Telangana
-
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం: పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు రెవెన్యూ శాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇందులో భాగంగా రైతులకు పారదర్శకంగా, సులభతరమైన సేవలు అందించడానికి ల్యాండ్, సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ను తయారు చేశామన్నారు.ఈ పోర్టల్ను ఈనెల 2వ తేదీ నుంచి ఐదు మండలాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించి భూ వివాదాల పరిష్కారానికి తొలి అడుగు వేయబోతున్నామని వెల్లడించారు. ఇక్కడ వచ్చే ఫలితాలను బట్టి అవసరమైన మార్పులు చేర్పులు చేసి భవిష్యత్తులో ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. కేరళం పర్యటనలో ఉన్న మంత్రి శ్రీనివాసరెడ్డి బుధవారం.. ఈ పోర్టల్ ప్రారంభానికి సంబంధించి రెవెన్యూ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ను రైతు కోణంలో రూపొందించామని సామాన్య ప్రజానీకానికి ముఖ్యంగా రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 2 నుంచి ఖమ్మం జిల్లా కుసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట, రంగారెడ్డి జిల్లా అమన్గల్, సంగారెడ్డి జిల్లా వట్పల్లి, నారాయణపేట జిల్లా కొస్గి మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆయా జిల్లా కలెక్టర్లు పోర్టల్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.గతంలో మాదిరిగా రైతులు తమ భూ సేవల కోసం మీ సేవ కేంద్రాలకు వెళ్లవలసిన పనిలేకుండా తన ఇంటి నుంచే భూ సేవలు పొందే విధంగా పోర్టల్ను రూపొందించామని అన్నారు. రైతులు తమ భూమి హద్దులు తేల్చాలని సర్వే అధికారుల చుట్టూ తిరిగేవారని.. ఇప్పుడు ఎక్కడికీ వెళ్లకుండా ఇంటి నుంచే భూభారతి పోర్టల్ ద్వారా పొందవచ్చన్నారు. రైతు లాగిన్ అయిన వెంటనే తనకు ఉన్న భూమి వివరాలు కనిపిస్తాయి. ఎన్నిఎకరాలకు సర్వే కావాలో కోరితే అందుకు సంబంధించిన ఫీజు ఎంతచెల్లించాలో కనిపిస్తుంది.ఫీజు చెల్లించిన తర్వాత ఆ వివరాలు ఆ గ్రామంలో ఉన్న లైసెన్స్డ్ సర్వేయర్ లాగిన్కు వెళుతుంది. ఆతర్వాత రెండు రోజల్లో ఆ రైతు భూమికి ఆనుకొని ఉన్న రైతులకు నోటీసులు జారీ చేస్తారు. తర్వాత ఏడు రోజుల్లోపు సర్వే తేదీని సదరు లైసెన్స్డ్ సర్వేయర్ ఖరారు చేయడమేగాక సర్వేకూడా రోవర్లతో పూర్తి చేస్తారు. దీనిని సిస్టమ్లో నమోదు చేశాక అది మండల సర్వేయర్ స్య్రూటినీకి వెళుతుంది.ఆపై మండల తహశీల్దార్ ఆమోదం పొందాక దరఖాస్తుదారైన రైతుకు ఎల్పిఎమ్, భూధార్ నెంబర్ల కేటాయింపు జరుగుతుంది. ఈ వివరాలు భూభారతి పోర్టల్లో కూడా నిక్షిప్తమవుతాయి. సర్వే పూర్తయిన తర్వాత సర్వే మ్యాప్ ను జనరేట్ చేసి భూభారతి పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. ఈ ప్రక్రియలో రిజిస్ట్రేషన్ దరఖాస్తు ప్రారంభమైనప్పటి నుంచి పూర్తయ్యేవరకు ప్రతి దశలో పౌరుల రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు ఎస్ ఎమ్ ఎస్ అలర్ట్స్ పంపిస్తారు. భూభారతి చట్టంలో పేర్కొన్నవిధంగా వ్యవసాయ భూములకు సంబంధించి క్రయ విక్రయదారులకు ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాపును జతపరచే నిబంధనను ఈ ఐదు మండలాల్లో అమలు చేస్తున్నామని ఈ ఐదు మండలాల్లో ప్రతి సర్వే మ్యాప్ ( ఎల్పిఎమ్) యూనిక్ నెంబరు, అదేవిధంగా ప్రతి సర్వే నెంబర్కు ఆధార్ నెంబర్ మాదిరిగానే భూధార్ నెంబర్ను కూడా ఇస్తామని వెల్లడించారు.ఈ ఐదు మండలాల్లో రైతులు దరఖాస్తు చేసుకున్నతర్వాత సర్వే నిర్వహించడానికి అవసరమైన సర్వేయర్లను అందుబాటులో ఉంచామని అలాగే గొలుసులు, కర్రలు, క్రాస్ స్టాఫ్, మెజరింగ్ టేప్ వంటి పాత సర్వే పరికరాలకు స్వస్తి చెప్పి రోవర్లతో సర్వే నిర్వహిస్తామని తెలిపారు. దీనివల్ల సర్వే ప్రక్రియ త్వరితగతిన పూర్తవుతుందని, కచ్చితమైన సర్వే వివరాలు వస్తాయని తెలిపారు.భూ సమస్యలు రైతు జీవితంలో పెద్ద అడ్డంకిగా మారాయని వాటికి శాశ్వత పరిష్కారం చూపించేందుకు ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ ఒక కీలకమైన ముందడుగు అని రైతు ఇంటి నుంచే అన్నిసేవలు పొందేలా పారదర్శక వ్యవస్ధను తీసుకువస్తున్నామని ఇది రెవెన్యూ వ్యవస్ధలో చారిత్రాత్మక మార్పునకు నాంది అవుతుందని మంత్రి పొంగులేటి అన్నారు. -
అతి వ్యాయామంతో ప్రాణాపాయం : ‘కోలా యూరిన్’ గురించి తెలుసా?
హైదరాబాద్, మార్చి 26, 2026: ‘నో పెయిన్.. నో గెయిన్’ (కష్టం లేనిదే ఫలితం ఉండదు) అనే సూత్రాన్ని నమ్మి జిమ్లో మితిమీరిన కసరత్తులు చేయడం ప్రాణాల మీదకు తెస్తుందని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రోలజీ అండ్ యూరాలజీ (AINU) వైద్యులు హెచ్చరిస్తున్నారు. తక్కువ సమయంలోనే కండలుపెంచాలనే ఆరాటంతో చేసే కఠినమైన వ్యాయామాలు ‘రాబ్డోమయోలిసిస్’ (Rhabdomyolysis) అనే ప్రమాదకర పరిస్థితికి దారితీస్తాయని వారు స్పష్టం చేశారు.ఒక్క రోజే 90 నిమిషాల కసరత్తు.. కిడ్నీలు ఫెయిల్!ఇటీవల ఫిట్నెస్ కోసం మొదటి రోజే జిమ్కు వెళ్లిన 25 ఏళ్ల యువకుడు, త్వరగా ఫలితం రావాలనే ఉద్దేశంతో ఏకంగా 90 నిమిషాల పాటు స్క్వాట్స్, డెడ్ లిఫ్ట్స్ మరియు పుష్-అప్స్ వంటి అత్యంత కఠినమైన వ్యాయామాలు చేశాడు. రెండు రోజుల తర్వాత అతనికి కండరాల నొప్పులు తీవ్రమవ్వడమే కాకుండా, మూత్రం రంగు మారి ‘కోలా’ లేదా టీ డికాషన్ రంగులోకి మారింది. పరిస్థితి విషమించడంతో అతను ఎమర్జెన్సీ వార్డులో చేరాడు. పరీక్షల్లో అతని శరీరంలో కండరాల విచ్ఛిన్నం వల్ల విడుదలయ్యే ‘మయోగ్లోబిన్’ స్థాయిలు పెరిగి, కిడ్నీలు దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు. దీనినే ‘ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ రాబ్డోమయోలిసిస్’ అంటారు. ఏమిటీ రాబ్డోమయోలిసిస్?కండరాలు విపరీతంగా అలసిపోయినప్పుడు లేదా దెబ్బతిన్నప్పుడు వాటిలోని కణాలు విచ్ఛిన్నమై ‘మయోగ్లోబిన్’ అనే ప్రోటీన్ను రక్తంలోకి విడుదల చేస్తాయి. ఈ ప్రోటీన్ కిడ్నీలలోని సూక్ష్మ నాళాలను మూసివేస్తుంది (Clogging). దీనివల్ల కిడ్నీలు తాత్కాలికంగా లేదా శాశ్వతంగా దెబ్బతింటాయి. సకాలంలో గుర్తించకపోతే డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.గుర్తించాల్సిన ప్రమాద సంకేతాలు: వ్యాయామం చేసే వారు ఈ క్రింది లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదుమూత్రం రంగు మారడం: మూత్రం కోలా లేదా టీ రంగులోకి మారడం అత్యంత ముఖ్యమైన సంకేతం.తీవ్రమైన కండరాల నొప్పి: సాధారణ నొప్పి కంటే భిన్నంగా, కండరాలు వాపు రావడం.నీరసం: విపరీతమైన అలసట లేదా కండరాల్లో శక్తి లేకపోవడం.తక్కువ మూత్ర విసర్జన: రోజువారీ కంటే మూత్రం రావడం తగ్గిపోవడం. వాంతులు: వికారం లేదా వాంతులు అవ్వడం.సకాలంలో చికిత్సతో ప్రాణాపాయం నుంచి విముక్తిఈ యువకుడి కేసులో ఏఐఎన్యూ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ దీపక్ రాగూరి, నెఫ్రాలజిస్ట్ డాక్టర్ క్రాంతి కుమార్ సమన్వయంతో చికిత్స అందించారు. రోగికి తగినంత ద్రవాలను అందిస్తూ (Aggressive Hydration),ఎలక్ట్రోలైట్ సమ తుల్యతను కాపాడటం ద్వారా కిడ్నీలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకున్నట్టు హైటెక్ సిటీలోని ఏఐఎన్యూ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. జిమ్కు వెళ్లే వారికి వైద్యుల సూచనలునెమ్మదిగా ప్రారంభించండి: మొదటి రోజే కఠినమైన వ్యాయామాలు వద్దు. క్రమక్రమంగా తీవ్రతను పెంచాలి.నీరు ఎక్కువగా తాగాలి: వ్యాయామానికి ముందు, తర్వాత శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి.విశ్రాంతి అవసరం: కండరాలు కోలుకోవడానికి వారంలో కనీసం ఒక రోజైనా విశ్రాంతి ఇవ్వాలి. నొప్పిని భరించొద్దు: తీవ్రమైన నొప్పి ఉంటే వ్యాయామం ఆపేయాలి. పెయిన్ కిల్లర్స్ వేసుకుని మరీ జిమ్ చేయడం ప్రాణాంతకం."వ్యాయామం అనేది ఒక ఔషధం లాంటిది. అది సరైన మోతాదులో ఉన్నప్పుడే ఆరోగ్యం. శరీరం ఇచ్చే హెచ్చరికలను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి," అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇదీ చదవండి: తండ్రితో గొడవ, నాలుగేళ్ల బాలుడిపై ఇంత ప్రతీకారమా? -
శాడిస్ట్ భర్త.. మద్యం మత్తులో భార్య, పిల్లలను నరికేసి..
రంగారెడ్డి జిల్లా: కట్టుకున్న భార్యతోపాటు అభంశుభం తెలియని చిన్నారులపై ఓ వ్యక్తి మద్యం మత్తులో కర్కశంగా వ్యవహరించాడు. రోకలి, చాకుతో దాడి చేశాడు. భార్య, కుమారుడు మృతిచెందగా కూతురు మృత్యువుతో పోరాడుతోంది. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం సీతారాంనగర్ పంచాయతీలోని పులుగోనిపల్లితండాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తండాకు చెందిన బాణావత్ రాందాస్నాయక్ ఆమనగల్లులోని ఓ కాటన్మిల్లులో కారి్మకుడిగా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య కవిత, ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. కవిత కూలి పనికి వెళ్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండేది. కూతుళ్లు పవిత్ర, పావని ఆమనగల్లులోని హాస్టల్లో ఉంటూ చదువుకుంటుండగా కుమారుడు, చిన్న కూతురు తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారు. కొన్నేళ్లుగా రాందాస్ నిత్యం మద్యం తాగి వచ్చి భార్యతో గొడవపడుతున్నాడు. స్థానిక పెద్దలు, పోలీసులు పలుమార్లు సర్దిచెప్పినా ఆయనలో మార్పు రాలేదు. సోమవారం రాత్రి అతిగా మద్యం తాగి ఇంటికి రావడంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. భార్య కవిత (32), కుమారుడు హర్ష(6), కూతురు ప్రణీతపై చాకు, రోకలితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన కవిత, హర్ష అక్కడికక్కడే మృతిచెందారు. ఇరుగుపొరుగు వారు సమాచారం అందించగా.. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ప్రణీతను హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి, తల్లీకొడుకుల మృతదేహాలను పోస్టుమారా్టనికి తరలించారు. మహేశ్వరం ఏసీపీ జానకిరెడ్డి, ఆమనగల్లు ఎస్హెచ్ఓ వెంకటేశ్వర్లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడు రాందాస్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. -
‘శిరసా’వహిస్తేనే ఊళ్లోకి రండి!
ఖమ్మం జిల్లా: రోడ్డు ప్రమాదాల నివారణ కోసం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం వెంకట్రాంపురం పంచాయతీ పాలకవర్గం వినూత్న ఆలోచన చేసింది. తమ గ్రామంలోకి వచ్చే ప్రతీ ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లేనిపక్షంలో గ్రామంలోకి ప్రవేశం లేదని గ్రామ పొలిమేరలో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. పోలీసులు ఇటీవల ‘అరైవ్..అలైవ్’కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతా చర్యలు చేపట్టాలని చేసిన సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. వాహనదారుల భద్రత కోసం తమ పాలకవర్గం తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సర్పంచ్ ధరావత్ శివాజీ విజ్ఞప్తి చేశారు. -
భర్త రెండో పెళ్లి.. ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య
పచ్చని కాపురాల్లో కలహాలు చిచ్చురేపాయి. మద్యం, మనస్పర్థలు, అక్రమ సంబంధాలు.. ఇలా కారణమేదైనా.. బంధాలు బలి అయ్యాయి. ఈ ఘటనలు స్థానికంగా కలకలం రేపాయి. మూసాపేట/చెన్నారావుపేట: భర్త రెండో పెళ్లి చేసుకొని వేధిస్తూ ఉండటంతో వేధింపులు తాళలేక ఇద్దరు పిల్లలను చంపి భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. బాలానగర్ ఏసీపీ నరేష్ స్థానికుల కథనం ప్రకారం... వరంగల్ జిల్లా, చెన్నారావు పేట మండలం బోడమాణిక్యం తండాకు చెందిన ప్రవీణ్ (31) అదే మండలంలోని పదహార చింతల తండాకు చెందిన స్రవంతి (27) పదమూడేళ్ల కిందట ప్రేమించి పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వీరికి కౌశిక్ (10), కార్తీక్ (8) సంతానం. వీరు మూసాపేట రాఘవేంద్ర సొసైటీలో ఉంటున్నారు. స్రవంతి దగ్గర బంధువుల అమ్మాయి మహేశ్వరి అలియాస్ సోనూ పరిచయం కాగా, ప్రవీణ్ ఆమెను సంవత్సరం కిందట రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ప్రవీణ్ రెండో భార్య వద్దకు వెళ్లి వచ్చేవాడు. స్రవంతిని నిత్యం వేధింపులకు గురి చేస్తుండటంతో ఆమె పిల్లలను తీసుకుని నాలుగు రోజుల కిందట పుట్టింటికి వెళ్లింది. అయితే ప్రవీణ్.. స్రవంతి, పిల్లలు కావాలంటూ సోమవారం సాయంత్రం వారిని తన ఇంటికి తీసుకొచ్చాడు. మంగళవారం ఉదయం ప్రవీణ్ పనికి వెళ్లడంతో స్రవంతి, ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉన్నారు. ప్రవీణ్ మధ్యాహ్నం ఇంటికి రాగా తలుపులు మూసిఉన్నాయి. స్థానికుల సహాయంతో తలుపులు తెరిచి చూడగా స్రవంతి, ఇద్దరు కుమారులు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించారు. తల్లి ఇద్దరు కుమారులకు ఉరేసిన అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రవీణ్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తుంది. స్రవంతి, ఇద్దరు పిల్లలను ప్రవీణే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. స్రవంతి బంధువులు వరంగల్ జిల్లాలోని ప్రవీణ్ ఇంటికి నిప్పు పెట్టారు. -
HYD: భారీగా హైడ్రా కూల్చివేతలు
సాక్షి, రంగారెడ్డి: తెలంగాణలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా బుధవారం తెల్లవారుజాము నుంచే మైలార్దేవుపల్లి సర్కిల్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. సుమారు 30 కోట్ల రూపాయల విలువచేసే స్థలాన్ని హైడ్రా కాపాడినట్టు తెలుస్తోంది.వివరాల మేరకు.. మైలార్దేవుపల్లిలో సర్వే నంబరు 134/20 శాస్త్రిపురానికి చెందిన 6500 గజాల పార్కు స్థలం కబ్జాకు గురైనట్టు ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో స్థానికుల ఫిర్యాదుతోరంగంలోకి దిగిన హైడ్రా.. నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్లుగా చేసి అమ్మి సొమ్ముచేసుకున్నట్టు గుర్తించింది. దీంతో, బుధవారం తెల్లవారుజాము నుంచే భారీ బందోబస్తు మధ్య హైడ్రా కూల్చివేతలను చేపట్టింది. పార్క్ స్థలంలో నిర్మాణాలను నేలమట్టం చేసింది. అలాగే, మూడు, నాలుగు అంతస్తులున్న భవనాలను సైతం హైడ్రా సిబ్బంది నేలమట్టం చేసింది. సుమారు 30 కోట్ల రూపాయల విలువ చేసే స్థలాన్ని హైడ్రా కాపాడినట్టు తెలిసింది.అంతకుముందు మంగళవారం కూడా హైడ్రా ఆక్రమణల కూల్చివేత చేపట్టింది. మంచిరేవుల గ్రామంలోని నాగిరెడ్డికుంటలో 7 ఎకరాల స్థలాన్ని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ కబ్జాలో ఉంచుకున్నట్లు తేలింది. సర్వే చేయగా.. సదరు సంస్థ కబ్జాచేయగా మిగిలిన భూమిని, స్థానిక నేత విక్రయించినట్లు స్పష్టమైంది. ఆ మేరకు మొత్తం ఆక్రమణలను నేలమట్టం చేశామని హైడ్రా వెల్లడించింది. బహిరంగ మార్కెట్లో వాటి విలువ రూ.934 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అలాగే, బౌరంపేట్లోని గండిమైసమ్మ-మియాపూర్ రహదారికి ఇరువైపులా ఎకరా విస్తీర్ణంలో నిర్మించిన రేకుల షెడ్లను హైడ్రా నేలమట్టం చేసింది. ఘట్కేసర్ వద్దనున్న అవుషాపూర్లో.. ఇళ్ల స్థలాలుగా మారిన 1,440 గజాల పార్కు భూమికి, జూబ్లిహిల్స్లో ఆక్రమణకు గురైన 300గజాల వరద నాలాకు హైడ్రా విముక్తి కల్పించింది. -
మహిళా సంఘాలకు రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు
సాక్షి, హైదరాబాద్: ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ ఎన్ని సవాళ్లు ఎదురైనా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి చూపుతుందని, దానికి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకమే నిదర్శనమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి మొదలైన తర్వాత జీరో టికెట్ల మొత్తం రూ.10 వేల కోట్ల మైలురాయిని చేరుకున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ప్రజాభవన్లో మహిళా సంఘాల సభ్యులతో ప్రభుత్వం అభినందన సభ ఏర్పాటు చేసింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరిన వెంటనే, బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణ వసతి పథకాన్ని ప్రారంభించిందని, దాని రూపంలో ఇప్పటి వరకు 290 కోట్ల ప్రయాణాలతో మహిళలు ఆదా చేసుకున్న మొత్తం రూ.10 వేల కోట్లకు చేరుకోగా, అంతేమొత్తాన్ని ఆర్టీసీకి ప్రభుత్వం అందజేసి దాన్ని ఆదుకుందని తెలిపారు. వచ్చే మూడేళ్లలో మహిళా సంఘాలకు రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చే దిశగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని, వీలైతే ఈ మొత్తాన్ని రూ.లక్షన్నర కోట్లకు చేరుస్తామని ప్రకటించారు. ఈ లక్ష్య సాధనలో సంవత్సరానికి రూ.20 వేల కోట్లు ఇచ్చే దిశలో ఇప్పటికే రూ.57 వేల కోట్లను అందజేసినట్లు వెల్లడించారు. వాటిపై ప్రభుత్వం వడ్డీ భరిస్తూ రూ.1329 కోట్లను చెల్లించిందని, తాజా బడ్జెట్లో వడ్డీ కోసం రూ.రెండున్నర వేల కోట్లను ప్రతిపాదించిందని, ఐదేళ్లలో రూ.10 వేల కోట్లను ప్రభుత్వం వడ్డీ మొత్తాన్ని భరిస్తుందని తెలిపారు. ఆరీ్టసీకి బకాయిల భారమున్నా మహాలక్ష్మి పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, కారి్మక సంఘాల పునరుద్ధరణ అంశాలు తప్ప సంస్థకు సంబంధించిన ఆర్థికపరమైన అంశాలను కొలిక్కి తెస్తున్నట్లు వెల్లడించారు. ఉచిత ప్రయాణ పథకాన్ని విమర్శించే వారికి, ఆ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న మహిళలే తిరుగుబాటు ద్వారా సమాధానం చెప్పాలని మంత్రి సీతక్క సూచించారు. ఈ సందర్భంగా ఉచిత ప్రయాణ వసతికి సంబంధించి రూ.10 వేల కోట్ల మొత్తాన్ని ఆరీ్టసీకి రీయింబర్స్ చేయడానికి గుర్తుగా రూ. 10,000 కోట్ల మెగా చెక్కును మంత్రులు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మాలోతు రాందాస్, ప్రేమ్సాగర్ రావు, మాజీ మేయర్ గద్వాల విజయ లక్ష్మి, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, సెర్ఫ్ సీఈవో దివ్య, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన, ఆర్టీసీ ఈడీలు సీహెచ్.వెంకన్న, ఖుస్రో షా ఖాన్ , రాజశేఖర్, పద్మశ్రీ పురస్కార గ్రహీత సునీతాకృష్ణన్ పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
చర్చించకుండా పారిపోయారు: హరీశ్రావు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం సభా సాంప్రదాయాలను తుంగలో తొక్కిందని శాసనసభలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ టి.హరీశ్రావు ఆగ్ర హం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పకుండా సీఎం రేవంత్రెడ్డి తొండలు, కండల భాష వాడారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిన ప్రతీసారి ప్రతిపక్షంపై ఎదురుదాడి చేస్తూ గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తోందన్నారు. ప్రతిపక్ష పాత్రను బీఆర్ఎస్ సమర్థవంతంగా నిర్వహిస్తుంటే కాంగ్రెస్ తట్టుకోలేకపోతున్నదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, డాక్టర్ సంజయ్, బండారి లక్ష్మారెడ్డి, విజయుడు, పాడి కౌశిక్రెడ్డితో కలిసి అసెంబ్లీ మీడియా హాల్లో మంగళవారం హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత సహాఅనేక అంశాలపై ఎలాంటి దిశా నిర్దేశం లేకుండానే ముగిశాయన్నారు. బడ్జెట్, బిల్లులను ఆమోదించుకోవాలనే రాజ్యాంగ అనివార్యత వల్లే సభను తూతూ మంత్రంగా నడిపారన్నారు. 19 అంశాలపై బీఆర్ఎస్ స్వల్పకాలిక చర్చల కోసం నోటీసులు ఇచ్చినా ప్రభుత్వం ముందుకు రాలేదని, ప్రశ్నోత్తరాల్లో బీఆర్ఎస్ లేవనెత్తిన ప్రశ్నలు చర్చకు రాకుండా సాగదీత ధోరణిలో సభ జరిగిందన్నారు. సీఎం ఢిల్లీ పర్యటనలు, డిప్యూటీ సీఎం సన్నద్ధత పేరిట, విరామం పేరిట గంటల కొద్దీ సభ వాయిదా వేశారని, కేరళ ఎన్నికల కోసం అసెంబ్లీ సమావేశాలను 30వ తేదీన హడావుడిగా ముగించారని హరీశ్రావు మండిపడ్డారు. అవినీతి మంత్రిని కాపాడేందుకు డైవర్షన్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అవినీతిని సాక్ష్యాధారాలతో సహా సభలో బయటపెడితే డైవర్షన్ రాజకీయాలు చేశారని హరీశ్రావు మండిపడ్డారు. అవినీతి మంత్రిని కాపాడేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రెండు రోజుల పాటు సస్పెండ్ చేసి బిల్లులు, పద్దులు ఆమోదించుకున్నారన్నారు. కత్తుల కోలాటం ఆడుతాం.. తలలు తీస్తాం.. సామాజిక బహిష్కరణ చేస్తాం.. అంటూ కాంగ్రెస్ సభ్యుల మాటలను సీఎం పక్కన కూర్చుని ప్రోత్సహించారన్నారు. ఎమ్మెల్యేల వ్యాఖ్యలతో పాటు రేవంత్ రెండేండ్లుగా సభలో వాడుతున్న భాషను కూడా ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వమే అన్ని అనుమతులు ఇచ్చినా రూ.లక్ష కోట్లు కొట్టుకు పోయాయని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ పార్లమెంటులో కామెంట్లు చేస్తున్నారని, కేంద్ర మంత్రి వ్యాఖ్యలు అచ్చం రేవంత్ మాటల తరహాలోనే ఉండడం కాంగ్రెస్, బీజేపీ నడుమ ఉన్న ఫెవికాల్ బంధానికి నిదర్శనమన్నారు. -
టోల్ ఇక్కడ తగ్గింది.. అక్కడ పెరిగింది
చౌటుప్పల్/రఘునాథపల్లి/దేవరుప్పుల/మంచిర్యాల: హైదరాబాద్–విజయవాడ రూట్లో టోల్ చార్జీలు స్వల్పంగా తగ్గగా, హైదరాబాద్–వరంగల్, జనగామ–సూర్యాపేట రూట్లో స్వల్పంగా పెరిగాయి. తగ్గిన, పెరిగిన ధరలు బుధవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు ఎన్హెచ్ఏఐ ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్–విజయవాడ రూట్లో టోల్ చార్జీలు తగ్గడంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి, సూర్యాపేట జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్, ఏపీలోని ఇబ్రహీంపట్నం మండలం చిల్లకల్లు టోల్ప్లాజాల మీదుగా ప్రయాణించే వాహనదారులకు ప్రయోజనం చేకూరనుంది. అయితే ఈ ధరలు కూడా ఒక టోల్ప్లాజా వద్ద తగ్గితే మరో టోల్ప్లాజా వద్ద యథావిధిగా ఉన్నాయి. ⇒ పంతంగి టోల్ప్లాజా వద్ద త్రీ యాక్సల్ వాహనాలకు మాత్రమే ఇరువైపులా 5 రూపాయలు తగ్గనుంది, మిగిలిన వాహనాలకు తగ్గింపు చేయలేదు. ఇక్కడ త్రీ యాక్సల్ వాహనాలకు ఒక వైపునకు రూ.290 నుంచి రూ.285కు, ఇరువైపులా రూ.435 నుంచి రూ.430 తగ్గింది. ⇒ కొర్లపహాడ్ టోల్ప్లాజా వద్ద కూడా కేవలం త్రీ యాక్సస్ వాహనాలకు మాత్రమే ఐదు రూపాయలు తగ్గనుంది. ఇక్కడ ఒకవైపునకు రూ.450 నుంచి రూ.445కు, రెండు వైపులా రూ.675 నుంచి రూ.670కు తగ్గుతుంది. ⇒ ఏపీలోని చిల్లకల్లు వద్ద కారు, జీపు, వ్యాను, లైట్ మోటారు వాహనాలకు ఐదు రూపాయలు తగ్గించారు. ఇక్కడ వీటికి ఒకవైపునకు రూ.105 నుంచి రూ.100కు తగ్గించారు. రెండు యాక్సల్ వాహనాలకు రూ.350 నుంచి రూ.345కు, మూడు యాక్సల్ వాహనాలకు 24గంటల్లో ఇరువైపులా రూ.570 నుంచి రూ.565కు తగ్గించారు. ⇒ మంచిర్యాల–చంద్రాపూర్ జాతీయ రహదారి 363పై మంచిర్యాల జిల్లా మందమర్రి, ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల సరండి టోల్ ప్లాజాల్లో గతేడాదితో పోలిస్తే కనీసం రూ.5 నుంచి నెలవారీ పాస్లపై గరిష్టంగా 25 చొప్పున తగ్గాయి. ఒకవైపు రాకపోకలు సాగించే మినీ వాహనాలకు ఒకవైపు జర్నీకి రూ.150 ఉండగా, 145కు తగ్గించారు. 3 జతల టైర్ల వాహనాలకు రూ.340 ఉండగా, ప్రస్తుతం రూ.335కు తగ్గింది. అలాగే నెలవారీ పాస్లు సైతం ఒక్కో పాస్కు రూ.25 నుంచి గరిష్టంగా ఏడు జతల భారీ వాహనాల వరకు రూ.160 వరకు తగ్గాయి. ⇒ జనగామ –సూర్యాపేట రహదారిలో జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి ప్లాజా వద్ద రూ.5 నుంచి రూ.10 వరకు టోల్ చార్జీలు పెరిగాయి. కారు (నాలుగు టైర్ల వాహనాలు)కు రూ.35 నుంచి రూ.40, లైట్ కమర్షియల్ వాహనాలకు ప్రస్తుత రేటు రూ.60 ఉండగా ఇందులో ఎలాంటి మార్పు లేదు. బస్సు, ట్రక్కు వాహనాలకు ప్రస్తుతం రూ.125 ఉండగా 130కి పెరిగింది. రిటర్న్ జర్నీకి రూ.5 పెరిగింది. త్రీ యాక్సల్ కమర్షియల్ వాహనానికి ప్రస్తుతం రూ.135కి 140 పెరగగా, రిటర్న్ జర్నీకి రూ.5, ఫోర్ టూ సిక్స్ యాక్సల్స్ వాహనాలకు ప్రస్తుతం రూ.295 నుంచి 300కు పెరగగా రిటర్న్ జర్నీకి రూ.5 పెరిగింది. సెవన్ టూఓహెచ్సీ వాహనాలకు ప్రస్తుతం రూ.240 ఉండగా 245కి, రిటర్న్ జర్నీకి రూ.355 నుంచి 365కి పెరిగింది. ⇒ వరంగల్– హైదరాబాద్ జాతీయ రహదారిపై యాద్రాద్రి జిల్లా బీబీనగర్ మండలంలోని గూడూరు, జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోమల్ల టోల్ ప్లాజాల వద్ద కారు, జీపు, వ్యాన్, లైట్ మోటార్ వాహనాలకు ఒకవైపునకు రూ. 5 పెరిగింది. లైట్ కమర్షియల్ వాహనం, లైట్ గూడ్స్ వాహనం, మినీ బస్సు సింగిల్ జర్నీకి రూ. 5పెరగ్గా, రిటర్న్ జర్నీకి రూ.10 పెరిగింది. బస్సు, ట్రక్కుకు ఒకవైపునకు రూ.15 పెరిగింది. త్రీ యాక్సల్ కమర్షియల్ వాహనం ఒక వైపు రూ.10, రిటర్న్ జర్నీకి రూ.15 పెరిగింది. భారీ వాహనాలకు ఒక వైపునకు రూ.20 పెరగ్గా, రిటర్న్ జర్నీకి రూ.25 పెరిగింది. పెరిగిన వార్షిక ఫాస్టాగ్ పాస్ల రుసుము టోల్ప్లాజాల వద్ద స్వల్పంగా టోల్ రుసుమును తగ్గించినా, వార్షిక ఫాస్టాగ్ పాస్ల రుసుమును సైతం స్వల్పంగా పెంచారు. పెరిగిన ధరలు బుధవారం నుంచి అమలులోకి రానున్నాయి. ఇప్పటి వరకు వార్షిక ఫాస్టాగ్ పాస్ల రుసుము రూ.3000 ఉండగా దానిని రూ.3075కు పెంచారు. ట్రిప్పుల విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదు. -
మీరే పరిష్కరించుకోవాలి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల విషయంలో నదీ యాజమాన్య బోర్డు చేతులెత్తేసింది. ఇకపై నీటి తరలింపు, ఇతర అంశాలకు సంబంధించిన సమస్యలను మీకు మీరే పరస్పర సహకారంతో పరిష్కరించుకోవాలని తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు తేల్చిచెప్పింది. ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్ విషయంలో రెండు రాష్ట్రాలు ప్రస్తుతం అమల్లో ఉన్న కృష్ణా ట్రిబ్యునల్–1 తీర్పునకు లోబడి నడుచుకోవాలని సూచించింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖలకు మార్చి 30న లేఖ రాసింది. ఏపీ శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ కిందికి నీళ్లను విడుదల చేస్తుండడంతో జలాశయం ఖాళీ అవుతోందని, తమ సాగునీటి అవసరాలతో పాటు వేసవి తాగునీటి అవసరాలకి నిల్వలను పరిరక్షించడం కోసం జల విద్యుదుత్పత్తి జరపకుండా ఆ రాష్ట్రాన్ని కట్టడి చేయాలని కోరుతూ తెలంగాణ మార్చి 25న కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. ఈ లేఖకు స్పందిస్తూ రెండు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు తాజాగా లేఖ రాసింది. పెండింగ్ అంశాలతో బోర్డుకు ప్రాథమిక పరిమితులు.. ఉమ్మడి ఏపీకి కృష్ణా జలాల్లో ఉన్న వాటాలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ప్రాజెక్టుల వారీగా పునః కేటాయింపులు జరపడంతో పాటు ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్ నిర్వహణకు సంబంధించిన ఆపరేషన్ ప్రొటోకాల్స్ను జస్టిస్ బ్రిజేష్కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్–2 ఖరారు చేయాల్సి ఉంది. అలాగే ఏపీ పునర్విభజన చట్టం, 2014 ప్రకారం కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ మేరకు రెండు రాష్ట్రాలు ఉమ్మడి జలాశయాలను కృష్ణా బోర్డుకు అప్పగించాల్సి ఉంది. ఈ విషయాలు తేలకపోవడం.. తమ విధులకు సంబంధించి ప్రాథమిక పరిమితులుగా మారిందని కృష్ణా బోర్డు పేర్కొంది. ఇవన్నీ తేలేవరకు పరస్పర సహకారంతో సమస్యలు పరిష్కరించుకోవాలని రెండు రాష్ట్రాలకు స్పష్టం చేసింది. ఇకనైనా ఏపీని కట్టడి చేయాలి – కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి జరపకుండా ఏపీ జెన్కోను కట్టడి చేయాలని కృష్ణా బోర్డుకు తెలంగాణ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మార్చి 25న లేఖ రాసింది. ‘శ్రీశైలం జలాశయంలో నిల్వలు గత మార్చి 20 నాటికి 839.9 అడుగులకు పడిపోవడంతో కనీస నిల్వ మట్టానికి ఎగువన 7.824 టీఎంసీల నీళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. రాష్ట్రానికి తాగునీటితో పాటు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద సాగునీటి అవసరాల కోసం జలాశయంలో నిల్వలను పరిరక్షించాల్సి ఉంది. నాగార్జునసాగర్ కుడి ప్రధాన కాల్వ ఆయకట్టు అవసరాలను తీర్చడానికే ఏపీ.. శ్రీశైలం నుంచి సాగర్కు విద్యుదుత్పత్తి ద్వారా నీళ్లను విడుదల చేస్తోంది. దీంతో శ్రీశైలం జలాశయం వేగంగా ఖాళీ అవుతోంది. సాగర్ కుడి ప్రధాన కాల్వకు 132 టీఎంసీల కేటాయింపులుండగా, ఏపీ ఇప్పటికే 178.06 టీఎంసీలను తరలించుకుంది..’ అని తెలంగాణ వివరించింది. ప్రస్తుత నీటి సంవత్సరంలో ఏపీ ఏకంగా 738.25 టీఎంసీల (76.19శాతం) కృష్ణా జలాలను వాడుకోగా, తాము 230.76 టీఎంసీలు (23.18శాతం) మాత్రమే వాడుకున్నట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి ఏపీ ఇంకా నీళ్లు తీసుకోకుండా కట్టడి చేయాలని ఇప్పటికే పలుమార్లు లేఖలు రాసినా బోర్డు పట్టించుకోవడం లేదని, ఇకనైనా ఏపీని కట్టడి చేయాలని కోరింది. లెక్కలు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయండికేంద్ర జలశక్తి శాఖ 2015 జూన్ 18, 19న ఏపీ, తెలంగాణతో నిర్వహించిన సమావేశంలో త్రిసభ్య కమిటీ ద్వారా నీటి పంపకాలను పరిష్కరించుకోవాలని నిర్ణయించిన విషయాన్ని బోర్డు గుర్తు చేసింది. రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జల వివాదాల పరిష్కారానికి సీడబ్ల్యూసీ చైర్మన్ అధ్యక్షతన ఇటీవల కేంద్రం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన విషయం ప్రస్తావించింది. త్రిసభ్య కమిటీ, సీడబ్ల్యూసీ కమిటీతో పాటు ఇతర వేదికలను జల వివాదాల పరిష్కారానికి వినియోగించుకోవాలని సూచించింది. మరోవైపు ఒక్కో మేజర్, మీడియం ప్రాజెక్టుతో పాటు స్థూలంగా అన్ని మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా ప్రతినెలా వాడుకుంటున్న కృష్ణా జలాల లెక్కలను రెండు రాష్ట్రాలు క్రమం తప్పకుండా తమ వెబ్పోర్టల్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని కృష్ణా బోర్డు కోరింది. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల కోసం త్రిసభ్య కమిటీ సమావేశమైనప్పుడు ఈ గణాంకాలు అవసరం అవుతాయని తెలిపింది. -
దారుణం.. ఆస్పత్రి ఫ్లష్ట్యాంక్లో శిశువు మృతదేహం
హైదరాబాద్: కూకట్పల్లిలో దారుణం చోటు చేసుకుంది. కూకట్పల్లి రాందేవ్రావు ఆస్పత్రిలో అమానుష ఘటన వెలుగుచూసింది. ఆస్పత్రి మహిళా వాష్రూమ్ ఫ్లష్ ట్యాంకులో శిశువు డెడ్ బాడీ లభించడం హృదయ విదారకంగా మారింది. ఓ మహిళ ప్రసవం అనంతరం శిశువును ఫ్లష్ ట్యాంక్లో పడేసింది. ఆపై అక్కడ నుంచి పరారైంది. ప్రస్తుతం ఆ మహిళ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు పోలీసులు. యావత్ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఈ ఘటనతో అంతా షాక్కు గురౌతున్నారు. అప్పుడే పుట్టిన పసికందను ఇలా ఫ్లష్ ట్యాంక్లు పడేయడం ఏంటని విస్తుపోతున్నారు. -
శ్రీ వీర హనుమాన్ విజయ యాత్రకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
హైదరాబాద్: ఏప్రిల్ 2వ తేదీన జరగనున్న శ్రీ హనుమాన్ జయంతి శ్రీ వీర హనుమాన్ విజయ యాత్రను అత్యంత ప్రశాంతంగా, దిగ్విజయంగా నిర్వహించేందుకు నగర పోలీసు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ యాత్ర ఏర్పాట్లపై కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారి అధ్యక్షతన వివిధ ప్రభుత్వ శాఖలు, ఉత్సవ నిర్వాహకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన శ్రీరామ నవమి శోభాయాత్రను అన్ని శాఖల సహకారంతో విజయవంతంగా పూర్తి చేసినట్లే, హనుమాన్ విజయ యాత్రను కూడా శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని పిలుపునిచ్చారు.ఈసారి ప్రధాన యాత్రలో సుమారు 168 శోభాయాత్రలు కలవనున్న నేపథ్యంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 3,000 మంది పోలీసు సిబ్బందితో పాటు అదనపు సాయుధ బలగాలు, టాస్క్ ఫోర్స్ బృందాలను కీలక ప్రాంతాల్లో మోహరిస్తున్నట్లు వెల్లడించారు.యాత్ర నిర్వహణలో వాలంటీర్లకు తగిన శిక్షణ ఇచ్చి, రోప్ పార్టీ సభ్యులను అధిక సంఖ్యలో ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులకు సీపీ సూచించారు.యాత్రలో కొత్త వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, నిర్ణీత మార్గాల్లోనే యాత్ర సాగేలా చూడాలని కోరారు. ఫ్లైఓవర్లు, రైల్వే బ్రిడ్జిల దృష్ట్యా విగ్రహాల ఎత్తు విషయంలో జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా మళ్లింపులు చేపడతామని, ప్రజలు పోలీసుల సూచనలు పాటించాలని కోరారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని, రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.సమావేశం అనంతరం సీపీ గౌలిగూడ రామమందిరాన్ని దర్శించుకుని.. అక్కడి నుంచి తాడ్బండ్ హనుమాన్ దేవాలయం వరకు ఉన్న 12 కిలోమీటర్ల యాత్ర మార్గాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. -
HYD: ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లిలో దారుణం జరిగింది. ఇద్దరు కుమారులను హత్య చేసి తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన కైతలాపూర్ రాఘవేంద్ర కాలనీలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ సైతం రంగంలోకి దిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల దర్యాప్తులో తల్లి స్రవంతి ముందుగా ఇద్దరు కుమారులు కార్తిక్,కౌశిక్లను హత్య చేసింది. ఇద్దరు చనిపోయారని నిర్ధారించుకున్న తరువాత తల్లి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు, భార్య స్రవంతిని వదిలేసి భర్త ప్రవీణ్ రెండో పెళ్లి చేసుకున్నాడు. దీంతో అత్తమామలు స్రవంతికి కొంత స్థలాన్ని రాసిచ్చారు. అయితే, ఆ స్థలాన్ని తిరిగి ఇవ్వాలని భార్యను వేధిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, ఇదే కారణంగా భార్య, పిల్లలను భర్త ప్రవీణ్ హత్య చేసి ఉండవచ్చని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. -
రేపటి నుంచి తెలంగాణలో చికెన్ షాపులు బంద్
హైదరాబాద్: రిటైల్ చికెన్ షాపులకు ఇచ్చే మార్జిన్ పెంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చింది రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్. దీనిలో భాగంగా రేపట్నుంచి(బుధవారం, ఏప్రిల్ 1వ తేదీ) రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాపులను బంద్ చేస్తున్నట్లు వెల్లడించింది. పౌల్ట్రీ కంపెనీలు తమకు ఇచ్చే లాభం (మార్జిన్) తగ్గించడంతో వ్యాపారులు తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారని, ఈ మార్జిన్ను పెంచాలని డిమాండ్ చేస్తోంది చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్. గతంలో ఫౌల్ట్రి వాళ్ళు రిటైల్ షాపులకు కేజీకి 26 రూపాయలు మార్జిన్ ఇచ్చే వారని, గత 20 ఏళ్ళుగా 26 రూపాయలే మార్జిన్ ఉందని, కానీ ఇటీవల మార్జిన్ను16 రూపాయలకు తగ్గించారని, ప్రస్తుతం కేజీ చికెన్కు మార్జిన్ 30 రూపాయలు చేయాలని డిమాండ్ చేస్తుంది.అసోసియేషన్ నాయకుల చెబుతున్న దాని ప్రకారం, ప్రస్తుతం చికెన్ విక్రయాలపై వస్తున్న లాభం చాలా తక్కువగా ఉండటంతో షాపులు నిర్వహించడం కష్టంగా మారిందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో వ్యాపారులు జీవనోపాధి కొనసాగించడం సవాల్గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మార్జిన్ను తక్షణమే పెంచాలని డిమాండ్ చేస్తూ, తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు నిరసన కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులు బంద్ పాటించనున్నట్లు ప్రకటించారు.ఈ నిర్ణయం వల్ల సాధారణ వినియోగదారులు ఇబ్బందులు పడే అవకాశముంది. ముఖ్యంగా వేసవి కాలంలో చికెన్కు ఉన్న డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ధరలు మరింత పెరగవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రభుత్వం లేదా సంబంధిత అధికారులు త్వరగా జోక్యం చేసుకుని సమస్యకు పరిష్కారం చూపాలని వ్యాపారులు కోరుతున్నారు. లేదంటే ఈ బంద్ దీర్ఘకాలం కొనసాగి మార్కెట్పై ప్రభావం చూపే అవకాశం ఉంది. -
బెంగళూరులో విషాదం: తెలంగాణ టెకీ దంపతుల ఆత్మహత్య
బెంగళూరులో పెను విషాదం చోటు చేసుకుంది. తెలంగాణకు చెందిన యువ టెకీ దంపతులు బెంగళూరులో విషాదకరమైన స్థితిలో ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది.తెలంగాణలోని సిద్దిపేటకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ భానుచందర్ రెడ్డి కుంట (32), సోమవారం తన అపార్ట్మెంట్లోని ఒక గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భాను చందర్ ప్రముఖ టెక్ కంపెనీ ఐబీఎంలో పనిచేస్తున్నాడు. అతని భార్య బీబీ షాజియా సిరాజ్ (31) తమ ఇంటి తలుపు తాళం వేసి ఉండటాన్ని గమనించింది. ఆమె పదేపదే తలుపు తట్టినా లోపల ఉన్న భర్త స్పందించలేదు. దీంతో ఆందోళన చెందిన ఆమె భద్రతా సిబ్బందిని, ఇరుగుపొరుగు వారిని అప్రమత్తం చేసింది. వారు బలవంతంగా తలుపు తెరిచి చూడగా, భాను మృతదేహం కనిపించింది. ఇదీ చదవండి: నటీమణులు షాకింగ్ వెయిట్ లాస్ : కేవలం నీళ్లు, మద్యంకొన్ని నిమిషాల తర్వాత, షాజియా అదే నివాస సముదాయంలోని 17వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఇరుకుటుంబాల్లో విషాదంలో మునిగి పోయాయి. తెలంగాణలో కుటుంబ సభ్యులు దాఖలు చేసిన ఫిర్యాదుల ఆధారంగా రెండు వేర్వేరు బలవంతపు మరణాలు కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. మృతదేహాలనుపోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. వీరి మరణాలకు ప్రేరేపించిన అంశాలు ఆరోగ్య సమస్యలా? మానసిక క్షోభ? ఇతర కారణాలపై ఆరాతీస్తున్నారు. ఈ జంట ఆత్మహత్యలకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: పార్టీలో గొడవ : భార్యను బైక్ మీద నుంచి తోసేశాడు! -
సినిమాల్లో హీరోలు తాగితే తప్పు లేదా?: అనిరుధ్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: సినిమా వాళ్ళు చేస్తే ఒప్పు, రాజకీయ నాయకులం చెప్తే తప్పా? అంటూ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ఆయన సీఎల్పీ మీడియా హాల్లో మాట్లాడుతూ.. హీరోలకంటే రాజకీయ నాయకులకు ప్రైవసీ లేకుండా పోయింది.. సినిమాల్లో హీరోలు తాగితే తప్పులేదా?’’ అంటూ మండిపడ్డారు.‘‘ఖుషీ సినిమాలో పవన్ కళ్యాణ్ తాగుతాడు. ధూల్పేటలో గుడుంబా దొరుకుంటుందని సినిమాలో చూపెట్టాడు. బాలకృష్ణ సినిమాలో మామా ఏక్ పెగ్ లా అనే పాటలో నటించాడు. మందుబాబులం అనే పాట పాడుకుంటూ డ్యాన్స్ చేశారు. రాజకీయ నాయకులం కల్తీసారా తాగకండి అంటే బద్నాం చేస్తారా.. ఎక్కువ డ్రగ్స్ వాడేది సినీ ఇండస్ట్రీ లోనే’’ అని అనిరుధ్రెడ్డి ఆరోపణలు గుప్పించారు.‘‘సినీ యాక్టర్స్ అందరూ డ్రగ్స్ టెస్ట్ చేయించుకుంటే అభిమానులు హ్యాపీగా ఫీలవుతారు. సినిమా వాళ్లపైనే రూమర్స్ ఎక్కువ ఉన్నాయి. మా రాజకీయ నాయకులపై ఎక్కువగా రూమర్స్ లేవు. అందరూ సినిమా యాక్టర్స్ 90 రోజుల కోకసారి పాలికర్ టెస్ట్ చేయించుకోవాలి. నేను కూడా డ్రగ్స్ టెస్ట్ చేయించుకున్నా.. నా కొడుకు నన్ను డ్రగ్స్ గురించి అడిగాడు. ఇప్ప సారా ఇండియన్ లిక్కర్. ఇప్పసారాను బ్రిటిష్ వాళ్ళు బ్యాన్ చేశారు. ఇప్పసారాకు 3000 ఏండ్ల చరిత్ర ఉంది. నేను సారాకి వ్యతిరేకం. తాగమంటున్నాడని నాపై దుష్ప్రచారం చేస్తున్నారు.కల్తీ సారా కంటే ఇప్పసారా చాలా మంచిది. రాలిపోయిన ఇప్ప పూల నుండి సారా చేస్తారు. ఇప్ప సారా వల్ల లాభాలపై అనేక అధ్యయనాలు జరిగాయి. ఆదివాసీలు లిక్కర్ చేస్తే తప్పా?. కార్పొరేట్ కంపెనీలు లిక్కర్ చేస్తే కరెక్టా?. ప్రకృతి నుండి వచ్చే ప్రతిదీ మంచిది. ఇండియా నుండి తీసుకుపోతున్న ఇప్ప పువ్వుతో విదేశాల్లో సారా చేసి వేలల్లో సంపాదిస్తున్నారు. ఆదివాసీలు ఉన్నారు కాబట్టే అడవులు ఉన్నాయి’’ అని అనిరుధ్రెడ్డి పేర్కొన్నారు. -
కాకతీయ వర్శిటీలో దారుణం
సాక్షి, హనుమకొండ జిల్లా : హనుమకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో దారుణం చోటుచేసుకుంది. విద్యార్థులను ఎలుకలు కొరికిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థులు సమ్మక్క సారలమ్మ హాస్టల్లో నిద్రిస్తున్న సమయంలో 14 మంది విద్యార్థులపై ఎలుకలు దాడి చేశాయి.విశ్వవిద్యాలయంలో ఎలుకల దాడులు పలుమార్లు జరగడంపై విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు జాగ్రత్తలు తీసుకొని విద్యార్థులను ఎలుకల బారి నుంచి కాపాడాలని కోరుతున్నారు. -
“పోలీస్ అక్క”కు రేవంత్ అభినందనలు
హైదరాబాద్: ఢిల్లీ వేదికగా ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డును అందుకున్న నిర్మల్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జానకి షర్మిలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా మహిళల భద్రతపై అవగాహన కల్పించే విధంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా దాదాపు 7,000 మంది విద్యార్థినులు, మహిళలకు అవగాహన కల్పించడం ప్రశంసనీయమని అన్నారు.నిర్మల్ లో నిర్వహించిన "పోలీస్ అక్క" కార్యక్రమం యావత్ పోలీసు యంత్రాంగానికి మంచి ప్రేరణగా నిలుస్తుందని రేవంత్ రెడ్డి కొనియాడారు. సమస్య ఎదురైనప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై మహిళా పోలీసు అధికారులు పోలీస్ అక్కలుగా మారి మహిళలు, బాలికలకు ఆత్మవిశ్వాసం కల్పించడం అభినందనీయమన్నారు.మహిళల భద్రత కోసం, ముఖ్యంగా విద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసం పెంచడానికి ఒక వినూత్నమైన ఆలోచనతో “పోలీస్ అక్క” పేరిట నిర్మల్ జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్ఫూర్తిదాయకమైన కార్యక్రమానికి జాతీయ స్థాయిలో స్కోచ్ (SKOCH) అవార్డు లభించడం తెలంగాణకు గర్వకారణమని చెప్పారు.బండి సంజయ్ అభినందనలుప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు సాధించినందుకు ఐపీఎస్ జానకి షర్మిల, నిర్మల్ జిల్లా పోలీసులకు అభినందనలు అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ట్వీట్ చేశారు. నిర్మల్లో పోలీస్ అక్క వంటి కార్యక్రమాన్ని అమలు చేయడానికి విజన్ ఎలా ఉండాలో, హార్డ్వర్క్ ఎలా చేయాలో ఈ అవార్డు చాటిచెబుతుంది. పోలీస్ అక్క కార్యక్రమం కరుణతో కూడిన పోలీసింగ్ ఎలా జీవితాలను మార్చగలదో చూపించడానికి ఓ ఉదాహరణగా నిలుస్తుంది. మహిళా అధికారులను మార్గదర్శకులు, రక్షకులుగా నిలబెట్టడం ద్వారా ఈ కార్యక్రమం భద్రతను మాత్రమే కాకుండా యువతుల్లో నిజమైన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. తమ భవిష్యత్తును సురక్షితంగా ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది’ అని అన్నారు.తెలంగాణ డీజీపీ ప్రశంసలుకరుణతో కూడిన పోలీసింగ్ను పోలీస్ అక్క వంటి అద్భుతమైన కార్యక్రమం ప్రతిబింబిస్తుందని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. రక్షణతో పాటు అంతకుమించి ఆత్మవిశ్వాసం, మార్గదర్శకత్వం, భద్రత భావాన్ని అందించే స్ఫూర్తిదాయక ప్రయత్నమని చెప్పారు. నిర్మల్ జిల్లాలో జానకి షర్మిల నాయకత్వంలో సాగుతున్న ఈ కార్యక్రమానికి స్కోచ్ అవార్డు రావడం గర్వకారణమని అన్నారు. భద్రతతో కూడిన సమాజ నిర్మాణంలో ఇది గొప్ప ముందడుగని చెప్పారు. -
హనీ ట్రాప్ బారిన ప్రముఖులు? బయటకు రాని భారీ స్కాం!
