breaking news
Other Sports
-
హర్మన్ప్రీత్ సారథ్యంలో...
న్యూఢిల్లీ: ఆసియా కప్ టోర్నమెంట్కు సన్నాహాల్లో భాగంగా భారత పురుషుల హాకీ జట్టు ఈ నెలలో ఆ్రస్టేలియాలో పర్యటించనుంది. ఆగస్టు 15 నుంచి 21 వరకు జరిగే ఈ పర్యటనలో టీమిండియా నాలుగు మ్యాచ్లు ఆడుతుంది. ఈ సిరీస్లో పాల్గొనే భారత జట్టును సోమవారం ప్రకటించారు. 24 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు హర్మన్ప్రీత్ సింగ్ సారథ్యం వహిస్తాడు. కర్ణాటకకు చెందిన డిఫెండర్ సీబీ పూవణ్ణ తొలిసారి జాతీయ సీనియర్ జట్టులోకి ఎంపికయ్యాడు. ప్రస్తుతం బెంగళూరులోని భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కేంద్రంలో భారత జట్టుకు శిక్షణ శిబిరం జరుగుతోంది. ఈ పర్యటన కోసం భారత జట్టు శుక్రవారం బెంగళూరు నుంచి ఆస్ట్రేలియాకు బయలుదేరుతుంది. భారత పురుషుల హాకీ జట్టు: కృషన్ పాఠక్, సూరజ్ (గోల్కీపర్లు), సుమిత్, జర్మన్ప్రీత్ సింగ్, హర్మన్ప్రీత్ సింగ్ (కెపె్టన్), సంజయ్, అమిత్ రోహిదాస్, నీలం సంజీప్, జుగ్రాజ్ సింగ్, పూవణ్ణ (డిఫెండర్లు), రాజిందర్ సింగ్, రాజ్కుమార్ పాల్, హార్దిక్ సింగ్, మన్ప్రీత్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్, రబిచంద్ర సింగ్, విష్ణుకాంత్ సింగ్ (మిడ్ఫీల్డర్లు), మన్దీప్ సింగ్, శిలానంద్ లాక్రా, అభిõÙక్, సుఖ్జీత్ సింగ్, దిల్ప్రీత్ సింగ్, సెల్వం కార్తీ, ఆదిత్య లలాగే (ఫార్వర్డ్స్). -
ప్రపంచ చాంపియన్ షిప్పోటీలకు అమన్, అంతిమ్
లక్నో: గత ఏడాది పారిస్ ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన భారత స్టార్ రెజ్లర్ అమన్ సెహ్రావత్... ప్రపంచ చాంపియన్షిప్లో తొలి పతకంపై గురి పెట్టాడు. సెప్టెంబర్ 13 నుంచి 21వ తేదీ వరకు క్రొయేషియా రాజధాని జాగ్రెబ్లో ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్ జరగనుంది. ఈ మెగా ఈవెంట్లో పాల్గొనే భారత పురుషుల, మహిళల ఫ్రీస్టయిల్ జట్లను సోమవారం ప్రకటించారు. రెండు రోజులపాటు నిర్వహించిన సెలెక్షన్ ట్రయల్స్ ఆధారంగా జట్లను ఎంపిక చేశారు. 22 ఏళ్ల అమన్ జూన్లో మంగోలియాలో జరిగిన ర్యాంకింగ్ సిరీస్ టోర్నీలో కాంస్య పతకం గెలిచాడు. రెండు నెలల తర్వాత మళ్లీ మ్యాట్పైకి అడుగు పెట్టిన అమన్ చురుకైన కదలికలతో ఆకట్టుకున్నాడు. ట్రయల్స్లో తన ప్రత్యర్థులు సుమీత్, రాహుల్లపై అమన్ ‘టెక్నికల్ సుపిరీయారిటీ’ పద్ధతిలో (ప్రత్యరి్థపై 10 పాయింట్ల ఆధిక్యం సంపాదించడం) అలవోకగా గెలిచాడు. ‘నా అత్యుత్తమ స్థాయికి చేరుకున్నానని భావిస్తున్నాను. పూర్తి ఫిట్నెస్తో ఉన్నా. ప్రపంచ చాంపియన్షిప్ పోటీలకు సిద్ధంగా ఉన్నా. ఏడాది తర్వాత బరిలోకి దిగిన మంగోలియా టోర్నీలో నేను కొన్ని పొరపాట్లు చేశాను. ఓవరాల్గా నా ప్రదర్శనపట్ల సంతృప్తిగా ఉన్నా’ అని అమన్ వ్యాఖ్యానించాడు. 2022 ఆసియా క్రీడల్లో కాంస్యం, 2023 ఆసియా చాంపియన్షిప్లో స్వర్ణం నెగ్గిన అమన్ ప్రపంచ చాంపియన్షిప్లో మాత్రం ఇంకా పతకాల బోణీ కొట్టలేదు. మరోవైపు మహిళల విభాగంలో స్టార్ రెజ్లర్ అంతిమ్ పంఘాల్ ఈసారి ప్రపంచ చాంపియన్షిప్లో స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. 2023 ప్రపంచ చాంపియన్షిప్లో కాంస్యం గెలిచిన అంతిమ్ జాతీయ ట్రయల్స్లో తన ప్రత్యర్థులకు ఒక్క పాయింట్ కూడా ఇవ్వకుండా విజేతగా నిలిచింది. గత ఏడాది పారిస్ ఒలింపిక్స్లో తొలి రౌండ్లోనే నిష్క్రమించిన 20 ఏళ్ల అంతిమ్ ఇప్పటికే ఆసియా క్రీడల్లో, ఆసియా చాంపియన్షిప్లో, గ్రాండ్ప్రి సిరీస్ టోరీ్నల్లో, అండర్–20, అండర్–17 ప్రపంచ చాంపియన్షిప్లలో పతకాలు సాధించింది. భారత పురుషుల ఫ్రీస్టయిల్ జట్టు: అమన్ సెహ్రావత్ (57 కేజీలు), ఉదిత్ (61 కేజీలు), సుజీత్ కల్కాల్ (65 కేజీలు), రోహిత్ (70 కేజీలు), జైదీప్ (74 కేజీలు), అమిత్ (79 కేజీలు), ముకుల్ దహియా (86 కేజీలు), దీపక్ పూనియా (92 కేజీలు), విక్కీ (97 కేజీలు), రజత్ (125 కేజీలు). భారత మహిళల ఫ్రీస్టయిల్ జట్టు: అంకుశ్ (50 కేజీలు), అంతిమ్ (53 కేజీలు), నిశు (55 కేజీలు), తపస్య (57 కేజీలు), నేహా (59 కేజీలు), మనీషా (62 కేజీలు), వైష్ణవి (65 కేజీలు), సృష్టి (68 కేజీలు), జ్యోతి (72 కేజీలు), ప్రియా మలిక్ (76 కేజీలు). -
బ్రె‘జిల్...జిల్...జిల్’
క్విటో (ఈక్వెడార్): ఆరుసార్లు ప్రపంచ ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు నెగ్గిన మార్టా రెండు గోల్స్తో విజృంభించడంతో... బ్రెజిల్ జట్టు తొమ్మిదోసారి కోపా అమెరికా మహిళల ఫుట్బాల్ టోర్నీ టైటిల్ కైవసం చేసుకుంది. ఆదివారం అత్యంత హోరాహోరీగా సాగిన ఫైనల్లో బ్రెజిల్ ‘షూటౌట్’లో 5–4 గోల్స్ తేడాతో కొలంబియాపై విజయం సాధించింది. నిరీ్ణత సమయంలో ఇరు జట్లు 4–4 గోల్స్తో నిలవడంతో... విజేతను తేల్చేందుకు షూటౌట్ అనివార్యమైంది. ఇందులో బ్రెజిల్ ఆధిక్యం కనబర్చింది. అంతకుముందు మ్యాచ్లో బ్రెజిల్ తరఫున మార్టా (90+6వ, 105వ నిమిషాల్లో) డబుల్ గోల్స్తో మెరవగా... ఏంజెలీనా (45+9వ నిమిషంలో), అమండా గుటెరెస్ (80వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. కొలంబియా తరఫున లిండా కైసెడో (25వ నిమిషంలో), టర్సియానె (69వ నిమిషంలో), మైరా రమిరెజ్ (88వ నిమిషంలో), లైసీ సంటోస్ (115వ నిమిషంలో) తలా ఒక గోల్ సాధించారు. 39 ఏళ్ల మార్టా 82వ నిమిషంలో మైదానంలో అడుగుపెట్టి బ్రెజిల్ స్కోరును 3–3తో సమం చేసింది. అనంతరం అదనపు సమయంలో మార్టా మరో గోల్ సాధించడంతో బ్రెజిల్ 4–3తో ఆధిక్యంలోకి వెళ్లినా... చివర్లో లైసీ గోల్తో కొలంబియా స్కోరు సమం చేసింది. దీంతో విజేతను నిర్ణయించేందుకు షూటౌట్ నిర్వహించాల్సి వచ్చింది. ఇందులో గోల్ కీపర్ లొరెనా డా సిల్వా రెండు పెనాల్టీ కిక్లను సమర్థవంతంగా అడ్డుకోవడంతో... బ్రెజిల్ వరుసగా ఐదోసారి కోపా అమెరికా కప్ కైవసం చేసుకుంది. గత ఐదు ఫైనల్స్లో బ్రెజిల్ జట్టు నాలుగుసార్లు కొలంబియాపైనే విజయం సాధించడం విశేషం. బ్రెజిల్ తరఫున 6 ఫుట్బాల్ ప్రపంచకప్లు, 6 ఒలింపిక్స్లో బరిలోకి దిగిన మారా్ట... కెరీర్లో 206 మ్యాచ్లాడి 122 గోల్స్ సాధించింది. 2024 పారిస్ ఒలింపిక్స్ ఫైనల్లో అమెరికా చేతిలో ఓడిన బ్రెజిల్ జట్టు రజత పతకం సాధించిన విషయం తెలిసిందే. ఈ టోరీ్నలో అమండా గుటెరెస్ ఆరు గోల్స్తో అత్యధిక స్కోరర్గా నిలిచింది. -
నోరిస్ ‘పాంచ్ పటాకా’
బుడాపెస్ట్ (హంగేరి): ఫార్ములావన్ తాజా సీజన్లో మెక్లారెన్ డ్రైవర్ల జోరు సాగుతోంది. ఆస్కార్ పియాస్ట్రి, లాండో నోరిస్ మధ్య ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన హంగేరి గ్రాండ్ప్రి ప్రధాన రేసులో నోరిస్ విజయం సాధించాడు. ఈ సీజన్లో నోరిస్కిది ఐదో విజయం కాగా... మెక్లారెన్ జట్టుకిది 200వ ఎఫ్1 గెలుపు కావడం విశేషం. ఆదివారం జరిగిన ఈ రేసులో నోరిస్ నిర్ణీత 70 ల్యాప్లను అందరికంటే వేగం6గా, అందరికంటే ముందుగా 1 గంట 35 నిమిషాల 21.231 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు. మెక్లారెన్ జట్టుకే చెందిన పియాస్ట్రి 1 గంట 35 నిమిషాల 21.929 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రెండో స్థానంలో నిలిచాడు. 0.698 సెకన్ల తేడాతో పియాస్ట్రి రెండో స్థానానికి పరిమితమయ్యాడు. తొలి ల్యాప్ ముగిసే సమయానికి ఐదో స్థానానికి పరిమితమైన నోరిస్ ఆ తర్వాత వాయువేగంతో దూసుకెళ్లాడు. ‘ఇది చాలా కష్టమైంది. ప్రాణం పోయినంత పనైంది. చివరి క్షణాల్లో పియాస్ట్రిని దాటేసేందుకు ఎంతగానో ప్రయత్నించా’ అని రేసు అనంతరం నోరిస్ అన్నాడు. గత వారం జరిగిన బెల్జియం గ్రాండ్ప్రిలో పియాస్ట్రి విజయం సాధించగా... నోరిస్ రెండో స్థానంలో నిలిచాడు. మెర్సిడెస్ డ్రైవర్ జార్జ్ రసెల్ (1 గంట 35 నిమిషాల 43.147 సెకన్లు) మూడో స్థానం దక్కించుకున్నాడు. ఇక ఈ ఏడాది తొలిసారి పోల్ పొజిషన్ దక్కించుకొని అగ్రస్థానంతో రేసును ప్రారంభించిన ఫెరారీ డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ (1 గంట 36 నిమిషాల 3.791 సెకన్లు) నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్ వెర్స్టాపెన్ (1 గంట 36 నిమిషాల 33.876 సెకన్లు; రెడ్బుల్) తొమ్మిదో స్థానంలో నిలవగా... ఏడుసార్లు ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ (1 గంట 35 నిమిషాల 31.092 సెకన్లలో 69 ల్యాప్లు; ఫెరారీ) పన్నెండో స్థానానికి పరిమితమయ్యాడు. 24 రేసులో తాజా సీజన్లో ఇప్పటి వరకు 14 రేసులు ముగియగా... డ్రైవర్స్ చాంపియన్షిప్లో పియాస్ట్రి 284 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... నోరిస్ 275 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. వీరిద్దరి మధ్య పాయింట్ల అంతరం 9కి తగ్గగా... డిఫెండింగ్ చాంపియన్ వెర్స్టాపెన్ 187 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. తదుపరి రేసు ఈ నెల 31న డచ్ గ్రాండ్ప్రి జరుగుతుంది. -
ఈత కొలను అమెరికన్లదే...
సింగపూర్: ప్రపంచ స్విమ్మింగ్ పోటీల్లో తమకు తిరుగులేదని అమెరికా మరోసారి నిరూపించుకుంది. ఆదివారం ముగిసిన ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో అమెరికా 29 పతకాలతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఇందులో 9 స్వర్ణాలు, 11 రజతాలు, 9 కాంస్యాలు ఉన్నాయి. చివరిరోజు మహిళల 4గీ100 మీటర్ల మెడ్లీ రిలేలో రేగన్ స్మిత్, కేట్ డగ్లస్, గ్రెట్చెన్ వాల్ష్, టోరీ హుస్కీలతో కూడిన అమెరికా బృందం కొత్త ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు పసిడి పతకాన్ని హస్తగతం చేసుకుంది. అమెరికా బృందం 3 నిమిషాల 49.34 సెకన్లలో రేసును ముగించింది. ఈ క్రమంలో గత ఏడాది పారిస్ ఒలింపిక్స్లో 3 నిమిషాల 49.63 సెకన్లతో అమెరికా బృందమే నెలకొల్పిన ప్రపంచ రికార్డును అమెరికా జట్టే బద్దలు కొట్టింది. ‘ప్రపంచ చాంపియన్షిప్ను ప్రపంచ రికార్డుతో, పసిడి పతకంతో ముగించడం చాలా ఆనందంగా ఉంది. ఈత కొలనులో దూకితే మా అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాం. సింగపూర్ నుంచి నవ్వుతూ తిరిగి వెళ్తున్నందుకు సంతోషంగా ఉంది’ అని ప్రపంచ రికార్డు నెలకొల్పిన అమెరికా మెడ్లీ రిలే బృందం సభ్యురాలు గ్రెట్చెన్ వాల్ష్ వ్యాఖ్యానించింది. ఆ్రస్టేలియా 8 స్వర్ణాలు, 6 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి 20 పతకాలు సాధించి రెండో స్థానంలో... ఫ్రాన్స్ 4 స్వర్ణాలు, 1 రజతం, 3 కాంస్యాలతో కలిపి 8 పతకాలతో మూడో స్థానంలో నిలిచాయి. మహిళల విభాగంలో కెనడా టీనేజ్ స్టార్ సమ్మర్ మెకింటోష్... పురుషుల విభాగంలో ఫ్రాన్స్ స్టార్ లియోన్ మర్చండ్ ‘ఉత్తమ స్విమ్మర్లు’ పురస్కారాలు గెల్చుకున్నారు. ఆఖరి రోజు ఆదివారం ఎనిమిది ఈవెంట్స్లో ఫైనల్స్ జరిగాయి. పురుషుల 50 మీటర్ల బ్యాక్స్ట్రోక్లో రష్యాకు చెందిన క్లిమెంట్ కొలెస్నికోవ్ (23.68 సెకన్లు) స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఉక్రెయిన్–రష్యా యుద్ధం నేపథ్యంలో రష్యా క్రీడాకారులపై నిషేధం ఉన్న నేపథ్యంలో క్లిమెంట్ తటస్థ స్విమ్మర్గా ఈ పోటీల్లో బరిలోకి దిగాడు. మహిళల 50 మీటర్ల బ్రెస్ట్స్ట్రోక్ ఈవెంట్లో రుటా మెలుటైట్ (లిథువేనియా; 29.55 సెకన్లు) బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. మహిళల 50 మీటర్ల ఫ్రీస్టయిల్లో మెగ్ హారిస్ (ఆస్ట్రేలియా; 24.02 సెకన్లు) విజేతగా నిలిచింది. పురుషుల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్లో అహ్మద్ జవోది (ట్యూనీషియా; 14 నిమిషాల 34.41 సెకన్లు) పసిడి పతకాన్ని దక్కించుకున్నాడు. పురుషుల 4గీ100 మీటర్ల మెడ్లీ రిలే ఈవెంట్లో తటస్థ స్విమ్మర్లుగా బరిలోకి దిగిన రష్యా బృందం బంగారు పతకాన్ని గెలిచింది. మిరోన్ లిఫింత్సెవ్, కిరిల్ ప్రిగోడా, ఆండ్రీ మినాకోవ్, ఇగోర్ కొర్నెవ్లతో కూడిన తటస్థ బృందం 3 నిమిషాల 26.93 సెకన్లలో రేసును ముగించి విజేతగా నిలిచింది.మర్చండ్ ‘హ్యాట్రిక్’...పురుషుల 400 మీటర్ల మెడ్లీ విభాగంలో లియోన్ మర్చండ్ (ఫ్రాన్స్; 4 నిమిషాల 04.73 సెకన్లు) చాంపియన్గా నిలిచి ‘హ్యాట్రిక్’ సాధించాడు. 2022, 2023 ప్రపంచ చాంపియన్షిప్ల్లోనూ ఈ విభాగంలో మర్చండ్ స్వర్ణ పతకాలు నెగ్గ డం విశేషం. ఓవరాల్గా ఈ మెగా ఈవెంట్ చరిత్ర లో మర్చండ్కిది ఏడో పసిడి పతకం కావడం గమనార్హం.ఐదు పతకాలతో....మహిళల 400 మీటర్ల మెడ్లీ ఈవెంట్లో సమ్మర్ మెకింటోష్ (కెనడా; 4 నిమిషాల 25.78 సెకన్లు) విజేతగా నిలిచి ఈ మెగా ఈవెంట్ను నాలుగో స్వర్ణ పతకంతో, ఓవరాల్గా ఐదో పతకంతో ముగించింది. 400 మీటర్ల ఫ్రీస్టయిల్, మెడ్లీ, 200 మీటర్ల మెడ్లీ, 200 మీటర్ల బటర్ఫ్లయ్ విభాగాల్లో స్వర్ణాలు నెగ్గిన 18 ఏళ్ల మెకింటోష్ 800 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ మెగా ఈవెంట్లో కెనడా గెల్చుకున్న మొత్తం ఎనిమిది పతకాల్లో ఐదు మెకింటోష్వే కావడం విశేషం. -
విజేత కార్ల్సన్... అర్జున్కు నాలుగో స్థానం
రియాద్: తొలిసారి నిర్వహించిన ఈ–స్పోర్ట్స్ వరల్డ్కప్ చెస్ టోర్నమెంట్లో నార్వే దిగ్గజం, ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్ చాంపియన్గా అవతరించాడు. అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్)తో జరిగిన ఫైనల్లో కార్ల్సన్ 3–1, 3–1తో విజయం సాధించాడు.సెట్–1లో భాగంగా జరిగిన నాలుగు గేముల్లో కార్ల్సన్ రెండు గేముల్లో గెలిచి, రెండింటిని ‘డ్రా’ చేసుకున్నాడు. సెట్–2లో భాగంగా జరిగిన నాలుగు గేముల్లో కార్ల్సన్ మూడు గేముల్లో నెగ్గి, ఒక గేమ్లో ఓడిపోయాడు. హికారు నకముర (అమెరికా) మూడో స్థానం పొందగా... భారత గ్రాండ్మాస్టర్, తెలంగాణ స్టార్ ఇరిగేశి అర్జున్ నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు.నకమురతో జరిగిన వర్గీకరణ మ్యాచ్లో అర్జున్ 2.5–3.5తో ఓడిపోయాడు. ఐదు గేముల్లో అర్జున్ రెండింటిలో గెలిచి, ఒక దానిని ‘డ్రా’ చేసుకున్నాడు. విజేతగా నిలిచిన కార్ల్సన్కు 2,50,000 డాలర్లు (రూ. 2 కోట్ల 18 లక్షలు) లభిస్తాయి.రెండో స్థానం పొందిన అలీరెజాకు 1,90,000 డాలర్లు (రూ. 1 కోటీ 65 లక్షలు), మూడో స్థానంలో నిలిచిన నకమురకు 1,45,000 డాలర్లు (రూ. 1 కోటీ 26 లక్షలు), నాలుగో స్థానంలో నిలిచిన అర్జున్కు 1,15,000 డాలర్లు (రూ. 1 కోటీ 33 వేలు) ప్రైజ్మనీగా లభించాయి. -
Hungarian GP: లెక్లెర్క్కు తొలి ‘పోల్’
బుడాపెస్ట్ (హంగేరి): ఎట్టకేలకు ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లోని 14వ రేసులో ఐదో కొత్త ‘పోల్ పొజిషన్’ డ్రైవర్ అవతరించాడు. గత 13 రేసుల్లో లాండో నోరిస్ (మెక్లారెన్), ఆస్కార్ పియాస్ట్రి (మెక్లారెన్), మాక్స్ వెర్స్టాపెన్ (రెడ్బుల్), జార్జి రసెల్ (మెర్సిడెస్) ‘పోల్ పొజిషన్స్’ దక్కించుకున్నారు.శనివారం జరిగిన హంగేరి గ్రాండ్ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో ఫెరారీ డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ ‘పోల్ పొజిషన్’ సాధించాడు. తాజా సీజన్లో మెక్లారెన్ డ్రైవర్లు నోరిస్, పియాస్ట్రి జోరు సాగుతుండగా... వారిద్దరినీ వెనక్కి నెట్టి లెక్లెర్క్ ఈ ఏడాది తొలి ‘పోల్ పొజిషన్’ దక్కించుకున్నాడు.క్వాలిఫయింగ్ సెషన్లో లెక్లెర్క్ అందరికంటే వేగంగా 1 నిమిషం 15.372 సెకన్లలో ల్యాప్ను పూర్తి చేసి ‘టాప్’లో నిలిచాడు. ఆదివారం జరగనున్న ప్రధాన రేసును లెక్లెర్క్ అగ్రస్థానం నుంచి నుంచి ప్రారంభిస్తాడు. పియాస్ట్రి (1 నిమిషం 15.398 సెకన్లు; మెక్లారెన్), నోరిస్ (1 నిమిషం 15.413 సెకన్లు; మెక్లారెన్) వరుసగా రెండో, మూడో స్థానాల్లో నిలిచారు.‘మాటలు రావడం లేదు. ఏమాత్రం ఊహించలేదు. అందుకే ఇది నా ప్రదర్శనల్లో అత్యుత్తమమైన వాటిలో ఒకటి. ఎలా జరిగిందో అర్థం కావడం లేదు. అగ్రస్థానంలో నిలిచేందుకు చేయాల్సిందంతా చేశాను’ అని కెరీర్లో 27వసారి పోల్ పొజిషన్ పొందిన లెక్లెర్క్ పేర్కొన్నాడు. ఓవర్టేక్ చేయడం చాలా కష్టమైన హంగేరి ట్రాక్పై పోల్ పొజిషన్ సాధించడం ప్రధాన రేసులో ఫెరారీ డ్రైవర్కు ఎంతో సహకరించనుంది. డిఫెండింగ్ చాంపియన్ వెర్స్టాపెన్ (1 నిమిషం 15.728 సెకన్లు; రెడ్బుల్) 8వ స్థానంలో నిలవగా.... ఫెరారీకే చెందిన మరో డ్రైవర్, ఏడుసార్లు ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ (1 నిమిషం 15.702 సెకన్లు) 12వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. -
800 మీటర్లలో సప్త స్వర్ణం
సింగపూర్: ఒకటి కాదు...రెండు కాదు... మూడు కాదు... నాలుగు కాదు... వరుసగా ఏడోసారి కేటీ లెడెకీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. లాంగ్ డిస్టెన్స్ స్విమ్మింగ్లో తనకు తిరుగులేదని అమెరికా మహిళా స్టార్ స్విమ్మర్ నిరూపించుకుంది. ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్షిప్ 800 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో 7వసారి లెడెకీ చాంపియన్గా నిలిచింది. 28 ఏళ్ల లెడెకీ 800 మీటర్ల విభాగంలో 7వసారి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. శనివారం హోరాహోరీగా సాగిన 800 మీటర్ల ఫైనల్ రేసును లెడెకీ 8 నిమిషాల 05.62 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఈ చాంపియన్షిప్లో నాలుగో స్వర్ణంపై గురి పెట్టిన సమ్మర్ మెకింటోష్ కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. మెకింటోష్ 8 నిమిషాల 07.29 సెకన్లలో రేసును ముగించి మూడో స్థానంలో నిలిచింది. లానీ పాలిస్టర్ (ఆస్ట్రేలియా; 8 నిమిషాల 05.98 సెకన్లు) రజత పతకాన్ని కైవసం చేసుకుంది. 700 మీటర్లు ముగిశాక మెకింటోష్ 0.14 సెకన్ల ఆధిక్యంలో ఉండగా... చివరి 100 మీటర్లలో లెడెకీ జోరు పెంచడంతో చివరకు మెకింటోష్ మూడో స్థానంతో, లానీ పాలిస్టర్ రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచి్చంది. 16 ఏళ్ల ప్రాయంలో 2013 ప్రపంచ చాంపియన్షిప్లో 800 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో తొలిసారి స్వర్ణ పతకాన్ని గెల్చుకున్న లెడెకీ... 2015లో, 2017లో, 2019లో, 2022లో, 2023లోనే బంగారు పతకాలు సొంతం చేసుకోవడం విశేషం. ఇప్పటి వరకు ప్రపంచ చాంపియన్షిప్ చరిత్రలో లెడెకీ 23 స్వర్ణాలు, 6 రజతాలు, 1 కాంస్యం సాధించింది. ఒలింపిక్స్లో 9 స్వర్ణాలు, 4 రజతాలు, 1 కాంస్యం కైవసం చేసుకుంది. ఓవరాల్గా లెడెకీ 44 ప్రపంచ, ఒలింపిక్ పతకాలతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది.మిక్స్డ్ రిలేలో ప్రపంచ రికార్డుమరోవైపు మిక్స్డ్ ఫ్రీస్టయిల్ 4్ఠ100 రిలేలో జాక్ అలెక్సీ, ప్యాట్రిక్ సామన్, కేట్ డగ్లస్, టోరి హుస్కీలతో కూడిన అమెరికా జట్టు కొత్త ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు పసిడి పతకాన్ని హస్తగతం చేసుకుంది. అమెరికా బృందం 3 నిమిషాల 18.48 సెకన్లలో రేసును ముగించి 2023లో 3 నిమిషాల 18.83 సెకన్లతో ఆ్రస్టేలియా బృందం నెలకొలి్పన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. మహిళల 50 మీటర్ల బటర్ఫ్లయ్ విభాగంలో గ్రెట్చెన్ వాల్‡్ష (అమెరికా; 24.83 సెకన్లు) బంగారు పతకాన్ని దక్కించుకుంది. పురుషుల 50 మీటర్ల ఫ్రీస్టయిల్లో పారిస్ ఒలింపిక్స్ చాంపియన్ కామెరాన్ మెక్ఇవోయ్ (ఆ్రస్టేలియా; 21.14 సెకన్లు) స్వర్ణ పతకాన్ని సాధించాడు. 200 మీటర్ల బ్యాక్స్ట్రోక్లో డిఫెండింగ్ చాంపియన్ కేలీ మెక్కియోవన్ (ఆ్రస్టేలియా; 2ని:03.33 సెకన్లు) విజేతగా నిలిచి టైటిల్ నిలబెట్టుకున్నాడు. నేటితో ముగియనున్న ప్రపంచ చాంపియన్షిప్లో ప్రస్తుతం అమెరికా 8 స్వర్ణాలు, 11 రజతాలు, 7 కాంస్యాలతో కలిపి మొత్తం 26 పతకాలతో నంబర్వన్ స్థానంలో ఉంది. -
మెస్సీ మేనియా షురూ!
కోల్కతా: ఫుట్బాల్ దిగ్గజం, అర్జెంటీనా కెపె్టన్ లియోనెల్ మెస్సీ ఈ ఏడాది చివర్లో భారత్లో పర్యటించనున్నాడు. 2011లో చివరిసారిగా భారత్కు విచ్చేసిన మెస్సీ... రెండు రోజుల పర్యటనలో భాగంగా డిసెంబర్లో కోల్కతా, అహ్మదాబాద్, ముంబై, న్యూఢిల్లీలో ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు సమాచారం. ఫుట్బాల్ను అమితంగా ఇష్టపడే కోల్కతా నుంచి మెస్సీ పర్యటన ప్రారంభం కానుంది. అందకు తగ్గట్లే ఏర్పాట్లు సైతం జరుగుతున్నట్లు సమాచారం. అయితే భారత పర్యటనపై ఇప్పటి వరకు మెస్సీ నుంచి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అతి త్వరలో అది వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ‘మెస్సీ పర్యటన ఖరారైంది. అతడి నుంచి అధికారిక స్పందన రావడమే తరువాయి. అది సామాజిక మాధ్యమాల ద్వారా ఏ క్షణమైనా రావచ్చు’ అని నిర్వాహకులు వెల్లడించారు. ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ 12న మెస్సీ కోల్కతాలో అడుగు పెట్టనున్నాడు. 70 అడుగుల విగ్రహం... ఫుట్బాల్ను విపరీతంగా అభిమానించే కోల్కతా వాసులు... మెస్సీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీఐపీ రోడ్లోని లేక్టౌన్ శ్రీభూమిలో మెస్సీ 70 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పర్యటనలో భాగంగా మెస్సీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నాడు. ప్రపంచంలో మెస్సీకి ఇదే అతి ఎత్తయిన విగ్రహం కానుంది. డిసెంబర్ 13 మధ్యాహ్నం ఈడెన్ గార్డెన్స్లో నిర్వహించే ‘గోట్ కాన్సెర్ట్’లో మెస్సీ పాల్గొననున్నాడు. మెస్సీ ఘనతలను వివరించేలా సాగే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు. ‘అభిమానులను తప్పుదోవ పట్టించాలనుకోవడం లేదు. గోట్ కాన్సెర్ట్తో పాటు ఏడుగురు ప్లేయర్లతో కూడిన ‘సెవెన్–ఎ–సైడ్’ గోట్ కప్ మ్యాచ్లో మెస్సీ పాల్గొననున్నాడు. ఇందులో భారత క్రికెట్ జట్టు మాజీ కెపె్టన్ సౌరవ్ గంగూలీ, టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్, భారత ఫుట్బాల్ జట్టు మాజీ కెప్టెన్ బైచుంగ్ భూటియా, ప్రముఖ నటుడు జాన్ అబ్రహం తదితరులు పాల్గొననున్నారు. ఇది మెస్సీ గౌరవార్ధం నిర్వహిస్తున్నాం. ఈడెన్ గార్డెన్స్లో నిర్వహించే ఈ మ్యాచ్ చూసేందుకు అభిమానులు ఎగబడే అవకాశం ఉండగా... టికెట్ ధరలు సైతం ఎక్కువగానే ఉండనున్నాయి. సుమారు గంటన్నర పాటు మెస్సీ మైదానంలో ఉంటాడు. అతడిని దగ్గర నుంచి చూసేందుకు స్టేడియం నిండిపోవడం ఖాయమే’ అని నిర్వాహకులు వెల్లడించారు. ఈ మ్యాచ్ అనంతరం బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మెస్సీని సత్కరించే అవకాశముంది. ముంబైలో క్రికెట్ మ్యాచ్! కోల్కతా పర్యటన అనంతరం మెస్సీ అహ్మదాబాద్, ముంబైలో జరగనున్న ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొననున్నాడు. డిసెంబర్ 14న ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలో జరగనున్న ‘గోట్ కాన్సెర్ట్’, ‘గోట్ కప్’లో మెస్సీ పాల్గొననున్నాడు. దీని కోసం ఇప్పటికే మైదానాన్ని బుక్ చేసినట్లు సమాచారం. ముంబైలో మెస్సీ క్రికెట్ మ్యాచ్ ఆడనున్నట్లు వార్తలు వస్తుండగా... నిర్వాహకులు మాత్రం వాటిని ఖండించారు. ‘మెస్సీ ఎలాంటి క్రికెట్ మ్యాచ్ ఆడబోవడం లేదు. భారత సెలెబ్రిటీలతో సరదాగా సాఫ్ట్బాల్ ఆడుతాడు’ అని వెల్లడించారు. అదే సమయంలో భారత ఫుట్బాల్ జట్టును సైతం మెస్సీ కలిసే అవకాశముంది. అనంతరం డిసెంబర్ 15న ఢిల్లీ చేరుకోనున్న మెస్సీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో మర్యాద పూర్వకంగా భేటీ కానున్నాడు. ఈ సందర్భంగా ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రతి నగరంలో మెస్సీ చిన్నారులతో ప్రత్యేకంగా గడపనున్నాడు. ఈ టూర్లో మెస్సీ కేరళకు వెళ్లడం లేదని నిర్వాహకులు స్పష్టం చేశారు. అప్పుడేం జరిగిందంటే...2011 ఆగస్టు 31న మెస్సీ తొలిసారి భారత్లో పర్యటించాడు. వెనిజులాతో ఎగ్జిబిషన్ మ్యాచ్ కోసం కోల్కతాకు విచ్చేసిన మెస్సీకి అభిమానులు బ్రహ్మరథం పట్టారు. అర్జెంటీనా జట్టుతో పాటు వచి్చన మెస్సీ కోసం వేలాది మంది అభిమానులు ఎయిర్పోర్ట్లో స్వాగతం పలకగా... మ్యాచ్ జరుగుతున్నంత సేపు ‘సాల్ట్లేక్’ స్టేడియం మెస్సీ నామస్మరణతో మార్మోగిపోయింది. కోల్కతా నగరం మొత్తం ‘మెస్సీ మేనియా’తో ఊగిపోయింది. ఇప్పుడు మళ్లీ ఇన్నాళ్ల తర్వాత... ప్రపంచ చాంపియన్ హోదాలో మెస్సీ భారత్లో అడుగుపెట్టనుండటంతో... ఈ సారి మరింత మంది అభిమానులు అర్జెంటీనా స్టార్ను చూసేందుకు ఎగబడటం ఖాయమే. -
దివ్యకు రూ. 3 కోట్ల నజరానా
నాగ్పూర్: మహిళల చెస్ ప్రపంచకప్ టైటిల్ గెలిచిన భారత క్రీడాకారిణి దివ్య దేశ్ముఖ్కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రూ. 3 కోట్ల నగదు బహుమతిని అందించారు. జార్జియాలో ఇటీవల జరిగిన వరల్డ్కప్ ఫైనల్లో భారత స్టార్ కోనేరు హంపిపై ‘టైబ్రేక్’లో నెగ్గి చాంపియన్గా అవతరించిన 19 ఏళ్ల దివ్యను శనివారం ఏర్పాటు చేసిన పౌర సన్మాన కార్యక్రమంలో ఫడ్నవీస్ ప్రత్యేకంగా అభినందించారు. నాగ్పూర్కు చెందిన దివ్య యావత్ దేశాన్ని గర్వపడేలా చేసిందని ఫడ్నవీస్ అన్నారు. చిన్న వయసులోనే పెద్ద ఘనత సాధించిన దివ్యను సత్కరించడం ఆనందంగా ఉందని వెల్లడించారు. ఈ సందర్భంగా దివ్య మాట్లాడుతూ... ‘ఇది నాకు ప్రత్యేకమైన సందర్భం. చిన్నారులకు స్ఫూర్తిగా నిలవడంలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. సహకరించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు’ అని వెల్లడించింది. ఇదే కార్యక్రమంలో మహారాష్ట్ర చెస్ సంఘం దివ్యకు రూ. 11 లక్షల నజరానా అందించింది. ఒక్క జీఎం నార్మ్ కూడా లేకుండా ప్రపంచకప్ బరిలోకి దిగిన దివ్య... టైటిల్తో పాటు నేరుగా గ్రాండ్మాస్టర్ హోదా సైతం దక్కించుకుంది. మరోవైపు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ గవాయ్ శనివారం దివ్య దేశ్ముఖ్ ఇంటిని సందర్శించి... వరల్డ్కప్ టైటిల్ గెలిచిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. దివ్య కుటుంబంతో తనకున్న అనుంబంధాన్ని గుర్తుచేసుకున్న చీఫ్ జస్టిస్... భవిష్యత్తులో దివ్య మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. -
భర్తతో విడాకులు.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన సైనా నెహ్వాల్
భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ (Saina Nehwal) అభిమానులకు శుభవార్త చెప్పింది. భర్త పారుపల్లి కశ్యప్ (Parupalli Kasyap)తో కలిసి దిగిన ఫొటోను పంచుకుంటూ.. ‘‘దూరం దగ్గర చేసింది’’ అని క్యాప్షన్ ఇచ్చింది. తద్వారా తాము తిరిగి కలిసిపోయామనే సంకేతాలు ఇచ్చింది.కాగా భర్త పారుపల్లి కశ్యప్తో తాను విడిపోతున్నట్లు (Divorce) సైనా నైహ్వాల్ గత నెలలో ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు జూలై 13న సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.ఆలోచించే విడాకుల నిర్ణయం‘‘జీవితం మనల్ని ఒక్కోసారి వేర్వేరు దిశల్లో ప్రయాణించేలా చేస్తుంది. సుదీర్ఘ చర్చలు, ఆలోచనల అనంతరం నేను, కశ్యప్ విడిపోవాలని నిశ్చయించుకున్నాం. ఈ బంధంలో నాకెన్నో మధురానుభూతులు ఉన్నాయి. ఇకపై కూడా మేము స్నేహితుల్లా కొనసాగుతాం’’ అని సైనా నోట్ విడుదల చేసింది.ఊహించని ట్విస్ట్అయితే, తాజాగా శనివారం పారుపల్లి కశ్యప్తో కలిసి దిగిన ఫొటోలను సైనా నెహ్వాల్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ‘‘కొన్నిసార్లు దూరమే.. మన సన్నిహితులతో కలిసి ఉండటం ఎంత విలువైనదో నేర్పుతుంది. మేము కలిసి ఉండేందుకు మరో ప్రయత్నం చేస్తున్నాం’’ అని రెండు హార్ట్ ఎమోజీలతో సైనా క్యాప్షన్ జతచేసింది. కాగా భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్ దగ్గర శిక్షణ తీసుకున్న సైనా, కశ్యప్ చాలా ఏళ్లపాటు ప్రేమించుకున్నారు. 2018లో పెళ్లి బంధంతో ఒక్కటైన వీరు అన్యోన్యంగా ఉండేవారు. కెరీర్ పరంగానూ ఒకరికొరు అండగా ఉంటూ కపుల్ గోల్స్ సెట్ చేసేవాళ్లు. అయితే, సైనా విడాకుల ప్రకటన చేయగా.. కశ్యప్ మాత్రం అపుడు స్పందించలేదు.ఇక ఇప్పుడు భార్యతో కలిసి పోస్ట్ షేర్ చేస్తూ తమ రీయూనియన్ని మాత్రం తెలియజేశాడు. కాగా లండన్ ఒలింపిక్స్-2012లో మహిళల సింగిల్స్ విభాగంలో సైనా కాంస్యం గెలవగా.. అదే ఎడిషన్లో కశ్యప్ పురుషుల సింగిల్స్లో క్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్నాడు.చదవండి: నిప్పుతో చెలగాటం ఆడటమే.. వరల్డ్కప్ గెలిస్తే ధోని గొప్పవాడు అయిపోతాడా? View this post on Instagram A post shared by SAINA NEHWAL (@nehwalsaina) -
కిన్ డబుల్ ధమాకా..
సింగపూర్: ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్షిప్ ఆరో రోజు స్టార్ స్విమ్మర్లు లాన్ మర్చెండ్ (ఫ్రాన్స్), టీనేజ్ స్టార్ స్విమ్మర్ సమ్మర్ మెకింటోష్ (కెనడా) బరిలో లేకపోవడంతో... ఐదు వేర్వేరు దేశాలకు చెందిన స్విమ్మర్లు పసిడి పతకాలు ఖాతాలో వేసుకున్నారు. శుక్రవారం పోటీల్లో నెదర్లాండ్స్, చైనా, హంగేరి, అమెరికా, ఇంగ్లండ్కు చెందిన స్విమ్మర్లు స్వర్ణ పతకాలు సాధించారు. మహిళల 100 మీటర్ల ఫ్రీస్టయిల్లో మ్యారిట్ స్టీన్బెర్గన్ (నెదర్లాండ్స్) పసిడి పతకంతో మెరిసింది. ఫైనల్ రేసులో స్టీన్బెర్గన్ 52.55 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచింది. మొల్లీ ఓ కల్లాఘన్ (52.67 సెకన్లు; ఆ్రస్టేలియా), టారీ హుస్కే (52.89 సెకన్లు; అమెరికా) వరుసగా రజత, కాంస్యాలు దక్కించుకున్నారు. 2024లో దోహా వేదికగా జరిగిన పోటీల్లో సైతం విజేతగా నిలిచిన స్టీన్బెర్గన్... చివరి 50 మీటర్లలో జోరు పెంచి చాంపియన్గా అవతరించింది. ఆ్రస్టేలియా, అమెరికా స్విమ్మర్ల నుంచి కఠిన పోటీ ఎదురైనా... ఆఖర్లో ఆధిక్యం కనబర్చింది. ‘దోహాలో సునాయాసంగా విజయం సాధించా. కానీ ఈ సారి పోటీ చాలా తీవ్రంగా ఉంది. అందుకే ఈ విజయం చాలా సంతృప్తినిచి్చంది’ అని పోటీ అనంతరం స్టీన్బెర్గన్ పేర్కొంది. ఆరో రోజు పోటీలు ముగిసేసరికి అమెరికా, ఆ్రస్టేలియా ఐదేసి స్వర్ణ పతకాలతో పట్టిక అగ్రస్థానంలో నిలిచాయి. ఓవరాల్గా అమెరికా 20 పతకాలు సాధించగా... ఆ్రస్టేలియా 13 పతకాలు ఖాతాలో వేసుకుంది. కిన్ విన్ పురుషుల 200 మీటర్ల బ్రెస్ట్స్ట్రోక్లో చైనా స్విమ్మర్ కిన్ హైయాంగ్ విజేతగా నిలిచాడు. శుక్రవారం జరిగిన ఫైనల్లో కిన్ 2 నిమిషాల 7.41 సెకన్లలో లక్ష్యాన్ని చేరి పసిడి పతకం ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పీ వటనబె (2 నిమిషాల 7.70 సెకన్లు; జపాన్) రజతం గెలుచుకోగా... కాస్పర్ కారŠూబ్య (2 నిమిషాల 7.73 సెకన్లు; నెదర్లాండ్స్) కాంస్య పతకం నెగ్గాడు. ఈ విభాగంలో రెండేళ్ల క్రితం ప్రపంచ రికార్డు (2 నిమిషాల 5.48 సెకన్లు) తనపేరిట రాసుకున్న కిన్... విజయం అనంతరం ‘ఇదో అద్భుతం’ అని వ్యాఖ్యానించాడు. 100 మీటర్ల బ్రెస్ట్స్ట్రోక్లోనూ పసిడి నెగ్గిన కిన్... 200 మీటర్లలోనూ జోరు కనబర్చి డబుల్ ధమాకా మోగించాడు. పురుషుల 200 మీటర్ల బ్యాక్స్ట్రోక్లో పారిస్ ఒలింపిక్స్ చాంపియన్ హబర్ట్ (హంగేరి) పసిడి పతకం గెలిచాడు. 1 నిమిషం 53.19 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచాడు. పీటర్ కోట్జీ (1 నిమిషం 53.36 సెకన్లు; దక్షిణాఫ్రికా), యోహాన్ బ్రౌర్డ్ (1 నిమిషం 54.62 సెకన్లు; ఫ్రాన్స్) వరుసగా రజత, కాంస్యాలు దక్కించుకున్నారు. స్టార్ స్విమ్మర్ కేట్ డగ్లస్... అమెరికాకు ఐదో స్వర్ణం అందించింది. మహిళల 200 మీటర్ల బ్రెస్ట్స్ట్రోక్లో 2 నిమిషాల 18.50 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచింది. ఈ విభాగంలో ఇది రెండో అత్యుత్తమ టైమింగ్ కావడం విశేషం. చికునోవా (2 నిమిషాల 19.96 సెకన్లు) రజతం గెలుచుకోగా.. కైలెన్ కార్బెట్, అలీనా ముసుకా (2 నిమిషాల 23.52 సెకన్లు) ఒకే సమయంలో లక్ష్యాన్ని చేరి కాంస్యం దక్కించుకున్నారు. పురుషుల 4–200 ఫ్రీస్టయిల్ రిలేలో బ్రిటన్ జట్టు 6 నిమిషాల 59.84 సెకన్ల టైమింగ్తో స్వర్ణం పసిడి గెలుచుకుంది. చైనా (7 నిమిషాల 0.91 సెకన్లు), ఆ్రస్టేలియా (7 నిమిషాల 0.98 సెకన్లు) వరుసగా రజత, కాంస్యాలు దక్కించుకున్నాయి. చైనాకు చెందిన 12 ఏళ్ల స్విమ్మర్ యూ జిడి ప్రపంచ చాంపియన్షిప్లో కాంస్య పతకంతో సత్తాచాటింది. మహిళల 4–200 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలే విభాగంలో చైనా జట్టులో సభ్యురాలైన యూ జిడి కాంస్యం గెలుచుకుంది. ఆ్రస్టేలియా, అమెరికా బృందాలు వరుసగా స్వర్ణ, రజతాలు నెగ్గారు. 200 మీటర్ల బటర్ఫ్లై, 200 మీటర్ల మెడ్లీ వ్యక్తిగత విభాగాల్లోనూ యూ జిడి పతకానికి దగ్గరగా వచ్చింది. నాలుగో స్థానంలో నిలిచి తృటిలో పతకానికి దూరమైంది. 400 మీటర్ల విభాగం యూ జిడి ఇంకా పోటీ పడాల్సి ఉంది. ఈ టోర్నీలో భారత స్విమ్మర్ల నిరాశజనక ప్రదర్శన ఆరో రోజు కూడా కొనసాగింది. పురుషుల 100 మీటర్ల బటర్ఫ్లై విభాగంలో రోహిత్ 47వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. -
ఫైనల్కు లక్కీ
ఏథన్స్ (గ్రీస్): ప్రపంచ అండర్–17 రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత యువ రెజ్లర్ లక్కీ పసిడి పతకానికి అడుగు దూరంలో నిలిచాడు. పురుషుల ఫ్రీస్టయిల్ 110 కేజీల విభాగంలో లక్కీ ఫైనల్కు దూసుకెళ్లాడు. జపాన్, ఇరాన్కు చెందిన రెజ్లర్లపై విజయాలతో లక్కీ ముందంజ వేశాడు. జపాన్ రెజ్లర్ హంటో హయేషిపై టెక్నికల్ సూపీరియారిటీతో విజయం సాధించిన లక్కీ... తదుపరి రౌండ్లో 8–0తో ముర్తాజ్ బగ్దవద్జె (జార్జియా)పై గెలుపొందాడు. ఇక హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో లక్కీ 15–7 పాయింట్ల తేడాతో ఇరాన్కు చెందిన అమీర్ హుసేన్పై నెగ్గాడు. 65 కేజీల విభాగంలో గౌరవ్ పూనియా తొలి రెండు రౌండ్లలో టెక్నికల్ సుపీరియారిటీతో విజయం సాధించినా... క్వార్టర్స్లో ఓడి ఇంటిబాట పట్టాడు. -
భారత్ ఫుట్బాల్ కోచ్గా జమీల్
న్యూఢిల్లీ: భారత పురుషుల ఫుట్బాల్ జట్టుకు చాన్నాళ్ల తర్వాత స్వదేశీ కోచ్ను నియమించారు. అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) భారత్కు చెందిన ఖాలిద్ జమీల్కు జాతీయ జట్టు కోచింగ్ బాధ్యతలు అప్పగించింది. ఈ కోచ్ పదవి కోసం విదేశీ కోచ్లు స్టీఫెన్ కాన్స్టంటైన్, స్టీఫాన్ టర్కోవిచ్లు కూడా పోటీపడినప్పటికీ వీళ్లిద్దరిని వెనక్కినెట్టిన 48 ఏళ్ల జమీల్ భారత్ హెడ్ కోచ్గా నియమితులయ్యారు. 13 ఏళ్ల తర్వాత జాతీయ ఫుట్బాల్ జట్టుకు స్వదేశీ కోచ్ శిక్షణ ఇవ్వనున్నారు. చివరి సారిగా భారత్కే చెందిన సావియో మెడెరా 2011 నుంచి 2012 వరకు హెడ్ కోచ్గా వ్యవహరించారు. తాజా నియామకంపై ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడు కళ్యాణ్ చౌబే మాట్లాడుతూ ‘ఐఎమ్ విజయన్ నేతృత్వంలోని టెక్నికల్ కమిటీ ముగ్గురితో కూడిన తుదిజాబితా నుంచి జమీల్ను ఎంపిక చేసింది. అయితే ఆయన పదవీ కాలాన్ని మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. జమీల్ మూడేళ్ల గడువును ఆశిస్తున్నారు. అయితే రెండేళ్లా లేదంటే మూడేళ్లా అనేది జట్టు ప్రదర్శన, ఆయన ఇచ్చే శిక్షణను బట్టి ఉంటుంది’ అని అన్నారు. భారత మాజీ ఫుట్బాలర్ అయిన జమీల్ శిక్షణలో 2017లో ఐజ్వాల్ ఫుట్బాల్ క్లబ్ ‘ఐ–లీగ్’ టైటిల్ను సాధించింది. ప్రస్తుతం ఆయన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో జంషెడ్పూర్ ఎఫ్సీ కోచ్గా ఉన్నారు. అయితే భారత కోచ్గా నియమితులైన జమీల్ పూర్తి స్థాయిలో టీమిండియా కోచ్గా పనిచేయాల్సి ఉంటుందని ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడు చౌబే స్పష్టం చేశారు. దీంతో ఐఎస్ఎల్ ఫ్రాంచైజీకి జమీల్ గుడ్బై చెప్పాల్సి ఉంది. గత కోచ్ మారŠె భారత జట్టు హెడ్ కోచ్గా ఉంటూనే, ఎఫ్సీ గోవా కోచ్గాను పనిచేశారు. స్పెయిన్కు చెందిన మనోలో గత నెల కోచ్ పదవి నుంచి తప్పుకున్నారు. టీమిండియా గత కొంతకాలంగా తక్కువ ర్యాంకు జట్లతోనూ ఓడిపోతుండటంతో ఇంకో ఏడాది పదవీకాలం మిగిలిండగానే కోచ్ తన పదవికి రాజీనామా చేశారు. -
సెమీస్లో తరుణ్
మకావ్: సంచలన ప్రదర్శనతో దూసుకెళ్తున్న భారత షట్లర్, హైదరాబాద్ ప్లేయర్ తరుణ్ మన్నేపల్లి... మకావ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ సెమీ ఫైనల్కు చేరాడు. వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 15వ ర్యాంకర్, టాప్ సీడ్ లీ చెక్ యు (హాంకాంగ్)పై ప్రిక్వార్టర్స్లో సంచలన విజయం సాధించిన తరుణ్... క్వార్టర్ ఫైనల్లోనూ అదే జోరు కనబర్చాడు. శుక్రవారం పురుషుల సింగిల్స్ క్వార్టర్స్లో ప్రపంచ 47వ ర్యాంకర్ తరుణ్ 21–12, 13–21, 21–18తో ప్రపంచ 87వ ర్యాంకర్ హు జె (చైనా)పై గెలిచి సెమీస్లో అడుగుపెట్టాడు. బీడబ్ల్యూఎఫ్ సూపర్–300 టోర్నీల్లో తరుణ్ సెమీస్కు చేరడం ఇదే తొలిసారి. ఈ ఏడాది ఫిబ్రవరిలో అతడు అత్యుత్తమంగా జర్మన్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్ ఆడాడు. 75 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి గేమ్ను సులువుగా గెలుచుకున్న 23 ఏళ్ల తరుణ్... రెండో గేమ్లో వెనుకబడ్డాడు. ఆ తర్వాత నిర్ణయాత్మక మూడో గేమ్ ఆరంభం నుంచి నువ్వానేనా అన్నట్లు సాగగా... కీలక దశలో పాయింట్లు సాధించిన తరుణ్ ముందంజ వేశాడు. మరో క్వార్టర్ ఫైనల్లో భారత్కే చెందిన కామన్వెల్త్ స్వర్ణ పతక విజేత లక్ష్యసేన్ 21–14, 18–21, 21–14తో జియాన్ చెన్ జూ (చైనా)పై విజయం సాధించాడు. 63 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో లక్ష్యసేన్ ఆధిక్యం కనబర్చాడు. నేడు జరగనున్న సెమీఫైనల్స్లో ఐదో సీడ్ అల్వీ ఫర్హాన్ (ఇండోనేసియా)తో లక్ష్యసేన్, జస్టిన్ హో (మలేసియా)తో తరుణ్ తలపడనున్నారు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత స్టార్ జోడీ సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి 14–21, 21–13, 20–22తో చూంగ్ హాన్ జియాన్–హైకల్ ముహమ్మద్ (మలేసియా) ద్వయం చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. -
ఓటమితో వీడ్కోలు.. టెన్నిస్ స్టార్ కన్నీటి పర్యంతం
మాంట్రియల్: కెనడాకు చెందిన టెన్నిస్ ప్లేయర్ జెనీ బుచార్డ్ ఆటకు వీడ్కోలు పలికింది. సొంతగడ్డపై అభిమానుల సమక్షంలో కెరీర్లో చివరి మ్యాచ్ ఆడేసింది. నేషనల్ బ్యాంక్ ఓపెన్లో భాగంగా గురువారం మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో బుచార్డ్ 2–6, 6–3, 4–6తో 17వ సీడ్ బెలిండా బెన్చిచ్ (స్విట్జర్లాండ్) చేతిలో ఓడింది. తొలి రౌండ్లో పోరాడి గెలిచిన బుచార్డ్... రెండో రౌండ్లో అదే ఆటతీరు కనబర్చలేకపోయింది. 2 గంటల 16 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో... తొలి సెట్లో ఓడిన బుచార్డ్... ఆ తర్వాత పుంజుకుంది. రెండో సెట్ గెలిచి... మూడో సెట్లోనూ చక్కటి పోరాటం కనబర్చినా... కీలక సమయాల్లో ఆధిక్యం కనబర్చిన బెన్చిచ్ విజయం సాధించింది. ప్రత్యేక అనుబంధం‘మాంట్రియల్తో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. కెరీర్ ఆరంభించినప్పటి నుంచి ఎదో ఒక రోజు ఇదే మైదానంలో ఆటకు వీడ్కోలు పలకాలని బలంగా అనుకునే దాన్ని. ఇప్పుడు ఆ రోజు వచ్చేసింది. ఇదో భావోద్వేగ సందర్భం. కెరీర్లో సాధించిన దాంతో సంతృప్తిగా ఉన్నా’ అని బుచార్డ్ పేర్కొంది. 2014లో కెరీర్ అత్యుత్తమ దశలో ఉన్న సమయంలో బుచార్డ్ ప్రపంచ ర్యాంకింగ్స్లో అత్యుత్తమంగా 5వ స్థానానికి చేరింది. ఆ ఏడాదే కెరీర్లో ఏకైక డబ్ల్యూటీఏ సింగిల్స్ టైటిల్ నెగ్గిన ఆమె.... ఆ్రస్టేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోరీ్నల్లో సెమీఫైనల్కు చేరింది. 2014లో వింబుల్డన్ టోర్నీలో రన్నరప్గా నిలిచింది. ఆ తర్వాత ఆ స్థాయి ప్రదర్శన కనబర్చలేకపోయిన బుచార్డ్... తిరిగి పుంజుకోలేకపోయింది. కన్నీటి పర్యంతం‘ఎన్నో కష్టనష్టాలు ఓర్చి ఇక్కడి వరకు వచ్చా. టెన్నిస్ ధ్యాసలో పడి చదువుకు దూరమయ్యా. ఇష్టాలను వదులుకొని ఎంతో కష్టపడితేనే ఈ స్థాయికి చేరుకున్నా. నేను ఆటకు ఎంతో ఇచ్చాను. ఇక ఆటకు వీడ్కోలు పలికి ఇతర విషయాలపై దృష్టి పెట్టాలనుకుంటున్నా. టెన్నిస్ నాకు తిరిగిచి్చన దాంతో సంతృప్తిగా ఉన్నా. చిన్నప్పుడు ఈ మైదానంలో కూర్చొని మ్యాచ్లు వీక్షించేదాన్ని. ఏదో ఒక రోజు ఈ కోర్టులో అడుగు పెట్టాలని కలలు కనేదాన్ని. అది నిజం చేసుకొని సగర్వంగా ఇక్కడే ఆటకు వీడ్కోలు పలుకుతున్నా’ అని మ్యాచ్ అనంతరం బుచార్డ్ కన్నీటి పర్యంతమైంది. -
గురువును గుర్తు చేసుకుంటూ..
