breaking news
Telangana
-
తెలంగాణలో భారీగా ఐపీఎస్ల బదిలీలు
సాక్షి హైదరాబాద్: రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ల బదీలీలు జరిగాయి. 20 మంది అధికారులను ఇతర ప్రదేశాలకు మారుస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వాటితో పాటు నాలుగు కమిషనరేట్ల పరిధిలోని డీసీపీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వారి వివరాలు.. చేవేళ్ల డీసీపీగా యోగేష్, కూకట్పల్లి డీసీపీగా రీతిరాజ్, శేరిలింగంపల్లి డీసీపీగా చింతమనేని శ్రీనివాస్, బేగంపేట డీసీపీగా రక్షితామూర్తి, రాజేంద్రనగర్ డీసీపీగా శ్రీనివాస్, ఉప్పల్ డీసీపీగా సురేష్, సిద్ధిపేట సీపీగా రష్మీ పెరుమాళ్, హెదరాబాద్ ఎస్పీ డీసీపీగా విజయ్ కుమార్లను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. -
గొర్రె, మేకల రక్తం మాఫియా.. ఖంగుతిన్న అధికారులు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గొర్రె, మేకల రక్తం మాఫియా వ్యవహారం తీవ్ర కలకలం సృష్టించింది. బతికున్న గొర్రెలు, మేకల నుంచి రక్తాన్ని సేకరించి అక్రమంగా వ్యాపారం చేస్తున్న ముఠాపై కేంద్ర ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. సీఎన్కే ఇంపోర్ట్ ఎక్స్పోర్టు కంపెనీపై దాడులు చేసిన 1000 లీటర్ల రక్తాన్ని సంబంధించిన ప్యాకెట్లను డ్రగ్ కంట్రోల్ అధికారులు సీజ్ చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై కేంద్ర డ్రగ్ కంట్రోల్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి దర్యాప్తు ప్రారంభమైంది.వివరాల ప్రకారం.. కేంద్ర డ్రగ్ కంట్రోల్ అధికారుల సూచనలతో హైదరాబాద్ పోలీసులు, రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అధికారులతో కలిసి కాచిగూడ ప్రాంతంలోని CNK ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ కంపెనీలో బుధవారం ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీ మొత్తంలో రక్త నిల్వలు బయటపడ్డాయి. సుమారు 1000 లీటర్లకు పైగా గొర్రె, మేక రక్తంతో నిండిన ప్యాకెట్లను అధికారులు సీజ్ చేశారు. ఇంత పెద్ద మొత్తంలో రక్తం నిల్వ చేయడం వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటన్నదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అయితే, ఈ రక్తంతో క్లినికల్ ట్రయల్స్ ఏమైనా చేస్తున్నారనే అనుమానాన్ని డ్రగ్ కంట్రోల్ అధికారులు వ్యక్తం చేశారు. సీఎన్కే కంపెనీ యజమాని నికేష్ పరారీలో ఉన్నాడు. రెండు రోజులుగా నికేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నికేష్ దొరికితే రక్త సేకరణపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కీసరలోని నిర్మానుష్య ప్రాంతం నుంచి నికేష్.. గొర్రెలు, మేకల రక్తాన్ని తెప్పించుకుంటున్నట్టు అధికారులు గుర్తించారు. -
మైనర్లతో అసభ్యకర ఇంటర్య్వూలు.. యూట్యూబర్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియా యూట్యూబ్లో చిన్న పిల్లల చేత అసభ్యకరమైన కంటెంట్ ఇంటర్వ్యూలు చేస్తున్న వారికి తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. ఇదే సమయంలో వ్యూస్ వేటలో నైతిక విలువలు మరిచి కంటెంట్, వీడియోలు చేసిన యూట్యూబర్ను హైదరాబాద్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.వివరాల మేరకు.. యూట్యూబ్లో వ్యూస్ కోసం బరితెగిస్తున్న కంటెంట్ క్రియేటర్లు, యూట్యూబర్లకు తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు షాకిచ్చారు. వైరల్ హబ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మైనర్లతో అశ్లీల ఇంటర్వ్యూలు చేసి.. వీడియోలు అప్లోడ్ చేసిన కంబేటి సత్యమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కగా, 15 నుంచి 17 ఏళ్ల బాలబాలికలతో ఇంటర్వ్యూ చేసిన సత్యమూర్తి.. అసభ్య ప్రశ్నలు, అనుచిత ప్రవర్తనకు పాల్పడినట్టు గుర్తించారు. ఈ క్రమంలో సీసీఎస్ పోలీసులు.. వారిపై పోక్సో, ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మైనర్ల విషయంలో ఇలాంటి చట్టవిరుద్ధమైన ఇంటర్వూలకు పాల్పడినా.. కంటెంట్ క్రియేట్ చేసినా.. కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. -
ఈసీ సమావేశం.. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై తెలంగాణ ఎన్నికల సంఘం కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో 2019 నాటి ఓటరు జాబితానే ప్రాతిపదికగా తీసుకోవాలని ఆదేశాలను జారీ చేసింది.తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం అధికారులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులతో పాటు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇదే సమయంలో జిల్లా కలెక్టర్లతో స్టేట్ ఎలక్షన్ కమిషన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సందర్బంగా మున్సిపల్ ఎన్నికల కోసం 2019 నాటి ఓటరు జాబితానే ప్రాతిపదికగా తీసుకోవాలని ఈసీ ఆదేశించింది. అలాగే, ఈనెల 16వ తేదీన ఓటరు తుది జాబితాను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 13వ తేదీ నాటికి పోలింగ్ స్టేషన్ల వివరాల ముసాయిదా ప్రచురించాలి. టీపోల్ యాప్లో పోలింగ్ స్టేషన్ల వివరాలు అప్లోడ్ చేయాలని తెలిపింది. ఇక, పోలింగ్ స్టేషన్లలో బీఎల్వోల ద్వారా ఓటరు వివరాలను పరిశీలన చేయాలని సూచించింది. అలాగే, ఆన్లైన్లో కూడా ఓటరు నమోదు, మార్పులకు అవకాశం ఇచ్చింది. FST, SST బృందాల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నియమావళి కఠినంగా అమలు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది.12-01-2026 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ13-01-2026న క్లెయిమ్స్, అభ్యంతరాల పరిశీలన ప్రారంభం16-01-2026న తుది ఓటరు జాబితా విడుదల చేయాలని ఆదేశం. -
TGSRTC: సంక్రాంతికి టీజీఎస్ఆర్టీసీ సన్నద్ధం
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) పూర్తి స్థాయిలో సన్నద్దమైంది. ఈ ఏడాది సంక్రాంతికి పండుగకు 6431 ప్రత్యేక బస్సులను నడపాలని యాజమాన్యం ఇప్పటికే నిర్ణయించింది. ప్రధానంగా ఈ నెల 9, 10, 12, 13 తేదీల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆయా రోజుల్లో రద్దీ మేరకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచేలా ప్లాన్ చేసింది. అలాగే, ఈ నెల 18, 19 తేదీల్లో తిరుగు ప్రయాణ రద్దీకి సంబంధించి తగిన ఏర్పాట్లు చేసింది.హైదరాబాద్లో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్బీ, బోయిన్పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతోంది. ఆయా ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం పండల్స్, షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, తాగునీటి సదుపాయం, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేయనుంది.2003లో జీవో ప్రకారం ఛార్జీల పెంపు.. ప్రధాన పండుగులు, ప్రత్యేక సందర్భాల్లో ప్రజలకు రవాణా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు స్పెషల్ సర్వీసులను ఆర్టీసీ యాజమాన్యం నడుపుతోంది. తిరుగు ప్రయాణంలో స్పెషల్ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ ఏమాత్రం లేనప్పటికీ రద్దీ ఉన్న రూట్లలో ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఖాళీ బస్సులను త్వరతగతిన సంస్థ వెనక్కి తెప్పిస్తుంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా వాటిని ఆయా రూట్లలో నడిపిస్తుంది. ఆ స్పెషల్ బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చులు, నిర్వహణ మేరకు టికెట్ ధరను సవరించుకోవాలని 2003లో జీవో నంబర్ 16ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో నడిచే స్పెషల్ బస్సుల్లో మాత్రమే 1.5 రేట్ల వరకు టికెట్ ధరలను సవరించుకునే వెసులుబాటును సంస్థకు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం ప్రతి ప్రధాన పండుగకు 1.5 రేట్ల వరకు టికెట్ ధరలను ఉమ్మడి కార్పొరేషన్గా ఉన్నప్పటి నుండి అమలు చేస్తుంది. టీజిఎస్ఆర్టీసీ ఏర్పడిన నాటి నుండి ప్రతి ప్రధాన పండుగకు దీన్ని అమలు చేస్తుంది.ఆ బస్సుల్లో ఉచిత ప్రయాణం..ఈ సంక్రాంతి పండుగకు నడిపే ప్రత్యేక బస్సులకు రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం 1.5 రేట్లు వరకు టికెట్ ధరలను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం సవరించింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు తిరిగే స్పెషల్ బస్సులకు మాత్రమే సవరించిన చార్జీలు వర్తిస్తాయి. ఈ నెల 9, 10, 12,13 తేదీలతో పాటు తిరుగు ప్రయాణ రద్దీ ఎక్కువగా ఉండే 18, 19 తేదీల్లో మాత్రమే సవరించిన చార్జీలు అమల్లో ఉంటాయి. స్పెషల్ బస్సులు మినహా రెగ్యులర్ బస్సుల్లో సాధారణ చార్జీలే అమల్లో ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వ మహాలక్ష్మి పథకంలో భాగంగా సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం యథావిధిగా అమల్లో ఉంటుంది. టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ను www.tgsrtcbus.in వెబ్ సైట్లో బుక్ చేసుకోవాలని యాజమాన్యం తెలిపింది. సంక్రాంతి ప్రత్యేక బస్సులకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 లలో సంప్రదించాలని సూచించింది. -
నా మొగుడు నాకే సొంతం
సాక్షి, వరంగల్: నా భర్త నాకు కావాలి. అది కుదరకుంటే అతను బతికి ఉండడానికి వీల్లేదు.. అంటూ వరంగల్ చౌరస్తాలో ఓ వివాహిత కత్తితో కాసేపు హల్ చల్ చేసింది. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగగా.. పోలీసులు రంగంలోకి దిగి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం వరంగల్ చౌరస్తాలో జ్యోత్స్న అనే వివాహిత తన భర్తపై దాడికి యత్నించింది. తప్పించుకున్న భర్త స్థానికంగా ఓ నగల దుకాణంలో దాక్కున్నాడు. అయితే.. ఎలాగైనా చంపుతానంటూ ఆమె రోడ్డు మీదే బైఠాయించింది. దీంతో ఆ భర్త ప్రాణభయంతో పోలీసులకు ఫోన్ చేశాడు.తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని.. తన ఆస్తులన్నింటినీ లాగేసుకున్నాడని.. ఇప్పుడు విడాకులు ఇచ్చేందుకు చూస్తున్నాడని ఆరోపిస్తూ ఆవేదన వ్యక్తం చేసిందామె. కోర్టులో కేసు నడుస్తున్నందున.. చంపాలనుకున్నట్లు చెప్పింది. అయితే ఈలోపు రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఆమె చేతి నుంచి కత్తి లాక్కుని పీఎస్కు తీసుకెళ్లారు. -
నిన్న ప్రియురాలు.. నేడు ప్రియుడు!
సాక్షి, హైదరాబాద్: ప్రేమ వ్యవహారం రెండు నిండు ప్రాణాలను బలిగొంది. ఒకరికొకరు దూరం అవుతున్నారనే బాధలో.. బలవన్మరణానికి పాల్పడి తమ కుటుంబాల్లో విషాదం నింపారు. యాచారం మండలం మేడిపల్లి గ్రామ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. హయత్ నగర్ పీఎస్ పరిధి బ్రహ్మణపల్లిలో బుధవారం ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న ఓ వెంచర్లోకి వెళ్లి పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకున్నాడు. అది గమనించిన కొందరు స్థానికులు రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతుడ్ని మేడిపల్లి గ్రామానికి చెందిన మహేష్గా గుర్తించారు. అయితే కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు విస్తుపోయే విషయం ఒకటి తెలిసింది. మేడిపల్లి గ్రామానికే చెందిన పూజ(17) నిన్న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మహేష్-పూజలు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ప్రియురాలి మృతిని తట్టుకోలేకనే మహేష్ ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే.. ఈ ఇద్దరూ గతంలోనూ సూసైడ్ అటెంప్ట్ చేసినట్ల తేలింది. రెండు నెలల కిందట ఇద్దరూ పురుగుల మందు తాగగా.. స్థానికులు గుర్తించి రక్షించారు. ఆ తర్వాత ఏమైందో తెలీయదుగానీ.. వెనువెంటనే ఇలా ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
సిట్ దూకుడు.. సీఎం సోదరుడు, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపులు తీసుకుంటోంది. ఈ కేసు దర్యాప్తులో సిట్ దూకుడు పెంచింది. తాజాగా ఇద్దరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలతో పాటు సీఎం రేవంత్రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికి సైతం నోటీసులు జారీ చేసింది. రేపు(గురువారం) తమ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్యలకు నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో మాజీ అధికారులను దఫదఫాలుగా ప్రశ్నించిన సిట్.. రాజకీయ నేతలను సైతం సిట్ విచారించడం మొదలుపెట్టింది. మొన్నీమధ్యే ఎమ్మెల్సీ నవీన్ రావును సుదీర్ఘంగా ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ఇద్దరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలను ప్రశ్నించబోతుండడం విశేషం. అయితే.. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను అధికారులు గతంలోనే విచారించారు. ఈ కేసులో మరో నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ అదనపు ఎస్పీ మేకల తిరుపతన్న ఫోన్లో లింకు దొరికిన నేపథ్యంలో.. ఆ ఆధారాలను ముందుపెట్టి ఈ మాజీ ఎమ్మెల్యేలను ప్రశ్నించారు. అయితే.. తాజాగా ఈ కేసులో సిట్ను తెలంగాణ ప్రభుత్వం మార్చింది. హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో 9 మంది అధికారుల బృందానికి ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును అప్పగించింది. అప్పటి నుంచి పొలిటికల్ లీడర్లను ప్రశ్నించడం మొదలైంది. ఇక సీఎం రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డికి సైతం సిట్ నుంచి పిలుపు వచ్చింది. ప్రతిపక్ష నేతగా ఉన్న టైంలో రేవంత్రెడ్డి కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాపింగ్కు గురైనట్లు సిట్ గుర్తించింది. ఈ క్రమంలోనే ఆయనను సైతం తమ ఎదుట హాజరు అయ్యి తాము అడిగే ప్రశ్నకు సమాధానాలు ఇవ్వాలని సిట్ కోరినట్లు సమాచారం. మరోవైపు ఈ కేసులో మాజీ మంత్రి హరీష్రావును విచారించాలన్న సిట్ ప్రయత్నం ఫలించలేదు. ఆయనపై దాఖలైన ఎఫ్ఐఆర్ను గతంలో తెలంగాణ హైకోర్టు కొట్టేయగా, తాజాగా ఆ తీర్పును ఇటు సుప్రీం కోర్టు సమర్థించడంతో ఊరట లభించినట్లైంది. ఇక.. ఈ కేసులో ప్రధాన నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్రావును సిట్ రెండు దఫాలుగా కస్టోడియల్ ఎంక్వైరీ జరిపింది. ఆ విచారణకు సంబంధించిన నివేదికను ఈ నెలాఖరులోపే దర్యాప్తు బృందం కోర్టుకు సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు విచారణ రాజకీయ మలుపు తీసుకోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. -
క్వార్టర్స్లో నెగ్గాం.. సెమీస్, ఫైనల్లోనూ మనదే గెలుపు
సాక్షి, ఖమ్మం: ఎగవేతలు, కూల్చివేతలతో కాంగ్రెస్ పాలన కొనసాగుతోందని.. అందుకే ఆ పార్టీని తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఖమ్మంలో బుధవారం నిర్వహించిన నూతన సర్పంచ్ల అభినందన సభలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ సర్కార్పై ధ్వజమెత్తారు. క్వార్టర్ ఫైనల్లో(సర్పంచ్ ఎన్నికలను ఉద్దేశించి..) మంచి ఫలితాలు వచ్చాయి. సెమీ ఫైనల్ లో మంచి ఫలితాలు వస్తాయి. చివరికి ఫైనల్ లో విజయం మనదే. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. యూరియా బస్తాలు దొరకడం లేదని రైతన్నలు చెబుతున్నారు. పాలిచ్చే గేదెను వదులుకొని.. తన్నే దున్నపోతు ను గెలిపించారని నేను వారితో చెప్పా. అయిపోయింది ఏదో అయిపోయింది.. వచ్చేది బీఆర్ఎస్ అని రైతులు నాతో చెప్పారు. రైతులు ఎంత క్లారిటీగా ఉన్నారో అర్థమైంది.బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో యూరియా కష్టాల్లేవ్. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే లైన్లలో చెప్పులు కనిపిస్తున్నాయి. షాపుల్లో లేని యూరియా యాప్ల్లో ఎలా వస్తుంది?.. కాంగ్రెస్ పాలనలో ఎగవేతలు, కూల్చివేతలు. లక్ష కోట్ల బడ్జెట్ అన్నారు.. ఏమైంది?. కౌలు రైతులకు ఇస్తామన్న డబ్బులు ఇచ్చారా?. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇచ్చారా?. రెండేళ్లలో ఏం అభివృద్ధి జరిగింది?.. కూల్చివేతలు, ఎగవేతలే కనిపిస్తున్నాయి. ఇది సర్వభ్రష్ట ప్రభుత్వం.. ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలని కేసీఆర్ పని చేశారు. ఇప్పుడు ఇదే జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నారు. కనీసం రైతులకు యూరియా ఇప్పించలేని పరిస్థితిలో ఉన్నారు. కమీషన్ల కోసమే ఆ మగ్గురు పని చేసేది. 30 శాతం ట్యాక్స్ నడిపిస్తున్నారు వాళ్లు. ఆరు గ్యారెంటీలు భద్రంగా పెట్టుకొండనీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆనాడు ఎన్నికల ప్రచారం లో చెప్పారు. ఇప్పుడు రెండేళ్లు అయిన గ్యారెంటీలు అమలు కాలేదు. దీనికి భట్టి ఏమి సమాధానం చెబుతారు?..ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ఓటమికి రంగం సిద్ధమైంది. సర్పంచ్ ఎన్నికల్లో 40 శాతం పదవులు గెలుచుకున్నాం. ఇక్కడే రెండేళ్లలోనే ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత వచ్చిందో తెలుస్తోంది. త్వరలో జగరబోయే కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి తప్పదు. ఖమ్మం నుంచి 7 నుంచి 8 స్థానాలు గెలుస్తాం అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
కేటీఆర్ రోడ్ షోలో వైఎస్సార్సీపీ జెండాల రెపరెపలు
సాక్షి, ఖమ్మం: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఖమ్మం జిల్లా పర్యటనలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కూసుమంచి మండలం నాయకన్గూడెంలో కేటీఆర్ రోడ్ షోలో వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫొటోతో పాటు వైఎస్సార్సీపీ జెండాలు రెపరెపలాడాయి. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు వైఎస్సార్సీపీ జెండాలతో జై జగన్, జై కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. -
ఐబొమ్మ రవికి మరో షాక్
సాక్షి, హైదరాబాద్: పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి బెయిల్ పిటిషన్లను నాంపల్లి హైకోర్టు కొట్టివేసింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఐదు కేసుల్లో బెయిల్ ఇవ్వాలని రవి కోర్టును ఆశ్రయించాడు. అయితే, కేసు దర్యాప్తు దశలో ఉందని కోర్టు దృష్టికి పోలీసులు తీసుకెళ్లారు. అతడికి విదేశాల్లో పౌరసత్వం ఉందని.. బెయిల్ ఇస్తే దేశం దాటి పోయే అవకాశం ఉందని తెలిపారు. విచారణ జరిపిన న్యాయస్థానం రవి బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది.కాగా, ఇమంది రవి విచారణలో పలు కీలక విషయాలు బయటపడుతున్న సంగతి తెలిసిందే. ప్రహ్లాద్తో పాటు మరో ఇద్దరి పేర్లు, వివరాలతో రవి నకిలీ గుర్తింపు కార్డులు పొందినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు నిర్థారించారు. వెల్లెల ప్రహ్లాద్ కుమార్తో పాటు అంజయ్య, కాళీప్రసాద్ పేర్లు, వివరాలు వాడి తన ఫొటోతో వీటిని పొందాడు. వీటిని ఉపయోగించి తన ఫొటోతో కొన్ని గుర్తింపు కార్డులతో దరఖాస్తు చేసి తీసుకోగా.. మరికొన్ని తయారు చేశారు.గతంలో రవి అమీర్పేట్లోని హాస్టల్లో ఉన్నప్పుడు ప్రహ్లాద్తో పరిచయమైంది. కడప జిల్లాకు చెందిన ప్రహ్లాద్ 2017లో అమీర్పేటలోని హాస్టల్ రూమ్లో రవితో కలిసి ఉన్నాడు. ఆ సమయంలో ప్రహ్లాద్కు సంబంధించిన పదో తరగతి మార్కుల లిస్టు, ఆధార్ కార్డు కలర్ జిరాక్సులు తీసుకున్నాడు. ఆపై వాటిని వాడి ప్రహ్లాద్ పేరుతోనే డ్రైవింగ్ లైసెన్స్, పాన్కార్డు తీసుకుని వీటి ఆధారంగా బ్యాంక్ అకౌంట్ తెరిచాడు. కరీంనగర్కు చెందిన అంజయ్య పేరుతోనూ రవి నకిలీ గుర్తింపుకార్డులు తయారు చేశాడు.ఇతడితో పాటు తన పదో తరగతి క్లాస్మేట్ అయిన కాళీప్రసాద్ పేరుతో రూపొందించాడు. ఈ ముగ్గురి పేర్లు, వివరాలు వాడే వెబ్సైట్ల నిర్వహణకు అవసరమైన డొమైన్లు ఖరీదు చేశాడు. హాస్పిటల్.ఇన్, సప్లయర్స్.ఇన్ తదితర వెబ్సైట్లను ఇలానే ఏర్పాటు చేశారు. ఈ రెండూ విజయం సాధించకపోవడంతోనే రవి ‘ఐబొమ్మ’ను ఏర్పాటు చేశాడు. ఇతడి బ్యాంకు ఖాతాల ద్వారా జరిగిన లావాదేవీల్లో ఇప్పటికి రూ.13 కోట్లు గుర్తించారు. వీటిలో రూ.3 కోట్లు పోలీసులు ఫ్రీజ్ చేయగా.. మిగతా రూ.10 కోట్లు విదేశాల్లో జల్సాలు, ఆస్తుల ఖరీదుకు రవి ఖర్చు చేశాడు. -
KPHB: ఆలయంలో భారీ చోరీ.. గర్భగుడి తాళాలు పగులగొట్టి..
సాక్షి, హైదరాబాద్: కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో సర్దార్ పటేల్ నగర్లోని ఆలయంలో చోరీ జరిగింది. వెంకటేశ్వరస్వామి ఆలయంలో గర్భగుడి తాళాలు పగులగొట్టి విగ్రహానికి ఉన్న నగలు అపహరించారు. సుమారు రూ.30 లక్షల విలువ చేసే 15 తులాల వెండి ఆభరణాలతో పాటు 3 తులాల బంగారు ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో గుడిలోకి ప్రవేశించి చోరీ చేసినట్లు గుర్తించారు.తెల్లవారుజామున రోజు వారిలానే ఆలయాన్ని తెరిచి పూజలు నిర్వహించే క్రమంలో పూజారులు గుర్తించారు. వెంటనే ఆలయ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
అన్యాయం చేయొద్దంటూ రైతు అర్ధనగ్న నిరసన
వికారాబాదు జిల్లా: భూ సమస్య పరిష్కారంలో తమకు అన్యాయం చేయొద్దంటూ ఓ రైతు తహసీల్దార్ కార్యాలయం వద్ద అర్ధనగ్నంగా నిరసన చేపట్టాడు. వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన రైతు హన్మయ్య 2007లో మృతిచెందాడు. ఇతనికి ముగ్గురు భార్యలు ఉండగా, వీరిలో ఈశ్వరమ్మ చనిపోయింది. హన్మయ్యకు 6.32 ఎకరాల భూమి ఉంది. దీన్ని తమ పేరిట విరాసత్ చేయాలంటూ మిగిలిన ఇద్దరు భార్యలు హన్మమ్మ, భీమమ్మ గత ఐదేళ్లుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. రెండేళ్ల క్రితం హన్మమ్మ కుటుంబీకులు విరాసత్కు దరఖాస్తు చేసుకోగా వారసత్వ ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని సూచించి, తిరస్కరించారు. అయితే, రెండు నెలల క్రితం భీమమ్మ కూతురు యాదమ్మ భూమి కోసం విరాసత్ చేసుకోగా, ఈ విషయమై అధికారులు విచారణ చేస్తున్నారు. దీంతో తమ దరఖాస్తును తిరస్కరించి, వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ హన్మమ్మ కుమారుడు సత్యం తదితరులు మంగళవారం తహసీల్ ఆఫీసు ఎదుట అర్ధనగ్న నిరసన చేపట్టారు. ఈ విషయమై తహసీల్దార్ వెంకటేశ్వర్లును వివరణ కోరగా బాధిత కుటుంబీకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, విచారణ కొనసాగుతోందని తెలిపారు. -
మా నాన్నకి పుట్టింది కొడుకు, కూతురు కాదు..!
నేను లింగమార్పిడి ద్వారా స్త్రీగా మారాను. దానికి అంగీకరించని మా కుటుంబం నన్ను వదిలేసింది. మాకు పూర్వికుల ఆస్తి ఉంది. ఇటీవలే మా అమ్మానాన్నా ఇద్దరూ చనిపోయారు. ఇప్పుడు మా అన్నయ్య ‘‘నువ్వు మగాడిగా పుట్టి ఆడదానిగా మారిపోయావు అంటే నువ్వు చచ్చిపోయినట్టే. మా నాన్నకి పుట్టింది కొడుకు. కూతురు కాదు.’’ అంటున్నాడు. అది నిజమేనా?– మాళవిక, సూర్యాపేటమీ పరిస్థితి బాధాకరం. చట్టాలలో ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ సమాజంలో ఇంకా మార్పు రాలేదు. బహుశా ఆ మార్పు రావడానికి ఇంకాస్త సమయం పట్టేలా కనిపిస్తుంది. లింగమార్పిడి చేసుకున్న స్త్రీలైనా పురుషులైనా ముందుగా వారు మనుషులు! మనిషిని మనిషిగా చూడడం కనీస మానవత్వం. అదే చట్టం – రాజ్యాంగం కూడా. అందుకనే సుప్రీంకోర్టు సైతం స్వలింగ సంపర్కులకు, లింగ మార్పిడి చేయించుకున్న వారికి, ఔఎఆఖీఖగా గుర్తింపబడే ఇతర లైంగిక వర్గాలను వివక్షించే వీలు లేదు అంటూ అనేక తీర్పులు ఇచ్చింది. ట్రాన్స్ జెండర్ల రక్షణ చట్టం, 2019లో సైతం లింగమార్పిడి చేయించుకున్న వారిపై వివక్షను రద్దు చేయడమే కాకుండా వివక్ష చూపిన వారిపై శిక్షలు కూడా విధించింది. ఉత్తరప్రదేశ్ లాంటి కొన్ని రాష్ట్రాలు లింగమార్పిడి చేయించుకున్నవారికి పూర్వీకుల వ్యవసాయ భూమిలో హక్కు ఉంటుంది అని చట్టాలు చేశాయి. అయితే మిగతా రాష్ట్రాలలో లింగమార్పిడి చేయించుకున్న వారికి వారసత్వం ద్వారా ఆస్తి ΄÷ందే విషయంలో చట్టంలో కొంత స్తబ్దత ఉన్న మాట నిజమే అయినప్పటికీ, మీ కేసులో మీ అన్నగారు మీకు ఆస్తి ఇవ్వను అనడం కుదరదు. లింగమార్పిడి చేయించుకున్నంత మాత్రాన మీరు మనుగడలో లేకుండా పోయినట్లు కాదు. అందువల్ల మీరు మీపై వివక్ష చూపుతున్న మీ అన్నయ్యపై నిరభ్యంతరంగా ΄ార్టిషన్ సూటు వేయచ్చు.హిందూ వారసత్వ చట్టంలో కూడా బైనరీ జెండర్ ఆధారంగానే అంటే వారసులుగా కేవలం ఆడ/మగ లను మాత్రమే గుర్తిస్తుంది. అయితే అదే చట్టంలోని సెక్షన్ 28 ప్రకారం, ఏదైనా వ్యాధి ఉందని గానీ, లోపం ఉంది అనిగానీ, మరే ‘‘ఇతర కారణాలు’’ చూపి అయినా గాని వివక్ష చూపడానికి వీలు లేదు – ఆస్తి ఇవ్వను అనడానికి వీల్లేదు. మీ అన్నగారు మీకు లోపం ఉంది అనే వాదన చేస్తే చేసుకోనివ్వండి. మీరేం ఆందోళన పడనక్కరలేదు. చట్టం మీ ఆస్తి మీకు వచ్చేలా చేస్తుంది. -
భార్యకు వంటరాదని విడాకులా?
సాక్షి, హైదరాబాద్: భార్య వంట చేయలేదని చెప్పి భర్త విడాకులు కోరడాన్ని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. దంపతులిద్దరూ ఉద్యోగాలు చేస్తున్న ప్పు డు భార్య వంట చేసేందుకు ఆస్కారం ఉండకపోవచ్చునని చెప్పింది. అంతేకాకుండా వంట చేయకుండా తన తల్లికి ఆమె సహకరించడం లేదని చెప్పి భార్య క్రూరత్వానికి పాల్పడిందనే భర్త వాదనను తోసిపుచ్చింది. వివరాలు ఇలా...ఎల్ఎల్బీ గ్రాడ్యుయేట్..సాఫ్ట్వేర్ ఉద్యోగినిని 2015, మేలో వివా హం చేసుకున్నారు. వైద్య సమస్యల కారణంగా 2017లో ఆమెకు గర్భస్రావమైంది. ఆ తర్వాత గృహ కలహాలతో 2018, అక్టోబర్ నుంచి ఇద్దరూ విడివిడిగా నివసిస్తున్నారు. ఈ క్రమంలో విడాకులు కోరుతూ భర్త మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కోర్టులో దావా వేశారు. జిల్లా కోర్టు విడాకులకు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ భర్త హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ మౌషుమి భట్టాచార్య, జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మా సనం విచారణ చేపట్టింది. జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన భార్య తనకు వంట చేయడంలో విఫలమైందని, తన తల్లికి రోజువారీ పనుల్లో సహకరించడం లేదన్న అతని ఆరోపణను తప్పుబట్టింది. సాఫ్ట్వేర్ ఉద్యోగిని కావడంతో విభిన్న పనివేళల దృష్ట్యా ఆమె వంట చేయకపోవడాన్ని తీవ్రంగా పరిగణించలేమని, దానిని క్రూరత్వంగా పేర్కొనలేమని అభిప్రాయపడింది. చిన్న చిన్న సమస్యలతో విడాకుల వరకు వెళ్లవద్దని సూచిస్తూ.. అప్పీల్ను కొట్టివేసింది. -
ప్రాణం తీసిన వేధింపులు
రంగారెడ్డి జిల్లా: తనను పెళ్లి చేసుకోవాలంటూ ఓ యువకుడు పెడుతున్న వేధింపులను భరించలేక, తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని నక్కర్తమేడిపల్లికి చెందిన సిద్దగోని మహేశ్, ఇదే గ్రామానికి చెందిన ఇంటర్ సెకండియర్ విద్యార్థిని పూజ(17)ను కొన్నేళ్లుగా ప్రేమిస్తున్నాడు. వీరి పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో ఆమె తనకు దక్కుతుందో.. లేదోనని ఆందోళనకు గురైన మహేశ్ నెల రోజుల క్రితం పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఆస్పత్రిలో చేరి్పంచగా, కోలుకుని ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత తరచూ పూజకు ఫోన్ చేసి తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే చచ్చిపోతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని సదరు యువతి తన కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో, ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇది తెలిసిన మహేశ్ యువతిపై మరింత ఒత్తిడి పెంచడంతో మనోవేదనకు గురై మంగళవారం ఉదయం ఇంట్లో ఉరేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు, ఇబ్రహీంపట్నంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయింది. కాగా, మహేశ్ బెదిరింపులతోనే తమ బిడ్డ చనిపోయిందని ఆరోపిస్తూ మృతురాలి కుటుంబ సభ్యులు మంగళవారం ఉద యం పూజ మృతదేహంతో యువకుడి ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. సీఐ, గ్రామస్తు లు నచ్చజెప్పడంతో శాంతించారు. మహేశ్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
నాన్నా.. మేమేం చేశాం?
మహబూబ్ నగర్ జిల్లా: భార్య విడాకులు ఇచ్చిందనే కోపంలో అతడు కిరాతకుడిలా మారాడు. అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన కొడుకు, కూతురిని కర్కశంగా హతమార్చాడు. ఆపై మూడుసార్లు ఆత్మహత్యకు యత్నించాడు. చివరకు ఆస్పత్రిలో చిక్సిత పొందుతూ మృతి చెందాడు. సీఐ రాజేందర్రెడ్డి చెప్పిన వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరు గ్రామానికి చెందిన చాకలి శివరాములుకు ఊట్కూరు మండలం పెద్దజట్రం గ్రామానికి చెందిన ఓ మహిళతో తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. శివరాములు డ్రైవర్గా పనిచేస్తూ హైదరాబాద్లో స్థిరపడ్డారు. వీరికి కూతురు రితిక, కుమారుడు చైతన్య ఉన్నారు. అయితే దంపతులు తరచూ గొడవపడేవారు. ఆరేళ్ల క్రితం భర్తను వదిలి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో శివరాములు తీలేరుకు వచ్చాడు. ఇద్దరు పిల్లల ఆలనాపాలనా శివరాములు అమ్మానాన్న చూసేవారు. ఈ క్రమంలో దంపతులను కలపాలని రెండుసార్లు గ్రామపెద్దలు పంచాయతీ పెట్టారు. ఫలితం లేకపోవడంతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించగా.. గతేడాది మార్చి నెలలో కోర్టు విడాకులు మంజూరు చేసింది. అప్పటి నుంచి శివరాములు మనస్తాపానికి గురై ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. మూడు రోజుల నుంచే ప్లాన్.. తాను చనిపోతే పిల్లలు అనాథలు అవుతారని భావించిన శివరాములు మూడు రోజుల క్రితం నిర్ణయించుకున్న ఓ ప్లాన్ ప్రకారం తన ఇద్దరు పిల్లలు రితిక(8), చైతన్య(6)లను పొలం దగ్గరకు తీసుకెళ్లి రాత్రి అక్కడే నిద్రించి ఉదయం ఇంటికి వచ్చేవారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం భోజనం చేయకుండా తన పిల్లలను బైక్పై తీసుకెళ్లాడు. ఇంటికి రాకపోవడంతో శివరాములు తమ్ముడి భార్య రాత్రి 8 గంటలకు ఫోన్ చేయగా రితిక అనారోగ్యంతో ఉందని మరికల్ ఆస్పత్రికి తీసుకొచ్చా.. డాక్టర్కు చూపించి వస్తానని చెప్పి ఫోన్ పెట్టేశాడు. మళ్లీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా వెళ్లి కూతురు, కుమారుడిని పొలం దగ్గర ఉన్న పశువుల కొట్టంలో పడుకోబెట్టాడు. అర్ధరాత్రి సమయంలో వారు గాఢనిద్రలో ఉండగా తాడుతో ఒక్కొక్కరి గొంతు నులిమి చంపేశాడు. పొలం పక్కనే ఉన్న కోయిల్సాగర్ సాగునీటి కాల్వలో మృతదేహాలను పడేసి నీళ్లలో లోపలికి తొక్కేశాడు. పిల్లలను చంపిన తర్వాత తానూ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ముందుగా పొలం దగ్గర ఉన్న గడ్డి మందు తాగాడు. ఆపై పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను పట్టుకున్నాడు. అయితే సింగిల్ ఫేజ్ ఉండి అది ట్రిప్ కావడంతో షాక్ కొట్టి వదిలేసింది. మళ్లీ పశువుల కొట్టంలోకి వచ్చి గడ్డపారతో పొడుచుకొని చనిపోవాలని ప్రయత్నించాడు. అది కూడా సాధ్యం కాకపోవడంతో బ్లేడ్తో గొంతు కోసుకున్నాడు. అయినా చనిపోకపోవడంతో తనను బతికించాలని పక్క పొలం రైతులకు మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు ఫోన్ చేశాడు. వారు వెంటనే అక్కడకుచేరుకొని చికిత్స నిమిత్తం మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. పిల్లలను కాల్వలో నుంచి బయటకు తీశారు. శివరాములు పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్లోని ఉస్మానియాకు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని చిన్నారుల మృతదేహాలను నారాయణపేట ఆస్పత్రికి తరలించారు. కాగా.. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో రితిక 4వ తరగతి, చైతన్య 1వ తరగతి చదువుతున్నారు. డబ్బులు ఇవ్వడం లేదని.. తండ్రిని చంపిన తనయుడు పాపన్నపేట(మెదక్): డబ్బులు ఇవ్వలేదనే కోపంతో ఓ కొడుకు కన్నతండ్రినే దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని సీతానగర్లో చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్గౌడ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన లంగడి లక్ష్యయ్య (48) వ్యవసాయంతోపాటు విద్యుత్ లైన్మెన్ వద్ద సహాయకుడిగా పనిచేస్తున్నాడు. భార్య శేఖమ్మతోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు శ్రీకాంత్ వివాహం, వ్యవసాయం నిమిత్తం కొంత అప్పులు చేశాడు. శ్రీకాంత్ ఏ పని చేయకుండా జులాయిగా తిరుగుతూ, ఖర్చుల కోసం తరచూ తండ్రిని వేధింపులకు గురిచేసేవాడు. ఈ క్రమంలో పలుమార్లు తండ్రీకొడుకు మధ్య గొడవలు జరిగాయి. సోమవారం రాత్రి లక్ష్మయ్య ఇంటికి రాగానే కొడుకు డబ్బులు అడగడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆవేశంతో శ్రీకాంత్ ముందుగా సుత్తితో తండ్రిపై దాడి చేయగా, తల్లి కొడుకు చేతి నుంచి సుత్తి లాక్కుంది. తీవ్ర ఆవే«శంతో రగిలిపోతున్న శ్రీకాంత్.. అక్కడే ఉన్న కర్రతో తండ్రి తలపై బాదాడు. తీవ్రంగా గాయపడిన లక్ష్మయ్యను చికిత్స నిమిత్తం మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు చెప్పారు. -
లాస్ట్ మినిట్లో మారిన లొంగుబాట
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: పీఎల్జీఏ బెటాలియన్ వన్ కమాండర్ బర్సె దేవా లొంగుబాటు విషయంలో ఛత్తీస్గఢ్, తెలంగాణ పోలీసులు పోటాపోటీగా వ్యూహాలు అమలు పరిచినట్టు తెలుస్తోంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాతోపాటు పీఎల్జీఏ బెటాలియన్ వన్ కమాండర్ బర్సె దేవాను లొంగిపోవాలని కోరుతూ వారి స్వగ్రామమైన పూవర్తికి ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం విజయ్శర్మ గతేడాది నవంబర్ 6న వెళ్లారు. హిడ్మా, దేవా తల్లులైన పొజ్జి, హింగేలతో కలిసి భోజనం చేశారు. ఇద్దరూ లొంగిపోవాలని వారి తల్లులతో పిలుపునిప్పించారు. అయితే నవంబర్ 18న ఏపీలో జరిగిన మారేడుమిల్లి ఎన్కౌంటర్లో హిడ్మా చనిపోయాడు. ఈ ఘటన అనంతరం మావోయిస్టు మద్దతుదారులతోపాటు స్థానిక ప్రజానీకంలోనూ హిడ్మా పట్ల సానుభూతి పెరిగింది. ఈ నేపథ్యంలో ఇటు ఛత్తీస్గఢ్ సర్కార్, అటు కేంద్రం తదుపరి ఆపరేషన్లపై ఆచితూచి వ్యవహరించాయి. ఇదే సమయంలో ఛత్తీస్గఢ్లో మైనింగ్ కోసం చేపట్టిన భూసేకరణ ప్రక్రియ రణరంగంగా మారడం పరిస్థితి తీవ్రతను మరింతగా పెంచింది. దీంతో ఎన్కౌంటర్లకు బదులు తమ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ద్వారా బర్సె దేవాను లొంగుబాటుకు ఒప్పించేందుకు కేంద్రం ముమ్మరంగా ప్రయతి్నంచినట్టు సమాచారం. అప్రమత్తమైన తెలంగాణఛత్తీస్గఢ్ పోలీసుల నుంచి వచ్చిన లొంగుబాటు ప్రయత్నాలపై నిర్ణయం తీసుకునే విషయంలో బర్సె దేవా ఒకటికి రెండుసార్లు ఆలోచించినట్టు తెలుస్తోంది. చివరకు ఛత్తీస్గఢ్ కంటే తెలంగాణలో లొంగిపోవడమే మేలని భావించి ఇటు దిశగా వచి్చనట్టు సమాచారం. అయితే, అనుకున్నంత వేగంగా లొంగుబాటు ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో తన ‘నెట్వర్క్’ద్వారా బర్సె దేవా ఛత్తీస్గఢ్ పోలీసుల టచ్లోకి వెళ్లేందుకు ప్రయతి్నంచినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు లొంగుబాటు ‘ముచ్చట్లు’సాగించేందుకు అక్కడి నుంచి ప్రతినిధులు గోదావరి తీర ప్రాంత అడవుల్లోకి చేరుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే తెలంగాణ పోలీసులు అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. వెనువెంటనే బర్సె దేవా ‘లొకేషన్’కు చేరుకొని, అక్కడి నుంచి సరెండర్ ప్రక్రియను ఆగమేఘాల మీద పూర్తి చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. అకస్మాత్తుగా బర్సె దేవా బృందం మాయం కావడంతో పౌరహక్కుల సంఘాలు సైతం ఆందోళన వ్యక్తం చేశాయి. వరుస ఎన్కౌంటర్లు హిడ్మా ఎన్కౌంటర్తో జరిగిన డ్యామేజ్ను ఎంతో కొంత పూడ్చుకునేందుకు బర్సె దేవా లొంగుబాటును ఉపయోగించుకునే ప్రయత్నాలు విఫలం కావడంతో బస్తర్లో యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్లో ఉన్న బలగాలు తమ పంథాను మార్చుకున్నట్టు సమాచారం. బర్సె దేవా లొంగుబాటు ప్రక్రియ అధికారికంగా జరగాల్సిన రోజు ఉదయమే బీజాపూర్, సుక్మా జిల్లాల్లో వేర్వేరుగా రెండు ఎన్కౌంటర్లు చోటు చేసుకున్నాయి. ఆ రోజు 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరోవైపు బర్సె దేవా లొంగుబాటు విషయంలో తెలంగాణ పోలీసులు వ్యవహరించిన తీరుకు అతని స్వగ్రామమైన పూవర్తి నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. -
సంక్రాంతి పందేనికి.. సై..
సంక్రాంతి పండుగ దగ్గర పడుతోంది. సంక్రాంతి అంటేనే రంగవల్లులు, పిండివంటలు, కోడిపందేలు గుర్తుకొస్తాయి. అయితే ఈ కోడిపందేల ఆటలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచాయి. వేల మంది వీక్షించేలా ఏకంగా స్టేడియాల్లో పోటీలు నిర్వహించేందుకు ఈసారి తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోనూ అమ్మకానికి పందెం కోళ్లు సిద్ధమయ్యాయి. దీనిని నగరంలోని కొందరు ఔత్సాహికులు ఉపాధి మార్గంగా ఎంచుకుని నగర శివారులోని ఫామ్హౌస్లలో భారీగా పందెం పుంజులను పెంచుతున్నారు. వీటికి ప్రత్యేక శిక్షణ, హై క్లాస్ ఆహారాన్ని అందిస్తూ అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నగరంలో ఔత్సాహికులు పెరగడంతో కోళ్లకు భారీగా డిమాండ్ ఏర్పడింది. దీంతో ఒక్కో పుంజు దాని జాతి, రంగును బట్టి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకూ అమ్ముడుపోతున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కోడిపందేలు సంక్రాంతి సంస్కృతిలో ఓ భాగం. దీంతో ఈ సారి భారీ ఎత్తున పందేల నిర్వహణకు ఏర్పాటు జరుగుతున్నాయి. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి స్టేడియాలను తలపించే నిర్మాణాలు దీని కోసం చేస్తున్నారంటే పందేలకు ఉన్న క్రేజ్ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. కుస్తీ పోటీల్లో ఉన్నట్లుగా రింగుల మధ్యలో ఇసుక పోసి.. గైడ్ ఆధ్వర్యంలో బరువులో సరితూగే పుంజులను పోటీకి ఎంపిక చేస్తుంటారు. వీటికి బ్లేడ్లు, చిరుకత్తులు కాళ్లకు కట్టి బరిలోకి దింపుతారు. బరిలో పందెం కోళ్లు కత్తులు దూస్తుంటే.. రింగు బయట జనం ఈలలు, చప్పట్లతో హుషారుగా పందేలు కాస్తూ.. గెంతులేస్తుంటారు. శిక్షణ కోసం ఎంపిక.. పందేల్లో పాల్గొనే కోళ్లను చిన్న పిల్లగా ఉన్నప్పుడే పరిశీలించి, ఎంపిక చేసి వాటిని ప్రత్యేకంగా సిద్ధం చేస్తారు. అయితే సిద్ధం చేసే ప్రక్రియ కూడా ఓ పెద్ద వ్యాపారంగా మారింది. చాలా మందికి ఇదొక ఉపాధి మార్గంలా కనిపిస్తోంది. జనవరిలో జరిగే పందేల కోసం సెపె్టంబర్ నుంచే సన్నాహాలు చేస్తుంటారు. కొన్ని రకాల కోడిపుంజులను బిహార్ వంటి ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుని, వాటిని పందేలకు సన్నద్ధం చేస్తుండటం విశేషం. పుంజుల ఎంపిక నుంచి వాటిని పందేలకు సిద్ధం చేయడం వరకూ ప్రత్యేక ప్రాధాన్యత కలిగిన అంశమని, ప్రత్యర్థి కోడితో పోరు సాగించాలంటే తమ కోడికి అన్ని రకాల తరీ్ఫదులు అందిస్తామని పెంపకందారులు చెబుతున్నారు.హై క్లాస్ డైట్.. పందెం పుంజులకు నాణ్యమైన ఆహారం అందిస్తారు. గంట్లు, చోళ్ళు, జొన్నలు, బియ్యం, రాగులు, మినప, శనగపప్పు గోధుమ మిశ్రమాన్ని తినిపిస్తారు. దీంతోపాటు జీడిపప్పు, బాదం, పిస్తా, ఎండు ఖర్జురం, కిస్మిస్ వంటి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. రోజూ కోడిగుడ్డు కూడా ఇస్తారు. కొన్నిటికి బోన్లెస్ చికెన్, మటన్ కీమా కూడా ఆహారంగా ఇస్తారు. కొందరు మేకపాలు కూడా తాగిస్తుంటారు. తిన్నది ఒంటికి పట్టే విధంగా కసరత్తులు, మార్నింగ్ వాక్ చేయిస్తారు. పౌష్టికాహారంతో పాటుగా రోజూ ఎక్సర్సైజులు చేయిస్తారు. స్విమ్మింగ్, రన్నింగ్ చేసేందుకు ఏర్పాట్లుంటాయి. పందేలకు పుంజులను సిద్ధం చేయడానికి కొందరు నిపుణులు కూడా తయారయ్యారు. వీరు కోళ్లకు ఉదయాన్నే మౌత్ వాష్ చేయిస్తారు. పందెం కోడి నిర్వహణకు నెలకు ఐదు నుంచి ఆరు వేల వరకు ఖర్చు అవుతుంది.ఆన్లైన్లోనూ అమ్మకాలు.. సంక్రాంతి బరిలో నిలబడే ప్రత్యర్థి కోడిని ఓడించడమే లక్ష్యంగా పందేం రాయుళ్లు కోడి పుంజులను కొనుగోలు చేస్తుంటారు. దేశ, విదేశాల్లోని ప్రధాన నగరాల్లో స్థిరపడి సొంత ఊరికి కోడి పందేల కోసం వచ్చేవారు ఆన్లైన్లో పుంజులను కొనుగోలు చేస్తున్నారు. ఇందు కోసం పెంపకందారులకు అధిక మొత్తంలో అడ్వాన్స్ చెల్లిస్తున్నారు. ఇక నగరాల్లో నివసించే వారూ పందేలపై ఉన్న ఆసక్తితో ఇప్పటి నుంచే కొనుగోలు చేస్తున్నారు. దీంతో నగరంలోనూ పందెం కోళ్ల పెంపకం భారీ స్థాయిలో జరుగుతోంది.రకాలు.. ఎంపికలు.. కోడిపందేనికి కొన్ని రకాల జాతులు పనికిరావు. ప్రత్యేకంగా సూచించిన వాటినే కోడిపందేలకు ఉపయోగిస్తారు. వీటిలో కనీసంగా 25 రకాల కోడిపుంజులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లో పందేలకు దింపుతుంటారు. ఇందులో ప్రధానంగా కాకి, నెమలి, సవళ, రసంగి, డేగ, తెల్లపర్ల, కాకిడేగ, కత్తిరాయి, జుమర్, నూరి, కగర్, డుమర్, యాకూద్, అబ్రాస్, పచ్చకాకి, సేత్వా, అసీల్ వంటివి ప్రధానంగా పోటీలో కనిపిస్తుంటాయి. దీంతోపాటు రంగులను బట్టి కోళ్లను రకాలుగా విభజిస్తారు. అంతేకాకుండా ఏ రకం కోడి ఏ కోడితో, ఏ సమయంలో పందేలకు దిగితే ఫలితాలొస్తాయో కూడా శాస్త్రబద్ధమేనని స్థానికులు చెబుతుంటారు. అన్ని రకాల శిక్షణలు పూర్తయిన తర్వాచ పెందేలకు సిద్ధం చేస్తారు. ఇలా పెరిగిన కోడి పుంజుల ధర లక్షల్లో ఉంటుంది. ఒక్కో పుంజు కనీసం రూ.50వేల నుంచి రూ.2లక్షల వరకు పలుకుతుంది. -
ఫ్రీ కదా.. పోయొద్దాం
సాక్షి, హైదరాబాద్: స్టడీ టూర్ పేరిట ఇతర సిటీలను చూసేందుకు వెళ్లిన కార్పొరేటర్ల అవస్థలు అన్నీఇన్నీ కావు. వారిని చూసి పలువురు జాలి పడుతున్నారు. సాధారణంగా.. నగర పాలనకు సంబంధించి ఇతర సిటీల్లో అమలవుతున్న మెరుగైన విధానాలను అధ్యయనం చేసి, వాటిని హైదరాబాద్లో అమలు చేసే అంశాన్ని పరిశీలించేందుకు కార్పొరేటర్లు స్లడీ టూర్లకు వెళ్తారు. తాము అధ్యయనం చేసిన అంశాల్ని, వాటిని ఇక్కడ ఎలా అమలు చేయవచ్చో పేర్కొంటూ ఒక నివేదిక రూపొందించి కమిషనర్కు అందజేస్తారు. సాధ్యాసాధ్యాలు పరిశీలించి అమలు చర్యలు చేపడతారు. కార్పొరేటర్ల స్టడీటూర్కయ్యే వ్యయాన్ని జీహెచ్ఎంసీ ఖజానా నుంచే చెల్లిస్తారు. జీహెచ్ఎంసీలో చేయాల్సిన పనులకు కాబట్టి జీహెచ్ఎంసీ నుంచి ఖర్చు చేస్తారు. అందుకు ఎవరికీ అభ్యంతరం లేదు. ఎందుకీ అభ్యంతరాలు ? కార్పొరేటర్ల టూర్లపై పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. గతంలో స్టడీటూర్ల పేరిట ఆయా నగరాలు తిరిగి వచ్చి , ఇక్కడ చేసిందేమీ లేకపోవడం ఒక కారణం కాగా.. మరో నెలరోజుల్లో పదవి నుంచి దిగిపోనున్న వారు ఇక చేసేదేముంటుందన్నది ప్రధాన అభ్యంతరం. ప్రజా ధనంతో ఇలాంటి టూర్లను అనుమతించరాదంటూ ఫోరమ్ ఫర్ గుడ్గవర్నెన్స్ సహా పలు సంస్థలు, ప్రజలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో లోకాయుక్త సైతం ప్రజాధనంతో కార్పొరేటర్ల టూర్లను ఆక్షేపించింది. ఈ నేపథ్యంలో గుట్టుచప్పుడు కాకుండా.. మేయర్ సహా అహ్మదాబాద్ కు బయలుదేరారు. దిగిపోయేముందు ఈ టూర్లు అనవసరమని భావించి స్వచ్ఛందంగానే టూర్లను విరమించుకున్న కార్పొరేటర్లు కూడా ఉండటం విశేషం. టూర్ కోసం జీహెచ్ఎంసీ ఒక్కో కార్పొరేటర్కు దాదాపు లక్ష రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. కార్పొరేటర్లు టూర్లు చేయాలనుకుంటే కష్టమేం కాదు. ఏ కొందరో మినహా, ఎన్నికల్లో గెలిచేందుకు లక్షలకు లక్షలు ఖర్చు చేశారు. అలాంటి వారికి ఈ టూర్కయ్యే వ్యయం లెక్కలోది కాదు. అలాంటప్పుడు ఈ కక్కుర్తి ఏమిటన్నదే సాధారణ ప్రజల ప్రశ్న. పదవి దిగిపోయే ముందు అపప్రథ మూటగట్టుకోవడం తప్ప ఇప్పుడీ టూర్ ఎందుకన్నదానికి ‘స్టడీ’టూర్కు వెళ్లిన, వెళ్లనున్న వారేమైనా సమాధానం చెబుతారేమో వేచి చూడాల్సిందే. పేరుకు మాత్రమే.. జీహెచ్ఎంసీలో కొంతకాలంగా, మరీ ముఖ్యంగా ప్రస్తుత పాలకమండలి హయాంలో స్టడీ టూర్లంటే విహార యాత్రలనే ముద్ర పడేలా చేశారు. పేరు మాత్రం స్టడీ టూర్లంటూ ఇష్టమొచ్చినట్టు నగరాల్ని రెండు మూడు బ్యాచ్లుగా వెళ్లి వచ్చేలా అలవాటు చేశారు. వెళ్లనివారు అనివార్య కారణాల వల్ల వెళ్లలేదని పేర్కొంటూ ప్రయాణ చార్జీల్ని పొందిన ఘటనలు కూడా గతంలో ఉన్నాయి. తాజాగా మంగళవారం 40 మందికి పైగా అహ్మదాబాద్ వెళ్లినట్లు సమాచారం. అహ్మదాబాద్లోని నర్మద రివర్ప్రాజెక్ట్ అధ్యయనం పేరిట వెళ్లారు. మిగతా వారు సంక్రాంతి పండగ తర్వాత వెళ్లేందుకు ప్లాన్ సిద్ధం చేశారు. -
పేలనున్న సూపర్నోవా!
