Other Sports
-
భారత బాక్సర్లకు 17 పతకాలు
తాష్కెంట్: ఆసియా అండర్-17 బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్లు 17 పతకాలతో అదరగొట్టారు. శుక్రవారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో భారత బాలికలు 12 పతకాలు సాధించగా... భారత బాలురు 5 పతకాలు సొంతం చేసుకున్నారు. బాలికల కేటగిరీలో రాఖీ (46 కేజీలు), నవ్య (57 కేజీలు) స్వర్ణ పతకాలు దక్కించుకున్నారు.ఖుషీచంద్ (48 కేజీలు), దివ్య (63 కేజీలు), హిమాన్షి (70 కేజీలు), జ్యోతి (75 కేజీలు), వన్షిక (80 కేజీలు), గుర్సీరత్ కౌర్ (ప్లస్ 80 కేజీలు) ఫైనల్లో ఓడిపోయి రజత పతకాలను దక్కించుకున్నారు. మమత (52 కేజీలు), లక్ష్మీ మంజునాథ్ (54 కేజీలు), ఇషిక (60 కేజీలు), హర్నూర్ కౌర్ (66 కేజీలు) సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలు పొందారు.బాలుర కేటగిరీ 75 కేజీల ఫైనల్లో లక్షయ్ ఫొగాట్ 0:5తో తొష్పులతోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయి రజత పతకాన్ని గెల్చుకున్నాడు. నేళ్ల నరేంద్ర కుమార్ (46 కేజీలు), యశ్ యాదవ్ (50 కేజీలు), నివేశ్ పాల్ (54 కేజీలు), నమన్ కుమార్ (70 కేజీలు) సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలను సంపాదించారు. -
ఫైనల్లో సాకేత్ జోడీ
బెంగళూరు: కర్ణాటక ఓపెన్ ఏటీపీ చాలెంజర్-50 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో భారత డేవిస్కప్ జట్టు మాజీ సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని ఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో సాకేత్-నికీ కలియంద పునాచా (భారత్) జోడీ 7-5, 6-1తో టాప్ సీడ్ ప్రజ్వల్ దేవ్-నితిన్ కుమార్ సిన్హా (భారత్) జంటపై విజయం సాధించింది.71 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సాకేత్-పునాచా మూడు ఏస్లు సంధించి, ఒక డబుల్ ఫాల్ట్ చేశారు. తొలి సర్వీస్లో 27 పాయింట్లు, రెండో సర్వీస్లో 12 పాయింట్లు స్కోరు చేశారు. తమ సర్వీస్ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న సాకేత్ ఈ ఏడాది తొమ్మిది టోర్నీల్లో పాల్గొన్నా క్వార్టర్ ఫైనల్ దాటి ముందుకెళ్లలేకపోయాడు.పదో టోర్నీలో మాత్రం టైటిల్కు విజయం దూరంలో నిలిచాడు. నేడు జరిగే ఫైనల్లో పీటర్ బార్ బిరుకోవ్ (రష్యా)-గ్రిగోరి లొమాకిన్ (కజకిస్తాన్)లతో సాకేత్-పునాచా తలపడతారు. రెండో సెమీఫైనల్లో బిరుకోవ్-లొమాకిన్ 7-6 (7/4), 7-6 (7/4)తో ఆదిల్ కల్యాణ్పూర్-ముకుంద్ శశికుమార్ (భారత్)లపై విజయం సాధించారు. -
సరికొత్త చరిత్ర.. తొలి ప్లేయర్గా ఘనత
రోమ్: ప్రతిష్టాత్మక మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీలలో యానిక్ సినెర్ కొత్త రికార్డు నెలకొల్పాడు. మాస్టర్స్ సిరీస్ టోర్నీలలో అత్యధిక వరుస విజయాలు సాధించిన ప్లేయర్గా ఈ ఇటలీ స్టార్ గుర్తింపు పొందాడు. రోమ్ ఓపెన్ మాస్టర్స్ టోర్నీలో భాగంగా జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్వన్ సినెర్ 6–2, 6–4తో రుబ్లెవ్ (రష్యా)ను ఓడించాడు. తద్వారా మాస్టర్స్ సిరీస్ టోర్నీలలో వరుసగా 32వ విజయం అందుకున్నాడు. సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ (2011లో 31 వరుస విజయాలు) పేరిట ఉన్న రికార్డును సినెర్ బద్దలు కొట్టాడు. -
నిఖత్కు చుక్కెదురు
పాటియాలా: కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్లో పాల్గొనే భారత బాక్సింగ్ జట్టు ఎంపిక కోసం నిర్వహిస్తున్న సెలెక్షన్ ట్రయల్స్లో... రెండుసార్లు ప్రపంచ చాంపియన్, భారత స్టార్ నిఖత్ జరీన్కు అనూహ్య ఓటమి ఎదురైంది. గురువారం జరిగిన 51 కేజీల విభాగం సెమీఫైనల్లో తెలంగాణకు చెందిన నిఖత్ 1:4 తేడాతో సరీ్వసెస్ బాక్సర్ సాక్షి చౌధరీ చేతిలో ఓడిపోయింది. ఈ ఓటమితో నిఖత్ కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్లో భారత్కు ప్రాతినిధ్యం వహించే అవకాశం లేకుండా పోయింది. 29 ఏళ్ల నిఖత్ 2022 బరి్మంగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణ పతకం... 2023 హాంగ్జౌ ఏషియన్ గేమ్స్లో కాంస్య పతకం గెలిచింది. -
భారత అండర్–21 హాకీ జట్టు హెడ్ కోచ్గా సోయెజ్
న్యూఢిల్లీ: రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత, టీమిండియా మాజీ గోల్కీపర్ పీఆర్ శ్రీజేశ్ స్థానంలో... భారత అండర్–21 పురుషుల హాకీ జట్టుకు కొత్త హెడ్ కోచ్గా ఫ్రెడరిక్ సోయెజ్ను నియమించారు. ఫ్రాన్స్కు చెందిన సోయెజ్కు అంతర్జాతీయ ప్లేయర్గా 15 ఏళ్లు... హెడ్ కోచ్గా 15 ఏళ్లు అనుభవం ఉందని హాకీ ఇండియా తెలిపింది. ఫ్రాన్స్ తరఫున సోయెజ్ 196 మ్యాచ్లు ఆడి 195 గోల్స్ చేశాడు. 2016 రియో ఒలింపిక్స్, 2020 టోక్యో ఒలింపిక్స్లో స్పెయిన్ జట్టుకు... 2024 పారిస్ ఒలింపిక్స్లో ఫ్రాన్స్ జట్టుకు సోయెజ్ కోచ్గా వ్యవహరించారు. -
మూణ్ణెళ్ల కింద రాజీనామా.. ఇప్పుడు రికార్డు పుటల్లోకి!
