Telangana
-
ప్రపంచ సుందరి పోటీలకు ‘మెట్రోరైల్’ విస్తృత ప్రచారం
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ప్రపంచసుందరి పోటీలపై హైదరాబాద్ మెట్రో రైల్ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. మరికొద్ది రోజుల్లో పోటీలు ముగియనున్న దృష్ట్యా మిస్వరల్డ్ పోటీలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వివిధ రూపాల్లో ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. మరోవైపు తెలంగాణ పర్యాటక, చారిత్రక, వారసత్వ కట్టడాలపై ప్రజల్లో, ప్రయాణికుల్లో అవగాహన కలి్పంచేందుకు పోస్టర్లు, కటౌట్లు, చిత్రాల ప్రదర్శనకు ఏర్పాట్లు చేసింది. నగరంలోని గోల్కొండ, చారి్మనార్ వంటి చారిత్రక కట్టడాలతో పాటు పోచంపల్లి, రామప్ప, లక్నవరం, ఆమ్రాబాద్ పులుల అభయారణ్యం, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వంటి ఆధ్యాత్మిక, చారిత్రక ప్రదేశాలపై ఆకర్షణీయమైన దృశ్యాలను వివిధ ప్రాంతాల్లో ఆవిష్కరించారు. ప్రపంచసుందరి పోటీల్లో హైదరాబాద్ మెట్రో రైల్ తనవంతు భాగస్వామ్యాన్ని నిర్వహిస్తోందని మెట్రోరైల్ ఎండీ ఎనీ్వఎస్రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఈ పోటీలపై ప్రత్యేక ప్రదర్శనలను ఏర్పాటు చేయడంతో పాటు తెలంగాణ ప్రాశస్త్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ ప్రచారకార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణకు పరిచయం చేసేలా.. పోటీల్లో పాల్గొంటున్న ప్రపంచ సుందరీ మణులను తెలంగాణకు పరిచయం చేసేవిధంగా హైటెక్ సిటీ నుంచి నాగోల్ వరకు, మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు పలు ప్రాంతాల్లో మెట్రో స్టేషన్లు, మెట్రో స్తంభాలు, రహదారులకు ఇరువైపులా ఉన్న మెట్రో రైలింగ్లపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆకర్షణగా నిలిచాయి. మరోవైపు మెట్రో రైళ్లలోనూ స్క్రీన్లపై, మెట్రో స్టేషన్ ప్లాట్ఫాంలు, కాన్కోర్స్లలోనూ మిస్ వరల్డ్ వేడుకలను ప్రతిబింబించేలా అనేక ఏర్పాట్లు చేశారు. అలాగే మెట్రో స్టేషన్ల ప్రవేశ ద్వారాలను సైతం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆరీ్చలతో అలంకరించారు. నగరంలోని వివిధ మార్గాల్లో ప్రతిరోజు సుమారు 4.5 లక్షల నుంచి 5 లక్షల మంది ప్రయాణికులు మెట్రోల్లో రాకపోకలు సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ వారసత్వ సంపదను ప్రయాణికులకు తెలియజేసే బృహత్ కార్యక్రమంలో భాగంగా వివిధ రూపాల్లో ప్రచారాన్ని కొనసాగిస్తున్నట్లు ఎనీ్వఎస్ చెప్పారు. తెలంగాణ సంప్రదాయాలకు కీర్తి పతాకగా నిలిచిన బోనాలు, బతుకమ్మ, చార్మినార్ వంటి విశేషాలతో కూడిన ఆకర్షణీయ దృశ్యాలను ’మెట్రో రైల్’ ఈ వేడుకల సందర్భంగా మరింత విస్తృత ప్రచారం కల్పించిందని ఎండీ వెల్లడించారు. -
భూమికగా ఎలా మారిందంటే..?
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఛత్తీస్గఢ్లోని అబుజ్మడ్ ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు విజయలక్ష్మి (36) అలియాస్ భూమిక మృతదేహం కోసం కుటుంబ సభ్యులు, బంధువులకు ఎదురు చూపులు తప్పడం లేదు. ఎన్కౌంటర్లో నంబాల కేశవరావుతో పాటు కేశంపేట మండలం వేములనర్వకు చెందిన విజయలక్ష్మి కూడా చనిపోయింది. మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు శనివారం రాత్రి షాద్నగర్ నుంచి బయలుదేరి ఆదివారం మధ్యాహ్నం ఛత్తీస్గఢ్ నారాయణపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. పోస్టుమార్టం తర్వాత పలువురి మృతదేహాలను వారి బంధువులకు అప్పగించారు. విజయలక్ష్మి మృతదేహాన్ని మాత్రం ఇప్పటికీ అప్పగించకపోవడంతో బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఛత్తీస్గఢ్ పోలీసులకు స్థానిక పోలీసుల నుంచి ఆదేశాలు అందకపోవడమే ఈ జాప్యానికి కారణమని తెలుస్తోంది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన భూమిక 12 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లింది. ఓయూ నుంచి అబుజ్మడ్ వరకు వేములనర్వ గ్రామానికి చెందిన వన్నాడ సాయిలు, రాధమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. ముగ్గురూ ఆడపిల్లలే. మూడో సంతానమైన విజయలక్ష్మి పుట్టిన ఏడాదికే తల్లి పాముకాటుతో చనిపోయింది. ఇంటరీ్మడియెట్ వరకు కేశంపేటలోనే చదువుకుంది. ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు పిల్లలకు ట్యూషన్లు చెప్పేది. మహబూబ్నగర్ ఎన్టీఆర్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. తర్వాత 2009–10లో ఓయూ పీజీ కాలేజీలో ఎంఏ పొలిటికల్ సైన్స్లో చేరింది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంది. పలు మార్లు జైలుకు కూడా వెళ్లి వచ్చింది. ఇదే సమయంలో పోలవరం ముంపు గ్రామాలను సందర్శించి, ఆదివాసీల కష్టాలను చూసి చలించిపోయింది. ఈ ఘటన ఆమెపై తీవ్ర ప్రభావం చూపింది. 2013–14 మధ్య కాలంలో విజయలక్ష్మి అజ్ఞాతంలోకి వెళ్లింది. మావోయిస్టు పారీ్టలో చేరిన మొదటి రోజు విషయాలను ‘వసంత మేఘం’ అనే వెబ్సైట్లో ‘కొత్త బంగారులోకం’ అనే శీర్షికతో ఓ కథను కూడా రాసింది. తానెందుకు గెరిల్లాగా మారాననే అంశాలతో పాటు ఓయూ కేంద్రంగా కొనసాగిన తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని గుర్తు చేసుకుంది. 12 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీలో పని చేసి, చివరికి ప్రధాన కార్యదర్శి నంబాల రక్షణ బృందంలో పని చేస్తూ మరణించింది. భూమికగా ఎలా మారిందంటే..? విజయలక్ష్మి కేశంపేటలో ఇంటరీ్మడియెట్ (2001–2003) పూర్తి చేసింది. అదే సమయంలో ‘ఒక్కడు’ సినిమా విడుదలైంది. ఆ సినిమాలోని హీరోయిన్ భూమిక పోలికలు కలిగి ఉండటంతో స్నేహితులంతా ఆమెను భూమికతో పోల్చుతూ అదే పేరుతో పిలిచేవారు. అజ్ఞాతంలోకి వెళ్లిన తర్వాత కూడా అదే పేరుతో కొనసాగినట్లు సమాచారం. చిన్నప్పటి నుంచి ఆమెకు సంగీతం, వ్యాసరచన అంటే ఇష్టం. ఇతరులకు సాయపడాలనే తపన బలంగా ఉండేది. ఇదే భావన మావోయిస్టు పార్టీ వైపు మళ్లించింది. అజ్ఞాతంలోకి వెళ్లిన తర్వాత ఆమె ఎప్పడూ ఇంటి ముఖం చూడలేదు. ఇప్పటికీ ఛత్తీస్గÉŠ ఆస్పత్రిలోనే విజయలక్ష్మి మృతదేహం అక్కడికి చేరుకుని పడిగాపులు కాస్తున్న కుటుంబీకులు -
ఘనంగా కాళేశ్వరం సరస్వతి పురస్కారాలు.. పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
కొత్త రేషన్ కార్డులకు మోక్షం
సాక్షి, హైదరాబాద్: నగరంలో కొత్త ఆహార భద్రత (రేషన్) కార్డులకు మోక్షం లభించింది. మీ సేవ కేంద్రాల్లో ఆన్లైన్ ద్వారా అందిన దరఖాస్తులపై క్షేత్ర స్థాయి విచారణ ప్రారంభమైంది. అర్హులకు కొత్త కార్డులు మంజూరవుతున్నాయి. పౌరసరఫరాల శాఖ ఇప్పటికే విచారణ పూర్తి చేసి కొందరికి కార్డులు మంజూరు చేయగా.. మరికొందరికి తిరస్కరించింది. ఇంకొన్ని దరఖాస్తులపై విచారణ కొనసాగుతోంది. ఈ నెల 24వ తేదీ వరకు మంజూరైన కొత్త కార్డులకు రేషన్ కోటా కేటాయించింది. దశలవారీగా విచారణ చేస్తూ రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నట్లు పౌరసరఫరాల అధికారులు చెబుతున్నారు. భారీగా దరఖాస్తులు.. గ్రేటర్ పరి«ధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల్లో సుమారు రెండు లక్షల కుటుంబాల వరకు కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పదేళ్లలో పెద్దగా రేషన్ కార్డులు మంజూరు కాకపోవడంతో కొత్త కార్డుల కోసం తాకిడి పెరిగినట్లయింది. పెళ్లి చేసుకొని అత్తగారింటికి వచ్చినకోడళ్లు రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి వారంతా ప్రజా పాలనలో రేషన్ కార్డుల కోసం భారీగా దరఖాస్తులు చేసుకున్నారు. ప్రభుత్వం సమగ్ర సర్వే ద్వారా గ్రేటర్లో మొత్తం 22 లక్షల కుటుంబాల వివరాలు సేకరించి, నమోదు చేసినట్లు అంచనా. మెజారిటీ దరఖాస్తుల్లో తమకు రేషన్కార్డు లేదని, కొత్త రేషన్ కార్డు కావాలని జనం కోరారు. అవన్నీ పరిశీలించిన తర్వాత అర్హుల లెక్క 83,285గా తేలింది. ఎన్నికల కోడ్ ఇతరత్రా కారణాలతో అది పెండింగ్లో పడిపోయింది. గత నెలలో ఆన్లైన్ ద్వారా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు ఆహా్వనించడంతో పేద కుటుంబాలు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నాయి. వాటిపై విచారణ నిర్వహిస్తూ కొత్త కార్డులు మంజూరు చేస్తోంది. -
Hyderabad: అత్తగారింటికి వెళ్తూ అనంతలోకాలకు..
సికింద్రాబాద్: కన్నపిల్లల కళ్ల ముందే ఓ తల్లి రైలు బోగీ నుంచి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందిన ఘటన ఆదివారం ఘట్కేసర్ రైల్వే స్టేషన్లో విషాదాన్ని నింపింది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ నారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని అనకాపల్లి జిల్లా దొండపూడి గ్రామానికి చెందిన మట్ట వెంకటేశ్, శ్వేత (33) దంపతులు. నగరంలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న వెంకటేశ్ తన భార్య శ్వేత, ఇరువురు పిల్లలతో కలిసి లింగంపల్లిలో నివాసం ఉంటున్నారు. వేసవి సెలవులు పూర్తవుతున్న క్రమంలో కొద్ది రోజులు శ్వేత తన ఇద్దరు పిల్లలతో దొండపూడిలో గడిపి రావాలనుకుంది. ఇందుకోసం భర్త వెంకటేశ్ ఆన్లైన్ టికెట్ కొనుగోలు చేశాడు. ఉదయం భార్య, పిల్లలను లింగంపల్లి రైల్వేస్టేషన్ తీసుకువచి్చన వెంకటేశ్ జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలు ఎక్కించి డీ3 బోగీలోని సీట్లలో కూర్చోబెట్టాడు. సీట్ నంబర్ సరిగా ప్రింట్ కాకపోవడంతో.. రైలు బయలుదేరిన కొద్ది సేపటి తర్వాత శ్వేత కూర్చున్న సీట్లు తమవని వేరే ప్రయాణికులు వచ్చారు. తన వద్ద ఉన్న టికెట్ను మరోసారి సరిచూసుకోగా తన బోగీ డీ8గా గుర్తించింది శ్వేత. రైలులో రద్దీ ఎక్కువగా ఉండడంతో 3వ నంబరు బోగీ నుంచి 8వ నంబర్ బోగీ వరకు బోగీల మార్గం నుంచి వెళ్లడం సాధ్యం కాలేదు. చర్లపల్లి రైల్వేస్టేషన్లో రైలు నిలపగానే డీ3 బోగీ దిగిన ఆమె తన పిల్లలు, లగేజీతో 8వ నంబర్ బోగీ వద్దకు చేరుకుంది. అప్పటికే రైలు కదలడం ప్రారంభమైంది. రైలు బోగీ, ప్లాట్ఫాం మధ్య నలిగి.. పిల్లలను, లగేజీని హుటాహుటిన బోగీలోకి ఎక్కించి తాను ఎక్కేందుకు ఉపక్రమిస్తున్న సమయంలోనే రైలు వేగం పుంజుకుంది. దీంతో కాలుజారి కిందపడిన శ్వేత బోగీకి ప్లాట్ఫామ్ మధ్యలో ఇరుక్కుపోయి తీవ్ర గాయాలపాలై పట్టాల పక్కన పడిపోయింది. ప్రమాదాన్ని గుర్తించిన ప్రయాణికులు, పోలీసులు ఆమెను రక్షించే ప్రయత్నం చేస్తుండగానే అప్పటికే మృతి చెందింది. సమాచారం అందుకుని ఘటన స్థలానికి చేరుకున్న భర్త వెంకటేశ్ కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఆన్లైన్ టికెట్లో ప్రింట్ సరిగా పడని కారణంతోనే తన భార్య రైలు ప్రమాదానికి బలైందన్నాడు. శ్వేత మృతదేహానికి గాంధీ మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించారు. -
నలుగురా.. ఐదుగురా..?
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నో నెలలుగా చర్చోపచర్చలకు తావిస్తున్న మంత్రివర్గ విస్తరణపై హస్తిన వేదికగా మరోమారు కసరత్తు మొదలైంది. నీతి ఆయోగ్ భేటీలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, అక్కడే ఉన్న పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో ఆదివారం గంటపాటు చర్చించారు. ఆశావహుల సామాజిక వర్గాలు,స్థానిక బలాబలాలను పరిగణనలోకి తీసుకొని చర్చించారు. అయితే చర్చలు కొలిక్కి రాకపోవడంతో సోమవారం కూడా భేటీ కొనసాగనుంది. సామాజిక వర్గాలవారీగా విశ్లేషణ రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం పొందే నేతల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం దాదాపు ఖరారు చేసినట్లు తెలిసింది. అయితే తీసుకొనేది నలుగురినా లేక ఐదుగురినా? అనే అంశంపై స్పష్టత రాలేదు. గతంలో గుర్తించిన పేర్లపై మరోమారు చర్చించారు. ఇందులో మహబూబ్నగర్ జిల్లా నుంచి వాకిటి శ్రీహరి, నిజామాబాద్ జిల్లా నుంచి పి.సుదర్శన్రెడ్డి, నల్లగొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, బాలూనాయక్, రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, టి.రామ్మోహన్రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్సాగర్రావు, గడ్డం వివేక్, కరీంనగర్ జిల్లా నుంచి ఆదిశ్రీనివాస్, మైనారిటీ కోటాలో షబ్బీర్ అలీ, ఆమేర్ అలీఖాన్ల పేర్లు ఉన్నాయి. వారితోపాటే మహిళా కోటాలో ఎమ్మెల్సీ విజయశాంతి పేరును పరిశీలించినట్లు సమాచారం. ఇందులో ఓసీల నుంచి రెడ్డి అయితే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, సుదర్శన్రెడ్డిలతోపాటు వెలమ అయితే ప్రేమ్సాగర్రావు, ఎస్సీ అయితే గడ్డం వివేక్, ఎస్టీ అయితే బాలూనాయక్, శంకర్ నాయక్, ఓబీసీ నుంచి వాకాటి శ్రీహరి, విజయశాంతిల పేర్లు తుది పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. మైనారిటీ కోటాలో షబ్బీర్ అలీ, ఆమేర్ అలీఖాన్, ఫహీమ్ ఖురేïÙల పేర్లు ఉన్నాయి. నేడు రాహుల్ సమక్షంలో చర్చలు.. మంత్రివర్గ కూర్పుపై స్పష్టత రాకపోవడంతో కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ సోమవారం మరోసారి భేటీ కానున్నారు. కేసీ వేణుగోపాల్తోపాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాం«దీని వారిద్దరూ కలిసి మంత్రివర్గ అంశం, పీసీసీ కార్యవర్గంపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోనూ సమావేశమయ్యే అవకాశాలున్నాయి. ఈ భేటీల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి హైదరాబాద్కు తిరుగు ప్రయాణం వాయిదా పడింది. మంత్రివర్గ అంశంలో అధిష్టానం వద్ద గ్రీన్ సిగ్నల్ లభించాక సీఎం హైదరాబాద్ బయలుదేరనున్నారు. కాగా, కేసీ వేణుగోపాల్తో భేటీ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ అంశం, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపైనా చర్చ జరిగింది. -
ఈవీలు.. చార్జింగ్!
దేశవ్యాప్తంగా విద్యుత్ వాహనాల (ఈవీ) అమ్మకాలతోపాటు.. వాటి విద్యుత్ వినియోగమూ పెరుగుతోంది. 2024–25లో రికార్డు స్థాయిలో సుమారు 19.65 లక్షల ఈవీలు వినియోగదారుల చేతుల్లోకి వెళ్లాయి. ఈవీల కోసం ఏర్పాటుచేస్తున్న పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లు (పీసీఎస్) కూడా గత మూడేళ్లలో భారీగా పెరిగాయి. కేంద్ర విద్యుత్ సంస్థ (సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ – సీఈఏ) తాజా నివేదిక ప్రకారం.. ఈ స్టేషన్లలో చార్జింగ్ కోసం 2024–25లో వినియోగించిన విద్యుత్ 847 మిలియన్ యూనిట్లు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 82 శాతం అధికం కావడం గమనార్హం. పీసీఎస్లు వినియోగించిన విద్యుత్ విషయంలో తెలుగు రాష్ట్రాలు టాప్ – 7 జాబితాలో ఉన్నాయి.గతంలో ఎన్నడూ లేని విధంగా.. ఈవీల కోసం ఏర్పాటుచేసిన పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లలో (పీసీఎస్) దేశవ్యాప్త విద్యుత్ వినియోగం 2024–25లో 847.8 మిలియన్ యూనిట్లకు (ఎంయూ) చేరుకుంది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 82 శాతం ఎక్కువ. 2024 ఏప్రిల్ నెలలో వినియోగం 52.88 ఎంయూలు కాగా, 2025 మార్చిలో ఇది 60.7 శాతం పెరిగి 85 ఎంయూలకు చేరింది.తెలంగాణ@ 5.. ఏపీ @7కేంద్ర విద్యుత్ సంస్థ నివేదిక ప్రకారం పీసీఎస్లు వినియోగించే విద్యుత్లో ఢిల్లీ 38.69 శాతం వాటాతో ముందంజలో ఉంది. విస్తీర్ణంలో చిన్నదైనప్పటికీ, పీసీఎస్ల అధిక విద్యుత్ వినియోగానికి కారణం.. రాజధానిలో ఈవీల అమ్మకాలు దూసుకెళ్లడమే. మహారాష్ట్ర 25.57 శాతం, కర్ణాటక 9.39, గుజరాత్ 7.56 శాతాలతో ఆ తరువాతి స్థానాల్లో నిలిచాయి. తెలంగాణ 5వ స్థానంలోనూ, ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలోనూ నిలిచాయి. టాప్ – 4 మినహాయిస్తే.. మిగతా రాష్ట్రాలన్నీ కలిపి 18.78 శాతం విద్యుత్ను వినియోగించాయి.ఏటా 50,000 స్టేషన్లుభారత్లో 2025 ఏప్రిల్ 1 నాటికి ఉన్న ఈవీల పబ్లిక్ చార్జింగ్ స్టేషన్ల సంఖ్య 26,367. 2022 డిసెంబరుతో పోలిస్తే.. 2024 డిసెంబరు నాటికే వీటి సంఖ్య సుమారు ఐదింతలు కావడం విశేషం. కర్ణాటకలో అత్యధిక సంఖ్యలో 5,880 కేంద్రాలు ఉన్నాయి. మహారాష్ట్రలో 3,746, ఉత్తరప్రదేశ్లో 2,137, ఢిల్లీలో 1,951, తమిళనాడులో 1,524 స్టేషన్స్ పనిచేస్తున్నాయి. తెలంగాణలో 976, ఆంధ్రప్రదేశ్లో 616 స్టేషన్స్ ఉన్నాయి. 2030 నాటికి ప్రైవేట్ వాహనాల్లో 30 శాతం, వాణిజ్య వాహనాల్లో 70 శాతం, బస్సుల్లో 40 శాతం, ద్విచక్ర, త్రిచక్ర వాహనాల్లో 80 శాతం ఎలక్ట్రిక్వే ఉండాలని నీతి ఆయోగ్ లక్ష్యంగా నిర్దేశించింది. దీనికి అనుగుణంగా చార్జింగ్ నెట్వర్క్ను ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఆరేళ్లలో ఏటా దాదాపు 50,000 చార్జింగ్ పాయింట్ల చొప్పున ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అంతర్జాతీయ ఇంధన సంస్థ వెల్లడించింది.త్రీ వీలర్ల అమ్మకాల్లో నం.1ఈవీల అమ్మకాల్లో భారత్లో రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. 2024–25లో 17 శాతం వృద్ధితో 19,64,831 యూనిట్ల ఈవీలు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. ఇందులో టూ వీలర్స్ గతేడాదితో పోలిస్తే 21 శాతం పెరిగి 11,49,307 యూనిట్లు, త్రీ వీలర్స్ 10శాతం అధికమై 6,99,062 యూనిట్లను తాకాయి. 1,07,462 ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు జరిగాయి. ఎలక్ట్రిక్ త్రి చక్ర వాహనాల అమ్మకాల్లో రెండేళ్లుగా భారత్ ప్రపంచంలో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది.చైనా గత ఏడాది 3,00,000 ఎలక్ట్రిక్ త్రీవీలర్స్ను విక్రయించింది. ఈ–కామర్స్, క్విక్ కామర్స్ సంస్థలు సరుకు డెలివరీ కోసం ఈవీలను ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి. దీంతో ఈ విభాగంలో ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు అధికంగా అమ్ముడవుతున్నాయి. 2032 నాటికి 12.3 కోట్ల ఈవీలు భారతీయ రోడ్లపై పరుగు తీస్తాయని ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్, కస్టమైజ్డ్ ఎనర్జీ సొల్యూషన్స్ సంయుక్త నివేదిక వెల్లడించింది. 2013–14 నుంచి 2025 మార్చి వరకు భారత్లో 59.25 లక్షల యూనిట్ల ఈవీలు అమ్ముడయ్యాయి. ప్రస్తుతం 44 లక్షలు రోడ్లపై పరుగుతీస్తున్నాయి.2.5 నుంచి 3.5 రెట్లు తెలంగాణలో ఈ ఏడాది ఒక రోజులో నమోదైన గరిష్ఠ విద్యుత్ వినియోగం దాదాపు 339 ఎంయూ. అదే ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే సుమారు 240 ఎంయూ. అంటే తెలుగు రాష్ట్రాల ఒక రోజు విద్యుత్ వినియోగంతో పోలిస్తే సుమారు 2.5 నుంచి 3.5 రెట్లు ఎక్కువ విద్యుత్తును.. 2024–25లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు వినియోగించాయన్నమాట.ఈవీలు – చార్జింగ్ స్టేషన్లు⇒ గత ఆర్థిక సంవత్సరంలో అమ్ముడైన ఈవీలు సుమారు 19.65 లక్షలు⇒2022 డిసెంబరు నాటికి దేశవ్యాప్తంగా ఉన్న ఈవీ పబ్లిక్ చార్జింగ్ స్టేషన్స్ 5,151⇒ 2022 డిసెంబరు నాటికి దేశవ్యాప్తంగా ఉన్న ఈవీ పబ్లిక్ చార్జింగ్ స్టేషన్స్ 5,151⇒ ప్రస్తుతం తెలంగాణలో 976, ఏపీలో 616 కేంద్రాల⇒ 2013–14 నుంచి 2024–25 మధ్య అమ్ముడైనవి 59.25 లక్షల యూనిట్లు⇒ ప్రస్తుతం వినియోగంలో ఉన్నవి 44 లక్షలు -
బనకచర్లతో తెలంగాణకు భారీ నష్టం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సాగు నీటి ప్రయోజనాలు కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్రావు అన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు కడుతుంటే అడ్డుకోవలసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ఎంపీలు, కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, ఆ పార్టీ ఎంపీలు.. తమకేమీ పట్టనట్లుగా ఉన్నారని ధ్వజమెత్తారు. గోదావరి–బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. జల దోపిడీ మళ్లీ షురూ ఉమ్మడి పాలనలో సాగిన జల దోపిడీ, నేడు కాంగ్రెస్ పాలనలో మళ్లీ మొదలైందని, ఎప్పటిలాగే పదవుల కోసం పెదవులు మూసుకుంటున్నారని హరీశ్రావు విమర్శించారు. తెలంగాణ ప్రయోజనాలకు నీళ్లొదిలి సీఎం రేవంత్రెడ్డి గురు దక్షిణ చెల్లించుకుంటూ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని దుయ్యబట్టారు. బనకచర్ల ద్వారా 200 టీఎంసీల గోదావరి జలాలను తరలించుకుపోయేందుకు ఏపీ కుట్ర చేస్తోందన్నారు.ఇందుకు సహకరిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం..ఈ ప్రాజెక్టుకు వేల కోట్ల రూపాయలు ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని విమర్శించారు. నాడు తెలంగాణ ప్రాజెక్టులను రద్దు చేయాలని, అనుమతులు ఇవ్వొద్దని లేఖలు రాసిన చంద్రబాబు నేడు మిగులు జలాలను తీసుకుంటున్నట్లు చెప్పడం శోచనీయమన్నారు. ఏ ఒక్క అనుమతి లేకుండా, నిబంధనలు బుల్డోజ్ చేస్తూ, కేంద్రం జుట్టు తమ చేతిలో ఉందని ఏపీలో రాత్రికి రాత్రి పనులు చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. అనుమతుల్లేని ప్రాజెక్టుకు నిధులెలా ఇస్తారు? గత అసెంబ్లీలో నీతి అయోగ్ బహిష్కరిస్తాం అని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అందరి కంటే ముందే నీతి అయోగ్ మీటింగ్కు వెళ్లారని, బనకచర్లను అడ్డుకుంటారని భావిస్తే ఏమీ మాట్లాడకుండా వచ్చారని హరీశ్రావు ఎద్దేవా చేశారు. ఎలాంటి అనుమతులు లేని ప్రాజెక్టుకు 50 శాతం కేంద్రం గ్రాంటు ఇవ్వడంతో పాటు, మరో 50 శాతం ఎఫ్ఆర్బీఎంను మించి రుణం తీసుకునే వెసులుబాటు కల్పిస్తారని చెపుతున్నారని.. నిబంధనలు ఉల్లంఘించి నిర్మించే ప్రాజెక్టుకు ఇలా నిధులు, అనుమతులు, రుణాలు ఎలా ఇస్తారని నిలదీశారు. కిషన్రెడ్డి చొరవ చూపి ఈ ప్రాజెక్టును ఆపాలన్నారు. లేదంటే ఢిల్లీ సీడబ్ల్యూసీ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. తెలంగాణపై ఎందుకింత కక్ష? పోలవరానికి జాతీయ హోదా ఇచి్చ..కాళేశ్వరం, పాలమూరు, సీతారామ ప్రాజెక్టులకు ఎందుకు జాతీయ హోదా ఇవ్వరని హరీశ్రావు ప్రశ్నించారు. పోలవరానికి రూ.80 వేల కోట్లు, బనకచర్లకు రూ.80 వేల కోట్లు కలిపి రూ.1.6 లక్షల కోట్లు ఏపీకి ఇస్తున్నప్పుడు, తెలంగాణ ప్రాజెక్టులకు అందులో ఒక్క శాతం అయినా ఇచ్చారా? అని ప్రశ్నించారు. తెలంగాణపై బీజేపీకి ఎందుకింత కక్ష, సవతి తల్లి ప్రేమో అర్థం కావడం లేదన్నారు.కృష్ణాలో వాటా కోసం కేసీఆర్ పోరాటం చేసి సెక్షన్ 3ని సాధించారని,. కొత్త ట్రిబ్యునల్ సాధించారని చెప్పారు. గోదావరి మీద కూడా భవిష్యత్తులో కొత్త ట్రిబ్యునల్ వస్తుందని భావించి ప్రాణహితకు 160 టీఎంసీల నీటి కేటాయింపులు ఉంటే, కాళేశ్వరానికి 240 టీఎంసీల నీటి కేటాయింపులు చేసినట్లు తెలిపారు. ఈ విధంగా పలు ప్రాజెక్టులు చేపట్టి కొన్నింటిని పూర్తి చేశామని వివరించారు. కాంగ్రెస్ వాళ్లు ప్రాజెక్టులు పూర్తి చేయకుండా ఉండబట్టే నీళ్లు కిందకు వెళుతున్నాయని అన్నారు. -
ఆ విమర్శలపై స్పందించొద్దు
సాక్షి, హైదరాబాద్ : పార్టీలో అంతర్గత విభేదాలు అంటూ జరుగుతున్న ప్రచారం..విమర్శలకు పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదని, పార్టీలో వ్యక్తమయ్యే భిన్నాభిప్రాయాలపై తొందరపడి స్పందించొద్దని మాజీ సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సూచించారు. జూన్ 1న అమెరికాలోని డల్లాస్లో జరిగే పార్టీ రజతోత్సవ సభకు హాజరయ్యేందుకు కేటీఆర్ ఈనెల 28న హైదరాబాద్ నుంచి బయలుదేరనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఎర్రవల్లిలోని నివాసంలో కేసీఆర్తో కేటీఆర్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు.ఈ సందర్భంగా గత నెల 27న ఎల్కతుర్తిలో జరిగిన పార్టీ రజతోత్సవ సభ, అనంతరం జాతీయంగా, రాష్ట్రంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, వాటిపై బీఆర్ఎస్ స్పందిస్తున్న తీరుపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. పార్టీలో అంతర్గత విభేదాలు అంటూ జరుగుతున్న ప్రచారం, విమర్శలపై కేసీఆర్తో చర్చించారు. ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ, అమెరికా పర్యటన నుంచి వచి్చన తర్వాత కవిత చేసిన వ్యాఖ్యలు తదితర అంశాలు ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. పార్టీని బలోపేతం చేసేందుకు ఫోకస్ పెట్టాలని, అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. త్వరలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి సభ్యత్వ నమోదుకు సంబంధించిన మార్గదర్శకాలు ఇవ్వాలని కేటీఆర్ను ఆదేశించారు.డిజిటల్ సభ్యత్వ నమోదుకు సాంకేతికంగా జరుగుతున్న ఏర్పాట్లు, రూపొందిస్తున్న యాప్నకు సంబంధించిన వివరాలను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు డల్లాస్ సభలో ప్రసంగిచాల్సిన అంశాలపై ఇద్దరి మధ్య చర్చ సాగింది. తెలంగాణవాసులతో సభ అనంతరం జరపాల్సిన భేటీలపై ఈ సందర్భంగా కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. జూన్ 2న జరిగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను తెలంగాణ భవన్లో నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసే బాధ్యతను మండలిలో ప్రతిపక్ష నేత, పార్టీ సీనియర్ నేత మధుసూదనాచారికి అప్పగించాలని నిర్ణయించారు. -
గురుకులాలకు 'ఖాళీ' గుబులు!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో అద్దె బకాయిల అంశం గుబులు పుట్టిస్తోంది. దాదాపు పది నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం అద్దె చెల్లించక పోవడంతో భవనాలు ఖాళీ చేయాలంటూ ప్రిన్సిపాళ్లపై యజమానులు ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు అద్దెకు సంబంధించిన ఒప్పందం గడువు ముగియడంతో తమ భవనాలు తక్షణమే ఖాళీ చేయాలని ఇప్పటికే 63 గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్లకు యజమానులు కరాఖండిగా తేల్చిచెప్పినట్లు సమాచారం. దీంతో గురుకుల సంస్థల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రభుత్వ బకాయిలు పెద్దయెత్తున పేరుకుపోవడం, ప్రైవేటుకు ఇచ్చుకుంటే నెలా నెలా అద్దె ఠంఛనుగా వసూలు చేసుకోవచ్చని యజమానులు భావిస్తున్నట్లు తెలిసింది. మైనారిటీ గురుకులా ల్లోనూ అద్దెలు ఏడాదికి పైగా పెండింగ్లోనే ఉన్నాయి.అద్దె లేదు.. నిర్వహణ భారం గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లోని భవనాల యజమానులు ఎక్కువగా గురుకుల పాఠశాలలను ఖాళీ చేయాలని అధికారులకు స్పష్టం చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోని భవనాలకు మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో అద్దె సక్రమంగా రాని గురుకుల పాఠశాలలకు బదులుగా ఇతర ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు అద్దెకిస్తే అద్దె నెలవారీ వస్తుందని, పైగా ఎక్కువ మొత్తంలో డబ్బులు వచ్చే అవకాశం ఉందనే ఆలోచనతో యజమానులు తమ భవనాలు ఖాళీ చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. మరోవైపు ఏటా అద్దె పెంపు సైతం నిలిచిపోవడం కూడా ఇందుకు మరో కారణంగా కన్పిస్తోంది. ఇంకోవైపు భవనాలకు రెగ్యులర్ రిపేర్లు, కొన్ని గురుకులాల్లో తాగునీరు, ఇతర అవసరాలకు నీటిని ట్యాంకర్ల ద్వారా తెచ్చి సరఫరా చేయాల్సి ఉండటంతో యజమానులకు ఇబ్బందికరంగా మారుతోంది. నెలవారీ అద్దెబిల్లు రాకపోగా.. ప్రతినెలా సొంతంగా ఖర్చులు భరించాల్సి రావడంతో వాటిని ఖాళీ చేయించడమే ఉత్తమం అని రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు భవనాల యజమానులు భావిస్తున్నారు. 2025–26 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికల్లా భవనాలను ఖాళీ చేయాలని ఇప్పటికే ప్రిన్స్పల్స్కు స్పష్టం చేశారు. కొంతమంది యజమానులు ఇప్పటికే భవనాల గేట్లకు తాళాలు వేసినట్లు క్షేత్రస్థాయి సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అద్దె భవనాల్లో 662 గురుకులాలుప్రస్తుతం గురుకులాల అద్దె బకాయిలు రూ.215 కోట్లు పెండింగ్లో ఉన్నట్లు సొసైటీ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. కాగా యజమానులు గురుకుల సొసైటీలపై ఒత్తిడి చేస్తున్నప్పటికీ.. ప్రభుత్వం పైసా విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలోనే యజమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఐదు ప్రభుత్వ గురుకుల సొసైటీలున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నాలుగు గురుకుల సొసైటీలుండగా..విద్యాశాఖ పరిధిలో జనరల్ గురుకుల సొసైటీ ఉంది. వీటి పరిధిలో 1,023 గురుకుల పాఠశాలలు, కళాశాలలున్నాయి. ఇందులో 662 విద్యా సంస్థలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. వీటికి నెలకు సుమారు రూ.20 కోట్ల మేర అద్దె రూపంలో చెల్లించాల్సి ఉంది. అయితే గత 10 నెలలుగా అద్దె బిల్లులను ప్రభుత్వం విడుదల చేయక పోవడంతో మొత్తం బకాయిలు రూ.215 కోట్లకు చేరాయి. వీటిని విడుదల చేయాలంటూ అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నా ఫలితం లేదని యజమానులు చెబుతున్నారు. -
సైబర్ సస్పెక్ట్.. వెంటనే రిపోర్ట్ చేయండి
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాల నిరోధం దిశగా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్సీఆర్పీ) మరో కీలక ముందడుగు వేసింది. అనుమానాస్పద సోషల్ మీడియా ఖాతా, ఫోన్ నంబర్.. ఇలా మొత్తం ఎనిమిది అంశాలపై ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేసే అవకాశం ఇచి్చంది. దీనికోసం తన అధికారిక పోర్టల్లో (https:// cybercrime.gov.in) ప్రత్యేక విభాగంతో కూడిన లింక్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ లింక్ దుర్వినియోగానికి ఆస్కారం లేకుండా ప్రతి ఫిర్యాదుతోపాటు ఆధారాలను జత చేయడం తప్పనిసరి చేసింది. సైబర్ నేరాలకు అవే ఆధారం ఏ సీజన్లో.. ఆ ఫ్రాడ్ చేస్తూ అందినకాడికి కొల్లగొట్టే సైబర్ నేరగాళ్లకు ఫోన్ కాల్స్తోపాటు సోషల్మీడియా ఖాతాలే ఆధారం. డార్క్ వెబ్తోపాటు వివిధ మార్గాల్లో లక్షల్లో ఫోన్నంబర్లను సంప్రదిస్తున్న సైబర్ నేరగాళ్లు వీటి ఆధారంగానే ఎర వేస్తున్నారు. బల్క్ విధానంలో సందేశాలు పంపుతూ, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం (ఐవీఆర్ఎస్) కాల్స్ చేస్తూ తమ పని ప్రారంభిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో నకిలీ వెబ్సైట్లు ఏర్పాటు చేసి, వర్చువల్ మొబైల్ యాప్స్ను లింకుల ద్వారా టార్గెట్ చేసిన వ్యక్తికి పంపి అందినకాడికి దండుకుంటున్నారు. వీరు వినియోగించే సిమ్కార్డులు, బ్యాంకు ఖాతాలు సహా ప్రతీదీ నకిలీ పేర్లు, చిరునామాలతోనే ఉంటున్నాయి. ఇప్పటి వరకు నేరం జరిగాకే... సైబర్ నేరాల బారిన పడినవారు ఫిర్యాదు చేయడానికి, సహాయసహకారాలు పొందడానికి ఎన్సీఆర్పీ పోర్టల్ పనిచేస్తోంది. ఈ వెబ్సైట్తో పాటు టోల్ఫ్రీ నంబరు1930 ద్వారా బాధితులు ఫిర్యాదు చేసే అవకాశముంది. ఇలా వచి్చన ఫిర్యాదుల ఆధారంగా నేరగాళ్లు వినియోగించిన సెల్నంబర్, బల్క్ పోర్టల్, వెబ్సైట్, బ్యాంకు ఖాతా సహా వివిధ అంశాలను పోర్టల్ నిర్వాహకులతోపాటు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) దృష్టికి వెళుతున్నాయి. ఇలా ఆయా నేరగాళ్లు వినియోగించిన వాటిని గుర్తిస్తున్న అధికారులు వాటిని కేసుల దర్యాప్తునకు ఆధారంగా మార్చుకుంటున్నారు. ఆపై వీటికి సంబంధించిన జాబితాలను రూపొందించి సంబంధిత విభాగాలు, మంత్రిత్వ శాఖలు, బ్యాంకుల ద్వారా బ్లాక్ చేయిస్తున్నారు. ఒకేసారి ఎందరినో టార్గెట్ చేస్తూ... ఇదంతా నేరం జరిగిన తర్వాత, ఆ నేరంలో కొందరు బాధితులుగా మారిన తర్వాత జరుగుతోంది. అలాకాకుండా సైబర్ నేరం చేయడానికి ముందే ఆ కేటుగాళ్లు ఎర వేయడం మొదలెట్టడంతోనే వీటిని బ్లాక్ చేయాలని ఎన్సీఆర్పీ నిర్ణయించుకుంది. ఓ వ్యక్తిని టార్గెట్ చేసిన తర్వాత నేరగాళ్లు కొన్నిరోజుల పాటు వారితో సంప్రదింపులు జరుపుతుంటాడు. వ్యవస్థీకృతంగా నేరం చేయడానికి కాల్ సెంటర్లు సైతం ఏర్పాటు చేసుకుంటున్న నేరగాళ్లు ఒకేసారి అనే క మందితో సంప్రదింపులు జరుపుతున్నారు.వీరిలో కొందరే వారి వల్లో పడతారు. ఆదిలోనే ప్రజల నుంచి సమాచారం సేకరించి వారి ఫోన్నంబర్ తదితరాలను బ్లాక్ చేస్తే బాధితుల సంఖ్య తగ్గే అవకాశముందని ఎన్సీఆర్పీ నిర్ణయించింది. దీంతో తన పోర్టల్లోని ‘రిపోర్ట్ అండ్ చెక్ సస్పెక్ట్’ ( https:// cybercrime.gov.in/webform/cyber&suspect.) విభాగంలో వెబ్సైట్, వాట్సాప్ నంబర్/టెలి గ్రాం హ్యాండ్లర్, ఫోన్ నంబర్, ఈ–మెయిల్ ఐడీ, ఎస్ఎంఎస్ నంబర్/హ్యాండ్లర్, సోషల్మీడియా యూఆర్ఎల్, డీప్ ఫేక్, మొబైల్ యాప్లపై ఫిర్యాదు చేసే అవకాశం ఇచి్చంది. -
ఆటల్లో మేటి.. కష్టాలు కోటి
సాక్షి, సిద్దిపేట: ఆటలపై మక్కువ అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. ఆర్థిక ఇబ్బందులు మాత్రం పాతాళానికి లాగుతున్నాయి. సిద్దిపేట జిల్లా అక్బర్పేట–భూంపల్లి మండటం జంగాపల్లికి చెందిన బేస్బాల్ క్రీడాకారిణి పోసానిపల్లి సౌమ్యారెడ్డి పరిస్థితి ఇది. చైనాలో నవంబర్లో జరిగే బేస్బాల్ మహిళా ఆసియా కప్లో పాల్గొనే భారత జట్టులో ఆమె చోటు సంపాదించింది. ఇటీవల బ్యాంకాక్లో జరిగిన ఆసియా కప్ క్వాలిఫైయింగ్ పోటీలలో భారత జట్టు సిల్వర్ మెడల్ సాధించడంలో సౌమ్యారెడ్డి కీలకపాత్ర పోషించింది. చిన్నప్పటి నుంచి ఆటలే లోకం సౌమ్యారెడ్డి తల్లిదండ్రులు ప్రతాప్రెడ్డి, కవిత. వీరికి ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు సౌమ్యారెడ్డి, చిన్న కూతురు మాధురి. సౌమ్య క్రీడల్లో రాణిస్తుండటంతో మంచి శిక్షణ ఇప్పించేందుకు హైదరాబాద్కు మకాం మార్చారు. ప్రతాప్రెడ్డి ఇళ్లకు పెయింటింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సౌమ్యకు చిన్నప్పటి నుంచి ఆటలే లోకం. 8వ తరగతి చదువుతున్నప్పుడే త్రో బాల్ నేషనల్స్ ఆడింది. సాఫ్ట్బాల్, క్రికెట్, బేస్బాల్ ఆటలో సైతం రాణిస్తోంది. హైదరాబాద్ పీజీ గ్రౌండ్లో బేస్బాల్ కోచింగ్ తీసుకుంది. ఇప్పటివరకు బేస్బాల్లో 12 నేషనల్స్ ఆడింది.అండర్ –19 క్రికెట్తోపాటు సాఫ్ట్బాల్ 15 నేషనల్స్లలో పాల్గొంది. నవంబర్లో చైనాలో జరిగే ఆసియా కప్లో పాల్గొనే భారత జట్టుకు ఇటీవల ఎంపికైంది. అయితే, పేద కుటుంబం కావటంతో ప్రయాణ ఖర్చులు భారంగా మారాయి. పోటీలలో పాల్గొనేందుకు నెల రోజుల ముందే చైనాకు చేరుకుని ప్రాక్టీస్ చేయాలి. ప్రయాణం ఖర్చులతో పాటు అక్కడ నెలపాటు ఉండేందుకు దాదాపు రూ.5 లక్షల వరకు అవసరం. అంతమొత్తం భరించే స్తోమత ఆ కుటుంబానికి లేకపోవటంతో సౌమ్య నిరాశలో కూరుకుపోయారు.ఇండియాకు మెడల్స్ తీసుకొస్తా ఇండియా తరఫున ఆడి మెడల్స్ తీసుకువస్తా. చైనాలో జరిగే ఆసియా కప్ను గెలుపొందేందుకు కృషి చేస్తా. చైనాకు వెళ్లాలంటే ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది. హైదరాబాద్లో బేస్బాల్ శిక్షణ, ప్రాక్టీస్ కోసం రోజు 14 కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్తున్నాను. నన్ను ప్రోత్సహిస్తున్న బేస్బాల్ అసోసియేషన్¯ ప్రధాన కార్యదర్శి శ్వేత, కోచ్ చిన్న, ఖాదర్, షానవాజ్లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. – సౌమ్యారెడ్డి, బేస్బాల్ క్రీడాకారిణి. బ్యాంకాక్కు బంగారం కుదువపెట్టి పంపించాం బ్యాంకాక్ పోటీల్లో పాల్గొనేందుకు దాదాపు రూ.3.5 లక్షలు ఖర్చు అయింది. మా బిడ్డ లక్ష్యంకు చేరుకునేందుకు మా దగ్గర ఆర్థిక స్తోమత లేనప్పటికీ బంగారం బ్యాంకులో కుదువపెట్టి ఆ డబ్బుతో పంపించాము. కొంత అప్పు కూడా చేశాం. నవంబర్లో చైనా వెళ్లేందుకు రూ.5 లక్షలు అవుతుందని తెలిసింది. అంత ఖర్చు భరించే స్తోమత మాకు లేదు. ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఆదుకోవాలి. – సౌమ్య తల్లిదండ్రులు ప్రతాప్రెడ్డి, కవిత -
దాయాది సైబర్ వార్కు చెక్
సాక్షి, హైదరాబాద్: తూటాలు, క్షిపణులు, డ్రోన్లు, ఎయిర్ డిఫెన్స్ సిస్టం... ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్లోని ముష్కరులపై భారత్ సాగించిన కైనెటిక్ వార్ ఫేర్ ఇది. కానీ వర్చువల్ వరల్డ్లో మరో పెద్ద యుద్ధమే జరిగింది. ‘ఆపరేషన్ బనియన్ ఉమ్ మార్సూస్’పేరుతో పాకిస్తాన్ పన్నిన కుయుక్తుల్ని భారత ఏజెన్సీలు సమర్థంగా తిప్పికొట్టాయి. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్ర దాడి జరగ్గా మే 7న ఆపరేషన్ సిందూర్ మొదలవడం తెలిసిందే. దీనికి ప్రతిస్పందనగా మే 10 నుంచి తాము ఆపరేషన్ మార్సూస్ను చేపట్టినట్లు పాక్ హ్యాకర్లు వర్చువల్ వరల్డ్లో ప్రచారం చేసుకున్నారు. కానీ వాస్తవానికి పహల్గాం దాడి జరిగిన మర్నాడే సైబర్ ఎటాక్స్ మొదలైనట్లు మన నిఘా వర్గాలు గుర్తించాయి. ఐదు దశల్లో ఇవి జరిగాయని, భారత ఏజెన్సీలతోపాటు ఎథికల్ హ్యాక్టివిస్టులు వాటిని సమర్థంగా తిప్పికొట్టారని తాజాగా వెల్లడించాయి. సందేశాలతో మొదలుపెట్టి డాస్, డీడాస్... పాకిస్తాన్కు చెందిన హ్యాకర్లు సైబర్ దాడుల్ని వివిధ పంథాల్లో చేపట్టినట్లు మన ఏజెన్సీలు గుర్తించాయి. గత నెల 23 నుంచి 26 వరకు జరిగిన మొదటి దశలో పాక్ హ్యాకర్లు ముఠాలుగా ఏర్పడి సైబర్ దాడులు చేశారు. హ్యాక్టివిస్టులుగా పిలిచే ఈ ముష్కరులు చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, స్కూళ్లు, కళాశాలలతోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన అధికారిక వెబ్సైట్లను టార్గెట్ చేశారు. కేవలం తమ స్లోగన్లు, రెచ్చగొట్టే సందేశాలు ప్రదర్శించడానికే వారు ప్రాధాన్యం ఇచ్చారు.ఏప్రిల్ 27 నుంచి మే 2 వరకు జరిగిన రెండో దశ సైబర్ ఎటాక్తో తీవ్రత పెరిగింది. అందులో ఈ–సేవ, ఈ–గవర్నెన్స్తోపాటు ప్రజాసేవలకు సంబంధించిన వెబ్సైట్లను లక్ష్యంగా చేసుకున్నారు. ప్రత్యేక ప్రోగ్రామింగ్ కలిసిన మాల్వేర్ను పంపడం ద్వారా వెబ్సైట్లు కుప్పకూలేలా చేయాలని ప్రయతి్నంచారు. వాటినే సాంకేతికంగా డాస్ (డినైయల్ ఆఫ్ సర్విసెస్), డీడాస్ (డ్రిస్టిబ్యూటెడ్ డినైయల్ ఆఫ్ సర్విసెస్) ఎటాక్స్ అని వ్యవహరిస్తుంటారు. మూడో దశలో ర్యాట్లను పంపిస్తూ... పాక్ హ్యాకర్లు మే 3 నుంచి మే 6 మధ్య మూడో దశలో రిమోట్ యాక్సెస్ ట్రోజన్ (ర్యాట్) విధానంలో ఫిషింగ్, స్పియర్ ఫిషింగ్ తరహా సైబర్ ఎటాక్స్ చేశారు. ఈ–మెయిల్స్, వాట్సాప్ సందేశాల్లో మాల్వేర్ను జోడించి పంపారు. దీన్ని ఎవరైనా క్లిక్ చేస్తే వారి ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు హ్యాకర్ల అ««దీనంలోకి వెళ్లిపోతాయి. ఆ డేటా మొత్తాన్ని లాక్ చేసి ఎన్క్రిప్ట్ చేసే అవకాశం వారికి వస్తుంది. దీన్ని డీక్రిప్ట్ చేయడానికి క్రిప్టో కరెన్సీ డిమాండ్ చేస్తారు. ఆ దశలో ఆయిల్, గ్యాస్ ఇండస్ట్రీ, తయారీ రంగంలో ఉన్న సంస్థలు టార్గెట్గా మారాయి. మే 7 నుంచి 12 వరకు సాగిన నాలుగో దశ ఎటాక్స్లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) టార్గెట్గా మారింది. అడ్వాన్డ్స్ ప్రెసిస్టెంట్ థ్రెట్ 36 (ఏపీటీ 36) పేరుతో నిష్ణాతులైన హ్యాకర్ల సమూహం ఈ దాడుల్ని చేసింది. పాక్కు మద్దుతుగా ఐదు దేశాల హ్యాకర్లు... ఈ నెల 12 నుంచి దాదాపు 10 రోజులపాటు సాగిన ఐదో దశ సైబర్ ఎటాక్స్లో పాక్ హ్యాక్టివిస్టులకు చైనా, తుర్కియే, ఇరాన్, ఉత్తర కొరియా హ్యాకర్లూ తొడయ్యారు. వారంతా కలిసి ఏపీటీ 36తోపాటు ఏపీటీ 10, ఏపీటీ 28, మడ్డీ వాటర్, లజారస్ పేర్లతో సమూహాలుగా ఏర్పడ్డారు. ప్రజాసేవల రంగాలను దెబ్బతీయాలని ప్రయత్నించారు. టెలికమ్యూనికేషన్స్, పవర్ గ్రిడ్, బ్యాంకింగ్ రంగాలను లక్ష్యంగా చేసుకొని సైబర్ ఎటాక్స్ చేశారు. ఇందుకోసం ఒపేక్ డ్రాకో, మాకింగ్ డ్రాకో, సైడ్ వైండర్, టీమ్ ఇన్సానే పీకే, టీమ్ అజ్రేల్–ఎంజెల్ ఆఫ్ డెత్, సైలెంట్ సైబర్ ఫోర్స్ పేర్లతో బృందాలుగా ఏర్పడ్డారు. భారత ఏజెన్సీలు, మన ఎథికల్ హ్యాక్టివిస్టులు విదేశీ సైబర్ దాడులను సమర్థంగా తిప్పికొట్టడంతో దేశీయ సంస్థలకు భారీ నష్టం ఏమీ వాటిల్లలేదు. సైబర్ దాడుల ముప్పు ఇంకా కొనసాగొచ్చని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
బుల్లెట్ రైలు వస్తోందీ..
దేశీయ ప్రయాణికుల రవాణా వ్యవస్థలో వందే భారత్ రైలు ఒక పెద్ద ముందడుగు. సౌకర్యవంత ప్రయాణ అనుభూతికి ఈ రైలు ప్రసిద్ధి. గంటకు గరిష్ఠంగా 180 కిలోమీటర్ల వేగంతో కూడా ప్రయాణించగలదు. దీన్ని మించిన వేగంతో దూసుకుపోయే ‘హై స్పీడ్ రైల్’ కొద్దిరోజుల్లో పట్టాలెక్కనుంది. భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక ముంబై–అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ (ఎంఏహెచ్ఎస్ఆర్) ప్రాజెక్టు వేగం పుంజుకుంది. 2026 నాటికి పాక్షిక కార్యకలాపాలు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. అన్నీ అనుకూలిస్తే 2028 నాటికి ప్రాజెక్ట్ పూరై్త బుల్లెట్ రైల్ దూసుకెళ్లనుంది. తద్వారా ప్రపంచంలో హై స్పీడ్ రైల్ వ్యవస్థ కలిగిన అతికొద్ది దేశాల సరసన భారత్ నిలవనుంది. – సాక్షి, స్పెషల్ డెస్క్హైస్పీడ్ రైలు ప్రాజెక్టు కోసం 300 కి.మీ. వయాడక్ట్లు పూర్తయినట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల తెలిపారు. ముంబై–అహ్మదాబాద్ కారిడార్ పొడవు 508 కిలోమీటర్లు. బుల్లెట్ రైలు గంటకు 320 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణించనుంది. ముంబైలో మొదలై సూరత్, వడోదర, అహ్మదాబాద్ స్టాప్స్నకు పరిమితమైతే చివరి స్టాప్ అయిన సబర్మతికి 2 గంటల 7 నిమిషాల్లోనే ఈ రైలు చేరనుంది. అన్ని స్టాప్స్లోనూ ఆగితే 2 గంటల 58 నిమిషాల సమయం తీసుకుంటుంది. ఈ కారిడార్లో 12 స్టేషన్లు ఉన్నాయి. వీటిలో గుజరాత్లో ఎనిమిది, మహారాష్ట్రలో నాలుగు ఉన్నాయి. ముంబై స్టేషన్స్ భూగర్భంలో నిర్మిస్తుండగా మిగిలిన థానే, విరార్, బోయిసర్, వాపి, బిలిమోరా, సూరత్, భరూచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్, సబర్మతి వద్ద ఎలివేటెడ్ స్టేషన్స్ రానున్నాయి.సముద్రగర్భ రైల్ టన్నెల్..బుల్లెట్ రైలు కారిడార్లో 21 కిలోమీటర్ల పొడవైన సముద్రగర్భ రైల్ టన్నెల్ ప్రత్యేక ఆకర్షణ. ఇది ముంబై–థానే మధ్య ఏర్పాటవుతోంది. ఇందులో భారత్లోనే మొట్టమొదటి 7 కి.మీ. పొడవైన సముద్రగర్భ సొరంగం కూడా ఉంది. 13.1 మీటర్ల వ్యాసం కలిగిన ఒకే ట్యూబ్ సొరంగంలో రెండు ట్రాక్లు ఉంటాయి. ముంబై–అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్టులో 465 కి.మీ. మేర ఎలివేటెడ్ కారిడార్ ఉంటుంది. ప్రధానంగా ఫుల్ స్పాన్ లాంచింగ్ మెథడ్ ఉపయోగించి నిర్మిస్తున్నారు. వయాడక్ట్ నిర్మాణంలో ఉపయోగించే సంప్రదాయ సెగ్మెంటల్ నిర్మాణ సాంకేతికత కంటే ఇది 10 రెట్లు వేగంగా ఉంటుంది. ఈ ప్రత్యేకమైన నిర్మాణ పద్ధతిని దేశంలో మొదటిసారిగా ఉపయోగిస్తున్నారు. ఈ సాంకేతికతను ఉపయోగించే, నైపుణ్యం సాధించిన ప్రపంచంలోని అతి కొద్ది దేశాలలో భారత్ ఒకటి.ట్రయల్ రన్ గుజరాత్లో..ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్న నేషనల్ హై–స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రకారం.. 383 కి.మీ. పీయర్ పనులు, 401 కి.మీ. ఫౌండేషన్, 326 కి.మీ. గర్డర్ క్యాస్టింగ్ కూడా పూర్తయ్యాయి. ఇప్పటివరకు రూ.67,486 కోట్లు ఖర్చయ్యాయి. ప్రాజెక్టు పూర్తి అయ్యేసరికి వ్యయం భారీగా పెరిగే అవకాశం ఉంది. 2026లో మొదటి ట్రయల్ రన్ గుజరాత్లో 50 కి.మీ.లో నిర్వహించనున్నారు. ఢిల్లీ–వారణాసి, చెన్నై–మైసూరు వంటి కారిడార్లలో హెచ్ఎస్ఆర్ ప్రాజెక్ట్ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరుగుతోంది. ముంబై–హైదరాబాద్, ఢిల్లీ–అçßæ్మదాబాద్ కారిడార్లు పరిశీలనలో ఉన్నాయి.ఆటంకాలు దాటుకుని..కోవిడ్–19 మహమ్మారి, మహారాష్ట్రలో భూసేకరణ, అనుమతుల జాప్యం.. వంటి కారణాలు బుల్లెట్ రైలు ప్రాజెక్టును రెండున్నరేళ్లు వెనక్కి నెట్టాయి. మౌలిక సదుపాయాలు, రోలింగ్ స్టాక్, సిగ్నలింగ్ వ్యవస్థ ఖరీదు భారం కావడం వంటి సవాళ్లను ఎదుర్కొంది. భారత రైల్వేల సొంత ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, ప్రభుత్వ అధీనంలో ఉన్న బీఈఎంఎల్ను సంయుక్తంగా 280 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రెండు ప్రోటోటైప్ రైలు సెట్లను (ఒక్కొక్కటి ఎనిమిది కార్లు) రూపొందించి తయారు చేయడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది.ఆర్థిక సహాయంతోపాటు భారత్లో సమాచార సేకరణ, పరీక్షల కోసం రెండు షింకన్సెన్ రైళ్లను (జపాన్ బుల్లెట్ రైళ్లు) 2026 నాటికి జపాన్స్ ఇంటర్నేషనల్ కో–ఆపరేషన్స్ ఏజెన్సీ (జికా) ఉచితంగా సరఫరా చేయనుంది. సిగ్నలింగ్ వ్యవస్థకు ప్రత్యామ్నాయాలను అందించేందుకు ఆల్స్టమ్–ఎల్అండ్టీ, డీఆర్ఏ–సీమెన్స్ ్స జాయింట్ వెంచర్లు టెండర్ల కోసం బిడ్డింగ్ చేస్తున్నాయి.హెచ్ఎస్ఆర్గా పరిగణించాలంటే..హై–స్పీడ్గా పరిగణించాలంటే రైళ్లు వాటి కోసం ప్రత్యేకంగా కేటాయించిన ట్రాక్లపై గంటకు 250 కి.మీ. కంటే ఎక్కువ వేగంతో వెళ్లాలి. సాధారణంగా వీటికి నూతన, ప్రత్యేకంగా రూపొందించిన మార్గాలు అవసరం. కొన్ని హెచ్ఎస్ఆర్ వ్యవస్థలు ప్రస్తుత నెట్వర్క్లోని కొంత ట్రాక్లను ఉపయోగిస్తాయి. అధిక వేగానికి తగ్గట్టుగా ట్రాక్లలో మార్పు, సిగ్నలింగ్ను మెరుగుపరచడం వంటివి చేయాల్సి ఉంటుంది. కఠిన భద్రతా ప్రమాణాలు, తగినంత విద్యుత్ సరఫరా, శిక్షణ పొందిన ఆపరేటింగ్ సిబ్బంది, మెరుగైన నిర్వహణ తప్పనిసరి.వాటి అనుభవాల నుంచి..జపాన్, ఫ్రాన్స్ ్స, జర్మనీతో సహా అభివృద్ధి చెందిన దేశాల్లో హై స్పీడ్ రైల్ నెట్వర్క్ ఉంది. ప్రపంచంలో అతిపెద్ద హెచ్ఎస్ఆర్ నెట్వర్క్ ఉన్న దేశం చైనా. ఇండోనేషియా, ఉజ్బెకిస్తాన్ వంటి మధ్య ఆదాయ దేశాలు సైతం హెచ్ఎస్ఆర్ జాబితాలో ఉన్నాయి. ఇప్పటికే హెచ్ఎస్ఆర్ నెట్వర్క్లను కలిగి ఉన్న దేశాల్లో పరిస్థితులపై పూర్తిస్థాయిలో మనం అధ్యయనం చేయాలి. అలాగే బుకింగ్స్ సమస్యలు (ఉజ్బెకిస్తాన్స్ ), భారీ నిర్వహణ వ్యయాలు (చైనా), శబ్ద కాలుష్యం (జపాన్స్ ) వంటి విషయాల్లో ఈ నెట్వర్క్లు ఎదుర్కొన్న విమర్శలపైనా దృష్టిపెట్టాలి. అప్పుడే మన బుల్లెట్ రైలు బ్రేకులు లేకుండా యమస్పీడుగా దూసుకెళ్తుంది.రూ.లక్ష కోట్ల ప్రాజెక్టుముంబై–అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ (ఎంఏహెచ్ఎస్ఆర్) ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,08,000 కోట్లు. ఇందులో 81 శాతం నిధులను జపాన్స్ ఇంటర్నేషనల్ కో–ఆపరేషన్స్ ఏజెన్సీ (జికా) ద్వారా జపాన్స్ ప్రభుత్వం సమకూరుస్తోంది. ఈ ప్రాజెక్టులో రైల్వే మంత్రిత్వ శాఖకు 50 శాతం, మహారాష్ట్ర, గుజరాత్కు చెరి 25 శాతం వాటా ఉంది. మొత్తం 1,389.5 హెక్టార్ల భూమిని సమీకరించారు.బుల్లెట్ రైల్.. ఇతర హైలైట్స్⇒ ముంబై–అహ్మదాబాద్ కారిడార్ పొడవు 508 కిలోమీటర్లు.⇒ బుల్లెట్ రైలు గరిష్ఠ వేగం గంటకు 320 కి.మీ.⇒ 2028 నాటికి దూసుకెళ్లనున్న బుల్లెట్ రైల్⇒ పరిమిత స్టాప్స్తో 2 గంటల 7 నిమిషాల్లోనే ప్రయాణం⇒ అన్ని స్టాప్స్లో ఆగితే 2 గంటల 58 నిమిషాల సమయం -
బీసీల సాధికారతపై నేడు కాంగ్రెస్ సమావేశం
సాక్షి, న్యూఢిల్లీ: బీసీల సాధికారతపై కాంగ్రెస్ పార్టీ సోమవారం కీలక సమావేశం నిర్వహించనుంది. ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో కాంగ్రెస్ అగ్రనేత, రాహుల్గాం«దీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేల నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. దేశవ్యాప్తంగా ఉన్న తాజా, మాజీ పీసీసీ అధ్యక్షులు, బీసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకావాలని ఇప్పటికే అధిష్టానం ఆదేశించింది. టీపీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ రెండురోజుల క్రితమే కులగణనపై కాంగ్రెస్ అధిష్టానానికి ఇందిరాగాంధీ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం తెలిసిందే.అప్పటి నుంచి ఆయన ఢిల్లీలోనే ఉన్నారు. సోమవారం జరిగే సమావేశంపై కాంగ్రెస్ పెద్దలతో కలిసి చర్చల్లో పాల్గొంటారు. తెలంగాణలోని బీసీ మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఈ భేటీకి హాజరవుతారు. ఆదివారం మాణిక్యం ఠాగూర్, మహేశ్గౌడ్ సహా పలువురు నేతలు కులగణనకు సంబంధించి సమావేశ నిర్వహణపై చర్చించారు. కులగణనపై దేశవ్యాప్తంగా వర్క్షాపులు నిర్వహించాలని అధిష్టానం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది.రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఇచి్చన హామీ మేరకే తెలంగాణలో కులగణన సర్వే జరిగిందని, కాంగ్రెస్ ఒత్తిడి వల్లే కేంద్రం కులగణన ప్రకటన చేసిందనే అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఏఐసీసీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ లేదా బిహార్లో కులగణన ప్రకటనలో కీలకపాత్ర పోషించిన రాహుల్కు ధన్యవాద సభ, భారీ ర్యాలీ నిర్వహించాలని యోచిస్తోంది. -
కేబినెట్లో బీసీలే అత్యధికంగా ఉండాలి
సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో జరగబోయే రాష్ట్ర మంత్రివర్గ విస్తర ణలో అత్యధిక శాతం బీసీలు ఉండాలని అధిష్టానాన్ని కోరుతున్నట్టు టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ తెలిపారు. టీపీసీసీ కార్యవర్గంలో కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీ, మైనారిటీలకు 70% వరకు అవకాశం ఇవ్వబోతున్నామని స్పష్టం చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్గాంధీ కోరుకున్న విధంగా అందరికీ సమాన భాగస్వామ్యం ఉంటుందన్నారు.ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా బీసీ నినాదం అనేది దేశవ్యాప్తంగా అంటుకుందని చెప్పారు. రా హుల్ జాతీయస్థాయిలో ఓబీసీల విషయంలో గొంతెత్తడంతో కొంత చలనం వచ్చిందని.. దానికి తెలంగాణ దిక్సూచి గా మారిందన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మహేశ్గౌడ్ రాష్ట్ర తాజా రాజకీయాలు, ఇతర అంశాలపై ఆదివారం ‘సాక్షి’తో ముచ్చటించారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే... మా అభిప్రాయాలను అధిష్టానానికి చెప్పాం ‘మంత్రివర్గ కూర్పు విషయంలో ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డి, నేను, సీనియర్ నాయకులమంతా మా అభిప్రాయాలను ఏ ఐసీసీకి చెప్పాం. జూన్లో అధిస్టానం తుది నిర్ణయం ప్రకటిస్తుందని అనుకుంటున్నాం. వీలైనంత త్వరగా కేబినెట్, టీపీసీసీ కార్యవర్గ విస్తరణ జరగాలని కోరుకుంటున్న వారిలో నేను మొదటి వ్యక్తిని. ప్రభుత్వ, పార్టీపరమైన పదవుల్లో మహిళలకు ప్రాధాన్యం ఉంటుంది. నేను, రేవంత్ జోడెడ్లలా పనిచేస్తున్నాం నాకు..రేవంత్రెడ్డి మధ్య సఖ్యత ఉంది. ముఖ్యమంత్రిగా ఆయన, టీపీసీసీ అధ్యక్షుడుగా నేను జోడెడ్లలాగా పనిచేస్తున్నాం. అలా చేస్తేనే పార్టీకి నష్టం జరగకుండా ముందుకు పోతుంది. అంతా ఐక్యంగా ఉన్నారనే విశ్వాసంతోనే ప్రజలు మాకు అధికారం కట్టబెట్టారు. వారి ఆకాంక్షలు, ఆశయాల మేరకు మేము పనిచేయాల్సిందే. ఒత్తిళ్తు, విభేదాలున్నా, వాటిని పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా ముందుకు పోతున్నాం. ఆ పార్టీ వ్యవహారాన్ని రాజకీయంగా మలచుకోం కవిత ఎపిసోడ్తో రేవంత్రెడ్డికి, కాంగ్రెస్కు ఎలాంటి సంబంధం లేదు. అందులో తలదూర్చాల్సిన అవసరమూ లేదు. ఆ తతంగాన్ని రాజకీయంగా మలచుకోవాలనే దురుద్దేశం మాకు లేదు. వాళ్ల ఆస్తుల పంపకాలకుగానీ, పదవుల పంపకాలకు గానీ మమ్మల్ని వారు పిలవలేదు. ఆమె లేఖ రాసేవరకు అందరూ ప్రేమగానే ఉంటున్నారని అనుకున్నాం. ఇప్పు డు లుకలుకలు బయటపడ్డాయి. కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, బండి ఏం వెలగబెట్టారు? తెలంగాణ పట్ల మోదీ ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపిస్తోంది. రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్రమంత్రులు ఉన్నారు. రాష్ట్రం కోసం వీరు వెలగబెట్టిందేమిటి? ఏపీకి ఇచ్చినంత బడ్జెట్ కూడా తెలంగాణకు ఇవ్వలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల కేంద్రం, రాష్ట్రం మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి. రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాకుండా పోయాయి. నష్టం జరిగింది. విభజన హామీలు, కేంద్రం నుంచి రావాల్సిన రూ.వేల కోట్ల బకాయిల గురించి బీజేపీ నేతలు పట్టించుకోవడం లేదు. రాష్ట్ర ప్రయోజనాల మేరకే పోలవరం ప్రాజెక్టుకు సహకారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అభివృద్ధి జరగాలని కాంగ్రెస్ కోరుకుంటోంది. అయితే తెలంగాణ నీటివాటా విషయం, రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలగకుండా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకుంటామంటే అందుకు సహకరిస్తాం. అందులో తప్పేముంది? రాష్ట్రమే మాకు ముందు ప్రాముఖ్యం’అని మహేశ్గౌడ్ చెప్పారు. -
పరిశ్రమలు రాష్ట్రం దాటకుండా చూడండి
సాక్షి, హైదరాబాద్: యువతకు ఉపాధి కల్పించడంతో పాటు ఖజానాకు ఆదాయం సమకూర్చే పరిశ్రమలు రాష్ట్రం దాటకుండా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఆదివారం ప్రజాభవన్లో పారిశ్రామిక పెట్టుబడులకు ప్రోత్సాహంపై సబ్ కమిటీ సమావేశం జరిగింది. కమిటీ సభ్యులైన మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో పెట్టుబడులకు ప్రోత్సాహం, ఇప్పటికే చేసుకున్న ఎంవోయూల అమలులో ప్రగతి, కొత్త యూనిట్ల స్థాపనకు సంబంధించిన అంశాలపై చర్చించారు.ఒక పరిశ్రమ స్థాపిస్తే అందుకు అనుబంధంగా పెద్ద సంఖ్యలో పరిశ్రమలు వచ్చే అవకాశం ఉన్న ప్రతిపాదనలపై దృష్టి పెట్టి వాటిని త్వరితగతిన ఆచరణలోకి తీసుకురావాలని భట్టి అధికారులకు సూచించారు. ఇకపై ప్రతి శనివారం పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహక సమావేశాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు. ఒక పరిశ్రమ ఏర్పాటుతో అనేక అనుబంధ పరిశ్రమలు రావడం తద్వారా రాష్ట్ర యువతకు వేల సంఖ్యలో ఉద్యోగాలు, రాష్ట్ర ఖజానాకు భారీ ఆదాయం సమకూరే వ్యూహాత్మక ప్రాధాన్యతను అధికారులు దృష్టిలో పెట్టుకొని ఆ రకమైన ప్రతిపాదనలపై కసరత్తు చేయాలని సబ్ కమిటీ సూచించింది.జహీరాబాద్ నిమ్జ్ ప్రాంతంలో హ్యుందాయ్ గ్లోబల్ ఇన్నోవేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ స్థాపనకు సబ్ కమిటీ ఆమోదం తెలిపింది. 675 ఎకరాల్లో రూ. 8,528 కోట్ల పెట్టుబడితో ఈ కంపెనీ రాష్ట్రానికి రావడం గొప్ప విజయమని కమిటీ అభిప్రాయపడింది. ఈ సెంటర్ ఏర్పాటుతో కొత్తగా 4,276 మంది రాష్ట్ర యువతకు ఉపాధి లభిస్తుందని కంపెనీ ప్రతినిధులు సమావేశంలో వివరించారు. రీసెర్చ్ సెంటర్లో ఆటోమోటివ్ టెస్ట్ ట్రాక్, పైలట్ లైన్, ప్రోటో టైపింగ్ ఉంటాయని వివరించారు. ప్రస్తుతం ప్రారంభమవనున్న పరిశ్రమలు రాబోయేకాలంలో భారీగా ఉపాధి, ఆదాయ అవకాశాలు కలి్పస్తాయని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. -
కేసీఆర్ అవినీతిని ఈటల బయట పెట్టాలి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యే బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్కు రాష్ట్ర పార్టీ తరఫున పూర్తిస్థాయి మద్దతు ఉంటుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి అన్నారు. కేసీఆర్ చేసిన అవినీతిని ఈ సందర్భంగా కమిషన్ ముందు బయట పెట్టాలని ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఆదివారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు.రాష్ట్ర అభివృద్ధిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఫెయిల్ అయ్యాయని కిషన్రెడ్డి విమర్శించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని, కాంగ్రెస్ పాలనలో అదే పరిస్థితి పునరావృతం అవుతోందని చెప్పారు. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ చేతగానితనాన్ని బీజేపీపై రుద్దుతున్నారని విమర్శించారు. కేసీఆర్కు కవిత లేఖ రాయడంపై మాట్లాడుతూ దోచుకున్న డబ్బు పంచుకోవడం కోసం లేఖలు రాసుకున్నారని కిషన్రెడ్డి ఆరోపించారు. -
ఆ నలుగురిలో నేను లేను
సాక్షి, హైదరాబాద్: ‘రెండ్రోజుల నుంచి ఆ నలుగురు.. ఆ నలుగురు అని వినిపిస్తోంది. ఆ నలుగురుకి నాకు సంబంధం లేదు. ఆ నలుగురిలో నేను లేను. పదిహేనేళ్ల క్రితం ఆ నలుగురు అని మొదలైంది. ఆ తర్వాత ఆ నలుగురు కాస్తా పదైంది. అది ఎవరూ పట్టించుకోవడం లేదు. ఓ పది మంది దగ్గర థియేటర్లు ఉన్నాయి. ఆ నలుగురి వ్యాపారంలో నేను లేను. కోవిడ్ టైమ్ నుంచే నేను బయటకు వచ్చాను. తెలుగు రాష్ట్రాల్లో 1,500 థియేటర్లు ఉన్నాయి. కానీ.. తెలంగాణలో నాకున్నది ఒకే ఒక్క థియేటర్. ఆంధ్రప్రదేశ్లో కూడా అన్నింటినీ వదిలేసుకుంటూ వస్తున్నాను. ప్రస్తుతం 15లోపు థియేటర్లు మాత్రమే నా దగ్గర ఉన్నాయి. వీటి లీజులు అయిపోయిన తర్వాత రెన్యువల్ చేయొద్దని నా సిబ్బందితో చెప్పాను. పాత అలవాటు ప్రకారం ఆ నలుగురిలో నా ఫొటోను వాడుకుంటున్నారు. నన్ను విమర్శిస్తున్నారు. దయచేసి మీడియా మిత్రులు ఆ నలుగురు న్యూస్లో నన్ను కలపకండి. నేను వాళ్లలో లేను. వారితో వ్యాపారంలో లేను’అని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ప్రస్తుతం థియేటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతల సెక్టార్స్లో థియేటర్ల రెవెన్యూ షేరింగ్, థియేటర్స్లో అద్దె చెల్లింపులు వంటి అంశాల నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమలో విభిన్నమైన పరిణామాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ‘జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ను మూసివేస్తారనే అంశంపై ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పందించిన విధానం చాలా సమంజసంగా ఉందని నాకనిపించింది. ఇక ఈ థియేటర్స్ క్లోజ్ అంశానికి సంబంధించి ఇటీవల జరిగిన సమావేశాలకు నేను కావాలని, ఇష్టం లేకనే వెళ్లలేదు. అలాగే నా గీతా డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన వ్యక్తులు కానీ, నాతో అసోసియేట్ అయిన వ్యక్తులు కానీ ఈ మీటింగ్కు వెళ్లొద్దని చెప్పాను. థియేటర్స్కు చాలా కష్టాలు ఉన్నప్పుడు ఇండస్ట్రీ పెద్దలతో మాట్లాడి, సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి. కానీ కొందరు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంపై నాకు చిరాకు కలిగి వెళ్లలేదు. థియేటర్లు మూసివేస్తున్నాం అనడం సరైంది కాదు. పవన్కళ్యాణ్ సినిమా విడుదల సమయంలో థియేటర్లు మూసివేస్తామని చెప్పడం దుస్సాహసం. గతంలో అశ్వనీదత్ సినిమా విషయంలో పవన్ను కలిశాం. అప్పుడు ఆయన ఫిల్మ్ చాంబర్ తరపున వెళ్లి ఏపీ సీఎం చంద్రబాబును కలవండన్నట్టు హింట్ ఇచ్చారు. అయితే మన వాళ్లు పట్టించుకోలేదు. ఆ విషయాన్ని విస్మరించారు. అధికారికంగా అందరం కలవాలి. కానీ కలవలేదు. ఎవరో ఇటీవల మనది ప్రభుత్వానికి సంబంధం లేని రంగం అని అంటుంటే విన్నాను. ప్రభుత్వానికి సంబంధం లేని పరిశ్రమ అయితే గత చీఫ్ మినిస్టర్ను సినీ పరిశ్రమలోని పెద్దపెద్ద వాళ్లంతా వెళ్లి ఎందుకు కలిశారు? ఏ వ్యాపారం అయినా సవ్యంగా చేసుకోవాలంటే ప్రభుత్వ సహకారం లేకుండా జరగదు. ఇప్పుడు ప్రభుత్వాన్ని వెళ్లి కలవకపోవడం సరికాదు. మనకు కష్టం వస్తే తప్ప మనం ప్రభుత్వం దగ్గరికి వెళ్లమా? నిజంగానే సింగిల్ స్క్రీన్ థియేటర్లకు సమస్యలు ఉన్నాయి. సమస్యలు ఉన్నప్పుడు మాట్లాడుకోవాలి తప్ప.. ఇలా థియేటర్స్ మూసివేస్తున్నామని చెప్పడం సరికాదు’అని అరవింద్ వ్యాఖ్యానించారు. పవన్ వ్యాఖ్యల్ని అరవింద్ ఖండించారంటున్న నెటిజన్లు ‘ప్రైవేట్ పెట్టుబడితో మేం సినిమాలు చేస్తే గవర్నమెంట్ కంట్రోల్ చేస్తానంటాదేంటి’అని గత ప్రభుత్వ హయాంలో పవన్కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘ఏ వ్యాపారమైనా సవ్యంగా చేసుకోవాలంటే ప్రభుత్వ సహకారం లేకుండా జరగదు. అటువంటిది ప్రభుత్వంతో సంబంధం ఏంటి. మాది ప్రైవేట్ వ్యాపారం అనడం సరికాదు. ప్రభుత్వంతో సంబంధం ఉంటుంది. ప్రభుత్వం కో–ఆపరేషన్ కావాలి’అంటు అరవింద్ తాజాగా చేసిన వ్యాఖ్యల్ని నెటిజన్లు ప్రముఖంగా చర్చించుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో పవన్కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని అల్లు అరవింద్ పరోక్షంగా ఖండించినట్టు ఉన్నాయని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. అప్పట్లో పవన్కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు.. తాజాగా అరవింద్ చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్ను జతచేసి సోషల్ మీడియా వేదికలపై వైరల్ చేస్తున్నారు. -
వారు స్కై వారియర్లు
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: డ్రోన్ల సాయంతో వ్యవసాయ పనులు చేస్తున్న సంగారెడ్డి జిల్లాలోని 54 మంది స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) మహిళలపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఆదివారం నిర్వహించిన మాసాంతపు రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’లో వారి ప్రతిభను కొనియాడారు. ‘వారు డ్రోన్ ఆపరేటర్లు కాదు.. స్కై వారియర్లు’అంటూ ప్రధాని అభివర్ణించారు. ‘పొలాలతోపాటు ఆకాశపు ఎత్తుల్లో కూడా పనిచేస్తున్న అనేక మంది మహిళలు ఈ రోజుల్లో ఉన్నారు. ఇప్పుడు గ్రామీణ మహిళలు డ్రోన్ దీదీలుగా మారి డ్రోన్లను ఆపరేట్ చేస్తున్నారు.వారు వ్యవసాయంలో కొత్త విప్లవాన్ని తీసుకొస్తున్నారు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో కొంతకాలం కిందటి వరకు ఇతరులపై ఆధారపడిన మహిళలు ఇ ప్పుడు స్వయంగా డ్రోన్ల ద్వారా 50 ఎకరాల భూమిలో మందులు పిచికారీ చేస్తున్నారు. ఉదయం మూడు గంటలు, సా యంత్రం రెండు గంటలు పనిచేస్తున్నారు. అంతే పని పూ ర్తయిపోతుంది. ఎండ వేడి లేదు. విషపూరిత రసాయనాల ప్రమాదం లేదు. గ్రామస్తులు కూడా ఈ మార్పును మన స్ఫూర్తిగా అంగీకరించారు. ఇప్పుడు మహిళలు డ్రోన్ ఆపరేటర్లుగా కాదు, స్కైవారియర్లుగా గుర్తింపు పొందారు. సాంకేతికత, సంకల్పం కలిసి నడిచినప్పుడు మార్పు వస్తుందని ఈ మహిళలు నిరూపిస్తున్నారు’అని మోదీ ప్రశంసించారు. సబ్సిడీపై డ్రోన్లు.. శిక్షణ అందించి.. సంగారెడ్డి జిల్లా ఆందోల్ ప్రాంతానికి చెందిన 54 మంది ఎస్హెచ్జీ మహిళలను కేంద్రం అమలు చేస్తున్న నమో డ్రోన్ దీదీ పథకానికి ఎంపిక చేసింది. వారికి బెంగళూరుకు చెందిన ఫ్లైయింగ్ వెడ్జ్ అనే సంస్థ ఆధ్వర్యంలో డ్రోన్లను ఎగరేయడంలో శిక్షణ ఇప్పించింది. అలాగే ఈ పథకం కింద 80% సబ్సిడీపై డ్రోన్లను అందించింది. కేంద్ర సాయంతో రూ. 10 లక్షల వ్యయంతో ఎస్హెచ్జీ మహిళలు యూనిట్ను ప్రారంభించారు.ఇందులో లబ్ధిదారులు 20% (రూ.2 లక్షలు) చెల్లించగా మిగిలిన 80% రూ. 8 లక్షలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నమో దీదీ, కిసాన్ దీదీ పథకాల కింద సబ్సిడీ ఇస్తున్నాయి. డ్రోన్ సేవలను మహిళలు వారి పొలాల వద్ద వినియోగించడంతోపాటు ఇతర రైతుల పొలాల వద్ద సేవలందిస్తున్నారు. ఇందుకోసం వారు రైతుల నుంచి నిర్ణిత మొత్తాన్ని తీసుకుంటూ ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. డ్రోన్ దీదీల సాయంతో రైతులకు సైతం పొలాల్లో పురుగుమందుల పిచికారీ చేసేందుకు కూలీల కొరత తప్పుతోంది. -
‘కాజీపేట’కు రెడ్సిగ్నల్!
