breaking news
Telangana
-
ఇంజనీరింగ్లో 77,561 సీట్ల భర్తీ
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ తొలివిడత కౌన్సెలింగ్లో 77,561 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 5,493 సీట్లు మిగిలిపోయాయి. 82 కాలేజీల్లో వందశాతం సీట్లు నిండాయి. 6,083 మందికి ఈడబ్ల్యూఎస్ కోటా కింద సీట్లు వచ్చాయి. తక్కువ ఆప్షన్లు ఇవ్వడం వల్ల 16,793 మంది సీట్లు పొందలేకపోయారు. ఈఏపీసెట్ మొదటి విడత సీట్ల కేటాయింపు శుక్రవారం చేపట్టారు. ఆ వివరాలను సాంకేతిక విద్య విభాగం వెల్లడించింది.రాష్ట్రంలో 172 కాలేజీల్లో 83,054 ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. వీటి కోసం 94,354 మంది విద్యార్థులు 59,31,279 ఆప్షన్లు ఇచ్చారు. ఈసారి కొత్తగా మాక్ సీట్ల కేటాయింపు చేపట్టారు. దీని తర్వాత విద్యార్థులు ఆప్షన్లు మార్చుకున్నారు. మాక్తో పోలిస్తే 36,544 ఆప్షన్లు మారాయి. ఇందులో కొంతమంది కాలేజీలు మార్చుకుంటే, మరికొందరు బ్రాంచీలు మార్చుకున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 22లోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. తొలిసారిగా ఎస్సీ కుల వర్గీకరణ ప్రకారం ఇంజనీరింగ్ సీట్లు కేటాయించారు.కంప్యూటర్ కోర్సులదే ఆధిపత్యం: మొదటి విడతలో 77,561 సీట్లు భర్తీ అయితే, ఇందులో 57,042 సీట్లు కంప్యూటర్, ఇతర ఎమర్జింగ్ కోర్సుల్లోనే ఉన్నాయి. ఈ విభాగంలో 1,700 సీట్లు మాత్రమే మిగిలిపోయాయి. ప్రధాన ప్రాధాన్యత ఎమర్జింగ్, కంప్యూటర్ బ్రాంచీలే అయినా... ఈసారి కోర్ గ్రూపుల వైపు విద్యార్థులు ఎక్కువగా మొగ్గారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్లో 16,112 సీట్లు ఉంటే, 14,054 సీట్లు భర్తీ అయ్యాయి. సివిల్, మెకానికల్లో అన్నింటికన్నా తక్కువ సీట్లు భర్తీ అయ్యాయి. అయినప్పటికీ గతంతో పోలిస్తే కొంత మెరుగే కనిపించింది. గత ఏడాది ఈ బ్రాంచీల్లో 40 శాతం సీట్లు కూడా భర్తీ అవ్వలేదు. -
150 ఎంబీబీఎస్ సీట్లు గోవిందా!
సాక్షి, హైదరాబాద్: రెన్యువల్ కోసం లంచం ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వరంగల్లోని ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజీ (ఎఫ్సీఐఎంఎస్)కి ఈ సంవత్సరం ఎంబీబీఎస్ అడ్మిషన్లలో షాక్ తగిలింది. త్వరలో ప్రారంభం కానున్న ఎంబీబీఎస్ అడ్మిషన్ల జాబితా నుంచి ఈ కళాశాలను జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) తొలగించింది.ఈ కాలేజీలో ఉన్న 150 ఎంబీబీఎస్ సీట్లను రెన్యువల్ చేయలేదు. దీంతో రాష్ట్రంలో ఈసారి 150 ఎంబీబీఎస్ సీట్లు తగ్గనున్నాయి. వైద్య కళాశాల రెన్యువల్ కోసం రూ.66 లక్షలు లంచంగా ఇచ్చినట్లు సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగాసీబీఐ నమోదుచేసిన కేసుల ఆధారంగా మొత్తం 3,000 మెడికల్ సీట్లను ఎన్ఎంసీ ఈసారి రెన్యువల్ చేయలేదు. అందులో తెలంగాణ నుంచి ఎఫ్సీఐఎంఎస్ ఒక్కటే ఉంది. రెన్యూవల్ కోసం అడ్డదారులు: ఎఫ్సీఐఎంఎస్ 2023లోనే ప్రారంభమైంది. ఈ కళాశాలకు ట్రస్టీగా ఉన్న ఫాదర్ జోసఫ్ కొమ్మారెడ్డి.. కళాశాల రెన్యువల్ కోసం అక్రమాలకు పాల్పడినట్లు సీబీఐ గుర్తించింది. నకిలీ బోధకులు, అద్దె రోగులతో కళాశాల పరిధిలోని బోధనాసుపత్రిని నింపి అప్పటి అధికారులను మేనేజ్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. డాక్టర్ బి.హరిప్రసాద్ (కదిరి, ఏపీ), డాక్టర్ అంకం రాంబాబు (హైదరాబాద్), డాక్టర్ కృష్ణ కిషోర్ (విశాఖపట్నం) ద్వారా రెండు విడతల్లో రూ.66 లక్షలను ఎంసీఐ అధికారులకు లంచంగా ఇచ్చినట్లు సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో పేర్కొంది. -
మూడు రోజులు భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: తీవ్ర వర్షాభావ పరిస్థితుల నుంచి రాష్ట్ర ప్రజలకు ఉపశమనం లభించింది. శుక్రవారం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. రానున్న మూడు రోజులు కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు సైతం నమోదు కావొచ్చని అంచనా వేసింది. బికనీర్, సికార్, వాయువ్య మధ్యప్రదేశ్ నుంచి నైరుతి ఉత్తరప్రదేశ్ వరకు వాయుగుండం కొనసాగుతోంది.ఇది క్రమంగా తూర్పు ఆగ్నేయ దిశలో కదిలి ఈశాన్య బంగాళాఖాతం వరకు విస్తరించనుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీనికి సమాంతరంగా ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మధ్య తెలంగాణలో భారీ వర్షం..: శుక్రవారం రాష్ట్రంలో అనేక చోట్ల వర్షాలు కురిశా యి. ప్రధానంగా మధ్య తెలంగాణలో భారీ వర్షాలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 50 చోట్ల 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురిసింది. రా ష్ట్రంలో వరుసగా మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శనివారం ఉదయం వరకు రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, సిద్దిపేట, భువనగిరి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచి్చంది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.జీహెచ్ఎంసీ సమీప జిల్లాల్లో భారీ వర్షం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో శుక్రవారం భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యాయి. దక్షిణ కోస్తా, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల చక్రవాత ఆవర్తనం, దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులు వర్షాలకు అనుకూలంగా మారాయి. దీంతో మూడు రోజుల పాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఉమ్మడి నల్లగొండ, మహబూబ్నగర్లోని కొన్ని ప్రాంతాలు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో వచ్చే మూడు రోజులకు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేశాం. – డాక్టర్ కే.నాగరత్న డైరెక్టర్, ఐఎండీ–హైదరాబాద్ -
చినుకు సిటీ అంతా వణుకు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో శుక్రవారం మధ్యాహ్నం తర్వాత రెండు, మూడు గంటల పాటు కురిసిన అతి భారీ వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. నాలాలు, డ్రైనేజీలు ఉప్పొంగి ప్రవహించాయి. రోడ్లన్నీ వాగుల్ని తలపించాయి. ఫ్లైఓవర్లపై సైతం వరద ఏరులా ప్రవహించింది. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయాయి. పలు ప్రధాన రహదారుల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. కొన్నిచోట్ల వరద ఉధృతికి ఆటోలు, ద్విచక్ర వాహనాలు, తోపుడు బండ్లు కొట్టుకు పోయాయి. నగరం నలుమూలలా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.ప్యాట్నీ నగర్లో వరదలో చిక్కుకున్న వారిని పడవల ద్వారా తరలిస్తున్న సహాయక సిబ్బందికంటోన్మెంట్, బోయిన్పల్లి ప్రాంతాల్లో అత్యధికంగా 11.5 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాల్లో 6 సెం.మీ పైగా వర్షం కురిసింది. ఉద్యోగాలకు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లిన వారు నరకయాతన పడ్డారు. రోడ్లపై మోకాలిలోతు నీళ్లు ప్రవహిస్తుండటంతో మెట్రో స్టేషన్లు, ఫ్లైఓవర్ల కింద, పెట్రోల్ బంకులు వద్ద గంటల కొద్దీ తలదాచుకున్నారు. ఎటు చూసినా వరదే.. హైదరాబాద్లోని మాదాపూర్ నెక్టార్ గార్డెన్ వద్ద, ఎల్బీనగర్, మలక్పేట, మూసారంబాగ్, చైతన్యపురి ప్రాంతాల్లో రోడ్లపై వరద వాగుల్ని తలపించింది. షేక్పేట్, ఖాజాగూడ, రాయదుర్గం, గచ్చి»ౌలి, కొండాపూర్, హఫీజ్ పేట్, మాదాపూర్, హైటెక్ సిటీ, మియాపూర్, ఏఎంబీ మాల్ వద్ద వర్షపు నీరు నిలిచిపోయింది. టోలిచౌకి నానల్ నగర్ జంక్షన్ వద్ద నాలా పొంగిపొర్లింది. పాతబస్తీలోని డబీర్పురా, శివగంగా నగర్, రాజన్న బావి, ఛత్రినాక చౌరస్తా, అచ్చయ్య నగర్, హనుమాన్ నగర్, అంబికా నగర్, పటేల్ నగర్ ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, చింతల్బస్తీ, ఖైరతాబాద్, సోమాజిగూడ, లక్డీకాపూల్, శ్రీనగర్ కాలనీ, శ్రీకష్ణానగర్, ఇందిరానగర్, ఫిలింనగర్, వెంకటగిరి, అమీర్పేట తదితర ప్రాంతాలన్నీ నీటమునిగాయి. ఫిలింనగర్లోని పలు బస్తీల్లో వరద నీరు ఇళ్లల్లోకి చేరింది. ఉప్పల్, రామాంతపూర్, అంబర్పేట, తార్నాక, మెట్టుగూడ తదితర ప్రాంతాల్లో వరద నీరు రోడ్లపై నిలిచి పోవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. ట్రాఫిక్ పద్మవ్యూహంలో నగరం రోడ్లపై వరద ప్రవాహంతో వాహనాలన్నీ ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుపోయాయి. అర కిలోమీటరు దూరం ప్రయాణించడానికి గంటల కొద్దీ సమయం పట్టింది. సాయంత్రం కార్యాలయాలు, కాలేజీలు, పాఠశాలల నుంచి ఇళ్లకు వెళ్లే టైమ్ కావడంతో ఎక్కడ చూసినా వాహనాల బారులు కిక్కిరిసిపోయి కని్పంచాయి. ప్రధానంగా ఐటీ కారిడార్ రాయదుర్గం, షేక్పేట్ మార్గంలో మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రాయదుర్గం, బయో డైవర్సిటీ, ఐకియా జంక్షన్, గచి్చ»ౌలి పీజేఆర్ ఫ్లైఓవర్పై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నాంపల్లి, మెహదీపట్నం, టోలిచౌకి మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హఫీజ్పేట్, ఆల్విన్ కాలనీ, చందానగర్ మార్గంలో కిలోమీటరు ప్రయాణానికి రెండు గంటలకు పైగా సమయం పట్టింది. అంబర్పేట పటేల్నగర్, ప్రేమ్నగర్, అలీకేఫ్ చౌరస్తాల్లో, బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కు నుంచి జూబ్లీహిల్స్ చౌరస్తా మాదాపూర్ వరకు ట్రాఫిక్ స్తంభించింది. అమీర్పేట, పంజగుట్ట, ఖైరతాబాద్, మాసబ్ట్యాంక్, ఎన్ఎఫ్సీఎల్ చౌరస్తా, విరించి ఆస్పత్రి చౌరస్తా, యూసుఫ్గూడ శ్రీకష్ణానగర్ రోడ్లలో ట్రాఫిక్ నిలిచిపోయింది. మూసారంబాగ్ బ్రిడ్జిని వరద ముంచెత్తింది. సహాయక కార్యక్రమాలు పర్యవేక్షించిన హైడ్రా కమిషనర్వరద ఉధృతికి సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని ప్యాట్నీనగర్ పూర్తిగా ముంపునకు గురైంది. పలు భవనాల సెల్లార్లలోకి వర్షపునీరు చేరింది. దీంతో నాలుగు పడవల ద్వారా అధికారులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. స్థానికులను, వివిధ కార్యాలయాల్లో ఉన్న ఉద్యోగులు సుమారు 80 మందిని బయటకు తీసుకొచ్చారు. ఫైరింజన్ ద్వారా వర్షపు నీటిని తోడారు. మొదటి. రెండవ అంతస్తులో నివాసం ఉంటున్న స్థానికులు ఇళ్లను విడిచి బయటకు వచ్చేందుకు నిరాకరించారు. కంటోన్మెంట్ ప్రాంతంలో సహాయ కార్యక్రమాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యవేక్షించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం... ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి సుమారు 270 ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అప్రమత్తమైన విద్యుత్ అధికారులు సిబ్బందిని రంగంలోకి దింపి దాదాపు 200 ఫీడర్ల పరిధిలో కేవలం ముప్పై నిమిషాల వ్యవధిలో సరఫరా పునరుద్ధరించినట్లు ట్రాన్స్కో సీఎండీ ముషారఫ్ ఫరూఖి తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగి పడడంతో సరఫరా పునరుద్ధరణకు కొంత అదనపు సమయం పట్టిందన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ, జలమండలి, హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు రంగంలోకి దిగి సహాయ కార్యక్రమాలు చేపట్టాయి. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షానికి ప్రధాన వాగులు, వంకలు పొంగిపొర్లాయి. మొయినాబాద్ మండలం నదీమ్నగర్ గ్రామంలో మైసమ్మ దేవాలయం వద్ద దాదాపు 200 ఏళ్ల వయసున్న వేప చెట్టు నేలకొరిగింది. -
స్టాక్ మార్కెట్లో యూత్!
ఒకప్పుడు.. ‘స్టాక్ మార్కెట్తో మాకేంటి సంబంధం?’ అని సామాన్యుడు అనుకునేవాడు. కానీ, ఇప్పుడు అదే స్టాక్ మార్కెట్లో సామాన్యులు కూడా పెట్టుబడులు పెడుతున్నారు. ముఖ్యంగా, కోవిడ్, ఆ తరువాత జరిగిన అనేక పరిణామాలు.. ఇలా ఇందుకు కారణాలు అనేకం. ఫలితంగా ఇప్పుడు ఇన్టెస్టర్ల సంఖ్యలో ఏటా కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. దేశ జనాభాలో సుమారు 11.5 కోట్ల మంది జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్లో పెట్టుబడులు పెట్టారు. వీరిలో 30 ఏళ్లలోపు వారు 39 శాతం కాగా.. మహిళలు సుమారు 25 శాతం కావడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లోనూ మదుపరులు.. ముఖ్యంగా మహిళల సంఖ్య భారీగా పెరిగింది.బిహార్.. దేశంలోనే అత్యల్ప తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రం. నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్ (ఎన్ఎస్ఈ) వేదికగా బిహార్ ఇన్వెస్టర్ల సంఖ్య అయిదేళ్లలో దేశంలోనే అత్యధికంగా 678 శాతం పెరిగింది. మదుపరుల సంఖ్య 7 లక్షల నుంచి 52 లక్షలకు దూసుకెళ్లింది. బిహార్లోనే ఇలా ఉంటే మరి ఇతర రాష్ట్రాల్లో? అవును.. ఇతర రాష్ట్రాల్లోనూ మదుపరులు గణనీయంగా పెరిగారు. ఎన్ఎస్ఈలో మదుపరుల సంఖ్య 2014–15లో 1,79,60,000. ఈ ఏడాది మే నాటికి అది ఏకంగా 11,49,42,000కు చేరింది. అంటే పదేళ్లలో 540 శాతం పెరుగుదల! 5–6 నెలలకే కొత్తగా కోటి మంది ఇన్వెస్టర్లు వచ్చి చేరుతున్నారంటే స్టాక్ మార్కెట్ పట్ల ఆసక్తి ఏ స్థాయిలో పెరుగుతోందో అర్థం చేసుకోవచ్చు.సులభమైన షేర్ల లావాదేవీలు!స్మార్ట్ ఫోన్ సామాన్యుడికి చేరువైంది. ఆన్లైన్ ఆర్థిక లావాదేవీలు సులువయ్యాయి. ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే భయపడే రోజుల నుంచి.. ప్రతిరోజూ వేలూ, లక్షల రూపాయలను రకరకాల మార్గాల్లో పంపే పరిస్థితులు వచ్చాయి. డిజిటల్ అక్షరాస్యత గణనీయంగా పెరిగింది. మరోపక్క.. దేశీయ స్టాక్ మార్కెట్ కూడా రోజురోజుకూ కొత్త శిఖరాలను అధిరోహిస్తూ మదుపరులను ఊరిస్తోంది. తక్కువ సమయంలో, సులభమైన ఆదాయ మార్గంగా స్టాక్ మార్కెట్ అందరి దృష్టినీ ఆకర్షించింది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలంటే ఒకప్పుడు దరఖాస్తు ప్రక్రియ చాలా సంక్లిష్టంగా ఉండేది.ఏ కంపెనీని ఎంచుకోవాలో సమాచారం తెలిసేది కాదు. ఇప్పుడు స్మార్ట్ఫోన్ ఉంటే చాలు! షేర్ల కదలిక కళ్ల ముందు కనపడుతోంది. సామాన్యులు సైతం అతి తక్కువగా.. అంటే రూ.100 పెట్టుబడితో స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టొచ్చు. పెట్టుబడి పెట్టడమే కాదు.. ఉపసంహరణ సైతం చాలా సులభం అయిపోయింది. ముఖ్యంగా రిటైల్ ట్రేడింగ్ను సులభతరం చేసే ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ఎన్నో వచ్చాయి. కోవిడ్ సమయంలో చాలామందికి ఇంటి దగ్గర ఉంటూ ఆదాయార్జన మార్గంగా స్టాక్ మార్కెట్ను ఎంపిక చేసుకున్నారు. ఇలాంటి అనేక అంశాలు స్టాక్ మార్కెట్లో పెట్టుబడిదారుల సంఖ్య పెరగడానికి కారణమయ్యాయి.పెరిగిన మహిళా శక్తి!..: స్టాక్ మార్కెట్లో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుండడం విశేషం. మహిళా ఇన్వెస్టర్ల వాటా 2022–23లో 22.5 శాతం కాగా ఈ ఏడాది మే నాటికి 24.4 శాతానికి చేరింది. గోవాలో అత్యధికంగా మహిళా పెట్టుబడిదారులు 32.6 శాతం ఉన్నారు. దేశంలో మొత్తం ఇన్వెస్టర్ల పరంగా మహిళా ఇన్వెస్టర్ల అత్యధికంగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. అక్కడ 28.4 శాతం ఉంటే , గుజరాత్లో 27.8 శాతం ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 23.4, తెలంగాణలో 24.9 శాతం మహిళలు ఉన్నారు.ఆ మూడు రాష్ట్రాలు..: ఒక కోటి మంది ఇన్వెస్టర్ల క్లబ్లో చేరిన మూడో రాష్ట్రంగా గుజరాత్ అవతరించింది. 1.86 కోట్లతో మహారాష్ట్ర, 1.31 కోట్లతో ఉత్తరప్రదేశ్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ప్రాంతాల వారీగా చూస్తే 4.2 కోట్లతో ఉత్తర భారత్ అగ్రస్థానంలో ఉంది. పశ్చిమ భారత్ 3.5 కోట్లు, దక్షిణాది 2.4 కోట్లు, తూర్పు భారత్లో 1.4 కోట్ల మంది ఇన్వెస్టర్లు ఉన్నారు. సంఖ్యా పరంగా ఏడాదిలో ఉత్తరాదిలో 24%, తూర్పు భారత్ 23%, దక్షిణాది 22%, పశ్చిమ భారత్లో 17% వృద్ధి నమోదైంది. మే నెలలో తోడైన కొత్త ఇన్వెస్టర్ల సంఖ్యలో దేశంలోని టాప్–10 జిల్లాల్లో రంగారెడ్డి (8), హైదరాబాద్ (10) చోటు దక్కించుకున్నాయి.దేశ వ్యాప్తంగా 11.5 కోట్ల మంది మదుపరులకు జూలై 14 నాటికి 22.87 కోట్లకుపైగా ట్రేడింగ్ అకౌంట్లు ఉన్నాయి. వీటిలో ఏపీ నుంచి 1.04 కోట్లకుపైగా ఉంటే, తెలంగాణలో 51.50 లక్షలకుపైగా ఉన్నాయి. -
రాయలసీమ ప్రాజెక్టును రద్దు చేయండి
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/సాక్షి, నాగర్కర్నూల్: ‘ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు విజ్ఞప్తి చేస్తున్నా.. పాలమూరు ప్రాజెక్టులను అడ్డుకోవద్దు. పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, డిండి, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులను పూర్తి చేసుకునేందుకు సహకరించండి. ఈ ప్రాజెక్టులను అడ్డుకోవడం న్యాయమా? ఒకనాడు పాలమూరు జిల్లాను దత్తత తీసుకున్నామని మీరు చెప్పారు. మీరు బాధ్యతగా ఉండి, మమ్మల్ని బతకనివ్వండి. మా ప్రాజెక్టులను పూర్తి చేసుకోనివ్వండి. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ శ్రీశైలం బ్యాక్వాటర్ నుంచి 4 టీఎంసీల నీరు తీసుకునేది..ఇప్పుడు 9.5 టీఎంసీల నీరు తీసుకెళ్లేందుకు ప్రాజెక్టులు పెట్టుకున్నరు. రోజుకు 3 టీఎంసీలు తీసుకునే రాయలసీమ ప్రాజెక్టును రద్దు చేసి ఉదారత చూపండి.రెండు తెలుగు రాష్ట్రాలను, తెలుగువారిని సమానంగా అభివృద్ధి చేయాలన్న మీ ఆలోచన నిజమైతే రాయలసీమ ప్రాజెక్టును రద్దు చేయండి. పాలమూరు ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు సహకరించండి. పాలమూరు బిడ్డలం మీ మేలు మర్చిపోం. మేం విజ్ఞప్తులు చేస్తాం. వినకపోతే ఎలా పోరాటం చేయాలో పాలమూరు బిడ్డలకు తెలుసు. పాలమూరు ప్రాజెక్టులను రెండున్నరేళ్లలో పూర్తిచేసేలా నేను బాధ్యత తీసుకుంటా..’ అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం జటప్రోలు గ్రామంలో రూ.200 కోట్లతో చేపట్టనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఇక్కడి మదనగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడారు. మేం అన్నం పెడితే.. నువ్ సున్నం పెట్టావు.. ‘పాలమూరు నుంచి 2009లో ఎంపీగా గెలిచిన కేసీఆర్ ఈ ప్రాంతానికి చేసింది, ఇచ్చింది ఏంటో చెప్పాలి. కరీంనగర్ నుంచి పారిపోయి పాలమూరుకు వలస వస్తే ఇక్కడి బిడ్డలు భుజాలపై పెట్టుకున్నారు. పదేళ్ల కాలం పాటు సీఎంగా ఉన్నా పాలమూరు ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదు? ఉమ్మడి రాష్ట్రంలో కన్నా కేసీఆర్ పాలనలోనే పాలమూరుకు అన్యాయం జరిగింది. పాలమూరు బిడ్డలు అన్నం పెడితే, కేసీఆర్ వారికి సున్నం పెట్టారు. పాలమూరు బిడ్డ సీఎం అయితే కేసీఆర్కు దు:ఖం వస్తోంది.2034 వరకు ఇంకో పదేళ్ల పాటు పాలమూరు బిడ్డనే ముఖ్యమంత్రిగా ఉంటారు. పదేళ్లుగా పెండింగ్లో ఉన్న పాలమూరు, కల్వకుర్తి, బీమా, కోయిల్సాగర్ ప్రాజెక్టులను పూర్తిచేసే బాధ్యత నేను తీసుకుంటా. డిసెంబర్ 9 కల్లా అన్ని ప్రాజెక్టుల భూసేకరణ పూర్తిచేసి, నిర్వాసితులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లిస్తాం. ఆయన అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్షంలో కూర్చుని మేము చేస్తున్న పనులు చూడాలి..’ అని రేవంత్రెడ్డి అన్నారు. రెండున్నరేళ్లలో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు ‘కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ రూ.లక్ష కోట్లు ఖర్చు చేశాడు. ఒకే ఒక్క ప్రాజెక్టు కోసం లక్ష కోట్లు పెట్టిన పరిస్థితి ఎక్కడా లేదు. ఎవరైనా గుడిసె కట్టుకున్నా పదేళ్లు ఉంటది. కానీ కాళేశ్వరం 2019లో కడితే 2023లో కూలింది. మూడేళ్లకే ప్రాజెక్టు కూలుతుందా? బీఆర్ఎస్ పాలనలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయలేదు. తన ఇంటినిండా మాత్రం కొలువులు నింపుకున్నాడు. మా ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోనే 60 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. రెండున్నరేళ్ల కాలంలో మొత్తం లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో మాదిగ ఉప కులాలకు న్యాయం జరిగేలా చూసే క్రమంలో నోటిఫికేషన్ల జారీ ఆలస్యం అవుతోంది. ఆరు నెలలు ఆలస్యమైనా వారికి న్యాయం జరుగుతుంది. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లు దేశానికే తలమానికంగా నిలువబోతున్నాయి..’ అని సీఎం చెప్పారు. మా పాలనలో మహిళలకు అందలం ‘కేసీఆర్ పాలనలో 2018 వరకు ఒక్క మహిళా మంత్రి కూడా లేరు. ఇలాంటి పరిస్థితి దేశంలో ఎక్కడా లేదు. ఆడవాళ్లు వంటింటికే పరిమితం కావాలన్న దుర్మార్గమైన ఆలోచన బీఆర్ఎస్ది. మా ప్రభుత్వం రాష్ట్రంలోని కోటిమంది మహిళలను కోటీశ్వరుల్ని చేసేలా పనిచేస్తోంది. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో బడిపంతుళ్ల హాజరు లెక్కలు చూసే అధికారం అక్కలకే ఇచ్చాం. పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులు, సోలార్ విద్యుత్ ప్లాంట్లు, ఇందిరా మహిళాశక్తి క్యాంటీన్ల ద్వారా మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నాం..’ అని ముఖ్యమంత్రి తెలిపారు.రాష్ట్రంలోని పేదల విద్య, ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యతేనని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. 2011లో వైఎస్సార్ మహిళలకు వడ్డీలేని రుణాలను అందించారని, బీఆర్ఎస్ పాలనలో ఈ రుణాలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తమ ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేపడుతోందని మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి చెప్పారు.పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ఒక్క మోటారు ఆన్చేసి కేసీఆర్ ఎన్నికల డ్రామా ఆడారని మండిపడ్డారు. కాగా స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలకు వడ్డీలేని రుణాల కింద రూ.344 కోట్లను సీఎం ఈ సందర్భంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీ దామోదర్రెడ్డి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేశ్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, యెన్నం శ్రీనివాస్రెడ్డి, మధుసూదన్రెడ్డి, అనిరుధ్రెడ్డి, పరి్ణకారెడ్డి, మేఘారెడ్డి, వీర్లపల్లి శంకర్, కలెక్టర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్నదని అనుమానం
జనగామ: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నాటి బీఆర్ఎస్ వారసత్వాన్ని స్వీకరించి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నదనే అనుమానం కలుగుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనగామలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆందోళన కలిగిస్తే, కాంగ్రెస్ సర్కారు కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు తెలుస్తోందని ఆరోపించారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఫోన్ను కూడా నాడు ట్యాప్ చేశారని, ఆయనెట్లా కేసీఆర్ను కాపాడుతారని ప్రశ్నించారు.కేసీఆర్ లాంటి చండాలమైన వ్యక్తిని తానెక్కడా చూడలేదన్నారు. భార్యాభర్తలు బెడ్రూంలో మాట్లాడుకునే మాటలను కూడా ట్యాప్ చేసి విన్న ఘనుడు కేసీఆర్ అని సంజయ్ దుయ్యబట్టారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో బీజేపీ స్టాండ్ వెరీ క్లియర్గా ఉందని, వందశాతం వర్తింపజేస్తే, కేంద్రాన్ని ఒప్పించి బిల్లును ఆమోదింపజేసే బాధ్యత తీసుకుంటామన్నారు.51 శాతం జనాభా ఉన్న బీసీలకు ఇప్పటికే మోదీ ప్రభుత్వం 27 శాతం రిజర్వేషన్లను అందిస్తోందని, మరి కాంగ్రెస్ ఒరగబెట్టిందేంటని నిలదీశారు. బీసీ జాబితాలో ముస్లింలను చేర్చితే ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు. బనకచర్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగనివ్వబోమని, అన్ని అంశాలపై కేంద్రం కమిటీ వేస్తున్నట్లు ప్రకటించిందని సంజయ్ చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచార కర్తలుగా బీజేపీ బ్రాండ్ అంబాసిడర్లు మాజీ సర్పంచులే ముందుండి పనిచేస్తారన్నారు. -
2028లో రప్పా రప్పా..!
ఖమ్మం జిల్లా: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం జిల్లా పర్యటనలో రప్పా రప్పా ఫ్లెక్సీలు వెలిశాయి. ఇటీవల మృతి చెందిన మాజీ వైరా ఎమ్మెల్యే మదన్ లాల్ కుటుంబాన్ని పరామర్శించేందుకు కేటీఆర్.. ఖమ్మం వెళ్లారు. ఈ క్రమంలోనే అక్కడ కేటీఆర్ ఫోటోతో ఉన్న ఫ్లెక్సీ ఒకటి వెలిసింది. 2028లో రప్పా రప్పా అంటూ ఉన్న ఓ ఫ్లెక్సీ.. బీఆర్ఎస్ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ‘ 3.o లోడింగ్. 2028లో రప్పా రప్పా. కాంగ్రెస్ నాయకులకు వడ్డీతో సహా చెల్లిస్తాం ’ అని ఫ్లెక్సీలో ముద్రించి ఉంది. ఇప్పుడు ఈ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. -
ఎవర్ని వదిలిపెట్టం.. కేటీఆర్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య జరిగిన కొట్లాటలో గాయపడిన 141వ డివిజన్ (గౌతమ్ నగర్) కార్పొరేటర్ సునీత భర్త రాము యాదవ్ను కేటీఆర్ శుక్రవారం పరామర్శించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 90 సీట్లు సాధించామని.. రెండో సారి కూడా తిరుగులేని విజయం సాధించామన్నారు.హైదరాబాద్లో ఒక్క సీటు కూడా రాలేదనే కారణంతో కాంగ్రెస్ గుండాగిరి రాజ్యం తెస్తోంది. మా ఎమ్మెల్యే, మా కార్పొరేటర్లు దేవుడి కార్యక్రమానికి చెక్కులు ఇచ్చే కార్యక్రమంలో గొడవ చేస్తారా? మీ అడ్డా అని వీర్రవీగుతున్నారా?. అధికారంలోకి వచ్చాక ఎవర్ని వదిలి పెట్టం’’ అంటూ కేటీఆర్ హెచ్చరించారు. గుండాల్లాగా రాజకీయం చేస్తూ బస్తీ మే సవాల్ అంటూ సవాల్ చేస్తున్నారు’’ అని కేటీఆర్ మండిపడ్డారు.మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి సిద్ధిపేటలో బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేసి పెట్రోల్ పోసి తగలబెడతామని బెదిరిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?. పోలీసులు కొంత మందికి తొత్తులుగా మారారు. మేము మిమ్మల్ని వదలం. మా కార్యకర్తలు తరలి వచ్చి మీ అంతు చూస్తాం. మా ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి రాలేదని ఇష్టానుసారంగా చేస్తున్నారు. మేము ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్లు చేయటం లేదు’’ అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
Heavy Rains: హైదరాబాద్ అతలాకుతలం.. భారీగా ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్: శుక్రవారం మధ్యాహ్నం నుంచి దంచి కొట్టిన భారీ వర్షం.. నగరాన్ని అతలాకుతలం చేసేసింది. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. దీంతో పలువురు వరద నీటిలో చిక్కుకున్నారు. కొత్తగూడ ఫ్లై ఓవర్పై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ను మళ్లిచారు. పలుచోట్ల ఫ్లై ఓవర్లు వాహనాలతో నిండిపోయాయి. భారీ వర్షం కారణంగా ఐటీ సెక్టార్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.నగరంలో రెండు గంటలపాటు వర్షానికి ఐటీ ఏరియా అతలాకుతలమైంది. గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, బయోడైవర్సిటీ, రాయదుర్గంలో భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. ఈ రాత్రికి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని.. యాద్రాది, భువనగిరి జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్కు ఆరెంజ్ అలర్ట్..హైదరాబాద్కు ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యంది. భారీ వర్షానికి సికిందరాబాద్లో ‘పైగా’ కాలనీ నీటమునిగింది. కాలనీలో ఉన్న ఇళ్లలోకి వరద నీరు భారీగా చేరింది. కొన్ని పరిశ్రమలు, షోరూమ్ ఉద్యోగులు వరద నీటిలో చిక్కుకున్నారు. అత్యధికంగా మారేడ్పల్లిలో 11.2 సెం.మీ వర్షపాతం నమోదైంది. బాలానగర్ 11, ఉప్పల్లో 10.5, మల్కాజ్గిరిలో 9.7, ఇబ్రహీంపట్నంలో 9.6, బండ్లగూడలో 9.5, ముషీరాబాద్లో 8.9, అంబర్పేట్లో 8.4, దుండిగల్ 8.3 సెం.మీ వర్షపాతం నమోదైంది.భారీ వర్షాలు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలువర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, వాటర్ వర్క్స్, విద్యుత్, పోలీస్ సిబ్బంది సమన్వయంతో పని చేయాలని రేవంత్ సూచించారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలు, ఇతర విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షంతో ఇబ్బందులు పడుతున్న ప్రాంతాల్లో ప్రజలు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. -
ఈగల్ టీమ్కు చిక్కిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, హెచ్ఆర్ మేనేజర్లు..!
హైదరాబాద్: డ్రగ్స్ రహిత తెలంగాణనే లక్ష్యంగా సర్కారు చేపట్టిన చర్యల్లో భాగంగా ఈరోజు(శుక్రవారం, జూలై 18) పలువురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చిక్కారు. నగరంలోని గచ్చిబౌలిలో ఈగల్ టీమ్ చేపట్డిన డకాయ్ ఆపరేషన్లో గంజాయిని కొనుగోలు చేస్తూ వీరు పట్టుబడ్డారు. ఇలా పట్టుబడిన వారిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో పాటు రియల్ ఎస్టెట్ వ్యాపారులు, డెంటల్ టెక్నీషియన్లు, విద్యార్థులు ఉన్నారు. రెండు గంటల పాటు ఈగల్ టీమ్ నిర్వహించిన డకాయ ఆపరేషన్లో 86 మంది వరకూ పట్టుబడ్డారు. మార్కెటింగ్ ఉద్యోగులు, హెచ్ఆర్ మేనేజర్లు సైతం ఈగల్ టీమ్కు చిక్కిన వారిలో ఉన్నారు. బాయ్ బచ్చా ఆగయా అంటూ వాట్సాప్ గ్రూప్ ద్వారా గంజాయి అమ్మకాలు జరుపుతున్నట్లు ఈగల్ టీమ్ అధికారులు గుర్తించారు. సరిహద్దుల నుంచి రాకుండా కట్టడి.. రాష్ట్ర పరిధిలో స్పెషల్ ఆపరేషన్లకే పరిమితం కాకుండా.. రాష్ట్రంలోకి డ్రగ్స్ సరఫరా అవుతున్న ప్రాంతాల్లోనూ డెకాయి ఆపరేషన్లు నిర్వహించడం, మాటు వేసి మత్తు ముఠాల గుట్టు కనిపెట్టడంలోనూ ఈగల్ బృందాలు విజయవంతమవుతున్నాయి. ఇటీవల ఇదే తరహాలో గోవా పబ్బుల్లో డీజేలుగా పనిచేస్తూ.. హైదరాబాద్కు కొకైన్ సప్లయ్ చేస్తున్న డీజే వనిష్ టక్కర్, సప్లయర్ బాలకృష్ణను ఇటీవల అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో నిందితులుగా ఉన్న డ్రగ్స్ సప్లయర్ల కాంటాక్ట్స్, కస్టమర్ల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా.. అధికారులు గోవాలో ఇటీవలే సోదాలు నిర్వహించడం తెలిసిందే.గోవాలో దాదాపు 50 మంది నైజీరియన్లు పనిచేస్తున్నట్టు పక్కా సమాచారం సేకరించిన తర్వాత.. డ్రగ్స్ కింగ్పిన్గా భావిస్తున్న మ్యాక్స్ నెట్వర్క్లోని హవాలా వ్యాపారులు ఉత్తమ్ సింగ్, రాజు సింగ్, మహేందర్ ప్రజాపతిలను అరెస్ట్ చేసి ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. వీరి నుంచి రూ.49.65 లక్షలు సీజ్ చేశారు. ఈ క్రమంలోనే ఓ నైజీరియన్ను అరెస్ట్ చేసి రూ.1.64 కోట్ల విలువైన డ్రగ్స్ను సీజ్ చేశారు. ఇలా అంతర్రాష్ట్ర ఆపరేషన్లలోనూ దూకుడుగా వెళ్తున్నారు. -
పాలమూరు అంటే కేసీఆర్కు చిన్నచూపు: సీఎం రేవంత్
సాక్షి, నాగర్ కర్నూల్: కృష్ణా జలాలు పొలాల్లో పారుతుంటే ఎందుకంత విషం చిమ్ముతున్నారంటూ రేవంత్రెడ్డి మండిపడ్డారు. పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ పాలమూరుకు ఎందుకు న్యాయం చేయలేదంటూ ప్రశ్నించారు. పాలమూరులో ప్రాజెక్టులకు డిసెంబర్లో భూములు సేకరిస్తాం. రెండేళ్లలో ప్రాజెక్ట్లు పూర్తి చేసి చూపిస్తాం’’ అని రేవంత్ అన్నారు.సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లాలో పర్యటించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెంట్లవెల్లి మండలం జటప్రోల్లో రూ.150 కోట్లతో 22 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ముందుగా గ్రామంలోని పురాతన మదనగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన, ఆ తర్వాత భారీ బహిరంగ సభ ప్రసంగించారు. సభలో ఇందిరా మహిళాశక్తి కింద స్వయం సహాయక బృందాల మహిళలకు వడ్డీలేని రుణాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా బహిరంగ సభలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘‘రెండేళ్లు కాలేదు అప్పుడే దిగిపో.. దిగిపో అంటున్నారు. పాలమూరు అంటే కేసీఆర్ కుటుంబానికి చిన్నచూపు. కరీంనగర్ నుంచి పారిపోయిన కేసీఆర్ ఆదరిస్తే సున్నం పెట్టారు. వాల్మికీలను ఎస్టీ జాబితాలో చేర్పిస్తామన్న కేసీఆర్ ఎందుకు చేయలేదు?. చెప్పులు కుట్టమని, గొర్రెలు పెంచమని చేపలు పట్టమని చెప్పారు. ఆయన బిడ్డలే రాజ్యాలు ఏలాలా? పాలమూరు బిడ్డలకు పదవులు వద్దా?. మాదిగ కులాల వర్గీకరణ చేసినందుకు కేసీఆర్కు కడుపుమంటగా ఉంది. 25 వేల కోట్లు ఖర్చు పెడితే పాలమూరు ప్రాజెక్ట్లు పూర్తయ్యేవి. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం మూడేళ్లలో కూలేశ్వరం అయ్యింది’’ అంటూ రేవంత్ విమర్శలు గుప్పించారు. -
జామపండు, మిరపకాయతో కాఫీ!
పుర్రెకో బుద్ధి... జిహ్వకో రుచి అని పాత సామెత. యువతరం.. కొత్త తరం విషయంలో ఇది మరింత సత్యం. అందుకే నగరాల్లో రకరకాల కాఫీలు ప్రత్యక్షమవుతున్నాయి. పాపులర్ అవుతున్నాయి కూడా. తాజాగా ఈ జాబితాలోకి చేరుతోంది ప్రఖ్యాత కంపెనీ టాటాకు చెందిన స్టార్బక్స్. విషయం ఏమిటంటే.. హైదరాబాద్లోని కాజాగూడ ప్రాంతంలో స్టార్బక్స్ దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి ‘ఎక్స్పెరిమెంటల్ స్టోర్’ను ప్రారంభించింది. ప్రపంచం నలుమూలల్లోని వేర్వేరు దేశాల కాఫీ రుచులను హైదరాబాదీలకు పరిచయం చేయడమే కాకుండా.. దేశీ వెరైటీలు కొన్నింటిని అందుబాటులోకి తెచ్చింది. మలబార్ కోకనట్ క్రీమ్ పేరుతో కాఫీలోకి కొబ్బరిపాల మీగడను చేర్చి అందిస్తుండగా .. మహారాష్ట ఎర్ర జామ పండ్ల ముక్కలకు, తమిళనాట పెరిగే కాంతారి మిరపకాయల రుచులను చేర్చింది. అలాగే తాటిబెల్లంతో తయారైన కాఫీని కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా అందిస్తున్నారు.‘‘కాఫీ గింజలు ఎక్కడైనా ఒక్కటే అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే ప్రాంతాన్ని బట్టి అక్కడి కాఫీ గింజల లక్షణాలు మారిపోతాయి. అక్కడి నీరు, మట్టిలోని ఖనిజాలు, వాతావరణాల ప్రభావంతో ఆ గింజలతో తయారైన కాఫీ రుచిలోనూ తేడాలొస్తాయి’’ అని వివరించారు స్టార్బక్స్ కాఫీ అంబాసిడర్ విభోర్ మిశ్రా. దీంతోపాటు డికాక్షన్ తయారు చేసే పద్ధతిని బట్టి కూడా రుచి మారుతూంటుందని తెలిపారు. కాఫీ గింజలు/పొడికి వేడి నీటిని కలిపి కాగితపు న్యాప్కిన్ ద్వారా ఫిల్టర్ చేస్తే కాఫీలోని నూనెలు తగ్గుతాయని, సాధారణ ఫిల్ట్రేషన్తో ఇలా జరగదని కూడా ఆయన వివరించారు. కాఫీతోపాటు స్టార్బక్స్ ఎక్స్పెరిమెంటల్ స్టోర్లో రెడ్వెల్వెట్, చాకొలెట్ ట్విస్ట్, ఇటాలియన్ వంటకం ‘క్రాసో’ వంటివి కూడా అందిస్తున్నారు. అప్పుడప్పుడు తాము కాఫీ తయారీకి సంబంధించిన వర్క్షాపులు కూడా నిర్వహిస్తూంటామని విభోర్ తెలిపారు. ‘‘కాఫీ అనగానే మన మనసుల్లో ఎన్నో జ్ఞాపకాలు మెదలుతాయి. నాకైతే స్టార్బక్స్ ఎక్స్పెరిమెంటల్ స్టోర్లో లభిస్తున్న దేశీ కాఫీ వెరైటీలకు, క్రాసో, చాకొలెట్ ట్విస్ట్, రెడ్వెల్వెట్ లకు మంచి లింకు కుదిరినట్లు అనిపిస్తుంది’’ అని వివరించారు పేస్ట్రీ షెఫ్, చాకొలటీర్ నికిత ఉమేశ్! ఇంకో విషయంలో ప్రపంచంలోని సుమారు 40 వేల ఔట్లెట్లలో మాదిరిగానే ఇక్కడ కూడా లాటే, డార్క్ రోస్ట్, బ్లాండ్ రోస్ట్ వంటివి ఇక్కడ కూడా లభిస్తాయి.! -
హైదరాబాద్లో మళ్లీ భారీ వర్షం
హైదరాబాద్: నగరంలో మళ్లీ భారీ వర్షం పడుతోంది. నిన్న(గురువారం, జూలై 17) సాయంత్రం సమయంలో హైదరాబాద్నలో భారీ వర్షం పడగా, ఈరోజు(శుక్రవారం, జూలై 18) కూడా పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో కీకారణ్యంగా మారిపోయిన మేఘాలు.. కాసేపటికి భారీ వర్షంతో నగరాన్ని తడిపేశాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయతనగర్లో కుండపోత వర్షం పడుతుండగా, ఉప్పల్, బోడుప్పల్, మేడిపల్లిలో సైతం భారీ వర్షం కురుస్తోంది. ఇక మెహదీపటం్నం, అత్తాపూర్, రాజేంద్రనగర్, గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటిలో కుండపోత వర్షం పడుతోంది. నాచారం, హబ్సిగూడ్, తార్నాక తదితర ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది. నగరంలో పలుచోట్ల భారీ వర్షం పడుతూ ఉండటంతో ట్రాఫిక్ సమస్యలు తప్పడం లేదు. బంజారాహిల్స్, పంజాగుట్టలోట్రాఫిక్ జామ్తో వాహనదారులు అవస్థులు పడుతున్నారు. -
సీఎం రేవంత్పై కేటీఆర్ సంచలన ఆరోపణలు
సాక్షి,ఖమ్మం: సీఎం రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ‘నీ సీఎం సీటుకు ఎసరు పెడతారని ఉత్తమ్,పొంగులేటి,భట్టి ఫోన్లు ట్యాప్ చేయడం లేదా?.దమ్ముంటే దీనికి రేవంత్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఖమ్మం పర్యటనలో భాగంగా శుక్రవారం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ నివాసంలో జరిగిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్.. రేవంత్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం రేవంత్రెడ్డికి సరిగా కేసులు కూడా పెట్టడం రాదు. మాపై దొంగ కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం,ఫోన్ ట్యాపింగ్,కారు రేసింగ్ అని తప్పులు పెడుతున్నారు. లీకులు తప్ప ఆయన పెద్దగా చేసేదేమీ లేదు. రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లాకు సీఎం రేవంత్ ఏం అభివృద్ధి చేశారు? 18 నెలల పాలనలో రాష్ట్రానికి ఏం అభివృద్ధి చేశారు. ఎప్పుడైనా,ఎక్కడికైనా చర్చకు సిద్ధం. కేసీఆర్ సీతారామ ప్రాజెక్ట్ కడితే రేవంత్ రిబ్బన్ కట్చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పొంగులేటికి కాంట్రాక్ట్లు వచ్చాయి.2014లో ఖమ్మం ఎలా ఉండేది. మా పాలనలో ఎంత అభివృద్ధి జరిగిందో మీకు తెలియదా?. ఖమ్మంను అభివృద్ధి చేసింది కేసీఆర్ కాదా? సీఎం రేవంత్ సీటుకు భట్టి విక్రమార్క,కోమటిరెడ్డి ఎసరుపెడుతున్నారు.అందుకే వారి ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు. దీనికి సీఎం రేవంత్ సమాధానం చెప్పాలంటూ కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపారు. -
బనకచర్ల గురించి చంద్రబాబు అతిగా మాట్లాడారు: సీపీఐ నారాయణ
సాక్షి, ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా బనకచర్ల ఎలా కడతారు? అని ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి ప్రశ్నించారాయన. శుక్రవారం సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. బనకచర్ల అనేది ప్రస్తుత ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్టు కాదు. మొదట పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయాలి. బనకచర్ల గురించి చంద్రబాబు అతిగా మాట్లాడారు. కాంట్రాక్టర్లు,రాష్ట్రం ,కేంద్రం కలిసి ప్రాజెక్టు కడతామని చెప్పారు. బనక చర్ల రూ.80 వేల కోట్ల ప్రాజెక్టు కాదు రూ.2 లక్షల కోట్ల ఖర్చు అవుతుంది. అసలు.. చంద్రబాబు బనకచర్ల గురించి మొదట తెలంగాణ ముఖ్యమంత్రితో మాట్లాడాల్సింది. అలా చేయకపోవడం వల్ల విమర్శలు వచ్చి తెలంగాణ ముఖ్యమంత్రి వ్యతిరేకించారు. ప్రాజెక్టులు ఎప్పుడైనా వివాద రహితంగా కట్టుకోవాలి. నదుల్లో రెండు రాష్ట్రాల నీటి వాటాలు తేలాకనే నీటి ప్రాజెక్టులపై ముందుకు వెళ్ళాలి. అంతేగానీ నీళ్ళను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం.. తల్లిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడంతో సమానమే. కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికి నీళ్లను అడ్డుకోవద్దు అని నారాయణ హితవు పలికారు. రేవంత్ గట్టొడుటీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తరువాత సెంటిమెంట్ ఎగిరిపోయింది. ఇప్పుడు సెంటిమెంట్లు లేవు. ప్రతి అంశంపై సెంటిమెంట్లతో రెచ్చగొట్టాలని చూస్తున్నారు. రేవంత్ తెలంగాణ సీఎం. ఆయన ఎన్నుకోబడిన నేత.. నామినేట్ చేయబడిన వ్యక్తి కాదు. తెలంగాణకి రేవంత్ అన్యాయం చేయలేదు. పొట్టివాడు గట్టి వాడు. అయితే.. రేవంత్ విమర్శిస్తూ రాజకీయాలు చేయడం మానుకోవాలి అని నారాయణ సూచించారు. -
సీఎం రేవంత్ పేరిట డీప్ఫేక్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
సాక్షి, హైదరాబాద్: రూ.21,000 పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు రూ.2 లక్షలు సంపాదిస్తారు. మీరు దీన్ని నమ్మి పెట్టుబడి పెట్టండి ’ అని సీఎం రేవంత్రెడ్డి చెబుతున్నట్టుగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఢిల్లీలో ఒక న్యూస్ చానల్కు రేవంత్రెడ్డి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోను వినియోగించి ఏఐతో ఒక డీప్ఫేక్ వీడియోను సృష్టించారు సైబర్ నేరగాళ్లు.రేవంత్ రెడ్డి క్వాంటం ఏఐ అనే వెబ్సైట్ను ప్రమోట్ చేస్తున్నట్లుగా కనిపించే నకిలీ ఏఐ–జనరేటెడ్ వీడియోను నమ్మవద్దని సీఎం కార్యాలయ అధికారులు సూచించారు. ఈ మేరకు గురువారం ఎక్స్లో ఒక పోస్టు పెట్టారు. ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ సైతం ఈ వీడియో డీప్ఫేక్ అని, దాని నమ్మి మోసపోవద్దని సూచించింది. రేవంత్ రెడ్డి ఎప్పుడూ అలాంటి ప్రకటన చేయలేదు. అసలు క్వాంటం ఏఐని భారత ప్రభుత్వం ప్రారంభించలేదని, ప్రముఖుల వీడియోలను నకిలీవి సృష్టించి మోసాలకు పాల్పడుతున్నట్టు తెలిపారు. ఇలాంటి వీడియోల నుంచి సురక్షితంగా ఉండాలని సూచించారు.ఇలా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని ఊదరగొట్టే ప్రకటనలు నమ్మవద్దని, అటువంటి వెబ్సైట్లలో వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ సమాచారాన్ని ఎప్పుడూ షేర్ చేయవద్దని సూచించారు. ప్రభుత్వం పెట్టే ఏవైనా ఆర్థిక పథకాలను గురించి ధృవీకరించడానికి అధికారిక ప్రభుత్వ వెబ్సైట్లను మాత్రమే ఉపయోగించాలని పేర్కొన్నారు. ఇలాంటి మోసాలను గుర్తిస్తే వెంటనే http://cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. -
పేదలు కాదు.. పెద్దలు కూడా హైడ్రా టార్గెట్: రంగనాథ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అక్రమ నిర్మాణాల తొలగింపు, చెరువుల రక్షణ, ప్రభుత్వ స్థలాలను కాపాడటమే లక్ష్యంగా హైడ్రా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో నేడు హైడ్రా ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా అంబర్ పేట బతుకమ్మ కుంట వద్ద స్కూల్ స్టూడెంట్స్ మానవహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ..‘చెరువులను కాపాడాలనే ఉద్దేశ్యంతో మొదట్లో మేము చాలా అగ్రసీవ్ గా వెళ్ళాం. అలా చేయడంతో చెరువుల ఆక్రమణలు తగ్గాయి. భావితరాలకు భవిష్యత్తు ఇవ్వడం కోసం హైడ్రా పని చేస్తుంది. సీఎం ఆదేశాలతో సామజిక కోణంలో చూసి పేదల ఇళ్లు కూల్చడం లేదు. కబ్జాలు చేసిన వారే హైడ్రాపై విమర్శలు చేస్తున్నారు. సెప్టెంబర్ 21న బతుకమ్మ కుంటను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. హైడ్రా అంటే డెమాలిషన్ కాదు డెవలప్మెంట్. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన బతుకమ్మ కుంట ఒక షాంపిల్ మాత్రమే. త్వరగా ఎన్నో బతుకమ్మ కుంటలు వెలుగు లోకి వస్తాయి.గత ఏడాది జూలై 19న హైడ్రా ఏర్పడింది. డిజాస్టర్ మేనేజ్మెంట్పై ప్రత్యేక దృష్టి పెట్టం. ప్రభుత్వ స్థలాలు కాపాడటంపై ప్రత్యేక దృష్టి సారించాం. చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు.. దాదాపు 500 ఎకరాల భూమి కాపాడాం. వాటి విలువ 30వేల కోట్లకు పైనే ఉంటుంది. బతుకమ్మ కుంటను వెలుగులోకి తెచ్చాము. ప్రజల సహకారంతో ప్రభుత్వ, ప్రజల ఆస్తులు కాపాడే ప్రయత్నం చేశాం. హైడ్రా అంటే కేవలం కూచివేతలు కాదు. రాబోయే రోజుల్లో మరింత పటిష్టంగా హైడ్రా పనిచేస్తుంది. పేద వారి మీద కాదు మా ప్రతాపం.. పెద్ద వారిపై కూడా హైడ్రా సమానంగా పని చేస్తుంది. హైడ్రాపై అనేక విమర్శలు చేశారు. సామాజిక కోణంలో హైడ్రా పని చేస్తుంది..సల్కాం చెరువుపై ఇంకా ఫైనల్ నోటిఫికేషన్ అవ్వలేదు. ఒవైసీ ఫాతిమా కాలేజీపై సామాజిక కోణంతో ముందుకు వెళ్తున్నాం. 140 చెరువుల ఫైనల్ నోటిఫికేషన్ ఉంది. మిగతా చెరువుల బౌండరీతో పాటు ఫైనల్ నోటిఫికేషన్ రాలేదు. ఫైనల్ నోటిఫికేషన్ వచ్చాక మిగతా FTL, బఫర్లో వచ్చిన అక్రమ నిర్మాణాలపై ఫోకస్ చేస్తాం. ఈ ఏడాది సెప్టెంబర్ 21న ముఖ్యమంత్రి చేతుల మీదగా బతుకమ్మ కుంట లో బతుకమ్మ సెలబ్రేషన్స్ జరుగుతాయి. బతుకమ్మ కుంట పునరుద్దరణ చేయడం మా పనికి నిదర్శనం అని చెప్పుకొచ్చారు. -
HYD: ట్యాక్స్ ఎగ్గొట్టే యత్నం.. పట్టించిన ఏఐ
స్థిరాస్తి విక్రయాలకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖకు చెల్లించాల్సిన లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ (ఎల్టీసీజీ) ట్యాక్స్ ఎగవేయాలని పథకం వేసిన హైదరాబాద్ వ్యాపారి కొన్ని నకిలీ బిల్లులు సృష్టించారు. రూ.21.6 లక్షలు చెల్లించాల్సిన చోట రూ.7200 చెల్లిస్తే చాలన్నట్లు తయారు చేశారు. ఓ బిల్లులోని ఫాంట్పై అనుమానం వచ్చిన ఐటీ అధికారులు ఏఐ టూల్ వినియోగించారు. ఈ నేపథ్యంలో ఆ బిల్లుపై ఉన్న తేదీ నాటికి మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో ఆ ఫాంట్ లేదని నివేదిక వచ్చింది. దీని ఆధారంగా ఐటీ అధికారులు సదరు వ్యాపారికి నోటీసులు ఇచ్చి ప్రశ్నించారు. గత్యంతరం పరిస్థితుల్లో సదరు వ్యాపారి రూ.21.6 లక్షలు చెల్లించి కేసు నుంచి బయటపడాల్సి వచ్చింది.హైదరాబాద్లోని ఆదాయపు పన్ను శాఖ కార్యాలయం కేంద్రంగా జరిగిన ఈ వ్యవహారం పూర్వాపరాలు ఇలా... ఆదాయపు పన్ను శాఖ నిబంధనల ప్రకారం ఎల్టీసీజీ ద్వారా వచ్చే లాభంలో 30 శాతం పన్నుగా చెల్లించాలి. అయితే ఈ మొత్తాన్ని మరో స్థిరాస్తి పైన లేదా దాని అభివృద్ధి కోసం వెచ్చిస్తే ఆ మొత్తానికి మినహాయింపు పొందవచ్చు. హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారి 2000కు ముందు రూ.68 లక్షలు వెచ్చించి శివార్లలో ఉన్న ఓ పాత ఇంటిని ఖరీదు చేశారు. దీనికి మరమ్మతులు చేసి అదనపు హంగులు చేర్చారు. దీంతో పాటు రియల్ ఎస్టేట్ బూమ్ కారణంగా రూ.1.4 కోట్లకు విక్రయించారు. ఇలా సదరు స్థిరాస్తి విక్రయం ద్వారా 2002లో రూ.72 లక్షలు లాభం పొందారు. దీనిపై క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్గా రూ.21.6 లక్షలు చెల్లించాల్సి ఉంది.అయితే 2002–08 మధ్య తనకు చెందిన మరో ఇంటి అభివృద్ధి కోసం రూ.71 లక్షలకు పైగా వెచ్చించినట్లు నకిలీ బిల్లులు సృష్టించారు. వీటిని ఆదాయపు పన్ను శాఖకు సమర్పిస్తూ చేస్తూ తనకు క్యాపిటల్ గెయిన్గా కేవలం రూ.24 వేలు మిగిలినట్లు చూపించారు. ఇందులో 30 శాతం యడం ద్వారా ఆ మేరకు మినహాయింపు పొంది మిగిలిన రూ.7200 చెల్లించారు. ఈ వ్యవహారాన్ని సందేహించిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు సదరు వ్యాపారికి నోటీసులు జారీ చేస్తుండగా దానికి ఆయన నుంచి సమాధానాలు వెళ్తున్నాయి. ఇలా దాదాపు 16 ఏళ్లుగా వీరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి.ఈ బిల్లుల్లోని లోటుపాట్లను గుర్తించడానికి ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఏఐ టూల్ వినియోగించారు. వ్యాపారి సమర్పించిన బిల్లుల్లో 2002 జూలై 6 తేదీతో రూ.7.6 లక్షలది కూడా ఉంది. దీన్ని విశ్లేషించిన ఏఐ టూల్ అందులోని ఫాంట్లో ఉన్న లోపాన్ని ఎత్తి చూపింది. ఆ బిల్లు మైక్రోసాఫ్ట్ ఆఫీస్లోని కాలిబ్రి అనే ఫాంట్తో ముద్రించి ఉంది. డిజిటల్ సాన్స్–సెరిఫ్ టైప్ ఫేస్ ఫాంట్ అని గుర్తించిన ఏఐ టూల్ మరికొన్ని కీలకాంశాలను బయటపెట్టింది.దీన్ని 2002–2004 మధ్య డచ్ డిజైనర్ లూకాస్ డి గ్రూట్ రూపొందించారని, 2006లో విండోస్ విస్టాతో ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారని తేల్చింది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో ఆ ఫాంట్ 2007 నుంచి మాత్రమే అందుబాటులోకి వచ్చినట్లు స్పష్టం చేసింది. వర్డ్లో టైమ్స్ న్యూ రోమన్ని, పవర్పాయింట్, ఎక్సెల్, ఔట్లుక్ల్లో ఏరియల్న ఫాంట్కి బదులు ఇది అందుబాటులోకి వచ్చినట్లు ఆ టూల్ నివేదించింది. కంప్యూటర్ ప్రపంచంలోకి 2006లో అందుబాటులోకి వచ్చిన ఫాంట్తో 2002లో బిల్లు ముద్రితం కావడం అసాధ్యమని స్పష్టం చేసింది. ఈ నివేదిక ఆధారంగా ఐటీ అధికారులు సదరు వ్యాపారికి మరోసారి నోటీసులు జారీ చేశారు. దీంతో గత్యంతరం లేక ఆ వ్యాపారి మొత్తం రూ.21.6 లక్షలు చెల్లించిన అధికారులకు క్షమాపణ చెప్పి వెళ్లారు.- శ్రీరంగం కామేష్ -
నీ గూడు చెదిరింది...
కొంగల గూళ్లు కూలిపోవడంతోపాటు వాటి పిల్లలు గాయాలతో మృత్యువాత పడ్డాయి. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగిన ఈ విషాదకర సంఘటన వివరాలివి. గోదావరిఖని అడ్డగుంటపల్లిలో రోడ్డు సమీపంలోని పెద్ద చింతచెట్టును బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నరికివేశారు. దీంతో చెట్టుకొమ్మలపై పొదిగిన కొంగపిల్లలతో సేదదీరుతున్న వందలాది కొంగల గూళ్లు చెదిరిపోయాయి. కొమ్మల కింద పడిన పిల్లలు పెద్దసంఖ్యలో చనిపోగా.. చాలావరకు గాయపడ్డాయి. గాయపడిన కొంగలు కొమ్మలపైనే గురువారం తెల్లవారేదాకా అరవడంపై పర్యావరణ, పక్షి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన కొంగపిల్లల ఖననం, తీవ్రంగా గాయపడిన వాటికి చికిత్స, గూడు చెదిరిన వాటిని మరోచోటికి తరలించడానికి రామగుండం నగరపాలక సంస్థ, అటవీ, పశువైద్యాధికారులు రంగంలోకి దిగారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సతీశ్, జిల్లా పశువైద్యాధికారి శంకర్తోపాటు వైద్యుడు పల్లె ప్రసాద్, సిబ్బంది చంద్రశేఖర్, హ్యాండ్స్ టూ సర్వ్ ఎన్జీవో వ్యవస్థాపకుడు దేవినేని అరవింద్స్వామి సేవలు అందించారు. కాగా, బతికిన కొంగలను కరీంనగర్లోని పార్క్కు తరలించారు. గాయపడిన కొంగల చికిత్సకు సుమారు రూ.8వేల వరకు తన సంస్థ ద్వారా వెచ్చించినట్లు అరవింద్స్వామి తెలిపారు. కాగా, చింతచెట్టు నరికివేతతో రామగుండం బల్దియాకు సంబంధం లేదని కమిషనర్ (ఎఫ్ఏసీ) అరుణశ్రీ స్పష్టం చేశారు. -
హైదరాబాద్లో బరితెగిస్తున్న బ్లడీ చీటర్స్
మానవత్వం మంటగలిసిపోతోంది.. అమూల్యమైన సేవలకు సైతం మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది.. కొందరి అమాయకత్వం, అవసరం.. ఇంకొందరికి వరంగా మారుతోంది.. సమాజం కోసం ఏదో చేయాలనే తపనతో ఓ వైపు యువత స్వచ్ఛందంగా రక్తం దానం చేసేందుకు ముందుకొస్తుంటే.. మరికొందరు బాధితుల అవసరాన్ని సైతం సొమ్ము చేసుకుంటున్నారు!!.ఇటీవలి కాలంలో రక్తదానంపై అవగాహన పెరగడంతో చాలా మట్టుకు ఆపద సమయాల్లో అవసరం తీరుతోంది. సరిగ్గా అదే అదునుగా కొందరు కేటుగాళ్లు బరితెగిస్తున్నారు. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణానికి ఆస్పత్రులకు వచ్చేవారిని టార్గెట్ చేస్తూ బాధితులకు టోకరా వేస్తున్నారు.. మానవత్వం ముసుగులో సమాజం సిగ్గుతో తలదించుకునే చర్యలకు పాల్పడుతున్నారు.. బ్లడీ చీటర్స్.. అంతేకాదు.. డబ్బు స్వాహా చేసేదే కాకుండా అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వివిధ ఆరోగ్య సమస్యలతో నగరంలోని గాంధీ, ఉస్మానియా, నిమ్స్తో పాటు జాతీయ స్థాయిలో పేరొందిన పలు కార్పొరేట్ ఆస్పత్రులకు అనేక మంది బాధితులు వస్తుంటారు. సరిగ్గా వీరినే ఆసరా చేసుకుని సరికొత్త మోసాలకు పాల్పడుతున్నారు కొందరు కేటుగాళ్ళు. సేవ పేరుతో సమాజం తలదించుకునే మోసానికి తెరతీస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమని సోషల్ మీడియాల్లో, ఇతర సామాజిక మాధ్యమాల్లో పెట్టే విజ్ఞప్తులను క్యాష్ చేసుకుంటున్నారు. ఆపదలో ఉన్న వారి ప్రాణాలతో ఆటలాడుతున్నారు.. అమూల్యమైన వారి సమయాన్ని ధనార్జన కోసం ఫణంగా పెడుతున్నారు.సమాచారమే.. వారి డేటా..అత్యవసర పరిస్థితుల్లో రక్తం కోసం కుటుంబసభ్యులు, మిత్రుల ద్వారా సామాజిక మాధ్యమైలన వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్ వంటి వాటిల్లో సహాయం కోరేవారి వివరాలే వారికి డేటాగా మారుతోంది.. అలాంటి సమాచారాన్ని సేకరించిన మోసగాళ్లు దాతల పేరుతో తక్షణమే బాధితులకు ఫోన్ చేస్తారు. ‘నాకు ఫలానా గ్రూపులో మెసేజ్ కనిపించింది. నేను రక్తం ఇవ్వడానికి సిద్ధం. కానీ నేను నగరానికి దూరంలో ఉన్నాను.. అయితే నా దగ్గర ప్రస్తుతం ట్రావెల్ చేయడానికి డబ్బులు లేవు.. మీరు ఏమీ అనుకోకుండా ఫోన్పేగానీ, గూగుల్పేగానీ చేస్తే వెంటనే వస్తాను.. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో రావాలంటే సమయం పడుతుంది.. మీరు అర్జెంట్ అంటున్నారు కావబట్టి క్యాబ్ చార్జీలు ఇస్తే చాలు’ అని చెబుతారు.. డబ్బులు వేశాక ఫోన్ స్విచ్ఆఫ్ చేసేస్తారు.. ఆపదలో ఉన్న బాధితులు ఎలాగో పోలీసు స్టేషన్కి వెళ్లే పరిస్థితి ఉండదు.. ఒక వేళ వెళ్లినా వెయ్యి, రెండు వేల కోసం ఫిర్యాదు ఏం చేస్తాంలే.. అనే ఆలోచనతో ఉంటారు.. మరీ ముఖ్యంగా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వేరే దాత కోసం వేటలో పడతారు.. రోజువారీ ఖర్చులకు.. బాధ్యతారాహిత్యంగా.. మానవీయ విలువలు లేని వారు.. పక్కవాడి బాధను అర్థం చేసుకోలేని వారే ఇలాంటి మోసాలకు పాల్పడరు.. మరీ ముఖ్యంగా రోజు వారీ ఖర్చుల కోసం కొందరు యువత ఇలా బాధ్యతా రాహిత్యంతో వ్యవహరిస్తున్నారని సైబర్ నిపుణులు చెబుతున్నారు.. ఇటీవలి కాలంలో ఈ తరహా మోసాలు పెరిగాయని, గేమింగ్, బెట్టింగ్, డేటింగ్ యాప్స్ ఖర్చుల కోసం అవగాహనా రాహిత్యంతో.. మేం చేసేది చిన్న మోసమేగా అనే అపోహతో.. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. అంతేకానీ తాము చేసే ఈ చిన్న తప్పిదం వల్ల సమాజానికి ఓ పెద్ద ప్రమాదం జరుగుతోందని, ఓ నిండు ప్రాణం బలైపోయే పరిస్థితి ఉందని, ఓ కుటుంబం రోడ్డున పడుతుందనిగానీ ఆలోచించలేని మైండ్ సెట్ ఉన్నవారు మాత్రమే ఈ తరహా మోసానికి పాల్పడతారని చెబుతున్నారు. వీరి వల్ల నిజంగా రక్తం ఇచ్చే దాతలకు కూడా చెడ్డపేరు వస్తుందని, చివరికి మంచి వారిపై కూడా నమ్మకం కోల్పోయే పరిస్థితి తలెత్తుతుందని ఆలోచించకుండా మనుషుల మధ్య విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారు.సైబర్ క్రైమ్ హెల్ప్లైన్..అవసరం, అమాకత్వం వంటివే మోసగాళ్లకు అనుకూలంగా మారే అంశాలు.. మరీ ముఖ్యంగా నగరంలో భాష సమస్య కూడా ఓ కారణమే. ఇలాంటి తరుణంలో మోసపోయామని గ్రహించిన బాధితులు సైబర్ క్రైమ్ సెల్కు వెంటనే ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఇలాంటి మోసాలపై సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 లేదా www.cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయవచ్చు. హైదరాబాద్ నగరం మరోసారి ‘గివింగ్ సిటీ’గా నిలవాలంటే.. ప్రజలతోపాటు, పోలీస్, హెల్త్ డిపార్ట్మెంట్, స్వచ్ఛంద సంస్థలు కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఏర్పడింది.:::సాక్షి, సిటీబ్యూరో -
ప్రాణం తీసిన ప్రేమ పంచాయితీ!
