీస్తే ఇచ్చింది 16 వేల ఉద్యోగాలేనని చెప్పారన్నారు. ఇప్పటికే రైతుబంధు మూడుసార్లు ఎగ్గొట్టావని, వడ్లకు బోనస్ రెండుసార్లు ఇవ్వలేదని.. కూట్లో రాయి తీయనోడు.. ఏట్లే రాళ్లు తీశాడంటా అన్నట్టుంది నీ పరిస్థితి అంటూ రేవంత్రెడ్డిపై సెటైర్లు వేశారు. ‘మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్రెడ్డి వెళ్లారు.. అక్కడ కాంగ్రెస్ ఓడిపోయింది. మళ్లీ కేరళలో జరుగుతున్న ఎన్నికల ప్రచారానికి వెళుతున్నారు. రేవంత్.. నీది ఐరన్ లెగ్ అక్కడ సైతం కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఖాయం’అంటూ హరీశ్రావు ఎద్దేవా చేశారు.పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 1.83 కోట్ల క్యూబిక్ మీటర్ల పనులు చేపడితే, మిగిలిన 30 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మూడేళ్లు కావొస్తున్నా పూర్తి చేయడం లేదన్నారు. మూడవ ఫేజ్లో ఉన్న పాలమూరు ఎత్తిపోతల పథకంలోని కాల్వలను తవి్వతే కొడంగల్కు 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.90 శాతం పనులు పూర్తి చేసిన పాలమూరును పక్కనపెట్టి కమీషన్ల కోసం రూ.4,500 కోట్లతో నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని చేపడుతున్నారని విమర్శించారు. ఫ్యూచర్ సిటీ అందాల పోటీలు, ఫుట్బాల్ షో అంటూ వేల కోట్లు ఖర్చు చేశావు గానీ.. లంబాడ సోదరులకు చేసింది ఏమీ లేదన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పట్నం నరేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, పాల్గొన్నారు. -
గ్రీన్ టెక్స్టైల్ హబ్లు
సాక్షి, హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ గ్రీన్ టెక్స్టైల్ హబ్లను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ప్రకటించారు. 2047 నాటికి తెలంగాణను దక్షిణ ఆసియాకు టెక్స్టైల్ రాజధానిగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. యువత, మహిళలను లక్ష్యంగా చేసుకొని సంప్రదాయ వస్త్రోత్పత్తికి ఆధునికతను జోడించి డిజైన్, కుట్టు పని తదితరాల్లో శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు. ప్రపంచానికి ఔషధాలు, వ్యాక్సి న్లు అందిస్తున్న తెలంగాణలో తయారయ్యే దుస్తులను ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ధరించేలా వస్త్ర పరిశ్రమను తీర్చిదిద్దడం లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు.హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)లో శుక్రవారం ‘ఏషియన్ టెక్స్టైల్స్ కాన్ఫరెన్స్– 2026’(ఎటెక్స్కాన్)ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ‘శతాబ్దాలుగా కళలు, సంస్కృతి, సాంప్రదాయాల కలబోతగా తెలంగాణ వస్త్ర పరిశ్రమ నిలుస్తోంది. మన జీవన విధానంలో వస్త్ర పరిశ్రమ అంతర్భాగంగా ఉంది. నిజాం కాలంలోనే ప్రపంచం నలుమూలల నుంచి హైదరాబాద్కు వచ్చే వ్యాపారులు ముత్యాలు, వస్త్రాలు కొనుగోలు చేసేవారు. పోచంపల్లి ఇక్కత్ మొదలుగద్వాల చీరలు, వరంగల్ డర్రీలు, నారాయణపేట చేనేత వరకు అనేక రకాలైన వ్రస్తోత్పత్తుల్లో తెలంగాణకు ఎంతో పేరు ఉంది’అని సీఎం పేర్కొన్నారు. పత్తి ఉత్పత్తి నాణ్యతలో అగ్రగామి ‘భారత్తోపాటు ప్రపంచ వ్యాప్తంగా పత్తి ఉత్పత్తి, నాణ్యతలోనూ తెలంగాణ అగ్రగామిగా ఉంది. వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ప్రపంచస్థాయిలో పేరొందిన సంస్థలు దుస్తుల తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేశాయి. నైపుణ్యం, సంకల్పం, అత్యుత్తమ మానవ వనరులు, ప్రపంచానికి సరితూగే విధానాలతోపాటు వస్త్ర పరిశ్రమపై తెలంగాణకు దూరదృష్టి కూడా ఉంది. తెలంగాణ పత్తి చేల నుంచి లండన్, న్యూయార్క్, పారిస్, మిలాన్, టోక్యో, దుబాయ్ ఫ్యాషన్ షోల వరకు అనేక అంశాల్లో మేం కలిసి పనిచేస్తున్నాం.హైదరాబాద్ భారతదేశానికి మాత్రమే కాదు..ప్రపంచానికి కూడా సినిమా నిర్మాణ కేంద్రంగా ఎదుగుతూ హాలీవుడ్ స్థాయికి చేరింది. టాలీవుడ్, బాలీవుడ్ ఇప్పటికే హైదరాబాద్ను తమ నిర్మాణ కేంద్రంగా ఉపయోగిస్తున్నాయి. సినిమా రంగం ద్వారా కూడా ఫ్యాషన్ రంగాన్ని ప్రోత్సహిస్తాం. పెట్టుబడులతో వచ్చే వారికి మౌలిక సదుపాయాలు, భూమి, విద్యుత్, నీరు, ఇతర ప్రోత్సాహకాలతోపాటు వేగంగా అనుమతులు మంజూరు చేస్తాం. ప్రపంచాన్ని మార్చగలిగే స్థాయిలో తెలంగాణలో వ్రస్తోత్పత్తి పరిశ్రమ వాతావరణాన్ని నిర్మిద్దాం’అని సీఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. నేతన్నకు అందించే సామాజిక న్యాయం : శ్రీధర్బాబు ప్రభుత్వం దృష్టిలో వస్త్రోత్పత్తి అంటే అట్టడుగున ఉన్న నేతన్నకు అందించే సామాజిక న్యాయమని మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. ‘స్వాతంత్య్రం చరఖా, మగ్గం ద్వారా కూడా వస్తుందని మహాత్మాగాంధీ నిరూపించారు. అంతర్జాతీయ సరఫరా గొలుసులో నేతన్నలు కూలీగానే మిగిలిపోకుండా యజమానిగా ఎదగాలనే సంకల్పంతో నేత కార్మికులను ప్రోత్సహిస్తూ అండగా నిలుస్తున్నాం. ఆధునిక సాంకేతికతతో మేడిన్ తెలంగాణ బ్రాండ్ను విశ్వవ్యాప్తం చేసేందుకు ‘న్యూ స్వదేశీ విజన్’కు శ్రీకారం చుడుతున్నాం. డిజిటల్ డిజైన్లు, అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం ద్వారా తెలంగాణ నేతన్నల నైపుణ్యాన్ని మిలాన్, న్యూయార్క్ వంటి అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికలపైకి చేర్చాలని లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని ముందుకెళ్తున్నాం’అని శ్రీధర్బాబు ప్రకటించారు. వేలాది కుటుంబాలకు జీవనాధారం : మంత్రి తుమ్మల ‘తెలంగాణలో టెక్స్టైల్ రంగం కేవలం ఒక పరిశ్రమ మాత్రమే కాదు. వేలాది కుటుంబాల జీవనాధారం. మన సంస్కృతి, సంప్రదాయాల ప్రతిబింబం. చేనేత రంగం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి పొందుతున్న కుటుంబాల సంఖ్య అధికంగా ఉంది. ప్రభుత్వం టెక్స్టైల్ రంగాన్ని కేవలం ఆర్థిక ప్రగతిగా కాకుండా, ఒక సామాజిక బాధ్యతగా భావిస్తోంది. ‘తెలంగాణ విజన్ 2047’లో టెక్స్టైల్ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యం కల్పించాం. దీని ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది’అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. – ఎటెక్స్ కాన్ 2026లో భాగంగా ‘రీమేజినింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ గ్లోబల్ టెక్స్టైల్స్’పై రూపొందించిన నివేదికను సీఎం రేవంత్ విడుదల చేశారు. సదస్సులో టెక్స్టైల్ రంగంలోని తాజా ధోరణులు, సాంకేతిక పరిణామాలు, అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలపై పలు సెషన్లు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చేనేత, వస్త్ర పరిశ్రమ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, శశాంక, టీజీఐఐసీ ఛైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొన్నారు. -
కసాయి తండ్రి.. ఐదేళ్ల కవల కూతుళ్ల ప్రాణం తీశాడు..
సాక్షి, కరీంనగర్ : రూరల్ మండలం జూబ్లీనగర్లో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో తండ్రి ఇద్దరు కుమార్తెలను హత్య చేసి బావిలో పడేశాడు.పోలీసుల వివరాల ప్రకారం, శుక్రవారం శ్రీశైలం తన భార్యతో గొడవపడ్డాడు. కోపోద్రికుడైన అతడు ఐదేళ్ల కవల కూతుళ్లకు గడ్డి మందు తాగించి అనంతరం బావిలో పడేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు పిల్లల మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఒక కూతురు మృతదేహం లభించగా, మరో కూతురు కోసం గాలింపు కొనసాగుతోంది.ఈ ఘటనపై ఆగ్రహించిన స్థానికులు శ్రీశైలంపై దాడి చేశారు. భార్యతో గొడవపడి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని వారు చెబుతున్నారు. నిందితుణ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
ట్రాన్స్జెండర్లకు గుడ్ న్యూస్ : డ్రోన్ పైలట్ శిక్షణ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వానికి చెందిన 'దివ్యాంగులు, వృద్ధులు ,ట్రాన్స్జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ' (EPwD), ట్రాన్స్జెండర్ వ్యక్తుల కోసం నైపుణ్య శిక్షణా కార్యక్రమాల ప్రారంభోత్సవాన్ని నిర్వహించనుంది. ఈ శిక్షణా కార్యక్రమాలలో డ్రోన్ పైలట్ శిక్షణ, హోటల్ నిర్వహణ విభాగం కింద క్యాంటీన్ చెఫ్ శిక్షణ , కారు డ్రైవింగ్ నైపుణ్య శిక్షణను అందిస్తారు. ఈ కార్యక్రమం రేపు (04.04.2026) ఉదయం 11:00 గంటలకు హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఉన్న NITHM ప్రాంగణంలో జరగనుంది.ఈ కార్యక్రమంలో ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధులు మరియు ట్రాన్స్జెండర్ వ్యక్తుల సాధికారత శాఖల గౌరవ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. -
సర్పంచ్ ఆత్మహత్యాయత్నం.. ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రమాదం
సాక్షి,నిర్మల్: విధి ఆడిన వింత నాటకంలో సర్పంచ్ లహరిక మృతి చెందారు. నిర్మల్ జిల్లా మాసాయిపేట సర్పంచ్ లహరిక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ప్రమాదం చోటుచేసుకుంది. లహరికను తీసుకెళ్తున్న కారు రోడ్డు పక్కన నిలిపి ఉన్న ట్రాక్టర్ను ఢీకొట్టింది.ప్రమాదంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు లహరికను మరో ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయారు.ఈ విధంగా వరుస సంఘటనలు విషాదాంతానికి దారితీశాయి. ఆత్మహత్య ప్రయత్నం, రోడ్డు ప్రమాదం, ఆసుపత్రి చికిత్స.. వరుస సంఘటనలు చివరికి విషాదాంతానికి దారితీశాయి. మాసాయిపేట సర్పంచ్ లహరిక మృతి నిర్మల్ జిల్లాలో చర్చనీయాంశమైంది -
ఇది చూసి నవ్వుకునేరు.. బాబోరు మళ్లీ వేసేశారు..!