నాగ్పూర్: దివ్య దేశ్ముఖ్... ప్రస్తుత చెస్ సంచలనం. 19 ఏళ్ల వయసులో మహిళల ప్రపంచకప్ను గెలుచుకొని సత్తా చాటిన ఘనాపాటీ. జార్జియాలో జరిగిన ఫైనల్లో కోనేరు హంపిని ఓడించిన అనంతరం చాంపియన్గా నిలిచిన అనంతరం దివ్య బుధవారం రాత్రి స్వదేశానికి తిరిగి వచ్చింది. సొంత ఊరు నాగ్పూర్ విమానాశ్రయంలో ఆమె తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు, సన్నిహితులతో అంతా సందడిగా ఉంది. దివ్య రాగానే వారంతా బాజా భజంత్రీలతో ఆమెకు ఘన స్వాగతం పలికారు. అప్పుడే దివ్య తన వద్ద ఉన్న ఒక ఫోటో ఫ్రేమ్ను బయటకు తీసి ప్రదర్శించింది. అది ఆమె మొదటి కోచ్ రాహుల్ జోషి చిత్రం. దానిని చూపిస్తూ దివ్య భావోద్వేగానికి లోనైంది. చెస్లో రాహుల్ వద్దే దివ్య ఓనమాలు నేర్చుకుంది. కేవలం కోచ్గానే కాకుండా తన సొంత ఇంట్లో మనిషిగా చూస్తూ రాహుల్ ఆమెకు శిక్షణనందించాడు. కెరీర్ ఆరంభంలో అండర్–9 స్థాయి నుంచి అండర్–14 వరకు పలు విజయాలు రాహుల్ కోచ్గా ఉండగానే వచ్చాయి.ఆమె మరింత ఎదుగుతున్న దశలో 2020లో కరోనా మహమ్మారి వచి్చంది. దీనికి 40 ఏళ్ల వయసులోనే జోషి బలయ్యాడు. కొన్ని విజయాలు సాధించగానే గతాన్ని మరిచిపోయే క్రీడాకారులు మనకు ఎంతో మంది కనిపిస్తుంటారు. కానీ ఆదిగురువును ఆమెకు గౌరవించిన తీరు దివ్యను ప్రత్యేకంగా చూపించింది. ‘నేను ఈ స్థాయికి చేరడంతో మొదటి కోచ్ రాహుల్ జోషి సర్ పాత్ర ఎంతో ఉంది. నేను గ్రాండ్మాస్టర్ కావాలని ఆయన ఎంతో కోరుకునేవారు. ఈ విజయం ఆయనకే అంకితం’ అని దివ్య తన మనసులో భావాన్ని వెల్లడించింది. నా ఆటపైనే దృష్టి పెట్టాను... హంపితో జరిగిన ఫైనల్ మ్యాచ్లో తనపై ఎలాంటి ఒత్తిడీ లేదని, తాను ఓడినా కోల్పోయేదేమీ లేదనే ఆలోచనతోనే బరిలోకి దిగినట్లు దివ్య పేర్కొంది. ప్రత్యర్థికి ఎంతో అనుభవం ఉన్నా... దాని గురించి ఆందోళన చెందకుండా తన ఆటపైనే దృష్టి పెట్టానని ఆమె వెల్లడించింది. ‘నేను ఓడిపోతాననే ఆలోచన కూడా ఎప్పుడూ రాలేదు. నిజానికి హంపి చేసిన పెద్ద తప్పుతోనే విజయం నా సొంతమైంది. నేను వేయబోయే ఎత్తుల గురించే తప్ప తుది ఫలితం ఎలా వస్తుందని పట్టించుకోలేదు. కాబట్టి ఒత్తిడికి లోను కాలేదు.అంతర్జాతీయ చెస్లో భారత మహిళలు సాధించే విజయాలు ఇక్కడ మరింత మంది అమ్మాయిలు ఈ ఆట వైపు ఆకర్షితులయ్యేందుకు స్ఫూర్తినిస్తాయి. అయితే నా ఉద్దేశం ప్రకారం తల్లిదండ్రుల మద్దతే అన్నింటికంటే అవసరం. ముఖ్యంగా విజయాలు సాధించినప్పుడు కాకుండా ఓటములు ఎదురైనప్పుడు కూడా అండగా నిలవాల్సి ఉంటుంది’ అని దివ్య అభిప్రాయ పడింది. సెప్టెంబర్ లో తర్వాతి టోర్నీ... ప్రపంచకప్ను గెలుచుకోవడంతో తనకు దక్కిన కొత్త గుర్తింపు పట్ల దివ్య దేశ్ముఖ్ సంతోషం వ్యక్తం చేసింది. మున్ముందు ఇలాంటి విజయాలను కొనసాగిస్తానని ఆమె ఆత్మవిశ్వాసంతో చెప్పింది. స్వస్థలం నాగపూర్లో లభించిన ఘన స్వాగతాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని దివ్య పేర్కొంది. ‘నా కోసం ఇంత మంది ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. వారంతా నన్ను సన్మానించిన తీరు చూస్తే గర్వంగా అనిపిస్తోంది. నాతో పాటు చెస్కు లభించిన గుర్తింపుగా దీనిని భావిస్తున్నాను. తల్లిదండ్రులు నాకు అండగా నిలిచి ప్రోత్సహించడంతోనే ఇది సాధ్యమైంది. నా విజయంలో వారి పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకొని మళ్లీ బరిలోకి దిగుతాను. సెపె్టంబర్ 2 నుంచి ఉజ్బెకిస్తాన్లో జరిగే గ్రాండ్ స్విస్ నా తర్వాతి టోర్నీ కానుంది’ అని దివ్య వెల్లడించింది. తాను వరల్డ్ కప్ గెలుచుకోవడంలో సహకరించిన మాజీ ఆటగాళ్లు, కోచ్లు అభిజిత్ కుంతే, అభిమన్యు పురాణిక్, సబా బలోగ్ (హంగేరీ)లకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. -
మెకింటోష్ పసిడి ‘హ్యాట్రిక్’
సింగపూర్: ఈత కొలనులో తనకు తిరుగులేదని కెనడా టీనేజ్ స్టార్ స్విమ్మర్ సమ్మర్ మెకింటోష్ మరోసారి చాటుకుంది. ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో తన జోరు కొనసాగిస్తూ 18 ఏళ్ల మెకింటోష్ మూడో స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో జమ చేసుకుంది. గురువారం జరిగిన మహిళల 200 మీటర్ల బటర్ఫ్లయ్ ఫైనల్లో మెకింటోష్ 2 నిమిషాల 01.99 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచింది. ఈ చాంపియన్షిప్లో ఇప్పటికే మెకింటోష్ 400 మీటర్ల ఫ్రీస్టయిల్, 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లీ విభాగాల్లో బంగారు పతకాలు సొంతం చేసుకుంది. 800 మీటర్ల ఫ్రీస్టయిల్, 400 మీటర్ల మెడ్లీ ఈవెంట్స్లో మెకింటోష్ బరిలోకి దిగాల్సి ఉంది. ఈ రెండింటిలోనూ మెకింటోష్ స్వర్ణాలు సాధిస్తే... ఒకే ప్రపంచ చాంపియన్షిప్లో అత్యధికంగా 5 స్వర్ణ పతకాలు సాధించిన స్విమ్మర్గా మైకేల్ ఫెల్ప్స్ (అమెరికా; 2007లో) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును మెకింటోష్ సమం చేస్తుంది. గత ఏడాది జరిగిన పారిస్ ఒలింపిక్స్లో మెకింటోష్ 200 మీటర్ల బటర్ఫ్లయ్, మెడ్లీ, 400 మీటర్ల మెడ్లీ ఈవెంట్స్లో స్వర్ణాలు గెలిచి, 400 మీటర్ల ఫ్రీస్టయిల్లో రజతం సాధించింది. 2022 ప్రపంచ చాంపియన్షిప్లో రెండు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం నెగ్గిన మెకింటోష్ ... 2023 ప్రపంచ చాంపియన్షిప్లో రెండు స్వర్ణాలు, రెండు కాంస్యాలు సాధించింది. మూడోసారి ప్రపంచ చాంపియన్షిప్లో పోటీపడుతున్న మెకింటోష్ ఇప్పటి వరకు మొత్తం ఏడు స్వర్ణాలు, ఒక రజతం, మూడు కాంస్యాలతో కలిపి 11 పతకాలు గెలిచింది. మరోవైపు పురుషుల 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లీలో ఫేవరెట్ లియోన్ మర్చండ్ స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. బుధవారం సెమీఫైనల్ రేసులో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పిన 23 ఏళ్ల మర్చండ్... గురువారం జరిగిన ఫైనల్ రేసును 1 నిమిషం 53.68 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. పురుషుల 100 మీటర్ల ఫ్రీస్టయిల్లో డేవిడ్ పొపోవిచి (రొమేనియా; 46.51 సెకన్లు)... మహిళల 50 మీటర్ల బ్యాక్స్ట్రోక్లో కేథరీన్ బెర్కోఫ్ (అమెరికా; 27.08 సెకన్లు) బంగారు పతకాలు గెలిచారు. మహిళల 4–200 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలేలో ఆస్ట్రేలియా బృందం స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. మరో మూడు రోజులపాటు కొనసాగనున్న ఈ మెగా ఈవెంట్లో పతకాల పట్టికలో ఆస్ట్రేలియా (5 స్వర్ణాలు, 1 రజతం, 5 కాంస్యాలు) 11 పతకాలతో అగ్రస్థానంలో... అమెరికా (4 స్వర్ణాలు, 10 రజతాలు, 4 కాంస్యాలు) 18 పతకాలతో రెండో స్థానంలో... కెనడా (3 స్వర్ణాలు, 2 కాంస్యాలు) ఐదు పతకాలతో మూడో స్థానంలో ఉన్నాయి. గెలిచిన స్వర్ణాల సంఖ్య ఆధారంగా ర్యాంకింగ్ను నిర్ణయిస్తారు. -
రచన, అశ్విని బంగారం
ఏథెన్స్ (గ్రీస్): అంతర్జాతీయ స్థాయిలో మరోసారి భారత ‘పట్టు’ చాటుకుంటూ... ప్రపంచ అండర్–17 రెజ్లింగ్ చాంపియన్షిప్లో మహిళా రెజ్లర్లు ఐదు పతకాలతో అదరగొట్టారు. ఇందులో రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యం ఉన్నాయి. 43 కేజీల విభాగంలో రచన... 65 కేజీల విభాగంలో అశ్విని విష్ణోయ్ బంగారు పతకాలు సొంతం చేసుకోగా... 57 కేజీల విభాగంలో మోనీ, 73 కేజీల విభాగంలో కాజల్ రజత పతకాలు గెలిచారు. 49 కేజీల విభాగంలో కోమల్ వర్మ కాంస్య పతకాన్ని హస్తగతం చేసుకుంది. గురువారం జరిగిన ఫైనల్స్లో రచన 3–0తో జిన్ హువాంగ్ (చైనా)పై, అశ్విని 3–0తో ముఖాయో రఖిమ్జొనోవా (ఉజ్బెకిస్తాన్)పై విజయం సాధించారు. మద్ఖియా ఉస్మనోవా (కజకిస్తాన్)తో జరిగిన తుది పోరులో మోనీ 5–6 పాయింట్ల తేడాతో... వెన్జిన్ కియు (చైనా)తో జరిగిన ఫైనల్లో కాజల్ 5–8 పాయింట్ల తేడాతో ఓడిపోయారు. కాంస్య పతక బౌట్లో కోమల్ వర్మ 8–3 పాయింట్ల తేడాతో అన్హెలీనా బుర్కినా (రష్యా)పై గెలిచింది. మరోవైపు భారత్కే చెందిన యశిత (61 కేజీలు) స్వర్ణ పతకం కోసం... మనీషా (69 కేజీలు) కాంస్య పతకం కోసం ఈ రోజు పోటీపడనున్నారు. -
తరుణ్ సంచలనం
మకావ్: అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న భారత షట్లర్, హైదరాబాద్ ప్లేయర్ తరుణ్ మన్నేపల్లి తన కెరీర్లో గొప్ప విజయాన్ని అందుకున్నాడు. మకావ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీలో ప్రపంచ 47వ ర్యాంకర్ తరుణ్ సంచలనం సృష్టించాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో తరుణ్ 19–21, 21–14, 22–20తో ప్రపంచ 15వ ర్యాంకర్, టాప్ సీడ్ లీ చెక్ యు (హాంకాంగ్)ను బోల్తా కొట్టించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 60 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో తరుణ్ తొలి గేమ్లో ఒకదశలో 7–1తో ఆధిక్యంలో ఉన్నప్పటికీ అదే జోరును కొనసాగించలేకపోయాడు. తొలి గేమ్ చేజార్చుకున్నప్పటికీ ఆందోళనకు గురి కాకుండా సంయమనంతో ఆడిన తరుణ్ రెండో గేమ్ను దక్కించుకొని మ్యాచ్లో నిలిచాడు. హోరాహోరీగా సాగిన నిర్ణాయక మూడో గేమ్లు పలుమార్లు స్కోర్లు సమమయ్యాయి. ఒకదశలో 17–14తో ముందంజ వేసిన తరుణ్ ఆ తర్వాత తడబడి స్కోరును 20–20తో సమం చేసుకున్నాడు. అయితే వెంటనే వరుసగా రెండు పాయింట్లు నెగ్గిన తరుణ్ చిరస్మరణీయ విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. భారత్కే చెందిన లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్ చేరగా... ఆయుశ్ శెట్టి నిష్క్రమించాడు. లక్ష్య సేన్ 21–14, 14–21, 21–17తో చికో వర్దోయో (ఇండోనేసియా)పై నెగ్గగా... ఆయుశ్ 18–21, 16–21తో జస్టిన్ హో (మలేసియా) చేతిలో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రక్షిత శ్రీ (భారత్) 21–14, 10–21, 11–21తో బుసానన్ (థాయ్లాండ్) చేతిలో ఓడిపోయింది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల (భారత్) ద్వయం 21–19, 13–21, 18–21తో జిమ్మీ వోంగ్–లాయ్ పె జింగ్ (మలేసియా) జంట చేతిలో ఓటమి పాలైంది. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ –చిరాగ్ శెట్టి (భారత్) జంట క్వార్టర్ ఫైనల్ చేరింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ 10–21, 22–20, 21–16తో కకేరు కుమగాయ్–హిరోకి నిషి (జపాన్)లపై గెలిచింది. 61 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో తొలి గేమ్ను కోల్పోయిన భారత జోడీ రెండో గేమ్లో 19–20తో ఓటమి అంచుల్లో నిలిచింది. అయితే పట్టుదలతో పోరాడి వరుసగా మూడు పాయింట్లు నెగ్గిన భారత ద్వయం రెండో గేమ్ను నెగ్గి మ్యాచ్లో నిలిచింది. నిర్ణాయక మూడో గేమ్లో ఆరంభంలోనే 4–0తో ముందంజ వేసిన సాత్విక్–చిరాగ్ చివరి వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని విజయాన్ని అందుకుంది. -
PKL 12: ఆరోజే ఆరంభం.. వైజాగ్లో తొలి మ్యాచ్.. పూర్తి వివరాలు
సాక్షి, విశాఖపట్నం: కబడ్డీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్ ఆరంభానికి సమయం సమీపిస్తోంది. ఆగష్టు 29న ప్రారంభం కానున్న ఈ మెగా కబడ్డీ టోర్నమెంట్ను నాలుగు ప్రధాన నగరాల్లో నిర్వహించనున్నారు. ఈసారి వైజాగ్, జైపూర్, చెన్నై, ఢిల్లీ నగరాలు 12 జట్లు తలపడే ఈ మెగా లీగ్కు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి.వైజాగ్లో గ్రాండ్ ఓపెనింగ్..ప్రొ కబడ్డీ 12వ సీజన్ ప్రారంభ వేడుకలు వైజాగ్లోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో అట్టహాసంగా జరగనున్నాయి. ఆగస్టు 29 శుక్రవారం జరిగే తొలి మ్యాచ్లో ఆతిథ్య జట్టు తెలుగు టైటాన్స్, తమిళ్ తలైవాస్తో తలపడనుంది. అదే రోజు జరిగే రెండో మ్యాచ్లో బెంగళూరు బుల్స్, పుణేరి పల్టాన్ను ఢీకొట్టనుంది.ఇక ఆగస్టు 30న, తెలుగు టైటాన్స్ మరోసారి బరిలోకి దిగి యూపీ యోధాస్తో పోటీపడనుంది. ఆ తర్వాత జరిగే మ్యాచ్లో యు ముంబా, గుజరాత్ జెయింట్స్తో తలపడనుంది. ఇక సూపర్ సండే 30న తలైవాస్, యు ముంబా మధ్య హోరాహోరీ పోరు జరగనుంది.మరోవైపు.. డిఫెండింగ్ చాంపియన్ హర్యానా స్టీలర్స్ తమ టైటిల్ వేటను బెంగాల్ వారియర్స్ మ్యాచ్తో ప్రారంభించనుంది. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత పీకేఎల్ మళ్లీ వైజాగ్కు రావడం విశేషం. గతంలో 2018లో ఆరో సీజన్కు అంతకుముందు 1,3 వ సీజన్ పోటీలకు అతిథ్యం ఇచ్చిన ఈ నగరంలో ఇప్పుడు మళ్ళీ కబడ్డీ సందడి నెలకొననుంది.చాలా ఆనందంగా ఉందిఈ సందర్భంగా ప్రో కబడ్డీ లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి మాట్లాడుతూ, "ప్రో కబడ్డీ లీగ్ ఎదుగుదలలో 12వ సీజన్ ఒక కొత్త అధ్యాయం. ఈ మల్టీ-సిటీ ఫార్మాట్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న అభిమానుల వద్దకు అత్యుత్తమ కబడ్డీ యాక్షన్ను తీసుకువెళ్తున్నాం. ముఖ్యంగా ఈ ఆటకు మంచి ఫ్యాన్ బేస్ ఉన్న విశాఖపట్నంకు తిరిగి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది" అని అన్నారు. కాగా 12వ సీజన్ ప్లే ఆఫ్స్ షెడ్యూల్ను త్వరలో ప్రకటించనున్నారు.అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏకేఎఫ్ఐ) ఆధ్వర్యంలో మషల్ స్పోర్ట్స్, జియోస్టార్ కలిసి ఈ లీగ్ను దేశంలో అత్యంత విజయవంతమైన స్పోర్ట్స్ లీగ్స్ లో ఒకటిగా నిలబెట్టాయి. ప్రో కబడ్డీ లీగ్ మ్యాచ్లు స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. జియో హాట్స్టార్ లో లైవ్ స్ట్రీమ్ అవుతాయి.మిగతా నగరాల్లో షెడ్యూల్జైపూర్వైజాగ్లో తొలి అంచె ముగిసిన తర్వాత సెప్టెంబర్ 12 నుంచి జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ ఇండోర్ స్టేడియంలో మ్యాచ్లు ప్రారంభమవుతాయి. ఇక్కడ జరిగే తొలి పోరులో జైపూర్ పింక్ పాంథర్స్, బెంగళూరు బుల్స్తో తలపడనుంది. 10వ సీజన్లో చారిత్రాత్మక 1000వ మ్యాచ్కు జైపూర్ ఆతిథ్యం ఇచ్చింది.చెన్నైసెప్టెంబర్ 29 నుంచి చెన్నైలోని ఎస్డీఏటీ మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో మూడో లెగ్ ప్రారంభమవుతుంది. ఇక్కడ దబాంగ్ ఢిల్లీ కేసీ.. హర్యానా స్టీలర్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో స్టార్ రైడర్ నవీన్ కుమార్ తన మాజీ జట్టుపై పోటీపడనుండటం ఆసక్తి రేపుతోంది.ఢిల్లీఅక్టోబర్ 13 నుంచి ఢిల్లీలోని త్యాగరాజ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో లీగ్ చివరి దశ మ్యాచ్లు జరుగుతాయి. ప్లేఆఫ్స్కు ముందు అభిమానులకు మరింత వినోదాన్ని పంచేందుకు, ఈ దశలో ట్రిపుల్ హెడర్ (రోజుకు మూడు మ్యాచ్లు) మ్యాచ్లు కూడా నిర్వహించనున్నారు. -
హర్దీప్ ‘పసిడి’ పట్టు
ఏథెన్స్ (గ్రీస్): అందరి అంచనాలను తారుమారు చేస్తూ... ప్రపంచ అండర్–17 రెజ్లింగ్ చాంపియన్షిప్ గ్రీకో రోమన్ స్టయిల్లో భారత యువ రెజ్లర్ హర్దీప్ స్వర్ణ పతకం సాధించి సంచలనం సృష్టించాడు. బుధవారం జరిగిన 110 కేజీల విభాగం ఫైనల్లో హర్దీప్ 3–3 పాయింట్లతో యజ్దాన్ రెజా డెల్రూజ్ (ఇరాన్)పై గెలుపొందాడు. ఇద్దరి స్కోర్లు సమమైనప్పటికీ... నిబంధనల ప్రకారం చివరి పాయింట్ హర్దీప్ సాధించడంతో భారత రెజ్లర్కు స్వర్ణం ఖరారైంది.యజ్దాన్కు రజతం దక్కింది. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో గ్రీకో రోమన్ స్టయిల్లో భారత్కు బంగారు పతకాన్ని అందించిన నాలుగో రెజ్లర్గా 16 ఏళ్ల హర్దీప్ గుర్తింపు పొందాడు. గతంలో వినోద్ కుమార్ (45 కేజీలు; 1980లో).. పప్పూ యాదవ్ (51 కేజీలు; 1992లో)... సూరజ్ (55 కేజీలు; 2022లో) ఈ ఘనత సాధించారు.ప్రస్తుతం ఆసియా అండర్–17 విభాగంలో చాంపియన్గా ఉన్న హర్దీప్... తొలి రౌండ్లో 2–0తో బక్తూర్ సొవెట్ఖాన్ (కజకిస్తాన్)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో 4–2తో తొమెల్కా (పోలాండ్)పై, క్వార్టర్ ఫైనల్లో 9–0తో అనతోలి నవచెంకో (ఉక్రెయిన్)పై, సెమీఫైనల్లో 4–2తో ఎమ్రుల్లా కప్కాన్ (టర్కీ)పై విజయం సాధించాడు. హరియాణాలోని ఝాజర్ జిల్లాకు చెందిన హర్దీప్ తన చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. ప్రస్తుతం హర్దీప్ బహదూర్గఢ్లోని ‘హింద్ కేసరి’ సోనూ అఖాడాలో ధర్మేందర్ దలాల్ వద్ద శిక్షణ తీసుకుంటున్నాడు. మరో నాలుగు పతకాలు ఖాయం... ప్రపంచ అండర్–17 రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత్కు మరో నాలుగు పతకాలు ఖాయమయ్యాయి. మహిళల విభాగంలో భారత రెజ్లర్లు రచన (43 కేజీలు), మోనీ (57 కేజీలు), అశ్విని విష్ణోయ్ (65 కేజీలు), కాజల్ (73 కేజీలు) ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఈరోజు జరిగే ఫైనల్స్లో జిన్ హువాంగ్తో రచన... మద్ఖియా ఉస్మనోవా (కజకిస్తాన్)తో మోనీ, ముఖాయో రఖిమ్జొనోవా (ఉజ్బెకిస్తాన్)తో అశ్విని; వెన్జిన్ కియు (చైనా)తో కాజల్ తలపడతారు. -
తరుణ్ ముందుకు...
మకావు: మకావు ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. హైదరాబాద్ ప్లేయర్ తరుణ్ మన్నేపల్లి, పారిస్ ఒలింపియన్ లక్ష్య సేన్, ఆయుశ్ శెట్టి శుభారంభం చేసి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా... హెచ్ఎస్ ప్రణయ్, మన్రాజ్ సింగ్, శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్, కిరణ్ జార్జి, సతీశ్ కుమార్ కరుణాకరన్, రిత్విక్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. తొలి రౌండ్ మ్యాచ్ల్లో తరుణ్ 21–19, 21–13తో సహచరుడు మన్రాజ్ సింగ్పై, లక్ష్య సేన్ 21–8, 21–14తో జియోన్ హైయోక్ జిన్ (దక్షిణ కొరియా)పై, ఆయుశ్ 21–10, 21–11తో హువాంగ్ యు కాయ్ (చైనీస్ తైపీ)పై విజయం సాధించారు. ప్రపంచ 33వ ర్యాంకర్ ప్రణయ్ 21–18, 15–21, 16–21తో ప్రపంచ 75వ ర్యాంకర్ యోహానెస్ మార్సెలినో (ఇండోనేసియా) చేతిలో... శంకర్ 18–21, 14–21తో హు జె ఆన్ (చైనా) చేతిలో... కిరణ్ జార్జి 15–21, 10–21తో ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్) చేతిలో... సతీశ్ కుమార్ 19–21, 12–21తో జస్టిన్ హో (మలేసియా) చేతిలో, రిత్విక్ 16–21, 8–21తో చికో వర్దాయో (ఇండోనేసియా) చేతిలో ఓటమి చవిచూశారు. రక్షిత శ్రీ సంచలనం మహిళల సింగిల్స్లో ఆరుగురు భారత క్రీడాకారిణులు బరిలోకి దిగగా... రక్షిత శ్రీ మినహా మిగతా ఐదుగురు తొలి రౌండ్లోనే వెనుదిరిగారు. తొలి రౌండ్లో రక్షిత శ్రీ 63 నిమిషాల్లో 18–21, 21–17, 22–20తో ప్రపంచ 35వ ర్యాంకర్ పోర్న్పిచా చోయికివోంగ్ (థాయ్లాండ్)ను బోల్తా కొట్టించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్ల్లో ఉన్నతి హుడా 21–16, 19–21, 17–21తో జూలీ జేకబ్సన్ (డెన్మార్క్) చేతిలో, తస్నీమ్ మీర్ 6–21, 14–21తో టాప్ సీడ్ చెన్ యు ఫె (చైనా) చేతిలో, ఆకర్షి కశ్యప్ 14–21, 16–21తో ప్రపంచ మాజీ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్) చేతిలో, అనుపమ 16–21, 10–21తో రికో గుంజి (జపాన్) చేతిలో, అన్మోల్ 21–23, 11–21తో బుసానన్ (థాయ్లాండ్) చేతిలో ఓడిపోయారు. రుత్విక జోడీకి నిరాశ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తెలంగాణ ప్లేయర్ గద్దె రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్) జోడీకి నిరాశ ఎదురైంది. తొలి రౌండ్లో రుత్విక శివాని–రోహన్ ద్వయం 20–22, 17–21 తో వు గువాన్ జున్–లీ చియా సిన్ (చైనీస్ తైపీ) జంట చేతిలో ఓడిపోయింది. తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల (భారత్) జంట ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకుంది. తొలి రౌండ్లో తనీషా–ధ్రువ్ ద్వయం 21–10, 21–15తో రచాపోల్–నత్తమోన్ (థాయ్లాండ్) జంటపై నెగ్గింది.ఇతర మ్యాచ్ల్లో హేమనాగేంద్ర బాబు–ప్రియ (భారత్) 11–21, 14– 21తో ఫువానత్–ఫుంగ్ఫా (థాయ్లాండ్) చేతిలో ... సతీశ్–ఆద్య (భారత్) 18–21, 21– 23 తో అమ్రీ–నితా (ఇండోనేసియా) చేతి లో... ఆయుశ్ –శ్రుతి (భారత్) 10–21, 11– 21 తో రెహాన్–గ్లోరియా (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయారు. -
14 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు
సింగపూర్: ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. ఫ్రాన్స్ స్టార్ స్విమ్మర్ లియోన్ మర్చండ్ పురుషుల 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లీ విభాగంలో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. బుధవారం జరిగిన 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లీ సెమీఫైనల్ ఈవెంట్ను 23 ఏళ్ల మర్చండ్ 1 నిమిషం 52.61 సెకన్లలో ముగించాడు. ఈ క్రమంలో 14 ఏళ్లుగా అమెరికా మేటి స్విమ్మర్ ర్యాన్ లోచ్టె (1ని:54 సెకన్లు) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును మర్చండ్ బద్దలు కొట్టాడు. సెమీఫైనల్లో తొలుత 50 మీటర్లను (బటర్ఫ్లయ్ స్టయిల్) 24.10 సెకన్లలో పూర్తి చేసిన మర్చండ్... తదుపరి 50 మీటర్లను (బ్యాక్స్ట్రోక్ స్టయిల్) 28.40 సెకన్లలో ముగించాడు. తర్వాత 50 మీటర్లను (బ్రెస్ట్స్ట్రోక్ స్టయిల్) 32.13 సెకన్లలో... చివరి 50 మీటర్లను (ఫ్రీస్టయిల్) 28.06 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచి ఫైనల్కు అర్హత సాధించాడు. ఈరోజు జరిగే ఫైనల్లో మర్చండ్ తన పేరిట నమోదైన కొత్త ప్రపంచ రికార్డును మళ్లీ సవరించే అవకాశాలు ఉన్నాయి. కొత్త ప్రపంచ రికార్డు సృష్టించిన లియోన్ మర్చండ్కు 30 వేల డాలర్లు (రూ. 26 లక్షల 28 వేలు) ప్రైజ్మనీగా లభించాయి. గత ఏడాది స్వదేశంలో జరిగిన పారిస్ ఒలింపిక్స్లో మర్చండ్ నాలుగు స్వర్ణాలు, ఒక కాంస్యంతో కలిపి ఐదు పతకాలు సాధించి అదరగొట్టాడు. గత రెండు ప్రపంచ చాంపియన్íÙప్లలో (2022, 2023) మర్చండ్ 200, 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లీలో స్వర్ణ పతకాలు సాధించాడు. -
లెడెకీ పసిడి ‘సిక్సర్’
సింగపూర్: సంవత్సరాలు గడుస్తున్నాయి.... ప్రత్యర్థులు మారుతున్నారు... కానీ ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్షిప్ మహిళల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో మాత్రం విజేత పేరు మారడం లేదు. 2013 నుంచి 2025 వరకు ఏడు ప్రపంచ చాంపియన్షిప్లు జరిగాయి. ఇందులో ఆరింటిలో (2013, 2015, 2017, 2022, 2023, 2025) కేటీ లెడెకీకే స్వర్ణ పతకం లభించింది. 2019 ప్రపంచ చాంపియన్షిప్లో లెడెకీ ఫైనల్ చేరుకున్నా అనారోగ్యం కారణంగా ఫైనల్ రేసు నుంచి వైదొలిగింది. లేదంటే లెడెకీ ఖాతాలోనే స్వర్ణం చేరేది. ప్రస్తుతం సింగపూర్లో జరుగుతున్న ప్రపంచ చాంపియన్షిప్లో మంగళవారం జరిగిన 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో లెడెకీ తన సత్తా చాటుకుంది. ఇంతకుముందు 400 మీటర్ల ఫ్రీస్టయిల్లో కాంస్యం నెగ్గిన లెడెకీ... 1500 మీటర్లలో పసిడి పతకం కైవసం చేసుకుంది. 15 నిమిషాల 26.44 సెకన్లలో రేసును ముగించిన ఆమె అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఇతర ఈవెంట్ల సంగతి పక్కన పెడితే... 1500 మీటర్లలో తనకు తిరుగులేదని లెడెకీ మరోసారి నిరూపించింది. ఈ విభాగంలో ప్రపంచ అత్యుత్తమ స్విమ్మర్గా గుర్తింపు సాధించిన లెడెకీ... దశాబ్ద కాలంగా 1500 మీటర్లలో అత్యుత్తమ మహిళా స్విమ్మర్గా కొనసాగుతోంది. ఈ ఈవెంట్లో ప్రపంచ 26 అత్యుత్తమ ప్రదర్శనల్లో 25 ఆమె పేరిట ఉన్నాయంటే... 1500 మీటర్లలో ఆమె ఆధిపత్యం ఎలా సాగుతోందో అర్థంచేసుకోవచ్చు. ‘నాకు ఈ రేసు అంటే చాలా ఇష్టం. 2013లో మొదటిసారి ప్రపంచ రికార్డు బద్దలు కొట్టినప్పటి నుంచి 1500 మీటర్ల రేసును ప్రేమిస్తున్నా. ఇన్నేళ్లలో ఎన్నో గొప్ప విజయాలు దక్కడం ఆనందంగా ఉంది. కొలనులో అడుగు పెట్టిన ప్రతిసారి అత్యుత్తమ ప్రదర్శన చేయాలనే భావిస్తా. అందుకు తగ్గట్లే కష్టపడతా. ప్రస్తుత టైమింగ్తో సంతోషంగా ఉన్నా’ అని లెడెకీ వెల్లడించింది. మంగళవారం పోటీలో ఒకానొక దశలో ప్రపంచ రికార్డు వేగం కంటే ముందున్న లెడెకీ చివర్లో కాస్త వెనుకబడింది. మహిళల స్విమ్మింగ్లో ఏకఛత్రాధిపత్యం కనబరుస్తున్న లెడెకీకి ప్రపంచ చాంపియన్షిప్లో ఇది 22వ స్వర్ణం కాగా... ఓవరాల్గా 28వది. ఒలింపిక్స్లో సాధించిన 9 పసిడి పతకాలు, మొత్తంగా 14 మెడల్స్ కలుపుకుంటే... ఓవరాల్గా ఆమె పతకాల సంఖ్య 42. అందులో 31 స్వర్ణాలు ఉండటం విశేషం. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షురాలు, 2004, 2008 ఒలింపిక్స్ 200 మీటర్ల బ్యాక్స్ట్రోక్ స్వర్ణ పతక విజేత క్రిస్టీ కొవెంట్రీ సమక్షంలో లెడెకీ పతకం నెగ్గింది. పోటీల మూడో రోజు మంగళవారం ఐదు అంశాల్లో ఫైనల్స్ నిర్వహించగా... పురుషుల 200 మీటర్ల ఫ్రీ స్టయిల్లో రొమేనియాకు చెందిన డేవిడ్ పొపొవిక్ వరుసగా రెండో సారి స్వర్ణ పతకం సాధించగా... పురుషుల 100 మీటర్ల బ్యాక్స్ట్రోక్లో దక్షిణాఫ్రికాకు చెందిన పీటర్ కోట్జీ పసిడి పతకం ఖాతాలో వేసుకున్నాడు. మహిళల 100 మీటర్ల బ్యాక్స్ట్రోక్లో జర్మనీకి చెందిన అన్నా ఎలెన్ సంచలనం సృష్టించింది. అమెరికా స్టార్ స్విమ్మర్ కేట్ డగ్లస్ను వెనక్కి నెడుతూ బంగారు పతకం కైవసం చేసుకుంది. పురుషుల 200 మీటర్ల ఫ్రీస్టయిల్లో ల్యూక్ హబ్సన్ విజేతగా నిలిచాడు. భారత స్విమ్మర్లకు నిరాశ ప్రపంచ చాంపియన్షిప్లో భారత స్విమ్మర్ల నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు భారత స్విమ్మర్లు హీట్స్ దాటి ముందడుగు వేయలేకపోయారు. పురుషుల 200 మీటర్ల బటర్ఫ్లయ్ విభాగంలో సజన్ ప్రకాశ్ 24వ స్థానంలో నిలిచి సెమీఫైనల్కు దూరమయ్యాడు. ఈ విభాగంలో తొలి 16 స్థానాల్లో నిలిచిన వాళ్లు సెమీస్కు అర్హత సాధించారు. భారత్ నుంచి నేరుగా ఒలింపిక్స్ (టోక్యో 2020)కు అర్హత సాధించిన తొలి స్విమ్మర్గా రికార్డు సృష్టించిన 31 ఏళ్ల సజన్ ప్రకాశ్... ఈ టోర్నీ 200 ఫ్రీస్టయిల్లో 43వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.ఇక 800 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో ఆర్యన్ నెహ్రా 23వ స్థానంలో నిలిచాడు. మంగళవారం పోటీలో ఆర్యన్ 8 నిమిషాల 21.30 సెకన్లలో లక్ష్యాన్ని చేరాడు. తొలి 8 స్థానాల్లో నిలిచిన వాళ్లు ఫైనల్కు చేరారు. మరోవైపు 50 మీటర్ల బటర్ఫ్లయ్ విభాగంలోనూ ఆర్యన్ 57వ స్థానంతో సరిపెట్టుకోగా... ఎస్పీ లికిత్ 50వ స్థానంలో నిలిచాడు. -
సాత్విక్–చిరాగ్ జోడీ శుభారంభం
మకావు: ఈ ఏడాది తొలి టైటిల్ కోసం వేచి చూస్తున్న భారత డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి మకావు ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–13, 21–15తో లో హాంగ్ యీ–ఎన్జీ ఇంగ్ చెయోంగ్ (మలేసియా) జంటపై గెలిచి శుభారంభం చేసింది. 36 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్లో భారత జోడీకి ఏ దశలోనూ పోటీ ఎదురుకాలేదు. మహిళల డబుల్స్లో ప్రియ–శ్రుతి మిశ్రా (భారత్) జోడీ కూడా ముందంజ వేసింది. తొలి రౌండ్లో ప్రియ–శ్రుతి 21–15, 16–21, 21–17తో జి లింగ్ హువాంగ్–వాంగ్ జు మిన్ (చైనీస్ తైపీ)లపై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. మహిళల సింగిల్స్ విభాగంలో భారత రైజింగ్ స్టార్స్ అన్మోల్, తస్నీమ్ మీర్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించారు. క్వాలిఫయింగ్ మ్యాచ్ల్లో అన్మోల్ 21–11, 21–13తో ఫాతిమా (అజర్బైజాన్)పై, తస్నీమ్ 21–14, 13–21, 21–17తో టిడాప్రోన్ క్లీబైసన్ (థాయ్లాండ్)పై గెలుపొందారు. మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో టాప్ సీడ్ చెన్ యు ఫె (చైనా)తో తస్నీమ్; రెండో సీడ్ బుసానన్ (థాయ్లాండ్)తో అన్మోల్ తలపడతారు. టాప్ సీడ్ గాయత్రి జంటకు షాక్ మహిళల డబుల్స్ విభాగంలో టాప్ సీడ్ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) ద్వయం అనూహ్యంగా తొలి రౌండ్లోనే ని్రష్కమించింది. లిన్ జియో మిన్–పెంగ్ యు వె (చైనీస్ తైపీ) జోడీతో జరిగిన మ్యాచ్లో గాయత్రి–ట్రెసా జంట 21–16, 20–22, 15–21తో ఓడిపోయింది. మరో తొలి రౌండ్ మ్యాచ్లో అపూర్వ–సాక్షి (భారత్) 8–21, 11–21తో తియో మె జింగ్–గో పె కి (మలేసియా) చేతిలో ఓటమి చవిచూశారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో హరిహరన్–రూబన్ (భారత్) 21–15, 19–21, 14–21 తో టోరి ఐజవా–దైసుకె సానో (జపాన్) చేతిలో పరాజయం పాలయ్యారు. డింకూ సింగ్–అమాన్ (భారత్) జోడీ క్వాలిఫయింగ్ మ్యాచ్లో 21–18, 21–17తో లా చెయుక్ హిమ్–యెంగ్ షింగ్ చోయ్ (హాంకాంగ్) జంటపై నెగ్గి మెయిన్ ‘డ్రా’కు చేరుకుంది. మెయిన్ ‘డ్రా’కు హేమనాగేంద్ర జోడీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తాండ్రంగి హేమనాగేంద్ర బాబు–ప్రియ (భారత్) జోడీ మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందింది. క్వాలిఫయింగ్ మ్యాచ్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన హేమనాగేంద్ర బాబు–ప్రియ జోడీ 21–17, 21–19తో జి వె హి–యాన్ ఫె చెన్ (చైనీస్ తైపీ) ద్వయంపై విజయం సాధించింది.మళ్లీ టాప్–10లోకి సాత్విక్–చిరాగ్ జోడీన్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) పురుషుల డబుల్స్ ర్యాంకింగ్స్లో భారత స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి మళ్లీ టాప్–10లోకి దూసుకొచ్చింది. గతవారం చైనా ఓపెన్లో సెమీఫైనల్కు చేరడం ద్వారా సాత్విక్ జంట మూడు స్థానాలు మెరుగుపరుచుకొని 10వ ర్యాంక్కు చేరింది. గతేడాది థాయ్లాండ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన అనంతరం ప్రపంచ నంబర్వన్ ర్యాంక్ దక్కించుకున్న భారత ద్వయం... ఈ సీజన్లో మూడు టోర్నీల్లో సెమీఫైనల్కు చేరింది. చైనా ఓపెన్ కంటే ముందు సింగపూర్ ఓపెన్, ఇండియా ఓపెన్లలో సైతం ఈ జోడీ సెమీస్ ఆడింది. పురుషుల సింగిల్స్లో భారత అగ్రశ్రేణి షట్లర్ లక్ష్యసేన్ రెండు స్థానాలు మెరుగు పరుచుకొని 17వ ర్యాంక్కు చేరాడు. ఇక మహిళల సింగిల్స్లో ఇటీవల పీవీ సింధుపై నెగ్గిన 17 ఏళ్ల ఉన్నతి హుడా కెరీర్ బెస్ట్ 31వ ర్యాంక్ దక్కించుకుంది. ఈ విభాగంలో భారత్ నుంచి అత్యుత్తమంగా సింధు 15వ స్థానంలో ఉంది. టాప్–100లో భారత్ నుంచి 16 మంది ఉండటం విశేషం. మహిళల డబుల్స్లో పుల్లెల గాయత్రిæ–ట్రెసా జాలీ జంట 11వ ర్యాంక్లో కొనసాగుతోంది. -
‘మానసిక దృఢత్వమే గెలిపించింది’
న్యూఢిల్లీ: మహిళా చెస్ దిగ్గజం సుసాన్ పోల్గర్ భారత గ్రాండ్మాస్టర్ దివ్య దేశ్ముఖ్పై ప్రశంసలు కురిపించింది. వరల్డ్ కప్లో వేర్వేరు సందర్భాల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా దివ్య గెలిచిన తీరు అద్భుతమని ఆమె వ్యాఖ్యానించింది. మానసిక దృఢత్వం, పోరాటతత్వమే ఆమెను చాంపియన్గా నిలిపిందని పోల్గర్ అభిప్రాయపడింది. ‘చారిత్రక విజయం సాధించిన దివ్యకు నా అభినందనలు. చాలా బాగా ఆడింది. టోర్నీకి ముందు ఫేవరెట్లలో ఆమె పేరు లేదు. అయితే గెలవాలనే పట్టుదల, మానసిక దృఢత్వంతో ఆమె ముందంజ వేయగలిగింది. టోర్నీలో దివ్య ఇబ్బంది పడిన గేమ్లు ఉన్నాయి. మంచి అవకాశాలు వచ్చినా వాటిని వృథా చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే వాటి ప్రభావం ఆమెపై పడలేదు. ఎలాంటి ఆందోళన లేకుండా ఆమె పోరాడింది. అదే పట్టుదల చివరి వరకు నిలిచి గెలిచేలా చేశాయి’ అని పోల్గర్ వ్యాఖ్యానించింది. ప్రపంచ చెస్లో ఇటీవలి కాలంలో భారత ఆటగాళ్లు సాధించిన విజయాలు అపూర్వమని ఆమె పేర్కొంది. వీరందరికీ గొప్ప భవిష్యత్తు ముందుందని పోల్గర్ జోస్యం చెప్పింది. ‘గుకేశ్ పెద్ద స్థాయికి చేరతాడని అతనికి 12 ఏళ్లు ఉన్నప్పుడే నేను చెబితే ఎవరూ నమ్మలేదు. 50 మంది గ్రాండ్మాస్టర్లను తయారు చేసిన నా అనుభవంతో ఆ వ్యాఖ్యలు చేశాను. దివ్య విషయంలో కూడా అదే జరిగింది. పెద్ద ప్లేయర్గా గుర్తింపు లేకపోయినా ఆమెలో ప్రత్యేక ప్రతిభ ఉంది కాబట్టే ఈ స్థాయిలో గెలిచింది. ప్రస్తుతం భారత చెస్లో స్వర్ణయుగం నడుస్తోంది. వారి ఆట గొప్పగా ఉండటంతో పాటు సరైన రీతిలో మద్దతు, దిశానిర్దేశం లభిస్తున్నాయి. దివ్య ఇక్కడితో ఆగిపోవద్దు. ఆమె ఆటపై అందరి దృష్టీ ఉంటుంది కాబట్టి మరింతగా కష్టపడి లోపాలను సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. హంపి అంటే కూడా నాకు గౌరవం ఉంది. సుదీర్ఘ కాలం ఆమె అగ్రస్థాయిలో కొనసాగింది. అయితే వయసు పెరుగుతున్నకొద్దీ పరిస్థితులు కొంత ప్రతికూలంగా మారడం సహజం’ అని పోల్గర్ పేర్కొంది. -
భారత్కు క్లిష్టమైన ‘డ్రా’
సిడ్నీ: ఆసియా ఫుట్బాల్ సమాఖ్య (ఏఎఫ్సీ) మహిళల ఆసియా కప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో భారత జట్టుకు క్లిష్టమైన ‘డ్రా’ పడింది. వచ్చే ఏడాది ఆ్రస్టేలియాలో మార్చి 1 నుంచి 21 వరకు జరిగే ఈ టోర్నీలో ఆసియా ఘనాపాటి జపాన్ సహా మాజీ చాంపియన్లు చైనీస్ తైపీ, వియత్నాం జట్లున్న గ్రూప్ ‘సి’లో భారత అమ్మాయిల జట్టుకు చోటు దక్కింది. దీనికి సంబంధించిన ‘డ్రా’ వేడుక సిడ్నీ టౌన్ హాల్లో మంగళవారం అట్టహాసంగా జరిగింది. భారత స్టార్ మిడ్ఫీల్డర్ సంగీత బస్ఫొరె ప్రత్యేక ఆహ్వానితులుగా ‘డ్రా’ ఈవెంట్లో పాల్గొంది. మొత్తం 12 ఆసియా జట్లను మూడు గ్రూప్లుగా విభజించారు. ఒక్కో జట్టులో నాలుగేసి టీమ్లు తలపడతాయి. గ్రూప్ ‘సి’లో భారత అమ్మాయిల జట్టు తమ తొలి మ్యాచ్లో మార్చి 4న వియత్నాంతో... రెండో మ్యాచ్లో మార్చి 7న ప్రపంచ మాజీ చాంపియన్ జపాన్తో... మూడో మ్యాచ్లో మార్చి 10న చైనీస్ తైపీతో ఆడుతుంది. ప్రపంచ ర్యాంకింగ్స్లో జపాన్ 7వ స్థానంలో, వియత్నాం 37వ స్థానంలో, చైనీస్ తైపీ 42వ స్థానంలో, భారత్ 70వ స్థానంలో ఉన్నాయి. సెమీస్ చేరితే ప్రపంచకప్ టోర్నీకి... ఆసియా కప్ గ్రూప్ ‘ఎ’లో ఆతిథ్య ఆ్రస్టేలియా, దక్షిణ కొరియా, ఇరాన్, ఫిలిప్పీన్స్... గ్రూప్ ‘బి’లో డిఫెండింగ్ చాంపియన్ చైనా, ఉత్తర కొరియా, బంగ్లాదేశ్, ఉజ్బెకిస్తాన్ జట్లున్నాయి. ఒక్కో గ్రూప్ నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధిస్తాయి. అలాగే ఈ మూడు గ్రూప్ల్లో మెరుగైన మూడో స్థానం పొందిన రెండు జట్లు కూడా నాకౌట్కు క్వాలిఫై అవుతాయి. ఈ 8 జట్ల మధ్య జరిగే క్వార్టర్ ఫైనల్స్ విజేతలు అంటే సెమీఫైనల్ చేరిన నాలుగు జట్లు 2027లో బ్రెజిల్లో జరిగే ప్రపంచకప్ టోర్నీకి నేరుగా అర్హత పొందుతాయి. క్వార్టర్స్లో ఓడిన జట్లు ప్లే ఆఫ్స్ ఆడాల్సి ఉంటుంది. ఆసియా నుంచి మరో రెండు జట్లకు ప్రపంచకప్ బెర్త్లు లభిస్తాయి. -
Divya Deshmukh: అసలైన హీరో మాత్రం ఆమెనే: ఆనంద్ మహీంద్ర
దివ్య దేశ్ముఖ్ (Divya Deshmukh).. భారత చెస్ వర్గాల్లో ప్రస్తుతం ఈ పేరు మారుమ్రోగి పోతోంది. చదరంగ దిగ్గజాలు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక (Dronavalli Harika)లకు కూడా సాధ్యం కాని అరుదైన ఘనతను దివ్య సాధించడమే ఇందుకు కారణం. ఫిడే మహిళల ప్రపంచకప్ (FIDE Women's World Cup) ఫైనల్లో ఏకంగా హంపినే ఓడించిన దివ్య.. ఈ టైటిల్ సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా తన పేరును చరిత్ర పుటల్లో లిఖించుకుంది.దూకుడు ప్రదర్శిస్తూనేపందొమిదేళ్ల వయసులోనే ఈ మహారాష్ట్ర అమ్మాయి ఈ అరుదైన రికార్డు సాధించడం మరో విశేషం. దూకుడుగా ఎత్తులకు పైఎత్తులు వేస్తూనే.. కీలక సమయాల్లో ఒత్తిడి దరిచేరనీయకుండా ప్రశాంతంగా ఉండటం దివ్యలోని అరుదైన లక్షణం. ప్రత్యర్థి ఎంతటివారైనా ఏమాత్రం తడబాటుకు లోనుకాకుండా తన పనిని పూర్తి చేయడంలో ఆమె దిట్ట.అందుకే భారత చదరంగ మహారాణిగా వెలుగొందుతున్న 38 ఏళ్ల హంపిని కూడా.. ఇంత చిన్నవయసులోనే దివ్య ఓడించగలిగింది. క్లాసిక్ గేమ్స్ను డ్రా చేసుకున్న దివ్య.. ర్యాపిడ్ రౌండ్స్లో మాత్రం చక్కటి ప్రదర్శనతో ఆద్యంతం సానుకూల దృక్పథంతో ముందుకు సాగి చాంపియన్గా అవతరించింది.అసలైన ‘హీరో’కు కూడా క్రెడిట్ఈ నేపథ్యంలో దివ్య దేశ్ముఖ్పై ప్రశంసల జల్లు కురుస్తోంది. భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండుల్కర్ తదితరులు దివ్యను కొనియాడగా.. తాజాగా వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర కూడా ఈ జాబితాలో చేరారు. అయితే, ఆయన దివ్యను ప్రశంసిస్తూనే ఆమె వెనుక ఉన్న అసలైన ‘హీరో’కు కూడా క్రెడిట్ ఇవ్వడం విశేషం.ఈ మేరకు.. ‘‘ఫిడే ప్రపంచకప్-2025 విజేత దివ్య దేశ్ముఖ్. ఈ విజయంతో ఆమె గ్రాండ్ మాస్టర్ హోదాను కూడా పొందింది. పందొమిదేళ్ల వయసులోనే ఈ ఘనత సాధించింది.అయినా, ప్రతీ గ్రాండ్ మాస్టర్ వెనుక ఓ తల్లి ఉంటుంది. ఎంతో మంది ఇలాంటి స్టార్ల వెనుక అన్సంగ్ హీరోగా నిలబడిపోతుంది’’ అంటూ దివ్య దేశ్ముఖ్ తన తల్లి నమ్రతను ఆలింగనం చేసుకున్న వీడియోను ఆనంద్ మహీంద్ర పంచుకున్నారు.ఇక ఆయన వ్యాఖ్యలతో నెటిజన్లు కూడా ఏకీభవిస్తున్నారు. ఈ సందర్భంగా చెన్నై చెస్ స్టార్లు ఆర్.ప్రజ్ఞానంద, ఆర్.వైశాలిల తల్లి నాగలక్ష్మిని గుర్తుచేస్తూ అమ్మలకు సెల్యూట్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.దివ్య భావోద్వేగంప్రపంచకప్ గెలవగానే దివ్య తీవ్ర భావోద్వేగానికి లోనైంది. ‘‘ఈ విజయానుభూతిని ఆస్వాదిస్తున్నాను. దీని నుంచి తేరుకునేందుకు ఇంకా కొంత సమయం పడుతుంది. ఇక్కడికి వచ్చే ముందు నాకు ఒక్క జీఎం నార్మ్ కూడా లేదు.నేను ఎప్పుడు నార్మ్ సాధిస్తానో అని ఆలోచించేదాన్ని. కానీ ఇక్కడ ఇలా గ్రాండ్మాస్టర్ కావాలని నాకు రాసి పెట్టి ఉంది. నాకు ఈ ఆనందంలో మాటలు రావడం లేదు. ఈ విజయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. నా దృష్టిలో ఇది ఆరంభం మాత్రమే. మున్ముందు ఇంకా ఇలాంటివి చాలా సాధించాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొంది. ఇక ఫైనల్ గెలవగానే తల్లి నమ్రతను హత్తుకుని దివ్య ఆనందభాష్పాలు రాల్చింది. ఆ తల్లి కూడా విజయగర్వంతో ఉప్పొంగిపోయింది. కాగా మహారాష్ట్రలోని నాగ్పూర్కు చెందిన దివ్య దేశ్ముఖ్ తల్లిదండ్రులు నమ్రత, జితేంద్ర దేశ్ముఖ్. వీరిద్దరూ డాక్టర్లే!చదవండి: ‘కోహ్లిపై వేటుకు సిద్ధమైన ఆర్సీబీ.. అతడి స్థానంలో మాజీ క్రికెటర్’ Divya Deshmukh, the Winner of the 2025 FIDE Women’s World Cup.Through this victory she also achieves Grandmaster status. At the age of 19. And behind the Grandmaster is the caring mother…As always, the unsung hero behind many stars…pic.twitter.com/9AyeBBPbM5— anand mahindra (@anandmahindra) July 28, 2025 -
ఇంగ్లండ్... తగ్గేదేలే
బాసెల్: డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ మహిళల జట్టు యూరో ఫుట్బాల్ చాంపియన్షిప్లో టైటిల్ నిలబెట్టుకుంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన హోరాహోరీ తుది పోరులో ఇంగ్లండ్ జట్టు పెనాల్టీ షూటౌట్లో 3–1తో స్పెయిన్పై విజయం సాధించింది. నిర్ణీత సమయంలో ఆఖరి క్షణం దాకా పోటాపోటీగా పోరాడిన స్పెయిన్ పెనాల్టీ షూటౌట్లో అనూహ్యంగా చిత్తయ్యింది. కేవలం ఒకే ఒక్క స్ట్రయికర్ గోల్ చేయడం గమనార్హం. మరోవైపు ఇంగ్లండ్ బృందంలో ఇద్దరు బంతిని లక్ష్యాన్ని చేర్చడంలో విఫలమవగా... ముగ్గురు గోల్స్ చేశారు. అంతకుముందు నిర్ణీత సమయం ముగిసేసరికి ఇంగ్లండ్, స్పెయిన్ జట్లు 1–1 స్కోరుతో సమఉజ్జీలుగా నిలిచాయి. ముందుగా స్పెయిన్ శిబిరం నుంచి గోల్ నమోదైంది. తొలి అర్ధభాగంలోనే మరియాన కాల్డెంటే (25వ నిమిషంలో) గోల్ చేసి జట్టుకు శుభారంభాన్నిచి్చంది. 1–0తో ఆధిక్యంతోనే ప్రథమార్ధాన్ని ముగించింది. ద్వితీయార్ధం మొదలవగానే ఇంగ్లండ్ ప్లేయర్లు దాడులకు పదును పెట్టారు. ఈ క్రమంలో అలెసియా రుసో (57వ నిమిషంలో) గోల్ చేసి స్కోరును 1–1తో సమం చేసింది. తర్వాత ఇరుజట్ల ప్లేయర్లు ఎంతగా శ్రమించిన ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. నిరీ్ణత సమయంలో ఫలితం తేలకపోవడంతో అదనపు సమయం ఆడించారు. అయినా... స్కోరులో ఏ మార్పు లేకపోవడంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. ఇక్కడ తొలి షాట్ నుంచే ‘డ్రా’ మొదలైంది. స్పెయిన్ ఒకటే గోల్ చేసినా... ఇంగ్లండ్ గెలిచేందుకు ఆఖరి షాట్ గోల్దాకా వేచిచూడక తప్పలేదు. ఎందుకంటే మొదట కిక్ మొదలుపెట్టిన ఇంగ్లండ్ జట్టులో బెత్ మీడ్ విఫలమైంది. స్పెయిన్ తరఫున ప్యాట్రిసియా గూజారో గోల్ కొట్టడంతో నిరీ్ణత సమయం మ్యాచ్లోలానే 1–0తో ‘షూటౌట్’లోనూ తొలుత పైచేయి సాధించింది. అయితే ఇంగ్లండ్ ప్లేయర్లు అలెక్స్ గ్రీన్వుడ్, నియామి చార్లెస్లు వరుసగా షాట్లు కొట్టడంతో రేసులో పడగా... మరోవైపు స్పెయిన్ శిబిరంలో మరియానా, ఐతాన బొన్మటి విఫలమవడంతో ఇంగ్లండ్ అనూహ్యంగా 2–1తో ఆధిక్యంలోకి దూసుకొచి్చంది. నాలుగో షాట్ లియా విలియమ్సన్ (ఇంగ్లండ్), సాల్మ పారాల్యులో (స్పెయిన్) ఎవరి వల్లా కాలేదు. 2–1తో ఇక ఆఖరి ప్రయత్నానికి సిద్ధమయ్యారు. ఒకవేళ ఇంగ్లండ్ ఐదో షాట్ విఫలమై, స్పెయిన్ చేసి ఉంటే 2–2తో సమమై విజేత కోసం డ్రామా కొనసాగేది. కానీ క్లో కెల్లీ (ఇంగ్లండ్) స్పెయిన్కు ఆ ఆఖరి ఛాన్స్ ఇవ్వకుండా గోల్ చేసింది. 3–1తో ఫలితం రావడంతో స్పెయిన్ ఆఖరి షాట్ తీసుకోలేదు. 2022లో జరిగిన అమ్మాయిల యూరోలోనూ ఇంగ్లండే చాంపియన్గా నిలిచింది. స్టేడియానికి ‘రాయల్’ కళసెయింట్ జాకబ్ పార్క్లో జరిగిన ఈ టైటిల్ పోరుకు ‘రాయల్’ హాజరు లభించింది. తుదిపోరును ప్రత్యక్షంగా తిలకించేందుకు బ్రిటన్ యువరాజు విలియమ్స్ (కింగ్ చార్లెస్ తనయుడు) కుమార్తె ప్రిన్సెస్ చార్లట్తో విచ్చేశారు. ప్రిన్స్ విలియమ్స్ ఇంగ్లిష్ ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. మరోవైపు స్పెయిన్ రాజవంశానికి చెందిన యువరాణి ప్రిన్సెస్ లియోనర్ తన సోదరి ఇన్ఫాంటా సోఫియాతో కలిసి టైటిల్ పోరును వీక్షించింది. సోఫియా 2023లో సిడ్నీలో జరిగిన ప్రపంచకప్ ఫైనల్ను తల్లి, స్పెయిన్ రాణి లెటిజియాతో కలిసి వీక్షించింది. ఆ మ్యాచ్లో స్పెయిన్ విజేతగా నిలిచింది. మొత్తానికి 2023 ప్రపంచకప్, 2024 యూఈఎఫ్ఏ నేషన్స్ లీగ్ టైటిళ్లతో జోరుమీదున్న స్పెయిన్ వరుసగా మూడో ఏడాది ప్రతిష్టాత్మక టైటిల్ గెలవాలనే గంపెడాశలతో బరిలోకి దిగింది. కానీ తుదిమెట్టుపై చతికిలబడింది. దీంతో ‘యూరో’ కప్ స్పెయిన్ మహిళల జట్టుకు ఇన్నేళ్లయినా అందని ద్రాక్షగానే ఉంది. -
దివ్యమైన విజయం
అంతర్జాతీయ చదరంగ వేదికపై మరోసారి భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. మహిళల ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్లో భారత్ నుంచి దివ్య దేశ్ముఖ్ రూపంలో తొలిసారి చాంపియన్ ఆవిర్భవించింది. తనకంటే ఎంతో మెరుగైన రేటింగ్ ఉన్న క్రీడాకారిణులు బరిలో ఉండటం... ఫేవరెట్ ముద్ర లేకపోవడం... 19 ఏళ్ల ఈ మహారాష్ట్ర అమ్మాయికి కలిసొచ్చింది. ఫలితంగా... ఆరంభం నుంచి స్వేచ్ఛగా ఆడుతూ... అందరి అంచనాలను తారుమారు చేస్తూ... మేధో క్రీడలో ఏకాగ్రతతో ఆడితే... పక్కా ప్రణాళికతో చకచకా ఎత్తులు వేస్తే... ప్రత్యర్థి ఎంతటి మేధావి అయినా... ఒకానొక దశలో ఒత్తిడికి గురై అనవసర తప్పిదాలు చేస్తారని.... చివరకు చేతులెత్తేస్తారని... దివ్య తన అద్భుతమైన ఆటతీరుతో నిరూపించింది. వెరసి తన కెరీర్లోనే అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ఒకే గెలుపుతో... దివ్య స్వర్ణ పతకాన్ని దక్కించుకోవడంతోపాటు...మరోవైపు ఊహ కందని విధంగా గ్రాండ్మాస్టర్ (జీఎం) టైటిల్ హోదాను కూడా ఖాయం చేసుకోవడం విశేషం. బతూమి (జార్జియా): అనుభవంపై యువతరం గెలిచింది. మహిళల ప్రపంచకప్ చెస్ టోర్నీలో భారత్కు చెందిన అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం), 19 ఏళ్ల దివ్య దేశ్ముఖ్ విజేతగా అవతరించింది. రెండు సార్లు ర్యాపిడ్ ప్రపంచ చాంపియన్గా నిలిచిన భారత మహిళా దిగ్గజ చెస్ ప్లేయర్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్, 38 ఏళ్ల కోనేరు హంపితో జరిగిన ఫైనల్లో దివ్య దేశ్ముఖ్ ఓవరాల్గా 2.5–1.5 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. ఆదివారం క్లాసికల్ ఫార్మాట్లో నిరీ్ణత రెండు గేమ్లు ముగిశాక ఇద్దరూ 1–1తో సమంగా నిలిచారు. దాంతో విజేతను నిర్ణయించేందుకు సోమవారం టైబ్రేక్ నిర్వహించారు. ర్యాపిడ్ ఫార్మాట్లో 15 నిమిషాల నిడివిగల రెండు గేమ్లు జరిగాయి. తొలి గేమ్లో తెల్ల పావులతో ఆడిన దివ్య 81 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. దాంతో టైబ్రేక్లో తొలి గేమ్ ముగిశాక ఇద్దరూ 0.5–0.5తో సమంగా నిలిచారు. రెండో గేమ్ను హంపి తెల్ల పావులతో ప్రారంభించింది. ఒకానొక దశలో ఈ గేమ్ కూడా ‘డ్రా’గా ముగిసేలా అనిపించింది. చాంపియన్ను నిర్ధారించేందుకు మరో రెండు ర్యాపిడ్ గేమ్లు అవసరం పడతాయనిపించింది. అయితే సమయాభావం వల్ల కీలక దశలో హంపి ఒత్తిడికిలోనై పొరపాట్లు చేయడం... వాటిని దివ్య సది్వనియోగం చేసుకుంది. ఫలితంగా రెండో గేమ్లో దివ్య 75 ఎత్తుల్లో గెలుపొంది 1.5–0.5తో విజయాన్ని ఖాయం చేసుకుంది. టైబ్రేక్లో తొలి రెండు ర్యాపిడ్ గేముల్లోనే విజేత తేలిపోవడంతో తదుపరి గేమ్లు నిర్వహించాల్సిన అవసరం రాలేదు. ఈ గెలుపుతో ప్రస్తుతం అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం) టైటిల్తో ఉన్న దివ్యకు గ్రాండ్మాస్టర్ (జీఎం) టైటిల్ ఖాయమైంది. విజేత దివ్య దేశ్ముఖ్కు స్వర్ణ పతకంతోపాటు 50 వేల డాలర్లు (రూ. 43 లక్షల 38 వేలు)... రన్నరప్ హంపికి రజత పతకంతోపాటు 35 వేల డాలర్లు (రూ. 30 లక్షల 36 వేలు)... మూడో స్థానం పొందిన చైనా గ్రాండ్మాస్టర్ టాన్ జోంగికి కాంస్య పతకంతోపాటు 25 వేల డాలర్లు (రూ. 21 లక్షల 68 వేలు) ప్రైజ్మనీగా లభించాయి. గాలివాటమేమీ కాదు... 46 దేశాల నుంచి మొత్తం 107 మంది ప్లేయర్లు పోటీపడ్డ ఈ ప్రపంచకప్ నాకౌట్ టోర్నీలో 2463 రేటింగ్ పాయింట్లు ఉన్న దివ్య 15వ సీడింగ్తో బరిలోకి దిగింది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన ఈ నాగ్పూర్ అమ్మాయి టైటిల్ గెలిచే క్రమంలో తన కంటే ఎంతో మెరుగైన రేటింగ్ పాయింట్లు, గ్రాండ్మాస్టర్ హోదా ఉన్న నలుగురు ప్లేయర్లను ఓడించి ఈ విజయం గాలివాటమేమీ కాదని నిరూపించుకుంది. ఫైనల్లో హంపి (2543 రేటింగ్ పాయింట్లు), సెమీఫైనల్లో టాన్ జోంగి (చైనా; 2546), క్వార్టర్ ఫైనల్లో ద్రోణవల్లి హారిక (భారత్; 2483), ప్రిక్వార్టర్ ఫైనల్లో జు జినెర్ (చైనా; 2547 రేటింగ్)లపై దివ్య గెలిచింది. దివ్య 2005లో జన్మించగా... హంపి 2002లోనే గ్రాండ్మాస్టర్ హోదా పొందింది. ఇప్పటికి రెండుసార్లు హంపి ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్ (2019లో, 2024లో) నిలిచింది. ఈ నేపథ్యంలో ఫైనల్లో హంపినే ఫేవరెట్ అనుకున్నారంతా... కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ అద్భుత విజయంతో ‘దివ్య’మైన చెస్ ప్రపంచాన్ని సొంతం చేసుకుంది. విజేతగా నిలిచిన వెంటనే దివ్య తన భావోద్వేగాన్ని తల్లితో పంచుకుంది. డాక్టర్ల ఫ్యామిలీ నుంచి... దివ్య తల్లిదండ్రులు నమ్రత, జితేంద్ర దేశ్ముఖ్లిద్దరూ డాక్టర్లు. 2005 డిసెంబర్ 5న నాగ్పూర్లో జన్మించిన దివ్య ఐదేళ్ల ప్రాయంలో చెస్లో అడుగు పెట్టింది. దివ్య సోదరి బ్యాడ్మింటన్ శిక్షణకు వెళుతున్న సమయంలో అక్కడే జరుగుతున్న చెస్ శిబిరంలో దివ్య చేరింది. ఆ తర్వాత చెస్పై మక్కువ ఏర్పడటంతో ఆటను సీరియస్గా తీసుకుంది. 2020లో ఆన్లైన్లో జరిగిన చెస్ ఒలింపియాడ్లో విజేతగా నిలిచిన భారత జట్టులో సభ్యురాలిగా ఉన్న దివ్య 2021లో అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం) హోదా పొందింది. ఆ తర్వాత 2022లో జాతీయ చాంపియన్గా నిలిచింది. 2022 చెస్ ఒలింపియాడ్లో వ్యక్తిగత కాంస్య పతకం... 2023లో ఆసియా చాంపియన్షిప్ను సొంతం చేసుకుంది. 2023లోనే జరిగిన టాటా స్టీల్ చెస్ టోర్నీ ర్యాపిడ్ విభాగంలో హారిక, హంపి, సవితాశ్రీ, వంతిక అగర్వాల్, ఇరీనా క్రష్లను ఓడించిన దివ్య వరల్డ్ చాంపియన్ జు వెన్జున్తో, అనా ఉషెనినాతో గేమ్లు ‘డ్రా’ చేసుకొని టోర్నీ విజేతగా నిలిచింది. 2024లో గాంధీ నగర్లో జరిగిన ప్రపంచ జూనియర్ చాంపియన్షిప్లో టైటిల్ నెగ్గిన దివ్య... హంగేరిలో జరిగిన చెస్ ఒలింపియాడ్లో భారత జట్టుకు స్వర్ణం దక్కడంలో కీలకపాత్ర పోషించింది. వ్యక్తిగత విభాగంలోనూ ఆమె బంగారు పతకాన్ని సాధించింది.ప్రస్తుత వరల్డ్ ర్యాపిడ్ చాంపియన్ అయిన హంపి ఓటమి ఊహించలేనిది. ఎండ్గేమ్లో ఆమె వరుసగా తప్పులు చేసింది. 54వ ఎత్తులో చిన్న పొరపాటు చేసి హంపి వెనుకబడినా... ఆమెకు కోలుకునే అవకాశం కూడా వచి్చంది. అయితే సమయాభావ ఒత్తిడి ఆమెపై ప్రభావం చూపించింది. 67వ ఎత్తు వేసే సమయానికి దివ్యకు సానుకూల పరిస్థితి ఏమీ లేదు. దీనిని హంపి జాగ్రత్తగా వేసి ఉంటే గేమ్ డ్రా వైపు వెళ్లేది. కానీ ఇక్కడే హంపి మళ్లీ మరో పెద్ద తప్పు చేసింది. కొత్త తరానికి ప్రతినిధి అయిన దివ్య కొత్తగా నేర్చుకోవడంలో, దూసుకుపోవడంలో సహజంగానే కాస్త ఎక్కువ చురుకుదనాన్ని ప్రదర్శించింది. సుదీర్ఘ కెరీర్లో ఎన్నో ఘనతలు సాధించిన హంపిని ఎదుర్కొనేందుకు దివ్య పక్కాగా కొత్త ప్రణాళికలతో సిద్ధమై వచ్చినట్లు కనిపించింది. –చంద్రమౌళి, ఇంటర్నేషనల్ చెస్ ఆర్బిటర్ -
ప్రపంచకప్ చాంపియన్గా దివ్య దేశ్ముఖ్
ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్ (FIDE World Cup) ఫైనల్లో యువ తరంగం దివ్య దేశ్ముఖ్ (Divya Deshmukh) సత్తా చాటింది. తెలుగు తేజం కోనేరు హంపి (Koneru Humpy)ని 2.5-1.5తో ఓడించి.. మహిళల చెస్ ప్రపంచకప్ టైటిల్ గెలిచిన భారత తొలి క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.జార్జియాలోని బతూమీ వేదికగా సోమవారం జరిగిన టై బ్రేకర్లో హంపీ తొలుత నల్ల పావులతో ఆడగా.. దివ్యతో కలిసి డ్రా చేసుకుంది. పదిహేను నిమిషాల పాటు సాగిన గేమ్లో 81 ఎత్తుల తర్వాత ఇద్దరూ డ్రాకు అంగీకరించారు. అనంతరం పదిహేను నిమిషాల రెండో ర్యాపిడ్ మ్యాచ్లో 38 ఏళ్ల హంపి తెల్ల పావులతో ఆడగా.. దివ్య నల్ల పావులతో ఎత్తులు వేసింది. అయితే, ఈ టై బ్రేక్లో 38 ఏళ్ల హంపి చేసిన తప్పిదాల ఫలితంగా 19 ఏళ్ల దివ్య చాంపియన్గా అవతరించింది.ఈ గెలుపుతో దివ్య గ్రాండ్ మాస్టర్గా ప్రమోషన్ పొందడంతో పాటు.. క్యాండిడేట్స్ టోర్నమెంట్కు అర్హత సాధించింది. ఇక హంపిపై గెలిచిన అనంతరం దివ్య తీవ్ర భావోద్వేగానికి లోనైంది.దివ్య భావోద్వేగం‘‘ఇలా నేను గ్రాండ్ మాస్టర్ అవుతానని ఊహించలేదు. నా విధిరాతలో ఇది ఉంది. ఈ టోర్నమెంట్ ఆరంభానికి ముందు నాకు ఈ హోదా లేదు. ఈ విజయం నాకెంతో విలువైనది. ఇంకా నేను సాధించాల్సినవి చాలానే ఉన్నాయి. ఇది కేవలం ఆరంభం మాత్రమే’’ అంటూ దివ్య దేశ్ముఖ్ ఎమోషనల్ అయింది. ఈ సందర్భంగా దివ్య తల్లి ఆమెను అక్కున చేర్చుకుని.. విజయ గర్వంతో ఉప్పొంగిపోయారు. దివ్య కంటే ముందు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, ఆర్.వైశాలి గ్రాండ్ మాస్టర్ హోదా పొందారు.ట్రై బ్రేకర్ ఇలా..టైబ్రేక్లలో 10 నిమిషాల చొప్పున రెండు రాపిడ్ మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. ప్రతి కదలిక తర్వాత 10 సెకన్ల ఇంక్రిమెంట్ ఉంటుంది. స్కోరు సమంగా ఉంటే, ప్రతి కదలిక తర్వాత మూడు సెకన్ల ఇంక్రిమెంట్లతో రెండు, ఐదు నిమిషాల మ్యాచ్లు ఆడతారు. టై కొనసాగితే, ప్రతి కదలిక తర్వాత రెండు సెకన్ల ఇంక్రిమెంట్లతో మూడు నిమిషాల చొప్పున రెండు బ్లిట్జ్ మ్యాచ్లు ఆడాలి. Divya Deshmukh 🇮🇳 winner of the World Chess Cup and also now a Grandmaster!pic.twitter.com/UNmgiq33qq— Chessdom (@chessdom) July 28, 2025 -
గొప్పగా హాకీ ‘శత’ వసంతం
మహాబలిపురం: భారత హాకీ స్వర్ణోత్సవాన్ని (వందేళ్ల పండగను) గొప్పగా నిర్వహించేందుకు హాకీ ఇండియా (హెచ్ఐ) ఏర్పాట్లు చేస్తోంది. అలాగే శత వసంతం సందర్భంగా రాష్ట్ర హాకీ సంఘాలకు నిధుల వితరణను పెంచింది. సీనియర్, జూనియర్ అంతర్జాతీయ, జాతీయ, మహిళల టోర్నీల నిర్వహణ కోసం అందజేసే గ్రాంట్ల మొత్తాన్ని కూడా గణనీయంగా హెచ్చింపు చేసింది. క్షేత్రస్థాయిలో జరిగే ఈవెంట్ల నిర్వహణను ప్రోత్సహించేలా ఆర్థిక సాయాన్ని పెంచింది. ఏదేని రాష్ట్రంలో ఇకపై పురుషుల, మహిళల సీనియర్ జాతీయ చాంపియన్షిప్ జరిగితే రూ. 70 లక్షలు గ్రాంట్గా అందజేయనుంది. అదే జూనియర్, సబ్–జూనియర్ స్థాయి ఈవెంట్లను నిర్వహిస్తే రూ. 30 లక్షలు ఇవ్వనున్నట్లు హెచ్ఐ ప్రకటించింది. దీంతో పాటు రాష్ట్ర స్థాయి, జిల్లా టోర్నీల నిర్వహణ కోసం రూ. 25 లక్షలు ఇస్తామని ప్రకటించింది. నవంబర్ 7న దేశవ్యాప్తంగా హాకీ వందేళ్ల స్వర్ణోత్సవ సంబరాన్ని అంబరాన్నంటేలా నిర్వహిస్తారు. భవిష్యత్తుకు భరోసా కల్పించేలా... నిధుల పెంపుదలతో ఆయా రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాలు మరింత పెరిగేందుకు దోహదం చేస్తుంది. దీంతో పాటు ఈవెంట్ను ఘనంగా నిర్వహించే ఆరి్థక వెసులుబాటు కలుగుతుందని హెచ్ఐ భావిస్తోంది. దీంతో టోర్నీ ఆకర్షణీయగా మారుతుంది. అదనపు హంగులతో నిర్వహించబడుతుంది. నిష్ణాతులైన రిఫరీలు, అధికారుల మార్గదర్శనంలో జరగడం వలన పోటీల నాణ్యత కూడా పెరుగుతుంది. ప్లేయర్లకు వసతులు పెరుగుతాయి. కొత్తగా మరెంతో మంది ఉత్సాహంగా హాకీ క్రీడను కెరీర్గా ఎంచుకుంటారు. ఇలా బహుముఖ ప్రయోజనాలు కలుగుతాయని హాకీ ఇండియా బలంగా నమ్ముతోంది. ఆటగాళ్లే కాదు హాకీ క్రీడ కోసం పనిచేసే అధికారులు, కోచ్లు, ఫిజియోలకు ఒనగూరే ప్రయోజనాలూ ఇందులో ఇమిడి ఉంటాయి. వీళ్లందరి భవిష్యత్తుకు భరోసా పెరుగుతుంది. ఒకేసారి 1000 మ్యాచ్ల నిర్వహణ శత వసంతాల హాకీ మైలురాయి ఘనతకు గుర్తుగా జాతీయ స్థాయి వేడుకలే కాదు... పోటీలు కూడా హాకీని మరింత శోభాయమానం చేయనుంది. ‘హాకీ–100’ను చిరస్మరణీయంగా మలిచేందుకు మహిళలు, పురుషుల విభాగాల్లో ఒకే సమయం దేశ వ్యాప్తంగా వెయ్యి చొప్పున మ్యాచ్ల్ని నిర్వహించేందుకు హెచ్ఐ ఏర్పాట్లు చేస్తోంది.మహిళల్లో, పురుషుల్లో 18 వేల మంది చొప్పున ఏకంగా 36 వేలమంది క్రీడాకారులు ఈ పోటీల్లో ఒకేసారి పాల్గొనబోతున్నారు. మన హాకీ స్వర్ణ శకం వెయ్యేళ్లు గుర్తుండిపోయేలా, భవిష్యత్ తరాలకు మన హాకీ ప్రభ, శోభ తెలిసేలా వందేళ్ల వేడుక ఉంటుందని హెచ్ఐ అధ్యక్షుడు దిలిప్ టిర్కీ తెలిపారు. -
పియాస్ట్రి ‘సిక్సర్’
స్పా–ఫ్రాంకోర్చాంప్స్ (బెల్జియం): ఫార్ములావన్ తాజా సీజన్లో మెక్లారెన్ డ్రైవర్ల జోరు సాగుతోంది. ఆస్కార్ పియాస్ట్రి, లాండో నోరిస్ మధ్య ఆధిక్యం చేతులు మారుతూ సాగిన బెల్జియం గ్రాండ్ప్రిలో పియాస్ట్రి విజయం సాధించాడు. ఈ సీజన్లో పియాస్ట్రికిది ఆరో విజయం కావడం విశేషం. ఆదివారం జరిగిన ఈ రేసులో పియాస్ట్రి నిరీ్ణత 44 ల్యాప్లను అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 1 గంట 25 నిమిషాల 22.601 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు. మెక్లారెన్ జట్టుకే చెందిన నోరిస్ 1 గంట 25 నిమిషాల 26.016 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రెండో స్థానంలో నిలిచాడు. పోల్ పొజిషన్తో రేసును ప్రారంభించిన నోరిస్... 3.415 సెకన్ల తేడాతో రెండో స్థానానికి పరిమితమయ్యాడు. వర్షం అంతరాయం కారణంగా షెడ్యూల్ కన్నా ఆలస్యంగా ప్రారంభమైన రేసులో ఫెరారీ డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ (1 గంట 25 నిమిషాల 42.786 సెకన్లు) మూడో స్థానం దక్కించుకున్నాడు. నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్ మ్యాక్స్ వెర్స్టాపెన్ (1 గంట 25 నిమిషాల 44.432 సెకన్లు; రెడ్బుల్) నాలుగో స్థానంతో సరిపెట్టుకోగా... ఏడుసార్లు ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ (1 గంట 26 నిమిషాల 3.280 సెకన్లు; ఫెరారీ) ఏడో స్థానానికి పరిమితమయ్యాడు. 24 రేసులో తాజా సీజన్లో ఇప్పటి వరకు 13 రేసులు ముగియగా... డ్రైవర్స్ చాంపియన్షిప్లో పియాస్ట్రి 266 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... నోరిస్ 250 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. డిఫెండింగ్ చాంపియన్ వెర్స్టాపెన్ 185 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. తదుపరి రేసు ఆస్ట్రియా గ్రాండ్ప్రి ఆగస్టు 3న జరుగుతుంది. -
అంకితకు రజతం
రినె–రుర్ ఎసెన్ (జర్మనీ): ప్రపంచ యూనివర్సిటీ క్రీడల్లో భారత స్టీపుల్ఛేజర్ అంకిత ధ్యాని రజత పతకంతో మెరిసింది. మహిళల 3000 మీటర్ల పోటీలో అంకిత 9 నిమిషాల 31.99 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రెండో స్థానంలో నిలవగా... పురుషుల 4x100 మీటర్ల రిలేలో భారత జట్టుకు కాంస్య పతకం దక్కింది. ఆదివారంతో ఈ టోర్నీ ముగియగా... చివరి రోజు భారత్ ఖాతాలో రెండు పతకాలు చేరాయి. ఓవరాల్గా ఈ క్రీడల్లో భారత్ 12 పతకాలు (2 స్వర్ణాలు, 5 రజతాలు, 5 కాంస్యాలు) సాధించింది. మహిళల స్టీపుల్చేజ్లో 23 ఏళ్ల అంకిత తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో వెండి వెలుగులు విరజిమ్మింది. అంతకుముందు హీట్స్లో అగ్రస్థానంతో ఫైనల్కు చేరిన అంకిత... తుది రేసులోనూ జోరు కనబర్చి మిల్లీ సెకన్ల తేడాతో స్వర్ణానికి దూరమైంది. ఈ క్రమంలో తన గత వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన కంటే 7 సెకన్ల టైమింగ్ను మెరుగు పరుచుకోవడం విశేషం. పురుషుల 4x100 మీటర్ల రిలే టీమ్ రేసులో లాలు ప్రసాద్ భోయ్, అనిమేశ్, మణికంఠ, మృత్యం జయరాంతో కూడిన భారత జట్టు 38.89 సెకన్లలో లక్ష్యాన్ని చేరి కాంస్య పతకం గెలుచుకుంది. దక్షిణ కొరియా (38.50 సెకన్లు), దక్షిణాఫ్రికా (38.80 సెకన్లు) జట్లు వరుసగా స్వర్ణ, రజతాలు నెగ్గాయి. మహిళల 4్ఠ100 మీటర్ల రిలే టీమ్ విభాగంలో అనఖ బిజుకుమార్; దివ్యనిబ జాలా, రష్దీప్ కౌర్, రూపాల్తో కూడిన భారత జట్టు 2 నిమిషాల 35.8 సెకన్లలో లక్ష్యాన్ని చేరి ఐదో స్థానంలో నిలిచింది. పురుషుల 4x100 మీటర్ల రిలేలో విశాల్, అశ్విన్, జెరోమ్, బాలకృష్ణతో కూడిన భారత జట్టు 3 నిమిషాల 6.5 సెకన్లతో ఐదో స్థానానికి పరిమితమైంది. రేస్ వాక్లో భారత పురుషుల, మహిళల అథ్లెట్లు టాప్–10లో చోటు దక్కించుకోలేకపోయారు. అంతకుముందు మహిళల 20 కిలోమీటర్ల రేస్వాక్ టీమ్ విభాగంలో సెజల్ సింగ్, మునిత ప్రజాపతి, మాన్సి నేగితో కూడిన భారత జట్టు కాంస్య పతకం నెగ్గింది. -
ఐదులో నాలుగు చైనాకే...
