breaking news
Telangana
-
ఎస్కేప్ ఎపిసోడ్: ఆర్థిక నేరస్తుడిని తప్పించిన ఎస్ఐ సస్పెండ్
సాక్షి, హైదరాబాద్: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐను సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ ఉత్తర్వుల జారీ చేశారు. సదాశివపేట దగ్గర ఆర్థిక నేరస్తుడిని తప్పించిన సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ డి.శ్రీకాంత్ గౌడ్ను సస్పెండ్ చేశారు. ముంబైలో ఉప్పలపాటి సతీష్ను అరెస్ట్ చేసి హైదరాబాద్కు తీసుకొస్తుండగా పరారయ్యాడు. ఉప్పలపాటి సతీష్ పరారీ అయ్యేందుకు సహకరించడంతో శ్రీకాంత్ గౌడ్ సస్పెన్షన్కు గురయ్యారు.ఘరానా మోసగాడు సతీష్ను పట్టుకోవడం నుంచి అతడు పారిపోవడానికి సహకరించడం వరకు ప్రతి అంశంలోనూ టాస్క్ఫోర్స్ ఎస్ఐ ఆనవాయితీకి విరుద్ధంగా వ్యవహరించారు. ముంబైలో సతీష్ ఆచూకీ కనిపెట్టిన టాస్క్ ఫోర్స్ పోలీసులు అతడి కోసం ఎస్ఐ నేతృత్వంలో బృందాన్ని గత గురువారం అక్కడకు పంపారు. గత గురువారం రాత్రి (23వ తేదీ) సతీష్తో పాటు ఆయన భార్య, కుమార్తెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఆ వెంటనే వారి వద్ద ఉన్న దాదాపు ఎనిమిది సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సాధారణంగా ఇలాంటి నిందితుల్ని పోలీసులు తమ వాహనంలోనే తరలిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్లు వారి చేతికి అందనీయరు. టాస్క్ఫోర్స్ ఎస్ఐ మాత్రం తన బృందం ఉన్న కారును వదిలి నిందితులతో కలిసి వాళ్ల కారు ఎక్కారు. ఫోన్లు సైతం నిందితులకు తిరిగి ఇచ్చేశాడు. ఈ వాహనాన్ని నిందితుడి డ్రైవరే నడిపారు.వీరిది ఎస్యూవీ వాహనం కాగా పోలీసులది పాత ఇన్నోవా. దీంతో ఈ రెండు వాహనాల మధ్య దూరం దాదాపు 40 కి.మీలకు చేరింది. గురువారం రాత్రి షోలాపూర్లో నిందితులతో కలిసి భోజనం చేసిన ఎస్ఐ ఆ సమయంలోనూ తన బృందంతో మాట్లాడారు. వీరి వాహనం సదాశివపేట్ చేరడానికి రెండు గంటల ముందే నగరం నుంచి మరో కారు వచ్చి అక్కడ సిద్ధంగా ఉంది. గత శుక్రవారం (24వ తేదీ) తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో సతీష్, ఎస్ఐ తదితరులు ప్రయాణిస్తున్న వాహనం సదాశివపేట్లోని ఓ దాబా వద్దకు చేరింది. అప్పటికే అక్కడ ఉన్న నగరం నుంచి వచ్చిన కారులో ఎక్కిన నిందితులు కొల్హాపూర్ వైపు పారిపోయారు. ఇది జరిగిన కొద్దిసేపటికి వెనుక వస్తున్న తన బృందానికి ఎస్ఐ సమాచారం ఇచ్చారు.సాధారణ పరిస్థితుల్లో సదరు ఎస్ఐ అక్కడే ఉండిపోవడమో, సీసీ కెమెరాల ఫీడ్ ఆధారంగా నిందితులు వెళ్లిన దారిలో గాలిస్తూ వెళ్లడమో చేస్తారు. అయితే ఇతను మాత్రం నిందితు డి కారులో, అతడి డ్రైవర్తో కలిసి హైదరాబాద్ పయనమ య్యా రు. కొద్దిసేపటికి దాబా వద్దకు చేరుకున్న బృందం ఎస్ఐని సంప్రదించగా.. తాను హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పాడు. అలా సిటీకి వచ్చేసిన సదరు ఎస్ఐ ఎక్కడెక్కడకు వెళ్లా డు? ఎవరెవరిని కలిశాడు? తదితర అంశాలను ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఈఎస్ఐతో పాటు సతీష్ కుటుంబీకులు ప్రయాణించిన కారు డ్రైవర్ను పోలీసులు ప్రశ్నించారు. -
అజారుద్దీన్కు మంత్రి పదవి రాకుండా బీజేపీ కుట్ర: భట్టి
సాక్షి, హైదరాబాద్: అజారుద్దీన్కు మంత్రి పదవి రాకుండా బీజేపీ కుట్రలు చేస్తోందంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ. ఎన్నికల కమిషన్కు బీజేపీ నేతలు లేఖ రాశారని.. జూబ్లీహిల్స్ బయట ఎన్నికల కోడ్ లేదన్నారు. తెలంగాణకు, హైదరాబాద్కు గొప్ప పేరు తెచ్చిన వ్యక్తి అజారుద్దీన్. ఈ రాష్ట్రం మీద, ఈ దేశం మీద బీజేపీకి ప్రేమ లేదు. ఈ దేశానికి పేరు తెచ్చిన అజారుద్దీన్ను కేబినెట్లోకి తీసుకుంటే స్వాగతించాల్సింది పోయి... వద్దని బీజేపీ ఎన్నికల కమిషన్కు లేఖ రాసింది’’ అని భట్టి మండిపడ్డారు.‘‘పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ సరెండర్ అయింది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు బీజేపీ సరెండర్ అయింది. బీఆర్ఎస్ను గెలిపించేందుకు బీజేపీ ఎత్తులు వేస్తుంది. బీఆర్ఎస్కు లబ్ధి చేకూర్చే పనిలో భాగంగానే అజారుద్దీన్పై బీజేపీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. ప్రమాణ స్వీకారం జరగకుండా ఉండేందుకు గవర్నర్పై బీజేపీ ఒత్తిడి తెస్తుంది. జూబ్లీహిల్స్ బయట ఎన్నికల కోడ్ లేదు. కరగ్పూర్ నియోజకవర్గంలో పోలింగ్కు ముందు అభ్యర్థిని మంత్రిగా బీజేపీ ప్రకటించింది. అజారుద్దీన్ ఇక్కడ అభ్యర్థి కూడా కాదు.. అయినా అభ్యంతరం ఎందుకు?’’ అంటూ భట్టి విక్రమార్క ప్రశ్నించారు. -
తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. రేపు మధ్యాహ్నం 12.15 నిమిషాలకు కొత్తమంత్రిగా అజారుద్దీన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందులో భాగంగా రేపు రాజ్ భవన్లో కేబినెట్ మంత్రి ప్రమాణ స్వీకారానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాజ్ భవన్ దర్బార్ హాల్ను ప్రోటోకాల్ అధికారులు పరిశీలించారు. మంత్రి ప్రమాణ స్వీకారానికి సీటింగ్, తదితర అంశాలపై అధికారుల ఏర్పాట్లు చేస్తున్నారు.ఇదిలా ఉండగా.. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి వచ్చే నెల 11న ఉప ఎన్నికలు జరగనుండగా, ఈ నెల 31న మాజీ క్రికెటర్ ముహమ్మద్ అజారుద్దీన్తో రాష్ట్రమంత్రిగా ప్రమాణస్వీకార ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వచ్చే డిసెంబర్ ఏడో తేదీతో రెండేళ్లు పూర్తికానుండగా, ఇప్పటి వరకు రాష్ట్ర మంత్రివర్గంలో ముస్లింలకు చోటు కల్పించలేదు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం పరిధిలో గణనీయ సంఖ్యలో ఉన్న ముస్లిం ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితిలో అజారుద్దీన్ను మంత్రిగా ప్రభుత్వం నియమించనుండటం ఆసక్తికరంగా మారింది. -
దారుణం.. బతికున్న వ్యక్తిని మార్చురీలో పెట్టిన వైద్యులు
సాక్షి, మహబూబాబాద్: వైద్యం కోసం వచ్చిన రోగిని ఆధార్ కార్డు లేదనే నెపంతో ఆసుపత్రిలో చేర్చుకునేందుకు ఆసుపత్రి సిబ్బంది అంగీకరించలేదు. ఆసుపత్రి ఆవరణలో రోగి.. వైద్యం కోసం రెండు రోజుల పాటు పడిగాపులు కాస్తూ నిరీక్షించి నీరసించడంతో సిబ్బంది మృతి చెందాడనే అనుమానంతో మార్చురీలో భద్రపరిచిన అమానవీయ సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా ఆసుపత్రిలో చోటుచేసుకుంది.చిన్న గూడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన వి.రవి మూత్ర పిండాల వ్యాధితో ఇబ్బంది పడుతూ మూడు రోజుల క్రితం జిల్లా ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చాడు. రోగికి తోడుగా ఎవ్వరు ఉండక పోవడంతో పాటు ఆధార్ కార్డు లేకపోవడంతో ఆసుపత్రిలో చేర్చుకోవడానికి వైద్య సిబ్బంది నిరాకరించారు. దీంతో రోగి 2 రోజుల పాటు ఆస్పత్రి ఆవరణలో పడిగాపులు పడి.. నీరసించి ఆ చేతనంగా మారిపోయాడు. రోగి మృతి చెందాడనే అనుమానంతో వైద్య సిబ్బంది ఆసుపత్రిలోని మార్చూరికి తరలించి భద్ర పరిచారు.మరుసటి రోజు మార్చురిని శుభ్ర పరచడానికి వచ్చిన స్వీపర్లు.... రోగి కదలికలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆసుపత్రికి చేరుకుని రోగిని వైద్యం చేయిస్తున్నారు. ఆసుపత్రిలో ఇంత దారుణం జరిగినా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చిన రోగి పట్ల ఆసుపత్రి సిబ్బంది వ్యవహరించిన తీరు.. మానవత్వం మంటగలిపారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
నాపై కాంగ్రెస్ వాళ్లే తప్పుడు ప్రచారం: రాజగోపాల్ రెడ్డి
సాక్షి, యాదాద్రి భువనగిరి: తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలను కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖండించారు. రాజకీయంగా తాను ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు ఆయనే ప్రెస్ మీట్ పెట్టి చెబుతాను అంటూ క్లారిటీ ఇచ్చారు. పార్టీ మార్పు అంటూ తప్పుడు ప్రచారాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురువారం చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని లక్కారం, చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని చెరువులను పరిశీలించి గంగ పూజను నిర్వహించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలోని చెరువు నిండినప్పుడు కాలనీలు జలమయం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. అనంతరం, రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ..‘చౌటుప్పల్ మున్సిపాలిటీ అభివృద్ధికి 500 కోట్ల రూపాయలతో ప్రణాళిక రూపుదిద్దబోతున్నాం. చౌటుప్పల్ చెరువుకు ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తుగా ప్రణాళికలు వేసి దండు మల్కాపురం, లక్కారం వద్ద వరద నీటిని డైవర్ట్ చేయడంతో మున్సిపాలిటీ ప్రజలకు వరద ముప్పు తప్పిందని తెలిపారు.పార్టీ మార్పుపై.. పార్టీ మారుతున్నానని సొంత పార్టీ వాళ్లు, బయట పార్టీ వాళ్లు నాపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలు దుష్ప్రచారాలను ఎవరు నమ్మవద్దు. నేను ఏదైనా నిర్ణయం తీసుకున్నట్లయితే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రకటిస్తాను. నేను ప్రస్తుతం సిన్సియారిటీ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తను, ఎమ్మెల్యేను.. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే పని చేస్తాను. క్రమశిక్షణ గల కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కార్యకర్తగా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి కట్టుబడి ఉంటా. నా ముందు మునుగోడు అభివృద్ది తప్ప, మరో ఆలోచన లేదు. నాపై సోషల్ మీడియాలో వచ్చే దుష్ప్రచారాలను నమ్మవద్దు అంటూ కామెంట్స్ చేశారు. -
రేపు వరంగల్కు సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ప్రతీ ఒక్కరు ఫీల్ట్లో ఉండాల్సిందే.. రిపోర్ట్ ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించే అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు. అలాగే, రేపు వరంగల్, హుస్నాబాద్లో పర్యటించనున్నట్టు తెలిపారు. తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, సెక్రటరీ వేముల శ్రీనివాసులు, డీజీపీ శివధర్ రెడ్డి, HMWSSB ఎండీ అశోక్ రెడ్డి, తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.అధికారులపై చర్యలుంటాయ్.. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..‘అన్ని విభాగాలు సంయుక్తంగా పనిచేయాలి. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ధాన్యం సేకరణ కేంద్రాల వద్ద క్షేత్ర స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై పౌరసరఫరాల విభాగం ఎప్పటికప్పుడు కలెక్టర్లకు తగిన సూచనలు చేయాలి. ప్రతీ కొనుగోలు కేంద్రానికి మండల స్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించి బాధ్యతలు అప్పగించాలి. అవసరమైన చోట ధాన్యాన్ని దగ్గర లోని ఫంక్షన్స్ హాల్స్కు తరలించేలా చర్యలు తీసుకోవాలి. ప్రతీ ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి ప్రతీ 24 గంటల పరిస్థితిపై ప్రతిరోజు కలెక్టర్కు రిపోర్ట్ అందించాలి. రిపోర్ట్ ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించే అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలిజిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ సంయుక్తంగా ఒక మానీటరింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకోవాలి. దెబ్బతిన్న రోడ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ట్రాఫిక్ను డైవర్ట్ చేయాలి. చెరువులు, వాగులు, మేజర్, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, లో లెవల్ కల్వర్టుల దగ్గర పరిస్థితులను గుర్తించి స్థానికులను ముందుగానే అలర్ట్ చేయాలి. 16 జిల్లాలపై తుఫాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనిపై ముందస్తు చర్యలు తీసుకున్నా. ఇది వరి కోతల కాలం.. అనుకోని ఉపద్రవం రైతులకు ఆవేదన మిగులుస్తోంది. అధికారులు అప్రమత్తంగా ఉండాలి. అందరి సెలవులు రద్దు చేసి క్షేత్రస్థాయిలో పర్యటించేలా చూడాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తున్నాం. ఈదురు గాలులతో విద్యుత్ అంతరాయం కలగుండా విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు అవసరమైతే తప్ప రోడ్లపైకి రాకుండా అవగాహన కల్పించాలి. అవసరమైన చోట అత్యవసర వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలిహైడ్రా సేవలు వినియోగించుకోండి.. వరంగల్లో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అవసరమైన చోట హైడ్రా సేవలను వినియోగించుకోవాలి. 24 గంటలు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించాలి. అధికారులతో సమన్వయం చేసుకుని ఉమ్మడి జిల్లాల మంత్రులు కలెక్టర్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి. జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమాచారాన్ని సంబంధిత జిల్లా ఇంచార్జ్ మంత్రికి తెలపాలి. వాగులు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో స్థానిక ప్రజలను అప్రమత్తం చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలి. ప్రాజెక్టుల ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. ప్రాణనష్టం, పశు నష్టం, పంట నష్టం జరగకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఏ ఒక్కరి ప్రాణాలకు నష్టం జరగడానికి వీల్లేదురేపు వరంగల్, హుస్నాబాద్ పర్యటన.. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ్టి వరంగల్ ఆకస్మిక పర్యటన వాయిదా వేసుకున్నా. రేపు వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తా. తుఫాను ప్రభావిత జిల్లా ఇంచార్జ్ మంత్రులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలి. క్షేత్ర స్థాయిలో పర్యటించి ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి. వారిని ఆదుకునే ప్రయత్నం చేయాలి. ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. -
కోడ్ ఉండగా మంత్రిని నియమించవచ్చా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఓ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతుండగా, రాష్ట్ర మంత్రిగా ఎవరినైనా నియమించవచ్చా?. ఆ అసెంబ్లీ స్థానం పరిధిలో అమల్లో ఉన్న ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కాదా?. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా ముఖ్యమంత్రి సిఫారసుల మేరకు గవర్నర్ కొత్త మంత్రిని నియమించవచ్చా?. ఈ సందేహాలకు కేంద్ర ఎన్నికల సంఘమే సమాధానం చెప్పాల్సి ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) కార్యాలయ వర్గాలు స్పష్టం చేశాయి.జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి వచ్చే నెల 11న ఉప ఎన్నికలు జరగనుండగా, ఈ నెల 31న మాజీ క్రికెటర్ ముహమ్మద్ అజారుద్దీన్తో రాష్ట్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించాలని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వచ్చే డిసెంబర్ ఏడో తేదీతో రెండేళ్లు పూర్తికానుండగా, ఇప్పటి వరకు రాష్ట్ర మంత్రివర్గంలో ముస్లింలకు చోటు కల్పించలేదు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం పరిధిలో గణనీయ సంఖ్యలో ఉన్న ముస్లిం ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితిలో అజారుద్దీన్ను మంత్రిగా ప్రభుత్వం నియమించనుండటం ఆసక్తికరంగా మారింది.నాడు సీఎంకు నేరుగా ఈసీ ఫోన్.. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా మంత్రివర్గంలో కొత్త మంత్రిని నియమించవచ్చా? గతంలో ఇలాంటి ఘటనలెక్కడైన జరిగాయా? అప్పుడు ఎన్నికల సంఘం ఏం చేసింది? అనే సందేహాలను కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ అశోక్ లావాసా ఇటీవల హైదరాబాద్లో ఇచ్చిన ఓ ఉపన్యాసంలో నివృత్తి చేశారు. మంతన్ ఆధ్వర్యంలో గత సెప్టెంబర్ 13న నగరంలోని విద్యా అరణ్య పాఠశాలలో నిర్వహించిన సంస్థ సహా వ్యవస్థాపకుడు ‘అజయ్ గాంధీ’ స్మారక ఉపన్యాసంలో ఈ మేరకు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.గతంలో గోవాలోని ఓ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతుండగా, ఆ స్థానం పరిధిలో గణనీయ సంఖ్యలో ఉన్న సామాజికవర్గానికి సంబంధించిన ఓ వ్యక్తిని రాష్ట్రమంత్రిగా నియమించాలని అప్పటి సీఎం మనోహర్ పారికర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో నాటి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ నేరుగా మనోహర్ పారికర్కు ఫోన్ చేసి ఉప ఎన్నికలు ముగిసే వరకు కొత్త మంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని కోరారని అశోక్ లావాసా వెల్లడించారు. మంత్రుల నియాయకం విషయంలో రాజ్యాంగం ద్వారా తనకు సంక్రమించిన అధికారాలను సైతం వాడుకోలేనా? అని మనోహర్ పారికర్ బదులిచ్చారని గుర్తు చేసుకున్నారు.ఎన్నికలు జరుగుతున్న సమయంలో కొత్త మంత్రితో ప్రమాణస్వీకారం చేయిస్తే ఆ సామాజికవర్గ ఓటర్లను ప్రభావితం చేసినట్టు అవుతుందని ప్రధాన కమిషనర్ నచ్చజెప్పడంతో అప్పట్లో మనోహర్ పారికర్ వెనక్కుతగ్గి ప్రమాణస్వీకారోత్సవాన్ని వాయిదా వేసుకున్నారని అశోక్ లావాసా తెలిపారు. రాష్ట్రంలో కొత్త మంత్రిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు వస్తున్న వార్తలపై సీఈఓ కార్యాలయం స్పందనను ‘సాక్షి’ కోరగా, దీనిపై తమకు ఏమైన ఫిర్యాదులు వస్తే కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తామని బదులిచ్చారు. ఈసీ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. -ముహమ్మద్ ఫసియుద్దీన్. -
‘మంత్రి పదవి కోడ్ ఉల్లంఘనే!’
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ.. మాజీ క్రికెటర్, కాంగ్రెస్ మాజీ ఎంపీ మహమ్మద్ అజహరుద్దీన్కు మంత్రి పదవి ఇస్తుండడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడమేనని పేర్కొంటూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి గురువారం బీజేపీ ఫిర్యాదు చేసింది. అజారుద్దీన్ మంత్రి పదవి అంశంపై తెలంగాణ బీజేపీ బృందం ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. సీఈవోతో జరిగిన భేటీలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, బీజేపీ లీగల్ టీం పాల్గొంది. నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. అయితే.. అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడం ఓ వర్గం ఓటర్లను ప్రభావితం చేయడానికేనని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ నియామకాన్ని Model Code of Conduct (MCC) ఉల్లంఘనగా పేర్కొంటూ ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసింది.ఈ అంశంపై బీఆర్కే భవన్ వద్ద మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘మంత్రివర్గ విస్తరణకు ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకోవాలి. అజారుద్దీన్ గతంలో జూబ్లీహిల్స్ లో ఎమ్మెల్యే పదవి కి పోటీ చేశారు. ప్రభుత్వం మంత్రి వర్గ విస్తరణ అంటే ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించినట్లే. ఒక వర్గం ఓట్ల కోసం అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తున్నారు. ఆ వర్గం ప్రజలు ఇది గమనించాలి. కేవలం ఓట్ల కోసమే ఆ వర్గానికి చెందిన అజారుద్దీన్కు మినిస్ట్రీ ఇస్తున్నారు. ఎన్నికల లబ్ధి కోసమే మంత్రి వర్గ విస్తరణకు కాంగ్రెస్ పాల్పడుతోంది. సీఎం ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించిన విషయంలో సంబంధిత అధికారులకు ఈసీ నోటీసులు ఇవ్వాలి’’ అని అన్నారు..పాయల్ శంకర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలక్షన్ ఉల్లంఘించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల కోడ్ ఉండగా...ప్రకటన చేయడం ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లే. ఎలక్షన్ కోడ్ ఉండగా అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం కోడ్ ఉల్లంఘించడమే. ఒక వర్గం ఓటర్లతో సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నారు. ఇంకొక పది రోజులు ఆగితే మోడల్ కోడ్ కండక్ట్ ముగిసిపోతుంది కదా!. 20శాతం వర్గం మీద ఆధారపడి కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను 80శాతం వర్గం ప్రజలు గమనిస్తున్నారు. CEO మంత్రి వర్గ విస్తరణ ను ఆపాలని కోరాం. జూబ్లీహిల్స్ ప్రాంత ఓటర్లకు ప్రభావితం చేసే ఏ నిర్ణయం తీసుకోవద్దు అని అన్నారు.కేటీఆర్ ఏమన్నారంటే.. మరోవైపు ఈ అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. మాజీ క్రికెటర్ అజారుద్దీన్ను కేబినెట్లోకి తీసుకోవడం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసమేనని అన్నారాయన. ప్రభుత్వంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు క్షేత్రస్థాయి వాస్తవాలను గ్రహిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే పూర్తిగా దిగజారిన పార్టీ పరువును కాపాడుకోవడానికి అడ్డగోలు ప్రయత్నాలు చేస్తుంది. జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఆపదమొక్కులు మొక్కుతోంది. జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం సినీ కార్మికులకు అడ్డగోలు వాగ్దానాలు చేయడం, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ను కేబినెట్లోకి తీసుకోవడం, మంత్రులు గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ వీధుల్లో హడావుడిగా తిరగడం వంటివి ఆ పార్టీ తీవ్ర ఒత్తిడిలో ఉందనడానికి నిదర్శనం. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోతేనే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేస్తుంది. అందుకే కాంగ్రెస్, దాని నాయకత్వానికి గుణపాఠం చెప్పడానికి జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సరైన వేదిక అని కేటీఆర్ అన్నారు. అయితే అజారుద్దీన్ వ్యవహారంపై ఈసీని ఆశ్రయించే అంశంపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. I guess desperate times call for desperate measures 😁After 2 years in Govt, looks like Congress party is finally waking up to ground realities Promising the moon to cine workers, inducting Azharuddin in cabinet and ministers desperately running around in Hyderabad Gullies…— KTR (@KTRBRS) October 30, 2025మాజీ ఎంపీ, గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసిన అజారుద్దీన్.. ఈ ఉప ఎన్నిక బరిలో నిలబడతారనే ప్రచారం ఉధృతంగా సాగింది. అయితే అనూహ్యంగా ఆయన్ని గవర్నర్ కోటా ద్వారా MLCని చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ క్రమంలో అజారుద్దీన్ నేడో, రేపో మంత్రిగా ప్రమాణం చేస్తారని ప్రచారం నడుస్తోంది. ప్రభుత్వ వర్గాల నుంచి దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ ఉంటే.. ఎలక్షన్ కోడ్ ఫిర్యాదు నేపథ్యంలో ఈ ప్రమాణ స్వీకారానికి ఈసీ అనుమతిస్తుందా? ఎలాంటి వివరణ ఇస్తుందో?? చూడాలి. -
శ్రీశైలం-హైదరాబాద్ హైవే బంద్!
సాక్షి, హైదరాబాద్: మోంథా తుపాను తెలంగాణపై విరుచుకుపడింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఉమ్మడి మహబూబ్నగర్లో భారీ వర్షాల కారణంగా శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై రోడ్డు తెగిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.వివరాల ప్రకారం.. నాగర్కర్నూల్లోని ఉప్పునుంతల మండలం లత్తిపూర్ వద్ద జాతీయ రహదారి రోడ్డు తెగిపోయింది. డిండి ప్రాజెక్టు అలుగుపోయడంతో జాతీయ రహదారి కోతకు గురైంది. దీంతో 765 హైవేపై హైదరాబాద్- శ్రీశైలం వైపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాలను అచ్చంపేట మండలంలోని హాజీపూర్ మీదుగా మళ్లించారు. వంగూరు మండలం చింతపల్లి, కొండారెడ్డిపల్లి మీదుగా వాహనాలు ప్రయాణం చేస్తున్నాయి.కొట్టుకుపోయిన హైదరాబాద్- శ్రీశైలం నేషనల్ హైవే ఏమయినా ఇజ్జత్ ఉందా సోయి లేని సంజయ్? @bandisanjay_bjp లక్షల కోట్లు టోల్ వసూల్ చేసి మోడీ సర్కార్ కట్టే రోడ్ల నాణ్యత ఇట్లా ఉంది 👇👇pic.twitter.com/KRoYsnFWBY— MBR (@BharathMBNR) October 30, 2025రైల్వే ట్రాక్లపై వర్షపు నీరు..మరోవైపు.. ఎడతెరపి లేని వర్షానికి ఉమ్మడి వరంగల్ జిల్లా చిగురుటాకులా వణికింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో భారీ వర్షం కురిసింది. గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. డోర్నకల్ రైల్వే స్టేషన్లో సుమారు రెండు కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ నీట మునిగింది. రైల్వే ట్రాక్పై మూడు అడుగుల ఎత్తులో నీరు ప్రవహించగా, జేసీబీల సాయంతో అధికారులు 12 గంటలు శ్రమించి నీటిని తొలగించారు. ముందు జాగ్రత్తగా వేగం నియంత్రించి నెమ్మదిగా రైళ్ల రాకపోకలు సాగిస్తున్నారు.హైదరాబాద్ - శ్రీశైలం రాకపోకలు బంద్...హైదరాబాద్ శ్రీశైలం రోడ్డులో విపరీతమైన వాహనాల రద్దీ ఉంటుంది...వారందరికీ చేరే వరకు ఈ పోస్ట్ షేర్ చేయండిఉప్పునుంతల మండలం లతీపూర్ గ్రామ సమీపంలోని హైదరాబాద్ - శ్రీశైలం ప్రధాన రహదారిపై రాత్రి కురిసిన భారీ వర్షానికి కొట్టుకపోయిన నేషనల్ హైవే రోడ్ pic.twitter.com/wsY6AjyY3X— Bhaskar Reddy (@chicagobachi) October 29, 2025లోతట్టు ప్రాంతాలు జలమయం హుజూరాబాద్ డివిజన్లోని జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక, శంకరపట్నం, సైదాపూర్ మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. హుజూరాబాద్లోని డిపో క్రాస్ రోడ్ వద్ద గల కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై భారీగా వర్షపు నీరు చేరింది. హుస్నాబాద్లో పలు దుకాణాలు, ఇండ్లలోకి వరద నీరు చేరింది. బస్టాండ్ ఆవరణ వరద నీటితో కుంటను తలపించింది. భారీ వర్షాల నేపథ్యంలో కరీంనగర్ కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షం కారణంగా వరంగల్లో పలు ప్రాంతాలు జలదిగ్భందంలోనే ఉన్నాయి. డోర్నకల్ రైల్వేస్టేషన్ జలమయం | #Dornakal #RailwayStation #Submerged #CycloneMontha pic.twitter.com/PjCJy5ENJK— Sakshi TV Official (@sakshitvdigital) October 29, 2025 -
ప్రేమ పెళ్లి చేసుకున్న పన్నెండు రోజులకే..
నల్గొండ జిల్లా: వారిద్దరు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పన్నెండు రోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు. కానీ కాళ్ల పారాణి ఆరకముందే నవ వధువు రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్రంపోడు మండలం చామలేడు గ్రామానికి చెందిన శిలువేరు నవీన్ నాంపల్లి మండలం దామెర గ్రామానికి చెందిన అనూష(20) ప్రేమించుకున్నారు. మొదట్లో అనూష తల్లిదండ్రులు వారి ప్రేమకు అంగీకరించకపోవడంతో గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి ఈ నెల 17న గ్రామంలో సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకన్నారు. నవీన్ పెయింటర్గా పనిచేస్తున్నాడు. నవీన్, అనూష కలిసి బుధవారం బైక్పై గుర్రంపోడుకు వస్తున్నారు. అదే సమయంలో గుర్రంపోడు గ్రామానికి చెందిన రేపాక లచ్చయ్య బైక్పై తన పిల్లలకు తీసుకుని గ్రామ శివారులోని బ్రిడ్జి వద్ద వాగు ప్రవాహాన్ని చూపించి మళ్లీ గుర్రంపోడు వైపు వెళ్లేందుకు బైక్ను తిప్పుతున్నాడు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న నవీన్ సడన్ బ్రేక్ వేస్తూ లచ్చయ్య బైక్ను ఢీకొట్టి నల్లగొండ– దేవరకొండ రహదారిపై ఎడుమ వైపునకు పడిపోయాడు. బైక్పై వెనుక కూర్చున్న అనూష ఎగిరి బ్రిడ్జి రెయిలింగ్పై నుంచి వాగులోకి పడిపోయింది. అక్కడే ఉన్న స్థానికులు ఎవరో వాగులో పడినట్లు గుర్తించి వాగులోకి వెళ్లి వెతకడం ప్రారంభించారు. అర్ధగంట తర్వాత వాగు ప్రవాహం అంచున గుంతలో అనూష మృతదేహం లభ్యమైంది. తలకు తీవ్ర గాయమైన నవీన్ను 108 వాహనంలో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి.. అక్కడి నుంచి హైదరాబాద్కు తీసుకెళ్లారు. కాగా ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
ఏసీబీ వలలో యాదగిరిగుట్ట ఆలయ విద్యుత్ ఈఈ
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం విద్యుత్ ఈఈ రామారావు కాంట్రాక్టర్ వద్ద రూ.1.90లక్షలు లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ జగదీశ్ చంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట ఆలయంలో లడ్డూ, పులిహోర ప్రసాదం తయారీ మిషన్ల మెయింటనెన్స్ టెండర్ను యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన ఉపేందర్, సందీప్రెడ్డి గతేడాది రూ.10లక్షలకు దక్కించుకున్నారు. కానీ గత సంవత్సర కాలంగా వారికి బిల్లులు రావడం లేదు. దీంతో తమకు రావాలి్సన రూ.10లక్షల బిల్లులు ఇవ్వాలని ఉపేందర్, సందీప్రెడ్డి గత కొన్ని నెలలుగా ఈఈ రామారావును అడుగుతూ వస్తున్నారు. రూ.2లక్షలు ఇస్తేనే..అయితే రూ.10లక్షల బిల్లుల్లో రూ.2లక్షలు తనకు ఇవ్వాలని రామారావు డిమాండ్ చేశాడు. రూ.1.90లక్షలు ఇస్తామని ఉపేందర్, సందీప్రెడ్డి చెప్పారు. ఈ విషయాన్ని వారు ఏసీబీ అధికారుల దృష్టికి రెండు నెలల క్రితం తీసుకెళ్లారు. రామారావు వివిధ పనుల్లో బిజీగా ఉండి ఉపేందర్, సందీప్రెడ్డిని ఈ రెండు నెలలు డబ్బులు అడగలేదు. బు«ధవారం విధులు ముగించుకొని హైదరాబాద్కు వెళ్తూ మార్గమధ్యలో రూ.1.90లక్షలు తీసుకుంటానని ఉపేందర్, సందీప్రెడ్డికి రామారావు చెప్పాడు. దీంతో వారు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చారు. మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లిలోని ఓ ఆస్పత్రి సమీపంలో ఉపేందర్, సందీప్రెడ్డి నుంచి రామారావు రూ.1.90లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. గతంలో 9 నెలలు సస్పెండ్.యాదగిరిగుట్ట ఆలయంలో సురక్ష సిబ్బంది వద్ద ఈఈ రామారావు డబ్బులు తీసుకొని వారిని ఉద్యోగంలో పెట్టుకున్నారని గతేడాది ఆరోపణలు రావడంతో అప్పటి ఈఓ భాస్కర్రావు విచారణ చేసి రామారావును సస్పెండ్ చేశారు. 9 నెలలు సస్పెండ్కు గురైన తర్వాత పైరవీలు చేసుకొని తిరిగి ఈ ఏడాది ఏప్రిల్లో ఉద్యోగంలో చేరినట్లు తెలుస్తోంది. ఆయన అక్రమ పద్ధతిలో ఉద్యోగం సంపాదించాడని, కింది స్థాయి ఉద్యోగులు, సిబ్బంది, ప్రైవేట్ సిబ్బందిని ఇబ్బందులకు గురిచేసేవారనే ఆరోపణలు ఉన్నాయి. తన వద్ద పనిచేసే సిబ్బందితో తన వ్యవసాయ బావి వద్ద పనులు చేయించుకునే వారని, వినకుంటే వ్యక్తిగతంగా దూషించి, ఉద్యోగంలో నుంచి తీసేస్తానని బెదిరించేవాడని సమాచారం. ఇక్కడ ఈఈ, మేడారంలో ఎస్ఈ..?ములుగు జిల్లా మేడారంలో వచ్చే ఏడాది జరగనున్న సమ్మక్క–సారక్క జాతర జరగనుండగా.. అక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న ఎస్ఈ పోస్టుకు రామారావును ఇన్చార్జిగా రెండు రోజుల క్రితం నియమించినట్లు తెలుస్తోంది. విద్యుత్ విభాగంలో పనిచేస్తున్న రామారావు.. సివిల్ విభాగంలో ఇన్చార్జి ఎస్ఈగా పదోన్నతి పొందడంపై స్థానిక ఆలయ ఉద్యోగుల్లో చర్చ మొదలైంది. ఇదిలా ఉండగా.. బుధవారం యాదగిరి క్షేత్రంలోని లక్ష్మీ పుష్కరిణిని సందర్శించేందుకు వచ్చిన సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస్రాజుతో కలిసి ఇన్చార్జి ఎస్ఈ హోదాలో రామారావు పరిశీలించాడు. ఇంట్లో సోదాలుఏసీబీ డీఎస్పీ జగదీశ్ చంద్రం ఆధ్వర్యంలో రామారావు ఇంట్లోతో పాటు ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా యాదగిరిగుట్ట ఆలయంలో రామారావు కార్యాలయంలో సైతం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించి పలు ఫైల్స్ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. -
‘చిరంజీవి’ కేసులపై ప్రత్యేక దృష్టి
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు, కేంద్ర మాజీమంత్రి కొణిదెల చిరంజీవి ఫిర్యాదు మేరకు సిటీ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో నమోదైన రెండు కేసులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆయన ఫిర్యాదు మేరకు డీప్ఫేక్పై శనివారం, అభ్యంతరకర వ్యాఖ్యపై మంగళవారం కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లోని నిందితులను గుర్తించడానికి దర్యాప్తు అధికారులు సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నారు. -
ఎందుకు వచ్చేశాడు? ఎవరిని కలిశాడు?
సాక్షి, హైదరాబాద్: నగర నేర పరిశోధన విభాగంలో (సీసీఎస్) నమోదైన కేసులో వాంటెడ్గా ఉండి, గత వారం టాస్క్ ఫోర్స్ పోలీసుల కస్టడీ నుంచి ఎస్కేప్ అయిన సతీష్ ఉప్పలపాటి వ్యవహారంలో అనేక కీలకాంశాలు వెలుగులోకి వస్తున్నాయి. దీన్ని విచారిస్తున్న ఉన్నతాధికారులు పోలీసు బృందాలకి నేతృత్వం వహించిన సబ్–ఇన్స్పెక్టర్ కదలికల్ని అనుమానిస్తున్నారు. మరోపక్క పరారీలో ఉన్న నిందితుడు సతీష్తో పాటు ఆయన భార్య శిల్ప బండ కోసం సీసీఎస్ బృందాలు రంగంలోకి దిగాయి. ఆనవాయితీకి విరుద్ధంగా వ్యవహారం... ఘరానా మోసగాడు సతీష్ను పట్టుకోవడం నుంచి అతడు పారిపోవడానికి సహకరించడం వరకు ప్రతి అంశంలోనూ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఆనవాయితీకి విరుద్ధంగా వ్యవహరించారు. ముంబైలో సతీష్ ఆచూకీ కనిపెట్టిన టాస్క్ ఫోర్స్ పోలీసులు అతడి కోసం ఎస్ఐ నేతృత్వంలో బృందాన్ని గత గురువారం అక్కడకు పంపారు. గత గురువారం రాత్రి (23వ తేదీ) సతీష్తో పాటు ఆయన భార్య, కుమార్తెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వెంటనే వారి వద్ద ఉన్న దాదాపు ఎనిమిది సెల్ఫోన్లు స్వా«దీనం చేసుకున్నారు. సాధారణంగా ఇలాంటి నిందితుల్ని పోలీసులు తమ వాహనంలోనే తరలిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్లు వారి చేతికి అందనీయరు. టాస్్కఫోర్స్ ఎస్ఐ మాత్రం తన బృందం ఉన్న కారును వదిలి నిందితులతో కలిసి వాళ్ల కారు ఎక్కారు. ఫోన్లు సైతం నిందితులకు తిరిగి ఇచ్చేశాడు. ఈ వాహనాన్ని నిందితుడి డ్రైవరే నడిపారు. రెండు గంటల ముందే వచ్చిన మరో కారు... వీరిది ఎస్యూవీ వాహనం కాగా పోలీసులది పాత ఇన్నోవా. దీంతో ఈ రెండు వాహనాల మధ్య దూరం దాదాపు 40 కి.మీలకు చేరింది. గురువారం రాత్రి షోలాపూర్లో నిందితులతో కలిసి భోజనం చేసిన ఎస్ఐ ఆ సమయంలోనూ తన బృందంతో మాట్లాడారు. వీరి వాహనం సదాశివపేట్ చేరడానికి రెండు గంటల ముందే నగరం నుంచి మరో కారు వచ్చి అక్కడ సిద్ధంగా ఉంది. గత శుక్రవారం (24వ తేదీ) తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో సతీష్, ఎస్ఐ తదితరులు ప్రయాణిస్తున్న వాహనం సదాశివపేట్లోని ఓ దాబా వద్దకు చేరింది. అప్పటికే అక్కడ ఉన్న నగరం నుంచి వచ్చిన కారులో ఎక్కిన నిందితులు కొల్హాపూర్ వైపు పారిపోయారు. ఇది జరిగిన కొద్దిసేపటికి వెనుక వస్తున్న తన బృందానికి ఎస్ఐ సమాచారం ఇచ్చారు. బృందం రాకముందే హైదరాబాద్కు.. సాధారణ పరిస్థితుల్లో సదరు ఎస్ఐ అక్కడే ఉండిపోవడమో, సీసీ కెమెరాల ఫీడ్ ఆధారంగా నిందితులు వెళ్లిన దారిలో గా లిస్తూ వెళ్లడమో చేస్తారు. అయితే ఇతను మాత్రం నిందితు డి కారులో, అతడి డ్రైవర్తో కలిసి హైదరాబాద్ పయనమ య్యా రు. కొద్దిసేపటికి దాబా వద్దకు చేరుకున్న బృందం ఎస్ ఐని సంప్రదించగా.. తాను హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పాడు. అలా సిటీకి వచ్చేసిన సదరు ఎస్ఐ ఎక్కడెక్కడకు వెళ్లా డు? ఎవరెవరిని కలిశాడు? తదితర అంశాలను ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఈఎస్ఐతో పాటు సతీష్ కుటుంబీకులు ప్రయాణించిన కారు డ్రైవర్ను పోలీసులు ప్రశి్నస్తున్నారు. వాహనాలు మారుస్తూ ఏమారుస్తూ... సదాశివపేట్ దాబా వద్ద నుంచి సతీష్, అతడి కుటుంబం మహారాష్ట్రలోని కొల్హాపూర్ వరకు వెళ్లింది. అక్కడ నుంచి మరో కారు అద్దెకు తీసుకుని ముంబై రూట్లో ప్రయాణించినట్లు అధికారులు గుర్తించారు. ఈ నిందితులను పట్టుకోవడానికి బుధవారం నుంచి సీసీఎస్ పోలీసులు రంగంలోకి దిగారు. కేంద్ర మాజీ మంత్రిగా, రెండు రాష్ట్రాలకు గవర్నర్గా పని చేసిన ప్రముఖ రాజకీయ నాయకుడి ఫిర్యాదు మేరకు సతీష్ తదితరులపై సీసీఎస్లో నమోదైన కేసులో నిందితులు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నాంపల్లిలోని న్యాయస్థానం దీనిపై గురువారం తీర్పు వెలువరించనుంది. అప్పటి వరకు దొరకొద్దని భావించిన సతీష్, శిల్ప అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈలోపే టాస్్కఫోర్స్కు చిక్కడంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. -
మొన్న ప్రేయసి.. నిన్న ప్రియుడు
రంగారెడ్డి జిల్లా: వాళ్లిద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ ఏమైందో ఏమో.. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో మనస్తాపం చెందిన యువతి ఇంటోనే ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడగా.. ఆమె లేని జీవితం వ్యర్థమని భావించిన యువకుడు.. ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. పెళ్లికి ఒత్తిడి తేవడంతో.. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధి ఆరుట్ల గ్రామానికి చెందిన పంబాల నందిని(21), అదే గ్రామానికి చెందిన మంకు నాగరాజు రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కాలం గడుస్తున్న కొద్దీ.. ఇదే విషయమై ఆమె అతడిపై ఒత్తిడి తేగా.. అతను నిరాకరిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో సోమవారం మరోసారి ఇద్దరు ఫోన్లో గొడవ పడ్డారు. దీంతో మనస్తాపం చెందిన యువతి.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. నందిని మృతితో వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తంచేశారు. తమ కూతురు మృతికి నాగరాజే కారణమని పేర్కొంటూ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు అయింది. ఆందోళన చెంది.. నందిని చనిపోవడం, ఠాణాలో కేసు నమోదు కావడంతో ఆందోళన చెందిన మహేశ్(26).. అదే రోజు సాయంత్రం ఆగాపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్లి, అక్కడే తల దాచుకున్నాడు. మానసికంగా కృంగిపోయి, భయాందోళనకు గురైన అతను.. బుధవారం ఆ గ్రామ శివారులోని చింత చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమించిన యువతి మృతితో మానసిక వేధనకు గురై మహేశ్ బలవన్మరణానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కుటుంబీకులకు అప్పగించారు. -
వేలు గోర్లు కత్తిరించి.. ఫ్యాషన్ డిజైనర్పై లైంగిక దాడి
హైదరాబాద్: స్నేహితురాలిపై పైశాచికత్వం చూపించాడో యువకుడు. ఆమెపై లైంగిక దాడికి పాల్పడి.. మధ్య వేలు గోర్లు కత్తిరించి, కత్తెరతో ఆమెపై తీవ్రంగా దాడిచేశాడు. పోలీసులకు, ఇతరులు ఎవరికైనా చెబితే యాసిడ్ పోసి చంపేస్తానంటూ బెదిరించిన ఘటన పంజగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన ఓ యువతి ఫ్యాషన్ డిజైనింగ్ చేసేందుకు నగరానికి వచ్చి ఆర్థిక ఇబ్బందులతో సగంలోనే కోర్సును ఆపేసింది. అనంతరం ల్యాంకోహిల్స్ వద్ద ఓ ప్రైవేట్ సంస్థలో టెక్నికల్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్గా విధులు నిర్వహిస్తూ సోమాజిగూడ, కపాడియా లైన్లో ఓ అపార్ట్మెంట్లో స్నేహితులతో కలిసి ఓ ఫ్లాట్లో నివసిస్తుంది. ఆమె పనిచేసే సంస్థలోనే విధులు నిర్వహించే బీఎన్ రెడ్డి నగర్ పరిధలోని చైతన్యనగర్కు చెందిన ఎ.భానుప్రకాష్తో పరిచయం అయింది. అతను వివాహం చేసుకుంటానని నమ్మించి సదరు యువతిని ప్రేమలోకి దింపాడు. ఈ క్రమంలో విభేదాలు మొదలై భానుప్రసాద్ బాధితురాలిని తరచూ వేధించడం, కొట్టడం, బెదిరించడం చేస్తుండే వాడని పోలీసులు తెలిపారు. ఈ నెల 26వ తేదీన రాత్రి 2:30కి బాధితురాలు ఉండే ఫ్లాట్కి వచ్చి ఆమె రూమ్ మేట్స్ను సైతం బెదిరించి..గదిలో బంధించి బలవంతంగా లైంగిక దాడి చేశాడు. అంతే కాకుండా కత్తెరతో దాడి చేశారు. దీంతో బాధితురాలు తీవ్ర భయాందోళనకు గురికాగా..మరుసటి రోజు స్నేహితులతో కలిసి పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు భానుప్రకాష్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
తెలంగాణను వీడని మోంథా
మోంథా తుపాన్ మొత్తానికి వాయుగుండంగా బలహీనపడింది. సాయంత్రం కల్లా దీని ప్రభావం పూర్తిగా పోతుందని భారత వాతావరణ శాఖ (IMD) పేర్కొంది. అయితే ఈ ప్రభావంతో రాగల కొన్ని గంటల్లో తెలంగాణతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్లో భారీ వర్షాలే పడనున్నాయని హెచ్చరిక జారీ చేసింది. ఈ నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం, అధికార యంత్రాగం అప్రమత్తమైంది. తెలంగాణలో మోంథా ఎఫెక్ట్తో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్ధిపేట, యాదాద్రి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయ్యింది. 9 జిల్లాలకు ఆరెంజ్, మరో 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. 35-45కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.ఆరు జిల్లాలకు సెలవులు.. భారీ వర్షాల నేపథ్యంతో వరంగల్, సిద్ధిపేట, ములుగు, ఉమ్మడి కరీంనగర్, హన్మకొండ, యాదాద్రి జిల్లాల్లో స్కూళ్లకు ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవు ప్రకటించారు. ఫ్లాష్ఫ్లడ్ హెచ్చరికజగిత్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు ఫ్లాష్ఫ్లడ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. మోంథా ప్రభావం ఇలా.. మోంథా తుపాను వాయుగుండంగా బలహీనపడింది. భద్రాచలానికి 120కి.మీ... ఖమ్మంకు 180 కి.మీ... ఒడిశా మల్కన్గిరికి 130 కి.మీ. వాయుగుండంగా కేంద్రీకృతమైంది. సాయంత్రం కల్లా పూర్తి బలహీనంగా మారిపోనుంది.సీఎం సమీక్షతుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. -
రైతులకు నష్టం జరగొద్దు
సాక్షి, హైదరాబాద్: మోంథా తుపాను ప్రభావంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను బుధవారం ఆరా తీశారు. వరి కోతల సమయం,.. పలుచోట్ల కళ్లాల్లో ధాన్యం ఆరబోసిన నేపథ్యంలో ఎటువంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాల్లోనూ తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. మోంథా ప్రభావం ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో అధికంగా ఉండటం.. హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సీఎం నిర్దేశించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ జంక్షన్లో గోల్కొండ ఎక్స్ప్రెస్, గుండ్రాతిమడుగు స్టేషన్లో కోణార్క్ ఎక్స్ప్రెస్ నిలిచిపోవడం.. పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు దారి మళ్లించిన నేపథ్యంలో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని చెప్పారు. మోంథా ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సమన్వయం చేసుకోవాలని.. జిల్లా కలెక్టర్లు మార్గదర్శకత్వం వహించాలని సూచించారు. వాగులు, వంకలు పొంగే ప్రమాదం ఉన్నందున జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించాలని చెప్పారు. నీటిమట్టాలను పరిశీలించండి నీటిపారుదల శాఖ అధికారులు, సిబ్బంది రిజర్వాయర్లు, చెరువులు, కుంటల నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నీటి విడుదలపై ముందుగానే కలెక్టర్లు, క్షేత్ర స్థాయి సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. పూర్తిగా నిండిన చెరువులు, రిజర్వాయర్ల వద్ద ఇసుక బస్తాలను ముందుగానే సిద్ధంగా ఉంచాలని చెప్పారు. రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో, లోలెవల్ బ్రిడ్జిలు, కాజ్వేలపై నుంచి రాకపోకలు పూర్తిగా నిషేధించాలన్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు వాటి సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. తుపాను ప్రభావంతో వర్షపు నీరు నిల్వ ఉండి దోమలు, ఇతర క్రిమికీటకాలు విజృంభించి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున పురపాలక, గ్రామాల పారిశుధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. వైద్యారోగ్య శాఖ తగినన్ని మందులను అందుబాటులో ఉంచుకోవాలని, అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రాణ, ఆస్తి నష్టం, పశు నష్టం జరగకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. రెవెన్యూ, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, వైద్యారోగ్య, పోలీస్, అగ్నిమాపక శాఖలు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సమన్వయంతో సాగాలని చెప్పారు. హైదరాబాద్లో ప్రజల నుంచి వచ్చే వినతులకు జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్, అగి్నమాపక శాఖ సిబ్బంది తక్షణమే స్పందించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. -
రైతన్న వెన్ను విరిచిన వాన
సాక్షి, హైదరాబాద్: వానాకాలం సీజన్ మొత్తాన్ని అతలాకుతలం చేస్తూ వచ్చిన వర్షాలు ‘మోంథా’తుపానుతో రైతుల నడ్డి విరిచాయి. గత సెప్టెంబర్ నుంచి కురుస్తున్న అకాల వర్షాలతో పత్తి పంట ఇప్పటికే చాలా వరకు దెబ్బతింది. చేలల్లో నీరు నిలిచి పత్తి గింజలు బలహీనంగా ఎదిగాయి. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో మొదటి విడత పత్తి ఏరడం పూర్తయ్యింది. రెండోదశ పత్తి ఏరేందుకు సిద్ధమవుతున్న చేలకు ‘మోంథా’తుపాను తీవ్ర నష్టం కలిగించింది. పత్తి గింజలు విచ్చుకుంటున్న సమయంలో కురిసిన వర్షాలతో పత్తి మరింత దెబ్బతింది. పత్తి అధికంగా సాగయ్యే ఆదిలాబాద్లో వర్ష ప్రభావం అధికంగా లేకపోవడంతో ఇక్కడ నష్టం కొంత తక్కువగానే ఉంది. వరి పంట చేతికి వస్తున్న సమయంలో కురిసిన వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కోతలు పూర్తయిన రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు పోయగా, చాలా ప్రాంతాల్లో ధాన్యం తడిసిపోయింది. ఇక కోతకు వచ్చిన వరి వర్షాలకు చాలా జిల్లాల్లో నేలకొరిగింది. పొట్టకొచ్చిన వరి నేలరాలడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏపీ సరిహద్దు జిల్లాల్లో అధిక నష్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆనుకొని ఉన్న జిల్లాల్లో మోంథా తుపానుతో నష్టం ఎక్కువగా ఉంది. నల్లగొండ, సూర్యాపేట, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో పత్తి పంట నష్టం అధికంగా ఉన్నట్టు వ్యవసాయ శాఖ గుర్తించింది. మహబూబాబాద్, వరంగల్, భూపాలపల్లి, వికారాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లాల్లో కూడా పత్తి దెబ్బతింది. వరంగల్ ప్రధాన వ్యవసాయ మార్కెట్లో వడ్లు, మక్కలు వర్షం నీటిలో నానిపోయాయి. ఖమ్మం, మహబూబాబాద్, భద్రాచలం, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాల్లో పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లినట్టు క్షేత్రస్థాయి వ్యవసాయ అధికారులు నివేదికలు ఇచ్చినట్టు సమాచారం. మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర నష్టం మహబూబాబాద్ జిల్లాలో పత్తి, మొక్కజొన్న, వరి, మిర్చి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరి 2,15,723 ఎకరాల్లో సాగు కాగా, ప్రస్తుతం పొట్ట దశలో ఉంది. ఈ వర్షాల కారణంగా 50 శాతానికిపైగా నష్టం వాటిల్లింది. మొక్కజొన్న 62,751 ఎకరాల్లో సాగు చేసి, కంకులను కోసి రైతులు విక్రయించేందుకు కల్లాలు, అనువుగా ఉన్న ప్రాంతాల్లో ఆరబోసుకు న్నారు. మొక్కజొన్నలకు 70 నుంచి 80 శాతానికిపైగా నష్టం వాటిల్లింది. పత్తి 86,224 ఎకరాల్లో సాగు కాగా, పంట కోతదశకు చేరుకున్న సందర్భంలో 60 శాతానికి పైగా నష్టం చేకూర్చనుంది. మిర్చి 38,289 ఎకరాల్లో సాగు చేయగా, పూత 40% వరకు రాలిపోతున్నట్టు ప్రాథమికంగా అంచనా. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో... ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా ఈసారి అత్యధికంగా 6,85,262 ఎకరాల్లో పత్తి సాగైంది.భారీ వర్షాల కారణంగా పత్తి పంట దిగుబడి సగానికి పడిపోవడం, ప్రస్తుత తుపాను కారణంగా పంట మరింత దెబ్బతినడంతో ఎకరానికి ఐదు క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు చేతికంది వచ్చిన పంట ఆగమైందిరెండున్నర ఎకరాల్లో వరిసాగు చేయగా రూ.లక్షకుపైగా ఖర్చు అయ్యింది. ప్రస్తుతం వరి పొట్టదశకు చేరుకుంది. కొద్దిరోజుల్లో వరి కోతలు అనుకున్నాం. అంతలోనే తుపాను కారణంగా చేతికి అంది వచ్చిన పంటకు నష్టం వాటిల్లింది. –భూక్యా శాంతి, సోమ్ల తండా మహబూబాబాద్ పత్తి ఏరకుండా వదిలేశానునాకున్న 3 ఎకరాల్లో పత్తి పంట వేశా. ఇప్పటివరకు ఎకరాకు రూ.30 వేల చొప్పున ఖర్చు అయ్యింది. ఈసారి భారీ వర్షాలకు పత్తి దిగుబడి సగానికి తగ్గింది. కూలీలతో పత్తి ఏరేందుకు సిద్ధమవుతున్న సమయంలో తుపాను కారణంగా పంట మరింత దెబ్బతింది. కూలీల ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడం పత్తి తీయడం మానేశాను. – లాల్యా, పోచమ్మతండా, వెల్దండ మండలం, నాగర్కర్నూల్ జిల్లా) రైతులు అప్రమత్తంగా ఉండాలిమోంథా తుపాను ప్రభావంతో జిల్లాలో ఆరెంజ్ హెచ్చరిక జారీ అయ్యింది. రైతులు అప్రమత్తంగా ఉండాలి. కోసిన వరి, మొక్కజొన్న, పత్తిని సురక్షిత ప్రాంతాల్లో దాచుకోవాలి. వరి, మొక్కజొన్నను తుపాను ప్రభావం తగ్గిన తర్వాత కోయాలి. పత్తి ఏరవద్దు. తొందరపడి కోస్తే తడిసే అవకాశం ఉంది.అధిక నీటి నిల్వతో ఎండుతెగులుతో పాటు ఇతర చీడపీడలు సోకే అవకాశాలు ఉన్నందున పలు జాగ్రత్తలు పాటించాలి. – శ్రీనివాస్, డీఏవో పెద్దపల్లి -
క్యాంపులతో ఖతం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: పెరిగిన నిర్బంధం..సహకరించని ఆరోగ్యం కారణంగా ప్రజాస్వామ్యయుత పోరాటానికే పరిమితం అవుతున్నట్టు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న లొంగుబాటు సందర్భంగా చెప్పారు. ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోటగా ఉన్న దండకారణ్యంలో ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అందుకే అన్నలు అనివార్యంగా అడవిని వీడుతున్నారు. పారా మిలిటరీని ఎదుర్కొనేలా.. బస్తర్ అడవుల్లోకి పారా మిలిటరీ దళాలు అడుగుపెట్టగానే మావోయిస్టులు రక్షణ వ్యూహాలకు పదును పెట్టారు. జర్మన్ యుద్ధరీతులను అధ్యయనం చేసి వేగంగా బంకర్లు, బూబీట్రాప్స్ నిర్మాణాలను వంట పట్టించుకున్నారు. తమ బస(క్యాంప్)కు సంబంధించిన సమాచారం పోలీసులు, భద్రతా దళాలకు చేరిన తర్వాత వారు తమను చుట్టుముట్టేందుకు ఎంత సమయం పడుతుంది ? ఈ దాడి నుంచి తమను తాము రక్షించుకునేందుకు ఎంత సమయం అవసరం ? తప్పించుకున్న తర్వాత చెల్లాచెదురైన దళాలు 24 లేదా 72 గంటల్లోగా తిరిగి ఎక్కడ కలుసుకోవాలి ? అనే అంశాలపై అధ్యయనం చేశారు.చివరకు భద్రతాదళాలు కనీసం నాలుగు కిలోమీటర్ల పాటు అడవిలో నడిస్తే తప్ప తమను చేరుకోలేనంత దట్టమైన అడవిలోనే క్యాంప్లు ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ నాలుగు కిలోమీటర్ల నడకలో ఉన్నప్పుడే భద్రతా దళాలపై అంబూష్ లు చేసే టెక్నిక్ నేర్చుకున్నారు. దీంతో యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్లో భాగంగా అడవుల్లోకి వెళ్లిన బలగాలు అనేక సార్లు మావోయిస్టుల ఉచ్చులో చిక్కుకున్నాయి. కట్టుదిట్టం చేసినా.. ఆపరేషన్ గ్రీన్హంట్ చేపట్టి పదేళ్లు దాటినా సానుకూల ఫలితం రాకపోవడంతో 2017లో ఆపరేషన్ సమాధాన్ (ఎస్–స్మార్ట్ లీడర్షిప్, ఏ–అగ్రెసివ్ స్ట్రాటజీ, ఎం– మోటివేషన్ అండ్ ట్రైనింగ్, ఏ–యాక్షనబుల్ ఇంటెలిజెన్స్, డీ–డ్యాష్ బోర్డ్ బేస్డ్ కీ రిజల్ట్ ఏరియా, హెచ్– హార్నెస్టింగ్ టెక్నాలజీ, ఏ–యాక్షన్ ప్లాన్, ఎన్–నో ఆక్సెస్ టు ఫైనాన్సింగ్ )ను కేంద్రం తెరపైకి తెచ్చిది. మావోయిస్టుల ఆర్థిక వనరులపై దెబ్బకొట్టడం, వారి స్థావరాలను కచ్చితంగా కనుక్కోవడం, ఔషధాలు అందకుండా చూడడం, మావోయిస్టుల్లోకి కొత్త రిక్రూట్మెంట్లు తగ్గించే పనిపై ఫోకస్ చేశారు. ఆఖరకు వాయుమార్గ దాడులకు తెర తీశారు. ఎన్ని చేసినా 2021 ఏప్రిల్లో తెర్రం దగ్గర జరిగిన దాడిలో 22 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోవడం భద్రతాదళాలకు పెద్ద ఎదురుదెబ్బగా నిలిచింది. మావోయిస్టులను ఎదుర్కొనేందుకు మరో కొత్త వ్యూహం భద్రతాదళాలకు అవసరమైంది. 4 కి.మీ ప్లాన్మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రతీ 4 కిలోమీటర్లకు ఒక పారామిలిటరీ క్యాంప్ ఏర్పాటు చేసే వ్యూహానికి శ్రీకారం చుట్టారు. దీని ప్రకారం అడవిలో క్యాంప్ ఏర్పాటు చేసి 24 గంటలూ జవాన్లు అక్కడే ఉన్నారు. క్యాంప్ చుట్టూ నాలుగు కి.మీ. పరిధిలో నిత్యం కూంబింగ్ చేశారు. క్యాంపుతోపాటే భారీ వాహనాలు తిరిగేలా తాత్కాలిక రోడ్లు, మొబైల్ టవర్లు, విద్యుత్ సౌకర్యం కల్పించారు. నెల రోజుల వ్యవధిలోనే ఆ ప్రాంతంపై పట్టు సాధించి అక్కడి నుంచి 4 కి.మీ. దూరంలో మావోలకు పట్టున్న ప్రాంతంలో మరో కొత్త క్యాంప్ (ఫార్వర్డ్ ఆపరేటింగ్ బ్లాక్, ఎఫ్ఓబీ) ఏర్పాటు చేశారు. ఇలా ప్రణాళికాయుతంగా ముందుకు సాగడంతో 2023 నాటికి 300 పైగా క్యాంపులు ఏర్పాటయ్యాయి. పరిస్థితులు తమకు అనుకూలంగా మారాయనే నమ్మకం రాగానే 2024 జనవరిలో ఆపరేషన్ కగార్ మొదలైంది. మావోయిస్టుల కదలికలపై మానవ, సాంకేతిక నిఘాతో కచ్చితమైన దాడులు జరిగాయి. ప్రతీ ఎన్కౌంటర్ మావోయిస్టులకు భారీ నష్టం చేస్తూ వచ్చింది. చివరకు ఆ పార్టీ సుప్రీం కమాండర్ నంబాల సైతం ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఓ వర్గం సాయుధ పోరాటానికి సెలవు ప్రకటించి ఆయుధాలతో లొంగిపోగా, మరికొందరు సాయుధ పోరాటానికి మద్దతు ఇస్తూనే పెరిగిన నిర్బంధం, అనారోగ్య సమస్యల కారణంగా వనం వీడాల్సి వస్తోంది. -
ప్రాజెక్టులకు మళ్లీ జలకళ