అది ప్రధాని మోదీ 2023 జూలై 8న స్వయంగా శంకుస్థాపన చేసిన రైల్వే ప్రాజెక్టు. కానీ విచిత్రంగా రైల్వే బోర్డు మాత్రం ఇప్పటివరకు ఆ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వలేదు. ఫలితంగా ప్రాజెక్టు నిర్మాణ పనులు మూడొంతులు పూర్తయినా ఆధునిక యంత్రాల కోసం దిగుమతి ఆర్డర్ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. వెరసి.. మరికొద్ది నెలల్లో ఉత్పత్తి ప్రారంభం కావాల్సిన యూనిట్ ఇప్పట్లో అందుబాటులోకి వచ్చేలా కనిపించట్లేదు. ఇదీ కాజీపేట రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ (మినీ కోచ్ ఫ్యాక్టరీ) దుస్థితి.సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజల దశాబ్దాల కలల ప్రాజెక్టు అయిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై ఏళ్ల తరబడి నాన్చుతూ వచ్చిన కేంద్రం చివరకు దానికి పచ్చజెండా ఊపింది. తొలుత రైల్వే వ్యాగన్ ఓవర్ హాలింగ్ వర్క్షాపుగా మంజూరైన ప్రాజెక్టును కోచ్ తయారీ యూనిట్గా అప్గ్రేడ్ చేసింది. ఇందులో ఎలక్ట్రిక్ మెమూ యూనిట్లు (ఈఎంయూ), సరుకు రవాణా వ్యాగన్లు తయారవుతాయని ప్రకటించింది. దేశవ్యాప్తంగా వందేభారత్ రైళ్లను వేగంగా పట్టాలెక్కించే ఉద్దేశంతో వీలైనన్ని ప్రాంతాల్లో ఆ కోచ్లను తయారు చేయాలని నిర్ణయించి కాజీపేట యూనిట్ను కూడా అందుకు అనుగుణంగా ఉపయోగించుకోవాలని ఆ తర్వాత నిర్ణయించింది. భవిష్యత్తులో కాజీపేట యూనిట్లోనూ వందేభారత్ కోచ్ల తయారీకి వీలుగా మౌలిక వసతులు సిద్ధం చేయాలనుకుంది. దీనికి సంబంధించిన ఆధునిక యంత్రాలను జపాన్కు చెందిన టైకిషా కంపెనీ నుంచి దిగుమతి చేసుకోనున్నట్లు ప్రకటించింది.ఇంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాతే పరిస్థితి తలకిందులైంది. ప్రధాని శంకుస్థాపన చేసిన తర్వాత.. ఈ యూనిట్ నిర్మాణ బాధ్యతను రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్)కు రైల్వేశాఖ అప్పగించింది. ఈ యూనిట్ను ఓవర్హాలింగ్ వర్క్షాప్గా ప్రతిపాదించినప్పుడే ఆర్వీఎన్ఎల్ టెండర్లు పిలవగా పవర్మెక్–టైకిషాలతో కూడిన జాయింట్ వెంచర్ దీన్ని దక్కించుకుంది. తొలుత రూ. 269 కోట్ల యూనిట్ వ్యయాన్ని ఆ తర్వాత రూ. 362 కోట్లకు పెంచిన కేంద్రం.. మినీ కోచ్ ఫ్యాక్టరీగా అప్గ్రేడ్ చేశాక దాన్ని రూ. 530 కోట్లకు పెంచింది. అనంతరం ప్రధాని మోదీ ఈ యూనిట్ పనులకు శంకుస్థాపన చేశారు. ఇప్పటికే మూడొంతుల పనులు పూర్తవగా వచ్చే మార్చికల్లా యూనిట్ పూర్తిగా సిద్ధం కానుంది. వీలైతే ఈ ఏడాది చివరికల్లా సిద్ధం చేసే వీలుందని అధికారులు చెబుతున్నారు. ఓవైపు షెడ్లు సిద్ధమవుతున్న నేపథ్యంలో నిర్మాణ సంస్థతో ఉన్న ఒప్పందం మేరకు జపాన్కు చెందిన టైకిషా కంపెనీ నుంచి అత్యాధునిక పరికరాలు, యంత్రాలను దిగుమతి చేసుకోవాల్సి ఉంది. ఆ మేరకు అనుమతి కోరుతూ ఆర్వీఎన్ఎల్ ఇటీవల రైల్వే బోర్డు అనుమతి కోరగా బోర్డు అనూహ్యంగా షాక్ ఇచ్చింది. కొర్రీలతో బ్రేకులు! కాజీపేటలో రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్కు అనుమతే ఇవ్వలేదని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. పెంచిన అంచనా వ్యయానికి తాము అనుమతి ఇవ్వనిదే యంత్రాలు ఎలా కొంటారని ఎదురు ప్రశ్నించింది. పైగా అన్ని షెడ్లు, యంత్రాలు ఎందుకో చెప్పడంతోపాటు జపాన్ నుంచి కొనాల్సిన అవసరం ఏమిటో లిఖితపూర్వకంగా తెలియజేయాలని ఆదేశించింది. దీంతో ఆర్వీఎల్ఎల్ అధికారులు ఒక్కో దానికి సమాధానం ఇస్తూ వచ్చారు. ఇంతలో ఈ వ్యవహారాలు చూసే రైల్వే బోర్డు ఉన్నతాధికారి బదిలీ కావడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. పాత అధికారి స్థానంలో వచ్చిన కొత్త అధికారి మరిన్ని కొర్రీలు పెడుతున్నారు. ఆ యూనిట్ లేఅవుట్ పంపాలని.. దాన్ని చూశాక మరిన్ని సందేహాలు తీర్చాలంటూ ఐదారు రోజుల క్రితం అడిగారు. ఈ నేపథ్యంలో ఆ యూనిట్లో ఉత్పత్తి ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. రైల్వే బోర్డు తీరు చూస్తే ఇప్పట్లో ఉత్పత్తి మొదలయ్యే సూచనలు కనిపించడం లేదు. ప్రధాని శంకుస్థాపన చేసిన ఓ ప్రాజెక్టు విషయంలో రైల్వే బోర్డు ఇలా వ్యవహరిస్తుండటం స్థానిక అధికారులనే అయోమయానికి గురిచేస్తోంది. -
ముక్కిపోతున్న దొడ్డు బియ్యం
సాక్షి, సిద్దిపేట: రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ నెల నుంచి తెల్లరేషన్కార్డు దారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. మార్చి నెలలో మిగిలిపోయిన దొడ్డుబియ్యం ఇంకా రేషన్ షాప్లలోనే ఉంది. మూడు నెలలుగా స్టాక్ ఉండటంతో ముక్కిపోతున్నాయి. పైగా లక్క పురుగులు వచ్చి చేరుతున్నాయి. దీంతో దొడ్డు బియ్యానికి పట్టిన లక్క పురుగులు సన్న బియ్యానికి పడతాయని రేషన్ డీలర్లు అంటున్నారు. మార్చి నెలలో కార్డుదారులకు ఇవ్వగా రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో 28,380.97 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం మిగిలింది. వాటిని రేషన్షాప్లలో పక్కన పెట్టాలని పౌరసరఫరాల శాఖ గతంలోనే ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల గదులు ఇరుకుగా ఉండటంతో సన్న బియ్యం దించుకునేందుకు స్థలం ఉండటం లేదు. ఈ బియ్యమంతా ఫిబ్రవరి 22 నుంచి 28వ తేదీవరకు రేషన్షాప్లకు చేరింది. మూడు నెలలుగా నిల్వలు ఉండటంతో లక్క పురుగు పడుతున్నాయి. పలుచోట్ల వర్షాలకు తడిసి ముక్కిపోతున్నాయి. ఎఫ్సీఐకి పెడితే ఆదాయం సన్న బియ్యం పంపిణీ చేస్తున్న నేపథ్యంలో దొడ్డు బియ్యంతో పని ఉండదు. ఈ బియ్యాన్ని ఎఫ్సీఐ లేదా ఇతర రాష్ట్రాలకు విక్రయిస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. పైగా రేషన్షాప్లలో ఉన్న సన్న బియ్యానికి లక్క పురుగుల బాధ ఉండదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే షిఫ్ట్ చేస్తాం రేషన్ షాప్లలో స్టాక్ ఉన్న దొడ్డు బియ్యం గురించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఆ బియ్యం బస్తాలకు రెడ్ కలర్తో ఇంటు మార్క్ వేయించాం. ఈ బియ్యాన్ని శుభ్రంగా ఉంచాలని, సేఫ్టీగా భద్రపరచాలని డీలర్లకు చెప్పాం. బియ్యం తరలింపుపై ఆదేశాలు రాగానే రేషన్షాపుల నుంచి తరలిస్తాం. – అబ్దుల్ హమీద్, అదనపు కలెక్టర్, సిద్దిపేట -
నేర్చుకోవాలి.. నేర్పించాలి
ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగప్రవేశంతో సాఫ్ట్వేర్ రంగంలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా చెప్పింది చేసేవారు కాకుండా, ముందుండి నడిపించే నాయకత్వ లక్షణాలున్న వారినే సంస్థలు కోరుకుంటున్నాయి. కొంతకాలంగా టీం లీడర్ అర్థమే మారిపోయింది. ఉద్యోగికి, యాజమాన్యానికి మధ్య పోస్టుమన్ ఉద్యోగం చేయడమే లీడర్ షిప్ కాదని టెక్ రంగం స్పష్టం చేస్తోంది.ముందు తను నేర్చుకోవాలి.. ఆ తర్వాత టీంలోని అందరికీ అర్థమయ్యేలా చెప్పాలని సంస్థలు అంటున్నాయి. ప్రముఖ ఉద్యోగ ప్లాట్ఫామ్స్ లింక్డ్ ఇన్, నౌకరీ డాట్కామ్ ఐటీ ఉద్యోగంలో వస్తున్న మార్పులను విశ్లేషించాయి. ఇప్పటివరకు ఐటీ సెక్టార్లో సర్వీస్ ప్రాధాన్యంగానే ఉద్యోగాల సృష్టి జరిగింది. దేశంలో ప్రతి లక్ష మంది ఉద్యోగుల్లో 80 వేల మంది ఈ కేటగిరీలోనే ఇంతకాలం పనిచేశారు. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.కొత్తగా ఆలోచించాల్సిందే.. ప్రధాన టెక్ సంస్థలన్నీ ఏఐతో కూడిన డేటాను సిద్ధం చేసుకున్నాయి. దీంతో నాయకత్వ పని చాలావరకు ఏఐ చేస్తోంది. దీనికోసం ప్రపంచవ్యాప్తంగా టెక్ సంస్థలు 40 వేల కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టినట్టు స్కిల్ ఇండియా పేర్కొంది. ప్రపంచంలో మొత్తం 67,200 కృత్రిమ మేధ సంస్థలుండగా, అందులో 25 శాతం అమెరికాలోనే ఉన్నాయి. భారత్లో 1,67,000 స్టార్టప్స్ ఉంటే, వాటిల్లో 6,636 సంస్థలు ఏఐపైనే పనిచేస్తున్నాయి.ఇవి ఈ రంగంపై రూ.లక్ష కోట్లు పెట్టుబడులు పెట్టాయి. దేశీయ వైద్య సాంకేతికతల రంగంలో సుమారు 12 వేల స్టార్టప్స్ పనిచేస్తున్నాయి. ఫిన్టెక్ రంగంలో ఉన్న ఏఐ పెట్టుబడుల విలువ 90 వేల కోట్ల డాలర్లు. 2021లో ఇండియాలో 2,100 ఫిన్టెక్ కంపెనీలుంటే ఇప్పుడు 10,200కు చేరాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు సాధారణ పని విధానం ఐటీ ఉద్యోగాలకు పనికిరాదని పిన్టెక్ సంస్థలు అంటున్నాయి. ఏఐతో పనిచేసే టీం లీడర్ క్రియేటివ్ ఆలోచనా విధానం... దానికి తగ్గట్టుగా లాంగ్వేజ్ మాడ్యూల్స్ అభివృద్ధి చేసుకోవాలని టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి సంస్థల రిక్రూట్ విభాగాలు పేర్కొంటున్నాయి. చెప్పింది మాత్రమే చేస్తే.. ఉద్యోగం ఊస్టే ఇప్పుడున్న టెక్నాలజీ సిస్టమ్లో సర్విస్ సెక్టార్ కోడ్ను ఏఐ డీకోడ్ చేసే ఏర్పాటు చేశారు. ఇంతకాలం ఈ పని ఐటీ ఉద్యోగుల ద్వారా జరిగేది. దీంతో గతం మాదిరిగా అనుకరించే పనికే పరిమితమైన ఉద్యోగులను ఐటీ కంపెనీలు తొలగిస్తున్నాయి. ఏఐకి ప్రోగ్రామింగ్ ఇవ్వగల నేర్పు, అది కూడా ఏఐ డేటాలో ఉన్నది కాకుండా కొత్తదిగా ఉండాలని ఐటీ సంస్థలు కోరుకుంటున్నాయి. సరికొత్త కోడింగ్ వ్యవస్థను తీసుకొచ్చే ఉద్యోగుల కోసం వెదుకుతున్నాయి.స్కిల్ ఇండియా నివేదిక ప్రకారం ఇలాంటి నిపుణులు 2026 నాటికి 10 లక్షల మంది అవసరం ఉంది. నౌకరీ డాట్కామ్ అభిప్రాయ సేకరణలో దాదాపు 152 సంస్థలు ఇదే విషయాన్ని చెప్పాయి. 2023 ఆగస్టు లెక్కల ప్రకారం దేశంలో 4.16 లక్షల మంది ఏఐ కోడింగ్ నిపుణులు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు కావల్సింది 6.29 లక్షల మంది. ఏఐ డేటా అనాలసిస్ వచ్చిన తర్వాత దాదాపు లక్ష మంది ఉద్యోగాలు కోల్పోవటమో, కోల్పోయే పరిస్థితికి చేరడమో జరిగిందని ఐటీ కంపెనీలు అంటున్నాయి.నిత్యం అప్గ్రేడ్ అవ్వాలి ఐటీ సెక్టార్లో టీం లీడర్ రోల్ పూర్తిగా మారిపోయింది. ఉద్యోగి పని విధానం అంచనా వేయడానికి సాఫ్ట్వేర్ను కంపెనీలు అనుసరిస్తున్నాయి. దీంతోపాటే టీం లీడర్ పరిధిలో పనిచేసే వారిని స్కిల్ వైపు ఏ విధంగా తిప్పగలిగామో కంపెనీ అంచనా వేస్తోంది. తప్పులను కిందివాళ్లపై నెట్టడం ఇక కుదరని పని. కింది ఉద్యోగి పని విధానం మెరుగవ్వలేదంటే టీం లీడర్ను కంపెనీలు బాధ్యులను చేస్తున్నాయి. నేర్చుకోవడం, నేర్పించడం వంటి నాయకత్వ లక్షణాలున్న టీం లీడర్ను కంపెనీలు కోరుకుంటున్నాయి. – వికాశ్ వాసన్, ఎంఎన్సీ కంపెనీలో డేటా టీం లీడర్నాయకత్వ సృజనాత్మకత కావాలి ఇంటర్వ్యూ చేసేప్పుడు లీడర్షిప్ క్వాలిటీని కంపెనీలు పరిశీలిస్తున్నాయి. చాలా మంది ఇక్కడే తిరస్కరణకు గురవుతున్నారు. చాలామందిలో ఏఐ మాడ్యూల్స్ను ఇతర ఉద్యోగులతో కలిసి లేదా ఇతర కంపెనీలతో కలిసి నిర్వహించగల సామర్థ్యం కన్పించడం లేదు. వేగంగా మారుతున్న డేటా విధానం వల్ల శరవేగంగా అందరితో సమన్వయం చేసుకునే నాయకత్వ లక్షణం ఇప్పుడు టెక్ రంగంలో ఎంతో అవసరం. – సంజీవ్ పల్లవ్, ఐటీ ఆధారిత కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్ -
ఈ సారి కూడా ఆలస్యమేనా?
సాక్షి,హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు ముంచుకొస్తున్నా.. ఉచిత చేప పిల్లల పంపిణీపై మత్య్సశాఖ మేల్కొనడంలేదు. మత్స్యకారుల లబ్దికోసం 100 శాతం సబ్సిడీ తో 2016లో ఉచిత చేప పిల్లల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టినా, సకాలంలో ఏ ఒక్క ఏడాది కూడా చెరువులకు చేప పిల్ల లు చేరిన దాఖలాలు లేవని గణాంకాలు చెబుతున్నాయి. కాంట్రాక్టర్ల వైఖరి, నిధుల కొరత, అధికారుల సమన్వయలేమితో ఈ పథకం అభాసుపాలు అవుతోందని ఆరోపణలు వస్తున్నాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది అయినా ముందస్తుగా టెండర్లు పిలుస్తారని అనుకుంటే, మే నెల మూడో వారం వచ్చినా ఇప్పటి వరకు ఆ దిశలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి కసరత్తు లేదు.. మే నెల మూడో వారం వచి్చనా కూడా ఇప్పటి వరకు చేప పిల్లల పంపిణీకి సంబంధించిన టెండర్లకు మత్య్సశాఖ సిద్ధం కాలేదని తెలుస్తోంది. ఈ ఏడాది ముందస్తు వర్షాలు కురుస్తాయని, నైరుతి రుతుపవనాల ప్రభావంతో జూన్ మొదటివారంలో భారీగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అయినా మత్య్సశాఖ చేప పిల్లల పంపిణీ ప్రక్రియకు సంబంధించి ఎలాంటి కసరత్తు చేయలేదని సమాచారం. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ ప్రారంభించి, జూన్ మొదటి వారంలో వాటిని ఖరారు చేస్తే.. రెండో వారం నుంచి ఉచిత చేప పిల్లలను పంపిణీ చేయడానికి వీలుంటుందని మత్స్యకారులు చెబుతున్నారు. ప్రతీ ఏడాది ఆలస్యంగా టెండర్లు పిలవడం వల్ల పుణ్యకాలం గడిచిపోతోందని, అదను మించిపోయాక చేప పిల్లలను పంపిణీ చేయడం వల్ల ప్రయోజనం ఉండదని అంటున్నారు. సరైన సమయంలో చెరువుల్లో వదిలితేనే ఎదుగుదల ఆలస్యంగా ఉచిత చేప పిల్లలు పంపిణీ చేయడంతో తగిన లబ్ధి చేకూరడంలేదని మత్స్యకారులు చెపుతున్నారు. చెరువుల్లో సరైన సమయానికి చేప పిల్లలు వదలక పోవడం వల్ల చేపల్లో ఎదుగుదల లేకపోవడంతో ధర రావడంలేదు అంటున్నారు. కిలో నుంచి రెండు మూడు కిలోల వరకు చేపలు ఎదగాలంటే, చేప పిల్లలను జూన్, జూలై నెలల్లో చెరువుల్లో వదలాల్సి ఉంటుందని, అప్పుడే వాటి వృద్ధి ఎక్కువగా ఉంటుందని చెపుతున్నారు.అలాంటి చేపలకే మార్కెట్లో మంచి ధర వస్తుంది. వాటిని ఎగుమతి చేయడానికి అనుకూలంగా ఉంటుంది. కానీ ప్రభుత్వం ఇస్తున్న ఉచిత చేప పిల్లలను గతంలో డిసెంబర్లో కూడా చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో వదిలిన దాఖలు కూడా ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. జూన్ నుంచి ఆగస్టు మధ్య చేప పిల్లలను వదలాలి.. జూన్ నుంచి ఆగస్టు మధ్యలో చేప పిల్లలను చెరువులు, ప్రాజెక్టుల్లో వదలాలి. కానీ, ఈ ప్రక్రియను 9ఏళ్ల నుంచి ఆలస్యం చేస్తున్నారు. ముందస్తుగా నిధులు సమకూర్చుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. సకాలంలో చేప పిల్లలను వదిలితేనే మత్స్యకారులకు అర్థికంగా లాభం. ప్రభుత్వం అసలు పథకం ఉంచుతారా? లేదా? అనేది చెప్పాలి. లేదంటే మత్స్యకారులే చేప పిల్లలను చెరువుల్లో వదులుకుంటారు. ప్రభుత్వ అలసత్వం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా పథకం అభాసుపాలవుతోంది. దీనివల్ల 4.5 లక్షల మత్స్యకారుల కుటుంబాలకు అన్యాయం జరుగుతుంది. – పిట్టల రవీందర్, ఫిషరీస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్టెండర్లు ముందస్తుగా ఖరారు చేయాలి.. టెండర్లు ముందస్తుగా ఖరారు చేయాలి. జూన్ మొదటి వారంలోనే అన్నీ పూర్తి చేసుకుని చివరి వారంలోగా మీనాలు చెరువుల్లో వదిలేలా ప్రణాళిక చేయాలి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా అధికారులు వేగం పెంచాలి. నిధుల కొరత ఉంటే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి నిధులు సమకూర్చుకోవాలి. మత్స్యకారులకు లాభం జరిగేలా చూడాలి. – గౌటే గణేశ్, గంగపుత్ర సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు -
సొరంగం పనులు ముందుకు సాగేదెప్పుడు?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఎస్ఎల్బీసీ టన్నెల్ తవ్వకం పనులు ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా మారాయి. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి వద్ద ఉన్న ఔట్లెట్లో టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం) బేరింగ్ పాడై 2023 జనవరిలోనే పనులు ఆగిపోగా, దోమలపెంట వద్ద ఇన్లెట్లో షియర్ జోన్ కారణంగా బురద నీరు ఉబికి రావడంతో 2019 నుంచి పనులు ఆగిపోయాయి. ఏడాదిన్నర కిందట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సొరంగం తవ్వకం పనులు పూర్తి చేయడంపై దృష్టి సారించింది. అయినా వివిధ కారణాలతో టన్నెల్ తవ్వకం పనులకు అవాంతరాలు తప్పడం లేదు. ఔట్లెట్లో టీబీఎంకు అమర్చాల్సిన బేరింగ్ను తెప్పించినా, స్పేర్ పార్ట్స్కు అవసరమైన డబ్బులు లేవంటూ కాంట్రాక్టు సంస్థ చేతులెత్తేయడంతో పనులు ముందుకు సాగడం లేదు. ఇటీవల ఇన్లెట్లో 14వ కిలోమీటరు వద్ద సొరంగం కుప్పకూలిపోయిన నేపథ్యంలో ప్రత్యామ్నాయంపై ఉన్నత స్థాయి టెక్నికల్ కమిటీ నివేదిక వస్తేనే గానీ ముందుకు సాగలేని పరిస్థితి నెలకొంది. ఏళ్లు గడిచిపోతున్నా.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 4.15 లక్షల ఎకరాలకు సాగునీరు, 516 ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు రక్షిత తాగునీటిని అందించే లక్ష్యంతో 2005లో ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టు పనులు చేపట్టారు. అయితే అనేక అవాంతరాలతో ఏళ్లు గడిచిపోతున్నాయి. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటిని పూర్తి గ్రావిటీ ద్వారా అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి వరకు తరలించేందుకు ప్రభుత్వం సొరంగం తవ్వకాన్ని చేపట్టింది. 43.930 కిలోమీటర్ల పొడవైన సొరంగం పూర్తిగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతం కావడంతో వన్యప్రాణులు, పర్యావరణ రక్షణ కోసం డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానం కాకుండా టీబీఎం ద్వారా పనులు చేపట్టింది. ఇన్లెట్, ఔట్లెట్ కలిపి 34.37 కిలోమీటర్లు మేర టన్నెల్ తవ్వకం పూర్తికాగా, ఇంకా 9.56 కిలోమీటర్లు తవ్వాల్సి ఉంది. ఔట్లెట్లో బేరింగ్ పాడై..వచ్చినా లోపలికి వెళ్లక ఔట్లెట్లో 20.435 కిలోమీటర్లు సొరంగం తవ్వకం పూర్తి కాగా, మరో 3.545 కిలోమీటర్ల తవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో టీబీఎం బేరింగ్ పాడైపోవడంతో 2023 జనవరిలో పనులు ఆగిపోయాయి. అదే ఏడాది డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సొరంగం పూర్తి చేయాలని నిర్ణయించింది. అమెరికా నుంచి బేరింగ్ తెప్పించేందుకు నిర్ణయించి గత ఏడాదే రాబిన్స్ కంపెనీకి ఆర్డర్ ఇవ్వడంతో అది గత నెల 18వ తేదీన మన్నెవారిపల్లికి చేరింది. నెల దాటినా.. అమెరికా నుంచి బేరింగ్ అయితే వచ్చింది. కానీ బేరింగ్ను టీబీఎంకు ఫిట్ చేసేందుకు అవసరమైన పరికరాలతోపాటు మరికొన్ని పరికరాలను కెనడా నుంచి తెప్పించాల్సి ఉందని కాంట్రాక్టు సంస్థ పేర్కొంది. అందుకు రూ.70 కోట్లు కావాలని విన్నవించింది. వాస్తవానికి ఆ నిధులను కాంట్రాక్టు సంస్థే వెచ్చించాలి. కానీ తమ వద్ద డబ్బుల్లేవని, ప్రభుత్వం ఇస్తేనే ముందుకు పోతామని స్పష్టం చేయడంతో బేరింగ్ను వచ్చినా టన్నెల్ లోపలికి తీసుకెళ్లని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం దీనిపై కాంట్రాక్టు సంస్థతో సంప్రదింపులు జరుపుతోంది. ఔట్లెట్లో ఇంకా 3.545 కిలోమీటర్లే తవ్వాల్సి ఉంది. అయితే టీబీఎంకు మిగిలి ఉన్న సామర్థ్యం, అక్కడి మట్టి పొరలు, రాక్ ఫార్మేషన్ పరిస్థితులను బట్టి ఇంకా 2 కిలోమీటర్ల వరకే తవ్వే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆ తర్వాత 200 మీటర్ల పొడవునా షియర్ జోన్ ఉండటంతో ఆ తర్వాత పరిస్థితి ఏంటన్న దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇన్లెట్లో పనులకూ అవాంతరాలు సొరంగం ఇన్లెట్ దోమలపెంట వైపు నుంచి 13.935 కిలోమీటర్ల తవ్వకం గతంలోనే పూర్తయింది. ఇంకా 6.015 కిలోమీటర్లు తవ్వాల్సి ఉంది. అయితే 14వ కిలోమీటరు కంటే ముందు షియర్ జోన్ కారణంగా పెద్ద ఎత్తున బురద, మట్టి ఉబికి వస్తుండటంతో 2019లోనే పనులు ఆగిపోయాయి. అ యితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పనుల కొనసాగింపుపై దృష్టి పెట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరి 22వ తేదీన టీబీఎంతో తవ్వుతుండగా సొరంగం పైకప్పు కూలిపోవడం, టీబీఎం ముక్కలైపోవడం తెలిసిందే. ఈ ప్రమాదంలో 8 మంది గల్లంతవగా ఇప్పటివరకు ఇద్దరు కార్మికుల మృతదేహాలు మాత్రమే బయ పడ్డాయి. కాగా మిగతా కార్మికుల వెలికితీత పనులను కూడా ప్రభుత్వం ఇటీవల నిలిపివేసింది. ప్రస్తుతం సొరంగం పనులు ఎప్పుడు మొదలవుతాయో కూడా చెప్పలేని పరిస్థితి ఉంది.ఇన్లెట్లో పనులు మొదలయ్యేదెప్పుడో..సొరంగం ఇన్లెట్ నుంచి తవ్వకాలు చేపట్టే టీబీఎం పూర్తిగా ధ్వంసం కాగా, ఇకనుంచి డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానంలోనే సొరంగం తవ్వకం సాధ్యమవుతుందని నిపుణులు ప్రభుత్వానికి నివేదించారు. ఇన్లెట్లో 14వ కిలోమీటరు వద్ద కుప్పకూలిన ప్రాంతాని కంటే ముందు నుంచి 50 మీటర్ల వరకు పక్కకు జరిగి, అక్కడి నుంచి సొరంగానికి సమాంతరంగా తవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం వివిధ సంస్థలకు చెందిన నిపుణులతో ఉన్నత స్థాయి సాంకేతిక కమిటీని ఏర్పాట చేసింది. పూర్తిస్థాయి అధ్యయనం తర్వాత ప్రభుత్వానికి ఈ కమిటీ నివేదిక సమర్పించనుంది. ఆ తర్వాతే దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రమాదం నేపథ్యంలో నిపుణుల సూచన మేరకు డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానంలో తవ్వకం పనులు చేపట్టాలంటే కేంద్రం నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. -
రానున్న రెండ్రోజులు మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో రానున్న రెండ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని, ఆదివారం నాటికి పశ్చిమ మధ్య, తూర్పు మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని వివరించింది. అదేవిధంగా కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలకు, గోవా రాష్ట్రమంతటా, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు, పశ్చిమ మధ్య, ఉత్తర బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు, మిజోరం, మణిపూర్, నాగాలాండ్లోని కొన్ని ప్రాంతాలకు కూడా విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణంలో నెలకొన్న మార్పులతో ఉష్ణోగ్రతలు భారీగా పతనమయ్యాయి. ఆదివారం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 నుంచి 9.7 డిగ్రీల సెల్సియస్ వరకు తక్కువగా నమోదయ్యాయి. రానున్న రెండు రోజులు కూడా ఉషోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ వివరించింది. -
ఈవీలు.. చార్జింగ్!
దేశవ్యాప్తంగా విద్యుత్ వాహనాల (ఈవీ) అమ్మకాలతోపాటు.. వాటి విద్యుత్ వినియోగమూ పెరుగుతోంది. 2024–25లో రికార్డు స్థాయిలో సుమారు 19.65 లక్షల ఈవీలు వినియోగదారుల చేతుల్లోకి వెళ్లాయి. ఈవీల కోసం ఏర్పాటుచేస్తున్న పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లు (పీసీఎస్) కూడా గత మూడేళ్లలో భారీగా పెరిగాయి. కేంద్ర విద్యుత్ సంస్థ (సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ – సీఈఏ) తాజా నివేదిక ప్రకారం.. ఈ స్టేషన్లలో చార్జింగ్ కోసం 2024–25లో వినియోగించిన విద్యుత్ 847 మిలియన్ యూనిట్లు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 82 శాతం అధికం కావడం గమనార్హం. పీసీఎస్లు వినియోగించిన విద్యుత్ విషయంలో తెలుగు రాష్ట్రాలు టాప్ – 7 జాబితాలో ఉన్నాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్గతంలో ఎన్నడూ లేని విధంగా.. ఈవీల కోసం ఏర్పాటుచేసిన పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లలో (పీసీఎస్) దేశవ్యాప్త విద్యుత్ వినియోగం 2024–25లో 847.8 మిలియన్ యూనిట్లకు (ఎంయూ) చేరుకుంది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 82 శాతం ఎక్కువ. 2024 ఏప్రిల్ నెలలో వినియోగం 52.88 ఎంయూలు కాగా 2025 మార్చిలో ఇది 60.7 శాతం పెరిగి 85 ఎంయూలకు ఎగసింది.తెలంగాణ@ 5.. ఏపీ @ 7కేంద్ర విద్యుత్ సంస్థ నివేదిక ప్రకారం పీసీఎస్లు వినియోగించే విద్యుత్లో ఢిల్లీ 38.69 శాతం వాటాతో ముందంజలో ఉంది. విస్తీర్ణంలో చిన్నదైనప్పటికీ, పీసీఎస్ల అధిక విద్యుత్ వినియోగానికి కారణం.. రాజధానిలో ఈవీల అమ్మకాలు దూసుకెళ్లడమే. మహారాష్ట్ర 25.57 శాతం, కర్ణాటక 9.39, గుజరాత్ 7.56 శాతాలతో ఆ తరువాతి స్థానాల్లో నిలిచాయి. తెలంగాణ 5వ స్థానంలోనూ, ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలోనూ నిలిచాయి. టాప్ – 4 మినహాయిస్తే.. మిగతా రాష్ట్రాలన్నీ కలిపి 18.78 శాతం విద్యుత్ను వినియోగించాయి.ఈవీలు – చార్జింగ్ స్టేషన్లుగత సంవత్సరంలో అమ్ముడైన ఈవీలు సుమారు 19.65 లక్షలు2022 డిసెంబరు నాటికి దేశవ్యాప్తంగా ఉన్న ఈవీ పబ్లిక్ చార్జింగ్ స్టేషన్స్ 5,1512025 ఏప్రిల్ 1 నాటికి 26,367కు చేరిక» ప్రస్తుతం తెలంగాణలో 976, ఏపీలో 616 కేంద్రాలు» 2013–14 నుంచి 2024–25 మధ్య అమ్ముడైనవి 59.25 లక్షల యూనిట్లు» ప్రస్తుతం వినియోగంలో ఉన్నవి 44 లక్షలు2.5 నుంచి 3.5 రెట్లు తెలంగాణలో ఈ ఏడాది ఒక రోజులో నమోదైన గరిష్ఠ విద్యుత్ వినియోగం దాదాపు 339 ఎంయూ. అదే ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే సుమారు 240 ఎంయూ. అంటే తెలుగు రాష్ట్రాల ఒక రోజు విద్యుత్ వినియోగంతో పోలిస్తే సుమారు 2.5 నుంచి 3.5 రెట్లు ఎక్కువ విద్యుత్తును.. 2024–25లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు వినియోగించాయన్నమాట.ఏటా 50,000 స్టేషన్లుభారత్లో 2025 ఏప్రిల్ 1 నాటికి ఉన్న ఈవీల పబ్లిక్ చార్జింగ్ స్టేషన్ల సంఖ్య 26,367. 2022 డిసెంబరుతో పోలిస్తే.. 2024 డిసెంబరు నాటికే వీటి సంఖ్య సుమారు ఐదింతలు కావడం విశేషం. కర్ణాటకలో అత్యధిక సంఖ్యలో 5,880 కేంద్రాలు ఉన్నాయి. మహారాష్ట్రలో 3,746, ఉత్తరప్రదేశ్లో 2,137, ఢిల్లీలో 1,951, తమిళనాడులో 1,524 స్టేషన్స్్స పనిచేస్తున్నాయి. తెలంగాణలో 976, ఆంధ్రప్రదేశ్లో 616 స్టేషన్స్ ఉన్నాయి. 2030 నాటికి ప్రైవేట్ వాహనాల్లో 30 శాతం, వాణిజ్య వాహనాల్లో 70 శాతం, బస్సుల్లో 40 శాతం; ద్విచక్ర, త్రిచక్ర వాహనాల్లో 80 శాతం ఎలక్ట్రిక్వే ఉండాలని నీతి ఆయోగ్ లక్ష్యంగా నిర్దేశించింది. దీనికి అనుగుణంగా చార్జింగ్ నెట్వర్క్ను ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఆరేళ్లలో ఏటా దాదాపు 50,000 చార్జింగ్ పాయింట్ల చొప్పున ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అంతర్జాతీయ ఇంధన సంస్థ వెల్లడించింది.త్రీవీలర్ల అమ్మకాల్లో నం.1 ఈవీల అమ్మకాల్లో భారత్లో రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. 2024–25లో 17 శాతం వృద్ధితో 19,64,831 యూనిట్ల ఈవీలు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. ఇందులో టూవీలర్స్ గతేడాదితో పోలిస్తే 21 శాతం పెరిగి 11,49,307 యూనిట్లు, త్రీవీలర్స్ 10 శాతం అధికమై 6,99,062 యూనిట్లను తాకాయి. 1,07,462 ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు జరిగాయి. ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాల అమ్మకాల్లో రెండేళ్లుగా భారత్ ప్రపంచంలో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. చైనా గత ఏడాది 3,00,000 ఎలక్ట్రిక్ త్రీవీలర్స్ను విక్రయించింది. ఈ–కామర్స్, క్విక్ కామర్స్ సంస్థలు సరుకు డెలివరీ కోసం ఈవీలను ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి. దీంతో ఈ విభాగంలో ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు అధికంగా అమ్ముడవుతున్నాయి. 2032 నాటికి 12.3 కోట్ల ఈవీలు భారతీయ రోడ్లపై పరుగు తీస్తాయని ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్, కస్టమైజ్డ్ ఎనర్జీ సొల్యూషన్స్ సంయుక్త నివేదిక వెల్లడించింది. 2013–14 నుంచి 2025 మార్చి వరకు భారత్లో 59.25 లక్షల యూనిట్ల ఈవీలు అమ్ముడయ్యాయి. ప్రస్తుతం 44 లక్షలు రోడ్లపై పరుగుతీస్తున్నాయి. -
పెరిగిన రుణ పరపతి
సాక్షి, హైదరాబాద్: బ్యాంకులు వివిధ రంగాలకు ఇచ్చే రుణాలు ఏటేటా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) విడుదల చేసిన నివేదిక ప్రకారం 2024–25 ఆర్థిక సంవత్సరంలో అన్ని రకాల రుణాలు కలిపి రూ.10 లక్షల కోట్లకు పైగా బ్యాంకులు విడుదల చేశాయి. ఇందులో రూ.1.5 లక్షల కోట్లు వ్యవసాయ సంబంధిత రుణాలు కాగా, రూ.1.37 లక్షల కోట్ల వరకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రుణాలున్నాయి. అన్ని రకాల రుణాలు కలిపి 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.9.79 లక్షల కోట్లకు పైగా రుణాలివ్వగా, అంతకంటే రూ.58 వేల కోట్లు ఎక్కువగా 2024–25 ఆర్థిక సంవత్సరంలో రుణాలు విడుదల కావడం గమనార్హం. ఆ రెండు రంగాల్లోనే వృద్ధి బ్యాంకుల ద్వారా ఇచ్చే రుణాల విషయంలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో వృద్ధి కనిపిస్తోంది. » 2023–24లో వ్యవసాయానికి రూ.1.39 లక్షల కోట్లకు పైగా రుణాలివ్వగా, 2024–25లో రూ.1.59 లక్షల కోట్ల వరకు అప్పులు మంజూరయ్యాయి. అంటే గత ఏడాది కంటే రూ.20 వేల కోట్ల మేర ఈసారి వ్యవసాయ రుణాలు పెరిగాయన్నమాట. » సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) కూడా రుణ పరపతి పెరిగింది. 2023–24లో రూ.1.19 లక్షల కోట్లకు పైగా పారిశ్రామిక రుణాలను బ్యాంకులివ్వగా, 2024–25లో రూ.1.37లక్షల కోట్లకు పెరిగింది. అంటే గతం కంటే రూ.18 వేల కోట్ల పారిశ్రామిక రుణాలు పెరిగాయి. » విద్య, గృహ నిర్మాణం కోసం తీసుకునే రుణాల్లో తగ్గుదల కనిపించింది. విద్య కోసం 2023–24లో తీసుకున్న దాని కంటే రూ. 300 కోట్లకు పైగా తక్కువగా 2024– 25లో తీసుకున్నారని ఎస్ఎల్బీసీ గణాంకాలు చెబుతున్నాయి. గృహ రుణాల విషయంలోనూ ఇదే స్థాయిలో తగ్గుదల కనిపించింది. హౌస్ లోన్ల కింద 2023–24లో తీసుకున్న రుణాల కంటే 2024–25లో రూ.1500 కోట్ల వరకు తగ్గాయి. వ్యక్తిగత రుణాలు ఎక్కువే ఎస్ఎల్బీసీ నివేదికలో పేర్కొన్న గణాంకాల ప్రకారం మహిళలకు వ్యక్తిగత రుణాలు ఈసారి భారీగానే పెరిగాయి. మహిళలతోపాటు ఎస్సీ, ఎస్టీలు, బలహీనవర్గాలు, మైనార్టీలు.. ఇలా సామాజికవర్గాల వారీగా ఇచి్చన వ్యక్తిగత రుణాలన్నింటిలో పెరుగుదల కనిపించింది. ఇక, స్వయం సహాయక సంఘాలకు రుణాలు కూడా పెద్ద ఎత్తున మంజూరు చేసినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. » 2023–24లో దాదాపు రూ.35వేల కోట్లు రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలకు రుణాలివ్వగా, 2024–25లో అది రూ. 39,072 కోట్లకు చేరింది. అప్పుల లెక్క అలా ఉంటే... రాష్ట్రంలోని అన్ని బ్యాంకుల్లో కలిపి రూ.8.40 లక్షల కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. ఈ లెక్కన డిపాజిట్లతో పోలిస్తే 128 శాతం అప్పులు ఉండడం గమనార్హం. -
ఈ–సెట్లో 17,766 మంది పాస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఈసెట్–2025లో 17,766 మంది అర్హత సాధించారు. ఈసెట్ ఫలితాలను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి ఆదివారం విడుదల చేశారు. పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ మేథ్స్ కోర్సు ద్వారా ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈసెట్)ను ఈ నెల 12న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. 19,672 మంది దరఖాస్తు చేసుకోగా, 18,928 మంది పరీక్ష రాశారు. వీరిలో 17,768 (93.87 శాతం) అర్హత సాధించారు. ఈ సెట్ ద్వారా ఇంజనీరింగ్ రెండో సంవత్సరం (లేటరల్ ఎంట్రీ)లో చేరేందుకు అవకాశం లభిస్తుంది. మొత్తం పది బ్రాంచీలకు జరిగిన సెట్లో బాలురు 10,972 మంది, బాలికలు 6,796 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా ఉన్నారు. నాన్–లోకల్ కోటా ఎత్తివేయడంతో వారికి తెలంగాణలో ఇంజనీరింగ్లో ప్రవేశం ఉండదు. త్వరలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి తెలిపారు. ఫలితాల విడుదల కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ కుమార్ ఎం, సెట్ కనీ్వనర్ పి చంద్రశేఖర్, ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఈ.పురుషోత్తం, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఏఐకి సవాళ్ల స్వాగతం
సాక్షి, హైదరాబాద్: కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతిక అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణలో.. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సరికొత్త టెక్నాలజీని అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తోంది. ఏఐ సిటీ నిర్మాణం, బిగ్డేటా, సైబర్ సెక్యూరిటీ వంటి టెక్నాలజీలకు ప్రభుత్వం ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసింది. డేటా సైన్స్, నైపుణ్యం, పాలన, పరిశోధన, భాగస్వామ్యం, అనుసరణ అనే ఆరు అంశాలను మూల స్తంభాలుగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఏఐ పాలసీని రూపొందించింది. అదే సమయంలో ఈ రంగంలో అనేక సవాళ్లు కూడా ఎదురవుతున్నాయి. నిపుణుల కొరత.. డేటా సైన్స్, మెషీన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా అనలిటిక్స్ వంటి రంగాలలో రాష్ట్రంలో నిపుణుల కొరత తీవ్రంగా ఉంది. దీంతో ఏఐ ప్రాజెక్టుల అమల్లో ఆలస్యంతోపాటు అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలతో పోటీ పడలేకపోతున్నామని రాష్ట్ర ఐటీ వర్గాలు చెబుతున్నాయి. ఏఐ అభివృద్ధిలో కీలకమైన అధిక కంప్యూటింగ్ శక్తి, హై–స్పీడ్ ఇంటర్నెట్, డేటా సెంటర్లు ద్వితీయ శ్రేణి నగరాల్లో అంతగా అభివృద్ధి చెందలేదు. దీంతో ఏఐ ఆవిష్కరణలు హైదరాబాద్కే పరిమితమవుతున్నాయి. ఏఐ వ్యవస్థలు పెద్ద ఎత్తున డేటాపై ఆధారపడుతుండటంతో గోప్యత, భద్రత అత్యంత కీలకంగా మారింది. డేటా ఉల్లంఘనలు, సైబర్ నేరాలు కూడా ఏఐ ఆచరణలో ప్రధాన సవాలుగా నిలుస్తున్నాయి. ఎగుమతులు, ఉపాధి కల్పన నేలచూపులు కొన్నేళ్లుగా రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు, ఈ రంగంలో కొత్త ఉద్యోగాల కల్పన వృద్ధిలో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. 2022–23లో ఐటీ ఎగుమతుల్లో రూ.57,706 కోట్ల పెరుగుదల నమోదు కాగా.. 2023–24లో రూ.26,948 కోట్ల పెరుగుదల మాత్రమే ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2022–23లో ఐటీ రంగంలో కొత్తగా 1,27,594 ఉద్యోగాల కల్పన జరగ్గా, 2023–24లో 40,285కి పడిపోయాయి. ఈ తగ్గుదల ఏఐ సహా ఐటీ రంగంలో కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలో ఆటంకాలు సృష్టించిందనే వాదన వినిపిస్తోంది. ఏఐ ద్వారా ఆటోమేషన్ పెరిగి సంప్రదాయ ఉద్యోగాలు కోల్పోతామనే భయం ఐటీ ఉద్యోగుల్లో కనిపిస్తోంది. స్టార్టప్లు, ఆవిష్కరణలే కీలకం రాష్ట్రంలో రిజిస్టర్ చేసుకున్న స్టార్టప్ల (6,873)లో సుమారు మూడు శాతం ఏఐ, ఎంఎల్ ఆధారిత స్టార్టప్లు (211) ఉన్నాయి. తెలంగాణ ఏఐ మిషన్ (టీ ఎయిమ్) ద్వారా 142 ఏఐ స్టార్టప్లకు మార్కెట్తో అనుసంధానం, ఆర్థిక సాయం, మార్గదర్శనం, అత్యాధునిక ఏఐ కంప్యూటింగ్ సౌకర్యాలను ప్రభుత్వం అందిస్తోంది. 2027 నాటికి 5 లక్షల మందికి (18–45 ఏళ్ల వయస్సు) ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.నాస్కామ్, మైక్రోసాఫ్ట్ తదితర సంస్థలతో కలిసి ఏటా 30 వేల మంది విద్యార్థులకు ఏఐ శిక్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఏఐని పాఠ్యాంశంగా చేర్చే ప్రణాళిక రూపొందిస్తోంది. ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లకు ఏఐ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని అందుబాటులోకి తేవడం, 12 భారతీయ భాషల్లో ఏఐ అప్లికేషన్ల అభివృద్ధి, ప్రభుత్వ సేవల్లో ఏఐ సాంకేతిక వినియోగాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2024లో తెలంగాణ ఐటీ ఎగుమతులు రూ.2.68 లక్షల కోట్లు కాగా, 2025లో ఇందులో ఏఐ రంగం వాటాను 5 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.పెట్టుబడులు పెరిగితేనే ఫలితాలు మనకు విస్తృతమైన ఇంజనీరింగ్ ప్రతిభా సంపద ఉన్నప్పటికీ డేటాసైన్స్, మెషీన్ లెరి్నంగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీలో కీలక నైపుణ్యాల కొరతను ఎదుర్కొంటున్నాం. ద్వితీయ శ్రేణి నగరాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు లేకపోతే మనం ఏఐ ఫలితాలను అందుకోలేం. స్థానిక భాషలు, సంస్కృతి, స్థానిక అవసరాలకు అనుగుణంగా స్వదేశీ లార్జ్ లాంగ్వేజ్ మోడళ్లు (ఎల్ఎల్ఎం)లు, జనరేటివ్ ఏఐ మోడళ్లను అభివృద్ధి చేయడంలో కూడా మనం వెనుకబడి ఉన్నాం. ఏఐ వాతావరణం హైదరాబాద్ లాంటి నగరాలకే పరిమితం కాకుండా ఇంకా విస్తరించాలి. ఏఐ విప్లవాన్ని మన సొంత రీతిలో మనమే నిర్వచించుకోవాలి. – కరుణ్ తాడేపల్లి, కో ఫౌండర్, సీఈఓ–బైట్ఎక్స్ఎల్ఏఐతో ఉద్యోగాలకు ముప్పు లేదు ఏఐ వల్ల సంప్రదాయ ఉద్యోగాలకు ముప్పు ఉండదు. నెమ్మదిగా, పునరావృతమయ్యే పనులను వేగంగా పూర్తి చేసేందుకు ఏఐ సాంకేతికత ఉపయోగపడుతుంది. ఏఐ విప్లవానికి నాయకత్వం వహించే సామర్థ్యం మనకు ఉంది. కానీ ఏఐ, డేటా సైన్స్, క్లౌడ్లో నిపుణుల కొరతను ఎదుర్కొంటున్నాం. ఇది రాత్రికి రాత్రే పరిష్కారమయ్యే సమస్య కాదు. నైపుణ్య శిక్షణ, ఆచరణాత్మక విధానాలు, నిరంతర పెట్టుబడులతోనే ఈ సమస్యను అధిగమించగలం. ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు మాత్రమే ద్వితీయ శ్రేణి పట్టణాలు పరిమితం కాకుండా ఏఐ విప్లవంలో భాగస్వాములు కావాలి. – అంజి మరం, ఫౌండర్, సీఈఓ, క్రిటికల్రివర్ ఇంక్ -
ఆమెను వేశ్యలా చూశారన్న ఆరోపణలు అవాస్తవం: జయష్ రంజన్
సాక్షి, హైదరాబాద్: మిస్ ఇంగ్లాండ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. ఆమెను వేశ్యలా చూశారన్న ఆరోపణలు అవాస్తవమని ఆయన కొట్టిపారేశారు. ఆమె వ్యాఖ్యలు నిరాధారమన్నారు. తెలంగాణ ఆతిథ్యం నచ్చిందని ఆమె చెప్పారు. తల్లి ఆరోగ్యం బాగోలేదని పోటీ నుంచి తప్పుకున్నారు. ఆమె పట్ల ఎవరు తప్పుగా ప్రవర్తించలేదు’’ అని జయేష్ రంజన్ చెప్పారు.‘‘నేను మిస్ వరల్డ్ నిర్వాహకులతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నాను. ఆమె కేవలం చౌమహల్లా ప్యాలస్ డిన్నర్లో మాత్రమే పాల్గొంది. ప్రతి టేబుల్లో పురుషులు, మహిళలు అందరూ ఉన్నారు. ఆమె తోటి పోటీదారులను కూడా విచారించాం. అలాంటిది జరగలేదని చెప్పారు’’ అని జయేష్ రంజన్ పేర్కొన్నారు.మిస్ వరల్డ్ వివాదం.. విచారణకు ఆదేశించిన ప్రభుత్వం..మరోవైపు, మిస్ వరల్డ్ వివాదంపై తెలంగాణ సర్కార్ విచారణకు ఆదేశించింది. మిస్ వరల్డ్ పోటీలపై మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ చేసిన ఆరోపణలపై సీనియర్ ఐపీఎస్ అధికారి షికా గోయల్, ఐపీఎస్ రమా రాజేశ్వరి, సైబరాబాద్ డీసీపీ సాయిశ్రీ ఆధ్వర్యంలో విచారణ చేపట్టింది. మిస్ ఇంగ్లాండ్ ఆరోపణల్లో నిజమెంత? మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొంటున్నారా? అన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఈ వివాదంపై పూర్తి వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు. -
ఎర్రవల్లి ఫాంహౌస్కు కేటీఆర్.. కవిత లేఖ నేపథ్యంలో కేసీఆర్తో భేటీపై ఆసక్తి
సాక్షి, సిద్ధిపేట: ఎర్రవల్లి ఫాంహౌస్కు కేటీఆర్ వెళ్లారు. తన తండ్రి కేసీఆర్తో భేటీ అయ్యారు. కవిత లేఖపై చర్చ జరిగినట్లు సమాచారం. కవిత లేఖ నేపథ్యంలో ఇద్దరి భేటీపై ఆసక్తి నెలకొంది. సుమారు గంటన్నర సాగిన ఈ సమావేశంలో కాళేశ్వరం నోటీసులతో పాటు తాజా పరిస్థితులపై చర్చ జరిగినట్లు తెలిసింది. పార్టీలో అంతర్గతంగా మాట్లాడుకోవాల్సిన అంశాలను బహిరంగపరిచి క్యాడర్ను గందరగోళానికి గురి చేశారని కేసీఆర్కు కేటీఆర్ వివరించినట్టు సమాచారం.కాగా, కవిత లేఖ బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపుతోంది. ‘కేసీఆర్ దేవుడు.. ఆయన చుట్టూ దెయ్యాలు’ఉన్నాయంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ పరోక్ష వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘అంతర్గత విషయాలను ప్రస్తావించేందుకు పార్టీ వేదికలు ఉంటాయి. అధ్యక్షుడిని కలిసే అవకాశం ఉంటుంది. ఆఫీసు బేరర్స్ను కలిసి చెప్పుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాలను అంతర్గతంగా మాట్లాడితేనే బాగుటుందంటూ నిన్న(శనివారం) జరిగిన సమావేశంలో కేటీఆర్ వ్యాఖ్యానించారు.‘‘ఈ సూత్రం వాళ్లకు వీళ్లకు కాదు.. పార్టీలో ఉన్న కార్యకర్తలందరికీ వర్తిస్తుంది. ప్రజాస్వామిక స్ఫూర్తి కలిగిన బీఆర్ఎస్లో అధ్యక్షుడు కేసీఆర్కు లిఖితపూర్వకంగా లేదా మౌఖికంగా సూచనలిస్తూ ఎవరైనా లేఖలు రాయొచ్చు. అయితే పార్టీలో ఏ హోదాలో ఉన్న వారైనా కొన్ని అంతర్గత విషయాలను అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది’అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. -
సమతకు డాక్టరేట్
కేయూ క్యాంపస్(వరంగల్): కాకతీయ యూనివర్సిటీలోని ఫార్మాస్యూటికల్ సైన్సెస్లో పరిశోధకురాలు ఎ.సమతకు యూనివర్సిటీ డాక్టరేట్ను ప్రకటించింది. ఏ ప్రాస్పెక్టివ్ స్టడీ ఆన్ రోల్ ఆఫ్ మెట్ఫార్మిన్ అండ్ మయోఅయేనిసిటాల్ ఇన్ మేనేజ్మెంట్ ఆఫ్పాలిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అనే అంశంపై సమర్పించిన పరిశోధనాత్మక సిద్దాంత గ్రంథానికి సమతకు డాక్టరేట్ను ప్రదానం చేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్ తెలిపారు. కేయూ ఫార్మసీ కళాశాల డీన్ గాదె సమ్మయ్య పర్యవేక్షణలో సమత తన పీహెచ్డీ పూర్తి చేసింది. -
కేసీఆర్ ఉంటేనే కేటీఆర్, కవిత.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖపై కాంగ్రెస్ నాయకులు జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత లేఖ తో నష్టం జరుగుతుంది అనేది వారి కుటుంబ వ్యక్తిగత అంశం. కేసీఆర్ ఉంటేనే కేటీఆర్, హరీష్ రావు, కవిత లీడర్లు అని చెప్పుకొచ్చారు. కేసీఆర్ ను దేవుడు అంటూనే దెయ్యాలు అని సంబోధించడం దేనికి సంకేతం. కవిత వ్యవహారం చూస్తే తన కొమ్మను తాను నరుకున్నట్టు ఉంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో ఏదో జరిగిపోతుందనే చర్చ జోరుగా సాగుతుంది. కొత్త పార్టీ అనే చర్చ అన్ని రాజకీయ పక్షాల్లో నడుస్తుంది. కవిత లేఖతో కాంగ్రెస్కు వచ్చే నష్టమేమీ లేదు. కాంగ్రెస్ ఆనాటి నుండి ఈనాటి వరకు బలంగా ఉంది.. భవిష్యత్లోనూ బలంగానే ఉంటుంది. రాష్ట్ర రాజకీయాల్లో బలహీన పార్టీ బీజేపీ. బీఆర్ఎస్ ఉధ్యమం పేరుతో బలమైన పార్టీగా అవతరించింది. రాష్ట్ర విభజన కోణంలోనే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. పరిపాలన దక్షతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. వస్తుంది. మతం, హిందుత్వ పేరుతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. బలమైన పార్టీలుగా మొదటి స్థానంలో కాంగ్రెస్, రెండో స్థానంలో బీఆర్ఎస్, మూడో స్థానంలో బీజేపీ ఉంది. కమ్యూనిస్టు పార్టీలు ఉన్నప్పటికీ అధికారంలోకి వచ్చే పరిస్థితిలో లేవు.కేసీఆర్తోనే ఉనికి..కవిత లేఖతో నష్టం జరుగుతుంది అనేది వారి కుటుంబ వ్యక్తిగత అంశం. కవిత లేఖతో కేసీఆర్ కుటుంబంలో గొడవలు ఉన్నాయని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు భావించే అవకాశం ఉంది. కవిత లేఖ వల్ల బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ వైపు చూసే అవకాశం ఉంది. కాంగ్రెస్లో బలమైన క్యాడర్ ఉండడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కంటే బీజేపీ వైపు చూసే అవకాశం ఉంది. కేసీఆర్ కుటుంబంలో ఉన్న వారు తామే గొప్ప అనే భావన మంచిది కాదు. కేసీఆర్తోనే బీఆర్ఎస్ ఉనికి ఉంటుంది. కేసీఆర్ ఉంటేనే కేటీఆర్, హరీష్ రావు, కవిత లీడర్లు.బీజేపీకి ప్లస్ అవుతోంది..తండ్రి కూతురుగా కవిత లీడర్గా ఎదిగారు. కేసీఆర్ను దేవుడు అంటూనే దెయ్యాలు అని సంబోధించడం దేనికి సంకేతం?. కేసీఆర్ దేవుడు అంటూనే కేసీఆర్ను రాజకీయ సమాధి చేసేలా కవిత వ్యవహారం ఉంది.కవిత వ్యవహారం చూస్తే తన కొమ్మను తాను నరుకున్నట్టుగా ఉంది. కవిత లీకుల వ్యవహారం బీజేపీని బలపర్చేలా ఉంది. కవిత డిప్రెషన్లో ఉండి లేఖ విడుదల చేసినట్లుగా ఉంది. బీఆర్ఎస్ ఉనికిని దెబ్బతీస్తూ బీజేపీని పెంచి పోషించేలా బీఆర్ఎస్ వ్యవహారం ఉంది. లేఖలు, లీకులు మీడియాలో వార్తలకు పనిచేస్తాయి కానీ.. మీ మనుగడ దెబ్బతీస్తుందనే విషయం మర్చిపోతే ఎలా?. బీజేపీకి లేని బలాన్ని బీఆర్ఎస్ ఇస్తుంది. భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ అలర్ట్ కావాలి అని హెచ్చరించారు. కవితకు అవగాహన లేదు..బీఆర్ఎస్ కార్యకర్తలను కాంగ్రెస్ వైపు తిప్పుకునే వ్యూహం మేము అమలు చేయాలి. దీనిపై పీసీసీ, సీఎంతో మాట్లాడుతాను. నాయకత్వం లేని బీజేపీకి బీఆర్ఎస్ ఎందుకు అవకాశం ఇస్తుందో అర్దం కావడం లేదు. కేసీఆర్ లోతైన ఆలోచన చేస్తాడు. పిల్లలు దారి తప్పారని కేసీఆర్ భావిస్తున్నట్లు ఉంది. తండ్రి గురించి కవితకు పూర్తి అవగాహన లేకపోవడం దురదృష్టకరం. కుటుంబానికి వారసుడు కొడుకే అవుతాడు. కొడుకు లేని పక్షంలో కూతురు వారసురాలు అవుతుంది. కవిత ఏదో రాష్ట్ర రాజకీయాలను తిప్పేస్తుందని కాదు.. కానీ చర్చల వల్ల నష్టం జరుగుతుంది. కేసీఆర్ కూతురు కాబట్టే మీడియాలో కవితకు ప్రాధాన్యత. కవిత లేఖలు.. మా శత్రువు బీజేపీకి ఉపయోగపడుతాయనే మా బాధ’ అంటూ కామెంట్స్ చేశారు. -
Stray Dog: ఊరకుక్కలకో ఊరడింపు