కేవలం 1,56,000 జనాభా ఉన్న కురసావ్ దేశం వచ్చే నెలలో చరిత్ర పుటల్లోకి ఎక్కనుంది. 96 ఏళ్ల ఫుట్బాల్ ప్రపంచకప్ చరిత్రలో ఆడనున్న అతిచిన్న దేశంగా (జనాభా, వైశాల్యం పరంగా) కురసావ్ జట్టు గుర్తింపు పొందనుంది. ఈ జట్టుగా హెడ్ కోచ్గా ఉన్న డిక్ అడ్వోకాట్ కూడా రికార్డు నెలకొల్పనున్నాడు. ప్రపంచకప్ చరిత్రలోనే ఒక జట్టుకు హెడ్ కోచ్గా వ్యవహరించనున్న అతిపెద్ద వయస్కుడిగా 78 ఏళ్ల అడ్వోకాట్ (Dick Advocaat) గుర్తింపు పొందనున్నాడు. గతంలో ఈ రికార్డు ఒట్టో రెహగల్ పేరిట ఉంది. 2010 ప్రపంచకప్లో గ్రీస్ జట్టుకు రెహగల్ హెడ్ కోచ్గా ఉన్నపుడు ఆయన వయస్సు 71 ఏళ్లు. గ్రూప్ ‘ఇ’లో ఉన్న కురసావ్ జట్టు తమ తొలి మ్యాచ్ను జూన్ 14న హ్యూస్టన్లో జర్మనీ జట్టుతో ఆడనుంది. నెదర్లాండ్స్కు చెందిన అడ్వోకాట్ శిక్షణలోనే కురసావ్ దేశం మొదటిసారి ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించింది. రెండేళ్లపాటు కురసావ్ జట్టుకు కోచ్గా ఉన్న అడ్వోకాట్ మూడు నెలల క్రితం కుటుంబకారణాలరీత్యా తన పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయాడు. ఈ మూడు నెలల కాలంలో కురసావ్ జట్టుకు కోచ్గా వ్యవహరించిన ఫ్రెడ్ రుటెన్ ఆధ్వర్యంలో ఆశించిన ఫలితాలు రాలేదు. చైనా, ఆస్ట్రేలియాతో జరిగిన రెండు వార్మప్ మ్యాచ్ల్లో కురసావ్ ఓడిపోయింది. కురసావ్ జట్టులోని సీనియర్ ప్లేయర్లకు కూడా రుటెన్ శిక్షణ పద్ధతులు నచ్చలేదు. సీనియర్ ప్లేయర్లందరూ మళ్లీ అడ్వోకాట్ను కోచ్గా తేవాలని కురసావ్ ఫుట్బాల్ సమాఖ్యను కోరారు. దాంతో కురసావ్ సమాఖ్య... అడ్వోకాట్ను సంప్రదించగా ఆయన కోచ్గా మళ్లీ వచ్చేందుకు అంగీకరించారు. ఫుట్బాల్ సర్కిల్లో ‘ద లిటిల్ జనరల్’గా పేరున్న అడ్వోకాట్కు అంతర్జాతీయంగా మంచి పేరుంది. హెడ్ కోచ్గా అడ్వోకాట్కిది మూడో ప్రపంచకప్ కానుంది. 1994లో నెదర్లాండ్స్ జట్టుకు... 2006లో దక్షిణ కొరియా జట్టుకు ఆయన కోచ్గా ఉన్నారు. అంతేకాకుండా బెల్జియం, యూఏఈ, రష్యా, సెర్బియా, ఇరాక్ జట్లకు, 16 ప్రొఫెషనల్ క్లబ్ జట్లకు కోచ్గా వ్యవహరించారు. -
ఆస్ట్రేలియా పర్యటనకు భారత మహిళా జట్టు
ప్రొ హాకీ లీగ్లో మరోసారి స్థానం సంపాదించేందుకు భారత మహిళల హాకీ జట్టు సిద్ధమైంది. ప్రొ హాకీ లీగ్ అర్హత టోర్నీ అయిన నేషన్స్ కప్ జూన్ 15 నుంచి 21 వరకు న్యూజిలాండ్లోని ఆక్లాండ్ నగరంలో జరగనుంది. నేషన్స్ కప్ సన్నాహాల కోసం భారత జట్టు ఈనెలలో ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. పెర్త్ వేదికగా ఆ్రస్టేలియా జట్టుతో భారత జట్టు నాలుగు మ్యాచ్లు ఆడనుంది. మే 26, 27 తేదీల్లో తొలి రెండు మ్యాచ్లు... మే 29, 30 తేదీల్లో మరో రెండు మ్యాచ్లు భారత్ ఆడుతుంది. ఈ సిరీస్ ముగిశాక భారత జట్టు న్యూజిలాండ్లో అడుగు పెడుతుంది. నేషన్స్ కప్ విజేత జట్టు తదుపరి ఏడాది ప్రొ హాకీ లీగ్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ప్రొ హాకీ లీగ్లో చివరి స్థానంలో నిలిచిన జట్టు మళ్లీ లీగ్లో స్థానం కోసం నేషన్స్ కప్లో బరిలోకి దిగుతుంది. 2022లో స్పెయిన్లో జరిగిన నేషన్స్ కప్లో భారత జట్టు విజేతగా నిలిచింది. 2024–2025 ప్రొ లీగ్లో పాల్గొనే అవకాశాన్ని సంపాదించింది. తొమ్మిది జట్లు పాల్గొన్న 2024–2025 ప్రొ లీగ్లో భారత జట్టు చ చివరి స్థానంలో నిలిచి మళ్లీ నేషన్స్ కప్కు పడిపోయింది. ఇటీవల అర్జెంటీనాలో పర్యటించిన భారత మహిళల జట్టు నాలుగు మ్యాచ్లు ఆడింది. రెండింటిలో గెలిచింది. ఈ సిరీస్ తర్వాత బెంగళూరులోని భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కేంద్రంలో భారత జట్టుకు శిబిరం ఏర్పాటు చేశారు. ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా, ఆ తర్వాత నేషన్స్ కప్లో భారత జట్టులోని డ్రాగ్ ఫ్లికర్లకు నెదర్లాండ్స్ దిగ్గజం టేకె టకేమా శిక్షణ ఇస్తారు. ‘నేషన్స్ కప్ సన్నాహాల కోసం ఆ్రస్టేలియాతో సిరీస్ ఏర్పాటు చేయడం బాగుంది. ఈ సిరీస్ ద్వారా భారత జట్టులోని బలాబలాలు, బలహీనతలు తెలుస్తాయి’ అని భారత జట్టు చీఫ్ కోచ్ జొయెర్డ్ మరీన్ తెలిపారు. చదవండి: ఆసియా క్రీడలకు భారత జట్టు ప్రకటన.. ‘నంబర్ వన్’కు చోటే లేదు! -
ఆసియా క్రీడలకు భారత జట్టు ప్రకటన
భారత జట్టు ఎంపికలో ర్యాంకింగ్స్, అంతర్జాతీయ ప్రదర్శనలకంటే తమ సెలక్షన్ ట్రయల్స్కే ప్రాధాన్యతనిస్తామని భారత జాతీయ రైఫిల్ సంఘం (ఎన్ఆర్ఏఐ) స్పష్టం చేసింది. ట్రయల్స్లో సత్తా చాటితేనే టీమ్లో చోటు దక్కుతుందని, ర్యాంక్ను పరిగణనలోకి తీసుకోమని ఏడాది క్రితం తాము రూపొందించిన విధానాన్ని వెల్లడించింది. ‘నంబర్ వన్’కు చోటే లేదు!ఈ ఏడాది సెప్టెంబర్–అక్టోబర్లలో జపాన్లో జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత ‘షాట్గన్’ టీమ్లను ఎన్ఆర్ఐఏ ప్రకటించింది. అయితే ఇందులో ఆసియా నంబర్వన్, ప్రపంచ ర్యాంకింగ్స్లో 6వ స్థానంలో ఉన్న ట్రాప్ షూటర్ జొరావర్ సింగ్ సంధూకు చోటు దక్కలేదు.