కేతేపల్లి/నాగార్జునసాగర్/బాల్కొండ/జగిత్యాల అగ్రికల్చర్: విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టులు మళ్లీ జలకళను సంతరించుకున్నాయి. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద రాగా, బుధవారం ప్రాజెక్టు ఎనిమిది గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. 4.46 టీఎంసీల పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం గల మూసీ రిజర్వాయర్లో ప్రస్తుతం 4.09 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు పేర్కొన్నారు. నాగార్జునసాగర్ జలాశయానికి 1,94,845 క్యూసెక్కుల వరద వస్తుండడంతో 20 క్రస్ట్గేట్లు, విద్యుదుత్పాదన ద్వారా 1,94,845 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కుడి, ఎడమ కాల్వ, వరద కాల్వకు, ఏఎమ్మార్పికి నీటి విడుదలను నిలిపివేశారు. సాగర్ జలాశయ గరిష్ట స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 589.20 అడుగుల మేర నీరు ఉంది. మోంథా తుపాను ప్రభావంతో సాగర్ పరిసర ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాగర్ శివారులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దులోని ఎత్తిపోతల వద్ద జలపాతం ఉధృతంగా పారుతోంది. ఎగువ నుంచి భారీ వరద నీరు వస్తుండటంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 16 గేట్లను ఎత్తి 50 వేల క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి వదులుతున్నారు. బాబ్లీ గేట్ల మూసివేత శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువన మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బుధవారం త్రి సభ్య కమిటీ సభ్యుల సమక్షంలో మూసివేశారు. ప్రాజెక్టు గేట్లను జూలై 1 నుంచి అక్టోబర్ 28 వరకు తెరిచి ఉంచుతారు. ప్రతి ఏటా అక్టోబర్ 29న మూసివేస్తారు. అయితే ప్రాజెక్టుకు 14 గేట్లు ఉండగా, ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు వస్తుండటంతో పది గేట్లను మాత్రమే మూసి వేసి మిగతా నాలుగు గేట్లను తెరిచి ఉంచి ఎస్సారెస్పీలోకి నీటి విడుదల చేస్తున్నారు. వరద నీటి ఆధారంగా నాలుగు గేట్ల మూసి వేత, ఓపెన్ ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీడబ్ల్యూసీ ఈఈ ప్రాంక్లిన్, ఎస్సారెస్పీ ఎస్ఈ జగదీశ్, నాందేడ్ ఈఈ సీఆర్ బన్సద్, ఏఈఈ రవి తదితరులు పాల్గొన్నారు. -
సమన్వయంతో పార్టీ పురోగతికి పాటుపడాలి
సాక్షి, హైదరాబాద్: అందరూ సమన్వయంతో పని చేసి రాష్ట్రంలో పార్టీ పురోగతికి పాటుపడాలని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, రాష్ట్రఇన్చార్జ్ సునీల్బన్సల్ దిశా నిర్దేశం చేశారు. పార్టీ తరఫున ఎన్నికైన అన్ని స్థా యిల ప్రజాప్రతినిధులు మరింతగా పార్టీ బలోపే తం, విస్తరణకు కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావొస్తున్నందున, ఎన్నికల హామీల అమలు, ముఖ్యమైన సమ స్యల పరిష్కారంలో వైఫల్యాలను ఎండగడుతూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. పార్టీ వైఖరి, విధానాలు, క్రమశిక్షణ, మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఎంతటి పెద్ద నాయకులు వ్యవహరించినా కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పార్టీ అభ్యర్థికి విజయావకాశాలు మెండుగా ఉన్నాయని, పార్టీ నాయకులంతా సమన్వయంతో ప్రచారం చేసి గెలిపించుకునేందుకు కృషి చేయాలని సూచించారు.బుధవారం పార్టీ కార్యాలయంలో ఎంపీలు డీకే.అరుణ, ఈటల రాజేందర్, గొడెం నగేశ్, ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్రెడ్డి, పాయల్ శంకర్, ధన్పాల్ సూర్యనారాయణగుప్తా, ఎమ్మెల్సీలు ఏవీఎన్రెడ్డి, మల్క కొమురయ్యలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు, రాష్ట్రపార్టీ ఇన్చార్జ్ అభయ్పాటిల్, ఇతరనేతలు పాల్గొన్నారు. వారిపై పార్టీ నమ్మకం పెట్టుకుంది : రాంచందర్రావు బీజేపీ నాయకులు, కార్యకర్తలపై జాతీయ నాయకత్వం బలమైన నమ్మకాన్ని పెట్టుకుందని బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు తెలిపారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉందని, పార్టీ అభ్యర్థి గెలుస్తాడనే ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నామన్నారు. విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించి పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం రాంచందర్రావు అధ్యక్షతన రాష్ట పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అదే ఎంఐఎంకు వేసినట్టేనని చెప్పారు. పోలీస్ స్టేషన్లలో బైండోవర్ అయ్యే కాంగ్రెస్ అభ్యర్థి కావాలా? లేక ప్రజా సమస్యల పరిష్కారానికి అభివృద్ధి కోసం పనిచేసే బీజేపీ అభ్యర్థి కావాలా? ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో అవినీతి, అరాచకాలు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన తప్పుడు హామీలు, అమలు కాని 6 గ్యారంటీలను ప్రజల ఎదుట ఎండగట్టాలన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఇతర నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
సీఎం రేవంత్పై కేసు నమోదు చేయాలి
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ప్రచారంలో పాల్గొనకుండా నిషేధించడంతో పాటు, సుమోటోగా కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సి.సుదర్శన్రెడ్డికి బుధవారం వినతిపత్రం అందజేశారు. సీఎం రేవంత్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సినీ కార్మికుల ఓట్లకోసం సన్మానాల పేరిట కుట్రలు పన్నుతున్నారని అన్నారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కూడా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ఓటర్లను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈసీకి ఫిర్యాదు అనంతరం గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడారు. ‘సీఎం రేవంత్ ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించి ఆధారాలను ఎన్నికల కమిషన్కు అందజేశాం. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్గా రేవంత్ను తొలగించడంతో పాటు కేంద్ర పోలీసు బలగాలను మోహరించాలని కోరాం. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను అనర్హుడిగా ప్రకటించాలని ఈసీకి ఇచి్చన ఫిర్యాదులో కోరాం. తనకు అడ్డువస్తే చంపేస్తానని నవీన్ యాదవ్ బెదిరిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు’అని గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కాగా, ఇదే అంశంపై బీఆర్ఎస్ లీగల్ సెల్ బృందం కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేసింది. -
దొంగ ఓట్లతో గెలవాలని చూస్తున్నారు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు నమోదు చేయించినట్లు తెలిసిందని, ప్రజలు ఎలాగూ ఓటు వేయరని తెలిసి, దొంగ ఓట్లతో గెలవాలని చూస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు విమర్శించారు. ఈ నియోజకవర్గంలో 13 వేల దొంగ ఓట్లు సృష్టించారని, ప్రజలు అప్రమత్తంగా లేకపోతే కాంగ్రెస్కు చెందిన వారు ఎవరో ఒకరు ఓటు వేస్తారని అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సోదరుడికే మూడు ఓట్లు ఉన్న విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ భవన్లో బుధవారం జరిగిన ‘మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనం’లో కేటీఆర్ మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో మంత్రులు కొత్త వేషాలు వేసుకుని అభివృద్ధి చేస్తామని గల్లీ లీడర్లలా తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలను అంగట్లో సరుకులా కొని ఉప ఎన్నికలో గెలిచేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి స్వయంగా బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఆయన గెలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఓటర్లు ఆలోచించాలని అన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కాంగ్రెస్ను గెలిపిస్తే రూ.వెయ్యి కోట్లు ఇస్తామని హామీ ఇచ్చి ఒక్క పని చేయలేదన్నారు. అభివృద్ధి నిధుల కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రపంచ బ్యాంకుకు లేఖలు రాస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఒక్కరూ సంతోషంగా లేరు ‘కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించడంతో ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదు. ఇందిరమ్మ రాజ్యం అంటూ.. పేదల కోసం ఒక్క ఇల్లు కట్టకున్నా హైడ్రా పేరిట బుల్డోజర్లతో పేదల ఇళ్లు కూల్చారు. యూసుఫ్గూడలో సన్మానం పేరిట ముఖ్యమంత్రే వెళ్లి సినీ కార్మికులతో శాలువాలు కప్పించుకున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పేరిట మోసగించారు. బడ్జెట్లో ఏటా బీసీలకు రూ.20 వేల కోట్లు పెడతామని, ఆ దిశగా రేవంత్ ప్రయత్నం చేయలేదు’అని కేటీఆర్ విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, కోరుకంటి చందర్ తదితరులు పాల్గొన్నారు. -
ముంచేసిన మోంథా
సాక్షి, నెట్వర్క్: మోంథా తుపాను రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. మంగళవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో బుధవారం అనేక జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. చాలాచోట్ల రహదారులు తెగిపోవడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. చెరువులు, కుంటలు తెగిపోగా... కాల్వలు, వాగులు ఉప్పొంగాయి. వరదనీరు పొలాలను ముంచేసింది. పంటలు నేలకొరిగాయి. కాలనీలు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరదనీరు చేరడంతో బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. నాగర్కర్నూల్, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోని చాలాచోట్ల భారీ వర్షాలు నమోదయ్యాయి. 29 ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిశాయి. ఈ ప్రాంతాల్లో 12 గంటల్లోనే 20 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. 105 ప్రాంతాల్లో ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 10 సెంటీమీటర్లకు పైబడి వర్షపాతం నమోదైంది. గత ఐదేళ్లలో ఈ స్థాయిలో భారీ వర్షాలు నమోదు కావడం ఇదే ప్రథమం. మంగళవారం రాత్రి ఏపీలోని నర్సాపురం వద్ద తీరం దాటిన మోంథా తీవ్ర తుపాను ప్రభావం తెలంగాణపై తీవ్రంగా పడింది. బుధవారం సాయంత్రానికి మోంథా బలహీనపడి వాయుగుండంగా మారింది. గురువారం మధ్యాహ్నం కల్లా దీని ప్రభావం పూర్తిగా తగ్గనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరో రెండ్రోజులు మోస్తరు వర్షాలు... ⇒ ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలు నమోదు కావొచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ⇒ నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ⇒ ఈ ఏడాది జూన్ నుంచి అక్టోబర్ 29 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 82.90 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... 110.87 సెంటీమీటర్లు నమోదైంది. సాధారణం కంటే 34 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. 5 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా, 20 జిల్లాల్లో అధికం, 8 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు రాష్ట్ర ప్రణాళిక శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఓరుగల్లు అతలాకుతలం ఉమ్మడి వరంగల్ జిల్లాను మోంథా తుపాను కుదిపేసింది. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు దంచికొట్టిన వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. ప్రధానంగా వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్ జిల్లాలపై తుపాను తీవ్ర ప్రభావం చూపింది. కోతకొచ్చిన వరి పంట నేలరాలింది. ఇప్పటికే కోతలు పూర్తయి కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం కల్లాల్లోనే తడిసింది. మిర్చి, మొక్కజొన, పత్తి రైతుల పరిస్థితి ఆగమాగమైంది. 30 శాతమే వరికోతలు పూర్తి కాగా, సుమారు 4.50 లక్షల ఎకరాల్లో కోతలకు సిద్ధమయ్యాయి. పత్తి ఏరడానికి సిద్ధమైన తరుణంలోనే తుపాను రావడంతో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. వరంగల్, హనుమకొండ, కాజీపేటలోని సుమారు 71 కాలనీల్లో వరద నీరు చేరినట్లు సమాచారం. గురువారం కూడా తుపాను కొనసాగుతుందన్న వాతావరణశాఖ హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా> ఆరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశారు. జలదిగ్బంధంలో ‘గ్రేటర్ వరంగల్’... భారీ వర్షాలకు వరంగల్ నగరంలోని పలు కాలనీలు జలమయం అయ్యాయి. హనుమకొండ బస్టాండ్లోకి భారీగా వరద చేరి చెరువును తలపించింది. ఎస్ఆర్ నగర్, వివేకానందనగర్, సాయిగణేశ్కాలనీ, లక్ష్మీ గణపతి కాలనీ, మధురానగర్, గిరిప్రసాద్నగర్, గాం«దీనగర్, మైసయ్యనగర్, భద్రకాళినగర్, పోతననగర్, రాజీవ్నగర్, సమ్మయ్యనగర్, వాజ్పేయి కాలనీ, విద్యానగర్, పోచమ్మకుంట, ఇంద్రానగర్, దీన్దయాళ్నగర్, కాజీపేట ప్రశాంత్నగర్, బ్యాంక్ కాలనీల్లోకి వరద నీరు చేరింది. ప్రధాన నాలాలు పొంగిపొర్లాయి. హనుమకొండ, నయీంనగర్, కేయూ క్రాస్రోడ్డు, ములుగు క్రాస్రోడ్డు, హంటర్రోడ్డు, ఎన్జీవోస్ కాలనీ, అంబేడ్కర్ స్టేడియం తదితర ప్రాంతాల్లో వరదనీరు రోడ్లపైకి రావటంతో గంటలపాటు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఏజేన్సీ ప్రాంతాల్లో వాగులు పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. రైల్వే స్టేషన్లు, రైలు పట్టాలపైకి వరద చేరడంతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్ల రాకపోకలను నిలిపి వేసింది. వరంగల్లో ఇంటర్సిటీ, ఈస్ట్కోస్ట్, మహబూబాబాద్లో కృష్ణ ఎక్స్ప్రెస్లను నిలిపి వేసినట్లు అధికారులు తెలిపారు. వరంగల్ మీదుగా వెళ్లే పలు రైళ్లు షాలిమార్, టాటా నగర్, షిరిడీ, కాకినాడ ఎక్స్ప్రెస్ను వయా కాజీపేట మీదుగా దారి మళ్లించి భాగ్యనగర్, శాతవాహనను కూడా రద్దు చేశారు. అంతటా అప్రమత్తం... జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు అందుబాటులో ఉండాలి. రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దు. కలెక్టరేట్లో కంట్రోల్ రూం 24 గంటలు అందుబాటులో ఉంటుంది. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నంబర్ 7981975495, టోల్ ఫ్రీ నంబర్ 1800–425–1115 ఏర్పాటు చేశాం. అధికారులు ఎవరూ జిల్లా కేంద్రాన్ని వదిలి వెళ్లరాదని, సెల్ఫోన్లు స్విచ్ఛాఫ్ చేయరాదని ఆదేశాలు జారీచేశాం. – స్నేహ శబరీష్, హనుమకొండ జిల్లా కలెక్టర్ రంగారెడ్డిలో పొంగుతున్న వాగులు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో బుధవారం కుండపోత వర్షం కురిసింది. తలకొండపల్లిలో అత్యధికంగా 11.72 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పంట పొలాలు నీట మునిగాయి. కల్లాలు, మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో నిల్వ చేసిన ధాన్యం తడిపోయింది. పత్తి, వరి, కూరగాయలు, పూల తోటలకు తీరని నష్టం వాటిల్లింది. మూసీ, ఈసీ, కాగ్నా సహా పలు చెరువులు, కుంటలు పొంగిపొర్లాయి. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం వీర్శెట్టిపల్లి గ్రామానికి చెందిన యువకులు కాగ్నా వాగులో కొట్టుకుపోతున్న యాలాల మండలం అగ్గనూరుకు చెందిన పెద్దింటి నర్సింలు అనే వ్యక్తిని కాపాడారు. అతడు కొద్ది రోజులుగా మతిస్థిమితం కోల్పోయి తిరుగుతున్నట్లు సమాచారం. సిద్దిపేట జిల్లాలో వర్ష బీభత్సం సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం కుండపోత వర్షం కురిసింది. హుస్నాబాద్ నియోజకవర్గంలో 21.28 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొనుగోలు కేంద్రాల్లో, మార్కెట్ యార్డుల్లోని ధాన్యం కుప్పలు తడిసిముద్దయ్యాయి. హుస్నాబాద్ పట్టణంలోని దుకాణాల్లోకి వరద నీరు చేరింది. ఆర్టీసీ బస్టాండ్లోని ప్లాట్ఫాంల పైకి నీరు రావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. గురువారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఖమ్మం జిల్లాను వణికించిన మోంథా మోంథా తుపాను ఉమ్మడి ఖమ్మం జిల్లాపై తీవ్ర ప్రభావం చూపించింది. భారీ వర్షాలకు చేతికందే దశలో ఉన్న పంటలు నాశనమయ్యాయి. బోనకల్ మండలంలో 9.34 సెం.మీ. వర్షపాతం నమోదైంది. పాలేరు, వైరా, లంకాసాగర్, కిన్నెరసాని రిజర్వాయర్లలో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరింది. కొణిజర్ల మండలం అంజనాపురం సమీపంలో నిమ్మవాగు బ్రిడ్జి పైనుంచి వెళ్లటానికి ప్రయతి్నంచిన డీసీఎం వరద నీటిలో కొట్టుకుపోయింది. డీసీఎంను నడిపిన భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మోతీనగర్ కాలనీకి చెందిన ఆరేపల్లి మురళి (32) నీటిలో గల్లంతయ్యాడు. మహబూబాబాద్, డోర్నకల్ ప్రాంతాల్లో రైల్వేట్రాక్పైకి వరద చేరడంతో ఖమ్మం మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దుచేసి, ఇంకొన్నింటిని దారి మళ్లించారు. ఖమ్మంలోని మున్నేటి వరద ఉధృతిని కలెక్టర్ అనుదీప్ పరిశీలించి ప్రజలను అప్రమత్తం చేశారు. కలెక్టరేట్లు, పోలీసు కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు.ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం నిమ్మవాగులో కొట్టుకుపోతున్న డీసీఎం వాహనం నాగర్కర్నూల్ జిల్లావ్యాప్తంగా భారీ వర్షం ఉమ్మడి పాలమూరు జిల్లాలో బుధవారం భారీ వర్షం కురిసింది. నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలో అత్యధికంగా 18.22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అచ్చంపేట, చారకొండ, ఊర్కొండ, తెలకపల్లి, బల్మూర్ మండలాల్లో 12 సెం.మీ. వర్షం కురిసింది. నల్లమలలోని ఉమామహేశ్వర దేవాలయం సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంట వాగులో కారు కొట్టుకుపోయింది. నాగర్కర్నూల్ కలెక్టరేట్లోకి వరద నీరు చేరింది. నారాయణపేట జిల్లా కేంద్రంలోని హజికన్పేటలో ఓ ఇళ్లు కూలిపోవడంతో శిథిలాల కింద చిక్కుకున్న చింతామణి అనే మహిళలను పోలీసులు కాపాడారు. మహబూబ్నగర్లో ఎర్రకుంట, కొత్తచెరువు ఉధృతంగా ప్రవహించడంతో పలు కాలనీలు నీట మునిగాయి. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆరబోసిన మొక్కజొన్న కొట్టుకుపోయింది. హైదరాబాద్–శ్రీశైలం హైవేపై రాకపోకలు నిలిపివేత నల్లగొండ జిల్లాలోని డిండి ప్రాజెక్టుకు వరద భారీగా వచ్చి అలుగు ఉధృతంగా పారుతోంది. ప్రాజెక్టుకు కుడి భాగాన నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం లత్తీపూర్ గ్రామ శివారులో ఉన్న రెండో అలుగు దిగువన హైదరాబాద్ – శ్రీశైలం రహదారి బ్రిడ్జి వరద ధాటికి దెబ్బతింది. దీంతో ఈ మార్గం గుండా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో హైదరాబాద్–శ్రీశైలం వైపు వెళ్లే వాహనాలను తెలకపల్లి– లింగాల– బల్మూర్– అచ్చంపేట మీదుగా దారి మళ్లించారు. చెట్టు కూలి వ్యక్తి మృతి సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రానికి చెందిన కోట లక్ష్మీనారాయణ (45) చెట్టు కూలిపడి మరణించాడు. నూతనకల్ మండల పరిధిలోని తానంచర్ల గ్రామంలో మెడికల్షాపు నిర్వహిస్తున్న అతడు.. సొంత గ్రామంలోని పామాయిల్ తోటను చూసేందుకు బుధవారం వెళ్తుండగా చందుపట్ల గ్రామ శివాలో భారీ వృక్షం మొంథా తుపాన్ ధాటికి కూలి ద్విచక్ర వాహనంపై పడింది. దీంతో లక్ష్మీనారాయణ అక్కడికక్కడే మృతిచెందాడు. కామారెడ్డి, నిజామాబాద్లో అప్రమత్తం కామారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షాలకు పంటలు నీట మునిగాయి. రైతులు కల్లాల్లోని ధాన్యం కుప్పలు తడవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో కల్లాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడవకుండా కుప్పలు చేసి బుధవారం రోజంతా టార్పాలిన్లు కప్పి ఉంచారు. ఇటు కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కొనుగోళ్లను నిలిపేశారు. వ్యవసాయ అధికారుల సూచనతో రైతులు పంట కోతలను కూడా ఆపేశారు. ఉమ్మడి కరీంనగర్లో పంటలకు తీవ్ర నష్టం ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలకు వరి పంట నేలవాలింది. పలు చోట్ల కొనుగోలు కేంద్రాల్లో, మార్కెట్ యార్డులలోని ధాన్యం తడిసిపోయింది. కరీంనగర్, సిరిసిల్ల, హుజూరాబాద్ పట్ణణాల్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రామగుండం రీజన్లోని సింగరేణి ఓసీపీలో 1.5 లక్షల ఓబీ తవ్వకాలు, 50 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. నక్కవాగు, బిక్కవాగు, గంజివాగు, మానేరు, గోదావరి నదుల్లో వరద ప్రవాహం పెరిగింది. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 1.60 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండటంతో 11 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీరును దిగువకు వదులుతున్నారు. నల్లగొండ జిల్లా అతలాకుతలం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బుధవారం వర్షం బీభత్సం సృష్టించింది. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలంలోని కొమ్మేపల్లి వద్ద గిరిజన బాలుర గురుకుల ఆశ్రమ పాఠశాల వరద నీటిలో చిక్కుకుంది. దీంతో కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్చంద్ర పవార్ ఇతర అధికారులు అక్కడికి చేరుకుని 500 మంది విద్యార్థులను బయటకు తీసుకొచ్చారు. సూర్యాపేట జిల్లా అర్వపల్లిలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని వరదనీరు చుట్టముట్టింది. తుంగతుర్తి మండలంలో సంగెం– వెంకేపల్లి – కోడూరు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సూర్యాపేట పట్టణంలోని 16వ వార్డులో వరద నీరు ఇళ్లలోకి చేరింది. పెన్పహాడ్ మండలం గాజులమల్కాపురం, ధర్మాపురం గ్రామాల్లో విద్యుత్ తీగలపై చెట్ల విరిగిపడి స్తంభాలు నేలకూలాయి. కోదాడ పట్టణంలో ఉలకవాగు అలుగుపోయడంతో కొన్ని ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. రామాపురం ఊర చెరువుకు గండి పడి వరిపొలాలు నీట మునిగాయి. వర్షానికి వరి, పత్తి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పలుచోట్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. గుండాల మండలం మాసాన్పల్లి, నారాయణపురంలో పలువురి ఇళ్లు కూలాయి. యాదాద్రి భువనగిరి జిల్లాకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. గురువారం కూడా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. విశాఖ పట్నం నుంచి తిరిగొచ్చిన విమానం హైదారాబాద్ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం విశాఖపట్నం బయలుదేరి వాతావరణం అనుకూలించకపోవటంతో తిరిగి వచ్చింది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రె 2885 విమానం బుధవారం ఉదయం 6.57 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. తుపాను కారణంగా విశాఖపట్నం ఎయిర్పోర్టులో విమానం దిగేందుకు ప్రతికూల వాతావరణం ఉడడంతో దానిని తిరిగి హైదారాబాద్కు మళ్లించడంతో 9.57 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. విజయవాడకు బయలుదేరాల్సిన ఇండిగో 6ఈ 7201 విమానాన్ని కూడా ప్రతికూల వాతావరణం కారణంగా రద్దు చేసినట్లు ఎయిర్పోర్టు వర్గాలు తెలిపాయి. -
కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించాలని హైకోర్టు ఆదేశం
హైదరాబాద్: పదేళ్లకు పైగా సర్వీస్ ఉన్న కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించాలని అక్టోబర్ 23న తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఉద్యోగుల సేవలను రెగ్యులరైజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.ఈ తీర్పును న్యాయమూర్తి జస్టిస్ రాజేశ్వర్ రావు వెలువరించారు. ఈ కేసు వి.ప్రదీప్, ఎం.రాములు దాఖలు చేసిన రిట్ పిటిషన్లకు సంబంధించినది. వీరిద్దరూ 13 సంవత్సరాలుగా జూనియర్ ఇంజనీర్/మ్యానేజర్గా, మ్యానేజర్ (ప్రొడక్షన్ అండ్ ప్రోక్యూర్మెంట్)గా 16.5 సంవత్సరాలుగా తెలంగాణ స్టేట్ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ లో కాంట్రాక్ట్ సేవలందిస్తున్నారు.జస్టిస్ రాజేశ్వర్ రావు తన తీర్పులో పేర్కొంటూ, పిటిషనర్లు తాత్కాలిక లేదా విరామాలతో కూడిన పనుల్లో కాకుండా, సాంక్షన్ చేసిన పోస్టులపైనే కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. ఈ అంశం “వివాదాస్పదం కాదని” కూడా న్యాయస్థానం గమనించింది.అలాగే, కోర్టు స్పష్టమైన గడువును విధించింది. తీర్పు ప్రతిని అందుకున్న తేదీ నుండి మూడు నెలల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. -
ప్రైవేట్ కాలేజీలపై విజిలెన్స్ విచారణకు తెలంగాణ సర్కార్ ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థలపై విజిలెన్స్ విచారణకు తెలంగాణ సర్కార్ ఆదేశించింది. కాలేజీల్లో తనిఖీలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పోలీస్, విద్యా శాఖ సహకారంతో కాలేజీల్లో తనిఖీలు చేపట్టనున్నారు. కాలేజీల్లో సౌకర్యాలు, విద్యార్థుల నమోదుపై నివేదిక ఇవ్వాలని విజిలెన్స్కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.కాగా, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు లేబొరేటరీ, లైబ్రరీ ఫీజులు భారీగా పెంచగా.. ఒక్కో కాలేజీ ఒక్కో రకంగా ఫీజులు వసూలు చేస్తున్నాయంటూ కొంతమంది విద్యార్థులు ఇటీవల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. అదనంగా కట్టించుకునే ఫీజులకు కాలేజీ యాజమాన్యాలు ఎలాంటి రశీదులు ఇవ్వడం లేదని విద్యార్థులు తెలిపారు. అదనపు ఫీజులు కట్టకపోతే క్లాసుకు హాజరైనా అటెండెన్స్ ఉండదని, ఫలితంగా పరీక్ష రాసే అవకాశం కోల్పోతారని బెదిరిస్తున్నట్టు విద్యార్థులు వాపోతున్నారు. లైబ్రరీ, లేబొరేటరీ ఫీజు కింద అదనంగా ఏటా రూ.12 వేల వరకూ తీసుకోవాలని ప్రభుత్వం గతంలో జీఓ ద్వారా పేర్కొంది. కొన్నేళ్లుగా ఈ ఫీజులో ఎలాంటి మార్పూ లేదు. కానీ కొన్ని కాలేజీలు లైబ్రరీ, లేబొరేటరీ ఫీజు కింద గతేడాది రూ.20 వేల వరకూ వసూలు చేశాయి. ఈ ఏడాది నుంచి ఈ ఫీజును ఏకంగా రూ. 30 నుంచి రూ. 50 వేల వరకూ పెంచారు. క్యాంపస్ నియామకాలకు శిక్షణ ఇచ్చేందుకు కాలేజీలు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నాయి.ఏటా రూ.30 నుంచి రూ.60 వేల వరకూ విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నాయి. వాస్తవానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థికి స్కిల్ నేర్పించడం కాలేజీల బాధ్యత. అవేమీ పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.మరోవైపు, వచ్చే నెల 1వ తేదీ నాటికి ఫీజురీయింబర్స్మెంట్ బకాయిలు రూ. 900 కోట్లు విడుదల చేయకపోతే తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేటు కాలేజీలను నిరవధికంగా బంద్ చేస్తామని ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య హెచ్చరించింది. ఒకవేళ బకాయిలను విడుదల చేయకపోతే నవంబర్ 3 నుంచి ప్రైవేటు కాలేజీల నిరవధిక బంద్ చేస్తామని ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య చైర్మన్ రమేష్ బాబు స్పష్టం చేశారు. -
ఏసీబీ వలలో యాదగిరిగుట్ట ఆలయ విద్యుత్ శాఖ ఈఈ
సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్ట ఆలయ విద్యుత్ శాఖ ఈఈ రామారావు ఏసీబీ వలకు చిక్కారు. లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. రూ. 1.90 లక్షలు లంచం తీసుకుంటూ ఈఈ అడ్డంగా దొరికిపోయారు. ఓ ఎలక్ట్రిక్ కాంట్రాక్ట్ అప్పగించేందుకు భారీగా లంచం డిమాండ్ చేసిన రామారావు.. లంచం ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్ను రామారావు ఇబ్బందులకు గురిచేశాడు.ఈ క్రమంలోనే లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. గతంలోనూ రామారావుపై అనేక అవినీతి ఆరోపణలు ఉండగా.. ఇరవై ఏళ్లుగా యాదగిరి గుట్ట ఆలయంలోనే తిష్ట వేశారు. బదిలీ చేసినా కానీ రాజకీయ పలుకుబడి ఉపయోగించుకుని తిరిగి యాదగిరిగుట్ట దేవస్థాన పరిధిలోనే పోస్టింగ్ ఇప్పించుకునేవారనే ఆరోపణలు ఉన్నాయి. యాదగిరి గుట్ట ఆలయ పునర్నిర్మాణ సమయంలో రామారావు కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉండగా.. గతంలో రామారావు అవినీతిపై ఫిర్యాదులు రాగా.. చిక్కకుండా పకడ్బందీగా తప్పించుకున్నారు. తాజాగా రూ.1.90 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. -
‘ఈ ఆలోచన ఎప్పట్నుంచో ఉంది’
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్తో పాటు మైనార్టీకి చెందిన వారికి మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచన ఎప్పుట్నుంచో ఉందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఈ విషయాన్ని సీఎం రేవంత్తోపాటు ఏఐసీసీ నేతలకు చెప్పానని మహేష్ కమార్ గౌడ్ స్పష్టం చేశారు. తమది సెక్యూలర్ పార్టీ అని, మైనార్టీని మంత్రి వర్గంలోకి తీసుకోవాలని ఆలోచన ఎప్పుట్నుంచో ఉందన్నారు. అజారుద్దీన్ తనను కలిసి వెళ్లారన్నారు. సీఎం రేవంత్ను కూడా అజార్ కలుస్తారని మహేష్ గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం(అక్టోబర్ 31వ తేదీ) తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగనుంది. ప్రస్తుతం మూడు మంత్రి పదవులు ఖాళీ ఉండగా.. ఎల్లుండి(అక్టోబర్ 31, శుక్రవారం) కేబినెట్లోకి అజారుద్దీన్ చేరనున్నారు. రాజభవన్లో ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత మరో రెండు మంత్రి పదవులను భర్తీ చేసే అవకాశం ఉంది. కొన్ని నెలల క్రితం రేవంత్రెడ్డి. ముగ్గురిని మంత్రి వర్గంలోకి తీసుకున్నారు.అజారుద్దీన్కి ఎమ్మెల్సీ ఇస్తామని గతంలో కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించింది. ఇటీవల ప్రభుత్వం.. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రతిపాదన పంపింది. నిన్న(అక్టోబర్ 28, మంగళవారం) సాయంత్రం సీఎం రేవంత్ను అజారుద్దీన్ కలిశారు. అజారుద్దీన్ రాకతో కేబినెట్లో ఇంకా రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి.మాజీ క్రికెటర్, టీమిండియా మాజీ కెప్టెన్ అయిన ముహమ్మద్ అజహరుద్దీన్.. 2009 ఫిబ్రవరి 19వ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మురాదాబాద్ (ఉత్తరప్రదేశ్) లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 2014లో టోంక్ (రాజస్థాన్) నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తెలంగాణకు తిరిగొచ్చిన ఆయన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సేవలందించారు. 2023లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. -
హైదరాబాద్లో మెక్ డోనాల్డ్ గ్లోబల్ ఆఫీస్
హైదరాబాద్: ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ చెయిన్ మెక్ డోనాల్డ్ తన గ్లోబల్ ఆఫీస్ను హైదరాబాద్లో తెరిచింది. టీ హబ్ సమీపంలో ఏర్పాటైన మెక్ డోనాల్డ్ గ్లోబల్ ఆఫీస్ను తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణ ప్రతిభపై విశ్వాసం, పరిపాలనపై నమ్మకానికి మెక్ డోనాల్డ్ గ్లోబల్ ఆఫీస్ ఒక ప్రతీక అన్నారు. మెక్ డోనాల్డ్ గ్లోబల్ ఆఫీస్ కోసం హైదరాబాదును కేంద్రంగా ఎంచుకోవడం తెలంగాణ అద్భుత ప్రతిభకు నిదర్శనం అన్నారు. జీసీసీలకు రాజధానిగా హైదరాబాద్ నిలిచిందన్నారు. మాజీ ప్రధాని నెహ్రూ మొదలుకొని ఆ తర్వాత పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ వంటి మహా నేతలు దూరదృష్టితో చేపట్టిన చర్యల మూలంగా హైదరాబాద్ కు మరింత బలం చేకూరిందని డిప్యూటీ సీఎం వివరించారు.మెక్ డొనాల్డ్స్ గ్లోబల్ నాయకత్వ బృందాన్ని, సిబ్బందిని హైదరాబాద్కు స్వాగతించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి పేర్కొన్నారు. 1940లలో మెక్డొనాల్డ్స్ ప్రారంభమైనప్పుడు, అది కేవలం ఆహారం గురించి మాత్రమే కాదు.. పరిమాణం, సామర్థ్యం, అనుసంధానమైన ప్రపంచం అనే భావనకు ప్రతీకగా నిలిచిందన్నారు.మెక్డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీస్ ఈ నూతన కేంద్రం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మిస్తున్న కొత్త పరిణామంలో కీలక అధ్యాయం అని అభివర్ణించారు. గత రెండు దశాబ్దాల్లో హైదరాబాద్ ఇటువంటి అనేక సెంటర్లకు రాజధానిగా మారిందని, వందలాది గ్లోబల్ కేపబిలిటీ హబ్లు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని వివరించారు. -
‘కాంగ్రెస్లో ఓడిపోతామనే భయం.. అందుకే’
హైదరాబాద్:: జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయం కాంగ్రెస్కు పట్టుకుందని బీజేపీ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. దాంతో ఎలాగైనా గెలవాలని కుయుక్తులు చేస్తోందని మండిపడ్డారు. మైనార్టీ ఓట్ల కోసం అజారుద్దీన్ను మంత్రి చేయబోతున్నారని, బీఆర్ఎస్ కూడా బీజేపీని నిలువరించాలనే యత్నంచేస్తోందన్నారు డీకే అరుణ.‘ఎన్నికల్లో ఓడిపోతున్నరనే భయం కాంగ్రెస్కు పట్టుకుంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటే ఇలాంటి పనులు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ జూబ్లీహిల్స్ లో ఓడిపోతుంది. ఉపాధి కోసం వలస వచ్చిన వారే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ చేసింది శూన్యం. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కూడా ఒక్క పని చేయలేదు. కాంగ్రెస్ ఏం మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతుంది. రెండేళ్లుగా మైనార్టీకి మంత్రి పదవి గుర్తు రాలేదు ఓడిపోతామని తెలిసి మంత్రి పదవి నాటకం. ఓట్ల కోసం ఏ గడ్డి తినడానికి కాంగ్రెస్ రెడీ. మోదీ కేంద్ర ప్రభుత్వ నిధులు లేకుంటే రాష్ట్రంలో అభివృద్ధే లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలలే ఉంటదని ఆ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలే అంటున్నారు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలే ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు బీజేపీ తప్పకుండా జూబ్లీహిల్స్లో గెలుస్తుంది’ అని స్పష్టం చేశారు. -
తెలంగాణ కేబినెట్లోకి అజారుద్దీన్
సాక్షి, హైదరాబాద్: ఎల్లుండి తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగనుంది. ప్రస్తుతం మూడు మంత్రి పదవులు ఖాళీ ఉండగా.. ఎల్లుండి(అక్టోబర్ 31, శుక్రవారం) కేబినెట్లోకి అజారుద్దీన్ చేరనున్నారు. రాజభవన్లో ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత మరో రెండు మంత్రి పదవులను భర్తీ చేసే అవకాశం ఉంది. కొన్ని నెలల క్రితం రేవంత్రెడ్డి. ముగ్గురిని మంత్రి వర్గంలోకి తీసుకున్నారు.అజారుద్దీన్కి ఎమ్మెల్సీ ఇస్తామని గతంలో కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించింది. ఇటీవల ప్రభుత్వం.. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రతిపాదన పంపింది. నిన్న(అక్టోబర్ 28, మంగళవారం) సాయంత్రం సీఎం రేవంత్ను అజారుద్దీన్ కలిశారు. అజారుద్దీన్ రాకతో కేబినెట్లో ఇంకా రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి.మాజీ క్రికెటర్, టీమిండియా మాజీ కెప్టెన్ అయిన ముహమ్మద్ అజహరుద్దీన్.. 2009 ఫిబ్రవరి 19వ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మురాదాబాద్ (ఉత్తరప్రదేశ్) లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 2014లో టోంక్ (రాజస్థాన్) నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తెలంగాణకు తిరిగొచ్చిన ఆయన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సేవలందించారు. 2023లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. -
వాట్సాప్ ఛానల్ను ప్రారంభించిన సీపీ సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: నగర పౌరులకు అప్డేట్లు అందించేందుకు పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ (VC Sajjanar) అధికారిక వాట్సాప్ ఛానెల్ను బుధవారం ప్రారంభించారు. భారత్లో అత్యంత సురక్షితమైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమైన హైదరాబాద్ నుంచి ముఖ్యమైన సమాచారాన్ని, తాజా అప్ డేట్లను మిస్ కాకుండా తెలుసుకోవడానికి ఈ ఛానెల్ను వెంటనే ఫాలో కావాలంటూ సీపీ కోరారు.కాగా, ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ మోసాలు అధిక అయిపోయాయని, ముఖ్యంగా ఏఐ, డీప్ ఫేక్ క్లోనింగ్లతో ఆధునిక తరహా మోసాలు జరుగుతున్నాయని, వీటి నివారణకు ‘సేఫ్ వర్డ్’తో రక్షణ పొందాలని హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. డీప్ఫేక్ మోసాలను ఎదుర్కొనేందుకు ‘సేఫ్ వర్డ్’ ఉపయోగించాలని సజ్జనార్ సూచించారు. తెలంగాణలో డీప్ ఫేక్, సైబర్ మోసాల కేసులు విపరీతంగా పెరుగుతున్నందున, వీటి బారిన పడకుండా ఉండేందుకు నమ్మకమైన పరిచయస్తుల నడుమ ‘సురక్షిత పదం’ (సేఫ్ వర్డ్)ను ఉపయోగించాలన్నారు.మంగళవారం(అక్టోబర్ 28) తన ‘ఎక్స్’ ఖాతాలో నగర సీపీ సజ్జనార్.. ఏఐ సాధనాలు ఇప్పుడు ఆశ్చర్యకరమైన ఖచ్చితత్వంతో ముఖాలు, గొంతులను క్లోనింగ్ చేయగలవన్నారు. దీంతో మోసగాళ్లు మన స్నేహితులు, సహోద్యోగులు లేదా అధికారుల మాదిరిగా కూడా నటించగలరని సజ్జనార్ హెచ్చరించారు. ఏఐ,డీప్ఫేక్ల యుగంలో ‘సురక్షిత పదం’ బలమైన రక్షణగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: డీప్ ఫేక్కు కోడ్ వర్డ్తో చెక్ -
పట్టాలపైకి వరద.. పలు రైళ్ల రద్దు
సాక్షి, డోర్నకల్: మోంథా తుపాను ప్రభావంతో తెలంగాణలోని పలు చోట్ల ఎడతెరిపిలేని భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షం కారణంగా రైలు పట్టాలపైకి వరద నీరు చేరింది. దీంతో, డోర్నకల్ రైల్వేస్టేషన్లో పట్టాల పైనుంచి వరదనీరు ప్రవహిస్తోంది.పట్టాలపైన నీరు చేరడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. డోర్నకల్ రైల్వేస్టేషన్లో గోల్కొండ ఎక్స్ప్రెస్, మహబూబాబాద్లో కోణార్క్ ఎక్స్ప్రెస్లను అధికారులు నిలిపివేశారు. కొండపల్లిలో సాయినగర్ షిర్డీ ఎక్స్ప్రెస్ను ఆపేశారు. అలాగే రాష్ట్రంలోని పలు స్టేషన్లలో 12 గూడ్స్ రైళ్లు తుపాను ఎఫెక్ట్ దాటికి నిలిచిపోయాయి. కాజీపేట-విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. మరోవైపు.. వర్షాల కారణంగా పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఇందులో 127 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేయగా, మరో 14 రైళ్లను దారి మళ్లించింది. ఫలక్నామా, ఈస్ట్ కోస్ట్, గోదావరి, విశాఖ, నర్సాపూర్ ఎక్స్ప్రెస్ రైళ్లు రద్దు అయ్యాయి. వర్షాల కారణంగా పలుచోట్ల రైల్వేస్టేషన్లలో ఎక్కడికక్కడే రైళ్లు నిలిచిపోయాయి.Bulletin No.17 dt.29.10.25Due to Cyclone Montha effectCancellation of Trains:1) https://t.co/EMHwado7vJ. 22204 Secunderabad - Visakhapatnam Express is cancelled on 29/10/20252) Tr. No. 12703 Howrah - Secunderabad Falaknuma Express is cancelled on 30/10/2025— South Central Railway (@SCRailwayIndia) October 29, 2025ఇదిలా ఉండగా.. రానున్న మూడు గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో సహా, హైదరాబాద్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. HyderabadRains ALERT 2 ⚠️🌧️ STEADY MODERATE RAINS to continue in entire city for next 2-3hrs, thereafter STEADY LIGHT RAINS will continue till late evening in the cityGRADUAL REDUCTION IN RAINS EXPECTED IN HYDERABAD CITY FROM LATE EVENING AS CYCLONE MONTHA GRADUALLY MOVING UP— Telangana Weatherman (@balaji25_t) October 29, 2025 -
తెలుగు రాష్ట్రాలకు ఫ్లాష్ ఫ్లడ్స్.. IMD హెచ్చరిక
Cyclone Montha.. మోంథా తుపాను ప్రభావంతో దాదాపు ఎనిమిది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను నేపథ్యంలో తెలంగాణ, ఏపీ సహా మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న కొన్ని గంటల పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంది.భారత వాతావరణ శాఖ (IMD) తెలిపిన వివరాల ప్రకారం.. రానున్న కొన్ని గంటల్లో ఏపీలోని తీవ్ర ప్రాంతాలు, తెలంగాణ, మహారాష్ట్రలోని విదర్భా ప్రాంతాల్లో తక్కువ నుండి మధ్యస్థ స్థాయి ఫ్లాష్ ఫ్లడ్ వచ్చే ప్రమాదం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలకు చేసింది. వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లకుండా ఉండాలని తెలిపింది. వాగులు, కాల్వలు, చెరువుల దగ్గరకు వెళ్లరాదని హెచ్చరించింది. ప్రయాణం ముందు వాతావరణ సమాచారం తెలుసుకోవాలి. రైతులు పంటను, పశువులను సురక్షిత ప్రదేశాలకు తరలించండి. స్థానిక అధికారులు అత్యవసర సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో జిల్లా డిజాస్టర్ కంట్రోల్ రూమ్ లేదా స్థానిక సహాయ కేంద్రానికి సమాచారం ఇవ్వాలని తెలిపింది. IMD, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (SDMA) ఇచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు పాటించాలని సూచనలు చేసింది.హెచ్చరిక జారీ చేసిన జిల్లాలు ఇవే..ఏపీలో.. ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం, యానం, గుంటూరు, ప్రకాశం జిల్లాలు.తెలంగాణలో.. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగాం, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్–మల్కాజ్గిరి, పెద్దపల్లి జిల్లాలు.మహారాష్ట్రలో.. మరఠ్వాడ సమీప ప్రాంతాలు, నాందేడ్, హింగోలి, పర్బణీ, బుల్దానా, అకొలా, అమరావతి, వార్ధా, యవత్మాల్, నాగపూర్ జిల్లాలు. Weather warning ⚠️ #TelanganaNow I'm warning once again for North East Central TG see heavy during next 24 hours stay safe 🚨 Flash floods possible 🌧️🌀⚠️ https://t.co/5PvVp8klDy— Warangal Weatherman (@tharun25_t) October 29, 2025 -
ఆయుధం వీడిన అన్నల అడుగులు ఎటువైపు?
బడిలో తండ్రి బోధించిన పాఠాల కన్నా కళాశాలలో స్నేహితుడి దగ్గర నేర్చుకున్న విప్లవ మాటలే అతడిని అడవిబాట పట్టించాయి. గ్రామాల్లో వడ్డీ వ్యాపారుల ఆగడాలు నశించాలని, పీడీత, బాధిత పక్షాల కోసం పోరాడాలని అనుకున్నాడు. అందుకు తుపాకీనే మార్గమని భావించారు. పోరాట పంథాతోనే సమసమాజం సాధ్యమనుకుని 45 ఏళ్లు అజ్ఞాతంలో గడిపారు. మారిన కాలమాన పరిస్థితులు, అనారోగ్య సమస్యలతో తన నిర్ణయాన్ని మార్చుకుని ఆయుధం వీడి జనంలో వచ్చారు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాద్రావు అలియాస్ చంద్రన్న, శంకరన్న, సోమన్న. సాయుధ పోరాటాల ద్వారా లక్ష్యాన్ని చేరుకోలేమని భావించి, ప్రజాస్వామ్య పద్ధతుల్లో వెళ్లాలని నిర్ణయించుకుని చంద్రన్న అస్త్రసన్యాసం చేయడం అటు మావోయిస్టు పార్టీలో, ఇటు ప్రజల్లోనూ చర్చకు దారి తీసింది.సాక్షి, పెద్దపల్లి: సాయుధ పోరాటం ద్వారానే రాజ్యాధికారం సాధ్యమనే సిద్ధాంతాన్ని నమ్ముకుని పనిచేసిన మావోయిస్టులు ఆయుధం వీడి జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు. ఇప్పటికే జిల్లాకు చెందిన కేంద్రకమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్రావు మహారాష్ట్ర సీఎం ఎదుట లొంగిపోగా, తాజాగా తెలంగాణ డీజీపీ వద్ద కేంద్రకమిటీ సభ్యుడు, తెలంగాణ కమిటీకి మార్గదర్శిగా వ్యవహరిస్తున్న పుల్లూరి ప్రసాద్రావు అలియాస్ చంద్రన్న లొంగిపోయాడు. ప్రాణభయంతో లొంగిపోయారా? అనారోగ్య సమస్యలతోనా.. పార్టీకి నమ్మకద్రోహం చేశారా? సాయుధ పోరాట పంథాకు కాలం చెల్లిందన్న అభిప్రాయంతో జనజీవన స్రవంతిలో కలిశారా అనేది చర్చనీయాంశంగా మారింది. మాజీ మావోయిస్టులు తదుపరి జీవితాన్ని ఎలా గడపబోతున్నారు?పునరావాస శిబిరాల్లో కాలం వెళ్లదీస్తారా? సొంత ఊళ్లకు, తమకు నచ్చిన ప్రదేశానికో వెళ్లి సాధారణ జీవనం గడుపుతారా? పాలక పార్టీలో చేరుతారా? ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటారా అనేక ప్రశ్నలు ప్రజాసంఘాల్లో వ్యక్తమవుతున్నాయి.రణమా...శరణమా ?జిల్లాకు చెందిన ఇద్దరు కీలక నేతలు మల్లోజుల వేణుగోపాల్, పుల్లూరి ప్రసాద్రావు లొంగిపోగా అడవిలో ఉన్న మిగితా నేతలు ఆయుధం వీడి లొంగిపోతారా? లేక పోరాట పంథాలోనే కొనసాగుతారా అనేది ఆసక్తిగా మారింది. జిల్లా నుంచి మల్లా రాజిరెడ్డి, అప్పాసి నారాయణ, గంగిడి సత్యనారాయణరెడ్డి, ఆలేటి రామలచ్చులు, దాతు ఐలయ్య, దీకొండ శంకరయ్య, కంకణాల రాజిరెడ్డి, జూవ్వడి వెంకటేశ్వర్రావు మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం 2026 మార్చి 1 నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని ప్రకటించింది. దీంతో విప్లవ పంథా కొనసాగుతుందా లేక ప్రజాపంథాలోకి మిగిలిన నేతలు వస్తారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.కలిసి చదువుకున్నాంపుల్లూరి ప్రసాదరావు నేను వడ్కాపూర్లోనే 5 వ తరగతి వరకు, 10వ తరగతి వరకు ధూళికట్టలో కలిసి చదువుకున్నం. అప్పట్లోనే గ్రామాల్లో వడ్డీ వ్యాపారుల ఆగడాలు నశించాలని పోరాడేవాడు. చాలా సౌమ్యుడు. ఎక్కువగా మాట్లాడక పోయేది. ఇంటర్ చదివేందుకు పెద్దపల్లికి వెళ్లి ఆప్పటి నుంచి ఇప్పటి వరకు కనబడలేదు. – చెన్నమనేని సాగర్రావు, ప్రసాదరావు మిత్రుడు, వడ్కాపూర్ -
రూ.600 కోసం కొట్టి చంపారు..
హైదరాబాద్: రూ. 600 కోసం హోటల్ సిబ్బంది దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన టూరిస్ట్ గైడ్ చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నాగర్ కర్నూలు జిల్లా, వెల్దండ గ్రామానికి చెందిన విస్లావత్ శంకర్ నాయక్ టూరిస్ట్ గౌడ్గా పని చేసేవాడు. టూరిస్ట్లను హైదరాబాద్ తీసుకొచ్చి సిటీని చూపిస్తుంటాడు. ఈనెల 21న గుజరాత్ నుంచి వచ్చిన టూరిస్టుల కోసం కర్మన్ఘాట్లోని ఎన్ సెవెన్ హోటల్లో 22 ఏసీ రూంలు బుక్ చేశాడు. మర్నాడు ఉదయం గదులు ఖాళీ చేసే సమయంలో శంకర్నాయక్ బిల్లులో రూ. 600 తక్కువ ఇచ్చాడు. ఈ విషయమై హోటల్ సిబ్బందికి శంకర్ గొడవ జరిగింది. మాటా మాటా పెరగడంతో ఆగ్రహానికి లోనైన హోటల్ సిబ్బంది నూర్, కమలుద్దీన్, ఇస్లాంజహీదుల్, రహీం అతడిపై దాడి చేశారు. ఈ క్రమంలో నూర్ అనే వ్యక్తి పక్కనే ఉన్న కుర్చీతో శంకర్ తలపై మోదడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతను సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని ఇంటికి వెళ్లాడు. సోమవారం పరిస్థితి విషమించి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కుటుంబ సభ్యులు అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం మృతి చెందాడు. మృతుడి కుమారుడు వంశీకృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడిన హోటల్ సిబ్బంది ఒడిశాకు చెందిన వారిగా గుర్తించారు. నిందుతులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. -
కలకలం రేపిన బ్యాగు.. అందులో ఏముందంటే?
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుడు వదిలేసి వెళ్లిన బ్యాగు కలకలం రేపింది. మంగళవారం మధ్యాహ్నం అరైవల్ ర్యాంప్ 10 నంబర్ పిల్లర్ వద్ద బూడిద రంగులో ఉన్న బ్యాగు కనిపించడంతో అప్రమత్తమైన భద్రతాధికారులు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది బ్యాగ్ను పరిశీలించారు. అందులో ఎలాంటి ప్రమాదకరమైన వస్తువులు లేవని నిర్ధారించుకున్నారు. బ్యాగులో కొన్ని మొబైల్ ఫోన్లతో పాటు విదేశీ సిగరెట్లు ఉన్నట్లు గుర్తించారు. వాటి విలువ సుమారు రూ.12.72 లక్షల వరకు ఉండవచ్చునని అంచనా వేశారు. అనంతరం బ్యాగ్ను కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. బ్యాగు తీసుకొచ్చిన వారి వివరాల కోసం ఆరా తీస్తున్నారు. -
తెలంగాణపై మోంథా.. స్కూల్స్ బంద్, రెడ్ అల్టర్
సాక్షి, హైదరాబాద్: మోంథా తుపాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు తెలంగాణ పైనా కూడా తుపాను ప్రభావం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.తుపాను ప్రభావం ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాలపై అధికంగా ఉంటుందని హెచ్చరించింది. మూడు జిల్లాల్లో గంటకు 50-60 కి.మీ వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరిస్తూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, కరీంనగర్, జగిత్యాల, నిర్మల్, నాగర్ కర్నూల్, వికారాబాద్, జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఈ జిల్లాల్లో గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అంచనా వేస్తూ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.VERY HEAVY RAINS ALERT - CYCLONE MONTHA PEAK IMPACT ⚠️ As Cyclone Montha moving inland, VERY HEAVY DOWNPOURS ahead in RED MARKED DISTRICTS with few places to get 80-180mm rains causing FLOODS in few places. STAY ALERT ⚠️🌧️BLUE MARKED districts will get MODERATE RAINS today… pic.twitter.com/vMGDKP2eqy— Telangana Weatherman (@balaji25_t) October 29, 2025హైదరాబాద్, మంచిర్యాల, సంగారెడ్డి, జనగాం, జోగులాంబ గద్వాల్, మేడ్చల్, మహబూబ్నగర్, నారాయణపేట, రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ విధించింది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలోని మహబూబ్నగర్, వరంగల్, మహబూబాబాద్, నిజామాబాద్, హైదరాబాద్లో కూడా వర్షం కురుస్తోంది.మరోవైపు.. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలో కూడా ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. దీంతో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు యాజమాన్య విద్యాసంస్థలకు నేడు సెలవు ప్రకటించినట్లు పేర్కొన్నారు. అలాగే, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోరారు. సూర్యాపేట జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు.DELUGE RAINS IN SOUTH TG ⚠️🌧️CYCLONE MONTHA CORE BANDS are just stuck and NON STOP HEAVY RAINS keep on pouring all over Nagarkurnool, Nalgonda, Suryapet, Khammam, Wanaparthy, Mahabubnagar, Rangareddy for NEXT SEVERAL HOURS ⚠️⚠️200mm event for Nagarkurnool ⚠️⚠️— Telangana Weatherman (@balaji25_t) October 29, 2025 #29OCT 7:30AM⚠️CYCLONE MONCHA is moving slower than expected and is currently around KHAMMAM DistrictVERY HEAVY to HEAVY RAINS will continue over Nagarkurnool, Nalgonda, Suryapet, Khammam, Mahabubabad, Ranga Reddy, Vikarabad, and Sangareddy districts for the next 3 hours.… pic.twitter.com/TBEhgamFJp— Hyderabad Rains (@Hyderabadrains) October 29, 2025 -
ఫైన్ కట్టేస్తే పోలా!. జస్ట్..రూ.2 వేలు
సాక్షి, హైదరాబాద్: నామమాత్రపు జరిమానాలే ప్రైవేట్ బస్సులను యమదూతలుగా మార్చేస్తున్నాయి. పరిమితికి మించిన బరువుతో బస్సులు నడిపినా, అదనపు సీట్లు ఏర్పాటు చేసినా, చివరకు అగ్నిమాపక పరికరాలు లేకపోయినా సరే రవాణా అధికారులు గరిష్టంగా రూ.5000 వరకు జరిమానా విధిస్తారు. విద్యుత్ షార్ట్సర్క్యూట్ వల్ల కానీ, ఇతర కారణాల వల్ల కానీ బస్సులో మంటలు అంటుకుంటే వెంటనే వాటిని పసిగట్టి, నివారించేందుకు అవసరమైన ఫైర్ డిటెక్షన్ అండ్ సప్రెషన్ పరికరాలు బస్సుల్లో లేకుండా పట్టుబడితే రవాణా అధికారులు కేవలం రూ.2000 పెనాల్టీ విధిస్తున్నారు. దీంతో క్షణాల్లో పెనాల్టీలు చెల్లించి బస్సులను రోడ్డెక్కిస్తున్నారు. తిరిగి యథావిధిగా నిబంధనల ఉల్లంఘన కొనసాగుతూనే ఉంది. మోటారు వాహనచట్టంలో బలమైన నిబంధనలు లేకపోవడమే ఇందుకు కారణం. రవాణా అధికారులు విధించే నామమాత్రపు పెనాల్టీ లను ఆపరేటర్లు పెద్దగా పట్టించుకోవడం లేదు. పైగా ఒక్కో ఆర్టీఏ అధికారి ఒక్కో విధంగా ఈ పెనాల్టీలను విధిస్తున్నారు. దీంతో ప్రయాణికుల భద్రతకు సంబంధించిన కీలకమైన నిబంధనలు కూడా బేఖాతరవుతున్నాయి. ప్రాణ నష్టం తగ్గేది.. కర్నూలు బస్సు ప్రమాదం ఘటనలో కొద్ది క్షణాల్లో మంటలు అంటుకొని బస్సు పూర్తిగా కాలిపోయింది. కానీ ఆ సమయంలో బస్సులోని అగ్నిమాపక పరికరాలు పనిచేసి ఉంటే ప్రాణనష్టం చాలా వరకు తగ్గేది. 2013లో జరిగిన పాలెం బస్సు దగ్ధం సమయంలోనే ఈ కీలకమైన అగి్నమాపక పరికరాలు లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు. అప్పటి నుంచి ప్రతి బస్సులో వీటిని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలనే నిబంధన విధించినప్పటికీ అమలుకు నోచడం లేదు. ఎమర్జెన్సీ మార్గాల్లో అదనపు సీట్లు... ప్రమాదం వాటిల్లినప్పుడు అత్యవసర ద్వారం అద్దాలను పగులగొట్టి బయటకు వెళ్లేందుకు అవకాశం ఉండాలి. కానీ లాభార్జనే ధ్యేయంగా నడిచే ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణికుల డిమాండ్ మేరకు అదనపు సీట్లను ఏర్పాటు చేస్తున్నారు. చివరకు ఎమర్జెన్సీడోర్ల వద్ద కూడా ఈ అదనపు సీట్లను వేయడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో తప్పించుకొనేందుకు అవకాశం ఉండడం లేదు. మరోవైపు బస్సు అద్దాలను పగులగొట్టే హ్యామర్లు కూడా ప్రయాణికులకు అందుబాటులో ఉండవు. కర్నూలు ఉదంతం తరువాత ఆర్టీఏ అధికారులు గత నాలుగు రోజులుగా ప్రైవేట్ బస్సులపై దాడులను కొనసాగిస్తున్నారు. అధికారుల తనిఖీల్లో నిబంధనలను ఉల్లంఘిస్తూ పట్టుబడిన వాటిలో చాలా వరకు అలా అగ్నిమాపక పరికరాలు లేకుండా, హ్యామర్లు లేకుండా, అత్యవసర ద్వారాలను మూసివేస్తూ పట్టుబడిన బస్సులే ఎక్కువగా ఉండడం గమనార్హం. కొన్ని బస్సులు మాత్రం పరి్మట్లను ఉల్లంఘించి, సకాలంలో త్రైమాసిక పన్నులు చెల్లించకుండా పట్టుబడుతున్నాయి. ఏ రకమైన నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినప్పటికీ గరిష్టంగా రూ.5000 కంటే ఎక్కువ పెనాల్టీలు విధించేందుకు అవకాశం లేదు. ఏకీకృతమైన విధానం లేదు... రవాణా అధికారులు విధించే ఈ పెనాల్టీల్లోనూ ఏకీకృతమైన విధానం లేదు, ఒకేరకమైన ఉల్లంఘనపై ఏ ఇద్దరు అధికారులు విధించే జరిమానాలు ఒకే విధంగా ఉండకపోవడం గమనార్హం. అగ్నిమాపక పరికరాలు లేకుండా పట్టుబడినప్పుడు ఒక అధికారి రూ.2000 జరిమానా వేస్తే మరో అధికారి కేవలం రూ.1000 ఫైన్ విధిస్తారు. ఇలా కాంట్రాక్ట్ క్యారేజీ బస్సుల తనిఖీలపైన రవాణా అధికారులు అనుసరించే లోపభూయిష్టమైన విధానాలు కూడా ప్రయాణికుల పాలిట మృత్యుపాశాలుగా మారుతున్నాయి. ఒకవైపు భారీ జరిమానాలు విధించే అవకాశం లేకపోవడమే ఒక ప్రధాన లోపమైతే, మరోవైపు ఏకీకృతమైన విధానమంటూ లేకపోవడం కూడా సవాల్గా మారింది. అదనపు సీట్లు ఏర్పాటు చేయడం, ప్రయాణికుల జాబితా లేకపోవడం, సరుకు రవాణాకు పాల్పడడం వంటి ఉల్లంఘనలపైన పట్టుబడిన ప్రైవేట్ బస్సులను రవాణా అధికారులు గతంలో న్యాయస్థానాల ఎదుట హాజరుపరిచేందుకు అవకాశం ఉండేది. కానీ ప్రయాణికుల రవాణా సదుపాయాన్ని దృష్టిలో ఉంచుకొని న్యాయస్థానాల ఆదేశాల మేరకు దీన్ని మినహాయించారు. దీంతో కేవలం ఇప్పుడు జరిమానాల విధింపు వరకు అధికారులు పరిమితమయ్యారు.కొనసాగుతున్న దాడులుకర్నూలు దుర్ఘటన అనంతరం ఆర్టీఏ అధికారులు దాడులను ఉధృతం చేశారు. ఈ నెల 25వ తేదీ నుంచి 28వ తేదీ మంగళవారం వరకు గ్రేటర్ హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో ప్రైవేట్ బస్సుల్లో తనిఖీలు చేసి 192 కేసులు నమోదు చేసినట్లు హైదరాబాద్ జేటీసీ రమేష్ తెలిపారు. అగ్నిమాపక పరికరాలు లేకపోవడం, సరుకు రవాణాకు పాల్పడడం, ఎలక్ట్రిక్ పరికరాలు, ఇతర అదనపు హంగులను ఏర్పాటు చేయడం వంటి వివిధ రకాల ఉల్లంఘనలపైన ఈ కేసులను నమోదు చేశారు.ఈ నాలుగు రోజుల్లో రూ.4,55,000 జరిమానాలు విధించారు.8 బస్సులను జఫ్తు చేశారు. మంగళవారం ఒక్క రోజే నగరంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీల్లో 49 కేసులు నమోదు చేసి, రూ.లక్షా 49 వేల పెనాల్టీలు విధించినట్లు జేటీసీ చెప్పారు. దాడులను మరింత ఉధృతం చేయనున్నట్లు పేర్కొన్నారు. -
కాంటాక్ట్లెస్.. అటెండెన్స్!