అంతరిక్ష వీధిలో మరో తారకు ఆయువు మూడింది. అంతర్ధానానికి అతి సమీపానికి చేరింది. ఆ నక్షత్రం పేరు బెటెల్గేస్. ఓరియన్ నక్షత్రమండలంలో అత్యంత ప్రకాశవంతమైన తార ఇదే. బెటెల్గెస్ ఓ రెడ్ సూపర్జెయింట్ స్టార్. అంటే ఆయుఃప్రమాణం దాదాపుగా ముగింపుకు వచి్చన నక్షత్రమన్నమాట. అయితే కొన్ని దశాబ్దాలుగా అంతరిక్ష శాస్త్రవేత్తలను ఆకర్షిస్తోంది. ఎందుకంటే అంత పెద్ద నక్షత్రమై ఉండి కూడా ఇది చూసేందుకు ఓ తోకచుక్క మాదిరిగా కనిపిస్తూ ఉంటుంది. దాని ఒక కొస నుంచి తోక మాదిరిగా వాయుసమూహం సుదూరాల దాకా విస్తరించి ఉండటమే ఇందుకు కారణం. బహుశా ఇప్పటికే ఉనికిని కోల్పోయిన మరో నక్షత్రం తాలూకు శక్తిని కూడా బెటెల్గెస్ అందిపుచ్చుకుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు.భారీ తారలు తమ చుట్టూ ఉన్న సంక్లిష్ట వ్యవస్థలతో ఎలా ప్రతిక్రియ జరుపుతాయో తెలుసుకునేందుకు బెటెల్గెస్ ఉదంతం బాగా ఉపయోగపడుతోందని వారంటున్నారు. ఈ నక్షత్రం సూపర్నోవాగా మారి అతి త్వరలో పేలిపోనుందని హబుల్ టెలిస్కోప్ తాజాగా ధ్రువీకరించింది. అది ఎప్పుడు జరగొచ్చన్నది వీలైనంత కచి్చతంగా అంచనా వేసేందుకు సైంటిస్టులు ప్రయతి్నస్తున్నారు.ఏమిటా తోక?: బెటెల్గెస్ తాలూకు ‘తోక’ఇప్పుడు శాస్త్రవేత్తల నడుమ హాట్ టాపిక్గా మారింది. నక్షత్రం నుంచి అది అస్తవ్యస్తంగా సుదూరాల దాకా పొడుచుకుని వచి్చనట్టుగా కనిపిస్తోంది. హబుల్ టెలిస్కోప్ తాలూకు అతి శక్తిమంతమైన పరారుణ ఇమేజింగ్ సాయంతో ఈ తోక ఆనుపానులను సైంటిస్టులు తాజాగా అతి స్పష్టంగా కనిపెట్టారు. ఈ తోక ప్రాంతం మరో నక్షత్రం ప్రభావానికి, దాని గురుత్వాకర్షణ శక్తికి లోనవుతోందని, అందుకే అస్తవ్యస్తంగా వంపులు తిరుగుతున్నట్టుగా కనిపిస్తోందని వివరించారు. ‘‘ఆ తార స్పష్టంగా హబుల్ కంటికి చిక్కకపోయినా దాని ప్రభావం మాత్రం సుస్పష్టం.ఎందుకంటె బెటెల్గెస్ నుంచి బయటికి వెరజిమ్ముతున్న ప్రతి పదార్థమూ బయటి శక్తి ద్వారా ఒకరకమైన బలమైన లాగుడుకు లోనవుతోంది. చ్రి™కవిచిత్రమైన ఆకారాలు దాలుస్తోంది’’అని వారు చెప్పుకొచ్చారు. ఎందుకంత ప్రాధాన్యం?: బెటెల్గెస్ తోక తాలుకు స్వరూప స్వభావాలను సరిగా అర్థం చేసుకోవడం చాలా కీలకంగా మారనుంది. ఇప్పటిదాకా మిస్టరీగానే ఉన్న ఆస్ట్రోఫిజిక్స్ తాలూకు పలు చిక్కుముడులను విప్పడంలో ఇది ఎంతగానో దోహదపడవచ్చన్నది సైంటిస్టుల ఆశాభావం. అంతేగాక ఇలాంటి భారీ నక్షత్రాలు సూపర్నోవాగా మారి పేలినప్పుడు వాటినుంచి బయటికి విరజిమ్మే మూలకాలు, పదార్థాలు అంతరిక్షాన్ని మరింత సుసంపన్న చేస్తాయని చెబుతున్నారు.నిజానికి బెటెల్గెస్ ప్రవర్తన, దాని తీరుతెన్నులు ఇటీవలి కాలం దాకా సైంటిస్టులను బాగా తికమక పరిచాయి. ముఖ్యంగా 2019–20 నడుమ అది ఉన్నట్టుండి పూర్తిగా కాంతివిహీనంగా మారిపోయి అందరినీ ఆశ్చర్యపరిచింది! ‘‘అందుకే ఈ భారీ నక్షత్రం గురించి తెలుసుకుంటున్న కొద్దీ మరిన్ని కొత్త విషయాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇది నిజంగా గొప్ప విషయం’’అని సైంటిస్టులు చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఊపిరినిచ్చే ‘విటమిన్–సీ’
విటమిన్–సీ.. రోగనిరోధక శక్తిని పెంచడంలో దీనిది ప్రత్యేక పాత్ర. విటమిన్–సీ ప్రయోజనాల చిట్టా చాలా పెద్దదే. అయితే ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న వాయుకాలుష్య సంబంధ ఊపిరితిత్తుల వ్యాధుల నుంచి రక్షించడంలో విటమిన్–సీ దోహదం చేస్తుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. వాహనాల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలు, వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం వల్ల వచి్చన పొగ, దుమ్ముతో కూడిన తుపానుల వల్ల కలిగే ఊపిరితిత్తుల వ్యాధుల నుంచి ప్రజలను రక్షించడంలో విటమిన్–సీ ప్రయోజనకారి అని యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ సిడ్నీ (యూటీఎస్), వూల్కాక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇటీవల ఆ్రస్టేలియాలో నిర్వహించిన అధ్యయనంలో తేలింది. పీఎం–2.5 కాలుష్యానికి గురైన ఎలుకలు, ప్రయోగశాలలో పెరిగిన మానవ కణజాలాలపై వరుస ప్రయోగాలు చేయడం ద్వారా విటమిన్–సీ ప్రభావాలను పరిశోధకులు పరీక్షించారు.మైటోకాండ్రియాకు రక్షణపీఎం2.5 ప్రేరిత కణ అసమతుల్యత, వాపును విటమిన్–సీ సమర్థవంతంగా నిరోధిస్తుందని పరిశోధన కనుగొంది. కణాలలో హానికరమైన పదార్థాలను తగ్గించడంలో సహాయపడుతుందని.. మైటోకాండ్రియా దెబ్బతినకుండా కాపాడుతుందని తేలింది. వాయు కాలుష్యం వల్ల అధిక ప్రమాదం పొంచి ఉన్న వ్యక్తులకు విటమిన్–సీ సహాయపడుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. కోట్లాది మంది ప్రజలను ప్రభావితం చేసే ప్రపంచ సమస్యకు తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారంగా దీన్ని పరిగణిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే సిఫార్సు చేసిన గరిష్ట మోతాదు వరకే విటమిన్–సీని తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. కానీ మోతాదుకు మించి తీసుకుంటే ప్రమాదమని.. వైద్యుల సూచన మేరకే స్వీకరించాలని స్పష్టం చేశారు. అదే సమయంలో వాయు కాలుష్యం వల్ల కలిగే నష్టాలన్నింటినీ తొలగించగల అద్భుత పదార్ధం ఇది కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.ప్రాణాలను హరిస్తోంది..గాలి నాణ్యతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించిన పీఎం–2.5 స్థాయి ఏడాదిలో ఒక్కో క్యూబిక్ మీటర్కు 40 ్పమైక్రోగ్రామ్స్ వరకు ఆమోదయోగ్యం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఇది 5 ్పమైక్రోగ్రామ్స్ మించకూడదు. పారి్టక్యులేట్ మ్యాటర్ (పీఎం)–2.5 అంటే 2.5 మైక్రోమీటర్లు లేదా అంతకంటే తక్కువ వ్యాసంగల కణ పదార్థం. ఇది మానవ జుట్టు కంటే దాదాపు 30 రెట్లు చిన్నగా ఉంటుంది. వాహనాల నుంచి వెలువడే పొగ, ధూళి గాలిలోకి కలిసి ప్రాణాలను హరిస్తున్నాయి. ఈ కణాలు చాలా చిన్నవి కాబట్టి ఊపిరితిత్తులు, రక్తప్రవాహంలోకి ప్రవేశించి గుండె, ఊపిరితిత్తుల వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు, అకాల మరణాలను గణనీయంగా పెంచుతున్నాయి. వాయు కాలుష్యం ధూమపానం కంటే ప్రమాదకారి. స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ నివేదిక–2025 ప్రకారం ఎయిర్ పొల్యూషన్తో ప్రపంచవ్యాప్తంగా 2023లో 79 లక్షల మంది మరణించారు.ప్రపంచవ్యాప్తంగా విటమిన్–సీ అమ్మకాల విలువ 2024లో రూ.19,800 కోట్లు2030-34 మధ్య విక్రయాల విలువ రెండింతలు దాటుతుందని మార్కెట్ అంచనాప్రయోజనాలు ఎన్నో..⇒ చర్మ ఆరోగ్యానికి కావాల్సిన కొల్లాజెన్ ఉత్పత్తికి, కణాలు దెబ్బతినకుండా రక్షించడానికి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్గా విటమిన్–సీ పనిచేస్తుంది. ⇒ దీర్ఘకాలిక వ్యాధులు, గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ⇒ ఎముకలు, రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచడంలో దోహదపడుతుంది. ⇒ గాయాలను నయం చేయడంతోపాటు మహిళల్లో వంధ్యత్వాన్ని ఎదుర్కోవడంలో తోడ్పడుతుంది. -
భార్యకు వంటరాదని విడాకులా? : హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: భార్య వంట చేయలేదని చెప్పి భర్త విడాకులు కోరడాన్ని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. దంపతులిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు భార్య వంట చేసేందుకు ఆస్కారం ఉండకపోవచ్చునని చెప్పింది. అంతేకాకుండా వంట చేయకుండా తన తల్లికి ఆమె సహకరించడం లేదని చెప్పి భార్య క్రూరత్వానికి పాల్పడిందనే భర్త వాదనను తోసిపుచ్చింది. వివరాలు ఇలా...ఎల్ఎల్బీ గ్రాడ్యుయేట్..సాఫ్ట్వేర్ ఉద్యోగినిని 2015, మేలో వివాహం చేసుకున్నారు. వైద్య సమస్యల కారణంగా 2017లో ఆమెకు గర్భస్రావమైంది. ఆ తర్వాత గృహ కలహాలతో 2018, అక్టోబర్ నుంచి ఇద్దరూ విడివిడిగా నివసిస్తున్నారు. ఈ క్రమంలో విడాకులు కోరుతూ భర్త మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కోర్టులో దావా వేశారు. జిల్లా కోర్టు విడాకులకు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ భర్త హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ మౌషుమి భట్టాచార్య, జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మా సనం విచారణ చేపట్టింది. జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన భార్య తనకు వంట చేయడంలో విఫలమైందని, తన తల్లికి రోజువారీ పనుల్లో సహకరించడం లేదన్న అతని ఆరోపణను తప్పుబట్టింది. సాఫ్ట్వేర్ ఉద్యోగిని కావడంతో విభిన్న పనివేళల దృష్ట్యా ఆమె వంట చేయకపోవడాన్ని తీవ్రంగా పరిగణించలేమని, దానిని క్రూరత్వంగా పేర్కొనలేమని అభిప్రాయపడింది. చిన్న చిన్న సమస్యలతో విడాకుల వరకు వెళ్లవద్దని సూచిస్తూ.. అప్పీల్ను కొట్టివేసింది. -
డ్రగ్స్ సరఫరా చేస్తున్న విదేశీ మహిళ డిపోర్టేషన్
సాక్షి, హైదరాబాద్: స్థానికంగా మత్తుపదార్థాలు సరఫరా చేస్తున్న నైజీరియాకు చెందిన ఓ మహిళను తెలంగాణ ఈగల్ ఫోర్స్ మన దేశం నుంచి బహిష్కరించింది. మంగళవారం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఈమెను నైజీరియాకు తరలించారు. ఈ మేరకు ఈగల్ ఫోర్స్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. నైజీరియాకు చెందిన ముగ్గురు మహిళలు నకిలీ పాస్పోర్ట్, నకిలీ వీసాలతో భారత్కు వచ్చారు. ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి విశాఖపట్నం చేరుకున్న వారు స్థానికంగా షెల్టర్ తీసుకున్నారు. ఒక ఫ్లాట్ను అద్దెకు తీసుకుని డ్రగ్స్ అమ్మకాలు చేస్తున్నారు.నవంబర్ మొదటి వారంలో తెలంగాణ ఈగల్ ఫోర్స్ పోలీసులు ఢిల్లీలో నిర్వహించిన భారీ ఆపరేషన్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆపరేషన్లో 50 మందికి పైగా నైజీరియన్లను అరెస్ట్ చేయగా.. విశాఖపట్నంలో డ్రగ్స్ దందా చేస్తున్న ముగ్గురు మహిళల సమాచారం తెలిసింది. ఈ మేరకు డిసెంబర్లో విక్టరీ ఇటోహాన్ ఇయాసేలే సహా ముగ్గురు విదేశీ మహిళలను ఈగల్ ఫోర్స్ అరెస్ట్ చేసింది. ముగ్గురికీ హైదరాబాద్లోని ఫారినర్స్ రీజినల్ రిజి్రస్టేషన్ ఆఫీస్లో (ఎఫ్ఆర్ఆర్వో) బయోమెట్రిక్ నిర్వహించారు.ఆమెకు జింబాబ్వేకు చెందిన దంబుజా తఫాడ్జ్వా పేరున నకిలీ పాస్పోర్ట్, వీసా ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత ఎఫ్ఆర్ఆర్వో పాస్పోర్ట్ను పరిశీలించారు. ఇయాసేలే విక్టరీ ఇటోహాన్ నైజీరియాకు చెందిన మహిళను గుర్తించారు. ఎఫ్ఆర్ఆర్వో నుంచి అనుమతి తీసుకుని ముగ్గురిని హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్లోని డిటెన్షన్ సెంటర్లో ఉంచారు. విక్టరీ ఇటోహాన్ ఇయాసేలేకు ఎఫ్ఆర్ఆర్వో నుంచి ఎగ్జిట్ పరి్మట్ పొందిన తర్వాత నైజీరియాకు టికెట్ కొనుగోలు చేశారు. దాదాపు 37 రోజుల పాటు డిటెన్షన్ సెంటర్లో ఉంచిన తర్వాత మంగళవారం నైజీరియాలోని లాగోస్కు పంపించారు. -
ఏ విచారణకైనా రెడీ
హైదరాబాద్లో వాయు కాలుష్యం ప్రమాదకరంగా మారింది. నిర్దేశిత ప్రమాణాలను మించిపోయింది. ఇటీవల ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 263 నమోదైంది. వాహనాలతో 27% వాయుకాలుష్యం ఏర్పడుతుంటే, పరిశ్రమలతో 51% ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో నగరంలోని పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు తరలించడానికి 2012 నుంచే ప్రయ త్నాలు జరుగుతున్నాయి. మేం ఎన్జీటీ, సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు చర్యలు చేపట్టాం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కాలుష్య కారక పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు పంపిస్తాం. వాటికి ప్రత్యామ్నాయ పారిశ్రామికవాడలను సిద్ధంగా ఉంచాం.. – డిప్యూటీ సీఎం భట్టిసాక్షి, హైదరాబాద్: 2014 నుంచి, ఇటీవల తమ ప్రభుత్వం తెచ్చిన హిల్ట్పీ తో పాటు ఇప్పటివరకు జరిగిన పారిశ్రామికవాడల్లోని భూముల వినియోగ మార్పిడిపై ఏ విచారణను ఆదేశించడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు అడ్డగోలుగా చేస్తున్న ఆరోపణలకు కట్టుబడి ఉంటే.. ఆ మేరకు లేఖ రాసిన మరుక్షణం ఏ విచారణ సంస్థతో కావాలంటే ఆ సంస్థతో విచారణ చేయించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. మంగళవారం శాసనసభలో హైదరాబాద్ పారిశ్రామిక భూముల మార్పిడి (హిల్ట్) విధానం (పీ), తెలంగాణ రైజింగ్–2047పై లఘు చర్చ సందర్భంగా పలువురు సభ్యులు లేవనెత్తిన అంశాలకు భట్టి జవాబిచ్చారు. హిల్ట్ పీతో రూ.10,776 కోట్ల ఆదాయం: ‘ప్రతిపక్షం కడుపులో విషం పెట్టుకుని రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధిని పట్టించుకోకుండా తమ రాజకీయం కోసం రాజకీయాలు చేయడాన్ని మానుకోవాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం లీజు భూములను ఫ్రీహోల్డ్ చేసింది. తమకు కావాల్సిన వాళ్లకు పారిశ్రామిక భూములను వినియోగ మార్పిడి చేసింది. సిరీస్, గల్ఫ్ ఆయిల్ పరిశ్రమలకు భూ వినియోగ మార్పిడి చేసిన అంశాన్ని హిల్ట్ పాలసీతో పోల్చినప్పుడు రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ.4,076 కోట్ల నష్టం వాటిల్లింది. హిల్ట్ పీ కింద కాంగ్రెస్ ప్రభుత్వం.. 80 అడుగుల లోపు రహదారి ఉన్న భూములకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ (ఎస్ఆర్వో) ధరలో 30 శాతం, 80 అడుగుల కంటే ఎక్కువ వెడల్పుతో రహదారి ఉన్నచోట ఎస్ఆర్వో ధరలో 50 శాతం చెల్లించేలా నిర్ణయం తీసుకుంది. ఈ భూములపై ప్రభుత్వానికి ఎలాంటి హక్కు లేదు. కేవలం భూ వినియోగ మార్పిడి చేస్తున్నందుకు ఈ ఫీజులు వసూలు చేస్తున్నాం. ప్రస్తుతం ఉన్న భూ వినియోగ మార్పిడి ధరల ప్రకారం అయితే కేవలం రూ.574 కోట్ల ఆదాయం మాత్రమే రాష్ట్రానికి లభిస్తుంది. అదే హిల్ట్ పీ కింద దాదాపు 4,780 ఎకరాల భూములకు భూ వినియోగ మార్పిడికి అవకాశం కల్పించడం ద్వారా దాదాపు రూ.10,776 కోట్ల ఆదాయం లభిస్తుంది..’ అని డిప్యూటీ సీఎం తెలిపారు. హిల్ట్ పీ అత్యుత్తమం, పారదర్శకమైనది.. ‘హిల్ట్ పాలసీ రాగానే ప్రధాన ప్రతిపక్షానికి చెందిన ఓ నాయకుడు ప్రెస్మీట్ పెట్టి రాష్ట్రంలోని భూములన్నింటినీ అమ్మేస్తూ రూ.5 లక్షల కోట్ల స్కామ్కు తెరలేపారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలు విస్మరించి, బట్ట కాల్చి మీద వేసి తుడుచుకోమంటున్నారు. వారు రాష్ట్ర ప్రజా ప్రయోజనాల కంటే.. సొంత ప్రయోజనాల కోసం ఎక్కువగా పాకులాడుతున్నారు. హిల్ట్ పీ వల్ల రాష్ట్రానికి ఆదాయం లభిస్తుంటే.. గతంలో వారు చేసిన నిర్ణయాలతో భారీ నష్టం జరిగింది. గత ప్రభుత్వం అనుసరించి విధానాలతో పోలిస్తే హిల్ట్ పీ అత్యుత్తమమైనది. పారదర్శకమైనది. ఆదాయం సమకూరుతుంది. వారు ఆజామాబాద్, బాలానగర్, హఫీజ్పేట పారిశ్రామిక వాడల్లో ప్రభుత్వ భూములు లీజులో ఉంటే...వాటిని వేలానికి పెట్టకుండా ఇష్టానుసారం ఇచ్చేశారు. ప్రభుత్వానికి ఆదాయం రాకుండా పారిశ్రామికవేత్తలకు అప్పగించారు. వనరుల సమీకరణకు 2019లో అప్పటి ఆర్థిక మంత్రి హరీశ్రావు నేతృత్వంలో వేసిన కేబినెట్ సబ్ కమిటీకి సంబంధం లేకుండా కేటీఆర్ పరిశ్రమల మంత్రిగా జీవో ఇచ్చి పారిశ్రామిక భూములను ఐటీ పరిశ్రమలకు మార్చేలా ఉత్తర్వులు ఇచ్చారు. వారికి అనుకూలమైన వారికి భూ మార్పిడి చేశారు. తద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారు. మేము తెచ్చిన పాలసీలో దోపిడీకి ఆస్కారం లేదు..’ అని భట్టి చెప్పారు. రాష్ట్రానికి ఉత్పాదక షాక్ అవసరం ‘ప్రస్తుతం రాష్ట్రం 200 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ. వృద్ధి ఇలానే కొనసాగితే 2047 నాటికి 1.2 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగానే ఎదుగుతాం. ఇది సరిపోదని..3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్–2047 తీసుకొచ్చాం. కేవలం ఎక్కువ మందికి ఉపాధి కల్పించడం ద్వారా ఈ లక్ష్యానికి చేరుకోలేం. మనకు ఒక ‘ఉత్పాదకత షాక్’ అవసరం. పెట్టుబడి రేటును జీఎస్డీపీలో 52 శాతానికి పెంచాలనే కఠిన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం..’ అని భట్టి తెలిపారు.తర్వలో హిల్ట్ పీ మార్గదర్శకాలు: శ్రీధర్బాబు పదేళ్ల పాటు సాగిన బీఆర్ఎస్ పాలనలో చాలాచోట్ల అడ్డగోలు భూకేటాయింపులు జరిపిన విషయం వాస్తవమని.. తొలుత మాట్లాడిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. పరిశ్రమల పేరిట జరిగిన ఈ భూకేటాయింపులపై తప్పకుండా విచారణ చేపడతామని చెప్పారు. ‘హిల్ట్ పాలసీ ఏకపక్ష నిర్ణయం కాదు. నిపుణులు, మేధావులతో చర్చించిన తర్వాతే రూపొందించాం. ఇందుకు సంబంధించిన పూర్తిస్థాయి మార్గదర్శకాలు త్వరలో విడుదలవుతాయి. మంత్రివర్గ ఉప సంఘం సిఫారసులను పబ్లిక్ డొమైన్ (అందరికీ అందుబాటు)లో పెట్టం. అవి కేవలం ఇన్ కెమెరా (అంతర్గత) సూచనలు. వాటిని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను పాజిటివ్గా చూడాలి. అప్పుడే నిర్ణయాల అమలు వేగవంతంగా, విజయవంతంగా పూర్తవుతుంది. పరిశ్రమల తరలింపుతో కార్మికులకు ఉపాధి ప్రశ్నార్థకమవుతుందనే ఆందోళన అవసరం లేదు. కారి్మక చట్టాలు తప్పకుండా అమల్లో ఉంటాయి..’ అని శ్రీధర్బాబు చెప్పారు. పూర్తి పారదర్శక పాలసీ: మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పారిశ్రామిక భూమి బదలాయింపు విధానం రాష్ట్ర సుస్థిర పురోగతితో పాటు పారిశ్రామిక కాలుష్య రహిత హైదరాబాద్ను తీర్చిదిద్దేందుకు దోహదం చేస్తుందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు. పూర్తి పారదర్శకంగా ఉండేలా గొప్ప పాలసీకి రూపకల్పన చేశామని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీలు అర్ధరహిత విమర్శలు చేస్తున్నాయని విమర్శించారు. లీజు హక్కులతో ఉన్న పారిశ్రామిక భూములకు ఈ కొత్త విధానం వర్తించదని, పూర్తిస్థాయి యాజమాన్య హక్కులతో భూములు కలిగిఉన్న పారిశ్రామిక భూములకే వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఆ జీవోలో చీకటి కోణాలు: ఏలేటి ‘కాలుష్య కారక పరిశ్రమలను నగరం బయటకు పంపడం సరైన నిర్ణయమే. కానీ ఎలాంటి పర్యావరణ అధ్యయనాలు, కమిటీల నివేదికలు లేకుండా బయటకు తరలే పరిశ్రమలకు ప్రత్యామ్నాయ భూములు కేటాయించకుండా హడావుడిగా హిల్ట్ పాలసీని తేవడంలో ఆంతర్యం ఏమిటి? ప్రభుత్వం జారీ చేసిన జీఓ 27లో అనేక చీకటి కోణాలు ఉన్నాయి. 22 పారిశ్రామిక వాడల్లోని పరిశ్రమలను ఔటర్ రింగు రోడ్డు వెలుపల ఎక్కడికి తరలిస్తారు? అత్యంత కాలుష్య కారక పరిశ్రమలున్న ఐడీఏ బొల్లారంను హిల్ట్ పాలసీలో చేర్చకపోవడం విడ్డూరం..’ అని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి వ్యాఖ్యానించారు. ‘పరిశ్రమల భూములతో రియల్ ఎస్టేట్ దందా చేయడాన్ని ప్రభుత్వం మానుకోవాలి. ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పచ్చదనం పెంచాలి..’ అని సూచించారు. రాష్ట్ర విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన హిల్ట్ పాలసీని అందరూ స్వాగతించాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో వాయు నాణ్యత వేగంగా క్షీణిస్తోందని, ఇదే తరహాలో కాలుష్యం పెరిగితే పదేళ్లలో ఢిల్లీ తరహా పరిస్థితులు తలెత్తుతాయని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఆకాశానికి నిచ్చెన వేస్తే లాభం లేదు: పాల్వాయి హరీశ్బాబు ‘మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అంటూ ప్రభుత్వం ఆర్భాటం చేస్తోంది. గ్లోబల్ సమ్మిట్లో విజన్ డాక్యుమెంట్–2047 విడుదల చేశారు. ఇప్పుడు అక్కడ టెంట్లు కూడా లేవు. ఆకాశానికి నిచ్చెన వేస్తే లాభం లేదు..’ అని బీజేపీ సభ్యుడు పాల్వాయి హరీశ్బాబు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉందని మరో బీజేపీ సభ్యుడు పాయల్ శంకర్ అన్నారు. హిల్ట్ పాలసీకి చట్టబద్ధత లేదు: అక్బరుద్దీన్ ‘వనరుల సమీకరణకు ఈ ప్రభుత్వం భూముల వెనుక పరిగెడుతోంది. ప్రభుత్వం విడుదల చేసిన హిల్ట్ పాలసీ జీఓకు ఎలాంటి చట్టబద్ధత లేదు. పాలసీ రూపకల్పనలో పారదర్శకత కనిపించడం లేదు. పాలసీలో పేర్కొన్న భూములు ప్రైవేటువా లేక ప్రభుత్వ భూములా అనే అంశంపై ప్రభుత్వం పూర్తి స్పష్టత ఇవ్వాలి..’ అని ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుదీన్ ఒవైసీ అన్నారు. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీకి కేటాయించిన 50 ఎకరాలను వెనక్కి తీసుకునే ప్రయత్నాలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరారు. నగర కాలుష్యాన్ని నివారించేందుకు ఉద్దేశించిన హిల్ట్ పాలసీకి తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు చెప్పారు. కాగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడిన తర్వాత శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. -
అబద్ధపు హామీలతో మోసం
జనగామ: ‘వరంగల్ రైతు డిక్లరేషన్లో రైతుబంధును రూ.15 వేలకు పెంచుతానన్నారు. కౌలుదారులకు కూడా ఇస్తానన్నారు. ప్రతి పంటకు రూ.500 బోనస్ ఇస్తానన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. ఇవన్నీ అబద్ధాలు. అలాంటి హామీలు ఇచ్చి మోసం చేసిన రాహుల్గాందీనే నడిబజారులో ఉరితీయాలి..’అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కె.తారక రామారావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్గాంధీ లీడర్ కాదని, దేశంలో ఏకైక స్క్రిప్టు చదివే రీడర్ అని విమర్శించారు. స్క్రిప్టులో ఏమున్నా చదివేసే అవగాహన లేని నేత అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా? ఊడుతుందా? తెలియని పరిస్థితి ఉందన్నారు. సీఎంకు కూడా మూటలు మోసిన అనుభవం తప్ప మరేమీ లేదని, ఏమీ తెలియదని వ్యాఖ్యానించారు. జనగామ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో మంగళవారం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అధ్యక్షతన జరిగిన జిల్లాలో గెలుపొందిన బీఆర్ఎస్ సర్పంచుల అభినందన సభలో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రేవంత్కు పిచ్చి ముదిరి పాకానపడింది ‘రాష్ట్రంలో చెక్డ్యాంలు పటాకులు పేలినట్లు పేలుతున్నాయి. రేవంత్రెడ్డి ప్రభుత్వం కూడా అట్లనే ఉంది. రాష్ట్రంలో పాలిచ్చే బర్రెను కాదనుకుని, వెనకనుంచి తన్నే గేదెను తెచ్చుకున్నామని ప్రజలు మథనపడుతున్నారు. గోదావరి ఎక్కడుందో కూడా రేవంత్కు తెలియదు. భాక్రానంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉందని చెబుతున్న రేవంత్రెడ్డి..రాష్ట్రాన్ని ఎలా నడిపిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అవుతోంది.. ప్రజలకు చేసిన వాగ్దానాలు ఎంతవరకూ నెరవేర్చారో ఒక్కసారి ఆలోచించాలి. ఎనకటి రోజులు తెస్తానన్న రేవంత్, రాబందు కాలం తీసుకువచ్చారు. తెలంగాణను అభివృద్ధి చేసిన నాయకుడిని (కేసీఆర్)ఉరి తీయాలంటారా?. ఇంటింటికీ నీళ్లు ఇచ్చి, ఆసరా పెన్షన్లు, రైతుబంధు, రైతుబీమా, సాగునీటి ప్రాజెక్టులతో తెలంగాణను దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టిన కేసీఆర్ను ఉరి వేయాలని రేవంత్రెడ్డి అనడం చూస్తుంటే ఆయనకు పిచ్చి ముదిరి పాకాన పడిందని అర్థమవుతోంది. ఆ మాటకొస్తే హామీలు ఇచ్చి మోసం చేసిన రాహుల్గాం«దీనే ఉరి తీయాలి. తన సొంత సెక్యూరిటీని కూడా ప్రజల ముందే కొట్టే ముఖ్యమంత్రి ఎక్కడా దొరకడు. తెలంగాణ తెచ్చిన మొనగాడు కేసీఆర్ చెప్పు దూళికీ రేవంత్ సరిపోడు. కేసీఆర్ ఒక్క ప్రెస్మీట్కే ఆయన ఆగమాగం అవుతున్నాడు. ఇక అసెంబ్లీలో మాట్లాడితే అక్కడే గుండె ఆగిపోయి సచ్చిపోతారు..’అని కేటీఆర్ విమర్శించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జైల్లో గంజాయి ఘటన .. అధికారి సస్పెండ్
సాక్షి నిజామాబాద్: సెంట్రల్ జైల్లో అధికారుల నిర్లక్ష్యంపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఇటీవల గంజాయి తీసుకున్నారనే నెపంతో ఇద్దరు ఖైదీలపై దాడి చేసిన జైలర్ ఉపేందర్ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మరో జైలర్ సాయి సురేశ్పై బదిలీ వేటు వేశారు. అంతేకాకుండా జైలు సూపరిండెంట్ దశరథంపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు.ఇటీవల నిజామాబాద్ జైలులో జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇద్దరు ఖైదీలు గంజాయికోసం ఘర్షణ పడుతుండడంతో వారిని గమనించిన జైలు అధికారి వారిపై దాడిచేశారు దీంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఒకరికి ప్రక్కటెముకలు విరిగాయి. దీంతో ఈ విషయం అందరికీ తెలిసింది. ఈకేసును బోధన్ కోర్టు విచారించగా పోలీసులు తమను తీవ్రంగా కొట్టారని న్యాయమూర్తి ముందు ఖైదీలు తెలపారు. దీంతో ఈ కేసుపై కోర్టు విచారణకు ఆదేశించింది.ఆ నేపథ్యంలో ఉన్నతాధికారులు వారిపై చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా జైలులో గంజాయి, బీడీలు, ఇతర నిషేధిత వస్తువులతో అక్రమ వ్యాపారం చేస్తున్న ఏడుగురు ఖైదీలను సంగారెడ్డి, చర్లపల్లి, చంచల్గూడ జైలుకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. -
నిజామాబాద్ సౌమ్య కేసులో కొత్త ట్విస్ట్
సాక్షి, నిజామాబాద్: భర్తను హత్య చేసిన ఘటనలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. భర్త పల్లటి రమేష్పై రూ.2 కోట్లకు పైగా ఇన్స్యూరెన్స్ ఉండగా.. బీమా డబ్బుల కోసమే భార్య సౌమ్య, ప్రియుడు దిలీప్ పక్క ప్లాన్ చేసినట్లు పోలీసులు తేల్చారు. వివాహేతర సంబంధానికి అడ్డు తొలగించుకోటం ఆపై ఇన్స్యూరెన్స్ డబ్బులతో పారిపోవడానికి ప్లాన్ చేశారు.ఇన్స్యూరెన్స్ డబ్బుల కోసం నార్మల్ డెత్ గుండె పోటు అంటూ చిత్రీకరించారు. నిద్ర మాత్రలు ఇచ్చి భర్తగొంతు నులిమి హత్య చేసి హార్ట్ ఎటాక్గా భార్య నమ్మించింది. మృతుడి తమ్ముడి ఫిర్యాదుతో మృతదేహానికి రీపోస్టు మార్టం నిర్వహించారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విచారణలో తామే హత్య చేసినట్లు భార్య సౌమ్య, ప్రియుడు దిలీప్ ఒప్పుకున్నారు.పోలీసుల వెల్లడించిన వివరాలు ప్రకారం.. నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం బొర్గాం గ్రామానికి చెందిన పట్టాటి రమేష్ భార్య సౌమ్య ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తోంది. అదే పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న దిలీప్తో ఆమెకు పరిచయం.. వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయం భర్త రమేష్కు తెలియడంతో, ఇద్దరినీ గట్టిగా మందలించాడు.దీంతో భర్త అడ్డు తొలగించుకోవాలని సౌమ్య ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది. గత నెల 20న సౌమ్య తన ప్రియుడు దిలీప్తో కలిసి రమేష్ను ఇంట్లోనే హత్య చేశారు. అనంతరం భర్త గుండెపోటుతో మృతి చెందినట్లు నమ్మించి, ఎవరికీ అనుమానం రాకుండా హడావుడిగా అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, అంత్యక్రియల సమయంలో రమేష్ మెడపై గాట్లు కనిపించడంతో స్థానికులకు అనుమానం కలిగింది. వెంటనే ఇజ్రాయెల్లో ఉన్న అతని తమ్ముడు కేదారికి సమాచారం అందించడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి విచారణ చేపట్టగా అసలు నిజం బయటపడింది. ఈ కేసులో సౌమ్యతో పాటు మరో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
సీఎం రేవంత్పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, జనగాం: భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉరి తీయాలంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారాయన. మంగళవారం జనగాంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ 420 హామీలిచ్చి ఒక్కటీ అమలు చేయడం లేదు. రాహుల్, రేవంత్ను ఉరి తీయాలి. చదువురాని దద్దమ్మ రేవంత్రెడ్డి. ఢిల్లీకి డబ్బులు పంపి తన సీఎం సీటును కాపాడుకుంటున్నాడు. కేసీఆర్ ఒక్క ప్రెస్మీట్కే రేవంత్ లాగు తడిసింది’’ అంటూ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది. తెలంగాణ శాసనసభలో మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. 2019 మున్సిపల్ చట్టంలో కీలక మార్పు చేస్తూ బిల్లుకు సభ్యులు ఆమోదం తెలిపారు. ఓటర్ల జాబితా సవరణకు 60 రోజుల ముందే సమాచారం ఇవ్వాలన్న నిబంధన తొలగించారు.దీంతో భారత ఎన్నికల సంఘానికి ముందస్తు సమాచారం అవసరం ఇక లేదు. ఇప్పటికే ముసాయిదా ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ ప్రారంభం కాగా, ఈ నెల 10న తుది ఓటర్ల జాబితా విడుదల కానుంది. చట్ట సవరణతో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ వేగవంతం కానుంది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వానికి పూర్తి వెసులుబాటు వచ్చింది.కాగా, మున్సిపల్ ఎన్నికల దిశలో అడుగులు వడివడిగా పడుతున్నాయి. ఈ నెలలోనే ఎన్నికలకు గ్రీన్సిగ్నల్ ఇవ్వాలని, ఫిబ్రవరిలో ఈ ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సంక్రాంతికి ముందు లేదంటే ఆ తర్వాత కచ్చితంగా షెడ్యూల్ ప్రకటించి ఆ వెనువెంటనే నోటిఫికేషన్ ఇవ్వడానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ నెల 11న లేదంటే 20న షెడ్యూల్ ప్రకటించే అవకాశా లున్నాయి. ఫిబ్రవరి రెండు లేదా మూడో వారంలోగా ఎన్నికల తతంగాన్ని పూర్తి చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించింది. -
హిల్ట్ పాలసీపై చర్చ .. ‘అవి ప్రభుత్వ భూములు కావు’
సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక వేత్తల భూములను.. ప్రభుత్వ భూములని ప్రచారం చేస్తున్నారని.. అవి ప్రభుత్వ భూములు కావు.. పరిశ్రమలకు అమ్మిన భూములు అంటూ మంత్రి శ్రీధర్బాబు స్పష్టత నిచ్చారు. తెలంగాణ అసెంబ్లీలో హిల్ట్ పాలసీపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన వాతావరణం ఇవ్వాలన్నదే తమ ఆలోచన అని.. పర్యావరణం బాగుచేయాలనే ఆలోచనతోనే హిల్ట్ పాలసీ తీసుకువచ్చినట్లు తెలిపారు.‘‘హిల్ట్ పాలసీ కింద ఆరు నెలల గడువు ఇస్తాం. స్వచ్ఛందంగా ముందుకొస్తేనే భూములు కన్వర్ట్ చేస్తాం. పాలసీ గురించి అవగాహన లేకుండా ఆరోపణలు చేస్తున్నారు. దశాబ్ధాల కిందటే గత ప్రభుత్వాలు వారికి భూములు అమ్మేశాయి. రాజకీయాల పక్కనపెట్టి ఆలోచించాలి’’ అని శ్రీధర్బాబు పేర్కొన్నారు. స్వచ్ఛమైన గాలి, నీరు ఇవ్వలేని నాగరికత అసమర్థ నాగరికతే.. అభివృద్ధి పేరిట పర్యావరణ విధ్వంసం జరుగుతోందని శ్రీధర్బాబు హెచ్చరించారు.‘‘డెవలప్మెంట్ అంటే ప్రకృతిని నాశనం చేయడం కాదు. పిల్లలకు ఆస్తులు కాదు.. క్లీన్ ఎన్విరాన్మెంట్ నిజమైన వారసత్వం. బంగారు గిన్నెలో విషం పెట్టినట్లవుతోంది మన పరిస్థితి. ప్రకృతి నాశనమైతే తిరిగి రాదు. మనమంతా భూమి యజమానులు కాదు. కేవలం ట్రస్టీలమే. ఫ్యూచర్ జనరేషన్లకు క్లీన్ ఎన్విరాన్మెంట్ ఇవ్వడం మన బాధ్యత. ఇది కేవలం ల్యాండ్ యూజ్ మార్పు కాదు. ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు పునాది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో చారిత్రక నిర్ణయం తీసుకున్నాం. పిల్లల భవిష్యత్తు కోసం హిల్ట్ పాలసీ తీసుకొచ్చాం...ఓఆర్ఆర్ లోపల పరిశ్రమలు.. ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం. ఫ్యాక్టరీ గోడ పక్కనే ఇళ్లు.. ఇది సైంటిఫిక్ డిజాస్టర్. 1970లలో నగరం బయట పరిశ్రమలు.. నేడు నడిబొడ్డు ప్రాంతాలు బాలానగర్, సనత్నగర్, ఉప్పల్ ఇప్పుడు రెసిడెన్షియల్ జోన్లు. పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలికి తరలించడమే లక్ష్యం. పిల్లలకు స్వచ్ఛమైన గాలి, నీరు ఇవ్వడమే ప్రభుత్వ సంకల్పం. హిల్ట్పై కావాలనే తప్పుడు ప్రచారం జరుగుతోంది. మతలబు ఉందంటూ విమర్శలు బాధాకరం. తెలంగాణ నుంచే పర్యావరణ రక్షణకు చారిత్రక అడుగు.. మార్పు ఎప్పుడో కాదు.. ఇప్పుడే’’ అంటూ శ్రీధర్బాబు వ్యాఖ్యానించారు. -
హైదరాబాద్లో విషాద ఘటన..
సాక్షి, హైదరాబాద్: టోలిచౌకిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ బస్సు నిర్లక్ష్యానికి యువకుడు బలయ్యాడు. డెలివరీ బాయ్పైకి ప్రైవేట్ బస్సు దూసుకెళ్లింది. ఆర్డర్ డెలివరీ చేసేందుకు వెళ్తూ. అభిషేక్.. బైక్ స్కిడ్ అయి పడిపోయాడు. గమనించకుండా.. ఆ యువకుడి తలపైకి డ్రైవర్ బస్సు ఎక్కించాడు. స్పాట్లోనే అభిషేక్ మృతి చెందాడు. ఆపకుండా వెళ్ళిపోయే ప్రయత్నం చేసిన బస్సు డ్రైవర్ను వాహనదారులు అడ్డగించి బస్సును నిలిపివేయించారు.ప్రమాదం తర్వాత రోడ్డుపై మృతదేహం పడి ఉన్నా.. వాహనదారులు పట్టించుకోలేదు. మానవత్వం లేకుండా వెళ్లిపోయారు. బతికి ఉన్నాడో.. చనిపోయాడోనని చూసే ప్రయత్నం కూడా చేయని వాహనదారులు.. మృతదేహం పక్కనుంచే వెళ్లిపోయారు. -
చిరంజీవి సినిమాకు టికెట్ రేట్ల పెంపుపై నిర్మాతల క్లారిటీ
సంక్రాంతి రేసులో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీగా సినిమాల సందడి ఉంది. ఈ క్రమంలో మన శంకర వరప్రసాద్ గారు, ది రాజా సాబ్ చిత్రాలు కూడా బరిలో ఉన్నాయి. అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ రెండు చిత్రాలకు టికెట్ ధరలు పెంపుతో పాటు ప్రీమియర్ షోలు ఉంటాయా అనే ప్రశ్నలు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఒక క్లారిటీ వచ్చింది. మన శంకర వరప్రసాద్ గారు నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ అంశం గురించి ఆ చిత్ర నిర్మాతలు వివరణ ఇచ్చారు.ఆంధ్రప్రదేశ్లో ఎటూ ఈ రెండు చిత్రాలకు టికెట్ ధరలు పెంచుకునేందుకు ఛాన్స్ ఇవ్వడమే కాకుండా ప్రీమియర్ షోలకు కూడా అనుమతి ఇచ్చేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరీ తెలంగాణలో పరిస్థితేంటి..? అనేది హాట్ టాపిక్గా మారింది. ఈ క్రమంలో మన శంకర వరప్రసాద్ గారు చిత్ర నిర్మాతలు ఇలా అన్నారు. 'ఈ చిత్ర టికెట్స్ రేట్స్ పెంపుతో పాటు ప్రీమియర్ షోల గురించి రెండు ప్రభుత్వాలతో చర్చలు జరుగుతున్నాయి. మరో రెండురోజుల్లో క్లారిటీ వస్తుంది. ప్రభుత్వం నుంచి ఏదైనా సమాచారం రాగానే ప్లాన్ చేస్తాం. దాదాపు తెలంగాణలో కూడా ప్రీమియర్స్ ఉంటాయి.' అని పేర్కొన్నారు. -
సీఎం రేవంత్రెడ్డికి కిషన్రెడ్డి బహిరంగ లేఖ
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ కిషన్రెడ్డి లేఖ రాశారు. వరంగల్ కోట భూములు, అక్రమ కట్టడాలపై సీఎంకు లేఖ రాశారు కిషన్రెడ్డి. కోట భూముల్లో ఆక్రమణలు గుర్తించి తొలగించాలని విన్నవించారు. అక్రమ కట్టడాలను తొలగించి ఆ భూములను పురావస్తు శాఖ (ASI )కి అప్పగించాలన్నారు. వారసత్వ సంపద ను కాపాడటంలో పురావస్తు శాఖకు సహకరించాలని బహిరంగ లేఖ ద్వారా సీఎం రేవంత్కు విజ్ఞప్తి చేశారు కిషన్రెడ్డి. -
అటు సీఎం.. ఇటు మాజీ సీఎం!
మహబూబ్నగర్: ప్రస్తుతం పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ సాగుతోంది. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో భారీ బహిరంగ సభకు సన్నద్ధమవుతోంది. ఈ సభకు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఇందులో భాగంగానే ఉమ్మడి పాలమూరుకు చెందిన ఆ పార్టీ ముఖ్య నేతలు మంగళవారం ప్రాజెక్టుల బాట పట్టారు. సంక్రాంతి తర్వాత కేసీఆర్ సభ ఉండనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సైతం మహబూబ్నగర్నే ఎంచుకున్నట్లు తెలుస్తోంది. తొలుత వచ్చేనెల మూడో తేదీన జడ్చర్ల నియోజకవర్గంలో ట్రిపుల్ ఐటీ ప్రారంభోత్సవానికి రానున్నట్లు ఆ పార్టీ నేతలు ప్రకటించారు. అయితే అంతకన్నా ముందుగానే మహబూబ్నగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నగరంలో సుమారు రూ.1,200 కోట్లతో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, తాగునీటి శుద్ధీకరణ తదితర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. ఈనెల 10న ఓటర్ల తుది జాబితా ప్రకటించనుండగా.. ఆ తర్వాత పురపాలికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు నుంచే ఇటు కాంగ్రెస్.. అటు బీఆర్ఎస్ ఎన్నికల శంఖారావం మోగించనున్నట్లు తెలుస్తోంది. -
ఫాల్కన్ స్కాం.. మాస్టర్ మైండ్ అమర్దీప్ అరెస్టు
సాక్షి,హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్ని కుదిపేసిన ఫాల్కన్ స్కామ్ కేసులో కీలక పురోగతి చోటుచేసుకుంది. ఫాల్కన్ కంపెనీ ఎండీ అమర్ దీప్ను ముంబైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గల్ఫ్ దేశం నుండి ముంబైకి చేరుకున్న ఆయనను ఇమిగ్రేషన్ అధికారులు గుర్తించి, సమాచారం అందించడంతో తెలంగాణ పోలీసులు వెంటనే అరెస్టు చేశారు.అమర్ దీప్పై ఇప్పటికే లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేసిన తెలంగాణ పోలీసులు.. ఆయనను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ముంబైకి పంపారు. చివరికి ఆయనను అదుపులోకి తీసుకోవడంతో కేసులో కీలక మలుపు తిరిగింది. ఫాల్కన్ కంపెనీ డిజిటల్ డిపాజిట్ల పేరుతో ప్రజల నుండి భారీగా డబ్బులు వసూలు చేసింది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడతామని, ఎంఎన్సీ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి అమర్ దీప్ ప్రజలను నమ్మబలికాడు. యాప్ ఆధారిత డిజిటల్ డిపాజిట్ల పేరుతో 850 కోట్ల రూపాయలు కొట్టేసినట్లు విచారణలో బయటపడింది. అమర్ దీప్ ప్రజలను ఆకర్షించడానికి పలు వ్యూహాలు ఉపయోగించాడు. యాప్ ద్వారా డబ్బులు పెట్టుబడులుగా తీసుకోవడం, షేర్ మార్కెట్లో అధిక లాభాలు వస్తాయని నమ్మబలికడం, పెద్ద కంపెనీల్లో పెట్టుబడులు పెడతామని చెప్పి డబ్బులు వసూలు చేయడం వంటి పద్ధతులతో ఆయన ప్రజలను బురిడీ కొట్టించాడు. ఫాల్కన్ స్కామ్ వెలుగులోకి రాగానే అమర్ దీప్ తన భార్యతో కలిసి చార్టెడ్ ఫ్లైట్లో దుబాయ్కు పారిపోయాడు. అప్పటి నుండి ఆయనపై పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. చివరికి ముంబైలో ఆయనను పట్టుకోవడంతో కేసు దర్యాప్తు మరింత వేగవంతం కానుంది.ఈ కేసులో ఫాల్కన్ కంపెనీ సీఈఓతో పాటు అమర్ దీప్ సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు అమర్ దీప్ అరెస్టు చేశారు. అమర్దీప్ను అరెస్టు చేసిన పోలీసులు కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు వెలికితీసే అవకాశం ఉంది. -
ఘోరం.. కొడుకు, కుమార్తెను ఉరేసి చెరువులో పడేసిన తండ్రి
సాక్షి,హైదరాబాద్: పిల్లా,పాపలతో హాయిగా సాగిపోతున్న సంసారంలో కుటుంబ సమస్యలు ఘోర విషాదాన్ని నింపాయి. కొడుకు,కుమార్తెను ఉరేసి చెరువులో పడేశాడో తండ్రి. ఆపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మరికల్ మండలం తీలేరు గ్రామంలో మంగళవారం ఉదయం ఘోర విషాదం చోటుచేసుకుంది. కుటుంబ సమస్యలతో మనస్తాపానికి గురైన శివరాములు తన కూతురు రితిక, కొడుకు చైతన్యను ఉరిసే స్థానిక చెరువులో పడేశాడు. అనంతరం, విద్యుత్ తీగను పట్టుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన స్థానికులు స్పందించి అతడిని మహబూబ్ నగర్లోని ఓ ఆస్పత్రికి తరలించారు.గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పిల్లల మృతదేహాలను చెరువులో నుండి వెలికితీసి పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో తీలేరు గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సమస్యల కారణంగానే ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం. గ్రామస్థులు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, చిన్నారుల అమాయక ప్రాణాలు ఇలా బలైపోవడం పట్ల ఆవేదన చెందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.తీలేరు గ్రామంలో జరిగిన ఈ ఘటన కుటుంబ సమస్యలు ఎంతటి విషాదానికి దారితీస్తాయో మరోసారి స్పష్టంచేసింది. శివరాములు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతుండగా, గ్రామం మొత్తం ఈ దారుణంతో కన్నీటి సంద్రమైంది. -
‘సహకారం’ ఏదీ..?