సాక్షి,అమరావతి: చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతానికి పర్యాయ పదం. అయితే, ఆయన ధోరణి రెండు నాల్కుల తీరు అనేది మరోసారి బయటపడింది. తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో ఆయన తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, ఇప్పుడు తాను విభజనకు వ్యతిరేకం కాదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం తన వైఖరిని మార్చుకునే చంద్రబాబు తాజాగా తెలంగాణ నా బ్రెయిన్ చైల్డ్ అని చెప్పడంపై తెలుగు రాష్ట్రాల ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. నిన్నగాక మొన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ సిలిండర్తో వంట చేయొచ్చని చెప్పింది తానేన్నారు. గతంలో తన వల్లే అందరికీ సెల్ఫోన్లు వచ్చాయని కూడా చెప్పుకున్నారు. గతంలో ఇలాగే 2016లో దేశంలో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెనుక తన పాత్ర ఉందని, ప్రధాని మోదీకి తానే సూచించానని ప్రచారం చేసుకున్నారు. అవినీతిని తగ్గించేందుకు పెద్ద నోట్లను రద్దు చేసి డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించాలని తానే ఆలోచించానని చెప్పి .. జనం ముందు అభాసుపాలయ్యారు బాబోరు..ఈ విధంగా, తరచూ తనకే క్రెడిట్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తూ, వాస్తవానికి విరుద్ధంగా మాట్లాడటం ఆయనలోని విచిత్ర ధోరణిని బయటపెట్టుకుంటున్నారు. ప్రజలు ఏమనుకుంటారో అనేది సంబంధం లేకుండా ఏ ఘనతనైనా ఇట్టే తన ఖాతాలో వేసుసుకునే బాబుగారు.. తాజాగా తెలంగాణ నా బ్రెయిన్ చైల్డ్(నా మేధస్సు వల్లే పుట్టినది) అని చెప్పుకోవడం చూసి..బాబోరు మళ్లీ వేసేశారు అనుకుంటూ అదేదో సినిమాలోని సీరియస్ కమెడియన్ను గుర్తు చేసుకుంటున్నారు. -
‘తెలంగాణలో బీజేపీకి స్థానంలో లేదు’
మంచిర్యాల: తెలంగాణాలో బీజేపీకి స్థానం లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆరోపించారు. ఎన్నికలొస్తే దేవుళ్ల పేరు చెప్పడం బీజేపీకి అలవాటని ఎద్దేవా చేశారు. ఇక బీఆర్ఎస్పై కూడా మహేష్ గౌడ్ విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్లో కేసీఆర్, హరీష్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందన్నారు. కవిత వేరుకుంపటితో బీఆర్ఎస్ రోడ్డున పడిందన్నారు. కేసీఆర్ ఫామ్హౌస్కే పరిమితమయ్యారన్నారు. ‘ బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కేసుల పాలయ్యారు.. లాఠీ దెబ్బలు తిన్నారు. ఈ రోజు మేము పదవుల్లో ఉన్నామంటే అది కార్యకర్తల కష్టమే. తెలంగాణలో కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చింది కార్యకర్తలే. కేసీఆర్ శృతి లేని పాలన చేసిండు. వారి హయాంలో చేసిన అప్పులకు నెలకు రూ. 6 వేల కోట్ల వడ్డీ కడుతున్నాం . తెలంగాణాలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 సిట్లకు పైగా గెలుస్తుంది’ అని ధీమా వ్యక్తం చేశారు. -
కల్తీ మామిడి పండ్లతో తస్మాత్ జాగ్రత్త!: సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే కల్తీ వ్యాపారుల పట్ల పోలీసుల విభాగం ఉక్కుపాదం మోపుతుందని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ప్రజలు.. మామిడి పండ్ల రూపాన్ని చూసి మోసపోకుండా, సహజత్వాన్ని గుర్తించి పండ్లను కొనుగోలు చేయాలని కోరారు. కల్తీ మామిడి పండ్ల సమాచారం తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.హైదరాబాద్ సీపీ వీసీ సజ్జరాన్ తాజాగా ట్విట్టర్ వేదికగా..‘వేసవి కాలం రాకతో పండ్లలో రారాజు మామిడి మార్కెట్లో సందడి చేస్తోంది. అయితే, నోరూరించే ఈ ఫలాల మాటున ప్రాణాంతకమైన విషపు కోరలు దాగి ఉన్నాయన్న నిజాన్ని ప్రజలు విస్మరించకూడదు. కాసుల కక్కుర్తితో కొందరు స్వార్థపరులైన వ్యాపారులు ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. సహజ సిద్ధంగా పక్వానికి రావాల్సిన మామిడిని కాల్షియం కార్బైడ్, ఇతర రసాయాలను ఉపయోగించి కృత్రిమంగా మగ్గించి విక్రయిస్తున్నారు. రోడ్డు పక్కన బండ్ల మీద నిగనిగలాడుతూ, పసిడి వర్ణంతో కంటికి అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తున్న ప్రతి పండునూ నాణ్యమైనదిగా భావించి కొనుగోలు చేయడం అంటే.. అనారోగ్యాన్ని స్వయంగా కొని తెచ్చుకోవడమే.సాధారణంగా సహజంగా పండిన పండు అంతటా ఒకే రంగులో ఉండదు, కానీ రసాయనాలతో మగ్గించిన పండ్లు పైన పసుపు పచ్చగా ఉండి, లోపల మాత్రం పచ్చిగా ఉండి విషతుల్యంగా మారుతాయి. ఇలాంటి పండ్లను తినడం వల్ల గొంతు మంట, కడుపులో వికారం, వాంతులు, విరేచనాలు వంటి తక్షణ సమస్యలతో పాటు, దీర్ఘకాలంలో నాడీ వ్యవస్థ దెబ్బతినడం, శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.కల్తీ మామిడి పండ్లతో తస్మాత్ జాగ్రత్త!వేసవి కాలం రాకతో పండ్లలో రారాజు మామిడి మార్కెట్లో సందడి చేస్తోంది. అయితే, నోరూరించే ఈ ఫలాల మాటున ప్రాణాంతకమైన విషపు కోరలు దాగి ఉన్నాయన్న నిజాన్ని ప్రజలు విస్మరించకూడదు. కాసుల కక్కుర్తితో కొందరు స్వార్థపరులైన వ్యాపారులు ప్రజల ప్రాణాలను… pic.twitter.com/yOYzQFmVMG— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) April 3, 2026ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ఇలాంటి కల్తీ వ్యాపారుల పట్ల హైదరాబాద్ పోలీస్ విభాగం ఇప్పటికే ఉక్కుపాదం మోపుతోంది. కల్తీ మామిడి పండ్లపైనా హెచ్-ఫాస్ట్ నిఘా ఉంచుతోంది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ప్రజలు రూపాన్ని చూసి మోసపోకుండా, సహజత్వాన్ని గుర్తించి పండ్లను కొనుగోలు చేయాలని కోరుతున్నాను. సహజంగా పండిన పండ్ల కంటే అసహజమైన రంగు, రసాయన వాసన, వింత రుచి కలిగిన మామిడి పండ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. పండ్లపై అసాధారణ మచ్చలున్నా లేదా బేకింగ్ సోడా నీటిలో కడిగినప్పుడు రంగు మారినా అవి ఆరోగ్యానికి హానికరమని గ్రహించాలి. కల్తీ మామిడి పండ్ల సమాచారం తెలిస్తే డయల్ 100కి గానీ, హెచ్-ఫాస్ట్ ఫోన్ నంబర్ 8712661212కు సమాచారం ఇవ్వండి’ అని పోస్టు చేశారు. -
నల్లమల అడవి : తెలంగాణలో జరిగే ఈ సాహస యాత్ర గురించి తెలుసా? (ఫొటోలు)
-
కేజీకి రూ.44 మార్జిన్ ఇస్తున్నాం
సాక్షి, హైదరాబాద్: మార్కెట్లో చికెన్ ధరలు పెరిగినా, తగ్గినా దుకాణదారులకు ఇచ్చే మార్జిన్ (లాభం)లో ఎలాంటి కోతలు విధించలేదని బ్రాయిలర్ ఇంటిగ్రేషన్ కోఆర్డినేషన్ కమిటీ (బీఐసీసీ) ప్రతినిధులు స్పష్టం చేశారు. గురువారం స్థానిక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘పౌల్ట్రీ రంగం ఇతర వ్యాపారాలకు భిన్నంగా ఉంటుంది. భారీగా పెట్టుబడులు పెట్టిన ఇంటిగ్రేటర్, రైతు నష్టపోయే ప్రమాదం ఉంది. రిటైల్ దుకాణదారు ఎప్పుడూ నష్టపోడు. తనకు కేటాయించిన కచ్చితమైన మార్జిన్ స్థిరంగా ఉంటుంది.ప్రస్తుతం రాష్ర్టంలో కిలో చికెన్కు రూ.44 మార్జిన్ అందిస్తున్నాం. పౌల్ట్రీ యాజమాన్యాలు గత ఐదేళ్ల కాలంలో మూడేళ్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. 2022–23 లో కిలోకి రూ.7.96 నష్టం వచ్చింది. మొత్తం పది కోట్ల కిలోలు విక్రయించాం. అప్పులను భరించి బ్యాంకు రుణాలతో నడిపిస్తున్నాం. 2024–25లో కిలోకు రూ.6.53 నష్టం వచ్చింది. 2023–24లో కేజీకి 64 పైసలు, 2025–26లో రూ.1.60 లాభాలు వచ్చాయి.కార్పొరేట్ సంస్థలు అన్యాయం చేస్తున్నాయంటున్న రిటైల్ వ్యాపారులు ఒక్కసారి ఆలోచించాలి. సంస్థలు ఎలా ఉన్నా హోల్సేల్, రిటైలర్కిచ్చే మార్జిన్ (ఫిక్స్డ్ ప్రాఫిట్)లో ఎలాంటి తేడాలు చూపించలేదు. లాభనష్టాలతో సంబంధం లేకుండా చూశాం’అని చెప్పారు. ఈ సమావేశంలో స్నేహా ఫామ్స్ ఎండీ రామిరెడ్డి, వీహెచ్ఎల్ జీఎం బాలసుబ్రహ్మణియన్, ఎస్ఆర్ పౌల్ట్రీ ఎండీ శ్రీనివాస్, వెన్కాబ్ ఏజీఎం రాజిరెడ్డి పాల్గొన్నారు. -
ఇసుక నుంచి తైలం తీశారు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఎండీసీ) ఇసుక విక్రయాల్లో చరిత్రాత్మక మైలురాయిని నమోదు చేసింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను సంస్థ రూ.1008 కోట్ల ఆదాయం సాధించి రికార్డు సృష్టించింది. గత ఆర్థిక సంవత్సరంతో (2024–25) పోలిస్తే ఇది 36 శాతం వృద్ధి కావడం విశేషం.ఇసుక నిర్వహణలో పారదర్శకత, కఠినమైన అమలు చర్యలు, సాంకేతిక వినియోగం వంటి చర్యలు అధిక ఆదాయానికి ప్రధాన కారణాలుగా సంస్థ వెల్లడించింది.జిల్లాల్లో ఇసుక తవ్వకాలపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ, అక్రమ రవాణా నియంత్రణకు బలమైన యంత్రాంగం ఏర్పాటు చేయడం వల్ల ఆదాయం పెరిగినట్లు టీజీఎండీసీ తెలిపింది. ఆన్లైన్ బుకింగ్ వ్యవస్థను సంవత్సరమంతా అందుబాటులో ఉంచి, వినియోగదారులకు సమాన అవకాశాలు కలి్పంచడం జరిగిందని టీజీఎండీసీ వర్గాలు వెల్లడించాయి. -
మూసీ ప్రాజెక్టుకు 'గ్రీన్' సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: మూసీ ప్రాజెక్టు కారణంగా పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని, చట్ట నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నారన్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాల్లేవని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తెలిపింది. మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు మార్గం సుగమమైంది. మూసీ సుందరీకరణపై సర్కార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కార్తీక్రెడ్డి గత నెల ఎన్జీటీలో పిటిషన్ వేశారు. దీనిపై జ్యుడీషియల్ సభ్యుడు జస్టిస్ పుష్ప సత్యనారాయణ, టెక్నికల్ సభ్యుడు డాక్టర్ ప్రశాంత్ గార్గవ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. వాదనలు ఇలా..: పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది జి.రాజగోపాలన్ వాదనలు వినిపించారు. ‘రాష్ట్ర ప్రభుత్వం సరైన పర్యావరణ అనుమతి పొందకుండానే నిర్మాణ కార్యకలాపాలు చేపడుతోంది. అందువల్ల తదుపరి అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టకుండా నిరోధించాలి. ఇప్పటికే చేపట్టిన కార్యకలాపాలపై జరిమానా విధించాలి..’అని కోరారు. అనంతరం ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ తేరా రజనీకాంత్రెడ్డి వాదనలు విన్పించారు. ‘పర్యావరణ అనుమతి కోసం ఇప్పటికే దరఖాస్తు చేశాం. సుందరీకరణకు సంబంధించి చేపట్టిన కార్యకలాపాలన్నీ చట్టపరమైన అనుమతులు, దీనికి సంబంధించిన విధివిధానాలు తెలిపే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీవోఆర్)కు అనుగుణంగానే ఉన్నాయి. కేవలం రాజకీయ దురుద్దేశాలతో ఈ పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మక ఈ ప్రాజెక్టును ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఆది నుంచీ వ్యతిరేకిస్తోంది. కల్పిత ఆధారాలు, దరఖాస్తులతో బెంచ్ను కూడా రాజకీయ వేదికగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు..’అని వాదించారు. మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ తరఫున సీనియర్ న్యాయవాది శ్రీనాథ్ శ్రీదేవన్ వాదిస్తూ.. ఈ దశలో పిటిషన్ వేయడం చెల్లదంటూ కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. అన్ని పక్షాల వాదనల అనంతరం..ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవిస్తూ ఎన్జీటీ బెంచ్ తీర్పు వెలువరించింది. పిటిషనర్ లేవనెత్తిన అంశాలకు సంబంధించిన అన్ని వివరాలు రాష్ట్ర పర్యావరణ మదింపు అథారిటీ జారీ చేసిన విధివిధానాల పత్రంలో ఇప్పటికే ఉన్నాయని పేర్కొంది. పిటిషనర్ తన వాదనలకు సంబంధించి ఎలాంటి సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలను సమర్పించలేదని, కేవలం అనుమానాలతో ప్రాజెక్టును అడ్డుకోవడం సరికాదని స్పష్టం చేసింది. ఈ దశలో దీనిపై విచారణ చేపట్టలేమంటూ పిటిషన్ను కొట్టివేసింది. -
నమ్మితే నెట్టేట మునిగినట్టే..