చాంగ్జౌ: బ్యాడ్మింటన్ సీజన్లోని చివరి వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీ చైనా ఓపెన్లో చైనా క్రీడాకారులు తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. మొత్తం ఐదు విభాగాలకుగాను నాలుగు విభాగాల్లో టైటిల్స్ దక్కించుకున్నారు. పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో చైనా క్రీడాకారులే ఫైనల్ చేరుకున్నారు. ఫలితంగా విన్నర్స్, రన్నరప్గా చైనా ప్లేయర్లే నిలిచారు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ షి యు కి (చైనా) 64 నిమిషాల్లో 14–21, 21–14, 21–15తో ప్రపంచ 23వ ర్యాంకర్ వాంగ్ జెంగ్ జింగ్ (చైనా)పై గెలిచాడు.మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ వాంగ్ జి యి (చైనా) 39 నిమిషాల్లో 21–8, 21–13తో ప్రపంచ మూడో ర్యాంకర్ హాన్ యువె (చైనా)పై విజయం సాధించింది. మహిళల డబుల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్వన్ జోడీ లియు షెంగ్ షు–టాన్ నింగ్ (చైనా) 69 నిమిషాల్లో 24–22, 17–21, 21–14తో ప్రపంచ ఏడో ర్యాంక్ జాంగ్ షు జియాన్–జియా యి ఫాన్ (చైనా) ద్వయంపై నెగ్గింది. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్వన్ జంట ఫెంగ్ యాన్ జె–హువాంగ్ డాంగ్ పింగ్ 47 నిమిషాల్లో 23–21, 21–17తో ప్రపంచ రెండో ర్యాంక్ జోడీ జియాంగ్ జెన్ బాంగ్–వె యా జిన్ (చైనా)పై గెలుపొందింది. పురుషుల డబుల్స్ విభాగంలో ప్రపంచ 210వ ర్యాంక్ జోడీ ఫజర్ అల్ఫీయాన్–మొహమ్మద్ షోహిబుల్ ఫిక్రీ (ఇండోనేసియా) ద్వయం 21–15, 21–14తో ప్రపంచ రెండో ర్యాంక్ జోడీ ఆరోన్ చియా–సో వుయ్ యిక్ (మలేసియా)పై సంచలన విజయం సాధించి టైటిల్ను దక్కించుకుంది. పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు 1,40,000 డాలర్ల చొప్పున (రూ. 1 కోటీ 21 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 12,000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విజేత జోడీలకు 1,48,000 డాలర్ల చొప్పున (రూ. 1 కోటీ 28 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 12,000 ర్యాంకింగ్ పాయింట్లు దక్కాయి. -
పోరాడి ఓడిన యూకీ జోడీ
వాషింగ్టన్: ముబాదాల సిటీ డీసీ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో యూకీ బాంబ్రీ (భారత్)–మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) జోడీ పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో యూకీ–వీనస్ ద్వయం 6–3, 4–6, 7–10తో ‘సూపర్ టైబ్రేక్’లో నీల్ స్కప్స్కీ (బ్రిటన్)–జాన్ ప్యాట్రిక్ స్మిత్ (ఆ్రస్టేలియా) జంట చేతిలో పోరాడి ఓడిపోయింది. 93 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో ఇండో–కివీస్ ద్వయం మూడు ఏస్లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్లు చేసింది. తమ సర్వీస్ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను రెండుసార్లు బ్రేక్ చేసింది. అయితే నిర్ణాయక సూపర్ టైబ్రేక్లో స్కప్స్కీ, స్మిత్ జంట కీలకదశలో పాయింట్లు గెలిచి విజయాన్ని ఖరారు చేసుకుంది. క్వార్టర్ ఫైనల్లో ఓడిన యూకీ–వీనస్లకు 19,860 డాలర్ల (రూ. 17 లక్షల 17 వేలు) ప్రైజ్మనీతోపాటు 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
వరల్డ్కప్ టైటిల్ ఫలితం ఇక టై బ్రేకర్లోనే..!
బతూమి (జార్జియా): ఫిడే వరల్డ్కప్ టైటిల్ కోసం ఇద్దరు భారత చెస్ క్రీడాకారిణులు హోరాహోరీగా తలపడతున్నారు. అందులో ఒకరు తెలుగు తేజం కోనేరు హంపి కాగా, మరొకరు మహారాష్ట్రకు చెందిన దివ్యా దేశ్ముఖ్. టైటిల్ పోరులో భాగంగా ఇరువురి మధ్య జరిగిన రెండు వరుస గేమ్లు డ్రాగా ముగియడమే హోరాహోరీని తలపించింది.నిన్న జరిగిన తొలి గేమ్లో అనుభవాన్ని ఉపయోగించి కోనేరు హంపి డ్రా వరకు తీసుకెళ్లగా, ఈరోజు( ఆదివారం, జూలై 27) కూడా ఇంచుమించు అదే రిపీట్ అయ్యింది. తెల్లపావులతో ఈరోజు ఆటను మొదలు పెట్టిన హంపి.. నెమ్మదిగా ఆటన ప్రారంభించింది. గేమ్ లో ఇరువురు రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో పావుల్ని ఒకరి నుంచి ఒకరు ఎక్చేంజ్ చేసుకుంటూ ఆధిక్యాన్ని నిలుపుకోవడం లో విఫలమయ్యారు.. ఇలా వీరి మధ్య గేమ్ కు డ్రాకు దారితీసింది. అయితే గేమ్పై ఫలితం వచ్చే అవకాశాలు లేవని భావించిన ఇరువురు 34 మూవ్ వద్ద డ్రాకు అంగీకరించారు. -
నోరిస్కు పోల్
స్పా–ఫ్రాంకోర్చాంప్స్ (బెల్జియం): ఫార్ములావన్ బెల్జియం గ్రాండ్ప్రి క్వాలిఫయింగ్ టోర్నీలో మెక్లారెన్ డ్రైవర్ లాండో నోరిస్ పోల్ పొజిషన్ దక్కించుకున్నాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ రేసులో నోరిస్ 1 నిమిషం 40.562 సెకన్లలో ల్యాప్ను పూర్తిచేసి అగ్రస్థానం దక్కించుకున్నాడు. ఆదివారం జరగనున్న ప్రధాన రేసును నోరిస్ పోల్ పొజిషన్ నుంచి ప్రారంభించనున్నాడు. 2012లో జాన్సన్ బటన్ తర్వాత బెల్జియం గ్రాండ్ప్రిలో పోల్ పొజిషన్ దక్కించుకున్న తొలి మెక్లారెన్ డ్రైవర్గా నోరిస్ నిలిచాడు. మెక్లారెన్కే చెందిన ఆస్కార్ పియాస్ట్రి 1 నిమిషం 40.647 సెకన్లలో ల్యాప్ను ముగించి రెండో స్థానం దక్కించుకోగా... ఫెరారీ డ్రైవర్ లెక్లెర్క్ 1 నిమిషం 40.903 సెకన్లతో మూడో స్థానంలో నిలిచాడు. నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్, రెడ్బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ (1 నిమిషం 40.903 సెకన్లు) నాలుగో స్థానంలో నిలవగా... ఏడుసార్లు ప్రపంచ చాంపియన్, ఫెరారీ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ (1 నిమిషం 41.939 సెకన్లు) 16వ స్థానానికి పరిమితమయ్యాడు. అంతకుముందు జరిగిన స్ప్రింట్ రేస్లో రెడ్బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. 24 రేసులో తాజా సీజన్లో ఇప్పటి వరకు 12 రేసులు ముగియగా... డ్రైవర్స్ చాంపియన్షిప్లో పియాస్ట్రి 241 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... నోరిస్ 232 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. డిఫెండింగ్ చాంపియన్ వెర్స్టాపెన్ 173 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. -
జాదవ్కు స్వర్ణం పర్నీత్కు రజతం
రినె–రుర్ ఎసెన్ (జర్మనీ): ప్రపంచ యూనివర్సిటీ క్రీడల్లో భారత ఆర్చర్ సాహిల్ జాదవ్ స్వర్ణంపై పెట్టిన గురి కుదిరింది. పురుషుల వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో అతను బంగారు పతకం సాధించాడు. అయితే మహిళల కాంపౌండ్లో పర్నీత్ కౌర్కు తృటిలో పసిడి పతకం చేజారింది. ఆర్చర్లు ఐదు పతకాలతో ఈ పోటీలను ముగించారు. మిగతా మూడు పతకాలు టీమ్ ఈవెంట్లో వచ్చాయి. మిక్స్డ్ టీమ్ స్వర్ణం, పురుషుల టీమ్ రజతం, మహిళల టీమ్ కాంస్యం గెలుచుకుంది. ఒలింపిక్ క్రీడ అయిన రికర్వ్లో మాత్రం భారత ఆర్చర్లు నిరాశపరిచారు. పురుషుల కాంపౌండ్ టైటిల్ పోరులో సాహిల్ జాదవ్ గురి అదిరింది. మొత్తం 15 బాణాలను సంధించగా... ఇందులో ఏకంగా 14 షాట్లు కచ్చితత్వంతో లక్ష్యాన్ని చేరాయి. దీంతో పదికి పది పాయింట్లు లభించగా, ఆఖరి బాణం 9 పాయింట్లు తెచ్చింది. దీంతో జాదవ్ 149–148 స్కోరుతో అజయ్ స్కాట్ (బ్రిటన్)పై గెలిచి బంగారం అందుకున్నాడు. అంతకుముందు భారతీయుల మధ్యే జరిగిన సెమీస్లో సాహిల్ 148–148తో కుశాల్ దలాల్తో సమంగా నిలిచాడు. అయితే షూటాఫ్లో సాహిల్ జాదవ్ మెరుగైన స్థితిలో ఉండటంతో ఫైనల్ చేరాడు. మహిళల కాంపౌండ్లో ఆసియా క్రీడల టీమ్ఈవెంట్ స్వర్ణ పతక విజేత అయిన పర్నీత్ కౌర్ దాదాపు స్వర్ణంపైనే గురిపెట్టింది. కానీ ఆఖరి మెట్టుపై అనూహ్యంగా ఒత్తిడికి గురై తృటిలో పసిడి పట్టలేకపోయింది. చివరకు పాయింట్ తేడాతో బంగారాన్ని దూరం చేసుకున్న పర్నీత్ రజతంతో సరిపెట్టుకుంది. ఫైనల్లో ఆమె 146–147 స్కోరుతో మూన్ యీన్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడింది. అంతకుముందు క్వాలిఫికేషన్ రౌండ్లో టాపర్గా నిలిచింది. సెమీస్లో 145–144తో ఐదో సీడ్ కిమ్ సూయెన్ (దక్షిణ కొరియా)ను కంగుతినిపించింది. -
తన్వీ, వెన్నెలకు కాంస్యాలు
సోలో (ఇండోనేసియా): భారత రైజింగ్ షట్లర్లు వెన్నెల కలగొట్ల, తన్వీ శర్మలు ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో కాంస్య పతకాలతోనే సరిపెట్టుకున్నారు. అండర్–19 మహిళల సింగిల్స్లో సెమీఫైనల్స్కు చేరడం ద్వారానే కనీసం కాంస్య పతకాలు ఖాయం చేసుకున్న వీళ్లిద్దరికి శనివారం సెమీఫైనల్లో చుక్కెదురైంది. తెలుగమ్మాయి వెన్నెల 15–21, 18–21తో చైనాకు చెందిన లియూ సి యా చేతిలో పోరాడి ఓడింది. 37 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో రెండో గేమ్ను చేజిక్కించుకునేందుకు వెన్నెల చెమటోడ్చింది. 15–20తో ఇక మ్యాచ్ ఓడిపోయి స్థితిలో ఉన్నప్పటికీ ఏమాత్రం నిరాశచెందకుండా వరుసగా మూడు పాయింట్లను సాధించి రేసులో నిలిచింది. కానీ చైనా ప్రత్యర్థి ఈ దశలో మరింత జాగ్రత్త పడటంతో గెలిచేందుకు అవసరమైన పాయింట్ సాధించి ముందంజ వేసింది. మరో మ్యాచ్లో తన్వీ శర్మ 13–21, 14–21తో ఎనిమిదో సీడ్ యిన్ యి కింగ్ (చైనా) ధాటికి నిలువలేకపోయింది. తొలి గేమ్ను కోల్పోయిన పంజాబీ షట్లర్ ఒక దశలో రెండో గేమ్ను దూకుడుగా మొదలుపెట్టింది. 6–1 ఆధిక్యంతో జోరుపెంచింది. కానీ వరుస తప్పిదాలతో పాయింట్లను కోల్పోయి 8–8 వద్ద సమం కాగా అక్కడి నుంచి పట్టు కోల్పోయింది. గత నెల యూఎస్ ఓపెన్ సూపర్–300 టోర్నీలో రన్నరప్గా నిలిచిన తన్వీ వరుసగా ఈ టోర్నీలో కాంస్యం గెలుపొందడం విశేషం. మొత్తం మీద ఈ జూనియర్ ఆసియా టోర్నీలో 13 ఏళ్ల పతక నిరీక్షణకు వెన్నెల, తన్వీ కాంస్యాలతో తెరదించారు. చివరిసారిగా భారత్ 2012లో స్వర్ణం గెలుచుకుంది. పీవీ సింధు ఆ ఏడాది విజేతగా నిలిచింది. -
సత్యన్ జోడీకి టైటిల్
లాగోస్ (నైజీరియా): వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) కంటెండర్ టోర్నమెంట్లో... భారత ప్యాడ్లర్లు సత్యన్ జ్ఞానశేఖరన్–ఆకాశ్ పాల్ టైటిల్ దక్కించుకున్నారు. తెలంగాణ ప్లేయర్ ఆకుల శ్రీజ ఫైనల్లో మహిళల సింగిల్స్ పరాజయం పాలై రన్నరప్తో సరిపెట్టుకుంది. శనివారం పురుషుల డబుల్స్ ఫైనల్లో సత్యన్–ఆకాశ్ జోడీ 3–0 (11–9, 11–4, 11–9)తో లియో నోడ్రెస్ట్–జులెస్ రోలాండ్ (ఫ్రాన్స్) ద్వయంపై విజయం సాధించింది. పూర్తి ఏకపక్షంగా సాగిన తుది పోరు కేవలం 22 నిమిషాల్లో ముగియగా... భారత ప్యాడ్లర్లు సంపూర్ణ ఆధిపత్యం కనబర్చారు. మ్యాచ్ ఆరంభం నుంచి జోరు కనబర్చిన భారత జోడీ తమ సర్వీస్లో 19 పాయింట్లు సాధించడంతో పాటు... ప్రత్యర్థి సర్వీస్లో 14 పాయింట్లు రాబట్టి మ్యాచ్ను ముగించింది. ఇక మహిళల సింగిల్స్ ఫైనల్లో శ్రీజ 1–4 (7–11, 3–11, 4–11, 11–9, 11–13)తో రెండో సీడ్ హొనొకా హషిమోటో (జపాన్) చేతిలో ఓడింది. 48 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి మూడు గేమ్ల్లో పెద్దగా ప్రభావం చూపలేక వెనుకబడి పోయిన శ్రీజ ఆ తర్వాత పుంజుకొంది. నాలుగో గేమ్లో హోరాహోరీగా పోరాడి విజయం సాధించిన శ్రీజ... ఐదో గేమ్ను టై బ్రేక్కు తీసుకెళ్లింది. అయితే కీలక సమయాల్లో ఆధిక్యం కనబర్చిన జపాన్ ప్యాడ్లర్ ఒత్తిడి పెంచి విజయం సాధించింది. -
హంపి, దివ్య తొలి గేమ్ డ్రా
బతూమి (జార్జియా): భారత్కు ఖాయమైన వరల్డ్కప్ టైటిల్ను తమ పరం చేసుకునేందుకు తెలుగు తేజం కోనేరు హంపి, దివ్య దేశ్ముఖ్ తొలి గేమ్లో దీటుగా ఎత్తుకు పైఎత్తులు వేశారు. దాంతో ఈ పోరు సమంగా ముగిసింది. ‘ఫిడే’ మహిళల ప్రపంచకప్ నాకౌట్ చెస్ టోర్నమెంట్లో శనివారం జరిగిన తొలి గేమ్లో 41 ఎత్తుల తర్వాత ఫలితం వచ్చే అవకాశం లేకపోవడంతో ఇద్దరూ ‘డ్రా’కు మొగ్గు చూపారు. ఈ పోరులో నల్ల పావులతో బరిలోకి దిగిన హంపికి ఓపెనింగ్ ఎత్తుగడలేవీ కలిసి రాలేదు. గేమ్ను మొదలుపెట్టిన వ్యూహం, వేసిన ఎత్తులు ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ను కాస్త ఇరకాటంలో పెట్టాయి. దీంతో తెల్ల పావులతో ఆడుతున్న దివ్యకు అవి అదనపు బలాన్నిచ్చేలా చేశాయి. దీంతో 14వ ఎత్తు వరకు గేమ్ దివ్య నియంత్రణలోనే ఉంది. అయితే ఈ దశలో తేరుకున్న హంపి జాగ్రత్త పడింది. ఎత్తుగడ మార్చి పైఎత్తులతో గేమ్పై పట్టు పెంచుకుంది. దీంతో అక్కడి నుంచి ఆట పోటాపోటీగా సాగడంతో చివరకు డ్రా తప్పలేదు. ఇంటర్నేషనల్ మాస్టర్, 19 ఏళ్ల దివ్య ఒక దశలో వెటరన్ గ్రాండ్మాస్టర్కు చెమటలు పట్టించింది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ప్రయత్నించని డి4 గడి నుంచి ఓపెనింగ్ చేసిన దివ్య ఎత్తులు, చకచకా పావులు కదుపుతున్న తీరు ఆమె ఫైనల్ కోసం బాగా సన్నద్ధమైందనిపించింది. హంపిని ఒత్తిడికి గురి చేసేందుకు ఎత్తులకు పదునుపెట్టే క్రమంలో చాలా సమయం తీసుకుంది. మరో వైపు అనుభవజు్ఞరాలైన హంపి ఆరంభంలో ప్రత్యర్థి చురుకైన ఎత్తులకు ఏమాత్రం కంగారు పడకుండా తన గేమ్ ప్లాన్ను అమలు చేసింది. ఈ క్రమంలో ఆరంభంలో కాస్త ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఒత్తిడికి గురి కాలేదు. గేమ్ మధ్యలో పట్టు చిక్కించుకున్న హంపి... దివ్య జోరును అడ్డుకుంది. ఈ సమయంలో దివ్య గెలుస్తానన్న ధీమాతో డ్రాకు అంగీకరించలేదు. చివరకు గేమ్ సాగే కొద్దీ ఫలితంపై ఆశలు లేకపోవడంతో దాదాపు మూడు గంటలపాటు జరిగిన ఈ గేమ్ 41వ ఎత్తుల్లో డ్రా అయ్యింది. ఫైనల్లో భాగంగా నేడు రెండో గేమ్ జరుగుతుంది. ఇందులో గెలిచినవారు ప్రపంచ విజేతగా నిలుస్తారు. ఒకవేళ ఫలితం రాకపోతే రేపు టైబ్రేక్ ద్వారా చాంపియన్ను తేలుస్తారు. -
సెమీస్లో ఓడిన సాత్విక్ జోడీ
చాంగ్జౌ: భారత అగ్ర శ్రేణి బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్ –చిరాగ్ షెట్టి చైనా ఓపెన్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సెమీఫైనల్లో నిష్క్రమించింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్–చిరాగ్ జంట 13–21, 17–21తో మలేసియాకు చెందిన రెండో సీడ్ ఆరోన్ చియా–సో వుయి యిక్ ద్వయం చేతిలో పరాజయం చవిచూసింది. 2022 ప్రపంచ చాంపియన్ జోడీ ఆరోన్–సో వుయి మ్యాచ్ ఆరంభం నుంచే పట్టుదలగా ఆడటంతో భారత షట్లర్లకు పుంజుకునే అవకాశం లేకపోయింది. ఆసియా క్రీడల చాంపియన్ జోడీ అయిన సాత్విక్–చిరాగ్లకు మలేసియన్ జంట కొరకరాని కొయ్యగా మారింది. ఇప్పటివరకు 14 సార్లు ఈ రెండు జోడీలు పోటీపడగా ఏకంగా 11 సార్లు మలేసియన్ జంటే గెలుపొందింది. భారత జోడీ 3 సార్లు గెలిచింది. ఓవరాల్గా ఈ సీజన్లో భారత షట్లర్ల జోడీ నిలకడగా రాణిస్తోంది. ఇండియా ఓపెన్, సింగపూర్ ఓపెన్, మలేసియా ఓపెన్లలోనూ సాత్విక్–చిరాగ్ ద్వయం సెమీఫైనల్లోకి ప్రవేశించింది. -
నగాల్ పునరాగమనం
న్యూఢిల్లీ: కేంద్రం నుంచి నిధులు పొందుతూ... జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు విముఖత చూపితే... వారికి నిధులు నిలిపివేస్తామని ఇటీవల కేంద్ర క్రీడా శాఖ జారీ చేసిన హెచ్చరికలు ఫలితాన్నిచ్చాయి. డేవిస్ కప్ టీమ్ టెన్నిస్ టోర్నీలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు సింగిల్స్ స్టార్ సుమిత్ నగాల్... డబుల్స్ స్పెషలిస్ట్ యూకీ బాంబ్రీ మళ్లీ ముందుకొచ్చారు. ఈ ఏడాది సెపె్టంబర్ 12 నుంచి 14 వరకు స్విట్జర్లాండ్తో బీల్ నగరంలో జరిగే డేవిస్కప్ వరల్డ్ గ్రూప్–1 మ్యాచ్లో పాల్గొనే భారత జట్టును శుక్రవారం ప్రకటించారు.సింగిల్స్లో సుమిత్ నగాల్, కరణ్ సింగ్, ఆర్యన్ షా... డబుల్స్లో యూకీ బాంబ్రీ, శ్రీరామ్ బాలాజీ ఎంపికయ్యారు. హైదరాబాద్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ, శశికుమార్ ముకుంద్, దక్షిణేశ్వర్ సురేశ్ రిజర్వ్ ఆటగాళ్లుగా ఉన్నారు. ప్రపంచ సింగిల్స్ ర్యాంకింగ్స్లో 306వ స్థానంలో ఉన్న సుమిత్ నగాల్ చివరిసారి 2023లో డేవిస్కప్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత పాకిస్తాన్, స్వీడన్, టోగో జట్లతో జరిగిన మ్యాచ్లకు సుమిత్ దూరంగా ఉన్నాడు. ప్రపంచ డబుల్స్ ర్యాంకింగ్స్లో 35వ స్థానంలో ఉన్న యూకీ బాంబ్రీ గత ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్తో ఆడిన తర్వాత స్వీడన్, టోగో జట్లతో జరిగిన మ్యాచ్ల్లో పాల్గొనలేదు. -
ప్రపంచ బాక్సింగ్ పోటీలకు నిఖత్
న్యూఢిల్లీ: సెప్టెంబర్ లో ఇంగ్లండ్లో జరిగే ప్రపంచ సీనియర్ బాక్సింగ్ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనే భారత పురుషుల, మహిళల జట్లను ప్రకటించారు. తెలంగాణ స్టార్, రెండుసార్లు ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గొహైన్ భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. పాటియాలాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్ఐఎస్)లో వారం రోజులపాటు నిర్వహించిన శిబిరం తర్వాత భారత జట్లను ఎంపిక చేశారు. కొత్తగా ఏర్పడ్డ వరల్డ్ బాక్సింగ్ ఆధ్వర్యంలో సెపె్టంబర్ 4 నుంచి 14 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. పురుషుల, మహిళల విభాగాల్లో 10 వెయిట్ కేటగిరీల్లో బౌట్లు ఉంటాయి. భారత మహిళల బాక్సింగ్ జట్టు: మీనాక్షి హుడా (48 కేజీలు), నిఖత్ జరీన్ (51 కేజీలు), సాక్షి (54 కేజీలు), జైస్మిన్ లంబోరియా (57 కేజీలు, సంజూ ఖత్రి (60 కేజీలు), నీరజ్ ఫొగాట్ (65 కేజీలు), సనమచ చాను (70 కేజీలు), లవ్లీనా బొర్గోహైన్ (75 కేజీలు), పూజా రాణి (80 కేజీలు), నుపుర్ షెరాన్ (ప్లస్ 80 కేజీలు). భారత పురుషుల బాక్సింగ్ జట్టు: జాదుమణి సింగ్ (50 కేజీలు), పవన్ బర్త్వాల్ (55 కేజీలు), సచిన్ సివాచ్ జూనియర్ (60 కేజీలు), అభినాశ్ జమ్వాల్ (65 కేజీలు), హితేశ్ గులియా (70 కేజీలు), సుమిత్ కుందు (75 కేజీలు), లక్ష్య చహర్ (80 కేజీలు), జుగ్నూ అహ్లావత్ (85 కేజీలు), హర్ష్ చౌధరీ (90 కేజీలు), నరేందర్ బెర్వాల్ (ప్లస్ 90 కేజీలు). -
సింధుకు షాక్
చాంగ్జౌ: ఈ ఏడాది మరో టోర్నమెంట్లో భారత స్టార్, ప్రపంచ మాజీ చాంపియన్ పీవీ సింధు నిరాశ పరిచింది. చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీలో సింధు కథ ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. అనూహ్యంగా ఈసారి భారత రైజింగ్ స్టార్, హరియాణాకు చెందిన ఉన్నతి హుడా చేతిలో సింధు ఓడిపోవడం గమనార్హం. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 15వ ర్యాంకర్ సింధు 16–21, 21–19, 13–21తో ప్రపంచ 35వ ర్యాంకర్, 17 ఏళ్ల ఉన్నతి హుడా చేతిలో ఓటమి పాలైంది. 73 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సింధుకు ఆద్యంతం గట్టిపోటీ ఎదురైంది. తొలి గేమ్లో పలుమార్లు ఇద్దరి స్కోర్లు సమమయ్యాయి. స్కోరు 13–13 వద్ద వరుసగా మూడు పాయింట్లు నెగ్గిన ఉన్నతి 16–13తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఉన్నతి ఒక పాయింట్ కోల్పోయి, వెంటనే వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి 20–14తో ముందంజ వేసింది. సింధు రెండు పాయింట్లు నెగ్గిన తర్వాత మరో పాయింట్ చేజార్చుకొని తొలి గేమ్ను కోల్పోయింది. రెండో గేమ్లోనూ ఇద్దరూ ప్రతి పాయింట్కూ నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. గత ఏడాది సయ్యద్ మోదీ ఓపెన్ టోర్నీలో సింధు చేతిలో వరుస గేముల్లో ఓడిన ఉన్నతి ఈసారి మాత్రం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. స్కోరు 19–19 వద్ద సింధు రెండు పాయింట్లు నెగ్గి గేమ్ను దక్కించుకొని మ్యాచ్లో నిలిచింది. నిర్ణాయక మూడో గేమ్లో ఆరంభంలోనే ఉన్నతి 9–5తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని 15–9కు పెంచుకుంది. స్కోరు 16–13 వద్ద ఉన్నతి ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఐదు పాయింట్లు గెలిచి గేమ్తోపాటు చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో రెండుసార్లు ప్రపంచ చాంపియన్ అకానె యామగుచి (జపాన్)తో ఉన్నతి ఆడుతుంది. అంతర్జాతీయ టోర్నీల్లో భారత క్రీడాకారిణి చేతిలో సింధు ఓడిపోవడం 2018 తర్వాత ఇదే తొలిసారి. 2018 కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్లో సైనా చేతిలో సింధు ఓటమి పాలైంది. 2019 జాతీయ చాంపియన్షిప్ ఫైనల్లోనూ సైనా చేతిలోనే సింధు పరాజయం పాలైంది. ఈ ఏడాది సింధు ఇండియా ఓపెన్, ఇండోనేసియా మాస్టర్స్, ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్, స్విస్ ఓపెన్, ఆసియా చాంపియన్షిప్, మలేసియా మాస్టర్స్, సింగపూర్ ఓపెన్, ఇండోనేసియా ఓపెన్, జపాన్ ఓపెన్ టోర్నీలలో ఆడింది. జనవరిలో స్వదేశంలో జరిగిన ఇండియా ఓపెన్లో క్వార్టర్ ఫైనల్ చేరడమే ఈ ఏడాది సింధు అత్యుత్తమ ప్రదర్శన కావడం గమనార్హం. పురుషుల సింగిల్స్లో భారత పోరాటం ముగిసింది. భారత మూడో ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగాడు. ఆరో సీడ్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)తో జరిగిన మ్యాచ్లో ప్రణయ్ 21–18, 15–21, 8–21తో ఓడిపోయాడు. తొలి గేమ్ను నెగ్గిన ప్రణయ్ అదే జోరును కొనసాగించలేకపోయాడు. వరుసగా రెండు గేమ్లను కోల్పోయి ఓటమి పాలయ్యాడు. పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–19, 21–19తో ఎనిమిదో సీడ్ లియో రాలీ కర్నాండో–బగాస్ మౌలానా (ఇండోనేసియా) జోడీపై విజయం సాధించింది. సింధుపై గెలుస్తానని అస్సలు ఊహించలేదు. తుది ఫలితం గురించి ఆలోచించకుండా నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనే లక్ష్యంతో బరిలోకి దిగాను. మొత్తానికి సింధుపై నెగ్గడం నాకే ఆశ్చర్యమనిపిస్తోంది. మ్యాచ్లో నేను రెండుసార్లు హాక్ ఐ చాలెంజ్లను వృథా చేసుకున్నాను. చివరకు నా వద్ద అప్పీల్ చేసుకునేందుకు మరో అవకాశం లేకపోవడంతో కాస్త అసహనం కలిగింది. అయితే నిర్ణాయక మూడో గేమ్లో సంయమనం కోల్పోకుండా ఆడి విజయం అందుకున్నాను.– ఉన్నతి హుడా -
ఫైనల్లో కోనేరు హంపి
బతూమి (జార్జియా): మహిళల ప్రపంచకప్ నాకౌట్ చెస్ టోర్నమెంట్ టైటిల్ తొలిసారి భారత్ ఖాతాలో చేరడం ఖరారైంది. బుధవారం భారత్కు చెందిన ప్రపంచ జూనియర్ చాంపియన్ దివ్య దేశ్ముఖ్ ఫైనల్కు చేరగా... గురువారం దివ్య సరసన భారత దిగ్గజం కోనేరు హంపి కూడా చేరింది. చైనా గ్రాండ్మాస్టర్ లె టింగ్జితో జరిగిన రెండో సెమీఫైనల్లోఆంధ్రప్రదేశ్కు చెందిన హంపి టైబ్రేక్లో 4–2 పాయింట్లతో... ఓవరాల్గా 5–3 పాయింట్లతో విజయాన్ని అందుకొని ఫైనల్కు చేరింది. ఈ గెలుపుతో హంపి వచ్చే ఏడాది జరిగే క్యాండిడేట్స్ టోర్నీకి కూడా అర్హత సాధించింది. బుధవారం నిర్ణీత రెండు క్లాసికల్ గేమ్ల తర్వాత హంపి, లె టింగ్జి 1–1తో సమంగా ఉన్నారు. దాంతో విజేతను తేల్చేందుకు గురువారం టైబ్రేక్ గేమ్లు నిర్వహించారు. ముందుగా ర్యాపిడ్ ఫార్మాట్లో రెండు గేమ్లు జరిగాయి. అయితే ఈ రెండూ ‘డ్రా’గా ముగిశాయి. దాంతో ఇద్దరూ 2–2తో సమంగా నిలిచారు. అనంతరం ర్యాపిడ్ ఫార్మాట్ లోనే మరో రెండు గేమ్లు నిర్వహించారు. తొలి గేమ్లో లె టింగ్జి 65 ఎత్తుల్లో నెగ్గగా... రెండో గేమ్లో హంపి 39 ఎత్తుల్లో గెలిచింది. దాంతో స్కోరు 3–3తో సమమైంది. ఈసారి వీరిద్దరి మధ్య బ్లిట్జ్ ఫార్మాట్లో రెండు గేమ్లు నిర్వహించారు. ఈ రెండు గేముల్లోనూ హంపి నెగ్గి ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది. తొలి గేమ్లో హంపి 70 ఎత్తుల్లో, రెండో గేమ్లో 33 ఎత్తుల్లో గెలుపొందింది. హంపి, దివ్య మధ్య ఈనెల 26, 27వ తేదీల్లో ఫైనల్ జరుగుతుంది. రెండు గేమ్లలో ఫలితం తేలకపోతే 28న టైబ్రేక్ గేమ్లు నిర్వహించి విజేతను నిర్ణయిస్తారు. 2 ప్రపంచ చెస్ చాంపియన్షిప్లో టైటిల్ పోరుకు చేరడం హంపికిది రెండోసారి. 2011లో మ్యాచ్ ఫార్మాట్లో నిర్వహించిన ప్రపంచ చాంపియన్షిప్లో హంపి ఫైనల్ చేరి చైనా గ్రాండ్మాస్టర్ హు ఇఫాన్ చేతిలో ఓడిపోయింది. -
WWF దిగ్గజం హల్క్ హోగన్ కన్నుమూత
దిగ్గజ రెజ్లర్, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ (ప్రస్తుతం డబ్ల్యూడబ్ల్యూఈ) సూపర్ స్టార్ హల్క్ హోగన్ (Hulk Hogan) (71) ఇవాళ (జులై 24) ఉదయం కన్నుమూసినట్లు తెలుస్తుంది. అమెరికాలోని ఫ్లోరిడాలో గల తన నివాసంలో హోగన్ తుది శ్వాస విడిచారని సమాచారం. కార్డియాక్ అరెస్ట్ కారణంగా హోగన్ మృతి చెందినట్లు తెలుస్తుంది.1953 ఆగస్ట్ 11న జన్మించిన హోగన్ అసలు పేరు టెర్రి జీనీ బోల్లియా. 80వ దశకంలో హోగన్ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ (WWF) ద్వారా విశేష ప్రజాదరణ పొందారు. హోగన్ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ రెజిల్ మానియాలోని తొలి తొమ్మిది ఎడిషన్లలో ఎనిమిది టైటిళ్లు సాధించాడు.హోగన్కు డబ్ల్యూడబ్ల్యూఈ హాల్ ఆఫ్ ఫేమర్లలో కూడా చోటు దక్కింది. 1984లో హోగన్ తన తొలి డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఛాంపియన్షిప్ను కైవసం చేసుకున్నాడు. హోగన్ తన కెరీర్ ఉన్నతిలో ఆండ్రీ ద జెయింట్, మాఛో మ్యాన్ రాండీ సావేజ్, అల్టిమేట్ వారియర్ లాంటి దిగ్గజ రెజర్లతో కుస్తీ పడ్డాడు. హోగన్కు అతని మీసాలు చాలా ప్రత్యేకతనిచ్చాయి.హోగన్ రెజ్లింగ్ కాకుండా సినిమాలు, టీవీ రియాలిటీ షోల్లో కూడా నటించాడు. హోగన్ గడిచిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ తరఫున ప్రచారం చేశాడు. హోగన్కు భారత్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. 80వ దశకంలో పిల్లలకు హోగన్ సుపరిచితుడు. -
రీఎంట్రీలో దుమ్ములేపుతున్న స్టార్ ప్లేయర్
వాషింగ్టన్: సుదీర్ఘ విరామం తర్వాత ప్రొఫెషనల్ టెన్నిస్లో పునరాగమనం చేసిన అమెరికా దిగ్గజం వీనస్ విలియమ్స్ సింగిల్స్ విభాగంలోనూ శుభారంభం చేసింది. సిటీ డీసీ ఓపెన్–500 టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో 45 ఏళ్ల వీనస్ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకుంది. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్లో వీనస్ 6–3, 6–4తో ప్రపంచ 35వ ర్యాంకర్, 23 ఏళ్ల పేటన్ స్టెర్న్స్పై గెలుపొందింది. 97 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో వీనస్ తొమ్మిది ఏస్లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్ను ఆరుసార్లు బ్రేక్ చేసింది.ఈ గెలుపుతో మహిళల ప్రొఫెషనల్ టెన్నిస్లో విజయం సాధించిన రెండో అతిపెద్ద వయస్కురాలిగా వీనస్ గుర్తింపు పొందింది. ఇంతకుముందు 2004లో మార్టినా నవ్రతిలోవా 47 ఏళ్ల వయస్సులో సింగిల్స్ మ్యాచ్ నెగ్గింది. 2024 మయామి ఓపెన్లో చివరిసారి ఆడిన వీనస్ ఆ తర్వాత గాయాల కారణంగా ఆటకు విరామం ఇచ్చింది. 2023 ఆగస్టులో జరిగిన సిన్సినాటి ఓపెన్ టోర్నీ తర్వాత వీనస్ సింగిల్స్ మ్యాచ్ నెగ్గడం ఇదే మొదటిసారి కావడం విశేషం.‘నేను పూర్తి ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని పదేపదే ప్రార్థిస్తున్నాను’ పేటన్పై విజయానంతరం వీనస్ వ్యాఖ్యానించింది. ఈ మ్యాచ్ను వీనస్ కాబోయే భర్త, ఇటలీకి చెందిన సినీ నటుడు, నిర్మాత ఆండ్రియా ప్రెటి కూడా తిలకించాడు.విజయంతో రీఎంట్రీఇక పునరాగమనంలో వీనస్ విలియమ్స్ అదరగొట్టిన విషయం తెలిసిందే. ఏడాది తర్వాత రాకెట్ పట్టిన ఆమె డీసీ ఓపెన్లో శుభారంభం చేసింది. కెరీర్లో సింగిల్స్, డబుల్స్లో కలిపి 21 గ్రాండ్స్లామ్ టైటిల్స్ నెగ్గిన 45 ఏళ్ల వీనస్ తన దేశానికే చెందిన హైలీ బాప్టిస్ట్తో కలిసి డీసీ ఓపెన్ డబుల్స్లో ఆడుతోంది. తొలి రౌండ్లో వీనస్–హైలీ జంట 6–3, 6–1తో 2014 వింబుల్డన్ రన్నరప్ యూజీనీ బుచార్డ్ (కెనడా)–క్లార్వీ (అమెరికా) ద్వయంపై విజయం సాధించింది.మూడేళ్ల తర్వాత డబుల్స్ మ్యాచ్ ఆడిన వీనస్... కిక్కిరిసిన మైదానంలో మొదట తడబడినా... ఆ తర్వాత తన ట్రేడ్మార్క్ షాట్లతో ఆకట్టుకుంది. ‘ఆటను ఆస్వాదించాలనే ఉద్దేశంతోనే బరిలోకి దిగాను. ప్రస్తుతం అదే నా ప్రాథమిక లక్ష్యం. నాపై నేను ఎక్కువ ఒత్తిడి పెంచుకోవాలని అనుకోవడం లేదు. గెలుపంటే నాకు ఇష్టం.ఎలాంటి స్థితిలో అయినా గెలిచేందుకే ప్రయత్నిస్తా. అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు ప్రయత్నించా’ అని వీనస్ వెల్లడించింది. 2024 మయామి ఓపెన్ తర్వాత టెన్నిస్కు దూరమైన వీనస్... వైల్డ్ కార్డ్తో తాజా టోరీ్నలో బరిలోకి దిగింది.దీంతో తమ అభిమాన ప్లేయర్ ఆటను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులు ఈ మ్యాచ్కు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. 2022 యూఎస్ ఓపెన్లో సోదరి సెరెనా విలియమ్స్తో కలిసి బరిలోకి దిగిన అనంతరం వీనస్ ఇక డబుల్స్ మ్యాచ్ ఆడలేదు. వింబుల్డన్లో ఐదు (2000, 2001, 2005, 2007, 2008) సింగిల్స్ టైటిల్స్ గెలిచిన వీనస్... 2000, 2001లో యూఎస్ ఓపెన్ టైటిల్స్ ఖాతాలో వేసుకుంది.డబుల్స్లో 14 గ్రాండ్స్లామ్లు నెగ్గిన వీనస్... ఒలింపిక్స్లో 4 పసిడి పతకాలు చేజిక్కించుకుంది. ఇక ఇదే టోర్నీ సింగిల్స్లో సైతం వీనస్ బరిలోకి దిగనుంది. తొలి రౌండ్లో ప్రపంచ 35వ ర్యాంకర్ 23 ఏళ్ల పేటన్ స్టెర్న్తో తలపడనుంది.యూఎస్ ఓపెన్లో వీనస్ వచ్చే నెలలో జరగనున్న గ్రాండ్స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్లో వీనస్ విలియమ్స్ బరిలోకి దిగనుంది. మిక్స్డ్ డబుల్స్లో అమెరికాకే చెందిన రీలీ ఒపెల్కాతో కలిసి వీనస్ ఆడనుంది. వింబుల్డన్ రన్నరప్ అమండా అనిసిమోవా (అమెరికా) కూడా యూఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్లో పాల్గొననుంది. హోల్గర్ రూనె (డెన్మార్క్)తో కలిసి ఆమె డబుల్స్లో బరిలోకి దిగనుంది.ఈ మేరకు యూఎస్ ఓపెన్ నిర్వాహకులు వివరాలు వెల్లడించారు. కొత్తగా చేర్చిన జాబితాలో మొత్తం 25 జోడీలు పోటీపడుతున్నాయి. పేర్లు నమోదు చేసుకునేందుకు మరో వారం రోజులు గడువు ఉన్న నేపథ్యంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సింగిల్స్ మ్యాచ్లు ఆగస్టు 24 నుంచి ప్రారంభం కానుండగా... అందకు వారం రోజులు ముందుగానే మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్లు మొదలవుతాయి. -
కొత్త క్రీడా బిల్లులో ఏమున్నాయంటే...
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా.... భారత ప్రభుత్వం కొత్త క్రీడా బిల్లును ప్రవేశపెట్టింది. కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ బుధవారం లోక్సభలో ‘నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు’ను ప్రవేశ పెట్టారు. నేషనల్ స్పోర్ట్స్ బోర్డు, నేషనల్ స్పోర్ట్స్ ట్రిబ్యునల్, నేషనల్ స్పోర్ట్స్ ఎలక్షన్ ప్యానెల్, సమాచార హక్కు చట్టం అమలు, ప్రభుత్వ విచక్షణాధికారాలు, వయో పరిమితికి సంబంధించిన నిబంధనలు, జాతీయ డోపింగ్ నిరోధక (సవరణ) బిల్లు–2025 ఇలా అందులోని కొన్ని కీలక అంశాలు ఇవి... » జాతీయ క్రీడా బోర్డు (ఎన్ఎస్బీ)కు ఓ చైర్పర్సన్ ఉండనున్నాడు. అతడిని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. సామర్థ్యం, సమగ్రత, అర్హత ప్రతిపాదికన బోర్డు సభ్యుల ఎంపిక జరుగుతుంది. క్రీడలపై అవగాహనతో పాటు పాలన అనుభవం ఉన్న వ్యక్తులకు పెద్దపీట వేయనుంది. ప్రజల నుంచి సలహాలు సూచనలు తీసుకొని విస్తృత సంప్రదింపులు జరిపిన అనంతరం సెలక్షన్ కమిటీ సిఫార్సులతో ఈ నియమకాలు జరుగుతాయి. » సెలక్షన్ కమిటీకి క్యాబినెట్ సెక్రటరీ లేదా కేంద్ర క్రీడా శాఖ కార్యదర్శి, జాతీయ స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ జనరల్ చైర్ పర్సన్ అవుతారు. ఇందులో జాతీయ క్రీడా సంఘాలకు అధ్యక్ష, కార్యదర్శులుగా పనిచేసిన ఇద్దరు క్రీడా నిర్వాహకులతో పాటు ఖేల్రత్న, ద్రోణాచార్య, అర్జున అవార్డు పొందిన ఓ ప్రముఖ క్రీడాకారుడు ఉంటాడు. » భారత ఎన్నికల సంఘం మాజీ సభ్యులు లేదా రాష్ట్రాల మాజీ ప్రధాన ఎన్నికల అధికారులతో కూడిన జాతీయ క్రీడా ఎన్నికల ప్యానెల్ను కూడా ఈ బిల్లు అందించనుంది. ఈ ప్యానెల్ జాతీయ క్రీడా సంస్థల కార్యనిర్వాహక కమిటీలు, అథ్లెట్ల కమిటీకి ఎన్నికలు నిర్వహించనుంది. » క్రీడల్లో డోపింగ్కు ఏమాత్రం అవకాశం ఉండకూడదనే ఉద్దేశంతో... సమగ్ర ప్రక్షాళనకు కేంద్ర నడుం బిగించింది. జాతీయ డోపింగ్ నిరోధక (సవరణ) బిల్లు–2025 ప్రకారం క్రీడా కార్యకలాపాలు, దర్యాప్తులకు సంబంధించిన నిర్ణయాల్లో స్వయంప్రతిపత్తి ఉంటుంది. » సివిల్ కోర్టుకు ఉండే అన్నీ అధికారాలు గల జాతీయ క్రీడా ట్రిబ్యునల్ ప్రతిపాదన కూడా బిల్లులో ఉంది. ఇది వేర్వేరు క్రీడాంశాల్లో ప్లేయర్ల ఎంపికల నుంచి మొదలుకొని... సంఘాల ఎన్నికలు, వాటి వివాదాలను పరిష్కరించనుంది. ఇది అమల్లోకి వచ్చాక కేవలం సుప్రీంకోర్టుకు మాత్రమే ఈ నిర్ణయాలను సవాలు చేసే అధికారం ఉండనుంది. » క్రీడా మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం... ప్రస్తుతం క్రీడా రంగానికి సంబంధించిన 350 కేసులు వేర్వేరు న్యాయస్థానాల్లో నడుస్తున్నాయి. జాతీయ స్పోర్ట్స్ ట్రిబ్యునల్ ప్రారంభమైతే... అథ్లెట్లకు ఎంతో ఉపకరించనుంది. » జాతీయ డోపింగ్ నిరోధక (సవరణ) బిల్లు–2025ను సైతం కేంద్ర మంత్రి లోక్సభలో ప్రవేశపెట్టారు. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) సూచించిన మార్పులను ఇందులో పొందుపరిచారు. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) పనితీరులో ప్రభుత్వాల జోక్యం అధికంగా ఉండటంపై ‘వాడా’ గతంలో అభ్యంతరం వ్యక్తం చేసింది. » 2022లో ఈ చట్టాన్ని ఆమోదించారు. అయితే ‘వాడా’ లేవనెత్తిన అభ్యంతరాల కారణంగా దాని అమలును నిలిపి వేయాల్సి వచ్చింది. గతంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన చైర్పర్సన్, ఇద్దరు సభ్యులతో కూడిన బోర్డు... ‘నాడా’ను పర్యవేక్షించేది. అయితే స్వయం ప్రతిపత్తి గల సంస్థలో ప్రభుత్వ జోక్యాన్ని ‘వాడా’ తప్పుబట్టింది. -
చరిత్ర సృష్టించిన దివ్య దేశ్ముఖ్
అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని అద్భుత విజయాన్ని అందుకున్న భారత చెస్ ప్లేయర్ దివ్య దేశ్ముఖ్ చరిత్ర సృష్టించింది. మహిళల ప్రపంచకప్ చెస్ టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా 19 ఏళ్ల దివ్య రికార్డు నెలకొల్పింది. జార్జియాలో జరుగుతున్న ఈ మెగా టోర్నీ సెమీఫైనల్లో మహారాష్ట్ర అమ్మాయి దివ్య 1.5–0.5తో 2017 ప్రపంచ చాంపియన్ టాన్ జోంగి (చైనా)పై గెలిచింది. మంగళవారం వీరిద్దరి మధ్య తొలి గేమ్ ‘డ్రా’కాగా... బుధవారం జరిగిన రెండో గేమ్లో తెల్ల పావులతో ఆడిన దివ్య 101 ఎత్తుల్లో టాన్ జోంగిని ఓడించి ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది. ఈ విజయంతో దివ్య వచ్చే ఏడాది జరిగే క్యాండిడేట్స్ టోర్నీకి కూడా అర్హత సాధించింది. తాజా ప్రదర్శనతో దివ్య ఖాతాలో తొలి గ్రాండ్మాస్టర్ (జీఎం) నార్మ్ కూడా చేరింది. కోనేరు హంపి (భారత్)–లె టింగ్జి (చైనా) మధ్య సెమీఫైనల్ విజేతతో ఫైనల్లో దివ్య ఆడుతుంది. హంపి–లె టింగ్జి మధ్య బుధవారం జరిగిన రెండో గేమ్ కూడా 75 ఎత్తుల్లో ‘డ్రా’ కావడంతో ఇద్దరూ 1–1తో సమంగా నిలిచారు. హంపి–టింగ్జి మధ్య ఈరోజు టైబ్రేక్ గేమ్స్ నిర్వహించి విజేతను నిర్ణయిస్తారు. -
ఓటమి అంచుల నుంచి...
చాంగ్జౌ: ఈ ఏడాది ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్... ప్రతిష్టాత్మక చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీలో స్ఫూర్తిదాయక ప్రదర్శనతో శుభారంభం చేశాడు. ఓటమి అంచుల్లో ఉన్నప్పటికీ... సంయమనం కోల్పోకుండా ఆడిన ఈ కేరళ ప్లేయర్ ఏకంగా ఐదు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని గట్టెక్కడం విశేషం. ప్రపంచ 18వ ర్యాంకర్ కోకి వతనాబె (జపాన్)తో మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 35వ ర్యాంకర్ ప్రణయ్ 8–21, 21–16, 23–21తో గెలుపొంది ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. 57 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో ప్రణయ్ తొలి గేమ్లో తేలిపోయాడు. కేవలం ఎనిమిది పాయింట్లు మాత్రమే సాధించాడు. ఒకసారి వరుసగా ఐదు పాయింట్లు, ఇంకోసారి వరుసగా మూడు పాయింట్లు, మరోసారి వరుసగా నాలుగు పాయింట్లు కోల్పోయిన ప్రణయ్ తొలి గేమ్లో ప్రత్యర్థి స్కోరు సమీపానికి కూడా రాలేకపోయాడు. రెండో గేమ్ నుంచి ప్రణయ్ పుంజుకున్నాడు. ఆరంభంలో 2–5తో వెనుకబడ్డ ప్రణయ్ ఆ తర్వాత 5–5తో, 7–7తో, 9–9తో స్కోరును సమం చేశాడు. స్కోరు 9–9 వద్ద ఉన్నపుడు ప్రణయ్ ఒక్కసారిగా చెలరేగి వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గాడు. 13–9తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత తన జోరును కొనసాగిస్తూ 15–10తో ముందంజ వేసిన ప్రణయ్ ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ రెండో గేమ్ను సొంతం చేసుకొని మ్యాచ్లో నిలిచాడు. నిర్ణాయక మూడో గేమ్లో వతనాబె విజృంభించడంతో మొదట్లో ప్రణయ్కు ఏమి చేయాలో తోచలేదు. వరుస పాయింట్లు కోల్పోయిన భారత ప్లేయర్ చూస్తుండగానే 1–10తో వెనుకబడిపోయాడు. గతంలో థామస్ కప్ టైటిల్ భారత్కు తొలిసారి దక్కడంలో కీలకపాత్ర పోషించిన ప్రణయ్ ఈ దశలో పోరాడితే పోయేదేమీ లేదన్నట్లు ఆడాడు. తొమ్మిది పాయింట్ల వ్యత్యాసాన్ని 10–14తో నాలుగు పాయింట్లకు తగ్గించాడు. స్వల్ప ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగిన వతనాబె 20–15తో విజయం అంచుల్లోకి వచ్చాడు. ఒక్క పాయింట్ గెలిస్తే కెరీర్లో ప్రణయ్పై వరుసగా రెండోసారి గెలుపు అందుకునేందుకు చేరువైన వతనాబె ఈ దశలో తడబడ్డాడు. మ్యాచ్ కాపాడుకోవాలంటే ఐదు పాయింట్లు సాధించాల్సిన స్థితిలో ప్రణయ్ తుది ఫలితంపై దృష్టి పెట్టకుండా... ఒక్కో పాయింట్ నెగ్గేలా ఆడాడు. ప్రణయ్ వ్యూహం ఫలితాన్నిచ్చించంది. భారత ప్లేయర్ వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి 15–20 నుంచి 21–20తో ఆధిక్యంలో వచ్చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. వరుసగా ఆరు పాయింట్లు కోల్పోయాక వతనాబె ఒక పాయింట్ గెలిచి స్కోరును 21–21తో సమం చేశాడు. ఈ దశలో 33 ఏళ్ల ప్రణయ్ చెలరేగి వరుసగా రెండు పాయింట్లు గెలిచి గేమ్తోపాటు చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నాడు. ఈ ఏడాది 11 టోర్నీలు ఆడిన ప్రణయ్ ఒక్క దాంట్లోనూ క్వార్టర్ ఫైనల్ చేరుకోలేకపోయాడు. చైనా ఓపెన్లో క్వార్టర్ ఫైనల్లో చోటు కోసం ప్రపంచ ఆరో ర్యాంకర్, చైనీస్ తైపీ ప్లేయర్ చౌ టియెన్ చెన్తో ప్రణయ్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో ప్రణయ్ 6–7తో వెనుకంజలో ఉన్నాడు. చివరిసారి వీరిద్దరు గత ఏడాది ఇండియా ఓపెన్లో తలపడగా... ప్రణయ్ వరుస గేముల్లో గెలిచాడు.రెండు మ్యాచ్ పాయింట్లు వదులుకొని...పురుషుల సింగిల్స్ మరో మ్యాచ్లో భారత నంబర్వన్, ప్రపంచ 19వ ర్యాంకర్ లక్ష్య సేన్కు తొలి రౌండ్లోనే ఓటమి ఎదురైంది. ప్రపంచ ఐదో ర్యాంకర్ లీ షి ఫెంగ్ (చైనా)తో జరిగిన మ్యాచ్లో లక్ష్య సేన్ 21–14, 22–24, 11–21తో ఓడిపోయాడు. 67 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో లక్ష్య సేన్ తొలి గేమ్ గెల్చుకొని, రెండో గేమ్లో 21–20తో, 22–21తో రెండుసార్లు విజయానికి చేరువయ్యాడు. కానీ ఈ అవకాశాలను వదులుకున్న లక్ష్య సేన్ చివరకు 22–24తో రెండో గేమ్ను కోల్పోయాడు. నిర్ణాయక మూడో గేమ్లో లీ షి ఫెంగ్ జోరు పెంచగా... గెలుపు అవకాశాలను వృథా చేసుకున్న లక్ష్య సేన్ డీలా పడి చివరకు 11 పాయింట్లే గెలిచి మ్యాచ్ను సమర్పించుకున్నాడు. పోరాడి ఓడిన రుత్విక–రోహన్ జోడీ మిక్స్డ్ డబుల్స్లో భారత జోడీలకు నిరాశ ఎదురైంది. తెలంగాణ అమ్మాయి గద్దె రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్), అశిత్ సూర్య–అమృత జోడీలు తొలి రౌండ్లోనే నిష్క్రమించాయి. రుత్విక–రోహన్ ద్వయం 64 నిమిషాలు పోరాడి 27–25, 16–21, 14–21తో వోంగ్ టియెన్ సి–లిమ్ చియె సియెన్ (మలేసియా) చేతిలో... అశిత్–అమృత 12–21, 17–21తో రెహాన్–గ్లోరియా (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో అనుపమ (భారత్) 23–21, 11–21, 10–21తో లిన్ సియాంగ్ టి (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం పాలైంది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సెల్వం కవిప్రియ–సిమ్రన్ (భారత్) 16–21, 14–21తో లౌరెన్ లామ్–అలీసన్ లీ (అమెరికా) చేతిలో... అమృత–సోనాలీ 12–21, 5–21తో సియె పె షాన్–హుంగ్ ఎన్ జు (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి చవిచూశారు. ప్రస్తుతం నా కెరీర్లో ప్రతీ విజయం ముఖ్యం. గాయం నుంచి కోలుకుని మళ్లీ టోర్నీలు ఆడుతున్నందుకు ఆనందంగా ఉంది. స్వల్ప విరామాలు తీసుకుంటున్నాను. బ్యాడ్మింటన్లో పోటీతత్వం విపరీతంగా పెరిగిపోయింది. ప్రతీ రౌండ్లో గెలిచి ముందుకెళ్లడం రోజురోజుకీ క్లిష్టంగా మారిపోతోంది. పురుషుల సింగిల్స్లో ఆటగాళ్ల సగటు వయసు 22–23గా ఉంది. తెరపైకి ఒక్కసారిగా కొత్త వాళ్లు దూసుకొస్తున్నారు. వారు ఎలా ఆడతారో ముందస్తుగా తెలియడంలేదు. సీనియర్గా ఉంటూ యువ ప్రతిభావంతులతో పోరాడాలంటే కాస్త కష్టమే. – ప్రణయ్ -
జాతీయ క్రీడా నియమావళి పరిధిలోకి బీసీసీఐ!