మహబూబాబాద్ అర్బన్: ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిరుచి ఉంటుంది. కొందరికి మొక్కలు పెంచడం, ఇంకొందరికి జంతువులు, పక్షులను సాకడం ఇష్టం. కాగా పింగిలి శ్రీనివాస్, ఆయన కూతురు దీపిక మాత్రం శునకాలను పెంచడం ఇష్టంగా మార్చుకున్నారు. వారి కుటుంబ సభ్యులందరూ శునకాల ప్రేమికులే కావడం విశేషం. ఖమ్మం నుంచి తీసుకొచ్చి.. మానుకోట మున్సిపల్ పరిధిలోని ఈదులపూసపల్లికి చెందిన పింగిలి శ్రీనివాస్–ప్రసన్నలక్ష్మి దంపతులకు కూతురు దీపిక, కుమారుడు ఉన్నారు. శ్రీనివాస్ ప్రభుత్వ డ్రాయింగ్ ఉపాధ్యాయునిగా విధులు నిర్వర్తించి రిటైరయ్యారు. ఆయన ఒకరోజు ఖమ్మంలోని తన బంధువుల ఇంట్లో కార్యక్రమానికి వెళ్లారు. అక్కడ ఇంద్రనగర్ కాలనీలో సైడ్ డ్రెయినేజీ వద్ద చిన్న కుక్కపిల్ల శ్రీనివాస్ కంటపడగా.. దానిని ఇంటికి తీసుకొచ్చారు. ఆయన కూతురు దీపిక.. ఆ కుక్క పిల్లను ప్రేమగా దగ్గరికి తీసుకొని.. స్నానం చేయించి పాలు, బిస్కెట్లు అందించింది. కుక్కపిల్ల నోటినుంచి నురగ కారడంతో పాటు కురుపులు కావడంతో వెంటనే పశువైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యుడి సూచన మేరకు ఖమ్మంలో పశువైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించి శునకానికి క్యాన్సర్ ఉందని తేల్చారు. దీంతో హైదరాబాద్, ముంబై వైద్యులు చికిత్స చేయగా కోలుకుంది. కాగా దానికి దీపిక ముద్దుగా టాఫీ అని నామకరణం చేసి పెంచుకుంది. ఇలా వారి కుటుంబానికి కుక్కల పెంపకంపై మక్కువ పెరిగింది. వీధికుక్కలు, అనారోగ్యానికి గురైన వాటిని చేరదీసి వాటి ఆలనాపాలన చూస్తున్నారు. అనాధ శునకాలకు ఆలంబన మానుకోట జిల్లా కేంద్రంలో లక్ష్మి థియేటర్ వద్ద గర్భం దాల్చిన వీధి కుక్క కనిపించింది. తండ్రి శ్రీనివాస్, కూతురు దీపిక దాన్ని ఇంటికి తీసుకెళ్లి వైద్యం అందించారు. నెహ్రూసెంటర్లో మరో కుక్క పిల్ల కనిపించగా.. దాన్ని కూడా తీసుకెళ్లి పెంచుతున్న క్రమంలో ఒకరోజు కిందపడిపోయింది. దానిని పశువైద్యశాలకు తీసుకెళ్లగా శునకానికి మూర్ఛరోగం ఉందని తెలిపారు. ఆ కుక్కను హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి రూ.25 వేల వరకు వెచి్చంచి చికిత్స అందించారు. ఆ తర్వాత గర్భం దాలి్చన వీధి కుక్క 7 పిల్లలకు జన్మనిచి్చంది. అనంతరం వాటిని ఇంటికి తీసుకురాగా.. సందడి నెలకొంది. కుటుంబ సభ్యులందరూ సంతోషంగా వాటి మధ్యలో ఆడుకుంటూ ఆనందంగా గడుపుతున్నారు. ఇలా ఎక్కడ వీధి కుక్కలు అనారోగ్యంతో కనిపించినా.. వాటిని ఇంటికి తీసుకొచ్చి స్నానం చేయించి, సొంత డబ్బులతో మంచి వైద్యం అందించి ఆరోగ్యంగా తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 3వేల కుక్కలను దత్తత ఇచ్చారు. వారి కుటుంబం ప్రస్తుతం సుమారు 40 కుక్కలను పెంచుతోంది. దంపతులిద్దరూ శునకాల సేవలో.. పింగిలి దీపిక 13 ఏళ్లుగా శునకాలను పెంచుతోంది. కాగా ఆమెకు 2020లో మానుకోట జిల్లా కేంద్రానికి చెందిన ఇమామ్పాషాతో వివాహం జరిగింది. అప్పటి నుంచి ఇమామ్పాషా కూడా ఆమెకు సహకరిస్తున్నారు. రోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయత్రం తానే దగ్గరుండి చూసుకుంటూ.. భోజనంతో పాటు మందులు వేస్తున్నారు.కుక్కల కోసం యూట్యూబ్ చానల్ నాకు కుక్కలు, వాటి పిల్లలు అంటే చాలా ప్రేమ. మొదట మా నాన్న కుక్క పిల్లను తీసుకువచ్చాడు. దాంతో నాకు కుక్కలంటే ప్రేమ పెరిగింది. నేను మొదట మ్యారేజ్ ఈవెంట్స్ చేసేదాన్ని. అలా వచి్చన డబ్బులతో కుక్కలకు వైద్యం, స్నాక్స్, భోజనం అందించేదాన్ని. ప్రస్తుతం చాలా కుక్కలు ఇంట్లో ఉండడంతో.. నాన్న పెన్షన్ డబ్బులతో వాటికి అన్ని రకాల భోజనం అందిస్తున్నాను. నేను పెంచుతున్న వీధి కుక్కలకు ఏదో ఒక రోగం ఉంటోంది. గుండె, లివర్, క్యాన్సర్, పిడుసు లాంటి రోగాల బారిన పడి ఉన్నాయి. వాటిని హైదరాబాద్లో బంజారాహిల్స్ ఆస్పత్రికి కారులో తీసుకెళ్లి.. మంచి వైద్యం అందిస్తాను. ఎవరికి కుక్కలు కావాలన్నా ఈదులపూసపల్లికి వచ్చి దత్తత తీసుకుంటారు. ప్రత్యేకంగా కుక్కల కోసం నా పేరుతోనే సొంతంగా యూట్యూబ్ చానల్ ప్రారంభించాను. – పింగిలి దీపిక, శునకాల సంరక్షకురాలుమా బిడ్డకు ఇష్టమని.. నేను మొదటిసారిగా చిన్న కుక్క పిల్లను ఇంటికి తీసుకువస్తే.. మా అమ్మాయి దీపిక దానిపై ఎనలేని ప్రేమ పెంచుకుంది. అప్పటి నుంచి నేను ఎక్కడికి వెళ్లినా.. అనారోగ్యంతో వీధి కుక్కలు కనిపిస్తే ఇంటికి తీసుకెళ్తాను. వాటికి చికిత్స అందించి ఆరోగ్యవంతంగా మారిన తర్వాత.. తిరిగి బయటకు పంపించడం లేదా ఇంట్లోనే పెంచుతాను. నా పెన్షన్ డబ్బులతో వాటికి మంచి పౌష్టికాహారం అందిస్తాను. అవి ఇంట్లో సందడి చేస్తాయి. పింగిలి శ్రీనివాస్, ఈదులపూసపల్లిమా పిల్లలుగా భావిస్తాం దీపికకు నాకు వివాహమై ఐదు సంవత్సరాలు అవుతోంది. నాకు కూడా జంతువులంటే ప్రేమ. మా ఇద్దరినీ.. జంతువులపై ఉన్న ప్రేమే కలిపింది. రోజూ ఉదయం 9 గంటలకు కుక్కలకు స్నానం తర్వాత టానిక్, మందులు వేస్తాను. 10 గంటలకు ఎగ్, చికెన్ బిర్యానీ, కూరగాయలతోనే చక్కటి భోజనం పెడతాను. మధ్యాహ్నం స్నాక్స్, బిస్కెట్లు, ఇంట్లో తయారు చేసిన మురుకులు, అప్పాలు పెడతాను. సాయంత్రం 5గంటలకు భోజనం, రాత్రి 8 గంటలకు మందులు, పాలు అందిస్తాం. వీధి కుక్కలను ప్రేమ చూసుకుంటాను. – ఎండీ ఇమామ్పాషా. మానుకోట -
మరోసారి మావో చర్చ
షాద్నగర్(హైదరాబాద్): ఓవైపు కల్వకుర్తి.. మరో వైపు పాలమూరు అటవీ ప్రాంతం.. ఈ క్రమంలో మావోయిస్టుల చర్యలు.. కదలికలు ఒకప్పుడు కలవరం పుట్టించాయి.. రెండు దశాబ్దాలుగా అలాంటి ఆనవాళ్లు ఏవీ ఇక్కడ కనిపించడం లేదు.. తాజాగా మావోయిస్టు విజయలక్ష్మి అలియాస్ భూమిక ఎన్కౌంటర్ ఘటన మరోసారి షాద్నగర్లో కలకలం రేపింది. గతంలో ఇలా.. షాద్నగర్ నియోజకవర్గానికి ఆనుకొని ఉండే కల్వకుర్తి నియోజకర్గం మొదటి నుంచీ మావోయిస్టుల కార్యాకలాపాలకు కేంద్రం. ఈ క్రమంలో చాలామంది మావోయిస్టులు షాద్నగర్ను కేంద్రంగా చేసుకొని తమ కార్యాకలాపాలు కొనసాగించే వారని గతంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. షాద్నగర్కు సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉండే నల్లమల అటవీ ప్రాంతం సైతం మావోయిస్టులకు అడ్డాగా ఉండేది. అక్కడి నుంచి కూడా ఇక్కడికి తలదాచుకునేందుకు వచ్చే వారని ప్రచారంలో ఉంది.ఎన్కౌంటర్లో హతం ఫరూఖ్నగర్ మండలం నేరేళ్ల చెరువు గ్రామానికి చెందిన జంగయ్య అలియాస్ దివాకర్ నల్లగొండ దళంలో చేరి జిల్లా కార్యదర్శిగా పని చేశాడు. 15 ఏళ్ల క్రితం నల్లమల అటవీ ప్రాంతంలోని గోకారం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందాడు. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. 2005లో షాద్నగర్ పట్టణానికి చెందిన కానిస్టేబుల్ ప్రకాష్ ను మహబూబ్నగర్ జిల్లా బాలానగర్లో నక్సలైట్లు కాల్చి చంపారు. పదేళ్ల క్రితం కొందుర్గు మండల పరిధిలోని మహదేవ్పూర్, టేకులపల్లి గ్రామాల్లో, షాద్నగర్లోని మిలీనియం టౌన్íÙప్లో మావోయిస్టు సానుభూతిపరులను, ఆ తర్వాత కొందుర్గు మండలం ఆగిర్యాల గ్రామంలో మావోయిస్టు మద్దతుదారులను పోలీసులు అరెస్టు చేసిన సంఘటనలు ఉన్నాయి. అప్పట్లో వారి నుంచి విప్లవ సాహిత్య పుస్తకాలను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. ఇలా తరచూ ఏదో ఒక సంఘటనకు షాద్నగర్ వేదికగా మారింది. ఇరవై ఏళ్లుగా మావోయిస్టులకు సంబంధించి ఎలాంటి కదలికలు లేవు.మరోసారి ఉలికిపాటు మావోయిస్టుగా పేరు మోసిన విజయలక్ష్మి ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లా సరిహద్దు అబూజ్మడ్ అడవుల్లో గత బుధవారం జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే. కేశంపేట మండలం వేములనర్వ గ్రామానికి చెందిన ఆమె విద్యార్థి దశలో ఉద్యమాల పట్ల ఆకర్షితు రాలైంది. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న క్రమంలో అజ్ఞాతంలోకి వెళ్లి నక్సలిజం వైపు అడుగులు వేసింది. ఎన్కౌంటర్లో మృతి చెందడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. వేములనర్వలో విషాదఛాయలు కేశంపేట: ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో వేములనర్వ కు చెందిన విజయలక్ష్మి (38) మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఉదయం నుంచే గ్రామస్తులు విజయలక్ష్మి తల్లిదండ్రులు సాయిలు గౌడ్, సరస్వతిని పరామర్శించారు. మరోవైపు విజయలక్ష్మి మృతదేహాన్ని గ్రామంలోకి తీసుకువచ్చేందుకు కుటుంబ సభ్యులు ఆసక్తి చూపకపోవడంతో అంత్యక్రియల్లో జాప్యం ఏర్పడింది. మరోవైపు ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) విజయలక్ష్మిపై కేసులు నమోదు చేసినట్టు తెలిసింది. 2019, 2021లో కేసులను నమోదు చేయగా కొద్దిరోజుల క్రితం వారెంట్ ఇష్యూ చేసినట్టు సమాచారం. ఇంట్లో నుంచి వెళ్లినప్పటి నుంచి విజయలక్ష్మితో సంబంధాలు లేవని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదే విషయమై పంచాయతీ కార్యదర్శి రాతపూర్వకంగా తెలియజేసినట్టు సమాచారం. -
మిస్ వరల్డ్ పోటీలపై మిల్లా మాగీ సంచలన ఆరోపణలు.. కేటీఆర్ డిమాండ్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం తొలిసారి ఆతిథ్యం ఇస్తున్న మిస్ వరల్డ్–2025 అందాల పోటీల చుట్టూ తీవ్ర వివాదం ముసురుకుంది!. మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ.. మిస్ వరల్డ్ పోటీలపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఆమె చేసిన ఆరోపణలపై సంపూర్ణంగా విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. మిల్లా మాగీ ఒక బలమైన మహిళ, మా తెలంగాణలో మీరు ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నందుకు మేము చింతిస్తున్నాము. తెలంగాణలో మహిళలను గౌరవించే గొప్ప సంస్కృతి ఉంది. ఇక్కడ మహిళలను పూజిస్తాము, గౌరవిస్తాము, వారి అభివృద్ధికి సమాన అవకాశాలను కల్పిస్తాము. రాణి రుద్రమ, చిట్యాల ఐలమ్మ వంటి గొప్ప నాయకులు మా తెలంగాణ మట్టిలో పుట్టినవారే.దురదృష్టవశాత్తు, మీరు ఎదుర్కొన్న ఈ చేదు అనుభవం నిజమైన తెలంగాణను ప్రతిబింబించేది కాదు. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఏ ఒక్క మహిళ గానీ, ఆడపిల్ల గానీ ఇలాంటి భయానక అనుభవాలను ఎదుర్కోకూడదని ఒక అమ్మాయికి తండ్రిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాధితురాలిని విమర్శించడం, ఆమెను తప్పుగా చూపించడాన్ని ఖండిస్తున్నాను. అలాగే మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ చేసిన ఆరోపణలపై సంపూర్ణంగా విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నాను’ అంటూ వ్యాఖ్యలు చేశారు.It takes a lot of guts to stand up and call out misogynistic mentality, especially on international forums like the Miss WorldYou are a very strong woman, Milla Magee and I am truly sorry you had to go through this in our state of TelanganaTelangana has a rich culture of… pic.twitter.com/c7Gla3x3yI— KTR (@KTRBRS) May 25, 2025ఇదిలా ఉండగా, అంతకుముందు.. వ్యక్తిగత కారణాలతో పోటీల నుంచి వైదొలగుతున్నట్లు చెప్పి స్వదేశం వెళ్లిపోయిన మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ తాజాగా ‘ద సన్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పోటీల తీరుపై సంచలన ఆరోపణలు గుప్పించారు. తాను వేశ్యననే భావన కలిగేలా నిర్వాహకులు పరిస్థితులను కల్పించారంటూ బాంబు పేల్చారు. నిర్వాహకులు పేర్కొన్నట్లు ఈ పోటీలు బ్యూటీ విత్ పర్పస్కు అనుగుణంగా లేవని.. అదంతా డొల్లేనని దుయ్యబట్టారు. పోటీదారులంతా ఎల్లవేళలా మేకప్ వేసుకోవాలని ఆదేశించారని.. అల్పాహారం సమయంలోనూ బాల్ గౌన్లు ధరించాల్సిందేనని హుకుం జారీ చేశారని విమర్శించారు. ‘పోటీకి ఆర్థిక సహకారం అందిస్తున్న స్పాన్సర్లకు కృతజ్ఞతాపూర్వకంగా ఆరుగురు అతిథులు కూర్చున్న ఒక్కో టేబుల్ వద్ద ఇద్దరేసి పోటీదారులను కూర్చోబెట్టారు. సాయంత్రం మొత్తం వారితో కూర్చొని కృతజ్ఞతలు తెలుపుతూ మేం వినోదం అందించాలని నిర్వాహకులు ఆశించారు.ఓ సమయంలో పోటీల ఉద్దేశం గురించి అతిథులకు వివరించే ప్రయత్నం చేశా. కానీ ఈ విషయాన్ని వారెవరూ పట్టించుకోలేదు. అది నాకు భరించలేనట్లుగా అనిపించింది. ఇతరుల వినోదం కోసం నేను ఇక్కడికి రాలేదు కదా అనుకున్నా. సంపన్న పురుష స్పాన్సర్ల ముందు కవాతు చేశాక వేశ్యలా భావించా’ అని మిల్లా మాగీ చెప్పుకొచ్చింది.మారాలనుకున్నా... నా వల్ల కాలేదు.. సమాజంలో మార్పు తీసుకురావడానికి, యువతలో స్ఫూర్తినింపి వారి భవితకు దోహదపడాలనే ఉద్దేశంతోనే పోటీలో పాల్గొన్నానని మిల్లా మాగీ పేర్కొంది. కానీ అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితుల్లో ఉంటానని ఏమాత్రం ఊహించలేకపోయానని చెప్పుకొచ్చింది. అతిథులను సంతోషపెట్టేందుకు ఆటాడే కోతుల్లా అక్కడ కూర్చోవాల్సి వచ్చిందని.. దీన్ని ఏమాత్రం తట్టుకోలేకపోయానని వాపోయింది.‘నేను నిర్వాహకుల నిబంధనలకు అనుగుణంగా మారాలనే ప్రయత్నంలో ఒత్తిడిని అనుభవించా. అలా చేయకపోతే గెలవలేననే విషయం నాకు అర్థమైంది. మిస్ వరల్డ్ పోటీలంటే మనం ఎలా ఉన్నామో అలా కనిపించడం. కానీ 1970ల నుంచి ఆ పోటీల తీరు మారలేదు. అందుకే మేకప్ లేకుండానే బయటకు వెళ్లడం ప్రారంభించా. అల్పాహారం తీసుకోవడానికి నాకు నప్పేవి, తగిన దుస్తులను ధరించడం ప్రారంభించా’ అని మిల్లా మాగీ చెప్పింది. -
నువ్వులేక.. నేనుండలేను
కామారెడ్డి(జుక్కల్): రోడ్డు ప్రమాదంలో భార్య మరణా న్ని తట్టుకోలేకపోయిన ఒక భర్త తీవ్ర మనస్తాపంతో యాసిడ్ తాగి మరణించాడు. వివరాలివి. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన సునీల్కు, పెద్దతడ్గూర్ గ్రామానికి చెందిన జ్యోతితో గతేడాది పెళ్లి జరిగింది. ప్రస్తుతం జ్యోతి ఆరు నెలల గర్భవతి. శుక్రవారం భార్యాభర్తలు కలిసి బైక్పై వెళ్తుండగా.. బిచ్కుంద శివారులోని మైసమ్మ గుడి వద్ద అదుపు తప్పి పడిపోయారు. ఈ ప్రమాదంలో జ్యోతి (22) తలకు తీవ్రగాయాలై మృతి చెందింది. మృతదేహాన్ని అంబులెన్స్లో బిచ్కుందలోని ఇంటికి తీసుకొచ్చారు. శవాన్ని దించిన కొద్దిసేపటికే.. సునీల్ (26) తీవ్ర మనస్తాపంతో యాసిడ్ తాగాడు. బంధువులు అదే అంబులెన్స్లో సునీల్ను ఆస్పత్రికి తరలించారు. నిజామాబాద్లో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి సు నీల్ మృతి చెందాడు. భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండేవారని, తమకు సంతా నం కలగబోతోందని సంతోషపడేవారని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. -
బ్యూటీ విత్ పర్పస్ అనేది డొల్ల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం తొలిసారి ఆతిథ్యం ఇస్తున్న మిస్ వరల్డ్–2025 అందాల పోటీల చుట్టూ తీవ్ర వివాదం ముసురుకుంది! వ్యక్తిగత కారణాలతో పోటీల నుంచి వైదొలగుతున్నట్లు చెప్పి స్వదేశం వెళ్లిపోయిన మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ తాజాగా ‘ద సన్’కు ఇచి్చన ఇంటర్వ్యూలో పోటీల తీరుపై సంచలన ఆరోపణలు గుప్పించారు. తాను వేశ్యననే భావన కలిగేలా నిర్వాహకులు పరిస్థితులను కలి్పంచారంటూ బాంబు పేల్చారు. నిర్వాహకులు పేర్కొన్నట్లు ఈ పోటీలు బ్యూటీ విత్ పర్పస్కు అనుగుణంగా లేవని.. అదంతా డొల్లేనని దుయ్యబట్టారు.పోటీదారులంతా ఎల్లవేళలా మేకప్ వేసుకోవాలని ఆదేశించారని.. అల్పాహారం సమయంలోనూ బాల్ గౌన్లు ధరించాల్సిందేనని హుకుం జారీ చేశారని విమర్శించారు. ‘పోటీకి ఆర్థిక సహకారం అందిస్తున్న స్పాన్సర్లకు కృతజ్ఞతాపూర్వకంగా ఆరుగురు అతిథులు కూర్చున్న ఒక్కో టేబుల్ వద్ద ఇద్దరేసి పోటీదారులను కూర్చోబెట్టారు. సాయంత్రం మొత్తం వారితో కూర్చొని కృతజ్ఞతలు తెలుపుతూ మేం వినోదం అందించాలని నిర్వాహకులు ఆశించారు.ఓ సమయంలో పోటీల ఉద్దేశం గురించి అతిథులకు వివరించే ప్రయత్నం చేశా. కానీ ఈ విషయాన్ని వారెవరూ పట్టించుకోలేదు. అది నాకు భరించలేనట్లుగా అనిపించింది. ఇతరుల వినోదం కోసం నేను ఇక్కడికి రాలేదు కదా అనుకున్నా. సంపన్న పురుష స్పాన్సర్ల ముందు కవాతు చేశాక వేశ్యలా భావించా’అని మిల్లా మాగీ చెప్పుకొచ్చింది. మారాలనుకున్నా... నా వల్ల కాలేదు.. సమాజంలో మార్పు తీసుకురావడానికి, యువతలో స్ఫూర్తినింపి వారి భవితకు దోహదపడాలనే ఉద్దేశంతోనే పోటీలో పాల్గొన్నానని మిల్లా మాగీ పేర్కొంది. కానీ అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితుల్లో ఉంటానని ఏమాత్రం ఊహించలేకపోయానని చెప్పుకొచ్చింది. అతిథులను సంతోషపెట్టేందుకు ఆటాడే కోతుల్లా అక్కడ కూర్చోవాల్సి వచ్చిందని.. దీన్ని ఏమాత్రం తట్టుకోలేకపోయానని వాపోయింది.‘నేను నిర్వాహకుల నిబంధనలకు అనుగుణంగా మారాలనే ప్రయత్నంలో ఒత్తిడిని అనుభవించా. అలా చేయకపోతే గెలవలేననే విషయం నాకు అర్థమైంది. మిస్ వరల్డ్ పోటీలంటే మనం ఎలా ఉన్నామో అలా కనిపించడం. కానీ 1970ల నుంచి ఆ పోటీల తీరు మారలేదు. అందుకే మేకప్ లేకుండానే బయటకు వెళ్లడం ప్రారంభించా. అల్పాహారం తీసుకోవడానికి నాకు నప్పేవి, తగిన దుస్తులను ధరించడం ప్రారంభించా’అని మిల్లా మాగీ చెప్పింది. ఆరోపణలన్నీ నిరాధారం: మిస్ వరల్డ్ సీఈఓ మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ ఆరోపణలను మిస్ వరల్డ్–2025 సీఈఓ జూలియా మోర్లే ఓ ప్రకటనలో ఖండించారు. ఆమె ఆరోపణలను నిరాధార, కల్పితమైనవిగా అభివరి్ణంచారు. తల్లి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నందున పోటీల నుంచి వైదొలగుతానని మిల్లా మాగీ చెప్పడంతో ఆమె స్వదేశం చేరుకొనేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.మాగీ స్థానంలో మిస్ ఇంగ్లాండ్ పోటీల్లో రన్నరప్గా నిలిచిన చార్లెట్ గ్రాంట్ పోటీలో పాల్గొనేందుకు హైదరాబాద్ చేరుకుందని.. ఈ పోటీలో ఇంగ్లండ్ ప్రాతినిధ్యం కొనసాగుతోందని పేర్కొన్నారు. మిల్లా మాగీ ఆరోపణల నేపథ్యంలో పోటీలో పాల్గొన్న సందర్భంగా ఆమె నిర్వాహకులను ప్రశంసిస్తూ మాట్లాడిన మాటలు, అనుభూతులను పంచుకున్న వైనాన్ని వీడియోలను విడుదల చేయనున్నట్లు జూలియా మోర్లే వివరించారు. మిస్ వరల్డ్ సంస్థ అంకిత భావంతో ఉందని.. బ్యూటీ విత్ పర్పస్ అనే పంథాకు కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు. -
టాప్ మోడల్ చాలెంజ్ విజేత మిస్ ఇండియా
సాక్షి, హైదరాబాద్: మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే ముందు ఒకే ఒక్క చాలెంజ్ రౌండ్ ఉందనగా మిస్ ఇండియా నందినీ గుప్తా టాప్–40 జాబితాలో చోటు దక్కించుకుంది. గ్రాండ్ ఫినాలే నాటికి పోటీలో ఉండాలంటే కచ్చితంగా ఖండానికి 10 మంది చొప్పున ఉండే ఈ టాప్–40లో చోటు దక్కించుకోవాల్సిందే. ఫాస్ట్ట్రాక్ పోటీ రౌండ్లలో విజయం సాధించడం ద్వారా నేరుగా అందులో చేరే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు జరిగిన మూడు రౌండ్లలో ఆమె విజయం సాధించలేకపోవడంతో మిస్ వరల్డ్ పోటీలను అనుసరిస్తున్న భారత అభిమానుల్లో నిరాశే మిగిలింది.శనివారం హైటెక్స్లో జరిగిన టాప్ మోడల్ ఫ్యాషన్ షోలో నందినీ గుప్తా.. పటోలా లెహంగా వస్త్రధారణతో ర్యాంప్పై క్యాట్ వాక్తో న్యాయనిర్ణేతల దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత ఆధునిక వస్త్రధారణలోనూ తళుక్కున మెరిసింది. వెరసి ఈ రౌండ్లో ఆసియా–ఓషియానియా గ్రూప్ నుంచి ఆమె న్యూజిలాండ్ సుందరితో కలిసి టాప్–8లో నిలిచింది. చివరకు న్యూజిలాండ్ భామను వెనక్కు నెట్టి విజేతగా ఎంపికైంది. పోచంపల్లి, గద్వాల, గొల్లభామ చీరలు... మిస్ వరల్డ్ పోటీలు ఆసాంతం తెలంగాణ సంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబిస్తూ ముందుకు సాగుతుండగా దాన్ని మరింత విస్తరిస్తూ శనివారం టాప్ మోడల్ పోటీలు సాగాయి. ప్రపంచ ప్రఖ్యాత పోచంపల్లి వస్త్రాలు, సిద్దిపేట గొల్లభామ, గద్వాల చీరలతోపాటు లెహంగా, గాగ్రా చోలీ తదితర భారతీయ వస్త్రాలు ధరించిన అందాల భామలు.. ర్యాంప్పై క్యాట్ వాక్ చేసి ఆకట్టుకున్నారు. తొలుత తెలంగాణ టాప్ డిజైనర్లు రూపొందించిన తెలంగాణ–భారతీయ సంప్రదాయ వ్రస్తాలతో క్యాట్ వాక్ చేశారు. అనంతరం టాప్ డిజైనర్లు రూపొందించిన ఆధునిక వ్రస్తాలతో రెండోసారి ర్యాంప్పై నడిచారు. ఈ రెండు రౌండ్లకు కలిపి న్యాయనిర్ణేతలు మార్కులు వేశారు. హైహీల్స్, పొడవాటి వ్రస్తాలు ధరించిన జపాన్ సుందరి క్యాట్వాక్ రౌండ్ చివర్లో అదుపుతప్పి ర్యాంప్పై పడిపోయింది. ఆ వెంటనే లేచి తేరుకుని వాక్ పూర్తి చేసింది. తెలంగాణ డిజైన్లకు న్యాయ నిర్ణేతల ప్రశంసలు.. ఫ్యాషన్ ఫినాలేకు హాజరైన న్యాయ నిర్ణేతలు, ఆహూతులు.. తెలంగాణ సంప్రదాయ డిజైన్లను చూసి ప్రశంసలు కురిపించారు. పోటీదారులంతా స్థానిక చేనేతలను అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించడం ఆ డిజైన్లకు, తయారీదారులకు గుర్తింపును, మార్కెటింగ్ అవకాశాలను అందిస్తుందన్నారు. తెలంగాణ చేనేత వ్రస్తాలతో డిజైన్లు చేయడం ఆనందంగా, గర్వంగా ఉందని డిజైనర్ అర్చనా కొచ్చార్ అన్నారు. దీని ద్వారా చేనేత చీరలకు ప్రపంచ ఖ్యాతి దక్కుతుందని అభిప్రాయపడ్డారు. డిజైనర్ డ్రెస్ విజేతలు వీరే.. ఈ పోటీల్లో బెస్ట్ డిజైనర్ డ్రెస్ విజేతలుగా ఒక్కో ఖండం నుంచి ఒకరు చొప్పున నిలిచారు. ఆసియా–ఓషియానియా గ్రూప్ నుంచి న్యూజిలాండ్ సుందరి సమంతా పూల్, ఆఫ్రికా నుంచి దక్షిణాఫ్రికా ముద్దుగుమ్మ జోలైస్ జాన్సెన్ వాన్ రెన్స్బర్గ్, ఆమెరికా–కరీబియన్ బృందం నుంచి ప్యూర్టోరికో భామ వలేరియా పెరేజ్, యూరప్ నుంచి ఉక్రెయిన్ సుందరీమణి మారియా మెలి్నచెంకో విజేతలుగా నిలిచారు. అయితే వారు టాప్–40 పరిధిలోకి రారు. -
10 మందికి బెర్తులు ఖరారు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ సుందరి పోటీల్లో కిరీటం కోసం పోటీపడే టాప్–40 మందిలో 10 మంది చోటు దక్కించుకున్నారు. వారు ఒక్కో ఖండం నుంచి ఎంపికయ్యే టాప్–10లో భాగం కానున్నారు. శనివారం నాటికి మొత్తం నాలుగు రకాల చాలెంజ్ రౌండ్లు పూర్తయ్యాయి. గ్రాండ్ ఫినాలే ముందు మరో రౌండ్ మాత్రమే మిగిలి ఉంది. ఒక్కో ఖండం నుంచి ఎంపికయ్యే మొదటి 10 మందిలో ఫాస్ట్ట్రాక్ పద్ధతిలో స్థానం సంపాదించిన ఈ 10 మందిలో భారత సుందరి నందినీ గుప్తా కూడా ఉండటం విశేషం. మొదటి మూడు చాలెంజ్ రౌండ్లలో ఆమెకు నిరాశ ఎదురవగా శనివారం జరిగిన కీలక టాప్ మోడల్ చాలెంజ్లో ఆమె ఆసియా–ఓషియానియా నుంచి విజేతగా నిలిచి టాప్–10 గ్రూపులో చేరింది.ఇక చివరగా ఈ నెల 26న హైటెక్స్లో బ్యూటీ విత్ పర్పస్ కార్యక్రమం జరగనుంది. అందులో పోటీదారులు వారి సామాజిక సేవా కార్యక్రమాల గురించి వివరించాల్సి ఉంటుంది. వాటిల్లో ఉత్తమంగా రాణించినవారు టాప్–40 (ఖండానికి 10 మంది చొప్పున)లో మిగతా బెర్తులు సాధిస్తారు. వారిలోంచి టాప్–20 (ఖండానికి ఐదుగురు చొప్పున), ఆ తర్వాత టాప్–8 (ఖండానికి ఇద్దరేసి) ఎంపిక చేస్తారు. ఈ ఎనిమిది మంది ఈ నెల 31న హైటెక్స్లో జరిగే గ్రాండ్ ఫినాలేలో భాగమవుతారు. వారి నుంచి విజేత, మొదటి రన్నరప్, రెండో రన్నరప్ ఎంపికవుతారు. టాప్ మోడల్ చాలెంజ్: విజేతలు: మిస్ ఇండియా, మిస్ నమీబియా, మిస్ మార్టీనిక్, మిస్ ఐర్లాండ్ శనివారం జరిగిన టాప్ మోడల్ చాలెంజ్ ఆసాంతం ఆసక్తికరంగా సాగింది. ఇందులో తొలుత నాలుగు ఖండాల నుంచి ఇద్దరు చొప్పున మొత్తం ఎనిమిది మందితో షార్ట్లిస్ట్ తయారు చేశారు. అందులోంచి న్యాయ నిర్ణేతలు ఖండానికి ఒకరు చొప్పున నలుగురిని విజేతలుగా ప్రకటించారు. ఇందులో ఆసియా–ఓషియానియా నుంచి మిస్ ఇండియా నందినీ గుప్తా న్యూజిలాండ్ భామ నుంచి గట్టి పోటీ ఎదుర్కొని విజేతగా నిలిచింది.ఆఫ్రికా నుంచి నమీబియా సుందరి సెల్మా కమన్య, ఆమెరికా–కరీబియన్ నుంచి మిస్ మార్టీనిక్ అరేలీ జోచిమ్, యూరప్ నుంచి ఐర్లాండ్ సుందరి జాస్మిన్ గెర్హాడ్లు విజయం సాధించారు. ఇలా ఇప్పటి వరకు 10 మంది భామలు ఖండానికి 10 మంది చొప్పున మొత్తం 40 మంది ఉండే బృందంలో బెర్తు దక్కించుకున్నారు. గ్రాండ్ ఫినాలే నాటికి పోటీల్లో ఉండేందుకు చోటు దక్కించుకున్న 10 మందిలో ముగ్గురు ఆసియా ఖండానికి చెందిన వారున్నారు. మిగిలిన వారిలో యూరప్ నుంచి ముగ్గురు, ఆఫ్రికా నుంచి ఇద్దరు, ఆమెరికా–కరీబియన్ నుంచి ఇద్దరు ఉన్నారు. ఆసియా ఖండం నుంచి ఫాస్ట్ట్రాక్ పద్ధతిలో టాలెంట్ చాలెంజ్లో ఇండోనేసియా సుందరి, హెడ్ టు హెడ్ చాలెంజ్లో తుర్కియే ముద్దుగుమ్మ , శనివారం నందినీ గుప్తా చోటు దక్కించుకున్నారు. ఇంకా ఏడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటివరకు వివిధ చాలెంజ్లలో విజేతలుగా టాప్–40లో చోటుదక్కించుకున్న వారి వివరాలు ఇలా..స్పోర్ట్స్ చాలెంజ్: విజేత మిస్ ఎస్తోనియా ఎలిస్ రాండ్మా ⇒ ఈ నెల 17న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగింది. 109 మంది పోటీదారులు ఫిట్నెస్లో తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. అందులో 32 మందిని షార్ట్లిస్ట్ చేయగా అందులోంచి మొదటి నాలుగు స్థానాలకు నలుగురిని ఎంపిక చేశారు. వారిలో ఎస్తోనియాకు చెందిన ఎలిస్ రాండ్మా విజేతగా నిలిచింది. ఖండానికి 10 మంది చొప్పున 40 మందితో కూడిన ప్రధాన పోటీదారుల జాబితాలో ఆమె తొలి స్థానాన్ని దక్కించుకుంది.టాలెంట్ చాలెంజ్: విజేత మిస్ ఇండోనేసియా మొనికా కెజియా ⇒ ఈ నెల 22న శిల్పకళావేదికలో ఈ పోటీలు సాగాయి. పోటీదారులు ఆటాపాట, సంగీతంతో ఉర్రూతలూగించారు. అందులో మొత్తం 24 మందిని ఉత్తమ ప్రతిభావంతులుగా షార్ట్లిస్ట్ చేశారు. వారిలో నందినీ గుప్తా కూడా ఉన్నారు. ఆ తర్వాత టాప్–3లో ఇండోనేసియా, కామెరూన్, ఇటలీ పోటీదారులు నిలవగా చివరకు విజేతగా ఇండోనేసియా భామను ప్రకటించారు.హెడ్ టు హెడ్ చాలెంజ్: విజేతలు మిస్ వేల్స్, మిస్ తుర్కియే, మిస్ ట్రినిడాడ్–టొబాగో, మిస్ జాంబియా ⇒ ఈ నెల 20, 21 తేదీల్లో టీ–హబ్లో జరిగింది. ఫైనల్ పోటీ శుక్రవారం హోటల్ ట్రైడెంట్లో నిర్వహించారు. కాంటినెంటల్ క్వాలిఫైర్స్, టాప్–8 మందిని ఎంపిక చేసి అందులోంచి శుక్రవారం విజేతలను ప్రకటించారు. అందులో ఆసియా నుంచి తుర్కియే భామ ఇదిల్ బిల్గెన్, ఆఫ్రికా నుంచి ఫెయిత్ బ్వాల్వా, అమెరికా–కరీబియన్ దీవుల నుంచి ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చెందిన అన్నా లిసే నాన్టన్, యూరప్ నుంచి వేల్స్ ముద్దుగుమ్మ విల్లీ మీ ఆడమ్స్ ఎంపికయ్యారు. తొలుత టాప్–20, ఆ తర్వాత టాప్–8 భామలను ఎంపిక చేసి చివరకు విజేతలను ప్రకటించారు. -
ముందస్తుగా 3 నెలల సన్నబియ్యం
సాక్షి, హైదరాబాద్: వానాకాలంలో భారీ వర్షాలు, వరదల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో పేదలకు మూడు నెలల ముందే రేషన్ అందించాలన్న కేంద్రం ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం జూన్ ఒకటి నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. జూన్, జూలై, ఆగస్టుకు అవసరమైన సన్న బియ్యాన్ని రేషన్ దుకాణాల్లో అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణ పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్రం సూచనల మేరకు జూన్ ఒకటి నుంచి 30లోగా మూడు నెలల రేషన్ పంపిణీ పూర్తయ్యేలా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.ప్రతి నెలా ఇచి్చనట్లుగానే ఆహార భద్రతా కార్డుదారులకు ఒక్కొక్కరికీ 6 కిలోల చొప్పున ఒకేసారి మూడు నెలల బియ్యాన్ని అందిస్తామన్నారు. అంత్యోదయ ఆహార భద్రతా కార్డుదారులకు 35 కిలోల బియ్యం, అన్నపూర్ణ కార్డుదారులకు 10 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తామని పేర్కొన్నారు. అంత్యోదయ కార్డుదారులకు కిలో పంచదార రూ. 13.50 చొప్పున, గోధుమలు కిలో రూ. 7 చొప్పున జీహెచ్ఎంసీలో ఐదేసి కేజీలు, కార్పొరేషన్లలో రెండేసి కేజీలు పంపిణీ చేస్తామ న్నారు. రేషన్ పంపిణీపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గ్రామ, మండల, జిల్లా స్థాయిలో అధికారులు ప్రచా రం చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు. -
విచారణ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు
హుజూర్నగర్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై నియమించిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ విచారణ కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రీడిజైన్ చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వారి హయాంలోనే కూలిపోయిందన్నారు. అప్పట్లోనే కూలిపోయినా నోరు మెదపని ఆ నాయకులు విచారణ కమిషన్ నోటీసులిచ్చే సరికి రకరకాలుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. శనివారం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లోని తన నివాసంలో ఉత్తమ్ విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం దివంగత సీఎం రాజశేఖరరెడ్డి హయాంలో తుమ్మిడి హెట్టి వద్ద డిజైన్ చేసిన అంబేడ్కర్ చేవెళ్ల–ప్రాణహిత ప్రాజెక్టు రూ.38 వేల కోట్లతో పూర్తయ్యేదని, అది పూర్తి అయితే కాంగ్రెస్కు ఎక్కడ మంచి పేరు వస్తదో అని రాజకీయ దురుద్దేశంతో బీఆర్ఎస్వారు కట్టలేదని దుయ్యబట్టారు. రూ.38 కోట్లతో అయ్యేదానిని అదే ఆయకట్టుకు రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం కట్టారన్నారు. తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి ఒక చిన్న లిఫ్ట్ గ్రావిటీ ద్వారా వచ్చే నీళ్లను కాదని వాళ్లు తలపెట్టిన మూడు పెద్ద లిఫ్ట్లను కట్టడంతో ఏటా రూ.10 వేల కోట్లు కరెంటు బిల్లు వస్తోందన్నారు. ఆ పెద్ద మనిషి విమానంలో ప్రయాణిస్తూ ఇక్కడ ప్రాజెక్టు కట్టు, ఇక్కడ కాలవలు తీయ్ అని ప్రణాళికలు చేయడం వల్లనే మేడిగడ్డ కూలిపోయిందంటూ కేసీఆర్ను ఉద్దేశించి విమర్శించారు. -
ఆర్టీసీలో ఇక ఔట్సోర్సింగ్ కండక్టర్లు
సాక్షి, హైదరాబాద్: ఇటీవలే ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో డ్రైవర్ల నియామకాన్ని చేపట్టిన ఆర్టీసీ.. ఇప్పుడు కండక్టర్లను కూడా అదే విధానంలో నియమించుకునేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇందుకు తాజాగా మార్గదర్శకాలను ఖరారు చేసింది. 21 ఏళ్ల నుంచి 35 ఏళ్ల లోపు వయసుండి, పదో తరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించబోతోంది.మానవ వనరుల సరఫరా సంస్థల ద్వారా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. కండక్టర్లుగా ఎంపికైన వారికి నెలవారీ చెల్లించే కన్సాలిడేటెట్ జీతం మొత్తం రూ.17,969గా నిర్ణయించారు. ఏజెన్సీ రూ.2 లక్షల మొత్తాన్ని సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. విధి నిర్వహణలో సంస్థకు నష్టం జరిగితే.. దాన్ని ఈ మొత్తం నుంచి రికవరీ చేయనున్నట్టు ఆర్టీసీ ప్రకటించింది. వీరికి వర్క్మెన్స్ కాంపన్సేషన్ యాక్ట్ వర్తించదని తేల్చి చెప్పింది. పీఎఫ్, ఈఎస్ఐ లాంటి చట్టబద్ధమైన వెసులుబాట్లు కూడా ఉండవని స్పష్టం చేసింది. -
పదేళ్లు రాష్ట్రాన్ని లూటీ చేశారు: భట్టి విక్రమార్క
వైరా: గత పదేళ్లు అధికారంలో ఉన్నవారు రాష్ట్రాన్ని లూటీ చేశారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. వాళ్లే ఇప్పుడు ఫామ్హౌస్లో నిద్రపోతూ అన్యాయం జరుగుతోందని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఖమ్మం జిల్లా వైరాలో శనివారం ఏర్పాటుచేసిన మెగా జాబ్ మేళాను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పదేళ్లలో గ్రూప్–1 పోస్టులు భర్తీచేయకపోవటంతో నిరుద్యోగ యువత వారి తల్లిదండ్రులకు భారంగా మిగిలారని, మరికొందరు ఆవేదనతో రోడ్లపై తిరిగారని తెలిపారు. తాము అధికారంలోకి రాగానే టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి 56 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలు రాని యువతకు స్వయం ఉపాధి కోసం రూ.9 వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం ద్వారా తోడ్పాటు ఇవ్వనున్నామని వెల్లడించారు. ఆర్ఓఎఫ్ఆర్ చట్టం ద్వారా గిరిజనులకు పంపిణీ చేసిన 6.70 లక్షల ఎకరాల భూమిని సాగులోకి తీసుకొచ్చేలా రూ.12,600 కోట్లతో ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని ప్రారంభించినట్లు వివరించారు. బీఆర్ఎస్ పాలనలో గిరిజనులు అటవీ భూముల్లో పంటలు సాగుచేయకుండా ఇబ్బంది పెట్టారని, మహిళలను కూడా చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటనలు ఉన్నాయని విమర్శించారు. కాగా, జాబ్మేళాలో 92 కంపెనీలు పాల్గొనగా, సుమారు 8 వేల మంది నిరుద్యోగులు హాజరయ్యారు. ఇందులో 4,448 మందికి వివిధ ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్నాయక్, సింగరేణి సీఎండీ బలరామ్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
మెట్రో విస్తరణకు నిధులివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కోరారు. హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ, ప్రాంతీయ రింగ్రోడ్డు, రింగ్ రైలు తదితర ప్రాజెక్టులు కార్యరూపం దాల్చేందుకు కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. శనివారం ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం అనంతరం సీఎం రేవంత్రెడ్డి ప్రధానితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లిన అంశాలు హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్–2 మెట్రో రైలు ఫేజ్–1లో 69 కిలోమీటర్ల నిడివితో మూడు కారిడార్లు ఉన్నాయి. నగరంలోని ఇతర ప్రాంతాలకు మెట్రోను తక్షణం విస్తరించాల్సిన అవసరం ఉంది. ఫేజ్–2 కోసం కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించాం. ఇందులో 76.4 కిలోమీటర్ల నిడివితో 5 కారిడార్లు ఉంటాయి. కేంద్రం, రాష్ట్రం కలిసి చేపట్టాల్సిన ఈ జాయింట్ వెంచర్ మొత్తం ఖర్చు రూ.24,269 కోట్లు. ఇందులో కేంద్రం వాటా 18 శాతం (రూ.4,230 కోట్లు).రాష్ట్ర వాటా 30 శాతం (రూ.7,313 కోట్లు). రుణం 48 శాతం (రూ.11,693 కోట్లు). 2024 అక్టోబర్లో చెన్నై మెట్రో ఫేజ్–2కు రూ.63,246 కోట్లు, 2021 ఏప్రిల్లో బెంగళూరు మెట్రో ఫేజ్–2 కు రూ.14,788 కోట్లు, 2024 ఆగస్టులో బెంగళూరు మెట్రో ఫేజ్–3కి రూ.15,611 కోట్లు కేంద్రం ఆమోదం తెలిపింది. హైదరాబాద్ మెట్రో ఫేజ్–2పై కేంద్రం కొన్ని వివరణలు కోరగా, వాటికి సమాధానాలిచ్చాం. ఈ ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాలి. ప్రాంతీయ రింగ్ రోడ్డు హైదరాబాద్ చుట్టూ రెండు జాతీయ రహదారులతో కలిపి ప్రాంతీయ రింగు రోడ్డును (ఆర్ఆర్ఆర్)ను తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం సంగారెడ్డి – నర్సాపూర్ – తూప్రాన్ – గజ్వేల్ – భువనగిరి – చౌటుప్పల్ మధ్య 161వ నంబర్ జాతీయ రహదారి ఉండగా.. దక్షిణ భాగం చౌటుప్పల్ – ఆమన్గల్ – షాద్నగర్ – సంగారెడ్డి మధ్య ఎన్హెచ్ 65 ఉంది. ఉత్తర భాగం కోసం భూసేకరణ ప్రక్రియ 2022లో ప్రారంభమైంది.90 శాతం భూముల ప్రపోజల్స్ ఎన్హెచ్ఏఐకి పంపించాం. ఎన్హెచ్ఏఐ టెండర్లు కూడా పిలిచింది. అయితే, ఈ భాగానికి అవసరమైన ఆర్థిక, కేబినెట్ ఆమోదం ఇవ్వాలి. దక్షిణ భాగాన్ని కూడా ఉత్తర భాగంతోపాటే చేపట్టాలి. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం పూర్తయిన తర్వాత దక్షిణ భాగం నిర్మాణం చేపడితే భూ సేకరణ, నిర్మాణ వ్యయం భారీగా పెరిగే ప్రమాదం ఉంది. అందువల్ల రెండు భాగాలను కలిపి ఒకేసారి పూర్తి చేయాలి. ఉత్తరభాగంలాగే దక్షిణ భాగం భూ సేకరణకు అయ్యే వ్యయంలో 50 శాతం భరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రింగ్ రైల్వే ప్రాజెక్టు.. గ్రీన్ఫీల్డ్ హైవే రీజినల్ రింగు రోడ్డుకు సమాంతరంగా 370 కి.మీ. పరిధిలో రైల్వే లైన్ ప్రతిపాదించాం. ఇది రాష్ట్రాభివృద్ధికి కొత్త దిశలో మార్గం చూపుతుంది. బందరు పోర్టు నుంచి హైదరాబాద్ డ్రైపోర్ట్ వరకు గ్రీన్ఫీల్డ్ హైవే మంజూరు చేయండి. దేశం మొత్తం ఔషధాలలో తెలంగాణే 35 శాతం ఉత్పత్తి చేస్తోంది. బందరు పోర్ట్ – డ్రైపోర్ట్ గ్రీన్ ఫీల్డ్ హైవే సరుకు రవాణా ఖర్చు తగ్గించడంతో పాటు ఎగుమతులకు దన్నుగా నిలుస్తుంది. ఈ మార్గం తయారీ రంగానికి ప్రోత్సాహకంగా ఉండడంతో పాటు నూతన ఉద్యోగాలను సృష్టిస్తుంది. సెమీకండక్టర్ రంగానికి మద్దతివ్వండి ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం)కు తెలంగాణ పూర్తి మద్దతు ఇస్తోంది. హైదరాబాద్లో ఏఎండీ, క్వాల్కాం, ఎన్విడియా వంటి ఆర్అండ్డీ కేంద్రాలు ఉన్నాయి. పరిశ్రమలకు స్థలాలు, నైపుణ్యం గల మానవ వనరులు, మౌలిక సదుపాయాలు హైదరాబాద్లో అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ ఐఎస్ఎం ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలపాల్సి ఉంది. అది పెట్టుబడిదారులకు నమ్మకాన్ని కలిగించి ఉద్యోగాలు సృష్టిస్తుంది. 2030 నాటికి ఎల్రక్టానిక్స్ ఉత్పత్తిలో 500 బిలియన్ డాలర్లకు చేరుకోవాలనే లక్ష్యానికి తోడ్పడుతుంది. రక్షణరంగ ప్రాజెక్టులకు తోడ్పాటునివ్వండి హైదరాబాద్లో ప్రభుత్వ, ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యంలో, ఎంఎస్ఎంఈల్లో ఉన్న రక్షణరంగ ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వండి. హైదరాబాద్లోని డీఆర్డీఓ, డిఫెన్స్ పీఎస్యూ లు ఉన్నత స్థాయిలో పని చేస్తున్నాయి. వాటి పరిధిలో వె య్యికి పైగా ఎంఎస్ఎంఈలు, స్థానిక, అంతర్జాతీయ డిఫెన్స్ సంస్థలకు విడి భాగాలు తయారు చేస్తున్నాయి. లాక్హీడ్ మారి్టన్, బోయింగ్, జీఈ, సాఫ్రాన్, హనీవెల్ వంటి సంస్థలు హైదరాబాద్పై ఆసక్తి చూపుతున్నాయి. రక్షణ రంగంలోని జేవీలు, ఆఫ్సెట్లకు కేంద్ర ఆర్డర్లు తక్షణ అవసరం. వీటికి ఆమోదం తెలిపేందుకు ప్రత్యేకమైన వ్యవస్థ ఉండాలి. హైదరాబాద్ – బెంగళూరు డిఫెన్స్ కారిడార్ రక్షణ రంగానికి సంబంధించి ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్కు ప్రోత్సాహం ఉంది కానీ హైదరాబాద్కు లేదు. ఆయా రాష్ట్రాలతో సమానంగా తెలంగాణకు కేంద్రం మద్దతు ఇవ్వాలి. రక్షణ రంగ పరికరాల తయారీలో ముందున్న హైదరాబాద్లో డిఫెన్స్ ఎక్స్పో నిర్వహించాలి.మరో 800 ఎలక్ట్రిక్ బస్సులివ్వండి కేంద్రమంత్రి కుమారస్వామికి సీఎం రేవంత్ విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్కు మరో 800 ఎలక్ట్రిక్ బ స్సులు కేటాయించాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని సీఎం రేవంత్రెడ్డి కోరారు. ఢిల్లీలో కేంద్రమంత్రితో సీఎం శనివారం భేటీ అయ్యారు. ఇటీవల హైదరాబాద్కు రెండువేల ఈవీ బస్సులు కేటాయించారని, ప్రస్తుత నగర అవసరాలను దృష్టిలో పెట్టుకొని పీఎం ఈ–డ్రైవ్ పథకం కింద అదనంగా 800 బస్సులు కేటాయించాలని కోరారు. ఆర్టీసీ డ్రైవర్లు, మెకానిక్లు బస్సు నిర్వహణ చూసేలా హైబ్రిడ్ జీసీసీ మోడల్ను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. తెలంగాణ ఆర్టీసీ డీజిల్ బస్సుకు చేపట్టిన రెట్రోఫిట్టెడ్ సఫలమైందని, ఆ బస్సు నగరంలో రాకపోకలు సాగిస్తోందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సులకు రెట్రో ఫిట్మెంట్ అవకాశం కల్పించాలని సీఎం కోరారు. -
తెలంగాణకు పట్టిన దెయ్యం రేవంత్... శని కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు పట్టిన దెయ్యం రేవంత్రెడ్డి అని, రాష్ట్రానికి పట్టిన శని కాంగ్రెస్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ దెయ్యాన్ని, శనిని వదిలించాలన్నదే తమ ప్రయత్నమని పేర్కొన్నారు. ‘కేసీఆర్ దేవుడు.. ఆయన చుట్టూ దెయ్యాలు’ఉన్నాయంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో కేటీఆర్ ఈమేరకు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ‘అంతర్గత విషయాలను ప్రస్తావించేందుకు పార్టీ వేదికలు ఉంటాయి. అధ్యక్షుడిని కలిసే అవకాశం ఉంటుంది. ఆఫీసు బేరర్స్ను కలిసి చెప్పుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాలను అంతర్గతంగా మాట్లాడితేనే బాగుటుంది. ఈ సూత్రం వాళ్లకు వీళ్లకు కాదు.. పార్టీలో ఉన్న కార్యకర్తలందరికీ వర్తిస్తుంది. ప్రజాస్వామిక స్ఫూర్తి కలిగిన బీఆర్ఎస్లో అధ్యక్షుడు కేసీఆర్కు లిఖితపూర్వకంగా లేదా మౌఖికంగా సూచనలిస్తూ ఎవరైనా లేఖలు రాయొచ్చు. అయితే పార్టీలో ఏ హోదాలో ఉన్న వారైనా కొన్ని అంతర్గత విషయాలను అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది’అని కేటీఆర్ అన్నారు. ‘లోక్సభ ఎన్నికలకు ముందు మేము పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్ష పెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో ఎలా ముందుకు పోవాలని వేల మంది కార్యకర్తలతో గంటలకొద్దీ చర్చించాం. ఆ క్రమంలో చాలామంది నేరుగా మైక్లో మాట్లాడారు. మరికొందరు కేసీఆర్కు ఇవ్వమంటూ లేఖలు ఇచ్చారు. మా పార్టీలో బహిరంగ చర్చను ప్రోత్సహిస్తాం. ప్రజాస్వామిక స్ఫూర్తి కలిగిన మా పార్టీ అధ్యక్షుడికి ఎవరైనా సూచనలు చేయొచ్చు, ఉత్తరాలు రాయొచ్చు’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అన్ని పార్టీల్లో ఉన్నట్లు బీఆర్ఎస్లోనూ రేవంత్ కోవర్టులు ఉండొచ్చని, సరైన సమయంలో వారంతటే వారు బయటపడతారన్నారు. ఓటుకు నోటు కేసులో ‘బ్యాగ్మ్యాన్’ ‘యంగ్ ఇండియా నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి పేరును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చార్జిషీట్లో చేర్చడం రాష్ట్రానికి అవమానకరం. ఈ కేసులో రేవంత్ పేరు వచ్చిందన్న వార్తను కొన్ని పత్రికలు అసలు రాయనే లేదు. మీడియా ఎంత తాపత్రయపడ్డా.. ఎన్ని ప్రకటనలు తీసుకున్నా రేవంత్ ఒక లొట్ట పీసు ముఖ్యమంత్రి అని ప్రజలకు అర్థమైపోయింది. మీడియా ఎన్ని దాచినా సోషల్ మీడియాతో ప్రజలకు వాస్తవాలు తెలుస్తూనే ఉంటాయి. ఓటుకు నోటు కేసులో బ్యాగ్మ్యాన్ అని పేరు తెచ్చుకున్న రేవంత్ వైఖరి మారలేదని ఈడీ చార్జిïÙట్లో బయటపడింది. కాంగ్రెస్కు తెలంగాణ ఏటీఎంగా మారగా, ఢిల్లీ కాంగ్రెస్కు అవసరమైనప్పుడల్లా భారీ మొత్తంలో ఇస్తూ రేవంత్ తన పదవి కాపాడుకుంటున్నాడు. నైతికత ఉంటే రేవంత్ సీఎం పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలి లేదా కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ఆయనను పదవి నుంచి తప్పించాలి. ప్రధాని మోదీ, అమిత్ షాతో ఒప్పందం కుదుర్చుకునేందుకే రేవంత్ ఢిల్లీ వెళ్లారు. 17 నెలల్లో 44 సార్లు ఢిల్లీకి వెళ్లిన రేవంత్ కేసుల నుంచి తప్పించాలని చీకట్లో అమిత్ షా కాళ్లు పట్టుకుంటున్నాడు. రేవంత్కు రాహుల్ గాంధీ అధికారిక బాస్ కాగా, మోదీ, అమిత్ షా అనధికార బాస్లుగా వ్యవహరిస్తున్నారు. ఏడాదిన్నరగా బీఆర్ఎస్పై నిందలు, బిల్డర్లు కాంట్రాక్టర్లతో దందాలు, ఢిల్లీ బాస్లకు రూ.వేలకోట్ల చందాలు అనే రీతిలో రేవంత్ పాలన సాగుతోంది. రేవంత్ అవినీతిపై రాహుల్ మాట్లాడాలి. ఈడీ చార్జిïÙట్లో సోనియా, రాహుల్ పేర్లు ఉన్నా జపాన్ టూర్ పేరిట రేవంత్ స్పందించకుండా తప్పుకున్నాడు’అని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ నడుమ అపురూప బంధం ‘నేషనల్ హెరాల్డ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవంత్ విషయంలో తెలంగాణ బీజేపీ నేతలు మౌన మునుల్లా మారిపోయారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు చేస్తున్న భూదందా అక్రమాలకు రేవంత్ వత్తాసు పలుకుతున్నందుకే మౌనమా’అని కేటీఆర్ ప్రశ్నించారు. రూ.187 కోట్ల వాల్మీకి స్కామ్, ట్రిపుల్ ఆర్ టాక్స్, హెచ్సీయూ భూముల్లో అక్రమాలు, పౌర సరఫరాల కుంభకోణం జరుగుతున్నా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు స్పందించడం లేదు. రేవంత్కు రక్షణ కవచంలా వ్యవహరిస్తున్న బీజేపీ ప్రభుత్వం స్పందించకుంటే నెల రోజుల తర్వాత మా కార్యాచరణ ప్రకటిస్తాం. ముఖ్యమంత్రిని ప్రాసిక్యూట్ చేయాలని గవర్నర్ను కోరతాం’అని చెప్పారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, డాక్టర్ సంజయ్, ఎమ్మెల్సీ రవీందర్రావు, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, రాజయ్య పాల్గొన్నారు. -
కేరళ చేరిన నైరుతి
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి. శనివారం ఉదయం కేరళ భూభాగంలోకి రుతుపవనాలు ప్రవేశించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రుతుపవనాల కదలికలు అత్యంత చురుకుగా ఉన్నాయని, లక్షదీవులతో పాటు కేరళ రాష్ట్రంలోకి పూర్తిగా ప్రవేశించేందుకు అత్యంత తక్కువ సమయం పడుతుందని వివరించింది. మరోవైపు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలను కూడా రుతుపవనాలు తాకాయి. నైరుతి రుతుపవనాలు ముందుగా కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించిన తర్వాత దేశమంతటా విస్తరిస్తాయి. ఈ సీజన్లో రుతుపవనాలు వాతావరణ శాఖ అంచనాల కంటే మూడురోజులు ముందుగానే భారత ప్రధాన భూభాగాన్ని తాకటం విశేషం. గతేడాది నైరుతి రుతుపవనాలు మే 30న కేరళను తాకగా... ఈసారి ఆరు రోజుల ముందే ప్రవేశించాయి. రానున్న రెండురోజుల్లో రుతుపవనాలు మధ్య అరేబియన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, గోవాలో పూర్తి భూభాగం, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలతోపాటు సబ్ హిమాలయన్ పశ్చిమబెంగాల్, సిక్కింలోకి ప్రవేశించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది. ఈసారి వర్షాకాలంలో రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, సాధారణం కంటే అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. మూడురోజుల్లో రాష్ట్రంలోకి.. రానున్న మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సాధారణంగా కేరళను తాకిన తర్వాత సగటున నాలుగు నుంచి ఆరు రోజుల మధ్య తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రుతుపవనాల కదలికలు చురుకుగా ఉండడంతో మూడు రోజులలోపే రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలోకి ప్రవేశించిన తర్వాత రాష్ట్రమంతటా రుతుపవనాలు విస్తరించేందుకు మరో మూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గతేడాది జూన్ 3వ తేదీన రాష్ట్రంలోకి నైరుతి ప్రవేశించగా... ఈసారి మే నెలలోనే ప్రవేశించడం గమనార్హం. 27న బంగాళాఖాతంలో అల్పపీడనం నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతుండడం రైతాంగంలో ఉత్సాహాన్ని నింపుతోంది. సాధారణంగా నైరుతి రుతుపవనాల సీజన్లో కురిసే వర్షాలు బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం, వాయుగుండం, తుఫానులపైనే ఆధారపడి ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 27న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆరోజుకల్లా తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. దీంతో ఈ అల్పపీడనం ప్రభావం రాష్ట్రంపై ఉంటుందని, చాలాచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ అల్పపీడనం రెండ్రోజుల్లో బలపడి తీవ్ర అల్పపీడనంగా మారుతుందని ముందస్తు అంచనాలు వెల్లడించాయి. రెండ్రోజులు తేలికపాటి వర్షాలు రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. తూర్పు మధ్య అరేబియా సముద్రం, దక్షిణ కొంకణ్ – గోవా తీర ప్రాంతం సమీపంలో కొనసాగిన స్పష్టమైన అల్పపీడన ప్రాంతం శనివారం ఉదయం బలపడి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం అదే ప్రాంతంలో రత్నగిరికి ఆగ్నేయంగా 40 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. క్రమంగా తూర్పు దిశలో కదిలి శనివారం రాత్రికల్లా దక్షిణ కొంకణ్ తీరంలో రత్నగిరి, దాపోలి మధ్యలో వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో దక్షిణ ప్రాంత జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న రెండు రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదు కానున్నాయి. -
ఈసారీ యూరియా కొరత తప్పదా?