గత ఆరు నెలలుగా అంతర్జాతీయ స్థాయిలో అతను నిలకడగా రాణిస్తున్నా... ఇటీవల జాతీయ చాంపియన్షిప్, సెలక్షన్ ట్రయల్స్లోలో ప్రదర్శన బాగా లేకపోవడంతో జొరావర్ను తప్పించారు. నెల రోజుల క్రితమే జొరావర్ ప్రపంచ ర్యాంకింగ్స్లో 4వ స్థానంలో ఉన్నాడు. గత అక్టోబర్లో వరల్డ్ చాంపియన్షిప్లో కాంస్యం గెలిచిన 47 ఏళ్ల జొరావర్ ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో పతకం నెగ్గిన మూడో భారత షూటర్గా గుర్తింపు పొందాడు. గత నెలలో కేవలం స్కోరింగ్ పాయింట్ల కోసమే పాల్గొన్న వరల్డ్ కప్లో కూడా జొరావర్ 119 పాయింట్లతో భారత షూటర్లలో అందరికంటే మెరుగైన స్కోరు సాధించాడు. నా ఘనతను గుర్తించాలని కోరుతున్నాఇక 2025 వరల్డ్ చాంపియన్షిప్లో కూడా 122 పాయింట్లతో భారత్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. తమ నిర్ణయాన్ని ఎన్ఆర్ఏఐ పునఃసమీక్షించాలని జొరావర్ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశాడు. ‘ఆసియా నంబర్వన్గా, వరల్డ్ నంబర్ 6గా ఉన్న నా ఘనతను గుర్తించాలని కోరుతున్నా. గత ఆరు నెలలుగా నేను ట్రాప్లో అత్యుత్తమ స్కోరింగ్లు నమోదు చేశాను’ అని జొరావర్ అన్నాడు. ఎంపిక చేసే ప్రసక్తే లేదుఅయితే ఎన్ఆర్ఏఐ మాత్రం ఇవేమీ పరిగణనలోకి తీసుకోమని చెబుతోంది. ఎలాంటి మార్పూ లేకుండా ప్రస్తుతం ప్రకటించిన జట్టే 99 శాతం బరిలోకి దిగుతుందని ఎన్ఆర్ఏఐ కార్యదర్శి పవన్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు. ఆటగాళ్ల పేరు ప్రతిష్టలను బట్టి ఎంపిక ఉండదని ఆయన పునరుద్ఘాటించారు. టీమ్లోకి ఎంపికైన ఇతర ‘షాట్గన్’ షూటర్ల స్కోరింగ్ అంతర్జాతీయ స్థాయిలో జొరావర్కంటే తక్కువగా ఉండటం గమనార్హం. ఇటీవల జరిగిన ప్రపంచకప్లో రిజ్వీ (122), హైదరాబాద్ షూటర్ కైనన్ చెనాయ్ (119), శపథ్ భరద్వాజ్ (118) స్కోరు సాధించారు. 35 ఏళ్ల కైనన్ మూడోసారి ఆసియా క్రీడల్లో పోటీపడనున్నాడు. 2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లో బరిలోకి దిగిన కైనన్ 36వ స్థానంలో నిలిచాడు. 2023 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో కైనన్ కాంస్య పతకాన్ని సాధించాడు. 2016 రియో ఒలింపిక్స్లోనూ భారత్కు ప్రాతినిధ్యం వహించిన కైనన్... ఆసియా చాంపియన్షిప్లో ఒక రజతం, ఒక కాంస్యం... ప్రపంచకప్లలో ఒక స్వర్ణం, ఒక రజతం, రెండు కాంస్యాలతో కలిపి నాలుగు పతకాలు గెలిచాడు. భారత ‘షాట్గన్’ జట్ల వివరాలు పురుషుల ట్రాప్: కైనన్ చెనాయ్, అహ్వర్ రిజ్వీ, శపథ్ భరద్వాజ్. మహిళల ట్రాప్: నీరూ, మనీషా కీర్, ఆషిమా అహ్లావత్. పురుషుల స్కీట్: అనంత్జీత్ సింగ్, భవ్తేజ్ గిల్, మేరాజ్ అహ్మద్ ఖాన్. మహిళల స్కీట్: పరీనాజ్ ధలివాల్, రైజా ఢిల్లాన్, మహేశ్వరి చౌహాన్. ట్రాప్ ‘మిక్స్డ్’: కైనన్ చెనాయ్, నీరూ. స్కీట్ ‘మిక్స్డ్’: అనంత్జీత్ సింగ్, పరీనాజ్ ధలివాల్. చదవండి: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. తొలి ప్లేయర్గా అరుదైన రికార్డు -
శ్రీజేశ్పై అనూహ్య వేటు
న్యూఢిల్లీ: భారత మాజీ గోల్కీపర్, అండర్–21 జూనియర్ పురుషుల హాకీ జట్టు హెడ్ కోచ్ పీఆర్ శ్రీజేశ్పై అనూహ్యంగా వేటు పడింది. అతడిని కోచ్ పదవి నుంచి హాకీ ఇండియా (హెచ్ఐ) తప్పించింది. 17 నెలల పాటు కోచ్గా వ్యవహరించిన శ్రీజేశ్ మార్గనిర్దేశనంలో భారత్ ఐదు టోర్నీలు ఆడగా ఐదింటిలోనూ పతకం సాధించింది. జూనియర్ వరల్డ్ కప్లో కూడా కాంస్యం గెలుచుకుంది. అయితే శ్రీజేశ్ కాంట్రాక్ట్ను పొడిగించకుండా హెచ్ఐ కొత్త జూనియర్ కోచ్ ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది. దీనిపై అతను తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. కోచ్గా తన విజయాలను పట్టించుకోకుండా కేవలం విదేశీ కోచ్ను ఎంపిక చేసేందుకే హెచ్ఐ ఈ నిర్ణయం తీసుకుందని అతను ఆరోపించాడు. పురుషుల సీనియర్ జట్టు కోచ్ క్రెయిగ్ ఫుల్టన్ జూనియర్ టీమ్కు కూడా విదేశీ కోచ్ కావాలని కోరడంతోనే హెచ్ఐ ఈ తరహాలో వ్యవహరించడం ఆశ్చర్యం కలిగించిందని శ్రీజేశ్ అన్నాడు. ఇటీవలే కేంద్ర క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవీయ... 2036 ఒలింపిక్స్ కోసం శ్రీజేశ్లాంటి కోచ్లు కావాలని తనను ప్రశంసించిన విషయాన్ని అతను గుర్తు చేశాడు. ‘కోచ్గా విఫలమైతే అతడిని తప్పిస్తారనేది ఇంత కాలం చూశాను. కానీ విదేశీ కోచ్ను ఎంపిక చేసేందుకు భారత కోచ్ను తొలగిస్తారనేది ఇప్పుడు చూస్తున్నాను. జూనియర్ జట్టుకు కూడా విదేశీ కోచ్ ఉంటేనే భవిష్యత్తు కోసం సీనియర్ జట్టును సిద్ధం చేసేందుకు అనుకూలంగా ఉంటుందని హాకీ ఇండియా అధ్యక్షుడు నాకు చెప్పారు. విదేశీ కోచ్లకు ఇచ్చే ప్రాధాన్యత ఏమిటో దీని వల్ల అర్థమవుతోంది. భారత కోచ్లు భారత హాకీని అభివృద్ధి చేయలేరా’ అని శ్రీజేశ్ స్పందించాడు. వరుసగా రెండు ఒలింపిక్స్ క్రీడల్లో (2020 టోక్యో, 2024 పారిస్) భారత జట్టు కాంస్య పతకాలు గెలవడంలో గోల్కీపర్ శ్రీజేశ్ కీలకపాత్ర పోషించాడు. పారిస్ ఒలింపిక్స్ అనంతరం ప్లేయర్గా కెరీర్కు వీడ్కోలు పలికిన శ్రీజేశ్ కోచింగ్ వైపు వెళ్లాడు. హాకీ ఇండియా వివరణ... శ్రీజేశ్ అసంతృప్తిపై హెచ్ఐ స్పందించింది. అతడిపై తాము వేటు వేయలేదని, నిబంధనల ప్రకారమే వ్యవహరించామని స్పష్టం చేసింది. ‘శ్రీజేశ్ కాంట్రాక్ట్ గత డిసెంబర్లో ముగిసింది. దాంతో నిబంధనల ప్రకారం ప్రకటన ఇచ్చాం. అర్హులైన వారందరినీ షార్ట్లిస్ట్ చేసి ప్రక్రియ ప్రకారమే కొత్త కోచ్ను ఎంపిక చేశాం. త్వరలోనే కొత్త కోచ్ పేరును ప్రకటిస్తాం. శ్రీజేశ్ను మేం తొలగించలేదు. వచ్చే రెండు ఒలింపిక్స్ను దృష్టిలో ఉంచుకొని డెవలప్మెంట్ టీమ్కు కోచ్గా ఉండమని కోరాం. కోచ్గా కూడా అతను మరింత పరిణతి సాధించేందుకు అవకాశం లభిస్తుందని చెప్పాం. అయితే మేం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అతను దానిని తిరస్కరించాడు’ అని హెచ్ స్పష్టం చేసింది. -
Sufiya Sufi: 88 రోజులు.. 5 వేల కిలోమీటర్లు