సాక్షి, హైదరాబాద్: ఇప్పుడు సర్వం చాట్బాట్ మయమైపోతోంది. వంట మొదలు ఆదాయపు పన్ను మదింపు వరకు... సాధారణ అనారోగ్య సమస్యలు మొదలు వివిధ స్పెషలైజ్డ్ రంగాల్లోనూ దీనిపై ఆధారపడుతున్నారు. రోజువారీ పనుల కోసం ఏఐ చాట్బాట్లను ఉపయోగిస్తున్నా... అది ఇచ్చే సమాచారం కచి్చతత్వం, డేటా గోప్యత, జవాబుదారీతనం విషయంలో ప్రమాదాలు పొంచి ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘వంటకాల విషయంలో చాట్బాట్లు భోజన ప్రణాళికలను రూపొందించగలవు, తగిన వంటకాలను సూచించగలవు. అయితే రుచిని లేదా ఆకృతిని అంచనా వేయలేదు.వంటల్లో కొలతలు తప్పుగా ఉండొచ్చు, ఆహార సంప్రదాయాలను విస్మరించవచ్చు. ఆలోచనల రూపకల్పనకు ఇది సురక్షితమే కానీ సమస్యల నివారణకు ఇచ్చే సూచనలను తరచుగా సమీక్షించాల్సి ఉంటుంది’అని నిపుణులు సూచిస్తున్నారు. పన్ను మదింపు, హెల్త్ ఇష్యూస్ వంటి వాటిలో దీనిపై అతిగా లేదా పూర్తిగా ఆధారపడటం ప్రమాదకరమని చెబుతున్నారు. ప్రతి 8 మంది టీనేజర్లు/యువకుల్లో ఒకరు సలహా కోసం వీటిని ఉపయోగిస్తున్నారు. ఓపెన్ ఏఐ, హార్వర్డ్ అధ్యయనం ప్రకారం... అన్ని రంగాల్లో చాట్బాట్లపై ఆధారపడటం పెరిగింది.ఆరోగ్య విషయంలో... చాట్బాట్లు తప్పుడు లేదా హానికరమైన వైద్య సలహాలను ఇవ్వగలవని వివిధ అధ్యయనాలు వెల్లడించాయి. కొన్నిసార్లు ఆత్మహత్య ఆలోచనల వంటి సంక్షోభాలకు సరైన ప్రతిస్పందనలను అందించడంలో విఫలమౌతాయని చెప్పాయి. ⇒ వైద్య సంబంధిత ప్రశ్నలకు అనేక చాట్బాట్ ప్రతిస్పందనల్లో తప్పుడు సమాచారం ఉంటోంది. ⇒ ఆరోగ్య సలహాల కోసం ఏఐని ఉపయోగించడం ప్రమాదకరం. ⇒ తీవ్రమైన అనారోగ్య సమస్యలకు వైద్య సహాయం పొందడంలో ఆలస్యం జరగవచ్చు. ⇒ వైద్యుల మాదిరిగా ఏఐ శారీరక పరీక్షలు చేయలేదు. అలాగే వినియోగదారుడి పూర్తి వైద్య చరిత్రను అర్థం చేసుకోలేదు. సందర్భం తెలియకపోవడం వల్ల తప్పుడు రోగ నిర్ధారణలు జరుగుతాయి. ⇒ మానసిక ఆరోగ్యం కోసం చాట్బాట్లపై ఆధారపడితే వృత్తిపరమైన సంరక్షణ విషయంలో చిక్కులు ఎదుర్కునే ప్రమాదముంది. ⇒ హానికరమైన సలహాలను ఇచి్చన తర్వాత, యూఎస్ నేషనల్ ఈటింగ్ డిజార్డర్స్ అసోసియేషన్ (నెడా) తమ చాట్బాట్ ’టెస్సా’ను తొలగించింది. పన్ను మదింపు విషయంలో.. ⇒ ఏఐ పాత పన్ను చట్టాలనుఉపయోగించవచ్చు. వ్యూహాత్మక ప్రణాళికను అందించలేకపోవచ్చు. కచ్చితత్వ సమస్యలెదురుకావొచ్చు. ⇒ పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నులకు బాధ్యత వహించాలి. ఏఐ ప్లాట్ఫారమ్లు తరచుగా తమ సమాధానాలు అధికారిక సలహా కాదని పేర్కొంటాయి. ⇒ డేటా గోప్యతకు భంగం వాటిల్లుతుంది. వివిధ అధ్యయనాల్లో సిఫార్సులు ⇒ అత్యంత కీలకమైన సమాచారం కోసం ఎల్లప్పుడూ మానవ నిపుణులను సంప్రదించాలి. ⇒ వ్యక్తిగతంగా గుర్తించదగిన సమాచారాన్ని చాట్బాట్లతో పంచుకోవద్దు. వ్యక్తిగత డేటాను సంరక్షించుకోవాలి. ⇒ సాధారణ మేధోమథనం కోసం ఏఐని ఉపయోగించుకోవచ్చు. ఏదైనా అంశానికి సంబంధించి ప్రాథమిక, ప్రారంభ సమాచారంగా మాత్రమే ఉపయోగించుకోవచ్చు. -
ఏ పేదోడూ ఆఫీసుల చుట్టూ తిరగొద్దు
ఆమనగల్లు: భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసమే సమీకృత భూభారతి పోర్టల్ను తీసుకొచ్చామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని విఠాయిపల్లి గ్రామంలో గురువారం సమీకృత భూభారతి పోర్టల్ను కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ లోకేశ్కుమార్తో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. గత పదేళ్లలో బీఆర్ఎస్ నేతలు అభివృద్ధి పేరుతో ప్రజల ఆస్తులను దోచుకున్నారని, వారు టెర్రరిస్టుల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.వారి భూ బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా ఐదు మండలాలలో సమీకృత భూభారతి పోర్టల్ను గురువారం నుంచి అమలు చేస్తున్నామని, 45 రోజుల పాటు పరిశీలించిన తర్వాత అవసరమైన మార్పులు, చేర్పులతో జిల్లాకు ఒక మండలంలో పోర్టల్ను అమలు చేస్తామని ఆయన వివరించారు. రాష్ట్రంలో ఏ పేదోడు ఏ ఆఫీసు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, ఏ అధికారి దగ్గరకు వెళ్లి ప్రాధేయపడాల్సిన అవసరం ఉండకూడదని తెలిపారు. స్మార్ట్ఫోన్తో పోర్టల్లో లాగిన్ అయితే అన్ని సేవలు పొందొచ్చని వివరించారు.రాష్ట్రంలో ఉన్న సాదా బైనామాలకు త్వరలో శాశ్వత పరిష్కారం చూపుతామని చెప్పారు. రాష్ట్రంలో సర్వేయర్ల కొరత లేకుండా 5,300 మందికి రెండు విడతల్లో ఆరు నెలల పాటు శిక్షణ ఇచ్చి మండలానికి 4 నుంచి ఆరుగురు లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించామని తెలిపారు. భూముల సర్వే విషయంలో పాత పద్ధతులకు స్వస్తి పలికి రోవర్లతో కచ్చితమైన సర్వే చేయిస్తున్నామని, ఇప్పటికే 411 రోవర్లు ఉన్నాయని మరో 400 రోవర్లు రాబోతున్నాయని వివరించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, మున్సిపల్ చైర్మన్ పత్యానాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ యాట గీత, డీఏఓ ఉషారాణి, డీఈఓ సుశీందర్రావు, డీఎంహెచ్ఓ డా.లలితాదేవి, ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి, తహసీల్దార్ ఫయీం ఖాద్రి, మున్సిపల్ కమిషనర్ శంకర్నాయక్, టీపీసీసీ నేతలు బాలాజీసింగ్, అయిల శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు. -
గ్రూప్–1 నియామకాలకు సుప్రీం గ్రీన్సిగ్నల్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) చేపట్టిన 563 గ్రూప్–1 పోస్టుల నియామకాలకు ఉన్న న్యాయపరమైన అడ్డంకులు ఎట్టకేలకు తొలగిపోయాయి. ఈ నియామక ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. గ్రూప్–1 నియామకాలకు ఆమోదం తెలుపుతూ గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు గురువారం తుది తీర్పును వెలువరించింది.గ్రూప్–1 మెయిన్స్ సమాధాన పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ పి. ఆదిత్య తదితరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై ఇరుపక్షాల వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం.. నియామక ప్రక్రియలో కమిషన్ అనుసరించిన విధానాలను తప్పుబట్టలేమని స్పష్టం చేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే నియామకాలను సమరి్థంచిందని.. ఆ తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తేల్చిచెబుతూ పిటిషన్లను కొట్టేసింది. పారదర్శకంగా ’ట్రిపుల్ ఎవాల్యుయేషన్’ విచారణ సందర్భంగా టీజీపీఎస్సీ తరపున సీనియర్ న్యాయవాది ఎస్. నిరంజన్రెడ్డి బలమైన వాదనలు వినిపించారు. నియామక ప్రక్రియలో కమిషన్ అత్యంత పారదర్శకత పాటించిందని కోర్టుకు వివరించారు. మెయిన్స్ మూల్యాంకనంలో అత్యంత శాస్త్రీయమైన ‘ట్రిపుల్ ఎవాల్యుయేషన్’(మూడంచెల మూల్యాంకనం) విధానాన్ని అనుసరించినట్లు తెలిపారు.మూల్యాంకనకర్తలు మా ర్కులు వేసేటప్పుడు ఉండే వ్యత్యాసాలను (కొందరు కఠినంగా, మరికొందరు ఉదారంగా వేయడం) తగ్గించి, అభ్యర్థులకు న్యా యం చేసేందుకే ఈ పద్ధతిని అమలు చేశామన్నారు. మొదటి రెండు విడతల్లో బార్కోడ్విధానం పాటించామని.. మూడో విడ తలో మూల్యాంకనకర్తకు అభ్యర్థి వివరాలు తెలియకుండా ఉండేందుకు, గోప్యతను కాపాడేందుకు మాత్రమే బార్కోడ్ వినియోగించలేదని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు వెబ్నోట్ల ద్వారా అభ్యర్థులకు సమాచారం అందించామని పేర్కొన్నారు. నిలబడని పిటిషనర్ల వాదనలు మూడో విడత మూల్యాంకనంలో బార్కోడింగ్ లేకపోవడం వల్లే అక్రమాలకు ఆస్కా రం ఏర్పడిందని.. సుమారు 924 మంది అభ్యర్థుల ఎంపికలో వ్యత్యాసాలు ఉన్నాయ ని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు. జవాబుల ‘కీ’లోనూ లోపాలు ఉన్నా యని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. వాదనల సందర్భంగా మూల్యాంకన విధానం, బార్కోడింగ్ మినహాయింపు తదితర సాంకేతిక అంశాలపై కమిషన్ను ప్రశ్నించిన ధర్మాసనం.. టీజీపీఎస్సీ దాఖలు చేసిన అఫిడవిట్లను, ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించింది. కమిషన్ వాదనలతో ఏకీభవించిన న్యాయ స్థానం.. ఎంపిక ప్రక్రియలో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని నిర్ధారించుకున్న అనంతరం పిటిషన్లను కొట్టేస్తూ తీర్పునిచ్చింది. -
గ్రామ సభలు షురూ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ’లో భాగంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు విజయవంతంగా నిర్వహించారు. 12,700 గ్రామ పంచాయతీలు, 110 మున్సిపాలిటీల్లో ఈ సభలు జరిగాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామసభలో సీఎస్ కె.రామకృష్ణారావు పాల్గొన్నారు.పలుచోట్ల జరిగిన గ్రామసభల్లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, డోర్నకల్లో ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్ పాల్గొన్నారు. సీఎం ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టరు ఈ సభల్లో భాగస్వాములయ్యారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకా లపై ప్రజలకు అవగాహన కలి్పంచారు. -
నమ్మితే 'నెట్టేట' మునిగినట్టే..