ఖమ్మం జిల్లా: రాష్ట్రంలో ఎక్కడ సైబర్ క్రైం జరిగినా అందరి చూపు కల్లూరు డివిజన్పైనే పడుతోంది. కల్లూరు మండలం ఎర్రబోయినపల్లికి చెందిన పోట్రు ప్రవీణ్ ముఠా అయ్యప్ప సొసైటీ పేరుతో కాల్ సెంటర్ ఏర్పాటుచేసి రూ.90 కోట్ల మేర కొల్లగొట్టారంటూ గత ఏడాది నవంబర్ 29న హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేయడంతో ఈ ప్రాంతవాసులు ఉలికిపడ్డారు. అలాగే, డిసెంబర్ 24న రూ.547 కోట్ల మేర సైబర్నేరం వెలుగు చూడగా, ఇందులోనూ పోట్రు ప్రవీణ్తో పాటు మరికొందరే కాక మూల్ అకౌంట్లు ఇచ్చిన 45 మందిని అరెస్ట్ చేశారు. ఫిర్యాదుకు వెనుకంజకల్లూరు మండల కేంద్రంగా హనీ ట్రాప్తో సైబర్ నేరగాళ్లు రూ.6 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు కొల్లగొట్టారనే ప్రచారం చర్చనీయాంశంగా మారింది. సుమారు ఆరు నెలల క్రితం హానీ ట్రాప్ జరగగా, పలువురు ప్రముఖులు బాధితుల్లో ఉన్నట్లు తెలిసింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూడడం... కల్లూరు ప్రాంతవాసులు పలు సైబర్ నేరాల్లో నిందితులు కావడంతో పోలీసులు విచారణ చేపడుతున్నట్లు తెలిసింది. అయితే, హనీ ట్రాప్తో నష్టపోయినట్లు చెబితే వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలుగుతుందని ఎవరూ ఫిర్యాదు చేయలేదని సమాచారం. కానీ రూ.కోట్లల్లో మోసం కావడంతో పోలీసులు విచారణ చేడుతూనే హైదరాబాద్ సైబర్ క్రైం విభాగం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిసింది. ఇదేసమయాన గతంలో వెలుగు చూసిన సైబర్ నేరాల్లో ప్రధాన నిందితులు, వారి సన్నిహితుల పేర్లపై ఉన్న ఆస్తుల వివరాల కోసం రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు లేఖలు పంపించినట్లు సమాచారం. అంతేకాక నిందితుల్లో కొందరి బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేసినట్లు తెలిసింది.ధైర్యంగా ఫిర్యాదు చేయండిసైబర్ నేరాల్లో డబ్బు కోల్పోయిన బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేయాలి. బాధితుల గోప్యతకు భంగం ఏర్పడకుండా విచారణ చేపడుతాం. గతంలో నమోదైన సైబర్ కేసులు విచారణ దశలో ఉన్నాయి. హనీట్రాప్పై మాత్రం ఎలాంటి సమాచారం లేదు.– వసుంధర యాదవ్, కల్లూరు ఏసీపీ -
కారుపై చెత్త.. ఇదే శిక్ష
హైదరాబాద్: చెత్త తరలించేందుకు అవకాశం లేకుండా కార్లను అడ్డుగా పార్కింగ్ చేయడంతో కుత్బుల్లాపూర్ సర్కిల్ అధికారులు వినూత్న రీతిలో చర్యలు తీసుకున్నారు. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జీడిమెట్ల డివిజన్ దుర్గా ఎస్టేట్ కమ్యూనిటీ హాల్ వద్ద పరిశుభ్రత పనులు చేయడానికి సోమవారం ఉదయం జీహెచ్ఎంసీ సిబ్బంది వచ్చారు. రోడ్ల పక్కన పోగైన చెత్తను, పిచ్చి మొక్కలను తొలగించడానికి జేసీబీ, టిప్పర్లను తీసుకోవచ్చారు. సర్కిల్ ఉప కమిషనర్ శంకర్ సింగ్ కూడా వచ్చారు. అడ్డుగా ఉన్న కార్ల యజమానులకు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఉప కమిషనర్ ఆదేశాల మేరకు చెత్తను కార్లపై వేయించారు. దీంతో అటుగా వెళుతున్న వారు ఈ దృశ్యాన్ని ఆశ్చర్యంగా చూశారు. -
తాగిన మైకంలో కత్తి పట్టుకుని భార్యాపిల్లలపై..
రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తాగిన మైకంలో భార్యాపిల్లలపై కత్తితో దాడి చేశాడు ఓ కసాయి. ఆమనగల్ మండలం పులిగోని పల్లి తండాలో ఈ దారుణం జరిగింది. తాగిన మత్తులో ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా ప్రవర్తించాడు ఆ వ్యక్తి.బాణావత్ రాందాస్ నాయక్ తన భార్య, కుమారుడు, కూతుర్ని కత్తితో పొడిచాడు. దీంతో అతడి భార్య, కుమారుడు మృతి చెందగా, కూతురికి తీవ్రగాయాలయ్యాయి. ఆ బాలికకు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, ఈ బాణావత్ పాల్పడ్డ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. బాణావత్ రాందాస్ నాయక్ తన భార్య పేరు కవిత, కుమారుడి పేరు హర్ష, కూతురి పేరు ప్రణితగా గుర్తించారు. -
వేసవిలో వర్షాలు.. బాబోయ్ దంచికొట్టేస్తున్నాయ్..
హైదరాబాద్: వేసవికాలంలో వర్షాలు దంచికొడుతున్నాయ్. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు రైతులు నష్టపోయారు. ఇక, ఆంధ్రప్రదేశ్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో వానలు పడతాయని తెలిపారు. శ్రీకాకుళం, అల్లూరి, పోలవరం, కర్నూలు, నంద్యాలలో వర్షాలు కురుస్తాయని అన్నారు.తెలంగాణలోని జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడి వర్షం కురిసింది. గత అర్ధరాత్రి కూడా ఈదురు గాలులతో కూడిన వర్షానికి మామిడి, చింత, వరి పంటలు నేలరాలాయి. అకాల వర్షానికి రైతులు పంటలు నష్టపోయారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇవాళ ఉదయం పలుచోట్ల ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి.కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు బిక్కనూరు, దోమకొండ, మాచారెడ్డి, సదాశివనగర్, తాడ్వాయి మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మంగళవారం (మార్చి 31) ఉదయం తెల్లవారుజామున గంటపాటు భారీ వర్షం పడింది. అకాల వర్షంతో పంటలు దెబ్బతిన్నాయి. పలు మండలాల్లో అకాల వర్షానికి మొక్కజొన్న పంట నేలకొరిగింది. అలాగే, పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పలు గ్రామాలు అంధకారంలో ఉన్నాయి.మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో నిన్న రాత్రి వీచిన ఈదురు గాలులకు మామిడి పంటకు తీవ్ర నష్టం జరిగింది. కాయ నేల రాలడంతో ఆర్థికంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ప్రభుత్వం వెంటనే స్పందించి మామిడి రైతులకు నష్ట పరిహారమందించాలని కోరుతున్నారు.నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఈదురు గాలులతో కూడిన వర్షం వరి మాత్రమే కాకుండా మొక్కజొన్న పంటలను కూడా దెబ్బతీసింది. ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్, దొంకేశ్వర్ మాక్లూర్ ఆలూరు మండలంలోని పలు గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం కురిసింది. కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటలు పొలాల్లోనే నేలరాలిపోగా, కలాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసి నష్టపోయింది. -
తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా...మొత్తం 10 బిల్లులకు ఆమోదం
-
ఉత్సాహంగా నోస్టాల్జియా–2026 అలుమిని మీట్
హైదరాబాద్: బంజారాహిల్స్లోని ముఫకంజా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీ అలుమిని మీట్ సోమవారం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. నోస్టాల్జియా 2026 పేరుతో నిర్వహించిన ఈ అలుమిని మీట్లో వివిధ బ్యాచ్లకు చెందిన పూర్వ విద్యార్థులతో పాటు అధ్యాపకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎడ్యుకేషనల్ సొసైటీ గౌరవ కార్యదర్శి జాఫర్ జావెద్ మాట్లాడుతూ కాలేజీ నుంచి వెళ్ళిన పూర్వ విద్యార్థులు వివిధ రంగాల్లో స్థిరపడి మన విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని ఇది ఎంతో సంతోషకర విషయమని అన్నారు. ప్రతియేటా డిసెంబర్లో ఈ అలుమిని మీట్ ఇక నుంచి తప్పకుండా జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులకు నాటి అధ్యాపకులకు సొసైటీ చైర్మన్ మహ్మద్ వలియుల్లా జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీన్ డాక్టర్ హేమరాజ్, అడ్వజర్ కమ్ డైరెక్టర్ మహిపాల్ సింగ్రావత్, రిజిస్ట్రార్ నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. -
ఒంటరి మహిళలే అతని టార్గెట్
హైదరాబాద్: బెట్టింగ్ కు బానిసై.. ఒంటరి మహిళలను మభ్యపెట్టి కారులో తీసుకువెళ్లి హత్యలు చేస్తున్న సీరియల్ సైకో కిల్లర్ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. కృష్ణాజిల్లా చనగొల్లపాలెం గ్రామానికి చెందిన కునసాయి వాసు (29) మూడేళ్ల క్రితం నగరానికి వచ్చి జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–44లో ఓ వ్యాపారి ఇంట్లో డ్రైవర్గా ఉన్నాడు. కొంతకాలంగా బెట్టింగ్లకు బానిసయ్యాడు. ఎలాగైనా ఈజీ మనీ సంపాదించాలని పథకం వేశాడు. ఇందులో భాగంగానే ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసుకున్నాడు. ఫిలింనగర్ రోడ్ నెంబర్–16లో నివసించే బోయినపల్లి యాదమ్మ (70)ని పరిచయం చేసుకున్నాడు. ఈ నెల 11న తన కారులో ఆమెను ఎక్కించుకున్నాడు. నార్సింగ్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డుకు తీసుకువెళ్లి ఆమెను కిందికి దింపి తాడుతో ఉరి బిగించి కిరాతకంగా హత్య చేశాడు. తరువాత ఆమె ఒంటిపై ఉన్న నగలను తీసుకుని వెళ్లిపోయాడు. ఆ నగలు అమ్మిన డబ్బును మళ్లీ బెట్టింగ్లో పెట్టాడు. డిక్కీలో బ్యాగ్ మరిచిపోయానంటూ.. జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–44లో తాను పనిచేస్తున్న ఇంటి ఎదురుగానే ఓ ఫ్లాట్లో రోజూ బట్టలు ఉతికి ఇస్త్రే చేసే మంగతాయారమ్మ (60)ని టార్గెట్ చేశాడు. ఈ నెల 17న ఆమె పని ముగించుకుని బయటకు రాగానే జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–46లోని మస్తాన్నగర్లో దింపుతానని తన కారులో ఎక్కించుకున్నాడు. కొద్దిదూరం వెళ్లగానే డిక్కీలో బ్యాగ్ మరిచిపోయానంటూ కారు దిగి డిక్కీ తెరిచి అక్కడ ఉన్న తాడుతో వెనుక కూర్చొన్న మంగతాయారమ్మను గట్టిగా ఉరేసి హత్య చేశాడు. మోకిల పోలీస్స్టేషన్ పరిధిలో నిర్మానుష్య ప్రదేశంలో మృతదేహాన్ని పడేసి ఆమె ఒంటిపై ఉన్న నగలు, అదే రోజు తీసుకున్న జీతం రూ.16 వేలు తీసుకుని ఉడాయించాడు. మిస్సింగ్ కేసులు నమోదు మిస్సింగ్ కేసులు నమోదు చేసిన అనంతరం యాదమ్మ మృతదేహం కుళ్లిపోయి కనిపించగా నార్సింగ్ పోలీసులు జీహెచ్ఎంసీకి అప్పగించారు. అయితే మిస్సింగ్ కేసులను సీసీటీఎన్ఎస్లో పరిశీలిస్తున్న పోలీసులకు నార్సింగ్లో లభ్యమైన మృతదేహం ఫిలింనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో అదృశ్యమైన వృద్ధురాలు ఒక్కటేనని తేలింది. దీంతో అక్కడి సీసీ కెమెరాలు పరిశీలించగా వరుస హత్యలకు పాల్పడుతున్న వాసు నడిపిస్తున్న కారును గుర్తించారు. నిందితుడిని పట్టుకొని పోలీసులు విచారించగా బెట్టింగ్ల కోసమే ఈ ఇద్దరిని హత్య చేసినట్లుగా అంగీకరించాడు. ఒకవేళ పట్టుపడకపోతే తాను పనిచేస్తున్న ఇంటి యజమానురాలిని కూడా ఇలాగే తీసుకువెళ్లి హత్యకు పథకం వేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. -
పేలిన ట్రాన్స్ఫార్మర్.. ఎగిసిపడ్డ మంటలు
సాక్షి, హైదరాబాద్: మియాపూర్ మార్తాండనగర్ కాలనీలో ట్రాన్స్ఫార్మర్ పేలి అగ్ని ప్రమాదం సంభవించింది. అక్కడ ఉన్న టాటాఏస్ వాహనం, రెండు బైకులు దగ్ధమయ్యాయి. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ట్రాన్స్ఫార్మర్ పేలడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి, మంటలను అదుపు చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.2 రోజుల క్రితమే మణికొండలో.. వేసవికాలం కావడంతో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశాలు అధికంగా ఉంటాయి. హైదరాబాద్లోని మణికొండలో ఆదివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఓ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో అక్కడివారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.దీనిపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడంతో ప్రమాదం తప్పింది. నగరంలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలకు షార్ట్ సర్క్యూట్లు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. -
కమర్షియల్ సిలిండర్ రూ.6 వేలు
సాక్షి, హైదరాబాద్: ఏడాదిన్నరగా వాణిజ్య గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్న ఓ వ్యక్తి... పశ్చిమాసియా యుద్ధంతో నెలకొన్న కొరతను క్యాష్ చేసుకోసాగాడు. అతడి దందాపై సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు సోమవారం దాడి చేశారు. ప్రధాన నిందితుడు సహా పదిమందిని అరెస్టు చేసి, రూ.21 లక్షల విలువైన 414 సిలిండర్లు, పది వాహనాలు స్వా«దీనం చేసుకున్నట్టు డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ తెలిపారు. ఇన్స్పెక్టర్ సీహెచ్ యదేంధర్తో కలిసి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.ప్రధాన నిందితుడు మొహమ్మద్ అమీర్ భార్య పేరుతో గ్యాస్ డీలర్షిప్ తీసుకుని అఫ్జల్గంజ్లో ‘మెట్రో గ్యాస్ ఏజెన్సీ’ నిర్వహిస్తున్నాడు. దీనికి శంషాబాద్లో భారీ గోదాం కూడా ఉంది. అయితే, బ్లాక్ మార్కెట్ దందాకు పథకం వేసిన అమీర్.. ఏడాదిన్నర క్రితం బంజారాహిల్స్ నాగార్జున సర్కిల్ సమీపంలోని ఓ ప్రార్థన స్థలం ప్రాంగణాన్ని నెలకు రూ.5 వేలకు అద్దెకు తీసుకున్నాడు. 16 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి అక్రమంగా సిలిండర్లను నిల్వ ఉంచాడు. మొహమ్మద్ యూసుఫ్ను అక్కడ నియమించాడు. గ్యాస్ కోసం సంప్రదించే వ్యాపారులను ఈ ప్రాంతానికి వెళ్లమని సూచించేవాడు. ప్రభుత్వం నిర్దేశించిన ధర ప్రకారం వాణిజ్య సిలిండర్ను రూ.2,100కు విక్రయించాలి. కానీ, కొన్ని రోజులు రూ.4 వేల చొప్పున అమ్మారు. ఇటీవల గ్యాస్ సంక్షోభం ఏర్పడడంతో రూ.6 వేలకు పెంచేశారు. యూసుఫ్ చాలాసార్లు రూ.500 అ«ధికంగా వసూలు చేశాడు. అమీర్.. సిలిండర్ల డెలివరీకి మొహమ్మద్ ఇస్మాయిల్, రామారావు, లోక్ కుమార్లను, మొహమ్మద్ సక్రుద్దీన్, మొహమ్మద్ ముంతాజ్ అన్సారీ, మొహమ్మద్ మినాజ్ అన్సారీ, రాజేష్ పాల్ను కూలీలు, డ్రైవర్లుగా ఏర్పాటు చేసుకున్నాడు. పది వాహనాల్లో రోజూ 30 నుంచి 40 సిలిండర్ల విక్రయాలు జరుగుతున్నాయి. దీనిపై జూబ్లీహిల్స్ జోన్ టాస్్కఫోర్స్కు సమాచారం రాగా.. అమీర్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి పథకం వేశారు. డెకాయ్ ఆపరేషన్కు శ్రీకారం చుట్టారు. వారం రోజులుగా అమీర్ను సంప్రదిస్తున్న పోలీసులు ఆరు సిలిండర్లు కావాలని అడుగుతున్నారు. రోజురోజుకు రేటు పెంచేస్తున్న అతడు సోమవారం సిలిండర్ రూ.6 వేలకు విక్రయించడానికి అంగీకరించి గోదాం చిరునామా ఇచ్చాడు. ఇన్స్పెక్టర్ యదేంధర్ నేతృత్వంలో టాస్్క ఫోర్స్ ఎస్సై డి.రవిరాజ్ తమ బృందంతో దాడి చేశారు. అమీర్కు గోదాం కోసం అద్దెకిచి్చన ప్రార్థనా స్థలం అధ్యక్షుడు రామ్రాజ్ సింగ్నూ అరెస్టు చేశారు. -
తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఇల్లు సీజ్
సాక్షి, హైదరాబాద్: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నాయకురాలు జయలలితకు చెందిన హైదరాబాద్లోని ఇంటిని అధికారులు సీజ్ చేశారు. శ్రీనగర్ కాలనీలోని జయలలిత ఇంటిని అధికారులు సీజ్ చేశారు. రూ.83 లక్షల ఇంటి పన్ను పెండింగ్లో ఉండడంతో చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.కాగా, జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె పలుసార్లు తమిళనాడుకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆమెను అభిమానులు పురట్చి తలైవి (విప్లవ నాయకురాలు), అమ్మ అని పిలుచుకునేవారు. రాజకీయాల్లోకి రాకముందు జయలలిత సినిమాల్లోనూ నటించారు. మరోవైపు, జయలలితకు భారీగా ఆస్తులు ఉన్నాయి. జయలలితపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు అప్పట్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తులు గతంలో తమిళనాడు ప్రభుత్వానికి చేరాయి. పసిడి ఆభరణాలు, నగదుతో పాటు ఆస్తుల పత్రాలను మూడు ట్రంకు పెట్టెల్లో అధికారులు తమిళనాడు సర్కారుకు అప్పగించారు. -
అత్యవసర ఖర్చులకూ దిక్కులేదు
సాక్షి, హైదరాబాద్: ఆదాయం, వ్యయాల మధ్య వ్యత్యాసం భారీగా పెరిగి అత్యవసర ఖర్చులకూ ఖజానాలో డబ్బులు లేకపోవడంతో 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నుంచి మొత్తం 123 రోజులపాటు చేబదులు (ఓవర్ డ్రాఫ్ట్) రుణాలను తీసుకుందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) అక్షింతలు వేసింది. ప్రతిరోజూ రాష్ట్ర ఖజానాలో కనీసం రూ.1.38 కోట్ల నిధుల నిల్వ ఉండాలని ఆర్బీఐ నిర్దేశించగా, 2024–25లో ఏకంగా 123 రోజులపాటు అంతకంటే తక్కువ నిల్వలు ఉన్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో మొత్తం రూ.37,457 కోట్లను చేబదులుగా ఆర్బీఐ నుంచి తీసుకుంది. 2024–25లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ‘అకౌంట్స్ ఎట్ ఎ గ్లాన్స్’ పేరుతో కాగ్ రూపొందించిన నివేదికను సోమవారం శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అత్యవసర ఖర్చులకూ ఖజానాలో నిధులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ఆర్బీఐ నుంచి తాత్కాలికంగా చేబదులు తీసుకోవచ్చు. ఆదాయం సమకూరగానే ఆర్బీఐకి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014–15లో 62 రోజులు మాత్రమే చేబదులు తీసుకోగా, 2022–23లో అత్యధికంగా 328 రోజులపాటు తీసుకున్నారు. 2024–25లో 123 రోజులకి చేబదులు రుణాలు తగ్గడం గమనార్హం. 363 రోజులూ రుణాలే... రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ, వ్యయాల మధ్య అంతరాన్ని పూడ్చడానికి 2024–25లో ఆర్బీఐ నుంచి ప్రభుత్వం 298 రోజులపాటు రూ.64,188 కోట్ల వేస్ అండ్ మీన్స్ రుణాలను తీసుకోగా, 363 రోజులపాటు రూ.27,730 కోట్ల ప్రత్యేక రుణాలను తీసుకుంది. ఈ తాత్కాలిక రుణాలను మూడు నెలల్లో చెల్లించాల్సి ఉండగా, రూ.5842 కోట్లను గడువులోగా చెల్లించడంలో విఫలమైంది. రాష్ట్రం 2024–25లో రూ.9,420 కోట్ల రెవెన్యూ లోటు, రూ.48,922 కోట్ల ద్రవ్యలోటును కలిగి ఉంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఆదాయం, వ్యయాల మధ్య వ్యత్యాసాన్ని రెవెన్యూ లోటుగా, ఆదాయం (రుణాలు మినహాయించి), వ్యయాల మధ్య వ్యత్యాసాన్ని ద్రవ్యలోటుగా పరిగణిస్తారు. రూ.46,370 కోట్ల అప్పులను సమీకరించడం ద్వారా ద్రవ్యలోటును ప్రభుత్వం అధిగమించింది. ఆ సంవత్సరంలో రాష్ట్రానికి మొత్తం రూ.1,67,804 కోట్ల ఆదాయం రాగా, అందులో 45 శాతాన్ని జీతభత్యాల రూపంలో తప్పనిసరిగా చేయాల్సిన ఖర్చులకే ప్రభుత్వం వెచ్చించాల్సి వచ్చింది. జీతాలకు రూ.30,277 కోట్లు, వడ్డీల చెల్లింపులకు రూ.27,803 కోట్లు, పెన్షన్ల చెల్లింపులకు రూ.16,942 కోట్లను ఖర్చు చేసింది. ఏటేటా పెరుగుతున్న అప్పులు రాష్ట్ర అప్పులు ఏటేటా పెరుగుతున్నాయి. 2020–21లో రూ.2,78,018 కోట్లు ఉన్న ప్రభుత్వ అప్పులు 2024–25 నాటికి రూ.4,47,493 కోట్లకు ఎగబాకాయి. ఇక ప్రభుత్వ పూచీకత్తు అప్పులు 2020–21లో రూ.1,05,007 కోట్లు ఉండగా, 2024–25 నాటికి రూ.2,41,528 కోట్లకు చేరాయి. ప్రభుత్వ అప్పులు, ప్రభుత్వం పూచీకత్తు ఇచ్చిన అప్పుల మొత్తం సైతం రూ.3.83 లక్షల కోట్ల నుంచి రూ.6.89 లక్షల కోట్లకు పెరిగింది. -
ఒంటరి మహిళలే లక్ష్యం
బంజారాహిల్స్: బెట్టింగ్లకు బానిసై ఒంటరి మహిళలను మాయమాటలతో తన కారులో ఎక్కించుకుని దారుణంగా హత్య చేసి ఒంటిపై ఉన్న నగలతో ఉడాయించిన యువకుడిని జూబ్లీ హిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. కృష్ణాజిల్లా చినగొల్లపాలెం గ్రామానికి చెందిన కునసాయి వాసు (29) మూడేళ్ల క్రితం నగరానికి వచ్చి ఓ వ్యాపారి ఇంట్లో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా బెట్టింగ్లకు బానిసై తీవ్రంగా నష్టపోతున్న అతను ఈజీ మనీ కోసం పథకం వేశాడు. ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసుకుని గత ఐదు వారాల నుంచి ఫిలింనగర్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించసాగాడు. ఓఆర్ఆర్ సర్విస్ రోడ్డుకు తీసుకెళ్లి.. ఫిలింనగర్ రోడ్డునెంబర్–16లో నివసించే బోయినపల్లి యాదమ్మ (70)ని వాసు పరిచయం చేసుకున్నాడు. ఈ నెల 11న ఆమెకు మాయమాటలు చెప్పి తనకారులో ఎక్కించుకున్నాడు. మధ్యాహ్నం నేరుగా నార్సింగ్ పోలీస్స్టేషన్ పరిధి లోని ఓఆర్ఆర్ సర్విసు రోడ్డుకు తీసుకువెళ్లి ఆమెను కిందికి దింపి నెట్టేసి తాడుతో ఉరి బిగించి కిరాతకంగా హత్య చేశాడు. ఆమె ఒంటిపై ఉన్న నగలను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. డిక్కీలో బ్యాగ్ మరిచిపోయానంటూ.. ఆ తర్వాత జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–44లో తాను పనిచేస్తున్న ఇంటి ఎదురుగానే ఓ ఫ్లాట్లో బట్టలు ఉతికి ఇస్త్రీ చేసే మంగతాయారమ్మ (60)ని వాసు టార్గెట్ చేశాడు. ఈనెల 17న ఆమె పని ముగించుకుని మధ్యాహ్నం బయటకు రాగానే జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–46లోని మస్తాన్నగర్లో దింపుతానని ఆమెను తన కారులో ఎక్కించుకున్నాడు. పట్టపగలు కారు కొద్దిదూరం వెళ్లగానే డిక్కీలో బ్యాగ్ మరిచిపోయానంటూ కారు దిగి డిక్కీ తెరిచి అక్కడ ఉన్న తాడుతో వెనుక కూర్చొన్న మంగతాయారమ్మను గట్టిగా ఉరేసి హత్య చేశాడు. అలాగే వెనుక సీట్లో ఆమెను పడుకోబెట్టి మోకిళ్ల పోలీస్స్టేషన్ పరిధిలో నిర్మానుష్య ప్రదేశంలో పడే సి ఆమె ఒంటిపై ఉన్న నగలు, అదే రోజు తీసుకున్న జీతం రూ.16 వేలు తీసుకుని ఉడాయించాడు. మిస్సింగ్ కేసులు నమోదు అటు ఫిలింనగర్ పోలీస్స్టేషన్లో యాదమ్మ మిస్సింగ్ కేసు, ఇటు జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగతాయరమ్మ మిస్సింగ్ కేసులను పోలీసులు నమోదు చేశారు. యాదమ్మ మృతదేహం కుళ్లిపోయి కనిపించగా నార్సింగ్ పోలీసులు స్వాధీనం చేసుకుని గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదు చేసి జీహెచ్ఎంసీకి అప్పగించారు. అయితే మిస్సింగ్ కేసులను సీసీటీఎన్ఎస్లో పరిశీలిస్తున్న పోలీసులకు నార్సింగ్లో లభ్యమైన మృతదేహం ఫిలింనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో అదృశ్యమైన వృద్ధురాలు ఒక్కటేనని తేలింది.దీంతో అక్కడి సీసీ కెమెరాలు పరిశీలించగా వరుస హత్యలకు పాల్పడుతున్న వాసు నడిపిస్తున్న కారును గుర్తించారు. నిందితుడిని పట్టుకొని పోలీసులు విచారించగా విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. బెట్టింగ్ల కోసమే ఈ ఇద్దరిని హత్య చేసినట్లుగా పోలీసుల ముందు నిందితుడు అంగీకరించాడు. జూబ్లీహిల్స్ పోలీసులు సీరియల్ సైకో కిల్లర్ వాసును అరెస్టు చేశారు. మంగతాయారమ్మ ఒంటిపై ఉన్న నగలు అమ్మగా వచ్చిన డబ్బును కూడా బెట్టింగ్ల్లో పెట్టాడు. ఒకవేళ నిందితుడు పట్టుపడకపోతే తాను పనిచేస్తున్న ఇంటి యజమానురాలిని కూడా ఇలాగే తీసుకువెళ్లి హత్యకు పథకం వేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. -
కరడుగట్టిన నక్సలిజం ఖతం: అమిత్ షా
సాక్షి, న్యూఢిల్లీ: దశాబ్దాలపాటు దేశాన్ని, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలను వణికించిన వామపక్ష తీవ్రవాదం (నక్సలిజం) దాదాపు అంతమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం లోక్సభ సాక్షిగా ప్రకటించారు. ముఖ్యంగా తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కేంద్ర బలగాలు చేపట్టిన చరిత్రాత్మక ’ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్’ విజయవంతం కావడంతో తెలంగాణ పూర్తిస్థాయిలో నక్సల్స్రహిత రాష్ట్రంగా మారిందని చెప్పారు. దేశవ్యాప్తంగా నక్సలిజాన్ని పారదోలేందుకు భద్రతా బలగాలు చేసిన త్యాగాలను కొనియాడుతూ సభలో సెల్యూట్ చేశారు. అదే సమయంలో వామపక్ష తీవ్రవాదానికి దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబం ఏ విధంగా అండగా నిలిచిందో వివరిస్తూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్.. భీకర పోరు ‘తెలంగాణ–ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో 50 కి.మీ. పొడవు, 37 కి.మీ. వెడల్పు ఉన్న ఒక కొండపై మావోయిస్టులు ఏళ్ల తరబడి శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్క డ సోలార్ విద్యుత్, ఐఈడీ (బాంబుల) తయారీ ఫ్యాక్టరీలు, ఐదేళ్లకు సరిపడా ఆహార ధాన్యాలు నిల్వ ఉంచుకున్నారు. 400 నుంచి 500 మంది కేడర్ అక్కడ ఉన్నారు. ఆ స్థావరాన్ని ఛేదించేందుకు కోబ్రా, సీఆర్పీఎఫ్, డీఆర్జీ, ఛత్తీస్గఢ్ పోలీసులు సంయుక్తంగా 21 రోజులపాటు ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ చేపట్టారు. 45 డిగ్రీల భగభగమండే ఎండలో మన జవాన్లు రోజుకు కేవలం 300 మిల్లీలీటర్ల నీటిని తాగుతూ ధైర్యంగా పోరాడారు. ఈ ఆపరేషన్లో 30 మందికిపైగా మావోయిస్టులు హతమయ్యారు. మిగిలిన వారు లొంగిపోయారు లేదా పారిపోతూ పోలీసులకు చిక్కారు. దీంతో బస్తర్, మహారాష్ట్ర, తెలంగాణలో మావోయిస్టుల ఉనికి తుడిచిపెట్టుకుపోయింది. అయితే, ఈ ఆపరేషన్ సమయంలో నక్సల్స్ పైకి (ఉత్తరం వైపు) రాకుండా అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరగా వారు నిరాకరించారు. కిందికి వస్తే మాత్రం ఆపుతామని చెప్పారు‘ అని అమిత్ షా పేర్కొన్నారు. తెలంగాణలో తుడిచిపెట్టుకుపోయారు 2024 ప్రారంభంలో మావోయిస్టు కేంద్ర కమిటీ, పొలిట్బ్యూరోలో 21 మంది సభ్యులు ఉండగా.. ఇప్పుడు వారు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయారని అమిత్షా తెలిపారు. ‘ఒకరు పట్టుబడ్డారు, ఏడుగురు లొంగిపోయారు, 12 మంది హతమయ్యారు, ఒకరు మాత్రమే పరారీలో ఉండి చర్చలకు మొగ్గుచూపుతున్నారు. అలాగే దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలోని 37 మందికిగాను ఎవరూ మిగల్లేదు. తెలంగాణ విషయానికి వస్తే, రాష్ట్ర కమిటీలో ఉన్న వారిలో ఆరుగురు లొంగిపోయారు, ముగ్గురు ఎన్కౌంటర్లో చనిపోయారు. ప్రస్తుతం తెలంగాణలో ఒక్క నక్సలైట్ కూడా లేడు‘ అని చెప్పారు. బసవరాజు, హిడ్మా, వివేక్, పల్లూరి ప్రసాదరావు (చందన), వాసుదేవ్ వంటి అగ్రనేతలు ఎన్కౌంటర్లలో చనిపోవడం లేదా లొంగిపోయారని తెలిపారు. కాంగ్రెస్ దన్నుతోనే నక్సలిజం ‘1970లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ’అంతరాత్మ ప్రబోధానుసారం ఓటు వేయండి’ అని పిలుపునిచ్చి, నీలం సంజీవరెడ్డికి వ్యతిరేకంగా మావోయిస్టుల మద్దతు తీసుకున్నారు. ఆ మద్దతును ఆసరాగా చేసుకుని మావోయిస్టులు దేశంలోని 17 శాతం భూభాగానికి, 10 శాతం జనాభాకు విస్తరించారు. తిరుపతి నుంచి పశుపతినాథ్ వరకు రెడ్ కారిడార్ ఏర్పాటు చేసుకున్నారు‘ అని అమిత్షా చెప్పారు. అలాగే నక్సల్స్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేత మహేంద్ర కర్మ ప్రారంభించిన ’సల్వాజుడుం’ ఉద్యమాన్ని 2011 జూలై 5న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం చట్టవిరుద్ధమని ప్రకటించిందని, ఆ తీర్పు వల్లే నిరాయుధులైన ఎంతోమంది సల్వాజుడుం కార్యకర్తలను, ఆదివాసీలను నక్సల్స్ ఊచకోత కోశారని చెప్పారు. ఆ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తినే విపక్షాలు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టాయని, ఇదీ కాంగ్రెస్కు నక్సల్స్తో ఉన్న లాలూచీ అని దుయ్యబట్టారు. ‘రాహుల్ గాంధీ రాజకీయ జీవితంలో అనేకసార్లు నక్సల్స్ సానుభూతిపరులతో కనిపించారు. ఆయన జరిపిన భారత్ జోడో యాత్రలో నక్సల్స్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్లకు చెందిన వారు పాల్గొన్నారు. 2010లో ఒడిశాలో లాడో సికాకాతో, 2018లో హైదరాబాద్లో గద్దర్తో రాహుల్ వేదిక పంచుకున్నారు‘ అని అమిత్షా పేర్కొన్నారు. 1970 నుంచి 2026 మార్చి వరకు వామపక్ష తీవ్రవాదానికి కాంగ్రెస్ మద్దతు ఇస్తూనే ఉందని, నక్సల్స్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన 20 వేల మంది పౌరులు, జవాన్ల మరణాలకు కాంగ్రెస్ బాధ్యత వహించాలన్నారు. -
సెలెక్ట్ కమిటీకి విద్వేష బిల్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్వేష ప్రసంగాలు, నేరాల నిరోధక బిల్లు–2026ను సెలెక్ట్ కమిటీకి పంపాలని శాసనసభ తీర్మానించింది. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టగా, ప్రతిపక్ష పార్టీలు బీజేపీ, ఎంఐఎం, సీపీఐ తీవ్రంగా వ్యతిరేకించడంతో దానిని సెలెక్ట్ కమిటీకి పంపాలని శాసనసభా వ్యవహారాల మంత్రి డి.శ్రీధర్బాబు ప్రతిపాదించారు. దీనికి సభ ఆమోదం తెలిపింది. సెలెక్ట్ కమిటీ ఎంపిక అధికారాన్ని స్పీకర్కు కట్టబెడుతూ తీర్మానం చేసింది. రాష్ట్రంలో పెరుగుతున్న విద్వేష పూరిత ప్రసంగాలు, విద్వేష పూరిత నేరాలను అరికట్టేందుకు ప్రత్యేకంగా పటిష్టమైన చట్టం అవసరమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సభలో బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కక్ష సాధింపు ఉండదు వాక్ స్వాతంత్య్రాన్ని హరించడానికి ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చిందని విపక్ష పార్టీలు చేసిన ఆరోపణలను పొన్నం తోసిపుచ్చారు. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుగా ఆర్టికల్ 19(1)(ఏ)లో వాక్ స్వాతంత్య్రాన్ని చేర్చి దాని తో పాటే సహేతుకమైన పరిమితులను విధించిన విషయాన్ని గుర్తు చేశా రు. తెలంగాణ ఎల్లప్పుడూ గంగా–జమున సంస్కృతికి ప్రతీకగా నిలిచిందని, వివిధ మతాలు, సంస్కృతులు కలిసి మెలిసి జీవించే రాష్ట్రంగా గుర్తింపు పొందిందని చెప్పారు. అయితే ఇటీవలి కాలంలో ముఖ్యంగా సోషల్ మీడియా వేదికల ద్వారా విద్వేష ప్రసంగాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో మనుషులు, సమాజం మధ్య ఇవి విభేదాలను పెంచి శాంతి, సామరస్యానికి ముప్పు కలిగిస్తున్నాయని అన్నారు. ప్రస్తుత చట్టాలు మారుతున్న పరిస్థితులకు సరిపోవడం లేదని, అందుకే కొత్త చట్టం అవసరమైందని పేర్కొన్నారు. అయితే ఎవరి పట్ల కక్ష సాధింపు ఉండదని స్పష్టం చేశారు. పదాలు, సంకేతాలు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లు మొదలైనవన్నీ ఈ చట్టం పరిధిలోకి వస్తాయని వివరించారు. ఈ చట్టం కింద నమోదయ్యే నేరాలు విచారణార్హమైనవిగా, బెయిల్ ఇవ్వలేనివిగా ఉంటాయని మంత్రి వివరించారు. విద్వేషపూరిత కంటెంట్ను వెంటనే తొలగించే అధికారాన్ని సంబంధిత అధికారులకు ఇచ్చినట్లు, పునరావృత నేరస్తులపై కఠిన చర్యలు తీసుకునే అధికారాన్ని మేజిస్ట్రేట్లకు కల్పించినట్లు తెలిపారు. కాగా బాధితులకు పరిహారం కల్పించే విధానాన్ని కూడా బిల్లులో చేర్చినట్లు చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని అణచివేయాలనే కుట్ర: బీజేపీ బిల్లుపై బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని అణచి వేయడానికి ఈ బిల్లును తెచ్చారని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు. శాంతిభద్రతల పేరుతో తీసుకొచ్చిన ఈ చట్టం మానవ హక్కుల ఉల్లంఘనలా ఉందని చెప్పారు. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై కక్ష సాధించే విధంగా నిబంధనలు ఉన్నాయని అన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛను హరించే ప్రయత్నంగా ఈ బిల్లును అభివర్ణించారు. ఆధారాలు లేకుండానే అరెస్టులు చేసే అవకాశం కల్పిస్తోందని, నేరం రుజువు కాకముందే జైలుకు పంపేలా నిబంధనలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పైడి రాకేష్రెడ్డి కూడా మాట్లాడారురు. బిల్లును ఉపసంహరించుకోవాలి: ఎంఐఎం, సీపీఐ భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగేలా ఉన్న బిల్లును ఉపసంహరించుకోవాలని సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు కోరారు. ఇలాంటి చట్టాలు బ్రిటిష్ కాలంలో ఉండేవని, ప్రస్తుతం మళ్లీ వాటిని తీసుకురావడం వల్ల ప్రజల హక్కులకు, ప్రజాస్వామ్యానికి భంగం వాటిల్లుతుందని అన్నారు. ఎంఐఎం సభ్యుడు అహ్మద్ బిన్ బలాలా మాట్లాడుతూ.. మాట్లాడే స్వేచ్ఛను కూడా హరించే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. సెలెక్ట్ కమిటీకి పంపించి తదనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఈ చట్టం అవసరం: కాంగ్రెస్ సభ్యులు విద్వేషపూరిత ప్రసంగాలను, కంటెంట్ను నిరోధించేందుకు తెచ్చిన ఈ చట్టం స్వాగతించదగినదని, అదే సమయంలో బిల్లు ద్వారా వచ్చే అధికారాలు దుర్వినియోగం కాకుండా చూడాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ సభ్యుడు వంశీకృష్ణ అన్నారు. మాట్లాడే హక్కు పేరుతో స్టేజీల మీద, సోషల్ మీడియాలో వ్యక్తులను, సమూహాలను ఇష్టానుసారంగా తూలనాడే స్థితికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ ఎమ్మెల్యేలు డాక్టర్ రాగమయి, లక్ష్మారెడ్డి, యశస్వినిరెడ్డి, శంకరయ్య, కేఆర్ నాగరాజు, నారాయణ్ గణేష్, మరో సభ్యుడు దానం నాగేందర్ అభిప్రాయపడ్డారు. -
కల్తీపై కొరడా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆహార పదార్థాలు, వస్తువుల కల్తీపై హైడ్రా, ఈగల్ తరహా పకడ్బందీ నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి వివిధ రాష్ట్రాల్లో ప్రస్తుతమున్న వ్యవస్థలను, చట్టాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆహారంతో పాటు వివిధ రూపాల్లో కల్తీ వల్ల కేన్సర్, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ కేన్సర్ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా..సోమవారం శాసనమండలి కాన్ఫరెన్స్ హాలులో టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్కుమార్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతో కలిసి సీఎం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. వ్యవసాయం, పౌష్టికాహారంపై కమిటీ.. ‘ఆహార భద్రత కల్పనలో భాగంగా అందరికీ నాణ్యమైన ఆహారాన్ని అందించాల్సి ఉంది. నాణ్యమైన ఆహారంతోనే బాధ్యత తీరిపోయిందనుకోకుండా..వ్యవసాయం, పౌరసరఫరాలు, సంబంధిత ఇతర శాఖలతో కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేసి పౌష్టికాహారం అందించేందుకు, జబ్బులు రాకుండా నివారించేందుకు ఏం చేయాలి అని దానిపై చర్యలు తీసుకుంటాం. విద్యలో నాణ్యత, సాంకేతిక నైపుణ్యాలతో పాటు విద్యార్థులకు భోజనం, పౌష్టికాహారం అందించడం మా ప్రభుత్వ తదుపరి లక్ష్యం. అలాగైతే మోదీ ఫొటో పెడతాం.. సన్న బియ్యం పథకం అమలు కోసం ఏడాదికి రూ.14,560 కోట్లు ఖర్చు చేస్తున్నాం. రాష్ట్రంలోని 86 శాతం మందికి అంటే.. 3.39 కోట్ల మందికి (గతంలోని 2.80 కోట్ల మంది నుంచి 3.39 కోట్లకు పెరుగుదల) సన్న బియ్యం పథకం అందుతోంది. రేషన్కార్డుల పంపిణీ కూడా సంతృప్త స్థాయి (సాచురేషన్ లెవల్)లో వందశాతం పూర్తి చేస్తాం. కేంద్ర ప్రభుత్వం వంద శాతం సన్న బియ్యం ఇస్తే ప్రధాని మోదీ ఫొటో పెడతాం. దేశవ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ చేపడితే బాగుంటుందని కేంద్రానికి సూచిస్తున్నాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. పంటల మార్పిడి జరగాలి ‘ప్రస్తుతమున్న పరిస్థితుల్లో లాభసాటి పంట వరి ఒక్కటే కాదన్న విషయాన్ని రైతులు గ్రహించాలి. రాష్ట్ర భూమి, నైసర్గిక స్వరూపం, తదితరాలకు అనుగుణంగా పంటల మార్పిడి జరగాలి. ప్రభుత్వం కూడా వాణిజ్య పంటల వైపు రైతులను ప్రోత్సహిస్తోంది. అయితే ఈ విషయంలో రైతుల్ని ఒత్తిడి చేయం. వారికి తగిన అవగాహన కల్పిస్తాం. వరి వేస్తే ఉరేనంటూ గతంలో మాజీ సీఎం కేసీఆర్ బెదిరించారు. ఈ విషయంలో ఆయనకు, నాకు ఎలాంటి పోలిక లేదు. మేము బోనస్ కూడా ఇస్తున్నాం. పంటల మార్పిడిపై వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలు, ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు, మేధావులతో టాస్్కఫోర్స్ కమిటీ వేస్తాం. వారిచ్చే నివేదికపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం. రవాణా, కోల్డ్ స్టోరేజీలు, నిల్వ చేసే వ్యవస్థ తదితరాలపైనా సమగ్ర విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఏదైనా పరిస్థితి ఎదురైతే ప్రభుత్వం జోక్యం చేసుకుని ఓ నిధి ఏర్పాటు చేసేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం..’ అని సీఎం వెల్లడించారు. బ్రూటల్ మెజారిటీతో నియంతృత్వం ‘నియోజకవర్గాల పునర్విభజనను 50 శాతం సీట్ల పెంపు ప్రాతిపదికన చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ద్వితీయ శ్రేణి రాష్ట్రాలుగా మిగిలిపోతాయి. దక్షిణాదిలో ఒక్క సీటు కూడా గెలవకుండానే ఉత్తరాది, ఇతర ప్రాంతాల్లో గెలిచే సీట్లతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వీలవుతుంది. ఈ విధంగా లభించే ‘బ్రూటల్ మెజారిటీ’ నియంత పాలనకు, నియంతృత్వానికి దారితీస్తుంది. కాబట్టి పునర్విభజన జనాభా ప్రాతిపదికన చేయకూడదు. ఉత్తరాది రాష్ట్రాలకు మరి ముఖ్యంగా యూపీ, మధ్యప్రదేశ్, తదితర రాష్ట్రాలకు, దక్షిణాది రాష్టాలకు మధ్య ప్రస్తుతం ఎంపీ సీట్ల సంఖ్యలో తేడా ఎంత ఉందో అంత స్థాయిలోనే సీట్లు పెంచాక కూడా తేడా ఉండేలా చూడాలి. దీనిపై ఇప్పటికే కేంద్రానికి నిరసన తెలిపాం. లక్ష్మణ్ రాజీనామా చేయాలి దక్షిణాదికి జరిగే అన్యాయం సరిదిద్దకపోతే ఇతర రాష్ట్రాలతో కలిసి ఉమ్మడి కార్యాచరణ చేపట్టి ఉమ్మడిగా పోరాడుతాం. బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ ఏవేవో లెక్కలు చెబుతున్నారు. దక్షిణ భారత ప్రజల కోసం ఆయన తన పదవికి రాజీనామా చేయాలి. ఉత్తరం, దక్షిణం మధ్య అంతరం పెరగకుండా చూడాలి..’ అని రేవంత్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం నుంచి రెండురోజుల పాటు కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నట్టు తెలిపారు. శకుని వల్లనే శ్రీకృష్ణుడి గొప్పదనం తెలిసొచ్చింది ‘మాజీ సీఎం కేసీఆర్ చెప్పిన దానికి చేసిన దానికి సంబంధం లేదు. కేసీఆర్ ఉండటం వల్లే రేవంత్రెడ్డికి పేరు, గుర్తింపు వచ్చింది. ఆయన లేకపోతే నేను చేసిన మంచి పనులు తెలిసేవి కావు. సన్న బియ్యం ఇస్తున్నాం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్కార్డులు ఇలా అన్నీ చేస్తున్నాం. మరి కేసీఆర్ చెప్పినవి చేశారా? డబుల్ బెడ్రూం ఇళ్లు, ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చారా? మేము చేసేదే చెబుతున్నాం. రావణుడి చెడు వల్లే రాముడి గొప్పతనం తెలిసింది. శకుని చేసిన పనుల వల్లనే శ్రీకృష్ణుడి గొప్పదనం తెలిసొచ్చింది. కేసీఆర్ ఫామ్హౌస్లో రెస్ట్ తీసుకుంటున్నారని బీఆర్ఎస్ వాళ్లు చెబుతున్నారు. కానీ కేసీఆర్ను బావా, బావమరుదులు కలిసి (హరీశ్, కేటీఆర్) గృహ నిర్బంధంలో ఉంచారేమోనన్నది నా అనుమానం..’ అని సీఎం వ్యాఖ్యానించారు. -
మండలి నుంచీ బీఆర్ఎస్ సస్పెన్షన్
సాక్షి, హైదరాబాద్: అక్రమ మైనింగ్ అంశంలో రాఘవ కన్స్ట్రక్షన్స్ వ్యవహారంపై సభా సంఘం వేయాలని.. మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ సభ్యులు సోమవారం శాసనమండలిలో ఆందోళనకు దిగడంతో చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి వారిని ఒకరోజుపాటు సస్పెండ్ చేశారు. మండలి చరిత్రలోనే తొలిసారి ఎమ్మెల్సీలపై సస్పెన్షన్ వేటు పడింది. అంతకుముందు రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థ అక్రమాలపై సభా సంఘం లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మండలిలో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టగా చైర్మన్ తిరస్కరించారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు వెల్లోకి దూసుకెళ్లి నినాదాలతో 50 నిమిషాలపాటు హోరెత్తించారు. కాగితాలు చించి చైర్మన్ కుర్చీవైపు విసిరేందుకు ప్రయత్నించారు. మార్షల్స్ అడ్డుకోగా మరోసారి కాగితాలు చించి విసిరారు. వాటిలో కొన్ని గుత్తా సుఖేందర్రెడ్డిపైనా పడ్డాయి. ‘పెద్దల సభ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత సభ్యులపై ఉంది. ఇలా ఆందోళన చేయడం సరైంది కాదు. సభ్యులు వెనక్కి వెళ్లి వారి స్థానాల్లో కూర్చోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతిపక్ష నేత తమ సభ్యులను కంట్రోల్ చేయాలి. సభా కార్యక్రమాల నిర్వహణకు సభ్యులు సహకరించాలని’ అని చైర్మన్ పదేపదే విజ్ఞప్తి చేసినా బీఆర్ఎస్ సభ్యులు నిరసన కొనసాగించారు. బీఆర్ఎస్ సభ్యుల నిరసనల మధ్యే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలంగాణ ఉద్యోగుల తల్లిదండ్రుల పోషణ, జవాబుదారీతనం, పర్యవేక్షణ బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం ఈ బిల్లుపై చర్చలో పాల్గొన్న అద్దంకి దయాకర్ బీఆర్ఎస్ సభ్యుల తీరును తప్పుబట్టారు. తల్లిదండ్రుల కోసం పెట్టిన గొప్ప బిల్లుపై చర్చలో పాల్గొనకపోవడం సరికాదన్నారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడాక సభ్యుల ఆందోళన మధ్యే బిల్లుకు మండలి ఆమోదం తెలిపింది. ఈ సమయంలో శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు రెండుసార్లు కలగజేసుకొని బీఆర్ఎస్ కోరినట్టు ఈ అంశంపై ఇప్పటికే సీబీసీఐడీ విచారణకు ఆదేశిస్తూ సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారని చెప్పారు. అయినా శాంతించని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. ఆందోళన కొనసాగిస్తుండటంతో వారిని సస్పెండ్ చేయాలని తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని ఆమోదించిన చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మధుసూధనాచారి, తక్కెళ్లపల్లి రవీందర్రావు, దేశపతి శ్రీనివాస్, ఎల్. రమణ, యాదవరెడ్డి, సుంకరి రాజు, నవీన్కుమార్రెడ్డి, తాతా మధుసూదన్, వాణీదేవి, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎం. కోటిరెడ్డిలను ఒకరోజుపాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సస్పెండ్ అయిన సభ్యులంతా బయటకు వెళ్లాలని చైర్మన్ కోరగా ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, నవీన్కుమార్రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్రావు, తాతా మధు తదితరులు సభలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మార్షల్స్తో వాగ్వాదానికి దిగారు. చివరకు మార్షల్స్ బలవంతంగా వారిని బయటకు పంపడంతో పరిస్థితి సద్దుమణిగింది. గన్పార్కులో నిరసన.. శాసనమండలిలోకి సోమవారం వెళ్లే ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులో నిరసన తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంతోపాటు రాఘవ కన్స్ట్రక్షన్స్ మైనింగ్ అక్రమాలపై విచారణకు సభా సంఘం వేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నినాదాలు చేస్తూ ప్లకార్డులతో మండలిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. సస్పెన్షన్ పిరికిపంద చర్య: దేశపతి శ్రీనివాస్ మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ అక్రమ మైనింగ్ను ఆధారాలతో సహా సభ ముందు పెడితే నిజాలు బయటపడతాయనే భయంతో తమను సస్పెండ్ చేయడం పిరికిపంద చర్య అని శాసనమండలిలో బీఆర్ఎస్ విప్ దేశపతి శ్రీనివాస్ ఆరోపించారు. సాంకేతిక ఆధారాలు ఉన్నా ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా, సభా సంఘం వేసేందుకు ఎందుకు భయపడుతుందో చెప్పాలని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ డిమాండ్ చేశారు. -
‘బీజేపీ లక్ష్యం రాహుల్ గాంధీని బద్నాం చేయడమే’
ఢిల్లీ : కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ నేతృత్వంలోని బీజేపీ లక్ష్యం తమ నాయకుడు రాహుల్ గాంధీని బద్నాం చేయడమేని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంల్లో చేసిన వ్యాఖ్యలకు చామల కౌంటరిచ్చారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ టార్గెట్గా అమిత్ షా మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయడమే ఏకైక అజెండా అమిత్ షా పెట్టుకున్నారని మండిపడ్డారు. ‘పార్లమెంట్లో అమిత్ షా అబద్దాలు చెప్తూ దేశ ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ,రాహుల్ గాంధీ టార్గెట్ గా అమిత్ షా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయడం అమిత్ షా ఏకైక అజెండా. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణను అమిత్ షా తట్టుకోలేకపోతున్నారు. ఐదు రాష్ట్రాల ఓటర్లను ప్రభావితం చేసే విధంగా అమిత్ షా మాట్లాడాలని అనుకున్నారు. గద్దర్ మాజీ మావోయిస్టు. గద్దర్ తన మావోయిజానికి స్వస్తి పలికి తెలంగాణ సంస్కృతి,చరిత్ర,సాంప్రదాయంపై పోరాటం చేశారు. అలాంటి గద్దర్ను కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవించుకుంటే తప్పు ఎట్లా అవుతుంది?, జులై 20 వ తేదీ 2022లో బీజేపీ పరేడ్ గ్రౌండ్స్ లో నరేంద్ర మోదీ,,అమిత్ షా సభకు గద్దర్ హాజరయ్యారు. గద్దర్తో స్టేజ్ పంచునున్నారని అమిత్ షా ఎట్లా మాట్లాడారు...?, బీజేపీ లక్ష్యం రాహుల్ గాంధీని బద్నాం చేయడమే. గద్దర్ గురించి అమిత్ షా లోక్సభలో మాట్లాడుతుంటే బండి సంజయ్, కిషన్ రెడ్డి నోరు మెదపకుండా కూర్చున్నారు. బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నప్పుడు గద్దర్ బీజేపీ ఆఫీస్కు వెళ్లి తనపై ఉన్న పెండింగ్ కేసులపై చర్చించారుఒక పక్క మావోయిస్టులను లొంగిపొమ్మని చెప్పి ఎప్పుడో లొంగిపోయిన మావోయిస్టు సిద్దాంతాన్ని వదిలేసిన గద్దర్ తో రాహుల్ గాంధీ వేదిక పంచుకున్నారని చెప్పడం దారుణం. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలను గెలిపిస్తారని అమిత్ షా భయపడుతున్నారు. మీ ప్రభుత్వం అజెండా ప్రకారం మార్చి 31,2026 కల్లా నక్సల్స్ రహిత దేశంగా మార్చుకోండి. మేము తప్పుపట్టడం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ చరిత్రపై,రాహుల్ గాంధీపై విషం చిమ్మవద్దని సూచిస్తున్నాం’ అని చామల కిరణ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. -
శాసనమండలిలో విజయశాంతి కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఉద్యమకారులకిచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. అసలు ఉద్యమకారులు లేకపోతే సీఎంలు, మంత్రులు ఉండేవారా? అని ప్రశ్నించారు. ఉద్యమ కారులను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యతగా ఆమె పేర్కొన్నారు. ఒకవేళ ఉద్యమకారులను పట్టించుకోకపోతే చారిత్రక తప్పిదం అవుతుందని ఆమె వ్యాఖ్యానించారు. ప్రభుత్వం వెంటనే ఉద్యమకారుల సంక్షేమానికి సంబంధించిన వాగ్దానాలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఉద్యమకారులకు న్యాయం జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన కీలక వాగ్దానాలను అమలు చేయడంలో తమ ప్రభుత్వం జాప్యం చేస్తోందని అన్నారు.వీడియో కోసం ఈ లింక్ను క్లిక్ చేయండి -
‘దేశ వికాసంలో రాజస్థాన్ ప్రజల పాత్ర ఎనలేనిది’
హైదరాబాద్ దేశ వికాసంలో రాజస్థాన్ ప్రజల పాత్ర ఎనలేనిదన్నారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా. హైదరాబాద్లోని లోక్భవన్లో సోమవారం(మార్చి 30వ తేదీ )ఏక్ భారత్ - శ్రేష్ఠ భారత్ లో భాగంగా రాజస్థాన్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో హైదరాబాద్లో ఉంటున్న రాజస్థాన్ వాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వేడుకలకు రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సతీమణితో పాటు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో సంస్కృతి, సాంప్రదాయాల పరంగా రాజస్థాన్కు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. భగవాన్ శ్రీ రాముడు, జన్మభూమి స్వర్గం కంటే మిన్న అని చెప్పారని.. వారి స్ఫూర్తితోనే రాజస్థాన్ ప్రజలు దేశ అభివృద్ధి, సాంస్కృతిక వికాసంకు గొప్ప సేవ చేస్తున్నారని గవర్నర్ కొనియాడారు. గవర్నర్ సందేశం అనంతరం ఏర్పాటు చేసిన రాజస్థాన్ సాంస్కృతిక ప్రదర్శనలు వీక్షకులను కట్టిపడేశాయి. ఈ కార్యక్రమంలో గవర్నర్ సంయుక్త కార్యదర్శి శశికిరణాచారి, ఇతర లోక్ భవన్ ఉన్నతాధికారులు, రాజస్థాన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
గిగ్ వర్కర్స్ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం
హైదరాబాద్: గిగ్ వర్కర్స్ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. శాసనసభలో గిగ్ వర్కర్స్ బిల్లుపై చర్చలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ‘శాసనసభలో మంత్రి వివేక్ వెంకస్వామి గిగ్ వర్కర్స్ బిల్లును తేవడం సంతోషంగా ఉంది. మా నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్రలో గిగ్ వర్కర్స్ తో సమావేశం నిర్వహించారు. లక్షల మంది గిగ్ వర్కర్లు ఈ బిల్లు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ బిల్లులో వృత్తిపరంగా ఆరోగ్యపరమైన అంశాలు ఉన్నాయి.ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వారికి ప్రభుత్వం తరుఫున సాయం అందించడం లాంటివి ఉన్నాయి. ఈ బిల్లు ఎవరికీ వ్యతిరేకం కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట్ స్వామి ఆధ్వర్యంలో లో గిగ్ వర్కర్స్ చట్టం తేవడం శుభపరిణామం. వారికి వృత్తిపరంగా ఇబ్బంది లేకుండా చట్టం చూసుకుంటుంది. గిగ్ వర్కర్ల బిల్లుపై హైదరాబాద్ ఇన్చార్జి మంత్రిగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వం గిగ్ వర్కర్లకి అండగా ఉంటుంది’ అని అన్నారు.మతపరమైన విద్వేషాలను రెచ్చగొడితే చర్యలు మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్లు-2026ను ప్రవేశపెట్టింది. ఆ బిల్లును స్పీకర్.. సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేశారు. ‘తెలంగాణ విద్వేష పూరిత ప్రసంగాలు, విద్వేష పూరిత నేరాల నిరోధక బిల్లు’కు రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. మత సామరస్యానికి భంగం కలిగించేలా సోషల్ మీడియాలో చేసే పోస్టులతో పాటు అల్లర్లు, ఘర్షణలను ప్రేరేపించేలా చేసే ప్రసంగాలను కట్టడి చేయడానికి ఈ బిల్లును రూపొందించారు. -
కేసీఆర్ లేకపోతే నేను లేను: సీఎం రేవంత్
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కారణంగానే తన గొప్పతనం ఏమిటో తెలంగాణ సమాజానికి తెలిసిందని అంటున్నారు సీఎం రేవంత్రెడ్డి. అసలు కేసీఆర్ లేకపోతే తాను లేనంటూ చెప్పుకొచ్చారు రేవంత్. మీడియాతో చిట్చాట్లో భాగంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘ కేసీఆర్ వల్లే నాకు ఈ గుర్తింపు వచ్చింది. కేసీఆర్ లేకపోతే నేను లేను. రావణుడి చెడువల్లే రాముడి గొప్పతనం తెలిసింది. కేసీఆర్ రెస్ట్ తీసుకుంటున్నారని అంతా అనుకుంటున్నారు. కేసీఆర్ను గృహనిర్బంధం చేశారని నాకు అనుమానంగా ఉంది. కాలనాగు కంటే హరీష్రావు ప్రమాదం’ అని పేర్కొన్నారు. -
వేటేస్తారా.. వేచి చూస్తారా?