రాజస్థాన్కు చెందిన అల్ట్రా-మారథాన్ రన్నర్ సూఫియా సుఫీ తన సాహసయాత్రను ప్రారంభించింది. భారత సాయుధ దళాలకు నివాళిగా కన్యకుమారి నుంచి కారకోరం వరకు 5వేల కిలోమీటర్లు రన్నింగ్ చేయనుంది. అయితే అత్యంత కఠినమైన ఈ యాత్రను పూర్తి చేయడానికి సుఫియా సుఫీకి 88 రోజులు పట్టనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం తన యాత్రను ప్రారంభించిన సూఫియా తొలి రోజు 52 కిలోమీటర్ల దూరం పరిగెత్తిన వీడియోనూ ఎక్స్లో పంచుకుంది. బుధవారం మరో 52 కిలోమీటర్లు పరిగెత్తనున్నట్లు తెలిపింది. తొలిరోజు 12 గంటల 23 నిమిషాల పాటు పరిగెత్తి 52 కిలోమీటర్లు పూర్తి చేసినట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దక్షిణ భారత్ ఏరియా ప్రధాన కార్యాలయం మద్దతుతో ఈ మహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించిన సోఫి తన ప్రయాణంలో అన్ని ప్రధాన యుద్ధ స్మారక చిహ్నాలను గౌరవించనున్నట్లు తెలిపింది. లడఖ్లోని కార్గిల్ దివస్ వద్ద తన సాహసయాత్ర ముగించనున్నట్లు ఆమె పేర్కొంది. ఈ ఘనత సూఫియా అకుంఠిత స్ఫూర్తికి నిదర్శనంగా నిలవనుంది. జాతీయ ఐక్యత, దేశభక్తి, పట్టుదలకు ప్రతీకగా నిలిచే ఈ ప్రయాణానికి నాంది పలుకుతూ, కల్నల్ సూర్య ముఖర్జీ ఈ మారథాన్ను అధికారికంగా జెండా ఊపి ప్రారంభించారు. తన ఆరో గిన్నిస్ ప్రపంచ రికార్డు కోసం కృషి చేస్తున్న సూఫియా అంకితభావానికి, మానసిక స్థైర్యానికి ఈ పరుగు ఒక నిదర్శనం అని చెప్పొచ్చు.Day 01 of The Fastest Run Across India (Kanyakumari - Karakoram)Run For Dreams - An Official World Record Run to Tribute to our Armed Forces Bravehearts who sacrifice themselves for us. Run Flaged-off from Sunrise Point, Kanyakumari Beach. Thank you so much everyone for… pic.twitter.com/8GUjbMGVse— Sufiya Sufi Runner (@sufirunner) May 12, 2026చదవండి: సాయి సుదర్శన్ అరుదైన ఫీట్! -
వినేశ్ను అడ్డుకోవడం సబబు కాదు: సాక్షి మలిక్
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్కు మరో రెజ్లర్ సాక్షి మలిక్ మద్దతుగా నిలిచింది. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో పాల్గొనాలనుకుంటున్న వినేశ్... జాతీయ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్ ద్వారా తిరిగి మ్యాట్పై అడుగు పెట్టాలని భావించగా... భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) నిబంధనల సాకుతో అడ్డుపడింది. 2024 పారిస్ ఒలింపిక్స్లో ఫైనల్కు చేరిన అనంతరం 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హతకు గురై పతకం కోల్పోయిన వినేశ్... ఆ తర్వాతి పరిణామాల నేపథ్యంలో కెరీర్కు వీడ్కోలు పలికింది. అనంతరం రాజకీయాల్లో చేరి కాంగ్రెస్ పార్టీ తరఫున హరియాణా ఎమ్మెల్యేగా విజయం సాధించింది.ఇటీవల తల్లి అయిన వినేశ్ తిరిగి పోటీలో దిగేందుకు ప్రయత్నించగా... షోకాజ్ నోటీసుకు సమాధానం ఇచ్చిన తర్వాతే పోటీల్లో పాల్గొనే అవకాశమిస్తామని డబ్ల్యూఎఫ్ఐ పేర్కొంది. నిబంధనల ప్రకారం రిటైర్మెంట్ ప్రకటించిన అథ్లెట్లు తిరిగి పోటీల్లో పాల్గొనాలనుకుంటే... ఆరు నెలల నోటీసు నిబంధనను పాటించాలి. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలు కొత్తగా తల్లి అయిన అథ్లెట్ తిరిగి పోటీల్లో పాల్గొనేందుకు ప్రయత్నిస్తే వారి కోసం నిబంధనలు మార్చిన సందర్భాలు చాలా ఉన్నాయని సాక్షి వెల్లడించింది. ‘మహిళా అథ్లెట్ తల్లి అయిన తర్వాత కూడా దేశం కోసం ఆడటం, పతకాలు గెలవడం కొనసాగించేలా నిబంధనలు ఉండాలి.గతంలో పలు దేశాల్లో ఇలా నిబంధనల్లో మార్పులు చేశారు. వినేశ్ రెజ్లింగ్కు విరామమిచ్చిన అనంతరం ఎమ్మెల్యే అయింది. ఇప్పుడు ఆమె తిరిగి రెజ్లింగ్లో అడుగు పెట్టకుండా డబ్ల్యూఎఫ్ఐ కొన్ని నిబంధనలు తీసుకొచ్చింది. వినేశ్కు ట్రయల్స్ నిర్వహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా, డబ్ల్యూఎఫ్ఐని అభ్యరి్థస్తున్నా. దీంతో తల్లి అయిన తర్వాత పతకాలు గెలిచి ఆమె మహిళా సమాజానికి ఆదర్శంగా నిలవగలదు’ అని సాక్షి మలిక్ వెల్లడించింది. 2016 రియో ఒలింపిక్స్లో కాంస్య పతకం గెలిచిన సాక్షి... 2023లో వినేశ్ ఫొగాట్, బజరంగ్ పూనియాతో కలిసి డబ్ల్యూఎఫ్ఐ అప్పటి అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్పై జరిగిన నిరసనల్లో పాల్గొంది.75 కేజీల విభాగం ఫైనల్లో లక్షయ్తాష్కెంట్: ఆసియా అండర్–17 బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్ లక్షయ్ ఫొగాట్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 75 కేజీల విభాగం ఫైనల్లో లక్షయ్ 5:0తో సెయుంగ్మిన్ లీ (దక్షిణ కొరియా)పై గెలుపొందాడు. భారత్కే చెందిన నేళ్ల నరేంద్ర (46 కేజీలు), యశ్ యాదవ్ (50 కేజీలు), నివేశ్ పాల్ (54 కేజీలు), నమన్ (70 కేజీలు) సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలు సాధించారు. సెమీఫైనల్స్లో నరేంద్ర 0:5తో నురాలియెవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో, యశ్ 1:4తో ఉస్కుబాటర్ (మంగోలియా) చేతిలో, నివేశ్ 0:5తో అబ్దుల్బాసిత్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో, నమన్ 2:3తో అబ్దుమజిదోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓటమి చవిచూశారు. -
శ్రమించి గెలిచిన సాత్విక్ – చిరాగ్ జోడీ
బ్యాంకాక్: థాయ్లాండ్ ఓపెన్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో టాప్ సీడ్ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–19, 21–23, 21–10తో ఎర్వియాన్సియా–మౌలానా (ఇండోనేసియా) జంటపై శ్రమించి గెలిచింది.64 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో తొలి రెండు గేముల్లో గట్టిపోటీ ఎదుర్కొన్న భారత జోడీ నిర్ణాయక మూడో గేమ్లో మాత్రం పూర్తి ఆధిపత్యం చలాయించి విజయాన్ని ఖరారు చేసుకుంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో గూన్టింగ్– హైకల్ (మలేసియా)లతో సాత్విక్–చిరాగ్ తలపడతారు. -
ఆస్ట్రేలియన్ టెన్నిస్ దిగ్గజం కన్నుమూత!