న్యూఢిల్లీ: త్వరలోనే భారత ప్రభుత్వం కొత్త క్రీడా బిల్లును ప్రవేశ పెట్టనుంది. ఇది వరకే జాతీయ క్రీడా నియమావళి (స్పోర్ట్స్ కోడ్) ఉంది. దీనికి కొన్ని సవరణలు, మార్పు–చేర్పులతో తాజాగా స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లును ఈ వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. అయితే ఇన్నేళ్లుగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్వతంత్ర క్రీడా సమాఖ్యగా చక్రం తిప్పింది. ఇప్పుడు కొత్త బిల్లు ప్రకారం క్రికెట్ బోర్డు కూడా స్పోర్ట్స్ గవర్నెన్స్ గొడుగు కిందకే రానుంది. ఇదే విషయమై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ స్పష్టీకరించింది. ‘దేశంలో ఉన్న అన్ని జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)ల మాదిరే బీసీసీఐ కూడా కొత్త గవర్నెన్స్ బిల్లు పరిధిలోకి వస్తుంది. ప్రభుత్వం నుంచి నిధులు, గ్రాంట్లు పొందిన, పొందకపోయినా పార్లమెంటులో చట్టం అయ్యాక క్రికెట్ బోర్డు కూడా స్పోర్ట్స్ కోడ్ కిందకే వస్తుంది’ అని క్రీడాశాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. క్రీడా సమఖ్యల లాగే క్రికెట్ బోర్డుకు ఉన్న స్వయంప్రతిపత్తికి ఎలాంటి విఘాతం కలుగదని, అయితే వివాదాలు, ఇతరాత్ర సమస్యలు ఎదురైతే మాత్రం జాతీయ క్రీడా నియమావళి ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుందని ఆ అధికారి వెల్లడించారు. లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్–2028లో క్రికెట్ క్రీడాంశం ఉండటంతోనే బోర్డు ఒలింపిక్ సంఘం పరిధిలోకి వచ్చినట్లయ్యింది. జాతీయ క్రీడాసమాఖ్యల్లో నిర్లిప్తతను దూరం చేసి జవాబుదారితనాన్ని మరింత పెంచేందుకు, సకాలంలో ఎన్నికల ప్రక్రియ ముగించేందుకు, పారదర్శక పరిపాలన, అర్హులైన క్రీడాకారుల సంక్షేమం, ప్రమాణాల్ని మెరుగుపరిచేందుకు కేంద్రం స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లును తీసుకొస్తుంది. ముఖ్యంగా అంతర్జాతీయ ఒలింపిక్ చార్టర్ ప్రకారం నడుచుకోవాల్సిన ఆవశ్యకతను ఈ బిల్లు తెలియజేస్తుంది. దీనిపై సుదీర్ఘంగా కసరత్తు చేసిన మోదీ సర్కారు ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకునేందుకు సిద్ధమైంది. ఇది వరకటి స్పోర్ట్స్ కోడ్ ప్రకారం 70 ఏళ్ల వయసుకు చేరిన ఏ కార్యవర్గ సభ్యుడైనా పదవికి రాజీనామా చేయాల్సివుండగా... ఈ గరిష్ట వయోపరిమితి ఇక మీదట 75కు చేరే అవకాశముంది. బిల్లు పాసయితే... కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని అపెక్స్ కమిటీ రూపుదిద్దుకుంటుంది. ఈ కమిటీలో కేబినెట్ కార్యదర్శి హోదా ఉన్న అధికారి లేదంటే క్రీడా శాఖ కార్యదర్శి, స్పోర్ట్ అథారిటీ డైరెక్టర్ జనరల్ చైర్ పర్సన్ అవుతారు. క్రీడలకు సేవలిందించిన దిగ్గజ క్రీడాకారులు, కోచ్లు సభ్యులుగా ఉంటారు. వీరు తప్పనిసరిగా ద్రోణాచార్య, ఖేల్రత్న, అర్జున అవార్డీలై ఉండాలి. జాతీయ క్రీడా సమాఖ్యలకు చెందిన అధ్యక్ష, కార్యదర్శులకు ఈ కమిటీలో చోటుంటుంది. ముఖ్యంగా తరచూ వివాదాస్పదమవుతున్న అంశాలపై మరింత జవాబుదారీతనంగా ఈ కమిటీ వ్యవహరిస్తుంది. ఎంపికల ప్రక్రియ, ఆటగాళ్ల నిషేధం ఇతరాత్ర సమస్యల్ని ఈ కమిటీ పారదర్శక విధానంతో పరిష్కరిస్తుంది. -
మా హాకీ జట్టును భారత్కు పంపించం: పాక్
కరాచీ: భారత్, పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం నెలకొని ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆసియా కప్లో ఆడేందుకు తమ జట్టుకు భారత్కు పంపించడం లేదని పాక్ హాకీ సమాఖ్య (పీహెచ్ఎఫ్) ప్రకటించింది. ఈ విషయాన్ని ఇప్పటికే అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్)కు దీనికి సంబంధించి సమాచారం అందించినట్లు పీహెచ్ఎఫ్ పేర్కొంది. ‘ప్రస్తుత పరిస్థితుల్లో భారత్లో ఆడితే మా జట్టుకు భద్రతాపరమైన సమస్యలు ఎదురు కావచ్చు. అక్కడ జరిగే ఆసియా కప్లో పాల్గొనేందుకు మా ఆటగాళ్లు కూడా వెనుకంజ వేస్తున్నారు. మా భద్రతపై హామీ ఇస్తేనే మేం టోరీ్నపై దృష్టి పెట్టగలం. ఇదే విషయాన్ని ఎఫ్ఐహెచ్కు వెల్లడించాం’ అని పీహెచ్ఎఫ్ అధ్యక్షుడు తారిఖ్ బుగ్తీ స్పష్టం చేశారు. -
ఈసారైనా మెరిసేనా!
చాంగ్జౌ: ఈ సీజన్లో నిరాశాజనక ప్రదర్శన కనబరుస్తున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మరో టోర్నమెంట్కు సిద్ధమైంది. నేడు మొదలయ్యే చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోరీ్నలో సింధు తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. బుధవారం జరిగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో జపాన్ ప్లేయర్, ప్రపంచ ఆరో ర్యాంకర్ టొమాకా మియజాకితో సింధు తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 0–1తో వెనుకబడి ఉంది. గత ఏడాది స్విస్ ఓపెన్ ప్రిక్వార్టర్ ఫైనల్లో మియజాకి చేతిలో సింధు ఓడిపోయింది. చైనా ఓపెన్లో సింధు తొలి రౌండ్ అడ్డంకిని దాటితే ప్రిక్వార్టర్ ఫైనల్లో ఉన్నతి హుడా (భారత్) లేదా క్రిస్టీ గిల్మోర్ (స్కాట్లాండ్)లలో ఒకరితో ఆడాల్సి ఉంటుంది. ప్రిక్వార్టర్ ఫైనల్లోనూ సింధు గెలిస్తే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మాజీ చాంపియన్ అకానె యామగుచి (జపాన్) లేదా బుసానన్ ఒంగ్బమ్రుంగ్ఫన్ (థాయ్లాండ్)లలో ఒకరితో ఆడవచ్చు. ప్రపంచ ర్యాంకింగ్స్లో 16వ స్థానంలో ఉన్న సింధు ఈ ఏడాది ఇండియా ఓపెన్, ఇండోనేసియా మాస్టర్స్, ఆల్ ఇంగ్లండ్ ఓపెన్, స్విస్ ఓపెన్, మలేసియా మాస్టర్స్, సింగపూర్ ఓపెన్, ఇండోనేసియా ఓపెన్, జపాన్ ఓపెన్లతోపాటు ఆసియా చాంపియన్íÙప్, సుదిర్మన్ కప్ టోర్నీలలోఆడింది. ఇండియా ఓపెన్లో క్వార్టర్ ఫైనల్ చేరడమే ఈ సీజన్లో సింధు అత్యుత్తమ ప్రదర్శన కావడం గమనార్హం. చైనా ఓపెన్లో భారత్ నుంచి సింధు, ఉన్నతిలతోపాటు అనుపమ కూడా బరిలో ఉంది. మంగళవారం జరిగే తొలి రౌండ్లో చైనీస్ తైపీ ప్లేయర్ లిన్ సియాంగ్ టితో అనుపమ ఆడుతుంది. మరోవైపు పురుషుల సింగిల్స్లో భారత్ నుంచి లక్ష్య సేన్, ప్రణయ్ మాత్రమే బరిలో ఉన్నారు. బుధవారం జరిగే తొలి రౌండ్ మ్యాచ్ల్లో ఐదో సీడ్ లీ షి ఫెంగ్ (చైనా)తో లక్ష్య సేన్; కోకి వతనాబె (జపాన్)తో ప్రణయ్ పోటీపడతారు. ముఖాముఖి రికార్డులో లీ షి ఫెంగ్పై లక్ష్య సేన్ 7–5తో ఆధిక్యంలో ఉండగా... వతనాబెతో ఒకేసారి తలపడ్డ ప్రణయ్ ఓడిపోయాడు. పురుషుల డబుల్స్లో భారత్ నుంచి సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ మాత్రమే ఈ టోర్నీలో ఆడనుంది. తొలి రౌండ్లో కెన్యా మిత్సుహాíÙ–హిరోకి ఒకమురా (జపాన్)లతో సాతి్వక్–చిరాగ్ తలపడతారు. మహిళల డబుల్స్లో భారత్ నుంచి సెల్వం కవిప్రియ–సిమ్రన్; రుతపర్ణ–శ్వేతాపర్ణ పాండా, అమృత–సోనాలీ సింగ్ జోడీలు ఆడుతున్నాయి. తొలి రౌండ్లో యియుంగ్ ఎన్గా టింగ్–యియుంగ్ పుయ్ లామ్లతో రుతపర్ణ–శ్వేతాపర్ణ; సియె పె షాన్–హుంగ్ ఎన్ జులతో అమృత–సోనాలీ; లౌరెన్ లామ్–అలీసన్ లీ (అమెరికా)లతో కవిప్రియ–సిమ్రన్ పోటీపడతారు. మిక్స్డ్ డబుల్స్లో తెలంగాణ అమ్మాయి గద్దె రుతి్వక శివాని–రోహన్ కపూర్ (భారత్) జంట; అశిత్ సూర్య–అమృత జోడీలు బరిలో ఉన్నాయి. తొలి రౌండ్లో వోంగ్ టియెన్ సి–లిమ్ చియె సియెన్ (మలేసియా)లతో రుతి్వక–రోహన్; రెహాన్–గ్లోరియా (ఇండోనేసియా)లతో అశిత్–అమృత తలపడతారు. చైనా ఓపెన్ టోర్నమెంట్ చరిత్రలో భారత్ నుంచి ఇప్పటి వరకు ముగ్గురు చాంపియన్స్గా నిలిచారు. 2014లో కిడాంబి శ్రీకాంత్ పురుషుల సింగిల్స్ టైటిల్ను సాధించాడు. 2014లో సైనా నెహా్వల్, 2016లో సింధు మహిళల సింగిల్స్లో టైటిల్ను సొంతం చేసుకున్నారు.చైనా ఓపెన్ టోర్నమెంట్లో చైనా క్రీడాకారులు సాధించిన టైటిల్స్. 1986 నుంచి నిర్వహిస్తున్న ఈ టోరీ్నలో చైనా నుంచి పురుషుల సింగిల్స్లో 19 మంది... మహిళల సింగిల్స్లో 25 మంది విజేతగా నిలిచారు. పురుషుల డబుల్స్లో చైనా నుంచి 9 జోడీలు... మహిళల డబుల్స్లో 29 జోడీలు... మిక్స్డ్ డబుల్స్లో 19 జోడీలు టైటిల్స్ గెలిచాయి. -
ప్రపంచకప్ చెస్ టోర్నీకి భారత్ ఆతిథ్యం
న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్లో పురుషుల ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్ జరుగనుంది. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 27 వరకు ఈ టోర్నీని నిర్వహిస్తారు. అయితే వేదికను ఖరారు చేయాల్సి ఉంది. 23 ఏళ్ల తర్వాత ఈ మెగా ఈవెంట్కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. చివరిసారి 2002లో హైదరాబాద్ వేదికగా ప్రపంచకప్ జరగ్గా... భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ విజేతగా నిలిచాడు. అయితే ఈసారి జరగబోయేది క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించే ప్రపంచకప్ ఈవెంట్. ఇందులో ప్రపంచవ్యాప్తంగా 206 మంది ఆటగాళ్లు తలపడతారు. ఇది నాకౌట్ టోర్నీ. ప్రతీ రౌండ్లో ఓడిన ఆటగాడు నిష్క్రమిస్తాడు. ‘కొన్నేళ్లపాటు చెస్ టోర్నీ వివిధ ఫార్మాట్లుగా జరిగింది. కానీ 2021 నుంచి నాకౌట్ పద్ధతిలోనే ప్రపంచకప్ నిర్వహిస్తున్నాం. ఒక రౌండ్ మూడు రోజుల పాటు జరుగుతుంది. రెండు క్లాసికల్ గేమ్లను నిర్వహిస్తారు. సమమైతే మూడో రోజు టైబ్రేక్ పోటీ ఉంటుంది’ అని అంతర్జాతీయ చెస్ సమాఖ్య తెలిపింది. 2023లో అజర్బైజాన్లో జరిగిన ప్రపంచకప్లో కార్ల్సన్ (నార్వే) విజేతగా... ప్రజ్ఞానంద (భారత్) రన్నరప్గా నిలిచారు. -
హారికపై గెలుపుతో సెమీస్లో దివ్య
బతూమి (జార్జియా): మహిళల ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్లో భారత్కు చెందిన అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం), జూనియర్ ప్రపంచ చాంపియన్ దివ్య దేశ్ముఖ్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత్కే చెందిన గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారికతో సోమవారం జరిగిన టైబ్రేక్లో మహారాష్ట్రకు చెందిన 19 ఏళ్ల దివ్య 2–0తో విజయం సాధించింది. ఈ ఇద్దరి మధ్య ఆదివారం నిరీ్ణత రెండు గేమ్లు ముగిశాక స్కోరు 1–1తో సమంగా ఉండటంతో... విజేతను నిర్ణయించేందుకు సోమవారం టైబ్రేక్ నిర్వహించారు. తొలి గేమ్లో తెల్ల పావులతో ఆడిన దివ్య 57 ఎత్తుల్లో గెలిచింది. సెమీస్ చేరే అవకాశాలు సజీవంగా ఉండాలంటే కచి్చతంగా గెలవాల్సిన రెండో గేమ్లో తెల్ల పావులతో ఆడిన హారిక 76 ఎత్తుల్లో ఓడిపోవడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. నేడు జరిగే సెమీఫైనల్స్ తొలి గేమ్లలో టింగ్జీ లె (చైనా)తో భారత్కే చెందిన గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి; టాన్ జోంగి (చైనా)తో దివ్య తలపడతారు. భారత్ నుంచి ఇద్దరు ప్లేయర్లు సెమీఫైనల్ చేరుకోవడంతో ఒక పతకం ఖాయమైంది. అంతేకాకుండా వచ్చే ఏడాది జరిగే క్యాండిడేట్స్ టోర్నీకి కూడా భారత్కు ఒక బెర్త్ ఖరారైంది. ప్రపంచకప్ టోర్నీలో టాప్–3లో నిలిచిన ప్లేయర్లు ప్రపంచ చాంపియన్ ప్రత్యరి్థని నిర్ణయించే క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత పొందుతారు. -
కోనేరు హంపికి వైఎస్ జగన్ శుభాకాంక్షలు
ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్లో భారత్ నుంచి సెమీస్ చేరిన తొలి మహిళా గ్రాండ్ మాస్టర్గా కోనేరు హంపి (Koneru Humpy) చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. హంపి సాధించిన అరుదైన ఘనత భారత్కు గర్వకారణమన్నారు.యువ క్రీడాకారులకు హంపి స్ఫూర్తిదాయకమని.. ఆమె భవిష్యత్తులోనూ ఇలాగే మరిన్ని విజయాలు సాధిస్తూ దేశ కీర్తిని ఇనుమడింపజేయాలనని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. కాగా మహిళల ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్ (FIDE World Cup)లో భారత గ్రాండ్మాస్టర్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి కోనేరు హంపి సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే.యుజిన్ సాంగ్ను ఓడించి..యుజిన్ సాంగ్ (చైనా)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో హంపి 1.5–0.5తో గెలుపొందింది. శనివారం జరిగిన తొలి గేమ్లో నెగ్గిన హంపి... ఆదివారం జరిగిన రెండో గేమ్ను 53 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకొని సెమీఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది. సెమీఫైనల్లో చైనాకే చెందిన టింగ్జి లెతో హంపి తలపడుతుంది. మరో క్వార్టర్ ఫైనల్లో టింగ్జి లె 2–0తో నానా జాగ్నిద్జె (జార్జియా)పై గెలిచింది.హారిక, దివ్య పోరుమరోవైపు.. భారత్కే చెందిన మరో గ్రాండ్మాస్టర్ వైశాలి పోరాటం క్వార్టర్ ఫైనల్లో ముగిసింది. జోంగి టాన్ (చైనా)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో వైశాలి 0.5–1.5తో ఓడిపోయింది. శనివారం జరిగిన తొలి గేమ్ను ‘డ్రా’ చేసుకున్న వైశాలి... ఆదివారం జరిగిన రెండో గేమ్లో 88 ఎత్తుల్లో ఓటమి పాలైంది. ఇక భారత్కే చెందిన ద్రోణవల్లి హారిక, దివ్య దేశ్ముఖ్ నిర్ణీత రెండు గేమ్ల తర్వాత 1–1తో సమంగా నిలిచారు. దాంతో వీరిద్దరి మధ్య విజేత ఎవరో సోమవారం జరిగే టైబ్రేక్ గేమ్ల ద్వారా తేలుతుంది. వీరిద్దరి మధ్య ఆదివారం జరిగిన రెండో గేమ్ 60 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. Congratulations to Grandmaster Koneru Humpy on becoming the first Indian woman to reach the FIDE Women’s Chess World Cup semifinal! Your achievement is a proud moment for India and a true inspiration for young talent across the country. Wishing you continued success, more… pic.twitter.com/vwjfg8PoBn— YS Jagan Mohan Reddy (@ysjagan) July 21, 2025 -
అదర గొట్టిన సిక్కోలు సిన్నోడు..
శ్రీకాకుళం న్యూకాలనీ: పలాస మండలం అంతరకుడ్డ గ్రామానికి చెందిన వాలీబాల్ కుర్రాడు అట్టాడ చరణ్ అదరగొట్టాడు. అంతర్జాతీయ పోటీల్లో ప్రాతినిధ్యం వహించిన మొదటి టోర్నీలోనే జట్టు విజయంలో కీలకపాత్ర పోషించి కాంస్య పతకం సాధించి శభాష్ అనిపించాడు. ఈ నెల 12 నుంచి 19వ తేదీ వరకు థాయిలాండ్ వేదికగా ప్రతిష్టాత్మక 2వ ఏషియన్ అండర్ –16(మెన్) వాలీబాల్ చాంపియన్షిప్ –2025 పోటీలు జరిగాయి. ఇందులో త్రుటిలో ఫైనల్ బెర్త్ను కోల్పోయిన భారత జట్టు తృతీయ స్థానంలో నిలిచింది. భారత జట్టుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించిన సిక్కోలు క్రీడాతేజం చరణ్ కాంస్య పతకం సాధించాడు. జట్టు విజయంలో కీలకభూమిక వహించిన చరణ్ ప్రతిభను జట్టు యాజమాన్యం, ఇండియన్ వాలీబాల్ ఫెడరేషన్ ప్రసంశించింది. అంతకుముందు ఈ నెల 10వ తేదీ వరకు బెంగళూరు వేదికగా ఎన్.ఎస్.ఎస్.సి. అకాడమీలో జరిగిన శిక్షణా శిబిరాల్లో మంచి క్రమశిక్షణతోపాటు అత్యుత్తమ ఆటతీరుతో సెలక్టర్లను ఆకట్టుకున్నాడు.అంతరకుడ్డ నుంచి అంతర్జాతీయ పోటీలకు..చరణ్ తల్లిదండ్రులు అట్టాడ కమల్నాదమ్, దేవి. వీరిది వ్యవసాయ కుటుంబం. చరణ్ విశాఖపట్నంలోని అక్కయ్యపాలెంలో ఉన్న సాయ్ స్పోర్ట్స్ స్కూల్/హాస్టల్లో ఉంటూ పదో తరగతి పూర్తిచేశాడు. ఇంటర్మీడియెట్లో ప్రవేశం పొందనున్నాడు. అన్నయ్య భార్గవ్ ఇంజనీరింగ్ ఫస్టియర్ చదువుతున్నాడు. మావయ్య రవి ప్రేరణ.. కోచ్ సత్యనారాయణ ప్రోత్సాహంతో రాణించగలుగుతున్నానని చెబుతున్నాడు. 2025లో ఢిల్లీలో జరిగిన సీబీఎస్సీ నేషనల్స్ వాలీబాల్ స్కూల్గేమ్స్లో కాంస్య పతకం సాధించగా, గత ఏడాది 2024లో జార్ఖండ్లో జరిగిన సీబీఎస్సీ నేషనల్స్లో ప్రాతినిధ్యం వహించి సత్తాచాటాడు.అభినందనల వెల్లువ..సిక్కోలు నుంచి ఏషియన్ వాలీబాల్ పోటీలకు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా కాంస్య పతకం సాధించడం పట్ల క్రీడావర్గాల్లో సర్వాత్రా హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. వాలీబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ప్రత్యేకంగా మెచ్చుకున్నారు.వాలీబాల్ జిల్లా కార్యదర్శి కె.రామచంద్రుడు, ఉపాధ్యాక్షులు వై.పోలినాయుడు, కార్యనిర్వాహక కార్యదర్శి ఎన్వీ రమణ, టి.రవి, సలహాదారు పి.సుందరరావు, పీఈటీ సంఘ నాయకులు ఎంవీ రమణ, ఎం.సాంబమూర్తి, బి.సతీష్, డీఎస్డీఓ డాక్టర్ కె.శ్రీధర్రావు, కోచ్ కె.హరికృష్ణ, వాలీబాల్ సంఘ ప్రతినిధులు, సీనియర్ క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు.సంతోషంగా ఉంది..అంతర్జాతీయ ఏషియన్ వాలీబాల్ మీట్లో భారత్కు ప్రాతినిధ్యం వహించడం గర్వకారణంగా ఉంది. అందులోను మెడల్ సాధించడం సంతోషంగా ఉంది. సీనియర్ నేషనల్స్ ఆడి దేశానికి రిప్రజెంట్ చేయాలనేది నా కళ. ఇందుకు అహర్నిశలు కృషి చేస్తా.– అట్టాడ చరణ్, వాలీబాల్ క్రీడాకారుడు -
‘యునైటెడ్ ఇన్ మాంచెస్టర్’
మాంచెస్టర్: భారత క్రికెట్ జట్టు ఒకవైపు నాలుగో టెస్టుకు సన్నద్ధమవుతూనే మరోవైపు విరామ సమయాన్ని సరదాగా గడుపుతోంది. తాజాగా విఖ్యాత ఫుట్బాల్ క్లబ్ ‘మాంచెస్టర్ యునైటెడ్’ ప్రాక్టీస్ గ్రౌండ్ను టీమిండియా ఆటగాళ్లు సందర్శించారు. ఇరు జట్లకు ప్రధాన స్పాన్సర్గా ఉన్న స్పోర్ట్స్వేర్ ‘అడిడాస్’ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. క్రికెట్, ఫుట్బాల్ టీమ్ల సభ్యులు పరస్పర గౌరవాన్ని ప్రదర్శిస్తూ జెర్సీలు మార్చుకున్నారు. భారత ఆటగాళ్లతో పాటు మాంచెస్టర్ ఆటగాళ్లంతా రెండు జట్లుగా విడిపోయి ముందుగా ఫుట్బాల్ ఆడారు. ఆపై మాంచెస్టర్ ప్లేయర్లు క్రికెట్లో తమ ఆసక్తి ప్రదర్శిస్తూ బ్యాటింగ్ చేశారు. స్టార్ డిఫెండర్ హ్యారీ మేగ్వైర్కు సిరాజ్ బౌలింగ్ చేయగా... ‘రెడ్ డెవిల్స్’ టీమ్ సభ్యులు డియాలో, మేసన్ మౌంట్ తదితరులతో ఫుట్బాల్ ఆడేందుకు పంత్, బుమ్రా ప్రత్యేక ఆసక్తి కనబర్చారు. మాంచెస్టర్ యునైటెడ్, పోర్చుగల్ జట్లకు కెపె్టన్ అయిన బ్రూనో ఫెర్నాండెజ్తో భారత కెపె్టన్ శుబ్మన్ గిల్ కబుర్లాడాడు. మరోవైపు భారత్, మాంచెస్టర్ యునైటెడ్ హెడ్ కోచ్లు గంభీర్, రూబెన్ అమోరిమ్ మధ్య కూడా సుదీర్ఘ సంభాషణ చోటు చేసుకుంది. శిక్షణ, నాయకత్వం, స్టార్ ఆటగాళ్లతో జట్లను నడిపించడంవంటి అంశాలపై చివర్లో ఇరు జట్ల కోచ్లు తమ అభిప్రాయాలు వెల్లడించడంతో కార్యక్రమం ముగిసింది. బుధవారం నుంచి ఓల్ట్ ట్రఫోర్డ్ మైదానంలో భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. -
రోజర్ బిన్నీ తప్పుకుంటారా?
న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్, ప్రస్తుత భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు రోజర్ బిన్నీ శనివారం (19 జూలై) నాటి పుట్టినరోజుతో 70 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఇప్పుడున్న జాతీయ క్రీడా నియమావళి (స్పోర్ట్స్ కోడ్) ప్రకారం ఏవరైనా క్రీడా సమాఖ్య కార్యవర్గ సభ్యుడు గరిష్టంగా 70 ఏళ్ల వయసు వరకే పదవిలో కొనసాగాలి. వయోపరిమితి మించితే వైదొలగాల్సి ఉంటుంది. అయితే బీసీసీఐ ఒక స్వతంత్ర క్రీడా సంఘమైనా... మిగతా జాతీయ క్రీడా సమాఖ్యల మాదిరి భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) గొడుగు కింద లేకపోయినా... లాస్ఏంజెలిస్ ఒలింపిక్స్ (2028)లో క్రికెట్ ఉండటంతో ఇకపై స్పోర్ట్స్ కోడ్ ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇటీవల మీడియాలో ఆయన తప్పుకుంటారని, తాత్కాలిక అధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా బాధ్యతలు చేపడతారని వార్తలు ప్రముఖంగా వచ్చాయి. దీంతో అతను తప్పుకోవడంపై నేడో రేపో ప్రకటన ఉండొచ్చనే ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ బిన్నీ నుంచి అలాంటి ప్రకటన కాదు కదా... కనీసం సంకేతాలు కూడా రాలేదు. కొత్త ‘కోడ్’పై కోటి ఆశలు రోజర్ బిన్నీ పదవిని వీడకపోవడానికి కారణం కూడా లేకపోలేదు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నూతన క్రీడా బిల్లును ప్రవేశపెట్టబోతోంది. దీనికి సంబంధించిన ముసాయిదా ఎప్పుడో సిద్ధమైంది. ఈ శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్ ముందుకు ఈ బిల్లు రానుంది. ఇందులో ఉన్న కొత్త నిబంధన వృద్ధండ పిండాలకు ఊరటనిచ్చేలా ఉంది. గరిష్ట వయోపరిమితికి వెసులుబాటు కల్పిస్తుంది. అంటే నామినేషన్ల సమయంలో 69 ఏళ్లకు పైబడి 70 ఏళ్లలోపు ఏ ఒక్కరోజు మిగిలున్నా... అలాంటి సందర్భంలో ఆ వ్యక్తి పోటీపడేందుకు... గెలిస్తే పూర్తి పదవీకాలం కొనసాగేందుకు కొత్త క్రీడా పాలసీలో అవకాశం ఉంది. దీంతో ఈ బిల్లు పాస్ అయితే 70 ఏళ్ల నుంచి 75 ఏళ్ల వరకు బిన్నీలాంటివారు పదవిలో కొనసాగవచ్చు. పైగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ), అంతర్జాతీయ ఫుట్బాల్ సంఘాల సమాఖ్య (ఫిపా), అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)లో గరిష్ట వయోపరిమితి లేనేలేదు. ఒకవేళ విమర్శలు ఎదురైతే రాజీవ్ శుక్లాకు తాత్కాలిక బాధ్యతలు అప్పగించడం లేదంటే స్పోర్ట్స్ కోడ్ బిల్లు వరకు వేచి చూసే ధోరణితో ఉండాలని బీసీసీఐ వర్గాలు భావిస్తున్నాయి. -
క్వార్టర్ ఫైనల్లో భారత్
సాలో (ఇండోనేసియా): ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్ చాంపియన్షిప్లో భారత్ క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. తొలి పోరులో శ్రీలంకపై గెలుపొందిన భారత జట్టు... శనివారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)పై విజయం సాధించింది. గ్రూప్ ‘డి’లో భాగంగా జరిగిన పోరులో భారత్ 110–83 పాయింట్ల తేడాతో యూఏఈని చిత్తుచేసింది. భారత్ తరఫున తొలి మ్యాచ్ మహిళల సింగిల్స్లో రుజులా 11–5తో మైసా ఖాన్పై గెలుపొందింది. మిక్స్డ్ డబుల్స్లో లాల్రమ్సంగా–తరిణి జంట 11–6తో యూఏఈ జోడీపై నెగ్గింది. తన్వీ శర్మ, రిషిక కూడా విజయాలు సాధించడంతో భారత జట్టు సునాయాసంగా గెలుపొందింది. ఇదే గ్రూప్లో ఉన్న హాంకాంగ్ కూడా ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ విజయాలు సాధించి నాకౌట్ దశకు చేరింది. ఇక ఆదివారం జరగనున్న పోరులో హాంకాంగ్తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు గ్రూప్ ‘డి’ టాపర్గా నిలవనుంది. ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత్ అత్యుత్తమంగా 2011లో కాంస్య పతకం నెగ్గింది. ఆ తర్వాత మరోసారి పతకం సాధించలేకపోయింది. గతేడాది క్వార్టర్ ఫైనల్లో మలేసియా చేతిలో ఓడి రిక్త హస్తాలతో వెనుదిరిగింది. మొత్తం 17 జట్లు పాల్గొంటున్న ఈ టోరీ్నలో సెమీఫైనల్కు చేరితే పతకం ఖాయం కానుంది. -
సెమీస్లో అర్జున్ ఓటమి
లాస్ వేగస్: భారత చెస్ స్టార్, తెలంగాణ గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్... ఫ్రీస్టయిల్ గ్రాండ్స్లామ్ టూర్ చెస్ టోర్నమెంట్ సెమీ ఫైనల్లో ఓటమి పాలయ్యాడు. అప్రతిహత విజయాలతో దూసుకొచ్చిన అర్జున్... సెమీస్లో 0–2 పాయింట్ల తేడాతో లెవాన్ అరోనియన్ (అమెరికా) చేతిలో ఓడాడు. ఫ్రీస్టయిల్ గ్రాండ్స్లామ్ టోర్నమెంట్లో సెమీస్కు చేరిన తొలి భారత చెస్ ప్లేయర్గా నిలిచిన అర్జున్ కీలక పోరులో ఆకట్టుకోలేకపోయాడు. తొలి గేమ్లో అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్న అర్జున్... రెండో గేమ్ను ‘డ్రా’ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ పోటీలో నిలిచేందుకు రిస్క్ తీసుకొని పరాజయం పాలయ్యాడు. మరో సెమీస్లో హాన్స్ నీమన్ (అమెరికా) 2.5–1.5తో ఫాబియానో కరువానా (అమెరికా)పై విజయం సాధించి ఫైనల్కు చేరాడు. తుదిపోరులో నీమన్తో అరోనియన్ తలపడనున్నాడు. ‘వైట్ గ్రూప్’ లీగ్ దశలో నార్వే దిగ్గజం, ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్ను ఓడించి ‘టాపర్’గా నిలిచి ఆ తర్వాత క్వార్టర్ ఫైనల్లో పరాజయం పాలైన భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద వర్గీకరణ మ్యాచ్లో 1.5–0.5తో విన్సెంట్ కీమెర్ (జర్మనీ)పై గెలుపొందాడు. ఇతర క్లాసిఫికేషన్ మ్యాచ్ల్లో కార్ల్సన్ 1.5–0.5తో జవోఖిర్ సిందరోవ్ (ఉజ్బెకిస్తాన్)పై, హికారు నకముర (అమెరికా) 2–0తో లెనియర్ డొమింగెజ్ పెరెజ్ (అమెరికా)పై, వెస్లీ సో (అమెరికా) 3–1తో నొదిర్బెక్ అబ్దుసత్తరోవ్ (ఉజ్బెకిస్తాన్)పై విజయాలు సాధించారు. -
కోనేరు హంపి శుభారంభం
బతుమి (జార్జియా): ‘ఫిడే’ మహిళల ప్రపంచ కప్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి సెమీఫైనల్కు చేరువైంది. శనివారం యుజిన్ సాంగ్ (చైనా)తో జరిగిన క్వార్టర్ ఫైనల్ తొలి గేమ్లో హంపి విజయం సాధించింది. హంపి 53 ఎత్తుల్లో ప్రత్యర్థి ఆట కట్టించింది. ఈ పోరులో ఇద్దరి మధ్య జరిగే రెండో గేమ్ను హంపి ‘డ్రా’గా ముగించుకున్నా సరే సెమీ ఫైనల్లోకి ప్రవేశిస్తుంది. మరో క్వార్టర్ ఫైనల్ పోరులో ఇద్దరు భారత ప్లేయర్లు ద్రోణవల్లి హారిక, దివ్య దేశ్ముఖ్ తలపడగా... తొలి గేమ్ ‘డ్రా’గా ముగిసింది. 31 ఎత్తుల తర్వాత ఇద్దరు ప్లేయర్లు సమ ఉజ్జీలుగా నిలిచారు. క్వార్టర్ ఫైనల్ బరిలో నిలిచిన మరో భారత ప్లేయర్ ఆర్. వైశాలి కూడా తన తొలి గేమ్ను ‘డ్రా’ చేసుకుంది. వైశాలి, టాన్ జోంగీ (చైనా) మధ్య హోరాహోరీగా సాగిన ఈ పోరు 72 ఎత్తుల వరకు సాగి సమంగా ముగిసింది. హారిక, దివ్య మధ్య... వైశాలి, టాన్ జోంగీ మధ్య రెండో గేమ్లో ఎవరు గెలిస్తే వారు సెమీస్ చేరతారు. నాలుగో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ తొలి గేమ్లో టింగ్జీ లీ (చైనా) తొలి గేమ్లో 40 ఎత్తుల్లో స్థానిక ప్లేయర్ జాగ్నిడ్జ్ నానా (జార్జియా)ను ఓడించింది. -
వారికి నెలకు రూ. 50 వేల చొప్పున ఆర్థిక చేయూత
న్యూఢిల్లీ: భారత్ 2036 ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఆ విశ్వక్రీడల నాటికి భారత్ పతకాల పట్టికలో టాప్–5లో నిలవడమే లక్ష్యమని చెప్పారు. ప్రపంచ పోలీస్–ఫైర్ క్రీడల్లో పతకాలతో సత్తా చాటిన భారత బృంద సభ్యులను కేంద్ర మంత్రి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన అమిత్ షా పతక విజేతలకు నజరానా అందజేశారు. అనంతరం మాట్లాడుతూ ‘2036 విశ్వక్రీడల ఆతిథ్య హక్కులు దక్కించుకునేందుకు ప్రాథమిక బిడ్డింగ్లో పాల్గొన్నాం. ఒలింపిక్స్ను నిర్వహించే సత్తా భారత్కు ఉంది. అలాగే ఈ పోటీల కోసం ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. పతకాలు గెలవగలిగే 3000 మంది ప్రతిభావంతుల్ని గుర్తించి వారికి నెలకు రూ. 50 వేల చొప్పున ఆర్థిక చేయూతతో విశ్వక్రీడలకు దీటుగా తయారుచేస్తాం’ అని అన్నారు.ఇదీ చదవండి: భారత్ శుభారంభంసొలో (ఇండోనేసియా): ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత్ శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన తొలి పోరులో 110–69 పాయింట్ల తేడాతో శ్రీలంకపై ఘనవిజయం సాధించింది. గ్రూప్ ‘డి’లో శుక్రవారం జరిగిన టీమ్ ఈవెంట్ మ్యాచ్ల్లో భారత్ పది మ్యాచ్లు గెలిచి క్లీన్స్వీప్ చేసింది.మిక్స్డ్ డబుల్స్లో విష్ణు కోడె–రిషిక జోడీ 11–5తో కెనెత్ అరుగొడ–ఇసురి అటనాయకె జంటపై గెలుపొందగా, మహిళల సింగిల్స్లో గాయత్రి–మానస రావత్ 11–9తో సితుమి డిసిల్వా–ఇసురి అటనాయకెలపై గెలిచారు. సింగిల్స్లో తన్వీ శర్మ 11–7తో సితులి రణసింఘేపై గెలిచింది. మిగతా మ్యాచ్ల్లోనూ భారత షట్లర్లే గెలుపొందడంతో గరిష్ట 110 పాయింట్లతో భారత్ జయకేతనం ఎగురవేసింది. శనివారం జరిగే తమ రెండో లీగ్ మ్యాచ్లో భారత బృందం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో తలపడుతుంది. -
ఔరా... ఒలీవియా
లండన్: మహిళల ఫుట్బాల్లో ఒలీవియా స్మిత్ కొత్త చరిత్ర సృష్టించింది. కెనడాకు చెందిన ఈ స్టార్ ప్లేయర్ కోసం... ఇంగ్లండ్కు చెందిన అర్సెనల్ ఫుట్బాల్ క్లబ్ రికార్డు ధర చెల్లించింది. గత సీజన్లో లివర్పూల్ క్లబ్ కోసం ఆడిన ఒలీవియా వచ్చే నాలుగేళ్లపాటు అర్సెనల్ క్లబ్ తరఫున బరిలోకి దిగుతుంది. ట్రాన్స్ఫర్ ఫీజు కింద అర్సెనల్ క్లబ్ 10 లక్షల పౌండ్లను (రూ. 11 కోట్ల 55 లక్షలు) లివర్పూల్కు చెల్లించింది. మహిళల ఫుట్బాల్ చరిత్రలో ఇదే అత్యధిక బదిలీ మొత్తం కాగా... ఈ ఏడాది జనవరిలో అమెరికా ప్లేయర్ నవోమీ గిర్మా కోసం చెల్సీ క్లబ్... సాన్ డియెగో వేవ్ జట్టుకు చెల్లించిన 9 లక్షల పౌండ్ల (రూ. 9 కోట్ల 47 లక్షలు) ధర రెండో స్థానానికి చేరింది. ‘ఒలీవియ స్మిత్ ప్రతిభావంతురాలు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించగల సత్తా ఆమెలో ఉంది. క్లబ్ అభివృద్ధికి అది దోహదపడుతుంది’ అని అర్సెనల్ మహిళల ఫుట్బాల్ క్లబ్ డైరెక్టర్ క్లేర్ వీట్లీ తెలిపారు. 15 ఏళ్ల వయసులోనే కెనడా తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేసి ఆకట్టుకున్న ఒలీవియా... 2023 సీజన్లో స్పోరి్టంగ్ లిస్బన్ క్లబ్ తరఫున 28 మ్యాచ్ల్లో 16 గోల్స్తో మెరిసింది. ఇక గతేడాది లివర్పూల్కు ప్రాతినిధ్యం వహించిన 20 ఏళ్ల ఒలీవియా 25 మ్యాచ్ల్లో 9 గోల్స్ చేసింది. ‘ఒలీవియాలో అపార నైపుణ్యం ఉంది. అర్సెనల్ తరఫున ఆమె అద్భుతాలు చేయగలదనే నమ్మకముంది. చిన్న వయసులోనే గత రెండు యూరోపియన్ లీగ్ల్లో తన నైపుణ్యంతో అందరినీ ఆకట్టుకుంది’ అని అర్సెనల్ హెడ్ కోచ్ రెనీ స్లెగెర్స్ అన్నాడు. 15 సార్లు ఇంగ్లిష్ చాంపియన్గా నిలిచిన అర్సెనల్ క్లబ్... గత సీజన్లో రెండోసారి చాంపియన్స్ లీగ్ టైటిల్ గెలుచుకుంది. ‘ఇది నా కల. అత్యున్నత స్థాయిలో ఇంగ్లండ్, యూరప్ లీగ్ల్లో రాణించాలనుకుంటున్నా. అర్సెనల్ జట్టు తరఫున ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. క్లబ్ విజయం కోసం నా వంతు కృషి చేస్తా’అని ఒలీవియా పేర్కొంది. గతంలో మహిళా ఫుట్బాల్ ప్లేయర్లకు పెద్దగా డిమాండ్ లేకపోగా... ఇటీవలి కాలంలో వారి కోసం వెచ్చిస్తున్న మొత్తం భారీగా పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో గిర్మాకు కేటాయించిన ధరే అత్యధికం అనుకుంటే... ఆరు నెలలు తిరిగేసరికి ఒలీవియా ఆ రికార్డును బద్దలు కొట్టింది. పురుషుల విభాగంతో పోల్చుకుంటే ఇది తక్కువే అయినా... మహిళల ఆటకు దక్కుతున్న ఆదరణకు ఈ గణాంకాలు తాజా ఉదాహరణ. పురుషుల ఫుట్బాల్లో బ్రెజిల్కు చెందిన నెమార్ కోసం పారిస్ సెయింట్ జెర్మయిన్ (పీఎస్జీ) క్లబ్... 2017లో బార్సిలోనా క్లబ్కు 262 మిలియన్ల అమెరికా డాలర్లు (రూ. 2255 కోట్లు) చెల్లించింది. ఫ్రాన్స్ స్టార్ కిలియాన్ ఎంబాపె కోసం పీఎస్జీ క్లబ్... 216 మిలియన్ల అమెరికా డాలర్లు (రూ. 1859 కోట్లు) వెచ్చించింది. -
చర్చిల్ బ్రదర్స్కు కాదు...ఇంటర్ కాశీకి టైటిల్ ఇవ్వండి
ఒకవైపు జాతీయ పురుషుల జట్టు ప్రదర్శనపై విమర్శలు... విదేశీ కోచ్ల ముందస్తు రాజీనామాలు... ఈ ఏడాది ఇండియన్ సూపర్ లీగ్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు... సమాఖ్యలో అంతర్గత కుమ్ములాటలు... వెరసి అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్)కు ఏదీ కలసి రావడం లేదు. ఐ–లీగ్ విజేత తాజా ఉదంతంతో మరోసారి ఏఐఎఫ్ఎఫ్ పరువు పోయింది. తమకు అన్యాయం జరిగిందని ఒక జట్టు వాపోతుండగా... అవేమీ పట్టించుకోకుండా గత ఏప్రిల్లో ఏఐఎఫ్ఎఫ్ హడావిడిగా బహుమతి ప్రదానోత్సవం ఏర్పాటు చేసి గోవాకు చెందిన చర్చిల్ బ్రదర్స్ క్లబ్ జట్టుకు జాతీయ ఐ–లీగ్ 2024–2025 విన్నర్స్ ట్రోఫీ అందజేసింది. ఈ విషయంపై ఉత్తరప్రదేశ్కు చెందిన ఇంటర్ కాశీ క్లబ్ గత నెలలో స్విట్జర్లాండ్లోని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (కాస్)లో అప్పీలు చేసింది. నెలన్నర రోజుల తర్వాత ‘కాస్’ తుది తీర్పు వెలువరించింది. ఐ–లీగ్ విజేతగా ఇంటర్ కాశీ జట్టును ప్రకటించాలని స్పష్టం చేసింది. న్యూఢిల్లీ: దేశవాళీ ఫుట్బాల్ టోర్నమెంట్ ‘ఐ–లీగ్’లో ఇంటర్ కాశీ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) జట్టు చాంపియన్గా అవతరించింది. అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) నిర్ణయాన్ని స్విట్జర్లాండ్లోని కోర్ట్ ఆఫ్ అర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (కాస్) తిరస్కరించడంతో ఐ–లీగ్ 2024–25 సీజన్లో ఇంటర్ కాశీ జట్టుకు టైటిల్ దక్కింది. ఈ ఏడాది ఏప్రిల్ 6తో ఐ–లీగ్ మ్యాచ్లు ముగియగా... సీజన్లో 22 మ్యాచ్లాడిన చర్చిల్ బ్రదర్స్ 11 విజయాలు, 4 పరాజయాలు, 7 ‘డ్రా’లతో 40 పాయింట్లు ఖాతాలో వేసుకొని అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు ఇంటర్ కాశీ జట్టు 22 మ్యాచ్ల్లో 11 విజయాలు, 5 పరాజాయలు, 6 ‘డ్రా’లతో 39 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. అయితే లీగ్ దశలో భాగంగా నామ్ధారి జట్టుతో జరిగిన ఓ మ్యాచ్లో ఇంటర్ కాశీ జట్టు పరాజయం పాలైంది. అయితే ఆ మ్యాచ్లో నామ్ధారి జట్టు అర్హత లేని ఆటగాడిని ఆడించిందని ఇంటర్ కాశీ జట్టు ఆరోపించింది. దాన్ని ఏఐఎఫ్ఎఫ్ పట్టించుకోకపోవడంతో... వారణాసికి చెందిన ఫుట్బాల్ క్లబ్ స్విట్జర్లాండ్లోని ‘కాస్’లో ఫిర్యాదు చేసింది. దీంతో జోక్యం చేసుకున్న ‘కాస్’... ఏఐఎఫ్ఎఫ్ నిర్ణయాన్ని తప్పుపడుతూ... ఇంటర్ కాశీ జట్టుకు మూడు పాయింట్లు కేటాయించాల్సిందిగా ఆదేశించింది. దీంతో ఇంటర్ కాశీ జట్టు 42 పాయింట్లతో పట్టిక అగ్రస్థానం దక్కించుకొని 2024–25 సీజన్ చాంపియన్గా అవతరించింది. ‘అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య ఈ ఏడాది మే 31న జారీ చేసిన నిర్ణయంపై ఇంటర్ కాశీ దాఖలు చేసిన అప్పీలును పరిశీలించాం. భారత సమాఖ్య ఇంటర్ కాశీ జట్టును ఐ–లీగ్ సీజన్ చాంపియన్గా ప్రకటించాలని ఆదేశిస్తున్నాం’ అని ‘కాస్’ ప్రకటించింది. » 2023–24 సీజన్లో ఐ–లీగ్లో అడుగు పెట్టిన ఇంటర్ కాశీ జట్టు తొలి ప్రయత్నంలో నాలుగో స్థానంలో నిలవగా... ఇప్పుడు రెండో ఏడాది టైటిల్ కైవసం చేసుకోనుంది. » దేశంలో ఐ–లీగ్ ద్వితీయ శ్రేణి ఫుట్బాల్ టోర్నమెంట్ కాగా... ప్రతి ఏటా ఇందులో మెరుగైన ప్రదర్శన కనబరిచిన జట్టు అగ్రశ్రేణి ఫుట్బాల్ లీగ్ ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)కు అర్హత సాధిస్తుంది. » 2025–26 ఐఎస్ఎల్ సీజన్లో ఐ లీగ్ చాంపియన్ హోదాలో ఇంటర్ కాశీ జట్టు బరిలోకి దిగనుంది. అయితే మాస్టర్ రైట్స్ అగ్రిమెంట్ (ఎమ్ఆర్ఏ) గడువు ముగిసిన నేపథ్యంలో ఐఎస్ఎల్ తాజా సీజన్ ప్రారంభంపై స్పష్టత లోపించింది. » 2022–23, 2023–24 సీజన్లో ఐ–లీగ్ చాంపియన్గా నిలిచిన పంజాబ్ ఫుట్బాల్ క్లబ్, మొహమ్మదాన్ స్పోర్టింగ్ క్లబ్ జట్లు... ఐఎస్ఎల్లో బరిలోకి దిగాయి. » తాజా తీర్పుతో ఐ–లీగ్ పాయింట్ల పట్టికను మార్చాల్సిందిగా ఏఐఎఫ్ఎఫ్ను ‘కాస్’ఆదేశించింది. ఇంటర్ కాశీ జట్టుకు 42 పాయింట్లు కేటాయించి పట్టికలో అగ్రస్థానం ఇవ్వాలని వెల్లడించింది. » ఆర్బిట్రేషన్ ఖర్చుల్లో 55 శాతం భరించాల్సిందిగా ఏఐఎఫ్ఎఫ్ను ఆదేశించిన కాస్... చర్చిల్ బ్రదర్స్, నామ్ధారి ఎఫ్సీ, రియల్ కశీ్మర్ ఫుట్బాల్ క్లబ్లు 15 శాతం చొప్పున ఖర్చులు భరించాలని ఆదేశించింది. దీంతో ఏఐఎఫ్ఎఫ్ 3000 స్విస్ ఫ్రాంక్స్ (దాదాపు రూ. 3,22,275)లు, మిగిలిన మూడు క్లబ్లు 1000 స్విస్ ఫ్రాంక్ (దాదాపు రూ. 1,07,413)లు ఇంటర్ కాశీ జట్టుకు చెల్లించాల్సి ఉంటుంది. » ఈ ఏడాది జనవరి 13న ఇంటర్ కాశీ, నామ్ధారి జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్లో నామ్ధారి జట్టు 2–0 గోల్స్ తేడాతో నెగ్గింది. అయితే ఆ మ్యాచ్లో నామ్ధారి క్లబ్ అర్హత లేని ఆటగాడిని బరిలోకి దింపిందని ఇంటర్ కాశీ ఆరోపించింది. » ఐ–లీగ్లో ఆరుగురు విదేశీ ప్లేయర్లను మాత్రమే ఆడించే నిబంధన ఉండగా... నామ్ధారి జట్టు ఏడుగురు ఆటగాళ్లతో ఆడిందని నిరూపించడంలో ఇంటర్ కాశీ జట్టు విజయవంతమైంది. దీంతో గత నెల 17న జరిగిన తొలి అప్పీలుతో పాటు... శుక్రవారం జరిగిన మరో విచారణలో సైతం ఇంటర్ కాశీ జట్టు విజయం సాధించింది. ఫలితంగా ఈ సీజన్ చాంపియన్గా అవతరించింది. » ఇంటర్ కాశీ జట్టు ఈ అంశాన్ని ‘కాస్’ దృష్టికి తీసుకెళ్లినా... భారత ఫుట్బాల్ సమాఖ్య మాత్రం అవేవి పట్టించుకోకుండా సీజన్ ముగియగానే పాయింట్ల పట్టిక ‘టాప్’లో ఉన్న చర్చిల్ బ్రదర్స్ జట్టుకు ట్రోఫీ బహుకరించింది. అయితే తాజా ‘కాస్’ నిర్ణయంతో చర్చిల్ బ్రదర్స్ నుంచి ట్రోఫీ వెనక్కి తీసుకొని ఇంటర్ కాశీకి అందివ్వనున్నారు. -
సెమీస్లో అర్జున్
లాస్ వేగస్: ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పకడ్బందీ ఎత్తులతో అలరించిన భారత స్టార్, తెలంగాణ గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్... ఫ్రీస్టయిల్ గ్రాండ్స్లామ్ టూర్ చెస్ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఉజ్బెకిస్తాన్ గ్రాండ్మాస్టర్ నొదిర్బెక్ అబ్దుసత్తారోవ్తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో అర్జున్ 1.5–0.5తో గెలుపొందాడు. నల్ల పావులతో ఆడిన తొలి గేమ్ను అర్జున్ 64 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. అనంతరం తెల్ల పావులతో ఆడిన రెండో గేమ్లో అర్జున్ 69 ఎత్తుల్లో గెలుపొంది సెమీఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకున్నాడు. సెమీఫైనల్లో లెవాన్ అరోనియన్ (అమెరికా)తో అర్జున్ తలపడతాడు. ‘వైట్ గ్రూప్’ లీగ్ దశలో నార్వే దిగ్గజం, ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్ను ఓడించి ‘టాపర్’గా నిలిచిన ప్రజ్ఞానందకు క్వార్టర్ ఫైనల్లోనే ఓటమి ఎదురైంది. ఫాబియానో కరువానా (అమెరికా)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రజ్ఞానంద 3–4 పాయింట్ల తేడాతో పోరాడి ఓడిపోయాడు. తొలి గేమ్లో ప్రజ్ఞానంద 29 ఎత్తుల్లో నెగ్గగా... రెండో గేమ్లో కరువానా 60 ఎత్తుల్లో గెలిచి స్కోరును 1–1తో సమం చేశాడు. ఆ తర్వాత మూడో గేమ్లో ప్రజ్ఞానంద 58 ఎత్తుల్లో... నాలుగో గేమ్లో కరువానా 34 ఎత్తుల్లో నెగ్గారు. దాంతో స్కోరు 2–2తో సమమైంది. ఐదో గేమ్లో కరువానా 64 ఎత్తుల్లో నెగ్గి 3–2తో ఆధిక్యంలోకి వెళ్లగా... ఆరో గేమ్లో ప్రజ్ఞానంద 48 ఎత్తుల్లో గెలిచి స్కోరును 3–3తో సమం చేశాడు. నిర్ణాయక ఏడో గేమ్లో కరువానా 72 ఎత్తుల్లో గెలిచి సెమీఫైనల్లోకి అడుగు పెట్టాడు. సెమీఫైనల్లో అమెరికాకే చెందిన హాన్స్ నీమన్తో కరువానా తలపడతాడు. ఇతర క్వార్టర్ ఫైనల్స్లో అరోనియన్ 2.5–1.5తో హికారు నకముర (అమెరికా)పై, హాన్స్ నీమన్ 4–2తో సిందరోవ్ (ఉజ్బెకిస్తాన్)పై గెలుపొందారు. -
ప్రపంచకప్ చెస్ క్వార్టర్ ఫైనల్లో హంపి, హారిక, వైశాలి, దివ్య
బతూమి (జార్జియా): తాడోపేడో తేల్చుకోవాల్సిన గేమ్లలో భారత చెస్ స్టార్స్ కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలి, దివ్య దేశ్ముఖ్ అద్భుత ప్రదర్శన కనబరిచారు. ప్రపంచకప్ మహిళల నాకౌట్ చెస్ టోర్నీలో ఈ నలుగురూ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో గురువారం నిర్ణీత రెండు గేమ్ల తర్వాత భారత క్రీడాకారిణులు తమ ప్రత్యర్థులతో 1–1తో సమంగా నిలిచారు. దాంతో విజేతలను నిర్ణయించేందుకు శుక్రవారం టైబ్రేక్ గేమ్లు నిర్వహించారు. టైబ్రేక్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన హంపి 1.5–0.5తో ప్రపంచ మాజీ చాంపియన్ అలెగ్జాండ్రా కొస్టెనిక్ (స్విట్జర్లాండ్)పై... హైదరాబాద్ ప్లేయర్ హారిక 2.5–1.5తో ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ మాజీ చాంపియన్ కాటరీనా లాగ్నో (రష్యా)పై... తమిళనాడు గ్రాండ్మాస్టర్ వైశాలి 3.5–2.5తో మెరూర్ట్ కమలిదెనోవా (కజకిస్తాన్)పై... ప్రపంచ జూనియర్ చాంపియన్, మహారాష్ట్ర అమ్మాయి దివ్య దేశ్ముఖ్ 1.5–0.5తో ఆసియా క్రీడల చాంపియన్ జు జినెర్ (చైనా)పై విజయం సాధించారు. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్ తొలి గేమ్లో యుజిన్ సాంగ్ (చైనా)తో హంపి; దివ్య దేశ్ముఖ్తో హారిక; టాన్ జోంగీ (చైనా)తో వైశాలి తలపడతారు. -
ప్రపంచకప్ టోర్నీకి ముందే మేలుకోండి: భారత మాజీ కెప్టెన్
అంతర్జాతీయ హాకీ సమాఖ్య (FIH) ప్రొ లీగ్ టోర్నీ భారత జట్టుకు పాఠంలాంటిదని భారత మాజీ కెప్టెన్, హాకీ దిగ్గజం పీఆర్ శ్రీజేశ్ (PR Sreejesh) అన్నాడు. వచ్చే ఏడాది జరిగే ఆసియా క్రీడలు, ప్రపంచకప్కు ముందు మనకిది మేలుకొలుపు సంకేతమని చెప్పాడు. నెదర్లాండ్స్, బెల్జియం సంయుక్తంగా నిర్వహించే ప్రపంచకప్ వచ్చే ఏడాది ఆగస్టు 15 నుంచి 30 వరకు జరుగుతుంది. అనంతరం జపాన్ ఆతిథ్యమిచ్చే ఆసియా క్రీడలు సెపె్టంబర్ 19 నుంచి 4 వరకు జరుగుతాయి. కాగా యూరోపియన్ అంచె ప్రొ లీగ్ పోటీల్లో భారత జట్లు తీవ్రంగా నిరాశపరిచాయి. తొమ్మిది జట్లు పోటీపడిన యూరోపియన్ అంచెలో భారత పురుషుల జట్టు ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఆఖరిదాకా పోరాడారుఅయితే ఫలితాలు నిరాశపరిచినప్పటికీ భారత ఆటగాళ్ల ప్రదర్శన మరీ అంత తీసికట్టుగా ఏమీ లేదని ప్రస్తుతం భారత అండర్–21 జట్టుకు హెడ్ కోచ్గా ఉన్న శ్రీజేశ్ చెప్పుకొచ్చాడు. అక్టోబర్లో జరిగే వేదాంత ఢిల్లీ హాఫ్ మారథాన్కు సంబంధించిన ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన శ్రీజేశ్ మీడియాతో మాట్లాడుతూ ‘నిజానికి మన ఆటగాళ్లు బాగానే ఆడారు. ప్రతీ మ్యాచ్లోనూ గోల్స్ కోసం ఎన్నో అవకాశాల్ని సృష్టించారు. గెలిచేందుకు ఆఖరిదాకా పోరాడారు. కొన్నిసార్లు ఇంతబాగా ఆడినప్పటికీ దురదృష్టవశాత్తూ నిరుత్సాహకర ఫలితాలు వస్తాయి. యూరోప్లో సరిగ్గా అదే జరిగింది’ అని వివరించాడు.ఆ అంచె పోటీల కోసం చక్కగా సన్నద్దమైనప్పటికీ మైదానంలో ఫలితాలే ప్రతికూలమయ్యాయన్నాడు. అయితే ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఆసియా కప్, ప్రపంచకప్ మెగా ఈవెంట్లకు మరింత మెరుగ్గా సిద్ధమవ్వాల్సిన ఆవశ్యకతను యూరోపియన్ అంచె పోటీలు తెలియజేస్తున్నాయని చెప్పాడు.కోచ్గా ప్రయాణం ఎలా ఉందంటే?కాగా టోక్యో, పారిస్ వరుస ఒలింపిక్స్లో భారత జట్టు కాంస్య పతకాలు గెలుపొందడంలో కీలకపాత్ర పోషించిన శ్రీజేశ్.. సుదీర్ఘమైన కెరీర్కు వీడ్కోలు పలికిన అనంతరం కోచింగ్ బాధ్యతలు చేపట్టాడు. అండర్–21 జూనియర్ పురుషుల జట్టుకు హెడ్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు.ఈ కోచింగ్ ప్రయాణంపై మాట్లాడుతూ ఆటగాడిలాగే రొటీన్గా ఉందన్నాడు. ఉదయమే నిద్రలేవడం, ప్లేయర్లకు వార్మప్ తదుపరి శిక్షణ ఇవ్వడం, తదుపరి ట్రెయినింగ్ సెషన్ వ్యవహరాలు చక్కదిద్దడం, విశ్లేషించడం జరుగుతోందన్నాడు. అప్పుడు అటగాడిగా ఎక్కువగా శారీరకంగా శ్రమిస్తే ఇప్పుడు కోచ్గా మానసికంగా ఎక్కువ శ్రమించాల్సి వస్తోందని చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది చెన్నై, మదురై నగరాల్లో నవంబర్ 28 నుంచి డిసెంబర్ 10 వరకు జరిగే జూనియర్ ప్రపంచకప్ కోసం జట్టును తీర్చిదిద్దే పనిలో ఉన్నానని చెప్పాడు.ముందుగా ఒక్కో మ్యాచ్ గెలవడం, క్వార్టర్స్ చేరడం తమ లక్ష్యాలుగా ఉన్నాయన్నాడు. చిరకాల ప్రత్యర్థులు (భారత్, పాక్) ఒకే పూల్ (బి)లో ఉన్నప్పటికీ దీనిపై అనవసరంగా చర్చించి కుర్రాళ్లపై ఒత్తిడి పెంచదల్చుకోలేదని పేర్కొన్నాడు. చదవండి: కెప్టెన్గా నితీశ్ కుమార్ రెడ్డి -
రిటైర్మెంట్ ప్రకటించిన టెన్నిస్ భామ
మాంట్రియల్: కెనడా టెన్నిస్ స్టార్ జెనీ బుచార్డ్ తన కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించింది. మాంట్రియల్ ఓపెన్ టోర్నీ అనంతరం ఆటకు వీడ్కోలు పలుకుతానని గురువారం ప్రకటించింది. ఈ ఏడాది ఆఖరి గ్రాండ్స్లామ్ టోర్నీ అయిన యూఎస్ ఓపెన్కు ముందు సన్నాహక టోర్నీగా నిర్వహించే ‘నేషనల్ బ్యాంక్ ఓపెన్’ త్వరలో మాంట్రియల్లో జరుగుతుంది.‘ప్రతీ దానికి టైమ్ ఉంటుంది. అలాగే నేను నిష్క్రమించే టైమ్ వచ్చింది. ఎక్కడ కెరీర్ను మొదలు పెట్టానో అక్కడే టెన్నిస్ను ముగించబోతున్నాను’ అని సోషల్ మీడియాలో బుచార్డ్ పోస్ట్ చేసింది. కెరీర్లో 299 విజయాలు, 230 పరాజయాల రికార్డును కలిగిన బుచార్డ్ 2023లో కెనడా గెలిచిన బిల్లీ జీన్ కింగ్ కప్లో కీలకపాత్ర పోషించింది. 2014లో బుచార్డ్ సూపర్ ఫామ్ చాటుకుంది.ఆ ఏడాది వింబుల్డన్లో రన్నరప్గా నిలిచిన ఈ కెనడా స్టార్ ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్ ఓపెన్లలో సెమీఫైనల్ దాకా పోరాడింది. తద్వారా కెరీర్ బెస్ట్ ఐదో ర్యాంక్కు ఎగబాకింది. అయితే మరుసటి ఏడాది ఆ్రస్టేలియన్ ఓపెన్లోనూ క్వార్టర్స్ చేరిన ఆమెకు యూఎస్ ఓపెన్ చేసిన గాయం కెరీర్ను దెబ్బతీసింది.2015లో యూఎస్ ఓపెన్లో ప్రిక్వార్టర్స్ చేరిన ఆమె లాకర్ రూమ్ వద్ద జారిపడింది. దీంతో కన్కషన్కు గురైన ఆమె టోర్నీ నుంచి అర్ధంతరంగా వైదొలగింది. దీనిపై యూఎస్ ఓపెన్ నిర్వాహకులపై విమర్శలు వచ్చాయి. సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఆమె గాయపడిందని జ్యూరీ విచారణలో తేలింది. -
కార్ల్సన్కు ప్రజ్ఞానంద షాక్
లాస్ వేగస్: మరోసారి భారత చెస్ ప్లేయర్ చేతిలో నార్వే దిగ్గజం, ప్రపంచ మాజీ చాంపియన్, వరల్డ్ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్కు ఓటమి ఎదురైంది. ఫ్రీస్టయిల్ గ్రాండ్స్లామ్ టూర్ చెస్ టోర్నీలో భాగంగా భారత యువ గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానందతో జరిగిన గేమ్లో కార్ల్సన్ ఓడిపోయాడు. ‘వైట్ గ్రూప్’లో భాగంగా జరిగిన నాలుగో రౌండ్ గేమ్లో తెల్ల పావులతో ఆడిన ప్రజ్ఞానంద 39 ఎత్తుల్లో కార్ల్సన్ను ఓడించాడు. ఓవరాల్గా అన్ని ఫార్మాట్లలో (క్లాసికల్, ర్యాపిడ్, బ్లిట్జ్, ఫ్రీస్టయిల్, ఆన్లైన్) కార్ల్సన్పై ప్రజ్ఞానందకిది ఎనిమిదో విజయం కావడం విశేషం.2022లో ఎయిర్థింగ్స్ మాస్టర్స్, చెస్ఏబల్ మాస్టర్స్ టోర్నీలలో ఒక్కోసారి, క్రిప్టో కప్ (ఆన్లైన్) టోర్నీలో మూడుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద... 2024లో పోలాండ్లో జరిగిన సూపర్బెట్ టోర్నీలో, నార్వే ఓపెన్ టోర్నీలో ఒక్కోసారి విజయం సాధించాడు. ఇటీవల క్రొయేషియాలో జరిగిన సూపర్ యునైటెడ్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నీలో క్లాసికల్ వరల్డ్ చాంపియన్, భారత స్టార్ దొమ్మరాజు గుకేశ్ చేతిలోనూ కార్ల్సన్ ఓడిపోయాడు. ఫ్రీస్టయిల్ చెస్ టోర్నీలో ఎనిమిది మంది మేటి ప్లేయర్లు ఉన్న ‘వైట్ గ్రూప్’లో ప్రజ్ఞానంద 4.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించాడు. ‘వైట్ గ్రూప్’ నుంచి నొదిర్బెక్ అబ్దుసత్తారోవ్ (ఉజ్బెకిస్తాన్), సిందరోవ్ (ఉజ్బెకిస్తాన్), అరోనియన్ (అమెరికా) కూడా క్వార్టర్ ఫైనల్ చేరుకున్నారు. మరోవైపు ఇదే టోర్నీలో ఆడుతున్న తెలంగాణ గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్ కూడా క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. ‘బ్లాక్ గ్రూప్’లో పోటీపడ్డ అర్జున్ 4 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ‘బ్లాక్ గ్రూప్’ నుంచి నకముర, హాన్స్ నీమన్, కరువానా (అమెరికా) కూడా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. -
సాత్విక్–చిరాగ్ జోడీ పరాజయం
టోక్యో: అందివచ్చిన అవకాశాలను వృథా చేసుకున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీ నుంచి నిష్క్రమించింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 15వ ర్యాంక్ ద్వయం సాత్విక్–చిరాగ్ 22–24, 14–21తో ప్రపంచ ఆరో ర్యాంక్ జోడీ లియాంగ్ కె వెంగ్–వాంగ్ చాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయింది. ఓవరాల్గా లియాంగ్–వాంగ్ జంట చేతిలో సాత్విక్–చిరాగ్ జోడీకిది ఆరో పరాజయం కావడం గమనార్హం. 44 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో భారత జోడీ రెండు గేముల్లోనూ ఆధిక్యంలో నిలిచి ఆ తర్వాత దానిని చేజార్చుకుంది. తొలి గేమ్లో 9–6తో, రెండో గేమ్లో 10–6తో ఆధిక్యంలోకి వెళ్లిన సాత్విక్–చిరాగ్ ఈ ఆధిక్యాన్ని కాపాడుకోలేకపోయారు. మరోవైపు పురుషుల సింగిల్స్లో లక్ష్య సేన్... మహిళల సింగిల్స్లో అనుపమ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. దాంతో ఈ టోర్నీలో భారత క్రీడాకారుల కథ ముగిసింది. ప్రపంచ ఏడో ర్యాంకర్ కొడాయ్ నరోకా (జపాన్)తో జరిగిన మ్యాచ్లో ప్రపంచ 18వ ర్యాంకర్ లక్ష్య సేన్ 19–21, 11–21తో ఓటమి పాలయ్యాడు. నరోకా చేతిలో లక్ష్య సేన్కిది ఐదో పరాజయం. ప్రపంచ రెండో ర్యాంకర్ వాంగ్ జి యి (చైనా)తో జరిగిన మ్యాచ్లో ప్రపంచ 42వ ర్యాంకర్ అనుపమ 21–13, 11–21, 12–21తో పోరాడి ఓడిపోయింది. 55 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో అనుపమ తొలి గేమ్ను సొంతం చేసుకున్నా... అదే జోరును కొనసాగించలేకపోయింది. -
రెజ్లర్ సుజీత్కు స్వర్ణ పతకం
బుడాపెస్ట్ (హంగేరి): పొలియాక్ ఇమ్రె–వర్గా యానోస్ స్మారక అంతర్జాతీయ ర్యాంకింగ్ రెజ్లింగ్ టోర్నమెంట్లో భారత్కు తొలి రోజు రెండు పతకాలు లభించాయి. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో సుజీత్ (65 కేజీలు) స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకోగా... రాహుల్ (57 కేజీలు) కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. ఫైనల్లో సుజీత్ 5–1 పాయింట్ల తేడాతో అలీ రహీమ్జాదే (అజర్బైజాన్)పై గెలుపొందాడు. అంతకుముందు సెమీఫైనల్లో సుజీత్ 6–1తో వాజ్జెన్ తెవాన్యాన్ (అర్మేనియా)పై, క్వార్టర్ ఫైనల్లో 11–0తో అర్సమెర్జుయెవ్ (ఫ్రాన్స్)పై, తొలి రౌండ్లో 11–0తో ఇస్లాం దుదయెవ్ (అల్బేనియా)పై విజయం సాధించాడు. కాంస్య పతక బౌట్లో రాహుల్ 4–0తో నిక్లాస్ స్టెచెలె (జర్మనీ)పై నెగ్గాడు. అంతకుముందు సెమీఫైనల్లో రాహుల్ 6–7 పాయింట్ల తేడాతో ల్యూక్ జోసెఫ్ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. -
బాక్సింగ్ పోటీల్లో ఉద్రిక్తత... బాక్సర్లు, కోచ్ల డిష్యూం..డిష్యూం
హైదరాబాద్లోని షేక్పేట్లో జరుగుతున్న రాష్ట్రస్దాయి బాక్సింగ్ పోటీల్లో గందరగోళం నెలకొంది. పోటీల సమయంలో బాక్సర్లు, కోచ్లు ఘర్షణకు దిగారు. గురువారం ఇద్దరు బాక్సర్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా వివాదం తలెత్తింది.తప్పుడు అంపైరింగ్ కారణంగా ఓడిపోయామని ఓ టీమ్కు చెందిన సభ్యులు మరో వర్గంపై దాడి చేశారు. ఈ గొడవలో తలుపులు, కిటికీలు ధ్వంసమయ్యాయి. అనంతరం గోల్కొండ పోలీస్స్టేషన్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.చదవండి: ENG vs IND: ఇంగ్లండ్తో నాలుగో టెస్టు.. టీమిండియాకు భారీ షాక్ -
సింధుకు మళ్లీ నిరాశే
టోక్యో: ఈ ఏడాది భారత బ్యాడ్మింటన్ స్టార్, ప్రపంచ మాజీ చాంపియన్ పీవీ సింధు నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీ నుంచి ప్రపంచ 16వ ర్యాంకర్ సింధు తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. ప్రపంచ 14వ ర్యాంకర్ సిమ్ యు జిన్ (దక్షిణ కొరియా)తో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో 30 ఏళ్ల సింధు 15–21, 14–21తో ఓడిపోయింది. గతంలో సిమ్ యు జిన్తో ఆడిన మూడుసార్లూ గెలిచిన సింధు నాలుగో ప్రయత్నంలో తొలిసారి ఓటమి చవిచూసింది. 38 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో సింధు తొలి గేమ్లో ఒకదశలో 3–9తో వెనుకబడింది. ఆ తర్వాత తేరుకొని ఆధిక్యాన్ని 12–13కు తగ్గించింది. అయితే కీలకదశలో కొరియా ప్లేయర్ పైచేయి సాధించి సింధుకు అవకాశం ఇవ్వలేదు. ఇక రెండో గేమ్లో మూడుసార్లు ఇద్దరి స్కోరు సమమయ్యాయి. స్కోరు 11–11వద్ద ఉన్నపుడు సిమ్ యు జిన్ వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 15–11తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని నిలబెట్టుకొని సింధుపై ఆమె తొలిసారి విజయాన్ని అందుకుంది. ఈ ఏడాది సింధు ఇండోనేసియా మాస్టర్స్, ఆల్ ఇంగ్లండ్ ఓపెన్, స్విస్ ఓపెన్, మలేసియా మాస్టర్స్ టోర్నీల్లోనూ తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. తదుపరి సింధు వచ్చే మంగళవారం మొదలయ్యే చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. మరోవైపు భారత్కే చెందిన ఉన్నతి హుడా 8–21, 12–21తో చోచువోంగ్ (థాయ్లాండ్) చేతిలో ఓడిపోగా... అనుపమ 21–15, 18–21, 21–18తో సహచరిణి రక్షిత శ్రీపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. సాత్విక్–చిరాగ్ జోడీ శుభారంభం పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. తొలి రౌండ్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–18, 21–10తో కాంగ్ మిన్ హైయుక్–కి డాంగ్ జు (దక్షిణ కొరియా) జోడీని ఓడించింది. రూబన్ కుమార్–హరిహరన్ (భారత్) ద్వయం 15–21, 9–21తో కిమ్ వన్ హో–సియో సెయుంగ్ జే (దక్షిణ కొరియా) జోడీ చేతిలో ఓటమి పాలైంది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో లక్ష్య సేన్ (భారత్) 21–11, 21–18తో వాంగ్ జెంగ్ జింగ్ (చైనా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. -
దీపికకు ‘మ్యాజిక్ స్కిల్’ అవార్డు
న్యూఢిల్లీ: భారత జట్టు ఫార్వర్డ్ దీపిక ‘పాలీగ్రాస్ మ్యాజిక్ స్కిల్’ అంతర్జాతీయ హాకీ అవార్డును సొంతం చేసుకుంది. మైదానంలో అసాధారణ నైపుణ్యంతో ప్రత్యర్థి డిఫెండర్లను, గోల్కీపర్ను బోల్తా కొట్టించి చేసే గోల్కు గుర్తింపుగా ఈ అవార్డును యేటా అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ఇస్తుంది. 2024–25 ప్రొ లీగ్ సీజన్ సందర్భంగా ప్రపంచ నంబర్వన్ నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో ఎంతో నేర్పుగా దీపిక చేసిన ఫీల్డ్ గోల్ను ఎఫ్ఐహెచ్ జ్యూరీ, అభిమానులు ఓటింగ్లో ‘బెస్ట్ గోల్’గా ఎంపిక చేశారు. ‘ఈ అవార్డు దక్కడం గౌరవంగా భావిస్తున్నా. నెదర్లాండ్స్ లాంటి జట్టుపై ఆ గోల్ చేయడం ప్రత్యేక క్షణం. దానికి ఈ విధంగా గుర్తింపు దక్కడం చాలా ఆనందంగా ఉంది. ఎప్పటికప్పుడు స్ఫూర్తి నింపుతున్న సహచరులు, కోచ్లు, కుటుంబ సభ్యులు, సన్నిహితులకు ధన్యవాదాలు. ఈ పురస్కారం నా ఒక్కదానిది కాదు. ఇది మొత్తం భారత జట్టుది’ అని దీపిక వెల్లడించింది. -
టఫ్ ఫైట్లో ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓటమి
అమ్స్టెల్వీన్ (నెదర్లాండ్స్): యూరప్ పర్యటనలో భారత్ ‘ఎ’ పురుషుల హాకీ జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. మంగళవారం ఇంగ్లండ్తో జరిగిన హోరాహోరీ పోరులో భారత ‘ఎ’ జట్టు 2–3 గోల్స్ తేడాతో ఓడింది. మన జట్టు తరఫున మణీందర్ సింగ్, ఉత్తమ్ సింగ్ చెరో గోల్ చేశారు. ఈ టూర్లో భాగంగా తొలి మూడు మ్యాచ్ల్లో గెలిచి ‘హ్యాట్రిక్’ నమోదు చేసుకున్న భారత్... ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడింది.‘ప్రతి మ్యాచ్ నుంచి పాఠాలు నేర్చుకుంటున్నాం. గత రెండు మ్యాచ్ల్లో పోరాడినా ఫలితం దక్కలేదు. మెరుగైన ప్రత్యర్థులతో మరో మూడు మ్యాచ్లు ఆడనున్నాం. వాటిలో మెరుగైన ప్రదర్శన కనబరిచేందుకు ప్రయత్నిస్తాం’ అని కోచ్ శివేంద్ర సింగ్ అన్నాడు. తదుపరి మ్యాచ్లో బెల్జియంతో భారత జట్టు ఆడుతుంది. -
రెండు రోజులముందుగానే...'క్రికెట్... రైట్ రైట్'...