సాక్షి, హైదరాబాద్ : ఇప్పుడు సర్వం చాట్బాట్ మయమైపోతోంది. వంట మొదలు ఆదాయపు పన్ను మదింపు వరకు... సాధారణ అనారోగ్య సమస్యలు మొదలు వివిధ స్పెషలైజ్డ్ రంగాల్లోనూ దీనిపై ఆధారపడుతున్నారు. రోజువారీ పనుల కోసం ఏఐ చాట్బాట్లను ఉపయోగిస్తున్నా... అది ఇచ్చే సమాచారం కచ్చితత్వం, డేటా గోప్యత, జవాబుదారీతనం విషయంలో ప్రమాదాలు పొంచి ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘వంటకాల విషయంలో చాట్బాట్లు భోజన ప్రణాళికలను రూపొందించగలవు, తగిన వంటకాలను సూచించగలవు. అయితే రుచిని లేదా ఆకృతిని అంచనా వేయలేదు. వంటల్లో కొలతలు తప్పుగా ఉండొచ్చు, ఆహార సంప్రదాయాలను విస్మరించవచ్చు. ఆలోచనల రూపకల్పనకు ఇది సురక్షితమే కానీ సమస్యల నివారణకు ఇచ్చే సూచనలను తరచుగా సమీక్షించాల్సి ఉంటుంది’అని నిపుణులు సూచిస్తున్నారు. పన్ను మదింపు, హెల్త్ ఇష్యూస్ వంటి వాటిలో దీనిపై అతిగా లేదా పూర్తిగా ఆధారపడటం ప్రమాదకరమని చెబుతున్నారు. ప్రతి 8 మంది టీనేజర్లు/యువకుల్లో ఒకరు సలహా కోసం వీటిని ఉపయోగిస్తున్నారు. ఓపెన్ ఏఐ, హార్వర్డ్ అధ్యయనం ప్రకారం... అన్ని రంగాల్లో చాట్బాట్లపై ఆధారపడటం పెరిగింది.ఆరోగ్య విషయంలో... చాట్బాట్లు తప్పుడు లేదా హానికరమైన వైద్య సలహాలనుఇవ్వగలవని వివిధ అధ్యయనాలు వెల్లడించాయి. కొన్నిసార్లుఆత్మహత్య ఆలోచనల వంటి సంక్షోభాలకు సరైన ప్రతిస్పందనలను అందించడంలో విఫలమౌతాయని చెప్పాయి. » వైద్య సంబంధిత ప్రశ్నలకు అనేక చాట్బాట్ ప్రతిస్పందనల్లో తప్పుడు సమాచారం ఉంటోంది. » ఆరోగ్య సలహాల కోసం ఏఐని ఉపయోగించడం ప్రమాదకరం. » తీవ్రమైన అనారోగ్య సమస్యలకు వైద్య సహాయంపొందడంలో ఆలస్యం జరగవచ్చు. » వైద్యుల మాదిరిగా ఏఐ శారీరక పరీక్షలు చేయలేదు. అలాగే వినియోగదారుడి పూర్తి వైద్య చరిత్రను అర్థం చేసుకోలేదు.సందర్భం తెలియకపోవడం వల్ల తప్పుడు రోగ నిర్ధారణల జరుగుతాయి. » మానసిక ఆరోగ్యం కోసం చాట్బాట్లపై ఆధారపడితే వృత్తిపరమైన సంరక్షణ విషయంలో చిక్కులు ఎదుర్కునే ప్రమాదముంది. » హానికరమైన సలహాలను ఇచ్చిన తర్వాత, యూఎస్ నేషనల్ ఈటింగ్ డిజార్డర్స్ అసోసియేషన్ (నెడా) తమ చాట్బాట్ ’టెస్సా’ను తొలగించింది. పన్ను మదింపు విషయంలో.. » ఏఐ పాత పన్ను చట్టాలనుఉపయోగించవచ్చు. వ్యూహాత్మక ప్రణాళికను అందించలేకపోవచ్చు. కచ్చితత్వ సమస్యలెదురుకావొచ్చు. » పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నులకు బాధ్యత వహించాలి. ఏఐ ప్లాట్ఫారమ్లు తరచుగా తమ సమాధానాలు అధికారిక సలహా కాదని పేర్కొంటాయి. » డేటా గోప్యతకు భంగం వాటిల్లుతుంది. వివిధ అధ్యయనాల్లో సిఫార్సులు » అత్యంత కీలకమైన సమాచారం కోసం ఎల్లప్పుడూ మానవ నిపుణులను సంప్రదించాలి. » వ్యక్తిగతంగా గుర్తించదగిన సమాచారాన్ని చాట్బాట్లతో పంచుకోవద్దు. వ్యక్తిగత డేటాను సంరక్షించుకోవాలి. » సాధారణ మేధోమథనం కోసం ఏఐని ఉపయోగించుకోవచ్చు. ఏదైనా అంశానికి సంబంధించి ప్రాథమిక, ప్రారంభ సమాచారంగా మాత్రమే ఉపయోగించుకోవచ్చు. -
గత పాలకుల తప్పిదాలను సరిచేస్తాం.. ఆర్థిక సవాళ్లను అధిగమిస్తాం: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ’లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పలు పంచాయతీలు, మున్సిపాలిటీల్లో అధికారులు గురువారం గ్రామసభలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన సందేశాన్ని అన్ని సభల్లోనూ అధికారులు చదివి వినిపించారు. ⇒ ‘ప్రజాప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి రెండు సంవత్సరాల మూడునెలలు పూర్తయ్యింది. ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ, గత పాలకుల తప్పిదాలను సరిచేస్తూ... సంక్షేమం, అభివృద్ధి విషయంలో రాజీపడకుండా మన ప్రభుత్వం పనిచేస్తోంది. మేం పాలకులం కాదు..సేవకులం అన్న భావనతో ప్రజల ఆకాంక్షలు, అవసరాలే కేంద్ర బిందువుగా నిత్యం శ్రమిస్తున్నాం. ప్రతి నిర్ణయంలో ప్రజల మేలు, సామాజిక బాధ్యత, రాష్ట్ర భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుంటున్నాం. ⇒ ఉప ఎన్నికలు, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వరుస విజయాలతో ప్రజాపాలనకు మీ ఆమోదం, మద్దతు ప్రకటించారు. మీరు ఇచ్చిన ఈ ఫలితాలు మా బాధ్యతను మరింత పెంచాయి. ⇒ ప్రభుత్వ పథకాలు అంటే కాగితాలపై కాదు.. ప్రజల జీవితాల్లో స్పష్టమైన మా ర్పు తేవాలన్నది మా సంకల్పం. ఆ ఉద్దేశంతోనే ‘ప్రజాపాలన– ప్రగతిప్రణాళిక’ పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించాం. మార్చి 6 నుంచి 99 రోజులపాటు, గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు, అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలా సాగాలి. ఊరూవాడ స మస్యల పరిష్కారమే పరమావధిగా ప్రతి అధికారి పనిచేయాలి. వేగంగా ఫైళ్ల క్లియ రెన్స్, ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత, నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలి. ⇒ మహాలక్ష్మి ఉచిత బస్సు సౌకర్యం, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, రేష న్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇ ళ్లు, మహిళా సాధికారత వంటి పథకాలు అర్హులకు చేరేలా ఈ కార్యక్రమం జరగాలి. ⇒ ‘తెలంగాణ రైజింగ్–2047’విజన్తో ఆర్థికంగానే కాక, అన్నిరంగాల్లో తెలంగాణను ప్రపంచంలో నంబర్వన్గా నిలపాలన్నది మన సంకల్పం. ఈ సంకల్పంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి. క్యూర్, ప్యూర్, రేర్గా రాష్ట్రాన్ని వర్గీకరించుకున్నాం. వాటి పరిధిలో సేవా, తయారీ, వ్యవసాయ రంగాల్లో ప్రపంచానికి ఆదర్శంగా మనం ఎదగాలి. ⇒ ఈ 99 రోజుల కార్యాచరణ ఒక సాధా రణ కార్యక్రమం కాదు..ఒక దీక్ష. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఒక్కటై... దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలి. ఇదే నా కల. ఆ కలను సాకారం చేయడంలో ప్రతి తెలంగాణ బిడ్డ భాగస్వామి కావాలి’అని సీఎం సందేశం ఇచ్చారు. -
మళ్లీ టెక్ లేఆఫ్ కలకలం...