సాక్షి, హైదరాబాద్: సహకార ఆర్థిక సంస్థలు.. సంక్షేమ శాఖల పరిధిలో కొనసాగుతున్న ప్రత్యేక విభాగాలివి. ఈ కార్పొరేషన్ల ప్రధాన లక్ష్యం స్వయం ఉపాధిని ప్రోత్సహించడం.. రాయితీ అందిస్తూ స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు సహకరించడం... నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి యువతకు ఉపాధి మార్గాలను చూపించడం. కానీ ఉన్నత లక్ష్యంతో ఏర్పాటైన ఈ కార్పొరేషన్లు ఇప్పుడు అచేతన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. రాయితీపై రుణాల సంగతి అటుంచితే యువతకు కనీసం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను సైతం నిర్వహించలేకపోతున్నాయి. కాగితాల్లోనే వార్షిక ప్రణాళికలు.. రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలతోపాటు వికలాంగులు, మహిళల కోసం 30 సహకార ఆర్థిక సంస్థలు ఉన్నాయి. గతంలో 17 కార్పొరేషన్లు ఉండగా ప్రజాప్రభుత్వం కొత్తగా 13 కార్పొరేషన్లను ఏర్పాటు చేయడంతో వాటి సంఖ్య 30కి చేరింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లు ఏటా భారీ ఎత్తున వార్షిక ప్రణాళికలు రూపొందిస్తుండగా వాటిని ప్రభుత్వం ఆమోదిస్తోంది. కానీ కార్పొరేషన్లకు నిధులు విడుదల చేయట్లేదు. దీంతో నిర్దేశించిన కార్యక్రమాలన్నీ అటకెక్కుతున్నాయి. 2024–25 వార్షిక సంవత్సరం చివర్లో రాజీవ్ యువ వికాసాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టి రూ. 6 వేల కోట్ల మేర నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. అన్ని కార్పొరేషన్ల పరిధిలో ఈ పథకం కింద దరఖాస్తులు ఆహ్వానించగా ఏకంగా 16 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. 2025–26 వార్షిక బడ్జెట్లో నిధులు విడుదల చేస్తామని మొదట్లో చెప్పుకొచ్చిన సర్కారు... రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న లబ్ధిదారులకు మంజూరు పత్రాలు ఇస్తామని ప్రకటించింది. కానీ ఇప్పటివరకు మంజూరు పత్రాల జాడ లేకపోగా కనీసం ఈ పథకంపై ఎలాంటి సమీక్ష నిర్వహించకపోవడం గమనార్హం. మరోవైపు రాజకీయ నాయకులకు పునరావాస కేంద్రాలుగా ఈ కార్పొరేషన్లు మారుతున్నాయనే విమర్శలున్నాయి. పదవుల పందేరంలో భాగంగా ఆయా కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించడం... వారికి నెలవారీ జీతభత్యాల కింద భారీగా నిధులు ఇవ్వడం వరకే కార్పొరేషన్లు పరిమితమవుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఒక్కో చైర్మన్కు జీతభత్యాల కింద ఏటా సగటున రూ. 50 లక్షల వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఐదు కార్పొరేషన్లకే కార్యాలయాలు.. ⇒ బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 1974లో బీసీ కార్పొరేషన్ ఏర్పాటైంది. ప్రస్తుతం బీసీ సంక్షేమ శాఖ పరిధిలో బీసీ కార్పొరేషన్తోపాటు ఎంబీసీ, రజక, నాయీ బ్రాహ్మణ, కల్లుగీత, వడ్డెర, సగర (ఉప్పర), వాలీ్మకి/బోయ, భట్రాజ, విశ్వబ్రాహ్మణ, కృష్ణబలిజ/పూసల, కుమ్మరి/శాలివాహన, మేదర, ముదిరాజ్, గంగపుత్ర, మున్నూరు కాపు, లింగాయత్, యాదవ, మేర, పద్మశాలి, పెరిక కార్పొరేషన్లతోపాటు ఈబీసీ సంక్షేమ బోర్డు కొనసాగుతున్నాయి. ఇందులో కేవలం ఐదింటికి మాత్రమే చైర్మన్లున్నారు. పెద్ద సంఖ్యలో కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఐదింటికి మినహా మిగిలిన వాటికి కార్యాలయాలు సైతం లేవు. వాటిని బీసీ కార్పొరేషన్ కార్యాలయం నుంచే నిర్వహిస్తున్నారు. ⇒ ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలో ఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటై 50 ఏళ్లు పూర్తయింది. ఈ కార్పొరేషన్ను మాల, మాదిగలకు వేర్వేరుగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు ముందడుగు పడలేదు. ⇒ ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలోని ట్రైకార్ను మూడు కార్పొరేషన్లుగా ప్రభుత్వం మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదివాసీల కోసం కుమురం భీం ఆదివాసీ కార్పొరేషన్, లంబాడాల కోసం సంత్ సేవాలాల్ లంబాడా కార్పొరేషన్, ఎరుకల వర్గానికి ఏకలవ్య కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. వాటిలో ట్రైకార్ చైర్మన్ కొనసాగుతున్నప్పటికీ విభజించిన కార్పొరేషన్లకు నీడ కూడా లేదు. ఉద్యోగుల కేటాయింపు, కార్యాలయాల ఏర్పాటు ఊసే లేదు. ⇒ మైనారిటీ సంక్షేమ శాఖ పరిధిలో ఒక కార్పొరేషన్ ఉండగా అందులో ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీలకు వేర్వేరుగా కార్యకలాపాలు సాగించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ ముందడుగు పడలేదు. ⇒ వికలాంగుల సంక్షేమ శాఖ పరిధిలో తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ ఉండగా మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో తెలంగాణ మహిళా సహకార అభివృద్ధి సంస్థ కొనసాగుతోంది. వాటికి చైర్మన్లు ఉన్నారు. -
రూటు మారిన ఓటు!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో ఓటర్ల జాబితా తప్పులతడకగా రూపొందించారు. అన్ని మున్సిపాలిటీల్లోనూ అనేక పొరపాట్లు దొర్లాయి. నివాసం ఒక వార్డులో ఉంటే, ఓట్లు మరో వార్డులోకి వెళ్లాయి. ఒకే ఇంట్లో కొందరి ఓట్లు ఒక వార్డు పరిధిలో.. మరికొందరివి మరో వార్డు పరిధిలోకి వెళ్లాయి. మరికొన్ని చోట్ల అసలు ఓట్లే లేకుండా పోయాయి. దీంతో ఓటర్లంతా ఫిర్యాదులతో మున్సిపల్ కార్యాలయాల బాట పట్టారు. కార్పొరేషన్, పెద్ద మున్సిపాలిటీల్లో వందల కొద్దీ తప్పిదాలు చోటు చేసుకోగా, చిన్న మున్సిపాలిటీల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. ఆరు ఉమ్మడి జిల్లాల పరిధిలోనే ఓటర్ల జాబితాలో తప్పులపై సుమారు 6 వేల ఫిర్యాదులు అధికారులకు అందాయి. దీంతో వాటిని పరిష్కరించేందుకు తల పట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. నల్లగొండలోనే అత్యధిక ఫిర్యాదులు ఓటర్ల జాబితాల్లో తప్పులు దొర్లాయంటూ ఎనిమిది ఉమ్మడి జిల్లాల పరిధిలోని కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో 5,406 ఫిర్యాదులు అధికారులకు అందాయి. క్షేత్ర స్థాయిలోకి వెళ్లి పరిష్కరిస్తే తప్ప ఆ పొరపాట్లను సరిచేయలేమని అధికారులు చెబుతున్నారు.ఎంత మేరకు పరిష్కరిస్తారన్నది ఈ నెల 10వ తేదీన తుది ఓటరు జాబితా విడుదలైతేనే తెలియనుంది. ఇక ఓటర్ల జాబితాలపై అభ్యంతరాలు అత్యధికంగా 1,556 నల్లగొండ జిల్లాలోనే వచ్చాయి. ఒకే సీరియల్ నంబరు ఇళ్లు ఉండటంతోనే... అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా ఆధారంగానే వార్డులవారీ ఓటర్ల జాబితాను తయారు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇందులో భాగంగా వార్డుల వారీగా ‘టీ పోల్’యాప్ ద్వారా హద్దులు నిర్ణయించి, ఇంటి నంబర్ల ఆధారంగా వార్డుల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాను తయారు చేశారు. అయితే ఒక ఇంటి నంబర్ సీరియల్ ప్రారంభ డిజిట్ రెండు మూడు వార్డుల్లో ఉండటం, ప్రస్తుతం టీ పోల్ యాప్లో ఆ ఇంటి నంబర్ల ఆధారంగా ఓటర్ల జాబితా చేయడంతో పలు ఇళ్లకు చెందిన ఓటర్లు వేర్వేరు వార్డుల్లోకి వెళ్లిపోయారు. గతంలో ఉన్న వార్డు ఓటర్ల జాబితాను పరిశీలించుకుంటూ ఏ ఇంటి నంబర్ ఏ వార్డులో ఉందనేది తేల్చుతూ ఓటర్ల జాబితా తయారు చేస్తే ఇన్ని తప్పులు దొర్లేవి కావు. ఓటర్ల జాబితాల్లో తప్పులెన్నో.. ⇒ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తమ ఓట్లు వేరే వార్డుల్లోకి మారిపోయాయని 1,187 మంది ఓటర్లు ఫిర్యాదు చేశారు. ⇒ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఓటర్ల నుంచి 868 అభ్యంతరాలు వచ్చాయి. వీటిలో అత్యధికంగా 629 మంది ఓటర్లు తమ ఓట్లు వేరే డివిజన్లలోకి వెళ్లిపోయాయని ఫిర్యాదు చేశారు. ⇒ నిజామాబాద్ నగరపాలక సంస్థలో 1, 2, 3, 28వ డివిజన్లలో 3,200 ఓట్లు గల్లంతయ్యాయి. ఆ డివిజన్లలోకి వేరే డివిజన్ల నుంచి మరో 2,500 ఓట్లు వచ్చి చేరాయి. వీటిపై అధికారులకు ఫిర్యాదు చేశారు. 4, 43వ డివిజన్ల నుంచి మరో వెయ్యికి పైగా ఓట్లు ఇతర డివిజన్లలోకి వెళ్లిపోయాయని ఫిర్యాదు చేశారు. బోధన్లో ఓటర్ల పేర్లు గల్లంతు అయ్యాయని, భీమ్గల్ మున్సిపాలిటీలో 3 వేల ఓట్లు ఒక వార్డు నుంచి మరో వార్డుకు వెళ్లిపోయాయని ఫిర్యాదు చేశారు. ⇒ భూపాలపల్లి జిల్లాలో గ్రామాల పరిధిలో రెండేళ్ల కిందట నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలోకి వెళ్లిపోయిన వారి ఓట్లను కూడా భూపాలపల్లి మున్సిపాలిటీలోని వివిధ వార్డులలో ఉన్నట్లు ఫిర్యాదు చేశారు. ⇒ కరీంనగర్ నగరంలోని 64వ డివిజన్లో 600కు పైగా ఇతర ప్రాంత (డివిజన్కు సంబంధం లేని) ఓట్లున్నట్లు అభ్యంతరాలు వచ్చాయి. ఇది ఎవరికీ పట్టని కాలనీ.. 449 మంది ఓట్ల తొలగింపు ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొమ్మేపల్లి పునరావాస కాలనీని ఆరేళ్ల కింద ఏర్పాటు చేశారు. అక్కడ 449 మంది ఓటర్లు ఉన్నారు. వారు అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లోనూ కిష్టారం పంచాయతీ పరిధిలో ఓట్లు వేశారు. మొన్నటి సర్పంచ్ ఎన్నికల్లో మాత్రం వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. కారణం ఏంటంటే.. మున్సిపాలిటీ పరిధిలో ఆ కాలనీ ఉండటమే. అయితే ప్రస్తుతం వారికి మున్సిపాలిటీ పరిధిలో ఓట్లు లేకుండా చేశారు.దీనిపై వారంతా ఎంపీడీఓ, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్, కలెక్టర్కు వినతిపత్రాలు ఇచ్చారు. అయినా 449 మందికి ఓటు హక్కు ఇవ్వలేదు. దీంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే.. ఆ కాలనీని ఆనుకొని ఉన్న సింగరేణి క్వార్టర్స్ వారు 300 మంది ఓట్లు నమోదు చేసుకోగా, అదే మున్సిపాలిటీలోని 17వ వార్డులో కలిపారు. అయితే, కొమ్మేపల్లి పునరావాస కాలనీని మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు.ఈయన కడియం రమేశ్, నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని 19వ వార్డు పరిధిలోని ముత్తిరెడ్డి కుంట. ఇంట్లో ఐదుగురు ఉంటారు. ఆయన భార్య జ్ఞానేశ్వరి, ఇద్దరు కూతుళ్లు జెన్నిఫ్లోరా, డివైన్ రోజ్ల ఓట్లు 19వ వార్డులో ఉన్నాయి. రమేష్ తోపాటు మరో కూతురు జెస్సికా ఫ్లోరెన్స్ ఓట్లు మాత్రం 38వ వార్డులోకి వెళ్లిపోయాయి. దీంతో వాటిని మార్చాలంటూ ఆయన అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘విదేశీ’ వాటా తగ్గుతోంది
భారత్లో ఉన్నత విద్యను అంతర్జాతీయీకరించాల్సిన ఆవశ్యకత ఉందని నీతి ఆయోగ్ ఇటీవల స్పష్టం చేసింది. ఇదే జరిగితే ఐటీ నిపుణులు, వైద్యులు, ఇంజనీర్లు, విద్యావేత్తల వంటి నిపుణులకు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మన దగ్గరే ఉన్నత విద్యను అందించవచ్చు. జ్ఞానంతో నడుస్తున్న ప్రపంచంలో భారత్ నుంచి మేధావులు పరాయిగడ్డకు వెళ్లడం పోటీతత్వాన్ని దెబ్బతీస్తుందన్నది నిపుణుల మాట. అయితే విదేశాలలో ఉన్న తమ బిడ్డల చదువుల కోసం భారత్ నుంచి కుటుంబాలు పంపిస్తున్న డబ్బుల వాటా తగ్గుతోంది.వాటా పడిపోయింది.. మన దేశం నుంచి విదేశాల్లో ఉన్న తమవారికి పంపిన మొత్తం రెమిటెన్సుల్లో విదేశీ విద్య వాటా 2014–15లో 20.90%. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–అక్టోబర్లో ఇది 8.32 శాతానికి పడిపోయింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సరళీకృత చెల్లింపుల పథకం కింద విదేశీ విద్యకు భారత్ నుంచి పలు దేశాలకు పంపిన మొత్తం 2014–15లో 0.28 బిలియన్ డాలర్ల నుంచి 2024–25 వచ్చేసరికి 2.92 బిలియన్ డాలర్లకు పెరిగాయి. వాస్తవానికి దేశ చరిత్రలో అత్యధికంగా 2021–22లో ఈ మొత్తం 5.17 బిలియన్ డాలర్లుగా నమోదైంది. 2025–26 ఏప్రిల్–అక్టోబర్లో 1.43 బిలియన్ డాలర్లు విదేశాలకు చేరింది.ముందంజలో చైనా..వివిధ దేశాలకు చెందిన ఉన్నత విద్యాసంస్థల నిలయంగా చైనా ముందంజలో ఉంది. ఆ దేశంలో ఏకంగా 45 విదేశీ ఉన్నత విద్యా సంస్థలు (ఎఫ్హెచ్ఈఐ) పలు కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. భారత్లో ప్రస్తుతం 3 ఎఫ్హెచ్ఈఐలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. మరో 15 సంస్థలు మన దేశంలో సేవలు అందించేందుకు సూత్రప్రాయ ఆమోదం దక్కించుకున్నాయి. -
శీతలప్రాంత చేపలు ఉష్ణమండలంలో పెంపకం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జమ్మూకశ్మీర్, హిమాచల్ప్రదేశ్, సిక్కిం వంటి శీతల ప్రాంతాలకే పరిమితమైన రెయిన్బో ట్రౌట్ చేపల పెంపకం దేశంలోనే తొలిసారిగా ఉష్ణమండల ప్రాంతమైన తెలంగాణలో వాణిజ్య స్థాయిలో ప్రారంభమైంది. రాష్ట్రానికి చెందిన స్మార్ట్ గ్రీన్ ఆక్వాకల్చర్ లిమిటెడ్ సంస్థ.. రెండెకరాల విస్తీర్ణంలో ఇండోర్ పద్ధతిలో అత్యాధునిక రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టం (ఆర్ఏఎస్) ఆధారిత సాంకేతిక పరిజ్ఞానంతో రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో రెయిన్బో ట్రౌట్ ఫాం, పరిశోధన సంస్థను ఏర్పాటు చేసింది.సుమారు రూ. 54 కోట్ల పెట్టుబడితో, ఏటా 1,200 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ ఫాంను కేంద్ర పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్సింగ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెక్నాలజీని జోడించి చేపల పెంపకం చేపట్టడం అభినందనీయమన్నారు. ప్రతికూల వాతావరణంలోనూ ఇలాంటి చేపల పెంపకం చేపట్టడం ఆదర్శనీయమని చెప్పారు.ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దేశంలో ఎక్కడైనా ఇలాంటి చేపలను పెంచొచ్చని.. ప్రపంచ మార్కెట్లో ఈ చేపలకు డిమాండ్ ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి, మత్స్యశాఖ సహాయ మంత్రి జార్జి కురియన్, ఎస్పీ సింగ్ బగెల్, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, పశుసంవర్థక కార్యదర్శి సాగర్ మెహ్రా, ఆల్ ఇండియా డిక్కీ చైర్మన్ నర్ర రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉష్ణోగ్రత 10 నుంచి 15 డిగ్రీల్లోపే రెయిన్బో ట్రౌట్ చేపలు 10 నుంచి 15 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలోనే జీవిస్తాయని... అందువల్ల 44 కోల్డ్వాటర్ ఫిష్ ప్లాంట్లను ఏర్పాటు చేసి వాటిలో ఈ చేపల పెంపకం చేపడుతున్నామని సంస్థ నిర్వాహకుడు ఆదిత్య రిత్విక్ నర్ర తెలిపారు. 14 నెలల్లోనే చేపలు చేతికి వస్తాయన్నారు. ప్రస్తుతం అమెరికా నుంచి చేప పిల్లలను దిగుమతి చేసుకున్నట్లు చెప్పారు. కృత్రిమ చేపల చెరువులు, కుంటల్లో చేపట్టే చేపల పెంపకంలో.. చేపలను బయటకు తీసి కలుషిత నీటిని ఎప్పటికప్పుడు మార్చాల్సి ఉంటుందన్నారు. కానీ ఆర్ఏఎస్ టెక్నాలజీలో మాత్రం చేపలను తొలగించాల్సిన అవసరం లేకుండానే నీటిని నిరంతరం శుభ్రపరచొచ్చని.. అవే నీటిలో తిరిగి ఆక్సిజన్ను చేర్చడం, ఉష్ణోగ్రతలను నియంత్రించడం సాధ్యమవుతుందని వివరించారు. ఖరీదైన, అరుదైన రెయిన్బో ట్రౌట్ చేపలను ఎక్కడైనా పెంచొచ్చని నిరూపించేందుకే ఈ విధానంలో ఫిష్ ఫారి్మంగ్ను చేపట్టినట్లు ఆయన తెలిపారు. 6 కేజీల దాకా బరువు.. కిలో రూ. 3 వేలపైనే రేటు రెయిన్బో ట్రౌట్ రకం చేపల జీవితకాలం ఆరేళ్లు. ఇవి 10 నుంచి 15 అంగుళాల పొడవు, 6 కేజీల దాకా బరువు పెరుగుతాయి. ఈ రకం చేపల్లో పుష్కలంగా విటమిన్ బీ12, విటమిన్ డీతోపాటు ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్లు, ప్రొటీన్లు ఉంటాయి. బహిరంగ మార్కెట్లో ఈ చేప ధర కేజీ రూ. 3 వేలపైనే పలుకుతుండటంతో దేశంలోని శీతల ప్రాంతాల్లో వాటిని వాణిజ్య స్థాయిలో పెంచుతున్నారు. -
లేత మనసుకు రీల్స్ షాక్
సాక్షి, స్పెషల్ డెస్క్: షార్ట్స్, రీల్స్.. కంటెంట్ ఏదైనా ఆన్లైన్లో అందుబాటులోకి వస్తున్న వీడియోల వీక్షణం ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి వ్యసనంలా దాపురించింది. మాట్లాడటాన్ని మినహాయిస్తే ఒకప్పుడు ఖాళీ సమయాల్లో కొద్దిసేపు వెలిగే మొబైల్ ‘తెర’.. ఇప్పుడు గంటలకొద్దీ కాంతిని వెదజల్లుతోంది. ఒకదాని వెంట మరొకటిగా ప్రత్యక్షమయ్యే వీడియోలను విడిచి పెట్టకుండా చూసేస్తున్నారు. అయితే పిల్లలు సైతం ఈ వ్యసనం బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. స్మార్ట్ ఫోన్లలో అందుబాటులో ఉండే యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర యాప్లలో అప్లోడ్ అవుతున్న ఈ తక్కువ నిడివి వీడియోలు చూడటం నిత్యకృత్యంగా మారింది.డ్యాన్సులు, పాటలు, హాస్యం, నేరాలు, ప్రాంక్ (ప్రాక్టికల్ జోక్స్)..ఇలా అంశం ఏదైనా కోట్లాది షార్ట్ వీడియోలు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి. వంటలు చేయడం, పర్యాటక ప్రదేశాలు, ప్రపంచ దేశాలను చుట్టేయడం..వీటన్నిటినీ అప్లోడ్ చేసేది కొందరైతే, అవన్నీ చూస్తూ మొబైల్ స్క్రీన్ ముందు ఎంత సమయం గడుపుతున్నదీ తెలియనంతగా జనం లీనమై పోతున్నారు. వీటిల్లో చాలా వీడియోలు పిల్లలకు పనికొచ్చేవి కాదు..వారిని ఉద్దేశించి చేసినవీ కాదు. అయినప్పటికీ కోట్లాది మంది పిల్లలు వీటికి అలవాటుపడ్డారు. భారీ వరదలా ముంచెత్తే కంటెంట్ ప్రవాహం వీరి నిద్రకు అంతరాయం కలిగిస్తోంది. అనారోగ్య సమస్యలకు కారణమవుతోంది. చదువులపై ప్రభావం చూపిస్తోంది. స్మార్ట్ఫోన్ యూజర్లు ప్రతిరోజూ ప్రపంచవ్యాప్తంగా 40 వేల కోట్ల యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ వీక్షిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. నియంత్రణ కోల్పోయి..సాధారణంగా 15–90 సెకన్ల వ్యవధితో ఉండే ఈ చిన్న వీడియోలు మెదడు ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకునేలా రూపొందాయి. స్వైప్ చేసిన ప్రతిసారీ కొత్త వీడియో దర్శనమిస్తుంది. ఇంకేముంది.. స్క్రీన్తోనే తెల్లవారుతోంది.. అదే స్క్రీన్తో నిద్రలోకి జారుకుంటున్నారు. లక్ష మంది పాలుపంచుకున్న 71 అధ్యయనాలను విశ్లేíÙస్తే.. పెద్ద ఎత్తున షార్ట్ వీడియోల వీక్షణంతో స్వీయ నియంత్రణ, పని, చదువుపై శ్రద్ధ తగ్గిందని తేలింది. ముఖ్యంగా నిద్రపై తీవ్ర ప్రభావం పడుతోంది.నిద్రకు దూరం.. షార్ట్ వీడియోలు చూసే వారు సరిపడా నిద్రకు దూరమవుతున్నారు. చాలామంది పిల్లలు నిద్రకు ఉపక్రమించే ముందు మొబైల్స్లో విహరిస్తున్నారు. వేగవంతమైన కంటెంట్లో ఉండే భావోద్వేగ హెచ్చు తగ్గులు మెదడుకు ప్రశాంతత లేకుండా చేస్తాయి. నిద్రపోవడం కష్టమవుతుంది. మరో అధ్యయనం ప్రకారం అధికంగా షార్ట్ వీడియోల వీక్షణంతో కొంతమంది టీనేజర్లు పేలవమైన నిద్ర, బిడియం, ఆందోళనకు గురి అవుతున్నట్టు వెల్లడైంది. హెచ్చరిక లేకుండానే ప్రత్యక్షం స్వీయ నియంత్రణ విషయంలో చిన్నపిల్లల్లో తక్కువ పరిణతి ఉంటుంది. పైగా చాలావరకు సున్నిత మనసు్కలు. దీంతో త్వరితగతిన భావోద్వేగానికి గురవుతున్నారు. పిల్లలు ఎప్పుడూ చూడకూడని కంటెంట్ సైతం దర్శనమీయడం ప్రమాదానికి కారణం అవుతోంది. పిల్లల ప్రమేయం లేకుండానే వీడియోలు ఒకదాని తర్వాత ఒకటి ఆటోప్లే అవుతుంటాయి. హింసాత్మక, హానికరమైన చాలెంజ్లు, లైంగిక కంటెంట్ సైతం తెరపై ప్రత్యక్షమవుతుంటుంది. గంటల నిడివిగల వీడియోలు, సంప్రదాయ సోషల్ మీడియా పోస్ట్లకు భిన్నంగా షార్ట్ వీడియోలు ఎటువంటి హెచ్చరిక ప్రదర్శించవు. దీంతో భావోద్వేగ పరంగా సిద్ధం కావడానికి ఎలాంటి అవకాశమూ ఉండదు.భావోద్వేగాలను ఎదుర్కోవడానికి.. కంటెంట్, సౌండ్లో ఆకస్మిక మార్పు, భావోద్వేగపరమైన హెచ్చుతగ్గులు అభివృద్ధి చెందుతున్న మెదడులకు ఇబ్బంది కలిగిస్తుంది. అందరు పిల్లలపై ప్రతికూల మానసిక ప్రభావం చూపనప్పటికీ.. ఆందోళన, శ్రద్ధ వహించడంలో ఇబ్బందులు, భావోద్వేగ అస్థిరత ఉన్నవారు మానసిక స్థితిలో మార్పులకు ఎక్కువగా గురవుతారు. అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ (ఏడీహెచ్డీ) ఉన్నవారు ప్రధానంగా వేగవంతమైన కంటెంట్ వైపు ఆకర్షితులవుతారు. బెదిరింపులకు గురైన వారు, ఒత్తిడి, కుటుంబ అస్థిరత, పేలవమైన నిద్రతో బాధపడుతున్న పిల్లలు కష్టమైన భావోద్వేగాలను ఎదుర్కోవడానికి రాత్రి సమయంలో షార్ట్ వీడియోలను చూస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.నైపుణ్యాలు బలహీనం.. సంబంధాల నిర్మాణం, విసుగును తట్టుకోవడం, అసౌకర్య భావాలను ఎదుర్కోవడం బాల్యంలో నేర్చుకుంటారు. అలాంటిది ఎక్కువగా శీఘ్ర వినోదానికి అలవాటు పడిపోయినప్పుడు.. పిల్లలు కలలు కనడం, ఆటలు, కుటుంబంతో ముచ్చటించడం లేదా వారి సొంత ఆలోచనల్లో విహరించడం వంటి అవకాశాలను కోల్పోతారు. బడి నుంచి ఇంటికి వచి్చన తర్వాత ఖాళీ సమయంలో లేత మనసులు తమను తాము ఉల్లాసపర్చుకోవడం, అంతర్గత దృష్టిని పెంపొందించు కోవడం వంటివి చేయాలి. అది కరువైతే నైపుణ్యాలు బలహీన పడతాయని నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రులు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని హెచ్చరిస్తున్నారు.తల్లిదండ్రులు ఏం చేయాలి.. ⇒ నిద్ర, ఆఫ్లైన్ కార్యకలాపాలకు ప్రాధాన్యం ఇచ్చేలా చూడాలి. ⇒ ఆరు బయట క్రీడలు, పఠనం, అభిరుచులను ప్రోత్సహించాలి. ⇒ కంటెంట్, ఆన్లైన్ అనుభవాల గురించి పిల్లలతో చర్చించి అవగాహన కల్పించాలి. ⇒ డిజిటల్ ప్రయోజనాలు, స్క్రీన్ వీక్షణ ప్రభావాల గురించి వివరించాలి. -
మధ్యవర్తిత్వమే మార్గం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న గోదావరి జలాల వివాదాన్ని న్యాయ పోరాటాలతో కంటే.. సామరస్య పూర్వకంగా, మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవడం మేలని సుప్రీంకోర్టు సూచించింది. సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని చెప్పింది. మధ్యవర్తిత్వంతో సహా మూడు పరిష్కార మార్గాలను భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ రెండు రాష్ట్రాల ముందుంచారు. పోలవరం ప్రాజెక్టును అనుసంధానిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ‘పోలవరం–నల్లమల సాగర్’ ఎత్తిపోతల పథకం చేపట్టిందని, ఇందుకు సంబంధించి టెండర్లు పిలిచిందని, దీనిపై తక్షణమే స్టే ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సోమవారం జస్టిస్ జాయ్మాల్యా బగ్చితో కూడిన సీజేఐ ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపింది. తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, ఏపీ తరఫున మరో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, ఇతర న్యాయవాదులు వాదనలు విన్పించారు. మా నీటిని తరలించుకుపోయే కుట్ర: తెలంగాణ సింఘ్వి వాదనలు వినిపిస్తూ.. ‘ఏపీ ప్రభుత్వం గోదావరి ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. గోదావరి బేసిన్లో తెలంగాణకు 968 టీఎంసీల వాటా ఉంది. పోలవరం–నల్లమల సాగర్ ప్రాజెక్టు ద్వారా ఏపీ 200 టీఎంసీలను మళ్లిస్తే తెలంగాణ వాటాకు గండి పడుతుంది. వరద జలాల పేరుతో తెలంగాణకు కేటాయించిన నీటిని తరలించుకుపోయే కుట్ర ఇది. ఈ ప్రాజెక్టును ఆపాలని ఆదేశించాలి. అనుమతులు లేకుండా ముందుకెళ్లొద్దని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయినా ఏపీ ప్రభుత్వం వాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. పోలవరం నుంచి అక్రమంగా 200 టీఎంసీల వరద నీటిని మళ్లించేందుకు వీలుగా టెండర్లు పిలిచింది. సీడబ్ల్యూసీ అనుమతులు లేకుండా, కనీసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) ఆమోదం పొందకుండానే ఏపీ ప్రాజెక్టు పనులు చేపడుతోంది. ప్రస్తుతం సీడబ్ల్యూసీ చైర్మన్ నేతత్వంలో వేసిన కమిటీకి ప్రాజెక్టు పనులను ఆపే అధికారం లేదు. కాబట్టి సుప్రీంకోర్టు వెంటనే జోక్యం చేసుకుని కేంద్రం నియమించిన కమిటీ నివేదిక వచ్చేంత వరకైనా పనులను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలి..’ అని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ పోయింది..నీళ్లు కూడా వద్దా?: ఏపీ ముకుల్ రోహత్గీతో పాటు సీనియర్ న్యాయవాదులు బల్బీర్ సింగ్, జైదీప్ గుప్తా వాదనలు వినిపిస్తూ.. ‘పోలవరం–నల్లమల సాగర్ విషయంలో ఏపీ ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదు. ప్రస్తుతం ప్లానింగ్ దశలోనే ఉన్నాం. ప్రీ ఫీజబిలిటీ రిపోర్టు (పీఎఫ్ఆర్), డీపీఆర్ తయారీ కోసమే సర్వేలు, టెండర్ల ప్రక్రియ చేపట్టాం. క్షేత్రస్థాయిలో నిర్మాణాలు చేయడం లేదు. గోదావరి నుంచి సముద్రంలో వృధాగా కలుస్తున్న నీటిని కరువు ప్రాంతమైన రాయలసీమకు అందించాలన్నదే ఏపీ ఉద్దేశం. ఇది ఆ రాష్ట్ర అంతర్గత అవసరాల కోసం చేపడుతున్న ప్రాజెక్టు..’ అని వెల్లడించారు. రోహత్గీ వాదిస్తూ.. ’ఇప్పటికే రాష్ట్ర విభజనలో ఏపీ నుంచి హైదరాబాద్ను తీసేసుకున్నారు. ఇప్పుడు సముద్రంలో కలిసే నీళ్లు కూడా వాడుకోకూడదా?..’ అని ప్రశ్నించారు. 2014 విభజన చట్టం ద్వారా ఈ జాతీయ ప్రాజెక్టుకు తెలంగాణ సమ్మతి తెలిపినట్టేనని బల్బీర్ సింగ్ అన్నారు. తెలంగాణ పిటిషన్ దురుద్దేశపూర్వకమైనదని జైదీప్ గుప్తా చెప్పారు. ప్లానింగ్ దశలోనే ఉండొచ్చు కానీ..: సీజేఐ వాదనల సమయంలో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాము కేవలం ప్రాజెక్టు నివేదికల తయారీ కోసమే టెండర్లు పిలిచామన్న వాదనలపై స్పందిస్తూ.. ’ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్లానింగ్ దశలోనే ఉండొచ్చు. కానీ ఒకవేళ భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు నిబంధనలకు విరుద్ధమని తేలి ఆగిపోతే.. ప్లానింగ్, డాక్యుమెంటేషన్ కోసం ఖర్చు చేసిన ప్రజల నిధులు వృధా అవుతాయి కదా?’ అని ప్రశ్నించారు. ఈ పిటిషన్ విచారణార్హతను పరిశీలిస్తున్నామని చెప్పారు. మూడు పరిష్కార మార్గాలు ఈ కేసులో ఏదో ఒక నిర్ణయం తీసుకునే ముందు, సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ మూడు ప్రధాన పరిష్కార మార్గాలను ఇరు రాష్ట్రాల ముందు ఉంచారు. వీటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. ‘మొదటి మార్గంగా.. ఇది రెండు రాష్ట్రాల నడుమ తలెత్తిన జల వివాదం కాబట్టి, ఆర్టికల్ 32 కింద రిట్ పిటిషన్గా కాకుండా, ఆర్టికల్ 131 ప్రకారం ‘సివిల్ సూట్’గా దాఖలు చేస్తే సమగ్ర విచారణ జరిపేందుకు కోర్టుకు వెసులుబాటు ఉంటుంది. రెండవ మార్గంలో.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ వివాదంపై ఒక హై పవర్ కమిటీని ఏర్పాటు చేసినందున, ఆ కమిటీకి.. తెలంగాణ లేవనెత్తుతున్న అభ్యర్థనలను పరిశీలించి, అవసరమైతే ఆ ప్రాజెక్టును నిలిపివేసే (స్టే ఇచ్చే) ‘నిర్ణయాధికారాన్ని’ కల్పిస్తూ కోర్టు ఆదేశాలిచ్చే అవకాశం ఉంది. ముఖ్యమైన మూడవ మార్గంగా.. కోర్టు తీర్పుల దాకా వెళ్లకుండా, ఇరు రాష్ట్రాల ప్రతినిధులు కలిసి కూర్చుని, మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను స్నేహపూర్వకంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయవచ్చు..’ అని చెప్పారు. ఈ ప్రతిపాదనలపై తమ ప్రభుత్వ నిర్ణయాన్ని తెలుసుకునేందుకు సమయం కావాలని తెలంగాణ తరఫు న్యాయవాది సింఘ్వీ కోరడంతో.. ధర్మాసనం తదుపరి విచారణను జనవరి 12వ తేదీకి వాయిదా వేసింది. -
జూనియర్ డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో ట్విస్ట్
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేటలో జూనియర్ డాక్టర్ లావణ్య సూసైడ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. లావణ్య ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు తేల్చారు. ఈ క్రమంలో లావణ్య ఆత్మహత్యకు కారణమైన డాక్టర్ ప్రణయ్ని సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, ఏడాది నుంచి డాక్టర్లు లావణ్య, ప్రణయ్ తేజ్ ప్రేమించుకుంటున్నారని పోలీసులు తెలిపారు. కానీ, పెళ్లికి కులం వేరే ఉందని ప్రణయ్ సాకు చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ కారణంగానే మనస్తాపంతో పాయిజన్ ఇంజెక్షన్ వేసుకుని లావణ్య ఆత్మహత్య చేసుకుందని పోలీసులు నిర్ధారించారు.ఇదిలా ఉండగా.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన జూనియర్ డాక్టర్ లావణ్య.. నిమ్స్లో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతి చెందింది. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన బి.లావణ్య సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో హౌస్ సర్జన్ పూర్తి చేసి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఇంటర్న్షిప్ చేస్తోంది. శుక్రవారం ఉదయం లేబర్ రూంలో డ్యూటీలో ఉండగా అనారోగ్యంగా ఉండటంతో క్యాజువల్ డిపార్ట్మెంట్లో చికిత్స తీసుకొని కాలేజీ హాస్టల్కు వెళ్లారు.శనివారం ఉదయం ప్రభుత్వ కళాశాల హాస్టల్లో గడ్డి మందును ఇంజెక్ట్ చేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇది గమనించిన తోటి జూనియర్ డాక్టర్లు జీజీహెచ్కు తరలించారు. అక్కడి నుంచి నిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతి చెందారు. జూనియర్ డాక్టర్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిద్దిపేట త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. -
సాహితీ ఇన్ఫ్రా కేసులో 17 ఛార్జ్షీట్లు దాఖలు
సాక్షి,హైదరాబాద్: సాహితీ స్కాంపై సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ స్కాం మొత్తం రూ.3000 కోట్లుగా తేల్చినట్లు అధికారులు వెల్లడించారు.నాలుగేళ్ల పాటు విచారణ జరిపిన అనంతరం సీసీఎస్ పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేయగా.. ‘ఫ్రీ లాంచ్ ఆఫర్’ పేరుతో ప్రజలను మోసం చేసిన కేసుల్లో మొత్తం 64 కేసులు.. అమీన్పూర్లోని శర్వాణి ఎలైట్ ప్రాజెక్టుకు సంబంధించి 17ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రూ.500 కోట్ల పైచిలుకు వసూలు చేసినట్లు గుర్తించారు.వసూలు చేసిన డబ్బులను సాహితీ లక్ష్మీనారాయణ సొంత ప్రయోజనాలకు వాడుకున్నారని పోలీసుల విచారణలో తేలింది. ‘ఫ్రీ లాంచ్ ఆఫర్’ పేరుతో తక్కువ ధరకే ప్లాట్లు ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేసినట్లు విచారణలో బయటపడింది. సాహితీ స్కాంపై మొత్తం 13 మంది నిందితులపై అభియోగాలు నమోదు చేశారు. వీరిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి. -
సైబరాబాద్లో.. ఏఐ ఆధారిత ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో రోడ్డు భద్రతను మిషన్ మోడ్లో ముందుకు తీసుకెళ్లే దిశగా ‘అరైవ్ అలైవ్–2026’ కార్యక్రమం మరో ముందడుగు వేసింది. ఈ సందర్భంగా అరైవ్ అలైవ్–2026 టేబుల్టాప్ క్యాలెండర్ను విడుదల చేసి, ఆలోచనల నుంచి అమలుకు మారుతున్న స్పష్టమైన రోడ్మ్యాప్ను ప్రకటించారు. ఈ కార్యక్రమం డీజీపీ బి. శివధర్ రెడ్డి నేతృత్వంలో, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉన్నత పోలీసు అధికారుల సహకారంతో కొనసాగుతోంది.ఈ ప్రచారంలో భాగంగా ‘అరైవ్ అలైవ్’ ప్రతినిధులు మంగళవారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం. రమేశ్ను కలిశారు. రోడ్డు భద్రతను మరింత బలోపేతం చేయడంలో సాంకేతికత ఆధారిత చర్యలు, ప్రజల భాగస్వామ్యం కీలకమని ఈ సందర్భంగా చర్చించారు.ఈ సమావేశంలో ముఖ్య ఆకర్షణగా ఏఐ ఆధారిత ట్రాఫిక్ లా కంప్లయన్స్ వాహనం (TLCV)ను కమిషనర్ ఆఫ్ పోలీస్ స్వయంగా టెస్ట్ రైడ్ చేశారు. ట్రాఫిక్ ఉల్లంఘనలు గుర్తించడం, ప్రజా భద్రతను మెరుగుపరచడంలో ఈ వాహనం కీలకంగా ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. ‘అరైవ్ అలైవ్’ కేవలం ప్రచారం కాదని, ప్రతి కుటుంబం సురక్షితంగా గమ్యానికి చేరుకోవాలన్న బాధ్యతగా రాష్ట్రం ముందుకు సాగుతోందని నిర్వాహకులు పేర్కొన్నారు. -
చైనీస్ మాంజా వాడుతున్నారా.. సజ్జనార్ సీరియస్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంకాంత్రి అనగానే కోడి పందాలు, గొబ్బెమ్మలు, ముగ్గులు, పంతగులు గుర్తుకు వస్తాయి. హైదరాబాద్లో ప్రత్యేకంగా తయారు చేసిన పంతగులను(కైట్స్) ఎగురవేస్తారు. అయితే, కైట్స్ కోసం వాడే చైనీస్ మాంజా వినియోగంపై నగర సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరికలు జారీ చేశారు. చైనీస్ మాంజా విక్రయించినా, నిల్వ చేసినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.హైదరాబాద్ సీపీ సజ్జనార్ తాజాగా ట్విట్టర్ వేదికగా.. హైదరాబాద్ నగరవ్యాప్తంగా చైనీస్ మాంజాపై ప్రత్యేక నిఘా ఉంది. మాంజా విక్రయించినా, నిల్వ చేసినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. టాస్క్ఫోర్స్, స్థానిక పోలీసులతో సంయుక్త దాడులు చేస్తున్నాం. కైట్స్ షాపులు, గోదాములపై ఆకస్మిక తనిఖీలు చేస్తున్నాం. అక్రమ రవాణాపై ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలపై కూడా కేసులు పెడుతున్నాం. చైనీస్ మాంజాతో ప్రాణాపాయం. అందుకే అందరినీ హెచ్చరిస్తున్నాం. మాంజా వినియోగంపై సమాచారం ఇస్తే వారి వివరాలను గోప్యతగా ఉంచుతాం. డయల్ 100/ పోలీస్ వాట్సాప్ నంబర్ 94906 165559కు ఫిర్యాదు చేయవచ్చు అని తెలిపారు. Zero tolerance for Chinese Manja in HyderabadChinese manja is a silent killer that has caused serious injuries and even deaths of pedestrians, two-wheeler riders, birds, and animals.#Hyderabad Police has formed special teams to curb its illegal manufacture, storage,… pic.twitter.com/t8soSwDIsi— V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 5, 2026 -
మహిళల డ్రెస్సింగ్ వివాదం : రాధాకృష్ణ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం
నటుడు శివాజీ కారుకూతల పైత్యం పెద్ద దుమారాన్నే రాజేసింది. ప్రత్యక్షంగా హీరోయిన్లపైనా, పరోక్షంగా మహిళలపైనా అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయిన శివాజీపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అలాగే శివాజీకి అనూహ్యంగా మద్దతు కూడా లభించింది. ఈ దుమారం ఇలా కొనసాగుతుండగానే, ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కొత్త పలుకు పేరుతో రాసిన వ్యాసం కొత్త దుమారాన్ని రాజేసింది. ఇలాంటి వివాదాల పట్ల మీడియా బాధ్యతను, వ్యవహరించాల్సిన తీరును గుర్తు చేసింది.భూమిక ఫౌండర్, రచయిత్రి, సామాజికవేత్త కొండవీటి సత్యవతి ఈ ఆర్టికల్పై తీవ్రంగా స్పందించారు. ‘‘ఇది కొత్త పలుకు కాదు. మహిళల పరంగా చెత్త పలుకు. శివాజీని వెనకేసుకొచ్చిన ఈ పెద్దమనిషి గతంలో సినీనటుడు చలపతిరావుతో 'మీకు నిజంగా రేప్ చేయ్యాలనిపించలేదా?.. అని అసహ్యంగా అడిగినపుడు నేను డైరెక్ట్గా అతనికే ఫోన్ చేసి నిలదీసినపుడు మర్నాడు ఆంధ్రజ్యోతిలోనే సారీ చెప్పారు. అయినా ఇలాంటి వాళ్ళు మారతారని నేను అనుకోను. శివాజీకి కానీ, రాధాకృష్ణకి కానీ మహిళల వస్త్రధారణ మీద వ్యాఖ్యానించే అర్హత ముమ్మాటికీ లేదు. మీ వ్యవహారాలు మీరు చక్కబెట్టుకోండి. మాకు ఉచిత సలహాలు ఇవ్వడానికి సాహసించకండి. మీకా అర్హత లేదు. మీ వ్యాఖ్యలు చుట్టవిరుద్ధమే కాదు రాజ్యాంగ విరుద్ధం’’ అంటూ ఆమె ఫేస్బుక్లో మండిపడ్డారు. అలాగే సీనియర్ జర్నలిస్టు కృష్ణజ్యోతి కూడా సోషల్మీడియాలో దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విక్టిమ్ బ్లేమింగ్, entitlement, మేల్ ప్రివిలేజ్, మేల్ dominance, control, body & gender politics ఈ ఆర్టికల్ అద్దంపడుతోందన్నారు. మీడియాతో సహా మహిళల విషయాల పట్ల అందరికీ కొంతైనా జెండర్ sensitisation ఉండడం చాలా ముఖ్యమని.. కానీ ఇందులో ఆ స్పృహ, ఆలోచన, ఆసక్తి, కించిత్ బాధ్యత లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.అలాగే సిద్ధార్థ సుభాష్ చంద్రబోస్ ఈ వ్యాసంపై స్పందిస్తూ స్త్రీలు ఎటువంటి దుస్తులు వేసుకోవాలో తెలియజేస్తూ ఒక పత్రిక సంపాదకీయం రాయడం దారుణం అని వ్యాఖ్యానించారు. ‘‘స్త్రీలు మన కొలతల ప్రకారం శరీరం చూపే జంతువులు కాదు. వాళ్ల సౌకర్యాన్ని బట్టి, అవసరాన్ని బట్టి వాళ్ల దుస్తులు వాళ్లు ఎంపిక చేసుకునే హక్కుని అంగీకరించాలి. చూడలేకపోతే కళ్ళు మూసుకుని పక్కకు తప్పుకోవాలి, లేకపోతే గుహల్లో బ్రతకాలి. ఒక స్త్రీని దుస్తులని చూసి దాడి చేయాలనుకోవడం మగవాడి బలహీనతకు చిహ్నమే గాక, అది అతడు నాగరికంగా ఎదగలేకపోయిన వెనకబాటుని చూపిస్తుందనీ, రాజ్యాంగం సూచించిన స్వేచ్చా, సమానత్వాన్ని అంగీకరించని చట్టవిరుద్దమైన విషయమనీ, అలా గాకుండా ఇక్కడ ఏకంగా చేతులేస్తాం, రేపులు చేస్తామనడం తిరోగమనతత్వమని హితవు చెప్పి వుంటే అది "కొత్తపలుకు" అనే పదానికి అర్థవంతంగా వుండేది.. అంటూ బాగానే వాతలు పెట్టడం గమనార్హం.రాధాకృష్ణ వ్యాసంలో ఏముంది? డ్రెస్ కోడ్లతో మొదలైన అహంకారం, నిండు సభలో ఒక మహిళ చీర లాగినందుకు మహాభారత సంగ్రామం జరిగింది. అది ద్వాపర యుగం. కలియుగంలో మహిళలు జన సమూహంలోకి వెళ్లినప్పుడు చీర కట్టుకుంటే మంచిది అన్నందుకు మాటల యుద్ధం జరుగుతోందన్న సోషల్ మీడియా.. పలువురు వాడిన కాపీ డైలాగ్స్తో ఈ వ్యాసం సాగుతుంది.అభినవ కందుకూరి వీరేశలింగం అంటూ అంతేకాదు స్త్రీ జనోద్ధారకుడు, గొప్ప రచయిత కందుకూరి వీరేశలింగాన్ని కూడా అవమానపరుస్తూ, అభినవ కందుకూరి వీరేశలింగం పంతుళ్లు కొద్దిమంది మహిళల తరఫున వత్తాసు పలుకుతున్నారంటూ తన కుంచిత బుద్ధని ప్రకటించుకున్నారంటూ దుయ్యబట్టారు. ఇలాంటి వ్యాఖ్యల ద్వారా తన అజ్ఞానాన్ని, అహంకారాన్ని ప్రదర్శించకున్నాడంటూ దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్లు.ఆకతాయిలను రెచ్చగొడుతున్న వైనం‘‘చిట్టి పొట్టి దుస్తులతో ఒక మహిళా ప్రజాప్రతినిధి జనంలోకి వెళ్లడాన్ని ఊహించగలమా? వెళ్లకూడదా? అని గద్దిస్తే ఏం చెబుతాం? వెళ్లవచ్చు. కాకపోతే పర్యవసానాలకు కూడా సిద్ధం కావాలి. జరగరాని పరాభవం జరిగితే చింతించకూడదు’’ అంటూ పొట్టి దుస్తులు వేసుకున్న అమ్మాయిలను ఏం చేసేనా పరవాలేదనే పైత్యాన్ని నూరిపోస్తున్న ఒక మీడియా సంస్థ అధిపతి వైఖరి విమర్శలకు తావిస్తోంది.ఎవరి వల్ల ఎవరికి కష్టం? ఎవరిని శిక్షించాలి? ‘‘వస్త్రధారణ విషయంలో స్వేచ్ఛ అంటే అది కష్టాలు తెచ్చి పెట్టేదిగా ఉండకూడదు. తిండి, బట్ట విషయంలో స్వేచ్ఛ అనేది మనకు మేలు మాత్రమే చేయాలి. ఈ రెండు విషయాలలో నియమ నిబంధనలు పెట్టుకోవడం మనకే మంచిది!’’ అంటూ పెద్ద ముక్తాయింపు ఒకటి. ఇక్కడ ఎవరి వల్ల ఎవరికి కష్టం. దుస్తుల పేరుతో మహిళలపై, సెలబ్రిటీలపై ఆంబోతులపై ఎగబడుతున్నది ఎవరు అని ప్రశ్నించారు నెటిజన్లు. మంచికి పోతే చెడు ఎదురైనట్టుగా ప్రస్తుతం శివాజీ పరిస్థితి తయారైంది అంటూ శివాజీకి మద్దతు పలకడాన్ని మహిళలు తీవ్రంగా ఖండించారు.అసందర్భ ప్రేలాపనమోరల్ పోలీసింగ్ అంటే అర్థం తెలియని వాగాడంబరం ఎలా ఉందంటే ‘‘జంక్ ఫుడ్ తింటే ఊబకాయం వస్తుంది. అనారోగ్య సమస్యలతో బాధ పడతారు’ అని వైద్యులు చెబుతారు కదా! జంక్ ఫుడ్ తినవద్దని చెప్పడానికి మీరెవరు? అని ప్రశ్నించడం ఎంత అహేతుకంగా ఉంటుందో దుస్తుల విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించడాన్ని తప్పుపట్టడం కూడా అంతే అహేతుకం. జాగ్రత్తగా ఉండాలనడం మోరల్ పోలీసింగ్ అవుతుందని విమర్శించడం ఏమిటి?’’ అంటూ రాసుకు రావడం విడ్డూరంగా నిలిచింది. అల్లు అర్జున్పై దాడి గురించి ఏమంటారో?హైదరాబాద్లో హైటెక్ సిటీలోని ప్రసిద్ధ నిలోఫర్ కేఫ్కు టీ కోసం వెళ్లిన టాలీవుడ్ హీరో అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహారెడ్డికి ఎదురైన ఇబ్బందికర పరిస్థితి గురించి రాధాకృష్ణ ఏమంటారు? సెలబ్రిటీల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగేలా రెచ్చిపోతున్న యువకులను సమర్ధిస్తారా?. సెల్ఫీల కోసం ఎగబడి ఒక ఆడకూతుర్ని ఇబ్బంది పెట్టిన వైనంపై ఏమంటారో?. ఏ దుస్తులు వారిని అలా ప్రొవోక్ చేశాయి అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ‘వస్త్రధారణ స్వేచ్ఛే.. మహిళా సాధికారతా?’’ పేరుతో మగ దురహంకారంతో రాసిన రాతలు తప్ప మరొకటి కాదని రాధాకృష్ణ ఆర్టికల్పై ఆగ్రహం వ్యక్తమవుతోంది. మహిళల వస్త్రధారణపై చర్చ అంటూ అవాస్తవాలు, అవాకులు చెవాకులతో, చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ స్ఫూర్తికి భంగం కలిగించే విధంగా ప్రచురించిన ఈ వ్యాసంపై రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. -
కవిత పార్టీతో నష్టం ఏమీ లేదు: రాంచందర్రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కల్వకుంట్ల కవిత పార్టీ ఏర్పాటుపై రాష్ట్ర బీజేపీ చీఫ్ రాంచందర్ రావు సెటైరికల్ కామెంట్స్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు.. కవిత పార్టీ పెట్టుకుంటే మారేది ఏమీ లేదు అంటూ వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్పై కవిత చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిషన్ వేయాలి. ఆరోపణలు చేసిన కవిత.. తన వద్ద ఉన్న ఆధారాలను ఆ కమిషన్కు ఇవ్వాలి. ఇన్నాళ్లు అవినీతిలో అంటకాగి పంపకాల్లో తేడాలతోనే కవిత బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చారు. లిక్కర్ వ్యాపారం చేసి కవిత జైలుకు వెళ్లారు. లిక్కర్ కేసులో డబ్బులు సంపాదించారు.కవిత జైలుకు వెళ్లితే బీజేపీకి ఎం సంబంధం?. తప్పుచేసిన వారిని పార్టీలు జైలులో వేయవు. దర్యాప్తు సంస్థలు వేస్తాయి. కవితకు మాత్రమే ఆత్మగౌరవం ఉందా? తెలంగాణ ప్రజలకు లేదా?. ఆమె ఆత్మగౌరవం ఎలా దెబ్బతిందో అనేది వాళ్ల కుటుంబ అంశం మాత్రమే. ఇన్నాళ్లు వాళ్లతో ఉన్నప్పుడు కవిత ఎందుకు మాట్లాడలేదు. ఉద్యమ ద్రోహులు బీఆర్ఎస్లో చేరారని మేము మొదటి నుంచి చెప్పాం’ అంటూ కామెంట్స్ చేశారు. -
పోలవరం-నల్లమల్లసాగర్ ప్రాజెక్ట్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
సాక్షి, ఢిల్లీ: పోలవరం-నల్లమల్లసాగర్ ప్రాజెక్ట్ విషయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్ట్పై మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునేందుకు ప్రయత్నించండి అంటూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సూచించారు. అనంతరం, కేసు తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా చేశారు. కాగా, నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై స్టే ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ కోరారు. ఈ ప్రాజెక్టుతో గోదావరిలో తమ వాటా తగ్గుతుందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్కు సంబంధించి మూడు పరిష్కారాలను సుప్రీంకోర్టు సూచించింది.1. సమగ్ర విచారణ కోసం సివిల్ సూట్ ఫైల్ చేయమని సూచన 2. కేంద్ర ప్రభుత్వ కమిటీకి తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనలను పరిశీలించి, అవసరమైతే ప్రాజెక్టును ఆపే నిర్ణయాధికారాన్ని ఇస్తాం.3. మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకుని అవకాశం ఇచ్చారు.జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు..అంతకుముందు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్లానింగ్ దశలోనే ఉంది కదా?. ప్లానింగ్ డాక్యుమెంటేషన్ ప్రిపరేషన్కి ఏపీ నిధులే వృధా అవుతాయి కదా?. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ పిటిషన్ విచారణ అర్హతను పరిశీలిస్తున్నాం. సివిల్ సూట్ ఫైల్ చేస్తేనే సమగ్రంగా విచారణ జరపవచ్చు. ప్రాజెక్టు ఆపాలన్న మీ అభ్యర్థనను కేంద్ర ప్రభుత్వ కమిటీ పరిశీలించేలా చూడమని ఆదేశాలు ఇస్తాం. అలాగే మధ్యవర్తిత్వం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి అని అన్నారు.ఏకపక్షంగా నిర్మాణం..అనంతరం, తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింగ్వి వాదనలు వినిపిస్తూ..‘వరద జలాల పేరుతో మాకు కేటాయించిన నీటి వాటాను తరలించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఏకపక్షంగా ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. ప్రాజెక్టుపై వెంటనే సుప్రీంకోర్టు స్టే ఇవ్వాలి. గోదావరిలో తెలంగాణకు 968 టీఎంసీల నీటి వాటా ఉంది. పోలవరం-నల్లమల్లసాగర్ ప్రాజెక్టుతో మా వాటా తగ్గుతుంది. ఈ ప్రాజెక్టును ఆపాలని కేంద్ర జల సంఘం ఇచ్చిన ఆదేశాలను ఏపీ పట్టించుకోవడం లేదు. సీడబ్ల్యూసీ చైర్మన్ నేతృత్వంలో ఇటీవల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి ప్రాజెక్టును ఆపే అధికారం లేదు. సుప్రీంకోర్టు వెంటనే జోక్యం చేసుకొని ఈ ప్రాజెక్టును ఆపాలన్నారు.రాష్ట్ర ప్రాజెక్ట్ మాత్రమే.. మరోవైపు.. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ..‘పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టులో మేము నిబంధనలు ఉల్లంఘించలేదు. కేవలం మేము ప్లాన్ రెడీ చేసుకుంటున్నాం. సముద్ర జలాలు వృథా అవుతున్నాయి. వాటిని రాయలసీమకి అందించాలనుకుంటున్నాం. ఇది రాష్ట్ర ప్రాజెక్టు మాత్రమే జాతీయ ప్రాజెక్టు కాదు. మా రాష్ట్ర అవసరాలపైన ప్లానింగ్ చేసుకునే అధికారం ఉంది. మేము పీఎఫ్ఆర్, డీపీఆర్లను తయారు చేస్తున్నాము అని తెలిపారు.ఈ క్రమంలో సుప్రీంకోర్టు సూచించిన పరిష్కారాలపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాన్ని తెలుసుకునేందుకు సమయం ఇవ్వాలని అభిషేక్ సింఘ్వీ కోరారు. అనంతరం, కేసు తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా చేశారు. -
శాసన మండలిలో కవిత భావోద్వేగం
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత శాసన మండలిలో కంటతడి పెట్టారు. ఇదే తన ఆఖరి హాజరు అంటూ ప్రకటించిన ఆమె.. సోమవారం మండలికి హాజరై పలు అంశాలపై భావోద్వేగంగా మాట్లాడారు. ఎనిమిదేళ్లుగా ప్రజల కోసం నేను చేస్తున్న ప్రయత్నాల్ని అడ్డుకున్నారు. అంబేద్కర్ విగ్రహం నుంచి మొదలుపెడితే అమరజ్యోతి వరకు ప్రతిదాంట్లో అవినీతి జరిగింది. ఉద్యమకారులు, సూటిగా ప్రశ్నించేవారిపట్ల వివక్ష కొనసాగింది. కేసీఆర్పై కక్షతో బీజేపీ నన్ను జైల్లో పెట్టింది. ఈడీ, సీబీఐలపై పోరాడినా బీఆర్ఎస్ నాకు అండగా నిలవలేదు. పార్టీ మౌత్పీస్గా ఉన్న ఛానెళ్లు, పేపర్లు నాకు ఏనాడూ మద్దతు ఇవ్వలేదు. నేను ప్రశ్నిస్తే నాపై కక్షగట్టారు. కక్షగట్టి నన్ను పార్టీ నుంచి బహిష్కరించారు. కేసీఆర్కు అవినీతి మరక అంటితే నేనే పోరాడా. అలాంటిది నా సస్పెన్షన్కు ముందు నా వివరణ కోరలేదు. నైతికత లేని బీఆర్ఎస్ నుంచి దూరమైనందుకు సంతోషిస్తున్నా అంటూ కంటతడి పెట్టారామె. ఇకనైనా తన రాజీనామా ఆమోదించండి అని మండలి చైర్మన్కు కవిత విజ్ఞప్తి చేశారు. అయితే.. పరిణామాలను తాను అర్థం చేసుకోగలనని, భావోద్వేగాలతో రాజీనామా చేస్తే ఆమోదించరన్న చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి.. రాజీనామాపై పునరాలోచన చేయాలని కవితకు సూచించారు. -
ఒంటరిగా బతకలేక.. రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి బలవన్మరణం
ఆదిలాబాద్: అతను సింగరేణిలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు. ఉద్యోగం చేస్తున్న సమయంలోనే ముగ్గురు కొడుకులు, కూతురును చదివించాడు. ఈ క్రమంలో 20 ఏళ్ల క్రితం భార్య అనారోగ్యంతో మృతిచెందింది. దీంతో కుంగిపోయాడు. అయినా కూతురుకు, పెద్ద కుమారుడికి పెళ్లి చేశాడు. ప్రస్తుతం పిల్లలు ఉద్యోగ రిత్యా దూరంగా ఉంటున్నారు. కొన్నేళ్లుగా ఒంటరిగా ఉంటున్న అతనికి అందరూ ఉన్నాడు. ఇటీవల అనారోగ్య సమస్యలు కూడా మొదలయ్యాయి. ఒంటరిగా జీవించడంతో జీవితంపై విరక్తి కలిగింది. దీంతో ఉరేసుకుని ఉసురు తీసుకున్నాడు. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లో ఆదివారం జరిగింది. ఎస్సై భూమేశ్ కథనం ప్రకారం.. పట్టణంలోని భగత్సింగ్నగర్కు చెందిన రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి బచ్చు సుదర్శన్(75) భార్య 20 ఏళ్ల క్రితం మరణించింది. 2007లో గోల్డెన్షేక్ హ్యాండ్ ద్వారా రిటైర్ అయ్యాడు. వృత్తి రీత్యా కుమారులు హైదరాబాద్లో ఉంటుండగా, కుమార్తె అత్తింట్లో ఉంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం పెద్ద కుమారుడికి ఫోన్ చేశాడు. హైదరాబాద్కు వస్తానని తెలిపాడు. దీంతో కొడుక రెండు రోజల తర్వాత రావాలని సూచించాడు. ఇంతలోనే సుదర్శన్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో తండ్రి వద్దకు వచ్చిన పిల్లలు బోరున విలపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి యువతిపై కత్తితో దాడి
హైదరాబాద్: నిన్ను ప్రేమిస్తున్నా.. నా ప్రేమను అంగీకరించాలని ఓ యువకుడు ఓ యువతి ఇంట్లోకి చొరబడి కత్తితో దాడిచేశాడు. నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది . స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు.. అలకాపూర్ టౌన్షిప్లో ఓ యువతి(21) మరో ఇద్దరు యువతులతో కలిసి ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకుని ఉంటుంది. అదే భవనంలో కొనసాగుతున్న ఓ హోటల్లో వెయిటర్గా పర్వతాల రోహిత్(23) పనిచేస్తున్నాడు. ఈనెల 1న యువతి కొత్త సంవత్సరం వేడుకల అనంతరం అర్ధరాత్రి ఇంటికి వచ్చింది . అప్పటికీ ఆమె మిత్రులు రాకపోవటంతో తలుపు తెరచి ఉంచి నిద్రకు ఉపక్రమించింది. రెండు నెలలుగా ప్రేమిస్తున్నానని వెంటపడుతున్న రోహిత్ అదే అదనుగా ఇంట్లోకి చొరబడ్డాడు. యువతి అతన్ని గమనించి అరవటంతో కత్తితో దాడి చేశాడు. ఈదాడిలో యువతి చేతికి గాయమైంది. అయినా అతను అసభ్యంగా ప్రవర్తించి పరారయ్యాడు. దీంతో బాధితురాలు ఈనెల 2 నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈవిషయమై సెక్టార్ ఎస్సై మునీందర్ను వివరణ కోరగా యువతిపై కత్తితో దాడి, అసభ్యంగా ప్రవర్తించిన రోహిత్పై ఫిర్యాదు వచ్చిందని, నిందితునిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. -
డే-4.. కొనసాగుతున్న తెలంగాణ అసెంబ్లీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు.. నాలుగో రోజు కొనసాగుతున్నాయి. మరికాసేపట్లో.. తెలంగాణ యూనివర్సిటీల సవరణ బిల్లు–2026ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. బిల్లుపై చర్చతో పాటు ఆమోదం తెలపనుంది సభ. పాల్వాయి హరీష్, బీజేపీ ఎమ్మెల్యే కామెంట్స్.. డీఆర్డీఏ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారుఅధికారుల అవినీతి పై నేను ఎక్కని గడుప లేదుఅన్ని స్థాయిల్లో అధికారులకు అవినీతి పై ఫిర్యాదు చేసాంప్రభుత్వం డీఆర్డీఏ అధికారుల పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నా తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లు–2026ను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. అలాగే.. తెలంగాణ స్టేట్ వేర్హౌసింగ్ కార్పొరేషన్ పెండింగ్ వార్షిక నివేదికలను రిలీజ్ చేయనుంది. 2015-16 నుంచి 2018-19 వరకు ఆడిట్ నివేదికలు టేబుల్ చేయనుంది ప్రభుత్వం. దీంతో పాటు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్(హిల్టన్) పాలసీపై షార్ట్ డిస్కషన్ జరిగే అవకాశం కనిపిస్తోంది. -
అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్య!
అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్యకు గురైంది. న్యూ ఇయర్ వేడుకల రోజున అదృశ్యమైన నికితా గోడిశాల అనే యువతి తన మాజీ ప్రియుడు ఫ్లాట్లో శవమై కనిపించింది. మేరీల్యాండ్లోన మాజీ ప్రియుడు అర్జున్ శర్మ ఫ్లాట్లో ఆమె మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. దాంతో అర్జున్ శర్మనే ఆమెన హత్య చేసినట్లు పోలీసుల భావిస్తున్నారు. ప్రస్తుతం అర్జున్ శర్మ పరారీలో ఉన్నాడు. అతని కోసం యూఎస్ పోలీసులు గాలిస్తున్నారు.ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన నిఖిత.. ప్రస్తుతం ఆమె హోవర్డ్ కౌంటీలో ఉన్న ఎల్లికాట్ సిటీలో డేటా మరియు స్ట్రాటజీ అనలిస్ట్గా పనిచేస్తుంది.మాజీ ప్రియుడిపై ఫస్ట్- సెకండ్ డిగ్రీ హత్య అభియోగాలు మోపుతూ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. జనవరి 2వ తేదీన ఆమె అవృశ్యమైన ఫిర్యాదు తమకు వచ్చిందని, ఈ మేరకు విచారణ చేపడితే ఆమె హత్య గావించబడ్డ విషయం తాజాగా వెలుగుచూసిందన్నారు. మేరీల్యాండ్ సిటీలోని అర్జున్శర్మ ఫ్లాట్లో ఆమె డిసెంబర్ 31వ తేదీన చివరిసారి కనిపించినట్లు పోలీసులకు అపార్ట్మెంట్ వాసులు తెలిపారు. అదే అపార్ట్మెంట్లో సెర్చ్ వారెంట్ అమలు చేసి దర్యాప్తు ప్రారంభించగా, కత్తిపోట్లతో పడి ఉన్న ఆమె మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఆమెది తెలంగాణ రాష్ట్రంగా అనుమానిస్తున్నారు. ఆమె స్వస్థలంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే అర్జున్ శర్మది కూడా ఇండియానే. హత్య చేసిన తర్వాత అర్జున్ శర్మ భారత్కు వచ్చేశాడు.హత్యోదంతం తర్వాత భారత్కు వచ్చేసిన అర్జున్ శర్మను తమిళనాడులో అరెస్టు చేశారు. అర్జున్ శర్మది తమిళనాడు రాష్ట్రంగా తెలుస్తోంది. -
మాటలేని మూగజీవాల వేదన… నదిని ఈదే గోవులు
చందంపేట: నల్లగొండ జిల్లా చందంపేట మండలం కంబాలపల్లిలో ఆవులు కృష్ణా నదిని ఈదుకుంటూ శనివారం ఆంధ్ర ప్రాంతానికి తరలి వెళ్లాయి. చందంపేట మండలం కంబాలపల్లి, కాచరాజుపల్లి, గువ్వలగుట్ట, పొగిళ్ల తదితర ప్రాంతాల ఆవులను.. కాపరులు జనవరి నెలలో గ్రాసం కోసం ఆంధ్రకు తరలిస్తుంటారు.కంబాలపల్లి నుంచి ఆంధ్ర ప్రాంతంలోని మాచర్లకు వెళ్లాలంటే సుమారు 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దీంతో ఆవులను ఇలా రెండు కిలోమీటర్ల మేర కృష్ణా నదిని దాటిస్తుంటారు. మొదట గంగమ్మకు పూజలు చేసి గోవులను క్షేమంగా ఒడ్డుకు చేర్చాలని మొక్కుతారు. జనవరిలో మేత కోసం వెళ్లిన ఆవులు.. ఆరు నెలల తర్వాత జూన్లో స్వస్థలానికి ఈదుకుంటూనే తిరిగొస్తాయి. దూడలను మాత్రం కాపరులు తమతో పాటు పుట్టీల్లో తీసుకెళ్తారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ సర్కార్కు షాక్
సాక్షి, ఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. మాజీ మంత్రి హరీష్రావు పాత్రను విచారించేందుకు అనుమతించాలన్న అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. బీఆర్ఎస్ హయాంలో హరీష్ రావు ఆదేశాలతో పోలీసు ఉన్నతాధికారి రాధా కిషన్ రావు తన ఫోన్ టాప్ చేశారని రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ గతంలో పంజాగుట్ట పీఎస్లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు కాగా.. దానిని కొట్టేయాలని హరీష్రావు హైకోర్టును ఆశ్రయించారు. ఆ ఎఫ్ఐఆర్ను కొట్టేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పూ ఇచ్చింది. ఆ వెంటనే.. హైకోర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేయగా.. సుప్రీం పిటిషన్ ఆ పిటిషన్ను కొట్టేసింది. అయితే హరీష్రావుపై ఎఫ్ఐఆర్ను కొట్టివేయడం సరికాదంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో మరోసారి స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ను జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్రావు పాత్రపై తమకు ఆధారాలు లభించాయని, ఆయన బెదిరింపులకు పాల్పడ్డారని తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్ సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. అయితే.. సుప్రీం కోర్టు ఇదివరకే ఇచ్చిన తీర్పులో జోక్యానికి జస్టిస్ బీవీ నాగరత్న నిరాకరించారు. సోమవారం తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ను ఆమె కొట్టేశారు.నవీన్రావును కలవనున్న హరీష్!ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ బృందం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్రావును సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే. సుమారు 9 గంటల పాటు సాగిన విచారణలో గతంలో బీఆర్ఎస్ పార్టీకి సమకూరిన ఎలక్టోరల్ బాండ్ల అంశం, ఆ పార్టీ నేతలతో ఉన్న ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. నవీన్రావు వాంగ్మూలం ఆధారంగా కీలక వ్యక్తులను విచారించే అవకాశమున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇవాళ నవీన్రావుతో హరీష్రావు భేటీ అవుతారని, విచారణ వివరాలను అడిగి తెలుసుకుంటారని తెలుస్తోంది. -
భక్తజనంతో కిక్కిరిసిన మేడారం (ఫొటోలు)
-
భోజనం సరిగ్గా చేయలేదని తల్లి మందలించడంతో..