వికారాబాద్: డ్రగ్స్ కేసులో పేరు రావడంతో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డికి బీఆర్ఎస్ అధిష్టానం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. వివరణ కోసం ఇచ్చిన వారం రోజుల గడువు శుక్రవారంతో ముగిసింది. అతని నుంచి ఇంకా సమాధానం రాలేదు. ఈ నేపథ్యంలో వేటు వేస్తారా..? వేచి చూస్తారా? అనే విషయంపై చర్చ మొదలైంది. ఇటీవల మొయినాబాద్ సమీపంలోని రోహిత్రెడ్డి ఫాంహౌస్లో రేవ్ పార్టీ జరుగుతుండగా టాస్క్ ఫోర్స్, ఈగల్ టీం సభ్యులు దాడి చేసి పైలెట్తో పాటు మరి కొందరిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధిష్టారం వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ రోహిత్రెడ్డికి నోటీసులు ఇచ్చింది. గడువు ముగిసిన నేపథ్యంలో పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందనే దానిపై పార్టీ నాయకులల్లో విస్తృత చర్చ జరుగుతోంది. సస్సెండ్ చేస్తే లాభమా.. నష్టామా..? ఒకవేళ పైలెట్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే తర్వాత జరిగే పరిణామాలు.. పార్టీకి జరిగే లాభ నష్టాలపై బీఆర్ఎస్ అధిష్టానం బేరీజు వేసుకుంటున్నట్లు తెలిసింది. త్వరలో ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదు. ఒకవేళ రోహిత్రెడ్డిని మందలించి పార్టీలో కొనసాగిస్తే తర్వాత ప్రత్యర్థి పార్టీల నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలని అన్నది పెద్ద సమస్యగా మారనుంది. అవకాశం వచి్చన ప్రతిసారీ డ్రగ్స్ కేసు ఉదంతాన్ని తెరమీదకు తెచ్చి ప్రతిపక్షాలు లాభం పొందుతాయనే భయం కూడా లేకపోలేదు. ఈ విషయాన్ని అడ్డం పెట్టకుని కేటీఆర్తో పాటు మొత్తం పార్టీని టార్గెట్ చేసే అవకాశం ఉందనే వాదన పార్టీ సీనియర్లు తెరమీదకు తెస్తున్నట్టు సమాచారం.ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలకంగా ఉన్న పైలెట్ను పార్టీ దూరం చేసుకుంటే అతను ఏమైనా లొసుగులు బయటపెట్టి పారీ్టని, పార్టీ పెద్దలను ఇరకాటంలో పడేసే ప్రయత్నం చేస్తాడా..? అనేది కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో పారీ్టలో ఉంచాలా తొలగించాలా అనే దానిపై ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు సమాచారం. గతంలోనూ పలు సందర్భాల్లో రోహిత్రెడ్డి అతని సోదరుడిపై డ్రగ్స్ ఆరోపణలు రాగా ప్రత్యర్థులు ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఇదే అంశాన్ని ఆయుధంగా మార్చుకున్నారు. ఇప్పుడు డ్రగ్స్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారనే అభియోగాల నేపథ్యంలో అధిష్టానం అతనిపై వేటు వేసేందుకే మొగ్గు చూపే అవకాశం ఉందని పార్టీ సీనియర్లు పేర్కొంటున్నారు. రేసులో ముగ్గురి పేర్లు పైలెట్ను తప్పిస్తే తాండూరు బాధ్యతలు ఎవరికి అప్పజెప్పాలనే చర్చ జరుగుతోంది. నియోజకవర్గంలో రోహిత్రెడ్డి తర్వాత అంత స్థాయి ఉన్న నాయకులు లేకపోవడం పారీ్టకి లోటుగా కనిపిస్తోంది. మరో నేత శ్రీశైల్రెడ్డి ఉన్నా రోహిత్రెడ్డికి చిన్నాన్నే కావడంతో ఆయనకు పార్టీ బాధ్యతలు ఇచ్చే అవకాశం లేదు. ఇన్నాళ్లు పార్టీలో ఉంటూ వచ్చిన పట్నం కుటుంబం ఎన్నికలయ్యాక అధికార పార్టీ గూటికి చేరడం, మరో నాయకుడు మురళీకృష్ణ కూడా పార్టీని వీడటంతో నియోకవర్గ బాధ్యతలు మోసేంత సమర్థులు కనిపించడంలేదు. ఇప్పటికే దిగుమతి నేతలతో నిండిన తాండూరుకు మరో నేతను ఇతర ప్రాంతాల నుంచి తెచ్చుకునే పరిస్థితి వద్దనే వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి. కొంత కాలంగా తాండూరు టికెట్ ఆశిస్తూ క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటున్న ఉద్యమ నాయకుడు బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్పటేల్ పేరు కూడా అధిష్టానం దృష్టిలో ఉన్నట్టు తెలుస్తోంది. షాబాద్ తాజా మాజీ జెడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డికి అక్కడ పార్టీ బాధ్యతలు ఇస్తే ఎలా ఉంటుందనే విషయాన్ని కూడా అధిష్టానం ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఆయనకు బాధ్యతలు ఇస్తే మహేందర్రెడ్డి వర్గాన్ని అక్కున చేర్చుకొని బీఆర్ఎస్కు లాభం జరగే అవకాశాలున్నాయి. పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్రెడ్డి తనయుడు కొప్పుల అనీల్రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఏది ఏమైనా తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డిని అన్ని విధాలుగా ఎదుర్కోగలిగిన నేత కోసం బీఆర్ఎస్ అధిష్టానం గాలిస్తున్నట్లు సమాచారం. -
భూ కబ్జా.. పొంగులేటి శ్రీనివాస్, హర్షా రెడ్డిపై గవర్నర్కు ఫిర్యాదు: కేటీఆర్
సాక్షి, రంగారెడ్డి: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం వట్టివాగులపల్లిలో పర్యటిస్తోంది. భూ బాధితులతో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సమావేశమయ్యారు. ఈ క్రమంలో బాధితులు.. మంత్రి పొంగులేటి కుమారుడిపై భూ కబ్జా ఆరోపణలు చేశారు. దీంతో, కబ్జాకు గురైన భూములను బీఆర్ఎస్ బృందం పరిశీలించింది. కాగా, రాఘవా కన్స్ట్రక్షన్స్ కబ్జాకు ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.అనంతరం మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..‘మంత్రి పొంగులేటి కుమారుడే కబ్జాలకు పాల్పడ్డాడు. రాఘన కనస్ట్రక్షన్ భూ కబ్జాలపై చర్యలు తీసుకోవాలి. బాధితులను బెదిరించి 27 ఎకరాల భూమిని లాక్కోవాలని చూస్తున్నారు. 1960 నుంచే ఇక్కడ సతీష్ షా కుటుంబానికి భూమి ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వారి పేరుమీదనే భూమి ఉంది. గత 60 సంవత్సరాలుగా ఈ భూమిలో వారు నివసిస్తున్నారు. వట్టినాగులపల్లి గ్రామం అభివృద్ధి చెందిన తర్వాత ఇక్కడ భూముల విలువలు భారీగా పెరిగాయి. సతీష్ షా కుటుంబానికి చెందిన ఈ భూమి సుమారు 1400 కోట్ల విలువ కలిగి ఉండగా, దీనిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కన్నుపడింది. మంత్రి పొంగులేటి, ఆయన కుమారుడు హర్షా రెడ్డి కలిసి స్వయంగా సతీష్ షా ఇంటికి వెళ్లి, భూమిని డెవలప్మెంట్కు ఇవ్వకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని బెదిరించారు. అయితే సతీష్ షా కుటుంబం భూమిని డెవలప్మెంట్కు ఇవ్వడానికి గానీ, అమ్మడానికి గానీ సిద్ధంగా లేమని స్పష్టంగా తెలిపింది.సర్వే పేరుతో 27 ఎకరాల భూమి స్వాధీనం..దీనికి తరువాత మంత్రి పొంగులేటి అరాచకాలకు తెరలేపారు. తన రెవెన్యూ శాఖలోని శ్రీనివాసులు అనే అధికారి ద్వారా, 100 కోట్ల లంచం కేసులో పట్టుబడిన ఏడీ (AD)తో దొంగ సర్వే చేయించి బాధితులను తీవ్రంగా వేధింపులకు గురిచేశారు. భూమిని ఇవ్వకపోతే, రెవెన్యూ సర్వే పేరుతో 27 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటామని బెదిరించారు. దీనికీ లొంగకపోవడంతో హర్షా రెడ్డి, ఆయనకు చెందిన రాఘవ కనస్ట్రక్షన్స్ గుండాలతో కలిసి, నంబర్ ప్లేట్లు లేని జేసీబీలతో వచ్చి బాధితులు నిర్మించుకున్న గోశాలను కూల్చివేశారు. దాదాపు కిలోమీటర్ మేర ఉన్న కాంపౌండ్ వాల్ను కూడా ధ్వంసం చేసి, బాధితులను భయభ్రాంతులకు గురిచేశారు.ఈ ఘటన విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన సతీష్ షా, పల్లవి షా కుటుంబ సభ్యులను అక్కడే సజీవంగా పాతిపెడతామని బెదిరించి, రాత్రంతా నిలబెట్టారు. ఈ ఘటనపై పోలీసుల వద్ద ఫిర్యాదు చేయగా, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రాష్ట్రపతి పతకం అందుకున్న నిజాయితీ గల పోలీస్ అధికారి హబీబుల్లాను బదిలీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి మధ్య ఉన్న వ్యాపార అనుబంధాన్ని అడ్డుపెట్టుకుని ఈ దురాగతాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి పోర్టల్లో ఉన్న 20 లక్షల ఎకరాల భూమిని కోటి ఎకరాలకు పెంచి, నిషిద్ధ జాబితా పేరుతో ప్రజలను బెదిరిస్తూ 50 శాతం భూమి వాటా డిమాండ్ చేస్తోంది. ఇలాంటి అన్యాయాలకు గురైన బాధితులు ఎవరైనా ఉంటే తెలంగాణ భవన్కు వచ్చి వివరాలు ఇవ్వాలని, వారికి పార్టీ పరంగా మరియు న్యాయపరంగా అండగా ఉంటామని తెలిపారు. ఈ క్రమంలోనే అక్రమంగా క్రషర్లు ఏర్పాటు చేసి మైనింగ్ చేస్తున్న మంత్రి పొంగులేటిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమ మైనింగ్ను ప్రశ్నించిన మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై దాడి చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర గవర్నర్ను కలుస్తున్నామని, త్వరలో మరిన్ని కుంభకోణాలను బయటపెడతామని తెలిపారు. గవర్నర్కు ఫిర్యాదు.. అనంతరం.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో లోక్భవన్కు ఎమ్మెల్యేల బృందం వెళ్లింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై గవర్నర్కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. అక్రమ మైనింగ్కు పాల్పడుతున్న పొంగులేటిని మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ ఫిర్యాదులో పేర్కొంది. అలాగే, అక్రమ మైనింగ్, భూ కబ్జాలకు పాల్పడుతున్న రాఘవ కనస్ట్రక్షన్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని గవర్నర్కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..‘రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పరిపాలన పై గవర్నర్కు ఫిర్యాదు చేశాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రజా సంపదను కొల్లగొడుతున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి రాఘవ కన్స్ట్రక్షన్పై గవర్నర్ కు పిర్యాదు చేశాము. హిమాయత్ సాగర్ పరిధిలో నిబంధనలు , ORR పరిధిలో నిబంధనలను తుంగలో తొక్కి అక్రమ మైనింగ్ చేస్తున్నారు. ఎటువంటి పర్మిషన్ లేకుండా వందల కోట్ల ప్రజా సంపద కొల్లగొడుతున్న వివరాలు గవర్నర్ కు ఫిర్యాదు చేశాము.తెలంగాణలో ఇందిరమ్మ ఎమర్జెన్సీ..ఇదే విషయంపై మా పార్టీ నాయకుడు హరీష్ రావు అసెంబ్లీలో లేవనెత్తితే ఎదురుదాడి చేశారు. అక్రమ మైనింగ్ పై CB CID విచారణ చేయిస్తాం అని సీఎం అంటున్నారు. మేము హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశాము. హౌస్ కమిటీలకు విలువ లేదని మంత్రి శ్రీధర్ బాబు అనడం విడ్డూరం. ప్రభుత్వ పెద్దలే గద్దలుగా మారితే, రక్షకులే భక్షకులు అయితే ఎలా ప్రజలకు ఎవరు దిక్కు?. ఎమర్జెన్సీ ఇందిరమ్మ పాలన తెలంగాణలో కనిపిస్తుంది. తెలంగాణలో ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన నడుస్తుంది. ప్రజా దోపిడిని ప్రజా క్షేత్రంలోనే ఎండగడుతాం. రాష్ట్రంలో ఇలాంటి అక్రమాలు అనేకం జరుగుతున్నాయి. బ్లాక్ మెయిల్ బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి. బ్లాక్ మెయిల్ రాజకీయాలు రేవంత్ రెడ్డికి తెలిసినంతగా ఈ దేశంలో ఎవరికి తెలియదు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
విద్యార్థినిపై కీచక టీచర్ దారుణం.. ఘటనలో ఏడుగురు అరెస్ట్
నారాయణపేట: మద్దూరు మండలంలోని మోమినాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఘటనలో ఏడుగురిపై పోక్సో కేసు నమోదు చేసి.. రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ డా.వినీత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్పీ వివరాల మేరకు.. ప్రధాన నిందితుడు పెద్దూరుపాడుకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు చండేపల్లి స్వామి ఓవిద్యార్థినితో అనుచితంగా ప్రవర్తించినట్లు సీసీ కెమెరాలో రికార్డు కాగా.. మరో టీచర్ గుర్నాథ్రెడ్డి ఆ వీడియోను ఉపాధ్యాయుడు కర్ని చెన్నకేశవులు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోలేదు. దీంతో గుర్నాథ్రెడ్డి సదరు వీడియోను సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేయించారు.ఈ విషయంపై గ్రామానికి చెందిన గుల్ల రవికుమార్, బి.ఆనంద్, నిడ్జింత విజయ్కుమార్, మేకల రవి సదరు వీడియోను అనధికారికంగా పంచుకోవడంతో పాటు అదే గ్రామంలో రాజీ ప్రయత్నాలు వంటి చర్యలకు పాల్పడ్డారు. ఈ కేసును డీఎస్పీ నల్లపు లింగయ్య విచారించగా.. విద్యారి్థనిపై ప్రధాన నిందితుడు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. అతడితో పాటు అతడికి సహకరించిన వ్యక్తులపై పోక్సో, ఐటీ, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదు చేసి.. సీసీ కెమెరాలు, మొబైల్ ఫోన్లు స్వా«దీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.ఏడుగురు నిందితులను కోర్టులో హాజరుపర్చగా.. రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. జిల్లాలోని విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రత అత్యంత ప్రాధాన్యతగా భావిస్తున్నామని.. ఇలాంటి ఘటనలు ఎక్కడైనా జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమస్యలను చట్టపరంగా పరిష్కరించకుండా స్వయంగా రాజీ ప్రయత్నాలు చేయడం.. లేదా నేరాలను దాచిపెట్టడం వంటి చర్యలకు పాల్పడితే తీవ్రమైన నేరాలుగా పరిగణించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. -
శాసన మండలి నుంచి బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్
సాక్షి,హైదరాబాద్: శాసన మండలి నుంచి బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్కు గురయ్యారు. పొంగులేటిని మంత్రి వర్గం నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ మండలి సభ ప్రారంభం నుంచి బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేపట్టారు. అక్రమ మైనింగ్ అంశంలో రాఘవ కన్స్ట్రక్షన్స్ వ్యవహారంపై సభా సంఘం వేయాలంటూ నినాదాలు చేశారు. వెల్లోకి వచ్చి ప్లకార్డులు పట్టుకుని ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. ఈ క్రమంలో సభ సజావుగా జరిగే సభ్యులు వ్యవహరించాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కోరారు. అనంతరం,బీఆర్ఎస్ సభ్యుల్ని ఒక రోజు సభ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. -
ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యం
సాక్షి, హైదరాబాద్: వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆహార భద్రత (రేషన్)కార్డు లబ్ధిదారులకు భారీ వెసులుబాటు కల్పించాయి. ఏప్రిల్ మాసంలో ఒకేసారి మూడు నెలల (ఏప్రిల్, మే, జూన్) కోటాను పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ మేరకు గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలకు సంబంధించి రేషన్ కోటాను విడుదల చేసి పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదివారం నుంచి ప్రభుత్వ చౌకధరల దుకాణాలకు పీడీఎస్ బియ్యం సరఫరా ప్రారంభించింది. కేటాయింపులు ఇలా.. మూడు జిల్లాల పరిధిలో సుమారు 21,46,995 ఆహార భద్రత కార్డులున్నాయి. మొత్తం 76,91,452 యూనిట్లు ఉన్నాయి. తాజాగా మూడు నెలల కోటా కింద దాదాపు 14,27,621.31 క్వింటాళ్ల పీడీఎస్ బియాన్ని విడుదల చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్ధ నిబంధనల ప్రకారం ఆహార భద్రత కార్డులోని ప్రతి యూనిట్ (లబ్ధిదారు)కు నెలకు 6 కిలోల చొప్పున సన్న బియ్యం అందిస్తున్నారు. తాజాగా మూడు నెలల కోటా ఒకేసారి ఇస్తున్నందున ఒక్కో యూనిట్కు 18 కిలోల చొప్పున నలుగురు సభ్యులున్న కుటుంబానికి 72 కిలోలు, ఐదుగురు సభ్యులున్న కుటుంబానికి 90 కిలోలు ఇవ్వనున్నారు. అంత్యోదయ కార్డుదారులకు మాత్రం నెలకు 35 కిలోల చొప్పున మూడు నెలలకు కలిపి 105 కిలోలు పంపిణీ చేస్తారు. లబి్ధదారులు పోర్టబిలిటీ సౌకర్యం ద్వారా అందుబాటులోని ప్రభుత్వ చౌక ధరల దుకాణంలో బియ్యం తీసుకోవచ్చు. ఈ–పాస్లో మార్పులు చేర్పులు. లబ్ధి కుంటుబాలకు ఒకేసారి మూడు నెలల కోటా పంపిణి చేస్తుండటంతో అందుకు అనుగుణంగా ఈ–పాస్ (బయోమెట్రిక్) మిషన్లలో సాంకేతిక మార్పులు చేర్పులు చేస్తున్నారు. సరుకులు డ్రా చేసే లబ్ధిదారు ఒక్కో నెలకు విడివిడిగా మూడుసార్లు కాకుండా ఒకేసారి వేలిముద్ర వేసేలా సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తున్నారు. సవాల్గా మారిన నిల్వలు ప్రభుత్వ చౌకధరల దుకాణాల్లో మూడు నెలల స్టాక్ ఉంచేంత స్థలం లేకపోవడంతో బియ్యం నిల్వ చేయడం డీలర్లకు తలకు మించిన భారంగా తయారైంది. చాలా దుకాణాలు చిన్నపాటి మడిగెల్లో నిర్వహిస్తుండటంతో వందల క్వింటాళ్ల బియ్యాన్ని భద్రపరచడంపై డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డీలర్ల డిమాండ్ మేరకు దశలవారీగా దుకాణాలకు బియ్యం సరఫరా చేస్తేందుకు పౌరసరఫరా అధికారులు చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్ : తెలంగాణ శాసన మండలి, శాసన సభ్యుల సాంస్కృతిక ప్రదర్శనలు (ఫొటోలు)
-
ప్రభుత్వ ఆస్పత్రులకు బ్రాండింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు బ్రాండింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. ఆదివారం అసెంబ్లీలో బడ్జెట్ పద్దులపై సమాధానాలు ఇస్తున్న సమయంలో ఆయన మాట్లాడారు. గాంధీ ఆస్పత్రిని ఆధునీకరిస్తామని, నిమ్స్ను మరింత అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ రూపొందించామన్నారు. నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగా ప్రతి మెడికల్ కాలేజీలో 21 డిపార్ట్మెంట్లు ఉండాలని, కానీ కొన్నిచోట్ల లేకపోవడంతో నగరంలోని స్పెషలైజ్డ్ ఆస్పత్రులపై భారం పడుతోందని చెప్పారు.ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రతీ మెడికల్ కాలేజీలో అన్ని విభాగాలను తెరుస్తామన్నారు. ప్రతి జనరల్ ఆస్పత్రికి బ్రాండింగ్ ఇస్తామని, సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేకంగా ఈ విషయాన్ని సూచించారన్నారు. మెడికల్ కాలేజీల్లో రెండు రకాల కార్యక్రమాలు ఉంటాయని, వైద్య సరీ్వసులకు సంబంధించి వైద్యులు పర్యవేక్షిస్తే... పరిపాలన వ్యవహారమంతా గ్రూప్ అధికారులతో నిర్వహిస్తామన్నారు. పద్దులకు ఆమోదం దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచి్చన తర్వాత 9,752 ఎకరాలు దేవాలయ భూములను పరిరక్షించినట్లు చెప్పారు. శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణం అక్షింతలను కొరియర్ ద్వారా పంపిణీ చేసే సౌకర్యం కల్పించామన్నారు. దేవాలయాల అభివృద్ధితోపాటు భక్తుల వసతికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. మంత్రి జి.వివేక్ మాట్లాడుతూ.. దావోస్ సదస్సుతో రాష్ట్రంలో 7 లక్షల కోట్ల పెట్టుబడులు అవగాహన కుదిరిందన్నారు. మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణాహిత చేవెళ్ల తప్పకుండా పూర్తి చేస్తామన్నారు. కృష్ణా, గోదావరి నదుల్లో ప్రతీ చుక్కను రాష్ట్రం వినియోగించుకుంటుందని, నీటి హక్కులను కాపాడుకుంటామని, అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు.అనంతరం మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో హామ్ విధానంలో రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని, కొత్తగా 13006.27 కి.మీ. మేర కొత్త రోడ్లు వేస్తామన్నారు. వైద్య, ఆరోగ్యం, అటవీ, దేవాదాయ, సైన్స్ అండ్ టెక్నాలజీ, గనులు, కారి్మక శాఖ, నీటిపారుదల, పౌరసరఫరాలు, పాఠశాల విద్య, ఉన్నత విద్య, సాంకేతిక విద్యా శాఖలకు సంబంధించిన పద్దులపై చర్చ అనంతరం వాటిని ఆమోదించినట్లు స్పీకర్ ప్రసాద్కుమార్ ప్రకటించారు. అనంతరం సభ సోమవారం ఉదయానికి వాయిదా వేశారు. -
సిట్టింగ్ జడ్జితో ఓకే: హరీశ్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోదరులు, బావమరిదితోపాటు తన సోదరుడు, బావమరిది, కుటుంబ సభ్యులపై సీబీసీఐడీ, హౌస్ కమిటీతో కాకుండా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమని అసెంబ్లీలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు ప్రకటించారు. సీఎం సోదరుల టీడీఆర్ కుంభకోణం, బావమరిది అమృత్ కుంభకోణంతోపాటు ఇతర అక్రమాలపై రేవంత్రెడ్డి కూడా విచారణకు సిద్ధమా అని సవాల్ చేశారు. తాను చేసిన సవాల్పై తోక ముడిచి పారిపోకుండా, చెంచాలతో తిట్టించకుండా సీఎం రేవంత్రెడ్డి దమ్ముంటే స్పందించాలన్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, కొత్త ప్రభాకర్రెడ్డి, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్తో కలిసి హరీశ్రావు మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి నడుమ రాష్ట్రంలో భూముల సెటిల్మెంట్తోపాటు అనేక కుంభకోణాల్లో వాటాలు ఉన్నాయని ఆరోపించారు. మంత్రి పొంగులేటి అక్రమ మైనింగ్ వ్యవహారంపై అసెంబ్లీ సభా సంఘం ఏర్పాటు చేసే దమ్ము సీఎంకు లేదని విమర్శించారు. మంత్రి పొంగులేటి అక్రమాలు బయటపడటంతో అసెంబ్లీ వేదికగా తనపై బురదచల్లే ప్రయత్నం జరుగుతోందన్నారు. ‘కోటి ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో పెట్టి సెటిల్మెంట్కు వచ్చిన వారికి క్లియర్ చేస్తున్నారు. సెటిల్మెంట్లకు ముందుకు రాని వారిని బెదిరిస్తున్నారు. సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి భూ కుంభకోణాలను త్వరలో ఆధారాలతో సహా బయట పెడతాం. సీఎం, మంత్రి కుంభకోణాలపై విచారణ చేసేంత వరకు బీఆర్ఎస్ వదిలిపెట్టదు’అని హరీశ్రావు తేల్చిచెప్పారు. సొంత ప్రయోజనాల కోసం మంత్రి పొంగులేటి తాను ఎన్నడూ ఫోన్ చేయలేదని.. గృహలక్ష్మి పథకం బిల్లుల విడుదల కోసం ఒకట్రెండు సార్లు మంత్రితో ఫోన్లో మాట్లాడినట్లు హరీశ్రావు వెల్లడించారు. మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలి.. ‘సీబీసీఐడీ సీఎం రేవంత్రెడ్డి జేబు సంస్థ. మైనింగ్ అక్రమాలపై నిష్పాక్షిక విచారణ కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి లేదా మంత్రివర్గం నుంచి ఆయన్ను బర్తరఫ్ చేయాలి. సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి నడుమ ఫెవికాల్ బంధం ఉండటం వల్లే కొడంగల్, నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్ అప్పగించడంతోపాటు మూసీ సుందరీకరణ ప్రాజెక్టు రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి ఇస్తున్నారు. మంత్రి పొంగులేటి అక్రమ మైనింగ్ వ్యవహారం బయటపడటంతో ఆత్మరక్షణలో పడిపోయిన రేవంత్రెడ్డి.. దృష్టి మళ్లింపు రాజకీయాలకు పాల్పడుతున్నాడు. అసెంబ్లీలో మాకు మైకు ఇవ్వకుండా హౌస్ కమిటీ వేయాలనే మా డిమాండ్పై దళితులంటూ రాజకీయం చేస్తున్నాడు. ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపైనా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దాడిని ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడిగా భావిస్తున్నాం. గతంలో సీఎం రేవంత్ వాడిన భాషను కూడా ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాలి. దళితులపై కాంగ్రెస్ మాటలో ప్రేమ చూపిస్తే బడ్జెట్లో కేటాయింపులు, సంక్షేమ పథకాల ఆచరణలో మేము చూపించాం. దళితులపై రేవంత్రెడ్డి కపట ప్రేమ చూపుతూ మొసలి కన్నీరు కారుస్తున్నాడు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కంపెనీ అవినీతికి పాల్పడిందని స్వయంగా రేవంత్రెడ్డే చెప్పాడు. మంత్రి తప్పు చేస్తే సీబీసీఐడీ విచారణ నిష్పాక్షికంగా జరుగుతుందా? పొంగులేటిని కాపాడే క్రమంలో ప్రభుత్వం మరో 100 అబద్ధాలు చెప్పింది. అక్రమ మైనింగ్లో రూ. వందల కోట్లు రాష్ట్ర ఖజానాకు నష్టం జరిగింది’అని హరీశ్రావు పేర్కొన్నారు. తాము సీఎంకు అందజేసిన 20 అంశాలపై సిట్టింగ్ జడ్జిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పొంగులేటి అంశంపై భవిష్యత్తులో ఏం చేయాలో తమకు తెలుసని.. సోమవారం ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్ నుంచి తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హరీశ్రావు తెలిపారు. ముఠా నాయకుడిలా రేవంత్: వేముల ప్రశాంత్రెడ్డి మంత్రి పొంగులేటి అక్రమాలను బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్రావు ఆధారాలతో సహా బయటపెడితే సీఎం రేవంత్రెడ్డి డైవర్షన్ రాజకీయాలకు తెరలేపాడని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆరోపించారు. ‘రేవంత్ ఎదురుదాడికి దిగి మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తూ మా నేతలను బెదరిస్తున్నాడు. రేవంత్ సభా నాయకుడిలా కాకుండా ముఠా నాయకుడిలా కనిపిస్తున్నాడు. రాఘవ కన్స్ట్రక్షన్స్ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కుటుంబానికి చెందిన కంపెనీ అని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, అవినీతి ఆరోపణలపై హౌస్ కమిటీ డిమాండ్ నిరాకరించడం సరికాదు. రేవంత్ వ్యాఖ్యలను కూడా ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాలి. ‘మిమ్మల్ని తొక్కుతా’అని మాట్లాడినందుకు సీఎంపై చర్యలు తీసుకోవాలి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మేధావి అయితే ఆయన్ను సీఎం చేయాలి. ఎన్ని బెదిరింపులకు పాల్పడ్డా బీఆర్ఎస్ భయపడదు. అవినీతిపై ప్రశి్నస్తూనే ఉంటాం’అని వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టం చేశారు. -
కేటీఆర్తో రేవంత్ కుమ్మక్కు..: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో సీఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కు అయ్యారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. అందుకే కేటీఆర్పై ఉన్న అవినీతి కేసుల జోలికి పోవడం లేదన్నారు. కేవలం హరీశ్రావును టార్గెట్ చేస్తూ కాళేశ్వరంలోని కొంత భాగం అవినీతిపై మాత్రమే మాట్లాడుతున్నారన్నారు. కాళేశ్వరంలో జరిగిన రూ.లక్ష కోట్ల అవినీతిపై విచారణ జరిపితే మొత్తం బండారం బయటపడుతుందనే భయంతోనే అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ అవినీతిపైనే విచారణకు పరిమితమయ్యారని చెప్పారు. ఆదివారం బీజేపీ కార్యాలయంలో మీడియాతో సంజయ్ ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ... ‘కేటీఆర్ అతిపెద్ద అవినీతిపరుడు. బీఆర్ఎస్ పాలనలో జరగని అవినీతి ఏమైనా ఉందా? కేటీఆర్ సంగతి తెలిసినా రేవంత్ ఎందుకు కాపాడుతున్నారు? కేటీఆర్, రేవంత్ మధ్య ఉన్న ఒప్పందం ఏమిటి’అని నిలదీశారు. ‘కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు నడిపిస్తున్నాయి. హరీశ్తో జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్కు సీఎం సలహా ఇస్తున్నారు. రేవంత్కు కాళేశ్వరం, హరీశ్పై ఉన్నంత పగ కేటీఆర్పై లేదు. ఎందుకంటే ఫార్ములా–ఈ కేసు, డ్రగ్స్, ఫాంహౌజ్ కేసులపై మాట్లాడటం లేదు. కేటీఆర్, కవిత మధ్య సంధి కుదుర్చేందుకు రేవంత్ యతి్నస్తున్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్తో కలిసి పోటీ చేయాలని రేవంత్ భావిస్తున్నారు’అని అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్కు రేవంత్ డబ్బులు సమకూరుస్తున్నారని, కర్ణాటక నుంచి డబ్బులు వెళ్లడం లేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్తో పొత్తు జరగని పని ‘కేసీఆర్పై ఉన్న కోపం కూడా రేవంత్కు పోయింది. ఇద్దరి మధ్య డీల్ కుదిరింది. ఆనాడు తనను జైలుకు పంపించిన సంగతి రేవంత్ మర్చిపోయిండు. ఆ పౌరుషం, రోషం కూడా పోయింది. ఇకపై కేసీఆర్, కేటీఆర్ అవినీతిపై రేవంత్ విచారణ జరిపే అవకాశమే లేదు’అన్నారు. ‘బీఆర్ఎస్, బీజేపీ పొత్తు జరగని పని. కుటుంబ పాలనకు బీజేపీ వ్యతిరేకం. కేసీఆర్ కుటుంబ అవినీతిని భూస్థాపితం చేయాలనే ఉద్దేశంతోనే మేం పోరాడాం. ఆ పార్టీని ఓడించాం. మోదీ ఇటీవల జరిగిన సమావేశంలో రాజకీయ కుటుంబ వారసులకు టిక్కెట్లు ఇవ్వబోమని తేల్చి చెప్పారు. అలాంటప్పుడు అవినీతి కుటుంబ పార్టీతో మేం పొత్తు ఎందుకు పెట్టుకుంటాం’అని సంజయ్ పేర్కొన్నారు. -
టీఎన్జీఓ అధ్యక్షుడిగా మారం జగదీశ్వర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నాన్గెజిటెడ్ అధికా రుల సంఘం అధ్యక్షు డిగా మారం జగ దీశ్వర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు. ప్రధాన కార్యదర్శిగా ఎస్ఎం హుస్సేనీ ముజీబ్ నియ మితుల య్యారు. ఆదివారం గచ్చిబౌలిలోని టీఎన్జీఓ హౌసింగ్ సొసైటీ ఆవరణలో ఎన్నికల అధి కారి సుగుణాకర్ రెడ్డి, సహాయ ఎన్నికల అధి కారి సురేశ్ ఆధ్వర్యంలో ఈ ఎన్నికల ప్రక్రియ జరిగింది. అధ్యక్ష పదవికి ఒకేఒక్క నామినేషన్ రావడంతో మారం జగదీశ్వర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శి ఎన్నిక కూ డా ఏకగ్రీవం అయింది. కార్యవర్గ సభ్యులుగా 17మంది నామినేషన్ దాఖలు చేయడంతో వారిని నియమించారు. అధ్యక్ష, కార్యదర్శు లుగా మారం జగదీశ్వర్, ఎస్ఎం హుస్సేనీ ముజీబ్ వరుసగా రెండోసారి ఎన్నిక య్యారు. అనంతరం అన్ని జిల్లాల అధ్యక్ష, కార్యద ర్శులు నూతన అధ్యక్ష, కార్యద ర్శులను సన్మానించారు. -
ఎంతో కొంత కళా పోషణ ఉండాలి
గన్ ఫౌండ్రీ (హైదరాబాద్): మనిషన్నాక ఎంతో కొంత కళాపోషణ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉద్ఘాటించారు. రెండు రోజులపాటు నిర్వహించిన శాసన సభ్యుల క్రీడా సాంస్కృతిక పోటీల ముగింపు సభ ఆదివారం రవీంద్ర భారతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... చాలామంది ప్రజా ప్రతినిధులు తమలో ఉన్న ప్రతిభను మర్చిపోయారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో శాసనసభ్యులకు క్రీడా పోటీలు నిర్వహించే వారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ సంప్రదాయాన్ని కొనసాగించలేదన్నారు. శాసనసభ్యుల క్రీడా పోటీలను కొందరు రాజకీయం చేసి బహిష్కరించారని, కనీసం వచ్చే సంవత్సరమైనా పాల్గొనాలని సూచించారు. క్రీడల్లో రాణించిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. విద్యార్థులు మత్తు పదార్థాల వైపు వెళ్తూ.. తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిలిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం పోటీల్లో విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, పలువురు శాసన సభ్యులు, కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. విజేతలు వీరే.. : క్రికెట్లో మంత్రి శ్రీహరి జట్టు విజయం సాధించగా.. బ్యాడ్మింటన్లో రాందాస్ నాయక్, ఆదినారాయణ జోడి విజయం సాధించింది. టేబుల్ టెన్నిస్లో మంత్రి జూపల్లి కృష్ణారావు గెలుపొందారు. పవర్ లిఫ్టింగ్ 63 కేజీల విభాగంలో శంకర్ నాయక్, 93 కేజీల విభాగంలో మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, 105 కేజీల విభాగంలో అనిరుధ్ రెడ్డి విజయం సాధించారు. ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు శాసనసభ్యుల కోసం రవీంద్ర భారతిలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అట్టహాసంగా జరిగాయి. దుర్యోధనుడి వేషధారణలో మంత్రి వాకిటి శ్రీహరి పలికిన డైలాగులు, గంభీరమైన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. కట్టప్ప పాత్రలో శంకర్ నాయక్ ఒదిగిపోగా, ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు గిరిజన సంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శించారు. వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ గిరిజన పాటలకు హుషారుగా డ్యాన్స్ చేయగా.. రామచంద్రనాయక్ తనదైన స్టెప్పులు వేశారు. -
నీట మునిగి 8 మంది మృతి
కొండపాక (గజ్వేల్): రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో నీట మునిగి 8 మంది మృతిచెందారు. వీరిలో ఆరుగురు ఈతకు వెళ్లి మరణించగా, మరో ఇద్దరు చెరువులో మునిగి చనిపోయారు. గజ్వేల్ మండలంలోని కొడకండ్ల గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థులు (వరుసకు అక్కా తమ్ముడు) రిషిక (13), కుక్కల మనీష్ అలియాస్ లక్కీ (11) మామ వరుసైన గణేశ్తో కలిసి వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. గణేశ్ పశువులను మేతకు తీసుకెళ్లగా మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్కు వెళ్లే కాలువలో మనీష్ ఈత కోసం దిగాడు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోతుండగా రిషిక కాపాడేందుకు కాలువలోకి దిగగా ఇద్దరూ మృతి చెందారు. రుషిక కొడకండ్ల ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతుండగా, మనీష్ 7వ తరగతి చదువుతున్నాడు. కుటుంబీకులు, గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఎస్హెచ్ఓ, ట్రైనీ ఐపీఎస్ అయేషా ఫాతిమా ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను బయటకు తీయించారు. ఇదిలాఉండగా హైదరాబాద్లోని మల్కాజ్గిరి బాలాజినగర్కు చెందిన రాములు కుకునూరుపల్లి మండలంలోని ముద్దాపూర్, రాంచంద్రాపూర్ శివారులో కొంత వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. దీంతో రాములు కొడుకు రాజుతోపాటు 8 మంది స్నేహితులతో కలిసి సరదా కోసం వ్యవసాయ బావి వద్దకు వచ్చారు. విజయ్కుమార్తోపాటు మరో నలుగురు మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్కు వెళ్లే కాలువలో ఈత కోసం దిగారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతోపాటు ఈత రాకపోవడంతో విజయ్కుమార్ నీటిలో మునిగిపోతుండగా స్నేహితులు కాపాడే ప్రయత్నం చేశారు.. అయినా ఫలించలేదు. దీంతో విజయ్కుమార్ మృతి చెందాడు. విజయ్ కుమార్ ఆర్మీ క్యాంటీన్లో కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేస్తున్నాడన్నారు. ఈ మేరకు మృతుల కుటుంబీకుల మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో విషాదంసత్తుపల్లి టౌన్: ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎన్టీఆర్ నగర్లో నివాసం ఉంటున్న వేంసూరు మండలం కుంచపర్తికి చెందిన ఒంగూరి జానకి, వెంకటేశ్వరరావు కుమారుడు నాగబాబు (12) రేజర్ల సమీపాన మామిడి తోటలో గేదెలు మేపేందుకు వెళ్లాడు. నాగబాబుతోపాటు అదే కాలనీకి చెందిన వంటిపులి దేవ (11), షేక్ సైదులు కూడా వెళ్లారు. ఈ క్రమంలో పక్కనే నీళ్లు ఉన్న మట్టి క్వారీ గుంత వద్దకు వెళ్లి ఈత కొట్టేందుకు దూకారు. అయితే క్వారీ గుంతలో నీళ్ల లోతును అంచనా వేయలేక మునిగిపోతూ కేకలు వేశారు. సమీపంలో గేదెలు మేపుతున్న దేశినేని సుధారాణి తన చున్నీ విసిరి భుజాల వరకు నీట మునిగిన షేక్ సైదులును కాపాడింది. మిగతా ఇద్దరు నీళ్లల్లో పూర్తిగా మునిగిపోవడంతో మరణించారు. చెరువులో మునిగి ఇద్దరు మృతికోనరావుపేట (వేములవాడ): చెరువులో మునిగి ఇద్దరు చనిపోయిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారంలో విషాదం నింపింది. ధర్మారం గ్రామానికి చెందిన ముడికె లక్ష్మీరాజం (65), కుమ్మం మొండయ్య (55) అనే గొర్రె కాపరులు తమ జీవాలను తీసుకుని గ్రామ శివారులోని పెద్దచెరువు వైపు వెళ్లారు. గొర్లను చెరువులోకి తీసుకెళ్లి స్నానం చేయించేందుకు దిగగా లక్ష్మీరాజం ప్రమాదవశాత్తు చెరువులో జారిపడ్డాడు. గమనించిన మొండయ్య అతడిని కాపాడేందుకు చెరువులోకి దిగాడు. ఈక్రమంలో లక్ష్మీరాజం.. మొండయ్య మెడను గట్టిగా పట్టుకోవడంతో ఈత వచ్చినా కూడా ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. కోనరావుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.కుంటలో మునిగి...అబ్దుల్లాపూర్మెట్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కోహెడలో నివసిస్తున్న నాగనా థ్ పంచాల్ కుమారుడు నరేష్ నాగనాథ్ (14) కోహెడ జెడ్పీ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. శనివారం స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన నరేష్ ఈత కొట్టేందుకు బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేక పోయింది. ఆదివారం ఉదయం సంఘీనగర్ నుంచి గండిచెరువుకు వెళ్లే దారిలో ఉన్న సమల గడ్డ కుంట వద్ద నరేష్ దుస్తులు, చెప్పులు కనిపించడంతో కుంటలో పరిశీలించగా మృతదేహం నీటిపై తేలుతూ కనిపించింది. అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
కూతురు పెళ్లికి అప్పు పుట్టక..
పాపన్నపేట (మెదక్): కూతురు పెళ్లి కోసం అప్పు పుట్టక ఓ తండ్రి మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదివారం మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం... నార్సింగి గ్రామానికి చెందిన ఫిరంగి సత్యనారాయణ (50) కల్లు వ్యాపారం చేసుకుంటూ జీవనం కొన సాగిస్తున్నాడు. ఇతనికి ముగ్గురు కుమార్తెలు. వారం క్రితం ఆయన పెద్ద కూతురు నిశ్చితార్థం జరిగింది. ఆదివారం ఇంట్లో పెళ్లి పత్రిక పెట్టుకొని, సాయంత్రం పెద్దల పండుగ చేసుకోవాల్సి ఉంది. ఈ మేరకు చుట్టాలకు కబురందించారు. అయితే త్వరలో బిడ్డ పెళ్లి చేయాల్సి ఉండగా, డబ్బులు లేక, అప్పులు పుట్టక ఆందోళన చెందాడు. దిక్కుతోచని స్థితిలో శనివారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన సాయంత్రానికి కూడా ఇంటికి రాలేదు. దీంతో కుటుంబీకులు గ్రామ శివారులో వెతికారు. కాగా ఆదివారం ఉదయం గ్రామ సమీపంలోని మూతబడిన రైస్ మిల్లులో ఉరివేసుకున్నాడు. దీంతో శుభకార్యం జరగాల్సిన ఆ ఇంట రోదనలు మిన్నంటాయి. పెళ్లి పత్రిక కోసం రావాల్సిన బంధువులు, అంత్య క్రి యలకు రావాల్సి రావడంతో, ఊరంతా శోక సంద్రమైంది. కాగా, పెళ్లి కుమారుని తరపు వారు కట్నం ఆశించకుండానే పెళ్లికి ఒప్పుకున్నట్లు తెలిసింది. విషయం తెలిసి వారు కూడా కన్నీరు మున్నీరయ్యారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
తల్లిదండ్రులకు తోడుగా..