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. రాష్ట్రంలో కూడా ఆ ప్రభావం కనిపిస్తోంది. వచ్చే నెల మొదటి వారం నుంచే వానాకాలం సాగుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ అన్ని ఏర్పా ట్లు చేస్తోంది. వరితోపాటు పత్తి, ఇతర ఉద్యానవన పంట ల సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు మరోసారి యూరియా కోసం పడిగాపులు పడే పరి స్థితి వస్తుందేమోననే ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో వానాకాలం పంటలకు ఎరువు బస్తాల కోసం సహకార సంఘం దుకాణాల ముందు రైతులు నిలబడిన దృశ్యాలు పునరావృతం అవుతాయోమే అన్న సందేహం తలెత్తుతోంది. ఈ సీజన్లో వాడకం అధికం రాష్ట్రంలో ఈ వానాకాలంలో 134 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో 5 ప్రధాన పంటలైన వరి, పత్తి, మొక్కజొన్న, కందులు, సోయాబీన్ సాగు విస్తీర్ణమే 131. 80 లక్షల ఎకరాలు. వీటిలో వరి, పత్తి, మొక్కజొన్నకు యూరియా వాడకం ఎక్కువగానే ఉంటుంది. ఈసారి 12 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) యూరియా అవసరమ ని అధికారులు చెపుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం కేవలం 9.8 ఎల్ఎంటీ యూరియానే రాష్ట్రానికి కేటాయించింది. గత యాసంగిలో కేటాయించిన 9.8 ఎల్ఎంటీల యూరియానే ఈ సీజన్కూ కేటాయించడం గమనార్హం. యాసంగిలో పత్తి, సోయాబీన్ వంటి పంటలు లేకపోయి నా 9.8 ఎల్ఎంటీ యూరియా సరి పోని పరిస్థితి. కానీ వానాకాలంలోనూ అంతేస్థాయిలో యూరియా కేటాయించడంతో రైతులు ఎరువుల కోసం రోడ్డె క్కే పరిస్థితి తప్పకపోవచ్చునని వ్యవ సాయ రంగ నిపుణులు చెపుతున్నారు. ఇప్పటి వరకు 1.72 ఎల్ఎంటీలే... ఈ వానాకాలంలో కేంద్రం ఏప్రిల్ నుంచి దశల వారీగా యూరియాను రాష్ట్రానికి పంపించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఏప్రిల్లో 1.70 ఎల్ఎంటీలు, మేలో 1.60 ఎల్ఎంటీల చొప్పున 3.30 ఎల్ఎంటీలు రావలసి ఉంది. అయితే కేంద్రం ఏప్రిల్లో 1.20 ఎల్ఎంటీలు, మేలో 0.52 ఎల్ఎంటీలు మాత్రమే ఇచ్చింది. అంటే ఇప్పటివరకు ఇచ్చిన కోటా కేవలం 1.72 ఎల్ఎంటీలే. గత ఏడాది వానాకాలం ప్రారంభానికి ముందే 4 ఎల్ఎంటీల యూరియాను నిల్వ చేసినప్పటికీ, ఇబ్బందులు తప్పలేదు. కానీ ఈసారి కేవ లం 1.72 ఎల్ఎంటీలే కేంద్రం పంపడంతో రాష్ట్ర ప్రభు త్వం ఆందోళన చెందుతోంది. దీంతో వ్యవసాయ శాఖ అధికారులు ఇటీవల ఢిల్లీకి వెళ్లి ఎరువుల మంత్రిత్వ శాఖ కార్యాలయంలో అధికారులను కలిసి తక్షణం లక్ష మెట్రిక్ టన్నుల యూరియాను విడుదల చేయాలని కోరారు. ఎరువుల వాడకం తగ్గించండి..: డిమాండ్కు అనుగుణంగా యూరియా సరఫరా చేయాలని ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం కోరుతుండగా, రాష్ట్రాలు ఎరువుల వాడకాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. అదే సమయంలో సేంద్రీయ ఎరువుల వాడకాన్ని పెంచుకోవాలని కోరుతుంది. వానాకాలం వరి, మొక్కజొన్న వంటి పంటలకు యూరియా కీలకమని, తొలిదశలో సరిపడా యూరియా లేకపోతే మొద టి దశ నుంచే పంట దిగుబడిపై ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాంటి పరిస్థితి రాకుండా ముందుగానే ప్రణాళిక అవసరమని అంటున్నారు. -
700 శ్లోకాల ‘విజయ’లక్ష్మిలు!
ముస్తాబాద్ (సిరిసిల్ల): మామ ఆలపించే భక్తిగీతాలు వారికి ప్రేరణనిచ్చాయి. భజనలు వారిలో స్ఫూర్తినింపాయి. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఏడాదిలోనే భగవద్గీతలోని 18 అధ్యాయాల్లో 700 శ్లోకాలను కంఠస్థం చేయడమే కాకుండా మైసూరులోని శ్రీదత్త పీఠం ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన భగవద్గీత పారాయణ పోటీల్లో ఏకంగా 20 వేల మందితో పోటీపడి బంగారు పతకాలు సాధించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూర్ గ్రామానికి చెందిన తోటి కోడళ్లు కట్కం లక్ష్మి, కట్కం విజయలక్ష్మిల స్ఫూర్తిదాయక ఆధ్యాత్మిక ప్రయాణం ఇది. భజన మండలి, మామయ్య స్ఫూర్తి కట్కం లక్ష్మి, కట్కం విజయలక్ష్మి 30 మంది స్నేహితులతో కలిసి 20 ఏళ్ల క్రితం శ్రీ వేంకటేశ్వర భజన మండలిని ఏర్పాటు చేసుకున్నారు. ఆవునూర్ గ్రామంలోని రామాలయంతోపాటు ఇళ్లలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భజనలు చేసేవారు. లక్ష్మి, విజయలక్ష్మిల మామయ్య కట్కం రాజేశం నిత్యం భక్తిగీతాలు ఆలపించేవారు. ఈ క్రమంలో హైదరాబాద్కు చెందిన కొట్ర అనురాధతో ఏర్పడిన పరిచయం ఆన్లైన్లో శిక్షణ తీసుకొనేలా చేసింది.ఇటీవల మైసూరులోని శ్రీదత్తపీఠం ఆధ్వర్యంలో ఆన్లైన్ ద్వారా 20 వేల మందితో నిర్వహించిన భగవద్గీత శ్లోకాల పారాయణం పోటీల్లో పాల్గొన్న లక్ష్మి, విజయలక్ష్మి తమ ప్రతిభను చాటి ఫైనల్కు చేరుకున్నారు. ఈ నెల 19న 2 వేల మందికి జరిగిన ఆన్లైన్ ఫైనల్ పోటీల్లో విజేతలుగా ఎంపికైన 500 మందిలో వారిద్దరూ నిలిచారు. దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానందస్వామి చేతుల మీదుగా లక్ష్మి, విజయలక్ష్మి బంగారు పతకాలు, ప్రశంసా పత్రాలు అందుకున్నారు. శ్లోకాలకు తాత్పర్యం చెబుతాం భగవద్గీత పారాయణాన్ని జీవిత లక్ష్యంగా పెట్టుకున్నా. భర్త, పిల్లల సహకారంతో ఏడాదిపాటు సాధన చేశా. అనురాధ మేడం మమ్మల్ని గుర్తించి మా బృందంలోని 10 మందికి శిక్షణ ఇచ్చారు. భవిష్యత్లో శ్లోకాలకు అర్థాలు చెప్పి, భగవద్గీత మహత్మ్యాన్ని పంచుతాం. – కట్కం లక్ష్మి భజన మండలితో అంకురార్పణ మా భజన మండలి సభ్యులు, ఆన్లైన్లో శిక్షణ ఇచి్చన అనురాధ మేడం ప్రోత్సాహంతోనే పతకాలు సాధించాం. భవిష్యత్లో మరింత మందికి శ్లోకాలను నేర్పి భగవద్గీత గొప్పదనాన్ని పంచుతాం. – కట్కం విజయలక్ష్మి -
కోవిడ్పై ఆందోళన వద్దు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ భరోసా ఇచ్చారు. కోవిడ్ కేసులను సమర్థంగా ఎదుర్కొనేందుకు తమ శాఖ సర్వసన్నద్ధంగా ఉందన్నారు. అయితే ఇప్పుడు దేశంలో నమోదవుతున్న కేసులు సాధారణమైనవేనని చెప్పారు. రాష్ట్రంలో కోవిడ్ వైరస్ వ్యాప్తి, సీజనల్ వ్యాధుల నివారణపై మంత్రి దామోదర ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్, సీజనల్ వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. జలుబు, దగ్గు లాగే కోవిడ్ కూడా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుందని.. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం.. మాస్కు ధరించడం వంటి చర్యల ద్వారా వైరస్ల వ్యాప్తిని నిరోధించొచ్చని చెప్పారు. ఇంటి పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలనే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పేందుకు అన్ని గ్రామాలు, పట్టణాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. అన్ని ఆస్పత్రుల్లో సరిపడా మందులు, రీఏజెంట్స్ను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. కోవిడ్, డెంగీ పేరిట ప్రైవేటు ఆస్పత్రులు ప్రజల్ని దోచుకొనే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి దామోదర స్పష్టం చేశారు. జేఎన్–1 వేరియంట్తో ఆందోళన అక్కర్లేదు దేశంలో కోవిడ్ జేఎన్–1 వేరియంట్ కేసులు కొన్ని నమోదయ్యాయని.. ఈ వేరియంట్ 2023 నుంచే దేశంలో వ్యాప్తిలో ఉందని అధికారులు మంత్రి దామోదరకు వివరించారు. ఈ వేరియంట్ వల్ల ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన పరిస్థితులేమీ లేవన్నారు. ఇతర దీర్ఘకాలిక జబ్బులు ఉన్నవారికి తప్పితే ఇతరులెవరికీ ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసరం పడటం లేదన్నారు. రాష్ట్రంలో అక్కడక్కడా నమోదయ్యే కోవిడ్ కేసులను ఎదుర్కొనేందుకు టెస్టింగ్ కిట్స్, మెడిసిన్ సహా అవసరమైన అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. -
జూన్ 2 నుంచి రాష్ట్రమంతా స్లాట్ బుకింగ్
సాక్షి, హైదరాబాద్: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో చేపట్టిన సంస్కరణల్లో భాగంగా జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు. స్లాట్బుకింగ్ విధానంపై శనివారం ఆయ న సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటికే ప్రయోగాత్మకంగా 47 కార్యాలయా ల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేస్తుండగా, జూన్ 2 నుంచి అన్నిచోట్లా అమల్లోకి తెస్తున్నామని మంత్రి తెలిపా రు. స్లాట్బుకింగ్ ద్వారా ఇప్పటివరకు 36 వేలకు పైగా లావాదేవీలు జరిగాయని, ఈ విధానంపై 94% మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని వెల్ల డించారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యా హ్నం 1:30 గంటల మధ్య, తిరి గి మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల మధ్య స్లాట్ బుకింగ్కు అవకాశముంటుందని తెలి పారు. స్లాట్బుకింగ్ విధానం అమలవుతున్న దృష్ట్యా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పు నర్వ్యవస్థీకరణ జరుగుతోందని చెప్పారు. పని భారం ఎక్కు వగా ఉండే పటాన్చెరు, యాదగిరిగుట్ట, గండిపేట, ఇబ్రహీంపట్నం, సూర్యాపేట, జడ్చర్ల, మహబూబ్నగర్, వనపర్తి, గద్వాల కార్యాలయాల్లో అదనపు సబ్రిజిస్ట్రార్తో పాటు సిబ్బందిని నియమిస్తామని ప్రకటించారు. భూ భా రతి తరహాలోనే ప్రత్యేకంగా ఒక పోర్టల్ తయారు చేసి అందులో నిషేధిత భూములు, ఆస్తుల వివరాలను పొందుపరుస్తామని వెల్లడించారు. ఎక్కడ నిషేధిత భూమి రిజిస్ట్రేషన్ జరిగినా క్షణాల్లో ప్రధాన కా ర్యాలయానికి తెలిసేలా ఆన్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేశామని, ఇలాంటి ఘటనలు ఎక్కడైనా జరిగితే అధికారులపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. నేడు జీపీఓ పరీక్ష : గ్రామ పాలనాధికారి (జీపీఓ) నియామకాలకు ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష నిర్వహిస్తున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. దాదాపు 5 వేల మంది ఈ పరీక్షకు హాజరవుతారని, జేఎన్టీయూ ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహిస్తున్నామని చెప్పారు. గతంలో వీఆర్వో, వీఆర్ఏలుగా పనిచేసిన వారిలో ఆసక్తి ఉన్నవారిని వీలైనంత త్వరగా ఈ పోస్టుల్లో నియమిస్తామని వెల్లడించారు. -
తెలంగాణకు రేవంత్, ఉత్తమ్ తెల్ల ఏనుగులు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును వైట్ ఎలిఫెంట్ (తెల్ల ఏనుగు) అని విమర్శిస్తూ.. మరోవైపు అవే ప్రాజెక్టులో అంతర్భాగమైన రిజర్వాయర్లను ప్రభుత్వం వాడుకుంటోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. చెప్పిన అబద్ధాలనే మళ్లీమళ్లీ చెప్తూ కాళేశ్వరం ప్రాజెక్టుపై దు్రష్పచారం చేయడమే సీఎం రేవంత్రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డికి ఏకైక ఎజెండాగా మారిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్, ఉత్తమ్ తెలంగాణ పాలిట నిజమైన తెల్ల ఏనుగులు అని ధ్వజమెత్తారు. ఈ మేరకు శనివారం హరీశ్రావు సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. సీఎం రేవంత్ రాష్ట్ర ఆదాయానికి, మంత్రి ఉత్తమ్ నీటి వాటాకు గండి కొడుతున్నారని విమర్శించారు. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రలు మినహా ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదని, ఒక్క ఎకరాకు నీరు ఇవ్వలేదని ఆరోపించారు. ఏడాదిన్నర అయినా తట్టెడు మట్టి తీయలేదు గతంలో ఉమ్మడి ఏపీ, మహారాష్ట్రతో పాటు కేంద్రంలోనూ ఏకకాలంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి ఎలాంటి అనుమతులు సాధించలేదని హరీశ్రావు విమర్శించారు. ‘తట్టెడు మట్టి తీయకుండా, ఒక్క ఇటుక పేర్చకుండా మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరిట రూ.2,328 కోట్లు స్వాహా చేశారు. ప్రాణహిత ప్రాజెక్టులో భూ సేకరణ, ఇతర పనుల కోసం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.3,780 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. మీరు ఆనాడు తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ కట్టి, ఎల్లంపల్లి వరకు గ్రావిటీ కెనాల్ తవ్వి ఉంటే ప్రాజెక్టు రీ డిజైనింగ్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏడాదిన్నరగా తుమ్మిడిహెట్టి వద్ద తట్టెడు మట్టి తీయలేదు’అని హరీశ్రావు ధ్వజమెత్తారు. కాళేశ్వరం కమిషన్ విచారణ తర్వాత చర్యలు తప్పవని మంత్రి ఉత్తమ్ చెప్తున్నారని, మంత్రి మనసులో ఉన్న కుట్రకు ఆయన వ్యాఖ్యలే నిదర్శనమని హరీశ్రావు మండిపడ్డారు. గోదావరి జలాలు ఎత్తుకుపోతుంటే ఏం చేస్తున్నారు? తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తూ, గోదావరి జలాలను ఎత్తుకుపోయేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుట్రలు చేసున్నా.. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు ఏం చేస్తున్నారని హరీశ్రావు ప్రశ్నించారు. ఎలాంటి అనుమతులు లేకుండా, ఏపీ నిర్మించతలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం 50 శాతం నిధులు ఇస్తూ, మిగతా 50 శాతం నిధులకోసం ఎఫ్ఆర్బీఎం పరిధిని మించి అప్పు చేసేందుకు అనుమతి ఇవ్వడం అన్యాయం, అనైతికం అని మండిపడ్డారు. తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపుతూ, ఆంధ్రప్రదేశ్పై వరాల జల్లులు కురిపిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే ధైర్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు. -
బీఆర్ఎస్ 3 ముక్కలు కావడం ఖాయం
సాక్షి, న్యూఢిల్లీ: కేసీఆర్ కుటుంబంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను గమనిస్తే.. భవిష్యత్తులో తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదని, అది మూడు, నాలుగు ముక్కలవుతుందని టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ అన్నారు. ఇంట్లో పోరు తట్టుకోలేక కేటీఆర్ సతమతమవుతున్నారని, పార్టీ పగ్గాల కోసం కవిత, కేటీఆర్ మధ్య తీవ్ర పోటీ నెలకొందని చెప్పారు. ఈ నేపథ్యంలో హరీశ్రావు అదను కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మహేశ్గౌడ్ శనివారం తెలంగాణ భవన్లోని శబరి బ్లాక్లో విలేకరులతో మాట్లాడారు. కేటీఆర్ ముందు ఇంట్లో కుంపటిని సరిచేసుకోవాలి‘ఇంట్లో కుంపటి తట్టుకోలేక.. సోదరి తనకే ఏకు మేకై, మరో పవర్ సెంటర్ కావడంతో మతి భ్రమించి కేటీఆర్ ఆ ఎపిసోడ్ని డైవర్ట్ చేయడం కోసం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై పసలేని ఆరోపణలు చేస్తున్నారు. తన ఇంట్లో రగులుతున్న కుంపటిని కేటీఆర్ ముందుగా సరిచేసుకోవాలి. కవిత.. కేసీఆర్కే లేఖ రాసి పది సంవత్సరాల తప్పిదాలను ఎత్తి చూపే స్థాయికి వచ్చిందంటే, కేసీఆర్ కుటుంబంలో రగులుతున్న మంట ఎంత పెద్దదో అర్థమవుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మెజారిటీ ప్రజలు నమ్మిన నేపథ్యంలో వారి ఆకాంక్షల మేరకు విచారణ కమిషన్ వేశాం. కేసీఆర్, హరీశ్రావులకు నోటీసులు ఇస్తే కేటీఆర్ బెంబేలెత్తారు. అవినీతి బాగోతం బయటపడుతుందన్న భయంతో ఆయన మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. బీఆర్ఎస్, బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం.. ఫార్ములా ఈ–కార్ రేసులో అవినీతి బట్టబయలైంది. అందులో కేటీఆర్ దొరికిపోయారు. హైదరాబాద్, దాని చుట్టపక్కల కొన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూములను తక్కువ ధరకే తన సన్నిహితులు, బంధువులకు అప్పజెప్పిన వైనం ఇంకా తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు. కవిత లేఖలో ఆమె ప్రస్తావించిన అంశాలను పరిశీలిస్తే.. బీజేపీకి, బీఆర్ఎస్కు పరిపూర్ణమైన లోపాయికారి ఒప్పందం ఉందని స్పష్టంగా తెలుస్తోంది. బీఆర్ఎస్ గతంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహాయ, సహకారాలు అందించిన కారణంగానే కవిత లిక్కర్ కేసులో ఇరికినప్పుడు అమిత్షా దగ్గరకు వెళ్లి బేరం కుదుర్చుకుని బెయిల్ వచ్చే విధంగా చేసుకున్న విషయాన్ని ప్రజలు మర్చిపోలేదు. బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య లోపాయికారి మైత్రి ఉంది కాబట్టే బెయిల్ సునాయాసమైంది. కేటీఆర్, హరీశ్రావులే కదా.. ఆ బేరసారాలు చేశారు. తమ అవినీతి బయటపడకుండా ఉండేందుకు మోదీ, అమిత్షా కాళ్లు ఎవరు పట్టుకున్నారో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. కేసీఆర్ను ఫామ్ హౌస్లో బందీ చేశారు.. హరీశ్రావు, కేటీఆర్ కలసి కేసీఆర్ను ఫామ్ హౌస్లో బందీ చేశారని నేను దాదాపు మూడున్నర నాలుగు మాసాల క్రితం చెప్పాను. అదిప్పుడు వాస్తవం అని తెలుస్తోంది. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని కవిత చెప్పారు. ఆ దెయ్యాలు ఎవరో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ మొదలుకొని.. కేటీఆర్, హరీశ్రావు, కవిత సహా ఆ కుటుంబం అంతా విచ్చల విడిగా అవినీతికి పాల్పడిన విషయాన్ని పదేళ్లుగా చూశాం. వారి మధ్య వైరం వచ్చిందంటే రాజకీయ పదవుల పోటీ ఒకటైతే.. పంపకాల్లో కూడా తేడా వచ్చిం దనేది నా అనుమానం. అందుకే కవిత ఇవాళ బాహాటంగా తిరుగుబాటు జెండా ఎగురవేసినట్లు కనిపిస్తోంది. కేసీఆర్కు పట్టిన దెయ్యం కూడా కేటీఆరేనని కవిత చెప్పకనే చెప్పారు. దీంతో ఇంట్లో జరుగుతున్న పోరు ప్రజలకు తెలియకుండా ఉండేందుకు కేటీఆర్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నట్లు కనిపిస్తోంది’అని మహేశ్గౌడ్ అన్నారు.ఘనంగా మహేశ్గౌడ్ జన్మదిన వేడుకలుసాక్షి, న్యూఢిల్లీ/ హైదరాబాద్: టీపీసీచీఫ్ మహేశ్కుమార్గౌడ్ పుట్టినరోజు సందర్భంగా శనివారం ఢిల్లీలో పలువురు కాంగ్రెస్ నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ భవన్లోని శబరి బ్లాక్లో ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్కుమార్రెడ్డి, అధికార ప్రతినిధి సుధాకర్గౌడ్ తదితరులు మహేశ్కు పుష్పగుచ్ఛం అందజేసి మిఠాయిలు తినిపించారు. అలాగే మహేశ్గౌడ్ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాయి.హైదరాబాద్ గాంధీభవన్లో తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, కల్లుగీత పారిశ్రామిక సంఘం చైర్మన్ నాగరాజు గౌడ్, మహిళా కాంగ్రెస్, సేవాదళ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, స్వీట్లు పంచుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాజుల లింగంగౌడ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. -
తెలంగాణలో నిరంతరాయ విద్యుత్ సరఫరా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. విద్యుత్ రంగంలో రాష్ట్ర పురోగతి, ప్రణాళికలను వివరిస్తూ, ఇంధన మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడం, ఆపరేషనల్ సామర్థ్యాన్ని పెంచడం, సంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తిలో వేగంగా ముందుకెళ్తున్నామని, దీనిపై కేంద్రం, రాష్ట్రాలు కలిసి ముందుకు వెళ్లాల్సి ఉందని చెప్పారు. బెంగళూరులో శుక్రవారం రాత్రి పొద్దుపోయే వరకు జరిగిన కేంద్ర విద్యుత్ మంత్రుల ఆధ్వర్యంలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రుల సదస్సులో భట్టి మాట్లాడారు. నెట్వర్క్ బలోపేతంరాష్ట్రంలోని అంతర్గత విద్యుత్ ప్రసార నెట్వర్క్ను బలోపేతం చేయడం ద్వారా పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ వనరులను సమన్వయం చేస్తూ చర్యలు చేపడుతున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. ‘2034–35 వరకు దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించాల్సిన అవసరం ఉంది. విద్యుత్ పంపిణీ సంస్థల పనితీరు, ఆర్థిక స్థితిని మెరుగుపరిచేలా సరైన ప్రణాళికలు రూపొందించాలి. ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటును వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది’అని చెప్పారు. భవిష్యత్తులో విద్యుత్ డిమాండ్ను తీర్చేందుకు తెలంగాణ చూపిస్తున్న క్రియాశీలక దృష్టికోణాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల ద్వారా గ్రిడ్ స్థిరత్వాన్ని మెరుగుపరిచే ప్రణాళికలపైనా భట్టి మాట్లాడారు. రాష్ట్రాలు, కేంద్రం కలిసి పనిచేయడం ద్వారా జాతీయ ఇంధన లక్ష్యాలను సాధించవచ్చన్న విషయం ఈ సదస్సులో స్పష్టమైంది. సమావేశంలో కేంద్ర ఇంధన శాఖ మంత్రి మనోహర్ లాల్, కేంద్ర ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ యస్సో నాయక్, కర్ణాటక, తమిళనాడు విద్యుత్ మంత్రులు కేజే జార్జ్, శివశంకర్ పాల్గొన్నారు. -
పాలిసెట్లో 88.5% ఉత్తీర్ణత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పాలిసెట్లో 83,364 (88.54 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఎంపీసీ విభాగంలో 81.88%, ఎంబైపీసీ విభాగంలో 84.33% అర్హత సాధించారు. టాప్ ర్యాంకుల్లో ఎక్కువ మంది బాలికలే ఉండటం విశేషం. 120 మార్కుల పేపర్లో నలుగురు విద్యార్థులు పూర్తి మార్కులు 120 సాధించటం గమనార్హం. పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశానికి సాంకేతిక విద్య, శిక్షణ మండలి ఈ నెల 13న రాష్ట్రవ్యాప్తంగా పాలిసెట్ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్ష ఫలితాలను సాంకేతిక విద్య కమిషనర్ దేవసేన శనివారం విడుదల చేశారు. పరీక్షకు మొత్తం 1,06,716 మంది దరఖాస్తు చేయగా, 98,858 మంది పరీక్ష రాశారు. వీరిలో 83,364 మంది అర్హత సాధించారు. ఎంపీసీ విభాగంలో మొత్తం 80,949 మంది అర్హత సాధించగా, వారిలో బాలురు 41,923 మంది, బాలికలు 39,026 మంది ఉన్నారు. ఎంబైపీసీ విభాగంలో బాలురు 42,836, బాలికలు 40,528 మంది కలిపి మొత్తంగా 83,364 మంది అర్హత సాధించారు. మొత్తం 120 మార్కులకు నిర్వహించిన పరీక్షలో అర్హత మార్కులు 36. ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు ఒక్క మార్కు వచ్చినా అర్హతగా పరిగణిస్తారు. పాలిసెట్ ర్యాంకు కార్డులను ఎస్బీటీఈటీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని దేవసేన తెలిపారు. ప్రవేశ ప్రకటన వెలువడిన తర్వాత విద్యార్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరవ్వాలని ఆమె సూచించారు. లక్ష్యంతో చదివా మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాఠశాల స్థాయి నుంచి పాలిసెట్లో ర్యాంకు సాధించాలనే లక్ష్యంతో చదివాను. ఎస్సెస్సీలో 574 మార్కులు సాధించాను. ఫిజిక్స్, మేథ్స్ సబ్జెక్టులు నాకు ఎక్కువ ఇష్టం. భవిష్యత్లో ఐఐటీలో మంచి సీటు సాధించి, ఇంజనీర్ కావాలన్న లక్ష్యంతో చదువుతున్నాను. ర్యాంకు సాధించేందుకు సహకరించిన పాఠశాల ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. – ఉంద్యాల కౌశిక్నారాయణ, 1వ ర్యాంకర్ సివిల్స్ సాధించడమే లక్ష్యం కోదాడ: భవిష్యత్తులో సివిల్స్ సాధించడమే నా లక్ష్యం. ఐఐటీలో ఇంజనీరింగ్ చదువుతా. తరువాత సివిల్స్పై దృష్టి సారిస్తా. టీజీఎస్ఆర్జేసీలో కూడా నాలుగో ర్యాంకు సాధించాను. పాఠశాల యాజమాన్యం, నా తండ్రి జానీపాషా ప్రోత్సాహంతో ఈ ర్యాంకులు సాధించాను. – ఎస్.కె. ఇఫ్రా తస్నీమ్, 3వ ర్యాంకర్ ఆదిలాబాద్ విద్యార్థికి 5వ ర్యాంకు నేరడిగొండ: పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్–2025 ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం సవర్గామ్ గ్రామానికి చెందిన జాదవ్ రిషి ఆరాధ్య రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు సాధించింది. ఈమె తండ్రి జె.తానాజీ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఐఐటీలో సీటు సాధించడమే లక్ష్యం సూర్యాపేట టౌన్: పాలిసెట్లో రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ర్యాంకు రావడం సంతోషాన్నిచ్చింది. నాన్న మధుసూదన్రావు, అమ్మ సునీత ప్రోత్సాహంతోనే ఈ ర్యాంకు సాధించగలిగాను. టీచర్లు కూడా ప్రోత్సహించి మంచి విద్యనందించారు. ఐఐటీలో సీటు సాధించడమే లక్ష్యంగా చదువుతున్నాను. అలాగే భవిష్యత్తులో సివిల్స్ కూడా సాధించాలనేది నా కోరిక. –గోరుగంటి శ్రీజ, 1వ ర్యాంకర్ -
ఉగ్ర కుట్ర కేసు.. వెలుగులోకి విస్తుపోయే కొత్త కోణాలు
సాక్షి, హైదరాబాద్: సిరాజ్ ఉగ్ర కదలికలపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఏడేళ్లుగా హైదరాబాద్లో మకాం వేసిన సిరాజ్.. సమీర్ కలిసి ఐదు చోట్ల రెక్కీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్, విజయనగరం, ఢిల్లీ, బెంగళూరు, ముంబైలో రెక్కీ నిర్వహించారు. వరంగల్కు చెందిన ఫర్హాన్ మోయినుద్దీన్ కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. యూపీకి చెందిన బాదర్తో సిగ్నల్ యాప్ ద్వారా సిరాజ్ కాంటాక్ట్ అయినట్లు పోలీసులు గుర్తించారు. మహారాష్ట్ర, కర్ణాటక ఇతర రాష్ట్రాల వారితో జరిగిన సమావేశాలపై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు.సిరాజ్ సోషల్ మీడియా అకౌంట్లపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియోలకు సిరాజ్ కౌంటర్ ఇవ్వగా.. సిరాజ్ కౌంటర్ను మెచ్చుకుంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. రాజాసింగ్కు ఇంకా గట్టి కౌంటర్ ఇవ్వాలని చెప్పిన గుర్తు తెలియని వ్యక్తికి, సిరాజ్కు నాలుగు రోజుల పాటు ఇద్దరి మధ్య సోషల్ మీడియా చాటింగ్స్ కొనసాగినట్లు పోలీసులు నిర్థారించారు.రాజాసింగ్తో పాటు పలువురికి ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇవ్వాలని ఆదేశాలిచ్చిన.. ఆ గుర్తు తెలియని వ్యక్తి.. తనకు తాను విశాఖ రెవెన్యూ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. సోషల్ మీడియా ద్వారానే సిరాజ్తో టచ్లో ఆ గుర్తు తెలియని వ్యక్తి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సిరాజ్ను కాంటాక్ట్ చేసిన అకౌంట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. -
హైదరాబాద్లో దంచికొట్టిన వాన
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం వర్షం దంచికొట్టింది. మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్లో భారీ వర్షం కురిసింది. అలాగే సనత్ నగర్, పంజాగుట్ట, అమీర్పేట, ఖైరతాబాద్, మెహదీపట్నం, టోలీచౌకీ, గోల్కోండ తదితర ప్రాంతాల్లోనూ వాన పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగారు. ఆఫీసులు ముగిసే సమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల ట్రాఫిక్ భారీగా జామ్ కావడంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. ఇంకా చిరు జల్లులు పడుతుండగా.. రేపు భారీ వర్షం పడొచ్చని వాతావరణశాఖ తెలిపింది. నైరుతి(Southwest Monsoon) రుతుపవనాలు సాధారణం కంటే ఎనిమిది రోజుల ముందే కేరళను తాకాయి. దీంతో రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ విభాగం ప్రకటించింది. Ameerpet metro station 🌧️ #HyderabadRains#Hyderabad pic.twitter.com/svyXFaOb0b— Rajesh (@bekindtoevery_1) May 24, 2025#24MAY 7:30PM⚠️Pouring So Heavily in Northern & Western Parts of the City #Hyderabadrains pic.twitter.com/gNR0GD4WZc— Hyderabad Rains (@Hyderabadrains) May 24, 2025 -
‘బీఆర్ఎస్ మూడు ముక్కలు కాబోతుంది’
సాక్షి, ఢిల్లీ: బీఆర్ఎస్ మూడు ముక్కలు కాబోతుందంటూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కవిత ఇచ్చిన ఝలక్తో కేటీఆర్కు మతి భ్రమించిందన్నారు. ఇంట్లో కంపటి తట్టుకోలేక కేటీఆర్ సతమతమవుతున్నారంటూ చెప్పుకొచ్చారు. కవిత ఎపిసోడ్ డైవర్ట్ చేసేందుకే తమపై ఆరోపణలు చేశారన్న మహేష్ గౌడ్.. పది సంవత్సరాల బీఆర్ఎస్ తప్పిదాలను కవిత ఎత్తి చూపిందన్నారు.బీఆర్ఎస్ తప్పిదాలన్ని ప్రజలకు అర్థమవుతున్నాయి. కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్కు నోటీసులతో.. కేటీఆర్ భయపడుతున్నాడు. బీఆర్ఎస్కు, బీజేపీకి స్పష్టమైన అవగాహన ఉన్నట్లు కవిత వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. బీఆర్ఎస్ మూడు ముక్కలు కాబోతుంది కవిత, కేటీఆర్ మధ్య పోటీ తీవ్రం కావడంతో అదను కోసం హరీష్ రావు ఎదురుచూస్తున్నారు. దిక్కుతోచని స్థితిలో కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితమయ్యారు’’ అంటూ మహేష్ గౌడ్ విమర్శలు గుప్పించారు.‘‘కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలు ఎవరో ప్రజలకు తెలియాలి. పదేళ్ల అవినీతిలో పంపకాల్లో వచ్చిన తేడాతోనే.. కవిత జెండా ఎగరవేసినట్లు అర్థమవుతుంది. భవిష్యత్తు తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో బీఆర్ఎస్ ఉండదు’’ అంటూ మహేష్ గౌడ్ వ్యాఖ్యానించారు. -
సిస్టర్ స్ట్రోక్తోనే కేటీఆర్ అలా మాట్లాడారు: మంత్రి సీతక్క
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తాజాగా చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క(Minister Seethakka) స్పందించారు. గోబెల్స్ ప్రచారంలో కేటీఆర్(KTR)ను మించిన వారే లేరని కౌంటర్ ఇచ్చారామె.శనివారం మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కవిత చెప్పిన దెయ్యం కేటీఆరే. సిస్టర్ స్ట్రోక్(Sister Stroke)తో కేటీఆర్ చిన్న మెదడు చిట్లింది. కాళేశ్వరంలో కమీషన్లు తిన్నప్పుడు లేని భయం.. కమిషన్ ముందు హాజరయ్యేటప్పుడు ఎందుకు?. అబద్ధాల పునాదులపై బీఆర్ఎస్ నడుస్తోంది. రాహుల్ గాంధీ(Rahul Gandhi) గురించి మాట్లాడే స్థాయి కేటీఆర్కు లేదు’’ అని అన్నారామె. అటవీ అధికారులు ప్రజలకు సహకరించాలిఅటవీ శాఖ కఠిన నిబంధనల వల్ల ఉమ్మడి అదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో అటవీ సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి సీతక్క అన్నారు. ‘‘ప్రజల తరఫున వారి సమస్యలను ఎమ్మెల్యేలు మా దృష్టికి తీసుకొస్తున్నారు. అందుకే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాలు చూపించాలనే ఉద్దేశంతో అటవీ శాఖ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, రోడ్లు భవనాల శాఖ, ఐటీడీఏ శాఖలతో ఈరోజు సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఈ భేటీలో క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను విస్తృతంగా చర్చించి ఓ మార్గం చూపిస్తాం. అటవీ ప్రాంతాల్లోనీ ప్రజల అభివృద్ధికి అటవీశాఖ అధికారులు మానవీయ కోణంలో సహకరించాలి. కనీస సౌకర్యాలు కల్పించాలి’’ అని అన్నారామె.ఇదీ చదవండి: కవితకు ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చిన కేటీఆర్! -
కేఏ పాల్ సభకు హైకోర్టు అనుమతి
సాక్షి, హైదరాబాద్: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ శనివారం సికింద్రాబాద్లోని జింఖానా గ్రౌండ్లో ప్రపంచ శాంతి ఉత్సవం నిర్వహించుకొనేందుకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. సభలో వెయ్యి మందికి మించి ప్రజలు పాల్గొనరాదని.. ప్రార్థనలు మినహా ఇతర ప్రేరేపిత ప్రసంగాలు చేయరాదని సభ నిర్వహిస్తున్న గ్లోబల్ పీస్ ఫెస్టివల్కు స్పష్టం చేసింది. సభ శాంతియుతంగా సాగేలా పోలీసులు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఏదైనా అనుకోని ఘటన జరిగితే దానికి సొసైటీనే బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది. నిబంధనలు ఉల్లంఘించినా లేక దేశ ప్రయోజనాలకు, సమగ్రతకు విరుద్ధమైన నినాదాలు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవచ్చని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. సభకు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ గోస్పెల్ సొసైటీ హైకోర్టులో దాఖలు చేసిన హౌస్మోషన్ పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ నందికొండ నర్సింగ్రావు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. -
కవితకు కేటీఆర్ స్వీట్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీలో సూచనలు చేయాలనుకుంటే ఎవరైనా లేఖలు రాయవచ్చు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇదే సమయంలో పార్టీలో అంతర్గతంగా మాట్లాడితేనే మంచిది అంటూ కవితకు కేటీఆర్ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ కవిత లేఖపై స్పందించారు. ఈ సందర్బంగా కేటీఆర్.. మా పార్టీలో సూచనలు చేయాలనుకుంటే ఎవరైనా లేఖలు రాయవచ్చు. పార్టీలో అంతర్గతంగా మాట్లాడితేనే మంచిది. మా పార్టీలో ప్రజాస్వామిక స్పూర్తి ఉంది. పార్టీలో ఎవరైనా సూచనలు చేయవచ్చు.. ఎవరైనా లేఖలు రాయవచ్చు. అన్ని పార్టీల్లో కోవర్టులు ఉంటారు. పార్టీలో అందరం కార్యకర్తలమే.. అందరూ సమానమే. ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుతుంటే దేవుడు, దెయ్యం ఎందుకు? అని ప్రశ్నించారు. -
రేవంత్ రాజీనామా చేయాల్సిందే.. బీజేపీ నేతలెందుకు స్పందించరు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు బట్టబయలైంది. నీతి, నిజాయితీ ఉంటే రేవంత్ సీఎం పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హస్తిన పెద్దల కాళ్లు పట్టుకోవడానికే రేవంత్ ఢిల్లీకి వెళ్తున్నారు. బీజేపీ నాయకత్వం కాంగ్రెస్ నేతలను కాపాడుతోందని సంచలన ఆరోపణలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ..‘ఓటుకు నోటు కుంభకోణం ఇంకా ఎవరూ మర్చిపోలేదు. ఢిల్లీ కాంగ్రెస్ నేతలకు తెలంగాణ ఏటీఎంలా మారిపోయింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు పంపిస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. పీసీసీ పదవి కోసం రేవంత్ రూ.50 లక్షలు ఇచ్చారని కాంగ్రెస్ నేతలే ఆరోపణలు చేశారు. ఇప్పుడు సీటుకు రూట్ కుంభకోణం బయటపడింది. రేవంత్ రెడ్డి వైఖరితో దేశవ్యాప్తంగా తెలంగాణ పరువు పోయింది.నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు బట్టబయలైంది. రేవంత్ రెడ్డితో రాజీనామా చేయించి నిష్ఫక్షపాతంగా విచారణ చేయించాలి. రేవంత్ రెడ్డి తరచూ ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారో అర్థమవుతోంది. హస్తిన పెద్దల కాళ్లు పట్టుకోవడానికే రేవంత్ ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీ బాసులకు రేవంత్ రెడ్డి వేల కోట్లు చందాలు ఇస్తున్నారు. లీడర్లు, కాంట్రాక్టర్లతో రేవంత్ దందాలు చేశారు. రేవంత్ జపాన్ పర్యటనపై మాకు అప్పుడే సందేహాలు వచ్చాయి. యంగ్ ఇండియా పేరుతో దందా చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో భారీ వసూళ్లను పాల్పడ్డారు. రేవంత్ రెడ్డి వ్యవహారంలో రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదు. నీతి, నిజాయితీ ఉంటే రేవంత్ సీఎం పదవి నుంచి తప్పుకోవాలి. లేకుంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కుర్చీ నుంచి రేవంత్ను తప్పించాలి.మంత్రి పొంగులేటిపై ఈడీ దాడులు చేస్తే ఇప్పటి వరకూ బీజేపీ నేతలు స్పందించలేదు. వాల్మీకి స్కాంపై నోరు మెదపరు. సివిల్ సప్లయ్ స్కాంపై ఎలాంటి చర్యలు లేవు. బీజేపీకి నిజాయితీ ఉంటే ఈ స్కాంలపై స్పందించాలి. తెలంగాణలో ఎవరు ఎవరితో కుమ్మక్కు అవుతున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలి. గవర్నర్ని కలిసి సీఎం అవినీతిపై చర్యలకు డిమాండ్ చేస్తాం. నెల రోజుల్లో చర్యలు తీసుకోకుంటే మా పార్టీ కార్యచరణ తీసుకుంటాం అని హెచ్చరించారు. యడ్యూరప్పపై విమర్శలు వస్తే రిజైన్ చేయాలని కర్ణాటక కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేయలేదా?. కాంగ్రెస్ అంటేనే కరప్షన్ అని అందరికీ తెలుసు. డీకే శివకుమార్ను తొలగించాలని కర్ణాటకలో బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కానీ, తెలంగాణలో మాత్రం బీజేపీ నేతలకు ఏమైంది?. హెరాల్డ్ కేసుపై రేవంత్ ఎందుకు స్పందించలేదు?. బీజేపీ నాయకత్వం కాంగ్రెస్ నేతలను కాపాడుతోంది. బీజేపీ నేతలకు దమ్ముంటే రేవంత్ వ్యవహారంపై వెంటనే స్పందించాలి’ అని డిమాండ్ చేశారు. -
మూణ్నాళ్ల ముచ్చటగా మారిన కాంగ్రెస్ హామీ
‘హైదరాబాద్ నగర శివారులోని మౌలాలీకి చెందిన బాలకృష్ణ కుటుంబం రూ.500 గ్యాస్ సిలిండర్ వర్తింపునకు అర్హత సాధించింది. రీఫిల్ డోర్ డెలివరీ కాగానే మార్చి నెల వరకు ఠంచన్గా బ్యాంక్ ఖాతాలో సబ్సిడీ నగదు జమ అవుతూ వచ్చింది. కాగా.. మార్చి నుంచి రెండు పర్యాయాలు సిలిండర్ బుక్ చేస్తే .. రీఫిల్ డోర్ డెలివరీ అయింది కానీ సబ్సిడీ నగదు బ్యాంక్ ఖాతాలో జమ కాలేదు. బాలకృష్ణ కుటుంబానికే ఎదురైన సమస్య కాదు.. గ్రేటర్ పరిధిలో గ్యాస్ సబ్సిడీకి అర్హత సాధించిన చాలా కుటుంబాలదీ ఇదే పరిస్థితి’సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ సర్కార్ ఆరు గ్యారంటీల్లో భాగంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం కింద రూ.500కు వంట గ్యాస్ సబ్సిడీ నగదు జమ మూణ్నాళ్ల ముచ్చటగానే తయారైంది. గ్యాస్ సబ్సిడీకి అర్హత సాధించి రీఫిల్ డోర్ డెలివరీ కాగానే సబ్సిడీ నగదు రూపంలో కొన్ని నెలలు బ్యాంక్ ఖాతాలో జమ అయినా.. ఆ తర్వాత ఆగిపోవడం విస్మయానికి గురిచేస్తోంది. దీంతో కేవలం కేంద్ర ప్రభుత్వ స్లాబ్ సబ్సిడీకి పరిమితం కావాల్సిన పరిస్థితి నెలకొంది. మూడు లక్షల కుటుంబాలకు.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మహాలక్ష్మి పథకం కింద రూ. 500 కు వంట గ్యాస్ వర్తింపునకు కేవలం మూడు లక్షల కుటుంబాలు మాత్రమే అర్హత సాధించాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్– మల్కాజిగిరి జిల్లాల పరిధిలో సుమారు 40.18 లక్షల ఎల్పీజీ కనెక్షన్దారులున్నారు. ప్రజాపాలనలో సుమారు 24.74 లక్షల కుటుంబాలు గ్యాస్ సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. వీటిలో 19.10 లక్షల కుటుంబాలకు మాత్రమే తెల్లరేషన్ కార్డులు ఉన్నాయి. సబ్సిడీ గ్యాస్ మాత్రం కేవలం మూడు లక్షలలోపు కనెక్షన్దారులకు మాత్రమే వర్తించినట్లు పౌరసరఫరాల శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మిగతా 16 లక్షల కనెక్షన్దారులు అర్హులుగా ఉన్నా.. సబ్సిడీ వర్తింపు మాత్రం అందని ద్రాక్షగా మారింది. తాజాగా అర్హత సాధించిన కుటుంబాల్లో సైతం కొందరికి సబ్సిడీ నగదు బ్యాంక్ ఖాతాలో జమకావడం మూణ్నాళ్ల ముచ్చటగానే మారింది. కొందరి ఖాతాల్లోనే నగదు జమ.. రాష్ట్ర ప్రభుత్వం అందించే సబ్సిడీ బ్యాంక్ ఖాతాలో నగదు జమ కాకపోవడంతో మళ్లీ వంట గ్యాస్ ఆర్థిక భారంగా తయారవుతోంది. మార్కెట్ ధర ప్రకారం కొనుగోలు చేయక తప్పడం లేదు. కేంద్ర ప్రభుత్వం సిలిండర్పై సబ్సిడీ రూపంలో రూ.40.71 జమ చేస్తోంది. ఆరు గ్యారంటీ పథకాల్లో భాగంగా అర్హత సాధించిన వంట గ్యాస్ లబి్ధదారులకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సిలిండర్ ధరలో రూ.500, కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ మినహాయించి మిగతా సొమ్మును నగదు బదిలీ ద్వారా వినియోగదారులు ఖాతాలో చేస్తూ వస్తోంది. తాజాగా సిలిండర్పై కొద్ది మందికి మాత్రమే సబ్సిడీ బ్యాంకు ఖాతాల్లో జమ అవుతోంది. మిగతా వారికి జమ కావడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల్లో కొరవడిన స్పష్టత.. వంట గ్యాస్ సబ్సిడీ నగదు జమ కొన్ని లబ్ధి కుటుంబాలకు నిలిచిపోవడంపై పౌరసరఫరాల అధికారులకు సైతం స్పష్టత లేకుండా పోయింది. సిలిండర్ల వినియోగం దాటడమే సబ్సిడీ నగదు జమ కాకపోవడానికి కారణమనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం 12 సిలిండర్లపై సబ్సిడీ వర్తింప జేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గత మూడేళ్లలో వినియోగించిన సిలిండర్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. గరిష్టంగా ఏటా ఇవ్వాల్సిన సిలిండర్ల సంఖ్య ఎనిమిదిగా నిర్ధారించింది. లబి్ధదారుల సిలిండర్ సంఖ్య ఎనిమిది పరిమితి దాటనప్పటికీ.. గతంలో వినియోగించిన సంఖ్య తక్కువగా ఉంటే దాని ప్రకారమే సబ్సిడీ వర్తింపజేస్తున్నట్లు సమాచారం. -
‘రాజస్థాన్ నేరం’ వెనుక లోకేంద్ర!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కాచిగూడకు చెందిన కార్టన్స్ ఫ్యాక్టరీ యజమాని హేమ్రాజ్ దుగ్గర్ ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న లోకేంద్ర బహదూర్ షాహి నేతృత్వంలోని ముఠా మరో నేరం చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ పంజా విసరడానికి ఆరు నెలల ముందు ముంబైకి చెందిన ఓ బడా వ్యాపారి ఇంట్లో ఇదే పంథాలో 5 కేజీల బంగారం తస్కరించినట్లు ఇప్పటికే వెలుగులోకి వచ్చింది. దీంతో పాటు ఈ నెల 14 రాత్రి రాజస్థాన్లోని జైపూర్లో నివసించే కాంగ్రెస్ పార్టీ నేత సందీప్ చౌదరి ఇంట్లో రూ.6 కోట్ల సొత్తు దొంగతనానికీ ఇతడే సూత్రధారి అని ఆ పోలీసులు అనుమానిస్తున్నారు. దీన్ని ఖరారు చేసుకోవడానికి హైదరాబాద్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. వ్యవస్థీకృతంగా లోకేంద్ర వ్యవహారాలు.. కొన్నేళ్ల క్రితం నేపాల్ నుంచి వసలవచ్చిన లోకేంద్ర వ్యవస్థీకృతంగా ఈ చోరీలు చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక్కడి వ్యాపారుల ఇళ్లల్లో పని చేస్తున్న నేపాలీల్లో కొందరితో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. వారి ద్వారా ఆయా వ్యాపారుల కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలు తెలుసుకుంటున్నాడు. అదను చూసుకుని అప్పటికే పని చేస్తున్న వారి ద్వారానే, ఆ స్థానంలో మరో నేపాలీని పనిలో పెట్టిస్తున్నాడు. ఆపై తన ముఠాతో రంగంలోకి దిగి ఆ ఇంటిని కొల్లగొట్టిస్తున్నాడు. ముంబైకి చెందిన వ్యాపారి ఇంట్లో ఇదే పంథాలో ఐదు కేజీల బంగారం తస్కరించారు. గత నెల్లో కాచిగూడలోనూ ఇలానే భారీ చోరీకి పాల్పడ్డారు. ఇక్కడ ఇంట్లో ఉన్న ఇద్దరు వృద్ధులకు మత్తు మందు ఇచ్చి తమ పని కానిచ్చారు.వైశాలీ నగర్లోనూ .. జైపూర్లోని వైశాలీనగర్లో ఉన్న సందీప్ చౌదరి ఇంట్లోనూ ఇదే పం«థాలో నేరం జరిగింది. ఈ ఇంట్లో పని చేసే మహిళతో పాటు ఓ పురుషుడు అదను కోసం ఎదురు చూశారు. సందీప్ జైపూర్లో లేని విషయం గమనించి మరో ఇద్దరికి సమాచారం ఇచ్చారు. ఆయన కుటుంబీకులతో మత్తు మందు కలిపిన టీ తాగించారు. అంతా అపస్మారక స్థితిలో ఉండగా ఆ ఇద్దరితో పాటు మరొకరినీ రప్పించిన ఈ ద్వయం ఇంట్లో ఉన్న నగదు, బంగారం, వెండి, వజ్రాభరణాలతో సహా రూ.6 కోట్ల విలువైన సొత్తుతో ఉడాయించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన ప్రత్యేక బృందం భరత్ బిస్త్, హరి బహదూర్ దామిలను అరెస్టు చేశారు. మిగిలిన ముగ్గురి ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు. నిందితుల విచారణలో సరైన వివరాలు రాకపోవడంతో ఈ పంథాలో జరిగిన నేరాల వివరాలు ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే కాచిగూడ చోరీ వారి దృష్టికి వెళ్లింది. ఇక్కడా, అక్కడా ఒకేలా నేరం జరగడంతో జైపూర్ చోరీ వెనుకా లోకేంద్ర బహదూర్ షాహి పాత్రను అనుమానిస్తున్నారు. దర్యాప్తు కోసం వివరాలు కోరుతూ నగర పోలీసులను సంప్రదిస్తున్నారు. -
కవిత లేఖ కలకలం.. కేటీఆర్ కీలక ప్రెస్మీట్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ కవిత లేఖ, ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కవిత వ్యాఖ్యలపై పార్టీ అధినేత కేసీఆర్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కవిత లేఖ, కామెంట్స్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించనున్నారు. తెలంగాణభవన్లో ఈరోజు ఉదయం 11 గంటలకు కేటీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా కీలక విషయాలను వెల్లడించే అవకాశం ఉంది.ఇక, అంతకుముందు కేసీఆర్కు ఎమ్మెల్సీ కవిత లేఖ రాసిన విషయం తెలిసిందే. తాజాగా బీఆర్ఎస్పై కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. అమెరికా నుంచి హైదరాబాద్కు చేరుకున్న కవిత శుక్రవారం శంషాబాద్ విమానాశ్రయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా కవిత..‘నా కుమారుడి గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి వెళ్లిన తర్వాత లేఖ లీక్ అయి హంగామా జరిగినట్లు తెలిసింది. రెండు వారాల క్రితం నేను కేసీఆర్కు లేఖ రాశా. గతంలో కూడా లేఖల ద్వారా కేసీఆర్కు అనేకసార్లు అభిప్రాయాలు చెప్పా. మా పార్టీ అధినేతకు రాసిన లేఖ బహిర్గతమైందంటే.. దాని వెనుక ఎవరున్నారో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ కుమార్తెనైన నేను రాసిన లేఖే బయటికి వచ్చిందంటే.. పార్టీలో సామాన్యుల పరిస్థితి ఏమిటి? దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది.నాపై కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయని ఇటీవలే చెప్పా. ఇప్పుడు లేఖ బహిర్గతం అవ్వడంతో.. ఏం జరుగుతున్నదోనని పార్టీలో ఉన్న అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. పార్టీలో అన్ని స్థాయిల్లో ఉన్న వారు, దాదాపు సగం తెలంగాణ ప్రజలు అనుకుంటున్న విషయాలే నేను లేఖలో చెప్పా. ఇందులో నాకు వ్యక్తిగత ఎజెండా ఏమీ లేదు. వ్యక్తిగతంగా నాకు ఎవరిపైనా ద్వేషం లేదు. మా నాయకుడు కేసీఆరే. ఆయన నాయకత్వంలో తెలంగాణ బాగుపడుతుంది. పార్టీ కూడా ముందుకెళ్తుంది అని అన్నారు. మరోవైపు.. కవిత అభిమానులు.. ఆమెను సీఎం.. సీఎం.. కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. -
కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)
-
మందలా చేరికలు.. మందకొడి బోధన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లో ఇంజనీరింగ్ విద్య నాణ్యతపై ఆడిట్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయాన్ని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) దృష్టికి తీసుకెళ్లేదుకు సిద్ధమైంది. డీమ్డ్ వర్సిటీలపై రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం వల్ల జరుగుతున్న నష్టాన్ని ఏఐసీటీఈకి వివరించాలని నిర్ణయించింది. ఈ అంశంపై విద్యాశాఖ, సాంకేతిక విద్య శాఖ అధికారులు గురువారం చర్చించారు.ప్రభుత్వ సూచనల మేరకు ఏఐసీటీఈకి లేఖ రాసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. డీమ్డ్ వర్సిటీల్లో నాణ్యతా ప్రమాణాలు దెబ్బతింటున్న తీరు, దీనివల్ల విద్యార్థులకు జరిగే నష్టాన్ని అందులో వివరించాలని నిర్ణయించారు. ముఖ్యంగా ఎమర్జింగ్ కోర్సుల నాణ్యతపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో ప్రమాణాలు లేని బోధన జరుగుతోందని ప్రభుత్వం గుర్తించింది.కాలం చెల్లిన కోడింగ్గత ఏడాది డీమ్డ్ వర్సిటీల నుంచి ఇంజనీరింగ్ పట్టా పొందిన విద్యార్థులు కొన్ని రకాల కోడింగ్ మాత్రమే చేయగలుగుతున్నారు. ఏఐ వచి్చన తర్వాత పాతతరం కోడింగ్, డీకోడింగ్ అవసరమే లేకుండా పోయింది. అడ్వాన్స్డ్ కోడింగ్ను సాఫ్ట్వేర్ కంపెనీలు కోరుకుంటున్నాయి. ఇవేవీ డీమ్డ్ వర్సిటీ విద్యార్థుల్లో కన్పించడం లేదని సాంకేతిక విద్య అధికారులు అంటున్నారు. డ్రిస్కియేట్ మేథమెటిక్స్, డేటా స్ట్రక్చర్, కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్, డేటా స్ట్రక్చర్ లేబోరేటరీపై బేసిక్స్ తప్ప, ఏఐ సమాంతర బోధనపై ఏమాత్రం దృష్టి పెట్టడం లేదని గుర్తించారు. కొన్ని సంస్థల కోసం జరిగే ఇంటర్వ్యూల్లో కీలకమైన బిజినెస్ ఎకనమిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలసిస్పై కనీస పరిజ్ఞానం కూడా విద్యార్థుల్లో ఉండటం లేదని టెక్ కంపెనీలు అంటున్నాయి. అడ్డగోలు ప్రవేశాలుతెలంగాణలో మొత్తం పదివరకు డీమ్డ్ వర్సిటీలున్నాయి. వీటిలో కొన్ని ఆఫ్ క్యాంపస్ బ్రాంచీలున్నాయి. డీమ్డ్ హోదా ఉన్న సంస్థలు తెలంగాణలో బ్రాంచీలు పెట్టాయి. భూమి, మౌలిక వసతులు, కొన్నేళ్లుగా సాధించిన ర్యాంకుల ఆధారంగా డీమ్డ్ హోదాను ఏఐసీటీఈ ఇస్తుంది. ఈ హోదా వచి్చన వర్సిటీలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు పొందాల్సిన అవసరం లేదు. అడ్మిషన్లు కూడా వాళ్ల ఇష్టమే.ఇష్టానుసారం అన్ని బ్రాంచీల్లోనూ సీట్లు పెంచుకోవచ్చు. డీమ్డ్ హోదా కోసం సంస్థలు వ్యూహాత్మకంగా జాతీయ ర్యాంకులు వచ్చేలా చూసుకుంటున్నాయి. ర్యాంకులిచ్చే జాతీయ సంస్థలకు ఇవి అనేక ప్రలోభాలకు గురిచేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ వర్సిటీలో చదివిన విద్యార్థులు అన్స్కిల్డ్ ఉద్యోగాల్లో చేరినా, వాటిని ర్యాంకింగ్ డేటాలో స్కిల్డ్గానే చూపిస్తున్నాయి. ఇలా హోదా తెచ్చుకున్న తర్వాత నియంత్రణ లేకుండా విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. ఒక్కో యూనివర్సిటీ ఇంజనీరింగ్లో ఏకంగా 3 వేలకుపైగానే విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తోంది.ఇందులో ప్రధానంగా డేటాసైన్స్, ఏఐఎంఎల్, సైబర్ సెక్యూరిటీ వంటి ఎమర్జింగ్ కోర్సులే ఉంటున్నాయి. అయితే, ఇంతమందికి సరిపడా ఫ్యాకల్టీ ఎలా తెస్తున్నారు? బోధించేవాళ్ల నాణ్యత ఎంత? అనే అంశాలపై అనేక సందేహాలు వ్యక్తమవుతన్నాయి. డీమ్డ్ వర్సిటీల్లో చదివిన విద్యార్థుల ఉపాధి అవకాశాలపై ఇటీవల రాష్ట్ర సాంకేతిక విద్యా విభాగం డేటా తెప్పించి పరిశీలించింది. కంప్యూటర్ సైన్స్ చదివిన వారిలో కనీసం 32 శాతం కూడా సరైన ఉద్యోగాలకు ఎంపికవ్వడం లేదని గుర్తించారు.పనికి మాలిన ప్రాజెక్టులుప్రతీ కంపెనీ ఇప్పుడు ఏఐ టెక్నాలజీకి అనుసంధానమయ్యాయి. దానిని నిర్వహించే ఉద్యోగ అర్హతలకు కొన్ని ప్రాజెక్టులు ఇంజనీరింగ్లోనే చేయాలి. అయితే, డేటా అనలిటిక్స్ లేబొరేటరీల్లో సాధారణ ప్రాజెక్టులు మాత్రమే పూర్తి చేస్తున్నారు. ఫీల్డ్ వర్క్లో చేసే ప్రాజెక్టుల్లో ఎక్కడా ఏఐ కోడింగ్, మాడ్యూల్స్పై అధ్యయనం చేసిన దాఖలాలు డీమ్డ్ వర్సిటీ విద్యార్థుల్లో ఉండటం లేదని సాంకేతిక విద్య అధికారి ఒకరు తెలిపారు. సైబర్ సెక్యూరిటీలో ఎథి్నకల్ హ్యాకింగ్, థ్రెట్ ఇంటిలిజెన్స్, ఢిజిటల్ ఫోరెన్సిక్స్ వంటి సబ్జెక్టుల్లో కనీస పరిజ్ఞానం కన్పించడం లేదని అధికారులు సేకరించిన డేటా స్పష్టం చేస్తోంది. బోధన నాణ్యతమై ఆడిటింగ్ జరిగితే తప్ప డీమ్డ్ వర్సిటీలు చేస్తున్న అన్యాయం వెలుగులోకి రాదని ఒక ఉన్నతాధికారి తెలిపారు. -
రాష్ట్రంలో తగ్గిన ఉపాధి హామీ పనిదినాలు
సాక్షి, న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రాష్ట్రంలో అమలైన తీరుపై తాజా గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పథకంలో పాల్గొనే కుటుంబాల సంఖ్య పెరుగుతున్నా వారికి అందుతున్న పనిదినాలు మాత్రం తగ్గిపోతున్నాయి. లిబ్టెక్ ఇండియా ఇటీవల విడుదల చేసిన ‘తెలంగాణ ట్రాకర్ 2024–25’ప్రకారం గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే పలుచోట్ల అభివృద్ధి కనిపించినా కీలకాంశాల్లో మందగమనమే కనిపిస్తోంది.సగటు పనిదినాల్లో క్షీణత.. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేసిన ప్రత్యేక కుటుంబాల సంఖ్య జాతీయ స్థాయిలో 3.5% తగ్గుదల నమోదవగా తెలంగాణలో మాత్రం 5.3% పెరుగుదల నమోదైంది. ఈ సంఖ్య 25.33 లక్షల నుంచి 26.68 లక్షలకు పెరిగింది. అదే సమయంలో ప్రతి ఇంటికి సగటు పనిదినాలు 47.7 నుంచి 45.8కి తగ్గాయి. వంద రోజుల పని పూర్తిచేసే కుటుంబాలు 31% తగ్గాయి. ఇది జాతీయ క్షీణత కంటే మూడురెట్లు ఎక్కువ కావడం గమనార్హం. దేశవ్యాప్తంగా వ్యక్తిగత పనుల్లో 7% తగ్గుదల నమోదవగా తెలంగాణలో మాత్రం మొత్తం ఉద్యోగ దినాలు 1.1% పెరిగాయి. గతేడాదితో పోలిస్తే సంవత్సర ప్రారంభంలో పెరుగుదల నమోదైంది. వ్యక్తిగత పనిదినాల్లో 2024 ఏప్రిల్, మే నెలల్లో 88%, 35% వృద్ధి నమోదైన తర్వాత తగ్గుదల కనిపించింది.వేతన నష్టం..గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వేతన రేటు రూ. 272 నుంచి రూ. 300కు పెంచినట్లు ప్రకటించినప్పటికీ కార్మికులు రోజుకు సగటున రూ. 213 మాత్రమే పొందారు. కార్మికులకు అంచనా వేసిన వేతన నష్టం రూ.1,059 కోట్లుగా ఉంది. కాగా ఈ పథకం నుంచి గత మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 21 లక్షల మంది కార్మికులు ఎంజిఎన్ఆర్ఇజీఏ జాబితా నుంచి తొలగించబడ్డారు. ఇతర రాష్ట్రాలు తిరిగి కార్మికులను చేర్చుకొనే ప్రక్రియలు చేపడుతున్నా తెలంగాణలో మాత్రం ప్రభుత్వం స్పందించకపోవడం ఆందోళన కలిగిస్తోందని నివేదిక పేర్కొంది. తప్పుగా తొలగించిన లబి్ధదారులను పునరుద్ధరించడంలో తెలంగాణ ఇతర రాష్ట్రాల కంటే వెనుకబడి ఉంది.జిల్లాలవారీగా చూస్తే..గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 32 జిల్లాల్లో 17 జిల్లాలు పెరిగిన ఉద్యోగ దినాలను నమోదు చేశాయి. ములుగు జిల్లాలో 36.5%, కామారెడ్డి జిల్లాలో 24.6%, వరంగల్ జిల్లాలో 23.7% అత్యధిక పెరుగుదల నమోదవగా మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలో –25.3%, సంగారెడ్డి జిల్లాలో –19.2%, మహబూబాబాద్ జిల్లాలో–18.1% అత్యధిక తగ్గుదల నమోదైంది. గ్రామీణ పనులకు డిమాండ్ ఉన్నప్పటికీ పాలనాపరమైన అడ్డంకులు, వేతనంలో తగ్గుదల, మినహాయింపులు తెలంగాణలో పథకం లక్ష్యాలను బలహీనపరుస్తున్నాయని నివేదిక పేర్కొంది.నివేదికలోని ప్రధానాంశాలు⇒ ఉపాధి హామీ పథకంలో పాల్గొన్న కుటుంబాలు: 25.33 లక్షల నుంచి 26.68 లక్షలకు పెరిగాయి (5.3%) ⇒ పనిదినాల సగటు: 47.71 నుంచి 45.80కి తగ్గింది ⇒ 100 రోజుల ఉద్యోగం పూర్తి చేసిన కుటుంబాలు: 1.35 లక్షల నుంచి 0.93 లక్షలకు తగ్గింది. (–31.1%) ⇒ ప్రభుత్వం ప్రకటించిన వేతనం: రూ.300, కానీ వాస్తవంగా అందినది రూ.213 మాత్రమే ⇒ వేతన లోటు: రూ.1,059 కోట్లు (40.6%) ⇒ కార్మికుల తొలగింపులు: గత మూడేళ్లలో 21 లక్షల మంది తొలగింపు ⇒ రాష్ట్రం నూతన జాబ్కార్డుల పునరుద్ధరణకు చర్యలు తీసుకోలేదు. -