క్రైమ్: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలో పట్టపగలు యువకుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన కలకలం రేపింది. ప్రేమ వ్యవహారం కారణంగానే ఈ హత్య జరిగినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కిషన్రావుపేట గ్రామానికి చెందిన చల్లూరి మల్లేశ్ (30) కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన ఒక యువతితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు. ఈ విషయంలో యువతి బంధువులు అనేకసార్లు మల్లేశ్కు నచ్చజెప్పారు. రెండు కుటుంబాల మధ్య గొడవలు, కొట్లాటలు జరిగాయి. ఈ క్రమంలో మల్లేశ్ జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. అతనిపై రౌడీషీట్ కూడా నమోదైంది. అయినప్పటికీ మల్లేశ్ ప్రవర్తనలో మార్పు రాలేదు. మల్లేశ్ గతంలో హార్వెస్టర్ నడిపించగా.. ఈ గొడవల నేపథ్యంలో హార్వెస్టర్ అమ్మేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. గురువారం ఉదయం కూడా మల్లేశ్ సదరు యువతి ఇంటికి వెళ్లి గొడవ చేసినట్లు సమాచారం. యువతి తండ్రికి ఫోన్ చేసి దుర్భాషలాడినట్లు తెలిసింది. ఈ క్రమంలో యువతి బంధువులు విసిగిపోయారు. ఇంటి నుంచి ద్విచక్రవానంపై బయలుదేరిన యువకుడిని వెంబడించి వెల్గటూర్ మండల కేంద్రంలోని పెద్దవాగుపై విచక్షణారహితంగా కొట్టి ఆటోలో తీసుకెళ్లి కోటిలింగాల రోడ్డులోని పాత వైన్స్ వెనకాల కత్తులతో పొడిచి చంపినట్లు స్థానికులు చెబుతున్నారు. మృతుడి తల్లిదండ్రులకు నలుగురు కూతుళ్లుకాగా మల్లేశ్ ఒక్కడే కుమారుడు. -
45 ఏళ్ల తర్వాత.. మళ్లీతెరపైకి సరిహద్దు వివాదం!
స్తబ్దుగా ఉన్న తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. సరిహద్దు గ్రామాలు తమవేనని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయా పంచాయతీల్లోని కొన్ని గ్రామాల ప్రజలు ఈ ప్రకటనను వ్యతిరేకిస్తుండగా, మరికొందరు మాత్రం సానుకూలంగా స్పందిస్తున్నారు. ఆరు గ్రామాల ప్రజలు తెలంగాణలోనే కొనసాగుతామంటూ గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపి కలెక్టరేట్లో వినతిపత్రం సైతం సమర్పించారు. ముంబైలో ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వం కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జివితితోపాటు పలు సరిహద్దు గ్రామాలకు చెందిన 11 మంది నాయకులు ప్రజాప్రతినిధులను కలిశారు. సరిహద్దు గ్రామాల విషయంలో స్పష్టతనివ్వాలని కోరడంతోనే విలీన విషయం మళ్లీ తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది.అసలు వివాదం ఇదీ.. 1955–56లో ఫజల్ అలీ కమిషన్ ద్వారా రాష్ట్రాల సరిహద్దులను నిర్ధారించారు. ఈ క్రమంలో భాషా ప్రాతిపదికన ప్రస్తుతం ఉన్న వివాదాస్పద 14 గ్రామాలు మహారాష్ట్రలోకి వెళ్లాయి. 1978లో మరోసారి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సరిహద్దులు నిర్ణయించగా, భౌగోళిక పరిస్థితుల ఆధారంగా ఆర్టికల్–3 ద్వారా ఆయా గ్రామాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అదీనంలో ఉంటాయని ఒప్పందం కుదుర్చుకున్నాయి. ముకదంగూడ గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త రాందాస్ నర్వడే తెలిపిన వివరాల ప్రకారం.. 1980 నుంచి ఆంధ్రప్రదేశ్లో కొనసాగబోమని, మహారాష్ట్రలో విలీనం చేయాలని ఉద్యమం ప్రారంభమైంది. దీంతో 1983లో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ప్రజల సమస్యలు తెలుసుకుని కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. 1978లో చేసిన హద్దుల ప్రకారం గ్రామాలు ఏపీకి చెందినవేనని స్పష్టం చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రామాలు ఆంధ్రప్రదేశ్కు చెందుతాయని 1990 జూలై 7న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అక్కడ మలిదశ ఉద్యమం ప్రారంభమైంది. మరాఠీ మాట్లాడే వారు ఎక్కువగా ఉన్నారని, భాషా ప్రాతిపదికన విభజించాలని న్యాయవాది, రాజురా ఎమ్మెల్యే వామన్రావు చటప్ ప్రజలతో కలిసి ఆందోళన చేశారు. అసెంబ్లీలోనూ సమస్యను లేవనెత్తారు. వివాదాస్పద గ్రామాలు భాషాపరంగా తమకు చెందుతాయని ‘మహా’సర్కార్ 1993 ఆగస్టు 5న 1990 నాటి పాత ఉత్తర్వులను రద్దు చేసింది. దీనిపై 1996 ఏప్రిల్ 3న అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం హైకోర్టులో రిట్ పిటిషన్ను వేసింది. అక్కడి ప్రభుత్వం అదే ఏడాది ఏప్రిల్ 30న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ 10338/96 దాఖలు చేసింది. కేసు వెనక్కి తీసుకోవాలని సుప్రీంకోర్టు 1997 ఫిబ్రవరి 12న ఏపీకి ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిట్ పిటిషన్ను ఆగస్టు 21న బేషరతుగా వెనక్కి తీసుకుంది. అయితే ఆ ఉత్తర్వులపై స్థానిక ప్రజలు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందలేదు. దీంతో ఇరు రాష్ట్రాలూ తమ పాలనను కొనసాగిస్తున్నాయి. ఇరు ప్రభుత్వాలు నిర్వహిస్తున్న ఎన్నికల్లోనూ ప్రజలు ఓటు వేస్తున్నారు. 1965 నుంచి ఆయా గ్రామాలు మహారాష్ట్రలోని నోకేవాడ, పుడ్యాన్మోదా గ్రామ పంచాయతీలో ఉండగా, 1990లో మళ్లీ పరంధోళి, అంతాపూర్ గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసి గ్రామాలను విడదీసింది. అనంతరం ఆంధ్రప్రదేశ్ కూడా పరంధోళి, అంతాపూర్ గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది.ఇరు రాష్ట్రాల పాలన ప్రస్తుతం 14 గ్రామాలు ఇరు రాష్ట్రాల పాలనలో కొనసాగుతున్నాయి. ప్రజలకు రెండేసి రేషన్ కార్డులు, ఓటరు కార్డులు ఉన్నాయి. మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాల ఆధ్వర్యంలో పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. గతంలో పరంధోళి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనా నిర్మించలేదు. పట్టాల కోసం 40 ఏళ్లుగా ఎదురుచూస్తున్నా సమస్యకు పరిష్కారం లభించలేదు. గ్రామాలను అనుసంధానిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం రవాణా సౌకర్యం కల్పించింది. ఇరవై శాతం గిరిజనులకు తెలంగాణ ప్రభుత్వం అటవీ హక్కు పత్రాలు అందించింది. డెబ్భైయ్ శాతం ఉన్న ఎస్సీలు, 10 శాతం ఉన్న బీసీలకు హక్కులు కల్పించకపోవడంతో.. వారిలో చాలామంది మహారాష్ట్రలో కలుస్తామని చెబుతున్నారు.రెండు రాష్ట్రాల రేషన్ కార్డులు చూపిస్తున్న మహిళలుపట్టాలిస్తేనే.. నలభయ్యేళ్లుగా సాగు చేస్తున్నా నేటికీ భూములకు పట్టాలు లేవు. ఇరు ప్రభుత్వాలు కూడా స్పందించకపోవడంతో సంక్షేమ పథకాలు అందడం లేదు. ప్రజలు పేదరికంలో బతుకుతున్నారు. ఏ ప్రభుత్వం సాగు భూములకు పట్టాలిస్తే ఆ రాష్ట్రంలో కొనసాగుతాం. :::కాంబ్డె లక్ష్మణ్, మాజీ సర్పంచ్, పరంధోళి‘మహా’సర్కారు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం మహారాష్ట్ర సర్కారు 14 గ్రామాలు తమవే అని ప్రకటించిన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. అన్నివర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుంది. మరాఠీ మాట్లాడే మేమంతా భాషా ప్రాతిపదికన మహారాష్ట్రలోనే ఉంటా మని 1980 నుంచి పోరాటం చేస్తున్నాం. గ్రామాలు మహారాష్ట్రకు చెందినవని 1997లోనే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. :::రాందాస్ రన్వీర్, సామాజిక కార్యకర్త, ముకదంగూడతెలంగాణ రాష్ట్రంలోనే ఉంటాం తెలంగాణ ప్రభుత్వం గిరిజనులకు ఎన్నో పథకాలు అమలు చేస్తోంది. అటవీ భూములకు హక్కు పత్రాలు ఇచి్చంది. త్వరలో ఇందిరమ్మ ఇళ్లు కూడా అందనున్నాయి. తాగునీరు, సాగునీరు తదితర సౌకర్యాలు కలి్పస్తోంది. మా గ్రామాల ప్రజలు తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటాం. :::హడ్సె బాజీరావు, ఇంద్రానగర్ :::కెరమెరి (ఆసిఫాబాద్), సాక్షి ప్రతినిధి -
హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: నగర శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని కారు ఢీ కొన్న ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. నలుగురు ప్రమాద స్థలంలోనే మరణించగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పెద్దఅంబర్పేట నుంచి బొంగ్లూరు వెళ్తుండగా ఆదిభట్ల ఓఆర్ఆర్పై ఈ ఘటన చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని వేగంగా దూసుకొచ్చిన కారు ఢీ కొట్టడంతోనే ఘోరం చోటు చేసుకుంది. ఘటన తర్వాత సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు.. కారు నుంచి మద్యం బాటిల్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే మృతుల వివరాలు, ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పోలీసులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. -
రేవంత్వి చెత్త వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: బనకచర్ల విషయంలో ఢిల్లీ సమావేశంలో తన నిజ స్వరూపాన్ని బట్టబయలు చేసిన సీఎం రేవంత్రెడ్డి, తన చీకటి బాగోతాన్ని కప్పి పుచ్చుకునేందుకు కేటీఆర్పై చెత్త వ్యాఖ్యలు చేస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి పక్కన ఉన్న వారంతా గార్బేజ్ (చెత్త) బ్యాచేనని, కాలుష్యం అధికంగా ఉండే ఢిల్లీలో రేవంత్రెడ్డి చెత్త వ్యాఖ్యలతో అది మరింత పెరిగిందని ఎద్దేవా చేశారు. గురువారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో చిట్చాట్ చేశారు. బనకచర్లపై అబద్ధాలు చెబుతున్నారు.. ‘బనకచర్ల ప్రాజెక్టు ఢిల్లీ భేటీ ఎజెండాలో ఉందని ఏపీ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు చెపుతుంటే, రేవంత్రెడ్డి అసలు చర్చకే రాలేదని అంటున్నారు. కేంద్ర జలశక్తి నిర్వహించిన సమావేశంలో బనకచర్లపై చర్చ జరిగినట్లు ఏపీలోని అన్ని పేపర్లలో వచి్చంది. లైయింగ్ సిండ్రోమ్ అనే వ్యాధితో రేవంత్రెడ్డి బాధ పడుతున్నాడు. అందుకే అబద్ధాలు చెపుతున్నాడు. కేటీఆర్ మీలా బ్యాగ్లు మోయలేదు.. మేము బనకచర్ల గురించి మాట్లాడుతుంటే ఆయన డ్రగ్స్, గంజాయి అంటూ మోకాళ్లకు, బోడి గుండుకు ముడి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్రెడ్డిలా కేటీఆర్ బ్యాగ్లు మోయలేదు. ఆయన చుట్టూ ఉన్నవారు కూడా బ్యాగులు మోసేవారే. పరిపాలన అంటే బ్యాగ్లు మోసుడు కాదని రేవంత్రెడ్డి గుర్తుంచుకోవాలి. కేటీఆర్ను లోకేశ్ అర్ధరాత్రి పూట కలిశాడని అంటున్నాడు. రాష్ట్రంలో అర్ధరాత్రి పూట గోడలు దూకే అలవాటు రేవంత్రెడ్డికే ఉంది. ఎవడో దుబాయ్లో చనిపోతే కేటీఆర్కు ఏం సంబంధం? కేటీఆర్పై చేసిన ఆరోపణలకు రుజువులు ఉంటే చూపించాలి. లేదంటే కేటీఆర్కు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి..’అని హరీశ్రావు డిమాండ్ చేశారు. శాంతిభద్రతలు పూర్తిగా విఫలం ‘కాంగ్రెస్ పార్టీ పాలనలో మలేరియా, డెంగ్యూ వంటి రోగాలతో గురుకుల పాఠశాలల విద్యార్థులు ఆస్పత్రుల్లో ఉంటున్నారు. మరోవైపు గ్రామాల్లో పాలన పడకేసింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయి. మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఇంటిపై, నా క్యాంపు కార్యాలయంపై, పాడి కౌశిక్రెడ్డి ఇంటిపై, సునీత లక్ష్మారెడ్డిపై, మర్రి రాజశేఖర్రెడ్డిపై దాడికి దిగుతున్నారు..’అని మాజీమంత్రి చెప్పారు. మా ఫోన్లతో పాటు విలేకరులవీ ట్యాప్ చేస్తున్నారు.. ‘రేవంత్రెడ్డికి కేంద్రమంత్రి కిషన్రెడ్డి అండగా ఉంటున్నాడు కాబట్టే ఈడీ ఆయన్ను అరెస్టు చేయడం లేదు. మాపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు. ఇంటెలిజెన్స్ వ్యవస్థతో నిఘా పెట్టినా మాకేం కాదు. రేవంత్రెడ్డి బీఆర్ఎస్ నాయకుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నాడు. విలేకరుల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయి..’అని హరీశ్రావు ఆరోపించారు. -
నేడు నాగర్కర్నూల్ జిల్లాలో సీఎం పర్యటన
సాక్షి, నాగర్కర్నూల్: ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో ని పెంట్లవెల్లి మండలం జటప్రోల్లో రూ.150 కోట్లతో 22 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. సీఎం హెలీకాప్టర్లో హైదరాబాద్ నుంచి బయలుదేరి.. జటప్రోల్ చేరుకుంటారు. ముందుగా గ్రామంలోని పురాతన మదనగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన, ఆ తర్వాత భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. సభలో ఇందిరా మహిళాశక్తి కింద స్వయం సహాయక బృందాల మహిళలకు వడ్డీలేని రుణాలను పంపిణీ చేయనున్నారు. -
సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు ఆమోదం తెలపండి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో సెమీకండక్లర్ ప్రాజెక్టులకు త్వరితగతిన ఆమోదం తెలపాలని కేంద్ర ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్కు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నూతన ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణం, ప్రపంచ స్థాయి పరిశోధన, అభివద్ధి కేంద్రాలు తెలంగాణలో ఉన్నాయని తెలిపారు. అందువల్ల ప్రతిపాదిత అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజీ టెక్నాలజీస్ (ఏఎస్ఐపీ) ప్రాజెక్టు, మైక్రో ఎల్ఈడీ డిస్ప్లే ఫ్యాబ్ ప్రాజెక్టు క్రిస్టల్ మ్యాట్రిక్స్కు ఆమోదం తెలపాలని కోరారు.రెండురోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఢిల్లీ వచ్చిన సీఎం..గురువారం రైల్ భవన్లో అశ్వినీ వైష్ణవ్తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో హైటెక్ ఎల్రక్టానిక్స్ పార్క్ ఏర్పాటుకు ఈఎంసీ 2.0 పథకం కింద తెలంగాణ ఇచ్చిన వినతిని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రీజినల్ రింగు రోడ్డు సమీపంలో నూతన ఎల్రక్టానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ పార్క్ ఏర్పాటు చేయాలని కోరారు. రీజినల్ రింగు రైలుకు అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు. సీఎం వినతులపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. హైదరాబాద్ డ్రైపోర్టు–బందరు లైన్ మంజూరు చేయండి రాష్ట్రంలో రైల్వే అనుసంధానత పెంపు కోసం నూతన ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని అశ్వినీ వైష్ణవ్ను ముఖ్యమంత్రి కోరారు. హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డుకు సమాంతరంగా రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్టును ప్రతిపాదించామని..ఇందుకు రైల్వే బోర్డు ఇప్పటికే ఫైనల్ లొకేషన్ సర్వేకు అనుమతి ఇచ్చిందని తెలిపారు. రూ.8 వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టుకు త్వరగా అనుమతులు ఇవ్వాలని కోరారు. ‘రీజినల్ రింగ్ రైలుతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అనుసంధానత పెరగడంతో పాటు హైదరాబాద్ నగరంలోని ప్రధాన స్టేషన్లలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది..’అని చెప్పారు. హైదరాబాద్ డ్రైపోర్టు నుంచి బందరు ఓడ రేవుకు అనుసంధానంగా రైలుమార్గం మంజూరు చేయాలని కోరా రు. ఔషధాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫుడ్ ప్రాసెసింగ్ ఉ త్పత్తుల ఎగుమతులకు ఈ మార్గం దోహదపడుతుందన్నారు. కొత్త రైలు మార్గాలు మంజూరు చేయండి ఖాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు అంశాన్ని సీఎం రేవంత్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రంలో రైల్వే ఆపరేషన్లను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఖాజీపేట రైల్వే డివిజన్ అవసరమని తెలిపారు. ప్రయాణికులకు భద్రత, వేగవంతమైన సేవల కోసం దీనిని ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా తెలంగాణలో వివిధ ప్రాంతాల అనుసంధానత, పారిశ్రామిక, వ్యవసాయక ఎగుమతులు, దిగుమతుల కోసం.. వెనుకబడిన ప్రాంతాల అభివద్ధికి నూతన రైలు మార్గాలు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.వికారాబాద్–కృష్ణా (122 కి.మీ.–అంచనా వ్యయం రూ.2,677 కోట్లు) కల్వకుర్తి–మాచర్ల (100 కి.మీ.–అంచనా వ్యయం రూ.2 వేల కోట్లు), డోర్నకల్–గద్వాల (296 కి.మీ.–అంచనా వ్యయం రూ.6,512 కోట్లు), డోర్నకల్–మిర్యాలగూడ (97 కి.మీ.–అంచనా వ్యయం 2,184 కోట్లు) మార్గాలను వంద శాతం రైల్వే శాఖ వ్యయంతో మంజూరు చేయాలని కోరారు. రాష్ట్ర మంత్రులు శ్రీధర్బాబు, ఉత్తమ్కుమార్ రెడ్డి, ఎంపీలు పోరిక బలరాం నాయక్, చామల కిరణ్కుమార్ రెడ్డి, కుందూరు రఘువీర్ రెడ్డి, రామసహాయం రఘురాంరెడ్డి, సురేశ్ షెట్కార్, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్కుమార్, ఆర్ అండ్ బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, కేంద్ర ప్రభుత్వ పథకాల సమన్వయ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. -
చంద్రబాబు స్క్రిప్టు.. రేవంత్ చిలక పలుకు
సిరిసిల్ల: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి తొత్తుగా మారారని, తెలంగాణ ప్రయోజనాలను గురుదక్షిణగా తాకట్టు పెట్టేందుకు చూస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు విమర్శించారు. ఇక్కడ మాట్లాడుతున్న చిలుక రేవంత్రెడ్డి అయితే పలుకులు మాత్రం చంద్రబాబువని మండిపడ్డారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో గురువారం బీఆర్ఎస్ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.ఆరు దశాబ్దాలుగా జరిగిన జలదోపిడీ ఒక ఎత్తయితే సీఎం రేవంత్రెడ్డి కోవర్టుగా మారి ఢిల్లీలో బుధవారం తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టడం ఒక ఎత్తు అని ధ్వజమెత్తారు. బనకచర్ల ప్రాజెక్టు గురించి చర్చ పెడితే సమావేశానికే వెళ్లను అని చెప్పిన రేవంత్రెడ్డి.. ఎలా మీటింగ్కు పోయారని ప్రశ్నించారు. అసలు ఆదిత్యనాథ్ను సాగునీటి సలహాదారుగా పెట్టుకోవడమే పెద్ద తప్పు అన్నారు. కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వొద్దని అడ్డుకున్నదే చంద్రబాబు నాయుడు అని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ రైతుల హక్కులను కాపాడడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నారని స్పష్టం చేశారు. బనకచర్లపై కాంగ్రెస్ ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే మరోసారి ఉద్యమానికి బీఆర్ఎస్ సిద్ధమవుతుందని హెచ్చరించారు. చంద్రబాబు కనుసన్నల్లో కేంద్రం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చంద్రబాబు కనుసన్నల్లో నడుస్తోందని, తెలంగాణ జలవనరులను దోపిడీ చేయాలని చూస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఎలాంటి అనుమతులు లేకుండానే బనకచర్ల ప్రాజెక్టు కట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్రెడ్డికి తెలిసిందల్లా రియల్ ఎస్టేట్ వ్యాపారమేనని ఎద్దేవా చేశారు. రాయలసీమ, ఆంధ్రా కూడా బాగుండాలని.. అదే సమయంలో తెలంగాణ నీటి వాటా తేలాలని కేసీఆర్ కోరుకున్నట్లు చెప్పారు. తమకు ఆంధ్రా ప్రజలతో గొడవ లేదని స్పష్టంచేశారు. వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని. కన్నెపల్లిలో మోటార్లను ఆన్ చేస్తే తెలంగాణలో కరువు ఛాయలు ఉండవని అన్నారు. డ్రగ్స్ కేసులో ఆధారాలు చూపాలి సీఎం రేవంత్రెడ్డి మీడియా చిట్చాట్ పేరుతో తనపై విషం చిమ్ముతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం కార్యాలయానికి గౌరవం ఇచ్చి ఇప్పటి వరకు సంయమనం పాటించానని, ఇకపై ఊరుకోబోనని స్పష్టంచేశారు. డ్రగ్స్ కేసులో తనపై విచారణ జరుగుతుందని రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆధారం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘హైదరాబాద్లో నాతో ముఖాముఖి చర్చకు వచ్చే దమ్ము లేక ఢిల్లీకి వెళ్లి మరీ రేవంత్రెడ్డి నాపై బురద జల్లుతున్నారు. న్యాయస్థానాల పరిధి నుంచి తప్పించుకోవడానికే చిట్చాట్ల పేరుతో దొంగచాటు మాటలు మాట్లాడుతున్నారు. పిరికి దద్దమ్మలా చిట్చాట్ల పేరుతో నా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. ఇకపై వీటిని సహించేది లేదు. సీఎం చేసిన నిరాధార ఆరోపణలకు క్షమాపణ చెప్పాలి. డిమాండ్ చేశారు. లేదంటే పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’అని హెచ్చరించారు. -
ఏపీతో చర్చించొద్దా?
సాక్షి, న్యూఢిల్లీ: ‘నదీ జలాల విషయంలో భారత్–పాకిస్తాన్ మధ్యే చర్చలు జరుగుతున్నాయి. నీటి పంపకాలపై రెండు దేశాలు మాట్లాడుకుంటున్నాయి. అలాంటప్పుడు కృష్ణా, గోదావరి నదీ జలాలకు సంబంధించిన అంశాలపై పొరుగు రాష్ట్రంతో మేం చర్చిస్తే తప్పేంటి. నదీ జలాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో చర్చలే వద్దన్న తరహాలో బీఆర్ఎస్ మాట్లాడటం విడ్డూరంగా ఉంది. 2015–16లో చంద్రబాబునాయుడుతో చర్చలకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ వెళ్లలేదా? ఇప్పుడు మేము వెళితేనే నొప్పొచ్చిందా?. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు కొనసాగాలి. మేము రాజకీయంగా బతకాలన్నది వారి కోరిక. అందుకే మా భేటీపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. కేంద్రంతో కలిసి పనిచేసేందుకు కూడా మాకెలాంటి అభ్యంతరం లేదు.నేనెవరికీ భయపడను. కేవలం సిస్టమ్కు మాత్రమే భయపడే వ్యక్తిని. నా ప్రాధాన్యత రాష్ట్రం. సమస్య ఉంటే చర్చలతో పరిష్కరించుకుంటా. కొట్లాట నా చివరి అస్త్రం. ఇదే ధోరణిలో కేంద్రంతో పాటు పక్క రాష్ట్రం ఏపీతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాం. కొట్లాడుకుంటూ పోతే పాలకులకు కాదు, ప్రజలకు నష్టం..’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. నదీ జలాల అంశంపై కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించిన భేటీలో పాల్గొనేందుకు ఢిల్లీ వచి్చన సీఎం గురువారం తన అధికారిక నివాసంలో మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. పలు అంశాలపై వివరంగా మాట్లాడారు. బీఆర్ఎస్పై విమర్శనా్రస్తాలు సంధించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థి మాత్రమే.. కేంద్ర జలశక్తి మంత్రి వద్ద సమావేశంలో బనకచర్లపై చర్చ జరగలేదు. జలశక్తి శాఖ తన ప్రకటనలో కూడా అదే చెప్పింది. ఆ భేటీ భవిష్యత్ కార్యాచరణకు రోడ్మ్యాప్ వంటిది. మేం పూర్తిగా కేంద్రానికి సహకరిస్తాం. వారి సహకారం తీసుకుంటాం. కలిసి పనిచేస్తాం. నిధులైనా, అనుమతులైనా అడగకపోతే ఎవరూ ఇవ్వరు. కాబట్టి అడిగి తీసుకుంటాం. కేంద్రం పిలిస్తే మీరెందుకు వెళ్తారని బీఆర్ఎస్ నేతలు ప్రశి్నస్తున్నారు. కేంద్ర పిలిస్తే ఢిల్లీకి రాకుండా, ఫాంహౌస్కు రావాలా? కేంద్రం వద్ద వాదన వినిపించకుండా, ఫాంహౌస్లో వాదించాలా? కేసీఆర్తో నాకు ఎలాంటి శత్రుత్వం లేదు, ఆయన నాకు కేవలం రాజకీయ ప్రత్యర్థి మాత్రమే. ఆయనతో ఏ అంశంపై అయినా చర్చకు సిద్ధమే. అన్నీ అధ్యయనం చేశాకే ‘ఇచ్చంపల్లి’.. కేంద్ర ప్రభుత్వమే గోదావరి–కావేరి నదుల అనుసంధానంలో భాగంగా ఇచ్చంపల్లి–నాగార్జునసాగర్ ప్రతిపాదనను ఇచ్చిం ది. తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం కలిగించేదైతే ఈ లింక్పై చర్చిస్తామని కేంద్రానికి చెప్పాం. ఎప్పుడో తయారు చేసిన డీపీఆర్ ప్రకారం అయితే దీనికి ఒప్పుకునేది లేదు. అది తయారయ్యాక ఎగువ రాష్ట్రాల్లో అనేక ప్రాజెక్టులు వచ్చేశాయి. కాబట్టి ప్రస్తుతం నీటి లభ్యత ఎంత ఉందో తేలాలి. వందేళ్ల రాష్ట్ర అవసరాలకు సరిపడా నీటి లభ్యత, అవసరాలు అన్నీ అధ్యయనం చేశాకే ముందుకెళ్తాం తప్ప గుడ్డిగా వ్యవహరించం. 400 టీఎంసీలు చాలన్నది కేసీఆరే.. నీళ్ల ద్రోహి కేసీఆరే. 2004–2014 వరకు శ్రీశైలం బ్యాక్వాటర్ నుంచి రోజుకు 4.1 టీఎంసీల చొప్పున నీళ్లు తరలించుకుపోతే, 2014–23 మధ్య ఆ సామరŠాధ్యన్ని ఏకంగా 9.6 టీఎంసీలకు పెంచనిచ్చిం ది కేసీఆరే. అంతకుముందు ఉమ్మడి ఏపీలో పదేళ్లలో 727 టీఎంసీలు ఏపీ తరలించుకుపోతే, బీఆర్ఎస్ పదేళ్ల హయాంలో ఏకంగా 1,200 టీఎంసీల నీటిని ఏపీకి పోనిచ్చాడు. దీన్నిబట్టి నీళ్ల ద్రోహి ఎవరో తెలుస్తోంది. మరోవైపు 2023లో కృష్ణా జలాల్లో 400 టీఎంసీలు చాలు అన్నది కేసీఆరే.గోదావరిలో 3వేల టీఎంసీలు వృధాగా పోతున్నాయి. వాటిని వాడుకోండని ఏపీకి చెప్పింది ఆయనే. చేపల పులుసు తిని అది అరిగేదాకా కూడా ఆగకుండా నీళ్లు వాడుకోమని చెప్పారు. ఇదే సమయంలో ‘కాళేశ్వరం’ కూలిపోతే ఒక్కరిపైనా చర్యలు తీసుకోలేదు. మేం ఒక్కొక్కరిపై చర్యలు తీసుకుంటున్నాం. సినిమాల్లో విలన్లను ఆఖరిలో చంపినట్లు ఇక్కడా మెల్లిగా అరెస్టులు జరుగుతాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజీవ్రాల్ అరెస్టు చివర్లోనే జరిగింది కదా. 42% రిజర్వేషన్ల అమలుపై ప్రత్యేక వ్యూహం 2014కు ముందు కాంగ్రెస్ పార్టీ బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించింది. 2014లో కేసీఆర్ అధికారంలోకి వచ్చాక 23 శాతానికి తగ్గించారు. రిజర్వేషన్లు 50శాతం దాటకూడదని 2018లో పంచాయతీరాజ్ చట్టాన్ని తెచ్చి బీసీలకు అన్యాయం చేశారు. ప్రస్తుతం 50 శాతం క్యాప్ను ఎత్తివేస్తున్నాం. 42 శాతం రిజర్వేషన్ల అమలుపై మాకు ప్రత్యేక వ్యూహం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను అమలు చేసి తీరుతాం.కోర్టు ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థలకు ఎన్నికలు పెడతాం. అందుకే ఆర్డినెన్స్, మిగతా ప్రక్రియపై దృష్టి పెట్టాం. గుజరాత్, యూపీ, మహారాష్ట్రల్లో ముస్లింలకు రిజర్వేషన్లు తొలగించాక, తెలంగాణలో రిజర్వేషన్లపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి మాట్లాడాలి. రాష్ట్రంలో రెండేళ్ల తర్వాతే కొత్త నామినేటెడ్ చైర్మన్ పోస్టులు ఇస్తాం. అప్పటివరకు ప్రస్తుత కార్పొరేషన్లకు డైరెక్టర్లు, సభ్యులను భర్తీ చేస్తాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కచ్చితంగా పోటీ చేస్తుంది. లోకేశ్ను కేటీఆర్ చీకట్లో ఎందుకు కలిసినట్లు? ‘నేను అధికారికంగా చర్చలో పాల్గొంటే తప్పు అంటున్నారు. మరి ఇటీవల ఏపీ మంత్రి నారా లోకేశ్ను కేటీఆర్ ఎందుకు కలిశాడు?, చీకట్లో కలవాల్సిన అవసరం ఏముంది?. లోకేష్తో భేటీ అయిన మాట వాస్తవం కాదా? చెప్పమనండి..’ అని రేవంత్రెడ్డి సవాల్ చేశారు. లోకేశ్ను కలిసినట్లు మీకెలా తెలిసింది? మీరు కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారా? అని మీడియా ప్రశ్నించగా.. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తమకు లేదని ఆయన అన్నారు. ఆ విషయాన్ని మాకు కళ్ల ముందు ఉన్న వ్యక్తులే చెప్పారని తెలిపారు. కేటీఆర్ది గంజాయి బ్యాచ్ కేటీఆర్ది గంజాయి బ్యాచ్ అని రేవంత్రెడ్డి ఆరోపించారు. ‘ఆ గంజాయి బ్యాచ్ సవాల్ విసిరితే నేను స్పందించాలా? కేటీఆర్ బిజినెస్ భాగస్వామి కేదార్æ రకరకాల డ్రగ్స్ వాడి దుబాయ్లో ఆత్మహత్య చేసుకున్నాడు. లిక్కర్లో కాక్టెయిల్ విన్నాం..కానీ ఇక్కడ గంజాయి, డ్రగ్స్ కాక్టెయిల్ అని వింటున్నాం. అతని ఫోరెన్సిక్ రిపోర్టును తెప్పించాం. సందర్భాన్ని బట్టి మీడియా ద్వారా బయటపెడతాం. అవసరమైతే అసెంబ్లీలో పెట్టడానికీ సిద్ధమే. ఆయన బావమరిది ఫాంహౌస్లో సమీప గ్యాంగ్ అంతా గంజాయి, డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడ్డారు. ఇలా కేటీఆర్ చుట్టూ ఉన్న వాళ్లంతా గంజాయి బ్యాచే..’ అని సీఎం ఆరోపించారు. మిగిలింది కేటీఆరే.. మున్సిపల్ శాఖలో అక్రమాలకు సంబంధించి కీలక అధికారి బాలకృష్ణ అరెస్టు అయ్యారని, ఇక మిగిలింది కేటీఆర్ మాత్రమేనని ముఖ్యమంత్రి అన్నారు. ‘ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక్కొక్కరూ బయటకు వస్తున్నారు. కేసు ప్రస్తుతం హైకోర్టులో ఉంది. గతంలో నా ఫోన్ ట్యాప్ అయిందని చెప్పిన కిషన్రెడ్డి ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదు? కొత్తగా ఫోన్ ట్యాపింగ్ కేసు కేంద్రానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఏడాదిన్నర్రగా ప్రభాకరావును కాపాడింది ఎవరు? ఇదే బీజేపీ, బీఆర్ఎస్ కాదా?..’ అని రేవంత్ ప్రశ్నించారు. -
ఓఆర్ఆర్ లోపల కల్లు దుకాణాలు బంద్!
సాక్షి, హైదరాబాద్: కల్లుపై నిషేధాన్ని హైదరాబాద్కే పరిమితం చేయకుండా ఔటర్ రింగ్రోడ్డు లోపలి మొత్తం ప్రాంతాన్ని చేర్చాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎక్సైజ్ శాఖ నుంచి పూర్తి వివరాలను తెప్పించుకున్నట్లు సమాచారం. ఈ కల్లు దుకాణాలకు అవసరమైన చెట్లు లేకపోవడం వల్ల వ్యాపారులు అల్ప్రాజోలమ్ వినియోగించి కల్తీ కల్లు తయారు చేస్తున్నట్లు అధికారవర్గాలు కూడా వెల్లడిస్తున్నాయి. ఈ మధ్య కూకట్పల్లిలో కల్తీ కల్లు తాగి 10 మంది మరణించడం ఎక్సైజ్ శాఖను కుదిపేసింది.ఈ వ్యవహారంలో కొందరు అధికారులపై చర్యలు తీసుకున్నా.. కల్తీ కల్లు కారణంగా అమాయకులు ప్రాణాలు కోల్పోకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తప్పదన్న నిశి్చతాభిప్రాయానికి ప్రభుత్వం వచ్చినట్లు ఎక్సైజ్ వర్గాలు వెల్లడించాయి. ఔటర్ రింగ్ రోడ్డులోపల ఎన్ని దుకాణాలు ఉన్నాయ న్న సమాచారంతో పాటు దానిపై ఆధారపడి ఉన్న వారి వివరాలను కూడా అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.ఈ నేపథ్యంలో హైదరాబాద్, సికింద్రాబాద్తో పాటు రంగారెడ్డి ఎక్సైజ్ డివిజన్ పరిధిలోని మల్కాజి గిరి, మేడ్చల్, సరూర్నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ల పరిధిలోని కల్లు దుకాణాల ఎత్తి వేతకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కల్తీ కల్లు కారణంగా పది మంది మరణించడం ప్రభుత్వానికి మచ్చగా మారిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఓఆర్ఆర్ లోపల 390 సంఘాలు, 454 దుకాణాలు ఔటర్ రింగ్ రోడ్డు లోపల తాటి కో ఆపరేటివ్ సోసైటీలు.. హైదరాబాద్లో 14 ఉండగా, వీటి కింద 53 కల్లు దుకాణాలు, సికింద్రాబాద్లో 31 సంఘాల పరిధిలో 50 కల్లు దుకాణాలు, రంగారెడ్డి జిల్లాలోని మల్కాజిగిరిలో 77 సంఘాల కింద 79 దుకాణాలు, మేడ్చల్ పరిధిలో 50 సంఘాల కింద 52 కల్లు దుకాణాలు, సరూర్నగర్ పరిధిలో 158 సంఘాల కింద 158 దుకాణాలు శంషాబాద్ పరిధిలో 60 సంఘాల కింద 62 దుకాణాలు ఉన్నాయి.మొత్తం 390 సంఘాల కింద 454 కల్లు దుకాణాలు ఉన్నట్లు ఎక్సైజ్శాఖ నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ప్రభుత్వం ఈ 454 కల్లు దుకా ణాలను పూర్తిగా ఎత్తేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. దుకాణాల మూతతో పాటు హైదరాబాద్, సికింద్రాబాద్ మినహా మేడ్చల్, మల్కాజిగిరి, శంషాబాద్, సరూర్నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ల పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న టీఎఫ్టీ (ట్రీఫర్ ట్రేడ్) లైసెన్స్లు కూడా రద్దు అయ్యే అవకాకాలు ఉన్నట్లు తెలుస్తోంది.మరో పక్క ఎక్సైజ్, పోలీసులు, టీజీ న్యాబ్, కొత్తగా ఏర్పాటు చేసిన ఈగల్ నిఘా సంస్థలు కల్తీ కల్లు తయారుకు వినియోగించే అ్రల్ఫాజోలమ్, హైడ్రో క్లోరైడ్, డైజో ఫామ్ లాంటి నిషేధిత రసాయనాలను పూర్తిగా అరికట్టలేక పోతుండడంతో ప్రభుత్వం ఓఆర్ఆర్ పరిధి లోపల కల్లు అమ్మకాలను నిషేధించాలని భావిస్తున్నట్లు ఎక్సైజ్ వర్గాలు చెపుతున్నాయి. -
‘నిట్’కే విద్యార్థుల టిక్
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) నిర్వహించిన కౌన్సెలింగ్ ఆరు రౌండ్లు పూర్తయింది. దీంతో ఐఐటీల్లో సీట్ల కేటాయింపు బుధవారంతో ముగిసింది. ఐఐటీల్లో 18,160 సీట్లుండగా.. వాటన్నింటినీ భర్తీ చేశారు. జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో (నిట్)లో సీట్ల భర్తీకి మరికొన్ని రౌండ్లు ఉన్నాయి. జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో మొత్తం 62,853 సీట్లున్నాయి. వాటికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహించి ర్యాంకుల ఆధారంగా జేఈఈ అడ్వాన్స్డ్కు 2.5 లక్షల మంది విద్యార్థులను ఎంపిక చేశారు. వీటిల్లో వచి్చన ర్యాంకుల ఆధారంగా ఐఐటీల్లో సీట్లు కేటాయించారు. మిగతా సీట్లను జేఈఈ ర్యాంకుల ఆధారంగా భర్తీ చేశారు. పెరిగిన కటాఫ్ ఈసారి ఐఐటీల్లో కటాఫ్ ర్యాంకులు పెరిగాయి. కంప్యూటర్ కోర్సులకు జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో 13 వేల లోపు ర్యాంకు వరకే సీట్లు వచ్చాయి. ఒక్క ముంబై ఐఐటీలో మాత్రం ఈ ఏడాదీ పోటీ కన్పించింది. సీఎస్ఈ బ్రాంచీకి ఐఐటీ హైదరాబాద్లో గత ఏడాది బాలురకు 656 ర్యాంకు వరకే సీటు వచ్చిం ది. తాజా కౌన్సెలింగ్లో 673 ర్యాంకు వరకూ సీటు వచ్చిం ది. ఇలా అన్ని ఐఐటీల్లోనూ ఇదే ట్రెండ్ కన్పించింది. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష కష్టంగా ఉందని విద్యార్థులు భావిస్తున్నారు. దీంతో జేఈఈ మెయిన్స్ వరకే చాలామంది పరిమితమవుతున్నారు.ఐఐటీలు కాకుండా నిట్ లేదా ట్రిపుల్ ఐటీల్లో సీట్లు పొందేందుకు ఇష్టపడుతున్నారు. ఇది కూడా సాధ్యం కాకపోతే రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో టాప్ కేటగిరీలోని వాటికి ప్రాధాన్యమిస్తున్నారు. అందుకే ఈసారి రాష్ట్ర ఎప్సెట్లో 5 వేల ర్యాంక్ వచ్చిన వారూ కౌన్సెలింగ్కు దరఖాస్తు చేశారు. నిట్లో కూడా సీఎస్ఈకి భారీ డిమాండ్ కన్పించింది. ఓపెన్ కేటగిరీలో గరిష్టంగా 6 వేల ర్యాంకు వరకే సీట్లు వచ్చాయి. కెమికల్ ఇంజనీరింగ్లో 30 వేల ర్యాంకుపైన కూడా సీట్లు వచ్చాయి. నేడు రాష్ట్ర కాలేజీల్లో సీట్ల కేటాయింపు తెలంగాణ ఎప్సెట్ తొలి దశ సీట్ల కేటాయింపు శుక్రవారం చేపడతారు. జోసా కౌన్సెలింగ్ పూర్తవ్వడంతో జాతీయ కాలేజీల్లో సీట్లు రానివారు రాష్ట్ర కాలేజీల్లో చేరే వీలుంది. రాష్ట్రంలో 76,795 ఇంజనీరింగ్ సీట్లను కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తున్నారు. ఇందులో 70 శాతం కంప్యూటర్, ఎమర్జింగ్ కోర్సుల్లోనే ఉన్నాయి. 94,354 మంది 59 లక్షలకు పైగా వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. దీంతో సీట్ల కేటాయింపు విద్యార్థులకు కీలకంగా మారబోతోంది. -
ఏఐతో.. ముప్పు పొంచి ఉంది!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ప్రస్తుతం ప్రపంచమంతా మాట్లాడుకుంటున్న సాంకేతికత. ఏఐతో కొత్త అవకాశాలు రావడమే కాదు.. ప్రస్తుతం తాము పనిచేస్తున్న ఉద్యోగాలకు ముప్పు రానుందని అత్యధిక మంది నిపుణులు నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో నైపుణ్యాలను పెంచుకోవాలన్న కృతనిశ్చయం వారిలో కనిపిస్తోంది. మెషీన్ లెర్నింగ్, ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ఎక్కువ శాతం మంది భావిస్తున్నారని ‘గ్రేట్ లెర్నింగ్’ సర్వేలో తేలింది.సాంకేతికతతో తమ ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందని భావించే వారిలో 21 నుండి 28 సంవత్సరాల వయసు గల యువత (జనరేషన్ –జెడ్) అత్యధికంగా ఉండటం విశేషం. ముఖ్యంగా ఏఐ వల్ల తమ ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందని 74% మంది జెన్ –జెడ్ తరం భావిస్తున్నారు. ప్రస్తుతం తాము పనిచేస్తున్న ఉద్యోగానికి ఢోకా లేదని 64 శాతం మంది ధీమాగా ఉన్నారు.45–60 సంవత్సరాల వయసు గల జనరేషన్ –ఎక్స్లో 56% మంది ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మొత్తంగా 69% మంది నిపుణులు తమ ఉద్యోగాలకు ఏఐ వల్ల ప్రమాదం ఉందని నమ్ముతున్నారు. ‘అప్స్కిల్లింగ్ ట్రెండ్స్ రిపోర్ట్ 2025–26’ పేరుతో ఎడ్టెక్ కంపెనీ ‘గ్రేట్ లెర్నింగ్’ దేశవ్యాప్తంగా విభిన్న రంగాలకు చెందిన 1,000 మందికిపైగా నిపుణులతో చేసిన సర్వేలో ఇలాంటి ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.నైపుణ్యం పెంచుకుంటాం..ఈ సంవత్సరం నైపుణ్యాలను పెంచుకోవాలని 81% మంది భావిస్తున్నారు. హైదరాబాద్లో ఈ సంఖ్య దేశంలోనే అత్యధికంగా 90 శాతం ఉంది. తమ కెరీర్లపై ఏఐ ప్రభావం సానుకూలంగా ఉంటుందని 78% మంది చెబుతున్నారు. ఈ ఏడాది 73% మంది నిపుణులు తమ ఉద్యోగాలను నిలుపుకోవడంపై నమ్మకంగా ఉన్నారు. 82% మంది చురుగ్గా కొత్త ఉద్యోగ అవకాశాలను అన్వేషిస్తున్నారు. ఇక 29–44 ఏళ్ల వయసున్న (మిలీనియల్స్) ఉద్యోగుల్లో 90 శాతం మంది నైపుణ్య విలువను గుర్తించారు. జెన్ –జెడ్ విషయంలో ఇది 79 శాతం. కానీ ఆఫీసు పని గంటల కారణంగా నూతన సాంకేతిక నైపుణ్యాలను సంపాదించడం అడ్డంకిగా మారిందని 37% మంది అంటున్నారు. కుటుంబ బాధ్యతలు, ఇంటి పని కారణంగా కొత్త కోర్సులు నేర్చుకోలేకపోతున్నామని 25 శాతం మహిళలు చెబుతుంటే.. ఇలా చెప్పిన పురుషులు 20 శాతం కావడం విశేషం.6 వారాల నుంచి ఆరు నెలలు..కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి జెన్ –ఏఐని ఉపయోగిస్తున్నట్లు 80% మంది నిపుణులు వెల్లడించారు. మెషీన్ లెర్నింగ్, ఏఐ విభాగాల్లో నైపుణ్యం పెంచుకుంటామని 44 శాతం మంది తెలిపారు. తమ పనిలో జెన్ –ఏఐని ‘ఎల్లప్పుడూ’ లేదా ’తరచుగా’ ఉపయోగిస్తామని 60% మంది చెబుతున్నారు. ఇక ఐటీ, ఐటీఈఎస్, బీపీఎం, టెలికం రంగాల్లో పనిచేస్తున్నవారిలో 91 శాతం మంది నైపుణ్యం మెరుగుపర్చుకోవడం ముఖ్యం అని తెలిపారు. 64% మంది నిపుణులు 6 వారాల నుంచి 6 నెలల నిడివిగల ప్రోగ్రామ్స్తో నైపుణ్యాన్ని పెంచుకోవాలని అనుకుంటున్నారు.జెన్ –జీ ప్రధానంగా స్వల్పకాలిక ప్రోగ్రామ్స్ను ఇష్టపడుతున్నారు. 50% మంది 6 వారాల కంటే తక్కువ లేదా 6 వారాల నుండి 3 నెలల మధ్య ఉన్న ప్రోగ్రామ్లను ఇష్టపడుతున్నారు. దేశీయ యూనివర్సిటీలు అందించే సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నామని 43 శాతం చెప్పగా.. అంతర్జాతీయ వర్సిటీల సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నామని 36 శాతం తెలిపారు. తల్లి/తండ్రిగా బాధ్యతలు నెరవేరుస్తున్న ఉద్యోగుల్లో 90% మంది నిపుణులు నైపుణ్యం పెంపుదల ముఖ్యమైనదని భావిస్తున్నారు. ఇతర (పెళ్లికాని లేదా పిల్లలు లేనివారు) నిపుణుల్లో ఈ సంఖ్య 76 శాతమే. -
విలన్లు క్లైమాక్స్లోనే అరెస్ట్ అవుతారు: సీఎం రేవంత్
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీ వెళ్లామని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీకి కాకుండా ఫామ్ హౌస్కు రావాలా? అంటూ రేవంత్ చమత్కరించారు. బనకచర్ల చర్చ జరిగిందో లేదో కేంద్రమే చెప్పిందని ఒక ప్రశ్నక సమాధానంగా చెప్పారు సీఎం రేవంత్. ‘ ‘కేసీఆర్ సభకు రావాలి. గత ప్రభుత్వం అవినీతిపై విచారణ జరుగుతోంది. కేటీఆర్ డ్రగ్స్ కేసులోనూ విచారణ కొనసాగుతోంది. శాఖాపరమైన విచారణ రాత్రికి రాత్రే పూర్తి కాదు. విలన్లు క్లైమాక్స్లోనే అరెస్ట్ అవుతారు’ అని సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు. ‘కేటీఆర్ను కాపాడాలని కిషన్రెడ్డి చూస్తున్నారు. అందుకే కాళేశ్వరం, ట్యాపింగ్ కేసు సీబీఐకి ఇవ్వాలనుకుంటున్నాం. బీసీ రిజర్వేషన్లపై మా వ్యూహం మాకుంది. సెప్టెంబర్ 30 లోపు లోకల్ బాడీ ఎన్నికలు జరుపుతాం. రెండేళ్ల తర్వాత నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తాం’ అని రేవంత్ తెలిపారు.చంద్రబాబు తొత్తు రేవంత్: కేటీఆర్సిరిసిట్ల: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ తొత్తుగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వొద్దని అడ్డుకుందే చంద్రబాబని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ హక్కులను కాపాడటానికి కేసీఆర్ ఉన్నారని, బనకచర్లపై కాంగ్రెస్ స్టాండ్ మార్చకోకపోతే మరొకసారి ఉద్యమానికి బీఆర్ఎస్ సిద్ధమవుతోందన్నారు. చిలుక రేవంత్ అయతే పలుకులు చంద్రబాబువి అని కేటీఆర్ సెటైర్లు వేశారు. ఏ బేసిన్లో ఏ ప్రాజెక్టు ఉందో సీఎం రేవంత్కు తెలియదని, ఆయనకు తెలిసింది రియల్ ఎస్టేట్ మాత్రమేనని కేటీఆర్ విమర్శించారు. -
Telangana phone tapping case: బండి సంజయ్కు సిట్ నోటీసులు
సాక్షి,కరీంనగర్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తొలిసారి వెలుగులోకి తీసుకువచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఎంపీ బండి సంజయ్కు నోటీసులు జారీ చేసింది. కేంద్ర మంత్రితో పాటు పీఆర్వో, పీఏలకూ సిట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈమేరకు సిట్ విచారణలో హైదరాబాద్ లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో స్టేట్మెంట్ ఇచ్చేందుకు అంగీకరించారు. అదే రోజు పీఆర్వో, పీఏల స్టేట్మెంట్ను సిట్ పోలీసులు రికార్డ్ చేయనుంది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం సిట్ అధికారులు కేంద్ర మంత్రి నివాసానికి వెళ్లి నోటీసులు అందించారు. -
తెలంగాణ హైకోర్టులో సీఎం రేవంత్రెడ్డికి ఊరట
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డి ఊరట దక్కింది. గచ్చిబౌలి పీఎస్లో ఆయనపై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేసింది.ప్రస్తుత సీఎం 2016లో అప్పటి మల్కాజ్గిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలంలో ఐటీ హబ్గా పేరొందిన గచ్చీబౌలీకి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గోపన్నపల్లీలో 31 ఎకరాల హౌసింగ్ సొసైటీ భూమూల్ని ఆక్రమించుకునేందుకు రేవంత్ రెడ్డి, అతని సోదరుడు కొండల్ రెడ్డితో పాటు అతని అనుచరులు ప్రయత్నించారంటూ ఫిర్యాదులందాయి.ఆ ఫిర్యాదుల్లో రేవంత్రెడ్డి, అతని సోదరుడు,అనుచురులు ఎలాంటి హక్కులు, అనుమతులు లేకుండా వివాదాస్పద సొసైటీ భూముల్ని వినియోగించుకునేందుకు ప్రయత్నించారని, సొసైటీ సభ్యుల్ని బెదిరించడం, భూములతో సంబంధం ఉన్నవారిని దూషించారంటూ పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు గచ్చీబౌలీ పోలీసులు రేవంత్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. భూముల వివాదానికి సంబంధించి కోర్టులో ఛార్జ్షీట్ కూడా దాఖలైంది. హైకోర్టు విచారణ చేపట్టింది. సొసైటీ భూముల వ్యవహారంలో తమ ప్రమేయం లేదని, రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగా తనపై కేసు నమోదు చేశారని రేవంత్ తరుపు న్యాయవాదులు కోర్టులో వాదించారు. అదే కేసులో 2019లో కోర్టులో రేవంత్ మరో ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి న్యాయ విచారణ నిలిపివేయాలని కోరుతూ రేవంత్ వాదనలు వినిపించారు. రేవంత్ తరుపు వాదనలు విన్న కోర్టు ఎటువంటి అధికారిక అభియోగాలు మోపలేదు. దీనికి ప్రతిస్పందనగా, హౌసింగ్ సొసైటీ తరపు న్యాయవాదులు ఈ కేసులో రేవంత్ తన రాజకీయ పలుకుబడిని ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు సొసైటీ భూముల వివాదంపై రిపోర్టును తయారు చేసి ట్రయల్ కోర్టులో సబ్మిట్ చేయాలంటూ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఈ కేసు విచారణ కొనసాగుతున్న సమయంలో 2020లో రేవంత్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. సొసైటీ భూముల వివాదంలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై గత జూన్ 20న విచారణ చేపట్టిన కోర్టు తీర్పును జులై 17కి రిజర్వు చేసింది. ఇవాళ కోర్టులో జరిగిన విచారణలో.. సంఘటనా జరిగిన సమయంలో రేవంత్ రెడ్డి అక్కడ లేరని దర్యాప్తులో తేలిందని హైకోర్టు తెలిపింది. ఫిర్యాదు దారు చేసిన ఆరోపణల్లో సరైన సాక్ష్యాధారాలు లేవని పేర్కొంది. గచ్చిబౌలి పీఎస్లో ఆయనపై నమోదైన క్రిమినల్ కేసులను కొట్టివేసింది. -
HCA Scam: ఉప్పల్ సీఐ ఎలక్షన్రెడ్డి సస్పెన్షన్
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ సీఐ ఎలక్షన్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) స్కామ్లో ప్రమేయం ఉందని తేలడంతో ప్రభుత్వం సస్పెండ్ చేసింది. హెచ్సీఏ జనరల్ సెక్రెటరీ దేవరాజు అరెస్టుకు సీఐడీ రంగం సిద్ధం చేసింది. దేవ్రాజ్కు సహకరించిన ఎలక్షన్రెడ్డి.. సీఐడీ సమాచారాన్ని ముందుగానే లీక్ చేశారు. సీఐడీ సమాచారాన్ని దేవరాజుకు ముందుగా లీక్ చేసినందుకు ఎలక్షన్రెడ్డిని సస్పెండ్ అయ్యారు.మరోవైపు, హెచ్సీఐ అక్రమాలపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) మరోసారి సీఐడీకి ఫిర్యాదు చేసింది. ఇందులో రాజకీయ నాయకుల ప్రమేయంపై కూడా విచారణ జరపాలని కోరింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత పేర్లను సీఐడీకి ఇచ్చిన ఫిర్యాదులో టీసీఏ ప్రస్తావించింది.తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు సీఐడీ అడిషనల్ డీజీ చారుసిన్హాను కలిశారు. ఈ సందర్భంగా.. హెచ్సీఏ అక్రమార్కుల వెనుక కేటీఆర్, కవిత హస్తం ఉందని టీసీఏ ఆరోపించింది. జగన్మోహన్రావుతో పాటు మరికొందరు అక్రమార్కులు కూడా ఉన్నారని.. వాళ్లపై కూడా దర్యాప్తు చేయాలని కోరింది. జాన్ మనోజ్, విజయానంద్, పురుషోత్తం అగర్వాల్, సురేందర్ అగర్వాల్, వంకా ప్రతాప్లపై కూడా టీసీఏ ఫిర్యాదు చేసింది.కాగా.. హెచ్సీఏ- ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్రైజర్స్ హైదరాబాద్ వివాదం నేపథ్యంలో అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావును సీఐడీ ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు కోశాధికారి శ్రీనివాస్ రావు, సీఈఓ సునీల్ కంటే, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేందర్ యాదవ్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవితలను కూడా అరెస్టు చేశారు. ఈ క్రమంలో జగన్మోహన్ రావు అక్రమ పద్ధతిలో హెచ్సీఏలోకి ప్రవేశించినట్లు సీఐడీ గుర్తించింది. ఈ నేపథ్యంలో మల్కాజిగిరీ కోర్టు నిందితులకు పన్నెండు రోజుల రిమాండ్ విధించింది. -
బీసీసీఐ నుంచి వచ్చే నిధులు మళ్లించారు.. కేటీఆర్, కవితపై సంచలన ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అక్రమాలపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) మరోసారి సీఐడీకి ఫిర్యాదు చేసింది. ఇందులో రాజకీయ నాయకుల ప్రమేయంపై కూడా విచారణ జరపాలని కోరింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత పేర్లను సీఐడీకి ఇచ్చిన ఫిర్యాదులో టీసీఏ ప్రస్తావించింది.తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు సీఐడీ అడిషనల్ డీజీ చారుసిన్హాను కలిశారు. ఈ సందర్భంగా.. హెచ్సీఏ అక్రమార్కుల వెనుక కేటీఆర్, కవిత హస్తం ఉందని టీసీఏ ఆరోపించింది. జగన్మోహన్రావుతో పాటు మరికొందరు అక్రమార్కులు కూడా ఉన్నారని.. వాళ్లపై కూడా దర్యాప్తు చేయాలని కోరింది. జాన్ మనోజ్, విజయానంద్, పురుషోత్తం అగర్వాల్, సురేందర్ అగర్వాల్, వంకా ప్రతాప్లపై కూడా టీసీఏ ఫిర్యాదు చేసింది.కేటీఆర్, కవిత, హరీష్ రావుకి అంకితం‘‘HCA ఎన్నికల్లోకి హఠాత్తుగా జగన్మోహన్ రావు రావడం వెనక కేటీఆర్, కవిత హస్తం ఉంది. క్రికెట్ కి సంబంధం లేని ఈ ఇద్దరూ.. జగన్మోహన్ వెంట ఉండి నడిపించారు. HCA ప్రెసిడెంట్ గా జగన్మోహన్ రావు గెలవగానే.. నా విజయం కేటీఆర్, కవిత, హరీష్ రావుకి అంకితం అని చెప్పాడు. అతడి వెనక ఉన్న వాళ్ళ పాత్ర కూడా నిగ్గు తేల్చాలి అని CID కి ఫిర్యాదు చేశాం. HCA లో మరికొందరు అక్రమార్కులు ఉన్నారు.. వీళ్లపై కూడా దర్యాప్తు చేయాలని కోరాం’’ అని ఫిర్యాదు చేసిన సందర్భంగా టీసీఏ పేర్కొంది.బీసీసీఐ నుంచి వచ్చే నిధులు మళ్లించారుఇక టీసీఏ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ.. ‘‘క్రికెట్ నిధులను ఎవరు వాడుకున్నారు. అక్రమాలకు పాల్పడిన జగన్మోహన్ రావుకు పడిన శిక్ష రాజకీయ నాయకులకూ పడాలి. జగన్మోహన్ రావు గెలిచిన తర్వాత ఎవరికి అంకితం చేశాడో ఆ వీడియోలు సీఐడీ కి పిర్యాదు చేశాం’’ అని తెలిపారు. కాగా బీసీసీఐ నుంచి వచ్చే కోట్లాది రూపాయల నిధులను మళ్లించారని ఆరోపించిన టీసీఏ.. మనీలాండరింగ్ కోణంలో విచారణ జరపాలని ఈడీకి కూడా ఫిర్యాదు చేసింది.కాగా.. హెచ్సీఏ- ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్రైజర్స్ హైదరాబాద్ వివాదం నేపథ్యంలో అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావును సీఐడీ ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు కోశాధికారి శ్రీనివాస్ రావు, సీఈఓ సునీల్ కంటే, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేందర్ యాదవ్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవితలను కూడా అరెస్టు చేశారు. ఈ క్రమంలో జగన్మోహన్ రావు అక్రమ పద్ధతిలో హెచ్సీఏలోకి ప్రవేశించినట్లు సీఐడీ గుర్తించింది. ఈ నేపథ్యంలో మల్కాజిగిరీ కోర్టు నిందితులకు పన్నెండు రోజుల రిమాండ్ విధించింది. -
సీఎం రేవంత్కు కిషన్రెడ్డి లేఖ.. ఏమన్నారంటే?