సాక్షి, హైదరాబాద్: మళ్లీ టెక్ లేఆఫ్లు ఊపందుకోవడంతో ఐటీ, ఇతర రంగాల ఉద్యోగుల్లో దడ మొదలైంది. 2026 తొలి మూడు నెలల్లోనే ప్రధాన టెక్, ఇతర కంపెనీల్లో దాదాపు లక్ష లేఆఫ్లు చోటుచేసుకున్నాయి. ఇందుకు ఒరాకిల్, అమెజాన్, డెల్ వంటి దిగ్గజ కంపెనీలు కూడా మినహాయింపుగా లేవు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్, లాజిస్టిక్స్, కార్పొరేట్ రంగాల్లో ఉద్యోగుల్లో భారీ కోతను సూచిస్తోంది. జనవరి 2026 నాటి డేటా ప్రకారం... 2009 తర్వాత ఒక ఏడాది ప్రారంభంలో నమోదైన అత్యధిక ఉద్యోగ కోతలు ఇవే కావడం గమనార్హం. 1.08 లక్షలకు పైగా ఉద్యోగ కోతలకు జరిగిన ప్రణాళికలు 2025 చివర్లో తగ్గుముఖం పట్టినా.. 2026 తొలి మూడు నెలల్లో అనూహ్య మార్పు వచ్చింది. ఇందుకు ప్రధానంగా... ఏఐ, మౌలిక సదుపాయాల పెట్టుబడులు, పునరి్నర్మాణం, కోవిడ్లో అవసరానికి మించి తీసుకున్న వర్క్ఫోర్స్ వంటి వాటికి ముగింపు పలకడం వంటి వ్యూహాత్మక మార్పులే కారణంగా నిపుణులు చెబుతున్నారు. తొలగింపులు – ప్రణాళికలు ఇలా... ఒరాకిల్: ప్రపంచవ్యాప్తంగా సుమారు 30వేల ఉద్యోగులను (మొత్తం ఉద్యోగుల్లో 18%) తొలగిస్తోంది. ఒక్క భారత్లోనే 12వేల మందిపై ప్రభావం. అమెజాన్: ఏఐ పెట్టుబడులు పెంచుతున్నందున, జనవరిలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 16 వేల కార్పొరేట్ ఉద్యోగులను తగ్గించింది. యూపీఎస్: తన భవిష్యత్ నెట్వర్క్ను ఆటోమేట్ చేస్తున్నందున, 2025లో కొన్నివేల ఉద్యోగాల తొలగింపు. 2026లో 30వేల వరకు ఉద్యోగాల తొలగింపునకు ప్రణాళిక. నోకియా: ప్రపంచవ్యాప్తంగా 14 వేల ఉద్యోగాలను ప్రభావితం చేసే ప్రణాళికలను ప్రకటించింది. డెల్: సుమారు 11 వేల ఉద్యోగులను తగ్గించింది. ఎపిక్ గేమ్స్: వెయ్యికి పైగా ఉద్యోగుల తొలగింపు » మెటా (700+), ఇంటెల్ (15,000), మైక్రోసాఫ్ట్ (15,000), స్పాటిఫై (పాడ్కాస్టింగ్) వంటి టెక్ కంపెనీల్లో గణనీయమైన కోతలు జరుగుతున్నాయి. లేఆఫ్స్ పెరుగుదలకు కారణాలివీ... » కంపెనీలు తమ సిబ్బందిపై వెచ్చించే బిలియన్ల డాలర్లను ఏఐ డేటా సెంటర్లు, చిప్లు, శిక్షణ వైపు మళ్లిస్తున్నాయి. » 2020–22 మధ్య టెకీలను పెద్దసంఖ్యలో తీసుకున్న కంపెనీలు, ఇప్పుడు ఉత్పాదకతపై దృష్టి సారిస్తూ కోతలు విధిస్తున్నాయి. » అనేక కంపెనీలు నిర్వహణ శ్రేణులను తగ్గించడం, పునరావృతమయ్యే పనులను ఆటోమేషన్ చేయడంపై దృష్టి సారిస్తున్నాయి. » పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, అధిక వడ్డీలు, తగ్గిన వినియోగదారుల విశ్వాసం. జాబ్ మార్కెట్పై ప్రభావం 2026 జనవరిలో నియామకాలు 17 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోవడంతో, ఉద్యోగాలు కోల్పోయిన వారు కొత్త ఉద్యోగాలు వెతుక్కోవడం మరింత సమస్యగా మారింది. తిరిగి ఉద్యోగంలో చేరినప్పుడు తరచుగా తక్కువ జీతం, తక్కువ స్థాయి హోదాలు లేదా భద్రత లేని, ఒప్పంద ఆధారిత పని లభిస్తోంది. ఇతర నిర్మాణాత్మక సమస్యలను దాచిపెట్టడానికి లేదా ఖర్చులను తగ్గించడం ద్వారా స్టాక్ ధరలను పెంచుకోవడానికి కంపెనీలు ఏఐని సాకుగా ఉపయోగిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. యుద్ధమూ ఒక కారణమే.. రాబోయే మూడేళ్లలో బాగా పెరగబోయే ఏఐ అడాప్షన్లో భాగంగా కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అమెరికా–ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధ పరిణామాల నేపథ్యంలోనూ మార్పులు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో ఏఐ అన్వయింపు మరింతగా పెరుగుతోంది. పెద్ద కంపెనీలు కాస్ట్ ఆప్టిమైజేషన్ చేసుకోలేకపోతే ఇండస్ట్రీలో మనుగడ సాధించే అవకాశాలు లేవు. కాస్ట్ కంట్రోల్ మినహా మరో గత్యంతరం లేదు. ఇందులో ఉద్యోగుల జీతాలు తగ్గించడమే ప్రధానం. క్లౌడ్, జెన్ ఏఐ టూల్స్ వినియోగం వల్ల కూడా పరిస్థితులు మారుతున్నాయి. అయితే ఏఐ, ఇతర అత్యాధునిక నైపుణ్యాలను పెంచుకుంటే ఇప్పుడు ఉద్యోగాలు కోల్పోతున్న వారికి కూడా తప్పకుండా అవకాశాలు పెరుగుతాయి. –వెంకా రెడ్డి, చీఫ్ పీపుల్ ఆఫీసర్, క్వాలీజీల్ -
పెళ్లికి పెద్దలు నిరాకరించారని..
చేర్యాల(సిద్దిపేట): పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. అది తట్టుకోలేక ప్రియురాలు బలవన్మరణానికి పాల్పడింది. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. ముస్త్యాల గ్రామానికి చెందిన తరిగొప్పుల హారిక (24), అదే గ్రామానికి చెందిన అనుముల రాకేశ్ (27) ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో గత నెల 28న రాకేశ్గడ్డి మందు తాగాడు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ప్రేమికుడు మృతి చెందినప్పటి నుంచి మనోవేదనకు గురైన హారికను కుటుంబ సభ్యులు జనగామ జిల్లా నర్మెట మండల కేంద్రంలోని అమ్మమ్మ ఇంట్లో ఉంచారు. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుంది. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే ప్రేమజంట ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. -
నిధులిచ్చినా.. పారడం లేదు!
సాక్షి, హైదరాబాద్: దీర్ఘకాలంగా మరమ్మతులకు నోచుకోక నిర్లక్ష్యానికి గురైన రాష్ట్రంలోని కీలకమైన జలాశయాల పునరుద్ధరణకు కేంద్రం నిధులు కేటాయించినా.. రాష్ట్ర ప్రభుత్వం వాడుకోవడంలో ఉదాసీనత చూపుతోంది. ప్రపంచ బ్యాంకు, ఏసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్(ఏఐఐబీ)ల ఆర్థిక సహాయంతో అమలు చేస్తున్న డ్యామ్ రిహాబిలిటేషన్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టు (డ్రిప్) రెండో దశ కింద రూ.100 కోట్లను రాష్ట్రానికి కేటాయించిన కేంద్రం, మూడో దశ కింద రూ.445 కోట్లను సూత్రప్రాయంగా కేటాయించింది. రాష్ట్రంలోని 29 ప్రాజెక్టులను డ్రిప్ పథకం కింద చేర్చి రూ.545 కోట్లతో మరమ్మతులు నిర్వహించడానికి 2024లో రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇప్పటివరకు రెండో దశ కింద 9 ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలను మాత్రమే కేంద్రానికి పంపించగా, కేంద్రం నుంచి రూ.5.72 కోట్లు విలువైన పనులకే ఆమోదం లభించింది. ఇప్పటివరకు ఒక్క పనికీ టెండర్లు నిర్వహించి కాంట్రాక్టర్కు అప్పగించలేదు. ఒక్క రూపాయీ ఖర్చు చేయలేదు. కేంద్ర జలశక్తి శాఖ ఉన్నతాధికారులు ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన ఓ సమావేశంలో దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. డ్రిప్ ప్రాజెక్టును రాష్ట్రంలో అమలు చేసేందుకు నీటిపారుదల శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయకపోవడంతో ఇన్చార్జీ/అదనపు చార్జీ బాధ్యతల్లో పనిచేస్తున్న అధికారులు ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని కేంద్ర జలశక్తి శాఖ తప్పుబట్టింది. రాష్ట్రం నుంచి 29 డ్యామ్లు2025లో వర్షాకాలం ముగిసిన తర్వాత రాష్ట్రంలోని జలాశయాలకు తనిఖీలు నిర్వహించగా, 21 జలాశయాల్లో తీవ్ర లోపాలు బయటపడ్డాయి. ఆనకట్టల భద్రత చట్టం, 2021 ప్రకారం ఈ జలాశయాలను కేటగిరీ–2 జాబితాలో చేర్చి అత్యవసర మరమ్మతులు నిర్వహించాల్సి ఉంది. ఈ జలాశయాలకు డ్రిప్ కింద మరమ్మతులు నిర్వహించవచ్చని తాజాగా కేంద్ర జలశక్తి శాఖ రాష్ట్రానికి సూచన చేయడం గమనార్హం. డ్రిప్ ప్రాజెక్టు రెండు, మూడో దశల కింద దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల పరిధిలోని 736 డ్యామ్లను రూ.10,211 కోట్లతో పునరుద్ధరించడానికి కేంద్రం ఆమోదించింది. వీటిలో రాష్ట్రంలోని 29 డ్యామ్లు ఉన్నాయి. ఈ జాబితాలో రాష్ట్రం నుంచి నాగార్జునసాగర్, ఎల్లంపల్లి, నిజాంసాగర్, ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్, జూరాల, పాకాల లేక్, లక్నవరం, రామప్పలేక్, పాలేరు, డిండి, కోయిల్సాగర్, కడెం, మూసీ, శ్రీరామ్సాగర్, వట్టివాగు, స్వర్ణ, ఎల్ఎండీ, మల్లూరువాగు, బొగ్గులవాగు, ఎన్టీఆర్ సాగర్, కౌలాస్నాలా, సాత్నాలా, సింగూరు, గడ్డెన్నవాగు, అక్కంపల్లి రిజర్వా యర్ పెద్దదేవలపల్లి, పీపీఆర్ ప్రాజెక్టులున్నాయి. జూరాల ప్రాజెక్టును రూ.143.44 కోట్లు, నాగార్జునసాగర్ను రూ.29.56 కోట్లు, శ్రీరామ్సాగర్ను రూ.63.48 కోట్లతో మరమ్మతులు చేసేందుకు ప్రతిపాదించారు. వ్యయంలో 70శాతం రుణాన్ని కేంద్రం ఇప్పించనుండగా, 30 శాతం రాష్ట్ర వాటాగా భరించాల్సి ఉండనుంది. 2031 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని గడువు విధించింది. పొరుగు రాష్ట్రాలు భేష్డ్రిప్ పథకాన్ని కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలు బాగా సద్వినియోగం చేసుకున్నాయి. కర్ణాటకకు డ్రిప్ రెండో దశ కింద రూ.699 కోట్లు, మూడో దశ కింద రూ.400 కోట్లను కేటాయించగా, ఆ ప్రభుత్వం 13 ప్రాజెక్టులను ప్రతిపాదించింది. అందులో రూ.600 కోట్లతో 11 ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలపగా, రూ.372 కోట్లు విలువైన పనులను కర్ణాటక ఇప్పటికే కాంట్రాక్టర్లకు అప్పగించింది. ఒడిశా సైతం రూ.40.59 కోట్లు విలువైన పనులు పూర్తి చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఒక్క రూపాయీ ఖర్చుచేయలేదు. -