సాక్షి, హైదరాబాద్: ‘బాధ్యతా రహితంగా వ్యవహరించే కొడుకులను నియంత్రించడంతో పాటు తల్లిదండ్రుల్లో విశ్వాసం పెంచేందుకే సామాజిక బాధ్యతగా.. ‘తెలంగాణ ఉద్యోగుల తల్లిదండ్రుల పోషణ, జవాబుదారీతనం, పర్యవేక్షణ బిల్లు’తీసుకువచ్చాం. తల్లిదండ్రులకు ఈ చట్టం ఒక మంత్రదండం. తల్లిదండ్రులను చూసుకోని వారిని సమాజం బహిష్కరించాలి. అలాంటి వారిని చట్టపరిధిలోకి తెచ్చి దారిలో పెట్టడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశం.అయితే దీనితోనే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని కాదు.. వృద్ధ తల్లిదండ్రులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగించేందుకే మా ప్రయత్నం. ఏ తల్లిదండ్రులు అనాథలుగా ఉండకూడదు, చివరిరోజుల్లో ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో ఈ బిల్లును తెస్తున్నాం..’అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. ఆదివారం అసెంబ్లీలో ఈ బిల్లు’పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. బాధ్యత, భావోద్వేగంతో.. ‘పురాణాలలో శ్రవణ కుమారుడి కథ మాతృ పితృ భక్తికి అద్దం పడితే..అత్యంత విలాసవంతమైన జీవితం గడిపిన రేమండ్స్ మాజీ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మభూషణ్ అవార్డు గ్రహీత విజయ్పథ్ సింఘానియా చివరకు కొడుకు చేసిన ద్రోహంతో అనామకుడిగా తనువు చాలించాల్సి వచ్చింది. పిల్లలకు సర్వస్వం ఇచ్చి పెద్ద తప్పు చేశానంటూ.. తన ఆత్మకథ ‘యాన్ ఇన్కంప్లీట్ లైఫ్’పుస్తకంలో సింఘానియా తన చేదు అనుభవాలను వివరించారు. కొందరు ప్రజాప్రతినిధులు సైతం ఇదే రకమైన ధోరణితో ఉన్నారు. ఒక మాజీమంత్రి తండ్రి సైతం ఇదే విధంగా సరిగా చూసుకోని పరిస్థితుల్లో క్యాన్సర్తో చనిపోయారు. భవిష్యత్తులో తల్లిదండ్రులకు ఆ పరిస్థితి రావొద్దనే ప్రభుత్వం.. బాధ్యత, భావోద్వేగంతో ఈ బిల్లును తీసుకువచ్చింది. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. తల్లిదండ్రులను సంతానంలో ఎవరో ఒకరు చూసుకునేవారు. కానీ ఇప్పుడు మేం ఇద్దరం మాకు ఒక్కరన్న పరిస్థితి వచ్చింది. వృద్ధ తల్లిదండ్రులకు రక్షణ మనిషి బంధాలు, అనుబంధాలను మర్చిపోయి చివరికి పేగు బంధాలను కూడా విస్మరించి భౌతిక సుఖాలు, ఆర్థిక ప్రయోజనాలు, సంపద కోసం పాకులాటల్లో మునిగిపోయాడు. బతికున్నప్పుడు గుప్పెడు మెతుకులు పెట్టని బిడ్డలు, చనిపోయాక ఆస్తుల కోసం కొట్లాడుకోవడం అత్యంత విషాదకరం. తల్లిదండ్రులపై ఒకవేళ కూతురికి ప్రేమ ఉన్నా పెళ్లి తర్వాత వారిని చూసుకోలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం మహిళలు, చిన్నారులను కాపాడేలా ఎన్నో చట్టాలు ఉన్నాయి. పిల్లలు తమ తల్లిదండ్రులను చూసుకోవడం చట్టబద్ధ బాధ్యత అని చెబుతూ ఇప్పటికే చట్టాలున్నా సమాజంలో తల్లిదండ్రుల సంరక్షణ విషయంలో జరుగుతోన్న వివక్ష, నిర్లక్ష్యం గమనిస్తూనే ఉన్నాం. ఈ విధంగా నిర్లక్ష్యానికి గురవుతున్న తల్లిదండ్రుల్లో విశ్వాసాన్ని పెంచేందుకు తీసుకువచ్చిన ఈ బిల్లుకు సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలపాలి. తల్లిదండ్రుల పట్ల భక్తి లేనివారికి భయం కలిగించేందుకే ఈ చట్టం తెచ్చాం. వృద్ధ తల్లిదండ్రులకు రక్షణ కల్పించే దిశగా ఇది ఒక కీలక అడుగు అవుతుంది..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. ‘అమ్మా.. నీకు వందనం’ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ఈ బిల్లు పెట్టాల్సి రావడం దురదృష్టకరమన్నారు. సమాజం మారాలని, విలువలు పెరగాలని ఆకాంక్షించారు. కన్నబిడ్డలు నిర్ల క్ష్యం చేసిన ఓ ముస్లిం మహిళను తాను చేరదీసి అనాథా శ్రమంలో చేర్చిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. ఎంతో మానవత్వంతో ఆలోచించి ఈ బిల్లును ప్రవేశపెట్టిన సీఎం రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఎమ్మెల్యే ఆదినారాయణ అన్నారు. ఈ సందర్భంగా ‘అమ్మా.. నీకు వందనమే..’అనే పాట ఎమ్మెల్యే పాడారు. గతంలో కుటుంబ అనుబంధాలు చాటిచెప్పే సినిమాలు వచ్చేవని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఎమ్మె ల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను భయపెట్టే స్థితిలో కొందరు కొడుకులు, కోడళ్లు ఉన్నారన్నారు. బిల్లుకు ఎమ్మెల్యేలు పాయల్శంకర్, జాఫర్ హుస్సేన్ మద్దతు తెలిపారు. చర్చ అనంతరం బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ సమాజంలో ఏ కుటుంబంలోనూ తల్లిదండ్రులు అనాథలుగా మిగిలిపోకూడదన్న సంకల్పంతోనే ప్రభుత్వం తల్లిదండ్రుల రక్షణ కోసం చట్టం తీసుకొస్తుందని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు చెప్పారు. శాసనసభలో మంత్రి @minister_adluri గారు ప్రవేశపెట్టిన “తెలంగాణ ఎంప్లాయిస్ అకౌంటబిలిటీ, మానిటరింగ్ ఆఫ్… pic.twitter.com/F1JJLwwWsp— Telangana CMO (@TelanganaCMO) March 29, 2026 -
రేవంత్ పాలనలో 19 ప్రధాన స్కామ్లు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రెండేళ్ల మూడు నెలల పాలనలో 19 ప్రధాన కుంభకోణాలు జరిగాయని, వీటిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో లేదా హౌజ్ కమిటీ వేసి విచారణ జరపాలని బీఆర్ఎస్ శాసనసభా పక్షం డిమాండ్ చేసింది. ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పీకర్కు అందజేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీ అక్రమ మైనింగ్పై హౌజ్ కమిటీ వేయాలని బీఆర్ఎస్ సభ్యులు సభలో నినాదాలు చేస్తున్న సమయంలోనే ఈ లేఖను అందజేశారు. తాము ఇచ్చిన లేఖను సీఎం రేవంత్రెడ్డికి పంపాలని కోరారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండున్నరేళ్లలో రాష్ట్రం అవినీతి, కుంభకోణాలకు కేంద్రంగా మారిపోయింది. దాదాపు అన్ని శాఖల్లో అవినీతి, అక్రమాలు, అధికార దురి్వనియోగం యథేచ్ఛగా సాగుతోంది. వాటిని అడ్డుకోవాల్సిన వారే ఈ దోపిడీకి మూలస్తంభాలుగా మారిన పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది. బాధ్యత వహించాల్సిన మంత్రులకు ఈ కుంభకోణాల్లో నేరుగా ప్రమేయం ఉందనే ఆరోపణలు రావడం ప్రజాస్వామ్య వ్యవస్థకు అవమానం. ఈ కుంభకోణాల ఫలితంగా రూ.వేల కోట్ల ప్రజా ధనం కొద్దిమంది చేతుల్లోకి మళ్లిపోతోంది. నియంత్రణ లేకుండా సాగుతున్న ఈ దోపిడీని చూస్తే ఇది నిర్లక్ష్యమా లేక మీ ప్రోత్సాహమా అన్న అనుమానం ప్రజల్లో బలపడుతోంది’అని లేఖలో బీఆర్ఎస్ శాసనసభాపక్షం పేర్కొంది. అడ్డుకోవడం సీఎంగా మీ బాధ్యత ‘అవినీతి, కుంభకోణాలపై లేఖ రాస్తే విచారణ జ రుపుతామని శాసనసభలో స్వయంగా మీరే ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ పాలనలో జరిగిన కుంభకోణాల వివరాలు అందిస్తున్నాం. ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ కుంభకోణాలపై సిట్టింగ్ జడ్జితో విచా రణ జరిపి బాధ్యులపై కఠినచర్యలు తీసుకుని, ప్రజా ధనాన్ని రికవరీ చేయాలి.పౌర సరఫరాలు, అమృత్ టెండర్లు, కేఎల్ఎస్ఆర్, నైనీ కోల్ బ్లాక్, సింగరేణి స్కామ్, సోలార్ పవర్స్కామ్, ఎన్టీపీసీ థర్మల్ పవర్ స్కామ్, హెచ్సీయూ, లగచర్ల భూ స్కామ్, కోటి ఎకరాల భూమి నిషేధిత జాబితా కుంభకోణం, హ్యామ్ రోడ్లు, ఫోర్త్ సిటీ, హిల్ట్–పీ, అక్రమ మైనింగ్ వంటి కుంభకోణాలపై విచారణ జరపాలి. నిష్పక్షపాత విచారణ కోసం ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు వెంటనే పదవులకు రాజీనామా చేయాలి. ప్ర జాధనాన్ని రక్షించడం, అవినీతి అక్రమాలను అడ్డు కోవడం రాజ్యాంగబద్ధమైన సీఎంగా మీ బాధ్యత’అని లేఖలో బీఆర్ఎస్ శాసనసభాపక్షం పేర్కొంది. -
సభలో ‘పాడి’ మంటలు!
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో ఆదివారం బీఆర్ఎస్ సభ్యుడు పాడి కౌశిక్రెడ్డి వ్యవహరించిన తీరుపై దుమారం చెలరేగింది. అక్రమ క్రషింగ్కు పాల్పడిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీపై విచారణకు సభా సంఘం వేయాలని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ రెండోరోజూ అసెంబ్లీలో పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు చేస్తున్న క్రమంలో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి ఫిరాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కడియం శ్రీహరి మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. అయితే పాడి కౌశిక్రెడ్డి సహా మరికొందరు అందుకు అభ్యంతరం తెలిపారు. కడియం ఏ పార్టీకి చెందిన వారో చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో మండిపడ్డ కడియం.. ధరణిని అడ్డుపెట్టుకొని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున భూకబ్జాలకు పాల్పడిందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. అయితే కడియం మాట్లాడుతుండగా కౌశిక్రెడ్డి ఆయన వైపు చేతులతో అసభ్యకరమైన రీతిలో సైగలు చేశారని.. తుపాకీతో కాల్చి చంపుతానని బెదిరింపులకు పాల్పడ్డారని అధికార కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు. ఇది అత్యంత దారుణ ప్రవర్తన: మంత్రులు మంత్రులు వివేక్ వెంకటస్వామి, అజహరుద్దీన్, సభ్యులు రేవూరి ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ కడియం శ్రీహరిపట్ల పాడి కౌశిక్రెడ్డి ప్రవర్తన అత్యంత దారుణమని తప్పుబట్టారు. కౌశిక్రెడ్డిపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. అలాంటి వ్యక్తిని హరీశ్రావు వంటి నేతలు ప్రోత్సహించడం సరికాదని హితవు పలికారు. కౌశిక్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కవ్వంపల్లి సత్యనారాయణ, రాంచందర్, కాలె యాదయ్య, గడ్డం వినోద్, శ్రీగణేశ్, ఆదినారాయణ, జయదీర్రెడ్డి, యశస్వినీరెడ్డి, ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, బీర్ల యాదయ్య తదితరులు డిమాండ్ చేశారు. కత్తులతో కోలాటం ఆడతం.. ఖబడ్దార్: మందుల సామేల్ పాడి కౌశిక్రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ దళిత సభ్యుడు మందుల సామేల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘కత్తులతో కోలాటం ఆడతం బిడ్డా ఖబడ్దార్.. ఏం అనుకుంటున్నవ్? మా పడికత్తుల లేస్తేననుకో నీ గడికి వేలాడగడ్తం బిడ్డా.. ఎవరిని బెదిరిస్తున్నవ్? దళితులు, గిరిజనులంటే లెక్కలేనితనంతో ఉంటే మీ గడిల్లో దూరేరోజు కూడా వస్తుంది’ అని హెచ్చరించారు. కౌశిక్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పీకర్ను కోరారు. కౌశిక్రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయడంతోపాటు కేటీఆర్, హరీశ్రావు కడియం శ్రీహరికి, దళితులకు క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ దళిత శాసనసభ్యులు, మంత్రులు డిమాండ్ చేశారు. చట్టసభల్లోనే దళితులకు రక్షణ కొరవడిందని వేముల వీరేశం ఆరోపించారు. దళితులు, ఆదివాసులైన తాము అడవుల్లో క్రూర మృగాల మధ్య పెరిగామని, తాము యుద్ధం చేస్తే తట్టుకోలేరని బాలూ నాయక్ హెచ్చరించారు. తుపాకీ గురిపెడితే భయపడే ప్రసక్తే లేదన్నారు. ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేయాలని సభలో తీర్మానం.. కడియం శ్రీహరిపై అనుచితంగా ప్రవర్తించిన కౌశిక్రెడ్డిపై చర్యలకు ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేయాలని సభలో తీర్మానించారు. సభా మర్యాదలకు విరుద్ధంగా అసభ్యకర రీతిలో వ్యవహరించిన పాడి కౌశిక్రెడ్డి విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్పీకర్ను సీఎం రేవంత్రెడ్డి కోరారు. ఈ సందర్భంగా రూల్ బుక్లో ఉన్న నిబంధనలను చదవి వినిపిస్తూ ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేసి పాడి కౌశిక్రెడ్డిపై చర్యలు తీసుకోవాలన్నారు. సభ్యుల ప్రవర్తన అభ్యంతరకరంగా ఉంటే ఎలాంటి పరిణామాలు ఉంటాయో భవిష్యత్ తరాలకు తెలిసేలా చర్యలు ఉండాలన్నారు. -
సంరక్షణ మరిస్తే జీతంలో 15% కోత
సాక్షి, హైదరాబాద్: తల్లిదండ్రుల సంరక్షణకు ప్రభుత్వం చట్టబద్ధత కల్పించింది. ఈ మేరకు సరికొత్తగా రూపొందించిన ‘తెలంగాణ ఉద్యోగుల తల్లిదండ్రుల పోషణ, జవాబుదారీతనం, పర్యవేక్షణ బిల్లు–2026’ను ఆదివారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ శాసనసభలో ప్రవేశపెట్టారు. బిల్లుకు సభ్యులు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. వృద్ధ తల్లిదండ్రులకు ఆర్థిక భద్రత, గౌరవప్రద జీవనానికి వీలు కల్పించడమే ఈ చట్టం లక్ష్యం. కాగా కుటుంబ వ్యవస్థలో తగ్గుతున్న బాధ్యతలను..ఇకపై తప్పనిసరిగా నెరవేర్చేలా చేసేందుకు ప్రభుత్వం ఈ చట్టానికి రూపకల్పన చేసింది. కేంద్రం 2007లో ఇలాంటి ఓ చట్టం అమల్లోకి తీసుకొచ్చినప్పటికీ..అంతకంటే కఠినమైన నిబంధనలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. చట్టంలో ఏముంది..ఈ చట్టం కట్టుదిట్టంగా అమలయ్యేలా ప్రభుత్వం ఓ ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇది కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న వారితో పాటు జీతభత్యాలు పొందే ప్రతి ఒక్కరికీ (ప్రజాప్రతినిధులకు కూడా) వర్తిస్తుంది. అతి ముఖ్యమైన అంశం ఏమిటంటే..పిల్లలు తమ తల్లిదండ్రుల సంరక్షణను బాధ్యతగా నిర్వహించకుంటే వారి వేతనంలో 15% లేదా రూ.10 వేలు (ఏది తక్కువైతే అది) కోత విధించి తల్లిదండ్రుల ఖాతాలో జమ చేస్తారు. ఇందుకోసం పిల్లలు పనిచేస్తున్న ప్రభుత్వ శాఖలు లేదా యాజమాన్యాలకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలను జారీ చేస్తుంది. నిరాదరణకు గురైన తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్కు నేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ దరఖాస్తుపై జిల్లా కలెక్టర్ లేదా కలెక్టర్ నియమించిన అధికారి ఇరువర్గాలను పిలిచి విచారణ జరుపుతారు. తర్వాత ఉద్యోగి జీతం నుంచి నిర్దేశించిన మొత్తాన్ని మినహాయిస్తూ ఆదేశాలిస్తారు. దరఖాస్తును అది అందిన 60 రోజుల్లోగా తప్పకుండా పరిష్కరించాలిఒకవేళ అధికారి ఆదేశాలపై దరఖాస్తు దారులు సంతృప్తి చెందకున్నా, గడువులోగా పరిష్కారం చేయకున్నా రాష్ట్ర స్థాయిలో ఫిర్యాదు చేయవచ్చు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వయోవృద్ధుల కమిషన్ ఏర్పాటు చేస్తుంది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి లేదా ప్రభుత్వం ఎంపిక చేసిన వ్యక్తి ప్రధాన కమిషనర్గా వ్యవహరిస్తారు. జిల్లా స్థాయి నుంచి దరఖాస్తుదారుడు నేరుగా వయోవృద్ధుల కమిషన్లో అప్పీలు చేసుకున్న తర్వాత నెలరోజుల్లోగాతప్పకుండా పరిష్కరించాలి. -
సీఐడీ వద్దంటే సీబీఐ
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన మైనింగ్ లావాదేవీలపై సమగ్ర విచారణను సీబీసీఐడీకి అప్పగిస్తూ ఆదేశాలిచ్చాం. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీబీసీఐడీ విచారణ సక్రమంగా జరగదనే అనుమానం వారికి (ప్రతిపక్షం) ఉంటే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీబీఐ విచారణ కావాలా? సీబీఐ విచారణ కావాలని వారిని అడగమనండి. అడిగితే వేస్తాం’అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. మైనింగ్ అక్రమాలపై సభాసంఘం వేయాలని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలోని పోడియం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆదివారం సైతం ఆందోళనకు దిగిన నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ తీరును తూర్పారపట్టారు. సభలో బీఆర్ఎస్ పప్పులు ఉడకవని... వారి మంత్రాలకు చింతకాయలు రాలవని ధ్వజమెత్తారు. పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి చెందిన వారు గానీ, తన కుటుంబంగానీ ఏమైనా అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం ఉంటే సీబీసీఐడీకి ఆధారాలు సమర్పించాలని అన్ని పార్టీల సభ్యులకు సీఎం సూచించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సంబంధించిన మైనింగ్ లావాదేవీల్లో అక్రమాలు చేసినట్లు ఆధారాలున్నా సీబీసీఐడీకి ఇవ్వాలని.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన మైనింగ్ లావాదేవీలపైనా విచారణ జరుపుతామని అన్నారు. కేటీఆర్, హరీశ్రావు సీబీసీఐడీకి సహకరించాలన్నారు. హరీశ్రావు కారణంగా ఇరుకునపడ్డానని కేటీఆర్ ఆగ్రహంగా ఉన్నారంటూ చురకలంటించారు. సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... రాఘవ కన్స్ట్రక్షన్స్ నుంచి పన్నులు రాబట్టింది మేమే ‘రాఘవ కన్స్ట్రక్షన్స్ విషయంలో 2025లో వాస్తవ పరిస్థితులు తెలుసుకొని మైనింగ్ శాఖ పన్నులు రాబట్టుకుంది. ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చర్యలు తీసుకున్నాం. ఇంత పారదర్శకంగా మేం తీసుకున్న చర్యలను అభినందిస్తే మా అధికారులు మరింత ఉత్సాహంగా పనిచేసేవారు. మా ప్రభుత్వం ఇచ్చిన నోటీసు తీసుకొచ్చి వాళ్లేదో కనిపెట్టినట్లు మాట్లాడుతున్నారు. దానిపై సభాసంఘం వేయాలని డిమాండ్ చేస్తున్నారు. వాళ్ల ప్రభుత్వంలో మూడు సభాసంఘాలు వేసి బ్లాక్మెయిల్ చేసి ఆస్తులు గుంజుకున్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి రాజకీయ లబ్ధి పొందారు. వారిలా హౌస్ కమిటీ వేసి రాజకీయ లబ్ధి పొందాలని మేం చూడలేదు. హౌస్ కమిటీ వేసినా నివేదికను మళ్లీ ఏదో ఒక ప్రభుత్వ విచారణ సంస్థకు ఇవ్వాల్సిందే. అందుకే మేం నేరుగా సీబీసీఐడీ విచారణకు ఆదేశించాం’అని సీఎం రేవంత్ చెప్పారు. దళితులను అవమానించేలా బీఆర్ఎస్ తీరు ‘తెలంగాణ సాధిస్తే దళితుడిని సీఎం చేస్తానని నాడు కేసీఆర్ చెబితే ప్రజలు నమ్మి ఓట్లేశారు. కానీ దళితులకు సీఎం పదవి చేతకాదు.. దొర మాత్రమే సీఎం కావాలని దళితులను నట్టేట ముంచాడు. 2018 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక కేవలం కొప్పుల ఈశ్వర్కు మంత్రి పదవి ఇచ్చాడు. విద్యావంతుడైన భట్టి విక్రమార్కను కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష నేతను చేస్తే సంవత్సరం తిరగకముందే ఎమ్మెల్యేలను లాక్కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. అయినా సహనం కోల్పోకుండా ఆయన పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు. అలాంటి ఆయన్ను డిప్యూటీ సీఎంగా, ఆర్థిక మంత్రిగా చేస్తే దాన్ని కూడా సహించట్లేదు. దొరలు మాత్రమే పాలించే తెలంగాణలో దళితుడు బడ్జెట్ ప్రవేశపెడతాడా అని ఉప ముఖ్యమంత్రిని అవమానించేలా వ్యవహరిస్తున్నారు. దళితులపై ప్రేమ కాదు.. కనీసం మానవత్వం కూడా చూపట్లేదు’అని సీఎం రేవంత్ మండిపడ్డారు. దళితుడు పైన కూర్చుంటే కింద కూర్చోవాలా అని కేసీఆర్ సభకు రావట్లేదు ‘గతంలో దళితులు, గిరిజనులకు జరిగిన అవమానాలను గుర్తించే మేం అధికారంలోకి రాగానే పాలనలో వారికి పెద్దపీట వేశాం. బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు, దయాకర్రావు, కవితారావు, సంతోశ్రావు, వినోద్రావులు రాజ్యమేలారు. కానీ మా టీంలో భట్టి, దామోదర రాజనర్సింహ, వివేక్, అడ్లూరి, సీతక్క, రామచంద్ర నాయక్, వేముల వీరేశం, అద్దంకి దయాకర్ మొదలైన వారున్నారు. ఇన్నాళ్లూ చేసిన పాపాలకు అనుభవిస్తారని స్పీకర్గా దళితుడిని కూర్చోబెడితే ఒక దళితుడి ముందు మైక్ అడగడమా? దళితుడు పైన కూర్చొంటే నేను కింద కూర్చోవాలా? అని కేసీఆర్ సభకు రావట్లేదు. కేసీఆర్ అలా వ్యవహరించగా ఆ పారీ్టలోని ఇతర సభ్యులు సభను నడవనివ్వట్లేదు. స్పీకర్ ఎన్నిసార్లు సభను సజావుగా సాగనీయాలని కోరినా వినట్లేదు. సభాపతిని అవమానించారు. దళితులు మంత్రులుగా ఉండకూడదన్నట్లుగా కుట్రలు చేస్తున్నారు. కుల వివక్షను బహిరంగంగా ప్రదర్శిస్తున్నారు. దళితులను అవమానించే రాజకీయ సంస్కృతి ఇక నడవదు. వారికి గౌరవం, అవకాశాలు కలి్పంచడం మా ప్రభుత్వ బాధ్యత’అని రేవంత్రెడ్డి చెప్పారు. కేసీఆర్తో రాజీనామా చేయించండి ‘సభలో ఒకట్రెండు కోతులు సభను అపహాస్యం చేస్తున్నాయి. రెవెన్యూ శాఖలో సంస్కరణలు తెచ్చి లక్షలాది కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తున్న పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని రాజీనామా చేయాలంటున్నారు. వారికి సిగ్గుంటే సభకు రాని కేసీఆర్తో రాజీనామా చేయించాలి. రూ. కోటీ పది లక్షల జీతం తీసుకొని సభకు రాడట, జీతం వెనక్కు ఇవ్వడట. ఆయన రాజీనామా చేయవద్దట. గురివింద గింజ సామెతలా వ్యవహరిస్తున్నారు. సభ్యులుగా ఏ అంశమైనా వారు లేవెనెత్తొచ్చు. కానీ మేం చెప్పినట్టే ఈ ప్రభుత్వం నడవాలనే విధానం దుర్మార్గం. స్పీకర్ను నిర్దేశించే ఈ విధానం ఎక్కడిది? కడియం శ్రీహరి కేసీఆర్కు సమానంగా ప్రజాజీవితం నుంచి వచ్చిన వ్యక్తి. నిబద్ధత, నిజాయితీతో కూడిన నాయకుడు. అవినీతి మచ్చలేని సీనియర్ నాయకుడిపై కౌశిక్రెడ్డి వ్యవహరించిన తీరు సరైనదేనా అని కేటీఆర్, హరీశ్ చెప్పాలి. అసభ్యకరంగా, అసహ్యకరంగా సభలో వ్యవహరిస్తే మీరు ఒప్పుకుంటారా? మా దగ్గర కూడా కండలు తిరిగిన రాజ్ ఠాకూర్ (రామగుండం ఎమ్మెల్యే) లాంటి వాళ్లు ఉన్నారు. ఇలాగే ఉంటే అసెంబ్లీలో కత్తిపోట్లు, కుస్తీపోట్లకు పోటీలు జరగాల్సి ఉంటుంది. సభ్యులు సభను సజావుగా జరగనివ్వకపోతే సభా వ్యవహారాల మంత్రి సస్పెన్షన్కు సిఫారసు చేస్తారు. పాడి కౌశిక్రెడ్డి వ్యవహారంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలి’అని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు. -
23 చిత్ర నిర్మాణం చాలా కష్టంతో కూడుకుంది: సౌమ్యామిశ్రా
2025 సంవత్సరానికి గానూ రాష్ట్రప్రభుత్వం ప్రకటించే గద్దర్ అవార్డ్స్ లో స్పెషల్ జ్యురీ అవార్డు పొందిన 23 (ఇరవై మూడు) చిత్ర బృందానికి జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభకు ఆమె హాజరయ్యారు.ఈ సినిమా నిర్మాణం అత్యంత బాధ్యత, కష్టంతో కూడుకున్నదని ఈ సినిమా చాలా ప్రభావవంతం గా ఉందని సౌమ్యామిశ్రా అన్నారు.జైలు జీవితాలను ఇంత వాస్తవికతంగా ఎవరూ తెరమీద చూపించలేదని ది షాషాంక్ రిడెంప్షన్ వంటి గొప్ప చిత్రాల సరసన నిలబడే చిత్రం 23 అని అన్నారు. ఈ సినిమా ఖచ్చితంగా జైలులోని ఖైదీలు చూసేలా ఏర్పాట్లు చేస్తానని తెలిపారు. కొంతమంది ఖైదీలలో మార్పు వచ్చినా అది గొప్పమార్పేనని సౌమ్యామిశ్రా పేర్కొన్నారు. అనంతరం దర్శకుడు రాజ్ మాట్లాడుతూ..ఈ చిత్ర ప్రయాణంలో తనకు తోడున్న సభ్యులందరికీ కృతజ్ఞతలని ఈ సినిమా ప్రయాణం చాలా ప్రత్యేకమని తెలిపారు. ఈ సినిమా నిర్మించిన ప్రయోజనం నెరవేరాలంటే జైళ్లలో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. 23 వంటి సామాజిక దృక్పథం ఉన్న సినిమాలకు ప్రభుత్వం ప్రోత్సాహాలు అందించాలని దర్శకుడు బి. నర్సింగరావు కోరారు. ఈ కార్యక్రమం సినీ ఇండస్ట్రీకి చెందిన ఇతర ప్రముఖులు పాల్గొన్నారు -
మణికొండలో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి,హైదరాబాద్: మణికొండలో ఆదివారం సాయంత్రం ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనతో నివాసితులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మంటలు మొదటగా అపార్ట్మెంట్లోని ఒక ఫ్లోర్లో చెలరేగి, కాసేపటికే ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. పొగలు కమ్ముకోవడంతో నివాసితులు బయటకు పరుగులు తీశారు. కొంతమంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు.సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్థానిక పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. నష్టాన్ని అంచనా వేయడానికి అధికారులు చర్యలు ప్రారంభించారు.ఈ ఘటనతో మణికొండ ప్రాంతంలో కలకలం రేగింది. ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చినా, ఆస్తులకు గణనీయమైన నష్టం జరిగినట్లు సమాచారం. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అపార్ట్మెంట్ మేనేజ్మెంట్ మరింత జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.మణికొండలో జరిగిన ఈ అగ్నిప్రమాదం పెద్ద ప్రమాదాన్ని తలపించింది. అగ్నిమాపక సిబ్బంది వేగంగా స్పందించకపోతే పరిస్థితి మరింత విషమించేది. ప్రాణనష్టం జరగకపోవడం స్థానికులకు ఊరటనిచ్చింది. అయితే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా నివాసితులు, మేనేజ్మెంట్ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. -
ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి హాట్ కామెంట్స్
హైదరాబాద్: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం మంత్రుల నియోజకవర్గాలకే నిధులు ఇస్తున్నారని, ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు ఎందుకు నిధులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. నిధుల కోసం మంత్రుల.. సీఎం చుట్టూ తిరగాలా? అంటూ మండిపడ్డారు. ప్రభుత్వం అంటే మంత్రులే కాదు.. ఎమ్మెల్యేలందరం కలిస్తునే ప్రభుత్వమనే విషయం తెలుసుకోవాలన్నారు. ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వకుండా, మంత్రులకు మాత్రమే ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గాలపై వివక్ష చూపొద్దని ప్రభుత్వానికి సూచించారు. -
‘ఎండాకాలం.. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేత’
హైదరాబాద్: తెలంగాణ శాసన సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఎండాకాలంలో నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకుని శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. సన్నబియ్యం కార్యక్రమం మొదలుపెట్టి ఏడాది అవుతోందని చెప్పారు. 86 శాతం ప్రజలకు (3 కోట్ల 36 లక్షల మందికి) సన్న బియ్యం ఇస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కోటి 60 లక్షల జనాభాకు రేషన్ కార్డులు ఇస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో డొమెస్టిక్ సిలిండర్ల కొరత లేదని, కమర్షల్ సిలిండర్ల కొరత ఉందని తెలిపారు. కొన్ని రోజుల్లో కమర్షియల్ సిలిండర్ల కొరత కూడా తగ్గుతుందని చెప్పారు.మరోవైపు, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ స్పందించారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా బేసిన్ పై ఫోకస్ పెట్టింది. దిండి ప్రాజెక్ట్ వచ్చే రెండేళ్లలో పూర్తి చేయబోతున్నామని హామీ ఇస్తున్నా. గత ప్రభుత్వం చేసిన లోన్స్ వల్ల ఇప్పుడు సమస్య ఏర్పడింది. 97 వేల కోట్ల రూపాయలను గత ప్రభుత్వం ఇరిగేషన్ పై ఖర్చు చేసింది. కాళేశ్వరం - పాలమూరు ప్రాజెక్ట్ పై మాత్రమే ఖర్చు చేశారు. పాలమూరు ప్రాజెక్ట్ పై ఒక్క ఎకరా కొత్త ఆయకట్టు రాలేదు. పెండింగ్ ప్రాజెక్టులపై ఎమ్మెల్యేలందరికి న్యాయం చేసేలా ముందుకు వెళ్తున్నాం. ఇరిగేషన్ శాఖలో ఎవ్వరికీ అన్యాయం జరగదు. ఎమ్మెల్యేలు ఎవ్వరూ ఆందోళన చెందవద్దు. ప్రాజెక్ట్ ల భూ సేకరణ కోసం 5వేల కోట్ల రూపాయల బడ్జెట్ లో పెట్టాం’ అని అన్నారు. -
‘మంత్రి అవినీతికి పాల్పడినట్లు రేవంతే ఒప్పుకున్నారు’
హైదరాబాద్: మంత్రి పొంగులేటి కంపెనీ అవినీతిక పాల్పడిందనే విషయం ప్రజలకు అర్థమైందని బీఆర్ఎస్ నేత హరీష్రావు పేర్కొన్నారు. కాకపోతే డైవర్షన్ కోసం రేవంత్ ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు. మంత్రిని కాపాడటానికే సీబీసీఐడీ విచారణ వేశారని, హౌస్ కమిటీ గానీ, సిట్టింగ్ జడ్జితో గానీ విచారణ చేయించాలని హరీష్ డిమాండ్ చేశారు. ఈరోజు(ఆదివారం, మార్చి 29వ తేదీ) ప్రెస్మీట్లో హరీష్రావు మాట్లాడుతూ.. ‘ పొంగులేటి కంపెనీ అవినీతికి పాల్పడిందని ప్రజలకు అర్థమైంది. తప్పు జరిగిందని రేవంత్ స్వయంగా ఒప్పుకున్నారు. మంత్రి అవినీతికి పాల్పడినట్లు రేవంతే ఒప్పుకున్నారు. ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి పది తప్పులు చేస్తున్నారు. అసెంబ్లీలో ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది’ అని విమర్శించారు.సీఎం రేవంత్కు హరీష్ సవాల్సీఎం రేవంత్రెడ్డికి హరీష్రావు సవాల్ విసిరారు. ‘మీ తమ్ముడు చేసిన అవినీతిపై విచారణకు సిద్ధమైతే.. హౌస్ కమిటీ విచారణకు నేను సిద్ధం. హౌస్ కమిటీ విచారణ.. సీఐడీ విచారణ కాకుండా, ఇద్దరం కలిసి సిట్టింగ్ జడ్జితో విచారణకు వెళ్దాం.. సీఎం రేవంత్ సిద్ధంటే.. నేను సిద్ధం’ అని చాలెంజ్ చేశారు. నిన్న(శనివారం, మార్చి 28వ తేదీ) అసెంబ్లీలో హరీష్ మాట్లాడుతూ.. నగరం నడిబొడ్డను అక్రమ మైనింగ్ జరుగుతుందని ధ్వజమెత్తారు. కంచె చేనుమేసినట్లు.. రక్షకుడే భక్షకుడిలా మారినట్లు అక్రమ మైనింగ్ జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రాఘవ కన్స్ట్రక్షన్స్ నడుపుతున్న క్రషర్స్ కు ఎలాంటి అనుమతులు లేవని,. జీవో త్రిబుల్ వన్ వైలెట్ చేస్తూ ఆక్రమణ జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? అని ప్రశ్నించారు, క్రషర్ నడపాలంటే 8 రకాల అనుమతులు కావాలని, నిబంధనలను పాటించకుండా క్రషర్ నడుపుతున్నారని మండిపడ్డారు. -
‘ కాంగ్రెస్-బీఆర్ఎస్ ఒక్కటే’
హైదరాబాద్: కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని పునరుద్ఘాటించారు కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్. ముఖ్యమంత్రి రేవంత్కు కేటీఆర్ అంటే ప్రేమని, అందుకే ఈ కార్ రేస్, విద్యుత్ కొనుగోలు, ఫామ్ హౌస్, ఫోన్ ట్యాపింగ్ కేసులపై విచారణ ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి మాట్లాడిన బండి సంజయ్.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కాళేశ్వరంపై విచారణ ఒక్కటే కనబడుతోందని విమర్శించారు. హరీష్ రావు మీద ఉన్న కసి కేటీఆర్ మీద ఎందుకు తగ్గిందన్నారు బండి సంజయ్. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పోటీ చేసే ప్రయత్నాలు ఇద్దరి మధ్య జరుగుతున్నాయని, కేటీఆర్ను కవితను కలిపే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేటీఆర్కు, రేవంత్కు మధ్య రహస్య ఒప్పందాలు జరిగాయని బండి సంజయ్ ఆరోపించారు. -
TG: తల్లిదండ్రుల చట్టానికి ఆమోదం
సాక్షి,హైదరాబాద్: తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీలో అధికారికంగా ప్రకటన చేశారు. ‘తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగి జీతంలో 15శాతం కోసం కోత విధించి ఆ మొత్తాన్ని నేరుగా ఉద్యోగి తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసేలా చట్టాన్ని రూపొందించామని తెలిపారు. పిల్లల్ని కనగలం..వారి బుద్ధుల్ని మనం కనలేం అన్నట్లుగా ఉంది కొందరి వ్యవహారం. సామాజిక బాధ్యతగా మా ప్రభుత్వం తల్లిదండ్రుల కోసం ఈ చట్టం తెచ్చింది. భక్తితో లేదా భయంతో తల్లిదండ్రుల్ని చూసుకోవాలన్నదే మా ఆలోచన. ప్రేమలు పంచాల్సి చోట చట్టం తేవడం బాధగా ఉంది. తల్లిదండ్రుల్ని పట్టించుకోని ప్రతి కుమారికి బుద్ధి చెప్పే చట్టం ఇది. ఉద్యోగులే కాదు ప్రజా ప్రతినిధులు సైతం ఈ చట్టం కిందకి వస్తారు. తల్లిదండ్రుల్ని పట్టించుకోని కుమారులను సామాజిక బహిష్కరణ చేయాలి’అని సూచించారు. -
తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. రెండు రోజుల పాటు సభ నుంచి సస్పెన్షన్ చేశారు. కేటీఆర్,హరీష్రావు, కృష్ణారావు, మహిపాల్రెడ్డి పద్మారావు, చింతా ప్రభాకర్రావు, కొత్త ప్రభాకర్రెడ్డి, మర్రి రాజశేఖర్రెడ్డి,సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్లను సస్పెండ్ చేశారు. బడ్జెట్పై చర్చను అడ్డుకుంటున్నారంటూ స్పీకర్ చర్యలు చేపట్టారు.ఎథిక్స్ కమిటీకి పాడి కౌశిక్ వ్యవహారం..తెలంగాణ అసెంబ్లీని కౌశిక్రెడ్డి వ్యవహారం కుదిపేసింది. సభలో కౌశిక్రెడ్డి వ్యవహారంపై ఎథిక్స్ కమిటీకి స్పీకర్ సిఫారసు చేశారు. కౌశిక్ వ్యవహారాన్ని బీఆర్ఎస్ సమర్థిస్తుందా? అంటూ సీఎం రేవంత్రెడ్డి మండిపడ్డారు. సీనియర్ ఎమ్మెల్యే పట్ల కౌశిక్ ప్రవర్తన సరికాదని.. ఎథిక్స్ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని రేవంత్ డిమాండ్ చేశారు.కడియం శ్రీహరి నిబద్ధత, నిజాయితీ ని ఈ దేశంలో ఎవరూ ప్రశ్నించలేరు. కడియం శ్రీహరి అవినీతి మచ్చలేని నేత. కడియం శ్రీహరి విషయంలో మీ సభ్యులు వ్యవహరించిన తీరును కేటీఆర్, హరీష్ రావు సమర్థిస్తున్నారా?. కడియం శ్రీహరికి జరిగినట్లే రేపు కేసీఆర్కు జరిగితే సమర్థిస్తారా?. సభకు కుస్తీల పోటీకి రాలేదు. సభలో కూర్చింటే బిఆర్ఎస్ సభ్యులను కొనసాగించండి. లేదంటే ఈ రెండు రోజులు సస్పెండ్ చేయండి. కౌశిక్ విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలి’’ అని స్పీకర్ను రేవంత్రెడ్డి కోరారు. -
సొంత వాహనం పక్కన పెట్టండి.. మెట్రో ఎక్కండి!
సాక్షి, హైదరాబాద్: మెట్రో రైళ్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఒకవైపు వేసవి, మరోవైపు పెట్రోల్, డీజిల్ కొరత. దీంతో చాలామంది సొంత వాహనాలను తాత్కాలికంగా పక్కన పెట్టి మెట్రోల్లో ప్రయాణం చేస్తున్నారు. సాధారణ రోజుల్లో కంటే ప్రయాణికుల సంఖ్య పెరిగింది. వారం క్రితం రోజుకు 4.5 లక్షల మంది ప్రయాణం చేయగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 4.7 లక్షల నుంచి 4.85 లక్షలకు పెరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. పశి్చమాసియా యుద్ధం కారణంగా కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై నెలకొన్న అనిశ్చితి, రెండు రోజులుగా అకస్మాత్తుగా బంకుల్లో రద్దీ వంటి పరిణామాల కారణంగా మెట్రో రైళ్లకు డిమాండ్ పెరిగింది. కొత్త కోచ్లకు బ్రేక్.. ⇒ ఉద్యోగులు, విద్యార్ధులు, ఐటీ నిపుణులు ఇతర వర్గాల చెందిన ప్రయాణికులు సమ్మర్ హీట్ బారిన పడకుండా ఉండేందుకు మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు. నాగోల్ నుంచి అమీర్పేట్, ఎల్బీనగర్ నుంచి మియాపూర్ కారిడార్లతో పాటు జేబీఎస్– ఎంజీబీఎస్ కారిడార్లోనూ ప్రయాణికుల రద్దీ పెరిగినట్లు అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్, మే నెలల్లో ప్రతిరోజు సుమారు 5 లక్షల మందికి పైగా మెట్రోల్లో ప్రయాణం చేసే అవకాశం ఉంది. కాగా.. ప్రయాణికుల డిమాండ్ మేరకు కోచ్ల సంఖ్య పెరగడం లేదు. ⇒ ప్రస్తుతం నగరంలోని మూడు కారిడార్లలో ప్రతి రోజు సుమారు 1000 ట్రిప్పులు తిరుగుతున్నాయి. ప్రతి 3 నుంచి 5 నిమిషాలకు ఒకటి చొప్పున మెట్రో అందుబాటులో ఉన్నప్పటికీ ప్రయాణికులు పడిగాపులు కాయాల్సి వస్తోంది. అన్ని మెట్రో రైళ్లకు కేవలం 3 బోగీలే ఉండడంతో ఈ పరిస్థితి నెలకొంది. అదనంగా మరో 3 బోగీలను ఏర్పాటు చేయాలని రెండేళ్ల క్రితం భావించారు. ఈ క్రమంలో ఎల్అండ్టీ సంస్థ హైదరాబాద్ మెట్రో రైల్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకోవడంతో కొత్త కోచ్ల కొనుగోలుకు బ్రేక్ పడింది. అరకొర కోచ్లతో ప్రయాణికులకు ఇబ్బందులు ఇప్పట్లో తప్పేలే లేవు. -
పనిలోంచి తొలగించారని సిలిండర్ ఎత్తుకెళ్లారు
రంగారెడ్డి జిల్లా: యజమాని తమను పనిలోంచి తొలగించాడని అతడి బైక్, గ్యాస్ స్టౌతో పాటు సిలిండర్ను ఎత్తుకెళ్లిన దంపతుల ఘటన ఘట్కేసర్ పీఎస్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీకి చెందిన మల్లెల కిరణ్, ఆయన భార్య ఉపాధి కోసం «అంకుషాపూర్ వచ్చాకె. గ్రామానికి చెందిన పెరికాల ప్రవీణ్ తన ఫాంహౌద్ద ఈ దంపతులను నెల క్రితం పనిలో పెట్టుకున్నారు. వీరికి రూ. 25 వేలు అడ్వాన్స్ ఇచ్చారు. కాగా.. పని సక్రమంగా చేయడం లేదని విధులకు రావొద్దని వారికి సూచించారు. దీంతో యజమానిపై కోపంతో అతడి బైక్, స్టౌతో పాటు సిలిండర్ను ఈ నెల 16న ఎత్తుకెళ్లిపోయారు. ఫోన్ చేస్తే త్వరలో వస్తామని చెప్పినా.. వారం రోజులుగా స్పందించకపోవడంతో ప్రవీణ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. -
హరీష్రావుకు సీబీసీఐడీపై నమ్మకం లేదా?: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: మైనింగ్ అక్రమాలపై చర్చకు అవకాశం ఇచ్చామని.. మైనింగ్ అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశించామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరంలో కేసీఆర్ కుటుంబం దోపిడీకి పాల్పడిందని మేం మాత్రమే కాదు.. దేశ ప్రధాని, హోంశాఖ మంత్రి కూడా అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తే కేసీఆర్, హరీష్ రావును 48 గంటల్లో జైల్లో పెడతామన్నారు. వీళ్ళ మాటలు నమ్మి మేం కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించాం’’ అని రేవంత్ పేర్కొన్నారు.‘‘48 గంటలు కాదు… ఎన్ని నెలలు గడిచిందో మీరే చూశారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణను ఢిల్లీలో తొక్కిపెట్టి మీరు, వాళ్లు ఒక్కటై పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు సీట్లు పంచుకున్నారు కదా. కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీష్ను జైల్లో పెట్టిన తరువాత బీజేపీ నేతలు సూచనలు చేస్తే బాగుంటుంది. నేను నిర్దిష్టమైన ఆరోపణలు చేస్తున్నా.. మహబూబ్నగర్ జిల్లా బాలానగర్లో ప్రైవేటు పరిశ్రమ యజమానులను బెదిరించి హరీష్రావు తమ్ముడు మహేశ్ రావు.. ధరణి ద్వారా వందల ఎకరాలు భూ బదలాయింపు చేసుకున్నారు. హరీష్ రావు ఒప్పుకుంటే… దీనిపై హౌస్ కమిటీ వేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం’’ అని రేవంత్ తేల్చి చెప్పారు.కాగా, సభలో బీఆర్ఎస్ సభ్యుల నిరసనకు దిగారు. రాఘవ కన్స్ట్రక్షన్స్పై హౌస్ కమిటీ వేయాలని నినాదాలు చేశారు. మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. స్పీకర్ పోడియం ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ నిరసనల మధ్యే మూడు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇప్పటికే మైనింగ్పై విచారణకు ఆదేశించామని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. సీఐడీ విచారణకు ఆదేశించిన తర్వాత కమిటీ ఎందుకు?. బీఆర్ఎస్ దగ్గర ఆధారాలుంటే సీఐడీకి ఇవ్వొచ్చని శ్రీధర్బాబు అన్నారు.అంతకుముందు రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ క్రషర్పై చర్యలు తీసుకోవాలంటూ గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు. గన్ పార్క్ నుంచి అసెంబ్లీ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. సభలో ఇదే అంశంపై ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నిలదీసింది. -
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 29- ఏప్రిల్ 05)
-
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఆందోళన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఆందోళన నెలకొంది. సభలో బీఆర్ఎస్ సభ్యుల నిరసనకు దిగారు. రాఘవ కన్స్ట్రక్షన్స్పై హౌస్ కమిటీ వేయాలని నినాదాలు చేశారు. మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. స్పీకర్ పోడియం ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన చేపట్టారు.బీఆర్ఎస్ నిరసనల మధ్యే మూడు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇప్పటికే మైనింగ్పై విచారణకు ఆదేశించామని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. సీఐడీ విచారణకు ఆదేశించిన తర్వాత కమిటీ ఎందుకు?. బీఆర్ఎస్ దగ్గర ఆధారాలుంటే సీఐడీకి ఇవ్వొచ్చని శ్రీధర్బాబు అన్నారు. అంతకుముందు రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ క్రషర్పై చర్యలు తీసుకోవాలంటూ గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు. గన్ పార్క్ నుంచి అసెంబ్లీ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. సభలో ఇదే అంశంపై ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నిలదీసింది. -
ద్విచక్రవాహనంలో రక్తపింజరి
హైదరాబాద్: ఏసీగార్డ్స్లోని టూవీలర్ మెకానిక్ ఫకృద్దీన్కు ఓ ద్విచక్రవాహనంలో రక్తపింజరి పాము ప్రత్యక్షం కావడంతో భయాందోళనకు గురయ్యాడు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రాష్ట్ర కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగి శనివారం తన వాహనాన్ని మరమ్మతుకు ఇచ్చాడు. రిపేరు చేసే క్రమంలో డిక్కీలో రక్తపింజరి పాము కనిపించింది. దీంతో ఫకృద్దీన్ మరొకరి సహాయంతో పామును ఖాళీ బాటిల్లోకి పంపించి దూరంగా వదిలేశారు. -
శివయ్య పిలుస్తున్నాడు.. నేను వెళ్లిపోతున్నా
మేడ్చల్ జిల్లా: నన్ను శివయ్య పిలుస్తున్నాడు.. నేను వెళ్లిపోతున్నా అని లేఖరాసి ఓ యువతి అదృశ్యమైంది. మేడిపల్లి పోలీసులు తెలిపిన మేరకు.. పర్వతాపూర్ సాయిఐశ్వర్య కాలనీలో నివాసముంటున్న శైలజ(39) కుమార్తె మధుహసిత(19) ఇంటివద్దే ఉంటోంది. గతంలో లాలాపేటలో నివాసమున్నపుడు యువతికి ఓయువకుడితో పరిచయం ఏర్పడింది. దీంతో కుటుంబ సభ్యులు మందలించడంతో అతనితో మాట్లాడడం మానేసింది. ఈ నెల 27న సాయంత్రం తల్లి శైలజ ఇంటికి రాగా కుమార్తె కనిపించలేదు. ఇంట్లో తల్లికి ఓలేఖ లభించింది. ఆ లేఖలో ‘‘నేను చాలా డిప్రెషన్లో ఉన్నాను.. లార్డ్ శివయ్య పిలుస్తున్నాడు’’ అని లేఖలో పేర్కోంది. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.యువకుడితో వెళ్లిపోయిన బాలిక..బంజారాహిల్స్: ఓ బాలిక యువకుడితో వెళ్లిపోయిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బోరబండలో నివసించే బాలిక (14) జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్–25లోని ఓ ఇంట్లో కేర్ టేకర్గా పనిచేస్తోంది. కొంతకాలంగా అంజు (25) అనే యువకుడితో పరిచయం పెంచుకుని చాటింగ్ చేస్తోంది. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున యజమానురాలి కళ్లు గప్పి అంజుతో వెళ్లిపోయింది. దీంతో యజమానురాలు బాలిక తల్లికి సమాచారం అందించింది. కొంతకాలంగా అతనితో ఫోన్లో మాట్లాడుతోందని, చాటింగ్ కూడా చేస్తున్నదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు పేర్కొన్నారు. తన కూతురు కనిపించడం లేదంటూ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కుమారుడితో సహా కాల్వలో దూకిన తల్లి?