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఈ సందర్భంగా కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రతిపాదించిన పునరుత్పాదక ఇంధన (రెన్యూవబుల్ ఎనర్జీ) కార్యక్రమాలపై తెలంగాణ ప్రభుత్వ సహకారం కోరుతూ లేఖలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (CPSUలు), ముఖ్యంగా కోల్ ఇండియా లిమిటెడ్ (CIL), నేవేలీ లిగ్నయిట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (NLCIL).. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం కుదుర్చుకుని, సౌర, పవన విద్యుత్ ప్లాంట్లు, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు (PSP), బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (BESS) వంటి కీలకమైన పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని కిషన్రెడ్డి లేఖలో తెలిపారు. ఈ ప్రాజెక్టులు వచ్చే మూడేళ్లలో దాదాపు రూ.10 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్శించనున్నాయి.లేఖలో కీలక ప్రతిపాదనలు:తెలంగాణలోని అధిక సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం గల జోన్లను గుర్తించి ఆయా ప్రాంతాల్లో సౌర విద్యుత్ ప్లాంట్లను అభివృద్ధి చేయడం.గ్రిడ్ స్టెబిలిటీ, ఎనర్జీ రిలయబిలిటీలను మరింత పెంచేలా అత్యాధునిక బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS)ను అభివృద్ధి చేయడం.క్రిటికల్ బ్యాలెన్సింగ్ కెపాసిటీని అందించేందుకు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాల అధ్యయనం, అమలు.ప్రాజెక్టు అమలును వేగవంతం చేయడానికి, స్థానిక ఆర్థిక ప్రయోజనాలను పెంచడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలతో లేదా బొగ్గు కంపెనీలు స్వతంత్ర ప్రాతిపదికన జాయింట్ వెంచర్ మోడల్స్ ఏర్పాటు చేయడం.ఈ ప్రతిపాదనలు, ప్రాజెక్టులకు భూసేకరణ, భూకేటాయింపు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు అవసరం.ఈ ప్రాజెక్టులు కర్బన ఉద్గారాలను తగ్గించడం, గాలి నాణ్యతను మెరుగుపరచడం, సహజ వనరుల నిర్వహణ తదితర విషయాల్లో కీలక పాత్ర పోషిస్తాయి. వీటి ద్వారా ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధి, ఇంధన భద్రతతోపాటుగా, అవసరమైనంత మేర విద్యుత్ ను అందుబాటులోకి తీసుకురావడం, సమ్మిళిత అభివృద్ధి, జీవన ప్రమాణాలను పెంచడం వంటి సామాజిక-ఆర్థిక ప్రయోజనాలు కూడా లభించనున్నాయి. ఈ ప్రాజెక్టులు విజయవంతంగా అమలుకావడానికి రాష్ట్ర ప్రభుత్వం, CPSUల మధ్య నిర్మాణాత్మక భాగస్వామ్యం, సరైన సమన్వయం అత్యంత అవసరం. ఇందుకోసం మీరు ప్రత్యేకమైన చొరవతీసుకోవాలని కోరుతున్నాను. మీ జోక్యంతోనే ఈ ప్రాజెక్టులు వేగంగా, సమర్థవంతంగా అమలు అవుతాయని విశ్వసిస్తున్నాను.పునరుత్పాదక విద్యుదుత్పత్తిలో తెలంగాణ సామర్థ్యాన్ని గుర్తిస్తూ.. రాష్ట్రంలో హరితాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణమైన చిత్తశుద్ధితో సహకారం అందిస్తోంది. ఇది రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. భారతదేశ సుస్థిర విద్యుత్ వ్యవస్థలో తెలంగాణ పాత్ర కీలకం కానున్న సందర్భంలో.. ఈ ప్రాజెక్టుల ప్రాధాన్యత మరింత పెరగనుంది. తెలంగాణకు ఉన్న పునరుత్పాదక విద్యుదుత్పత్తి సామర్థ్యం, హరితాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ నిబద్ధతను దృష్టిలో ఉంచుకుని.. ఈ ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని మరో మెట్టు ముందుకు తీసుకెళ్తాయి. దీంతోపాటుగా భారతదేశం సుస్థిర ఇంధన పరివర్తన దిశగా చేస్తున్న కృషిలో తెలంగాణ కీలక పాత్ర పోషించడానికి ఇదొక చక్కటి అవకాశం. భారతదేశపు దీర్ఘకాల ప్రణాళికలైన ఇంధన భద్రత, పర్యావరణ పరిరక్షణను సాకారం చేసుకోవడంలో భాగంగా ఆర్థిక పురోగతిని, అభివృద్ధి అవకాశాలను సమతుల్యం చేసుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం అత్యంత కీలకం.పర్యావరణ పరిరక్షణతో పాటుగా ఆత్మ నిర్భరతతో కూడిన భవిష్యత్ను ఏర్పరచుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిర్మాణాత్మక సహకారంలో మీ చొరవ కీలకం. తెలంగాణలో రానున్న ఈ సానుకూల మార్పుకు మీ సహకారాన్ని కోరుతూ.. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ, మా శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థలనుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలియజేస్తున్నాను’ అని పేర్కొన్నారు. -
తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ సెలైన్స్పై కవిత కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశమై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్పై ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ సరైనదే అని కవిత చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై కూడా కవిత ఆసక్తికర కామెంట్స్ చేశారు.ఎమ్మెల్సీ కవిత తాజాగా మీడియా చిట్ చాట్లో మాట్లాడుతూ..‘బీసీ రిజర్వేషన్పై ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కరెక్టే. బీఆర్ఎస్ నాయకులు ఆర్డినెన్స్ వద్దని చెప్పడం సరికాదు. బీఆర్ఎస్ వాళ్ళు నా దారికి రావాల్సిందే. నాలుగు రోజులు టైం తీసుకుంటారేమో అంతే. 2018 చట్ట సవరణ చేసి ఆర్డినెన్స్ తేవడం సబబే. నేను న్యాయనిపుణులతో చర్చించిన తర్వాతే ఆర్డినెన్స్కు సపోర్ట్ చేశాను. అలాగే, తీన్మార్ మల్లన్న నాపై చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ నాయకులు స్పందించకపోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఒక ఎమ్మెల్సీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచింది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లనను నేను జనాభా లెక్కల నుంచి తీసివేశాను అన్నారు. ఆయన ఎవరో నాకు తెలియదు’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కమీషన్ల కోసమే బనకచర్ల..అనంతరం, బనకచర్లపై చర్చకు తాను వెళ్లనని సీఎం రేవంత్ రెడ్డి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. నిన్నటి డిల్లీ సమావేశంలో ఎజెండాలో మొదటి అంశమే బనకచర్ల. ముఖ్యమంత్రి, మంత్రి ఉత్తమ్ సిగ్గులేకుండా గోదావరి జలాలను చంద్రబాబు చేతిలో పెట్టారు. బనకచర్లపై చర్చే జరగలేదని రేవంత్ రెడ్డి బుకాయిస్తున్నాడు. తెలంగాణ హక్కులను కాలరాసిన నాన్ సీరియస్ ముఖ్యమంత్రి తన పదవి రాజీనామా చేయాలి. బనకచర్ల వల్ల ఆంధ్రా ప్రజలకు ఏం లాభం లేదు. కాంట్రాక్టర్లు, కమిషన్ల కోసం బనకచర్ల కడుతున్నారు. ముఖ్యమంత్రి మెగా కంపెనీ వాటా కోసమే డిల్లీకి వెళ్లారు. చంద్రబాబు ఎజెండాలో భాగంగానే సీఎం డిల్లీకి వెళ్ళాడు. బనకచర్ల ఆపకపోతే న్యాయపోరాటం చేస్తాం.సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చంద్రబాబును ఎదుర్కొని సన్మానం చేశారు. సిగ్గులేకుండా బనకచర్ల ప్రాజెక్టును చంద్రబాబుకు అప్పనంగా అప్పగించారు. రేవంత్ రెడ్డి బనకచర్లపై బుకాయిస్తున్నారు. ఆయనకు పాలించే హక్కు లేదు. తక్షణమే సీఎం పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. నాలుగు విజయాలు సాధించామని సీఎం రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారు. కృష్ణానది బోర్డును అమరావతిలో పెట్టడం అనేది ఏపీ విభజన చట్టంలో ఉంది. తెలంగాణ ప్రజల హక్కులను చంద్రబాబు కాళ్ల దగ్గర తాకట్టుపెట్టారు.బాబుకు బహుమతిగా గోదావరి నీళ్లు..పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్న నేపధ్యంలో ముఖ్యమంత్రి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలి. తన స్కూల్ బీజేపీ, కాలేజీ టీడీపీ, ఉద్యోగం కాంగ్రెస్లో అని సీఎం చెప్తుంటారు. ముఖ్యమంత్రి ఇంకా కాలేజీలోనే ఉన్నానని అనుకుంటున్నారు. అందుకే గోదావరి నీళ్లను చంద్రబాబుకు గిఫ్టుగా ఇచ్చారు. తుపాకులగూడెం నుంచి నదుల అనుసంధానం జరిగితే తెలంగాణ, ఆంధ్రాకు న్యాయం జరుగుతుంది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు బనకచర్లపై అసలు చర్చ జరగలేదు. కొప్పుల ఈశ్వర్ స్వయంగా బొగ్గుగని కార్మికుడు.. వారికి బొగ్గుగని కార్మిక సంఘం బాధ్యతలు అప్పగించడాన్ని స్వాగతిస్తున్నా’ అంటూ కామెంట్స్ చేశారు. -
నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి
విజయనగర్కాలనీ(హైదరాబాద్): పాఠశాల స్థాయిలోనే విద్యార్థులు నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని ఇండియన్ ఆర్మీ అధికారి కల్నల్ దీప్జ్యోతి సకై, రవీంద్రభారతి విద్యాసంస్థల డీన్ ప్రియామనీష్ అన్నారు. విజయనగర్కాలనీ రవీంద్రభారతి పాఠశాలలో విద్యార్థి నాయకులను ఎంపిక చేసి ప్రమాణ స్వీకారోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కల్నల్ దీప్జ్యోతి సకై పాకిస్థాన్పై చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ విషయాలను విద్యార్థులకు వివరించారు. అలాగే ఎస్పీఎల్గా ఎంపికైన విద్యార్థి నాయకులకు బ్యాడ్జీలు అందజేసి ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఠాకూర్ సరిత, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. టోలిచౌకీ రవీంద్రభారతీ పాఠశాలలో..గోల్కొండ: టోలిచౌకీ రవీంద్రభారతీ పాఠశాలలో విద్యార్థి నాయకుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నగర క్రైం బ్రాంచ్ ఏసీపీ కె.ఎం.కిరణ్కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉన్నత విద్యనభ్యసించి కుటుంబానికే కాకుండా దేశానికి గర్వకారణంగా నిలవాలన్నారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన విద్యార్థి నాయకులకు బ్యాడ్జీలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జయశ్రీ, డీన్ ప్రియామనీశ్ , ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
టీబీజీకేఎస్ ఇన్చార్జిగా కొప్పుల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బొగ్గుగని కార్మీక సంఘం (టీబీజీకేఎస్) కార్యకలాపాలను ఇకపై సంఘం వ్యవస్థాపక సభ్యుడు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పార్టీ పక్షాన ఇన్చార్జిగా పర్యవేక్షిస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. సింగరేణి ప్రాంతానికి చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు, మాజీ మంత్రులతో సమన్వయం చేసుకుంటూ బొగ్గు గని కార్మిక సంఘం కార్యకలాపాలు నిర్వహించాలన్నారు. తెలంగాణ భవన్లో బుధవారం టీబీజీకేఎస్ నేతలతో జరిగిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. కొప్పుల ఆధ్వర్యంలో సంఘం కార్యకలాపాలను ముందుకు తీసుకుపోవడంతోపాటు కార్మీకుల సమస్యలపై పోరాటం చేయాలన్నారు.సింగరేణి బొగ్గు గనులపై కాంగ్రెస్, బీజేపీ కలిసి చేస్తున్న కుట్రలపై గళమెత్తాలని పిలుపునిచ్చారు. పార్టీకి అనుబంధంగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ద్వారా సింగరేణి కార్మీకుల హక్కుల కోసం ఉద్యమించాలన్నారు. సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేంత వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఈ భేటీలో నిర్ణయించారు. కార్మీకులకు ప్రభుత్వం చేసే అన్యాయాలపై పోరాడేందుకు పార్టీ లీగల్ సెల్ అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. బొగ్గు గని కార్మీక సంఘం ఆధ్వర్యంలో త్వరలో విస్తృతస్థాయి సమావేశం ఉంటుందని ప్రకటించారు. ‘టాక్ జర్నలిజం’ఈవెంట్కు కేటీఆర్ దేశంలోని ప్రముఖ జర్నలిస్టులు, మేధావులు, రాజకీయ నాయకులు ప్రతిష్టాత్మక ‘టాక్ జర్నలిజం 2025’కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కేటీఆర్కు ఆహ్వనం అందింది. ఈ నెల 19, 20 తేదీల్లో రాజస్తాన్లోని జైపూర్ వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుంది. దక్షిణ భారత రాజకీయాల్లో ప్రజాస్వామ్య ప్రాతినిధ్యాన్ని బలంగా వినిపిస్తున్న, విజన్ ఉన్న వినూత్న నాయకుడిగా పేరు తెచ్చుకున్న కేటీఆర్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు ఆహ్వన లేఖలో పేర్కొన్నారు.మీడియా రంగంలోని మార్పులు, ధోరణులు, సవాళ్లపై చర్చించేందుకు దేశ విదేశాలకు చెందిన జర్నలిస్టులు కలుసుకునే వేదికగా ‘టాక్ జర్నలిజం’నిలుస్తోంది. గతంలో సచిన్ పైలట్, అసదుద్దీన్ ఒవైసీ, సుబ్రమణ్య స్వామి, జీవీఎల్ నరసింహారావు, రాఘవ్ చద్దా, డి.రాజా, ప్రియాంకా చతుర్వేది తదితరులు పాల్గొన్నారు. ఈసారి కేటీఆర్ తన ప్రసంగంలో ప్రాంతీయ అసమానతలు, సమాఖ్య విధానం, మారుతున్న భారత రాజకీయాల దిశ వంటి అంశాలను ప్రస్తావించనున్నారు. -
వాయుగండం
సాక్షి, హైదరాబాద్: ‘ముందస్తు’గా మురిపించిన వర్షాలు కీలక సమయంలో ముఖం చాటేయటంతో రాష్ట్రంలో వాతావరణం వేసవిని తలపిస్తోంది. నైరుతి రుతుపవనాల సీజన్ లో సమృద్ధిగా వానలు కురవాల్సిన సమయంలో.. మొగులు కోసం రైతన్న దిగులుగా చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రుతుపవనాల కదలికలు మందగించడం, నిలకడలేని తీవ్రగాలుల ప్రభావంతో వర్షాలు జాడ లేకుండా పోయాయి. ఇదే సమయంలో తెలంగాణ ఎగువన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈసారి రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ముందస్తుగా ప్రవేశించడంతో ఈ సీజన్లో వర్షాలు జోరుగా ఉంటాయని అంచనా వేశారు. ఈ అంచనాలు తలకిందులు కావటానికి ఎక్కువ రోజులు పట్టలేదు. నైరుతి రుతుపవనాల సీజన్లోనే రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో సగటున 24.34 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. కానీ 17.59 సెంటీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. సీజన్లో కేవలం జూన్, జూలై నెలల్లోనే ఎక్కువ వర్షాలు కురుస్తుంటాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత వరుసగా రెండు నెలలపాటు లోటు వర్షపాతం నమోదు కావడం ఇదే ప్రథమం అని వాతావరణ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ⇒ ఆదిలాబాద్ జిల్లాలో మాత్రమే సాధారణం కంటే 2 శాతం అధిక వర్షపాతం నమోదైంది. మిగతా 32 జిల్లాల్లో లోటు వర్షపాతమే ఉంది. ⇒ ఏడు జిల్లాల్లో 20 శాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. కుమ్రంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, మహబూబ్నగర్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల్లో సాధారణం కంటే తక్కువగా వర్షపాతం నమోదైంది. ⇒ 24 జిల్లాల్లో వర్షపాతం భారీ లోటు నమోదైంది. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగుడెం, హబుబాబాద్, వరంగల్, హన్మకొండ, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, జనగామ, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, ములుగు, నారాయణపేట జిల్లాల్లో 20 నుంచి 60 శాతం లోటు ఉంది. ⇒ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ఏకంగా 62 శాతం తక్కువ వర్షాలు కురిశాయి. వేసవి ఎండలు తక్కువగా ఉండడంవల్లే.. రాష్ట్రంలో సాధారణంగా వేసవి సీజన్లో ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. కానీ, ఈ ఏడాది వేసవిలో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత 20 సంవత్సరాల్లో మే నెలలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు ఈ సారి నమోదు కావడం గమనార్హం. ఎండల తీవ్రత తక్కువగా ఉంటే వర్షాలు సైతం తక్కువగానే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా మే నెలలో వర్షాలు అధికంగా కురవడం కూడా ప్రస్తుత వర్షాభావ పరిస్థితులకు మరో కారణమని అంటున్నారు. రాష్ట్రంలో వానలు బాగా కురవాలంటే బంగాళాఖాతంలో వాతావరణ మార్పులు కీలకమని నిపుణులు చెబుతున్నారు. గాలుల తీవ్రతతో వానలకు ఆటంకం నైరుతి సీజన్లో గాలుల తీవ్రత విపరీతంగా ఉంది. నిలకడలేని గాలుల కారణంగా వర్షాలు కురవడం లేదు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం లాంటివి ఏర్పడితే రాష్ట్రంలో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఉండేవి. కానీ ఈ సీజన్లో ఇప్పటివరకు అలాంటివేవీ నమోదు కాలేదు. ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం లాంటివి కనీసం రెండుమూడు రోజుల పాటు కొనసాగితే వర్షాలు సమృద్ధిగా కురిసేవి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వానలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ... తెలంగాణలో మాత్రం తక్కువగా ఉన్నాయి. మరో వారం తర్వాత పరిస్థితులు మారుతాయని అంచనా వేస్తున్నాం. – జీఎన్ఆర్ఎస్ శ్రీనివాసరావు, వాతావరణ శాస్త్రవేత్త, హైదరాబాద్ వాతావరణ కేంద్రం -
హైదరాబాద్–అమరావతి కొత్త రైలు మార్గం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్–అమరావతి మధ్య కొత్త రైల్వేలైన్ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. భూసేకరణ ప్రక్రియ పూర్తికానుండటంతో టెండర్లు పిలిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కృష్ణానదిపై నిర్మించాల్సిన భారీ వంతెనకు విడిగా టెండర్లు పిలుస్తారు. డిసెంబర్లో కొత్త లైన్ నిర్మాణ పనులు ప్రారంభించబోతున్నారు. నాలుగేళ్లలో ఇది పూర్తికానుందని సమాచారం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు.. హైదరాబాద్–అమరావతి మధ్య తొలుత పిడుగురాళ్ల మార్గంలో కొత్తలైన్ నిర్మించాలని ప్రతిపాదించినా, తర్వాత దాన్ని ఉపసంహరించుకుని కాజీపేట–విజయవాడ లైన్తో అనుసంధానించాలని నిర్ణయించారు. ⇒ కాజీపేట–విజయవాడ లైన్లో మధిర సమీపంలోని ఎర్రుపాలెం స్టేషన్ నుంచి కొత్త లైన్ ప్రారంభమవుతుంది. ⇒ ఎర్రుపాలెం–పెద్దాపురం–చెన్నారావుపాలెం–పరిటాల–అమరావతి–కొప్పురావూరు–నంబూరు వరకు ఈ లైన్ కొనసాగుతుంది. ⇒ గుంటూరు–విజయవాడ లైన్లో ఉన్న నంబూరు స్టేషన్తో ఇది అనుసంధానమవుతుంది. ఈ నిడివి 56.53 కి.మీ.గా ఉంటుంది. ⇒ ఇటు కాజీపేట–విజయవాడ లైన్, అటు గుంటూరు–విజయవాడ లైన్.. ఈ రెండింటిని అనుసంధానిస్తూ మధ్యలో ఈ కొత్త గ్రీన్ఫీల్డ్ లైన్ నిర్మితమవుతుందన్నమాట. ⇒ హైదరాబాద్ నుంచి అమరావతి వరకు వెళ్లాలంటే.. సికింద్రాబాద్ స్టేషన్లో బయలు దేరే రైలు కాజీపేట మీదుగా ఖమ్మం, మధిర, ఎర్రుపాలెం వరకు ప్రస్తుతం ఉన్న లైనులో వెళ్లి అక్కడి నుంచి కొత్త మార్గంలోకి మళ్లి పెద్దాపురం, పరిటాల మీదుగా అమరావతి చేరుకుంటుంది. అక్కడి నుంచి ముందుకు సాగి ప్రస్తుతం ఉన్న గుంటూరు–విజయవాడ లైనుతో అనుసంధానమై విజయవాడ చేరుకుంటుంది. ఈ రెండు పాత లైన్లను అనుసంధానించటం వల్ల చాలా రైళ్లను ఎటునుంచైనా దారి మళ్లించొచ్చు. ⇒ ప్రస్తుత మార్గాల్లో సామర్థ్యానికి మించి రైళ్లు నడుస్తున్నందున, ఈ కొత్త మార్గం అందుబాటులోకి వస్తే కొంత ఉపశమనం కలుగుతుంది. ప్రయాణికుల రైళ్లకే కాకుండా సరుకు రవాణా రైళ్లకు కూడా ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. భారీ వంతెన ప్రత్యేకం.. ఈ మార్గంలో కృష్ణానదిపై భారీ వంతెనను నిర్మించనున్నారు. అమరావతి–పరిటాల సెక్షన్ల మధ్య వడ్డమాను–కొత్తపల్లి గ్రామాలను అనుసంధానిస్తూ కృష్ణానదిపై 3.3 కి.మీ. నిడివితో ఈ వంతెన నిర్మిస్తారు. 55 స్పాన్స్తో ఉండే ఈ వంతెన నిర్మాణానికి రూ.550 కోట్లు ఖర్చు కానుంది. విజయవాడలో కృష్ణానదిపై ఉన్న రైల్వే వంతెనకంటే ఇది చాలా పెద్దది కావటం విశేషం. భారీ వ్యయం.. ఈ లైన్ నిర్మాణానికి రూ.2300 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. పనులు జరిగేకొద్దీ ఈ మొత్తం మరింత పెరగనుంది. ఈ పనులను రెండు దశల్లో నిర్మిస్తారు. ఫేజ్–1: ⇒ నంబూరు–కొప్పురవూరు (5.5 కి.మీ.) ⇒ కొప్పురువూరు– అమరావతి (12.75 కి.మీ) ఫేజ్–2: ⇒ ఎర్రుపాలెం–పెద్దాపురం (5.1 కి.మీ) ⇒ పెద్దాపురం–చెన్నారావుపాలెం (4.7 కి.మీ.) ⇒ చెన్నారావుపాలెం–పరిటాల (8.65కి.మీ) ⇒ పరిటాల–అమరావతి (20.29 కి.మీ.) ⇒ ఈ ప్రాజెక్టు కోసం 361 హెక్టార్ల భూమిని సేకరిస్తున్నారు. ప్రస్తుతం భూసేకరణ ప్రక్రియ తుదిదశలో ఉంది. ⇒ కృష్ణానదిపై భారీ వంతెనతోపాటు ఈ మార్గంలో 32 పెద్ద వంతెనలు, 92 చిన్న వంతెనలు, రెండు ఆర్ఓబీలు, 10 ఆర్యూబీలు ఉంటాయి. ఎక్కడా వాహనాలు రైలు పట్టాల మీదుగా దాటి పోవాల్సిన పని ఉండదు. దేశంలో రైల్వే లెవల్ క్రాసింగ్స్ లేకుండా ప్రత్యామ్నాయంగా వంతెనలు నిర్మిస్తున్నందున, కొత్తగా నిర్మించబోయే మార్గాల్లో లెవల్ క్రాసింగ్స్ లేకుండా చూడాలని రైల్వేశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా అమరావతి కొత్త మార్గంలో ఎక్కడా లెవల్ క్రాసింగ్స్ ఉండకూడదన్న ఉద్దేశంతో ఇన్ని వంతెనలకు ప్రణాళికలు రూపొందించారు. ⇒ అమరలింగేశ్వరస్వామి దేవాలయం, అమరావతి స్తూపం, ధ్యాన బుద్ధ విగ్రహం, ఉండవల్లి గుహలు.. తదితర ఆధ్యాత్మిక ప్రాంతాలకు రైలు అందుబాటులోకి వస్తుంది. ⇒ మచిలీపట్నం పోర్టు, కాకినాడ పోర్టు, కృష్ణపట్నం పోర్టులకు మరిన్ని రైళ్లు వచ్చేందుకు వీలు కలుగుతుంది. -
అనిల్ హత్య వెనుక టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే మనవడు?
సాక్షి టాస్క్ఫోర్స్/సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/ మెదక్ జోన్/కొల్చారం: మెదక్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి మారెల్లి అనిల్ కుమార్ హత్య కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ హత్య వెనుక వైఎస్సార్ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే మనవడి ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం హైదరా బాద్లో పార్టీ సమావేశానికి హాజరై తిరిగి వెళ్తుండగా మెదక్ జిల్లా ఘన్పూర్ శివారులో రెండు కార్లలో వచ్చిన దుండగులు అనిల్పై కాల్పులు జరిపి హత్య చేసిన సంగతి తెలిసిందే. కాగా ఆ టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే మన వడు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు.ఆపై సెటిల్మెంట్లు.. దందాలు మొదలుపెట్టారు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పేరుతో ఏపీలోని ప్రొద్దుటూరు, బద్వేలు, నాగులపల్లె, దర్శి ప్రాంతాల్లోని సన్నిహితుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు. వారికి నమ్మకం కలిగించేందుకు కొన్ని ప్లాట్లను ఆయా వ్యక్తుల పేర్ల మీద ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ విషయం బయటపడటంతో దర్శి ప్రాంతానికి చెందిన వ్యక్తులు.. ఎమ్మెల్యే మనవడిని నిలదీ శారు. తమకు డబ్బులు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యవహారాల నేపథ్యంలో ఓ సెటిల్మెంట్కు సంబంధించి అనిల్కు ఆ ఎమ్మెల్యే మనవడు దాదాపు రూ.కోటి ఇవ్వాల్సి ఉన్నట్లు తెలిసింది.డబ్బులు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో బెంజ్ కారు అప్పగించినట్లు సమాచారం. రోజులు గడుస్తున్నా ఆ డబ్బులు చెల్లించకపోవడంతో ఎమ్మెల్యే మనవడిని అనిల్ పరుష పదజాలంతో దూషించినట్లు తెలిసింది. దీన్ని ఎమ్మెల్యే మనవడు తీవ్ర అవమానంగా భావించి.. ఓ మాజీ నక్సలైట్కు సుపారీ, ఆయుధం ఇచ్చి అనిల్ను హత్య చేయించినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లుఅనిల్ హత్యలో ఏపీకి చెందిన కొందరు ప్రత్యక్షంగా పాల్గొన్నారని, నేరం చేసిన తర్వాత అక్కడికే పారిపోయారని తెలిసింది. ఇందులో తన మనవడి పాత్ర వెలుగులోకి వస్తుండటంతో ఆ సీనియర్ ఎమ్మెల్యే చక్రం తిప్పారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఆయన సోదరుడి కుమారుడు రంగంలోకి దిగినట్లు విశ్వసనీయంగా తెలిసింది. తెలంగాణలో రాజకీయ పెద్దలతో తనకున్న సన్నిహిత సంబంధాలను ఉపయోగించుకుని.. ఇక్కడి పోలీసులపై ‘పెద్ద’ స్థాయిలో ఒత్తిళ్లు తెస్తున్నట్టు సమాచారం.కేసును తొక్కిపెట్టేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే రెండు రోజులుగా దర్యాప్తు నత్తనడకన నడుస్తున్నట్లు సమాచారం. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పేర్కొంటున్న పోలీసులు.. ఎలాంటి పురోగతిని సాధించలేకపోతున్నారు. దీనికి రాజకీయ ఒత్తిళ్లే కారణమని తెలుస్తోంది. కాగా, అనిల్ అంత్యక్రియలు బుధవారం ఆయన స్వగ్రామం పైతరలో జరిగాయి. అదుపులో నిందితులు?సీనియర్ ఎమ్మెల్యే మనుమడి వద్ద విల్లా కొనుగోలు చేసిన రామచంద్రారెడ్డి అనే వ్యక్తిని మెదక్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అతడిని జీడిమెట్ల పోలీస్స్టేషన్లో విచారిస్తున్నట్లు సమాచారం. అనిల్తో పరిచయాలపై ఆరా తీసినట్లు తెలిసింది. అనిల్ గతంలో పలు తగాదాల్లో ఉన్న భూములను సెటిల్మెంట్లు చేశాడని, అందుకే విల్లాకు సంబంధించిన గొడవ తనకు చెప్పటంతో రూ.2 కోట్లకుగాను రూ.1.20 కోట్లు వసూలు చేశాడని పోలీసులకు వివరించినట్లు తెలిసింది. కాగా అనిల్పై కాల్పులు జరిపిన నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. ఈ విషయంపై మెదక్ డీఎస్పీని వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. లేరంటూ సమాధానం దాటవేశారు. -
తాళాలే తియ్యరు.. ఫీజులు మెక్కేస్తారు
సాక్షి, హైదరాబాద్: క్లాసులే పెట్టరు..విద్యార్థులే రారు..ఫీజు రీయింబర్స్మెంట్ మాత్రం కాలేజీల ఖాతాల్లోకి వెళుతుంది.ఇదీ ప్రైవేటు ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల తీరు. కొన్నేళ్లుగా ఈ వ్యవహారం సాగుతోంది. దీనిపై ఏటా కుప్పలుతెప్పలుగా ఫిర్యా దులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యామండలి ఇటీవల దాదాపు 40 కాలేజీలను తనిఖీ చేసింది. చాలాచోట్ల ఎంబీఏ, ఎంసీఏ బోధనే జరగడం లేదని గుర్తించింది. కొన్నిచోట్ల అదే ప్రాంగణంలో ఇంజనీరింగ్ కాలేజీలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ లెక్కల్లో మాత్రం కాలేజీలు కనిపిస్తున్నాయి.కౌన్సెలింగ్ జరుగుతోంది. సీట్ల కేటాయింపు పూర్తవుతుంది. రికార్డుల్లో ఉన్న విద్యార్థులు కాలేజీల్లో మాత్రం కనిపించరు. తనిఖీలు చేపడతామని యూనివర్సిటీ అధికారులు నోటీసులు ఇస్తే మాత్రం పిలిపిస్తారు. ఘట్కేసర్లోని ఓ రాజకీయ నేత కాలేజీకి వెళ్లిన మండలి అధికారులు నివ్వెరబోయారు. అక్కడ ఇంజనీరింగ్ కాలేజీ మినహా ఎంబీఏ, ఎంసీఏ తరగతులు, రికార్డులు కనిపించలేదు. పరీక్షల తీరూ ప్రహసనమే రాష్ట్రవ్యాప్తంగా 281 ఎంబీఏ కాలేజీల్లో 38,200 సీట్లున్నాయి. 76 ఎంసీఏ కాలేజీల్లో 8,900 సీట్లున్నాయి. ఒక్కో వర్సిటీ పరిధిలో ఒక్క కాలేజీని మినహాయిస్తే..మిగతావన్నీ ప్రైవేట్ కాలేజీలే. ఉమ్మడి ప్రవేశపరీక్ష ద్వారా ఈ సీట్లు భర్తీ చేస్తారు. ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం రూ.28 వేల ఫీజు రీయింబర్స్ చేస్తుంది. ఇతర స్కాలర్షిప్పులూ విద్యార్థులకు అందుతాయి. ఈ ప్రక్రియ మొత్తం సాధారణంగానే జరిగిపోతుంది. ఈ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు 50 శాతం ప్రాజెక్టు వర్క్ ఉంటుంది. ఈ రిపోర్టులనూ వీరు తయారు చేయడం లేదు.ఇతరులు చేసినవి డబ్బులిచ్చి కొంటున్నారు. కాలేజీలో ఒక్క క్లాసు కూడా జరిగిన దాఖలాల్లేవు. ఎంబీఏ, ఎంసీఏ అధ్యాపకులు ఎవరో? వారికి ఏ అకౌంట్ నుంచి వేతనాలు ఇస్తున్నారో.. తెలిపే ఒక్క ఆధారం మండలి అధికారులకు కనిపించలేదు. విద్యార్థులంతా వార్షిక సంవత్సరం ఆఖరులో పరీక్షలకు హాజరవుతారు. అక్కడా కాలేజీలే మేనేజ్ చేస్తున్నాయనేది ఆరోపణ. క్లాసులకు రాకున్నా, పాఠాలు చదవకున్నా, అందరూ పాసయిపోతున్నారు. ఇలా డిగ్రీలు ఇస్తే విద్యార్థుల్లో నైపుణ్యం ఏముంటుందని మండలి వైస్చైర్మన్ ఇటిక్యాల పురుషోత్తం అన్నారు. నివేదికను తొక్కి పెట్టిందెవరు? ఆనవాళ్లే లేని కాలేజీల బాగోతంపై తనిఖీలు జరిపిన మండలి అధికారులు నివేదిక రూపొందించారు. ఇది జరిగి రెండు నెలలైంది. ఇంతవరకూ ఇది ప్రభుత్వం వద్దకే చేరలేదు. రాజకీయ ఒత్తిడే కారణమని తెలుస్తోంది. తనిఖీ వ్యవహారంపై మండలి వర్గాల్లోనూ వివాదాలకు కారణమవుతోంది. కీలకమైన నివేదికను ప్రభుత్వం దృష్టికి తేవాలని ఒక వీసీ పట్టుబడుతున్నారు. దీనిపై ఆందోళన చేసేందుకు విద్యార్థి సంఘాలు సమాయత్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే ఉస్మానియా వర్సిటీ అధికారులు గురువారం నుంచి కాలేజీల తనిఖీలు చేపట్టబోతున్నారు. ఇది పూర్తయిన తర్వాతే అనుబంధ గుర్తింపు ఇస్తారు. మండలి నివేదికను పరిగణలోనికి తీసుకుంటే చాలా కాలేజీలకు అనుబంధ గుర్తింపు వచ్చే అవకాశం ఉండదు. ఈ మొత్తం వ్యవహారంలో అన్ని స్థాయిలకు ముడుపులు వెళుతున్నాయని విద్యార్థి వర్గాలు అంటున్నాయి. -
‘స్థానిక’ స్థానాలు ఖరారు
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ త్వరలో వెలువడనున్న నేపథ్యంలో రాష్ట్రంలో జెడ్పీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ స్థానాలను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం.. రాష్ట్రంలో జిల్లా ప్రజా పరిషత్లు 31, జెడ్పీటీసీ స్థానాలు 566, మండల ప్రజా పరిషత్లు 566, ఎంపీటీసీ స్థానాలు 5,773, గ్రామపంచాయతీలు 12,778, వార్డులు 1,12,694 ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 2019లో పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.అప్పుడు 32 జెడ్పీపీలు, ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు 570 చొప్పున, ఎంపీటీసీలు 5,817, గ్రామ పంచాయతీలు 12,848 ఉన్నాయి. దీనిని బట్టి చూస్తే ఇప్పుడు 1 జెడ్పీపీ, నాలుగు జెడ్పీటీసీ, నాలుగు ఎంపీపీలు, 44 ఎంపీటీసీ స్థానాలు, 70 గ్రామపంచాయతీలు తగ్గాయి. మేడ్చల్–మల్కాజిగిరిలోని మెజారిటీ గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల్లో విలీనం కావడంతో ఈ గ్రామీణ జిల్లా ఉనికి లేకుండా పోయింది. దీనివల్లే ఒక జెడ్పీపీ, 4 జెడ్పీటీసీల సంఖ్య తగ్గింది.మరికొన్ని జిల్లాల్లోనూ పంచాయతీలు సమీప మున్సిపాలిటీల్లో విలీనం కావడం, ఇతర కారణాలతో గ్రామ పంచాయతీల సంఖ్య తగ్గింది. సంఖ్యాపరంగా చూస్తే...నల్లగొండ జిల్లా 33 జడ్పీటీసీలు, 33 ఎంపీపీలు, 353 ఎంపీటీసీ స్థానాలతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఇక ములుగు జిల్లా 10 జడ్పీటీసీలు, 10 ఎంపీపీలు, 83 ఎంపీటీసీ స్థానాలతో అత్యల్ప స్థానాలున్న జిల్లాగా నిలిచింది. టాప్–5, లాస్ట్–5 జిల్లాల్లోని స్థానాలు ఇలా.. టాప్–5 జిల్లాలు... నల్లగొండ: 1 జడ్పీ, 33 జడ్పీటీసీలు, 33 ఎంపీపీలు, 353 ఎంపీటీసీ స్థానాలు నిజామాబాద్: 1 జడ్పీ, 31 జడ్పీటీసీలు, 31 ఎంపీపీలు, 307 ఎంపీటీసీ స్థానాలు ఖమ్మం: 1 జడ్పీ, 20 జడ్పీటీసీలు, 20 ఎంపీపీలు, 283 ఎంపీటీసీ స్థానాలు సంగారెడ్డి: 1 జడ్పీ, 26 జడ్పీటీసీలు, 26 ఎంపీపీలు, 271 ఎంపీటీసీ స్థానాలు సూర్యాపేట: 1 జడ్పీ, 23 జడ్పీటీసీలు, 23 ఎంపీపీలు, 235 ఎంపీటీసీ స్థానాలు లాస్ట్–5 జిల్లాలు... ములుగు: 1 జడ్పీ, 10 జడ్పీటీసీలు, 10 ఎంపీపీలు, 83 ఎంపీటీసీ స్థానాలు వరంగల్: 1 జడ్పీ, 11 జడ్పీటీసీలు, 11 ఎంపీపీలు, 130 ఎంపీటీసీ స్థానాలు రాజన్న సిరిసిల్ల: 1 జడ్పీ, 12 జడ్పీటీసీలు, 12 ఎంపీపీలు, 123 ఎంపీటీసీ స్థానాలు వనపర్తి: 1 జడ్పీ, 15 జడ్పీటీసీలు, 15 ఎంపీపీలు, 133 ఎంపీటీసీ స్థానాలు మంచిర్యాల: 1 జడ్పీ, 16 జడ్పీటీసీలు, 16 ఎంపీపీలు, 129 ఎంపీటీసీ స్థానాలు -
ఆ ముచ్చటే లేదు!
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆధ్వర్యంలో జరిగిన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో బనకచర్ల అంశమే ప్రస్తావనకు రాలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. ‘బనకచర్ల ప్రాజెక్టును కడతామని ఏపీ వాళ్లు ప్రస్తావిస్తే కదా.. మేము ఆపమంటూ అభ్యంతరం తెలిపేది..’ అని సీఎం అన్నారు. అయినా బనకచర్లపై ఇప్పటికే తెలంగాణ అభ్యంతరాలు తెలియజేసిందని, ఆ ప్రాజెక్టుపై పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా అభ్యంతరాలు తెలిపాయని చెప్పారు.ఇది కేవలం అనధికార (ఇన్ఫార్మల్) భేటీ మాత్రమే అన్న రేవంత్రెడ్డి.. ఇద్దరు సీఎంలతో ఈ భేటీని నిర్వహించేలా చేయడం, ఇరు రాష్ట్రాలకు సంబంధించిన జల వివాదాల పరిష్కారానికి కమిటీ వేసేలా చేయడం.. తెలంగాణ సాధించిన విజయంగా అభివర్ణించారు. ముఖ్యమంత్రుల సమావేశం పూర్తిగా ఇన్ఫార్మల్గానే సాగిందని, కేంద్రం ఎటువంటి ఎజెండా పెట్టుకోకుండా, కేవలం ఒక వేదికను ఏర్పాటు చేసి మధ్యవర్తిలా మాత్రమే వ్యవహరించిందని తెలిపారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎంలు, నీటిపారుదల శాఖల మంత్రులు, అధికారుల సమావేశం అనంతరం..రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మీడియాతో మాట్లాడారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం కాదు ‘జరిగింది అపెక్స్ కౌన్సిల్ సమావేశం కాదు. కేవలం ముఖ్యమంత్రుల స్థాయిలో జరిగిన ఒక అనధికార సమావేశం. కృష్ణా, గోదావరి నదీ జలాల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేస్తున్న కమిటీ అన్ని అంశాలను గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటుంది. పార్లమెంటులో చేసిన రాష్ట్ర పునరి్వభజన చట్టంలోని అంశాల అమలు నిబద్ధతకే దిక్కు లేదు. ఏ విషయంలోనైనా నమ్మకంతో ముందుకు పోవాలి తప్ప, అనుమానించుకుంటూ పోతే ఏ సమస్యలూ పరిష్కారం కావు..’ అని ముఖ్యమంత్రి (విలేకరుల ప్రశ్నకు జవాబు) అన్నారు. యుద్ధ ప్రాతిపదికన టెలీమెట్రీ ‘కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంపై రెండు రాష్ట్రాలకూ అనుమానాలున్నాయి. అందుకే టెలీమెట్రీ పరికరాలు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఎవరెన్ని నీళ్లు వాడుతున్నారోనన్న రాష్ట్రాల సందేహాలకు ఇది శాశ్వత పరిష్కారం చూపిస్తుంది. కాబట్టి అవసరమైతే తెలంగాణ నిధులతోనే యుద్ధ ప్రాతిపదికన అన్ని పాయింట్లలో టెలీమెట్రీ ఏర్పాటు చేస్తాం. గోదావరి బోర్డు హైదరాబాద్లో, కృష్ణా బోర్డు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. శ్రీశైలం డ్యాం మరమ్మతులు తక్షణమే చేపట్టేందుకు ఏపీ అంగీకరించింది. ఈ నాలుగు అంశాలపైనే ఈసారి చర్చ సాగింది. టెలీమెట్రీ ఏర్పాటుతో పాటు శ్రీశైలం డ్యాం మరమ్మతులకు ఏపీని ఒప్పించడం కూడా రాష్ట్రం సాధించిన విజయమే. ఈ విషయంలో ఎలాంటి ఊహాగానాలకు తావు లేదు. కమిటీ ఏర్పాటు అయిన 30 రోజుల్లోగా సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం..’ అని రేవంత్రెడ్డి చెప్పారు. కేసీఆర్ రాష్ట్ర హక్కులు ఏపీకి ధారాదత్తం చేశారు ‘గత సీఎం కేసీఆర్ తెలంగాణ హక్కులను ఏపీకి ధారాదత్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కూడా అమలు చేయలేకపోయారు. పదేళ్లు అధికారంలో ఉండి ఏం సాధించారు? కనీసం బోర్డుల కార్యాలయాలు ఎక్కడ ఉండాలో కూడా నిర్ణయించలేకపోయారు. కానీ మేము సమస్యలను పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తున్నాం. మా హయాంలో పలు అంశాలు చర్చల స్థాయికి రావడం, నాలుగు అంశాలపై స్పష్టమైన నిర్ణయాలు రావడం తెలంగాణ సాధించిన విజయం. కానీ కొందరు అధికారం కోల్పోయిన బాధతో ఈ చర్చలు సఫలమవ్వకూడదని చూస్తున్నారు..’ అని సీఎం విమర్శించారు. ఈ సమావేశంలో కేంద్రం కేవలం మధ్యవర్తిగా మాత్రమే వ్యవహరించిందని, జలశక్తి మంత్రి ఈ విషయంలో ఎవరి పక్షాన నిలబడకుండా ఒక న్యాయమూర్తిలా వ్యవహరించారని కితాబు ఇచ్చారు. సమావేశం ఫలప్రదం: ఏపీ మంత్రి నిమ్మల కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో జరిగిన రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం ఫలప్రదమైనట్లు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాకు చెప్పారు. భేటీ స్నేహపూరిత, సుహృద్భావ వాతావరణంలో జరిగిందని అన్నారు. కేంద్రం ఏర్పాటు చేసే కమిటీ సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో పనిచేస్తుందని తెలిపారు. -
రేవంత్ గుట్టు రట్టయ్యింది: కేటీఆర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్రెడ్డి 48వ ఢిల్లీ పర్యటన గుట్టురట్టయ్యిందన్న కేటీఆర్.. ముసుగు వీడింది.. నిజం తేటతెల్లమయ్యిందన్నారు. ‘‘నిధులు రాహుల్ గాంధీకి.. నీళ్లు చంద్రబాబుకి.. బనకచర్ల గురించి చర్చే రాలేదని బుకాయిస్తున్నారు. గురుదక్షిణగా గోదావరి జలాలను అప్పజెప్పడానికేనా?. నువ్వు గద్దెనెక్కింది’’ అంటూ ఎక్స్ వేదికగా రేవంత్పై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘కోవర్టులెవరో, తెలంగాణ కోసం కొట్లాడిందెవరో తేలిపోయింది. ఒక్క బొట్టు నీరు అక్రమంగా అప్పజెప్పినా పోరాటం తప్పదు. తెలంగాణను పీక్కుతింటున్న రాబందుల పని పడతాం’’ అంటూ కేటీఆర్ హెచ్చరించారు. నీ గురువుపై విశ్వాసం చూపించడానికి తెలంగాణ విధ్వంసం కావలసిందేనా?. ఇంకెందుకు రెండు రాష్ట్రాలు, ఇద్దరు ముఖ్యమంత్రులు?. నిన్ను ఎన్నుకున్న పాపానికి…చెరిపేయి సరిహద్దులు! తెలంగాణా మీద నీ అక్కసు చల్లారుతుందేమో!’’ అంటూ కేటీఆర్ పోస్ట్ చేశారు.ముసుగు వీడింది, నిజం తేటతెల్లమయ్యింది! 48వ ఢిల్లీ పర్యటన గుట్టురట్టయ్యిందినిధులు రాహుల్ గాంధీకి, నీళ్లు చంద్రబాబుకి, తెలంగాణా వ్యతిరేకిని ముఖ్యమంత్రిగా గెలిపించినందుకు….బూడిద తెలంగాణ ప్రజలకి! బనకచర్ల గురించి చర్చే రాలేదని బుకాయించి….గురుదక్షిణగా గోదావరి జలాలను అప్పచెప్పడం…— KTR (@KTRBRS) July 16, 2025 -
జలశక్తి సమావేశంలో కేంద్రం కీలక నిర్ణయాలు.. సీఎం రేవంత్ ఏమన్నారంటే
సాక్షి,న్యూఢిల్లీ: జలశక్తి సమావేశంలో కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గోదావరి,కృష్ణా జలాలపై వివాదాలపై పరిష్కరించేలా కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. కేంద్రం ఆధ్వర్యంలో జలవివాదాల పరిష్కార కమిటీని కేంద్రం నియమిస్తుంది. ఈ నెల 21లోగా కమిటీ ఏర్పాటు కానుంది. హైదరాబాద్లోని గోదావరి నది బోర్డు,అమరావతిలోనే కృష్ణానది బోర్డు ఉండేలా నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు రిజర్వయార్ల ప్లో నీటి లెక్కలను గుర్తించేలా టెలిమెట్రీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకు వచ్చేలా కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ సమావేశంపై తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ఇది కేవలం ఇన్ ఫార్మల్ మీటింగ్ మాత్రమే. నాలుగు అంశాలపై పరిష్కారం దొరికింది. కేసీఆర్ ఇన్నాళ్లు వీటికి పరిష్కారం కనుక్కోలేదు. ఈ సమావేశంలో మేము విజయం సాధించాం. అన్ని ప్రాజెక్టులలో టెలిమెట్రి యంత్రాలు పెట్టేందుకు ఏపీ అంగీకరించడం మా విజయం. చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం చేసుకుంటాం..పోరాటం చేయాల్సిన అవసరం లేదు. కృష్ణా, గోదావరిపై ప్రాజెక్టుల అపరిష్కృతంగా ఉన్న అన్ని అంశాలపై ఇంజనీర్ల కమిటీ ముందడుగు చూపిస్తుంది. వారం రోజుల్లో కమిటీ ఏర్పాటు అవుతుందని తెలిపారు. -
తెలంగాణకు అలర్ట్.. రెండురోజుల పాటు భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రెండు రోజులపాటు భారీ వర్షాలు ఉంటాయని తెలిపింది. వర్షాలు లేక రైతాంగం ఇప్పటికే తీవ్ర అవస్థలు పడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఎండలు, ఉక్కపోతతో సామాన్య ప్రజానీకం సైతం ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో.. రేపు(గురువారం) నల్గొండ, సూర్యాపేట, నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయని తెలిపింది. అలాగే.. ఎల్లుండి మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్ష పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. మిగతా జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంటుందని అంచనా వేస్తోంది. ఈ క్రమంలో ఆ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పలు జిల్లాల్లో పడొచ్చని హెచ్చరించింది.రాజధాని హైదరాబాద్ నగరంలో ఈరోజు సాయంత్రం లేదంటే రాత్రి తేలికపాటి వర్షం పడొచ్చని అంచనా వేస్తోంది. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలోని 340 మండలాల్లో ఇప్పటికే లోటు వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెయిన్ అలర్ట్ జిల్లాలుఆదిలాబాద్, ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లిభూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, నిర్మల్నిజామాబాద్, జగిత్యాల, కొత్తగూడెంనల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండరంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ఈదురుగాలులు: గంటకు 30–40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.⚠️ హెచ్చరికలు:పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ ప్రజలు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల సమయంలో సురక్షితంగా ఉండాలని సూచనచెట్లు విరిగిపడే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు -
దేవుడా మేమేం పాపం చేశాం.. నా బిడ్డను తీసుకెళ్లావా?
కొల్చారం(నర్సాపూర్): కాంగ్రెస్ ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి అనిల్ హత్య ఉమ్మడి జిల్లాలో కలకలం రేపింది. పేద కుటుంబంలో పుట్టిన అనిల్.. రాజకీయంగా అంచెలంచెలుగా జిల్లాస్థాయి నాయకుడిగా ఎదిగారు. పైగా ఆర్థికంగా బలపడ్డారు. అయితే సోమవారం హైదరాబాద్లో పార్టీ సమావేశానికి వెళ్లి తిరిగి వస్తుండగా అనూహ్య రీతిలో దుండగులు వెంటాడి వేటాడి కాల్పులు జరిపి అనిల్ను మట్టుబెట్టారు. దీంతో అతడి సొంతూరు కొల్చారం మండలం పైతరలో తీవ్ర విషాదం నెలకొంది. బుధవారం అనిల్ పుట్టిన రోజు ఉండటం.. ఒక రోజు ముందే హత్యకు గురికావడంతో అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. అయ్యో.. దేవుడా.. ‘అయ్యో.. బిడ్డా పుట్టిన రోజుకు ఒక ముందే మమ్మల్ని విడిచి పోయావా?.. దేవుడా మేమేం పాపం చేశాం.. నా బిడ్డను తీసుకెళ్లావా?’ అంటూ అనిల్ తల్లి యేసమ్మ రోదించడం అక్కడున్న వారిని కదిలించింది. బర్త్డే వేడుకలు చేసుకుందాం..అందరం కలుసుకుందాం అని చెప్పిన అనిల్ను ఇలా విగతజీవిగా చూస్తామని కలలు కూడా ఊహించలేదని స్నేహితులు కన్నీటిపర్యంతమయ్యారు. పదిమందికి సహాయం చేసే గుణం తప్ప మా అన్న ఎవరికీ చెడు చేయలేదని, శత్రువులు కూడా ఎవరూ లేరని అనిల్ సోదరుడు నవీన్ విలపిస్తున్నాడు. పోలీస్ ఈ విషయంలో పూర్తి దర్యాప్తు చేసి నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గ్రామంలో విషాదఛాయలు అనిల్ మృతితో పైతర గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. తల్లిదండ్రులు మాత్రం తను మా కుమారుడు ఎవరికి హాని తలపెట్టింది లేదని, కావాలనే పిలిచి తమ కుమారుడిని హత్య చేశారంటూ విలపిస్తున్నారు. అనిల్పై కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులతోపాటు వివిధ పారీ్టలకు చెందిన నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఫోన్ మాట్లాడిన 15 నిమిషాలకే.. ఫోన్లో మాట్లాడిన 15 నిమిషాలకే యాక్సిడెంట్ అయ్యిందన్న వార్త అందిందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లేశంగౌడ్ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు గాం«దీభవన్లో జరిగిన నియోజకవర్గస్థాయి సమావేశానికి నాతో పాటు అనిల్, ఇంకా కొంతమంది నాయకులు పాల్గొన్నారన్నారు. తిరుగు ప్రయాణంలో అదే కారులో నేను మరికొంతమంది కలసి ప్రయాణమయ్యామన్నారు. నేను కూకట్పల్లి మెట్రోస్టేషన్ వద్ద దిగి వెళ్లిపోయానని తెలిపారు. రాత్రి 7:45కు ఫోన్ చేయగా అందర్నీ వారివారి గ్రామాల్లో దించేసి ఇంటికి వెళ్తున్నట్లు చెప్పారని, పావుగంట తర్వాత అనిల్కు యాక్సిడెంట్ అయిందని ఫోన్ వచ్చిందని వివరించారు. క్లూస్టీం ఆధారాల సేకరణ ఘటనా స్థలిని ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి సందర్శించారు. క్లూస్ టీం సహాయంతో ఆధారాలను సేకరించారు. -
భర్తకు కూల్ డ్రింక్ లో గడ్డి మందు కలిపి..
వర్ధన్నపేట: కుటుంబ కలహాల కారణంగా ఓ భార్య కూల్డ్రింక్లో గడ్డి మందు కలిపి భర్తకు ఇవ్వడంతో తీవ్ర అనారోగ్యానికి గురైన అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. వర్ధన్నపేట ఎస్సై చందర్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం భవానికుంట తండాకు చెందిన జాటోతు బాలాజీ (44) ఈనెల 8న తండాలోని తన నివాసంలో దాటుడు పండుగ జరుపుకున్నాడు. పండుగ సందర్భంగా సాయంత్రం ఏడు గంటల సమయంలో బాలాజీ తాను మద్యం సేవించేందుకు బయటికి వెళ్తున్నానని భార్య కాంతికి చెప్పాడు. బయటికి వెళ్లొద్దని, ఇంట్లోనే మద్యం ఉందని చెప్పిన భార్య, వంటింట్లోకి వెళ్లి ఒక గ్లాసులో కూల్డ్రింక్లో గడ్డి మందు కలిపి బాలాజీకి ఇచ్చింది. ఇది తాగిన కొద్దిసేపటికే బాలాజీ గొంతులో నొప్పిగా ఉందని చెప్పడంతో కాంతి అతన్ని వదిలిపెట్టి అదే తండాలో ఉండే తన బావ అయిన వాంకుడోతు దశరు ఇంటికి వెళ్లింది. బాలాజీ పరిస్థితిని గమనించిన తండావాసులు వెంటనే వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా, వైద్యుల సూచనల మేరకు వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ఎంజీఎంనుంచి ఈనెల 13న హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మరణించినట్లు ఎస్ఐ తెలిపారు. భర్తతో గొడవను మనసులో పెట్టుకున్న కాంతి తన బావ దశరు ప్రోత్సాహంతో గడ్డి మందును ఉద్దేశ పూర్వకంగానే బాలాజీకి తాగించినట్లు చెప్పారు. మృతుడికి కూతురు, కుమారుడు ఉన్నారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఇంత బరితెగింపా.. గుంపులో ఎవరూ చూడలేదనుకున్నారా?