ఆస్ట్రేలియా టెన్నిస్ దిగ్గజం మాల్ అండర్సన్ (91) కన్నుమూశాడు. అనారోగ్య సమస్యలతో సోమవారం తన ఇంట్లోనే తుదిశ్వాస విడిచాడు. ఆస్ట్రేలియా తరఫున యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ నెగ్గిన తొలి అన్సీడెడ్ ప్లేయర్గా మాల్ అండర్సన్ చరిత్ర సృష్టించాడు. వ్యవసాయక్షేత్రంలోని మట్టికోర్టుపై ప్రాక్టీస్ను ఆరంభించిన అండర్సన్ ఆ తర్వాత టెన్నిస్లో దిగ్గజ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. 1957లో యూఎస్ క్రౌన్ టైటిల్ నెగ్గిన అండర్సన్, మూడు డబుల్స్ టైటిల్స్ కూడా సాదించాడు. యునైటెడ్ స్టేట్స్ చాంపియన్షిప్ సాధించిన అన్సీడెడ్ క్రీడాకారుడిగా అండర్సన్ నిలిచాడు. ఇక ప్రతిష్ఠాత్మక డేవిస్ కప్ను కూడా అండర్సన్ రెండుసార్లు సాధించి చరిత్ర సృష్టించాడు.ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత అండర్సన్, ప్రపంచ నంబర్ వన్గా ఎదిగిన పాట్ రాఫ్టర్ సహా ఎంతోమంది యువ ఆస్ట్రేలియన్ ఆటగాళ్లకు మార్గనిర్దేశనం చేశాడు. మాల్ అండర్సన్ మరణంపై పాట్ రాఫ్టర్ స్పందించాడు. మాల్ మరణవార్త విని నేను చాలా బాధపడ్డాను. నా కెరీర్ ప్రారంభంలో టెన్నిస్లో మెళుకువలు తీర్చిదిద్దడంలో మాల్ అండర్సన్ ఎంతగానో సహాయపడ్డారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా" అని పాట్ రాఫ్టర్ పేర్కొన్నాడు. -
నేను పోరాటం కొనసాగిస్తా: వినేశ్
గోండా (ఉత్తరప్రదేశ్): ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫొగాట్, భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మధ్య వివాదం మరింత తీవ్రమైంది. షోకాజ్ నోటీసుకు సమాధానమిచ్చే వరకు టోర్నిలో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వరాదని డబ్ల్యూఎఫ్ఐ నిర్ణయం తీసుకోగా... తాను పారిపోనని, పోరాటం కొనసాగిస్తానని వినేశ్ స్పష్టం చేసింది. నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నిలో భాగంగా మంగళవారం మహిళల విభాగంలో బౌట్లు జరగనున్న నేపథ్యంలో వినేశ్ టోర్నీ జరిగే వేదిక వద్దకు వచ్చింది. టోర్నిలో పాల్గొనడంపై ఆమె ఇచ్చిన సంబంధిత డాక్యుమెంట్లను తీసుకోవడానికి అధికారులు నిరాకరించారు. సమీపంలో ఆమె ప్రాక్టీస్ చేసుకునేందుకు ప్రయత్నించగా, వామప్ ఏరియా గదికి తాళం కూడా వేశారు. తాను ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ రెజ్లింగ్లోకి అడుగుపెట్టకుండా డబ్ల్యూఎఫ్ఐ ప్రయత్నిస్తోందని, రిటైర్ కావాలనే విధంగా కావాలనే అడ్డంకులు సృష్టిస్తున్నారని వినేశ్ ఆరోపించింది. అయితే తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గనని ఆమె స్పష్టం చేసింది. -
వివాన్–నీరూ జోడీకి కాంస్యం
అల్మాటీ (కజకిస్తాన్): ప్రపంచకప్ షాట్గన్ షూటింగ్ టోర్నమెంట్ను భారత జట్టు ఏకైక కాంస్య పతకంతో ముగించింది. చివరిరోజు ఆదివారం ట్రాప్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో వివాన్ కపూర్–నీరూ ద్వయం కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. నాలుగు జోడీల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో వివాన్–నీరూ జంట 24 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. యాంగ్ కున్ పి–లియు వాన్ యు (చైనీస్ తైపీ) జోడీ 36 పాయింట్లతో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పడంతోపాటు పసిడి పతకాన్ని గెలిచింది. 33 పాయింట్లతో మౌరో డె ఫిలిపిస్–మరియా స్టాంకో సిల్వానా (ఇటలీ) జంట రజత పతకాన్ని కైవసం చేసుకుంది. -
మన బాణం బంగారం
షాంఘై (చైనా): ఐదేళ్ల నిరీక్షణకు భారత మహిళల ఆర్చరీ జట్టు తెరదించింది. ఆదివారం ముగిసిన ప్రపంచకప్ స్టేజ్–2 టోర్నీలో మహిళల టీమ్ రికర్వ్ విభాగంలో టీమిండియా భారత జట్టు స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. వరుసగా నాలుగు ఒలింపిక్స్లో పోటీపడ్డ ప్రపంచ మాజీ నంబర్వన్ దీపిక కుమారి, అంకిత, కుంకుమ్లతో కూడిన భారత జట్టు ఫైనల్లో 5–4 (54–53, 52–55, 56–57, 54–53, 28–26) సెట్ పాయింట్లతో జు జింగీ, యు కి, హువాంగ్ యువెలతో కూడిన ఆతిథ్య చైనా జట్టును ఓడించింది. తొలి సెట్ను నెగ్గిన భారత్ 2–0తో ముందంజ వేయగా... రెండో సెట్ను గెలిచి చైనా స్కోరును 2–2తో సమం చేసింది. మూడో సెట్ను కోల్పోయి 2–4తో వెనుకబడ్డ భారత్ నాలుగో సెట్ను సొంతం చేసుకొని స్కోరును 4–4తో సమం చేసింది. విజేతను నిర్ణయించేందుకు ‘షూట్ ఆఫ్’ నిర్వహించారు. భారత బృందం 28 పాయింట్లు స్కోరు చేయగా... చైనా 26 పాయింట్లకే పరిమితమైంది. దాంతో 2021 తర్వాత భారత మహిళల రికర్వ్ జట్టు ప్రపంచకప్లో బంగారు పతకాన్ని దక్కించుకుంది. చివరిసారి 2021లో దీపిక కుమారి, కోమలిక, అంకితలతో కూడిన భారత జట్టు గ్వాటెమాలా సిటీలో జరిగిన ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నీలో, పారిస్లో జరిగిన ప్రపంచకప్ స్టేజ్–3 టోర్నీలో పసిడి పతకాలు గెలిచింది. మరోవైపు మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్ సిమ్రన్జీత్ కౌర్ కాంస్య పతకాన్ని చేజార్చుకుంది. సెమీఫైనల్లో సిమ్రన్జీత్ 0–6 ( 25–26, 24–29, 26–28)సెట్ పాయింట్లతో కాంగ్ చెయంగ్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయింది. అనంతరం కాంస్య పతక మ్యాచ్లో సిమ్రన్జీత్ 4–6 (29–27, 27–29, 28–28, 28–29, 28–28) సెట్ పాయింట్లతో జాంగ్ మిన్హీ (దక్షిణ కొరియా) చేతిలో పరాజయం పాలైంది. సెట్ గెలిస్తే రెండు పాయింట్లు, స్కోరు సమమైతే ఒక్కో పాయింట్ కేటాయిస్తారు. తదుపరి ప్రపంచకప్ స్టేజ్–3 టోర్నీ టర్కిలోని అంటాల్యా నగరంలో జూన్ 9 నుంచి 14 వరకు జరుగుతుంది. -
ఫైనల్లో 8 మంది బాక్సర్లు
తాష్కెంట్: ఆసియా అండర్–15 బాక్సింగ్ చాంపియన్షిప్ (బాలికల విభాగం)లో 8 మంది భారత బాక్సర్లు ఫైనల్లోకి దూసుకెళ్లారు. దాంతో వేర్వేరు కేటగిరీల్లో కనీసం 8 రజతాలు భారత్కు ఖాయమయ్యాయి. అక్షిత (33 కేజీలు), అన్జీ (37 కేజీ), సోనియా (40 కేజీలు), తాన్వి (43 కేజీలు), హన్షిక (46 కేజీలు), సునైనా (58 కేజీలు), భూమిక (61 కేజీలు), తాన్వి (64 కేజీల విభాగం) తమ సెమీ ఫైనల్ బౌట్లలో గెలిచి ఫైనల్లోకి ప్రవేశించారు. ఇతర భారత బాక్సర్లలో జియా (35 కేజీలు), ఖుషీ రాణా (49 కేజీలు), కనిష్క (52 కేజీలు), ఆష్వి (67 కేజీలు), మాన్వి (70+ కేజీలు) సెమీ ఫైనల్ బౌట్లలో పరాజయం పాలయ్యారు. -
గుకేశ్కు ఆరో స్థానం