వరంగల్ జిల్లా: భార్యాభర్తలు గొడవ ప డ్డారు. ఆవేశంతో సదరు మహిళ తన కుమారుడితో సహా ఇంటినుంచి వెళ్లిపోయింది. కాగా, ఎస్సారెస్పీ కాల్వలో దూకినట్లు అనుమానం వ్యక్తం చేస్తూ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన శనివారం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్య్రాల శివారులో జరిగింది. వర్ధన్నపేట ఎస్సై సాయిబాబు కథనం ప్రకారం..క్రట్యాలకు చెందిన మేకల లింగయ్య చిన్న కూతురు కల్యాణిని జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్కు చెందిన టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ కామిండ్ల రాజ శేఖర్కు ఇచ్చి వివాహం చేశారు. వీరికి కుమారుడు శ్రేయాన్స్ (3) ఉన్నాడు. వరంగల్లోని రంగశాయి పేటలో వీరు ఉంటున్నారు. కొంతకాలంగా భార్యాభర్తలకు తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం ఉదయం ఇంట్లో గొడవ జరిగింది. విషయాన్ని కల్యాణి తన సోదరి మమతకు ఫోన్లో తెలిపి ఇంట్లోనుంచి వస్తున్నానని చెప్పింది. శనివారం ఉదయం సుమారు 8.30 గంటల ప్రాంతంలో కల్యాణి తన కుమారుడిని తీసుకుని ఉప్పరపల్లి క్రాస్ రోడ్డు వద్ద బస్సు దిగింది. వరంగల్ నుంచి తన కూతురు వస్తుందని తెలుసుకున్న తండ్రి లింగయ్య ఎదురుచూస్తుండగా, తమ వ్యవసాయ భూమి వైపు కుమారుడిని ఎత్తుకుని వెళ్తోందని కట్ట రాజు అనే వ్యక్తి తెలపడంతో వెంటనే అక్కడికి వెళ్లి చూశాడు. వ్యవసాయ పొలం సమీపంలోని ఎస్సారెస్పీ కాలువ గట్టుపై కళ్యాణి, శ్రేయాన్స్కు సంబంధించిన చెప్పులు, బ్యాగు ఉన్నాయి. ఇద్దరూ కాల్వలో దూకి ఉంటారని లింగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపడుతున్నామని ఎస్సై సాయిబాబు తెలిపారు. విషయం తెలుసుకున్న కళ్యాణి భర్త ఎస్సారెస్పీ కెనాల్ వద్దకు వచ్చి బోరున విలపించాడు. -
అనుమతుల్లేకుండా ‘రాఘవ’ మైనింగ్: హరీశ్రావు
సాక్షి, హైదరాబాద్: మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ అనుమతుల్లేకుండానే హైదరాబాద్లో మైనింగ్ చేస్తోందని బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్రావు ఆరోపించారు. ఈ అంశంపై ప్రతిపక్ష సభ్యుడి ఆధ్వర్యంలో సభా సంఘం ఏర్పాటు చేయాలని లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. పొంగులేటి మంత్రి పదవికి రాజీనామా చేసి విచారణ ఎదుర్కోవాలని పట్టుబట్టారు. హరీశ్కు మద్దతుగా బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీ వెల్లోకి దూసుకెళ్లి అక్కడే బైఠాయించి నినాదాలతో సభను హోరెత్తించారు. తప్పు చేయ కపోతే పొంగులేటికి భయం ఎందుకన్నారు. దాడుల్లో దొరికినా ప్రభుత్వ చర్యలేవీ? బడ్జెట్ పద్దులపై చర్చలో భాగంగా శనివారం శాసనసభలో గనుల శాఖపై చర్చలో సాగర్ ఎమ్మెల్యే జయవీర్రెడ్డి మాట్లాడిన తర్వాత హరీశ్రావు మాట్లాడారు. ‘రాష్ట్రంలో ఎంతో ఖనిజ సంపద ఉంది, దాన్ని రక్షించే రక్షకులే భక్షకులయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా, అనుమతుల్లేకుండా దర్జాగా దందా చేస్తున్నారు. జీవో 111కు విరుద్ధంగా కొత్వాల్గూడలో రాఘవ కన్స్ట్రక్షన్స్ బరితెగించి మైనింగ్ చేస్తోంది. అక్కడ ఎలాంటి కాలుష్య పరిశ్రమలు పెట్టొద్దు. కానీ రాఘవ కన్స్ట్రక్షన్స్ భారీ స్టోన్ క్రషర్ను డీజిల్ జనరేటర్లపై నడుపుతోంది. జీవో 26 ప్రకారం స్టోన్ క్రషర్ పెట్టాలంటే మినరల్ డీలర్ లైసెన్స్ ఉండాలి. పరిశ్రమల శాఖ అనుమతి తీసుకోవాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి సీఎఫ్ఈ, సీఎఫ్ఓ సరి్టఫికెట్లు తీసుకోవాలి. కానీ ఆ సంస్థ విద్యుత్ కనెక్షన్ తీసుకోకుండా దొంగచాటుగా డీజిల్ జనరేటర్లతో క్రషింగ్ చేస్తోంది. 2025 మే 21న మైనింగ్ డైరెక్టర్ జనరల్ స్వయంగా ఈ క్రషర్ తనిఖీకి ఆదేశించారు. రెవెన్యూ, పీసీబీ, ఎస్పీడీసీఎల్, మైనింగ్ అధికారులు సంయుక్తంగా దాడులు చేసి 5,130 మెట్రిక్ టన్నుల అక్రమ రఫ్ స్టోన్ నిల్వలను పట్టుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 13న డిమాండ్ నోటీసు జారీ చేసి రూ. 24 లక్షలు చెల్లించాలని ఆదేశించారు. మార్చి 4న మళ్లీ తనిఖీ చేస్తే 11,200 మెట్రిక్ టన్నుల ముడి సరుకు దొరికింది. మార్చి 13న మరో షోకాజ్ నోటీసు జారీ చేశారు. డీజిల్ జనరేటర్లతో కాలుష్యంపై స్వయంగా మైనింగ్ అధికారులే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు లేఖ రాశారు. మైనింగ్ చట్టం ప్రకారం ఎండీఎల్, లైసెన్స్ లేకుండా క్వారీ నిర్వహిస్తే మొదటిసారి రూ. 10 వేలు, రెండోసారి పట్టుబడితే రూ. 25 వేల జరిమానా, ఏడాది కఠిన కారాగార శిక్ష విధించాలి. కానీ రాఘవ కన్స్ట్రక్షన్స్ రెండుసార్లు పట్టుబడ్డా ఎందుకు ప్రభుత్వం మౌనంగా ఉంది? ఆ కంపెనీపై ఎందుకింత ప్రేమ?’అని హరీశ్రావు నిలదీశారు. ప్రతిపక్షానికో న్యాయం.. మంత్రులకో న్యాయమా? ‘మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి చెందిన సంస్థ కావడంతోనే ప్రభుత్వం చర్యలకు వెనకడుగు వేసింది. ప్రతిపక్షానికో న్యాయం.. మంత్రులకో న్యాయం చేస్తోంది. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి తమ్ముడి స్టోన్ క్రషర్లో చిన్న తప్పు జరిగిందని రాత్రికి రాత్రి అరెస్టు చేసి నెల రోజులు జైల్లో పెట్టారు. మరి రాఘవ కన్స్ట్రక్షన్స్పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలి’అని హరీశ్రావు డిమాండ్ చేశారు. పొంగులేటి పేరు ప్రస్తావనపై మంత్రుల అభ్యంతరం.. హరీశ్రావు చేసిన ఆరోపణలపై సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. సంబంధం లేని విషయంలో మంత్రి పొంగులేటి పేరు ప్రస్తావించారంటూ మంత్రులు శ్రీధర్బాబు, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వివేక్తోపాటు విప్ ఆది శ్రీనివాస్, ఇతర కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. హరీశ్రావు తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకొని సభలో మాట్లాడటం నిబంధనలకు విరుద్ధమని, హరీశ్రావు అభూత కల్పనలతో సభను తప్పుదోవ పట్టించడం సరికాదని మంత్రి శ్రీధర్బాబు వ్యాఖ్యానించారు. వెంటనే హరీశ్రావు క్షమాపణ చెప్పి ఆయన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని సూచించారు. మంత్రి అడ్లూరి మాట్లాడుతూ సిరిసిల్ల నియోజకవర్గంలోని నేరెళ్ల గ్రామంలో దళితులపై అరాచకాలు జరిగినప్పుడు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందని నిలదీశారు. లారీలను నిలిపివేయాలని అడిగిన ప్రజలను కొట్టి హింసించిన ఘటనలు మర్చిపోయారా?.. అప్పుడు సభాసంఘం ఎందుకు వేయలేదు? అని ప్రశ్నించారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ కోత్వాల్గూడ మైనింగ్కు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా ఏమైనా ఉంటే తప్పకుండా విచారణ చేపడతామని... తప్పు ఎవరు చేసినా ఉపేక్షించబోమని మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పారు. మంత్రి వాకిటి మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో మహబూబ్నగర్లో ఇసుక మాఫియా లారీల కింద పడి పిల్లలు చనిపోతే కనీసం అటువైపు చూడని నేతలు ఇప్పుడు సభాసంఘం ఏర్పాటు చేయాలని మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ క్రమంలో ప్రభుత్వ, ప్రతిపక్ష సభ్యుల వాదప్రతివాదనలతో సభ దద్దరిల్లింది. దీంతో స్పీకర్ జోక్యం చేసుకొని హరీశ్రావు వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం బడ్జెట్ పద్దులపై చర్చను కొనసాగించారు. -
దేవుడి పేరుతో ప్రజలకు మోసం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: మూసీనది పునరుజ్జీవం పేరిట సీఎం రేవంత్రెడ్డి లక్షన్నర కోట్ల రూపాయల అవినీతికి తెరలేపుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. గాంధీ కుటుంబ సభ్యులు కూడా ఈ అవినీతిని వ్యతిరేకి స్తున్నా, దేవుడి పేరును ఉపయోగించి ప్రజలను మోసం చేస్తున్నారని, ‘శివతాండవం చేస్తాను’అని అహంకారంగా మాట్లాడుతున్న రేవంత్రెడ్డి అధికార దుర్వినియోగానికి నిదర్శ నమని హెచ్చరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.16 వేల కోట్లతో సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసినా, ప్రస్తుత ప్రభుత్వం అనవసరంగా అంచనాలు పెంచి అవినీతికి మార్గం సుగమం చేస్తోందని ఆరోపించారు. మూసీ ప్రాజెక్టు పేరుతో పేదల లక్షల ఇళ్లను కూల్చి, సుమారు 3 వేల ఎకరాల భూమిని కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందన్నారు. బఫర్ జోన్ పేరుతో పేదల ఇళ్లు మాత్రమే కూల్చేస్తున్న ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో శనివారం గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం (బీఆర్ఎస్వీ) విస్తృత సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఏప్రిల్ మొదటి వారంలో మేధావులు, పర్యావరణ నిపుణులతో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహిస్తామన్నారు. ఏప్రిల్ 14 అంబేడ్కర్ జయంతి వరకు ప్రతి కాలేజీ, బస్తీల్లో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజలను చైతన్యవంతం చేస్తామని ప్రకటించారు. అవసరమైతే ట్యాంక్బండ్పై ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహ ప్రాంగణానికి వేసిన తాళా లు బద్దలుకొట్టైనా ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామన్నారు. మూసీ పరీవాహక ప్రాంతాల్లో విద్యార్థులు పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించాలని బీఆర్ ఎస్వీ నాయకులకు పిలుపునిచ్చారు.ప్రతిపక్ష నాయకులను బెదిరించే ధోరణిమంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మైనింగ్ అక్రమాలను ప్రశ్నించినందుకు ప్రతిపక్ష నాయకులపై సీఎం బెదిరించే ధోరణి ప్రదర్శించారని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్రెడ్డికి బెదిరింపులు అలవాటైపోయాయని, అలాంటి బెదిరింపులకు బీఆర్ఎస్ ఎప్పటికీ భయపడదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మూసీలో మురుగునీటి శుద్ధి కేంద్రాలను దాదాపు పూర్తి చేసి, కాళేశ్వరం నుంచి నీటిని పంపించే ప్రణాళిక సిద్ధం చేసినా, ప్రస్తుత ప్రభుత్వం డీపీఆర్ కూడా సిద్ధం చేయకుండా భారీ అంచనాలతో స్కామ్కు తెరలేపుతోందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. మూసీ ఒడ్డున ఉన్న ఇళ్లు చట్టవిరు ద్ధమని చెప్పి కూల్చేస్తూ, అదే ప్రాంతంలో భారీ హోటళ్లు, బిజినెస్ సెంటర్లు నిర్మించాలనుకోవడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని తీవ్రంగా మండిపడ్డారు. పేదల జీవితాలను నాశనం చేస్తూ హైదరా బాద్ను విధ్వంసం చేస్తున్నారని, రాష్ట్రం ‘పిచ్చోడి చేతిలో రాయి’లాగా మారిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, బాల్క సుమన్, ఎర్రోళ్ల శ్రీనివాస్, గ్యాదరి కిశోర్, పట్లోళ్ల కార్తీక్రెడ్డి పాల్గొన్నారు. -
పద్దులపై చర్చ నుంచి బీఆర్ఎస్ వాకౌట్
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో శనివారం పద్దులపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులు రెండు సార్లు వాకౌట్ చేయడంపై మంత్రులు శ్రీధర్బాబు, సీతక్క తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. శనివారం పద్దులపై చర్చలో భాగంగా హోంపాలన, రవాణా నిర్వహణ, వెనుకబడి తరగతుల సంక్షేమం అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు, దివ్యాంగుల సంక్షేమం పద్దుపై మంత్రి సీతక్కలు మాట్లాడారు. ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన అంశాలపై వారు వేర్వేరుగా వివరణ ఇచ్చినా మంత్రుల సమాధానాలు సంతృప్తికరంగా లేవంటూ బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు తాము సభ నుంచి వాకౌట్ చేస్తున్నామని ప్రకటించి రెండుసార్లు బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. దీనిపై శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు కలుగజేసుకుని ఏ అంశంలోనూ బీఆర్ఎస్ సభ్యులకు చిత్తశుద్ధి లేదని, అందుకే... ముఖ్యమైన అంశాలపై హౌస్లో చర్చ జరుగుతుంటే వాకౌట్ చేస్తున్నారని మండిపడ్డారు. పంచాయతీరాజ్శాఖ పద్దులపై చర్చలో బీఆర్ఎస్ సభ్యులు పూర్తిగా అబద్దాలు చెబుతున్నారని, అన్ని అంశాలపై సమాధానం ఇస్తున్నా సభ నుంచి వాకౌట్ చేస్తున్నారని, ప్రజా సమస్యలపై వారికి చిత్తశుద్ధి లేదని మంత్రి సీతక్క తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆర్టీసీ విలీనం... కమిటీ పరిశీలనలో ఉంది: మంత్రి పొన్నం సామాజిక న్యాయానికి చాంపియన్ కాంగ్రెస్ పార్టీ అని, ప్రజాపాలనలో అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం పద్దులపై చర్చలో భాగంగా హోంపాలన, రవాణా నిర్వహణ, వెనుకబడిన తరగతుల సంక్షేమం అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. బీసీ సబ్ప్లాన్పై చర్చిస్తున్నామని, బలహీన వర్గాల అభ్యున్నతి ప్రభుత్వం విజన్తో ఉందన్నారు. మహిళా భద్రత, డ్రగ్స్, సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ కమిటీ పరిశీలనలో ఉందని తెలిపారు. ఈ చర్చలో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్రెడ్డి, గంగుల కమలాకర్, కూనంనేని సాంబశివరావు, దానం నాగేందర్ లేవనెత్తిన అంశాలకు మంత్రి సమాధానమిచ్చారు. మరోసారి కరీంనగర్ సీపీ అంశంపై సభలో చర్చ కరీంనగర్ పోలీస్ కమిషనర్ అంశం మరోసారి అసెంబ్లీలో చర్చకు వచ్చింది. కరీంనగర్ పోలీస్ కమిషనర్ తన సతీమణి, స్నేహితులతో కలిసి ఫైరింగ్ చేశారు. ఈ కాల్పులతో బోనాలపల్లి గ్రామంలోని అమృతమ్మ అనే మహిళకు బుల్లెట్ గాయమైందని, బదిలీ కోసం సీపీ హోంగార్డుల నుంచి డబ్బులు వసూలు చేశారని, ప్రభుత్వ వాహనాలు ప్రైవేటు వ్యక్తుల కోసం వినియోగిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, సిట్ వేసి సీపీపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి మరోసారి అసెంబ్లీలో ప్రస్తావించారు. దీనికి మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానమిస్తూ వ్యక్తిగత అంశాలకు, విమర్శలకు సభలో తావులేదని, ఏదైనా తప్పు జరిగి ఉంటే తప్పక విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు త్వరలో 15 వేల అంగన్వాడీ పోస్టుల భర్తీ : మంత్రి సీతక్క త్వరలో 15 వేల అంగన్వా డీ పోస్టుల భర్తీకి నోటిఫికే షన్ ఇవ్వనున్నట్టు పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క తెలిపారు. త్వరలో ఈ ఫైల్కు సంబంధించి కేబినెట్ అనుమతి తీసుకుని ఉద్యోగాల ప్రకటన జారీ చేస్తామన్నారు. పంచాయతీరాజ్, గ్రా మీణాభివృద్ధి, మహిళా శిశు, దివ్యాంగుల సంక్షేమం పద్దుపై మంత్రి సీతక్క మాట్లాడారు. గ్రామాల్లో 7 లక్షల నివాసాలకు తాగునీటి సదుపాయం లేదని తమ పరిశీలనలో తేలిందని, వేసవి దృష్ట్యా మంచినీటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.పద్దుపై చర్చలో ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, పాల్వాయి హరీశ్బాబు ప్రస్తావించిన అంశాలకు మంత్రి సమాధానమిచ్చారు. -
ఈజ్ ఆఫ్ లివింగ్ సిటీ
సాక్షి, సిటీబ్యూరో: జీవన సౌలభ్యాన్ని అంచనా వేయడానికి నిర్వహించిన అధ్యయనంలో సిటీ టాప్ ప్లేస్ను కైవసం చేసుకుంది. ఈజ్ ఆఫ్ లివింగ్లో నెంబర్ వన్గా నిలిచింది. రియల్ ఎస్టేట్ వృద్ధి, రవాణాసౌకర్యం, ఆహ్లాదకరమైన వాతావరణాలతోపాటు వే ర్వేరు విభాగాల్లో 15 కొలమానాల ఆధారంగా దేశంలోని ఎనిమిది మెట్రో నగరాల్లో ఈ అధ్యయనం నివేదిక రూపొందింది. ఈ కొత్త నివేదిక ప్రకారం, భారతదేశంలో అత్యంత ‘నివాసయోగ్యమైన’మ హానగరంగా బెంగళూరును అధిగమించి హైదరాబాద్ నిలిచింది. నివేదిక నేపథ్యం... బెంగళూరుకు చెందిన స్వచ్ఛంద సంస్థ అన్బాక్సింగ్ బీఎల్ఆర్((బెంగుళూరు నగరం యొక్క కళలు, సంస్కృతి, సాంకేతికత మరియు వారసత్వాన్ని ప్రదర్శించే ఓ వార్షిక వేడుక) ప్రచురించిన ‘వుయ్ ఆర్ సిటీ–2026’వార్షిక నివేదిక ఈ వివరాలు వెల్లడించింది. ఇటీవల నిర్వహించిన ఇండియాస్పోరా గ్లోబల్ ఏఐ సదస్సులో ఈ డేటా నివేదికను విడుదల చేశారు. ‘సిటీ ఇండెక్స్’పేరిట వెలువరించిన 159 పేజీల నివేదికలో, ప్రయాణం, వైవిధ్యం, అవుటింగ్, గృహవసతి, మౌలిక సదుపాయాలు చివరగా వాతావరణం వంటి కొలమానాలను ఉపయోగించి జీవన సౌలభ్యం ఆధారంగా ఎనిమిది నగరాలకు ర్యాంకులు ఇచ్చారు. ఈ ర్యాంకుల ప్రకారం ఉద్యోగాలు, వినియోగం, రవాణా వంటి అంశాల్లో రెండు టెక్ హబ్లు హైదరాబాద్, బెంగుళూర్లు భారతదేశ వృధ్ధికి చోదకశక్తిగా నిలుస్తున్నాయని ఈ నివేదిక తేల్చి చెప్పింది. జనాభాపరంగా ముంబై, ఢిల్లీ ఎంతో పెద్దవైనప్పటికీ ఆర్థిక వృద్ధిలో మాత్రం ఈ రెండు నగరాలు వాటిని మించిపోతున్నాయి. సిటీ ర్యాంక్ను పెంచిన వైవిధ్యం... గృహ వసతి, జీవన వైవిధ్యం వంటి అంశాలు హైదరాబాద్ ర్యాంకింగ్ను పెంచగా, ప్రయాణ సమయం మౌలిక సదుపాయాలు బెంగళూరును రెండవ స్థానానికి నెట్టాయి. ఒక్కో విభాగంలో ఒక్కొక్క నగరం సత్తా చాటినప్పటికీ మొత్తం మీద హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది ఆ తర్వాతి స్థానాల్లో బెంగళూరు కోల్కతా నిలిచాయి. అహ్మదాబాద్ అట్టడుగున నిలవగా, చెన్నై, ఢిల్లీ ఎన్సిఆర్, పూణే, గ్రేటర్ ముంబై వరుసగా నాలుగవ, ఐదవ, ఆరవ మరియు ఏడవ స్థానాల్లో నిలిచాయి. కొత్త కంపెనీల ఏర్పాటు, గ్రేడ్–ఎ ఆఫీస్ స్పేస్లు జీసీసీ సెటప్ల వంటి రంగాలలో హైదరాబాద్ బెంగళూరుకు సవాలుగా ఎదుగుతోందని కూడా నివేదిక తెలిపింది. -
తల్లీ, ఇద్దరు పిల్లల అనుమానాస్పద మృతి
కంది(సంగారెడ్డి): తల్లీ, ఇద్దరు పిల్లలు అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని జుల్కల్లో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. జుల్కల్కు చెందిన పట్నం ప్రవీణ్ (30)తో అల్లూరుకు చెందిన మమత(27) వివాహం 8 ఏళ్ల క్రితం జరిగింది. వీరికి మణికంఠ (5), ప్రళయశ్రీ (2) అనే పిల్లలు ఉన్నారు. కాగా, గత జనవరి 5న జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రవీణ్ మృతి చెందాడు. దీంతో పిల్లల పోషణ భారం మమతపై పడింది. అప్పటినుంచి మమత మానసికంగా బాధపడుతోంది. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇరుగు పొరుగువారు పిలిచినా పలకక పోవడంతోపాటు తలుపులు తెరవలేదు. అనుమానం వచ్చి వారు తలుపులను బలవంతంగా తెరిచి చూడటంతో మమత చీరతో దూలానికి ఉరివేసుకొని మృతి చెందగా, పిల్లలు ఇద్దరు విగత జీవులుగా పడి ఉన్నారు. పిల్లల గొంతు భాగాల్లో గాయాలు ఉన్నట్లు గుర్తించారు. భర్త మరణంతో కలిగిన మానసిక వేదనతో మమత తన పిల్లలను గొంతు నులిమి చంపి, అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్పీ పరితోష్ పంకజ్, డీఎస్పీ సత్యయ్య గౌడ్ సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విజయ్కుమార్ తెలిపారు. -
తండ్రి ఆస్తి ఇవ్వడం లేదని కొడుకు ఆత్మహత్య
మోమిన్పేట: తండ్రి తనకు ఆస్తి ఇవ్వడం లేదని మనస్తాపానికి గురైన ఓ కొడుకు సెల్ టవర్ ఎక్కి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వికారాబాద్ జిల్లా మోమిన్పేట మండలం కేసారంలో శనివారం జరిగిన ఈ సంఘటనపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలివి. గ్రామానికి యాదయ్య కుమారుడు నాగరాజు అలియాస్ (నరేందర్) (40) పదిహేనేళ్ల క్రితం ఏపీలోని గుంతకల్కు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. భార్య, ఇద్దరు కుమారులతో కలిసి అక్కడే ఉంటున్నాడు. ఇటీవల ఒంటరిగా గ్రామానికి వచ్చిన నాగరాజు.. తండ్రి పేరున ఉన్న 15 గుంటల భూమిని తనకు రిజిస్ట్రేషన్ చేయాలని కోరాడు. లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. మూడు రోజుల క్రితం ఆత్మహత్యకు ప్రయత్నించగా ఆస్పత్రిలో చికిత్స చేయించారు. తమ భూమిని, ఇంటిని ఎవరూ కొనుగోలు చేయొద్దని, ఒకవేళ అలా కొనుగోలు చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడంతో పాటు ఆస్తిని తిరిగి స్వా«దీనం చేసుకుంటానంటూ శుక్రవారం నోట్ రాసి పంచాయతీ కార్యాలయానికి అందజేశాడు. ఆ తర్వాత శనివారం ఉదయాన్నే మద్యం తాగి గ్రామంలోని సెల్ టవర్ ఎక్కాడు. తండ్రి ఆస్తిని తన పేరున రిజి్రస్టేషన్ చేస్తేనే దిగుతానని, లేదంటే ఇక్కడే ఉరేసుకుని చనిపోతానని బెదిరించాడు. అతనితో మాట్లాడిన స్థానికులు భూమి ఇప్పిస్తామని చెప్పినప్పటికీ టవర్పై ఉన్న ఓ తీగతో ఉరేసుకుని మృతి చెందాడు. సమాచారం అందుకున్న సీఐ వెంకట్, ఎస్ఐ భరత్భూషణ్ సంఘటన స్థలానికి చేరుకొని ఫైర్ సిబ్బంది సాయంతో మృతదేహాన్ని దించారు. కొడుకు కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నందున ఆస్తి ఇవ్వడానికి తండ్రి నిరాకరించడంతో.. నాగరాజు ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఎస్ఐ తెలిపారు. -
ఇక అధికారులకే బోధనాస్పత్రుల నిర్వహణ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వాస్పత్రులను చక్కదిద్దేందుకు ప్రభుత్వం పాలనా వ్యవహారాల్లో వైద్యుల జోక్యానికి తెరదించాలని నిర్ణయించింది. తొలుత 36 ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో ఈ ప్రయోగం అమలుకు యోచిస్తోంది. తద్వారా డాక్టర్లు, ప్రొఫెసర్లను వారి వృత్తికే పరిమితం చేయాలని భావిస్తోంది. ఈ మేరకు బోధనాస్పత్రుల వ్యవహారాలన్నీ గ్రూప్–1, గ్రూప్–2 స్థాయి అధికారులకు అప్పగించాలని సూత్రప్రాయంగా నిర్ణయించి కసరత్తు చేస్తోంది. జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న సనత్నగర్ టిమ్స్ (తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ద్వారా ప్రయోగాత్మకంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. అనంతరం అల్వాల్, ఎల్బీనగర్ టిమ్స్తోపాటు రాష్ట్రంలోని అన్ని బోధనాస్పత్రులకు విస్తరించాలని, అవసరమైతే 50, 100, 150 పడకలతో కూడిన ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు కూడా ఇదే విధానాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే ఈ నిర్ణయాన్ని ప్రభుత్వ బోధనాస్పత్రుల వైద్య సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఆస్పత్రుల నిర్వహణను వైద్యంతో సంబంధం లేని అధికారులకు అప్పగిస్తే బోధనాస్పత్రుల్లో పాలన కుంటుపడుతుందని, సమన్వయం లోపిస్తుందని, ఆ ప్రభావం వైద్యంపై పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సూపరింటెండెంట్లు, ఆర్ఎంఓల ద్వారా ప్రస్తుతం నిర్వహణ ప్రస్తుతం అన్ని ప్రభుత్వాస్పత్రులు, బోధనాస్పత్రుల్లో సీనియర్ వైద్యాధికారులు సూపరింటెండెంట్లుగా వ్యవహరిస్తున్నారు. రోగులకు సేవలు, క్లినికల్ పర్యవేక్షణ, మందుల కొనుగోళ్లు, వైద్యులు డ్యూటీలతోపాటు ఆస్పత్రుల నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు. అయితే వైద్యులు ఆస్పత్రుల నిర్వహణను చేపడుతుండటం వల్ల రోగులకు వైద్యం అందించడంకన్నా ‘పెద్దరికం’ పనులు ఎక్కువయ్యాయని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే ఆస్పత్రుల నిర్వహణకు ఇప్పటికే అమల్లో ఉన్న పరిపాలనాధికారి (ఏవో) పోస్టులకు పూర్తిస్థాయి అధికారాలు ఇవ్వడం ద్వారా ఆ పోస్టును బలోపేతం చేసి ఆ పోస్టుల్లో అధికారులను నియమించాలనుకుంటోంది. ఇప్పటివరకు ఆస్పత్రుల్లో ఏవో పోస్టులను క్లరికల్ పనులకే పరిమితం చేశారు. ద్వంద్వ పరిపాలనతో గందరగోళం: టీజీజీడీఏ రాష్ట్రంలో ప్రొఫెసర్ కేడర్కు సెక్రటరీ స్థాయి, సూపరింటెండెంట్ కేడర్కు ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి బాధ్యతల సమానత్వం ఉన్న నేపథ్యంలో అనుభవజు్ఞలైన వైద్య అధికారులతో ఆస్పత్రులు సమర్థంగా నడుస్తున్నాయని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ) పేర్కొంది. ఈ పరిస్థితిలో కొత్తగా గ్రూప్–1 అధికారులను ప్రవేశపెట్టడం అవసరంలేని చర్యగా సంఘం అధ్యక్షుడు డాక్టర్ నరహరి, సెక్రటరీ జనరల్ లాలూప్రసాద్ రాథోడ్ ఒక ప్రకటనలో అభివర్ణించారు. ఈ ప్రతిపాదన అమలైతే ప్రస్తుత సూపరింటెండెంట్ల అధికారాలు దెబ్బతినడం, హోదా తగ్గిపోవడం, ద్వంద్వ పరిపాలన ఏర్పడి గందరగోళం ఏర్పడుతుందని హెచ్చరించారు. సూపరింటెండెంట్లు, ఆర్ఎంఓలకే మరిన్ని అధికారాలిచ్చి విధాన నిర్ణయాల్లో సంఘాన్ని భాగస్వామ్యం చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా ఈ వ్యవస్థ లేదు: టీటీజీడీఏ ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో పరిపాలన కోసం గ్రూప్–1, గ్రూప్–2 అధికారులను నియమించాలన్న ప్రతిపాదనను వెనక్కు తీసుకోవాలని తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీటీజీడీఏ) డిమాండ్ చేసింది. దేశంలో ఎక్కడా ప్రధాన బోధనాస్పత్రుల్లో ఇలాంటి విధానం అమల్లో లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు టీటీజీడీఏ అధ్యక్షుడు డాక్టర్ కిరణ్ బొల్లేపాక, ప్రధాన కార్యదర్శి డాక్టర్ కిరణ్ మాదల ఒక ప్రకటన విడుదల చేశారు. డాక్టర్ల ఆధ్వర్యంలో పరిపాలన సరిగా ఉండదన్న అపోహలు సరైనవి కావని, ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ , సీడీసీ వంటి సంస్థల్లో కూడా వైద్యులే నిర్వహిస్తున్నారని వారు పేర్కొన్నారు. -
ఎరువు.. ఇక బరువే..
పశ్చిమాసియా యుద్ధం కారణంగా రసాయనిక ఎరువుల కొరత వచ్చే ఖరీఫ్ సాగుకు ప్రతిబంధకంగా మారే సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. యుద్ధం వల్ల ఇతర దేశాల నుంచి ఎరువుల దిగుమతికి గల అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో యూరియా టన్ను ధర (ప్రస్తుతం 680 డాలర్లు) యుద్ధం మొదలయ్యాక 48% పెరిగింది. దీంతో మొత్తంగా వార్షిక ఎరువుల సబ్సిడీ 25% పెరిగి రూ. 2 లక్షల కోట్లు దాటుతుందని ‘క్రిసిల్’(క్రెడిట్ రేటింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) అంచనా. కింకర్తవ్యం? దిగుబడులు తగ్గకుండా చూసుకుంటూనే రసాయనిక ఎరువుల కొరతను అధిగమించేందుకు ఉన్న ప్రత్యామ్నాయాలేమిటి? నిపుణులు ఏమంటున్నారంటే? -(సాక్షి, స్పెషల్ డెస్క్) నిల్వలు ఎంత ఉన్నాయి? » రానున్న ఖరీఫ్ పంట కాలానికి మన దేశానికి ఎంత మొత్తంలో రసాయనిక ఎరువుల అవసరం ఉంటుంది? గత ఏడాది ఏప్రిల్–సెపె్టంబర్ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా యూరియా 19.3 మిలియన్ టన్ను లు, ఎన్పీకే (మొక్కలకు ఆరోగ్యకరమైన పెరుగుదలకు అవసరమైన పోషకాలు, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం) 8.1 మిలియన్ టన్ను లు, డీఏపీ 4.6 మిలియన్ టన్నులు, పొటాష్ 1.1 మిలియన్ టన్నులు వినియోగించాం. » అయితే, ఈ నెల 10 నాటికి భారత ప్రభు త్వం దగ్గర ఉన్న నిల్వ ఎంత? యూరియా 6.2 మిలియన్ టన్నులు, ఎన్పీకే 5.63 మిలియన్ టన్నులు, డీఏపీ 2.51 మిలియన్ టన్నులు, పొటాష్ 1.29 మిలియన్ టన్నులు నిల్వ ఉన్నా యని కేంద్ర ఎరువుల శాఖ, క్రిసిల్ ఇంటెలి జెన్స్ల సమాచారం. అంటే, యూరియా లభ్యత ప్రస్తుతానికి 65% వరకు తక్కువగా ఉంది. » యుద్ధం కారణంగా పశ్చిమాసియా యేతర దేశాల నుంచి ఎరువులను ఎక్కువగా దిగుమతి చేసుకునే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో టన్ను యూరియా ధర ఇప్పటికే 48% పెరిగింది. 2026–27 బడ్జెట్లో ఎరువుల సబ్సిడీ రూ. 1.7 లక్షల కోట్లని కేంద్రం అంచనావేసింది. మారిన పరిస్థితుల్లో ఇది 25% మేరకు పెరిగి రూ. 2 లక్షల కోట్లు దాటుతుందని క్రిసిల్ అంచనా.నిబంధనలు సడలించాలి!రసాయనిక ఎరువుల గుళికలను పొడిగా మార్చి వాడితే 20–30 శాతం గుళికల ఎరువులతోనే ఇప్పటికన్నా అధిక దిగుబడి సాధించవచ్చని, 70–80 శాతం ఎరువులను దిగుబడిలో రాజీపడకుండానే ఆదా చేసుకోవచ్చని రోజ్మేరీ ఔషధ పంటపై మా పరిశోధనల్లో రుజువైంది. నానో ఎరువుల పొడిని నేలపై వెయ్యవచ్చు, పిచికారీ చెయ్యవచ్చు. వరి, టమాటా వంటి ఏకదళ, ద్విదళ పంటలన్నిటికీ ఈ టెక్నాలజీ వాడొచ్చు. రసాయనిక ఎరువుల గుళికలను పొడిగా మార్చి వాడటం వల్ల ఎరువును సమర్థవంతంగా వాడుకోవటం సాధ్యమవుతుంది. నిబంధనల నుంచి ప్రభుత్వం ప్రత్యేక మినహాయింపు ఇస్తే మాత్రమే నానో ఎరువుల పొడి టెక్నాలజీని రైతులకు సత్వరమే అందుబాటులోకి తేవడం సాధ్యపడుతుంది. – ప్రొ. వీవీఎస్ఎస్ శ్రీకాంత్, స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రత్యామ్నాయ మార్గాలేమిటి? » పొదుపుగా వాడటం: రసాయనిక ఎరువుల అతి వినియోగా న్ని తగ్గించటం, వినియోగ సామర్థ్యాన్ని పెంచుకోవటం. ఐసీఆర్ఐఈఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనమిక్ రిలేషన్స్) తాజా నివేదిక ప్రకారం సిఫారసు కన్నా యూరియా వినియోగం పంజాబ్లో 61%, తెలంగాణలో 54% ఎక్కువగా ఉంది. » నానో ఎరువులు: నానో ఎరువుల్లో రెండు రకాలున్నాయి.. ఇఫ్కో నానో ద్రవరూప ఎరువుల సాంకేతికత ఒకటి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) రూపొందించిన నానో పొడి ఎరువుల టెక్నాలజీ రెండోది. నానో యూరియా, నానో డీఏపీ వంటి ‘ద్రవ’రూప ఎరువులను రైతుల సహకార సంస్థ ‘ఇఫ్కో’అభివృద్ధి చేసి ఇప్పటికే మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) పరిశోధకులు రూపొందించిన మరో రకం ‘నానో పొడి ఎరువుల టెక్నాలజీ’కూడా అందుబాటులో ఉంది. గుళికల రూపంలో రసాయనిక ఎరువులను 100 కిలోలు వాడే బదులు, ఈ టెక్నాలజీ తో ఆ గుళికలను పిండిగా మార్చి వాడుకుంటే 20– 30 కిలోలతోనే సరిపోతుంది. 70–80% ఎరువు ఆదా అవుతుంది. అంతేకాదు, చాలు అధిక దిగుబడి సాధించవచ్చని ప్రొ. వీవీఎస్ఎస్ శ్రీకాంత్ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. » ప్రకృతి సేద్యపు బాట: ప్రకృతి/సేంద్రియ వ్యవసాయాన్ని నిర్మాణాత్మకంగా ప్రోత్సహించడం. ఎరువుల సబ్సిడీని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చెయ్యడం ద్వారా రైతులను రసాయన రహిత సేద్యం వైపు ఆకర్షించవచ్చు. తొలి ఏడాదే దిగుబడి తగ్గకుండా జాగ్రత్తపడే ప్రకృతి సేద్య పద్ధతులు అందుబాటులో ఉన్నాయని కొందరు నిపుణులు చెబుతున్నారు. విధాన విశ్లేషకులు డా. దొంతి నరసింహారెడ్డి ఒక నిర్మాణాత్మక కార్యాచరణ ప్రణాళికను భారత ప్రభుత్వానికి సూచించారు. -
11,19,079 కేసుల పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్కు కక్షిదారుల నుంచి అనూహ్య స్పందన వచి్చంది. ఒకేరోజు 11,19,079 కేసులను పరిష్కరించారు. వీటిలో 85,231 ప్రిలిటిగేషన్ కేసులు, 10,31,317 క్రిమినల్ కేసులు, 2,531 సివిల్ కేసులున్నాయి. లబి్ధదారులకు రూ.397 కోట్లు పరిహారం చెల్లింపులకు ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టులో 2, రుణ రికవరీ ట్రిబ్యునల్ 2 సహా మొత్తం 341 బెంచ్లను అందుబాటులో ఉంచారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, టీఎస్ఎల్ఎస్ఏ పాట్రన్ ఇన్ చీఫ్ జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ పి.శామ్ కోషి మార్గదర్శకాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా లోక్ అదాలత్ నిర్వహించారు. మహబూబ్నగర్ జిల్లాలో జస్టిస్ శామ్ కోషి లోక్ అదాలత్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవ్యవస్థలో కేసులు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉండటంతో 1987లో లోక్ అదాలత్లు ప్రారంభించారన్నారు. ముఖ్యంగా కుటుంబ వివాదాలు, మోటారు వాహన ప్రమాదాల క్లెయిమ్లు, చెక్బౌన్స్ కేసులు ఎక్కువగా పరిష్కారం లభిస్తోందన్నారు. తొలుత జాతీయ లోక్ అదాలత్లను సంవత్సరానికి ఒకసారి నిర్వహించేవారని.. ఆదరణ పెరగడంతో ఇప్పుడు ఏటా నాలుగుసార్లు నిర్వహిస్తున్నారన్నారు. ప్రతి లోక్ అదాలత్లో పరిష్కార కేసుల సంఖ్య పెరగడం, ఈ యంత్రాంగంపై ప్రజల విశ్వాసం, ఆమోదం పెరుగుతోందని చెప్పారు. లోక్ అదాలత్లతోపాటు మధ్యవర్తిత్వం, ప్రత్యేక లోక్ అదాలత్ల వంటి ఇతర ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగాలను కూడా ప్రవేశపెట్టారని వెల్లడించారు. ఇవి కక్షిదారులకు వివాదాలను సమర్థవంతంగా పరిష్కరించుకోవడానికి బహుళ మార్గాలను అందిస్తాయని.. న్యాయవ్యవస్థకే కాకుండా సమాజానికి వినియోగపడతాయన్నారు. కక్షిదారులు.. తమ విభేదాలను పక్కనపెట్టి, శాంతియుత సహ జీవనాన్ని పెంపొందించుకోవడం ద్వారా తమ వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ సూచించారు. ఈ సందర్భంగా న్యాయ సేవాధికార సంస్థ కార్యకలాపాలను, లోక్ అదాలత్లతో కలిగే ప్రయోజనాలను టీఎస్ఎల్ఎస్ఏ సభ్యకార్యదర్శి సీహెచ్.పంచాక్షరి వివరించారు. ఈ కార్యక్రమంలో మహబూబ్నగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబి్ధదారులకు చెక్కులు పంపిణీ చేశారు. హైకోర్టులో.. హైకోర్టులో జరిగిన లోక్ అదాలత్లో జస్టిస్ వాటికి రామకృష్ణారెడ్డి, జస్టిస్ ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు. 129 కేసులను పరిష్కరించి, రూ.11 కోట్లు కక్షిదారులకు చెల్లించాలని ఆదేశించారు. రెండు బెంచ్లు మొత్తం 241 కేసులను విచారణకు స్వీకరించగా, వీటిలో 185 కేసులు పరిష్కారమయ్యాయి. రూ.10,57,63,800 పరిహారం చెక్కులను కక్షిదారులకు పంపిణీ చేశారు. -
భర్తీ చేస్తున్నా.. ఖాళీలే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెరిగిన వైద్య అవసరాలకు అనుగుణంగా డాక్టర్లు, ప్రొఫెసర్లతో పాటు ఇతర సిబ్బంది లేకపోవడంతో ఆ ప్రభావం ప్రజారోగ్యం, వైద్యవిద్యపై పడుతోంది. రాష్ట్రంలో పెరిగిన ప్రభుత్వ వైద్య కళాశాలలు వాటికి అనుబంధంగా ఏర్పాటైన ఆస్పత్రులకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైద్యులు, ప్రొఫెసర్లు, నర్సులు పారామెడికల్ సిబ్బంది నియామకం జరుపుతూ వస్తోంది. రాష్ట్రంలోని వైద్య అవసరాలకు ప్రభుత్వ పరిధిలోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్, ప్రాథమిక ఆరోగ్యం (డీహెచ్), టీవీవీపీ, డీఎంఈల ద్వారా జిల్లా ఆస్పత్రులు, టీచింగ్ ఆస్పత్రులు, మాతా శిశు కేంద్రాలు, పీహెచ్సీలు, సీహెచ్సీ తదితర కేంద్రాల నిర్వహణ ఉంటుంది. ఈ నాలుగు శాఖల పరిధిలోని ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలలో 51,455 వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది ఉండాలి. కానీ ఇప్పటికీ 13,929 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం శాసనమండలి వేదికగా వెల్లడించింది. వాటిలో 7,170 పోస్టుల నియామక ప్రక్రియ పురోగతిలో ఉండగా, మరో 6,759 పోస్టులు ఖాళీగా ఉంటాయని తెలుస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం మొత్తం ఆమోదిత పోస్టుల్లో దాదాపు మూడో వంతు ఖాళీగా ఉండటం వల్ల ఆస్పత్రుల సేవలు, వైద్యవిద్య రెండూ తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ... రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్యులు, నర్సులు, ప్రొఫెసర్ల ఖాళీలను భర్తీ చేసేందుకు ఇప్పటికే పలుమార్లు నోటిఫికేషన్లు జారీ చేసింది. తద్వారా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ నియంత్రణలోని పీహెచ్సీలు, బస్తీ దవాఖానాలు, ఆరోగ్య ఉప కేంద్రాలు, మాతా శిశు కేంద్రాలలోని మొత్తం 2,651 ఖాళీలలో 145 మంది వైద్యులు, 351 మంది నర్సుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్లు విడుదల చేసింది. త్వరలోనే ఈ ఖాళీలు నిండుతాయి. అయితే పారా మెడికల్ సిబ్బంది పోస్టుల్లో 2,651 ఖాళీలు ఉంటే వాటిలో 2,016 వరకు మాత్రమే భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు ఇచ్చారు. మరో 635 ఖాళీలు ఉండగా, వాటి నియామకాలు ఇప్పట్లో జరిగే అవకాశం లేదు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కింద 7,769 పోస్టులకు గాను 1,367 ఖాళీలు ఉండగా, వాటిలో 31 మంది నర్సులు, 160 మంది పారా మెడికల్ సిబ్బంది నియామక ప్రక్రియ సాగుతోంది. ఇంకా 315 మంది వైద్యులు, 304 మంది నర్సులు, 557 మంది పారా మెడికల్ సిబ్బంది భర్తీ కావలసి ఉంది. ఇక తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని జిల్లా ఆస్పత్రులలో 9,554 మంది వైద్య సిబ్బంది ఉండాల్సి ఉంటే... 3,706 ఖాళీలు ఉన్నాయి. వీటిలో ఇటీవలే 1,658 మంది వైద్యుల భర్తీకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తి కావచ్చింది. మరో 721 వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 682 నర్సుల నియామక ప్రక్రియ సాగుతుండగా, 347 పోస్టులు భర్తీ కావలసి ఉంది. అలాగే పారామెడికల్ సిబ్బంది 298 ఖాళీలకు గాను 185 పోస్టులను భర్తీ చేస్తున్నారు. డీఎంఈ పరిధిలోని టీచింగ్ హాస్పిటల్స్లో ఏకంగా 20,585 పోస్టులకు గాను 6,205 ఖాళీలు ఉన్నాయి. అంటే సుమారు 40శాతం పోస్టులు ఖాళీగా ఉండడం వైద్య విద్య నాణ్యతపై నేరుగా ప్రభావం చూపుతోంది. అయితే డీఎంఈ పరిధిలో 607 మంది వైద్యులు, 1,545 మంది నర్సులు, 286 మంది పారా మెడికల్ సిబ్బందితో కూడిన 2,438 పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్చలు చేపట్టగా, ఇంకా 3,767 పోస్టులు ఖాళీగానే ఉంటున్నాయి. అందులో అత్యధికంగా 2,179 వైద్య విద్య బోధించే వివిధ స్థాయిల ప్రొఫెసర్ పోస్టులు ఉండడం గమనార్హం. వైద్యుల పోస్టుల్లోనే భారీగా ఖాళీలు ఈ నాలుగు శాఖల్లో కలిపి 14,633 ఆమోదిత డాక్టర్/ ప్రొఫెసర్ పోస్టుల్లో ప్రస్తుతం 9,008 మాత్రమే భర్తీ కాగా, 5,625 ఖాళీలు ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న నియామకాలు పూర్తైనా ఇంకా 3,200 పైగా పోస్టులు ఖాళీగా మిగిలే అవకాశం ఉంది. ముఖ్యంగా టీచింగ్ హాస్పిటల్స్లో రెండు పోస్టుల్లో ఒకటి ఖాళీగా ఉండడం తృతీయ స్థాయి వైద్యం, వైద్యుల శిక్షణపై ప్రభావం చూపుతోందని హెల్త్కేర్ రిఫారŠమ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. టీవీవీపీ పరిధిలోని జిల్లా ఆస్పత్రుల్లో అనేక చోట్ల సగానికన్నా తక్కువ సిబ్బందితోనే నడుస్తున్నాయి. దీని వల్ల గ్రామీణ, అర్ధపట్టణ ప్రాంతాల్లో రోగులకు సమయానికి చికిత్స అందడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. డాక్టర్లు తయారవుతున్నా.... ఇంకో వైపు రాష్ట్రంలో పెరిగిన వైద్య కళాశాలల ద్వారా ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో వైద్యులు వైద్యం కోసం సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో కలిపి ఏటా సుమారు 9,000 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు ఇంటర్న్షిప్ పూర్తి చేస్తున్నారు. 2,500 నుంచి 3,000 మంది పీజీ వైద్యులు సిద్ధమవుతున్నారు. అయితే నియామకాల్లో ఆలస్యం, అసంఘటిత విధానం కారణంగా వీరిలో చాలా మంది నిరుద్యోగులుగానే ఉండిపోతున్నారు లేదా కాంట్రాక్ట్ ఉద్యోగాలకే పరిమితమవుతున్నారు. ఇది ఒక వైపు ఖాళీలు పెరగడం, మరోవైపు యువ వైద్యులకు అవకాశాలు లేకపోవడం అనే విరుద్ధ పరిస్థితిని సృష్టిస్తోంది. -
సోషల్ మీడియా అసత్య వార్తలతో దేశం ఇబ్బంది పడింది! : కిషన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత ఉందని వస్తున్న వదంతులను నమ్మొద్దని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి కిషన్రెడ్డి అన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న అసత్య వార్తలతో అనేక రకాలు ఇబ్బందులు వస్తున్నాయని, దీంతో ఒక్క కుటుంబమో, ఒక వ్యక్తి ఇబ్బంది పడడం లేదని, యావత్ దేశం ఇబ్బంది పడేలా చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయిల్ కంపెనీలు, డీలర్లతో కలిసి కిషన్రెడ్డి సీజీజీ టవర్లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో గత వారం రోజులుగా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ సరఫరాలపై ప్రజల్లో ఒక రకమైన ఆందోళన నెలకొందన్నారు. కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ పంపుల్లో ఇంధనం లేదని చెప్పడం, కొంతసేపు పంపులను మూసివేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని, ఈ పరిస్థితులు ప్రజల్లో భయాందోళనలను కలిగించాయని చెప్పారు. దేశానికి అవసరమైన ఇంధనం కొరత లేకుండా ఉండేందుకు, ఇతర దేశాలు నిర్ణయించిన ధరలను చెల్లించి అయినా సరే, పెట్రోల్, డీజిల్ వంటి ఉత్పత్తులను దేశానికి తీసుకురావడంలో కట్టుబడి ఉందన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని దేశాలతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారని తెలిపారు. దేశంలో వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుందని, ఈ పరిస్థితుల్లో మనం ఇంధన వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తూ, దేశవ్యాప్తంగా రైల్వేలను విద్యుదీకరణ చేస్తూ, పెట్రోల్ వినియోగాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. కొరత పేరుతో గ్యాస్, పెట్రోల్, డీజిల్ ఎక్కువ ధరకు అమ్మినా, స్టాక్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని కిషన్రెడ్డి హెచ్చరించారు. ప్రజలు, వ్యాపారులకు కావాల్సిన వాటిని సకాలంలో చేర్చేలా కంపెనీలు, ఏజెన్సీలు చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనల ప్రకారం గతంలో గ్యాస్ బుక్ చేసుకున్నట్టుగా ఇంటి దగ్గరకి వచ్చి ఇస్తారని చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పొల్చితే మన రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయన్నారు. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, కొంతమేర ధరల తగ్గిస్తే ప్రజలకు ఉపశమనం కలిగించినట్టు అవుతుందన్నారు. ప్రజలకు భారం కావొద్దని కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించద్దని చెప్పారు. ఈ సమావేశంలో జగన్మోహన్రెడ్డి, అమరేందర్రెడ్డి, సుశీల్కుమార్ రాయ్, నిలేశ్, పీయూష్ మిత్తల్ పాల్గొన్నారు. -
బ్లాక్ మెయిలింగ్కు భయపడం.. మైనింగ్పై నిగ్గుదేలుస్తాం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అక్రమ మైనింగ్ విషయంలో విపక్ష బీఆర్ఎస్ బ్లాక్మెయిలింగ్కు పాల్పడుతోందని.. అయినప్పటికీ తమ ప్రభుత్వం ఏమాత్రం భయపడబోదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తేల్చిచెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన 2014 జూన్ 2 నుంచి నేటి వరకు ఇచ్చిన మైనింగ్ లీజులు, అక్రమాలపై పూర్తిస్థాయి సీబీసీఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్లు శాసనసభ వేదికగా సీఎం ప్రకటించారు. ప్రధానంగా అక్రమ మైనింగ్ ఆరోపణలు వచ్చిన రాఘవ కన్స్ట్రక్షన్స్, హరీశ్ సోదరుడి మైనింగ్ సంస్థ సహా ఆరు సంస్థలపైనా సమగ్ర దర్యాప్తు ఉంటుందన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోగా ఈ విచారణ ముగించి నిజాలను నిగ్గుతేల్చి సభ ముందు నివేదికను ఉంచి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. శనివారం అసెంబ్లీలో పద్దులపై చర్చ సందర్భంగా రాఘవ కన్స్ట్రక్షన్స్ మంత్రి పొంగులేటికి చెందినదని.. ఆ సంస్థ మైనింగ్ అక్రమాలపై సభాసంఘాన్ని వేయడంతోపాటు విచారణ సజావుగా సాగేలా సంబంధిత మంత్రి రాజీనామా చేయాలంటూ సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. సభ వెల్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతోపాటు అక్కడే బైఠాయించి నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పందిస్తూ ఈ కీలక ప్రకటన చేశారు. ఇసుక లేదా లీజు మాఫియాలో గతంలో ఫైన్లు, పెనాల్టీలు వేసి వాటిని తగ్గించి సంబంధిత వ్యక్తులను పార్టీలో చేర్చుకొని మళ్లీ ఆ చార్జీలను తొలగించాలని చేసిన ప్రయత్నాలన్నింటినీ ఈ విచారణ ద్వారా తేల్చి ఒక్కొక్కరి సంగతి తేలుస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎక్కడ ప్రభుత్వ ఆదాయానికి గండిపడినా, ఖనిజ లేదా ఇతర ఆదాయానికి గండిపడేలా ఎలాంటి తప్పిదాలు జరిగినా ఎవరినీ ఉపేక్షించబోమని తేల్చిచెప్పారు. నాడు బెదిరించి.. లీజులు రాయించుకొని ‘సిరిసిల్ల నియోజకవర్గం నేరెళ్లలో దళితులను ఇసుక లారీతో ఢీకొట్టించి చంపి సంతోశ్రావు తండ్రి రవీందర్రావుకు సంబంధించిన నేరెళ్ల ఇసుక మాఫియా అక్రమ ఇసుక రవాణా చేసింది. శిరీష గ్రానైట్స్ జియో గ్రానైట్స్ ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేవి. గతంలో మైనింగ్ శాఖ మంత్రిగా ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే ఆయన్ను బెదిరించి వారి మైనింగ్ లీజును రాయించుకున్నారు. మిడ్వెస్ట్ గ్రానైట్స్కు సంబంధించి ఇప్పుడు రెవెన్యూ మంత్రిని బ్లాక్మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు సోదరుడు మహేశ్రావు అక్రమ మైనింగ్ చేశారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులకు చెందిన శ్వేత గ్రానైట్స్ అక్రమ మైనింగ్పై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విచారణే కాకుండా ఈడీ విచారణ కూడా జరుగుతోంది. బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు చెందిన గాయత్రి గ్రానైట్స్పై గతంలో ఫైన్లు, పెనాల్టీలు వేసి లొంగదీసుకొని మళ్లీ ఆర్బిట్రేషన్లో తగ్గించి గాయత్రి గ్రానైట్స్ రాయించుకొని అక్రమ మైనింగ్కు పాల్పడ్డారు’అని సీఎం రేవంత్ ఆరోపించారు. వాటన్నింటిపైనా విచారణ జరిపిస్తామన్నారు. ఇసుక ఆదాయం పెంచాం.. ‘మేం అధికారంలోకి వచ్చాక పెంచిన ఆదాయం కళ్ల ముందు ఉంది. రాష్ట్రానికి ఇసుక ద్వారా ఆదాయం 2020–21లో రూ. 721 కోట్ల ఆదాయం వస్తే 2025–26లో రూ. 972 కోట్లు (35 శాతం) పెంచాం. నిర్మాణ రంగం కుంటుపడిందని, రియల్ ఎస్టేట్ దెబ్బదిన్నదని ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ దెబ్బతింటే మేం ఇసుకను బుక్కుతున్నామా? బిర్యానీ వండుకొని తింటున్నామా? ఇసుకలోనే ఏడాదికి రూ. వెయ్యి కోట్ల ఆదాయం పెరిగిందంటే అర్థం ఏమిటి?’అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. బురదజల్లేందుకే బ్లాక్మెయిలింగ్.. ‘బీఆర్ఎస్ నేతల దోపిడిని నిలువరించి ఇసుక, మైనింగ్లో ఆదాయం పెంచితే రాష్ట్ర ప్రభుత్వానికి మంచిపేరు వచ్చి గత పదేళ్లలో బీఆర్ఎస్ సాగించిన దోపిడి ప్రజలకు అర్థమవుతుందనే సంబంధిత మంత్రిపై బురదచల్లేందుకు, బ్లాక్మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏపీ, తెలంగాణలో ఏ రెడ్డికైనా ఏదో ఒక రూపంలో బంధువులు, దూరపు బంధువులు ఉండటం సహజమే. మంత్రి పొంగులేటి, వారి కుటుంబ సభ్యులు, ఎవరో బంధువుల మధ్య ఏవో గొడవలు ఉంటే వాటితో మంత్రికేం సంబంధం? సొంత చెల్లినే ఇంట్లోంచి వెళ్లగొట్టి దోపిడికి పాల్పడిన మీరు.. మంత్రి బంధువులకు ఏవో వ్యాపారాలు ఉన్నాయని పొంగులేటికి ముడిపెట్టి ఆయన్ను బెదిరించి లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇది దిక్కుమాలిన చర్య. ఇలాంటి ప్రయత్నాలు చేయకండి. ఇటువంటి వాటి వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు’అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. రాఘవ కన్స్ట్రక్షన్స్పై గతంలోనే చర్యలు తీసుకున్నాం.. ‘రాఘవ కన్స్ట్రక్షన్స్కు సంబంధించి గతంలోనే ప్రభుత్వం నోటీసు ఇచ్చి చర్యలు తీసుకోవడంలో భాగంగా సీనరేజీ చార్జీ కింద రూ. 1.52 కోట్లు, పర్మిట్ ఫీజు కింద రూ. 1.22 కోట్లను ప్రభుత్వం, మైనింగ్శాఖ కట్టించుకుంది. ఇదేదో బీఆర్ఎస్ వాళ్లు కనిపెట్టి, ఫిర్యాదు చేస్తే తాము తీసుకున్న చర్య కాదు. మా ప్రభుత్వం తరఫున మైనింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆ సంస్థకు నోటీసులిచ్చి చర్యలు తీసుకున్నారు. ఇందులో ప్రతిపక్షం కొత్తగా కనిపెట్టిందేమీ లేదు. 2025 ఆగస్టు 8న ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఫిర్యాదుతో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. రాఘవ కన్స్ట్రక్షన్స్తో మంత్రికి ప్రత్యక్షంగా సంబంధం ఉంటే నోటీసులిచ్చి ఆదాయం రాబట్టే ప్రయత్నం ఏ ప్రభుత్వమైనా చేస్తుందా? ఇలాంటివి గత ప్రభుత్వంలో జరిగాయా?’అని విపక్ష సభ్యులను సీఎం రేవంత్ ప్రశ్నించారు. కాగా, సీఎం ప్రసంగం అనంతరం ప్యానెల్ స్పీకర్ బాలూ నాయక్ సభను ఆదివారం ఉదయం 10 గంటలకు వాయిదా వేశారు. -
భద్రాచలం శ్రీరాముని పట్టాభిషేకం.. పాల్గొన్న గవర్నర్ దంపతులు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి పట్టాభిషేక మహోత్సవం శనివారం అంగరంగ వైభవంగా సాగింది. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, వారి సతీమణి జానకి శుక్లా ఈ వేడుకకు హాజరై సీతారాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే వెంకట్రావు, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిషోర్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు ఈ ఉత్సవాన్ని తిలకించారు.భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొనేందుకు తొలిసారి వచ్చిన తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దంపతులకు ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ హెలీప్యాడ్ వద్ద మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భద్రాచలం ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావు, కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజు శాలువా, పుష్పగుచ్ఛం అందజేసి గవర్నర్ స్వాగతం పలికారు.భద్రగిరి మార్ట్ను ప్రారంభించిన గవర్నర్గవర్నర్ ఐటీడీఏ ఆధ్వర్యంలో భద్రాచలంలో భద్రగిరి మార్ట్ను గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రారంభించారు. మార్ట్లో విక్రయానికి ఉంచిన గిరిజన ఉత్పత్తుల గురించి భద్రాచలం ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి బి రాహుల్, సహాయ ప్రాజెక్ట్ అధికారి (జనరల్) డేవిడ్లు గవర్నర్కు వివరించారు. గిరిజన ఉత్పత్తులను పరిశీలించి, పలు ఉత్పత్తులను గవర్నర్ దంపతులు కొనుగోలు చేశారు. -
రాహుల్ గాంధీకి హనుమంతరావు లేఖ
ఢిల్లీ: లోక్సభ ప్రతిపక్షనేత రాహుల్గాంధీకి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు(వీహెచ్) లేఖ చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం పార్లమెంట్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టాలని రాహుల్గాంధీకి ఆయన లేఖ రాశారు. ప్రతిపక్ష నేతగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం రాహుల్ గాంధీ పార్లమెంట్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టాలి. రాహుల్ గాంధీ పార్లమెంట్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టేలా చూడాలనిపార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్లకు లేఖలు రాసినట్లు వీహెచ్ తెలిపారు.‘‘రాహుల్ గాంధీ బీసీ ప్రైవేట్ మెంబర్ బిల్లు ఆమోదం పొందినా.. పొందకపోయినా బీసీల పట్ల చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి బిల్లు పెట్టాలని కోరా. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ సవరిస్తేనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధ్యం అవుతుంది. మోదీ బీసీ అయినా బీసీలకు న్యాయం చేయడం లేదు. సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం ఆధ్వర్యంలో జంతర్ మంతర్లో ధర్నా కూడా చేశాము. తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలో శ్రీరాముని కళ్యాణం జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతాను’’ అని వీహెచ్ తెలిపారు. -
రిమాండ్ అవసరం లేదు.. స్టేషన్ బెయిల్ ఇవ్వండి..!