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఇటీవల జరిగిన మొహర్రం, బోనాలు ఊరేగింపుల్లో పోకిరీలు రెచ్చిపోయారు. విచక్షణా రహితంగా, అనుచితంగా తాకుతూ మహిళలు, యువతులను వేధించారు. ఈ రెండు సందర్భాల్లోనూ షీ–టీమ్స్ నిఘాలో మొత్తం 478 మంది పట్టుబడినట్లు డీసీపీ డాక్టర్ ఎన్జేపీ లావణ్య మంగళవారం ప్రకటించారు. దీనికోసం షీ–టీమ్స్ రహస్య కెమెరాలు వినియోగించాయి. చిక్కిన పోకిరీల్లో 386 మంది మేజర్లు, 92 మంది మైనర్లు ఉన్నారు. ఈ ఆకతాయిల్లో నలుగురిపై పెట్టీ కేసులు, నగంలోని వివిధ ఠాణాల్లో ఎనిమిది ఎఫ్ఐఆర్లు నమోదు చేయించారు. మిగిలిన వారిని మందలించి పంపారు. #WomenSafety - #HyderabadSHE Teams caught a total of 478 people red-handed for Misbehaving with Women Devotees during #Bonalu , including 386 majors and 92 minors in Hyderabad#SHETeams of @hydcitypolice apprehended several individuals red-handed for #misbehaving with #women… pic.twitter.com/7EDBUgo4JN— Surya Reddy (@jsuryareddy) July 15, 2025 -
మైనర్ డ్రైవింగ్ అని ఆపితే... చోరీ అయిన బైకు తేలింది
బంజారాహిల్స్: ఓ మైనర్ హెల్మెట్ లేకుండా వస్తున్నాడని హోండా యాక్టివాను ఆపి చలానా విధించిన ట్రాఫిక్ పోలీసులకు..అది చోరీ బైకు అని తెలిసింది. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ కేబీఆర్ పార్కు చౌరస్తాలో బంజారాహిల్స్ ట్రాఫిక్ ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేస్తున్నారు. అదే సమయంలో ముగ్గురు యువకులు హోండా యాక్టివాపై నెంబర్ ప్లేట్ లేకుండా వస్తూ కనిపించారు. హెల్మెట్ కూడా ధరించకపోవడంతో వారిని ఆపారు. బైక్ నడిపిస్తున్న వ్యక్తి మైనర్ అని తేలింది. బైక్ ధ్రువ పత్రాలు అడగ్గా చూపించలేదు. బైక్ నెంబర్ కూడా చెప్పకపోవడంతో చాసిస్ నెంబర్ ఆధారంగా టీఎస్09 ఈ జెడ్ 1525 అనే రిజి్రస్టేషన్ నెంబర్ కలిగిన బైక్ అని గుర్తించారు. దీంతో ఈ నెంబర్ మీద మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ చలానా విధించారు. బైక్ నెంబర్తో పాటు ఫోటోను ట్యాబ్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేశారు. ఆన్లైన్లో బండి నెంబర్ నమోదైన వెంటనే యజమానికి మెసేజ్ వెళ్ళింది. నిమిషాల వ్యవధిలోనే వాహన యజమాని లియాండర్ టెర్రస్ స్మిత్ అనే వ్యక్తి బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్దకు ఉరుకులు పరుగులతో వచ్చాడు. కాసేపటి క్రితం ట్రాఫిక్ పోలీసులు చలానా విధించిన బండి తనదేనని, ఏప్రిల్ 2వ తేదీన తన బైక్ చోరీకి గురికాగా అదే రోజు మీర్పేట పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. దీంతో అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు ఈ విషయాన్ని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 లో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి తదితరులకు తెలిపారు. అప్పటికీ యాక్టివా మీద వచి్చన ముగ్గురు అక్కడే ఉండడంతో వారిని పట్టుకున్న ట్రాఫిక్ పోలీసులు ఈ వ్యవహారాన్ని మీర్పేట పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. తమ పీఎస్ పరిధిలో యాక్టివా బైక్ చోరీ అయిన మాట వాస్తవమేనని ఈ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశామని అక్కడ పోలీసులు తెలిపారు. దీంతో బైక్ మీద వచ్చిన ముగ్గురితో పాటు బైక్ను కూడా మీర్పేట పోలీసులకు అప్పగించారు. మొత్తానికి ట్రాఫిక్ పోలీసులు విధించిన చలానా చోరీ బైక్ను పట్టించడంతో మీర్పేట్ పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. -
ENC మురళీధర్రావు.. చంచల్గూడ జైలుకు తరలింపు
సాక్షి, హైదరాబాద్: అక్రమ ఆస్తుల కేసులో ఇరిగేషన్ శాఖ మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ENC) మురళీధర్రావును ఏసీబీ అధికారులు మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. అనంతరం, ఏసీబీ అధికారులు.. మురళీధర్ రావును న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచారు. ఈ క్రమంలో మురళీధర్ రావుకు న్యాయమూర్తి .. 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో, ఆయనను పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు.ఇదిలా ఉండగా.. నీటిపారుదలశాఖ మాజీ ఈఎన్సీ మురళీధర్రావును మంగళవారం ఉదయం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. మురళీధర్రావుతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో అధికారులు సోదాలు నిర్వహించారు. మొత్తం 11 చోట్ల తనిఖీలు జరిగాయి. వివిధ పత్రాలను ఏసీబీ అధికారులు పరిశీలించి భారీగా ఆస్తులను గుర్తించారు. హైదరాబాద్ శివారులో 11 ఎకరాల భూమి, నాలుగు ఇళ్ల స్థలాలు, మోకిలలో 6,500గజాల స్థలం గుర్తించారు.కొండాపూర్లో విల్లా.. బంజారాహిల్స్, యూసఫ్గూడ, బేగంపేట, కోకాపేట ప్రాంతాల్లో అపార్ట్మెంట్ ప్లాట్లు ఉన్నట్లు తేలింది. కరీంనగర్, హైదరాబాద్లో బిజినెస్, జహీరాబాద్లో సోలార్ పవర్ ప్రాజెక్ట్, వరంగల్లో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్లను గుర్తించారు. మురళీధర్రావు ఉమ్మడి రాష్ట్రంలోనే పదవీ విరమణ పొందారు. తర్వాత ఆయన పదవీ కాలాన్ని 13 ఏళ్ల పాటు పొడిగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొన్నాళ్లు పదవిలో ఉన్నారు. మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక తర్వాత మురళీధర్రావును ప్రభుత్వం తొలగించింది. -
బుట్టబొమ్మతో ప్రేమాయణం కొనసాగిస్తా... ఏం చేసుకుంటావో చేసుకో
హైదరాబాద్: ‘ఇన్స్టా రీల్స్ అమ్మాయి బుట్టబొమ్మతో ప్రేమాయణం కొనసాగిస్తా ...ఏం చేసుకుంటావో చేసుకో’అన్న భర్త మాటలతో క్షణికావేశానికి లోనైన వైద్యురాలు ప్రత్యూష ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్రెడ్డి వెల్లడించారు. ఆదివారం డాక్టర్ ప్రత్యూష అనుమానాస్పదంగా మృతి చెందినట్లు నమోదైన కేసులో విచారించిన పోలీసులు మంగళవారం ఆమె భర్త డాక్టర్ అల్లాడి సృజన్, అత్తమామలు పుణ్యవతి–మధుసూదన్తోపాటు ఇన్స్టా రీల్స్గర్ల్ బానోతు శ్రుతిలను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు. హసన్పర్తి పోలీస్స్టేషన్లో కాజీపేట ఏసీపీ ప్రశాంత్రెడ్డి ఆవివరాలు వెల్లడించారు. మట్టెవాడకు చెందిన తంజాపూరి పద్మావతి కూతురు డాక్టర్ ప్రత్యూషకు (35), ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపూర్కు చెందిన డాక్టర్ అల్లాడి సృజన్కు 2017లో వివాహం జరిగింది. ప్రస్తుతం వీరు హసన్పర్తిలోని కాకతీయ వెంటెజ్లో ఓ విల్లా కొనుగోలు చేసి నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు. వీరితోపాటు సృజన్ తల్లిదండ్రులు పుణ్యవతి–మధుసూదన్లు కూడా ఇక్కడే ఉంటున్నారు. బానోతు శ్రుతితో కుటుంబంలో చిచ్చు.. ఏడాది క్రితం బుట్టబొమ్మ–17 ఇన్స్ర్ట్రాగాం ఐడీ పేరుతో రీల్స్ చేసే అమ్మాయి బానోతు శ్రుతితో డాక్టర్ సృజన్ దగ్గరయ్యాడు. ఈ క్రమంలో తన భార్యకు విడాకులు ఇస్తానని బెదిరించాడు. మరో వైపు శ్రుతి కూడా ఫోన్ ద్వారా ప్రత్యూషను వేధింపులకు గురి చేయడం ప్రారంభించింది. ఆది వారం కూడా ఆ దంపతుల మధ్య గొడవ జరిగింది. శ్రుతిని వదిలేది లేదని సృజన్ చెప్పడంతో ప్రత్యూష పైఅంతస్తుకు వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. కాగా గొడవ విషయంలో సృజన్ తల్లిదండ్రులు కూడా కొడుకుకే మద్దతు పలికారని ఏసీపీ పేర్కొన్నారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. -
డ్రగ్స్ పెడ్లర్లుగా పోలీసుల సుపుత్రులు
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు మాదక ద్రవ్యాల రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతుంటే.. మరోవైపు వారి కొడుకులే డ్రగ్స్ పెడ్లర్లుగా దందా నిర్వహిస్తున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో ఓ డీసీపీ కుమారుడు మోహన్ను డ్రగ్స్ కేసులో సైబరాబాద్ ఈగల్ పోలీసులు అరెస్టు చేశారు. ఇంటెలిజెన్స్ వింగ్ (ఎస్ఐబీ) ఓఎస్డీ కొడుకు రాహుల్తేజను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఇటీవల అరెస్టయిన కొంపల్లిలోని మల్నాడు కిచెన్ యజమాని, అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్ సూర్య అమ్మినేని సెల్ఫోన్ కాల్ డేటా, ఇతరత్రా సాంకేతిక ఆధారాలను విశ్లేషించగా.. వీరికి సూర్యతో సత్సంబంధాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. నిందితుల సెల్ఫోన్లు, ల్యాప్టాప్లను స్వా«దీనం చేసుకున్న ఈగల్ బృందం వాటిని విశ్లేíÙస్తోంది. వీరికి ఎంతమంది సెలబ్రిటీలు, ప్రముఖులతో లింక్లు ఉన్నాయో ఈగల్ పోలీసులు రట్టు చేసే పనిలో పడ్డారు.గుట్టు రట్టయిందిలా.. డ్రగ్స్ కేసులో సూర్యతో సహా అరుగురిని అరెస్టు తర్వాత పోలీసులు వారి నెట్వర్క్పై దృష్టి పెట్టారు. సాంకేతిక ఆధారాలను ముమ్మరం చేయగా ఈ క్రమంలో ఎస్ఐబీ అధికారి కొడుకు రాహుల్తేజ పాత్ర తెరపైకి వచ్చింది. డ్రగ్స్ వ్యవహారంలో తేజ పాత్రపై లోతుగా దర్యాప్తు చేయగా, మరికొన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి. గతేడాది జనవరిలో డ్రగ్స్ కేసులో నిజామాబాద్ పోలీసులు నాగ్పూర్–హైదరాబాద్ మార్గంలో కొకైన్, ఎండీఎంఏ రవాణా చేస్తుండగా విక్రం, ఖాజా మొహిద్దీన్లను పట్టుకున్నారు. వీరిని విచారించగా.. ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్లకు చెందిన ప్రధాన మాదక ద్రవ్యాల సరఫరాదారులకు తేజనే నిందితులకు పరిచయం చేశాడని ఆ ఇద్దరూ అంగీకరించారు. దీంతో నిజామాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్లోనూ ఏ–3గా తేజ పేరును చేర్చారు. కానీ, ఎప్పుడూ అరెస్టు చేయలేదు. పరారీలో ఉన్నట్టు పేర్కొన్నారు. తేజ హైదరాబాద్లో ఒక రెస్టారెంట్ను సైతం నడుపుతున్నాడు. ముందస్తు బెయిల్ కూడా లేదు.. రాహుల్తేజ ఎస్ఐబీ ఓఎస్డీ కొడుకు కావడంతోనే గతంలో పోలీసులు అతన్ని అరెస్ట్ చేయకుండా జాప్యం చేశారనే విషయాన్ని సైబరాబాద్ ఈగల్ అధికారులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులపై న్యాయస్థానంలో చార్జీషీట్ దాఖలు చేసిన నిజామాబాద్ పోలీసులు.. తేజపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఇప్పటికే ఏ–3గా తేజ ఉన్నా, కనీసం బెయిల్ లేదా ముందస్తు బెయిల్ కూడా తీసుకోలేదంటే నిందితుడికి పోలీసులు ఎలా సహకరించారో స్పష్టమవుతుందని ఈగల్ అధికారులు అంటున్నారు. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అతడిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. అయితే, తాజాగా సూర్య అమ్మినేని కేసులో అరెస్టు చేస్తారా లేదా నిజామాబాద్ కేసులలో అరెస్టు చేస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. -
గతేడాది 357 మంది మావోల మృతి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గతేడాది కాలంలో సానుభూతిపరుడి నుంచి జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు వరకు మొత్తం 357 మంది మావోయిస్టులు చనిపోయారు. మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ (సీసీ) పేరిట గత జూన్ 23న రాసిన 22 పేజీల డాక్యుమెంట్లో ఈ వివరాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ డాక్యుమెంట్ మంగళవారం వెలుగులోకి వచ్చింది. అందులోని వివరాల ప్రకారం...బూటకపు ఎన్కౌంటర్లలో 80 మంది చనిపోయారని, మొత్తంగా చనిపోయిన వారిలో 136 మంది మహిళలు ఉన్నారని, ఎదురుకాల్పులు కాకుండా అనారోగ్య కారణాలతో నలుగురు, ప్రమాదంలో మరొకరు మృతి చెందారు. నలుగురు సెంట్రల్ కమిటీ సభ్యులు, 16 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు, 23 మంది జిల్లా కమిటీ సభ్యులు, 83 మంది ఏరియా కమిటీ, 138 మంది పార్టీ సభ్యులు, పీఎల్జీఏ 17, ఇతర విభాగాల వారు 40, గుర్తించని మృతులు 36 మంది ఉంటారని వివరించింది. వీరి త్యాగాలను స్మరించుకుంటూ ఈ నెల 28 నుంచి ఆగస్టు 3 వరకు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. చుట్టుముట్టి చంపుతున్నారు నక్సల్బరీ విప్లవ పోరాటం మొదలైన తర్వాత ఆపరేషన్ కగార్తో ఏడాది వ్యవధిలోనే పెద్ద సంఖ్యలో సెంట్రల్, స్టేట్ కమిటీ సభ్యులను కోల్పోవడంతో తీవ్ర నష్టం జరిగిందని పార్టీ సెంట్రల్ కమిటీ పేర్కొంది. గతేడాది ఏప్రిల్లో జరిగిన కాంకేర్ ఎన్కౌంటర్ (29 మంది మావోయిస్టులు చనిపోయారు) తర్వాత సగటున ప్రతీ 20 రోజులకు ఒక భారీ ఎన్కౌంటర్ జరుగుతోందని, ఈ ఘటనల్లో కనిష్టంగా 10 నుంచి గరిష్టంగా 35 మంది వరకు మావోయిస్టులు చనిపోయారని తెలిపింది. 20 కిలోమీటర్ల వలయాకారంలో వేలాది మంది భద్రతాదళాలు చుట్టుముడుతూ తమపై దాడులు చేస్తున్నాయని, ఆధునిక ఆయుధాలు, టెక్నాలజీ గల భద్రతా దళాలను తమ కేడర్ ప్రాణాలకు తెగించి ఎదుర్కోంటోందని ఆ డాక్యుమెంట్లో పేర్కొంది. నిజాలు దాస్తున్నారు ప్రతీ ఎదురుకాల్పుల ఘటనలో భద్రతాదళాల వైపు కూడా పది మందికి మించి జవాన్లు చనిపోతున్నారని సెంట్రల్ కమిటీ తెలిపింది. తమకున్న అంచనా ప్రకారం ప్రతిదాడుల్లో 70 మంది జవాన్లు చనిపోగా, 130 మంది తీవ్రంగా గాయపడి ఉంటారని అభిప్రాయపడింది. అయితే ఈ విషయాన్ని దాచి పెడుతూ కేవలం మావోయిస్టుల మరణాల లెక్కలనే పాలకులు బయటకు వెల్లడిస్తున్నారని విమర్శించింది. దీర్ఘకాలిక సాయుధ పోరాటంలో ఎత్తుపల్లాలు సహజమేనని వివరణ ఇచ్చింది. అంతర్జాతీయ వ్యవహారాలపై కూడా ఈ డాక్యుమెంట్లో కేంద్ర కమిటీ తమ అభిప్రాయాలను తెలిపింది. అనువైన సమయం కోసం గెరిల్లా యుద్ధతంత్రంలో అనుసరించాల్సిన వ్యూహాలను సరైన రీతిలో అమలు చేయనందుకే పార్టీకి నష్టాలు పెరిగాయని సీసీ వివరణ ఇచి్చంది. 2024 ఆగస్టులో పొలిట్బ్యూరో తీసుకున్న నిర్ణయాలను అమల్లోకి తీసుకురాబోతున్నట్టు పేర్కొంది. వర్గ పోరాటాన్ని వికేంద్రీకరించి అటవీ, గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో పార్టీని విస్తరించాలని సీసీ స్పష్టంగా పేర్కొంది. పెరిగిన నిర్బంధం, పార్టీకి వరుసగా జరుగుతున్న నష్టాలను దృష్టిలో ఉంచుకొని ఈ విస్తరణ వీచేగాలిలా, ప్రవహించే నీరులా ఉండాలని కేడర్కు కేంద్ర కమిటీ సూచించింది. శత్రువు బలంగా ఉన్నప్పుడు ఎదురుగా నిలిచి పోరాటం చేయనక్కర్లేదని, అనువైన సమయం కోసం ఎదురుచూడాలని ఆదేశించింది. శాంతి చర్చలు జరపాలంటూ 9 రాష్ట్రాల నుంచి డిమాండ్ రావడం ఇటీవల కాలంలో కనిపించిన సానుకూల పరిణామమని ఆ పార్టీ పేర్కొంది. 2026 మార్చి 31 నాటికి మావోయిస్టులను అంతం చేస్తామని కేంద్రం చేసిన ప్రకటన ఎప్పటికీ నెరవేరబోదని ధీమా వ్యక్తం చేసింది. -
రూ.10 లక్షల ఖర్చు దాటితే.. ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: దేవాదాయ శాఖ అ«దీనంలోని దేవాలయాల వార్షిక బడ్జెట్కు ఆమోదముద్ర వేసే విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆలయాల బడ్జెట్ ప్రతిపాదనలన్నీ కచి్చతంగా ప్రభుత్వ పరిశీలనకు పంపాల్సిందేనని తాజాగా ఆదేశించింది. ఇక దేవాలయాల్లో రూ.10 లక్షలకు మించి ఖర్చు చేయాల్సిన ప్రతి పనికి ప్రభు త్వ ఆమోదం కూడా తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇంతకాలం డిప్యూటీ కమిషనర్లు, రీజినల్ జాయింట్ కమిషనర్లు, కమిషనర్ స్థాయిలో బడ్జెట్లను ఆమోదిస్తున్నా రు. అయితే, కొందరు అధికారులు బడ్జెట్కు ఆమోదముద్ర వేయాలంటే ఆలయ కార్యనిర్వహణాధికారులను కమీషన్ల కోసం వేధిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వారికి డబ్బులివ్వకుంటే బడ్జెట్ ప్రతిపాదనలను పెండింగులో ఉంచుతున్నారని కొన్ని ప్రధాన దేవాలయాల కార్యనిర్వహణాధికారులు ఆరోపిస్తున్నారు. వీటిపై ఫిర్యాదులు చేస్తే వేధిస్తారన్న భయంతో ఎక్కడా లిఖితపూర్వక ఫిర్యాదులు చేయట్లేదు. దీన్ని ఆసరా చేసుకుని అలాంటి అధికారులు మరింత చెలరేగిపోతున్నారు. అవినీతి అధికారుల వల్ల దేవాదాయశాఖకు చెడ్డపేరు వస్తోంది. ఈ తీరుపై ఇటీవల ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ వివరాలు ఆరాతీసి చర్యలకు ఉపక్రమించారు. శాఖను అప్రదిష్టపాలు చేస్తున్న ఆరోపణలను ఆమె తీవ్రంగా పరిగణించారు. వెంటనే తీరు మారాలని ఆ శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ను ఆదేశించారు. ప్రభుత్వం దృష్టికి రాకుండా ఆలయాల బడ్జెట్లను అధికారులే మంజూరు చేయటం కూడా సరికాదని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈమేరకు తాజాగా దేవాదాయ శాఖ ప్రత్యేక సూచనలు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ఆమోదిస్తేనే నిధులు.. ప్రస్తుతం దేవాదాయ శాఖలో 6ఏ, 6బీ, 6 సీలుగా దేవాలయాలను వాటి ఆదాయం ప్రకారం విభజించారు. ఇందులో తక్కువ ఆదాయం ఉన్నవాటిని 6సీలో ఉంచారు. ఆదాయం ఎక్కువ ఉండే దేవాలయాల్లో 6బీ కేటగిరీలోని దేవాలయాల బడ్జెట్లను డిప్యూటీ కమిషనర్లు ఆమోదిస్తున్నారు. 6ఏ కేట గిరీ దేవాలయాల్లో రూ.25 లక్షల వరకు ఉండే బడ్జెట్లను రీజినల్ జాయింట్ కమిషనర్ ఆమోదిస్తున్నారు. అంతకంటే ఎక్కువుండే జాయింట్ కమిషనర్ స్థాయి దేవాలయాల బడ్జెట్లను కమిషనర్ ఆమోదిస్తున్నారు. ఇకపై అన్ని దేవాలయా ల బడ్జెట్లను తొలుత నేరుగా ప్రభుత్వానికి సమర్పించాలి. ప్రభుత్వం ఆమోదిస్తేనే అధికారులు మంజూరు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసే అంశాలను తిరిగి మార్చాల్సి ఉంటుంది. దీంతో అధికారుల ఇష్టారాజ్యానికి కళ్లెం వేయొచ్చన్నది ప్రభుత్వ ఆలోచన. అలాగే రూ.10 లక్షలను మించి ఖర్చయ్యే ప్రతి పనికి ఇక ప్రభుత్వం ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. -
నేటి నుంచి ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు రిజిస్ట్రేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మెడికల్, డెంటల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం (కేఎన్ఆర్యూహెచ్ఎస్) మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి కాంపిటెంట్ అథారిటీ (కనీ్వనర్) కోటా కింద ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలలో ప్రవేశాలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల ప్రక్రియ బుధవారం (16వ తేదీ) ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. చివరి తేదీ ఈ నెల 25 సాయంత్రం 6 గంటలు.అభ్యర్థులు https:// tsmedadm.tsche.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా నీట్ యూజీ –2025లో అర్హత సాధించాలి. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలతో పాటు ప్రైవేట్, మైనారిటీ, నాన్ మైనారిటీ మెడికల్, డెంటల్ కాలేజీలలోని కాంపిటెంట్ అథారిటీ కోటా కింద ఉన్న సీట్లకు మాత్రమే ఈ నోటిఫికేషన్ వర్తించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు (జీఓ నంబర్ 114) జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ కాలేజీల్లో 85 శాతం, ప్రైవేటు కాలేజీల్లో 50 శాతం సీట్లను భర్తీ చేస్తారు. కటాఫ్ మార్కులు ఇలా: ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు సంబంధించి వివిధ కేటగిరీల కింద నిర్దేశించిన కటాఫ్ మార్కులను యూనివర్సిటీ వెల్లడించింది. ఓసీ, ఈడబ్లు్యఎస్ కేటగిరీ విద్యార్థులకు 144 మార్కులు (50 శాతం పైగా పర్సంటైల్), బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 113 మార్కులు (40 శాతం పైగా), దివ్యాంగులకు 127 (45 శాతం పైగా) మార్కులు కటాఫ్గా నిర్ణయించారు. అర్హతలు ఇవే⇒ అభ్యర్థి భారతీయ పౌరుడై ఉండాలి. పీఐఓ/ఓసీఐ కార్డు కలిగి వుండొచ్చు. ⇒ తెలంగాణ రాష్ట్రంలో కనీసం 4 సంవత్సరాలు చదువుకున్న లేదా నివసించినవారు మాత్రమే అర్హులు. ⇒ ఇంటర్ లేదా సమానమైన అర్హత సబ్జెక్టులు: ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/బోటనీ/జువాలజీ లేదా బయోటెక్నాలజీ, ఇంగ్లిష్ ⇒ నీట్లో ఓసీలు 50%, బీసీ, ఎస్సీ, ఎస్టీలు 40%, ఓసీ– పీడబ్ల్యూడీలు 45% మార్కులు సాధించటం తప్పనిసరి. ⇒ 2025 డిసెంబర్ 31 నాటికి కనీస వయస్సు 17 ఏళ్లు ఉండాలి. ⇒ రిజిస్ట్రేషన్లు, ప్రాసెసింగ్ ఫీజు ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.4,000, ఎస్సీ, ఎస్టీలకు రూ.3,200. ఫీజు ఆన్లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలి. ⇒ అవసరమైన సర్టిఫికెట్లు: నీట్ ర్యాంక్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, ఇంటర్ మార్కుల మెమో, స్టడీ సర్టిఫికేట్లు (9వ తరగతి నుంచి ఇంటర్ వరకు), కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్, ఫొటో, సంతకం వంటి పత్రాలు తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి. ⇒ ప్రవేశాలకు సంబంధించి మెరిట్ జాబితా జారీ చేయడమే అర్హత అని భావించరాదు. ఒరిజినల్ సర్టీఫికేట్లు పరిశీలించిన తర్వాతే ప్రవేశం ఖరారు అవుతుందని యూనివర్సిటీ తెలిపింది. వెబ్ ఆప్షన్ల తేదీలను విశ్వవిద్యాలయం తర్వాత ప్రకటించనుంది. -
కళ్లలో కారం చల్లి కాల్చి చంపారు
సాక్షి, హైదరాబాద్/మలక్పేట: సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కేతావత్ చందు రాథోడ్ అలియాస్ చందు నాయక్ (50) దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్ మలక్పేట పోలీసుస్టేషన్ పరిధిలోని శాలివాహననగర్ పార్కులో వాకింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తుండగా దుండగుల కాల్పుల్లో చనిపోయారు. కళ్లలో కారం చల్లిన నిందితులు అతి సమీపం నుంచి కాల్పులు జరపడంతో ఆయన శరీరంలోకి మూడు తూటాలు దూసుకుపోయాయి. ఈ హత్యలో నలుగురు ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు గుర్తించిన పోలీసులు.. పరోక్షంగా సహకరించిన వారి వివరాలు ఆరా తీస్తున్నారు. మూడేళ్ల క్రితం ఎల్బీనగర్ ఠాణాలో నమోదైన హత్య కేసులో చందు నిందితుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రతీకారం, భూ వివాదాలతోపాటు వివాహేతర సంబంధం కోణాన్ని పరిగణనలోకి తీసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు, హతుడి కుటుంబీకులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. వసూళ్లు అడ్డుకోవడంతో వివాదాలు నాగర్కర్నూల్ జిల్లా నర్సాయిపల్లికి చెందిన చందు.. భార్య నారీబాయి, కుమారుడు సిద్ధు, కుమార్తె సింధులతో కలిసి దిల్సుఖ్నగర్ సమీపంలోని విద్యుత్నగర్లో ఉంటున్నారు. ప్రస్తుతం సిద్ధు కెనడాలో ఎంటెక్ చదువుతుండగా... సింధు గ్రూప్స్కు సన్నద్ధమవుతోంది. చందు విద్యార్థి దశలో ఎస్ఎఫ్ఐలో, కారి్మక నాయకుడిగా సీఐటీయూలో పని చేశారు. ఎల్బీనగర్ ఏరియా సీపీఎం నాయకుడిగా నాగోల్ శ్రీ సాయినగర్లోని స్థలాల్లో పేదలతో గుడిసెలు వేయించారు. 2010లో సీపీఐలో చేరి భూపోరాటం చేసి పట్టాలు ఇప్పించారు. సీపీఐ (ఎంఎల్) నాయకుడు రాజేష్ తో కొన్నాళ్లుగా చందుకు విభేదాలున్నాయి. కుంట్లూర్ రావినారాయణరెడ్డి నగర్లోని మూడెకరాల భూమిలో గుడిసెలు వేసుకున్న వారి నుంచి రాజేష్ తదితరులు డబ్బులు వసూలు చేస్తుండటాన్ని చందు అడ్డుకున్నారు. దీంతో రాజేష్ , సుధాకర్, మున్నా, రాయుడుతో కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. వాకింగ్ చేసిన పార్కు బయటే... రాజేశ్తోపాటు మరికొందరు సోమవారం రాత్రి కారులో చందు ఇంటి సమీపంలో సంచరించడాన్ని నారీబాయి గమనించి చందును హెచ్చరించారు. మంగళవారం ఉదయం భార్య, కుమార్తెతో కలిసి చందు శాలివాహననగర్ పార్కులో వాకింగ్ చేశారు. 7.30 గంటల ప్రాంతంలో బయటకు రాగా.. అక్కడే కారులో రాజేష్ కనిపించడంతో నారీబాయి హెచ్చరించారు. ‘నాకేం కాదు. ఏం భయం లేదు. మీరు ఇంటికి వెళ్లండి’అంటూ భార్య, కుమార్తెను పంపేశాడు. పార్కు వెస్ట్ గేట్ నుంచి కుడి వైపు రోడ్డులో కారు వద్దకు వెళ్తుండగా అందులోంచి దిగిన ఇద్దరు చందు కళ్లలో కారం కొట్టారు. అప్రమత్తమైన ఆయన తప్పించుకోవడానికి వెనక్కు పరిగెత్తగా.. పార్కు గేటు వద్ద ఉన్న ఇసుకలో కాలు జారి పడిపోయారు. సమీపంలోకి వచ్చిన ఇద్దరు పిస్టల్తో అతని ఛాతీ, పొట్ట భాగాల్లో కాల్చారు. రక్తం మడుగులో ఉన్న అతడిని కాలుతో వెనక్కు తిప్పి తలపై మరో రౌండ్ కాల్చి కారులో పారిపోయారు. సెల్ఫ్ డ్రైవింగ్ కారు అద్దెకు తీసుకుని... ఘటనాస్థలి వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ఆధారంగా దుండగులు స్విఫ్ట్ (టీఎస్ 08 హెచ్డబ్ల్యూ 0875) కారులో వచి్చనట్లు గుర్తించారు. ఇది పీర్జాదిగూడకు చెందిన ఓ మహిళ పేరుతో రిజిస్టరై ఉంది. ఆమె దీన్ని కొత్తపేట కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఓ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ఏజెన్సీకి కాంట్రాక్టుకు ఇచ్చారు. సోమవారం ఆన్లైన్లో ఆ కారును బుక్ చేసుకున్న ఏడుకొండలు అనే వ్యక్తి తీసుకుని వెళ్లారు.అతడితోపాటు రాజేష్ , ప్రశాంత్, మరొకరు ప్రత్యక్షంగా హత్యలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఏడుకొండలు కారు తీసుకెళ్లి అద్దెకు ఇచ్చిన సంస్థకు అప్పగించి పారిపోయారు. క్లూస్ టీమ్ ఘటనాస్థలిలో మూడు ఖాళీ క్యాట్రిడ్జ్లు, రెండు పేలని తూటాలను స్వాధీనం చేసుకుంది. పేలింది నాటు తుపాకీ అని, తూటాలు 7.65 ఎంఎం క్యాలిబర్కు చెందినవిగా తేల్చారు. భానుచందర్ హత్య కేసులో నిందితుడు... చందు 2022లో జరిగిన రంగారెడ్డి జిల్లా ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి పదిర భానుచందర్ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. భూ వివాదాల నేపథ్యంలో నాగోలుకు చెందిన భాను చందర్ను, మన్సూరాబాద్కు చెందిన సీపీఐ నాయకుడు కందుల సుధాకర్, చందు తదితరులు ఆ ఏడాది ఏప్రిల్ 16న కిడ్నాప్ చేశారు. యాదాద్రి జిల్లా తిరుమలగిరి వద్ద అతడిని హత్య చేసి మృతదేహాన్ని ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ సమీపంలో పడేశారు. ఈ కేసులో పోలీసులు చందుతోపాటు మిగిలిన నిందితులను అరెస్టు చేశారు. రంగంలోకి పది ప్రత్యేక బృందాలు హత్య విషయం తెలిసిన వెంటనే సౌత్ఈస్ట్ డీసీపీ ఎస్.చైతన్యకుమార్, అదనపు డీసీపీ కె.శ్రీకాంత్, టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ అందె శ్రీనివాసరావు ఘటనాస్థలికి వచ్చారు. సీపీఐ నాయకులు అజీజ్పాషా, ఈటీ నర్సింహా, ఛాయాదేవి తదితరులు ఘటనాస్థలికి తరలివచ్చారు. చందు భార్య, కుమార్తె మృతదేహం వద్ద కన్నీరు మున్నీరయ్యారు. ఏడాదిన్నర నుంచి చందుకు ప్రాణహాని ఉందని రాజేష్ తదితరులే చంపారని ఆమె ఆరోపించారు. చందు మృతితో నాగర్కర్నూల్ జిల్లాలోని స్వగ్రామం నర్సాయిపల్లిలో విషాదఛాయలు అలముకున్నాయి. చందు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. నిందితులను పట్టుకోవడానికి పది ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని చైతన్య కుమార్ చెప్పారు. మలక్పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో పాలుపంచుకున్నట్లు అనుమానిస్తున్న నలుగురిని పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అలాగే రెంటల్ ఏజెన్సీ నుంచి నిందితులు వాడిన కారును స్వా«దీనం చేసుకున్నారు. -
పరస్పర అంగీకారంతోనే కలిసి ఉన్నారు
సాక్షి, హైదరాబాద్: అత్యాచార ఆరోపణలపై నమోదైన కేసులో అసిస్టెంట్ ప్రొఫెసర్ రంజిత్కు హైకోర్టులో ఊరట లభించింది. ఇద్దరు మేజర్లు పరస్పర అంగీకారంతో కలసి ఉన్నప్పుడు ఒక్కరిపై ఆరోపణలు చేయడం సరికాదని, అవి నిరాధారమైనవని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఫిర్యాదుదారు(మహిళ) గతంలోనూ ఇలా మరొకరిపై ఫిర్యాదు చేయగా, అతనిపై కేసును సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయాన్ని ప్రస్తావించింది. 21 ఏళ్ల మహిళకు తాను ఏం చేస్తున్నానో తెలుసని.. తెలిసే పిటిషనర్తో ఉన్నారని అభిప్రాయపడింది. దీనికి పిటిషనర్ను బాధ్యుడిని చేయలేమని తేల్చిచెబుతూ.. రంజిత్పై కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. ఫిర్యాదుదారు మేరకు.. ‘2017లో నేను హాస్టల్లో ఉండి ఎంఏ ఇంగ్లిష్ చదువుతున్నప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్తో పరిచయం ఏర్పడింది. తన భార్యకు విడాకులు ఇచ్చిన వెంటనే వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చి నన్ను లైంగికంగా వాడుకున్నారు. ఆ తర్వాత వివాహం చేసుకోవడానికి నిరాకరించి.. ఇంటి నుంచి గెంటివేశారు’. ఈ ఫిర్యాదు ఆధారంగా, 2019లో పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత ట్రయల్కోర్టులో చార్జిïÙట్ దాఖలు చేశారు. తనపై నమోదు చేసిన కేసు కొట్టివేయాలని కోరుతూ అసిస్టెంట్ ప్రొఫెసర్ రంజిత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ జువ్వాడి శ్రీదేవి విచారణ చేపట్టారు. అన్నీ తెలిసే పిటిషనర్తో ఉన్నారు..: పిటిషనర్ తరపు న్యాయవాది వాదన లు వినిపిస్తూ..‘పిటిషనర్ నిర్దోషి. ఫిర్యాదుదారు ఆరోపణలతో పిటిషనర్కు ఎలాంటి సంబంధం లేదు. రెండేళ్లు గడిచిన తర్వాత పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. ఇంత ఆలస్యానికి కారణం చెప్పలేదు. ఫిర్యాదుదారుకు బ్లాక్మెయిల్ చేసే అలవాటు ఉంది. కేశవ్కుమార్ అనే వ్యక్తిపై కూడా ఫిర్యాదు చేసింది. మాదాపూర్ పోలీసులు నమోదు చేసిన ఆ కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఫిర్యాదుదారు చేసిన ఫిర్యాదులో తేదీలు, సమయం, స్థలం సరిగా వివరించలేదు. పిటిషనర్పై నేరాలు ఆమోదయోగ్యం కాదు.. ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలి’అని కోరారు. ఏపీపీ వాదనలు వినిపిస్తూ.. ‘పిటిషనర్పై నిర్దిష్ట ఆరోపణలు ఉన్నా యి. అతనిపై ఆరోపణలలో నిజానిజాలు ట్రయల్కోర్టు తేలుస్తుంది. పిటిషన్ను కొట్టివేయాలి’అని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. 2019, జనవరి 16న ఇంటి నుంచి గెంటివేశారని చెబుతున్న మహిళ ఫిర్యాదు చేయడానికి 23 వరకు ఎందుకు ఆగాల్సి వచి్చందో పేర్కొనలేదన్నారు. ఆమెకు ఇలా ఫిర్యాదు చేసే అలవాటు ఉందని గత వివరాలు పరిశీలిస్తే తెలుస్తోందన్నారు. పిటిషనర్, మహిళ.. ఇద్దరూ మేజర్లు. వారి మధ్య సంబంధం ఏకభిప్రాయంతోనే జరిగినట్టు అవగతమవుతోందని స్పష్టం చేశారు. 21ఏళ్ల మహిళకు తాను ఏం చేస్తున్నానో తెలుసని.. తెలిసే పిటిషనర్తో ఉన్నారని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. దీనికి పిటిషనర్ను బాధ్యుడిని చేయలేమని తేల్చిచెప్పారు. అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత పిటిషనర్పై కేసును కొట్టివేస్తున్నామని తీర్పునిచ్చారు. -
పాలిసెట్లో 65.5 శాతం సీట్ల భర్తీ
సాక్షి, హైదరాబాద్: పాలిసెట్ కౌన్సెలింగ్లో ఎట్టకేలకు సాంకేతిక విద్యావిభాగం విద్యార్థులకు కాలేజీల్లో సీట్లు కేటాయించింది. వెబ్సైట్లో కౌన్సెలింగ్ డేటా ఎరేజ్ అవ్వడం, దాన్ని వారం రోజుల తర్వాత రికవరీ చేయడంతో ముందుగా ప్రక టించిన తేదీకంటే పది రోజులు ఆలస్యంగా మంగళవారం సీట్లు కేటాయించారు. తొలివిడతలో 65.5 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఈసారి ప్రభుత్వ కాలేజీలకే విద్యార్థులు ప్రాధాన్యమిచ్చారు. వీటిల్లోని మొత్తం సీట్లలో 82 శాతం నిండగా, ప్రైవేట్ కాలేజీల్లో కేవలం 50 శాతం సీట్లు మాత్రమే నిండాయి. మొదటి విడత సీట్ల భర్తీ తర్వాత ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో 10,012 సీట్లు మిగిలాయి. అయితే, వెబ్ ఆప్షన్లు ఎంచుకున్నా.. రెండు వేలమందికి సీట్లు రాకపోవటం గమనార్హం. ⇒ మొదటి విడతలో 6 కాలేజీల్లోని వందశాతం సీట్లు నిండాయి. వీటిలో ఐదు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలుండగా, ఒక ప్రైవేట్ కాలేజీ ఉంది. ⇒ ఈడబ్ల్యూఎస్ కోటాలో 713 సీట్లు నిండాయి. ఎన్సీసీ, స్పోర్ట్స్కోటాను తుదివిడత కౌన్సెలింగ్లో భర్తీ చేస్తారు. ⇒ సీట్లు పొందినవారు ఈ నెల 18లోగా ఫీజు చెల్లించి, ఆన్లైన్లో సెల్ఫ్ రిపోరి్టంగ్ చేయాలి. ⇒ తుది విడత కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత విద్యార్థులు ఈ నెల 28 నుంచి 30 లోపు కాలేజీల్లో ప్రత్యక్షంగా రిపోర్ట్ చేయాలి. ఇలా రిపోర్ట్ చేయకపోతే సీటు కోల్పోతారు. ⇒ ఈ నెల 28 నుంచి 30 వరకు విద్యార్థులకు ఓరియంటేషన్ నిర్వహిస్తారు. 31 నుంచి పాలిటెక్నిక్ మొదటి సెమిస్టర్ క్లాసులు ప్రారంభమవుతాయి. ⇒ ఆగస్టు 2, 3 తేదీల్లో సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ ఉంటుంది. కౌన్సెలింగ్లో సీటు వచ్చిన కాలేజీలోని మరో బ్రాంచిలో సీటు ఖాళీగా ఉంటే ఈ స్లైడింగ్ విధానంలో మార్చుకోవచ్చు. -
చంపేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి..
సాక్షి, యాదాద్రి : భర్త వేధింపులతో విసిగిపోయిన ఆమె.. తన సోదరుడు, ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసింది. కారుతో ఢీకొట్టి చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసి.. చివరకు పోలీసులకు దొరికిపోయారు. మంగళవారం భువనగిరి డీసీపీ ఆకాంష్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన వస్తుపుల స్వామి(36)కి ఆత్మకూరు(ఎం) మండల కేంద్రానికి చెందిన పొట్టెపాక మహేశ్ సోదరి స్వాతితో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. స్వామి భువనగిరిలోని ఓ ట్రాక్టర్ షోరూంలో మేనేజర్గా పనిచేసేవాడు. భార్య స్వాతి భువనగిరి హౌసింగ్ బోర్డు కాలనీలో ఉద్యోగం చేసే క్రమంలో తుర్కపల్లి మండలం పల్లెపహాడ్ గ్రామానికి చెందిన గుంటిపల్లి సాయికుమార్తో పరిచయం ఏర్పడింది. గొడవలు ఇలా.. స్వాతి సోదరుడు మహేశ్కు ఇద్దరు భార్యలు. తన బావ తన భార్యతోనే వి వాహేతర సంబంధం పె ట్టుకున్నాడని మహేశ్ స్వామిపై కోపం పెంచుకున్నాడు. ఈ విషయాన్ని స్వాతితో చెప్పగా, ఆమె భర్తను నిలదీసింది. దీంతో స్వాతిని స్వామి వేధించడం మెదలు పెట్టాడు. ఇదిలావుంటే.. గత సంవత్సరం ఫిబ్రవరిలో స్వాతి మోత్కూరుకు వెళ్లి సాయికుమార్ను కలిసి తన భర్త వేధింపులను సాయికుమార్కు వివరించింది. ఈ క్రమంలో వారి మధ్య వివాహేతర సంబంధం మొదలైంది. అక్క వివాహేతర సంబంధానికి మహేశ్ కూడా సహకరించాడు. తమను వేధిస్తున్న స్వామిపై ఎలాగైనా పగతీర్చుకోవాలని స్వాతి, మహేశ్ నిర్ణయించుకున్నారు. కారు అద్దెకు తీసుకుని.. ఈనెల 13న స్వామి భువనగిరికి పనిమీద వస్తున్న విషయాన్ని స్వాతి.. సాయికుమార్, మహేశ్లకు చెప్పింది. దీంతో వారు స్వామి కదలికలపై నిఘా పెట్టారు. స్వామిని హత్య చేసేందుకు సాయికుమార్, తన స్నేహితుడు చీమల రామలింగస్వామి సహాయంతో భువనగిరిలో కారును అద్దెకు తీసుకున్నారు. స్వామి భువనగిరిలో పని ముగించుకుని రాత్రి వేళ స్నేహితుడు వీరబాబుతో కలిసి బైక్పై బయలుదేరాడు. రాత్రి 11.15 గంటల సమయంలో సాయికుమార్ కాటేపల్లి శివారులో కారుతో వారి బైక్ను ఢీకొట్టి కొంతదూరం ఈడ్చుకుపోయాడు. ఘటనలో స్వామి అక్కడికక్కడే మృతిచెందగా వీరబాబుకు గాయాలయ్యాయి. అయితే కారు అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకుపోయి ముందుకు కదలకుండా ఆగిపోయింది. స్వామి మృతి విషయం సాయికుమార్ ద్వారా తెలుసుకున్న మహేశ్ ద్విచక్ర వాహనం తీసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. సాయికుమార్, రామలింగస్వామిని బైక్పై ఎక్కించుకుని వచ్చి భువనగిరి రైల్వే స్టేషన్ వద్ద వదిలేశాడు. కారుతో.. కదిలిన డొంక రోడ్డు పక్కన ఆగిపోయిన కారును చూసిన పోలీసులకు అనుమానం వచ్చింది. కారు నంబర్ ఆధారంగా జరిపిన విచారణలో.. సాయికుమార్ సెల్ప్ డ్రైవింగ్ కోసం అద్దెకు తీసుకున్నాడని తెలిసింది. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. అతని సెల్ఫోన్లో స్వాతి ఫోన్ నంబర్ కన్పించడంతో స్వాతిని విచారించగా మొత్తం విషయం వెలుగులోకి వచి్చంది. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. మరో నిందితుడు చీమల రామలింగస్వామి పరారీలో ఉన్నాడు. వైద్యురాలిది ఆత్మహత్యే‘బుట్టబొమ్మ’ను వదల్లేనని భార్యతో చెప్పిన డాక్టర్ సృజన్క్షణికావేశానికిలోనై ఉరివేసుకున్న డాక్టర్ ప్రత్యూషసృజన్, బానోతు శ్రుతితో పాటు అత్తామామల అరెస్ట్ హసన్పర్తి: ‘ఇన్స్టా రీల్స్ అమ్మాయి బుట్టబొమ్మతో ప్రేమాయణం కొనసాగిస్తా ...ఏం చేసుకుంటావో చేసుకో’అన్న భర్త మాటలతో క్షణికావేశానికి లోనైన వైద్యురాలు ప్రత్యూష ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్రెడ్డి వెల్లడించారు. ఆదివారం డాక్టర్ ప్రత్యూష అనుమానాస్పదంగా మృతి చెందినట్లు నమోదైన కేసులో విచారించిన పోలీసులు మంగళవారం ఆమె భర్త డాక్టర్ అల్లాడి సృజన్, అత్తమామలు పుణ్యవతి–మధుసూదన్తోపాటు ఇన్స్టా రీల్స్గర్ల్ బానోతు శ్రుతిలను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు. హసన్పర్తి పోలీస్స్టేషన్లో కాజీపేట ఏసీపీ ప్రశాంత్రెడ్డి ఆవివరాలు వెల్లడించారు. మట్టెవాడకు చెందిన తంజాపూరి పద్మావతి కూతురు డాక్టర్ ప్రత్యూషకు (35), ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపూర్కు చెందిన డాక్టర్ అల్లాడి సృజన్కు 2017లో వివాహం జరిగింది. ప్రస్తుతం వీరు హసన్çపర్తిలోని కాకతీయ వెంటెజ్లో ఓ విల్లా కొనుగోలు చేసి నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు. వీరితోపాటు సృజన్ తల్లిదండ్రులు పుణ్యవతి–మధుసూదన్లు కూడా ఇక్కడే ఉంటున్నారు. బానోతు శ్రుతితో కుటుంబంలో చిచ్చు.. ఏడాది క్రితం బుట్టబొమ్మ–17 ఇన్స్ర్ట్రాగాం ఐడీ పేరుతో రీల్స్ చేసే అమ్మాయి బానోతు శ్రుతితో డాక్టర్ సృజన్ దగ్గరయ్యాడు. ఈ క్రమంలో తన భార్యకు విడాకులు ఇస్తానని బెదిరించాడు. మరో వైపు శ్రుతి కూడా ఫోన్ ద్వారా ప్రత్యూషను వేధింపులకు గురి చేయడం ప్రారంభించింది. ఆది వారం కూడా ఆ దంపతుల మధ్య గొడవ జరిగింది. శ్రుతిని వదిలేది లేదని సృజన్ చెప్పడంతో ప్రత్యూష పైఅంతస్తుకు వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. కాగా గొడవ విషయంలో సృజన్ తల్లిదండ్రులు కూడా కొడుకుకే మద్దతు పలికారని ఏసీపీ పేర్కొన్నారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.తరగతి గదిలో ఉరేసుకుని విద్యార్థి ని ఆత్మహత్య!సూర్యాపేట జిల్లా నడిగూడెం కేజీబీవీలో ఘటన నడిగూడెం: పదోతరగతి చదువుతున్న విద్యార్థిని తరగతి గదిలో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంగళవారం సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జరిగింది. స్థానిక ఎస్ఐ గంధమళ్ల అజయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మునగాల మండలం కలకోవ గ్రామానికి చెందిన తాపీ మేస్త్రీ నిమ్మ వెంకటేశ్వర్లు, వసుంధర దంపతులకు కుమార్తె తనూషా మహాలక్ష్మి (14), ఇద్దరు కుమారులు సంతానం. తనూషా మహాలక్ష్మి నడిగూడెం మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో 10వ తరగతి చదువుతోంది. ఈనెల 4వ తేదీన వ్యక్తిగత కారణాలతో బాలిక ఇంటికి వెళ్లింది. తిరిగి 6వ తేదీన పాఠశాలకు వచ్చింది. ఆదివారం తనూషాను చూసేందుకు ఆమె తల్లి పాఠశాల వద్దకు వచ్చి భోజనం పెట్టి వెళ్లింది. సోమవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో తండ్రి వెంకటేశ్వర్లు కూడా కుమార్తెను చూసి వెళ్లాడు. మంగళవారం తెల్లవారుజామున తనూషా పాఠశాలలోని తన తరగతి గదిలో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఉదయం ఐదు గంటల సమయంలో తనూషా స్నేహితురాలు తమ తరగతి గదిలోకి వెళ్లగా.. అప్పటికే తనూషా ఫ్యాన్కు చున్నీతో ఉరేసుకుని కనిపించింది. రాత్రి విధుల్లో ఉన్న హిందీ ఉపాధ్యాయురాలు సునీత పాఠశాల ప్రత్యేకాధికారి వెంకటరమణకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతురాలి తండ్రి తన కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదు చేయడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ ఘటనతో విద్యాలయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, పాఠశాలను సూర్యాపేట జిల్లా విద్యాధికారి అశోక్, తహసీల్దార్ వి.సరిత, జీసీడీఓ తీగల పూలాన్, మునగాల సీఐ రామకృష్ణారెడ్డి పరిశీలించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
19న సీజే ప్రమాణస్వీకారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్ ఈ నెల 19న ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజ్భవన్లో శనివారం మధ్యాహ్నం 12.30కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. దీంతో ఆయన ఏడో సీజేగా బాధ్యతలు చేపడతారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఏకే సింగ్ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. గత సీజే జస్టిస్ అలోక్ అరాధే జనవరిలో బదిలీపై బాంబే హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా వెళ్లిన నాటి నుంచి సీజే పోస్టు ఖాళీగానే ఉంది.సీజే నియామకానికి గత మేలో సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేయడంతో రెండు రోజుల క్రితం రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఇదిలాఉండగా, కోల్కతా హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయిన రాష్ట్ర హైకోర్టు ఏసీజే జస్టిస్ సుజోయ్పాల్కు బుధవారం ఫుల్కోర్టు ఘన వీడ్కోలు పలకనుంది. బుధవారం మధ్యాహ్నం 3.45 గంటలకు ఫస్ట్కోర్టు హాల్లో జరిగే వీడ్కోలు సమావేశంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది పాల్గొననున్నారు. మధ్యప్రదేశ్కు చెందిన జస్టిస్ సుజోయ్పాల్ 2024, మార్చి 26న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది జనవరి 21 నుంచి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్న ఆయన బదిలీపై కోల్కతా హైకోర్టుకు వెళ్లనున్నారు. -
పంటల బీమా వచ్చేనా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా... పంటల బీమా పథకం అమలుపై ఇప్పటివరకు మార్గదర్శకాలు రూపొందించలేదు. బీఆర్ఎస్ హయాంలో రద్దయిన పంటల బీమా పథకాన్ని 2024 వానకాలం సీజన్లోనే పునః ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించినా.. గత రెండు సీజన్లలో పంటల బీమాపై అడుగు ముందుకు పడలేదు. రాష్ట్రంలో వానకాలం సీజన్ ప్రారంభమై ఇప్పటికే 60 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు వేశారు. ఈసారైనా పంటల బీమా పథకాన్ని అమలు చేస్తారా లేదా? అని రైతులు ఎదురు చూస్తున్నారు. పంటల బీమాకు సంబంధించి ప్రధాన మంత్రి ఫసల్ బీమా పథకంలో చేరాలా లేక సొంతంగా రాష్ట్రంలో బీమా పథకాన్ని రూపొందించాలా? అనేది ప్రభుత్వం తేల్చుకోలేకపోతోంది. మూడు నెలలైనా ముందుకు పడని అడుగు పంటల బీమా పథకానికి విధి విధానాలు రూపొందించాలని ఏప్రిల్ 23వ తేదీన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. కానీ, ఇప్పటివరకు వ్యవసాయ శాఖ దానిని పట్టించుకోనే లేదు. గతంలో వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంకర్లతో మంత్రి సమావేశమైనప్పటికీ బ్యాంకర్లు పంటల బీమాపై ఆసక్తి చూపలేదు. దీంతో ప్రధాని ఫసల్ బీమా పథకంలోనే చేరాలని సూత్రప్రాయంగా నిర్ణయించినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని గతంలో అమలు చేశారు. 2018–19 సీజన్ తరువాత ఈ పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం నిలిపివేసింది. 11 క్లస్టర్లుగా రాష్ట్రం రాష్ట్రంలో పంటల బీమాను పునరుద్ధరించాలంటే ఫసల్ బీమా ఒక్కటే సరైనదిగా రాష్ట్ర ప్రభుత్వం ఒక అంచనాకు వచి్చంది. రాష్ట్రాన్ని 11 క్లస్టర్లుగా విభజించి బీమా అమలు చేయాలని నిర్ణయించారు. వానకాలం సీజన్లో సుమారు 132 లక్షల ఎకరాల్లో పంటలు, యాసంగిలో 78 లక్షల ఎకరాల్లో వేస్తారని లెక్క కట్టారు. ఈ నేపథ్యంలో ఫసల్ బీమా పథకం మార్గదర్శకాల ప్రకారంగా వానకాలానికి మొత్తం ప్రీమియంలో రైతు వాటా కింద 2 శాతం, యాసంగిలో 1.5 శాతం.. వాణిజ్య, ఉద్యాన పంటలకు 5 శాతం ప్రీమియం రైతు వాటాగా తీసుకోవాలని నిర్ణయించారు. మిగిలిన ప్రీమియంలో రాష్ట్రం, కేంద్రం 50:50 చొప్పన భరిస్తాయి. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులతో ఈసారి వరి సాగు మందగించింది. కాగా, పంటలు వేసిన తరువాత క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తరణాధికారులు క్రాప్ బుకింగ్ ప్రక్రియ చేపడతారు. అంటే ఏ పంటను ఏ రైతు ఎంత విస్తీర్ణంలో సాగు చేశారనే లెక్కలను రూపొందిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాతే పంటల బీమా పథకం అమలు ప్రక్రియ ప్రారంభమవుతుందని వ్యవసాయశాఖలోని ఒక కీలక అధికారి తెలిపారు. -
ఆదాయం ఉన్న చోటే విలువల సవరణ
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతానికి రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువల సవరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. రిజిస్ట్రేషన్ల ద్వారా ఎక్కువ ఆదాయం వస్తున్న జీహెచ్ఎంసీ, శివారు ప్రాంతాల్లో మాత్రమే భూముల విలువలను పెంచాలని, తద్వారా అటు ఆదాయం పెరగడమే కాకుండా, రాష్ట్ర ప్రజలందరిపై భారం పడకుండా ఉంటుందని భావిస్తోంది. ఈ మేరకు ప్రతి ఏటా రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరుగుతూ రెవెన్యూ ఎక్కువగా వచ్చే రాష్ట్రంలోని 38 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి మాత్రమే ప్రభుత్వం విలువల సవరణ ప్రతిపాదనలు తెప్పిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో సవరణను ప్రస్తుతానికి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఆదాయం పెరగాల్సి ఉండటంతో..: గత ఏడాదిలోనే భూముల విలువల సవరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖ నుంచి ప్రతిపాదనలు తెప్పించింది. క్షేత్రస్థాయి కమిటీల మదింపు మేరకు వచి్చన ఈ ప్రతిపాదనలపై థర్డ్ పార్టీ చేత కూడా పరిశీలన చేయించింది. అనంతరం థర్డ్పార్టీ కూడా ప్రభుత్వానికి అప్పట్లోనే నివేదిక ఇచ్చింది. కానీ రాష్ట్రంలో రియల్ బూమ్ సరిగా లేని నేపథ్యంలో భూముల విలువలు సవరిస్తే ఆ రంగం మరింత దెబ్బతింటుందేమోననే ఆలోచనతో సవరణ ప్రతిపాదనను పక్కన పెట్టింది.అయితే గత నెలలో మళ్లీ ఈ ఫైలును ప్రభుత్వం కదిలించింది. రాష్ట్ర ఖజానాకు ఆదాయం ఖచ్చితంగా పెరగాల్సి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో భూముల విలువల సవరణ అనివార్యమని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించినట్టు సమాచారం. ఈ క్రమంలో థర్డ్ పార్టీ నివేదికలను మళ్లీ క్షేత్రస్థాయికి పంపిన ప్రభుత్వం.. ఆదాయం ఎక్కువగా వచ్చే 38 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి ప్రతిపాదనలు కోరింది. హైదరాబాద్, రంగారెడ్డి నుంచే ఎక్కువ ఆదాయం ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోనే రిజిస్ట్రేషన్ల ఆదాయం ఎక్కువగా వస్తుంటుంది. మొత్తం ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో 60–70 శాతం ఆదాయం ఇక్కడినుంచే వస్తుందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రంగారెడ్డి (ఆర్వో), గండిపేట, పటాన్చెరు, కుత్బుల్లాపూర్, బంజారాహిల్స్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, ఉప్పల్, మేడ్చల్, కూకట్పల్లి, వరంగల్, మహేశ్వరం, బాలానగర్, మల్కాజిగిరి, ఎల్బీనగర్, ఎస్సార్నగర్, చంపాపేట, ఆజంపుర. నారపల్లి, సరూర్నగర్, వనస్థలిపురం, చిక్కడపల్లి, కాప్రా, వల్లభనగర్, కీసర, శంకర్పల్లి, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల సహా 38 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి ప్రతిపాదనలు అడిగినట్టు సమాచారం.త్వరలోనే మంత్రి పొంగులేటి సమీక్ష రాష్ట్రంలోని భూముల ప్రభుత్వ విలువల సవరణ విషయంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎక్కడెక్కడ, ఏమేరకు విలువలు పెంచాలనే అంశంపై ఇప్పటికే పలుమార్లు సమీక్షలు నిర్వహించారు. థర్డ్పార్టీ నివేదికను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. అటు స్టాంపుల శాఖ, ఇటు థర్డ్పార్టీ నివేదికను మదింపు చేసిన మంత్రి.. తాజా ప్రతిపాదనల కోసం ప్రత్యేక ఫార్మాట్ను పంపినట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనలు పూర్తిస్థాయిలో ప్రభుత్వానికి అందగానే స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం భూముల విలువల సవరణ ఫైలును సీఎం ఆమోదానికి పంపుతారని, ముఖ్యమంత్రి ఆమోదం లభించగానే సవరించిన భూముల విలువలు అమల్లోకి వస్తాయని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
ప్రపంచ దేశాలతోనే పోటీ
సాక్షి, మేడ్చల్ జిల్లా: రాష్ట్రాలతో కాదు.. ప్రపంచ దేశాలతో పోటీ పడాలనేదే తమ ప్రభుత్వ ప్రయత్నమని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. ఇందుకోసం అధునాతన పారిశ్రామిక విధానాలు తీసుకొస్తున్నామని తెలిపారు. ప్రపంచ బల్క్ డ్రగ్స్ రాజధానిగా హైదరాబాద్ రూపుదిద్దుకుంటోందని, దేశంలో నే 33% టీకాలు, బల్క్ డ్రగ్స్లో 43% ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు.రాబోయే రోజుల్లో హైదరాబాద్ డేటా సిటీగా మారనుందని, తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.3 లక్షల 28 వేల కోట్ల పెట్టుబడులు సాధించామని తెలిపారు. మంగళవారం శామీర్పేట జీనోమ్ వ్యాలీలో ఐకార్ బయోలాజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ విస్తరణలో భాగంగా 1.75 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించనున్న కొత్త ప్లాంట్కు మంత్రులు శ్రీధర్బాబు, వివేక్ వెంకటస్వామితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. జీనోమ్ వ్యాలీతో మంచి గుర్తింపు దేశంలో జీనోమ్ వ్యాలీలోనే టీకాల ఉత్తత్తి జరుగుతోందని, జీనోమ్ వ్యాలీ తెలంగాణకు మంచి గుర్తింపు తీసుకొచి్చందని రేవంత్రెడ్డి చెప్పారు. కోవిడ్ సమయంలో జీనోమ్ వ్యాలీ నుంచి ప్రపంచ దేశాలకు టీకాను ఎగుమతి చేసిన ఘనత ఇక్కడి పారిశ్రామికవేత్తలదని పేర్కొన్నారు. ప్రభుత్వాలు మారినా పారిశ్రామిక విధానాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగానే తమ నిర్ణయాలు ఉన్నాయన్నారు. తమ ప్రభుత్వం మరింత సరళమైన విధానాలతో ముందుకెళ్తోందని, నూతన పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తోందని, వారికి అవసరమైన సహకారాన్ని అందిస్తోందని చెప్పారు. రాబోయే పదేళ్లలో తెలంగాణను 1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చి దిద్దడమే లక్ష్యంగా, తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. భూమిపూజ చేస్తున్న సీఎం రేవంత్రెడ్డి. చిత్రంలో మంత్రులు వివేక్, శ్రీధర్బాబు తదితరులు గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్గా తెలంగాణ: మంత్రి శ్రీధర్బాబు తెలంగాణను గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్గా మార్చేందుకు సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు చెప్పారు. ఈ లక్ష్య సాధనలో ఐకార్ రూపంలో మరో అడుగు ముందుకు పడిందని, కొత్తగా 800 మందికి ఉద్యోగాలు లభించనున్నాయని తెలిపారు. హైదరాబాద్–నాగ్పూర్, హైదరాబాద్–బెంగళూరు కారిడార్లలో ప్రత్యేకంగా ఫార్మా విలేజెస్ను అభివృద్ధి చేయబోతున్నామని చెప్పారు. లైఫ్ సైన్సెస్ రంగంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడంపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని, ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.. యువతకు ఉద్యోగాలే లక్ష్యం: మంత్రి వివేక్ యువతకు ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పారు. అధిక ఉద్యోగాల కల్పనతో నిరుద్యోగాన్ని తగ్గించాలని సీఎం రేవంత్రెడ్డి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఎక్కువ పరిశ్రమలను స్థాపించడం ద్వారా ఎక్కువ ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ మను చౌదరి, పలువురు శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. -
రిజర్వేషన్లు ఎలా ఉంటాయో!?