లాస్ ఏంజెలిస్: మరో మూడేళ్ల తర్వాత జరగనున్న లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ షెడ్యూల్ విడుదలైంది. 2028 జూలై 14 నుంచి 30 వరకు ఈ విశ్వక్రీడల సంరంభం కొనసాగనుంది. అయితే సంప్రదాయానికి భిన్నంగా ఈ ఏడాది పలు క్రీడాంశాల షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఒలింపిక్స్ ప్రారంభ వేడుకకు ముందే ఆరంభమయ్యే క్రీడాంశాల సంఖ్య పెరగగా... విశ్వక్రీడల చివర్లో నిర్వహించే అథ్లెటిక్స్ను ఈ సారి ముందే జరపనున్నారు. మొత్తం 351 మెడల్ ఈవెంట్స్ జరగనున్న ఈ విశ్వక్రీడల షెడ్యూల్లోని కొన్ని విశేషాలు... » 2028 జూలై 14న లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ ఆరంభ వేడుక జరగనుండగా... అంతకు రెండు రోజుల ముందే పలు క్రీడా పోటీలు ప్రారంభం కానున్నాయి. 1932, 1984 ఒలింపిక్స్ క్రీడలకు వేదికగా నిలిచిన లాస్ ఏంజెలిస్లోని విఖ్యాత ఎల్ఏ మెమోరియల్ కొలోజియంతోపాటు ఇంగ్లెవుడ్లోని స్టేట్ ఆఫ్ ఆర్ట్ స్టేడియంలో ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. ముగింపు వేడుకలకు ఎల్ఏ మెమోరియల్ కొలోజియం వేదికగా నిలుస్తుంది. » బాస్కెట్బాల్, క్రికెట్, హాకీ, హ్యాండ్బాల్, రగ్బీ సెవెన్స్, ఫుట్బాల్, వాటర్ పోలో వంటి ఈవెంట్లలో పోటీలు ముందే మొదలవనున్నాయి. » 1920 ఒలింపిక్స్ తర్వాత... విశ్వక్రీడల ప్రారంభ వేడుకకు ముందు ఇన్ని క్రీడాంశాల్లో పోటీలు మొదలు కావడం ఇదే తొలిసారి. 2024 పారిస్ ఒలింపిక్స్లో ఆర్చరీ, హ్యాండ్బాల్, రగ్బీ సెవెన్స్, ఫుట్బాల్ పోటీలు మాత్రమే ముందు ప్రారంభించారు. » ప్రధాన క్రీడా వేదిక లాస్ ఏంజెలిస్కు 50 కిలోమీటర్ల దూరంలోని పొమెనాలో క్రికెట్ పోటీలు జరగనుండగా... జూలై 12న ప్రారంభం కానున్న ఈ పోటీలు 29న ముగియనున్నాయి. జూలై 20, 29న మెడల్ మ్యాచ్లు నిర్వహిస్తారు. » టి20 ఫార్మాట్లో నిర్వహించనున్న ఈ టోర్నీలో... పురుషుల, మహిళల విభాగాల్లో ఆరేసి జట్లు పాల్గొననున్నాయి. 1900 ఒలింపిక్స్లో చివరిసారి క్రికెట్ పోటీలు నిర్వహించగా... సుదీర్ఘ కాలం తర్వాత తిరిగి ప్రవేశ పెట్టారు. » అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) క్రికెట్తో పాటు బేస్బాల్, ఫ్లాగ్ ఫుట్బాల్, లాక్రాస్, స్క్వాష్ వంటి పలు క్రీడాంశాలను లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో చేర్చేందుకు అనుమతి ఇచ్చింది. » ఆరంభ వేడుక తదుపరి రోజు అంటే జూలై 15న ట్రయాథ్లాన్లో తొలి మెడల్ ఈవెంట్ జరగనుంది. » ఒలింపిక్స్లో స్విమ్మింగ్ పోటీలు ముగిసిన తర్వాత అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించడం పరిపాటి కాగా... ఈసారి మొదట అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించి చివరి వారంలో స్విమ్మింగ్ ఈవెంట్లు జరపనున్నారు. » 2028 జూలై 30న ఒలింపిక్స్ ముగింపు వేడుకలు నిర్వహించనుండగా... చివరగా స్విమ్మింగ్ పోటీలు జరుగుతాయి. -
రుతపర్ణ–శ్వేతపర్ణ జోడీ ఓటమి
టోక్యో: జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్కు శుభారంభం లభించలేదు. టోర్నీ తొలి రోజు మహిళల డబుల్స్ విభాగంలో ‘పాండా సిస్టర్స్’ జోడీ రుతపర్ణ–శ్వేతపర్ణ తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. కొకోనా ఇషికావా–మైకో కవాజోయి (జపాన్) ద్వయంతో జరిగిన మ్యాచ్లో ఒడిశాకు చెందిన రుతపర్ణ–శ్వేతపర్ణ 13–21, 7–21తో ఓడిపోయింది. 32 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో రెండు గేముల్లో ఆరంభ దశలో రుతపర్ణ–శ్వేతపర్ణ ఆకట్టుకున్నా... ఆ తర్వాత తడబడ్డారు. నేడు జరిగే మ్యాచ్ల్లో మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో దక్షిణ కొరియా ప్లేయర్, ప్రపంచ 14వ ర్యాంకర్ సిమ్ జు యున్తో పీవీ సింధు... ప్రపంచ 7వ ర్యాంకర్ పోర్న్పవీ చోచువోంగ్ (థాయ్లాండ్)తో ఉన్నతి హుడా; రక్షిత శ్రీతో అనుపమ పోటీపడతారు. మరోవైపు పురుషుల సింగిల్స్లో తొలి రౌండ్లో చైనా ప్లేయర్ వాంగ్ జెంగ్ జింగ్తో లక్ష్య సేన్ ఆడతాడు. పురుషుల డబుల్స్లో భారత్ నుంచి సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి; హరిహరన్–రూబన్ కుమార్ జోడీలు పోటీపడుతున్నాయి. తొలి రౌండ్లో కాంగ్ మిన్ హియుక్–కి డాంగ్ జు (దక్షిణ కొరియా)లతో సాతి్వక్–చిరాగ్; కిమ్ వన్ హో–సియో సెంగ్ జే (దక్షిణ కొరియా)లతో హరిహరన్–రూబన్ తలపడతారు. -
పల్లెకు పరిచయమైన "వర్చువల్ రియాలిటీ గేమింగ్".. స్పందన మామూలుగా లేదు..!
వర్చువల్ రియాలిటీ గేమింగ్ (VR Gaming) అనేది గేమింగ్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పును తీసుకొచ్చిన సాంకేతికత. ఇది ఆటగాళ్లను త్రిమితీయ (3D) వాతావరణంలోకి తీసుకెళ్లి, నిజంగానే ఆ ప్రపంచంలో ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. ఈ క్రీడలను VR హెడ్సెట్, మోషన్ కంట్రోలర్ లాంటి సాధనాలను ఉపయోగించి ఆడతారు. VR Gamingను కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా విద్య, శిక్షణ, వైద్య రంగాల్లో కూడా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం దేశంలోని పెద్దపెద్ద నగరాల్లో మాత్రమే ఈ VR Gaming సెంటర్లు వెలిశాయి.Few youths opened a "Virtual Reality Gaming Centre" in Karnataka 's village. The response was overwhelming 🤩 pic.twitter.com/hNTfIY0qoQ— 👑Che_Krishna🇮🇳💛❤️ (@CheKrishnaCk_) July 14, 2025అయితే, ఇటీవల కర్ణాటకలోని హసన్ జిల్లాకు కొందరు ఔత్సాహిక యువకులు ఈ VR Gamingను ఓ మారుమూల పల్లెకు పరిచయం చేశారు. టెక్నాలజీ అంటే ఏమిటో తెలియని ఆ పల్లె ప్రజలు ఈ కాల్పనిక క్రీడలను తెగ ఎంజాయ్ చేశారు. సదరు యువత ఇచ్చిన Meta Quest VR Headsetలను ధరించి నిజంకాని ప్రపంచంలోకి వెళ్లిపోయారు.పిల్లలు, మహిళలు, వృద్దులు అన్న తేడా లేకుండా ఆ గ్రామంలోని ప్రతి ఒక్కరు VR Gamingతో కలిగిన కొత్త అనుభూతిని ఆస్వాధించారు. VR Gaming ద్వారా బాక్సింగ్, బిల్డింగ్పై నడవడం లాంటి కాల్పనిక క్రీడలను ఆడారు. ఈ VR Gaming కేంద్రానికి విశేషమైన స్పందన రావడంతో సదరు యువకులు దీనికి సంబంధించిన వీడియోను సోషల్మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు కూడా విపరీతమైన స్పందన వస్తుంది. -
పెళ్లిళ్లు.. విడాకులు.. హైదరాబాద్ స్పోర్ట్స్ స్టార్స్కి ఏమైంది..?
సెలబ్రిటీలకు సంబంధించి పెళ్లిళ్లు ఎంత గొప్పగా ప్రచారానికి నోచుకుంటాయో విడాకులు అంతకు మించి ప్రచారం పొందుతాయి. ఒకప్పుడు సినిమా సెలబ్రిటీలే వివాహ బంధాన్ని విఛ్చిన్నం చేసుకోవడంలో ముందుంటారని ఒక అభిప్రాయం ఉండేది. అయితే ఇప్పుడు అది దాదాపుగా అన్ని రంగాలకూ విస్తరించింది. అదే క్రమంలో ఇప్పుడు క్రీడారంగాన్ని కూడా అంటుకున్నట్టు కనిపిస్తోంది.తాజాగా బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తన విడాకుల నిర్ణయాన్ని ఇన్స్ట్రాగామ్ ద్వారా ప్రకటించారు. పారుపల్లి కశ్యప్తో (సైనా భర్త) విడిపోయే నిర్ణయం తాను స్వయంగా తీసుకున్నానని, ఈ ప్రయాణంలో ‘‘పీస్, గ్రోత్, హీలింగ్’’ కోసం ఇద్దరం ఒకే మాటతో ముందుకు వెళుతున్నామని తెలిపింది. ఇది ఓ రకంగా షాకింగ్ అనే చెప్పాలి.సాధారణంగా స్పోర్ట్స్ స్టార్స్కు సంబంధించిన విడాకుల అంశాలపై ముందస్తు అంచనాలు, సూచనలు ఏవీ వెలువడడం జరుగదు. అదే సినిమా రంగానికి చెందిన వాళ్లయితే విడిపోవడానికి కాస్త ముందుగానే మీడియా ఈ విషయాన్ని పసిగట్టేయగలుగుతుంది.ఇక్కడ మరో చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విశేషం ఏమిటంటే... హైదరాబాద్ నగరం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన క్రీడాకారులు, మరీ ముఖ్యంగా తమ క్రీడా విజయాలతో ఎందరో యువతులకు స్ఫూర్తిగా నిలిచిన మహిళలది ఇదే బాట కావడం. గతంలో ఇదే విధంగా విడిపోయిన ప్రముఖ క్రీడాకారిణుల్లో సానియా మీర్జా అందరికీ చిరపరిచితం.ఆటతోనే కాకుండా అందంతో కూడా అందరి మనసుల్నీ దోచుకున్న టెన్నిస్ స్టార్ సానియా.. పాకిస్తాన్ క్రికెటర్ షోయెబ్ మాలిక్ ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహ బంధం చివరికి 2024 లో ముక్కలైంది. సానియా మీర్జా కూడా హైదరాబాద్ వాసే కావడం గమనార్హం.మరో క్రీడాకారిణి కూడా ఇదే నగరం నుంచి విడాకులు తీసుకుంది. దాదాపు పదేళ్ల క్రితం వరకూ బ్యాడ్మింటన్ కి చిరునామాగా నిలిచిన గుత్తా జ్వాల చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఆమె 2005లో మరో బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కేవలం ఆరేళ్లకే అంటే 2011లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.నాటి ఒక యువ టాలీవుడ్ హీరోతో అనుబంధం అంటూ పుకార్లకు కూడా ఎదుర్కున్న గుత్తా జ్వాల కూడా హైదరాబాద్ వాసే. తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా హైదరాబాద్ ప్రతిష్టను నలుదిశలా చాటిన ఈ టాప్ స్పోర్ట్స్ స్టార్స్ యువతుల్లో క్రీడారంగం పట్ల ఎంతగా స్ఫూర్తి నింపారో తెలియంది కాదు.అయితే ఒకే నగరానికి చెందిన వీరంతా వ్యక్తిగత జీవితాల్లో ఒకే రకమైన ఒడిదుడుకులు ఎదుర్కోవడం విచిత్రం. కొసమెరుపు ఏమిటంటే... హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ క్రికెట్ చిత్ర పటంలో చేర్చిన మహ్మద్ అజారుద్దీన్ కూడా విడాకులు తీసుకోవడం. ఆయన 1996లో సినీనటి సంగీతా బిజిలానీని పెళ్లి చేసుకుని 2010లో విడాకులు తీసుకున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 114 ఏళ్ల దిగ్గజ మారథాన్ రన్నర్
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మారథాన్ రన్నర్గా పేరొందిన ఫౌజా సింగ్ 114 ఏళ్ల వయసులో ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సోమవారం మధ్యాహ్నం జలంధర్-పఠాన్కోట్ హైవేపై కారు ఢీకొనడంతో ఫౌజా సింగ్ తలకు తీవ్ర గాయమైంది. ఫౌజాను వెంటనే ఆసుపత్రికి తరలించగా.. రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ప్రాణాలు వదిలారు.ఫౌజా సింగ్ మృతదేహాన్ని విదేశాల్లో నివసిస్తున్న అతని పిల్లలు వచ్చే వరకు మార్చురీలో ఉంచనున్నారు. వారు వచ్చిన తర్వాతే అతని అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఫౌజా సింగ్ మరణం పట్ల పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా తీవ్ర విచారం వ్యక్తం చేశారు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫౌజా కుటుంబానికి, అతని అభిమానులకు సానుభూతి తెలియజేశారు. ఫౌజా ఆత్మకు శాశ్వత శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.114 ఏళ్ల వయసులోనూ ఫౌజా తన బలం మరియు నిబద్ధతతో తరతరాలను ప్రేరేపించాడని అన్నారు. గతేడాది 'నాషా ముక్త్ - రంగాలా పంజాబ్' మార్చ్లో ఫౌజాతో పాటు నడిచే గౌరవం లభించిందని గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు గులాబ్ చంద్ కటారియా తన అధికారిక ఫేస్బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు.కాగా, ఫౌజా సింగ్ 1911 ఏప్రిల్ 1న పంజాబ్లోని జలంధర్లో జన్మించారు. భార్య, కొడుకు మరణంతో ఫౌజా సింగ్ మానసిక సమస్యలతో పోరాడుతూ 1992లో మరాథాన్వైపు మళ్ళారు. అప్పటి నుంచి ఫౌజా మారథాన్లో సంచలన ప్రదర్శనలు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.ఫౌజా సింగ్ లండన్, టొరంటో, న్యూయార్క్ వంటి ప్రముఖ అంతర్జాతీయ మారథాన్లలో పాల్గొన్నారు. 42 కిలోమీటర్ల మారథాన్ను విజయవంతంగా పూర్తి చేయడంతో పాటు టొరంటో మారథాన్ను 5 గంటలు 44 నిమిషాలు 4 సెకన్లలో ముగించి రికార్డు నెలకొల్పాడు.ఫౌజా 2004 ఏథెన్స్ మరియు 2012 లండన్ ఒలింపిక్స్ లకు టార్చ్ బేరర్ గా ఉన్నాడు. దిగ్గజ ఫుట్బాలర్ డేవిడ్ బెక్హమ్, బాక్సింగ్ లెజెండ్ ముహమ్మద్ అలీతో కలిసి ఓ ప్రధాన క్రీడా బ్రాండ్ కోసం ప్రకటనలో కనిపించారు. -
ప్రేమతో టై... పెళ్లితో బ్రేక్!
మైదానంలో అలరించిన భారత క్రీడాకారులు పతకాలు, ట్రోఫీలతో పాటు అభిమానుల మనసుల్ని గెలుస్తారు. అలాగే తమ మనసు గెలిచిన వారితో మనసారా ఒక్కటవుతారు. టోరీ్నల్లో లాగానే మొదట పరిచయంతో ప్రేమపెళ్లికి ‘క్వాలిఫై’ అవుతారు. తర్వాత ‘మెయిన్ రౌండ్’లో ప్రేమించుకుంటారు. ‘ఫైనల్’కు వచ్చేసరికి పెళ్లి చేసుకుంటారు. అయితే ఇక్కడితోనే ‘పెళ్లి’ టైటిల్కు శుభం కార్డు పడుతుందనుకుంటే తప్పులో కాలేసినట్లే! కొన్నాళ్లకు, కొన్నేళ్లకు కొన్ని క్రీడా జంటలకు ‘విడాకులు’తో అశుభం కార్డు పడుతోంది. అలా ఈ కోవలో ఒక్క‘టై’.. ‘బ్రేక్’ చేసుకున్న జంటల కథలు...క్రీడాకారుల విజయాలు వార్తలవడం సహజం. విజయవంతమైన క్రేజీ స్టార్ల ప్రేమలు కూడా హాట్ న్యూస్లే! తర్వాత ఫారిన్ ట్రిప్పులు, చెట్టాపట్టాల్ అన్నీ కూడా మీడియా కంటపడకుండా ఉండవు. చివరకు పెళ్లి ముచ్చట ఇవన్నీ బాగానే ఉన్నా... కొందరి ‘ప్రేమ–పెళ్లి–విడాకుల’ తంతు పరిపాటిగా మారడమే క్రీడాకారుల దాంపత్య బంధాన్ని పలుచన చేస్తున్నాయి. తాజాగా వెటరన్ బ్యాడ్మింటన్ స్టార్ల జోడీ సైనా నెహా్వల్, పారుపల్లి కశ్యప్ తాము విడిపోతున్నట్లు ప్రకటించింది. గతంలో పాపులర్ షట్లర్లు గుత్తా జ్వాల, చేతన్ ఆనంద్లు బ్యాడ్మింటన్ కోర్టులో జోడీ కట్టి... తర్వాత పెళ్లి పీటలెక్కారు. కొన్నాళ్లకే కోర్టుకెక్కి విడాకులు తీసుకున్నారు. అయితే ఇటీవల ‘టై బ్రేక్’ జోడీల సంఖ్య ఎక్కువవుతోంది. వారి వివరాలివే...హార్దిక్ పాండ్యానటాషాభారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా సెర్బియన్ మోడల్ నటాషా స్టాంకోవిచ్ మనసుపడి మనువాడాడు. 2020లో కోవిడ్ సమయంలో ప్రపంచం మొత్తం లాక్డౌన్ అయిన సమయంలో తొలుత పెళ్లి చేసుకున్నారు. మళ్లీ 2023లో హిందూ, సెర్బియా మతాచారాల ప్రకారం మళ్లీ పెళ్లాడారు. కానీ ఇంతలా ఇష్టపడ్డ సెర్బియన్ నెచ్చెలితో పెళ్లి ముచ్చట కొన్నాళ్లకే ముగిసింది. 2024లో ఇద్దరు విడాకుల ప్రకటన చేశారు. ధావన్ అయేషాభారత క్రికెటర్ శిఖర్ ధావన్ సరిహద్దులు దాటిన ప్రేమ తదుపరి పెళ్లినాటి ప్రమాణాలు కూడా కొన్నేళ్ల తర్వాత గుదిబండగా మారడంతో చివరికి చెరోదారి చూసుకోవాల్సి వచి్చంది. మెల్బోర్న్లో స్థిరపడ్డ భారత సంతతికి చెందిన అయేషా ముఖర్జీతో మొదలైన పరిచయం కొన్నాళ్లకే ప్రణయానికి దారితీసింది. ధావన్ కంటే అయేషా ఏకంగా 12 ఏళ్లు పెద్ద వయసు్కరాలు. అయితే ఈ వయస్సు ప్రేమకి, పెళ్లికి అడ్డంకి కాలేదు. 2012లో వివాహబంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట పెళ్లి తర్వాత మనస్పర్థలతో 2023లో విడిపోయింది.చహల్ ధనశ్రీ భారత క్రికెట్లో మణికట్టు స్పిన్నర్గా బక్కపలుచని యోధుడు యజువేంద్ర చహల్ కొన్నాళ్లు వెలుగు వెలిగాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఐపీఎల్లో తమ జట్లకు చిరస్మరణీయ విజయాలు అందించిన చహల్... సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మతో ప్రేమలో పడ్డాడు. వీరిజంట నెట్టింట ‘మూడు రీల్స్... ఆరు జిగేల్స్’గా తెగ హల్చల్ చేసింది కొన్నాళ్లు! కానీ చిత్రంగా పెళ్లి మూణ్నాళ్ల ముచ్చటగానే చెదిరిపోయింది. ప్రేమ బాసలు, పెనవేసుకున్న ఊసులతో 2020లో మ్యారేజ్ చేసుకున్న చహల్–ధనశ్రీ వర్మ రెండేళ్లకే విడిపోయారు. 2022లో డివోర్స్ కార్డ్ వేశారు.షమీ హసీన్ జహన్ భారత సీనియర్ సీమర్ మొహమ్మద్ షమీ ప్రేమ పెళ్లి ముచ్చట వివాదాలు, ఆరోపణలతో నాలుగేళ్లకే క్లీన్»ౌల్డయ్యింది. తనకు పరిచయమైన హసీన్ జహన్తో కొంతకాలం ప్రేమాయణం జరిపిన తర్వాత 2014లో ఇద్దరు పెళ్లితో ఒక్కటయ్యారు. అయితే హసీన్ రచ్చకెక్కి మరీ గృహహింస కేసులు పెట్టి చివరకు 2018లో విడిపోయారు.సైనా కశ్యప్సింధు మేనియా ముందువరకు సైనానే సూపర్స్టార్గా వెలుగొందింది. కామన్వెల్త్ క్రీడల్లో రెండుసార్లు చాంపియన్గా నిలిచింది. ఎన్నో సూపర్ సిరీస్ టైటిళ్లు గెలిచింది. ఒకప్పుడు క్రీడా వార్తల్లో టెన్నిస్లో సానియా మీర్జా, బ్యాడ్మింటన్లో సైనాల విజయాలే పతాక శీర్షికలయ్యేవి. 2012–లండన్ ఒలింపిక్స్లో సైనా కాంస్య పతకం గెలుచుకుంది అంతగా పాపులారిటీ సంపాదించుకున్న ఆమె... గోపీచంద్ అకాడమీలో శిక్షణ సందర్భంగా పారుపల్లి కశ్యప్ను ప్రేమించింది. వీరి ప్రేమాయణం 2018లో మూడుముళ్ల బంధంగా మారింది. ఏడడుగులు నడిచిన ఈ జంట ఏడేళ్లు పూర్తయ్యేసరికి తమ బంధానికి బైబై చెప్పింది. -
Divorce: సైనా అలా.. పారుపల్లి కశ్యప్ ఇలా!.. ఇన్స్టా పోస్ట్ వైరల్
Saina Nehwal- Parupalli Kashyap Divorce: భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్స్ పతక విజేత సైనా నెహ్వాల్ (Saina Nehwal) తన భర్త పారుపల్లి కశ్యప్ (Parupalli Kashyap)తో విడిపోతున్నట్లు ప్రకటించింది. తాము సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆదివారం రాత్రి సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.ప్రకటన విడుదల చేసిన సైనాఈ మేరకు.. ‘‘జీవితం మనల్ని ఒక్కోసారి వేర్వేరు దిశల్లో ప్రయాణం చేయిస్తుంది. సుదీర్ఘ చర్చలు, ఆలోచనల తర్వాత.. నేను కశ్యప్ పారుపల్లి విడిపోవాలని నిర్ణయించుకున్నాం.శాంతియుత జీవనం, ఎదుగుదల, మానసిక ప్రశాంతత మా ఇరువురికీ ముఖ్యమని భావించి వేర్వేరు దారుల్లో ప్రయాణించాలని భావించాము. మా ఇద్దరి బంధానికి సంబంధించి నాకెన్నో మధురానుభూతులు ఉన్నాయి. ఇక ముందు కూడా స్నేహితుల్లా ముందుకు సాగుతాం.ఇలాంటి క్లిష్ట సమయంలో మా గోప్యత, గౌరవానికి భంగం కలగకుండా మా నిర్ణయాన్ని గౌరవించాలని కోరుకుంటున్నా’’ అని సైనా నెహ్వాల్ ఇన్స్టా స్టోరీ ద్వారా తమ విడాకుల విషయాన్ని వెల్లడించింది.బెస్టెస్ట్ అంటూ కశ్యప్ స్టోరీఅయితే, అదే సమయంలో పారుపల్లి కశ్యప్ మాత్రం విడాకుల గురించి ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు. అంతేకాదు.. సైనా కంటే ముందే ఓ పోస్ట్ను ఇన్స్టాలో షేర్ చేశాడు. ఇందులో కశ్యప్ తన స్నేహితులతో కలిసి వెకేషన్లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోను రీషేర్ చేస్తూ.. ‘‘బెస్టెస్ట్’’ అంటూ స్టోరీ పెట్టాడు.కపుల్ గోల్స్ సెట్ చేసిన క్రీడా జంట.. అంతలోనే..అయితే, సైనాతో ఉన్న పాత ఫొటోలన్నీ కూడా పారుపల్లి కశ్యప్ అలాగే ఉంచాడు. ఆమెతో కలిసి టూర్లకు వెళ్లిన ఫొటోలన్నీ తన సోషల్ మీడియా అకౌంట్లో అలాగే అట్టిపెట్టుకున్నాడు. కాగా భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్ దగ్గర శిక్షణ తీసుకున్న సైనా, కశ్యప్ చాలా ఏళ్లపాటు ప్రేమించుకున్నారు. 2018లో పెళ్లి బంధంతో ఒక్కటైన వీరు అన్యోన్యంగా ఉండేవారు. కెరీర్ పరంగానూ ఒకరికొరు అండగా ఉంటూ కపుల్ గోల్స్ సెట్ చేసే వాళ్లు.కానీ అకస్మాత్తుగా ఇలా సైనా నుంచి విడాకుల ప్రకటన రాగా.. కశ్యప్ మాత్రం ఇంకా స్పందించకపోవడం గమనార్హం. కాగా సైనాకు ప్రయాణాలు చేయడం అంటే చాలా ఇష్టం. కొన్నిసార్లు భర్త కశ్యప్తో పాటు టూర్లకు వెళ్లే సైనా.. మరికొన్ని సార్లు తన తల్లిదండ్రులతో కలిసి ప్రయాణాలు చేసేది. ఇందుకు సంబంధించిన జ్ఞాపకాలను ఫొటోల రూపంలో తన సోషల్ మీడియాలో షేర్ చేసేది సైనా. ఇక భర్తతో ఉన్న మధురానుభూతులను కూడా కెమెరాతో ఒడిసిపట్టి అభిమానులతో పంచుకునేది. చివరగా ఈ ఏడాది మేలో సైనా, కశ్యప్ సౌతాఫ్రికా టూర్కి వెళ్లినట్లుగా తెలుస్తోంది. అక్కడ సంతోషంగా గడిపిన క్షణాలను సైనా షేర్ చేసింది. అయితే, వీరి మధ్య విభేదాలు, విడాకులకు గల కారణం ఏమిటో మాత్రం తెలియదు.కెరీర్లో బెస్ట్కాగా సైనా లండన్ ఒలింపిక్స్-2012లో మహిళల సింగిల్స్ విభాగంలో కాంస్య పతకం గెలవగా.. అదే ఎడిషన్లో కశ్యప్ మెన్స్ సింగిల్స్లో క్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన భారత తొలి బ్యాడ్మింటన్ క్రీడాకారుడిగా కశ్యప్ చరిత్ర సృష్టించాడు. -
నాలుగో రౌండ్లో హంపి, దివ్య
బతూమి (జార్జియా): మహిళల ప్రపంచకప్ చెస్ నాకౌట్ టోర్నమెంట్లో భారత గ్రాండ్మాస్టర్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి కోనేరు హంపి, జూనియర్ ప్రపంచ చాంపియన్ దివ్య దేశ్ముఖ్ (మహారాష్ట్ర) నాలుగో రౌండ్లోకి దూసుకెళ్లారు. మూడో రౌండ్లో హంపి 1.5–0.5తో కులోన్ క్లౌడియా (పోలాండ్)పై, దివ్య 1.5–0.5తో టియోడోరా ఇంజాక్ (సెర్బియా)పై విజయం సాధించారు. ఆదివారం జరిగిన మూడో రౌండ్ రెండో గేమ్లో హంపి 44 ఎత్తుల్లో క్లౌడియాను ఓడించింది. ఇంజాక్తో జరిగిన రెండో గేమ్ను దివ్య 30 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. శనివారం జరిగిన మూడో రౌండ్ తొలి గేమ్ను హంపి 102 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకోగా... ఇంజాక్తో జరిగిన గేమ్లో దివ్య 39 ఎత్తుల్లో గెలిచింది. మూడో రౌండ్లోని రెండు గేమ్లు ముగిశాక భారత్కే చెందిన ద్రోణవల్లి హారిక–స్టావ్రూలా (గ్రీస్), వంతిక అగర్వాల్–కాటరీనా లాగ్నో (రష్యా), వైశాలి–కరిస్సా యిప్ (అమెరికా) 1–1తో సమంగా నిలిచారు. దాంతో ఈరోజు టైబ్రేక్ గేమ్లు నిర్వహించి విజేతలను నిర్ణయిస్తారు. -
జ్యోతి యర్రాజీ సర్జరీ సక్సెస్
సాక్షి, హైదరాబాద్: గాయంతో ఇబ్బంది పడుతున్న భారత స్టార్ అథ్లెట్ జ్యోతి యర్రాజీ మోకాలికి శస్త్రచికిత్స చేయించుకుంది. ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్ మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో 12.96 సెకన్ల టైమింగ్తో స్వర్ణం నెగ్గిన జ్యోతి... ప్రాక్టీస్ సందర్భంగా గాయపడింది. దీంతో పోటీలకు దూరమైన జ్యోతి... తాజాగా యాంటిరియర్ క్రూసియేట్ లిగమెంట్ (ఏసీఎల్)కు సర్జరీ చేయించుకున్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించింది. ప్రముఖ వైద్యుడు దిన్షా పర్దీవాలా పర్యవేక్షణలో జరిగిన శస్త్రచికిత్స విజయవంతమైందని తెలిపింది. ‘గత కొన్ని వారాలు భారంగా గడిచాయి. గాయం కారణంగా అమితంగా ఇష్టపడే అథ్లెటిక్స్కు దూరంగా ఉండాల్సి రావడం తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. ఈ శుక్రవారం సర్జరీ విజయవంతంగా పూర్తైంది. కష్ట సమయంలో అండగా నిలిచిన కుటుంబ సభ్యులు, కోచ్లు, భారత అథ్లెటిక్స్ సమాఖ్యకు ప్రత్యేక ధన్యవాదాలు. త్వరలోనే తిరిగి కోలుకుంటా. రెట్టించిన ఉత్సాహంతో ట్రాక్పై అడుగుపెట్టాలని భావిస్తున్నా’ అని జ్యోతి పేర్కొంది. ఇటీవల నిలకడగా రాణిస్తున్న జ్యోతి... టోక్యో వేదికగా జరగనున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో పాల్గొనాలని ఆశించినా... ఇప్పుడది సాధ్యపడేలా లేదు. వరల్డ్ అథ్లెటిక్స్ అర్హత మార్క్ 12.73 సెకన్లు కాగా... జ్యోతి నేరుగా ఈ అవకాశం దక్కించుకోకపోయినా ర్యాంకింగ్స్ ఆధారంగా ఆమెకు ఈ మెగా టోర్నీలో అవకాశం దక్కేది. -
భారత చెస్ 87వ గ్రాండ్మాస్టర్గా హరికృష్ణన్
చెన్నై: భారత చదరంగంలో మరో గ్రాండ్మాస్టర్ (జీఎం) అవతరించాడు. తమిళనాడుకు చెందిన 24 ఏళ్ల హరికృష్ణన్ ఈ ఘనత సాధించాడు. ఫ్రాన్స్లో ముగిసిన లా ప్లాగ్ని అంతర్జాతీయ చెస్ ఫెస్టివల్లో హరికృష్ణన్ జీఎం హోదా పొందడానికి అవసరమైన మూడో జీఎం నార్మ్ను ఖరారు చేసుకున్నాడు. భారత్కే చెందిన ఇనియన్తో గేమ్ను ‘డ్రా’ చేసుకున్న హరికృష్ణన్ నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో చివరి జీఎం నార్మ్ను అందుకున్నాడు. 2023లో బీల్ చెస్ ఫెస్టివల్లో తొలి జీఎం నార్మ్ పొందిన ఈ మాస్టర్ ఆఫ్ కామర్స్ (ఎంకామ్) విద్యార్థి ఈ ఏడాది జూన్లో స్పెయిన్లో జరిగిన అందుజార్ ఓపెన్లో రెండో జీఎం నార్మ్ పొందాడు. ‘చాలా ఆనందంగా ఉంది. ఏడేళ్ల క్రితం గ్రాండ్మాస్టర్ హోదా కోసం ప్రయత్నం మొదలైంది. గత మూడేళ్లలో క్రమం తప్పకుండా టోర్నీల్లో పోటీపడుతున్నాను. కానీ జీఎం నార్మ్లు సాధించలేకపోయాను. అయితే రెండు నెలల వ్యవధిలో రెండు జీఎం నార్మ్లు పొంది గ్రాండ్మాస్టర్ హోదా దక్కించుకోవడంతో చాలా సంతోషంగా ఉన్నాను’ అని తమిళనాడుకే చెందిన గ్రాండ్మాస్టర్ శ్యాం సుందర్ మోహన్రాజ్ వద్ద శిక్షణ తీసుకుంటున్న హరికృష్ణన్ వ్యాఖ్యానించాడు. -
వివాహబంధానికి సైనా, కశ్యప్ గుడ్బై
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా సైనా తమ విడాకుల విషయాన్ని ఆదివారం రాత్రి పోస్ట్ చేసింది. ‘జీవితం కొన్నిసార్లు మనల్ని వేర్వేరు దిశలకు తీసుకెళుతుంది. ఎంతో ఆలోచించి, సుదీర్ఘంగా చర్చించుకున్న తర్వాత నేను, కశ్యప్ విడిపోవాలనే నిర్ణయానికి వచ్చాం. పరస్పర అవగాహనతో సహృద్భావ వాతావరణంలో మా విడాకులు తీసుకుంటున్నాం. కశ్యప్తో నాకు ఎన్నో తీపి గుర్తులున్నాయి.ఇకపై మిత్రులుగా ఉంటాం. మా నిర్ణయాన్ని అందరు స్వాగతిస్తారని, ప్రైవసీని గౌరవిస్తారని ఆశిస్తున్నాం’ అని ఇన్స్టాలో పోస్ట్ చేసింది. పుల్లెల గోపీచంద్ వద్ద శిక్షణ తీసుకున్న సైనా, కశ్యప్లు 2018లో పెళ్లి చేసుకున్నారు. సైనా రెండుసార్లు కామన్వెల్త్ చాంపియన్గా నిలిచింది. 2012 లండన్ ఒలింపిక్స్లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. -
విన్నర్ సినెర్
లండన్: పచ్చిక కోర్టులపై తన ప్రతాపాన్ని చూపిన ఇటలీ స్టార్, ప్రపంచ నంబర్వన్ యానిక్ సినెర్ ‘వింబుల్డన్ గ్రాండ్స్లామ్’ చాంపియన్గా అవతరించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సినెర్ 4–6, 6–4, 6–4, 6–4తో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ రెండో ర్యాంకర్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్)ను ఓడించాడు. విజేతగా నిలిచిన సినెర్కు 30 లక్షల పౌండ్లు (రూ. 34 కోట్ల 85 లక్షలు), రన్నరప్ అల్కరాజ్కు 15 లక్షల 20 వేల పౌండ్లు (రూ. 17 కోట్ల 66 లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి. 3 గంటల 4 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో గెలవడం ద్వారా గత నెలలో ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో అల్కరాజ్ చేతిలో ఎదురైన ఓటమికి 23 ఏళ్ల సినెర్ బదులు తీర్చుకున్నాడు. అంతేకాకుండా తన కెరీర్లో తొలిసారి వింబుల్డన్ టైటిల్ను సాధించాడు. ఓవరాల్గా సినెర్ ఖాతాలో ఇది నాలుగో గ్రాండ్స్లామ్ టైటిల్ కావడం విశేషం. సినెర్ 2024, 2025లలో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్... 2024లో యూఎస్ ఓపెన్ టైటిల్ సాధించాడు. సినెర్ చేతిలో ఓటమితో గ్రాండ్స్లామ్ ఫైనల్లో అల్కరాజ్కు తొలిసారి పరాజయం ఎదురైంది. ఈ మ్యాచ్కంటే ముందు 22 ఏళ్ల అల్కరాజ్ ఫైనల్ చేరిన ఐదు గ్రాండ్స్లామ్ టోర్నీల్లోనూ (2022 యూఎస్ ఓపెన్; 2023 వింబుల్డన్; 2023 ఫ్రెంచ్ ఓపెన్; 2024 వింబుల్డన్; 2025 ఫ్రెంచ్ ఓపెన్) విజేతగా నిలిచాడు. తొలి సెట్ కోల్పోయినా... గతంలో అల్కరాజ్ చేతిలో ఎనిమిదిసార్లు ఓడిపోయి, నాలుగుసార్లు మాత్రమే నెగ్గిన సినెర్ వింబుల్డన్ ఫైనల్లో శుభారంభం చేయలేకపోయాడు. తొలి సెట్లో 4–2తో ఆధిక్యంలో ఉన్నప్పటికీ... అల్కరాజ్ ధాటికి సినెర్ వరుసగా నాలుగు గేమ్లు కోల్పోయి సెట్ను 4–6తో చేజార్చుకున్నాడు. తొలి సెట్ను కోల్పోయినా... ఆందోళన చెందకుండా సంమయనంతో ఆడిన సినెర్ రెండో సెట్లో తొలి గేమ్లోనే అల్కరాజ్ సర్వీస్ను బ్రేక్ చేశాడు. ఆ తర్వాత తన సర్వీస్లను నిలబెట్టుకొని సెట్ను 6–4తో నెగ్గి 1–1తో సమం చేశాడు. మూడో సెట్లోని తొమ్మిదో గేమ్లో అల్కరాజ్ సర్వీస్ను బ్రేక్ చేసి పదో గేమ్లో సర్వీస్ను నిలబెట్టుకున్న సినెర్ సెట్ను 6–4తో దక్కించుకున్నాడు. నాలుగో సెట్లోనూ సినెర్ దూకుడు కొనసాగించి మూడో గేమ్లో అల్కరాజ్ సర్వీస్ను బ్రేక్ చేశాడు. ఆ తర్వాత తన సర్వీస్లను కాపాడుకొని సెట్తోపాటు విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. -
నదీమ్తో నీరజ్ ఢీ
సిలేసియా (పోలాండ్): భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా... దాయాది పాకిస్తాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్తో పోటీకి సిద్ధమవుతున్నాడు. వచ్చే నెల 16న పోలాండ్ వేదికగా జరగనున్న సిలేసియా డైమండ్ లీగ్లో వీరిద్దరూ బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య శనివారం వివరాలు వెల్లడించింది. గతేడాది పారిస్ ఒలింపిక్స్లో చివరిసారిగా ఈ ఇద్దరు తలపడగా... నదీమ్ జావెలిన్ను 92.97 మీటర్ల దూరం విసిరి స్వర్ణం కైవసం చేసుకున్నాడు. నీరజ్ 89.45 మీటర్ల దూరంతో రజతం గెలుచుకున్నాడు. అంతకుముందు 2020 టోక్యో ఒలింపిక్స్లో చోప్రా పసిడి పతకం నెగ్గాడు. ఇటీవల భారత్ వేదికగా తొలిసారి జరిగిన అంతర్జాతీయ జావెలిన్ త్రో ఈవెంట్ ‘నీరజ్ చోప్రా క్లాసిక్’ టైటిల్ గెలిచిన 27 ఏళ్ల నీరజ్ చోప్రా జోరు మీదున్నాడు. ఈ సీజన్లో వరుసగా మూడు టైటిల్స్తో అతను ఇప్పటికే ‘హ్యాట్రిక్’ నమోదు చేశాడు. ‘నదీమ్, నీరజ్ మధ్య ఆసక్తికర పోరు ఖాయం. పారిస్ ఒలింపిక్స్ తర్వాత ఈ ఇద్దరు ఒకే టోర్నమెంట్లో పాల్గొంటుండటం ఇదే తొలిసారి. ఒకరు ప్రపంచ చాంపియన్, మరొకరు ఒలింపిక్ చాంపియన్. వారి మధ్య సమరాన్ని చూసేందుకు పోలాండ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాకిస్తాన్ అథ్లెట్ యూరోపియన్ లీగ్ల్లో పాల్గొనడం చాలా తక్కువ. మరి ఈ సారి అతడికి నీరజ్కు మధ్య పోటీ ఎలా సాగుతుందో చూడాలి’ అని లీగ్ నిర్వాహకులు వెల్లడించారు. ఈ ఏడాది తొలిసారి 90 మీటర్ల మార్క్ దాటిన నీరజ్ చోప్రా... మే నెలలో జరిగిన దోహా డైమండ్ లీగ్లో జావెలిన్ను 90.23 మీటర్ల దూరం విసిరి తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసుకున్నాడు.పారిస్ ఒలింపిక్స్ తర్వాత వరుసగా టోర్నీల్లో పాల్గొంటున్న నీరజ్ దిగ్గజ కోచ్ జాన్ జెలెజ్నీ దగ్గర శిక్షణ తీసుకుంటున్నాడు. మరోవైపు 28 ఏళ్ల నదీమ్... ఒలింపిక్ చాంపియన్గా నిలిచిన అనంతరం కేవలం ఒక్క టోర్నీలో మాత్రమే పాల్గొన్నాడు. సెపె్టంబర్లో టోక్యో వేదికగా ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ జరగనున్న నేపథ్యంలో ఈ లీగ్ ప్రాధాన్యత సంతరించుకుంది. 2023లో వరల్డ్ చాంపియన్గా నిలిచిన నీరజ్ దాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. -
సినెర్ X అల్కరాజ్
లండన్: ప్రతిష్ఠాత్మక గ్రాండ్స్లామ్ టోర్నీ వింబుల్డన్లో పురుషుల సింగిల్స్ ఫైనల్కు వేళయింది. ఆదివారం జరగనున్న ఈ తుది పోరులో ప్రపంచ నంబర్వన్ జానిక్ సినెర్ (ఇటలీ), రెండో ర్యాంకర్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) అమీతుమీ తేల్చుకోనున్నారు. గత నెల జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ ఫైనల్లోనూ ఈ ఇద్దరే తలపడగా... అల్కరాజ్ విజేతగా నిలిచాడు. ఇలా ఫ్రెంచ్ ఓపెన్ తర్వాత వింబుల్డన్లో ఆ ఇద్దరు ఆటగాళ్లే ఫైనల్లో తలపడనుండటం రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్), రాఫెల్ నాదల్ (స్పెయిన్) తర్వాత ఇదే తొలిసారి. ఈ ఇద్దరు దిగ్గజాలు 2006–2008 మధ్య వరుసగా మూడేళ్ల పాటు ఈ రెండు గ్రాండ్స్లామ్ ఫైనల్స్లో ఢీకొన్నారు. ఆ ఇద్దరు కెరీర్కు వీడ్కోలు పలకగా... 38 ఏళ్ల జొకోవిచ్ కూడా గతంలో మాదిరిగా దూకుడు కనబర్చలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా నవతరం నిలకడ కనబరుస్తోంది. అందులో ముఖ్యంగా 22 ఏళ్ల అల్కరాజ్, 23 ఏళ్ల సినెర్ తమ పోరాట పటిమతో అభిమానుల మనసు దోచుకుంటున్నారు. అల్కరాజ్ ఇప్పటివరకు ఐదు గ్రాండ్స్లామ్ టైటిల్స్ గెలవగా... సినెర్ మూడు నెగ్గాడు. గత 6 మేజర్ టైటిల్స్ను ఈ ఇద్దరే పంచుకోవడం విశేషం. ‘భవిష్యత్తు గురించి ఇప్పటి నుంచే ఆలోచించడం లేదు. ప్రస్తుతానికైతే సినెర్తో పోటీని ఆస్వాదిస్తున్నా. మున్ముందు కూడా ఇలాగే సాగుతుందని చెప్పలేను. దిగ్గజాల సరసన మా పేర్లు జోడించడం ఆనందమే’ అని అల్కరాజ్ అన్నాడు. వింబుల్డన్లో గత రెండేళ్లుగా తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తున్న ఈ స్పెయిన్ యంగ్స్టర్... ‘హ్యాట్రిక్’పై కన్నేశాడు. ఇప్పటి వరకు జాన్ బోర్గ్, సంప్రాస్, ఫెడరర్, జొకోవిచ్ వింబుల్డన్లో వరుసగా మూడు టైటిల్స్ సాధించగా... ఇప్పుడు ఆ జాబితాలో తన పేరు నమోదు చేసుకోవాలని అల్కరాజ్ తహతహలాడుతున్నాడు. సినెర్కు ఇది వరుసగా నాలుగో మేజర్ ఫైనల్ కాగా అందులో యూఎస్ ఓపెన్, ఆ్రస్టేలియా ఓపెన్లో విజయాలు సాధించాడు. గత నెలలో వీరిద్దరి మధ్య రోలాండ్ గారోస్లో 5 గంటల 29 నిమిషాల పాటు సాగిన సుదీర్ఘ ఫైనల్లో సినెర్పై అల్కరాజ్ విజయం సాధించగా... ఆ ఓటమికి బదులు తీర్చుకోవాలని ఇటలీ ప్లేయర్ భావిస్తున్నాడు. -
ఒక్కటే మిగిలింది!