సాక్షి,హైదరాబాద్: జీహెచ్ఎంసీలోని బోగస్ ఉద్యోగులను, బోగస్ హాజరును అరికట్టడంతోపాటు ఎవరెవరు ఏ సమయానికి కార్యాలయాలకు వస్తున్నారు..ఎప్పుడు వెళ్తున్నారు? తదితర అంశాలను ఆటోమేటిక్గానే తెలుసుకునేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. ఇందుకుగాను ఉద్యోగుల ఫేస్ రికగి్నషన్ హాజరుకు మరింత సాంకేతికత జోడించి జీహెచ్ఎంసీ అన్ని జోనల్, సర్కిల్ కార్యాలయాల్లో అమలు చేసేందుకు నిర్ణయించారు. తద్వారా రికార్డుల్లో లేకుండానే వేతనాలు కాజేస్తున్న వారిని గుర్తించడం ద్వారా జీహెచ్ఎంసీ ఆదాయానికి గండికొడుతున్న దొంగల భరతం పట్టనున్నారు. మరోవైపు ఇష్టానుసారం వచ్చి పనులు చేయకున్నా, కార్యాలయాల్లో ఉండకున్నా వేతనాలు పొందుతున్న వారి ఆటలు ఆగిపోనున్నాయి. ఇందుకుగాను జీహెచ్ఎంసీలోని 6 జోనల్, 30 సర్కిల్ కార్యాలయాల్లో ఎడ్జ్ బేస్డ్ ఏఐ ఆధారిత హాజరు నమోదు విధానాన్ని అందుబాటులోకి తేనుంది. ఈ విధానం వల్ల ఉద్యోగులు ఫేస్ రికగి్నషన్ హాజరు కోసం ఎక్కడా ఆగాల్సిన పనిలేదు. ఒకసారి ఉద్యోగి తన పేరు, ఐడీ నెంబరు, పనిచేస్తున్న విభాగం, హోదా తదితర వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకుంటే కార్యాలయంలోకి సాధారణంగా నడుస్తూ వచ్చే సమయంలోనే ఎంట్రీ వద్ద, వెళ్లేటప్పుడు ఎగ్జిట్ వద్ద ఆటోమేటిక్గానే ఫేస్ రికగి్నషన్తో హాజరు నమోదు కానుంది. అందుకోసం ఆగాల్సిన పనిలేదు. ఆమేరకు ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. తొలుత ఎంట్రీ వద్ద వచ్చిన సమయాన్ని ఎగ్జిట్ వద్ద చివరగా వెళ్లిన సమయాన్ని ప్రాతిపదికన ఎన్నిగంటలు కార్యాలయంలో ఉన్నదీ తెలుసుకోగలుగుతారు. ఉద్యోగి ఎన్నిగంటలు పనిచేసిందీ రంగుల కోడ్తో విశ్లేషిస్తారు. అందుకుగాను 6 గంటలు అంతకంటే ఎక్కువ సేపు పనిచేసేవారికి గ్రీన్ కలర్, 5–6 గంటలు పనిచేసే వారికి ఆరెంజ్, 5 గంటలు, అంతకంటే తక్కువ పనిచేసే వారికి రెడ్ కలర్, దీర్ఘకాలం సెలవులో ఉండేవారికి యాష్ కలర్ సూచిస్తాయి. తద్వారా వారి పనితీరును బట్టే వేతనాల చెల్లింపులు సైతం చేయనున్నారు. తద్వారా పారదర్శకత, ఉద్యోగుల బాధ్యత, సమర్థత పెంచేందుకు ఉపకరించగలదని భావిస్తున్నారు. ఈ వ్యవస్థ ద్వారా.. ఉద్యోగులు నడుచుకుంటూ వెళ్లే సమయంలోనే హాజరు నమోదు అవుతుంది. జీహెచ్ఎంసీ హెచ్ఆర్ఎంఎస్, పేరోల్ వ్యవస్థలతో అనుసంధానం. ఇంటర్నెట్ ఉన్నా, లేకున్నా పనిచేసే విధానం. జీహెచ్ఎంసీ అన్ని కార్యాలయాల హాజరు డేటాను ఒకే డాష్బోర్డ్లో వీక్షించే అవకాశం. జోన్ల వారీగా రంగుల కోడ్తో పనితీరు విశ్లేషణ. మానవ తప్పిదాలు, హాజరు నివేదికల్లో ఆలస్యానికి తావుండదు. మొబైల్, టాబ్లెట్ ఫోన్లతో పనిలేదు. రియల్టైమ్ హాజరు నమోదవుతుంది. నగర పాలనలో ఆధునీకరణకు ఏఐ వినియోగం, స్మార్ట్ గవర్నెన్స్ అమలు కోసం జీహెచ్ఎంసీ ఇందుకు సిద్ధమైంది. రియల్టైమ్ పర్యవేక్షణ ప్రస్తుతం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అమలవుతున్న ఫేస్ రికగి్నషన్ అటెండెన్స్ కంటే ఆధునిక సాంకేతికతతో పనిచేసే ఈ ‘ఎడ్జ్ బేస్డ్ ఫేషియల్ రికగి్నషన్ అటెండెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్’ కోసం జీహెచ్ఎంసీ టెండర్లను ఆహా్వనించింది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతో సహ అన్ని జోనల్, సర్కిల్ కార్యాలయాలకు ఒకే సురక్షిత వెబ్ యూఆర్ఎల్తో డ్యాష్బోర్డు పనిచేసేలా ఉండాలని కోరింది. తద్వారా జీహెచ్ఎంసీ అన్ని కార్యాలయాల్లోని ఉద్యోగులు, సిబ్బంది హాజరును ప్రధాన కార్యాలయంలోని ఉన్నతాధికారులు రియల్టైమ్లో చూడగలుగుతారు. -
కాంగ్రెస్ ముసుగులో మజ్లిస్ పోటీ చేస్తోంది
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో బీజేపీ జోరు పెంచించింది. మంగళవారం ఉత్తరాది తరహా కార్పెట్ బాంబింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏకకాలంలో 50 ప్రాంతాల్లో బీజేపీ నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. ఎర్రగడ్డ డివిజన్లో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రాంచందర్రావు, శ్రీనగర్కాలనీలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, నియోజకవర్గవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ...‘గత ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్ కుటుంబపాలన, అవినీతి, దుర్మార్గపు పాలన పోవాలని, ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు నిరసనగా కాంగ్రెస్కు ఓటు వేశారు. కేసీఆర్ రహదారులను అద్దంలా తయారు చేస్తా అన్నారు.బోరబండ, రహ్మత్నగర్, షేక్పేట్, శ్రీనగర్ కాలనీ, ఎక్కడైనా గంట పాదయాత్ర చేసి ఓట్లు అడగాలి’అని కిషన్రెడ్డి సవాల్ విసిరారు. పేరుకే జూబ్లీహిల్స్ ఇక్కడ రోడ్డుపై అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఉందన్నారు. ఈ సమస్యలకు బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలదే బాధ్యత కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ముసుగులో మజ్లిస్పోటీ చేస్తోందన్నారు. ఎంఐఎం నేతలు వచ్చి ప్రచారం చేస్తున్నారని, హైదరాబాద్ను కబ్జా చేయడానికి మజ్లిస్ పార్టీ ప్రయత్నిస్తోందని చెప్పారు.ఎర్రగడ్డ డివిజన్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ ఏకైక ప్రత్యామ్నాయంగా మారిందని తెలిపారు. ఈ ఎన్నికల్లో దీపక్రెడ్డిని గెలిపిస్తే తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావడానికి అది నాందిగా నిలుస్తుందన్నారు. బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అలవికాని బూటకపు హామీలు ఇచ్చి గద్దెనెక్కిందని, రెండేళ్లు కావొస్తున్నా హామీల అమలులో చిత్తశుద్ధి లేదని చెప్పారు. -
150 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహెట్టి
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణలో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద 150 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మించి 80 టీఎంసీల జలాలను తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ బరాజ్ నిర్మాణంతో మహా రాష్ట్రలో ఏర్పడే ముంపుపై అక్కడి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపేందుకు త్వరలో మహారాష్ట్రలో పర్యటించనున్న ట్టు ఆయన తెలిపారు.నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్కుమార్ రెడ్డితో కలిసి ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణపై మంగళవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం సమీక్ష నిర్వహించారు. తుమ్మిడిహెట్టి బరాజ్ నుంచి సుందిళ్ల బరాజ్కి గ్రావిటీ ద్వారా నీళ్లను తరలించి అక్కడి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఎత్తిపోయాలనే ప్రత్యామ్నాయ అలైన్మెంట్ను ఈ సమావేశంలో సూత్రప్రాయంగా ఆమో దించారు.తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మించినా 80 టీఎంసీల నీళ్లను తరలించుకోవచ్చనే వాదన ను ఈ సమావేశంలో సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ) అధికారులు తోసిపుచ్చారు. కనీసం 149 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మిస్తేనే 80 టీఎంసీలను గ్రావిటీతో సుందిళ్ల వరకు తరలించగలమని స్పష్టం చేశారు. దీంతో 150 మీటర్ల ఎత్తు లో తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.ప్రాణహిత ప్రాజెక్టు కింద గతంలో నిర్మించిన పనులను వినియోగంలోకి తెచ్చి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగు, తాగునీటి సరఫరా చేయాలనే లక్ష్యంతో ఈ ప్రతిపాదనల రూపకల్పన జరగాలన్నారు. సుందిళ్ల బరాజ్కు సత్వరం మరమ్మతులు నిర్వహించి వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. ఇందుకు అవసరమైన అంచనాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కాళేశ్వరం మరమ్మతుల బాధ్యత కాంట్రాక్టర్లదే..కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల పునరుద్ధరణ బాధ్యత నిర్మాణ సంస్థలదేనని ముఖ్యమంత్రి రేవంత్ తేల్చిచెప్పారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ –2021 ప్రకారం 5 ఏళ్లలోపు దేశంలోని ఆనకట్టల భద్రతకు సంబంధించిన సమగ్ర మూల్యాంకనం పూర్తి చేయాల్సి ఉండగా, ఈ విషయంలో రాష్ట్రం వెనకబడిందని పేర్కొంటూ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఈ నెల 17న సీఎం రేవంత్కు లేఖ రాశారు.రాష్ట్రంలోని 173 ఆనకట్టల భద్రతకి సంబంధించి మూల్యాంకనం పూర్తిచేసేందుకు 15 నెలల సమయమే మిగిలి ఉందని, ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు స్వయంగా సమీక్ష నిర్వహించాలని సీఎంకు కేంద్ర మంత్రి సూచించారు. దీంతో కేంద్రం నిర్దేశించిన గడువులోగా అన్ని ఆనకట్టల భద్రతకు సంబంధించి మూల్యాంకనం పూర్తిచేసి నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు. పురోగతి విషయంలో ఆనకట్టలవారీగా స్థితిగతుల నివేదిక రూపొందించాలని, నవంబర్ రెండోవారంలో మళ్లీ సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. -
టికెట్ రేట్లు పెంచాలంటే.. 20% సినీ కార్మికులకు ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: సినిమాల విడుదల సమయంలో టికెట్ల రేట్లు పెంచాలంటే.. ఇకపై పెంచిన టికెట్ రేట్ల ద్వారా వచ్చిన ఆదాయంలో 20 శాతం సినీ కార్మికులకు ఇవ్వాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. సినీ కార్మికుల వెల్ఫేర్ఫండ్ ఏర్పాటు చేసి, ఆ మొత్తాన్ని ఫండ్కు జమచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అలా ఇస్తేనే టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తామని స్పష్టంచేశారు. ఆ మేరకు ఒక జీవో జారీ చేస్తామని చెప్పారు. మంగళవారం సాయంత్రం సినీకార్మిక సంఘాలు యూసుఫ్గూడ పోలీసు గ్రౌండ్స్లో ముఖ్యమంత్రికి సన్మాన కార్యక్రమం నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. సినీ కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబాలను ఆదుకోవడానికి సినీ కార్మిక వెల్ఫేర్ ఫండ్ను ఏర్పాటు చేయాలని సంఘాలకు సూచించారు.ప్రభుత్వం నుంచి వెల్ఫేర్ ఫండ్కు రూ.10 కోట్లు డిపాజిట్ చేస్తామని హామీ ఇచ్చారు. ‘చాలామంది సినిమా పెద్దలు టికెట్ రేట్లు పెంచాలని నా దగ్గరకు వస్తున్నారు. ధర పెంచితే నిర్మాత, హీరోలకు ఆదాయం పెరుగుతుంది. కార్మికులకు మాత్రం దాని ఫలాలు దక్కడం లేదు. మీ శ్రమతో సంపాదించిన ప్రతి రూపాయిలో మీకు భాగస్వామ్యం ఉండాలి. టికెట్ రేట్లు పెంచడం ద్వారా వచ్చిన ఆదాయంలో 20 శాతం వెల్ఫేర్ ఫండ్ ఇవ్వాలని ప్రభుత్వం జీవో ఇస్తుంది.కృష్ణానగర్లో మూడునాలుగు ఎకరాల స్థలం చూడండి. సినీ కార్మికుల పిల్లల చదవుల కోసం నర్సరీ నుంచి 12వ తరగతి వరకు కార్పొరేట్ స్థాయి పాఠశాలను నిర్మిస్తాం. టిఫిన్, లంచ్, ఉన్నత విద్య అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. అసోసియేషన్కు భవనం లేదని నా దృష్టికి వచ్చింది. కొంత స్థలం కేటాయించి, నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. ఫైటర్స్, సినీ కార్మికుల ప్రాక్టీస్ కోసం స్థలం కావాలన్నారు. ఫ్యూచ ర్సిటీలో మీకు కావా ల్సిన ఏర్పాట్లు చేస్తాం’అని సీఎం హామీ ఇచ్చారు. హాలీవుడ్కు కూడా హైదరాబాద్ వేదికవ్వాలిహైదరాబాద్ నగరం హాలీవుడ్ సినిమా షూటింగ్లకు వేదిక కావాలని సీఎం రేవంత్రెడ్డి ఆకాంక్షించారు. ‘ఒకనాడు తెలుగు సినీ పరిశ్రమను మద్రాసీ అని పిలిచేవారు. నాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి, అగ్ర నటులు నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వర్ రావు, కృష్ణ, రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు వంటి మహానుభావులు తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్కు తరలిరావడాన్ని ప్రోత్సహించారు. సినీ కళాకారులు, కార్మికులు ఎంతో కష్టపడతారు. నగదు బహుమతుల కంటే కొట్టే చప్పట్లు, సన్మానంలో కప్పిన శాలువాలతోనే సంతోషపడతారు.కవులు, కళాకారులను సన్మానించే కార్యక్రమం పదేళ్లు ఆగిపోయింది. ఆగిపోయిన నంది అవార్డుల కార్యక్రమాన్ని ప్రజాయుద్ధ నౌక గద్దర్ పేరుతో గద్దర్ ఫిలిం అవార్డుల రూపంలో అందిస్తున్నాం. నంది అవార్డులను గెలవడమే గొప్ప అనుకున్నాం. కానీ, తెలుగు సినీ పరిశ్రమ ప్రపంచంలోనే గొప్పదైన ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ విజయం వెనుక డైరెక్టర్లు, నటులే కాదు.. కార్మికుల శ్రమ కూడా ఉంది. తెలుగు సినిమాల షూటింగ్ ఇతర దేశాల్లో జరగడం కాదు.. ప్రపంచ సినీ పరిశ్రమకు హైదరాబాద్ వేదిక కావాలన్నది నా ఆలోచన. మీరంతా అండగా ఉంటే హాలీవుడ్ను హైదరాబాద్కు తీసుకొచ్చే బాధ్యత మాది’అని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్లో సినీ పరిశ్రమకు ఒక చాప్టర్ పెడతామని చెప్పారు. నిర్ణయం తీసుకున్నాక వెనక్కి పోను..సినీ కార్మికుల సమస్యలపై చర్చించేందుకు వచ్చే నెలలో మరోసారి సమావేశం నిర్వహిస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలి పారు. ‘మహాభారతంలో నాకు నచ్చిన క్యారెక్టర్ కర్ణుడు. మిత్ర ధర్మాన్ని ఉల్లంఘించకుండా ప్రాణత్యాగం చేశాడు. మీకు అండగా నేను నిలబడతా. సమస్యలు పరిష్కరిస్తా. నిర్ణయం తీసుకోనంత వరకే నేను ఆలోచిస్తాను. తీసుకున్నా క ఆలోచన చేయను. నవంబర్ చివర లో మళ్లీ మీ సంఘాల నాయకులను కలుస్తా. ప్రతి విషయంలోనూ నిర్దిష్టమైన ప్ర ణాళికతో ముందుకెళతాం. నిర్మాతలతో మీకు ప్రతిష్టంభన వచ్చినపుడు.. మీరు రాణించాలంటే కార్మికులను కుటుంబ సభ్యుల్లా చూసుకో వాలని దర్శక, నిర్మాతలకు చెప్పాను. మీ సమ స్యలను తెలుసుకోవడానికి నేనే కృష్ణానగర్కు వస్తా. కార్మికులకు ఇళ్ల గురించి అడిగారు.. ఎంతవరకు సాయం చేయగలనో అంచనా వేసుకున్నాక 24 క్రాఫ్ట్స్ నాయకులను పిలిచి మాట్లాడుతా’ అని సీఎం హామీ ఇచ్చారు. శృంగేరి విధుశేఖర స్వామిని కలిసిన సీఎం⇒ శంకరమఠంలో మర్యాదపూర్వకంగా భేటీ⇒ రేవంత్కు ఆశీస్సులు అందించిన స్వామీజీ నల్లకుంట: శృంగేరి శారదా పీఠం దక్షిణామ్నాయ జగద్గురువు విధుశేఖర భారతీ స్వామిని «ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి మంగళవారం హైదరాబాద్ నల్ల కుంటలోని శంకరమఠంలో మర్యాదపూర్వకంగా క లిశారు. స్వామీజీకి సీఎం పూలమాలను సమర్పించగా, సీఎం మెడలో స్వామీజీ రుద్రాక్ష మాల వేసి జగద్గురువు చిత్రపటం అందజేసి ఆశీర్వచనం అందించారు. అంతకుముందు శంకరమఠం ధర్మా ధికా రి చింతలపాటి శ్రీనివాసమూర్తి, పండితులు వేద మంత్రాలతో సీఎంకు స్వాగతం పలికారు. ముందుగా మఠం ప్రాంగణంలో గల శక్తి గణపతి, చంద్ర మౌళీశ్వర స్వామి, ఆదిశంకరాచార్యులు, శారదాంబ ఆలయాల్లో సీఎం ప్రత్యేక పూజలు నిర్వ హించారు.‘ధర్మ విజయ యాత్ర–2025’లో భాగంగా హైదరా బాద్ విచ్చేసిన విధుశేఖర భారతీ స్వామీజీ.. శంకరమఠంలో విడిది చేశారు. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల అభివృద్ధితోపాటు ముఖ్యంగా వేముల వాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి వివరాలను స్వామీజీకి సీఎం వివరించారు. సీఎం వెంట ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జీహెచ్ ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు ఉన్నారు.హైదరాబాద్లో మెక్డొనాల్డ్ కొత్త గ్లోబల్ ఆఫీసునేడు ప్రారంభించనున్న సీఎం రేవంత్రెడ్డిసాక్షి, హైదరాబాద్: మెక్డొనాల్డ్ సంస్థ హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్న కొత్త గ్లోబల్ ఆఫీసును ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం ప్రారంభించనున్నారు. హైదరాబాద్లో తన కార్యకలాపాలను విస్తరించడంలో భాగంగా మెక్డొనాల్డ్ ఈ గ్లోబల్ ఆఫీసును ఏర్పాటు చేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో ఆఫీస్ ఫైనాన్స్, హెచ్ఆర్, సోర్సింగ్, డేటా అనలిటిక్స్, ఏఐ, టెక్నాలజీ వంటి కార్పొరేట్ కార్యకలాపాలకు సంబంధించిన బృందాలు ఇక్కడ నుంచే పనిచేస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా సంస్థకు ఉన్న 43 వేల రెస్టారెంట్లు, 65 మిలియన్ల మంది కస్టమర్లను ప్రభావితం చేసే కార్యకలాపాలపై ఈ గ్లోబల్ ఆఫీసు పనిచేస్తుంది. హైటెక్ సిటీలో ఏర్పాటు చేస్తున్న కొత్త కార్యాలయం నాలుగు అంతస్తుల్లో 1.56 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. హైదరాబాద్ గ్లోబల్ ఆఫీసులో వివిధ కార్యకలాపాల కోసం ఉద్యోగుల నియామక ప్రక్రియను మెక్ డొనాల్డ్ ఇప్పటికే ప్రారంభించింది. ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్బాబు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. -
అర్బన్ పార్కులు..షూటింగ్ స్పాట్లు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరానికి చుట్టుపక్కల ఉన్న అటవీశాఖకు చెందిన అర్బన్ పార్కుల్లో సినిమా షూటింగ్లకు లైన్ క్లియరైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అటవీ ప్రాంతాలు, అర్బన్ పార్కుల్లో సినిమాల చిత్రీకరణకు అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఈ పార్కుల్లోని ప్రకృతి శోభ, పచ్చటి అందాలు సినిమాల్లో కనువిందు చేయనున్నాయి. సినిమా చిత్రీకరణలకు అనువుగా ఉన్న 70 అటవీ ప్రాంతాలను షూటింగ్ స్పాట్లుగా ఎంపిక చేశారు. అందులో హైదరాబాద్ నగరానికి చుట్టుపక్కల ఉన్న 52 అర్బన్ పార్కులు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి అటవీశాఖ అధికారులు, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రతినిధుల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయి. ఆయా అంశాలపై స్పష్టత వచ్చాక అర్బన్ పార్కుల్లో సినిమాల చిత్రీకరణకు అటవీశాఖ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. సినిమా షూటింగ్జరుపుకునేందుకు గుర్తించిన స్పా ట్లు చిత్రీకరణలకు అనుకూలంగా ఉన్నా యా లేదా అన్న అంశాలను పరిశీలించారు. చిలుకూరు ట్రెక్పార్కు మొదలు కిన్నెరసాని జింకల పార్కు దాకా... రాష్ట్రంలో సినిమా షూటింగ్లకు అనుమతి ఇవ్వాలని అటవీ శాఖ నిర్ణయించిన పార్కులు, ప్రదేశాల్లో...చిలుకూరు ఫారెస్ట్ ట్రెక్పార్కు, మృగవని నేషనల్ పార్కు, బీఎన్రెడ్డి నగర్ ఆరోగ్యసంజీవని,, మహావీర్ హరిణ వనస్థలి, పాలపిట్ట సైక్లింగ్ పార్క్, మహబూబ్నగర్లోని మయూరి హరితవనం, కవ్వాల్, అమ్రాబాద్ పులుల అభయారణ్యాలు, కిన్నెరసాని జింకల పార్కు తదితరాలున్నాయి. అయితే సినిమా షూటింగ్స్ నిర్వహించేందుకు ఎంపిక చేసుకున్న అర్బన్ పార్కుల్లో అనుమతి కోసం నిర్మాతలు దరఖాస్తు చేసుకోవాలి. వాటిని పరిశీలించి ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) 24 గంటల్లో అనుమతి ఇస్తుంది. దరఖాస్తు చేసుకున్నాక కూడా ఏదైనా కారణం వల్ల అనుమతి లభించడానికి ఆలస్యమైనా కూడా ముందు నిర్ణయించుకున్న తమ షెడ్యూల్ ప్రకారం సినీ యూనిట్స్ షూటింగ్స్ జరుపుకునే అవకాశం కల్పించనున్నారు. అర్బన్ పార్కుల్లో ఒకరోజు షూటింగ్ జరుపుకునేందుకు రూ. 50 వేల ఫీజును ఎఫ్డీసీకి ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. దీని ద్వారా ఆయా పార్కుల్లోనూ పర్యాటకుల సందడి పెరిగితే అటవీశాఖకు మంచి ఆదాయం కూడా సమకూరుతుందని భావిస్తున్నారు. రాష్ట్రంలో సినీరంగ అభివృద్ధికి కావాల్సిన అనుమతులను సింగిల్ విండో ద్వారా అందించనున్నట్టు సమా చారం.ప్రత్యేకంగా దీని కోసం ప్రభుత్వం ‘ఫిలిమ్స్ ఇన్ తెలంగాణ’పేరుతో ఓ వెబ్సైట్ రూపొందించింది. తెలంగాణలో షూ టింగ్స్, థియేటర్ల నిర్వహణకు కావాల్సిన అన్ని అనుమతులను దీని ద్వారా పొందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలోనే ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, మెదక్, వరంగల్, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో అడవులకు సంబంధించిన దృశ్యాలను చిత్రీకరించిన విషయం తెలిసిందే. -
‘ఇందిరమ్మ’కు ఇసుక ట్యాక్సీ
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు ఇసుక కోసం ఇబ్బందులు పడకుండా ఆన్లైన్లో బుక్ చేస్తే ఇంటికే ఇసుక వచ్చే విధానాన్ని గృహనిర్మాణ శాఖ సిద్ధం చేసింది. తెలంగాణ గనుల శాఖ కోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ గతంలో రూపొందించిన ‘మన ఇసుక వాహనం’యాప్ను ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అనుసంధానించారు. ఇందులో ఉన్న సాంకేతికపరమైన అవాంతరాలను గుర్తించి, దాన్ని మరింత మెరుగ్గా రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ యాప్లో ఆయా గ్రామాల్లోని ట్రాక్టర్ల వివరాలను అనుసంధానించారు. ఇందిరమ్మ లబ్దిదారులు ఆ యాప్లో ఇసుక లోడ్ బుక్ చేసి, వాహన రవాణా చార్జీని ఆన్లైన్లో చెల్లించగానే, ఆ ఊరికి సంబంధించి యాప్లో ఉన్న వాహనం వెళ్లి ఇసుకను తెచ్చి లబ్దిదారుకు అందిస్తుంది. ఇందిరమ్మ పథకం కింద లబ్దిదారులకు ఇసుకను ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. కేవలం ఇసుక రీచ్/ఇసుక బజార్/ ఇసుక డంప్ నుంచి ఇసుకను తరలించే ట్రాక్టర్కు రవాణా ఖర్చులు చెల్లిస్తే సరిపోతుంది. ట్రాక్టర్ యజమానులు తోచినంత డిమాండ్ చేసే వీలు లేకుండా రవాణా చార్జీలను కూడా అధికారులే ఖరారు చేసి యాప్లో నిక్షిప్తం చేశారు. ఇసుక బుక్ చేసుకున్న లబ్దిదారు ఇల్లు ఇసుక బజార్ నుంచి ఎంత దూరం ఉందో... దానికి తగ్గ చార్జీ ఆటోమేటిక్గా యాప్లో తెలుస్తుంది. ఆ మొత్తాన్ని చెల్లించి ఇసుక పొందే ఏర్పాటు చేస్తున్నట్టు గృహనిర్మాణ సంస్థ ఎండీ గౌతమ్ తెలిపారు. ఇసుక పక్కదారి పట్టకుండా లబ్దిదారు బుక్ చేయగానే వన్టైం బార్ కోడ్ జనరేట్ అవుతుంది. దాన్ని స్కాన్ చేస్తేనే ఇసుక తరలింపు సాధ్యమవుతుందని, ఇది అక్రమాలకు కళ్లెం వేస్తుందని ఆయన తెలిపారు. మంగళవారం గృహనిర్మాణ సంస్థ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలు తెలిపారు. ఇసుక రీచ్లు దూరంగా ఉండే ప్రాంతాల్లో ఇసుక బజార్లు ఏర్పాటు చేసి ఇసుకను అందుబాటులో ఉంచుతున్నట్టు వెల్లడించారు. నిబంధనల మేరకే కట్టాలి.. ఇందిరమ్మ ఇళ్ల విస్తీర్ణం 400 చ.అ.కు తగ్గకుండా, 600 చ.అ.కు పెరగకుండా ఉండేలా నిబంధన విధించామని, మేస్త్రీలు కూడా ఇంటి పైకప్పును అదే విస్తీర్ణంలో నిర్మించాలని గౌతమ్ సూచించారు. కొందరు పైకప్పును ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించి ఎక్కవ చార్జీలు డిమాండ్ చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలో గతంలో డబుల్ బెడ్రూమ్ పథకంలో భాగంగా నిర్మించిన కాలనీలు కొన్ని ఖాళీగా ఉన్నాయని, వాటిని లబ్ధిదారులకు అలాట్ చేసినా అక్కడ ప్రభుత్వ పాఠశాలలు లేక వెళ్లటం లేదని తెలిపారు. అలాంటి చోట్ల బడులు ఏర్పాటు చేస్తున్నారని, త్వరలో లబ్దిదారులు వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఆర్థిక ఇబ్బందులతో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించుకోని లబ్దిదారులకు ఇళ్ల మంజూరీని రద్దు చేయబోమని హామీ ఇచ్చారు. అలాంటి వారు స్వయంసహాయక బృందాల్లో ఉంటే రుణాలు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు 22 వేల మందికి రూ.236 కోట్లు మంజూరు చేసినట్టు వెల్లడించారు. జన్ధన్ ఖాతాలు, తపాలా శాఖ ఖాతాల నగదు నిల్వపై పరిమితి ఉన్నందున ఇందిరమ్మ బిల్లుల చెల్లింపులో సమస్యలు వస్తున్నాయని, వారు బ్యాంకులను సంప్రదించి సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 2.25 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభమైందని, లబ్దిదారులకు ఇప్పటివరకు రూ.2,526.12 కోట్లు చెల్లించినట్టు వివరించారు. కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ చైతన్య కుమార్, సీనియర్ కన్సల్టెంట్ ఈశ్వరయ్య, జీఎంలు శ్రీదేవి, మమత తదితరులు పొల్గొన్నారు. -
‘తేమ’ తంటాలు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: సీసీఐ కొనుగోలు కేంద్రాలు తెరుచుకున్నా...పత్తి రైతులకు తేమ కష్టాలు తప్పడం లేదు. తేమ శాతం పేరుతో కొర్రీలు ఎదురవుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ప్రస్తుత తుపాను ప్రభావంతో తేమ తగ్గే పరిస్థితులు లేకపోగా.. 12 శాతం లోపు తేమ నిబంధనను మార్చాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నిండా ముంచిన వరుణుడు ఈ ఏడాది వానాకాలంలో అధిక వర్షాలు పత్తి రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. రాష్ట్రంలో సుమారు 43.29 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కాగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా, ఆ తర్వాత ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోనూ పత్తి గణనీయంగా సాగైంది. అయితే జూలై, ఆగస్టు, సెపె్టంబర్లో సాధారణానికి మించి వర్షాలు కురవడంతో చేలల్లో నీరు నిలిచి పత్తి మొక్కలు ఎదగలేదు. ఫలితంగా దిగుబడి ఎకరాకు 4–6 క్వింటాళ్లే వస్తోంది. ఇప్పుడు మోంథా తుపాను కారణంగా పత్తి దెబ్బతింటుండగా.. రైతులు చేలలోనే ఉంచుతున్నారు. సీసీఐ కేంద్రాలు తెరిచినా.. రాష్ట్రవ్యాప్తంగా తొలివిడత పత్తితీత చివరి దశకు చేరింది. సీసీఐ కేంద్రాల్లో 12శాతం లోపు తేమ ఉంటే క్వింటా పత్తికి రూ.8,110 మద్దతు ధర ప్రకటించారు. కేంద్రాలు ప్రారంభించకముందే వ్యాపారులు రూ.6,500 లోపే చెల్లించారు. ఈ నేపథ్యాన రాష్ట్రవ్యాప్తంగా 318 కొనుగోలు కేంద్రాలు తెరవాలని నిర్ణయించగా.. ఇప్పటి వరకు 72 కేంద్రాలే ప్రారంభమయ్యాయి. ఈ కేంద్రాల్లో 1,700 టన్నుల వరకు విక్రయించారు. నల్లగొండ జిల్లాలో 23, సిద్దిపేటలో 10, ఖమ్మం జిల్లాలో 8, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాలుగు కేంద్రాలు తెరిచారు. తేమ కారణంగా కొర్రీలతో కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఖమ్మం జిల్లాలో 128.01 టన్నుల పత్తి కొనుగోలు చేయగా, భద్రాద్రి జిల్లాలో కొనుగోళ్లు మొదలే కాలేదు. 12 శాతంలోపు తేమ ఉంటేనే.. సీసీఐ విధించిన తేమ శాతం నిబంధన రైతులకు ఇబ్బందిగా మారింది. ఈ ఏడాది వరుసగా కురిసిన వర్షాలు, ప్రస్తుత మోంథా తుపానుతో తేమ తగ్గకపోగా, పత్తిని ఆరబెడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 8 నుంచి 12 శాతం లోపు తేమ ఉంటేనే కొనుగోలు చేస్తామని చెబుతూ సోమవారం వ్యాపారులు ముందుకు రాలేదు. దీంతో తక్కువ «ధరకే వేలం కొనసాగింది. ఇదే పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్నారు. అయితే 20 శాతం వరకు తేమ ఉన్నా కొనుగోలు చేయాలని రైతుల నుంచి డిమాండ్ వస్తోంది. కాగా, సోమవారం రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రులతో కేంద్ర మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇక్కడి సమస్యలను వివరించి నిబంధనలు సడలించాలని కోరారు.పెట్టుబడులు కూడా రాలేదు ఖమ్మం జిల్లా తల్లాడ మండలం బిల్లుపాడుకు చెందిన హేమా అర్జున్రావుకు పదెకరాల్లో పత్తి సాగు చేశాడు. ఎకరాకు రూ.50 వేల పెట్టుబడి పెడితే వర్షాలతో పత్తి తడిసి రంగు మారింది. తల్లాడలోని సీసీఐ కేంద్రానికి తీసుకెళ్తే తిరస్కరించడంతో చేసేదేమీ లేక ప్రైవేట్ వ్యాపారులకు అమ్మాడు. ఫలితంగా పెట్టుబడి కూడా రాకపోగా.. చేనులో మిగిలిన పత్తి వర్షాలకు తడిసిపోయింది. తేమశాతంతో మద్దతు ధర రాదని.. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం ఎదుళ్లచెరువుకు చెందిన శొంఠి వెంకటేశ్వర్లు తనకున్న ఆరెకరాల్లో పత్తి సాగు చేశాడు. కొద్ది రోజులుగా పత్తి తీస్తున్నా, వర్షాలతో తేమ ఎక్కువగా ఉండడంతో ఆరబెట్టాడు. ఇప్పుడు తుపాన్ ప్రభావంతో తేమ తగ్గే పరిస్థితి లేక.. మద్దతు ధర కష్టమేనని వాపోతున్నాడు. -
సేవారంగ ఆదాయంలో తెలంగాణ టాప్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ ఆర్థిక ప్రగతికి చోదకశక్తిగా మారిన సేవల రంగం నుంచి ఆదాయాన్ని ఆర్జించడంలో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తోంది. దేశ సేవల రంగం స్వరూపం, ఎదుగుదల, ఉపాధి కల్పన సరళిపై నీతి ఆయోగ్ మంగళవారం ఢిల్లీలో విడుదల చేసిన తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. భారత సేవల రంగం: స్థూల విలువ జోడింపు (జీవీఏ) ధోరణులు–రాష్ట్ర స్థాయి డైనమిక్స్ నివేదిక ప్రకారం తెలంగాణ స్థూల రాష్ట్ర విలువ జోడింపు (జీఎస్వీఏ)లో సేవల వాటా 2011–12లో ఉన్న 52.8% నుంచి 2023–24 నాటికి 62.4 శాతానికి పెరిగింది. ఇది జాతీయ సగటు (54.5%) కంటే అధికం కావడం విశేషం. మొత్తంగా చూస్తే తెలంగాణ సగటు సేవల రంగం వాటా 60.3 శాతంగా నమోదైంది. హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి చెందిన ఐటీ, స్టార్టప్ల వ్యవస్థ, రియల్ ఎస్టేట్, వృత్తిపరమైన సేవలు (సగటు జీఎస్వీఏ వాటా 34.1%), ఆర్థిక సేవలు (11.1%) ఈ వృద్ధికి కారణమని నీతి ఆయోగ్ నివేదిక తెలిపింది. అధిక ఉత్పాదకత, ఆధునిక సేవలపై తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉందని పేర్కొంది.ఉపాధి కల్పనలో చూస్తే 2023–24లో తెలంగాణ శ్రామిక శక్తిలో 34.8% మంది (62 లక్షల మంది) సేవల రంగంలో పనిచేస్తున్నట్లు నివేదిక వివరించింది. ముఖ్యంగా ఐటీ రంగం (12 శాతం వాటాతో) ఉపాధిలోనూ గణనీయ పాత్ర పోషిస్తోందని తెలిపింది. తెలంగాణ తన ఐటీ బలాన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించాలని.. అప్పుడే వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో రాష్ట్రం కీలకపాత్ర పోషించగలదని నీతిఆయోగ్ అభిప్రాయపడింది. ఇక ఆంధ్రప్రదేశ్లో పరిస్థితిని పరిశీలిస్తే జీఎస్వీఏలో సేవల రంగం వాటా తెలంగాణ కంటే తక్కువగా ఉంది. 2011–12లో 40.9% ఉన్న వాటా 2023–24 నాటికి 42 శాతానికి పెరిగింది. ఇది జాతీయ సగటు కంటే తక్కువ. మరోవైపు ఉపాధి కల్పనలో 2023–24 నాటికి ఏపీ శ్రామిక శక్తిలో 31.8% మంది (78 లక్షల మంది) సేవల రంగంలో పనిచేస్తున్నట్లు నీతి ఆయోగ్ పేర్కొంది. ఏపీ ఓడరేవులు, వ్యవసాయ అనుబంధ సేవలు, లాజిస్టిక్స్ను బలోపేతం చేసుకోవాలని నీతిఆయోగ్ నివేదిక సూచించింది. వృద్ధిలో సమతుల్యత.. నాణ్యతే సవాల్ దేశవ్యాప్తంగా సేవల రంగం వృద్ధి ప్రాంతీయంగా సమతౌల్యంగా మారుతోందని.. వెనుకబడిన రాష్ట్రాలు సైతం పుంజుకుంటున్నాయని నీతి ఆయోగ్ పేర్కొంది. అయితే ఉపాధి కల్పనలో ఆధునిక రంగాలు అధిక ఆదాయాన్ని సృష్టిస్తున్నా తక్కువ మందికే ఉద్యోగాలిస్తుంటే సంప్రదాయ రంగాలు ఎక్కువ మందికి ఉపాధినిస్తున్నా అవి అసంఘటితంగా, తక్కువ వేతనాలతో కొనసాగుతున్నాయని తెలిపాయి. ఉపాధి కల్పనలో లింగ వివక్ష, ప్రాంతీయ వ్యత్యాసాలు ప్రధాన సవాళ్లుగా ఉన్నాయని నీతి ఆయోగ్ గుర్తించింది. ఈ సవాళ్లను అధిగమించడానికి గిగ్, స్వయం ఉపాధి, ఎంఎస్ఎంఈ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని, మహిళలు, గ్రామీణ యువతకు డిజిటల్ నైపుణ్యాలు అందించాలని, నూతన ఆర్థిక వ్యవస్థకు అవసరమైన నైపుణ్యాలపై పెట్టుబడి పెట్టాలని, టైర్–2, టైర్–3 నగరాల్లో సేవా కేంద్రాలను అభివృద్ధి చేయాలని నీతి ఆయోగ్ సూచించింది. -
పోటీ పరీక్షల కోసం అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్లు
మధిర: తెలంగాణ రాష్ట్రం విద్యారంగంలో దేశానికే ఆదర్శంగా నిలిచేలా సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని, ఆయన ఆలోచనలకు అనుగుణంగా ఆర్థిక శాఖలో ప్రణాళి కలు రూపొందించి ముందుకు సాగుతామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఖమ్మం జిల్లా మధి రలో మంగళవారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. అనంతరం భట్టి మీడియాతో మాట్లాడుతూ.. గ్రామీణ యువత పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు పట్టణాలకు వెళ్లకుండా నియోజకవర్గ కేంద్రాల్లోనే అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ సెంటర్లలో మెటీరియల్తోపాటు డిజిటల్ లైబ్రరీ అందుబాటులో ఉంటుందన్నారు. రాష్ట్రం, దేశంలో నిష్ణాతులైన అధ్యాపకులతో ఆన్లైన్ బోధన ఉంటుందని చెప్పారు. తొలి విడతగా ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో వీటిని ప్రారంభించేలా ప్రతిపాదనలు సిద్ధమైనట్లు తెలిపారు. శరవేగంగా నిర్మాణంవిద్యావ్యవస్థలో గేమ్ చేంజర్గా నిలిచే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభిస్తామని, ఇప్పటికే నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయని భట్టి తెలిపారు. విద్యార్థులు పోషకాహార లోపంతో ఇబ్బంది పడొద్దనే భావనతో సీఎం రేవంత్రెడ్డి వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం అందించాలని నిర్ణయించగా, ఆర్థిక శాఖ ప్రణాళికలు రూపొందిస్తోందని చెప్పారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్గ్రేడ్ చేస్తున్నామని, పాలిటెక్నిక్ కళాశాలల్లో అవసరమైన వసతులు కల్పించి ఇంజనీరింగ్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేస్తామని వెల్లడించారు. అంతేకాక ప్రతీ మండలంలో పదేసి గ్రామాలకు ఒకటి చొప్పునమూడు ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసి దశలవారీగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కోసం సీఎస్ఆర్ నిధుల ద్వారా స్థానికంగా అధికారులు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, పాఠశాల విద్య డైరెక్టర్ నికోలస్, ఇంటర్మీడియెట్ విద్య కార్యదర్శి ఆదిత్య భాస్కర్, ఈడబ్ల్యూఎస్ ఐడీ ఎండీ గణపతిరెడ్డి, ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు.ఎన్పీడీసీఎల్కు రెండు ఐఎస్ఓ సర్టిఫికెట్లుమధిర: అత్యంత ప్రతిష్టాత్మకమైన రెండు ఐ ఎస్ఓ సర్టిఫికెట్లు టీజీ ఎన్పీడీసీఎల్కు దక్కా యి. ఖమ్మం జిల్లా మధిరలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు హాజరైన ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క ఈ సర్టిఫికెట్లను ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డికి అందజేశారు. విద్యుత్ పంపిణీ కార్యకలాపాలు, సబ్స్టేషన్ల నిర్వహణ, నిర్మాణాల్లో అత్యుత్తమ నాణ్యతకు గుర్తింపుగా ఐఎస్ఓ 9001:2015 క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ సర్టిఫికెట్ దక్కిందని భట్టి తెలిపారు. అలాగే, ఉద్యోగుల భద్రతకు తీసుకుంటున్న సురక్షా ప్రమాణా లను గుర్తిస్తూ ఐఎస్ఓ 45001:2018 ఆక్యుపే షనల్ హెల్త్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సర్టిఫికె ట్ జారీ అయిందన్నారు. ఈ సర్టిఫికెట్లను హెచ్వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ జారీ చేయగా, తెలంగాణలో మొదటిసారి ఎన్పీడీసీఎల్ సంస్థకు దక్కడం విద్యుత్ రంగంలో మైలురాయిగా నిలుస్తుందని భట్టి తెలిపారు. -
మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లకు ‘సుప్రీం’ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2013లో కారుణ్య నియామకాల కింద తిరిగి విధుల్లోకి తీసుకున్న 1,200 మంది మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్లకు (ఎంపీహెచ్ఏ– పురుషులు) సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. వీరి నియామకాలను రద్దు చేస్తూ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం పక్కనపెట్టింది. జస్టిస్ అరవింద్కుమార్, జస్టిస్ అంజారియాలతో కూడిన ధర్మాసనం, ఈ ఉద్యోగులను సర్వీసులో కొనసాగించేందుకు అనుమతిస్తూ మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది.ఏళ్ల తరబడి న్యాయ పోరాటం 2003లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం సుమారు 2,300 ఎంపీహెచ్ఏ (పురుష) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకు ఇంటర్మీడియట్ +డిప్లొమాను అర్హతగా నిర్ణయించింది. ఆ తర్వాత అర్హతను పదో తరగతి + డిప్లొమాగా మార్చడంతో వివాదం మొదలైంది. ఈ అంశం సుప్రీంకోర్టు వరకు వెళ్లగా.. 2012లో పదో తరగతి + డిప్లొమా అర్హతనే ఖరారు చేస్తూ సుప్రీంకోర్టు తుది తీర్పునిచ్చింది. దీంతో అప్పటికే ఇంటర్ + డిప్లొమా అర్హతతో ఏళ్ల తరబడి సేవలు అందిస్తున్న సుమారు 1,200 మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది.ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన కోర్టుఉద్యోగాలు కోల్పోయిన 1,200 మంది ఏళ్లపా టు అందించిన సేవలను పరిగణనలోకి తీసు కున్న ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం, మానవతా దృక్పథంతో 2013లో వారిని కాంట్రాక్ట్ పద్ధతిలో కారుణ్య నియామకాల కింద తిరిగి విధుల్లోకి తీసుకుంది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించగా, తెలంగాణ హైకోర్టు ఆ నియామకాలను రద్దు చేసింది. దీనిపై ఉద్యోగులు, ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. విచారణ సందర్భంగా 2003 నాటి నియామకాలతో సంబంధం లేకుండా, పూర్తిగా కారుణ్య కారణాల ఆధారంగానే 2013లో వీరిని తిరిగి నియమించామని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఇది పూర్తిగా ప్రభుత్వ స్వతంత్ర నిర్ణయమని అంగీకరించింది. ఈ నేపథ్యంలో, 2013 నియామకాలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. 1,200 మంది ఎంపీహెచ్ఏల ఉద్యోగాలను కొనసాగించాలని స్పష్టం చేసింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు శేఖర్ నాప్డే, మాధవి దివాన్, శ్రీరామ్ భాస్కర్ గౌతమ్ వాదనలు వినిపించారు. -
లొంగిపోయిన వారికి రక్షణ: డీజీపీ శివధర్రెడ్డి
సాక్షి, హైదరాబాద్/పెద్దపల్లి/జూలపల్లి: పోలీసుల ఎదుట లొంగిపోతున్న మావోయిస్టులను కాపాడుకుంటామని డీజీపీ శివధర్రెడ్డి హామీ ఇచ్చారు. లొంగిపోయిన వారిని ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసు అని పేర్కొన్నారు. మావోయిస్టులు ఎవరికి వారు ఇష్టంతోనే బయటకు వస్తున్నారని.. అలాంటి వారి మీద మావోయిస్టులు యాక్షన్ తీసుకుంటామనడం కరెక్ట్ కాదని చెప్పారు. సిద్ధాంతపరంగా వారు ఎంత పడిపోయారో దీనిని బట్టి తెలుస్తున్నదని విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా డీజీపీ చెప్పారు. 45 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాద్రావు అలియాస్ చంద్రన్న, రాష్ట్ర కమిటీ సభ్యుడు (ఎస్సీఎం) బండి ప్రకాశ్ అలియాస్ ప్రభాత్ జనజీవన స్రవంతిలో కలిశారు. ఈ మేరకు వారిద్దరూ డీజీపీ శివధర్రెడ్డి సమక్షంలో మంగళవారం లొంగిపోయారు. ఈ సందర్భంగా డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్, శాంతిభద్రతల అడిషనల్ డీజీ మహేశ్ భగవత్, ఎస్ఐబీ చీఫ్, ఐజీ సుమతితో కలిసి డీజీపీ ఆ వివరాలు వెల్లడించారు. లొంగిపోయిన మావోయిస్టుల పేరిట ప్రకటించిన రివార్డు మొత్తం నుంచి చంద్రన్నకు రూ.25 లక్షలు, బండి ప్రకాశ్కు రూ.20 లక్షల చొప్పున డీడీలను అందించారు. ఈ సందర్భంగా డీజీపీ శివధర్రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మావోయిస్టు కీలక నేతలు, నాలుగు దశాబ్దాలకు పైగా అండర్గ్రౌండ్లో పనిచేసిన ఇద్దరూ జనజీవన స్రవంతిలో కలిశారని చెప్పారు. ఈ ఏడాదిలో 427 మంది మావోయిస్టు అండర్ గ్రౌండ్ కేడర్లు సాయుధ పోరాటాన్ని వదిలి జనజీవన స్రవంతిలోకి వచ్చాయన్నారు. మావోయిస్టు భావజాలాన్ని ఓడించడం ఎవరితరం కాదు : చంద్రన్నమావోయిస్టు భావజాలాన్ని ఓడించడం ఎవరితరం కాదని చంద్రన్న తేల్చి చెప్పారు. డీజీపీ ఎదుట లొంగిపోయిన అనంతరం ఆయన మీడియా మాట్లాడారు. లాల్సలాం అంటూ తాను మాట్లాడారు. ‘ఇది లొంగుబాటు కాదు.. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో మేం జనంలోకి వచ్చి పనిచేయాలనుకుంటున్నాం. పార్టీలో అంతర్గతంగా చీలిక వచ్చింది ఇది క్లియర్. అవకాశం వచ్చిప్పుడు నేను పిలుస్తా మీరు (మీడియాను ఉద్దేశించి) రండి. నేను మాట్లాడుతా. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా దేవ్జీ అలియాస్ తిప్పరి తిరుపతిని పార్టీ ఎన్నుకుంది. పార్టీలో చీలిక వచ్చింది కా>బట్టి ఎవరి మార్గం వారు ఎంచుకున్నారు. మా మార్గం మేము ఎంచుకున్నాం. నేను మాత్రం పార్టీ లైన్నే సమర్థిస్తున్న. దేవ్జీకి సపోర్ట్ చేస్తున్న. సోనును వ్యతిరేకిస్తున్న. మాకు కూడా ప్రజల మధ్య పనిచేసే కేడర్ ఉన్నారు’అని చెప్పారు. చంద్రన్న నేపథ్యంపెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడ్కాపూర్ గ్రామానికి చెందిన ప్రసాద్రావు పదోతరగతి వరకు స్వగ్రామంలోనే చదువుకున్నాడు. 1979లో పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ (బైపీసీ) చదువుతుండగా రాడికల్ స్టూడెంట్ యూనియన్ ఆర్గనైజర్గా వ్యవహరించిన దగ్గు రాజలింగుతో చంద్రన్నకు పరిచయం ఏర్పడింది. ఆయన ప్రభావంతో ఆర్ఎస్యూలో చేరి 1980లో మల్లోజుల కిషన్జీకి కొరియర్గా పనిచేస్తూ హైదరాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తున్న కేఎస్ గ్రూప్కు సమాచారం చేరవేయడంలో ముఖ్యపాత్ర పోషించాడు. 1980 జూలైలో ఛత్తీస్గఢ్లోని భూపాలపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆసిఫాబాద్ దళంలో సభ్యుడిగా పనిచేశారు. 1981లో పీపుల్స్వార్ ఆవిర్భావం తర్వాత సిర్పూర్ దళ కమాండర్గా 1983లో బాధ్యతలు చేపట్టారు. 1995 నుంచి నార్త్ తెలంగాణ స్పెషల్జోనల్ కమిటీ సభ్యునిగా పనిచేశారు. 2007లో నార్త్ తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 2008లో కేంద్రకమిటీ సభ్యుడు అయ్యారు. 2021లో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బాధ్యతలు చేపట్టారు. 2024 డిసెంబర్లో తెలంగాణ రాష్ట్ర కమిటీ బాధ్యతలు బడే దామోదర్ అలియాస్ చొక్కారావుకు అప్పగించిన తర్వాత సీసీ మెంబర్గా, తెలంగాణ కమిటీకి మార్గదర్శిగా వ్యవహరించారు. డివిజినల్ కమిటీ సభ్యురాలు మోతీబాయి అలియాస్ రాధక్కను 1989లో వివాహం చేసుకున్నారు. ఆమె 2013 జూన్లో భద్రాద్రి కొత్తగూడెంలో అరెస్టు అయ్యింది. 2015లో జైలు నుంచి విడుదలై ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలోని తన స్వగ్రామంలో నివసిస్తోంది. ప్రభాత్పేరిట పత్రికా ప్రకటనలు ఇచ్చేది బండి ప్రకాశే..:బండి ప్రకాశ్ అలియాస్ ప్రభాత్ స్వస్థలం మంచిర్యాల జిల్లా మందమర్రి. 1983లో కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్లో ఏడో తరగతి వరకు చదివాడు. రాడికల్ యూత్ లీగ్ (ఆర్వైఎల్)లో 1984లో చేరాడు. తర్వాత పుల్లూరి ప్రసాదరావు నాయకత్వంలో సిర్పూర్ సాయుధ దళంలో కొనసాగాడు. 1984లో సీపీఐ నాయకుడు వీటీ అబ్రహం హత్యలో పాల్గొని జైలుకు వెళ్లాడు. 1988లో ఆదిలాబాద్ సబ్ జైలు నుంచి పారిపోయి 1989లో అండర్ గ్రౌండ్కు వెళ్లాడు. కొన్నాళ్లకు సిద్ధాంతపరమైన విభేదాలు రావడంతో దళాన్ని వదిలి హైదరాబాద్ మల్కాజ్గిరిలో సుతారి మేస్త్రీగా పనిచేశాడు. అబ్రహం హత్యకేసులో 1992లో మరోసారి అరెస్టు కాగా. జీవితఖైదు పడి చంచల్గూడ జైలుకు వెళ్లాడు. 2004లో మెర్సీ గ్రౌండ్స్లో జైలు నుంచి విడుదలయ్యాడు. శాంతిచర్చల సమయంలో నార్త్ తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ నుంచి ప్రాతనిధ్యం వహించాడు. 2005లో శాంతి చర్చలు విఫలం కావడంతో మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లాడు. 2008 నుంచి 2011 వరకు చర్ల–శబరి ఏరియా కమిటీ ఇన్చార్జ్గా, 2012లో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొంది, ఆదిలాబాద్ జిల్లా కమిటీ కార్యదర్శిగా నియమితులయ్యారు. 2015లో ఆరోగ్యం క్షీణించడంతో సింగరేణి కోల్బెల్ట్ కమిటీ ఇన్చార్జ్గా, ప్రజావిముక్తి పత్రిక సంపాదకుడిగా నియమించారు. 2015 నుంచి తెలంగాణ రాష్ట్ర కమిటీ (టీఎస్సీ) ప్రెస్టీం ఇన్చార్జ్ కొనసాగుతూ సీపీఐ మావోయిస్టు పార్టీ పత్రికా ప్రకటనలు ‘ప్రభాత్’పేరుతో విడుదల చేస్తున్నాడు. -
‘ఏరో-ఇంజిన్’ రాజధానిగా తెలంగాణ: మంత్రి
తెలంగాణను 2030 నాటికి దేశ ‘ఏరో-ఇంజిన్ రాజధాని’గా తీర్చిదిద్దాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఈ లక్ష్య సాధనకు అంతర్జాతీయ, జాతీయ దిగ్గజ ఏరో సంస్థలు రాష్ట్రంలో కొత్తగా పెట్టుబడులు పెట్టేలా సమగ్ర రోడ్ మ్యాప్ను సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు.ఆదిభట్లలో న్యూ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీటాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్(TASL), సాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్స్ సంయుక్తంగా రూ.425 కోట్ల పెట్టుబడితో ఆదిభట్లలో ఏర్పాటు చేసిన ఏరో ఇంజిన్ రొటేటివ్ కాంపోనెంట్స్ న్యూ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని మంత్రి శ్రీధర్ బాబు మంగళవారం వర్చువల్గా ప్రారంభించారు. ఈ ఫెసిలిటీ ద్వారా ఎయిర్బస్, బోయింగ్ సంస్థలు లీప్ ఇంజిన్ల తయారీలో వినియోగించే బేరింగ్ హౌసింగ్ (స్టేషనరీ కాంపోనెంట్), లో ప్రెషర్ టర్బైన్ షాఫ్ట్ (రోటేటివ్ కాంపోనెంట్)లు తయారు కానున్నాయి.ఈ కొత్త యూనిట్ ద్వారా తెలంగాణ బ్రాండ్ విశ్వవ్యాప్తమవ్వడంతో పాటు కొత్తగా 500 మందికి ఉపాధి లభిస్తుందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. గ్లోబల్ ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ హబ్గా తెలంగాణను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. హైదరాబాద్ అంటే కేవలం ‘సిటీ ఆఫ్ పెరల్స్’ మాత్రమే కాదని ‘ప్రొపల్షన్, ప్రెసిషన్, ప్రోగ్రెస్’ నగరంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.రాష్ట్రంలో ఏరోస్పేస్, రక్షణ రంగాల ఎగుమతులు 2023-24లో రూ.15,900 కోట్లు ఉండగా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి 9 నెలల్లోనే రూ.30,742 కోట్లకు పెరిగాయని మంత్రి చెప్పారు. విమాన తయారీ కంపెనీలకు రాష్ట్రం గమ్యస్థానంగా ఉందని, ఇక్కడ తామ కార్యకలాపాలు చేపట్టాలని అంతర్జాతీయ దిగ్గజ ఏరో సంస్థలకు మంత్రి పిలుపునిచ్చారు. ఇంజిన్స్, కాంపోనెంట్స్, కన్వర్షన్స్, స్పేస్, డ్రోన్స్, డిజిటల్, ఏఐ మాన్యుఫ్యాక్చరింగ్ తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ సీఈవో, ఎండీ సుకరన్ సింగ్, సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్స్ వైస్ ప్రెసిడెంట్ డొమినిక్ డూప్, టీజీఐఐసీ ఎండీ శశాంక తదితరులు పాల్గొన్నారు.ఇదీ చదవండి: 60 ఏళ్లలో 260 రెట్లు పెరిగిన వేతనాలు! -
సినీ టికెట్ ధరల పెంపుపై సీఎం రేవంత్
హైదరాబాద్: సినిమా టికెట్ ధరల పెంపుపై సీఎం రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ ధరలు పెంచితే మాత్రం అందులో కార్మికులకు 20 శాతం వాటా ఉండాలన్నారు. కార్మికులకు ఆరోగ్య బధ్రత చూసుకోవాల్సిన బాధ్యత నిర్మాతలదేనని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో సీఎం రేవంత్కు సినీ కార్మికులచే అభినందన సభ ఏర్పాటు చేశారు. తెలుగు సిని పరిశ్రమ 24 క్రాఫ్ట్ సంఘాల ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, వివేక్, పొన్నం, ఎఫ్ డి సి చైర్మన్ దిల్ రాజు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. దీనిలో భాగంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘ చిన్న సినిమాలను తక్కువ చేసి చూసే ప్రసక్తే లేదు. కార్మిక కుటుంబాలకు ఆరోగ్య భద్రత కల్పిస్తాం. కార్మికులకు రాజీవ్ ఆరోగ్య పథకం అమలు చేస్తాం. కార్మికుల్ని కుటుంబాలుగా చూసుకోవాలని నిర్మాతకు చెప్పా. సినిమా టికెట్లు పెంచితే వచ్చే ఆదాయంతో 20 శాతం కార్మికులకు ఇవ్వాలి. 20 శాతం కార్మికుల వెల్ఫేర్ ఫండ్కు బదిలీ అవ్వాలి. ఆ రకంగా అయితే ిటికెట్ ధరలు ెపెంచుకునేందుకు జీవో ఇస్తాం. నా శక్తి మేర సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం కృషి చేస్తా. గత పదేళ్లుగా నంది అవార్డులు ఇవ్వలేదు.. ఇప్పుడు ప్రజా యుద్ధ నౌక గద్దర్ పేరుతో ఆ అవార్డులు ఇస్తున్నాం. మహా భారతం లో నాకు నచ్చిన క్యారెక్టర్ కర్ణుడు. ప్రాణం పోతుంది అని తెలిసిన స్నేహితుల వైపు ఉన్నాడు. అందుకే మిత్ర ధర్మాన్ని పాటించడంలో నేను కర్ణుడు లాంటి వాడిని. నిర్ణయం తీసుకున్నాక నేను ఆలోచించను. ఎన్ని అడ్డంకులు వచ్చిన కార్మికుల క్షేమం కోసం మిత్ర ధర్మం పాటిస్తాను. డిసెంబర్ 9 నాడు సినీ కార్మికుల కోసం దిశా నిర్దేశం చేసి ప్రణాళిక ఇస్తాము. కార్మికులు బాగుంటేనే దర్శక నిర్మాతలు బాగుంటారు అని చెప్పిన. కార్మికుల వెల్ఫేర్ కోసం 10 కోట్ల ఫండ్ కేటాయిస్తాము. టికెట్ ధరలు పెంచాలి అంటే అందులో కార్మికులకు వాటా ఇవ్వాలి. టికెట్ ధరలు పెంచితే హీరోలకు నిర్మాతలకు లాభం. మరి కార్మికులకు ఎం ఒరిగింది. కార్మికులకు అదనంగా ఒక్క రూపాయి రావట్లేదు. పెంచిన టికెట్ ధర లో 20 శాతం సినీ కార్మికులకు ఇస్తేనే ప్రభుత్వం జీవో ఇస్తాము. మీ శ్రమతో సంపాదించే ప్రతి దానిలో మీకు వాటా ఉండాలి. ఎంత పెద్ద నిర్మాత అయినా కార్మికులకు వెల్ఫేర్ ఫండ్ జమ చేస్తేనే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తది. నేను ఈ విధంగా చేయాలనీ ఆదేశలు ఇస్తున్న’ అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. -
ఆ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఊరట.. తెలంగాణ హైకోర్టు తీర్పును కొట్టివేసిన ‘సుప్రీం’
న్యూఢిల్లీ: తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. సుప్రీంలో 1200 మంది మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్లకు (mphs) ఊరట దక్కింది. మల్లీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ల కొనసాగింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.2013లో ఉమ్మడి ఏపీలో కారుణ్య నియామకాల కింద 1200మంది ఎంపీహెచ్ఎస్లు ఉద్యోగం పొందారు. అయితే, ఆ నియామక ప్రక్రియను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. విచారణ సందర్భంగా ఆ 1200మందిని కారుణ్య నియామకం కింద నియమించామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు 1200మంది మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ల నియామకాల్ని రద్దు చేసింది. దీనిపై ఉద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా విచారణ చేపట్టిన దేశ అత్యున్నత న్యాయ స్థానం .. తెలంగాణ హైకోర్టు తీర్పును కొట్టివేసింది. మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్లు వారి ఉద్యోగాల్లో కొనసాగించవచ్చని కీలక తీర్పును వెలువరించింది. -
‘డీప్ఫేక్’ నుంచి ‘సేఫ్ వర్డ్’ రక్షణ: సీపీ సజ్జన్నార్
హైదరాబాద్: ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ మోసాలు అధికం అయిపోయాయని, ముఖ్యంగా ఏఐ, డీప్ ఫేక్ క్లోనింగ్లతో ఆధునిక తరహా మోసాలు జరుగుతున్నాయని, వీటి నివారణకు ‘సేఫ్ వర్డ్’తో రక్షణ పొందాలని హైదరాబాద్ నగర సీపీ సజ్జన్నార్ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.డీప్ఫేక్ మోసాలను ఎదుర్కొనేందుకు ‘సేఫ్ వర్డ్’ఉపయోగించాలని సజ్జనార్ సూచించారు. తెలంగాణలో డీప్ ఫేక్, సైబర్ మోసాల కేసులు విపరీతంగా పెరుగుతున్నందున, వీటి బారిన పడకుండా ఉండేందుకు నమ్మకమైన పరిచయస్తుల నడుమ‘సురక్షిత పదం’ (సేఫ్ వర్డ్)ను ఉపయోగించాలన్నారు. మంగళవారం తన ‘ఎక్స్’ ఖాతాలో నగర సీపీ సజ్జన్నార్..ఏఐ సాధనాలు ఇప్పుడు ఆశ్చర్యకరమైన ఖచ్చితత్వంతో ముఖాలు, గొంతులను క్లోనింగ్ చేయగలవన్నారు. దీంతో మోసగాళ్లు మన స్నేహితులు, సహోద్యోగులు లేదా అధికారుల మాదిరిగా కూడా నటించగలరని సజ్జనార్ హెచ్చరించారు. ఏఐ,డీప్ఫేక్ల యుగంలో ‘సురక్షిత పదం’ బలమైన రక్షణగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. In the age of AI and deepfakes, a ‘safe word’ is your strongest protection! AI tools can now clone your face and voice with shocking accuracy. Fraudsters misuse these deepfakes to trick people — pretending to be your friend, colleague, or even an official. 👉 Defend yourself… pic.twitter.com/HTw0o097rS— V.C. Sajjanar, IPS (@SajjanarVC) October 28, 2025కుటుంబ సభ్యులు, నమ్మకమైన పరిచయస్తులతో ఒక ప్రత్యేకమైన భద్రతా పదాన్ని రూపొందించుకోవాలి, వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని పంచుకునే ముందు దానిని ఉపయోగించి, ఏవైనా అనుమానాస్పద కాల్లు లేదా సందేశాలను ధృవీకరించాలని ఆయన సూచించారు. డీప్ఫేక్ అనుకరణలకు సంబంధించిన సైబర్ ఫిర్యాదులు అంతకంతకూ పెరుగుతున్నాయని సజ్జన్నార్ పేర్కొన్నారు. స్కామర్లు క్లోన్ చేసిన వాయిస్లు, వీడియోలను ఉపయోగించి డబ్బు లేదా సున్నితమైన డేటాను అత్యవసరంగా బదిలీ చేయాలని డిమాండ్ చేస్తారని హెచ్చరించారు. అందుకే అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. కాగా ఇటువంటి మోసపూరిత కార్యకలాపాలను గుర్తించేందుకు ప్రజల మధ్య డిజిటల్ అక్షరాస్యత ప్రచారాలను సైబర్ క్రైమ్ యూనిట్లు ముమ్మరం చేశాయి.ఇది కూడా చదవండి: ఢిల్లీ విమానాశ్రయం వద్ద బస్సులో మంటలు -
పెట్రోలుబంకు కార్మికుడికి రోబోటిక్ కిడ్నీ మార్పిడి
హైదరాబాద్: రంగారెడ్డి.. ఓ సాధారణ పెట్రోలుబంకు కార్మికుడు. అతడి వయసు 45 ఏళ్లు. అయితే, అధిక రక్తపోటు (బీపీ) ఉన్న విషయాన్ని సరిగా గమనించుకోలేదు. గుర్తించేసరికే రెండు కిడ్నీలు పాడైపోయాయి. కొన్నాళ్లుగా డయాలసిస్ చేయించుకుంటూ కిడ్నీ మార్పిడి కోసం ప్రయత్నించాడు. కుటుంబసభ్యులలో ఎవరిదీ సరిపోకపోవడంతో జీవన్దాన్ లో పేరు నమోదుచేయించుకున్నాడు. అందులో కిడ్నీ అందుబాటులోకి రావడంతో ఎల్బీనగర్లోని కామినేని ఆస్పత్రిలో మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆస్పత్రికి చెందిన సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ట్రాన్స్ప్లాంట్, రోబోటిక్ సర్జన్ డాక్టర్ వి. సూర్యప్రకాష్ తెలిపారు.“రంగారెడ్డికి అధిక రక్తపోటు కారణంగా రెండు కిడ్నీలూ పాడయ్యాయి. దీర్ఘకాల కిడ్నీవ్యాధితో బాధపడుతున్న అతడికి మార్పిడి తప్పనిసరి అయ్యింది. జీవన్దాన్లో కిడ్నీ దొరకడంతో కామినేని ఆస్పత్రిలో అతడికి శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించాం. అయితే, సాధారణ శస్త్రచికిత్సలో అయితే పెద్ద కోత పెట్టాల్సి రావడం, ఇతర సమస్యలు ఉంటాయని.. సీఎంఆర్ సర్జికల్ రోబోతో అతడికి కిడ్నీ మార్పిడి చేయాలన్న నిర్ణయానికి వచ్చాం. కామినేని ఆస్పత్రిలో రోబోటిక్ పద్ధతిలో కిడ్నీమార్పిడి చేయడం ఇదే మొదటిసారి. అంతేకాదు.. సీఎంఆర్ రోబోతో ఈ శస్త్రచికిత్స చేయడం ప్రపంచంలోనే ఇది తొలిసారి. దీన్ని విజయవంతంగా నిర్వహించాం.రోబోటిక్ పద్ధతి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. చాలా చిన్న కోత, కణజాలాలకు నష్టం తక్కువ ఉండడం, రక్తస్రావం కూడా అతి తక్కువ ఉండడం లాంటి ప్రయోజనాలుంటాయి. పైపెచ్చు కచ్చితత్వం నూటికి నూరుశాతం ఉంటుంది. రోబోటిక్ ఆర్మ్స్ ను ఎప్పటికప్పుడు స్టెరిలైజ్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉండదు. నొప్పి చాలా తక్కువ ఉండడంతో ఆస్పత్రిలో ఎక్కువ కాలం ఉండక్కర్లేదు, వేగంగా కోలుకుని తమ పనులు చేసుకోవచ్చు. ఊబకాయం ఉన్నవారికి ఇది మరింత సానుకూలం.సీఎంఆర్ రోబో ఏంటి..కామినేని ఆస్పత్రిలో ఉన్న సీఎంఆర్ వెరిసస్ సర్జికల్ రోబో అనేది అత్యంత ఆధునికమైన రోబోటిక్ వ్యవస్థ. దీని సాయంతో రోబోటిక్ రాడికల్ ప్రోస్టేటెక్టమీ, రాడికల్ సిస్టో ప్రోస్టేటెక్టమీ, ఇంట్రాకార్పొరియల్ యూరినరీ డైవర్షన్, పైలోప్లాస్టీ, పార్షియల్ నెఫ్రక్టమీ లాంటి ఆధునిక శస్త్రచికిత్సలన్నీ పూర్తి కచ్చితత్వంతో విజయవంతంగా చేయొచ్చు” అని డాక్టర్ వి.సూర్యప్రకాష్ వివరించారు. -
మావోయిస్టు పార్టీకి మరో కోలుకోలేని దెబ్బ
హైదరాబాద్ మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. పార్టీ ఐడియాలజీని నిర్మించిన పుల్లూరు ప్రసాద్రావు అలియాస్ చంద్రన్న లొంగిపోయారు. తెలంగాణ ఎస్ఐబీ (ప్రత్యేక ఇంటెలిజెన్స్ బ్యూరో) చేపట్టిన కీలక ఆపరేషన్లో మావోయిస్టు చంద్రన్న లొంగిపోయారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న చంద్రన్న సైతం లొంగిపోవడం ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. చంద్రన్నది తెలంగాణ రాష్ట్రంలో పెదపల్లి జిల్లాలోని ఎడ్కాపూర్ గ్రామం. ఈ ఏడాది మే నెలలో బీజాపూర్ కర్రెగుట్ట ఎన్కౌంటర్లో చంద్రన్న మృతిచెందినట్లు వార్తలు వచ్చినప్పటికీ ఆ ఎన్కౌంటర్ నుంచి తప్పించుకన్నారు. తాజాగా తెలంగాణ ఎస్ఐబీ చేపట్టిన కీలక ఆపరేషన్లో చంద్రన్న లొంగిపోయారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీ శివధర్రెడ్డి మాట్లాడుతూ.. ‘ ఈ ఏడాది తెలంగాణలో 427 మంది మావోయిస్టులు లొంగిపోయారు. సీఎం రేవంత్రెడ్డి పిలుపు మేరకు చంద్రన్న లొంగిపోయారు. చంద్రన్నపై రూ.25 లక్షల రివార్డు ఉంది. చంద్రన్న కేంద్ర కమిటీలో కీలక సభ్యుడిగా పనిచేశారు. తెలంగాణ నుంచి 64 మంది ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు. వారంతా అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలోకి రావాలి’ అని పేర్కొన్నారు.లొంగుబాటు పరంపరం..మావోయిస్టుల లొంగుబాటు పరంపర కొనసాగుతోంది. ఆ పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ అభయ్, తక్కళ్ళపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్నలు కొన్ని రోజుల క్రితం లొంగిపోయారు. మావోయిస్టు పార్టీలో కీలక నేతలుగా ఉన్న వీరు లొంగిపోయిన తర్వాత వందల సంఖ్యలో మావోయిస్టులు సైతం వారి వారిప్రాంతాల్లో పోలీసుల ఎదుట లొంగిపోతూ వస్తున్నారు. కేంద్ర బలగాలు చేపట్టిన ఆపరేషన్ కగార్ సక్సెస్ కావడంతో మావోయిస్టులు తమ ఆయుధాల్ని ీవీడి జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు.కాగా, దండకారణ్యంలో పరిస్థితులు తమకు అనుకూలంగా మారాయనే నమ్మకం రాగానే 2024 జనవరిలో ఆపరేషన్ కగార్ మొదలైంది. దళాల కదలికలపై మానవ, సాంకేతిక నిఘాతో కచ్చితమైన దాడులు చేయడం మొదలైంది. అప్పటి నుంచి ప్రతీ ఎన్కౌంటర్ మావోయిస్టులకు భారీ నష్టం చేస్తూ వచ్చింది. చివరకు ఆ పార్టీలో ఓ వర్గం సాయుధ పోరాటానికి సెలవు ప్రకటించి లొంగుబాటుకు సిద్ధం కావాల్సి వచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ మావోయిస్టులకు అనుకూలంగా లేకపోవడంతో వారు లొంగిపోక తప్పడం లేదనే వాదన తెరపైకి వచ్చింది. తెలంగాణ డీజీపీ ఎదుట బండి ప్రకాశ్ సరెండర్ -
హరీష్రావుకు పరామర్శ
సాక్షి, గుంటూరు: బీఆర్ఎస్ సీనియర్ నేత, తెలంగాణ మాజీ మంత్రి హరీష్రావును వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి పరామర్శించారు. హరీష్రావు తండ్రి సత్యనారాయణరావు ఈ వేకువజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంతో వైఎస్ జగన్ ఆయనతో ఫోన్లో మాట్లాడి సానుభూతి తెలియజేశారు. అంతకు ముందు.. హరీష్రావు పితృవియోగంపై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు సంతాపం తెలియజేస్తూ తన ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. ‘‘తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీష్ రావు గారి తండ్రి సత్యనారాయణ రావుగారి మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. సత్యనారాయణ రావుగారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీష్ రావు గారి తండ్రి సత్యనారాయణ రావుగారి మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. సత్యనారాయణ రావుగారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.…— YS Jagan Mohan Reddy (@ysjagan) October 28, 2025హరీష్రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ ఈ వేకువజామున కన్నుమూశారు. దీంతో హైదరాబాద్లోని క్రిన్స్విల్లాస్లో సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని ఉంచారు. కేటీఆర్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలు, ఇతర రాజకీయ ప్రముఖులు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. -
తెలంగాణ డీజీపీ ఎదుట బండి ప్రకాశ్ సరెండర్
సాక్షి, హైదరాబాద్: మావోయిస్ట్ పార్టీ కీలక నేత బండి ప్రకాష్ తెలంగాణ డీజీపీ శివధర్రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. ఆశన్న లొంగుబాటు సమయంలోనే ప్రకాశ్ కూడా లొంగిపోతారనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. బండి ప్రకాశ్ అలియాస్ ప్రభాత్, అశోక్, క్రాంతి.. స్వస్థలం మంచిర్యాల జిల్లా మందమర్రి. ప్రకాశ్ తండ్రి సింగరేణి కార్మికుడు. 1982–84 మధ్య గో టు ద విలేజెస్ ఉద్యమం ద్వారా రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (RSU) తరఫున పోరాడారు. ఆపై మావోయిస్ట్ పార్టీ అనుబంధ సంస్థ సింగరేణి కార్మిక సంఘం అధ్యక్షుడిగా, అక్కడి నుంచి రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎదిగాడు. అనారోగ్య కారణాలతో ఆయన లొంగిపోయారని తెలుస్తోంది.మావోయిస్టులు లొంగిపోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కొందరు లొంగిపోయారని.. మిగతా వాళ్లు కూడా జనజీవన స్రవంతిలో కలిసి దేశాభివృద్ధిలో భాగం కావాలని కోరారాయన. అదే సమయంలో.. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ కగార్ ప్రభావంతో ఆ పార్టీ కీలక సభ్యులు తమ దళాలతో వరుసగా లొంగిపోతున్నారు. మావోయిస్ట్ పార్టీ లో నేషనల్ పార్క్ ఏరియా అత్యంత కీలక ఆర్గనైజర్ బండి ప్రకాశ్. గత 45 ఏళ్లుగా వివిధ స్థాయిల్లో పని చేసిన ఆయన లొంగిపోవడం.. ఆ పార్టీకి భారీ దెబ్బే అని చెప్పొచ్చు. -
తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని మీరు సందర్శించారా? (ఫొటోలు)
-
Cyclone Montha: తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు!