కరీంనగర్: ఆర్బీఎల్ బ్యాంక్లో భారీ కుంభకోణం కేసుకు సంబంధించి అదుపులోకి తీసుకున్న 13 మందిని రిమాండ్కు ఇవ్వాలన్న అభ్యర్ధనను కరీంనగర్ కోర్టు తిరస్కరించింది. వారిని రిమాండ్కు ఇవ్వాల్సిన అవసరం లేదని, స్టేషన్ బెయిల్ ఇవ్వాలని సీపీకి ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకు అధికారుల ఫిర్యాదు లేకుండా అక్రమాలు జరిగాయని ఎలా నిర్దారిస్తారని ఈ సందర్భంగా కోర్టు ప్రశ్నించింది. స్టేషన్ బెయిల్ ఇవ్వాలని సీపీకి సూచించింది. దాంతో ఈ కేసులో అరెస్టైన 13 మందికి స్టేషన్ బెయిల్ లభించింది. సొంత పూచీకత్తుపై 13 మందికి బెయిల్ మంజూరు చేశారు.కాగా, కరీంనగర్ ఆర్బీఎల్ బ్యాంకులో నిన్న(శుక్రవారం, మార్చి 27వ తేదీ) భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సుమారు రూ. 130 కోట్ల కుంభకోణం జరిగినట్లు సమాచారం. నకిలీ ఖాతాలు తెరిచి, మ్యూల్ ఖాతాలో డబ్బులు మళ్లింపు జరిగినట్లు తెలుస్తోంది. సైబర్ క్రైమ్, హవాలా జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కుంభకోణం ఘటనకు సంబంధించి 13 మంది అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులోకి తీసుకున్న వారిలో ఆర్బీఎల్ కిసాన్ నగర్ బ్రాంచ్ మేనేజర్తో పాటు ఇతర ఉద్యోగులు, కొందరు మధ్యవర్తులు ఉన్నట్లు సమాచారం. -
ఉస్మానియా బిస్కెట్లు తింటున్నారా?.. మీకో ఊహించని షాక్!
సాక్షి, హైదరాబాద్: కల్తీ బేకరీ ఉత్పత్తుల తయారీ కేంద్రంపై టాస్క్ఫోర్స్ దాడులు నిర్వహించారు. ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ (గోల్కొండ టీమ్), గుడిమల్కాపూర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో కేడీ కాలనీ పరిధిలో ఎటువంటి అనుమతులు లేకుండా, అపరిశుభ్ర వాతావరణంలో నడుస్తున్న అక్రమ బేకరీ తయారీ కేంద్రం గుట్టురట్టు చేశారు. భారీ మొత్తంలో నిల్వ ఉంచిన బేకరీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు.రూ.12,54,280 విలువైన ముడి పదార్థాలు, యంత్రాలను పోలీసులు సీజ్ చేశారు. తయారు చేసిన బిస్కెట్లు (ఉస్మానియా, కాజు, చాయ్, ఫ్యాన్ బిస్కెట్లు), రస్కులు, బటర్ బన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అహ్మద్ రజా లైసెన్స్ లేకుండా.. అపరిశుభ్రమైన, ప్రమాదకరమైన వాతావరణంలో తక్కువ నాణ్యత గల ముడి పదార్థాలను ఉపయోగించి ఉస్మానియా బిస్కెట్లు, రస్కులు, బటర్ బన్ వంటి ఉత్పత్తులను తయారు చేస్తున్నాడు. వీటిని నగరంలోని వివిధ కిరాణా దుకాణాలు, హోటళ్లు, కేఫ్లకు సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. -
తెలంగాణలో రానున్న 5 రోజులు భారీ వర్షాలు
-
ఐపీఎల్ బెట్టింగ్.. సజ్జనార్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ క్రికెట్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో నగరంలో బెట్టింగ్ ముఠాలకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. క్రికెట్ క్రీడను జూదంగా మార్చి అమాయకుల జీవితాలతో ఆడుకునే వారిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. గతంలో చేపట్టిన #SayNoToBettingApps ప్రచారానికి ప్రజల నుంచి అద్భుతమైన మద్దతు లభించిందన.. తద్వారా కేంద్ర ప్రభుత్వం వందలాది బెట్టింగ్ యాప్లను నిషేధించడమే కాకుండా కఠినమైన ఆన్లైన్ గేమింగ్ బిల్లును కూడా తీసుకువస్తోందన్నారుఅయితే ప్రస్తుతం ఈ వంచన కొత్త రూపం దాల్చిందని.. యాప్లు పోయినా టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల వేదికగా కొత్త వెబ్సైట్లను సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. కేవలం ఆన్లైన్ మాత్రమే కాకుండా, నివాస గృహాలు, ఫామ్ హౌస్లు, ఇతర రహస్య స్థావరాల్లో గుంపులుగా చేరి ఫోన్ల ద్వారా ఆఫ్లైన్ బెట్టింగ్లు నిర్వహించే వారిపై ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు. స్థానిక బుకీలు యువతను అప్పుల ఊబిలోకి నెడుతున్నారని, ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించడానికైనా సిద్ధమేనని స్పష్టం చేశారు.తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశ చివరికి కన్నీళ్లే మిగిలిస్తుందని, బెట్టింగ్లో గెలిచేది కేవలం నిర్వాహకులు మాత్రమేనని, ఆడేవారు సర్వస్వం కోల్పోతారని హెచ్చరించారు. ఒక్కసారి ఈ వ్యసనానికి బానిసలైతే కుటుంబాలు రోడ్డున పడతాయని, క్రికెట్ను ఒక క్రీడగా ఆస్వాదించాలి తప్ప జూదంగా మార్చుకోవద్దని హితవు పలికారు.యువతను ఈ బెట్టింగ్ భూతం నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, పరిసరాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిస్తే లేదా మిమ్మల్ని వేధిస్తున్నా వెంటనే డయల్ 100కు గానీ, హైదరాబాద్ పోలీస్ వాట్సాప్ నంబర్ 94906 16555కు గానీ సమాచారం అందించాలని కోరారు. -
‘అక్రమ మైనింగ్ జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది?’
హైదరాబాద్: నగరం నడిబొడ్డను అక్రమ మైనింగ్ జరుగుతుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్రావు ధ్వజమెత్తారు. కంచె చేనుమేసినట్లు.. రక్షకుడే భక్షకుడిలా మారినట్లు అక్రమ మైనింగ్ జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు(శనివారం, మార్చి 28వ తేదీ) అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మైనింగ్ అంశంపై హరీష్రావు మాట్లాడారు. ‘రాఘవ కన్స్ట్రక్షన్స్ నడుపుతున్న క్రషర్స్ కు ఎలాంటి అనుమతులు లేవు. జీవో త్రిబుల్ వన్ వైలెట్ చేస్తూ ఆక్రమణ జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది?, క్రషర్ నడపాలంటే 8 రకాల అనుమతులు కావాలి. నిబంధనలను పాటించకుండా క్రషర్ నడుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి కోట్ల రూపాయల గండిపడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది?, మైనింగ్ శాఖ షోకాజ్ నోటీసులతోపాటు డిమాండ్ నోటీసులు ఇచ్చింది. రెండవసారి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అనుమతులు లేని క్రషర్ ను మూసివేయాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు మైనింగ్ శాఖ లేఖ పంపినా చర్యలు లేవు. నేను చెప్పింది తప్పు అయితే నన్ను ఊరి తీయండి. మా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తమ్ముడు క్లస్టర్ లో చిన్న తప్పు జరిగితే రాత్రికి రాత్రే జైల్లో పెట్టారు. మంత్రి పొంగులేటి రాజీనామ చేయాలి‘తప్పులు చేశారు కాబట్టే ముఖ్య నెత సంస్థకు నోటీసులు ఇచ్చారు. ముఖ్య నేత క్లస్టర్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. అక్రమ మైనింగ్ కు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రిగా పొంగులేటి రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేశారుహరీష్ వ్యాఖ్యలు ఖండించిన మంత్రి శ్రీధర్బాబుఅక్రమ మైనింగ్పై హరీష్రావు చేసిన వ్యాఖ్యలను మంత్రి శ్రీధర్బాబు ఖండించారు. హరీష్రావు డిమాండ్ చేసినట్లు విచారణ చేయిస్తామని, అంతే కానీ స్లీపింగ్ రిమార్క్స్ చేస్తాం అంటే ఊరుకోమన్నారు. పొంగులేటిపై హరీష్రావు చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని మంత్రి శ్రీధర్బాబు డిమాండ్ చేశారు. సభ రికార్డుల నుంచి హరీష్ రావు వ్యాఖ్యలను తొలగించాలని, వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదన్నారు. -
ఐపీఎల్ బెట్టింగ్స్.. ప్రత్యేక నిఘాతో సజ్జనార్ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో బెట్టింగ్లపై హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ సీజన్ మొదలవుతున్న తరుణంలో క్రికెట్ను కేవలం క్రీడగా ఆస్వాదించాలని, బెట్టింగ్ ఊబిలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నట్టు వీడియో షేర్ చేశారు. ఎవరైనా బెట్టింగ్లకు పాల్పడితే సమాచారం ఇవ్వాలన్నారు.హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా..‘బెట్టింగ్ ఊబిలో పడొద్దు.. బతుకును ఛిద్రం చేసుకోవద్దు!. ఐపీఎల్ సీజన్ మొదలవుతున్న తరుణంలో క్రికెట్ను కేవలం క్రీడగా ఆస్వాదించాలని, బెట్టింగ్ ఊబిలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో #SayNoToBettingApps ప్రచారం ద్వారా వందలాది యాప్లను ప్రభుత్వం నిషేధించినప్పటికీ, ఇప్పుడు టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికగా ఈ దందా కొత్త రూపం దాల్చింది. కేవలం డబ్బు కోసం ఇటువంటి ప్రమాదకరమైన యాప్లను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం.ఆన్లైన్ మాత్రమే కాకుండా ఫామ్ హౌస్లు, రహస్య ప్రాంతాల్లో సాగే ఆఫ్లైన్ బెట్టింగ్లపై మా ప్రత్యేక నిఘా ఉంది. బెట్టింగ్ వల్ల అప్పులపాలై కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి తెచ్చుకోవద్దు. మీ పరిసరాల్లో ఎవరైనా బెట్టింగ్కు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100 లేదా మా వాట్సాప్ నంబర్ 94906 16555 కు సమాచారం ఇవ్వండి అని’ వీడియో షేర్ చేశారు. #SayNoToBettingబెట్టింగ్ ఊబిలో పడొద్దు.. బతుకును ఛిద్రం చేసుకోవద్దు!ఐపీఎల్ సీజన్ మొదలవుతున్న తరుణంలో క్రికెట్ను కేవలం క్రీడగా ఆస్వాదించాలని, బెట్టింగ్ ఊబిలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో #SayNoToBettingApps ప్రచారం ద్వారా వందలాది యాప్లను… pic.twitter.com/BA4uUttaIU— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) March 28, 2026 -
మూసీ ప్రాజెక్ట్.. సబితపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, రంగారెడ్డి: మూసీ నది పునర్జీవన ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. మంచిరేవుల వద్ద భారీ ఎత్తున ఓంకారేశ్వర ఆలయ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ పనులకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నేడు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఆధునిక గోశాల నిర్మాణానికి కూడా సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇప్పటికే డిజైన్లను ఖరారు చేసింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.శంకుస్థాపన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్లో ముందడుగు ఇది. నదులు కాలుష్యం అవుతున్నాయి. నదులను ప్రక్షాళన చేయాలని చాలా మంది సీఎంలు ఆలోచించారు. ఓంకారేశ్వర ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన దైవకార్యంగా భావిస్తున్నా. 80 ఏళ్ల చరిత్ర కలిగిన వీరభద్రస్వామి ఆలయం. మూసీ దుస్థితి ప్రకృతి తప్పిదం కాదు. మానవ తప్పిదం. మూసీ ప్రక్షాళన అత్యవసరం. హైదరాబాద్ నుంచి కాలుష్యం మూసీ నదిలో కలుస్తుంది. ఈ ప్రాంతాల్లో పంటను కొనే పరిస్థితి లేదు. ఇక్కడున్న ప్రజాప్రతినిధులందరూ మూసీ ప్రక్షాళన చేయాలని కోరుతున్నారు. కొద్ది మంది రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డుపడుతున్నారు. ఎవరైనా దీనికి పెడార్థాలు తీసినా, రాజకీయం చేసినా ప్రభుత్వం శివతాండవం చేస్తుంది.బీఆర్ఎస్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ కామెంట్స్ చేశారు. ఇదే ప్రాంతంలో ఉండే అక్క అనేక రకాలుగా రాజకీయ లబ్ది పొందారు. అక్క కొడుకే ఎన్జీటీలో కేసు వేశాడు. మూసీ పునరుద్దీకరణ ఆపాలని కేసు పెట్టాడు. కేసు వేయడానికి వారికి మనసు ఎలా వచ్చింది?. ప్రజాప్రతినిధిగా వారికి అర్హత ఉందా?. ఎవరు అడ్డం వచ్చినా మూసీ నదిని పునరుద్ధరిస్తాం. ఈ అవకాశం చరిత్రలో ఎవరికో ఒకరికి వస్తుంది. దైవ నిర్ణయంతో ఈ గొప్ప కార్యక్రమం చేస్తున్నాం. ఈ ప్రాంతానికి గొప్ప చరిత్ర ఉంది. ఈ చరిత్ర కనుమరుగు అవ్వకుండా కార్యక్రమాలు చేస్తున్నాం. విమర్శలు, అడ్డంకులు వచ్చినా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. నదీ పరివాహక ప్రాంతంలోనే అభివృద్ధి ఉంటుంది. సముద్రం ఉన్న ప్రాంతంలోనే వ్యాపారాలు ఎక్కువగా ఉంటాయి. సముద్రపు ఒడ్డు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ. మానవ తప్పిదం వల్లే మూసీకి ఇలాంటి పరిస్థితి. దీంతో హైదరాబాద్ నగరమే కనుమరుగయ్యే పరిస్థితులు వచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో వస్తున్న పొల్యూషన్ వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఢిల్లీని చూసి అయినా మనం నేర్చుకోవాలి’ అని అన్నారు.ఇక, ఇక్కడ.. చారిత్రక వీరభద్రస్వామి ఆలయం సమీయంలో ఓంకారేశ్వర ఆలయ నిర్మాణం జరగనుంది. సుమారు రూ.700 కోట్లతో 8 ఎకరాల్లో ఈ నిర్మాణం జరగనుండగా 100 అడుగుల గాలి గోపురం నిర్మాణం చేస్తారు. గాలి గోపురం నుంచి లోపలికి ప్రవేశించాక వేర్వేరు మండపాలు ఉంటాయి. మూసీ నది మధ్యలో 100 అడుగుల శివని విగ్రహం ఏర్పాటు చేస్తారు. 207 అడుగుల పొడవైన ప్రధాన మండపం, గర్భాలయ గోపురాన్ని 14 అడుగుల పొడవు, 14 అడుగుల వెడల్పు, 64 అడుగుల ఎత్తుతో నిర్మించనున్నారు. ఈ దేవాలయానికి ఓఆర్ఆర్ నుంచి విశాలమైన రోడ్డు మార్గాలను నిర్మిస్తారు. ఆలయం వద్ద 199 కోట్లతో వెయ్యి నుంచి 2 వేల వాహనాలు పార్కింగ్ చేసుకునే విధంగా మూడంతస్తుల్లో పార్కింగ్ సౌకర్యం కల్పించనున్నారు. -
తెలంగాణకు మాత్రమే రేవంత్ సీఎం.. ఉత్తరాదికి కాదు: బండి సంజయ్
సాక్షి, కరీంనగర్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి తన స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నారని ఆరోపించారు. తెలంగాణకు మాత్రమే రేవంత్ రెడ్డి సీఎం.. ఉత్తరాది రాష్ట్రాలకు కాదు అంటూ చురకలు అంటించారు.కేంద్రమంత్రి బండి సంజయ్ తాజాగా కరీంనగర్లో మాట్లాడుతూ..‘ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎన్ని పార్టీలు అయినా పెట్టుకోవచ్చు. కాళేశ్వరం డిజైన్ చేసింది కేసీఆర్ ప్రభుత్వమే. కాళేశ్వరం కూలిపోవడానికి అప్పుడున్న బీఆర్ఎస్ బాధ్యత వహించాలి. కేసీఆర్తో సీఎం రేవంత్ కుమ్మక్కు అయ్యారు. రేవంత్, కేసీఆర్ కలిసే రాజకీయం చేస్తారు. ముఖ్యమంత్రి తన స్థాయి మరిచి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణకి ముఖ్యమంత్రి.. ఉత్తరాది రాష్ట్రాలకు కాదు.మొదట ఆరు గ్యారంటీలు అమలు చేయాలి. కేంద్రం ఏం ఇస్తున్నాదో.. ఏం చేస్తుందో తెలంగాణ ప్రజానీకానికి తెలుసు. తెలంగాణ రాష్ట్ర ఖజానా పరిస్థితి బాగాలేదు. రైతులకి ఇబ్బందులు కలగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తుంది అంటూ వ్యాఖ్యలు చేశారు. -
పెళ్లింట విషాదం
కర్ణాటక: ఈత సరదా పెళ్లింట్లో విషాదం నింపింది. తుంగభద్ర నదిలో గల్లంతై నలుగురు కర్ణాటక వాసులు మృత్యువాత పడిన ఘటన కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని కందుకూరులో చోటు చేసుకుంది. వివరాలివీ.. కందుకూరు గ్రామంలో దాసరి తిరుపతయ్య కుమారుడు ఆదిశేషులు వివాహం ఈ నెల 26న నిర్వహించారు. శుక్రవారం తిరుగు పెళ్లి చేసి వెళ్లాలని బంధువులు ఇక్కడే ఉండిపోయారు. మధ్యాహ్నం సమయంలో తుంగభద్ర నదిలో స్నానానికని బంధువులు దాదాపు 15 మంది గ్రామ శివారులోని రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) ఆనకట్ట వద్ద తుంగభద్ర నదికి వెళ్లారు. ఆ సమయంలో దాసరి రత్నమ్మ(26) కాలు జారి నదిలోకి పడి పోయింది. కాపాడేందుకు ఆమె అక్క దాసరి ఉమావతి అలియాస్ సంగీత (28), దాసరి శివానంద (20), దాసరి మహంతే‹Ù(20) నదిలోకి దూకి గల్లంతయ్యారు. బంధువులంతా గాలించగా చివరకు మృతదేహాలై కనిపించడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
అమెరికాలో హైదరాబాదీ ‘గోల్డ్ స్కామ్’
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి వెళ్లి అమెరికాలోని టెక్సాస్లో స్థిరపడ్డ సాయి ప్రవీణ్ కొమ్మన అక్కడ ఓ భారీ స్కామ్కు పాల్పడ్డాడు. నకిలీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) ఏజెంట్ అవతారం ఎత్తి, ఎక్సెల్సియర్ స్ప్రింగ్స్ ప్రాంతానికి చెందిన వృద్ధురాలిని టార్గెట్గా చేసుకుని, ఆమె నుంచి 97,240 డాలర్లు (దాదాపు రూ.92 లక్షల) విలువైన బంగారం కాజేశాడు. దీనిపై ఇటీవల అక్కడి క్లే కౌంటీ కోర్టులో అ«భియోగపత్రాలు దాఖలయ్యాయి. ఈ స్కామ్లో ఇతడికి మరో ఇద్దరు తెలుగు వాళ్లు సహకరించినట్లు ఆ కోర్టుకు పోలీసులు తెలిపారు. కస్టమర్ సరీ్వస్ను సంప్రదించబోయి... బాధిత మహిళ గత ఏడాది సెప్టెంబర్ 10న ఓ కంపెనీకి చెందిన కస్టమర్ సర్వీను సంప్రదించడానికి ప్రయత్నించారు. అనుకోకుండా ఆమె సాయి ప్రవీణ్కు ఫోన్ చేశారు. ఈ కాల్ అందుకున్న అతగాడు తాను సీఐఏ ఏజెంట్ అంటూ ఆమెతో పరిచయం చేసుకున్నాడు. పథకం ప్రకారం వ్యవహరించిన ప్రవీణ్ నకిలీ బ్యాడ్జ్తో పాటు గుర్తింపు కార్డు ఫోటో కూడా పంపాడు. దీని ఆమె పూర్తిగా నమ్మడంతో ప్రవీణ్ అసలు కథ మొదలెట్టాడు. ఆమె సోషల్ సెక్యూరిటీ ఖాతా హ్యాక్ అయిందని చెప్పాడు. బ్యాంకులో ఉన్న నగదు నేరగాళ్ల పాలు కాకుండా ఉండాలంటే తక్షణం బంగారంగా మార్చాలని సూచించాడు. దీనికి అంగీకరించిన ఆమె అంత బంగారం తీసుకువచ్చి ఇంట్లో పెట్టుకోవడం ఎలా అని ప్రశ్నించారు. భద్రపరిచే బాధ్యతా తనదేనంటూ... దీంతో ఆ బాధ్యతలు తాను తీసుకుంటానని, గోల్డ్ బార్స్ను కొన్నాళ్లు భద్రంగా ఉంచి, ఆపై నగదుగా మార్చి బ్యాంకు ఖాతాలో వేస్తానని నమ్మబలికాడు. దీంతో బాధితురాలు తన బ్యాంక్ ఖాతా నుంచి 97,240 డాలర్లను కాన్సాస్ సిటీ జ్యువెలరీ దుకాణానికి బదిలీ చేసి గోల్డ్ బార్లు కొనుగోలు చేసి ఇంటికి తీసుకువచ్చారు. ఆ మరుసటి రోజు కారులో వచ్చిన ప్రవీణ్ ఆ బంగారం తీసుకుని వెళ్లాడు. కొన్ని రోజులకు బాధితురాలు విషయాన్ని తన కుమార్తెకు చెప్పడంతో ఆమె విషయాన్ని ఫేస్బుక్లో పోస్టు చేయడం ద్వారా బయటకు తెచ్చింది. ఇలా కేసు వెలుగులోకి రావడంతో అక్కడి పోలీసులు రంగంలోకి దిగారు.ప్రవీణ్ను గుర్తించి పట్టుకున్న పోలీసులు బాధితురాలి ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలు, ఫోన్ నెంబర్ల ఆధారంగా దర్యాప్తు చేసిన అక్కడి పోలీసులు ప్రవీణ్ను గుర్తించారు. అతడిని అరెస్టు చేసి, బంగారం స్వా«దీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో మరో ఇద్దరు తెలుగు వారి పాత్ర కూడా ఉన్నట్లు అమెరికా పోలీసులు నిర్థారించారు. గత ఏడాదే ఈ ముగ్గురినీ అరెస్టు చేయగా... ప్రవీణ్ తన నేరాన్ని అంగీకరించలేదు. దీంతో మిగిలిన ఇద్దరికీ శిక్ష విధించిన న్యాయస్థానం ఇతడికి బెయిల్ ఇచ్చింది. దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు ఇటీవల అక్కడి కోర్టులో ప్రవీణ్పై అభియోగపత్రాలు దాఖలు చేశారు. త్వరలోనే క్లే కౌంటీ కోర్టులో ప్రవీణ్ కేసు విచారణ జరగనుంది. -
అనుకున్నదొకటి.. అయినదొకటి
హైదరాబాద్: పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందన్న అనుమానంతో గడిచిన నాలుగు రోజుల నుంచి చాలామంది వాహనాల ట్యాంక్లు ఫుల్ చేసుకునేందుకు పెట్రోల్ బంకుల వద్ద బారులుదీరారు. వాహనాలతో పెట్రోల్ బంకులన్నీ కిక్కిరిసిపోయాయి. కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేయగా, మరికొన్ని చోట్ల సరఫరా చేయలేక సిబ్బంది చేతులెత్తేశారు. నాలుగు రోజులుగా పెట్రోల్ బంకుల ప్రాంగణాలు, రోడ్లన్నీ బారులుదీరిన వాహనాలతో కనిపించాయి. ఇదే అదునుగా కొంతమంది పెట్రోల్ బంకుల యజమానులు వాహననదారుల బలహీనతను క్యాష్ చేసుకుంటున్నారు. లక్డీకాపూల్లోని ద్వారకా సర్వీస్ స్టేషన్ పెట్రోల్ బంకు యజమాని గురువారం తన వద్ద 38 వేల లీటర్ల పెట్రోల్, డీజిల్ స్టాక్ ఉండగానే భారీగా వాహనదారులు వస్తారని గ్రహించి, మరో 8 వేల లీటర్ల ట్యాంక్ను తెప్పించారు. తీరా చూస్తే గురువారం మధ్యాహ్నం నుంచే వాహనదారులు రావడం తగ్గిపోయారు. మూడు రోజులుగా వచ్చినట్లు శుక్రవారం కూడా క్యూ కడతారని ఆశించిన పెట్రోల్బంకు యజమానికి నిరాశే ఎదురైంది. అప్పటికే నిల్వ ఉన్న పెట్రోల్, డీజిల్తో పాటు ట్యాంకర్ కూడా అలాగే ఉండిపోయింది. -
ఎక్సైజ్ తగ్గినా ధరలు యథాతథం..!
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో సామాన్యుడిపై భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డిజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పటికీ నగరంలో మాత్రం రిటైల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. శుక్రవారం లీటర్ పెట్రోల్ రూ.107.46, డీజిల్ రూ. 95.70 వద్ద స్థిరంగా కొనసాగాయి. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై విధిస్తున్న ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ. 10 చొప్పున తగ్గించింది. తాజా తగ్గింపుతో పెట్రోల్పై కేంద్ర ఎక్సైజ్ సుంకం లీటరుకు రూ.13 నుంచి రూ. 3కి పడిపోయింది. డీజిల్పై రూ.10 సుంకాన్ని పూర్తిగా (సున్నాకు) తొలగించడం గమనార్హం. సాధారణంగా ఎక్సైజ్ సుంకం తగ్గితే వెంటనే పెట్రోల్ బంకుల్లో ధరలు తగ్గాలి. కానీ.. ధరలు స్థిరంగా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయ పరిస్థితులు అంటున్నాయి ఆయిల్ కంపెనీలు. సామాన్యుడిపై భారం పడకుండా కేంద్రం నిర్ణయం ఉపశమనం కలిగించింది. 2021 నవంబర్లో పెట్రోల్పై రూ. 5, డీజిల్పై రూ. 10., 2022 మేలో పెట్రోల్పై రూ. 8, డీజిల్పై రూ. 6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం తగ్గించింది. -
ఈ కుర్రోడు.. టాలెంటున్నోడు!
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పోలీసు కమిషనర్ డాక్టర్ ఎం.రమేష్... నిత్యం అత్యంత బిజీగా ఉండే అధికారి. ఈ కమిషనరేట్ పరిధిలో ఉన్న, బయటి నుంచి వచ్చే వీఐపీలు, సాధారణ ప్రజలు ఆయన్ను కలవడానికి వేచి ఉంటారు. కొందరు నేరుగా.. మరికొందరు అపాయింట్మెంట్ తీసుకుని.. ఇంకొందరు సిఫార్సులతో వచ్చి కలుస్తుంటారు. అలాంటి సైబరాబాద్ సీపీ... కూరగాయల వ్యాపారి కుమారుడైన సందీప్ను కలవాలని ఆసక్తి చూపారు. తన సిబ్బందిని పురమాయించి మరీ అతడిని తన కార్యాలయానికి పిలిపించుకున్నారు. సందీప్కు స్మార్ట్ ఫోన్ అందజేస్తున్న సీపీ రమేష్ దీనికి కారణం సోషల్మీడియాలో వైరల్గా మారిన సందీప్ వీడియో. రాంనగర్ మార్కెట్లో విలక్షణ శైలితో కూరగాయలు విక్రయిస్తున్న సందీప్ వీడియో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నెటిజనులతో పాటు సైబరాబాద్ సీపీ రమేష్ చూశారు. ఆయనను యువకుడి శైలి ఆకట్టుకోవడంతో.. స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మహేష్ ద్వారా సందీప్ను గురువారం గచ్చిబౌలిలోని కమిషనరేట్కు రప్పించారు. ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ చేస్తున్న సందీప్.. తల్లి చేసే కూరగాయల వ్యాపారంలో చేదోడువాదోడుగా ఉంటున్నాడు. తన వాక్చాతుర్యంతో మార్కెట్కు వచ్చిన వినియోగదారుల్ని ఆకట్టుకుంటున్నాడు. View this post on Instagram A post shared by sandeep rapper (@diffrent_guy_) పోలీసుల కోసం రీల్స్ చేయాలని.. రీల్స్, కంటెంట్ చేయడంపై ఆసక్తి, నైపుణ్యం ఉన్న సందీప్కు వాటిని చిత్రీకరించడానికి సొంతంగా సెల్ఫోన్ లేదు. ఈ విషయం తెలుసుకున్న సీపీ రమేష్... ఓ కొత్త ఫోన్ను అతడికి బహూకరించారు. ఈ ఫోన్తో సైబరాబాద్ పోలీసుల కోసం కొన్ని రీల్స్, కంటెంట్ తయారు చేయాలని సూచించారు. సైబర్ నేరాలు, డ్రగ్స్కు వ్యతిరేకంగా.. రోడ్డు ప్రమాదాలు నిరోధానికి తాము చేసే పోరాటాలకు మద్దతుగా అవి ఉండాలన్నారు. కమిషనర్ రమేష్కు ధన్యవాదాలు తెలిపిన సందీప్.. త్వరలోనే కొన్ని రీల్స్ తయారు చేసుకువస్తానన్నాడు. View this post on Instagram A post shared by sandeep rapper (@diffrent_guy_) -
సజావుగా పెట్రో ఉత్పత్తుల సరఫరా
సాక్షి, హైదరాబాద్: పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరాకు సంబంధించి సమీక్షకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు ముఖ్యమంత్రి ఏ.రేవంత్రెడ్డి తెలిపారు. పశి్చమాసియాలో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం సాయంత్రం నిర్వహించిన వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు అంశాలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సీఎస్ ఆధ్వర్యంలోని కమిటీ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని చెప్పారు. 33 జిల్లాల్లోనూ గ్యాస్ సరఫరా, పెట్రోల్, డీజిల్ విక్రయాలు.. బ్లాక్ మార్కెట్ నిరోధానికి కమిటీలు ఏర్పాటు చేసి నోడల్ అధికారులను నియమించినట్టు సీఎం తెలిపారు. ప్రాధాన్యత క్రమంలో ఆస్పత్రులు, పాఠశాలలు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను పంపుతున్నట్టు సీఎం వెల్లడించారు.ప్రతి బంక్లో స్టాక్ ఎంత ఉంది.. ఎంత వినియోగిస్తున్నారనే దానిపై అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారని సీఎం తెలిపారు. తెలంగాణలో సాధారణ రోజుల్లో రోజుకు 36,189 కిలోలీటర్ల పెట్రోల్, డీజిల్ వినియోగం జరుగుతుందని, ప్రస్తుతం 1,88,210 కిలోలీటర్ల నిల్వలు ఉన్నట్టు సీఎం వివరించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతపై సోషల్ మీడియాలో భయాందోళనలు కలిగేలా పోస్టులు పెడు తున్న వారిపై చట్టపరమైన చర్య తీసుకుంటున్నట్టు తెలిపారు. శిలాజ ఇంధనాలపై దృష్టి...తెలంగాణలో శిలాజ ఇంధనాలపై (బొగ్గు, చమురు, గ్యాస్) ఆధార పడడం తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నామని.. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి పెంచుతున్నామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా తెలంగాణలో ఈవీలపై వంద శాతం రోడ్డు పన్ను, రిజి్రస్టేషన్ ఫీజు మినహాయించామన్నారు. ఈవీల తయారీ, బ్యాటరీ ఎకో సిస్టమ్ను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నట్టు పీఎం మోదీ దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్ నగరంలో 1.20 లక్షలకు పైగా ఉన్న పెట్రోల్, డీజిల్ ఆటోలను రెట్రో ఫిటింగ్ ద్వారా ఈవీలుగా మార్చే ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ఆరీ్టసీలో ఇక ముందు అన్ని ఈవీ బస్సులనే వినియోగించనున్నట్టు సీఎం రేవంత్ ప్రధాన మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి పాల్గొన్నారు. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్గా రేవంత్రెడ్డి కేరళ, అసోం, గోవా, పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో కీలకంసాక్షి, న్యూఢిల్లీ: సీఎం రేవంత్రెడ్డికి జాతీ యస్థాయిలో ప్రాధాన్యం పెరుగుతోంది. ఏఐసీసీ తాజాగా ప్రకటించిన పుదుచ్చేరితోపాటు కేరళ, అసోం, గోవా రాష్ట్రాల స్టార్ క్యాంపెయినర్ల జాబితాల్లో ఆయనకు చోటు దక్కింది. కేరళ, అసోం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రకటించిన 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాలలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్గాం«దీ, ప్రియాంక గాం«దీ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్లతోపాటు రేవంత్రెడ్డి ఉన్నారు. పుదుచ్చేరి జాబితాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొన్నం ప్రభాకర్లకు కూడా చోటు దక్కింది. స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ సమరి్పంచింది. -
ఆర్థిక ఆరోగ్యం యథాతథం
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సూక్తి కేవలం మనుషులకే కాదు వ్యవస్థలకు కూడా వర్తిస్తుంది. మనిషి ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉన్నట్టే.. రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్యం ఎంత మెరుగ్గా ఉంటే అంత ఎక్కువ కాలం పురోగతిలో పయనించేందుకు, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు వీలవుతుంది. రాష్ట్రాలకు సంబంధించి అలాంటి ఆర్థిక ఆరోగ్య సూచీలను నీతి ఆయోగ్ ఇటీవల విడుదల చేసింది. ఆర్థిక ఆరోగ్య సూచిక–2026 పేరుతో 2023–24 ఆర్థిక సంవత్సరం నాటికి రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో మార్కులతో కూడిన ర్యాంకులు ఇచ్చింది.ఒడిశా ఆర్థిక ఆరోగ్యం 73.1 స్కోరుతో అన్ని రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉండగా, కేవలం 12.4 స్కోరుతో పంజాబ్ చిట్టచివరి స్థానంలో నిలిచింది. ఇక తెలంగాణ 44.3 స్కోరుతో ఏడో స్థానంలో నిలవడం గమనార్హం. తెలంగాణ ఏర్పాటైన తర్వాత తొలి పదేళ్ల అనంతరం కూడా రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యంలో మార్పు ఏమీ రాలేదని స్పష్టమవుతోంది. 2014–15లో 45 పాయింట్ల స్కోరుతో ఏడో స్థానంలో నిలిచిన తెలంగాణ, పదేళ్ల తర్వాత 2023–24లోనూ ఏడో స్థానంలోనే నిలవడం గమనార్హం. నిజానికి అప్పుడు సాధించిన స్కోరు కంటే 0.7 పాయింట్లు తగ్గి 44.3 స్కోరుకే పరిమితం అయింది. అంతకుముందు 2021–22లో 34.8 స్కోరుతో తొమ్మిదో స్థానంలో ఉండగా, ఆ తర్వాత కొంత పుంజుకుని 2014–15 కల్లా ఏడో స్థానానికి చేరింది. ఐదు అంశాల ఆధారంగా.. ఖర్చులో నాణ్యత, రెవెన్యూ సమీకరణ, ఆర్థిక వివేచన, రుణసూచిక, రుణ స్థిరత్వం అనే ఐదు అంశాల ఆధారంగా ఈ ఆరోగ్య సూచీని లెక్కకట్టిన నీతి ఆయోగ్.. దేశంలోని 18 పెద్ద రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలకు వేర్వేరుగా ర్యాంకులు ఇచి్చంది. మొత్తం ఖర్చులో అభివృద్ధి వ్యయం, జీఎస్డీపీలో మూల ధన వ్యయం ఆధారంగా ఖర్చులో నాణ్యత నిర్ధారించింది.జీఎస్డీపీలో రాష్ట్ర సొంత రాబడులు, మొత్తం ఖర్చులో సొంత రెవెన్యూ ఆధారంగా రెవెన్యూ సమీకరణను పరిశీలించింది. జీఎస్డీపీతో పోలిస్తే స్థూల ద్రవ్యలోటు, రెవెన్యూలోటు ఆధారంగా ఆర్థిక వివేచన, రెవెన్యూ రాబడుల్లో వడ్డీల చెల్లింపులు, జీఎస్డీపీతో పోలిస్తే మొత్తం అప్పుల ఆధారంగా రుణ సూచిక, జీఎస్డీపీ వృద్ధి, అప్పులకు వడ్డీల చెల్లింపులో పెరుగుదల ఆధారంగా రుణ స్థిరత్వం.. అంశాల్లో స్కోరు నమోదు చేసింది. తెలంగాణకు సంబంధించిన ముఖ్యాంశాలు.. ⇒ దేశంలోని 18 పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే ఖర్చులో నాణ్యత విషయంలో గత పదేళ్ల కాలంలో కొంత మెరుగుదల నమోదైంది. 2014–15లో ఈ సూచీకి సంబంధించి 55.3 స్కోరు సాధించిన రాష్ట్రం ఆ తర్వాత వరుసగా దిగజారింది. 42.0 (2018–19), 39.4 (2021–22), 36.9 (2022–23) స్కోర్లు నమోదు చేసింది. కానీ 2023–24కు వచ్చేసరికి ఖర్చులో నాణ్యత విషయంలో అత్యధికంగా 57.1 స్కోరు సాధించగలిగింది. ⇒ రెవెన్యూ సమీకరణ సూచీలో తెలంగాణ గణనీయమైన వృద్ధి సాధించిందని నీతి ఆయోగ్ గణాంకాలు చెబుతున్నాయి. 2014–15లో వనరుల సమీకరణ అంశంలో 50.7 మాత్రమే స్కోరు సాధించిన రాష్ట్రం.. ఆ తర్వాత వరుసగా 54.1, 59.7 స్కోర్లు సాధించింది. ఇక 2022–23లో ఏకంగా 75.2 స్కోరుతో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. కానీ 2023–24కు వచ్చేసరికి కొంత దిగజారి 60.8 స్కోరు సాధించి మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ⇒ ఆర్థిక వివేచన అంశంలోనూ తొలి పదేళ్ల కాలంలో తెలంగాణ ఒడిదుడుకులను ఎదుర్కొంది. రాష్ట్రం ఏర్పాటైన 2014–15లో 29.4 స్కోరుతో 10వ స్థానంలో నిలిచిన రాష్ట్రం ఆ తర్వాత మరింత దిగజారింది. 22.5 స్కోరుతో 2019–20లో 10వ స్థానం, 21.6 స్కోరుతో 2021–22లో మళ్లీ 10వ స్థానంలోనే ఉంది. అయితే 2022–23లో 40.8 స్కోరుతో 9వ స్థానానికి చేరింది. అలాగే 2023–24లోనూ 30 స్కోరుతో మళ్లీ తొమ్మిదో స్థానాన్ని నిలబెట్టుకుంది. ⇒ రుణసూచిక విషయంలో రాష్ట్రం ఏర్పాటైన 2014–15లో 83.7 స్కోరుతో నాలుగో స్థానంలో ఉన్న తెలంగాణ.. ఆ తర్వాత 2019–20 నాటికి 63.4 స్కోరుతో ఎనిమిదో స్థానానికి దిగజారింది. ఆ తర్వాత 49.8 స్కోరుతో 2021–22 నాటికి పరిస్థితి మరింత చేయిదాటిపోయింది. అంటే ఈ మధ్యకాలంలో అప్పులకు వడ్డీల చెల్లింపులు ఎక్కువయ్యాయన్నమాట. కాగా 2022–23లో కొంత మెరుగుపడి 52.3, 2023–24లో 53.5 స్కోరు సాధించింది. ఆర్థిక క్రమశిక్షణతో టాప్లో ఆ రాష్ట్రాలు స్థిరమైన ఆదాయం, రుణాల స్వయం నియంత్రణ కారణంగా 2023–24 ఆర్థిక సంవత్సరం నాటికి ఒడిశా ఆర్థిక ఆరోగ్య సూచీలు దృఢంగా ఉన్నాయి. బలమైన ఆర్థిక క్రమశిక్షణ, వనరులు సమకూర్చుకోవడంలో సమర్థత కారణంగా ఒడిశాతో పాటు గోవా, జార్ఖండ్, గుజరాత్, మహారాష్ట్రలు టాప్–5 ర్యాంకుల్లో ఉన్నాయి. అదే సమయంలో పెరుగుతున్న అప్పులు, స్థిరమైన లోటు, రెవెన్యూ వృద్ధిలో మందగమనం కారణంగా పంజాబ్, కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు ఆర్థిక ఒత్తిడులను ఎదుర్కొంటున్నాయి. -
ఇక సెగలే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టగా, రెండ్రోజులుగా క్రమంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి రెండోవారం నుంచే ఎండల తీవ్రత నమోదైంది. ఆ తర్వాత వాతావరణంలో నెలకొన్న మార్పులతో ఈ నెల మొదటి వారంలో గరిష్ట ఉష్ణోగ్రతలు వేగంగా పెరిగినా, ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ప్రస్తుతం వేసవి సీజన్ తీవ్రత ప్రారంభమైంది. ఏప్రిల్ మూడో వారంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాల్సి ఉండగా... ఇప్పుడు కొన్నిచోట్ల అంతకు మించి నమోదవుతున్నాయి.శుక్రవారం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదయ్యాయి. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల పరిధిలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. రానున్న ఐదు రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు వేగంగా పెరగనున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రధానంగా ఉత్తరాది జిల్లాలైన ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్,వరంగల్ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 39 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉన్నట్టు సూచించింది.వరుసగా నాలుగు రోజుల పాటు ఉష్ణోగ్రతలు గరిష్టంగా కొనసాగితే వడగాల్పులకు అవకాశం ఉంటుందని, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఈ పరిస్థితి ఉండొచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. శుక్రవారం ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్లో 40.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్లో 18.3 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. రానున్న రెండ్రోజులు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్ట్లు వాతావరణ శాఖ వివరించింది. శుక్రవారం ప్రధాన కేంద్రాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు (సెల్సియస్లో) ................................................... కేంద్రం గరిష్టం కనిష్టం ఆదిలాబాద్ 40.6 23.7 భద్రాచలం 38.4 24.8 దుండిగల్ 38.0 23.5 హకీంపేట్ 37.9 23.6 హనుమకొండ 37.0 22.0 హైదరాబాద్ 38.2 23.8 ఖమ్మం 38.0 21.6 మహబూబ్నగర్ 39.4 24.6 మెదక్ 38.6 18.3 నల్లగొండ 36.0 21.0 నిజామాబాద్ 39.6 25.3 రామగుండం 37.8 22.6 -
రైతుకు ప్రత్యామ్నాయ భూమి రాజ్యాంగ హక్కు
సాక్షి, హైదరాబాద్: ప్రాజెక్టుల కింద భూమి కోల్పోయిన రైతులకు ప్రత్యామ్నాయ భూమి కేటాయించడం రాజ్యాంగ హక్కు అని హైకోర్టు నొక్కి చెప్పింది. పరిహారం చెల్లించే విషయంలో సర్కార్ నిర్లక్ష్యాన్ని తప్పుబట్టింది. బాధితురాలైన ఓ వృద్ధ మహిళను పదేళ్లపాటు కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారుల వాదనలు స్వార్థపూరితంగా ఉన్నాయని, విశ్వసనీయత ఎంతమాత్రం లేదని స్పష్టం చేసింది. ఆస్తి హక్కు చట్టబద్ధమైందని, ఆర్టీకల్ 300ఏ ప్రకారం రాజ్యాంగ హక్కని పేర్కొంది.తప్పనిసరి పునరావాస ప్రయోజనం కోసం పిటిషనర్ను ఇరవై ఏళ్లు వేచి ఉండేలా చేయడం రాజ్యాంగ విరుద్ధమని.. ఇది సర్కార్ తన బాధ్యతను విస్మరించడమేనంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇన్నేళ్లు పిటిషనర్ పడిన మానసిక వేదన, బాధకు ఎవరు మూల్యం చెల్లిస్తారని ప్రశ్నించింది. ప్రత్యామ్నాయ భూమిని కేటాయించి, భౌతికంగా అందజేయకుంటే అది రైతు జీవనోపాధిని దెబ్బతీసినట్లేనని తేల్చి చెప్పింది. మహిళా రైతుకు రెండెకరాల భూమికి బదులుగా ప్రత్యామ్నాయ భూమిని కేటాయించాలని, డాక్యుమెంటేషన్ పూర్తి చేసి భూమిని భౌతికంగా అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇరవై ఏళ్లుగా భూమి కోల్పోవడం ద్వారా నష్టపోయిన వ్యవసాయ ఆదాయానికి పరిహారంగా రూ.10 లక్షలు, కోర్టు ఖర్చుల నిమిత్తం మరో రూ.25 వేలు చెల్లించాలని తీర్పునిచ్చింది. ఇరవై ఏళ్ల క్రితం ఇల్లు, పొలం కోల్పోయి.. ప్రస్తుతం నిజామాబాద్లో నివసిస్తున్న దంతకళ చిన్నక్క.. శ్రీరాంసాగర్ నిర్మాణ సమయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండలం కుస్తాపూర్ గ్రామంలోని తన ఇల్లు, పొలాన్ని కోల్పోయారు. 2006లో ప్రభుత్వం సమీప గ్రామంలో ప్రత్యామ్నాయ భూమి కేటాయించి పట్టా జారీ చేసినా భౌతికంగా స్వా«దీనం చేయలేదు. భూమి కోసం చిన్నక్క అధికారుల చుట్టూ పదేళ్ల పాటు తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో విధిలేక 2016లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై జస్టిస్ అనిల్కుమార్ జూకంటి ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది.ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుబట్టారు. పునరావాస, పునఃస్థాపన పథకం కింద భూమి అప్పగింత ప్రయత్నాలు సాగుతున్నాయని, అంతర్గత కార్యాలయాల నుంచి సమాచార జాప్యం కారణంగా అప్పగింత ఆలస్యమవుతోందన్న జీపీ వాదనలను తిరస్కరించారు. అధికారుల ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం, నిరుపేద మహిళా రైతు ఏం చేయలేరన్న వైఖరిని పరిగణనలోకి తీసుకున్న తర్వాత రాజ్యాంగంలోని ఆర్టీకల్ 226 కింద తమ అసాధారణ అధికార పరిధిని వినియోగించుకోవడానికి ఇది సముచితమైన కేసు అని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. సర్కారు తీరు దిగ్భ్రాంతికి గురి చేసింది: న్యాయమూర్తి రైతుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం సహించరానిదని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు. అధికారుల నిర్లక్ష్య వైఖరి తీవ్ర ఆక్షేపణీయమన్నారు. సర్కారు తీరు న్యాయస్థానాన్ని ది్రగ్బాంతికి గురి చేసిందని చెప్పారు. అధికారంతో పౌరులను వారి జీవనోపాధి నుంచి దూరం చేయలేరని చెప్పారు. ఉత్తర్వుల కాపీ అందిన నాటి నుంచి నాలుగు నెలల్లో ప్రత్యామ్నాయ సాగు భూమిని భౌతికంగా అందజేయాలని సూచించారు. హద్దులు నిర్ణయించి, పట్టాదారు పాస్బుక్, హక్కు పత్రాన్ని అందివ్వాలని ఆదేశించారు. ఏటా రెండెకరాలకు రూ.50 వేలు చొప్పున 20 ఏళ్లకు రూ.10 లక్షల నష్టపరిహారం 16 వారాల లోగా చెల్లించాలంటూ తీర్పునిచ్చారు. -
కొత్త కోర్సుల జోష్..
సాక్షి, హైదరాబాద్: అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో కొత్త జోష్ క న్పిస్తోంది. బీటెక్తో సమానంగా తీసుకొస్తున్న ఎమర్జింగ్ కోర్సులపై ఆసక్తి పెరుగుతోంది. ఈ మేరకు కొత్త కోర్సులు మొదలు పెట్టేందుకు కాలేజీలు కూడా ముందుకొస్తున్నాయి. 2026–27 విద్యా సంవత్సరంలో వీటిని ప్రవేశ పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని కాలేజీలు చెబుతున్నాయి. అనుమతి కోరుతూ ఉన్నత విద్యా మండలికి దరఖాస్తు చేసుకున్నాయి. ఇప్పటివరకూ యూజీ కాలేజీల నుంచి 200, పీజీ కాలేజీల నుంచి 73 దరఖాస్తులు అందాయి.అత్యధికంగా బీఎస్సీ అండ్ మెషీన్ లెర్నింగ్ (ఏఐఎంఎల్), బీఎస్సీ సైబర్ సెక్యూరిటీ కోర్సుల వైపు కాలేజీలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. తర్వాత స్థానంలో బీకాం డిజిటల్ మార్కెటింగ్ కోర్సుపై ఆసక్తి కనబరుస్తున్నాయి. ఆయా కాలేజీల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలోనివే ఎక్కువగా ఉన్నాయి. ఉపాధే లక్ష్యం యూజీ, పీజీ తర్వాత తక్షణ ఉపాధిని యువత ఆశిస్తోంది. అయితే సంప్రదాయ డిగ్రీ కోర్సులు ఈ అవకాశం కల్పించలేకపోతున్నాయి. దీంతో ఇంజనీరింగ్ విద్య వైపు వెళ్తున్నారు. అక్కడా నైపుణ్యం కొరత అడ్డంకిగా మారుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని డిగ్రీ, పీజీ కోర్సుల్లో నైపుణ్యం, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కోర్సులను రూపొందించారు.ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డిఫెన్స్ సెక్యూరిటీ సర్విసెస్, ల్యాండ్ అగ్రికల్చరల్ రూరల్ డెవలప్మెంట్, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ ఫైనాన్స్ అండ్ అక్కౌంట్స్, ఏవిమేషన్ మేనేజ్మెంట్, మెరైన్ టెక్నాలజీ, లాజిస్టిక్స్, హెల్త్ కేర్ మేనేజ్మెంట్తో పాటు పలు కోర్సులను డిజైన్ చేశారు. బోధన ప్రణాళికను కూడా ఇదే తరహాలో రూపొందించారు. మారుతున్న సాంకేతికత సృష్టిస్తున్న ఉపాధి అవకాశాలకు ఈ కోర్సులు మేలు చేస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫ్యాకల్టీ మాటేంటి? అనుమతులు మంజూరు చేసే విషయంలో ఆచితూచి అడుగేయాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యికి పైగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో 4.6 లక్షల సీట్లున్నాయి. అయితే ఏటా 2.2 లక్షల సీట్లు మాత్రమే భర్తీ అవుతున్నాయి. ఇందులో కూడా బీకాం, బీఎస్సీ లైఫ్సైన్సెస్ వంటి కోర్సుల్లోనే అడ్మిషన్లు ఉంటున్నాయి. దీంతో ఈ ఏడాది అకడమిక్ ఆడిట్ చేపట్టాలని, విద్యార్థులు చేరని కోర్సులు, కాలేజీల్లో సీట్లు తగ్గించాలని మండలి భావించింది.అయితే అనూహ్యంగా కాలేజీలు కొత్త కోర్సుల వైపు వెళ్తున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా..ఎమర్జింగ్ కోర్సులు బోధించే అధ్యాపకులను ఎక్కడి నుంచి తీసుకుంటారనే దానిపై కాలేజీలు స్పష్టత ఇవ్వడం లేదు. సంప్రదాయ డిగ్రీ కోర్సులు బోధించే వారికి ఇది సాధ్యం కాదనే అభిప్రాయం ఉంది. దీంతో ఐటీ, ఇతర రంగాల్లో నిష్ణాతులైన వారిని ఆన్లైన్ ద్వారా బోధించే ఏర్పాటు చేయాలని కాలేజీలకు మండలి సూచిస్తోంది. అన్నీ పరిశీలించి అనుమతులిస్తాం.. ఏఐ సాంకేతికతతో కూడిన కొత్త కోర్సుల ప్రతిపాదనకు మంచి స్పందన వస్తోంది. కాలేజీలు వీటిని ప్రవేశ పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. బోధన సిబ్బంది, ఇతర అంశాలు పరిశీలించిన తర్వాత అనుమతులు ఇస్తాం. – ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి (ఉన్నత విద్యా మండలి చైర్మన్) -
కల్యాణ వైభోగమే..