సాక్షి క్రీడా విభాగం : 2019...ఇగా స్వియాటెక్ తొలి సారి గ్రాండ్స్లామ్ బరిలోకి దిగిన ఏడాది. అంటే 2020లో నిర్వహించని వింబుల్డన్ను మినహాయిస్తే 26 గ్రాండ్స్లామ్ టోర్నీల్లో ఆమె బరిలోకి దిగింది. ఏడేళ్ల కెరీర్ కూడా పూర్తి కాకముందే ఆమె ఖాతాలో ఇప్పుడు ఆరు టైటిల్స్ ఉన్నాయి. 24 ఏళ్ల వయసుకే ఇన్ని ఘనతలు సాధించిన ఇగా... పురుషుల, మహిళల విభాగంలో వింబుల్డన్ నెగ్గిన తొలి పోలండ్ ప్లేయర్గా నిలిచింది. దూకుడైన ఆటతో ఆమె అన్ని సర్ఫేస్లపై ఆధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చింది. స్వయంగా ఇగా మాటల్లోనే చెప్పాలంటే ‘భారీ సర్వీస్లు, టాప్ స్పిన్, పదునైన బ్యాక్హ్యాండ్ నా ప్రధాన బలాలు’. ఇదే ఆటపై ఇప్పుడు ఆమె ప్రపంచ మహిళల టెన్నిస్ను శాసిస్తోంది. శనివారం అనిసిమోవాతో జరిగిన ఫైనల్లో ఆమె ఆధిక్యం ప్రదర్శించిన తీరు స్వియాటెక్ పదునును చూపించింది. క్రీడాకారులు, ఒలింపిక్స్లో పాల్గొన్న రోయర్ అయిన తండ్రి ప్రోత్సాహంతో తొలి అడుగులు వేసిన ఆమె ఇప్పుడు అసాధారణ ప్రదర్శనతో శిఖరానికి చేరింది. ఆమె ప్రొఫెషనల్ కెరీర్లో తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. తొలిసారి 903వ ర్యాంక్తో డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్లో అడుగు పెట్టిన ఆమె మూడేళ్ల పాటు చెప్పుకోదగ్గ విజయాలతో దూసుకుపోయింది. స్వియాటెక్ కెరీర్లో మూడేళ్లు 2022, 2023, 2024 అద్భుతంగా సాగాయి. తొలి సారి వరల్డ్ నంబర్వన్గా నిలవడంతో పాటు మూడు సీజన్ల పాటు ఆమె దానిని నిలబెట్టుకోవడం విశేషం. ఐదేళ్ల వ్యవధిలో నాలుగు సార్లు క్లే కోర్టు ఫ్రెంచ్ ఓపెన్లో చాంపియన్గా నిలిచినా గ్రాస్ మాత్రం ఆమెకు కొరుకుడు పడలేదు. ఈ సారి విజేతగా నిలవడానికి ముందు ఆమె అత్యుత్తమ ప్రదర్శన క్వార్టర్ ఫైనల్ మాత్రమే. గత ఏడాదైతే మూడో రౌండ్లోనే నిష్క్రమించింది. ఆ తర్వాత నవంబరులో డోపింగ్ పరీక్షలో విఫలం కావడంతో కొత్త వివాదం రేగింది. సస్పెన్షన్ ముగిసి మళ్లీ బరిలోకి దిగిన తర్వాత 2025లో కూడా ఆమె ప్రదర్శన గొప్పగా లేదు. రెండు గ్రాండ్స్లామ్లు ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్లలో ఇగా సెమీఫైనల్కే పరిమితమైంది. అయితే గ్రాస్కోర్టులో ప్రాక్టీస్ను తొందరగా మొదలు పెట్టేందుకు ఇది ఉపకరించింది. వింబుల్డన్కు ముందు సన్నాహక గ్రాస్ కోర్టు టోర్నీ బాడ్ హాంబర్గ్ ఓపెన్లో ఫైనల్కు చేరడంతో కాస్త ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇప్పుడు దానినే కొనసాగిస్తూ పచ్చికపై తన చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. హార్డ్ కోర్ట్పై యూఎస్ ఓపెన్ నెగ్గగా...ఆ్రస్టేలియన్ ఓపెన్ మాత్రమే ఇంకా అందుకోవాల్సి వచ్చింది. ఇదే ఫామ్ కొనసాగితే 2026లోనే అది సాధ్యం కావచ్చు. -
వింబుల్డన్ క్వీన్ స్వియాటెక్
లండన్: పోలండ్ స్టార్ ఇగా స్వియాటెక్ అసాధారణ ఆటతో వింబుల్డన్లో విజయకేతనం ఎగురవేసింది. గ్రాస్ కోర్టుపై తిరుగులేని ప్రదర్శన కనబర్చిన ఇగా 2025 వింబుల్డన్ చాంపియన్గా నిలిచింది. శనివారం పూర్తి ఏకపక్షంగా సాగిన ఫైనల్లో ఎనిమిదో సీడ్ స్వియాటెక్ 6–0, 6–0తో 13వ సీడ్ అమందా అనిసిమోవా (అమెరికా)ను చిత్తు చిత్తుగా ఓడించింది. కేవలం 57 నిమిషాల్లోనే ముగిసిన ఈ పోరులో స్వియాటెక్ ముందు అమందా ఏమాత్రం నిలవలేకపోయింది. స్వియాటెక్ కెరీర్లో ఇది తొలి వింబుల్డన్ టైటిల్ కాగా...ఓవరాల్గా ఇది ఆరో గ్రాండ్స్లామ్. ఈ గెలుపుతో మూడు సర్ఫేస్ (హార్డ్, క్లే, గ్రాస్)లలోనూ గ్రాండ్స్లామ్ నెగ్గిన ప్లేయర్గా స్వియాటెక్ గుర్తింపు పొందింది. నాలుగు ఫ్రెంచ్ ఓపెన్లు, ఒక యూఎస్ ఓపెన్ ట్రోఫీ నెగ్గిన పోలండ్ స్టార్ కెరీర్లో ఇక ఆ్రస్టేలియన్ ఓపెన్ మాత్రమే మిగిలి ఉంది. ఫటాఫట్... మ్యాచ్కు ముందు మాజీ వరల్డ్ నంబర్వన్ స్వియాటెక్పై సహజంగానే గెలుపు అంచనాలు ఉన్నాయి. అయితే సెమీస్లో వరల్డ్ నంబర్వన్ సబలెంకాపై సంచలన విజయం సాధించిన అనిసిమోవా గట్టి పోటీనిస్తుందని అంతా భావించారు. అయితే పోలండ్ స్టార్ ముందు అమెరికన్ ప్లేయర్ ఆటలు ఏమాత్రం సాగలేదు. తొలి సెట్లో ఏకంగా 14 అన్ఫోర్స్డ్ ఎర్రర్స్ చేసిన అనిసిమోవా...రెండో సెట్లోనూ మరో 14 అన్ఫోర్స్డ్ ఎర్రర్స్తో ప్రత్యరి్థకి మ్యాచ్ను అప్పగించింది. తొలి ఫైనల్ ఆడుతున్న ఒత్తిడి అమెరికన్లో కనిపించగా...స్వియాటెక్ మాత్రం ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయింది. 3 ఏస్లు సంధించిన పోలండ్ ప్లేయర్ ప్రత్యర్థి సర్వీస్ను 6 సార్లు బ్రేక్ చేసింది. ఆరో గ్రాండ్స్లామ్తో ఇగా విజయగర్జన చేయగా... ఓటమి అనంతరం అనిసిమోవా కన్నీళ్లపర్యంతమైంది. 2018లో స్వియాటెక్ బాలికల సింగిల్స్లో వింబుల్డన్ టైటిల్ నెగ్గింది. 6 స్వియాటెక్ కెరీర్లో ఇది ఆరో గ్రాండ్స్లామ్ టైటిల్100 గ్రాండ్స్లామ్లో స్వియాటెక్కు ఇది వందో విజయం. 2019లో తొలి సారి బరిలోకి దిగిన ఆమె 120 మ్యాచ్లలో 100 గెలిచింది.114 వింబుల్డన్ ఫైనల్ ఇలా 6–0, 6–0 (డబుల్ బీగెల్)తో ముగియడం 114 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 1911 వింబుల్డన్ ఫైనల్లో డొరొతియా లాంబర్ట్ 6–0, 6–0తో డొరా బుత్బైని ఓడించింది. 1988 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో స్టెఫీగ్రాఫ్ 6–0, 6–0తో నటాషా జ్వెరెవాను చిత్తు చేసింది.నేడు పురుషుల సింగిల్స్ ఫైనల్అల్కరాజ్ (స్పెయిన్) X సినెర్ (ఇటలీ) రాత్రి గం. 8:30 నుంచి స్టార్ స్పోర్ట్స్లో ప్రత్యక్ష ప్రసారం -
ఆర్చరీ ప్రపంచకప్లో జ్యోతి సురేఖ ‘హ్యాట్రిక్’
మాడ్రిడ్: ఆంధ్రప్రదేశ్ స్టార్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ ప్రపంచకప్లో ‘హ్యాట్రిక్’ పతకాలు సాధించింది. అయితే కాంపౌండ్లో తృటిలో రెండు స్వర్ణావకాశాల్ని చేజార్చుకుంది. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో ఒక్కో రజతం, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కాంస్యం గెలుచుకుంది. కాంపౌండ్ వ్యక్తిగత ఫైనల్లో జ్యోతి 147–148తో ఎలా గిబ్సన్ (బ్రిటన్) చేతిలో పాయింట్ తేడాతో ఓడి రజతంతో తృప్తి పడింది. మరో కాంపౌండ్ టీమ్ ఈవెంట్ స్వర్ణ పతక పోరులో జ్యోతి, పర్ణిత్ కౌర్, ప్రీతికలతో కూడిన భారత జట్టు 225–227తో చైనీస్ తైపీకి చెందిన హువంగ్ జౌ, చెన్ యి సున్, చియు యు ఎర్ చేతిలో పరాజయం చవిచూసింది. మొదట 57–57తో తైపీ త్రయాన్ని నిలువరించిన భారత జట్టు... 58–56తో, 55–56తో మూడు రౌండ్లు ముగిసేసరికి 170–169తో ఆధిక్యంలో నిలిచింది. కానీ ఆఖరి నాలుగో రౌండ్లో గురి కుదరక రజతంతో సరిపెట్టుకుంది. మిక్స్డ్ టీమ్ ఈవెంట్ కాంస్య పతక పోరులో జ్యోతి సురేఖ (ఏపీ)–రిషభ్ యాదవ్ (హరియాణా) జోడీ 156–153తో పాలొ కొరాడో–డగ్లస్ నొలాస్కో (ఎల్ సాల్వడోర్) జంటపై గెలిచింది. -
Wimbledon 2025: వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేత స్వియాటెక్
ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీలో సరికొత్త ఛాంపియన్ అవతరించింది. వింబుల్డన్-2025 టోర్నీ మహిళల సింగిల్స్ విజేతగా పొలాండ్కు చెందిన ఇగా స్వియాటెక్ (Iga Swiatek) నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో అమెరికాకు చెందిన అమందా అనిస్మోవాకను 6-0, 6-0 తేడాతో చిత్తుగా ఓడించిన స్వియాటెక్.. తొలి వింబుల్డన్ టైటిల్ను సొంతంచేసుకుంది. రెండు సెట్లలోనూ పొలాండ్ భామ జోరు ముందు అమందా నిలవలేకపోయింది. కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. -
మూడో రౌండ్లో వంతిక
బతూమి (జార్జియా): మహిళల ప్రపంచకప్ చెస్ నాకౌట్ టోర్నమెంట్లో భారత క్రీడాకారిణి వంతిక అగర్వాల్ మూడో రౌండ్లోకి ప్రవేశించగా... పద్మిని రౌత్, ప్రియాంక రెండో రౌండ్లోనే ని్రష్కమించారు. ప్రపంచ మాజీ చాంపియన్ అన్నా ఉషెనినా (ఉక్రెయిన్)తో జరిగిన రెండో రౌండ్లో వంతిక 4.5–3.5తో విజయం సాధించింది. గురువారం రెండో రౌండ్లో రెండు గేమ్లు ముగిశాక ఇద్దరూ 1–1తో సమంగా ఉండటంతో శుక్రవారం టైబ్రేక్ నిర్వహించారు. టైబ్రేక్లో వంతిక 3.5–2.5తో గెలిచింది. ప్రపంచ మాజీ చాంపియన్ అలెగ్జాండ్రా కొస్టెనిక్ (స్విట్జర్లాండ్)తో జరిగిన పోరులో పద్మిని 3.5–4.5తో ఓడిపోయింది. గురువారం రెండు గేమ్లు ముగిశాక ఇద్దరూ 1–1తో సమంగా నిలిచారు. దాంతో శుక్రవారం టైబ్రేక్ గేమ్లు నిర్వహించగా... కొస్టెనిక్ 3.5–2.5తో పద్మినిని ఓడించింది. కులోన్ క్లౌడియా (పోలాండ్)తో జరిగిన పోటీలో ప్రియాంక 1–3తో ఓటమి పాలైంది. నేడు జరిగే మూడో రౌండ్ తొలి గేమ్లలో కులోన్ క్లౌడియాతో కోనేరు హంపి; టియోడొరా ఇంజాక్ (సెర్బియా)తో దివ్య దేశ్ముఖ్; కాటరీనా లాగ్నోతో వంతిక; స్టావ్రూలాతో ద్రోణవల్లి హారిక; కరిస్సా యిప్తో వైశాలి తలపడతారు. -
సెమీస్లో జొకోవిచ్కు షాక్
లండన్: కెరీర్లో రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్స్లామ్ టైటిల్ లక్ష్యంగా వింబుల్డన్ టోర్నీలో బరిలోకి దిగిన సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ ప్రస్థానం ముగిసింది. పురుషుల సింగిల్స్లో ఆరో సీడ్, ఆరుసార్లు చాంపియన్ జొకోవిచ్ సెమీఫైనల్లో నిష్క్రమించాడు. ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ యానిక్ సినెర్ (ఇటలీ) అద్భుతంగా ఆడి 6–3, 6–3, 6–4తో వరుస సెట్లలో జొకోవిచ్ను ఓడించి తొలిసారి వింబుల్డన్ టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 2017 తర్వాత వింబుల్డన్ టోర్నీలో జొకోవిచ్ ఫైనల్ చేరుకోకపోవడం ఇదే తొలిసారి. గత రెండేళ్లు ఫైనల్లో అల్కరాజ్ చేతిలో ఓడిన జొకోవిచ్ 2018, 2019, 2021, 2022లలో విజేతగా నిలిచాడు. కరోనా కారణంగా 2020లో వింబుల్డన్ టోర్నీని నిర్వహించలేదు. జొకోవిచ్తో 1 గంట 55 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్లో సినెర్ 12 ఏస్లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్ను ఐదు సార్లు బ్రేక్ చేశాడు. జొకోవిచ్ 12 ఏస్లు సంధించడంతోపాటు 28 అనవసర తప్పిదాలు చేశాడు. ‘హ్యాట్రిక్’ టైటిల్పై అల్కరాజ్ గురి తొలి సెమీఫైనల్లో 2023, 2024 చాంపియన్ అల్కరాజ్ (స్పెయిన్) 2 గంటల 49 నిమిషాల్లో 6–4, 5–7, 6–3, 7–6 (8/6)తో ఐదో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)పై గెలిచాడు. వరుసగా మూడో ఏడాది ఈ టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించాడు. ఆదివారం జరిగే ఫైనల్లో సినెర్తో అల్కరాజ్ తలపడతాడు. అల్కరాజ్ గెలిస్తే... జాన్ బోర్గ్, సంప్రాస్, ఫెడరర్, జొకోవిచ్ తర్వాత వింబుల్డన్లో ‘హ్యాట్రిక్’ టైటిల్స్ నెగ్గిన ఐదో ప్లేయర్గా నిలుస్తాడు. నేడు మహిళల సింగిల్స్ ఫైనల్ స్వియాటెక్ (పోలాండ్) X అనిసిమోవా (అమెరికా) రాత్రి గం. 8:30 నుంచి స్టార్ స్పోర్ట్స్లో ప్రత్యక్ష ప్రసారం -
సినియకోవా–వెర్బీక్ జోడీకి మిక్స్డ్ డబుల్స్ టైటిల్
లండన్: వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో కాటరీనా సినియకోవా (చెక్ రిపబ్లిక్)–సెమ్ వెర్బీక్ (నెదర్లాండ్స్) జోడీ విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో సినియకోవా–వెర్బీక్ ద్వయం 7–6 (7/3), 7–6 (7/3)తో లూసియా స్టెఫానీ (బ్రెజిల్)–జో సాలిస్బరీ (బ్రిటన్) జోడీపై విజయం సాధించింది. సినియకోవా–వెర్బీక్ జంటకు 6,80,000 పౌండ్లు (రూ. 7 కోట్ల 88 లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి. సినియకోవా కెరీర్లో ఇది 11వ గ్రాండ్స్లామ్ డబుల్స్ టైటిల్కాగా... ‘మిక్స్డ్’లో మాత్రం తొలి టైటిల్. మహిళల డబుల్స్లో సినియకోవా మూడుసార్లు చొప్పున ఆ్రస్టేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టోర్నీలలో... ఒకసారి యూఎస్ ఓపెన్లో టైటిల్స్ సాధించింది. అంతేకాకుండా టోక్యో ఒలింపిక్స్లో మహిళల డబుల్స్లో... పారిస్ ఒలింపిక్స్లో మిక్స్డ్ డబుల్స్లో స్వర్ణ పతకాలు సొంతం చేసుకుంది. మరోవైపు వెర్బీక్ తొలి గాండ్స్లామ్ టైటిల్ నెగ్గాడు. -
ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి
న్యూఢిల్లీ: యువ క్రీడాకారిణులు మరింత బాధ్యతగా ఆడాల్సిన అవసరముందని భారత మహిళల హాకీ జట్టు ప్రధాన కోచ్ హరేంద్ర సింగ్ అన్నాడు. లేకుంటే జట్టు సీనియర్ ప్లేయర్లపై ఎక్కువ ఆధారపడాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. మ్యాచ్కు ముందు ఎంత బాగా శిక్షణ పొందినా... ఒక్కసారి మైదానంలో అడుగు పెట్టాక అప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుంటూ ముందుకు సాగితేనే ఫలితాలు అనుకూలంగా వస్తాయని ఆయన వెల్లడించాడు. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్ యూరప్ అంచె పోటీల్లో భారత మహిళల హాకీ జట్టు ఎనిమిది మ్యాచ్ల్లోనూ ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.ఈ నేపథ్యంలో హరేంద్ర సింగ్ మాట్లాడుతూ... ‘ప్రొ లీగ్లో యువ జట్టుతో బరిలోకి దిగాం. పలువురు అనుభజు్ఞలైన ప్లేయర్లు గాయాలతో యూరప్ అంచె పోటీలకు దూరమవడం ఫలితాలపై ప్రభావం చూపింది. ముఖ్యంగా డిఫెన్స్ మరీ బలహీనంగా మారింది. దీంతో ప్రత్యర్థులు సులువుగా గోల్స్ చేస్తూ జట్టుపై ఒత్తిడి పెంచారు. దీనిపై మరింత కృషి చేయాల్సిన అవసరముంది. అనుభవరాహిత్యం కారణంగా యువ ప్లేయర్లు తాము మైదానంలో ఎక్కడ ఉన్నాం... తమ బాధ్యత ఏంటి అనే విషయంలో కాస్త అయోమయానికి గురయ్యారనేది సుస్పష్టం. అందుకే పరిస్థితులకు తగ్గట్లు ముందుకు సాగాలి. లేకుంటే తిరిగి సీనియర్ ఆటగాళ్లపైనే భారం మోపాల్సి ఉంటుంది. ఫీల్డ్లో నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం పనికిరాదు. ఎంత వేగంగా స్పందిస్తే అంత మెరుగైన ఫలితం సాధించవచ్చు. ప్రత్యర్థి సర్కిల్లోకి ప్రవేశిస్తే... గోల్ పోస్ట్పై దాడులు చేసేందుకు వెరవకూడదు. పదేపదే దాడులు చేస్తూ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెడితేనే మ్యాచ్పై పట్టు చిక్కుతుంది’ అని అన్నాడు. సీనియర్లు అందుబాటులో లేకే... అంతర్జాతీయ స్థాయిలో అపార అనుభవం ఉన్న ప్లేయర్లు వేర్వేరు కారణాలతో జట్టుకు దూరం కావడంతోనే యూరప్ అంచె పోటీల్లో భారత ఆటతీరు మరీ తీసుకట్టులా మారిందని హరేంద్ర సింగ్ అన్నాడు. ‘ప్రొ లీగ్ ప్రారంభానికి ముందు సుశీలా చాను జట్టుకు దూరమైంది. నిక్కీ ప్రధాన్, ఉదిత గాయాలతో ఇబ్బంది పడుతుండటంతో వారికి విశ్రాంతినివ్వాల్సి వచ్చింది. దీంతో ముగ్గురు ప్రధాన డిఫెండర్లు లేకపోవడంతో మన రక్షణ పంక్తి బలహీనపడింది. యువ స్ట్రయికర్ సంగీత కుమారి కూడా గాయం కారణంగా జట్టుకు దూరమైంది’ అని హరేంద్ర వెల్లడించాడు. ప్లేయర్ల మానసిక బలాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు హరేంద్ర అన్నాడు. ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ప్లేయర్లకు మానసికంగా దృఢంగా ఉండేవిధంగా శిక్షణ ఇచ్చిన మోహన్ అనే వ్యక్తిని జట్టు సహాయక సిబ్బందిలో చేర్చినట్లు తెలిపారు. ఒత్తిడిని అధిగమించడం, తక్షణం స్పందించే గుణం వంటి పలు కీలక అంశాల్లో అతడి శిక్షణ మన ప్లేయర్లకు ఎంతగానో ఉపయోగపడనుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 5 నుంచి 15 వరకు హాంగ్జౌ వేదికగా ఆసియ కప్ జరగనుండగా... ఆ లోపు ప్లేయర్లను మానసికంగా మరింత సంసిద్ధం చేస్తామని హరేంద్ర అన్నాడు. అవకాశాలను వినియోగించుకుంటేనే... ప్రొ లీగ్ యూరప్ అంచె పోటీల్లో భారత జట్టుకు ఎన్నో అవకాశాలు వచ్చినా... వాటిని సది్వనియోగ పరుచుకోలేకపోయింది. అనుభజు్ఞలు లేకపోవడంతో డిఫెన్స్ విభాగంలో వెనుకబడిన టీమిండియా... అటాకింగ్లోనూ ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా పెనాల్టీ కార్నర్లను గోల్స్గా మలచడంలో మనవాళ్లు మరింత దృష్టి పెట్టాల్సిన అవసరముంది. ‘పెనాల్టీ కార్నర్ల విషయంలో చాలా మెరుగపడాల్సి ఉంది. మెరుగైన ప్రత్యర్థులతో తలపడుతున్నప్పుడు ప్రతి అంశంలో పక్కాగా ఉండాలి. అది లోపించడం వల్లే ప్రో లీగ్ నుంచి ఉద్వాసన ఎదురైంది. అయితే ఇక్కడితో ఆగిపోము. ఈ లోపాలను సవరించుకొని మరింత బలంగా పుంజుకుంటాం. ప్రత్యర్థికి పదే పదే పెనాల్టీ కార్నర్ అవకాశాలు ఇవ్వడం దెబ్బకొట్టింది. అయితే సానుకూల అంశాలు కూడా ఉన్నాయి. మనకంటే మెరుగైన జట్లతో మ్యాచ్ల్లో సైతం అమ్మాయిలు ఆకట్టుకున్నారు. కొన్ని తప్పిదాలను పక్కన పెడితే ప్రపంచ స్థాయి ఆటతీరు కనబర్చారు. ఆసియా కప్ ప్రారంభానికి ముందే ఈ తప్పులను సరిదిద్దుకుంటాం. ప్లేయర్లకు పెద్దగా అనుభవం లేదు. వారిని నిందించాలనుకోవడం లేదు. ఏడుగురు ఆటగాళ్లకు ఇదే తొలి ప్రొ లీగ్’ అని హరేంద్ర అన్నాడు. -
సెమీఫైనల్లో జ్యోతి సురేఖ, పర్ణీత్
మాడ్రిడ్: ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్–4 టోర్నమెంట్ మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత్కు చెందిన వెన్నం జ్యోతి సురేఖ, పర్ణీత్ కౌర్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి సురేఖ 147–144తో హజల్ బురున్ (తుర్కియే)పై, పర్ణీత్ కౌర్ 142–141తో క్యూర్ గిరిడి (తుర్కియే)పై విజయం సాధించారు. మరోవైపు రికర్వ్ విభాగంలో భారత జట్లకు నిరాశ ఎదురైంది. భారత పురుషుల, మహిళల జట్లు కనీసం మూడో రౌండ్కు కూడా చేరుకోలేకపోయాయి. ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ బొమ్మదేవర ధీరజ్, రాహుల్, నీరజ్ చౌహాన్లతో కూడిన భారత పురుషుల జట్టు రెండో రౌండ్లో 2–6 (55–56, 54–57, 57–56, 54–56) సెట్ పాయింట్ల స్కోరుతో జ్విక్ ఎలీ, మార్కస్ అల్మీదా, మథియాస్ గోమ్స్లతో కూడిన బ్రెజిల్ జట్టు చేతిలో ఓడిపోయింది. దీపిక కుమారి, అంకిత, గాథ ఖడకేలతో కూడిన భారత మహిళల జట్టు కూడా రెండో రౌండ్లోనే వెనుదిరిగింది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన భారత జట్టు రెండో రౌండ్లో 3–5 (58–54, 55–55, 54–55, 53–54) సెట్ పాయింట్ల స్కోరుతో అమెలీ కార్డెయు, లీసా బార్బెలిన్, విక్టోరియా సెబాస్టియన్లతో కూడిన ఫ్రాన్స్ జట్టు చేతిలో ఓటమి పాలైంది. -
ఆరు స్థానాలు పడిపోయి...
న్యూఢిల్లీ: అంతర్జాతీయస్థాయిలో ఆశించిన ఫలితాలు సాధించడంలో విఫలమవుతోన్న భారత పురుషుల ఫుట్బాల్ జట్టు ప్రపంచ ర్యాంకింగ్స్లోనూ దిగజారింది. అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య (ఫిఫా) గురువారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో భారత జట్టు ఆరు స్థానాలు పడిపోయి 133వ ర్యాంక్లో నిలిచింది. గత తొమ్మిదేళ్లలో భారత్కిదే అత్యల్ప ర్యాంక్ కావడం గమనార్హం. ఈ ఏడాది జూన్ 4న థాయ్లాండ్తో జరిగిన అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్లో భారత బృందం 0–2 గోల్స్ తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత ఆసియా కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో హాంకాంగ్ చేతిలో 0–1తో పరాజయం పాలైంది. భారత జట్టు నిరాశాజనక ప్రదర్శన నేపథ్యంలో హెడ్ కోచ్ మనోలో తన పదవి నుంచి వైదొలిగాడు. 2016 డిసెంబర్లో భారత జట్టు అత్యల్పంగా 135వ ర్యాంక్లో నిలువగా... 1996 ఫిబ్రవరిలో అత్యుత్తమంగా 94వ స్థానాన్ని దక్కించుకుంది.1113.22 రేటింగ్ పాయింట్లతో భారత జట్టు ఆసియాలో 24వ స్థానంలో ఉంది. 210 దేశాలు ఉన్న ‘ఫిఫా’ ర్యాంకింగ్స్లో ప్రపంచ చాంపియన్ అర్జెంటీనా టాప్ ర్యాంక్లో కొనసాగుతుండగా... స్పెయిన్, ఫ్రాన్స్, ఇంగ్లండ్, బ్రెజిల్ జట్లు వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. -
మూడో రౌండ్లో హారిక, హంపి
బతూమి (జార్జియా): మహిళల ప్రపంచకప్ చెస్ నాకౌట్ టోర్నమెంట్లో భారత గ్రాండ్మాస్టర్లు, తెలుగు తేజాలు ద్రోణవల్లి హారిక, కోనేరు హంపి మూడో రౌండ్లోకి ప్రవేశించారు. నందిత (భారత్)తో జరిగిన రెండో రౌండ్లో హారిక 1.5–0.5తో... హంపి 1.5–0.5తో అఫ్రూజా ఖామ్దమోవా (ఉజ్బెకిస్తాన్)పై గెలుపొందారు. గురువారం జరిగిన రెండో రౌండ్ రెండో గేమ్లో హారిక 37 ఎత్తుల్లో నందితను ఓడించగా... అఫ్రూజాతో గేమ్ను హంపి 44 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. బుధవారం జరిగిన తొలి గేమ్లో అఫ్రూజాపై హంపి నెగ్గగా... నందితతో గేమ్ను హారిక ‘డ్రా’ చేసుకుంది. భారత్కే చెందిన వైశాలి, దివ్య దేశ్ముఖ్ కూడా మూడో రౌండ్కు చేరుకున్నారు. మరో ముగ్గురు భారత ప్లేయర్లు వంతిక అగర్వాల్, పద్మిని రౌత్ మూడో రౌండ్లో చోటు కోసం నేడు టైబ్రేక్ గేమ్లు ఆడనున్నారు. -
అనిసిమోవా అదరహో
లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్వన్ సబలెంకా (బెలారస్) వరుసగా మూడోసారి సెమీఫైనల్ అడ్డంకిని దాటలేకపోయింది. అమెరికా ప్లేయర్ అమండ అనిసిమోవా అద్భుత ఆటతీరు కనబరిచి టాప్ సీడ్ సబలెంకాను బోల్తా కొట్టించింది. 2 గంటల 37 నిమిషాలపాటు జరిగిన తొలి సెమీఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్ అనిసిమోవా 6–4, 4–6, 6–4తో సబలెంకాను ఓడించి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్స్లామ్ టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. 30 విన్నర్స్ కొట్టిన అనిసిమోవా ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. మరోవైపు సబలెంకా 37 అనవసర తప్పిదాలు చేసింది. కెరీర్లో 22వ సారి గ్రాండ్స్లామ్ టోర్నీ బరిలోకి దిగిన 23 ఏళ్ల అనిసిమోవా గ్రాండ్స్లామ్ టైటిల్కు విజయం దూరంలో నిలిచింది. రేపు జరిగే ఫైనల్లో ఐదు గ్రాండ్స్లామ్ టోర్నీల విజేత ఇగా స్వియాటెక్ (పోలాండ్)తో అనిసిమోవా తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ స్వియాటెక్ కేవలం 72 నిమిషాల్లో 6–2, 6–0తో బెలిండా బెన్చిచ్ (స్విట్జర్లాండ్)ను ఓడించి తన కెరీర్లో తొలిసారి వింబుల్డన్ టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించింది. -
ఇన్ స్టాల్ రీల్స్ చేసిన టెన్నిస్ ప్లేయర్.. హత్య చేసిన తండ్రి!
గురుగ్రామ్: హర్యానా రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ఇన్ స్టా రీల్స్ చేసిందని కన్న కూతురి జీవితాన్ని చిదిమేశాడు తండ్రి. టెన్నిస్లో ఎంతో భవిష్యత్ ఉన్న 25 ఏళ్ల రాధికా యాదవ్ను తండ్రి హత్య చేశాడు. గురుగ్రామ్ సుశాంక్ లోక్ ఫేజ్-2లో నివాసముంటున్న రాధికా యాదవ్ను.. తండ్రి గన్తో కాల్చి చంపాడు. ఇన్ స్టా రీల్కు సంబంధించి తండ్రీ కూతుళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇన్ స్టా రీల్ ఎందుకు చేశావని ఆగ్రహించిన తండ్రి.. కూతుర్ని నిలదీశాడు. ఈ విషయంపై కూతురు ఎదురు తిరిగింది. దాంతో కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని తండ్రి తన వద్ద ఉన్న గన్తో కాల్చి హత్య చేశాడు.తన లైసెన్స్డ్ రివాల్వర్తో కూతుర్ని తన ఇంటి వద్దే కాల్చి చంపాడు. కూతుర్ని చంపడమే లక్ష్యంగా మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. దాంతో తీవ్ర గాయాల పాలై రక్తపు మడుగులో ఉన్న ఆమెను ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. ఆమె మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కూతుర్ని హత్య చేసిన విషయాన్ని తండ్రి అంగీకరించడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. లైసెన్స్డ్ రివాల్వర్ను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. టెన్నిస్ ఖేలో డాట్ కామ్ ప్రకారం అంతర్జాతీయ టెన్నిస్ ఫెడరేషన్ డబుల్స్ ర్యాంకింగ్స్లో ఆమె 113వ స్థానంలో ఉంది. 2020, మార్చి 23వ తేదీన జన్మించిన రాధికా యాదవ్.. టెన్నిస్లో తన ఢవిష్యత్ను ఎతుక్కుంటూ ఒక్కో మెట్టూ ఎక్కుతూ వచ్చింది. ఈ క్రమంలో ఎన్నో పోటీల్లో విజేతగా నిలిచింది. తన భవిష్యత్ను మరింత మెరుగులు దిద్దుకునే క్రమంలో తండ్రి చేతిలో ప్రాణాలు కోల్పోవడంపై దేశ వ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. -
ఆగస్టు 29 నుంచి ప్రొ కబడ్డీ లీగ్
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్ ఈ ఏడాది ఆగస్టు 29 నుంచి ప్రారంభం కానుంది. ఇటీవల పీకేఎల్ వేలం ముగియగా... అన్ని ఫ్రాంచైజీలు జట్లను సిద్ధం చేసుకున్నాయి. త్వరలోనే వేదికలతో పాటు సీజన్ షెడ్యూల్ను విడుదల చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ‘12 ఫ్రాంచైజీలు వేలంలో తమ తమ జట్లను బలోపేతం చేసుకున్నాయి. 12వ సీజన్ కోసం అన్నీ జట్లు సమాయత్తమవుతున్నాయి. గతం కంటే మరింత రసవత్తరంగా మ్యాచ్లు జరగడం ఖాయం’ అని నిర్వాహకులు వెల్లడించారు. మే 31, జూన్ 1న ముంబై వేదికగా పీకేఎల్ వేలం పాట జరగగా... రికార్డు స్థాయిలో 10 మంది ఆటగాళ్లు కోటి రూపాయాల కంటే ఎక్కువ ధర దక్కించుకున్నారు. వచ్చే నెల ఆఖరులో ప్రారంభం కానున్న పీకేఎల్లో హర్యానా స్టీలర్స్ డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగనుంది. ఇక గత సీజన్లో 22 మ్యాచ్లాడిన తెలుగు టైటాన్స్... 12 విజయాలు, 10 పరాజయాలతో పట్టికలో ఏడో స్థానానికి పరిమితమైంది. -
స్టార్ టెన్నిస్ ప్లేయర్ రిటైర్మెంట్
లండన్: ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి వైదొలుగుతున్నట్లు ఇటలీ టెన్నిస్ స్టార్ ఫాబియో ఫాగ్నిని ప్రకటించాడు. వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ ఫాగ్నిని తొలి రౌండ్లో ఓడిపోయాడు. డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్తో జరిగిన ఈ మ్యాచ్లో 38 ఏళ్ల ఫాగ్నిని ఐదు సెట్లు పోరాడాడు. ఈ ఏడాది చివర్లో ఆటకు గుడ్బై చెప్పాలని ఫాగ్నిని అనుకున్నాడు. అయితే ఈ సీజన్లో వరుసగా పది పరాజయాలు ఎదురుకావడంతో వింబుల్డన్ టోర్నీ సందర్భంగానే అతను రిటైర్మెంట్ ప్రకటనను జారీ చేశాడు.‘ఆటకు గుడ్బై చెప్పాక ఏం చేస్తానో ఇప్పుడే చెప్పలేను. ప్రస్తుతం మాత్రం కుటుంబంతో గడుపుతాను’ అని కెరీర్లో 9 సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన ఫాగ్నిని తెలిపాడు. 2019లో మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్ టైటిల్ నెగ్గిన ఫాగ్నిని అదే ఏడాది కెరీర్ బెస్ట్ 9వ ర్యాంక్కు చేరుకున్నాడు. 2015 యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ చాంపియన్ ఫ్లావియా పెనెట్టా (ఇటలీ)ను పెళ్లి చేసుకున్న ఫాగ్నిని తన 20 ఏళ్ల కెరీర్లో మొత్తం 63 గ్రాండ్స్లామ్ టోర్నీలు ఆడాడు. 2011 ఫ్రెంచ్ ఓపెన్లో క్వార్టర్ ఫైనల్ చేరుకోవడమే గ్రాండ్స్లామ్ టోర్నీల్లో అతని అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన. ప్రస్తుతం ఫాగ్నిని 138వ ర్యాంక్లో ఉన్నాడు. -
ఇక చాలు!
మిల్టన్ కీన్స్ (ఇంగ్లండ్): సుదీర్ఘ కాలంగా ఫార్ములావన్ (ఎఫ్1) రెడ్బుల్ టీమ్ ప్రిన్సిపాల్గా వ్యవహరిస్తున్న క్రిస్టియన్ హార్నర్ను ఆ జట్టు ఆర్ధాంతరంగా తప్పించింది. 20 సంవత్సరాలుగా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ... 8 సార్లు డ్రైవర్స్ చాంపియన్షిప్ టైటిల్స్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించిన హార్నర్ను తొలగిస్తున్నట్లు రెడ్బుల్ బుధవారం ప్రకటించింది. అతడి సేవలకు ధన్యవాదాలు తెలిపిన రెడ్బుల్ యాజమాన్యం తప్పించడం వెనుక ఉన్న కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. ‘అతడు మా జట్టు చరిత్రలో ఎప్పటికీ ఒక ముఖ్యమైన వ్యక్తే’ అని ఏకవాక్య ప్రకటన విడుదల చేసింది. హార్నర్ చీఫ్గా ఉన్న సమయంలో రెడ్బుల్ జట్టు 405 రేసుల్లో పాల్గొని 124 విజయాలు సాధించింది. 8 డ్రైవర్స్ చాంపియన్షిప్ టైటిల్స్, 6 కన్స్ట్రక్టర్స్ టైటిల్స్ గెలుచుకుంది. హార్నర్ స్థానంలో రెడ్బుల్ జట్టు చీఫ్ ఎగ్జిక్యూటివ్గా తమ సొంత జట్టు రేసింగ్ బుల్స్కు చెందిన లారెంట్ మెకీస్కు బాధ్యతలు అప్పగించింది. ఈ నెల 27న జరగనున్న బెల్జియం గ్రాండ్ప్రితో మెకీస్ జట్టు బాధ్యతలు అందుకోనున్నాడు. ‘రేసింగ్ బుల్స్ జట్టు స్ఫూర్తి అద్భుతమైంది. ఇది కేవలం ప్రారంభమే అని బలంగా విశ్వసిస్తున్నా. రెడ్బుల్ అప్పగించిన బాధ్యతలను అందుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. సవాలుతో కూడుకున్నదే అయినా నా వంతు కృషి చేస్తా. డ్రైవర్లకు సహాయ సహకారాలు అందిస్తూ వారిని సరైన దిశలో నడిపించడమే నా బాధ్యత’ అని మెకీస్ ఒక ప్రకటనలో తెలిపాడు. అయితే అతడు ఇందులో కనీసం హార్నర్ పేరును ప్రస్తావించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇక మెకీస్ స్థానంలో అలాన్ పెర్మనే రేసింగ్ బుల్స్ డైరెక్టర్గా పదోన్నతి పొందాడు. ఆది నుంచి అతడే... రెడ్బుల్ జట్టు తొలిసారి 2005లో ఫార్ములావన్లో అడుగు పెట్టగా... అప్పటి నుంచి హార్నర్ టీమ్ ప్రిన్సిపాల్గా వ్యవహరిస్తూ వస్తున్నాడు. ఇటీవల బ్రిటన్ గ్రాండ్ప్రిలో సైతం హార్నర్ తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాడు. రెడ్బుల్ జట్టుకు చెందిన సెబాస్టియన్ వెటెల్, వెర్స్టాపెన్ వరుసగా నాలుగుసార్లు సార్లు చొప్పున డ్రైవర్స్ చాంపియన్షిప్ సాధించడం వెనక హార్నర్ కీలకంగా వ్యవహరించాడు. ఈ సీజన్లో మెక్లారెన్ డ్రైవర్లు సత్తా చాటుతుండగా... డిఫెండింగ్ చాంపియన్ వెర్స్టాపెన్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక జట్ల విషయానికి వస్తే రెడ్బుల్ నాలుగో స్థానంలో ఉంది. ఇటీవల బ్రిటన్ గ్రాండ్ప్రి సందర్భంగా... వచ్చే ఏడాది రెడ్బుల్తో కొనసాగడంపై ఇప్పుడే స్పష్టత ఇవ్వలేనని వెర్స్టాపెన్ వెల్లడించిన నేపథ్యంలో... ఆ జట్టు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో రెడ్బుల్ జట్టు నుంచి వైదొలుగుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కారు రూపకల్పనలో నిష్ణాతుడైన అడ్రియన్ రెడ్బుల్ను వీడి ఆస్టన్ మార్టిన్ జట్టుతో చేరగా... స్పోర్టింగ్ డైరెక్టర్ జొనాథన్ వెట్లీ సాబెర్కు మారాడు. ఇక గత సీజన్లో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయిన పెరెజ్ను రెడ్బుల్ జట్టు వదిలేసుకుంది. అతడి స్థానంలో లియామ్ లాసన్ను ఎంచుకుంది. 32 ఏళ్ల వయసులోనే... 1997లో డ్రైవర్గా కెరీర్ ప్రారంభించిన హార్నర్ 2005లో రెడ్బుల్ బాధ్యతలు చేపట్టే నాటికి అతడి వయసు కేవలం 32 సంవత్సరాలే. పిన్న వయసులోనే పెద్ద బాధ్యతలు అందుకున్న హార్నర్ రెండు దశాబ్దాల పాటు వాటిని సమర్థవంతంగా నిర్వర్తించాడు. ఆరంభంలో ‘పార్టీ టీమ్’గా ముద్ర పడ్డ జట్టును... వరుస విజయాలు సాధించే స్థాయికి తీసుకొచ్చాడు. హార్నర్ హయాంలో 2009లో తొలిసారి రెడ్బుల్ డ్రైవర్ వెటల్ చైనా గ్రాండ్ ప్రిలో విజయం సాధించగా... ఆ తర్వాత 2010 నుంచి వరుసగా నాలుగేళ్ల పాటు అతడు డ్రైవర్స్ చాంపియన్గా నిలిచాడు. 2016లో రెడ్బుల్ తరఫున మ్యాక్స్ వెర్స్టాపెన్ అరంగేట్రం చేయగా... ట్రాక్పై అడుగుపెట్టిన తొలి రేసు స్పానిష్ గ్రాండ్ ప్రిలో విజేతగా నిలిచిన ఈ ఘనత సాధించిన పిన్న వయస్కుడి (18 సంవత్సరాలు)గా రికార్డు సృష్టించాడు. 2019లో నెట్ఫ్లిక్స్లో విడుదలైన ‘డ్రైవ్ టు సరై్వవ్’ తొలి సీజన్ హార్నర్కు పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చింది. -
జ్యోతి సురేఖరిషభ్ జోడీ ప్రపంచ రికార్డు
మాడ్రిడ్: ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్–4 టోర్నమెంట్లో భారత జోడీ వెన్నం జ్యోతి సురేఖ–రిషభ్ యాదవ్ కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. కాంపౌండ్ విభాగం క్వాలిఫయింగ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో జ్యోతి సురేఖ (ఆంధ్రప్రదేశ్), రిషభ్ యాదవ్ (హరియాణా) ద్వయం 1431 పాయింట్లు స్కోరు చేసింది. తద్వారా 2023 యూరోపియన్ గేమ్స్లో 1429 పాయింట్లతో టాంజా జెలెన్థియెన్–మథియాస్ ఫులర్టన్ (డెన్మార్క్) నెలకొల్పిన ప్రపంచ రికార్డును సురేఖ–రిషభ్ ద్వయం బద్దలు కొట్టింది. మహిళల క్వాలిఫయింగ్లో జ్యోతి సురేఖ 715 పాయింట్లు ... పురుషుల క్వాలిఫయింగ్లో రిషభ్ 716 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచారు. ఫైనల్లో సురేఖ బృందం జ్యోతి సురేఖ, పర్ణీత్ కౌర్, ప్రీతికలతో కూడిన భారత మహిళల జట్టు కాంపౌండ్ టీమ్ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వాలిఫయింగ్లో భారత జట్టు 2116 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి నేరుగా క్వార్టర్ ఫైనల్కు ‘బై’ పొందింది. క్వార్టర్ ఫైనల్లో సురేఖ బృందం 235–226తో ఎల్ సాల్వడోర్ జట్టుపై... సెమీఫైనల్లో 230–226తో ఇండోనేసియాపై గెలిచింది. -
తొలిసారి సెమీస్లోకి...
లండన్: ఐదు గ్రాండ్స్లామ్ టోర్నీ టైటిల్స్ విజేత ఇగా స్వియాటెక్ (పోలాండ్) ఆరో ప్రయత్నంలో... ప్రపంచ మాజీ నాలుగో ర్యాంకర్ బెలిండా బెన్చిచ్ (స్విట్జర్లాండ్) తొమ్మిదో ప్రయత్నంలో... తొలిసారి వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో సెమీఫైనల్కు అర్హత సాధించారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ స్వియాటెక్ 6–2, 7–5తో 19వ ర్యాంకర్ సమ్సోనోవా (రష్యా)పై... 35వ ర్యాంకర్ బెన్చిచ్ 7–6 (7/3), 7–6 (7/2)తో 7వ ర్యాంకర్ మిరా ఆంద్రీవా (రష్యా)పై గెలుపొందారు. సెమీస్లో సినెర్తో జొకోవిచ్ ‘ఢీ’ పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్వన్ యానిక్ సినెర్ (ఇటలీ), ఏడుసార్లు చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా) సెమీఫైనల్లోకి ప్రవేశించారు. క్వార్టర్ ఫైనల్స్లో టాప్ సీడ్ సినెర్ 2 గంటల 19 నిమిషాల్లో 7–6 (7/2), 6–4, 6–4తో పదో సీడ్ బెన్ షెల్టన్ (అమెరికా)ను ఓడించగా... జొకోవిచ్ 3 గంటల 11 నిమిషాల్లో 6–7 (6/8), 6–2, 7–5, 6–4తో 22వ సీడ్ ఫ్లావియా కొ»ొల్లి (ఇటలీ)పై విజయం సాధించారు. రేపు జరిగే సెమీఫైనల్స్లో అల్కరాజ్ (స్పెయిన్)తో టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా); సినెర్తో జొకోవిచ్ తలపడతారు. -
రైజింగ్ ‘గ్రాండ్’ స్టార్
టెన్నిస్ రాకెట్ చేతపట్టిన ప్రతి ప్లేయర్ గ్రాండ్స్లామ్ ఆడాలనే కలలు కంటాడు. అందులోనూ 148 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన వింబుల్డన్ కోర్టులో అడుగు పెట్టాలనిఅందరికీ ఉంటుంది. కానీ దాన్ని కొందరు మాత్రమే నిజం చేసుకుంటారు. నాలుగు గ్రాండ్స్లామ్ టోర్నీలలో వింబుల్డన్కు ఉన్న క్రేజే వేరు. నిగనిగలాడే పచ్చిక కోర్టులు... ఎంత గొప్ప ప్లేయర్లయినా తెలుపు రంగు దుస్తులతోనే ఆడాలన్న నిబంధన... దీనిని ప్రతి ఒక్కరూ పాటించడం... ఇదొక అనిర్వచనీయ అనుభూతి. లండన్లోని ఆల్ ఇంగ్లండ్ క్లబ్లో నిర్వహించే ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఈసారి మన హైదరాబాద్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ (Bollipalli Rithvik Choudary) బరిలోకి దిగాడు. తొలి అడ్డంకిని దాటి రెండో రౌండ్కు చేరిన రిత్విక్... భవిష్యత్తుపై భరోసా పెంచుతున్నాడు. ఇప్పటి వరకు ముగ్గురు భారతీయులు మాత్రమే వింబుల్డన్ డబుల్స్ విభాగంలో విజేతలుగా నిలవగా... ఎప్పటికైనా ఇక్కడ చాంపియన్గా నిలవడమే తన జీవిత లక్ష్యమని రిత్విక్అంటున్నాడు. – సాక్షి క్రీడావిభాగం అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సాధించాలని చిన్నప్పటి నుంచి కలలు కన్న బొల్లిపల్లి రిత్విక్చౌదరీ కెరీర్లో రెండు ఏటీపీ–250 టోర్నీ డబుల్స్ టైటిల్స్ గెలిచాడు. అధిక శాతం ఆటగాళ్లు కెరీర్ తొలినాళ్లలో సింగిల్స్పై దృష్టి పెట్టి... ఇక చాలు అనుకుంటున్న దశలో డబుల్స్కు మారడం పరిపాటి. అయితే రిత్విక్మాత్రం అందుకు భిన్నంగా కెరీర్ ఆరంభంలోనే తన లక్ష్యాలపై స్పష్టత ఏర్పరచుకున్నాడు. తన ఆటతీరుకు డబుల్స్ అనుకూలంగా ఉంటుందని భావించిన రిత్విక్సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాడు. ఫలితంగా 24 ఏళ్ల వయసులోనే రెండు ఏటీపీ–250 టైటిల్స్ అతడి ఖాతాలో చేరాయి. ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్లో ప్రస్తుతం ప్రపంచ 79వ ర్యాంక్లో ఉన్న ఈ హైదరాబాదీ... ఈ ఏడాది వరుసగా మూడు గ్రాండ్స్లామ్ టోర్నమెంట్లలోనూ బరిలోకి దిగి నిలకడ కనబర్చాడు. ఆ్రస్టేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్లలో తొలి రౌండ్లోనే వెనుదిరిగిన రిత్విక్ వింబుల్డన్లో మాత్రం రెండో రౌండ్కు చేరుకున్నాడు. తొలిసారి వింబుల్డన్ బరిలోకి దిగడం చాలా ఆనందంగా ఉందన్న రిత్విక్... దీని వెనక తన తల్లిదండ్రులు ప్రతాప్, లక్ష్మీ త్యాగాలు ఎన్నో ఉన్నాయని పేర్కొన్నాడు. ప్రపంచంలో అత్యుత్తమ టోర్నమెంట్లో తల్లిదండ్రుల సమక్షంలో మ్యాచ్ నెగ్గడం మరిచిపోలేని అనుభూతి అని అన్నాడు. డ్యాన్సింగ్, డ్రాయింగ్ కాదని... క్రికెట్ను మతంలా భావించే మన దేశంలో... అందరిలాగే రిత్విక్కూడా పెద్దయ్యాక ప్రొఫెషనల్ క్రికెటర్గా మారాలనుకున్నాడు. ఏక కాలంలో అనేక అంశాలపై ఆసక్తి కనబరిచే పిల్లల్లాగే రిత్విక్పసితనంలో అన్నీ చేస్తూ హైపర్ యాక్టివ్గా ఉండేవాడు. డ్యాన్సింగ్, డ్రాయింగ్ ఇలా అన్నీట్లో ముందుండేవాడు. దీంతో అతడిని ఏదైనా ఆటలో శిక్షణ ఇప్పించాలని తల్లిదండ్రులు భావించారు. క్రికెట్ నేర్పించాలని అనుకున్నా... రిత్విక్వయసు మరీ చిన్నది కావడంతో బంతితో దెబ్బలు తగులుతాయేమోననే భయంతో తల్లిదండ్రులు అతడిని ఇంటికి సమీపంలోని టెన్నిస్ కోచింగ్ సెంటర్లో చేర్పించారు.సికింద్రాబాద్లోని రైల్వే రిక్రియేషన్ క్లబ్ మైదానం సమీపంలోని ‘ద స్కూల్ ఆఫ్ పవర్ టెన్నిస్’ సెంటర్లో కోచ్ సీవీ నాగరాజ్ వద్ద ఓనమాలు నేర్చుకున్న రిత్విక్అండర్–12, అండర్–16 స్థాయిలో జాతీయ నంబర్వన్గా నిలిచాడు. ఒలింపియన్, భారత డేవిస్కప్ జట్టు మాజీ సభ్యుడు, వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో ఆడిన విష్ణువర్ధన్, ఆసియా క్రీడల్లో, డేవిస్కప్లో, గ్రాండ్స్లామ్ టోర్నీల్లో ఆడిన సాకేత్ మైనేని కూడా ఒకప్పుడు ‘ద స్కూల్ ఆఫ్ పవర్ టెన్నిస్’ సెంటర్లోనే శిక్షణ తీసుకున్నారు. కోచ్ నాగరాజ్ వద్ద క్రమం తప్పకుండా తన ఆటకు మెరుగులు దిద్దుకున్న రిత్విక్ అంచలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నాడు. ప్రపంచంలో ఎన్ని టెన్నిస్ టోర్నీలు ఉన్నా వింబుల్డన్ మాత్రం ప్రత్యేకమని రిత్విక్తల్లి లక్ష్మి వెల్లడించారు. వింబుల్డన్ అధికారిక వెబ్సైట్ నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో లక్ష్మి... రిత్విక్ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. స్టెఫీ గ్రాఫ్, పీట్ సంప్రాస్, లియాండర్ పేస్, మహేశ్ భూపతి, సానియా మీర్జా (Sania Mirza) వంటి దిగ్గజ ఆటగాళ్లు విజేతలుగా నిలిచిన చోట తమ కుమారుడు కూడా ఆడటం మాటల్లో వర్ణించలేని అనుభూతి అని ఆమె అన్నారు. ఆర్థిక ఇబ్బందులకు ఎదురొడ్డి... టెన్నిస్ బాగా ఖర్చుతో కూడుకున్న క్రీడ కావడంతో ఒక దశలో రిత్విక్ శిక్షణకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే తమ కుమారుడి కెరీర్కన్నా తమకు ఏదీ ఎక్కువ కాదనుకున్న ఆ తల్లిదండ్రులు... రిత్విక్ లక్ష్యం కోసం అన్నీ వదిలేసుకున్నారు. ఎదుగుతున్న క్రమంలో అతడి ఆటతీరు ఆ నమ్మకాన్నివ్వగా... ఒక్కసారి ప్రొఫెషనల్ కెరీర్ ప్రారంభించాక ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. ‘వింబుల్డన్ ఆడుతున్నానని తెలిసినప్పుడు నా కన్నా మా అమ్మానాన్నే ఎక్కువగా సంతోషించారు. చిన్నప్పటి నుంచి ఇక్కడ ఆడాలని ఎన్నో కలలు కన్నా. ఇప్పటికి అది సాధ్యపడింది. దీని వెనక మా కుటుంబం మొత్తం కృషి ఉంది. ఈ విజయం నా ఒక్కడిది కాదు ఇందులో మా అమ్మ, నాన్న, అమ్మమ్మ పాత్ర ఎంతో ఉంది’ అని తొలి రౌండ్ విజయానంతరం రిత్విక్అన్నాడు. కొలంబియాకు చెందిన నికోలస్ బరియెంటోస్తో కలిసి పురుషుల డబుల్స్ బరిలోకి దిగిన రిత్విక్... రెండో రౌండ్లో ఆరో సీడ్ జోడీ జో సాలిస్బరీ–నీల్ స్కప్స్కీ (బ్రిటన్) చేతిలో పోరాడి ఓడిపోయారు. రిత్విక్వింబుల్డన్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించడంతో... చిన్నప్పటి నుంచి కన్న కల నిజమైనట్లు అనిపించింది. ప్రపంచంలో ఎన్ని టోర్నమెంట్లు ఉన్నా... వింబుల్డన్ అంటే వింబుల్డనే. ఆటలో హుందాతనానికి ఇది గొప్ప నిదర్శనం. ప్రపంచంలోని అత్యుత్తమ టోర్నీలో రిత్విక్ ఆడతాడని కలలో కూడా ఊహించలేదు. అందుకే లండన్లో అడుగు పెట్టిన మూడు రోజుల తర్వాత కూడా నమ్మశక్యంగా అనిపించలేదు. సంప్రాస్, స్టెఫీ గ్రాఫ్ వంటి దిగ్గజాలు ఆడిన చోట రిత్విక్ బరిలోకి దిగడం నాకెంతో గర్వంగా ఉంది. – లక్ష్మి, రిత్విక్తల్లి రిత్విక్ప్రొఫైల్పుట్టిన తేదీ, స్థలం: 17–1–2001; హైదరాబాద్ ఎత్తు: 6 అడుగుల 2 అంగుళాలు బరువు: 85 కేజీలు ప్రొఫెషనల్గా మారిన ఏడాది: 2022 డబుల్స్లో కెరీర్ బెస్ట్ ర్యాంక్: 65 (మార్చి;2025లో) ఏటీపీ టూర్లో నెగ్గిన డబుల్స్ టైటిల్స్: 2 (అల్మాటీ ఓపెన్–250 టోర్నీ; చిలీ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీ) ఏటీపీ చాలెంజర్ టూర్ టైటిల్స్: 5 ఐటీఎఫ్ సర్క్యూట్లో నెగ్గిన టైటిల్స్: 6 -
సబలెంకా శ్రమించి...
లండన్: ఈ ఏడాది వరుసగా మూడో గ్రాండ్స్లామ్ టోర్నీలో ఫైనల్ చేరేందుకు బెలారస్ స్టార్ సబలెంకా మరో విజయం దూరంలో నిలిచింది. ఈ సంవత్సరం ఆ్రస్టేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీల్లో ఫైనల్కు చేరి రన్నరప్తో సరిపెట్టుకున్న సబలెంకా... అదే జోరును వింబుల్డన్ టోర్నీలోనూ కొనసాగించి ఈ టోర్నీలో మూడోసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సబలెంకా 4–6, 6–2, 6–4తో ప్రపంచ 104వ ర్యాంకర్ లౌరా సిగెముండ్ (జర్మనీ)పై కష్టపడి గెలిచింది. 2 గంటల 54 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సబలెంకాకు 37 ఏళ్ల సిగెముండ్ నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైంది. క్వార్టర్ ఫైనల్ చేరే క్రమంలో ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోని సబలెంకా ఈ మ్యాచ్లో తొలి సెట్ను చేజార్చుకుంది. అయితే రెండో సెట్లో తేరుకున్న సబలెంకా మూడుసార్లు ప్రత్యర్థి సర్వీస్ను బ్రేక్ చేసింది. సెట్ను 6–2తో దక్కించుకొని మ్యాచ్లో నిలిచింది. మూడో సెట్లో ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. చివరకు పదో గేమ్లో సిగెముండ్ సర్వీస్ను బ్రేక్ చేసిన సబలెంకా విజయాన్ని ఖరారు చేసుకుంది.మ్యాచ్ మొత్తంలో రెండు ఏస్లు సంధించిన సబలెంకా నాలుగు డబుల్ ఫాల్ట్లు చేసింది. నెట్ వద్దకు 43 సార్లు దూసుకొచ్చి 25 సార్లు పాయింట్లు గెలిచింది. 29 విన్నర్స్ కొట్టిన ఈ బెలారస్ స్టార్ 36 అనవసర తప్పిదాలు చేసింది. తన సర్వీస్ను ఆరుసార్లు కోల్పోయి ప్రత్యర్థి సర్వీస్ను ఎనిమిదిసార్లు బ్రేక్ చేసింది. 2021, 2023లలో వింబుల్డన్లో సెమీఫైనల్ చేరి ఓడిపోయిన సబలెంకా రేపు జరిగే సెమీఫైనల్లో అనిసిమోవాతో ఆడుతుంది. తొలిసారి సెమీస్లో అనిసిమోవా నాలుగోసారి వింబుల్డన్ టోర్నీలో ఆడుతున్న ప్రపంచ 12వ ర్యాంకర్ అనిసిమోవా (అమెరికా) తొలిసారి సెమీఫైనల్కు అర్హత సాధించింది. క్వార్టర్ ఫైనల్లో అనిసిమోవా 6–1, 7–6 (11/9)తో పావ్లీచెంకోవా (రష్యా)పై నెగ్గింది. 22వసారి గ్రాండ్స్లామ్ టోర్నీ ఆడిన అనిసిమోవా 2019లో ఫ్రెంచ్ ఓపెన్లో సెమీఫైనల్కు చేరుకుంది. అల్కరాజ్ అలవోకగా... పురుషుల సింగిల్స్లో డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్ (స్పెయిన్) వరుసగా మూడో ఏడాది సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. కామెరాన్ నోరి (బ్రిటన్)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో అల్కరాజ్ 6–2, 6–3, 6–3తో గెలుపొందాడు. 99 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో అల్కరాజ్ 13 ఏస్లు సంధించి ప్రత్యర్థి సర్వీస్ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. సెమీఫైనల్లో అమెరికా ప్లేయర్, ప్రపంచ ఐదో ర్యాంకర్ టేలర్ ఫ్రిట్జ్తో అల్కరాజ్ తలపడతాడు. మరో క్వార్టర్ ఫైనల్లో ఫ్రిట్జ్ 6–3, 6–4, 1–6, 7–6 (7/4)తో ఖచనోవ్ (రష్యా)పై గెలిచి తన కెరీర్లో తొలిసారి వింబుల్డన్లో సెమీఫైనల్కు చేరాడు. గట్టెక్కిన సినెర్ సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్వన్ యానిక్ సినెర్ (ఇటలీ) కి అదృష్టం కలిసొచ్చింది. దిమిత్రోవ్ (బల్గేరియా) తో జరిగిన మ్యాచ్లో సినెర్ తొలి రెండు సెట్లను 3–6, 5–7తో కోల్పోయాడు. మూడో సెట్లో స్కోరు 2–2తో సమంగా ఉన్నపుడు దిమిత్రోవ్ గాయపడ్డాడు. దాంతో దిమిత్రోవ్ ఆటను కొనసాగించలేకపోవడంతో సినెర్ను విజేతగా ప్రకటించారు. గత ఐదు గ్రాండ్స్లామ్ టోర్నీలలో దిమిత్రోవ్ గాయాల కారణంగా వైదొలగడం గమనార్హం. -
పట్టుదల...పోరాటం...అద్భుతం
జనవరి 2022... ఆతిథ్య దేశం హోదాలో భారత మహిళల ఫుట్బాల్ జట్టు ఆసియా కప్లో తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. అయితే ఒక్కసారిగా ప్రపంచాన్ని తలకిందులు చేసిన కోవిడ్ మహమ్మారి ప్రభావం ఈ జట్టుపై కూడా పడింది. చైనీస్ తైపీతో తొలి మ్యాచ్ సమయానికి కోవిడ్ కారణంగా మన జట్టుకు కనీసం 13 మంది ప్లేయర్లు కూడా అందుబాటులో లేకుండా పోయారు. దాంతో నిబంధనల ప్రకారం మొదటి మ్యాచ్ నుంచే కాకుండా మొత్తం టోర్నీ నుంచి టీమ్ తప్పుకోవాల్సి వచ్చింది. క్వాలిఫయింగ్ పోటీలు లేని సమయంలో 2003లో చివరిసారిగా ఆసియా కప్కు నేరుగా అర్హత సాధించిన మన జట్టు ఈసారి ఎంతో ఉత్సాహంతో, పట్టుదలతో సొంతగడ్డపై ఆసియా కప్కు సన్నద్ధమైంది. అయితే అనూహ్య పరిణామాలు ఎదురు కావడం మన మహిళలకు ఇది తీరని వేదన మిగిల్చింది. ఇప్పుడు మూడున్నరేళ్ల తర్వాత క్వాలిఫయింగ్ టోర్నీలో సత్తా చాటి మన మహిళలు దర్జాగా ఆసియా కప్కు అర్హత సాధించారు. అయితే గత టోర్నీ, ప్రస్తుత క్వాలిఫికేషన్కు మధ్య ఎంతో పోరాటం ఉంది. సవాళ్లు, ప్రతికూలతలు అధిగమించి అమ్మాయిలు సాధించిన ఈ గెలుపునకు ఎంతో ప్రత్యేకత ఉంది. సాక్షి క్రీడా విభాగం : ఆసియా కప్లో ఆడకుండానే బరి నుంచి తప్పుకోవడం మొదలు ఇప్పుడు అర్హత సాధించడం వరకు భారత మహిళల ఫుట్బాల్ జట్టుకు ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి. సరైన దిశా నిర్దేశం లేకుండా, అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) తమ బాధ్యతను మరిచి పట్టించుకోకపోవడంతో అనాథలా కనిపించింది. అసలు జాతీయ జట్టు ఉందనే విషయాన్ని కూడా అంతా మర్చిపోయారు. ఒకటా, రెండా ఎన్నో పరిణామాలు మహిళల ఫుట్బాల్ పతనానికి దారి తీశాయి. అండర్–17 జట్టు కోచ్పై లైంగిక వేధింపుల ఆరోపణలు, ‘శాఫ్’ టోర్నీ సెమీస్లో నేపాల్ చేతిలో పరాజయం, అండర్–17 వరల్డ్ కప్లో ఆడిన మూడు మ్యాచ్లలో ఓడి నిష్క్రమణ, ఆసియా క్రీడల్లో చివరి స్థానం, ఒలింపిక్ క్వాలిఫయర్స్లో ఆఖరి స్థానం, పేరుకే ఇండియన్ ఉమెన్ లీగ్ ఉన్నా కనీస సౌకర్యాలు కల్పించలేని ఫెడరేషన్... ఇలా మహిళల జట్టుకు సమస్యలు నిర్విరామంగా సాగుతూనే వచ్చాయి. ఇలాంటి స్థితి నుంచి పైకి లేచి మన టీమ్ ఆసియా కప్కు అర్హత సాధించడం చిన్న విషయమేమీ కాదు. నాలుగు మ్యాచ్లలో నాలుగూ గెలవడం అసాధారణ ప్రదర్శనగా చెప్పవచ్చు. ముఖ్యంగా కొంత మంది ప్లేయర్లకు వ్యక్తిగతంగా కూడా ఇది ఎంతో ప్రత్యేక ఘనత. అందుకే థాయ్లాండ్తో మ్యాచ్ గెలవగానే వారంతా కన్నీళ్లపర్యంతమయ్యారు. వారి భావోద్వేగాలను నిలువరించడం ఎవరి వల్లా కాలేదు. వరుసగా కోచ్ల మార్పు... భారత మహిళల జట్టుకు ఎదురైన ఇటీవలి అనుభవాలు చూస్తే టీమ్ ఎలా నడుస్తోందో అర్థమవుతుంది. సంవత్సరాల తరపడి స్వయంగా ఫెడరేషన్ నిర్వహించే లీగ్లో కూడా ఆట జరుగుతుందా లేదా అనే సందేహాలు, జాతీయ శిబిరానికి వెళ్లినా తర్వాతి రోజు కోచ్ వస్తాడా లేదా అనుమానం, అసలు మహిళలుగా తమకు కనీస భద్రత కూడా ఉంటుందా లేదా అని పరిస్థితిని వారు దాటుకుంటూ వచ్చారు. ఏఐఎఫ్ఎఫ్ వరుసగా కోచ్లను మారుస్తూ పోయింది. డెనర్బై, సురేన్ ఛెత్రి, ఛోబా దేవి, సంతోష్ కశ్యప్, జోకిమ్ అలెగ్జాండర్సన్... ఇలా కోచ్లు రావడం, పోవడం జరిగిపోయాయి. చివరకు క్రిస్పిన్ ఛెత్రి చేతుల్లోకి కోచింగ్ బాధ్యతలు వచ్చాయి. అతనికి అసిస్టెంట్గా పీవీ ప్రియను తీసుకున్నారు. ఆసియా కప్ కోసం మన జట్టు థాయ్లాండ్లో అడుగు పెట్టినప్పుడు కూడా ఎలాంటి అంచనాలు లేవు. 2022లో కోవిడ్ కారణంగా టోర్నీకి దూరమైన జట్టులో ఉన్నవారిలో చాలామంది ఈ సారి కూడా టీమ్లో ఉన్నారు. నాటి గాయం వారి మనసుల్లో ఇంకా మిగిలే ఉంది.కోచ్పై లైంగిక వేధింపుల ఆరోపణ వివాదం వచ్చినప్పుడు అండర్–17 టీమ్లో భాగమైన హేమమ్ షిల్కీ దేవి, లిండా కోమ్, మార్టినా తోక్చోమ్ ఇప్పుడు సీనియర్ టీమ్లో ఉన్నారు. పురుషుల ఫుట్బాల్ జట్టు చిత్తుగా ఓడిన సందర్భాల్లోనూ వార్తల్లో ఉంటుండగా... మహిళల టీమ్ను అసలు ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఇలాంటి స్థితిలో వారు తమ పోరాటాన్ని మొదలు పెట్టారు. పటిష్ట ప్రత్యర్థి ని పడగొట్టి... మంగోలియాపై 13–0తో, తిమోర్ లెస్టెపై 4–0తో, ఆపై ఇరాక్పై 5–0తో ఘన విజయం... అంచనాలకు భిన్నంగా చక్కటి ప్రదర్శనతో మన మహిళలు వరుసగా మూడు విజయాలు సాధించారు. అయితే సరే ఆసియా కప్ క్వాలిఫికేషన్పై ఇంకా సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే చివరి లీగ్లో ఆతిథ్య థాయ్లాండ్ ప్రత్యరి్థగా ఎదురైంది. ‘ఫిఫా’ ర్యాంకింగ్స్లో మనకంటే ఎంతో ముందుండటం మాత్రమే కాదు, ఈ టీమ్ గత రెండు ‘ఫిఫా’ వరల్డ్ కప్లు కూడా ఆడింది. పైగా పెద్ద సంఖ్యలో విదేశీ ఆటగాళ్లు ఉండటంతో పాటు ప్రముఖ జపాన్ కోచ్ ఫుటోషీ ఐకెడా కోచింగ్ ఇస్తున్నాడు. మనకంటే బలమైన థాయ్లాండ్ జట్టు ఆరంభంలోనే దూకుడుగా ఆడి గోల్పోస్ట్పై దాడులు చేస్తూ ఆధిపత్యం ప్రదర్శించింది. అయితే భారత్ పదునైన డిఫెన్స్తో వాటిని నిలువరించగలిగింది. తాము ఇంత కాలంగా పడిన ఆవేదన, చేసిన పోరాటం వారిలో ఒక్కసారిగా స్ఫూర్తి నింపినట్లుంది. అంతే... ఆ తర్వాత జట్టులో ఒక్కసారిగా కొత్త ఉత్సాహం వచ్చింది. ప్రత్యర్థి ఎవరనేది పట్టించుకోకుండా చివరి వరకు పట్టు విడవకుండా చెలరేగిన జట్టు విజయాన్ని అందుకుంది.అన్ని రకాలుగా సన్నద్ధమై...మ్యాచ్ ముగిశాక సంగీత బస్ఫోర్ ఆనందానికి హద్దుల్లేవు. రెండు గోల్స్తో ఆమె ఈ చిరస్మరణీయ విజయంలో కీలకపాత్ర పోషించింది. కోవిడ్ కారణంగా 2022 ఆసియా కప్కు జట్టుకు దూరంగా కాగా, అంతకుముందే గాయంతో సంగీత టోర్నీ నుంచి తప్పుకుంది. 2019 నుంచి జట్టులో ప్రధాన సభ్యురాలిగా ఉన్న ఆమె ఆపై కోలుకోవడానికి ఏడాది పట్టింది. అదే సమయంలో ఆమె తండ్రిని కూడా కోల్పోయింది. సీనియర్ ప్లేయర్ అయిన తనకు భవిష్యత్తులో మళ్లీ ఎప్పుడు ఈ స్థాయిలో విజయానందం వరిస్తుందో అంటూ ఆమె ఆనందభాష్పాలు రాల్చింది. టోర్నీకి ముందు తమదైన రీతిలో ప్లేయర్లు సన్నద్ధమయ్యారు. మనీషా కళ్యాణ్, జ్యోతి చౌహాన్, తెలంగాణ ప్లేయర్ గుగులోత్ సౌమ్య యూరోపియన్ క్లబ్స్ ట్రయల్స్కు వెళ్లి కాంట్రాక్ట్లు పొంది తమ ఆటకు పదును పెట్టారు. మిగిలిన వారు ఐ–లీగ్లో బరిలోకి దిగి సాధ్యమైనంత ఎక్కువగా ప్రాక్టీస్పై దృష్టి పెట్టారు. ఈ విజయం కచ్చితంగా ఏఐఎఫ్ఎఫ్ది మాత్రం కాదు. తమ శక్తి, స్వేదం, కన్నీళ్లు ధారబోసిన 23 మంది మహిళా ఫుట్బాలర్లదే. వచ్చే ఏడాది ఆసియాకప్లో కూడా ఇదే రీతిలో సత్తా చాటితే వరల్డ్ కప్లో పాల్గొనే స్వప్నం కూడా సాకారమవుతుంది. -
రెండో రౌండ్లో వంతిక అగర్వాల్
బతూమి (జార్జియా): మహిళల ప్రపంచకప్ నాకౌట్ చెస్ టోర్నమెంట్లో భారత క్రీడాకారిణులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. వంతిక అగర్వాల్, పద్మిని రౌత్, పీవీ నందిత రెండో రౌండ్లోకి ప్రవేశించగా... కిరణ్ మనీషా మొహంతి తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. కె.ప్రియాంక భవిత్యం నేడు జరిగే టైబ్రేక్ గేమ్లలో తేలనుంది. తొలి రౌండ్లో వంతిక 1.5–0.5తో లాలా షొహోర్దోవా (తుర్క్మెనిస్తాన్)పై, పద్మిని 2–0తో జాంగ్ లాన్లిన్ (చైనా)పై, నందిత 2–0తో ఒరిట్జ్ అనాహి (ఈక్వెడార్)పై గెలుపొందారు. కిరణ్ మనీషా 0.5–1.5తో సాంగ్ యుజిన్ (చైనా) చేతిలో ఓడిపోయింది. తొలి రౌండ్లోని రెండు గేమ్లు ముగిశాక ప్రియాంక–గాల్ జొసోకా (హంగేరి) 1–1తో సమంగా నిలిచారు. షొహోర్దోవాతో ఆదివారం తొలి గేమ్ను ‘డ్రా’ చేసుకున్న వంతిక సోమవారం జరిగే రెండో గేమ్లో 29 ఎత్తుల్లో నెగ్గింది. జాంగ్ లాన్లిన్పై తొలి గేమ్లో గెలిచిన పద్మిని సోమవారం జరిగిన రెండో గేమ్లో 34 ఎత్తుల్లో... అనాహిపై తొలి గేమ్లో నెగ్గిన నందిత రెండో గేమ్లో 64 ఎత్తుల్లో విజయం అందుకున్నారు. సాంగ్ యుజిన్ చేతిలో తొలి గేమ్లో ఓడిపోయిన మనీషా రెండో గేమ్ను 30 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకొని ఇంటిదారి పట్టింది. -
ఐసీసీ సీఈఓగా సంజోగ్ గుప్తా
దుబాయ్: భారత మీడియా మొఘల్ సంజోగ్ గుప్తా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ (సీఈఓ)గా నియమితులయ్యారు. ఈ ఏడాది పాకిస్తాన్ ఆతిథ్యమిచ్చిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆ్రస్టేలియాకు చెందిన జెఫ్ అలర్డైస్ సీఈఓ పదవి నుంచి తప్పుకున్నారు. అప్పటి నుంచి ఈ పదవి ఖాళీగానే ఉండటంతో సంజోగ్ గుప్తాతో భర్తీ చేశారు. జియోస్టార్ నెట్వర్క్కు సీఈఓగా వ్యవహరించిన సంజోగ్కు మీడియా రంగంలో విశేషానుభవం ఉంది. దీంతో పాటు భారత్కే చెందిన జై షా ఐసీసీ చైర్మన్గా ఉండటం కూడా అంతర్జాతీయ క్రికెట్ వ్యవహారాలు చక్కబెట్టే పదవిని చేపట్టేందుకు కలిసొచ్చింది. అంతమాత్రాన పూర్తిగా జై షా చలవే అనలేం. ఎందుకంటే ఏళ్ల తరబడి మీడియా రంగంలో ఆయన విశేష కృషి చేశారు. అందువల్లేనేమో 2500 పైచిలుకు దరఖాస్తు చేసుకుంటే సంజోగ్నే సీఈఓ పదవి వరించింది. ఐసీసీలోని శాశ్వత, అనుబంధ సభ్యులైన 25 దేశాల నుంచి వేల సంఖ్యలో ఈ పదవి కోసం పోటీపడ్డారు. అనుభవం, పనితీరు ఆధారంగా ఒక్కో దేశం నుంచి 12 మంది చొప్పున తుది జాబితాకు ఖరారు చేయగా ఇందులో సంజోగ్ గుప్తా అర్హుడని ఐసీసీ కమిటీ భావించింది. ఈ నామినేషన్ల కమిటీలో ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖాజా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు చైర్మన్ రిచర్డ్ థాంప్సన్, లంక క్రికెట్ అధ్యక్షుడు షమ్మీ సిల్లా, భారత బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ సిఫార్సు మేరకే ఐసీసీ చైర్మన్ జై షా... సంజోగ్ను కొత్త సీఈఓగా నియమించారు. స్పోర్ట్స్ జర్నలిస్ట్గా వచ్చి... ఈ జనవరిలో పదవి నుంచి వైదొలిగిన అలర్డైస్ వారసుడిగా సంజోగ్ గుప్తా త్వరలోనే పదవీ బాధ్యతలు చేపడతారు. ఐసీసీ చైర్మన్ తర్వాత రెండో ప్రాధాన్య పదవి సీఈఓ. దీంతో ఈ రెండు కీలకమైన పదవుల్లో భారతీయులే కొలువుదీరడం విశేషం. జై షా భారత హోం మంత్రి అమిత్ షా తనయుడు. కానీ గుప్తా మాత్రం ఢిల్లీలోని ద ట్రైబ్యున్ పత్రికలో ఓ సాధారణ స్పోర్ట్స్ జర్నలిస్టుగా కెరీర్ను ప్రారంభించి మీడియా మొఘల్గా ఎదిగాడు. 2010లో స్టార్ ఇండియా (ప్రస్తుత జియో స్టార్)లో సహాయ ఉపాధ్యక్షుడిగా చేరిన సంజోగ్ తన నేర్పు, నైపుణ్యం, అంకితభావం, నిబద్ధతతో అంచెలంచెలుగా ఎదిగారు. కంటెంట్, ప్రొగ్రామింగ్, వ్యూహారచనతో ఓ చానెల్ నెట్వర్క్ను విస్తరించారు. మొదటి పదేళ్లు ఐపీఎల్ ‘సోనీ’ నెట్వర్క్లో ప్రసారమైంది. తర్వాత కోట్లు గుమ్మరించి ఐపీఎల్ సహా, ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్), ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్బాల్ (ఐఎస్ఎల్) సహా ఎన్నో ప్రీమియర్ లీగ్ను, గ్రాండ్స్లామ్ టోర్నీల ప్రసార హక్కుల్ని స్టార్ హస్తగతమయ్యేలా చేశారు. రిలయన్స్కు చెందిన వయాకామ్ 18 నెట్వర్క్ డిస్నీ స్టార్ను సొంతం చేసుకోవడంతో రిలయన్స్ యాజమాన్యం గతేడాది సంజోగ్ గుప్తాను సీఈఓగా నియమించింది. ఇప్పుడైతే ఏకంగా ఐసీసీలో ఏడో సీఈఓగా అంతర్జాతీయ క్రికెట్ను వ్యవహారాలను చక్కబెట్టే పనిలో పడతారు.7 ఐసీసీ సీఈఓగా నియమితుడైన ఏడో వ్యక్తి సంజోగ్ గుప్తా. గతంలో డేవిడ్ రిచర్డ్స్ (1993–2001), మాల్కం స్పీడ్ (2001–2008), హరూన్ లోర్గాట్ (2008–2012), డేవిడ్ రిచర్డ్సన్ (2012–2019), మనూ సాహ్ని (2019–2021), జెఫ్ అలర్డైస్ (2021–2025) ఈ బాధ్యతలు నిర్వర్తించారు. -
జొకోవిచ్ 16వసారి...