మహబూబ్ నగర్ జిల్లా: తల్లి మందలించిదని ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భూత్పూర్ మున్సిపాలిటీలోని వాల్యాతండాలో శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ చంద్రశేఖర్, తండావాసుల కథనం ప్రకారం.. వాల్యాతండాకు చెందిన డేగావత్ వసురాం, భార్య శారద, ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లతో కొన్నేళ్ల కిందట హైదరాబాద్లోని శివరాంపల్లిలో నివాసం ఉంటున్నారు. కొన్నిరోజులుగా డేగావత్పూజ(రెండో కుమార్తె) భోజనం సరిగ్గా చేయడంలేదని తల్లి మందిలించింది. శనివారం ఉదయం 9గంటల ప్రాంతంలో భూత్పూర్ మున్సిపాలిటీలోని వాల్యాతండాకు (నాయనమ్మ) వద్దకు వెళ్తున్నానని తల్లిదండ్రులకు చెప్పి వచ్చింది.శివరాంపల్లి నుంచి వాహనంలో వచ్చి వాల్యాతండా స్టేజీ వద్ద దిగి తండా సమీపంలోనే వ్యవసాయ పొలం వద్ద ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కొద్ది దూరంలో ఉన్న వ్యవసాయ పొలం వద్ద తండాకు చెందినవారు వ్యవసాయ పనులు చేస్తుండగా ఆకస్మాత్తుగా పొగ రావడం గమనించిన వెళ్లి చూడగా యువతి మంటల్లో ఉన్న విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. 108వాహనంలో జనరల్ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. పూజ డీఆర్డీఏలో కంప్యూటర్ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తుందని, పూజ తండ్రి వసురాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
‘ఎంజీనరెగా బచావో సంగ్రామ్’ కన్వీనర్గా మాకెన్
న్యూఢిల్లీ: ఈ నెల 10వ తేదీ నుంచి 45 రోజులపాటు కొనసాగే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(ఎంజీఎన్ఆర్ఈజీఏ) బచావో సంగ్రామ్ కమిటీ కన్వీనర్గా సీనియర్ నేత అజయ్ మాకెన్ను కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఎంజీఎన్ఆర్ఈజీఏ బచావో సంగ్రామ్ ఆందోళన కార్యక్రమాల పర్యవేక్షణ, మార్గదర్శకత్వం, పరిశీలన కోసం సమన్వయ కమిటీని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఏర్పాటు చేశారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుంది’ అని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. కాంగ్రెస్ కోశాధికారి అజయ్ మాకెన్ సారథ్యంలోని కమిటీలో సీనియర్ నేతలు జైరాం రమేశ్, సందీప్ దీక్షిత్, ఉదిత్ రాజ్, ప్రియాంక్ ఖర్గే సభ్యులుగా ఉంటారు. ఇందులో తెలంగాణ నాయకురాలు డి. అనసూయ సీతక్క, దీపికా పాండే సింగ్, సునీల్ పన్వర్, మనీశ్ శర్మలను ఖర్గే నియమించారు. ఏఐసీసీలోని ఓబీసీ, ఎస్సీ, మైనారిటీ, ఆదివాసీ విభాగాల చైర్పర్సన్లు, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు కమిటీలో సభ్యులేనని వేణుగోపాల్ వివరించారు. ఉపాధి హామీని తిరిగి అమలు చేయడంతోపాటు కేంద్రం తీసుకువచ్చిన వీబీ జీ రామ్ జీ పథకాన్ని రద్దు చేయాలనే డిమాండ్తో కాంగ్రెస్ పార్టీ జనవరి 10 నుంచి ఫిబ్రవరి 25వ తేదీ వరకు దేశవ్యాప్త నిరసనలను చేపట్టనున్నట్లు ప్రకటించడం తెల్సిందే. -
కేటీఆర్పై కాంగ్రెస్ ‘ఫైర్’
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్పై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. రాహుల్ గాంధీ, రేవంత్రెడ్డిలను ఉరి తీయాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను అధికార పార్టీ నేతలు తీవ్రంగా తప్పు పట్టారు. రాహుల్ గాంధీ, రేవంత్లను ఏకంగా ఉరితీయాలని కేటీఆర్ వ్యాఖ్యానించడం ఆయన అహంకారానికి నిదర్శనమని, ఆయన అహంకారం పీక్స్కు చేరిందని, ప్రజలు అంతా గమనిస్తున్నారని అన్నారు.భస్మాసురుడి కజిన్ బ్రదర్ కేటీఆర్: మహేశ్గౌడ్కేటీఆర్ వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేశ్ కుమార్గౌడ్ తీవ్రంగా స్పందించారు. కేటీఆర్లో అహంకారం పరాకాష్టకు చేరిందని, ఆయన భస్మాసురుడి కజిన్ బ్రదర్ అని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం అవినీతితో ప్రజల ఛీత్కారానికి గురైన నేపథ్యంలో ఇప్పుడు పాలమూరు ప్రాజెక్టులో తమ బాగోతం ఎక్కడ బయటపడుతుందోనని అసెంబ్లీ నుంచి పారిపోయారన్నారు. ఈ అంశాన్ని పక్క దోవ పట్టించేందుకు చౌకబారు మాటలు మాట్లాడుతు న్నారని విమర్శించారు. ముందు తన చెల్లెలు కవిత అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పి కేటీఆర్ తమ గురించి మాట్లాడాలని మహేశ్గౌడ్ హితవు పలికారు. అవినీతిని బయటపెట్టడంతో ఆగమాగం: విప్ శ్రీనివాస్అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన ఉపన్యాసంతో కల్వకుంట్ల కుటుంబం అల్లాడిపోతోందని, పదేళ్ల పాటు వా రు చేసిన తప్పులను రేవంత్ తూర్పారపట్టడంతో కేటీఆర్, హరీశ్రావులు తల్లడిల్లిపోతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. తెలంగాణకు తామే చాంపియన్లమంటూ చెలామణి అయిన కేసీఆర్ కుటుంబం అవినీతి చరిత్రను అసెంబ్లీలో బయటపెట్టేసరికి ఇప్పుడు ఆగమాగమవుతు న్నారని ఎద్దేవా చేశారు.కళ్లకు కట్టినట్టు వివరించారు: ఎంపీ చామలరాష్ట్ర సాధన నినాదాలైన నీళ్లు, నిధు లు, నియా మకాలను బీ ఆర్ఎస్ తుంగలో తొక్కిందని రుజు వైందని, పదేళ్ల కాలంలో కమీషన్లు దండుకోవడమే ధ్యేయంగా బీఆర్ఎస్ చేపట్టిన ప్రాజె క్టులను సీఎం రేవంత్రెడ్డి కళ్లకు కట్టిన ట్టు వివరించారని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమా ర్రెడ్డి వ్యాఖ్యానించారు. నిజంగా కేసీఆర్ చావు కోరుకునేది కేటీఆర్, హరీశ్ రావులేనని, సీఎం పదవి కోసం కేటీఆర్, పార్టీ కోసం హరీశ్రావులు మాత్రమే కేసీఆర్ చావును కోరుకుంటారని, అలాంటి ఆలోచన ఎవరికీ ఉండదన్నారు. -
వారిని ఎన్నిసార్లు ఉరితీయాలి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘ఎన్నికల హామీలను అమలు చేయని కాంగ్రెస్ నాయకులను ఎన్నిసార్లు ఉరితీయాలి? రెండు లక్షల ఉద్యోగాల హామీ నెరవేర్చని రాహుల్ గాందీని అశోక్ నగర్ అడ్డా మీద, రైతు రుణమాఫీ అమలు చేయనందుకు వరంగల్లో ఉరి తీయాలి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ హామీ తప్పించినందుకు కామారెడ్డి చౌరస్తాలో రేవంత్ను, కాంగ్రెస్ నాయకులను ఉరితీయాలి. 420 హామీల ఎగవేతకు 420 సార్లు కాంగ్రెస్ను ప్రజలు శిక్షించాల్సిన పరిస్థితి వచి్చంది’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.‘రేవంత్ రెడ్డికి తిట్టడం తప్ప మరో భాష రాదు. కానీ మాకు మూడు నాలుగు భాషల్లో సమాధానం చెప్పగల శక్తి ఉంది. ఐఐటీకీ, ట్రిపుల్ ఐటీకీ, బచావత్ ట్రిబ్యునల్కు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు తేడా తెలియని అజ్ఞాని తెలంగాణ భవితవ్యంపై మాట్లాడటం హాస్యాస్పదం. కృష్ణా, గోదావరి బేసిన్ల గురించి బేసిక్స్ గురించి తెలియని వ్యక్తికి తెలంగాణకు ఏం కావాలో ఎలా తెలుస్తుంది? దోచుకోవడం, దాచుకోవడం తప్ప ఇంకేమీ తెలియని అజ్ఞాని పాలన ఇది’ అని కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్ స్థాయిని తగ్గించలేడు.. ‘‘తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ వాదులపై తుపాకీ ఎత్తిన చరిత్రను ప్రజలు మర్చిపోలేదు. అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి వికృతమైన మాటలతో కేసీఆర్ స్థాయిని తగ్గించలేడు. తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పోరాటం ఆగదు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత, అహంకారం, ద్రోహపూరిత విధానాలను ప్రజల ముందు ఎండగడతాం. శాసనసభలో జరుగుతున్న చర్చల తీరును, ముఖ్యంగా సభానాయకుడి స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి మాట్లాడుతున్న భాషను చూసిన తర్వాత పెద్దలు చెప్పిన మాట ‘వినాశకాలే విపరీత బుద్ధి’ అనే సామెత గుర్తుకొస్తోందన్నారు. పదేపదే చావు, ఉరిశిక్షలు అంటూ మాట్లాడే వ్యక్తి.. రైతుబంధు వంటి మానవీయ పథకాలు ప్రవేశపెట్టి రైతులకు అండగా నిలిచిన కేసీఆర్పై అనరాని మాటలు అనడం దుర్మార్గం’’ అని కేటీఆర్ అన్నారు. -
డాక్టరమ్మలు తగ్గిపోతున్నారు!
డాక్టరమ్మకే కష్టం వచ్చి పడింది! విరామం లేని డ్యూటీలు, మానసిక ఒత్తిడి, ఇంటికి–ఆసుపత్రికి మధ్య నలిగిపోయే దైనందిన పోరాటం.. ఆమెను వైద్య వృత్తిని వదిలిపెట్టేలా చేస్తున్నాయి. నిజానికి ఎంబీబీఎస్ పట్టాను సాధించటం అన్నది ఎన్నో నిద్ర లేని రాత్రుల కల! ఆ కలను నెరవేర్చుకున్నప్పటికీ, వృత్తి ధర్మాన్ని నిర్వర్తించలేని పరిస్థితులు లేడీ డాక్టర్లకు ఎదురవుతున్నాయి.మెడలో స్టెతస్కోప్ ధరించి, డాక్టరమ్మ చిరునవ్వుతో కనిపిస్తే చాలు.. జబ్బు సగం నయం అయినట్లే ఉంటుంది. కానీ ఇప్పుడా డాక్టరమ్మకే కష్టం వచ్చి పడింది! విరామం లేని డ్యూటీలు, మానసిక ఒత్తిడి, ఇంటికి–ఆసుపత్రికి మధ్య నలిగిపోయే దైనందిన పోరాటం.. ఆమెను వైద్య వృత్తిని వదిలిపెట్టేలా చేస్తున్నాయి. నిజానికి ఎంబీబీఎస్ పట్టాను సాధించటం అన్నది ఎన్నో నిద్ర లేని రాత్రుల కల! ఆ కలను నెరవేర్చుకున్నప్పటికీ, వృత్తి ధర్మాన్ని నిర్వర్తించలేని పరిస్థితులు లేడీ డాక్టర్లకు ఎదురవుతుండటం దురదృష్టకరమే కాదు, దేశ ఆరోగ్య వ్యవస్థకే నష్టం.ఇండియాలో ఎంబీబీఎస్ చదివే మహిళల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. ప్రాక్టీస్ చేసే సమయానికి మహిళా పట్టభద్రులు; ఉద్యోగంలో చేరి కొంత కాలం పని చేసిన తర్వాత మహిళా డాక్టర్లు వైద్య వృత్తిని వదిలిపెట్టేస్తున్నారట. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బి.సి.జి.)– దస్రా అనే స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా విడుదల చేసిన తాజా నివేదిక ‘అడ్వాన్సింగ్ విమెన్ ఇన్ లీడర్షిప్ ఇన్ హెల్త్ కేర్’లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అనుకూలంగా లేని పరిస్థితులే అందుకు ప్రధాన కారణమని నివేదిక పేర్కొంది.తీవ్రమైన ఒత్తిడిపురుష డాక్టర్ల కంటే మహిళా డాక్టర్లు ఎక్కువ మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. నివేదిక ప్రకారం, సుమారు 87 శాతం మంది మహిళా డాక్టర్లు మానసిక అలసటతో విధులను నిర్వర్తిస్తున్నారు.ఇల్లు–ఆసుపత్రిఆసుపత్రిలో వారానికి 60 నుండి 80 గంటల కఠినమైన పని వేళలతో పాటు ఇంట్లో పిల్లల పెంపకం, ఇతర కుటుంబ బాధ్యతలు కూడా మహిళలే చూసుకోవాల్సి వస్తోంది. ఈ రెండు రకాల బాధ్యతలను సమన్వయం చేసుకోలేక లేడీ డాక్టర్లు తమకు ఇష్టమైన వైద్య రంగాన్ని వదులుకోవలసి వస్తోంది.భద్రతా సమస్యలుమహిళా డాక్టర్లకు పని ప్రదేశంలో భద్రత అనేది పెద్ద సవాలుగా మారింది. ముఖ్యంగా చిన్న నగరాల్లో పనిచేసే వారిలో 70 శాతం కంటే ఎక్కువ మంది తాము సురక్షితంగా లేమని భావిస్తున్నట్లు తెలిపారు.ప్రోత్సాహ లేమిపని వేళలు అనుకూలంగా లేకపోవడం, ప్రసూతి సెలవుల తర్వాత తిరిగి చేరడానికి సరైన ప్రోత్సాహం లేకపోవడం వంటివి మహిళా వైద్యులను వెనక్కి లాగుతున్నాయి. అలాగే, వైద్య వృత్తిలో ఉన్నత పదవుల్లో మహిళలు తక్కువగా ఉండటం వల్ల మహిళా వైద్యుల సమస్యలను పట్టించుకునే వారు కరువయ్యారు.ప్రభావంమహిళా డాక్టర్లు వృత్తిని వదిలితే భవిష్యత్తులో గైనకాలజీ, పీడియాట్రిక్స్ వంటి విభాగాల్లో డాక్టర్ల కొరత ఏర్పడుతుంది. ఇది దేశ ఆరోగ్య వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.పరిష్కారంపని ప్రదేశంలో మహిళా డాక్టర్ల భద్రతను పెంచటం పని వేళల్లో వెసులుబాటును కల్పించటం సమానమైన పనికి సమాన వేతనం పదోన్నతుల్లో సమానత్వంగణాంకాలు.. ముఖ్యమైన అంశాలువృత్తిలో లేనివారుపురుషుల్లో కేవలం 5–10 శాతం మంది మాత్రమే ఖాళీగా ఉండగా, మహిళా పట్టభద్రుల్లో 30 శాతం మంది వైద్య వృత్తిలో కొనసాగటం లేదు.స్పెషలైజేషన్లో వ్యత్యాసంసర్జరీ, కార్డియాలజీ, ఆర్థోపెడిక్స్ విభాగాలలోని మొత్తం నిపుణుల్లో మహిళల వాటా 10 శాతం కంటే తక్కువే.ప్రవేశాలలో కొరతదేశ వ్యాప్తంగా ఇంకా 7–8 లక్షల మంది వైద్య నిపుణుల అవసరం ఉన్నప్పటికీ, సుమారు 60–70 వేల మంది మహిళా నిపుణులు వైద్య వృత్తిలోకి ప్రవేశించటం లేదు.నర్సుల్లో మహిళలే అధికందేశంలోని ఆసుపత్రుల్లో ఉన్న నర్సుల్లో సుమారు 70–85 శాతం మహిళలే. కానీ, డాక్టర్లలో సీనియర్ లీడర్షిప్ విభాగాల్లో మాత్రం మహిళల సంఖ్య 20 శాతానికే పరిమితమైంది. -
మావోళ్లు.. ఎక్కడున్నట్టు?
‘మా అన్న నక్సల్స్లోకి వెళ్లాడు. ఆయన ఆచూకీ కోసం పోలీసులు చాలాసార్లు మా ఇంటికి వచ్చారు. లొంగిపోవాలని చెప్పారు. నిన్న డీజీపీ చెప్పిన లిస్టులో మా అన్న పేరు లేదు. ఎక్కడున్నాడో కనీసం మావోయిస్టు బాధ్యులు కూడా చెప్పడం లేదు. అన్నలు, పోలీసులు ఎవరు ఆచూకీ చెప్పకుంటే ఎలా’అని కోరుట్ల నుంచి 44 ఏళ్ల క్రితం మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్లిన బెజ్జారపు కిషన్ తమ్ముడు ఆంజనేయులు ప్రశ్న. కిషన్ భార్య కూడా తన భర్త ఎక్కడున్నాడో తెలపాలని వేడుకుంటోంది.జగిత్యాల జిల్లా కోరుట్ల నుంచి 44 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన నిజాముద్దీన్ కుటుంబ పరిస్థితి కూడా దాదాపు ఇదే. మావో టెక్ విభాగ ఇన్చార్జ్గా పనిచేసినట్టు చెప్పుకున్న నిజాముద్దీన్ ఆచూకీ ఎక్కడా దొరకడం లేదు. ఇలా ఉత్తర తెలంగాణ నుంచి నక్సల్స్ ఉద్యమంపై ఆసక్తితో అజ్ఞాతంలోకి వెళ్లి జాడ లేకుండా పోయిన వారు పదుల సంఖ్యలో ఉంటారని అంచనా.కోరుట్ల: కోరుట్ల నుంచి ప్రస్తుత మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అజ్ఞాతంలోకి వెళ్లడానికి మూడేళ్ల ముందే అంటే.. 1982లో కోరుట్లకు చెందిన బెజ్జారపు కిషన్, మహ్మద్ నిజాముద్దీన్ నక్సల్స్లో చేరి దళాల్లో వివిధ హోదాల్లో ఉన్నట్టు ప్రచారం జరిగింది. ప్రస్తుతం పోలీసులు ప్రకటించిన లిస్టులో ఈ ఇద్దరి వివరాలు లేవు. ⇒ కోరుట్ల నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన ముక్కా వెంకటేశం డీసీఎం స్థాయిలో 1998లో యాదగిరిగుట్ట వద్ద జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయాడు. ⇒ పసుల రాంరెడ్డి తెలంగాణ పశ్చిమ డివిజన్ దళానికి డీసీఎంగా పనిచేస్తూ సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట వద్ద 2000 సంవత్సరంలో జరిగిన మద్దిమల్ల ఎన్కౌంటర్లో మృతి చెందారు. ఈ లెక్కన కోరుట్ల నుంచి నక్సల్స్లోకి వెళ్లిన బెజ్జారపు కిషన్, నిజాముద్దీన్, తిప్పిరి తిరుపతి, ముక్కా వెంకటేశం, పసుల రాంరెడ్డిల్లో ఇద్దరు ఎన్కౌంటర్లలో మృతి చెందగా.. మరో ఇద్దరు జాడ లేకుండా పోయారు. ఏడాది క్రితం వరకు తెలంగాణ నుంచి 55 మంది వరకు మావోయిస్టుల్లో ఉన్నారని పోలీసు రికార్డులు చెబుతుండగా, ప్రస్తుతం 17 మంది మాత్రమే ఉన్నారని..వారి పేర్లు ప్రకటించడం గమనార్హం.దీంతో ఇప్పటి వరకు ‘మావో’ల్లోనే మావారు ఉన్నారని అనుకొని వారి కోసం ఆశగా ఎదురుచూస్తున్న కుటుంబాలు ఒక్కసారిగా ఆందోళనకు గురవుతున్నాయి. పౌరహక్కుల సంఘాలు, ఇతర మార్గాల ద్వారా మావోయిస్టు ప్రతినిధులకు సమాచారం పంపినా ఫలితం దక్కలేదు. ఆచూకీ లేకుండా పోయిన వారు ఉద్యమంలో ఉన్నారా? జైళ్లలో ఉన్నారా ? లేకుంటే చనిపోయారా? అన్న విషయంలో మావోయిస్టులు స్పష్టత ఇవ్వాలని వారు కోరుతున్నారు. -
కాంగ్రెస్కు తలనొప్పిగా క్షేత్రస్థాయి పదవుల పందేరం
సాక్షి, హైదరాబాద్: క్షేత్రస్థాయిలో పార్టీ పదవుల పందేరం అధికార కాంగ్రెస్కు తలనొప్పిగా మారుతోంది. ఇటీవలే పంచాయతీలకు ఎన్నికలు ముగిసి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ కమిటీల కూర్పు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోననే ఆందోళన ఆ పార్టీ నేతల్లో ఉంది. ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో పార్టీ కమిటీలను ఏర్పాటు చేయాలన్న పీసీసీ ఆదేశాల నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ)లతోపాటు మండల పార్టీ అధ్యక్ష హోదాల్లో ఎవరిని నియమిస్తే ఏం జరుగుతుందోనని మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు గుబులు చెందుతున్నారు. ముఖ్యంగా మండల పార్టీ అధ్యక్షుల నియామకం మున్సిపల్ ఎన్నికల సమయంలో ఎలాంటి తంటా తెచ్చిపెడుతుందోననే ఆలోచనతో డీసీసీ అధ్యక్షులకు పేర్లు ఇచ్చేందుకూ వారు వెనుకాడుతుండటం గమనార్హం. పేరుకే డీసీసీలు..డీసీసీ అధ్యక్షుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. కొత్తగా నియమితులైన తమకు పార్టీ పదవుల నియామకాల్లో ఎలాంటి స్వేచ్ఛను ఇవ్వడం లేదని వాపోతున్నారు. పార్టీ పదవుల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు పేర్లు ఇచ్చి వాటినే చేర్చాలని ఒత్తిడి చేస్తున్నారని అంటున్నారు. పీసీసీ మార్గదర్శకాలను కూడా పాటించలేని పరిస్థితుల్లో తామున్నామని చెబుతుండటం గమనార్హం. ఈ పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కనిపిస్తోంది. కొన్నిచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలకు అనుకూలంగా లేని వారు డీసీసీ అధ్యక్షులుగా నియామకం కావడంతో అలాంటి జిల్లాల్లో ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. ఎట్టి పరిస్థితుల్లో తామిచ్చిన పేర్లను డీసీసీ కమిటీల్లో ఉంచాలని మంత్రులు, ఎమ్మెల్యేలు కోరుతున్నారని, వారి సూచనల మేరకు కార్యవర్గం ఏర్పాటు చేసి భవిష్యత్తులో జిల్లాలో పార్టీని ఎలా ముందుకు నడిపించాలని డీసీసీలు ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల టికెట్ల కేటాయింపులో కూడా తమ మాటకు విలువ ఇస్తామని పీసీసీ, ఏఐసీసీ చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదని అంటున్నారు. కనీసం పార్టీ కార్యవర్గంలో పదవులు ఇచ్చే అధికారం కూడా తమకు లేకుండా పోయిందని వాపోతున్నారు. ఇన్నాళ్లూ పార్టీ కమిటీలను ఏర్పాటు చేయకుండా జాప్యం చేసిన పీసీసీ.. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ కమిటీలను పూర్తి చేయాలని ఆదేశించడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని డీసీసీ అధ్యక్షులు చెబుతున్నారు. మెజార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయం వేరేలా ఉందని, మున్సిపల్ ఎన్నికలు అయిపోయాక జిల్లా కమిటీలను ప్రకటించాలని కోరుతున్నారని, ఈ అంశాన్ని పీసీసీ పరిగణనలోకి తీసుకోవాలని, జిల్లా కార్యవర్గం కూర్పులో డీసీసీలకూ కోటా పెట్టాలని వారు కోరుతుండటం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ విషయమై జిల్లా మంత్రికి ఇష్టం లేకుండా నియమితుడైన దక్షిణ తెలంగాణకు చెందిన డీసీసీ అధ్యక్షుడు ఒకరు ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘ఇప్పటికే పార్టీ కార్యక్రమాల్లో కూడా మా ఫొటోలు పెట్టని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పిన పేర్లతో జిల్లా కాంగ్రెస్ కమిటీలను ఏర్పాటు చేసి మేము ఏం చేయాలి? రేపు మా మాట ఎవరు వింటారు? పార్టీని నడిపేదెట్టా? ఆరునెలల పనితీరును చూసి అవసరమైతే డీసీసీ అధ్యక్ష పదవులు తీసేస్తామని సీఎం రేవంత్రెడ్డి హెచ్చరించారు. మరి ఈ సిఫారసులు, ఒత్తిళ్లను ఎలా తట్టుకోవాలో.. మున్ముందు ఎలా పనిఏయాలో అర్థం కావడం లేదు’ అని వ్యాఖ్యానించారు. కార్యవర్గం కూర్పు ఇలా..! జిల్లా కాంగ్రెస్ కమిటీల కూర్పునకు పీసీసీ మార్గదర్శకాలను రూపొందించింది. పీసీసీ సూచించిన ప్రకారం ప్రతి జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాల వారీగా డీసీసీ కార్యవర్గం సంఖ్య ఖరారు కానుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు బ్లాకులు ఏర్పాటు చేసి, ప్రతి బ్లాక్ నుంచి ఒక డీసీసీ ఉపాధ్యక్షుడు, ఇద్దరు ప్రధాన కార్యదర్శులను నియమించనున్నారు. అదేవిధంగా ప్రతి డీసీసీకి ఒక కోశాధికారిని నియమిస్తారు. దీంతోపాటు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి డీసీసీ అధికార ప్రతినిధి, ప్రతి మండలం నుంచి డీసీసీ కార్యదర్శిని ఎంపిక చేస్తారు. ఈ మేరకు ఆయా జిల్లాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇంచార్జీలు, ఇతర సీనియర్ నేతల సిఫారసులను పరిగణనలోకి తీసుకుంటారు. డీసీసీ కార్యవర్గాల కూర్పులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని, పార్టీలో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న సీనియర్లకు ఆఫీస్ బేరర్లలో అవకాశం కలి్పంచాలని పీసీసీ నిర్ణయించింది. బీఆర్ఎస్ లేదా ఇతర పార్టీల నుంచి కొత్తగా కాంగ్రెస్లోకి వచ్చిన వారికీ స్థానిక పరిస్థితుల ఆధారంగా 20–30 శాతం పదవులు ఇవ్వాలని చెప్పింది. డీసీసీ అధ్యక్షులతో జూమ్ మీటింగ్ జిల్లా కార్యవర్గంతోపాటు మండల పార్టీ అధ్యక్ష నియామకాలు, ఏఐసీసీ పిలుపుల అమలు ఎజెండాగా ఆదివారం జూమ్ సమావేశం జరిగింది. డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ ఉపాధ్యక్షులతో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు బి. మహేశ్కుమార్గౌడ్, ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, సచిన్ సావంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులకు పలు ఆదేశాలు జారీ చేశారు. డీసీసీ కార్యవర్గాలను పూర్తి చేసి ఈనెల 8కల్లా పూర్తిస్థాయి నివేదికలను పీసీసీకి పంపాలని, 15వ తేదీలోపు మండల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాలు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈనెల 8న గాం«దీభవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం ఉంటుందని, ఆ సమావేశానికి సీఎం రేవంత్తోపాటు మీనాక్షి కూడా హాజరవుతారని మహేశ్ గౌడ్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మాగాంధీ పేరు తొలగించడం పట్ల దేశవ్యాప్తంగా నిరసనలు నిర్వహించాలన్న ఏఐసీసీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మహేశ్గౌడ్ ఆదేశించారు. -
‘గృహలక్ష్మి’కి ఇందిరమ్మ ఆశీర్వాదం!
సాక్షి, హైదరాబాద్: ‘గృహలక్ష్మి’పథకం ఇళ్లకు ఎట్టకేలకు మోక్షం కలగనుంది. ఆ ఇళ్లను కూడా ఇందిరమ్మ ఇళ్ల పథకంలోకి తేవాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఆ లబ్ధిదారుల అర్హత వివరాలను పరిశీలించి, ఇందిరమ్మ పథకం కింద నిధులు విడుదల చేసి వాటిని పూర్తి చేయాలని భావిస్తోంది. త్వరలో దీనికి సంబంధించి తుది నిర్ణయం వెలువడనుంది. ఇందిరమ్మ పథకాన్ని ప్రకటించిన వెంటనే కొందరు పేదలు అత్యుత్సాహంతో ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. కానీ, తుది జాబితాలో చోటు దక్కక వారికి నిధులు అందలేదు. దీంతో ఆ ఇళ్లు కూడా అసంపూర్తిగా ఉన్నాయి. ఈ రెండు రకాల అసంపూర్తి ఇళ్లు కలిపి దాదాపు 13 వేల వరకు ఉంటాయని అంచనా. ఈ మొత్తం ఇళ్లను ఇందిరమ్మ పథకంలోకి తీసుకురానున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు.. ఆపై గృహలక్ష్మిగత ప్రభుత్వం రెండు బెడ్ రూమ్ల ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. దానికి నిధుల సమస్య రావటంతో ఆ ఇళ్లను పూర్తి చేయలేక మధ్యలో వదిలేసింది. ఎన్నికల ముందు గృహలక్ష్మి పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించింది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం యూనిట్ కాస్ట్ రూ.5 లక్షలు కాగా, గృహలక్ష్మి పథకంలో అది రూ.3 లక్షలు మాత్రమే. రూ.3 లక్షలను కిస్తీల వారీగా లబ్ధిదారులకే చెల్లిస్తూ వారే ఇళ్లను నిర్మించుకునేలా దాన్ని ప్రకటించింది. దాదాపు పది వేల మంది ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించుకున్నారు. ఎన్నికల కోడ్ వల్ల నిధులు కూడా విడుదల కాలేదు. ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించటంతో, ఆ పథకం అధికారికంగా రద్దయింది. దీంతో ప్రారంభించుకున్న ఇళ్ల నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుతం మొండిగోడలు వెక్కిరిస్తున్నాయి. తమకు న్యాయం చేయాలంటూ ఆ లబ్ధిదారులు పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నారు. వచ్చే ఏప్రిల్లో మలి విడత ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులు ఉండనున్నందున, ఈ గృహలక్ష్మి ఇళ్లను కూడా ఇందిరమ్మ పరిధిలోకి తీసుకొచ్చి వాటికి నిధులు విడుదల చేసే విషయమై తదుపరి కేబినెట్ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఇందిరమ్మ కాని ఇందిరమ్మ ఇళ్లుకాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పథకాన్ని ప్రకటించిన వెంటనే కొందరు పేదలు ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. తదుపరి జాబితాలో తమకు చోటు దక్కుతుందో లేదో అన్న ఉద్దేశంతో, ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తే చోటు ఖాయమవుతుందనుకున్నారు. కానీ, వారికి చోటు దక్కలేదు. జాబితాలో వారి పేరు లేనందున ఇందిరమ్మ నిధులు వారికి అందటం లేదు. అలా ముందే ప్రారంభించుకున్న ఇళ్ల సంఖ్య మూడు వేల వరకు ఉందని ఇటీవల అధికారులు గుర్తించారు. మలి విడతలో వీరికి కూడా నిధులు చెల్లిస్తే బాగుంటుందని ప్రభుత్వం భావిస్తోంది. -
3 బస్తాలు సరిపోవు
‘సార్.. నేను ఐదెకరాల్లో మక్కలేసిన. అవి మొలుస్తున్నయ్. యూరియా కావాలని సొసైటీకి పోతే ఎకరానికి 3 బస్తాలే ఇస్తమంటున్నరు. ఎకరానికి ఇప్పుడు 5 బస్తాలు కావాలె. అవి పెరిగినంక మల్ల 5 బస్తాలు కావాలె. మీ ఆఫీసర్లేమో పంట మొత్తానికి 3 బస్తాలే ఇస్తం అంటున్నరు’ అంటూ వ్యవసాయశాఖలో కీలక స్థానంలో పనిచేస్తున్నఓ అధికారికి నిజామాబాద్కు చెందిన ఓ రైతు ఫోన్ చేశాడు.సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విచ్చలవిడిగా యూరియా వినియోగం పెరిగిందనడానికి ఈ ఫోన్కాల్ ఓ ఉదాహరణ. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే కాదు.. దాదాపు అన్ని జిల్లాల్లో యూరియా వినియోగం ప్రమాదకర రీతిలో పెరిగిపోయింది. ఓ వైపు ఎరువుల వినియోగం తగ్గించాలని పర్యావరణ వేత్తలు, వ్యవసాయ శాస్త్రవేత్తలతోపాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నా... యూరియాతోపాటు ఇతర ఎరువుల వాడకం తగ్గడం లేదు. రాష్ట్రంలో యాసంగి ఇంకా పూర్తిస్థాయిలో మొదలు కాకముందే.. ఈ సీజన్లో వినియోగించే యూరియాలో 50 శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. యూరియాతోపాటు కాంప్లెక్స్, డీఏపీ ఎరువు కూడా ఇప్పటికే 50 శాతానికి పైగా కొనుగోలు చేశారు. యూరియా, ఇతర ఎరువులు అందుబాటులో ఉన్నా, జిల్లాల్లో యూరియా కోసం జనాలు పీఏసీఎస్లు, సొసైటీల వద్ద క్యూలు కడుతుండడం గమనార్హం. సాగు అంచనా 68.67 లక్షల ఎకరాలు..సాగైంది 13.89 లక్షల ఎకరాలు యాసంగిలో యూరియా వినియోగం ప్రధానంగా వరి, మొక్కజొన్న పంటలకే ఎక్కువ. అయితే రైతులు కూరగాయల నుంచి ఇతర అన్ని పంటలకు యూరియాను వినియోగించడం పరిపాటిగా మారింది. గత ఐదు సంవత్సరాల సగటు ఆధారంగా ఈ యాసంగి సీజన్లో రాష్ట్రంలో 52 లక్షల ఎకరాల్లో వరి, 7 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇవి కాకుండా మిగతా అన్ని పంటలు కలిపి 69 లక్షల ఎకరాల వరకు సాగయ్యే అవకాశం ఉందని లెక్కలు కట్టింది. కాగా జనవరి 1వ తేదీ వరకు వ్యవసాయ శాఖ జిల్లా నోడల్ అధికారి నివేదిక ప్రకారం వరి 4 లక్షల ఎకరాల్లో సాగవగా, మొక్కజొన్న 5.50 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగైంది. సాగుకు సంబంధం లేకుండా కొనుగోళ్లు కేంద్ర ప్రభుత్వం యాసంగిలో 10.40 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించింది. అందులో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలకుగాను ఇప్పటి వరకు 5.78 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేసింది. వానాకాలం సీజన్లో 133 లక్షల ఎకరాల్లో పంటలు సాగయితే, యాసంగిలో అందులో 60 శాతం మాత్రమే సాగవుతాయి. ఇప్పటికే రైతులు ఏకంగా 3.54 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కొనుగోలు చేశారు. సాగుతో సంబంధం లేకుండా రైతులు యూరియాను అడ్డగోలుగా కొనుగోలు చేసి, నిల్వ చేసుకోవడం ఒకటైతే... అవసరానికి మించి యూరియాను వాడడం మరో సమస్యగా మారింది. మొక్కజొన్న పంటకు ఏకంగా ఎకరానికి 10 బస్తాల యూరియాను వాడుతున్న విషయం తమ దృష్టికి వచ్చినట్టు ఓ వ్యవసాయ అధికారి ‘సాక్షి’తో చెప్పడం గమనార్హం. డీఏపీ, కాంప్లెక్స్ వినియోగం కూడా అధికమే యూరియా తర్వాత అధికంగా వినియోగించే ఎరువుల్లో కాంప్లెక్స్, డీఏపీ. ఈ యాసంగి కోసం కేంద్రం 7 లక్షల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు కేటాయించగా, ఇప్పటి వరకు 3.84 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా అయ్యాయి. అందులో 1.21 లక్షల మెట్రిక్ టన్నులు రైతులు కొనుగోలు చేశారు. ఇందులో ఇప్పటి వరకు 1.21 లక్షల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ వినియోగించగా, ఇంకా డీలర్లు, సొసైటీలు, మార్క్ఫెడ్ వద్ద కలిపి 2.63 లక్షల మెట్రిక్ టన్నులు నిల్వ ఉంది. డీఏపీ కూడా 1.45 ఎల్ఎంటీకిగాను 1.36 ఎల్ఎంటీ సరఫరా కాగా, దాదాపు లక్ష మెట్రిక్ టన్నులను రైతులు కొనుగోలు చేశారు. -
వరంగల్లో మూగబోయిన పోలీస్ సైరన్
సాక్షి, వరంగల్: వరంగల్ మిల్స్ కాలనీ పరిధిలోని జన్మభూమి జంక్షన్ వద్ద ఆకతాయిల వీరంగం స్థానికులను భయాందోళనలకు గురి చేస్తోంది. నడిరోడ్డుపై బీర్ సీసాలతో హంగామా చేస్తూ కొంతమంది వ్యక్తులు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. గంజాయి మత్తులో రెండు వర్గాలు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఆ సమయంలో వారిని అదుపు చేయడానికి వెళ్లిన వారిపై కూడా దాడి చేసినట్టు స్థానికులు తెలిపారు. ఈ ప్రాంతంలో తరచూ గొడవలు జరుగుతున్నప్పటికీ పోలీసులు కనీసం పట్టించుకోవడం లేదని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. రాత్రి వేళల్లో అండర్ రైల్వే గేట్ ప్రాంతంలో నివసించే వారు ప్రాణాలు గుపిట్లో పెట్టుకొని తమ గృహాలకు చేరుతున్న పరిస్థితి నెలకొంది. రోజురోజుకి ఆకతాయిల అల్లర్లు పెరుగుతున్నాయి. వారిని అదుపులోకి తీసుకురావడంలో పోలీసులు విఫలమవుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయాల్లో పోలీస్ పెట్రోలింగ్ సరిగ్గా లేకపోవడం మాకు భయాన్ని కలిగిస్తోంది. ఇప్పటికైనా అధికారులు పెట్రోలింగ్ పెంచి గొడవలను అదుపులోకి తీసుకురావాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తానికి ఈ ప్రాంతంలో శాంతి భద్రతలు కాపాడటానికి పోలీసులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
మద్యం మత్తులో ఆటో డ్రైవర్ హంగామా.. పోలీసులపై పాము
హైదరాబాద్: డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ ఓ ఆటో డ్రైవర్ ట్రాఫిక్ పోలీసులపై పాము విసిరేందుకు ప్రయత్నించిన ఘటన పాతబస్తీ చంద్రాయణగుట్ట చౌరస్తా వద్ద కలకలం రేపింది. మద్యం సేవించి వాహనం నడుపుతున్నాడన్న అనుమానంతో ట్రాఫిక్ పోలీసులు ఆటోను ఆపి బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించారు. పరీక్షలో డ్రైవర్కు 150 రీడింగ్ రావడంతో ఆటోను సీజ్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.ఈ సమయంలో మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ ఒక్కసారిగా ఆటోలో నుంచి పామును తీసి పోలీసులపైకి విసిరే ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసులు భయాందోళనకు గురై వెంటనే దూరం తప్పుకున్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న ఆటో డ్రైవర్ పాముతో సహా అక్కడి నుంచి పరారయ్యాడు.ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసుల విధుల నిర్వహణకు ఆటంకం కలిగించడం, ప్రజల ప్రాణాలకు ముప్పుగా వ్యవహరించినందుకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. -
గ్యాస్.. బిజినెస్!
ఇది హస్తినాపురం జెడ్పీరోడ్డులోని ఓ టిఫిన్సెంటర్. ఇక్కడ ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం ఫాస్ట్ఫుడ్ విక్రయిస్తుంటారు. కమర్షియల్ సిలిండర్కు బదులు.. ఇలా డొమెస్టిక్ వినియోగిస్తున్నారు. ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేస్తున్న సిలిండర్లను కొంత మంది అక్రమార్కులు కమర్షియల్ కేంద్రాలకు చేరవేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా ఈ ఒక్క టిఫిన్ సెంటర్లోనే కాదు.. జిల్లాలోని చాలా చోట్ల ఇదే తంతు కొన సాగుతోంది.సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజలకు సబ్సిడీపై గ్యాస్ సిలిండర్లను అందజేస్తోంది. దీపం, ఉజ్వల పథకాల కింద ఉచితంగా అందజేసిన సిలిండర్లతో పాటు ప్రైవేటు సిలిండర్లు కూడా ఉన్నాయి. జిల్లాలో గృహ, వాణిజ్య కనెక్షన్లు 12 లక్షలకుపైగా ఉన్నట్లు అంచనా. ముఖ్యంగా శంషాబాద్, మొయినాబాద్, రాజేంద్రనగర్, గాయత్రీనగర్, జెడ్పీరోడ్డు, బీఎన్రెడ్డి, హయత్నగర్, అబ్దుల్లాపూర్మెట్, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, ఆమనగల్లు, షాద్నగర్, శంకర్పల్లి, తుక్కుగూడ, జల్పల్లి, పెద్ద అంబర్పేట్, తుర్కయంజాల్, ఆదిబట్ల తదితర ప్రాంతాల్లోని ఏజెన్సీల పరిధిలో గృహ అవసరాల కోసం వినియోగించాల్సిన వంట గ్యాస్ సిలిండర్లు పక్కదారి పడుతున్నాయి. హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్ నిర్వాహకులకు ఏజెన్సీలు, డెలీవరీ బోయ్స్ సహకరిస్తుండటంతో ఈ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. వినియోగదారుల పేరున బుక్ చేసి.. రెండు మూడు నెలలకు ఒక సిలిండర్ మాత్రమే వినియోగించే వారి నుంచి గ్యాస్బుక్లను సేకరించి, వారి పేరున సిలిండర్లను బుక్ చేస్తున్నారు. ప్రభుత్వం అందించే సబ్సిడీ వినియోగదారుల ఖాతాల్లో నమోదవుతుండటంతో వారు దీన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఏజెన్సీలు, డెలివరీ బోయ్స్ దీన్ని అవకాశంగా తీసుకుని అడ్డదారులు తొక్కుతున్నారు. నిజానికి 14.2 కిలోల గృహ సిలిండర్ ధర రూ.925 కాగా, 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ.1,820 ఉంది. వినియోగదారుల పేరున సిలిండర్ బుక్ చేసిన ఆయా సిలిండర్లను హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, టీస్టాళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లకు తరలిస్తున్నారు. ఇందుకు ప్రతిఫలంగా ఒక్కో సిలిండర్పై రూ.400 నుంచి రూ.500 వరకు వసూలు చేస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీలు/ డెలివరీ పాయింట్లపై నిరంతరం నిఘా పెట్టాల్సిన సివిల్ సప్లయ్ విజిలెన్స్ విభాగం వారికి పరోక్షంగా వారికి సహకరిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. ఆయా ఏజెన్సీల నుంచి ప్రతి నెలా వారికి ముడుపులు ముట్ట జెబుతుండటంతో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాట్సాప్ గ్రూపుల్లో ‘జీపే స్కానర్’ చక్కర్లు సివిల్ సప్లయ్ విభాగం వాట్సాప్ గ్రూపుల్లో ఇటీవల ఓ ‘జీపే స్కానర్’ చక్కర్లు కొట్టడం చర్చనీయాంశంగా మారింది. డీలర్ల సంక్షేమం పేరుతో అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. జిల్లాలో 919 రేషన్ షాపులు ఉండగా, ఒక్కో షాపు నుంచి నెలకు రూ.2000 వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ప్రతి నెలా రూ.18.32 లక్షలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇలా వసూలైన మొత్తంలో ఉన్నతాధికారుల వరకు వాటాలు అందుతున్నట్లు సమాచారం. -
రేవంత్ది కట్టుకథ.. కుట్రతో ప్రాజెక్ట్ల నిర్లక్ష్యం: హరీష్రావు
సాక్షి, తెలంగాణ భవన్: అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కట్టుకథలు చెప్పారని ఆరోపించారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు. తెలంగాణ ప్రయోజనాలను ఫణంగా పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అంటూ ఘాటు విమర్శలు చేశారు. నల్లగొండ జిల్లాకు మరణశాసనం రాసింది కూడా కాంగ్రెస్ పార్టీనే అంటూ సంచలన ఆరోపణలు చేశారు.తెలంగాణ భవన్లో కృష్ణా జలాలపై బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తోంది. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..‘అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారు. పాలమూరు వలసలకు కారణమే కాంగ్రెస్ పార్టీ. నల్లగొండ జిల్లాకు మరణశాసనం రాసింది కూడా కాంగ్రెస్ పార్టీనే. విభజనలో సెక్షన్-84 పెట్టి రాష్ట్రానికి అన్యాయం చేశారు. 11వ షెడ్యూల్లో మన ప్రాజెక్ట్లను ఎందుకు పెట్టలేదు?. కాంగ్రెస్ చేసిన ద్రోహాలను కప్పిపుచ్చుకున్నారు. పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్ట్లను 11వ షెడ్యూల్లో పెట్టకపోగా విభజన చట్టంలో రక్షణ కల్పించామని సీఎం చెబుతున్నారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్కు లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు.కుట్రపూరితంగా ప్రాజెక్ట్లను నిర్లక్ష్యం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద సీఎం రేవంత్ కక్ష గట్టారు.. పాలమూరుపై పగబట్టారు. కాంగ్రెస్ తాను చేసిన తప్పులను కప్పిపుచ్చుకుంటోంది. తెలంగాణకు కాంగ్రెస్ చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు. రేవంత్ ప్రభుత్వం తెలంగాణకు ద్రోహం చేస్తోంది. కుట్రపూరితంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. 2004-14 వరకు కాంగ్రెస్ పాలనలో 6.64 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారు. గడిచిన తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం 48.74 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చింది. పాలమూరు ఎత్తిపోతలు, డిండి ప్రాజెక్ట్లను కొనసాగిస్తామని కేసీఆర్ స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు ముఖం మీదే కేసీఆర్ చెప్పారు..టెలీమెట్రీ పెట్టాలని కేసీఆర్ ఎప్పుడో ఒప్పించారు. 2016లోనే టెలీమెట్రీ ఏర్పాటు చేశారు. సొంత ప్రాంతానికే రేవంత్ అన్యాయం చేస్తున్నారు. శాసన సభను రేవంత్ తప్పుదోవ పట్టించారు. తనకు అనుకూలంగా ఉన్న పేజీలను చదివారు. సభలో అసలైన పేజీలను రేవంత్ చదవకుండా వదిలేశారు. ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లోనే ట్రిబ్యునల్ ఏర్పాటుపై ప్రశ్నించాం. రాష్ట్రం ఏర్పడిన 42 రోజుల్లోనే నీటి హక్కులపై కేంద్రాన్ని నిలదీశాం. కేసీఆర్కు తెలంగాణ రాష్ట్రమే ముఖ్యం. పొతిరెడ్డిపాడు అక్రమ ప్రాజెక్ట్ అని ఆనాడే కేసీఆర్ చెప్పారు. చంద్రబాబు ముఖం మీదే బల్లగుద్దినట్టు కేసీఆర్ మాట్లాడారు. ఉత్తమ్ కట్టుకథలు, రేవంత్ పిట్ట కథలు చెప్పారు. తెలంగాణకు నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్. రేవంత్ రెండేళ్లలోనే కృష్ణా ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పచెబుదామంటారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టుకు రేవంత్, చంద్రబాబు లోపాయికారి ఒప్పందం కుదిరింది అని విమర్శించారు. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ వల్లే నీటి సమస్యలు..అసెంబ్లీలో అబద్ధాలు ఆడినందుకు రాజీనామా చేయాలి. కాంగ్రెస్ మాత్రం ఒక్క ప్రాజెక్ట్ డీపీఆర్ కూడా కేంద్రానికి పంపించలేదు. మీ పాలనలో మూడు డీపీఆర్లు వెనక్కి వచ్చాయి. అరెంజ్మెంట్, అగ్రిమెంట్కు తేడా తెలియకుండా విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక కేంద్రానికి 11 ప్రాజెక్ట్ల డీపీఆర్లను పంపించాం. ఏడు ప్రాజెక్ట్లకు అనుమతి తీసుకొచ్చాం. తెలంగాణకు కేసీఆర్ అన్యాయం చేశారంటే ఎవరైనా నమ్ముతారా?. రేవంత్ అబద్దాలను చేసి నిజమే ఉరేసుకుంటుందేమో. బీఆర్ఎస్ హయంలోనే అత్యధికంగా కృష్ణా నీళ్ల వినియోగం జరిగింది. ప్రాజెక్ట్ల నిర్మాణాన్ని కేసీఆర్ పరుగులు పెట్టించారు. తెలంగాణకు బీఆర్ఎస్ మరణశాసనం రాసిందని చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. గత పదేళ్లు నీటి హక్కుల కోసం కేంద్రంపై కేసీఆర్ పోరాడారు. 2023లోనే 66:34 లేకుండానే అగ్రిమెంట్ చేశాం. కృష్ణా జలాల్లో 50:50 నీటి వాటాల కోసం కేంద్రానికి 28 లేఖలు రాశాం. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ వల్లే నీటి సమస్యలు వచ్చాయి అని చెప్పుకొచ్చారు. రేవంత్వి బలుపు మాటలు: కేటీఆర్అంతకముందు కేటీఆర్ మాట్లాడుతూ..‘నదీ జలాల మీద కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా ద్రోహానికి పాల్పడుతోంది. అధికార మదంతో విర్రవీగుతూ, బలుపు మాటలతో రేవంత్ రెడ్డి విర్రవీగుతున్నాడు. ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డిని ఉరితీయాలి. రేవంత్కి ఒక్క భాషలో తిట్లు వస్తే మాకు నాలుగైదు భాషల్లో తిట్టడానికి వచ్చు. దోచుకోవడం, దాచుకోవడం తప్ప తెలంగాణకు ఏం కావాలో.. రేవంత్కు తెలియదు. రేవంత్ మాటలతో కేసీఆర్ స్థాయి తగ్గదు. కేసీఆర్ గురించి ‘వినాశకాలే విపరీత బుద్ధి’ అన్నట్టుగా రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీని ఊరి వేయాలి?. అసలు ఈ ముఖ్యమంత్రి గారికి బేసిన్లు తెలియదు.. బేసిన్ అంతకంటే తెలియదు. దేవాదుల ఏ బేసిన్లో ఉంది అని అడిగే రేవంత్ రెడ్డి ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నాడు అంటూ సెటైర్లు వేశారు. -
బంజారాహిల్స్లో మరో చరిత్ర..!
హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన అమ్మాయి(16), అబ్బాయి(16) ఇద్దరూ పదో తరగతి వరకు ఒక్కటే పాఠశాలలో చదువుకుంటుండగా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఏడాది క్రితం వరకూ ఇద్దరూ ప్రేమ పక్షుల్లా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండటంతో అమ్మాయి, అబ్బాయి కుటుంబీకులకు తెలిసి మందలించి ఒకనొకరు కలుసుకోకుండా షరతులు విధించారు. సినీ ఫక్కీలో గత మరో చరిత్ర సినిమాను తలపించేలా అమ్మాయిని, అబ్బాయిని విడదీసి మేజర్లు అయ్యేవరకు కలుసుకోవద్దని చెప్పారు. దీంతో సదరు అబ్బాయి పాల్వంచలోనే ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుండగా, అమ్మాయి హైదరాబాద్కు వచ్చి బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12లోని ఎన్బీటీనగర్ బస్తీలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఇక్కడే కుట్టు శిక్షణ తీసుకుంటున్నది. ఈ నెల 31వ తేదీన సదరు అబ్బాయి హైదరాబాద్కు వచ్చి ఎన్బీటీనగర్లోని అమ్మాయి ఇంటికి వెళ్లి అక్కడే నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నాడు. ఈ విషయం గత నెల 31న రాత్రి 8 గంటల ప్రాంతంలో అబ్బాయి కనిపించకపోవడంతో అనుమానం వచ్చి హైదరాబాద్కు పరుగులు తీశారు. ఎన్బీటీనగర్లోని అమ్మాయి ఇంటికి వచ్చి చూడగా ఇద్దరూ ఒకే గదిలో కనిపించారు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సదరు బాలుడు మైనర్ కావడంతో జువైనల్ హోమ్కు తరలించారు. అమ్మాయిని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. 16 ఏళ్ల వయస్సులో ఈ ఇద్దరు మైనర్లు మరో చరిత్ర సినిమాను తలపించేలా ప్రేమించుకోవడం, తల్లిదండ్రులు విడగొట్టడం, మళ్లీ కలుసుకోవడం, వ్యవహారం పోలీసుల దాకా రావడం పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ నవీన్రావుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) నోటీసులు ఇచ్చింది. ఇవాళ(ఆదివారం జనవరి 4) జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో విచారణకు రావాలని నోటీసులు ఇవ్వగా.. ఆయన విచారణకు హాజరయ్యారు. డివైజ్తో ట్యాపింగ్ చేసినట్లు నవీన్రావుపై ఆరోపణలు ఉన్నాయి. త్వరలో బీఆర్ఎస్ కీలక నేతలను సిట్ విచారించే అవకాశముంది.కాగా, ఈ కేసులో ఒక పెన్ డ్రైవ్ కీలక ఆధారంగా మారగా.. ఈ పెన్ డ్రైవ్లో వందల సంఖ్యలో ఫోన్ నెంబర్లను సిట్ అధికారులు గుర్తించినట్టు సమాచారం మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు విధుల్లో ఉన్న సమయంలోనే ఈ పెన్ డ్రైవ్లో ఫోన్ టాపింగ్కు సంబంధించిన.. కీలక సమాచారం స్టోర్ చేసినట్లు అధికారులు గుర్తించారు.ఈ పెన్ డ్రైవ్లో వందల సంఖ్యలో ఫోన్ నంబర్లు నమోదై ఉన్నట్లు తేలింది. వీటిలో రాజకీయ నేతలు, ప్రముఖ జర్నలిస్టులు, హైకోర్టుకు చెందిన ఓ న్యాయమూర్తి ప్రొఫైల్ వివరాలు కూడా ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. దీంతో, మరిన్ని వివరాలు సేకరించే పనిలో అధికారులు ఉన్నట్టు తెలిసింది. -
జీఎస్టీ తగ్గించినా లభించని ఊరట!
సాక్షి, సిటీబ్యూరో: అధిక ధరలకు కళ్లెం వేసి.. పన్నుల భారం తగ్గించి.. సామాన్యులకు ఊరట కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ 2.0 లక్ష్యం నీరుగారుతోంది. జీఎస్టీ రెండు స్లాబుల్లో 28 –18 శాతానికి, 12 నుంచి 5 శాతానికి పన్నులను కేంద్రం తగ్గించింది.పన్ను వ్యవస్థను మరింత పారదర్శకంగా చేయడం, పన్ను ఎగవేతకు చెక్ పెట్టడం, నిజాయతీ గల వ్యాపారులకు సౌలభ్యం కల్పించడమే దీని ఉద్దేశం. అయితే రాష్ట్రంలో జీఎస్టీ సంస్కరణలు కేవలం సర్క్యులర్లు, ప్రకటనలు, పోర్టల్ మార్పులకే పరిమితమయ్యాయని పలువురు వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా వ్యాపార సంస్థలు తగ్గించిన పన్నులు కాకుండా యధాతథంగా పాత రేట్లతో బిల్లులు జారీ చేస్తున్నట్లు ‘సాక్షి’సర్వేలో తెలిసింది.ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టి పెట్టి పన్ను తగ్గింపు పూర్తిస్థాయిలో అమలవడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని వినియోగదారులు కోరుతున్నారు. వ్యాపారులు పాత రేట్లు వసూలు చేస్తూ వాణిజ్య పన్నుల శాఖకు మాత్రం కొత్త, తక్కువ రేట్లతో రిటర్న్స్ దాఖలు చేస్తున్నారని కొంతమంది అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు.ఇలా చేయడం జీఎస్టీ వ్యవస్థపై ప్రజల్లో ఉన్న నమ్మకానికి భంగం కల్పించినట్టేనని అంటున్నారు. జీఎస్టీ సంస్కరణలు అమలు కావాలంటే కఠిన తనిఖీలు, పాత రేట్ల వసూళ్లపై జీరో టాలరెన్స్ వినియోగదారులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. -
ఒక్కసారే ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు..
మహబూబాబాదు జిల్లా: ఎవరైనా ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే దాదాపు తపస్సు చేయాలి. కానీ, మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలానికి చెందిన ఓ యువకుడు ఒకేసారి ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా.. అనిపించాడు. మండలంలోని దుబ్బతండాకు చెందిన గుగులోత్ చందు పట్టుదలే పెట్టుబడిగా రెండు నెలల వ్యవధిలోనే ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి రికార్డు సృష్టించాడు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేరళ గ్రామీణ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఐడీబీఐతోపాటు ఎయిమ్స్ ఢిల్లీలో క్లర్క్ ఉద్యోగం సాధించాడు. కాగా, చందు ఢిల్లీ పంజాబ్ నేషనల్ బ్యాంకులో క్లర్క్ ఉద్యోగంలో చేరాడు. ఈ సందర్భంగా చందును గ్రామస్తులు అభినందించారు. -
కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్!
సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మధ్యాహ్నం తర్వాత అసెంబ్లీలో కృష్ణా జలాలపై చర్చ ప్రారంభమైన సమయంలో సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతుండగా పార్టీ ఎమ్మెల్యేలు పలుచగా ఉండడాన్ని గమనించిన ఆయన ఈ మేరకు సీరియస్ అయ్యారని సమాచారం. ‘ముఖ్యమైన అంశంపై చర్చ ప్రారంభమైన తర్వాత కూడా మన ఎమ్మెల్యేలు ఎందుకు సభకు రాలేదు. వెంటనే వారిని సభకు రమ్మని చెప్పండి. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలందరూ సభలో ఉండాలి’అని ఆయన పార్టీ విప్లను ఆదేశించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో వెంటనే సభలో లేని ఎమ్మెల్యేలందరికీ సీఎల్పీ నుంచి ఫోన్లు వెళ్లడంతో అందరూ సభకు వెళ్లారు. -
తెల్లారితే గల్ఫ్ పయనం.. అంతలోనే గుండెపోటు
జగిత్యాల జిల్లా: తెల్లారితే దుబాయ్ వెళ్లాల్సిన ఓ వలసకార్మికుడు.. పొలంలో పనిచేస్తుండగా గుండెపోటుకు గురై చనిపోయిన సంఘటన రాయికల్ మండలం కుమ్మరిపల్లిలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పంచతి గంగారెడ్డి (48) ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లి అక్కడ ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. 25 రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. కంపెనీ ఇచ్చిన సెలవులు పూర్తికావడంతో ఆదివారం తిరిగి దుబాయ్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. శనివారం తన పొలంలో కుటుంబసభ్యులతో కలిసి పనులు చేస్తున్నాడు. ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు. స్థానికులు, కుటుంబసభ్యులు వెంటనే రాయికల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గంమధ్యలో మృతిచెందాడు. గంగారెడ్డికికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రెండు రోజులుగా కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతున్న గంగారెడ్డి గుండెపోటుతో మృతిచెందడంతో ఆ కుటుంబంలో విషాధ చాయలు అలుముకున్నాయి. -
శంకర్ దాదా ఎంబీబీఎస్లే!
సాక్షి, హైదరాబాద్: మహా నగరానికి నకిలీ వైద్యుల బెడద పట్టుకుంది. అత్యంత అభివృద్ధి చెందిన నగరంగా హైదరాబాద్ దూసుకెళుతోంది. ప్రపంచ స్థాయిలో మెడికల్ టూరిజాన్ని ఆకర్షిస్తోంది. క్షేత్ర స్థాయిలో వైద్యం మాత్రం గ్రామీణ ప్రాంతాలకంటే ఘోరంగా ఉంది. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నివేదికలు దీన్నే ప్రతిబింబిస్తున్నాయి. గడచిన రెండేళ్ల వార్షిక నివేదికలను పరిశీలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా మూడు జిల్లాల్లోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 34, మేడ్చల్ 32, హన్మకొండలో 30 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఒక్కో ఎఫ్ఐఆర్లో రెండు నుంచి ఐదు కేసులు ఉంటాయని మెడికల్ కౌన్సిల్ సభ్యులు చెబుతున్నారు. మిగతా జిల్లాల్లో సుమారుగా ఏడాదికి సింగిల్ డిజిట్లోనే ఉన్నాయి. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తనిఖీల్లో అర్హత లేని వ్యక్తులు వైద్యం చేయడం, అనధికారికంగా క్లినిక్లు, నర్సింగ్ హోంలు నిర్వహించడం, నిషేధిత స్టెరాయిడ్స్, అబార్షన్ కిట్లు, ప్రమాదకరమైన యాంటీబయాటిక్స్, హార్మోనల్ ట్యాబ్లెట్లు వినియోగిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఏటా పది వేల మంది వైద్యులు.. రాష్ట్రంలో మొత్తం 65 వైద్య కళాశాలలు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ కళాశాలలు 36 ఉండగా, ప్రైవేటువి 29 ఉన్నాయి. ఏటా పది వేల మంది వైద్య విద్యార్థులు పట్టా పొందుతున్నారు. నగరంలో 260 బస్తీ దవాఖానాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా, జిల్లా ఆసుపత్రులు, మెడికల్ కళాశాలలు, గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, నిమ్స్, ఇతర కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నప్పటికి నకిలీ వైద్యుల ప్రభావం ఇంత పెద్ద ఎత్తున ఉండటం ఆందోళనకు గురిచేస్తోంది. వైద్యాధికారులు, మెడికల్ కౌన్సిల్ తనిఖీల్లో పట్టుబడిన వారిపై తెలంగాణ మెడికల్ ప్రాక్టిసనర్స్, రిజి్రస్టేషన్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల కాలంలో గ్రేటర్ పరిధిలోని ఓ డీఎంహెచ్ఓ నిబంధనలు పాటించని ఆసుపత్రికి రూ.50 వేల జరిమానా విధించారు. ప్రజారోగ్యానికి నష్టం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నా నకిలీల మకిలీ వదలడంలేదు.నాణ్యమైన వైద్యం అందాలన్నదే లక్ష్యం ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలన్నదే లక్ష్యంగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ పని చేస్తోంది. అర్హత లేని వ్యక్తులు వైద్యం చే యడం, అనుమతులు లేకుండా క్లినిక్స్, నర్సింగ్హోంల నిర్వహణ, నిషేధిత మందుల వినియోగంపై విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించి కేసులునమోదు చేస్తున్నాం. తదుపరి చర్యల కోసం ఆయా జి ల్లా వైద్యాధికారులకు అప్పగిస్తున్నాం. నకిలీ వైద్యులతో సమాజానికి నష్టం జరుగుతోంది. అవసరం లేకపోయినా పవర్ ఫుల్ మందులు రాస్తున్నారు., స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్తో భవిష్యత్తులో తీవ్ర ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. – మహేష్ కుమార్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఛైర్మన్ -
హోటళ్లు, స్పాలు అన్నీ నా చేతుల్లోనే సర్.. పోస్టింగ్ ఇప్పించండి!
సాక్షి, హైదరాబాద్: ఫోకల్ పోస్టింగ్ల కోసం ఖాకీల పైరవీలు అప్పుడే మొదలయ్యాయి. రాజధానిలో పోలీసు విభాగం పునర్ వ్యవస్థీకరణ ఇంకా తుది దశకు చేరుకోకముందే పలువురు పోలీసు అధికారులు పైరవీల బాటపట్టారు. కానిస్టేబుల్, ఎస్ఐ, ఇన్స్పెక్టర్, డీఎస్పీ ర్యాంక్ అధికారుల వరకు తమకు నచ్చిన చోట పోస్టింగ్ కోసం ఎవరికి వారు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తమ సన్నిహితులను ప్రసన్నం చేసుకునే పనిలో తలమునకలయ్యారు. కానిస్టేబుల్ నుంచి ఎస్ఐలు, డీఎస్పీల వరకూ పలువురు అధికారులు నేతల సిఫారసు లేఖల కోసం చక్కర్లు కొడుతున్నారు. రాజకీయ నేతల జోక్యం.. సాధారణంగా పోలీసు బదిలీలు, పోస్టింగ్లలో రాజకీయ నేతల జోక్యం ఎక్కువగా ఉంటుందనేది బహిరంగ రహస్యమే. శాసనసభా నియోజకర్గ పరిధిలోని ఠాణాలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ), ఏసీపీ పోస్టింగ్స్కు సంబంధిత ప్రజా ప్రతినిధి ఆమోదముద్ర ఉండాల్సిందే. నేత మాట కాదని ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేసినా బాధ్యతలు చేపట్టడం కత్తిమీద సాముగా మారింది. ఇటీవల గ్రేటర్లో కొత్తగా ఏర్పడిన ఓ డివిజన్కు ఏసీపీ పోస్టు కేటాయిస్తూ ఓ అధికారికి ఉత్తర్వులు జారీ చేశారు. తీరా ఆయన బాధ్యతలు చేపట్టకుండానే తిరిగి హెడ్ క్వార్టర్స్కు చేరారంటే స్థానిక నేతల ప్రభావం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ పోస్టింగ్లకు డిమాండ్.. నగర శివారు ప్రాంతాల్లో జనావాస విస్తరణతో భూములకు గిరాకీ పెరిగింది. దీంతో భూ లావాదేవీలు అధికంగా జరిగే ప్రాంతాల్లోని ఠాణాలలో పోస్టింగ్ కోసం పలువురు పోలీసు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందంగా పోస్టింగ్లో ఉన్నప్పుడు ఎంతో కొంత వెనకేసుకోవాలని పలువురు అధికారులు భావిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణమని ఓ పోలీసు ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. గ్రేటర్లో ఖరీదైన కమిషనరేట్గా పేరున్న ప్రాంతంలో ఏసీపీ, డీసీపీ పోస్టింగ్లకు ఫుల్ డిమాండ్ ఉంది. అక్కడ తమకు అవకాశం కల్పిస్తే అండగా ఉంటామంటూ ఒకరిని మించి మరొకరు పోటీ పడుతున్నారు. హోటళ్లు, స్పాలు, ఐటీ కంపెనీలున్న ఓ డివిజన్లో తానే ఏసీపీనంటూ ఓ అధికారి ముందుగానే సిబ్బందికి చెబుతుండటం గమనార్హం.వామ్మో ఆ కమిషనరేటా? గ్రేటర్లో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరిలతో పాటు నాలుగో పోలీసు కమిషనరేట్ ఫ్యూచర్ సిటీ ఏర్పాటైంది. దీంతో త్వరలోనే కొత్త జోన్లు, డివిజన్లు, ఠాణాలు ఏర్పాటు కావడం అనివార్యం. ఇప్పటివరకు లూప్ లైన్లో ఉన్న పలువురు పోలీసు అధికారులు ఆయా ఫోకల్ పోస్టింగ్లు దక్కించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. తమకు అనుకూలమైన పోస్టింగ్ల కోసం ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఉన్నతాధికారులకు ఫోన్లు సైతం చేయిస్తున్నారనే పోలీసు శాఖలో ప్రచారం జరుగుతోంది. రూల్బుక్ ఆఫీసర్గా పేరున్న ఓ పోలీసు బాస్ కమిషనరేట్లో పనిచేసేందుకు పలువురు పోలీసులు జంకుతున్నారు. దీంతో వేరే కమిషనరేట్కు బదిలీ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. -
సమయం లేదు మిత్రమా..
సాక్షి, హైదరాబాద్: ‘సమయం మించిపోతోంది మిత్రమా..గడువులోగా వచ్చి లొంగిపోండి. ప్రభుత్వాలు, పోలీసుల తరఫున ఏ సహకారం అందాలో అది పూర్తిగా అందిస్తాం..’అని మావోయిస్టులకు డీజీపీ బి.శివధర్రెడ్డి పిలుపునిచ్చారు. మావోయిస్టు పార్టీ పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ (పీజీఎల్ఏ) పతనం అంచుకు చేరిందని, ప్రస్తుతం కేవలం 66 మంది మాత్రమే మిగిలారని తెలిపారు. ఇప్పటివరకు పట్టుబడిన మావోయిస్టుల నుంచి అత్యంత కీలక సమాచారం తెలిసిందని, వారు మావోయిస్టుల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన 52 మంది అండర్ గ్రౌండ్లో ఉన్నట్టు రికార్డులు ఉన్నా..వాస్తవానికి 17 మంది మాత్రమే ఉన్నట్టు తెలిసిందని చెప్పారు.మడావి హిడ్మా అనుచరుడు పీజీఎల్ఏ బెటాలియన్ కమాండర్ బడ్సె సుక్క అలియాస్ దేవా (బర్సె దేవా), దర్శన్, మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేష్, ఆయన భార్య అడ్లూరి ఈశ్వరి అలియాస్ రంకో సహా మొత్తం 20 మంది మావోయిస్టులు శనివారం డీజీపీ సమక్షంలో లొంగిపోయారు. రెండు అత్యాధునిక లైట్ మెషీన్ గన్ (ఎల్ఎంజీ)లు సహా మొత్తం 48 ఆయుధాలను పోలీసులకు అప్పగించారు.రూ.20.3 లక్షల నగదు కూడా అప్పగించారు. ఈ సందర్భంగా డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఇంటెలిజెన్స్ అదనపు డీజీ విజయ్కుమార్, శాంతిభద్రతల అదనపు డీజీ మహేశ్ భగవత్, ఆపరేషన్స్ అదనపు డీజీ అనిల్కుమార్, ఎస్ఐబీ చీఫ్, ఐజీ సుమతితో కలిసి శివధర్రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం సహా మరే ఇతర రాష్ట్రాల పోలీస్ చరిత్రలోనూ ఒకే లొంగుబాటులో ఇంత పెద్ద ఎత్తున ఆయుధాలు మావోయిస్టులు విడిచిపెట్టడం ఇదే మొదటిసారి (రికార్డు) అని తెలిపారు.మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ‘అంతర్గత కలహాలు, ఆరోగ్య సమస్యలు, ప్రస్తుతం అడవుల్లో ఉండలేని పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాస ప్యాకేజీలకు మావోయిస్టులు ఆకర్షితులవుతున్నారు. ఇప్పటికే 576 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మిగిలి ఉన్న అగ్రనేతలు సహా అందరూ వీలైనంత త్వరలో జనజీవన స్రవంతిలోకి కలుస్తారని ఆశిస్తున్నాం. గెరిల్లా ఆపరేషన్లను ముందుండి నడిపిన దేవా లొంగుబాటుతో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. పెద్దపల్లి జిల్లా కిష్టంపేటకు చెందిన కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్ లొంగుబాటుతో ఆ పార్టీ రాష్ట్ర కమిటీపై పెద్ద దెబ్బ పడినట్లయింది.రాజిరెడ్డి 1997లో ఉద్యమంలో చేరాడు. ప్రస్తుతం లొంగిపోయిన 20 మందికి మొత్తంగా రూ.1.81 కోట్ల రివార్డు అందిస్తాం. తక్షణ సాయం కింద ఒక్కొక్కరికీ రూ.25 వేల చొప్పున డీడీలు ఇస్తున్నాం..’అని డీజీపీ తెలిపారు. రాజిరెడ్డి మాట్లాడుతూ.. మారిన పరిస్థితులు, సాంకేతికత కారణంగా సాయుధ పోరాటం చేయడం కష్టమైందని చెప్పారు. అయితే తాను అనారోగ్య కారణాలతోనే లొంగిపోతున్నట్టు తెలిపారు.మిగిలిన వారు సైతం లొంగిపోవాలని సూచించారు. కాగా 2 ఎల్ఎంజీలతో పాటు అమెరికాలో తయారైన కోల్ట్ రైఫిల్, ఇజ్రాయెల్ దేశంలో తయారైన టవర్ రైఫిల్, 8 ఏకే 47లు, 10 ఇన్సాస్లు, 8 ఎస్ఎల్ఆర్ (సెల్ఫ్ లోడింగ్ రైఫిల్)లు, 4 బీజీఎల్ (బ్యారెల్ గ్రనేడ్ లాంచర్)లు, 11 సింగిల్ షాట్లు, రెండు గ్రనేడ్లు, ఒక ఎయిర్ గన్, 93 మ్యాగ్జైన్లు, 2,206 తూటాలు మావోయిస్టులు అప్పగించారు. -
‘ప్రభుత్వం మారినా కాంట్రాక్టర్లు మారట్లేదు.. సీబీఐ విచారణ జరగాలి’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంట్రాక్టర్లపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ కాంట్రాక్టర్లు మారడం లేదు అంటూ వ్యాఖ్యానించారు. కాంట్రాక్టర్లపై విచారణ చేయాల్సిన అవసరం ఉంది అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మాట్లాడుతూ..‘ప్రభుత్వాలు మారుతున్నా కాంట్రాక్టర్లు ఎంజాయ్ చేస్తున్నారు. ప్రభుత్వంలో ఏ ప్రాజెక్టు అయినా సేమ్ కాంట్రాక్టర్లు కొనసాగుతున్నారు. ప్రభుత్వ పథకాలు ఫెయిల్ అయినప్పుడు కాంట్రాక్టర్లపై బాధ్యత ఉంటుంది. కాంట్రాక్టర్లకు సైతం నిబంధనలు వర్తించాలి. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో ప్రభుత్వాలు మారిన కాంట్రాక్టర్లు మాత్రం వాళ్లే ఉంటున్నారు. గత ప్రభుత్వంలో పాఠశాలల్లో పెయింటింగ్, బెంచీల కాంట్రాక్టర్లు ఇప్పుడు సైతం కొనసాగుతున్నారు. కాంట్రాక్టర్లపై విచారణ చేయాల్సిన అవసరం ఉంది. కాంట్రాక్టర్లపై సీబీఐ విచారణ చేయాల్సిన అవసరం ఉందన్నారు.ఇదే సమయంలో కేసీఆర్ గురించి మాట్లాడుతూ.. సభకు రాని కేసీఆర్ అజెండా డిసైడ్ చేస్తున్నారు. ఆయనే సభకు వస్తున్నాను.. ఇరిగేషన్ మీద చర్చ చేస్తా అంటారు. చివరకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సభను బహిష్కరించారు అని వ్యాఖ్యలు చేశారు. -
ఇదే బీఆర్ఎస్ రాసిన మొదటి మరణ శాసనం: రేవంత్
సాక్షి, హైదరాబాద్: ప్రాజెక్టులపై నిలదీస్తామన్న కేసీఆర్ సభకు రాలేదని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. శనివారం ఆయన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ.. సభకు వచ్చి కేసీఆర్ తన దగ్గర ఉన్న సమాచారం ఇస్తారనుకున్నామని.. సూచనలు ఇస్తే తీసుకుందామనుకున్నమన్నారు. కృష్ణా నీటిపై ఒకరోజు, గోదావరి నీటిపై ఒక రోజు చర్చ పెడదామనుకున్నామంటూ చెప్పుకొచ్చారు.‘‘రెండేళ్లుగా ప్రతిపక్ష నేత సభకు రావడం లేదు. సభకు వచ్చి మీ అనుభవాలు మాతో పంచుకోవాలని నేను పదేపదే కేసీఆర్ను కోరుతున్నా.. గతంలో జానారెడ్డి, భట్టి విక్రమార్క పోషించిన పాత్ర పోషించమని కోరా. జానారెడ్డి, భట్టిలను ఆనాడు అవమానానించినా భరించి సభకు వచ్చి సలహాలు ఇచ్చారు. బహిరంగ సభల్లో మాట్లాడడం కాదు.. సభకు రండి నిజాలు ఏంటో తేలుద్దాం. కృష్ణా నది జలాలపై చర్చ పెట్టమని మేము అడగలేదు. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ అడిగారు. అందుకే అసెంబ్లీ పెట్టి చర్చింస్తున్నాం’’ అని రేవంత్రెడ్డి పేర్కొన్నారు.‘‘కేసీఆర్ సభకు ఎందుకు రాలేదో కారణమే లేదు. హరీష్ రావుకు మాట్లాడే అవకాశం స్పీకర్ ఇచ్చారు. అయినా మేము సభకు రామని వెళ్లిపోయారు. మీరు సభ పెట్టండి మీ బట్టలు ఊడదీస్తామని ఒకరు ,తొలు తీస్తామని ఒకరు మాట్లాడారు. సభకు వచ్చి చర్చలో పాల్గొంటే ఎవరి బట్టలు ఊడదీయాలో ప్రజలు తేల్చుకునేవారు.’’ అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు.‘‘బచావత్ ట్రిబ్యునల్ (KWDT-1)అవార్డు ప్రకారం కృష్ణాజలాల్లో 75 శాతం నీటిలభ్యత అంచనాల ప్రకారం మొత్తం 2130 టీఎంసీల నీటిని కేటాయించారు. ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 811 టీఎంసీలు, మహారాష్ట్రకు 585 టీఎంసీలు, కర్ణాటకకు 811 టీఎంసీలు.. కేటాయించారు. పునర్విభజన చట్టం ప్రకారం నీటి కేటాయింపులు చేసుకోవాల్సి ఉండేది. నికర జలాలు, మిగులు జలాల వేర్వేరుగా నీటి కేటాయింపులు జరిపారు. కృష్ణా నదిపై ఉన్న వివిధ రాష్ట్రాల ఫిర్యాదుల కారణంగా 2004 ఫిబ్రవరి 2వ తేదీన అప్పటి కేంద్ర ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏర్పాటుచేసింది...బచావత్ ట్రిబ్యునల్ పంపిణీచేసిన 2130 టీఎంసీల నీటి కేటాయింపులను కొనసాగిస్తూనే, అదనపు నీటి లభ్యత అంచనాలతో 2578 టీఎంసీల నీటిని బచావత్ ట్రిబ్యునల్ కృష్ణా పరివాహకంలో ఉన్న రాష్ట్రాలకు పంపిణీచేసింది. దీని ప్రకారం మహారాష్ట్రకు 666 టీఎంసీలు, కర్ణాటకకు 907 టీఎంసీలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 1005 టీఎంసీల నీటి వాటాలు కేటాయించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఏపీ మధ్య నీటి వాటాల పంపిణీ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం ఇదే బ్రిజేష్ కుమార్ట్రిబ్యునల్కు (KWDT2) అప్పగించింది. ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టులను కొనసాగించుకోవచ్చని పునర్విభజన చట్టంలో ఉంది...ఉమ్మడి రాష్ట్రంలో ఉన్పప్పుడే అప్పటి ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో వీలైనన్ని సాగునీటి ప్రాజెక్టులు మంజూరు చేసింది. 2005 నుంచి 2014 నాటికే కృష్ణా బేసిన్లో ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు రంగారెడ్డి, డిండి, మక్తల్ నారాయణపేట కొడంగల్, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు చేపట్టింది. 2014లో అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ఈ ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేయాల్సిందిపోయి అసంపూర్తిగా వదిలేసింది. 490 టీఎంసీలు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు కేటాయిస్తే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక… కేసీఆర్, హరీష్ రావు బాధ్యతలు చేపట్టాక తెలంగాణ ప్రజలకు మరణ శాసనం రాశారు. 2015 జూన్లో జరిగిన కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో జరిగిన అంతర్రాష్ట్ర సమావేశంలో 299 టీఎంసీలకు అంగీకరించారు. ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీలల్లో తెలంగాణకు 490 టీఎంసీలు అడగాల్సిందిపోయి 299 టీఎంసీలకు ఒప్పుకుని సంతకం పెట్టారు...21.09.2016 న జరిగిన అపెక్స్ మీటింగ్ లోనూ మనకు 299 టీఎంసీలు చాలు అని కేసీఆర్ తాత్కాలిక నీటి వాటాలకు ఒప్పుకొని వచ్చారు. 06.10.2020లో జరిగిన రెండో అపెక్స్ మీటింగ్లోనూ ఈ కేటాయింపులే కొనసాగించండి.. అని శాశ్వతంగా ఒప్పుకొని వచ్చారు. కృష్ణా జలాలపై బహిరంగ సభలు కాదు.. సభలోనే చర్చించాలని మేం కేసీఆర్, హరీష్ ను ఆహ్వానించాం. పదేళ్లు కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోయేందుకు సహకరించి తెలంగాణకు తీరని అన్యాయం చేశారు. వివరాలతో సభలో చర్చిద్దామంటే సభకు రాకుండా వెళ్లిపోయారు.’’ రేవంత్ పేర్కొన్నారు. -
తెలంగాణకు పటేల్ వరం.. నెహ్రూ శాపం: మహేశ్వర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు అన్యాయం జరిగింది అంటే మొదటి ముద్దాయి కాంగ్రెస్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. బీఆర్ఎస్ పాలనలో సాగు నీళ్ల ముసుగులో నిధులు మహా దోపిడీకి గురయ్యాయి. అదే బాటలో రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది అంటూ విమర్శలు గుప్పించారు. సభను భజన మండలిగా మార్చారు అంటూ మండిపడ్డారు.కృష్ణ జలాలపై మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో సభ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. అనంతరం, బీజేఎల్పీ మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణకు పటేల్ వరం అయితే.. నెహ్రూ శాపం. పటేల్ రజాకర్ల నుంచి విముక్తి చేస్తే.. నెహ్రూ తెలంగాణను ఆంధ్రాలో కలిపి ద్రోహం చేశారు. జల దోపిడికి నెహ్రూ చేసిన పనితోనే శ్రీకారం పడింది. బీఆర్ఎస్ పాలనలో సాగు నీళ్ల ముసుగులో నిధులు మహా దోపిడీకి గురయ్యాయి. అదే బాటలో రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోంది. దేశ రాజకీయాలలో చక్రం తిప్పాలని దురాశతో ఏపీకి సాగు నీళ్ళను దారాదత్తం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆస్థాన గుత్తదారుల జేబులు నింపడానికి అదే పని చేస్తుంది. నాగార్జున సాగర్ తెలంగాణకు వచ్చే ఎడమ కాల్వను పైకి కట్టి, కుడి కాల్వను కిందకు కట్టి దోపిడిని ఆరోజే ప్రారంభించారు. తెలంగాణ కోసం చేపట్టిన ఎస్ఎల్బీసీ అంతా గందరగోళం.. ఇంకా పూర్తి కాలేదు.సభలో కాంగ్రెస్ తరఫున 25 మంది ఎమ్మెల్యేలు మాట్లాడారు. బీజేపీ నుండి ఒక్కరికీ మాత్రమే ఇచ్చారు. బీజేపీ నుండి మరొకరికి అవకాశం అడిగితే ఇవ్వలేదు. బీఆర్ఎస్ ఎలాగో సభలో లేనే లేదు.. ప్రతిపక్షంగా మాకు అవకాశం ఇవ్వచ్చు కదా?. ఎంఐఎం, సీపీఐతో డబ్బా కొట్టించుకున్నారు. సభను భజన మండలిగా మార్చారు’ అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. -
తప్పుడు చరిత్ర రాసే ప్రయత్నంలో కేంద్రం: టీపీసీసీ చీఫ్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తప్పుడు చరిత్రను రాసే ప్రయత్నం చేస్తోందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఉపాధి హామీ చట్టంలో మార్పులు తేవడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తుంది. ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు తొలగించడం హేయమైన చర్య అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు.టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘మహాత్మాగాంధీ మన దేశంలోనే కాదు.. ప్రపంచం గర్వించదగిన త్యాగశీలి. ఉపాధి హామీ చట్టంలో మార్పులు తేవడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తుంది. కేంద్రం.. దేశం కోసం ప్రాణాలు అర్పించిన గాంధీ, దేశ స్వాతంత్రం కోసం 12 ఏళ్ళు జైలు జీవితం గడిపిన నెహ్రూలను మరిపించే ప్రయత్నం చేస్తుంది. దేశంలో వలసల నివారణ కోసం సోనియా గాంధీ తీసుకువచ్చిన గొప్ప చట్టం ఇది. పేదలకు ఉపాధి హక్కును కల్పించి జీవనోపాధిని కల్పించింది. 20 ఏళ్లుగా కోట్ల మంది ఆకలి తీర్చిన చట్టం ఇది.ఉపాధి హామీ పనుల్లో 90 శాతం మంది లబ్ధిదారుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారు. 62 శాతం మంది మహిళలు లబ్ది పొందారు. పేదలకు ఆపన్న హస్తంలా నిలిచిన ఉపాధి హామీని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ వస్తుంది. ఒక తెలంగాణలోనే గత ఏడాది 6 కోట్ల విలువైన పని దినాలు తగ్గించారు. పేదల పొట్ట కొట్టి కార్పోరేట్ శక్తులను పెంచి పోషించడమే బీజేపీ విధానం. పెట్రోల్, డీజిల్ రేటు మూడింతలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ క్రూడాయిల్ ధరలు తగ్గినా.. దేశంలో రేటు పెరుగుతుంది. కేంద్ర ఆర్థిక విధానాల వల్ల రాష్ట్రాల ఆదాయ వనరులు తగ్గాయి. ఇది చాలదు అన్నట్లు ఉపాధి హామీ నిధుల్లో 40 శాతం భారం వేయడం అన్యాయం. కేంద్రం చర్యల వల్ల ఒక్క తెలంగాణ మీదే 1800 కోట్ల అదనపు భారం పడుతుంది’ అని కామెంట్స్ చేశారు. -
యూట్యూబర్ అన్వేష్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!
సాక్షి,హైదరాబాద్: నమస్తే ఫ్రెండ్స్. నాపేరు అన్వేష్. నేను ప్రపంచ యాత్రికుడిని. వెల్కమ్ టు మై ఛానల్ నా అన్వేషణ. నా కళ్లతో మీకు చూపిస్తాను ప్రపంచాన్ని’ అంటూ ప్రపంచ దేశాల్లో వింతలు, విశేషాల గురించి వివరించే యూట్యూబర్ అన్వేష్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే వరుస వివాదాలు, క్షమాపణలు, సబ్స్కైబర్ల సంఖ్య భారీ పడిపోయింది.ఈ క్రమంలో గరికపాటిపై యుద్ధం అంటూ మరో వివాదంలో చిక్కుకున్న అన్వేష్పై తెలంగాణ మహిళా కమిషన్కు పలు ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. ఆ ఫిర్యాదుల్లో మహిళలపై అవమానకరంగా, అసభ్యంగా వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మహిళలను వస్తువుల్లా చూపిస్తూ కంటెంట్ను ప్రసారం చేశాడని బాధితులు కమిషన్ దృష్టికి తీసుకువచ్చినట్లు సమాచారం. మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వీడియోలు రూపొందించడమే కాకుండా, బాలల హక్కులకు భంగం కలిగించే కంటెంట్ కూడా ఆ ఛానల్లో ఉందని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. ఆ ఫిర్యాదులపై.. సమాజంలో నైతిక విలువలు, సామాజిక సమతుల్యతకు భంగం కలిగించేలా ఈ వీడియోలు ఉన్నాయని కమిషన్ అభిప్రాయపడింది. సంబంధిత వీడియోల లింకులు, ఖాతా వివరాలను సేకరించింది. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు కూడా కమిషన్ గుర్తించింది. ఈ అంశాలు ప్రజా నైతికతకు విరుద్ధమని, చట్టపరమైన చర్యలు అవసరమని స్పష్టం చేసింది. విచారణలో సంబంధిత ఇన్ఫ్లుయెన్సర్ విదేశాల్లో ఉన్నట్లు గుర్తించింది. అందుకే ఈ కేసును జాతీయ మహిళా కమిషన్ (NCW)కు పంపినట్లు తెలంగాణ మహిళా కమిషన్ వెల్లడించింది.మహిళల గౌరవాన్ని కాపాడటంలో, బాలల హక్కులను రక్షించడంలో ఇలాంటి చర్యలు అత్యవసరమని కమిషన్ పేర్కొంది. ఎన్సీడబ్ల్యూ ఈ కేసుపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ మహిళా కమిషన్ విజ్ఞప్తి చేసింది. -
జిమ్స్ జామ్ : న్యూ ఇయర్ జోష్...కసరత్తుల కళకళ
ఎప్పటి మాదిరిగానే కొత్త ఏడాది సందర్భంగా ఆరోగ్యార్థుల తీర్మానాల ఫలితంగా నగరంలోని జిమ్ సబ్స్క్రిప్షన్లు రికార్డు స్థాయిలో పెరిగాయి. దీంతో జిమ్ములు కసరత్తులు చేసే వారితో కళకళలాడాయి. నగరంతో పాటు దేశవ్యాప్తంగా ఇదే ట్రెండ్ ఉన్నట్లు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా గత యేడాదితో పోలిస్తే ఈ సంవత్సరంలో 14% జిమ్ సభ్యత్వాలు పెరిగాయని, నగరంలోనూ అదే పరిస్థితి కనిపిస్తోందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇక గత డిసెంబర్తో పోలిస్తే 20–25% పెరుగుదల కనిపించినట్లు తెలుస్తోంది. న్యూ ఇయర్ తీర్మానాలతో పాటు భారీ డిస్కౌంట్ ఆఫర్లు కూడా దీనికి కారణమని స్పష్టమవుతోంది. – సాక్షి, సిటీబ్యూరో కొత్త సంవత్సరం ఆరోగ్యార్థులతో జిమ్స్ కళకళలాడాయి. ముఖ్యంగా మధ్య వయసు్కల సందడి అధికంగా కనిపించింది. న్యూ ఇయర్ తీర్మానాల్లో భాగంగా రికార్డు స్థాయిలో కొత్త సభ్యత్వాలు నమోదుకాగా.. దీనికి న్యూ ఇయర్ డిస్కౌంట్లు, ఆఫర్లు కూడా కారణమేనని తెలుస్తోంది. అయితే ఎప్పటి మాదిరిగానే మొదటి నెలలోనో.. లేదా రెండు నెలల తర్వాతనో వదిలేస్తే.. అది ఆరంభ శూరత్వంగా మారుతుందని ట్రైనర్లు చెబుతున్నారు. ఒక్కసారిగా భారీ స్థాయిలో కసరత్తులు చేసి.. ఆ వెంటనే వదిలేయడం సరికాదని, రోజుకు కొంత సమయం అనుకుని ఆ మేరకు క్రమంగా పెంచుకుంటూ వెళితే మంచి ఫలితాలు సాధించవచ్చని ట్రైనర్లు సూచిస్తున్నారు. తీర్మానాల ఫలం.. జిమ్కు బలం.. సాధారణ బరువు తగ్గించే లక్ష్యాలు మొదలుకుని.. పలు రకాల వ్యాధులకు చికిత్సగా వ్యాయామాలను సూచిస్తున్నారు నిపుణులు.. దీంతో ముందస్తు నివారణే ముఖ్యమనే ఆలోచనతో అనేక మంది జిమ్స్లో చేరుతున్నట్లు ట్రైనర్లు చెబుతున్నారు. నిశ్చల ఆధునిక జీవనశైలి కారణంగానే అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయనే అవగాహన అనేక మందిలో కలుగు తుండడంతో వాయిదా వేస్తూ వచి్చన వ్యాయామ కార్యాచరణను కొత్త ఏడాది సందర్భంగా అమలులోకి తీసుకొచ్చారు. జనవరి నెలలో యేటా ఈ పెరుగుదల ఉంటుందనేది ముందే తెలుసు కాబట్టి, పేరొందిన బ్రాండెడ్ జిమ్స్.. సభ్యత్వ రుసుములపై 30 నుంచి 50 శాతం వరకూ డిస్కౌంట్స్ ప్రకటించడం ఈ సారి మరింత ఊపుని అందించింది. ఇంట్లోనే వర్కవుట్స్.. ‘ఇంట్లోనే వ్యాయామం చేయాలని, హోమ్ జిమ్స్ ఏర్పాటు చేసుకోవాలని ఆశించే వారి సంఖ్య కూడా ఈ సారి భారీగానే పెరిగింది. ఇంట్లోనే వర్కవుట్ చేసుకునేందుకు వీలైన పరికరాలను ఎంచుకునే వారు పెరగడంతో మేము ‘గెట్ ఫిట్ డేస్’ పేరిట ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించాం’ అంటూ ఆన్లైన్ విపణి అమెజాన్ బజార్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఈ మేరకు డిసెంబర్ నెలాఖరులో భారీగా జిమ్ ఎక్విప్మెంట్ అమ్ముడుపోయినట్లు వివరించారు. మధ్య వయసువారే అధికం.. ఈ ఏడాది కొత్తగా జిమ్స్ సభ్యత్వాలు తీసుకున్నవారిలో మధ్య వయస్కులు అధికంగా ఉండడం విశేషం అని నగరంలోని ఓ జిమ్ నిర్వాహకులు త్రినేత్ర తెలిపారు. తాము అందుకున్న సభ్యత్వాల్లో దాదాపు 54 శాతం మిడిల్ ఏజ్డ్ వాళ్లవే కాగా 40 శాతం యువత, మిగిలిన వారు ఉన్నారని, యువతుల సంఖ్య కూడా భారీగానే పెరిగిందని ఆయన వివరించారు. డయాబెటిస్, బీపీ తదితర దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణ కోసం మందులపై ఆధారపడే పరిస్థితిని తగ్గించే శక్తి వ్యాయామానికి ఉందనే అవగాహన పెరగడమే దీనికి కారణమని వ్యాయామ శిక్షకుడు విజయ్ గంధం తెలిపారు. చదవండి: కర్ణాటకలో అద్భుతం : ఇది ‘మామూలు చిరుత’ కాదుస్లో.. స్టడీ.. విన్.. అయితే సభ్యత్వ రుసుములు చెల్లించి జిమ్లో, ఫిట్నెస్ స్టూడియోల్లో చేరినంత సులభంగా వ్యాయామాన్ని క్రమబద్ధంగా కొనసాగించడం కష్టమని ప్రముఖ సెలబ్రిటీ ట్రైనర్ కరణ్ చెబుతున్నారు. జనవరిలో పెరిగినట్టు కనిపించిన సభ్యత్వాల సంఖ్య కేవలం ఫిబ్రవరి కల్లా 20 శాతానికి అలాగే మార్చి నెల వచ్చే సరికి 35 శాతానికి పైగా తగ్గిపోతున్నట్లు పాత గణాంకాలు వెల్లడిస్తున్నాయన్నారు. కాబట్టి త్వరిత ఫలితాల కోసం ఆధారపడకుండా, సహేతుకమైన లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. కొత్తగా వ్యాయామం ప్రారంభించినప్పుడు వచ్చే ఒళ్లునొప్పులు, శారీరక సమస్యల విషయంలో గాభరా పడకుండా నిత్యం శిక్షకులు, వైద్యుల సూచనలను అనుసరిస్తూ ఫిట్నెస్ రొటీన్ కొనసాగించాలని, అదే విధంగా డైట్లోనూ తగిన మార్పులు, చేర్పులు చేసుకోవాలని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: రూ. 25 వేలకే అమ్మాయిలు : మంత్రి భర్త వ్యాఖ్యలు వీడియో వైరల్ -
గచ్చిబౌలిలో కారును ఢీకొట్టిన జింక
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఓ జింక.. కారును ఢీకొట్టింది. అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చిన జింక కారును ఢీకొనడంతో గాయపడింది. దీంతో, ఘటనా స్థలానికి చేరుకున్న యూనిమల్ ప్రొటెక్షన్ టీమ.. జింకను వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలించారు.తెలిసిన సమాచారం మేరకు.. గచ్చిబౌలి లో కారును ఢికోన్న జీంక.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అటవీ ప్రాంతం నుంచి ఓ జింక బయటకు వచ్చింది. గచ్చిబౌలి-లింగంపల్లి పాత ముంబై జాతీయ రహదారిపైకి రావడంతో కారును జింక ఢీకొట్టింది. వెంటనే సమాచారం అందుకున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యానిమల్ ప్రొటెక్షన్ టీమ్ అక్కడికి చేరుకుంది. అనంతరం, జింకను వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలిస్తున్నట్టు సిబ్బంది తెలిపారు. -
బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్/వైఎస్సార్: వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డిని(Sudheer Reddy) తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్యే కుమారుడు సుధీర్ రెడ్డి.. హైదరాబాద్లో డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కాడు. దీంతో, నార్సింగి పోలీసులు.. సుధీర్ రెడ్డికి డ్రగ్స్ టెస్టు చేయడంతో పాజిటివ్గా తేలింది. ఈ నేపథ్యంలో సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని నానక్రామ్గూడలో శనివారం ఈగల్ టీమ్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో తన ఇంట్లోనే డ్రగ్స్(గంజాయి) సేవిస్తున్న కూటమి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డిని పోలీసులు పట్టుకున్నారు. దీంతో, సుధీర్కు డ్రగ్స్ టెస్టులు చేయగా పాజిటివ్గా తేలింది. అనంతరం, సుధీర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి.. డీఅడిక్షన్ సెంటర్కు పంపించారు. ఈ క్రమంలో సుధీర్తో పాటు మరో వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఇక, గతంలో కూడా సుధీర్ రెడ్డి రెండు సార్లు డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు పట్టుబడటం గమనార్హం. ఇదిలా ఉండగా.. సుధీర్ రెడ్డి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు ఆరోపణలు సైతం ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణలో మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు.. డ్రగ్స్ కేసు నుంచి తప్పించేలా ఏపీ ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. -
రియల్ ఎస్టేట్ ఏజెంట్లూ.. బీ కేర్ ఫుల్!
కమీషన్లకు ఆశ పడి గృహ కొనుగోలుదారులకు ఏవేవో మాయమాటలు చెప్పి ప్లాట్, అపార్ట్మెంట్ విక్రయించేశామా.. చేతులు దులిపేసుకున్నామా? అంటే కుదరదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, మధ్యవర్తులు, బ్రోకర్లు టీజీ రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి. రెరా రిజిస్ట్రేషన్ లేకుండా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడం నేరం. గృహ కొనుగోలుదారులకు సరైన సమాచారం అందించి వారు మోసాలకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, మధ్యవర్తులది. రెరా నిబంధనలు పాటించని ఏజెంట్లకు రోజుకు రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తారు. గృహ కొనుగోలుదారులకు భరోసా, పెట్టుబడులకు భద్రత కల్పించడమే తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(టీజీ రెరా) ప్రధాన లక్ష్యం. ఏజెంట్లు, మధ్యవర్తులు ఆదాయ పన్ను చట్టం 1961లోని నిబంధనలకు 43 ఆఫ్ 1961 ప్రకారం తన ఖాతా పుస్తకాలు, రికార్డులు, ఇతరత్రా పత్రాలను నిర్వహించడంతో పాటు తరచూ సమీక్షించాలి.ప్రాజెక్ట్ల రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, టీజీఐఐసీ, డీటీసీపీ, యూడీఏ ఇతర స్థానిక సంస్థల అనుమతులతో పాటు రెరా రిజిస్ట్రేషన్ తప్పనిసరి. 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం లేదా 8 కంటే ఎక్కువ యూనిట్లు ఉన్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లు రెరా అథారిటీ ఆమోదం, రిజిస్ట్రేషన్ లేకుండా ప్లాట్లు, అపార్ట్మెంట్ల అమ్మకం, బుకింగ్, ఆఫర్లు, మార్కెటింగ్, ఇతర ప్రచారాలు చేయకూడదు. రెరా నిబంధనలను ఉల్లంఘించి నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రాజెక్ట్లు, బిల్డర్లకు రెరా చట్టంలోని సెక్షన్–59 ప్రకారం అపరాధ రుసుములు విధిస్తుంది.ఇది చదివారా? రియల్ ఎస్టేట్.. ఫుల్ జోష్!10,408 ప్రాజెక్ట్ల నమోదు.. ఇప్పటి వరకు టీజీ రెరాలో 10,408 ప్రాజెక్ట్లు నమోదయ్యాయి. 4,729 మంది ఏజెంట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 10 మంది ప్రాజెక్ట్లు/ఏజెంట్ల రిజి్రస్టేషన్లను రద్దు చేశారు. జయాస్ ప్లాటినం, బీఆర్ మోడోల్యాండ్ అపార్ట్మెంట్స్, కేసినేని నార్త్స్కేప్, సిగ్నిఫా సిగ్నేచర్, లక్ష్మీ ఇన్ఫోబాన్ టవర్–23, ఎపిటోమ్ ఇంటిగ్రేటెడ్ సిటీ–ఫేజ్ 2, వియాన్ వన్80, గంగిడీస్ రాయల్ అడోబ్, స్పెక్ట్రా టెక్ టవర్స్ వీటిల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు టీజీ రెరాలో 2,619 ఫిర్యాదులు నమోదు కాగా.. 1,709 ఫిర్యాదులను పరిష్కృతమయ్యాయి. -
‘బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణకు తీవ్ర అన్యాయం’
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్పై ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మంత్రి ఉత్తమకుమార్రెడ్డి అన్నారు. కృష్ణా జలాలపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన మంత్రి.. పాలమూరులో బీఆర్ఎస్ తట్టేడు మట్టి ఎత్తి పోయలేదని మండిపడ్డారు. వచ్చే మూడేళల్లో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్న ఉత్తమ్.. పాలమూరు ప్రాజెక్ట్ తరవాత కాళేశ్వరం మొదలైనా ఇప్పటికీ పాలమూరు పూర్తి కాలేదన్నారు.‘‘కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం 90 వేల కోట్లు ఖర్చు చేశారు.. పాలమూరు కు కేవలం 27వేల కోట్లు మాత్రమే. కాళేశ్వరానికి అన్ని అనుమతులు వచ్చాయి. పాలమూరకు ఇప్పటికీ అనుమతులు పూర్తిగా రాలేదు. పాలమూరు ప్రాజెక్టును కావాలనే బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసింది బీఆర్ఎస్ సభ్యులు సభకు ఎందుకు రావడం లేదు. కేసీఆర్.. కృష్ణా, గోదావరి జలాలపై ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాన్ని మేం ఖండిస్తున్నాం’’ అని ఉత్తమ్కుమార్రెడ్డి పేర్కొన్నారు.‘‘కృష్ణా నీటిలో చుక్క నీరు వదులుకోం. తెలంగాణ హక్కులను కాపాడటంతో రాజీపడం. తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సంతకాలు చేశారు. తెలంగాణకు బీఆర్ఎస్ తీవ్ర అన్యాయం చేసింది. తెలంగాణకు 34 శాతం నీళ్లు చాలు అని కేసీఆర్, హరీష్రావు సంతకాలు చేశారు. కేసీఆర్ తను ముఖ్యమంత్రిగా అబద్ధాలు చెప్పారు. కూర్చువేసుకొని దేవరకద్ర ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు.. కానీ ఇప్పటికీ కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 24 వేల కోట్ల బడ్జెట్ల ఇరిగేషన్కు కేటాయిస్తే అందులో 16 వేల కోట్లు ఇంట్రెస్ట్కే వెళ్లాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ను 2నుంచి 3టీఎంసీ లకు పెంచారు... పాలమూరు ప్రాజెక్టును 1.5 నుంచి 1టీఎంసీకి పంపారు’’ అని ఉత్తమ్ చెప్పుకొచ్చారు. -
డీజీపీ ఎదుట లొంగిపోయిన బర్సీ దేవా.. మావోయిస్టులకు ఎదురుదెబ్బ
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట మావోయిస్టు అగ్రనేత బర్సె దేవా లొంగిపోయారు. దేవాతో పాటు తెలంగాణ కీలక నేత కంకణాల రాజిరెడ్డి కూడా పోలీసులు ఎదుట లొంగిపోయారు. మరో 48 మంది మావోయిస్టులు వీరి బృందంలో ఉన్నారు. తాజాగా మావోయిస్టుల లొంగుబాటు కారణంగా 41 మంది కేంద్ర కమిటీ సభ్యులతో ప్రారంభమైన మావోయిస్టు పార్టీ ఇప్పుడు నలుగురికి చేరింది.ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ఒక్క రాష్ట్ర కమిటీ సభ్యుడు మాత్రమే మిగిలారు. సీఎం రేవంత్ రెడ్డి పిలుపుతో వీరంతా లొంగిపోయారు. మావోయిస్టు పార్టీకి ఆయుధాలు సమకూర్చడంతో బర్సె దేవా కీలకంగా పనిచేశారు. మావోయిస్టు పార్టీలో అంతర్గత కలహాలు ఎక్కువయ్యాయి. వీరంతా అంతర్గత కలహాలకు తోడు ఆరోగ్య సమస్యలతో లొంగిపోయారు అని చెప్పుకొచ్చారు. ఈ లొంగుబాటుతో పీజీఎల్ఏ బెటాలియన్ మొత్తం కొలాప్స్ అయ్యింది. లొంగిపోయిన మావోయిస్టులకు నిబంధనల ప్రకారం రివార్డులు అందిస్తాం. తక్షణ సాయంగా రూ.25వేల చెక్కలను అందిస్తాం. ఉన్న 66 మందిలో లొంగిపోయిన వారు కాకుండా మిగిలిన వారంతా మరణించారు’ అని తెలిపారు. కాగా, బర్సె దేవా మావోయిస్టు పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్గా బాధ్యతలు నిర్వర్తించారు. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీలో దేవా కీలకంగా ఉన్నారు. మావోయిస్టు పార్టీ సాయుధ బలగాల వ్యవహారాలను చూస్తున్నారు. బర్సె దేవా లోంగిపోవడంతో ఇక కేంద్ర కమిటీలో కేవలం నాలుగు మాత్రమే మిగిలి ఉన్నారు. ఇక, హిడ్మా, బర్సె దేవా ఛత్తీస్గఢ్లో ఒకే గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మావోయిస్టులకు ఆయుధాల సరఫరాలో దేవా కీలక పాత్ర పోషించారు. నిన్న తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దు నుంచి బర్సె దేవా బృందాన్ని పోలీసులు తీసుకొచ్చారు. -
తెలంగాణ అసెంబ్లీ వద్ద టెన్షన్.. రైతుల ఆందోళన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రైతులు.. అసెంబ్లీని ముట్టడించారు. సోయాబీన్ పంటను కొనుగోలు చేయాలంటూ నినాదాలు చేస్తూ అసెంబ్లీలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో, రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వద్ద ఉద్రికత్త చోటుచేసుకుంది.ఈ సందర్భంగా ఆదిలాబాద్ రైతులు మాట్లాడుతూ..‘అధిక వర్షపాతం కారణంగా సోయాబీన్ పంట నష్టం జరిగింది. రంగు మారిందని సోయాబీన్ పంట కొనుగోలు చేయడం లేదు. పార్టీలకు అతీతంగా రైతు నాయకులు, రైతులు అందరం.. మంత్రిని కలవడానికి వచ్చాం. కేవలం ఐదుగురు రైతులను మాత్రమే అనుమతి ఇస్తామని పోలీసులు చెబుతున్నారు. వచ్చిన రైతులందరినీ పంపిస్తేనే లోపలికి వెళ్తాం అని చెప్పుకొచ్చారు. అయితే, పోలీసులు రైతులను లోపలికి అనుమతించకపోవడంతో వారంతా అక్కడి నుంచి వెనుదిరిగారు.కాగా, రైతుల వద్ద నిలువ ఉన్న సోయాబీన్ పంటను రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి. రైతుల వద్ద నుంచి 2,80,000 క్వింటాళ్లకు పైగా సోయాబీన్ను ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి ఉంది. జిల్లాలో ఈ ఏడాది.. 24,000 మంది రైతులు 72 ఎకరాలలో సోయాబీన్ సాగు చేశారు. 4,32,000 క్వింటాల దిగుబడి వస్తుందని అంచనా కానీ అంతకంటే ఎక్కువే వచ్చింది. ఇప్పటి వరకు 6280 మంది రైతుల వద్ద 1,64,000 క్వింటళ్ల పంటను మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసింది. దీంతో, రైతులు ఆందోళనకు దిగారు. -
తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి ఆటో డ్రైవర్ల ప్రయత్నం
-
కిమ్స్లో జాతీయస్థాయి రుమటాలజీ సదస్సు
హైదరాబాద్, సాక్షి : ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, లూపస్, ఆటో ఇమ్యూన్ వ్యాధులు తదితర రుమటాలజీ సమస్యలకు ప్రపంచవ్యాప్తంగా అనేక కొత్త రకాల చికిత్సా పద్ధతులు వస్తున్నాయని, వీటి గురించి రుమటాలజిస్టులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ రోగులకు సాంత్వన కలిగించేందుకు ప్రయత్నించడం ముదావహమని కిమ్స్ ఆస్పత్రుల ఛైర్మన్, ఎండీ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు అన్నారు. ఆస్పత్రి ప్రాంగణంలో రెండు రోజుల పాటు జరిగే క్లినికల్ రుమటాలజీ కాన్ఫరెన్స్ 2026 (సీఆర్సీ 2026) సదస్సును ఆయన ప్రారంభించారు.దేశం నలుమూలల నుంచి 400 మందికి పైగా రుమటాలజిస్టులు ఈ సదస్సుకు హాజరయ్యారు. రెండేళ్లకు ఒకసారి మాత్రమే నిర్వహించే ఈ సదస్సులోఅనుభవజ్ఞులైన రుమటాలజిస్టులు అత్యంత సంక్లిష్టమైన కేసులకు ఎలా చికిత్స చేశారన్న విషయాన్ని కేసుల వారీగా చర్చించిన తరువాత, తద్వారా సదస్సులో పాల్గొన్న అందరికీ ఈ తరహా కేసులకు ఎలా చికిత్స చేయాలన్న విషయాలను వివరించారు.సదస్సు ప్రారంభోత్సవంలో కిమ్స్ ఆస్పత్రి సీఎండీ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు, కిమ్స్ హాస్పిటల్స్ సికింద్రాబాద్ మెడికల్ డైరెక్టర్ డా. సంబిత్ సాహు, డా. బి. శ్రీనివాస్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డా. వినోద్ రవీంద్రన్ ప్రెసిడెంట్ ఎలెక్ట్, ఇండియన్ రుమాటాలజీ అసోసియేషన్, సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రి రుమటాలజీ విభాగం క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ శరత్ చంద్రమౌళి, హైదరాబాద్ రుమటాలజీ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ రాజ్కిరణ్ తదితరులు పాల్గొన్నారు. సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ వీరవల్లి శరత్ చంద్రమౌళి, సీఆర్సీ 2026 సైంటిఫిక్ ఛైర్ డాక్టర్ వినోద్ రవీంద్రన్, నేతృత్వంలో జరిగిన ఈ సదస్సులో రుమటాయిడ్ ఆర్థరైటిస్, లూపస్, యాంకైలోజింగ్ స్పాండిలైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, గౌట్, వాస్కులైటిస్, బాల్య ఆర్థరైటిస్, అరుదైన రుమాటిక్ కండిషన్ల వంటి అంశాలపై చర్చించారు. ఈ సదస్సులో ట్రైనీల కోసం రుమటాలజీ క్విజ్ కూడా నిర్వహించారు. సీఆర్సీ 2026 ప్రత్యేకతలలో ఒకటి కొత్తగా చేర్చిన ఇమేజ్ పోటీ. సదస్సులో పాల్గొన్న పలువురు ఈ అంశంలో చాలా చురుగ్గా పాల్గొన్నారు. సదస్సుకు తమ సృజనాత్మక కోణాన్ని జోడించారు. అదనంగా, భారతదేశం నలుమూలల నుండి 269 కేసు సారాంశాలను సమర్పించారు. ప్రతి కేటగిరీలో ఎంపిక చేసిన ముఖ్యమైన కేసులను కాన్ఫరెన్స్ సెషన్లలో చర్చించారు.ఈ సందర్భంగా డాక్టర్ వీరవల్లి శరత్ చంద్రమౌళి మాట్లాడుతూ, “సీఆర్సీ 2026 విజయవంతం కావడం, దేశవ్యాప్తంగా ఉన్న రుమటాలజిస్టులు ఉత్సాహభరితంగా భాగస్వామ్యం వహించడం ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ సదస్సులో హాజరైన అనుభవజ్ఞులైన రుమటాలజిస్టులు అందరూ తమ తమ విజ్ఞానాన్ని పదిమందితో పంచుకోవడం, అత్యంత సమస్యాత్మకమైన కేసుల గురించి చర్చించడానికి ఈ సదస్సు ఒక విలువైన అవకాశాన్ని కల్పించింది. ఇందులో ప్రధానంగా రుమాటిక్, కండరాలు, లూపస్ వ్యాధులపై అవగాహన పొందగలిగాము” అన్నారు.భారతదేశంలో రుమటాలజీ రంగాన్ని అభివృద్ధి చేయడానికి క్లినికల్ రుమటాలజీ కాన్ఫరెన్స్ 2026 ఒక ప్రముఖ వేదికగా తన ప్రాముఖ్యతను మరోసారి నిరూపించింది. రుమటాలజీలో విజ్ఞాన భాగస్వామ్యం, వృత్తిపరమైన అభివృద్ధి సంప్రదాయాన్ని కొనసాగించడానికి సిద్ధంగా ఉన్న సీఆర్సీ తదుపరి ఎడిషన్ కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. -
హాస్టల్ వార్డెన్ అరాచకం.. విషం పెట్టి విద్యార్థులను చంపేయండి అంటూ..
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో హాస్టల్ వార్డెన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులకు అన్నంలో విషం కలిపి చంపండి అంటూ వంట మనుషులతో మాట్లాడటం సంచలనంగా మారింది. దీంతో, సదరు హాస్టల్ వార్డెన్పై పేరెంట్స్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హాస్టల్ వార్డెన్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.వివరాల మేరకు.. సంగారెడ్డి జిల్లాలోని సిర్గాపూర్ ఎస్సీ హాస్టల్లో తమ సమస్యలపై విద్యార్థులు ధర్నా చేశారు. దీంతో, హాస్టల్ వార్డెన్ కిషన్ ఆగ్రహంతో రెచ్చిపోయారు. బూతులతో రెచ్చిపోయారు. ఈ క్రమంలోనే విద్యార్థుల పట్ల అనుచితంగా మాట్లాడుతూ.. విద్యార్థులు తినే అన్నంలో విషయం కలిపి చంపండి అని వంట మనుషులకు చెప్పాడు. అంతటితో ఆగకుండగా హాస్టల్ భవనంపై నుంచి విద్యార్థులను తోసేసి చంపేస్తా అంటూ హెచ్చరించారు. దీంతో, వార్డెన్ కిషన్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ విషయాన్ని హాస్టల్ విద్యార్థులు తమ పేరెంట్స్కు చెప్పడం ఈ విషయంలో చర్చనీయాంశంగా మారింది. హాస్టల్ వార్డెన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పేరెంట్స్.. కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో, కలెక్టర్ వార్డెన్ కిషన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
రాజాసాబ్, చిరంజీవి.. తెలంగాణలో జీవో తెచ్చేదెవరు?