సాక్షి, హైదరాబాద్: మోంథా తీవ్ర తుపాను కారణంగా సోమవారం నుంచి తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే రెడ్ అలర్ట్ జారీ చేసిన నాలుగు జిల్లాల్లో ఇవాళ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మోంథా ప్రభావంతో ఇవాళ మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, జనగామ, ఖమ్మం, కొమురంభీం, మంచిర్యాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడొచ్చని, అలాగే.. సిద్ధిపేట, సూర్యాపేటలో అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయని అధికారులు అంటున్నారు. హైదరాబాద్కు భారీ వర్ష సూచన నేపథ్యంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. అలాగే రేపు(బుధవారం) నాలుగు జిల్లాలకు ఆరెంజ్, 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తుపాన్ తీరం దాటే సమయంలో.. ఇటు తెలంగాణలోనూ గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ చెబుతోంది. తుపాను ప్రభావంతో మరో మూడు రోజులు వర్షాలు తప్పవని అధికారులు అంటున్నారు.మోంథా నేపథ్యంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. సమీక్ష నిర్వహించిన మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి.. అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. రైతులు నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచిస్తూనే.. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.క్లిక్ చేయండి: కాకినాడకు చేరువలో మోంథా.. బీభత్సం చూశారా? -
కోతిని మింగిన కొండచిలువ
పెద్దపల్లి జిల్లా(మంథని): పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం కేశనపల్లి గ్రామంలో ఓ కొండచిలువ కోతిని మింగి మిగతా వాటి దాడిలో హతమైంది. గ్రామానికి చెందిన చొప్పరి రవి నివాసం ఎదుట సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామశివారులోని చెట్లపొదల్లోంచి జనావాసాల్లోకి చేరుకున్న ఓ కొండచిలువకు కోతుల గుంపు కనిపించింది. దీంతో వాటివైపు కదిలిన కొండచిలువ.. తొలుత చిన్నకోతిపిల్లను మిగింది. మరో పెద్దకోతిని మింగేందుకు యత్నించగా.. బిగ్గరగా అరిచింది. దీంతో సమీపంలోని సుమారు కోతులు గల గుంపు ఒక్కసారిగా వచ్చి కొండచిలువపై దాడిచేశాయి. ఆ దాడిలో కొండచిలువ చనిపోగా పెద్దకోతి ప్రాణాలతో బయటపడింది. కొండచిలువ భయానికి స్థానికులెవరూ అటువైపు వెళ్లలేదు. సమాచారం అంతుకున్న బేగంపేట ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నర్సయ్య, బీట్ ఆఫీసర్ పవన్కుమార్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. కొండచిలువ పొడవు 6 అడుగులు ఉందని అధికారులు తెలిపారు. దానికి పంచనాబా చేసి అటవీప్రాంతంలో పూడ్చిపెట్టినట్లు వివరించారు. హార్వెస్టర్లో పడి కొండచిలువ హతంచందుర్తి(వేములవాడ): వరికోత కోస్తుండగా హార్వెస్టర్లో పడి కొండచిలువ హతమైంది. చందుర్తి మండలం కట్టలింగంపేటకు చెందిన రైతు యెల్ల నరేశ్కు చెందిన వరి పొలం కోస్తుండగా హార్వెస్టర్లో కొండచిలువ చిక్కి మిషన్ ఆగిపోయింది. మిషన్లో చిక్కిన గడ్డిని తొలగిస్తుండగా.. ఆ గడ్డిలోనే కొండచిలువ ప్రత్యక్షమైంది. దీంతో అక్కడే ఉన్న రైతులు పెద్ద కొండచిలువ అంటూ పరుగులు పెట్టారు. ఆపరేటర్ మిషన్లో చిక్కిన కొండచిలువను తొలగించారు. -
చెల్లిని ఇవ్వొద్దు..
తిరుమలగిరి(నాగార్జునసాగర్): ఆడ శిశువు పుట్టిన పదిరోజులకే గిరిజన దంపతులు విక్రయించారు. వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలం యల్లాపురంతండాకు చెందిన కొర్ర బాబు–పార్వతి దంపతులు నల్లగొండలో కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. పార్వతి మొదటి కాన్పు 2016లో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఉమ్మనీరు అధికంగా తాగడంతో పుట్టినబాబు అదే రోజున మృతిచెందాడు. ఆ తర్వాత పార్వతి రెండు, మూడు కాన్పుల్లోనూ ఆడపిల్లలకు జన్మనిచ్చింది. వారసుడి కోసం పార్వతి నాలుగోసారి గర్భం దాల్చింది.పది రోజుల క్రితం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించగా.. మళ్లీ ఆడపిల్లే జన్మించింది. అయితే ముగ్గురు ఆడపిల్లలను సాకలేమని భావించిన ఆ దంపతులు ఆ శిశువు అమ్మకానికి సిద్ధమయ్యారు. మధ్యవర్తుల ద్వారా గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన దంపతులకు ఆడశిశువును రూ.3 లక్షలకు రెండు రోజుల క్రితం విక్రయించారు. బాబు–పార్వతి దంపతులు శిశువును విక్రయిస్తుండగా.. వారి కుమార్తెలు చెల్లిని ఇవ్వొద్దంటూ గుక్కపట్టి ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అమ్మా, నాన్న చెల్లిని ఇవ్వకండి అంటూ ఏడుస్తున్న వీడియో చూసిన ప్రతి ఒక్కరి మనసు కలిచివేసింది. ఆ తర్వాత పార్వతి తన పుట్టినిల్లు పెద్దవూర మండలం ఊరబావితండాకు వెళ్లింది. శిశువుని విక్రయించిన విషయం కొర్ర బాబు అన్న సురేశ్నాయక్కు తెలియడంతో ఆ చిన్నారిని మనమే సాకుదామని విక్రయించిన శిశువును తిరిగి తీసుకురావాలని కుటుంబ సభ్యులపై ఒత్తిడి తీసుకొచ్చాడు. ఈ క్రమంలోనే విషయం అంగన్వాడీ అధికారుల దృష్టికి వెళ్లింది. అధికారులు వారి ఇంటికి వచ్చి వివరాలు సేకరించారు. -
జాక్పాట్ కొట్టిన నల్లగొండ దంపతులు
సాక్షి, హైదరాబాద్,సూర్యాపేట టౌన్: వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన రాజేశ్వర్రావు, సాంబలక్ష్మి దంపతులు ఈసారి మద్యం దుకాణాల్లో జాక్పాట్ కొట్టారు. లక్కీడ్రాలో రాజేశ్వర్రావు, సాంబ లక్ష్మిలకు చెరో దుకాణం మంజూరైంది. 25 ఏళ్లుగా మద్యం వ్యాపారంలో ఉంటున్న వీరు ఈసారి కూడా టెండర్లు దాఖలు చేశారు. జి.సాంబలక్ష్మి నర్సంపేట –5 నంబర్ దుకాణం దక్కించుకోగా భర్త జి.రాజేశ్వర్రావు ఆత్మకూర్–38 షాపు లాటరీ డ్రాలో విజేతగా నిలిచాడు. కాగా, రెండు షాపులు దక్కడం అదృష్టంగా భావిస్తున్నామని భార్యాభర్తలు తెలిపారు. వందలో ఒక్కడు.. హనుమకొండ జిల్లా నడికూడ మండల పరిధిలోని 14 గ్రామాలకు కలిపి ఒకే వైన్షాపు ఉంది. ఈ దుకాణానికి 100 అప్లికేషన్లు వచ్చాయి. సోమవారం లాటరీ పద్ధతిలో డ్రా తీయగా 100 అప్లికేషన్ల నుంచి జి.రమణారెడ్డి అనే వ్యక్తికి లక్కు తగిలింది. వందలో ఒక్కడు అంటూ ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. భార్యాభర్తలను వరించిన అదృష్టం మద్యం దుకాణాల టెండర్ల డ్రాలో భార్యాభర్తలను అదృష్టం వరించింది. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం లక్ష్మీదేవిగూడెం గ్రామానికి చెందిన ఎలికట్టి భరత్, ఆయన భార్య శ్రావణి సూర్యాపేట పట్టణంలో చెరో మద్యం షాపును దక్కించుకున్నారు. ఒకే ఇంట్లో ముగ్గురికి.. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రానికి చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురికి మద్యం దుకాణాలు దక్కాయి. మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి గిలకత్తుల ఉప్పల మల్లయ్యకు సూర్యాపేటలో, ఆయన కుమారుడు నవీన్కు మద్దిరాలలో, కోడలు సృజనకు తిరుమలగిరిలోని వైన్ షాపులు డ్రాలో వచ్చాయి. ఉప్పల మల్లయ్య కొన్ని సంవత్సరాలుగా మద్యం వ్యాపారంలోనే ఉన్నారు. 2,601 మద్యం దుకాణాల డ్రా... తెలంగాణలో రెండేళ్లపాటు మద్యం దుకాణాలు నడుపుకోవడానికి దరఖాస్తు చేసుకున్న వారికి సంబంధించి జిల్లాల కలెక్టర్ల సమక్షంలో డ్రా తీశారు. మొత్తం 2,620 దుకాణాల కోసం దరఖాస్తులు ఆహ్వానించారు. కాగా అందులో 2,601 దుకాణాలకు డ్రా తీసి గెలుపొందిన వారికి అనుమతినిచ్చారు. డ్రా సమయంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి. 2,620 దుకాణాలకు మొత్తం 95,137 దరఖాస్తులు రాగా, ఒక్కో దరఖాస్తుకు ఫీజు కింద రూ.3 లక్షల లెక్కన రూ. 28.54 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. ఎలాంటి ఉద్రిక్త ఘటనలు జరుగకుండా డ్రా ప్రక్రియ ముగియడంపై ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ యంత్రాంగాన్ని అభినందించారు. కాగా, మిగిలిన 19 మద్యం దుకాణాలకు మంగళవారం నోటిఫికేషన్ జారీ చేయడంతోపాటు దరఖాస్తులు తీసుకుంటామని అధికారులు తెలిపారు. నవంబర్ 1 వరకు మద్యం షాపులకు దరఖాస్తుల స్వీకరణ, నవంబర్ 3న 19 మద్యం షాపులకు డ్రా తీయనున్నట్లు ఎౖMð్సజ్ ఉన్నతాధికారి పేర్కొన్నారు.ప్రభుత్వ టీచర్కుమద్యం దుకాణం.. విచారణ చేస్తామన్న డీఈఓ మహబూబ్నగర్ క్రైం: మద్యం దుకాణాల కేటాయింపు లక్కీడిప్లో ఓ ప్రభుత్వ టీచర్కు మద్యం దుకాణం దక్కింది. మహబూబ్నగర్ కలెక్టరేట్లో కలెక్టర్ విజయేందిర బోయి ఆధ్వర్యంలో ఏ4 మద్యం దుకాణాలకు లక్కీడిప్ నిర్వహించారు. ఇందులో గెజిట్ నంబర్ 16వ దుకాణానికి లక్కీడిప్ తీసిన క్రమంలో 17వ టోకెన్ నంబర్ కలిగిన బి.పుష్ప అనే ప్రభుత్వ పీఈటీ ఉపాధ్యాయురాలికి దుకాణం వచ్చింది. ఆమె ప్రస్తుతం జిల్లాకేంద్రంలోని రాంనగర్ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నారు. ఈ విషయంపై డీఈఓ ప్రవీణ్కుమార్ను వివరణ కోరగా, సీసీఏ నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి ఎలాంటి వ్యాపారాలు చేయరాదని, ఒకవేళ చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. విచారణ నివేదిక ఉన్నతాధికారులకు అందజేస్తామని డీఈఓ తెలిపారు. -
హరీష్రావుకు పితృవియోగం.. రాజకీయ ప్రముఖుల సంతాపం
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్రావు ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణ ఈ వేకువజామున కన్నుమూశారు. దీంతో హైదరాబాద్లోని క్రిన్స్విల్లాస్లో సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని ఉంచారు. కేసీఆర్ సంతాపం హైదరాబాద్లోని క్రిన్స్విల్లాస్లో హరీష్రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు భౌతిక కాయానికి బీఆర్ఎస్ అధినేత..మాజీ సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. తన బావ సత్యనారాయణరావుతో (కేసీఆర్ 7వ సోదరి (అక్క) లక్ష్మి భర్త)తన అనుబంధాన్ని స్మరించుకున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.సీఎం రేవంత్ సంతాపంహరీష్రావు తండ్రి సత్యనారాయణ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. ఒక ప్రకటనలో హరీష్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.హరీష్ కుటుంబానికి కవిత సానుభూతిమాజీ మంత్రి హరీశ్ రావు గారి తండ్రి సత్యనారాయణ రావు మృతికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. హరీశ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.మంచి వ్యక్తి: బండి సంజయ్మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మృతి పట్ల కేంద్ర మంత్రి బండి సంజయ్ సంతాప ప్రకటన విడుదల చేశారు. సత్యనారాయణ చాలా మంచి వ్యక్తి. రాజకీయాలతో సంబంధం లేకుండా ఆయనతో ఎంతో కాలంగా నాకు సాన్నిహిత్యముంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. హరీష్ రావు కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని అమ్మ వారిని వేడుకుంటున్నా’ అని బండి సంజయ్ ఆ ప్రకటనలో తెలిపారు. -
తుమ్మిడిహెట్టి–సుందిళ్ల అనుసంధానం
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణలో భాగంగా తుమ్మిడిహెట్టి నుంచి సుందిళ్ల బరాజ్కు నీటిని తరలించాలనే ప్రత్యామ్నాయ అలైన్మెంట్ను ఖరారు చేసే అంశంపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. తక్కువ వ్యయం, సాంకేతిక సుస్థిరత, పర్యావరణ అనుకూల మార్గాలపై ఇప్పటికే అధ్యయనం జరపగా, తుమ్మిడిహెట్టి–సుందిళ్ల బరాజ్ అనుసంధానం అత్యుత్తమ ప్రత్యామ్నాయంగా తేలిందన్నారు. దీంతో ప్రాజెక్టు నిర్మాణ ఖర్చు 10–12 శాతం తగ్గడంతోపాటు భూసేకరణ వ్యయం సగానికి తగ్గి చివరకు రూ.1,500–1,600 కోట్ల భారం తగ్గుతుందన్నారు. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటిని తరలించాలనే పాత అలైన్మెంట్ను అనుసరిస్తే బొగ్గు నిక్షేపాలున్న భూముల గుండా సొరంగం తవ్వకాలు జరపడం ప్రమాదకరమని చెప్పారు. కొత్త అలైన్మెంట్తో ఇలాంటి భౌగోళిక ప్రతికూలతలను నివారించడంతోపాటు కాల్వ, సొరంగాల పొడవూ తగ్గి వ్యయభారం తగ్గుతుందన్నారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణపై సోమవారం సచివాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షించారు. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న ఈ ప్రాజెక్టును పటిష్ట సాంకేతికత, ఆర్థిక సుస్థిరత, పర్యావరణ అనుకూల పద్ధతుల్లో నిర్మించి ఎత్తయిన ప్రాంతంలో ఉన్న కరువు పీడిత ప్రాంతాలకు గోదావరి జలాలను సరఫరా చేయడమే తమ లక్ష్యమన్నారు. కొత్త అలైన్మెంట్కు సంబంధించి సాంకేతిక, ఆర్థిక అధ్యయనాలన్నీ పూర్తయిన తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. క్షేత్ర స్థాయిలో మళ్లీ జియోఫిజికల్, జియోటెక్నికల్ అధ్యయనాలు జరిపిన గతంలో జరిపిన సర్వేల సరిపోల్చుకుని చూడాలన్నారు. ప్రత్యామ్నాయ అలైన్మెంట్తో గ్రావిటీ కాల్వ పొడవు 30 కి.మీ.ల నుంచి 13 కి.మీ.లకి, సొరంగం పొడవు 14 కి.మీ.ల నుంచి 10 కి.మీ.లకి, పంప్హౌస్ల సంఖ్య 15 నుంచి10 కి తగ్గుతాయని అధికారులు వివరించారు. కేవలం వ్యయం తగ్గింపే లక్ష్యం కాకుండా తరతరాలకు ఉపయోగపడేలా దీర్ఘకాలం మన్నిక కలిగి తక్కువ విద్యుత్ అవసరాలుండే ప్రాజెక్టు కోసం డిజైన్లు రూపొందించాలని మంత్రి ఆదేశించారు. అధ్యయనాలను సమగ్రంగా పూర్తి చేశాకే ప్రాజెక్టు సవరణ డీపీఆర్ను రూపొందించాలని చెప్పారు. డీపీఆర్ను మంత్రివర్గం ముందు ఉంచి ఆమోదిస్తామన్నారు. త్వరలో మహారాష్ట్రతో సంప్రదింపులు సాధ్యమైనంత ఎక్కువ ఎత్తులో తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మిస్తే కాల్వలకు గ్రావిటీతో నీళ్లు అందుతాయని మంత్రి ఉత్తమ్ అన్నారు. ఇందుకోసం మహారాష్ట్ర సమ్మతి తీసుకోవడానికి తగిన సమయంలో సంప్రదింపులు ప్రారంభిస్తామని చెప్పారు. గతంలో ఎత్తు తగ్గించడంతో నీటి మళ్లింపు సామర్థ్యం తగ్గిపోయిందన్నారు. సమ్మక్క–సారక్క, సీతమ్మసాగర్, సీతారామ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ నిర్మాణం, ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్ల పునరుద్ధరణ పనుల నిర్వహణ, జలాశయాల్లో పూడిక తొలగింపు, దేవాదుల ప్రాజెక్టు పురోగతి, ఎస్ఎల్బీసీ సొరంగం తవ్వకాల పునరుద్ధరణ, సింగూరు కాల్వ లైనింగ్ తదితర అంశాలపై ఈ సమీక్షలో మంత్రి చర్చించారు. కోర్టు కేసులు, ఎన్జీటీ కేసులను సత్వరంగా పరిష్కరించాలని ఆదేశించారు. -
ఒక్కసారి కాదు.. పదిసార్లు అంటా
సాక్షి, హైదరాబాద్: రేవంత్రెడ్డి మంత్రివర్గం కచ్చితంగా దండుపాళ్యం ముఠాయేనని మాజీమంత్రి టి.హరీశ్రావు మరోమారు విమర్శించారు. ఇదే విషయాన్ని ఒక్కసారి కాదు..పదిసార్లు అయినా అంటానని, ఉన్న విషయం మాట్లాడితే కొందరు మంత్రులు ఉలిక్కి పడుతున్నారని మండిపడ్డారు. మంత్రుల మధ్య పంచాయితీల పరిష్కారం కోసమే కేబినెట్ సమావేశాలు పెట్టుకుంటున్నారా అని ప్రశ్నించారు. దక్కన్ సిమెంట్స్ కంపెనీ యాజమాన్యాన్ని తుపాకీతో బెదిరించిన వ్యవహారంలో నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందా అని నిలదీశారు.నిర్మల్ నియోజకవర్గ బీజేపీ నేత సిందే దీక్షిత్ తన అనుచరులతో కలిసి సోమవారం తెలంగాణభవన్ వేదికగా బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో హరీశ్రావు మాట్లాడారు. ‘అన్ని వర్గాల ప్రజలు రేవంత్ పాలనపై ఆగ్రహంతో ఉన్నారు. ప్రజల అభిప్రాయాలకు అనుగు ణంగా బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజాక్షేత్రంలో పరుగులు పెట్టాలి’అని పిలుపునిచ్చారు. అనంతరం జరిగిన రజక సంఘం సమావేశంలోనూ హరీశ్రావు మాట్లాడారు. రేవంత్ రెండేళ్లలో విపక్షాలను దుర్భాషలాడటం మినహా రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. అడ్డమైన భాషతో అధికారంలోకి వచ్చాడని, ప్రస్తుతం ప్రజలు కూడా అదే భాషతో సీఎంపై తిరుగుబాటు చేస్తున్నారని చెప్పారు. ఓట్లు చీల్చేందుకు కాంగ్రెస్ కుట్రలు ‘జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో చపాతీ మేకర్, రోడ్ రోలర్ వంటి గుర్తులతో అభ్యర్థులను పెట్టి కాంగ్రెస్ ఓట్లు చీల్చే ప్రయత్నం చేస్తుంది. అయినా ఉప ఎన్నికలో కాంగ్రెస్ కుట్రలను ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. రాష్ట్రంలోని ప్రతీ మహిళకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.60 వేలు బాకీ పడింది. అధికారంలోకి వచ్చేందుకు అలవికాని హామీలు ఇచ్చిన రేవంత్ వాటిని నెరవేర్చకుండా అన్ని వర్గాలను మోసం చేశాడు. మద్యం ధరలను పెంచి ప్రజల నుంచి విచ్చలవిడిగా డబ్బు దండుకుంటున్నారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఓటమితోనే తెలంగాణకు లాభం జరుగుతుంది’అని హరీశ్రావు పేర్కొన్నారు. -
హరీశ్రావు.. దమ్ముంటే చర్చకు రా..
సాక్షి, హైదరాబాద్: పదేళ్ల పాటు రాష్ట్రాన్ని ఇష్టానుసారంగా దోచుకొని, దాచుకొని ఇప్పుడు రాష్ట్ర కేబినెట్ను ‘దండుపాళ్యం బ్యాచ్’అంటారా అని మాజీమంత్రి హరీశ్రావుపై సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ నిప్పులు చెరిగారు. మంత్రివర్గం, సీఎం రేవంత్రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై హరీశ్రావు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సోమవారం మంత్రుల సముదాయంలో ఎమ్మెల్యేలు నాగరాజు, వేముల వీరేశం, మందుల సామేల్, ఎమ్మెల్సీలు బల్మూరు వెంకట్, అద్దంకి దయాకర్, ఎంపీ అనిల్యాదవ్లతో కలిసి మీడియాతో మంత్రి అడ్లూరి మాట్లాడారు.మీ మామ, మీరు.. నీ బామ్మర్దులు దండుపాళ్యం ముఠా నాయకులని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని దోచు కున్న మీరే ‘స్టువర్ట్పురం దొంగలకు మించిన బందిపోట్లు’అని ఘాటుగా విమర్శించారు. మీ మంత్రివర్గంలో ఎంతమంది ఉన్నా, మీ ముగ్గురే నడిపించారని, అదే సీఎం రేవంత్రెడ్డి కేబినెట్లో దళితులు, బలహీనవర్గాలు ఉన్న కేబినెట్ను అవమానిస్తావా అని ప్రశ్నించారు. కేబినెట్పై మా ట్లాడిన హరీశ్రావును సిద్దిపేట దేవాలయంలో చర్చకు రావాలని సవాల్ విసిరితే రాకుండా తోక ముడిచారని మంత్రి అడ్లూరి అన్నారు. మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, ఎవరినో పంపడం కాదు..నీకు దమ్మూ ధైర్యం ఉంటే చర్చకు నువ్వేరా.. ప్రజల ముందే చర్చిద్దామని సవాల్ విసిరారు. ⇒ బీఆర్ఎస్ దండుపాళ్యం బ్యాచ్కు నాయకుడు హరీశ్రావేనని మందుల సామేల్ అన్నారు. కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో ప్రతి పనిలో దోచుకున్నార న్నారు. నాగరాజు మాట్లాడుతూ మీరు చేసిన పనులకు లలిత్మోదీ, విజయ్ మాల్యలు కూడా మిమ్మల్ని చూసి సిగ్గుపడుతున్నారన్నారు. వేముల వీరేశం మాట్లాడుతూ మంత్రి అడ్లూరి సవాల్ ను స్వీకరించకుండా హరీశ్రావు పారిపోయారని చెప్పారు. అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్లు మాట్లాడుతూ కేసీఆర్ అడ్రస్లేదని, వస్తారో లేదో కూడా తెలవదని ఎద్దేవా చేశారు. ఎంపీ అనిల్ మాట్లాడుతూ ప్రజలను మో సం చేస్తే సరైన తీర్పు ఇస్తారన్నారు. -
సైబర్ అటాక్స్ తప్పించే వారేరీ?
సాక్షి, హైదరాబాద్: సైబర్ హ్యాకర్లు కొత్త సాంకేతికతను ఉపయోగించుకుంటూ దాడులకు తెగబడుతుండగా దీన్ని అధిగమించేందుకు సైబర్ భద్రతా నిపుణుల కొరత పెద్ద సమస్యగా మారుతోందని తాజా నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ ఉద్యోగుల ఖాళీలు 48 లక్షలకు చేరుకున్నాయని తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఇది 19% ఎక్కువని పేర్కొంది. ముఖ్యంగా భారత కంపెనీలు, సంస్థలు వారానికి సగటున 3,233 సైబర్ దాడులను ఎదుర్కొంటున్నట్లు చెక్ పాయింట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ నివేదిక వెల్లడించింది. అలాగే విద్యా రంగం వారానికి 7,095, ప్రభుత్వ శాఖలు, అనుబంధ విభాగాలపై 5,140, వినియోగదారుల వస్తువులు, సేవలు లక్ష్యంగా 3,889 సైబర్ దాడులు జరుగుతున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆన్లైన్ సేవలు ఉపయోగించుకునే వినియోగదారులే లక్ష్యంగా హ్యాకర్లు వారి కార్యకలాపాలను ఆటోమేట్ చేయడానికి కృత్రిమ మేధను ఎక్కువగా ఉపయోగిస్తుండటంతో వాటిని గుర్తించడం కష్టతరంగా మారుతోందని సైబర్ నిపుణులు చెబుతున్నారు. కంపెనీలకు పెరుగుతున్న ‘భద్రత’ ఖర్చు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, బీమా రంగాలు, రిటైల్, హెల్త్కేర్, తయారీ రంగాల్లో సైబర్ సెక్యూరిటీ నిపుణుల అవసరం వేగంగా పెరుగుతోందని చెక్ పాయింట్ సంస్థ పేర్కొంది. భారత్లో దాదాపు 10 లక్షల మంది సైబర్ భద్రతా నిపుణులకు డిమాండ్ ఉండగా ప్రస్తుతం 5 లక్షల మంది సైబర్ నిపుణులే అందుబాటులో ఉన్నారని తెలిపింది. ఈ నైపుణ్యాల అంతరం భద్రతా ఉల్లంఘనల ప్రమాదాన్ని పెంచడంతోపాటు ఆయా కంపెనీలు, సంస్థల నిర్వహణా ఖర్చులు కూడా భారీగా పెరిగేందుకు కారణమవుతోందని విశ్లేషించింది. అక్టోబర్ నెలను సైబర్ భద్రతా అవగాహన మాసంగా పాటిస్తుండగా...ఈ నెల ముగింపు నేపథ్యంలో దేశంలో డిజిటల్ భద్రత, నైపుణ్యాల తక్షణ అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.ఏ నైపుణ్యాలకు అధిక డిమాండ్ అంటే.. – ఏఐ, మెషీన్ లెరి్నంగ్ సెక్యూరిటీ – క్లౌడ్ కంప్యూటింగ్ – డిజిటల్ ఫోరెన్సిక్స్ – ఆటోమేషన్ నైపుణ్యం, అప్లికేషన్ భద్రతా పరీక్షఏఐ ఆధారిత నిఘా పెంచాలి.. డిజిటల్ ప్రపంచం మరింత వేగం సంతరించుకోవడంతో ఆర్థిక సేవలు, విద్యుత్ తదితర రంగాలకు చెందిన సంస్థలు హ్యాకర్లకు కీలక లక్ష్యాలుగా మారతాయి. ఈ నేపథ్యంలో సంస్థలన్నీ ఏఐ–ఆధారిత నిఘా, పర్యవేక్షణ విధానాలను అవలంబించాలి. డీప్ ఫేక్ ముప్పు గురించి ఉద్యోగులకు అవగాహన కల్పించాలి. సైబర్ దాడులను తిప్పికొట్టే శక్తివంతమైన ప్రతిస్పందన ప్రణాళికలను రూపొందించాలి – సైబర్ భద్రతా నిపుణులు ప్రపంచ దేశాల్లో ఇటీవల జరిగిన సైబర్ దాడులు ఇలా.. అమెరికాకు చెందిన జివెట్ కామెరాన్ ట్రేడింగ్ కంపెనీపై హ్యాకర్లు దాడి చేసి 35 వేల మంది వినియోగదారుల సమాచారాన్ని తస్కరించడంతో ఆ సంస్థ ట్రేడింగ్లో తీవ్రంగా నష్టపోయింది. – జపాన్కు చెందిన ఈ–కామర్స్ సంస్థ ‘ఆస్కల్’ సైబర్ దాడికి గురవడంతో తమ ఆన్లైన్ ఆర్డర్లన్నింటినీ రద్దు చేసుకోవాల్సి వచ్చింది. – యూరప్కు చెందిన వివిధ రక్షణరంగ కంపెనీలపై జరిగిన ఫిషింగ్ అటాక్ వల్ల ఆయా సంస్థల యూఏవీలు, డ్రోన్ల డిజైన్లు, కీలక ఆయుధాల వివరాలు లీక్ అయ్యాయి. – కెనడాకు చెందిన ఆట»ొమ్మల సంస్థ ‘టాయ్స్ఆర్అజ్’పై సైబర్ నేరస్తులు దాడి చేసి వినియోగదారుల సమాచారాన్ని దొంగిలించి డార్క్ వెబ్లో విక్రయించారు. వీటికి ముప్పు ఎక్కువ.. ⇒ తగినంత మంది సైబర్ నిపుణులు లేని సంస్థలు డేటా ఉల్లంఘనలు, గోప్యతా ఉల్లంఘనలు, ఆర్థిక మోసాలకు ఎక్కువగా గురవుతాయి. ⇒ తప్పుడు కాన్ఫిగరేషన్లు, అసురక్షిత ఏపీఐ (అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్) కారణంగా క్లౌడ్ వాతావరణాలు ఎక్కువగా ప్రమాదంలో పడతాయి. -
ఆటో ఓనర్లు.. డ్రైవర్లుగా మారుతున్నారు
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్/శ్రీనగర్కాలనీ: ఆటో కార్మికుల ఆత్మహత్యలకు కాంగ్రెస్ పాలన కారణమని, ఆత్మహత్యలకు పాల్పడిన ఆటో డ్రైవర్ల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ‘ఆటో అన్నతో మాట ముచ్చట’పేరిట సోమవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావుతోపాటు పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు ఆటోల్లో ప్రయాణించి కార్మికుల సమస్యలు తెలుసుకున్నారు. గతంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రయాణించిన ఆటో కార్మికుడు మష్రత్ అలీ ఆటోలో కేటీఆర్ ప్రయాణించారు.జూబ్లీహిల్స్ చెక్పోస్టు నుంచి తెలంగాణ భవన్ వరకు ఆటోలో ప్రయాణించిన కేటీఆర్.. పార్టీ కార్యాలయంలో ఆటో డ్రైవర్లతో భేటీ అయ్యారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఆటో డ్రైవర్ల పరిస్థితి దిగజారిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తాను రెండు ఆటోల యజమాని అని, అయితే ప్రస్తుతం వాటిని అమ్ముకుని అద్దె ఆటోను నడుపుతున్నానని ఆటో డ్రైవర్ మష్రత్ అలీ.. కేటీఆర్కు వివరించారు. కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ పాలనలో 161 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని, వారి కుటుంబాలకు రూ.10 లక్షలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఆటో కార్మికులకు ఏటా రూ.12 వేలు చెల్లించాలన్నారు. ఆటో డ్రైవర్లకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. హరీశ్.. కోకాపేట నుంచి ఎర్రగడ్డ వరకు ‘ఆటో అన్నతో మాట ముచ్చట’లో భాగంగా మాజీ మంత్రి హరీశ్రావు తన కోకాపేట నివాసం నుంచి ఎర్రగడ్డకు, అక్కడ నుంచి తెలంగాణ భవన్కు ఆటోలో చేరుకున్నారు. మహాలక్ష్మి ఉచిత బస్సు పథకంతో తమకు రోజూవారీ ఆదాయం తగ్గి ఇబ్బందులు పడుతున్నామని ఆటో కార్మికులు హరీశ్తో తమ ఆవేదన పంచుకున్నారు.నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆటో ప్రయాణం చేసిన వారిలో మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, కొప్పుల ఈశ్వర్ ఉన్నారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు కేపీ వివేక్, డాక్టర్ కె.సంజయ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ముఠా గోపాల్, మాధవరం కృష్ణారావు, కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, శంభీపూర్ రాజు తదితరులు ఆటోల్లో ప్రయాణించి కార్మికులతో సంభాషించారు. -
అన్ని బస్సుల్లోనూ అగ్నిమాపక పరికరాలు
సాక్షి, హైదరాబాద్: ఏపీలో తాజాగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సుకు మంటలంటుకొని 19 మంది సజీవదహనమైన నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ అప్రమత్తమైంది. ఈ తరహా ప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడు ప్రయా ణికులు వీలైనంత వేగంగా తప్పించుకునేలా వారిలో అవగాహన కల్పించే ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రయాణికులకు వివరించాలని డ్రైవర్లకు ప్రత్యేక సూచనలు జారీ చేసింది. మంగళవారం నుంచి ఈ ప్రక్రియ అమలు కానుంది. అలాగే పల్లె వెలుగు సహా అన్ని రకాల బస్సుల్లో అగ్నిమాపక పరికరా లను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది.ఎయిర్ హోస్టెస్ తరహాలో...: విమానం బయలుదేరే ముందు ఎయిర్ హోస్టెస్ ప్రయాణికులను విధిగా అప్రమత్తం చేస్తారు. విమానంలోని అత్యవసర మార్గాలు, ఆక్సిజన్ మాస్కులను ధరించాల్సిన విధానం, లైఫ్ జాకెట్ పొందే తీరు, అందులో గాలి నింపే పద్ధతి.. ఇలా అన్ని అంశాలనూ ప్రయాణికులకు వివరిస్తారు. ఇదే తరహాలో ఇకపై బస్సు డ్రైవర్లు కూడా ప్రారంభ స్టేషన్లో ప్రయాణికులకు కొన్ని సూచనలు చేయనున్నారు. తొలుత తనను తాను పరిచయం చేసుకొని ఆపై కండక్టర్ పేరు వెల్లడిస్తారు. అలాగే బస్సు ఎప్పుడు బయలుదేరి తుది గమ్యం ఏ వేళకు చేరుకుంటుందో వివరిస్తారు. బస్సులో అగ్నిమాపక పరికరాలను ఉంచిన ప్రదేశం.. వాటిని వాడే విధానం.. అత్యవసర తలుపు ఉండే చోటు.. దాన్ని తెరిచే పద్ధతి.. అత్యవసర సమయంలో కిటికీ అద్దాలను పగలగొట్టేందుకు వాడే సుత్తిని ఎలా వాడాలో, దాన్ని బస్సులో ఎక్కడ ఉంచారో వెల్లడిస్తారు. ఏసీ బస్సుల్లో రూఫ్ హాచెస్ తెరిస్తే పొగ బయటకు వెళ్లిపోతుందని, అత్యవసర సమయాల్లో వాటి నుంచి కూడా ప్రయాణికులు బయటపడే వీలుంటందని కూడా వివరించనున్నారు. మరోవైపు ప్రస్తుతం ఏసీ బస్సుల్లోనే సుత్తులు ఉంటుండగా ఇటీవల కొన్ని సూపర్ లగ్జరీ బస్సుల్లోనూ అందుబాటులో ఉంచుతున్నారు. ఇక నుంచి ఏసీ సహా అన్ని సూపర్ లగ్జరీ బస్సుల్లో కూడా సుత్తులు, అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచనున్నారు. -
బ్యాంకు ఖాతాలు.. ఇంతింతై!
ప్రపంచవ్యాప్తంగా 100 మంది మహిళల్లో 77 మందికి బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. మన దేశం మాత్రం ఈ విషయంలో ప్రపంచ సగటు కంటే చాలా మెరుగ్గా ఉంది. ప్రపంచ బ్యాంకు ఫైండెక్స్ రిపోర్ట్–2025, సీఎంఎస్–టెలికం రిపోర్ట్–2025 ప్రకారం భారత్లో ఏకంగా 89% మంది మహిళలు బ్యాంకు ఖాతాలు నిర్వహిస్తుండడం విశేషం. ఆర్థిక కార్యకలాపాల్లోనూ అత్యధిక మహిళలు నిమగ్నమయ్యారనడానికి ఇది నిదర్శనం. ఆర్థిక విషయాలపట్ల పెరుగుతున్న అవగాహన, జన్ ధన్ ఖాతాలు, ప్రభుత్వ పథకాల తాలూకా ఆర్థిక ప్రయోజనాలు నేరుగా ఖాతాల్లోకి చేరడం.. వెరసి బ్యాంకు సేవలు అందుకుంటున్న స్త్రీల సంఖ్య పెరుగుతోంది.దేశవ్యాప్తంగా 2025 ఆగస్టు నాటికి 56 కోట్లకుపైగా ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ఖాతాలు తెరిచారు. వీటిలో 55.7 శాతం ఖాతాలు మహిళలకు చెందినవి కావడం విశేషం. ప్రపంచ బ్యాంక్ గ్లోబల్ ఫైండెక్స్ డేటాబేస్ 2025 ప్రకారం 54% భారతీయ మహిళలు తమ మొదటి బ్యాంకు ఖాతాను ప్రధానంగా ప్రభుత్వ ప్రయోజనాలు లేదా వేతనాలను పొందడానికి తెరిచారు. అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా, ప్రపంచ సగటు కంటే చాలా ఎక్కువగా 89% మంది భారతీయ మహిళలు బ్యాంకు ఖాతాను కలిగి ఉండడం గమనార్హం.తగినంత నగదు లేక..ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) పథకాల ద్వారా అందుకున్న నగదుపై మహిళల నియంత్రణ పెరిగిందని నివేదిక తెలిపింది. స్త్రీ పేరుతో ఉన్న ఆదాయం.. గృహ నిర్ణయాలలో ఆమె వాటాను పెంచుతుందని.. కుటంబ అభివృద్ధికి దోహదపడుతుందని పరిశోధనలో తేలింది. బ్యాంకు ఖాతాల విషయంలో ప్రపంచ సగటుతో పోలిస్తే మెరుగ్గా ఉన్నప్పటికీ.. ఖాతాల్లో తగినంత నగదు లేకపోవడం, తక్కువ అవసరం, అధికారిక బ్యాంకింగ్లో పాల్గొనడంలో అసౌకర్యం కారణంగా 17.5 శాతం బ్యాంకు ఖాతాలు క్రియాశీలకంగా లేవు.మరొకరిపై ఆధారం..డేటా ఖర్చులు, గోప్యత లేకపోవడం, సైబర్ మోసం భయం, సామాజిక నిబంధనల వంటివి మహిళలు మొబైల్ ఫోన్లు కొనకుండా అడ్డుకుంటున్నాయని నివేదిక తెలిపింది. సొంతంగా మొబైల్ లేకపోవడం స్వతంత్ర డిజిటల్ బ్యాంకింగ్ను పరిమితం చేస్తోంది. భారతీయ మహిళల్లో 66 శాతానికిపైగా ఇప్పటికీ ఆర్థిక లావాదేవీలు చేయడానికి పురుష బంధువులపై ఆధారపడుతున్నారట. ప్రభుత్వ పథకాలు ఆర్థిక సాధికారతకు నిజమైన సాధనంగా మారాలంటే.. మహిళల బ్యాంకు ఖాతాలలో డబ్బును జమ చేయడమేకాదు, లబ్ధిదారులకు దీర్ఘకాలిక మద్దతు అవసరమని నివేదిక వివరించింది. సబ్సిడీ స్మార్ట్ఫోన్లు, సరసమైన డేటా ప్లాన్లు.. మహిళలు తమ ఖాతాలను, డిజిటల్ చెల్లింపు సాధనాలను స్వతంత్రంగా ఉపయోగించడానికి వీలు కల్పిస్తాయి.బ్యాంకు ఖాతాలను ఉపయోగించి ఆర్థిక కార్యకలాపాల్లో మహిళల భాగస్వామ్యం (శాతాల్లో)⇒ బ్యాంకు ఖాతాలు ఉన్నవారు - 89⇒ డెబిట్ కార్డుదారులు - 30⇒ నగదు పంపడం, విత్డ్రా - 25⇒ ఖాతాలో పొదుపు - 21.2⇒ డిజిటల్ చెల్లింపులకు కార్డు/మొబైల్ వాడకం - 18.9⇒ క్రియాశీలకంగా లేని ఖాతాలు - 17.5⇒ రుణం తీసుకున్నవారు - 11.9⇒ వ్యాపారానికి రుణం - 9⇒ యుటిలిటీ బిల్లులు చెల్లించినవారు - 8.4⇒ డిజిటల్ పేమెంట్స్ చేసినవారు - 7.8మహిళలకు అందుబాటులో మొబైల్.. ఆర్థిక లావాదేవీలలో దాని వినియోగం (శాతాల్లో)⇒ ఖాతా నిల్వ పరిశీలనకు మొబైల్, ఇంటర్నెట్ వాడినవారు - 27⇒ పురుషుల సాయం లేకుండా లావాదేవీ నిర్వహించినవారు - 28⇒ కుటుంబ సభ్యులకు తన ఫోన్ ఇచ్చేవారు - 31⇒ తన పేరుతో సిమ్ ఉన్నవారు - 32⇒ ఇతరుల ఫోన్ వాడడం వల్ల సొంతంగా మొబైల్ లేనివారు - 24⇒ భద్రతా కారణాలతో సొంతంగా ఫోన్ లేనివారు - 18⇒ చదవడం, టైపింగ్ రాకపోవడం వల్ల ఫోన్ లేనివారు - 27⇒ డబ్బులు లేక మొబైల్ కొనుక్కోలేనివారు - 32⇒ టెలికం సేవలు ఖరీదు కావడం వల్ల ఫోన్ కొనలేనివారు - 38 -
‘మోంథా’ పెను ముప్పు!