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో శ్రీసీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దంపతులు జానకీరాములకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ వేడుకను ప్రత్యక్షంగా చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు భద్రాచలం తరలివచ్చారు. మధ్యాహ్నం 12 గంటలకు.. శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో మిథిలా స్టేడియానికి సీతారాములను తీసుకువచ్చారు. ఆ తర్వాత వేదస్వస్తితో వివాహ వేడుకలు ప్రారంభిస్తూ ముందుగా విశ్వక్సేన పూజ నిర్వహించారు. ఆపై వరుసగా పుణ్యాహవచనం, శ్రీయోద్వాహం, యోక్త్రాబంధనం, అలంకరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటల సమయాన అభిజిత్ లగ్నంలో వధూవరులైన సీతారాముల తలలపై జీలకర్ర, బెల్లం ఉంచారు. 12:11 గంటల సమయంలో మాంగళ్యధారణ జరగగా ఆపై తలంబ్రాల కార్యక్రమం నిర్వహించారు.12–40 గంటల సమయాన హారతి ఇవ్వడంతో కల్యాణ క్రతువు ముగిసింది. సీఎం సతీమణి గీతతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు వాకిటి శ్రీహరి, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్కతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు. మహా సంకల్పం సమయంలో వచ్చిన సీఎం భద్రగిరి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులకు సీఎం రేవంత్రెడ్డి భూమి పూజ నిర్వహించే సమయాన కల్యాణ మండపం వద్ద వరపూజ కార్యక్రమం జరుగుతోంది. అందులో భాగంగా పాద ప్రక్షాళన, మధుపర్కం, నూతన వ్రస్తాల సమర్పణ, ఆభరణాల అలంకరణ చేయాల్సి ఉంది. అయితే మధుపర్కం సమయానికి కూడా సీఎం కల్యాణ మండపం దగ్గరకు రాకపోవడంతో తదుపరి కార్యక్రమమైన మహా సంకల్పాన్ని ఉదయం 11–37 గంటలకు మొదలెట్టారు. కాగా సీఎం 11–41 గంటలకు కల్యాణ మండపం దగ్గరకు చేరుకున్నారు. అనంతరం 11–46 గంటలకు నూతన వ్రస్తాలను సీఎం దంపతులతో పాటు డిప్యూటీ సీఎం, మంత్రులు సమర్పించారు. గోత్రాలు అవే... కల్యాణం సందర్భంగా సీతారాముల గోత్రాల విషయంలో నెలకొన్న వివాదం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై కల్యాణం జరిపించే వైదికులు స్పందించారు. కన్యావరణం సందర్భంగా గోత్రాలు చెప్పే విషయంలో శ్రీరాముడికి నారాయణుడి గోత్రమైన అచ్యుత గోత్రాన్ని, సీతమ్మ వారికి లక్ష్మీదేవి గోత్రమైన సౌభాగ్య గోత్రాన్ని చెప్పారు. రామదాసు కాలం నుంచి ఇవే గోత్రాలు చెబుతున్నారని, ఇకపై కూడా ఇవే గోత్రాలను చదువుతామని, ఇందులో మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. రూ.351 కోట్లతో అభివృద్ధి పనులు ఉదయం 10–45 గంటలకు సారపాకలోని హెలిప్యాడ్కు సీఎం చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా భద్రాచలం ఆలయానికి చేరుకుని దైవదర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత రూ.351 కోట్లతో చేపట్టే ఆలయ విస్తరణ, పునరుద్ధరణ, పుష్కరఘాట్ విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన పనులకు భూమి పూజ నిర్వహించారు. వచ్చే పుష్కరాల నాటికి పనులు పూర్తి చేస్తామని మంత్రి కొండా సురేఖ ఈ సందర్భంగా చెప్పారు. సీఎం రాక సందర్భంగా పోలీసులు ఆంక్షలు విధించడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. నిలువ నీడ, మంచినీటి కోసం అల్లాడిపోయారు. నేడు పట్టాభిషేకానికి గవర్నర్ కల్యాణం ముగిసిన మరుసటి రోజు భద్రాచలంలో శ్రీరాముడికి పట్టాభిషేకం జరిపించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ మేరకు శనివారం జరిగే వేడుకకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్యఅతిథిగా రానున్నారు. ఇందుకోసం మిథిలా స్టేడియంలో దేవాదాయ శాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. -
ఔటర్ లోపలే సిటీ బస్సులు!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సిటీ సర్వీసుల సంఖ్య తగ్గబోతోంది. ప్రస్తుతం హైదరాబాద్ నగరం నుంచి 30 కి.మీ. నుంచి 50 కి.మీ. దూరంలో ఉన్న ప్రాంతాలకు తిరుగుతున్న సిటీ బస్సులను జిల్లా డిపోలకు తరలించాలని ఆర్టీసీ భావిస్తోంది. దీంతో ఆ బస్సులతోపాటు, తదనుగుణ సంఖ్యలో సిబ్బంది కూడా జిల్లాలకు తరలాల్సి ఉంది. సమీప భవిష్యత్లో ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే ఔటర్ రింగురోడ్డు లోపల తిరగనున్న విషయం తెలిసిందే. మరో ఆరు నెలల్లో ఎలక్ట్రిక్ బస్సుల రాక మొదలు కానుంది. అక్కడి నుంచి ఏడాది కాలంలో దాదాపు 2,300 బస్సులు సమకూరుతాయి. అప్పుడు ఇక్కడి డీజిల్ బస్సులను ఔటర్ ఆవలివైపు మాత్రమే తిప్పాల్సి ఉంటుంది. ఎలక్ట్రిక్ బస్సులన్నీ అద్దె ప్రాతిపదికన ప్రైవేట్ సంస్థలు నిర్వహించనున్నందున, వాటిల్లో కండక్టర్లు మినహా మిగతా సిబ్బంది అవసరం ఉండదు. అప్పుడు డిపోల్లోని ఆయా కేటగిరీ సిబ్బంది అంతా జిల్లా డిపోలకు వెళ్లాల్సిందే. దీంతో ఇప్పటి నుంచే ఆ ప్రక్రియకు ఆర్టీసీ సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో కేవలం నగరం, నగర శివారు ప్రాంతాలకు తిరిగే బస్సులను మాత్రమే సిటీ డిపోల్లో ఉంచి, కాస్త దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులను జిల్లాలకు తరలించే కసరత్తు మొదలుపెట్టింది. వ్యయ నియంత్రణ కోసం... గ్రేటర్ నగరం–జిల్లాలు... ఈ రెండు ప్రాంతాల్లో సిబ్బంది వేతనాల్లో తేడా ఉంటుంది. నగరంలో పనిచేసే వారి ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) ఎక్కువగా ఉంటుంది. నగరాల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రత్యేక నగర పరిహార భత్యం (సీసీఏ) ఉంటుంది. అంతమేర జీతాల పద్దు పెరిగి ఆర్టీసీ ఖజానాపై భారం మోపుతోంది. » నగరంలో కి.మీ.కు వేతన భారం రూ.85 ఉంటుండగా, జిల్లాల్లో ఆ మొత్తం రూ.65గా ఉంటుందని గుర్తించారు. » ఇక అదనపు గంటలు పనిచేసినందుకు స్పెషల్ ఆఫ్ తీసుకునే వెసులుబాటు ఉంటుంది. 8 గంటల డ్యూటీ బదులు 12 గంటల నుంచి 15 గంటలపాటు పనిచేయటం ద్వారా ఈ డబుల్ మస్టర్ నమోదవుతుంది. అంటే రెండు రోజులపాటు పనిచేసినట్టుగా భావించి మరుసటి రోజు పూర్తి సెలవు ఇస్తారు. ప్రత్యే క చెల్లింపు ఉంటుంది. ఈ స్పెషల్ ఆఫ్ పొందాలంటే నగరంలో 300–330కి.మీ. మేర అదనంగా బస్సు తిరిగితే చాలు. » జిల్లాల్లో అయితే 500 కి.మీ. అదనంగా బస్సుతో పాటు వెళ్లాల్సి ఉంటుంది. ఉత్పాదకతపై కూడా ప్రభావం ఉంటుంది. ఇలా అదనపు భారాన్ని తగ్గించుకునే క్రమంలో ఇటీవల ఆర్టీసీ అధికారులు మేధోమథనం నిర్వహించి, నగరం నుంచి దూర ప్రాంతాలకు తిరుగుతున్న సర్వీసులను జిల్లాలకు పంపాలన్న ఆలోచనకొచ్చారు. » నగరంలో దాదాపు 400 వరకు బస్సులు ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. అవి నగరం నుంచి 50 కి.మీ. దూరం వరకు తిరుగుతున్నాయి. ఇప్పుడు వాటిని, వాటితోపాటు నిర్ధారిత సంఖ్యలో సిబ్బందిని జిల్లాలకు పంపితే అంతమేర హెచ్ఆర్ఏ, సీసీఏ భారం తగ్గుతుందన్న అంచనాకొచి్చంది. » ఎలక్ట్రిక్ బస్సులు వస్తే ఈ సిబ్బంది జిల్లాలకు వెళ్లాల్సిన వారే అయినందున (కండక్టర్లు మినహా) కాస్త ముందుగా పంపనుంది. త్వరలో దీనికి సంబంధించిన కసరత్తు పూర్తి చేసి ఆ బస్సు ల బదిలీ ప్రక్రియ ప్రారంభం కానుంది. సిబ్బంది కోరుకున్న జిల్లాలకు పంపే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. -
నయవంచకుడిని పట్టుకోండి!
హైదరాబాద్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను లోబరుచుకుని తన వద్ద రూ.30 లక్షలకు పైగా నగదును వాడుకుని మోసంచేసిన విజయనగరం పట్టణానికి చెందిన బొబ్బిలి సాయికిరణ్ను తక్షణమే అరెస్టుచేసి శిక్షించాలని బాధితురాలు ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది. హైదరాబాద్ ప్రెస్క్లబ్లో శుక్రవా రం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం తాను ఉద్యోగం నిమిత్తం చెన్నై వెళ్లగా అక్కడ సాయికిరణ్ పరిచయమయ్యాడని చెప్పింది. తనకు పెళ్లయి ఒక కూతురు ఉందని, భర్తతో వేరుగా ఉంటున్నానని చెప్పినా తనతో సన్నిహితంగా ఉంటూ పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా తనను లోబరుచుకున్నాడని ఆరోపించింది. రెండేళ్లు మణికొండలో లివింగ్ రిలేషన్షిప్లో ఉండి తన నుంచి రూ.30 లక్షలకు పైగా తీసుకున్నాడని బాధితురాలు తెలిపింది. ఆరు నెలల క్రితం మరో మహిళ పరిచయం కావడంతో తనను నిర్లక్ష్యం చేస్తూ వచ్చాడని, దీంతో తాను ప్రశ్నించగా తనపై దాడులు చేస్తూ చంపేస్తానని బెదిరించాడని ఆమె వాపోయింది. ఈ విషయమై తాను నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపింది. అనంతరం.. విజయనగరం వెళ్లి సాయి కుటుంబ సభ్యులతో విష యం చెప్పేందుకు ప్రయత్నించగా అక్కడ సాయి తండ్రి బొబ్బిలి ముత్యాలనాయుడు టీడీపీ ఎంపీపీకి ప్రధాన అనుచరుడని తెలిసిందని, అక్కడి టీడీపీ కార్యకర్తలు తానున్న హోటల్కు వచ్చి సాయికిరణ్పై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని బెదిరించారని బాధి తురాలి వాపోయింది. నార్సింగ్ సీఐ హరికిషన్ నిందితుడికి వత్తాసు పలుకుతూ తనను అవమానించారని ఆమె ఆవేదన వ్యక్తంచేసింది. -
రాష్ట్రంలో 5% నిరుద్యోగిత
సాక్షి, హైదరాబాద్: దేశంలో నిరుద్యోగిత రేటు తగ్గుతోంది. కోవిడ్–19తో పెద్ద ఎత్తున పెరిగిన నిరుద్యోగిత క్రమంగా గాడిన పడుతోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడుతుండడంతో ఏయేటికి ఆ ఏడు నిరుద్యోగిత రేటు కూడా తగ్గుతూ వచ్చింది. ఈ మేరకు కేంద్ర అర్ధ గణాంకాల శాఖ ‘పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే–2025’పేరుతో శుక్రవారం నివేదికను విడుదల చేసింది. తెలంగాణలో నిరుద్యోగిత 5 శాతం ఉన్నట్లు ఈ సర్వే గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతంలో 3.9 శాతం ఉండగా.. పట్టణ ప్రాంతంలో 6.8 శాతం, మొత్తంగా జాతీయ స్థాయి కంటే ఎక్కువగా 5.0 శాతం ఉంది. అదే జాతీయ స్థాయిలో నిరుద్యోగం గ్రామీణ ప్రాంతంలో 2.4 శాతం, పట్టణ ప్రాంతంలో 4.8 శాతంగా ఉంది. మొత్తం మీద 3.1 శాతం మాత్రమే ఉండటం గమనార్హం. దేశంలో గత నాలుగేళ్లలో నిరుద్యోగిత శాతం గ్రామీణ ప్రాంతాల్లో 0.8 శాతం తగ్గగా, పట్టణ ప్రాంతంలో 1.1 శాతం తగ్గింది. 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు దేశ వ్యాప్తంగా సర్వే నిర్వహించిన ఈ శాఖ జాతీయ గణాంకాలతో పాటు రాష్ట్రాల్లో పరిస్థితిని విశ్లేషిస్తూ వివరాలు వెల్లడించింది. 2022లో కోవిడ్–19 ప్రభావంతో నిరుద్యోగం భారీగా పెరిగింది. గ్రామీణ ప్రాంతంలో అప్పట్లో 2.8 శాతం నిరుద్యోగం ఉండగా.. క్రమంగా తగ్గుతూ 2.4 శాతానికి తగ్గింది. పట్టణ ప్రాంతంలో 5.9 శాతంగా ఉన్న నిరుద్యోగం 4.8కు తగ్గింది. మహిళల వేతనాల్లో వృద్ధి రాష్ట్రంలో ఉద్యోగం, చదువు, శిక్షణ లేని వారి శాతం భారీగానే ఉంది. 15–24 ఏళ్ల యువతలో ఇలాంటి వారు 21.1శాతం ఉండగా, 15–29 ఏళ్ల వయసున్న వారిలో 26.2 శాతం, 30–59 ఏళ్ల మధ్య వారిలో 20.6 శాతం ఉన్నారు. 15 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసున్న వారు 22.6 శాతం ఉన్నారు. 15 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసున్న వారిని కూడా పరిగణనలోకి తీసుకుంటే జాతీయ సగటు నిరుద్యోగిత 3.4 శాతం ఉండగా, రాష్ట్రంలో 5.3 శాతంగా ఉంది. » మహిళల వేతనాల్లో వృద్ధి వేగంగా ఉంది. స్వయం ఉపాధిలో 8.8% పెరుగుదల నమోదు కాగా, రెగ్యులర్ ఉద్యోగాల్లో 7.2% , కూలి పనుల్లో 5.4% పెరుగుదల నమోదైంది. పురుషులతో పోలిస్తే మహిళల ఆదాయం ఇంకా తక్కువగానే ఉన్నప్పటికీ, వృద్ధి రేటు ఎక్కువగా ఉండటం సానుకూల పరిణామంగా భావిస్తున్నారు. » గ్రామీణ ప్రాంతాల్లో పురుషుల ఉపాధి 80.5%గా ఉండగా, మహిళల ఉపాధి 45.9%గా ఉంది. పురుషులకు విద్య, నైపుణ్యంతో ఉపాధి అవకాశాలు పెరుగుతుండగా... మహిళల్లో 44.4% మంది గృహ బాధ్యతలు, పిల్లల సంరక్షణ వల్ల ఉద్యోగాల్లోకి రాలేకపోతున్నారు. 2025లో దేశంలో 61.6 కోట్ల మంది ఉద్యోగాల్లో ఉన్నారని అంచనా కాగా.. ఇందులో 41.6 కోట్ల మంది పురుషులు, 20 కోట్ల మంది మహిళలు ఉన్నారు. దేశంలో కేవలం 4.2% మందికి మాత్రమే వృత్తి శిక్షణ లభించింది. యువతలో ఇది 5% మాత్రమే. -
హైదరాబాద్లో భారీ వర్షం
సాక్షి హైదరాబాద్: నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. నిజాంపేట్, కేపీహెచ్బీ, కూకట్పల్లి, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఉప్పల్, బోడుప్పల్, నాచారం, చిల్కానగర్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడ్డాయి. ఎండాకాలం కావడంతో మధ్యాహ్నం వేళ సూర్యుని వేడిమికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు రాత్రివేళ ఈ జల్లులు కొద్దిమేర ఉపశమనం కలిగించాయి. అయితే రాత్రి పదిగంటల ప్రాంతంలో వర్షం కురవడంతో ట్రాఫిక్కు ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. -
352 కిలోల కుళ్లిన చికెన్.. పట్టుకోకపోతే ఆదివారం తినేసేవాళ్లం!
హైదరాబాద్: నగరంలో మరోసారి భారీ ఎత్తున కుళ్లిన చికెన్ లభ్యమైంది. ప్రజారోగ్యానికి హాని కలిగించే విధంగా నిల్వ ఉంచిన కుళ్లిన చికెన్ను స్థానిక విక్రేతలకు సరఫరా చేస్తున్న ఒక వ్యక్తిని హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ (H-FAST) బృందం అరెస్ట్ చేసింది. ఈ ఆపరేషన్కు సంబంధించిన వివరాలను హైదరాబాద్ సిటీ కమిషనర్ టాస్క్ ఫోర్స్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ వెల్లడించారు.విశ్వసనీయ సమాచారం మేరకు హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ కె.నాగార్జునతో కలిసి మూసాపేట సమీపంలోని భరత్ నగర్, జింకలవాడ వద్ద ఉన్న 'మెసర్స్ ఎస్.పి.ఆర్ (SPR) చికెన్' ప్రాంగణంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో నిల్వ ఉంచిన కుళ్లిన చికెన్ను గుర్తించారు. దీనిని స్థానిక హోటళ్లు, విక్రేతలకు సరఫరా చేస్తున్నట్లు నిర్ధారణ అయింది.సూరజ్ పాల్ (66) అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడు కూకట్పల్లిలోని రాజీవ్ గాంధీ నగర్లో ఉంటాడు. అతడి షాపు నుంచి సుమారు 352 కిలోల కుళ్లిన చికెన్ (రెక్కలు, రొమ్ము భాగం, కాలేయం వంటి భాగాలు)ను స్వాధీనం చేసుకున్నారు. అతడి సంస్థకు సంబంధించిన ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ గడువు ముగిసింది. స్వాధీనం చేసుకున్న మాంసాన్ని, నిందితుడిని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం సనత్ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వోకు హెచ్-ఫాస్ట్ బృందం అప్పగించింది. -
TG: రేపు శాసనసభలో ప్రశ్నోత్తరాలు రద్దు
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రేపు(శనివారం, మార్చి 28వ తేదీ ) జరగాల్సిన ప్రశ్నోత్తర సమయాన్ని రద్దు చేసినట్లు శాసనసభ కార్యదర్శి రెండ్ల తిరుపతి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు శాసనసభ స్పీకర్ ప్రశ్రోత్తర సమయాన్ని రద్దు చేసిన విషయాన్ని ఎమ్మెల్యేలకు తెలియజేమన్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. సభ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది, కానీ ప్రశ్నోత్తరాలు జరగవు. ఈ నిర్ణయాన్ని బీఏసీలో సమావేశంలో తీసుకున్నారు. -
కరీంనగర్: ఆర్బీఎల్లో భారీ స్కాం
కరీంనగర్: కరీంనగర్ ఆర్బీఎల్ బ్యాంకులో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సుమారు రూ. 130 కోట్ల కుంభకోణం జరిగినట్లు సమాచారం. నకిలీ ఖాతాలు తెరిచి, మ్యూల్ ఖాతాలో డబ్బులు మళ్లింపు జరిగినట్లు తెలుస్తోంది. సైబర్ క్రైమ్, హవాలా జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కుంభకోణం ఘటనకు సంబంధించి పదిమంది అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులోకి తీసుకున్న వారిలో ఆర్బీఎల్ కిసాన్ నగర్ బ్రాంచ్ మేనేజర్తో పాటు ఇతర ఉద్యోగులు, కొందరు మధ్యవర్తులు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులపై రాజకీయ నేతల నుంచి ఒత్తిళ్లు వస్తున్నట్లు తెలుస్తోంది. -
హైదరాబాద్లో శ్రీరాముడి శోభాయాత్ర
హైదరాబాద్: నగరంలో శ్రీరాముడి శోభాయాత్ర కొనసాగుతోంది. సీతారాంబాగ్ నుంచి సుల్తాన్బజార్ వరకు శోభాయాత్ర ఉంటుంది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లిస్తున్నారు.శ్రీరామనవమి శోభాయాత్రను పురస్కరించుకుని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సీతారాం బాగ్ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనర్ మీడియాతో మాట్లాడుతూ.. నగరంలో జరుగుతున్న శ్రీరాముడి శోభాయాత్ర ప్రశాంతంగా సాగేందుకు పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని వెల్లడించారు.ఈ యాత్ర ఇవాళ రాత్రి 10 గంటల్లోగా ముగిసేలా పక్కా రూట్ మ్యాప్ సిద్ధం చేశామని తెలిపారు. ఇప్పటికే పలు శాఖల అధికారులతో కలిసి యాత్ర సాగే మార్గాలను క్షుణ్ణంగా పరిశీలించామని, ఎక్కడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా డ్రోన్లు, సీసీ టీవీ కెమెరాల ద్వారా నిరంతరం నిశితంగా పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు.ఈ భారీ శోభాయాత్ర కోసం దాదాపు 3,000 మంది సిబ్బందితో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసినట్లు వివరించారు. అంతకుముందు తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్.. శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
భార్య స్నానం చేస్తుండగా.. వీడియో తీసిన భర్త స్నేహితుడు!
జగిత్యాలజోన్: ఓ వివాహిత తన ఇంట్లో స్నానం చేస్తుండగా.. చాటుగా ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెడతానంటూ బ్లాక్మెయిలింగ్ చేసి.. ఆమెను శారీరకంగా లోబర్చుకున్న కేసులో నిందితుడికి పదేళ్ల జైలుశిక్షతో పాటు రూ.6,600 జరిమానా విధిస్తూ జగిత్యాల మొదటి అదనపు జిల్లా జడ్జి సుగళి నారాయణ గురువారం తీర్పు చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ బిట్ల నర్సయ్య కథనం ప్రకారం.. గొల్లపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళను మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. దంపతులకు ఇద్దరు పిల్లలు. తన భర్తకు స్నేహితుడైన అదే మండలం నర్సాపూర్కు చెందిన నరేండ్ల మహేందర్ అప్పుడప్పుడు సదరు మహిళ ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. మహేందర్ ఓ రోజు ఇంటికి వచ్చిన సమయంలో మహిళ స్నానం చేస్తోంది. ఆ దృశ్యాలను సెల్ఫోన్లో వీడియా తీసి.. ఆమె భర్తకు ఆమె గురించి చెడుగా చెప్పాడు. ఫలితంగా భార్యాభర్తల మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో మహిళ పుట్టింటికి చేరింది. దీంతో మహేందర్ తన ఫోన్లో ఉన్న మహిళ వీడియోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించి శారీరకంగా లొంగదీసుకున్నాడు. 2022 ఏప్రిల్ 19న కూడా రాత్రి సమయంలో వచ్చి వీడియోలు తొలగిస్తానని చెప్పి మళ్లీ శారీరకంగా లొంగదీసుకున్నాడు. వీడియోలు తీసేయమంటే, తాను అడిగినప్పుడల్లా కోరిక తీర్చాల్సిందేనని బెదిరించాడు. దీంతో సదరు మహిళ తనకు జరుగుతున్న అన్యాయాన్ని గొల్లపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేయగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అప్పటి ధర్మపురి సీఐ బిల్లా కోటేశ్వర్ కేసును దర్యాప్తు చేశారు. నిందితుడైన మహేందర్ను అరెస్ట్ చేసి..కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు. కోర్టు మానిటరింగ్ అధికారులు ఎం.కిరణ్కుమార్, బి.రాజు, వి.శ్రీధర్ సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టడంతో పరిశీలించిన అనంతరం మహేందర్కు పదేళ్ల జైలుశిక్షతోపాటు రూ.6,600 జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. -
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
సాక్షి, భద్రాచలం: తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామ నవమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయాల్లో సీతారాముల కల్యాణాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు తరలివచ్చారు. భద్రాద్రిలో రాములోరి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణం జరిగింది. కళ్యాణం కనులారా చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.ఎండ తీవ్రత నేపథ్యంలో ప్రధాన రహదారి నుంచి ఆలయ ప్రాంగణం వరకు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. ఉదయం 9:30 గంటల తర్వాత శంకు ,చక్ర, ధనుర్బాణాలను ధరించి సీతతో కూడిన రామయ్య ఉత్సవ విగ్రహాలను ఆలయం నుంచి పల్లకిలో మిథిలా స్టేడియంలోనికి కళ్యాణ మండపానికి తీసుకొచ్చిన అర్చకులు.. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్యహవచనం నిర్వహించారు.అనంతరం కళ్యాణం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన వస్త్రాలను సీతారాములకు ధరింపచేశారు. భక్త రామదాసు చేయించిన చింతాకు పతకం సీతమ్మకు, పచ్చల హారం రామయ్యకు అలంకరణ, లక్ష్మణుడికి రామమాడ ధరింప చేశారు. చైత్ర శుద్ధ నవమి అభిజిత్ లగ్న ముహూర్తం రాగానే సీతారాముల కల్యాణం జరిగింది. సీఎం రేవంత్రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.పులివెందులలో..వైఎస్సార్ జిల్లా: పులివెందులలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని భాకరాపురం, నగరిగుట్ట, వేల్పుల గ్రామంలోని రామాలయాల్లో వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.గొల్లల మామిడాడలోకాకినాడ జిల్లా: పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలోని ప్రసిద్ధి గాంచిన కోదండ రామాలయంలో శ్రీసీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో రాములోరి కళ్యాణం జరిగింది. ఉదయం 10 గంటలకు కళ్యాణ క్రతువు ప్రారంభమైంది. సుదూర ప్రాంతాల నుండి కళ్యాణం చూడడానికి ముందురోజే భక్తులు తరలివచ్చారు. -
Shamirpet: ఖాళీ సిలిండర్... క్యూలోమీటర్
మేడ్చల్ రూరల్/గోల్కొండ: వంటగ్యాస్కు తంటాలు తప్పడంలేదు. మేడ్చల్ జిల్లా శామీర్పేట్లోని ఓ గ్యాస్ ఏజెన్సీ వద్ద గురువారం వినియోగదారులు ఖాళీ సిలిండర్లతో కిలోమీటర్ మేర క్యూ కట్టారు. సుమారు 500 మందికి పైగా రాజీవ్ రహదారి వరకూ బారులు తీరారు. బుకింగ్ చేసి 20 రోజులవుతున్నా సరఫరా చేయడంలేదని ఆరోపించారు. జిల్లా సివిల్ సప్లయ్ అధికారి శ్రీనివాస్రెడ్డి గ్యాస్ ఏజన్సీ కార్యాలయానికి వచ్చి పరిస్థతిని పరిశీలించారు. కొరత లేదని బుకింగ్ చేసుకున్న ప్రతి ఒక్కరికీ సిలిండర్ అందజేస్తామని తెలిపారు. సిలిండర్ల కోసం షేక్పేట్లోని గోదాముల వద్ద ప్రజలు ఎగబడుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. గురువారం షేక్పేట్ నాలా మాధవి గ్యాస్ ఏజెన్సీ వద్ద ఒకరినొకరు తోసుకుంటూ సిలిండర్లు తీసుకెళ్లేందుకు సిద్ధపడగా నియంత్రించి సర్దిచెప్పారు. -
డీజిల్..పెట్రో.. ఇదేమిట్రో!
హైదరాబాద్: అసలే కొరత.. ఆపై అక్రమ విక్రయం కొంత.. పశ్చిమాసియా యుద్ధం, చమురు సంస్థల నిబంధనల వల్ల కొన్ని పెట్రోల్ బంక్లు నో స్టాక్ బోర్డు పెడుతున్నాయంటూ వచి్చన వదంతులకు వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. పెట్రోల్కు కటకట ఏర్పడిందంటూ వచి్చన వాహనదారులతో బంక్లు కిటకిటలాడుతున్నాయి. తెరిచి ఉన్న ఏ బంకు వద్ద చూసినా డీజిల్, పెట్రోల్ కోసం వాహనదారుల బారులే బారులు.. ఈ నేపథ్యంలో కూకట్పల్లి ఆలి్వన్ కాలనీలోని ఓ బంక్ నిర్వాహకులు.. విడిగా బాటిళ్లు, క్యాన్లు పట్టుకొని వచి్చనవారికి కూడా డీజిల్, పెట్రోల్ విక్రయిస్తున్నారు. ఇది చట్టవిరుద్ధం. ప్రమాదకరం కూడా. అధికారులు నిఘా పెట్టి అక్రమ విక్రయాన్ని అడ్డుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. -
సీఎం సార్ యాదికున్నదా!
సాక్షి, హైదరాబాద్: అమర వీరుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన తెలంగాణ స్మారకజ్యోతి వెలవెలబోతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ కట్టడానికి నేడు ఆదరణ కరువైంది. పచ్చటి మొక్కలు ఎండిపోయాయి. రెండేళ్లు దాటినా సందర్శకులకు అనుమతి లభించడం లేదు. అమరుల మ్యూజియంతో పాటు వాయిదాపడిన పనులు ముందుకు సాగడం లేదు. తొలి, మలి దశ ఉద్యమాల్లో అసువులు బాసిన అమరుల త్యాగాలను ఎత్తిపట్టేలా మ్యూజియం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. తెలంగాణ ఉద్యమాలపై రూపొందించిన డాక్యుమెంటరీలను ప్రదర్శించేందుకు ప్రత్యేకమైన హాళ్లను ఏర్పాటు చేశారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ఉద్యమాలపై ఓ గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. కానీ ఈ దిశగా ఒక్క అడుగు ముందుకు పడలేదు. దీంతో ప్రత్యేక తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేసేందుకు ప్రాణాలొడ్డిన అమరుల యాది జాడ మసకబారుతోంది. ప్రపంచంలో అపురూప కళాఖండం.. హుస్సేన్సాగర్ తీరాన లుంబిని పార్కును ఆనుకొని 3.2 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రపంచంలోనే ఒక అపురూపమైన కళాఖండంగా నిలిచింది. ఎలాంటి అతుకులు లేని స్టెయిన్లెస్ స్టీల్తో దీన్ని నిర్మించారు. దుబాయ్లో ఎంతో పేరొందిన ఫ్యూచర్ మ్యూజియానికి వినియోగించిన స్టీల్కు అతుకులు ఉన్నాయి. కానీ ఈ స్మారకానికి మాత్రం ఎలాంటి అతుకులు లేకపోవడం విశేషం. 8,5000 చదరపు అడుగుల విస్తీర్ణంలో సుమారు రూ.131 కోట్లతో గత ప్రభుత్వం దీన్ని నిర్మించింది. భవనంపై ఉన్న స్మారకజ్యోతి వరకు సందర్శకులు వెళ్లేందుకు అవకాశం ఉంది. అక్కడే ఒక రెస్టారెంట్ను ఏర్పాటు చేయాలని భావించారు. ఇక భవనం రెండంతస్తుల్లో.. తెలంగాణ అమరవీరుల త్యాగాలను, వీరోచిత పోరాట గాథలను స్మరించుకొనేలా గ్రౌండ్ఫ్లోర్లో చిత్రపటాలు, చారిత్రక చిహ్నాలను ఏర్పాటు చేయాలని భావించారు. ప్రేక్షకులు వీక్షించేందుకు లేదా విని తెలుసుకొనేందుకు వీలుగా ఆడియో, వీడియో హాళ్లు, గ్యాలరీలను కూడా గ్రౌండ్ఫ్లోర్లోనే ఏర్పాటు చేయాల్సి ఉంది. పచ్చదనానికి రక్షణేది? మ్యూజియంలో అక్కడక్కడా కియోస్్కలు, టచ్ స్క్రీన్లు ఏర్పాటు చేసి వాటిద్వారా కూడా ఉద్యమ చరిత్ర, విశేషాలను భావి తరాలకు తెలియజేయాలని ప్రతిపాదించారు. పైఅంతస్తులో కనీసం 600 మంది కూర్చొనేందుకు వీలైన కన్వెన్షన్ హాల్ కూడా ఉంది. సాహిత్య సభలు, సమావేశాలు నిర్వహించేందుకు అనువైన హాల్ ఇది. ఆర్ట్ గ్యాలరీలను కూడా ఏర్పాటు చేయవచ్చు. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. దీంతో స్మారకజ్యోతి అలంకారప్రాయంగానే ఉండిపోయింది. నిర్వహణ లేక పరిసరాలు పూర్తిగా కళ తప్పాయి. మొక్కలు అడ్డదిడ్డంగా పెరిగాయి. ఎంతో పవిత్రంగా ఉండాల్సిన ప్రాంగణం అడవిని తలపిస్తుండగా.. పచ్చదనానికి రక్షణ లేకుండాపోయింది. ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని అమరవీరుల స్మారకాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి సందర్శకులకు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. -
భద్రాచలంలో కనుల పండువగా శ్రీసీతారాముల ఎదుర్కోలు ఉత్సాహం (ఫొటోలు)
-
బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలి
సాక్షి, హైదరాబాద్: బీసీలకు సబ్ ప్లాన్ అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గురువారం గన్పార్కులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో.. పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని, బీసీలకు ఆత్మ గౌరవ భవనాలు నిర్మించాలని, బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంటు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గన్పార్కు నుంచి అసెంబ్లీ వరకు ర్యాలీగా చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభ ప్రధాన ద్వారం వద్ద ప్లకార్డులు చూపుతూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా శాసనసభలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. వెనుకబడిన తరగతుల సంక్షేమానికి ప్రతీ వార్షిక బడ్జెట్లో రూ.20 వేల కోట్లు ఖర్చు పెడతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీలను మోసగించారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బీసీలు సమాధి చేయడం ఖాయమని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. -
ప్రాణాలైనా తీసుకోండి.. భూములివ్వం
పరిగి: ప్రాణాలైనా ఇస్తాం కానీ పరిశ్రమల ఏర్పాటుకు భూములు ఇచ్చేది లేదని వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాళ్లాపూర్ రైతులు నినదించారు. ఈ మేరకు గురువారం పరిగి బస్టాండ్ ఎదుట బీజాపూర్ జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. మండలంలోని కాళ్లాపూర్, రాపోల్ గ్రామాల్లో 1,197 ఎకరాల భూమిలో ఇండ్రస్టియల్ పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 260 ఎకరాల పట్టా భూమి, 937 ఎకరాల లావాణి పట్టా భూములు ఉన్నాయి. దీన్ని వ్యతిరేకిస్తూ ఇరు గ్రామాల రైతులు నాలుగు రోజులుగా రిలే నిరాహార దీక్షలతో నిరసన తెలుపుతున్నారు.ఇందులో భాగంగా ప్రజా సంఘాల నాయకులు, వివిధ పార్టీల మద్దతుతో కొడంగల్ చౌరస్తా నుంచి పరిగి బస్టాండ్ ర్యాలీ తీశారు. తమ జీవనాధారమైన భూములను లాక్కోవద్దని కోరారు. సీఎం, ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాము శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామని, తమకు సహకరించాలని పోలీసులను పలువురు రైతుల వేడుకున్నారు. రైతుల మాటలేవీ పట్టించుకోని పోలీసులు నిరసనకారులపై బలప్రదర్శన చేశారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రోడ్డుపై నిరసన చేపట్టడంతో ట్రాఫిక్ జామ్ అవుతోందని, వెంటనే విరమించాలని సూచించగా, రైతులు కొంత సమయం ఇవ్వాలని కోరారు.ఇందుకు అంగీకరించని పోలీసులు కాళ్లాపూర్ సర్పంచ్ పల్లయ్యతో పాటు, రైతులను బలవంతంగా వాహనాల్లో ఎక్కించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న పెనుగులాటలో పలువురు రైతులు, సర్పంచ్కు గాయాలయ్యాయి. ఈ క్రమంలో వాహనాలను పీఎస్కు తరలిస్తుండగా మహిళా రైతులు అడ్డుపడ్డారు. తాము తహసీల్దార్కు వినతిపత్రం అందజేసి, ధర్నా ఆపేస్తామని చెప్పడంతో పోలీసులు శాంతించారు. అనంతరం నాయకులు, రైతులు వెళ్లి తహసీల్దార్ వెంకటేశ్వరికి వినతిపత్రం ఇచ్చారు. ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి వెంటనే భూ సేకరణను ఆపాలని, లేదంటే నిరసనలు మరింత ఉద్రితం చేస్తామని రైతులు హెచ్చరించారు. -
కూల్చివేతల కేసులో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్లలో భూదాన్ భూముల్లో ఇళ్ల కూల్చివేతలో ఇప్పుడు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్లలో కొందరికి పట్టాలు మంజూరు చేయడంతోపాటు మరికొందరి దరఖాస్తులు పరిశీలిస్తున్నామని ప్రభుత్వం చెబుతోందని, ఈ దశలో ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. మధ్యంతర ఉత్తర్వులతో అర్హులకు అన్యా యం జరిగే అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. తదుపరి విచారణను వచ్చే నెల 15కు వాయిదా వేసింది.భూదాన్ భూముల్లో నిర్మించుకున్న ఇళ్ల కూల్చివేతలను సవాల్ చేస్తూ ఖానాపురానికి చెందిన తాళ్లూరి వెంకట నరసమ్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆమెతోపాటు మొత్తం 24 మంది కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నెల 24న ఉదయాన్నే చట్టవిరుద్ధంగా అధికారులు చేపట్టిన కూల్చివేతలు 2014లో హైకోర్టు ఇచి్చన ఉత్తర్వులకు విరుద్ధమన్నారు. బాధితులందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వకుండా.. కొందరికే ఇవ్వడం సరికాదన్నారు. అందరికీ ఇళ్లు నిర్మించి ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.ఈ పిటిషన్పై జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి బుధవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది టి.శ్రీకాంత్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. చట్టవిరుద్ధంగా ఇళ్లను కూల్చివేయడం చెల్లదన్నారు. ప్రభుత్వం తరఫున న్యాయవాది కాట్రం మురళీధర్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లలోని ఆరుగురికి పట్టా లు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. సొంతిళ్లున్న అయిదుగురి విజ్ఞప్తిని తిరస్కరించామని, మిగిలినవారి దరఖాస్తుల పరిశీలన చేస్తున్నామని వివరించారు. కూల్చివేతల తర్వాత 311 పట్టాలు, 101 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి.. మధ్యంతర ఉత్తర్వులకు నిరాకరిస్తూ, విచారణను వాయిదా వేశారు. -
సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ల పనివేళలు పెంపు
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న వేళ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పనివేళలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 28, 30, 31 తేదీల్లో ఈ పనివేళలను పెంచుతూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణ రోజుల్లో ఉదయం 10.30 గంటల నుంచి 5.30 గంటల వరకు సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేస్తున్నాయి.తాజా ఉత్తర్వుల ప్రకారం ఈనెల 28, 30, 31 తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేయాల్సి ఉంటుంది. ఈ మేరకు రాష్ట్రంలోని అందరు సబ్రిజిస్ట్రార్లు ఎలాంటి సెలవులు తీసుకోకుండా విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ పనివేళల పెంపుతో రోజుకు 88 ఆన్లైన్ స్లాట్లు అందుబాటులోకి రానున్నట్టు స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖ వర్గాలు వెల్లడించాయి. -
ప్రతి చిన్నారికి విద్య, పోషకాహారం
సాక్షి, హైదరాబాద్: ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, పోషకాహారం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారం పెట్టేందుకు బడ్జెట్లో కేటాయింపులు చేశామని చెప్పారు. ప్రముఖ ఆర్థికవేత్త కార్తీక్ మురళీధరన్ గురువారం సీఎంను కలిశారు. రాష్ట్రంలో 0–10 ఏళ్లలోపు పిల్లల్లో పోషకాహారం లోపం.. విద్యాభ్యాసన స్థాయి సామర్థ్యలోపాలకు సంబంధించి పలు నివేదికలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. చిన్న వయస్సులో పోషకాహారం లోపంతో భవిష్యత్లో తలెత్తే ఆరోగ్య సమస్యలు, ప్రాథమిక స్థాయిలో సరైన బోధన లభించకపోతే విద్యార్థి భావి జీవితంలో పడే మానసిక వేదన వివరించారు.వాటిని అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. అయితే ఆయా అంశాలపై తాము ఇప్పటికే ప్రత్యేక శ్రద్ధ పెట్టామని సీఎం చెప్పారు. మురళీధరన్తో సమన్వయం చేసుకుని ఆయా అంశాలపై ప్రత్యేక నివేదిక రూపొందించి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, సీఎస్ కె.రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి, కార్యదర్శి మాణిక్ రాజ్, ప్రత్యేక కార్యదర్శి అజిత్రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా, మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, సెర్ప్ సీఈవో దివ్య తదితరులు పాల్గొన్నారు. -
అంగన్వాడీలను ఒంటిపూట నిర్వహించాలి
సాక్షి, హైదరాబాద్: వేసవి ఉష్ణోగ్రతల నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాలకు ఒంటి పూట నిర్వహణ ఉత్తర్వులు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్లా భారతి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.ఈమేరకు గురువారం ప్రజా భవన్లో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖా మంత్రి సీతక్కను కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం డైరెక్టరేట్లోనూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో ఐదేళ్లలోపు పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య అందిస్తున్నామని, ప్రభుత్వ పాఠశాల మాదిరిగా అంగన్వాడీ కేంద్రాలను కూడా ఒంటిపూట నిర్వహించాలన్నారు. -
ఆ రెండు సమస్యలకు చెక్
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు సాదాబైనామాలకు శాశ్వత పరిష్కారం దిశలో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసింది. భూభారతి చట్టం ద్వారా వీటి పరిష్కారానికి మార్గం లభించినా అనేక అడ్డంకుల కారణంగా మోక్షం కలగడం లేదన్న వాస్తవాన్ని గమనించిన రెవెన్యూ శాఖ రెండు ప్రత్యేక ఉత్తర్వుల జారీ ద్వారా ఈ దరఖాస్తుల పరిష్కారానికి మార్గం సుగమం చేసింది. రాష్ట్ర రెవెన్యూ కార్యదర్శి డీఎస్ లోకేశ్కుమార్ జారీ చేసిన జీవో నం 76, 77ల ప్రకారం.. సాదాబైనామాల పరిష్కారంలో ఎదురవుతున్న రెండు ప్రధాన అడ్డంకులు తొలగిపోగా, దరఖాస్తులను క్లియర్ చేసేందుకు జిల్లా కలెక్టర్లు అవలంబించాల్సిన కార్యాచరణ మార్గదర్శకాలు కూడా త్వరలోనే విడుదల కానున్నాయి. అభ్యంతరాలు రాకపోతే సర్టీఫికెట్ భూభారతి చట్టంలోని సెక్షన్ (6) ప్రకారం సాదాబైనామాలకు చట్టబద్ధత కల్పించే వెసులుబాటు కల్పించినా ఆ తర్వాత రెవెన్యూ శాఖ జారీ చేసిన నిబంధనలు ఇబ్బందులు తెచి్చపెట్టాయి. ముఖ్యంగా ఎప్పుడో కొన్న భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ లావాదేవీ కోసం అప్పట్లో అమ్మిన వ్యక్తి అఫిడవిట్ ఇవ్వాలనే నిబంధన జఠిలమైన సమస్యగా మారింది. ఈ నిబంధనపై సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తం కావడం, రైతులు ఇబ్బందులు పడుతుండడంతో ఆ నిబంధనను ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నం.76 జారీ చేసింది.ఈ జీవో ప్రకారం భూమిని కొనుగోలు చేసి సాదాబైనామా రాయించుకున్న వ్యక్తి అఫిడవిట్ ఇస్తే సరిపోతుంది. అఫిడవిట్తో పాటు ఆ భూమికి సంబంధించిన డాక్యుమెంట్లను ఆర్డీవో పరిశీలిస్తారు. సదరు అఫిడవిట్ సమర్పించిన దరఖాస్తులు 30 రోజుల పాటు పెండింగ్లో పెడతారు. ఈలోపు ఎవరూ అభ్యంతరాలు వ్యక్తం చేయకపోతే అఫిడవిట్తో పాటు డాక్యుమెంట్లను పరిశీలించి సదరు రైతుకు సాదాబైనామా సర్టీఫికెట్ జారీ చేస్తారు. అయితే కొనుగోలు చేసిన వ్యక్తి ఇచ్చే అఫిడవిట్లో తప్పుడుసమాచారం ఉందని ఎప్పుడు తేలినా సదరు సర్టీఫికెట్ రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి దఖలు పడుతుంది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ కోసం రైతు చెల్లించే స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజును వెనక్కు ఇవ్వరు. దీంతో పాటు తప్పుడు సమాచారం ఇచ్చిన రైతులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటారు. ఆ గ్రామాల్లో లైన్ క్లియర్ సాదాబైనామాలకు సంబంధించిన దరఖాస్తులు తీసుకున్న నాటికి గ్రామీణ ప్రాంతం అయి ఉండి ఇప్పుడు మున్సిపాలిటీలో కలిసిపోయినా ఆ దరఖాస్తులను పరిష్కరించేందుకు వీలుగా జీవో నం: 77 జారీ చేశారు. కొత్తగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఏర్పాటయినప్పుడు చాలా గ్రామాలు వాటిలో కలిశాయి. భూభారతి చట్టానికి అనుగుణంగా ఆయా గ్రామాల్లో సాదాబైనామాలు చేయాలా వద్దా అనే దానిపై రెవెన్యూ అధికారులకే స్పష్టత లేకుండా పోయింది.దీంతో ఆ అనుమానాలను నివృత్తి చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మేరకు పట్టణాల్లో కలిసిన గ్రామీణ ప్రాంతాల్లోని సాదాబైనామాల పరిష్కారానికి ఈ జీవో ద్వారా వెసులుబాటు కల్పించారు. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రాంతంలోనైనా సాదాబైనామా సర్టిఫికెట్ జారీ చేసే నాటికి అమల్లో ఉన్న స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక క్షేత్రస్థాయిలో ఈ సాదాబైనామా దరఖాస్తుల ప్రక్రియ పరిష్కారం కోసం అవసరమైన కార్యాచరణ మార్గదర్శకాలను జిల్లాల కలెక్టర్లకు జారీ చేసేలా భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ)కు అనుమతినిస్తున్నట్టు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
మానవ అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డికి ఊరట
సిటీ కోర్టులు: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి భారీ ఊరట లభించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన మానవ అక్రమ రవాణా కేసులో ఎలాంటి నేరాలు రుజువు కాలేదంటూ తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి (ఏ–1), కుసుమ కుమార్ (ఏ–3)లను నిర్దోషులుగా ప్రకటిస్తూ నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు గురువారం తీర్పు ఇచ్చింది. ఈమేరకు వారిపై దాఖలైన కేసును కొట్టివేసింది. వారు నేరానికి పాల్పడినట్లు రుజువు కాకపోవడంతో వారిని నిర్దోషులుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు ఇచి్చంది. అసలు ఏం జరిగింది..? జగ్గారెడ్డి 2004లో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మానవ అక్రమ రవాణాకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. నకిలీ డాక్యుమెంట్లు సమరి్పంచి తన భార్య, కుమార్తె, కుమారుడి పేరుతో పాస్పోర్టులు తీసుకున్నారని.. ఆ తర్వాత అమెరికా వీసా పొంది తన వెంట ఒక మహిళ, యువకుడిని తీసుకెళ్లి తిరిగి ఇండియాకు ఒక్కరే వచ్చారని ఆరోపణలున్నాయి.నకిలీ డాక్యుమెంట్లతో ముగ్గురు వ్యక్తులను దేశం దాటించారని, ఇందులో ఆర్థిక ప్రయోజనం పొందినట్లు జగ్గారెడ్డిపై సికింద్రాబాద్ మార్కెట్ పోలీసులు కేసు నమోదుచేశారు. ఐపీసీ 419, 420, 467, 468, 471, 409, 370, భారత పాస్పోర్ట్ చట్టంలోని సెక్షన్ 12, ఇమ్మిగ్రేషన్ చట్టంలోని సెక్షన్ 24 కింద జగ్గారెడ్డి, కుసుమ కుమార్పై అభియోగాలు నమోదుచేశారు. వారిని 2018లో అరెస్ట్ చేయగా తర్వాత బెయిల్పై బయటికి వచ్చారు. దీనిపై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు విచారణ చేసి తాజాగా తీర్పు ఇచ్చింది. -
నేటినుంచి అంతర్జాతీయ బౌద్ధ మహాసభలు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన గౌతమ బుద్ధుని బోధనలను చాటిచెప్పేందుకు హైదరాబాద్ వేదిక వేదిక కానుంది. తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (టీజీటీడీసీ) అనుబంధ విభాగం ‘బుద్ధవనం’, వియత్నాం బౌద్ధ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ‘ప్రపంచ శాంతి – అంతర్జాతీయ బౌద్ధ మహాసభలు–2026’శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 27 నుంచి 29 వరకు హైదరాబాద్, నాగార్జునసాగర్ వేదికలుగా ఈ సదస్సు నిర్వహించనున్నారు.బేగంపేటలోని టూరిజం ప్లాజాలో శుక్రవారం ఉదయం 10 గంటలకు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, శ్రీలంక బౌద్ధ శాసన, సాంస్కృతిక వ్యవహారాల మంత్రి ప్రొఫెసర్ హినిదుమ సునీల్ సేనవి ముఖ్య అతిథులుగా హాజరై ఈ మహాసభలను ప్రారంభించనున్నారు. ఈ మహాసభలకు అర్జెంటీనా, బెల్జియం, కంబోడియా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, మలేషియా, మయన్మార్, దక్షిణ కొరియా, శ్రీలంక, థాయిలాండ్, వియత్నాం సహా 22 దేశాల నుంచి సుమారు 150 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. బౌద్ధ ధర్మం, విశ్వశాంతి అనే అంశాలపై వారు పరిశోధన పత్రాలను సమర్పించనున్నారు. -
కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనాలు ఇవ్వాలి
కవాడిగూడ: గత 20 ఏళ్లుగా కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాలు, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు నామమాత్రపు వేతనాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రమ దోపిడికి పాల్పడుతున్నాయని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనాలు ఇవ్వాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఇందిరాపార్కు వద్ద తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, కేజీబీవీ, యుఆర్ఎస్ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు, సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఛలో అసెంబ్లీ కార్యక్రమంలో భాగంగా మహాధర్నా చేపట్టారు.ఈ ధర్నాకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మాజీ ఎమ్మెల్సీ ప్రొ.డాక్టర్, కె. నాగేశ్వర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే విధంగా శాసన సభలో తనవంతు పోరాటం చేస్తానని ఆయన తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ ప్రొ.కె.నాగేశ్వర్ మాట్లాడుతూ కేజీబీవీలలో అనాథలు, పాక్షిక అనాథ బాలికలకు నాణ్యమైన విద్యను అందిస్తూ అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారని, వీధి బాలలు పునరావాసానికి అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలు విశేషంగా కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు.విద్యా గణాంకాల సేకరణ, ప్రాథమిక పాఠశాలలకు అకడమిక్ సహకారం అందించడానికి సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు కృషి చేస్తున్నారని, వీరందరికి కనీస వేతనాలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జాతీయ మహిళా ఉపాధ్యాయ నాయకురాలు ఎం.సంయుక్త మాట్లాడుతూ సెలవుల విషయంలో రెగ్యులర్, కాంట్రాక్ట్, వివక్ష చూపడం సమంజసం కాదన్నారు.అనంతరం టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావరవి , ప్రధాన కార్యదర్శి వెంకట్లు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాలు గడిచిపోయినా కేజీబీవీ యుఆర్ఎస్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు రాష్ట్ర కార్యదర్శి బి.మధు, టీఎస్యుటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దుర్గాభవాని, కోశాధికారి టి. లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ కుటుంబాన్ని కొట్టేందుకు... నాపై ఐదు సీబీఐ కేసులు పెట్టారు..
సాక్షి, హైదరాబాద్: ‘నేను కాంగ్రెస్లో ఉన్నన్ని రోజులు పార్టీకి సేవ చేసిన. పార్టీ నాకు మంత్రి పదవి ఇచ్చింది. సోనియా గాందీకి, ఆ రోజు సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి, రోశయ్య, కిరణ్కి .. మొన్న మంత్రిపదవి ఇచ్చిన కేసీఆర్కు థ్యాంక్స్. పార్టీ మంచి చేసిందని చెప్పుకున్నప్పుడు పార్టీ చేసిన నష్టం కూడా చెప్పుకుంటాం. రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని కొట్టడానికి నాపై ఐదు సీబీఐ కేసులు పెట్టలేదా? అసెంబ్లీలో సీఎం రేవంత్ నాపై మాట్లాడే వరకు నేను కాంగ్రెస్ గురించి మాట్లాడలేదు. ఇప్పుడు ఆవేదనతోనే మాట్లాడుతున్న. నిజాయితీగా ఉన్నందుకే కేసులను ధైర్యంగా ఎదుర్కొంటున్నం’అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సభ్యులు పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ బడ్జెట్ పద్దులపై శాసనసభలో గురువారం రాత్రి జరిగిన చర్చలో మంత్రి సీతక్క చేసిన విమర్శలకు స్పందిస్తూ సబిత పైవిధంగా స్పందించారు. ‘ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు మంత్రి సీతక్క మొన్న నా మీద పడ్డారు. ఇప్పుడు సునీతా రెడ్డిపై పడ్డారు. నేను తనకు పోటీ కాదు. తను కాంగ్రెస్లో.. నేను బీఆర్ఎస్లో ఉన్నాం. మొన్న హరీశ్రావు మాట్లాడుతున్నప్పుడు.. నేను అయ్యో అన్నందుకే నన్ను దొరసాని అన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని, సబితమ్మను తిడితే సీఎం సంతోషపడతారేమో’అని సబిత ఘాటుగా విమర్శించారు. బీఆర్ఎస్ వారికి ఇష్టం లేదు: సీతక్క అంతకు ముందు మంత్రి సీతక్క మాట్లాడుతూ.. పల్లెల్లో నీటి సరఫరా జరగడం లేదని అసత్య ఆరోపణలు చేశారంటూ సబితను తప్పుబట్టారు. ‘నాలాంటి వాళ్లు పంచాయతీరాజ్ శాఖను నిర్వహించడం వారికి ఎట్లానూ ఇష్టం లేదు. ఆదివాసీల నుంచి మంత్రి కావడం బీఆర్ఎస్ వారికి ఏమాత్రం ఇష్టం లేదు..’అని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ కేసులు పెట్టిన తర్వాత కూడా సబిత కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే అయ్యారని, ఆ తర్వాత ఆమెను ఓడించడానికి ప్రయత్నించిన వారి పార్టీలో చేరారని విమర్శించారు. సబిత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన విషయాలను బీఆర్ఎస్ వారు విమర్శిస్తున్నప్పుడు ఆమె.. అవును.. అవును అని మద్దతు తెలపడంతోనే ఆవేశం వచ్చి ఆ రోజు ..‘అయ్యో దొరసాని’అన్నానని సీతక్క వివరణ ఇచ్చారు. సబితకు తనపై ద్వేషం ఉండొచ్చని, ఆమె బీఆర్ఎస్లోకి పోవడంతో తనకు మంత్రి పదవి వచి్చందని ఆమె భావిస్తుండవచ్చని సీతక్క పేర్కొన్నారు. ‘ఆమె కేటగిరీ వేరు, నా కేటగిరీ వేరు, ఆమె రాజ్యం వేరు, నా రాజ్యం వేరు. వాళ్లది హైదరాబాద్ సిటీ. వాళ్లు ఉన్నత వర్గాలు. మేము అడవి బిడ్డలం. మాకు ఎక్కడ కూడా వాళ్లతో పోలిక లేదు’అని సబితను ఉద్దేశించి సీతక్క వ్యాఖ్యానించగా, కులం ప్రస్తావన ఎందుకు? అని బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. సబిత స్పందిస్తూ తాము వ్యవస్థలో లోపాలు ఎత్తిచూపుతామని, కులం, మతం చూడమని స్పష్టం చేశారు. -
ఆరోగ్యశ్రీలో కొత్తగా కాంగ్రెస్ చేసిందేమీ లేదు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకంలో కొత్తగా చేసిందేమీ లేదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. ఈ పథకంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రసంగం సభను తప్పుదోవ పట్టించేలా ఉందన్నారు. గురువారం శాసనసభ లాబీలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2014 జూన్ 2వ తేదీన బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చే నాటికి ఆరోగ్యశ్రీ పథకానికి నెలకు రూ.32 కోట్లు ఖర్చు అవుతుండగా, 2023 నాటికి రూ.68 కోట్లకు చేరిందని చెప్పారు.ప్రస్తుతం నెలకు రూ.89 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ప్రభుత్వం చెప్తోందని, దీన్నిబట్టి చూస్తే ఆరోగ్యశ్రీపై చేస్తున్న ఖర్చులో సహజ పెరుగుదల మాత్రమే ఉందని, కొత్తగా ప్రభుత్వం ఖర్చు చేస్తుందేమీ లేదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆసుపత్రులకు బకాయిలు పెరిగాయన్నారు. ఆస్పత్రుల నిర్మాణం, సీఎంఆర్ఎఫ్ విషయంలో వాస్తవాలు వివరించేందుకు తమకు సభలో అనుమతి ఇవ్వడం లేదని హరీశ్రావు అన్నారు. వాయిదా తీర్మానాలు తిరస్కరణ రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో భాగంగా ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన పలు వాయిదా తీర్మానాలను స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ తిరస్కరించారు. వెనుకబడిన తరగతుల సంక్షేమానికి ప్రతి వార్షిక బడ్జెట్లోలో రూ.20 వేల కోట్లు ఖర్చు పెడతామంటూ కాంగ్రెస్ ఇచ్చిన హామీపై చర్చించాలని కోరుతూ బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్యాదవ్ వాయిదా తీర్మానం ఇచ్చారు. రాష్ట్రంలో యువత డ్రగ్స్ బారిన పడటంపై చర్చించాలంటూ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్రావు వాయిదా తీర్మానం ఇచ్చారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్ స్కీమ్, జవహర్లాల్ హౌసింగ్ సొసైటీ తదితర అంశాలపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వా యిదా తీర్మానం ఇచ్చారు. వీటన్నిటినీ స్పీకర్ తిరస్కరించారు. ఈ మేరకు సభలో ప్రకటన చేశారు. -
బఫర్ జోన్ 50 మీటర్లు అయితే 5 కి.మీ.ల పరిధిలో భూసేకరణ ఎందుకు ?