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వారంలో సంక్రాంతి సందడి ప్రారంభం కానుంది. రేసులో చాలా సినిమాలు ఉన్నాయి. చిన్న సినిమాలతో పాటు భారీ బడ్జెట్ చిత్రాలు కూడా బరిలో ఉన్నాయి. ఇప్పటికే రాజా సాబ్ ట్రైలర్ రావడంతో ఆ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. జనవరి 4న మన శంకర వరప్రసాద్ గారు ట్రైలర్తో వస్తున్నారు. చిరంజీవి సినిమా కావడంతో ఎటూ బజ్ ఉంటుంది. అయితే, ఇప్పుడు ఈ రెండు సినిమాల టికెట్ ధరల గురించి ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది.ఆంధ్రప్రదేశ్లో ఎటూ ఈ రెండు చిత్రాలకు టికెట్ ధరలు పెంచుకునేందుకు ఛాన్స్ ఇవ్వడమే కాకుండా ప్రీమియర్ షోలకు కూడా అనుమతి ఇచ్చేందుకు ఛాన్స్ ఉంది. మరీ తెలంగాణలో పరిస్థితేంటి..? అనేది హాట్ టాపిక్గా మారింది. చిరంజీవి, ప్రభాస్ సినిమాలకు సంబంధించిన చిత్ర యూనిట్లలో ముందుగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఎవరు కదుపుతారు అనే చర్చ పెద్ద ఎత్తున సాగుతుంది. రీసెంట్గా అఖండ-2 మూవీకి టికెట్ ధరలు పెంచితే తనకు తెలియకుండానే అధికారులు జీవో ఇచ్చారని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్లో ఎవరూ టికెట్ రేట్ల పెంపు కోసం తమ ప్రభుత్వం వద్దకు రావద్దని మీడియా ద్వారా సినిమా వాళ్లకు తెలిపారు. అలాంటిది ఇప్పుడు టికెట్ రేట్ల కోసం ప్రభుత్వంతో చర్చలు ఎవరు జరుపుతారు అనేది తేలాల్సి ఉంది. రాజా సాబ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్, చిరంజీవిలలో ఎవరైనా రంగంలోకి దిగుతారా..? మంత్రి తన మనసు మార్చకుని వెసులుబాటు ఇస్తారా..? అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ తెలంగాణలో టికెట్ ధరలు పెంపు అనేది లేకుండా ఈ రెండు సినిమాలను విడుదల చేస్తే.. బ్రేక్ ఈవెన్ దాటడం చాలా కష్టమని చెప్పవచ్చు. అయితే, మిగతా సినిమాలకు ఈ సమస్య లేదని చెప్పాలి. అనగనగా ఒక రాజు, భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాల నిర్మాతలు ఇప్పటికే ఈ విషయంపై ఒక ప్రకటన చేశారు. తమ సినిమాలకు టికెట్ రేట్లు పెంచడం లేదని తెలిపారు. -
వివాదాస్పదంగా గుట్ట ఈవోల పనితీరు
సాక్షి, యాదాద్రి: యాదగిరిగుట్ట దేవస్థానంలో ఈవోల పనితీరు వివాదాస్పదంగా మారుతోంది. పాలకమండలి నియామకం లేకపోవడంతో కొందరు ఈవోలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 2023 నుంచి గుట్టలో పనిచేసిన ముగ్గురు ఈవోల బదిలీలు వివాదాస్పదంగా మారాయి. ఇందులో ఇద్దరు ఈవోలు రాజీనామా చేశారు. 2014 నుంచి ఈవోగా పనిచేసిన గీతారెడ్డి 2023లో రాజీనామా చేశారు. ఆ తర్వాత దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎం. రామకృష్ణారావును ఇన్చార్జ్ ఈవోగా నియమించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గుట్ట ఆలయం ఆశీర్వచనం విషయంలో తలెత్తిన వివాదంతో రామకృష్ణారావును తొలగించారు. ఆ తర్వాత ఈవోగా వచ్చిన భాస్కర్రావు 2024 మార్చిలో బదిలీ అయ్యారు. 2025 ఏప్రిల్లో ఐఏఎస్ అధికారి వెంకట్రావు ఈవోగా నియమితులయ్యారు. ఆయన పదవీ విరమణ అనంతరం కూడా ప్రభుత్వం ఈవోగా కొనసాగించింది. రెండు రోజుల క్రితం వెంకట్రావు అనారోగ్య కారణాలతో పదవికి రాజీనామా చేశారు. వెంకట్రావు ఈవోగా చేరినప్పటి నుంచి దేవస్థానంలో పలు వివాదాలు చోటుచేసుకున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు పొడిగించడం, సస్పెండ్ అయిన ఉద్యోగికి బెనిఫిట్స్ ఇవ్వడం, సదరు ఉద్యోగి ఏసీబీకి పట్టుబడడం, దేవాలయ ప్రసాద విక్రయశాల గోదాంలో చోరీకి బాధ్యులపై సరైన చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రొటోకాల్ నిబంధనలను ఉల్లం ఘించాడన్న ఆరోపణలు చుట్టుముట్టాయి. సమస్యలను గాలికొదిలి, వ్యక్తిగత ప్రచారానికి ప్రాముఖ్యతను ఇచ్చాడని ఫిర్యాదులు అందాయి. ఇటీవల అన్నప్రసాద శాలను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను కాదని ప్రారంభోత్సవం చేయించడం వివాదాస్పదమైంది. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీల విషయంలో ఈవో ఉదాసీనతే ఆయన పదవికి ఎసరు తెచ్చినట్లు ప్రచారం సాగుతోంది.అటకెక్కిన పాలకమండలితిరుపతి తరహాలో యాదగిరిగుట్ట పాలకమండలిని నియమిస్తామని ప్రభుత్వం చట్టం చేసింది. 2025 మార్చిలోనే వైటీడీ బిల్లు పాసైంది. వైటీడీ ఏర్పాటుకు ప్రభుత్వం విధి విధానాలను రూపొందించింది. కానీ ఇంతవరకు పాలవర్గాన్ని ఏర్పాటు చేయలేదు. దీంతో పాలన వ్యవహారాల్లో అ«ధికారులు ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. -
తెలంగాణ అసెంబ్లీ నుంచి బీజేపీ వాకౌట్
👉తెలంగాణ అసెంబ్లీ సోమవారానికి వాయిదాఎల్లుండి ఉదయం 10 గంటలకు తిరిగి ప్రారంభం కానున్న అసెంబ్లీఅసెంబ్లీలో కీలక తీర్మానాలు చేసిన ప్రభుత్వంపాలమూరుకు కేంద్రం అనుమతి ఇవ్వాలని తీర్మానం👉తెలంగాణ శాసన సభ నుంచి బీజేపీ వాకౌట్కృష్ణా జలాలపై తమకు మాట్లాడే అవకాశం ఇవ్వనందుకు వాకౌట్ చేసిన బీజేపీపాలమూరుపై ఉత్తమ్ సభలో వాస్తవాలు చెప్పారు: సీఎం రేవంత్ఇరిగేషన్ విషయంలో సభ్యులంతా తమ ఆలోచనలు, అభిప్రాయాలను చెప్పారుకేసీఆర్ 45 ఏళ్లు ప్రజాజీవితంలో ఉన్నారు..ఆయన ప్రభుత్వానికి సూచనలు ఇస్తారని అనుకున్నాంమంత్రి ఉత్తమ్ చాలా విషయాల వాస్తవాలను సభకు వివరించారుకృష్ణా జలాలపై ఒక రోజు.. గోదావరి జలాలపై మరో రోజు చర్చిందామని అనుకున్నాంశాసనసభ:ప్రభుత్వ తీరుపై చేసిన అక్బరుద్దీన్ ఓవైసీ అసంతృప్తిఅర్ధరాత్రి వరకు ఎజెండా స్టేటమెంట్ సభ్యులకు అందడం లేదుఎన్నిసార్లు కంప్లైంట్ చేసిన మీరు స్పందించడం లేదుప్రభుత్వం ఎప్పుడు మాట్లాడిన కృష్ణ గోదావరి తప్పితే ఇతర అంశాలు మాట్లాడడం లేదుసభ నిబంధనలు సరిగ్గా పాటించకపోతే సభ్యులు ఇబ్బంది పడతారుసభ్యులకు ఎజెండా స్టేట్మెంట్ కరెక్టు టైంకు ఇవ్వకపోతే ఎలా ప్రిపేర్ అవుతారు?స్పీకర్ సభ్యుల హక్కులను కాపాడాలిసభ్యులకు ఎజెండా, స్టేట్మెంట్ సరైన సమయంలో ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా.ఉత్తమ్ కుమార్ రెడ్డి@అసెంబ్లీకృష్ణా బేసిన్పై ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందిపాలమూరులో బీఆర్ఎస్ తట్టేడు మట్టి ఎత్తి పోయలేదువచ్చే మూడేళల్లో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాంపాలమూరు ప్రాజెక్ట్ తరవాత కాళేశ్వరం మొదలైనా ఇప్పటికీ పాలమూరు పూర్తి కాలేదుకాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం 90 వేల కోట్లు ఖర్చు చేశారుపాలమూరుకు కేవలం 27 వేల కోట్లు మాత్రమేకాళేశ్వరానికి అన్ని అనుమతులు వచ్చాయిపాలమూరుకు ఇప్పటికీ అనుమతులు పూర్తిగా రాలేదుపాలమూరు ప్రాజెక్ట్ను కావాలనే బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసింది👉కృష్ణా జలాలపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్బీఆర్ఎస్ సభ్యులు సభకు ఎందుకు రావడం లేదు: ఉత్తమ్కేసీఆర్.. కృష్ణా, గోదావరి జలాలపై ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశారుబీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది: ఉత్తమ్బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాన్ని మేం ఖండిస్తున్నాం👉బ్రేక్ తర్వాత ప్రారంభమైన శాసనసభకృష్ణ నది నీటి కేటాయింపులపై మొదలైన చర్చ..👉తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో విచిత్రమైన పరిస్థితి కనిపించింది. సభలో ప్రతిపక్షం లేకున్నా ప్రభుత్వం తీరుపై విమర్శలు వినిపించాయి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఈ పని చేశారు. ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల విషయంలో ఎన్ని విజ్ఞప్తులు చేస్తున్నా.. కనీస స్పందన ఉండడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ శాసన సభలో ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విమర్శలకు దిగారు. తమ నియోజకవర్గంలో బిల్లులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని, టెక్నీకల్ సమస్యలతో ఇబ్బందులు పెట్టొద్దని సభలో కొందరు ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఇస్తున్న ఇండ్లతో పాటు అదనపు ఇండ్లు మంజూరు చేయాలని మరికొందరు ఎమ్మెల్యేలు కోరారు. అయితే.. దీనికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరణ ఇచ్చారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో మోసం చేసిందని చెప్పుకొచ్చారు. ‘‘గతంలో 200 కోట్లు డబుల్ బెడ్ ఇండ్లకు బిల్లులు బకాయిలు పెట్టారు. గత ప్రభుత్వంలో కేవలం పింక్ కలర్ వాళ్ళకే డబుల్ బెడ్ రూమ్ ఇచ్చారు. గత ప్రభుత్వ పెద్దలు దత్తత తీసుకున్న వాసల మర్రిలో హామీ నెరవేర్చలేదు.రాష్ట్రవ్యాప్తంగా అసంతృప్తిగా ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇండ్లను పూర్తి చేస్తాం. అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్న అంశంపై ప్రభుత్వం ద్రుష్టి సారించింది. ఇండ్ల స్థలం లేని పేదలకు స్థలంతో పాటు ఇళ్లను ఇస్తాం. ఇందిరమ్మ ఇండ్లు రాష్ట్రవ్యాప్తంగా 52,000 ఇండ్లు ఇప్పటికే గృహప్రవేశాలు అయ్యాయి. అర్బన్ ప్రాంతాలలో ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వబోతున్నాం. గ్రేటర్ సిటీని మూడు కార్పొరేషన్లుగా పెద్దగా చేసుకోబోతున్నాం’’ అని అన్నారాయన. అసెంబ్లీలో ఇవాళ కృష్ణా జలాల అంశంపై స్వల్ప కాలిక చర్చ జరగనున్న సంగతి తెలిసిందే. మధ్యాహ్న సమయంలో మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. ఈ మేరకు సభలోని స్పెషల్ హాల్లో ఏర్పాట్లు చేశారు. -
తెలంగాణ భవన్ వద్ద టెన్షన్ వాతావరణం
సాక్షి, హైదరాబాద్: కృష్ఝా జలాలపై తెలంగాణలో పొలిటికల్ హీట్ నడుస్తోంది. ఈ అంశంపై అసెంబ్లీలో ఇవాళ ప్రభుత్వం స్వల్పకాలిక చర్చ జరుపుతుండగా.. దానికి కౌంటర్గా మరో పవర్ పాయింట్ ప్రజంటేషన్కు బీఆర్ఎస్ సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. కాంగ్రెస్ శ్రేణులు నిరసనలకు సిద్ధం కావడంతో బీఆర్ఎస్ అధికార కార్యాలయం తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శనివారం తెలంగాణ భవన్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు సిద్ధమయ్యాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపిస్తున్నారు. అయితే అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తెలంగాణ భవన్ వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరికాసేపట్లో కేటీఆర్, హరీష్రావు ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కీలక సమావేశం జరుగనుంది. హరీష్రావు పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేస్తారని ప్రచారం నడుస్తోంది. కృష్ఝా జలాల పంపిణీ అంశంపై ప్రభుత్వం స్వల్పకాలిక చర్చ(షార్ట్ డిస్కషన్) ఇవాళ నిర్వహిస్తోంది. మధ్యాహ్నాం 12 గంటల సమయంలో సభలో మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. ఈ మేరకు స్పెషల్ స్క్రీన్ను ఇప్పటికే ఏర్పాటు చేశారు.సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని.. తమకూ పవర్పాయింట్ ప్రజంటేషన్కు అవకాశం ఇవ్వాలని, అలాగే యూరియా సహా ఇతర అంశాలపై చర్చించాలన్న డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించకపోవడంతో బీఆర్ఎస్ ఈ సెషన్ను బహిష్కరించింది. అయితే బీఆర్ఎస్లోనే అన్యాయం జరిగిందని.. తప్పులు బయటపడతాయనే సమావేశాలను బహిష్కరించిందని.. దమ్ముంటే సభకు రావాలని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. మంత్రి ఉత్తమ్ పవర్పాయింట్ ప్రజంటేషన్పై హరీష్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంభిస్తోంది. సంప్రదాయాలను కాంగ్రెస్ నేతలు తుంగలో తొక్కారు. మార్పు పేరుతో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు’’ అని అన్నారు. -
మమ్మీ... నొప్పి
అశ్వాపురం/వేంసూరు/పెనుబల్లి: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శుక్రవారం రెండు విద్యా సంస్థల బస్సులు బోల్తా పడ్డాయి. అయితే, ఈ ఘటనల్లో పలువురు విద్యార్థులకు తీవ్రగాయాలైనా ప్రాణనష్టం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కేఎల్ఆర్ కళాశాలకు శుక్రవారం ఉదయం వివిధ ప్రాంతాల విద్యార్థులను తీసుకెళ్తున్న బస్సు అశ్వాపురం మండలం మొండికుంట శివారులో వంతెన సమీపాన బోల్తా పడింది. బస్సు స్టీరింగ్ పని చేయకపోవడంతో అదుపు తప్పి వాగు వంతెన పక్కకు బోల్తా కొట్టినట్లు తెలుస్తోంది. ఘటనా సమయంలో 50 మంది విద్యార్థులు ఉండగా, సీఐ అశోక్రెడ్డి, ఎస్సై రాజేష్ సిబ్బందితో చేరుకుని స్థానికుల సాయంతో 108 వాహనాల్లో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో విద్యార్థులందరికీ గాయాలు కాగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, బస్సు బోల్తా పడిన సమయాన మణుగూరుకు చెందిన విద్యార్థి అంబికా చేయి బస్సులో ఇరుక్కొని విలవిల్లాడింది. అర గంట పాటు ఆమె నొప్పితో రోదిస్తుండగా జేసీబీల సాయంతో బస్సును పైకి లేపి ఆమెను బయటకు తీయాల్సి వచి్చంది. అయితే, ఈ బస్సు వంతెనకు కాస్త ముందు వాగులో బోల్తా పడితే ప్రాణాపాయం జరిగేదని స్థానికులు తెలిపారు. అయితే, ఫిట్నెస్ లేకపోవడంతో స్టీరింగ్ బ్రేక్ అయి ప్రమాదం జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. ఒకే బస్సులో వంద మంది..: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గణేషన్పాడు శివారు వీరబ్రహ్మాంద్ర స్వామి ఆలయం సమీపాన సాగర్ కాల్వలో వేంసూరు మండలం మొద్దులగూడెంకు చెందిన వివేకానంద పాఠశాలకు చెందిన బస్సు బోల్తా పడింది. శుక్రవారం సాయంత్రం పాఠశాల ముగిశాక విద్యార్థులను ఇళ్లకు తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో 107 మంది వరకు విద్యార్థులు ఉండగా 20 మందికి గాయాలయ్యాయి. పరిమితికి మించి విద్యార్థులను తీసుకెళ్లడమే కాక బస్ డ్రైవర్ ఆళ్ల నవీన్ మద్యం మత్తులో ఉండడమే ఘటనకు కారణమని తెలుస్తోంది. బస్సు కాల్వలో పడగానే వచ్చిన శబ్దం, విద్యార్థుల కేకలు విని స్థానికులు చేరుకుని వారిని బయటకు తీశారు. అనంతరం క్షతగాత్రులను తిరుపూరు, పెనుబల్లి ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదాలపై మంత్రులు ఆరా: ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో జరిగిన విద్యాసంస్థల బస్సు ప్రమాదాలపై మంత్రులు పొన్నం ప్రభాకర్,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు. కలెక్టర్లు, రవాణా శాఖ అధికారులతో మాట్లాడిన వారు ప్రమాదాలకు కారణాలపై విచారణ చేపట్టాలన్నారు. -
హైదరాబాద్ : మహా నగరంపై మంచు తెర..(ఫొటోలు)
-
ఐఐటీహెచ్ విద్యార్థికి రూ.2.5 కోట్ల వార్షిక వేతనం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: హైదరాబాద్ ఐఐటీకి చెందిన ఎడ్వర్డ్ నాథన్ వర్గీస్ అనే విద్యార్థి రూ.2.5 కోట్ల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం సాధించాడు. సీఎస్ఈ ఫైనలియర్ చదువుతున్న వర్గీస్కు నెదర్లాండ్లోని అప్టివర్ అనే ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఈ ఉద్యోగం లభించింది. ఐఐటీహెచ్ చరిత్రలోనే అత్యధిక వేతనంతో ఉద్యోగం పొందిన విద్యారి్థగా వర్గీస్ నిలిచాడు. గత డిసెంబర్లో క్యాంపస్ ప్లేస్మెంట్ ప్రక్రియ నిర్వహించారు. వివిధ దేశాలకు చెందిన 24 కంపెనీలు ఈ క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉద్యోగాలిచ్చాయి. గతేడాదితో పోలి్చతే 2025లో ప్లేస్మెంట్ ఉద్యోగాలు 75 శాతం పెరిగాయి. -
హైదరాబాద్లో మరో స్టీల్ బ్రిడ్జి
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్పేట్ ఔటర్ రింగ్రోడ్డు వరకు ఎలివేటెడ్ స్టీల్బ్రిడ్జి కారిడార్ నిర్మాణానికి హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) చర్యలు చేపట్టింది. వీఎస్టీ నుంచి అశోక్నగర్ వరకు నిర్మించిన బ్రిడ్జి తరహాలోనే ప్యారడైజ్– శామీర్పేట్ మధ్య 18.18 కి.మీ మేర బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు. దాదాపు రూ.4,263 కోట్ల అంచనాలతో రూపొందించిన ఈ ప్రాజెక్టును ప్రముఖ నిర్మాణ సంస్థ బేకమ్ దక్కించుకుంది. రానున్న రెండేళ్లలో దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. వెస్ట్ మారేడ్పల్లి, కార్ఖానా, తిరుమలగిరి, బొల్లారం, అల్వాల్, హకీంపేట్, తూంకుంట మీదుగా శామీర్పేట్ ఓఆర్ఆర్ జంక్షన్ (Shamirpet ORR Junction) వరకు నిర్మించే ఈ స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్ నుంచి నేరుగా ఔటర్ మీదుగా రాజీవ్ రహదారికి రాకపోకలు సాగించవచ్చు. నగరానికి ఉత్తరం వైపున మేడ్చల్ రూట్లో ప్యారడైజ్ నుంచి డెయిరీఫామ్ వరకు చేపట్టిన మరో ఎలివేటెడ్ కారిడార్తో రెండు మార్గాల్లోనూ ప్రయాణ సదుపాయాలు మెరుగుపడతాయి. స్టీల్ బ్రిడ్జి ఎలివేటెడ్ కారిడార్ ఇలా.. ⇒ ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్పేట్ ఓఆర్ఆర్ జంక్షన్ వరకు 18.18 కి.మీ. నిర్మాణంలో 11.52 కి.మీ. ఎలివేటెడ్ కారిడార్ ఉంటుంది. హకీంపేట్ ఎయిర్ఫోర్స్ అకాడమీ వద్ద 6 లేన్లతో టన్మెల్ నిర్మించనున్నారు. తిరుమలగిరి, అల్వాల్ (Alwal) వద్ద రెండు చోట్ల వాహనదారులు బ్రిడ్జిపైకి ప్రవేశించేందుకు, నిష్క్రమించేందుకు ఎంట్రన్స్, ఎగ్జిట్లు ఉంటాయి. ⇒ ఈ ప్రాజెక్టు కోసం 9.35 కి.మీల మార్గంలో 114.50 ఎకరాల రక్షణశాఖ భూములను, 8.35 కి.మీ.మార్గంలో 78.39 ఎకరాల ప్రైవేట్ భూ ములను సేకరించారు. 967 నిర్మాణాలను తొలగించి రోడ్డు విస్తరణ చేపట్టాల్సి ఉంటుంది. వేగిరంగా డెయిరీఫామ్ కారిడార్.. ప్యారడైజ్ జంక్షన్ నుంచి మేడ్చల్ రూట్లో డెయిరీఫామ్ వరకు 5.40 కి.మీ వరకు చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ (elevated corridor) నిర్మాణ పనులు వేగిరంగా కొనసాగుతున్నాయి. ఈ కారిడార్ పనులు 36 నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. ఇది అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ మీదుగా మెదక్, నిజామాబాద్ మార్గంలో రాకపోకలు సులభతరమవుతాయి. -
అమ్మ..ఇక రాదు కన్నా..!
హైదరాబాద్: ‘‘పిల్లలూ..ఇక్కడ కూర్చొని ఈ ఫోన్తో ఆడుకోండి.. నేను కాసేపటి తరువాత వస్తా’’ అంటూ వెళ్లిన తల్లి అనంతలోకాలకు వెళ్లిపోయింది. అమ్మ.. ఇక రాదని తెలియని ఆ చిన్నారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. నాలుగేళ్ల క్రితం తండ్రి మృతి చెందగా.. ఇపుడు అమ్మ కూడా పిల్లలను కూడా వదలి వెళ్లింది. హృదయ విదారకమైన ఈ సంఘటన శుక్రవారం జరిగింది. లేక్పోలీసులు తెలిపిన మేరకు.. పహాడీషరీఫ్కు చెందిన వసంత (29) భర్త లక్ష్మణ్ నాలుగేళ్ల క్రితం మృతి చెందాడు. వీరికి కుమారుడు నందు, కుమార్తె చెర్రి ఉన్నారు. భర్త మృతి అనంతరం సోదరుడు, తల్లితో ఉంటూ కూలీపనిచేస్తూ జీవనం సాగిస్తోంది. ఇటీవల కాలంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. శుక్రవారం సాయంత్రం పిల్లలను తీసుకుని ట్యాంక్బండ్కు వచ్చింది. వారిని లవ్ హైదరాబాద్ దగ్గర బెంచీపై కూర్చోబెట్టి మొబైల్ ఫోన్ ఇచ్చి ఆడుకోమని చెప్పి వెళ్లింది. అయితే కాసేపటికే ఆమె హుస్సేన్ సాగర్లో దూకింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన చేరుకోగా అప్పటికే ఆమె నీటిలో మునిగిపోయింది. అదే ప్రాంతంలో గాలించగా మృతదేహం లభించింది. పిల్లల దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ ద్వారా మృతురాలు వసంతగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. -
నేటి నుంచి టెట్
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 20 వరకు మొత్తం 9 రోజులు ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. టెట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు పాఠశాల విద్య డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు.పేపర్–1, పేపర్–2 కలిపి మొత్తం 2,37,754 మంది దరఖాస్తు చేశారు. వీరిలో 71,670 మంది ఇన్ సర్విస్ టీచర్లు ఉన్నారు. టెట్ తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఇన్ సర్వీస్ టీచర్లు కూడా టెట్కు దరఖాస్తు చేశారు. టెట్ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 97 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
పేదలు, మహిళా కూలీల హక్కులకు విఘాతం
సాక్షి, హైదరాబాద్: వీబీజీ రామ్జీ (వికసిత్ భారత్–గ్యారంటీ– రోజ్గార్ ఆజీవిక మిషన్ (గ్రామీణ్)) చట్టాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా అమలు చేయాలని నిర్ణయించిన ఈ చట్టం.. పేదలు, మహిళా కూలీల హక్కులను దెబ్బతీస్తుందని పేర్కొంది. పేదలు, కూలీలకు ఉపాధి హామీని కల్పిస్తూ 2005లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ (ఎంజీ ఎన్ఆర్ఈజీఏ) పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని కోరుతూ తీర్మానించింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం శాసనసభలో ఈ తీర్మానం ప్రవేశపెట్టారు.అంతకుముందు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఈ అంశంపై చర్చను ప్రారంభించగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు విజయ రమణారావు, వెడ్మ బొజ్జు, బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి, సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం నుంచి జుల్ఫికర్ అలీ మాట్లాడారు. మహేశ్వర్రెడ్డి కేంద్రం తెచ్చిన చట్టాన్ని సమరి్థంచగా, మిగతా సభ్యులు వ్యతిరేకించారు. అనంతరం సభలో సీఎం తీర్మానం ప్రవేశపెట్టి మాట్లాడారు. వలసలకు ఊతం.. ‘ఉపాధి హామీ పథకం పేరు నుంచి మహాత్మాగాంధీ పేరును తొలగించడాన్ని, పేదలు, మహిళలు పని హక్కును కోల్పేయేలా తెచ్చిన చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాం. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా పేదల కోసం.. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టాం. ఏ గ్రామంలోని వారు అక్కడే ఏడాదికి 100 రోజులు పనిచేసుకునేలా తీసుకొచ్చిన ఉపాధి చట్టాన్ని మార్చి కార్మికులు మళ్లీ వలస పోయేలా కేంద్రం చట్టం తెచ్చింది.కూలీ పనుల కోసం దేశమంతా వలసలు పోయే పాలమూరు జిల్లా వాసులతో పాటు అనంతపురం, మెదక్ జిల్లాలను పరిగణనలోకి తీసుకొని గతంలో ఈ పథకాన్ని తీసుచ్చినట్లు గుర్తు చేశారు. సొంత ఊరులోనే పని కల్పించేందుకు తెచ్చిన ఈ చట్టాన్ని మార్చి మళ్లీ వలసలకు పోయే పరిస్థితి కల్పించారని విమర్శించారు. పేద, అణగారిన, ఆదివాసీలు, కూలీల కోసం తెచ్చిన ఈ చట్టం స్ఫూర్తి కొనసాగింపునకు, కేంద్రం తెచ్చిన కొత్త చట్టాన్ని తిరస్కరించేందుకు సభలో ఆమోదం తెలపాలని కోరగా.సభ ఈ తీర్మానాన్ని ఆమోదించింది ముఖ్యమంత్రి ఏమన్నారంటే.. ‘గ్రామీణ ప్రాంత పేదలకు ఉపాధి కల్పించి, పేద కుటుంబాలకు ఆర్థిక భరోసాను అందించేందుకు డా. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2005లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులోకి తీసుకు వచ్చింది. పేదరికం, నిరుద్యోగం, వలసలు, నైపుణ్యం లేని శ్రామిక వర్గాల దోపిడీ, స్త్రీ పురుషుల మధ్య వేతన అసమానతలను తగ్గిస్తూ అన్ని వర్గాల అభివృద్ధికి తెచ్చిన ఈ చట్టం 2006 ఫిబ్రవరి 2 నుంచి అమలులోకి వచ్చింది. ప్రతి గ్రామీణ కుటుంబానికి సంవత్సరానికి కనీసం 100 రోజులు ఉపాధి కCచి, కనీస వేతనం అందేలా చూడటం ఈ చట్టం ప్రధాన లక్ష్యం.గత 20 ఏళ్లుగాగా ఈ పథకం ద్వారా తెలంగాణలో లబ్ధి పొందిన వారిలో సుమారు 90 శాతం ఎస్సీలు, ఎస్టీలు, బీసీలే ఉన్నారు. వీరిలో 62 శాతం మహిళలు. దళితులు, గిరిజనులు, దివ్యాంగులు, అత్యంత వెనుకబడిన తెగలకు చెందిన ఆదివాసీలు, చెంచులు, పేద వర్గాలే ఎక్కువగా ప్రయోజనం పొందారు. కాగా ప్రస్తుతం కేంద్రం ప్రవేశపెట్టిన ‘వీబీజీరామ్జీ –2025’ పేదల హక్కులను దెబ్బతీసేలా ఉంది. ఈ పథకంపై ప్రధానంగా ఆధారపడిన గ్రామీణ ప్రాంత మహిళలు, బలహీన వర్గాల ఉపాధికి హామీ లేకుండా చేస్తోంది. పాత ఉపాధి హామీ పథకం ఆత్మను దెబ్బతీసే నిబంధనలు పేదల పాలిట శాపంగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సభ కింద తెలిపిన విధంగా తీర్మానిస్తోంది..’ అని సీఎం చెప్పారు. ఇదీ తీర్మానం.. 1. కొత్త చట్టం పథకం అసలు ఉద్దేశాన్ని దెబ్బతీస్తోంది. డిమాండ్కు అనుగుణంగా పనుల ప్రణాళికను తయారు చేసే విధానానికి స్వస్తి పలికింది. డిమాండ్ ఆధారిత పాత విధానాన్ని కొనసాగించాలి. 2. కొత్త చట్టం మహిళా కూలీలకు వ్యతిరేకంగా ఉంది. ఇప్పుడు అమల్లో ఉన్న ఎంజీఎన్ఆర్ఈజీఏ లో దాదాపు 62% మహిళలు కూలీ పొందేవారు. కొత్త చట్టంలో పొందుపరిచిన పరిమిత కేటాయింపుల విధానం వల్ల పని దినాలు తగ్గిపోతాయి. దీంతో పేద కుటుంబాల్లోని మహిళలు నష్టపోతారు. మహిళా సాధికారత సాధించాలంటే పాత విధానం పునరుద్ధరించాలి. 3. ప్రస్తుతం ఉపాధి హామీ పథకంలో పూర్తిగా కేంద్రమే నిధులు కేటాయించేది. కొత్త చట్టంలో కేంద్ర–రాష్ట్ర నిధుల వాటా 60:40గా పేర్కొనడం రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారాన్ని మోపుతుంది. 4. మహాత్మాగాంధీ పేరును ఈ పథకం నుంచి తొలగించటంతో ఆయన స్ఫూర్తిని నీరుగార్చినట్లయింది. 5. వ్యవసాయ సీజన్లో 60 రోజుల విరామం తప్పనిసరి చేయడంతో భూమి లేని నిరుపేద కూలీలకు అన్యాయం జరుగుతుంది. ఈ పథకాన్ని సంవత్సరం పొడవునా కొనసాగించాలి. 6. ప్రస్తుతం ఉపాధి హామీ ద్వారా 266 రకాల పనులు చేపట్టే వెసులుబాటు ఉంది. కొత్త చట్టంలో భూముల అభివృద్ధి వంటి శ్రమ ఆధారిత పనులు తొలిగించటంతో చిన్న సన్నకారు రైతులు, దళితులు, గిరిజనులు నష్టపోతారు. ఇప్పుడున్న పనుల జాబితాను యథాతథంగా అనుమతించాలి. -
మూసీ కాలుష్యాన్ని మించిన విషం
సాక్షి, హైదరాబాద్: మూసీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని తాను కృత నిశ్చయంతో ఉంటే, విపక్ష బీఆర్ఎస్ అసత్యాల ప్రచారంతో అవినీతి బురద జల్లుతోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. 1.50 లక్షల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చామని, రూ.25 కోట్ల కమీషన్లు తినేశామని ప్రచారం చేయడం దుర్మార్గమని అన్నారు. వాళ్ల కడుపులో విషం మూసీ కాలుష్యం కన్నా ప్రమాదకరమని మండిపడ్డారు.కాలి బూడిదయ్యేంత విషపు కళ్లతో చూస్తున్నారని వ్యాఖ్యానించారు. శుక్రవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో మూసీ పునరుజ్జీవంపై పలువురు లేవనెత్తిన ప్రశ్నలపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. అసలు మూసీ ప్రక్షాళన ఇష్టమా? కాదా? చెప్పాలని నిలదీశారు. ప్రక్షాళనకు సహకరిస్తే సూచనలు ఇవ్వాలని, వ్యతిరేకం అయితే ఆ కడుపు మంటకు కారణమేంటో చెప్పాలని అన్నారు. డీపీఆర్లు వచ్చిన తర్వాతే అంచనాలు ‘బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేసిందేంటో చెప్పాలి. కాంట్రాక్టులు ఇవ్వడం, కమీషన్లు పట్టడం, లిçఫ్టులు, పంపులు పెట్టడం, ఇళ్లలో కనకవర్షం కురిపించుకోవడం, జన్వాడ, మొయినాబాద్లో ఫామ్హౌస్లు కట్టుకోవడమే కదా చేసింది. తమను వాళ్లలా ఊహించుకుని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మూసీ ప్రక్షాళనకు అంతర్జాతీయ కన్సల్టెన్సీ తోడ్పాటు తీసుకుంటున్నాం. అది డీపీఆర్లు ఇచి్చన తర్వాతే అంచనాలు వెల్లడిస్తాం. ముందే చెప్పడానికి నేను 80 వేల పుస్తకాలు చదవలేదు. వాళ్ళంత పరిజ్ఞానం లేదు. దుర్గంధ భరితమైన మూసీ పక్కన నివసించాలని ఎవరికీ ఉండదు.ఎంతో కష్టాల్లో ఉన్న నిరుపేదలే అక్కడ ఉంటారు. అలాంటి వారికి మంచి కాలనీలు కట్టించాలని, వారి పిల్లలకు చదువులు చెప్పించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంటే, విపక్షం మాత్రం వాళ్లు అక్కడే ఉండాలని కోరుకుంటోంది. విపక్ష నేతలు వర్షాలు ఉన్నప్పుడు మూసీ ప్రాంతంలోని ఇళ్ళల్లో ఎందుకు పడుకోలేదు?. ఇప్పుడైనా సగం కాలిపోయి, కుళ్ళిపోయిన శవాలున్న మూసీ ప్రాంతంలో పడుకోవాలి. నన్ను రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంటున్నారు. అది ఒక పరిశ్రమ.. అభివృద్ధి చెందితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి..’అని సీఎం చెప్పారు. మూసీలో నిరంతరం స్వచ్ఛమైన నీరు ‘మూసీ కాలుష్యం కారణంగా నల్లగొండ జిల్లా ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారు. కంపెనీల కలుíÙత జలాల నుంచి జంతువుల కళేబరాల వరకు మూసీలో కలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూసీ నది ప్రక్షాళనే ప్రభుత్వ లక్ష్యం. ప్రక్షాళనతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చేలా చేస్తాం. లండన్ థేమ్స్ నదిని, న్యూయార్క్ జపాన్, సౌత్ కొరియా, సింగపూర్ లాంటి దేశాల్లో ఇలాంటి ప్రక్షాళన పనులు పరిశీలించాం.మూసీ ప్రక్షాళనకు ప్రణాళికలు సిద్ధం చేశాం. 20 టీఎంసీల గోదావరి జలాలు తరలించి 15 టీఎంసీలు తాగు నీటి అవసరాలకు, 5 టీఎంసీలు మూసీలో నిరంతరం స్వచ్చమైన నీరు పారించేందుకు ఉపయోగిస్తాం. మార్చి 31 లోగా అంచనాలు సిద్ధం చేసి టెండర్లు పిలుస్తాం. ఆసియా అభివృద్ధి బ్యాంకు రూ. 4 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు ముందుకొచి్చంది. గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కి.మీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని భావిస్తున్నాం. ఓల్డ్ సిటీ ఎప్పటికీ ఒరిజినల్ సిటీయే. దాన్ని నిర్లక్ష్యం చేయం. మూసీ ప్రక్షాళనకు అందరూ సహకరించాలి..’అని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. బుల్డోజర్లకు అడ్డు పడతాం: హరీశ్రావు బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉప నేత హరీశ్రావు ఈ అంశంపై చర్చలో పాల్గొన్నారు. మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్ళు కూలగొడితే తమ పార్టీ సహించదని, బుల్డోజర్లకు అడ్డుపడతామని అన్నారు. మూసీలో ఇప్పటివరకు ఎన్ని ఇళ్ళు తొలగించారో, ఎంతమందికి ప్రత్నామ్నాయం చూపారో, ఇంకెన్ని ఇళ్ళు కూల్చాలనుకుంటున్నారో చెప్పాలని నిలదీశారు. మూసీ పునరుజ్జీవం వల్ల నిరాశ్రయులైన వారికి ఇప్పటివరకు ఎంత చెల్లించారో చెప్పాలని కోరారు. 2013 భూసేకరణ చట్టం కింద డబ్బులు ఇచ్చారా లేదా తెలపాలన్నారు. ఇటీవల వర్షాలు కురిసినప్పుడు మూసీ గేట్లు ఉద్దేశపూర్వకంగా ఎత్తివేసినట్టు తమ దృష్టికి వచి్చందని, ప్రభుత్వమే దీనికి అనుమతించినట్టు తెలిసిందని, ఇందులో వాస్తవం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. సమగ్ర ప్రక్షాళన అవసరం: అక్బరుద్దీన్ ఓవైసీ మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సంబంధించి సమగ్ర వివరాలను సభ ముందుంచాలని ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. మూసీ నది ప్రారంభమయ్యే దగ్గర్నుంచి, అది ముగిసే వరకూ ప్రక్షాళన పనులు జరగాలని సూచించారు. హైదరాబాద్లో చారిత్రక కట్టడాలు ఉన్నాయని, వీటితో పాటు నగర సంస్కృతిని కాపాడాలని కోరారు. మైక్ కట్తో బీఆర్ఎస్ నిరసన సీఎం ప్రసంగం తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్..బీఆర్ఎస్ సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డికి మాట్లాడే అవకాశం ఇచ్చారు. హరీశ్రావుకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని ఆమె కోరడంతో స్పీకర్ అభ్యంతరం తెలిపారు. ఆ తర్వాత సునీతా లక్ష్మారెడ్డికీ ఇదే పరిస్థితి ఎదురైంది. తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్కు మాట్లాడే అవకాశం ఇచ్చారు. మూసీ పునరుద్ధరణకు సహకరిస్తామని, నిర్వాసితులకు ఇచ్చే పరిహారం గురించి చెప్పాలని తలసాని అన్నారు. తమకు కడపులో విషం ఉందని సీఎం అనడం సరికాదన్నారు. సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు జోక్యం చేసుకుని.. ముఖ్యమంత్రి ఎవరినీ ఉద్దేశించి వ్యాఖ్యానించలేదని అన్నారు.అనంతరం హరీశ్రావుకు అవకాశం ఇవ్వగా..సభలో తమ హక్కులు కాపాడాలని ఆయన కోరారు. మూసీ కంపుకన్నా ముఖ్యమంత్రి మాటల కంపు ఎక్కువ ఉందంటూ విమర్శించారు. దీంతో హరీశ్రావు మైక్ను స్పీకర్ నిలిపివేశారు. దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ నేతలు సభ నుంచి వాకౌట్ చేశారు. కాగా యూరియా కొరతపై బీఆర్ఎస్, ఇతర అంశాలపై పలువురు ఇచి్చన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. సీఎంపై హరీశ్రావు చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించినట్టు తెలిపారు. మూసీ పునరుజ్జీవంపై జరిగిన చర్చలో ఎమ్మెల్యేలు బాలూ నాయక్, శంకరయ్య, మల్రెడ్డి రంగారెడ్డి, పాయల్ శంకర్ తదితరులు కూడా పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ బాయ్కాట్
సాక్షి, హైదరాబాద్: శాసనసభ స్పీకర్ ఏకపక్ష వైఖరి, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అప్రజాస్వామిక ప్రవర్తనకు నిరసనగా అసెంబ్లీ సమావేశాలు బహిష్కరిస్తున్నట్టు బీఆర్ఎస్ ప్రకటించింది. శుక్రవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో భాగంగా మూసీ పునరుజ్జీవంపై జరిగిన చర్చలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ పార్టీ సభ నుంచి వాకౌట్ చేసింది. అనంతరం శాసనసభ లాబీలోని ప్రతిపక్ష నేత కేసీఆర్ చాంబర్లో ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. పార్టీ శాసనసభా పక్షం డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు ప్రభుత్వ వైఖరిపై అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.సభలో జరిగిన పరిణామాలను ప్రతిపక్ష నాయకుడు, పార్టీ అధినేత కేసీఆర్కు వివరించారు. ప్రభుత్వ తీరును ఎండగట్టేలా ప్రస్తుత సమావేశాలు ముగిసేంత వరకు అసెంబ్లీని బహిష్కరించడమే సరైనదనే అభిప్రాయం ఈ భేటీలో వ్యక్తమైంది. పార్టీలకతీతంగా సభ్యుల హక్కులను రక్షించాల్సిన స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఖండించారు. స్పీకర్ వైఖరితోపాటు ప్రభుత్వ తీరుపై నిరసన తెలపాలని నిర్ణయించారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరుల స్తూపం వద్దకు చేరుకున్నారు. సుమారు గంట పాటు నిరసన తెలిపారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలను బీఆర్ఎస్ బహిష్కరిస్తున్నట్లు పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ప్రకటించారు. అసలేం జరిగింది.. ప్రశ్నోత్తరాల సందర్భంగా మూసీ నది పునరుజ్జీవంపై చర్చ సందర్బంగా అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నడుమ మాటల యుద్ధం నడిచింది. మూసీ సుందరీకరణ కోసం చేసే ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. ఇళ్ల కూలి్చవేతలు, నిర్వాసితులకు పరిహారం, ప్రాజెక్టు అంచనాలు, మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాల తరలింపు అంశాలపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ఈ దశలో జోక్యం చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గంటకు పైగా మాట్లాడారు. అయితే సీఎం ప్రసంగంపై వివరణ కోరేందుకు తాము అడిగినా ఎంఐఎంకు స్పీకర్ అవకాశం ఇవ్వడాన్ని బీఆర్ఎస్ తప్పు పట్టింది.హరీశ్రావు పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తుతూ స్పీకర్ సభకు కస్టోడియన్గా తమ హక్కులు కాపాడాలని కోరారు. తమ గొంతు నొక్కుతూ హక్కులకు భంగం కలుగుతున్నపుడు స్పీకర్కు తమకు రక్షణగా నిలవాలన్నారు. ఈ దశలో హరీశ్రావు మైక్ను కట్ చేసిన స్పీకర్.. మంత్రి శ్రీధర్బాబుకు అవకాశం ఇచ్చారు. శ్రీధర్బాబు వివరణతో సంతృప్తి చెందని బీఆర్ఎస్ సభ్యులు తమకు అవకాశం ఇవ్వాలని పట్టుబట్టడంతో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్కు అవకాశం ఇచ్చారు. సభా సాంప్రదాయాలు కాపాడుతూ హరీశ్రావుకు మైక్ ఇవ్వాలని ఆయన కోరారు.హరీశ్రావు మాట్లాడుతూ.. ‘మేము అడిగిన ఏ ఒక్క పాయింట్కు కూడా సీఎం దగ్గర క్లారిఫికేషన్ లేదు. పైగా మాకు మైక్ ఇవ్వకుండా, మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. నిరసన తెలపడం సభ్యుడి హక్కు. మాకు మైక్ ఇవ్వకపోవడం ముమ్మాటికీ సరికాదు. మూసీ నది కంపు కంటే ముఖ్యమంత్రి గారి మాటల కంపు ఎక్కువగా ఉంది. సభా నాయకుడి హోదాలో ఉండి ఆయన మాట్లాడుతున్న భాష వినడానికే చాలా కష్టంగా, అసహ్యంగా ఉంది..’ అనడంతో స్పీకర్ మరోమారు మైక్ కట్ చేశారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. ఏడు సమావేశాల్లో ఇదే తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2023 డిసెంబర్లో కొలువుదీరిన మూడో శాసనసభ ఇప్పటివరకు ఏడు మార్లు సమావేశమైంది. ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ బీఆర్ఎస్ పలుమార్లు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసినా..మొత్తం సమావేశాలను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకోవడం మాత్రం ఇదే తొలిసారి. కాగా శనివారం ఉదయం పది గంటలకు తెలంగాణ భవన్లో జరిగే భేటీలో బీఆర్ఎస్ శాసనసభా పక్షం తదుపరి కార్యాచరణ ప్రకటించనుంది. నదీజలాల్లో తెలంగాణ వాటా, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశమున్నట్టు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. రేవంత్ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారు: హరీశ్రావు గన్పార్కు వద్ద మాట్లాడిన హరీశ్రావు.. మూసీ ప్రక్షాళనకు ముందు సీఎం నోరు ప్రక్షాళన చేయాలని వ్యాఖ్యానించారు. మూసీ కాలుష్యం కంటే సీఎం మాటల కంపు ఎక్కువైందన్నారు. ‘రాహుల్గాంధీ దేశమంతా రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతుంటే ఇక్కడ రేవంత్ మాత్రం అసెంబ్లీ సాక్షిగా రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారు. శాసనసభ నడుస్తున్న తీరు ప్రజాస్వామ్య విలువలకు పూర్తి విరుద్ధంగా ఉంది. బీఏసీ సమావేశంలో మమ్మల్ని గంటన్నర సేపు వెయిట్ చేయించి అవమానించారు. సభను 7 రోజుల పాటు నడపాలని, ఆ తర్వాత మళ్లీ సమావేశమై తదుపరి షెడ్యూల్ నిర్ణయిద్దామని స్పష్టంగా అనుకున్నాం. కానీ సభలో ప్రవేశపెట్టిన మినట్స్లో మాత్రం సభ ఎన్ని రోజులు నడపాలనేది స్పీకర్ నిర్ణయానికే వదిలేస్తున్నాం అని తప్పుడు సమాచారం పొందుపరిచారు.స్పీకర్ సభను కస్టోడియన్లా కాకుండా ఏకపక్షంగా నడుపుతున్నారు. సీఎంను విమర్శించొద్దంటూ స్పీకర్ మాకు రూల్స్ చెప్పడం ఎక్కడి పద్ధతి? ప్రతిపక్షం మాట్లాడకూడదంటే అసలు సభ ఎందుకు? సభలో సీఎం బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఒక సీఎంలా కాకుండా వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారు. కేసీఆర్పై సీఎం వాడిన భాషను తీవ్రంగా ఖండిస్తున్నాం. అవినీతికి అధికారికంగా రేట్లు నిర్ణయించి వసూలు చేస్తున్న రేవంత్కు మా గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు..’ అని హరీశ్రావు మండిపడ్డారు. అసెంబ్లీని గాం«దీభవన్లా నడిపిస్తున్నారని తలసాని ధ్వజమెత్తారు. మూసీపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షం గొంతు నొక్కుతూ అధికార పార్టీ దాడి చేస్తోందని, స్పీకర్ మౌనంగా ఉంటూ సభ నడిపించే విధానాన్ని మర్చిపోయారని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. -
మరో అగ్రనేత లొంగుబాటు!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సీపీఐ (మావోయిస్టు) బెటాలియన్ నంబర్ వన్ కమాండర్ బర్సె దేవా లొంగుబాటు వార్తలు హల్చల్ చేస్తుండగానే, మరో అగ్రనేత సైతం లొంగుబాటలో ఉన్నారనే అంశం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు ఓ యూట్యూబ్ చానల్ నిర్వాహకుడి ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. గతేడాది మే 21న మావోయిస్టు పార్టీ చీఫ్ సెక్రటరీ నంబాల మరణం తర్వాత కీలక మావోయిస్టు నేతలు దండకారణ్యం వదిలిపెట్టారు. దండకారణ్యం చుట్టూ విస్తరించిన తెలంగాణ, ఏపీ, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో అగ్రనేతలు రహస్య జీవితం గడుపుతున్నట్టు తెలుస్తోంది.నవంబర్లో హిడ్మా ఏపీలో ఎన్కౌంటర్ కావడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. అప్పటి నుంచి తెలంగాణ–ఛత్తీస్గఢ్తో సరిహద్దులు పంచుకుంటున్న ములుగు, భద్రాద్రి కొత్తగూడెంతోపాటు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల అడవుల్లో మావోయిస్టు కీలక నేతలు తలదాచుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇందుకు తగ్గట్టే తెలంగాణలో షెల్ట ర్ తీసుకున్న ఓ కీలక నేత తన అభిప్రాయాలు, డిమాండ్లను బాహ్య ప్రపంచానికి తెలిపేందుకు ఓ యూట్యూబర్ను తమ స్థావరానికి పిలిపించారని సమాచారం. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని సదరు యూ ట్యూబర్ శుక్రవారం రాత్రి 10 గంటల సమయాన తన చానల్ ద్వారా వివరాలు వెల్లడించారు. ఎవరా నేత ? హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు తిప్పిరి తిరుపతి పోలీసుల అదుపులో ఉన్నట్టు రెండు వారాల పాటు ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆయన క్షేమంగానే ఉన్నాడని పార్టీ ప్రకటించింది. అప్పటి నుంచి జార్ఖండ్లోని ఓ రహస్య ప్రాంతంలో తిరుపతి ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే, శాంతిచర్చలు–లొంగుబాట్ల సమయంలో కీలక సమాచారం బయటి ప్రపంచానికి తెలిపిన యూట్యూబర్ ఇప్పుడు తెలంగాణలో కీలక నేతను కలుసుకునేందుకు వచ్చినట్టు ప్రకటించడంతో ఆ కీలక నేత తిరుపతేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.తిరుపతి కానీ పక్షంలో తెలంగాణ రాష్ట్ర కమిటీకి నేతృత్వం వహిస్తున్న దామోదర్ అయి ఉండే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. వీరిద్దరు కాకపోతే లొంగుబాటుకు ముందే బర్సె దేవా తన సేఫ్టీ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా అయి ఉండొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో తలదాచుకుంటున్న సదరు కీలక నేత ఎవరనే అంశం ఒకటి, రెండు రోజుల్లో వెల్లడయ్యే అవకాశముంది. సంధానకర్తలుగా గతేడాది ఏప్రిల్లో శాంతిచర్చల ప్రక్రియ తెరపైకి వచ్చినప్పుడు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న ‘బస్తర్ టాకీస్’అనే యూట్యూబ్ చానల్కు ఇంటరూయ్వ ఇచ్చారు. ఆ తర్వాత 210 మంది కేడర్తో ఆయుధాలతో సహా ఆయన లొంగిపోయారు. ఇటీవల ఎంఎంసీ జోనల్ సభ్యుడు అనంత్ మరో యూట్యూబ్ చానల్ ద్వారా లొంగిపోయిన విషయం తెలిసిందే. ఆపరేషన్ కగార్ మొదలయ్యాక ఇంటర్నెట్ యాక్సెస్ కీలకంగా మారింది.దీంతో ఇటు పోలీసులు, అటు మావోయిస్టులకు అనుసంధానకర్తలుగా యూట్యూబ్ చానళ్లు మారినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బస్తర్ టాకీస్కు చెందిన వికాస్ తివారి.. తెలంగాణలోకి వచ్చారు. దట్టమైన అడవిలో ఓ రహస్య ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేతతో సమావేశమయ్యారు. మార్గమధ్యలో బెటాలియన్ వన్ కమాండర్ బర్సె దేవా తన జంబో టీమ్తో బస చేసిన ప్రాంతం, వంటలు చేసుకున్న ప్రదేశాలను వీడియోలో చూపించాడు. వారు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిన మూడు రోజుల తర్వాత ఆ ప్రదేశాన్ని మావోయిస్టులు బహిర్గతం చేశారు. -
ఫిబ్రవరిలో మున్సి'పోల్'
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల దిశలో అడుగులు వడివడిగా పడుతున్నాయి. ఈ నెలలోనే ఎన్నికలకు గ్రీన్సిగ్నల్ ఇవ్వాలని, ఫిబ్రవరిలో ఈ ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సంక్రాంతికి ముందు లేదంటే ఆ తర్వా త కచి్చతంగా షెడ్యూల్ ప్రకటించి ఆ వెనువెంటనే నోటిఫికేషన్ ఇవ్వడానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచి్చనట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ నెల 11న లేదంటే 20న షెడ్యూల్ ప్రకటించే అవకాశా లున్నాయి. ఫిబ్రవరి రెండు లేదా మూడో వారంలోగా ఎన్నికల తతంగాన్ని పూర్తి చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించింది. డబ్ల్యూఈఎఫ్ సమావేశాలకు సీఎం.. జనవరిలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విదేశీ పర్యటనకు వెళుతున్నారు. స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలు ఈనెల 19 నుంచి 23 వరకు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు 17 లేదా 18న సీఎం రేవంత్ బయలుదేరతారని తెలుస్తోంది. దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో జరిగే సమావేశాల తర్వాత ఆయన అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు.ఈ పర్యటనను కూడా ముగించుకుని ఫిబ్రవరి 1న హైదరాబాద్కు వస్తారని, 3న జడ్చర్లకు వెళ్తారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాల ద్వారా తెలిసింది. ఫిబ్రవరి 3న జడ్చర్లలో ఆయన ట్రిపుల్ ఐటీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత పలు జిల్లాల్లో పర్యటిస్తారు. గత రెండేళ్లలో ఆయన ఎక్కడెక్కడ పర్యటించారన్న దానిపై సీఎంవో వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. ఈ దఫా జిల్లాల పర్యటనలో గతంలో వెళ్లని గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నారని, ఈ మేర కు షెడ్యూల్ తయారవుతోందని సమాచారం. స్థానిక ఎన్నికలు పూర్తి చేస్తేనే..15వ ఆర్థిక సంఘం నుంచి నిధులు రావాలంటే.. స్థానిక సంస్థలకు ఎన్నికలు పూర్తి చేయాలి. అప్పుడే కేంద్రం గ్రాంట్లు విడుదల చేసేందుకు సాధ్యమవుతుంది. దాదాపు రూ.500 కోట్ల ని ధులు రాకుండా ఆగిపోయిన నేపథ్యంలో ము న్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న జీహెచ్ఎంసీ పాలక మండలి గడువు ఫిబ్రవరి 10వ తేదీతో ముగియనుంది. ఆ తర్వాత ఈ కార్పొరేషన్ను మూడు కార్పొరేషన్లుగా విభజించనున్నట్లు తెలిసింది. అనంతరం 300 వార్డులను ఈ మూడు కార్పొరేషన్లకు సర్దుబాటు చేసిన అనంతరం ఓటర్ల జాబితాను ప్రకటించి...ఎన్నికలు వచ్చే మే లేదా జూన్లో నిర్వహించే అవ కాశం ఉన్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. -
ఆ మాటలకు స్పీకర్ నవ్వడం మరింత బాధాకరం: బండి సంజయ్
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీపై కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యే కూనంనేని చేసిన వ్యాఖ్యలను అభ్యంతరకరంగా ఉన్నాయని బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని ఎక్స్ వేదికగా బండి సంజయ్ మండిపడ్డారు. ‘దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు భావజాలం ప్రజాదరణను కోల్పోయింది. ఇందుకు ఇలాంటి బాధ్యతలేని, అసభ్య భాషే ప్రధాన కారణం. తెలంగాణ అసెంబ్లీలో అలాంటి వ్యాఖ్యలను అనుమతించడమే కాకుండా ఆ మాటలను ఆస్వాదిస్తూ స్పీకర్ నవ్వడం బాధాకరం. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది. మిత్రపక్షాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ అన్ని రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించింది. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు మాత్రం రాజకీయ దూషణలకే పరిమితమై ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయి. తక్షణమే ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. దేశ ప్రజలకూ, గౌరవ ప్రధానికీ నిస్సందేహంగా క్షమాపణ చెప్పాల్సిందే’ అని బండి సంజయ్ డిమాండ్ చేశారు. Strongly condemn the offensive remarks made by a Communist Party MLA against Hon’ble Prime Minister Shri @narendramodi Ji.Communism has lost ground across the country, and this kind of reckless language explains why. Such language has no place in a democratic Assembly. By…— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) January 2, 2026 -
‘సంక్రాంతికి ఊరెళ్తున్నారా’.. ఇలా చేస్తే దొంగ చేతికి తాళం ఇచ్చినట్లే!