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30లోగా గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. మరోవైపు ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి చట్టబద్ధత కల్పనకు పంచాయతీరాజ్ చట్టానికి సవరణలతో త్వరలో ఆర్డినెన్స్ సైతం తీసుకురానుంది. దీంతో ఆర్డినెన్స్ ఎప్పుడు జారీ అవుతుంది? రిజర్వేషన్లు ఎలా ఉంటాయి? అనే అంశాలు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. అన్ని రాజకీయ పార్టీల సన్నాహాలతో స్థానిక సంస్థల ఎన్నికల రాజుకుంటున్న నేపథ్యంలో గతంతో పోల్చితే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఏ విధంగా ఉండవచ్చనేది చర్చనీయాంశంగా మారింది. ఆర్డినెన్స్ ఎలా ఉంటుందో..: పంచాయతీరాజ్ చట్టం–2018 ప్రకారం చూస్తే..అన్ని రిజర్వేషన్లు కలుపుకొని 50 శాతానికి లోబడి ఉండాలి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ప్రస్తుతం ఉన్న 22 శాతం రిజర్వేషన్లను, 42 శాతానికి పెంచి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆర్డినెన్స్ తేనుండటంతో.. అందులో పొందుపరిచే అంశాలు, బీసీ జనాభా లెక్కలు, వాటిని బట్టి మారే రిజర్వేషన్లు చర్చనీయాంశమయ్యాయి. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు వారి జనాభా ప్రాతిపదికన ఖరారు కానున్నందున వాటి విషయంలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చునని అంటున్నారు. అయితే రిజర్వేషన్లు మొత్తంగా మారిపోయే అవకాశం ఉందని, కాబట్టి ఎస్సీ,ఎస్టీ స్థానాలు కూడా కొంత మేరకు ప్రభావితం కావచ్చునని చెబుతున్నారు. వార్డు స్థానాలు మొదలు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ అధ్యక్షులు, జడ్పీ చైర్పర్సన్ స్థానాల వరకు రిజర్వేషన్లలో మార్పులు జరిగే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు.. గతంలో ఉన్న రిజర్వేషన్లు రెండు పదవీ కాలాల (టర్మ్లు) సమయం కొనసాగాయి. ఇప్పుడు ఒకే టర్మ్కు రిజర్వేషన్లు పరిమితం కానున్నాయి. అంటే ఈసారి నిర్ణయించే రిజర్వేషన్లు ఒక టర్మ్ మాత్రమే ఉంటాయన్న మాట. ఈ కారణంగానూ రిజర్వేషన్ స్థానాల్లో అనేక మార్పులు చోటు చేసుకోవచ్చునని అంటున్నారు. తాజా జనాభా లెక్కలతోనూ ప్రభావితం! గతంలో మాదిరిగానే సర్పంచ్, ఎంపీటీసీ రిజర్వేషన్లు మండల ప్రతిపాదికన, జెడ్పీటీసీ స్థానాలు జిల్లా యూనిట్గా..ఎంపీపీ అధ్యక్షుడు జిల్లా యూనిట్గా, జెడ్పీపీ చైర్మన్ రాష్ట్ర యూనిట్గా రిజర్వేషన్లు ఉంటాయా లేదా అనేది కూడా రాజకీయ పార్టీల నేతలు, ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠకు కారణమౌతోంది. అయితే ప్రభుత్వం జారీచేసే ఆర్డినెన్స్కు అనుగుణంగా ఆయా రిజర్వేషన్లు మారే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. మరోవైపు తాజా జనాభా లెక్కల్లో (కుల గణన)వచ్చిన మార్పులను బట్టి రిజర్వేషన్లు కూడా మారిపోతాయని భావిస్తున్నారు. స్థానాల సంఖ్యపై స్పష్టత! రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, వార్డుల సంఖ్యతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల సంఖ్యపై స్పష్టత వచ్చినట్టు సమాచారం. గ్రామ పంచాయతీలు 12,782గా, గ్రామాల వార్డులు 1,12,712, ఎంపీటీసీ స్థానాలు 5,816, జెడ్పీటీసీ స్థానాలు 566, మండల ప్రజా పరిషత్లు 566, జిల్లా పరిషత్లు 31గా లెక్క తేలినట్లు తెలుస్తోంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖాపరంగా ఈ లెక్క తేల్చినట్లు అధికారవర్గాల భోగట్టా. 2019లో జరిగిన మండల, జిల్లా పరిషత్ ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రంలో ఒక జిల్లా ప్రజా పరిషత్ (జెడ్పీపీ)–(మేడ్చల్ జిల్లా పరిషత్ రద్దు) స్థానం తగ్గగా అనేక గ్రామాలు, మండలాలు సమీప మున్సిపాలిటీల్లో విలీనం కావడంతో ఎంపీటీసీ స్థానాల సంఖ్య 55 నుంచి 60 స్థానాల వరకు తగ్గినట్లు తెలుస్తోంది. మరోవైపు కొత్త మండలాలు, గ్రామ పంచాయతీల సంఖ్య పెరిగింది. తగ్గిన ఎంపీటీసీలు, పెరిగిన మండలాలు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని అనేక గ్రామాలు సమీప మున్సిపాలిటీల్లో విలీనం కావడంతో మేడ్చల్ జిల్లా ప్రజా పరిషత్ (గ్రామీణ జిల్లా) ఉనికిలో లేకుండా పోతోంది. కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేయడం, కార్పొరేషన్లలో ఆయా గ్రామాలు విలీనం కావడం వల్ల ఎంపీటీసీ స్థానాల సంఖ్య తగ్గనున్నట్టు తెలుస్తోంది. 2019లో ఎంపీటీసీ స్థానాలు 5,847 ఉండగా, ప్రస్తుతానికి ఆ సంఖ్య 5,800 వరకు తగ్గవచ్చని అంచనా. రాష్ట్రంలో మండలాల సంఖ్య 539 నుంచి 566కు పెరిగింది. గత ఎన్నికల్లో 12,769 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం వాటి సంఖ్య 12,782కు పెరిగింది. వీటిపై రాష్ట్రవ్యాప్తంగా 10–11 తేదీలలో అభ్యంతరాలను స్వీకరించి 12న తుది జాబితా ప్రకటించాల్సి ఉండగా, క్షేత్రస్థాయి నుంచి సకాలంలో పూర్తి సమాచారం అందకపోవడంతో వాటి ప్రకటనలో జాప్యం జరిగింది. సోమవారం నాటికి కూడా కొన్నిచోట్ల నుంచి వివరాలు రాకపోవడంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సీట్లపై కచి్చతమైన సంఖ్యను అధికారులు అధికారికంగా వెల్లడించలేదు. 2019 ఎన్నికల నాటికి మండల ప్రజా పరిషత్లు 539 ఉండగా, 2025 ఎన్నికల నాటికి 566కు పెరగనున్నాయి. గతంలో గ్రామ పంచాయతీలు 12,769 ఉండగా, ఇప్పుడు 12,782కు చేరుకున్నట్టు అధికారవర్గాల సమాచారం. -
బనకచర్ల వద్దు.. తెలంగాణ సర్కారు లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ మధ్య జల వివాదాలపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ బుధవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశం ఎజెండాలో గోదావరి–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును చేర్చడంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అనుమతులు లేని ప్రాజెక్టుపై చర్చ అసమంజసమని స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేనే లేదని, వెంటనే ఎజెండాను సవరించాలని కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలతో రాసిన ఈ లేఖలో బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణకు ఉన్న అభ్యంతరాలన్నింటినీ సీఎస్ ప్రస్తావించారు. బనకచర్లే సింగిల్ ఎజెండాగా ఏపీ ప్రతిపాదన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్రెడ్డితో ఈ సమావేశం జరగనుంది. అయితే ఈ భేటీ సింగిల్ (ఏకైక) ఎజెండాగా బనకచర్లపై మాత్రమే చర్చించాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏపీ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ లేఖ రాసింది. తెలంగాణ చేసిన పలు ప్రతిపాదనలను ఎజెండాలో చేర్చాలని కోరింది. కృష్ణా బేసిన్లోని తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులు, గతంలో కేంద్రం ఇచ్చిన హామీ ప్రకారం పాలమూరు, డిండి ప్రాజెక్టులకు జాతీయ ప్రాజెక్టులుగా గుర్తింపు అంశాన్ని ఎజెండాలో చేర్చి చర్చించాలని ఇప్పటికే కేంద్రాన్ని రాష్ట్ర సర్కారు కోరింది. అలాగే తుమ్మిడిహెట్టి వద్ద ప్రతిపాదించిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు 80 టీఎంసీల నీటి కేటాయింపుతో పాటు ఏబీఐపీ పథకం కింద సాయం, గోదావరిపై ఇచ్చంపల్లి వద్ద 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు, నిధుల కేటాయింపు వంటి అంశాలను చేర్చాలని విజ్ఞప్తి చేసింంది. తాజాగా ఇప్పుడు కూడా ఈ అంశాలపైనే చర్చించాలని సీఎస్ స్పష్టం చేశారు. ఆ సంస్థల విశ్వసనీయత దెబ్బతింటుంది.. బనకచర్ల ప్రాజెక్టుపై గోదావరి బోర్డు, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), కేంద్ర పర్యావరణ శాఖలోని నిపుణుల మదింపు కమిటీ తీవ్ర అభ్యంతరాలు తెలపడాన్ని సీఎస్ గుర్తు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా, చట్టాలను, ట్రిబ్యునల్ తీర్పులన్నింటినీ ఉల్లంఘిస్తూ చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేనేలేదని తేల్చి చెప్పారు. ఇలాంటి చర్యలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఏపీ సమర్పించిన ప్రీ ఫీజబిలిటీ రిపోర్టును కేంద్ర పర్యావరణ శాఖ పరిధిలోని నిపుణుల కమిటీ తిరస్కరించిన విషయాన్ని ప్రస్తావించారు. సీడబ్ల్యూసీ కూడా ఈ రిపోర్టును తిరస్కరించాలని కోరారు. డీపీఆర్ సమర్పించకుండా, టెండర్లు పిలవకుండా ఏపీని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాలు ఇవే.. ⇒ పరీవాహక ప్రాంతంలోని ఇతర రాష్ట్రాలతో సంప్రదింపులు జరపకుండా, అంగీకారం తీసుకోకుండా, గోదావరి ట్రిబ్యునల్ తీర్పు, ఏపీ పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఏపీ ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టుతో రాష్ట్రాలకు ట్రిబ్యునల్ జరిపిన నీటి కేటాయింపుల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రాజెక్టుల నిర్వహణలో సైతం మార్పులు చోటుచేసుకుంటాయి. ఏకపక్షంగా 200 టీఎంసీలను తరలించాలని చేసిన ప్రతిపాదనతో పోలవరం ప్రాజెక్టు ఆపరేషన్ షెడ్యూల్లో మార్పులు జరగడంతో పాటు తెలంగాణ నీటి హక్కులకు విఘాతం కలుగుతుంది. ⇒ ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టుకు అనుమతుల జారీకి సీడబ్ల్యూసీ, గోదావరి బోర్డు, కృష్ణా బోర్డు, అపెక్స్ కౌన్సిల్ నుంచి క్లియరెన్స్లు అవసరం కాగా, బనకచర్ల ప్రాజెక్టుకు ఇవేమీ లేవు. ⇒ ఏపీ సమర్పించిన ప్రీ ఫీజబిలిటీ రిపోర్టులో కీలకమైన సమాచార లోపాలున్నాయి. నీటి లభ్యత, సాంకేతిక సమాచారం లోపించింది. ⇒ పోలవరం ప్రాజెక్టుతో ఒడిశా, ఛత్తీస్గఢ్లో ఏర్పడే ముంపుపై ఇప్పటికే న్యాయస్థానాల్లో కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ సమయంలో ఈ ప్రాజెక్టును ఎలా చేపడతారు? ⇒ ఈ ప్రాజెక్టు తెలంగాణకు హక్కుగా రావాల్సిన నీటి వాటాలను హరిస్తుంది. ప్రధానంగా కరువు పీడిత ప్రాంతాలపై దుష్ప్రభావం చూపుతుంది. అన్ని ప్రక్రియలూ పూర్తైన తర్వాతే చర్చించాలి ⇒ చట్టబద్ధంగా రావాల్సిన అన్ని అనుమతులు, అంతర్రాష్ట్ర సంప్రదింపులు, అభ్యంతరాల పరిష్కారం వంటి ప్రక్రియలు పూర్తైన తర్వాతే ఈ ప్రాజెక్టుపై అయినా, ఏ సమావేశంలోనైనా చర్చ జరగాలి. ఆ తర్వాతే ప్రాజెక్టును ఆమోదించాలి. ⇒ బనకచర్ల ద్వారా తరలించనున్న 200 టీఎంసీల గురించి పోలవరం ప్రాజెక్టు డీపీఆర్లో ప్రస్తావన లేదు. నీటి లభ్యత, అంతర్రాష్ట్ర ప్రభావాలపై సమగ్ర అధ్యయనంతో పాటు ట్రిబ్యునల్ తీర్పులను నికచ్చిగా అమలు చేస్తేనే ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టాల్సి ఉంటుందని పోలవరం ప్రాజెక్టు ఆథారిటీ (పీపీఏ) స్పష్టం చేసింది. ⇒ బనకచర్ల ప్రాజెక్టుతో పోలవరం ప్రాజెక్టు ఆపరేషన్ షెడ్యూల్, గోదావరి ట్రిబ్యునల్ తీర్పు, 1980 ఏప్రిల్ 2న జరిగిన అంతర్రాష్ట్ర ఒప్పందం అమలు తీరులో మార్పులు చోటుచేసుకుంటాయని గోదావరి బోర్డు అభ్యంతరం తెలిపింది. ఎలాంటి మార్పులకైనా పరీవాహకంలోని అన్ని రాష్ట్రాల నుంచి తప్పనిసరిగా రాతపూర్వకంగా సమ్మతి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. గోదావరి జలాల బట్వాడా విషయంలో ఏపీ, తెలంగాణ మధ్య ఎలాంటి ఒప్పందం లేదని కూడా తెలిపింది. 80 టీఎంసీలకు మించి జలాలను ఇతర బేసిన్లకు మళ్లిస్తే బేసిన్లోని అన్ని రాష్ట్రాలకు వాటాలు ఇవ్వాలని కృష్ణా, గోదావరి ట్రిబ్యునల్ తీర్పులు స్పష్టం చేస్తున్నాయని తెలిపింది. ⇒ గోదావరి ట్రిబ్యునల్ పరీవాహక ప్రాంతంలోని అన్ని రాష్ట్రాలకు కేటాయించిన నికర జలాల కోటాలను పూర్తిగా వాడుకోవడానికి ఆయా రాష్ట్రాల్లో ప్రాజెక్టులను నిర్మించిన తర్వాతే బనకచర్ల ప్రాజెక్టుకు ప్రతిపాదించిన 200 టీఎంసీల లభ్యతపై స్పష్టత వస్తుందని సీడబ్ల్యూసీ తేల్చి చెప్పింది. ⇒ ప్రాజెక్టు గోదావరి ట్రిబ్యునల్ తీర్పుకు విరుద్ధమని పేర్కొంటూ బనకచర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు జారీ చేయడానికి కేంద్ర పర్యావరణ శాఖ నిరాకరించిన విషయాన్ని సైతం లేఖలో తెలంగాణ ప్రస్తావించింది. అన్ని రకాల అనుమతులు సాధించిన తర్వాతే పర్యావరణ అనుమతులకు దరఖాస్తు చేసుకోవాలని కోరిందని తెలిపింది. చర్చకు పెడితే బాయ్కాట్! కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో జరిగే సమావేశానికి సీఎం రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఇందుకోసం మంగళవారం రాత్రి వారు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అయితే ఈ సమావేశానికి హాజరైనప్పటికీ, ఎట్టి పరిస్థితుల్లోనూ బనకచర్లపై చర్చకు ఒప్పుకునేది లేదని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ బనకచర్లను ఎజెండాలో పెట్టి చర్చ ప్రారంభిస్తే నిరసన వ్యక్తం చేస్తూ బాయ్కాట్ చేస్తారని తెలుస్తోంది. కాగా, వీలును బట్టి సీఎం బుధవారం రాత్రికి, లేదా గురువారం నగరానికి వస్తారని సీఎంవో కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. -
భట్టి విక్రమార్కకు లీగల్ నోటీసులు పంపిన రామచందర్రావు
హైదరాబాద్: తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు లీగల్ నోటీసులు పంపించారు. రోహిత్ వేముల ఆత్మహత్యకు సంబంధించిన అంశంపై తనపై వ్యాఖ్యలు చేసిన భట్టి విక్రమార్కపై లీగల్గా చర్యలు తీసుకునే క్రమంలో నోటీసులు పంపించారు రామచందర్రావు. తన అడ్వకేట్ విజయ్ కాంత్తో నోటీసుల పంపించారు రామచందర్రావు. బేషరుతగా మూడు రోజుల్లో భట్టి విక్రమార్క క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మూడు రోజల్లో క్షమాపణ చెప్పని పక్షంలో రూ. 25 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని నోటీసుల్లో హెచ్చరించారు. దీనిపై క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్ రావు నియామకాన్ని పునరాలోచన చేయాలని ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. దళితులు, గిరిజనులను వేధించిన వారికి బీజేపీ ఉన్నత పదవులు ఇస్తుందనే దానికి తెలంగాణ అధ్యక్షుడిగా రామచందర్ రావు నియామకమే ఉదాహరణ అంటూ భట్టి విమర్శలు చేశారు.హెచ్సీయూలో రోహిత్ వేముల ఆత్మహత్యకు రామచందర్ రావు కారణమంటూ వ్యాఖ్యానించారు.. ఆయనకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవితో రివార్డు ఇచ్చారని. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచందర్ రావు నియామకాన్ని పునరాలోచన చేయాలని వ్యాఖ్యానించారు. -
వివాదంలో బరాజ్ల పునరుద్ధరణ డిజైన్లు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల పునరుద్ధరణ చర్యలకి అవసరమైన డిజైన్ల తయారీకి నైపుణ్యం తమకు లేదని నీటిపారుదల శాఖలోని సెంట్రల్ డిజైన్స్ విభాగం చీఫ్ ఇంజనీర్(సీఈసీడీఓ) విభాగం చేతులెత్తేయడం పట్ల ఆ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.‘బరాజ్ల నిర్మాణానికి డిజైన్లను సీఈ సీడీఓనే తయారు చేసింది. సాగునీటి ప్రాజెక్టుల డిజైన్లు, డ్రాయింగ్స్ రూపకల్పనకి శాఖలో సర్వోన్నత విభాగం సీఈ సీడీఓ. విభాగం సేవలు అవసరమైనప్పుడు బాధ్యత తీసుకోకుండా బరాజ్ల పునరుద్ధరణకి డిజైన్ల తయారీని నిపుణులు/అత్యుత్తమ సంస్థలు/పరిశోధన విభాగాలకు అప్పగించాలని ఎలా కోరుతుంది?’ అని నీటిపారుదల శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది.నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ(ఎన్డీఎస్ఏ) సిఫారసుల ఆధారంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల పునరుద్ధరణకి డిజైన్లను తయారు చేసే బాధ్యతకు సీఈ సీడీఓ విభాగం కట్టుబడి ఉండాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. శాఖలో డిజైన్ల తయారీకి నోడల్ ఏజెన్సీ కావడంతో ఈ బాధ్యతల నుంచి సీఈ సీడీఓ తప్పించుకోలేదని స్పష్టం చేసింది. అవసరమైతే సంబంధిత అంశాల నిపుణులు, సాంకేతిక సంస్థలను సంప్రదించి డిజైన్లు సరిగ్గానే ఉన్నట్టు ధ్రువీకరించుకోవచ్చని సూచించింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ఈఎన్సీ(జనరల్) తాజాగా సీఈఓ సీడీఓకు లేఖ రాశారు.కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్ 2023 అక్టోబర్ 21న కుంగిపోగా, అన్నారం, సుందిళ్ల బరాజ్లలో సైతం బుంగలు ఏర్పడిన విషయం తెలిసిందే. బరాజ్లలోని లోపాలపై అధ్యయనం జరిపిన ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సమర్పించిన తుది నివేదికను గత ఏప్రిల్ 24న కేంద్ర జలశక్తి శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. ఈ నివేదికలో చేసిన సిఫారసుల ఆధారంగా బరాజ్లలోని లోపాలను గుర్తించడానికి జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలను నిర్వహించి వాటి ద్వారా అందే సమాచారం ఆధారంగా ఆయా బరాజ్ల పునరుద్ధరణకి డిజైన్లు, డ్రాయింగ్స్ను రూపొందించాల్సి ఉంది.నిపుణుల కమిటీ నివేదిక అంది రెండు నెలలు గడిచినా బరాజ్ల పునరుద్ధరణ చర్యల విషయంలో ఎలాంటి పురోగతి లేకపోవడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో సీఈ సీడీఓ తమ ఇంజనీర్లతో లేదా అత్యున్నత సంస్థల సహాయంతో బరాజ్ల పునరుద్ధరణకి డిజైన్లు, డ్రాయింగ్స్ తయారీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ తాజాగా ఈఎన్సీ(జనరల్) లేఖ రాశారు. మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణకి అవసరమైన డిజైన్ల ఆమోదానికి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా నిర్దిష్ట గడువులు విధించుకుని ఈ పనులు పూర్తి చేయాలని సీఈ సీడీఓను ఆదేశించారు. డిజైన్ల తయారీకి అవసరమైన సాంకేతికసహాయం కోసం మరింత జాప్యం చేయకుండా తక్షణమే ఆసక్తి వ్యక్తీకరణ(ఈఓఐ)ను ఆహ్వానించాలని స్పష్టం చేశారు.బరాజ్ల డిజైన్లలో లోపాలను ఎత్తిచూపి వాటికి పరిష్కారాలను ఎన్డీఎస్ఏ సిఫారసు చేసిన నేపథ్యంలో ఆలోపాలను సరిదిద్దాల్సిన బాధ్యత సీఈ సీడీఓ విభాగానికే ఉందని నీటిపారుదల శాఖ స్పష్టం చేసింది. ఇతర సంస్థలపై డిజైన్లు, డ్రాయింగ్స్ తయారీ బాధ్యతను తోసేయడానికి సీఈ సీడీఓ విభాగం కన్సల్టెంట్ కాదని, నీటిపారుదల శాఖలో అంతర్భాగమని గుర్తు చేసింది.అలా అనడం అనుచితం..బరాజ్ల డిజైన్లలో లోపాలను సరిదిద్దడానికి/ వాటి పునరుద్ధరణకి అవసరమైన ఇన్వెస్టిగేషన్లు నిర్వహణ, డిజైన్ల తయారీకి తమ సొంత నైపుణాన్ని వాడడానికి బదులుగా ఇలాంటి చర్యల్లో ప్రపంచ స్థాయి నైపుణ్యం కలిగిన అత్యున్నత సంస్థలకు ఆ బాధ్యతలు అప్పగించేందుకు ఆసక్తి వ్యక్తీకరణను ఆహా్వనించాలని కోరుతూ సీఈ సీడీఓ లేఖ రాయడాన్ని నీటిపారుదల శాఖ అనుచితమని అభివర్ణించింది. ఒక వేళ నిపుణుల సహాయం అవసరమని భావిస్తే స్వయంగా చొరవ తీసుకుని ప్రపంచ స్థాయి నైపుణ్యం గల సంస్థలను నేరుగా సంప్రదించి తగిన సిఫారసులతో ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సిన బాధ్యత సీఈ సీడీఓపై ఉందని గుర్తు చేసింది. బరాజ్ల పునరుద్ధరణ విషయంలో సంస్థల నైపుణ్యాన్ని నిర్థారించే పరిజ్ఞానం సీఈ సీడీఓకే ఉంటుందని స్పష్టం చేసింది. ఆసక్తి వ్యక్తీకరణ ఆహ్వానించి డిజైన్ ఏజెన్సీలను ఎంపిక చేయడం, వాటికి డిజైన్ల తయారీ అప్పగించడం, ఆ సంస్థలు ఇచ్చే డిజైన్లను ఆమోదించడం కోసం ఎంత సమయం పడుతుందో సీఈ సీడీఓ తెలియజేయలేదని తప్పుబట్టింది.ఏడాదిగా కోరుతున్నా నామమాత్రంగా స్పందనబరాజ్లలోని లోపాలపై అధ్యయనం జరిపి వాటి పునరుద్ధరణకి డిజైన్లు తయారు చేయాలని 2023 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు నీటిపారుదల శాఖ 9 లేఖలు రాయగా, వాటికి సీఈ సీడీఓ నామమాత్రంగానే స్పందించిందని నీటిపారుదల శాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు సీఈ సీడీఓతో శాఖ జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించిన 20కి పైగా లేఖలను రిఫరెన్స్గా పొందుపరిచింది. ఒక్కో లేఖలో శాఖ ఏం కోరింది? సీఈ సీడీఓ ఏం సమాధానం ఇచ్చింది? అనే విషయాలను తాజా లేఖలో పొందుపరిచి సీఈ సీడీఓ స్పందించిన తీరు బాగా లేదని తప్పుబట్టింది. -
TG: గవర్నర్ వద్దకు పంచాయతీ ఆర్డినెన్స్ ఫైల్
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు అంశానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. దీనికి సంబంధించిన ఫైల్ను గవర్నర్ వద్దక పంపింది. దీనిలో భాగంగా పంచాయతీ ఆర్డెనెన్స్ ఫైల్ను మంగళవారం(జూలై 15వ తేదీ) మంత్రి, సీఎం సంతకం చేసి రాజ్భవన్కు పంపింది ప్రభుత్వం. 285(A) సెక్షన్ లో సవరణ చేస్తూ ముసాయిదాను రాజ్ భవన్కు పంపారు. ఎటువంటి లీగల్ చిక్కులు రాకండా ముసాయిదా డ్రాఫ్డ్ను గవర్నర్కు పంపించింది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. గవర్నర్ నుంచి ఆమోదం రాగానే ఆర్డినెన్స్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది ప్రభుత్వం. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలను మూడు నెలల్లో నిర్వహించాలని ఇప్పటికే హైకోర్టు డెడ్లైన్ విధించిన నేపథ్యంలో రిజర్వేషన్ల ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగానే గవర్నర్ ఆమోదంతో పంచాయతీరాజ్ సవరణ చట్టం వీలైనంత త్వరగా అమల్లోకి తీసుకు రావడానికి యత్నాలు చేస్తోంది ప్రభుత్వం. -
హెచ్సీఏ కంటే జూబ్లీహిల్స్ బైఎలక్షనే నాకు ముఖ్యం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్లో చోటు చేసుకున్న పరిణామాలపై టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ స్పందించారు. హెచ్సీఏ అవినీతి సర్వసాధారణం అయ్యిందన్న ఆయన.. తాను ఆ విషయాన్ని పట్టించుకునే స్థితిలో లేనని అన్నారు. మంగళవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ..‘‘రూల్స్ పాటించకపోతే ఇలాంటి కష్టాలే వస్తాయ్. హెచ్సీఏలో చాలా సమస్యలున్నాయ్. అసోషియేషన్ అనేది ఎప్పుడూ స్వలాభంతో నడవకూడదు. ఫోర్జరీ చేసినందుకే ప్రస్తుత ప్రెసిడెంట్ అరెస్ట్ అయ్యాడు. కాబట్టి, ఇప్పటివరకు జరిగిన అవకతవకలు బయటకి తీయాలి. హెచ్సీఏలో జరుగుతున్న పరిణామాలపై బీసీసీఐ ఫోకస్ పెట్టాలి. హెచ్సీఏ సభ్యులు, కోచ్ల పిల్లలనే క్రికెట్ ఆడిస్తున్నారు. సెలక్టర్లలో కూడా అవినీతి ఉంది. మొత్తంగా అవినీతి అనేది కామన్గా మారింది. పార్టీ ఆదేశిస్తే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోటీ చేస్తా. జూబ్లీహిల్స్ రేసులో నేను కూడా ఉన్నాను. హెచ్సీఏ కంటే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక లో పోటీ చేయడమే నా ముఖ్య లక్ష్యం’’ అని అజారుద్దీన్ కుండబద్ధలు కొట్టారు. -
స్థానిక సంస్థల ఎన్నికలపై దూకుడు పెంచిన బీజేపీ
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ దూకుడ పెంచింది. ఈ మేరకు ఘట్కేసర్ సమీపంలోని పీపీఆర్ కన్వెన్షన్లో వర్క్ షాపు నిర్వహించింది. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికైన రాంచందర్ రావు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ బన్సల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వర్క్షాపుకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డితో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, పదాధికారులు, జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలిచేలా వ్యూహ రచన చేస్తున్నారు. ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ముగ్గురు ప్రధాన కార్యదర్శలతో కమిటీ ప్రకటించే అవకాశం ఉంది. -
భార్యభర్తల మధ్య గొడవ.. పంచాయితీకి వచ్చిన ఇద్దరు దారుణ హత్య
సాక్షి,పెద్దపల్లి జిల్లా: సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లిలో కత్తిపోట్లు కలకలం సృష్టించాయి. భార్య భర్తల మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించేందుకు వచ్చిన భార్య తరుపు కుటుంబ సభ్యులపై.. భర్త తరుపు కుటుంబ సభ్యులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. పోలీసుల వివరాల మేరకు.. సుగ్లాంపల్లి భార్యాభర్తల పెద్ద మనుషుల పంచాయితీలో కత్తిపోట్ల కలకలం సృష్టించాయి. భార్య,భర్తల మధ్య జరుగుతున్న గొడవలకు పులిస్టాప్ పెట్టి వారిద్దరిని కలిపేందుకు ఆ ఊరి గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టారు. ఈ పంచాయతీ జరుగుతున్న సమయంలో భర్త తరుపు కుటుంబ సభ్యులు దారుణానికి ఒడిగట్టారు. మారణాయుధాలతో భార్య తరుపు కుటుంబ సభ్యులపై మారణాయుధాలతో దాడి చేశారు.అప్రమత్తమైన భార్య కుటుంబీకులు సైతం కత్తులతో దాడికి దిగారు. ఈ దాడిలో పెద్దపల్లి మండలం రాఘవాపూర్కు చెందిన గాండ్ల గణేష్,ఓదెలకు చెందిన మోటం మల్లేష్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. దుర్ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భార్యాభర్తల మధ్య వివాదాలలో జోక్యం చేసుకోవడం అనేది ఒక సున్నితమైన సమస్య. సాధారణంగా, కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు వారి మధ్య సామరస్యం కుదర్చడానికి ప్రయత్నించడం మంచిది. కానీ వ్యక్తిగత విషయాలలో ఎక్కువగా జోక్యం చేసుకోవడం వల్ల సమస్యలు మరింత జటిలం అయ్యే అవకాశం ఉంది. -
బాబు పంపిందే రేవంత్ మాట్లాడుతున్నారు: జగదీష్రెడ్డి
లేని గొప్పలు చెప్పుకోవడం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి అలవాటుగా మారిందని, తన గురురు చంద్రబాబు కోసం తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి మండిపడ్డారు. తిరుమలగిరి సభలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ జగదీష్రెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడారాయన. సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణకు రేవంత్ చేసింది ఏమీ లేదు. చెప్పుకోవడానికి ఏమీ లేదు. లేని గొప్పలు చెప్పుకోవడం ఆయనకు అలవాటు. తిరుమలగిరి సభకు స్పందనే లేదు. అందుకే సీఎం ఆ సభలో బూతులు మొదలుపెట్టారు. నానాటికీ ఆయన తన స్థాయి మరిచి మాట్లాడుతున్నారు అని జగదీష్ రెడ్డి అన్నారు. ‘‘నీళ్ళ విషయంలో మరొక సారి రేవంత్ అజ్ఞానం బయటపడింది. ఏపీ సీఎం చంద్రబాబు పంపిన దానినే రేవంత్ మీడియా ముందు మాట్లాడుతున్నారు. తద్వారా తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తున్నారు. గురుదక్షిణ కింద కృష్ణ, గోదావరి జలాలను బాబుకు అప్పజెప్పబోతున్నారు. బనకచర్ల కోసం మేడిగడ్డను గాలికి వదిలేస్తున్నారు’’ అని రేవంత్పై జగదీష్ మండిపడ్డారు. మేడి గడ్డ బ్యారేజీ, అన్నారం , సుందిల్ల నుండి బాహుబలి పంపు హౌస్ వరకు ఎక్కడైనా చర్చకు సిద్దం’’ అని సవాల్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 6,47,479 కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశాం. మరి మా హయంలో రేషన్ కార్డులు పంపిణీ జరగలేదని అంటున్న రేవంత్ చెంప దెబ్బకు సిద్ధమా?. ఇప్పుడు ఎన్నికలు పెడితే నల్గొండలో 12 సీట్లకు 12 సీట్లు బీఆర్ఎస్ గెలుస్తుంది.ధాన్యం ఉత్పత్తిలో నల్గొండ జిల్లాను దేశంలోనే నంబర్ వన్గా బీఆర్ఎస్ ప్రభుత్వం తీర్చిదిద్దింది. ధాన్యం ఉత్పత్తిలో 3 లక్షల మెట్రిక్ టన్నుల నుండి 40 లక్షల మెట్రిక్ టన్నుల పెంచింది బిఆర్ఎస్ ప్రభుత్వమే. నల్గొండలో యాదాద్రి పవర్ ప్లాంట్, 3 మెడికల్ కాలేజీ లు, యాద్రాది టెంపుల్ అభివృద్ధి కేసీఆర్ హయాంలోనే జరిగాయి కదా. మరి సీఎంగా రేవంత్ హయాంలో ఒక్క ప్రాజెక్ట్ అయినా ప్రారంభించారా?. నల్గొండ రైతులనే అడుగుదాం.. వారి చెంప దెబ్బలకు నేను సిద్ధంగా ఉన్నా. మరి సీఎం రేవంత్, మంత్రులు అందుకు సిద్ధమేనా? అని జగదీష్రెడ్డి సవాల్ విసిరారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విషయంలో తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలను జగదీష్ రెడ్డి ఖండించారు. రాజకీయాల్లో ఇలాంటి అక్కర్లేదు. ఎవరికివారే సంస్కారం నేర్చుకుంటే మంచిది. సీఎం రేవంత్ కూడా విజ్ఞతతో మాట్లాడడం నేర్చుకోవాలి అని జగదీష్రెడ్డి హితవు పలికారు. -
కాంగ్రెస్ నేత హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి, మెదక్: కాంగ్రెస్ నేత అనిల్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కడప జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే కుమారుడికి, అనిల్కు మధ్య విబేధాలు ఉన్నాయి. ఓ భూమి విషయంలో గత కొద్దిరోజులుగా వివాదం నడుస్తుంది. టీడీపీ ఎమ్మెల్యే కుమారుడి వద్ద అనిల్ రూ.80 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. ఘటనాస్థలంలో ఉన్న బెంజ్ కారు కూడా టీడీపీ ఎమ్మెల్యే కుమారుడిదేనని పోలీసులు అంటున్నారు. గత ఐదు నెలలుగా బెంజ్ కారు అనిల్ వద్దనే ఉంటుందని చెబుతున్నారు.మెదక్ – జోగిపేట ప్రధాన రహదారిపై నిన్న(సోమవారం రాత్రి కాంగ్రెస్ నేత అనిల్ అనుమానాస్పదంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. మండలంలోని పైతర గ్రామానికి చెందిన మరెల్లి అనిల్(28)జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాడు. మెదక్ నుంచి స్వగ్రామానికి కారులో ఆయన ప్రయాణమయ్యాడు.చిన్నఘనాపూర్ విద్యుత్ సబ్ స్టేషన్ వద్దకు రాగానే కారు అదుపుతప్పి పక్కనే ఉన్న కల్వర్టును ఢీకొట్టింది. అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అనిల్ మృతి చెందినట్లు తెలిపారు. అయితే, అనిల్ శరీరంపై బుల్లెట్ గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ఘటనా స్థలంలో నాలుగు బులెట్లు లభ్యమయ్యాయి. -
తేజేశ్వర్ కేసులో మరో ట్విస్ట్
సాక్షి, జోగుళాంబ గద్వాల జిల్లా: ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. హత్య కేసులో ప్రధాన నిందితులైన తిరుమలరావు ఏ–1, కుమ్మరి నాగేష్ ఏ–3, చాకలి పరశురాముడు ఏ–4, చాకలి రాజు ఏ–5లను ఈ నెల 10న విచారణాధికారి శ్రీను.. కోర్టు అనుమతితో 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని వివరాలు సేకరించారు.వాయిస్ మెసెంజర్తో గొంతు మార్చి మాట్లాడినట్లు ఇది వరకే బయటపడగా.. తాజాగా మరో ట్విస్ట్ బయటపడింది. తేజేశ్వర్-సహస్రల మధ్య ఎలాంటి కలయిక ఉండరాదనే ఉద్దేశంతో స్పై కెమెరాను కొనుగోలు చేసి తేజేశ్వర్ బెడ్రూంలో ఏర్పాటు చేశారు.తిరుమలరావు నిత్యం వారి కదలికలను కెమెరా ద్వారా గమనించాడు. కొత్త ట్విస్టు వెలుగులోకి రావడంతో.. సహస్రను కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు పీటీ వా రెంట్ను కోర్టుకు సమర్పించారు. ఏ–2 సహస్రను కస్టడీలోకి తీసుకుంటే పూర్తి వివరాలు తెలుస్తాయని గద్వాల సీఐ శ్రీను వెల్లడించారు. -
బనకచర్ల.. ఏపీకి షాకిచ్చిన తెలంగాణ
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో నీటి వివాదం కొత్త మలుపు తిరిగింది. బనకచర్ల విషయంలో ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. ఈ ప్రాజెక్టుపై చర్చకు ససేమీరా చెబుతూ కేంద్ర ప్రభుత్వానికి తాజాగా ఓ లేఖ రాసింది. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో రేపు(జూలై 16, 2025) అత్యున్నత స్థాయి సమావేశం జరగాల్సి ఉంది. ఇందులో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనాల్సి ఉంది. ఇందులో గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు, పర్యావరణ అనుమతులు, జల వివాదాలు ప్రధాన అంశాలు చర్చిస్తారనే ప్రచారం తెర మీదకు వచ్చింది. ఈ క్రమంలో..ఇద్దరు సీఎంలను హాజరు కావాలంటూ కేంద్ర జలశక్తి శాఖ లేఖ రాసింది. సమావేశంలో పాల్గొనే ప్రతినిధుల వివరాలు, అజెండా పంపాలని పేర్కొంది. అయితే..అయితే బనకచర్లపై చర్చించాలంటూ ఏపీ సింగిల్ ఎజెండా ఇచ్చింది. దీనికి తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. బనకచర్లపై చర్చ అవసరం లేదంటూ కేంద్రానికి తాజాగా లేఖ రాసి ట్విస్ట ఇచ్చింది. ఇప్పటివరకు బనకచర్ల ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవు. బీఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ, ఈఏసీలు సైతం అభ్యంతరాలు తెలిపాయి. చట్టాలను, ట్రిబ్యునల్ తీర్పును ఉల్లంఘించే బనకచర్లపై రేపటి సమావేశంలో చర్చించాల్సిన అవసరం లేదు. ఇతర అంశాలపై చర్చిస్తేనే మీటింగ్కు వస్తామని తెలంగాణ ప్రభుత్వం లేఖ ద్వారా కేంద్రానికి స్పష్టం చేసింది.తెలుగు రాష్ట్రాల నడుమ బనకచర్ల ప్రాజెక్టు వివాదాస్పందంగా మారింది తెలిసిందే. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి వరద జలాలను రాయలసీమకు మళ్లించాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనను తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో రేపటి చర్చలు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాల పరిష్కారానికి కీలకంగా మారే అవకాశం ఉందని అంతా భావించారు. అయితే తెలంగాణ ప్రభుత్వ తాజా లేఖతో జరగబోయే పరిణామాలపై ఆసక్తి నెలకొంది. తెలంగాణ అభ్యంతరాలుప్రాజెక్టు రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధమని వాదనగోదావరి ట్రైబ్యునల్ కేటాయింపులకు వ్యతిరేకంగా ఉందని అభిప్రాయంనాగార్జునసాగర్ వాడకాన్ని తప్పుబడుతూ, పర్యావరణ నష్టం గురించి ఆందోళన ఏపీ వాదనలువర్షాకాలంలో సముద్రంలో కలిసిపోతున్న వరద జలాలను వినియోగించాలన్న ఉద్దేశంరూ.80,000 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు ప్రతిపాదన3 దశల్లో నిర్మాణం: పోలవరం → బొల్లపల్లి → బనకచర్లఏపీ ప్రభుత్వం పంపిన బనకచర్ల ప్రతిపాదనలను కేంద్రం వెనక్కి పంపించివేసింది. ఈ ప్రాజెక్టుపై పర్యావరణ నిపుణుల కమిటీ (EAC) అభ్యంతరాలు వ్యక్తం చేసిందని తెలిపింది. ఈ క్రమంలోనే గోదావరి వరద జలాల లభ్యతపై అధ్యయనం చేయాలని ఏపీ ప్రభుత్వానికి సూచించింది.ఇదీ చదవండి: బనకచర్ల.. గురు శిష్యుల డ్రామానా? -
ఏసీబీ అదుపులో రిటైర్డ్ ఈఎన్సీ మురళీధర్రావు
సాక్షి, హైదరాబాద్: నీటి పారుదల శాఖ మాజీ చీఫ్ ఇంజినీర్ మురళీధర్రావు ఇంట్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో బంజారాహిల్స్లోని ఆయన నివాసంలొ ఏసీబీ అదుపులోకి తీసుకుంది.ఈఎన్సీగా పనిచేస్తూ భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలున్నాయి. హైదరాబాద్ కరీంనగర్, జహీరాబాద్.. మొత్తం 10 చోట్ల ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. -
హైదరాబాద్: పార్క్లో కాల్పుల కలకలం
సాక్షి, హైదరాబాద్: దిల్సుఖ్నగర్లో కాల్పుల కలకలం రేగింది. మార్నింగ్ వాకర్స్పై దుండగులు కాల్పులు జరిపారు. శాలివాహన నగర్ పార్క్లో జరిగిన ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. వాకింగ్ చేస్తున్న సమయంలో చందు నాయక్ అనే వ్యక్తిపై దుండగులు కాల్పులు జరపగా.. ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.చందు నాయక్ నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట వాసిగా పోలీసులు గుర్తించారు. కాల్పులకు భూ వివాదమే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కారులో నలుగురు వ్యక్తులు.. చందు నాయక్పై ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. మృతుడిపై కారం చల్లి.. ఆ తర్వాత దాడికి పాల్పడ్డారు. ఘటన స్థలానికి చేరుకున్న కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇసుక రేణువుల్లో ఉన్న బుల్లెట్స్ కోసం పోలీసులు సెర్చింగ్ చేస్తున్నారు. మృతుడు చందును చంపుతున్న క్రమంలో అడ్డొచ్చిన వారిని దుండగులు గన్తో బెదిరించారు. చుట్టుపక్కల సీసీ ఫుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. గన్స్లో ఉన్న బుల్లెట్స్ను పరిశీలించిన క్లూస్ టీమ్.. నమూనాలను ల్యాబ్కి పంపించారు. నిందితుల కార్ నెంబర్ ఆధారంగా పోలీసులు ట్రాక్ చేస్తున్నారు.సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యకుమార్ కాల్పుల ఘటన వివరాలను మీడియాకు వెల్లడించారు. ‘‘ఉదయం 7:30 గంటలకు ఓ వ్యక్తిపై కాల్పులు జరిగాయని సమాచారం వచ్చింది. చందు నాయక్ అనే వ్యక్తి వాకింగ్ చేస్తుండగా నలుగురు దుండగులు వచ్చి కాల్పులు జరిపారు. షిఫ్ట్ కార్ లో వచ్చి నలుగురు వ్యక్తులు కాల్పులు జరిపారని స్థానికులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం.నిందితుల కోసం 10 బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నాం. స్పాట్లో 7 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నాం. క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించాం. స్పాట్లో దొరికిన బుల్లెట్లను చూస్తే ఒకే వెపన్తో ఫైరింగ్ చేసినట్టు ఉన్నాయి. 2022లో జరిగిన హత్య కేసులో చందు నాయక్ నిందితుడిగా ఉన్నాడు. కాగా, ఈ కాల్పుల ఘటనలో ఎస్వోటీ పోలీసుల ఎదుట నలుగురు లొంగిపోయారు. ఐదుగురి మధ్య ఆర్థిక లావాదేవీలే చందునాయక్ హత్యకు కారణమని పోలీసులు చెబుతున్నారు. మృతుడు చందునాయక్తో పాటు ఈ నలుగురు ఓ హత్య కేసులో నిందితులు. -
మెదక్ జిల్లాలో కాంగ్రెస్ నేత అనుమానాస్పద మృతి
సాక్షి, మెదక్ జిల్లా: కాంగ్రెస్ నేత అనిల్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని మెదక్ – జోగిపేట ప్రధాన రహదారిపై సోమవారం రాత్రి చోటుచేసుకుంది. మండలంలోని పైతర గ్రామానికి చెందిన మరెల్లి అనిల్(28)జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాడు. మెదక్ నుంచి స్వగ్రామానికి తన కారులో ప్రయాణమయ్యాడు.చిన్నఘనాపూర్ విద్యుత్ సబ్ స్టేషన్ వద్దకు రాగానే కారు అదుపుతప్పి పక్కనే ఉన్న కల్వర్టును ఢీకొట్టింది. దీంతో అనిల్కు ఛాతీలో బలమైన దెబ్బ తగిలి స్పృహ తప్పి పడిపోయాడు. అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అనిల్ మృతి చెందినట్లు తెలిపారు. అయితే, అనిల్ శరీరంపై బుల్లెట్ గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ఘటనా స్థలంలో నాలుగు బులెట్లు లభ్యమయ్యాయి. -
జల వివాదాలపై కేంద్రం దృష్టి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపై కేంద్రం దృష్టి సారించింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఈ నెల 16న మధ్యాహ్నం 2.30 గంటలకు ఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో రెండు రాష్ట్రాల సీఎంలు రేవంత్రెడ్డి, చంద్రబాబుతో సమావేశం ఏర్పాటు చేసినట్లు.. ఆ శాఖ సంయుక్త కార్యదర్శి ప్రదీప్కుమార్ అగర్వాల్ తెలిపారు. ఈ మేరకు సోమవారం రెండు రాష్ట్రాలకు లేఖ రాశారు. ఈ భేటీలో చర్చించడానికి రెండు రాష్ట్రాలూ తమ ఎజెండా అంశాలను తక్షణమే పంపించాలని కోరారు. సీఎంలతో పాటు సమావేశానికి రానున్న ప్రతినిధి బృందాల వివరాలను కూడా పంపించాలని సూచించారు. తెలంగాణ వాటాల కోసం కేంద్రంపై ఒత్తిడికృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన ప్రతి నీటి బొట్టును సాధించడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని సీఎం రేవంత్రెడ్డి నిర్ణయించారు. కృష్ణా బేసిన్లోని రాష్ట్ర ప్రాజెక్టులకు వెంటనే క్లియరెన్సు ఇవ్వాలని, నీటి కేటాయింపులతో పాటు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలని కేంద్రాన్ని కోరనున్నారు. 16న ఢిల్లీలో జరిగే సమావేశంలో రాష్ట్ర నీటి వాటాల సాధనతో పాటు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులు, కొత్త ప్రాజెక్టులకు పట్టుబట్టాలని నిర్ణయించారు. ‘కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణకు తీరని ద్రోహం జరిగింది. కేసీఆర్ ప్రభుత్వం కృష్ణా జలాల్లో న్యాయంగా రావాల్సిన నీటి వాటాల సాధించడంలో దారుణంగా విఫలమైంది. తెలంగాణకు 299 టీఎంసీల నీటి వాటాకు అంగీకరించి ఏపీకి 512 టీఎంసీలు కట్టబెట్టింది. శ్రీశైలం ఎగువన ఏపీ అక్రమంగా నిర్మించుకున్న ప్రాజెక్టులన్నింటికీ వంత పాడింది. కృష్ణా నీళ్లను ఏపీ యధేచ్ఛగా మళ్లించుకుంటే మౌనం వహించింది. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణాపై నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ఇవ్వకుండా అసంపూర్తిగా వదిలేసింది..’ అని సీఎం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. -
హ్యామ్ పద్ధతిలో ఉత్తర రింగు
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగం రోడ్డు నిర్మాణాన్ని హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్)లో నిర్మించాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ నిర్ణయించింది. తొలుత దీన్ని ఈపీసీ (ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్) పద్ధతిలో నిర్మించాలని నిర్ణయించినప్పటికీ, తాజాగా హ్యామ్ వైపు మొగ్గు చూపింది. ఈ పద్ధతిలో ప్రభుత్వం నిర్మాణానికయ్యే ఖర్చును ఎప్పటికప్పుడు చెల్లించాల్సిన అవ సరం ఉండదు. నిర్మాణ సంస్థకు విడతల వారీగా చెల్లించే వీలుంటుంది. ఖజానాపై భారం పడకుండా వెసులుబాటు లభిస్తుంది. రద్దీ ఎక్కువగా ఉంటుందని తేలడంతో.. ఉత్తర భాగాన్ని (162 కి.మీ) చేపట్టేందుకు మూడు నెలల క్రితం ఎన్హెచ్ఏఐ టెండర్లు పిలిచింది. మొత్తం 8 లేన్లకు గాను తొలివిడతలో 4 వరసలుగా నిర్మించాలని టెండర్ డాక్యుమెంటులో పేర్కొంది. ఈ రోడ్డు మీద టోల్ ఆదాయం తక్కువగా ఉంటుందనే అంచనాతో కాంట్రాక్టర్లు ఈపీసీ పద్ధతిలో పని చేపట్టేందుకే ముందుకొస్తారని ఎన్హెచ్ఏఐ భావించింది. ఈపీసీ పద్ధతిలో నిర్మాణ వ్యయాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. పనులు జరిగేకొద్దీ ఎప్పటికప్పుడు అయ్యే వ్యయాన్ని నిర్మాణ సంస్థకు విడుదల చేయాల్సి ఉంటుంది. నిధుల విడుదల నిలిచిపోతే పనులు కూడా ఆగిపోతాయి. అయితే పీఎం గతిశక్తిలోని నెట్వర్క్ ప్లానింగ్ గ్రూప్ ఈ ప్రాజెక్టుపై సమీక్షించి ఆర్ఆర్ఆర్ వల్ల ఆయా ప్రాంతాల్లో మంచి అభివృద్ధి జరిగే అవకాశం ఉన్నందున, ఆ రోడ్డుపై వాహనాల సంఖ్య కూడా అధికంగానే ఉంటుందని, దీనివల్ల టోల్ ఆదాయం కూడా ఎక్కువే ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేసింది. రోడ్డును 4 వరసలుగా కాకుండా, తొలి దశలోనే 6 వరసలతో నిర్మించాలని సూచించింది. ఈ మేరకు మరోసారి ట్రాఫిక్ స్టడీ నిర్వహించాలని పేర్కొంది. కాగా భవిష్యత్తులో వాహనాల సంఖ్య భారీగా ఉండనుందని ట్రాఫిక్ స్టడీ తేల్చింది. దీంతో 6 వరసల రోడ్డు, 8 వరసలతో వంతెనలు నిర్మించాలని కేంద్రానికి ఎన్హెచ్ఏఐ ప్రతిపాదించింది. తాజాగా దానికి కేంద్ర ఉపరితల రవాణాశాఖ ఆమోదం తెలిపింది. ఈపీసీ పద్ధతిలో కాకుండా, హ్యామ్ మోడల్లో రోడ్డు నిర్మాణానికి కాంట్రాక్టు సంస్థతో ఒప్పందం చేసుకోవాలని కూడా ఆదేశించింది. దీంతో పాత టెండర్ డాక్యుమెంట్ను మార్చి ఆ మేరకు మార్పులు చేయాలని ఆదేశించింది. హ్యామ్తో ఇదీ వెసులుబాటు.. హ్యామ్ మోడల్లో ప్రభుత్వం మొత్తం నిర్మాణ వ్యయంలో తొలుత 40 శాతం మాత్రమే భరిస్తుంది. మిగతా మొత్తాన్ని నిర్మాణ సంస్థ బ్యాంకుల నుంచి రుణం ద్వారా సమకూర్చుకుంటుంది. సొంత ఆర్థిక వనరులుంటే రుణంతో సంబంధం లేకుండా కూడా ఖర్చు చేసుకోవచ్చు. ఈ మొత్తాన్ని 15 ఏళ్ల సమయం (ఒప్పందంలో పేర్కొనే గడువు)లో ప్రభుత్వం వడ్దీతో చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి ఆరు నెలలకు ఓ వాయిదా చొప్పున చెల్లిస్తుంది. అంతకాలం రోడ్డు నిర్వహణ బాధ్యతను ఆ సంస్థనే పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇక రోడ్డుపై టోల్వసూలు చేసే బాధ్యతను మరో టెండర్ ద్వారా ఇంకో సంస్థకు అప్పగిస్తుంది. త్వరలో రోడ్డుకు నంబర్.. ఈ రోడ్డును చేపట్టాలంటే దానికి కేంద్ర కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోద ముద్ర అవసరం. రోడ్డు పనులకు ఆయ్యే వ్యయం వివరాలను సమీక్షించి, ఆ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై కమిటీ చర్చించి ఆమోద ముద్ర వేస్తుంది. అప్పుడే ఆ రోడ్డుకు జాతీయ రహదారి నంబరు కేటాయిస్తుంది. ఆ తర్వాత టెండర్ తెరిచి నిర్మాణ సంస్థతో ఒప్పందం చేసుకుంటారు. ఈ వారంలో కమిటీ సమావేశం జరగనున్నట్టు తెలిసింది. అందుకు వీలుగా ఎన్హెచ్ఏఐ నివేదిక సిద్ధం చేస్తోంది. -
‘ఇచ్చంపల్లి’కి అనుమతించండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని కరువు పీడిత ప్రాంతాల సాగు, తాగునీటి అవసరాలు తీర్చేందుకు 200 టీఎంసీల వరద నీటిని ఉపయోగించుకునేలా గోదావరిపై ఇచ్చంపల్లి వద్ద కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గోదావరిపై పోలవరం, ఇచ్చంపల్లి ప్రాజెక్టులు చేపట్టాల్సిందిగా గోదావరి ట్రిబ్యునల్ తీర్పులో పేర్కొన్న అంశాన్ని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు తరహాలోనే ఇచ్చంపల్లి ప్రాజెక్టుకు సైతం కేంద్రం నిధులు సమకూర్చాలని కోరారు. సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలతో సోమవారం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్కు మంత్రి ఉత్తమ్ ఈ మేరకు లేఖ రాశారు. జాతీయ నదుల అనుసంధానం విధానంలో భాగంగా ప్రతిపాదించిన గోదావరి–కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టు కింద గోదావరిపై ఇచ్చంపల్లి వద్ద బరాజ్ నిర్మించి 148 టీఎంసీలను బదిలీ చేయాలని నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్డబ్ల్యూడీఏ) చేసిన ప్రతిపాదనను ఉత్తమ్ గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా తరలించే జలాల్లో 50 శాతం తెలంగాణకు కేటాయించాలని ఎన్డబ్ల్యూడీఏ 2024 మార్చిలో లేఖ రాసిందని తెలిపారు. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయడంతో పాటు అనుమతులు జారీ చేయాలని కోరారు. కృష్ణా, గోదావరి బేసిన్లలోని వివాదాలపై కేంద్రం వెంటనే చొరవచూపాలని విజ్ఞప్తి చేశారు. లేఖలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.. ఏపీ అక్రమ ప్రాజెక్టులు ⇒ శ్రీశైలం జలాశయం అట్టడుగు స్థాయి నుంచి బేసిన్ వెలుపలి ప్రాంతాలకు రోజుకు 10 టీఎంసీలు చొప్పున 20 రోజుల్లో 200 టీఎంసీల జలాలను అక్రమంగా మళ్లించేందుకు ఏపీ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది. దీనివల్ల శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతలలో జల విద్యుదుత్పత్తిపై దుష్ప్రభావం పడటంతో పాటు తెలంగాణలోని నాగార్జునసాగర్, కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి, డిండి, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుల ఆయకట్టుకు నీటి కొరత ఏర్పడుతుంది. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్కు అనుసంధానమై ఉన్న శ్రీశైలం కుడిగట్టు ప్రధాన కాల్వ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కుల నుంచి 89 వేల క్యూసెక్కులకు పెంచుకున్న ఏపీ.. తాజాగా దానిని 1.5 లక్షలకు పెంచుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది. శ్రీశైలం 841 అడుగుల నుంచే రోజుకు 8 టీఎంసీలను మళ్లించేలా కాల్వల నిర్మాణాలు చేపట్టింది. ఎన్జీటీ స్టేను ఉల్లంఘించి 797 అడుగుల వద్ద రోజుకు 3 టీఎంసీలు తీసుకెళ్లేందుకు రాయలసీమ ఎత్తిపోతలు, ముచ్చుమర్రి, మల్యాల, గురు రాఘవేంద్ర ప్రాజెక్టులు నిర్మిస్తోంది. కృష్ణా ట్రిబ్యునల్ విచారణ త్వరగా పూర్తి చేయాలి ⇒ 1979లో ఎస్ఎల్బీసీ, 1984లో కల్వకుర్తి, 1997లో నెట్టెంపాడు, 2013లో పాలమూరు–రంగారెడ్డి, 2007లో డిండి, 2005లో కొల్లాపూర్, 2014లో నారాయణపేట–కొడంగల్ ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. కృష్ణా ట్రిబ్యునల్–1 అవార్డు ప్రకారం చేపట్టిన ఈ ప్రాజెక్టులకు సీడబ్ల్యూసీ అనుమతులు ఇవ్వాలి. కృష్ణా ట్రిబ్యునల్ విచారణ త్వరగా పూర్తి కావాలి. ⇒ నిబంధనలకు విరుద్ధంగా ఇతర బేసీన్లకు నీటిని మళ్లించడాన్ని కేఆర్ఎంబీ అడ్డుకోవాలి. ⇒ శ్రీశైలం డ్యామ్ నిర్వహణ ప్రమాదకరంగా మారింది. డ్యామ్ భద్రత, నిరంతర కార్యకలాపాలు, జల విద్యుత్తు ఉత్పత్తి, నీటిపారుదల అవసరాలు, తాగునీటి సరఫరాకు తక్షణ చర్యలు చేపట్టాలి. ⇒ గోదావరి నదీ జలాల్లో తెలంగాణకు ఉన్న 968 టీఎంసీల వాటాలో నుంచి ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు 80 టీఎంసీలను సర్దుబాటు చేయాలి. ఏఐబీపీ కింద ఆర్థిక సాయం అందించాలి. జాతీయ ప్రాజెక్టుగా డిండి ⇒ పాలమూరు–రంగారెడ్డి, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల డీపీఆర్లకు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) క్లియరెన్సుతో పాటు పర్యావరణ అనుమతులు జారీ చేయాలి. ⇒ 2007లోనే డిండి ఎత్తిపోతలకు పరిపాలన అనుమతులు జారీ చేశారు. ఫ్లోరోసిస్ సమస్యను పరిష్కరించే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని పీఎంఓ 2010 డిసెంబర్ 10వ తేదీన ప్రతిపాదించింది. ⇒ 2021 సెపె్టంబర్ 21న సీడబ్ల్యూసీకి సమ్మక్క సాగర్ ప్రాజెక్టు డీపీఆర్ సమరి్పంచాం. ఛత్తీస్గఢ్ నుంచి ఎన్వోసీ లేక అంతర్రాష్ట్ర వ్యవహారాల డైరెక్టరేట్ నుంచి క్లియరెన్స్ ఆలస్యమవుతోంది. ఛత్తీస్గఢ్ నిబంధనల ప్రకారం అక్కడి నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లిస్తాం. ముంపుపై ఖరగ్పూర్ ఐఐటీ సిఫారసుల అమలుకు కట్టుబడి ఉన్నాం. -
2050 నాటికి 640 కి.మీ. మెట్రో
సాక్షి, హైదరాబాద్: వచ్చే 25 ఏళ్లలో అంటే 2050 నాటికి 640 కి.మీ. వరకు మెట్రోరైల్ విస్తరణ చేపట్టాలని లీ అసోసియేట్స్ అధ్యయన సంస్థ ప్రతిపాదించింది. అప్పటివరకు హైదరాబాద్ మహానగర జనాభా 3.5 కోట్లకు చేరనున్నట్లు అంచనా. దీంతో సుమారు 65 లక్షల మందికి పైగా మెట్రోసేవలను వినియోగించుకుంటారని పేర్కొంది. భవిష్యత్ ప్రజారవాణా అవసరాల దృష్ట్యా మెట్రో విస్తరణ ఎంతో కీలకమని ఈ సంస్థ స్పష్టం చేసింది. 2050 నాటికి నాలుగు దశలుగా విస్తరణ చేపట్టాల్సి ఉందని పేర్కొంది.రీజనల్ రింగ్రోడ్డు వరకు హైదరాబాద్ మహానగరాన్ని విస్తరించిన నేపథ్యంలో ఇందుకనుగుణంగా అన్నివైపులా కనెక్టివిటీని పెంచాల్సి ఉంది. సమగ్ర మాస్టర్ప్లాన్–2050లో భాగంగా ప్రభుత్వం సమగ్ర రవాణా ప్రణాళికపై లీ అసోసియేట్స్ను కన్సల్టెన్సీగా నియమించింది. రోడ్లు, రవాణా సదుపాయాలు, ఎంఎంటీఎస్తోపాటు మెట్రో సేవల విస్తరణపై ఈ సంస్థ ప్రధానంగా అధ్యయనం చేస్తోంది. ఇప్పుడు రెండో దశలో 8 మార్గాల్లో మెట్రో విస్తరణకు ప్రణాళికలను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఇది 2030 నాటికి వినియోగంలోకి వస్తే మెట్రో ప్రయాణికుల సంఖ్య 15 లక్షలకు చేరనుంది.మూడో దశలో 2040 నాటికి పెరగనున్న జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకొని 340 కి.మీ. వరకు విస్తరించాల్సి ఉందని అంచనా వేసింది. మూడో దశ అందుబాటులోకి వస్తే మెట్రో ప్రయాణికులు 35 లక్షలు దాటొచ్చునని అంచనా. ఇలా 2050 నాటికి 640కి.మీ వరకు మెట్రో మార్గాలను పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ సంస్థ సెప్టెంబర్లో తుది నివేదికను సమరి్పంచనుంది. రెండో దశ పూర్తయితే 231.5 కి.మీ. ప్రస్తుతం ప్రతిపాదించిన మెట్రో రెండో దశ వల్ల కొత్తగా 162.5 కి.మీ. వరకు మెట్రో మార్గం అందుబాటులోకి వస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేసేందుకు ప్రజారవాణాలో మెట్రోరైల్ మాత్రమే కీలకమవుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఆర్థికాభివృద్ధి ప్రణాళికపై అధ్యయనం హెచ్ఎండీఏ పరిధి విస్తరణతో ప్రస్తుతం 11 జిల్లాలు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సిద్దిపేట్, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి, నల్లగొండ, నాగర్కర్నూల్, మహబూబ్నగర్, వి కారాబాద్ జిల్లాల్లోని 104 మండలాలు, 1355 గ్రామాలతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా (హెచ్ఎంఏ) ఏర్పడింది. ఆర్థికాభివృద్ధి ప్రణాళికపై అధ్యయనం చేసి సమగ్ర ప్రాజెక్టు నివేదికను అందజేసేందుకు ప్రభుత్వం క్రిసిల్ ప్రైవే ట్ లిమిటెడ్ అనే కన్సల్టెన్సీ సంస్థకు బాధ్యతలను అప్పగించింది. ఈ సంస్థ త్వరలో దీనిపై నివేదికను అందజేయనుంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 35ఆర్థిక మండ లాలు, లాజిస్టిక్ హబ్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదిం చింది. ప్రపంచంలోని టాప్–10 నగరాల సరసన హైదరాబాద్ను నిలబెట్టేందుకు అమలు చేయాల్సిన భవిష్యత్తు ఆర్థిక ప్రణాళికలపై క్రిసిల్ నివేదికను ఇవ్వనుంది. -
ఇంజనీరింగ్ ఆప్షన్లు అటు.. ఇటు
సాక్షి, హైదరాబాద్: మాక్ సీట్ల కేటాయింపు తర్వాత ఇంజనీరింగ్ ఆప్షన్లు వేగంగా కదులుతున్నాయి. ఆప్షన్ల జోడింపు.. తొలగింపుతో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మాక్ కేటాయింపునకు ముందు విద్యార్థుల నుంచి 56,63,308 వెబ్ ఆప్షన్లు రాగా.. సోమవారం మరో లక్ష పెరిగాయి. మళ్లీ మధ్యాహా్ననికి 30 వేలు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో ఆప్షన్లు ఇవ్వడంలో విద్యార్థులు కొంత గందరగోళానికి గురవుతున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆప్షన్ల గడువు మంగళవారంతో ముగియనుంది. దీంతో ఉన్న ఆప్షన్లు తీసేయడం, కొత్తవి పెట్టడం చేస్తున్నారు.మరోవైపు మంచి ర్యాంకు ఉండీ సీటు రాని విద్యార్థులు కూడా అప్రమత్తమయ్యారు. ఆప్షన్లు ఇచ్చినా సీటు రాని వారు 16,905 మంది ఉన్నారు. వీళ్లంతా మాక్ కేటాయింపునకు ముందు ఐదుకు మించి బ్రాంచీలను సెలెక్ట్ చేయలేదు. పది కాలేజీలకు మించి ప్రాధాన్యత ఇవ్వలేదు. దీంతో మాక్లో సీటు రాలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సోమవారం వీళ్లంతా పెద్దఎత్తున ఆప్షన్లు ఇచ్చారు. 2 వేలలోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులు మాక్లో 5 వేల ర్యాంకు కటాఫ్ ఉన్న కాలేజీల్లో రెండు, మూడు బ్రాంచీలకు ఆప్షన్లు ఇస్తున్నారు. రెండో ప్రాధాన్యత కీలకం మంచి కాలేజీ, మంచి బ్రాంచీ వచ్చిన విద్యార్థులు కొంత అప్రమత్తంగానే ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఈ నెల 18న వెల్లడించే సీట్ల కేటాయింపునకు ర్యాంకర్లు రంగంలోకి వచ్చే వీలుంది. సీట్లు రాని 16,905 మంది 10 వేల లోపు వచ్చిన అన్ని కాలేజీలపైనా ప్రభావం చూపిస్తారు. దీంతో 25 వేల ర్యాంకుతో సీటు వచ్చిన విద్యార్థి సీటు మారే అవకాశం ఉంది. కాబట్టి 20 వేలపైన ర్యాంకులు వచ్చిన విద్యార్థులు రెండో ఆప్షన్ను జాగ్రత్తగా చూసిపెట్టాలి. తమ ర్యాంకుకు ఎక్కడ సీటు వస్తుందనేది గుర్తించాలి. దీనికోసం గత ఏడాది సీట్ల కేటాయింపును కొలమానంగా తీసుకోవాలి. పోటీ లేకుంటే మాక్లో వచ్చిన సీటే రావచ్చు. ఒకవేళ మంచి ర్యాంకర్లు పోటీకి వస్తే రెండో ప్రాధాన్యత ఇచ్చిన కాలేజీ, బ్రాంచీలో సీటు పొందే వీలుందని, దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మంచి ర్యాంకు ఉండే విద్యార్థులు ఇప్పుడున్న బ్రాంచీ, కాలేజీ కన్నా బెస్ట్ ఆప్షన్ ఎంపిక చేసుకుంటారు. కాబట్టి టాప్ 20 కాలేజీల్లో మార్పులు అనివార్యం. ఈ కారణంగా రెండో ప్రాధాన్యతకు సీటు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ బ్రాంచీలైతే మార్పు అక్కర్లేదు సివిల్, మెకానికల్, ఈఈఈ బ్రాంచీల్లో పెద్దగా ఆప్షన్లు మా ర్చాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. సివిల్లో 3,129 సీట్లున్నాయి. మాక్ తర్వాత ఈ బ్రాంచీ విద్యార్థుల్లో కొంతమంది కాలేజీ, బ్రాంచీ మార్చుకుంటారు. కాబట్టి ఇదే బ్రాంచీలో ఆసక్తి ఉంటే, మంచికాలేజీ వచ్చినప్పుడు మార్పు చేసుకోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఐటీ బ్రాంచీలోనూ 3,681 సీట్లు ఉన్నాయి. మాక్ కేటాయింపులో వచ్చిన సీటు పక్కాగా వచ్చే వీలుందని అధికారులు అంటున్నారు. ఈఈఈ, మెకానికల్లోనూ పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. అయితే, సీఎస్సీ, ఇతర ఎమర్జింగ్ కోర్సుల్లో పోటీ ఎక్కువగా ఉంది. మంచి ర్యాంకు లేకున్నా, ఈ కోర్సుల్లో సీటు వచ్చిన విద్యార్థులు కాలేజీ, బ్రాంచీల ప్రాధాన్యతకు మరిన్ని ఆప్షన్లు ఇవ్వడం మంచిదని సూచిస్తున్నారు.ఆప్షన్లు పెంచుకున్నానునాకు ఎప్సెట్లో 2 వేల ర్యాంకు వచ్చింది. పక్కా గా సీటు వస్తుందని తక్కువ ఆప్షన్లు ఇచ్చాను. కానీ మాక్ కేటాయింపులో సీటు రాలేదు. దీంతో ఇప్పుడు 35 కాలేజీలకు ఆప్షన్లు ఇచ్చాను. మాక్ వల్ల మేలే జరిగింది. నేను ఇచ్చిన ఆప్షన్లన్నీ సీఎస్ఈ, ఎమర్జింగ్ కోర్సులకే. టాప్ కాలేజీలో కోరుకున్న సీటు వస్తుందనే నమ్మకం ఉంది. – సి.సంజన సుప్రియ (హైదరాబాద్ విద్యార్థిని) అయినా... అప్రమత్తమయ్యామాక్ కేటాయింపులో టాప్ 20 కాలేజీల్లో సీఎస్ఈ బ్రాంచీలో సీటు వచ్చింది. గత ఏడాది కేటాయింపును పరిశీలిస్తే టాప్ 22లో ఉన్న కాలేజీలో నాకొచ్చిన ర్యాంకుకు సీటు వచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రెండు, మూడో ప్రాధాన్యతలు మార్చుకున్నా. ఇప్పుడొచ్చిన కాలేజీలో రాకున్నా, వేరే కాలేజీలో సీటు వస్తుందని భావిస్తున్నాను. – వి.శివ నాగేశ్వర్ (ఖమ్మం విద్యార్థి) -
ఆచితూచి 42% ఉత్తర్వులు!
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల్లో వెనుకబడిన వర్గాలకు 42% రిజర్వేషన్లు కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆచి తూచి ముందుకెళుతోంది. ఇటీవల మంత్రిమండలి ఆమోదించి పంపిన ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం లభిస్తుందన్న అంచనాతో.. తదుపరి ప్రక్రియలో భాగంగా అధికారిక ఉత్తర్వులు జారీ చేసే దిశలో అడుగులు వేస్తోంది. ఈ జీవో రూపకల్పన కోసం.. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను 50 శాతానికి మించి ఇవ్వాలంటూ పంచాయతీరాజ్ చట్టం–2018కి చేసిన సవరణ, ఈ మేరకు ఆమోదించిన ఆర్డినెన్స్, నూతన మార్గదర్శకాల ప్రకారం డెడికేటెడ్ కమిషన్ సమర్పించే నివేదికలను ఆధారంగా చేసుకోనుంది. ఆర్డినెన్స్కు మంత్రివర్గ ఆమోదం అనంతరం కొత్త విధివిధానాలతో మరో నివేదిక ఇవ్వాలని డెడికేటెడ్ కమిషన్ను కోరిన ప్రభుత్వం.. ఆ నివేదిక వచ్చిన తర్వాత వారం రోజుల్లోపు న్యాయపరమైన చిక్కులకు అవకాశం లేకుండా జీవో విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. ఆర్డినెన్స్ను, కమిషన్ నివేదికను ప్రస్తావిస్తూ.. పంచాయతీరాజ్ చట్టం–2018లోని సెక్షన్ 285 (ఏ)కు చేసిన సవరణ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు ప్రత్యేక పరిస్థితుల్లో 50 శాతానికి మించవచ్చు అని మాత్రమే ఆర్డినెన్సులో ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఆర్డినెన్సుతో పాటు డెడికేటెడ్ కమిషన్ ఇచ్చే నివేదిక మేరకు స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం సీట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొంటారని చెబుతున్నాయి. ఈ జీవో మేరకే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దఖలు పడతాయని వివరిన్నాయి. చట్టానికి చేసిన సవరణే ప్రాతిపదికగా జీవో ప్రభుత్వం జీవో విడుదల చేసే జీవో న్యాయ సమీక్షలోనూ నిలబడే విధంగా అవసరమైన అన్ని అంశాలను ప్రస్తావిస్తూ వివరణాత్మకంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ల పరిమితిని ప్రత్యేక పరిస్థితుల్లో పెంచేందుకు పంచాయతీ రాజ్ చట్టానికి చేసిన సవరణనే ఈ జీవోకు ప్రాతిపదికగా ఉంటుందని అంటున్నారు. బీసీల సామాజిక, ఆర్థిక పరిస్థితులు, రాజకీయ వెనుకబాటు స్థాయి, జనాభాకు తగిన ప్రాతినిధ్యం అనే అంశాల ప్రాతిపదికన చట్టాన్ని సవరించామని, ఈ అంశాలన్నింటినీ కూలంకషంగా పేర్కొంటూ రిజర్వేషన్ల పెంపును సమర్థించే కోణంలో జీవోకు రూపకల్పన చేస్తున్నామని వెల్లడిస్తున్నారు. -
తెలంగాణ కొత్త సీజేగా జస్టిస్ ఏకే సింగ్
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: దేశంలోని పలు హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు నియమితులయ్యారు. ఇందులోభాగంగా తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ నియమితులయ్యారు. ఎన్న డూ లేనివిధంగా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి తోనే 6 నెలలుగా తెలంగాణ హైకోర్టు కొనసాగింది. గత సీజే జస్టిస్ అలోక్ అరాధే జనవరిలో బదిలీపై బాంబే హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా వెళ్లిన విషయం తెలిసిందే. నాటి నుంచి సీజే పోస్టు ఖాళీగానే ఉంది. ఎట్టకేలకు పూర్తిస్థాయి సీజేను నియమించడంపై న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జస్టిస్ ఏకే సింగ్.. ప్రస్తుతం త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు. అలాగే, జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్ర రావుని త్రిపుర హైకోర్టు సీజేగా బదిలీ చేశారు. దేశంలో ఐదుగురు న్యాయమూర్తులు సీజేలుగా నియమితులవగా, నలుగురు సీజేలను ఇతర హైకోర్టులకు బదిలీ చేశారు. ఈ మేరకు మే 26న సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ ఏడో సీజేగా..: జస్టిస్ ఏకే సింగ్ 1965, జూలై 7న జన్మించారు. బీఏ ఆనర్స్ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేశారు. 1990లో పట్నా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 2000 వరకు అక్కడ న్యాయవాదిగా పనిచేసి.. 2001లో జార్ఖండ్ హైకోర్టుకు మారారు. 2012, జనవరి 24న జార్ఖండ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2014, జనవరి 16న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2022, డిసెంబర్ నుంచి 2023, ఫిబ్రవరి వరకు జార్ఖండ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహించారు. 2023, ఏప్రిల్ 17న ప్రధాన న్యాయమూర్తి పదోన్నతితో త్రిపుర హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఈ వారంలో తెలంగాణ హైకోర్టు 7వ సీజేగా బాధ్యతలు చేపట్టనున్నారు. కోల్కతాకు జస్టిస్ సుజోయ్పాల్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్న జస్టిస్ సుజోయ్పాల్ను కోల్కతాకు, జస్టిస్ తడకమళ్ల వినోద్కుమార్ను మద్రాస్కు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సుకు కూడా కేంద్రం ఆమోదముద్ర వేస్తూ గెజిట్ జారీ చేసింది. ప్రస్తుతం హైకోర్టులో 26 మంది న్యాయమూర్తులున్నారు. ఇద్దరి బదిలీ, ఒకరి రాకతో ఈ సంఖ్య 25కు చేరనుంది. మొత్తం 42 మందికిగాను ఇంకా 17 ఖాళీలుంటాయి. సుప్రీంకోర్టు సిఫార్సు చేసిన మరో ముగ్గురు న్యాయమూర్తులు జస్టిస్ అభిõÙక్రెడ్డి, జస్టిస్ కన్నెగంటి లలిత, జస్టిస్ సుమలత బదిలీపై ఇక్కడికి రావాల్సి ఉంది. అలాగే న్యాయవాదుల కోటా నుంచి న్యాయమూర్తులుగా సిఫార్సు చేసిన గౌస్ మీరా మొహియుద్దీన్, సుద్దాల చలపతిరావు, వాకిటి రామకృష్ణారెడ్డి, గాడి ప్రవీణ్కుమార్ నియామకాలకు కూడా కేంద్రం ఆమోదం తెలపాల్సి ఉంది. -
చర్చకు సిద్ధమా?.. సీఎం రేవంత్ సవాల్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: కేసీఆర్ రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లలోనే కూలేశ్వరం అయిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. ‘70 ఏళ్ల కిందట కాంగ్రెస్ పాలనలో కట్టిన మూసీ, నాగార్జునసాగర్, శ్రీశైలం, ఎస్ఆర్ఎస్పీ, జూరాల ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో.. కేసీఆర్ పాలనలో కట్టిన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ఎలా ఉన్నాయో నాగార్జునసాగర్ కట్టపై చర్చిద్దామా?.. సుందిళ్ల వద్దకు పోదామా?.. చర్చకు సిద్ధమా?’ అని బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. రూ.లక్ష కోట్లు మింగి తెలంగాణ ధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు. కూలిన కూలేశ్వరం వద్ద మిమ్మల్ని ఉరి తీసినా పాపం లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో సోమవారం రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. పలువురు పేదలకు స్వయంగా రేషన్కార్డులు అందజేశారు. అంతకు ముందు ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభలో ప్రసంగించారు. నాడు బెల్టు షాపులు తెరిచారు ‘రేషన్కార్డు.. పేదల ఆత్మగౌరవం, గుర్తింపు, ఆహార భద్రత. అలాంటి రేషన్ కార్డులను తమ పదేళ్ల పాలనలో పేదలకు ఇవ్వాలన్న ఆలోచనే బీఆర్ఎస్కు లేదు. అప్పుడు రేషన్ షాపులు తెరవలేదు. బెల్ట్ షాపులను మాత్రమే తెరిచింది. ఇప్పుడు మా ప్రభుత్వంలో పేదలకు 5.61 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం. 3.10 కోట్ల మంది పేద ప్రజలకు సన్న బియ్యం అందిస్తున్నాం. ఈ రోజు రేషన్ షాపుల వద్ద జనాలు నిలబడి సన్న బియ్యం తెచ్చుకుంటున్నారు. పేదలకు సన్న బియ్యం ఇస్తుంటే బీఆర్ఎస్ నాయకులు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు. దీనితో పాటు రైతు రుణమాఫీ, భరోసా, సన్న ధాన్యానికి బోనస్ వంటి ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. 25 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల రుణ మాఫీ చేశాం. 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతు భరోసా ఇచ్చాం. పండించిన ప్రతి గింజను కొని బోనస్ ఇచ్చాం. దాంతో ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే నంబర్వన్గా నిలిచాం. రైతును రాజును చేసింది ఇందిరమ్మ రాజ్యమే. సోనియాగాంధీ ఇచ్చిన హామీ మేరకు రైతులు పండుగ చేసుకుంటున్నారు. గత పదేళ్లలో కొత్త కోడలు వస్తే కార్డులో పేరు నమోదు చేయని పరిస్థితి. ఇప్పుడు 26 లక్షల మంది పేర్లను చేర్చాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. మహిళలు అంబానీతో పోటీపడేలా చేస్తున్నాం.. ‘మహిళల స్వయం సమృద్ధికి కృషి చేస్తున్నాం. రూ.21 వేల కోట్లు వడ్డీలేని రుణాలు అందించాం. మహిళా సంఘాలు వ్యాపారంలో అంబానీతో పోటీపడేలా చేస్తున్నాం. వెయ్యి బస్సులు కొని మహిళా సంఘాలు ఆర్టీసీకే అద్దెకు ఇచ్చేలా రుణాలు అందిస్తున్నాం. నాడు పెట్రోలు బంకులు రిలయన్స్ అంబానీలే పెట్టేవారు. వారితో పోటీ పడేలా మహిళా సంఘాలకు రుణాలు ఇచ్చి పెట్రోలు బంకులు ఏర్పాటు చేయిస్తున్నాం. మహిళ సంఘాల ఆధ్వర్యంలో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయించి వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఒప్పందం చేసుకుంటున్నాం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయ్యేలోపు లక్ష ఉద్యోగాలను కల్పిస్తాం. ఇప్పటికే 60 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఎస్సీ ఉప కులాల వర్గీకరణ అమలు చేసి దేశంలోనే ఆదర్శంగా నిలిచాం. జనగణనలో కులగణన చేసేలా కాంగ్రెస్ మోదీ మెడలు వంచాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తాం. బీసీలు రాజ్యాధికారం పొందేలా చేస్తాం..’ అని రేవంత్రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏం చేసిందో మహిళలు ఆలోచించాలి ‘త్వరలో స్థానిక సంస్థలకు ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. ఆ ఎన్నికల్లో జిల్లాలో ఒక్క గంజాయి మొక్క మొలవకుండా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలదే. మహిళలు ఇంటికి పోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో ఆలోచించండి. మీకు వడ్డీ›లేని రుణాలు, ఉచిత బస్, సబ్సిడీ గ్యాస్ ఇచ్చాం. ఇవన్నీ ఇంట్లో మీ ఇంటాయనతో చర్చించి కాంగ్రెస్కు సహకరించండి. 2034 వరకు మేమే అధికారంలో ఉంటాం. రాష్ట్రాన్ని ఒక ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దుతాం..’ అని సీఎం అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్కార్డులు: మంత్రి ఉత్తమ్ దేశంలో ఎక్కడా లేని విధంగా సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించామని, ఇప్పుడు కొత్త రేషన్కార్డుల పంపిణీని చేపట్టామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందిస్తున్నట్లు తెలిపారు. గతంలో రేషన్ కార్డుల ద్వారా దొడ్డు బియ్యం వస్తే అందులో 90 శాతం వృధా అయ్యేవని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చి సన్న బియ్యం అందజేస్తోందని చెప్పారు. ప్రస్తుతం 3.10 కోట్ల మందికి సన్న బియ్యం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పాత రేషన్ కార్డులలో కూడా కొత్తగా కుటుంబ సభ్యులను చేర్చుకునే అవకాశం ఉందన్నారు. దేవాదుల ప్రాజెక్టు–6 ప్యాకేజీ ద్వారా పాలకుర్తి, స్టేషన్ ఘనపూర్తో పాటు తుంగతుర్తి నియోజకవర్గానికి కూడా గోదావరి జలాలు అందుతాయని చెప్పారు.20 వేల ఎకరాలు అదనంగా సాగవుతాయన్నారు. బునాదిగాని కాల్వను రీడిజైన్ చేయడానికి రూ.200 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. కాంగ్రెస్ పేదల ప్రభుత్వం: మహేశ్కుమార్గౌడ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను ప్రజా పాలనలో అమలు చేస్తున్నామని, 5 లక్షల మందికి రేషన్ కార్డులు ఇస్తున్న ఈరోజు శుభ దినమని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ అన్నారు. ఇది నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమం అని అన్నారు. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని మహేశ్గౌడ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యేలు మందుల సామేల్, బీర్ల ఐలయ్య, వేముల వీరేశం, కుంభం అనిల్కుమార్రెడ్డి, బాలునాయక్, లక్ష్మారెడ్డి, జైవీర్రెడ్డి, యశస్వినిరెడ్డి, రామచందర్నాయక్, ఎమ్మెల్సీలు శంకర్నాయక్, అద్దంకి దయాకర్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. -
పల్లె బడిలో ఏఐ పాఠాలు
పట్టణాలు, నగరాలకు దీటుగా కృత్రిమ మేధస్సు (ఏఐ –ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో సాంకేతిక బోధనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మారుమూల గ్రామంలోని ఓ ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ స్కూళ్లకు సమానస్థాయిలో ఆధునిక బోధన అందిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. సర్కార్ టీ ఫైబర్ హైస్పీడ్ ఇంటర్నెట్ను అందుబాటులోకి తేవడంతో ఉపాధ్యాయులు ఏఐ ఆధారంగా చదువు చెబుతున్నారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయడంతోపాటు అదనపు సమాచారం అందించి వారి మేధకు పదును పెడుతున్నారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ జెడ్పీ హైస్కూల్ ఇందుకు వేదికైంది. – ముత్తారం (మంథని)మద్రాస్–ఐఐటీ నుంచి కోర్సు!స్థానిక ఉపాధ్యాయులకు గూగుల్తో ఏఐ బోధనలో శిక్షణకు ఇప్పించేందుకు టీ–ఫైబర్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే మద్రాస్ ఐఐటీ కళాశాల నుంచి కోర్సు అందించేందుకు ప్రయత్నాలు చేస్తుండటం విశేషం. టీ ఫైబర్ బృందం సోషల్ మీడియా వేదికగా దీనిపై ప్రచారం చేయడంతో అమెరికాలో శాన్ఫ్రాన్సిస్కో కేంద్రంగా ఉన్న పర్ఫ్లెక్సిటీ ఏఐ కో–¸ûండర్, సీఈవో అరవింద్ శ్రీనివాస్ ఎక్స్ వేదికగా స్పందించారు. తమ ఉచిత ఏఐ టూల్ను వినియోగించుకుని విద్యార్థులు విజ్ఞానం మెరుగుపర్చుకోవడం సంతోషంగా ఉందన్నారు. మారుమూల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ మార్పురావడం గొప్పవిషయమని చెప్పారు.పైలెట్ ప్రాజెక్టుగా మూడు గ్రామాలు.. టీ–ఫైబర్, పయనీర్ ఈల్యాబ్స్ కంపెనీ భాగస్వామ్యంతో పల్లెల్లో ఇంటింటికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోభాగంగా రాష్ట్రంలోని మూడు గ్రామాల్లోని పాఠశాలలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్, సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం సంగుపేట, నారాయణపేట జిల్లా మద్దూరు జెడ్పీ హైస్కూళ్లను దీని కింద ఎంపిక చేసింది. అడవిశ్రీరాంపూర్ జెడ్పీ హైస్కూల్లో టీ–ఫైబర్ నెట్ నిర్వాహకులు హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చి రెండు మానిటర్లు ఇవ్వగా.. ప్రభుత్వం ఇటీవల మరోమూడు కేటాయించింది. గత జూన్లో ఏఐ ఆధారిత పర్ప్లెక్సిటీ టూల్స్ ద్వారా 8, 9, 10వ తరగతి విద్యార్థులకు ఆధునిక బోధన ప్రారంభించారు. కార్పొరేట్కు దీటుగాఏఐ, పర్ప్లెక్సిటీ టూల్ సాయంతో బోధన ప్రారంభించాం. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా పల్లె పాఠశాలలో ఆధునిక విద్య ఇస్తుండటంతో విద్యార్థుల ప్రవేశాల సంఖ్య పెరుగుతోంది. ఏఐ క్లాసులతో విద్యార్థుల్లో నైపుణ్యత, సాంకేతిక పరిజ్ఞానం వృద్ధి చెందుతోంది. మరో 20 కంప్యూటర్లు, మైక్రోఫోన్స్ అందిస్తే ఏఐ బోధన మరింత సులువవుతుంది. – ఇరుగురాల ఓదెలు, హెచ్ఎం, అడవిశ్రీరాంపూర్ జెడ్పీ హైస్కూల్రక్తం ఎందుకు గడ్డ కట్టదుపర్ఫ్లెక్సిటీ ఏఐ టూల్ ద్వారా రక్తనాళాల్లో రక్తం ప్రవహించేటప్పుడు ఎందుకు గడ్డ కట్టదనే ప్రశ్నకు సమాధానాన్ని సొంతంగా తెలుసుకున్నా. బయాలజీలో ఎర్ర, తెల్లరక్త కణాలు, కణ ఫలదీకరణ, నిర్మాణం, వాటి విధుల గురించి వివరంగా తెలుసుకున్నా. టీచర్ల బోధన తర్వాత అర్థం కాని విషయాలు, సందేహాలను పర్ప్లెక్సిటీ టూల్ నివృత్తి చేస్తోంది. – ఉప్పు మన్విత, తొమ్మిదో తరగతిగణితంలో అన్ని పద్ధతులుఏఐ టూల్తో విద్యార్థి శక్తిని అంచనావేసుకుని సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. పర్ప్లెక్సిటీ యాప్లో గణితంలోని అన్ని పద్ధతులు పొందుపర్చడాన్ని సులువుగా నేర్చుకోవచ్చు. చిత్రపటాలతో అర్థమయ్యే రీతిలో ఏఐ వివరిస్తోంది. – మార్త కోమలత, పదోతరగతిఉపయోగం తెలుసుకున్నాఏఐ పర్ప్లెక్సిటీలో నిక్ (ఆ్రస్టేలియాకు చెందిన ఈయన అరుదైన వ్యాధితో జని్మంచారు) గురించి సార్ను అడిగా. అంగవైకల్యం ఉన్నా.. విధిరాతను కూడా ఎలా మార్చుకోవచ్చో ఏఐ టూల్తో తెలుసుకున్నా. నిక్ చికెన్ లెగ్ను ఉపయోగించి నీటి గ్రావిటి బ్యాలెన్స్ చేసుకునే విధానం గురించి కూడా నేర్చుకున్నా. – చిగురు మధులాస్య, పదోతరగతి -
కాపురంలో చిచ్చుపెట్టిన రీల్స్ చిన్నది!