వార్సా (పోలండ్): సూపర్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్ను భారత ఆటగాడు గుకేశ్ దొమ్మరాజు ఆరో స్థానంతో ముగించాడు. ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ కలిపి అతను మొత్తం 17 పాయింట్లు సాధించాడు. ర్యాపిడ్ విభాగంలో 9 పాయింట్లు సాధించిన గుకేశ్ బ్లిట్జ్లో 8 పాయింట్లు మాత్రమే రాబట్టగలిగాడు. ఈ టోర్నమెంట్లో అమెరికాకు చెందిన హన్స్ నీమన్ విజేతగా నిలిచాడు. ర్యాపిడ్, బ్లిట్జ్ విభాగాల్లో కలిపి మొత్తం 22.5 పాయింట్లు సాధించిన నీమన్ 50 వేల డాలర్ల బహుమతిని సొంతం చేసుకున్నాడు. శనివారం 9 బ్లిట్జ్ రౌండ్లలో బరిలోకి దిగిన గుకేశ్... 3 రౌండ్లలో గెలవగా, 4 రౌండ్లలో ఓటమిని ఎదుర్కొన్నాడు. మరో 2 రౌండ్లు డ్రాగా ముగిశాయి. వెస్లీ సో (అమెరికా), నీమన్ (అమెరికా), జాన్ డ్యూడా (పోలండ్)లపై విజయం సాధించిన గుకేశ్...అలీరెజా ఫిరోజ్ (ఫ్రాన్స్), వ్లదీమర్ ఫెడోసీవ్ (రష్యా), ఫాబియో కరువానా (అమెరికా), సిందరోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతుల్లో పరాజయంపాలయ్యాడు. వొటాజెక్ (పోలండ్), మ్యాగ్జిమ్ లాగ్రేవ్ (ఫ్రాన్స్)లతో అతని ఆట సమంగా ముగిసింది. 16వ రౌండ్లో గుకేశ్ చేతిలో ఓడినా... కోలుకొని చివరకు నీమన్ చాంపియన్గా నిలవడం విశేషం. -
సాహిల్ జాదవ్కు కాంస్యం
షాంఘై (చైనా): ప్రపంచ కప్ ఆర్చరీ స్టేజ్–2 టోర్నమెంట్లో భారత ఆటగాడు సాహిల్ జాదవ్ కాంస్యంతో మెరిశాడు. శనివారం పురుషుల కాంపౌండ్ విభాగంలో మూడో స్థానం కోసం జరిగిన పోరులో జాదవ్ 147–144 స్కోరుతో మార్టీన్ డామ్సో (డెన్మార్క్)పై విజయం సాధించాడు. కాంపౌండ్లో భారత్కు లభించిన పతకం ఇదొక్కటే కావడం విశేషం. 25 ఏళ్ల సాహిల్ ప్రస్తుత వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ చాంపియన్ కూడా. డామ్సోతో జరిగిన మ్యాచ్లో తొలి ఎండ్లో 29–30తో వెనుకబడిన సాహిల్, రెండో ఎండ్లో 27–30తో పైచేయి సాధించాడు. ఆ తర్వాత 29–28, 30–29తో భారత ఆర్చర్ ముందంజ వేయగా... అప్పటికే నాలుగు పాయింట్లు వెనుకబడిన డామ్సో చివరి ఎండ్ను 30–29తో ముగించినా లాభం లేకపోయింది. జాదవ్ ఖాతాలో కాంస్య పతకం చేరింది. అంతకు ముందు జరిగిన సెమీఫైనల్లో జాదవ్ 146–147 స్కోరుతో ప్రస్తుత వరల్డ్ చాంపియన్ నికోలస్ గిరార్డ్ (ఫ్రాన్స్) చేతిలో పరాజయంపాలయ్యాడు. నేడు జరిగే మహిళల రికర్వ్ ఫైనల్ (టీమ్ ఈవెంట్)లో చైనాతో భారత్ తలపడనుండగా... వ్యక్తిగత విభాగంలో సిమ్రన్జిత్ కౌర్ సెమీఫైనల్ బరిలోకి దిగుతుంది. -
వినేశ్ ఫొగాట్కు డబ్ల్యూఎఫ్ఐ షోకాజ్
రిటైర్మెంట్ను వెనక్కి తీసుకొని అంతర్జాతీయ రెజ్లింగ్ బరిలోకి దిగాలని భావిస్తున్న స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్కు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) షాక్ ఇచ్చింది. క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడటం, డోపింగ్ నిబంధనల ఉల్లంఘనవంటి ఆరోపణలతో ఆమెకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. పైగా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత పునరాగమనానికి అనుసరించాల్సిన నిబంధనల ప్రకారం ఆమె పోటీల్లో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. దీని ప్రకారం ఈ ఏడాది జూన్ 26 వరకు వినేశ్ దేశవాళీ పోటీల్లో కూడా బరిలోకి దిగే అవకాశం లేదు. నేటి నుంచి గోండాలో జరిగే జాతీయ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నీలో పాల్గొని ఆసియా క్రీడల కోసం సన్నద్ధం కావాలని వినేశ్ భావించింది. పారిస్ ఒలింపిక్ క్రీడల సందర్భంగా వినేశ్ ప్రవర్తన ‘రెజ్లింగ్కు చెడ్డపేరు తెచ్చింది’ అని డబ్ల్యూఎఫ్ఐ ఆరోపించింది. గతంలో డబ్ల్యూఎఫ్ఐకి వ్యతిరేకంగా ఉద్యమం చేసిన వినేశ్...ఇటీవల మరోసారి విమర్శలు చేయడంతోనే ఆమెపై చర్యకు డబ్ల్యూఎఫ్ఐ ఉపక్రమించింది. -
స్విమ్మింగ్లో చరిత్ర సృష్టించిన బెంగళూరు టెకీ దంపతులు
బెంగళూరుకు చెందిన టెకీ దంపతులు దనిష్ అబ్డి, వృశాలీ ప్రసాదే స్విమ్మంగ్లో అరుదైన సాహసం చేసి చరిత్ర సృష్టించారు. వీరు శ్రీలంక నుంచి భారత్ వరకు సముద్ర మార్గంలో ఈదుతూ సుమారు 32 కిలోమీటర్ల దూరాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. చారిత్రక ప్రాధాన్యం ఉన్న రామసేతు మార్గం గండా ఈ ఫీట్ సాధించడం విశేషం.దనిష్-వృశాలీ జంట శ్రీలంకలోని తలైమన్నార్ నుంచి ప్రయాణం ప్రారంభించి, తమిళనాడులోని ధనుష్కోడి వద్ద ముగించారు. ఇండియన్ ఓషియన్లో అలలు, బలమైన ప్రవాహాలను ఎదుర్కొంటూ వారు 10 గంటల 45 నిమిషాల్లో ఈ సాహస యాత్రను పూర్తి చేశారు.బెంగళూరు నివాసులైన డానిష్ అబ్ది మరియు వృషాలి ప్రసాద్, శ్రీలంకలోని తలైమన్నార్ నుండి భారతదేశంలోని ధనుష్కోడి వరకు సముద్రంలో 32 కిలోమీటర్లు ఈదారు.#SriLanka #Dhanushkodi #UANow pic.twitter.com/NylspcpXNi— UttarandhraNow (@UttarandhraNow) May 8, 2026ఈ ప్రయాణంలో కోస్ట్ గార్డులు, వైద్య సిబ్బంది, ఎస్కార్ట్ బోట్లు వారికి సహకరించాయి. సముద్రంలో కఠిన పరిస్థితులు ఎదురైనా ఇద్దరూ ధైర్యంగా ముందుకు సాగారు. ఈ ఫీట్ను సాధించికా దనిష్-వృశాలీ జంట సోషల్మీడియాలో ఇలా పోస్ట్ చేసింది. శ్రీలంక నుంచి భారత్ వరకు విజయవంతంగా ఈదాం. ఇది చాలా కఠినమైన ప్రయాణం అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ పోస్టు వైరల్గా మారగా, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.దనిష్-వృశాలీ దంపతులు గతంలో కూడా సముద్ర ఈత పోటీల్లో పాల్గొన్నారు. అయితే కలిసి చేసిన తొలి భారీ ఓపెన్ వాటర్ స్విమ్ ఇది. భారత్, శ్రీలంకల మధ్య సాంస్కృతిక అనుబంధాన్ని గుర్తుచేసే ప్రయత్నంగా కూడా ఈ సాహసాన్ని వారు చేపట్టినట్లు తెలుస్తోంది. -
ఫైనల్లో చైనాతో ఢీ.. చరిత్రకు అడుగు దూరంలో
ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–2 టోర్నమెంట్లో భారత మహిళల రికర్వ్ జట్టు పెను సంచలనం సృష్టించింది. దీపిక కుమారి, అంకిత, కుంకుమ్లతో కూడిన భారత జట్టు 10 సార్లు ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత దక్షిణ కొరియా జట్టును బోల్తా కొట్టించింది. షాంఘై వేదికగా గురువారం జరిగిన సెమీఫైనల్లో భారత బృందం 5–1 సెట్ల (58–55, 56–56, 58–56) స్కోరుతో లీ యున్జీ, ఒ యెజిన్, కాంగ్ చెయంగ్లతో కూడిన దక్షిణ కొరియా జట్టును ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది.ఈ క్రమంలో ఆదివారం జరిగే ఫైనల్లో చైనా జట్టుతో భారత్ తలపడుతుంది. తొలి రౌండ్లో భారత్ 6–2 సెట్ల (53–56, 57–54, 55–54, 55–51) స్కోరుతో ఉజ్బెకిస్తాన్ జట్టుపై, క్వార్టర్ ఫైనల్లో 5–4 సెట్ల (53–54, 54–49, 58–56, 55–56, 28–25) స్కోరుతో వియత్నాం జట్టుపై విజయం సాధించింది. 1988 సియోల్ ఒలింపిక్స్లో మహిళల ఆర్చరీ టీమ్ ఈవెంట్ను ప్రవేశ పెట్టారు. 1988 సియోల్ నుంచి 2024 పారిస్ ఒలింపిక్స్ వరకు జరిగిన 10 విశ్వ క్రీడల్లో మహిళల రికర్వ్ టీమ్ విభాగంలో దక్షిణ కొరియా జట్టే స్వర్ణ పతకాలు సాధించడం విశేషం.మరోవైపు.. పురుషుల రికర్వ్ టీమ్ విభాగంలో బొమ్మదేవర ధీరజ్, తరుణ్దీప్ రాయ్, యశ్దీప్లతో కూడిన భారత జట్టు పేలవ ప్రదర్శన కనబరిచింది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన భారత జట్టు రెండో రౌండ్లో 2–6 సెట్ల (52–55, 54–54, 53–53, 53–57) స్కోరుతో అబ్దుర్ రెహమాన్, రామకృష్ణ సాహా, మిషాద్లతో కూడిన బంగ్లాదేశ్ జట్టు చేతిలో ఓడిపోయింది. వ్యక్తిగత విభాగంలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ బొమ్మదేవర ధీరజ్, తరుణ్దీప్ రాయ్ మూడో రౌండ్ చేరుకున్నారు. -
‘ఏం పాపం చేశాం.. ఇదేనా మాకిచ్చే విలువ!’