రెండ్రోజుల్లో కేరళకు నైరుతి
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాల కదలిక అత్యంత చురుకుగా ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో చురుకుగా సాగుతున్న రుతుపవనాలు రానున్న రెండ్రోజుల్లో కేరళను తాకేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. మరోవైపు ఈ నెల 27న పశి్చమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఈ అల్పపీడనం క్రమంగా బలపడే అవకాశం ఉందని తెలిపింది. నైరుతి రుతుపవనాల సమయంలో బంగాళాఖాతంలో ఏర్ప డే అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలకు అవకాశం ఉంటుంది.గురువా రం తూర్పు మధ్య అరేబియా సముద్రం, దక్షిణ కొంకణ్–గోవా తీర ప్రాంతం సమీపంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం మరింత బలపడి శుక్రవారం ఉదయం 5.30 గంటలకు స్పష్టమైన అల్పపీడనంగా మారిందని, ఇది క్ర మంగా బలపడి శనివారం ఉదయానికల్లా వాయుగుండంగా మారే అవకా శం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న రెండ్రోజులు రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదు కావొచ్చని సూచించింది. ఈ మేరకు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు శుక్రవారం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి. ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే.. ఖమ్మంలో అత్యధికంగా 36.0 డిగ్రీ సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, కనిష్టంగా మెదక్లో 20.0 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండురోజులు కూడా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీ సెల్సియస్ వరకు తక్కువగా నమోదు కావొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. -
హెడ్ టు హెడ్లో విజేతలు వీరే
సాక్షి, హైదరాబాద్: మిస్ వరల్డ్ పోటీల్లో కీలకమైన హెడ్–టు–హెడ్ ఛాలెంజ్ ఫైనల్ హైదరాబాద్లోని ట్రైడెంట్ హోటల్లో పోటాపోటీగా జరిగింది. యూరప్, ఆఫ్రికా, ఆసియా అండ్ ఓషియానియా, అమెరికా అండ్ కరేబియన్ నుంచి ఐదుగురు చొప్పున మొత్తం ఇరవై మంది పోటీదారులు సామాజిక అంశాలపై తమ అభిప్రాయాలను, తాము చేస్తున్న కార్యక్రమాలను తమదైన శైలిలో జడ్జిలకు వివరించారు. జడ్జిలు తమకు వేసిన ప్రశ్నలకు వారు జవాబిచ్చారు. వాటి ఆధారంగా నాలుగు ఖండాల నుంచి నాలుగు దేశాలకు చెందిన సుందరీమణులను హెడ్–టు–హెడ్ విజేతలుగా ఎంపిక చేశారు. అమెరికా–కరేబియన్ నుంచి మిస్ ట్రినిడాడ్ హెడ్–టు–హెడ్ ఛాలెంజ్ ఫైనల్లో భాగంగా అమెరికా–కరేబియన్ ఖండంలోని బ్రెజిల్, సురినామ్, కేమెన్ ఐలాండ్స్, గయానా, ట్రినిడాడ్ అండ్ టొబాగో నుంచి వచ్చిన పోటీదారులకు ‘తెలంగాణలో మహిళా సాధికారత – భద్రత’ పై ప్రపంచానికి మీరు ఏ సందేశాన్ని ఇస్తారనే ప్రశ్న వేశారు. ఈ గ్రూపులో ఉత్తమ జవాబు ఇచ్చిన మిస్ ట్రినిడాడ్ అండ్ టొబాగో తుది రౌండ్కు ఎంపికయ్యింది. ప్రగతి, సాధికారత ఒకటే. భారత్ ముఖ్యంగా హైదరాబాద్ ఈ దిశగా చేయడుతున్న చర్యలు అభినందనీయం. సగం జనాభా వెనుకబడి ఉంటే విజయం సాధించలేమనే ఉద్దేశంతో మహిళలను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్న తెలంగాణ స్ఫూర్తిదాయకం..’ అంటూ సమాధానం ఇచ్చింది. ఆఫ్రికా నుంచి మిస్ జాంబియా ఆఫ్రికా ఖండానికి సంబంధించి దక్షిణాఫ్రికా, నమీబియా, సోమాలియా, ఉగాండా, జాంబియా పోటీదారులకు..‘సోషల్ మీడియా జీవితంలోని అనేక అంశాలను, ముఖ్యంగా యువతను ప్రభావితం చేస్తోంది. ఈ విషయంలో మీరు ఎలా ప్రామాణికంగా ఉంటారు’అనే ప్రశ్న వేశారు. ఈ గ్రూపు నుంచి తుది పోరుకు ఎంపికైన మిస్ జాంబియా మాట్లాడుతూ‘ప్రపంచం మారవచ్చు, కానీ మీరు మారాల్సిన అవసరం లేదు. మీరలాగే ఉండండి. ప్రపంచం దాన్ని స్వీకరించనివ్వండి. సమాజం పరిణామం చెందవచ్చు, కానీ మన నిజ స్వభావాన్ని కోల్పోకూడదు’ అని చెప్పారు. యూరప్ నుంచి మిస్ వేల్స్.. యూరప్ గ్రూప్లో స్పెయిన్, వేల్స్, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్ దేశాల సుందరీమణులు పాల్గొనగా..‘మీ దేశంలో యువ జీవితాలను మెరుగుపరచడానికి మీరు ఒక మార్పును అమలు చేయగలిగితే అది ఏమిటి? అదే ఎందుకు?’ అనే ప్రశ్న వేయగా.. ఈ బృందంలో ఎంపికైన మిస్ వేల్స్.. ‘ఆరోగ్య సంరక్షణ, విద్య ప్రధానం. మా కుటుంబంలో విశ్వవిద్యాలయానికి వెళ్లిన మొదటి వ్యక్తిని నేనే. ఉగాండా, భారతదేశంలో వైద్య సేవలు, ముఖ్యంగా యాసిడ్ దాడి బాధితుల కథలు, నా లక్ష్యానికి స్ఫూర్తినిచ్చాయి. విద్య అత్యంత శక్తివంతమైన సాధనం..’ అని చెప్పడం ద్వారా విజేతగా నిలిచారు. ఆసియా నుంచి మిస్ టర్కీ ఇక ఆసియా అండ్ ఓషియానియా నుంచి శ్రీలంక, థాయిలాండ్, టర్కీ, లెబనాన్, జపాన్ కంటెస్టెంట్లకు.. ‘బ్యూటీ విత్ ఎ పర్పస్’ ప్రాజెక్ట్తో పనిచేయడం మీ దృక్పథాన్ని ఎలా మార్చింది?’ అనే ప్రశ్న జడ్జిలు వేశారు. ఈ గ్రూపులో విజేత మిస్ టర్కీ.. ‘నేటి ప్రపంచంలో సాంస్కృతిక వారసత్వం అత్యంత ముఖ్యమైనది. కాన్సులేట్లు, రాయబార కార్యాలయాలు నిర్వహించే అంతర్జాతీయ ఈవెంట్ ద్వారా సంగీతం, కళలు, వంటకాలు, సంప్రదాయాలతో మనం సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడటమే కాకుండా, ఐక్యతను పెంపొందించుకోగలం. సాంస్కృతిక తేడాలు అడ్డంకులు కావు.. వంతెనలు..’ అని చెప్పారు.మీరు తెలంగాణను ప్రపంచానికి ఎలా పరిచయం చేస్తారు? తుది పోరుకు ఎంపికైన మిస్ టర్కీ, వేల్స్, జాంబియా, ట్రినిడాడ్ అండ్ టొబాగోలకు జడ్జిలు చివరగా ఒక ప్రశ్న వేశారు. ‘భారతదేశంలోని అతి చిన్న రా ష్ట్రమైన తెలంగాణను సంస్కృతి, వారసత్వం, ఆవిష్కరణల పరంగా ప్రపంచానికి ఎలా పరిచయం చేస్తారు?’ అని అడగ్గా.. నలుగురూ జవాబిచ్చారు. ఆవిష్కరణల కేంద్రం తెలంగాణ సాంకేతిక, వైద్య ఆవిష్కరణల కేంద్రం. ఇది ప్రగతిశీల, శక్తివంతమైన రాష్ట్రం, మహిళల హ క్కులు, భద్రత, విద్యకు ప్రాధాన్యత ఇస్తుంది. తెలంగాణ ప్రపంచానికి ‘సాధికారత, ఆవిష్కరణ, లింగ సమానత్వంతో శక్తివంతమైన సందేశాన్ని పంపుతుంది. – మిస్ టర్కీనా దేశాన్ని ఆహ్వానిస్తా తెలంగాణ గురించి చెప్పడమే కాదు.. ఈ రాష్ట్ర గొప్ప సంస్కృతిని ప్రత్యక్షంగా అనుభవించడానికి నా దేశాన్ని ఆహ్వానిస్తాను. – మిస్ వేల్స్ కళలు, సంస్కృతితో మమేకం తెలంగాణ ప్రజలు కళలు, సంస్కృతితో మమేకమైన వారు. నాకు వారి ప్రామాణికతను ప్రతిబింబించే అనేక బహుమతులు లభించాయి. మిస్ వరల్డ్ నినాదం ‘బ్యూటీ విత్ ఎ పర్ప స్’ కాగా.. తెలంగాణ ఆ స్ఫూర్తిని పూర్తి స్థాయిలో కలిగి ఉంది. – మిస్ జాంబియాదయ, సంస్కృతి నిండిన ప్రజలునా దేశం లార్డ్ అఫ్ ది సన్ దేశంగా ప్రసిద్ధి చెందింది. తెలంగాణ సన్ అఫ్ ది లార్డ్. ఇక్కడ ప్రజలు దయ, సంస్కృతితో నిండి ఉన్నారు. – మిస్ ట్రినిడాడ్ అండ్ టొబాగో -
సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ బ్యాగ్మ్యాన్
సాక్షి, హైదరాబాద్: నేషనల్ హెరాల్డ్ కేసులో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేరును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చార్జిషీట్లో చేర్చటంతో ఆయన అవినీతి బండారం బయట పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంలా మారిందని ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలు కూడా చెప్తున్నాయని అన్నారు. ఈడీ చార్జిషిట్లో పేరు రావడంతో ‘తెలంగాణ బ్యాగ్ మ్యాన్’రేవంత్రెడ్డి ప్రజల దృష్టి మళ్లించే డ్రామాలు మొదలు పెట్టారని శుక్రవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. తన అవినీతిపై చర్చ జరగకుండా చూసేందుకు రేవంత్ రోజుకో కొత్త నాటకం వేస్తున్నారని ఆరోపించారు.ఈడీ చార్జిషిట్లో రేవంత్ పేరు నమోదైనందున కేంద్రం ఆయనపై చర్యలు తీసుకుంటున్నదీ లేనిదీ చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో అమృత్ స్కామ్, ఆర్ఆర్ ట్యాక్స్ కుంభకోణం, పౌర సరఫరాల స్కామ్ వంటి వాటిని చూసీ చూడనట్లుగా వదిలేసిన రీతిలోనే కేంద్రం నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలోనూ వ్యవహరిస్తుందా? అని ప్రశ్నించారు. అధికారం కోసం వందల కోట్లు సీఎం పదవి చేపట్టకముందే అధికారం కోసం రేవంత్రెడ్డి.. కాంగ్రెస్ పెద్దలకు వందల కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చిన వ్యవహరం ఈడీ చార్జిషిట్లో బయటపడిందని కేటీఆర్ అన్నారు. యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇప్పిస్తానని రేవంత్రెడ్డి ప్రలోభపెట్టిన విషయం ఈడీ చార్జిషిటులో బయట పడిందని తెలిపారు. వందల కోట్లతో మొదలైన రేవంత్ అవినీతి బాగోతం ఏడాదిన్నరలోనే సీఎం పదవిని అడ్డుపెట్టుకుని వేల కోట్ల రూపాయలకు చేరిందని ఆరోపించారు. మంత్రి పొంగులేటి తరహాలోనే రేవంత్ చీకట్లో బీజేపీ పెద్దల కాళ్లు పట్టుకుంటారా? అని ప్రశ్నించారు.కేవలం చార్జిషిట్లో రేవంత్ పేరు నమోదుతో సరిపెట్టకుండా విచారణకు పిలిచి అవినీతిని కక్కించాలని డిమాండ్ చేశారు. అంతర్గత కుమ్ములాటలతో కాంగ్రెస్ కకావికలమైందని, తిరుగుబాట్లతో సీఎం కుర్చీ ఎప్పుడు దిగాల్సి వస్తుందో అనే భయం రేవంత్ను అడుగడుగునా వెంటాడుతోందని ఎద్దేవా చేశారు. కమిషన్లు లేనిదే ఫైలు కదలడం లేదని మంత్రి కొండా సురేఖ చెప్పారని, 30 శాతం పర్సంటేజీపై ఎమ్మెల్యే అనిరుద్రెడ్డి చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ నిజ స్వరూపం బయట పడిందని అన్నారు. ప్రజల ముందు సీఎం అవినీతి బాగోతం బట్టబయలు కావడంతో కుడితిలో పడిన ఎలుకలా కాంగ్రెస్ పార్టీ కొట్టుకుంటోందని విమర్శించారు. పచ్చని రాష్ట్రంలో చిచ్చుపెట్టి వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేస్తూ పేదల జీవితాలతో చెలగాటమాడుతున్న సీఎం పాపం పండిందని, ధర్మమే గెలుస్తుందని కేటీఆర్ అన్నారు. -
ముగ్గెట్టా పోసేది..?!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులు ఊపందుకోవడం లేదు. చేతిలో చిల్లి గవ్వ లేని నిరుపేద లబ్ధిదారులు ముగ్గు పోసుకునేందుకు ముందుకు రావడం లేదు. గృహ విస్తీర్ణాన్ని 600 చదరపు అడుగులకు పరిమితం చేయ డం కూడా ఈ పథకం ప్రగతికి ప్రతిబంధకమవు తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీటికి తోడు సిమెంట్, ఇటుక, స్టీలు వంటి వాటి ధరలు భారీగా పెరగడంతో లబ్ధిదారులు పనులు ప్రారంభించేందుకు వెనుకాముందు అవుతున్నారు.నిరు పేదల సొంతింటి కలను నిజం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్న విషయం విదితమే. తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా మండలానికి ఒక గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ఇళ్ల నిర్మాణానికి అనుమతి ప త్రాలు పొందిన 47,235 మంది లబ్ధిదారుల్లో ఇప్పటివరకు 38% మంది అంటే 17,982మంది మాత్రమే నిర్మాణ పనులు ప్రారంభించారు. కాగా కొందరు తమకు ఇళ్లు వద్దని చెబుతుండటం గమనార్హం. పెట్టుబడి కొరత..చిన్న ఇల్లు ఆలోచన లబ్ధిదారులు ఇంటి నిర్మాణం చేపట్టాలంటే కొంత మొత్తంలో అయినా డబ్బు అవసరం. బేస్మెంట్ వరకు కట్టాలంటే కనీసం రూ.1.50 లక్షలు ఖర్చవుతుంది. బేస్మెంట్ వరకు నిర్మాణం పూర్తయ్యాకే రూ.లక్ష బిల్లు వస్తుంది. నిరుపేదలకు రూ.1.50 లక్షలు పెట్టుబడి పెట్టి పనులు ప్రారంభించడం కష్టమవుతోంది. అప్పోసొప్పో చేసి నిర్మాణం ప్రారంభిద్దామనుకున్నా.. బిల్లులు వస్తాయో, రావోననే ఆందోళన చాలామందిలో ఉంది. ఇక ఆర్థికంగా కాస్త మెరుగ్గా ఉన్న లబ్ధిదారులు 600 చదరపు అడుగుల విస్తీర్ణంలోపు ఇంటి నిర్మాణానికి ఆసక్తి చూపడం లేదు.జీవితంలో ఒక్కసారే ఇల్లు కట్టుకుంటామని, చిన్న ఇల్లు కట్టుకుంటే ప్రయోజనం ఏంటనే అభిప్రాయంతో కొందరున్నారు. కనీసం 900 (100 గజాల్లోనైనా) చదరపు అడుగులైనా బాగుంటుందని, పిల్లలకు పెళ్లిళ్లు అయినా కొంత సౌకర్యంగా ఉంటుందనే భావనలో ఉన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 600 చదరపు అడుగులకు మించి ఇల్లు కట్టుకుంటే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారిగా పరిగణించరని అధికారులు చెబుతున్నారు.అలాంటి నిర్మాణాలకు బిల్లులు రాకపోతే తమది బాధ్యత కాదని తేల్చి చెబుతున్నారు. మరోవైపు ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు.. మంజూరు పత్రం తీసుకున్న 45 రోజుల్లోపు ఇంటికి అవసరమైన మెటీరియల్ (స్టీలు, సిమెంట్, ఇటుక, ఇసుక, కిటికీలు, తలుపులు) సమకూర్చుకోవాలి. ఈ నిబంధన కూడా ఒకింత ఇబ్బందికరంగా ఉందని అంటున్నారు. ఇక మార్క్ అవుట్ ఇచ్చాక 90 రోజుల్లో ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. పెరిగిన నిర్మాణ వ్యయమూ కారణమే.. ప్రస్తుత రోజుల్లో ఇంటి నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది. సిమెంట్ ధర ఇప్పుడు సంచి రూ.340కి చేరింది. ఒక్కో ఇటుక రూ.8 పలుకుతోంది. మేస్త్రీకి తక్కువలో తక్కువ రూ.లక్ష వరకు చెల్లించాలి. ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షలతో పోల్చుకుంటే నిర్మాణ వ్యయం భారీగా ఉంటోందని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇది కూడా ఈ గృహాల నిర్మాణం నత్తనడకన సాగడానికి కారణమనే అభిప్రాయం ఉంది. మంజూరు పత్రాలు వెనక్కి.. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం ముచ్చర్ల గ్రామాన్ని తొలి విడత పైలెట్ గ్రామంగా ఎంపిక చేశారు. మొత్తం 94 మంది లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేస్తే.. ఇందులో ఏకంగా 56 మంది తమకు గృహాలు వద్దంటూ మంజూరు పత్రాలు వెనక్కి ఇచ్చేశారు. నిర్మాణం ప్రారంభించేందుకు తమ వద్ద డబ్బులు లేని కారణంగానే మంజూరు పత్రాలను వెనక్కి ఇచ్చామని వారు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు పైలెట్ గ్రామాల్లో ఈ పరిస్థితి ఉన్నట్లు సమాచారం. అడ్వాన్సు కోసం ఐకేపీ రుణం.. ప్రస్తుత పరిస్థితుల్లో.. లబ్ధిదారులు ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించుకునేందుకు అవసరమైన ఖర్చుల కోసం ఐకేపీ రుణాలు మంజూరు చేయించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మహిళా సంఘాల సభ్యులకు రూ.లక్ష వరకు రుణం మంజూరు చేస్తున్నారు. దీనిద్వారా ఇంటి నిర్మాణం ప్రారంభించి పునాదుల వరకు పూర్తి చేసుకుంటే రూ.లక్ష బిల్లు వచ్చాక ఈ రుణం తీర్చేలా చర్యలు చేపట్టారు. అడ్వాన్సు ఇస్తే బాగుండేది ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారు. నిర్మాణం ప్రారంభించమని అధికారులు చెబుతున్నారు. కానీ ముగ్గు పోసేందుకు చేతిలో డబ్బులు లేవు. ముందుగాల ఏమైనా డబ్బులు అడ్వాన్సు రూపంలో ఇస్తే బాగుండేది. కానీ ముందుగాల పైసలు పెట్టుకుని కట్టుకుంటే.. బిల్లులు తరువాత ఇస్తారట. మాచేతిలో పైసలు లేక ఇల్లు వద్దని అధికారులకు రాసిచ్చాము. – కోల దేవవ్వ, సిరికొండ, రాజన్న సిరిసిల్ల జిల్లాడబ్బుల్లేక ముగ్గు పోయలేదు.. మాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రం ఇచ్చారు. కానీ ముగ్గు పోసుకుని పనులు షురూ చేద్దామంటే చేతిలో డబ్బులు లేవు. బేస్మెంట్ వరకు పూర్తయితేనే బిల్లు వస్తుందని అధికారులు చెబుతున్నారు. అడ్వాన్సుగా ఖర్చులు పెట్టుకునేందుకు డబ్బులు లేక ముగ్గు పోసుకోలేదు. – తూర్పాటి లక్ష్మీ, ముచ్చర్ల గ్రామం, సంగారెడ్డి జిల్లా. -
తెలంగాణ కులగణనను దేశవ్యాప్తం చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో సామాజిక న్యాయా న్ని సాధించే దిశగా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేను దేశ వ్యాప్తంగా ప్రచారం చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేతలు, పార్టీ అధికార ప్రతినిధులకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ సూచించారు. తెలంగాణ తరహా మోడల్ను అనుసరించేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. భారత్ జోడో పాదయాత్ర సందర్భంగా, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం జనగణన చేసి చూపించి దేశానికే మార్గదర్శిగా నిలిచిన అంశాన్ని ప్రజలకు వివరించాలని, ఈ విషయంలో కాంగ్రెస్కు ఉన్న నిబద్ధతను చాటి చెప్పాలని సూచించారు.దేశంలోని అణగారిన వర్గాలకు విద్య, ఉపాధి, రాజకీయ అంశాల్లో న్యాయం చేసేలా జనగణనలో భాగంగా కులగణను ఎప్పట్లోగా కేంద్రం పూర్తి చేస్తుందో చెప్పాలంటూ బలంగా డిమాండ్ చేయాలని అన్నారు. శుక్రవారం ఇందిరా భవన్లోని పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధులు, ముఖ్య నేతలతో కులగణన అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాహుల్గాంధీ పాల్గొనగా, ఖర్గే వర్చువల్గా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో కులగణన సర్వే నిర్వహించిన తీరు, ప్రశ్నాపత్రం, వివిధ వర్గాల భాగస్వామ్యం, అసెంబ్లీ తీర్మానం వంటి అంశాలను పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అత్యంత పారదర్శకంగా, పూర్తి నిబద్ధతతో పూర్తి చేయడమే కాకుండా విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో దీనిని అమలు పరిచేలా తీసుకుంటున్న చర్యలను సమావేశం దృష్టికి తెచ్చారు. సైద్ధాంతిక నిబద్ధతకు నిదర్శనం: ఖర్గే సమావేశంలో ప్రారంబోపన్యాసం చేసిన ఖర్గే.. తెలంగాణలో కులగణన చేపట్టడాన్ని మరోసారి అభినందించారు. ‘తెలంగాణలో జరిగిన కుల సర్వే సమాజం, నిపుణులు, ప్రభుత్వం అందరూ పాల్గొన్న ఒక నమూనాను ప్రదర్శించింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి ప్రజా, స్నేహపూర్వక, పారదర్శక నమూనాను అవలంబించాలని మేము కోరుకుంటున్నాం. ఈ ప్రక్రియలో సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం..’అని అన్నారు.కులగణన సామాజిక న్యాయం కోసం జరిగే పోరాటం మాత్రమే కాదని, రాజ్యాంగం ఆత్మను కాపాడుకునే పోరాటమని పేర్కొన్నారు. కులగణన అంశాన్ని కేవలం ఎన్నికల అంశంగా పరిగణించవద్దని, ఇది పార్టీ సైద్ధాంతిక నిబద్ధతకు నిదర్శనం అన్న విషయం గుర్తుంచుకోవాలని అన్నారు. పార్టీ అధికార ప్రతినిధులుగా కులగణన అంశాన్ని వాస్తవాలతో, సున్నితత్వంతో, భయం లేకుండా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఖర్గే సూచించారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో దళిత, ఓబీసీ, ఆదివాసీ విద్యార్థులకు రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగంలోని ఆరి్టకల్ 15(5)ని వెంటనే అమలు చేసేలా గొంతును పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజాస్వామ్యం నైతిక బాధ్యత: రాహుల్ పార్టీ మేనిఫెస్టోలో, పార్లమెంటులో, వీధుల్లో, సామాజిక న్యాయం గురించి చర్చించాల్సిన ప్రతి వేదికపై కాంగ్రెస్ దీనిని లేవనెత్తిందని రాహుల్గాంధీ గుర్తు చేశారు. తాము హామీ ఇచి్చనట్లుగా తెలంగాణలో అమలు చేసి చూపామన్నారు. కులగణన భారత ప్రజాస్వామ్యం నైతిక బాధ్యత అని పేర్కొన్నారు. కులగణనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచి్చన సందర్భంగా మహేశ్గౌడ్ మాట్లాడుతూ.. కులగణనతో రాష్ట్రంలో కులాల వారీగా లెక్కలు తేలాయని, వీటి ఆధారంగా ఎవరికి ఎంత రిజర్వేషన్లు దక్కాలో తెలిసిందని అన్నారు. రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానించి కేంద్రం ఆమోదానికి పంపామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు కృషి చేస్తున్నామన్నారు. -
తెలంగాణలో ‘తృణధాన్య పరిశోధన సంస్థ’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి కొత్తగా మూడు కేంద్ర సంస్థలు మంజూరయ్యాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి తెలిపారు. కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో పెద్ద సంఖ్యలో కేంద్ర సంస్థలు ఏర్పాటయ్యాయని చెప్పారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రూ.250 కోట్లతో ‘గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ మిల్లెట్స్’నుకేంద్ర వ్యవసాయ శాఖ హైదరాబాద్లో ఏర్పాటు చేయనుందని వెల్లడించారు. ఇప్పటికే ఐసీఏఆర్, ఐఐఎంఆర్ ఆధ్వర్యంలో మిల్లెట్స్పై పరిశోధనలు జరుగుతున్నాయని, వీటిని మరింత విస్తృతం చేసే దిశగా ఈ సంస్థ తోడ్పడుతుందని చెప్పారు. హైదరాబాద్లో ఏర్పాటు కానున్న ఈ కేంద్రంలో సెంట్రల్ ఇన్స్ట్రుమెంటేషన్ ల్యాబ్, ఇంటర్నేషనల్ హాస్టల్, మిల్లెట్స్ మ్యూజియం, రీసెర్చ్ ఫామ్లు, ట్రైనింగ్ రూమ్లు, ఇంటర్నేషనల్ గెస్ట్ హౌస్ ఉంటాయని వివరించారు. అలాగే జీనోమ్ ఎడిటింగ్ గ్రీన్ హౌజ్లు, స్పీడ్ బ్రీడింగ్ ల్యాబ్స్, ఫినోమిక్స్ ల్యాబ్స్ వంటి ఆధునిక పరిశోధనా వసతులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. వికసిత్ భారత్ కింద రూ.60 వేల కోట్లతో ఐటీఐల అప్గ్రేడేషన్ కోసం హైదరాబాద్తో పాటు భువనేశ్వర్, చెన్నై, కాన్పూర్, లుథియానాలో ‘ట్రైనింగ్ ఫర్ ట్రైనర్స్’సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు కిషన్రెడ్డి తెలిపారు. రైల్వే సెక్యూరిటీకి సంబంధించి ‘కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్‘సంస్థను రూ.300 కోట్లతో సికింద్రాబాద్లో ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచి్చందని చెప్పారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేయాలి.. కాళేశ్వరం అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తున్నట్టు కిషన్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బీటలు పడుతున్నాయని, బీఆర్ఎస్ పార్టీ మునిగిపోతున్న నావలా మారిందని అన్నారు. కుటుంబ పార్టీలు అత్యంత ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్లో డాడీ–డాటర్ లేఖ ఒక డ్రామా అని కొట్టిపారేశారు.రాష్ట్రంలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీజేపీయే అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ’ట్రిపుల్ ఆర్ ట్యాక్స్’ పేరిట భారీ వసూళ్లు జరుగుతున్నాయని ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసు దర్యాప్తు చట్టబద్ధంగా సాగుతుందని అన్నారు. రాష్ట్రంలో అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 53 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు ఒప్పందం కుదుర్చుకుందని, అంతకంటే ఎక్కువ సేకరించినా పూర్తి వ్యయాన్ని కేంద్రం భరిస్తుందని హామీ ఇచ్చారు. -
తప్పు చేయకుంటే భయమెందుకు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతలు వికృత, వికార చేష్టలకు పాల్పడుతున్నారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. తప్పు చేయకుంటే భయమెందుకని, కాళేశ్వరంపై విచారణ జరుపుతున్న పీసీ ఘోష్ కమిషన్ నోటీసులకు వణికి పోవలసిన అవసరం ఏముందని ప్రశ్నించారు. జ్యుడీíÙయల్ కమిషన్ను తప్పు పట్టడం సరికాదని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కమీషన్లకు కక్కుర్తిపడి ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు తరలించిందని, రీడిజైన్ చేసి మూడేళ్లలోనే ప్రాజెక్టు కూలిపోయేందుకు కారణమయ్యిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అదనంగా వెచి్చంచిన డబ్బులతో పాలమూరు– రంగారెడ్డి, బీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్సాగర్, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేవని అన్నారు. శుక్రవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జేబులు నింపుకోవడానికే కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు రైతులకు నీళ్లు ఇవ్వడానికి కాదు జేబులు నింపుకోవడానికేనని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. రూ.38 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును రూ.84 వేల కోట్లకు అంచనాలు పెంచి , ఆ తర్వాత రూ.లక్షా ఇరవై వేల కోట్లకు తీసుకెళ్లారని ధ్వజమెత్తారు. ఇంతా చేస్తే ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చిన కొత్త ఆయకట్టు నామమాత్రమేనని విమర్శించారు.బీఆర్ఎస్ నేతల అవినీతి, అసమర్ధత, కమీషన్ల కక్కుర్తి కారణంగానే ప్రాజెక్టు కూలిపోయిందని ఆరోపించారు. లోపభూయిష్టంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లు ఇప్పుడు ఎందుకూ పనికి రావని ఎన్డీఎస్ఏ, కాగ్, విజిలెన్స్ చెప్పడంతోనే జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలో కమిషన్ వేసినట్లు తెలిపారు. ఈ కమిషన్ ముందు హాజరు కావాలని అప్పటి సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, ఈటల రాజేందర్లకు నోటీసులు పంపితేనే బెంబేలెత్తి పోయి, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలోనే ఎఫ్ఐఆర్ మేడిగడ్డపై బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, అక్కడ బాంబులు ఉన్నాయో లేదో అప్పుడే ఎందుకు తేల్చలేదని మంత్రి ప్రశ్నించారు. మేడిగడ్డలో బాంబులు అని తప్పుడు వ్యాఖ్యలకు, ఎన్డీఎస్ఏపై విమర్శలు చేసినందుకు చట్టప్రకారం చర్యలు ఉంటాయని అన్నారు. 2019లో ప్రాజెక్టును ప్రారంభించిన మరుసటి వారం నుంచే లోపాలు బయటపడుతున్నా, కప్పిపుచ్చి ప్రజలకు అబద్ధాలు చెప్పారని, ఆ బరాజ్ నిండా నీళ్లు నింపడంతో పరిస్థితి మరీ అధ్వాన్నమైందని అన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ చెప్పినట్టు ఈ ప్రాజెక్టులో నీళ్లు నింపితే భద్రాచలం, 43 గ్రామాలు, సమ్మక్క–సారక్కల ప్రదేశం కొట్టుకుపోతాయని, దానికి ఎవరు బాధ్యులని ఉత్తమ్ ప్రశ్నించారు. ఎన్డీఎస్ఏ రిపోర్టును అధ్యయనం చేసి నివేదిక ఇచ్చే బాధ్యతను ఒక సంస్థకు అప్పగించామని చెప్పారు. ఈ సమావేశంలో మంత్రి సీతక్క, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ పాల్గొన్నారు. -
కేసీఆర్ దేవుడు.. ఆయన చుట్టూ దెయ్యాలు
సాక్షి, హైదరాబాద్/ శంషాబాద్: ‘కేసీఆర్ దేవుడు.. ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయి. వారివల్ల పార్టీకి నష్టం జరుగుతోంది. నేను రెండు వారాల క్రితం మా పార్టీ నాయకుడికి లేఖ రాసిన మాట వాస్తవం. ఆ లేఖ బయటకు లీక్ కావడం బాధాకరం. కేసీఆర్ కుమార్తె రాసిన లేఖనే లీకైతే ఇక పార్టీలోని సామాన్యుల పరిస్థితేంటి? దీనిపై చర్చ జరగాలి’అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ఆ పార్టీ అధినేత కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆమె కేసీఆర్కు రాసిన లేఖ రెండురోజుల క్రితం బహిర్గతం కావడం రాష్ట్రంలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ లేఖపై బీఆర్ఎస్ పార్టీ అగ్ర నాయకులు మౌనంగా ఉన్నా.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. లేఖ లీకవక ముందు కవిత తన కుమారుడి గ్రాడ్యుయేషన్ ఉత్సవం కోసం అమెరికా వెళ్లారు. శుక్రవారం రాత్రి తిరిగి వచ్చిన ఆమె.. శంషాబా ద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. పార్టీలో కింది నుంచి పైస్థాయి నాయకుల వరకు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలనే తాను రాసిన లేఖలో ప్రస్తావించినట్లు స్పష్టం చేశారు. కుట్రలు, కుతంత్రాలు పార్టీలో కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయని ఈ మధ్య తాను చెప్పిన విషయం లేఖ బహిర్గతం ద్వారా మరోసారి స్పష్టమైందని కవిత అన్నారు. గతంలో కూడా లేఖ ద్వారా తన అభిప్రాయాలను కేసీఆర్కు చెప్పినట్లు వెల్లడించారు. ‘నేను నా కుమారుడి గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి వెళ్లిన తరువాతే నా లేఖ లీకైనట్లు హంగామా జరిగింది. పార్టీలో ఏం జరుగుతుందో ఇప్పుడు అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీలో అన్ని స్థాయిల్లో ఉన్నవారు అనుకుంటున్న విషయాలు, దాదాపు సగం తెలంగాణ ప్రజలు అనుకుంటున్న విషయాలే లేఖలో చెప్పాను.ఇందులో నాకు వ్యక్తిగత ఎజెండా ఏమీలేదు. వ్యక్తిగతంగా నాకు ఎవరిపై ద్వేషం లేదు, ఎవరిపై ప్రేమ లేదు. మా పార్టీ అధినేతకు రాసిన లేఖ బహిర్గతమైందంటే, దాని వెనుక ఎవరున్నారో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ దేవుడు.. కానీ ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయి. వారి వల్లే నష్టం జరుగుతోంది. లేఖ బహిర్గతం కావడంతో కాంగ్రెస్, బీజేపీలు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు సంబరపడుతున్నాయి.బీఆర్ఎస్ పార్టీ ఆగమైనట్లు ఆ పార్టీల నాయకులు మాట్లాడుతున్నారు. మా నాయకుడు కేసీఆరే.. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ బాగుపడుతుంది. పార్టీ కూడా ముందుకెళ్తుంది. పార్టీలో చిన్నచిన్న లోపాలపై చర్చించుకొని సవరించుకొని కోవర్టులను పక్కకు జరుపుకొని ముందుకెళ్తే పార్టీ పది కాలాల పాటు చల్లగా ఉంటుంది. కాంగ్రెస్, బీజేపీలు విఫలమయ్యాయి. వారు రాష్ట్రానికి చేసిందేమీ లేదు. వాటికి కేసీఆర్ నాయకత్వమే ప్రత్యామ్నాయం’అని కవిత స్పష్టంచేశారు. కనిపించని గులాబీ జెండాలు శంషాబాద్ విమానాశ్రయంలో కవితకు స్వాగతం పలకడానికి బీఆర్ఎస్ శ్రేణులు, నేతలు ఎవరూ రాలేదు. కవితక్క జిందాబాద్.. సామాజిక తెలంగాణ కోసం పోరాడిన కవితక్క అన్న ప్లకార్డులను ప్రదర్శిస్తూ బీసీ సంఘాల నాయకులు ఆమెకు స్వాగతం పలికారు. కవిత టీం పేరుతో వచ్చినవారు ప్రదర్శించిన ప్లకార్డులలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫొటోలు కానీ, కేటీఆర్ లేదా హరీశ్రావు ఫొటోలు కానీ కనిపించకపోవడం గమనార్హం. జాగృతి ఆధ్వర్యంలో వచ్చిన కొందరు మాత్రం కవితతోపాటు కేసీఆర్ ఫొటోలు ఉన్న ప్లకార్డులు పట్టుకొని కవిత జిందాబాద్.. కేసీఆర్ జిందాబాద్ అని నినాదాలు చేశారు. అయితే, ఏ ఒక్కరూ బీఆర్ఎస్ కండువాలు ధరించకపోవటం గమనార్హం. కొందరు అభిమానులు కవితను చూసి సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేశారు. -
యాభై సార్లయినా మోదీని కలుస్తా
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు..ఎన్నికలయ్యాక అభివృద్ధి చేయడమే లక్ష్యం.. కేంద్రం సహకారాన్ని తీసుకుంటాం.. ఎవరు ఏమనుకున్నా సరే.. మోదీని ఒక్కసారి కాదు 50 సార్లు అయినా కలుస్తాం..రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెచ్చుకుంటాం..కావాల్సిన అనుమతులు తీసుకుంటాం.. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకున్నప్పుడే, కలిసి మెలసి పనిచేసినప్పుడే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుంది.చెరువు మీద అలిగి కడుక్కోకుంటే ఎలా?..దిగిపోయిన ఆయన (కేసీఆర్) చెరువు మీద అలిగి ఫామ్ హౌస్లో పడుకుంటే ఏమైంది?.. ప్రజలు ఇంటికి పంపే పరిస్థితి వచ్చింది.. నేను అలాంటి తప్పులు చేయను.. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు..’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో రూ.494 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులన ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జహీరా బాద్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మారుస్తాం ‘రాష్ట్ర ప్రజలు మాపై విశ్వాసంతో ఓట్లేసి గెలిపించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు అమలు చేస్తూ పారదర్శక పాలన అందించడం ద్వారా వారి విశ్వాసాన్ని కాపాడుకుంటాం. ఐటీ, ఫార్మా, ఇతర పరిశ్రమలు రావ డం ద్వారా ఆదాయం పెరుగుతుంది. ఈ ఆదాయాన్ని పేదలకు పంచాలనే లక్ష్యంతో మేం పని చేస్తున్నాం. ప్రజలు మాకు అండగా నిలిస్తే తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చి దిద్దుతాం. ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మారుస్తాం. హైదరాబాద్ నగరాన్ని న్యూయార్క్, టోక్యో వంటి నగరాలతో పోటీ పడే విధంగా అబివృద్ధి చేస్తాం. ఫ్యూచర్ సిటీ, ఆర్ఆర్ఆర్, మెట్రో, ఫార్మాసిటీ అన్నిటినీ అభివృద్ధి చేసి ప్రజలకు అంకితం ఇచ్చే వరకు నిద్రపోను..’ అని రేవంత్ అన్నారు. అదానీ, అంబానీలతో పోటీ పడేలా ఆడబిడ్డలకు అవకాశాలు ‘రాష్ట్రంలో మహిళలకు ఉచితబస్సు పథకం కోసం ఇప్పటికే రూ.5,500 కోట్లు ఖర్చు చేశాం. మహిళా సంఘాల ద్వారా 600 బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చాం. వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి విద్యుత్ శాఖతో ఒప్పందాల ద్వారా తెలంగాణ మహిళలు అదానీ, అంబానీలతో పోటీ పడే స్థాయిలో అవకాశాలు కల్పిస్తున్నాం. అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణను మహిళలకే అప్పగించాం. మహిళా సంఘాలకు పెట్రోల్ బంక్లు ఇచ్చాం. ఇందిరమ్మను ఆదర్శంగా తీసుకుని.. సోనియాగాంధీ నాయకత్వంలో ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో రూ.21 వేల కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు ఇచ్చి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం..’ అని సీఎం చెప్పారు. యువత నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాం.. ‘తెలంగాణ ఉద్యమంలో ముందున్న లక్షలాది మంది యువతకు గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలు రాలేదు. కేసీఆర్ పదేళ్ల పాలనలో ఆయన కుటుంబంలో నలుగురికి మాత్రం ఉద్యోగాలు వచ్చాయి. నేను సీఎంగా బాధ్యతలు తీసుకున్నాక 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. ప్రైవేటు రంగంలో లక్ష ఉద్యోగాలు ఇచ్చి యువతలో మాపై ఉన్న విశ్వాసాన్ని, నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ 15 నెలల్లోనే రూ.3 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు రాష్ట్రానికి తెచ్చి పారిశ్రామికంగా అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం.వీటన్నింటికీ ప్రజల ఆశీర్వాదం ఉండాలి. ప్రజలు ఆశ్విర్వదిస్తేనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం సాధ్యమవుతుంది. ప్రజల ఆశీర్వాదంతోనే రాష్ట్రంలో 25.55 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ.20,617 కోట్ల రుణమాఫీ చేశాం. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. రైతుబరోసా ఆర్థిక సాయాన్ని రూ.12 వేలకు పెంచాం. భూమిలేని నిరుపేదలకు రూ.12 వేల ఆర్థిక సాయం అందిస్తున్నాం. సన్న ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తున్నాం..’ అని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రావాలి ‘రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రతిపక్షాల సహకారం కూడా కావాలి. ప్రతిపక్ష నాయకుడికి విజ్ఞప్తి చేస్తున్నా.. రండి.. అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి.. 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో సూచనలు ఇవ్వండి.. ఎక్కడైనా తప్పులు చేస్తే సరిదిద్దుకుంటాం..అలా కాకుండా అధికారంలో ఉంటేనే అసెంబ్లీకి వస్తా.. లేకపోతే ఫాంహౌస్లో పడుకుంటానంటే ప్రజలే విచక్షణతో నిర్ణయం తీసుకుంటారు. నేను 20 ఏళ్లు ప్రజల గొంతుకై నిలిచా నేను ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, జెడ్పీటీసీగా, ఎంపీగా.. ఇలా 20 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరోజూ సెలవు తీసుకోలేదు. ప్రజల సమస్యలకు గొంతుకనై పనిచేశా. నేను 20 ఏళ్లుగా ప్రజల పక్షాన పనిచేశాను కాబట్టే ప్రజలు నాకు సీఎంగా అవకాశం కల్పించారు. నా వద్దకు చిన్నోడు వచి్చనా.. పెద్దోడు వచి్చనా.. ఉన్నోడు వచి్చనా.. పేదోడు వచ్చినా.. అందరినీ కలిసి.. చేతనైన సాయం చేస్తున్నా..’ అని రేవంత్ చెప్పారు. సభలో మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, ఎంపీ సురేష్ షెట్కార్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. -
చీటింగ్ కేసులో శ్రవణ్రావు విచారణ
సాక్షి, హైదరాబాద్: ఓ చీటింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మీడియా సంస్థ యజమాని ఎ.శ్రవణ్ కుమార్ రావును సీసీఎస్ పోలీసులు శుక్రవారం తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఇనుప ఖనిజం వ్యాపారం డీల్ ఇప్పిస్తానంటూ శ్రవణ్రావు మోసం చేశాడని అఖండ ఇన్ఫ్రాటెక్ ఇండియా సంస్థ ఎండీ ఎ.ఆకర్‡్ష కృష్ణ ఫిర్యాదు చేయటంతో ఈ కేసు నమోదైంది. ఈ నెల 13న శ్రవణ్ను పోలీసులు అరెస్టు చేశారు. ఒక రోజు కస్టడీ విచారణకు కోర్టు అనుమతించడంతో శుక్రవారం విచారించారు. ఏ ప్రశ్నకు అతడి నుంచి సరైన సమాధానం రాలేదని, ప్రతి ఆరోపణను ఖండించాడని అధికారులు తెలిపారు. రూ.6.5 కోట్ల మోసం: శ్రవణ్రావు రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా సాగిన అక్రమ ఫోన్ట్యాపింగ్ కేసులో ఆరో నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఇన్రిధమ్ ఎనర్జీ సంస్థ డైరెక్టర్గా ఉన్న శ్రవణ్రావు 2022 జూన్లో ఆకర్్షను సంప్రదించాడు. కర్ణాటకలోని సాండూర్లో ఉన్న ఎకోర్ ఇండస్ట్రీస్ బాధ్యతల్ని తాను స్వీకరించినట్లు చెప్పాడు. ఇనుప ఖనిజం వ్యాపారంలో ఉన్న తమకు నిధులు సమకూరిస్తే ప్రతి టన్నుకు రూ.300 చొప్పున లాభం ఇస్తానని నమ్మబలికాడు. దీంతో అఖండ సంస్థ 2022 నవంబర్ నుంచి 2023 డిసెంబర్ వరకు పలు దఫాలుగా ఎకోర్ సంస్థ ఖాతాల్లోకి రూ.6.5 కోట్లు బదిలీ చేసింది.ఈ చెల్లింపులకు సంబంధించి ఎకోర్ సంస్థ నుంచి తమకు ఎలాంటి ఇన్వాయిస్లు అందలేదని ఆకర్‡్ష తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 2023 నాటికి సంబంధిత వ్యక్తులకు రూ.7 కోట్ల విలువైన ఇనుప ఖనిజం సరఫరా జరగాల్సి ఉండగా.. అది రాకపోవటంతో ఆకర్‡్షకు అనుమానం వచ్చి ఆరా తీశారు. తమ సంస్థ బదిలీ చేసిన నిధుల్ని శ్రవణ్రావు వేరే అవసరాలకు మళ్లించినట్లు గుర్తించారు. దీనిపై ఎన్నిసార్లు ప్రశ్నించినా శ్రవణ్రావు నుంచి సరైన సమాధానం రాలేకపోవటంతో సీసీఎస్లో ఫిర్యాదు చేశారు. శ్రవణ్రావును దాదాపు మూడు గంటల పాటు ప్రశ్నించిన అనంతరం తిరిగి జైలుకు తరలించారు. ఈ కేసులో శ్రవణ్రావుతో పాటు ఆయన భార్య ఎ.స్వాతిరావు, వ్యాపార భాగస్వామి కేబీ వేదమూర్తి, ఎకోర్ ఇండస్ట్రీస్ హోల్టైమ్ డైరెక్టర్ ఉమా మహేశ్వర్రెడ్డి నిందితులుగా ఉన్నారు. -
కేసీఆర్ చుట్టూ కొన్ని దెయ్యాలున్నాయి: కవిత
సాక్షి, హైదరాబాద్: తన తండ్రి కేసీఆర్కు రాసిన లేఖపై ఎమ్మెల్సీ కవిత క్లారిటీ ఇచ్చారు. అమెరికా నుంచి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న కవిత మీడియాతో మాట్లాడారు. ‘‘ కేసీఆర్ దేవుడు.. ఆయన చుట్టూ కొన్ని దెయ్యాలున్నాయి. రెండు వారాల కిందట కేసీఆర్కు లేఖ రాశా. కేసీఆర్కు లేఖ రాసిన మాట వాస్తవమే. లేఖ రాయడంలో పర్సనల్ ఏజెండా ఏమీ లేదు. పార్టీ నేతలు అనుకున్నదే నేను లేఖలో రాశా. అంతర్గతంగా రాసిన లేఖ బయటకు రావడం కుట్ర. లేఖ లీక్ చేసింది పార్టీలోని కోవర్టులే. మా నాయకుడు కేసీఆర్.. ఎలాంటి ఆలోచన లేదు. ఆయన నాయకత్వంలో పనిచేస్తా. నా లేఖ లీక్తో కాంగ్రెస్, బీజేపీలు సంబరపడిపోతున్నాయి. గతంలోనూ కేసీఆర్కు లేఖలు రాశా. తాజాగా రాసిన లేఖను లీక్ చేసింది ఎవరో తెలియాలి’’ అంటూ కవిత వ్యాఖ్యానించారు.కాగా, కేసీఆర్కు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖతో తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. అమెరికా నుంచి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న కవితకు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు రాలేదు. కవితకు స్వాగతం పలికేందుకు ఆమె మద్దతు దారులు శంషాబాద్ ఎయిర్పోర్టుకు తరలివచ్చారు. సామాజిక తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్న ఎమ్మెల్సీ కవితకు స్వాగతం, సుస్వాగతం అంటూ ప్లకార్డులు, బ్యానర్లను ప్రదర్శించారు. వాటిల్లో ఎక్కడా పార్టీ పేరు, ముఖ్య నేతల ఫొటోలు కనిపించలేదు. టీమ్ కవితక్కా అంటూ ప్లకార్డులు దర్శనమిచ్చాయి. -
హైదరాబాద్లో కోవిడ్ కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: నగరంలో కోవిడ్ కేసు నమోదైంది. కూకట్పల్లిలో డాక్టర్కు కరోనా పాజిటివ్గా తేలింది. వైద్యుడు నాలుగు రోజులుగా జలుబు, దగ్గు, జ్వరంతో బాధ పడుతున్నారు. తలనొప్పి, ఒళ్లు నొప్పులు, రుచి, వాసన లేకపోవడం వంటి లక్షణాలు ఉండటంతో.. అన్నిరకాల పరీక్షలు చేయించగా.. కరోనా పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. మరోవైపు, ఢిల్లీలో కోవిడ్ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటివరకు 23 కేసులు నమోదయ్యాయి.కాగా, కోవిడ్ మొదటి వేవ్ 2020 ఏప్రిల్ నుండి 2021 మార్చి వరకు కొనసాగింది. యంత్రాంగం ఎంత కష్టపడినా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడలేదు. లాక్డౌన్ సడలింపు వేళలో ప్రజలు నిత్యవసరాల కోసం రావడం, ఇతర ప్రాంతాలకు వెళ్తుండడం.. ఆ సమయాన జాగ్రత్తలు పాటించకపోవడంతో కేసులు గణనీయంగా పెరిగాయి. మొదటి వేవ్లో కరోనా వ్యాక్సిన్ రావడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. తొలుత ఫ్రంట్లైన్ వారియర్స్కు వ్యాక్సిన్ అందించిన ప్రభుత్వం.. ఆతర్వాత అందరికీ ఇవ్వడానికి రెండేళ్లు పట్టింది.కోవిడ్ రెండో వేవ్ 2021 ఏప్రిల్లో ప్రారంభం కాగా డిసెంబర్ వరకు కొనసాగింది. ఈ వేవ్లో తెలంగాణ వ్యాప్తంగా పరిశీలిస్తే ఖమ్మం జిల్లానే ఎక్కువ తల్లడిల్లింది. కోవిడ్ సోకిన రెండు, మూడు రోజులకే కొందరు మృతి చెందడమే కాక వృద్ధుల మరణాలు గణనీయంగా నమోదయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో పడకలు సరిపోక చికిత్స అందకపోవడంతో గంటల్లోనే ప్రాణాలు వదలడం సాధారణంగా మారింది. దీనికి తోడు చాలాచోట్ల ఆక్సిజన్ కొరత ఏర్పడింది. -
జహీరాబాద్: బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్
సాక్షి, సంగారెడ్డి: జహీరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. శుక్రవారం జహీరాబాద్లో పర్యటించిన సీఎం.. హుగ్గెల్లి జంక్షన్లో బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించారు. మాచునూరులో కేంద్రీయ విద్యాలయం భవనాన్ని కూడా ప్రారంభించారు. అనంతరం పస్తాపూర్ చేరుకున్న సీఎం.. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రాంగణంలో రూ.494.67 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 2014 తర్వాత నిమ్జ్ అభివృద్ధి కుంటుపడిందని.. భూసేకరణలో అన్యాయం జరిగిందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక నిమ్జ్కు భూములిచ్చిన రైతులకు నష్టపరిహారం పెంచామని చెప్పారు. నిమ్జ్ కోసం భూములిచ్చిన వారికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామన్నారు. త్వరలోనే 5,612 కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేస్తామని సీఎం రేవంత్ తెలిపారు.నేషనల్ హైవేపై అండర్ పాస్ నిర్మాణాలు చేస్తాం. సింగూరు ప్రాజెక్టును అద్భుతమైన టూరిజంగా తీర్చిదిద్దుతాం. హుండాయ్ కార్ల పరిశ్రమ ఏర్పాటు కాబోతుందని రేవంత్ అన్నారు. జహీరాబాద్ అభివృద్ధి సమీక్ష చేసి నిధులు మంజూరు చేస్తామని.. నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఏకో టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రేవంత్ చెప్పారు. -
‘ఓటీటీ ఫ్యామిలీ డ్రామాలా కవిత లేఖ’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha Letter) రాసిన లేఖ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ను కార్నర్ చేసి.. బీజేపీ, కాంగ్రెస్లు పోటాపోటీగా విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో అంశంపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కవిత లేఖ ‘కాంగ్రెస్ వదిలిన బాణం‘ అనే OTT ఫ్యామిలీ డ్రామా. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ విఫలం. కుటుంబ పార్టీ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకం. కుటుంబ పార్టీ వాటి సొంత సంక్షోభాన్ని ప్రజల ఎమోషన్లుగా మార్చాలని చూస్తోంది. కానీ, తెలంగాణ ప్రజలు ఈ లేఖ డ్రామాని పట్టించుకోవడం లేదు. బీజేపీ(BJP) ఎవరినీ జైలుకు పంపదు. చట్టం ఆ పని చేస్తుంది. తప్పు చేసినవారు చట్టం నుంచి తప్పించుకోలేరు. తెలంగాణలో ప్రతీ సర్వే బీజేపీ గ్రాఫ్ పెరుగుతోందని చెబుతోంది. అధికారం.. ఆర్భాటాలు లేకున్నా బీజేపీని ప్రజలు నమ్ముతున్నారు. వాళ్లు కోరుకునేది అభివృద్ధి.. నిజమైన మార్పు. అంతేగానీ పొలిటికల్ ఫ్యామిలీ డ్రామాలు కాదు. నిజమైన మార్పు బీజేపీ తోనే సాధ్యమని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు’’ అని ట్వీట్ చేశారాయన. ఇదీ చదవండి: కవిత లేఖపై తర్వాత స్పందిస్తాం- హరీష్ రావు -
జూబ్లీహిల్స్లో హైడ్రా కూల్చివేతలు..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా జూబ్లీహిల్స్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. నాలాను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను అధికారులు నేల మట్టం చేశారు.వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్లోని పెద్దమ్మ గుడి పక్కన నాలాపైన ఆక్రమణలను హైడ్రా అధికారులు గుర్తించారు. నాలాను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్టు హైడ్రా అధికారులు తెలిపారు. దీంతో, రంగంలోకి దిగిన హైడ్రా.. నాలాపై నిర్మించిన నిర్మాణాలను, షెడ్లను కూల్చివేసింది. 500 గజాలకు పైగా స్థలంలో నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. -
‘కవిత లేఖ ఓ డ్రామా.. ఇది ఆ ఇద్దరి పనే!’
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్-బీజేపీలు కలిసి పోటీ చేస్తాయనే ఊహాగానాలు తెలంగాణ రాజకీయాలను కాస్త హీటెక్కించాయి. అయితే అది ఎట్టి పరిస్థితుల్లో జరగబోదని ఇరు పార్టీలు తేల్చేశాయి. ఈలోపు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు ఆయన కుమార్తె, ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ కలకలం రేపింది. అయితే ఈ లేఖపై కవిత లేఖ(Kavitha Letter)పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ కుటుంబం మరో డ్రామాకు తెరలేపిందన్నారు. ‘‘కవిత లేఖ ఉత్తదే. కేసీఆర్కు సలహా ఇచ్చే స్థాయిలో కవిత ఉందా?. బీజేపీ పై ఎంతసేపు మాట్లాడాలో కవిత డిసైడ్ చేస్తదా?. కేటీఆర్ హరీష్ రావులే ఈ లేఖ తయారు చేయించారు. కవిత పేరుతో బయటకు వదిలారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలసి పోటీ చేయడం ఖాయం. ఈ లేఖతోనే బీజేపీ, బీఆర్ఎస్ బంధం బయటపడింది. వరంగల్ సభతో బీఆర్ఎస్ పని అయిపోయిందని తేలిపోయింది. అందుకే ఈ డ్రామాలు’’ అని అన్నారాయన. మరోవైపు.. కేసీఆర్ కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ కీలక నేతలు స్పందించేందుకు నిరాకరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కవిత లేఖపై స్పందించాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), సీనియర్ నేత హరీష్రావును మీడియా కోరగా.. ఇద్దరూ స్పందించలేదు. ఓ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ మైక్ను పక్కకు తోసేయగా.. హరీష్రావు(Harish Rao) మాత్రం కవిత లేఖపై త్వరలో స్పందిస్తామంటూ హడావిడిగా కారెక్కి వెళ్లిపోయారు. కిందటి నెల 27న వరంగల్ ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ ధూం ధాం సభ సక్సెస్ అయ్యిదంటూనే.. అది పార్టీ కార్యకర్తలను ఆకట్టుకోలేకపోయిందంటూ కొన్ని ప్రతికూల పాయింట్లను ఆమె లేఖలో ప్రస్తావించినట్లు నోట్ ఒకటి తెర మీదకు వచ్చింది. పైగా బీజేపీ గురించి తక్కువ మాట్లాడేసరికి ఆ పార్టీతో పొత్తు ఉండబోతుందనే ప్రచారం బలంగా సాగుతోందంటూ అందులో వివరణాత్మకంగా రాసి ఉంది. ‘‘బీజేపీపై మీరు రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడటంతో భవిష్యత్తులో బీజేపీతో పొత్తు(BRS-BJP Alliance) పెట్టుకుంటారనే ఊహాగానాలకు తావు ఇచ్చినట్లు అయింది. బీజేపీతో ఇబ్బంది పడిన నేను కూడా ఇదే అంశాన్ని కోరుకున్నా. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్పై నమ్మకం కోల్పోయిన వారు బీజేపీ మనకు ప్రత్యామ్నాయమవుతుందని అనుకుంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకపోవడంతో బీజేపీకి మనం సాయం చేశామనే కోణాన్ని కాంగ్రెస్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది’’ అయితే ఆ నోట్ ఆమె రాసిందేనా? అనేదానిపై విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చాకే ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కవిత లేఖపై అనుమానాలు: డీకే అరుణకేసీఆర్కు కవిత లేఖ లేఖ రాయాల్సిన అవసరం ఏముందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ ప్రశ్నిస్తున్నారు. అసలు ఆ లేఖ బయటకు ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారామె. ఇదీ చదవండి: మై డియర్ డాడీ.. -
ఈడీ కేసులో రేవంత్.. పొంగులేటి రూటేనా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: వందల కోట్లతో మొదలైన రేవంత్ అవినీతి బాగోతం గత ఏడాదిన్నరలో సీఎం పదవిని అడ్డం పెట్టుకుని ఏకంగా వేల కోట్లకు చేరిందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నాలుగు కోట్ల ప్రజల ముందు ముఖ్యమంత్రి అవినీతి బాగోతం బట్టబయలు కావడంతో కుడితిలో పడిన ఎలుకలా కాంగ్రెస్ పార్టీ కొట్టుకుంటోంది అని ఎద్దేవా చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు పెట్టడంతో.. సీఎం అవినీతి బండారం మొత్తం బయటపడింది. యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇప్పిస్తానని రేవంత్ రెడ్డి ప్రలోభ పెట్టాడని ఈడీ నమోదు చేసిన చార్జిషీట్ తో సీఎం అవినీతి సామ్రాజ్యం బట్టబయలైంది. అధికారం కోసం ముఖ్యమంత్రి కాకముందే కాంగ్రెస్ పార్టీ పెద్దలకు వందల కోట్లు కట్టబెట్టిన వ్యవహారం కుండబద్దలు కొట్టినట్టయింది.వందల కోట్లతో మొదలైన రేవంత్ అవినీతి బాగోతం గత ఏడాదిన్నరలో సీఎం పదవిని అడ్డం పెట్టుకుని ఏకంగా వేల కోట్లకు చేరింది. దివ్యమైన తెలంగాణని దివాళా తీసి వేల కోట్లు కొల్లగొట్టడం వల్లే ఈడీ కేసులో రేవంత్ రెడ్డి అడ్డంగా ఇరుక్కుపోయారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి – పొంగులేటి తరహాలో చీకట్లో బీజేపీ పెద్దల కాళ్లు పట్టుకుంటాడా ?. ఈడీ, కేవలం చార్జిషీటులో పేరు పెట్టడం వరకే పరిమితం అవుతుందా?. లేక రేవంత్ రెడ్డిని విచారణను పిలిచి మొత్తం అవినీతి కుంభకోణాలను కక్కిస్తుందా?.నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు పెట్టడంతో.. సీఎం అవినీతి బండారం మొత్తం బయటపడింది. యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇప్పిస్తానని రేవంత్ రెడ్డి ప్రలోభ పెట్టాడని ఈడీ నమోదు చేసిన చార్జిషీట్ తో సీఎం అవినీతి సామ్రాజ్యం బట్టబయలైంది. అధికారం కోసం ముఖ్యమంత్రి… pic.twitter.com/fsb8uT8Sc9— KTR (@KTRBRS) May 23, 2025రాష్ట్ర కాంగ్రెస్లో రోజురోజుకూ పేట్రేగిపోతున్న అంతర్గత కుమ్ములాటలతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కకావికలమైంది. పెరిగిపోతున్న తిరుగుబాట్లతో సీఎం కుర్చీ ఎప్పుడూ కూలిపోతుందో అనే భయం రేవంత్ రెడ్డిని అడుగడుగునా వెంటాడుతోంది. ఏం చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్న కాంగ్రెస్, ముఖ్యమంత్రి.. అటెన్షన్ డైవర్షన్ కోసం రోజురోజుకూ చేస్తున్న చిల్లర చేష్టలు, కొత్త కుట్రలకు తెరపడినట్టే.సీఎం రేవంత్ కు పిల్లనిచ్చిన మామ సూదిని పద్మారెడ్డియే స్వయంగా కాళేశ్వరంలో అవినీతి జరగలేదనడంతో ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు ఒక్కసారిగా ఎగిరిపోయినై.. కమీషన్లు లేనిదే ప్రభుత్వంలో ఒక్కటంటే ఒక్క ఫైలు కదలడం లేదని స్వయంగా కేబినెట్ మంత్రి కొండా సురేఖ కుండబద్దలు కొట్టడంతో కాంగ్రెస్ నిర్వాకాలన్నీ వరుసగా వెలుగుచూస్తున్నాయి.30 శాతం పర్సెంటేజీలు ఇవ్వనిదే సొంత ప్రభుత్వంలో పనులు కావడం లేదని సాక్షాత్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆ పార్టీ బట్టలిప్పడంతో కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడింది. నాలుగు కోట్ల ప్రజల ముందు ముఖ్యమంత్రి అవినీతి బాగోతం బట్టబయలు కావడంతో కుడితిలో పడిన ఎలుకలా కాంగ్రెస్ పార్టీ కొట్టుకుంటోంది. పచ్చని రాష్ట్రంలో చిచ్చుపెట్టడమే కాకుండా వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీచేస్తూ, పేదల జీవితాలతో చెలగాటమాడుతున్న ముఖ్యమంత్రి పాపం పండింది. చివరికి ధర్మం గెలుస్తుంది. జై తెలంగాణ.. జై కేసీఆర్ అంటూ కామెంట్స్ చేశారు. -
కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఉద్యోగిపై దాడి..