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ఉగ్రరూపం దాల్చుతూ.. సాగరాన్ని చీల్చుకుంటూ.. రాష్ట్రంపై విరుచుకుపడేందుకు మోంథా తుపాను పెను ఉప్పెనలా దూసుకొస్తోంది. ఓవైపు బలమైన ఈదురు గాలులు కకావికలం చేస్తుండగా.. జడివానలు జడిపిస్తున్నాయి. రోడ్డు మార్గాలు జలమయమయ్యాయి.. రైలు మార్గాలను ముంపు ముప్పు భయపెడుతోంది. భీకర గాలులు వాయుమార్గాన్ని సైతం స్తంభింపజేస్తున్నాయి. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై తదితర ప్రాంతాల నుంచి విజయవాడ, విశాఖ, తిరుపతికి వచ్చే పలు విమానాలను పెను తుపాను కారణంగా రద్దు చేశారు. దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే జోన్ల పరిధిలో 97 రైళ్లను రద్దు చేశారు. సముద్రం అల్ల కల్లోలం కావడంతో జల రవాణా స్తంభించిపోయింది. పోర్టుల్లో సరుకు రవాణా కార్గో షిప్పులకు లంగరు వేశారు. నౌకాదళానికి చెందిన నౌకలు ప్రధాన కేంద్రాలకు చేరుకున్నాయి. కాకినాడ తీరంలో రాకాసి అలల హోరు.. తీరం వైపు దూసుకొస్తున్న మోంథా తుపాను ధాటికి రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ జిల్లా తడిసి ముద్దవగా కాకినాడ తీరంలో రాకాసి అలలు విరుచుకుపడుతున్నాయి. తీవ్ర వాయుగుండం నుంచి సోమవారం ఉదయానికి తుపానుగా మారింది. ఆగ్నేయ, పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తుపాను గంటకు 13 నుంచి 18 కిలోమీటర్ల వేగంతో ఉత్తర, వాయవ్య దిశగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాత్రి సమయానికి విశాఖకు 460 కిలోమీటర్లు, కాకినాడకు 410, చెన్నైకి 400 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. మంగళవారం ఉదయానికి ఇది తీవ్ర తుపానుగా మారి ముందుకు కదలనుంది. బుధవారం తెల్లవారు జామున కాకినాడ– అమలాపురం మధ్యలో తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రచండ వేగంతో.. తుపాను తీరాన్ని సమీపిస్తున్న కొద్దీ వేగం పెరుగుతోంది. తుపాను తీరాన్ని దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్లు, గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. విశాఖపట్నం జిల్లాలో ఎడతెగని వర్షం.. మోంథా తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర అంతటా ఎడతెగని వర్షాలు కురవగా మిగిలిన చోట్ల ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. విశాఖ నగరంతోపాటు జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురవడంతో పలుచోట్ల చెట్లు విరిగి రోడ్డుపై కూలిపోయాయి. విశాఖ రూరల్ పరిధిలోని జాతర ప్రాంగణం వద్ద 9.2 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. మధురవాడ, కాపులుప్పాడ, పెందుర్తి, సీతమ్మధార, ఎండాడ, సాగర్ నగర్, మహారాణిపేట, గోపాలపట్నం, గాజువాక, సబ్బవరం ప్రాంతాల్లో 6 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. అనకాపల్లి జిల్లా గంధవరంలో 5.8, శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం విజయరాంపురంలో 5.7 సెంటీమీటర్ల వర్షం పడింది. అంబేడ్కర్ కోనసీమ, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అన్నమయ్య జిల్లాల్లోనూ పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. కాకినాడ సముద్ర తీరంలో రెండు మీటర్లపైగా ఎత్తులో అలలు ఎగిసిపడుతున్నాయి. విశాఖ బీచ్లో కోస్టల్ బ్యాటరీ వద్ద ఎగసిపడుతున్న అలలు నేడు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. తుపాను ప్రభావంతో మంగళవారం ప్రకాశం, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు (20 సెంటీ మీటర్లకుపైగా), కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు (15 నుంచి 20 సెంటీ మీటర్లు) కురిసే అవకాశం ఉంది. తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్ కడప, చిత్తూరు, నెల్లూరు, నంద్యాల, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మిగిలిన జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రేపు కూడా కుండపోతే..! ఈ నెల 29వ తేదీన బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నంద్యాల, ప్రకాశం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీనివల్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు, కమ్యూనికేషన్ వ్యవస్థకు ఆటంకం, వరదలు, పిడుగులు, నేల కోతకు గురి కావడం, రోడ్లు దెబ్బతినడం, బలహీనమైన నిర్మాణాలు, గుడిసెలు నేలమట్టమయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. భారీ వర్షాలకు పలుచోట్ల వాగులు ఉప్పొంగి ఆకస్మిక వరదలు ముంచెత్తే ప్రమాదం ఉందని అప్రమత్తం చేసింది. అందుకనుగుణంగా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ నెల 30వ తేదీ వరకు మత్స్యకారులు వేట కోసం సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించింది. అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సరఫరాను పునరుద్ధరించేందుకు సంసిద్ధంగా ఉండాలని విద్యుత్ సంస్థలతో నిర్వహించిన సమీక్షలో సీఎస్ కె.విజయానంద్ ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా కంచిలిలో కురుస్తున్న వర్షం ప్రాణనష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు సహాయక చర్యలపై ఉత్తరాంధ్ర జిల్లాల జోనల్ ఇన్చార్జి అజయ్జైన్ మీడియాకు తెలిపారు. ఇప్పటికే 32,400 మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని.. ఐదు ఎన్డీఆర్ఎఫ్, ఆరు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. తుపాను ప్రభావిత జిల్లాల్లో 2,914 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 233 మండలాల్లోని 1,419 గ్రామాలు, 44 మున్సిపాలిటీల్లో తుపాను ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్నదాతల్లో ఆందోళన.. అన్నదాత చివరి ఆశలపై మోంథా తుపాను నీళ్లు జల్లింది. డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లావ్యాప్తంగా 1.63 లక్షల ఎకరాల్లో ఖరీఫ్లో వరి సాగు చేపట్టగా ప్రస్తుతం గింజ గట్టి పడుతున్న దశలో ఉంది. గత వారం అల్పపీడన ప్రభావంతో మూడు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు వరి చేలల్లో ముంపు నీరు చేరింది. కొబ్బరి రైతుల్లోనూ తుపాను తీవ్ర కలవరం రేపుతోంది. 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని హెచ్చరిస్తుండటంతో 1996 తుపాను గుర్తు చేసుకుని ఆందోళన చెందుతున్నారు. నేడు, రేపు 17 జిల్లాల్లో రెడ్ అలెర్ట్..ముంచుకొస్తున్న తుపాను ముప్పుతో అంతటా అప్రమత్తత నెలకొంది. మంగళ, బుధవారం 17 జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశాలుండటంతో రెడ్ అలెర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో ముందస్తు చర్యలు చేపట్టాలంటూ కేంద్ర ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో హై అలెర్ట్ ప్రకటించారు. పలు జిల్లాల్లో నాలుగు రోజులపాటు అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఉద్యోగులకు మూడు రోజుల పాటు సెలవులు రద్దు చేసి సహాయక చర్యల్లో నిమగ్నం చేశారు. పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలుతుపాను నేపథ్యంలో కాకినాడ పోర్టులో 7వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. విశాఖ, గంగవరం పోర్టుల్లో 6వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేయగా మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో 5వ నంబర్ ప్రమాద హెచ్చరికలు వెలువడ్డాయి. కళింగపట్నం, భీమునిపట్నం, వాడరేవు పోర్టుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరికలు ఎగుర వేశారు. తీర ప్రాంతాలకు సందర్శకులు రాకుండా నిషేధాజ్ఞలు జారీ చేశారు. ప్రధాన బీచ్లలో పోలీసులు, మెరైన్ సిబ్బంది పహారా కాస్తున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. కాగా రెడ్ అలెర్ట్ జారీ చేసిన జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు... ఆరెంజ్ అలెర్ట్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.తుపాను కారణంగా అలల తాకిడి పెరగడంతో విశాఖ బీచ్ రోడ్డులో కృష్ణ మందిర్ వద్ద కోతకు గురైన తీరం కోనసీమకు పెను గండం..!సాక్షి, అమలాపురం: పెను తుపాను గండం కోనసీమను వణికిస్తోంది. సముద్రం ముందుకు చొచ్చుకు రావడంతో రాకాసి అలలు రెండు, మూడు మీటర్ల ఎత్తున ఎగసిపడుతున్నాయి. ఓడలరేవు వద్ద ఓఎన్జీసీ వశిష్ట టెర్మినల్ ప్రధాన గోడను అలలు తాకుతున్నాయి. సరుగుడు తోటలు సముద్రంలో కలసిపోతున్నాయి. కాట్రేనికోన మండలం నదీపాయల మధ్య ఉన్న మగసానితిప్ప గ్రామంలోని మత్స్యకారులను బలుసుతిప్పకు తరలించి పునరావాసం కల్పించారు. లంక గ్రామాల రైతులు పాడి పశువులను మైదాన ప్రాంతాలకు తరలించారు. జిల్లాలో 120 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. భయం గుప్పెట్లో కాకినాడసాక్షి ప్రతినిధి, కాకినాడ: మోంథా తుపాను కాకినాడ సమీపంలో తీరం దాటనుందనే భారత వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లాలోని తీర ప్రాంత మండలాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. జిల్లాలోని 12 మండలాలపై ఈ తుపాను తీవ్ర ప్రభావం చూపించనుంది. ఈ నేపథ్యంలో కాకినాడ డీప్ వాటర్ పోర్టు, యాంకరేజ్ పోర్టుల్లో కార్యకలాపాలను నిలిపివేశారు. కాకినాడ–ఉప్పాడ బీచ్ రోడ్డు, బీచ్ పార్కులలో రాకపోకలను ఆపేశారు. కాకినాడ జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు ఈ నెల 29వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. జిల్లావ్యాప్తంగా 269 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. సోమవారం కాకినాడ రూరల్లోని పర్ర కాలువ వంతెనపై ప్రవహిస్తున్న నీటిలో పడి 12 ఏళ్ల బాలుడు గల్లంతయ్యాడు. రెడ్ అలెర్ట్ జిల్లాలివే..శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం.ఆరెంజ్ అలెర్ట్ జిల్లాలుశ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్ కడప, నంద్యాలఎల్లో అలెర్ట్ జిల్లాలుచిత్తూరు, కర్నూలు, శ్రీసత్యసాయి, అనంతపురంతెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు మొంథా తుఫాను ప్రభావం తెలంగాణపైనా ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్పింది. రానున్న రెండు రోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లోని కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ, అత్యంత భారీ వర్షాలు కూడా నమోదు కావొచ్చని హెచ్చరించింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు నమోదు కావొచ్చని వివరించింది. తీవ్ర తుపాను కారణంగా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈమేరకు జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకోవాలని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. 8 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ తెలంగాణలోని ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, నిర్మల్, మహబూబాబాద్... భద్రాద్రి కొత్తగూడెం,ఈ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ, అత్యంత భారీ వర్షాలు కూడా నమోదు కావొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. విమానాల రద్దు మోంథా తుపాను ప్రభావంలో విజయవాడ, విశాఖపట్నం నుంచి హైదరాబాద్, తిరుపతితోపాటు దేశంలోని వివిధ గమ్యస్థానాలకు రాకపోకలు సాగించే విమానాలను కొన్ని ఎయిర్లైన్స్ సంస్థలు ఇప్పటికే రద్దు చేశాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో 30కి పైగా విమానాల రాకపోకలపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉందని ఎయిర్పోర్టు వర్గాలు తెలిపాయి. అలాగే, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మంగళవారం, బుధవారం ప్రయాణించాల్సిన 54 రైళ్లను రద్దు చేశారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో 43 రైళ్లను రద్దు చేశారు. మొత్తం 97 రైళ్లను రద్దు చేసినట్లు ఆయా డివిజన్ల అధికారులు ప్రకటించారు. విజయవాడ డివిజన్ పరిధిలోని విజయవాడ, భీమవరం, నిడదవోలు, గుంటూరు, కాకినాడ, తెనాలి, రేపల్లె, మార్కాపురం, మచిలీపట్నం, నరసాపూర్, ఒంగోలు, రాజమహేంద్రవరం నుంచి బయలుదేరే రైళ్లను రద్దు చేసినట్లు డివిజనల్ అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులకు ఎంఎస్ఎస్ ద్వారా సమాచారం పంపామని, టికెట్ల డబ్బును వారి ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. కాగా, కాకినాడ, మచిలీపట్నం పోర్టుల్లో లోకల్ వార్నింగ్ సిగ్నల్–4 ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. తమిళనాడు, ఒడిశాలో.. తమిళనాడు, ఒడిశాలోనూ మోంథా ప్రభావం చూపుతోంది. చెన్నైతోపాటు ఉత్తర తమిళనాడులోని నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసనట్లు ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. మోంథా నేపథ్యంలో ఒడిశా కూడా అప్రమత్తమైంది. దక్షిణ ఒడిశాలో 8 జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీచేశారు. మూడువేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. -
మోంథా తుపాన్పై తెలంగాణ సర్కారు హై అలర్ట్.
Cyclone Montha: మోంధా తుపాను నేపథ్యంలో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, తుమ్మల. ప్యాడీ రక్షణకు అన్ని శాఖలు సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్యాడీ రక్షణపై దృష్టి పెట్టీ - వర్షాలతో ధాన్యం దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ ఆదేశాలు జారీ చేశారు. రైతు ప్రాధాన్యాన్ని గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ధాన్యం పై కప్పేందుకు తార్పాలిన్లు ఉపయోగించాలి, నిల్వ ఉన్న ధాన్యాన్ని తక్షణమే రైస్ మిల్లులకు తరలించాలి. పంట కోత నిలిపివేయాలి. ఇప్పటివరకు రాష్ట్రంలో 1.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. 22,433 మంది రైతులకు రూ.431 కోట్లు చెల్లించాం.రాష్ట్ర వ్యాప్తంగా 4,428 కేంద్రాలు ఇప్పటికే ప్రారంభించాం. ప్యాడీ కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలు చేస్తే కఠిన చర్యలు. రైతు నష్టపోకూడదు, ప్రభుత్వ ప్రతిష్ట దానిపైనే ఆధారపడింది. అత్యవసర పరిస్థితుల్లో తాను అందుబాటులో ఉంటాం’ అని మంత్రి ఉత్తమ్ భరోసా ఇచ్చారు. -
ప్రభుత్వ స్కూల్లో కలకలం.. బాలికల వాష్రూమ్లో సీక్రెట్ కెమెరాలు
సాక్షి, కరీంనగర్: ప్రభుత్వ పాఠశాలలో కలకలం రేపింది. బాలికల వాష్రూంలో స్కూల్ అటెండర్ రహస్యంగా కెమెరాలు అమర్చాడు. టాయిలెట్కు వెళ్లిన బాలికలకు టాయిలెట్లో కెమెరా ఉండటాన్ని గుర్తించారు. భయాందోళనకు గురైన బాలలికలు స్కూల్ హెడ్ మాస్టర్కి ఫిర్యాదు చేశారు.కరీంనగర్ పోలీసుల వివరాల మేరకు.. గంగాధర మండలం కురిక్యాల పాఠశాలలో అటెండర్గా పనిచేస్తున్న నిందితుడు కెమెరాలు పెట్టినట్లు తెలిపారు. బాలికలు మద్యాహ్న సమయంలో టాయిలెట్కు వెళ్లగా అక్కడ కెమెరాలు అమర్చినట్లు బాలికలు స్కూల్ ప్రధానోపాధ్యుడికి, తల్లిదండ్రులకు సమాచారం అందించారు. బాలికలు సమాచారంతో తల్లిదండ్రులు, స్కూల్ హెడ్ మాస్టర్ ఫిర్యాదుతో నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోక్సో కేసు నమోదు చేశారు. మరోవైపు గంగాధరలోని పాఠశాల ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ స్పందించారు. కరీంనగర్ రూరల్ ఏసీపీతో మాట్లాడారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిందితుడి వద్దనున్న వీడియోలను స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఆందోళనలో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులకు పూర్తి భరోసా కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. -
TG: ముగ్గురు ఎస్పీఎస్ అధికారులకు కన్ఫర్డ్ ఐపీఎస్లగా పదోన్నతి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సర్వీస్లకు చెందిన ముగ్గురు పోలీస్ అధికారులకు ఐపీఎస్ కన్ఫర్డ్ ఐపీఎస్ పదోన్నతి దక్కింది ఈ మేరకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం పంపింది. ముగ్గురు పోలీసు అధికారులకు కన్ఫర్డ్ ఐపీఎస్లుగా ప్రమోట్ అయిన విషయాన్ని తెలియజేసింది. వీరిలో ఎస్. శ్రీనివాస్, కే. గుణశేఖర్, డీ. సునీతలు ఉన్నారు. గతంలో సీఎం సెక్యూరిటీ వింగ్ చీఫ్గా ఎస్శ్రీనివాసన్ పనిచేశారు. కాగా, కన్ఫర్డ్ ఐపీఎస్అంటే, రాష్ట్ర పోలీసు సర్వీసులో ఉన్న అధికారులకు భారతీయ పోలీసు సేవ(IPS)లో పదోన్నతి ఇవ్వడం. ఇది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. యూపీఎస్సీ ఆధ్వర్యంలో ఒక కమిటీ సమావేశమై, అర్హత కలిగిన ఎస్పీఎస్ అధికారుల పేర్లను పరిశీలించి, ఐపీఎస్లుగా పదోన్నతి ఇవ్వాలని నిర్ణయిస్తుంది. పదోన్నతి పొందిన వారు ఐపీఎస్ అధికారులుగా గుర్తింపు పొందుతారు, -
’జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయం’
సాక్షి,హైదరాబాద్ : జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ గెలిస్తే సీఎం రేవంత్రెడ్డికి బుద్ధి వస్తుందని మాజీ మంత్రి హరీష్రావు అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై హరీష్రావు మీడియాతో మాట్లాడారు. ‘మాగంటి గోపీనాధ్ భార్యకు టికెట్ ఇవ్వడం తప్పా. మాగంటి సునీత ఏడుపును మంత్రులు రాజకీయం చేశారు. రోడ్రోలర్, చపాతీ మేకర్, సబ్బు పెట్టె గుర్తులతో జాగ్రత్త. రేవంత్రెడ్డి దింపుడు కళ్లెం ఆశతో ఇండిపెండెంట్ అభ్యర్థులను పోటీలో పెట్టారు. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయం’అని మాజీ మంత్రి హరీష్ రావు ధీమావ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్బిహార్ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ను ఈసీ విడుదల చేసింది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల 13 నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 21 వరుకు గడువు ఇచ్చింది. ఈ నెల 22న నామినేషన్ల పరిశీలన జరగనుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించింది. మాగంటి గోపీనాథ్ భార్య సునీతను బరిలోకి దించిన బీఆర్ఎస్.. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉంది.జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,99,000 కాగా, జూలై 1, 2025ను అర్హత తేదీగా తీసుకుని సవరించిన జాబితాలో 2,07,382 మంది పురుషులు, 1,91,593 మంది మహిళలు, 25 మంది ట్రాన్స్జెండర్ ఓటర్లు ఉన్నారు. లింగ నిష్పత్తి ప్రతి వెయ్యి పురుషులకు 924 మహిళలుగా ఉంది. ఈ జాబితాలో 6,106 మంది యువ ఓటర్లు (18–19 సంవత్సరాలు), 2,613 మంది వృద్ధులు (80 ఏళ్లు పైబడిన వారు), అలాగే 1,891 మంది వికలాంగులు ఉన్నారు.వీరిలో 519 మంది చూపు కోల్పోయిన వారు, 667 మంది కదలికల లోపం ఉన్న వారు, 311 మంది వినికిడి/మాట లోపం కలిగిన వారు, మిగతా 722 మంది ఇతర కేటగిరీలకు చెందినవారు. విదేశీ ఓటర్లు 95 మంది ఉన్నారు. సెప్టెంబర్ 2న విడుదలైన ప్రాథమిక జాబితాలో 3,92,669 ఓటర్లు ఉన్నారు. నిరంతర సవరణల తరువాత 6,976 మంది కొత్తగా చేర్చబడ్డారు, 663 మంది తొలగించబడ్డారు. దీంతో మొత్తం సంఖ్య 3,98,982కి చేరింది. సేవా ఓటర్లను కలుపుకుని తుది సంఖ్య 3,99,000గా నమోదైంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉపఎన్నిక నిర్వహణకు 139 కేంద్రాల్లో 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. -
Rangareddy: సెల్ టవర్ ఎక్కి.. కిందకు దూకి
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్మెట్లో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. అబ్దుల్లాపూర్మెట్లో ఉన్న సెల్ టవర్ ఎక్కి గంటకు పైగా కలకలం సృష్టించాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు.. అతన్ని కిందకు దింపే యత్నం చేసినప్పటికీ అతను కిందకు దూకేశాడు. అయితే టవర్పై నుంచి దూకే క్రమంలో టవర్కు ఉన్న కడ్డీలు తగిలి కింద బురదలో పడ్డాడు. దాంతో అతనికి తీవ్ర గాయాలవ్వగా స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతను బిహార్కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.అతన్ని కిందకు దింపే ప్రయత్నంలో భాగంగా పోలీసులు.. 108 అంబులెన్స్ సర్వీస్ను, డాక్టర్లను అక్కడ అందుబాటులో ఉంచారు. అయితే పోలీసు సిబ్బందిలో ఒకరు మెల్లగా పైకి ఎక్కి ఆ వ్యక్తిని కిందకు దింపే యత్నం చేశారు. అతన్ని పట్టుకుని పైకి లాగుదామనుకునేలోపే చేయి విదిల్చుకుని కిందకు దూకేశాడు ఆ బిహార్ వ్యక్తి. అసలు టవర్ ఎక్కి ఎందుకు దూకాలనుకున్నాడనే విషయం తెలియాల్సి ఉంది. అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. -
అమ్మో.. మలుగు బెన్
మలుగు బెన్ చేప.. ఇది అచ్చం పామును పోలి ఉంటుంది. కేవలం చిన్న వెన్నెముక మాత్రమే ఉండి శరీరం మొత్తం మాంసంతో ఉండే ఈ చేపకు మార్కెట్లో గిరాకీ ఉంది. ఓమెగా–3, ప్రొటీన్ ఉండే ఈ చేప రుచిగా ఉంటుంది. అరుదుగా కనిపించే ఈ చేపలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం కాజీపేట మార్కెట్లో లభిస్తున్నాయి. ఈ చేపల వినియోగంతో ఆయుర్వేద పరంగా సత్ఫలితాలు ఉంటాయనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో వీటి కొనుగోళ్లకు అనేక మంది పోటీ పడుతుంటారు. గోదావరి నది జలాల నుంచి వచ్చిన ఈ చేపలు ధర్మసాగర్ దేవాదుల రిజర్వాయర్లో కలిశాయి. దీంతో ప్రతీరోజు వ్యాపారులు వీటిని మార్కెట్కు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. కిలోకు రూ.450కు పైగా ధర పలుకుతుంది. కాగా, పాతతరానికి ఈ చేపలంటే చాలా ప్రీతి. కొత్తతరం మాత్రం అమ్మో పాములు తింటారా అంటారు.(చదవండి: -
జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ కొత్త డ్రామాలు: పొన్నం
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం పీక్ స్టేజ్కు చేరుకుంది. కాంగ్రెస్ మంత్రులు, మాజీ మంత్రి హరీష్ అనే విధంగా రాజకీయం నడుస్తోంది. తాజాగా హరీష్ వ్యాఖ్యలకు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కౌంటరిచ్చారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..‘బీఆర్ఎస్ అనవసరపు రాద్ధాంతం చేస్తోంది. జూబ్లీహిల్స్ ఎన్నికలో ఓట్ల కోసమ బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతోంది. బీఆర్ఎస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. గులాబీ నేతల తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి హరీష్ రావుకు లేదు. బీఆర్ఎస్ ఎన్నో హామీలను ఎగ్గొట్టింది. ఆటో కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది అని అన్నారు.మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ.. హరీష్ రావు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. అంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. బలహీన వర్గాల మంత్రులు ఉన్న కేబినెట్ను దండుపాళ్యం బ్యాచ్ అని హరీష్ రావు ఎలా అంటారు. రాష్ట్ర మంత్రి వర్గం దండుపాళ్యం బ్యాచ్ అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రివర్గం స్టువర్ట్ పురం దొంగలా అని నిలదీశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్న కేబినెట్పై చేసిన వ్యాఖ్యలకు గాను హరీష్ రావు తక్షణమే క్షమాపణలు చెప్పాలి.కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు అవినీతికి పాల్పడ్డారంటూ కవిత చేసిన ఆరోపణలపై చర్చకు రమ్మంటే తొక ముడిచిన హరీష్ రావు.. ఇప్పుడు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను చర్చకు పంపుతానంటున్నారని ఎద్దేవా చేశారు. అంబేద్కర్ విగ్రహం వద్దకు చర్చకు రావడానికి మేము సిద్ధమేనన్నారు. కేసీఆర్ మీ అల్లుడ్ని కంట్రోల్లో పెట్టుకోవాలని సూచించారు. కేసీఆర్ కు తెలియకుండా హరీష్ రావు 28 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఫండింగ్ చేశారు. అందువల్లే రెండోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా హరీష్ రావుకు కేసీఆర్ వెంటనే మంత్రి పదవి ఇవ్వలేదు’ అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
‘రక్త దానం చేసి ఇతరుల ప్రాణాలు కాపాడండి’
సాక్షి, హైదరాబాద్: రక్తదానం చేయడం అంటే ఇతరుల ప్రాణాలను కాపాడటమే అని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. రోగుల అవసరానికి తగ్గట్టుగా జనాభాలో ఒక శాతం రక్తాన్ని దానం చేయడంలో ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని చెప్పుకొచ్చారు. ఒక్క యూనిట్ రక్తం ముగ్గురు ప్రాణాలు కాపాడుతుందన్నారు.పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్బంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మెగా బ్లడ్ డొనేట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ పాల్గొన్నారు. అనంతరం, డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ..‘రక్తదానం చేయడం వల్ల పలు రకాలుగా రక్తం ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఉపయోగపడుతుంది. ప్రతీ యేటా నాలుగు సార్లు బ్లడ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సమాజంలో రోడ్డు ప్రమాదాలలో గాయపడే వారికి ఈ రక్తం అవసరం ఉంటుంది. రాష్ట్రంలో ఒక ఏడాదిలో ఎనిమిది వేల మంది చనిపోయారు. వారిలో రక్తం లేక చనిపోయిన వారే ఎక్కువగా ఉన్నారు. రోగుల అవసరానికి తగ్గట్టుగా జనాభాలో ఒక శాతం రక్తాన్ని దానం చెయ్యడంలో ప్రజలందరూ ముందుండాలి. రక్తదానం చేసే గొప్ప కార్యక్రమం నిర్వహించిన సీపీ సజ్జనార్కు అభినందనలు తెలిపారు. గతంలో కోవిడ్ సమయంలో సైబరాబాద్ సీపీగా సజ్జనార్ ప్రజలకు అందించిన సేవలను డీజీపీ కొనియాడారు.మరోవైపు.. సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. నగరంలో అన్ని జోన్లలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశాం. తొమ్మిది క్యాంపుల ద్వారా 3,500 యూనిట్స్ టార్గెట్ పెట్టుకొని శిబిరాలు ఏర్పాటు చేశాం. పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల త్యాగాలకు నివాళిగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని చెప్పారు. రక్తం అందక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రజలు సామాజిక బాధ్యతగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కోరారు. రోడ్డు ప్రమాదాలు, ఎమర్జెన్సీలో ఆపరేషన్లో రక్తం అవసరం ఉంటుందన్నారు. తలసేమియా వ్యాధితో చాలామంది బాధ పడుతున్నారు. పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన బ్లడ్ యూనిట్స్ను వాళ్లకు అందజేస్తామని తెలిపారు. On the occasion of #PoliceCommemorationWeek, a Mega Blood Donation Drive is being organised across Hyderabad.Let’s honour the sacrifices of our brave Police Martyrs by donating blood and saving lives. 🩸Join us — every drop counts!#BloodDonation #HyderabadCityPolice… pic.twitter.com/1B8yG6RVc0— V.C. Sajjanar, IPS (@SajjanarVC) October 27, 2025 -
తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ఐదు ముక్కలవుతుందని అన్నారాయన. అంతేకాదు.. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన స్థాయికి తగ్గ వ్యక్తి కాదంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై అదనపు సమాచారం అందాల్సి ఉంది. -
బీఆర్ఎస్ కొప్పుల ఈశ్వర్, చందర్ అరెస్ట్..
బీఆర్ఎస్ నేతలు అరెస్ట్..బీఆర్ఎస్ నేతలు కొప్పుల ఈశ్వర్, కోరుకంటి చందర్ అరెస్ట్మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చర్చకు రాచాలంటూ.. 125అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్దకు వచ్చిన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలుబీఆర్ఎస్ నేతలు కొప్పుల ఈశ్వర్, కోరుకంటి చందర్కు పోలీసులకు మధ్య తోపులాటబీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి పీఎస్కు తరలింపుతెలంగాణలో మరోసారి రాజకీయం వేడెక్కింది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్, మాజీ మంత్రి హరీష్, కొప్పుల ఈశ్వర్ మధ్య రాజకీయ సవాళ్లు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ పాలనపై చర్చకు సచివాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు రావాలని మంత్రి కొప్పుల సవాల్ విసిరారు. దమ్ముంటే హరీష్ రావు చర్చకు రావాలి అంటూ మంత్రి అడ్లూరి ప్రతి సవాల్ విసిరారు. దీంతో, రాజకీయం ఆసక్తికరంగా మారింది.మంత్రి వర్సెస్ మాజీ మంత్రి..పదేళ్ల బీఆర్ఎస్ పాలన, రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమంటూ మంత్రి అడ్లూరు లక్ష్మణ్కు మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ సవాల్ విసిరారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తనతో చర్చకు రావాలన్నారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు అంబేద్కర్ విగ్రహం వద్దకు వస్తున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో కొప్పుల వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి స్పందిస్తూ..హరీష్ రావు గడ్డ మీదకి వెళ్ళి సవాల్ విసిరాను. దమ్ముంటే హరీష్ రావు చర్చకు రావాలి. నా మీద ఓడిన కొప్పుల ఈశ్వర్ రావడం ఏంటి?. హరీష్ మొహం చాటేసుకుని పోయారు. నేను నా ఇంట్లో రెడీగా ఉన్నాను. హరీష్, కేటీఆర్ వస్తే బయల్దేరడానికి సిద్ధంగా ఉన్నాను. కొప్పుల ఈశ్వర్, రసమయి వస్తే మా ప్రీతం వెళ్ళి సమాధానం చెప్తాడు. కేబినెట్ పర్సనల్ పంచాయితీలు జరగలేదు. హరీష్ రావు వచ్చి ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాను. మీ పాలన.. మా పాలనపై దమ్ముంటే చర్చకు రండి అని కామెంట్స్ చేశారు.హరీష్ రావు కౌంటర్.. మరోవైపు.. ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు మాజీ మంత్రి హరీష్ రావు స్వయంగా ఆటోలో కోకాపేట్ నివాసం నుంచి ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ వరకు ప్రయాణించారు. అనంతరం, ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ నుంచి తెలంగాణ భవన్ వరకు వెళ్లారు. ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ.. మంత్రి అడ్లూరితో చర్చకు మా నాయకుడు కొప్పుల ఈశ్వర్ వస్తారు. కొప్పుల ఈశ్వర్తో చర్చకు కాంగ్రెస్ నేతలు రెడీగా ఉండాలి. కేబినెట్లో మంత్రుల పంచాయితీలు జరిగాయని అన్ని మీడియాలో సైతం వచ్చింది. ముఖ్యమంత్రి, మంత్రులు ఒకరిపై ఒకరు దూషించుకున్నారన్న నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ సర్కార్ విఫలమైంది. ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకోవటానికే ఆటోలో ప్రయాణం చేశాను.రేవంత్ రెడ్డి పేరుకు ఉచిత బస్ అన్నారు. ఐదుసార్లు బస్ ఛార్జీలు పెంచి ప్రయాణికులపై భారం మోపుతున్నారు. రాహుల్ గాంధీ సినిమా యాక్టర్ల కంటే ఎక్కువ యాక్టింగ్ చేశారు. అశోక్ నగర్ వెళ్లి మెట్లపై కూర్చుని మొదటి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి మోసం చేశారు. ఆటోలో వెళ్లి యూసుఫ్గూడలో ఆటో వాళ్లకి ఇచ్చిన హామీలను విస్మరించారు. రాష్ట్రంలో ఐదు లక్షల నుంచి ఆరు లక్షల ఆటోలు ఉంటాయి. ఒక్కొక్క ఆటో కార్మికులకు 24 వేల రూపాయలు కాంగ్రెస్ బాకీ ఉంది. రాహుల్ గాంధీ మళ్ళీ హైదరాబాద్కి రావా?. శంషాబాద్ ఎయిర్పోర్టు వద్దే రాహుల్ గాంధీకి ఆటోలు అడ్డంగా పెట్టి కార్మికులు అడ్డుకుంటారు.రేవంత్ రెడ్డి ఢిల్లీకి మూటలు మోస్తున్నారు. మంత్రులు వాటాలు పంచుకోవడానికి డబ్బులు ఉంటాయి.. కానీ, ఆటో కార్మికులకు ఇవ్వడానికి ఉండవా?. మూడువేల కోట్ల రూపాయల ఆదాయం మద్యంపై వచ్చింది. అవి ఆటో కార్మికులకు ఇవ్వండి. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఆటో కార్మికులకు కాపాడుకుంటాం. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించండి. లేని ఫ్యూచర్ సిటీకి 5000 కోట్లతో ఎందుకు రోడ్లు వేస్తున్నారు. ప్రభుత్వం వద్ద పైసలు లేక కాదు.. కమిషన్ వచ్చే వాటిపైన మాత్రమే దృష్టి పెడుతున్నారు. గద్దెనెక్కినంక గరీబోళ్ళని మర్చిపోయారు.. -
పాముకాటుకు చిన్నారి బలి
చందుర్తి(వేములవాడ): ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి పాముకాటుతో మృత్యువాత పడింది. రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఆశిరెడ్డిపల్లిలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన చేకుట లత, రమేశ్ దంపతుల ఏడాదిన్నర వయసు ఉన్న కూతురు వేదాన్షి శనివారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటుండగా హఠాత్తుగా ఇంట్లో వారికి ఏడుపు వినిపించింది. కుటుంబ సభ్యులు వెంటనే వెళ్లి పరిశీలించగా చిన్నారి కాళ్ల వేలి మధ్యలో నుంచి రక్తం కారుతుండటంతో వెంటనే వేములవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి, పాము కాటు తో పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. అక్కడి నుంచి అర్ధరాత్రి ఎల్లారెడ్డిపేటలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే పాప ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి తండ్రి రమేశ్ ఆరు నెలల క్రితం దుబాయ్ వెళ్లాడు. పాముకాటుకు కూతురు మృతిచెంది న విషయం తెలుసుకున్న తండ్రి రమేశ్ స్వగ్రా మానికి బయలుదేరినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం పాప మృతదేహాన్ని బాడీఫ్రీజర్లో భద్రపరిచారు. చిన్నారి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్ తెలిపారు. -
ప్రాణం తీసిన కిటికీ వివాదం
కరీంనగర్ కార్పొరేషన్: చిన్న కిటికీ వివాదానికి నిండు ప్రాణం బలైన ఘటన కరీంనగర్లో సంచలనం సృష్టించింది. పక్కింటి వాళ్లతో పాటు నగరపాలక సంస్థ టౌన్ప్లానింగ్ అధికారుల వేధింపులతోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మృతుడు సూసైడ్ నోట్లో పేర్కొనడం కలకలం రేపుతోంది. కరీంనగర్ సిటీలోని రాఘవేంద్రనగర్లో వడ్లకొండ లక్ష్మీరాజం శనివారం పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నిబంధనల పేరిట తమ ఇంటి కిటికీలను నగరపాలక సంస్థ అధికారులు పదేపదే తొలగించడం అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు. తన ఇంటి కిటికీ విషయంపై పక్కింటి వాళ్లతో పాటు, నగరపాలక సంస్థ టౌన్ప్లానింగ్ అధికారులు వేణు, ఖాదర్ వేధించడంతోనే చనిపోతున్నట్లు లక్ష్మిరాజం సూసైడ్ నోట్ రాశాడు. దాదాపు మూడేళ్లుగా పక్కింటివాళ్లతో కిటికీల విషయంపై లక్ష్మిరాజంకు వివాదం నడుస్తోంది. సెట్బ్యాక్ నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంటూ టౌన్ప్లానింగ్ అధికారులు కిటికీని 2023లో మొదటిసారి తొలగించారు. మళ్లీ ఏర్పాటు చేశారంటూ ఈ సంవత్సరం ఆగస్టులో మరోసారి తొలగించారు. తన కిటికీలు తొలగించడం, పక్కింటి వాళ్లపై తాను ఫిర్యాదు చేస్తే పట్టించుకోకపోవడంతో మానసిక వేదనతో లక్ష్మిరాజం ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. తన భర్త ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన పక్కింటి వాళ్లతోపాటు, నగరపాలక సంస్థ టౌన్ప్లానింగ్ అధికారులు వేణు, ఖాదర్పై చర్య తీసుకోవాలని లక్ష్మిరాజం భార్య శారద వన్టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే పక్కింటి వ్యక్తి ఫిర్యాదు, హైకోర్టు ఆదేశాల మేరకే తాము నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన కిటికీలు తొలగించామని డిప్యూటీ సిటీ ప్లానర్ బషీర్ తెలిపారు. -
గురుకుల పాఠశాలలో బాలిక బలన్మరణం, ట్రాక్టర్లో మృతదేహం తరలింపు వివాదం
తెలంగాణా హనుమకొండ జిల్లా, భీమదేవరపల్లి మండలంలోని వంగర (పీవీ రంగారావు) బాలికల గురుకుల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. దీపావళి సెలవులకు ఇంటికి వెళ్లి, తిరిగి పాఠశాలకు వెళ్లిన బిడ్డ అనూహ్యంగా కన్నుమూయడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. స్కూలు ప్రిన్సిపాల్ , వైస్ ప్రిన్సిపాల్ తనను వేధిస్తున్నారని తల్లిదండ్రులతో ఫోన్ ద్వారా మొరపెట్టుకుంది. తనను ఇంటికి తీసుకెళ్లాలని కన్నీటితో వేడుకున్న కొంతసేపటికే ఆమె వసతి గృహంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. బాధిత బాలికను హుజురాబాద్ మండలం, రంగాపూర్కు చెందిన పదవ తరగతి విద్యార్థిని వనం శ్రీవర్ష (14)నిగా గుర్తించారు.అక్టోబర్ 23న దీపావళి సెలవుల తర్వాత శ్రీవర్ష పాఠశాలకు తిరిగి వచ్చింది. అయితే ప్రిన్సిపాల్ మరియు వైస్ ప్రిన్సిపాల్ వేధింపుల కారణంగా తమ కుమార్తె శ్రీవర్ష ఆత్మహత్యకు పాల్పడిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో వస్తువులు దొంగతనంచేసిందని ఆమెపై తప్పుడు ఆరోపణలతో వేధించారని కుటుంబం , మరికొంతమంది కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. చదువుల్లో రాణిస్తూ, అత్యుత్తమ విద్యార్థినిగా ఇటీవల జిల్లా కలెక్టర్ నుండి అవార్డు కూడా అందుకుందని ఆమె సహచరులు, ఇతర మిత్రులు గుర్తు చేసుకున్నారు. తోటి విద్యార్థులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అయితే ఆమెకు ఆరోగ్య సమస్యలున్నాయి పాఠశాల అధికారులు సిబ్బంది ఈ ఆరోపణలను ఖండించారు.FOR SPEAKING THE TRUTH??? Varshita, a 10th class student at Government Gurukul School Vangara died by suicide recently! Varshitha was school topper, school captain and an excellent student. She even recently received an award from the district collector. She came back home… pic.twitter.com/WtC5XjTns2— Revathi (@revathitweets) October 26, 2025మరోవైపు పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆమె మృతదేహాన్ని అంబులెన్స్కు బదులుగా ట్రాక్టర్లో తరలిలంచడం తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. రెండేళ్లలో గురుకులాలలో 110 విద్యార్థులు చనిపోయారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. -
కూర ఎందుకు వండలేదు? భర్త మందలింపుతో..
రాయికల్(జగిత్యాల): కూర ఎందుకు వండలేదని భర్త మందలించినందుకు రాయికల్ మండలం రామాజీపేట గ్రామానికి చెందిన దొడిమెల్లి మనోజ(27) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై సుధీర్రావు తెలిపారు. మండలంలోని భూపతిపూర్ గ్రామానికి చెందిన మనోజను తొమ్మిదేళ్ల క్రితం రామాజిపేటకు చెందిన సుధాకర్తో వివాహం చేశారు. వీరికి ముగ్గురు పిల్లలు. శనివారం రాత్రి సుధాకర్ మార్కెట్కు వెళ్లి కూరగాయలు తీసుకొచ్చేసరికి మనోజ కూర వండలేదు. ఎందుకు వండలేదని మందలించాడు. పిల్లలు కారంతో అన్నం తింటుండడంతో వంట చేసేందుకని సుధాకర్ వంటింట్లోకి వెళ్లాడు. మనోజ వెంటనే బెడ్రూంలోకి వెళ్లి ఉరేసుకుంది. సుధాకర్ వచ్చి చూసేసరికే మృతిచెందింది. మనోజ తల్లి వెంకటి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
తీర్పుపై ఉత్కంఠ!
చిత్తూరు అర్బన్ : జిల్లా న్యాయస్థానం ఇవ్వనున్న తీర్పుపై సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒక్క చిత్తూరు వాసులే కాదు.. ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్రంలోని కూటమి నాయకుల వరకు న్యాయస్థానం ఏం శిక్ష విధిస్తుందోనని గమనిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్తూరు మాజీ మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ జంట హత్యల కేసులో దోషులకు సోమవారం కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. 2015.. నవంబరు 17వ తేదీ.. స్థలం – చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం సమయం – మధ్యాహ్నం 11.57 గంటలు ఏం జరిగింది – మేయర్ సీటులో కూర్చుని ఉన్న కటారి అనురాధను పాయింట్ బ్లాక్లో తుపాకీతో కాల్చి చంపేసారు. పక్కనే కూర్చుని ఉన్న ఆమె భర్త కటారి మోహన్ను కత్తులతో వెంటాడి నరికేశారు. కొనప్రాణంతో కొట్టుమిట్టాడతున్న మోహన్ను చిత్తూరుకు ఆపై వేలూరుకు తరలించగా అక్కడి ఆసుపత్రిలో చనిపోయాడు. చేసిందెవరంటే – ప్రధాన నిందితుడు, మోహన్ మేనల్లుడు చంద్రశేఖర్ అనే చింటూతో పాటు 23 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నేరం రుజువైంది వీరిపై .. చింటూ, చంద్రశేఖర్ అలియాస్ చింటూ (54), వెంకటాచలపతి (59), జయప్రకా‹Ùరెడ్డి (32), మంజునాథ్ (36), వెంకటేష్ (48)పై నేరం రుజువైనట్లు చిత్తూరులోని 6వ అదనపు జిల్లా సెషన్స్ ఇన్చార్జ్ న్యాయమూర్తి డాక్టర్ ఎన్.శ్రీనివాసరావు తీర్పునిచ్చారు. మిగిలినవారిపై కేసు కొట్టేసింది. నిరూపించబడ్డ సెక్షన్లు 120 (బి) ఐపీసీ (హత్యకు కుట్ర) – అయిదుగురు అనురాధను హత్య చేసినందుకు సెక్షన్ 302 రెడ్విత్ సెక్షన్ 120 బి (ఐపీసీ) – అయిదుగురికి మోహన్ను హత్య చేసినందుకు సెక్షన్ 302 రెడ్విత్ సెక్షన్ 120 బి (ఐపీసీ) – అయిదుగురికి వేలూరు సతీష్ కుమార్ నాయుడుపై హత్యాయత్నం చేసినందుకు సెక్షన్ 307 ఐపీసీ – ముద్దాయి మంజునాథ్ వేలూరు సతీష్కుమార్ నాయుడును నిందితులు ఒకే ఉద్దేశ్యంతో హత్యాయత్నం చేయడం సెక్షన్ 307 రెడ్విత్ సెక్షన్ 34 ఐపీసీ – చింటూ, వెంకటాచలపతి, జయప్రకాష్రెడ్డి, వెంకటేష్. సతీష్కుమార్ నాయుడును చంపాలనే ఉద్దేశ్యంతో గాయపరచడం సెక్షన్ 302 ఐపీసీ – ముద్దాయి మంజునాథ్ . పోలీసుల భారీ భద్రత దోషులు అయిదుగురిని చిత్తూరు జిల్లా జైలు నుంచి ఉదయం 10 గంటలకు చిత్తూరు కోర్టుకు తీసుకెళ్లనున్నారు. దోషులకు న్యాయస్థానం శిక్ష ఖరారు చేయనున్న నేపథ్యంలో చిత్తూరులోని జిల్లా న్యాయస్థానాల సముదాయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఒక ఏఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, ఆరుగురు సీఐలు, ఎనిమిది మంది ఎస్ఐలు, 80 మంది వరకు పోలీసులను కోర్టు ఆవరణలో భద్రత కోసం ఏర్పాటు చేశారు. కటారి కుటుంబ సభ్యులకు, సీకే బాబు ఇంటి వద్ద, ప్రధాన సాక్షుల ఇళ్ల వద్ద పోలీసు రక్షణ కలి్పంచారు. -
Jubilee Hills bypoll: అగ్గిపెట్టె.. సబ్బుపెట్టె..
హైదరాబాద్: అగ్గిపెట్టె, సబ్బుపెట్టె, పండ్లబుట్ట, ఇటుక, కత్తెర, గాజు.. ఇవన్ని ఏమిటని అనుకుంటున్నారా.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు. మచ్చుకు ఇవి కొన్ని మాత్రమే. ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు ఉండగా 3 ప్రధాన పార్టీల అభ్యర్థులను పక్కనబెడితే మిగతావారికీ గుర్తుల కేటాయింపు ఎన్నికల అధికారులకు సవాల్గా నిలిచింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా పెద్ద సంఖ్యలో అభ్యర్థులు బరిలో ఉండడంతో రకరకాల గుర్తులను తీసుకోవాల్సి వచ్చింది. ఇందులో ఇటుకలతో పాటు కత్తెర, గాజులు కూడా కేటాయించారు. సీసీ టీవీ కెమెరా, కూలర్, బెలూన్, ల్యాప్ట్యాప్, టీవీ రిమోట్, డిష్ యాంటెనా, డోలి, సైకిల్కు గాలి కొట్టే పంపు, బెల్టు, హెల్మెట్, బేబీ వాకర్, ఆపిల్, ద్రాక్ష.. ఇలా చిత్ర విచిత్రంగా గుర్తులు కేటాయించారు. జూబ్లీహిల్స్లో ఇప్పటివరకు 58 మంది అభ్యర్థులు పోటీపడిన దాఖలాలు లేవు. ఇందులో 50 మందికి పైగా స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. వారిక గుర్తుల కేటాయింపు ఎప్పుడూ కష్టంగానే ఉంటుంది. ఈసారి ప్రెషర్ కుక్కర్, చపతీ రూలర్, బ్రీఫ్కేస్, ఉంగరం, వజ్రం, బైనోక్యూలర్స్.. ఇన్నో ఎన్నో రకాల గుర్తులను కేటాయించారు. ఇక అభ్యర్థులు తమ గుర్తులను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రచారం చేసుకోవాల్సి ఉంటుంది. ఈసారి బెల్టు కూడా ఓ అభ్యర్థికి గుర్తుగా వచి్చంది. గుర్తులను సేకరించేందుకు అధికారులు మల్లగుల్లాలు పడ్డారు. ఎంతో వడబోసి చివరకు గుర్తులను సేకరించి కేటాయించి హమ్మయ్యా..! అంటూ ఊపిరిపీల్చుకున్నారు. -
నీళ్లు బంద్ చేస్తే సమాచారం ఏదీ?
బంజారాహిల్స్లోని ఒక కాలనీకి రోజు విడిచి రోజు తెల్లవారు జామున నాలుగు గంటల ప్రాంతంలో నల్లా నీటిని విడుదల చేస్తారు. ఎప్పటి మాదిరిగా ఒక కుటుంబం తెల్లవారు జామున లేచి నల్లా నీటి కోసం వేచి చూసింది. పదిగంటల తర్వాత సంబంధిత స్థానిక అధికారులకు ఫోన్ చేసి అడిగితే పైప్లైన్ లీకేజీ కారణంగా నీటిని విడుదల చేయలేదని సమాధానం చెప్పారు. ముందస్తు సమాచారం ఇవ్చవచ్చని కదా.. అడిగితే పత్రికలు చూడలేదా ? అని ఎదురు ప్రశి్నంచారు. ప్రతి నెల నల్లా బిల్లుకు సంబంధించి వివరాలు రిజిస్ట్రర్డ్ మొబైల్కు సంక్షిప్త సమాచారం ద్వారా అందిస్తారు కదా..నీటి సరఫరా అంతరాయం సమాచారం కూడా పంపవచ్చు కదా అని ప్రశ్నిస్తే..సమాధానం లేదు. ఇది ఈ ఒక్క కుటుంబానికి సంబంధించిన సమస్య కాదు.. ప్రతి నెల ఏదో ఒక లైన్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతూనే ఉంటుంది. వినియోగదారులు మాత్రం ఎలాంటి సమాచారం ఉండదు. ఐటీ సేవలు ఇంతగా అభివృద్ధి చెందుతున్నా..కనీసం నల్లా నీరు రావడం లేదనే మెసేజ్ పంపడం సాధ్యం కాదా అంటూ జనం ప్రశ్నిస్తున్నారు.సాక్షి, హైదరాబాద్: మహానగరంలో మరింత మెరుగైన సేవలందించేందుకు ఏడాది కాలంగా సరికొత్త సంస్కరణలతో ఆత్య«ధునిక సాంకేతి పరిజ్ఞానాన్ని అందిపుచుకొని ఐటీ బాట పట్టిన జలమండలి.. వినియోగదారులకు నీటి సరఫరా అంతరాయం ‘సమాచారం’ అందించడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తోంది. క్షేత్రస్థాయి యంత్రాంగం పనితీరును జీఐఎస్ నెట్వర్క్ డేటా బేస్ మ్యాపింగ్తో ప్రత్యేక ఆన్లైన్ లైవ్ లొకేషన్ డ్యాష్ బోర్డు ద్వారా పర్యవేక్షిస్తున్న జలమండలి..వినియోగదారులకు నీటి సరఫరా అంతరాయం సమాచారానికి మాత్రం ఐటీని వినియోగించకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. 14.21 లక్షల కనెక్షన్ల పైనే.. జలమండలి పరిధిలో సుమారు 14.21 లక్షలపైనే తాగు నీటి నల్లా కనెక్షన్లు ఉండగా, అందులో 96 శాతంపైగా గృహోపయోగ నీటి కనెక్షన్లు ఉంటాయి. ప్రధాన జలాశయాల నుంచి నీటిని తరలించి శుద్ధి చేసి సరఫరా చేసేందుకు నగరంలో నీటి సరఫరా నెట్వర్క్ పైప్లైన్ వ్యవస్థ సుమారు 12,978.75 కిలో మీటర్ల మేర విస్తరించి ఉంది. ప్రతినిత్యం ఏదో ఒక ప్రాంతంలోని మెయిన్ పైపులైన్లు తరచూ పగలడం, లీకేజీలకు గురికావడంతో మరమ్మతు తప్పడం లేదు. దీంతో నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం తప్పడం లేదు. అయితే జలమండలి అధికారులు నీటిసరఫరా అంతరాయం సమాచారం కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితం అవుతున్నారు. పత్రికల ద్వారా సమాచారం కొద్దిమేర మాత్రమే తెలుస్తుంది. దాదాపు 90 శాతం మందికి ఈ సమాచారం తెలియక నీటి కోసం తిప్పలు పడుతున్నారు. కాబట్టి వినియోగదారులకు బిల్లింగ్ వివరాలు పంపించే మొబైల్ నెంబర్కు అంతరాయం సమాచారం కూడా పంపిస్తే బాగుంటుందని వినియోగదారులు అంటున్నారు. ఈ నెలలో అంతరాయం ఇలా.. తాజాగా మంజీరా నీటి సరఫరా పథకం–3 కు సంబంధించి జాతీయ రహదారి 65 సమీపంలోని 1600 ఎంఎం డయా పంపింగ్ మెయి¯న్లో భారీ లీకేజీ ఏర్పడటంతో జలమండలి అత్యవసరంగా షట్డౌన్ తీసుకుంది. దీంతో సుమారు 20 ఎంజీడీల నీటి సరఫరా నిలిచిపోయింది. అధికారులు ఆయా రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాల వినియోగదారులకు సమాచారం అందించడంలో పూర్తిగా విఫలమయ్యారు. ప్యారడైజ్ జంక్షన్ నుండి డెయిరీ ఫాం రోడ్ వరకు ఎలివేటెడ్ కారిడార్ పనుల్లో భాగంగా ప్యారడైజ్ జంక్ష¯న్ వద్ద గల తాగునీటి సరఫరాకు సంబంధించిన 800 ఎంఎం డయా పైప్లైన్ విస్తరణ కోసం పనులు చేస్తుండడంతో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. దీంతో తాజాగా సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుండి 18 గంటల పాటు నీటి సరఫరా నిలిచిపోనుంది. -
సెల్ఫోన్ స్నాచర్లు ముగ్గురు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో ఉన్న చాదర్ఘాట్లోని విక్టోరియా ప్లే గ్రౌండ్స్లో శనివారం సాయంత్రం చోటు చేసుకున్న కాల్పుల ఉదంతంపై పూర్తి స్పష్టత వచ్చింది . సెల్ఫోన్ స్నాచింగ్కు పాల్పడిన స్నాచర్లు ముగ్గురిగా, వీళ్లు ఆటోలో వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో తూటాలు దిగిన అన్సారీ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా... మరో నిందితుడు అలీని టాస్్కఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పరారీలో ఉన్న మూడో నిందితుడిని అదుపులోకి తీసుకోవడంతో పాటు నేరానికి వినియోగించిన ఆటోను స్వా«దీనం చేసుకోవడానికి ప్రత్యేక బృందాలు పని చేస్తున్నాయి. మరోపక్క ఈ ఉదంతంపై కేసు నమోదు చేసుకున్న సుల్తాన్బజార్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సోమాజీగూడలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డీసీపీ ఎస్.చైతన్యకుమార్తో పాటు గన్మ్యాన్ వీఎస్ఎన్ మూర్తిని డీజీపీ బత్తుల శివధర్రెడ్డి, నగర కొత్వాల్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనర్ ఆదివారం పరామర్శించారు. ఆగస్టు నుంచి ఔట్ ఆఫ్ వ్యూ... కాలాపత్తర్ పోలీసుస్టేషన్లో రౌడీషిటర్గా ఉన్న కామాటిపుర వాసి మహ్మద్ ఒమర్ అన్సారీ ఈ ఏడాది ఏప్రిల్లో జైలు నుంచి విడుదలయ్యాడు. ఇలాంటి అసాంఘికశక్తులు ప్రతి నెలా నిరీ్ణత తేదీల్లో స్థానిక పోలీసుస్టేషన్లో హాజరవ్వాల్సి ఉంటుంది. అలా కాకుంటే వాళ్లు ఔట్ ఆఫ్ వ్యూగా ఉన్నట్లు పరిగణిస్తారు. ఏప్రిల్లో జైలు నుంచి బయటకు వచ్చిన అన్సారీ జూలై వరకు కాలాపత్తర్ ఠాణాలో హాజరయ్యాడు. ఆగస్టు నుంచి ఔట్ ఆఫ్ వ్యూలోకి వెళ్లిపోయాడు. వృత్తిరీత్యా ఆటోడ్రైవర్ అయిన ఇతగాడు ఇటీవల కాలంలో మరో ఇద్దరితో కలిసి ముఠా కట్టాడు. ఈ త్రయం ఆటోలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ సెల్ఫోన్ స్నాచింగ్స్కు పాల్పడుతోంది. సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా ఉన్న ఎస్.చైతన్యకుమార్ శనివారం మధ్యాహ్నం బషీర్బాగ్లోని ఓల్డ్ కమిషనరేట్కు వచ్చారు. అక్కడి నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) కార్యాలయంలో అదనపు సీపీ ఎం.శ్రీనివాసులు నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో సీసీఎస్ నుంచి సైదాబాద్లో ఉన్న తన కార్యాలయానికి అధికారిక వాహనంలో బయలుదేరారు. గన్మ్యాన్ను తోసి పారిపోయిన అన్సారీ... తనను గట్టిగా పట్టుకున్న మూర్తితో పాటు డీసీపీనీ తోసేసిన అన్సారీ అక్కడ నుంచి పరిగెత్తాడు. ఈ ప్రయత్నంలో అతడి చొక్కా చిరిగిపోయింది. కింద పడిపోయిన మూర్తి, చైతన్య కుమార్లకు స్వల్ప గాయాలయ్యాయి. గన్మ్యాన్కు సంబంధించిన 0.9 ఎంఎం పిస్టల్ కూడా కింద పడిపోయింది. ఆ విషయం గుర్తించి దాన్ని తన ఆ«దీనంలోకి తీసుకున్న డీసీపీ నిందితుడు అన్సారీ, తన గన్మ్యాన్ వెళ్లిన మార్గంలో విక్టోరియా ప్లే గ్రౌండ్స్ వైపు పరిగెత్తారు. ఆ సమీపంలోని ఓ సందులోకి వెళ్లిన అన్సారీ ఓ ఇంటికి బయట నుంచి మెట్లు ఉండటాన్ని గమనించారు. అతగాడు వాటి ద్వారా ఆ ఆ భవనం రెండో అంతస్తులోకి చేరుకున్నాడు. మూర్తి, డీసీపీ సైతం అతడి వెనకాలే అక్కడకు వెళ్లాడు. అన్సారీ అక్కడ నుంచి పక్క భవనం టెర్రాస్ పైకి దూకగా... గన్మ్యాన్ సైతం దూకేశాడు. డీసీపీ చైతన్యకుమార్ కిందికి దిగి మరో మార్గంలో అక్కడకు చేరుకోవడానికి వెనుదిరిగారు. తన వెంట పడుతున్న గన్మ్యాన్ను చూసిన అన్సారీ ప్యాంటు జేబులో దాచుకున్న కత్తిని తీసి హత్యాయత్నం చేశాడు. గన్మ్యాన్ను రక్షించేందుకే కాల్పులు... ఇది గమనించిన మూర్తి తనను రక్షించాలంటూ డీసీపీని ఉద్దేశించి ‘సార్ సార్’ అంటూ గట్టిగా అరిచాడు. ఈ అరుపులు విన్న డీసీపీ వెనక్కు తిరిగి చూసే సమయానికి అన్సారీ కత్తితో మూర్తిపై దాడికి సిద్ధమయ్యాడు. అతడిని రక్షించడంతో పాటు అన్సారీ ప్రాణాలకు ముప్పు ఉండకూడదనే ఉద్దేశంతో చైతన్యకుమార్ స్పందించారు. తన చేతిలో ఉన్న పిస్టల్తో అన్సారీ శరీరం దిగువ భాగంలో కాల్చారు. ఆ తూటా తనకు తగిలినా ఆగని అన్సారీ హత్యాయత్నం కొనసాగించాడు. దీంతో డీసీపీ అతడి పైకి మరో తూటా కాల్చాల్సి వచి్చంది. ఇలా రెండు తూటాలు తగిలిన అన్సారీ ఆ టెర్రాస్ పై నుంచి రోడ్డు పైకి దూకి, అక్కడ నుంచి విక్టోరియా ప్లేగ్రౌండ్స్లోకి వెళ్లి పడిపోయాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇతడి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. డీసీపీ ఫిర్యాదు మేరకు బీఎన్ఎస్లోని 304, 109, 132 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న సుల్తాన్బజార్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఐపీ ధర్మారావు దర్యాప్తు చేపట్టారు. పారిపోయిన మరో ఇద్దరి కోసం గాలించిన టాస్క్ఫోర్స్ బృందాలు ఓ నిందితుడు అలీని ఆదివారం పట్టుకుని ఏడు చోరీ సెల్ఫోన్లు స్వా«దీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మూడో నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.డీసీపీకీ డ్రైవర్ సందీప్ సమాచారం ఆ సమయంలో డీసీపీ వాహనంలో ఆయన డ్రైవర్ పి.సందీప్తో పాటు గన్మ్యాన్ వీఎస్ఎన్ మూర్తి ఉన్నారు. సాయంత్రం 4.50 గంటల సమయంలో వీరి వాహనం చాదర్ఘాట్ చౌరస్తా సమీపంలోని ఇసామియా బజార్ వరకు వెళ్లింది. ఆ సమయంలో ఓ ఆటోలో (నెం.9395) వచి్చన ముగ్గురు ఓ వ్యక్తి సెల్ఫోన్ తస్కరించి పారిపోవడాన్ని డ్రైవర్ సందీప్ చూశారు. ఆయన ఈ విషయాన్ని డీసీపీ దృష్టికి తీసుకువెళ్లడంతో సదరు ఆటోను వెంబడించాల్సిందిగా చైతన్యకుమార్ స్పష్టం చేశారు. చాదర్ఘాట్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ రద్దీ కారణంగా స్నాచర్ల ఆటో ఆగిపోయింది. ఈ విషయం గుర్తించిన సందీప్ అదే విషయాన్ని డీసీపీకి చెప్పారు. వాహనం దిగి వెళ్లి, ఆటోలోని వారిని పట్టుకోవాల్సిందిగా తన గన్మ్యాన్ మూర్తిని చైతన్యకుమార్ ఆదేశించారు. తక్షణం రంగంలోకి దిగిన మూర్తి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాడు. అదే సమయంలో డీసీపీ కూడా అక్కడకు చేరుకున్నారు. యూనిఫాంలో ఉన్న డీసీపీని చూసిన మిగిలిన ఇద్దరు స్నాచర్లు ఆటోలో అక్కడ నుంచి ఉడాయించారు. -
Jubilee Hills Bypoll: ఏంటీ కార్పెట్ బాంబింగ్?