లండన్: రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్స్లామ్ టైటిల్ వేటలో సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ మరో అడుగు ముందుకేశాడు. వింబుల్డన్ టోర్నీలో ఏడుసార్లు చాంపియన్ జొకోవిచ్ 16వసారి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ జొకోవిచ్ 1–6, 6–4, 6–4, 6–4తో 11వ సీడ్ అలెక్స్ డిమినార్ (ఆ్రస్టేలియా)పై నెగ్గాడు. 3 గంటల 19 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో జొకోవిచ్ తొలి సెట్లో కేవలం ఒక గేమ్ మాత్రమే గెలిచాడు. అయితే రెండో సెట్ నుంచి గాడిలో పడ్డ జొకోవిచ్ ప్రత్యరి్థకి ఆధిపత్యం చలాయించే అవకాశం ఇవ్వలేదు. మ్యాచ్ మొత్తంలో ఆరు ఏస్లు సంధించిన జొకోవిచ్ ఐదు డబుల్ ఫాల్ట్లు చేశాడు. నెట్ వద్దకు 52 సార్లు దూసుకొచ్చి 35 సార్లు పాయింట్లు నెగ్గిన జొకోవిచ్ 38 విన్నర్స్ కొట్టాడు. తన సర్వీస్ను ఆరుసార్లు కోల్పోయిన జొకోవిచ్ ప్రత్యర్థి సర్వీస్ను కూడా ఆరుసార్లు బ్రేక్ చేశాడు. ఓవరాల్గా వింబుల్డన్లో 101వ విజయం నమోదు చేసిన జొకోవిచ్ కెరీర్లో 63వసారి గ్రాండ్స్లామ్ టోర్నీల్లో క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించాడు. క్వార్టర్ ఫైనల్లో ఇటలీ ప్లేయర్ ఫ్లావియో కొబోలితో జొకోవిచ్ ఆడతాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్లో కొబోలి 6–4, 6–4, 6–7 (4/7), 7–6 (7/3)తో మారిన్ సిలిచ్ (క్రొయేషియా)పై... బెన్ షెల్టన్ (అమెరికా) 3–6, 6–1, 7–6 (7/1), 7–5తో సొనెగో (ఇటలీ)పై, డిఫెండింగ్ చాంపియన్ , రెండో సీడ్ అల్కరాజ్ (స్పెయిన్) 6–7 (5/7), 6–3, 6–4, 6–4తో 14వ సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా)పై విజయం సాధించారు. -
ఒకే రోజు రెండు వరల్డ్ రికార్డులు బద్దలు
యుజీన్ (అమెరికా): మిడిల్ డిస్టెన్స్ రన్నింగ్లో తమకు తిరుగులేదని కెన్యా మహిళా అథ్లెట్లు మరోసారి నిరూపించుకున్నారు. డైమండ్ లీగ్లో భాగంగా అమెరికాలోని యుజీన్లో జరిగిన ప్రిఫోంటెయిన్ క్లాసిక్ మీట్లో ఇద్దరు కెన్యా మహిళా అథెట్లు రెండు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టారు. మూడుసార్లు ఒలింపిక్ చాంపియన్ ఫెయిత్ కిపియేగాన్ 1500 మీటర్ల విభాగంలో... పారిస్ ఒలింపిక్స్లో రెండు స్వర్ణాలు గెలిచిన బిట్రెస్ చెబెట్ 5000 మీటర్లలో కొత్త ప్రపంచ రికార్డులు సృష్టించారు. 31 ఏళ్ల కిపియేగాన్ 1500 మీటర్ల దూరాన్ని 3 నిమిషాల 48.68 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచింది.ఈ క్రమంలో గత ఏడాది పారిస్ ఒలింపిక్స్లో 3 నిమిషాల 49.04 సెకన్లతో తానే నెలకొల్పిన ప్రపంచ రికార్డును కిపియేగాన్ తిరగరాసింది. కిపియేగాన్ 2016 రియో, 2020 టోక్యో, 2024 పారిస్ ఒలింపిక్స్లో స్వర్ణ పతకాలు గెలిచి 1500 మీటర్ల విభాగంలో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. మరోవైపు 5000 మీటర్ల దూరాన్ని 25 ఏళ్ల బిట్రెస్ చెబెట్ 13 నిమిషాల 58.06 సెకన్లలో ముగించి తన పేరిట కొత్త ప్రపంచ రికార్డును లిఖించుకుంది.5000 మీటర్ల దూరాన్ని 14 నిమిషాల్లోపు పూర్తి చేసిన తొలి మహిళా అథ్లెట్గా గుర్తింపు పొందిన చెబెట్... రెండేళ్ల క్రితం ప్రిఫోంటెయిన్ క్లాసిక్ మీట్లో 14 నిమిషాల 00.21 సెకన్లతో గుడాఫ్ సెగె (ఇథియోపియా) సృష్టించిన ప్రపంచ రికార్డును సవరించింది. గత ఏడాది పారిస్ ఒలింపిక్స్లో చెబెట్ 5000, 10,000 మీటర్ల విభాగాల్లో స్వర్ణ పతకాలు నెగ్గి విశ్వ క్రీడల్లో అరుదైన ‘డబుల్’ సాధించిన మూడో అథ్లెట్గా గుర్తింపు పొందింది. -
రెడ్డి భవానీకి వైఎస్ జగన్ శుభాకాంక్షలు
ఆసియా యూత్ అండ్ జూనియర్ ఛాంపియన్షిప్లో బంగారు పతకం సాధించిన రెడ్డి భవానీకి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan Mohan Reddy) శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.కాగా విజయనగరం జిల్లాకు చెందిన రెడ్డి భవానీ ఆసియా యూత్ & జూనియర్ ఛాంపియన్షిప్లో మహిళల 48 కిలోల వెయిట్లిఫ్టింగ్ విభాగంలో పోటీపడింది. మొత్తంగా 159 కిలోల బరువునెత్తి స్వర్ణం కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా రెడ్డి భవానీకి.. వైఎస్ జగన్ సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. Hearty congratulations to Reddy Bhavani from Vizianagaram district on her stunning Gold Medal win at the Asian Youth & Junior Championships! Here’s to many more milestones and memorable victories ahead. Keep shining, Bhavani! pic.twitter.com/nNwL5I0QoG— YS Jagan Mohan Reddy (@ysjagan) July 7, 2025 -
నా స్వప్నం సాకారమైంది: నోరిస్కు నాలుగో టైటిల్
సిల్వర్స్టోన్: ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన బ్రిటిష్ గ్రాండ్ప్రి ఫార్ములావన్ రేసులో బ్రిటన్ డ్రైవర్ లాండో నోరిస్ టైటిల్ సాధించాడు. ఆదివారం జరిగిన ఈ రేసులో మెక్లారెన్ జట్టుకు చెందిన నోరిస్ నిరీ్ణత 52 ల్యాప్లను అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 1 గంట 37 నిమిషాల 15.735 సెకన్లలో ముగించి విజేతగా అవతరించాడు. సొంతగడ్డపై నోరిస్కిదే తొలి విజయం కాగా... ఈ సీజన్లో నాలుగోది.నా స్వప్నం సాకారమైంది‘సొంతనగరంలో టైటిల్ నెగ్గాలని కలలు కన్నాను. నా స్వప్నం సాకారమైంది. ఈ చిరస్మరణీయ విజయాన్ని నా మనుసులో ఎల్లవేళలా దాచుకుంటాను’ అని విజయానంతరం నోరిస్ వ్యాఖ్యానించాడు. మెక్లారెన్ జట్టుకే చెందిన ఆస్కార్ పియాస్ట్రి రెండో స్థానంలో నిలిచాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ వెర్స్టాపెన్ (రెడ్బుల్) ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు.టాప్ ర్యాంక్లో పియాస్ట్రివర్షం అంతరాయం కలిగించిన ఈ రేసులో ఏకంగా ఐదుగురు డ్రైవర్లు కిమీ ఆంటోనెలి (మెర్సిడెస్), ఐజాక్ హద్జార్ (రేసింగ్ బుల్స్), బొర్టోలెటో (స్టేక్ ఎఫ్1), లియామ్ లాసన్ (రేసింగ్ బుల్స్), కొలాపింటో (అల్పైన్ టీమ్) రేసును పూర్తి చేయలేకపోయారు. 24 రేసుల సీజన్లో ఇప్పటికి 12 రేసులు ముగిశాయి. పియాస్ట్రి 234 పాయింట్లతో టాప్ ర్యాంక్లో కొనసాగుతుండగా... 226 పాయింట్లతో నోరిస్ రెండో స్థానంలో, 165 పాయింట్లతో వెర్స్టాపెన్ మూడో స్థానంలో ఉన్నారు. సీజన్లోని తదుపరి రేసు బెల్జియం గ్రాండ్ప్రి ఈనెల 27న జరుగుతుంది.బ్రిటిష్ గ్రాండ్ప్రిలో బ్రిటన్ డ్రైవర్కే టైటిల్ లభించడం ఇది 12సారి కావడం విశేషం. గతంలో స్టిర్లింగ్ మోస్, పీటర్ కోలిన్స్, క్లార్క్, స్టీవార్ట్, హంట్, జాన్ వాట్సన్, మాన్సెల్, డామన్ హిల్, జానీ హెర్బర్ట్, డేవిడ్ కౌతార్డ్, హామిల్టన్ ఈ రేసులో గెలిచారు. -
సబలెంకా జోరు
లండన్: టైటిల్ ఫేవరెట్స్లో ఒక్కొక్కరూ వెనుదిరుగుతుండగా... మరోవైపు అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ బెలారస్ స్టార్, ప్రపంచ నంబర్వన్ సబలెంకా ముందంజ వేసింది. ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీలో టాప్ సీడ్ సబలెంకా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సబలెంకా 6–4, 7–6 (7/4)తో ఎలీసా మెర్టెన్స్ (బెల్జియం)పై విజయం సాధించింది. 122 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సబలెంకాకు రెండు సెట్లలో గట్టిపోటీ ఎదురైంది. అయితే కీలకదశలో సబెలంకా పైచేయి సాధించి వరుస సెట్లలో విజయాన్ని ఖరారు చేసుకుంది. అర డజను ఏస్లు సంధించిన సబలెంకా ఒక్కడబుల్ ఫాల్ట్ మాత్రమే చేసింది. నెట్ వద్దకు 15 సార్లు దూసుకొచ్చి 10 సార్లు పాయింట్లు గెలిచింది. తన సరీ్వస్ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సరీ్వస్ను మూడుసార్లు బ్రేక్ చేసింది. 36 విన్నర్స్ కొట్టిన సబలెంకా 18 అనవసర తప్పిదాలు చేసింది. ఆరోసారి వింబుల్డన్ టోర్నీలో ఆడుతున్న సబలెంకా 2021లో, 2023లో సెమీఫైనల్లో ని్రష్కమించింది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్ల్లో అనస్తాసియా పావ్లీచెంకోవా (రష్యా) 7–6 (7/3), 6–4తో సోనె కర్తాల్ (బ్రిటన్)పై, లౌరా సిగెముండ్ (జర్మనీ) 6–3, 6–2తో సొలానా సియెరా (అర్జెంటీనా)పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. ఫ్రిట్జ్ మూడోసారి... పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ ఐదో ర్యాంకర్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా), కామెరాన్ నోరి (బ్రిటన్), కరెన్ ఖచనోవ్ (రష్యా) క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. జోర్డాన్ థాంప్సన్ (ఆ్రస్టేలియా)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ఫ్రిట్జ్ తొలి సెట్ను 6–1తో నెగ్గి, రెండో సెట్లో 3–0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఈ దశలో గాయం కారణంగా థాంప్సన్ వైదొలిగాడు. దాంతో ఈ టోర్నీలో ఫ్రిట్జ్ మూడోసారి క్వార్టర్ ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకున్నాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్లో కామెరాన్ నోరి 4 గంటల 27 నిమిషాల్లో 6–3, 7–6 (7/4), 6–7 (7/9), 6–7 (5/7), 6–3తో నికోలస్ జారీ (చిలీ)పై, ఖచనోవ్ 6–4, 6–2, 6–3తో కామిల్ మజార్జక్ (పోలాండ్)పై గెలుపొందారు. -
డిఫెండింగ్ చాంప్ క్రెజికొవా అవుట్
లండన్: ఈ వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీలో సీడెడ్ స్టార్ల పరాజయాల పరంపర కొనసాగుతోంది. మహిళల సింగిల్స్లో డిఫెండింగ్ చాంపియన్, 17వ సీడ్ బార్బర క్రెజికొవా (చెక్ రిపబ్లిక్)కు మూడో రౌండ్లోనే చుక్కెదురైంది. ఆమెతో పాటు 11వ సీడ్ రిబాకినా (కజకిస్తాన్), 16వ సీడ్ కసట్కినా (ఆ్రస్టేలియా), లోకల్ స్టార్ ఎమ్మా రాడుకాను (బ్రిటన్)ల ఆట కూడా ముగిసింది. టాప్సీడ్ సబలెంక, ఎనిమిదో సీడ్ స్వియాటెక్, ఏడో సీడ్ అండ్రీవా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. పురుషుల సింగిల్స్లో ప్రపంచ నంబర్వన్ యానిక్ సినెర్ సునాయాస విజయంతో ప్రిక్వార్టర్స్ చేరాడు. 11వ సీడ్ డిమినార్, 19వ సీడ్ దిమిత్రోవ్లు కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మూడు గ్రాండ్స్లామ్ టైటిళ్ల చాంపియన్, టాప్ సీడ్ సినెర్ (ఇటలీ) 6–1, 6–3, 6–1తో స్పెయిన్కు చెందిన మార్టినెజ్పై వరుస సెట్లలో గెలుపొందాడు. డిమినార్ (ఆ్రస్టేలియా) 6–4, 7–6 (7/5), 6–3తో హొల్మ్గ్రెన్ (డెన్మార్క్)పై, దిమిత్రోవ్ (బల్గేరియా) 6–3, 6–4, 7–6 (7/0)తో సెబాస్టియన్ అఫ్నెర్ (ఆ్రస్టియా)పై, మారిన్ సిలిచ్ (క్రొయేషియా) 6–3, 3–6, 6–2, 6–4 జేమే మునర్ (స్పెయిన్)పై విజయం సాధించారు. 25వ గ్రాండ్స్లామ్ టైటిల్ లక్ష్యంతో బరిలోకి దిగిన సెర్బియన్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ సునాయాస విజయంతో ప్రిక్వార్టర్స్ చేరాడు. ఆరో సీడ్ జొకో 6–3, 6–0, 6–4తో కెక్మనోవిచ్ (సెర్బియా)పై విజయం సాధించాడు. క్రెజికొవా మూడో రౌండ్లోనే... చెక్ రిపబ్లిక్ స్టార్, 17వ సీడ్ క్రెజికొవా టైటిల్ నిలబెట్టుకునే పోరాటానికి పదో సీడ్ ఎమ్మా నవారో (అమెరికా) చెక్పెట్టింది. మూడో రౌండ్లో నవారో 2–6, 6–3, 6–4తో క్రెజికొవాను ఓడించింది. 2021 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ క్రెజికొవాకు ఈ ఏడాది కలిసిరావడం లేదు. ఈ సీజన్ ఆరంభ గ్రాండ్స్లామ్ ఆ్రస్టేలియా ఓపెన్కు గైర్హాజరైన ఆమె ఫ్రెంచ్ ఓపెన్లో రెండో రౌండ్లోనే వెనుదిరిగింది. ఇప్పుడు ఇక్కడా పేలవ ప్రదర్శనతోనే టోర్నీ నుంచి ని్రష్కమించింది. ఏనాడు వింబుల్డన్లో తొలిరౌండ్ అడ్డంకిని దాటలేకపోయిన క్లారా టౌసన్ (డెన్మార్క్) ఈ సారి ప్రిక్వార్టర్స్ చేరింది. ఆమె 7–6 (8/6), 6–3తో వింబుల్డన్ (2022) మాజీ చాంపియన్, ఆ్రస్టేలియా ఓపెన్ (2023) మాజీ రన్నరప్ ఎలీనా రిబాకినా (కజకిస్తాన్)ను కంగుతినిపించింది. దీంతో గతేడాది సెమీఫైనలిస్ట్ అయిన రిబాకినా ఆట ఈ సీజన్లో మూడో రౌండ్తోనే ముగిసింది. ఈ ఏడాది ఆ్రస్టేలియా, ఫ్రెంచ్ ఓపెన్లలో ప్రిక్వార్టర్స్ చేరిన రిబాకినా... ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్లో నిరాశపరిచింది. ఓవరాల్గా వింబుల్డన్లోనే ఆమెకిది పేలవ ప్రదర్శన. ఇక్కడ 2021 నుంచి ఆడుతున్న ఆమె ఆ ఏడాది ప్రిక్వార్టర్స్ చేరింది. మరుసటి ఏడాది విజేతగా నిలిచింది. 2023, 2024లలో క్వార్టర్స్, సెమీస్ వరకు పోరాడింది. స్వియాటెక్, అండ్రీవా అలవోకగా... మహిళల సింగిల్స్లో ఎనిమిదో సీడ్ ఇగా స్వియాటెక్ (పోలండ్), అండ్రీవా (రష్యా) సునాయాస విజయాలతో ప్రిక్వార్టర్స్ చేరారు. ఐదు గ్రాండ్స్లామ్ టైటిళ్ల చాంపియన్ స్వియాటెక్ 6–2, 6–3తో కొలిన్స్ (అమెరికా)పై విజయం సాధించగా, ఏడో సీడ్ మిర్ర అండ్రీవా (రష్యా) కూడా 6–1, 6–3తో హెయిలీ బాప్టిస్ట్ (అమెరికా)పై వరుస సెట్లలో నెగ్గింది. ఈ సీజన్ ఆ్రస్టేలియా, ఫ్రెంచ్ ఓపెన్ల రన్నరప్ ప్రపంచ నంబర్వన్ సబలెంక (బెలారస్) 7–6 (8/6), 6–4తో రాడుకానుపై గెలుపొందింది. భారత జోడీలకు నిరాశపురుషుల డబుల్స్లో భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. యూకీ బాంబ్రీ తన అమెరికా భాగస్వామితో కలిసి మూడో రౌండ్లోకి దూసుకెళ్లగా, రిత్విక్ బొల్లిపల్లి, శ్రీరామ్ బాలాజీ జోడీలకు రెండోరౌండ్లో చుక్కెదురైంది. యూకీ బాంబ్రీ–రాబర్ట్ గాలొవే (అమెరికా) ద్వయం 6–3, 7–6 (8/6)తో నునొ బోర్జెస్ (పోర్చుగల్)–మార్కస్ గిరోన్ (అమెరికా) జంటపై గెలిచింది. రిత్విక్–నికోలస్ బారియెంటోస్ (కొలంబియా) జోడీ 4–6, 6–7 (7/9)తో ఆరో సీడ్ జో సలిస్బురి–నియోల్ స్కప్స్కీ (బ్రిటన్) జంట చేతిలో ఓటమి పాలైంది. శ్రీరామ్ బాలాజీ–మిగెల్ రెయిస్ (మెక్సికో) ద్వయం 4–6, 4–6తో నాలుగో సీడ్ మార్సెల్ గ్రెనొల్లర్స్ (స్పెయిన్)–హొరాసియో జె»ొల్లస్ (అర్జెంటీనా) జోడీ చేతిలో పరాజయం చవిచూసింది. -
సత్తా చాటిన భారత అమ్మాయిలు
చియాంగ్ మై (థాయిలాండ్): భారత మహిళల ఫుట్బాల్ జట్టు అసలు సమయంలో చెలరేగింది. క్వాలిఫయింగ్ టోర్నీలో సత్తా చాటి ఆసియా కప్కు అర్హత సాధించింది. 2003 తర్వాత మన మహిళలు ఆసియా కప్ నేరుగా అర్హత సాధించడం ఇదే తొలిసారి. శనివారం జరిగిన మ్యాచ్లో భారత్ 2–1 గోల్స్ తేడాతో ఆతిథ్య జట్టు థాయిలాండ్ను ఓడించింది. భారత్ తరఫున సంగీత బస్ఫోర్ రెండు గోల్స్ (28వ నిమిషం, 78వ నిమిషం) సాధించడం విశేషం. థాయిలాండ్ తరఫున చట్చవాన్ రాడ్థాంగ్ ఏకైక గోల్ (47వ నిమిషం) నమోదు చేసింది.ఈ మ్యాచ్కు ముందు ఇరు జట్ల మధ్య గోల్ వ్యత్యాసం కూడా (+22) కూడా సమానంగా ఉండటంతో ఇరు జట్లూ తప్పనిసరిగా గెలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగాయి. ‘ఫిఫా’ ర్యాంకింగ్స్లో భారత్కంటే 24 స్థానాలు ముందున్న థాయిలాండ్ ఫేవరెట్గా బరిలోకి దిగింది. అయితే మన అమ్మాయిల పట్టుదలకు విజయం వరించింది. గతంలో భారత్ ఎప్పుడూ థాయిలాండ్ను ఓడించలేదు. క్వాలిఫయింగ్ టోర్నీలో గ్రూప్ ‘బి’ నుంచి ఆడిన నాలుగు మ్యాచ్లలోనూ భారత మహిళలు విజయం సాధించి అగ్రస్థానంతో ముందంజ వేయడం విశేషం. టోర్నీలో గత మూడు మ్యాచ్లలో ఇరాక్, మంగోలియా, తిమోర్ లెస్ట్లను భారత్ ఓడించింది. ఆసియా కప్ టోర్నీ 2026లో ఆస్ట్రేలియాలో జరుగుతుంది. -
ఎదురులేని నీరజ్
బెంగళూరు: భారత్లో నిర్వహించిన తొలి అంతర్జాతీయ జావెలిన్ త్రో ఈవెంట్... ‘నీరజ్ చోప్రా క్లాసిక్’లో భారత స్టార్ నీరజ్ చోప్రా విజేతగా నిలిచాడు. ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య ‘ఎ’కేటగిరీ గుర్తింపునిచ్చిన ఈ టోర్నీలో శనివారం నీరజ్ జావెలిన్ను 86.18 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానం దక్కించుకున్నాడు. ఇటీవల పారిస్ డైమండ్ లీగ్, ఓస్ట్రావా గోల్డెన్ స్పైక్ టోర్నీల్లో టైటిల్స్ నెగ్గిన 27 ఏళ్ల నీరజ్ చోప్రాకు ఇది ‘హ్యాట్రిక్’టైటిల్ కావడం విశేషం. 2020 టోక్యో ఒలింపిక్స్లో పసిడి, 2024 పారిస్ ఒలింపిక్స్లో రజతం నెగ్గిన నీరజ్... సొంతగడ్డపై అంచనాలను అందుకుంటూ అదరగొట్టాడు. ప్రపంచ మాజీ చాంపియన్ జూలియన్ యెగో (84.51 మీటర్లు; కెన్యా), రమేశ్ పతిరగే (84.34 మీటర్లు; శ్రీలంక) వరుసగా రెండో, మూడో స్థానాల్లో నిలిచారు. భారత అథ్లెటిక్స్ సమాఖ్య, ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య, జేఎస్డబ్ల్యూ స్పోర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో నీరజ్ చోప్రా పర్యవేక్షణలో జరిగిన ఈ ఈవెంట్ విజయవంతం కాగా... విజేతలకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య బహుమతులు అందజేశారు. తొలి ప్రయత్నంలో ఫౌల్ చేసిన నీరజ్... రెండో త్రోలో జావెలిన్ను 82.99 మీటర్ల దూరం విసిరాడు. ఇక మూడో ప్రయత్నంలో ఈటెను 86.18 మీటర్ల దూరం విసిరి అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసిన నీరజ్ విజయనాదం చేశాడు. ఆ తర్వాత నాలుగో ప్రయత్నంలో మరోసారి ఫౌల్ చేసిన నీరజ్.. ఐదో ప్రయత్నంలో 84.07 మీటర్లు, ఆరో త్రోలో 82.22 మీటర్ల దూరం నమోదు చేసుకున్నాడు. మిగిలిన అథ్లెట్లెవరూ నీరజ్ దరిదాపుల్లోకి చేరుకోలేకపోవ డంతో భారత స్టార్ విజేతగా నిలిచాడు. -
స్వర్ణం గెలిచిన నీరజ్ చోప్రా.. సరికొత్త చరిత్ర
భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా మరోసారి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. భారత్లో తొలిసారి జరుగుతున్న అంతర్జాతీయ జావెలిన్ ఈవెంట్లో స్వర్ణ పతకంతో మెరిశాడు. బెంగళూరు వేదికగా తన పేరిట జరుగుతున్న ‘నీరజ్ చోప్రా క్లాసిక్’ టైటిల్ను ఈ గోల్డెన్ బాయ్ సొంతం చేసుకున్నాడు.ఈ క్రమంలో తన పేరిట జరుగుతున్న అంతర్జాతీయ పోటీలో తానే పసిడి పతకం గెలిచిన తొలి అథ్లెట్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. అత్యుత్తమంగా ఈటెను 86.18 మీటర్ల దూరం విసిరి నీరజ్ గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు. బెంగళూరులోని శనివారం నాటి ఈవెంట్కు శ్రీ కంఠీవరవ స్టేడియం వేదికైంది.ఇక కెన్యాకు చెందిన జూలియస్ యెగో 84.51 దూరం బల్లాన్ని విసిరి నీరజ్ తర్వాతి స్థానంలో నిలిచి రజత పతకం అందుకున్నాడు. శ్రీలంకకు చెందిన అండర్-16 మాజీ ఫాస్ట్ బౌలర్ రమేశ్ పతిరగె 84.34 మీటర్ల దూరం ఈటెను విసిరి కాంస్య పతకం గెలుచుకోగా.. భారత్కే చెందిన సచిన్ యాదవ్ తృటిలో కాంస్యాన్ని కోల్పోయాడు. అతడు అత్యుత్తమంగా బల్లాన్ని 82.33 మీటర్ల దూరం విసిరాడు.హ్యాట్రిక్ కొట్టిన నీరజ్ చోప్రాకాగా టోక్యో ఒలింపిక్స్-2020లో పసిడి పతకం గెలిచిన నీరజ్ చోప్రా.. 2024 పారిస్ ఒలింపిక్స్లో రజతం సొంతం చేసుకున్నాడు. అంతేకాదు..27 ఏళ్ల ఈ హర్యానా అథ్లెట్ ఖాతాలో ప్రపంచ చాంపియన్షిప్ స్వర్ణాలు, డైమండ్ లీగ్ టైటిల్స్.. అదే విధంగా ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో గెలిచిన పతకాలు ఉన్నాయి. ఇక ఇటీవల పారిస్ డైమండ్ లీగ్, ఓస్ట్రావా గోల్డెన్ స్పైక్ టోర్నీల్లో టైటిల్స్ కైవసం చేసుకున్న నీరజ్ చోప్రా.. తాజాగా నీరజ్ చోప్రా క్లాసిక్ ఈవెంట్ గెలిచి హ్యాట్రిక్ కొట్టాడు. ఈ ఈవెంట్లో నీరజ్ చోప్రా (భారత్)తో పాటు.. సిప్రియన్ మిర్జిగ్లాడ్ (పోలాండ్), లూయిజ్ మౌరిసియో డా సిల్వా (బ్రెజిల్), థామస్ రోలెర్ (జర్మనీ), కర్టిన్స్ థామ్సన్ (అమెరికా), మార్టిన్న్ కొనెస్నీ (చెక్ రిపబ్లిక్), జూలియస్ యెగో (కెన్యా), రమేశ్ పతిరగే (శ్రీలంక), సచిన్ యాదవ్ (భారత్), రోహిత్ యాదవ్ (భారత్), సాహిల్ సిల్వాల్ (భారత్), యశ్ వీర్ సింగ్ (భారత్) బరిలో దిగారు.NEERAJ CHOPRA WINS NC CLASSIC 2025! 🏆- The Winning Throw of 86.18m for G.O.A.T 🐐pic.twitter.com/nPaJhHuJmk— The Khel India (@TheKhelIndia) July 5, 2025 -
నవ శకానికి నాంది
బెంగళూరు: భారత్లో తొలిసారి జరుగుతున్న అంతర్జాతీయ జావెలిన్ ఈవెంట్కు రంగం సిద్ధమైంది. శనివారం బెంగళూరు వేదికగా ప్రతిష్ఠాత్మక ‘నీరజ్ చోప్రా క్లాసిక్’ ఈవెంట్ జరగనుంది. భారత స్టార్ జావెలిన్ త్రోయర్, ఒలింపిక్స్లో రెండు పతకాలు సాధించిన నీరజ్ చోప్రా పేరిట నిర్వహిస్తున్న ఈ టోర్నీలో 12 మంది జావెలిన్ త్రోయర్లు పాల్గొంటున్నారు. తన పేరిట జరుగుతున్న ఈ టోర్నీలో నీరజ్ ఫేవరెట్గా బరిలోకి దిగుతున్నాడు. ఇటీవల పారిస్ డైమండ్ లీగ్, ఓస్ట్రావా గోల్డెన్ స్పైక్ టోర్నీల్లో టైటిల్స్ నెగ్గిన 27 ఏళ్ల నీరజ్ చోప్రా... హ్యాట్రిక్ టైటిల్పై గురిపెట్టాడు. 2020 టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం, 2024 పారిస్ ఒలింపిక్స్లో రజతంతో పాటు... ప్రపంచ చాంపియన్షిప్ స్వర్ణాలు, డైమండ్ లీగ్ టైటిల్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు ఇలా అంతర్జాతీయ స్థాయిలో దాదాపు అన్నీ టోర్నీల్లో నీరజ్ సత్తా చాటాడు. ఇప్పుడు స్వదేశంలో నిర్వహిస్తున్న ‘నీరజ్ చోప్రా క్లాసిక్’ ఈవెంట్లో కూడా అదే పరంపర కొనసాగించాలని భావిస్తున్నాడు. దేశంలో అథ్లెటిక్స్కు మరింత ఊతం ఇచ్చేందుకు ఈ టోర్నీ దోహదపడుతుందన్న నీరజ్... యువ అథ్లెట్లు దీని నుంచి స్ఫూర్తి పొందితే సంతోíÙస్తానని వెల్లడించాడు. ఈ ఏడాది తొలిసారి 90 మీటర్ల మార్క్ అందుకున్న నీరజ్... అదే ప్రదర్శన పునరావృతం చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. మే నెలలో దోహా వేదికగా జరిగిన పోటీల్లో నీరజ్ తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసుకొని ఫుల్ జోష్లో ఉన్నాడు. భారత్లో నీరజ్ ఓ టోర్నీలో పాల్గొననుండటం ఏడాది విరామం తర్వాత ఇదే మొదటి సారి. భారత్లో ఇదే తొలిసారి.. భారత అథ్లెటిక్స్ సమాఖ్య, ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య, జేఎస్డబ్ల్యూ స్పోర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో నీరజ్ చోప్రా పర్యవేక్షణలో ఈ ఈవెంట్ జరుగుతోంది. ప్రస్తుతానికి ఈ ఈవెంట్లో జావెలిన్ త్రో పోటీలు మాత్రమే జరుగుతుండగా... భవిష్యత్తులో దీన్ని మరింత విస్తృతం చేయాలని నీరజ్ భావిస్తున్నాడు. ప్రతి ఏటా దీన్ని నిర్వహించడంతో పాటు మరిన్ని క్రీడాంశాలను జతచేసే ఆలోచన ఉన్నట్లు వెల్లడించాడు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం మే 24న హర్యానాలోని పంచకులలో ఈ ఈవెంట్ నిర్వహించాలని నిర్ణయించగా... అంతర్జాతీయ ప్రసారదారుల విజ్ఞప్తి మేరకు దీన్ని బెంగళూరుకు మార్చారు. అనంతరం సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఈవెంట్ తేదీ సైతం మారింది. ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య దీనికి ‘ఎ’ కేటగిరీ గుర్తింపునివ్వగా... భారత్లో జరుగుతున్న తొలి అంతర్జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీ ఇదే కావడం విశేషం. అయితే ఈవెంట్ ప్రారంభానికి ముందే పలువురు స్టార్ అథ్లెట్లు వేర్వేరు కారణాల వల్ల టోర్నీ నుంచి వైదొలిగారు. గ్రెనడాకు చెందిన రెండుసార్లు ప్రపంచ చాంపియన్ అండర్సన్ పీటర్స్ గాయం కారణంగా పోటీలకు దూరం కాగా... భారత్కు చెందిన కిషోర్ జెనా సైతం గాయంతో టోర్నీకి దూరమయ్యాడు. వరల్డ్ అథ్లెటిక్స్కు సన్నాహకంగా ఈ ఏడాది సెప్టెంబర్లో టోక్యో వేదికగా ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్íÙప్ జరగనుండగా... దానికి ఇది సన్నాహకంగా ఉపయోగపడనుంది. మొత్తం 12 మంది అథ్లెట్లు ఈ పోటీల్లో పాల్గొంటుండగా... అందులో ఐదుగురు త్రోయర్లు ఇప్పటికే వరల్డ్ అథ్లెటిక్స్ అర్హత మార్క్ (85.50 మీటర్లు) అందుకున్నారు. పాకిస్తాన్కు చెందిన ఒలింపిక్ చాంపియన్ అర్షద్ నదీమ్ను కూడా ఈ ఈవెంట్కు ఆహ్వానించగా... అతడు వ్యక్తిగత శిక్షణకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో పాల్గొనబోవడం లేదని ప్రకటించాడు. ఆ తర్వాత ఇరు దేశల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఆ ఊసే లేకుండా పోయింది. 2016 రియో ఒలింపిక్స్ చాంపియన్ థామస్ రోలెర్ (జర్మనీ), ప్రపంచ మాజీ చాంపియన్ జూలియస్ యెగో (కెన్యా), కర్టిస్ థామ్సన్ (అమెరికా) నుంచి నీరజ్కు ప్రధాన పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే యెగో, రోలెర్ ప్రస్తుతం ఫామ్లో లేరు. మార్టిన్ కొనెస్నీ (చెక్ రిపబ్లిక్), లూయిజ్ మౌరిసియో డా సిల్వా (బ్రెజిల్), రమేశ్ పతిరగే (శ్రీలంక), సిప్రియన్ మిర్జిగ్లాడ్ (పోలాండ్) సంచలనం నమోదు చేయాలని చూస్తున్నారు. భారత్ నుంచి నీరజ్ చోప్రాతో పాటు సచిన్ యాదవ్, యశ్వీర్ సింగ్, రోహిత్ యాదవ్, సాహిల్ సిల్వాల్ బరిలో దిగనున్నారు. ప్రస్తుతం దిగ్గజ కోచ్ జాన్ జెలెన్జీ వద్ద నీరజ్ శిక్షణ తీసుకుంటున్నాడు. ఇలాంటి టోర్నమెంట్ మనదేశంలో జరగాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నా. ఇప్పుడు దానికి సమయం ఆసన్నమైంది. కల నెరవేరినట్లు అనిపిస్తోంది. చాలా ఉత్సాహంగా ఉన్నా. ఒలింపిక్స్లో దేశం కోసం పతకాలు సాధించా. ఇప్పుడు దేశానికి తిరిగి ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నా. ఇది భారత యువ అథ్లెట్లకు, అభిమానులకు ఆనందం పంచుతుందనుకుంటున్నా. భారత అథ్లెటిక్స్లో నూతన అధ్యాయానికి ఇది నాంది. ఈ ఈవెంట్ ఇంత భారీ స్థాయిలో నిర్వహించేందుకు తోడ్పడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మనదేశంలో అంతర్జాతీయ పోటీలకు ఇది శుభారంభం. భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో టోర్నీలు జరగాలి. జర్మనీలో వారానికి ఒకటి చొప్పున కేటగిరి ‘ఎ’, ‘బి’, ‘సి’పోటీలు జరుగుతుంటాయి. మనం కూడా ఆ స్థాయికి చేరాలి. అప్పుడు దేశంలో క్రీడా సంస్కృతి పెరుగుతుంది. మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తా. అందుకోసం కఠోర సాధన చేస్తున్నా. ఈ పోటీల తర్వాత ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ కోసం ప్రాక్టీస్ ప్రారంభిస్తా. జావెలిన్ను విసిరే సమయంలో మరింత నియంత్రణ అవసరం. ప్రస్తుతం దానిపై దృష్టి పెట్టా. –నీరజ్ చోప్రాబరిలో ఉన్నది వీరే నీరజ్ చోప్రా (భారత్) సిప్రియన్ మిర్జిగ్లాడ్ (పోలాండ్) లూయిజ్ మౌరిసియో డా సిల్వా (బ్రెజిల్) థామస్ రోలెర్ (జర్మనీ) కర్టిన్స్ థామ్సన్ (అమెరికా) మార్టిన్న్ కొనెస్నీ (చెక్ రిపబ్లిక్) జూలియస్ యెగో (కెన్యా) రమేశ్ పతిరగే (శ్రీలంక) సచిన్ యాదవ్ (భారత్) రోహిత్ యాదవ్ (భారత్) సాహిల్ సిల్వాల్ (భారత్) యశ్ వీర్ సింగ్ (భారత్) -
ముందుకెవరు? ఇంటికెవరు?
చియాంగ్ మయ్ (థాయ్లాండ్): ఆసియా ఫుట్బాల్ సమాఖ్య (ఏఎఫ్సీ) మహిళల ఆసియా కప్ క్వాలిఫయర్స్లో భారత అమ్మాయిలకు అసలైన సవాల్ ఎదురవుతోంది. ర్యాంకింగ్లోనూ, పోటీలోనూ పటిష్టమైన థాయ్లాండ్తో ‘ఢీ’ కొట్టేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో నేడు గ్రూప్ దశలోని ఆఖరి క్వాలిఫయింగ్ పోరు రసవత్తరంగా జరుగనుంది. ఈ క్వాలిఫయింగ్ టోర్నీలో పాయింట్ల పరంగా, గోల్స్ పరంగా సమఉజ్జీలుగా ఉన్న ఇరు జట్లలో గెలిచిన జట్టే ఆసియా కప్ ఫుట్బాల్ టోర్నీకి అర్హత సాధిస్తుంది. ఏఎఫ్సీ ఆసియా కప్ టోర్నీ వచ్చే ఏడాది ఆ్రస్టేలియాలో జరుగుతుంది. ప్రస్తుత క్వాలిఫయర్స్లో సత్తా చాటుకున్నప్పటికీ థాయ్లాండ్పై ఏనాడూ గెలవని భారత్ ఈ చెత్త రికార్డును చెరిపేయాలన్నా... ఏఎఫ్సీ ఆసియా కప్కు అర్హత సాధించాలన్నా సర్వశక్తులు ఒడ్డాల్సిందే! గ్రూప్ ‘బి’లో భారత్, థాయ్లాండ్ జట్లు ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ గెలిచాయి. ఇరాక్, తిమోర్–లెస్టే, మంగోలియాలపై గెలుపొందిన రెండు జట్లు ఇప్పుడు ఆఖరి లీగ్లో ఎదురుపడుతున్నాయి. ఆఖరి మెట్టులో గట్టెక్కితే మాత్రం ఆసియా కప్ ఆడే అవకాశం లభిస్తుంది. ఇదే జరిగితే ‘ఫిఫా’ మహిళల ప్రపంచకప్ (2027) క్వాలిఫికేషన్ టోర్నీ ఆడే జట్టుగా చరిత్రలో నిలుస్తుంది. అందుకేనేమో కోచ్ క్రిస్పిన్ ఛెత్రి థాయ్లాండ్తో మ్యాచ్పై గంపెడాశలు పెట్టుకున్నారు. ఈ విజయంతో వచ్చే ఆసియా కప్ బెర్త్తో భారత ఫుట్బాల్ ముఖచిత్రమే మారుతుందని అన్నారు. దేశ ఫుట్బాల్ క్రీడకే కొత్త ఊపిరినిస్తుందని చెప్పారు. గతంలో 2003లో అమ్మాయిల జట్టు ఆసియా కప్ ఆడింది. కానీ అప్పుడు ఏఎఫ్సీ క్వాలిఫయర్స్ లేవు. ఎట్టకేలకు మళ్లీ మూడేళ్ల క్రితం 2022లో ఆతిథ్య జట్టుగా ఆడే భాగ్యం భారత్కు లభిస్తే ‘కరోనా’ మహమ్మారి గద్దలా తన్నుకుపోయినట్లు టోర్నీనే తుడిచి పెట్టేసింది. కోవిడ్ వల్ల భారత్ ఆ ఏడాది టోర్నీని నిర్వహించలేక పోయింది. ఇప్పుడు మాత్రం క్వాలిఫయింగ్ టోర్నీలో చేసిన పోరాటంతో దర్జాగా అర్హత సాధించాలనుకుంటున్న భారత్కు శనివారం విషమ పరీక్ష ఎదురవుతోంది. 13–0తో మంగోలియాపై, 4–0తో తిమోర్ లెస్టేపై, 5–0తో ఇరాక్పై గెలిచిన భారత్ ప్రత్యర్థులకు ఒక్క గోల్ ఇవ్వకుండా ఘనవిజయాలు సాధించింది. మరోవైపు థాయ్లాండ్ కూడా ఒక్క గోల్ ఇవ్వకుండానే జైత్రయాత్ర సాగించింది. ఈ ఆఖరి మజిలీనే ఇరు జట్లను ఒంటికాలుపై నిలబడేలా చేస్తుంది. సాధారణంగా గ్రూప్ దశలో షూటౌట్ నిర్వహించరు. అయితే ఇరు జట్లు సమఉజ్జీగా ఉండటంతో ఫలితం కోసం ఈ మ్యాచ్లో ‘షూటౌట్’ నిర్వహించడం ఖాయమైంది. -
కీస్ కథ ముగిసె...
లండన్: వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీలో స్టార్ ప్లేయర్ల నిష్క్రమణ పర్వం కొనసాగుతోంది. తాజాగా మహిళల సింగిల్స్ విభాగంలో ఆరో సీడ్, ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ మాడిసన్ కీస్ (అమెరికా)... ప్రపంచ మాజీ నంబర్వన్, నాలుగు గ్రాండ్స్లామ్ టోర్నీల విజేత నయోమి ఒసాకా (జపాన్) మూడో రౌండ్లో ఇంటిముఖం పట్టగా... పురుషుల సింగిల్స్ విభాగంలో నాలుగో సీడ్ జాక్ డ్రేపర్ (బ్రిటన్) రెండో రౌండ్లోనే వెనుదిరిగాడు.శుక్రవారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్లో ప్రపంచ 104వ ర్యాంకర్, 37 ఏళ్ల లౌరా సిగెముండ్ (జర్మనీ) 6–3, 6–3తో మాడిసన్ కీస్పై సంచలన విజయం సాధించి తన కెరీర్లో తొలిసారి వింబుల్డన్ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకుంది. 93 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో లౌరా తన సర్వీస్ను రెండుసార్లు కోల్పోయి ప్రత్యర్థి సర్వీస్ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. కీస్ నాలుగు డబుల్ ఫాల్ట్లతోపాటు 31 అనవసర తప్పిదాలు చేసింది. మరో మ్యాచ్లో పావ్లీచెంకోవా (రష్యా) 3–6, 6–4, 6–4 తో ఒసాకాను ఓడించి 2016 తర్వాత మరోసారి వింబుల్డన్ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకుంది. డ్రేపర్ అవుట్ పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో 2017 రన్నరప్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా) 2 గంటల 39 నిమిషాల్లో 6–4, 6–3, 1–6, 6–4తో డ్రేపర్ను ఓడించాడు. మరో రెండో రౌండ్ మ్యాచ్లో వరల్డ్ నంబర్వన్ యానిక్ సినెర్ (ఇటలీ) 6–1, 6–1, 6–3తో వుకిచ్ (ఆ్రస్టేలియా)పై గెలిచాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్ల్లో ఐదో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) 6–4, 6–3, 6–7 (5/7), 6–1తో ఫొకీనా (స్పెయిన్)పై, 14వ సీడ్ రుబ్లెవ్ (రష్యా) 7–5, 6–2, 6–3తో మనారినో (ఫ్రాన్స్)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. యూకీ జోడీ బోణీ మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో యూకీ బాంబ్రీ (భారత్)–జిన్యు జియాంగ్ (చైనా) జోడీ 6–3, 1–6, 7–6 (10/6)తో హారిసన్–నికోల్ మెలిచార్ (అమెరికా) ద్వయంపై గెలిచి రెండో రౌండ్కు చేరుకుంది. -
చెస్ను ఆస్వాదించలేకపోతున్నా
జాగ్రెబ్: ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్ మునుపటిలా తాను చెస్ ఆడటాన్ని ఆస్వాదించలేకపోతున్నానని చెప్పాడు. ఓ దశాబ్దంపాటు ప్రపంచ చెస్ చాంపియన్షిప్ టైటిల్ను నిలబెట్టుకున్న కార్ల్సన్ ఇటీవల భారత టీనేజ్ సంచలనం, ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ చేతిలో ఓడిపోతున్నాడు. ఇక్కడ జరుగుతున్న సూపర్ యునైటెడ్ ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నీలో గురువారం రెండోసారి గుకేశ్ చేతిలో కంగుతిన్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఆటపై ఆసక్తి తగ్గి బలహీన ప్లేయర్గా మారుతున్నానని వ్యాఖ్యానించాడు. అయితే ప్రపంచ చాంపియన్ గుకేశ్ అద్భుతంగా ఆడుతున్నాడని కితాబిచ్చాడు. అవకాశాల్ని ఒడిసిపట్టుకోవడం, సందర్భోచిత ఎత్తులు వేయడంలో అతని ఆటతీరు గొప్పగా ఉందన్నాడు. ‘నిజాయితీగా చెప్పాలంటే... ఇప్పుడు నేను చెస్ ఆడటాన్ని ఏమాత్రం ఆస్వాదించలేకపోతున్నాను. ఎత్తులు, పైఎత్తులపై ఆసక్తి సన్నగిల్లుతోంది. చెస్ బోర్డు ముందు కూర్చొని ఆడేటపుడు నాలో ఎలాంటి అనుభూతి కలగడం లేదు. అందుకే ఆటలో పేలవంగా ఆడుతున్నాను’ అని నార్వే సూపర్ స్టార్ అన్నాడు. 2013 నుంచి 2023 వరకు ప్రపంచ చెస్ను శాసించిన ఈ సూపర్ గ్రాండ్మాస్టర్ బరిలో ఉన్న పదేళ్లు టైటిల్ను నిలబెట్టుకోవడం విశేషం. రెండేళ్ల క్రితం కార్ల్సన్ స్వయంగా వైదొలగడంతోనే డింగ్ లిరెన్ (చైనా) చాంపియన్ అయ్యాడు. ఇతన్ని గతేడాది ఓడించిన గుకేశ్ సరికొత్త చాంపియన్గా అవతరించాడు. -
నా హృదయం ముక్కలైంది.. కుల్దీప్ యాదవ్ భావోద్వేగం
పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ డియాగో జోటాకు టీమిండియా క్రికెటర్ కుల్దీప్ యాదవ్ నివాళి అర్పించాడు. జోటా మరణంతో ఫుట్బాల్ ప్రపంచం మొత్తం మూగబోయిందని.. అతడు లేని లోటు ఎవరూ పూడ్చలేరంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. నా హృదయం ముక్కలైందిఈ మేరకు.. ‘‘2020 (లివర్పూల్)లో ఒప్పందం.. 20వ నంబర్ను సాధించావు.. అదే నీ శాశ్వత గుర్తింపుగా మార్చుకున్నావు. ఈరోజు ఫుట్బాల్ ఒక్కటే నిన్ను కోల్పోలేదు.ప్రపంచం మొత్తం చీకటిగా మారింది. పిచ్పై అడుగుపెట్టేటపుడు నీ చిరునవ్వే ఉజ్వలమైన కాంతిలా అనిపించేది. పోర్టో లేదంటే వోల్వ్స్.. లేదంటే లివర్పూల్.. ఎక్కడ ఉన్నా నువ్వు అందరి హృదయాలను గెలుచుకున్నావు.నీ కుటుంబానికి ఆ దేవుడు ధైర్యం అందించాలి. నీ ఆత్మకు శాంతి చేకూరాలి డియాగో’’ అంటూ ఇన్స్టా స్టోరీలో కుల్దీప్ యాదవ్ భావోద్వేగపూరిత నోట్ రాశాడు. హార్ట్బ్రేక్ ఎమోజీతో తన అభిమాన ఆటగాడికి నివాళి అర్పించాడు.కారు ప్రమాదంలో..కాగా పోర్చుగల్ ఫుట్బాల్ జట్టు ఫార్వర్డ్ ప్లేయర్ డియాగో జోటా రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన విషయం విదితమే. స్పెయిన్లో జరిగిన కారు ప్రమాదంలో 28 ఏళ్ల డియాగో జోటాతో పాటు అతడి సోదరుడు ఆండ్రె సిల్వా (25) దుర్మరణం పాలయ్యాడు. జమోరా నగరంలో బుధవారం అర్ధరాత్రి దాటాక ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటనలో ఇతర వాహనాల ప్రమేయం లేదని... అతి వేగంతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమిక అంచనాకు వచ్చారు.ఈ బంధం శాశ్వతంఅయితే ఘటన జరిగిన సమయంలో కారు ఎవరు నడుపుతున్నారనే అంశంపై స్పష్టత రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. జోటా ఇటీవలే తన ప్రియురాలు రూట్ కార్డోసోను వివాహమాడాడు. ‘ఈ బంధం శాశ్వతం’ అని సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించిన వారాల్లోనే అనుకోని ప్రమాదంలో జొటా కన్నుమూశాడు. వీరికి ముగ్గురు సంతానం.గత నెలలో పోర్చుగల్ జాతీయ జట్టు నేషన్స్ లీగ్ టైటిల్ సాధించడంలో జోటా కీలక పాత్ర పోషించాడు. మరోవైపు ఆండ్రె సిల్వా పోర్చుగల్ క్లబ్ పినాఫైల్ తరఫున పలు డివిజన్ లీగ్లలో పాల్గొన్నాడు. ‘ఈ విషాదం తీవ్రంగా బాధిస్తోంది’ అని లివర్పూల్ ఫుట్బాల్ క్లబ్ ప్రకటించింది. ఇలాంటి క్లిష్ట సమయంలో జోటా, ఆండ్రె కుటుంబానికి అండగా ఉంటామని వెల్లడించింది.లివర్పూల్ ప్రధాన ఆయుధం ప్రముఖ ఫుట్బాల్ క్లబ్ లివర్పూల్ తరఫున 123 మ్యాచ్లాడిన జోటా 47 గోల్స్ సాధించాడు. లెఫ్ట్ వింగ్లో ఫార్వర్డ్గా ఆడే డియాగో జోటా... అద్వితీయమైన ఫినిషింగ్, ప్రత్యర్థికి అంతుచిక్కని డ్రిబ్లింగ్లో సిద్ధహస్తుడు. చిన్నప్పటి నుంచి ఆటను ప్రేమించిన జోటా... జూనియర్ స్థాయిలో సంచలనాలతో వెలుగులోకి వచ్చాడు.లా లీగాలో అట్లెటికో మాడ్రిడ్ తరఫున 2016 నుంచి రెండు సీజన్లు ఆడిన జోటా... ఆ తర్వాత వివిధ క్లబ్లకు ప్రాతినిధ్యం వహించాడు. 2020 నుంచి లివర్పూల్ తరఫున కొనసాగుతున్న జొటా... మూడు మేజర్ ట్రోఫీలు గెలుచుకున్నాడు. గత సీజన్లో ప్రీమియర్ లీగ్ టైటిల్ గెలిచిన జట్టులో డియాగో ప్రధాన సభ్యుడు. ఇక 2019లో పోర్చుగల్ జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేసిన జోటా... కెరీర్లో 49 మ్యాచ్లాడి 14 గోల్స్ చేశాడు. ఇది తీరని లోటు... పోర్చుగల్ సాకర్ సమాఖ్య కూడా జోటా మృతికి సంతాపం తెలిపింది. ‘ఇది పూడ్చలేని లోటు. జాతీయ జట్టు తరఫున 50కి పైగా మ్యాచ్లు ఆడిన అద్భుత ఆటగాడు ఇలా అర్ధాంతరంగా మృతిచెందడం కలచివేస్తోంది. సహచరులు, ప్రత్యర్థులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ గౌరవించే అత్యుత్తమ ఆటగాడు అప్పుడే లోకం వీడి వెల్లడం బాధగా ఉంది’ అని ఒక ప్రకటనలో తెలిపింది.జోటా మృతికి సంతాపంగా... గురువారం పోర్చుగల్, స్పెయిన్ మహిళల జట్ల మధ్య యూరోపియన్ చాంపియన్షిప్ మ్యాచ్కు ముందు ఇరు జట్ల ఆటగాళ్లు ఒక నిమిషం పాటు మౌనం వహించారు. పోర్చుగల్ ప్రధానమంత్రి లూయిస్ మోంటెనెగ్రో కూడా డియాగో జోటా మృతికి సంతాపం ప్రకటించారు.‘మేము ఇద్దరు చాంపియన్లను కోల్పోయాము. వారి లోటు పోర్చుగల్ సాకర్కు తీరని లోటు. వారి వారసత్వాన్ని గౌరవించేందుకు మా వంతు కృషి చేస్తాం. దేశ ఖ్యాతిని పెంచిన ఆటగాళ్లో జోటా ఒకడు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. ఇది సాకర్కు విషాదకరమైన రోజు’ అని పేర్కొన్నారు.ఇక సహచర ఆటగాడు పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో... ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ‘ఇప్పటి వరకు జాతీయ జట్టులో డియాగోతో కలిసి ఆడాను. ఇంతలో ఇలా ఎలా జరిగిందో. ఇటీవలే జోటా వివాహం జరిగింది. కుటుంబంతో కలిసి సంతోషంగా గడుపుతాడు అనుకుంటే ఊహించని ఘటన అతడిని దూరం చేసింది. ఈ క్లిష్ట సమయంలో అతడి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. మేమందరం మిమ్మల్ని మిస్ అవుతాము’ అని రొనాల్డో అన్నాడు.మరోవైపు.. బాస్కెట్బాల్ దిగ్గజం లెబ్రాన్ జేమ్స్తో పాటు టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ వంటి పలు ప్లేయర్లతో పాటు... ఇతర క్లబ్లు, పలువురు ప్రముఖులు కూడా సంతాపం ప్రకటించారు. టీమిండియా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా జోటా మృతికి సంతాపం తెలిపాడు. కాగా కుల్దీప్ ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నాడు. అయితే, తొలి రెండు టెస్టుల్లోనూ అతడికి తుదిజట్టులో ఆడే అవకాశం లభించలేదు. చదవండి: వింబుల్డన్లో సంచలనాల మోత.. టాప్ సీడ్లకు ఊహించని షాకులు -
సంచలనాల మోత.. టాప్ సీడ్లకు ఊహించని షాకులు
టెన్నిస్ సీజన్ మూడో గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ వింబుల్డన్లో ఈ ఏడాది సంచలనాల మోత కొనసాగుతోంది. ముఖ్యంగా మహిళల సింగిల్స్ విభాగంలో టైటిల్ ఫేవరెట్స్ అనూహ్య పరాజయాలతో ఇంటిదారి పడుతున్నారు. ఇప్పటికే రెండో సీడ్ కోకో గాఫ్, మూడో సీడ్ జెస్సికా పెగూలా, ఐదో సీడ్ కిన్వెన్ జెంగ్, తొమ్మిదో సీడ్ పౌలా బదోసా తొలి రౌండ్లోనే నిష్క్రమించగా... తాజాగా వీరి సరసన గత ఏడాది రన్నరప్, నాలుగో సీడ్ జాస్మిన్ పావోలిని చేరింది. రష్యాకు చెందిన ప్రపంచ 80వ ర్యాంకర్, అన్సీడెడ్ కామిలా రఖిమోవా అద్భుత ఆటతో పావోలిని ఆట కట్టించి మూడో రౌండ్లోకి దూసుకెళ్లింది. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ క్రెజికోవా (చెక్ రిపబ్లిక్), మాజీ నంబర్వన్ నయోమి ఒసాకా (జపాన్) మూడో రౌండ్లోకి అడుగు పెట్టారు. లండన్: గత ఏడాది రెండు గ్రాండ్స్లామ్ టైటిల్స్కు గెలుపు దూరంలో ఉండిపోయిన ఇటలీ టెన్నిస్ స్టార్ జాస్మిన్ పావోలినికి ఈ సీజన్ కలిసి రావడం లేదు. ఆస్ట్రేలియన్ ఓపెన్లో మూడో రౌండ్లో వెనుదిరిగిన పావోలిని... ఫ్రెంచ్ ఓపెన్లో నాలుగో రౌండ్లో ఓడిపోగా... తాజాగా వింబుల్డన్ టోర్నీలో రెండో రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. రష్యాకు చెందిన అన్సీడెడ్ క్రీడాకారిణి, ప్రపంచ 80వ ర్యాంకర్ కామిలా రఖిమోవా 4–6, 6–4, 6–4తో ప్రపంచ ఐదో ర్యాంకర్, నాలుగో సీడ్ పావోలినిపై సంచలన విజయం సాధించింది.తద్వారా తన కెరీర్లో మూడోసారి ఓ గ్రాండ్స్లామ్ టోర్నీలో మూడో రౌండ్కు చేరుకుంది. గత ఏడాది ఫ్రెంచ్ఓపెన్ ఫైనల్లో స్వియాటెక్ చేతిలో... వింబుల్డన్ టోర్నీ ఫైనల్లో క్రెజికోవా చేతిలో ఓడిపోయి రన్నరప్గా నిలిచిన పావోలిని ఈ ఏడాది మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. రఖిమోవాతోజరిగిన పోరులో తొలి సెట్ను నెగ్గిన పావోలిని ఆ తర్వాత తడబడింది. 2 గంటల 19 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో పావోలిని 40 అనవసర తప్పిదాలు చేసి, 23 విన్నర్స్ కొట్టింది. తన సరీ్వస్ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను రెండుసార్లు బ్రేక్ చేసింది. రఖిమోవా 26 విన్నర్స్ కొట్టింది. నెట్ వద్దకు 12 సార్లు దూసుకొచ్చి ఎనిమిదిసార్లు పాయింట్లు గెలిచింది. స్వియాటెక్ ముందంజ... మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ క్రెజికోవా (చెక్ రిపబ్లిక్), మాజీ నంబర్వన్ నయోమి ఒసాకా (జపాన్), ఏడో సీడ్ మిరా ఆంద్రీవా (రష్యా), ఎనిమిదో సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్), మాజీ చాంపియన్ రిబాకినా (కజకిస్తాన్), పదో సీడ్ ఎమ్మా నవారో (అమెరికా) మూడో రౌండ్లోకి ప్రవేశించారు. రెండో రౌండ్ మ్యాచ్ల్లో క్రెజికోవా 6–4, 3–6, 6–2తో డొలెహిడి (అమెరికా)పై, ఒసాకా 6–3, 6–2తో సినియకోవా (చెక్ రిపబ్లిక్)పై, ఆంద్రీవా 6–1, 7–6 (7/4)తో బ్రాన్జెట్టి (ఇటలీ)పై, రిబాకినా 6–3, 6–1తో సాకరి (గ్రీస్)పై, నవారో 6–1, 6–2తో కుదెర్మెటోవా (రష్యా)పై, స్వియాటెక్ 5–7, 6–2, 6–1తో కేటీ మెక్నాలీ (అమెరికా)పై గెలిచారు. బాలాజీ జోడీ బోణీ పురుషుల డబుల్స్ విభాగంలో శ్రీరామ్ బాలాజీ (భారత్)–వరేలా (మెక్సికో) జోడీ శుభారంభం చేసింది. తొలి రౌండ్లో బాలాజీ–వరేలా ద్వయం 6–4, 6–4 తో లెర్నర్ టియెన్–కొవాసెవిక్ (అమెరికా) జంటను ఓడించింది. జొకోవిచ్... వరుసగా 16వసారి పురుషుల సింగిల్స్ విభాగంలో ఏడుసార్లు చాంపియన్, సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ వరుసగా 16వ సారి వింబుల్డన్ టోర్నీలో మూడో రౌండ్కు చేరుకున్నాడు. గత ఆరు పర్యాయాల్లో ఫైనల్ చేరిన జొకోవిచ్... గురువారం జరిగిన రెండో రౌండ్లో అలవోకగా గెలిచాడు. 1 గంటా 47 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో జొకోవిచ్ 6–3, 6–2, 6–0తో డేనియల్ ఇవాన్స్ (బ్రిటన్)పై గెలుపొందాడు. 11 ఏస్లు కొట్టిన జొకోవిచ్ రెండు డబుల్ ఫాల్ట్లు చేశాడు. 26 సార్లు నెట్ వద్దకు దూసుకొచ్చి 23 సార్లు పాయింట్లు గెలిచాడు. తన సర్వీస్ను ఒక్కసారి కూడా చేజార్చుకోని జొకోవిచ్ ప్రత్యర్థి సర్వీస్స్ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. -
భారత్కు రానున్న పాకిస్తాన్ జట్టు..!