సాక్షి, బంజారాహిల్స్: ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పనిచేసే ఉద్యోగిపై దాడి ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. సదరు ఉద్యోగిపై అక్కడి మాజీ ఉద్యోగి తన స్నేహితుడితో కలిసి దాడి చేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ కేబీఆర్ పార్కు చౌరస్తాలోని టీడీపీ కార్యాలయంలో బొడ్డుపల్లి ప్రశాంత్ వీడియో ఎడిటర్గా పనిచేస్తున్నాడు. గతంలో అదే కార్యాలయంలో ప్రవీణ్ అనే వ్యక్తి పనిచేసేవాడు. అతడి ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో విధుల నుంచి తొలగించారు. అక్కడి వెళ్లిపోయిన తర్వాత ప్రవీణ్ తనతో పాటు పనిచేసిన ఓ యువతి ఫోన్ నెంబర్ తన స్నేహితుడు శశికిరణ్కు ఇచ్చాడు. గత కొద్ది రోజులుగా శశికిరణ్ సదరు యువతికి మెసేజ్లు పెడుతూ వేధిస్తున్నాడు. ఈ విషయం ఆమె.. ప్రశాంత్ దృష్టికి తీసుకెళ్లడంతో బుధవారం అతను శశికిరణ్కు ఫోన్ చేసి అతడిని నిలదీశాడు. ఇకపై ఆమెకు ఫోన్ చేయవద్దని హెచ్చరించాడు. దీంతో కక్ష పెంచుకున్న శశికిరణ్ తన స్నేహితుడు ప్రవీణ్తో కలిసి అదే రోజు రాత్రి మాట్లాడదామని ప్రశాంత్ను ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పక్క గల్లీలోకి పిలిపించాడు. ప్రశాంత్ అక్కడికి రావడంతోనే ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో శశికిరణ్, ప్రవీణ్ అతడిపై కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేయడమేగాక చంపేస్తామంటూ బెదిరించారు. తీవ్రంగా గాయపడిన అతను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సోనియా, రాహుల్కు తీర్పు అనుకూలమైతే ఏమంటారు?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ నేతల తప్పులు ఎత్తి చూపిస్తే కోర్టు తీర్పులను అపహాస్యం చేస్తారా? అని ప్రశ్నించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రేపు ఒకవేళ కోర్టులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు అనుకూలంగా తీర్పు ఇస్తే.. తప్పు అని చెప్తారా? అంటూ వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘మహేష్ కుమార్ గౌడ్ గారు.. మీ నాయకుడు రాహుల్ గాంధీ న్యాయ యాత్రలు చేస్తుంటారు. మీ కాంగ్రెస్ నాయకులు మాత్రం న్యాయాన్ని, కోర్టులను, తీర్పులనూ అపహాస్యం చేస్తుంటారు. మీకు అనుకూలం కాకుంటే అది నిజం కాదు! మీకు నచ్చకపోతే అది న్యాయం కాదు?. నేషనల్ హెరాల్డ్ కేసులో రేపు ఒకవేళ కోర్టులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు అనుకూలంగా తీర్పు ఇస్తే తప్పు అని చెప్తారా?. కంచె గచ్చిబౌలి అయినా, పాలమూరు ప్రాజెక్ట్ అయినా.. మీ తప్పులు ఎత్తి చూపిస్తే కోర్టు తీర్పులను అపహాస్యం చేస్తారా?’ అంటూ ప్రశ్నించారు. Absolutely appalled by the comments of TPCC president Mahesh Kumar Goud garu on the Honourable Supreme court’s dismissal of Special Leave Petition (SLP) in Palamuru-Rangareddy Lift Irrigation Scheme projectIt is not just demeaning to the Supreme Court but the constitution of…— KTR (@KTRBRS) May 23, 2025 -
రోబోలకు బాబు.. మనిషిలాంటి డాబు హ్యూమనాయిడ్
‘మనసున మనసై.. బ్రతుకున బ్రతుకై...’ – తోడొకరు ఉండటానికేముంది కానీ.. ఇంట్లో వంట పనికి తోడుండగలరా? ఇల్లు తుడవటానికి తోడుండగలరా? గిన్నెలు తోమటానికి, బట్టల్ని నీళ్లలో జాడించటానికీ, దండెం మీద ఆరేయటానికీ తోడుండగలరా? అది కదా నిజంగా తోడుగా ఉండటం అంటే! ఒక్క ఇల్లనే కాదు; ఇంటి పనీ, వంట పనీ అనే కాదు – చేదోడు అవసరమైన ప్రతి చోటా, ప్రతి రంగంలో మనసెరిగి పనులు చక్కబెట్టే మనిషొకరు ఉంటే ప్రపంచం ఎంత సౌఖ్యంగా మారిపోతుంది! నిజమే కానీ, మానవ మాత్రులెవ్వరూ అలా తోడుగా ఉండలేరు. అందుకొక మెషీన్ కావలసిందే. వట్టి మెషీన్ కాదు.. మనిషి లాంటి మెషీన్.. అంటే.. హ్యూమనాయిడ్!!మొన్న మే 21న..టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ ‘కనీ విని ఎరుగని’అంటూ ఒక వీడియో క్లిప్ విడుదల చేశారు. అందులో ‘ఆప్టిమస్’అనే హ్యూమనాయిడ్ ఇంటి పనుల్ని చలాకీగా చక్కబెట్టేస్తోంది. వంగి, చెత్త బ్యాగును తీసి డస్ట్ బిన్లో పడేస్తోంది. ఒక చేత్తో బ్రష్, ఇంకో చేత్తో డస్ట్ ప్యాన్ ఉపయోగించి టేబుల్ని శుభ్రం చేస్తోంది. టిష్యూ పేపర్ రోల్ నుంచి చిన్న ముక్కను లాగి తీసుకుంటోంది. స్టౌ మీద గిన్నెలో కూరగాయల్ని గరిటెతో కలియదిప్పుతోంది. గచ్చును తుడుస్తోంది. ప్రశాంతంగా సూచనలు పాటిస్తూ.. ‘ఇంకేమైనా పనుందా అమ్మగారూ...’అనే మన పాతకాలపు పనిమనిషిలా తర్వాతి ఆదేశాల కోసం చూస్తోంది. త్వరలోనే మార్కెట్లోకి రానున్న ఈ ‘ఆప్టిమస్’హ్యూమనాయిడ్ రూ.18–25 లక్షల వరకు ఉంటుందట.హ్యూమనాయిడ్, రోబో ఒకటి కాదా..ఈ ప్రశ్నకు సమాధానం... ‘కాదు’, ‘అవును’కూడా. హ్యూమనాయిడ్లన్నీ రోబోలే. కానీ, రోబోలన్నీ హ్యూమనాయిడ్లు కావు. రోబో యంత్రమైతే, హ్యూమనాయిడ్ మానవ యంత్రం. రోబో ఏ ఆకారంలోనైనా ఉండొచ్చు. హ్యూమనాయిడ్ మాత్రం కృత్రిమ మేధస్సుతో ప్రత్యేక మానవ నైపుణ్యాలను, మానవాకృతిని కలిగి ఉంటుంది. ఫ్యాక్టరీలో కారు భాగాలు జోడించే సాధారణ రోబోలు, లేదా నేలను శుభ్రం చేసే వాక్యూమ్ క్లీనర్ రోబోలతో పోలిస్తే ఈ హ్యూమనాయిడ్లు చాలా వైవిధ్యమైనవి. ఇవి కష్టమైన పనులను సైతం చేయగలవు, మనుషులతో మాట్లాడగలవు, కొత్త పరిస్థితులకు అలవాటు పడగలవు. వీటి ప్రత్యేకత ఏమిటంటే.. వీటి రూపం మనుషులకు సౌకర్యంగా అనిపించడం.ఇంత తెలివి ఎలా ?హ్యూమనాయిడ్లు మనుషుల్లా పనిచేయడానికి స్మార్ట్ టెక్నాలజీలను ఉపయోగించుకుంటాయి. ఏఐ మస్తిష్కంతో ఇవి ప్రపంచాన్ని అర్థం చేసుకుంటాయి. వాటిల్లోని సెన్సార్లే.. వాటి పంచేంద్రియాలు. గదిని 3డీలో చూడటానికి, వస్తువులను గుర్తించడానికి 3డీ కెమెరాలు, ‘లైడార్’ సహాయపడతాయి. గైరోస్కోప్లు, యాక్సిలరోమీటర్లు వీటి నడకను బ్యాలెన్స్ చేస్తాయి. ‘ఫోర్స్’సెన్సార్లు వస్తువులను అవి పగలనంత సున్నితంగా పట్టుకోవడానికి తోడ్పడ తాయి.విజన్ సెన్సార్లు ముఖాలను గుర్తించడానికి, దారులను కనుక్కోటానికి ఉపకరిస్తాయి. హ్యూమనాయిడ్లు మైక్రోఫోన్లతో మాటలను విని, అర్థం చేసుకోగలవు. మోటార్లు, యాక్చుయేటర్లు వాటి కండరాలు. శక్తిమంతమైన కంప్యూటర్ల సెన్సార్ల నుండి వచ్చే సమాచారాన్ని వేగంగా ప్రాసెస్ చేస్తాయి. అందువల్ల హ్యూమనాయిడ్లు తక్షణం ఆలోచించి పనిచేయగలదు. బ్యాటరీలతో ఇవి 5 గంటల వరకు పనిచేస్తాయి. కానీ నడిచే హ్యూమనాయిడ్లకు చాలా శక్తి అవసరం. వీటిని ఇంటర్నెట్తో అనుసంధానిస్తారు. ‘అక్యూట్’తో భారత్ అరంగేట్రం!హ్యూమనాయిడ్స్ను మనదేశమూ తయారు చేస్తోంది. తొలిసారిగా బిట్స్ పిలానీ ‘అక్యూట్’అనే హ్యూమనాయిడ్ కి ప్రాణ ప్రతిష్ట చేసింది. ఇస్రో, డీఆర్డీఓ, రిలయన్స్ వంటివి ఈ రంగంలో విస్తృత ప్రయత్నాలు చేస్తున్నాయి. కృత్రిమ మేధ (ఏఐ), సెన్సార్ల వంటి స్మార్ట్ టెక్నాలజీలు ఈ హ్యూమనాయిడ్ల మెదడుకు మేత. ఈ మేతకు అవసరమైన కీలక ఎలక్ట్రానిక్ విడిభాగాల కోసం చైనా, యూఎస్, జర్మనీలపై ఆధారపడకుండా పూర్తి స్థాయిలో తయారీ చేపడితే అంతర్జాతీయంగా హ్యూమనాయిడ్ రోబోల రంగంలో భారత్ పోటీపడే అవకాశాలు ఉంటాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. వచ్చే ఐదేళ్లలో 50 వేలు...ప్రపంచ హ్యూమనాయిడ్ రోబో మార్కెట్ 2024లో 3.28 బిలియన్ డాలర్లు. 2032 నాటికి ఇది 66 బిలియన్ డాలర్లకు చేరవచ్చని నివేదికలు చెబుతున్నాయి. భారత హ్యూమనాయిడ్ రోబోల మార్కెట్ విలువ రూ.1,275 కోట్లు. మొత్తం 8,000 రోబోలలో హ్యూమనాయిడ్లు 10 శాతం వరకు ఉంటాయి. ఏటా 25 శాతం రోబోలు తోడవుతున్నాయి. 2030 నాటికి భారత్ 50,000 హ్యూమనాయిడ్లను ఉపయోగించే అవకాశం ఉంది. మన హ్యూమనాయిడ్ రోబోల మార్కెట్ 2035 నాటికి రూ.12,750 కోట్లకు చేరొచ్చని అంచనా.సవాళ్లు – పరిమితులు హ్యూమనాయిడ్ రోబోల తయారీ, వినియోగం ఖరీదైన వ్యవహారం. చైనాకు చెందిన ‘యూనిట్రీ జీ1’ధర రూ.13.6 లక్షలు. భారత రోబోలు.. ఆప్టిమస్ లేదా యూనిట్రీ జీ1 లాగా స్వేచ్ఛగా కదలలేవు, బ్యాటరీ ఎక్కువసేపు ఉండదు. రోబోలకు 5జీ వంటి వేగవంతమైన ఇంటర్నెట్ కావాలి. భారత్లో పూర్తి స్థాయిలో 5జీ విస్తృతం కాలేదు. అయితే మన ‘యాడ్వర్బ్’భారీ ప్రణాళికలు, డీఆర్డీఓ రక్షణ పనులు.. భారత్ సైతం ఈ రంగంలో పోటీపడగలదని నిరూపిస్తున్నాయి. ఖర్చు వంటి సవాళ్లు ఉన్నప్పటికీ ఆశాజనకంగా ఉన్న మార్కెట్, ప్రభుత్వ మద్దతు ఉజ్వల భవిష్యత్తుపై ఆశలు కలిగిస్తున్నాయి.పోటీలో దూసుకుపోతున్న భారత్⇒ హ్యూమనాయిడ్ రోబో రేసులో దేశీయ కంపెనీలు చురుగ్గా ఉన్నాయి. మెక్స్ రోబోటిక్స్, స్వాయ రోబోటిక్స్, ఇన్వెంటో రోబోటిక్స్, సిరెనా టెక్నాలజీస్, విస్టాన్నెక్ట్స్జెన్ తదితర సంస్థలు వీటి తయారీలో ఉన్నాయి. ⇒ షాపులు, ఫ్యాక్టరీలు, కస్టమర్ సేవల కోసం అహ్మదాబాద్కు చెందిన కోడీ టెక్నోలాబ్ తయారు చేసిన ‘స్కంద’2024లో రంగ ప్రవేశం చేసింది. షాపుల్లో స్టాక్ నిర్వహణ వంటి పనులు చేస్తుంది. ⇒ రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్టుబడులు పెట్టిన నోయిడాకు చెందిన యాడ్వర్బ్ టెక్నాలజీస్ ఫ్యాషన్, రిటైల్, ఎనర్జీ రంగాల్లో వాడేందుకు హ్యూమనాయిడ్ను తీసుకొస్తోంది. ఉత్పత్తులను అసెంబుల్ చేయడం, గిడ్డంగుల్లో వస్తువులను తీసుకెళ్లడం వంటి క్లిష్టమైన పనులు ఇది చేస్తుంది. ⇒ ప్రమాదకర మిలటరీ పనుల కోసం డీఆర్డీఓ, స్వాయ రోబోటిక్స్తో కలిసి 2027 నాటికి హ్యూమనాయిడ్ను పరిచయం చేయనుంది. ఇది 24 విధాలుగా కదలగలదు. 3డీలో ప్రాంతాలను మ్యాప్ చేయగలదు. బాంబులను నిరీ్వర్యం చేయగలదు. ప్రమాదకర ప్రాంతాల్లో సమాచారాన్ని సేకరించగలదు. ⇒ భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ అంతరిక్ష మిషన్లలో సహాయపడేందుకు వ్యోమమిత్ర హ్యూమనాయిడ్ రోబో తయారుచేసింది.కొన్ని హ్యూమనాయిడ్లు..⇒ చైనా కంపెనీ యూబీటెక్ వృద్ధుల సంరక్షణ, బోధన కోసం ప్రత్యేక హ్యూమనాయిడ్లను తయారు చేస్తోంది. యూఎస్ టెక్నాలజీ సంస్థ ఎజిలిటీ రోబోటిక్స్ తయారు చేసిన ‘డిజిట్’లు వస్తువులను తీసుకోవడం, ప్యాక్ చేయడంn చేస్తున్నాయి. స్టాన్ఫోర్డ్ వర్సిటీ రూపొందించిన ‘ఓషన్ వన్’... సముద్రంలో ప్రమాదకర ప్రాంతాల్లో, భూగర్భంలో వెలికితీతలకు చక్కగా ఉపయోగ పడుతోంది. -
బీఆర్ఎస్లో‘కవిత లేఖ’ కలకలం
సాక్షి, హైదరాబాద్: ఎల్కతుర్తిలో గత నెల 27న జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వచ్చిన స్పందన, తన తండ్రి కేసీఆర్ ప్రసంగం తీరుతెన్నులను విశ్లేషిస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసినట్లుగా చెప్తున్న లేఖ పార్టీలో కలకలం రేపుతోంది. అమెరికాలో తన కుమారుడు ఆదిత్య గ్రాడ్యుయేషన్ వేడుకకు హాజరయ్యేందుకు వెళ్లిన కవిత శుక్రవారం హైదరాబాద్కు చేరుకోనున్నారు. కవిత హైదరాబాద్కు చేరుకున్న తర్వాతే లేఖ అంశంపై స్పందించే అవకాశముంది. అయితే కవిత రాసింది లేఖ కాదని, తన అభిప్రాయాలతో రాసిన నోట్ మాత్రమేనని ఆమె సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. రజతోత్సవ సభపై కేసీఆర్కు ఫీడ్బ్యాక్ ఇచ్చేందుకు తయారుచేసుకున్న నోట్స్ బయటకు ఎలా లీక్ అయిందనే కోణంలోనూ చర్చ జరుగుతోంది. లేఖలో పేర్కొన్న అంశాలు ⇒ ఎల్కతుర్తి సభ పార్టీ కేడర్లో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. అందరూ మీ (కేసీఆర్) ప్రసంగం చివరి వరకు ఆసక్తిగా విన్నారు. ఆపరేషన్ కగార్, రేవంత్ ప్రభుత్వ వైఫల్యాలు, పహల్గామ్ అమరులకు నివాళి, ప్రసంగంలో రేవంత్ పేరును ప్రస్తావించకపోవడం అందరికీ నచ్చాయి. ⇒ తెలంగాణ అంటే బీఆర్ఎస్ అనే విషయాన్ని బలంగా చెప్తారని ఆశించారు. ప్రసంగంలో మరింత పంచ్ ఉండాలని నాయకులు, కార్యకర్తలు కోరుకున్నారు. పోలీసులను హెచ్చరించడంపై మంచి స్పందన వచ్చింది. తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ గీతం మార్చడంపై మీరు స్పందిస్తారని అనుకున్నారు. ⇒ వక్ఫ్ బిల్లు, బీసీలకు 42శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ మీద మాట్లాడితే బాగుండేది. ⇒ బీజేపీపై మీరు రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడటంతో భవిష్యత్తులో బీజేపీతో పొత్తు పెట్టుకుంటారనే ఊహాగానాలకు తావు ఇచ్చినట్లు అయింది. బీజేపీతో ఇబ్బంది పడిన తాను కూడా ఇదే అంశాన్ని కోరుకున్నా. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్పై నమ్మకం కోల్పోయిన వారు బీజేపీ మనకు ప్రత్యామ్నాయమవుతుందని అనుకుంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకపోవడంతో బీజేపీకి మనం సాయం చేశామనే కోణాన్ని కాంగ్రెస్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. ⇒ జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు కూడా మిమ్మల్ని కలవడం సాధ్యం కావడం లేదనే అభిప్రాయంతో ఉన్నారు. దయచేసి అందరికీ చేరువకండి. -
నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్రెడ్డి
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు పవన్ బన్సల్తోపాటు దివంగత నేత అహ్మద్ పటేల్ పేర్లు తెరపైకి వచ్చాయి. గత నెలలో కోర్టుకు సమర్పించిన చార్జిషిట్లో వీరి పేర్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రస్తావించింది. కానీ, వీరిని నిందితులుగా చేర్చలేదు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాందీ, రాహుల్ గాంధీతోపాటు మరో ఐదుగురిని నిందితులుగా చేర్చిన సంగతి తెలిసిందే. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు చెందిన రూ.2,000 కోట్ల విలువైన ఆస్తులను అక్రమంగా కొట్టేయడానికి కుట్ర జరిగినట్లు ఈడీ ఆరోపిస్తోంది. ఆస్తులను కాజేయాలన్న ఉద్దేశంతోనే యంగ్ ఇండియా సంస్థను స్థాపించినట్లు చెబుతోంది. ఈ సంస్థ ఏర్పాటుకు పలువురు కాంగ్రెస్ నాయకులతోపాటు ఇతరులు 2019–22 మధ్య విరాళాల రూపంలో డబ్బులు సమకూర్చారు. అందుకు ప్రతిఫలంగా పదవులు, ప్రయోజనాలు కట్టబెడతామని ప్రస్తుత తెలంగాణ సీఎం (అప్పటి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు) రేవంత్రెడ్డి, పవన్ బన్సల్, అహ్మద్ పటేల్ ప్రలోభ పెట్టారని ఈడీ చార్జిషిట్లో పేర్కొంది. సాక్షులను విచారించిన తర్వాతే ఈ విషయం నిర్ధారించుకున్నట్లు స్పష్టంచేసింది. ఈడీ ఆరోపణలపై రేవంత్రెడ్డి, పవన్ బన్సల్ ఇంకా స్పందించలేదు. ఇదిలా ఉండగా,యంగ్ ఇండియా సంస్థ ఏర్పాటు కోసం రూ.30 లక్షలు విరాళంగా ఇచ్చానని కాంగ్రెస్ నేత అరవింద్ విశ్వనాథ్ సింగ్ చౌహాన్ ఈడీ విచారణలో అంగీకరించారు. అహ్మద్ పటేల్ సూచన మేరకే ఈ డబ్బులు ఇచ్చినట్లు తెలిపారు. కాగా, ఈడీ గతంలో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ అంజన్కుమార్ యాదవ్, మాజీ మంత్రి గీతారెడ్డి, గాలి అనిల్కుమార్కు కూడా నోటీసులిచ్చి విచారించిన విషయం తెలిసిందే. -
కొలువుల కుదింపు... వేతనాల్లోనూ కోత!
సాక్షి, హైదరాబాద్: అసంఘటిత రంగ కార్మీకుల కనీస వేతన సవరణ ప్రక్రియలో ప్రతిచోటా కోతల పర్వం కొనసాగుతోంది. గతంలో ప్రభుత్వం ఇచ్చిన వేతన సవరణ తుది ఉత్తర్వుల్లో ఖరారు చేసిన ఉద్యోగాలు, వేతనాలకు సంబంధించి కత్తెర పడుతోంది. సర్వీసు నిబంధనల్లో భారీగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కార్మికుల కనీస వేతన సవరణ చివరిసారిగా 2006లో జరిగింది. అప్పుడు చేసిన సవరణకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడేందుకు దాదాపు ఆరేళ్లు పట్టింది. ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనా వేతన సవరణ ఊసే లేదు. దీనిపై కార్మీక సంఘాలు తీవ్రస్థాయిలో ఆందోళన చేపట్టాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక రాష్ట్రంలో ఏర్పాటైన మొదటి, రెండో కనీస వేతన సలహా బోర్డులు లోతుగా కసరత్తు చేసి గత ప్రభుత్వానికి వివిధ ఎంప్లాయిమెంట్లకు సంబంధించి ప్రతిపాదనలు సమర్పించాయి. వీటిపై గత ప్రభుత్వం కసరత్తు చేపట్టి ఐదు ఎంప్లాయిమెంట్లకు తుది ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ గెజిట్లు విడుదల కాకపోవడంతో అమలుకు నోచుకోలేదు. మరో 12 ఎంప్లాయిమెంట్లకు సంబంధించి ప్రతిపాదనలు ప్రభుత్వం ఆమోదించినా ఉత్తర్వులు వెలువడలేదు. మిగిలిన ఎంప్లాయిమెంట్లు ప్రతిపాదన దశలోనే ఉండిపోయాయి. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం 73 రకాల ఎంప్లాయిమెంట్లకు సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్లను గతేడాది జనవరి 29న జారీ చేయగా.. ఇప్పుడున్న కనీస వేతన సలహా బోర్డు తుది ప్రతిపాదనలు రూపొందిస్తోంది. నాలుగు అంశాలు కొలిక్కి... ఈ బోర్డు గతేడాది డిసెంబర్లో ఏర్పాటు కాగా.. అప్పట్నుంచి ఏడుసార్లు సమావేశమైంది. ప్రభుత్వం జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్లపై సుదీర్ఘంగా చర్చించి ఐదు ఎంప్లాయిమెంట్లకు సంబంధించి ప్రతిపాదనలను దాదాపు సిద్ధం చేసింది. ఇందులో నాలుగు రకాల అంశాలపై కీలకంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కార్మీకుల వేతనాలకు సంబంధించి బేసిక్ వేజ్, వీడీఏ ఖరారుతో పాటు, ఉద్యోగ హోదా (డిజిగ్నేషన్), సర్వీసు నిబంధనలకు సంబంధించిన ఫుట్ నోట్లను కూడా సిద్ధం చేసినట్లు తెలిసింది. కట్.. కట్... కట్... కనీస వేతన సలహా మండలి సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకున్న అంశాలపై కార్మీక సంఘాలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బోర్డు నిర్ణయాలు అధికారికంగా బహిర్గతం కానప్పటికీ.. చర్చించిన అంశాలు, మినిట్స్ తదితర సమాచారం బయటకు రావడంతో సంఘాలు భగ్గుమంటున్నాయి. కార్మిక సంఘాల ద్వారి తెలిసిన సమాచారం ప్రకారం.. కనీస వేతన సలహా బోర్డు సెక్యూరిటీ సర్వీసెస్, కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్, స్టోన్ బ్రేకింగ్ అండ్ స్టోన్ క్రషింగ్, కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రాజెక్ట్స్, ప్రైవేట్ మోటార్ ట్రాన్స్పోర్ట్ ఎంప్లాయిమెంట్స్కు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయి. ఫుట్ నోట్స్ కీలకం.. కార్మీకుల సర్వీసు నిబంధనల్లో ఫుట్ నోట్స్ కీలకం. ఈ ఫుట్నోట్స్ ఆధారంగా కార్మీకుడి గ్రేడ్ పెంచుతూ వేతనాలను సవరిస్తారు. ఉదాహరణకు ఒక కేటగిరీలో కార్మీకుడు ఐదేళ్లపాటు పనిచేస్తే ఆరో సంవత్సరం కార్మీకుడి గ్రేడ్ పెంచుతూ అధిక వేతనం ఇవ్వాలి. నైట్ షిఫ్ట్ అలవెన్సు 25 శాతం, రిస్క్ అలవెన్స్ 20 శాతం, అధిక ఎత్తులు, భూమి లోపల పనిచేసే వారికి అదనపు వేతనం జారీ తదితర నిబంధనలున్న ఫుట్ నోట్లను తగ్గించినట్లు సమాచారం. కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఎంప్లాయిమెంట్ 21 ఫుట్నోట్లను 5కు పరిమితం చేశారు. ఏకంగా 16 ఫుట్నోట్లు రద్దు చేశారు. ఇలా అన్ని సెక్టార్లలోనూ ఫుట్నోట్లకు కోత పడింది. హైలీ స్కిల్డ్ వేతనంలో రూ.7,234 కోత 2021 జూన్లో ప్రభుత్వం ఐదు కేటగిరీలకు కనీస వేతనాలకు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా బోర్డు ప్రతిపాదించిన వేతనాలను పరిశీలిస్తే గతంలో కంటే భారీగా కోత పెట్టినట్లు తెలుస్తోంది. హైలీ స్కిల్డ్ కేటగిరీలో రూ.7,234 కోత పడగా.. అన్స్కిల్డ్లో రూ.3,018 కోత పడింది. వాస్తవానికి రోజుకురోజు నిత్యావసర సరుకుల ధరలు, రోజువారీ ఖర్చులు విపరీతంగా పెరుగుతున్న క్రమంలో ఐదేళ్ల క్రితం నిర్దేశించిన వేతనాలకంటే 10 శాతం నుంచి 20 శాతం మేర కోత పెడుతూ బోర్డు ప్రతిపాదనలు తయారు చేయడంపై కార్మీక సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.భారీగా ఉద్యోగాల కోతలు గతంలో హైలీస్కిల్డ్–1, 2, 3, 4, స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ కేటగిరీలుండగా... ఇప్పుడు వాటిని హైలీస్కిల్డ్, స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ కేటగిరీలకే పరిమితం చేశారు. 3 ఉద్యోగ కేటగిరీలు తొలగించడంతో ఉపాధి సంస్థల్లో భారీగా ఉద్యోగులు తగ్గిన ట్లేనని కార్మీక సంఘాలు అంటున్నాయి. సెక్యూరిటీ సర్వీసెస్ ఎంప్లాయిమెంట్లో 26 జూన్ 2021లో జారీ చేసిన జీఓఎంఎస్ 21 ప్రకారం 66 ఉద్యోగాలున్నాయి. గతేడాది విడుదలైన ప్రాథమిక నోటిఫికేషన్లో వీటి సంఖ్య 11కు తగ్గించారు. వీటిని బోర్డు ఆమోదిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఇక్కడే 55 ఉద్యోగాలకు కోత పడింది. అలాగే కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఎంప్లాయిమెంట్లో 611 ఉద్యోగాలను 58కి కుదించడంతో 533 ఉద్యోగాలకు కోతపడింది. స్టోన్ బ్రేకింగ్ అండ్ స్టోన్ క్రషింగ్ ఎంప్లాయి మెంట్లో 196 ఉద్యోగాలను 69కి కుదించారు. ఇలా ప్రతి ఎంప్లాయిమెంట్లో ఉద్యోగాల సంఖ్య తగ్గిస్తూ కనీస వేతన సలహా బోర్డు ప్రతిపాదనలు తుదిరూపుకు తెచ్చినట్లు సమాచారం. ఉద్యోగుల సంఖ్య కుదించడంతో ఉన్న కార్మికులపై పనిఒత్తిడి పడనుంది. -
మిస్ ‘కళలు’.. అదుర్స్
సాక్షి, హైదరాబాద్: మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో గురువారం రాత్రి నిర్వహించిన ‘టాలెంట్ గ్రాండ్ ఫినాలే విభిన్న కళలతో అలరించింది. 24 దేశాలకు చెందిన పోటీదారులు ఎంపికైన ఈ ఫినాలేలో మిస్ ఇండోనేషియా (పియానో) మొదటి స్థానంలో నిలవగా, మిస్ కామెరూన్ (సింగింగ్) రెండవ స్థానంలో, మిస్ ఇటలీ (బ్యాలే నృత్యం) మూడో స్థానంలో నిలిచారు. అద్భుతమైన పియానో సంగీతంతో మిస్ ఇండోనేషియా వేదికను సోల్ఫుల్ ఫీల్లో ముంచెత్తింది. శ్రావ్యమైన పాశ్చాత్య సంగీత వెల్లువతో ‘గుడ్నెస్ ఆఫ్ గాడ్’ పాట పాడి మిస్ కామెరూన్ ప్యానెలిస్టుల మనసు దోచుకుంది.మిస్ ఇటలీ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక విశిష్టతను కలిగిన బ్యాలేను ప్రదర్శించింది. ఇండియన్ కంటెస్టెంట్ మిస్ ఇండియా నందిని గుప్తా చేసిన బాలీవుడ్ హిట్ సాంగ్ దోల్ భాజే సాంగ్ వేదికను దద్దరిల్లేలా చేసింది. భారతీయ సంస్కృతిని మిస్ వరల్డ్ వేదికపై ఘనంగా ప్రదర్శించడం సంతోషంగా ఉందని నందినీ గుప్తా తెలిపారు. చివరగా మొత్తం 24 మంది పోటీదారులు రాను బొంబాయికి రాను, అద్దాల మేడలున్నయే అంటూ తెలుగు పాటలకు స్టెప్పులేశారు. కాగా, అత్యవసర సమయాల్లో రోగులను కాపాడే సీసీఆర్ ఎలా చేయాలో వినూత్నంగా ప్రదర్శించి వేల్స్ కంటెస్టెంట్ తన వైద్య వృత్తి గొప్పదనాన్ని చాటారు. సింగరేణి స్టాల్స్లో సుందరీమణులు గురువారం సాయంత్రం శిల్పారామాన్ని సందర్శించిన అనంతరం మిస్వరల్డ్ పోటీదారులు పక్కనే ఉన్న ఇందిరా మహిళా శక్తి బజారును సందర్శించారు. ఈ సందర్భంగా సింగరేణి సేవా సమితి స్వయం ఉత్పత్తిదారుల వస్తు విక్రయశాలను కూడా వారు తిలకించారు. వివిధ ప్రాంతాల నుంచి సింగరేణి సేవా సమితిలో శిక్షణ పొందిన మహిళలు తయారుచేసిన బ్యాగులు, చేతి పర్సులు, మగ్గం వర్క్ చేసిన దుస్తులను పరిశీలించి, ఇవి చక్కగా ఉన్నాయంటూ ప్రశంసలు కురిపించారు. -
రెండ్రోజులు తేలికపాటి వానలు
సాక్షి, హైదరాబాద్: అరేబియా సముద్రంలోని దక్షిణ కొంకణ్–గోవా తీర ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తర దిశగా కదులుతూ మరింత బలపడి శుక్రవారం సాయంత్రానికి వాయుగుండంగా మారే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ తర్వాత వాయుగుండం మరింత బలపడే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తోంది. దీంతో రానున్న రెండు రోజులు రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఉమ్మడి మెదక్ జిల్లాలోని కొన్నిప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదు కావొచ్చని, అదేవిధంగా జగిత్యాల, కామారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షా లు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మిగిలిన ప్రాంతా ల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు, రానున్న రెండు, మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించేందుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తగ్గిన ఉష్ణోగ్రతలు గురువారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత నల్లగొండలో అత్యధికంగా 35.5 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్లో అత్యధికంగా 20.3 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 6–10 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయ్యాయి. రానున్న రెండు రోజులు కూడా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదు కావొచ్చని వాతావరణ శాఖ వివరించింది. -
2025–26 రుణ లక్ష్యం రూ.7.65 లక్షల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయం, వ్యాపార రంగాల్లో పెట్టుబడి పెంపు, గ్రామీణ ఆర్థికశక్తి వృద్ధికి పెద్దపీట వేస్తూ బ్యాంకులు లక్ష్యాలను నిర్దేశించుకున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలో రూ.7,65,000 కోట్ల రుణా లు ఇవ్వాలని నిర్ణయించాయి. గత ఏడాది (2024–25)లో రూ.6.51 లక్షల కోట్ల లక్ష్యానికి గాను అదనంగా మరో లక్ష కోట్లు ఎక్కువగా రూ.7.52 లక్షల కోట్ల రుణాలు టార్గెట్గా పెట్టుకున్నారు. గురువారం జరిగిన స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్ఎల్బీసీ) వార్షిక నివేదికలో ఈ మేరకు గత ఏడాది లక్ష్యాలను చేరుకున్న తీరు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏఏ రంగాలకు ఎన్ని వేల కోట్ల రుణాలు మంజూరు చేయాలనే లక్ష్యాలను ఎస్ఎల్బీసీ చైర్మన్ రాజేశ్కుమార్ వెల్లడించారు. వ్యవసాయ రంగం 2024–25లో వ్యవసాయ రంగానికి రూ.1.52 లక్షల కోట్లకుగాను రూ.1.37 లక్షల కోట్లు మంజూరు చేశారు. పంట రుణాల్లో 80.5% మేర పురోగతి సాధించగా, వ్యవసాయ ఆధారిత ఇతర రంగాల్లో 104.8% సాధించారు. 27.53 లక్షల రైతులకు రూ.33,245 కోట్ల విలువైన కేసీసీ (కిసాన్ క్రెడిట్ కార్డు) రుణాలు ఇచ్చారు. ఎంఎస్ఎంఈ రంగం ఎంఎస్ఎంఈలకు ఇచ్చే రుణ లక్ష్యం రూ.1.29 లక్షల కోట్లు కాగా, రూ.1.21 లక్షల కోట్ల రుణాలను ఆయా బ్యాంకులు ఇచ్చాయి. అంటే 93.6% లక్ష్యాన్ని సాధించాయి. మైక్రో, స్మాల్, మీడియం పరిశ్రమల విభాగాల్లో రుణాల ప్రవాహం పెరుగుతోందని ఎస్ఎల్బీసీ తెలిపింది. ఇతర రంగాల్లో బలహీన పురోగతి విద్యారుణాల్లో కేవలం 21.43 శాతం మాత్రమే లక్ష్యాలను చేరుకున్నాయి. 2024–25లో విద్యారుణాలను రూ.2707 కోట్లు మేర ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా, రూ.580 కోట్లు మాత్రమే అందజేశారు. గృహ రుణాల్లో 31.87 శాతం మాత్రమే లక్ష్యాలను చేరుకున్నట్టు ఎస్ఎల్బీసీ నివేదిక తెలిపింది. రూ.10,769 కోట్ల గృహ రుణాలు లక్ష్యం కాగా, కేవలం రూ.3432 కోట్లు మాత్రమే ఇచ్చారు. 2025–26 లక్ష్యాలు ఇవీ... తాజా ప్రణాళిక ప్రకారం 2025–26లో రూ.7.65 లక్షల కోట్లు రుణాల లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో వ్యవసాయ రంగానికి రూ.1.65 లక్షల కోట్లు, ఎంఎస్ఎంఈలకు రూ.1.45 లక్షల కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. విద్యా రుణాలకు రూ.3200 కోట్లు, గృహరుణాలకు రూ.11,500 కోట్లు కేటాయించారు. విద్యా, గృహరుణాల్లో తక్కువ లక్ష్య సాధన కనబడగా, ఎంఎస్ఎంఇలు, వ్యవసాయరంగాల్లో బ్యాంకులు రుణాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తేలింది. కాగా బ్యాంకు రుణాలకు సంబంధించిన సిఫార్సులల్లో గ్రామీణ ప్రాంతాల్లో నిర్భంధ బ్యాంకు కరెస్పాండెంట్లను (బీసీలు) అమలు చేయాల్సి ఉంది. అన్ని కేసీసీ ఖాతాలకు ఆధార్ లింక్ చేయడంతో పాటు ఎస్హెచ్జీ సభ్యులకు బీమా పథకాలను విస్తరించాలని నివేదిక స్పష్టం చేసింది. -
డిగ్రీ.. పదో తరగతి
పీఎం ఇంటర్న్షిప్.. దేశంలోని టాప్ – 500 కంపెనీల్లో యువత శిక్షణ పొంది, ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు సాధించేందుకు అద్భుతమైన వేదిక. మొదటి రౌండ్ మొత్తం పూర్తయిపోయి, రెండో రౌండ్ కూడా సగం పూర్తయింది. ఈ దశలో టాప్ – 4 రాష్ట్రాలలోనే సుమారు 50 వేల అవకాశాలు ఉన్నాయి. మొత్తం అవకాశాల్లో ఇవి దాదాపు 42 శాతం. అంటే.. పారిశ్రామికంగా అభివృద్ధి చెందినవీ, పట్టణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఎక్కువ అవకాశాలు అందిస్తున్నాయి. మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణల్లో గ్రాడ్యుయేషన్ అభ్యర్థుల తరవాత అత్యధిక ఇంటర్న్షిప్లకు దరఖాస్తు చేసింది పది పాసైనవారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం గ్రాడ్యుయేషన్ తరవాత.. ఐటీఐ వాళ్లు ఎక్కువగా ఉన్నారు. దేశంలోని 21–24 ఏళ్ల మధ్య ఉండే యువత ఉద్యోగ సాధనకు అవసరమయ్యే పూర్తిస్థాయి నైపుణ్యాలను.. అత్యుత్తమ కంపెనీల ద్వారా యువతకు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2024లో ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం (పీఎంఐఎస్) తీసుకొచి్చంది. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ వంటి చదువులు పూర్తిచేసిన విద్యార్థులకు శిక్షణతోపాటు, నెలకు రూ.5,000 చొప్పున స్టైపెండ్ కూడా ఈ పథకం ద్వారా అందిస్తారు. దీంతోపాటు కంపెనీలో చేరేముందు వన్టైమ్ గ్రాంట్ కింద రూ.6,000 కూడా చెల్లిస్తారు. ఏడాదిలో 6 నెలలు క్లాస్ రూమ్లో, 6 నెలలు క్షేత్రస్థాయిలో శిక్షణ ఉంటుంది. ఏడాదికి రూ.8 లక్షల వార్షికాదాయం కలిగిన కుటుంబాలకు చెందినవారు దీనికి అర్హులు.మొదటి రౌండ్లో.. ఈ ఏడాది మార్చిలో రాజ్యసభలో కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ చెప్పిన సమాధానం ప్రకారం.. 2024 అక్టోబర్లో ప్రారంభమైన పీఎంఐఎస్ పైలట్ ప్రాజెక్ట్ మొదటి రౌండ్లో... చివరికి 28,141 మంది ఆఫర్లు తీసుకుని ఆయా సంస్థల్లో శిక్షణకు హాజరయ్యారు. ఇందులో ఏపీ నుంచి 1,970, తెలంగాణ నుంచి 1,380 మంది ఉన్నారు. యూపీ నుంచి అత్యధికంగా 4,656 మంది, బిహార్ నుంచి 2,418 మంది స్వీకరించారు. మొదటి రౌండ్లో మొత్తం 1.27 లక్షల ఆఫర్లు రాగా.. వాటికోసం 6.21 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కంపెనీలు 82,077 మందిని ఎంపిక చేసుకుని ఇంటర్న్షిప్ ఆఫర్ చేశాయి. గ్రాడ్యుయేషన్... ఐటీఐ ఈసారి ఇంటర్న్షిప్లకు వచి్చన దరఖాస్తుల్లో ప్రధాన రాష్ట్రాల్లో గ్రాడ్యుయేషన్ అభ్యర్థులు ఎక్కువగా ఉన్నారు. ఆ తరవాత పదో తరగతి అభ్యర్థులు ముందంజలో ఉండటం విశేషం. తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, యూపీలలో ఇదే పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం గ్రాడ్యుయేషన్ తరవాత ఐటీఐ వాళ్లు అధిక సంఖ్యలో ఉన్నారు. మే 20 నాటికి 4,710 దరఖాస్తులు వస్తే.. అందులో గ్రాడ్యుయేషన్ చేసినవాళ్లు 1,717 మంది కాగా, ఐటీఐ అభ్యర్థులు 1,040 మంది. అలాగే తెలంగాణలో 5,252 రాగా.. గ్రాడ్యుయేషన్ అభ్యర్థులు దాదాపు సగం అంటే.. 2,611 మంది ఉండటం విశేషం. రెండో రౌండ్లో.. రెండో రౌండ్లో కంపెనీల సంఖ్య పెరిగింది. మొదటి దశలో 280 వస్తే ఇప్పుడు 327 కంపెనీలు ముందుకొచ్చాయి. ఇవి సుమారు 1.19 లక్షల ఇంటర్న్షిప్ అవకాశాలు అందిస్తున్నాయి. దేశంలోని 36 రాష్ట్రాల్లోని 735 జిల్లాల్లో యువతకు.. 25 రంగాల్లో నైపుణ్యం పొందే అవకాశం లభించింది. ఈసారి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు దేశంలోని ప్రధాన రాష్ట్రాల్లోని యువత పోటీపడ్డారు. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, కర్ణాటక.. ఈ నాలుగు రాష్ట్రాల నుంచే దాదాపు 50 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి అత్యధిక ఇంటర్న్షిప్లు ఆఫర్ చేస్తున్న ప్రధాన రంగాలు.. చమురు, సహజవాయువు, ఇంధనం; పర్యాటకం, ఆతిథ్యం; బ్యాంకింగ్, ఆర్థిక సేవలు.. అత్యధిక ఇంటర్న్షిప్లు అందిస్తున్న టాప్ –3 రంగాలు. -
కొత్త కోర్సులకే ‘దోస్త్’
సాక్షి, హైదరాబాద్: డిగ్రీలో ఏ కోర్సులో చేరితే బెటర్ అంటూ విద్యార్థులు ఆరా తీస్తున్నారు. ఇటీవల దోస్త్ నోటిఫికేషన్ విడుదల కాగా, ఈ నెల 10వ తేదీ నుంచి విద్యార్థులు ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రక్రియ ఈ నెల 22 వరకూ కొనసాగుతుంది. ఇంజనీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రాథమిక కీ కూడా విడుదలైంది. దీని ఆధారంగా ఎన్ని మార్కులు వస్తాయనే అంచనాకు విద్యార్థులు వచ్చారు. ఈ కారణంగా దోస్త్కు ముందుగా దరఖాస్తు చేసేందుకు వారు ఆసక్తి చూపుతున్నారు. ఈసారి డిగ్రీలో అనేక కొత్త కోర్సులు ఉంటాయని, సిలబస్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాప్టర్లు తీసుకొస్తుండటంతో కొన్ని రకాల డిగ్రీ కోర్సుల్లో ఈసారి డిమాండ్ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇంజనీరింగ్ కన్నా మెరుగైనవి » ఇంజనీరింగ్ కన్నా మెరుగైన కోర్సులు డిగ్రీ స్థాయిలో కూడా ఉన్నాయి. అయితే, ఇవి ఎక్కువగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. తక్షణ ఉపాధి లభిస్తుందని, సాఫ్ట్వేర్ వైపు కూడా వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుందని కొన్ని కోర్సుల గురించి విద్యార్థులు ఎక్కువగా వాకబు చేస్తున్నారు. » బీకాంలో గతంలో సంప్రదాయ సబ్జెక్టులు ఉండేవి. ఇప్పుడు కొత్తగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ), ఈ–కామర్స్ ఆపరేషన్స్, రిటైల్ ఆపరేషన్స్ వంటి కోర్సులు వచ్చాయి. కరోనా తర్వాత ఈ–కామర్స్ పెరిగింది. ఆడిటింగ్ వ్యవస్థలోనూ డిజిటలైజేషన్కే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఈ–కామర్స్, కంప్యూటర్ అనుసంధానిత కోర్సులను ఎంచుకునేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. » బీఎస్సీలో మేథ్స్, బీజెడ్సీ వంటి కోర్సులే ప్రాధాన్యం సంతరించుకున్న పరిస్థితి మారిపోయింది. కానీ ఇప్పుడు బీఎస్సీలో టూరిజం అండ్ హాస్పిటాలిటీ ఆపరేషన్స్, డిజిటల్ ఇండస్ట్రీయల్ ఆపరేషన్స్, బీఎస్సీ మేథ్స్ డేటాసైన్స్, బీఎస్సీ ఆనర్స్ వంటి కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. దీంతోపాటు బీఎస్సీలోనూ ఏదైనా ఒక ఇతర సబ్జెక్టు చేసుకునే వీలుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని బీఎస్సీ మేథ్స్ విద్యార్థులు డేటాసైన్స్ వైపు ఆసక్తి చూపుతున్నారు. ఆప్షన్లో మా కాలేజీకి ప్రాధాన్యం ఇవ్వండి అంటూ.. గత ఏడాది దోస్త్ ఐదు దశలు నిర్వహించినా, ప్రైవేట్ కాలేజీల్లో 38 శాతమే సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులను ఆకర్షించేందుకు ప్రైవేట్ కాలేజీలు ప్రయత్ని స్తున్నాయి. ప్రతీ విద్యార్థికి ఫోన్లు చేసి, ఏజెంట్ల ద్వారా కలుసుకొని దోస్త్ ఆప్షన్లలో తమ కాలేజీకే ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. కొన్ని కాలేజీలు ప్రత్యేక రాయితీలు కూడా ఇస్తామంటున్నాయి. తొలిదశలో చేరిన వారికి రవాణా సౌకర్యం కల్పిస్తామని, బహుమతులు ఇస్తామని చెబుతున్నాయి. గ్రామీణ కాలేజీలు ఊరికో ఏజెంట్ను పెట్టుకొని మరీ విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. మీ–సేవ కేంద్రాలను కొన్ని కాలేజీలు మచ్చిక చేసుకుంటున్నాయి. కేంద్రాలకు వచ్చే వారిని తమ కాలేజీల వైపు మళ్లించాలని నజరానాలు ఇస్తున్నాయి. -
రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను వైభవంగా నిర్వహించాలి
సాక్షి, హైదరాబాద్: జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలని ఉన్నతాధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశించారు. వేడుకల ఏర్పాట్లపై గురువారం సచివాలయంలో సీఎస్ ఉన్నతాధికారులతో సమావేశమై సమీక్షించారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో ఘనంగా నిర్వహించనున్నట్లు సీఎస్ తెలిపారు. ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్ వద్ద చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులకు సీఎస్ దిశానిర్దేశం చేశారు. ఈ వేడుకల ఏర్పాట్లపై ప్రతి శాఖ నుంచి ఒక నోడల్ అధికారిని నియమించి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రముఖులు ప్రయాణించే మార్గాలలో అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, పరేడ్ గ్రౌండ్స్కు వచ్చే వాహనాలకు అసౌకర్యం కలగకుండా పార్కింగ్ ఏర్పాట్లు చేసి ట్రాఫిక్ రూట్ మ్యాప్ను సిద్ధం చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు. వర్షాలను దృష్టిలో పెట్టుకొని వాటర్ ప్రూఫ్ షామియానాలు, బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆర్అండ్బీ శాఖను ఆదేశించారు. సభా ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనుల నిర్వహణతోపాటు తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. పండుగ వాతావరణాన్ని తలపించేలా కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సాంస్కృతిక శాఖను ఆదేశించారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని దీంతో పాటు జనరేటర్ బ్యాకప్ సైతం ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖకు సూచించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు లైవ్ టెలికాస్ట్ ఏర్పాట్లు చేయాలని సమాచార శాఖ కమిషనర్ను ఆదేశించారు.అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలన్నారు. సమీక్షలో డీజీపీ జితేందర్, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్రాజ్, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, సమాచార పౌర సంబంధాల కమిషనర్ హరీశ్, జలమండలి ఎండీ అశోక్రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
తాగునీటి కోసం కృష్ణా జలాల కేటాయింపు
సాక్షి, హైదరాబాద్/ నాగార్జునసాగర్: తాగునీటి అవసరాల కోసం తెలంగాణకు 10.26, ఆంధ్రప్రదేశ్కు 4 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయిస్తూ కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) చైర్మన్ అతుల్ జైన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ కుడి కాలువ ద్వారా ఈనెల 22 నుంచి అంటే గురువారం నుంచే రోజుకు 5,500 క్యూసెక్కుల చొప్పున 4 టీఎంసీలను విడుదల చేయాలని సాగర్ సీఈని ఆదేశించారు. శ్రీశైలం ప్రాజెక్టులో జూలై 31 నాటికి 800 అడుగుల స్థాయిలో నీరు నిల్వ ఉండేలా చూసి.. మిగతా నీటిని విడ్యుదుత్పత్తి చేస్తూ సాగర్కు తరలించాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్లలో నీటి లభ్యతను సమీక్షించి.. కేటాయింపులపై బోర్డు చైర్మన్కు సిఫార్సు చేసేందుకు ఈనెల 5న హైదరాబాద్లో త్రిసభ్య కమిటీ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి తెలంగాణ ఈఎన్సీ హాజరుకాగా, ముందస్తు షెడ్యూలు వల్ల ఏపీ ఈఎన్సీ హాజరుకాలేదు. కాగా, రాష్ట్రంలో తాగునీటి అవసరాల కోసం 10.26 టీఎంసీలు కేటాయించాలని తెలంగాణ ఈఎన్సీ త్రిసభ్య కమిటీ సమావేశంలో కోరారు. అలాగూ తాగునీటి అవసరాల కోసం పది టీఎంసీలు విడుదల చేయాలని ఈనెల 20న ఏపీ ఈఎన్సీ కృష్ణా బోర్డు చైర్మన్కు లేఖ రాశారు. శ్రీశైలంలో ఈనెల 5 నాటికి 800 అడుగులకు ఎగువన, సాగర్లో 510 అడుగులకు ఎగువన 10.81 టీఎంసీలు మాత్రమే లభ్యతగా ఉన్నాయని తెలంగాణ ఈఎన్సీ కృష్ణా బోర్డుకు లేఖ రాశారు. ఇదిలా ఉండగా రెండు రాష్ట్రాల తాగునీటి అవసరాలు తీర్చడానికి శ్రీశైలంలో 800 అడుగుల వరకూ.. సాగర్లో 505 అడుగుల స్థాయి వరకూ నీటిని వినియోగించుకోవాలని కృష్ణా బోర్డు నిర్ణయించింది. బుధవారం సాయంత్రానికి శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగులకు ఎగువన 8.422, సాగర్లో 505 అడుగులకు ఎగువన 12.793.. వెరసి మొత్తం 21.215 టీఎంసీలు లభ్యతగా ఉన్నట్లు బోర్డు లెక్కగట్టింది. ఇందులో 4.243 టీఎంసీలు ఆవిరి, ప్రవాహ నష్టాలుపోనూ 16.972 టీఎంసీల్లో తెలంగాణకు 10.26, ఆంధ్రప్రదేశ్కు 4 టీఎంసీల చొప్పున బోర్డు కేటాయించింది. కాగా, కేఆర్ఎంబీ ఆదేశాలతో ప్రాజెక్టు అధికారులు సాగర్ కుడికాలువకు గురువారం 5,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. రోజుకు 5,500 క్యూసెక్కుల చొప్పున 8 రోజుల పాటు 4 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కుడి కాలువ పరిధిలోని చెరువులు, కుంటలను నింపుకొని తాగునీటి అవసరాలకు వాడుకోవాలని బోర్డు అధికారులు సూచించారు. -
నంబాల అంత సులువుగా ఎలా?
సాక్షి ప్రతినిది, భద్రాద్రి కొత్తగూడెం: సాయుధ పోరాటం ద్వారా విప్లవం సాధించాలని ప్రయత్నిస్తున్న అతి పెద్ద పార్టీగా దేశంలో గుర్తింపు ఉన్న భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఎన్కౌంటర్లో చనిపోయినట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ ఎన్కౌంటర్పై పలువురు సామాజిక కార్యకర్తలు, పౌరహక్కులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నేతల్లో ప్రత్యక్షంగా, సామాజిక మాధ్యమాల్లో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అనారోగ్య కారణాలతో ఒడిశాలో రహస్యంగా చికిత్స పొందుతున్న నంబాలను పట్టుకుని ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ చేశారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. అప్పట్నుంచీ ఒక్క ఫొటో కూడా లేదు సాయుధ పోరాట మార్గం ఎంచుకున్నప్పటి నుంచి నంబాల కేశవరావు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించేవాడని ఆ పార్టీకి చెందిన సానుభూతిపరులు, మాజీ మావోయిస్టులు చెబుతున్నారు. తినడం, పడుకోవడం ఇలా ప్రతి అంశంలో జాగ్రత్తలు తీసుకునేవాడని తెలుస్తోంది. అజ్ఞాత జీవితం గడిపే వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ఫొటోలు, ఛాయా చిత్రాలు, ఇతర ఆనవాళ్లు బయట పడకుండా జాగ్రత్త పడాలని తోటి కామ్రేడ్లకు చెప్పేవాడని అంటున్నారు. తాను స్వయంగా ఫోన్లకు దూరంగా ఉండటమే కాకుండా.. తాను ఉన్న ప్రదేశంలోనూ ఫోన్లు, కెమెరాలకు అనుమతి ఇచ్చేవాడు కాదని తెలుస్తోంది. ఈ కారణంగానే 45 ఏళ్ల అజ్ఞాత జీవితంలో ఆయనకు సంబంధించిన ఒక్క ఫొటో కూడా బయటకు రాలేదు. ఎంతో జాగ్రత్తగా ఉండే వ్యక్తి ఎన్కౌంటర్కు గురి కావడం, 45 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లడమే కాకుండా కనీసం ఫొటోలు కూడా చూసిన దాఖలాలు లేని నేపథ్యంలో..వెనువెంటనే అతన్ని భద్రతా దళాలు గుర్తించడం సందేహాస్పదమన్న వాదనలు వినిపిస్తున్నాయి. మూడే ఏకే 47లు ఎలా? మావోయిస్టు పార్టీ చీఫ్గా ఉన్న నంబాల కేశవరావుకు మూడంచెల భద్రత సర్వసాధారణంగా ఉంటుంది. సాధారణ పరిస్థితుల్లో వందకు పైగా, క్లిష్టమైన పరిస్థితులు ఉంటే కనీసం 70కి తక్కువ కాకుండా రక్షణ దళం ఉంటుందని, వీరిలో కనీసం 40 మంది ఏకే 47 వంటి తుపాకులు వినియోగిస్తారని ఆయనతో కలిసి పనిచేసిన మాజీ మావోలు చెబుతున్నారు. కానీ నారాయణపూర్ ఎన్కౌంటర్ ఘటనలో 27 మంది మావోయిస్టులు చనిపోగా 28 ఆయుధాలను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. ఇందులో ఏకే 47 తుపాకులు కేవ లం మూడే ఉన్నాయి. ఎస్ఎల్ఆర్లు 4, 303 రైఫిళ్లు 6, 12 ఇంచ్ బోర్ తుపాకులు 5, ఇన్సాస్లు 6, బ్యారెల్ గ్రనేడ్ లాంచర్లు 3, కార్బన్ తుపాకీ 1 ఉన్నాయి. చనిపోయిన వారిలో నంబా ల, నవీన్, టిప్పులు డివిజన్ ఆ పైస్థాయి నేతలు గా ఉన్నారు. దీంతో మూడు ఏకే 47లు దొరికాయనుకున్నా, మాజీలు చెబుతున్నట్టు ప్రధాన కార్యదర్శికి రక్షణ కల్పించే దళానికి ఉండాల్సిన సంఖ్యలో అక్కడ ఏకే 47లు లభ్యం కాకపోవడాన్ని కొందరు ప్రస్తావిస్తుండటం గమనార్హం. జనంలోకి రాబట్టే జుట్టుకు రంగు? సాధారణంగా అజ్ఞాత జీవితం గడిపే మావోయిస్టులు పొదుపుగా వనరులు ఉపయోగిస్తుంటారు. పాలు, చక్కెర, టీపొడి వంటి నిత్యావసరాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కానీ నంబాల కేశవరావు హెయిర్ డై వాడినట్టుగా ఫొటోల్లో కనిపించడం అసాధారణంగా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. అనారోగ్య సమస్యల కారణంగా అజ్ఞాతం వీడి జనబాహుళ్యంలోకి నంబాల వచ్చారని, అందువల్లే బయట పరిస్థితులకు తగ్గట్టుగా హెయిర్ డై వాడటం, క్లీన్ షేవ్ చేసుకోవడం వంటివి జరిగి ఉండవచ్చని అంటున్నారు. అయితే రహస్యంగా చికిత్స పొందుతున్న అంశంపై పక్కా సమాచారం అందడంతో పోలీసులు చాకచక్యంగా దాడి చేసి పట్టుకున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. డీఆర్జీ బలగాల పనేనా? నారాయణపూర్ ఆపరేషన్లో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ (డీఆర్జీ) బలగాలు పాల్గొన్నట్లు పోలీసులు ప్రకటించారు. అయితే.. జంగిల్ వార్ఫేర్లో శిక్షణ పొందిన కోబ్రా బలగాలు, యుద్ధతంత్రాల్లో ఆరితేరిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో టిబెటన్ పోలీస్ ఫోర్స్, ఆధునిక ఆయుధాలు ఉపయోగించే సీఆర్పీఎఫ్ జవాన్లతో సాధ్యం కానిది కేవలం నాలుగు జిల్లాలకు చెందిన మాజీ మావోలతో కూడిన డీఆర్జీ బలగాలు మావోయిస్టు చీఫ్ను ఎన్కౌంటర్ చేయడం ఎలా సాధ్యమైందనే వాదన విన్పిస్తోంది. అయితే మావోయిస్టు పార్టీ చీఫ్ను పట్టుకునేందుకు దశాబ్దాల తరబడి శ్రమిస్తున్నామని, వందలాది మంది పోలీసులు నిరంతరం ఇదే పనిలో ఉన్నారని, చివరకు తమ కష్టం ఫలించి నంబాల ఆచూకీ తెలుసుకున్నామని, లొంగిపోమ్మని చెబితే వినకుండా కాల్పులు జరపడం వల్లే ఎన్కౌంటర్లో ఆయన ప్రాణాలు కోల్పోయారని, చాలామంది మావోయిస్టులు ఘటనా స్థలి నుంచి తప్పించుకున్నారని పోలీసు వర్గాలు అంటున్నాయి. గోప్యత ఎందుకు: విరసం నంబాల కేశవరావు మరణం, పోస్టుమార్టం, భౌతికకాయాన్ని బంధువులకు అప్పగించే విషయం.. ప్రతిచోటా పోలీసులు గోప్యతను ఎందుకు పాటిస్తున్నారో అర్థం కావటం లేదని విప్లవ రచయితల సంఘం (విరసం) పేర్కొంది. భౌతికకాయం కోసం గురువారం జగదల్పూర్కు వెళ్లిన కేశవరావు సోదరులను దూరం నుంచే పోలీసులు వెనక్కు పంపించారని తెలిపింది. దీనివెనుక ఉద్దేశం ఏంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేసింది. -
మార్చికి ముందే మావోయిస్టుల అంతం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: దేశాన్ని 2026 మార్చి 31 నాటికి మావోయిస్టు విముక్తి ప్రాంతంగా మారుస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్షా చెప్పారని, కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అంతకుముందే మావోయిస్టుల నిర్మూలన జరిగే అవకాశం ఉందని ఛత్తీస్గఢ్ డీజీపీ అరుణ్దేవ్ గౌతమ్ అన్నారు. అబూజ్మఢ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మరణించడంతో దేశానికి మంచిరోజులు వచ్చాయని వ్యాఖ్యానించారు. మావోయిస్టుల కారణంగా ఎంతోమంది అమాయక ప్రజలు మృత్యువాత పడ్డారని అన్నారు. నంబాల మృతదేహంతో పాటు ఎన్కౌంటర్లో మరణించిన మొత్తం 27 మంది మృతదేహాలను గురువారం నారాయణపూర్ జిల్లా కేంద్రానికి తీసుకొ చ్చారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన డీజీపీ ఎన్కౌంటర్ జరిగిన తీరుతెన్నుల గురించి స్థానిక పోలీసులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మావోయిస్టులకు భారీ నష్టం కేంద్ర కమిటీకి చెందిన అగ్రనాయకులు ఉన్నారనే పక్కా సమాచారంతో మే 19 నుంచి ఆపరేషన్ చేపట్టామని డీజీపీ చెప్పారు. నంబాల వంటి అగ్రనేత మృతి మావోయిస్టు పార్టీకి తీరని నష్టం చేకూరుస్తుందని అన్నారు. ఛత్తీస్గఢ్ పోలీసులకు ఇదో గొప్పరోజని వ్యాఖ్యానించారు. ఎదురుకాల్పుల్లో ఒక జవాన్ మరణించాడని, మరికొందరు గాయపడినా ప్రాణాపాయం లేదని తెలిపారు. మరికొందరు మావోయిస్టులు కూడా తీవ్రంగా గాయçపడి తప్పించుకున్నారని, వారిని పట్టుకునేందుకు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నామని చెప్పారు. మృతుల్లో కాయ్ –7కి చెందినవారే ఎక్కువ ఎన్కౌంటర్లో మొత్తం 27 మంది చనిపోగా అందులో 13 మంది పురుషులు 14 మంది మహిళలు ఉన్నారు. మృతుల్లో నంబాల కేశవరావుతో పాటు స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు, జంగ్ పత్రిక నిర్వాహకుడు, సెంట్రల్ కమిటీ, సెంట్రల్ రీజనల్ బ్యూరో స్టాఫ్గా ఉన్న నవీన్ అలియాస్ మధు అలియాస్ పజ్జా వెంకట నాగేశ్వరరావు, సీవైపీసీ కమాండర్ రోషన్ అలియాస్ టిప్పు ఉన్నారు. కేశవరావు, మధు, టిప్పును మినహాయిస్తే మిగిలిన వారంతా సుప్రీం కమాండర్కు రక్షణ కల్పించే దళమైన కాయ్ –7కి చెందినవారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మృతుల్లో నంబాల కేశవరావు, జంగు నవీన్ అలియాస్ మ«ధు, రోషన్ అలియాస్ టిప్పు (సీవైపీసీ ఇన్చార్జ్/కమాండర్) కీలక నేతలుగా ఉన్నారు. వీరితో పాటు నంబాలకు రక్షణ కల్పించే కాయ్–7 కంపెనీకి చెందిన సునీల్, కుర్సం విజా, రవి, సూర్య అలియాస్ సంతు, తెల్లం రాజేశ్, గుడ్డు అలియాస్ ఉంగా, ఓయం రాజు, కోసా హోడి, వివేక్ అలియాస్ ఉగేంద్ర, ఓది భద్రు, బుచ్చి అలియాస్ రామే, భీమే ఆలియాస్ మడావి, భూమిక, లక్ష్మీ అలియాస్ కమ్ల, పొడియం జమున, గీతా, సోమ్లీ అలియాస్ సజ్జంతి, రేష్మా పొడియం, రాగో, సంగీత, సరిత అలియాస్ మాంకో, హిడిమే, అవలం కల్పన, మడావి క్రాంతి మరణించినట్లు పోలీసులు ప్రకటించారు. నంబాలతో పాటు నవీన్ ఏపీకి చెందిన వారు కాగా వివేక్ (30)తో పాటు భూమిక, సంగీత తెలంగాణ ప్రాంతానికి చెందిన వారని తెలిపారు. కేశవరావు మృతదేహం హెలికాప్టర్ ద్వారా.. కేశవరావు మృతదేహాన్ని గురువారం ఉదయం హెలికాప్టర్ ద్వారా నారాయణపూర్ జిల్లా కేంద్రానికి తరలించారు. అక్కడ పోలీస్ లైన్స్లో మిగతా అందరి మృతదేహాలతో పాటు ఎన్కౌంటర్లో స్వా«దీనం చేసుకున్న ఆయుధాలను ప్రదర్శించారు. ఎన్కౌంటర్లో చనిపోయిన ఇతర మావోల మృతదేహాలకు తెల్లని కవర్లు చుట్టగా కేశవరావుకు మాత్రం నల్లని కవర్ చుట్టారు. గురువారం సాయంత్రం పోస్టుమార్టం నిర్వహించారు. -
సీఎం రేవంత్లో అపరిచితుడు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిలో ఒక అపరిచితుడు ఉన్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆయనకు ’మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్’ అనే భయంకరమైన మానసిక రుగ్మత ఉండటంతో ఒకే అంశంపై రోజుకో రీతిలో మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణ భవన్లో గురువారం కేటీఆర్ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ‘పర్సంటేజీల పాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు నోటీసులు అంటూ కాంగ్రెస్ నీచ రాజకీయాలు చేస్తోంది. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారం సుప్రీంకోర్టు సాక్షిగా తేలి పోయి నిజాలు బయటకు వచ్చాయి. కాళేశ్వరంపై కాంగ్రెస్, బీజేపీ కలసికట్టుగా చేస్తున్న దు్రష్పచారం కూడా త్వరలో తేలిపోతుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం నియమించిన పీసీ ఘోష్ తన విచారణ పూర్తయిందని, నివేదిక సిద్ధంగా ఉందని చెప్పారు. కానీ తిరిగి కమిషన్ గడువును ఎందుకు పొడిగించారో చెప్పాలి’అని డిమాండ్ చేశారు. కాళేశ్వరం అంశానికి సంబంధించి కేసీఆర్, హరీశ్రావుకు నేరుగా నోటీసులు అందినట్లు సమాచారం లేదని కేటీఆర్ తెలిపారు. నోటీసులు అందిన తర్వాత విచారణకు హాజరు కావడంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్ని బరాజ్లను కూలగొట్టి మళ్లీ టెండర్లు పిలవడం ద్వారా 20 నుంచి 30 శాతం కమీషన్లు తీసుకోవాలన్నదే ఈ నోటీసుల వెనుక ఉన్న అసలు ఎజెండా అని ఆరోపించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. రాష్ట్రంలో 500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే సీఎం అందాల పోటీల్లో తలమునకలై ఉన్నారని కేటీఆర్ విమర్శించారు. అన్నదాతల ధాన్యం వర్షంలో కొట్టుకుపోతుంటే.. రేవంత్ అందాల పోటీలకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గుల్జార్ హౌస్లో అతిపెద్ద అగ్ని ప్రమాదం జరిగితే కనీసం చూడటానికి కూడా వెళ్లని సీఎం.. అందాల పోటీలకు మాత్రం నాలుగు సార్లు హాజరయ్యారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఒక్క రూపాయి కూడా లేదంటూనే అందాల పోటీలకు రూ.200 కోట్లు ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. మంత్రులంతా మిస్వరల్డ్ పోటీదారులకు టూర్ గైడ్లుగా మారిపోయారని ఎద్దేవా చేశారు. మిస్ వరల్డ్ పోటీదారులకు బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులను చూపిస్తున్నారని, నిజాంలు, కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులు మినహా చూపించేందుకు కాంగ్రెస్ కట్టిన ఒక్క ప్రాజెక్టు కూడా లేకుండా పోయిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. అభిప్రాయభేదాలు సహజంరాజకీయ పార్టీల్లో అభిప్రాయ భేదాలు సహజమని కేటీఆర్ అన్నారు. ‘నలుగురు కుటుంబ సభ్యులు ఉన్న ఇంట్లోనే కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు వస్తాయి. అలాంటిది లక్షల మంది కార్యకర్తలు ఉన్న పార్టీలో అభిప్రాయ భేదాలు ఉండడం సహజమే. వాటిని పక్కనపెట్టి అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తే వారి గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పని చేయాలి’అని సూచించారు. గురువారం హైదరాబాద్లో తనను కలిసిన నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
నిలోఫర్లో ప్రైవేట్ మందుల దుకాణం కూల్చివేత
సాక్షి, హైదరాబాద్: నిలోఫర్ ఆస్పత్రిలో రాత్రికి రాత్రే నిర్మించిన మందుల దుకాణాన్ని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశాల మేరకు అధికారు లు తొలగించారు. గురువారం నాంపల్లి తహసీల్దార్, ఇతర సిబ్బంది ఆస్పత్రి భవనం ఎదురుగా నిర్మించిన దుకాణాన్ని కూల్చివేయించారు. ‘రాత్రికి రాత్రే కట్టేశారు’శీర్షికన నిలోఫర్ ఆస్పత్రి ఆవరణలో ప్రైవేట్ మందుల దుకాణ నిర్మాణంపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం ఆరోగ్యశాఖలో చర్చనీయాంశమైంది. దీనిపై సీఎం కార్యాలయంతోపాటు మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తూను వివరణ కోరినట్టు సమాచారం. నిలోఫర్ ఆస్పత్రిలో ప్రైవేటు మందుల దుకాణం ఏర్పాటుకు సంబంధించిన అంశంపై విచారణ జరిపి వివరణ ఇవ్వాలని వైద్యవిద్య సంచాలకులు డాక్టర్ నరేంద్రకుమార్కు ఆదేశించారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్పందిస్తూ నిలోఫర్ ఆస్పత్రి క్యాంపస్లో నిర్మాణా లకు ఎవరికి అనుమతి ఇవ్వ లేదని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. మెడికల్ షాపు కోసం డీఎంఈ, కలెక్టర్ నుంచి అనుమతులు తీసుకున్నామని ఆస్పత్రి సూపరింటెండెంట్ చెప్పడం అవాస్తవమని కలెక్టర్ తెలిపారు. ఎవరి కోసం?: నిలోఫర్ ఆస్పత్రిలో ప్రైవేట్ మందుల దుకాణం కోసం ఏకంగా పార్కు స్థలంలోనే కాంక్రీట్ కట్టడం నిర్మించిన తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. సీఎం కార్యాలయ ఆదేశాలతో మంత్రి దామోదర, కలెక్టర్లతో చర్చించి మందుల దుకాణం ఏర్పాటుకు అనుమతి ఇచ్చినట్టు నిలోఫర్ సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్ ‘సాక్షి’కి ఫోన్లో తెలియజేశారు. ఎమర్జెన్సీలో అవసరమైన మందుల కోసం వైద్యులు ఎదురుచూసే పరిస్థితి లేకుండా ఆస్పత్రి ఆవరణలోనే మందుల దుకాణం పెట్టాలని అందరితో చర్చించి నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పారు. అయితే మంత్రి, కలెక్టర్, డీఎంఈలు సూపరింటెండెంట్ ప్రకటనను తోసిపుచ్చిన నేపథ్యంలో మందుల దుకాణం అంశం మళ్లీ చర్చనీయాంశమైంది. నిజంగానే సీఎంఓ స్థాయిలో సూపరింటెండెంట్ను ప్రభావితం చేసేలా ఒత్తిళ్లు వచ్చా యా అని ఆరోగ్యశాఖలో చర్చ నడుస్తోంది. హైదరాబాద్లోని ప్రఖ్యాత ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులలో నిర్వహిస్తున్న మందుల దుకాణాలపై కూడా మంత్రి దృష్టి పెట్టాల్సిన అవసరముంది. ప్రభుత్వమే రోగులకు ఉచితంగా మందులు అందజేస్తున్నప్పుడు ప్రైవేట్ మందుల దుకాణాలకు అనుమతి ఎందుకు ఇస్తారనే ప్రజల అనుమానాలను నివృత్తి చేయాల్సి ఉంది. -
మావోయిస్టుల కొత్త చీఫ్ ఎవరు?