సాక్షి, వరంగల్: రీల్స్ కలిపిన ప్రేమ.. పండంటి కాపురంలో చిచ్చు రాజేసింది. తన భర్త పరాయి యువతితో ప్రేమాయణం సాగించడం భరించలేని భార్య బలవన్మరణానికి పాల్పడింది. వరంగల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన కేసు వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తున్న డాక్టర్ ప్రత్యూష.. హసన్పర్తిలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదుతో హసన్పర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో భర్త సృజన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ పాపులారిటీ సంపాదించుకున్న ఓ యువతితో సృజన్ ప్రేమ వ్యవహారమే ప్రత్యూష మరణానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. నగరంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సృజన్ కార్డియాలజీ డాక్టర్గా పని చేస్తున్నారు. మరో ఆస్పత్రిలో ప్రత్యూష డెంటిస్ట్గా పని చేస్తోంది. అయితే సోషల్ మీడియాలో రీల్స్ చేసే ఓ అమ్మాయి.. డాక్టర్ సృజన్ను ఆ మధ్య ఇంటర్వ్యూ చేసింది. వాటిని రీల్స్గా చేసి ప్రమోట్ చేసింది. ఈ క్రమంలో సృజన్, ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మధ్య పరిచయం ప్రేమగా మారింది. ఈ వ్యవహారం తెలిసి ప్రత్యూష భర్తను నిలదీసింది. ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో.. పెద్దలు సర్దిచెబుతూ వచ్చారు. అయినా సృజన్లో మార్పు రాకపోవడంతో ప్రత్యూష ఇలా ఘాతుకానికి పాల్పడిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తమ బిడ్డ మరణానికి కారణమైన సృజన్ను, ఆ యువతిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. -
ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ నేతలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యలకు పొన్నం కౌంటరిచ్చారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చే నిధులను ఆయనే ఆపుతున్నారని ఘాటు విమర్శలు చేశారు.మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కాంగ్రెస్ పార్టీ బీసీల చాంపియన్. గుడ్డుకు వెంట్రుక కట్టే పని పెట్టుకోవద్దని బీజేపీ నేతలకు విజ్ఞప్తి చేస్తున్నాం. బీజేపీ నేతలు అరవింద్, బండి సంజయ్, ఈటల రాజేందర్, లక్ష్మణ్, కృష్ణయ్య గారు బీసీ రిజర్వేషన్లకు మద్దతు తెలపాలని కోరుతున్నాం. తెలంగాణ కుల గణన విప్లవాత్మక నిర్ణయమని స్వయానా వారణాసి ప్రజా ప్రతినిధి (ఆర్ఎస్ఎస్)నేత నాతో అన్నారు. బీజేపీ నేతలు దుర్బుద్దిని వీడండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. అంతకంటే ముందు ఇచ్చిన హామీ మేరకు స్పష్టమైన విధానంతో కుల సర్వే నిర్వహించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల చట్టం తీసుకొచ్చాం.చట్టం 3, 4 ప్రకారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తాం. బీజేపీ లక్ష్మణ్ అసహనంతో మాట్లాడున్నారు. రాష్ట్రానికి కేంద్రం నిధులు మీరే ఆపారు. చట్టపరమైన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని బీసీ రిజర్వేషన్ల బిల్లును ముందుకు తీసుకెళ్తున్నాం. కడుపులో కత్తులు పెట్టుకొని మాట్లాడకండి. బీసీ రిజర్వేషన్ల పట్ల మాకు చిత్త శుద్ధి ఉంది. రాష్ట్రపతి ఆమోదం పొందించి తొమ్మిదో షెడ్యూల్లో చేర్చేలా కేంద్రాన్ని ఒప్పించండి. ఫ్యూడల్ సిద్ధాంతాలతో అడ్డుపడకండి. బిల్లు చట్టబద్ధత కోసం సీఎం రేవంత్, మంత్రులందరం సిద్ధంగా ఉన్నాం.. మీ నాయకులను తీసుకుని రండి ఢిల్లీకి వెళ్దాం.బీఆర్ఎస్ అధ్యక్ష పదవి, కార్యనిర్వాహక పదవి బీసీలకు ఇవ్వలేరా?. ఆర్డినెన్సు తీసుకొచ్చే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒక్కటే.. దొంగ దొంగ అంటూ డ్రామాలు చేస్తున్నారు. ఈ డబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోసం 50 శాతం ఎత్తేసినపుడు.. బీసీ రిజర్వేషన్లు ఎందుకు సాకారం కాదు అని ప్రశ్నిస్తున్నా. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీ అయినా సరే గెలిచేది బీసీ అభ్యర్థి అనే విషయం మరిచిపోకూడదు. బీసీ రిజర్వేషన్లుకు మద్దతు ఇవ్వాల్సిందిగా అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
మరో కీలక నిర్ణయం
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నగర పోలీసు విభాగానికి గుండెకాయ వంటి టాస్క్ఫోర్స్ను పునర్ వ్యవస్థీకరించారు. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై టాస్్కఫోర్స్కు డీసీపీతో పాటు ఇద్దరు అదనపు డీసీపీలు ఉండనున్నారు. కొత్త అదనపు డీసీపీగా సీరియర్ పోలీసు అధికారి మహ్మద్ ఇక్బాల్ సిద్ధిఖీని నియమించిన కొత్వాల్ ఆయనకు వెస్ట్, సౌత్ వెస్ట్ జోన్ల బాధ్యతలు అప్పగించారు. ఒకప్పుడు నాలుగు.. ఇప్పుడు ఐదు. నగర కమిషనరేట్లో ఒకప్పుడు కేవలం నాలుగు జోన్లే ఉండేవి. ఆపై వీటి సంఖ్య ఐదుకు పెరిగింది. ప్రతి జోన్కు బాధ్యత వహిస్తూ ఓ టాస్్కఫోర్స్ బృందం ఉంటుంది. వీటన్నింటినికీ నాన్ క్యాడర్ లేదా అదనపు ఎస్పీ స్థాయిలో ఉన్న అధికారి డీసీపీగా నేతృత్వం వహిస్తుంటారు. ఈయనకు సహకరించడానికి ఓ అదనపు డీసీపీ పని చేస్తుండే వారు. అప్పట్లో జోన్ల సంఖ్య ఐదుకు పెరిగినప్పుడూ ఇదే విధానం కొనసాగించారు. డీసీపీపై ఉన్న పని ఒత్తిడిని పరిగణనలోకి తీసుకున్న ఉన్నతాధికారులు జోన్లను విభజించారు. వెస్ట్, నార్త్, సెంట్రల్ జోన్లకు డీసీపీ నేతృత్వం వహించేలా, ఈస్ట్, సౌత్ జోన్లకు అదనపు డీసీపీ నేతృత్వం వహించేలా నిర్ణయం తీసుకున్నారు. దీంతో డీసీపీ కార్యాలయం సికింద్రాబాద్లోనే కొనసాగిస్తూ అదనపు డీసీపీకి పాతబస్తీలోని పురానీ హవేలీలో ఏర్పాటు చేశారు. నగరంలో మాదకద్రవ్యాల వ్యతిరేక విభాగం హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) ఏర్పడటంతో పాటు జోన్ల సంఖ్య ఏడుకు చేరింది. అయినప్పటికీ కొన్నాళ్లు సౌత్ ఈస్ట్, హెచ్–న్యూలు టాస్్కఫోర్స్ డీసీపీ అ«దీనంలోనే పని చేశాయి. ఆపై డీసీపీకి హెచ్–న్యూతో పాటు వెస్ట్, సౌత్ వెస్ట్, నార్త్, సెంట్రల్ జోన్లను అప్పగించారు. సాంకేతిక కారణాలతో సౌత్ వెస్ట్ జోన్ను అదనపు డీసీపీగా అప్పటిస్తూ గత ఏడాది నిర్ణయం తీసుకున్నారు. తాజాగా టాస్్కఫోర్స్కు మరో అదనపు డీసీపీగా నియమించిన సీపీ ఆనంద్.. ఆయనకు వెస్ట్, సౌత్ వెస్ట్ టీమ్స్ను అప్పగించారు. కొత్త అదనపు డీసీపీగా సీసీఎస్ అదనపు డీసీపీగా ఉన్న ఇక్బాల్ సిద్ధిఖీని నియమించారు. కీలక బాధ్యతల్లో పని చేసిన సిద్ధిఖీ... నగర టాస్్కఫోర్స్ అదనపు డీసీపీగా నియమితులైన మహ్మద్ ఇక్బాల్ సిద్ధిఖీ ఇప్పటి వరకు అనేక కీలక బాధ్యతల్లో పని చేశారు. సిద్ధిఖీ ఎన్నికల ముందు వరకు పశి్చమ మండల అదనపు డీసీపీగా, ఎన్నికల తర్వాత సౌత్ వెస్ట్ జోన్ అదనపు డీసీపీగా పని చేశారు. దీనికి ముందు ఆయన బంజారాహిల్స్ సహా కీలక ఠాణాలకు ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తించారు. ‘షోయబ్ మాలిక్–సానియా మీర్జా’ ఉదంతం చోటు చేసుకున్నప్పుడు సిద్ధఖీనే బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్గా ఉండి ఆ వ్యవహారాన్ని సమర్థంగా పర్యవేక్షించారు. ఈయనకు ఈస్ట్జోన్ టాస్్కఫోర్స్ టీమ్ సబ్–ఇన్స్పెక్టర్గా, సౌత్ జోన్ టాస్్కఫోర్స్ టీమ్ ఇన్స్పెక్టర్గా పని చేసిన అనుభవం ఉంది. పాకిస్థాన్లో ముద్రితమైన రూ.500, రూ.1000 నకిలీ నోట్లు ఒకేసారి రూ.2.5 కోట్ల విలువైనవి చిక్కడం నగర పోలీసు చరిత్రలో రికార్డు. 2007 ఆగస్టు 25న పాతబస్తీలో ఈ నకిలీ నోట్లను టాస్్కఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అప్పట్లో జరిగిన ఈ భారీ ఆపరేషన్కు సిద్ధిఖీనే నేతృత్వం వహించారు. అదే ఏడాది నగరంలో చోటు చేసుకున్న మక్కా మసీదులో బాంబు పేలుడు, గోకుల్చాట్– లుంబినీ పార్క్ల్లో జంట పేలుళ్ల కేసుల దర్యాప్తులోనూ ఇక్బాల్ సిద్ధిఖీ కీలకపాత్ర పోషించారు. సైబరాబాద్లో క్రైమ్స్–2 అదనపు డీసీపీగానూ సిద్ధిఖీ పని చేశారు. -
నా బిడ్డకి నాకు న్యాయం చేయండి
వరంగల్: భర్తతోనే (అతడి తల్లిదండ్రులు కాకుండా) కలిసి ఉండేలా తనకు న్యాయం చేయాలని ఓ ఇల్లాలు భర్త ఇంటి ఎదుట తన తల్లిదండ్రులు, ఐదేళ్ల కూతురితో కలిసి ఆదివారం నిరసన చేపట్టింది. మల్కాపూర్ గ్రామానికి చెందిన సాంబారి రాజేశ్వర్, మణెమ్మ దంపతులకు విద్యాసాగర్ ఒక్కడే కుమారుడు. ఆరేళ్ల క్రితం భూపాలపల్లి జిల్లా ములు గు ఘణపురం గ్రామానికి చెందిన వెంకటనారాయణ కుమార్తె తేజస్వినితో పెళ్లి జరిపించారు. దంపతులు కొంతకాలం క్రితం వరకు అన్యోన్యంగా ఉండేవారు. అయితే మల్కాపూర్ వచ్చిన నాటి నుంచి తేజస్వినిని ఏదో రకంగా అత్తామామ ఇబ్బంది పెట్టేవారు. దీంతో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీలు నిర్వహించినా ఫలితం లేకపోవడంతో కోర్టు వరకు వెళ్లింది. అయినా విద్యాసాగర్ తల్లిదండ్రుల్లో ఎలాంటి మార్పు రాకపోవడంతో ఆదివారం తేజస్విని తన తల్లిదండ్రులతో పాటు కూతురితో కలిసి మల్కాపూర్ గ్రామానికి వచ్చింది. ఇంటి ఎదుట ఫ్లెక్సీ ఏర్పాటు చేసి నిరసన చేపట్టింది. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై నవీన్కుమార్ ఆదేశంతో కానిస్టేబుల్ చారి అక్కడకు వెళ్లి గొడవ జరగకుండా చేశారు. -
యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట: ఆదివారం సెలవు కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల భక్తులు యాదగిరి క్షేత్రానికి తరలివచ్చారు.దీంతో శ్రీస్వామి వారి ధర్మ దర్శనానికి మూడు గంటలకు పైగా, వీఐపీ దర్శనానికి గంటకు పైగా సమయం పట్టింది. వివిధ పూజలతో శ్రీస్వామి వారికి నిత్యాదాయం రూ.53,64,989 వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు. -
టాప్ – 8 గోల్కొండ కోట
దేశంలో ఇప్పటికీ అత్యధికులకు సందర్శనకు ఇష్టమైన ప్రదేశం తాజ్మహల్. 2025 జనవరి – మార్చి త్రైమాసికంలో దేశీయ పర్యాటకులు అత్యధికంగా సందర్శించింది తాజ్నే. దాని దరిదాపుల్లో మరేవీ లేవు.దేశీయ పర్యాటకులు అత్యధికంగా సందర్శించిన టాప్ – 10 ప్రదేశాల జాబితాలో హైదరాబాద్లోని గోల్కొండ కోట 8వ స్థానంలో నిలిచింది. -
తిరుపతి – చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు
తిరుపతి అన్నమయ్య సర్కిల్: ఆగస్టులో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. ప్రతి సోమ, శనివారాల్లో తిరుపతి నుంచి చర్లపల్లికి (07018), ప్రతి శుక్ర, శని వారాల్లో చర్లపల్లి నుంచి తిరుపతికి (07017) రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఈ రైళ్లు మల్కాజిగిరి, కాచిగూడ, ఉందానగర్, షాద్న గర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడి పత్రి, ఎరగ్రుంట, కడప, ఒంటిమిట్ట, రాజంపే ట, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి.ప్రతి బుధవారం చర్లపల్లి నుంచి తిరుపతికి రైలు (07251), ప్రతి గురువారం తిరుపతి నుంచి చర్లపల్లికి రైలు (07252) రైళ్లు నడువను న్నాయి. ఈ ప్రత్యేక రైళ్లు జనగాం, కాజీపేట, వరంగల్, నెక్కొండ, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి. -
సీపీఐ రాష్ట్ర మహాసభల లోగో ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభల లోగోను సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి ఆవిష్కరించారు. మహాసభల ఆహ్వాన సంఘ సమావేశం హిమాయత్నగర్లోని రాజ్ బహదూర్ హాల్లో జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ రాష్ట్ర మహాసభల సందర్భంగా సీపీఐ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి పార్టీ లక్ష్యాలను వివరిస్తూ, చందాలను సేకరించాలన్నారు.సమావేశంలో సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈటీ నర్సింహ, కలవేణి శంకర్, శ్రామిక మహిళా ఫోరం జాతీయ నాయకురాలు ప్రేమ్ పావని, రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘ అధ్యక్షుడు ఎండీ యూసుఫ్, ప్రధాన కార్యదర్శి ఈ. ఉమామహేశ్ తదితరులు పాల్గొన్నారు. -
సాగర్ రెండో జోన్కు నీటి విడుదల నేడు
కూసుమంచి: పాలేరు రిజర్వాయర్ నుంచి జిల్లాలోని సాగర్ ఆయకట్టు(రెండో జోన్కు) సోమవారం సాగునీటిని విడుదల చేస్తామని రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పాలేరు వద్ద ఎడమ కాల్వకు చేపట్టిన యూటీ నిర్మాణ పనులను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి మంత్రి ఆదివారం రాత్రి పరిశీలించారు. సోమవారం ఉదయమే 1,300 క్యూసెక్కుల నీటి విడుదలకు ఏర్పాట్లు చేయాలని ఇరిగేషన్ డీఈఈ మాధవిని ఆదేశించారు. కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు హాజరవుతానని, ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.గత సెప్టెంబర్లో వచ్చిన భారీ వర్షాలకు పాలేరు వద్ద ఎడమ కాల్వ యూటీ కొట్టుకుపోయిందని, ఈ ప్రాంతాన్ని అప్పట్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరిశీలించారని గుర్తు చేశారు. సీఎం సూచనలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సహకారంతో.. రూ.14.20 కోట్లతో శాశ్వత ప్రాతిపదికన యూటీ, కాలువ మరమ్మతులు చేపట్టామని వివరించారు. ఈ ఏడాది కృష్ణా బేసిన్లో వర్షాలు సమృద్ధిగా కురవడంతో.. అనుకున్న సమయానికంటే ముందే రైతులకు సాగునీరు సరఫరా చేస్తున్నామని చెప్పారు. ఆయన వెంట రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. -
ఎడ్యుటెక్ కంపెనీల కట్టడి ఎలా?
సాక్షి, హైదరాబాద్: చట్ట విరుద్ధంగా కోచింగ్ కేంద్రాలను నిర్వహిస్తున్న సంస్థలను నియంత్రించటంపై ప్రభుత్వం దృష్టి సారించింది. వీటిని దారికి తెచ్చేందుకు విద్యాశాఖ, రెవెన్యూ, పోలీసు విభాగాల అధికారులతో ప్రత్యేక కమిటీ వేయాలని భావిస్తోంది. ఇంజనీరింగ్లో నైపుణ్యం పేరుతో కొన్ని సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని ఉన్నత విద్యా మండలి గుర్తించింది. డీమ్డ్, ప్రైవేటు యూనివర్సిటీల్లోకి స్కిల్ పేరుతో చొరబడుతున్న ఈ కంపెనీల వల్ల జరిగే నష్టాలను మండలి అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. స్కిల్ కోసం షార్ట్కట్స్లో ఇవి బోధిస్తున్నాయి. సబ్జెక్టు ఫ్యాకలీ్టలో నాణ్యత పాటించడం లేదు. ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్ పొందిన విద్యార్థులు ఈ కోచింగ్ కేంద్రాలకు వెళ్లడం వల్ల నష్టం జరుగుతుందని ప్రభుత్వానికి మండలి తెలిపింది. ఏం చేస్తారో చేసుకోండి ఎలాంటి అనుమతులు లేకుండా కోచింగ్ కేంద్రాలు నడుపుతున్న సంస్థలకు గత నెలలో ఉన్నత విద్యా మండలి నోటీసులు ఇచి్చంది. అయితే, నోటీసులు పొందిన సంస్థలు మండలికి ఘాటుగా సమాధానం ఇచ్చాయి. తామెక్కడా చట్ట వి రుద్ధంగా బోధన చేయడం లేదని, విద్యార్థులు స్కిల్ కోసం తమ దగ్గరకు వస్తున్నారని పేర్కొన్నాయి. అసలు తమను నియంత్రించడం, నోటీసులు ఇచ్చే అధికారం ఉన్నత విద్యా మండలికి లేదని న్యాయవాదులతో సమాధానం ఇవ్వడంతో మండలి వర్గాలు నివ్వెరబోయాయి.ఇదే విషయాన్ని అధికారులు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. మరోవైపు ఆ సంస్థల్లో చేరిన విద్యార్థులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడించడం, మండలి అధికారులను తప్పుబడుతూ విద్యార్థులు మెయిల్స్ ఇవ్వడంతో సమస్య తీవ్రంగా మారింది. ఈ నేపథ్యంలో ఏం చేయాలో చెప్పాలని మండలి అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. దీంతో సీఎం కార్యాలయం విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఇటీవల దీనిపై చర్చించింది. కట్టడి చేయకుంటే కష్టమే ఇంజనీరింగ్ పూర్తవ్వగానే ఉద్యోగం పొందడం ఒక్కటే లక్ష్యంగా భావిస్తున్న విద్యార్థుల బలహీనతను కోచింగ్ కేంద్రాలు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. ఇందులో డీమ్డ్, ప్రైవేటు యూనివర్సిటీలు ప్రధానంగా భాగస్వామ్యం అయ్యాయి. సబ్జెక్టులకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వకుండా, కేవలం ఉద్యోగం పొందేందుకు కొత్తగా వస్తున్న చాట్ జీపీటీ, ఏఐ సంబంధిత టెక్నాలజీపైనే షార్ట్ కట్స్ బోధిస్తున్నాయి. ఈ క్రమంలో కీలకమైన ఫ్యాకలీ్టని కూడా తగ్గిస్తున్నాయి. హైదరాబాద్లోని రెండు డీమ్డ్ వర్సిటీలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న డీమ్డ్ వర్సిటీల ఆఫ్ క్యాంపస్లపై గత ఏడాది కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులొచ్చాయి. ఎమర్జింగ్ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు కాలేజీల్లో కాకుండా, స్కిల్ కేంద్రాల్లో బోధిస్తున్నారు.పరీక్షలు నిర్వహించి, డిగ్రీలు ఇవ్వడం మాత్రం కాలేజీల్లోనే జరుగుతోంది. ఇది పూర్తిగా చట్ట విరుద్ధమని మండలి పేర్కొంది. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో బేసిక్స్ నేర్పుతారు. రెండు, మూడు సంవత్సరాల్లో కీలకమైన కోడింగ్పై సబ్జెక్టులు ఉంటాయి. ఇదే క్రమంలో ఎమర్జింగ్ కోర్సులకు పారిశ్రామిక భాగస్వామ్యంతో శిక్షణ ఇవ్వాలి. అప్పుడే విద్యార్థి కోడింగ్పై పట్టు సాధిస్తాడు. ఏఐ చేసే కోడింగ్, డీ–కోడింగ్ కచి్చతమైనదేనా? కాదా? అనేది సబ్జెక్టులపై అవగాహన ఉన్నప్పుడే తెలుస్తుంది. ప్రైవేటు కాలేజీలు దీన్ని విస్మరించి ఉద్యోగం పొందడానికి అవసరమైన స్కిల్స్ను మాత్రమే నేర్పుతుండటంతో ఉద్యోగం వచి్చనా, పనిలో పురోగతి సాధించలేకపోతున్నారు. గడచిన ఐదేళ్లలో ఐటీ కంపెనీల్లో అనేక మంది కోడింగ్పై పట్టు లేకపోవడం వల్లే ఉద్యోగాలు పోగొట్టుకున్నారు.విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం చట్ట విరుద్ధంగా నడుపుతున్న కోచింగ్ కేంద్రాలకు నోటీసులు ఇచ్చాం. సమాధానం వచ్చింది. అయితే, ఇప్పుడు ఏం చేయాలో ఆలోచిస్తున్నాం. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. త్వరలో దీనిపై విధాన నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. – ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి ఉన్నత విద్యా మండలి చైర్మన్ -
నేడు రేషన్కార్డుల పంపిణీ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/తిరుమలగిరి (తుంగతుర్తి): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం సూర్యాపేట జిల్లాకు రానున్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండల కేంద్రంలో సాయంత్రం 4 గంటలకు బహిరంగసభ నిర్వహించనున్నారు. సభలో ఆయన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి నేతృత్వంలో ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 5,61,343 మందికి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. వాటిద్వారా 45,34,430 మందికి లబ్ధి చేకూరనుంది. రాష్ట్రంలో గతంలో 89,95,282 కార్డుల ద్వారా 2,81,47,565 మందికి లబ్ధి చేకూరగా, ఇకపై 95,56,625 రేషన్ కార్డుల ద్వారా 3,09,30,911 మందికి లబ్ధి చేకూరనుంది. సీఎం వెంట జిల్లా మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సభలో పాల్గొననున్నారు. -
నిరసన తెలిపితే కాల్పులా?: కవిత
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మల్లన్నపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డిని ఆదివారం కలిసిన కవిత.. మల్లన్న సభ్యత్వాన్ని రద్దుచేయాలని కోరారు. ఆయన వ్యాఖ్యలను ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేయాలని విన్నవించారు. మల్లన్నపై డీజీపీ కార్యాలయంలో కూడా ఆమె ఫిర్యాదు చేశారు. ఆయా చోట్ల కవిత మీడియాతో మాట్లాడారు. మల్లన్న తనపై చేసిన వ్యాఖ్యలకు కోపం వచ్చి కొందరు నిరసన వ్యక్తం చేశారని, అంతమాత్రానికే ల్పులు జరిపి చంపేస్తారా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్రెడ్డి స్పందించి వెంటనే మల్లన్నపై చర్యలు తీసుకోవాలని, లేదంటే ఆయనతో అలా మాట్లాడించింది ప్రభుత్వమే అని భావించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. కాల్పులపై దర్యాప్తు చేయాలని డీజీపీని కోరినట్లు చెప్పారు. తాను మామూలు ఆడబిడ్డను కాదు.. అగ్గిరవ్వను అని వ్యాఖ్యానించారు. మల్లన్న వ్యాఖ్యలపై ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించకపోవడం ఏంటని ప్రశ్నించారు. గత రెండేళ్లుగా బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నట్లు చెప్పారు. తన పోరాటం ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చిందని కవిత అన్నారు. తనను అగౌరవ పరిచిన తీన్మార్ మల్లన్నపై బీఎన్ఎస్ 74,79 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని అదనపు ఐజీ రమణకుమార్కు వినతి పత్రం అందజేసినట్లు చెప్పారు. మల్లన్న బీసీ బిడ్డ కాబట్టి ఏది పడితే అది మాట్లాడతానంటే చెల్లదని స్పష్టంచేశారు.కవిత ఇంటి వద్ద భారీ బందోబస్తుతీన్మార్ మల్లన్న క్యూన్యూస్ కార్యాలయంపై తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడి చేసిన నేపథ్యంలో బంజారాహిల్స్ రోడ్డు నంబర్–14లోని కల్వకుంట్ల కవిత ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఆమె ఇంటికి వెళ్లే మార్గాల్లో వెళ్లే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. సుమారు 50 మంది పోలీసులతో నాలుగు చోట్ల పికెటింగ్లు ఏర్పాటుచేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. -
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై ‘జాగృతి’ దాడి..
మేడిపల్లి/ఘట్కేసర్: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్కు చెందిన క్యూన్యూస్ కార్యాలయంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు చెందిన తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని క్యూన్యూస్ ఆఫీస్లోకి ఆదివారం ఉదయం 11.30 గంటల సమయంలో సుమారు 20 మంది కర్రలు, రాడ్లతో దూసుకొచ్చి చానల్ సిబ్బందిపై దాడి చేస్తూ విధ్వంసం సృష్టించారు. అక్కడే ఉన్న మల్లన్నపై కూడా దాడికి ప్రయతి్నంచారు. కార్యాలయంలోని ఫరి్నచర్, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు.వారిని అదుపుచేసేందుకు మల్లన్న గన్మెన్లు గాల్లోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ లోపుగా మల్లన్న మేడిపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. గాయపడిన ఆఫీస్ సిబ్బందిని, మల్లన్నను చికిత్స నిమిత్తం ఘట్కేసర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మల్లన్న చేతికి స్వల్ప గాయం కావడంతో చికిత్స అందించి ఆస్పత్రి నుంచి పంపించారు. ఎమ్మెల్సీ కవితపై తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ జాగృతి కార్యకర్తలే ఈ దాడి చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. దాడులకు భయపడను: మల్లన్న తెలంగాణ జాగృతి కార్యకర్తల దాడిని తీన్మార్ మల్లన్న తీవ్రంగా ఖండించారు. హత్యాయత్నాలతో బీసీ ఉద్యమాన్ని ఆపలేరని స్పష్టంచేశారు. దాడి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘20 మంది వరకు కర్రలు, రాడ్లతో దూసుకొచ్చి నాతోపాటు మా కార్యాలయం సిబ్బందిపై పాశవికంగా దాడి చేశారు. నాతో సహా పలువురికి గాయాలయ్యాయి. దాడి తీవ్రతను చూసి వెంటనే గన్మెన్ గాల్లోకి ఐదు రౌడ్లు కాల్పులు జరిపారు. హత్యాయత్నాలతో బీసీ ఉద్యమాన్ని ఆపలేరు. ఇలాంటి దాడులకు బయపడేది లేదు. కంచం–మంచం అనే పదం తెలంగాణలో ఊతపదం. నా వ్యాఖ్యలకు కట్టుబడి వున్నా.రౌడీల్లా నాపై దాడి చేయడమే కాకుండా మళ్లీ నాపైనే కేసు పెట్టారు. నా ఆఫీస్లో నా రక్తాన్ని కళ్లచూశారు. ఈ రక్తం మరకలతోనే ప్రజల్లోకి వెళతాను. ప్రభుత్వం ఈ ఘటనపై స్పందించాలి’అని డిమాండ్ చేశారు. మల్కాజిగిరి డీసీపీ పద్మజారెడ్డి, ఏసీపీ చక్రపాణి, మేడిపల్లి ఇన్స్పెక్టర్ గోవింద్ రెడ్డి తమ సిబ్బందితో ఘటనా ప్రదేశాన్ని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ దాడి ఘటనలో గాయపడ్డ ఆందోళనకారులు రాంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. మేడిపల్లి పోలీసుల అదుపులో జాగృతి యాదాద్రి జిల్లా అధ్యక్షుడు సందుపట్ల సుజిత్రావు, ఓయూ జాగృతి అధ్యక్షుడు ఆశోక్ యాదవ్తోపాటు మరికొందరు ఉన్నట్లు తెలిసింది. -
ఎగువ గోదారి వెలవెల!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించి నెలన్నర గడిచిపోయినా వరద ప్రవాహం లేక ఎగువ గోదావరి వెలవెలబోతోంది. మరోవైపు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని దిగువ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ఉప నదులైన ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, వాగులు, వంకల్లో వరద ఉధృతి పెరిగి దిగువ గోదావరి పోటెత్తింది. గోదావరిలో ప్రాణహిత కలిసే కాళేశ్వరం వద్ద నిర్మించిన మేడిగడ్డ బరాజ్ నుంచి ధవళేశ్వరం బరాజ్కి దిగువన సముద్రంలో కలిసే వరకూ గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రాణహితలో వరద పెరగడంతో కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బరాజ్లోకి 2.21 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, వచ్చిన వరదను వచ్చినట్టు కిందికి విడుదల చేస్తున్నారు. దానికి ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్న ఇంద్రావతి వరద తోడవుతుండటంతో తుపాకులగూడెం (సమ్మక్క సాగర్) బరాజ్లోకి 2.69 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా అంతే స్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. సీతమ్మసాగర్ (దుమ్ముగూడెం బరాజ్)లోకి చేరుతున్న 5.92 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఏపీలోని ధవళేశ్వరం బరాజ్ గేట్లను ఎత్తివేయడంతో ఇప్పటికే ఈ ఏడాది 175 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలోకి కలిసిపోయాయి.ఎగువన అన్ని రిజర్వాయర్లూ వెలవెలనే..గోదావరిపై మహారాష్ట్రంలో ఉన్న జైక్వాడ్ ప్రాజెక్టు గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 102.73 టీఎంసీలు కాగా, ప్రస్తుతం జలాశయానికి 15 వేల క్యూసెక్కుల వరద వస్తుండడంతో 83.48 టీఎంసీలకు నిల్వలు చేరాయి. జైక్వాడ్ ప్రాజెక్టు నిండితేనే గోదావరి ప్రధాన పాయ ద్వారా తెలంగాణలోకి వరద ప్రవాహం ప్రారంభమవుతుంది. మంజీరపై నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 17.8 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ఎలాంటి ఇన్ఫ్లో లేకపోవడంతో నిల్వలు 4.71 టీఎంసీలకు పడిపోయాయి. గోదావరి ప్రధాన పాయపై ఉన్న శ్రీరామ్సాగర్ గరిష్ట నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, కేవలం 2,100 క్యూసెక్కుల వరద వస్తుండగా, జలాశయంలో 20.77 టీఎంసీల నీరే ఉంది. కడెం నదిపై నిర్మించిన కడెం ప్రాజెక్టు సామర్థ్యం 4.7 టీఎంసీలు కాగా, 602 క్యూసెక్కుల వరద వస్తుండడంతో నిల్వలు 3.47 టీఎంసీలకు చేరాయి. గోదావరి ప్రధాన పాయపై ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు సామర్థ్యం 20.18 టీఎంసీలు కాగా, 431 క్యూసెక్కుల వరద మాత్రమే వస్తుండడంతో నిల్వలు 8.9 టీఎంసీలకు పరిమితమయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గోదావరి ప్రధాన పాయపై నిర్మించిన సుందిళ్ల, అన్నారం బరాజ్లకు సైతం నామమాత్రంగా 293 క్యూసెక్కులు, 450 క్యూసెక్కుల వరద మాత్రమే వస్తోంది. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బరాజ్లలో నీళ్లు నింపరాదని ఎన్డీఎస్ఏ సూచించింది. దీంతో మేడిగడ్డ బరాజ్కి భారీ వరద వస్తున్నా నీటిని ఎత్తిపోసే అవకాశం లేకుండా పోయింది.నాగార్జున సాగర్లో 551 అడుగులకు నీటి మట్టంనాగార్జునసాగర్: శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గుముఖం పట్టడంతో ఒక గేటు ద్వారా దిగువన నాగార్జునసాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల ద్వారా 69,382 క్యూసెక్కులు, ఒక గేటు ద్వారా 27,295 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది. సాగర్ జలాశయ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 551.10 అడుగుల మేర నీటి మట్టం ఉంది. సాగర్ జలాశయానికి గడిచిన 24 గంటల్లో 70,320 క్యూసెక్కుల నీరు రాగా, 9,552 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. -
సీఐ వార్నింగ్.. వ్యక్తి ఆత్మహత్య
చొప్పదండి/కరీంనగర్ క్రైం: గృహహింస, వరకట్న వేధింపుల కేసులో తనను అత్తింటివారితోపాటు మధ్యవర్తులు, కరీంనగర్ మహిళా పోలీస్స్టేషన్ సీఐ వేధిస్తున్నారని ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నెల 7వ తేదీన సెల్ఫీ వీడియో తీసుకుని పురుగుల మందు తాగిన కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన కడారి శ్రవణ్కుమార్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. ఈ వ్యవహారంలో చొప్పదండి పోలీసులు కరీంనగర్ మహిళా పోలీస్స్టేషన్ సీఐ శ్రీలత, మృతుడి భార్య, అత్త, మధ్యవర్తులపై కేసు నమోదు చేశారు.కరీంనగర్ రూరల్ రెవెన్యూ కార్యాలయంలో శ్రవణ్ కుమార్ రికార్డు అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. అతనికి కరీంనగర్ బస్ డిపోలో కండక్టర్గా పనిచేస్తున్న కరీంనగర్ నివాసి నీలిమతో 2021 జూన్లో వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. రెండేళ్ల నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అప్పటి నుంచి నీలిమ తల్లిగారింట్లో ఉంటోంది. గత నెలలో కరీంనగర్ మహిళా పోలీస్స్టేషన్లో నీలిమ వరకట్నం వేధింపుల కేసు పెట్టడంతో శ్రవణ్తోపాటు, అతని తండ్రి నర్సింగం, తల్లి విజయ, అక్క కడారి వనజ పోలీస్స్టేషన్కు వెళ్లారు. అక్కడ సీఐ శ్రీలత ‘నువ్వు ప్రభుత్వ ఉద్యోగివి. నేను చెప్పినట్లు వింటే మంచిది. కంప్రమైజ్ చేసుకో. లేకుంటే ఇబ్బంది పడతావు’అని బెదిరిస్తూ అతడిపై కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో సీఐ శ్రీలత, తన భార్య, అత్త, మధ్యవర్తుల వేధింపులు భరించలేకపోతు న్నానని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని శ్రవణ్ సెల్ఫీ వీడియోలో ఆరోపించాడు. శ్రవణ్ తండ్రి నర్సింగం ఫిర్యాదుతో సీఐ శ్రీలత, నీలిమ, ప్రవీణ్కుమార్, నవీన్కు మార్, ఎడ్ల ప్రసన్న, బత్తుల వినోద, బత్తుల మధుకుమార్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేశ్రెడ్డి తెలిపారు. శ్రవణ్ మృతితో కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద అతడి బంధు వులు ఆందోళన నిర్వహించారు. శ్రవణ్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
చేదెక్కిన చెరకు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చెరకు సాగు విస్తీర్ణం క్రమేపీ తగ్గుతోంది. ఫ్యాక్టరీల క్రషింగ్ సామర్థ్యానికి సరిపోను దిగుబడి కూడా ఉండటం లేదంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. చెరకు సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వపరంగా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో రైతులు ఇతర పంటల వైపు మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా వరిసాగుకు సై అనడంతో చెరుకు సాగు విస్తీర్ణం పెరగడం లేదని ఫ్యాక్టరీల యాజమాన్యాలు, చెరకు విభాగం అధికారులు చెబుతున్నారు. చెరకు పరిశ్రమ ద్వారా ఒక్కో మెట్రిక్ టన్నుపై ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో రూ.250 వరకు సమకూరుతోంది. చెరకు ఏడాది పంట కావడంతో టన్నుకు రూ.1,000 చొప్పున ప్రోత్సాహకం ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. చెరకు ఫ్యాక్టరీలకు అవసరమైన ముడి సరుకుతోపాటు గ్రామీణ ప్రాంతంలో ఉపాధి కల్పనలో కీలకంగా ఉన్న చెరకు పరిశ్రమను ప్రోత్సహించాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో చెరకు రైతులకు బోనస్ ప్రకటించేందుకు విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా చెరకు విభాగం అధికారులు కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు సమాచారం. మూడోవంతు విస్తీర్ణంలోనే సాగు ! రాష్ట్రంలో 12 చక్కెర కర్మాగారాలు ఉండగా, ఐదు కర్మాగారాలు మూత పడ్డాయి. ప్రస్తుతం ప్రైవేట్ రంగంలోని ఏడు చక్కెర కర్మాగారాలు మాత్రమే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటి క్రషింగ్ సామర్థ్యం రోజుకు 24,700 మెట్రిక్ టన్నులు. 130 రోజుల క్రషింగ్ సీజన్ను పరిగణనలోకి తీసుకొని లెక్క వేస్తే మొత్తంగా ఫ్యాక్టరీల క్రషింగ్ సామర్థ్యానికి అనుగుణంగా 32.11 లక్షల మెట్రిక్ టన్నుల చెరకు అవసరం. రాష్ట్రంలో 40వేలకు పైగా హెక్టార్లలో చెరుకు సాగు చేస్తేనే ఈ ఏడు ఫ్యాక్టరీల క్రషింగ్ సామర్థ్యానికి అనుగుణంగా దిగుబడి వస్తుందని యాజమాన్యాలు చెబుతున్నాయి. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో 21వేల హెక్టార్లలో మాత్రమే రైతులు చెరకును సాగు చేస్తున్నారు. దీంతో ఫ్యాక్టరీలకు నష్టాలు తప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించి మూతపడిన బోధన్, మెదక్, మెట్పల్లిలోని నిజాం డెక్కన్ షుగర్స్ యూనిట్లు తెరుచుకుంటే చెరకు పంట సాగు విస్తీర్ణం 61వేల హెక్టార్లకు చేరాలి. అంటే ప్రస్తుతం రాష్ట్రంలోని ఫ్యాక్టరీల క్రషింగ్ సామర్థ్యానికి అవసరమైన విస్తీర్ణంలో కేవలం మూడో వంతు విస్తీర్ణంలో మాత్రమే చెరకు సాగవుతోంది. తమిళనాడు తరహాలో బోనస్ ఇవ్వాలి తమిళనాడులో చెరకు రైతులకు టన్నుకు రూ.1,000 చొప్పున బోనస్ ఇస్తున్నారు. ఇదే తరహాలో తెలంగాణ ప్రభుత్వం కూడా చెరకు రైతులకు రూ.1,000 చొప్పున ప్రోత్సాహకం ఇవ్వాలి. ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో రైతులు వరి సాగువైపే మొగ్గు చూపుతున్నారు. – రచ్చ నరసింహారావు, చెన్నారం, ఖమ్మం జిల్లాచెరకు రైతులను ఆదుకోవాలిచెరకు సాగులో ఖర్చులు పెరిగి గిట్టుబాటు కావడం లేదు. స్థానికంగా ఉన్న చక్కెర కర్మాగారం మూతపడటంతో తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు కనీస మద్దతు ధర కూడా ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. సన్న వడ్లకు ఇచ్చినట్టుగా చెరకు రైతులకు కూడా బోనస్ ఇవ్వాలి. చెరకు సాగులో యాంత్రీకరణ అనుకున్నంత వేగంగా జరగడం లేదు. – ఈదులపల్లి ఈరన్న, హద్నూర్, సంగారెడ్డి జిల్లా -
మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నాం
దండేపల్లి/జన్నారం/మంచిర్యాల రూరల్ (హాజీపూర్)/ లక్సెట్టిపేట: మహిళా సాధికారతకు ప్రజా ప్రభుత్వం కట్టుబ డి ఉందని, రాష్ట్రంలోని ప్రతీ నియోజక వర్గంలో మహిళల కోసం మైక్రో ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసి, వారు వ్యాపారాలు చేసుకునేలా కార్యక్రమాలు చేపడతామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఆదివారం మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట, దండేపల్లి, హాజీపూర్ మండలాల్లో మంత్రులు శ్రీధర్బాబు, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారా వులతో కలసి భట్టి విక్రమార్క పర్యటించారు. లక్సెట్టిపేట లో నూతనంగా నిర్మించిన 50 పడకల సామాజిక ఆస్పత్రి, కళాశాల భవనాన్ని ప్రారంభించారు. దండేపల్లి మండలం రెబ్బెనపల్లిలో ఇందిరా మహిళా శక్తి సౌర విద్యుత్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. హాజీపూర్ మండలం వేంపల్లిలో ఇండస్ట్రియల్ పార్కు, ఐటీ పార్కుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో భట్టి విక్రమార్క మాట్లాడుతూ జనాభాలో సగభాగమైన మహిళలకు గత కాంగ్రెస్ ప్రభుత్వాలు వడ్డీ లేని రుణాలు అందించగా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే వడ్డీ లేని రుణాల పథకాన్ని పునరుద్ధరించినట్లు తెలిపారు. ‘కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని ప్రకటించినప్పుడు కొందరు అవహేళన చేశారు. కానీ మొదటి సంవత్సరంలోనే రూ.21,600 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. మహిళా సంఘాలకు సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు కేటాయించి, ఆర్థిక స్వావలంబనకు మార్గం సుగమం చేస్తున్నాం. మహిళా సంఘాలకు రుణ సౌకర్యం కల్పించి, బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకు ఇప్పిస్తున్నాం. క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, ఇతర వ్యాపారాల కోసం మహిళా సంఘాలకు స్థలాలు కేటాయించాం’అని భట్టి చెప్పారు.సంక్షేమ పథకాల కోసం రూ.55 వేల కోట్లు ఖర్చుఇందిరమ్మ ఇళ్ల పథకంలో 4.50 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని రూ.22,500 కోట్లతో మొదలుపెట్టామని భట్టి విక్రమార్క తెలిపారు. సంక్షేమ పథకాల కోసం రూ.55 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. గతంలో అటవీ అధికారులతో ఇబ్బందులు ఎదుర్కొన్న గిరిజనుల కోసం ఇందిరా సౌర గిరిజన వికాసం పథకం ప్రవేశపెట్టినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ పథకం కింద ఉచిత సోలార్ పంప్సెట్లు, స్ప్రింక్లర్లు, డ్రిప్ ఇరిగేషన్, అవకాడో, వెదురు మొక్కలను ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును తిరిగి చేపడతామని డిప్యూటీ సీఎం ప్రకటించారు. ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామ న్నారు. ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల అభివృద్ధిపై సీఎం రేవంత్రెడ్డితో పాటు మంత్రివర్గం దృష్టి సారించిందని తెలిపారు.మంచిర్యాలలో ఐటీ, ఇండస్ట్రియల్ పార్కుమంచిర్యాలలో 212 ఎకరాల్లో దత్తసాయి ఇండస్ట్రియల్, ఐటీ, ఆటోనగర్ పార్కు ఏర్పాటుకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు శంకుస్థాపన చేశారు. మొత్తం 300 ఎకరాల్లో ఈ పార్కును నిర్మించనున్నట్లు తెలిపారు. మొదటి విడతగా రూ.30 కోట్లు కేటాయించామని, ఈ ప్రాజె క్టు ద్వారా 2 వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. -
డోర్నకల్–గద్వాల రైల్వేలైన్ చేపట్టాలా.. వద్దా?
సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణలోని సూర్యాపేట, నాగర్కర్నూలు, కల్వకుర్తి, అచ్చంపేటలాంటి కీలక ప్రాంతాలకు ఇప్పటి వరకు రైలుమార్గం లేదు. ఈ మార్గాలను అనుసంధానిస్తూ ప్రతిపాదించిన రైల్వేలైన్కు భారీ వ్యయం అవుతున్నందున రైల్వేబోర్డు ఎటూ తేల్చుకోలేకబోతోంది. దాదాపు రూ.5,500 కోట్ల వరకు వ్యయం చేయాల్సి ఉన్నందున.. ఈ మార్గాన్ని నిర్మిస్తే రైల్వేకు వచ్చే ఆదాయం ఎంతో లెక్కలేసుకుంటోంది. ఆదాయం అంతగా ఉండదని భావిస్తే ఈ కీలక మార్గం మంజూరయ్యే అవకాశం లేదు. దీంతో ఇప్పుడు ఈ ప్రాజెక్టును సాధించాలంటే రాజకీయ ఒత్తిడి కీలకంగా మారబోతోంది. నేతలు గట్టిగా ఒత్తిడి చేస్తే తప్ప ఇది సాకారం అయ్యే సూచనలు కనిపించటం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏంటా ప్రాజెక్టు.. ఎందుకు టెన్షన్ తెలంగాణలో ఆది నుంచి రైల్వే అనుసంధానం తక్కువ. అందులోనూ దక్షిణ తెలంగాణలోని కీలక ప్రాంతాలకు రైల్వే భాగ్యం లేకుండా పోయింది. ఉన్న ప్రధాన లైన్లు తప్ప, వాటిని అనుసంధానించే కొత్త లైన్లు లేవు. ఈ తరుణంలో రైల్వే శాఖ సికింద్రాబాద్–విజయవాడ గ్రాండ్ ట్రంక్ రూట్లో ఉన్న డోర్నకల్ నుంచి కాచిగూడ–బెంగుళూరు ప్రధాన లైన్లో ఉన్న గద్వాలను అనుసంధానిస్తూ కొత్త రైలు మార్గం నిర్మించాలని ప్రతిపాదించింది. దీనికి సంబంధించి ఇటీవల ఫైనల్ లొకేషన్ సర్వేను పూర్తి చేసింది. ఇప్పుడు అందులో కీలకమైన డీపీఆర్ తయారీ దాదాపు పూర్తయ్యింది. ఇప్పుడు దీనిపై రైల్వేబోర్డు నిర్ణయం వెల్లడించాల్సి ఉంది. డోర్నకల్లో ప్రారంభమయ్యే కొత్త లైన్ ఖమ్మంలోని కూసుమంచి, పాలేరు మీదుగా దక్షిణ తెలంగాణలో కీలక పట్టణాలైన సూర్యాపేట, నల్లగొండ, కల్వకుర్తి, నాగర్కర్నూలు, వనపర్తి, భూత్పూర్ల మీదుగా సాగి గద్వాల వద్ద ముగుస్తుంది. దీని నిడివి దాదాపు 300 కి.మీ. ఈ ప్రాంతాల్లో చాలా వాటికి ఇప్పటి వరకు రైలు వసతి లేదు. రైల్వేలైన్ ఏర్పడితే ఆ ప్రాంతాల్లో పురోగతి వేగం అందుకుంటుంది. పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందేందుకు దోహదం చేస్తుంది. దీంతో ఈ రైలు మార్గం దక్షిణ తెలంగాణ ఆర్థిక పరిస్థితిని మార్చే కీలక ప్రాజెక్టు. నిడివి ఎక్కువగా ఉండటంతో ఈ రైలు మార్గం నిర్మాణానికి దాదాపు రూ.5,500 కోట్లకుపైగా ఖర్చవుతుందని డీపీఆర్ ప్రాథమిక కసరత్తు చెబుతోంది. అధికారిక అంచనా వెల్లడి కావాల్సి ఉంది. ప్రస్తుతానికి జరుగుతున్న కసరత్తు మేరకు, ఇది భారీ ఖర్చుతో కూడుకున్నందున దీనిపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆదాయం అంతగా రాదని.. ప్రయాణికుల రైళ్లతో పెద్దగా ఆదాయం ఉండదు. సరుకు రవాణా రైళ్లతోనే ఆ శాఖకు భారీగా ఆదాయం సమకూరుతుంది. సిమెంటు పరిశ్రమలు, బొగ్గు గనులు, భారీ వ్యవసాయ మార్కెట్లు ఉన్న ప్రాంతాల మీదుగా సరుకు రవాణా రైళ్ల అవసరం ఉంటుంది. ఇప్పుడు ప్రతిపాదించిన కొత్త మార్గంలో సిమెంటు పరిశ్రమలు పెద్దగా లేవు. ఉమ్మడి ఖమ్మం ప్రాంతం మీదుగా సాగనున్నందుకు బొగ్గు తరలింపునకు అవకాశం ఉంది. రూ.ఐదున్నర వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నందున రేట్ ఆఫ్ రిటర్న్స్ బ్రేక్ ఈవెన్ను మించేలా ఉంటే ఈ ప్రాజెక్టును చేపట్టే వీలుంది. బ్రేక్ఈవెన్కు చేరుకోకుంటే నష్టం తెచ్చే ప్రాజెక్టుగా ముద్ర వేసి దాన్ని పక్కనపెట్టేస్తారు. దీనిపై రైల్వే బోర్డు నిర్ణయం తీసుకునే తరుణం అయినందున, ఇప్పుడే రాజకీయ ఒత్తిడి ఉండాలన్న సూచనలు వస్తున్నాయి. -
‘మాక్’తో మేల్కొలుపు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ మాక్ సీట్ల కేటాయింపు విద్యార్థులకు అనేక అనుభవాలను నేర్పింది. ఆప్షన్ల ఎంపికలో అతి విశ్వాసం పనికిరాదని స్పష్టం చేసింది. మంచి ర్యాంకు వచ్చినా తక్కువ ఆప్షన్లు పెట్టడం వల్ల సీటు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. ఎక్కువ ర్యాంకు వచ్చిన వారికి కోరుకున్న బ్రాంచీలో సీటు వచ్చింది. అయితే, ఇక్కడ జాగ్రత్తగా వ్యవహరించకపోతే అసలు సీట్ల కేటాయింపులో నష్టం జరిగే వీలుంది. ఆప్షన్లు ఇవ్వడంలో పొరపాట్లు చేసిన వారు ఇప్పుడు వాటిని సరి చేసుకుంటారు. దీంతో ఈ నెల 18న చేపట్టే అసలు సీట్ల కేటాయింపులో చాలా మార్పులు ఉండే వీలుందని నిపుణులు చెబుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే జాగ్రత్తగా అప్షన్లు మార్చుకోవచ్చని సూచిస్తున్నారు. 2 వేల ర్యాంకుకూ సీటు రాలే..మాక్ సీట్ల కేటాయింపులో 83,054 సీట్లకు 77,154 సీట్లు భర్తీ అయ్యాయి. దాదాపు 95 వేల మంది విద్యార్థులు ఆప్షన్లపై కసరత్తు చేశారు. అయితే, 16,905 మంది ఆప్షన్లు ఇచ్చినా సీట్లు పొందలేకపోయారు. వీళ్లంతా తక్కువ కాలేజీలు, కొన్ని బ్రాంచీలను మాత్రమే ఎంచుకున్నారు. మొదటి దశ కౌన్సెలింగ్ కాబట్టి జేఈఈ ద్వారా జాతీయ కాలేజీలకు వెళ్లే విద్యార్థులు కూడా రాష్ట్ర ఎప్సెట్కు దరఖాస్తు చేశారు. ఎక్కువ ఆప్షన్లు ఇవ్వకపోవడం వల్ల మంచి ర్యాంకు వచ్చినా వారికి సీటు రాలేదు. ఒక విద్యార్థినికి ఎప్సెట్లో 2 వేల ర్యాంకు వచ్చింది. అయినా మాక్ సీట్ల కేటాయింపులో సీటు రాలేదు. ఒక విద్యార్థికి 50 వేల ర్యాంకు వచ్చినా టాప్ 15 జాబితాలో ఉన్న కాలేజీలో సీఎస్ఈ బ్రాంచీలో సీటు వచ్చింది. ఇతను ఎక్కువ ఆప్షన్లు ఇవ్వడం వల్ల ఇలా జరిగింది.జాగ్రత్తగా ఆప్షన్లు ఇవ్వాలిఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ వైపు వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. 2023–24తో పోలిస్తే 2024–25లో 16 వేల మంది పెరిగి, 1.07 లక్షలకు ఇంజనీరింగ్ ప్రవేశాలు చేరాయి. కాబట్టి ఎప్సెట్ అసలు సీట్ల కేటాయింపులో చాలా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే తక్కువ ఆప్షన్లు ఇచ్చినవాళ్లు ఈసారి వాటిని పెంచుతారు. మంచి ర్యాంకులు ఉండి సీట్లు వచ్చిన విద్యార్థులు టాప్ కాలేజీల్లో మార్పులు కోరుకుంటారు. కాబట్టి మాక్లో వచ్చిన సీటు అసలు కేటాయింపులో ఉండకపోవచ్చు. 20 వేల ర్యాంకుపైన వచ్చిన విద్యార్థుల దీన్ని ప్రధానంగా గుర్తు పెట్టుకోవాలని, ఇందుకు తగ్గట్టుగా ఆప్షన్ల ఎంపికపై కసరత్తు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. -
రిజర్వేషన్ల చుట్టూ ‘రాజకీయం’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాలన్నీ బీసీ రిజర్వేషన్ల అంశం చుట్టూనే తిరుగుతున్నాయి. స్థానిక సంస్థలకు మూడు నెలల్లో ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఊపందుకున్న రిజర్వేషన్ల రగడను రాజకీయంగా ఉపయోగించుకునేందుకు అన్ని ప్రధాన పార్టీలు ఎత్తులు వేస్తున్నాయి. ఇందులో అధికార కాంగ్రెస్ ఓ అడుగు ముందుండగా.. బీఆర్ఎస్, బీజేపీ కూడా బీసీల మన్ననలు పొందేందుకు తమదైన శైలిలో ప్రయత్నిస్తున్నాయి. అయితే, పార్టీల వ్యూహ, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. ఈసారి స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలుకాకుండా ఎక్కడ ఆగిపోతాయేమోననే ఆందోళన బీసీ సంఘాలు, ఆయా వర్గాల ప్రజల్లో వ్యక్తమవుతోంది. మొత్తం మీద బీసీ రిజర్వేషన్ల అంశంలో రాజకీయ కౌంటర్లు, ఎన్కౌంటర్లు, కోర్టు కేసు వ్యవహారంపై భిన్నాభిప్రాయాల నేపథ్యంలో అసలు ఎన్నికల ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియకుండానే రాష్ట్రంలో ‘స్థానిక’వేడి మొదలుకావడం గమనార్హం. అధికార పార్టీ ఏమనుకుంటోందంటే.. ఎవరెంతో.. వారికంత అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ అందిపుచ్చుకున్న దేశవ్యాప్త నినాదంతో సామాజిక న్యాయం చేస్తున్నామని చెప్పుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఎస్సీల వర్గీకరణ, మంత్రివర్గ విస్తరణతోపాటు తాజాగా రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన ఆర్డినెన్స్తో అన్ని వర్గాలకు తాము న్యాయం చేస్తున్నామని చెబుతోంది. అంతకంటే ముందు అసెంబ్లీలో ఆమోదం పొందిన బీసీ బిల్లు కూడా కామారెడ్డి డిక్లరేషన్ను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామనేందుకు నిదర్శనమని ఆ పార్టీ నేతలంటున్నారు. తాము మాత్రమే బీసీలకు న్యాయం చేయగలమని, అందుకే చేశామని ఆ పార్టీ నేతలంటుండగా సీఎం రేవంత్రెడ్డి మరో అడుగు ముందుకేసి రాహుల్గాంధీ ప్రధాని అయి ఉంటే 48 గంటల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయించేవాడినన్నారు. కేబినెట్ ఆర్డినెన్స్ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు నిర్వహించి తామే బీసీల చాంపియన్నని చెబుతోంది. ఈ నేపథ్యంలోనే మరోమారు ఢిల్లీ యాత్రకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ పార్టీ వర్గాల్లో బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ఆగం చేస్తుందా అనే మీమాంస కూడా కనిపిస్తోంది. ఇప్పటికే అసెంబ్లీలో ఆమోదం పొందిన బీసీ బిల్లు రాష్ట్రపతి, పార్లమెంటు ఆమోదం కోసం పెండింగ్లో ఉండగా, ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకురావడం ఏ మేరకు మేలు చేస్తుందనే దానిపై ఆ పార్టీ నేతల్లోనూ సందేహాలు వ్యక్తమవుతుండటం గమనార్హం. విపక్షాలు ఏమనుకుంటున్నాయంటే... కర్ర విరగకుండా పాము చావకుండా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని, అధికారంలో ఉన్న పార్టీగా చేయాల్సింది చేయకుండా బీసీ వర్గాలను బుట్టలో వేసుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్తోందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. బీసీలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో రాష్ట్రం నుంచి అఖిలపక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకెళ్తానని సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందినప్పుడే చెప్పారని, అయితే ఇప్పటివరకు ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదని నిలదీస్తున్నాయి. అన్ని పార్టీలను ప్రధాని వద్దకు తీసుకెళ్తానని చెప్పిన తర్వాత ఎన్నోసార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి వచ్చిన ఆయన కనీసం ఒక్కసారి కూడా ఎందుకు బీసీ బిల్లు ఆమోదం గురించి వినతిపత్రం ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్రపతి వద్దకు వెళ్లిన బిల్లును ఆమోదింపజేసి పార్లమెంటు ఆమోదం కోసం తీసుకురావడంలో కాంగ్రెస్ చేసిన కృషి ఏంటో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలన్న ప్రధాన డిమాండ్ను వినిపిస్తున్న బీఆర్ఎస్ ఈ విషయంలో కాంగ్రెస్ వైఖరిని తప్పుపడుతోంది. బీసీలను మోసం చేసేందుకే ఆర్డినెన్స్ అంటున్నారని, ఏకసభ్య కమిషన్ పేరుతో ఇచ్చిన నివేదిక లొసుగులతో ఉందని, ఈ నేపథ్యంలో బీసీలకు న్యాయం జరిగే పరిస్థితి లేదని అంటోంది. ఇక, బీజేపీ కూడా ఈ విషయంలో కాంగ్రెస్ వైఖరిని తప్పుపడుతోంది. రాష్ట్రపతి వద్ద బిల్లు పెండింగ్లో ఉండగా, ఆర్డినెన్స్ తేవడం బీసీలను ఏమార్చడానికేనని అంటోంది. తాము బహిరంగంగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశానికి మద్దతిస్తున్నా.. అటు రాష్ట్రపతితోపాటు ఇటు పార్లమెంటులోనూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లుకు ఆమోదం పొందకపోతే తమకు ‘స్థానిక’ంగా పట్టురాదేమోననే ఆందోళన కమలనాథుల్లో వ్యక్తమవుతోంది. బీసీ సంఘాలు ఏమంటున్నాయి... ఆర్డినెన్స్ ఆధారంగా ప్రభుత్వం జారీ చేయాలనుకుంటున్న రిజర్వేషన్ల జీవోకు న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయన్న దానిపై బీసీ సంఘాల్లో, ఆయా వర్గాల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ జీవో కోర్టులో నిలబడుతుందా లేదా అన్న దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కోర్టులో సవాల్ చేస్తే నిలబడదని కొందరు, కొన్ని ప్రాతిపదికల మీద నిలబడుతుందని మరికొందరు అంటున్నారు. గతంలో సుప్రీంకోర్టు చెప్పిన విధంగా రిజర్వేషన్ల సీలింగ్ 50 శాతానికి పరిమితం అవుతుందని, ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన కల్పించే రిజర్వేషన్లు పోను 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు వర్తింపజేయడం సుప్రీంతీర్పు అమల్లో ఉన్నంతవరకు సాధ్యం కాదని, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే జీవోను సవాల్ చేస్తే వెంటనే కోర్టు కొట్టి వేస్తుందనేది వారి వాదన. అయితే, గతంలో బీసీల జనాభా లెక్కలు అందుబాటులో లేనందున కోర్టులు కొట్టివేశాయని, ఇప్పుడు ప్రభుత్వం చేసిన కుల సర్వేలో బీసీల జనాభా 56 శాతంగా తేలిందని, బీసీలకు తగినంత రిజర్వేషన్లు కల్పించవచ్చని సుప్రీంకోర్టు తీర్పులోనే పేర్కొన్నందున 42 శాతం కోటా న్యాయ సమీక్షలో నిలబడుతుందని మరికొందరు వాదిస్తున్నారు. అలాగే, డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు అంశం కూడా ఈ వాదనకు బలాన్నిస్తుందని అంటున్నారు. మరోవైపు అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేసే క్రమంలోనే 50 శాతం సీలింగ్ చాలా రాష్ట్రాల్లో దాటిపోయిందని, తెలంగాణలోనూ ఇబ్బంది ఉండదని వారంటున్నారు. మరోవైపు బీసీ వర్గాలకు న్యాయం జరుగుతున్నందున దాన్ని అడ్డుకోవద్దని, కోర్టులో కేసులు వేయొద్దని అటు రాజకీయ పార్టీలకు, ఇటు ప్రజలకు బీసీ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నా ఏ క్షణంలో కోర్టులో కేసు పడుతుందోననే గుబులు మాత్రం కనిపిస్తోంది. బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో ఇచ్చిన మరుసటి రోజే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైతే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున కోర్టు కూడా జోక్యం చేసుకోదనే వాదన సముచితం కాదనే భిన్నమైన అంశాన్ని బీసీ సంఘాల నిపుణులు తెరపైకి తెచ్చారు. గతంలో మహారాష్ట్రలో ఇదే జరిగిందని, మరాఠాలను బీసీల్లో చేర్చి, వారికి రిజర్వేషన్లు కల్పించి పంచాయతీ ఎన్నికలకు వెళ్తే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని మరీ ఎన్నికల ప్రక్రియను నిలిపివేసిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో జీవోలు, ఆర్డినెన్స్ల కంటే పార్లమెంటు ఆమోదం ద్వారా 42 శాతం రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చడమే రక్షణ కవచమని, ఆ కోణంలోనే అన్ని పార్టీలు చిత్తశుద్ధితో పనిచేయాలని బీసీ సంఘాలు కోరుతున్నాయి. -
కోట శ్రీనివాసరావు మృతిపట్ల ప్రధాని మోదీ సంతాపం
న్యూఢిల్లీ: టాలీవుడ్ ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. కోట శ్రీనివాసరావు మరణం బాధాకరమని, ఆయన సినీ ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞగా ఆయన గుర్తిండిపోతారని మోదీ కొనియాడారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘కోట శ్రీనివాసరావు గారి మరణం బాధాకరం. ఆయన సినీ ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞకు గుర్తుండిపోతారు. తరతరాలుగా ప్రేక్షకులను తన అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. సామాజిక సేవలో కూడా ఆయన ముందంజలో ఉన్నారు మరియు పేదలు మరియు అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడానికి కృషి చేశారు. ఆయన కుటుంబానికి, అసంఖ్యాక అభిమానులకు నా సంతాపం. ఓం శాంతి.’ అని ‘ఎక్స్’ ఖాతా ద్వారా సంతాపం తెలిపారు.శ్రీ కోట శ్రీనివాసరావు గారి మరణం బాధాకరం. ఆయన సినీ ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞకు గుర్తుండిపోతారు. తరతరాలుగా ప్రేక్షకులను తన అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. సామాజిక సేవలో కూడా ఆయన ముందంజలో ఉన్నారు మరియు పేదలు మరియు అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడానికి కృషి చేశారు. ఆయన…— Narendra Modi (@narendramodi) July 13, 2025 ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న నటుడుప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు మరణం బాధాకరం. తన అద్భుతమైన నటనా ప్రతిభతో కోట ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. ఆయన సినిమాకు చేసిన సేవలకు గాను ఆయనకు 2015లో పద్మశ్రీ అవార్డు లభించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిన్నా’ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంతాపం తెలిపారు.Deeply saddened by the demise of illustrious film personality Shri Kota Srinivasa Rao Garu. Admired for his phenomenal acting talent, Shri Kota Srinivasa Rao Garu made his place in people's hearts and won honors for his devotion to uplifting the poor. He was also conferred the…— Amit Shah (@AmitShah) July 13, 2025 ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతి -
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జులై 13-20)
-
తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై కవిత ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న)పై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికు ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు చేశారు. వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అనంతరం జూబ్లీహిల్స్లోని గుత్తా నివాసంలొ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తెలంగాణలో ఆడబిడ్డలంటే ఎంతో గౌరవం ఉంటుందన్నారు. బీసీ బిడ్డల్లో గౌరవించే అవకాశం మెండుగా ఉంటుందన్న కవిత.. రాజకీయాల్లో మహిళలపై పురుష పదజాలం వాడడంతో రాజకీయాల్లోకి మహిళలు రావాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు.‘‘తెలంగాణ జాగృతి విషయంలో బీసీ రిజర్వేషన్ల అమలుకై పోరాటం చేస్తూనే ఉన్నాం. మీరు బీసీ బిడ్డా కాబట్టి ఏదీ పడితే అదీ మాట్లాడితే సరికాదు. తీన్మార్ మల్లన్న మీరు మాట్లాడిన మాటలకు మావాళ్ళకు కోపం వచ్చి నిరసన చేశారు. ఇంత మాత్రనికే గన్ఫైర్ చేసి చంపేస్తారా!??. ఒక ఆడబిడ్డ ప్రశ్నిస్తే సహించలేకపోతున్నారా !?. నేను ఊరుకునే ప్రసక్తే లేదు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలి. లేదంటే మీరు వెనకనుండి మాట్లాడించారని భావించాల్సి ఉంటుంది. వెంటనే చర్యలు తీసుకోవాలి’’ అని కవిత డిమాండ్ చేశారు.‘‘ఇప్పుడు సెషన్స్ లేవు కాబట్టి.. మీరు ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేయాలని ఛైర్మన్ సూచించారు. వెంటనే తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీ సభ్యత్వం నుండి సస్పెండ్ చేయాలి. 24 గంటలు గడిచిన ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం విడ్డూరం. ఎమ్మెల్సీ మహిళా నేతపై చేసిన వ్యాఖ్యలను పట్టించుకోకపోతే.. మిగతా సాధారణ మహిళల పరిస్థితి ఏంటీ? సీఎం, డీజీపీకీ రిక్వెస్ట్ చేస్తున్నా.. ఫైరింగ్ మీద పూర్తి ఎంక్వైరీ చేయాలి. గతంలో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు మహిళా జర్నలిస్టులను అరెస్టు చేశారు. తీన్మార్ మల్లన్న ఎవరు అసలు.. నన్నెందుకు అడ్డుకుంటాననీ అరుస్తూ గోలా గోలా చేస్తున్నాడు’’ అంటూ కవిత వ్యాఖ్యానించారు.కాగా, ఇవాళ ఉదయం(ఆదివారం) తీన్మార్ మల్లన్న కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడి చేసిన ఘటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కాగా, 3.30 గంటలకు డీజీపీని కలిసి కవిత ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. మేడిపల్లిలోని తీన్మార్ మల్లన్న ఆఫీస్లో ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. దీంతో మల్లన్న గన్మెన్ గాల్లోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు.మలన్న కార్యాలయానికి చేరుకున్న పోలీసులు.. పరిస్థితిని అదుపు చేశారు. ఇరువర్గాలను ఆఫీస్ నుంచి పంపించివేశారు. కవిత చేపట్టిన బీసీ ఉద్యమాన్ని తప్పుబడుతూ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై జాగృతి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిపై స్పందించిన మల్లన్న తనపై కవిత అనుచరులు హత్యాయత్నం చేశారంటూ ఆరోపించారు. హత్యాయత్నాన్ని ఆపేందుకు తన గన్ మెన్ గాల్లోకి కాల్పులు జరిపారన్నారు. -
మల్లన్నపై దాడి.. కొత్త పార్టీ ప్రకటనతో రాజకీయ వేడి
సాక్షి,హైదరాబాద్:తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న కొత్త పార్టీని స్థాపించనున్నట్లు ప్రకటించారు. బీసీలను ఏకం చేస్తూ ఈ పార్టీ భవిష్యత్ కార్యచరణ ఉంటుందని ప్రకటించడం పొలిటికల్ హీట్ను మరింత పెంచింది.తీన్మార్ మల్లన్న కార్యాలయంలో కాల్పులుబీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేపట్టిన బీసీ ఉద్యమాన్ని తప్పుబడుతూ మల్లన్న పలు వ్యాఖ్యలు చేశారు. మల్లన్న చేసిన వ్యాఖ్యలపై జాగృతి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిపల్లిలోని ఆయన ఆఫీస్పై దాడి చేశారు. అయితే, దాడితో అప్రమత్తమైన తీన్మార్ మల్లన్న గన్మెన్లు గాల్లోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు.తెలంగాణ మరో కొత్త రాజకీయ పార్టీ జాగృతి కార్యకర్తల దాడిపై తీన్మార్ మల్లన్న మీడియాతో మాట్లాడారు. నాపై హత్యాయత్నం జరిగింది. నన్ను కాపాడేందుకు గన్ మెన్ ఫైర్ చేశారు. దాడి నాపై చేసి.. కవిత డీజీపీకి ఫిర్యాదు చేయడం సిగ్గు చేటు. పక్కా ప్లాన్ ప్రకారం దాడి చేశారు. దాడికి ఉసిగొల్పిన కవిత శాసన మండలి సభ్యత్వం రద్దు చేయాలి. త్వరలో రాజకీయ పార్టీ పెడతా.. బీసీలను ఏకం చేస్తానని తెలిపారు. గతంలో తెలంగాణ నిర్మాణ పార్టీ’ 2023లో తీన్మార్ మల్లన్న ఓ కేసులో భాగంగా చర్లపల్లి జైలులో శిక్షను అనుభవించారు. చర్లపల్లి జైలు నుంచి విడుదల అనంతరం ‘తెలంగాణ నిర్మాణ పార్టీ’ పేరుతో రాజకీయపార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో (2024) మేడ్చల్ అసెంబ్లీ స్థానం నుంచి తన పార్టీ తరఫున పోటీ చేస్తానని తెలిపారు.అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు ప్రజల మనోభావాలు గౌరవించేందుకు కాదని, మహారాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశం కోసమేనని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చేది యువతేనని..రైట్ రీ కాల్ తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఇప్పుడు మరోసారి తీన్మార్ మల్లన్న తాను కొత్త రాజకీయ పార్టీని పెట్టనున్నట్లు ప్రకటించడం గమనార్హం. -
తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ చింతపండు నవీన్(తీన్మార్ మల్లన్న) కార్యాలయంపై దాడి జరిగింది. మేడిపల్లిలోని ఆయన ఆఫీస్పై జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కార్యకర్తలు దాడి చేశారు. ఆఫీస్లో ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. దీంతో మల్లన్న గన్మెన్ గాల్లోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు.మలన్న కార్యాలయానికి చేరుకున్న పోలీసులు.. పరిస్థితిని అదుపు చేశారు. ఇరువర్గాలను ఆఫీస్ నుంచి పంపించివేశారు. కవిత చేపట్టిన బీసీ ఉద్యమాన్ని తప్పుబడుతూ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై జాగృతి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిపై స్పందించిన మల్లన్న తనపై కవిత అనుచరులు హత్యాయత్నం చేశారంటూ ఆరోపించారు. హత్యాయత్నాన్ని ఆపేందుకు తన గన్ మెన్ గాల్లోకి కాల్పులు జరిపారన్నారు. -
వైభవంగా సికింద్రాబాద్ లష్కర్ బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: చరిత్రాత్మకమైన సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం 4 గంటలకు వేదమంత్రోచ్ఛరణల మధ్య ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ద్వారాలు తెరిచారు. మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి తొలిపూజ చేసి బోనం సమర్పించారు. అనంతరం సాధారణ భక్తులకు అమ్మవారిని దర్శించుకునేందుకు అనుమతించారు.ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అమ్మవారికి పట్టు వ్రస్తాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎంకు ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ ప్రత్యేక పూజలు చేశారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ఈటల రాజేందర్ దర్శించుకున్నారు. అనాదిగా హైదరాబాద్లో బోనాల పరంపర కొనసాగుతుందన్నారు.ఈ నెల 13, 14 తేదీల్లో అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు వివిధ శాఖల అధికారులు ఏర్పాటు చేశారు. ఆదివారం బోనాలు, సోమవారం రంగం కార్యక్రమంలో భాగంగా భవిష్యవాణి ఉంటుంది. తెలంగాణ నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు పాల్గొనే బోనాల ఉత్సవాల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది.అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం ఆరు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఇందులో రెండు క్యూలైన్లు బోనాలతో వచ్చే మహిళల కోసం, ఒకటి వీఐపీ పాస్లతో వచ్చే వారికి, మిగతావి సాధారణ భక్తులకు కేటాయించారు. బోనాలతో వచ్చే మహిళలతోపాటు ఐదుగురు కుటుంబ సభ్యులను అనుమతిస్తారు. దేవదాయ శాఖ అధికారులు దేవాలయం మొత్తం రంగులు, పువ్వులు, విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. జీహెచ్ఎంసీ అధికారులు 24 గంటలు పారిశుధ్య పనులు నిర్వహించేలా సిబ్బందిని నిమించారు.మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. జలమండలి అధికారులు ఐదు ప్రాంతాల్లో మంచినీటి శిబిరాలను ఏర్పాటు చేసి వాటర్బాటిళ్లు, మంచినీటి ప్యాకెట్లు అందించనున్నారు. మహంకాళి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో డీఎంఅండ్హెచ్వో ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి డాక్టర్లను అందుబాటులో ఉంచారు. అత్యవసర పరిస్థితుల కోసం అంబులెన్స్లను సిద్ధంగా పెట్టారు. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో భక్తులను అలరించేందుకు ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేసి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా కళాకారులతో కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.శివసత్తులు, జోగినుల కోసం అధికారులు ప్రత్యేక సమయాన్ని కేటాయించారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు వారికి ప్రత్యేకంగా అనుమతిస్తారు. ఆ సమయంలో తమ సంప్రదాయ పద్ధతిలో వచ్చి అమ్మవారిని దర్శించుకోవచ్చు. బాటా వైపు నుంచి క్యూలైన్లలో కాకుండా నేరుగా ఆర్చ్ గేటు వరకు అనుమతిస్తారు. -
బిల్లు మంజూరుకు రూ.90 వేల డిమాండ్
కాల్వశ్రీరాంపూర్ (పెద్దపల్లి): సీసీ రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్కు బిల్లు మంజూరు చేయడానికి లంచం డిమాండ్ చేసిన పంచాయతీరాజ్ ఏఈ జగదీశ్ను ఏసీబీ అధికారులు శనివారం రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా గంగారం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఏసీడీ డీఎస్పీ విజయ్కుమార్ కథనం ప్రకారం.. జిల్లాలోని ఓదెల మండలం బాయమ్మపల్లె గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ కావేటి రాజు కాల్వశ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో రూ.15 లక్షలు వెచ్చించి ఇటీవల సీసీ రోడ్లు నిర్మించారు. ఇందుకు సంబంధించిన బిల్లులు మంజూరు చేయాలని ఆయన ఏఈ జగదీశ్ను సంప్రదించారు. అయితే, తనకు రూ.లక్ష లంచం ఇస్తేనే బిల్లు మంజూరు చేస్తానని ఏఈ డిమాండ్ చేయగా, రూ.90 వేలకు ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలోనే బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారిసూచన మేరకు గంగారంలో రూ.90 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. రోడ్డుపైనే నిఘావేసి..: బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు గంగారం ప్రధాన చౌరస్తా సమీపంలోని రహదారిపై నిఘా వేశారు. అటుగా వచి్చన కాంట్రాక్టర్ రాజు నుంచి రూ.90 వేలు లంచం తీసుకుంటుండగా ఏ ఈ జగదీశ్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఓ ప్రభుత్వ అధికారి రోడ్డుపైనే బహి రంగంగా లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది. -
బీమా చేయించి.. ఆపై చంపించి..