పనుల నాణ్యతలో రాజీ పడొద్దు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఫ్యూచర్ సిటీ పనుల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని సీఎం రేవంత్రెడ్డి అధికారులకు సూచించారు. కేరళ పర్యటన ముగించుకుని గురువారం మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న సీఎం నేరుగా ఫ్యూచర్ సిటీకి చేరుకున్నారు. తొలుత ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్సీడీఏ) భవనాన్ని, ఆ తర్వాత స్కిల్స్ యూని వర్సిటీ భవనాన్ని సందర్శించి నిర్మాణ పనులను పరిశీలించారు. మే నాటికి ఎఫ్సీడీఏ పనులు, జూన్ చివరి నాటికి స్కిల్స్ యూనివర్సిటీ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.అక్కడి నుంచి పవర్గ్రిడ్ సెంటర్కు చేరుకున్నారు. కొంగరకలాన్ నుంచి మీర్ఖాన్పేట్, అక్కడి నుంచి ఆకుతోటపల్లి వరకు ఏర్పాటు చేస్తున్న 330 అడుగుల విస్తీర్ణంలోని గ్రీన్ఫీల్డ్ రోడ్డు పనులు సహా రేడియల్ రోడ్డు పనుల్లో వేగం పెంచాలని సూచించారు. ఫ్యూచర్ సిటీలోని ఓవర్ హెడ్ విద్యుత్ లైన్లను తొలగించి ఖర్చుకు వెనుకాడకుండా భూగర్భ విద్యుత్ కేబుళ్లను వేయాలని ఆదేశించారు. భారత్ ఫ్యూచర్ సిటీ భవిష్యత్తు పెట్టుబడులకు స్వర్గధామమని, ఇక్కడ అనేక జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు రాబోతున్నాయని, త ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని సీఎం ఈ సందర్భంగా చెప్పారు. అధికారుల ఉరుకులు, పరుగులు మధ్యాహ్నం 3.55కు ఇక్కడికి చేరుకున్న సీఎం..సాయంత్రం 5.10 గంటల సమయంలో తిరుగు ముఖం పట్టారు. సీఎం పర్యటన ఆఖరి నిమిషంలో ఖరారు కావడంతో అధికారులు ఉరుకులు, పరుగులు పెట్టారు. సీఎం వస్తున్న సమాచారం అధికార పార్టీ నేతలకు కూడా లేకపోవడం విశేషం. సీఎం వెంట సీఎస్ రామకృష్ణారావు, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, ట్రాన్స్కో సీఎండీ కృష్ణభాస్కర్, ఎఫ్సీడీఏ కమిషనర్ శశాంక, జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఉన్నారు. సీఎం రాకకు ముందే పవర్ గ్రిడ్ కేంద్రానికి చేరుకున్న సీఎస్.. విద్యుత్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. -
‘జూబ్లీహిల్స్’ ఎన్నికలపై హైకోర్టు స్టే
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఎన్నికలపై స్టే విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఓటర్ల జాబితాలో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో మార్చిలో ఇచ్చిన ఎన్నికల నోటిఫికేషన్ను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ, తదుపరి విచారణ ఈనెల 30కి వాయిదా వేసింది. ఆలోగా కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించారు. సొసైటీ నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసిన ఎన్నికల నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ సభ్యుడు సునీల్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ నందా సూరేపల్లి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ‘2024లో 270 మందికి సభ్యత్వం ఇవ్వడంపై ఈ కోర్టు గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. పాత వారిని తొలగించడంపై సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసినా సహకార శాఖ రిజి్రస్టార్ పట్టించుకోలేదు. దీంతో హైకోర్టులో పిటిషన్ వేయాల్సి వచ్చింది’అని చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రక్రియలో కోర్టులో జోక్యం చేసుకోలేవని సహకార శాఖ తరఫు న్యాయవాది హేమేంద్రనాథ్రెడ్డి వాదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఓటర్ల జాబితాపై పలు పిటిషన్లు, ధిక్కరణ పిటిషన్లపై ఇదే కోర్టు విచారణ చేపడుతున్నందున జోక్యం చేసుకోవచ్చన్నారు. పలు సుప్రీంకోర్టు తీర్పులను ప్రస్తావిస్తూ ఎన్నికల నోటిఫికేషన్ను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. -
దక్షిణ మధ్య రైల్వేకు రికార్డు స్థాయిలో ఆదాయం
సాక్షి, హైదరాబాద్: గత ఆర్థిక సంవత్సరంలో దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో రూ. 21,211.92 కోట్ల స్థూల ఆదాయాన్ని నమోదు చేసింది. జోన్ ప్రారంభమైనప్పటి నుంచి ఆర్జించిన అత్యధిక ఆదాయం ఇదే. అంతకుముందు 2024–25లో నమోదైన రూ.20,569.35 కోట్ల మునుపటి అత్యుత్తమ స్థాయితో పోలిస్తే ఇది 3 శాతం అధికం కావటం విశేషం. ఇందులో సరుకు రవాణా రూపంలో రూ.13,575 కోట్లు రాగా, ప్రయాణికుల టికెట్ల రూపంలో రూ.6,235 కోట్లు వచ్చింది. పెనాల్టీలు, తుక్కు అమ్మకాలు లాంటి ఇతర రూపాల్లో మిగతాది వసూలైంది. ఈ వివరాలను గురువారం రైల్ నిలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే...గత ఆర్థిక సంవత్సరంలో 147.871 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేసింది. 28.64 కోట్ల మంది ప్రయాణికుల తరలింపు ద్వారా రూ.6,235.37 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఈ మొత్తం 2024–25 సంవత్సరంలో రూ.5,714.83 కోట్లుగా ఉంది. 2024–25 సంవత్సరంలో 3,495 రైళ్లతో పోలిస్తే, ఈ సంవత్సరంలో 3,791 ప్రత్యేక రైళ్లను నడిపారు. టికెట్ల తనిఖీ ద్వారా రూ.232.6 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇది రూ.184.24 కోట్లు కాగా, 2023–24లో మునుపటి అత్యుత్తమ స్థాయి రూ.220.85 కోట్లుగా నమోదైంది. జోన్పరిధిలో 194.57 కిలోమీటర్ల ట్రాక్ అదనంగా నిర్మితమైంది. ఏడాది కాలంలో 325 కిలోమీటర్ల ట్రాక్ విద్యుదీకరణను పూర్తి చేసింది. అమృత్భారత్ స్టేషన్ల పథకం కింద దక్షిణ మధ్య రైల్వే రూ. 6వేల కోట్లకు పైగా వ్యయంతో 119 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి పనులను చేపడుతోంది. ఇందులో రూ.2,900 కోట్ల వ్యయంతో 11 ప్రధాన స్టేషన్ భవనాలను అభివృద్ధి చేస్తున్నారు. ఈ మొత్తంలో తెలంగాణ పరిధిలో 40 స్టేషన్లు ఉన్నాయి. వరంగల్, బేగంపేట, కరీంనగర్ స్టేషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మరో ఐదు స్టేషన్లు త్వరలో ప్రారంభం కానున్నాయి. జోన్ పరిధిలో 479 రూట్ కిలోమీటర్ల మేర ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థ ప్రారంభమైంది. 486 రూట్ కిలోమీటర్ల మేర కవచ్ వ్యవస్థ ఏర్పాటైంది. ఆర్ఓబీ/ ఆర్యూబీల నిర్మాణం ద్వారా 65 చోట్ల మ్యాన్డ్ లెవల్ క్రాసింగ్స్ను తొలగించారు. కొత్తగా 72 ఆర్యూబీలు, 27 ఆర్ఓబీలను నిర్మించారు. గత ఏడాది కాలంలో కొత్తగా 40 లిఫ్టులు, 25 ఎస్కలేటర్లు, 10.74 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. -
ఎండ కన్నా డేంజర్.. తేమ తాపం
దేశంలో మనకు తెలియకుండానే మన మనుగడకు ప్రమాదకరమైన స్థాయికి దగ్గరగా ఉన్న అధిక ఉష్ణోగ్రతలను ఇప్పటికే అనుభవిస్తున్నామా? హీట్ వేవ్ (వడగాడ్పుల) ముప్పును లెక్కగట్టేటప్పుడు ఒక్క ఉష్ణోగ్రతను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటూ ప్రమాదకరమైన వేడి ముప్పును ముందుగా తెలుసుకోలేకపోతున్నామా?అధిక ఉష్ణోగ్రతతోపాటు అప్పటి గాలిలో సాపేక్ష తేమ (రిలేటివ్ హ్యుమిడిటీ) శాతాన్ని కూడా కలిపి లెక్కించటం ప్రారంభించాలి. వాస్తవికమైన మనం ఫీలయ్యే వేడి ముప్పు తీవ్రతను ముందుగా గుర్తించటానికి, సహాయక చర్యల సన్నద్ధతను పెంచుకోవటానికి ఇది అవసరమని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్వెట్–బల్బ్ ఉష్ణోగ్రత అంటే? ఉష్ణోగ్రతతోపాటు గాలిలో సాపేక్ష తేమను కూడా పరిగణనలోకి తీసుకోవటాన్ని వెట్–బల్బ్ ఉష్ణోగ్రత లెక్కింపు పద్ధతి అంటారు. వేడి ఒత్తిడి అంచనాలో ఉష్ణోగ్రతతోపాటు గాలిలో తేమను కలపటం ఎందుకు అంటే.. వేడి వాతావరణంలో ఉన్నప్పుడు మనకు చెమట పడుతుంది. వేడిని తట్టుకునే ప్రక్రియలో చెమట శరీరానికి ఉపయోగపడుతుంది. చర్మంపై నుంచి చెమట ఎంతగా ఆవిరైపోతోందనే దానిపై ఈ ప్రక్రియ ఎంత సమర్థవంతంగా జరుగుతోందనేది ఆధారపడి ఉంటుంది.గాలిలో అధిక తేమ ఉన్న పరిస్థితిలో, శరీరం సహజ శీతలీకరణ యంత్రాంగానికి అంతరాయం కలుగుతుంది. చెమట ఆవిరి కానప్పుడు, శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇది తీవ్రమైతే అలసట, వడదెబ్బ తగులుతాయి. తీవ్రమైన సందర్భాల్లో మరణానికి దారితీస్తుంది. వేడి, తేమ వల్ల కలిగే ఈ మిశ్రమ ఒత్తిడిని వెట్–బల్బ్ ఉష్ణోగ్రత ద్వారా అంచనా వేస్తారు. వాతావరణ ప్రజారోగ్య స్థితిగతుల అంచనాల్లో ఇదొక కీలకమైన కొలమానమైనా, మన దేశంలో ఇంకా తక్కువగానే ఉపయోగిస్తున్నారు. ఉష్ణోగ్రత కన్నా తేమే ముఖ్యంకేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి డాక్టర్ ఎం.