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయి స్టు పార్టీ సుప్రీం కమాండర్, కేంద్ర ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో చనిపోవడంతో, ఆ బాధ్యతలు ఎవరికి దక్కుతాయనే అంశంపై ఆ పార్టీ వర్గాలు, సానుభూతిపరుల్లో చర్చ మొదలైంది. మరోవైపు పార్టీకి కమాండర్ ఇన్ చీఫ్ హోదాలో ఎవరు రావచ్చనే దానిపై ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఆరా తీస్తూ అంచనాలు వేస్తున్నట్టు సమాచారం. కేంద్ర కమిటీయే కీలకం.. భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) 2004లో ఏర్పాటైనప్పుడు కేంద్ర కమిటీలో 32 మంది సభ్యులు ఉండేవారు. అయితే వరుస ఎన్కౌంటర్లు, సహజ మరణాల నేపథ్యంలో ఈ సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఈ ఏడాది జరిగిన ఎన్కౌంటర్లలోనే నంబాల కేవశరావు, ప్రయాగ్ మాంఝీ, చలపతి వంటి కేంద్ర కమిటీ సభ్యులు మృతి చెందారు. ప్రస్తుతం కేంద్ర కమిటీలో 17 మంది సభ్యులే ఉన్నట్టు సమాచారం.2004 నుంచి గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావు పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. అనారోగ్య కారణాలతో ఆయన ఆ బాధ్యతల నుంచి తప్పుకోగానే సెంట్రల్ మిలిటరీ కమిషన్ (సీఎంసీ) బాధ్యతలు చూస్తున్న నంబాల కేశవరావు పార్టీ చీఫ్గా 2018 నవంబర్లో బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆయన ఎన్కౌంటర్లో చనిపోవడంతో గత సంప్రదాయాన్ని అనుసరిస్తూ ప్రస్తుతం సీఎంసీ కమాండర్గా ఉన్న తిప్పిరి తిరుపతి ఆలియాస్ దేవ్జీకి ఈ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. పదేళ్ల కిందట కూడా ఒకసారి పార్టీ చీఫ్ పదవికి తిరుపతి పేరు తెరపైకి వచి్చంది. అయితే కార్యరూపం దాల్చలేదు. ఈసారి తెలుగేతర వ్యక్తి? మరోవైపు కేంద్ర కమిటీ, పొలిట్బ్యూరో సభ్యుడిగా, అధికార ప్రతినిధిగా పలు బాధ్యతలు నిర్వహిస్తున్న మల్లోజుల వేణుగోపాల్ (మల్లోజుల కోటేశ్వరరావు సోదరుడు) పేరు కూడా విని్పస్తోంది. పార్టీ ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నందున మిలిటరీ విభాగం కంటే పొలిట్బ్యూరో సభ్యులకే అవకాశం ఇచ్చేందుకు ఆస్కారం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే వరుసగా రెండుసార్లు తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలకే అవకాశం దక్కినందున ఈసారి తెలుగేతర నేతలకు అవకాశం ఇవ్వవచ్చని, పశ్చిమ బెంగాల్కు చెందిన రాజా పేరును పరిశీలనలోకి తీసుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. హిడ్మాకు సీఎంసీ బాధ్యతలు! గడిచిన దశాబ్ద కాలంగా మావోయిస్టు పార్టీకి ఆదివాసీలు.. అందునా మహిళలే దన్నుగా నిలుస్తూ వస్తున్నారు. ఆపరేషన్ కగార్ మొదలైన తర్వాత జరుగుతున్న భారీ ఎన్కౌంటర్లు అన్నింట్లోనూ మహిళా మావోయిస్టులే ఎక్కువగా చనిపోతున్నారు. మావోయిస్టు ఉద్యమంలో మహిళల పోషిస్తున్న భూమికను దృష్టిలో ఉంచుకుని సెంట్రల్ రీజనల్ బ్యూరోలో ఉన్న మాధవి అలియాస్ సుజాతకు ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించవచ్చని, అదే సమయంలో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కంపెనీ వన్ కమాండర్గా ఉన్న మడావి హిడ్మాకు సీఎంసీ బా«ధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. సమష్టి నాయకత్వం! పీపుల్స్ వార్ పార్టీలో కొండపల్లి సీతారామయ్య తిరుగులేని విధంగా ఏకఛత్రాధిపత్యం చూపారు. దీన్ని ఇతర పార్టీ నేతలు నిరసించారు. కొండపల్లి తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టిన ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి గతాన్నికి భిన్నంగా ఉమ్మడి నాయకత్వం వైపు మొగ్గు చూపారు. అందువల్లే సెంట్రల్ కమిటీ, సెంట్రల్ రీజనల్ బ్యూరో, పొలిటికల్ బ్యూరో, సెంట్రల్ మిలిటరీ కమిషన్ వంటివి ఏర్పాడ్డాయి. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో సమష్టి నాయకత్వం వైపు మొగ్గు చూపవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీని ప్రకారం ప్రతి కమిటీకి ఒకరికి మించి నాయకులు ఉండే విధానం అవలంబించవచ్చని అంటున్నారు. -
గ్రూప్–2 తుది జాబితా విడుదల
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–2 ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థుల తుది జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ గురువారం విడుదల చేసింది. మొత్తం 783 ఉద్యోగాలకు గాను 777 మంది మాత్రమే ఎంపికయ్యారు. ఇందులో ఇద్దరు స్పోర్ట్స్ కోటా అభ్యర్థులున్నారు. అభ్యర్థుల జాబితాను కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. తుది జాబితాలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈనెల 29 నుంచి జూన్ 10వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నట్లు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికొలస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు, ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ పరిశీలన కొనసాగుతుంది. పెండింగ్ ధ్రువపత్రాల సమర్పణకు జూన్ 11వ తేదీని కమిషన్ రిజర్వ్ చేసింది. సురవరం వర్సిటీలో ధ్రువపత్రాల పరిశీలన నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ సమీపంలో ఉన్న సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీ (పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ)లో ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని టీజీపీఎస్సీ వెల్లడించింది. అభ్యర్థుల హాల్టిక్కెట్ నంబర్ల వారీగా పరిశీలన షెడ్యూల్ను ఈనెల 26న వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని తెలిపింది. అభ్యర్థులు పూర్తిస్థాయి సరి్టఫికెట్లతో హాజరు కావాలని, ఏవైనా కారణాలతో పరిశీలనకు గైర్హాజరైతే తదుపరి అవకాశం ఉండదని స్పష్టం చేసింది. ఉద్యోగాలకు అభ్యర్థులు తగ్గితే (షార్ట్ఫాల్) తదుపరి మెరిట్ నుంచి ఎంపిక చేసి పరిశీలన ప్రక్రియ పూర్తి చేస్తామని వివరించింది. ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియకు సమాంతరంగా వెబ్ ఆప్షన్ల ప్రక్రియ జరుగుతుంది. 2022లో నోటిఫికేషన్ గ్రూప్–2 సర్విసులకు సంబంధించి 18 కేటగిరీల్లో 783 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ 2022 డిసెంబర్ 29న నోటిఫికేషన్ జారీ చేసింది. 2023 జనవరి 18నుంచి ఫిబ్రవరి 16వ తేదీ వరకు... దాదాపు నెలరోజుల పాటు ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరించింది. 5,51,855 మంది దరఖాస్తు చేసుకోగా పరీక్షలు దాదాపు మూడుసార్లు వాయిదా పడ్డాయి. చివరకు గతేడాది డిసెంబర్ 15, 16 తేదీల్లో.. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో ఏర్పాటు చేసిన 1,368 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించింది. అయితే 2,49,964 మంది అభ్యర్థులు మాత్రమే నాలుగు పేపర్లు రాశారు. అయితే 777 మంది మాత్రమే ఉద్యోగాలకు ఎంపికయ్యారు. -
సీఎం రేవంత్ ఓఎస్డీనంటూ బెదిరింపులు.. మాజీ క్రికెటర్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డి ఓఎస్డీ పేరుతో బెదిరింపులకు దిగుతున్న శ్రీకాకుళానికి చెందిన ఆంధ్రా మాజీ రంజీ క్రికెటర్ బుడుమూరు నాగరాజును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా పొలాకి మండలం యవ్వారిపేటకు చెందిన నాగరాజు ర్యాపిడో, కంట్రీ డిలైట్ ఎండీలకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాదులు అందడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.తాను సీఎం ఓఎస్డీ అని చెప్పుకొంటూ పలు రియల్ ఎస్టేట్ కంపెనీల ఛైర్మన్లకు వాట్సాప్ మెసేజ్లు పంపినట్లు పోలీసులు గుర్తించారు. ఓఎస్డీ పేరుతో నాగరాజు ఫేక్ ఈ మెయిల్ క్రియేట్ చేసినట్టు పోలీసులు నిర్థారించారు. నాగరాజును శ్రీకాకుళంలోఅదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్టు సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాజీ క్రికెటర్ నాగరాజుపై 30 కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. శ్రీకాకుళంలో నాగరాజును అరెస్ట్ చేసిన పోలీసులు.. హైదరాబాద్కు తరలించారు. -
కేసీఆర్కు కవిత లేఖ.. ఆది శ్రీనివాస్ రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్లో ముసలం తారాస్థాయికి చేరుకుందని.. కల్వకుంట్ల కవిత రాసిన లేఖతో లుకలుకలు బయటపడ్డాయంటూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. బీజేపీతో బీఆర్ఎస్ కలిసి పనిచేస్తుందంటూ మేం చెబుతున్న మాటలను కవిత సమర్థించారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి కేసీఆర్ సిద్దమతున్నారని కవిత చెప్పకనే చెప్పింది. బీజేపీపైన పల్లెతు మాట మాట్లాడకుండా.. కేసీఆర్ వ్యవహరించిన తీరును కవిత కడిగి పారేసింది’’ అని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.‘‘భవిష్యత్తులో బీఆర్ఎస్, బీజేపీ పొత్తు పెట్టుకోబోతున్నాయి. బీఆర్ఎస్ బలహీనపడటం వల్లనే బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నట్లు కవిత అంగీకరించారు. కవిత పచ్చి నిజాలు మాట్లాడారు.. ఆ మాటలనే మేం చాలా కాలంగా చెబుతున్నాం. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ నియంతృత్వ వైఖరిని కూడా కవిత నిలదీశారు. పార్టీ రజతోత్సవ వేడుకల్లో కేసీఆర్ ఒక్కరే ప్రసంగించడాన్ని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్ వైఖరిని ఆయన కూతురే తప్పుపడుతోంది. ఇక ప్రజలకు వాళ్లేమీ సమాధానం చెబుతారు. కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారని కవిత తేల్చి చెప్పింది’’ అని ఆది శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.‘‘పార్టీ నాయకులను కలవకుండా ఏకపక్ష పోకడలకు పోతున్నారని ఆమె ధ్వజమెత్తారు. కవిత లేఖ పైన బీఆర్ఎస్ నాయకత్వం స్పందించి ప్రజలకు సమాధానం చెప్పాలి. మా సీఎం రేవంత్ రెడ్డి మీద ఒంటి కాలిపైన లేస్తున్న కేటీఆర్ ముందు తన చెల్లికి సమాధానం చెప్పాలి. కవితకు సమాధానం చెప్పకుండా ఇతర పార్టీలను విమర్శించే నైతిక హక్కు కేటీఆర్కు లేదు. కల్వకుంట్ల కుటుంబంలో లుకలుకలు ఉన్నాయి. అలిగిన హరీష్ రావు ఇంటికి వెళ్లి కేటీఆర్ బతిమాలుకున్నాడు...కవిత లేఖతో బీఆర్ఎస్ పార్టీ ఇద్దరికి మాత్రమే పరిమితం అయిందని తేలింది. గత పదేళ్లలో కేసీఆర్ హయాంలో జరిగిన దోపిడి గురించి కూడా కవిత ప్రశ్నిస్తే బాగుంటుంది. పంపకాలు, పదవుల్లో తేడా వచ్చి కుటుంబంలో లేఖలు రాసుకుంటున్నారు. బీఆర్ఎస్ పని ఇక అయిపోయింది. కేటీఆర్.. ముందు నీ ఇళ్లు సరిదిద్దుకో. అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్లోనే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యాడు. కేసీఆర్ తీరును ఆయన కూతురే తప్పుపడుతోంది.. ప్రజలకు ఆయన సమాధానం చెప్పాలి.’’ అంటూ ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. -
‘మై డియర్ డాడీ’ అంటూ.. కేసీఆర్కు కవిత సంచలన లేఖ
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ఆ లేఖ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. వరంగల్ సభ సక్సెస్ అయ్యిందంటూనే లేఖ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కేసీఆర్కు ఆరు పేజీల లేఖలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. మై డియర్ డాడీ అంటూ కేసీఆర్కు రాసిన ఆరు పేజీల లేఖలో వరంగల్ సభ సక్సెస్ అయ్యిందంటూనే.. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ ఏడాది ఏప్రిల్ 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్ని నిర్వహించింది. ఆ వేడుకలపై తన అభిప్రాయాలను తెలుపుతూ మే 2న కేసీఆర్కు రాసిన లేఖలో కవిత ప్రస్తావించారు. సభపై పాజిటీవ్, నెగిటీవ్ అంశాలను ఆ లేఖలో పేర్కొన్నారు. 👉పాజిటీవ్ అంశాలు బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ విజయవంతం కావడంపై మీకు నా హృదయపూర్వక అభినందనలు. సిల్వర్ జూబ్లీ తర్వాత కొన్ని అంశాలు నా దృష్టికి వచ్చాయి, వాటిని మీతో పంచుకోవాలనుకుంటున్నానుసిల్వర్ జూబ్లీ వేడుకల్లో మీ ప్రసంగంతో క్యాడర్లో కొత్త ఉత్సాహం కనిపించింది మీ ప్రసంగం మొదటి నుంచి చివరి వరకు అందరూ శ్రద్ధగా విన్నారు‘ఆపరేషన్ కగార్’ గురించి మీరు మాట్లాడిన విధానం అందరికి నచ్చింది మీరు చెప్పిన ‘కాంగ్రెస్ ఫెయిల్ ఫెయిల్’ అన్న మాట బాగా పాపులర్ అయిందిపహల్గాం బాధితుల కోసం మీరు మౌనం పాటించడంపై అభినందనలు వెల్లువెత్తాయిరేవంత్ రెడ్డిని మీరు పేరు పెట్టి విమర్శించకపోవడం అందరినీ ఆకట్టుకుంది. రేవంత్ రోజూ మిమ్మల్ని విమర్శిస్తున్నా మీరు గౌరవంగా స్పందించారన్న అభిప్రాయం అందరిలో నెలకొంది. తెలంగాణ అంటే బీఆర్ఎస్.. తెలంగాణ అంటే కేసీఆర్ అని మీరు మరింత బలంగా చెప్తారని చాలామంది అనుకున్నారుతెలంగాణ తల్లి విగ్రహం మార్పు, రాష్ట్ర గీతంపై మాట్లాడుతారని ఆశించారుఅయినప్పటికీ నాయకులు, క్యాడర్ మాత్రం మీ సభ మీద సంతృప్తిగా ఉన్నారు పోలీసులను మీరు హెచ్చరించిన మాటలు బాగా గుర్తుండిపోయాయి.👉నెగిటీవ్ అంశాలు :ఉర్దూలో మాట్లాడకపోవడం.వక్ఫ్ బిల్లుపై మాట్లాడకపోవడంబీసీలకు 42 శాతం రిజర్వేషన్ విషయాన్ని ప్రస్తావించలేదుఎస్సీ వర్గీకరణపై మాట్లాడలేదు.పాత ఇన్ఛార్జులకు బాధ్యతలు ఇచ్చిన కారణంగా కొన్ని నియోజకవర్గాల్లో సరిగా ఏర్పాట్లు జరగలేకపోయాయి. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కేడర్ను పట్టించుకోలేదు.పంచాయతీ ఎన్నికల బి-ఫారాల విషయంలో పాత ఇన్ఛార్జులకే బి-ఫారాలు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో కొత్త ఆశావహుల మధ్య అసంతృప్తిని కలిగిస్తోంది.కింది స్థాయి నాయకులు మీతో ఫోటో తీసుకోవాలనే ఉత్సాహాన్ని చూపించారు. కానీ వారికీ ఆ అవకాశం లేకపోవడం మీ దగ్గరకు రాక మానేశారు. కొంతమందికే అనే ఫీలింగ్ ఉంది. దయచేసి అందరికి అవకాశం ఇవ్వండి.2001 నుండి మీతో ఉన్న సీనియర్ నాయకులకు స్టేజ్ మీద మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేదన్న అభిప్రాయం ఉంది.‘ధూమ్ ధాం’ కార్యక్రమం క్యాడర్ను ఆకట్టుకోలేకపోయింది.బీజేపీపై మీరు రెండు నిమిషాలే మాట్లాడడం వల్ల.. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ఉంటుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.కాంగ్రెస్ క్రింద స్థాయిలో ప్రజాభిమానం కోల్పోయింది. కానీ బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందన్న అభిప్రాయం క్యాడర్లో ఉంది.ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం వల్లే బీఆర్ఎస్.. బీజేపీకి సహకరించిందంటూ కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది.👉అందరూ ఆశించిన విషయం:ప్రస్తుత రాజకీయాలపై మీరు శ్రేణులకు స్పష్టమైన కార్యక్రమాలు, దిశానిర్ధేశం ఇవ్వాలని అనుకున్నారు.👉సూచన:కనీసం ఇప్పటికైనా ఒక ప్లీనరీ నిర్వహించి ఒకటి,రెండు రోజులపాటు క్యాడర్ అభిప్రాయాలు వినాలి. వారికి భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టత ఇవ్వాలి. దయచేసి దీన్ని సీరియస్గా పరిగణించండి’ అని కేసీఆర్కు రాసిన లేఖలో కవిత ప్రస్తావించారంటూ ఆరు పేజీల లేఖ ఒకటి వెలుగులోకి వచ్చింది. అయితే, ఆ లేఖపై బీఆర్ఎస్ లేదంటే, ఎమ్మెల్సీ కవిత అధికారికంగా స్పందించాల్సి ఉంది. -
కొత్త మెట్రో లైన్లు.. ఎన్వీఎస్రెడ్డి కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: కొత్త మెట్రో లైన్లపై మెట్రో ఎండీ ఎన్వీఎస్రెడ్డి కీలక ప్రకటన చేశారు. మేడ్చల్, శామీర్ పేట్, ఫ్యూచర్ సిటీ మెట్రో రైల్ డీపీఆర్ సిద్ధమయ్యాయని.. ఫేజ్-2పై ఎటువంటి సందిగ్ధత లేదని స్పష్టంర చేశారు.మెట్రో రెండో దశ డీపీఆర్లు పూర్తి స్థాయిలో సిద్ధం. ప్రస్తుతం డీపీఆర్లు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం వరకు గోప్యత ముఖ్యం. రాష్ట్ర ప్రభుత్వం ఈ డీపీఆర్లను ఆమోదించి, కేంద్రానికి సమర్పించాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. -
‘సీఎం రేవంత్ పనైపోయింది.. అదొక లొట్టపీసు కేసు’
సాక్షి, తెలంగాణ భవన్: లొట్టపీసు కేసులతో సీఎం రేవంత్ చేసేది ఏమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురువారం తెలంగాణ భవన్లో నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణాలు, ఇతర అంశాలపై మాట్లాడారు. ‘తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బ్యారేజ్లో రెండు పగుళ్లు వస్తే ఏదో అయినట్లు చేస్తున్నారు. టైమ్ పాస్ కోసమే కమిషన్ నోటీసులు పంపింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు నోటీసులు అందాయో? లేదో? తెలియదు. కాళేశ్వరం విషయంలో నిజం నిలకడగా తేలుతుంది.మిస్ వరల్డ్ ప్లెక్సీలో రేవంత్ రెడ్డి ,బట్టి విక్రమార్క, జూపల్లి కృష్ణారావు ఫొటోలు ఉన్నాయి. వీరిలో ఎవరు మిస్ వరల్డో అర్థం కావడం లేదు. కమిషన్లు దండుకోవడమే ఈ ప్రభుత్వం పనిగా పెట్టుకుంది.కేసీఆర్ వరంగల్కు కదలగానే ఈ ప్రభుత్వానికి భయం పట్టుకుంది. అందుకే కమిషన్ నోటీసుల పేరుతో డైవర్ట్ పాలిటిక్స్ చేసేందుకు సిద్ధమయ్యారు.కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నిజం నిలకడగా తెలుస్తుంది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనైపోయింది. లొట్టపిసు కేసులతో ఏం కాదు. కోటిమంది మహిళలను కోటీశ్వరలను చేస్తామని అంటున్నారు. అవి అలవికాని హామీలు. ప్రతిపక్షంలో ఉంటూ రేవంత్ నిద్ర పట్టకుండా చేస్తున్నాం. ఇచ్చిన హామీల్ని అమలు చేయాలని నిలదీస్తున్నాం’ అని అన్నారు. జూన్ ,జూలైలో బీఆర్ఎస్ నూతన మెంబర్షిప్ ప్రారంభమవుతుంది. ఆ తరువాత శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయి. పార్టీ బలోపేతం కోసం అందరం కలిసి కట్టుగా చేయాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశా నిర్ధేశం చేశారు. -
నోటీసులపై ఏం చేద్దాం?.. ఎర్రవల్లి ఫాంహౌస్లో కేసీఆర్తో హరీష్రావు భేటీ
సాక్షి, సిద్ధిపేట జిల్లా: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్తో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన హరీష్రావు.. సుమారు మూడు గంటల పాటు కేసీఆర్తో మంతనాలు సాగించారు. కాళేశ్వరం కమిషన్ నోటీసుల నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. కాళేశ్వరం కమిషన్ నోటీసులపై స్పందించాలా? వద్దా? అన్న దానిపై చర్చించినట్లు సమాచారం. కమిషన్ విచారణకు వెళ్లాలా? లేదా? అన్న దానిపై కూడా మంతనాలు జరిపినట్లు తెలిసింది.కాగా, ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులు, ఇతరులను కమిషన్ విచారించింది. బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావుకు నోటీసులు జారీ చేసింది. జూన్ 5వ తేదీన విచారణకు హాజరుకావాలని తెలిపింది.బీఆర్ఎస్ హయాంలో మంత్రులుగా పనిచేసిన హరీశ్రావు, ఈటల రాజేందర్లకు సైతం నోటీసులు ఇచ్చింది. ముగ్గురికీ వేర్వేరుగా మూడు పేజీలున్న నోటీసులను మెసెంజర్ ద్వారా అలాగే రిజిస్టర్ పోస్టులోనూ పంపింది. వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని సూచించింది. జూన్ 6న హాజరుకావాలని హరీశ్రావుకు, 9వ తేదీన రమ్మని ఈటల రాజేందర్కు తెలిపింది.కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బరాజ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని అనుమానిస్తున్న ప్రభుత్వం, సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించేందుకు గత ఏడాది మార్చిలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను నియమించింది. బరాజ్ల నాణ్యతపై కూడా విచారించాలని సూచించింది. దీనిపై దాదాపుగా విచారణ పూర్తి చేసిన కమిషన్, రెండుమూడు రోజుల్లో నివేదిక ఇచ్చేందుకు సిద్ధమవుతోందని భావిస్తున్న తరుణంలో.. కమిషన్ గడువును మరో రెండు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
అంగరంగ వైభవంగా మానస వివాహం (ఫొటోలు)
పెద్దపల్లి రూరల్: కలెక్టరే పెళ్లి పెద్ద అయ్యారు. అధికారులే అయినవాళ్లయ్యారు. తమ ఇంటి ఆడపడుచులా అక్కున చేర్చుకున్నారు. అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. రామగుండం ప్రాంతానికి చెందిన తబితా ఆశ్రమంలో ఉంటున్న నక్క మానస వివాహం.. రాజేశ్తో కలెక్టరేట్లోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. తల్లిదండ్రులను చిన్నతనంలోనే కోల్పోయిన నక్క మానస, నక్క లక్ష్మి అక్కాచెల్లెళ్లు. వీరు 16 ఏళ్లుగా తబితా ఆశ్రమంలో ఉంటున్నారు. మానసకు వివాహం నిశ్చయం కావడంతో వివాహతంతు జరిపించేందుకు కలెక్టర్ కోయ శ్రీహర్ష చొరవ తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే కలెక్టరేట్ ఆవరణలోని శ్రీవేంకటేశ్వర ఆలయాన్ని వివాహవేదిక చేశారు. అర్చకుల మంత్రోచ్ఛారణలు, బాజాభజంత్రీల మధ్య ఉదయం 11.05 గంటలకు వివాహం ఘనంగా జరిగింది. కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎమ్మెల్యే విజయరమణారావు, పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, అడిషనల్ కలెక్టర్ వేణు, టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు బొంకూరి శంకర్ సహా పలుశాఖల జిల్లా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో సేకరించిన రూ.61,800 విలువైన చెక్కును కలెక్టర్ శ్రీహర్ష వధూవరులకు అందించారు. వరుడి బం««ధుమిత్రులతో పాటు మోచి సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్, కార్యదర్శి రాజు, ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు.. మోచికుల ఆ«రాధ్య దైవమైన సంత్ రవిదాస్ హరలయ్య జ్ఞాపికను వధూవరులకు అందజేశారు. -
నాంపల్లి కోర్టుకు హాజరైన సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని గతంలో రేవంత్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి నాంపల్లి మనోరంజన్ కోర్టుకు హాజరయ్యారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి రెండోసారి కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో విచారణ నిమిత్తం సీఎం రేవంత్ రెడ్డి కోర్టుకు హాజరు కావడం గమనార్హం.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బేగంబజార్, నల్గొండ, మెదక్ పోలీస్ స్టేషన్లలో కేసు నమోదైంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణకు హాజరయ్యారు. నల్గొండ టూ టౌన్ పీఎస్, బేగంబజార్ పీఎస్, మెదక్ జిల్లా కౌడిపల్లి పీఎస్ పరిధిలో నమోదైన మూడు కేసుల్లో వ్యక్తిగతంగా జడ్జి ముందు హాజరయ్యారు. సీఎం కోర్టుకు హాజరు కావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టు హాల్ దగ్గరకు ఇతరులను అనుమతించలేదు. రేవంత్ రెడ్డిపై ఈ కేసులు నమోదైన సమయంలో ఆయన పీసీసీ చీఫ్గా ఉన్నారు.ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి.. తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని కోర్టుకు తెలిపారు. పోలీసులు చెప్తున్నవి అన్నీ కూడా అవాస్తవాలు. తాను ఎక్కడ ఎలాంటి తప్పు చేయలేదన్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ కోర్టు నమోదు చేసుకుంది. ఈ మేరకు జూన్ 12వ తేదీన నాంపల్లి స్పెషల్ కోర్టు తీర్పు ప్రకటించనుంది. ఇక, విచారణ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కోర్టు నుంచి తిరిగి వెళ్ళిపోయారు. -
Operation Kagar: మావోళ్లు ఎలా ఉన్నరో?
సాక్షి, పెద్దపల్లి: మావోయిస్టులకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వారికి కంచుకోట అయిన ఛత్తీస్గఢ్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్తో నెత్తురోడుతోంది. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా 2024 జనవరిలో కేంద్ర బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో చోటుచేసుకుంటున్న ఎదురుకాల్పుల్లో సుమారు 300మందికి పైగా మా వోయిస్టులు మృతిచెందారు. ప్రభుత్వ దూకుడు, పె రుగుతున్న నిర్బంధం, వరుస ఎన్కౌంటర్లతో ఎ ప్పుడు ఏం జరుగుతుందోనని అజ్ఞాత మావోయి స్టు కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. తాజాగా మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో మృతిచెందడంతో జిల్లా నేతల క్షేమసమాచారంపై బంధువుల్లో ఆందోళన నెలకొంది. భయపెడుతున్న ఘటనలు మావోయిస్టుల అంతమే లక్ష్యంగా ఛత్తీస్గఢ్లో దూ సుకుపోతున్న భద్రతాదళాలకు మనజిల్లాకు చెంది న నేతలు కొరకరాని కొయ్యలా మారారు. కేంద్ర కమిటీతోపాటు వివిధ కీలక స్థానాల్లో మన జిల్లావా సులు దండాకారణ్యంలో కార్యకలాపాలు కొనసాగి స్తున్నారు. ప్రభుత్వానికి సమాంతరంగా జనతన స ర్కార్ను స్థాపించారు. అయితే, మావోయిస్టుల విస్తరణకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో 2009తో ఆపరేషన్ గ్రీన్హంట్ను కేంద్రప్రభుత్వం ప్రారంభించింది. అప్పటినుంచి దేశవ్యాప్తంగా ముమ్మరంగా యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ సాగిస్తోంది. తాజాగా ప్రభు త్వం ఆపరేషన్ కగార్ను ప్రారంభించింది. సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, డీఆర్జీ, సీ–60, ఎస్వోజీ, స్పెషల్ టాస్్కఫోర్స్ పేరుతో అడవులను జల్లెడ పడుతున్నా యి. దీంతో ఏడాదిన్నర కాలంలోనే 300 మందికిపైగా మావోయిస్టులు ఎన్కౌంటర్లలో మృతిచెందా రు. ఇందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నేతలు ఉన్నట్లు ప్రచారం జరిగినా త్రుటిలో తప్పించుకుంటున్నారు. ఇటీవల జూలపల్లికి చెందిన పుల్లూరి ప్రసాద్రావు ఉరఫ్ చంద్రన్న మృతిచెందారని ప్రచారం జరిగినా ఇంకా నిర్ధారణ కాలేదు. జిల్లావాసులే కీలకం పెద్దపల్లి జిల్లాలకు చెందిన పలువురు మావోయిస్టులు కేంద్ర, రాష్ట్ర కమిటీల్లో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు. కిష్టంపేట గ్రామానికి చెందిన కంకణాల రాజిరెడ్డి, జాలపల్లి మండలం వడ్కా పూర్ గ్రామానికి చెందిన పుల్లూరి ప్రసాద్రావు ఉరఫ్ చంద్రన్న, పెద్దపల్లికి చెందిన మల్లోజుల వేణుగోపాలరావు ఉరఫ్ భూపతి, జూలపల్లి మండలం వెంకట్రాపుపల్లికి చెందిన దీకొండ శంకర్, పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామానికి చెందిన గంకిడి సత్యనారాయణరెడ్డి ఉరఫ్ విజయ్, పాలితం గ్రానికి చెందిన అలేటి రామలచ్చులు, రామగుండం మండలానికి చెందిన అప్పాసి నారాయణ ఉరఫ్ రమేశ్, గోపయ్యపల్లికి చెందిన దళ కమాండర్ దాతు ఐలయ్య, సుల్తానాబాద్ మండలం కొదురుపాక గ్రామానికి చెందిన జువ్వాడి వెంకటేశ్వర్రావు, మంథని మండలం ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన మల్ల రాజిరెడ్డి ఉరఫ్ మీసాల రాజన్న తదితరులు ఉన్నారు. ఎక్కడ, ఎప్పుడు ఎలాంటి ఎన్కౌంటర్ జరిగినా ఉమ్మడి కరీంనగర్ జిల్లావాసుల్లో ఆందోళన నెలకొంటోంది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్ రావుకు బిగ్ షాక్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడైన ప్రభాకర్ రావుకు ప్రోక్లేయిమ్ నోటీసులు జారీ అయ్యాయి. దీంతో, జూన్ 28వ తేదీలోపు నాంపల్లి కోర్టులో హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు సహకరించకుండా ప్రభాకర్ రావు అమెరికాకు పారిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావుపై ఇప్పటికే లుక్ అవుట్ సర్క్యూలర్, రెడ్ కార్నర్, పాస్ పోర్టు రద్దు సహా అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్నట్లు పోలీసులు నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన పలు పిటిషన్లలో వెల్లడించారు. ఈ క్రమంలోనే నాన్ బెయిల్ వారెంట్ జారీ కావడంతో ప్రకటిత నేరస్థుడి(ప్రోక్లేయిమ్ అఫెండర్)గా ప్రకటించాలని కోరుతూ జనవరిలో పిటిషన్ దాఖలు చేశారు.తాజాగా ఈ పిటిషన్ను నాంపల్లి కోర్టు ఆమోదించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా జూన్ 28వ తేదీలోగా హాజరుకాకపోతే ఆయనకు సంబంధించిన ఆస్తులను కోర్టు తన అధీనంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కోర్టు ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు ఆస్తులను పోలీసులు జప్తు చేయనున్నారు. ఈ మేరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు. ఆ తర్వాత బహిరంగంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణకు హాజరైతే విచారణ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. -
హైడ్రా కూల్చివేతలు.. బోడుప్పల్లో కబ్జాలు..
సాక్షి, మేడ్చల్: తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. పోలీసులు బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి.వివరాల ప్రకారం.. పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పర్వతాపూర్లో స్మశాన వాటికల్లోని కొంత భూమిని కొందరు ఆక్రమించారు. అక్కడ అక్రమ నిర్మాణాలను చేపట్టారు. సర్వే నంబర్లు 1, 12లోని స్మశాన వాటికల్లోని భూములను కబ్జా చేసి కబ్జాదారులు వాటని విక్రయిస్తున్నారు. గత రెండేళ్లుగా కబ్జాలు జరుగుతున్నాయి. దీంతో, స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. అనంతరం, హైడ్రా కమిషనర్ రంగనాథ్ బుధవారం మధ్యాహ్నం బోడుప్పల్, పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో పర్యటించారు. అక్రమ నిర్మాణాలు, కబ్జాలు జరిగినట్టు గుర్తించారు.ఈ నేపథ్యంలో అక్కడ అక్రమ నిర్మాణాలను తొలగస్తామని రంగనాథ్.. స్థానికులకు హామీ ఇచ్చారు. గురువారం ఉదయమే హైడ్రా అధికారులు అక్కడికి చేరుకుని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. అక్రమ నిర్మాణాలు, కబ్జాలపై హైడ్రా స్పందించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక, అంతకుముందు, బుధవారం ఉదయం మేడిపల్లిలోని సేజ్ స్కూల్లోని అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. -
హైదరాబాద్లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)
-
ఢిల్లీ అతలాకుతలం.. తెలంగాణలో అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్
సాక్షి, ఢిల్లీ/హైదరాబాద్: మండు వేసవిలో దేశవ్యాప్తంగా అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. వర్షాకాలం నాటి పరిస్థితులు వేసవిలో కనిపిస్తున్నాయి. ఢిల్లీ, తెలుగు రాష్ట్రాలు సహా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక, ఢిల్లీలో బలమైన గాలులు, వడగళ్ల వానతో నగరం మొత్తం అస్తవ్యస్తంగా మారింది. ఈదురు గాలులకు చెట్లు, హోర్డింగ్లు నేలకొరిగి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అటు.. చెట్లు కూలడంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. కొన్ని ఏరియాల్లో మెట్రో సేవలు కూడా నిలిచిపోయాయి. ఇటు తెలంగాణలోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి.ఢిల్లీలో బుధవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గంటకు 70కిలో మీటర్ల వేగంతో గాలులు వీచాయి. సఫ్దర్జంగ్ ప్రాంతంలో ఏకంగా గంటకు 80 కిలీమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. లోదీ రోడ్లో వడగళ్ల వాన పడింది. ఈదురుగాలులు, భారీ వర్షం కారణంగా ఢిల్లీ ఎయిర్పోర్టు సహా పలు విమానయాన సంస్థలు ప్రయాణికులను అప్రమత్తం చేశాయి. విమాన సర్వీసులపై ప్రభావం పడే అవకాశముందని ముందుగానే ప్రకటించాయి.Just now Delhi witnessed a massive dust storm followed by rain and hail. The power of nature is on full display #delhirain ⛈️"From dust storm to heavy rain and hail - #Delhi's weather is going to change dramatically tonight 🌪⚡️#delhirain #DelhiWeather pic.twitter.com/FLatYfSEap— Weatherman Uttam (@Gujarat_weather) May 21, 2025Thunderstorms and dust storms coupled with heavy rain wreak havoc across Delhi-NCR, uprooting trees and mangling sign boards.#delhirain #DelhiWeather pic.twitter.com/duY0nhOhIs— Mr. J (@LaughingDevil13) May 21, 2025ఇదిలా ఉండగా.. మరో మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళా తీరాన్ని తాకనున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. నిన్న తెలంగాణలో కురిసిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. పిడుగులు పడి మహబూబాబాద్ జిల్లాల్లో ఇద్దరు, మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల్లో ఒక్కొక్కరు చనిపోయారు. సూర్యాపేట జిల్లాలో పిడుగుపాటుకు 39 మేకలు చనిపోయాయి. ఇక వీటితో పాటు.. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్, మెదక్, నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో వర్షాలు కురిశాయి.#delhirain pic.twitter.com/1nxW0mxdVC— Suaib (@JournalistSuaib) May 21, 2025హైదరాబాద్లో వాన బీభత్సంహైదరాబాద్లో వాన బీభత్సం సృష్టించింది. రోడ్లన్ని నదులను తలపించాయి. దీంతో ఎక్కడిక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరో 4 రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అప్రమత్తం చేసింది. తెలంగాణలోని అన్నిజిల్లాలకు ఎల్లో అలర్ట్ విధించింది వాతావరణ శాఖ. బంగ్లగూడ, సైదాబాద్, మలక్పేట్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. #HyderabadRains Continue... 🌧️📸: Retratoooo [IG] pic.twitter.com/2LrjO7dxqT— Hi Hyderabad (@HiHyderabad) May 21, 2025It was a craziest downpour in Sikh Village Secunderabad. @balaji25_t #HyderabadRains pic.twitter.com/TzkHmGDfUA— The Food GlanZer (@JavedMohammeds) May 21, 2025Dramatic visuals from Hyderabad's Greenpark Colony: Two-wheeler almost swept away by rainwater.#Rain #Hyderabad #HyderabadRains #ViralVideo #Trending pic.twitter.com/mD3hRXFpLi— TIMES NOW (@TimesNow) May 22, 2025 -
కొత్త సభ్యులకు రేషన్ కోటా!
సాక్షి, హైదరాబాద్: తెల్లరేషన్ (ఆహార భద్రత) కార్డుల్లో కొత్త యూనిట్లకు కోటా కేటాయించేందుకు పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది. మే నెలలో కొన్ని కొత్త యూనిట్లకు బియ్యం కోటా విడుదల చేయగా.. తాజాగా మరికొన్ని యూనిట్లకు జూన్ కోటా కేటాయించి విడుదల చేయాలని నిర్ణయించింది. ఎనిమిదేళ్ల నిరీక్షణ అనంతరం కొత్త యూనిట్లకు ఆమోదం లభించిన విషయం విదితమే. అయితే.. రేషన్ కార్డు లబ్ధి కుటుంబాల్లో కొత్తగా సభ్యులుగా చేరిన ఏడేళ్ల వయసు దాటిన వారికి మాత్రమే రేషన్ కోటా కేటాయించే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతున్నా.. పౌరసరఫరాల శాఖ అధికారులు మాత్రం వయసుతో నిమిత్తం లేకుండా కార్డుల్లోని ప్రతి యూనిట్కు బియ్యం కోటా విడుదల ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. 60 శాతం కొత్త సభ్యులకు ఆమోదం.. గ్రేటర్ పరిధిలో ఇప్పటి వరకు 60 శాతం కొత్త సభ్యులకు ఆమోదం లభించినట్లు పౌరసరఫరాల శాఖ అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వాస్తవంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిరిగి జిల్లాల పౌరసరఫరాల పరిధిలో సుమారు మూడు లక్షల లబ్ధి కుటుంబాలు కొత్త సభ్యుల చేర్పుల కోసం దరఖాస్తులు చేసుకున్నాయి. ఇప్పటి వరకు సుమారు సగానికి పైగా ఆమోదం లభించినట్లు తెలుస్తోంది. మిగిలిన దరఖాస్తులు ఇంకా పెండింగ్లో ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పౌరసరఫరాల అధికారులు మాత్రం పాతరేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల ఆమోదం ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొంటున్నారు. మీ సేవ కేంద్రాల్లో ఆన్లైన్ ద్వారా వచి్చన ప్రతి పెండింగ్ దరఖాస్తునూ పరిశీలించి అర్హులై సభ్యుల పేర్లను ఆమోదిస్తున్నామని స్పష్టం చేస్తున్నారు. -
హనుమాన్ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)
-
పది రోజులుగా టెంట్కిందనే..
పాలకుర్తి టౌన్: ఆయన యోగా గురువు. ఎంతోమందికి యోగా నేర్పాడు. ఏనాడూ డబ్బులకు ప్రాధాన్యం ఇవ్వలేదు. అద్దె ఇల్లు. తనకంటూ ఏమీ సంపాదించుకోలేదు. చివరికి అనారోగ్యంతో చనిపోగా, ఇంటి యజమాని ఒప్పుకోకపోవడం, పది రోజుల కార్యక్రమాలయ్యే వరకు రావద్దని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఖాళీ ప్లాట్లో టెంట్వేసి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. పది రోజులుగా అదే టెంట్లో కాలం గడుపుతున్నారు. ఈ విషాద ఘటన జనగామ జిల్లా పాలకుర్తిలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. పాలకుర్తి మండల కేంద్రం, చుట్ట పక్కల గ్రామాల్లో ఒకప్పుడు ఎల్ఎన్ టైలర్గా దార్ల లక్ష్మీనారాయణ ఓ వెలుగు వెలిగాడు. డబ్బులకు ప్రాధాన్యం ఇవ్వకుండా యోగా గురువుగా ఎంతోమంది కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నాడు. పది రోజులక్రితం అనారోగ్యం బారిన పడి చనిపోయాడు. మృతదేహం ఉంచేందుకు ఇంటి యజమాని ఒప్పుకోలేదు. దీంతో వారికున్న ఖాళీ స్థలంలో(ప్లాట్)లో టెంట్ వేసి దహనసంస్కారాలు నిర్వహించారు. పది రోజుల వరకు ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి. దీంతో ఆ టెంట్కు చుట్టూ పరదాలు కట్టుకొని కాలం వెళ్లదీస్తూ మిగతా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు ఈదురుగాలులు, వర్షం పడుతున్నా టెంట్కిందనే జీవనం సాగిస్తున్న దైన్యం. దశదిన కర్మ కార్యక్రమానికి కూడా చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితి. ఎవరైనా ఆపన్నహస్తం అందిస్తారని ఆశగా చూస్తున్నట్లు కుమారుడు దార్ల ఉపేందర్ తెలిపాడు. -
సీఎం రేవంత్రెడ్డిది పర్సంటేజీ పాలన: కేటీఆర్
నల్లగొండ టూటౌన్: ఎన్నికల వాగ్దానాలను అమలు చేయకుండా ప్రజల దృష్టి మరల్చేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ప్రచారం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వం కుట్ర పూరితంగా ఇచ్చే నోటీసులకు, విచారణలకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. నల్లగొండ పట్టణంలో బుధవారం ఓ వివాహానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్రెడ్డి ప్రభుత్వానిది ప్రజాపాలన కాదని, పర్సంటేజీల పాలన అని విమర్శించారు. కమీషన్లు ఇవ్వనిదే ఈ ప్రభుత్వంలో పనులు కావని స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలే బహిరంగ వేదికలపైనే చెబుతున్నారని అన్నారు. 20 శాతం, 30 శాతం కమీషన్లు తీసుకుంటున్నారని కాంట్రాక్టర్లు రాష్ట్ర సచివాలయంలోనే ధర్నా చేశారని గుర్తుచేశారు. ఈ కమీషన్ల వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కమిషన్ల ఏర్పాటు, నోటీసులు అంటున్నారని ఎద్దేవా చేశారు. ఇది దద్దమ్మ ప్రభుత్వం: ఇచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని కేటీఆర్ విమర్శించారు. ‘ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోయి గురువారానికి మూడు నెలలు పూర్తవుతుంది. అందులో చనిపోయినవారి శవాలను కూడా తీసుకురాలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే ఇప్పటివరకు విచారణ లేదు. అందుకు కారణమైన సంస్థపై చర్యలు లేవు. కాంగ్రెస్ వచ్చాక వట్టెం పంపుహౌస్ మునిగింది. పెద్దవాగు రెండుసార్లు కొట్టుకుపోయినా చర్యలు లేవు. కాంగ్రెస్, బీజేపీ కలిసి కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా ప్రచారం చేస్తున్నా ప్రజలకు వాస్తవాలు తెలుసు. దేశంలో చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద తమకు సంపూర్ణ నమ్మకం ఉంది. ఎన్ని నోటీసులు ఇచ్చినా న్యాయం, ధర్మమే గెలుస్తుంది. తెలంగాణకు మేలు చేసినవారిని ఆ దేవుడే కాపాడుతాడు. ఎన్ని నోటీసులు ఇచ్చినా హామీలు అమలు చేసేంతవరకు ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు’అని తేల్చి చెప్పారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రి జగదీశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి తదితరులు ఉన్నారు. -
అందాల భామలకు అగ్నిపరీక్ష
సాక్షి, హైదరాబాద్: పది రోజులుగా రాష్ట్రంలోని పలు దర్శనీయ స్థలాలను మండుటెండల్లో చుట్టేసి చెదరని చిరునవ్వు, అందం–అభినయంతో పరవశింపచేసిన సుందరీమణులు ఇప్పుడు చాలెంజ్ రౌండ్లలో దూసుకుపోతూ మిస్ వరల్డ్ పోటీలను రసవత్తరంగా మార్చారు. ఈనెల 10న ప్రారంభోత్సవం మొదలు వివిధ ప్రాంతాలను చుట్టేసిన అందాల భామలు.. ఆటవిడుపునకే పరిమితమయ్యారు. ఇప్పుడు అసలైన పోటీల్లో దిగి రెండు రోజులుగా మేధోసంపత్తితో అలరిస్తున్నారు. ఇప్పటిదాకా ఆటవిడుపుగా సాగిన పోటీలు అభిమానులకు రసవత్తరంగా మారగా, పోటీదారులకు అగి్నపరీక్షగా నిలిచాయి. దీంతో మిస్ వరల్డ్ 72వ ఎడిషన్ కీలక అంకంలోకి చేరినట్టయింది. సత్తా చాటిన 24 మంది: టీ–హబ్లో రెండు రోజులపాటు జరిగిన హెడ్ టు హెడ్ చాలెంజ్ రౌండ్లో 24 మంది విజయం సాధించి తదుపరి 23న జరిగే కీలక టాలెంట్ పోటీకి ఎంపికయ్యారు. 107 దేశాలకు చెందిన పోటీదారులు ఇందులో పాల్గొనగా, 24 మందిని ఉన్నత ప్రతిభావంతులుగా న్యాయనిర్ణేతలు తేల్చారు. హెడ్ టు హెడ్ చాలెంజ్లో ఇండియా, అమెరికా, పోలండ్, నైజీరియా, ఫిలిప్పీన్స్, మాల్టా, ఇటలీ, ఇండోనేసియా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, ఎస్టోని యా, జర్మనీ, బ్రెజిల్, కేమాన్ ఐలాండ్స్, నెదర్లాండ్స్, వేల్స్, చెక్ రిపబ్లిక్, జమైకా, అర్జెంటీనా, ఐర్లాండ్, ఆ్రస్టేలియా, శ్రీలంక, ఇథియోపియా, కామె రూన్, కెన్యా ముద్దుగుమ్మలు విజేతలుగా నిలిచారు. వీరు 23న జరిగే టాలెంట్ కాంపిటీషన్లో తలపడి తమ ఖండంలోని టాప్–10లో భాగమవుతారు. వారికి మళ్లీ సత్తా చాటే చాన్స్: హెడ్ టు హెడ్ చాలెంజ్లో 24 మంది విజేతలుగా నిలిచి సెమీఫైనల్ బెర్తుకు చేరువయ్యారు. ఈ రౌండ్లో ఓడిన వారు ఎలిమినేట్ కారు. వారు పోటీలో ఇతర విభాగాలైన మిస్ వరల్డ్ టాలెంట్ ఫైనల్, టాప్ మోడల్–ఫ్యాషన్ ఫైనల్, జ్యువెలరీ–పెర్ల్ ఫ్యాషన్ షోల్లో పాల్గొనవచ్చు. వీటిల్లో మెరుగ్గా రాణిస్తే తదుపరి రౌండ్లకు అర్హత సాధిస్తారు. అయితే, ఆ 24 మందితో పోలిస్తే వీరికి ఎక్కువ సవాళ్లు ఉంటాయి. మిస్ వరల్డ్ పోటీల్లో హెడ్ టు హెడ్ చాలెంజ్ను ఫాస్ట్–ట్రాక్ ఈవెంట్గా పరిగణిస్తారు. ఇందులో విజేతలు నేరుగా క్వార్టర్–ఫైనల్స్కు అర్హత సాధిస్తారు. ⇒ మిస్ వరల్డ్ టాలెంట్ ఫైనల్: ఈ పోటీ మే 22న శిల్పకళా వేదికలో జరుగుతుంది. ఇందులో పాల్గొనే వారు సంగీతం, నృత్యం, కళలు ఇతర ప్రతిభలను ప్రదర్శిస్తారు. ⇒ టాప్ మోడల్–ఫ్యాషన్ ఫైనల్: ఇది మే 24న హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఉంటుంది. ⇒ జ్యువెలరీ–పెర్ల్ ఫ్యాషన్ షో: మే 25న హైటెక్స్లో జరుగుతుంది, ఇందులో తెలంగాణలోని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు కూడా హాజరవుతారు. ⇒ ఈ అన్ని పోటీల్లో వడపోత కార్యక్రమం కొనసాగుతుంది. అమెరికా–కరేబియన్, ఆసియా–ఓషియానా, ఆఫ్రికా, యూరప్.. ఈ నాలుగు విభాగాల్లో తొలుత ఒక్కో ఖండం నుంచి 10 మంది ఎంపికవుతారు. తదుపరి రౌండ్లో ఆ సంఖ్య ఐదుకు పరిమితమవుతుంది. ఆ తర్వాత ఇద్దరు చొప్పున ఉంటారు. 31న జరిగే గ్రాండ్ ఫినాలేలో మొత్తం 8 మంది మిగులుతారు. వారిలో విజేత, రన్నరప్, రెండో రన్నరప్ను ఎంపిక చేస్తారు. విజేతకు మిస్వరల్డ్–2024 క్రిస్టీనా పిజ్కోవా రూ.6.21 కోట్ల విలువైన కిరీటాన్ని అలంకరింపజేస్తారు. ఈ గ్రాండ్ ఫినాలే ఈనెల 31న హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరుగుతుంది. -
నేడు జేఈఈ అడ్వాన్స్డ్ రెస్పాన్స్ షీట్
సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశానికి ఈ నెల 18న కాన్పూర్ ఐఐటీ నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష(జేఈఈ అడ్వాన్స్డ్) రెస్పాన్స్ షీట్ గురువారం విడుదలయ్యే అవకాశం ఉంది. సాయంత్రం 5 గంటల తర్వాత డౌన్లోడ్ ఆప్షన్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని కాన్పూర్ ఐఐటీ వర్గాలు తెలిపాయి. మే 26 లోపు కీ విడుదల చేసే వీలుంది. విద్యార్థుల అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత జూన్ 2న ఆన్లైన్ ద్వారా ఫలితాలు వెల్లడిస్తారు. జూన్ 3 నుంచి ఎన్ఐటీ, ఐఐటీ ఇతర జాతీయ సంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన షెడ్యూల్ను జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) విడుదల చేస్తుంది. -
ఉన్న బోధకులకే ‘కొత్త’ శిక్షణ
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ఎమర్జింగ్ కోర్సుల బోధనకు ఆధునిక మెళకువలు అవసరమని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) సూచించింది. ప్రస్తుతం ఉన్న ఫ్యాకల్టీకే శిక్షణ ఇవ్వడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చని తెలిపింది. ఈ మేరకు పలు మార్గదర్శకాలను జారీచేసింది. ఇంజనీరింగ్లో కొన్నేళ్లుగా కోర్ గ్రూపులకన్నా, కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో ప్రవేశాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్ వంటి బ్రాంచీలకు డిమాండ్ ఎక్కువైంది. అయితే, ఈ కోర్సుల బోధనకు సరైన ఫ్యాకల్టీ ఉండటం లేదనే విమర్శలు పెరుగుతున్నాయి. ఇవి కొత్తగా వచ్చిన కోర్సులు కావడంతో ఇందులో మాస్టర్స్ డిగ్రీ చేసినవారు ఉండటం లేదు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బోధించే వారితోనే కొత్త కోర్సులూ చెప్పిస్తున్నారు. ఇంకో మూడేళ్లపాటు ఇదే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న బోధకులకే శిక్షణ ఇచ్చి కొత్త కోర్సులు చెప్పేందుకు అవకాశం ఇవ్వాలని ఏఐసీటీఈ సూచించింది. శిక్షణ తప్పనిసరి రాష్ట్రంలో 1.16 లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఉంటే, ఇందులో సగానికిపైగా కంప్యూటర్ సైన్స్ కోర్సులే ఉన్నాయి. సీఎస్ఈ కోర్ కాకుండా ఏఐ, ఏఐఎంఎల్, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి సీట్లు 15 వేల వరకు ఉన్నాయి. ప్రతి 40 మంది విద్యార్థులకు ఒక నిపుణుడైన బోధకుడు ఉండాలి. దీంతో ఫ్యాకల్టీ కొరత ఏర్పడింది. వాస్తవానికి కొత్త కోర్సులకు అదనంగా ఆరు సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి. ఇందులో కూడా బేసిక్ చాప్టర్లు సీఎస్ఈ కోర్సులో ఉన్నవే. అదనపు చాప్టర్లు కొత్తగా వస్తున్న ఏఐ, డేటా అనాలిసిస్, సైబర్ లాంగ్వేజ్ సిస్టమ్కు సంబంధించినవి. ఐఐటీలు, ఎన్ఐటీల్లో కొత్త కోర్సులతోపాటు, ఆధునిక సాంకేతికతపై ఎప్పటికప్పుడు అంతర్జాతీయ సంస్థలతో ఓరియంటేషన్ నిర్వహిస్తున్నారు. దీంతో అక్కడి ఫ్యాకల్టీ అప్డేట్ అయ్యింది. రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో సీఎస్ఈతోపాటు ఎలక్ట్రానిక్స్ బోధిస్తున్న అధ్యాపకులను ఎన్ఐటీ, ఐఐటీల్లో కొంతకాలం శిక్షణకు పంపడం లేదా ఆన్లైన్ శిక్షణ ఇప్పించాలని ఏఐసీటీఈ సూచించింది. సాఫ్ట్వేర్ ఉద్యోగులతోనూ శిక్షణ ఇంజనీరింగ్ నేపథ్యం ఉన్న ఐటీ ఉద్యోగులు కంపెనీల శిక్షణతో వృత్తిపరమైన ఉన్నతి పొందుతున్నారు. నాలుగేళ్ల అనుభవం ఉన్న ఉద్యోగులకు సబ్జెక్టుపై మంచి అవగాహన ఉంటోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఐటీ ఉద్యోగులతో ఇంజనీరింగ్ కాలేజీ అధ్యాపకులకు శిక్షణ ఇప్పించాలని ఏఐసీటీఈ సూచించింది. ఐటీ ఉద్యోగులకు సాధారణంగా శని, ఆదివారాల్లో సెలవులు ఉంటాయి. ఈ రెండు రోజులు అధ్యాపకులకు క్లాసులు నిర్వహించవచ్చని తెలిపింది.దీంతోపాటు ఆన్లైన్లో నిర్వహించే ఏఐ కోర్సుల ద్వారా కూడా ఫ్యాకల్టీని అప్గ్రేడ్ చేయవచ్చని పేర్కొంది. ఇలా శిక్షణ పొందిన ఫ్యాకల్టీకి ప్రతి సంవత్సరం ఏఐసీటీఈ నేతృత్వంలో పరీక్ష నిర్వహించే ఆలోచనపై కూడా కసరత్తు జరుగుతోంది. దీంతో అధ్యాపకుడు ఆయా రంగంలో నిష్ణాతుడన్న ధ్రువీకరణ జరుగుతుంది. ఫ్యాకల్టీ లేని కారణంగా సీట్ల పెంపు ఆపేకన్నా, ఉన్నవారిని మెరుగుపర్చుకోవడం సులభమన్న విధానాన్ని ఏఐసీటీఈ రాష్ట్రాల ముందు ఉంచింది. -
ఆపద్బాంధవులకు అద్భుత శిక్షణ
గోదావరిఖని: ప్రకృతి వైపరీత్యాల సమయంలో అనుసరించాల్సిన విధానంపై స్టేట్ డిజాస్టర్స్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్) బృందాలకు సింగరేణి శిక్షణ ఇస్తోంది. జల, వాయు, అగ్ని ప్రమాదాలతోపాటు.. బహుళ అంతస్తుల్లో ప్రమాదాలు జరిగినప్పుడు అనుసరించాల్సిన సహాయక చర్యలపై సింగరేణి సంస్థ.. 36 రోజుల పాటు 1,200 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందికి శిక్షణ ప్రారంభించింది. వంద మందికి ఒక బృందం చొప్పున, మూడురోజులపాటు పలు అంశాలపై శిక్షణతోపాటు ప్రాక్టికల్స్ కూడా నిర్వహిస్తోంది. ఇలా 36 రోజుల పాటు 12 బృందాలకు శిక్షణ ఇవ్వనుంది. నాలుగు నెలల క్రితమే రాష్ట్రంలో ఎస్డీఆర్ఎఫ్ విభాగాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రిజర్వ్ పోలీసు విభాగం నుంచి ఆసక్తి ఉన్న 1,200 మందిని ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్రంలోని 12 క్యాంప్ల్లో ఉన్నవారికి ప్రకృతి వైపరీత్యాల సమయంలో స్పందించాల్సిన తీరు, ఆపత్కాలంలో తాము సురక్షితంగా ఉండి, ఆపదలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడం లక్ష్యంగా శిక్షణ కొనసాగుతోంది. ముందుగా ఇతర రాష్ట్రాల్లో కొన్ని బృందాలకు శిక్షణ ఇస్తున్నారు. కోయంబత్తూర్, విజయవాడ, పుణె, వడోధర, ఒడిశా రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్డీఆర్ఎఫ్ ద్వారా పలు అంశాల్లో తర్ఫీదు ఇస్తున్నారు. ఒక్కొక్క బృందానికి రెండు నెలల పాటు శిక్షణ కొనసాగుతుంది. దీంతోపాటు రాష్ట్రంలో పలు అంశాలపై స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ (ఎస్డీఆర్ఎఫ్) సిబ్బందికి శిక్షణ ప్రారంభమైంది. ముందుగా హైదరాబాద్లోని హుస్సేన్సాగర్లో బోట్లపై వెళ్లి.. నీటిలో చిక్కుకున్న వారిని కాపాడే అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత సింగరేణి రెస్క్యూ విభాగంతో శిక్షణ ఇస్తున్నారు. ఎస్ఎల్బీసీతో సింగరేణి రెస్క్యూపై నజర్ ఎస్ఎల్బీసీ ప్రమాదంతో.. సింగరేణి రెస్క్యూ ప్రాధాన్యం దేశవ్యాప్తంగా వెలుగులోకి వచి్చంది. సుమారు 40 రోజుల పాటు సొరంగంలో చిక్కుకున్న వారిని వెలికితీసే పనుల్లో సహాయ బృందాలు అందించిన సేవలు ప్రత్యేకంగా నిలిచాయి. ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం ఏర్పాటైన ఎస్డీఆర్ఎఫ్ విభాగానికి.. విపత్తుల సమయంలో స్పందించాల్సిన తీరుపై కఠోర శిక్షణ ఇస్తున్నారు. మొదటి బ్యాచ్లో డిచ్పల్లిలోని 7వ బెటాలియన్కు చెందిన వంద మందికి శిక్షణ కొనసాగుతోంది. మూడు రోజుల ప్రత్యేక శిక్షణ ప్రకృతికి విరుద్ధంగా భూగర్భ గనుల్లోకి వెళ్లి బొగ్గు ఉత్పత్తి చేస్తున్న కార్మికులు ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు వారిని కాపాడే విధానం, అగ్ని ప్రమాదాలు, విషవాయువులు ఏర్పడినప్పుడు ఎలాంటి పరికరాలు వినియోగించి.. ఎలా అదుపులోకి తీసుకురావాలో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందికి ప్ర త్యక్షంగా చూపించారు. భవనం కూలిపోయినప్పుడు, అ గ్ని ప్రమాదాలకు గురైనప్పుడు సహాయక సిబ్బంది సురక్షితంగా ఉంటూ.. ప్రమాదంలో చిక్కుకున్న వారిని సు రక్షితంగా బయటకు తీసుకురావడమే లక్ష్యంగా ఈ శిక్షణ ఇస్తున్నారు. బుధవారంతో మొదటిబ్యాచ్ శిక్షణ పూర్తయింది. సింగరేణి అందించిన శిక్షణ భవిష్యత్లో చాలా ఉపయోగపడుతుందని విపత్తుల విభాగం సిబ్బంది పేర్కొన్నారు.సంతోషంగా ఉంది అంతర్జాతీయ స్థాయి సామగ్రి సింగరేణి వద్ద ఉంది. ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలో అన్ని విషయాలను కళ్లకు కట్టినట్లు వివరించారు. ఇందుకు చాలా సంతోషంగా ఉంది. – కె.రవీందర్, ఆర్ఎస్ఐ, డిచ్పల్లి 7వ బెటాలియన్ఎలా రక్షించాలో తెలుసుకున్నాం.. క్లిష్ట సమయాల్లో ప్రకృతి వైపరీత్యాల సహాయక బృందం ఎలా వ్యవహరించాలనే విషయాలను తెలుసుకున్నాం. సకాలంలో స్పందించడంతో పాటు సురక్షితంగా ఉండి ఆపదలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడమే లక్ష్యంగా అందించిన శిక్షణ భవిష్యత్లో ఉపయోగ పడుతుంది. – బదావత్ రంజిత్కుమార్,హెడ్కానిస్టేబుల్కళ్లకు కట్టినట్టు..ఎత్తయిన భవనా ల్లో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా స్పందించాలి, ఏవిధమైన చర్యలు తీసుకోవాలనే తీరుపై కూలంకషంగా వివరించారు. ప్రమాదాల్లో చిక్కువారిని రక్షించడంతో పాటు.. మనం కూడా సురక్షితంగా బయటకు వచ్చే విధానం, మంటలను అదుపులోకి తెచ్చే తీరుతో పాటు పలు అంశాలపై కళ్లకు కట్టినట్లు వివరించారు. – కె.రవి, ఏఎస్ఐ, ఎస్డీఆర్ఎఫ్ అంతర్జాతీయ ప్రమాణాలతో.. ప్రకృతి వైపరీత్యాలతో పాటు భూగర్భ గనుల్లో ప్రమాదాలు జరిగినప్పుడు అనుసరించాల్సిన తీరుపై అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ కేంద్రంగా నిలుపుతాం. ఇప్పటికే కోలిండియాలోని అనేక సంస్థలకు సహాయ చర్యలపై శిక్షణ ఇచ్చాం. రాబోయే రోజుల్లో మరిన్ని సంస్థలకు కూడా శిక్షణ ఇచ్చి.. సింగరేణి పేరును అంతర్జాతీయ స్థాయిలో నిలుపుతాం. – ఎన్.బలరాం, సీఎండీ, సింగరేణి 4 నెలల క్రితమే చేరా.. నాలుగు నెలల క్రితం ఎస్డీఆర్ఎఫ్లో చేరాను. ముందుగా హుస్సేన్సాగర్లో నీటిలో పడిపోయిన వారిని రక్షించే అంశంపై శిక్షణ ఇచ్చారు. సింగరేణి రెస్క్యూ ద్వారా అందించిన శిక్షణ చాలా బాగుంది. – బీర్ల ఆనంద్, కానిస్టేబుల్, ఎస్డీఆర్ఎఫ్ -
మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో మరణించడం మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టమనే చెప్పాలి. ఆపరేషన్ కగార్ పేరిట తరుముతున్న సాయుధ పోలీసు బలగాలు..మరోవైపు ముంచుకొస్తున్న ఆనారోగ్య సమస్యలు.. కొన్నేళ్లుగా మావోయిస్టు పార్టీ కేడర్ను సతమతం చేస్తున్నాయి. ప్రధానంగా మావోయిస్టు సెంట్రల్ కమిటీలో ఉన్న నాయకులంతా ఐదుపదుల వయస్సు దాటినవారే కావడంతో ఏదో ఒక రకమైన ఆరోగ్య సమస్య వారిని వెంటాడుతూనే ఉంది. కొందరు కీలక నేతలను అనారోగ్యంతో కోల్పోతే, మరికొందరు ఎన్కౌంటర్లలో హతమవడం మావోయిస్టులను కలవర పెడుతోంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మావోయిస్టు పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు, సెంట్రల్ కమిటీ మెంబర్ కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ జూన్ 2023లో మృతి చెందారు. అంతకుముందే మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, సెంట్రల్ కమిటీ మెంబర్ యాపా నారాయణ (హరిభూషణ్) కరోనాతో మృతి చెందారు.మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్ అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్కే) సైతం కిడ్నీలు ఫెయిల్ అవడం ఇతర అనారోగ్యంతో బాధపడుతూ బస్తర్ అటవీ ప్రాంతంలో చనిపోయారు. ఇక సెంట్రల్ కమిటీలోని కొందరు నేతలు సొంతగా నడవలేని స్థితిలోనూ ఉన్నట్టు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర సాయుధ బలగాల నుంచి తప్పించుకుని తిరగడం వారికి కష్టమవుతోందనే వాదనలు ఉన్నాయి. కీలక నేతలే టార్గెట్గా ఆపరేషన్లు మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం 2026 మార్చి 31 డెడ్లైన్గా విధించడంతో సీఆర్పీఎఫ్, డీఆర్జీ, గ్రేహౌండ్స్ వంటి ప్రత్యేక బలగాలతో పాటు స్థానిక పోలీసులు మావోయిస్టు కీలక నేతలనే టార్గెట్ చేసుకుంటున్నారు. ఓవైపు మావోయిస్టుల కంచుకోటగా ఉన్న అబూజ్మఢ్, బస్తర్, కర్రిగుట్టలు సహా కీలక ప్రాంతాలన్నింటిలోకి చొచ్చుకుని వెళుతూ దళాలు క్యాంపులు నిర్మిస్తున్నాయి. మరోవైపు మావోయిస్టు అగ్ర నాయకత్వాన్ని టార్గెట్ చేస్తేనే మావోయిస్టులను మూలాల నుంచి దెబ్బ కొట్టవచ్చన్న వ్యూహంతో ముందుకు వెళుతున్నాయి. గతంలోనూ ఇదే తరహా వ్యూహాలను అమలు చేశాయి. ఈ ఏడాది జనవరి 16న ఛత్తీస్గఢ్ జాపూర్ జిల్లా పరిధిలో చేసిన ఎన్కౌంటర్లో తెలంగాణ మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ను మట్టుపెట్టాయి. జనవరి 21న ఒడిశా మావోయిస్టు పార్టీ కార్యదర్శి చలపతి మరణించారు. 2024 డిసెంబర్లో ములుగు జిల్లా పరిధిలో జరిగిన ఎన్కౌంటర్లో కుర్సుం మంగు అనే కీలక నేత చనిపోయారు. దంతెవాడ–బీజాపూర్ జిల్లా పరిధిలో 2024 సెప్టెంబర్లో జరిగిన ఎన్కౌంటర్లో మాచర్ల ఏసోబు అలియాస్ రణ«దీర్ ఎన్కౌంటర్ అయ్యారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో అత్యంత చురుకైన, ప్రమాకరమైన మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు మాడ్వి హిడ్మా కోసం వేలాది మందితో కూడిన భద్రత బలగాలు గాలిస్తున్నాయి. క్రమంగా కుచించుకుపోతున్న పార్టీ మావోయిస్టుల స్థావరాలు భద్రత బలగాల హస్తగతం అవుతుండడం..వరుస ఘటనల్లో అగ్ర నాయకత్వాన్ని కోల్పోతుండడంతో మావోయిస్టుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలోనే పదుల సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోతున్నారు. ప్రస్తుతం మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీలో వంద మంది లోపే సభ్యులు ఉన్నారని, వారిలోనూ 80 శాతానికి పైగా ఇతర రాష్ట్రాల వారే ఉన్నట్టు పోలీసులు అధికారికంగా వెల్లడించారు.ఇలా తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల్లోనూ మావోయిస్టు కమిటీల్లో కొత్తగా రిక్రూట్మెంట్లు లేకపోగా..ఉన్న వారు లొంగిపోతుండడంతో పార్టీ క్రమంగా కుచించుకుపోతోందని అంటున్నారు. తుడిచివేతే లక్ష్యంగా ‘కగార్’ దేశంలో మావోయిస్టులు లేకుండా చేయాలనే లక్ష్యంతో 2009లో కేంద్రం ఆపరేషన్ గ్రీన్హంట్ను చేపట్టింది. గడిచిన పదహారేళ్లలో ఈ కార్యక్రమం ఆపరేషన్ సమాధాన్, ప్రహార్గా కొనసాగి ఇప్పుడు కగార్ (ఫైనల్ మిషన్)కు చేరుకుంది. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లోని మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాలను నలువైపుల నుంచి చుట్టుముట్టడం ద్వారా మావోయిస్టులను పూర్తిగా ఏరివేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా.. 1) ఆయా ప్రాంతాల్లో ఫార్వర్డ్ బేస్ క్యాంపులను ఏర్పాటు చేస్తారు. దీని కోసం సీఆర్పీఎఫ్, ఇండోటిబెటన్ పోలీస్, బస్తర్ ఫైటర్స్, డీఆర్జీ, కోబ్రా ఇలా వివిధ పేర్లతో లక్ష మందికి పైగా జవాన్లను తయారు చేశారు. ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒకటి వంతున క్యాంపులు ఏరా>్పటు చేస్తున్నారు. 2) మావోయిస్టుల సమాచారం సేకరించడంలో భాగంగా డ్రోన్లు, శాటిలైట్ ఇమేజెస్, ఆర్టిఫిíÙయల్ ఇంటిలిజెన్స్లను వాడుతున్నారు. 3) తమ ఆ«దీనంలోకి వచి్చన ప్రాంతాల్లో వెనువెంటనే పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి లా అండ్ ఆర్డర్ను అమలు చేస్తూ, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. 4) లొంగిపోవాలని భావించే మావోయిస్టులకు ఉదారంగా సరెండర్ పాలసీ అమలు. ఈ నాలుగు లక్ష్యాలతో ఆపరేషన్ కగార్ 2024 జనవరి 1న మొదలైంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోకి క్యాంపులు రావడంతో నక్సలైట్ల కదలికలు పరిమితం అయ్యాయి. వారు దట్టమైన అడవుల్లో, షెల్టర్ జోన్లలో ఉండటాన్ని ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి గుర్తిస్తున్నారు. సెర్చ్ ఆపరేషన్లు చేసే క్రమంలో ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. మావోయిస్టులు పెద్ద సంఖ్యలో చనిపోతున్నారు. సరెండర్ పాలసీ కారణంగా లొంగుబాట్లు కూడా పెరిగాయి. -