సాక్షి, హైదరాబాద్: మూసీ అభివృద్ధి ప్రాజెక్టు డీపీఆర్ సిద్ధంగా ఉంటే శాసనసభ ముందు ఉంచాలని బీఆర్ఎస్ సభ్యుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. బడ్జెట్ పద్దులపై గురువారం అర్ధరాత్రి శాసనసభలో నిర్వహించిన చర్చలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టు డీపీఆర్ ఉందని మంత్రి శ్రీధర్బాబు పేర్కొనడంపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు వ్యయం రూ.1.5 లక్షల కోట్లు ఉంటుందని సీఎం రేవంత్రెడ్డి గతంలో ప్రకటించగా, తొలి విడత ప్రాజెక్టు వ్యయం రూ.6–7వేల కోట్లుగా మంత్రి శ్రీధర్బాబు ఎలా పేర్కొంటారని ప్రశ్నించారు. ప్రాజెక్టు వ్యయం రూ.లక్షన్నర కోట్లు అని సీఎం నాలుగుసార్లు ప్రకటించారని, మంత్రి శ్రీధర్బాబు డీపీఆర్ను సభలో పెట్టకుండా దాచిపెడుతున్నారని ఆరోపించారు. డీపీఆర్ విలువ రూ.50 వేల కోట్లు ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. మూసీ బఫర్ జోన్ 50 మీటర్లు అని చెప్పి 5 కిలోమీటర్ల అవతల వరకు భూముల సేకరణకు ఎందుకు నోటీసులు ఇస్తున్నారు అని నిలదీశారు. చట్టం అంటే పేదలకు భూతం..పెద్దలకు వరం అన్న రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని ..బఫర్ జోన్లో ఉన్న మంత్రుల ఇళ్లను వదిలేసి పేదల ఇళ్లను కూల్చుతా అంటోందని ఆరోపించారు. శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో రైలు ప్రాజెక్టును రద్దు చేసి నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ సీఎఫ్ఓను అరెస్టు చేస్తామని బెదిరించారని తప్పుబట్టారు. ఎల్అండ్టీ పైన, ఆ సంస్థ కట్టిన మేడిగడ్డ బరాజ్పైన కక్ష గట్టారని విమర్శించారు. ఎల్అండ్టీకి లీజు మీద ఇచ్చిన 280 ఎకరాల స్థలంపై కొందరు పెద్దలు కన్నేసి ఈ పనులు చేశారని ఆరోపించారు. ఫార్మా సిటీకి బీఆర్ఎస్ ప్రభుత్వం 14 వేల ఎకరాలను మాత్రమే సేకరించగా, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును 30 వేల ఎకరాల్లో నిర్మిస్తున్నట్టు మంత్రి శ్రీధర్ ప్రకటించడాన్ని కేటీఆర్ ప్రస్తావించారు.మిగిలిన 16 వేల ఎకరాలు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. కేటీఆర్ ఆరోపణలను మంత్రి శ్రీధర్బాబు తోసిపుచ్చారు. మూసీ ప్రాజెక్టు డీపీఆర్ను సిద్ధం చేసి ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వెట్టింగ్ కోసం సమర్పించామని, వెట్టింగ్ పూర్తయిన వెంటనే ఆన్లైన్లో బహిరంగపరుస్తామన్నారు.పద్దులపై చర్చిస్తుంటే ఆటల పోటీలా? అత్యంత కీలకమైన పద్దులపై అసెంబ్లీలోచర్చలు జరుగుతున్న తరుణంలో ఎమ్మెల్యేలకు ఆటల పోటీలు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కేటీఆర్ తప్పుబట్టారు. అసెంబ్లీ లాబీల్లో విలేకరులతో ఆయన మాటాడారు. ఈ విషయాన్ని మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లగా ఆయన వద్ద ఎలాంటి సమాధానం లేదని ఎద్దేవా చేశారు. -
బీసీలను నమ్మించి మోసగించొద్దు
సాక్షి, హైదరాబాద్: బీసీలను నమ్మించి మోసగించొద్దని, 42శాతం రిజర్వేషన్ సహా అన్ని హామీలను అమలు చేయాలని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. గురువారం అసెంబ్లీలో బీసీ పద్దుపై చర్చలో ఆయన మాట్లాడారు. కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామన్నారని, హామీ అమలు బాధ్యత కాంగ్రెస్పై ఉందన్నారు. కులగణన పారదర్శకంగా జరపలేదని, భూసాని కమిషన్ రిపోర్ట్ నేటి వరకు పబ్లిక్ డొమెన్లో పెట్టలేదని తలసాని అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, మంత్రులు ధర్నా చేస్తే ఆ పార్టీ అగ్ర నాయకత్వం హాజరు కాలేదని చెప్పారు. బీసీ బిల్లుకు చట్టబద్ధత కోసం ఆల్ పార్టీ ప్రతినిధులను ఢిల్లీ తీసుకెళ్లలేదన్నారు. 42 శాతం రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందని చెబుతున్నారని విమర్శించారు. బీసీ సబ్ప్లాన్ ఎందుకు పెట్టలేదని, మంత్రివర్గంలో బీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. బీసీలకు బడ్జెట్లో సంవత్సరానికి రూ. 20 వేల కోట్లు కేటాయిస్తామన్న హామీ ఏమైందన్నారు. కీలక పోస్టులలో బీసీలను తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని విమర్శించారు. తలసాని మాట్లాడుతుండగా..మంత్రులు శ్రీధర్బాబు, వాకిటి శ్రీహరి కలుగజేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో బీసీ నాయకులకు ఎంతో ప్రాధాన్యం ఉందని, జాతీయ స్థాయిలో బీసీల అంశాన్ని మాట్లాడిన నాయకుడు రాహుల్గాంధీ అని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. బీసీలకు రాజకీయ ప్రాధాన్యం దక్కాలని మల్లికార్జున ఖర్గే, రా హుల్గాం«దీలు తమ వైఖరిని ఇప్పటికే స్ప ష్టం చేశారని, వారిచ్చిన మనోధైర్యంతోనే తాము చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై ధీమాగా మాట్లాడుతున్నామన్నారు. రిజర్వేషన్ల సాధనలో అంతా కలిసి రావాలని కోరారు. హైడ్రాతో అరాచకాలు సృష్టిస్తున్నారు : వివేకానంద రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాతో అరాచకాలు సృష్టిస్తోందని, ఉన్న వారికి ఒక న్యాయం..పేదవారికి ఒక న్యాయం అన్నట్టుగా హైడ్రా పనితీరు ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆరోపించారు. హైడ్రా కమిషనర్ ప్రజాప్రతినిధుల ఫోన్లు సైతం మాట్లాడడం లేదని, మంత్రులను కలవొచ్చు కానీ, హైడ్రా అధికారిని కలిసే పరిస్థితి లేదన్నారు. ఎంఏయూడీ పద్దులపై చర్చలో వివేకానంద మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మూడు జోన్లు శాస్త్రీయంగా లేవని, భవిష్యత్లో ఇబ్బందులు తప్పవన్నారు. ఫ్యూచర్ సిటీ కేవలం ఇన్సైడ్ ట్రేడింగ్, రియల్ ఎస్టేట్ దందా కోసమేనని ఆరోపించారు. ఇదే పద్దుపై చర్చలో కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ నగర అస్థిత్వానికి వెన్నెముకగా కాంగ్రెస్ పార్టీ విధానాలు నిలిచాయన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రుల హయాంలోనే హైదరాబాద్ నగర అభివృద్ధిలో ఎన్నో మైలురాళ్లు నమోదయ్యాయని చెప్పారు. నగర అభివృద్ధి, మూసీ అభివృద్ధితో ముడిపడి ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దూరదృష్టితోనే ఫ్యూచర్ సిటీకి అంకురార్పణ చేశారన్నారు. హైదరాబాద్, తెలంగాణను గ్లోబల్ డెస్టినేషన్గా చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. -
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గేమ్చేంజర్
రాయదుర్గం (హైదరాబాద్): ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక ముఖ్యమైన గేమ్చేంజర్గా మారబోతోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)లోని సెంటర్ ఫర్ అనలిటికల్ ఫైనాన్స్ (సీఏఎఫ్) ఆ«ధ్వర్యంలో గురువారం పాలసీ కాన్క్లేవ్–2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బలమైన, రియల్టైమ్ సిటిజన్ బేటాబేస్లను ఉపయోగించడం ద్వారా ఏఐ మధ్యవర్తులను తొలగించగలదని, అవినీతిని తగ్గించగలదని, ప్రభుత్వ సేవలు నిరంతరాయంగా సాగేందుకు అవకాశం కలుగుతోందన్నారు. తెలంగాణ విజన్–2047 డాక్యుమెంట్ ముసాయిదా రూపకల్పనలో ఐఎస్బీ సహకారం గురించి ఆయన వివరించారు. రోజువారీ పాలనలో ఏఐని సజావుగా ఏకీకృతం చేయడానికి తెలంగాణను కచ్చితమైన జాతీయ నమూనాగా భావించి విద్యావేత్తలు, పరిశ్రమలు, నియంత్రణదారులందరికీ ఆహ్వానం పలుకుతున్నట్లు ప్రకటించారు. ఐఎస్బీ డీన్ ప్రొఫెసర్ మదన్ పిల్లుట్ల మాట్లాడుతూ ఐఎస్బీ 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నందున వ్యాపారపద్దులు, ప్రజా విధానాన్ని తెలియ జేయడానికి, కఠినమైన విద్యా పరిశోధనలను ఉత్పత్తి చేయాలనే దాని వ్యవస్థాపక దృష్టిని కొనసాగిస్తూనే ఉందన్నారు. ఎంఫాసిస్ మద్దతుగల కొత్త ‘ఏఐ ఫర్ ఇంపాక్ట్’చొరవను హైలైట్ చేస్తూ బలమైన ఏఐ ఆధారిత యంత్రాంగాలను అభివృద్ధి చేయడానికి కొనసాగుతున్న ప్రయత్నాలను సమర్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఫాసిస్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ సంతోష్ కులకర్ణి, సెంటర్ ఫర్ అనలిటికల్ ఫైనాన్స్, ఐఎస్బీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ప్రసన్నతంత్రి పలువురు ప్రొఫెసర్లు, అధికారులు, విద్యార్థులు, ఫ్యాకల్టీ పాల్గొన్నారు. -
రామప్పలో అద్భుతం..
వెంకటాపురం(ఎం): ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలంలోని రామప్ప దేవాలయంలో అద్భుతం చోటుచేసుకుంది. గురువారం ఉదయం 6.30 గంటలకు గర్భగుడిలోని శివలింగాన్ని సూర్యకిరణాలు తాకాయి. సహజసిద్ధమైన వెలుతురులోనే కాంతివంతంగా దర్శనమిచ్చే రామలింగేశ్వరస్వామిపై సూర్యకిరణాలు పడటంతో గర్భగుడి మరింత కాంతివంతంగా కళకళలాడింది. శివలింగంపై పడుతున్న సూర్యకిరణాలను చూసి భక్తులు అనుభూతికి లోనయ్యారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామప్ప ఆలయ ప్రధాన పూజారి కోమల్లపల్లి హరీశ్ శర్మ మాట్లాడుతూ.. ఏటా ఏదో ఒక మాసంలో శివలింగంపై సూర్యకిరణాలు రెండు నుంచి మూడు రోజులు పడతాయని వెల్లడించారు. కాకతీయుల కాలంలోనే శివలింగంపై సూర్యకిరణాలు పడేలా రామప్ప ఆలయాన్ని నిర్మించారని తెలిపారు. -
సీఎస్ఆర్ నిధులపై ప్రత్యేక పాలసీ
సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) నిధుల సమీకరణతో పాటు వాటి సమర్థ వినియోగానికి ప్రత్యేక పాలసీ రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎస్ఆర్ నిధులతో రాష్ట్రంలో అభివృద్ధి, ప్రజోపయోగ కార్యక్రమాలు చేపడుతున్న సంస్థలను ప్రభుత్వం తరఫున అభినందించాలని సూచించారు. ప్రతి ఏడాది అత్యుత్తమ భాగస్వామ్యం చూపిన సంస్థల ప్రతినిధులను సత్కరించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని, రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఈ అభినందన ఉత్సవాన్ని నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాష్ట్ర స్థాయిలో సీఎస్ఆర్ సెల్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక కార్యాలయం ప్రారంభించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ సెల్ ద్వారా కార్పొరేట్ సంస్థలు చేపడుతున్న కార్యక్రమాలు, ప్రభుత్వ విభాగాల్లో అందుబాటులో ఉన్న ప్రాజెక్టులు, సీఎస్ఆర్ ద్వారా చేపట్టదగిన కార్యక్రమాల వివరాలన్నింటిని సమన్వయం చేస్తారని సీఎం వివరించారు. సీఎఎస్ ఆర్ నిధులపై గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రత్యేక సీఎస్ఆర్ పోర్టల్కు రూపకల్పన ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేయడానికి ప్రత్యేక తెలంగాణ సీఎస్ఆర్ పోర్టల్ రూపొందించాలని సీఎం ఆదేశించారు. ఈ పోర్టల్లో సీఎస్ఆర్ విరాళాలు అందించేందుకు, వివిధ విభాగాల పరిధిలో అమలు చేయదగిన ప్రాజెక్టుల వివరాలను సమగ్రంగా పొందుపరచాలని సూచించారు. జాతీయ స్థాయిలో సీఎస్ఆర్ నిధుల్లో తెలంగాణకు కేవలం 3 శాతం వాటా మాత్రమే ఉందని అధికారులు నివేదించగా, రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలు ఇతర ప్రాంతాల్లో సీఎస్ఆర్ ఖర్చు చేయడం సరికాదని సీఎం వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాల విధానాలను అధ్యయనం చేసి, తెలంగాణకు మరిన్ని సీఎస్ఆర్ నిధులు రాబట్టేలా కొత్త పాలసీ రూపొందించాలని, కార్పొరేట్ సంస్థలను ఆకర్షించే చర్యలు తీసుకోవాలని సూచించారు. -
‘అనర్హత’పై కడియం, సంజయ్లకు హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, సంజయ్ కుమార్ అనర్హత పిటిషన్లలో స్పీకర్ తీర్పును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించగా పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని స్పీకర్ కమ్ ట్రిబ్యునల్, ఫిరాయింపు శాసనసభ్యులను సీజే ధర్మాసనం ఆదేశించింది. ఈ మేరకు వారికి నోటీసులు జారీ చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పిటిషనర్లు వ్యక్తిగతంగా స్పీడ్ పోస్టు ద్వారా నోటీసులు అందించేందుకు అనుమతించింది. దానికి సంబంధించిన ఆధారాలను తమ ముందు ఉంచాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్ 16కు వాయిదా వేస్తూ గతంలో ఇదే అంశంపై దాఖలైన పిటిషన్లకు వీటిని కూడా జత చేయాలని రిజిస్ట్రీకి సూచించింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన కాలే యాదయ్య, దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్రెడ్డి, కడియం శ్రీహరి, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, టి.ప్రకాశ్ గౌడ్, గాంధీ, తెల్లం వెంకట్రావు, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్కుమార్లు కాంగ్రెస్లో చేరారని వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ స్పీకర్ బీఆర్ఎస్ పిటిషన్లు సమర్పించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణ చేపట్టిన స్పీకర్(ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో) వీరంతా పార్టీ మారలేదంటూ తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీశ్రెడ్డి, కేపీ వివేకానంద హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ‘అనర్హత’తీర్పుపై దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది ఎల్. వెంకటేశ్వర్రావు వాదనలు వినిపిస్తూ 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి విజయం సాధించిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, సంజయ్కుమార్ కాంగ్రెస్లో చేరడం చట్టవిరుద్ధమన్నారు. స్పీకర్ తీర్పు అధికారిక ప్రతి అందనందున అది సమర్పించేందుకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. దీనికి అంగీకరించిన ధర్మాసనం ప్రతివాదులైన స్పీకర్ కమ్ ట్రిబ్యునల్, ఇద్దరు ‘ఫిరాయింపు’ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేస్తూ, విచారణ వాయిదా వేసింది. -
విద్య, వైద్యం.. నిధులు పుష్కలం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: విద్య, వైద్యం.. ఈ రెండు అంశాలు ప్రజా ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమైనవని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ఈ రెండు విభాగాలకు సరిపోయినన్ని నిధులు ప్రభుత్వం కేటాయిస్తుందని, ఎలాంటి పరిస్థితుల్లోనూ కోత విధించబోమని చెప్పారు. లక్ష్య సాధనకు అవసరమైతే మరిన్ని నిధులు కేటాయించి ఖర్చు చేస్తామని పేర్కొన్నారు. గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో బీఆర్ఎస్ఎల్పీ ఉప నేతలు హరీశ్రావు, సంజయ్ తదితరులు లేవనెత్తిన అంశాలపై సీఎం సమాధానమిచ్చారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. ‘రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం కింద నెలకు సగటున రూ.89 కోట్లు ఖర్చు చేస్తోంది. కానీ ఈ పథకం కింది బకాయిలతో ప్రైవేటు ఆస్పత్రులు మూత పడుతున్నాయనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ చెల్లింపులపై కొందరు అపోహలు సృష్టిస్తున్నారు. 2023 డిసెంబర్ 7వ తేదీ నాటికి ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.627 కోట్లు ఉంటే.. వారసత్వంగా వచ్చిన ఆ బకాయిలను చెల్లిస్తూనే ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. ప్రజా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకానికి ఇప్పటివరకు రూ.2,408.51 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో ప్రభుత్వ ఆస్పత్రులకు రూ.927.99 కోట్లు, ప్రైవేట్ ఆస్పత్రులకు రూ.1480.52 కోట్లు విడుదల చేశాం. ప్రస్తుతం రూ.727.75 కోట్ల బకాయిలున్నాయి. వారసత్వ బకాయిలు మరో రూ.100 కోట్లు ఉన్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి సహాయ నిధి చెల్లింపులు కూడా భారీగా పెరిగాయి. ఇప్పటివరకు దీని కింద రూ.2,046 కోట్లు ఇచ్చాం. సీఎంఆర్ఎఫ్, ఆరోగ్యశ్రీ కింద దాదాపు రూ.4,500 కోట్లు ఖర్చు చేశాం..’అని సీఎం వివరించారు. బోధనాసుపత్రులకు ఆరోగ్యశ్రీ రోగులు రాష్ట్రంలో 35 మెడికల్ కాలేజీలున్నాయి. బోధనాసుపత్రులకు రోగుల తాకిడి తక్కువగా ఉంది. పేదలు వైద్యం కోసం వెళ్లే దగ్గర కొన్నిచోట్ల సరైన డాక్టర్లు లేరు..రోగులున్న చోట నిపుణులు లేరు. అందువల్ల ఆరోగ్యశ్రీ రోగులను బోధనాసుపత్రులకు పంపించాలనుకుంటున్నాం. ఆరోగ్యశ్రీతో పాటు సీఎంఆర్ఎఫ్ను ఈ ఆస్పత్రులకు ఇస్తాం. దీంతో ఆస్పత్రుల నిర్వహణ మెరుగుపడుతుంది. ఈ ఆస్పత్రుల పర్యవేక్షణకు గ్రూప్–1 లేదా గ్రూప్–2 అధికారులను నియమిస్తాం. రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు ఇందిరమ్మ జీవిత బీమా అమలు చేయనున్నాం. ఇది ప్రతి కుటుంబానికి ప్రభుత్వం కల్పించే ధీమాగా మారుతుంది. విదేశాల్లో ఉండే తెలుగు డాక్టర్ల సేవలు వినియోగించుకునేలా, ఇక్కడికి వచ్చినప్పుడు చికిత్స అందించేలా ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ తయారు చేస్తున్నాం..’అని ముఖ్యమంత్రి చెప్పారు. ఆరోగ్యశ్రీపై ప్రైవేటు ఆస్పత్రుల ఆసక్తి: మంత్రి దామోదర ఆరోగ్యశ్రీ సేవలు అందించేందుకు ప్రైవేటు ఆస్పత్రులు ఉత్సాహం చూపిస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ చెప్పారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొత్తగా 330 కార్పొరేట్ ఆస్పత్రులు చేరాయన్నారు. ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రులకు క్రమం తప్పకుండా చెల్లింపులు జరుగుతున్నాయని, ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. పెట్టుబడులపై ఓర్వలేకే విమర్శలు: మంత్రి శ్రీధర్బాబు ప్రజా ప్రభుత్వంలో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, వాటిని చూసి ప్రతిపక్ష పార్టీ నేతలు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు విమర్శించారు. దావోస్ పెట్టుబడులు, ఇతర అంశాలపై సభ్యుల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. దావోస్కు వెళ్లిన 2024, 2025 సంవత్సరాల్లో మొత్తం 44 ఎంవోయూలు చేసుకోవడం ద్వారా రూ. 2,19,182 కోట్లు పెట్టుబడులు రానున్నట్లు వివరించారు. ఎంవోయూలు, పెట్టుబడులు, కంపెనీలు తదితర అంశాలపై శ్వేతపత్రం విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. -
ఫుల్లుగా పెట్రోల్.. అయినా ఉరుకులాటెందుకు?
హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో పెట్రోల్ కోసం వాహనదారులు ఎగబడుతున్నారు. ఒకరిని చూసి ఒకరు పెట్రోల్ బంకుల వద్దకు పరుగులు తీస్తున్నారు. నిజానికి వాహనదారులు పెట్రోలు బంకుల వద్దకు అంత భారీగా వెళ్తూ ఫుల్ ట్యాంకు నింపించుకుంటున్నారు కాబట్టి కొన్ని బంకుల్లో పెట్రోల్ అయిపోతుంది. దీంతో మరింత ఆందోళనకు గురవుతున్నారు. లేని ప్రమాదాన్ని ఊహించుకుని ఆందోళన చెందుతున్నట్లు ఉంది వాహనదారుల తీరు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం వల్ల భారత్లోని పలు నగరాల్లో ప్రజల్లో భయం, ఆందోళన పెరిగాయి. ఏ అనుకోని పరిస్థితి వస్తుందోనన్న భయంతో గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్ను పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నారు.ప్రభుత్వ వివరణ ఇదే..ఇరాన్ యుద్ధం వేళ క్రూడాయిల్ సరఫరా కొంత తగ్గినప్పటికీ ఇప్పుడు ఆ లోటు పూర్తిగా భర్తీ అయింది. హార్మూజ్ జలసంధి వద్ద ప్రతికూల పరిస్థితి ఉన్నా, భారత్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 41కి పైగా సరఫరాదారుల నుంచి క్రూడాయిల్ను దిగుమతి చేసుకుంటోంది. ఇంతకు ముందు హార్మూజ్ జలసంధి ద్వారా వచ్చిన దానికంటే ఎక్కువ క్రూడాయిల్ను భారత్ పొందుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో (ముఖ్యంగా పశ్చిమ గోళార్థంలోని దేశాల్లో) క్రూడాయిల్ పెద్ద మొత్తంలో ఉంది. ఇతర ప్రాంతాలనుంచి సరఫరా జరగకపోతే వేరే మార్కెట్ల నుంచి క్రూడాయిల్ను దిగుమతి చేసుకోవచ్చు. ప్రతి భారత రిఫైనరీ 100% కంటే ఎక్కువ వినియోగంతో నడుస్తోంది. భారత ఆయిల్ కంపెనీలు వచ్చే 60 రోజుల దేశ అవసరాలకు సరిపడే క్రూడాయిల్ సరఫరాల కోసం ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్నాయి. కాబట్టి దేశంలో లోటు ఉండే ప్రమాదం లేదు. సరఫరాలో ఎలాంటి లోటు లేదు.ఈ రాష్ట్రాల్లోనూ పరిస్థితి ఇదే..పెట్రోల్, డీజిల్ కొరత లేదని అధికారులు ఎంతగా చెబుతున్నా ప్రజలు నమ్మడం లేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక వంటి రాష్ట్రాలు, పలు నగరాల్లో పెట్రోల్ బంకులకు వాహనదారులు భయంతో వెళ్తున్నారు. ఇంధన లోటు ఉందేమోనన్న భయంతో ప్రజలు పొడవాటి క్యూల్లో నిలబడ్డ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి. -
ఎంఎంటీఎస్లో ప్రయాణికుల తగ్గుముఖంపై సీఎం ఆరా
హైదరాబాద్: ఎంఎంటీఎస్లో ప్రయాణికుల తగ్గుముఖంపై సీఎం రేవంత్రెడ్డి ఆరా తీశారు. ఈ మేరకు గురువారం(మార్చి 26వ తేదీ) ఎంఎంటీఎస్పై సీఎం సమీక్ష నిర్వహించారు. దీనిలో భాగంగా అధికారులకు అనేక సూచనలు చేశారు. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాలో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సర్వీసులు ఉండాలని సూచించిన సీఎం.. కార్యాలయాల సమయాల్లో ఎంఎంటీఎస్ల సంఖ్య పెంచడంతో పాటు క్రమం తప్పకుండా సమయ పాలన పాటిస్తూ సర్వీసులు నడపాలని ఆదేశించారు. ఎంఎంటీఎస్ స్టేషన్ల వద్దకు ఆర్టీసీ బస్సులు వెళ్లేందుకు అవకాశం లేకపోవడం, స్టేషన్లు లోపలికి ఉన్నందున అక్కడకు రాకపోకలు సాగించేందుకు వీలుగా మినీ బస్సులు నడిపే అంశాన్ని పరిశీలించాలన్నారు. ఎంఎంటీఎస్ స్టేషన్లలో ప్రయాణికులకు అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేయాలన్నారు. మెరుగైన వసతులు ఉన్నప్పుడే ప్రయాణికులు ఎంఎంటీఎస్ వైపు మొగ్గు చూపుతారని ఈ మేరకు సీఎం పేర్కొన్నారు. స్వీయ ఆదాయ వనరులు పెంచుకునేందుకు ప్రయత్నించాలని.. లాస్ట్ మైల్ కనెక్టివిటీ పెంపుతో పాటు ప్రయాణికుల సంఖ్య పెంపు.. వసతులు మెరుగుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలన్నారు. -
హైదరాబాద్: పిల్లలు అడగ్గానే ఐస్ క్రీమ్ కొనిస్తున్నారా?
సాక్షి, హైదరాబాద్: ముషీరాబాద్లో కల్తీ, గడువు ముగిసిన ఐస్ క్రీమ్ల తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించారు. హైదరాబాద్ సిటీ కమిషనర్స్ టాస్క్ ఫోర్స్ (ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్ బృందాలు) హెచ్-ఫాస్ట్ (H-Fast) టీమ్, జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపూజీ నగర్లో ఉన్న 'బ్లూ బెల్స్ ఐస్ క్రీం' (Blue Bells Ice Cream) తయారీ కేంద్రంపై మెరుపు దాడులు చేశారు.ఈ దాడుల్లో ఎటువంటి చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా, అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో, గడువు ముగిసిన ముడి పదార్థాలతో ఐస్ క్రీంలు తయారు చేస్తున్న పట్టాల అశోక్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున కల్తీ ఐస్ క్రీం ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. నాణ్యమైన ఐస్ క్రీమ్లంటూ నమ్మబలుకుతూ హోల్ సేల్, రిటైల్ కస్టమర్లకు సరఫరా చేస్తూ అక్రమ లాభాలు గడిస్తున్నాడు. తయారీలో గడువు ముగిసిన (Expired) రంగులు, ఫ్లేవర్లను ఉపయోగిస్తూ వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నట్లు గుర్తించారు. అలాగే తయారీ కేంద్రం, ముడి పదార్థాల నిల్వ ప్రాంతం అత్యంత అపరిశుభ్రంగా ఉన్నాయని పోలీసులు తెలిపారు.ఈ దాడుల్లో పోలీసులు మొత్తం రూ. 1,75,000 విలువైన 3,759 వివిధ రకాల ఐస్ క్రీం ఉత్పత్తులను (సుమారు 1,252 లీటర్లు) స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 4 లీటర్ల ప్యాకింగ్లో ఉన్న 400 లీటర్ల వెనీలా, 320 లీటర్ల బటర్ స్కాచ్, 120 లీటర్ల అమెరికన్ నట్స్, 120 లీటర్ల స్ట్రాబెర్రీ, 80 లీటర్ల డ్రై ఫ్రూట్, 60 లీటర్ల మాంగో, 20 లీటర్ల క్రీమ్ & కుకీస్ ఐస్ క్రీంలు ఉన్నాయి. అలాగే విక్రయానికి సిద్ధంగా ఉన్న 2,550 పెప్సీ ఐస్ క్రీం ప్యాకెట్లు, 1 లీటర్ ప్యాకింగ్లో ఉన్న 38 లీటర్ల స్పెషల్ ఫ్లేవర్, 24 లీటర్ల స్ట్రాబెర్రీ ఐస్ క్రీంలను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు అర లీటర్ ప్యాకింగ్లో ఉన్న 20 లీటర్ల స్పెషల్ ఫ్లేవర్, 10 లీటర్ల స్ట్రాబెర్రీ ఐస్ క్రీంలు, 50 ml పరిమాణంలో ఉన్న 800 మలై కుల్ఫీ ఐస్ క్రీంలను (40 లీటర్లు) సీజ్ చేశారు.ముఖ్యంగా తయారీలో వాడుతున్న కృత్రిమ ఆహార రంగులు (180 గ్రాముల ప్యాకెట్లు), టోన్కిన్ సింథటిక్ ఫుడ్ కలర్తో పాటు, గడువు ముగిసిన పైనాపిల్, మాంగో, సీతాఫల్ ఫ్లేవర్ బాటిళ్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
‘మొలంగూరు’ వారి ఆహ్వాన పత్రిక
విద్యానగర్(కరీంనగర్)/శంకరపట్నం: ‘మొలంగూరు వారి ఆహ్వాన పత్రిక. శ్రీమతి, శ్రీ చిత్రా మిశ్రా ఐఏఎస్ గారు, కలెక్టర్ కార్యాలయం, కరీంనగర్ జిల్లా. ఆహ్వానించువారు మొలంగూరు గ్రామ ప్రజలు, మండలం శంకరపట్నం, జిల్లా కరీంనగర్’.. అంటూ అచ్చు పెళ్లి పత్రి కలా రూపొందించిన ఆహ్వాన పత్రికను మొలంగూరు గ్రామ ప్రజలు కలెక్టర్ చిత్రా మిశ్రాకు అందజేశారు. తమ సమస్యల పరిశీలనకు ఓసారి గ్రామానికి రావాలని కోరారు. చరిత్రాత్మ కమైన మొలంగూర్ ఖిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని, ఖిల్లాకు వెళ్లేదారిలో ఉన్న మిద్దె గోడలు, రెండు ఎకరాల 10 గుంటల భూమి అక్రమణలకు గురైందని పేర్కొన్నారు. ఈ స్థలాన్ని కాపాడి, ప్రభుత్వ కార్యాలయాలు, సోలార్ ప్లాంట్, పార్క్, గ్రంథాలయం ఏర్పాటు చేయాలని కోరారు. ఆహ్వాన పత్రికను అందజేసిన వారిలో తెలంగాణ జన సమితి పార్టీ జిల్లా అధ్యక్షుడు మోరె గణేశ్, జిల్లా అధికార ప్రతినిధి చిట్యాల భానుబాబు ఉన్నారు. -
గత సర్కార్ తప్పిదాలను సరిచేస్తున్నాం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 600 కోట్లు గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. గురువారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. మేం అధికారంలోకి వచ్చాక రూ.2408 కోట్లు ఆరోగ్యశ్రీకి పేమెంట్ చేశామన్నారు. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతీనెల రూ.52 కోట్లు ఆరోగ్యశ్రీకి ఖర్చు పెడితే.. తమ ప్రభుత్వం ప్రతీనెల ఆరోగ్యశ్రీకి రూ.89 కోట్లు ఖర్చు పెడుతుందన్నారు.ఇవాళ వరకు ఆరోగ్యశ్రీకి రూ.720 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇందులో ప్రైవేటు ఆసుపత్రులకు 200 కోట్ల మించి బకాయిలు లేవు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ను దుర్వినియోగం చేశారు. బీఆర్ఎస్ ముఖ్య నేతల పీఏలు ఇందులో ఉన్నారు. 2046 కోట్ల రూపాయలు సీఏం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం. పేదలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రతీ కుటుంబానికి జీవిత బీమా సౌకర్యం కల్పిస్తాం...మెడికల్ కాలేజీలకు ఆరోగ్యశ్రీ అనుసంధానం చెస్తే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయి. గత ప్రభుత్వ తప్పిదాలను సరిచేస్తున్నాం. విద్యా, వైద్యం విషయంలో కోతలు ఉండవు. కోతలు పెట్టాల్సివస్తే వేరే వారికి కోతలు పెడతాం. పేదల విద్య, వైద్యం విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు’’ అని రేవంత్రెడ్డి తేల్చి చెప్పారు. -
దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు: కేంద్రం
👉కొరత వదంతులను కొట్టిపారేసిన కేంద్రందేశంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు60 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయికొరత వదంతులను కొట్టిపారేసిన కేంద్రం👉డిమాండ్ కంటే సప్లై ఎక్కువ చేస్తున్నాం: స్టీఫెన్ రవీంద్ర తెలంగాణలో మొత్తం పెట్రోల్ బంకులు 4321సాధారణంగా 5883 కిలో లీటర్ల పెట్రోల్ అవసరంనిన్న ఒక్కరోజు పెట్రోల్ 10,799.5 కిలో లీటర్ల విక్రయంనిన్న ఒక్కరోజు 84 శాతం పెట్రోల్ అధికంగా విక్రయంసివిల్ సప్లై కార్పొరేషన్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడి13,231 కిలో లీటర్ల డీజిల్ ప్రతినిత్యం సాధారణంగా అవసరంనిన్న ఒక్కరోజు 22,127 కిలో లీటర్ల డీజిల్ విక్రయం2173 డీజిల్ ట్యాంకర్లు ఉన్నాయి1056 పెట్రోల్ ట్యాంకర్లు ఉన్నాయిఎల్పీజీ డొమెస్టిక్ 1.28 కోట్ల కనెక్షన్లు ఉన్నాయి, కమర్షియల్ 63,550 కనెక్షన్లు ఉన్నాయిడిమాండ్ కంటే సప్లై ఎక్కువ చేస్తున్నాంపైప్ న్యాచురల్ గ్యాస్ లో లక్షా మూడు వేల 275 కనెక్షన్లు ఉన్నాయిసీఎన్జీ స్టేషన్లు 225 ఉన్నాయి..PNG, CNG expansion చేయడానికి చర్యలు తీసుకుంటున్నాంసప్లై చైన్ లో ఇబ్బంది లేకుండా చర్యలుఅడ్డగోలుగా పెట్రోల్ ధరలు👉 సూర్యాపేట జిల్లా: హుజూర్నగర్ లో పెట్రోల్ బంకుల్లో పెరిగిన పెట్రోల్ ధరలుఓ బంకులో ఏకంగా లీటర్ పెట్రోల్ కు ఐదు రూపాయలకు పైగానే వడ్డన అదేంటని ప్రశ్నించిన వినియోగదారులకు సమాధానం చెప్పని బంకు నిర్వాహకులు👉పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్న పుకార్లు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేగడంతో పెట్రోల్ బంకుల వద్ద ప్రజలు భారీగా క్యూలు కట్టారు. ప్రజలు భయాందోళన చెందడంతోనే అమ్మకాలు ఈ స్థాయిలో పెరిగాయని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్లో ఇంధన కొరత ఉందనే తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్ స్పష్టం చేశారు. సుమారు 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. అందువల్లే నో స్టాక్ బోర్డులు👉 విజయవాడ: ఏపీ సివిల్ సప్లై డైరెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ఆయిల్ కంపెనీలు, పెట్రోల్ డీలర్స్, సివిల్ సప్లై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్అడ్వాన్స్ లు చెల్లించినా సరఫరా నిలిపివేస్తున్నారంటున్న డీలర్లుఅందువల్లే నో స్టాక్ బోర్డు పెడుతున్నామన్న పెట్రో డీలర్ల ఫెడరేషన్సడెన్ గా ఇండెంట్ క్యాన్సిల్ చేయడంతోనే సమస్య వస్తోందని అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫెడరేషన్ఏపీ వ్యాప్తంగా 5 వేల పెట్రోల్ బంకులుట్యాంకర్లను తామే స్వయంగా పర్యవేక్షిస్తామన్న అధికారులుఈరోజు సాయంత్రంలోగా లాగిన్ యాక్సిస్ ప్రభుత్వానికి ఇవ్వాలని ఓఎంసీలకు ఆదేశంగుంటూరులో మూతపడుతున్న పెట్రోల్ బంకులు👉 గుంటూరు సిటీలో పెట్రోల్ లేక మూతపడుతున్న పెట్రోల్ బంకులునగరంలో పెట్రోల్ లేక మూతపడ్డ 8 పెట్రోల్ బంకులుపెట్రోల్ ఉన్న బంకుల్లో పెట్రోల్ కోసం బారులు తీరిన జనంప్రభుత్వం అంతా బానే ఉంది అని చెప్తోంది కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉందని మండిపడుతున్న ప్రజలుఇప్పటికే గ్యాస్ దొరకట్లేదు నూనె ధరలు పెరిగాయి ఇప్పుడు పెట్రోల్ దొరకట్లేదని ఆగ్రహిస్తున్న ప్రజలు👉కృష్ణాజిల్లా: గుడివాడ పట్టణంలో పెట్రోల్ బంక్లు మూతపడ్డాయి. బంక్ల వద్ద నో పెట్రోల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. గుంటూరు సిటీలో పెట్రోల్ లేక బంక్లు మూతపడుతున్నాయి. నగరంలో 8 పెట్రోల్ బంక్లు మూతపడ్డాయి. పెట్రోల్ కోసం జనం బారులు తీరారు. ప్రభుత్వం అంతా బానే ఉందని చెప్తోంది కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే దారుణంగా ఉందంటూ ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికే గ్యాస్ దొరకట్లేదని.. నూనె ధరలు పెరిగాయని.. ఇప్పుడు పెట్రోల్ దొరకట్లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
Petrol Diesel: ఏ బంకు చూసినా కిటకిట..!
హైదరాబాద్: ఏ బంకు చూసినా కిటకిట.. చాంతాడంత బారులు.. కొన్నిచోట్ల నో స్టాక్ బోర్డులు. వాహనదారుల ఇక్కట్లు. బుధవారం రోజంతా నగరంలో కనిపించిన దృశ్యాలిలి. ఉదయం నుంచే ప్రధాన పెట్రోల్ బంకుల్లో వాహనదారులు కిక్కిరిసిపోయారు. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో చమురు దిగుమతులపై వదంతులు షికార్లు చేస్తుండటంతో వాహనదారులు ట్యాంక్ ఫుల్ చేయించుకున్నారు. బాటిళ్లు, క్యాన్లలో అదనంగా నిల్వ చేసుకునేందుకు ఎగబడ్డారు. సీఎన్జీ కోసం ఆటోలు, కార్లు అల్లంత దూరం క్యూ కట్టాయి. ఈ ప్రభావం ఆయా మార్గాల్లో ప్రయాణించే వాహనాలపై తీవ్రంగా పడింది. పెట్రోల్, గ్యాస్ బంకుల కేంద్రంగా భారీ ట్రాఫిక్ జామ్స్ ఏర్పడ్డాయి. దీంతో పోలీసులు ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాల్సి వస్తోంది. శాంతి భద్రతల విభాగంతో పాటు ట్రాఫిక్ పోలీసులు ఆయా బంకుల వద్ద బుధవారం నుంచి బందోబస్తు నిర్వహిస్తున్నారు. -
భారీగా తగ్గిన ఫుడ్ డెలివరీలు
సాక్షి,హైదరాబాద్: పెట్రో కటకట గిగ్వర్కర్లపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో వివిధ ఫుడ్ డెలివరీ, ఈ కామర్స్, ఆన్లైన్ సర్వీసు సంస్థలకు తీవ్ర నష్టం వాటిల్లింది. భోజన ప్రియులు, వినియోగదారులు ఆర్డర్ చేసిన వస్తువులను నిర్ణీత సమయంలో డెలివరీ చేసే పరిస్థితి కనిపించలేదు. పెట్రోలు బంకులు చాలావరకు మూతపడగా.. ఉన్నవాటిలో వాహనదారులు బారులు తీరడంతో క్యాబ్ సరీ్వసులను కూడా ప్రభావితం చేసింది. అధికశాతం క్యాబ్లు సేవలను నిలిపివేయగా.. నడిచిన కొన్ని కూడా రద్దు కావడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లాలని క్యాబ్ బుక్ చేసుకున్న ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. మరోవైపు క్యాబ్లు, గిగ్వర్కర్ల సేవలు నిలిచిపోవడం..వారి వాహనాలు దాదాపుగా నిలిచిపోవడంతో నగర రోడ్లపై కొంత ట్రాఫిక్ తగ్గినట్టు కనిపించింది. -
60 రోజులకు సరిపడా నిల్వలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఇంధన కొరత ఉందనే తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్ స్పష్టం చేశారు. సుమారు 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఇంధన సరఫరాపై తలెత్తిన అపోహలు, పెట్రోల్ బంక్ల వద్ద రద్దీ తదితర పరిణామాల నేపథ్యంలో ఆయన బుధవారం బంజారాహిల్స్లోని టీజీ ఐసీసీసీలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన, అదనపు సీపీ తఫ్సీర్ ఇక్బాల్, జాయింట్ సీపీ ఎన్.శ్వేతలతో పాటు పౌర సరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జనర్ మాట్లాడుతూ.. ‘ఆయిల్ కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. నగర వ్యాప్తంగా సరఫరా నిరాటంకంగా కొనసాగుతోంది. ప్రజలు ఒక్కసారిగా పెట్రోల్ బంకులకు వచ్చి వాహనాలకు ఫుల్ ట్యాంకులు చేయించుకోవడంతో డిమాండ్ పెరిగింది. ఈ కారణంగానే కొన్ని చోట్ల తాత్కాలికంగా నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. దీన్ని కొరతగా భావించవద్దు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 22న 3,024 కిలో లీటర్ల ఇంధనం అమ్ముడు కాగా... కొరత వదంతుల నేపథ్యంలో 23న 6,400 కిలో లీటర్లకు చేరుకుంది’ అన్నారు.ప్రజల భయాందోళనతోనే..‘ప్రజలు భయాందోళన చెందడంతోనే అమ్మకాలు ఈ స్థాయిలో పెరిగాయి. ముఖ్యంగా నిబంధనలకు విరుద్ధంగా బాటిళ్లు, డబ్బాల్లో లూజ్ పెట్రోల్ లేదా డీజిల్ విక్రయించే బంకులపై చర్యలు తీసుకుంటాం. సోషల్ మీడియాలో ప్రజలను భయాందోళనలకు గురిచేసే వారిపై నిఘా ఉంచాం. అటువంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. కమిషనరేట్ పరిధిలోని 240 పెట్రోల్ బంకుల్లో పరిస్థితిని సివిల్ సప్లైస్, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిరంతరం పర్యవేక్షిస్తున్నాం’ అన్నారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ.. ‘ఆయిల్ సంస్థలు, పౌర సరఫరాల శాఖ అధికారులతో పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నాం. ప్రజల సౌకర్యార్థం ప్రత్యేకంగా కంట్రోల్ రూంను కూడా ఏర్పాటు చేశాం. ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా పరిధిలోని 186 బంకుల్లో ఇంధన సరఫరా సజావుగా సాగుతోంది. ప్రజలు అనవసర ఆందోళనతో బంకుల వద్ద రద్దీ పెంచవద్దు. నిత్యావసర సేవలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. క్షేత్రస్థాయిలో యంత్రాంగం అప్రమత్తంగా ఉంది’ అని కోరారు. -
మండీ బిర్యానీ తిని ఆస్పత్రి పాలు
మేడ్చల్ జిల్లా: ఏఎస్రావునగర్లోని ఓ మండీ హోటల్లో బిర్యానీ తిన్న నలుగురు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నాలుగు రోజుల క్రితం హోటల్కు వెళ్లి మండీ బిర్యానీ తిని ఇంటికి వెళ్లారు. కొద్దిసేపటికే వాంతులు, విరేచనాలు మొదలవ్వడంతో జమ్మిగడ్డలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. మండీ బిర్యానీ తినడం వల్లే ఆస్పత్రి పాలయ్యామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, విషయం తెలుసుకున్న ఫుడ్ సెక్యూరిటీ అధికారులు సదరు హోటల్ను పరిశీలించేందుకు వెళ్లగా, అది మూసి ఉంది. హోటల్ మూసి ఉండటంతో ఏమీ తెలుసుకోలేకపోయామని, విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని కాప్రా సర్కిల్ ఇన్చార్జ్ ఫుడ్ సెక్యూరిటీ అధికారిణి నిలీషా తెలిపారు. -
విధి లేకే వీడుతున్నా: జీవన్రెడ్డి
జగిత్యాల: కాంగ్రెస్లో నాలుగు దశాబ్దాలపాటు ఉన్న మాజీమంత్రి జీవన్రెడ్డి ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. బుధవారం జగిత్యాల జిల్లాకేంద్రంలోని బండారి గార్డెన్స్లో అభిమానులు, నాయకులు, కార్యకర్తల మధ్య రాజీనామా చేశారు. ఆ లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ తనదనే ధోరణిలో రేవంత్ మాట్లాడుతున్నారని, అడ్డొస్తే తొక్కుతా అంటున్నారని, ఎంతమందిని తొక్కుతారని ప్రశ్నించారు. ఏదో ఒకరోజు అందుకు ముగింపు తప్పదన్నారు. ఆ ముగింపు జగిత్యాల నుంచే ప్రారంభమవుతుందన్నారు. తాను ఎదగకుండా అణగదొక్కాలన్నదే రేవంత్రెడ్డి ఆలోచన అని, అయినప్పటికీ ఎదిరించి పోరాటం చేయడం తనకేం కొత్త కాదని తెలిపారు. కేసీఆర్, చంద్రబాబు వంటి వారితోనే పోరాటం చేశానని, ఇక నుంచి రేవంత్పైనే తన పోరాటమని వ్యాఖ్యానించారు. రేవంత్కు ఎదిరించే వారు వద్దని, రాహుల్గాంధీ ఆలోచనలకు అనుగుణంగా నడిచే వారిని అణగదొక్కుతున్నారని జీవన్రెడ్డి చెప్పారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... విధిలేకనే వీడుతున్నా... నేను 1984లో కాంగ్రెస్లో చేరిన. పార్టీతో నాకు 40 ఏళ్ల అనుబంధం ఉంది. అలాంటి అనుబంధాన్ని వదులుకోవాలని ఎవరూ కోరుకోరు. జరిగిన అవమానాలతో విధిలేని పరిస్థితుల్లో పార్టీని వీడుతున్నా. స్థానిక సంస్థల్లో ఒక సమయంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రాకపోతే ఒంటరిగా గెలిపించా. కాంగ్రెస్ కార్యకర్తలపై దౌర్జన్యం చేసిన వారికే మళ్లీ పార్టీలో స్థానం కల్పించారు. విధిలేని పరిస్థితుల్లో ఎమ్మెల్యేలను చేర్చుకున్నామని, మీ హక్కులకు భంగం కలగనివ్వబోమని కేసీ వేణుగోపాల్, మంత్రులు శ్రీధర్బాబు, అడ్లూరి లక్ష్మణ్కుమార్ హామీ ఇచ్చారు. అయినప్పటికీ మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకంలో జాప్యం చేశారు. దశాబ్దాలుగా అండగా నిలిచిన ఓ నాయకుడిని అతిదారుణంగా చంపితే సీఎం కనీసం మందలించలేదు. బీఆర్ఎస్ పాలనలో అరాచకం చేసిన పోలీసు యంత్రాంగాన్నే మళ్లీ తీసుకొచ్చారు. వేం నరేందర్రెడ్డి ఎవరు? అసలు వేం నరేందర్రెడ్డి ఎవరు..? ఆయన పార్టీకి ఏం చేశారు..? చిన్నారెడ్డి వంటి సీనియర్ నాయకులకు జరిగిన అన్యాయానికి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన దిశగా తీసుకొచ్చారు. సీనియర్లను గౌరవించడం లేదు. అణగదొక్కాలని ప్రయత్నిస్తున్నారు. వేం నరేందర్రెడ్డి ప్రభుత్వానికి ఏం సలహాలు ఇచ్చారో చెప్పాలి. ఇంకెంత కాలం అవమానాలు, మానసిక క్షోభ అనే ఉద్దేశంతోనే పార్టీని వీడుతున్నా. విధిలేని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నా. నేను ముఖ్యమంత్రి కావాలని కాంగ్రెస్లో చేరలేదు. పార్టీ కోసం కష్టపడ్డా. అదే రేవంత్ నాయకులను తొక్కుకుంటూ.. పథకం వేసుకుని పార్టీలో చేరి ముఖ్యమంత్రి అయ్యిండు. రేవంత్ నిర్ణయాలతో సొంత జిల్లా అయిన మహబూబ్నగర్ నియోజకవర్గంలో పార్టీ ఓడిపోయింది. ప్రభుత్వాన్ని నడిపేందుకు తగినంత సంఖ్యా బలం ఉన్నప్పటికీ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం మంచిది కాదని మొదటి నుంచి చెబుతున్నా. ఈ విషయమై గతంలోనే పార్టీ అధిష్టానానికీ లేఖ రాశా. రాష్ట్రంలో జరుగుతున్న ఫిరాయింపుల ప్రభావం జాతీయస్థాయిలో కాంగ్రెస్పై ప్రభావం చూపుతుంది. పార్టీ కార్యకర్తలకు ఇష్టం లేకపోయినా ఎమ్మెల్యే సంజయ్ను కాంగ్రెస్లో చేర్చుకున్నారు. రేవంత్పై పోరాటం రాబోయే రోజుల్లో రేవంత్రెడ్డితో పోరాటం చేయబోతున్నా. ఇది నా ఆఖరి పోరాటం కానుంది. బీఆర్ఎస్ను ఎదిరించి కాంగ్రెస్ను అధికారంలోకి తేవడానికి పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డి, సీఎల్పీ నాయకుడిగా భట్టి విక్రమార్క ఎంత పోరాటం చేశారో.. మండలి నాయకుడిగా నేనూ అంతే పోరాటం చేశా. రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి, భట్టి ఉప ముఖ్యమంత్రి అయినప్పుడు నాకు మంత్రి అయ్యే అర్హత లేదా? సీనియర్లయిన చిన్నారెడ్డి, మధుయాష్కీ, హన్మంతరావును కాదని వేం నరేందర్రెడ్డిని రాజ్యసభకు పంపడమేంటి? బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెడుతూ పార్టీ జెండా మోసినోళ్లకు పదవులు కట్టబెట్టడాన్ని సహించలేక పార్టీని వీడుతున్నా. నాలుగు దశాబ్దాలుగా అండగా నిలిచిన కార్యకర్తలను నాకు తోడుగా నిలవాలని కోరుతున్నా. జగిత్యాలను జాతీయస్థాయిలో అభివృద్ధి చెందేలా కృషి చేస్తా.