బ్యాడ్మింటన్లో థామస్ కప్కు ఉండే ప్రత్యేకత వేరు. చైనా, మలేషియా, జపాన్ లాంటి దేశాల్లో బ్యాడ్మింటన్ ఆటకు ఉన్న క్రేజ్ కూడా వేరు. భారత్లోనూ పీవీ సింధు, సైనా నెహ్వాల్, లక్ష్యసేన్, కిడాంబి శ్రీకాంత్, డబుల్స్ జోడి చిరాగ్-సాత్విక్ జోడి బ్యాడ్మింటన్లో అంచనాలు అందుకుంటూ పతకాలు సాధించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయినా కూడా భారత్లో క్రికెట్ను మినహాయించి ఏ క్రీడను అంతగా పట్టించుకోరన్నది చాలాసార్లు రుజువైంది. తాజాగా జర్మనీ వేదికగా జరిగిన థామస్ కప్లో భారత పురుషుల బృందం కాంస్య పతకం గెలిచిన సంగతి తెలిసిందే. అయితే థామస్ కప్లో పతకం సాధించి భారత్కు తిరిగి వస్తే తమను కనీసం పట్టించుకున్న పాపాన పోలేదంటూ భారత ఆటగాళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. జర్మనీ ఎయిర్పోర్టులో భారతీయులు ఉన్నా కూడా తమ దగ్గరకు రాలేదని, ఇక భారత్లో అయితే కనీసం తమ ముఖాలు కూడా చూడలేదని డబుల్స్ స్టార్ సాత్విక్ సాయిరాజ్ బాధను వ్యక్తం చేశాడు. దేశానికి పతకాలు సాధించినా తమకు తగిన గుర్తింపు లేకపోవడం షట్లర్లుగా తమకు నిరాశ కలిగించిందన్నాడు. ఇలాంటి అవమానాలతో భారత్లో బ్యాడ్మింటన్ వంటి క్రీడను వృత్తి పరంగా కొనసాగించాలా వద్దా అనేది ఆలోచించుకునే పరిస్థితిలో ఉన్నట్లు తెలిపాడు. సాత్విక్ సాయిరాజ్ మాట్లాడుతూ.. ‘జర్మనీ నుంచి ఏడు గంటల పాటు విమాన ప్రయాణం చేసి హైదరాబాద్ చేరుకున్నాం. మేము జర్మనీ ఎయిర్పోర్టులో ఉన్నప్పుడు మా కాంస్య పతకాలు చూసిన కొందరు.. ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు అని అడగలేదు. అందులో భారతీయులతో పాటు చాలా మంది తెలుగువాళ్లు కూడా ఉన్నారు. మేమంతా థామస్ కప్ జెర్సీలు ధరించి ఉన్నప్పటికీ, వాళ్లంతా ఐపీఎల్, రాజకీయాలతో బిజీగా ఉన్నారు. 2022లో ఇదే థామస్ కప్లో స్వర్ణం సాదించినప్పుడు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఇలాంటి ఘనతలు సాధించినప్పుడు సంబరాలు చేసుకోవాలి. ఇలాంటి అవకాశాలు తరచూ రావని మన అభిమానులకు తెలియడం లేదు. థామస్ కప్ గెలవడం చాలా కష్టం, పతకాలు సాధించడం కూడా కష్టతరం. ఎయిర్పోర్టులో దిగిన తర్వాత ప్రణయ్, శ్రీకాంత్, ధ్రువ్ క్యాబ్లు బుక్ చేసుకోవడం చూశాను. అభినందించడానికి ఒక్కరు కూడా మా దగ్గరికి రాలేదు. నా స్నేహితులు నన్ను పిక్ చేసుకునేందుకు వచ్చారు. కానీ ఎయిర్పోర్ట్లో నా సహచర ఆటగాళ్లు క్యాబ్లు బుక్ చేసుకోవడానికి ప్రయత్నాలు సాగించడం బాధగా అనిపించింది. టోర్నీల్లో బరిలోకి దిగి గాయపడితే.. మన బదులు ఆడేందుకు ఎవరూ ఉండరు. టీమ్ ఈవెంట్స్లోనూ తీవ్ర ఒత్తిడి ఉంటుంది. బయట నుంచి పెద్దగా సపోర్ట్ లేకుండా ఆడతాం. పతకాలు గెలిచినా సరిపోవడం లేదు. ఓ సందర్భంలో ప్రణయ్తో.. 'ఈ క్రీడకు ఎలాంటి గుర్తింపులేదు. నేను నా పిల్లలను బ్యాడ్మింటన్ వైపు రానివ్వను' అని చెప్పా. మానసికంగా దృఢంగా ఉంటే ఫర్వాలేదు. లేకపోతే మనం ఎంత ప్రదర్శన చేసినా గుర్తించకపోతే చాలా బాధేస్తుంది. హైదరాబాద్ అకాడమీలో కేక్ కటింగ్ చేసి సంబరాలు చేసుకోవడం వరకే ఆశిస్తున్నాం’అని సాత్విక్ బాధాతప్త హృదయంతో వెల్లడించాడు.చదవండి: పాక్తో ఆడేది లేదు.. వాళ్లకు మాత్రం మినహాయింపు! -
పాక్తో ఆడేది లేదు.. వాళ్లకు మాత్రం మినహాయింపు!