నాయర్ రాజీవన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ విషయంపై ఇలా అన్నారు.. ‘ప్రస్తుతం మనం తేమ ప్రభావాలపై తగినంత శ్రద్ధ పెట్టటం లేదు. కానీ మన ఆరోగ్యంపై ప్రభావం విషయానికి వస్తే, పెరుగుతున్న ఉష్ణోగ్రతతోపాటు తేమ కూడా అంతే ముఖ్యమైనది లేదా అంతకంటే ఎక్కువ ముఖ్యమైనది’. ‘డ్రై హీట్’ ఒక్కటే ప్రామాణికమా? ⇒ భారతీయ వాతావరణ శాఖ (ఐఎండీ) నిర్దేశించే ప్రాథమిక ప్రమాణాల ప్రకారం.. మైదాన ప్రాంతాల్లో 40 (కొండ ప్రాంతాల్లో 30, కోస్తా తీర ప్రాంతాల్లో 37) డిగ్రీల సెల్సియస్ దాటితేనే ప్రస్తుతం వడగాడ్పు (హీట్వేవ్స్)ను అధికారికంగా ప్రకటిస్తున్నారు. ⇒ ఈ స్థాయి కన్నా 4.5–6.4 డిగ్రీల మేరకు ఉష్ణోగ్రత పెరిగితే ‘వడగాడ్పు’రోజుగా, 6.4 డిగ్రీల కన్నా పెరిగితే ‘తీవ్ర వడగాడ్పు’రోజుగా ప్రకటిస్తున్నారు. ⇒ అయితే, ఉష్ణోగ్రతతోపాటు గాలిలోని సాపేక్ష తేమను ప్రాథమిక ప్రమాణంగా ఐఎండీ పరిగణనలోకి తీసుకోవడం లేదు. హీట్వేవ్స్ ప్రకటనకు సాపేక్ష తేమను ఐఎండీ ప్రాథమిక ప్రమాణంగా కాకుండా సెకండరీ విషయంగానే పరిగణించటం వల్ల ఈ ముప్పు ప్రాణాంతకంగా మారుతోంది. దీన్ని ‘డ్రై హీట్’ఉష్ణోగ్రత లెక్కింపు పద్ధతి అంటారు.⇒ పగటి ఉష్ణోగ్రత ఐఎండీ ప్రమాదకరమని భావించినంత పెరగనప్పుడు కూడా, గాలిలోని అధిక సాపేక్ష తేమ వల్ల, ప్రజలు ప్రమాదకరమైన వడగాడ్పుల ముప్పును అనుభవిస్తున్నారు. ఇంట్లో ఉన్నా, వృద్ధులు, పిల్లలతోపాటు ఆరుబయట పనిచేసే వారు వడదెబ్బకు గురవుతున్నారు. ⇒ గాలిలో తేమ శాతం సాధారణంగా ఎక్కువగా ఉండే కోస్తా తీర ప్రాంతాల్లో, కాంక్రీటు అరణ్యాలుగా మారిన నగర, పట్టణ ప్రాంతాల్లో వాతావరణ మార్పు నేపథ్యంలో ఈ ముప్పు పెరుగుతోంది. హీట్ స్ట్రోక్ మరణాలు ఎక్కువ కావటానికి ఇదొక ముఖ్య కారణంగా చెబుతున్నారు. ⇒ వడగాడ్పుల ప్రభావం ప్రజలపై ఉన్నా, అధికారికంగా ప్రకటించనందున, ప్రభుత్వ యంత్రాంగంలో, ప్రజల్లో సంసిద్ధత, అప్రమత్తత లోపిస్తోంది. నివారించదగిన వడగాడ్పు మరణాల రేటు పెరుగుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. ⇒ అంతేకాదు, బాధితులకు వైద్య సహాయంలో, సహాయక చర్యల్లో, వడగాడ్పు మృతులకు పరిహారం చెల్లింపుల్లోనూ ఇది ప్రతిబంధకంగా మారుతోంది. డ్రై హీట్ పద్ధతికి బదులు వెట్–బల్బ్ ఉష్ణోగ్రత లెక్కింపు పద్ధతిని అనుసరించటమే దీనికి పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు. -
విజేతలు శ్రీచరణ్ తేజ్, చిద్విలాసిని
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ అండర్–15 బాలుర విభాగంలో కొండ్లాపు శ్రీచరణ్ తేజ్, అండర్–15 బాలికల విభాగంలో కుమ్మరికుంట్ల చిద్విలాసిని విజేతలుగా నిలిచారు. సరూర్నగర్ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో వివిధ వయో విభాగంలో తెలంగాణ జిల్లాల నుంచి 300 మందికిపైగా పోటీపడ్డారు. నిర్ణీత ఐదు రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో శ్రీచరణ్ తేజ్ 4.5 పాయింట్లు సాధించగా... చిది్వలాసిని 3.5 పాయింట్లు స్కోరు చేసింది. తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం జనరల్ సెక్రటరీ జయచంద్ర విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఆర్.చంద్రమౌళి చీఫ్ ఆర్బిటర్గా, ఆర్.శ్రీరామ్ డిప్యూటీ ఆర్బిటర్గా వ్యవహరించారు. వివిధ వయో విభాగాల్లో టాప్–3లో నిలిచిన ప్లేయర్లు వివరాలు ఇలా ఉన్నాయి. అండర్–15 విభాగం: బాలురు: 1. శ్రీచరణ్ తేజ్ (4.5 పాయింట్లు), 2. బొబ్బిలి సుజయ్ (4 పాయింట్లు), 3. జక్కరాజు జై శ్రేయాన్స్ (4 పాయింట్లు). బాలికలు: 1. చిది్వలాసిని (3.5 పాయింట్లు), 2. లేఖ్యశ్రీ సాన్వి (3 పాయింట్లు), 3. ఎ.ప్రణతి (2.5 పాయింట్లు). అండర్–13 విభాగం: బాలురు: 1. ధ్రువ్ శ్రీవాస్తవ (5 పాయింట్లు), 2. ఎస్.శశాంక్ (5 పాయింట్లు), 3. జి.రుషికేశ్ ( 4 పాయింట్లు). బాలికలు: 1. కె.లాస్య (4 పాయింట్లు), 2. చేట్ల వేదశ్రుతి (3 పాయింట్లు), 3. గౌలీకర్ సుహాసిక (3 పాయింట్లు). అండర్–11 విభాగం: బాలురు: 1. కేఎస్ విశిష్ట్ శ్రీరామ్ (5 పాయింట్లు), 2. పి.చార్వీక్ సాయి (4.5 పాయింట్లు), 3. కొత్తపల్లి దేవాంశ్ (4.5 పాయింట్లు). బాలికల విభాగం: 1. పొలిశెట్టి ధృతి (4 పాయింట్లు), 2. కె.తేజస్వి (4 పాయింట్లు), 3. మునిపల్లి ఆశ్రిత (4 పాయింట్లు). అండర్–9 విభాగం: బాలురు: 1. అంబటి ప్రసిధ్ (5 పాయింట్లు), 2. బి.యజత్ రెడ్డి (5 పాయింట్లు), 3. పట్లోళ్ల ధ్రువిన్ రెడ్డి (4 పాయింట్లు). బాలికలు: 1. జి.శాన్విత (3 పాయింట్లు), 2. సాన్విక (3 పాయింట్లు), 3. ముద్దాల కుముద (3 పాయింట్లు). అండర్–7 విభాగం: బాలురు: 1. రంగనాధ వేద ఆర్క (5 పాయింట్లు), 2. ఎస్. తనవ్ ఇషాన్ (5 పాయింట్లు), 3. గూడురు విహాన్ (4 పాయింట్లు). బాలికలు: 1. మెహరీన్ షేక్ సుహీరా (4 పాయింట్లు), 2. ఆవుల శ్రేయాంశి (3 పాయింట్లు), 3. రంగనాధ ఐరా అర్ణి (3 పాయింట్లు). -
పెద్దల సభలో తెలంగాణ పంచాయితీ
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు–2026పై జరిగిన చర్చలో తెలంగాణకు సంబంధించిన పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఈ చర్చ పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. వివిధ అంశాలపై పార్టీలు పరస్పరం విమర్శలు గుప్పించుకున్నాయి. ఆ వ్యాఖ్యలు అభ్యంతకరం: కేఆర్ సురేశ్రెడ్డి ‘కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్లు కొట్టుకుపోయాయంటూ’కేంద్ర జలశక్తి మంత్రి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి ఒక్క పైసా కూడా తీసుకోకుండా తెలంగాణ ప్రభుత్వం సొంత నిధులతో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై కనీస అవగాహన లేకుండా మాట్లాడటం సరికాదన్నారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు సభను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, రికార్డుల నుంచి ఆ వ్యాఖ్యలను తొలగించి క్షమాపణ చెప్పాలని, లేకుంటే సభాహక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సురేశ్రెడ్డి హెచ్చరించారు. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్లే మేడిగడ్డ బరాజ్లోని రెండు పిల్లర్లు మాత్రమే కుంగాయన్నారు. తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు, ఐటీఐఆర్ కారి డార్, స్టీల్ ఫ్యాక్టరీ, మైనింగ్ యూనివర్సిటీలతోపాటు వెనుకబడిన ప్రాంతాలకు రావాల్సిన రూ.900 కోట్ల పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు బీఆర్ఎస్, కాంగ్రెస్పై విరుచుకుపడ్డ కిషన్రెడ్డి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘భద్రాచలం గ్రామాలను ఏపీలో కలపడం కాంగ్రెస్ రూపొందించిన విభజన చట్టంలోనే ఉంది. అప్పట్లో సోనియాగాంధీతో డిన్నర్ చేసి, ఆమె కాళ్లు పట్టుకున్న కేసీఆర్.. అప్పుడెందుకు ఆ గ్రామాల గురించి అడగలేదు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? కేంద్రం నుంచి పైసా తీసుకోలేదని చెబుతున్నారు. మరి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి కేసీఆర్ దుబాయ్లో నోట్లు ఏమైనా ముద్రించారా? అది కేసీఆర్ ఇంట్లో డబ్బు కాదు, ప్రజల డబ్బు. కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే వివిధ ఆర్థిక సంస్థల నుంచి నిధులు వచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఒక ఏటీఎంలా మారిపోయింది. ఎన్నికల ముందు కాళేశ్వరంపై విచారణ జరిపి కేసీఆర్ను జైలుకు పంపుతామన్న కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి ఇప్పుడు ఎందుకు ఆ పనిచేయడం లేదు’అని కిషన్రెడ్డి ప్రశ్నించారు. అది ఎలాగూ అమరావతే ఎంపీ రేణుకాచౌదరి పెట్టరా పేరు అమరావతి.. లేకపోతే పిలవరా ’కమ్మ’రావతి అంటూ రాజధాని అమరావతి పేరు చుట్టూ సాగుతున్న రాజకీయాలపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రేణుకా చౌదరి తనదైన శైలిలో స్పందించారు. ‘అది ఎలాగూ అమరావతే. నేను అప్పటి ముఖ్యమంత్రితో కూడా చెప్పాను.. ’పెట్టరా పేరు అమరావతి.. లేకపోతే పిలవరా పేరు కమ్మరావతి.. పెట్టు పేరు!’అని నేనే అన్నాను. వారికి (కేంద్రానికి) అంత ధైర్యం ఉంటే, చెప్పింది అమలు చేసే సాహసం కూడా చేయమనండి. ఇది కేవలం ఒక కాస్మెటిక్ టచ్ (కంటితుడుపు చర్య) మాత్రమే.’అన్నారు. ‘కేంద్ర ప్రభుత్వం ఏపీ పునర్విభజన చట్టాన్ని కేవలం తన మిత్రపక్షాలకు (కూటమికి) మేలు చేసేందుకే వాడుకుంటోంది. అదే చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను మాత్రం ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తోంది’అని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రేణుకాచౌదరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భద్రాచలం సరిహద్దుల్లోని ఏటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, గుండాల, పురుషోత్తపట్నం గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె సభలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలి: ఎంపీ వద్దిరాజు సూపర్బజార్ (కొత్తగూడెం): ఆంధ్రప్రదేశ్ విభజన సమయాన భద్రాచలం పట్టణానికి ఆనుకొని ఉన్న ఐదు గ్రామాలను ఏపీలో విలీనం చేశారని, ఆ గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర కోరారు. అన్నదమ్ముల్లా విడిపోయి రెండు రాష్ట్రాలను అభివృద్ధి చేసుకుందామనేది మొదటి నుంచి తమ పార్టీ విధానమని తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలని, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని, గిరిజన యూనివర్సిటీకి మరిన్ని నిధులు కేటాయించాలన్నారు. మాజీ సీఎం కేసీఆర్ను ఉద్దేశించి మంత్రి కిషన్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశారు. -
తెలంగాణే 'గ్యారంటీ'!