సాక్షి,హైదరాబాద్: కొత్త ఏడాది రాకతో తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ వాతావరణ నెలకొంది. ఇప్పటికే సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు పట్టణాలు వదిలి పల్లెలకు వెళ్లేందుకు సర్వం సిద్దం చేసుకున్నారు. పండుగకు కావాల్సిన కొత్తబట్టలు, బంగారం, ఇతర వస్తువుల్ని కొనుగోలు చేసుకున్నారు. ఈ క్రమంలో పలువురు సోషల్ మీడియా వేదికలపై తమ ఊరిలో సంక్రాంతి పండుగ సంబరాలపై షార్ట్స్,సెల్ఫీలతో పాటు ఇతర వివరాల్ని షేర్ చేస్తూ ఆనందాన్ని నెటిజన్లతో పంచుకుంటున్నారు. అయితే, అలా చేయొద్దని హైదరాబాద్ నగర పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పండక్కి ఊరెళ్తె మూడో కంటికి కనపడకూడదని సూచిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా చాలా మంది ఊర్లకు వెళ్లే అవకాశం ఉండటంతో దొంగలు ఈ సమయాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉందని సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ ముత్యం రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. ప్రజలు ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పోలీసులు రాత్రి వేళల్లో గస్తీ ఏర్పాట్ల గురించి ఆయన మాట్లాడారు.సీసీ కెమెరాలుసైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే పోలీసులు సీసీ కెమెరాలను అమర్చారు. వీటి సహాయంతో అనేక నేరాలను ఛేదించాం. ప్రజలు కూడా తమ కాలనీలు, ఇళ్లు, షాపింగ్ మాళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి.ఇళ్ల భద్రతా చర్యలు ఊర్లకు వెళ్లే వారు ఇంట్లో ఒక గదిలో లైటు వేసి ఉంచడం, తలుపులకు సెంట్రల్ లాకింగ్ సిస్టం ఏర్పాటు చేయడం, బీరువా తాళాలను ఇంట్లో ఉంచకుండా వెంట తీసుకెళ్లడం వంటి చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా, ఇంటి ముందు చెత్త, దినపత్రికలు, పాల ప్యాకెట్లు పేరుకుపోకుండా చూసుకోవాలని, లేకపోతే దొంగలు ఇంట్లో ఎవరూ లేరని గుర్తించే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.వాహనాల భద్రత విలువైన వస్తువులను స్కూటర్ డిక్కీల్లో లేదా కార్లలో ఉంచకూడదు. ద్విచక్ర వాహనాలు, కార్లను ఇంటి ఆవరణలోనే పార్క్ చేయాలని, బయట రోడ్లపై పార్క్ చేయకూడదు. వాహనాలకు హ్యాండిల్ లాక్తో పాటు వీల్ లాక్ కూడా వేయండి. ఇంట్లో బంగారు నగలు,నగదు ఉంటే వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవడం మంచిది. ఎక్కువ రోజులు ఊర్లకు వెళ్లేవారు వాటిని వెంట తీసుకెళ్లాలి. ప్రయాణ సమయంలో బ్యాగుల్లో నగలు, డబ్బు పెట్టుకున్నప్పుడు వాటిని దగ్గరలో ఉంచుకోవాలి. బస్సులో పెట్టి కిందికి దిగితే దొంగలు అపహరించే అవకాశం ఉంది.టెక్నాలజీ ఆధారిత భద్రత ఇళ్లలో టైమర్తో కూడిన లైట్లు, మోషన్ సెన్సర్ లైట్లు అమర్చుకోండి. హోమ్ సెక్యూరిటీ సిస్టం ద్వారా మొబైల్ నుంచే ఇంటిని ప్రత్యక్షంగా గమనించే అవకాశం ఉంది. డీవీఆర్లను ఇంటి లోపల రహస్య ప్రదేశంలో అమర్చుకోవాలి. ప్రజలు తమ ప్రాంతాల్లో గస్తీ ఏర్పాటుకు సహకరించాలని, పోలీస్ స్టేషన్ నంబర్లు, బీట్ కానిస్టేబుల్ నంబర్లు దగ్గర ఉంచుకోవాలి. కాలనీల్లో కమిటీలు ఏర్పాటు చేసి వాచ్మెన్లను నియమించుకోవాలని, కొత్త వ్యక్తుల కదలికలను గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వాలిసోషల్ మీడియాతో తస్మాత్ జాగ్రత్త ప్రజలు సోషల్ మీడియాలో తమ ప్రయాణ వివరాలను షేర్ చేయకూడదు. దూర ప్రాంతాలకు వెళ్లేవారు తమ చిరునామా, ఫోన్ నంబర్ను సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు తెలియజేయాలి. దీంతో వారి ఇళ్లపై నిఘా ఏర్పాటు చేయగలం. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండి, పోలీసులతో సమన్వయం చేస్తే చోరీలను నియంత్రించడం సులభమని సైబరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గమనించి వెంటనే 100 డయల్, సైబరాబాద్ పోలీస్ వాట్సాప్ నంబర్ 9490617444 కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
మారిషస్ మహిళకు పాంక్రియాస్లో అరుదైన కణితి
హైదరాబాద్: మారిషస్ దేశానికి చెందిన 55 ఏళ్ల మహిళకు ఉన్నట్టుండి షుగర్ లెవల్స్ తగ్గిపోయేది. అప్పటికప్పుడు ఏమైనా తింటే సరే.. లేకపోతే కళ్లు తిరిగి పడిపోయేవారు. ఏంటా అని అక్కడి వైద్యులకు చూపిస్తే, ఆమెకు పాంక్రియాస్ (క్లోమం)లో అరుదైన కణితి (ఇన్సులినోమా) ఉందని తేలింది. సంక్షిష్టమైన శస్త్రచికిత్స కావడంతో అక్కడి వైద్యులు దానికి శస్త్రచికిత్స చేయడం మారిషస్లో సాధ్యం కాదని, హైదరాబాద్ పంపారు. ఇక్కడ కొండాపూర్ కిమ్స్ ఆస్పత్రిలో ఆమెకు చికిత్స అందించిన కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, రోబోటిక్ సర్జన్ డాక్టర్ సీహెచ్ నవీన్ కుమార్ ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపారు.“ఆ మహిళ నేరుగా కొండాపూర్ కిమ్స్ ఆస్పత్రికి వచ్చారు. సాధారణంగా పాంక్రియాస్లో కణితులను తొలగించడం చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. ఎందుకంటే, పాంక్రియాస్కు కుట్లు వేయడం కష్టమవుతుంది. ఆమెకు ఇన్సులినోమా అనే రకం కణితి ఉన్నట్లు గుర్తించాం. మా బృందంతో పాటు అనస్థీషీయా బృందం డా. వీరభధ్ర రావు తో కలిసి అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను కేవలం లాప్రోస్కొపిక్ పద్ధతిలో చిన్న చిన్న రంధ్రాలు మాత్రమే చేసి ఆమె పాంక్రియాస్లో ఉన్న కణితిని తొలగించాం. అది బాగా చిన్న కణితి కావడంతో.. ఇంట్రాఆపరేటివ్ అల్ట్రాసౌండ్, ఇతర టెక్నాలజీలు వాడి దాన్ని తీసేశాం. శస్త్రచికిత్స అయిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో.. ఆరు రోజుల తర్వాత ఆమెను డిశ్చార్జి చేశాం” అని డాక్టర్ నవీన్ కుమార్ తెలిపారు. -
TG: కాల్వలో స్కూల్ బస్సు బోల్తా..
ఖమ్మం: ఓ స్కూల్ బస్సు కాలువలోకి దూసుకెళ్లిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలం గణేష్పాడులో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 20 మందికి గాయాలయ్యాయి. పరిమితికి మించి విద్యార్థులను తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.ఆ సమయంలో స్కూల్ బస్సులో 105 మంది చిన్నారులు ఉన్నారు. అయితే కాలువలో నీరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు డ్రైవ్ చేసే సమయంలో డ్రైవర్ మద్యం సేవించి ఉన్నట్లు తెలుస్తోంది. డ్రైవర్ మద్యం సేవించాడని విద్యార్థులు చెబుతున్నారు. -
జల వివాదం పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీ
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలను పరిష్కరించడానికి కేంద్ర జలశక్తి శాఖ కీలక నిర్ణయ తీసుకుంది. ఈ సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కమిటీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి నలుగురు చొప్పున ప్రాతినిథ్యం కల్పించనుంది. అదేవిధంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, గోదావరి రివర్ మెనేజ్మెంట్ బోర్డు ఛైర్మన్లకు ఇందులో స్థానం కల్పించింది.ఈ కమిటీకి ఛైర్మన్గా కేంద్రజలసంఘం ఛైర్మన్ అతుల్జైన్ వ్యవహరించనున్నారు. దీని ప్రధాన ఉద్దేశం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఉన్న జల వివాదాల్ని పరిష్కరించడం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రయత్నిస్తుండగా తెలంగాణ ప్రభుత్వం దానిని వ్యతిరేకిస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్రజలశక్తి శాఖ ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. -
ఐఐటీ హైదరాబాద్ విద్యార్థికి ఏకంగా రూ. 2.5 కోట్ల ఆఫర్, రికార్డ్
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ (IITH) విద్యార్థి 2025 ప్లేస్మెంట్ సీజన్లో రికార్డు ప్యాకేజీ సాధించాడు. చివరి సంవత్సరం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విద్యార్థి నెదర్లాండ్స్కు చెందిన గ్లోబల్ ట్రేడింగ్ సంస్థలో ఏకంగా రూ. 2.5 కోట్ల ప్యాకేజీని సాధించాడు. 2008లో ప్రారంభమైనప్పటి నన ఐఐటీ హైదరాబాద్ చరిత్రలో ఇప్పటివరకు ఇదే అత్యధికం కావడం విశేషం.హైదరాబాద్లో పుట్టి పెరిగి, 7 నుండి 12వ తరగతి వరకు బెంగళూరులో చదువుకున్న 21 ఏళ్ల విద్యార్థి ఎడ్వర్డ్ నేథన్ వర్గీస్ (Edward Nathan Varghese) భారీ వేతనంతో నెదర్లాండ్స్ ప్రముఖ సంస్థ 'ఆప్టివర్' (Optiver)లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేరనున్నాడు. అంతకుముందు రెండు నెలల వేసవి ఇంటర్న్షిప్కు ఎంపికైన ఇద్దరు విద్యార్థులలో వర్గీస్ ఒకడు. ఇంటర్న్షిప్ తరువాత కంపెనీ ఆయనకు ఇచ్చిన ప్రీ రీప్లేస్మెంట్ ఆఫర్తోపాటు, కేవలం రెండు వారాల ట్రైనింగ్ తర్వాత ఒక ప్రాజెక్ట్ను సక్సెస్ఫుల్గా పూర్తి చేశాడు.ఈ తర్వాత తుది ఆఫర్ను అందుకున్న ఏకైక వ్యక్తి. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం విద్యాపరంగా, వర్గీస్ 2022లో JEE మెయిన్లో 1100 ఆల్ ఇండియా ర్యాంక్ (AIR), JEE అడ్వాన్స్డ్లో AIR 558 సాధించాడు. 2025లో కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT)కి కూడా హాజరయ్యాడు. 99.96 పర్సంటైల్ సాధించి 120వ ర్యాంక్ను సాధించాడు.ప్లేస్మెంట్స్తో పాటు, వర్గీస్ క్యాంపస్లో అనేక లీడర్షిప్ రోల్స్ పోషించాడు. అతని లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, అతను IIT హైదరాబాద్లోని ఆఫీస్ ఆఫ్ కెరీర్ సర్వీసెస్లో ఓవరాల్ హెడ్గా పనిచేశాడు, ఎనిమిది మంది విద్యార్థి నిర్వాహకులు, దాదాపు 250 మంది కోఆర్డినేటర్లకు నాయకత్వం వహించాడు. దీనికి ముందు, అతను దాదాపు 11 నెలల పాటు ఇంటర్న్షిప్ సెల్ ఇదీ చదవండి: ఐదు నెలల చిన్నారి ఉసురు తీసిన ‘పాలు’కాగా ఐఐటీ హైదరాబాద్ ప్లేస్మెంట్లలో సరికొత్త చరిత్ర రికార్డైంది. ఐఐటీహెచ్లోని మరో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విద్యార్థి రూ. 1.1 కోట్ల ప్యాకేజీని పొందగా ఏడాది తరువాత ఈ రికార్డు స్థాయి ఆఫర్ రావడం విశేషం. 2017లో అత్యధిక ఆఫర్ రూ. కోటిగా ఉన్న క్యాంపస్ రిక్రూట్మెంట్స్ ఈ బెంచ్మార్క్ను దాటింది. మొత్తంమీద, 2025 ప్లేస్మెంట్ సీజన్లో ఇన్స్టిట్యూట్లో సగటు ప్యాకేజీలు దాదాపు 75శాతం పెరిగాయి, 2024లో రూ. 20.8 లక్షల నుండి ఈ సంవత్సరం మొదటి దశ ప్లేస్మెంట్లలో రూ. 36.2 లక్షలకు చేరుకున్నాయి. ఐఐటీహెచ్లోని విద్యార్థులు 24 అంతర్జాతీయ ఆఫర్లను పొందారు. -
తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయిన బర్సేదేవా
సాక్షి,హైదరాబాద్: మావోయిస్టు పార్టీకి కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. మడావి హిడ్మా సన్నిహితుడు, బెటాలియన్ కమాండర్ బర్సేదేవా తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. మావోయిస్టు పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్కు(సీఎంసీకి)వెన్నెముకగా నిలిచిన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) కార్యకలాపాలు ముగిసినట్లేనన్న భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే హిడ్మా మృతితో కోలుకోలేని దెబ్బ తగలగా.. తాజాగా బెటాలియన్ కమాండర్ బర్సేదేవా తెలంగాణ డీజీపీ శివదర్ రెడ్డి ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. ఆయనతో పాటు మరో పాటు మరో 19 మంది కమిటీ సభ్యులు సైతం ఉన్నారని.. రేపోమాపో వారిని పోలీసుల ఎదుట ప్రవేశ పెట్టనున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కొద్ది రోజుల క్రితం మావోయిస్టు లిబరేషన్ ఆర్మీ చీఫ్గా ఉన్న మడివి హిడ్మా పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లో మరణించారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో బరిసే దేవాను మావోయిస్టు పార్టీ నియమించింది. ప్రస్తుతం ఆయన సైతం ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.కాగా మడివి హిడ్మా, బరిసేదేవా ఇద్దరు ఒకే గ్రామానికి చెందిన వారు. మావోయిస్టు పార్టీకి ఆయుధాలు సరఫరా చేయడంలో బరిసే దేవా కీలక పాత్ర పోషించారు. బరిసే దేవా లొంగుబాటు సందర్భంగా పోలీసులు ఆయన దగ్గరినుంచి పెద్ద మెుత్తంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.పోలీసుల అదుపులో ఉన్న బరిసే దేవా రేపు మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. -
అసెంబ్లీ సమావేశాలు.. బీఆర్ఎస్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న వేళ బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించనున్నట్టు బీఆర్ఎస్ తెలిపింది. రేపటి నుంచి శాసనసభకు హాజరు కావద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నారు. రేపు ఉదయం తెలంగాణ భవన్లో కృష్ణా నదీ జలాలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. ఇక, ఈరోజు అసెంబ్లీ సమావేశాలను కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాయ్కాయ్ చేశారు. అనంతరం, బీఆర్ఎస్ నేతలు గన్ పార్క్ వద్దకు చేరుకున్నారు. గన్ పార్క్ వద్ద స్పీకర్ వైఖరిపై నిరసన తెలియజేస్తున్నారు. గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద బైఠాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. స్పీకర్ పక్షపాత వైఖరికి నిరసనగా అసెంబ్లీని బహిష్కరిస్తున్నాం. అసెంబ్లీని ఏకపక్షంగా నడిపారు. ప్రజాస్వామ నిబంధనలకు విరుద్ధంగా అసెంబ్లీ కొనసాగించారు. బీఏఎసీ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాలు వేరు. బీఏసీ మీటింగ్ ఎజెండాను మార్చేసి, సభను తప్పుదోవ పట్టించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ముఖ్యమంత్రి అడ్డగోలుగా మాట్లాడారు. అసెంబ్లీని ముఖ్యమంత్రి బూతుల మయం చేశారు. సభలో ముఖ్యమంత్రిని విమర్శంచవద్దని ఎలా చెబుతారు?. పార్లమెంట్లో రాహుల్ గాంధీ.. ప్రధాని మోదీని విమర్శించడం లేదా?. మేము మాట్లాడటానికి మైక్ ఇవ్వలేదు. మూసీ కంపు కంటే ముఖ్యమంత్రి మాటల కంపు ఎక్కువ. మూసీ కంటే ముందు.. ముఖ్యమంత్రి నోటిని ప్రక్షాళన చేయాలి. మూసీకి మేము వ్యతిరేకంగా కాదు.. పేదల ఇళ్ల కూల్చివేతకు వ్యతిరేకం. రేవంత్.. నువ్వు ముఖ్యమంత్రివా? లేక స్ట్రీట్ రౌడీవా?. రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి అని తీవ్ర విమర్శలు గుప్పించారు. మూసీ ప్రక్షాళన మొదలు పెట్టిందే బీఆర్ఎస్. బాడీ షేమింగ్ సరికాదు. ముఖ్యమంత్రి సభలో ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలి. ముఖ్యమంత్రి మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకే సభను వాకౌట్ చేసాం. స్పీకర్ వ్యాఖ్యలు సరికాదు. సభలో అందరికీ సమాన హక్కులు ఉంటాయి. అవినీతికి రేవంత్ అడ్డాగా మారాడు. భవనానికి పర్మిషన్ కావాలంటే ఆర్ఆర్ టాక్స్ పెట్టాడు. రేవంత్ మాట్లాడే రైట్ లేదు.. అన్నింటికి రేవంత్ ఒక రేటు పెట్టాడు. ప్రజాస్వామ్య విలువలు సభలో లేవు అని మండిపడ్డారు. -
దుర్గం చెరువు ఆక్రమణ.. హైడ్రా, సర్కార్కు ప్రభాకర్ రెడ్డి సవాల్
సాక్షి, హైదరాబాద్: దుర్గం చెరువులో తనకు భూమి లేదని క్లారిటీ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. తాను ప్రభుత్వ భూమి కబ్జా చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం అంటూ ప్రభుత్వానికి, హైడ్రాకు సవాల్ విసిరారు. పోలీసులు నమోదు చేసిన కేసుపై లీగల్గా ముందుకు వెళ్లనున్నట్టు చెప్పుకొచ్చారు.దుర్గం చెరువులో ఐదు ఎకరాల భూమి ఆక్రమణపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘దుర్గం చెరువు కబ్జా అనేది పూర్తిగా నిరాధారం. నాపై కక్షతో కేసు పెట్టారు. హైకోర్టులో యాక్షన్ పెడితే రెండేకరాలు కొన్నాం. అయితే తర్వాత చెల్లదని TDR ఇచ్చారు. తరువాత దుర్గం చెరువు నిర్మాణం జరిగింది. బాలకృష్ణ, లహరి ఎస్టేట్ హరిబాబు భూములు పక్కనే ఉన్నాయి. ప్రైవేట్ పార్కింగ్ పెట్టినందుకు నాపై కేసు పెట్టారు. దుర్గం చెరువులో నాకు భూమి లేదు. ప్రభుత్వ భూమి కబ్జా చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం. రోడ్డు మీద, చెట్ల కింద వెహికిల్ పార్కింగ్ చేసినందుకు కేసు పెట్టారు.అక్కడ ప్రభుత్వ భూమి కూడా లేదు. అక్కడ ప్రైవేట్ బస్సులు పార్కింగ్ చేస్తారు. ఆ ప్రాంతంలో ప్రభుత్వ భూమి గజం కూడా లేదు. అక్కడ నటుడు బాలకృష్ణ, లహరి ఎస్టేట్ హరిబాబు భూములు ఉన్నాయి. ఎవ్వరూ పర్సనల్ ఫిర్యాదు చేయలేదు. ఫిర్యాదులో హైడ్రా పేరు మాత్రమే కనిపిస్తోంది. కేసు సమాచారం మా సిబ్బందికి పోలీసులు చెప్పారు. కేసుపై లీగల్ పోరాటం చేస్తాం. పోలీస్ స్టేషన్కు వెళ్తాను.. పోలీసులకు సహకరిస్తాను. అక్కడ వెహికిల్ పార్కింగ్ చేయడం సహజం. బేషరుతుగా కేసు విత్ డ్రా చేయకపోతే.. ఎఫ్టీఎల్లో ఇండ్లు కట్టారు. ఆ ఇళ్లు ముందు ధర్నా చేస్తాం’ అని హెచ్చరించారు. -
హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఎమోషనల్ పోస్ట్
పాము తన బిడ్డలను కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే తింటుంది. అదే తరహాలో మనిషీ ప్రవర్తిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో తాజాగా.. అదీ కొత్త ఏడాది తొలిరోజునే జరిగిన రెండు ఘటనలు ‘‘అయ్యో పాపం’’ అనుకునేలా చేశాయి. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో పిల్లల్ని పోషించలేనని మనోవేదనతో తల్లి పిల్లలకు విషం పెట్టగా.. ఏపీలో కన్న తండ్రి తన ముగ్గురు బిడ్డల విషయంలో అదే పని చేశాడు. ఈ రెండు ఘటనలపై హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ ఎమోషనల్ స్పందించారు.నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో పిల్లల్ని పోషించలేనని మనోవేదనతో పిల్లలతో సహా విషపూరిత ఆహారం తల్లి, కుమార్తె మృతి చెందారు. కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. ఏపీలో కన్న తండ్రి ముగ్గురు బిడ్డలకు విషమిచ్చి.. తానూ బలవన్మరణం పొందారు. ఈ ఘటనలపై హైదరాబాద్ సీపీ సజ్జానార్ ఇవాళ (శుక్రవారం) ఎక్స్ వేదికగా స్పందించారు.నూతన సంవత్సర వెలుగులు చూడాల్సిన కళ్లు.. శాశ్వతంగా మూసుకుపోయాయి.. గోరుముద్దలు తినిపించాల్సిన చేతులే విషం కలిపాయని, గుండెలకు హత్తుకోవాల్సిన వారే ఊపిరి తీశారని పేర్కొన్నారు. అమృతం లాంటి ప్రేమను పంచాల్సిన తల్లిదండ్రులే.. ఇలా మారితే ఆ పసి ప్రాణాలు ఎవరికి చెప్పుకోగలవు? అని ప్రశ్నించారు. నాన్న ఇచ్చిన పాలలో విషం ఉందని ఆ చిన్నారులకు ఏం తెలుసు? అమ్మ కొంగు ఉరితాడవుతుందని ఆ అమాయకులకు ఏం ఎరుక? అని ఆవేదన చెందారు. కష్టాలు సునామీలా వచ్చినా సరే.. ఎదురీదాలే తప్ప, ఇలా పసిమొగ్గలను చిదిమేయడం పిరికితనం, పాపం, క్షమించరాని నేరం.. నూతన సంవత్సర వెలుగులు చూడాల్సిన కళ్లు.. శాశ్వతంగా మూసుకుపోయాయి. గోరుముద్దలు తినిపించాల్సిన చేతులే విషం కలిపాయి. గుండెలకు హత్తుకోవాల్సిన వారే ఊపిరి తీశారు. అమృతం లాంటి ప్రేమను పంచాల్సిన తల్లిదండ్రులే.. ఇలా మారితే ఆ పసిప్రాణాలు ఎవరికి చెప్పుకోగలవు?నాన్న ఇచ్చిన పాలలో విషం ఉందని… pic.twitter.com/LZCLiepwxs— V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 2, 2026చనిపోవడానికి ఉన్న ధైర్యం.. బ్రతకడానికి, పోరాడటానికి ఎందుకు సరిపోవడం లేదు? అని సజ్జనార్ ప్రశ్నించారు. ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదు.. అది మీపై ఆధారపడిన వారికి తీరని ద్రోహం.. అని తెలిపారు. దయచేసి ఆలోచించండి.. క్షణికావేశంలో నూరేళ్ళ జీవితాన్ని, బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోకండి. బ్రతికి గెలవండి.. పారిపోయి ఓడిపోవద్దు.. అని ట్వీట్లో పేర్కొన్నారు. న్యూఇయర్ రెజల్యూషన్గా.. నూతన సంవత్సరాన్ని వృద్ధాశ్రమంలో తన సిబ్బందితో గడిపిన నగర కమిషనర్.. ఈ ఉదయం మరో పోస్ట్ చేశారు. నూతన సంవత్సర వేడుకల భద్రతా ఏర్పాట్లలో నిన్నటివరకు పూర్తిగా నిమగ్నమైన ఈ పోలీస్ అధికారి.. ఈ రోజు తన సంకల్పాలను ప్రజలతో పంచుకున్నారు. ఆయన మాటల్లో.. జీవితం అనేది వృత్తి బాధ్యతలు మరియు వ్యక్తిగత కర్తవ్యాల మధ్య సమతుల్యం. పోలీస్ అధికారిగా తన ప్రధాన సంకల్పం నగరాన్ని మరింత సురక్షితంగా, భద్రంగా, అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దడమే. ఈ ఏడాది సైబర్ క్రైమ్, ఆన్లైన్ మోసాలు వంటి కొత్త తరహా నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచడం, కఠినమైన అమలు చర్యలు తీసుకోవడం ప్రాధాన్యతగా ఉంటుందది. అదే సమయంలో పోలీస్ సిబ్బంది ఆరోగ్యం, మానసిక ధైర్యం అత్యంత కీలకం. వారి సంక్షేమం నా ప్రధాన లక్ష్యంగా కొనసాగుతుంది. ప్రజలతో నిరంతర సంబంధం కారణంగా వ్యక్తిగత సమయం తగ్గిపోతున్నా, చదువుకోవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం ద్వారా వృత్తిలో సమకాలీనంగా ఉండాలి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడిపే సమయం అత్యంత ముఖ్యం. వారి సహకారం వల్లే సమాజానికి అంకితభావంతో సేవ చేయగలుగుతున్నాం. చివరగా.. శారీరక దృఢత్వం కోసం స్థిరమైన వ్యాయామ పద్ధతిని అవలంబించాలని, నిజాయితీగా చెప్పాలంటే ఈసారి జిమ్లో చేరతానంటూ ఆ పోస్ట్లో పేర్కొన్నారాయన. Having been fully engaged until yesterday with New Year security and arrangements alongside my dedicated and committed team, I felt today was the right moment to share my New Year resolutions with my extended family—you.Life, as we know, is a balance between professional… pic.twitter.com/WroFZxqDqu— V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 2, 2026 -
కవిత కన్ఫ్యూజన్.. కోమటిరెడ్డి కౌంటర్
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ నిన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే... ఊరూరా తిరుగుతున్నావ్’’ అంటూ కవితపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మండిపడ్డారు. ఇవాళ ఉదయం ఆయన అసెంబ్లీ లాబీలో మీడియా చిట్చాట్లో మాట్లాడారు. కేసీఆర్ను ఉరితీసినా తప్పు లేదన్న దానికి రక్తం మరిగిపోయిందన్న కవిత వ్యాఖ్యలపై కోమటిరెడ్డి స్పందిస్తూ.. కేటీఆర్, హరీష్రావులను ఉరితిసినా తప్పు లేదా? సమాధానం చెప్పాలన్నారు.బీఆర్ఎస్ నేతలందరినీ కోట్ల రూపాయలు దోచుకున్నారని కవిత విమర్శిస్తుంది. కేసీఆర్ సభకు రోజు వస్తే బీఆర్ఎస్ పుంజుకుంటుందని కవిత అంటుంది. కవిత బీఆర్ఎస్లో ఉన్నదా అనే అనుమానం ఉందని కోమటిరెడ్డి అన్నారు. కేసీఆర్ను తిడితే వస్తున్న కోపం హరీష్ రావును తిడితే కవితకు ఎందుకు రావడం లేదు. కవిత కన్ఫ్యూజన్లో ఉంది. జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ తప్పు అని కవిత ఒప్పుకుంది. సంతోషం. బీఆర్ఎస్ హయాంలో నల్లగొండ మంత్రి జిల్లాకు చేసిన అన్యాయంపై కవిత ప్రశ్నించాలి’’ అని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు.‘‘నేను మంత్రి పదవి కోసం ఏరోజు పాకులాడలేదు. తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసా.. నాకు ముఖ్యమంత్రి అంటే గౌరవం, ఆయనను ఏమన్నా అంటే కౌంటర్ ఇస్తా. నాకు మంత్రి పదవి కావాలని ఎవరిని అడగలేదు. నాకు, మా తమ్ముని మధ్య ఎటువంటి గొడవలు లేవు. నాకు ఎవరి మీద కోపం లేదు. నేను కవితకు సలహా మాత్రమే ఇచ్చా’ అని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు. -
మూసీ ప్రాంతంలో ప్రతిపక్ష నేతలు ఉంటారా?: రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: మూసీకి శాశ్వత పరిష్కారం దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రెండేళ్లలో గండిపేటకు గోదావరి నీళ్లను తీసుకొస్తామన్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతోందని వ్యాఖ్యలు చేశారు. ప్రణాళికబద్దంగా మూసీ ప్రక్షాళన జరుగుతుంది అంటూ క్లారిటీ ఇచ్చారు. ప్రతిపక్ష నేతలు మూసీ పరివాహక ప్రాంతంలో ఉండగలరా?’ అని ప్రశ్నించారు.అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో మాట్లాడుతూ..‘మూసీ ప్రక్షాళనపై సభ్యులు సూచనలు చేశారు. సభ్యుల సూచనలను పరిగణనలోకి తీసుకుంటాం. మోక్షగుండం విశ్వేశ్వరయ్య వరద ముంపు పరిష్కారం చూపారు. నదీ పరివాహక ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతోంది. చాలా దేశాల్లో నదీ పరివాహక ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధి కొనసాగుతోంది. మూసీ నది అనంతగిరిలో మొదలై 240 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఈసా, మూసా నదులు బాపూఘాట్ దగ్గర కలుస్తాయి. అందుకే అక్కడ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ చేపట్టాం.మూసీ ప్రక్షాళనపై నెలల తరబడి అధికారులతో సమీక్షలు చేశాం. ప్రణాళికబద్దంగా మూసీ ప్రక్షాళన జరుగుతుంది. ఈసా, మూసా నదులను గోదావరి నీళ్లతో నింపుతాం. రెండేళ్లలో గండిపేటకు గోదావరి నీళ్లను తీసుకొస్తాం. సంక్రాంతిలోగా ఫస్ట్ ఫేజ్పై క్లారిటీ వస్తుంది. ఫస్ట్ఫేజ్లో గండిపేట నుంచి గౌరెల్లి వరకు ప్రక్షాళన జరుగుతుంది. మొత్తం 55 కిలోమీటర్ల మేర మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ది జరుగుతుంది. వచ్చే మూడు నెలల్లో అంచనాలు ఫైనల్ చేస్తాం. మూసీని కలుషితం చేయడంతో నల్లగొండ జిల్లా ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారు. మనుషులు నివాసం ఉండటానికి సాధ్యం కాని విధంగా నల్లగొండ జిల్లా మారిపోయింది. ఫ్లోరైడ్ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నల్లగొండ ప్రాంతంలో ఫ్లోరైడ్ కారణంగా బిడ్డలు అంగవైకల్యంతో పుడుతున్నారు. మూసీ నదిలో నీళ్లు పారాల్సిందేనని అధికారులకు ఆదేశిలిచ్చాం. శాశ్వతంగా సమస్యను పరిష్కరించాలని నిర్ణయించాం.గండిపేటలో ఆగర్భశ్రీమంతులు ఫామ్హౌస్లు కట్టుకున్నారు. ఫామ్హౌసులు కట్టుకుని డ్రైనేజీ నీళ్లను గండిపేట చెరువులో కలిపారు. గండిపేట, మొయినాబాద్లో ఫామ్హౌస్లు కట్టుకున్న వాళ్లు లక్షలు, కోట్లు ఖర్చు చేసి నాపై సోషల్ మీడియాలో బద్నాం చేయించారు. అయినా మేం భయపడలేదు. గుజరాత్లో సబర్మతి ప్రాజెక్ట్ చేపట్టి 60వేల కుటుంబాలను తరలించారు. యూపీలో కూడా గంగా నది ప్రక్షాళన కోసం ఇళ్లు కూల్చారు. ఢిల్లీలో యమునా నది ప్రక్షాళన చేస్తామని చెప్పారు. నిజాం చేసిన అభివృద్ధిని కాలగర్భంలో కలిపేశారు. మూసీ ప్రక్షాళనకు ఎంత అవుతుందో ఇప్పుడే చెప్పలేం. మూసీ పరివాహక ప్రాంతాల్లో శివాలయం, గురుద్వార్, మసీదు, చర్చి నిర్మిస్తాం. మూసీ ప్రక్షాళన జరగలా వద్దా?.. ప్రతిపక్ష నేతలు చెప్పాలి. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలకు నివాసాలు కల్పిస్తామంటే అడ్డుకుంటున్నారు. ప్రతిపక్ష నేతలు మూసీ పరివాహక ప్రాంతంలో ఉండగలరా?’ అని ప్రశ్నించారు. -
అక్బరుద్దీన్ Vs శ్రీధర్బాబు.. మూసీలో ప్రైవేట్ ల్యాండ్ ఎంత?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మూసీ అంశంపై వాడీవేడి చర్చ నడిచింది. మూసీ అభివృద్ధిని ఎప్పటి నుంచి ప్రారంభిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ. మూసీ ప్రాజెక్ట్ వివరాలను ఇప్పటి వరకు ఎందుకు చెప్పడం లేదని పలు ప్రశ్నలు సంధించారు. ఆయన ప్రశ్నలకు మంత్రి శ్రీధర్ బాబు సమాధానం ఇచ్చారు.సభలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. మూసీకి, మీర్అలాంకు సంబంధమేంటి?. రెండు మూడు అంశాలను క్లబ్ చేస్తే ఎలా?. అసెంబ్లీ అధికారులు విధులను సరిగ్గా నిర్వర్తించడం లేదు. సభ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోవాలి. రెండేళ్ల నుంచి మూసీ పేరుతో కాలం గడుపుతుంది ఈ ప్రభుత్వం. మూసీ డెవలప్మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు.. అసలు మూసీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది?. మూసీ ప్రాజెక్ట్ బాబు ఘాట్ వరకు ఉందని విన్నాను.. కానీ ప్రాజెక్టు వివరాలు సర్కార్ చెప్పడం లేదు.నాకు తెలిసినంత వరకు అనంతగిరి నుంచి మూసీ ప్రారంభం అవుతుంది. ప్రభుత్వం అనంతగిరి నుంచి ప్రాజెక్ట్ తీసుకుంటుందా? లేదా?. మూసీలో ప్రైవేట్ ల్యాండ్ ఎంత ఉంది?. గోదావరి నీళ్లను హిమాయత్, ఉస్మాన్ సాగర్లోకి ఎలా తెస్తారు?. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ క్యాచిమెంట్ ఏరియా ఎంతో చెప్పాలి?. గతంలో అవసరం లేకుండా హిమాయత్, ఉస్మాన్ సాగర్ గేట్లు తెరిచారు?. ఈ రెండు సాగర్లలో వర్షపు నీళ్లు వస్తాయి.. మరి గోదావరి నీళ్లు తెస్తే ఎలా? అని ప్రశ్నించారు.మరోవైపు.. అక్బర్ద్దీన్ ప్రశ్నలకు మంత్రి శ్రీధర్ బాబు సమాధానమిస్తూ..‘మూసీ అభివృద్ధి ప్రాజెక్టును ఎంఆర్డీసీఎల్ చేపడుతుంది. ఉస్మాన్సాగర్ నుంచి బాపూఘాట్ వరకు మూసీ అభివృద్ధి ప్రాజెక్టు జరుగుతుంది. ప్రణాళిక, విశ్లేషణ, డిజైన్పై 18 నెలల్లో డీపీఆర్ సమర్పిస్తుంది. నల్లగొండ జిల్లా సాగు నీరుకు మూసీ నది ఉపయోగం. మూసీ పునరుజ్జీవనం జరగాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటున్నారు. మూసీ నది జంట నగరాలకే కాదు.. రాష్ట్రానికి సంబంధించిన అంశం. మీరాలం ఫీడెడ్ చానెల్ మూసీతో అనుసంధానమై ఉంది’ అని చెప్పుకొచ్చారు. -
హైదరాబాద్ : ఈ గుహలో ఉన్న లక్ష్మీ నరసింహ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
-
యూట్యూబర్ అన్వేష్ కేసులో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: యూట్యూబర్ అన్వేష్పై నమోదు అయిన కేసుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసు దర్యాప్తును పంజాగుట్ట పోలీసులు వేగవంతం చేశారు. అతగాడు చేసిన అభ్యంతకర.. అనుచిత వ్యాఖ్యల తాలుకా వీడియోలను క్షుణ్ణంగా పరిశీలించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో అన్వేష్కు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్లపై ఆరాలు తీస్తున్నారు. (Prapancha Yatrikudu Anvesh Controversy)నా అన్వేషణ చానెల్స్తో ప్రపంచ యాత్రికుడు, ఆటగాడిగా పాపులారిటీ సంపాదించుకున్న అన్వేష్.. సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ సినీనటి, బీజేపీ నేత అయిన కరాటే కల్యాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అభ్యంతర కంటెంట్ ప్రచారం చేశారని పేర్కొనడంతో అన్వేష్పై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. ఈ కేసులో నోటీసులు ఇవ్వడానికి ముందు అతని అకౌంట్లకు వెరిఫై చేసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు అన్వేష్ యూజర్ ఐడీ వివరాలు కావాలంటూ ఇన్స్టాగ్రామ్కు ఓ లేఖ రాసినట్లు తెలుస్తోంది. తద్వారా వారిచ్చే వివరాలతో అతని అకౌంట్లను పరిశీలించనున్నారు. (Naa Anveshana Police Case News)ఇప్పటికే అన్వేష్పై ఖమ్మంలోని ఖానాపురంహవేలి పీఎస్లో ఓ కేసు నమోదయ్యింది. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా హిందువులు పూజించే సీతాదేవి, ద్రౌపదీదేవిలపట్ల అసభ్యంగా వీడియో రిలీజ్ చేశాడని ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. హీరోయిన్ల వస్త్రధారణపై సినీ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలను ఖండించే క్రమంలో అన్వేష్ తన నోటికి పని చెప్పాడు. హిందూ దేవతల ప్రస్తావనతో వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను హిందూ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అన్వేష్ను దేశద్రోహిగా ప్రకటించాలని.. వెంటనే భారత్కు రప్పించి.. శిక్షించాలని కోరుతున్నాయి. అదే సమయంలో అతన్ని అన్ఫాలో కొడుతూ నెట్టింట మినీ ఉద్యమమే నడిపిస్తున్నారు. -
కొత్తగూడెంలో కాలేజీ బస్సు బోల్తా.. విద్యార్థులకు గాయాలు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం జిల్లాలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కాలేజీ విద్యార్థులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులు గాయపడటంతో వారికి స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట అటవీ ప్రాంతంలో ఎర్రమ్మ తల్లి గుడి వద్ద కేఎల్ఆర్ కాలేజీకి చెందిన బస్సు శుక్రవారం ఉదయం బోల్తా పడింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో 60 మంది విద్యార్థులు ఉన్నట్టు తెలిసింది. కాలేజీ బస్సు మణుగూరు నుండి పాల్వంచకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బస్సు బోల్తా కారణంగా విద్యార్థులు బస్సు కింద ఇరుక్కుపోయారు. ఈ ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
ఐదు బిల్లులకు ప్రభుత్వం ఆమోదం
ఐదు బిల్లులకు ప్రభుత్వం ఆమోదంతెలంగాణ శాసన సభలో ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్ మెంట్ అండ్ రెగ్యులేషన్ బిల్లు.మోటర్ వెహికిల్ టాక్సేషన్ బిల్లును ఆమోదించిన సభఈ బిల్లుతో పాటు మొత్తం ఐదు బిల్లులకు ప్రభుత్వ ఆమోదంప్రభుత్వ బిల్లులకు సభ ఆమోదంహైదరాబాద్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తాం: శ్రీధర్ బాబు.. మంత్రిప్రభుత్వ కార్యాలయాల్లో సరిపడే సిబ్బంది ఉండేలా చొరవ తీసుకుంటుంన్నాంగ్రేటర్ హైదరాబాద్ పరిపాలన వికేంద్రీకరణ పై దృష్టి పెట్టాంహైదరాబాద్ అభివృద్ధి కి ప్రత్యేక నిధులు కేటాయిస్తాంఉపాధి హామీ పథకం గొప్పతనం ఏంటి మహేశ్వర్ రెడ్డి తెలుసుకోవాలిమహాత్మాగాంధీ పేరు తొలగించి అవమానించారుమోడీ, అమిత్ షా కు చాలా సన్నిహితుడు బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డిఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు కొనసాగేలా మహేశ్వర్ రెడ్డి చొరవ చూపాలి👉ప్రజాస్వామ్యంలో మాకు కూడా హక్కు ఉంటుంది: తలసాని శ్రీనివాస్రెండు సంవత్సరాల్లో సభను చూసి అసహహించుకుంటున్నారుప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నలు ఉండాలిప్రశ్నలు అడగకుండా అడ్డగించడం సరికాదుహైదరాబాద్ కొత్తగా కట్టడానికి వచ్చినట్లు సీఎం మాట్లాడుతున్నారుసభలో మమ్మల్ని అవహేళన చేస్తున్నారుప్రధాన ప్రతిపక్షంగా మాకు వాయిస్ ఇవ్వకుండా ఇతరులకు ఇస్తున్నారుఅసెంబ్లీలో రూల్స్ ఫాలో కావాలి.. ముఖ్యమంత్రి పరిధి దాటి మాట్లాడుతున్నారురెండేళ్లలో ఒక్క ప్రాజెక్ట్ కూడా చేయలేదుస్పీకర్ మా వైపు కూడా చూడట్లేదు30 ఏళ్ల నుండి సభ చూస్తున్నా.. ఇంతటి దారుణం ఎక్కడ లేదుగాంధీభవన్ లాగా సభను వాడుతున్నారుప్రభుత్వలు శాశ్వతం కాదు.. రాచరిక పాలన కొనసాగిస్తున్నారు👉అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన బీఆర్ఎస్రేపటి నుంచి అసెంబ్లీకి హాజరుకావొద్దని బీఆర్ఎస్ నిర్ణయంగన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ధర్నాస్పీకర్ వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళనరేపు కృష్ణానదీ జలాలు, పాలమూరు ప్రాజెక్ట్పైపవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న బీఆర్ఎస్👉మున్సిపాల్టీ సవరణ బిల్లులను ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్బాబుఅసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాకౌట్సీఎం మాట్లాడిన తర్వాత తమకు అవకాశం ఇవ్వలేదని వాకౌట్ చేసిన బీఆర్ఎస్👉ప్రతిపక్ష నేతలు మాపై విషం చిమ్ముతున్నారు: సీఎం రేవంత్మొత్తం 55 కిలోమీటర్ల మేర మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిరెండేళ్లలో గండిపేటకు గోదావరి జలాలు తీసుకొస్తాంసంక్రాంతి లోగా ఫస్ట్ఫేజ్పై క్లారిటీ వస్తుందిఫస్ట్ ఫేజ్లో గండిపేట నుంచి గౌరెల్లి వరకు ప్రక్షాళనప్రతిపక్ష నేతలు మాపై విషం చిమ్ముతున్నారుకడుపు నిండా విషం నింపుకున్నారురేవంత్రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని కొందరు మాట్లాడుతున్నారురియల్ ఎస్టేట్తో నగరం మరింత అభివృద్ధి జరుగుతోందిమూసీ ప్రక్షాళన జరగాలా? వద్దా? ప్రతిపక్షనేతలు చెప్పాలిమూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలకు నివాసాలు కల్పిస్తామంటే అడ్డుకుంటున్నారుప్రతిపక్ష నేతలు మూసీ పరివాహక ప్రాంతంలో ఉండగలరా?👉మా సర్కార్ వచ్చాక వాటిపై ఉక్కుపాదం మోపాం: సీఎం రేవంత్మూసీ ప్రక్షాళనపై సభ్యులు సూచనలు చేశారుసభ్యుల సూచనలు పరిగణనలోకి తీసుకుంటాంనదీ పరివాహక ప్రాంతాల్లోనే నిర్మాణాలు జరిగాయిమోక్షగుండం విశ్వేశ్వరయ్య వరద ముంపు పరిష్కారం చూపారునిజాం ప్రభువు నిర్మించిన ప్రాజెక్ట్ ద్వారా నగరానికి నీరు అందుతోందినదీ పరివాహక ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతోందిఫామ్ హౌస్ల డ్రైనేజీలు గండిపేటలో కలిపారుమా ప్రభుత్వం వచ్చాక వాటిపై ఉక్కుపాదం మోపాం👉మండలిలో కవిత చిట్చాట్రాజీనామా చేసి నాలుగు నెలల కాలం గడిచిపోయిందినాలుగు నెలలో అనేక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయినా రాజీనామా ను ఆమోదించాలని చైర్మన్ను కోరడానికి మండలికి వచ్చాఫ్లోర్లో మాట్లాడే ఛాన్స్ ఇవ్వాలని చైర్మన్ను కలిసి కోరతా..కేసీఆర్ బీఆర్ఎస్ను కాపాడుకోవాలి..రేవంత్ రెడ్డి చేస్తున్న తప్పిదాలకు రేవంత్ రెడ్డినే రెండు సార్లు ఉరి తీయాలికేసీఆర్పై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు.కేసీఆర్ను తిడుతుంటే కూతురిగా నాకు రక్తం ఉడుకుతుంది👉మూసీ ప్రాజెక్ట్కు రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తోంది?: హరీష్రావుమూసీ ప్రాజెక్టులో ఎన్ని నివాసాలను కూల్చారు?కూల్చిన ఇండ్లకు ఇప్పటి వరకు పునరావాసం ఎంత కల్పించారు?మూసీకి గోదావరి నీళ్లు మల్లన్న సాగర్ నుంచి తెస్తున్నారా? లేదామొన్న వరదలు వచ్చినపుడు ఉద్దేశపూర్వకంగా గేట్లు ఎత్తిన విషయం ప్రభుత్వం దృష్టిలో ఉందా? లేదా?మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లను కూల్చితే బీఆర్ఎస్ పోరాటం చేస్తది.మూసీలో ఖాళీ స్థలాలు ఉన్నాయి.. అక్కడ అభివృద్ధి చేయాలి👉అసెంబ్లీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డిజూబ్లీహిల్స్ నివాసం నుంచి అసెంబ్లీకి బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిమండలికి చేరుకున్న ఎమ్మెల్సీ కవితతన రాజీనామాను ఆమోదించాలని మండలి చైర్మన్ ను కోరనున్న కవిత👉మూసీకి-మీరాళంకు సంబంధం ఏంటి?: అక్బరుద్దిన్ ఓవైసీరెండు మూడు అంశాలను క్లబ్ చేస్తే ఎలా?అసెంబ్లీ అధికారులు విధులను సరిగ్గా నిర్వర్తించడం లేదుసభ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోవాలిరెండేళ్ల నుంచి మూసి పేరుతో కాలం గడుపుతుందిమూసీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు.. అసలు మూసి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది?నాకు తెలిసినంత వరకు అనంతగిరి నుంచి ప్రారంభం అవుతుందిప్రభుత్వం అనంతగిరి నుంచి ప్రాజెక్ట్ తీసుకుంటుందా? లేదా?మూసీ లో ప్రైవేట్ ల్యాండ్ ఎంత ఉంది?గోదావరి నీళ్లను హిమాయత్, ఉస్మాన్ సాగర్లో ఎలా తెస్తారు?హిమాయత్ సాగర్, హుస్మాన్ సాగర్ కాచిమెంట్ ఏరియా ఎంతో చెప్పాలి?గతసారి అవసరం లేకుండా హిమాయత్, ఉస్మాన్ సాగర్ గేట్లు తెరిచారు?ఈ రెండు సాగర్లలో వర్షపు నీళ్లు వస్తాయి.. మరి గోదావరి నీళ్లు తెస్తే ఎలా?మూసీ ప్రాజెక్ట్ బాబు ఘాట్ వరకు విన్నాను.. కానీ ప్రాజెక్టు వివరాలు సర్కార్ చెప్పడం లేదు.శాసన మండలి:👉గత పదేళ్లలో ఏనాడు ప్రశ్నించలేదు: మంత్రి పొన్నం ప్రభాకర్బలహీన వర్గాల సంక్షేమంపై గత పదేళ్లలో ఏనాడు ప్రశ్నించలేదు13 కార్పొరేషన్లు ఉండేవి.. తరువాత 8 కార్పొరేషన్లు, ఒక ఈబీసీ బోర్డు ఏర్పాటు చేశాంస్థలాల సేకరణ చేశాం.. వాటి అభివృద్ధికి నిధులు కేటాయించలేదునిధులు పేపర్కే తప్ప గతంలో ఒక్క రూపాయి నిధులు ఇవ్వలేదుగొల్ల కురుమ భవన్కు మాజీ ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం తన సొంత నిధులతో ఆ భవనాన్ని నిర్మించారుప్రభుత్వం ఏర్పడిన తరువాత బలహీనవర్గాల మంత్రిగా అన్ని కుల సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాంకొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఎడ్యుకేషన్,స్కిల్స్ డెవలప్మెంట్ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాంబలహీన వర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందిబలహీన వర్గాలకు సముచిత న్యాయం జరిగేలా మా కార్యాచరణ ఉందిపార్టీ పదవులు, ప్రభుత్వ పదవులలో బలహీన వర్గాలకు ప్రాధాన్యత కల్పిస్తున్నాంసమగ్రమైన ప్రణాళికతో కొత్త కార్పొరేషన్లకు శాశ్వత సిబ్బందిని నియమిస్తాంధోబీ, కుమ్మరి ప్రత్యేక ప్రణాళికలు తీసుకుంటున్నాంగీత కార్పొరేషన్ కాటమయ్య రక్షణ కవచాలు ఇస్తున్నాంబలహీన వర్గాల శాఖ మంత్రిగా సామాజిక న్యాయం జరగడానికి రాజకీయాలు అతీతంగా పని చేస్తాంప్రశ్నోత్తరాల సమయం:హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లోకి పంప్ చేయడానికి ఏర్పాట్లు: శ్రీధర్బాబుత్వరలోనే డీపీఆర్లు తయారు చేస్తాంహిమాయత్ సాగర్ నుంచి బాపూఘాట్ వరకు అధ్యయనంమూసీ ప్రక్షాళనకు కట్టుబడి ఉన్నాంసాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభలో యూరియా కొరతపై బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. యూరియా కొరతపై చర్చ జరపాలని బిఆర్ఎస్ వాయిదా తీర్మానం చేయగా.. స్పీకర్ తిరస్కరించారు. బీఆర్ఎస్ నిరసనపై శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలకు ఏదైనా డిమాండ్ ఉంటే పాయింట్ ఆఫ్ ఆర్డర్ ప్రకారం రావాలన్నారు. ప్రతిపక్షాల డిమాండ్లపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ప్రశ్నోత్తరాల సమయంలో నిరసన చేయడం సరైన పద్ధతి కాదని శ్రీధర్బాబు అన్నారు. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్కు షాక్.. కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి(Kotha prabhakar reddy) బిగ్ షాక్ తగలింది. దుర్గం చెరువు అక్రమ ఆక్రమణపై హైడ్రా ఫిర్యాదుతో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్, ఆయన సోదరుడు వెంకట్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో భూ ఆక్రమణపై దర్యాప్తు చేపట్టినట్టు మాదాపూర్ పోలీసులు తెలిపారు.వివరాల మేరకు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, వెంకట్ రెడ్డిలు.. దుర్గం చెరువులో సుమారు ఐదు ఎకరాల భూమిని అక్రమంగా ఆక్రమించినట్లు ఆరోపణలు వచ్చాయి. చెరువు ప్రాంతాన్ని మట్టి, రాళ్లతో నింపేసినట్టు హైడ్రా(HYDRA) సూపర్వైజర్ కాంత్రి ఆనంద్, హైడ్రా అధికారులు గుర్తించారు. దీంతో, ఆక్రమణలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండగా.. అక్రమంగా ఆక్రమించిన ఐదు ఎకరాల భూమిని ఎస్టీఎస్ ప్రైవేటు ట్రాన్స్పోర్టు పార్కింగ్కు వినియోగిస్తున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.అయితే, ఈ భూమి వ్యవహారంలో 2014లో హెచ్ఎండీఏ ఎఫ్టీఎల్ ప్రాథమిక నోటిఫికేషన్ను జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ఉన్నప్పటికీ బీఆర్ఎస్ నేతలు భూమి ఆక్రమించినట్టు ఫిర్యాదులో చెప్పుకొచ్చారు. ఇలా ఆక్రమించిన భూమి ద్వారా నిందితులు అక్రమ ఆదాయం(రెంటుకు ఇవ్వడం) పొందుతున్నారని ఆరోపించారు. దీంతో, మాదాపూర్ పోలీసులు.. ప్రభాకర్ రెడ్డి, వెంకట్ రెడ్డిపై BNS 329(3), 3(5) సెక్షన్లు, PDPP యాక్ట్ సెక్షన్-3 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
తోడులేని జీవితం మాకొద్దు!