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కమల దళం కొత్త తరహా ప్రచారానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ రాజకీయాల్లో మొదటిసారిగా మంగళవారం కార్పెట్ బాంబింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందులో భాగంగా పార్టీ స్టార్ క్యాంపెయినర్స్, రాజస్థాన్ ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్, శాసన సభ, శాసన మండలి సభ్యులు, ఇతర ముఖ్య నాయకులంతా ఒక్కసారిగా నియోజకవర్గాన్ని చుట్టుముట్టనున్నారు. ప్రచార కార్యక్రమాలతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గంలో గల్లీగల్లీ బీజేపీ నేతలతో కిక్కిరిసిపోవాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ప్రచారంలో వెనుకబడ్డారన్న ఆరోపణలను పటాపంచలు చేయాలని భావిస్తోంది. ఎన్నికల ప్రచారం ముగిసే వరకు నేతలంతా జూబ్లీహిల్స్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశించింది.ఏంటీ కార్పెట్ బాంబింగ్?కుండపోత వర్షానికి క్లౌబ్ బరెస్ట్ అన్నట్లు రాజకీయాల్లో ఒక్కసారిగా అలాంటి ప్రభావంతమైన ప్రచార కార్యక్రమాన్ని చేపట్టడాన్ని కార్పెట్ బాంబింగ్ అంటారు. ఇది ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రాచుర్యంలో ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొదటిసారి అని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. మంగళవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో స్టార్ క్యాంపెయినర్స్ 40 మందితో పాటు రాష్ట్ర నేతలందరూ ప్రచారంలో పాల్గొననున్నారు. బీజేపీ నేతలతో నియోకవర్గ వీధులన్నీ కిక్కిరిసిపోవడం ఖాయమని నేతలు పేర్కొంటున్నారు.ప్రాంతీయ అభిమానాన్ని కొల్లగొట్టాలి..నియోజకవర్గంలో ప్రాంతీయాభిమానాన్ని కొల్లగొట్లాని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఏ కాలనీలో ఏ ప్రాంతానికి చెందిన ప్రజలు ఉన్నారు. వారిని ప్రభావితం చేసే నేతలను గుర్తించి, ప్రచార కార్యక్రమంలో వారిని భాగస్వాములను చేయాలని యోచిస్తోంది. దీంతో ఉత్తరాది నుంచి వచి్చన వలస ఓటర్ల కోసం రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మెఘవాల్, ఇతర నేతలను ప్రచారంలోకి దించుతున్నారు. అదే సమయంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల వారిని ఆకర్షించడం, జీఎఎస్టీ స్లాబ్లను తగ్గించడం వల్ల కలిగే లాభాలను ప్రజలకు వివరించడానికి కేంద్ర ఆరి్థక మంత్రి నిర్మలాసీతారామన్ తో పాటు ఇతర నేతలను ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్, రఘునందన్రావు, కొండా విశ్వేశ్వర్రెడ్డి, డీకే అరుణ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు పార్టీ ప్రచార కార్యక్రమాల్లోముమ్మరంగా పాల్గొనున్నారు.ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేతలుజూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చే శాసన సభ ఎన్నికలకు సెమీ ఫైనల్ అంటూ నేతలు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలోకి రావాలంటే జూబ్లీహిల్స్ విజయంతో నాంధి పలకాలని పార్టీ నాయకత్వం చెబుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్కు ఎమ్మెల్యేలు లేరు, కార్పొరేటర్లు అంతంతే. బీఆర్ఎస్కు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఉన్నా ప్రస్తుతం ఆ పార్టీ అధికారంలో లేదు. దీంతో వచ్చే ఏడాది జీహెచ్ఎంసీలో బీజేపీ జెండా ఎగురవేయాలని క్యాడర్ను సమాయత్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీలో, రాష్ట్రంలో బీజేపీ కుర్చీ దక్కించుకోవాలంటే జూబ్లీహిల్స్లో విజయం సాధించాలని నేతలు భావిస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే కేంద్ర, రాష్ట్ర ముఖ్య నేతలతో స్టార్ క్యాంపెయినర్స్ను ఈ ఉప ఎన్నిక ప్రచారంలోకి దించుతున్నారు. -
ఎవరికి సినిమా చూపిస్తారో..?
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ నియోజక వర్గం ఉప ఎన్నిక పోలింగ్ నవంబర్ 11న జరగనుంది. ప్రధాన పార్టీల అభ్యర్ధులు సినీ కార్మికుల ఓట్లను పొందేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. సినీ కార్మికుల మద్దతు కూడగట్టేందుకు మూడు పార్టీల అభ్యర్థులు అందుకు తగిన ప్రచారంతో, హామీలతో ముందుకు వస్తున్నారు. పదుల సంఖ్యలో ఉండే సినీ తారలు, దర్శక నిర్మాతలు, సినీ రచయితలు, కొరియోగ్రాఫర్లు, ఫైట్ మాస్టర్లు, ప్రముఖ నటీ నటులు ఈ నియోజక వర్గంలో లేకపోయినా తెర వెనుక పనిచేసే 24 వేల మంది సినీ కార్మికులు ఈ నియోజక వర్గ పరిధిలోనే ఉంటూ ఓటు హక్కు కూడా కలిగి ఉన్నారు. ఇప్పుడు వీరిని ప్రసన్నం చేసుకునేందుకు ఆయా పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. నియోజక వర్గ పరిధిలోని శ్రీకృష్ణానగర్, వెంకటగిరి, రహ్మత్నగర్, యూసుఫ్గూడ, శ్రీనగర్ కాలనీ, బోరబండ, ఎర్రగడ్డ, షేక్పేట తదితర డివిజన్ల పరిధిలో లైట్బాయ్లు, జూనియర్ ఆర్టిస్ట్లు, టెక్నీషియన్లు, ప్రొడక్షన్ సభ్యులు, డ్రైవర్లు ఇలా సినీ షూటింగ్లకు పనిచేసే కారి్మకులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వీరందరికీ చిత్రపురి కాలనీలో ఇళ్ల స్థలాలు కేటాయించినా అక్కడున్న రాజకీయాలు, అవినీతి అక్రమాలు స్వార్థపూరిత నాయకత్వంతో వేలాది మంది కారి్మకులకు ఇళ్లు దక్కలేదు. అంతేకాదు వీరికి ఆరోగ్య బీమా సౌకర్యం కూడా లేకుండా పోయింది. ప్రభుత్వాలు మారినా సినీ కార్మికుల తలరాతలు మాత్రం మారడం లేదు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి జీవితాలు మారుస్తామని నేతలు హామీ ఇవ్వడమే తప్ప ఏ ఒక్కరు చొరవ చూపింది లేదు. ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నిక నేపథ్యంలో మరోసారి ఆయా పార్టీల అభ్యర్ధులకు సినీ కార్మికులు గుర్తుకు వస్తున్నారు.పరిశ్రమతో ముగ్గురికీ అనుబంధం..సినీ పరిశ్రమతో బీఆర్ఎస్ అభ్యర్ధి మాగంటి సునీత భర్త మాగంటి గోపీనాథ్కు మంచి సంబంధాలు ఉండేవి. ఆయన రవన్న, పాతబస్తీ అనే రెండు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. మొదటి నుంచి సినీ వర్గాలతో మంచి సంబంధాలు నెలకొల్పారు. కారి్మక సంఘాలతోనూ అనుబంధం ఉంది. అంతే కాకుండా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా సినీకార్మికులులతో సంబంధాలు ఎక్కువగానే ఉన్నాయి. దీంతో కార్మికుల మద్దతు పొందేందుకు బీఆర్ఎస్ తగిన వ్యూహాలు రచిస్తోంది.⇒ కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్కు గత నాలుగు దశాబ్ధాలుగా సినీ కార్మిమక సంఘాలతోనూ, వర్కర్స్తోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్కు పలుమార్లు సార్లు సలహాదారుగా పని చేశారు. ఆయన తనయుడు వెంకట్ హీరోగా సినిమాలు కూడా నిర్మించారు. సినీ హీరో సుమన్, ఆయనకు మద్దతుగా ప్రచారం కూడా చేస్తున్నారు. దీంతో సినీ కార్మికుల మద్దతు ఎక్కువగా తమకే ఉంటుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ⇒ బీజేపీ అభ్యర్ధి లంకల్ దీపక్రెడ్డి గతంలో టీడీపీలో ఉండేవారు. అప్పటి నుంచే సినీ పరిశ్రమతో ఆయనకు మంచి సంబంధాలు ఉండటమే కాకుండా కారి్మక నాయకులతోనూ సంబంధాలు కొనసాగిస్తున్నారు. సినీ కార్మికుల మద్దతును కూడగట్టేందుకు ఆయన తన పాత పరిచయాలను వినియోగించుకుంటున్నారు. ⇒ గత మూడు నాలుగు రోజులుగా ఆయా పార్టీల అభ్యర్ధులు సినీ కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ మద్దతు కూడగట్టుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో తమకు ఓట్లు వేయాలంటూ సినీ కార్మికులతో పాటు వారి నాయకులను కూడా అభ్యర్థిస్తున్నారు. సినీ తారలతో సినీ కార్మికులు ఉండే ప్రాంతాల్లో రోడ్షోలు నిర్వహించాలని కూడా యోచిస్తున్నారు. రాబోయే రోజుల్లో పరిశ్రమకు చెందిన ప్రముఖులను తమ పార్టీలో చేర్చుకోవడమే కాకుండా వారితో ప్రచారం నిర్వహించాలని కూడా భావిస్తున్నారు.. మొత్తానికి మొట్ట మొదటిసారిగా సినీ కారి్మకుల మద్దతు కూడగట్టేందుకు వారిని ఆకట్టుకునేందుకు , బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ⇒ ఆ దిశగా ప్రచారం కూడా చేయాలని వారి సమస్యలను పరిష్కరిస్తామని, హామీ ఇవ్వాలని కూడా వీరు పేర్కొంటున్నారు. నియోజక వర్గం పరిధిలో పెద్ద సంఖ్యలో సినీ కారి్మకులు ఉంండే ప్రాంతాలను ఇప్పటికే గుర్తించిన అభ్యర్థులు, ఆ ఆప్రాంతాల్లో తమకు స్నేహితులైన హీరోలతో ప్రచారం చేయించనున్నారు. సుమారుగా 24 వేల మంది సినీ కార్మికులు ఉన్న ఈ నియోజక వర్గంలో నవంబర్ 11న మెజార్టీ కారి్మకులు ఎవరి వైపు మొగ్గుతారో వేచి చూడాల్సి ఉంది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో వీరికి ఇళ్లు దక్కకపోగా భారీ అవకతవకలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులైన వారికి ఇళ్లు కేటాయించే ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడం, ప్రత్యేక తెలంగాణ రావడం జరిగిపోయింది. ఇప్పుడు కారి్మకులంతా ఎవరివైపు మొగ్గుచూపుతారో చూడాల్సి ఉంది. -
వివాహితపై కానిస్టేబుల్ లైంగిక దాడి
మహబూబాబాద్ జిల్లా: మాయమాటలు చెప్పి వివాహితపై ఓ కానిస్టేబుల్ లైంగిక దాడికి పాల్పడిన సంఘటన ఆదివారం మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. బయ్యారం మండల కేంద్రానికి చెందిన దంపతులు కొన్ని నెలల క్రితం గొడవ పడ్డారు. గార్ల–బయ్యారం సర్కిల్ కార్యాలయంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ బి.దినేశ్కు వివాహిత గొడవ విషయం తెలిసింది. దీనిని ఆసరాగా చేసుకున్న కానిస్టేబుల్ తాను అండగా ఉంటానని వివాహితను నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం తన భర్తకు తెలిసిందని, తనను వివాహం చేసుకోవాలని ఆమె కానిస్టేబుల్ను కోరింది. అయితే వివాహానికి కానిస్టేబుల్ నిరాకరించాడు. దీంతో ఆమె తనను నమ్మించి మోసం చేసిన కానిస్టేబుల్పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆదివారం కానిస్టేబుల్పై లైంగిక దాడి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. -
ప్రేమకథ విషాదాంతం
యైటింక్లయిన్కాలనీ(రామగుండం): ఇన్స్ట్రాగామ్లో పరిచయం ఆ ఇద్దరి మధ్య ప్రేమకు దారితీసింది. కులాలు వేరైనా యువకుడి తల్లి దండ్రులు అంగీకరించడంతో వివాహం చేసేందుకు పెద్దలు నిర్ణయించారు. ఇంతలోనే నీట మునిగి ఆ యువతి మృతి చెందింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని నగర సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గోదావరిఖని విఠల్నగర్కు చెందిన దానవేన రవితేజ సింగరేణిలోని బోరింగ్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ కారి్మకుడిగా పనిచేస్తున్నాడు. పెద్దపల్లి మండలం పెద్దబొంకూరు గ్రామానికి చెందిన మౌనిక(17) పదో తరగతి వరకు చదివి ప్రస్తుతం ఇంటివద్దే ఉంటోంది. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం ఇన్స్ట్రాగామ్ ద్వారా మౌనిక, రవితేజ మధ్య పరిచయం ఏర్పడింది. అదికాస్త ప్రేమగా మారింది. రవితేజను వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో తన ఇంట్లో ఎవరికీ చెప్పకుండా మౌనిక నెల క్రితం గోదావరిఖనిలోని రవితేజ ఇంటికి వచ్చింది. అయితే మౌనిక మైనర్ కావడంతో 18 ఏళ్లు నిండిన తర్వాత వివాహం చేయాలని ఇద్దరి కుటుంబ సభ్యులు అంగీకరించారు. ఇందుకోసం వచ్చేనెల ఒకటో తేదీన ముహూర్తం నిర్ణయించారు. కుల సంప్రదాయం ప్రకారం.. మౌనిక, రవితేజ కుటుంబ సభ్యులతో కలిసి గోదావరి నది స్నానానికి వెళ్లారు. యువతీయువకులిద్దరూ నదిలోకి దిగి ప్రమాదవశాత్తు నీటమునిగారు. అక్కడే ఉన్న జాలర్లు, కుటుంబ సభ్యులు వెంటనే రక్షించేందుకు ప్రయతి్నంచారు. ఈక్రమంలో రవితేజను బయటకు తీయగా, ప్రాణాలతో బయటపడ్డాడు. నీటిలో కొట్టుకుపోతున్న మౌనికను కూడా బయటకు తీయగా అప్పటికే ఆమె మృతి చెందింది. మృతురాలి తల్లి కళ ఇచి్చన ఫిర్యాదు మేరకు సీఐ ప్రసాద్రావు ఆధ్వర్యంలో ఎస్సై అహ్మదుల్లా కేసు నమోదు చేశారు. -
పెస్క్లబ్ ఎన్నికల్లో ఫ్రెండ్స్ ప్యానల్ ‘విజయ’దుందుభి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ప్రెస్క్లబ్ (సోమాజిగూడ) ఎన్నికల్లో ఫ్రెండ్స్ ప్యానల్ ‘విజయ’దుందుభి మోగించింది. ఆదివారం ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు ఓ టింగ్ జరగ్గా, మొత్తం 1280 ఓట్లకు..1093 ఓట్లు పోలయ్యాయి. 17 పోస్టుల్లో..అత్యధిక పోస్టులను ఫ్రెండ్స్ ప్యానల్ కైవసం చేసుకుంది. అధ్యక్షునిగా శ్రీగిరి విజయ్కుమార్రెడ్డి (సాక్షి) రెండోసారి భారీ ఆధిక్యతతో విజయం సాధించగా, ప్రధాన కార్యదర్శిగా రమే శ్ వరికుప్పల (ఈనాడు), కోశాధికారిగా రమేశ్ వైట్ల (ఎన్టీవీ) గెలుపొందారు. ఉపాధ్యక్షునిగా ఎ.రాజేశ్, ఉపాధ్యక్షురాలిగా అరుణ అత్తలూరి, సంయుక్త కార్యదర్శులుగా చిలుకూరి హరిప్రసాద్, వి.బాపురావు గెలుపొందారు. మహిళా కార్యవర్గ సభ్యురాలిగా కల్యాణం రాజేశ్వరి, ఎన్.ఉమాదేవి విజయం సాధించారు. జనరల్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు గా మర్యాద రమాదేవి, శంకర్సింగా, ఎన్.శ్రీనివాసరెడ్డి, నాగరాజు వనం, కస్తూరి శ్రీనివాస్, రచన, డి.అశోక్ విజయం సాధించారు. ఇదిలా ఉంటే ఫ్రెండ్స్ ప్యానల్కు చెందిన ఎదంవీవీ సత్యనారాయణ, అమిత్ భట్టుకు సమాన ఓట్లు రావడంతో టై ఏర్పడింది. వీరు ఈసీ మెంబర్లుగా పోటీపడ్డారు. -
వేగం పుంజుకున్న మోంథా తుఫాను
‘మొంథా’ తుపాను దూసుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. అది ఆదివారం సాయంత్రానికి పోర్టుబ్లెయిర్కు 670 కిలోమీటర్లు, చెన్నైకు 720, కాకినాడకు 780, విశాఖపట్నానికి 790, గోపాలపూర్ (ఒడిశా)కు 900 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. సోమవారం ఉదయంలోగా నైరుతి, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశముందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. -
బాబు@74
సాక్షి, హైదరాబాద్: చంద్రబాబు ఎట్ 74..! ఇది ఆయన వయసు అనుకునేరు. రాష్ట్ర విభజన అనంతరం రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ పర్యటనల సంఖ్య ఇదీ. సీఎం చంద్రబాబు మరో వీకెండ్ను హైదరాబాద్లో గడిపారు. శనివారం తెల్లవారుజామున ఇక్కడకు వచ్చిన ఆయన ఆదివారం రాత్రి వరకు మూడు కార్యక్రమాలకు హాజరయ్యారు. అనంతరం ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు తీరు ఇలానే ఉంటోంది. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్కు రాకపోకలు సాగిస్తున్నారు. వారాంతాల్లో విశ్రాంతి, వినోదాలు, విందుల కోసం ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నారు.ఇటీవల అధికారిక పర్యటనలో భాగంగా గన్నవరం నుంచి దుబాయ్ వెళ్లిన చంద్రబాబు... అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చారు. ఇది ఆయన అధికారంలోకి వచ్చాక నగరానికి రావడం 74వ సారి కావడం గమనార్హం. శనివారం రాత్రి పార్క్ హయత్, ఆదివారం ఐటీసీ కాకతీయ హోటల్స్, అన్వయ కన్వెన్షన్లో జరిగిన కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొన్నారు.చంద్రబాబు వీకెండ్ టూర్లో ఉన్నారనే విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 2014–19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు, 2019లో అధికారం కోల్పోయాక కూడా చంద్రబాబు ఇలానే వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం కరోనా కష్టాల్లో ఉన్నప్పటికీ 2022 వరకు చంద్రబాబు తన ముఖం కూడా వారికి చూపించకుండా హైదరాబాద్లో తలదాచుకున్నారనే విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. -
ప్రాజెక్టులపై ‘పర్యావరణ’ పిడుగు!
సాక్షి, హైదరాబాద్: పర్యావరణ అనుమతులు (ఈసీ) తీసుకోకుండా చట్టవిరుద్ధంగా నిర్మితమవుతున్న సాగునీటి ప్రాజెక్టులకు ఆ తర్వాత దశ (పోస్ట్ ఫ్యాక్టో)లో పర్యావరణ అనుమతులు ఇచ్చేలా కేంద్రం 2017, 2021లలో జారీ చేసిన నోటిఫికేషన్, మెమోరాండంను కొట్టేస్తూ సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు తెలంగాణకు శరాఘాతంగా మారింది. పాలమూరు–రంగారెడ్డి, సీతమ్మసాగర్, డిండి తదితర ప్రాజెక్టులకు భవిష్యత్తులో అనుమతులు పొందేందుకు ఉన్న దారులను మూసేసింది. సుప్రీం తీర్పు నేపథ్యంలో కేంద్ర పర్యావరణ శాఖ ఇలాంటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల జారీని నిలుపుదల చేసింది. ‘పాలమూరు’కు ముందడుగు పడ్డట్టే పడి.. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నిపుణుల మదింపు కమిటీ 2023 జూలై 24న సమావేశమై పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు జారీ చేయాలని సిఫారసు చేసింది. ఈఏసీ సిఫారసు చేస్తే అనుమతి రావడం లాంఛనమే. అయితే పర్యావరణ అనుమతులు లేకుండానే ఈ ప్రాజెక్టు పనులను చేపట్టినందుకు ప్రాజెక్టును ప్రతిపాదించిన అధికారి (ప్రాజెక్టు ప్రపోనెంట్)పై పర్యావరణ పరిరక్షణ చట్టం–1986లోని సెక్షన్ 19 కింద రాష్ట్ర ప్రభుత్వం/కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) చర్యలు తీసుకోవాలని నిపుణుల కమిటీ అప్పట్లో షరతు విధించింది. పర్యావరణ అనుమతుల జారీకి ముందు ఆ వివరాలను సమర్పించాలని సూచించింది. అనుమతులు జారీ చేసే వరకు ప్రాజెక్టు నిర్వహణ చేపట్టరాదని స్పష్టం చేసింది. దీంతో కొందరు అధికారులపై స్థానిక కోర్టులో కేసు పెట్టి ఆ వివరాలను కేంద్ర పర్యావరణ శాఖకు నీటిపారుదల శాఖ పంపించింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలపై సంతృప్తి చెందని పర్యావరణ శాఖ.. అనుమతులు జారీ చేయకుండా అదనపు సమాచారం కోరింది. ఆలోగా సుప్రీంకోర్టు తీర్పు రావడంతో ఈ ప్రాజెక్టుకు అనుమతుల ప్రక్రియను కేంద్రం పక్కనపెట్టేసిందని నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. ఈ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం.. పర్యావరణ ప్రభావ మదింపు నోటిఫికేషన్ 2006ను ఉల్లంఘించినట్లు గతంలోనే నిపుణుల మదింపు కమిటీ నిర్ధారించింది. ఇలాంటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల జారీకి ప్రత్యేక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్ (ఎస్ఓపీ)ను ప్రకటిస్తూ 2021లో కేంద్రం ఆఫీస్ మెమోరండం జారీ చేసింది. పర్యావరణ పునరుద్ధరణకు రూ. 72.63 కోట్లు, ప్రకృతి వనరుల వృద్ధికి రూ. 40.2 కోట్లు, సామాజిక వనరుల అభివృద్ధికి రూ. 40.8 కోట్లు కలిపి మొత్తం రూ. 153.7 కోట్లతో ఎస్ఓపీ అమలు చేస్తామని నీటిపారుదల శాఖ ప్రతిపాదించగా నిపుణుల కమిటీ గతంలో సమ్మతి తెలిపింది. అనుమతులు లేకుండానే రూ. 21,200 కోట్ల అంచనాలతో ప్రాజెక్టు పనులు చేపట్టినందున నిబంధనల ప్రకారం అందులో 0.5 శాతం చొప్పున రూ. 106 కోట్లను జరిమానాగా విధించింది. అయితే ఎస్ఓపీని ప్రకటిస్తూ కేంద్రం జారీ చేసిన ఆఫీస్ మెమోరండంను సైతం సుప్రీంకోర్టు కొట్టేయడంతో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు ఇక అనుమతులు లభించడం అసాధ్యంగా మారిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. పర్యావరణ అనుమతులు లేకుండా 90 శాతం ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేసినందుకు గతంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ రాష్ట్ర ప్రభుత్వంపై రూ. 528 కోట్ల జరిమానా విధించి పర్యావరణ పరిహారంగా కృష్ణా బోర్డుకు చెల్లించాలని ఆదేశించగా సుప్రీంకోర్టు నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్టే తెచ్చుకుంది. రూ. 32,500 కోట్ల అంచనాతో ఈ ప్రాజెక్టును చేపట్టగా ఆ తర్వాత ప్రాజెక్టు వ్యయం రూ. 55 వేల కోట్లకు పెరిగింది. ఇప్పటికే రూ. 35 వేల కోట్లకుపైగా వ్యయంతో పనులు జరిగాయి. ‘సీతమ్మసాగర్’దీ అదే పరిస్థితి.. పర్యావరణ అనుమతులు లేకుండానే రూ. 19,954 కోట్ల అంచనాతో నిర్మితమవుతున్న సీతమ్మసాగర్ బహుళార్థక సాధక ప్రాజెక్టు పరిస్థితి సైతం అగమ్యగోచరంగా మారింది. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల కోసం రాష్ట్రం చేసుకున్న దరఖాస్తును సుప్రీం తీర్పు తర్వాత కేంద్రం మూసేసిందని అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటికే రూ. 11,316 కోట్లతో పనులు చేసిన ఈ ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) నుంచి మాత్రం అన్ని రకాల అనుమతులు లభించాయి. పర్యావరణ అనుమతులు లేకుండా పనులు చేసినందుకు గతంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఎన్జీటీ రూ. 53 కోట్ల జరిమానా విధించింది. మరోవైపు పర్యావరణ అనుమతులు లేకుండానే నిర్మాణ పనులు మొదలుపెట్టినందుకు డిండి ప్రాజెక్టుకు ఎన్జీటీ గతంలో రూ. 92.5 కోట్ల మేర జరిమానా విధించింది. -
డాక్టర్ల ఉత్పత్తిలోనూ తెలంగాణ నంబర్ వన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ధాన్యం ఉత్పత్తిలోనే కాదు.. డాక్టర్లను ఉత్పత్తి చేయడంలోనూ నంబర్ వన్గా నిలుస్తుందని నిరూపించిందని, ఆ ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జహీరాబాద్లోని తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలలో చదివి ఎంబీబీఎస్లో సీట్లు పొందిన మైనారిటీ గురుకుల విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆదివారం తెలంగాణ భవన్లో కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు సన్మానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, పిల్లలు ప్రయోజకులైనప్పుడు తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారని, ఈ విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధించడంలో కేసీఆర్ పాత్ర ఉన్నందుకు తాము ఎంతో సంతోషపడుతున్నామని చెప్పారు. ఒక్క జహీరాబాద్ నుంచి 16 మంది ఎంబీబీఎస్ సీట్లు సాధించారని, ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, సైంటిస్టులు అవుతున్నారని చెప్పారు. ‘ఏ తల్లీతండ్రి అయినా ఆడపిల్లని చదివించడానికి కులమతాలని చూడరు. మంచి వసతులు కల్పిస్తే చదివిస్తారు’అని ఎప్పుడూ కేసీఆర్ అంటూ ఉండేవారని గుర్తుచేసుకున్నారు. అందుకు నిదర్శనంగా రైతు కుమార్తె, జర్నలిస్టు కుమార్తె, ఆటో డ్రైవర్ కుమార్తె ఎంబీబీఎస్ సీట్లు సాధించి ఈరోజు గర్వంగా మనముందు నిలబడ్డారని పేర్కొన్నారు. ఎంబీబీఎస్ సాధించిన విద్యార్థులంతా మరికొందరు పేద విద్యార్థులకు సాయం చేయాలని సూచించారు. హరీశ్రావు మాట్లాడుతూ, కేసీఆర్ గురుకుల పాఠశాలలు పెట్టి మైనార్టీలకు నాణ్యమైన విద్యను అందించారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 203 మైనార్టీ గురుకులాలు ఏర్పాటు చేసింది కేసీఆర్ అని గుర్తుచేశారు. గురుకులాలు మా జీవితాలను మార్చేశాయి కేసీఆర్ ప్రవేశపెట్టిన మైనార్టీ గురుకుల పాఠశాలలు తమ జీవితాలను మార్చేశాయని ఎంబీబీఎస్ సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు వారి అభిప్రాయాలు పంచుకున్నారు. ‘మేము ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు మా అబ్బాయిని మైనార్టీ గురుకుల పాఠశాలలో చదివించాం. ఈరోజు మా కుమారుడు డాక్టర్ చదువుతున్నాడు’అని ఎంబీబీఎస్ సీటు సాధించిన ఒబేదు తండ్రి, ఆటోడ్రైవర్ ఇబ్రహీం తన సంతోషాన్ని పంచుకున్నారు. మరో విద్యార్థిని తాసిల్ కమల్ మాట్లాడుతూ, ‘నీట్లో 444 మార్కులు వచ్చాయి. వనపర్తి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ సాధించాను’అని తెలిపారు. రైతు కుమార్తె ఫిర్దోస్ మాట్లాడుతూ.. ‘నేను జహీరాబాద్ మైనార్టీ గురుకులంలో ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు చదివాను. మేం అయిదుగురం అక్కా చెల్లెళ్లము. ఒక తమ్ముడు ఉన్నారు. మా తండ్రి రైతు. తిండికి కూడా చాలా కష్టంగా ఉండేది. అలాంటి మేము ఫీజులు కట్టి స్కూళ్లలో చదవలేకపోయాం. మైనార్టీ గురుకులాల వల్లే నేను చదవగలిగాను’అని పేర్కొన్నారు. జర్నలిస్ట్ కుమార్తె ప్రియా ఏంజెల్ మాట్లాడుతూ, ‘నేను వనపర్తి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఫ్రీ సీటు సాధించాను. నా తండ్రికి సరైన వేతనం లేనందువల్ల ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండేవాళ్లం. 2016లో జహీరాబాద్ గురుకులంలో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు చదివాను. ఈ గురుకులం మా జీవితాలను మార్చేసింది’అని హర్షం వ్యక్తంచేశారు. -
ఎమ్మెల్యేలకూ డీసీసీ పదవులు
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల ఎంపిక ఈ నెలాఖరు నాటికి పూర్తికావచ్చని టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేశ్కుమార్గౌడ్ తెలిపారు. కొందరు ఎమ్మెల్యేలకు కూడా డీసీసీ పదవులు ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఆదివారం ఢిల్లీలో ఆయన విలేకరులతో చిట్చాట్ చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ కొన్ని సందర్భాల్లో నిక్కచి్చగా ఉండదు. పార్టీలో రెండు పదవులు ఉండొద్దు అనే నిబంధన ఉంది. కానీ, కొంతమంది ఎమ్మెల్యేలకు కూడా డీసీసీ అధ్యక్ష పదవులు ఇచ్చే అవకాశం ఉంది. డీసీసీ అధ్యక్ష పదవికి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి భార్య పద్మావతి కూడా దరఖాస్తు చేసుకున్నారన్న విషయం నాకు తెలియదు. ఎమ్మెల్యేలకు డీసీసీ అనేది పదవి కిందకు రాదు కాబట్టి కొంతమంది ఎమ్మెల్యేలను, కార్పొరేషన్ల చైర్మన్లను ఈ పోస్టులకు పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు డీసీసీ బరిలో ఉన్నారు. నామినేటెడ్ పదవుల్లో పాత వారికే అవకాశాలు ఇవ్వాలనేది అధిష్టానం ఆలోచన. నాలుగైదు జిల్లాలకు కొత్త డీసీసీలు వస్తారు. వారం పదిరోజుల్లో డీసీసీలను ప్రకటించే అవకాశం ఉంది’అని వివరించారు.మంత్రుల వివాదం ముగిసిన అధ్యాయం రాష్ట్రంలో మంత్రుల మధ్య చోటుచేసుకున్న వివాదం ముగిసిన అధ్యాయమని మహేశ్కుమార్గౌడ్ అన్నారు. ఈ అంశంపై అధిష్టానానికి వివరణ ఇచి్చనట్టు తెలిపారు. ఎంతటివారైనా పార్టీకి లోబడి ఉండాల్సిందేనని అన్నారు. గీత దాటితే తనతోసహా ఎవరైనా అధిష్టానం నిఘాలో ఉంటారని పేర్కొన్నారు. గోడలకు కూడా చెవులుంటాయనే విషయాన్ని గ్రహించి నేతలు జాగ్రత్తగా మాట్లాలని హితవు పలికారు. ‘మంత్రుల మధ్య విభేదాలపై అధిష్టానం సీఎం రేవంత్రెడ్డిని అడిగారో లేదో నాకు తెలియదు. నన్ను మాత్రం అడిగారు. ఆ పంచాయితీ ముగిసిన అధ్యాయం. కొండా సురేఖ కూతురు అలా మాట్లాడాల్సింది కాదు. ఆమె పార్టీ వ్యక్తి కాదు. ఈ అంశంపై కొండా సురేఖను పిలిచి మాట్టాడి మందలించాం. మంత్రులు పొన్నం ప్రభాకర్గౌడ్, అడ్లూరి లక్ష్మణ్గౌడ్లు స్నేహితులు. కానీ, వారి మధ్య తలెత్తిన వివాదంతో బయట రాంగ్ మెస్సేజ్ వెళ్లింది. నాతో సహా ఎవరికైనా పార్టీనే సుప్రీం. పార్టీ నియమావళికి లోబడి పనిచేయాల్సిందే’అని స్పష్టంచేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్దేనని ధీమా వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు ఇద్దరు భార్యలున్నారనే విషయం మీడియా ద్వారానే తనకు తెలిసిందని చెప్పారు. అది వారి వ్యక్తిగతమని పేర్కొన్నారు. ఓట్చోరీకి హైదరాబాద్లోనే బీజం.. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో 40 నుంచి 50 లక్షల ఓట్లు తొలగించారని మహేశ్కుమార్ ఆరోపించారు. ఓట్ చోరీకి మొదట హైదరాబాద్లోనే బీజం పడిందని అన్నారు. కులం మతం పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోందని విమర్శించారు. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ను తాను గౌరవిస్తానని చెప్పారు. ‘ఉద్యమంలో ఆయన ముందుండి పోరాటం చేశారు. కానీ, ఆయన పదేళ్ల పరిపాలన గాడి తప్పింది. కల్వకుంట్ల కవిత పాదయాత్రను స్వాగతిస్తున్నాం. ప్రజా క్షేత్రంలో పాదయాత్రలు మంచిదే. ఆమె మొత్తం వాస్తవాలు మాట్లాడినప్పుడు గౌరవిస్తాం’అని పేర్కొన్నారు. తెలంగాణకు కేంద్రం నుంచి సహకారం లేదని తెలిపారు. మెట్రో, మూసీ ప్రక్షాళన విషయంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డికి బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. -
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రూ.4.15 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్: మరోసారి శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. విదేశాల్లో సాగు చేస్తున్న హైడ్రోఫోనిక్ (మట్టి లేకుండా సాగు) గంజాయిని భారత్ తరలించడం ఇటీవల పెరిగింది. ఈ తరహాలో విదేశాల నుంచి గంజాయి తెస్తున్న వారిపై డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు నిఘా పెంచారు. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్కు పెద్ద మొత్తంలో హైడ్రోఫోనిక్ గంజాయి తరలిస్తున్నట్టు అందిన సమాచారంతో డీఆర్ఐ హైదరాబాద్ జోనల్ యూనిట్ అధికారులు శనివారం విమానాశ్రయంలో నిఘా పెట్టారు.బ్యాంకాక్ నుంచి హైదరాబాద్కు వచ్చిన ఒక ప్రయాణికురాలిని అడ్డుకున్నారు. ఆమె లగేజీని తనిఖీ చేయగా, అడుగుభాగంలో గంజాయికి పాజిటివ్గా తేలిన ముద్ద రూపంలో ఆకుపచ్చని పదార్థాన్ని కలిగి ఉన్న ప్యాకెట్లు గుర్తించారు. ఈ సోదాల్లో మొత్తం 4.15 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి పట్టుబడింది. దీని విలువ బహిరంగ మార్కెట్లో రూ. 4.15 కోట్లు ఉంటుందని డీఆర్ఐ అధికారులు తెలిపారు. బ్యాంకాక్ నుంచి గంజాయి తీసుకొచ్చిన ఆ ప్రయాణికురాలిని ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం అరెస్టు చేశారు. -
ఆ ఇద్దరి ధైర్య సాహసాలకు హ్యాట్సాఫ్
లక్డీకాపూల్/పంజగుట్ట: చాదర్ఘాట్ కాల్పుల ఘటనలో డీసీపీ చైతన్య, గన్మెన్ మూర్తి ధైర్య సాహసాలను ప్రదర్శించారని డీజీపీ శివధర్రెడ్డి అభినందించారు. సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ ఇద్దరిని ఆదివారం డీజీపీ పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఉన్నారు. ఈ సందర్భంగా మీడియాతో శివధర్రెడ్డి మాట్లాడుతూ చైతన్య, మూర్తిల ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, ఇద్దరూ సోమవారం డిశ్చార్జ్ అయ్యే అవకాశముందన్నారు. నిందితుడు అన్సారీకి బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరిగిందని, అతని ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉందని చెప్పారు. పరారీలో ఉన్న వారి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయన్నారు. కొన్ని క్లూస్ లభించాయి: సీపీ సజ్జనార్ చాదర్ఘాట్ ఘటనలో కొన్ని క్లూస్ లభించాయని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఆటోడ్రైవర్, ఇంకో వ్యక్తిని పట్టుకునేందుకు సౌత్జోన్ డీసీపీ నేతృత్వంలో ఐదు పోలీసు బృందాలు పనిచేస్తున్నాయన్నారు. ఇటీవల ఒమర్ కదలికలు, అతనికి ఉన్న పరిచయాలపై ఆరా తీస్తున్నామని చెప్పారు. విజబుల్ పోలీసింగ్ కూడా పెంచామని పేర్కొంటూ..ఎవరూ భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదన్నారు. డీసీపీ చైతన్యకి మెడ భాగంలో, గన్మెన్ మూర్తికి కాలుకు గాయమైందని చెప్పారు. డ్రైవర్ సందీప్ అలర్ట్గా ఉండి కీలక పాత్ర పోషించారన్నారు. -
నేచర్ టు అడ్వెంచర్.. ఎకో టూరిజం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రకృతి, స్థానిక సంస్కృతి, పర్యావరణ పరిరక్షణలో భాగంగా పర్యాటక ప్రాంతాలను తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. అడ్వెంచర్, రిక్రియేషన్, ఆధ్యాత్మిక, వారసత్వ, సినీ, వెడ్డింగ్, నేచర్ వైల్డ్లైఫ్, హెరిటేజ్ కల్చర్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని 17 సర్క్యూట్లలో 64 ఎకో టూరిజం ప్రదేశాలను గుర్తించి వాటి అభివృద్ధికి చర్యలు చేపట్టనుంది. తద్వారా పర్యాటక ప్రాంతాల అభివృద్ధితోపాటు స్థానిక యువతకు ఉపాధి కల్పించేందుకు కసరత్తు చేస్తోంది.ఇప్పటికే జీవవైవిధ్య ప్రాంతాలు, ప్రాచీన వారసత్వ సంపదకు అద్దంపట్టే ప్రదేశాలను గుర్తించింది. మొదట అనంతగిరి, కనకగిరి, నందిపేట, మన్ననూరు పర్యాటక ప్రాంతాల్లో అభివృద్ధి పనులను ప్రారంభించనుంది. ప్రభుత్వ – ప్రైవేటు భాగస్వా మ్యంతో ఎకో టూరిజం ప్రాజెక్టులను సర్కారు అభివృద్ధి చేయనుంది. ఇందులో భాగంగా అనంతగిరిలో 8, మన్ననూరులో 14 కాటేజీలను నిర్మించనుంది. ఒక్కో ఎకో కాటేజీ నిర్మాణానికి రూ. 20 లక్షలు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. ఎకో కాటేజీల నిర్మాణంతోపాటు ట్రెక్కింగ్ పార్క్, సఫారీ ట్రాక్, వాచ్ టవర్లను ఏర్పాటు చేయనున్నారు.మన్ననూరులో ఇప్పటికే 130 మంది గైడ్లకు ఎకో టూరి జం హాస్పిటాలిటీపై శిక్షణ ఇచ్చారు. త్వరలోనే నిజామాబాద్జిల్లా నందిపేటలోని ఉమ్మెడ, గాజపల్లి, బిల స్పూర్లలో ఎకో టూరిజం పనులు ప్రారంభం కానున్నాయి. అలాగే వరంగల్ జూ పార్కును వర్చువల్ రియాలిటీ పార్కుగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు సిద్ధమైనట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. -
యాదగిరిగుట్ట ఆదాయానికి టెండర్
వ్యాపారం ప్రారంభించిన తర్వాత లాభం వస్తోందా.. నష్టమా అన్నది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాలి. కానీ, వ్యాపారం ప్రారంభించిన వెంటనే నష్టం వచ్చిందన్న అభిప్రాయానికి రావటం కుదరదు. కానీ అలా టెండర్ వేసి..ఇలా నష్టం వస్తోంది.. ప్రత్యేక వెసులుబాటు ఇవ్వండంటూ ఓ వ్యాపారి అడిగేయటం, దానికి ఓ ప్రజాప్రతినిధి వంత పాడటం, వెనకాముందూ చూడకుండా ఉన్నతాధికారులు వెసులుబాటు ఇచ్చేయటం చకచకా జరిగిపోయింది. వడ్డించేవాడు మనవాడైతే ఏం చేసినా చెల్లిపోతుందన్న మాట ఇక్కడ తేలిగ్గా జరిగిపోయింది. ఇదంతా యాదగిరిగుట్ట దేవాలయంలో జరుగుతున్న ఇష్టారాజ్యానికి తాజా నిదర్శనంలా నిలిచింది. సాక్షి, హైదరాబాద్: దేవాదాయశాఖ పరిధిలోని పెద్ద దేవాలయాలకు భక్తులు స్వామి, అమ్మవార్లకు వ్రస్తాలు సమర్పించటం సహజం. ఆ వ్రస్తాలను ప్రసాదంగా భావించి భక్తులు కొంటారు. వస్త్రాలను భక్తులకు విక్రయించేందుకు టెండర్లు పిలిచి ఎక్కువ మొత్తం పాడిన వ్యక్తికి కాంట్రాక్ట్ అప్పగిస్తారు. యాదగిరిగుట్ట దేవాలయంలో ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి టెండర్ పిలవగా ఓ వ్యాపారి రూ.52,15,600 (జీఎస్టీతో కలుపుకొని) మొత్తానికి దక్కించుకున్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి వచ్చే సంవత్సరం మార్చి చివరి నాటికి టెండర్ గడువు ఉంది.కానీ టెండర్ దక్కించుకున్న మూడు నెలలకే... వ్రస్తాల విక్రయం సరిగ్గా లేదని, నష్టం వస్తోందని, దీంతో తనకు మూడేళ్లపాటు ఆ వస్త్రాలు విక్రయించే వెసులుబాటు కల్పించాలని దేవాదాయశాఖకు ఆ వ్యాపారి విన్నవించుకున్నారు. దీనికి వంత పాడుతూ ఓ ఎమ్మెల్యే సిఫారసు చేశారు. దాన్ని పరిశీలించిన దేవాలయ కార్యనిర్వహణాధికారి వెంకటరావు, కమిషనర్కు ప్రతిపాదించారు. ఆ వెంటనే సానుకూల ఆదేశాలు జారీ అయ్యాయి. టెండర్ను మూడేళ్లకు కొనసాగిస్తూ 2028 మార్చి 31 వరకు స్వామివారి వ్రస్తాలు సేకరించుకోవచ్చని పేర్కొంటూ ఆగస్టు 29 తేదీతో ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రతిపాదించిన ఆలయ ఈఓ, దేవాదాయశాఖ కమిషనర్... రెండు పోస్టులను ఆ సమయంలో ఐఏఎస్ అధికారి వెంకటరావే నిర్వహిస్తుండటం విశేషం. ఇలాంటి టెండర్ల విషయంలో లాభ నష్టాలతో దేవాలయానికి బాధ్యత ఉండదని పేర్కొంటుంటారు.దాన్ని పట్టించుకోకుండా మూడేళ్లపాటు పాత టెండరే కొనసాగేలా చక్రం తిప్పారు. గతంలో వేములవాడ దేవాలయంలో భక్తులు సమర్పించిన తలనీలాలను సేకరించే టెండర్ విషయంలోనూ ఓ పర్యాయం ఇలాంటి వ్యవహారమే చోటు చేసుకుంది. రూ.5 కోట్లకుపైగా మొత్తానికి టెండర్ పాడిన వ్యక్తి టెండరు గడువు ముగిసే సమయంలో, నష్టం పేరు చెప్పి తనకు మరో రెండేళ్ల పొడిగింపు ఇవ్వాలని కోరగా, అధికారులు సానుకూల నిర్ణయం తీసుకున్నారు. దీనిపై కొందరు వ్యక్తులు విజిలెన్సు విభాగానికి ఫిర్యాదు చేశారు. దీన్ని విజిలెన్సు అధికారులు ఎండగట్టడంతో పొడిగింపు ఆదేశాలను రద్దు చేసిన ప్రభుత్వం..మళ్లీ టెండర్ పిలవాలని ఆదేశించింది. మళ్లీ టెండర్ పిలిస్తే దాదాపు రూ.12 కోట్లకు ఫైనల్ అయ్యింది.యాదగిరిగుట్ట పునర్నిర్మాణం తర్వాత భక్తులు సమర్పించే వ్రస్తాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. వచ్చే సంవత్సరం మరింత ఎక్కువ మొత్తానికి టెండర్ పిలిచే వీలుంటుంది. అంటే దేవుడి ఆదాయం పెరిగే అవకాశాన్ని అధికారులు కాలదన్నినట్టయ్యింది. దేవాలయ స్థలాలు, దుకాణాల లీజుల విషయంలో నష్టం వస్తే, టెండర్ విలువ ఆధారంగా 33 శాతం/ 50 శాతం పెంపుతో తదుపరి సంవత్సరానికి అదే వ్యక్తికి పాత టెండర్ను కొనసాగించే వెసులుబాటు ఉంది. గతంలో ప్రభుత్వం ఇచి్చన ఉత్తర్వు ప్రకారం ఇది కొనసాగుతోంది. దాన్ని ఇలా వ్రస్తాల విషయంలోనూ అన్వయించేస్తున్నారు. విచిత్రమేంటంటే... పాత టెండర్ను తదుపరి అదనంగా రెండేళ్లపాటు కొనసాగించినా, టెండర్ మొత్తానికి ఎంతమేర పెంపును జతచేశారో ఉత్తర్వులో పేర్కొనలేదు. అంటే దేవుడి ఆదాయానికి రెండు రకాలుగా నష్టం వాటిల్లినట్టయ్యింది. -
రేపు జూబ్లీహిల్స్లో సీఎం రోడ్ షో
సాక్షి హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో ఈ నెల 28న సీఎం రేవంత్రెడ్డి రోడ్ షో ఉంటుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్యాదవ్కు మద్దతుగా సీఎం జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని నాలుగు డి విజన్లలో రోడ్షోలో పాల్గొంటారన్నారు.అనంతరం జరిగే బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్పాయి. -
కేంద్రమంత్రి కుమారుడి బారసాలకు సీఎం రేవంత్
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదివారం ఢిల్లీలో పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్, శ్రావ్య దంపతుల కుమారుడు శివాన్ బారసాల వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిన్నారిని ఆశీర్వదించారు. సీఎం వెంట కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి, కేంద్ర పథకాల సమన్వయకర్త గౌరవ్ ఉప్పల్ తదితరులు ఉన్నారు.కాగా, డీసీసీ అధ్యక్షుల ఎంపిక కోసం శనివారం ఢిల్లీకి వచ్చిన సీఎం రేవంత్.. తన రెండు రోజుల పర్యటన ముగించుకుని హైదరాబాద్కు తిరిగి వెళ్లారు. కేంద్రమంత్రి నివాసంలో జరిగిన బారసాల వేడుకకు కేంద్ర ఉక్కు శాఖ సహాయమంత్రి శ్రీనివాస వర్మ, ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలువురు ప్రముఖులు హాజరై శివాన్ను ఆశీర్వదించారు. -
అద్దె బకాయిలెన్ని?
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యా సంస్థల అద్దె బకాయిలను చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రతి నెలా సంక్షేమ శాఖలకు రూ.500 కోట్లు విడుదల చేస్తామని ఇటీవల ముఖ్యమంత్రి రేంవత్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నిధులను అటు గురుకుల విద్యా సంస్థల నిర్వహణకు, ఇటు సంక్షేమ శాఖల ద్వారా అమలు చేస్తున్న ఉపకార వేతనాలు, హాస్టళ్ల నిర్వహణ, ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపుల కు వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచించింది. సీఎం ఇచి్చన హామీలో భాగంగా ఈమేరకు వచ్చే నెలలో రూ.500 కోట్లు మంజూరు చేసే అవకాశం ఉంది.ఈ నిధులను ప్రాధాన్యతా క్రమంలో వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచించింది. కాగా, గురుకుల విద్యా సంస్థలకు ప్రైవేటు భవనాల అద్దె భారంగా ఉంది. దాదాపు పది నెలల నుంచి అద్దె చెల్లింపులు నిలిచిపోయినట్లు సొసైటీ వర్గాలు చెబుతున్నాయి. కేవలం అద్దె బకాయిలే దాదాపు రూ.155 కోట్లు చెల్లించాల్సి ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. ఈ బకాయిలను ఒకే విడతలో కాకుండా ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి నెలనెలా తీర్చాలని ప్రభుత్వం సూచించడంతో ఈమేరకు సొసైటీ అధికారులు లెక్కలు సిద్ధం చేస్తున్నారు. ఐదు నెలల్లో క్లియర్ చేసేలా.. ప్రస్తుతం పేరుకుపోయిన అద్దె బకాయిలను మార్చి నెలాఖరు నాటికి ఏ విధంగా క్లియర్ చేయవచ్చనే అంశంపై సొసైటీ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రస్తుతం అద్దె బకాయిలు రూ.155 కోట్లు ఉండగా.. వచ్చే ఏడాది మార్చి నాటికి మరో రూ.70 కోట్లు పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో నెలవారీగా ఏ మేరకు విడుదల చేస్తే బకాయిలను క్లియర్ చేయవచ్చనే అంశంపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ప్రతినెలా రూ.15 కోట్ల మేర అద్దె బిల్లులు చెల్లిస్తున్నారు. ప్రస్తుతం నెలవారీగా విడుదల చేసే నిధులకు అదనంగా.. గత బకాయిలను కలుపుకొంటూ చెల్లింపులు చేసేందుకు గురుకుల సొసైటీ అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు.సొసైటీల వారీగా అద్దె భవనాల సంఖ్య, అద్దె బిల్లుల బకాయిలు, కొత్తగా చెల్లించాల్సిన మొత్తం.. తదితర అంశాలతో కూడిన ప్రతిపాదనలను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం గురుకుల సొసైటీలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో సొసైటీ అధికారులు ప్రభుత్వం నిర్దేశించిన ఫార్మాట్ ఆధారంగా వివరాలు సమర్పించేందుకు చర్యలు చేపట్టారు. ఒకట్రెండు రోజుల్లో ఈ వివరాలతో కూడిన ప్రతిపాదనలను సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కార్యాలయానికి సమర్పిస్తామని సొసైటీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకల్లా గురుకుల అద్దె భవనాల బకాయిలు దాదాపు క్లియర్ అవుతాయని అధికారులు భావిస్తున్నారు. -
ఆయువు తీస్తున్న ‘వాయువు’!