సాక్షి హైదరాబాద్: కేరళలో యూడీఎఫ్ గ్యారంటీల అమలు సాధ్యమా అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారని.. దానికి సమాధానం తెలంగాణ రాష్ట్రమే అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. యూడీఎఫ్ మేనిఫెస్టోపై విమర్శలు చేసేవారు.. ఆ హామీలు తెలంగాణలో ఎలా అమలు అవుతున్నాయో వచ్చి చూడాలని, వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. విజయన్, ఆయన మంత్రులు కూడా ప్రత్యక్షంగా వచ్చి పరిశీలించుకోవచ్చని సవాల్ విసిరారు. గురువారం కొచ్చిలో ఐదు ఇందిరమ్మ గ్యారంటీలతో కూడిన యూడీఎఫ్ మేనిఫెస్టోను ఆవిష్కరించిన అనంతరం రేవంత్ మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, మొదటి కేబినెట్ సమావేశం నుంచే గ్యారంటీలను విజయవంతంగా అమలు చేస్తున్నా మని ముఖ్యమంత్రి చెప్పారు. రుణమాఫీ, రైతు భరోసా, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం గురించి వివరించారు. తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ –2047 మేరకు తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలపనున్నామని చెప్పారు. తమ రాష్ట్రం వృద్ధిరేటు 10.8%గా ఉందని, పన్నులు పెంచకుండానే అభివృద్ధి సాధ్య మని తాము నిరూపించామని రేవంత్ పేర్కొన్నారు. యూడీఎఫ్ స్వర్ణయుగ పాలన ఖాయం అవినీతి, కుటుంబ పాలన అంశంలో కేరళ సీఎం పినరయి విజయన్, మాజీ సీఎం కేసీఆర్ల మధ్య అనేక పోలికలు ఉన్నాయని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. కేరళలో పదేళ్లుగా విజయన్ ప్రభుత్వం కొనసాగుతుంటే 2014 నుంచి సుమారు పదేళ్లపాటు కేసీఆర్ తెలంగాణను పాలించారని చెప్పారు. కుటుంబ పాలన, అవినీతి, అసమర్థ పాలన విషయంలోనూ ఇద్దరి మధ్య పోలికలు ఉన్నా యన్నారు. దేశాన్ని, కేరళనూ మోదీ బ్రదర్స్ పాలిస్తున్నారని మోదీ.. విజయన్ను ఉద్దేశించి విమర్శించారు. దేవుడి సొంత రాష్ట్రంలో ఆయన ఆస్తికే రక్షణ లేకుండా పోయిందంటూ పరోక్షంగా శబరిమల బంగారం ఉదంతాన్ని ప్రస్తావించారు. వచ్చే ఎన్నికలతో కేరళలో విజయన్ పాలన ముగిసి యూడీఎఫ్ స్వర్ణ యుగ పాలన మొదలవుతుందని చెప్పారు. కార్యక్రమంలో కేరళ కాంగ్రెస్ నేతలతోపాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షీ పాల్గొన్నారు. -
కల్తీ రాయుళ్లకు సీపీ సజ్జనార్ వార్నింగ్
సాక్షి,హైదరాబాద్: నగరంలో ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి, స్వలాభం కోసం కల్తీకి పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. కల్తీ అనేది కేవలం వ్యాపారం కాదని, అది సమాజంపై జరుగుతున్న దాడి అని ఆయన అన్నారు.గురువారం బషీర్బాగ్లోని పాత పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో 'హెచ్-ఫాస్ట్' ఆధ్వర్యంలో నిర్వహించిన ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ల అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశానికి మాంసం, పాలు, బేకరీ ఉత్పత్తులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టీ పొడి తదితర విభాగాలకు చెందిన సుమారు 200 మంది వ్యాపార ప్రతినిధులు హాజరయ్యారు.ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, గత నెల రోజుల వ్యవధిలోనే నగరవ్యాప్తంగా 92 కేసులు నమోదు చేసి, సుమారు 62 టన్నుల కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని, ఈ అక్రమాలకు పాల్పడుతున్న 98 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఆహార పదార్థాల నాణ్యత విషయంలో రాజీ పడకుండా, బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యాపారులు వ్యవహరించాలని హితవు పలికారు. కల్తీ రహిత తెలంగాణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.హైదరాబాద్ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖ్యాతిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి వ్యాపారిపై ఉందని అన్నారు. ప్రతి ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ తప్పనిసరిగా ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) లైసెన్స్ కలిగి ఉండాలని, ఎక్కడైనా కల్తీ జరుగుతున్నట్లు సమాచారం ఉంటే తక్షణమే పోలీసులకు తెలపాలని కోరారు.నిజాయితీగా వ్యాపారం నిర్వహించే వారికి పోలీసు శాఖ, ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఆరోగ్యవంతమైన హైదరాబాద్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. వ్యాపార ప్రతినిధులు క్షేత్రస్థాయిలో తాము ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను సీపీ దృష్టికి తీసుకురాగా, వాటిని పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. పోలీసుల చొరవను వ్యాపారులు అభినందిస్తూ, కల్తీని అరికట్టడంలో తమ వంతు సహకారాన్ని అందిస్తామని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో టాస్క్ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, అదనపు డీసీపీ ఏ. శ్రీనివాసరావు, వైద్య ఆరోగ్య శాఖాధికారి వెంకట్తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
హైదరాబాద్ ‘మెట్రో రైల్’ పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన
ఢిల్లీ: హైదరాబాద్ నగర మెట్రో రైల్ ప్రాజెక్ట్పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు ఫేజ్ 2 ఆమోదానికి కాలపరిమితి లేదని, ప్రాజెక్టు ఆమోదం అనేది మదింపు ప్రక్రియ ఫలితం, సాధ్యాసాధ్యాలు, వనరుల లభ్యత పై ఆధారపడి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నకు కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి తోకన్ సాహూ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ‘2017 మెట్రో రైల్ పాలసీకి అనుగుణంగా ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 పై అప్రైజల్ జరుగుతుంది. మెట్రో రైల్ ప్రాజెక్టులు అత్యధిక వ్యయంతో కూడుకున్నవి. ప్రతిపాదిత ఫేస్ 2 నెట్వర్క్ ను ప్రస్తుత ఫేజ్ 1 మెట్రో నెట్వర్క్తో అనుసంధానం చేసే సాంకేతిక సాధ్యసాధ్యల పై సలహా ఇవ్వడానికి కమిటీని కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మూడు ఆప్షన్లను పరిశీలించి తెలంగాణ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని తెలియజేయాలి’ అని తెలిపారు. -
5 ఏళ్ల ప్రేమ, పెళ్లైన నెలకే ఐటీ ఉద్యోగిని ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: కట్నం కోరలకు మరో యువతి బలైపోయింది. హైదరాబాద్లోని సైబరాబాద్ పరిధిలోని మియాపూర్ ప్రాంతంలో, ప్రేమించి పెళ్లి చేసుకున్న నెల రోజులకే 26 ఏళ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. అదనపు కట్నం కోసం భర్త వేధించాడన్న ఆరోపణలతో, బిహార్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇషితా యాదవ్ తనువు చాలించింది. పోలీసుల వివరాల ప్రకారం,బుధవారం సాయంత్రం, ఇషితా యాదవ్ తన అపార్ట్మెంట్లోని హాలులో ఉన్న సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. ఆమెను ఆ స్థితిలో చూసిన ఆమె భర్త, నీరజ్ భన్సల్, వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఇషితా ,నీరజ్ 2020లో సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యారు. ఇషితా స్వస్థలం బిహార్ కాగా, నీరజ్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు. వీరిద్దరూ దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమించుకుని, ఈ ఏడాది ఫిబ్రవరి 20న పాట్నాలో తమ కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం, వీరిద్దరూ హైదరాబాద్కు మకాం మార్చారు.ఇదీ చదవండి : లాస్ట్ మినిట్ ట్విస్ట్ : వరుడితో కాదు పెళ్లి !బాధితురాలి తల్లిదండ్రుల కథనం ప్రకారం, నీరజ్ అదనపు కట్నం కోసం ఇషితాను వేధించడం, ఒత్తిడి చేయడం ప్రారంభించడంతో పాటు, తాను ఇటీవల ప్రారంభించిన ఒక స్టార్టప్ కంపెనీలో పెట్టుబడి పెట్టాలని ఆమె కుటుంబాన్ని డిమాండ్ చేయడంతో వారిద్దరి మధ్య మనస్పర్థలు పెరిగాయి. ఇషితా తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మియాపూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఆమె భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి: పెళ్లిలో మద్యం ఇవ్వలేదని రెచ్చిపోయిన గెస్ట్లు, వీడియో వైరల్ -
కల్తీ బేకరీ ఉత్పత్తుల తయారీ కేంద్రంపై దాడి
హైదరాబాద్ : నగర ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఎలాంటి అనుమతులు లేకుండా కల్తీ బేకరీ ఉత్పత్తులు, అపరిశుభ్రంగా తయారు చేస్తున్న కేంద్రంపై పోలీసులు దాడి చేశారు. కమిషనర్ టాస్క్ ఫోర్స్ గోల్కొండ టీమ్, టప్పాచబుత్రా పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్లో జిర్రాలోని చాంద్ బేకరీపై దాడి చేసి, రూ. 2.77 లక్షల విలువైన ముడి సరుకులు, ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు.బేకరీ యజమాని సయ్యద్ ఖదీర్ (42)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆసిఫ్ నగర్లో నివాసం ఉండే ఖదీర్ నటరాజ్ నగర్లో ‘చాంద్ బేకరీ’ పేరుతో తయారీ కేంద్రాన్ని నడుపుతున్నాడు. బేకరీ నిర్వహణ కోసం ప్రభుత్వ అనుమతులు లేవని పోలీసులకు సమాచారం అందింది.పక్కా సమాచారంతో చాంద్ బేకరీపై పోలీసులు దాడులు చేశారు. నకిలీ ఉత్పుత్తులతో పాటు మైదా బస్తాలు, సాస్ కార్టన్లు, డాల్డా, చక్కెర, కొబ్బరి పొడి, కేక్ పౌడర్, ఆయిల్ టిన్నులు, చికెన్, బ్రెడ్ బాక్సులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.2లక్షలకు పైగా ఉంటుందని అంచనా వేశారు.పక్కా సమాచారం ఆధారంగా గోల్కొండ జోన్ టాస్క్ ఫోర్స్, టప్పాచబుత్రా పోలీసులు ఈ దాడి నిర్వహించారు. నిందితుడిపై టప్పాచబుత్రా పోలీసులు పలు కింద కేసు నమోదు చేశారు. ఈ ఆపరేషన్ను హైదరాబాద్ సిటీ టాస్క్ ఫోర్స్ అడిషనల్ డిసిపి అందె శ్రీనివాసరావు పర్యవేక్షించారు. గోల్కొండ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఆర్. వెంకటేష్, టప్పాచబుత్రా ఇన్స్పెక్టర్ జి. బాలకృష్ణ, ఎస్.ఐలు కె. వెంకటరమణ, అమ్జద్ షరీఫ్, సిబ్బంది ఈ దాడిలో పాల్గొన్నారు. -
హైదరాబాద్లో ఇలాంటి మాంసాన్ని తింటున్నామా?
సాక్షి, హైదరాబాద్: ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి.. కుళ్లిపోయిన మేకలు, గొర్రెల మాంసం విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టయ్యింది. నిల్వ ఉంచిన కుళ్ళిన గొర్రె, మేక మాంసాన్ని (పాయా, ముడి, బీజా, గురుదా, కలేజీ తదితర అవయవాలు) విక్రయిస్తున్న ఒక భారీ నెట్వర్క్ను హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ (గోల్కొండ టీమ్), హెచ్-ఫాస్ట్ (H-FAST) మరియు మంగళ్హాట్ పోలీసులు సంయుక్తంగా ఛేదించారు.మంగళ్హాట్లోని 'A to Z షీప్ అండ్ గోట్ ఆఫ్ఫల్' స్టోర్పై మెరుపు దాడి చేసి సుమారు 12 టన్నుల కుళ్లిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ. పది లక్షలు ఉంటుందని అంచనా. నిందితుడు రఫీ అహ్మద్ను అరెస్ట్ చేయగా.. మరో నిందితుడు, స్టోర్ యజమాని మొహమ్మద్ అఫ్రోజ్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.అఫ్రోజ్పై గతంలో జీహెచ్ఎంసీ జరిమానా విధించడంతో పాటు, మంగళ్హాట్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. నిందితుడు రఫీ అహ్మద్.. యజమాని అఫ్రోజ్ సహాయంతో హోల్సేల్ మార్కెట్ నుండి తక్కువ ధరకు పాడైపోయిన గొర్రె, మేక అవయవాలను సేకరించేవాడు. ఈ మాంసాన్ని మంగళ్హాట్, అమాన్ నగర్ కాలనీలోని తమ స్టోర్లో నిల్వ చేసేవారు. మాంసం కుళ్లిపోకుండా దుర్వాసన రాకుండా ఉండేందుకు డీప్ ఫ్రీజర్లు, నిల్వ ఉన్న నీటితో నింపిన ప్లాస్టిక్ టబ్బులలో ఎక్కువ కాలం నిల్వ ఉంచేవారు. అనంతరం, ఈ కుళ్లిన మాంసాన్ని తాజా మాంసంగా నమ్మించి హోటళ్లు, శుభకార్యాలకు, ఇతర ఈవెంట్లకు సరఫరా చేసేవారని పోలీసులు తెలిపారు. -
ఆ విధానం రద్దు.. తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక నిర్ణయం..!
తెలంగాణ ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఉన్న రెంటల్ విధానానికి స్వస్తి పలికారు. మల్టీప్లెక్స్ తరహాలో పర్సంటేజీ విధానంలోనే సినిమాలను ప్రదర్శించాలని నగరంలోని 23 సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు నిర్ణయించాయి. ఏప్రిల్ 3 నుంచే ఇది అమల్లోకి రానుందని ప్రకటించారు. ఎగ్జిబిటర్లకు రెవెన్యూ షేర్ ఇలా.. సినిమా ప్రదర్శితమైన తొలివారం 60 శాతం, రెండోవారం 50 శాతం, మూడోవారం 40 శాతం. ఈ మేరకు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటన విడుదల చేసింది.ఇప్పటికే 23 మంది ఎగ్జిబిటర్లు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ను సంప్రదించార. తెలంగాణలోని పలువురు అగ్ర శ్రేణి డిస్ట్రిబ్యూటర్లతో చర్చించారు. వారి థియేటర్లు ముఖ్యమైన ప్రదేశాల్లో ఉన్నాయని అన్నారు. వాటిలో ప్రేక్షకులకు అన్ని సౌకర్యాలున్నాయని తెలిపారు. అయితే ఈ థియేటర్ల నిర్వహణ చాలా భారంగా మారిందన్నారు. ప్రస్తుత అద్దె విధానంతో నెట్టుకు రావడం కష్టసాధ్యమైందని వెల్లడించారు.పర్సంటేజీ ప్రాతిపదికన సినిమాలను ప్రదర్శిస్తామన్న తమ ప్రపోజల్ను డిస్ట్రిబ్యూటర్లు అంగీకరించారని చెప్పారు. శశిధర్ రెడ్డి మాత్రమే నిర్మాతలు, ఇతర భాగస్వాములతో మరింత చర్చించి అభిప్రాయం చెబుతామన్నారని పేర్కొన్నారు. ఇకపై తెలంగాణలోని అన్ని సింగిల్ స్క్రీన్లలో సినిమాలను కేవలం శాతం ప్రాతిపదికనే ప్రదర్శిస్తామని ఎగ్జిబిటర్స్ స్పష్టం చేశారు. ఇది దశల వారీగా జరుగుతుందని అని ఫిల్మ్ ఛాంబర్ తన ప్రకటనలో పేర్కొంది.