కల్వకుర్తి టౌన్/ఉయ్యాలవాడ: జీవిత భాగస్వాముల హఠాన్మరణం వారికి అంతులేని మనోవేదన కలిగించింది. జీవితంపై ఏర్పడిన విరక్తి బలవన్మరణానికి పురికొల్పింది. తాము మాత్రమే కన్నుమూస్తే కన్నబిడ్డలు అనాథలు అవుతారన్న భయం వారిని సైతం కడతేర్చేలా చేసింది. భర్త మరణాన్ని తట్టుకోలేక ఓ గృహిణి ఇద్దరు పిల్లలతో కలిసి నిద్రమాత్రలు కలిపిన కేక్ తినగా వారిలో తల్లీబిడ్డ మృతిచెందారు. మరోవైపు కొన్ని నెలల కిందట భార్య బలవన్మరణానికి పాల్పడటంతో తట్టుకోలేకపోయిన భర్త తన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపి ఉరేసుకొని కన్నుమూశాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలోని వేర్వేరు ప్రాంతాల్లో న్యూ ఇయర్ వేడుకల వేళ రెండు కుటుంబాల్లో చోటుచేసుకున్న ఆత్మహత్యలు స్థానికంగా తీరని వేదన మిగిల్చాయి. భర్తలేని జీవితం వద్దనుకొని.. నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని తిలక్నగర్ కాలనీకి చెందిన భీంశెట్టి ప్రకాశ్ (47)కు భార్య ప్రసన్న (38), 8వ తరగతి చదువుతున్న కూతురు మేఘన (13), 10వ తరగతి చదువుతున్న కుమారుడు అర్షిత్ రామ్ ఉన్నారు. స్థానికంగా బుక్ సెంటర్ నిర్వహించే ప్రకాశ్.. నవంబర్ 14న గుండెపోటుతో మృతిచెందాడు. దీంతో అతడి భార్య ప్రసన్న తీవ్ర మానసిక ఆందోళనకు గురైంది. తల్లిదండ్రులు ధైర్యం చెబుతూ ఆమె వద్దే ఉంటున్నప్పటికీ భర్త లేని జీవితం తనకు వద్దని ప్రసన్న నిర్ణయించుకుంది. అదే సమయంలో తన పిల్లలు ఇతరులకు భారం కావొద్దని భావించింది. బుధవారం ఉదయం తల్లిదండ్రులు స్థానికంగా ఉంటున్న కుమారుడి ఇంటికి వెళ్లడంతో చనిపోయేందుకు ఇదే సరైన సమయం అనుకుంది. వెంటనే నిద్రమాత్రలను పొడి చేసి కూల్ కేక్లో కలిపింది. ఇంటి తలుపులు గడియపెట్టి టీవీ చూస్తున్న పిల్లలతో కలిసి కేక్ కట్ చేసింది. అనంతరం తల్లి, కూతురు కేక్ తిని అపస్మారక స్థితికి వెళ్లగా కొడుకు మాత్రం అనారోగ్యం కారణంగా సరిగ్గా తినలేదు. దీంతో అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లలేదు. రోజూ మాదిరిగానే యోగక్షేమాలు తెలుసుకోవడానికి మధ్యాహ్న సమయంలో వచి్చన ప్రసన్న సోదరుడు చక్రి ఎంతసేపు తలుపు కొట్టినా ఎవరూ తీయలేదు. చివరకు గట్టిగా అరవడంతో అర్షిత్ రామ్ తేరుకొని తలుపు తీశాడు. వెంటనే ముగ్గురినీ 108 వాహనంలో ఆస్పత్రికి తరలించగా అప్పటికే తల్లి, కూతురు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అర్షిత్ రామ్ చికిత్స పొందుతున్నాడు. 4 పేజీల సూసైడ్ నోట్.. ఆత్మహత్యకు ముందు ప్రసన్న పుస్తకంలో నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాసింది. అందులో ‘నా చావుకు ఎవరూ కారణం కాదు. భర్త లేని జీవిత యుద్ధాన్ని చేయలేక చనిపోతున్నా. నేను చనిపోతే పిల్లలను ఎవరూ చూసుకోలేరని.. వారిని కూడా నాతో తీసుకెళ్తున్నా. నన్ను క్షమించండి. నా పెళ్లి చీర, పిల్లలకు ఇష్టమైన ఆకుపచ్చ దుస్తుల్లో దహన సంస్కారాలు నిర్వహించండి’అని ప్రసన్న రాసుకొచ్చింది. తమ మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించవద్దని సూసైడ్ నోట్లో కోరింది. ఐదు నెలల క్రితం చిన్నారుల తల్లి బలవన్మరణం ఏపీలోని నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలంలోని తుడుమలదిన్నెకు చెందిన వేములపాటి సురేంద్ర (35), మహేశ్వరి దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. తీవ్ర అనారోగ్యం బాధతో గతేడాది ఆగస్టులో మహేశ్వరి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి పిల్లలు కావ్యశ్రీ (7), జ్ఞానేశ్వరి (5), సూర్య గగన్ (1)తో కలిసి జీవిస్తున్న సురేంద్ర మానసికంగా కుంగిపోయాడు. బుధవారం రాత్రి ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపి ఆపై తానూ ఉరేసుకొని తనువు చాలించాడు. గురువారం ఉదయం 8 గంటలైనా ఇంటి తలుపులు తెరవకపోవడంతో సురేంద్ర తల్లి కృష్ణమ్మ వెళ్లి చూడగా కుమారుడు, మనవరాళ్లు, మనవడు విగత జీవులుగా కనిపించారు. -
మాకూ ‘పవర్ పాయింట్’ అవకాశం ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని భావిస్తే, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్కు కూడా అదే అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారక రామారావు డిమాండ్ చేశారు. సభలోకి అడుగుపెట్టిన తర్వాత ముఖ్యమంత్రి, సాధారణ సభ్యుడు అనే తేడా ఉండదని, సభ్యులందరికీ సమాన హక్కులే ఉంటాయన్నారు. తెలంగాణ భవన్లో గురువారం కేటీఆర్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘ప్రభుత్వం తన వాదన చెబితే, మేం మా వాదన చెప్పుకుంటాం. అంతే తప్ప మేమేమీ అదనంగా అడగడం లేదు. గత పదేళ్లలో తెలంగాణ వ్యవసాయాన్ని, సాగునీటిని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లామో సభలో వివరించేందుకు సిద్ధంగా ఉన్నాం’అని కేటీఆర్ చెప్పారు. 2016 మార్చి 31న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ బాయ్కాట్ చేసిందని గుర్తు చేశారు. అప్పుడు దాన్ని పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమని విమర్శించిన కాంగ్రెస్, ఈరోజు అదే విధానాన్ని ఎలా సమర్థిస్తుందని ప్రశ్నించారు. దీనిపై స్పీకర్కు లేఖ ఇచ్చామని, ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తామని చెప్పారు. అవగాహన లేకుండా ఉపన్యాసాలా? నదీ జలాలు, సాగునీటి వ్యవస్థపై కనీస అవగాహన లేని ముఖ్యమంత్రి శాసనసభలో ఉపన్యాసాలు ఇవ్వబోతున్నారంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భాక్రానంగల్ ప్రాజెక్ట్ తెలంగాణలో ఉన్నట్లు ముఖ్యమంత్రి చెప్పడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమన్నారు. ఆ ప్రాజెక్ట్ హిమాచల్ ప్రదేశ్లో ఉందన్న విషయం కూడా తెలియని స్థితిలో ఉన్న సీఎం నుంచి గోదావరి, కృష్ణా జలాలపై పాఠాలు వినాలా? అని ప్రశ్నించారు. దేవాదుల ప్రాజెక్ట్ ఏ బేసిన్లో ఉందో కూడా ఆయనకు తెలియదని విమర్శించారు. సుంకిశాల ప్రాజెక్ట్ కూలిపోయినా సమాధానం చెప్పలేని పరిస్థితి ఉందన్నారు. ‘మేం మీ దగ్గర ఏం నేర్చుకోవాలి? చెక్డ్యాంలు ఎలా ఫెయిల్ చేయాలో నేరి్పస్తారా? మేడిగడ్డ ఎలా పేల్చామో చెబుతారా? సుంకిశాల ఎలా కూల్చామో వివరిస్తారా? వట్టెం పంప్ హౌస్ ఎలా ముంచామో చూపిస్తారా? లేక కృష్ణా నదిపై తెలంగాణకు ఉన్న హక్కులన్నింటినీ కేఆర్ఎంబీకి ఎలా ధారాదత్తం చేశారో పవర్ పాయింట్లో చూపిస్తారా?’అని కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాలమూరును పక్కన పెట్టారు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లుగా పక్కన పెట్టిందని కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి తరచూ ‘పండబెట్టి తొక్కుతాం’అంటారని, ఇప్పుడు నిజంగానే ఆ ప్రాజెక్ట్ను పండుకోబెట్టి పాలమూరు రైతాంగాన్ని తొక్కుతున్నారని మండిపడ్డారు. ఏం చేశారని ప్రజల ముందుకు వెళ్తారని నిలదీశారు. ప్రజాస్వామ్యాన్ని నిజంగా గౌరవించే ప్రభుత్వం అయితే, శాసనసభలో ప్రధాన ప్రతిపక్షానికి సమాన అవకాశాలు కల్పించాల్సిందేనని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో తిరోగమనమే.. కేలండర్లు మారుతున్నాయే తప్ప, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆశలతో ఓటేసిన ప్రజల జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. రెండేళ్లుగా తెలంగాణ అభివృద్ధి బాటలో కాకుండా తిరోగమనం వైపు సాగుతోందన్నారు. కేటీఆర్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నూతన సంవత్సర డైరీని కేటీఆర్ ఆవిష్కరించిన అనంతరం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడకముందు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టకముందున్న పరిస్థితులు తిరిగి వస్తున్నాయని చెప్పారు. పండుగ వాతావరణం ఉన్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పారీ్టకి కార్యకర్తలే అసలైన బలమని, గులాబీ జెండా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిందని కేటీఆర్ అన్నారు. -
పనికిరాని వీడియోలకు వ్యూస్
ప్రపంచంలో అతిపెద్ద వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్ అయిన యూట్యూబ్లో విలువ లేని, పనికి రాని వీడియోలు వెల్లువెత్తుతున్నాయి. ఒకటికాదు రెండు కాదు.. ఏకంగా బిలియన్ల కొద్దీ మొబైల్ స్క్రీన్పై దర్శనమిస్తున్నాయి. నూతన యూజర్ల స్క్రీన్పై వచ్చే షార్ట్స్లో ఏఐతో తయారైన బ్రెయిన్ రాట్ వీడియోలు అయిదింట ఒక వంతు కైవసం చేసుకున్నాయి. వీటితో వీక్షకులకు సమయం వృథా తప్ప ఎటువంటి ప్రయోజనంచేకూర్చకపోవడం గమనార్హం. – సాక్షి, స్పెషల్ డెస్క్క్యాప్వింగ్ నివేదిక ప్రకారం... క్లౌడ్ ఆధారిత ఆన్లైన్ వీడియో ఎడిటర్ క్యాప్వింగ్ రూపొందించిన నివేదిక ప్రకారం.. ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన 15,000 యూట్యూబ్ చానెళ్లను కంపెనీ అధ్యయనం చేసింది. ప్రతి దేశం నుంచి టాప్–100 చానెళ్లు వీటిలో ఉన్నాయి. 278 చానెళ్లు పూర్తిగా ఏఐ స్లాప్ కంటెంట్ను మాత్రమే ప్రసారం చేస్తున్నాయి. ఏఐ స్లాప్ చానెళ్లు 2025 అక్టోబర్ నాటికి 6,300 కోట్లకుపైగా వ్యూస్, 22.1 కోట్ల మంది సబ్స్క్రైబర్స్ ను సంపాదించాయి. ఏటా ఇవి సుమారు రూ.1,050 కోట్లు ఆర్జిస్తున్నాయంటే ఆశ్చర్యం వేయకమానదు. ఏఐ స్లాప్ యూట్యూబ్ చానెళ్లలో మన దేశానికి చెందిన ‘బందర్ అప్నా దోస్త్’అత్యధిక వ్యూస్తో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది. అంతేకాదు ఈ విభాగంలో ఏటా రూ.38 కోట్లకుపైగా ఆదాయంతో అంతర్జాతీయంగా టాప్లో నిలిచింది. నివేదిక హైలైట్స్.. ⇒ 207 కోట్లకుపైగా వ్యూస్తో భారత్కు చెందిన ‘బందర్ అప్నా దోస్త్’ఏఐ స్లాప్ చానెల్ అంతర్జాతీయంగా టాప్లో నిలిచింది. ⇒ ప్రపంచంలో అత్యధికంగా స్పెయిన్కు చెందిన ట్రెండింగ్ ఏఐ స్లాప్ చానెల్స్కు 2 కోట్ల మందికిపైగా సబ్స్రై్కబర్స్ ఉన్నారు. ⇒ దక్షిణ కొరియాలో ప్రముఖ ఏఐ స్లాప్ చానెల్స్ 845 కోట్ల పైచిలుకు వ్యూస్ నమోదు చేశాయి. ⇒ యూఎస్లోని స్లాప్ చానెల్ క్యూంటోస్ ఫాసినాంటెస్ (సిక్) 59.5 లక్షల మంది సబ్స్రై్కబర్స్ కలిగి ఉంది. ⇒ కొత్త యూజర్లకు వచ్చే ఫీడ్లో తొలి 500 యూట్యూబ్ షార్ట్స్లో బ్రెయిన్రాట్ వీడియోలు దాదాపు 33% ఉన్నాయి. ⇒ నూతన యూజర్ల స్క్రీన్పై వచ్చే మొదటి 500 షార్ట్స్లో ఏఐ స్లాప్ వీడియోలు 21% కైవసం చేసుకున్నాయి.ఏఐ స్లాప్ తగినంత శ్రద్ధ, కచ్చితత్వం, ఆలోచన లేకుండా సబ్స్క్రిప్షన్స్, వ్యూస్ కోసమే ఆటోమేటిక్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఉపయోగించి రూపొందించి, పంపిణీ చేసిన విలువ లేని, పనికిరాని ఏఐ వీడియోలు. కంటెంట్లో లోపాలకుతోడు ప్రతికూల ప్రభావాలకు ఇవి దారితీస్తాయి.బ్రెయిన్రాట్నియంత్రణ, అర్థం లేని, తక్కువ నాణ్యత గల ఏఐ, ఏఐ రహిత వీడియో కంటెంట్ చూస్తున్నప్పుడు వీక్షకుడి మానసిక, మేధోస్థితిని క్షీణింపజేసే ప్రభావాన్ని కలిగి ఉంటాయి. -
టీచర్లకు ఏఐ పాఠాలు
సాక్షి, హైదరాబాద్: వికసిత్ భారత్లో భాగంగా మానవ వనరుల అభివృద్ధిపై కేంద్రం దృష్టి పెట్టింది. దీనికోసం రాష్ట్రాల్లో వివిధ స్థాయిల్లో ఉన్న కోర్సులను రీడిజైన్ చేయాలని ఒత్తిడి చేస్తోంది. దీంతో నైపుణ్యం గల మానవవనరుల కోసం అన్ని స్థాయిల కోర్సుల్లో సిలబస్ మార్పులు అనివార్యమైంది. ఫలితంగా పాఠశాల, ఇంటర్, ఉన్నత విద్య వరకూ సిలబస్ మార్పులపై దృష్టి పెట్టారు. దీనిపై ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. పాఠశాల విద్య నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సిలబస్ అవసరమని ఇందులో పేర్కొన్నారు. దీనికోసం టీచర్ల నుంచి యూనివర్సిటీ ప్రొఫెసర్ల వరకూ వేసవి సెలవుల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వబోతున్నారు. ఇందుకు సంబంధించిన కసరత్తు వేగవంతం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈ నెలాఖరు కల్లా కేంద్రానికి రాష్ట్ర విద్యాశాఖ నివేదిక ఇవ్వాల్సి ఉంది. కమిటీల ఏర్పాటు పాఠశాల స్థాయిలో 9, 10 తరగతులు, ఇంటర్లో రెండు సంవత్సరాలు, డిగ్రీ, పీజీతో పాటు ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ వంటి వృత్తి విద్యా కోర్సుల్లోనూ సిలబస్ను మార్చాలని నిర్ణయించారు. 20% సిలబస్ను ఏఐతో నింపాలని భావిస్తున్నారు. ఏయే చాప్టర్లు తొలగించాలి? ఏ స్థాయిలో ఎంతమేర ఏఐ సిలబస్ను తేవాలనేదానిపై విద్యాశాఖ అన్ని స్థాయిల్లో కమిటీలు వేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ విషయంపై మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డితో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా గత రెండు రోజులుగా సమన్వయం చేసుకుంటున్నారు. టెన్త్ తర్వాత కొనసాగే పాలిటెక్నిక్, ఐటీఐల సిలబస్ను వచ్చే విద్యా సంవత్సరంలో 50 శాతం వరకూ మార్చాలనుకుంటున్నారు. అన్ని కమిటీలతో విద్యాశాఖ ఉన్నతాధికారులు వచ్చే వారం సమావేశమయ్యే అవకాశం ఉంది. యూపీలోని కోర్సులపై దృష్టి గత ఏడాది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)తో కలిసి ఉపాధి అవకాశాలు పెంచే కోర్సులను డిజైన్ చేసింది. దీన్ని తెలంగాణా అనుసరించాలని నిర్ణయించింది. టీసీఎస్తోపాటు అందుబాటులో ఉండే కొన్ని సంస్థలతోనూ అధికారులు చర్చించాలని భావిస్తున్నారు. అక్కడి కోర్సులు, సిలబస్ మార్పులపై జరిపిన సంస్కరణల్లో కొన్నింటిని గుర్తించారు. –పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకూ యూపీలో కమ్యూనికేషన్ మూల పాఠాల సామర్థ్యం, ఏఐ పరిచయంపై బోధకులకు 15 రోజులపాటు శిక్షణ ఇస్తున్నారు. –యూపీలో ఏఐ ఫర్ రియల్ అప్లికేషన్, క్లౌడ్ కంప్యూటిగ్, వర్చువలైజేషన్, ఏఐ ఆప్టిమైజేషన్, ఏఐ ఆధారిత ఫిన్టెక్ లాంటి కోర్సులను తెచ్చారు. డేటాసైన్స్కు సంబంధించి ప్రొడక్టివ్ మోడల్స్, డేటా అనలిటిక్స్ వంటివీ ఉన్నాయి. –యూపీ ప్రభుత్వం పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీ కోర్సుల్లో ఏఐ ట్రైనింగ్ కోసం ప్రత్యేక కోర్సులను డిజైన్ చేసింది. డిప్లొమా, డిగ్రీ, వ్యాపార నైపుణ్యం కోర్సులు ఇందులో ఉన్నాయి. వీటన్నింటినీ రాష్ట్ర విద్యాసంస్థల్లోకి తేవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. -
నేటి నుంచి మళ్లీ అసెంబ్లీ
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ శీతాకాల సమావేశాలు స్వల్ప విరామం తరువాత శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్న వేళ.. పలు కీలక అంశాలపై చర్చకు అధికారపక్షం సిద్ధమైంది. ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల పేరిట గత ప్రభు త్వం ఏటా రూ.కోట్లు అప్పనంగా ఏజెన్సీలకు పంచిపెట్టార ని ఆరోపిస్తున్న అధికారపక్షం ఈ అంశంతోపాటు పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా కృష్ణా, గోదావరి జలాలను సక్రమంగా వినియోగించుకోలేక పోయిందో, అలాగే సకాలంలో ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడం వల్ల జరిగిన నష్టంపై చర్చ చేపట్టనుంది.రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను 42 శాతం బీసీ రిజర్వేషన్లతో నిర్వహించడానికి ఉన్న అవకాశాలపై కూడా ప్రభుత్వం చర్చించనున్నట్లు అధికారవర్గాల సమాచారం. ఇందుకు సంబంధించిన బిల్లులను ఆమోదించి గవర్నర్కు పంపించినా.. అవి ఆమోదానికి నోచుకోకపోవడం, ఆ బిల్లులు రాష్ట్రపతికి చేరి నెలలు గడుస్తున్నా ఆమోదం పొందే అవకాశం లేకపోవడంతో.. ఎలా ముందుకు వెళ్లాలన్న అంశాన్ని ప్రభుత్వం చర్చకు పెట్టనున్నట్లు తెలిసింది. అన్ని రాజకీయ పార్టీల నుంచి వచ్చే అభిప్రాయాల ఆధారంగా ఒక నిర్ణయానికి రావాలని సర్కారు భావిస్తున్నట్టు చెబుతున్నారు. పంచాయతీరాజ్ ఎన్నికలను 42 శాతం రిజర్వేషన్లు వర్తింపజేయకుండానే పూర్తిచేసిన విషయం విదితమే.నేడు అసెంబ్లీలో ఉపాధి హామీపై స్వల్పకాలిక చర్చశుక్రవారం శాసనసభలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమవగానే బీఏసీ ఖరా రు చేసిన ఎజెండాతోపాటు రవాణా, రోడ్లు–భవనాల శాఖకు సంబంధించిన పత్రాలను సభకు సమర్పించనున్నారు. అనంతరం జీహెచ్ఎంసీ విస్తరణ, వార్డుల పునర్విభజనకు సంబంధించిన బిల్లులపై సభ చర్చించనుంది. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో మూసీ పునరుజ్జీవం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల స్థాపన, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు వంటి అంశాలు ఉన్నాయి. మరోవైపు శాసన మండలిలోనూ సభ ప్రశ్నోత్తరాలతో ప్రారంభం అవుతుంది. అనంతరం ప్రభుత్వ బిల్లులపై చర్చ జరగనుంది. -
టీఎంసీల్లో అబద్ధాలు.. క్యూసెక్కుల్లో అజ్ఞానం
సాక్షి, హైదరాబాద్: నదీ జలాల విషయంలో సీఎం రేవంత్రెడ్డి టీఎంసీల కొద్దీ అబద్ధాలు, క్యూసెక్కుల కొద్దీ అజ్ఞానాన్ని పారిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్గా మారిన రేవంత్కు అంతర్జాతీయ స్థాయి అవార్డు ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. సీఎంకు నదీ పరీవాహక ప్రాంతం (బేసిన్) గురించి కనీస అవగాహన లేదని, బచావత్, బ్రిజేశ్ ట్రిబ్యునళ్ల నడుమ తేడా కూడా తెలియదన్నారు. ఈ మేరకు గురువారం రాత్రి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అవమానించం అంటూనే కసబ్తో పోలుస్తారా? ‘నిరాహార దీక్షతో కాంగ్రెస్ మెడలు వంచి తె లంగాణ సాధించిన మహనీయుడు కేసీఆర్. ఆయనకు సభకు వస్తే అవమానించం అని ముఖ్యమంత్రి చెబుతూనే కసబ్తో పోలుస్తున్నాడు. సంస్కారం, మర్యాద తెలియని రేవంత్కు అనాగరికమైన భాష, అసభ్య పదజాలం, బూతు ప్రసంగాలు మాత్రమే తెలుసు. పో లవరం, నల్లమలసాగర్ విషయంలో మేము వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. ‘గోదావరి బనకచర్ల’విషయంలో ఉమ్మడి కమిటీ వేసిన విషయాన్ని దాచిపెట్టి ఏపీ జల దోపిడీకి రేవంత్ తలుపులు తెరిచాడు..’అని హరీశ్రావు ఆరోపించారు. కృష్ణా వాటాలపై పచ్చి అబద్ధాలు ‘కృష్ణా జలాల్లో 299 టీఎంసీల వాటాకు కేసీఆర్ ఒప్పుకున్నారని రేవంత్ పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు. 811 టీఎంసీలు పునఃపంపిణీ చేయాలని రాష్ట్రం వచ్చిన 42 రోజుల్లోనే కేసీఆర్ లేఖ రాసిన విషయాన్ని చెప్పడం లేదు. 811 టీఎంసీల్లో తెలంగాణకు 69 శాతం వాటా దక్కాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. దీనిపై అపెక్స్ కౌన్సిల్ సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీశారు. సెక్షన్ 3 ద్వారా కృష్ణా జలాల పునఃపంపిణీ జరిపిస్తామనే కేంద్రం హామీ మేరకే కేసు విత్ డ్రా చేసుకున్న సంగతి తెలిసినా రేవంత్ అసత్య ప్రచారం చేస్తున్నాడు’ అని హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అజ్ఞానం బయట పెట్టుకున్నారు.. ‘కృష్ణా నీరు అంతా జూరాలకే వస్తుందంటూ రేవంత్ అజ్ఞానం బయట పెట్టుకున్నాడు. తుంగభద్ర ద్వారా శ్రీశైలం రిజర్వాయర్కు 450 నుంచి 600 టీఎంసీలు ప్రతి ఏటా వస్తాయనే జ్ఞానం లేదు. జూరాలపై ‘పాల మూరు–రంగారెడ్డి ప్రాజెక్టు’భారం మోపితే ఆయకట్టు దెబ్బతింటుందని జూరాల, నెట్టెంపాడు, బీమా, కోయిల్సాగర్ రైతులకు తెలుసు. రెండేళ్లుగా పాలమూరు–రంగారెడ్డి కోసం ఒక్క అనుమతి తేకపోగా, డీపీఆర్ కూడా వెనక్కి వచ్చింది..’అని మాజీమంత్రి విమర్శించారు. -
బీఆర్ఎస్ వల్లే భారీ నష్టం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి సంబంధించిన నదీ జలాలకు మరణ శాసనం రాసిందే బీఆర్ఎస్ ప్రభుత్వం అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు అవసరమైన నీటిని జూరాల నుంచి కాకుండా శ్రీశైలం ప్రాజెక్టుకు మార్చడం వల్ల తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని అన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాల కోసం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నీటి సామర్థ్యాన్ని రెండు టీఎంసీల నుంచి ఒక టీఎంసీకి తగ్గించారని విమర్శించారు. నదీ జిలాల విషయంలో బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికి వీలుగా గురువారం ప్రజాభవన్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్పర్సన్లు, ప్రజాప్రతినిధులకు ఆయన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.ఏపీతో అలయ్ బలయ్ చేసుకుని తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఉత్తమ్ ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలోనే ‘పాలమూరు’ ప్రాజెక్టు 90 శాతం పూర్తయిందని చెప్పడం శుద్ధ అబద్ధమని అన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రాజెక్టు పూర్తి చేయాలంటే మొత్తం వ్యయం రూ.80 వేల కోట్లు దాటుతుందని చెప్పారు. 2015లో కేవలం రూ.35 వేల కోట్ల అంచనాతో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని, కానీ డీపీఆర్ తయారు చేసే నాటికి దానిని రూ. 55 వేల కోట్లకు పెంచారని వివరించారు. అది కూడా కాలువల నిర్మాణం, భూ సేకరణ అంశం అందులో లేకుండా చేశారని చెప్పారు. బీఆర్ఎస్ రూ.27 వేల కోట్లే ఖర్చు చేసింది.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఈ ప్రాజెక్టు కోసం చేసిన వ్యయం రూ. 27 వేల కోట్లు మాత్రమేనని ఉత్తమ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. అదే రెండేళ్ల కాంగ్రెస్ హయాంలో రూ.7 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. 2013లో ప్రతిపాదించినట్టు జూరాల వద్దనే నీటిని తీసుకుని ఉంటే వ్యయం తగ్గేదని అన్నారు. -
జనవరిలోనూ గజగజే
సాక్షి, హైదరాబాద్: అత్యల్ప ఉష్ణోగ్రతలు, తీవ్ర చలిగాలులతో డిసెంబర్ నెలలో రికార్డు సృష్టించిన శీతాకాలం.. జనవరి నెలలోనూ అదే స్థాయిలో తన ప్రతాపాన్ని చూపనుంది. డిసెంబర్ నెలలో ఏకంగా 28 రోజులపాటు సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీనికి తోడు తూర్పు ఈశాన్య దిశల నుంచి వస్తున్న గాలుల ప్రభావంతో చలి తీవ్రత అధికంగా నమోదైంది. తాజాగా జనవరి నెలలోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదు కావొచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ నెల మూడోవారం వరకు కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల మేర తగ్గుతాయని, అడపాదడపా పగటి ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణ స్థితిలో నమోదవుతాయని చెబుతున్నారు. రాష్ట్రానికి ఈశాన్య దిశ నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలుల ప్రభావంతో చలి తీవ్రత పెరుగుతుందని చెబుతున్నారు. ఈనెల మూడో వారం వరకు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయని, ఆ తర్వాత ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని చెబుతున్నారు. పగటి పూట పొగమంచు ఉంటుందని, జనవరి నెలాఖరులో ఉత్తర, తూర్పు జిల్లాల్లోని కొన్నిచోట్ల ఒకట్రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదు కావొచ్చని చెబుతున్నారు. గురువారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్లో 30.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్లో 11.7 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గురువారం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదైంది. రాష్ట్రానికి తూర్పు, ఈశాన్య దిశల నుంచి తక్కువ ఎత్తులో బలంగా గాలులు వీస్తున్నాయి. దీంతో రానున్న నాలుగు రోజులు చలి తీవ్రత కూడా పెరుతుందని అధికారులు చెబుతున్నారు. -
'పాలమూరు'పై విచారణ
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు అవసరమైన నీటి వనరు (సోర్సు)ను జూరాల నుంచి శ్రీశైలంకు మార్చడం వెనుక లోతైన అవినీతి పునాదులున్నాయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరోపించారు. ‘పాలమూరు ప్రాజెక్టు సోర్సు మార్చడానికి మంత్రివర్గ ఆమోదం లేదు. నేను ఇదే అడుగుదామనుకుంటే కేసీఆర్ సభకు రావడం లేదు. కొందరు ఇరిగేషన్ అధికారులతో ఇటీవల జరిపిన సమీక్షలో విచారణకు ఆదేశిద్దాం..మార్గదర్శకాలు (టీఓఆర్) సిద్ధం చేయండి అని ఆదేశించా..’ అని సీఎం తెలిపారు. ఈ వాసన (విషయం) పసిగట్టిన బీఆర్ఎస్ నేత హరీశ్రావు నాటి నుంచి కృష్ణా జలాలపై చర్చను వదిలేసి నల్లమల్లసాగర్పై మాట్లాడుతున్నారని విమర్శించారు. ‘జూరాల నుంచి శ్రీశైలంకు ఎందుకు మార్చారు?..ఎవరి బాగోగుల కోసం మార్చారు?..రూ.వేల కోట్ల కమీషన్లు ఎవరి ఇంటికి వెళ్లాయి?.. తెలంగాణకు జరిగిన నష్టం ఏమిటి? అన్న దానిపై విచారణకు ఆదేశించాలి..’ అని అన్నారు. కృష్ణా ప్రాజెక్టులపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు గురువారం ప్రజాభవన్లో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమం ముగింపులో రేవంత్ మాట్లాడారు. జూరాల నిల్వ సామర్థ్యం 9 టీఎంసీలే కావడంతో 300 టీఎంసీల సామర్థ్యం ఉన్న శ్రీశైలంకు ‘పాలమూరు’ ప్రాజెక్టు సోర్సును మార్చామంటూ మాజీమంత్రి హరీశ్రావు చేసిన వాదనను ఆయన తోసిపుచ్చారు. సభలో మాట్లాడదాం రండి కేసీఆర్.. ‘ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు వనరు (సోర్సు)ను తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చాలనే అత్యంత కీలక నిర్ణయాన్ని మంత్రివర్గానికి బదులు వ్యక్తిగత స్థాయిలో తీసుకున్న వ్యక్తి (కేసీఆర్)ని శిక్షించాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ చెప్పింది. అదే తరహాలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు సోర్సును మార్చారు. దీనిపై సభలోనే మాట్లాడదాం రండి కేసీఆర్.. పాలమూరు కోసం రోజుకు 2 టీఎంసీల చొప్పున 35 రోజులు జూరాల వద్ద నీళ్లు తీసుకోవచ్చని నాటి సీఈ నివేదిక ఇచ్చారు. అయితే రోజుకు 3 టీఎంసీల చొప్పున 30 రోజుల్లో 90 టీఎంసీలను జూరాల వద్దే తీసుకునే అవకాశం ఉండేది. అప్పుడు పోతిరెడ్డిపాడు, మల్యాల, ముచ్చుమర్రి, రాయలసీమ లిఫ్టు ద్వారా తరలించుకోవడానికి శ్రీశైలంలో ఏపీకి నీళ్లు లభించేవి కాదు. తెలంగాణను కేసీఆర్, హరీశ్ అచేతనావస్థలోకి నెట్టేశారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన కేసీఆర్, హరీశ్ను ఉరేసినా తప్పులేదు. వారి పాలనలో శ్రీశైలం నుంచి నీళ్లను తరలించుకు సామర్థ్యాన్ని ఏపీ 4.5 నుంచి 13 టీఎంసీలకు పెంచుకుంది..’ అని సీఎం అన్నారు. కిరణ్కుమార్రెడ్డి లెక్కలకు కేసీఆర్ సమ్మతి ‘రాష్ట్ర విభజనకు ముందు నాటి సీఎం కిరణ్కుమార్రెడ్డి ఏపీకి ప్రయోజనం చూకూర్చాలనే ఉద్దేశంతో కృష్ణా బేసిన్లో ఏపీ ప్రాజెక్టులు 512, తెలంగాణ ప్రాజెక్టులు 299 టీఎంసీలు వాడుకుంటున్నాయని లెక్కలు తీయించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ మధ్య (తాత్కాలికంగా) నీటి పంపిణీ కోసం కేంద్రం నిర్వహించిన సమావేశంలో.. నాటి తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, చంద్రబాబు పాల్గొని నికర జలాల్లో ఉమ్మడి ఏపీకి ఉన్న 811 టీఎంసీల వాటాలో ఏపీకి 512 (66%), తెలంగాణకు 299 టీఎంసీలు(34%) సరిపోతాయనే లెక్కల ఆధారంగానే ఒప్పందం చేసుకుని తెలంగాణకు తీవ్ర ద్రోహం చేశారు. తొలుత ఏడాది కోసం చేసుకున్నా, ఆ తర్వాత వరుసగా మరో రెండేళ్లు ఈ ఒప్పందాన్ని పొడిగించేందుకు కేసీఆర్, హరీశ్ సమ్మతి తెలిపారు. కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చే వరకు ఈ ఒప్పందాన్నే కొనసాగించాలని, అప్పటి వరకు మళ్లీ ఈ సమావేశాలకు రావాల్సిన అవసరం లేకుండా ‘వన్స్ ఫర్ ఆల్’ సంతకం పెడుతున్నట్టు 2020లో కేసీఆర్ కేంద్రానికి తేల్చి చెప్పి వచ్చారు. ‘‘నాకు మల్లమల్ల డిస్ట్రర్బ్ చేయకురి..ఫార్మ్హౌస్లో ఉంటా’’ అని సంతకం పెట్టి కృష్ణా జలాలపై ఏపీకి శాశ్వతంగా 66 శాతం హక్కు ఇచ్చిండు..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. మా వాదనలతో ఏపీ ఉక్కిరిబిక్కిరి ‘ఏ రాష్ట్రంలో పరీవాహక ప్రాంతం ఎంత దామాషాలో ఉంటే అంత వాటాను ఆ రాష్ట్రానికి ఇవ్వాలనే అంతర్జాతీయ సూత్రాల ప్రకారం తెలంగాణకు 71 శాతం, ఏపీకి 29 శాతం కృష్ణా జలాలు కేటాయించాలని, ఆ లెక్కన మాకు 555 టీఎంసీలు వస్తాయని మేము వచ్చాక ట్రిబ్యునల్ ఎదుట తొలి వాదనగా వినిపించాం. అపెక్స్ కౌన్సిలో కేసీఆర్ ఈ వాదన, కృష్ణా జలాలను పెన్నా బేసిన్కు తరలించకుండా ఏపీని అడ్డుకోవాలని మరో వాదన చేసి ఉంటే రాష్ట్రానికి అన్యాయం జరిగి ఉండేది కాదు. 2014–23 మధ్య కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో కృష్ణా జలాలపై ఏపీ పూర్తి ఆధిపత్యం సాధించింది. 65 శాతం లభ్యతతో ఉమ్మడి ఏపీకి ట్రిబ్యునల్ కేటాయించిన 1,005 టీఎంసీల్లో తెలంగాణకు 763 టీఎంసీలు ఇవ్వాలని మేము ట్రిబ్యునల్ ఎదుట రెండోసారి వాదన వినిపించడంతో ఏపీ ఉక్కిరిబిక్కిరి అయింది. తెలంగాణ సమర్థవంతంగా వాదనలు వినిపిస్తోంటే ఏపీ ప్రభుత్వం ఎక్కడా నిలువరించలేకపోతోంది. కానీ జూబ్లీహిల్స్, సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి తప్పకపోవడంతో బీఆర్ఎస్ మనుగడే ప్రమాదంలో పడిందని బయటకు వచ్చిన కేసీఆర్ ..ఏపీకి సీఎం రేవంత్ సహకరిస్తున్నాడనే ఒక అపోహాను కలిగించి మళ్లీ జల వివాదాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. కేసీఆర్, హరీశ్రావు ఏం చెప్పినా తూకం వేస్తే 24 క్యారెట్లు అబద్ధంగా తేలుతుంది..’ అని ఎద్దేవా చేశారు. మేడిగడ్డ, పాలమూరు ..ఫార్ములా సేమ్ ‘రీడిజైనింగ్ పేరుతో తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు తరలించి ప్రాణహిత–చేవెళ్ల అంచనాలను రూ.35 వేల కోట్ల నుంచి రూ.1.5 లక్షల కోట్లకు పెంచడంలో వాడిన ఫార్ములానే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు సోర్సును జూరాల నుంచి శ్రీశైలంకు తరలించడానికి వాడారు. ఇలా పంపులు, లిఫ్టులు పెంచితే కనకవర్షం కురుస్తుందనేది తప్ప కేసీఆర్ మరే ఫార్ములా కనిపెట్టలేదు. జూరాల నుంచి నీళ్లను తీసుకునేలా ‘పాలమూరు’ను చేపడితే అంతర్రాష్ట్ర వివాదాలు ఉండేవి కావు. పంపులు, లిఫ్టులకు బిల్లులు ఇవ్వడానికి కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లి ‘పాలమూరు’ సాగునీటి ప్రాజెక్టు కాదని, 7.15 టీఎంసీలతో తాగునీటి ప్రాజెక్టుగా కట్టుకుంటామంటూ అఫిడవిట్ వేసి ఆ మేరకు పనులకే 2023లో అనుమతి పొందారు. కేసీఆర్, హరీశ్రావు కారణంగా రూ.27 వేల కోట్లు ఖర్చు చేసినా ప్రాజెక్టు పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. కమీషన్ల కోసం పంపులు, లిఫ్టుల కంపెనీకి రూ.27 వేల కోట్ల చెల్లింపులు చేశారు..’ అని సీఎం ఆరోపించారు. అన్నీ బయటపెడతాననే సభకు రావడం లేదు.. ‘మైనర్ ఇరిగేషన్లో పొదుపు చేసిన 45 టీఎంసీలు, గోదావరి జలాల మళ్లింపుతో లభ్యతలోకి వచ్చిన 45టీఎంసీలు కలిపి మొత్తం 90 టీఎంసీలతో ‘పాలమూరు’ ప్రాజెక్టుకి అనుమతి ఇవ్వాలని ఈ ప్రబుద్ధుడే (కేసీఆర్) పిటిషన్ వేస్తే, గోదావరి జలాల మళ్లింపుతో లభ్యతలోకి వచ్చిన 45 టీఎంసీలపై నిర్ణయాధికారం సీడబ్ల్యూసీకి లేదని, ట్రిబ్యునల్ చేయాల్సి ఉంటుందని ఏపీ అభ్యంతరం తెలిపింది. మైనర్ ఇరిగేషన్లో ఆదా చేసిన 45 టీఎంసీలకు సంబంధించి 30 ఏళ్ల డేటా సీడబ్ల్యూసీ కోరితే గత ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. మేము వచ్చాక అధ్యయనం చేయించి వివరాలను సమర్పించడంతో పాటు తొలి దశ కింద ఆ 45 టీఎంసీలు వాడుకోవడానికి అనుమతి కోరుతూ మంత్రి ఉత్తమ్ లేఖ రాశారు. పీఎంకేఎస్వై కింద 60 శాతం కేంద్ర నిధులతో పాటు 7.25 శాతం తక్కువ వడ్డీతో రుణాలు లభిస్తాయనే అనుమతులు కోరాం. రూ.84 వేల కోట్ల అంచనాల్లో రూ.50 వేల కోట్లు వచ్చే అవకాశం ఉంటుంది..’ అని రేవంత్ వివరించారు. ‘సమస్యలు పరిష్కారమైతే.. ప్రాజెక్టులు పూర్తైతే కేసీఆర్కు శాశ్వతంగా జలసమాధి జరుగుతుందన్న భయంతో తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించాలని వారు ప్రయత్నిస్తున్నారు. నేను తారీఖులతో సహా ఆయన సంతకం చేసిన ప్రతిలేఖ, చేసుకున్న ఒప్పందాలు, పెంచిన అంచనాలను బయటపెట్టి ప్రశ్నిస్తాననే శాసనసభకు రావడం లేదు..’ అని రేవంత్ విమర్శించారు. -
విద్యార్థులు వారి తల్లిదండ్రులు రోడ్డు నిబంధనలు పాటిస్తామని హామీ పత్రం పై సంతకాలు తీసుకోవాలి
హైద్రాబాద్: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నివారించి మరణాల రేటు తగ్గించడమే లక్ష్యంగా జనవరి 1 గురువారం నుండి 31 జనవరి వరకు జరిగే రోడ్డు భద్రతా మాసోత్సవాలను ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 26 వేల రోడ్డు ప్రమాదాలు ,8 వేల మరణాలు సంభవిస్తుండగా ప్రతి రోజు 22 మంది ప్రాణాలు కోల్పోతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలు ప్రారంభ కార్యక్రమంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా అధికారుల తలకు హెల్మెట్ తొడిగారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలు పోస్టర్ ను, వాహనాల స్టికర్ ను , విద్యార్థులకు రోడ్ సేఫ్టీ అవగాహన బుక్స్ రిలీజ్ చేశారు. రోడ్ సేఫ్టీ అవేర్నెస్ పై ఆటో లకు పోస్టర్ అతికించారు. విద్యార్థుల తో రోడ్ సేఫ్టీ పై ఫ్లకార్డులు పట్టుకొని అవగాహన కల్పించారు.రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం అతి వేగం ,డ్రంక్ అండ్ డ్రైవ్,రాంగ్ రూట్ లో రావడం , మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని రవాణా శాఖ అధికారులు ప్రతి పాఠశాల వెళ్ళి రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నుండి ఒక్క ప్రాణాన్ని కాపాడిన జీవితం సార్థకమవుతుందన్నారు. ఈ సంవత్సరం సడక్ - సురక్ష జీవన్ సురక్షా నినాదంతో కార్యక్రమాన్ని 4 ఈ ద్వారా ముందుకు తీసుకుపోతున్నామని వెల్లడించారు. ఎడ్యుకేషన్, ఇంజినీరింగ్, ఎన్ఫోర్స్మెంట్, ఎమర్జెన్సీ పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు జరిగే బాక్స్ స్పాట్స్ తొలగించి ప్రమాదాలను నివారించాలని అధికారులకు తెలిపారు.ఇది కేవలం రవాణా శాఖ,ఆర్టీసీ మాత్రమే కాకుండా ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్, పోలీస్ అధికారులు, ఆర్ అండ్ బి,విద్యా శాఖ ఇతర విభాగాల అధికారులు సమన్వయం చేసుకొని నెల రోజుల కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు.రవాణా శాఖ అధికారులు ప్రతి పాఠశాలకు వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులతో రోడ్డు నిబంధనలు పాటిస్తామని హామీ పత్రం తీసుకోవాలనీ ఆదేశించారు. రాష్ట్రంలో వెయ్యి మంది రవాణా శాఖ అధికారులు ఉంటే కోటి 80 లక్షల వాహనాలు ఉన్నాయని ప్రతి ఒక్కరు స్వీయ నిర్వహణ పాటించాలని సూచించారు. నిబంధనలు పాటించని వాహనాలపై లైసెన్స్ సస్పెండ్ చేస్తున్నామని తెలిపారు. రవాణా శాఖ అధికారులు ట్రాఫిక్ చిల్డ్రన్ అవేర్నెస్ పార్క్ ఏర్పాటు పై నిరక్ష్యాన్ని వీడాలని హెచ్చరించారు.ఆర్టీసీ కళా భవన్ లో రోడ్ సేఫ్టీ మంత్ కార్యక్రమాన్ని ప్రారంభించి గత 30 సంవత్సరాలుగా డ్రైవింగ్ చేస్తున్న ఒక్క ప్రమాదం కూడా జరగని డ్రైవర్లను అభినందించి సత్కరించారు. ఆర్టీసీ లో 20 వేల మంది డ్రైవర్లు ,10 వేల బస్సులు ప్రతి రోజు 60 లక్షల మంది ప్రయాణికులు ,39 లక్షల కిలోమీటర్లు లైఫ్ లైన్ అని కొనియాడారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ 2026 లో పాత బకాయిలు పోయి మరింత లాభాల్లోకి వచ్చేలా అందరం కృషి చేద్దామని వెల్లడించారు.ఆర్టీసీ ప్రమాదాలను జీరో కి తగ్గించడమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు.స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ మాట్లాడుతూ వాహనాల ఫిట్నెస్ ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి కమర్షియల్ వాహనాలను కట్టడి చేయాలని సూచించారు. హెవీ డ్రైవర్లకు ఎప్పటికప్పుడు శిక్షణ ఇవ్వాలని , వైద్య పరీక్షలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు మెదక్ జిల్లా కలెక్టర్ ప్రమాదాలను నివారించడానికి ఒక సంవత్సర కాలంలో 100 బ్లాక్ స్పాట్ గుర్తించి తొలగించారని అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులు పాల్గొనాలని సూచించారు..ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ లో ప్రతి లక్ష కిలోమీటర్లకు 0.07 శాతం ప్రమాదాలు ఉన్నాయని, సంవత్సర కాలంలో 600 ప్రమాదాలు జరిగాయని తెలిపారు.ప్రమాదాలు తగ్గించడానికి ప్రతి డిపో లో డ్రైవర్లకు శిక్షణ ఇవ్వడం , బ్రీత్ అనలైజర్ టెస్టులు చేయడం, సిబ్బందికి వైద్య పరీక్షలు , బస్సుల ఫిట్నెస్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన కుటుంబాలు శాశ్వత వికలాంగులు అయిన వారి కుటుంబాలు జీవితాంతం ఇబ్బందులు పడుతున్నాయన్నారు.ఆర్టీసీ ప్రతి సంవత్సరం 80 కోట్లు ప్రమాద బీమా చెల్లించడం జరుగుతుందనీ వెల్లడించారు.కార్యక్రమంలో స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలాంబర్తి,ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, జెటిసి లు చంద్రశేఖర్ గౌడ్, రమేష్ , శివలింగయ్య, డీటీసీ లు , స్టేట్ ఆర్టీఏ మెంబర్ నవీన్ ,జిల్లా ఆర్టీఏ సురేష్ లాల్ పాల్గొన్నారు -
జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: సియం ఎ.రేవంత్ రెడ్డి
హైద్రాబాద్: జర్నలిస్టుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని, తన పరిధిలో పరిష్కారమయ్యే సమస్యలను తన దృష్టికి తెస్తే తప్పకుండా వాటిని పరిష్కరిస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. గురువారం నాడు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) ప్రతినిధి బృందం సచివాలయంలో సియంను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది. అలాగే యూనియన్ రూపొందించిన 2026 మీడియా డైరీని ఆయన చేతుల మీదుగా ఆవిష్కరింపజేసింది. ఈ సందర్భంలో జర్నలిస్టులకు నూతన సంవత్సర కానుకగా సంక్షేమ పథకాలు అందించాలని యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కె. విరాహత్ అలీ ముఖ్యమంత్రిని కోరగా, ఆయన పై విధంగా స్పందించారు.ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఐజేయు మాజీ అధ్యక్షులు దేవులపల్లి అమర్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రాంనారాయణ, ఐజేయు కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు కె. సత్యనారాయణ, రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి కల్కూరి రాములు, కార్యదర్శులు వి.యాదగిరి, కె. శ్రీకాంత్ రెడ్డి, కోశాధికారి యం. వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి. కిరణ్ కుమార్, అజిత, చిన్న, మధ్యతరగతి పత్రికల సంఘం అధ్యక్షులు యూసుఫ్ బాబు, ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.ఎన్. హరి, ఉర్దూ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి గౌస్ మోహియుద్దీన్, వీడియో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హరీష్ లు ఉన్నారు. అనంతరం రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార మరియు పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని యూనియన్ ప్రతినిధి బృందం కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది.సీయంకు శుభాకాంక్షలు తెలిపిన శ్రీనివాస్ రెడ్డితెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి గురువారం నాడు సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. -
మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ
సాక్షి,హైదరాబాద్: మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టుల అగ్రనేత మడావి హిడ్మా స్థానంలో నియమించిన బార్సెదేవ తెలంగాణ పోలీసులకు లొంగిపోయినట్లు తెలుస్తోంది.ముందుగా బార్సెదేవను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారంటూ సోషల్ మీడియాలో వార్తలు వెలుగులోకి వచ్చాయి. అయితే, బార్సెదేవను తెలంగాణ పోలీసులు అరెస్టు చేయలేదని, ఆయనే స్వయంగా పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. లొంగిపోయిన బార్సెదేవను తెలంగాణ పోలీసులు మీడియా ముందు ప్రవేశ పెట్టే అవకాశం ఉందిదండకారణ్యంలో పార్టీని దూకుడుగా నడిపించిన మావోయిస్టు టాప్ కమాండర్ మడావి హిడ్మా మరణం తర్వాత ఆ స్థానంలో మరో కీలక కమాండర్ కోసం అన్వేషణ సాగింది. హిడ్మాకు సహచరుడు, ఆయన గ్రామం పువర్తికే చెందిన బార్సె దేవాను ఈ కీలక స్థానంలో నియమితులయ్యారు. తాజాగా బార్సెదేవ సైతం పోలీసుల సమక్షంలో లొంగిపోయారు. దీంతో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలినట్లైంది. -
‘కేసీఆర్ నిర్ణయాలతోనే తెలంగాణకు నీళ్ల వాటా తగ్గింది’
సాక్షి, హైదరాబాద్: ఏపీ నీటి చౌర్యం చేస్తున్నా.. మనం మనవాటా వాడుకోలేని స్థితి అంటూ సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజాభవన్లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు హాజరైన సీఎం.. అనంతరం మీడియాతో మాట్లాడారు. కమీషన్ల కోసమే జూరాల నుంచి శ్రీశైలానికి ప్రాజెక్టు మార్పు చేశారని.. తల వదిలేసి తోక దగ్గర నీళ్లు తెచ్చేలా ప్రాజెక్ట్ అంటూ దుయ్యబట్టారు.కేసీఆర్ నిర్ణయాలతోనే తెలంగాణకు నీళ్ల వాటా తగ్గిందని సీఎం రేవంత్ ఆరోపించారు. తెలంగాణ వినియోగిస్తున్న నీటి లెక్కలు చూస్తే ఆశ్చర్యమేస్తోందన్న రేవంత్.. కేసీఆర్ నిర్ణయాలతోనే ఏపీకి ఎక్కువ నీళ్లు వెళ్తున్నాయంటూ ఆరోపణలు గుప్పించారు. పంపులు పెరిగితే కమీషన్లు ఎక్కువ వస్తాయనేది బీఆర్ఎస్ ప్లాన్. కృష్ణాలో 550 టీఎంసీల నీళ్లు ఇవ్వాలనే వాదనను కేసీఆర్ వినిపించలేదు’’ అంటూ సీఎం విమర్శించారు.‘‘ఎలాంటి అనుమతులు లేకుండా పాలమూరు చేపట్టారు. ఏడేళ్ల వరకు పాలమూరు డీపీఆర్ కూడా తయారు చేయలేదు. రూ.32వేల కోట్ల ప్రాజెక్టును రూ.80 వేల కోట్లకు పెంచారు’’ అని సీఎం రేవంత్ ఆరోపించారు. -
యాదగిరిగుట్ట ఆలయ ఈవో రాజీనామా
సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్ట ఆలయ ఈవో వెంకట్రావు రాజీనామా సంచలనంగా మారింది. అనారోగ్య సమస్యల నేపథ్యంలో రాజీనామా చేశానని ఆయన చెబుతున్నారు. ముక్కోటి ఏకాదశి ముగిసిన వెంటనే రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.యాదగిరిగుట్టలో అధ్యయనోత్సవాలు జరుగుతుండగా ఉన్నట్లుండి వెంకట్రావు రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. రాజీనామా వెనుక అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో తీవ్రస్థాయిలో విభేదాల నేపథ్యంలో రాజీనామా చేశారని యాదగిరిగుట్టలో చర్చ నడుస్తోంది. -
ఇద్దరు పిల్లలకు విషమిచ్చి.. తల్లి ఆత్మహత్య
సాక్షి, నాగర్ కర్నూల్ జిల్లా: కల్వకుర్తిలో విషాదం చోటుచేసుకుంది. తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చిన తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఇద్దరు పిల్లలకు విషం కలిపిన ఆహారం పెట్టిన తల్లి.. తాను విషం కలిపిన ఆహారం తిన్నది. ఈ ఘటనలో తల్లి ప్రసన్న(38), కూతురు మేఘన(13) మృతి చెందగా, కుమారుడు ఆశ్రిత్ రామ్(15) పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రికి తరలించారు.రెండు నెలల క్రితం ప్రసన్న భర్త ప్రకాశ్ గుండెపోటుతో మృతి చెందగా.. అప్పటి నుంచి భార్య మనస్తాపానికి గురైంది. ప్రసన్న డిప్రెషన్తో ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు చెబుతున్నారు.👉మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
సచివాలయ ఉద్యోగులు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లో తెలంగాణ సెక్రటేరియట్లో ఉద్యోగుల భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తూ ప్రభుత్వం కొత్త ఐడి కార్డులను ప్రవేశపెట్టింది. గత కొద్ది నెలలుగా సచివాలయంలో నకిలీ ఉద్యోగుల బెడద ఎక్కువైంది. ఈ క్రమంలో నకిలీ ఉద్యోగులను అరికట్టేందుకు కొత్త ఐడీ కార్డులను అందుబాటులోకి తెచ్చింది. కార్డులపై సెక్రటేరియట్ భవనం,తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిరూపాలను ముద్రించింది. అదనంగా క్యూ ఆర్ కోడ్, ఇంటర్నల్ చిప్, ఎంప్లాయి నెంబర్, ఫోటో వంటి వివరాలను చేర్చింది. రెగ్యులర్ ఉద్యోగులు 1300 మంది, క్లాస్-4 ఉద్యోగులు 300 మంది.. మొత్తం 1600 మందికి ఈ కొత్త ఐడి కార్డులు పంపిణీ చేస్తున్నారు. ఇటీవలే ఉద్యోగుల కోసం ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ను అమలు చేసిన ప్రభుత్వం, ఇప్పుడు ఐడి కార్డుల ద్వారా భద్రతా చర్యలను మరింత బలోపేతం చేసింది. మార్ఫింగ్ లేదా నకిలీ కార్డులు తయారు చేసే అవకాశం లేకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఉద్యోగుల గుర్తింపును సాంకేతిక ఆధారాలతో నిర్ధారించే ప్రయత్నం జరుగుతోంది. -
నీళ్లు-నిజాలు.. మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్
సాక్షి, హైదరాబాద్: ప్రజాభవన్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ‘నీళ్లు-నిజాలు’ అంశంపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కృష్ణ-గోదావరి నదీజలాల నీటి కేటాయింపులు, బీఆర్ఎస్ ఆరోపణలపై చర్చ జరిగింది. డీప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఎంపీలు, కార్పోరేషన్ ఛైర్మన్లు, పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు.2014 నుంచి నేటి వరకు కృష్ణా- గోదావరి నదిలో నీటి కేటాయింపులు, బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన ఒప్పందాలపై సీఎం అవగాహన కల్పించారు. రేపు అసెంబ్లీలో నీటి కేటాయింపులపై చర్చ నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు సమావేశంలో అవగాహన కల్పించారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు, రెండేళ్ల ప్రభుత్వ పనితీరుపై నేతలు చర్చించారు.పవర్ పాయింట్ ప్రజంటేషన్లో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు 90 శాతం పూర్తి చేశామని బీఆర్ఎస్ అబద్ధాలు ప్రచారం చేస్తోందని ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్, హరీష్ చెప్తున్నది అబద్దమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు-రంగారెడ్డికి కేసీఆర్ రూ.27 వేల కోట్లు ఖర్చు చేశారని.. పాలమూరు-రంగారెడ్డి పూర్తి కావాలంటే ఇంకా రూ.80 వేల కోట్లు కావాలన్నారు. -
కుక్కల స్వైర విహారం.. బాలుడి పరిస్థితి విషమం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హైదర్షాకోట్లో కుక్కలు వీరంగం సృష్టించాయి. హిమగిరి కాలనీలో బాలుడిపై నాలుగు కుక్కలు దాడి చేశాయి. ఆడుకుంటున్న వేదాంత్ రెడ్డి(3)ని చుట్టుముట్టిన కుక్కలు విచక్షణారహితంగా కరిచివేశాయి. బాలుడి పరిస్థితి విషమం ఉంది. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై హిమగిరి కాలనీ వాసుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వీధి కుక్కలకు విషం..ఎన్టీఆర్ జిల్లా: జి. కొండూరు మండలం వెలగలేరులో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. 250 వీధి కుక్కలకు పంచాయతీ సిబ్బంది విషమిచ్చి చంపారు. వీధి కుక్కలను చంపినట్లు రత్న జంతుసేవా సంస్థ సిబ్బంది గుర్తించారు. పంచాయతీ కార్యదర్శిపై జి.కొండూరు పోలీస్ స్టేషన్లో రత్న జంతుసేవా సంస్థ ఫిర్యాదు చేసింది. విష పదార్థాన్ని ఉపయోగించి కుక్కలను చంపినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. -
తెలంగాణలో మద్యం విక్రయాల సునామీ!
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో న్యూఇయర్ వేడుకల్లో మద్యం ఏరులై పారింది. ఫలితంగా న్యూఇయర్ వేడుకల సందర్భంగా మద్యం విక్రయాలు కొత్త రికార్డులు సృష్టించాయి. ఈ నెల 25వ తేదీ నుంచి నిన్నటి వరకు మద్యం అమ్మకాల విలువ రూ.1350 కోట్లకు చేరింది. ముఖ్యంగా డిసెంబర్ 29, 30, 31 తేదీల్లోనే దాదాపు రూ.1000 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు సమాచారం. 29వ తేదీ రూ.280 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగ్గా..30వ తేదీన రూ.380 కోట్లు,31వ తేదీన రూ.315 కోట్ల అమ్మకాలతో.. మొత్తం మూడు రోజుల్లోనే 8.30 లక్షల కేసుల లిక్కర్, 7.78 లక్షల కేసుల బీరు విక్రయాలు జరిగాయి. రాష్ట్రంలో న్యూఇయర్ వేడుకల సందర్భంగా మద్యం వినియోగం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా హోటళ్లు, పబ్లు, రెస్టారెంట్లు, పార్టీలు, వ్యక్తిగత వేడుకల్లో మద్యం వినియోగం అధికంగా కనిపించింది. మద్యం విక్రయాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం లభించింది. ఎక్సైజ్ శాఖ గణాంకాల ప్రకారం, ఈ మూడు రోజుల్లోనే వందల కోట్ల రూపాయల పన్ను ఆదాయం రాష్ట్ర ఖజానాకు చేరింది.ప్రతి సంవత్సరం డిసెంబర్ చివరి వారంలో మద్యం అమ్మకాలు పెరగడం సాధారణమే. అయితే ఈసారి రికార్డు స్థాయిలో అమ్మకాలు జరగడం గమనార్హం. ఇది ప్రజల వినియోగ ధోరణిని, వినోదం పట్ల ఉన్న ఆసక్తిని ప్రతిబింబిస్తోంది. -
లోక్భవన్ వద్ద పోలీసుల ఓవరాక్షన్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రాజ్భవన్(లోక్భవన్) వద్ద పోలీసులు ఓవరాక్షన్ చేశారు. లోక్భవన్ వద్ద ప్రజలను కలుస్తానని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునివ్వడంతో భారీ సంఖ్యలో ప్రజల అక్కడికి తరలివచ్చారు. కానీ, పోలీసులు మాత్రం అక్కడికి వచ్చిన వారిని లోపలికి అనుమతించలేదు. దాదాపు గంట పాటు బయటే నిల్చోబెట్టారు. దీంతో, లోక్భవన్ వద్దకు వచ్చిన పిల్లలు, వృద్ధులు.. తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. పోలీసుల తీరుపై మండిపడ్డారు. గంట తర్వాత వారిని లోక్భవన్లోకి అనుమతి ఇవ్వడంతో గవర్నర్కు శుభాకాంక్షలు తెలిపారు. -
HYD: న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల్లో విషాదం ఘటన చోటుచేసుకుంది. అర్థరాత్రి వేడుకల్లో మద్యం తాగి బిర్యానీ తిన్న 17 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన నగరంలోని జగద్గిరిగుట్ట పరిధిలో వెలుగుచూసింది.వివరాల మేరకు.. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానీనగర్లో న్యూ ఇయర్ సందర్భంగా 17 మంది కలిసి వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మద్యం తాగి.. బిర్యానీ తిన్నారు. అనంతరం, వీరంతా అస్వస్థతకు గురయ్యారు. కాసేపటికే వీరిలో పాండు(53) మృతి చెందాడు. అపస్మారక స్థితిలో ఉన్న మిగతా వారిని మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఫ్యూచర్ సిటీలోనే కమిషనరేట్.. త్వరలో కొత్త బాస్?
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)ను పునర్ వ్యవస్థీకరించడంతో రాజధానిలో శాంతి భద్రతలను కాపాడటం, పోలీసింగ్ సామర్థ్యాన్ని మరింత మెరుగుపర్చడం, సమర్థమైన పర్యవేక్షణ అనివార్యమైన నేపథ్యంలో గ్రేటర్ పోలీసు విభాగాన్ని కూడా పునర్విభజించారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ మూడు కమిషనరేట్లు ఉండగా.. కొత్తగా ఫ్యూచర్ సిటీ పోలీసు కమిషనరేట్ను ఏర్పాటు చేశారు.సైబరాబాద్, రాచకొండలోని పలు శాంతి భధ్రతలు, ట్రాఫిక్ జోన్లను వేరు చేసి.. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్కు బదలాయించారు. దీంతో ప్రస్తుతం ఈ కొత్త కమిషనరేట్ పరిధిలో శంషాబాద్, రాజేంద్రనగర్, మహేశ్వరం లా అండ్ ఆర్డర్ జోన్ల పరిధిలోని 22 ఠాణాలు, మాదాపూర్, ఎల్బీనగర్ ట్రాఫిక్ జోన్ల పరిధిలోని నాలుగు పీఎస్లతో ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ స్వరూపం ఉంటుంది. ప్రస్తుతం రంగారెడ్డి కలెక్టరేట్లో ఫ్యూచర్ సిటీ పోలీసు కమిషనరేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. తాత్కాలిక కాలం పాటు ఇక్కడి నుంచే కమిషనరేట్ కార్యకలాపాలు సాగించనుంది. త్వరలోనే ప్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్సీడీఏ) పరిధిలో కమిషనరేట్కు స్థలం కేటాయించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇప్పటికే 30– 40 ఎకరాల స్థలం కోసం అధికారులు అన్వేషిస్తున్నారు.కొత్త కమిషనరేట్ ఎందుకంటే? ఔటర్ రింగ్ రోడ్ వరకూ జీహెచ్ఎంసీ విస్తరణ తర్వాత గ్రేటర్ పరిధి పెరిగిపోయింది. దీనికి తోడు ప్రభుత్వం హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తరహాలో నాలుగో నగరం అవసరమని భావించింది. ఈ నేపథ్యంలో శ్రీశైలం జాతీయ రహదారి, నాగార్జున సాగర్ రాష్ట్ర రహదారి మధ్యలో ముచ్చర్ల ప్రాంతంలో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించాలని నిర్ణయించింది. ఇటీవల నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్లో ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులకు పలు బహుళ జాతి సంస్థలతో ఒప్పందం చేసుకుంది. దీంతో అంతర్జాతీయ పెట్టుబడులు, కంపెనీలకు శాంతిభద్రతలు, పెట్టుబడులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంతో కొత్తగా ఫ్యూచర్ సిటీ పరిధి వరకు పోలీసు కమిషనరేట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే సైబరాబాద్, రాచకొండలోని పలు ప్రాంతాలను వేరు చేసి కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ను ఏర్పాటు చేశారు.3–4 నెలల్లో కొత్త సీపీ.. ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ పోలీసు కమిషనరేట్కు తొలి కమిషనర్గా జి.సు«దీర్బాబును నియమించింది. ఇప్పటివరకు రాచకొండ కమిషనర్గా ఉన్న ఈయన ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన భారత్ ఫ్యూచర్ సిటీకి పోలీసు బాస్గా నియమించారనే ప్రచారం జరుగుతోంది. మరో 3–4 నెలల్లో సుధీర్ బాబు పదవీకాలం ముగియనుంది. దీంతో ఫ్యూచర్ సిటీకి కొత్త పోలీసు బాస్ నియామకం అనివార్యం. ఒకవేళ రిటైర్మెంట్ తర్వాత కూడా సు«దీర్ బాబునే కమిషనర్గా కొనసాగిస్తే.. పదవీ విరమణ తర్వాత కూడా పోలీసు కమిషనర్గా కొనసాగిన తొలి కమిషనర్గా సుధీర్ బాబు రికార్డ్ సృష్టించినట్లవుతుందనే ప్రచారం జరుగుతోంది.ఠాణాలివీ జోన్లు (3): శంషాబాద్, రాజేంద్రనగర్, మహేశ్వరం డివిజన్లు (6): శంషాబాద్, షాద్నగర్, చేవెళ్ల, నార్సింగి, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం ఠాణాలు (22): కొత్తూరు, నందిగామ, ఆమన్గల్, తలకొండపల్లి, కడ్తాల్, శంషాబాద్/పెద్దషాపూర్, షాద్నగర్ టౌన్, కేశంపేట, కొందుర్గ్, చౌదరిగూడెం, మొయినాబాద్, చేవెళ్ల, షాబాద్, మోకిల, శంకర్పల్లి, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ, కందుకూరు, మహేశ్వరం, మాడ్గులత్వరలోనే కొత్త ట్రాఫిక్ ఠాణాలు.. ప్రస్తుతానికి మాదాపూర్ ట్రాఫిక్ జోన్ నుంచి షాద్నగర్, చేవెళ్ల పీఎస్లను, ఎల్బీనగర్ ట్రాఫిక్ జోన్ నుంచి ఇబ్రహీంపట్నం, మహేశ్వరం పీఎస్లను వేరు చేసి మొత్తం నాలుగు ఠాణాలతో ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ట్రాఫిక్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. అయితే త్వరలోనే కందుకూరు, కడ్తాల్, మాడ్గుల, ఆమన్గల్ వంటి పలు ట్రాఫిక్ పీఎస్లను కూడా ఏర్పాటు చేయనున్నారు.