సాక్షి, హైదరాబాద్: దేశంలో 2000 సంవత్సరం నుంచి ఇటీవలి కాలం వరకు వాయు కాలుష్యం వల్ల సంభవిస్తున్న మరణాలు 43 శాతం పెరిగాయని తాజా అధ్యయనం వెల్లడించింది. దేశవ్యాప్తంగా 2023లో సంభవించిన దాదాపు 20 లక్షల మరణాలు వాయు కాలుష్యంతో ముడిపడినవేనని తేలి్చంది. ఈ మేరకు అమెరికాలోని బోస్టన్ హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ (హెచ్ఈఐ), ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఇవాల్యుయేషన్ (ఐహెచ్ఎంఈ) స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్–2025 పేరుతో నివేదిక విడుదల చేసింది. భారత్లో వాయు కాలుష్య సంబంధ మరణాల రేటు అధిక ఆదాయ దేశాల కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువగా ఉందని నివేదిక తెలిపింది.భారత్లో ప్రతి లక్ష మందికి 186 మరణాలు సంభవిస్తుంటే సంపన్న దేశాల్లో ప్రతి లక్ష మందికి 17 మరణాలే నమోదవుతున్నాయని పేర్కొంది. 2023లో సంభవించిన వాయుకాలుష్య సంబంధ మరణాల్లో దాదాపు 89 శాతం గుండె జబ్బులు, ఊపిరితిత్తుల కేన్సర్, డయాబెటీస్ వంటి కారణంగా సంభవించాయి. 2021లో దక్షిణాసియాలో మొత్తం 26 లక్షల మంది వాయు కాలుష్యం బారినపడి మరణిస్తే వారిలో 21 లక్షల మంది భారత్లోనే మరణించారని నివేదిక పేర్కొంది. వాయు కాలుష్యం ఊపిరితిత్తులను దెబ్బతీయడంతోపాటు మెదడు పనితీరును సైతం క్షీణింపజేస్తోందని ఈ అధ్యయనం తేలి్చంది. మతిమరుపు కూడా... వాయుకాలుష్యం కేవలం శ్వాసకోశ, గుండె జబ్బులకే కాకుండా అల్జీమర్స్ వంటి మతిమరుపు సంబంధ మరణాలకు సైతం కారణమవుతున్నట్లు తాజా నివేదికలో వెల్లడైంది. ఒక్క 2023లోనే 6.26 లక్షల మందిలో మతిమరుపుతో ముడిపడిన మరణాలకు వాయుకాలుష్యం కారణమని తేలింది. ఈ అధ్యయనం ద్వారా మతిమరుపు వ్యాధి రావడంలో వాయుకాలుష్యం సైతం కీలకపాత్ర పోషిస్తోందనే విషయం తొలిసారి తేలింది. ప్రపంచవ్యాప్తంగా వృద్ధులపై అతిసూక్ష్మ రూపాల్లోని (పరి్టక్యులేట్ మ్యాటర్–పీఎం 2.5) కాలుష్యం దీర్ఘకాలిక ప్రభావంతో ఊపిరితిత్తులు, గుండెతోపాటు మెదడుపైనా అధిక ప్రభావం చూపుతున్నట్లు స్పష్టమైంది.సూక్ష్మ రూపాల్లోని కాలుష్య కారకాలు ఊపిరితిత్తుల నుంచి రక్తప్రవాహంలోకి ఎలా ప్రయాణించి మెదడును చేరి దాన్ని ఎలా దెబ్బతీస్తాయో తాజా అధ్యయనం వివరించింది. దీనిప్రకారం కాలుష్య కారకాల్లోని సూక్ష్మ కణాలు తొలుత మెదడు వాపునకు దారితీసి ఆ తర్వాత క్రమంగా మెదడు కణజాలాన్ని దెబ్బతీసి న్యూరాన్లను వేగంగా క్షీణింపజేస్తాయి. ఈ ప్రక్రియ అల్జీమర్స్, వ్యాసు్కలర్ డిమెన్షియా ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ పరిస్థితులు జ్ఞాపకశక్తి, తార్కికతను క్రమంగా కోల్పోయేలా చేస్తాయి.అలాగే వాయుకాలుష్యం వల్ల తలెత్తే మతిమరుపు సమస్య మహిళల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధ్యయనం పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 2021 నాటికి 6 కోట్ల మంది మతిమరుపుతో జీవిస్తున్నారని.. ఏటా కోటి కొత్త కేసులు బయటపడుతున్నాయని నివేదిక పేర్కొంది. కాలుష్యం తగ్గుదలతో జీవితకాలం పెరుగుదల... వాయు కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా ఆరోగ్య సంరక్షణ ఖర్చులను తగ్గించుకోవడంతోపాటు ఆరోగ్యకరమైన జీవితకాలం పెంచుకోవచ్చని.. ఇది వాతావరణ మార్పులను మందగించేలా చేయడంలోనూ దోహదపడుతుందని నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, విధాన రూపకర్తలకు ఈ అధ్యయన ఆధారాలు మేల్కొలిపేలా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు.సంపూర్ణ ఆరోగ్యంలో స్వచ్ఛమైన గాలిదే కీలకపాత్ర.. అందరికీ సంపూర్ణ ఆరోగ్యం, మెరుగైన జీవన ప్రమాణాలను నిర్ధారించడంలో స్వచ్ఛమైన గాలి కీలకపాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికాలలో నివసిస్తున్న వారి ఆరోగ్యంపై గాలి నాణ్యత గణనీయమైన ప్రభావం చూపుతోందని తాజా గణాంకాలు చెబుతున్నాయి. వాయు కాలుష్యాన్ని వీలైనంత తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో ఈ నివేదిక దోహదపడుతుందని ఆశిస్తున్నాం. – పల్లవి పంత్, బోస్టన్ హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ (గ్లోబల్ ఇనీషియేటివ్స్ హెడ్) -
ప్రైవేట్ బస్సుల్లో సరుకులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి ఏపీలోని కాకినాడ, మచిలీపట్నం, ఏలూరు, తిరుపతి, శ్రీకాళహస్తి, రాజమండ్రి, కడప, కర్నూలు వైజాగ్, నర్సీపట్నం, తదితర ప్రాంతాలకు బయలదేరే బస్సుల్లో టన్నుల కొద్దీ సరుకును చేరవేస్తున్నారు. ఈ బస్సులు యథేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘించి తిరుగుతున్నాయి. ఇటీవల కర్నూలు బస్సు ప్రమాద ఘటనలోనూ 400 మొబైల్ ఫోన్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. ప్రమాదం జరగడంతో సెల్ఫోన్ల అంశం వెలుగులోకి వచ్చింది. ఒకవేళ ఈ ప్రమాదం జరగకుండా ఉంటే ఆ బస్సులో మొబైల్ ఫోన్ల రవాణా కొనసాగేదే.కేవలం ఆ ఒక్క బస్సులోనే కాదు..హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు నడిచే చాలా బస్సుల్లో చాలావరకు ఎలక్ట్రిక్ వస్తువులు, వివిధ రకాల ఉపకరణాలు, వస్త్రాలు, ఎరువులు, ఐరన్ వంటివి పెద్ద ఎత్తున రవాణా అవుతున్నాయి. దీంతో ప్ర యాణికులు ఉన్నా, లేకున్నా నిర్ణీత సమయం ప్రకారం ఈ బస్సు లు రాకపోకలు సాగిస్తున్నాయి. దసరా, దీపావళి తర్వాత ప్రయా ణికుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. కానీ బస్సులు మాత్రం నిలిచిపోలేదు. కేవలం 50 శాతం ఆక్యుపెన్సీతోనే ఇవి రాకపోకలు సాగించడానికి సరుకు రవాణాయే ప్రధాన కారణం. పరిమితికి మించిన బరువుతో పరుగులు మోటారు వాహన నిబంధనల ప్రకారం.. ప్రైవేట్ బస్సులు హైవేలో గంటకు 80 కి.మీ.వేగంతోనే రాకపోకలు సాగించాలి. కానీ ఒకవైపు ప్రయాణికులు, మరోవైపు లగేజీ బాక్సులతో పరిమితికి మించిన బరువును మోసుకుంటూ వెళ్లే ఈ బస్సులు త్వరగా గమ్యాన్ని చేరేందుకు గంటకు 120 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో నడుస్తున్నాయి. దీంతో అనూహ్యమైన పరిస్థితుల్లో డ్రైవర్లు వేగాన్ని తగ్గించి బస్సులను అదుపు చేయలేకపోతున్నట్టు రవాణా రంగానికి చెందిన నిపుణులు పేర్కొంటున్నారు. ప్రతి బస్సులో తప్పనిసరిగా ఇద్దరు డ్రైవర్లు విధులు నిర్వర్తించాల్సి ఉండగా, కొన్నింటిలో కేవలం ఒక్కరే బస్సు నడుపుతున్నారు. దీంతో డ్రైవర్లపైన పనిభారం పెరిగి తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. బస్సు ప్రమాదాలకు అతివేగమే కారణమని అధికారులు పేర్కొంటున్నారు. కొనసాగుతున్న దాడులు కర్నూలు బస్సు దుర్ఘటన నేపథ్యంలో ప్రైవేట్ బస్సులపై రవాణాశాఖ దాడులను ఉధృతం చేసింది. రెండోరోజు ఆదివారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో నిబంధనలకు విరుద్ధంగా తిరిగే ప్రైవేట్ బస్సులపై 21 కేసులను నమోదు చేశారు. వివిధ రకాల ఉల్లంఘనలపైన రూ.69,000లకు పైగా జరిమానా విధించారు. ప్రైవేట్ బస్సుల అక్రమ రవాణాను అరికట్టేందుకు హైదరాబాద్, రంగారెడ్డి. మేడ్చల్ జిల్లాల పరిధిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు హైదరాబాద్ జేటీసీ సి.రమేశ్ తెలిపారు. హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాలతోపాటు బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాలకు ప్రతిరోజు సుమారు 1,000 బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి.వివిధ రాష్ట్రాల్లో నేషనల్ పర్మిట్లులు తీసుకొని తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణికుల కోసం నడుపుతున్న బస్సుల్లో చాలావరకు అక్రమ రవాణా కొనసాగిస్తున్నాయి. టూరిస్టులు, యాత్రికులు, తదితర కేటగిరీకి చెందిన ప్రయాణికుల కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతం వరకు నాన్స్టాప్గా తిరగాల్సిన వాటిలో, చాలావరకు ఆర్టీసీ తరహాలో స్టేజీ క్యారేజీలుగా నడుస్తున్నాయి. ప్రయాణికుల భద్రతకు ప్రమాదకరమైన అపరిమితమైన ఎలక్ట్రిక్ పరికరాల వినియోగం, హై ఓల్టేజీ విద్యుత్ వినియోగం అగ్ని ప్రమాదాలకు దారితీస్తుంది. రవాణా అధికారులు రెండురోజులుగా నిర్వహిస్తున్న తనిఖీల్లో ప్రయాణికుల భద్రతపైన ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి దాడులను కొనసాగిస్తున్నట్టు జేటీసీ తెలిపారు. -
కేన్సర్ రోగుల లెక్క తేల్చరా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేన్సర్ వ్యాధి అంతకంతకూ విస్తరిస్తోంది. ఏటా 55 వేల మందికిపైగా కేన్సర్ బారిన పడుతున్నట్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నమోదైన కేసులతోపాటు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద తీసుకుంటున్న చికిత్సల గణాంకాలతో వెల్లడవుతోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అధికారికంగా కేన్సర్ రోగుల లెక్కలను సేకరించడంలేదు. నిబంధనల ప్రకారం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అదీనంలోని ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సరై్వలెన్స్ పోర్టల్ (ఐడీఎస్పీ)లో దేశవ్యాప్తంగా సీజనల్ వ్యాధులు, ప్రమాదకర రోగాలకు సంబంధించిన సమాచారాన్ని చేర్చాలి. తద్వారా ఆయా వ్యాధుల నివారణ, ముందు జాగ్రత్తలపై కేంద్రం నిఘా ఉంటుంది. ఆయా వ్యాధులు ప్రబలడానికి గల కారణాలు, ఎక్కడెక్కడ ప్రబలుతున్నాయనే అంశాలపై కేంద్రానికి పరిశోధనలు జరిపే అవకాశం లభిస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకుండా కేవలం అంచనాలకే పరిమితమవుతోంది. ఐడీఎస్పీలో నిరంతర పర్యవేక్షణ సీజనల్ వ్యాధులతోపాటు తాగునీరు, ఆహారం, దోమలు, ఇతర రోగాలకు సంబంధించిన గణాంకాలను ఐడీఎస్పీ ద్వారా కేంద్ర ప్రభుత్వం 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సేకరించి ఆయా రోగాలపై నిరంతర నిఘా పెడుతుంది. డయేరియా, మలేరియా, చికున్గున్యా, టైఫాయిడ్, కలరా, వంటి 12 రోగాలపై ‘ఎల్’కేటగిరీలో నిఘా కొనసాగిస్తుంది. వాటితోపాటు కుక్క కాటు, పాముకాటు, చికెన్పాక్స్, మీజిల్స్, ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేకంగా సోకే వ్యాధులు, ఇతర గుర్తించని రోగాలకు సంబంధించి ‘ప్రిసంప్టివ్’విభాగంలో నమోదు చేసి ముందు జాగ్రత్త చర్యలు, పరిశోధనలు జరుపుతుంది. అలాగే సంబంధిత రాష్ట్రాలకు అవసరమైన మందులు, ఇతర సహకారాన్ని కూడా అందిస్తుంది. మంత్రి చెప్పినా పడని ముందడుగు .. రాష్ట్రంలో ఏటా 55 వేలకుపైగా కేన్సర్ కేసులు కొత్తగా నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు ప్రతి జిల్లాకు ఓ కేన్సర్ డే కేర్ సెంటర్ (సీడీసీ)ను ఏర్పాటు చేశారు. అన్ని జిల్లా ఆస్పత్రుల్లో కేన్సర్ స్క్రీనింగ్తోపాటు కీమోథెరపీ చికిత్స కూడా అందిస్తున్నారు. త్వరలో రీజనల్ కేన్సర్ సెంటర్లను ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో కేన్సర్ చికిత్స అందించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. లంగ్, బ్రెస్ట్, సరై్వకల్ కేన్సర్లే ఎక్కువగా రాష్ట్రంలో నమోదవుతున్న నేపథ్యంలో ఈ వ్యాధులకు తొలిదశ నుంచే చికిత్స అందించడం ద్వారా కేన్సర్ మరణాలను తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదయ్యే కేన్సర్ కేసులను ప్రతి వారం ఐడీఎస్పీలో నమోదు చేయాలని మంత్రి దామోదర గతంలో తన శాఖ సమీక్షలో ఉన్నతాధికారులను ఆదేశించారు. కానీ ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి ముందడుగు లేదు. -
కాంగ్రెస్కు ఓటేస్తే ఇంటికి బుల్డోజర్: కేటీఆర్
బంజారాహిల్స్/గోల్కొండ: రాష్ట్రంలో దండుపాళ్యం ముఠా పాలన నడుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో ఆదివారం తెలంగాణ హోటల్స్ కార్మీక యూనియన్ నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు కార్మీక నాయకులు బీఆర్ఎస్లో చేరగా వారిని గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలోనూ, అనంతరం జూబ్లీహిల్స్ ప్రచారంలోనూ కేటీఆర్ మాట్లాడారు. ‘మంత్రి ఓఎస్డీ తుపాకీతో బెదిరించారని మంత్రి ఇంటికి పోలీసులు వెళ్లారు. మంత్రి బిడ్డ బయటకు వచ్చి తుపాకీ ఇచ్చింది రేవంత్రెడ్డి, రోహిన్రెడ్డి అని చెప్పారు.. మంత్రి భర్త తుపాకీ ఇచ్చారని పోలీసులు అంటున్నారు. రాష్ట్రంలో రౌడీషీటర్ల పాలన నడుస్తోంది’అని అన్నారు. తుపాకీ రోహిన్రెడ్డి పెట్టిండా.. సుమంత్ పెట్టిండా అని ప్రశ్నించారు. అలీబాబా దొంగల ముఠాలా పాలన తయారైందన్నారు. లిక్కర్ బాటిల్స్ స్టిక్కర్ కాంట్రాక్ట్ కోసం సీఎం అల్లుడు, మంత్రి కొడుకు పోటీ పడ్డారని, ఎవరికీ చెప్పలేక ఐఏఎస్ రాజీనామా చేశారని పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్ను నమ్మలేదని, ఓఆర్ఆర్ లోపల కాంగ్రెస్కు ఒక్క సీటూ రాలేదన్నారు. హైడ్రాలో పేదవాళ్లకు మాత్రమే రూల్స్ ఉంటాయని, పెద్దవాళ్లకు రూల్స్ ఉండవన్నారు. రేవంత్రెడ్డి కుటుంబం, తమ్ముళ్లు, మంత్రులు దోచుకోవడంపై దృష్టి పెట్టారని ఆరోపించారు. జూబ్లీహిల్స్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్ధి చరిత్ర మీకు తెలుసునని, రౌడీషీటర్లు, నేరచరిత్ర, బెదిరింపులకు పాల్పడే వాళ్లను గెలిపిస్తారా? అన్నారు. కారు కావాలో.. బుల్డోజర్ కావాలో ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే బుల్డోజర్ ఇంటికి వస్తుందన్నారు. మైనార్టీలకు ప్రాతినిధ్యమేదీ? జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్పేట్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రగతిని, రెండేళ్ల కాంగ్రెస్ మోసాల పాలనను చూసి ప్రజలు జూబ్లీహిల్స్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. మైనార్టీ ప్రాతినిధ్యం లేని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో తొలిసారి వచ్చిందన్నారు. ఓవైపు ముఖ్యమంత్రి సెక్యులర్ ప్రభుత్వం అంటూనే మైనార్టీలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి తెలంగాణలో లోపాయికారిగా పని చేస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణలో సీఎం రేవంత్రెడ్డి బీజేపీతో కలిసి పనిచేస్తున్నారని, ఈ విషయంపై రాహుల్గాంధీ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తామన్న నమ్మకం స్వయంగా ముఖ్యమంత్రితోపాటు ఆయన మంత్రులకూ లేదని ఎద్దేవాచేశారు. జూబ్లిహిల్స్లో రౌడీ కుటుంబానికి చెందిన వారికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందని, లోపాయికారిగా ఓ ప్రాంతీయ పార్టీతో పొత్తుపెట్టుకుందని ఆరోపించారు. -
కమలానికి జూబ్లీహిల్స్ పరీక్ష
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకుంది. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, బీజేపీల మధ్య త్రిముఖ పోరు జరుగుతోంది. నామినేషన్ల పర్వం ముగియడంతో బరిలో నిలిచిన పార్టీలు, అభ్యర్థుల బలాబలాలు, ఇతర అంశాలు చర్చకు వస్తున్నాయి. వచ్చేనెల 11న పోలింగ్ జరగనుంది. ప్రచారానికి ఇంకా సమయం ఉండటంతో ఓటర్లను ఆకట్టుకునే వ్యూహాలకు అన్ని పార్టీలు పదునుపెడుతున్నాయి. ఇలాంటి కీలక పరిస్థితుల్లో పార్టీ అభ్యర్థి గెలుపునకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలంతా సమన్వయంతో కలిసి పనిచేస్తారా లేదా అన్నదే బీజేపీలో పెద్ద ప్రశ్నగా మారింది. పార్టీలో నాయకుల మధ్య సమన్వయం ఉందని చెప్పుకోవడానికి ఈ ఎన్నిక మంచి అవకాశంగా నాయకత్వం భావిస్తోంది.కిషన్రెడ్డిపైనే భారం.. ఎన్నికల ప్రచారంలో ముఖ్యనేతలు ఎక్కువ సంఖ్యలోనే పాల్గొంటున్నా.. ఇదంతా ప్రణాళికాబద్ధంగా జరుగుతుందా లేదా అన్న సందేహాలు పార్టీ నాయకుల్లో వ్యక్తమౌతున్నాయి. కేంద్రమంత్రి కిషన్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉండడంతో ఇక్కడ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునే భారమంతా ఆయనపైనే పడుతోంది. పార్టీ గెలిచినా ఓడినా బాధ్యత అంతా కిషన్రెడ్డిదే అనే ప్రచారం పార్టీలో సాగుతోంది. దీంతో కిషన్రెడ్డి ఈ ఎన్నికను సవాల్గా తీసుకున్నారని పార్టీ నాయకులు చెబుతున్నారు. ప్రస్తుతం కిషన్రెడ్డి మార్గదర్శనంలోనే ఎన్నికల ప్రచారం జరుగుతోంది. కొన్ని నెలలుగా కిషన్రెడ్డి ఈ నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టడంతో పాటు పలు కార్యక్రమాలను ఇక్కడి నుంచే ప్రారంభించారు. డివిజన్లవారీగా ఇన్చార్జిలను నియమించి ప్రచారం చేపడుతున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన లంకల దీపక్రెడ్డికి 25 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. ఉప ఎన్నికల్లో కూడా ఆయనకే పార్టీ టికెట్ ఇవ్వటంతో ఈసారి కచి్చతంగా మెరుగైన ప్రదర్శన చూపడంతోపాటు గెలుపు వాకిట నిలిచే అవకాశాలు కొట్టిపారేయలేమని కమలం నేతలు అంటున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల ఇమేజ్.. నియోజకవర్గంలో దీపక్రెడ్డికి ఉన్న పరిచయాలను బేరీజు వేస్తే బీజేపీ గెలుపు కష్టమేమీ కాదన్న ఆశాభావంతో ఆ పార్టీ నేతలున్నారు. ఏపీ ప్రాంత ఓట్లకు గాలం... ఈ నియోజకవర్గ పరిధిలో ఆంధ్ర ప్రాంతానికి చెందినవారి ఓట్లు కూడా గణనీయంగా ఉండడంతో ఆ ఓట్లపై కన్నేసినట్టు పార్టీ వర్గాల సమాచారం. పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీఎన్వీ మాధవ్, మాజీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యే సుజనాచౌదరి తదితరులున్నారు. వీరి ద్వారా ఆంధ్ర ప్రాంత ఓటర్లను ఆకర్షించేలా ప్రత్యేక ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. వారి ఓట్లను వేయించుకోగలిగితే విజయావకాశాలు మెరుగవుతాయనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఈ దిశలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. వివిధ కులాలు, వర్గాల ముఖ్యనేతలు, సంఘాలు, ప్రభావం చూపే వారిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. తమ పార్టీల్లోని ఆయా సామాజికవర్గాల ముఖ్యనేతల ద్వారా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నాయి. గతంలో ఇక్కడ టీడీపీ ప్రాబల్యం ఉండగా... ఇప్పుడు ఆ పార్టీ పోటీలో లేకపోవడంతో టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరుల ఓట్ల కోసం బీజేపీ ప్రయత్నాలు తీవ్రతరం చేసింది. బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తోందని పైకి చెబుతున్నా.. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలుగా ఉన్న టీడీపీ, జనసేనలు బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చే అవకాశాలు లేకపోలేదనే ప్రచారం జరుగుతోంది. -
TG: నవంబర్ 3 నుంచి ప్రైవేటు కాలేజీల నిరవధిక బంద్
హైదరాబాద్: వచ్చే నెల 1వ తేదీ నాటికి ఫీజురీయింబర్స్మెంట్ బకాయిలు రూ. 900 కోట్లు విడుదల చేయకపోతే తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేటు కాలేజీలను నిరవధికంగా బంద్ చేస్తామని ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య హెచ్చరించింది. ఒకవేళ బకాయిలను విడుదల చేయకపోతే నవంబర్ 3 నుంచి ప్రైవేటు కాలేజీల నిరవధిక బంద్ చేస్తామని ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య చైర్మన్ రమేష్ బాబు స్పష్టం చేశారు. ఈ మేరకు జనరల్ బాడీ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నారు.నవంబర్ 1 లోపు రూ. 900 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలిలేదంటే నవంబర్ 3 నుంచి ఉన్నత విద్యా సంస్థల నిరవధిక బంద్అన్ని వృత్తి విద్యా కళాశాలలు, డిగ్రీ ,పీజీ కాలేజీలు నిరవదిక బంద్ చేస్తాం..హామీ ఇచ్చి మళ్ళీ నెరవేర్చక పోతే మార్చి , ఏప్రిల్ లో జరిగే ఫైనల్ పరీక్షలు కూడా బాయ్ కాట్ చేస్తాం.2024-25 విద్యా సంవత్సరం వరకు పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించడానికి ప్రభుత్వం ఒక కాలపరిమితి గల రోడ్మ్యాప్ను ప్రకటించాలి2026 జూన్ నాటికి పూర్తి చెల్లింపు జరిగేలా చేయాలిప్రస్తుత సంవత్సరం 2025-26 బకాయిలు సకాలంలో విడుదల చేయాలిప్రభుత్వం నుంచి స్పందన రాకుంటే బంద్ లో రోజుకో నిరసనహైదరాబాద్ లో అధ్యాపకులతో కలిసి భారీ బహిరంగ సభ10 లక్షల మంది విద్యార్థులను హైదరాబాద్ తీసుకొచ్చి నిరసననవంబర్ 1 నాటికి పెండింగ్ బకాయిలు చెల్లిస్తారని ఆశిస్తున్నాంబెదిరింపులకు భయపడి ఈసారి వెనక్కి తగ్గేది లేదుబకాయిలు అడిగితేనే విజిలెన్స్ తనిఖీలు గుర్తుకు వస్తున్నాయి -
జేఎన్టీయూ ఫ్లై ఓవర్పై కారు బీభత్సం
సాక్షి,హైదరాబాద్ : హైదరాబాద్ జేఎన్టీయూ ఫ్లై ఓవర్పై ఓ కారు బీభత్సం సృష్టించింది. TS 09 FU 5136 నెంబర్ గల కారు వేగంగా దూసుకొచ్చింది. డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాద సమయంలో కారులో ఉన్న ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.కారు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బోల్తా పడిన కారును మరో ప్రాంతానికి తరలించారు. ప్రమాద సమయంలో కారులో ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. వీరందరూ సూడాన్ దేశస్థులుగా గుర్తించారు.ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
‘జూబ్లీహిల్స్లో గెలుపు మాదే.. మంచి మెజారిటీతో గెలుస్తాం’
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగర పరిధిలో ఉన్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగనున్న ఉప ఎన్నికలో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన మీడియాతో చిట్చాట్లో పాల్గొన్నారు. దీనిలో భాగంగా జూబ్లీహిల్స్ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో విజయం సాధిస్తామన్నారు. ఈ ఎన్నికల్లో మంచి మెజార్టితో గెలుపు సొంతం చేసుకుంటామన్నారు. ‘ జూబ్లిహిల్స్ లో 46 వేల ఇళ్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. రాష్ట్రంలో పరిస్థితులు అన్నింటిని హైకమాండ్ అన్ని గమనిస్తుంది. అందరం హైకమాండ్ రాడార్ లో ఉన్నాం. మంత్రుల పంచాయతీ ముగిసిన అధ్యాయం. ఎవరైనా, ఎక్కడైనా కులాల గురించి, మతాల గురించి మాట్లాడటం ఆక్షేపణీయం. గోడలకు చెవులు ఉండే సమయం. జాగ్రత్తగా మాట్లాడాలి. కొంతమంది ఎమ్మెల్యేలకు డిసిసి బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు డిసిసి బాధ్యతలు తీసుకోవడం మంచిది. ఎమ్మెల్యేలకు డిసిసి పదవులు డబుల్ పోస్టులుగా చూడం. కుటుంబాలు అంటే అప్పటికే పార్టీలో ఉండి, సర్వీస్ చేస్తుంటే అడ్డంకి ఉండదు. ఉన్నపళంగా తెరపైకి వచ్చి పోస్టులు అడిగితే ఇవ్వరు. నేను పార్టీలో ఉన్నా.. నాకొడుకు ఇప్పటిప్పుడు వచ్చి పోస్ట్ అడిగితే ఇవ్వరు. రెండు పదవులు ఉండొద్దు అనే నిబంధన ఉంది. ఒక పదవికి సెలెక్ట్ అయితే, ఇంకో పదవికి రాజీనామా చేస్తారు. కేంద్రం నుంచి సరైన విధంగా రాష్ట్రానికి సహకారం లేదు. రాజకీయాలు ఎన్నికల వరకే, అభివృద్ధి కోసం అందరూ కలిసి పని చెయ్యాలి. మెట్రో ఫేస్ టూకు కిషన్రెడ్డి అడ్డుపడుతున్నారు. కిషన్రెడ్డికి బాధ్యత లేదా?,’ అని ప్రశ్నించారు. -
Jubilee Hills: సీఎం రేవంత్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డి జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. అక్టోబర్ 28వ తేదీనగ బహిరంగ సభతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారాన్ని న రోడ్ షోతో ఆరంభించనున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఆదివారం(అక్టోబర్ 26వ తేదీ) వెల్లడించారు. నాలుగు రోడ్ షోలు, ఒక బహిరంగ సభలో సీఎం రేవంత్ పాల్గొంటారని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఈ నెల 28వ తేదీన సీఎం రేవంత్ బహిరంగ సభకు ప్లాన్ చేసిన కాంగ్రెస్.. ఈ సభను పోలీస్ గ్రౌండ్లో నిర్వహించనున్నట్లు తెలిపింది. ఆపై అక్టోబర్ 30, 31, నవంబర్ 4,5 తేదీలలో సీఎం రోడ్ షో చేపట్టనున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. పలువురు సినీ ప్రముఖులు కాంగ్రెస్ ప్రచారంలో పాల్గొననున్నారు. -
కర్నూలు ప్రమాదం: వాళ్లు టెర్రరిస్టులు, మానవ బాంబులే.. సజ్జనార్ వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: కర్నూలు బస్సు ప్రమాదంపై(Kurnool Bus Fire Accident) హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్(VC Sajjanar) స్పందించారు. మద్యం మత్తులో వాహనాలతో రోడ్డుపైకి వచ్చి అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకునే వాళ్లు టెర్రరిస్టులు, మానవ బాంబులు కాక ఇంకేమవుతారు.. చెప్పండి!! అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.కర్నూలు బస్సు ప్రమాదం నేపథ్యంలో హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘ఒక్కరి నిర్లక్ష్యం.. 20 మందిని ప్రాణాలను బలితీసుకుంది. మద్యం మత్తులో వాహనాలతో రోడ్డుపైకి వచ్చి అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకునే వాళ్లు టెర్రరిస్టులు, మానవ బాంబులు కాక ఇంకేమవుతారు.. చెప్పండి!!. వాళ్ళు చేసిన ఈ తప్పిదం వల్ల ఎన్ని కుటుంబాలు మానసిక క్షోభను అనుభవిస్తున్నాయి. మీ సరదా, జల్సా కోసం ఇతరుల ప్రాణాలను తీసే హక్కు మీకు ఎవరిచ్చారు!?.సమాజంలో మన చుట్టే తిరిగే ఇలాంటి టెర్రరిస్టులు, మానవ బాంబుల పట్ల జాగ్రతగా ఉండండి. వీరి కదలికలపై వెంటనే డయల్ 100 కి గానీ, స్థానిక పోలీసులకు గానీ సమాచారం ఇవ్వండి. చూస్తూ చూస్తూ వాళ్ళను ఇలాగే వదిలేస్తే రోడ్డు మీదకు వచ్చి ఎంతో మందిని చంపేస్తారు. వారిని మాకెందుకులే అని వదిలేస్తే చాలా ప్రాణ నష్టం జరుగుతుంది’ అని పోస్టు చేశారు. Drunk drivers are terrorists. Period.Drunk drivers are terrorists and their actions are nothing short of acts of terror on our roads. The horrific #Kurnool bus accident, which claimed the lives of 20 innocent people, was not an accident in the truest sense. It was a preventable… pic.twitter.com/oXTp0uOt2k— V.C. Sajjanar, IPS (@SajjanarVC) October 26, 2025 -
ఏం చేసిందని కాంగ్రెస్కు ఓటెయ్యాలి?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఏం చేసిందని.. హస్తం పార్టీకి ఓటు వేయాలని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీజేపీ బీ టీమ్ అంటూ మాపై నిందలు వేసి.. కాంగ్రెస్ నేతలు మాత్రం దోస్తీ చేస్తారని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ అంతర్జాతీయ ఖ్యాతి పొందింది అని చెప్పుకొచ్చారు.జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం సందర్బంగా మాజీ మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి షేక్పేట డివిజన్ పర్యటించారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ..‘2014 నుంచి పదేళ్లలో హైదరాబాదును ఎంతో అభివృద్ధి చేశాం. 2014 కంటే ముందు ప్రతి అపార్ట్మెంట్ ముందు జనరేటర్లు ఉండేవి బీఆర్ఎస్ వచ్చిన తర్వాత 24 గంటల విద్యుత్ సరఫరా చేయడం ద్వారా జనరేటర్లు మాయమయ్యాయి. గంగా-జమున తహసీబ్ సంస్కృతి ఉన్న ఇక్కడ ఎప్పుడు మతకల్లోలాలు జరగలేదు. పదేళ్ల పాలనలో అందరూ ప్రశాంతంగా జీవించారు. బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫాలు, క్రిస్టమస్ గిఫ్టులు అందించాం. కేసీఆర్ హిందు. ఆయన ఎన్నో యాగాలు చేశారు. అయినా ప్రతి మతాన్ని గౌరవించారు. కొత్త సచివాలయం నిర్మించినప్పుడు అక్కడ ఒక మజీద్, ఒక చర్చి, ఒక దేవాలయం నిర్మించారు. ఆయన సెక్యులర్ లీడర్ అనే దానికి ఇది ఒక నిదర్శనం. కాంగ్రెస్కు ఎందుకు ఓటేయాలో ఒకసారి ఆలోచించాలి. ఏం చేశారని వారికి ఓటేయాలి?. ప్రజలు ఆదరించే వ్యక్తిని కొన్ని పార్టీలు ఏదో ఒక సాకుతో ఆదరణ లేకుండా చేస్తాయి. బీజేపీతో బీ టీమ్ అని మాపై నిందలు వేస్తారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బుల్డోజర్లు నడిస్తే వ్యతిరేకించే రాహుల్ గాంధీ హైదరాబాదులో బుల్డోజర్లను ఎందుకు వ్యతిరేకించడం లేదు?. కేంద్రంలో సీబీఐపీ బీజేపీ తొత్తు అని రాహుల్ గాంధీ ఆరోపిస్తారు. ఇక్కడి కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టును ఎంక్వయిరీ చేయమని సీబీఐకి అప్పగిస్తుంది.వక్ఫ్ బిల్లును మొదటిసారిగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కోసం జీవో తెచ్చింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా వక్ఫ్ బిల్లును అమలు చేసేందుకు తొందర పడలేదు. ఇక్కడ ఒక మంత్రిపై ఈడీ దాడులు జరిగి సంవత్సరం అయినా ఎలాంటి చర్యలు లేవు. ఒక బీజేపీ ఎంపీకి ఇక్కడ రూ. 1350 కోట్ల రూపాయలతో కాంట్రాక్టు ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలైనా ఇప్పటికీ ఒక్క ముస్లిం వ్యక్తికి ప్రాతినిధ్యం లేదు. ముఖ్యమంత్రి అనుకుంటే ఒక ఎమ్మెల్సీ సీటు ముస్లింలకు కేటాయించి మంత్రి పదవి ఇవ్వచ్చు.. కానీ అలా చేయడం లేదు.తెలంగాణలో అన్ని అన్ని మతాల వారికి ప్రాధాన్యం ఉంటుంది. మేము కుల రాజకీయం, మత రాజకీయం చేయం. మేం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఐటీలో ఉద్యోగాలు మూడు రేట్లు పెరిగాయి. మైనారిటీ విద్యార్థుల కోసం 204 విద్యాలయాలు ఏర్పాటు చేశాం. మైనారిటీ ఓవర్సీస్ స్కాలర్షిప్ల ద్వారా మైనారిటీ విద్యార్థులకు చేయూతనిచ్చాం. లక్ష డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కట్టించాం. సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్లో మేము బ్రహ్మాండంగా గెలిచాం. మళ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవదు. ప్రస్తుతం అందరూ నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. అలవి గాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు.బీఆర్ఎస్ పాలనా కాలంలో కరోనా సమయంలో కూడా అభివృద్ధి ఆగలేదు. కరోనా మహమ్మారి వచ్చినప్పుడు ఇక్కడ ఎన్నో రోడ్లు నిర్మించాం. విద్యావంతులు ఓటు వేయడానికి నిరాసక్త చూపిస్తారు. మీరు కూడా ఓటు వెయ్యాలి. రాజకీయాలపై విద్యావంతులు ఆసక్తిగా ఉండరని అందుకే ఓటు వేయరని నాకు తెలుస్తుంది. కానీ అలా చేయడం సరికాదు. మీరు ఓటు వేయకపోతే తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. రాజకీయ నాయకులు మీ భవిష్యత్తును నిర్ధారిస్తారు. కాబట్టి మంచి నాయకులను మీరు ఎన్నుకోవాలి. ఓటు అడిగే వారిని ఓటు ఎందుకు వేయాలి మీరు ఎదురు ప్రశ్నించాలి అని’ కామెంట్స్ చేశారు. -
హైదరాబాద్:18 గంటలు నీళ్లు బంద్
హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో సుమారు 18 గంటల పాటు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని శనివారం జలమండలి ప్రకటించింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ఆధ్వర్యంలో ప్యారడైజ్ జంక్షన్ నుంచి డెయిరీఫాం రోడ్ వరకు ఎలివేటెడ్ కారిడార్ పనుల్లో భాగంగా.. పైపులైన్ విస్తరణ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని పేర్కొంది. అంతరాయం ఏర్పడే ప్రాంతాలు: నల్లగుట్ట, ప్రకాశ్నగర్, మేకలమండి, బౌద్ధనగర్, శ్రీనివాస నగర్, పాటిగడ్డ రిజర్వాయర్ పరిధి ప్రాంతాలు. భోలక్పూర్, కవాడిగూడ, సీతాఫల్ మండి, హస్మత్పేట్, ఫిరోజ్గూడ, గౌతమ్నగర్. బల్క్ వినియోగదారులు: సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్, మిలిటరీ ఇంజినీరింగ్ సరీ్వసెస్, బేగంపేట్ విమానాశ్రయం. బాలంరాయి పంప్హౌస్, బాలంరాయి చెక్పోస్ట్, బోయిన్పల్లి, రైల్వే కాలనీ పరిధిలో నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందన్నారు. వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని జలమండలి సూచించింది. -
Jubilee Hills bypoll: ముగ్గురికీ సవాలే!
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 11న జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మూడు ప్రధాన పార్టీల్లోని ముగ్గురు ముఖ్య నేతలకు ప్రతిష్టాత్మకంగా మారింది. తమ పార్టీని గెలిపించే బాధ్యత వీరి భుజస్కంధాలపై ఉంది. దీంతో ముగ్గురూ ఈ ఎన్నికను ఆషామాïÙగా తీసుకోవడం లేదు. తమకిది ఓ సవాల్గా భావించి సత్తా చాటుకోవాలనుకుంటున్నారు. అంతేకాదు, వారికీ ఎన్నిక చాలా అవసరమని.. వారి నాయకత్వానికి లిట్మస్టెస్ట్గా మారనుందని రాజకీయ పరిశీలకులు సైతం భావిస్తున్నారు. సీఎం రేవంత్రెడ్డికి ఎంతో కీలకం కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు ఎంతో అవసరం. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చాక దాదాపు రెండేళ్లకు జరుగుతున్న ఎన్నిక కావడంతో ఆయన పని తీరుకు గీటురాయి కానుంది. ఆయన పాలన తీరుకు ప్రజలిచ్చే తీర్పుగానే చాలామంది భావిస్తున్నారు. రేవంత్రెడ్డి సీఎం అయ్యాక కంటోన్మెంట్కు జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచినప్పటికీ, రేవంత్ సీఎం అయ్యాక స్వల్ప సమయంలోనే ఆ ఎన్నిక జరిగినందున దానిని ఆయన పనితీరుకు నిదర్శనమనలేదు. ఇప్పుడు మాత్రం ఆయన పాలనకు ప్రజలిచ్చే మార్కులుగా పరిగణిస్తున్నారు. 2023లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ ఉప ఎన్నిక జరుగుతుండటం తెలిసిందే. ఈ సీటును గెలుచుకుంటే నగరంలోనే సీఎంతో పాటు పార్టీ పట్టు బలపడుతుంది. అంతే కాదు.. రేవంత్రెడ్డి మోడల్(వెల్ఫేర్+డెవలప్మెంట్)కు విలువ పెరుగుతుంది. ఓటమి ఎదురైతే, అమలు కాని హామీలు (మహిళలకు నెలకు రూ.2500, తులం బంగారం తదితర స్కీమ్స్) ఇచ్చారనే పేరు మూటగట్టుకోవాల్సి వస్తుంది. ప్రజల నుంచి విమర్శల దాడి మరింత తీవ్రమవుతుంది. గెలిస్తే రాష్ట్రవ్యాప్తంగానూ ఉత్సాహంతో లోకల్బాడీ ఎన్నికలకు పార్టీకి మంచి బూస్ట్గా మారనుంది. కేటీఆర్కు సరై్వవల్ టెస్ట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు జూబ్లీహిల్స్లో గెలుపు ఎంతో అవసరం. తమ పార్టీ సిట్టింగ్ సీటు కావడంతో ఒక రకంగా చెప్పాలంటే ‘సర్వైవల్ టెస్ట్’. గెలిస్తే, కేటీఆర్ ప్రో–అర్బన్ ఇమేజ్ (యువత, ఐటీ సెక్టార్) బలపడుతుంది. కేటీఆర్ ప్రచారం చేస్తున్న బుల్డోజర్ రాజ్, హైడ్రా డెమాలిషన్స్, పవర్ కట్స్ వంటి వాటికి ప్రజలు మద్దతిచ్చారని భావించాల్సి ఉంటుంది. కాంగ్రెస్ ఫెయిలయిందని చెప్పేందుకూ ఇంతకు మించిన అవకాశం లేదు. కేటీఆర్ రాజకీయ సామర్థ్యానికీ నిదర్శనంగా మారనుంది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఫామ్హౌస్కు పరిమితమైనప్పటి నుంచీ పార్టీ వ్యవహారాలన్నీ కేటీఆరే చూస్తున్నారు. పార్టీ ఫ్యూచర్కు కూడా కీలకం. ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని పలువురు నేతలు పార్టీని వీడారు. ఓటమిపాలైతే పారీ్టలో మిగిలే వారు బహుశా ఉండకపోవచ్చు. కేటీఆర్ లీడర్ ప్పైనా ప్రశ్నలు వెల్లువెత్తే అవకాశముంది. అందుకే కేటీఆర్ సైతం వీటిని తేలిగ్గా తీసుకోలేదు. బూత్స్థాయి నేతలతో సమావేశమవుతున్నారు. డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ విజయయాత్ర తిరిగి ఇక్కడి నుంచే అని చెబుతున్నారు. గెలిస్తే సక్సెస్ స్టార్గా కేటీఆర్ నిలుస్తారు. కిషన్రెడ్డికి అవశ్యం.. బీజేపీ అభ్యర్థి గెలవడం కేంద్రమంత్రి కిషన్రెడ్డికి అవసరం. జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ కిషన్రెడ్డి గెలిచిన సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలోనే ఉంది. ఓడితే పార్టీ దిగజారుతుంది. ఇప్పటికే పార్టీ బహిష్కృత నేత రాజాసింగ్ వ్యంగ్యా్రస్తాలు సంధించారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ను గెలిపిస్తారా? బీఆర్ఎస్ను గెలిపిస్తారా? అంటూ ఎద్దేవా చేశారు. కిషన్రెడ్డి ఎన్నిసార్లు కేంద్రమంత్రి అయినప్పటికీ హైదరాబాద్కు చేసిందేమీలేదని ప్రతిపక్ష పారీ్టలు ఇప్పటికే విమర్శిస్తున్నాయి. గత లోక్సభ ఎన్నికల్లో ఈ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బీజేపీకి వచ్చినన్ని ఓట్లకన్నా ఓట్లు పెరిగితే గుడ్డిలో మెల్ల. ఇంకా తగ్గితే కిషన్రెడ్డి ఇమేజ్ దిగజారుతుంది. -
వెండితెరపై ‘గుమ్మడి’
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఇప్పటికీ సాధారణ జీవితం గడిపే గుమ్మడి నర్సయ్య గురించి తెలుసుకునేందుకు జెన్ జెడ్ తరం కూడా ఆసక్తి చూపిస్తోంది. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు, తమిళ్, మళయాళం, కన్నడ, హిందీ భాషల్లో సినిమా తెరకెక్కనుంది. కన్నడ స్టార్హీరో శివరాజ్కుమార్ గుమ్మడి పాత్రలో కనిపించబోతున్నారు. ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే తన జీవితంలో ఆచరించిన ఆదర్శాలను ఈ తరానికి మరింత స్పష్టంగా పరిచయం చేయబోతున్న దర్శకుడు పరమేశ్వర్ హివ్రాలే ఈ చిత్రం గురించి చెప్పిన విశేషాలు.మూడేళ్ల పాటు రీసెర్చ్మాది కామారెడ్డి. సినిమా రంగంలో పదేళ్లుగా ఉన్నాను. చిన్నప్పుడే కమ్యూనిస్టు యోధులు తరిమెల నాగిరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్యల జీవిత చరిత్ర చదివాను. ఆ తర్వాత అలాంటి ఆదర్శాలతో జీవించే రియల్టైం పొలిటీషియన్ కోసం ఆరా తీసే క్రమంలో ఇల్లెందు వచ్చి గుమ్మడి నర్సయ్యను కలిశాను. 2019 నుంచి మూడేళ్లపాటు ఆయనతో ట్రావెల్ చేసిన వారు, ఆయన చేతిలో ఓడిపోయిన వారు ఇలా అనేక మందిని కలిసి పూర్తి స్థాయిలో సినిమా స్క్రిప్టు రెడీ చేసుకున్నాను. ఐదు సార్లు ఒకే చోటనుంచి ఎన్నిక కావడమనేది సామాన్యమైన విషయం కాదు. ఎంతో నిజాయితీ ఉంటేనే ఇలా జరుగుతుంది. రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను తెరపై జరిగే సన్నివేశాలతో లీనమయ్యే చేయగలిగితే సినిమా హిట్టే. గుమ్మడి జీవిత చరిత్రలో ఐదు గంటల పాటు కూర్చోబెట్టగలిగేంత విషయం ఉంది.రెండేళ్లపాటుగుమ్మడి జీవిత కథతో సినిమా తీసేందుకు రెండేళ్లకు పైగా సమయం పట్టింది. హీరోలకు కథ నచ్చితే నిర్మాతలు దొరకలేదు. నిర్మాతలు దొరికితే కథకు తగ్గ హీరోలు దొరకలేదు. ఇద్దరు లభిస్తే.. కథలో మార్పులు చేర్పులు సూచించేవారు. ఇలాంటి సినిమాలు తమిళ్, మలయాళంలో ఆడుతాయి కానీ మన దగ్గర నడవవు. చివరకు పాల్వంచకు చెందిన ఎన్.సురేశ్రెడ్డి ప్రవళ్లిక ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై నిర్మించేందుకు ముందుకు వచ్చారు.కేవలం 20 రోజుల్లో..ఏడాదిన్నర క్రితం స్క్రిప్టును కన్నడ స్టార్హీరో డాక్టర్ శివరాజ్కుమార్కు పంపించాను. బెంగళూరు రావాలని సెప్టెంబరులో ఆయన మేనేజర్ నుంచి కాల్ వచ్చింది. అప్పటి నుంచి కేవలం ఇరవై రోజుల్లోనే శివరాజ్కుమార్ గుమ్మడి పాత్రను చేసేందుకు అంగీకరించడంతో పాటు ఒక రోజు షూట్లో పాల్గొనడంతో టీజర్ రిలీజ్ చేశాం. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. జిల్లాతో పాటు వరంగల్, కరీంనగర్ జిల్లాలోని పలు లొకేషన్లలో షూటింగ్ జరిపేలా ప్లాన్ చేస్తున్నాం. గుమ్మడి పాత్రలో కనిపించేందుకు శివరాజ్కుమార్ చాలా ఉత్సాహంతో ఉన్నారు.వారిద్దరు ఇంకా కలుసుకోలేదురియల్ హీరో గుమ్మడి నర్సయ్య రీల్ హీరో శివరాజ్కుమార్లు ఇంకా నేరుగా కలుసుకోలేదు. కేవలం ఫోన్లోనే ఇద్దరూ మాట్లాడుకున్నారు. షూటింగ్కు ముందు ఒకసారి ఇద్దరు కలిసే అవకాశముంది. గుమ్మడి నర్సయ్య ట్రైలర్ రిలీజైన వెంటనే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటకలోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా గుమ్మడి గౌరవం పెంచేలా భావి తరాలకు స్ఫూర్తిని ఇచ్చేలా ఈ చిత్రం ఉండబోతోంది. -
ఒకే లాడ్జిలో ఏడు జంటలు
పల్నాడు జిల్లా: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలం దాటింది. రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తామని ప్రగల్బాలు పలుకుతున్నారు. సింగపూర్ మాటేమోగానీ పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటను మసాజ్ సెంటర్లకు అడ్డాగా మారుస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నరసరావుపేట.. మసాజ్ సెంటర్ల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు వేదికైంది. ఈ «ధోరణి ఇలానే కొనసాగితే అసాంఘిక కార్యకలాపాలకు నరసరావుపేట హబ్గా మారే ప్రమాదముందని సామాజికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఒకే లాడ్జిలో ఏడు జంటలు నరసరావుపేట నడి»ొడ్డున ఆర్టీసీ బస్టాండ్కు కూతవేటు దూరంలో ఉన్న లాడ్జిలను బుధవారం పోలీసులు తనిఖీ చేసి ఏడు జంటలను అదుపులోకి తీసుకున్నారు. గతేడాది నుంచి ఈ లాడ్జిలో ప్రతిరోజూ ఇదే తరహా అసాంఘిక కార్యకలాపాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరికొన్ని లాడ్జిల్లోనూ ఇదే తరహా వ్యవహారం నడుస్తోందని తెలుస్తోంది. మరోవైపు జిల్లాతోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన జూదరులు నరసరావుపేటలోని హోటళ్లను కేంద్రాలుగా చేసుకొని పేకాట ఆడుతున్నట్టు ఆరోపణలు లేకపోలేదు. ‘స్పా’ ముసుగులో... నరసరావుపేట అభివృద్ధి చెందడం ఏమోగానీ థాయ్లాండ్ తరహా మసాజ్ సెంటర్లు వెలిశాయి. సత్తెనపల్లి, చిలకలూరిపేట, రావిపాడు రోడ్డులతోపాటు ఎల్టీ నగర్, సాయినగర్లలో ‘స్పా’ సెంటర్లు ఏర్పాటు చేశారు. ‘స్పా’ ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు కొనసాగుతున్నట్టు అక్కడికి వెళ్లి వచ్చినవారు చెప్పుకొస్తున్నారు. రిలాక్స్ కోసమంటూ వచ్చిన వారికి వలపు వల వేసి జేబులు గుల్ల చేస్తున్నారు. ఒక్కో స్పా సెంటర్లో గంటల లెక్కన వేల రూపాయలు ధరలు నిర్ణయించారు. వీటితోపాటు వ్యభిచారం కూపంలోకి లాగి యువత జీవితాలను నాశనం చేస్తున్నారు. ఒక్కో సెంటర్లో ప్రత్యేకమైన గదులు, ఆన్లైన్ బుకింక్ వ్యవస్థలను సైతం అందుబాటులోకి తీసుకువచ్చారు. మనోళ్లే వదిలేయండి.. ‘స్పా’ సెంటర్ల ముసుగులో కొనసాగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటి అనుమతులు, నిర్వహణ వంటి అంశాలపై దృష్టి సారించేందుకు పోలీసు యంత్రాంగం ముందుకు వచ్చినా అధికారం అడ్డుపడుతోంది. పక్క నియోజకవర్గంలో ‘స్పా’ సెంటర్ నిర్వహిస్తున్న ఓ వ్యక్తి నరసరావుపేట పట్టణంలో కూడా నూతన బ్రాంచ్ ఏర్పాటు చేశాడు. ఆ మసాజ్ సెంటర్పై ఫిర్యాదులు రావడంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. మనోళ్లవే వదిలేయండి.. అంటూ ఓ మంత్రి స్వయంగా సీఐ స్థాయి అధికారిని ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది. -
రేబిస్ వ్యాధితో బాలిక మృతి
బాల్కొండ: నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో వీధి కుక్క కాటుతో రేబిస్ వ్యాధి సోకి చిన్నారి మృతి చెందింది. గ్రామానికి చెందిన లక్షణ (10)పై నెల కిందట వీధి కుక్క దాడి చేసింది. దీంతో కుక్క గోళ్లు గీరి తలలో చిన్న గాయం అయింది. భయంతో చిన్నారి విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పలేదు. అయితే మూడు రోజుల కిందట చిన్నారి కుక్కలాంటి అరుపులతో వింతగా ప్రవర్తించడంతో కుటుంబ సభ్యులు నిజామాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలికకు తీవ్రమైన రేబిస్ వ్యాధి సోకినట్లు వైద్యులు గుర్తించారు. దీంతో మెరుగైన వైద్యం కోసం బాలికను హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం బాలిక మృతి చెందింది. -
బస్సులో కాదు.. ఎయిర్ బస్లో..
నాగర్కర్నూల్: పూలుపండ్ల ఫంక్షన్ (నిశ్చితార్థం) కోసం సాధారణంగా ప్రైవేట్ బస్సులు బుక్ చేసి కార్యక్రమానికి తీసుకెళ్లడం తెలిసిందే. అయితే తండ్రి కోరిక మేరకు ఓ వ్యక్తి రెండు విమానాల్లో 500 మంది గ్రామస్తులను, బంధువులను తీసుకెళ్లడం విమానాశ్రయ ఉద్యోగులను, ఇతర ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. వివరాలు.. నాగర్కర్నూల్కు చెందిన మేకల అయ్యప్ప కుమారుడు మేకల జగపతి (జవహర్నగర్ మాజీ మేయర్ కావ్యకు సోదరుడు) గోవాలో ఎంగేజ్మెంట్ ఫంక్షన్ చేయాలని నిర్ణయించుకున్నారు.ఈ కార్యక్రమానికి కుటుంబసభ్యులు, బంధువులతోపాటు గ్రామస్తులను సైతం ఫ్లైట్లో గోవా తీసుకెళ్లాలని వాళ్ల తండ్రి నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా తన ఆలోచనను అమల్లో పెట్టి వారిని తీసుకెళ్లిన తీరుతో ఎయిర్పోర్టులో సందడిగా మారింది. శనివారం రెండు విమానాల్లో కేవలం మేకల వారి బంధువులు, స్నేహితులు మాత్రమే ఉండటంతో ఎయిర్పోర్టు సిబ్బంది, ఉద్యోగులు ఆశ్చర్యానికి గురయ్యారు. తన తండ్రి కోరిక మేరకు వచ్చిన బంధువులు, స్నేహితులు, గ్రామస్తులకు ఈ సందర్భంగా మేకల కావ్య కృతజ్ఞతలు చెప్పారు. -
రూ.16 కోట్ల ఇంజక్షన్ ఇస్తేనే బతికే అవకాశం
వికారాబాదు జిల్లా: సెంట్రింగ్ పనిచేస్తూ జీవనం సాగించే నిరుపేద తల్లిదండ్రులకు కొండంత ఆపద వచ్చిపడింది. ఒక్కగానొక్క కొడుకు అరుదైన వ్యాధి (లక్షల మందిలో ఏ ఒక్కరికో సోకే) బారిన పడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. రూ.కోట్ల విలువ చేసే ఇంజక్షన్ ఇస్తే కానీ చిన్నారి బతికే అవకాశం లేదని చెప్పడంతో గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. వివరాలు ఇలా.. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం, బొంరాస్పేట్ మండలం వడిచర్ల పరిధిలోని ఊరెనికి తండాకు చెందిన ముడావత్ శ్రీను, గోరీబాయి దంపతులకు ముడావత్ జగన్ అనే ఐదేళ్ల కొడుకు ఉన్నాడు. బతుకుదెరువు నిమిత్తం మూడేళ్ల క్రితం తాండూరుకు వచి్చన వీరు సాయిపూర్లో నివసిస్తున్నారు. రెండేళ్లుగా జగన్ మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నాడు. ఎన్ని ఆస్పత్రులు తిప్పినా సరైన చికిత్స అందలేదు. దీంతో అప్పు చేసి హైదరాబాద్ బంజారాహిల్స్లోని రెయిన్బో ఆస్పత్రికి తీసుకెళ్లగా బాలుడిని పరీక్షించిన వైద్యులు.. బాబుకు అరుదైన, ప్రాణాంతక స్పైనల్ మసు్కలర్ ఆట్రోపీ (ఎస్ఎంఏ) అనే వ్యాధి సోకిందని చెప్పారు. ఇలాంటి వ్యాధి రాష్ట్రంలో ఎవరికీ లేదని, ఇది కొత్త వైరస్ వల్ల సోకిందని తెలిపారు. ఈ వ్యాధి నయం కావాలంటే జోల్జెన్స్మా అనే ఇంజక్షన్ ఇవ్వాలన్నారు. దీన్ని అమెరికా నుంచి తెప్పించాలని, ఇందుకు రూ.16 కోట్లు ఖర్చవుతుందని చెప్పడంతో బాధిత తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటున్నారు. ప్రతీ 12 గంటలకు ఒకసారి సిరప్ వేస్తేనే మామూలు స్థితికి వస్తున్నాడని, కొంచెం ఆలస్యమైనా ఫిట్స్ వస్తోందని కన్నీటి పర్యంతమవుతున్నారు. తమ ఎమ్మెల్యే, సీఎం రేవంత్రెడ్డి స్పందించి తమ కొడుకును బతికించాలని వేడుకుంటున్నారు. దాతలు సైతం ఆరి్ధక సాయం (ఫోన్ పే, గూగుల్ పే నంబర్ 8639157327), (ఎస్బీఐ అకౌంట్ నంబర్ 43194942778) చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. -
పల్లీ..
సాక్షి, సాగుబడి: ఆహార పదార్థాలన్నీ అందరికీ సరిపడాలన్న నియమం ఏమీ లేదు. అలర్జీకి కారణమయ్యే అవకాశం ఉన్న వేరుశనగల్లాంటి ఆహార పదార్థాలను పసిపిల్లలకు ఎంత వయసులో అలవాటు చెయ్యటం ప్రారంభించాలి? ఈ ప్రశ్నకు సమాధానం దేశాన్ని బట్టి మారిపోతుందంటున్నారు వైద్య నిపుణులు. విదేశాల్లోని పిల్లలతో పోలి్చతే మన పిల్లలకు ఇమ్యునిటీ ఎక్కువేనని, వారికి వచి్చన అలర్జీలన్నీ మనకు రావాలనేమీ లేదని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో 3.3 కోట్ల మందికి ఆహార సంబంధమైన అలర్జీలున్నాయని అంచనా.అక్కడి పిల్లలకు వేరుశనగలు (పల్లీలు), గుడ్లు, సోయాచిక్కుళ్లు తింటే అలర్జీ వస్తాయనే అభిప్రాయం ఉండేది. అందుకే మూడేళ్లు నిండే వరకు పిల్లలకు పల్లీలు పెట్టొద్దని అమెరికా ప్రభుత్వం గతంలో అనేక దశాబ్దాల పాటు అక్కడి తల్లిదండ్రులు, వైద్యులకు చెప్పింది. అయితే, ఆ తర్వాత కాలంలో జరిగిన వైద్య పరిశోధనల ఫలితాలను బట్టి 4–6 నెలల వయసులోనే శిశువులకు వేరుశనగలు తినిపించటం మొదలు పెట్టాలని సూచించింది. దీని వల్ల అలర్జీ బెడద చాలా వరకు తగ్గిందని తాజా అధ్యయనం చెబుతోంది. మన పరిస్థితి ఏమిటి? మన దేశంలో 6 నెలలు నిండిన పసి పిల్లలకు ధాన్యాలు, పప్పులు, నూనెగింజలు, గుడ్లు, పాల ఉత్పత్తులు, కూరగాయలు, పండ్లు కొద్ది మోతాదులో తినిపించవచ్చని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్)కు చెందిన జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) ఆహార మార్గదర్శకాల్లో సూచించింది. లండన్ అధ్యయనంతో మార్పు 2015లో లండన్లోని కింగ్స్ కాలేజీకి చెందిన డాక్టర్ జిడియోన్ లాక్ జరిపిన లెర్నింగ్ ఎర్లీ అబౌట్ పీనట్ ఎలర్జీ (ఎల్ఈఏపీ) అధ్యయనం వేరుశనగల అలర్జీపై అమెరికాకున్న పూర్వపు అవగాహనను పూర్తిగా మార్చేసింది. పుట్టిన కొద్ది నెలలకే శిశువులకు వేరుశనగలను తినిపించటం అలవాటు చేస్తే మున్ముందు జీవితంలో ఫుడ్ అలర్జీల ముప్పు 80% వరకు తగ్గిపోయిందని ఈ అధ్యయనం తేలి్చంది. ఈ పిల్లలు కౌమార దశ వరకూ 70% మందికి ఫుడ్ అలర్జీల బెడద లేదని కూడా తేలింది. ఈ అధ్యయనంలో వెల్లడైన ఫలితాల ఆధారంగా 2015లో అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. 4–6 నెలల మధ్య వయసులో శిశువులకు వేరుశనగ గింజలను తినిపించటం అలవాటు చెయ్యవచ్చని స్పష్టం చేసింది. నాలుగు నెలల నుంచే పెట్టొచ్చు.. గత దశాబ్ద కాలంగా 4–6 నెలల శిశువులకు వేరుశనగలు అలవాటు చెయ్యటం వల్ల మంచి ఫలితాలే వస్తున్నాయని తాజా అధ్యయనం తేలి్చంది. ఫిలడెల్ఫియా పిల్లల ఆస్పత్రిలో అలర్జీ నిపుణుడు, పరిశోధకుడు డాక్టర్ డేవిడ్ హిల్ ఆధ్వర్యంలో జరిగిన అధ్యయన వివరాలు ఇటీవల మెడికల్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. 2015లో సవరించిన మార్గదర్శకాల వల్ల సుమారు 60 వేల మంది పిల్లలు వేరుశనగల అలర్జీ నుంచి తప్పించుకున్నారని వెల్లడైంది. ఇది చాలా గొప్ప సంగతి కదూ అన్నారు డా. డేవిడ్ హిల్. డజన్ల కొద్దీ పిల్లల వైద్యుల వద్ద నుంచి 2015కు ముందు, ఆ తర్వాత పిల్లలకు అందించిన అలర్జీ చికిత్సల వివరాలను సేకరించి ఆయన విశ్లేíÙంచారు. మూడేళ్ల లోపు పిల్లల్లో వేరుశనగల అలర్జీ కేసులు 2015 తర్వాత 27%, 2017 తర్వాత 40% తగ్గిపోయాయని నిర్ధారించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ 2021లో మార్గదర్శకాలను మరోసారి సవరించి ఎటువంటి ముందస్తు పరీక్షలు చెయ్యకుండానే 4 నుంచి 6 నెలల శిశువులకు వేరుశనగ గింజలు, గుడ్లు, సోయాచిక్కుళ్లు వంటి అలర్జీ వచ్చే అవకాశం ఉన్న ఆహారాలను అలవాటు చెయ్యమని సూచించింది. అయితే, ఏడు నెలలకన్నా ముందు శిశువులకు వేరుశనగలు తినిపిస్తున్న తల్లిదండ్రులు ఇప్పటికీ కేవలం 17% మాత్రమేనని ఒక సర్వే చెబుతోంది.వేరుశనగతో అలర్జీ ఎందుకొస్తుంది?వేరుశనగ గింజల్లోని ప్రొటీన్లు హాని చేస్తాయేమోనని పిల్లల శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ తప్పుగా అర్ధంచేసుకొని రక్షణాత్మకంగా ప్రత్యేక రసాయనాలను విడుదల చేయటం ద్వారా ఈ గింజలు తినగానే అలర్జీ రియాక్షన్ వస్తోందని పరిశోధకులు గుర్తించారు. శరీరంపై దద్దుర్లు రావటం, శ్వాసకోశ సంబంధమైన ఇబ్బందులు రావచ్చు. కొన్ని సందర్భాల్లో ఈ ఫుడ్ అలర్జీ అతి తీవ్ర రూపం దాల్చి ప్రాణాంతకంగానూ పరిణమించవచ్చు. మన పిల్లల్లో ఇమ్యునిటీ ఎక్కువ వాతావరణం, జీవనశైలిలో అమెరికాకు మనకు వ్యత్యాసం ఉంది. వారితో పోలి్చతే మన పిల్లలకు రోగనిరోధక శక్తి ఎక్కువ. కాబట్టి వారికి వచ్చే కొన్ని అలర్జీలు మన పిల్లలకు అంతగా రావు. శిశువుకు 6 నెలల వరకు విధిగా తల్లిపాలు ఇవ్వాలని, ఆరు నెలల తర్వాతే ధాన్యాలు, పప్పులు వంటి ఆహార పదార్థాలను మెత్తగా వండి కొద్దికొద్దిగా తినిపించటం ప్రారంభించాలని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) సూచిస్తోంది. సాధారణంగా మన దగ్గర మరీ చిన్న పిల్లలకు వేరుశనగలు పెట్టరు. బిడ్డకు సంవత్సరం నిండే వరకు తల్లి పాలు ఇవ్వటం కొనసాగిస్తూనే అనుబంధ ఆహారం అలవాటు చెయ్యటం మంచిది. పసిపిల్లలకు జలుబుల్లాంటివి వచి్చనా యాంటీబయాటిక్స్ వాడకుండా ఉంటే వాటికవే తగ్గుతాయి. ఇమ్యునిటీ కూడా పెరుగుతుంది. – డాక్టర్ వి.ఆర్. లోహిత్ కుమార్, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, అపోలో స్పెక్ట్రా హాస్పిటల్, అమీర్పేట. -
రేపు బంగాళాఖాతంలో తుపాను
సాక్షి, హైదరాబాద్: ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది క్రమంగా పశ్చిమ దిశలో కదిలి శుక్రవారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో వాయుగుండంగా మారింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో విశాఖపట్నం నుంచి ఆగ్నేయంగా 970 కిలోమీటర్లు, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 970 కిలోమీటర్లు, కాకినాడకు ఆగ్నేయంగా 990 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. ఈ వాయుగుండం మరింత బలపడి ఆదివారం ఉదయంకల్లా తీవ్ర వాయుగుండంగా మారనున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది.తదుపరి 24 గంటల్లో ఈ తీవ్ర వాయుగుండం బలపడి సోమవారం నాటికి తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అనంతరం తుపాను మరింత బలపడి ఈనెల 28వ తేదీనాటికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆ తర్వాత తీవ్ర తుపాన్ ఉత్తర వాయవ్య దిశలో కదులుతూ కాకినాడకు సమీపంలో 28వ తేదీ సాయంత్రానికి తీవ్ర తుపానుగా తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.నాలుగు రోజులపాటు మోస్తరు వర్షాలు..బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం, తదుపరి తుపాను ప్రభావం రాష్ట్రంపైన మధ్యస్తంగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనావేసింది. రానున్న నాలుగు రోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచిస్తోంది. కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా నమోదు కావచ్చని చెబుతూ, రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. -
గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు ఎప్పుడు?
సాక్షి, హైదరాబాద్: ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. బతుకుదెరువు కోసం అప్పులు చేసి జోర్డాన్, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన కార్మికులు ఏజెంట్ల చేతుల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఉపాధి కోసం జోర్డాన్ వెళ్లి అక్కడే చిక్కుకు పోయిన 12 మంది వలస కార్మికులు హరీశ్రావు చొరవతో శనివారం తెల్లవారు జామున హైదరాబాద్కు చేరుకున్నారు.ఈ నేపథ్యంలో వారు హరీశ్రావును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జోర్డాన్లో అనేక కష్టాలు ఎదుర్కొన్న తమను ఆదుకుని, స్వదేశానికి చేర్చేందుకు చొరవ తీసుకున్నందుకు వారు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ ‘గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన తెలంగాణ కార్మికుల సంక్షేమం కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి నిధులు కేటాయిస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. ప్రవాస తెలంగాణ వాసుల కోసం ప్రత్యేక పాలసీ తెస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ప్రభుత్వం ఒక్క హామీనీ నెరవేర్చలేదు.రాష్ట్రం నుంచి గెలిచిన బీజేపీ ఎంపీలతో పాటు కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్రెడ్డి విదేశాల్లో చిక్కుకుపోయిన తెలంగాణ వాసులను తీసుకువచ్చేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడానికి చొరవ తీసుకోవాలి’అని డిమాండ్ చేశారు. జోర్డాన్లో చిక్కుకున్న 12 మంది తెలంగాణ వలస కార్మికులపై విధించిన జరిమానా కూడా చెల్లించి వారిని స్వదేశానికి తీసుకువచ్చాం అని హరీశ్రావు వెల్లడించారు. హరీశ్రావుతో భేటీ తర్వాత వారు జగిత్యాల, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట జిల్లాల్లోని తమ సొంత ఊళ్లకు బయలుదేరి వెళ్లారు. -
ఈసారి పత్తి విక్రయాలు కష్టమే!
సాక్షి, హైదరాబాద్: జిన్నింగ్ మిల్లుల్లో అవకతవకలకు చెక్ పెట్టేందుకు, దళారుల జోక్యాన్ని అడ్డుకోవ డానికి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తెచ్చిన నిబంధనలు పత్తి రైతులకు గుది బండగా మారాయి. గతేడాది వరకు సీసీఐ నోటిఫై చేసిన సమీపంలోని జిన్నింగ్ మిల్లుల్లో రైతులు పత్తిని విక్రయించుకొనే వెసులుబాటు ఉండగా ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోవడమే అందుకు కారణం. సీసీఐ తీసుకొచ్చిన తాజా నిబంధనల ప్రకారం రైతులు కపాస్ కిసాన్ యాప్లో వారి వివరాలతో పంట సమాచారాన్ని నమోదు చేసుకొని స్లాట్ బుక్ చేసుకున్నాక సీసీఐ నోటిఫై చేసిన ఆయా జిల్లాల్లోని కొన్ని మిల్లుల్లో ఏదో ఒక దాన్ని మాత్రమే ఎంపిక చేసుకొనే అవకాశం ఉంది. తదనుగుణంగా ఎంత దూరమైనా ఆ జిల్లాలో నిర్దేశించిన మిల్లుల్లోనే రైతులు పత్తిని విక్రయించాల్సి ఉంటుంది. ఒకవేళ నిర్దేశించిన రోజు పత్తిని విక్రయించకపోతే రైతులు మళ్లీ స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 30 జిల్లాలలోని మిల్లులను ఎల్–1, ఎల్–2, ఎల్–3లుగా 12 రకాల సీసీఐ విభజించడంతో ఈ సమస్య తలెత్తింది.ఎల్–1 నుంచి ఎల్–12 వరకు మిల్లుల విభజనఏదైనా పనికి టెండర్లు వేసినప్పుడు తక్కువ ధరకు బిడ్ వేసిన వారిని ఎల్–1గా, ఆ తర్వాత వారిని ఎల్–2, ఎల్–3గా నిర్ణయిస్తారు. పత్తి విక్రయాల్లోనూ ఈసారి సీసీఐ అదే విధానాన్ని అవలంబించింది. పత్తి కొనుగోళ్లకు టెండర్లు పిలిచినప్పుడు 347 మిల్లులు పాల్గొనగా వాటిలో 317 మిల్లులను పత్తి కొనుగోళ్ల కోసం సీసీఐ నోటిఫై చేసింది. వాటిలోనూ తక్కువ ధరకు జిన్నింగ్ చేసేందుకు ముందుకొచ్చిన, నిల్వ సామర్థ్యం ఎక్కువగా ఉండి, మెరుగైన సదుపాయాలు ఉన్న మిల్లులకు ఇచ్చిన మార్కుల ఆధారంగా ఎల్–1, ఎల్–2 నుంచి ఎల్–12 వరకు కేటగిరీలుగా విభజించింది. ఈ లెక్కన రాష్ట్రంలో ఎల్–1 కింద 117 మిల్లులు ఉండగా ఎల్–2 కింద 75, ఎల్–3 కింద 48, ఎల్–4 కింద 26, ఎల్–5 కింద 10 మిల్లులు, ఎల్–12 కింద వరంగల్లోని ఒక మిల్లును సీసీఐ ఎంపిక చేసింది.ఒకటి నిండాకే మరొకటి..రాష్ట్రంలో ప్రస్తుతం సీసీఐ ద్వారా నోటిఫై చేసిన జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. శుక్రవారం నాటికి ఆదిలాబాద్లో 6, కొత్తగూడెంలో 2, ఖమ్మంలో 3, నారాయణపేట, సిద్దిపేటలో ఒక్కో జిన్నింగ్ మిల్లు చొప్పున 13 మిల్లులు మాత్రమే కొనుగోళ్లు ప్రారంభించాయి. వాటిలో ఇప్పటివరకు 26 మంది రైతులు కేవలం రూ. 53 లక్షల విలువైన 66.48 క్వింటాళ్ల పత్తినే విక్రయించారు. వారంతా ఎల్–1 కింద నమోదైన మిల్లుల్లోనే పత్తిని విక్రయించారు. ఎల్–1 కింద కేటాయించిన 117 మిల్లుల్లో వాటి సామర్థ్యం మేరకు పత్తి బేళ్లు నిండాకే ఎల్–2, ఆ తర్వాత ఎల్–3కి కేటాయిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లకు పత్తి తక్కువగా వస్తున్న నేపథ్యంలో ఎల్–1 మిల్లులకే రైతులు పత్తిని విక్రయించాల్సి వస్తోంది. వచ్చే నెలలో పత్తి ఎక్కువగా మార్కెట్లకు వచ్చే వరకు ఇదే పరిస్థితి కొనసాగనుంది. ఎల్–1లో లేని మిల్లులు తమ వంతు వచ్చే వరకు మిల్లింగ్ చేయకుండా వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ అంశంపై మిల్లర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
రెండు రాష్ట్రాల్లో పార్టీని అధికారంలోకి తీసుకొస్తాం
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ పార్టీని బలోపేతం చేయడంతోపాటు అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడంపై రాంచందర్రావు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్లు శనివారం ఇక్కడి బీజేపీ కార్యాలయంలో చర్చలు జరిపారు. ఏపీ బీజేపీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి హైదరాబాద్కు వచ్చిన మాధవ్, రాంచందర్రావుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల్లో కేంద్ర పథకాలు అమలవుతున్న తీరు, వాటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై సమాలోచనలు జరిపారు.సమావేశం తర్వాత రాంచందర్రావు మీడియాతో మాట్లాడుతూ, పార్టీని మరింత విస్తరిస్తామని తెలిపారు. మాధవ్ మాట్లాడుతూ.. గతంలో బీజేపీ యువమోర్చా, పార్టీ ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా, జాతీయ కార్యదర్శిగా పనిచేసిన సందర్భాల్లో పలుమార్లు హైదరాబాద్ కేంద్రంగా కార్యక్రమాలు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణలోనూ త్వరలోనే డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పాటు అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ కార్యాలయానికి రావడం స్వగృహానికి వచ్చినట్లుగా ఉందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఏపీలోనూ విస్తృత పరిచయాలు ఉన్న రాంచందర్రావు ఇక్కడ అధ్యక్షుడు కావడం ఆనందంగా ఉందన్నారు. -
ఆ రెండు చోట్లా ఉప ఎన్నికలు ఖాయం
సాక్షి, హైదరాబాద్/శ్రీనగర్కాలనీ: బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన ఖైరతాబాద్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యేలపై రాబోయే రోజుల్లో అనర్హత వేటు పడటం ఖాయమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. ఆ రెండు నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు తప్పవని, అలాగే రాష్ట్రవ్యాప్తంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు కచ్చితంగా వస్తాయని ఆయన పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహంపై కేటీఆర్ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ ఎన్నికలో పార్టీ గెలుపు ఖాయమని అన్నారు.భారీ మెజారిటీకోసం కష్టపడాలని నేతలకు సూచించారు. శనివారం ఆయన తెలంగాణ భవన్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నాయకులందరూ కలసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లో బీఆర్ఎస్కు ఉన్న బలాన్ని ఈ ఉప ఎన్నికలో చాటాల్సిన అవసరం ఉందన్నారు. ‘బీఆర్ఎస్ నాయకులు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లకు హైదరాబాద్ సమస్యలపై అవగాహన ఉంది.హైదరాబాద్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, అమలు చేసిన పథకాలను ప్రజలకు మరోసారి గుర్తు చేయాలి’అని కేటీఆర్ సూచించారు. ప్రచారంలో కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు గుర్తు చేయడంతో పాటు నగరంలో రోజురోజుకూ దిగజారుతున్న పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, మురికినీటి కాలువల నిర్వహణ వంటి సమస్యలను ఎత్తి చూపాలన్నారు. హైదరాబాద్ అభివృద్ధిని పక్కన పెట్టి, కాంగ్రెస్ కేవలం రాజకీయాలకే పాల్పడుతోందన్నారు. జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్రజూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభమవుతుందని, ఈ నియో జకవర్గంలో తిరిగి గులాబీ జెండాను ఎగురవేస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం తెలంగాణభవన్లో షేక్పేట డివిజన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు తోట మహేశ్తో పాటు పలువురు నేతలు బీఆర్ఎస్లో చేరారు. వారికి కేటీఆర్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. -
స్పామ్ కాల్స్తో తలనొప్పా? తక్షణం రిపోర్ట్ చేయండి!