45 ఏళ్ల అజ్ఞాతం.. అడవిలోనే అంతం
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/ సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/కాజీపేట అర్బన్: మావోయిస్టు పార్టీ తన ప్రస్థానంలో ఎన్నో ఎదురు దెబ్బలు కాసింది. కానీ.. ఆ పార్టీకి బుధవారం తగిలిన ఎదురుదెబ్బ మాత్రం అశనిపాతమే. పార్టీ సుప్రీం కమాండర్గా ఉన్న ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు (ఎన్కే) అలియాస్ బసవరాజు అలియాస్ గంగన్న ఎవరూ ఊహించని విధంగా ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో పోలీసు తూటాలకు నేలకొరిగారు. మిలటరీ ఆపరేషన్ల నిర్వహణలో దిట్టగా గుర్తింపు పొందిన నంబాల అనేక భారీ దాడులకు వ్యూహకర్తగా వ్యవహరించారు. విద్యార్థి దశ నుంచే.. కేశవరావు స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలంలోని జియ్యన్నపేట. వాసుదేవరావు, లక్ష్మీనారాయణమ్మ దంపతులకు 1955లో జన్మించారు. ఆయనకు ఇద్దరు సోదరులు, ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. తండ్రి ఉపాధ్యాయుడు కాగా 1 నుంచి 5 వరకు స్వగ్రామమైన జియ్యన్నపేటలోనే విద్యనభ్యసించారు. ఆ తర్వాత 6 నుంచి 10 వరకు టెక్కలి మండలం తలగాం ఎట్ నౌపడ ఆర్ఎస్లోను, టెక్కలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్, టెక్కలి ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. కబడ్డీ, వాలీబాల్ క్రీడాకారుడిగా రాణించిన కేశవరావు విద్యార్థి దశలోనే విప్లవ భావజాలానికి ఆకర్షితుడయ్యారు. విద్యార్థి దశలో తన స్వగ్రామం వచ్చి తనకు రావాల్సిన వాటాను ఆస్తిగా ఇస్తే, పేదలకు పంపిణీ చేస్తానని తండ్రిని అడిగినట్టు సమాచారం. వరంగల్లోని రీజనల్ ఇంజినీరింగ్ కాలేజీలో (ఇప్పటి నిట్) బీటెక్ చేశారు. ఆ సమయంలోనే విప్లవ పార్టీలతో పరిచయాలు ఏర్పడ్డాయి. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్ఎస్యూ) సభ్యుడిగా చేరిన ఆయనకు సీపీఐ (ఎంఎల్) అగ్రనేతలు కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తితో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. మలుపు తిప్పినఎంటెక్..ఎంటెక్ చదువుతుండగా కళాశాలలోని మెస్లో జరిగిన చిన్నపాటి వివాదం కేశవరావు జీవితాన్ని మలుపు తిప్పింది. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ లీడర్గా కేశవరావు ఉన్న సమయంలో మరో విద్యార్థి సంఘం ఏబీవీపీతో జరిగిన వివాదానికి సంబంధించిన కేసులో ఆయన చిక్కుకున్నారు. అరెస్టు చేస్తారన్న సమాచారంతో.. 1980లో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన కేశవరావు 1982లో చింతపల్లి ప్రాంతంలో పోలీసులకు పట్టుబడ్డారు. విశాఖపట్టణం సెంట్రల్ జైలులో ఉండి బెయిల్పై బయటకు వచ్చారు. ఆ తర్వాత ఆయన ఆచూకీ లేదు.ఒక్కసారి కూడా ఇంటికి రాలేదు..కేశవరావు విప్లవ పార్టీలో చేరిన తరువాత ఒక్కసారి కూడా తన స్వగ్రామం జియ్యన్నపేటకు రాలేదు. 1980లో పీపుల్స్ వార్ పార్టీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. తొలుత గంగన్న అనే పేరుతో పీపుల్స్ వార్ ఈస్ట్ డివిజన్ కార్యదర్శిగా చేశారు. 1987లో ఈస్ట్ డివిజన్ను విస్తరించి ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఏజెన్సీ ప్రాంతాలను కలుపుతూ దండకారణ్య కమిటీ ఏర్పాటు ఆయన ఆలోచనే. ఆ కమిటీలో కేశవరావుతో పాటు మల్లోజుల కోటేశ్వరరావు, కటకం సుదర్శన్ కీలకపాత్ర పోషించారు.ఎల్టీటీఈ ద్వారా శిక్షణ1990లో కేశవరావు పీపుల్స్వార్ పార్టీ అగ్రనేతగా ఎదిగారు. ఆ తరువాత పీపుల్స్ వార్ పార్టీకి గుండెకాయ వంటి దండకారణ్య కమిటీ కార్యదర్శిగా నియమితులయ్యారు. కేశవరావు పేలుడు పదార్థాల తయారీ నిపుణుడిగా, మిలటరీ ఆపరేషన్ల వ్యూహ నిపుణుడిగా గుర్తింపు పొందారు. అప్పటి పీపుల్స్వార్ పార్టీ కీలక నేతలు మల్లోజుల కోటేశ్వరరావు, మల్లోజుల వేణుగోపాల్, మల్లా రాజిరెడ్డిలతో కలసి 1987లో మధ్యప్రదేశ్లోని బస్తర్ అడవుల్లో పేలుడు పదార్థాల ప్రయోగం, గెరిల్లా దాడుల్లో శిక్షణ పొందారు. ఎల్టీటీఈ ద్వారా వీరు ఈ శిక్షణ తీసుకున్నారు. దేశవ్యాప్త మిలటరీ ఆపరేషన్లకు నేతృత్వం పీపుల్స్వార్ పార్టీలో ప్రత్యేక మిలటరీ ఆపరేషన్స్ విభాగం ఏర్పాటు చేయాలని 1995లో గణపతి, కేశవరావు భావించారు. ఆ మిలటరీ ఆపరేషన్స్ విభాగానికి బసవరాజు, బీఆర్ పేర్లతో కేశవరావే నేతృత్వం వహించారు. 2001లో పీపుల్స్వార్ 7వ కాంగ్రెస్లో సెంట్రల్ మిలటరీ కమిషన్ ఇన్చార్జిగా నియమితులయ్యారు. అప్పటివరకు దండకారణ్య ప్రాంతానికే పరిమితమైన ఆయన ఆ తర్వాత దేశవ్యాప్తంగా పీపుల్స్వార్ పార్టీ మిలటరీ ఆపరేషన్లను పర్యవేక్షించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి బిహార్, ఉమ్మడి మధ్యప్రదేశ్, ఒడిశాలో వేలాదిమందికి గెరిల్లా పోరాటంలో శిక్షణ ఇచ్చారు.2016లో సుప్రీం కమాండర్గా..పీపుల్స్వార్, మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీ సెంటర్(ఎంసీసీ)ను విలీనం చేయడంలో గణపతి, కేశవరావు జోడీ ప్రధాన పాత్ర పోషించింది. గణపతి మొదటి ప్రధాన కార్యదర్శిగా పనిచేయగా.. కేశవరావు మిలటరీ కమిషన్ ఇన్చార్జిగా వ్యవహరించారు. 2016లో వయోభారంతో గణపతి ఆ పదవి నుంచి వైదొలగడంతో ప్రధాన కార్యదర్శి హోదాలో కేశవరావు సుప్రీం కమాండర్గా నియమితులయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో రెండు దశాబ్దాల పాటు పీపుల్స్వార్/మావోయిస్టు పార్టీ జరిపిన అన్ని ప్రధాన దాడుల వెనుక వ్యూహకర్త నంబాల కేశవరావే అని పోలీసులు చెబుతారు. గెరిల్లా వార్ఫేర్, ఆయుధాల తయారీ, మెరుపు దాడులు చేయడం వంటి అంశాల్లో నంబాల కేశవరావుకు దిట్టగా పేరుంది. స్వతహాగా ఇంజనీరింగ్ చదివి ఉండడంతో ఆ నైపుణ్యాన్ని పార్టీ బలోపేతానికి వినియోగించినట్టు చెబుతారు. పీపుల్స్వార్ చరిత్రలో తొలిసారి 1987లో తూర్పుగోదావరి జిల్లా దారగడ్డలో పోలీసు బలగాలపై గెరిల్లా దళం దాడికి కేశవరావు నేతృత్వం వహించారు. ఆ దాడిలో ఆరుగురు పోలీసులు మరణించారు. అలిపిరి ఘటనకు, ఇతర భారీ దాడులకు బాధ్యుడు 2003 అక్టోబర్ 1న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై తిరుపతిలోని అలిపిరిలో క్లెమోర్ మైన్ దాడి వ్యూహం కేశవరావుదే. 2008లో ఒడిశా నాయగఢ్లో పోలీసుల ఆయుధాగారంపై దాడిచేసి వెయ్యికి పైగా ఆధునిక ఆయుధాలను అపహరించుకుపోయిన దాడికి నేతృత్వం వహించారు. 2010లో ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో 76 మంది సీఆర్పీఎఫ్ బలగాలను బలిగొన్న దాడికి వ్యూహకర్త నంబాల కేశవరావే. ఆ దాడికి హిడ్మా నేతృత్వం వహించాడు. 2013లో ఛత్తీస్గఢ్ మాజీ మంత్రి, మావోయిస్టులకు వ్యతిరేకంగా సల్వా జడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మతో పాటు కాంగ్రెస్ నేత నందకుమార్ మరో 27మందిని బలిగొన్న దాడికి కూడా కేశవరావే వ్యూహకర్త. విశాఖ జిల్లా అరకులో అప్పటి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య ఘటనలోనూ కేశవరావు ప్రమేయం ఉందన్న వాదనలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నయాగరా, చింతల్నార్, బలిమెల వంటి దాడులు కూడా ఆయన నేతృత్వంలోనే చోటుచేసుకున్నాయి. శత్రువులుగా భావించిన వారికి మాటల కంటే తూటాలతోనే ఎక్కువ బదులిస్తారనే పేరు మోశారు. కాగా బసవరాజు పేరు ఏపీ, తెలంగాణలో కంటే జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది.నీడను కూడా నమ్మని మావోయిస్టు పార్టీ గెరిల్లా పోరాట పంథానుఅనుసరిస్తుండటంతో మావోయిస్టు పార్టీ నీడను సైతం నమ్మకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. పార్టీలో ఏదైనా విభాగానికి నిర్దిష్టమైన పనులు తప్ప మొత్తం వ్యవహారంపై అవగాహన ఉండదు. అయితే జాతీయ ప్రధాన కార్యదర్శి పొలిట్బ్యూరో, సెంట్రల్ మిలటరీ కమిషన్, రాష్ట్ర కమిటీలు, వివిధ డివిజన్ కమిటీలను సమన్వయం చేయడం, ఆర్థిక, ఆయుధ వ్యవహారాలను చక్కదిద్దడం వంటి పనులు చూస్తుంటారు.ఎక్కడ నుంచి ఆయుధాలు వస్తుంటాయి, ఆర్థిక వనరుల ఆనుపానులు ఎక్కడ ఉంటాయి, పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఎక్కడ షెల్టర్లలో ఉన్నారనే అంశాలు కూడా ఆయనకే ఎక్కువగా తెలుస్తాయి. ఇప్పటికే పెరిగిన నిర్బంధంతో ఆ పార్టీ విభాగాలు, కీలక నేతలు చెల్లాచెదురయ్యారు. ఇప్పుడు కేంద్ర కార్యదర్శే చనిపోవడంతో పార్టీకి సంబంధించిన వివిధ విభాగాల మధ్య సమన్వయం దెబ్బతినే అవకాశముందని భావిస్తున్నారు. ఒక్కసారి చిక్కినా విదిలించుకుని.. నంబాల కేశవరావు విద్యార్థి సంఘాలు ఆర్ఎస్యూ, ఏబీవీపీ ఘర్షణల్లో ఒక్కసారి మాత్రమే అరెస్టయ్యారు. 1987లో విశాఖపటా్ననికి ఒంటరిగా వచ్చిన ఆయన్ను పట్టుకునేందుకు పోలీసులు యత్నించారు. అయితే కబడ్డీ క్రీడాకారుడు కావడంతో చాకచక్యంగా విదిలించుకుని పరారయ్యారు. మిలటరీ ఆపరేషన్ల నిర్వహణలో కీలక పాత్ర పోషించిన ఆయనపై రూ.10 లక్షలతో మొదలైన పోలీసు రివార్డు రూ.1.50 కోట్లకు చేరుకుంది. పోలీసు శాఖ మోస్ట్వాంటెడ్ లిస్టులో అత్యధిక రివార్డు కేశవరావుపైనే ఉందని సమాచారం. 45 ఏళ్ల క్రితం విద్యార్థిథగా ఇంటిని వదిలివెళ్లిన కేశవరావు మావోయిస్టు అగ్రనేతగా ఎదిగి అప్పట్నుంచీ అజ్ఞాతంలోనే జీవితాన్ని గడిపారు. చివరకు అడవిలోనే ప్రాణాలు విడిచారు. కేశవరావు కుటుంబం విశాఖపట్నంలోనే స్థిరపడింది. -
అయోమయం... గందరగోళం
సాక్షి, హైదరాబాద్: గిరిజన గురుకుల విద్యాసంస్థల్లో ఆర్వో (రివర్స్ ఆస్మోసిస్) వాటర్ ప్లాంట్ల ఏర్పాటు టెండరు ప్రక్రియపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టెండరు నిబంధనల రూపకల్పన, దరఖాస్తుదారుల ఆర్థిక అంశాల ఎంపిక తికమకగా ఉన్నాయి. టెండర్లో పాల్గొనే వారు తయారీదారులై ఉండాలా? లేక పంపిణీ దారుడైతే సరిపోతుందా? అనే అంశంపై స్పష్టత లేకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.తెలంగాణ గిరిజన గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోని గురుకుల పాఠశాలల్లో 398 ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు ఈనెల 7న గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగం టెండర్లు పిలిచింది. 2025–26 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికల్లా కాంట్రాక్టర్లను ఖరారు చేసి ఆర్వో ప్లాంట్లను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చేలా గిరిజన సంక్షేమ శాఖ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. టెండరు ప్రక్రియలో లోపాలున్నాయని, ప్రభుత్వం దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని దరఖాస్తుదారులు డిమాండ్ చేస్తున్నారు. టెండరు ప్రక్రియ ఇలా... రాష్ట్రంలో మూడు ఏజెన్సీ ప్రాంతాలున్నాయి. ఉట్నూరు, ఏటూరు నాగరం, భద్రాచలం ఐటీడీఏ పరిధిలో ఉన్న విద్యాసంస్థల్లో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు మూడు టెండర్లు పిలిచారు. అదేవిధంగా మన్ననూరు ప్రాజెక్టుకుతోపాటు హైదరాబాద్ కేంద్రంగా నిర్దేశించిన విద్యాసంస్థల కోసం మరో టెండరు పిలిచారు. మొత్తం నాలుగు టెండర్ల ద్వారా 398 ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయాలి. ఇందులో 244 ప్లాంట్లు 500 లీటర్/అవర్, మిగతా 154 ప్లాంట్లు వెయ్యి లీటర్/అవర్ సామర్థ్యం గలవి. వీటికి రూ.25 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉంది. ఈనెల 7 నుంచి 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు టెండర్లకు గడువు విధించారు. ఈనెల 16న సాయంత్రం 5 గంటలకు బిడ్లు తెరిచి కాంట్రాక్టరును ఖరారు చేసేలా షెడ్యూల్లో ప్రకటించారు. అయితే బిడ్ తెరవాల్సిన తేదీ ముగిసి వారమైనా కాంట్రాక్టరును ఖరారు చేయకపోవడం గమనార్హం. నిబంధనలపై అభ్యంతరాలివీ.. » టెండరు ప్రక్రియలో దరఖాస్తు గడువు కీలకం. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం టెండరు ప్రక్రియలో మూడు వారాలపాటు అవకాశం కల్పించాలి. అత్యవసర సందర్భంలో గడువు పది రోజులు ఇవ్వొచ్చు. కానీ ఇక్కడ వారం మాత్రమే ఇచ్చారు. » టెండర్లలో పాల్గొనే వాళ్లు ప్లాంటు తయారీదారులై ఉండాలా? లేక నమోదైన పంపిణీదారుడై ఉండాలా? లేక చిన్నపాటి సరఫరాదారుడై ఉన్నా సరిపోతుందా? అనేదానిపై స్పష్టత లేదు. » ఆర్వో ప్లాంటు ఏర్పాటుకు సంబంధించి నాణ్యత ప్రమాణాలతోపాటు టెక్నికల్ డ్రాయింగ్, డిజైన్ తప్పనిసరిగా ప్రకటించాలి. కానీ అలాంటిది లేదు. » సాధారణంగా మిషనరీ, ఇతర పరికరాల కొనుగోలు విషయంలో తప్పనిసరిగా ఆర్థిక నిబంధనలు ప్రస్తావించాలి. టెండరు నిబంధనల్లో సాల్వెన్సీ సర్టిఫికెట్ అంశం లేకపోవడం గమనార్హం. » ప్లాంటు ఏర్పాటుకు సంబంధించిన కాలపరిమితి, వారంటీ వివరాలపై స్పష్టత లేదు. » బిడ్డర్కు వార్షిక టర్నోవర్ రూ.10 కోట్లు లేదా సగటున రూ.7 కోట్ల ఉంటే సరిపోతుందని పేర్కొన్నారు. కానీ కాంట్రాక్టు పరిమితి రూ.13.99 కోట్ల విలువ ఉండటంతో నిర్దేశించిన టర్నోవర్తో ఎలా సాధ్యమవుతుందనే సందేహం వ్యక్తమవుతోంది. ప్రాజెక్టు విలువకు కనీసం ఆరు రెట్లు అధికంగా టర్నోవర్ ఉండాలని నిబంధనలున్నాయి. -
రహదారులు రక్తసిక్తం
హయత్నగర్ (హైదరాబాద్)/గద్వాల క్రైం: బుధవారం హైదరాబాద్లోని హయత్నగర్, కర్ణాటకలోని విజయపుర జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 8 మంది మృతిచెందారు. హైదరాబాద్లో జరిగిన ప్రమాదంలో మృతిచెందిన ముగ్గురు యువకులు వారి కుటుంబాల్లో ఒక్కరే మగపిల్లలు కాగా, కర్ణాటకలో జరిగిన ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఓ కుటుంబంలో ఒక్కరు తప్ప అందరూ మృత్యుఒడికి చేరారు. విషాదం మిగిల్చిన అతివేగం.. హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ప్రమాదంలో అతి వేగం నాలుగు కుటుంబాలలో పెను విషాదం మిగిల్చింది. వేగంగా వచ్చిన కారు ఎదురుగా వస్తున్న డీసీఎంను ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరు గాయాలపాలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దఅంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలోని కుంట్లూర్కు చెందిన పిన్నింటి చంద్రసేనారెడ్డి (24), చుంచు త్రినాథ్రెడ్డి (24), చుంచు వర్షిత్రెడ్డి (23), ఎలిమేటి పవన్కల్యాణ్రెడ్డి చిన్నప్పటినుంచి స్నేహితులు. బుధవారం తెల్లవారుజామున వారంతా పస్మాముల వైపు నుంచి కుంట్లూర్కు స్కోడా కారులో వస్తున్నారు. ఉదయం 5:40 గంటల సమయంలో కుంట్లూర్లోని నారాయణ కళాశాల సమీపంలోని గ్యాస్ బంకు వద్ద ఎదురుగా వస్తున్న డీసీఎం వాహనాన్ని ఢీకొట్టారు. దీంతో కారులో ఉన్న చంద్రసేనారెడ్డి, త్రినాథ్రెడ్డి, వర్షిత్రెడ్డిలు అక్కడికక్కడే మృతిచెందారు. గాయపడ్డ పవన్కల్యాణ్రెడ్డిని కారులో నుంచి బయటికి తీసిన పోలీసులు చికిత్స నిమిత్తం హయత్నగర్లోని సన్రైజ్ ఆసుపత్రికి తరలించారు. కాగా, మంగళవారం రాత్రి ఓ రిసెప్షన్కు హాజరైన ఈ యువకులు మధ్యలో ఓ ఫాంహౌస్లో గడిపినట్లు తెలిసింది. అక్కడి నుంచి ఇంటికి బయలుదేరిన వారు కొద్దిసేపట్లో ఇంటికి చేరుకోవాల్సి ఉండగా మృత్యుఒడిలోకి చేరుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులలో ముగ్గురు మృతి చెందగా, డ్రైవర్సీటు పక్కన కూర్చున్న పవన్కల్యాణ్రెడ్డి గాయాలతో బయటపడ్డాడు. అతను సీటు బెల్టు పెట్టుకోవడంతో బెలూన్ ఓపెన్ అయినట్లు పోలీసులు తెలిపారు. వారసులను కోల్పోయిన కుటుంబాలు... పిన్నింటి చంద్రసేనారెడ్డి, చుంచు త్రినాథ్రెడ్డి, చుంచు వర్షిత్రెడ్డి వారి కుటుంబాల్లో ఒకరే మగపిల్లలు. వీరిలో త్రినాథ్రెడ్డి, వర్షిత్రెడ్డిలు అన్నదమ్ముల కుమారులు. వారిద్దరూ ప్రమాదంలో మృతి చెందడంతో తమకు వారసులు లేకుండా పోయారని, చేతికి అందివచ్చిన కొడుకులు ఇలా మృతిచెందారని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఒకే కుటుంబంలో నలుగురు మృతి.. కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. వీరిలో జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నారు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. గద్వాల పట్టణం బీసీ కాలనీకి చెందిన తెలుగు భాస్కర్ (41) మహారాష్ట్రలో కెనరా బ్యాంక్లో పనిచేస్తున్నారు. ఇటీవల మహారాష్ట్రలోని భండారా జిల్లా వార్తి ప్రాంతం నుంచి హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్కు బదిలీ అయ్యారు. దీంతో బుధవారం భార్య పవిత్ర (38), కుమార్తె జ్యోత్స్న (10), కుమారులు అభిరాం (8), ప్రవీణ్తో పాటు కర్ణాటకకు చెందిన డ్రైవర్ శివప్ప (45)తో కలిసి కారులో బయల్దేరారు. ఈ క్రమంలో కర్ణాటకలోని విజయపుర జిల్లా మనగులి సమీపంలో సోలాపూర్– చిత్రదుర్గ హైవేపై వీరు ప్రయాణిస్తున్న స్కార్పియో కారు డివైడర్ను ఢీకొని అవతలి లేన్లో ఎదురుగా వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. ప్రమాదంలో స్కార్పియో కారు తుక్కుతుక్కు కాగా అందులో ఉన్న భాస్కర్, పవిత్ర, జ్యోత్స్న, అభిరాం, డ్రైవర్ శివప్పలు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రవీణ్ను స్థానికులు చికిత్స నిమిత్తం అక్కడి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయాలతో బయటపడిన ప్రవీణ్ కుటుంబసభ్యులను కోల్పోయి అనాథగా మిగిలాడు. -
ట్రాఫికింగ్ డాన్ హితేశ్ అరెస్ట్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: విదేశాల్లో కొలువుల పేరిట వందలాది మంది భారతీయులను విదేశాల్లోని చైనా సైబర్ కేఫ్లకు విక్రయించిన మానవ అక్రమ రవాణా డాన్ హితేశ్ ఎట్టకేలకు అరెస్టయ్యాడు. భారత విదేశాంగ శాఖ కోరిక మేరకు అతడిని మంగళవారం రాత్రి థాయ్లాండ్ ఇమిగ్రేషన్ అధికారులు ఇండియాకు డిపోర్ట్ చేశారు. బుధవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన హితేశ్ను ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని, విదేశాంగశాఖకు అప్పగించారు. మార్చిలో కరీంనగర్ పోలీసులు జారీచేసిన లుక్అవుట్ నోటీసుల ఫలితంగా హితేశ్ ఇండియా రాగానే అదుపులోకి తీసుకున్నారు. హితేశ్ ఇండియాకు వస్తున్నాడన్న సమాచారంతో మంగళవారం రాత్రి కరీంనగర్ జిల్లా మానకొండూరు పోలీసులు ఢిల్లీకి చేరుకున్నారు. అయితే, గుజరాత్కు చెందిన హితేశ్ను తెలంగాణ పోలీసుల కంటే ముందే ఆ రాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం రోజంతా జరిగిన హైడ్రామా తర్వాత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కలుగజేసుకోవటంతో ఎట్టకేలకు హితేశ్ను తెలంగాణ పోలీసులకు అప్పగించారు. దీంతో కరీంనగర్ పోలీసులు అతన్ని సాయంత్రానికి కరీంనగర్కు తరలించారు. దేశవ్యాప్త నెట్వర్క్ గుజరాత్లోని పోర్బందర్కు చెందిన హితేశ్ మానవ అక్రమ రవాణా సూత్రధారి. ఇతను థాయ్లాండ్, మయన్మార్, లావోస్ దేశాల్లో సైబర్ నేరాలకు పాల్పడే కేఫ్లకు మనుషులను అక్రమంగా పంపిస్తాడు. విదేశాల్లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలిప్పిస్తానని, నెలకు రూ.లక్ష జీతమని నమ్మబలికి ఒక్కో వ్యక్తిని 3,000 డాలర్లకు చైనీస్ సైబర్ కేఫ్లకు విక్రయించేవాడు. మనదేశంలో ఇతనికి ప్రతి రాష్ట్రంలో ఏజెంట్లు ఉన్నారు. ఇప్పటివరకు అతడు దాదాపు 300 మందికిపైగా భారతీయులను విక్రయించాడని సమాచారం. ఇతని ఏజెంట్లలో జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన శ్యామారావు రాజశేఖర్ ఒకడు. వీరిద్దరు కలిసి గతేడాది డిసెంబర్లో కరీంనగర్ జిల్లా మానకొండూరుకు చెందిన మధుకర్రెడ్డి అనే యువకుడిని మయన్మార్కు పంపారు. అక్కడ ఆ యువకుడు తిరగబడ్డాడు. ఈ విషయాన్ని ‘సాక్షి’వరుస కథనాలతో వెలికితీయడంతో స్పందించిన బండి సంజయ్.. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్షాకు వివరించారు. దీంతో తొలుత అక్కడ సైబర్కేఫ్లో చిక్కుకున్న 540 మందిని మయన్మార్ సైన్యం సాయంతో కాపాడారు.తెలంగాణ సైబర్ పోలీసులు కూడా దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మానకొండూరు, ఖానాపూర్లో హితేశ్పై కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లోనే కరీంనగర్ పోలీసులు హితేశ్పై లుక్అవుట్ నోటీసులు జారీచేశారు. మరో కీలక నిందితుడు రాజశేఖర్ లావోస్లో తలదాచుకుంటున్నాడని సమాచారం. భారతీయ యువతీ యువకులను చైనీయులకు విక్రయించిన హితేశ్.. వారు తిరగబడితే చిత్రహింసలు పెట్టి చీకటిగదుల్లో వేయించేవాడు. చైనీయుల కోసం వందల మంది భారతీయులను అంగడి సరుకుగా విక్రయించాడు. చివరికి ఆ చైనీయులే అతన్ని చితకబాది థాయ్లాండ్ ఇమిగ్రేషన్ అధికారులకు పట్టించడం కొసమెరుపు. -
పాక్కు బుద్ధి చెప్పడంలో ప్రధాని వెనకడుగు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: పహల్గాం దాడి ఘటన నేపథ్యంలో పాకిస్తాన్కు బుద్ధి చెప్పడంలో ప్రధాని మోదీ వెనకడుగు వేశారని.. అదే ఇందిరమ్మ హయాంలో ఉగ్రవాదుల ముసుగులో భారత పౌరులపై దాడులకు తెగబడిన పాక్కు గట్టి గుణపాఠం చెప్పారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని సచివాలయం ముందు ఆయన విగ్రహానికి రేవంత్ పుష్పాంజలి ఘటించారు. రాజీవ్ వర్ధంతి రోజున ‘ఉగ్రవాద వ్యతిరేక దినం’గా పాటిస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేస్తూ.. ఉగ్రవాదంపై పోరాటం చేయడం ప్రతి భారతీయుడి దృఢ సంకల్పమన్నారు. దేశ భద్రత, సమగ్రతను కాపాడే విషయంలో రాజకీయాలకు తావు లేకుండా కేంద్ర ప్రభుత్వానికి, భారత వీర జవాన్లకు ఎప్పుడూ అండగా నిలబడతామని చెప్పారు. కశ్మీర్లో పర్యాటకులపై కాల్పుల ఘటన, ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పోరాటం చేస్తున్న వీర సైనికులకు అండగా తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటగా సంఘీభావ ర్యాలీ నిర్వహించిందని గుర్తుచేశారు. నాడు ఇందిర అంగీకరించలేదు...: ఉగ్రవాదులను నిర్మూలించడంలో ఇందిరమ్మ ఆదర్శంగా నిలిచారని, నాడు యుద్ధం సందర్భంగా ఆమెరికా లేదా ఇతర దేశాల మధ్యవర్తిత్వాన్ని ఆమె అంగీకరించలేదని రేవంత్రెడ్డి చెప్పారు. భారత దేశ భద్రతను కాపాడుకోవడంలో ఎవరి సూచనలు, మధ్యవర్తిత్వం అక్కర్లేదని స్పష్టంగా చెప్పారన్నారు. ట్రంప్ చెబితే కాల్పుల విరమణ చేసిన పరిస్థితి ఇప్పటి కేంద్ర ప్రభుత్వానిదని ఎద్దేవా చేశారు. కశ్మీర్ ఘటనలపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాందీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు అందరం కేంద్రానికి, పోరాటం చేస్తున్న వీర జవానులకు అండగా నిలబడ్డామన్నారు. –చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే కేంద్ర మంత్రి కిషన్రెడ్డి.. రాహుల్పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాలకు తావివ్వకుండా దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యతనివ్వాలని పిలుపునిచ్చారు. దేశ సమగ్రతను కాపాడటంలో కృషిచేసిన మహాత్మాగాందీ, ఇందిరా గాందీ, రాజీవ్ గాందీ, బీఆర్ అంబేడ్కర్, పీవీ నరసింహారావు విగ్రహాలతో ఈ ప్రాంతం భారతీయులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని చెప్పారు. దేశాభివృద్ధిలో రాజీవ్ గాంధీ పాత్ర మరువలేనిదని కొనియాడారు. ఓటు హక్కును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించి యువతకు ఓటు హక్కు కల్పించారని, ఆధునిక సాంకేతిక నైపుణ్యంతో 21వ శతాబ్దంవైపు దేశాన్ని నడిపించారని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్తోపాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. -
TG: గ్రామ పంచాయతీలకు పెండింగ్ బిల్లుల చెల్లింపు
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీలకు పెండింగ్ బిల్లుల చెల్లింపునకు రాష్ట్ర ప్రభుత్వం రూ.153 కోట్లు విడుదల చేసింది. పెండింగ్లో ఉన్న 9990 బిల్లులు ఒకే రోజున ప్రభుత్వం క్లియర్ చేసింది. ఒకే విడతలో రూ.10 లక్షల లోపు బిల్లులను ప్రభుత్వం చెల్లించింది.2024 ఆగస్టు వరకు పెండింగ్లో ఉన్న బిల్లుల నిధులకు ప్రాధాన్యం ఇచ్చింది. గత ప్రభుత్వం.. గ్రామ పంచాయతీలకు భారీ మొత్తంలో నిధులు పెండింగ్లో పెట్టింది. వీటితో పాటు ఎస్డీఎఫ్ (ప్రత్యేక అభివృద్ధి నిధి) కింద చేపట్టిన వివిధ పనులకు రూ.85 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. -
నాగం జనార్ధన్రెడ్డి పిటిషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు
ఢిల్లీ: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చేయాలంటూ నాగం జనార్ధన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. హైకోర్టు ఆదేశాలలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ బివి.నాగరత్నం, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం విచారణ జరిపింది.నాగం జనార్ధన్రెడ్డి తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తన వాదనలు వినిపిస్తూ.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో పెద్ద ఫ్రాడ్ జరిగిందన్నారు. ప్రభుత్వ ఖజానాకు రూ.2426 కోట్ల రూపాయల నష్టం జరిగింది. ప్రభుత్వం ఆమోదించిన ప్రకారం 65 శాతం పంపులు, మోటార్ల కోసం బీహెచ్ఈఎల్కు చెల్లింపులు చేయాలి. 35 శాతం సివిల్ వర్క్స్కు మేఘాకు చెల్లింపులు చేయాలి.. కానీ, అంతర్గత ఒప్పందం ప్రకారం బీహెచ్ఈఎల్కు 65 శాతం నుంచి 20 శాతానికి తగ్గించారు. మేఘాకు 80 శాతం చెల్లింపులు జరిగాయి. 65:35 నుంచి 20:80 కు ఎలా మారింది. ఇందులో భారీ ఎత్తున అవినీతి జరిగిందంటూ వాదనలు వినిపించారు. న్యాయవాది ముకుల్ రోహతగి తన వాదనలు వినిపిస్తూ.. ‘‘తెలంగాణ హైకోర్టులో దీనికి సంబందించిన ఐదు పిటిషన్లు కొట్టివేశారు.. ఇందులో ఎలాంటి ఫ్రాడ్ లేదని స్పష్టం చేసింది. సివిసి కూడా ఇందులో ఏమి లేదని తేల్చింది. ఎస్టిమేషన్ పెంచడాన్ని తప్పు పడుతున్నారు. బీహెచ్ఈఎల్ కూడా ఇందులో ఫిర్యాదు చేయలేదు. ఏదో ఒక డాక్యుమెంట్ తెచ్చి కేసులు వేస్తున్నారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్ బాగా పని చేస్తోంది’’ అని ముకుల్ రోహతగి తెలిపారు. -
కేసీఆర్కు నోటీసులపై కేటీఆర్ రియాక్షన్
హైదరాబాద్, సాక్షి: కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రయోగంగా చూపించేందుకు కాంగ్రెస్, బీజేపీలు కలిసి కుట్రలు చేస్తున్నాయని.. అందులో భాగంగానే మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు(Notices To KCR) జారీ అయ్యానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు(Kalvakuntla Rama Rao) అన్నారు. పాలన చేతకాక ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న నాటకమని మండిపడ్డారాయన. రేవంత్ సర్కార్(Revanth Sarkar)కు కమీషన్లు తప్ప.. పాలన చేత కాదు. ప్రజాపాలన కాస్త పర్సంటేజీల పాలనగా మారింది. 20 నుంచి 30 శాతం కమీషన్లు, పర్సంటేజీలు ఇవ్వకపోతే ఈ ప్రభుత్వంలో ఏ పని జరగదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులే బహిరంగంగా చెపుతున్నారు. తమ అవినీతి కమిషన్ల నుంచి దృష్టి మరల్చేందుకే కాళేశ్వరం కమిషన్(Kaleshwaram Commission) నోటీసుల డ్రామా. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించే నాటకాలు ఆడుతోంది. అందులో భాగంగానే ఈ నోటీసులు. కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం ఓ చిల్లర ప్రయత్నం. ఇలా ఎన్నో నోటీసులు ఇచ్చినా దుదీ పించల్లా ఎగిరి పోతాయి. కమిటీల పేరుతో, కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తూ.. ఆరు గ్యారంటీల(Six Guarantees) అమలును పక్కనపెడదామనుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాలను చూస్తూ ఊరుకోబోం. ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయి’’ అని కేటీఆర్ అన్నారు. ఇదీ చదవండి: కేసీఆర్ చట్టానికేమైనా అతీతుడా? -
హైదరాబాద్లో దంచికొడుతున్న వర్షం
హైదరాబాద్, సాక్షి: నగరంలో పలుచోట్ల వర్షం దంచికొడుతోంది. సికింద్రాబాద్, బేగంపేట్, బోయిన్పల్లి, బంజారాహిల్స్, మోహిదీపట్నం, ఆసిఫ్నగర్, కార్వాన్, మలక్పేట్, సైదాబాద్, చాదర్ ఘాట్, మారేడుపల్లి, షేక్పేట్, మాదాపూర్, గచ్చిబౌలి, అత్తాపూర్, అంబర్పేట్, అత్తాపూర్, రాజేంద్రనగర్, నల్లకుంట, నాచారం, తార్నాక, తిరుమలగిరి, అల్వాల్, బొల్లారం, ఉప్పల్, రామంతాపూర్లో భారీ వర్షం కురుస్తోంది.ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని నగరం హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో బుధవారం మధ్యాహ్నాం నుంచి ఈదురు గాలులు, పిడుగులతో కూడిన వానలు పడుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ‘రెయిన్ అలర్ట్’ జారీ చేసింది.ఉపరితల ద్రోణి ఉదయం నుంచి హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాలపై మేఘాలు కమ్ముకోగా.. మధ్యాహ్నాం నుంచి పలుచోట్ల ఈదురు గాలులతో వర్షం(Hyderabad Rains) కురుస్తోంది. కొన్ని చోట్ల చిరుజల్లులు, మరికొన్ని చోట్ల ఓ మోస్తరు వాన పడుతోంది. మలక్ పేట్, నాంపల్లి, చార్మినార్, దిల్సుఖ్ నగర్, కోఠి, రామంతపూర్, అబిడ్స్, అంబర్పేట్.. తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఖైరతాబాద్, లక్డీకాపూల్, రాజ్ భవన్, ట్యాంక్ బండ్ సమీపంలో స్వల్ప వర్షంతో మొదలై.. జడి వానగా మారింది. నగర శివారు ప్రాంతాల్లో చోట్ల చిరు జల్లులు పడుతున్నాయి. మరికొన్ని గంటల్లో జంట నగరాల వ్యాప్తంగా పూర్తి స్థాయిలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. అలాగే.. రాత్రి సమయంలో హైదరాబాద్లో తీవ్రమైన తుఫాను(Cyclone) వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ(GHMC) అప్రమత్తం అయ్యింది. సాయంత్రం పనులు ముగించుకుని వెళ్లేవాళ్లను అప్రమత్తం చేస్తోంది. మ్యాన్ హోల్స్, కరెంట్ పోల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నగర ప్రజలకు సూచించింది.ఇదిలా ఉంటే.. ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాజధాని నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో(Telangana Rains) ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులపాటు ఈదురు గాలులు, పిడుగులతో కూడిన భారీ వానలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్లు జారీ చేసింది. ఇక పంట చేతికొచ్చే సమయం కావడంతో అప్రమత్తంగా ఉండాలని రైతులకు అధికార యంత్రాంగం సూచిస్తోంది. తెలంగాణకు రెయిన్ అలర్ట్వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. రాష్ట్ర వ్యాప్తంగా రెయిన్ అలర్ట్ జారీ చేసింది. సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉండడంతో.. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ముందస్తు ప్రణాళికలతో సమన్వయం చేసుకోవాలని సూచించింది. అలాగే..ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్లను సైతం అందుబాటులో ఉండాలని ఆదేశించింది.‘‘ఋతుపవనాలు ముందుగా రాబోతున్నాయి. అన్ని విభాగాలు అప్రమత్తంగా ఉండాలి. 2024లో కురిసిన భారీ వర్షాలకు NDRF అందుబాటులో లేకపోవడంతో గోల్డెన్ అవర్ కోల్పోయాం. 2024 సెప్టెంబర్ లాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కావొద్దు. జిల్లాల్లో కలెక్టర్లు ముందస్తు ప్రణాళికలు, సమన్వయం చేసుకోవాలి. సింగరేణి లో ప్రత్యేక శిక్షణ పొందిన రెస్క్యూ టీమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి’’ అని సర్క్యులర్లో డిజాస్టర్స్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్ కుమార్ పేర్కొన్నారు. సీఎం రేవంత్ కీలక ఆదేశాలుముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సీఎస్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ‘‘ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలో ఉన్న ధాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలి. కలెక్టర్లు.. కాంటాలు వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు చేపట్టాలి.హైదరాబాద్ సిటీలో వర్షం కురుస్తున్న ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిల్వ లేకుండా చూడాలి. ట్రాఫిక్ ఇబ్బందులు, విద్యుత్తు సమస్యలు లేకుండా చూడాలి. జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్తు విభాగాలు సమన్వయంతో పని చేయాలి. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలి’’ అని సీఎస్ను ఆదేశించారాయన. ఇదీ చదవండి: సూర్యుడిపైకి సాగర మేఘాలు -
తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు: మల్లు రవి వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు జరుగుతున్నాయన్నారు. బీజేపీతో కలిసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. ఇదే సమయంలో ఎంతో మంది మాజీ ముఖ్యమంత్రులు జైలుకు వెళ్లారు.. కేసీఆర్ చట్టానికి అతీతులా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఎంపీ మల్లు రవి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ కలిసి తెలంగాణలో పోటీ చేయబోతున్నాయి. ముగ్గురు కలిసి ప్రజా ప్రభుత్వం మళ్ళీ రాకుండా కుట్ర చేస్తున్నారు. వీళ్లు ఎన్ని ప్రయత్నాలు చేసిన ప్రజా ప్రభుత్వమే వస్తుంది. బీజేపీతో కలిసి బీఆర్ఎస్ తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోంది.మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులకు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధం లేదు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చట్టానికి అతీతులా?. ఎంతో మంది మాజీ ముఖ్యమంత్రులు జైలుకి వెళ్ళారు. బీహార్లో లాలు ప్రసాద్ యాదవ్ జైలుకు వెళ్లలేదా?. కేసీఆర్, హరీష్, ఈటల.. కమిషన్ ముందు హాజరు కావాలి. నోటీసులు అందకపోవడానికి మనం ఏమైనా అమెరికాలో ఉన్నామా?. విద్యుత్ కమిషన్ విషయంలో కేసీఆర్ తప్పు చేశారు. ఇప్పుడైనా కాళేశ్వరం కమిషన్కు సహకరించాలి’ అని వ్యాఖ్యలు చేశారు. -
మంత్రి ఉత్తమ్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
సాక్షి, సూర్యాపేట: తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్కు ప్రమాదం తప్పింది. ఉత్తమ్ హెలికాప్టర్ కోదాడలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. వాతావరణ శాఖ అధికారుల సూచన మేరకు అత్యవసరంగా ల్యాండ్ అయినట్టు తెలిసింది.వివరాల ప్రకారం.. మంత్రి ఉత్తమ్ కుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. హుజూర్నగర్ మండలం మేళ్లచెరువులో హెలికాఫ్టర్ ల్యాండ్ కావాల్సి ఉండగా.. వాతావరణశాఖ అధికారుల సూచన మేరకు అత్యవసరంగా ల్యాండ్ చేశారు. కమ్ముకున్న మబ్బులు, గాలివాన నేపథ్యంలో పైలట్ అప్రమత్తమయ్యారు. దీంతో, అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అనంతరం, మంత్రి ఉత్తమ్ కుమార్.. కోదాడ నుంచి హుజూర్ నగర్కు రోడ్డు మార్గంలో వెళ్లిపోయారు. -
తమ్ముడూ మీ బావ లేడురా.. మనల్ని వదిలి వెళ్లాడురా..!
షాబాద్, పరిగి(వికారాబాద్ జిల్లా): రంగాపూర్ వద్ద జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి స్వగ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. షాబాద్ మండలం సీతారాంపూర్ గ్రామానికి చెందిన ముత్యాల మల్లేశ్కు భార్య స్వప్న, ఇద్దరు కూతుళ్లు మాన్యశ్రీ, ఆర్యాధ్య, కూమారుడు ప్రనిల్ ఉన్నారు. మల్లేశ్ మండల పరిధిలోని నాగర్గూడలో కులవృతి అయిన కటింగ్ షాప్ నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఆయన మృతి చెందడంతో భార్యాపిల్లలు దిక్కులేనివారయ్యారు. సోలీపేట్కు చెందిన మంగలి బాలమ్మకు ముగ్గురు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. అందరి వివాహాలయ్యాయి. చేవెళ్ల మండలం రావులపల్లికి చెందిన హేమలత తన ఇద్దరు పిల్లలను తీసుకుని పెళ్లికి వెళ్లింది. రోడ్డు ప్రమాదంలో ఆమె అక్కడిక్కడే మృతి చెందగా, మోక్షిత నీలోఫర్లో చికిత్స పొందుతోంది.అనాథలయ్యామురా.. ‘తమ్ముడూ మీ బావ లేడురా.. మనల్ని వదిలి వెళ్లాడురా.. నేను, నా పిల్లలు అనాథలయ్యామురా’.. అంటూ పెళ్లి కుమారుడి (సతీష్) అక్క స్వప్న తన తమ్ముడి పట్టుకుని విలపించింది. తండ్రి రామస్వామి రాగానే నా బతుకు ఆగమయ్యింది నాన్నా అంటూ రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. న్యాయం జరిగేలా చూస్తాం.. రంగాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను మంగళవారం ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్రెడ్డి, సీనియర్ నాయకులు చేవెళ్ల స్వామి, డాక్టర్ రాజు, మాజీ ఎంపీటీసీ అశోక్, మాజీ సర్పంచ్లు జనార్దన్రెడ్డి, మహేందర్గౌడ్, రాజేందర్రెడ్డి, నరేందర్, రఫిక్, దయాకర్ తదితరులు పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సాయం అందేలా చూస్తామని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా కృషిచేస్తామని తెలిపారు. చదవండి: చిన్నవిందుకు హాజరై వస్తుండగా ప్రమాదం -
కమిషన్ నోటీసులకు భయపడేది లేదు: ఈటల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి రాజకీయం వేడెక్కింది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయమై మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్రావు, ఈటల రాజేందర్కు పీసీ ఘోష్ కమిషన్ మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.తాజాగా ఈటల రాజేందర్ సాక్షితో మాట్లాడుతూ..‘నోటీసులకు భయపడేది లేదు. ఇంకా నోటీసులు అందలేదు. కాళేశ్వరం కమిషన్ విచారణకు సహకరిస్తాను. చట్టాలు, కోర్టులు, కమిషన్పై నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీలో కొంత మంది చిల్లర ఆరోపణలు చేస్తున్నారు. విచారణకు భయపడేది లేదు. తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే. నేను ఆర్థిక శాఖమంత్రిగా పని చేసిన సమయంలో ఆ శాఖ కార్యదర్శిగా ఉన్న రామకృష్ణారావు ప్రస్తుత రాష్ట్ర సీఎస్గా ఉన్నారని చెప్పారు. పీసీ కమిషన్ను ఎందుకు ఇన్నిసార్లు పొడిగించారో చెప్పాలని ఈటల డిమాండ్ చేశారు. తుమ్మల, కడియం, జూపల్లికి ఏం జరిగిందో తెలియదా? అని ప్రశ్నించారు.ఇదిలా ఉండగా.. కాళేశ్వరంపై జూన్ ఐదో తేదీన విచారణకు రావాలని కేసీఆర్కు, జూన్ ఆరో తేదీన హరీష్ రావు, జూన్ తొమ్మిదో తేదీన ఈటల రాజేందర్ను విచారణకు రావాలని పీసీ కమిషన్ జారీ చేసిన నోటీసుల్లో స్పష్టం చేసింది. మరోవైపు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిన వెంటనే మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్తో భేటీ అయ్యారు. అయితే, పీసీ ఘోష్ కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరు అవుతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. -
కాళ్లకు పెట్టిన పారాణితోనే వరుడు పాడె ఎక్కాడు..
బయ్యారం(వరంగల్): మూడుముళ్లు.. ఏడు అడుగుల బంధంతో ఒక్కటైన ఆ జంటపై దేవుడు చిన్న చూపు చూశాడు. అప్పటి వరకు పెళ్లి బా జాలు మోగిన ఆ ఇంట.. చావు డప్పు మో గాల్సి వచ్చింది. కోటి ఆశలతో కొత్త జీవితం ప్రారంభమై 48 గంటలు గడవకముందే న వవరుడు కన్నుమూశాడు. రిసెప్షన్ ఏర్పాట్లు చేస్తుండగా విద్యుదాఘాతం సంభవించి మృతి చెందాడు. భర్త తన కళ్లెదుటే కానరానిలోకాలకు వెళ్లడంతో ఆ నవవధువు స్పృహ తప్పడంతో బంధువులు చికిత్స ని మిత్తం ఆస్పత్రికి తరలించారు. కాళ్లకు పెట్టి న పారాణితోనే ఆ వరుడు పాడె ఎక్కిన విషాదకరఘటన పలువురిని కన్నీటిపర్యంతం చేసింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గౌరారం పంచాయతీ శివారు కోడిపుంజులతండాకు చెందిన ఇస్లావత్ బా ల, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. 14 సంవత్సరాల క్రితం బాల అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో బతుకుదెరువు నిమిత్తం ఇద్దరు కుమారులు గణేశ్, నరేశ్(26)తో కలిసి తల్లి లక్ష్మి హైదరాబాద్లో ఉంటుండగా నరేశ్ కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో నరేశ్కు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కంచికచర్ల గ్రామానికి చెందిన బానోత్ జాహ్నవితో వివాహం నిశ్చియం కాగా స్వగ్రామంలో రిసెప్షన్ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా రిసెప్షన్ కోసం ఇటీవల రేకుల ఇల్లు నిర్మించుకున్నారు. ఆదివారం కంచికచర్లలో జాహ్నవితో వివాహం జరిపించారు.మోటారు రూపంలో బలితీసుకున్న కరెంట్..రిసెప్షన్ సందర్భంగా మంగళవారం తెల్లవారుజాము నుంచే నరేశ్ ఇంటి వద్ద ఏర్పాట్లు మొదలు పెట్టారు. వంట చేసే వా రు భోజనాల తయారీలో నిమగ్నమయ్యా రు. వంట కోసం నీళ్లు అవసరం ఏర్పడడంతో నరేశ్ను మోటార్ ఆన్చేయని కోరారు. దీంతో నరేశ్ మోటర్ ఆన్ చేసే ప్రయత్నంలో విద్యుత్తీగలను సాకెట్లో పెడుతుండగా షాక్గురయ్యాడు. దీంతో కుటుంబీకు లు, స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. దీంతో నరేశ్ మృతదేహం మీదపడి కుటుంబీకులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. మృత్యువు కరెంట్రూపంలో బలి తీసుకుందని కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. చనిపోయే ముందు ఉప్మా అందించాడు..రిసెప్షన్ సందర్భంగా నరేశ్ ఉదయం తండాలోని పలువురు బంధువుల వద్దకు వెళ్లి ఉప్మా (అల్పాహారం) ఇచ్చి వచ్చాడు. ఆప్యాయంగా ఉప్మా అందించిన నరేశ్ ఇలా తమకు కన్నీటిని మిగిల్చి వెళ్తాడనుకోలేదని బంధువులు గుండెలవిసేలా రోదించారు. -
ఆశ్రమం నుంచి అత్తారింటికి నక్క మానస (ఫొటోలు)
-
ఒకరి ‘దూరం’.. ఇద్దరినీ ‘చేరువ’ చేసింది
కోనరావుపేట(వేములవాడ): చిన్న చిన్న భేదాలతో పలకరింపునకు దూరమైన సొంత అన్నదమ్ములను బంధువు మరణం కలిపింది. వివరాలు.. కోనరావుపేట మండలం కొలనూరు గ్రామానికి చెందిన మామిండ్ల నాగయ్య, మామిండ్ల రామయ్య సొంత అన్నదమ్ములు. ఇద్దరికీ 64 ఏళ్లకు పైగా వయస్సు ఉంటుంది. ఒకే ఊరిలో ఉంటున్నా చిన్నచిన్న అభిప్రాయ భేదాలతో దశాబ్ద కాలంగా ఒకరికొకరు మాట్లాడుకోవడం లేదు. వృద్ధాప్యానికి చేరువైనా రక్తం పంచుకుని పుట్టిన అన్నదమ్ములు మాట్లాడుకోక పోవడం నాగయ్య కుమారుడు శ్రీనివాస్ను కలచివేసింది.ఎలాగైనా ఇద్దరినీ కలపాలని శ్రీనివాస్ కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ, సఫలం కాలేకపోయాడు. ఇదిలా ఉండగా నాగయ్య, రామయ్యల మేనల్లుడు కూన తిరుపతి నాలుగు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఈ నెల 18న మూడో రోజు కార్యక్రమం (పిట్టకు పెట్టుడు) నిర్వహించగా, అన్నదమ్ములిద్దరూ హాజరయ్యారు. ఈక్రమంలో ఇద్దరినీ కలపాలని శ్రీనివాస్ భావించాడు. సోదరులు మామిండ్ల అంజయ్య, శ్రీనివాస్, రాజు, తిరుపతి, ఇతర బంధువులకు చెప్పడంతో వారు సహకారం అందించారు. నాగయ్య, రామయ్యకు బంధాల ప్రాధాన్యత వివరించారు. దీంతో ఇద్దరూ చెమర్చిన కళ్లతో ఆలింగనం చేసుకున్నారు. ఆత్మీయంగా పలకరించుకుని యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ ఘటన కుటుంబాల ఐక్యతకు ప్రతీకగా సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది.సావుదలకు పట్టింపులెందుకు..మేము వృద్ధాప్యంలోకి వచ్చాం. కాటికి కాలుజాపిన మాకు పట్టింపులు ఎందుకు. గతంలో చిన్నచిన్న కారణాలతో దూరమయ్యాం. ఇక నుంచి ఇద్దరం కలిసే ఉంటాం.– మామిండ్ల నాగయ్యపొరపాట్లను వదిలిపెట్టాంమేము ఐదుగురం అన్నదమ్ములం. ముగ్గురు ఇదివరకే చనిపోయారు. మేమిద్దరం ఉన్నాం. ఉన్న ఇద్దరం కలిసుంటే బాగుంటుందని అనిపించింది. పదేళ్లుగా దూరంగా ఉంటున్న మేము చనిపోయేవరకు కలిసే ఉంటాం.– మామిండ్ల రామయ్య -
చిన్నవిందుకు హాజరై వస్తుండగా ప్రమాదం
పరిగి: హైదరాబాద్– బీజాపూర్ రహదారి రక్తసిక్తమైంది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా 20 మంది గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. పెళ్లింట నిర్వహించిన చిన్నవిందుకు హాజరై వెళ్తున్న క్రమంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పెళ్లికూతురు, పెళ్లికొడుకుకు స్వల్ప గాయాలయ్యాయి. మృతుల్లో షాబాద్ మండలం సీతారాంపూర్కు చెందిన మల్లేశ్(35), ఇదే మండలం సోలిపేట్కు చెందిన బాలమ్మ (60), చేవెళ్ల మండలం రావులపల్లికి చెందిన హేమలత(32), ఫరూక్నగర్ మండలం కిషన్నగర్కు చెందిన సందీప్(28) ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే ఎస్ఐ సంతోష్కుమార్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను పరిగి ఆస్పత్రికి అక్కడి నుంచి తాండూరు, హైదరాబాద్ ఆస్పత్రులకు తరలించారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పరిగి ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని తెలిపారు.ఎలా జరిగిందంటే..వికారాబాద్ జిల్లా పరిగికి చెందిన రామకృష్ణ, స్వప్న దంపతుల కూతురు మల్లేశ్వరిని రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనవెల్లికి చెందిన సతీష్కు ఇచ్చి ఈనెల 16న పరిగిలో వివాహం జరిపించారు. 19న చిన్నవిందు ఏర్పాటు చేయడంతో పెళ్లి కొడుకు బంధువులు సుమారు 50 మంది ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో రాత్రి 8:30 గంటలకు చందనవెళ్లి నుంచి పరిగికి చేరుకున్నారు. బస్సును పార్కింగ్ చేసి వస్తానని వెళ్లిన డ్రైవర్.. ఇదే ట్రావెల్స్కు చెందిన మరో బస్సు పాడవడంతో అందులో ఉన్నవారిని పరిగి నుంచి వారి గమ్యస్థానంలో వదిలేసి, తిరిగి అర్ధరాత్రి 1:20 గంటలకు పరిగికి చేరుకున్నాడు. పెళ్లికూతురు, పెళ్లికొడుకుతో పాటు బంధువులతో కలిసి చందనవెళ్లి బయలుదేరారు. పది నిమిషాలు కూడా గడవకముందే రంగాపూర్ వద్ద ఎదురుగా వస్తున్న లారీకి సైడ్ ఇచ్చే క్రమంలో రోడ్డు పక్కన ఎడమ వైపు నిలిపి ఉన్న సిమెంట్ లోడ్ లారీని బలంగా ఢీకొట్టింది.తల్లి మృతి, ప్రాణాపాయంలో కూతురుప్రమాద స్థలంలో మృతిచెందిన హేమలత కూతురు మోక్షిత(5)కు తీవ్ర గాయాలు కావడంతో నగరంలోని నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. మిగిలిన వారిని వికారాబద్లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. సుజాత, నీరజ, నిహారి, మహేశ్, అరుణ, సాహితికి కాళ్లు, చేతులు విరిగాయి. ప్రియాంక, కార్తీక్, రమేశ్, లక్ష్మి, రాములు, మంజుల, సుజాత, నవనీతకు స్వల్ప గాయాలయ్యాయి.పెళ్లి కొడుకు బావ మృతిపెళ్లికొడుకు సతీష్ బావ (అక్క భర్త) మల్లేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఇతని భార్య, ముగ్గురు పిల్లలు సైతం ఇదే బస్సులో ఉన్నారు. మృతుల్లో కిషన్నగర్కు చెందిన సందీప్కు ఆరు నెలల క్రితమే వికారాబాద్ జిల్లా, పెద్దేముల్ మండలం నాగుపల్లికి చెందిన మహేశ్వరితో వివాహం జరిగింది. పెళ్లికుమారుడికి మేనబావ కావడంతో ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకున్నారు. ఇతని తండ్రి గతంలోనే మృతిచెందగా ఒకేఒక్క కుమారుడైన సందీప్ అకాల మృతితో అతని కుటుంబం విలవిల్లాడుతోంది. -
నేడు మానస వివాహం.. పెళ్లి పెద్దగా కలెక్టర్ శ్రీహర్ష
రామగుండం(కరీంనగర్): స్థానిక తబితా ఆశ్రమంలో ఉంటున్న నక్క మానస ఆశ్రమం నుంచి అత్తారింటికి వెళ్లే సమయం సమీపిస్తోంది. పెళ్లి కూతురు ముఖంలో ఓ వైపు చిరునవ్వు, మరోవైపు ఆశ్రమ సంరక్షకులను, తోబుట్టువును విడిచి వెళ్తున్నాననే బాధ.. పెద్దపల్లి కలెక్టరేట్లోని దేవాలయంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష వివాహ వేడుక జరిపిస్తున్నారు. కాగా, 2021 మార్చి 15వ తేదీన ఆశ్రమంలో ఆశ్రయం పొందిన గుంజ విజయలక్ష్మి అనే యువతికి హైదరాబాద్లోని ఓ వ్యాపారితో వీరేందర్నాయక్ వివాహం జరిపించగా, నక్క మానస వివాహం రెండోది. 16ఏళ్ల క్రితమే ఆశ్రమంలో చేరిన అక్కాచెల్లెలు.. సుమారు 16ఏళ్ల క్రితం తల్లిదండ్రులను కోల్పోయిన అక్కాచెల్లెళ్లు నక్క మానస, నక్క లక్ష్మి సంరక్షణ కోసం ఇంటగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ సరీ్వస్(ఐసీపీఎస్) అధికారులు స్పందించి రామగుండంలోని తబితా ఆశ్రమంలో చేరి్పంచారు. ఆనాటి నుంచి ఆశ్రమ నిర్వాహకుడు వీరేందర్నాయక్–విమల దంపతులు వారికి తల్లిదండ్రులుగా మారారు. నక్క మానస డిగ్రీ పూర్తి చేయగా, నక్క లక్ష్మి ఇంటర్మీడియట్ పూర్తిచేసింది. చిన్నప్పటి నుంచే చురుకైన పాత్ర.. ఆశ్రమంలో చేరిన సమయం నుంచి చదువులో, ఇంటిపనిలో చురుగా ఉంటోంది. ఇతరులతో మర్యాదగా వ్యవహరించడం తదితర గుణగణాలు కలిగిన అమ్మాయిగా పేరు తెచ్చుకుంది మానస. ఐదో తరగతి వరకు స్థానిక ప్రైవేట్ పాఠశాలలో విద్యనభ్యసించగా ఆరు నుంచి పదో తరగతి వరకు మేడారం గురుకుల విద్యాలయంలో చదివి టెన్త్9.8 జీపీఏ, ఎల్లంపల్లి కేజీబీవీలో ఇంటర్మీడియట్ చదివి ఎంపీసీ గ్రూపులో 895 మార్కులు, కరీంనగర్లోని వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో బీఎస్సీ(మ్యాథ్స్) ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించింది. ఎంత చెప్పినా తక్కువే చిన్నప్పటి నుంచి అమ్మానాన్న విమల, వీరేందర్నాయక్ అని తెలుసు. కానీ ఓ ఆశ్రమంలో సంరక్షకులుగా మాత్రం నాకు తెలియదు. చిన్నప్పటికీ నా బాధ్యతలు, కష్ట సుఖాలు అన్నీ వారితోనే పంచుకునే దాన్ని. ఇప్పుడు నాకు ఓ వ్యాపారితో వివాహం చేస్తుండడంతో నేను ఇల్లాలిగా మారుతున్నా. అప్పుడు నా చెల్లి నక్క లక్ష్మి, నాతోటి మిత్రులు, నా అమ్మనాన్నలు (సంరక్షకులు)విడిచి వెళ్లలేక పోతున్నా. నా వివాహం కలెక్టర్ జరిపిస్తుండడం మరీ విశేషం. – నక్క మానస, పెళ్లి కూతురు ఆనందమో.. బాధో తెలియడం లేదు పెళ్లీడుకొచ్చిన యువతికి వివాహం జరిపించడం నా కర్తవ్యం. అందుకు కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకోవడం ఊహకందని విషయం. బాల్యం నుంచే మమ్మల్నే తల్లిదండ్రులుగా భావిస్తూ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నాం. ఇప్పుడు పెళ్లి చేసి కన్యాదానం చేయడం ద్వారా గుండెలు బరువెక్కుతున్నాయి. పెళ్లి కూతురు చెల్లి లక్ష్మి మరింత ఆవేదనకు లోనవుతుంది. ఆశ్రమంలో పెద్ద మనిగా వ్యవహరిస్తూ అన్ని విషయాల్లో ఎంతో చురుకుగా వ్యవహరించే కూతురు నక్క మానస. భవిష్యత్తులో ఆమె కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. – వీరేందర్నాయక్, తబితా ఆశ్రమ నిర్వాహకుడుఆకట్టుకున్న మానస హల్దీ వేడుకలు -
శంషాబాద్లో విమానానికి తప్పిన ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో లుప్తాన్సా ఎయిర్లైన్స్ విమానానికి ప్రమాదం తప్పింది. విమానం రన్వే మీదకు వెళ్లిన వెంటనే విమానం ముందు టైరులో సాంకేతిక సమస్య ఏర్పడింది. ఈ క్రమంలో పైలట్ అప్రమత్తతో ప్రమాదం తప్పింది.వివరాల ప్రకారం.. శంషాబాద్ ఎయిర్పోర్టు నుండి ఫ్రాంక్ ఫోర్ట్ వెల్లాల్సిన విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. రన్వే మీదకు వెళ్లిన వెంటనే విమానం ముందు టైరులో సాంకేతిక సమస్య కనిపించింది. సమస్యను గుర్తించిన పైలట్ వెంటనే విమానాన్ని తిరిగి మళ్లించారు. దీంతో, పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 190 మంది ప్రయాణీకులు ఉన్నారు. పైలట్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. -
సరస్వతీ నది పుష్కర స్నానాలు..బారులు తీరిన భక్తజనం (ఫొటోలు)
-
HYD: డీసీఎంను ఢీకొన్నకారు.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
సాక్షి, హయత్నగర్: హైదరాబాద్ నగర శివారు హయత్నగర్లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పక్కనే ఆగి ఉన్న డీసీఎంను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి.వివరాల ప్రకారం.. హయత్నగర్లోని కుంట్లూరు వద్ద బుధవారం తెల్లవారుజామున అతి వేగంలో ఉన్న డీసీఎంను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. మృతులను కుంట్లూరుకు చెందిన చంద్రసేనారెడ్డి, త్రినాద్ రెడ్డి, వర్షిత్ రెడ్డిగా గుర్తించారు. అయితే, ఇంటికి సరిగ్గా 100 మీటర్ల దూరంలోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఇంటికి చేరుకోవడానికి కొన్ని సెకన్ల ముందే ఈ ఘటన చోటుచేసుకుంది. -
ఇంజనీరింగ్లో రెండు కొత్త కోర్సులు
సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంజనీరింగ్లో మరో రెండు కొత్త కోర్సులు రాబో తున్నాయి. ఐఐటీ మద్రాస్ వీటిని అందుబాటులోకి తెస్తోంది. 2025–26 విద్యా సంవత్సరంలో జరిగే జోసా (జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ) కౌన్సెలింగ్లో ఇవి ఉంటాయని మద్రాస్ ఐఐటీ తెలిపింది. మద్రాస్ ఐఐటీలోని అప్లైడ్ మెకానిక్స్, బయో మెడికల్ విభాగాలు ఈ కోర్సును డిజైన్ చేశాయి. ఒక్కో విభాగంలో 40 సీట్లు ఉంటాయని ఐఐటీ అధికారులు తెలిపారు. ప్రస్తుత ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకుని కోర్సులను రూపొందించామని ప్రొఫెసర్ వి కామకోటి తెలిపారు. ఇవీ కోర్సులు ⇒ నాలుగేళ్ల కాలపరిమితితో ఉండే ఈ రెండు కోర్సుల ప్రత్యేకతలను ఐఐటీ మద్రాస్ వెల్లడించింది. కంప్యుటేషనల్ ఇంజనీరింగ్ అండ్ మెకానిక్స్ (సీఈఎం) కోర్సు ఏఐ టెక్నాలజీ ఆధారితంగా ఉంటుంది. సాధారణ ఇంజనీరింగ్ విద్య కు భిన్నంగా ఉండే ఈ కోర్సు వల్ల విద్యార్థి సరికొత్త మెకానికల్ టూల్స్పై పట్టు సాధిస్తాడు. సాలిడ్ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ మెటీరియల్ సైన్స్, డైనమిక్స్లో అత్యాధునిక సాంకేతికతను అనుసంధానం చేశారు. ⇒ బయోమెడికల్ ఇంజనీరింగ్ను మరింత బలోపేతం చేసేందుకు ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ బయో మెడికల్ ఇంజనీరింగ్ (ఐబీఎంఈ) ఉపయోగపడుతుంది. ఐవోటీ, ఏఐ, వెబ్ ఎనేబుల్డ్ మెడికల్ టెక్నాలజీని ఈ కోర్సు ద్వారా అందిస్తారు. మారుతున్న వైద్య రంగంలో మంచి ఉపాధికి ఇది తోడ్పడుతుందని చెబుతున్నారు.