ఇటీవల జరిగిన తీవ్ర పరిణామాల (పహల్గాం ఉగ్రదాడి, బదులుగా భారత్ ఆపరేషన్ సిందూర్) తర్వాత భారత్, పాక్ల మధ్య అన్ని విషయాల్లో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. క్రీడలకు సంబంధించి కూడా ఇదే పరిస్థితి. పాక్తో ఏ క్రీడలో అయినా తలపడేందుకు భారత్ నిరాసక్తత వ్యక్తం చేస్తుంది.అయితే తాజాగా జరుగుతున్న ఓ ప్రచారం భారత క్రీడాభిమానులకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆసియా కప్, జూనియర్ వరల్డ్కప్ టోర్నీల్లో పాల్గొనేందుకు పాకిస్తాన్ హాకీ జట్లు భారత్కు రానున్నాయట. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పాక్ హాకీ జట్లకు అనుమతి కూడా జారీ చేసినట్లు తెలుస్తుంది.వచ్చే నెల (అగస్ట్) 27 నుంచి సెప్టెంబర్ 7 వరకు బీహార్లోని రాజ్గిర్లో ఆసియా కప్ జరుగనుంది. ఈ టోర్నీ కోసం 31 మంది సభ్యుల పాకిస్తాన్ జట్టుకు భారత్కు రానున్నట్లు సమాచారం. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఓ కీలక అధికారి ప్రముఖ క్రీడా వెబ్సైట్ స్పోర్ట్స్స్టార్కు చెప్పాడు. జూనియర్ హాకీ వరల్డ్కప్ నవంబర్ 28 నుంచి డిసెంబర్ 10 వరకు చెన్నై, మధురై నగరాల్లో జరుగనుంది. ఈ టోర్నీలో పాల్గొనేందుకు కూడా పాకిస్తాన్కు అనుమతి లభించినట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే, భారత్, పాకిస్తాన్ త్వరలో క్రికెట్ ఆసియా కప్లో కూడా తలపడాల్సి ఉంది. అయితే, ఈ విషయంపై బీసీసీఐ ఇప్పటివరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖను సంప్రదించలేదు. ఈ టోర్నీపై ఎలాంటి అధికారిక సమాచారమూ లేదు. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది క్రికెట్ ఆసియా కప్ సెప్టెంబర్ 5 నుంచి 21వ తేదీ వరకు యూఏఈలో జరగాల్సి ఉంది. ఈ టోర్నీ టీ20 ఫార్మాట్లో జరుగనుంది. భారత్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో టోర్నీ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. -
భావోద్వేగంతో వీడ్కోలు పలికిన రొనాల్డో.. పోస్ట్ వైరల్
లివర్పూల్ ఫుట్బాల్ స్టార్ డియోగో జోటా (Diogo Jota) జీవితం అర్ధంతరంగా ముగిసిపోయింది. 28 ఏళ్లకే ఈ పోర్చుగల్ ఫుట్బాలర్కు నూరేళ్లూ నిండాయి. స్పెయిన్లో జరిగిన ఘోర ర కారు ప్రమాదం అతడిని బలిగొంది. ఈ దుర్ఘటనలో జోటాతో పాటు అతడి తమ్ముడు ఆండ్రీ సిల్వా (25) కూడా మృత్యువాత పడ్డాడు.కాగా ఆండ్రీ కూడా అన్న మాదిరే ప్రొఫెషనల్ ఫుట్బాల్ ప్లేయర్. వీరిద్దరి దుర్మరణంతో ఫుట్బాల్ ప్రపంచంలో తీవ్ర విషాదం నెలకొంది. ముఖ్యంగా పెళ్లైన పదిరోజులకే జోటా ఈ లోకాన్ని విడిచి శాశ్వతంగా వెళ్లిపోవడం.. అతడి భార్య రూటే కార్డొసోకు తీరని శోకాన్ని మిగిల్చింది. మర్చిపోలేని రోజుఇక చనిపోవడానికి కొన్ని గంటల ముందే జోటా.. తమ పెళ్లి వీడియోను షేర్ చేశాడు. ‘ఇది జీవితంలో మర్చిపోలేని రోజు’ అంటూ తన లవ్ లైఫ్లోని మధుర క్షణాలను అభిమానులతో పంచుకున్నాడు. వధూవరులుగా మారిన చిరకాల స్నేహితులు అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలో ఉంగరాలు మార్చుకుని వివాహ బంధంతో ఒక్కటైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ఈ వీడియోను చూసిన జోటా అభిమానులు తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు. ‘‘మీ ప్రేమను చూసి చూసి విధికి కన్నుకుట్టింది. వి మిస్ యూ’’ అంటూ జోటాకు సంతాపం తెలుపుతున్నారు. కాగా పది రోజుల క్రితమే.. తన చిన్ననాటి స్నేహితురాలు రూటేను జోటా పెళ్లి చేసుకున్నాడు. జోటాకు ఇప్పటికే ముగ్గురు పిల్లలు సంతానం. View this post on Instagram A post shared by Diogo Jota (@diogoj_18) రొనాల్డో భావోద్వేగంపోర్చుగల్ దిగ్గజ ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) సహచర ఆటగాడు జోటా దుర్మరణం పట్ల తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశాడు. ‘‘అసలు ఇది నిజమేనా?!.. ఇలాంటిది ఒకటి జరిగిందా?.. మనం ఇప్పుడే కదా జాతీయ జట్టులో కలిసి ఆడటం మొదలుపెట్టాము.మొన్ననే కదా నువ్వు పెళ్లి చేసుకున్నావు. నీ భార్య, పిల్లలు, కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నా. నువ్వు ఎల్లప్పుడూ వాళ్లతోనే ఉంటావని నాకు తెలుసు. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. డియోగో, ఆండ్రీ.. మీ ఇద్దరిని మేము చాలా మిస్సవుతాము’’ అంటూ రొనాల్డో భావోద్వేగపూరిత నోట్ షేర్ చేశాడు. డియోగో జోటా ఫొటో షేర్ చేస్తూ రొనాల్డో పెట్టిన ఈ పోస్టు కూడా పదికి పైగా మిలియన్ల వ్యూస్తో వైరల్గా మారింది.లివర్పూల్ తరఫున ఐదు టైటిళ్లులివర్పూల్ ఫుట్బాల్ క్లబ్ తరఫున డియోగో జోటా ప్రీమియర్ లీగ్తో పాటు రెండు నేషన్స్ లీగ్ టైటిళ్లు.. అదే విధంగా.. రెండు ఈఎఫ్ఎల్ టైటిళ్లూ గెలిచాడు. కాగా తమ స్టార్ ప్లేయర్ మృతి పట్ల లివర్పూల్ ఎఫ్సీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. డియోగో, ఆండ్రీ మరణం తమను తీవ్రంగా కలచివేసిందని.. ఇలాంటి క్లిష్ట సమయంలో వారి కుటుంబం ధైర్యంగా ఉండాలంటూ సంతాపం ప్రకటించింది. వారికి తాము ఎల్లవేళలా అండగా ఉంటామని తెలిపింది. View this post on Instagram A post shared by Cristiano Ronaldo (@cristiano) -
పెళ్లైన పదిరోజులకే ఫుట్బాల్ స్టార్ దుర్మరణం
లివర్పూల్ ఫుట్బాలర్, పోర్చుగీస్కు చెందిన డియోగో జోటా (Diogo Jota) దుర్మరణం చెందాడు. అతడు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడంతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్పెయిన్లోని జమోరా ప్రావిన్స్లో గురువారం ఈ ప్రమాదం జరిగింది. ఈ మేరకు స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి.కాగా ప్రమాద సమయంలో జోటాతో పాటు అతడి సోదరుడు ఆండ్రీ కూడా కారులోనే ఉన్నాడు. అతడు కూడా ప్రొఫెషనల్ ఫుట్బాలరే!.. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. కారు రోడ్డును ఢీకొట్టిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో అందులోని వారు సజీవ దహనం అయ్యారని తెలుస్తోంది.కాగా 28 ఏళ్ల జోటా పదిరోజుల క్రితమే పెళ్లి బంధంలో అడుగుపెట్టాడు. తన చిరకాల ప్రేయసి, జీవిత భాగస్వామి అయిన రూటే కార్డెసోను వివాహమాడాడు. ఇంతలోనే అతడు ప్రాణాలు కోల్పోవడం విషాదం. కాగా జోటాకు భార్య రూటేతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇక ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.కీలక విజయాల్లో పాత్రపోర్టోలో జన్మించిన జోటా.. 2016లో అట్లెటికో మాడ్రిడ్ క్లబ్లో చేరాడు. ఆ తర్వాత ప్రీమియర్ లీగ్, వోల్వర్హాంప్టన్ వాండరర్స్ తరఫున సత్తా చాటిన జోటా.. లివర్పూల్తో జట్టు కట్టిన తర్వాత తన కెరీర్లో ఉన్నత శిఖరాలకు చేరుకున్నాడు. జర్గన్ క్లాప్ నాయకత్వంలో ఎఫ్ఏ కప్, లీగ్ కప్ టైటిల్స్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే లివర్పూల్ అటాకింగ్ విభాగంలో ప్రధాన ఆటగాడిగా ఎదిగాడు. ఇక 2024-25 సీజన్లో లివర్పూల్ ప్రీమియర్ లీగ్ గెలవడంలోనూ జోటాది కీలక పాత్ర. ఇక పోర్చుగల్ జట్టు తరఫున కూడా అతడు రాణించాడు.రొనాల్డో సంతాపంజోటా మృతిపై పోర్చుగల్ దిగ్గజ ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో స్పందించాడు. నువ్వులేని లోటు ఎవరూ తీర్చలేరని.. నీ భార్యా, పిల్లలు, కుటుంబానికి ఆ దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. మరోవైపు.. లివర్పూల్ ఫుట్బాల్ క్లబ్ జోటా మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ విషాదకర విషయాన్ని నమ్మలేకపోతున్నామంటూ సంతాపం వ్యక్తం చేసింది.చదవండి: ఇకపై మళ్లీ ఆడగలనా? -
భారత్ జైత్రయాత్ర
చియాంగ్ మాయ్ (థాయ్లాండ్): ఆసియా కప్–2026 మహిళల ఫుట్బాల్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత జట్టు ‘హ్యాట్రిక్’ నమోదు చేసుకుంది. గత రెండు మ్యాచ్ల్లో అద్వితీయ విజయాలు సాధించిన భారత్... బుధవారం మూడో మ్యాచ్లో 5–0 గోల్స్ తేడాతో ఇరాక్ను చిత్తుచేసింది. మ్యాచ్ ఆరంభం నుంచే సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన టీమిండియా... ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగింది. భారత్ తరఫున సంగీత (14వ నిమిషంలో), మనీషా (44వ నిమిషంలో), కార్తీక అంగముత్తు (48వ నిమిషంలో), నిర్మలా దేవి (64వ నిమిషంలో), రతన్బాలా దేవి (80వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. ఓవరాల్గా ఈ టోర్నీలో మూడు మ్యాచ్లు ఆడిన భారత జట్టు... 22 గోల్స్ సాధించి ప్రత్యర్థికి ఒక్కటి కూడా ఇవ్వకపోవడం విశేషం. తొలి మ్యాచ్లో 13–0 గోల్స్ తేడాతో మంగోలియాను చిత్తుచేసిన టీమిండియా... తిమోర్ లెస్టెపై 4–0 గోల్స్ తేడాతో నెగ్గింది. తాజా పోరులో సంగీత గోల్తో ఖాతా తెరిచిన భారత్... మనీషా గోల్తో ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది. ప్రత్యర్థి నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురుకాకపోవడంతో తొలి అర్ధభాగం ముగిసేసరికి భారత్ 2–0తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్ధంలోనూ అదే జోరు కొనసాగిస్తూ మరో మూడు గోల్స్ కొట్టి మ్యాచ్ను ఏకపక్షం చేసింది. గాయం కారణంగా తెలంగాణ అమ్మాయి గుగులోత్ సౌమ్య ఈ మ్యాచ్కు అందుబాటులో లేకపోగా... మరింత ఆధిక్యం సాధించే పలు అవకాశాలను మన ప్లేయర్లు సది్వనియోగం చేసుకోలేకపోయారు. గ్రూప్ ‘బి’లో భాగంగా ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ గెలిచిన భారత్ 9 పాయింట్లతో పట్టిక అగ్రస్థానంలో ఉండగా... బుధవారమే జరిగిన మరో మ్యాచ్లో 11–0 గోల్స్ తేడాతో మంగోలియాపై గెలిచిన థాయ్లాండ్ కూడా 9 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. థాయ్లాండ్ కూడా టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ గెలవగా... ఓవరాల్గా 22 గోల్సే చేసిన థాయ్లాండ్ అచ్చం టీమిండియా లాగే ప్రత్యర్థికి ఒక్క గోల్ కూడా ఇవ్వలేదు. గ్రూప్ నుంచి ఒక్క జట్టే ముందంజ వేసే అవకాశం ఉండటంతో... ఇరు జట్ల మధ్య శనివారం జరిగే ఆఖరి గ్రూప్ మ్యాచ్కు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. చివరిసారి భారత జట్టు 2003లో ఆసియా కప్ ప్రధాన టోర్నీలో ఆడింది. ఆ తర్వాత భారత జట్టు ఈ టోర్నీకి అర్హత సాధించలేకపోయింది. -
కోకో గాఫ్కు 'షాక్'
వింబుల్డన్లో సంచలనాల మోత! ఇటీవల ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకొచ్చిన కోకో గాఫ్, గత వారం జర్మనీలో ఇగా స్వియాటెక్ను ఓడించి టైటిల్తో ఈ గ్రాస్కోర్టులోకి దిగిన పెగూలా, రెండుసార్లు వింబుల్డన్ చాంపియన్ క్విటొవా, ఈ ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనలిస్ట్ లోరెంజో ముసెట్టి, మూడు గ్రాండ్స్లామ్ టోర్నీల రన్నరప్ అలెగ్జాండర్ జ్వెరెవ్, మెద్వెదెవ్, రూనె, ఐదోసీడ్ జెంగ్ క్విన్వెన్, 15వ సీడ్ కరోలినా ముకొవా... ఇలా టాప్ స్టార్లకు ఈ వింబుల్డన్ చేదు ఫలితాలనిచ్చింది. పెద్ద సంఖ్యలో సీడెడ్ ప్లేయర్లు మోయలేని భారంతో తొలి రౌండ్లోనే నిష్క్రమించేలా చేసింది. లండన్: గ్రాస్కోర్టు గ్రాండ్స్లామ్ టోర్నీ వింబుల్డన్ ఈ సారి మూడు రోజులకే వెలవెలబోతోంది. పలువురు మేటి స్టార్లంతా ఈ కోర్టులో తొలి రౌండ్లోనే ఆఖరి మ్యాచ్ ఆడేసి వెళ్లిపోయారు. మిగిలిన కొద్దిమందిలో ఇంకెంత మంది కనీసం ప్రిక్వార్టర్స్ వరకైనా చేరతారో తెలియని పరిస్థితి. సంచలన ఫలితాలతో పురుషులు, మహిళల సింగిల్స్లో ఒకరో ఇద్దరో కాదు... ఏకంగా 23 మంది సీడెడ్ స్టార్లు తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. మహిళల సింగిల్స్లో 10 మంది, పురుషుల సింగిల్స్లో 13 మంది స్టార్లు... 2001 నుంచి టాప్–32 సీడింగ్స్ను గుర్తించాక ఇంత మంది సీడెడ్లు తొలి రౌండ్లోనే కంగుతినడం మొత్తం గ్రాండ్స్లామ్ల చరిత్రలోనే మొదటిసారి! ఫ్రెంచ్ ఓపెన్ తాజా చాంపియన్, అమెరికన్ స్టార్ కోకో గాఫ్ కథ తొలిరౌండ్లోనే అది కూడా క్వాలిఫయర్ చేతిలో ముగిసింది. రెండు వింబుల్డన్ టైటిళ్ల విజేత పెట్రా క్విటోవా మొదటి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. పురుషుల సింగిల్స్లో 25వ గ్రాండ్స్లామ్ టైటిల్ కోసం విక్రమార్క పోరాటం చేస్తున్న సెర్బియన్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్తో పాటు ప్రపంచ నంబర్వన్ యానిక్ సినెర్ శుభారంభం చేశారు. మూడో రౌండ్లో సబలెంక, అల్కరాజ్ మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో బెలారస్ స్టార్, టాప్ సీడ్ సబలెంక 7–6 (7/4), 6–4తో మేరి బౌజ్కొవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచింది. ఈ సీజన్లో రెండు గ్రాండ్స్లామ్ (ఆ్రస్టేలియా, ఫ్రెంచ్) టోర్నీల్లోనూ రన్నరప్గా నిలిచిన సబలెంకకు తొలిసెట్లో అన్సీడెడ్ ప్లేయర్ గట్టి పోటీ ఇచ్చినా టైబ్రేకర్తో గెలుపుబాట పట్టింది. మరో పోరులో ఆరో సీడ్ మాడిసన్ కీస్ 6–4, 6–2తో ఓల్గా డానిలోవిచ్ (సెర్బియా)పై వరుస సెట్లలో విజయం సాధించింది. పురుషుల సింగిల్స్లో వింబుల్డన్ (2023, 2024) ‘హ్యాట్రిక్’పై కన్నేసిన కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) సునాయాస విజయంతో మూడో రౌండ్లోకి దూసుకెళ్లాడు. ఇటీవల ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన రెండో సీడ్ స్పెయిన్ స్టార్ 6–1, 6–4, 6–4తో బ్రిటన్ ప్లేయర్ టార్వెట్ను ఓడించాడు. రెండోరౌండ్లో 12వ సీడ్ ఫ్రాన్సిస్ టియాఫె (అమెరికా)కు చుక్కెదురైంది. గత యూఎస్ ఓపెన్ సెమీఫైనలిస్ట్ టియాఫె 6–4, 4–6, 3–6, 5–7తో కామెరూన్ నోరి (బ్రిటన్) చేతిలో కంగుతిన్నాడు. 14వ సీడ్ రుబ్లెవ్ 6–7 (1/7), 6–4, 7–6 (7/5), 6–3తో లాయిడ్ హారిస్ (దక్షిణాఫ్రికా)పై గెలుపొందాడు. డయానా సంచలనం ఉక్రెయిన్ ప్లేయర్ డయానా యస్త్రెంస్కా లండన్లో టైటిల్ గెలవకుండానే పతాక శీర్షికల్లో నిలిచింది. 2018 నుంచి గ్రాండ్స్లామ్ బరిలో దిగుతున్నప్పటికీ ఏనాడూ సాధ్యమవని విజయాన్ని ఈ వింబుల్డన్ తొలి రౌండ్లోనే సాకారం చేసుకుంది. పారిస్ మట్టికోర్టులో (ఫ్రెంచ్ ఓపెన్)లో మహారాణిగా నిలిచిన అమెరికన్ స్టార్, రెండో సీడ్ కోకో గాఫ్కు కనీవినీ ఎరుగని షాక్ ఇచ్చింది. ఉక్రెయిన్ అనామక ప్లేయర్ను సులువుగానే ఓడిస్తుందనుకున్న ప్రపంచ రెండో ర్యాంకర్ గాఫ్ 6–7 (3/7), 1–6తో 42వ ర్యాంకర్ డయానా య్రస్తెంస్కా చేతిలో ఘోర పరాభవానికి గురైంది.ప్రపంచ నాలుగో ర్యాంకర్ పోలండ్ స్టార్ ఇగా స్వియాటెక్ తొలి రౌండ్ను వరుస సెట్లలోనే గెలిచింది. రష్యన్ ప్రత్యర్థి నుంచి తొలిసెట్లో ప్రతిఘటన ఎదురైనప్పటికీ ఐదు గ్రాండ్స్లామ్ టైటిళ్ల చాంపియన్ అయిన స్వియాటెక్ 7–5, 6–1తో పొలినా కుడెర్మటోవాపై గెలుపొందింది. 17వ సీడ్ బార్బర క్రెజ్సికొవా (చెక్ రిపబ్లిక్) 3–6, 6–2, 6–1తో అలెగ్జాండ్రా ఎలా (ఫిలిప్పీన్స్)పై నెగ్గింది. ఇంతేనా... మిగిలింది! చెప్పుకోదగ్గ స్టార్లు, కనీసం సెమీఫైనల్ గ్యారంటీ అనుకున్న ప్లేయర్లు సైతం ఆదిలోనే కంగు తినడంతో ఇక మిగిలింది కొందరే! నంబర్వన్ సబలెంక, మూడో టైటిల్పై కన్నేసిన డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్, 2023 వింబుల్డన్ చాంపియన్ మార్కెటా వొండ్రుసొవా, 2021 యూఎస్ ఓపెన్ చాంపియన్ ఎమ్మా రాడుకాను, పదో సీడ్ ఎమ్మా నవారో, యానిక్ సినెర్, రజతోత్సవ టైటిల్పై కన్నేసిన జొకోవిచ్ తదితర స్టార్లే మిగిలారు. అయితే ఇంతటి సంచలనాల పర్వంలో ఇక వీరిలో ఎవరెవరు క్వార్టర్స్ దాటుతారనేది ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. రెండో రౌండ్లోకి యూకీ జోడీ పురుషుల డబుల్స్లో భారత ఆటగాడు యూకీ బాంబ్రీ తన అమెరికన్ భాగస్వామితో కలిసి శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన తొలిరౌండ్లో 16వ సీడ్ యూకీ–రాబర్ట్ గాలొవే ద్వయం 7–6 (10/8), 6–4తో అర్నియోడో (మొనాకో)–గినార్డ్ (ఫ్రాన్స్) జంటపై గెలిచింది. రిత్విక్ బొల్లిపల్లి–బారియెంటోస్ (కొలంబియా) జోడీ 4–6, 6–4, 7–6 (13/11)తో గాఫిన్ (బెల్జియం)–ముల్లర్ (ఫ్రాన్స్) జంటపై గెలిచింది. వెటరన్ స్టార్ రోహన్ బోపన్న ద్వయంకు తొలిరౌండ్లోనే చుక్కెదురైంది. బోపన్న–సాండర్ గిల్లీ (బెల్జియం) జోడీ 3–6, 4–6తో మూడో సీడ్ క్రావిట్జ్ (జర్మనీ)–ప్యూట్జ్ (జర్మనీ) జంట చేతిలో ఓడింది. జొకోవిచ్ కష్టపడి... బిగ్–3లో కెరీర్ను కొనసాగిస్తున్న సెర్బియన్ దిగ్గజం జొకోవిచ్ రెండో సెట్లో ప్రత్యర్థి నుంచి సవాళ్లు ఎదురైనా అనుభవంతో అధిగమించాడు. ఆరో సీడ్ జొకో 6–1, 6–7 (7/9), 6–2, 6–2తో ముల్లర్ (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. తొలిరౌండ్లో మూడు గంటలకు పైగానే కోర్టులో శ్రమించి టోర్నీలో శుభారంభం చేశాడు. ప్రపంచ నంబర్వన్ యానిక్ సినెర్ (ఇటలీ) మాత్రం అలవోక విజయంతో ముందంజ వేశాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్, ఫ్రెంచ్ రన్నరప్ సినెర్ 6–4, 6–3, 6–0తో తన దేశ సహచరుడు ల్యూకా నార్డిని ఓడించగా... నాలుగో సీడ్ డ్రాపర్ (బ్రిటన్) 6–2, 6–2, 2–1తో ఆధిక్యంలో ఉండగా ప్రత్యర్థి బేజ్ (అర్జెంటీనా) రిటైర్డ్హర్ట్గా వెనుదిరిగాడు. గత యూఎస్ ఓపెన్ రన్నరప్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) 6–7 (6/8), 6–7 (8/10), 6–4, 7–6 (8/6), 6–4తో పెరికార్డ్ (ఫ్రాన్స్)పై ఐదు సెట్ల పోరాటం చేసి గట్టెక్కాడు. -
Neeraj Chopra Classic 2025: మరో స్టార్ అవుట్
బెంగళూరు: భారత్లో జరగనున్న తొలి అంతర్జాతీయ జావెలిన్ త్రో ఈవెంట్... ‘నీరజ్ చోప్రా క్లాసిక్’ నుంచి ప్రపంచ చాంపియన్ అండర్సన్ పీటర్స్ (గ్రెనడా) వైదొలిగాడు. మడమ గాయం కారణంగా 27 ఏళ్ల పీటర్స్ ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీ నుంచి తప్పుకొన్నాడు. ఇప్పటికే పలువురు జావెలిన్ త్రోయర్లు ఈ ఈవెంట్కు దూరం కాగా... ఇప్పుడు ఆ జాబితాలో పీటర్స్ కూడా చేరాడు. ఇక 2024 పారిస్ ఒలింపిక్స్లో కాంస్య పతకం నెగ్గిన పీటర్స్ స్థానాన్ని పోలాండ్కు చెందిన సిప్రియన్ మ్రిగ్లాడ్ భర్తీ చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.‘పీటర్స్ గాయం కారణంగా ‘నీరజ్ చోప్రా క్లాసిక్’ ఈవెంట్కు దూరమయ్యాడు. అతడి స్థానాన్ని పోలాండ్కు చెందిన అథ్లెట్ సిప్రియన్ భర్తీ చేస్తాడు’ అని వెల్లడించారు. అండర్ 23 యూరోపియన్ మాజీ చాంపియన్ అయిన సిప్రియన్ అత్యుత్తమ ప్రదర్శన 84.97 మీటర్లు. శనివారం బెంగళూరు వేదికగా జరగనున్న నీరజ్ చోప్రా క్లాసిక్ ఈవెంట్కు అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య ‘ఎ’ కేటగిరీ గుర్తింపునిచ్చింది.మొత్తం 12 మంది జావెలిన్ త్రోయర్లు పాల్గొంటున్న ఈ ఈవెంట్లో భారత్ నుంచి ఐదుగురు అథ్లెట్లు పోటీలో ఉన్నారు. అయితే వేర్వేరు కారణాల వల్ల ఇప్పటికే ముగ్గురు ప్లేయర్లు టోర్నీకి దూరం కాగా... వారి స్థానాల్లో ఇతరులను ఎంపిక చేశారు. భారత త్రోయర్ కిషోర్ జెనా గాయం కారణంగా ఈ ఈవెంట్కు దూరం కావడంతో అతడి స్థానంలో యశ్వీర్సింగ్ బరిలోకి దిగనున్నాడు. జెన్కీ డీన్ (జపాన్) స్థానాన్ని మార్టిన్ కొనెస్నీ (పోలాండ్)తో భర్తీ చేశారు.ఈ టోర్నీలో నీరజ్ చోప్రాతో పాటు అంతర్జాతీయ స్టార్లు జూలియస్ యెగో (కెన్యా), థామస్ రహ్లెర్ (జర్మనీ), సిప్రియన్ మ్రిగ్లాడ్, మార్టిన్ కొనెస్నీ, కర్టీస్ థాంప్సన్ (అమెరికా), లూయిస్ మౌరిసియో డా సిల్వా (బ్రెజిల్), రమేశ్ పతిరగె (శ్రీలంక) పాల్గొననున్నారు. భారత్ నుంచి నీరజ్తోపాటు సచిన్ యాదవ్, రోహిత్ యాదవ్, సాహిల్, యశ్వీర్ సింగ్ బరిలోకి దిగనున్నారు. -
దుబాయ్లో ప్రపంచ కబడ్డీ లీగ్
న్యూఢిల్లీ: మనదేశంలో విశేషాదరణ చూరగొన్న ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) త్వరలో విశ్వవ్యాప్తంగా కూత పెట్టేందుకు ముస్తాబైంది. ప్రపంచ సూపర్ కబడ్డీ లీగ్ (డబ్ల్యూఎస్కేఎల్)కు వచ్చే ఏడాది నుంచి శ్రీకారం చుట్టనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ప్రారంభ ప్రపంచ లీగ్ దుబాయ్లో వచ్చే ఫిబ్రవరి, మార్చి నెలలో నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అంతర్జాతీయ కబడ్డీ సమాఖ్య (ఐకేఎఫ్) భాగస్వామ్యంతో ఫ్రాంచైజీ లీగ్ నిర్వహిస్తామని డబ్ల్యూఎస్కేఎల్ వర్గాలు తెలిపాయి.మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీల్లో పటిష్టమైన భారత బలగం ప్రధాన భూమిక పోషించనుంది. ‘ఒక్క భారత్లోనే కాదు... ప్రపంచస్థాయిలోనే కబడ్డీ క్రీడా ఎంతో ఎదిగింది. అంతర్జాతీయ క్రీడల్లో మన గ్రామీణ ఆట ప్రముఖ స్థానం సంపాదించుకుంది. పీకేఎల్ ద్వారా దేశంలో సంపాదించుకున్న అభిమాన దళాన్ని ఇక మీదట ప్రపంచ వ్యాప్తంగా సంపాదించుకునేందుకు వరల్డ్ సూపర్ కబడ్డీ లీగ్ దోహదం చేస్తుంది.తద్వారా భవిష్యత్తులో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) గుర్తింపు కూడా పొందాలన్నదే మా ప్రధాన లక్ష్యం’ అని ఎస్జే కబడ్డీ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు శాంభవ్ జైన్ తెలిపారు. ఈ సంస్థ ఆధ్వర్యంలోనే డబ్ల్యూఎస్కేఎల్ టోర్నీ జరగనుంది. అంతర్జాతీయ కబడ్డీలో రాణిస్తున్న దక్షిణ కొరియా, ఇరాన్, థాయ్లాండ్, పాకిస్తాన్, మలేసియా, జపాన్, కెనడా, అమెరికా దేశాల కబడ్డీ సమాఖ్యలు ఈ లీగ్పై ఆసక్తి కనబరుస్తున్నాయని ఆయన చెప్పారు. ఒక్కో ఫ్రాంచైజీ ఆటగాళ్ల కొనుగోలు కోసం రూ. 48 కోట్ల పర్సు కలిగి ఉంటుంది. ముందుగా ఎనిమిది ఫ్రాంచైజీల ఎంపిక అనంతరం పూర్తిస్థాయి వివరాలు వెల్లడవుతాయని ఆయన పేర్కొన్నారు. -
సంజయ్ సారథ్యంలో...
న్యూఢిల్లీ: ప్రొ హాకీ లీగ్ యూరప్ అంచె పోటీల్లో భారత జట్టు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో... హాకీ ఇండియా (హెచ్ఐ) దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. యువ ఆటగాళ్లకు యూరప్లో మ్యాచ్ ప్రాక్టీస్ దక్కాలనే ఉద్దేశంతో... భారత ‘ఎ’ జట్టును యూరప్ పర్యటనకు పంపుతోంది. దీని కోసం మంగళవారం 20 మంది యువ ఆటగాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఈ పర్యటనలో భాగంగా ఈ నెల 8 నుంచి 20 మధ్య ఫ్రాన్స్, ఐర్లాండ్, నెదర్లాండ్స్ జట్లతో రెండేసి మ్యాచ్లు ఆడనున్న భారత ‘ఎ’ జట్టు... ఇంగ్లండ్, బెల్జియంతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ‘నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఈ టూర్ ఉపయోగపడుతుంది. ప్రతిభగల ప్లేయర్లను గుర్తించడంతో పాటు వారికి అంతర్జాతీయ స్థాయి మ్యాచ్ పరిస్థితులు కలి్పంచేందుకు ఇది తోడ్పడుతుంది’అని హాకీ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. భారత ‘ఎ’ జట్టుకు సంజయ్ సారథ్యం వహిస్తుండగా... రబిచంద్రసింగ్ వైస్ కెపె్టన్గా వ్యవహరించనున్నాడు. భారత జాతీయ జట్టుకు సహాయక కోచ్గా పనిచేస్తున్న శివేంద్ర సింగ్... ఈ టీమ్కు కోచ్గా వ్యవహరిస్తున్నాడు. ‘యూరప్ ఆటగాళ్ల శైలిని అర్థం చేసుకునేందుకు మన యువ ఆటగాళ్లకు ఈ పర్యటన ఎంతగానో ఉపయోగపడుతుంది. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడానికి ముందే అంతర్జాతీయ అనుభవం గడించడం ఆటగాళ్లకు ఎంతో తోడ్పడుతుంది’ అని శివేంద్ర సింగ్ అన్నాడు. దీంతో జాతీయ జట్టు భవిష్యత్తుకు భరోసా పెరుగుతుందని వెల్లడించాడు. భారత ‘ఎ’ హాకీ జట్టు: గోల్ కీపర్స్: పవన్, మోహిత్. డిఫెండర్స్: ప్రతాప్ లాక్రా, వరుణ్ కుమార్, అమన్దీప్ లాక్రా, ప్రమోద్, సంజయ్ (కెప్టెన్). మిడ్ఫీల్డర్స్: పూవన్న చందూర బాబీ, మొహమ్మద్ రాహిల్, రబిచంద్ర సింగ్, విష్ణుకాంత్ సింగ్, ప్రదీప్ సింగ్, రాజిందర్ సింగ్. ఫార్వర్డ్స్: అంగద్బీర్ సింగ్, బాబీ సింగ్ ధామి, మణీందర్ సింగ్, వెంకటేశ్ కెంచె, ఆదిత్య అర్జున్ లాథె, సెల్వమ్ కార్తీ, ఉత్తమ్ సింగ్. స్టాండ్బై: అంకిత్ (గోల్కీపర్), సునీల్ (డిఫెండర్), సుదీప్ (ఫార్వర్డ్). -
భారత సంతతి ఆటగాళ్లకు అవకాశం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రీడల్లో భారత్ను మరింత ఉన్నత స్థితికి చేర్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త క్రీడా విధానానికి ఆమోద ముద్ర పడింది. ‘ఖేలో భారత్ నీతి’ పేరుతో తయారు చేసిన ఈ పాలసీని తాజా కేబినెట్ సమావేశంలో ఆమోదించారు. క్రీడల్లో ప్రపంచ టాప్–5లో నిలిచేందుకు అవసరమైన రోడ్ మ్యాప్తో ఇది సిద్ధమైందని ప్రభుత్వం ప్రకటించింది. భారత్లో తొలిసారి 1984లో క్రీడా పాలసీ అమల్లోకి వచి్చంది. ఆ తర్వాత 2001లో దీనికి మార్పులు చేశారు. అప్పటి నుంచి అదే విధానం కొనసాగుతుండగా.. 2001లో పాలసీని సవరిస్తూ కొత్త అంశాలు చేర్చారు. విశ్వ వేదికపై చక్కటి ప్రదర్శన, ఆరి్థకాభివృద్ధికి క్రీడలు, సామాజిక వృద్ధికి క్రీడలు, ప్రజల్లో క్రీడల ద్వారా చైతన్యం, జాతీయ విద్యావిధానంతో కలిసి క్రీడాభివృద్ధి అనే ఐదు అంశాలతో ‘ఖేలో భారత్ నీతి’ని ముందుకు తీసుకొచ్చామని, ఇది కొత్త మార్పుకు శ్రీకారం అవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. మరోవైపు భారత సంతతికి చెంది విదేశాల్లో స్థిరపడిన ఆటగాళ్లు కూడా ఇకపై భారత్కు ప్రాతినిధ్యం వహించేందుకు మార్గం సుగమమైంది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం భారతీయ పాస్పోర్ట్ ఉన్నవారే దేశం తరఫున ఆడేందుకు అవకాశం ఉంది. భారత ఆటగాళ్లకే ఎక్కువ అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో 2008లో ఈ నిబంధనను తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో విదేశాల్లో ఉంటున్న ఏ ప్లేయర్ అయినా భారత్ తరఫున ఆడితే అతనికి వ్యక్తిగతంగా ఉపకరించడంతో పాటు ఇక్కడి వర్ధమాన, యువ ఆటగాళ్లకు కూడా సరైన మార్గనిర్దేశనం లభిస్తుందని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఇకపై విదేశాల్లో స్థిరపడినా, అక్కడే శిక్షణ పొందుతున్నా... టోరీ్నల్లో మాత్రం మన దేశం తరఫున బరిలోకి దిగవచ్చు. ఉదాహరణకు టెన్నిస్లో దిగ్గజ ఆటగాడు ఆనంద్ అమృత్రాజ్ కుమారుడు ప్రకాశ్ అమృత్రాజ్కు అమెరికా పౌరసత్వం ఉంది. అతను 2003–08 మధ్య డేవిస్కప్లో భారత్కు ప్రాతినిధ్యం వహించినా ... ఆ తర్వాత తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అతను మళ్లీ సొంత దేశం తరఫున ఆడేందుకు అవకాశం ఉంది. -
హ్యాట్రిక్పై భారత్ గురి
చియాంగ్ మాయ్ (థాయ్లాండ్): ఆసియా కప్–2026 మహిళల ఫుట్బాల్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత జట్టు ‘హ్యాట్రిక్’పై కన్నేసింది. గత రెండు మ్యాచ్ల్లో అద్వితీయ విజయాలు సాధించిన భారత్... బుధవారం మూడో మ్యాచ్లో ఇరాక్తో పోటీపడనుంది. గ్రూప్ ‘బి’లో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన టీమిండియా ప్రస్తుతం 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. తెలంగాణ ప్లేయర్ గుగులోత్ సౌమ్య గాయం కారణంగా ఈ మ్యాచ్కు దూరమైంది. తిమోర్ లెస్టెతో జరిగిన గత పోరులో సౌమ్య ముక్కుకు బలమైన గాయమైంది. తొలి మ్యాచ్లో మంగోలియాపై 13–0 గోల్స్ తేడాతో గెలిచిన మన అమ్మాయిలు... రెండో మ్యాచ్లో తిమోర్ లెస్టెపై 4–0 గోల్స్తో నెగ్గారు. ఈ మ్యాచ్లో కూడా అదే జోరు కొనసాగిస్తూ మరో భారీ విజయం ఖాతాలో వేసుకోవాలని కృతనిశ్చయంతో ఉన్నారు. గ్రూప్లో భాగంగా శనివారం ఆతిథ్య థాయ్లాండ్తో భారత్ చివరి గ్రూప్ మ్యాచ్ ఆడనుంది. అంతకుముందే అగ్రస్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవడమే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగనుంది. ‘థాయ్లాండ్తో చివరి మ్యాచ్ ఆడనున్నాం. అయితే ప్రస్తుతానికి మా దృష్టి ఇరాక్తో పోరుపైనే ఉంది. మంగోలియాపై థాయ్లాండ్ ఎన్ని గోల్స్ సాధిస్తుంది... మేము ఇరాక్పై ఎన్ని సాధించాలనే లెక్కలు పక్కన పెట్టి సానుకూల దృక్పథంతో బరిలోకి దిగుతాం. గత మ్యాచ్ ప్రదర్శనను దృష్టిలో పెట్టుకొని మెరుగవ్వాల్సిన విషయాల్లో మరింత సాధన చేశాం. ఒక్కో ప్లేయర్కు ప్రత్యేక బాధ్యతలు అప్పగించాం. ఇరాక్తో మ్యాచ్ను తేలికగా తీసుకోవడం లేదు. అందరికీ అవకాశం ఇస్తూ... చివరి మ్యాచ్ వరకు తాజాగా ఉంచాలనుకుంటున్నాం. రొటేషన్ పద్ధతిని సరిగ్గా వినియోగించుకుంటాం’ అని భారత కోచ్ క్రిస్పన్ ఛెత్రీ పేర్కొన్నాడు. ఈ టోర్నీ కోసం భారత జట్టు 23 మంది ప్లేయర్లను ఎంపిక చేయగా... గత రెండు మ్యాచ్ల్లో 22 మందికి మ్యాచ్ ఆడే అవకాశం దక్కింది. సరైన సమయంలో ప్లేయర్లకు విశ్రాంతినిస్తూ... సబ్స్టిట్యూట్లను సమర్థవంతంగా వినియోగించుకోవడంతోనే ఇది సాధ్యమైంది. మరోవైపు టోర్నీలో మూడు మ్యాచ్లాడిన ఇరాక్... ఒక విజయం, ఒక ఓటమి, ఒక ‘డ్రా’తో 4 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక మూడో స్థానంలో ఉంది. ప్రపంచ 173వ ర్యాంకర్ ఇరాక్... ఇదే టోర్నీలో తమ తొలి అంతర్జాతీయ విజయం (మంగోలియాపై 5–2 గోల్స్తో) నమోదు చేసుకుంది. -
భారత నంబర్వన్గా ప్రజ్ఞానంద
లుసానే (స్విట్జర్లాండ్): ఈ ఏడాది నిలకడగా రాణిస్తున్న తమిళనాడు చెస్ గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద... ఓపెన్ విభాగంలో భారత కొత్త నంబర్వన్ ప్లేయర్గా అవతరించాడు. ప్రపంచ చెస్ సమాఖ్య (ఫిడే) మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో 19 ఏళ్ల ప్రజ్ఞానంద 2779 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. గతవారం ఉజ్బెకిస్తాన్ రాజధాని తాషె్కంట్లో జరిగిన ఉజ్కప్ చెస్ టోర్నీలో ప్రజ్ఞానంద విజేతగా నిలవడంతో అతని ర్యాంక్ మెరుగైంది. ఇదే టోర్నీలో నాలుగో స్థానంలో నిలిచిన తెలంగాణ గ్రాండ్మాస్టర్, కొన్నాళ్లుగా భారత నంబర్వన్గా ఉన్న ఇరిగేశి అర్జున్ 2776 పాయింట్లతో నాలుగు నుంచి ఐదో ర్యాంక్కు పడిపోయాడు. క్లాసికల్ ఫార్మాట్లో ప్రపంచ చాంపియన్, భారత్కే చెందిన మరో గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ 2776 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నాడు. వెరసి టాప్–6లో ముగ్గురు భారత గ్రాండ్మాస్టర్లు ఉండటం విశేషం. ఓవరాల్గా టాప్–100లో భారత్ నుంచి విశ్వనాథన్ ఆనంద్ (13వ స్థానం), అరవింద్ చిదంబరం (24), విదిత్ సంతోష్ గుజరాతి (26), పెంటేల హరికృష్ణ (30), నిహాల్ సరీన్ (37), రౌనక్ సాధ్వాని (44), మురళీ కార్తికేయన్ (75), అభిమన్యు పురాణిక్ (93) ఉన్నారు. మాగ్నస్ కార్ల్సన్ (నార్వే; 2839 పాయింట్లు) ‘టాప్’ ర్యాంక్లో కొనసాగుతుండగా... హికారు నకముర (అమెరికా; 2807 పాయింట్లు) రెండో స్థానంలో, ఫాబియానో కరువానా (అమెరికా; 2784 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచారు. ఐదో ర్యాంక్లో హంపి మహిళల క్లాసికల్ ఫార్మాట్ ర్యాంకింగ్స్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్, భారత స్టార్ కోనేరు హంపి ఒక స్థానాన్ని మెరుగుపర్చుకుంది. గత నెలలో ఆరో స్థానంలో ఉన్న హంపి తాజా ర్యాంకింగ్స్లో 2536 పాయింట్లతో ఐదో ర్యాంక్కు చేరుకుంది. హైదరాబాద్కు చెందిన గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక కూడా ఒక స్థానం పురోగతి సాధించి 2488 పాయింట్లతో 12వ ర్యాంక్ను అందుకుంది. 2478 పాయింట్లతో వైశాలి 15వ ర్యాంక్లో, 2463 పాయింట్లతో దివ్య దేశ్ముఖ్ 18వ ర్యాంక్లో కొనసాగుతున్నారు. -
నిఖత్ జరీన్కు రజతం
జాతీయ సీనియర్ మహిళల ఎలైట్ బాక్సింగ్ టోర్నీలో భారత స్టార్, తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ (51 కేజీలు) రజత పతకం సాధించింది. హైదరాబాద్లో మంగళవారం ముగిసిన ఈ టోర్నీలో గాయం కారణంగా నిఖత్ ఫైనల్ బౌట్లో బరిలోకి దిగలేదు. దాంతో నిఖత్ ప్రత్యర్థి జ్యోతి (రైల్వేస్) రింగ్లోకి దిగకుండానే స్వర్ణ పతకాన్ని ఖరారు చేసుకుంది. రైల్వేస్ బాక్సర్లు మూడు స్వర్ణాలు, మూడు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం 9 పతకాలను గెల్చుకున్నారు. -
తిరోగమనంలో మన ‘స్టిక్’
సాక్షి క్రీడా విభాగం: భారత పురుషుల హాకీ జట్టు నెల రోజుల క్రితం వరకు కూడా ప్రపంచంలో బలమైన జట్లలో ఒకటిగా కనిపించింది. వరుస విజయాలు, ఫామ్లో చూస్తే సరైన దిశలో నడుస్తున్నట్లుగా, మున్ముందు మరింత మెరుగైన ప్రదర్శనతో దూసుకుపోయే సత్తా ఉన్న టీమ్లా అనిపించింది. ఇదే ఉత్సాహంతో యూరోపియన్ టూర్కు జట్టు సిద్ధమైంది. అయితే నెల రోజులు తిరిగేసరికి పరిస్థితి అంతా మారిపోయింది. ఇంతకాలం ఆశలు రేపిన జట్టు ఇదేనా అన్న తరహాలో ప్రొ లీగ్లో పేలవమైన ఆటను చూపించింది. ఆటగాళ్లతో పాటు కోచ్లు కూడా అంచనాలకు పూర్తి భిన్నంగా విఫల ప్రదర్శనతో వెనుదిరిగారు. పురుషుల జట్టుతో పోలిస్తే భారత మహిళల బృందం మరింత నాసిరకం ఆటను ప్రదర్శించింది. ఎంతో అనుభవం ఉన్నా... లీగ్లో కనీస స్థాయిలో ప్రమాణాలు కూడా చూపించకుండా చతికిల పడింది. మున్ముందు ప్రతిష్టాత్మక ఈవెంట్లు జరగనున్న నేపథ్యంలో ఈ రెండు టీమ్లు ఏమాత్రం పట్టు సాధిస్తాయనేది చూడాలి. మూడు నుంచి ఎనిమిదో స్థానానికి... భువనేశ్వర్లో జరిగిన తొలి అంచె ప్రొ లీగ్ పోటీల్లో 8 మ్యాచ్ల ద్వారా 15 పాయింట్లు సాధించిన భారత పురుషుల జట్టు మూడో స్థానంతో మెరుగైన రీతిలో ముగించింది. కానీ యూరోప్లో జరిగిన రెండో అంచె పోటీల్లో 8 మ్యాచ్లలో కేవలం 3 పాయింట్లు మాత్రమే రాబట్టగలిగింది. ఫలితంగా తొమ్మిది జట్ల టోర్నీలో ఎనిమిదో స్థానానికే పరిమితమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారత హాకీ చరిత్రలో తొలిసారి వరుసగా ఏడు మ్యాచ్లు ఓడిన చెత్త రికార్డు కూడా నమోదైంది. ఒకదశలో టైటిల్ రేసులో నిలిచిన జట్టు పరిస్థితి చివరకు ఇలా తయారైంది. ఐర్లాండ్లాంటి బలహీన జట్టుతో గెలిచిన అదృష్టం వల్ల ఆఖరి స్థానం రాకుండా తప్పించుకోగలిగింది! అయితే ఇన్ని మ్యాచ్లు ఓడినా ఇవన్నీ హోరాహోరీగా సాగి చివరి వరకు పోరాడినవి కావడం కొంత సానుకూలాంశం. ఈ ఏడు పరాజయాల్లో ఆరింటిలో భారత్ ఒకే ఒక గోల్ తేడాతో మాత్రమే ఓడింది. వాటిలో ఐదూ చివరి క్వార్టర్లోనే వచ్చాయి. చివర్లో డిఫెన్స్ వైఫల్యంతో ఇది జరిగింది. దీనిపై దృష్టి పెట్టి సరిదిద్దుకునే అవకాశం జట్టు ముందుంది. యూరోప్ టూర్ ఆరంభంలో వీసా సమస్యల వల్ల పలువురు ఆటగాళ్లు ఆలస్యంగా జట్టుతో చేరగా, గుర్జంత్ సింగ్, కెప్టెన్ హర్మన్ప్రీత్ గాయాలతో ఇబ్బంది పడ్డారు. పూర్తిగా అటాకింగ్పైనే దృష్టి పెట్టాలంటూ కోచ్ క్రెయిన్ ఫుల్టన్ కొత్త వ్యూహాన్ని తీసుకురావడంతో ఆటగాళ్లు ఒక్కసారిగా దానికి అనుగుణంగా మారలేకపోయారు. దీంతో మరో వైపు డిఫెన్స్ బలహీనంగా మారిపోయింది. ట్యాకిల్ సరిగా లేక, పొజిషనింగ్ సరిగా లేక జట్టు ఈ ఎనిమిది మ్యాచ్లలో 26 గోల్స్ సమర్పించుకుంది! మార్పులు ఉంటాయా... సీనియర్లు అమిత్ రోహిదాస్, జుగ్రాజ్ సింగ్, జర్మన్ప్రీత్ సింగ్, సంజయ్ పూర్తిగా విఫలం కాగా... అభిõÙక్ ఒక్కడే నాలుగు గోల్స్తో ఫర్వాలేదనిపించాడు. అయితే సర్కిల్ లోపల ఎక్కువ సేపు బంతిని ఉంచుకునే అతని బలహీనత కారణంగా ప్రత్యర్థులు సరైన డిఫెన్స్తో భారత్ మరిన్ని గోల్స్ చేయకుండా అడ్డుకోగలిగారు. ఇద్దరు గోల్ కీపర్లు కృషన్ పాఠక్, సూరజ్ కర్కేరా ఘోర వైఫల్యం శ్రీజేశ్ ఉన్నప్పుడు జట్టు గోల్కీపింగ్ స్థాయి ఎంత గొప్పగా ఉండేదో గుర్తు చేసింది. మన్దీప్ సింగ్, లలిత్, సుఖ్జీత్, దిల్ప్రీత్ కూడా ప్రభావం చూపలేకపోయారు. 400కు పైగా అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన మన్ప్రీత్ సింగ్తో పాటు హార్దిక్ సింగ్ మాత్రమే తమ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇచ్చినా అది జట్టు గెలిచేందుకు సరిపోలేదు. హర్మన్ప్రీత్ ఆడని మ్యాచ్లలో మన డ్రాగ్ ఫ్లికింగ్ మరీ పేలవంగా కనిపించింది. రోహిదాస్ అంచనాలను అందుకోలేకపోగా, జుగ్రాజ్ అయితే ఏకంగా పెనాల్టీ స్ట్రోక్ను కూడా గోల్గా మలచలేకపోయాడు. ప్రస్తుతం అంతర్జాతీయ హాకీలో ఎంతో కీలకమైన డ్రాగ్ఫ్లికింగ్లో పరిస్థితి మెరుగు కాకపోయే ఎలాంటి విజయాలను ఆశించలేం. మరో రెండు నెలల్లో భారత్లోనే ఆసియా కప్ ఉంది. దీని ద్వారా మన టీమ్ వరల్డ్ కప్కు అర్హత సాధించే అవకాశం ఉంది. అప్పటిలోగా జట్టులో ఏమైనా మార్పులు చేస్తారా, సీనియర్లను పక్కన పెట్టిన కొత్తవారికి అవకాశాలు ఇస్తారా అనే విషయంపై కోచ్ స్పష్టతనివ్వలేదు. స్వదేశంలో జరిగే జూనియర్ వరల్డ్ కప్లో కుర్రాళ్ల ప్రదర్శన తర్వాత దీనిపై అతను నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అరైజిత్ సింగ్, మొహమ్మద్ రాహిల్, సెల్వమ్ కార్తీలాంటి యువ ఆటగాళ్లు ప్రస్తుతానికి తమ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. 2023–24 ప్రొ లీగ్లో కూడా ఏడో స్థానంలో నిలిచిన టీమ్ ఆ తర్వాత కోలుకొని పారిస్ ఒలింపిక్స్లో కాంస్యం గెలిచే వరకు వెళ్లింది. ఇప్పుడు టీమ్కు అదే స్ఫూర్తి కావాలి. -
ఆయుశ్ అదరహో
అయోవా (అమెరికా): నిరీక్షణ ముగిసింది. ఈ ఏడాది భారత ప్లేయర్ ఖాతాలో తొలి అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీ టైటిల్ చేరింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన యూఎస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోరీ్నలో భారత ప్లేయర్ ఆయుశ్ శెట్టి విజేతగా అవతరించాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 34వ ర్యాంకర్ ఆయుశ్ శెట్టి 21–18, 21–13తో ప్రపంచ 33వ ర్యాంకర్ బ్రియాన్ యాంగ్ (కెనడా)పై గెలుపొందాడు. ఈ ఏడాది యాంగ్పై ఆయుశ్కిది మూడో విజయం కావడం విశేషం. మలేసియా ఓపెన్, తైపీ ఓపెన్ టోర్నీల్లోనూ యాంగ్పై ఆయుశ్ నెగ్గాడు. చాంపియన్గా నిలిచిన ఆయుశ్కు 18 వేల డాలర్ల (రూ. 15 లక్షల 45 వేలు) ప్రైజ్మనీతోపాటు 7000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. యాంగ్తో 47 నిమిషాలపాటు జరిగిన తుది పోరులో ఆయుశ్కు తొలి గేమ్లో గట్టిపోటీ ఎదురైంది. మూడుసార్లు ఇద్దరి స్కోర్లు సమమయ్యాయి. స్కోరు 19–18 వద్ద ఆయుశ్ వరుసగా రెండు పాయింట్లు నెగ్గి తొలి గేమ్ దక్కించుకున్నాడు. రెండో గేమ్లో మాత్రం ఆయుశ్ దూకుడు కనబరిచాడు. ఆరంభంలోనే 6–1తో ఆధిక్యంలోకి వెళ్లిన ఆయుశ్ ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని 11–6కు పెంచుకున్నాడు. యాంగ్ కోలుకునే ప్రయత్నం చేసినా జోరు మీదున్న ఆయుశ్ ఎలాంటి అవకాశం ఇవ్వకుండా గేమ్తోపాటు మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. 2023లో లక్ష్య సేన్ కెనడా ఓపెన్లో టైటిల్ సాధించిన తర్వాత ఆయుశ్ శెట్టి రూపంలో మరో భారత ప్లేయర్ అంతర్జాతీయ టోర్నీలో పురుషుల సింగిల్స్ టైటిల్ గెల్చుకున్నాడు. ‘సీనియర్ సర్క్యూట్లో నాకిదే తొలి టైటిల్. ఈ విజయం ఎంతో ప్రత్యేకం. చాలా సంతోషంగా ఉన్నా. గత వారం రోజులుగా అద్భుతంగా ఆడాను. ఇదే జోరును కెనడా ఓపెన్లోనూ కొనసాగిస్తాను’ అని కర్ణాటకకు చెందిన 20 ఏళ్ల ఆయుశ్ వ్యాఖ్యానించాడు. 6 అడుగుల 5 అంగుళాల ఎత్తున్న ఆయుశ్ 2023లో ప్రపంచ జూనియర్ చాంపియన్íÙప్లో కాంస్య పతకాన్ని సాధించి వెలుగులోకి వచ్చాడు. రన్నరప్ తన్వీ శర్మ యూఎస్ ఓపెన్ టోరీ్నలో భారత్కు ‘డబుల్ ధమాకా’ సృష్టించే అవకాశం చేజారింది. మహిళల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్ తన్వీ శర్మ రన్నరప్గా నిలిచింది. టాప్ సీడ్, ప్రపంచ 21వ ర్యాంకర్ బీవెన్ జాంగ్ (అమెరికా)తో జరిగిన ఫైనల్లో 16 ఏళ్ల తన్వీ శర్మ 11–21, 21–16, 10–21తో పోరాడి ఓడిపోయింది. కెరీర్లో తొలి వరల్డ్ టూర్ ఫైనల్ ఆడిన పంజాబ్కు చెందిన తన్వీ ప్రత్యరి్థకి గట్టిపోటీనిచి్చనా చివరకు అనుభవజు్ఞరాలైన బీవెన్ జాంగ్దే పైచేయి అయింది. ప్రపంచ ర్యాంకింగ్స్లో 66వ స్థానంలో ఉన్న తన్వీ శర్మకు 9,120 డాలర్ల (రూ. 7 లక్షల 82 వేలు) ప్రైజ్మనీతోపాటు 5950 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
గట్టెక్కిన అల్కరాజ్
‘హ్యాట్రిక్’ టైటిల్ లక్ష్యంగా వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నిలో బరిలోకి దిగిన స్పెయిన్ స్టార్ అల్కరాజ్కు ఊహించని ప్రతిఘటన ఎదురైంది. తొలి రౌండ్ అడ్డంకిని అలవోకగా అధిగమిస్తాడని భావించినా... ఇటలీ సీనియర్ ప్లేయర్ ఫాగ్నిని పోరాటపటిమ కారణంగా ఏకంగా 4 గంటల 37 నిమిషాలు చెమటోడ్చి... చివరకు ఐదు సెట్ల పోరులో అల్కరాజ్ గట్టెక్కాడు. లండన్: టెన్నిస్ సీజన్ మూడో గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ వింబుల్డన్లో తొలి రోజు సంచలన ఫలితాలు నమోదయ్యాయి. పురుషుల సింగిల్స్ విభాగంలో రష్యా స్టార్, తొమ్మిదో సీడ్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా), ఎనిమిదో సీడ్ హోల్గర్ రూనె (డెన్మార్క్) తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టగా... డిఫెండింగ్ చాంపియన్, రెండో సీడ్ అల్కరాజ్ (స్పెయిన్) తొలి రౌండ్ను దాటేందుకు తీవ్రంగా శ్రమించాడు. ప్రపంచ 138వ ర్యాంకర్ ఫాబియో ఫాగ్నిని (ఇటలీ)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్లో ప్రపంచ రెండో ర్యాంకర్ అల్కరాజ్ 7–5, 6–7 (5/7), 7–5, 2–6, 6–1తో గెలుపొంది రెండో రౌండ్కు చేరుకున్నాడు. 4 గంటల 37 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో అల్కరాజ్ 14 ఏస్లు సంధించి, 9 డబుల్ ఫాల్ట్లు చేశాడు. 62 అనవసర తప్పిదాలు చేసి, 52 విన్నర్స్ కొట్టాడు. తన సరీ్వస్ను ఐదుసార్లు కోల్పోయిన అల్కరాజ్... ప్రత్యర్థి సరీ్వస్ను ఏడుసార్లు బ్రేక్ చేశాడు. ఇతర మ్యాచ్ల్లో బెంజిమిన్ బోంజి (ఫ్రాన్స్) 3 గంటల 7 నిమిషాల్లో 7–6 (7/2), 3–6, 7–6 (7/3), 6–2తో మెద్వెదెవ్పై... నికోలస్ జారీ (చెక్ రిపబ్లిక్) 3 గంటల 34 నిమిషాల్లో 4–6, 4–6, 7–5, 6–3, 6–4తో హోల్గర్ రూనెపై గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించారు. వాలెంటిన్ రాయర్ (ఫ్రాన్స్)తో జరిగిన మ్యాచ్లో 24వ సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) తొలి రెండు సెట్లను 3–6, 2–6తో కోల్పోయాక వెన్నునొప్పితో ఆటను కొనసాగించలేక వైదొలిగాడు. నిశేష్ కు నిరాశ కెరీర్లో తొలిసారి వింబుల్డన్ టోర్నిలో ఆడుతున్న తెలుగు సంతతికి చెందిన అమెరికా ప్లేయర్ నిశేష్ బసవరెడ్డికి నిరాశ ఎదురైంది. తొలి రౌండ్లో 20 ఏళ్ల నిశేష్ 6–7 (5/7), 3–6, 2–6తో అమెరికాకే చెందిన లెర్నర్ టియెన్ చేతిలో ఓడిపోయాడు. నిశేష్కు 66,000 పౌండ్లు (రూ. 77 లక్షల 56 వేలు) ప్రైజ్మనీగా లభించాయి. కష్టపడ్డ కీస్ మహిళల సింగిల్స్లో ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ సబలెంకా (బెలారస్) శుభారంభం చేసింది. తొలి రౌండ్లో సబలెంకా 6–1, 7–5తో కార్సన్ బ్రాన్స్టిన్ (కెనడా)పై గెలిచింది. ఈ ఏడాది ఆ్రస్టేలియన్ ఓపెన్ చాంపియన్, ఆరో సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) గెలిచేందుకు కష్టపడింది. 2 గంటల 41 నిమిషాల పోరులో కీస్ 6–7 (4/7), 7–5, 7–5తో ఎలీనా రూసె (రొమేనియా)పై నెగ్గింది. 20వ సీడ్, 2017 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ ఒస్టాపెంకో (లాతి్వయా)... 2022, 2023 రన్నరప్ ఆన్స్ జబర్ (ట్యూనిషియా) తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. తొమోవా (బల్గేరియా)తో జరిగిన మ్యాచ్లో జబర్ తొలి సెట్ను 6–7 (5/7)తో కోల్పోయి, రెండో సెట్లో 0–2తో వెనుకబడిన దశలో గాయంతో వైదొలిగింది. బ్రిటన్ ప్లేయర్ సోనె కార్టల్ 7–5, 2–6, 6–2తో ఒస్టాపెంకోను ఓడించి రెండో రౌండ్కు చేరింది. టోర్నీ మొదటిరోజు రికార్డు స్థాయిలో 33 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దాంతో ఆటగాళ్లకు పట్టపగలే చుక్కలు కనబడ్డాయి. చాలా మంది ప్లేయర్లు మ్యాచ్ మధ్యలో బ్రేక్లు తీసుకుంటూ... ఐస్ ప్యాక్లతో శరీరాన్ని చల్లబర్చుకుంటూ... ఆటను కొనసాగించారు. -
ప్రొ లీగ్ నుంచి భారత జట్టు అవుట్
బెర్లిన్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్ నుంచి భారత మహిళల జట్టు ని్రష్కమించింది. ఆదివారం 2024–2025 సీజన్ ముగిసింది. చివరిదైన యూరోపియన్ అంచె పోటీల్లో ఆడిన అన్ని మ్యాచ్లు ఓడిపోయిన భారత్ చివరిదైన తొమ్మిదో స్థానంలో నిలిచి ప్రొ లీగ్ నుంచి అవుటైంది. చైనాతో జరిగిన ఆఖరి మ్యాచ్లో భారత్ 2–3 గోల్స్ తేడాతో ఓడిపోయింది. భారత జట్టుకు సునెలితా టొప్పో (9వ నిమిషంలో), రుతుజా (38వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. చైనా నుంచి జంగ్ ఇంగ్ (19వ, 39 నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... జు వెన్ యు (53వ నిమిషంలో) ఒక గోల్ సాధించింది. నిజానికి శనివారం చైనాతో జరిగిన తొలి మ్యాచ్ ఓటమితోనే ప్రొ లీగ్ బెర్త్ గల్లంతయ్యింది. అయితే అసాధ్యమైన భారీ గోల్స్ తేడాతో పేపర్లో ఉన్న అవకాశం తాజా పరాజయంతో దూరమైంది. తొమ్మిది జట్లు పోటీపడిన ఈ లీగ్లో భారత్ 16 మ్యాచ్లాడి 10 పాయింట్లతో అట్టడుగున నిలిచింది. ఇలా ఆఖరి స్థానంలో నిలిచిన జట్టు ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ నుంచి అనర్హతకు గురవుతుంది. మళ్లీ లీగ్లోకి అర్హత సంపాదించాలంటే వచ్చే ఏడాది ఎఫ్ఐహెచ్ నేషన్స్ కప్లో ఆడిన అందులో మెరుగైన స్థానం సాధిస్తేనే ప్రొ లీగ్ బెర్త్ లభిస్తుంది. -
టైటిల్కు చేరువలో...
అయోవా (అమెరికా): ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) టూర్లో ఈ ఏడాది భారత క్రీడాకారులెవరూ ‘సూపర్’ స్థాయి టోరీ్నల్లో టైటిల్ సాధించలేదు. అంతా అనుకున్నట్లు జరిగితే ... ఒకేసారి రెండు టైటిల్స్తో భారత షట్లర్లు ‘డబుల్’ ధమాకా సృష్టించే అవకాశముంది. ఏమాత్రం అంచనాలు లేకుండా యూఎస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీలో బరిలోకి దిగిన భారత యువ షట్లర్లు ఆయుశ్ శెట్టి, తన్వీ శర్మ టైటిల్కు కేవలం విజయం దూరంలో నిలిచారు. పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ 34వ ర్యాంకర్ ఆయుశ్ శెట్టి... మహిళల సింగిల్స్లో విభాగంలో ప్రపంచ 66వ ర్యాంకర్ తన్వీ శర్మ ఫైనల్లోకి దూసుకెళ్లారు. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ఆయుశ్ శెట్టి 21–23, 21–15, 21–14తో టాప్ సీడ్, ప్రపంచ ఆరో ర్యాంకర్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)పై సంచలన విజయం సాధించగా... 16 ఏళ్ల తన్వీ శర్మ 21–14, 21–16తో ఏడో సీడ్, ప్రపంచ 40వ ర్యాంకర్ పొలీనా (ఉక్రెయిన్)ను బోల్తా కొట్టించింది. ఫైనల్స్లో బ్రియాన్ యాంగ్ (కెనడా)తో ఆయుశ్; బీవెన్ జాంగ్ (అమెరికా)తో తన్వీ తలపడతారు. గత నెలలో శ్రీకాంత్ మలేసియా ఓపెన్ టోరీ్నలో ఫైనల్కు చేరి రన్నరప్గా నిలవడమే ఈ ఏడాది భారత షట్లర్ల అత్యుత్తమ ప్రదర్శన. ఫైనల్లో ఆయుశ్, తన్వీ విజయం సాధిస్తే భారత్కు ‘టైటిల్’ లోటు తీరుతుంది. -
రన్నరప్ యూకీ జోడీ
మలోర్కా (స్పెయిన్): కెరీర్లో ఐదో డబుల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత టెన్నిస్ స్టార్ యూకీ బాంబ్రీకి నిరాశ ఎదురైంది. మలోర్కా ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నమెంట్లో యూకీ బాంబ్రీ (భారత్)–రాబర్ట్ గాలోవే (అమెరికా) జోడీ రన్నరప్గా నిలిచింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో యూకీ–గాలోవే జోడీ 1–6, 6–1, 13–15తో ‘సూపర్ టైబ్రేక్’లో సాంటియాగో గొంజాలెజ్ (మెక్సికో)–ఆస్టిన్ క్రాయిసెక్ (అమెరికా) జోడీ జంట చేతిలో పోరాడి ఓడిపోయింది. 79 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో యూకీ–గాలోవే జోడీ ఏడు ఏస్లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్లు చేసింది. తమ సరీ్వస్ను రెండుసార్లు కోల్పోయిన ఈ ఇండో–అమెరికన్ ద్వయం ప్రత్యర్థుల సరీ్వస్ను రెండుసార్లు బ్రేక్ చేసింది. రన్నరప్ యూకీ–గాలోవో జంటకు 16,940 యూరోల (రూ. 16 లక్షల 95 వేలు) ప్రైజ్మనీతోపాటు 150 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 2023లో లాయిడ్ హారిస్ (దక్షిణాఫ్రికా)తో కలిసి ఇదే టోరీ్నలో యూకీ డబుల్స్ టైటిల్ను సాధించాడు. ఓవరాల్గా యూకీ తన కెరీర్లో నాలుగు ఏటీపీ డబుల్స్ టైటిల్స్ను సాధించి, మరో నాలుగింటిలో రన్నరప్గా నిలిచాడు. -
వెల్డన్ నోరిస్
స్పీల్బర్గ్ (ఆ్రస్టియా): ఫార్ములావన్ తాజా సీజన్లో మెక్లారెన్ డ్రైవర్ లాండో నోరిస్ తన ఖాతాలో మూడో విజయం జమ చేసుకున్నాడు. 2025 సీజన్లో 11వ రేసుగా ఆదివారం జరిగిన ఆ్రస్టియా గ్రాండ్ప్రిలో నోరిస్ విజేతగా నిలిచాడు. నిర్ణీత 70 ల్యాప్లను నోరిస్ అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా ఒక గంట 23 నిమిషాల 47.693 సెకన్లలో ముగించి అగ్రస్థానం దక్కించుకున్నాడు. మెక్లారెన్ జట్టుకే చెందిన ఆస్కార్ పియాస్ట్రి ఒక గంట 23 నిమిషాల 50.388 సెకన్లతో రెండో స్థానంలో నిలిచాడు. చివరగా జరిగిన కెనడా గ్రాండ్ప్రిలో ఈ ఇద్దరి కార్లు పరస్పరం ఢీకొనగా... తాజా రేసులో వీరి మధ్య ఆద్యంతం రసవత్తర పోటీ సాగింది. అయితే ఆఖర్లో వేగం పెంచిన నోరిస్ టైటిల్ హస్తగతం చేసుకున్నాడు. తద్వారా డ్రైవర్స్ ప్రపంచ చాంపియన్షి ప్ సాధించే దిశగా ముందడుగు వేశాడు. ‘మా ఇద్దరి మధ్య గట్టి పోటీ సాగింది. తొలి రెండు స్థానాల్లో నిలవడం ఆనందంగా ఉంది’ అని రేసు అనంతరం నోరిస్ అన్నాడు. ఫెరారీ డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ (1 గంట 24 నిమిషాల 7.513 సెకన్లు) మూడో స్థానంలో నిలవగా... ఏడుసార్లు ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ (1 గంట 24 నిమిషాల 16.713 సెకన్లు; ఫెరారీ) నాలుగో స్థానంలో, రసెల్ (1 గంట 24 నిమిషాల 50.089 సెకన్లు; మెర్సిడెస్) ఐదో స్థానంలో నిలిచారు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్, రెడ్బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ రేసును పూర్తి చేయలేకపోయాడు. మొత్తం 20 మంది డ్రైవర్లు పాల్గొన్న ఈ రేసులో 16 మంది మాత్రమే రేసు పూర్తిచేశారు. 24 రేసుల తాజా సీజన్లో ఇప్పటి వరకు 11 రేసులు ముగిశాయి. డ్రైవర్స్ చాంపియన్షి ప్లో 216 పాయింట్లతో ప్రియాస్ట్రి అగ్రస్థానంలోనే కొనసాగుతుండగా... 201 పాయింట్లతో నోరిస్ రెండో స్థానంలో, 155 పాయింట్లతో వెర్స్టాపెన్ మూడో స్థానంలో ఉన్నారు. సీజన్లోని తదుపరి రేసు బ్రిటన్ గ్రాండ్ప్రి జూలై 6న జరుగుతుంది. మరోవైపు ఫార్ములావన్ షెడ్యూల్లో 2041 వరకు ఆ్రస్టియా గ్రాండ్ప్రి కొనసాగనుంది. ఈ మేరకు ఆదివారం ఫార్ములావన్ నిర్వాహకులు వివరాలు వెల్లడించారు.