సాక్షి, హైదరాబాద్: నేటి బిజీబిజీ జీవితాల్లో ప్రతి నిమిషం విలువైందే. ఎక్కడో అత్యంత ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్కాల్ వస్తుంది. ఒకసారి ఆన్సర్ చేయకపోతే మరోసారి వరుసగా మోగుతూనే ఉంటుంది. తీరా ఫోన్ ఆన్సర్ చేస్తే.. అవతలి వ్యక్తి హలో అంటూ మొదలు పెట్టి.. మనకు సంబంధం లేని ఏవేవో వాణిజ్య ప్రకటనలు, భూముల కొనుగోళ్లు, ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంట్లు అవసరం లేకుండా ప్రీ అప్రూవ్డ్ లోన్లు.. అంటూ దండకం అందుకుంటారు.ఇలాంటి స్పామ్ ఫోన్కాల్స్ తలనొప్పి కలిగిస్తున్నాయి. అయితే ఇలాంటి అనవసరమైన ఫోన్కాల్స్ బారి నుంచి బయటపడటంతోపాటు అనుమానాస్పద, మోసపూరిత యూఆర్ఎల్ (యూనిఫాం రిసోర్స్ లొకేటర్)పై సైబర్ క్రైం పోర్టల్ ఛిyb్ఛటఛిటజీఝ్ఛ.జౌఠి.జీnలో ఫిర్యాదు చేసేందుకు రిపోర్ట్ అండ్ చెక్ సస్పెక్ట్ అనే ఆప్షన్ అందుబాటులో ఉందని నిపుణులు చెపుతున్నారు. ఇలా చేయండి..మీకు అనుమానాస్పద నంబర్ల నుంచి ఎవరైనా ఫోన్ కాల్స్ చేసి విసిగిస్తున్నా, మీ వ్యక్తిగత వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నా.. అలాంటి ఫోన్కాల్ను కట్ చేసి వదిలేయకుండా ఆ నంబర్ల వివరాలను పోలీసుల దృష్టికి తెచ్చి చర్యలు తీసుకోవచ్చని సైబర్ నిపుణులు చెపుతున్నారు. అందుకు మీరు చేయాల్సింది.. సైబర్ క్రైం పోర్టల్లోకి వెళ్లి రిపోర్ట్ అండ్ చెక్ సస్పెక్ట్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. రిపోర్ట్ సస్పెక్ట్లోకి వెళ్లాలి.మీరు ఏ అంశానికి సంబంధించి ఫిర్యాదు చేయాలో కూడా అక్కడ ఆప్షన్స్ ఉంటాయి. అందులో ఫోన్ నంబర్, వెబ్సైట్ యూఆర్ఎల్, సోషల్ మీడియా యూఆర్ఎల్ నమోదు చేయాలి. మీకు ఏవిధంగా ఇబ్బంది కలిగిస్తున్నారన్న దానికి సంబంధించిన స్కీన్ర్షాట్ లేదా వాయిస్ రికార్డింగ్లు అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. సైబర్ క్రైం పోలీసులు ఈ ఫిర్యాదులను సమీక్షించి తగిన చర్యలు తీసుకుంటారు. -
45 రోజుల్లో ఇంటర్ కొత్త సిలబస్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ విద్యలో గుణాత్మక మార్పులు తెస్తున్నట్లు బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. రెండు సంవత్సరాల సిలబస్ను పూర్తిగా మారుస్తున్నా మని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ మార్పులు అమలులోకి వస్తాయన్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) స్థాయిలో పాఠ్య ప్రణాళిక ఉండబోతోందన్నారు. ఇంటర్ బోర్డు అధికారులతో కలిసి ఆయన శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొన్ని సబ్జెక్టులను ఆరేళ్ల క్రితం, మరికొన్నింటిని 12 ఏళ్ల క్రితం మార్చారని.. ఇప్పుడు సమూలంగా మారుస్తున్నామని చెప్పారు. ఈ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆమోదం తెలపడంతో ఇప్పటికే సబ్జెక్టు కమిటీని వేశామని వివరించారు. ఏయే చాప్టర్లలో ఏ మార్పులు తేవాలనేది కమిటీ సూచిస్తుందని, వచ్చే 45 రోజుల్లో కొత్త సిలబస్ను ఖరారు చేస్తామని తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఏప్రిల్ ఆఖరు లేదా మే తొలివారంలోనే కొత్త సిలబస్తో కూడిన పుస్తకాల ముద్రణ పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్నారు. నైపుణ్యం పెంపే లక్ష్యం: కొత్త సిలబస్ పూర్తిగా ప్రస్తుత అవసరాలకు, విద్యార్థుల నైపుణ్యాలు పెంచేదిగా ఉంటుందని కృష్ణ ఆదిత్య చెప్పారు. తెలుగు, హిందీ, ఆంగ్లం, ఇతర భాషలను కూడా పరిపూర్ణంగా నేర్చుకునేలా బోధన కార్యాచరణను ఖరారు చేస్తున్నామన్నారు. ఉదాహరణకు చరిత్ర సబ్జెక్టు తీసుకున్న విద్యార్థి స్థానిక పరిస్థితులు, చరిత్ర నేర్చుకునేలా చేస్తామని.. కామర్స్లో బడ్జెట్ రూపకల్పన, స్వరూపంపై అవగాహన కల్పిస్తామని వివరించారు. ఇలా అన్ని సబ్జెక్టుల్లోనూ నైపుణ్యం పెంచే పాఠ్యాంశాలు ఉంటాయన్నారు. ప్రతి చాప్టర్కూ క్యూఆర్ కోడ్ ఉంటుందని... దీన్ని స్కాన్ చేస్తే పాఠం మొత్తం లభించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. నాన్–డిటేయిల్డ్ కూడా తీసుకురావాలని భావిస్తున్నామన్నారు. ప్రయోగాలపై కొత్త పంథా ఇప్పటివరకు ఇంటర్ సెకండియర్కే పరిమితమైన ప్రాక్టికల్స్ను ఫస్టియర్లోనూ నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నట్లు కృష్ణ ఆదిత్య చెప్పారు. ప్రయోగాత్మకంగా నేర్చుకోవాలన్నదే దీని ఉద్దేశమన్నారు. 80 శాతం థియరీ మార్కులు ఉంటే 20 శాతం మార్కులు ప్రాక్టికల్స్కు ఉంటాయని వివరించారు. ప్రయోగశాలలు ఎక్కడ బాగుంటే అక్కడకు వెళ్లి విద్యార్థులు నేర్చుకొనే అవకాశం కల్పిస్తున్నామని.. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలతో సంబంధం లేకుండా ఆన్లైన్ ద్వారా విద్యార్థి లే»ొరేటరీని ఎంపిక చేసుకోవచ్చని ఆయన తెలిపారు. పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, ఇంటర్... ఇలా ఏ కాలేజీలోనైనా ప్రాక్టికల్స్కు హాజరయ్యేలా సింగిల్ పోర్టల్ను తీసుకొస్తున్నామన్నారు. ఎంఈసీలో స్కేలింగ్ విధానం ద్వారా మరింత మెరుగైన కోర్సును రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అకౌంట్స్, కామర్స్, ఎకనామిక్స్తో కూడిన కొత్త కోర్సును అందుబాటులోకి తెస్తామన్నారు. కాగా, ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు మొదలు పెట్టామని కృష్ణ ఆదిత్య తెలిపారు. మే 25 నుంచి మార్చి 15 వరకు పరీక్షలు ఉంటాయన్నారు. త్వరలోనే షెడ్యూల్ను విడుదల చేస్తామని చెప్పారు. విద్యార్థులు నవంబర్ తొలివారంలో పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. -
హైదరాబాద్ నడిబొడ్డున కాల్పుల కలకలం
సాక్షి, హైదరాబాద్/సుల్తాన్ బజార్: హైదరాబాద్ నడిబొడ్డున శనివారం తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. నగరంలో కరడుగట్టిన దొంగ అన్సారీ ఈ కాల్పుల్లో గాయపడ్డాడు. సెల్ ఫోన్ చోరీచేసి అతడు పారి పోతుండగా సౌత్ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్యకుమార్ గమనించి తన గన్మ్యాన్తో కలిసి పట్టుకునేందుకు ప్రయత్నించగా అన్సారీ తిరగబడి కత్తితో దాడి చేశాడు. ఆత్మరక్షణ కోసం చైతన్యకుమార్ తన గన్ మ్యాన్ వద్ద ఉన్న తుపాకీని తీసుకొని కాల్పులు జరపడంతో అన్సారీ తీవ్రంగా గాయపడ్డాడు. డీసీపీ, గన్మ్యాన్లకు కూడా స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ ముగ్గురిని వేర్వేరు ఆస్పత్రుల్లో చేర్పించారు. ఘటనాస్థలిని హైదరాబాద్ పోలీసు కమిషనర్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనార్ సందర్శించారు. తన కంట పడిన నేరగాడిని పట్టుకోవడానికి ఓ ఐపీఎస్ అధికారి ఛేజింగ్ చేయడం, కాల్పులు జరపడం నగర పోలీసు చరిత్రలో ఇదే తొలిసారి.ఘరానా నేరగాడు మహ్మద్ ఒమర్ అన్సారీ...నగరంలోని కామాటిపుర ప్రాంతానికి చెందిన మహ్మద్ ఒమర్ అన్సారీపై టప్పాచబుత్ర, కామాటిపుర, మైలార్దేవ్పల్లి, శివరాంపల్లి, చార్మినార్, బహదూర్పుర, అఫ్జల్గంజ్, ఉప్పల్, హుస్సేనిఆలం, ఫలక్నుమా, కాలాపత్తర్ ఠాణాల్లో 20 కేసులు ఉన్నాయి. వీటిలో చైన్ స్నాచింగ్, చోరీ, బెదిరింపులు తదితర నేరాలపై నమోదైనవే అధికం. అతడిపై పోలీసులు గతంలో రెండుసార్లు పీడీ యాక్ట్ ప్రయోగించారు. ఆయా సందర్భాల్లో ఏడాది చొప్పున జైలులో గడిపి వచ్చినా అన్సారీ తన పంథా మార్చుకోలేదు. ఇటీవల మరో నిందితుడితో కలిసి సెల్ఫోన్ చోరీలకు పాల్పడుతున్నాడు. రద్దీ ప్రాంతాలతో పాటు నిర్మానుష్యంగా ఉన్న చోటు మాటు వేసి అటుగా వచ్చే వారి సెల్ఫోన్లు లాక్కుపోతున్నాడు. ఇతడితో కలిసి నేరాలు చేస్తున్నది కూడా పాతబస్తీకి చెందిన పాత నేరగాడిగా తెలుస్తోంది. వీళ్లిద్దరూ పోలీసులకు మోస్ట్వాంటెడ్గా ఉన్నారు. నేరం చేస్తుండగా గుర్తించి.. 500 మీటర్లు వెంబడించి...నగరంలోని సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా పని చేస్తున్న ఎస్.చైతన్య కుమార్ శనివారం మధ్యాహ్నం వ్యక్తిగత పనిపై సైదాబాద్లోని కార్యాలయం నుంచి బయటకు వెళ్లారు. సాయంత్రం సుల్తాన్బజార్ మీదుగా చాదర్ఘాట్ చౌరస్తా వైపు వస్తున్నారు. ఈయన వాహనం కోఠిలోని చాకలి ఐలమ్మ మహిళ యూనివర్సిటీ వద్దకు చేరుకునే సమయానికి అన్సారీ, మరో నేరగాడితో కలిసి ఆటోలో వెళ్తున్న వ్యక్తి వద్ద సెల్ఫోన్ దొంగిలించి పారిపోతున్నారు. వారిని గమనించిన చైతన్యకుమార్ తన వాహనం నుంచి కిందకు దిగి వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఆయన వెంటే గన్మ్యాన్ సైతం వాహనం నుంచి బయటకు వచ్చారు. వారిని తోసేసిన అన్సారీ, మరో నిందితుడు తలోదిక్కు పారిపోయారు. అన్సారీ ఇసామియా బజార్ మీదుగా పారిపోతుండగా డీసీపీ అతడిని ఛేజ్ చేసుకుంటూ విక్టోరియా ప్లే గ్రౌండ్ వరకు దాదాపు 500 మీటర్లు పరిగెత్తారు. ఆయన వెంటనే గన్మ్యాన్ కూడా వచ్చారు. అక్కడ ఓ భవనం ఎక్కిన అన్సారీ తప్పించుకునే అవకాశం లేకపోవడంతో ప్లేగ్రౌండ్స్లోకి దూకేశాడు. అతడి వెంటే డీసీపీ, గన్మ్యాన్ కూడా గ్రౌండ్లోకి దూకారు. అక్కడ తన వద్ద ఉన్న కత్తితో గన్మ్యాన్, డీసీపీపై అన్సారీ దాడికి ప్రయత్నించాడు. పెనుగులాట జరిగి ముగ్గురూ కిందపడిపోయారు. అదే సమయంతో కత్తితో రెచ్చిపోవడానికి ప్రయత్నించిన అన్సారీపై గన్మ్యాన్ తుపాకీతో డీసీపీ రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ తూటాలు అన్సారీ చేయి, కడుపులోకి దూసుకుపోయాయి. తీవ్రగాయాలైన అన్సారీ కుప్పకూలిపోయాడు.ఆస్పత్రుల్లో చికిత్స...డీసీపీ చైతన్యకుమార్తో పాటు ఆయన గన్మ్యాన్కు స్వల్ప గాయాలు కావడంతో స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. తీవ్రంగా గాయపడిన అన్సారీని బంజారాహిల్స్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అన్సారీ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న సుల్తాన్బజార్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అన్సారీతో వచ్చి పరారైన మరో నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ ఉదంతం తర్వాత నగర పోలీసు విభాగంలోని అధికారులు, సిబ్బందిలో అవసరమైన వారికి తుపాకులు జారీ చేయాలని కొత్వాల్ సజ్జనర్ నిర్ణయించారు. కేవలం మహిళలపై జరిగే నేరాల విషయంలోనే కాకుండా ప్రతి నేరగాడి విషయంలోనూ కఠినంగానే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. నగరాన్ని నేర రహితంగా మార్చడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. -
లారీని ఢీకొట్టిన తెలంగాణ ఆర్టీసీ బస్సు
దాచేపల్లి: లారీని తెలంగాణ ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఇద్దరికి తీవ్రగాయాలవ్వగా.. మరో ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటన పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో శనివారం జరిగింది. వివరాలు.. తెలంగాణలోని మిర్యాలగూడెంకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రతి రోజూ దాచేపల్లికి రాకపోకలు సాగిస్తుంటుంది. శనివారం 35 మందితో మిర్యాలగూడెం నుంచి బయలుదేరిన బస్సు దాచేపల్లి మండలం గామాలపాడు సమీపంలోని ఆంధ్రా సిమెంట్స్ వద్దకు చేరుకుంది.అదే సమయంలో ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో.. వెనుక వస్తున్న బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జవ్వగా.. బస్సు డ్రైవర్ గొనేనాయక్, గురజాలకు చెందిన షేక్ నబీమున్కి తీవ్రగాయాలయ్యాయి. కండక్టర్ లింగయ్య, ప్రయాణికులు సంతోషం, ధనావత్ రంగి, రాణి, నర్సమ్మ, దానమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. సాగర్ సిమెంట్స్ ప్రతినిధులు తమ అంబులెన్స్లో క్షతగాత్రులను ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. -
గనుల శాఖలో బదిలీల పర్వం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖలో తరచూ బదిలీల పర్వం కొనసాగుతోంది. గత 22 నెలల్లో గనుల శాఖతోపాటు అనుబంధ డైరెక్టరేట్, ఖనిజాభివృద్ధి సంస్థలో భారీగా ఉన్నతాధికారులపై బదిలీ వేటు పడింది. పూర్తి అదనపు బాధ్యతల పేరిట ఇన్చార్జి అధికారుల పాలనే కొనసాగుతోంది. రాజకీయ ఒత్తిళ్లు, ఆదాయ లక్ష్యాలను చేరుకోకపోవడం, వివాదాస్పద పనితీరు, బాధ్యతలపై పట్టు లేకపోవడం తదితర కారణాలతో తరచూ అధికారుల మార్పిడి జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామం ఆ శాఖలో విధాన నిర్ణయాల్లో జాప్యానికి కారణం కావడంతోపాటు ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయంపైనా ప్రతికూల ప్రభావం చూపుతోంది. రాజకీయ ఒత్తిళ్లే అసలు కారణం?పాలనాపరమైన మార్పుల్లో భాగంగా జరగాల్సిన అధికారుల బదిలీల వెనుక రాజకీయ కారణాలే బలంగా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ. 5 వేల కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం ఈ శాఖకు లక్ష్యం నిర్దేశించగా అందులో సుమారు రూ. 1,200 కోట్ల మేర ఆదాయం తగ్గింది. గ్రానైట్, లైమ్స్టోన్ లీజుల అక్రమాలను అరికట్టి జరిమానా రూపంలో ఖజానాకు భారీ ఆదాయం సమకూర్చాలనే లక్ష్యం నెరవేరకపోవడం కొందరు అధికారుల బదిలీకి దారితీసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో గ్రానైట్ వ్యవహారాలు, ఉమ్మడి నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో ఇసుక వెలికితీత, విక్రయాలు, రవాణాలో అక్రమాలు అధికారుల బదిలీల్లో కీలకంగా మారాయని తెలిసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతలు ఇసుక క్వారీల లీజ్ల కోసం చేసిన ఒత్తిళ్ల వల్ల టీజీఎండీసీ నుంచి ఒకరిద్దరు అధికారులు నిష్క్రమించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి డైరెక్టర్ దాకా..!2024 జనవరిలో గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ బదిలీతో మహేశ్ దత్ ఎక్కా బదిలీపై వచ్చారు. కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే ఎక్కా స్థానంలో గనుల శాఖ కార్యదర్శిగా సురేంద్ర మోహన్ బాధ్యతలు చేపట్టారు. సురేంద్ర మోహన్ బదిలీతో ప్రస్తుతం పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ఎన్.శ్రీధర్ ఈ ఏడాది జనవరి నుంచి గనులు, భూగర్భ వనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్ఏసీ) నిర్వర్తిస్తున్నారు. గనుల శాఖ డైరెక్టర్ స్థానంలో గత 22 నెలల్లో ఆరుగురు అధికారులు మారారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గనుల శాఖ డైరెక్టర్గా ఉన్న పి.కాత్యాయనీదేవి స్థానంలో 2024 జనవరిలో బీవీఆర్ సుశీల్కుమార్ను నియమించారు. అదే ఏడాది సెప్టెంబర్లో కె.సురేంద్ర మోహన్, డిసెంబర్లో కె.శశాంక డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. ఆరు నెలలు తిరగక ముందే శశాంక స్థానంలో ప్రస్తుతం టూరిజం కార్పొరేషన్ వీసీ, ఎండీగా ఉన్న క్రాంతి వల్లూరును ఇన్చార్జిగా నియమించారు. తాజాగా ఈ నెల 20న వల్లూరు క్రాంతిని గనుల శాఖ డైరెక్టర్ పదవి నుంచి తప్పిస్తూ ఐటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ భవేశ్ మిశ్రాకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. మరోవైపు గత ఏడాది ఆగస్టులో రిటైరైన బీవీఆర్ సుశీల్ కుమార్ గతేడాది అక్టోబర్లో టీజీఎండీసీ వీసీ, ఎండీగా రెండేళ్లపాటు ఉండేలా ప్రత్యేక నియామకంపై వచ్చారు. కానీ స్వల్ప వ్యవధిలోనే ఆయన్ను గనుల శాఖ డైరెక్టర్గా బదిలీ చేశారు. తాజాగా రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ ప్రత్యేక అధికారిగా (ఓఎస్డీ)గా నియమిస్తూ ఈ ఏడాది మేలో నియమితులయ్యారు. రిటైరైన అధికారికి ఏడాదిలోపే మూడుసార్లు స్థానచలనం కలగడం చర్చనీయాంశమైంది. -
ఢిల్లీలో రేవంత్ ఇంట్లోకి మహిళా అధికారికి నో ఎంట్రీ
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్రెడ్డిని శనివారం ఆయన నివాసంలో కలిసేందుకు వచ్చిన ఓ మహిళా అధికారికి చేదు అనుభవం ఎదురైంది. ఐ అండ్ పీఆర్ ఢిల్లీ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అయిన హర్ష భార్గవి ఇటీవల తెలంగాణ సీపీఆర్వోగా బాధ్యతలు చేపట్టారు. సీఎం ఢిల్లీ రావడంతో మర్యాదపూర్వకంగా ఆయన్ను కలిసేందుకు సీఎం నివాసానికి చేరుకున్నారు. కానీ అక్కడి భద్రతా సిబ్బంది ఐడీ కార్డు చూపించినా ఆమెను లోపలకు పంపేందుకు నిరాకరించారు. ‘మీరెవరో తెలియదు. ఇక్కడ ఉండటానికి వీల్లేదు’ అన్నారు. దీంతో ఆమె వెనుదిరిగేందుకు సిద్ధమై క్యాబ్ కోసం నిరీక్షిస్తుండగా ఢిల్లీ పోలీసులు ఆమెను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. అక్కడున్న మీడియా సిబ్బంది గమనించడంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై ఐ అండ్ పీఆర్ ఉన్నతాధికారులకు ఆమె ఫోన్లో వివరించి కన్నీటిపర్యంతమయ్యారు. దీంతో వారు ఈ విషయాన్ని తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయల్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై విచారణ చేపడతానని శశాంక్ గోయల్ ‘సాక్షి’కి చెప్పారు. -
పరాయి కాలేజీల్లో ‘ప్రయోగాలా’?
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ప్రయోగ పరీక్షా కేంద్రాల ఖరారు విషయంలో బోర్డు తీసుకున్న నిర్ణయంపై గురుకుల విద్యాసంస్థల అధ్యాప కులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గురుకుల జూనియర్ కాలేజీల్లోని ఇంటర్ సెకండియర్ విద్యార్థులు ప్రాక్టికల్స్ కోసం సమీపంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు హాజరు కావాలని పేర్కొనడంపై వారు పెదవివిరుస్తు న్నారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక కాలేజీలైన గురుకుల విద్యాసంస్థలను ప్రయోగ పరీక్షా కేంద్రాలకు అనుమతించకపోవడం గురుకు లాల పరపతిని దిగజార్చడమేనని విమర్శిస్తు న్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సెల్ఫ్ సెంటర్లు ఉంటుండగా గురుకులాల్లో మెరుగైన మౌలిక వసతులు ఉన్నప్పటికీ ప్రయోగ పరీక్షా కేంద్రాల ఏర్పాటుకు అవకాశం ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తుతాయ ని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నివాస ప్రాంతాలకు దూరంగా ఉండే గురుకులాల్లో రెసిడెన్షియల్ విధానంలో బోధన జరుగుతుందని.. ప్రయోగ పరీక్షల కోసం విద్యార్థులు గురుకులాలను వదిలి ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉండే ప్రాంతాల వరకు రాకపోకలు సాగించాల్సి రానుండటం వారికి ఇబ్బందిగా మారుతుందని అధ్యాపకులు అంటున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రత్యేకంగా రవాణా ఏర్పాట్లు చేసుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు. -
అనుమతి లేకుండా చిరంజీవి పేరు, ఫొటోలు వాడొద్దు
సిటీ కోర్టులు: ప్రముఖ సినీ నటుడు చిరంజీవి అనుమతి లేకుండా ఇతర వ్యక్తులు లేదా సంస్థలు ఆయన పేరు, ఫొటోలు, స్వరాన్ని (వాయిస్) వాడొద్దని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. తన అనుమతి లేకుండా పలువురు వ్యక్తులు, సంస్థలు తన పేరును వాడుతున్నారని, దాని వల్ల తన పరువుకు భంగం కలిగే అవకాశం ఉన్నందున అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని, భవిష్యత్లో కూడా ఇలాంటివి జరుగకుండా ఆదేశాలు జారీ చెయ్యాలని సిటీ సివిల్ కోర్టులో చిరంజీవి పిటిషన్ దాఖలు చేశారు. తన పేరు/చిత్రం/ప్రసిద్ధ సినీ శీర్షికలను అనుమతి లేకుండా వాడుకోవడం, ఆ¯న్లైన్ ప్లాట్ఫాంలపై వినియోగించడం, కృత్రిమ మేధ (ఏఐ) ద్వారా మార్పులు చేసిన తన చిత్రాలు, వీడియోలను ప్రచారం చేయడం ఆపేలా ఆదేశాలివ్వాలని కోరారు. దీనిపైన విచారణ చేపట్టిన కోర్టు.. వ్యక్తులు లేదా ఏ సంస్థలైనా చిరంజీవి వ్యక్తిత్వ, ప్రచార హక్కులను ఉల్లంఘించే విధంగా ఆయన పేరు, ఫొటోలు, వాయిస్ తదితర వాటిని అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించరాదని శనివారం మధ్యంతర ఉత్తర్వులను జారీ చేశారు. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. అదేవిధంగా చిరంజీవి పిటిషన్లో ప్రతివాదులుగా పేర్కొన్న పలువురికి కోర్టు నోటీసులు జారీచేస్తూ అక్టోబర్ 27న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఏ రూపంలోనైనా, ఏ మాధ్యమంలోనైనా, వ్యక్తిగత లేదా వాణిజ్య లాభం కోసం నేరుగా గానీ పరోక్షంగా గానీ చిరంజీవి పేరును ఉపయోగించొద్దని స్పష్టంచేసింది. చిరంజీవి వ్యక్తిత్వ/ప్రచార హక్కుల ఉల్లంఘనలు గాని పరువు నష్టం చర్యలుగాని జరిగితే, సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. టెలివిజన్ చానళ్లు, డిజిటల్ ప్లాట్ఫాంలు, మీడియా సంస్థలు తదితర అన్నిరకాల వ్యక్తులు/సంస్థలు లాభాలను పొందే ఉద్దేశంతో చిరంజీవి పేరు, చిత్రం, వాయిస్ లేదా ఇతర వ్యక్తిత్వ లక్షణాలను అనుమతి లేకుండా ఉపయోగించడం, తప్పుగా చూపించడం లేదా వక్రీకరించడం చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. -
మేం కోవర్టులం కాదు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కోవర్టులుగా తమను చిత్రీకరిస్తున్న వారు, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మాజీ మావోయిస్టు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న విజ్ఞప్తి చేశారు. తమలో విప్లవ తత్వం ఇంకా చనిపోలేదని, ప్రజాపోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఈమేరకు తనతో పాటు లొంగిపోయిన 210 మంది మావోయిస్టులతో కలిసి ఛత్తీస్గఢ్ నుంచి మాట్లాడిన వీడియోను ఆయన శనివారం విడుదల చేశారు. అందులో ఆశన్న పేర్కొన్న ముఖ్యమైన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘కేంద్ర కమిటీ స్థాయి నాయకులు లొంగిపోతే విప్లవ ద్రోహులుగా పేర్కొనడం చాన్నాళ్లుగా జరుగుతూ వస్తోంది. మాపై కూడా అలాంటి నిందలు వస్తాయని ముందే ఊహించాం. కానీ, ఇటీవల మావోయిస్టు పార్టీకి జరిగిన భారీ నష్టాలకు మేమే కారణమని, మేం కోవర్టులుగా వ్యవహరించామంటూ ఆరోపణలు రావడంతో వివరణ ఇస్తున్నా. నాకు ఏ స్వార్థం లేదు. భయం కూడా లేదు. ప్రస్తుత పరిస్థితులు సాయుధ పోరాటానికి అనుకూలంగా లేనందునే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికీ మాలో విప్లవ తత్వం చచ్చిపోలేదు. ప్రజల తరఫున పోరాటాలకు సిద్ధంగా ఉన్నాం. అయితే, కార్యాచరణ ప్రకటించేంత అనువైన పరిస్థితులు లేనందున.. పరిస్థితులకు తగ్గట్టు నడుచుకోవడం ముఖ్యం. హైదరాబాద్లో కూర్చుని ప్రకటనలా? ప్రజాస్వామిక వాదులు, పౌర హక్కుల సంఘాల నేతలు హైదరాబాద్లో కూర్చుని మాపై ఇష్టారీతిగా ఆరోపణలు చేస్తున్నారు. మేము సైద్ధాంతికంగా మీ అంత బాగా మాట్లాడలేకపోవచ్చు. కానీ, క్షేత్రస్థాయిలో నిలబడి మాట్లాడుతున్నాం. మేము పోరాడుతున్న గడ్డ (దండకారణ్యం)కు వచ్చి నిజాలు తెలుసుకుని మాట్లాడండి. అప్పుడే మేము ఎలాంటి ప్రమాదాలు ఎదుర్కొన్నామో తెలుస్తుంది. అక్కడ (హైదరాబాద్) ఉండి సాయుధ పోరాటం చేయాల్సిందే అని చెబుతున్నారు. చేస్తే ఏమవుతుంది? మా శవాలు తెలంగాణకు వస్తే వాటిపై ఎర్రగుడ్డలు కప్పి ర్యాలీలు తీసి మమ్మల్ని హీరోలను చేస్తారు. కానీ ఇక్కడి(ఛత్తీస్గఢ్ మావోయిస్టులు) వారి సంగతేంటి? ప్రాణత్యాగం వృధా సమీప భవిష్యత్లో మన లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంటే తెగించి పోరాటం చేయడంలో తప్పులేదు. అలాంటి పరిస్థితి లేనప్పుడు ప్రాణత్యాగం చేయడం వృధా. విజ్ఞతతో ఆలోచన చేయండి. అనుకూలమైన పరిస్థితుల్లో ఉండి పరిధి దాటి మాట్లాడం పౌరహక్కుల సంఘం నేతలకు సరికాదు. మేము లొంగిపోయినా గుండెకోట్ ఎన్కౌంటర్లో తప్పించుకున్న మావోయిస్టులు సాయుధ పోరాటం చేయగలరని పౌరహక్కుల నేత గడ్డం లక్ష్మణ్ అంటున్నారు. కానీ, ఆ ఎన్కౌంటర్లో తప్పించుకున్న వారు కూడా ఇప్పుడు ఇక్కడ నా వెంటే ఉన్నారు. నేనో, సోనూనో చెబితే వచ్చేంత అమాయకులు కారు వారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలియకుండా వాఖ్యలు చేయడం సరికాదు. బీఆర్ దాదా ఉద్దేశం అది కాదు.. ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్లో మావోయిస్టులపై ప్రభుత్వం దాడి భీకరంగా ఉంటుందనే అంచనా ఉంది. అందుకే మార్చి 28న శాంతిచర్చల కోసం కేంద్ర కమిటీ తరఫున మన పార్టీ నాటి జనరల్ సెక్రటరీ బీఆర్ దాదా (నంబాల కేశవరావు) అనుమతితో లేఖ రాశాం. ఆ తర్వాత ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు నేను లేఖలు, ఇంటర్వ్యూ ఇచ్చాను. కానీ, ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంతో నేనేమైనా తొందరపడ్డానా అని తెలుసుకునేందుకు వ్యక్తిగతంగా బీఆర్ దాదాతో చర్చించాను. ఈ సందర్భంగా ‘మనం తప్పు చేయలేదు. సరైన దిశలోనే ఉన్నాం. కేంద్ర కమిటీ అంతా కూర్చుని నిర్ణయం తీసుకోవాల్సింది. అలాంటి పరిస్థితి లేనప్పుడు ప్రత్యామ్నాయ మార్గం చూడాలి’అని కూడా అన్నారు. దీనికి సంబంధించి నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. ఈ అంశంపై చివరిసారి మే 18న బీర్ దాదా నుంచి నాకు లేఖ వచ్చింది. ఈ లేఖ పంపిన రెండు గంటల తర్వాతే ‘గుండెకోట్ ఆపరేషన్’మొదలైంది. కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది శాంతిచర్చల విషయంలో దండకారణ్యంలో అందుబాటులో ఉన్న కేంద్ర కమిటీ సభ్యుల మధ్య చర్చ జరిగింది. ఇందులో దక్షిణ బస్తర్లో ఉన్న కామ్రేడ్లకు సమాచారం అందకముందే శాంతి చర్చల ప్రకటన వచ్చినట్టుంది. ఇక్కడ మా మాధ్య గ్యాప్ ఏర్పడింది. శాంతిచర్చల ప్రకటన మా నుంచి వచ్చినా ప్రభుత్వం నుంచి దాడులు ఆగలేదు. దీంతో ఆత్మరక్షణ కోసం మనం ఆయుధం పట్టవచ్చు అంటూ మే 13న బీఆర్ దాదా మరో లేఖ పంపారు. ప్రస్తుతం ఈ లేఖను చూపించి బీఆర్ దాదా సాయుధ పోరాటానికి అనుకూలమనే వాదనను తెర మీదకు తెస్తున్నారు. ఆత్మరక్షణ కోసం ఆయుధాలు పట్టుకోమనే బీఆర్ దాదా చెప్పారు తప్పితే అప్పటి వరకు శాంతి చర్చలు, కాల్పుల విరమణ, సాయుధ పోరాటంపై వంటి అంశాల్లో తన అభిప్రాయం మార్చుకున్నట్టు కాదు. ‘సాయుధ పోరాటం’విషయంపై నాతో పాటు మరో పొలిట్బ్యూరో సభ్యుడు దేవ్జీ (తిప్పిరి తిరుపతి)కి కూడా బీఆర్ దాదా లేఖ రాశారు. అందులో విషయాలను ఎందుకు బయటపెట్టడం లేదు. మల్లోజులతో టచ్లో లేను సోను (మల్లోజుల వేణుగోపాల్)తో నేను టచ్లో లేను. ఆగస్టుతో పాటు అక్టోబర్ 7వ తేదీన కేవలం రెండు సార్లే ఆయనను కలిశాను. సాయుధ పోరాటం చేయాలనే ఎస్జెడ్సీ సభ్యుడి సమక్షంలోనే బహిరంగంగా ప్రజాస్వామ్యబద్దంగా నేను, సోను చర్చ జరిపాం. అందరి అభిప్రాయాల కోసం సెప్టెంబర్ 13 వరకు ఎదురు చూశాం. ఆ తర్వాత సాయుధ పోరాట విరమణ ప్రకటన వచ్చింది. ఈ విషయంలో సాధ్యమైనంత వరకు పార్టీ పద్దతులు పాటించేందుకు ప్రయత్నించాం అని వివరించారు. -
ఎవరూ రచ్చకెక్కొద్దు!
సాక్షి, న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా తెలంగాణ కాంగ్రెస్లో, ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఏఐసీసీ వర్గాల ద్వారా తెలిసింది. ముఖ్యంగా మంత్రుల స్థాయిలోనే విభేదాలు రచ్చ కెక్కడంపై పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కేసీ వేణు గోపాల్ రాష్ట్ర నేతలకు క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. పార్టీలో అంతర్గతంగా చర్చించాల్సిన అంశాలను బహిరంగ వేదికలు, మీడియా ముందు మాట్లాడటాన్ని కేసీ తప్పుపట్టినట్లు తెలిసింది. డీసీసీ అధ్యక్ష నియా మకాల అంశంపై చర్చించేందుకు శనివారం ఢిల్లీకి వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్లు రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై కేసీ వేణుగోపాల్తో చర్చించారు. ఈ సందర్భంగా ఇటీవల పలువురు రాష్ట్ర మంత్రులు, నేతల మధ్య పొడచూపిన విభేదాలపై ఆయన ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే, వివాదాలను పరిష్కరించే దిశగా తీసుకున్న చర్యలను ఆయనకు రాష్ట్ర నేతలు వివరించారు. సమస్యలపై అంతర్గతంగా చర్చించుకోవా లని, రచ్చకెక్కవద్దని నేతలకు కేసీ ఈ సందర్భంగా సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీలకు 42% రిజర్వేషన్లపైనా చర్చ జరిగినట్లు తెలిసింది. బీసీ రిజర్వేషన్లపై నవంబర్ 3న హైకోర్టులో విచారణ ఉన్నందున ఆ తర్వాత మరోసారి ఈ అంశంపై చర్చించాలని నిర్ణయించినట్లు సమాచారం.పక్షం రోజుల్లో కొత్త డీసీసీలుపార్టీ సంస్థాగత నిర్మాణంలో ప్రధానపాత్ర పోషించే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాలను పక్షం రోజుల్లో పూర్తి చేయాలని ఏఐసీసీ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా పరిశీలకుల నుంచి అందిన నివేదికలు, స్థానిక సమీకరణలు, నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూ సమర్ధులైన వ్యక్తులను అధ్యక్షులుగా నియమించాలని నిర్ణయించారు. ముందునుంచీ చెబుతున్నట్లుగా పార్టీ పదవుల్లోనూ 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తూ, మహిళలకు ప్రాధాన్యమిస్తూ అన్ని వర్గాలవారికి న్యాయం చేయాలని భావిస్తోంది. మీనాక్షి నటరాజన్, రేవంత్రెడ్డి, భట్టి విక్రమార్క, మహేశ్కుమార్గౌడ్, ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాధన్లతో కేసీ వేణుగోపాల్ ఇందిరాభవన్లో శనివారం సమావేశమై రెండు గంటలపాటు చర్చించారు. రాష్ట్ర పరిశీలకుల నుంచి వచ్చిన పేర్లను ముందుపెట్టుకొని జిల్లాలవారీగా నేతల నుంచి విడివిడిగా అభిప్రాయాలను సేకరించారు. కచ్చితంగా ఒక ఓసీ, ఒక బీసీ..ఈ భేటీలో ప్రధానంగా జిల్లాలవారీగా పరిశీలనకు వచ్చిన ముగ్గురు అభ్యర్థుల పేర్లపై అభిప్రాయాలను సేకరించినట్లు తెలిసింది. ప్రతి ముగ్గురు పేర్లలో ఒక ఓసీ, ఒక బీసీ ఉన్నారని చెబుతున్నారు. జిల్లాల్లో ఉండే కుల సమీకరణలు, అభ్యర్థి బలాబలాలు, పార్టీపై ఉన్న నిబద్ధతను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థిత్వాలపై చర్చించారు. కొన్ని జిల్లాల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల బంధువులు, మిత్రుల పేర్లు రాగా వాటిని పక్కనపెట్టారని, మరికొన్ని జిల్లాల్లో పార్టీ అధికారంలోకి వచ్చాక కొత్తగా చేరినవారి పేర్లను ప్రత్యేకంగా గుర్తించి జాబితా నుంచి తొలగించారని తెలుస్తోంది. ఇప్పటికే అధ్యక్ష పదవుల్లో ఉన్నవారిని సైతం జాబితాల నుంచి తొలగించి మిగతా పేర్లపైనే ఎక్కువగా చర్చలు జరిగినట్లు తెలిసింది. అభిప్రాయాల సేకరణ ప్రక్రియ పూర్తయిన దృష్ట్యా, ఇందులో 42 శాతం బీసీలు ఉండేలా హైకమాండ్ తన తదుపరి చర్చలు కొనసాగించనుంది. ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక ఓసీ, ఒక బీసీ అధ్యక్షుడు ఉండేలా అభిప్రాయాలు వచ్చినట్లు తెలిసింది. ఈ లెక్కన కచ్చితంగా 9 మంది రెడ్లు, 13–14 మంది బీసీలకు అవకాశం దక్కుతుందని చెబుతున్నారు.డీసీసీలకు మరింత స్వేచ్ఛపార్టీ దీర్ఘకాలిక సంస్కరణల్లో భాగంగా జిల్లా యూనిట్లకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. నియోజకవర్గ అభ్యర్థులు మొదలు, పార్టీ, ప్రభుత్వ నియామకాల్లో వారి సూచనల మేరకే పదవుల పంపకాలు, జిల్లా స్థాయి సమస్యలపై పోరాటాలు చేసే స్వేచ్ఛ వారికి ఇచ్చే దిశగా ఈ భేటీలో సమాలోచనలు జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సంస్థాగత ఎన్నికల నుంచి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలకు డీసీసీలే జవాబుదారీగా ఉండాలని, వారి అభిప్రాయం మేరకు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పార్టీ విధానాల రూపకల్పన ఉండేలా భవిష్యత్తులో నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. ‘కేసీతో సంస్థాగత వివరాలపై చర్చించాం. అడిగిన వివరాలు అందించాం. సలహాలు, సంప్రదింపులు జరిపాం’అని తెలిపారు. అయితే, ఎప్పటిలోగా డీసీసీలను ప్రకటిస్తారన్నది మాత్రం చెప్పలేదు. 15 రోజుల్లోగా డీసీసీలను ప్రకటించాలని ఏఐసీసీ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. -
హైదరాబాద్లో ఆర్టీఏ అధికారుల దాడులు
హైదరాబాద్: కర్నూలు బస్సు ప్రమాద ఘటనతో ఆర్టీఏ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు హైదరాబాద్ ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. దీనిలో భాగంగా నిబంధనలు పాటించలేని 68 బస్సులపై కేసులు నమోదు చేశారు.ఏపీ వ్యాప్తంగా ఆర్టీఏ తనిఖీలుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో వ్రైవేట్ బస్సుల్లో ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన పలు బస్సులపై కేసులు నమోదు చేశారు. నిబంధనలు విరుద్ధంగా తిరుగుతున్న 18 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను సీజ్ చేసినట్లు సమాచారం. అదే సమయంలో పలు బస్సులపై కేసులు నమోదు చేశారు ఆర్టీఏ అధికారులు. సుమారు 289 బస్సులపై కేసులు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన బస్సులపై రూ. ఏడు లక్షలుగా పైగా జరిమానా విధించారు.ఇదీ చదవండి: కర్నూలు ఘటన: మరో షాకింగ్ ట్విస్టు -
ఈ రోజే లాస్ట్.. ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల ఆధార్ లింక్ తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ లింక్ లేకపోతే అక్టోబర్ నెల జీతం నిలిపివేయనున్నట్లు సృష్టం చేసింది. అన్ని శాఖాధిపతులు, కలెక్టర్లు వెంటనే చర్యలు తీసుకోవాలన్న ప్రభుత్వం.. IFMIS పోర్టల్లో ఆధార్ వివరాలు అప్డేట్ చేయాలని పేర్కొంది.రెగ్యులర్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సిబ్బందికి ఒకే నిబంధన విధించిన ప్రభుత్వం.. అక్టోబర్ 25 రాత్రి 12 గంటల లోపు డేటా అప్డేట్ చేయాలని తెలిపింది. ఆధార్ లింక్ లేని ఉద్యోగుల జీతం నిలిపివేత తప్పదని.. నియమాలను ఉల్లంఘించిన అధికారులపై కఠిన చర్యలు ఉంటాయంటూ ప్రభుత్వం హెచ్చరించింది. -
Delhi: సీఎం రేవంత్ నివాసంలోకి అధికారిణికి అనుమతి నిరాకరణ
ఢిల్లీ: హర్ష భార్గవి.. తెలంగాణ ప్రభుత్వ సమాచార మరియు ప్రజా సంబంధాల శాఖ(I&PR)లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఆమె ఇటీవల న్యూఢిల్లీకి బదిలీ అయి, రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (CPRO)గా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆమెకు తాజాగా చేదు అనుభవం ఎదురైంది. ఈరోజు(శనివారం, అక్టోబర్ 25వ తేదీ) ఢిల్లీలోని సీఎం రేవంత్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలవడానికి వెళ్లారు. అయితే అక్కడ పోలీస్ సిబ్బంది ఆమెను గేట్ వద్దే నిలిపేశారు. ఆమెను సీఎం నివాసం లోపలికి వెళ్లేందుకు అనుమంతిచలేదు. ఆమె ప్రభుత్వ ఉద్యోగిగా తనను పరిచయం చేసినప్పటికీ, పర్మిషన్ ఇవ్వలేదు. ఆమె ప్రశ్నించగా, అరెస్ట్ చేస్తామని బెదిరింపులకు దిగారు. దాంతో ఆమె కంటతడి పెట్టుకున్నారు. ఇదీ చదవండి:ఓటర్ల జాబితాపై సమీక్ష.. తెలంగాణలో SIR -
హైదరాబాద్లో కాల్పుల కలకలం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని చాదర్ఘాట్లో కాల్పుల కలకలం రేగింది. చైన్ స్నాచింగ్ పాల్పడుతున్న దొంగలను సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య పట్టుకునేందుకు యత్నించగా.. డీసీపీపై దొంగలు కత్తితో దాడికి యత్నించారు. తోపులాటలో డీసీపీ గన్మెన్ కిందపడిపోయారు. ఈ క్రమంలో గన్మెన్ నుంచి వెపన్ తీసుకుని దొంగలపై డీసీపీ చైతన్య కాల్పులు జరిపారు.దొంగలపై డీసీపీ చైతన్య రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు దొంగల్లో ఒకరికి గాయాలు కాగా, నాంపల్లి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. ఇద్దరు దొంగల్లో ఒకరికి గాయాలయ్యాయని.. డీసీపీతో పాటు మిగతా సిబ్బంది క్షేమంగా ఉన్నారని తెలిపారు. రౌడీలు, స్నాచర్లపై ఉక్కుపాదం మోపుతాం: సీపీ సజ్జనార్చాదర్ ఘాట్లోని కాల్పులు జరిగిన ప్రాంతాన్ని సీపీ సజ్జనార్ పరిశీలించారు. కాల్పుల్లో చైన్ స్నాచర్ ఒమర్ ఛాతి, భుజంపై గాయాలయ్యాయి. ఒమర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు చైన్ స్నాచర్లు పాతబస్తీకి చెందిన పాత నేరస్తులుగా పోలీసులు గుర్తించారు. ఒమర్పై 25 కేసులు ఉన్నాయని.. రౌడీషీట్ కూడా ఉందని సీపీ సజ్జనార్ తెలిపారు.‘‘ఆత్మ రక్షణలో భాగంగా డీసీపీ కాల్పులు జరిపారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు చాదరగట్టి విక్టోరియా ప్లేగ్రౌండ్ వద్ద ఘటన జరిగింది. రౌడీ షీటర్ మొబైల్స్ స్నాచర్స్ ఇద్దరూ స్నాచింగ్ చేస్తుండగా డీసీపీ చైతన్య పట్టుకునే ప్రయత్నం చేశారు. ఒమర్ రెండు సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. దొంగను చేజ్ చేస్తూ పట్టుకునేందుకు డీసీపీ తన గన్మెన్ వచ్చారు. దొంగ కత్తితో గన్మెన్పై దాడి చేశాడు. వెంటనే డీసీపీ చైతన్య రెండు రౌండ్లు దొంగపై కాల్పులు జరిపారు. దొంగకు చేతిపై, కడుపులో గాయాలయ్యాయి.దొంగను మాలకపేట యశోద ఆసుపత్రికి తరలించాం. పరారీలో ఉన్న మరో దొంగ కోసం గాలిస్తున్నాం. డీసీపీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గాయలైన కానిస్టేబుల్ లు ఇద్దరూ ఆసుపత్రిలో క్షేమంగా ఉన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తాం. మహమ్మద్ ఉమర్ అన్సారీ.. కేసులు.. నేరాలు.. అతనికి సహకరిస్తున్న వారిని గుర్తిస్తాం’’ అని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. -
ఓటర్ల జాబితా సవరణపై సమీక్ష.. తెలంగాణలో SIR
హైదరాబాద్, రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న ప్రత్యేక విస్తృత ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision–SIR) కార్యక్రమంపై సన్నాహాలను ముఖ్య ఎన్నికల అధికారి సి. సుధర్శన్ రెడ్డి శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు (DEOs), నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారులు (EROs)*తో సమీక్షించారు.ఈ సందర్భంగా సీఈఓ సుధర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రత్యేక విస్తృత సవరణలో భాగంగా చేపట్టాల్సిన అన్ని కార్యక్రమాలు నిర్ణీత గడువులో పూర్తిచేయాలని, ముఖ్యంగా టేబుల్టాప్ వ్యాయామం వంటి పెండింగ్ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి నియోజకవర్గం, పోలింగ్ స్టేషన్ వారీగా పురోగతిని సమీక్షిస్తూ, ఖచ్చితమైన , లోపరహిత ఓటర్ల జాబితా తయారీపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.తదుపరి సమీక్షా సమావేశం నవంబర్ 1, 2025న వీడియో కాన్ఫరెన్స్ రూపంలో నిర్వహించబడనుందని, అప్పటికి అన్ని పనులు పూర్తవ్వాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు ముఖ్య ఎన్నికల అధికారి లోకేష్ కుమార్, ఉప ముఖ్య ఎన్నికల అధికారి హరి సింగ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.ఇటీవల సుధర్శన్ రెడ్డి ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ ఆధ్వర్యంలో జరిగిన రెండు రోజుల జాతీయ సమావేశంలో పాల్గొన్నట్లు తెలిసింది. ఆ సమావేశంలో ఎన్నికల జాబితా నిర్వహణలో సాంకేతికత వినియోగం, పారదర్శకత పెంపు, ఓటర్ల సేవల మెరుగుదల మరియు ఉత్తమ పద్ధతుల అమలు వంటి అంశాలపై చర్చలు జరిగాయి.సీఈఓ సుధర్శన్ రెడ్డి మాట్లాడుతూ, రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పారదర్శకంగా, తప్పులేని, సమగ్ర ఓటర్ల జాబితాను సిద్ధం చేయడం ఎన్నికల శాఖ యొక్క ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఇదీ చదవండి:తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్ -
హైదరాబాద్లో కుండపోత.. భారీగా ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్: నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, సోమాజీగూడ, ఖైరతాబాద్, లక్డీకపూల్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, సనత్నగర్, మోహిదీపట్నం, అత్తాపూర్, ఆరాంఘర్, కూకట్పల్లి, మూసాపేట్, బాలానగర్లో కుండపోతగా వర్షం పడుతోంది. భారీ వర్షం కారణంగా నగర జీవనం ఒక్కసారిగా స్తంభించిపోయింది.పలు ప్రధాన రహదారులన్నీ జలమయమై.. కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై వర్షపు నీరు భారీగా చేరడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. పలు చోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.#HYDTPinfo🚧 Traffic Alert 🚗Due to waterlogging and ongoing road work near Mehdi Function Hall, Ayodhya Junction, the movement of vehicles is slow in the area.Commuters are advised to plan their travel accordingly and use alternate routes where possible.Drive cautiously and… pic.twitter.com/kAByg5kMpK— Hyderabad Traffic Police (@HYDTP) October 25, 2025 కాగా, ఏపీలోని దక్షిణ కోస్తా జిల్లాలకు ఐఎండీ.. అత్యంత అప్రమత్తత ప్రకటించింది. 27, 28 తేదీల్లో రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ నెల 27న భారీ వర్షాలు పడే అవకాశముందని.. బాపట్ల, ప్రకాశం, కడప, నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. 20 సెంటీమీటర్ల పైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.నంద్యాల, చిత్తూరు, పల్నాడు, గుంటూరు, కృష్ణ, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ అయ్యింది. ఈ నెల 28న కాకినాడ సమీపంలో మెంథా తీవ్ర తుఫాన్. తీరం దాటనుంది. తీవ్ర తుఫాన్ తీరం దాటే సమయంలో కాకినాడ, ఉభయగోదావరి, ఏలూరు, గుంటూరు, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, వైఎస్సార్ కడప జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.#HYDTPinfo🌧️ Traffic Alert 🚗Due to waterlogging on Panjagutta Flyover towards NFCL, vehicle movement is slow in the area.Commuters are advised to plan their travel accordingly and drive with caution. 🚦#HyderabadTraffic #TrafficUpdate #RainAlert #DriveSafe pic.twitter.com/R7iceOFQbV— Hyderabad Traffic Police (@HYDTP) October 25, 2025 -
తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. తీవ్ర తుపానుగా మోంథా
ఆగ్నేయ బంగాళాఖాతంలో నెమ్మదిగా కదులుతూ వాయుగుండంగా క్రమక్రమంగా బలపడుతోంది. రేపటికి తీవ్ర వాయుగుండంగా బలపడి ఆ తరవాత తుఫాన్ గా రూపాంతరం చెందుతుందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఈ క్రమంలో.. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అయితే.. బంగాళాఖాతంలో 27 నాటికి తీవ్ర తుఫాన్ మోంథాగా రూపాంతరం చెందనుంది. ఈ ప్రభావంతో గరిష్టంగా గంటకు 90-110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరిస్తోంది. మోంథా ప్రభావంతో.. ఏపీ తీరానికి తీవ్ర తుపాను ఉండే అవకాశం ఉందని, ఈనెల 28న కాకినాడ దగ్గర తీరం దాటుందని తెలిపింది. ప్రస్తుతం.. ప్రస్తుతం పోర్ట్ బ్లెయిర్కు పశ్చిమ-నైరుతి దిశలో 420 కి.మీ., విశాఖపట్నంకి పశ్చిమ-నైరుతి దిశలో 990 కి.మీ., చెన్నైకి తూర్పు-ఆగ్నేయంలో 990 కి.మీ., కాకినాడకి ఆగ్నేయంగా 1000 కి.మీ,. గోపాల్పూర్ దక్షిణ-ఆగ్నేయంలో 1040 కి.మీ. కొనసాగుతూ వాయుగుండంగా బలపడుతోంది. ఎల్లుండి ఉదయం నాటికి (27వ తేదీ) నైరుతి, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ-మధ్య బంగాళాఖాతం మీదుగా తుఫానుగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ తుపానుకు థాయ్లాండ్ సూచన మేరకు మోంథాగా(Cyclone Montha) నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ఈ తుపాన్ ప్రభావంతో ఏపీ, తెలంగాణాల్లో వచ్చే ఐదు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి. దీంతో ఇరు రాష్ట్రాల అధికార యంత్రాంగాలు అప్రమత్తం అవుతున్నాయి. ఉద్యోగులకు సెలవులు రద్దుమోంథా తుఫాన్ హెచ్చరికలతో విశాఖ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఉద్యోగులకు సెలవులు రద్దు చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. వచ్చే మూడు రోజులు ఎంతో కీలకమని.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా, డివిజన్, మండల ,గ్రామ స్థాయి అధికార యంత్రాంగం హెడ్ క్వార్టర్స్ లోనే ఉండాలని.. ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు. వేటపై నిషేధం విధిస్తూ మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికీ సముద్రంలోకి వెళ్లి ఉంటే ఒడ్డుకు చేరుకోవడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అధికారులు రిలీఫ్ సెంటర్ల ఏర్పాటుకు సిద్ధంగా ఉండాలన్నారు. ‘‘చెట్లు పడిపోతే వెంటనే తొలగించడానికి ఏర్పాట్లు చేసుకోవాలి. త్రాగునీటికి ఇబ్బందులు రాకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు చేసుకోవాలి. విద్యుత్ సరఫరాకి అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరించడానికి చర్యలు చేపట్టాలి.జనరేటర్లు,డీజిల్ అందుబాటు లో సిద్ధం గా ఉంచుకోవాలి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉంచాలి’’ అని అన్నారు. తుఫాను వల్ల భారీ వర్షాలు , పెనుగాలులు వచ్చే అవకాశం ఉన్నందున.. తీర ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని, పల్లపు ప్రాంతాల ప్రజలు నీటిని తరలించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. -
ఓఆర్ఆర్ వద్ద బస్సు ప్రమాదం.. పలువురికి గాయాలు
సాక్షి, హైదరాబాద్: పెద్ద అంబర్పేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద శనివారం ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు బోల్తా పడడంతో అందులోని ప్రయాణికులకు గాయాలయ్యాయి. దీంతో ఆంబులెన్స్లో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తుండగా బస్సు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. -
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీలు ఖరారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది. 2026 ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ దాకా పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య శనివారం ప్రకటించారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలను ఆయన మీడియాకు తెలిపారు. ఫిబ్రవరి 3 నుండి ప్రాక్టికల్స్ స్టార్ట్ అవుతాయి. పాత విధానంలో ప్రాక్టికల్స్ ఉంటాయి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కూడా ల్యాబ్స్, ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇంగ్లీష్లో ఉన్నట్లుగానే మిగతా భాషల్లోనూ ప్రాక్టీకల్స్ జరిపిస్తాం. అలాగే.. 12 ఏళ్ల తర్వాత ఇంటర్ సిలబస్లో మార్పులు జరగబోతున్నట్లు తెలిపారాయన. మ్యాథ్స్, ఫిజిక్స్ , కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సిలబస్ మారబోతున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి వెల్లడించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ఫిబ్రవరి 25 నుండి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు ప్రభుత్వ ఆమోదంతో నిర్వహిస్తున్నాం. నవంబర్ 1 నుండి పరీక్షల ఫీజులు ఆన్ లైన్ ద్వారా చెల్లించే ప్రక్రియ ప్రారంభిస్తున్నాం. 12 సంవత్సరాల తర్వాత ఇంటర్ సిలబస్ లో మార్పులు చేస్తున్నాం. NCERT ప్రకారం సబ్జెక్టు కమిటీ సూచనల ప్రకారం మార్పు చేస్తున్నాం. సిలబస్ మార్పులో జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ లెక్చరర్లు భాగస్వాములవుతారు. నలభై నుండి నలభై ఐదు రోజుల్లో దీన్ని పూర్తి చేస్తాం. ఇంటర్ బోర్డు నిర్దేశించిన ప్రకారం డిసెంబరు 15 నాటికి సిలబస్ తెలుగు అకాడమీకి అందిస్తాం. నూతన సిలబస్తో పాటు క్యూఆర్ కోడ్ ముద్రణ ఉంటుంది.. ఏప్రిల్ ఎండింగ్ లో కొత్త సిలబస్ బుక్స్ అందుబాటులోకి తెస్తాం అని అన్నారు. ల్యాబ్ ప్రాక్టికల్స్ ఇంగ్లీష్ తో పాటు ఇతర భాషల్లో కూడా ఉంటాయి. ల్యాబ్ ప్రాక్టికల్స్ ఇంటర్ మొదటి సంవత్సర విద్యార్థులకు కూడా ఉంటాయి.2026 నుండి ACE గ్రూప్ ప్రారంభం అవుతుంది. అకౌంటెన్సీ గ్రూపు రూపకల్పన తదితర అంశాలపై ప్రత్యేక కమిటీలను నియమిస్తున్నామని తెలిపారు.