సాక్షి, సిద్దిపేట/సిద్దిపేట కమాన్: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అత్తను హత్య చేయించి..దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన ఓ అల్లుడు కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా పెద్దమాసాన్పల్లి శివారులో చోటుచేసుకుంది. శనివారం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ డాక్టర్ బి.అనురాధ ఆ వివరాలు మీడియాకు వెల్లడించారు. ఈ నెల 7వ తేదీన తొగుట పీఎస్ పరిధిలో దివ్యాంగురాలైన తాటికొండ రామవ్వ(60)ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందని.. ఆమె అల్లుడు తాళ్ల వెంకటేశ్ డయల్ 100కు కాల్ చేశాడు. దీంతో గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధురాలు మృతి చెందినట్టు తొగుట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వైట్ కారు ఢీ కొట్టి..ఇప్పుడే వెళ్లిందని ఫిర్యాదులో భాగంగా వెంకటేశ్ పోలీసులకు చెప్పాడు. పోలీసులు వైట్ కారు డ్రైవర్ను విచారించగా, తన కంటే ముందు బ్లాక్ కలర్ తార్జీపు వెళ్లిందని చెప్పాడు. సీసీ ఫుటేజీని పరిశీలించగా ఈ తార్ జీపు తుక్కాపూర్ వరకు నంబర్ ప్లేట్ ఉన్నట్టు, తర్వాత దానిని తొలగించి టీఆర్ స్టిక్కర్ వేసినట్టు గుర్తించారు. ఎందుకు నంబర్ ప్లేట్ తొలగించారని ఆరా తీశారు. ఆ తార్ జీపు నంబరు ఆధారంగా వాహన యజమాని దగ్గరకు వెళ్లి పోలీసులు విచారించారు. పెద్దమాసాన్పల్లికి చెందిన కరుణాకర్ సెల్ఫ్ డ్రైవింగ్ నిమిత్తం సిద్దిపేటలో రూ 2,500 చెల్లించి ఆధార్ కార్డు, వివరాలు ఇచ్చి అద్దెకు తీసుకున్నాడు. దీంతో పోలీసులు కరుణాకర్ను అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. కరుణాకర్ చెప్పిన వివరాల ఆధారంగా మృతురాలి అల్లుడైన వెంకటేశ్ను అదుపులోకి తీసుకొని విచారించారు. తానే ఈ దారుణానికి ఒడికట్టానని పోలీసులకు చెప్పాడు. ముందస్తు ప్లాన్ ప్రకారమే...సిద్దిపేట కేసీఆర్నగర్కు చెందిన తాటికొండ రామవ్వ–రంగయ్య దంపతుల కుమార్తెను తొగుట మండలం పెద్దమాసాన్పల్లికి చెందిన తాళ్ల వెంకటేశ్కు ఇచ్చి వివాహం జరిపించారు. అయితే వెంకటేశ్ తన అత్తను హత్య చేసి దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి... ఆమె పేరుపై ఇన్సూరెన్స్ చేయించి డబ్బు కాజేయాలనుకున్నాడు. అందులో భాగంగానే ఈ ఏడాది మార్చిలో తాటికొండ రామవ్వ పేరుపై పోస్టాఫీసులో ఏడాదికి రూ.755 చెల్లించి రూ.15 లక్షల ఇన్సూరెన్స్, ఎస్బీఐలో రూ.2 వేలు చెల్లించి రూ 40 లక్షల ఇన్సూరెన్స్ చేయించాడు. రైతుబీమా డబ్బు లు వస్తాయని రంగయ్య (మృతురాలి భర్త) పేరు పైన ఉన్న 28 గుంటల వ్యవసాయ భూమిని రామవ్వ పేరు మీద పట్టా మారి్పడి చేయించాడు. ఆపై తన ప్లాన్కు వరుసకు తమ్ముడయ్యే తాళ్ల కరుణాకర్కు చెప్పాడు. వెంకటేశ్ గతంలోనే తాళ్ల కరుణాకర్కు రూ.1.30 లక్షలు అప్పుగా ఇచ్చాడు. అయితే కరుణాకర్ పౌల్ట్రీఫామ్ పెట్టి రూ.22 లక్షల వరకు నష్టపోయాడు. తన అత్త హత్యకు సహకరిస్తే అప్పు ఇవ్వాల్సిన అవసరం లేదని, వచ్చే ఇన్సూరెన్స్లో ఇద్దరం చెరి సగం పంచుకుందామని వెంకటేశ్ కరుణాకర్ను ఒప్పించాడు. ప్లాన్లో భాగంగానే ఈ నెల 7న కారు తీసుకొని రావాలంటూ వెంకటేశ్ కరుణాకర్కు ఫోన్ చేశా డు. ఇదే సమయంలో విద్యుత్ అధికారులు వస్తున్నారని నీ సంతకం కావాలని చెప్పి వెంకటేశ్ తన అత్త రామవ్వను ఎక్స్ఎల్ వాహనంపై పెద్దమాసాన్పల్లి శివారులోని వ్యవసాయ భూమి వద్దకు తీసుకొచ్చాడు. కరుణాకర్ సిద్దిపేటలోని కార్లు సెల్ఫ్ డ్రైవింగ్ ఇచ్చే వారి వద్దకు వెళ్లి ఓ తార్ జీపు (టీఎస్ 18జీ 2277)ను అద్దెకు తీసుకున్నాడు. నంబర్ ప్లేట్ కనిపించకుండా టీఆర్ పేపర్ అతికించి పెద్దమాసాన్పల్లి శివారుకు వచ్చాడు. రోడ్డుపైన రామవ్వను ఉంచి వెంకటేశ్ పొలంలోకి వెళ్లాడు. అనుకున్న ప్లాన్ ప్రకారం...రామవ్వను జీపుతో కరుణాకర్ ఢీకొట్టాడు. ఆపై కొద్ది దూరం వెళ్లాక వెంకటేశ్కు వాట్సాప్ కాల్ చేసి మీ అత్తను చంపిన వెళ్లి చూసుకో అన్నాడు. అనంతరం జీపునకు టీఆర్ పేపర్ తీసేసి దానిని సిద్దిపేటలో ఇచ్చేశాడు. సాంకేతిక సాయంతో పోలీసులు వెంకటేశ్ను అదుపులోకి తీసు కొని విచారించగా ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే తన అత్త ను చంపించినట్టు ఒప్పుకున్నాడు. ఆధారాలు దొరక్కుండా చేసేందుకు వారు దృశ్యం సినిమా చూశారని పోలీసు లు తెలిపారు. నార్మల్ ఫోన్ కాల్ చేస్తే పోలీసులకు దొరికే ప్రమాదముందని నిందితులిద్దరూ వాట్సాప్ కాల్స్ మా ట్లాడుకున్నట్టు విచారణలో తేలింది. వెంకటేశ్, కరుణాకర్లను అరెస్ట్ చేసి, హత్యకు ఉపయోగించిన తార్ జీప్ ఎక్స్ఎల్ వాహనాన్ని స్వా«దీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. గజ్వేల్ ఏసీపీ నరసింహులు ఆధ్వర్యంలో కేసును ఛేదించిన తొగుట సీఐ లతీఫ్, ఎస్ఐ రవికాంతరావు, సిబ్బందిని సీపీ అభినందించి రివార్డు అందజేశారు. -
పాశమైలారం: మరో పరిశ్రమలో అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు
సాక్షి, సంగారెడ్డి: పాశమైలారంలోని మరో పరిశ్రమలో తాజాగా భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఎన్ వీరో వేస్ట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో మంటలు ఎగిసిపడుతున్నాయి. సిగాచి పరిశ్రమలో అగ్ని ప్రమాద ఘటన నుంచి తేరుకోక ముందే మరో ప్రమాదం జరగడం స్థానికులను, కార్మికులను భయాందోళనకు గురిచేసింది.వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలో ఆదివారం ఉదయం మరో భారీ అగ్నిప్రమాద ఘటన వెలుగు చూసింది. ఎన్ వీరో వేస్ట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రమాద సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
హైదరాబాద్లో కల్లుపై నిషేధం?
సాక్షి, హైదరాబాద్: కల్తీ కల్లుతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో హైదరాబాద్లో కల్లు విక్రయాలను పూర్తిగా నిషేధించాలని ఎక్సైజ్ శాఖ ఆలోచిస్తోంది. నిషేధం విధించడానికి ముందు సంబంధిత వర్గాలన్నింటితో సంప్రదింపులు జరపాలని భావిస్తోంది. కల్లుపై నిషేధం రాజకీయపరమైన సమస్యలతో ముడిపడి ఉన్న నేపథ్యంలో జాగ్రత్తగా డీల్ చేయాలని యోచిస్తోంది. నగరంలోని కల్లు సొసైటీల్లో ఉన్నవారికి ప్రత్యామ్నాయ ఉపాధి ఎలా కల్పించాలన్న దానిపై సమాలోచన చేస్తున్నట్లు సమాచారం. కల్లుపై నిషేధం గురించి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో చర్చించాలని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. హైదరాబాద్ నగరంలో విక్రయిస్తున్న కల్లులో 90 శాతం కృత్రిమంగా తయారుచేసినదే ఉంటోందని అధికారవర్గాలు చెబుతున్నాయి. చెట్ల నుంచి సహజంగా తీసిన కల్లు 10 శాతమేనని అంటున్నారు. హైదరాబాద్లో మొత్తం 97 కల్లు సొసైటీలు ఉన్నాయి. ఒక్కో సొసైటీ పరిధిలో రోజూ 10 నుంచి 20 పెట్టెల (ఒక్కో పెట్టెలో 10 – 12 సీసాలు) కల్లు విక్రయాలు జరుగుతుంటాయని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఇందులో 90 శాతం ఆ్రల్ఫాజోలం వంటి రసాయనాలతో తయారుచేసినదే ఉంటోందని సమాచారం. ఈ ఆల్ప్రాజోలం ఎక్కువగా మహారాష్ట్ర నుంచి వస్తున్నట్లు చెబుతున్నారు. ఒక కిలో ఆల్ప్రాజోలం ధర దాదాపు రూ.15 లక్షల వరకు ఉంటుంది. ఎక్సైజ్ అధికారులు గత మూడేళ్లలో అడపాదడపా నిర్వహించిన దాడుల్లోనే దాదాపు 64 కిలోల ఆ్రల్పాజోలంను స్వా«దీనం చేసుకున్నారు. వైఎస్సార్ హయాంలో నిషేధం.. ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో నగరంలో కల్లు అమ్మకాలను నిషేధించారు. దాదాపు 12 సంవత్సరాలపాటు కల్లు విక్రయాలు బంద్ అయ్యాయి. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి బీఆర్ఎస్ (నాడు టీఆర్ఎస్) అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ కల్లు విక్రయాలు ప్రారంభం అయ్యాయి. నగర శివార్లలో అప్పట్లో తాటి చెట్లు పెద్ద ఎత్తున ఉన్నా.. అవి స్థానిక అవసరాలకే పరిపోవడం లేదని, అక్కడ నుంచి నగరానికి కల్లు సరఫరా సాధ్యం కాదన్న ఉద్దేశంతోనే వైఎస్ఆర్ హయాంలో నిషేధం విధించారని అధికారులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు రియల్ఎస్టేట్ కారణంగా ఉన్న చెట్లన్నీ నరికేశారని, హైదరాబాద్కు నిజామాబాద్, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లోని చెట్లను కేటాయించినా.. అక్కడి నుంచి కల్లు గీసి తీసుకురావడం లేదని ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్టవ్యాప్తంగా కల్లు సొసైటీలు 4,064 ఉంటే 4,697 దుకాణాలు ఉన్నాయి. అందులో సభ్యులుగా 1,95,391 మంది లైసెన్స్ విక్రయదారులు ఉన్నారు. 3,541 టీఎఫ్టీ (ట్రీ ఫర్ ట్రేడింగ్) కమిటీల కింద మరో 29,279 మంది ఉన్నారు. 2014 నుంచి 2025 వరకు కల్తీ కల్లు విక్రయాలపై నమోదైన కేసుల సంఖ్య కూడా దారుణంగా పడిపోయింది. 2014లో 9,562 కేసులు నమోదైతే, 2025లో 516 కేసులు మాత్రమే నమోదు కావడం గమనార్హం. -
భద్రాద్రి వారధి.. 60 ఏళ్లు
భద్రాచలం అర్బన్: దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనానికి రావాలంటే ఏళ్ల క్రితం అనేక కష్టాలు ఎదురయ్యేవి. వాహనాల రాకపోకలు సరిగ్గా లేక.. మధ్యలో గోదావరి దాటాలంటే ప్రాణాలకు తెగించాల్సి వచ్చేది. ఏటా శ్రీరామనవమి, ముక్కోటి ఉత్సవాలకు వచ్చే భక్తులు భద్రాచలం గోదావరి అవతల బూర్గంపాడు మండలం గొమ్మూరు నుంచి కాలినడకన, ఆపై పడవలో ప్రయాణించేవారు. అలా వస్తున్న 150 మంది భక్తులు ఒకసారి నీట మునగడంతో.. వారధి నిర్మాణం ఆవశ్యకతను పాలకులు గుర్తించారు. ఈ మేరకు గోదావరిపై నిర్మించిన తొలి వంతెనకు ఈనెల 13వ తేదీతో 60 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేక కథనమిది. ఆ ప్రమాదంతో నిర్మాణానికి అడుగులు 1959లో శ్రీరామనవమి ఉత్సవాలకు భక్తులు రెండు పడవలను కట్టుకుని గోదావరి నదిపై ప్రయాణం ప్రారంభించారు. అయితే, వరద ఉధృతితో వారి పడవలు మునిగిపోగా.. సుమారు 150 మంది మృతి చెందారు. దీంతో స్పందించిన నాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం గోదావరి నదిపై వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. నాటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి 1959 డిసెంబర్ 16న శంకుస్థాపన చేశారు. వంతెన డిజైన్, నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలను ముంబైకి చెందిన పటేల్ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్కు అప్పగించారు. ఆపై అనేక అవాంతరాల నడుమ వంతెన నిర్మాణం సాగుతూ ఆరేళ్లకు పూర్తవగా.. 1965 జూలై 13న అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రారంభించారు. అప్పట్లో రూ.70 లక్షలతో నిర్మాణం భద్రాచలం వద్ద గోదావరి నదిపై వంతెన నిర్మాణానికి రూ.70 లక్షలు వెచి్చంచారు. దీన్ని 3,934 అడుగుల పొడవు, 37 పిల్లర్లు, ఒక్కొక్క పిల్లర్ మధ్య 106.6 అడుగుల దూరంతో.. ముంబైకి చెందిన పటేల్ ఇంజనీరింగ్ కంపెనీ ఆధ్వర్యాన నిర్మించారు. ఈ వంతెనపై ఇన్నాళ్లూ లక్షలాది వాహనాల రాకపోకలు సాగినా పటిష్టంగానే ఉండడం విశేషం. ఈ వంతెనకు ఇంకా సామర్థ్యం ఉన్నా.. జాతీయ రహదారి కావడంతో.. భవిష్యత్ అవసరాల దృష్ట్యా పక్కనే మరో వంతెన నిర్మించారు. కొత్త వంతెన నిర్మాణానికి 2015లో శ్రీకారం చుట్టగా 2024లో శ్రీరామనమి వేడుకల వేళ అందుబాటులోకి తీసుకొచ్చారు. కొత్త వంతెన నిర్మాణానికి రూ.100 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేయగా.. ముంబైకే చెందిన రాజ్దీప్ సంస్థ పనులను దక్కించుకుని 2024 నాటికి పూర్తిచేసింది. నాలుగు రాష్ట్రాల ప్రజలకు సదుపాయం భద్రాచలంలో గోదావరిపై 1965లో అందుబాటులోకి వచ్చిన వంతెన ద్వారా నాలుగు రాష్ట్రాల ప్రజలకు రవాణా సదుపాయం ఏర్పడింది. ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు వచ్చివెళ్లే వారికి ఇది వారధిగా నిలుస్తోంది. అప్పుడప్పుడు చిన్న చిన్న మరమ్మతులు తప్ప ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. కాగా, 1986లో మొదటిసారి గోదావరికి 75.6 అడుగుల వరద వచ్చినప్పుడు.. ఉన్నతాధికారులు వంతెనపై రాకపోకలను నిషేధించారు. మళ్లీ 2022లో కూడా అంటే దాదాపు 36 ఏళ్ల తర్వాత భారీగా వరద రావడంతో రాకపోకలను కొన్నాళ్లు నిలిపివేశారు. ఎన్నో వరదలకు ప్రత్యక్ష సాక్షి భద్రాచలం వద్ద గోదావరి వరద ఆరున్నర దశాబ్దాల్లో పలుమార్లు తొలి ప్రమాద హెచ్చరికను దాటింది. ఎప్పుడూ జూలైలోనే గోదావరి నది 11 సార్లు తొలి ప్రమాద హెచ్చరికను దాటడమే కాకుండా.. నాలుగుసార్లు మూడో ప్రమాద హెచ్చరికను (53 అడుగులు) సైతం దాటడం గమనార్హం. 1972 జూలై 6న 44.3 అడుగులుగా గోదావరి నీటిమట్టం నమోదైంది. 1976 జూలై 22న 63.9 అడుగులు, 1986లో 75.6 అడుగులు, 1988 జూలై 29న 54.3, 2002 జూలై 27న 45.8, 2008 జూలై 6న 47.3, 2013 జూలై 19న 57, 2013 జూలై 24న 56.7, 2016 జూలై 12న 52.4 అడుగుల నీటిమట్టం నమోదైంది. ఇక 2022లో జూలై 16న 71.3 అడుగులుగా నీటిమట్టం నమోదు కాగా, 2023లో జూలై 29న 56.1, 2024లో జూలై 27న 53.9 అడుగులుగా నమోదైంది. వరదలే కాక గోదావరి ఎండిపోయి ఇసుక తిన్నెలు తేలడానికి కూడా ఈ వంతెన సాక్షిగా నిలిచింది. -
ఒకే రాజ్యం.. ఒకే రాజ్యాంగం..
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో రాష్ట్రంలో ఒకటి.. దేశంలో మరొకటి ద్వంద్వ పౌరసత్వం ఉంటుందని.. మన దేశం (రాజ్యం)లో అది సాధ్యం కాదని.. ఒకే దేశం–ఒకే రాజ్యాంగం మనదని బాబా సాహెబ్ అంబేడ్కర్ వ్యాఖ్యానించారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ పేర్కొన్నారు. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు ఎలా పనిచేయాలో ఆయన రోడ్మ్యాప్ వేశారన్నారు. 75 ఏళ్లుగా ఇలా చెక్కుచెదరకుండా ఉన్నామంటే అందుకు దృఢమైన రాజ్యాంగమే కారణమని చెప్పారు. భవిష్యత్ అవసరాల మేరకు రాజ్యాంగ సవరణ అనివార్యమంటూనే ప్రాథమిక హక్కుల రక్షణ బాధ్యతను సుప్రీంకోర్టుకు అప్పగించారని వెల్లడించారు. భారత రాజ్యాంగం: అంబేడ్కర్ పాత్ర అనే అంశంపై ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రాజ్యాంగ రూపకల్పన సమయంలో అంబేడ్కర్ ఆలోచనా సరళిని లోతుగా విశ్లేషిచారు. అట్టడుగు వర్గాలకు న్యాయం చేరాలని.. రాజ్యాంగ విలువలు, లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. దేశంలో అంతర్గత సంఘర్షణలు ఎన్ని వచ్చినా మన రాజ్యాంగం వల్లే బలంగా తట్టుకొని నిలబడగలిగామని చెప్పారు. నేరుగా ‘సుప్రీం’ను ఆశ్రయించే వెసులుబాటు.. ‘భవిష్యత్తు అవసరాల రీత్యా రాజ్యాంగ సవరణకు అంబేడ్కర్ అనుమతించారు. ఆ స్ఫూర్తితో పనిచేయాల్సిన అవసరం ఉంది. అతి సమైక్య, అతి కేంద్రీకృత రాజ్యాంగాన్ని అంబేడ్కర్ వ్యతిరేకించిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. రాజ్యాంగ ఆత్మలా, రక్షణ కవచంలా ఆరి్టకల్ 32 పౌర హక్కులకు భంగం కలగకుండా కాపాడుతోంది. పరిష్కార మార్గాలు లేని హక్కులున్నా ఉపయోగం లేదని అంబేడ్కర్ చెప్పిన విషయాన్ని మరిచిపోవద్దు. పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లితే నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించే వెసులుబాటును రాజ్యాంగం కల్పించింది. అమెరికాలో ద్వంద పౌరసత్వం అమల్లో ఉన్నా.. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంతోపాటు సమాఖ్య పౌరసత్వం ఉంది. అందుకు భిన్నంగా రాష్ట్రాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చేలా బలమైన ప్రజాస్వామ్య రాజ్యంగా పటిష్టపరిచే ఒకే దేశం ఒకే రాజ్యాంగాన్ని అంబేడ్కర్ అమల్లోకి తీసుకురావడం గరి్వంచదగిన విషయం. 1973లో ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులపై ఘర్షణ వచ్చింది. దీనిపై 13 మంది న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టమైన ఉత్తర్వులిచ్చింది. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు కలిసే పనిచేస్తాయని తేల్చిచెప్పింది. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలకు కూడా రోడ్మ్యాప్ నిర్మాణంలో అంబేడ్కర్ పాత్ర ఎనలేనిది’అని సీజేఐ జస్టిస్ గవాయ్ వివరించారు. త్వరలోనే మళ్లీ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వచ్చి ఎక్కువ సమయం కేటాయిస్తానని ప్రసంగాన్ని ముగించారు. అంబేడ్కర్కు హైకోర్టు సీజేగా ఆఫర్.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహ ప్రసంగిస్తూ ‘హైదరాబాద్ నా సొంత నగరం. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నా. నా సొంత నగరంలో నా వర్సిటీకి సీజీఐ రావడం, ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొనడం హర్షణీయం. అంబేడ్కర్కు హైదరాబాద్తో అనుబంధం ఉంది. సామాజిక న్యాయ పోరాటంలో భాగంగా అంబేడ్కర్ భాగ్యనగరాన్ని సందర్శించారు. నిజాం నవాబ్ ఆయన్ను కలసి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండాలని కోరారు. అయితే ఆ ఆఫర్ను అంబేడ్కర్ సున్నితంగా తిరస్కరించారు. మన దేశ రాజ్యాంగం ఎంతో గొప్పది.. ఔన్యతమైనది’అని వెల్లడించారు. అంబేడ్కర్తో హైదరాబాద్కు ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తుచేశారు. ఇక్కడ జరిగిన సామాజిక ఉద్యమాలకు ఆయన మద్దతు ప్రకటించారన్నారు. అంబేడ్కర్ తన ఆత్మకథలో హైదరాబాద్ ఉద్యమాలు, సామాజిక న్యాయం సహా అనేక విషయాలను పొందుపరిచారని వివరించారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్పాల్ ప్రసంగిస్తూ 1947 అక్టోబర్లో రాజ్యాంగ ముసాయిదా సిద్ధమైందని.. రెండున్నరేళ్ల చర్చలు, భేటీల తర్వాత 1949 నవంబర్లో తుదిరూపు వచ్చిందన్నారు. బీఆర్ గవాయ్ తండ్రి అంబేడ్కర్కు సన్నిహితుడు.. అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్రెడ్డి ప్రసంగిస్తూ 1953 జనవరి 12న అంబేడ్కర్కు ఓయూ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిందన్నారు. ఇది ఓ భారతీయ విశ్వవిద్యాలయం ఆయనకు ప్రదానం చేసిన తొలి డాక్టరేట్ అని చెప్పారు. బీఆర్ గవాయ్ తండ్రి ఆర్ఎస్ గవాయ్ అంబేడ్కర్కు అత్యంత సన్నిహితుడని.. దాదా సాహెబ్ గవాయ్గా ఆయన సుపరిచితుడన్నారు. విద్యావేత్త, రాజకీయ నేత, సామాజిక కార్యకర్తగానే కాకుండా పలు రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేశారన్నారు. ఓయూ ఉపకులపతి ఆచార్య కుమార్ మొలుగరం మాట్లాడుతూ... 108 ఏళ్ల ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రగతిని నివేదించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, పీపీ పల్లె నాగేశ్వర్రావు, రిజిస్ట్రార్ జనరల్ (ఎఫ్ఏసీ) గోవర్దన్రెడ్డి, ఏఏజీలు ఇమ్రాన్ఖాన్, తేరా రజనీకాంత్రెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య నరేశ్రెడ్డి, ఓఎస్డీ ఆచార్య జితేందర్ కుమార్ నాయక్, న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ పోస్టల్ కవర్ను జస్టిస్ బీఆర్ గవాయ్ విడుదల చేశారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి. -
పదేళ్ల తర్వాత.. కొత్త రేషన్కార్డులు
సాక్షి, హైదరాబాద్/సాక్షిప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో దశాబ్ద కాలం తర్వాత అధికారికంగా సోమవారం కొత్త రేషన్కార్డులు పంపిణీ చేయనున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండల కేంద్రంలో సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా కొత్త రేషన్కార్డులు జారీ చేయనున్నారు. మంత్రులు, ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ తదితరులు ఈ సభలో పాల్గొంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..ఈ జనవరి 26 తర్వాత మొదలైన కొత్త కార్డుల జారీ ప్రక్రియ నిరాటంకంగా సాగుతోంది. ఇప్పటి వరకు కొత్తగా జారీ చేసిన, చేస్తున్న కార్డుల సంఖ్య 5,61,343. పాత కార్డుల్లోని డూప్లికేట్ పేర్లు తొలగించిన తర్వాత..ప్రస్తుతం కార్డుల్లో సభ్యుల సంఖ్య 3,09,30,911గా తేల్చారు. ఇంత పెద్ద మొత్తంలో ఇప్పుడే... పదేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం రేషన్కార్డుల స్థానంలో జాతీయ ఆహారభద్రత చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కింద ఆహార భద్రత కార్డులను జారీ చేసింది. అప్పట్లో రాష్ట్రంలో సుమారు 55 లక్షల కార్డులను మాత్రమే కేంద్ర ప్రభుత్వం జారీ చేయగా, ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులతో సంబంధం లేకుండా మరో 30 లక్షల కార్డులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. తర్వాత జరిగిన పరిణామాల్లో అప్పుడప్పుడు జారీ చేసిన కార్డులు, తొలగించిన కార్డులు పోగా 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయే నాటికి రాష్ట్రంలో 89.95 లక్షల ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వ చ్చిన తర్వాత జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి కొత్త కార్డుల జారీ ప్రకటన చేశారు. అప్పటి నుంచి మే 23వ తేదీ వరకు కొత్తగా 2.03 లక్షల కార్డులు జారీ అయ్యాయి. ఆ తర్వాత 24 మే నుంచి ఇప్పటి వరకు మరో 3.58 లక్షల కార్డులను ఆన్లైన్లో జారీ చేశారు.దీంతో ఇప్పటి వరకు జారీ చేసిన కార్డుల సంఖ్య 5,61,343గా తేల్చారు. దీంతో రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డుల సంఖ్య 95,56,625గా పౌరసరఫరాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త సభ్యులను చేర్చుకుంటూ, పాత రేషన్కార్డుల్లోని ఉమ్మడి కుటుంబాల్లో పెళ్లిళ్లు అయిన వారిని, ఇళ్లల్లో లేని వారిని తొలగించగా, రాష్ట్రంలో రేషన్ పొందేందుకు అర్హులుగా 3.09 కోట్లుగా నిర్ధారించినట్టు పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. పది జిల్లాల్లో అత్యధిక కార్డులు పది జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులు ఎక్కువగా పంపిణీ చేయబోతున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 50,102 కొత్త రేషన్ కార్డులు రాబోతున్నాయి. ఆ తర్వాత కరీంనగర్లో 31,772 కొత్త కార్డులను ఇవ్వబోతున్నారు. కొత్త కార్డుల జారీ తర్వాత అత్యధికంగా 6,67,778 రేషన్కార్డులు ఉన్న జిల్లాగా హైదరాబాద్, అతి తక్కువ కార్డులు కలిగిన జిల్లాగా 96,982 కార్డులతో ములుగు ఉంది. 5,61,343 కార్డుదారులకు ప్రయోజనం : మంత్రి ఉత్తమ్రాష్ట్రంలో కొత్తగా 5,61343 రేషన్కార్డులు అందజేస్తున్నామని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. తద్వారా 45,34,430 మందికి ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. రాష్ట్రంలో పదేళ్ల తర్వాత ఇంత పెద్ద ఎత్తున రేషన్కార్డులు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం తమదేనని వెల్లడించారు. పాతకార్డుల్లో పేర్ల చేర్పు ద్వారా మరో 28,32,719మందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు.మొత్తంగా కార్డుల సంఖ్య 95,56,625 సన్నబియ్యం ఇచ్చేది 3,09,30,911 మందికి 13 ఏళ్ల తర్వాత కార్డు నాకు వివాహమై 13 ఏళ్లు అవుతోంది. మాకు ఇద్దరు పిల్లలు. ఇంతవరకు రేషన్ కార్డు రాలేదు. ఇరవై ముప్పై సార్లు మీసేవ కేంద్రంలో, తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాం. అయినా రాలేదు. ఈసారి దరఖాస్తు చేసుకున్నాం. ఇప్పుడు కార్డు వస్తోంది. – బూరి రేణుక, మొల్కపట్నం, నల్లగొండసంతోషంగా ఉంది చేనేత కార్మికులుగా పనిచేస్తూ జీవనం గడుపుతున్నాం. నాలుగైదేళ్లుగా కార్డు కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. గతంలోనూ అనేకసార్లు దరఖాస్తు చేసుకున్నాం. అయినా రాలేదు. ఇప్పుడు మీసేవలో దరఖాస్తు చేసుకున్నాం. కార్డు అప్రూవ్ అయ్యింది. – చెరుపల్లి నవీన, గట్టుప్పల్, నల్లగొండఇప్పటికొచ్చింది నాకు ఐదేళ్ల కిందట వివాహమైంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత ప్రభుత్వంలో రేషన్ కార్డు కోసం రెండుసార్లు దరఖాస్తు చేశా. అయినా రాలేదు. మొత్తానికి ఇప్పుడు అప్రూవ్ అయ్యింది. – బొందల విక్రం, తుమ్మల పెన్పహాడ్, సూర్యాపేట -
రాహులే ప్రధానిగా ఉంటే.. 48 గంటల్లో బీసీ రిజర్వేషన్లు!
సాక్షి, హైదరాబాద్: ‘బీసీ రిజర్వేషన్లపై మాకు చిత్తశుద్ధి లేదని కొందరు విమర్శిస్తున్నారు. చిత్తశుద్ధి లేనిది బీజేపీకి. బీసీ రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చి చట్టబద్ధత కల్పించాల్సింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు లక్ష్మణ్, ఆర్ క్రిష్ణయ్య దీన్ని సాధించాలి. మోదీ స్థానంలో రాహుల్గాంధీ ప్రధానిగా ఉండి ఉంటే 48 గంటల్లో నేను బీసీ రిజర్వేషన్లను సాధించుకు వచ్చేవాడిని. ప్రధాని మోదీని తెలంగాణకు చెందిన బీజేపీ మంత్రులు ప్రశ్నించాలి. బీజేపీ నాయకులు నిబద్ధతను చూపించాలి’అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన కోసం పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించినందుకు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఇతర నాయకులు శనివారం సీఎం రేవంత్రెడ్డిని జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో కలిసి ధన్యావాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్గౌడ్, మంత్రి కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రిజర్వేషన్ల విషయంలో తనను ప్రశ్నించే నైతిక హక్కు ప్రతిపక్షాలకు లేదని అన్నారు. బీసీల వందేళ్ల ఆకాంక్షను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిందని తెలిపారు. ‘కులగణన చేస్తామని భారత్ జోడో యాత్రలో రాహుల్గాంధీ ప్రకటించారు. ఆయన మాట మాకు శిలాశాసనం. నాయకుడు మాట ఇస్తే దాన్ని నేరవేర్చాల్సిన బాధ్యత నాది, మా పీసీసీ అధ్యక్షుడిది . ఏడాదిలో పక్కాగా కులగణన పూర్తి చేశాం. రాహుల్ గాం«దీ, మల్లికార్జున ఖర్గే తెలంగాణ మోడల్లో కులగణన చేయాలని దేశమంతా చెబుతున్నారు. కులగణనకు వ్యతిరేకమని బీజేపీ గతంలో సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చాలని జంతర్ మంతర్లో నిర్వహించిన ధర్నాకు 16 పార్టీలు మద్దతు ఇచ్చాయి. మనం తీసుకువచ్చిన ఒత్తిడికి లొంగే కేంద్రం 2026లో జరిగే జనగణనలో కులగణన చేయాలని నిర్ణయించింది. తెలంగాణ నిర్ణయం దేశాన్ని ప్రభావితం చేసింది’అని సీఎం పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తే సామాజిక బహిష్కరణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను వ్యతిరేకించేవారికి సామాజిక బహిష్కరణ శిక్ష విధించాలని సీఎం పిలుపునిచ్చారు. ‘రిజర్వేషన్ల కోసం ఇంకా ఏం చేయాలన్నా నేను సిద్ధం. అర్ధరాత్రి కూడా మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేస్తా. నెల రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి డెడ్లైన్ విధించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం కోసమే ఇంతకాలం ఈ ఎన్నికలు వాయిదా వేశాం. 50 శాతానికి మించి రిజర్వేషన్లు పెంచొద్దని గత కేసీఆర్ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టం చేసింది. ఈ చట్టం చేసినప్పుడు మంత్రులుగా బీసీలైన గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. కేసీఆర్ ఇప్పుడు వాళ్లను మాపైకి ఉసిగొల్పుతున్నారు. ఆ చట్టంలో పేర్కొన్న 50 శాతం నిబంధనను సవరిస్తూ మేం ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకువచ్చాం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తాపత్రయం పడుతున్నది నేను. నాకు తోడుగా ఉండండి. రక్షణ కవచంలా ఉండి రిజర్వేషన్లను కాపాడుకోవాలి. రిజర్వేషన్లపై ఎవరైనా కోర్టుకు వెళ్తే వాదించడానికి ఢిల్లీ నుంచి ఉద్ధండులైన న్యాయవాదులను నియమిస్తా. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కాగితం పెట్టిన వాళ్లని, కాగితం పెట్టించిన వాళ్లను సామాజిక బహిష్కరణ చేస్తామని ప్రకటించండి. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఎంపీలతో పాటు ఇండియా కూటమి ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాం. అన్ని రాష్ట్రాల్లో రిజర్వేషన్లు అమలు అయితేనే నిజమైన విజయం. 2029 ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లే ప్రధాన జెండా కావాలి’అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. -
సైబర్ నేర దర్యాప్తులో పెరగనున్న సమన్వయం
సాక్షి, హైదరాబాద్: భారత్, శ్రీలంక మధ్య చట్టాల అమలుతోపాటు సైబర్–భద్రతా రంగంలో సామర్థ్య పెంపు, దర్యాప్తులో సమన్వయం పెంచేందుకు ఐటీఈసీ (ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్) కోర్సు ఉపయోగపడుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో డిజిటల్ ఎవిడెన్స్ ఇన్వెస్టిగేషన్’అంశంపై శ్రీలంక సీనియర్ పోలీస్ అధికారులకు ఐటీఈసీ కోర్సులో శిక్షణ ఇచ్చారు. జూన్ 30 నుంచి జూలై 11 వరకు రామంతపూర్లోని సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (సీడీటీఐ)లో శిక్షణ నిర్వహించారు.ఈ కోర్సు ముగింపు సందర్భంగా శనివారం నిర్వ హించిన వాలెడిక్టరీ వేడుకకు ముఖ్యఅతిథిగా రాచకొండ పోలీసు కమిషనర్ జి.సుధీర్ బాబు, గౌరవ అతిథిగా ఉత్తరాఖండ్ హోంగార్డ్స్ డీజీ డాక్టర్ పీ.వీ.కే.ప్రసాద్ హాజరయ్యారు. సీడీటీఐ డైరెక్టర్ సల్మంతాజ్ పాటిల్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్. కార్తికేయన్ ఈ కోర్సు విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. కోర్సు కోఆర్డినేటర్, సీడీఐటీ డీఎస్పీ కేకేవీరెడ్డి కోర్సు నివేదికను సమర్పించారు.ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు మాట్లాడుతూ, శ్రీలంక పోలీసు అధికారులు ఈ కోర్సు నుంచి పొందిన జ్ఞానం వారి దేశంలో పోలీసు వ్యవస్థను మెరుగ–శ్రీలంకల మధ్య లా ఎన్ఫోర్స్మెంట్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో సామర్థ్య నిర్మాణం, సమాచార వినిమయంలో బలమైన సహకారాన్ని ఏర్పరుస్తుందని వారు పేర్కొన్నారు. ఈ కోర్సు ద్వారా అధికారుల వృత్తిపరమైన నైపుణ్యాలు మెరుగుపడడమే కాకుండా, ద్వైపాక్షిక సహకారాన్ని ప్రోత్సహించేందుకు విశ్వాసం, బలమైన బంధాలు ఏర్పడ్డాయని అభిప్రాయపడ్డారు. కోర్సులో పాల్గొన్న శ్రీలంక అధికారులకు సరి్టఫికెట్లు, స్మారక చిహ్నాల పంపిణీతో కార్యక్రమం ముగిసింది. -
ట్రిపుల్ఐటీ హైదరాబాద్ నూతన డైరెక్టర్గా సందీప్శుక్లా
రాయదుర్గం: ట్రిపుల్ఐటీ హైదరాబాద్ నూతన డైరెక్టర్గా సందీప్శుక్లా త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత డైరెక్టర్ పీజే నారాయణన్ తన స్నాతకోత్సవ ఉపన్యాసంలో మాట్లాడుతూ త్వరలో డైరెక్టర్ పదవిని వదిలి అధ్యాపకుడిగా కొనసాగుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఐఐటీ కాన్పూర్కు చెందిన సీనియర్ ప్రొఫెసర్, ఐఈఈఈఫెలో అయిన సందీప్ కె.శుక్లా ప్రముఖ సైబర్ సెక్యూరిటీ నిపుణులుగా గుర్తింపు పొందారు.అమెరికాలోని ఎస్యూఎన్వై అల్బనీ నుంచి పీహెచ్డీ పూర్తి చేశారు. ఈ సందర్భంగా సందీప్శుక్లా మాట్లాడుతూ ట్రిపుల్ఐటీ హైదరాబాద్ లాంటి అగ్రగామి సంస్థకు నూతన నాయకత్వ బా«ధ్యతలు చేపట్టే అవకాశం రావడం గర్వంగా ఉందని, ఇదొక సవాలుతో కూడిన అవకాశంగా పేర్కొన్నారు. వచ్చే నెలలో ఆయన ట్రిపుల్ఐటీ హైదరాబాద్ డైరెక్టర్గా బాధ్యతలను స్వీకరించనున్నారు. -
21 నుంచి నీట్ యూజీ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లోప్రవేశం కోసం నీట్ యూజీ– 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఆలిండియా కోటా, డీమ్డ్, సెంట్రల్ యూనివర్సిటీలు, రాష్ట్రం పరిధిలోని సీట్లలో చేరికకు సంబంధించిన కౌన్సెలింగ్ తేదీలను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) ప్రకటించింది. ఆలిండియా కోటా, డీమ్డ్ యూనివర్సిటీలు, సెంట్రల్ యూనివర్సిటీలకు మొదటి దశ కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల 21 నుంచి 30వతేదీ వరకు జరుగు తుంది. మూడు రౌండ్లలో జరిగే ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ సెప్టెంబర్ 10వ తేదీ వరకు సాగనుంది.స్టేట్ కౌన్సెలింగ్ మొ దటి దశను ఈ నెల 30 నుంచి ఆగస్టు 6వ తేదీ వరకు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 18 వరకు మూడు రౌండ్లలో ఈ కౌన్సెలింగ్ సాగనుందని ఎంసీసీ తెలిపింది. సెపె్టంబర్ 1వ తేదీ నుంచి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించింది. తెలంగాణ నుంచి నీట్ యూజీ –2025 పరీక్ష 70,259 మంది రాయగా, 43,400 మంది కౌన్సెలింగ్కు అర్హత సాధించినట్లు ఇప్పటికే కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది.రాష్ట్రంలో 9,065 ఎంబీబీఎస్ సీట్లురాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలతోపాటు డీమ్డ్ యూనివర్సిటీ, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కలిపి 64 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో 34 రాష్ట్ర ప్రభుత్వ కాలేజీలు కాగా , 26 ప్రైవేటు కాలేజీలు. మల్లారెడ్డి డ్రీమ్డ్ యూనివర్సిటీ పేరిట 2 కాలేజీలు ఉండగా, ఈఎస్ఐ, బీబీనగర్ ఎయిమ్స్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి. ఈ కళాశాలలన్నింటిలో కలిపి 9,065 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. వీటిలో 34 ప్రభుత్వ కళాశాలల్లో 4,090 సీట్లు ఉండగా, వాటిలో 15 శాతం అంటే 613 సీట్లు ఆలిండియా కోటా కిందికి వెళ్తాయి. మిగతా 3,477 సీట్లు పూర్తిగా తెలంగాణ విద్యార్థులకే దక్కుతాయి.అలాగే 26 ప్రైవేట్ కళాశాలల్లో 4,350 సీట్లు ఉన్నాయి. మల్లారెడ్డి యూనివర్సిటీకి చెందిన రెండు మెడికల్ కాలేజీలు (ఒకటి మహిళా కాలేజ్) డీమ్డ్ యూనివర్సిటీ కేటగిరీలో ఉన్నాయి. ఈ రెండు కళాశాలల్లో కలిపి 400 సీట్లు ఉండగా, డీమ్డ్ యూనివర్సిటీ విభాగంలో వీటికి కౌన్సెలింగ్ జరుగనుంది. కాగా ప్రైవేటు కాలేజీల్లోని 4,350 సీట్లలో 50 శాతం కనీ్వనర్ కోటా కింద తెలంగాణ విద్యార్థులకే దక్కుతాయి. మరో 35 శాతం సీట్లు బీ – కేటగిరీలో, 15 శాతం సీట్లు సీ కేటగిరీలో ఎన్ఆర్ఐ కోటాలో ఫీజు లు చెల్లించే స్తోమత ఉన్నవారికే కేటాయిస్తారు. ఇవి కాకుండా ఈఎస్ఐ కాలేజీలో 125 సీట్లు, బీబీనగర్ ఎయిమ్స్లోని 100 సీట్లను ఆల్ ఇండియా కోటా కింద భర్తీ చేస్తారు. -
‘ఆర్టీజన్ల’ నిరవధిక సమ్మె వాయిదా
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ భద్రత కల్పించాలని..అర్హులకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14 నుంచి చేపట్టాలని భావించిన నిరవధిక సమ్మెను వాయిదా వేస్తున్నట్టు తెలంగాణ విద్యుత్ ఆర్టీజన్ కన్వర్షన్ జేఏసీ ప్రకటించింది. ఈ మేరకు శనివారం ఆ సంఘం చైర్మన్ ఈశ్వర్రావు, కనీ్వనర్ వజీర్, కోచైర్మన్ గాంబో నాగరాజులు మింట్కాంపౌండ్లో సమ్మెను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. విద్యుత్ సంస్థల యాజమాన్యాల నుంచి సానుకూల ప్రకటన రావడం, విద్యుత్ వినియోగదారులకు ఇబ్బందులు సృష్టించొద్దనే ఆలోచనతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. ఆర్టిజన్లను కన్వర్షన్ చేయడం వల్ల ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం పడబోదన్నారు. అయితే తమ సమ్మె నోటీసులపై విద్యుత్ సంస్థల సీఎండీలు స్పందించి, ప్రభుత్వంతో మాట్లాడేందుకు 15 రోజుల సమయం కావాలని కార్మికశాఖను కోరినట్టు తెలిపారు. కార్మికశాఖ అధికారి హామీ మేరకు తాత్కాలికంగా నిరవధిక సమ్మెను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సమావేశంలో నరేందర్, లింగం, కోటి పాల్గొన్నారు. -
రాష్ట్రాల అభివృద్ధే దేశ అభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: సమాఖ్య విధానంలో కేంద్రం, రాష్ట్రాలు పరస్పరం గౌరవించుకోవాలని సీఎం రేవంత్రెడ్డి అభిప్రాయపడ్డారు. శనివారం జూబ్లీహిల్స్ నివాసంలో సీఎంను ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ ఎస్.మహేంద్రదేవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... ‘రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది.హైదరాబాద్తోపాటు పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టిసారించాం.యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం. రాష్ట్రంలో పారిశ్రామిక రంగంతో పాటు సేవ ల రంగం అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఉద్యోగులకు సముచిత అవకాశాలు కల్పిస్తేనే రాష్టానికి కంపెనీలు వస్తాయి. హైదరాబాద్ చుట్టూ రీజినల్ రింగ్ రోడ్ నిర్మిస్తాం. రీజినల్ రింగ్ రోడ్కు అనుసంధానంగా రేడియల్ రోడ్లు నిర్మిస్తున్నాం’అని వివరించారు.ఈ సందర్భంగా తెలంగాణను అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లే అంశంపై చర్చ జరిగింది. అధిక వడ్డీల కారణంగా రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతోందని, తిరిగి చెల్లింపులు కష్టం అవుతోందని సీఎం తెలిపారు. వడ్డీలు చెల్లించడం కోసమే రాష్ట్ర ఆదాయం ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా పాల్గొన్నారు. -
సృజనాత్మకతతోనే ఉన్నత శిఖరాలకు..
సాక్షి, హైదరాబాద్: న్యాయవాద వృత్తిలో నైపుణ్యంతోపాటు సృజనాత్మకత అవసరమని, అవి పాటించినవారే ఉన్నత శిఖరాలకు చేరుకోగలుగుతారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ అన్నారు. వర్ణ వివక్ష, సామాజిక వివక్షపై పోరాడిన న్యాయవాదుల వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలని యువ న్యాయవాదులకు పిలుపునిచ్చారు. న్యాయవాద వృత్తిలో అడ్డంకులుంటాయని, వాటిని అధిగమించి ముందుకు సాగాలని సూచించారు.న్యాయవ్యవస్థలో విశ్వాసం, నిబద్ధత, ప్రజా సేవకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. హైదరాబాద్ షామీర్పేటలోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో 22వ స్నాతకోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జస్టిస్ బీఆర్ గవాయ్, గౌరవ అతిథిగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ, నల్సార్ చాన్స్లర్, రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్పాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సీజేఐ పలుసూచనలు, సలహాలు ఇచ్చారు.విదేశీ విద్యపై మోజు వద్దు..‘నల్సార్ అంటే విద్యా నైపుణ్యం మాత్రమే కాదు.. చట్ట విలువల పట్ల దాని లోతైన నిబద్ధత. దేశంలో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు ఇతర సంస్థల కంటే మెరుగ్గా ప్రమాణాలు పాటిస్తున్నాయి. కొత్త ప్రపంచం, సాంకేతిక పరిణామాలకు ప్రతిస్పందనగా వృత్తి అభివృద్ధి చెందుతున్నా.. ఇంకా బలమైన పునాదులు అవసరం. సహచరుల ఒత్తిడి కారణంగా విదేశీ విద్యపై మోజు పెంచుకోవద్దు. అంతర్జాతీయ అర్హతతోనే ఎదుగుదల సాధ్యమన్నది అవాస్తవం.దేశంలో నాణ్యమైన విద్యకు కొదవలేదు. కొందరు ఆర్థిక భారమైనా విదేశాలకు వెళ్లాలని భావించడం సరికాదు. అది ఆ కుటుంబాలను అప్పుల్లో మునిగేలా చేస్తుంది. ఎల్ఎల్బీతోనే ఆగిపోకుండా ఎల్ఎల్ఎం సహా ఉన్నత చదువులపై దృష్టి సారించాలి. కోర్టు, కక్షిదారుల ముందు న్యాయవాదులు తమను తాము నిరూపించుకునేందుకు నిరంతరం కష్టపడాలి. న్యాయస్థానం ఇచ్చే తీర్పులపై అవగాహన పెంపొందించుకోవాలి. అప్పుడే సమర్థవంతమైన న్యాయవాదిగా నిలబడగలుగుతారు’ అని సూచించారు.విద్యార్థులకు బంగారు పతకాలు అందజేస్తున్న సుప్రీంకోర్టు సీజే గవాయ్, జస్టిస్ పీఎస్.నరసింహ, హైకోర్టు సీజే జస్టిస్ సుజయ్పాల్, సీఎం రేవంత్రెడ్డి నిబద్ధతతో ముందుకు సాగాలి..విద్యా నైపుణ్యం, రాజ్యాంగ విలువలు, సమ్మిళిత వృద్ధికి నల్సార్ కట్టుబడి ఉందని వర్సిటీ వీసీ శ్రీకృష్ణదేవరావు అన్నారు. ఎస్సీ, ఎస్టీ (అత్యాచార నిరోధక) చట్టం కింద ప్రత్యేక కోర్టుల ఆధునీకరణపై కేంద్రంతో కలిసి పని చేశామని చెప్పారు. డిగ్రీలు అందుకుని వెళ్తున్న విద్యార్థులు నిబద్ధతతో ముందుకు సాగాలని సూచించారు. ఈ సందర్భంగా డిగ్రీలు పూర్తి చేసుకున్న పీహెచ్డీ, ఎల్ఎల్ఎం, ఎంబీఏ, ఎంఏ (పన్ను చట్టాలు), ఎంఏ (క్రిమినల్ జస్టిస్ మేనేజ్మెంట్), బీఏ ఎల్ఎల్బీ(హానర్స్), బీబీఏ (హానర్స్), బీబీఏ, పీజీ డిప్లొమా ప్రోగ్రామ్ విద్యార్థులకు పట్టాలను అందజేశారు.ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జస్టిస్ బీఆర్ గవాయ్, రేవంత్రెడ్డి పసిడి పతకాలు ప్రదానం చేశారు. అత్యధికంగా ఇషికా గార్గ్ 8, ఖండేకర్ సుకృత్ శైలేంద్ర 7, అర్చిత సతీశ్ 6 పతకాలు సాధించారు. రెండు వీసీ మెడల్స్తో కలిపి మొత్తం 58 బంగారు పతాకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శామ్కోషి, జస్టిస్ వినోద్కుమార్, జస్టిస్ విజయ్సేన్రెడ్డి, జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి, బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ.నరసింహారెడ్డి, అడ్వొకేట్ జనరల్ ఏ.సుదర్శన్రెడ్డి, వర్సిటీ రిజి్రస్టార్ కె. విద్యుల్లతారెడ్డి, కేంద్ర సామాజిక న్యాయ సాధికారిత శాఖ కార్యదర్శి అమిత్ యాదవ్ (ఐఏఎస్) తదితరులు పాల్గొన్నారు. స్నాతకోత్సవం సందర్భంగా సీజేఐతో సీఎం రేవంత్రెడ్డి మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు.ఏఐతో సత్వర న్యాయం సాధ్యమే..‘ఏటా న్యాయవాద విద్యలోకి వచ్చే వారు పెరుగుతున్నారు. అయితే, వృత్తిలో నైపుణ్యం పెంచుకున్నవారే ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు. దేశానికి ఉత్తమ న్యాయవాదుల అవసరం ఎంతో ఉంది. మనదేశం ఎదుర్కొంటున్న చట్టపరమైన సవాళ్లకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. న్యాయవ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను వినియోగించాల్సిన సమయం ఆసన్నమైంది. సరై న పద్ధతిలో ఉపయోగిస్తే సత్వర న్యాయం అందించేందుకు దోహదం చేస్తుంది. స్నేహితులు, కుటుంబం, పుస్తకాలు, అభిరుచులు, ఆరోగ్యం, ఊహ.. ఈ ఐదు అంశాలు ఎప్పు డూ చెక్కుచెదరకుండా చూసుకోవాలి’అని ఉద్బోధించారు. -
రైతునేస్తం–2025 పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: రైతు నేస్తం(Rythunestam) పురస్కారాలకు వ్యవసాయ, అనుబంధ రంగాల శాస్త్రవేత్తలు, విస్తరణ అధికారులు, అగ్రి ఇన్నొవేషన్స్, రైతు ల నుంచి రైతు నేస్తం మాసపత్రిక దరఖాస్తులకు ఆహా్వనించింది. ఆగస్టు 31లోగా దరఖాస్తు చేసుకోవాలని శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. సెప్టెంబర్లో రైతునేస్తం 21వ వార్షికోత్సవం సందర్భంగా సుప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త ఐ.వి.సుబ్బారావు పేరిట వ్యవసాయ, అనుబంధ రంగాల్లో విశేష సేవ లందిస్తున్న శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు, విస్తరణ అధికారులతోపాటు అగ్రి ఇన్నొవే షన్స్ను అవార్డులతో ఘనంగా సత్కరించనుందని నేస్తం ఫౌండేషన్ చైర్మన్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు తెలిపారు.రైతునేస్తం వెబ్సైట్ https://rythunestham.in/awards నుంచి అప్లికేషన్ ఫారాన్ని డౌన్లోడ్ చేసుకుని, వారి పరిశోధనా వ్యాసాలను, సాగు అనుభవాలను జతపరచి ‘ఎడిటర్, రైతునేస్తం, 6–2–959, దక్షిణ భారత హిందీ ప్రచార సభ కాంప్లెక్స్, ఖైరతాబాద్, హైదరాబాద్–500004, ఫోన్: 9676797777 (లేదా) ‘రైతునేస్తం’, డో.నెం.8–198, పుల్లడిగుంట దగ్గర, కొర్నెపాడు పోస్టు, వట్టిచెరుకూరు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్–522 017, ఫోన్: 97053 83666 చిరునామాలకు పంపాలని సూచించారు. లేదంటే editor@rythunestham. in కు ఇ–మెయిల్ చేయవచ్చని, రెండు తెలుగు రాష్ట్రాలకు చెందినవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులేనని తెలిపారు. -
పారిపోయి రైలెక్కేస్తున్నారు!
ఈస్ట్కోస్ట్ ఎక్స్ప్రెస్ విజయవాడ స్టేషన్లో ఆగింది. అక్కడ 26 మంది చిన్నారులతో ఎనిమిది మంది వ్యక్తులు రైలెక్కారు. వారు సికింద్రాబాద్లో దిగాల్సి ఉంది. సాధారణంగా రైలెక్కినప్పుడు చిన్నారుల్లో ఓ సంబరం కనిపిస్తుంది, కిటికీల్లోంచి చూస్తూ కేరింతలు కొట్టడం సహజం. కానీ, ఈ చిన్నారుల్లో ఎక్కడా చలాకీతనం లేదు, దిగాలుగా కూర్చున్నారు. ఇది గమనించిన ఓ ప్రయాణికుడు విషయాన్ని రైల్వే అధికారులకు చెప్పాడు. రైలు సికింద్రాబాద్లో ఆగగానే, రైల్వే భద్రతా దళ సిబ్బంది కోచ్లోకి వచ్చి వారందరినీ అదుపులోకి తీసుకుంది. ఆరా తీస్తే.. ఆ 26 మందిని హైదరాబాద్ శివారులోని పరిశ్రమల్లో బాలకార్మికులుగా వెట్టి చేయించేందుకు తరలిస్తున్నట్టు తేలింది. పిల్లలను తరలిస్తున్న వారిని అరెస్టు చేసి.. ఆ బాలలకు స్వేచ్ఛ కల్పించారు. - సాక్షి, హైదరాబాద్ముంబై వెళ్లే రైలు జనరల్ కోచ్ ఎక్కిన ఇద్దరు 13 ఏళ్ల బాలికలు, రాత్రి వేళ స్లీపర్ కోచ్లోకి చేరుకున్నారు. వారి వద్ద అన్ రిజర్వ్డ్ టికెట్లు మాత్రమే ఉండటంతో టీసీ నిలదీశాడు. పొంతనలేని సమాధానం చెప్పటంతో ఆర్పీఎఫ్ సిబ్బందికి ఆయన సమాచారమిచ్చాడు. వారు బాలికలను అదుపులోకి తీసుకుని విచారిస్తే, చదవడం ఇష్టం లేక ఇంటి నుంచి పారిపోయినట్టు వెల్లడించారు. దీంతో వారికి కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.బడికి వెళ్లటం ఇష్టం లేక కొందరు.. తల్లిదండ్రుల మధ్య తరచూ జరిగే గొడవలతో విసిగిపోయి మరికొందరు.. సినిమాల్లో నటించాలని ఇంకొందరు.. కిడ్నాప్నకు గురై మరికొందరు.. ఇలా అనేక కారణాలతో తరచూ రైళ్లలో అనుమానాస్పదంగా ప్రయాణిస్తు్తన్న బాలలను రైల్వే రక్షక దళం సిబ్బంది కాపాడుతున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గత రెండున్నరేళ్లలో 3,433 మంది ఇలాంటి చిన్నారులను రక్షించారు. ఇది పెద్ద సంఖ్య కావటంతో మరింత అప్రమత్తంగా ఉండేందుకు రైల్వే శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. సిబ్బందికి మెరుగైన శిక్షణ ఇస్తోంది.రైళ్లెక్కేస్తున్నారుఇళ్ల నుంచి పారిపోయే చిన్నారుల్లో అత్యధికులు రైళ్లనే ఆశ్రయిస్తున్నారు. రోడ్డు మార్గాన వెళ్తే పోలీసు తనిఖీలు ఉంటాయన్న ఉద్దేశంతో, పిల్లలను అక్రమంగా రవాణా చేసే ముఠాలు కూడా రైళ్లనే ఎక్కువగా ఆశ్రయిస్తున్నాయి. వీరిని గుర్తించేందుకు ఇప్పుడు రైల్వే రక్షక దళం (ఆర్పీఎఫ్), ప్రభుత్వ రైల్వే పోలీసు (జీఆర్పీ) సిబ్బంది మరింత కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నారు. సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, తిరుపతి, విజయవాడ, నాందేడ్ డివిజన్హెడ్క్వార్టర్స్లో ప్రత్యేకంగా చైల్డ్ హెల్ప్ డెస్్కలు ఏర్పాటు చేశారు.ఇళ్లనుంచి పారిపోయి రైలెక్కుతున్న చిన్నారులు, అక్రమ రవాణాలో భాగంగా తరలిస్తున్న పిల్లలను గుర్తించి రక్షించటమే ఈ డెస్క్ల పని. రైల్వే స్టేషన్లలో నిఘా ఉంచడం, సంబంధిత విభాగాలతో సమన్వయం చేయడం, కోచ్లూ స్టేషన్లలో గుర్తించిన పిల్లలకు తక్షణ సంరక్షణ క ల్పించటం, ప్రజలలో అవగాహన క ల్పించడం ద్వారా ఈ డెస్్కలు అలాంటి చిన్నారులు ఆపదల్లో చిక్కుకోకుండా చూడగలుగుతున్నాయి. ఈ పిల్లలను గుర్తించేందుకు రైల్వే స్టేషన్లలో సీసీటీవీ కెమెరాల సంఖ్య కూడా పెంచుతున్నారు.ప్రత్యేక కార్యక్రమాలురైల్వే భద్రతా విభాగం ‘ఆపరేషన్ నన్హే ఫరిõÙ్త’, ‘ఆపరేషన్ – యాక్షన్ అగైనస్ట్ హ్యూమన్ ట్రాఫికింగ్’వంటి ప్రత్యేక కార్యక్రమాలను ప్రారంభించింది. ఒంటరిగా రైళ్లలో సంచరించే చిన్నారులు, బలవంతంగా వారిని తరలించేవారిని గుర్తించి వివరాలు వాకబు చేసి ప్రమాదంలో ఉన్న చిన్నారులను రక్షించి తిరిగి ఇళ్లకు తరలిస్తున్నారు. ఇళ్లకు వెళ్లేందుకు నిరాకరించే వారిని సంరక్షణ కేంద్రాలకు తరలిస్తున్నారు. చిన్నారుల అక్రమ రవాణాకు పాల్పడేవారిపై చట్టపరమైన చర్యలకుగాను పోలీసులకు అప్పగిస్తున్నారు. ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా పనిచేసే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, రైల్వే పోలీసులకు ఇప్పుడు ఇలాంటి చిన్నారులను గుర్తించి కాపాడే విషయంలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ‘బచ్పన్ బచావో ఆందోళ¯న్’అనే సంస్థతో కలిసి జోనల్ స్థాయిలో సిబ్బందికి శిక్షణ అందిస్తున్నారు. ఇవి సత్ఫలితాలనిస్తున్నాయి.దేశవ్యాప్తంగా 16వేల మంది⇒ 2024 నుంచి ఈ ఏడాది జూన్ వరకు దేశవ్యాప్తంగా రైల్వే శాఖ 16వేల మంది చిన్నారులను కాపాడింది. వీరిలో 3,000 మంది అమ్మాయిలే. నన్హే ఫరిõÙ్త కార్యక్రమం ద్వారా ఒక్క 2024లోనే 10వేలకుపైగా కుర్రాళ్లను కాపాడారు. ఈ ఏడాది జూన్ వరకు 6వేలకుపైగా చిన్నారులను సురక్షితంగా వెనక్కు తీసుకొచ్చారు.⇒ రైల్వే కోచ్లు, స్టేషన్లలో అనుమానాస్పదంగా తిరిగే చిన్నారులు; ఆందోళనగా కనిపించే పిల్లలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు @RailMinIndia, @SCRailwayIndia, @Gmscrailway తదితర ఎక్స్ హ్యాండిల్స్లో కూడా పోస్ట్ చేయవచ్చు.139కి సమాచారమివ్వండి‘ఇళ్ల నుంచి పారిపోయే చిన్నారులు, చైల్డ్ ట్రాఫికింగ్కు బలయ్యే బాలలను రక్షించే సామాజిక బాధ్యతతో రైల్వే శాఖ ప్రత్యేక చొరవ చూపుతోంది. ఈ విషయంలో ఎన్నో అద్భుత విజయాలు సాధించి వేలాది బాధిత చిన్నారులను రక్షించి తల్లిదండ్రుల చెంతకు చేర్చింది. రైల్వే చొరవకు ప్రజల సహకారం తోడైతే మరింత మందిని రక్షించవచ్చు. రైలు ప్రయాణికులు పరిసరాలను గమనిస్తూ అనుమానం ఉన్న చిన్నారుల విషయాన్ని 139 ద్వారా గాని, రైలు మద్దతు పోర్టల్ ద్వారా గాని సమాచారం అందిస్తే రైల్వే సిబ్బంది వెంటనే స్పందిస్తారు’. – ఎ.శ్రీధర్, దక్షిణ మధ్య రైల్వే ప్రధాన పౌర సంబంధాల అధికారి -
హైదరాబాద్లో కల్లు కాంపౌండ్లపై ఆకస్మిక దాడులు
సాక్షి, హైదరాబాద్: నగరంలో కల్లు కాంపౌండ్లపై ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మూడు బృందాలుగా ఏర్పడి వేర్వేరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. అనుమతి లేకుండా నడిపిస్తున్న కల్లు దుకాణాలపై ఎక్సైజ్ పోలీసులు నాజర్ పెట్టారు. కల్తీ కల్లు ఘటనలపై తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు అప్రమత్తం అయ్యారు.శేరిలింగంపల్లి సిద్ధిక్ నగర్లో కల్లు కాంపౌండ్పై దాడులు చేసిన ఎక్సైజ్ పోలీసులు.. అనుమతి లేకుండా కల్లు కాంపౌండ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. కల్లు కాంపౌండ్ సీజ్ చేయడంతో పాటు దుకాణ యజమానిపై కేసు నమోదు చేశారు. మూసాపేట్, బాలానగర్, కైతలాపూర్ ప్రాంతాల్లో కల్లు కాంపౌండ్లలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు నిర్వహించి కల్లు కాంపౌండ్లో ఉన్న పలు శాంపిల్స్ సేకరించారు. ముషీరాబాద్లో మూడు, కాచిగూడలో రెండు కల్లు డిపోలపై ఎక్సైజ్ తనిఖీలు చేపట్టారు.కల్లు కాంపౌండ్లలో సేకరించిన శాంపిల్స్ను ల్యాబ్కు పంపించిన ఎక్సైజ్ అధికారులు.. తనిఖీల సమయంలో కల్లు కాంపౌండ్ నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేశారు. డిపోల నుంచి వచ్చే కల్లును మాత్రమే స్టోరేజ్ చేసి విక్రయించాలన్నారు. కల్లులో ఎలాంటివి కలిపిన చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అల్ప్రోజలం లాంటివి మత్తు కోసం కలిపితే నేరమన్న పోలీసులు.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదన్నారు. ఒక్కసారి ఇలాంటివి చేసి పట్టుపడితే పర్మినెంట్గా లైసెన్స్ రద్దు చేస్తామని ఎక్సైజ్ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. -
నిజంగా ఇది హాస్టలే.. నమ్మండి బాబూ!
ఆదిలాబాద్ జిల్లా మావల మండల కేంద్రంలోని ఈ భవనంలో జైనథ్ మండలానికి చెందిన మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలుర వసతిగృహాన్ని నిర్వహిస్తున్నారు. పదేళ్లుగా అద్దె భవనంలో కొనసాగుతోంది. ఈ పాఠశాలలో 600 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. భవనం శిథిలమై అసౌకర్యంగా మారడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. భవనానికి కిటికీలు సైతం లేకపోవడంతో.. ఇటీవలి వర్షాలకు నీరు లోపలకు రాకుండా గోనె సంచులు, చద్దర్లు, అట్టముక్కలు కడుతున్నారు. వర్షాకాలం కావడంతో పురుగు, పుట్రతో భయంభయంగా కాలం వెళ్లదీస్తున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్మక్క బుట్టలకు మస్తు గిరాకీ నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామం పచ్చి మక్క బుట్టలకు చిరునామాగా నిలిచింది. చేతికి వచ్చిన బుట్టలను డజన్ రూ.80 చొప్పున విక్రయిస్తున్నారు. ఆటో ట్రాలీ మక్క బుట్టల ధర రూ.8 వేల నుంచి రూ.9 వేల వరకు పలుకుతోంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల్, కరీంనగర్, మంచిర్యాల్, మహారాష్ట్ర, చుట్టు పక్కల ప్రాంతాల వ్యాపారులు మక్కబుట్టలను కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. అంకాపూర్ మార్కెట్ శుక్రవారం పచ్చి మక్క బుట్ట విక్రయాలతో సందడిగా మారింది. సీజన్లో ఉదయం 5 గంటల నుంచి.. ఉదయం 9 గంటల వరకు హోల్సేల్ వ్యాపారం సాగుతోంది. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్చదవండి: మేకల కల్యాణి.. నీకు హ్యాట్సాఫ్ -
‘కవిత ఏ పార్టీ అన్నది అర్ధం కావడం లేదు’
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ చరిత్రాత్మక నిర్ణయమని పీసీసీ చీప్ మహేష్ కుమార్ గౌడ్ మరోసారి స్పష్టం చేశారు. దేశ చరిత్రలో 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు. సామాజిక విప్లవానికి నాంది పలికిన ఈ సందర్భంలో తాను టీపీసీసీ అధ్యక్షుడిగా ఉండటం జీవితంలో తాను చేసుకున్న అదృష్టమని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.బీసీ రిజర్వేషన్ల పట్ల తమకు కితాబు ఇవ్వకపోయినా పరవాలేదు కానీ కనీసం హర్షించే స్థితిలో లేకపోవడం దౌర్బగ్యమని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ తీసుకొచ్చిన అన్ని బిల్లులకు బీఆర్ఎస్ వారి హయాంలో మద్దతు ప్రకటించిందన్నారు. బీసీల పట్ల బీఆర్ఎస్కు చిత్తశుద్ధి లేదని విమర్శించారు మహేష్ కుమార్ గౌడ్. ఆనాడు వర్కింగ్ ప్రెసిడెంట్గా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకటించానని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకే కట్టుబడి ఉందని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.కవిత ఏ పార్టీ అన్నది అర్ధం కావడం లేదుప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఏ పార్టీలో ఉందనే విషయం అర్థం కావడం లేదని సెటైర్లు వేశారు మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్లో దెయ్యాలు ఉన్నాయా? లేదా?, దెయ్యాల పీడ వదిలిందా?, కవిత ఎందుకు స్పందించడం లేదు? అని టీపీసీసీ ప్రెసిడెంట్ ప్రశ్నించారు. కవిత బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు రాజీనామా చేయడం లేదని నిలదీశారు. బీసీ రిజర్వేషన్లపై కవిత సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. -
‘కాంగ్రెస్ కుట్ర.. బిల్లు పెండింగ్లో ఉంటే గవర్నర్ ఆమోదిస్తారా?
సాక్షి, ఢిల్లీ: బీసీల విషయంలో కాంగ్రెస్ , బీఆర్ఎస్ ద్వంద్వవైఖరితో వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. కాంగ్రెస్ పంపిన బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉంది అది తేలకముందే ఆర్డినెన్స్ తీసుకురావడంలో మతలబు ఏమిటి? అని ప్రశ్నించారు. కేంద్రం మీద నిందలు వేసేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘బీసీలను తమ ప్రయోజనాల కోసం రాజకీయ అస్త్రాలుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ వాడుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి వద్దకు బిల్లు పంపి చేతులు దులుపుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల కోసం మంత్రివర్గ తీర్మానం చేయడం బీసీలను వంచించడమే. షెడ్యూల్-9లో పొందుపరిస్తేనే రిజర్వేషన్లకు రక్షణ ఉంటుంది. మీరు పంపిన బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉంది. అది తేలకముందే ఆర్డినెన్స్ తీసుకురావడంలో మతలబు ఏమిటి?. రాష్ట్రపతి వద్ద పెండింగ్లో బిల్లు ఉంటే గవర్నర్ ఆమోదిస్తారా?. ఒకవేళ ఆమోదించిన కోర్టులలో నిలబడతాయా?.కాంగ్రెస్ పార్టీ చేసిన కుల సర్వే తప్పులతడకగా ఉంది. కేంద్రం మీద నిందలు వేసేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంగిత జ్ఞానం లేకుండా వ్యవహరిస్తుంది. బుర్ర వెంకటేశం నేతృత్వంలోని డెడికేటెడ్ కమిషన్ గణాంకాలు ఎందుకు బయట పెట్టడం లేదు?. ఎంతమంది బీసీలు ఉన్నారనే లెక్క ముఖ్యం కాదు. బీసీ కులాల్లో ఎంతమందికి రాజకీయ ప్రాతినిధ్యం దక్కిందో చెప్పాలి. ఈ వివరాలను దాచిపెట్టడం బీసీలను మోసం చేయడమే అవుతుంది.వికాస్ కిషన్ వర్సెస్ మహారాష్ట్ర కేసులో రిజర్వేషన్లు కల్పించడం రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయితే దీనికి ట్రిపుల్ టెస్ట్ అవసరమని సుప్రీం వెల్లడించింది. 50% రిజర్వేషన్లకు మించి వద్దని సుప్రీంకోర్టు చెబుతోంది. దాన్ని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలి. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ తగ్గించి వారికి అన్యాయం చేసింది. కామారెడ్డి డిక్లరేషన్లు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామన్న హామీ ఏమైంది? అని ప్రశ్నించారు. -
విచిత్ర ఘటన.. ఈ మృతదేహం నా భర్తది కాదు..!
హన్మకొండ: ‘రోడ్డు ప్రమాదంలో నీ భర్త మృతిచెందాడ’ని పోలీసులు సమాచారం అందించడంతో వరంగల్ ఎంజీఎంకు వెళ్లిన కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మృతదేహాన్ని తీసుకెళ్లి దహన సంస్కారాలు చేసే క్రమంలో మృతదేహం తమవారిది కాదని గుర్తించి.. తిరిగి ఎంజీఎం ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఈ విచిత్ర ఘటన శుక్రవారం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మైలారం గ్రామానికి చెందిన గోక కుమారస్వామి( 55), రమకు ముప్పయి ఏళ్లక్రితం వివాహమైంది. వారికి ఒక కూతురు. ఇరవై ఏళ్ల క్రితం కుమారస్వామి మతిస్థిమితం కోల్పోగా అప్పటినుంచి రమ వేరుగా ఉంటున్నారు. అతను మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణకేంద్రంలో యాచిస్తూ జీవిస్తున్నాడు. తొర్రూరులో ఈనెల 09వ తేదీన రోడ్డుపక్కన అపస్మారకస్థితిలో పడి ఉండగా స్థానికులు, పోలీసుల సాయంతో అంబులెన్స్లో ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ మరుసటి రోజు గురువారం మృతిచెందాడు. ఈ క్రమంలో ఎంజీఎంనుంచి పోలీసులు ‘నీ భర్త చనిపోయాడని’ మైలారానికి చెందిన గోక రమకు సమాచారం అందించారు. ఆస్పత్రికి వెళ్లిన రమ, కుటుంబ సభ్యులకు మార్చురీనుంచి చాపతో చుట్టిన మృతదేహాన్ని అప్పగించారు. మృతదేహాన్ని అంబులెన్స్లో నేరుగా మైలారంలోని దహనసంస్కారాలు చేసే స్థలానికి తీసుకొచ్చారు. కిందికి దించి చాప విప్పిచూడగా కుమార్తె స్వప్న ఆ మృతదేహాన్ని చూడగా తన తండ్రి చేతిపై శ్రీ అనే పచ్చబొట్టు ఉంటుందని, ఈ మృతదేహానికి పచ్చబొట్టు లేదని, తమ నాన్న కాదని తేల్చిచెప్పింది. భార్య, బంధువులు సైతం చూసి తమవారిది కాదని చెప్పడంతో తిరిగి మృతదేహాన్ని అదే అంబులెన్స్లో ఎంజీఎంకు తరలించారు. రమ తన భర్తను చాలా ఏళ్లుగా చూడకపోవడం.. చాపలో చుట్టి ఇవ్వడం వల్ల గుర్తించలేకపోయినట్లు కొందరు అంటున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కాగా, ఆ మృతదేహం ఎవరిది అన్నది గుర్తించాల్సి ఉంది. పోలీసుల వినతి మేరకే..ఎంజీఎం : ఈ నెల 9వ తేదీన అపస్మారకస్థితిలో ఉన్న ఓ వ్యక్తిని ఎంజీఎంకు తీసుకువచ్చారని, చికిత్స పొందుతూ గురువారం మృతిచెందినట్లు ఎంజీఎం ఆర్ఎంఓ శశికుమార్ తెలిపారు. కాగా, సద రు వ్యక్తి మృతదేహం రాయపర్తి మండలం మైలా రం గ్రామానికి చెందిన కుమారస్వామిగా పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. పోస్టుమార్టం లేకుండా అప్పగించాలనే పోలీసుల వినతి మేరకు ఆ మృతదేహాన్ని భార్య, బంధువుల అంగీకారం మేరకు అప్పగించినట్లు ఆర్ఎంఓ తెలిపారు. మృతదేహాన్ని ఇంటికి తీ సుకెళ్లిన కుటుంబ సభ్యులు తమది కాదని పేర్కొని తిరిగి ఎంజీఎం మార్చరీకి తరలించినట్లు వెల్లడించారు. -
Ranu Bombai Ki Ranu: ఈ పాట దేశంలోనే కాదు ఇతర దేశాల్లోనూ..
రేపల్లె మళ్లీ మురళి విన్నది.. ఆ పల్లె కళే పలుకుతున్నది.. ఆ జానపదం ఘల్లుమన్నది.. ఆ జాణ జతై అల్లుకున్నది.. అని రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అన్నట్లు.. గత కొంత కాలంగా తెలుగు ఫోక్ సాంగ్స్ సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. తెలుగు జానపదాలు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్లో ఉన్నాయి. ఒకప్పుడు సినిమా పాటలు వైరల్గా మారేవి.. కానీ ప్రస్తుతం మన జానపద పాటలు వైరల్గా మారి సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తున్నాయి. అంతేకాకుండా.. స్థానికంగానే కాకుండా దేశంలోని ఇతర నగరాల్లో సైతం ప్రముఖ కార్యక్రమాల్లో తెలుగు ఫోక్ సాంగ్స్ హైలైట్గా నిలుస్తున్నాయి. క్రికెట్ మ్యాచ్లు మొదలు మిస్ వరల్డ్ పోటీలను సైతం తెలుగు ఫోక్సాంగ్స్ అలరించాయి. సోషల్ మీడియాలో సైతం వైరల్గా మారడంతో ఈ పాటలకు మానిటైజేషన్ ఎక్కువగా జరిగి ప్రైవేట్ ఆల్బమ్స్కు సైతం లక్షల్లో రెమ్యూనరేషన్ వస్తుండటం విశేషం. అనాదిగా తెలుగు జానపద పాటలకున్న విశిష్టత, ప్రశస్తి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సంప్రదాయ ప్రైవేట్ ఆల్బమ్లతో యువత గుండెల్లో ఒక నిర్దిష్ట స్థానం ఏర్పరుచుకున్నాయి. అయితే ఈ మధ్య ఓ మెట్టు ఎగబాకి సినిమా పాటలను సైతం దాటి వైరల్గా మారుతుండడం విశేషం. ఎంతలా అంటే ఒక పాటకు 40, 50 లక్షల ఆదాయం సంపాదించేంతలా..!! ఈ పాటలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, ఎక్కువ వ్యూయర్ప్తో రెమ్యూనరేషన్ లభించడం ఈ తరం యువతకు కలిసొచి్చంది. ఇందులో భాగంగానే సినిమా పాటల మాదిరిగానే సెట్లు వేసి మరీ ప్రైవేటు ఆల్బమ్స్ షూట్ చేస్తున్నారు. ఊర్లో పెళ్లి బరాత్లు, పండుగలు, పబ్బాల్లో అలరించే ఈ పాటలు కొత్త రంగులు అద్దుకున్నాయి. యూట్యూబ్తో పాటు ఇన్స్టా, ఫేస్బుక్లో ఈ పాటలు, పాటల రీల్స్ సందడి చేస్తూ ఆదాయ మార్గాలుగా మారుతున్నాయి. వైరల్గా మారిన ఈ ఫోక్ సాంగ్స్లో నటించిన నటీనటులు, సింగర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు ప్రస్తుతం సోషల్ సెలబ్రెటీలుగా మారుతున్నారు. గతంలో ఇదే దారిలో వచ్చి సినిమా అవకాశాలు పొందిన మంగ్లీ, రామ్ మిర్యాల గురించి విధితమే. కానీ ఈ తరం ఫోక్ ఆరి్టస్టులు సినిమాలతో పాటు ప్రైవేటు ఆల్బమ్స్తోనే మంచి ఆదాయాలను పొందటం విశేషం. ఒకప్రైవేటు ఆల్బమ్తో కోటి రూపాయలకు పైగా వ్యూయర్షిప్ రెమ్యునరేషన్ పొందిన తెలుగు పాటలున్నాయి. ఇది ఈ తరం ఔత్సాహికులకు కళతో పాటు ఆదాయమార్గాలను చేరువ చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో వైరల్ అయినవి.. కాపోల్లింటికాడ..: 2023లో విడుదలైన ఈ పాట రీల్స్లో, ఫేస్బుక్, యూట్యూబ్లో సూపర్ హిట్ అనే చెప్పాలి. ఈ పాట ఇన్స్టా కవర్స్, డ్యాన్స్ ఛాలెంజ్లకు కారణమైంది. సిటీలో ఈ ట్రెండింగ్ కల్చర్కు కారణమైనవాటిలో ఈ సాంగ్ కూడా ఒకటి. ఓ పిలగ వెంకటి..: 2024లో విడుదలైన ఈ పాట యూట్యూబ్, ఇన్స్టా రీల్స్లో హాట్ ట్రెండ్ అయ్యింది. ఈ పాటలోని బీట్, లిరిక్స్ యువతతో పాటు అన్ని వర్గాల వారినీ ఆకర్షించింది. ఈ పాటతో వేల సంఖ్యలో రీల్స్ సోషల్ మీడియాను నింపేశాయి. కమలాపూరం రోడ్డాట..: మార్చి 2025లో విడుదలైన ఈ ఫోక్ జోక్ ట్యూన్ ఈ మధ్య కాలంలో ఇన్స్టా రీల్స్, రీమిక్స్ వీడియోల్లో సంచలనంగా మారింది. ఇందులోని గ్రామీణ సన్నివేశాలు, బీట్ మాధ్యంలోని హుక్లతో ఈ పాట క్రియేటర్లు, డీజే వర్క్షాప్లలో హైలైట్గా నిలిచింది. రాను బొంబైకి రాను..: అద్దాల మేడలున్నవే అంటూ మొదలయ్యే ఈ పాట.. రాను ముంబైకి రాను అంటూ ఈ ఏడాది ట్రెండింగ్ సాంగ్గా మారింది. ఈ పాట దేశంలోనే కాదు ఇతర దేశాల్లోనూ, బాలివుడ్ షోలలోనూ వైరల్గా మారింది. లైఫ్స్టైల్.. సోషల్ స్ట్రీమింగ్.. ఈ పాటలు గతంలో టిక్టాక్, ప్రస్తుతం యూట్యూబ్, క్యాప్కట్, ఇన్స్టాల్లో వైరల్గా మారుతున్నాయి. కొన్ని పాటలకు బ్రాండెడ్ వీడియో అలాగే లైవ్ ఈవెంట్ల ద్వారా ఆదాయం వస్తోంది. ఒక్క పాటతో పార్ట్ టైమ్ సెలబ్రిటీగా మారిన క్రియేటర్లు ఎందరో. ఈ ప్రభావంతో గ్రామీణ ఆవిష్కరణలుగా ప్రైవేట్ ఆల్బమ్స్ నిలుస్తున్నాయి. వీటికి సహకార వేదికలు, స్టేజ్ షోస్, వెబ్స్ట్రీమ్స్ ద్వారా ఆరి్టస్టులు దేశ–అంతర్జాతీయ స్థాయిలకు వెళ్లే అవకాశాలు పెరుగుతున్నాయి. హైబ్రిడ్ ఫ్యూజన్తో ఫోక్ + ఎలక్ట్రో బ్యాండ్లుగా అవతరిస్తున్నాయి. తెలుగు ఫోక్ సాంగ్స్ తాజాగా దేశవ్యాప్తంగా లైఫ్స్టైల్ ఈవెంట్స్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. క్రికెట్ మ్యాచ్లు, బాలీవుడ్ షోలు, మిస్ వరల్డ్ వేదికలపై ఫోక్ ఘనంగా ఆవిష్కృతమవుతోంది. ఈ ఆదరణ దృష్ట్యా రవితేజ వంటి సినీ హీరోలు తమ సినిమాల్లో ఫోక్ సాంగ్స్ను జతచేస్తున్నారు. మరికొందరు అన్ని పాటలూ ఫోక్సాంగ్స్ పెట్టుకున్న సందర్భాలూ లేకపోలేదు. -
రూకల్లోతు కష్టాల్లో మెట్రో!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోరైల్ రూకల్లోతు కష్టాల్లో కూరుకుపోతోంది. ఆదినుంచీ నష్టాల బాటలోనే పరుగులు తీస్తోంది. ఇప్పటివరకు మొత్తం రూ.6,605.51 కోట్ల నష్టాలు నమోదయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.625.88 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఎల్అండ్టీ హైదరాబాద్ మెట్రో రైల్ వార్షిక నివేదికలో వెల్లడించింది. తాజా గణాంకాల ప్రకారం ఎల్అండ్టీ హైదరాబాద్ మెట్రో రైల్ మొత్తం ఆదాయం రూ.1,108.54 కోట్లు కాగా, మొత్తం నిర్వహణ ఖర్చు రూ.1,734.45 కోట్ల వరకు నమోదైంది. పన్ను చెల్లింపుల అనంతరం వార్షిక నష్టం రూ.625.88 కోట్లు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. నగరంలో నాగోల్–రాయదుర్గం, ఎల్బీనగర్– మియాపూర్, ఎంజీబీఎస్–జేబీఎస్ల మధ్య ప్రస్తుతం 57 రైళ్లు నడుస్తున్నాయి. రోజుకు వెయ్యి ట్రిప్పులకు పైగా తిరుగుతున్నాయి. గతేడాది వరకు సుమారు 4.85 లక్షల మందికి పైగా ప్రయాణం చేశారు. ఈ ఏడాది మెట్రో ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం రోజుకు 4.5 లక్షల మంది ప్రయాణం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నాగోల్– రాయదుర్గం, ఎల్బీ నగర్– మియాపూర్ రూట్లలోనే ప్రయాణికుల రాకపోకలు ఎక్కువగా ఉన్నాయి. -
భర్త వేధింపులు తాళలేక..
హైదరాబాద్: భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అల్లాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సామల వెంకటరెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అల్లాపూర్లో నివాసం ఉంటున్న సాదిక్ ఆలి, సమీనా బేగం దంపతులకు ముగ్గురు సంతానం. గత కొన్నేళ్లుగా సాదిక్ ఆలి భార్య సమీనాను వేధిస్తున్నాడు. మద్యానికి బానిసైన అతను ప్రతి రోజూ తాగి వచ్చి భార్యను మానసికంగా, శారీరకంగా హింసించేవాడు. గురువారం రాత్రి కూడా అతను భార్యతో గొడవపడ్డాడు. దీంతో మనస్తాపానికి లోనైన సమీనా బేగం శుక్రవారం ఉదయం సీలింగ్ రాడ్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అల్లాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
త్వరలో రోహిత్ వేముల చట్టం
సాక్షి, న్యూఢిల్లీ: పరిశోధక విద్యార్థి రోహిత్ వేములను ఆత్మహత్యకు ప్రేరేపించిన వారికి బీజేపీ పెద్దపీట వేసి, ఉన్నత పదవులను కట్టబెట్టిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. అప్పట్లో ఎమ్మెల్సీగా ఉన్న ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు హెచ్సీయూ ఎదుట ఆందోళన చేశారని గుర్తు చేశారు. రాంచందర్రావు ఒత్తిడి కారణంగా ఆ సమయంలో అంబేడ్కర్ స్టూడెంట్ అసోసియేషన్లో ఉన్న విద్యార్థులపై యూనివర్సిటీ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఇంతటి ఘటనకు కారకుడైన రాంచందర్రావుపై చర్యలు తీసుకోకుండా అధ్యక్ష పదవి ఇచ్చి న బీజేపీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.శుక్రవారం ఢిల్లీలోని ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో ఏఐసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ రాజేంద్ర పాల్ గౌతమ్తో కలిసి భట్టి మీడియాతో మాట్లాడారు. రోహిత్ వేముల కేసును తాము పునర్విచారణ చేసేందుకు కోర్టును ఆశ్రయించినట్లు భట్టి చెప్పారు. అతని మృతికి కారకులైన వారిని వదిలేది లేదని హెచ్చరించారు. రోహిత్ ఆత్మహత్య వంటి ఘటనలు దేశంలో పునరావృతం కాకుండా ఉండేందుకు ముందుగా రాష్ట్రంలో ప్రత్యేక చట్టాన్ని తెస్తున్నట్లు చెప్పారు. పదవులు కట్టబెడతారా? ‘హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అడ్మిషన్లు తీసుకునే దళిత విద్యార్థులందరికీ అడ్మిషన్తోపాటు ఇంత విషం, ఒక తాడును కూడా ఇస్తే ఉరి వేసుకోవడానికి పనికొస్తుందని రోహిత్ వేముల వీసీకి రాసిన సూసైడ్ నోట్లో ఉంది. అప్పట్లో ఈ సూసైడ్ నోట్ దేశ ప్రజల మనసులను కలచివేసింది. వర్సిటీలో ఆత్మగౌరవంతో బతకడానికి కావలసిన హక్కులు కల్పించండి అంటూ అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ యూనివర్సిటీలో జరుగుతున్న ఘటనలపై వీసీకి వినతి పత్రం ఇచ్చి ంది. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేని వర్సిటీ ఏబీవీపీ యూనిట్ అధ్యక్షుడు సుశీల్ కుమార్.. రోహిత్తోపాటు మరో నలుగురు అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ సభ్యులను దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ వీసీకి ఫిర్యాదు చేశారు.ఆ నలుగురిపై పోలీసు కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని వీసీపై ఒత్తిడి తీసుకురావడమే కాకుండా, కేంద్ర మానవ వనరుల శాఖ నుంచి నుంచి వీసీపై ఒత్తిడి తెచ్చారు. అదే సమయంలో ఎమ్మెల్సీ రాంచందర్రావు ఒత్తిడి తేవడంతో పోలీసులు యూనియన్ సభ్యులపై కేసులు నమోదు చేశారు. నలుమూలల నుంచి వచ్చి న ఒత్తిడిని తట్టుకోలేక వర్సిటీ అధికారులు రోహిత్తోపాటు మరో నలుగురిని సస్పెండ్ చేయడంతో గత్యంతరం లేక రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డారు’అని భట్టి విక్రమార్క చెప్పారు. పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసు నమోదు చేయించిన నాటి ఎమ్మెల్సీ రాంచందర్రావును ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారని, రోహిత్ ఆత్మహత్యకు ప్రధాన కారకుడుగా భావిస్తున్న సుశీల్ కుమార్ను ఢిల్లీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమించారని మండిపడ్డారు. మా ప్రభుత్వంలో ఇబ్బందుల్లేవు పవర్ షేరింగ్ అనేది లేదు.. అందరం కలిసి పనిచేస్తున్నాం బీఆర్ఎస్ నేతల మాటలు మితిమీరాయి: భట్టి సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో బీఆర్ఎస్ నేతలు మితిమీరి వ్యాఖ్యలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో, వారి నిర్ణయం ఏంటనేది వారికే తెలియదన్నారు. వీటిపై తాము ప్రశి్నస్తే.. మితిమీరిన మాటలు మాట్లాడుతూ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో భట్టి మీడియాతో చిట్చాట్ చేశారు.‘మా ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బందులు లేవు. పవర్ షేరింగ్ అనేది ఏమీ లేదు. అందరం కలిసి టీం వర్క్గా పనిచేస్తున్నాం. మా ప్రభుత్వం బాగుంది. ఎన్నికల్లో ఇచ్చి న హామీలను ఒక్కోటి పూర్తిస్థాయిలో అమలు చేస్తూ ముందుకెళ్తున్నాం. ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాం. మహిళలకు ఉచిత బస్సు క్లిక్ అయ్యింది.. ఎంచక్కా మహిళలంతా ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నాం. ఫోర్త్సిటీ పనులు జరుగుతున్నాయి, మూసీ సుందరీకరణను కచ్చితంగా ఈ హయాంలోనే పూర్తి చేస్తాం. రీజినల్ రింగ్ రోడ్ కూడా వస్తుంది. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ రాదు. బీజేపీ వాళ్ల మాటలు వినడం ప్రజలు ఎప్పుడో మానేశారు’అని భట్టి అన్నారు. -
కోటాకు కాపు కాద్దాం!
సాక్షి, హైదరాబాద్/హిమాయత్నగర్: రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాల ప్రజలకు వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు దక్కేంతవరకు అందరం కలిసి కాపలా కాద్దామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి అన్నారు. ‘మా ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంది. మా పక్షం నుంచి పూర్తిస్థాయిలో మద్దతుగా ఉంటాం. ఏం జరుగుతుందనేది గమనిస్తూనే ఉంటాం. మీరు కూడా కాపలా కాయాలి. బీసీ రిజర్వేషన్లపై న్యాయపరమైన చిక్కులు రాకుండా చూసుకోవాలి’అని బీసీ సంఘాల నేతలతో సీఎం అన్నట్లు తెలిసింది.స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఆర్డినెన్స్ జారీచేయాలని మంత్రివర్గం నిర్ణయించిన నేపథ్యంలో జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో పలు బీసీ సంఘాల నేతలు శుక్రవారం జూబ్లీహిల్స్లోని క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వారితో సీఎం దాదాపు 45 నిమిషాలపాటు పలు అంశాలపై చర్చించినట్టు తెలిసింది. ముఖ్యంగా ఆర్డినెన్స్ అనంతరం అటు రాష్ట్ర ప్రభుత్వం పరంగా, ఇటు న్యాయపరంగా చిక్కులు రాకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు.రిజర్వేషన్లను సాధించుకునేంత వరకు బీసీ వర్గాలు సమన్వయంతో ఉండాలని, సామాజిక సామరస్యం దెబ్బతినకుండా చూసుకోవాలని సీఎం సూచించినట్టు సమాచారం. న్యాయస్థానాల్లో కేసులు పడకుండా చూడాలని, ఒకవేళ ఎవరైనా కేసులు వేసినా వాటి ప్రభావంతో నష్టం జరగకుండా ఇటు హైకోర్టులోనూ, అటు సుప్రీంకోర్టులోనూ కేవియట్ పిటిషన్లు వేయాలని సీఎంను ఆర్.కృష్ణయ్య కోరినట్లు తెలిసింది. కోర్టుకెళ్లినా గెలిచేది బీసీలే: ఆర్.కృష్ణయ్య సీఎం రేవంత్ను కలిసిన అనంతరం ఆర్.కృష్ణయ్య ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యయుతంగా, రాజ్యాంగబద్ధమైన వాటా 75 ఏళ్ల తర్వాత బీసీలకు అందుతోందని.. దీనికి ఎవరూ అడ్డుపడొద్దని విజ్ఞప్తి చేశారు. ‘బీసీల జనాభా లెక్కలు అందుబాటులో ఉన్నాయి. అసెంబ్లీలో బిల్లు పాసైనందున చట్టబద్ధత వచ్చింది. అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు 50 శాతం రిజర్వేషన్ల సీలింగ్ను సుప్రీంకోర్టు ఎత్తివేసింది. ఈ నేపథ్యంలో ఎవరైనా కోర్టుల్లో కేసులు వేసినా గెలిచేది బీసీలే. కానీ ఎవరినీ కేసులు వేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ ఎవరైనా కేసులు వేసినా కోర్టుల్లో పోరాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంచి న్యాయవాదులను పెట్టాలి.బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కేసులు వేసేందుకు పార్టీల పరంగా ఎవరైనా ప్రోత్సహించినట్టు తెలిస్తే వారిని బయటకు లాగుతాం. బీసీ ప్రజల కోర్టులో నిలబెట్టి ఆ పార్టీల భరతం పడతాం’అని హెచ్చరించారు. సీఎం రేవంత్ను కలిసిన వారిలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ తదితరులున్నారు. అంతకుముందు బషీర్బాగ్లోని దేశోద్ధారక భవన్లో సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆర్.కృష్ణయ్య మాట్లాడారు. మంత్రివర్గ నిర్ణయం బీసీల పోరాట విజయమని పేర్కొన్నారు. -
సీఎంకు దమ్ముంటే అసెంబ్లీ పెట్టాలి
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి దమ్ముంటే రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై సమగ్ర చర్చకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటుచేయాలని బీఆర్ఎస్ నేత హరీశ్రావు సవాల్ చేశారు. తాము పూర్తి సమాచారంతో వచ్చి అసెంబ్లీలో మాట్లాడుతామని ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశాల్లో ఆరుసార్లు నిర్ణయాలు జరిగాయని, శాసనసభలో మూడుమార్లు ఆమోదం పొందాయని తెలిపారు. కేబినెట్, అసెంబ్లీ సమావేశాల తేదీలు, అందులో జరిగిన చర్చ, ఇతర అంశాల వివరాలను కాళేశ్వరంపై విచారణ జరుపుతున్న ‘పీసీ ఘోష్ కమిషన్’కు అందజేసినట్లు చెప్పారు. కేబినెట్ నిర్ణయాల కంటే శాసనసభ ఆమోదం మరింత ఉత్తమం అని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నేతలు సి.లక్ష్మారెడ్డి, సు«దీర్రెడ్డి, లక్ష్మారెడ్డి, వెంకటేశ్, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులతో కలిసి శుక్రవారం ఉదయం 11 గంటలకు పీసీ ఘోష్ కమిషన్ను కలిసి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అదనపు సమాచారాన్ని హరీశ్రావు అందజేశారు. అనంతరం బీఆర్కే భవన్ వద్ద హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. ‘కమిషన్కు మా వద్ద ఉన్న అదనపు సమాచారం అందజేశాం. ఈ అంశానికి సంబంధించిన డాక్యుమెంట్లు ప్రభుత్వం వద్ద ఉన్నందున గతంలో తీసుకున్న కేబినెట్ నిర్ణయాలు, కేబినెట్ నోట్ తదితర సమాచారం కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జీఏడీ, నీటిపారుదల శాఖ కార్యదర్శులకు లేఖలు రాసినా స్పందన లేదు. దీంతో మాకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి నోట్ అందజేశాం. ప్రభుత్వం వద్ద పూర్తి వివరాలు ఉన్నా కమిషన్కు అందజేసిన సమాచారం మాకు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించకుండా కమిషన్ను తప్పుదోవ పట్టించేలా వివరాలు ఇస్తోందని మాకు అనుమానాలు ఉన్నాయి’అని హరీశ్రావు వ్యాఖ్యానించారు. సీఎంది కవర్ పాయింట్ ప్రజెంటేషన్.. ‘సీఎం రేవంత్రెడ్డి ప్రజాభవన్ వేదికగా 50 ఏండ్ల ద్రోహ చరిత్రపై ఇచ్చింది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాదు. అది ‘కవర్ పాయింట్ ప్రజెంటేషన్’. కృష్ణా నదీ జలాల్లో గత ప్రభుత్వం 299ః512 నిష్పత్తిలో వినియోగానికి శాశ్వత ఒప్పందం చేసుకుని సంతకాలు పెట్టిందని రేవంత్ పదేపదే పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. ఉమ్మడి ఏపీలో జానారెడ్డి, ఉత్తమ్ కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి చేతగాని నాయకుల వల్లే తెలంగాణకు 299 టీఎంసీలు తాత్కాలికంగా కేటాయించారు. ఆ అన్యాయాన్ని సరిదిద్దేందుకు కేసీఆర్ కేంద్రంతో పోరాడి సెక్షన్ 3ని సాధించి 763 టీఎంసీల వాటా కోసం పోరాటానికి బాటలు వేశారు.కానీ, అధికారంలోకి వచ్చిన వెంటనే 299 టీఎంసీలు చాలు అంటూ రేవంత్, ఉత్తమ్ సంతకాలు చేసి వచ్చారు. నదుల బేసిన్స్ గురించి బేసిక్స్ తెలియని సీఎం రేవంత్.. అహంకారం, వెటకారం వదిలి తెలంగాణకు ఉపకారం చేసే రీతిలో నడుచుకోవాలి. కాకతీయులు, నిజాం నవాబుల కాలంలో నిర్మించిన చెరువులు, ప్రాజెక్టులను కూడా రేవంత్ కాంగ్రెస్ ఖాతాలో వేసి 54 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చామని చెప్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో 48 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తే అంతకు మునుపు పదేళ్లలో కాంగ్రెస్ ఇచ్చింది ఆరు లక్షల ఎకరాలకు మాత్రమే’అని హరీశ్రావు వివరించారు. తమ్మిడిహెట్టిపైనా అబద్ధాలే.. ‘తమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ చెప్పినందునే మేడిగడ్డకు బరాజ్ మారిందని చెప్తున్నా సీఎం రేవంత్ పదేపదే అబద్ధాలు చెప్తున్నారు. జలాశయాల సామర్థ్యం, నీటి వినియోగం, ఆయకట్టు, పంపింగ్ సామర్థ్యం, భూసేకరణ పరిహారం పెరగడం వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలు పెరిగాయి. గత ఏడాది తెలంగాణ వాటాలో కేవలం 28 శాతం కృష్ణా జలాలను వాడుకుని, చంద్రబాబుకు గురుదక్షిణగా 65 టీఎంసీలు ఆంధ్రాకు మళ్లించారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి అన్ని ఆధారాలతో వస్తాం. దమ్ముంటే సీఎం రేవంత్కు నచ్చిన తేదీల్లో అసెంబ్లీలో చర్చ పెట్టాలి. కానీ ఒక్కటే షరతు.. మైక్ కట్ చేసి అసెంబ్లీని వాయిదా వేసి పారిపోవద్దు’అని హరీశ్రావు సూచించారు. ప్రఖ్యాత ఇంజనీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ జయంతి సందర్భంగా హరీశ్రావు నివాళి అర్పించారు. -
వర్షం లోటు..సాగు తడబాటు!
పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు.. ఈ ఏడాది వ్యవసాయానికి తగ్గట్టుగా వర్షాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నం. నాతో పాటు చాలామంది రైతులు అప్పులు చేసి విత్తనాలు కొనుగోలు చేసి పత్తి పంట వేశారు. కానీ వర్షాలు సరిగా లేకపోవడంతో విత్తనాలు మొలకెత్తే పరిస్థితి లేదు. నేను మూడున్నర ఎకరాల్లో రెండుసార్లు గింజలు పెడితే ఎకరన్నరలోనే ఓ తీరుగా మొలిచినయ్. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. – మురావత్ రాంసింగ్, లోక్యతండా, వేలేరు మండలం, హనుమకొండ జిల్లాసాక్షి ప్రతినిధి, వరంగల్: ఈ వానాకాలం సీజన్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితులతో రైతాంగం సతమతమవుతోంది. ముఖ్యంగా జూలైలో పది రోజులు దాటినా ఇప్పటివరకు సరైన వర్షాలు లేకపోవడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. మేలో వర్షాలు కురవడంతో మురిసిపోయిన రైతాంగం.. గతేడాదిలా ఈసారి కూడా సాగు సాఫీగా సాగుతుందని భావించారు. కానీ వానాకాలం సీజన్ ముగింపు దశకు చేరుకున్నా ఇంకా లోటు వర్షపాతమే ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా 42.48 శాతం విస్తీర్ణంలోనే పంటల సాగు జరిగింది.ఈ సీజన్లో 1.32 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అంచనా వేయగా, ఇప్పటివరకు కేవలం 56,26,243 (42.48 శాతం) ఎకరాల్లోనే రైతులు వివిధ పంటలు వేశారు. అయితే సరైన వర్షాలు లేక విత్తనాలు మొలకెత్తకపోవడం, మొలకలు ఎండిపోతుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పెట్టుబడి సైతం దక్కే పరిస్థితి లేదంటూ వాపోతున్నారు. లోటు వర్షపాతంతో కష్టకాలం గత సీజన్లో ఈ సమయానికి రాష్ట్ర సగటు వర్షపాతం 191.90 సె.మీ.లు ఉండాల్సి ఉండగా..అంతకు మించి 224.90 సె.మీ.లు నమోదు అయ్యిది. అయితే ఈ సీజన్లో మాత్రం అతి తక్కువగా కేవలం 165.5 సె.మీ.లే నమోదు కావడం గమనార్హం. గత సీజన్లో కరీంనగర్, ములుగు, ఖమ్మం, బి.కొత్తగూడెం, వికారాబాద్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 20 నుంచి 59 శాతం అధిక వర్షపాతం నమోదైంది. నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాలలలో 60 శాతానికి పైగా (లార్జ్ ఎక్సెస్) వర్షం పడగా, 21 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.అయితే ఈసారి మంచిర్యాల, పెద్దపల్లి, సంగారెడ్డి, జేఎస్ భూపాలపల్లి, జనగామ, మేడ్చల్ మల్కాజిగిరి, నల్లగొండ, సూర్యాపేట, యాదగిరి భువనగిరి, హైదరాబాద్ జిల్లాల్లో 20 నుంచి 59 శాతం లోటు వర్షాపాతం ఉంది. తక్కిన 23 జిల్లాల్లో 19 శాతం వరకు లోటు వర్షం ఉంది. ఈ నేపథ్యంలోనే సాగు నెమ్మదించిందని వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు. ఒక్క ఆదిలాబాద్లోనే 95% మించి సాగు ఈ వానాకాలంలో ఆదిలాబాద్ జిల్లాలో సాగు అంచనా 5,77,255 ఎకరాలు అయితే 5,51,573 (95.55 శాతం) ఎకరాల్లో రైతులు పంటలు వేశారు. అంటే ఆదిలాబాద్లో దాదాపు అంచనాలకు తగినట్టుగా సాగు జరిగిందన్న మాట. ఆ తర్వాతి స్థానాల్లో కేబీ ఆసిఫాబాద్ (76.33 శాతం), సంగారెడ్డి (66.81 శాతం), నిజామాబాద్ (65.36 శాతం), బి.కొత్తగూడెం (61.85 శాతం) జిల్లాలు ఉన్నాయి. ఇక అతి తక్కువ విస్తీర్ణంలో సాగైన జిల్లాల్లో వనపర్తి 2,46,582 ఎకరాలకు గాను 17,879 (7.25 శాతం) ఎకరాల్లో సాగుతో మొదటి స్థానంలో ఉంది.ఇక సూర్యాపేటలో 5,81,915 ఎకరాలకు 44,195 (7.59 శాతం) ఎకరాలలో, మెదక్లో 3,37,641 ఎకరాలకు 32,789 (9.71 శాతం) ఎకరాలలో, ఎం.మల్కాజిగిరిలో 23,430 ఎకరాలకు గాను 2,583 (11.02 శాతం) ఎకరాల్లో, ములుగులో 1,26,973 ఎకరాలకు 19,877 (15.65 శాతం) ఎకరాల్లో పంటలు వేశారు. కాగా ప్రతికూల పరిస్థితుల్లోనూ రైతులు పత్తి పంటపైనే ఆసక్తి చూపారు. పత్తి సాగు అంచనా 48,93,016 ఎకరాలకు గాను 36,30,988 (74.21 శాతం) ఎకరాలలో సాగయ్యింది. వరిసాగు అంచనా 62,47,868 ఎకరాలకు గాను కేవలం 5,01,129 (8.02 శాతం) ఎకరాల్లోనే సాగయ్యింది. వర్షాలు లేకపోవడం వరిసాగుపై తీవ్రంగా ప్రభావం చూపించింది. ప్రత్యామ్నాయంగా తృణ ధాన్యాలు, ఆహారేతర పంటలు... వర్షాభావం, ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర రైతాంగం ఈసారి ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపింది. ముఖ్యంగా ప్రధాన తృణ ధాన్యాలు (మిల్లెట్స్), ఆహారేతర పంటలపై దృష్టి పెట్టినట్లు సాగు విస్తీర్ణాన్ని బట్టి అవగతమవుతోంది. మేజర్ మిల్లెట్స్ (జొన్న, మొక్కజొన్న, రాగులు) 5,73,643 ఎకరాల్లో సాగవచ్చని అంచనా వేయగా అంచనాలకు తగినట్టుగా 5,61,240 (97.84 శాతం) ఎకరాల్లో ఈ పంటలు వేశారు. మొక్కజొన్న 5,21,206 ఎకరాలకు గాను 5,34,318 (102.52 శాతం) ఎకరాలలో సాగైంది. ఆహారేతర పంటలు 1,02,576 ఎకరాలు అంచనా వేయగా రెట్టింపునకు మించి 2,35,614 (229.70 శాతం) ఎకరాల్లో రైతులు దైంచా, పిల్లిపెసర, సన్ హెంప్, పారాగ్రాస్, మేత జోవార్లు సాగు చేశారు. నారు పోసిననప్పటి నుంచి వానలు లేవు.. మే నెలలో వానలు పడితే ఈసారి కాలం మంచిగనే అయితది అనుకున్నం. ఆ వానలు తప్ప మల్ల చినుకు పడలేదు. ఆలస్యంగనైన వరి ఏద్దమని ఆగినం. పది రోజుల కింద మబ్బులు చేసి తుంపురు తుంపురు వానలు పడ్డయి. కాలం మంచిగైతే నాట్లు వేసుకోవచ్చని నమ్మి నారు పోసినం. ఇగ వర్షాలు పడుతలేవు. చెరువులు, కుంటలల్ల కూడా నీళ్లు లేవు. ఎటూ తోస్తలేదు. – యెడబోయిన పద్మ, మహిళా రైతు, గ్రామం బేతోల్, మహబూబాబాద్ జిల్లా వానాకాలం 2025 సాగు ప్రణాళిక.. సాగైన విస్తీర్ణం (ఎకరాలలో) – ఈ వానాకాలం సాగు అంచనా ః 13244305 – ఇప్పటివరకైన సాగు విస్తీర్ణంః 5626243 – పత్తి సాగు అంచనాః 4893016 – సాగైన పత్తి విస్తీర్ణంః 3630988 – వరిసాగు అంచనాః 6247868 – సాగైన వరి విస్తీర్ణంః 501129 – మొక్కజొన్న సాగు అంచనాః 521206 – సాగైన మొక్కజొన్న విస్తీర్ణంః 534318 -
రాష్ట్రంలో అణు విద్యుత్ ప్లాంట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అణు విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. కనీసం 4 వేల మెగావాట్ల కేంద్రాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఇటీవల దీనిపై సమీక్ష నిర్వహించింది. అణు ఇంధన ఉత్పత్తికి గల అవకాశాలపై అధికారుల నుంచి నివేదిక కోరింది. ఇతర రాష్ట్రాల్లో వీటి ఏర్పాటు, అయిన ఖర్చు, పనితీరు, విద్యుత్ ఉత్పత్తి ధరలను పరిశీలించాలని వారిని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో విద్యుత్ ఉన్నతాధికారులు దీనిపై దృష్టి పెట్టారు. ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ త్వరలో నిపుణులతో సంప్రదింపులు జరపాలని యోచిస్తున్నారు. ఇందుకోసం అవసరమైతే నిపుణులతో కూడిన కన్సల్టెన్సీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.2047 నాటికి దేశవ్యాప్తంగా లక్ష మెగావాట్ల అణు ఇంధన ఉత్పత్తి జరగాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది బడ్జెట్లో నిధులు పెంచింది. మరోవైపు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో అణు ఇంధన ఉత్పత్తికి వనరులున్నాయని అధికారులు చెబుతున్నారు. దేశంలోనే అతిపెద్ద భారజల ఉత్పత్తి కేంద్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఉంది. ఇక్కడి నుంచి భారజలం దేశంలోని అన్ని అణు విద్యుత్ కేంద్రాలకూ అందుతోంది. సహజ యురేనియంను ఉపయోగించే అణు రియాక్టర్లలో శీతలీకరణకు (కూలెంట్గా) దీనిని ఉపయోగిస్తారు.ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తే వనరులను ఇక్కడే వినియోగించుకోవచ్చని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే అణు విద్యుత్ ప్లాంట్ల మంజూరు, స్థాపన, ఉత్పత్తి వినియోగం మొత్తం కేంద్ర ప్రభుత్వ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో ఉండటం గమనార్హం.కర్బన ఉద్గారాలకు చెక్! ప్రస్తుతం 14 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంది. థర్మల్, జల విద్యుత్ కేంద్రాల ద్వారా ఉత్పత్తి జరుగుతోంది. అయితే థర్మల్కు అవసరమైన బొగ్గుకు ఇబ్బందులున్నాయి. యాదాద్రి థర్మల్ ప్లాంటుకు వచ్చే ఫిబ్రవరికి 50 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం. ఇంత మొత్తం సింగరేణి అందించే పరిస్థితి కని్పంచడం లేదు. మరోవైపు బొగ్గు మండించడం వల్ల వచ్చే కర్బన ఉద్గారాలు సమస్యగా మారుతున్నాయి. దీంతో సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి పెట్టారు. థర్మల్ విద్యుత్ యూనిట్ సగటున రూ.4 వరకు ఉండగా, సోలార్ విద్యుత్ యూనిట్ రూ.2.15కు లభిస్తోంది.కానీ సాయంత్రం, రాత్రి వేళల్లో బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొంటే యూనిట్ రూ.9 వెచి్చంచి కొనాల్సి వస్తోంది. జలవిద్యుత్ చవక అయినా అది పరిమితంగానే ఉంది. కాగా వచ్చే పదేళ్లలో విద్యుత్ డిమాండ్ మరో 9 వేల మెగావాట్లకు పెరిగే వీలుంది. దీంతో అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అణు విద్యుత్ ప్లాంట్లు 90 శాతం ప్రాజెక్టు లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) ఇస్తున్నాయి.అంటే ప్రతి వంద మెగావాట్లు 24 గంటలు పనిచేశాయనుకుంటే 2.4 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దేశంలో 8 అణు విద్యుత్ కేంద్రాలున్నాయి. వీటిలో 25 రియాక్టర్లు పనిచేస్తున్నాయి, వీటి మొత్తం సామర్థ్యం 8,880 మెగావాట్లు. ప్రస్తుతం ఈ విద్యుత్ యూనిట్ రూ. 3.15కు లభిస్తోంది. మరో పది కేంద్రాల ఏర్పాటు జరుగుతోంది. గుజరాత్, రాజస్తాన్లో ఒక్కో యూనిట్ 700 మెగావాట్లతో నిర్మిస్తున్నారు. ఆధునిక సాంకేతికతతో ఉత్పత్తి ఇలా.. అణు ఇంధన రంగంలో ప్రస్తుతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తు న్నారు. దీనివల్ల ప్లాంట్ నిర్మాణ వ్యయం తగ్గుతోంది. అణు రియాక్టర్లోని భారజలంలో యురేనియం, థోరియం పరమాణువులను విచి్ఛన్నం చేస్తారు. దీంతో వెలువడే వేడిమితో నీటి ఆవిరి తయారవుతుంది. దాన్ని ఉపయోగించి టర్బైన్లను తిప్పడం ద్వారా విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. అణు విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన యురేనియం, థోరియం నిల్వలు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఉన్నట్టు ఇటీవల పరిశోధనల్లో తేలింది. ప్రయోజనాలెన్నో.. థర్మల్, అణు విద్యుత్ కేంద్రాలకు చాలా తేడా ఉంది. వి ద్యుత్ ప్లాంట్కు అవసరమైన యురేనియం, థోరియం సూట్కేస్ పరిణామంలోనే తీసుకెళ్ళొచ్చు. థర్మల్ కేంద్రాలకు వాడే బొగ్గును రైల్వే వ్యాగన్ల ద్వారా పంపాలి. అణు విద్యుత్తు కేంద్రాల స్థాపనకు, థర్మల్తో పోలిస్తే నాలుగో వంతు భూమి సరిపోతుంది. ఇటీవల కాలంలో చిన్న మాడ్యులర్ రియాక్టర్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటికి ఇంకా తక్కువ స్థలం వాడొచ్చు. థర్మల్ విద్యుత్ కేంద్రాల కాల పరిమితి 20 ఏళ్ళు. అణు కేంద్రాల కాల పరిమితి 40 ఏళ్ళ పైనే. అణు విద్యుత్ కేంద్రాల్లో హైడ్రోజన్ను ఉత్పత్తి చేయడం ద్వారా అదనపు ప్రయోజనం పొందవచ్చు.దేశంలోని అణు విద్యుత్ కేంద్రాలు⇒ తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం - మహారాష్ట్ర ⇒ రాజస్తాన్ అణు విద్యుత్ కేంద్రం - రాజస్తాన్ ⇒ మద్రాస్ అణు విద్యుత్ కేంద్రం - తమిళనాడు ⇒ నరోరా అణు విద్యుత్ కేంద్రం - ఉత్తరప్రదేశ్ ⇒ కైగా అణు విద్యుత్ కేంద్రం - కర్ణాటక ⇒ కుడంకుళం అణు విద్యుత్ కేంద్రం - తమిళనాడు ⇒ కాక్రపార అణు విద్యుత్ కేంద్రం - గుజరాత్ అణువిద్యుత్ ఉత్పత్తి పెరుగుతోందిఅణు ఇంధన విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై అన్ని రాష్ట్రాలూ దృష్టి పెట్టాయి. కేంద్రం కూడా అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. భవిష్యత్ విద్యుత్ ఉత్పత్తి అవసరాలు తీర్చేందుకు అణు ఇంధన ప్లాంట్ల ఏర్పాటు అవసరం. వనరులు పుష్కలంగా ఉన్న తెలంగాణలో అణు ఇంధనం ప్రయోజనకరం. – జి.వీర మహేందర్ (టీజీ జెన్కో ఫైనాన్స్ డైరెక్టర్) -
ఎమ్మెల్యే రాజాసింగ్ ఏ పార్టీలోకి? ఆయనేమన్నారంటే?
సాక్షి, హైదరాబాద్: ఏ పార్టీలో చేరాలనే విషయంపై తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ పార్టీలోకి తాను చేరుతున్నట్లు కొన్ని మీడియా ఛానళ్లలో ప్రచారం జరుగుతోందని.. అలాంటి తప్పుడు కథనాలను వ్యాప్తి చేయొద్దంటూ విజ్ఞప్తి చేసిన రాజాసింగ్.. కార్యకర్తలు, అభిమానులతో మాట్లాడి తదుపరి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.కాగా, రాజీనామాపై మరోసారి స్పందించిన రాజాసింగ్.. పదవి, అధికారం కోసం రాజీనామా చేయలేదన్నారు. హిందుత్వ భావజాలంతో ప్రజలకు సేవ చేయాలనే బీజేపీలోకి చేరానని తెలిపారు. నా చివరి శ్వాస వరకు హిందుత్వం కోసమే పని చేస్తానని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక తీరును నిరసిస్తూ రాజాసింగ్ ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శుక్రవారం ఆమోదించారు. -
TG: కొత్త రేషన్ కార్డుల జారీకి ముహూర్తం ఫిక్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీకి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 14వ తేదీన తుంగతుర్తి నియోజకవర్గంలో కొత్త కార్డుల పంపిణీని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభించనున్నారు. 2.4 లక్షల కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభించనున్నారు. 11.30 లక్షల మంది నిరుపేదలకు ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం వెల్లడించింది.గడిచిన ఆరు నెలల కాలంలో రాష్ట్రంలో 41 లక్షల మందికి ప్రభుత్వం కొత్తగా రేషన్ పంపిణీ చేసిన సర్కార్.. కొత్తగా జారీ చేసిన రేషన్ కార్డులతో కలిపి రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య 94,72,422కు చేరుతుంది. మొత్తంగా 3 కోట్ల 14 లక్షల మందికి లబ్ధి చేకూరనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. -
పవర్ షేరింగ్ ఏమీ లేదు: మల్లు భట్టి విక్రమార్క
ఢిల్లీ : బీఆర్ఎస్ నేతల మాటలు మితిమీరిపోయాయని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని, అదే సమయంలో జనాల్లోకి కూడా వెళ్లడం లేదని భట్టి విక్రమార్క తెలిపారు. ఈరోజ(శక్రవారం, జూలై 11వ తేదీ) ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో పాల్గొన్న మల్లు.. తమ ప్రభుత్వంలో అంతా కలిసికట్టగా పనిచేస్తన్నారని, ఇక్కడ పవర్ షేరింగ్ అంటూ ఏమీ లేదని మల్లు తెలిపారు. అందరం కలిసి టీమ్ వర్క్గా పనిచేస్తన్నామన్నారు.‘రెండు లక్షలు దాటిన వారికి రుణమాఫీ చేయొద్దన్నది విధాన నిర్ణయం. రేషన్ కార్డు ఆధారంగానే కుటుంబంలో రుణ మాఫీ. సన్నం బియ్యం సక్సెస్ అయ్యింది. మహిళలకు ఉచిత బస్సుకు మంచి స్పందన ఉంది. ఫోర్త్ సిటీ పనులు జరుగుతున్నాయి. మూసి సుందరీకరణ ఈ ప్రభుత్వం హయంలో పూర్తి అవుతుంది.రీజినల్ రింగ్ రోడ్డు కూడా వస్తుంది. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చేది లేదు. సిగాచి ప్రమాదం పై విచారణ కు ఆదేశించాము. ఇటీవల జరిగిన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో ఖర్గే,కేసి వేణుగోపాల్ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పట్ల పూర్తి సంతృప్తితో ఉంది’ అని మల్లు తెలిపారు.