పాకిస్తాన్తో ద్వైపాక్షిక సిరీస్లకు సంబంధించి భారత ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్తో ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్లు ఆడేది లేదని క్రీడాశాఖ మంత్రి మన్సుక్ మాండవీయ తెలిపారు. అయితే భారత్లో జరిగే మల్టీ నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్లో మాత్రం పాకిస్తాన్ అథ్లెట్లు పాల్గొనేందుకు అనుమతి ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు జాతీయ క్రీడా సమాఖ్య, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) సంయుక్తంగా సర్క్యులర్ విడుదల చేసింది. 2030 కామన్వెల్త్ గేమ్స్తో పాటు 2036 ఒలింపిక్స్ను నిర్వహణకు భారత్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఒలింపిక్ చార్టర్, అంతర్జాతీయ క్రీడా మార్గదర్శకాలను అనుసరించనున్నట్లు తెలిపింది. అయితే పాకిస్తాన్తో మాత్రం ఎలాంటి ద్వైపాక్షిక క్రీడా సంబంధాలు ఉండవని, అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఐసీసీ, ఒలింపిక్స్, కామన్వెల్త్, ఆసియా గేమ్స్ వంటి టోర్నీల్లో మాత్రమే భారత్, పాకిస్తాన్తో తలపడుతుందని క్రీడాశాఖ పునరుద్ఘాటించింది. తాజాగా విడుదల చేసిన సర్క్యులర్తో పాకిస్తాన్తో ప్రస్తుతం ఉన్న క్రీడా విధానం యథాతథంగా కొనసాగనుంది. దీంతో సమీప భవిష్యత్తులో అటు భారత్లో కానీ, ఇటు పాకిస్తాన్లో కానీ ఇరు దేశాల మధ్య క్రికెట్, హాకీ సహా ఇతర క్రీడా సిరీస్లు జరగవు. అయితే పాకిస్తాన్ అథ్లెట్లకు మాత్రం ఇందుకు మినహాయింపు ఉంటుందని, ఎందుకంటే వారి వ్యక్తిగత కెరీర్ను దెబ్బతీసే ఉద్దేశం తమకు ఎంతమాత్రం లేదని పేర్కొంది. భారత్లో జరిగే అథ్లెటిక్స్ ఈవెంట్లు ఏవైనా పాక్ అథ్లెట్లు పాల్గొనడానకి అవకాశమిస్తామని కేంద్ర క్రీడాశాఖ నొక్కి చెప్పింది. గతేడాది ఏప్రిల్లో పహల్గాం ఉగ్రదాడి ఘటనలో 26 మంది అమాయక ప్రాణాలు బలిగొన్న తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. నిజానికి 2008 ముంబై ఉగ్రదాడుల తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక క్రీడా సిరీస్లు పూర్తిగా నిలిచిపోయాయి. కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రం భారత్, పాకిస్తాన్లు తలపడుతున్నాయి. చివరగా 2026 టీ20 ప్రపంచకప్లో పాక్తో మ్యాచ్ ఆడిన భారత్ ఘన విజయాన్ని సాధించింది.చదవండి: బ్యాటర్ల వెన్నులో వణుకు.. కనుమరుగవుతున్న యార్కర్లు! -
క్వాలిఫయింగ్ టాప్–10లో భారత ఆర్చరీ జట్లు
షాంఘై: ప్రపంచ కప్ ఆర్చరీ స్టేజ్–2 టోర్నీ కాంపౌండ్ విభాగం క్వాలిఫయింగ్ రౌండ్లో భారత ప్లేయర్లు రాణించారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన వెన్నం జ్యోతి సురేఖ, ప్రపంచ మాజీ చాంపియన్ అదితి స్వామి, ప్రగతిలతో కూడిన భారత బృందం క్వాలిఫయింగ్లో 2092 పాయింట్లు స్కోరు చేసి ఏడో స్థానంలో నిలిచింది. అదితి 700 పాయింట్లతో 13వ స్థానంలో, ప్రగతి 697 పాయింట్లతో 19వ స్థానంలో, జ్యోతి సురేఖ 695 పాయింట్లతో 21వ స్థానంలో, మధుర 690 పాయింట్లతో 33వ స్థానంలో నిలిచారు.జట్టు స్థానాన్ని ఖరారు చేసేందుకు ఆయా దేశాల టాప్–3 క్రీడాకారిణుల స్కోర్లను లెక్కలోకి తీసుకుంటారు. మెక్సికోలో జరిగిన ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నిలో జ్యోతి సురేఖ బృందం స్వర్ణ పతకాన్ని సాధించింది. మరోవైపు ప్రపంచ మాజీ చాంపియన్ ఓజస్ దేవ్తలే, సాహిల్, కుశాల్లతో కూడిన భారత పురుషుల కాంపౌడ్ జట్టు క్వాలిఫయింగ్లో 2130 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. ఈ ప్రదర్శనతో తొలి రౌండ్లో ‘బై’ పొందిన భారత జట్టు రెండో రౌండ్లో జర్మనీ తో ఆడుతుంది. భారత మహిళల కాంపౌండ్ జట్టు తొలి రౌండ్లో సింగపూర్ జట్టును ఢీ కొంటుంది. -
బెదిరింపులకు దిగిన టెన్నిస్ స్టార్!
మహిళల ప్రపంచ నంబర్వన్, స్టార్ క్రీడాకారిణి అరీనా సబలెంకా బెదిరింపులకు దిగింది. గ్రాండ్స్లామ్ టోర్నీల్లో తమకు ఎక్కువ మొత్తంలో షేర్ ఇవ్వకపోతే ఆ టోర్నీలను ఆటగాళ్లు బాయ్కాట్ చేయాలని పిలుపునిచ్చింది. ఇటీవలే ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ ప్రైజ్మనీ విషయంలో ఇటలీ స్టార్ జానిక్ సిన్నర్.. 'ప్రైజ్మనీ విషయంలో పూర్తి నిరాశతో ఉన్నా' అంటూ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సిన్నర్కు సబలెంకా మద్దతుగా నిలుస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. 'ఆటగాళ్లకు ఆదాయంలో వాటా పెరగకపోతే మేము గ్రాండ్స్లామ్ టోర్నీలను బహిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఆటగాళ్లు అందుకున్న షేర్కు, చూపెడుతున్న లెక్కలకు సంబంధం ఉండడం లేదు. అందుకే ఆటగాళ్లకు పక్కగా ఆదాయంలో ఎక్కువ వాటాను ఇవ్వాలి. ఒకవేళ మేము బహిష్కరిస్తే టోర్నీలు జరగకపోవచ్చు. అదే జరిగితే మా నుంచి వచ్చే ఎంటర్టైన్మెంట్ను ప్రేక్షకులు మిస్ అవుతారు. కనీసం మాతో చర్చలు జరిపి ఆటగాళ్లు సంతోషపడే విధంగా ఆదాయంలో వాటా విషయమై ఒక ముగింపు ఇస్తారని ఆశిస్తున్నా' అని చెప్పుకొచ్చింది. ఇక ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ ఓపెన్ ప్రైజ్మనీపై అగ్రశ్రేణి ఆటగాళ్లు జానిక్ సిన్నర్, కోకో గాఫ్, స్వియాటెక్, జొకోవిచ్, జ్వెరెవ్, మెద్వెదెవ్ సహా పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం ప్రైజ్మనీ సుమారు పది శాతం మేర పెరిగి 61.7 యూరో మిలియన్లకు చేరుకుందని ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకులు ప్రకటించారు. అయితే ఆటగాళ్లు మాత్రం ఫ్రెంచ్ ఓపెన్లో ఆటగాళ్లకు ఆదాయంలో అందించే వాటా 15.5 నుంచి 14.9 శాతానికి తగ్గిందని విమర్శిస్తున్నారు. ఇక ఈ సీజన్లో తొలి గ్రాండ్స్లామ్ అయిన ఫ్రెంచ్ ఓపెన్ మే 18 నుంచి జూన్ 7 వరకు జరగనుంది.చదవండి: ఢిల్లీ క్యాపిటల్స్ అరుదైన ఫీట్! -
జిబ్రాల్టర్ జలసంధిని ఈదిన మిలింద్ సోమన్
వయసు కేవలం అంకె మాత్రమే అని మరోసారి నిరూపించాడు ప్రముఖ మోడల్, భారత ఫిట్నెస్ ఐకాన్ మిలింద్ సోమన్. మిలింద్ 60 ఏళ్ల వయస్సులో ఐరోపా, అఫ్రికా ఖండాన్ని వేరు చేసే జిబ్రాల్టర్ జలసంధిని ఈది సరికొత్త చరిత్ర సృష్టించాడు.మే 1న యూరప్లోని టారిఫా నుండి ఆఫ్రికాలోని మొరాకో తీరం వరకు సుమారు 15 కిలో మీటర్లు ఈది జిబ్రాల్టర్ జలసంధిని అతడు దాటాడు. ఈ ఘనతను ఒక అద్భుతంగా అతడు అభివర్ణించాడు. క్లిష్టమైన వాతావరణ పరిస్థితులను దాటి మరి ఈ లక్ష్యాన్ని అతడు చేరుకోవడం గొప్ప విషయంగా చెప్పుకోవాలి. కాగా మిలింద్ సోమన్ ఫిట్నెస్ పరంగా ఎంతో మందికి రోల్ మోడల్. సోమన్ తాజాగా తన ఫిట్నెస్ రహస్యాలను అభిమానులతో పంచుకున్నాడు. గత ఏడాది కాలంగా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పాటిస్తున్నట్లు మిలింద్ తెలిపాడు.ఇక సోమన్ 1990లలో సూపర్ మోడల్గా నిలిచాడు. ఆ తర్వాత అల్ట్రా-మారథాన్ రన్నర్గా, 'ఐరన్ మ్యాన్' టైటిల్ను గెలుచుకున్నారు. అంతేకాకుండా జుర్మ్, ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్,, డిసెంబర్ 16, ఎమర్జెన్సీ వంటి చిత్రాలు సిరీస్లలో తన నటనతో మొప్పించారు.At 60, most people slow down. Milind Soman chose to cross continents.On May 1, he swam 15 km across the Strait of Gibraltar, from Tarifa in Europe to the coast of Morocco in Africa.Calling the experience “beautiful,” he reminded the world that endurance isn’t about age, it’s… pic.twitter.com/Icx6mRgJFr— The Better India (@thebetterindia) May 5, 2026 -
ఆంటోనెల్లి ‘హ్యాట్రిక్’
ఫ్లోరిడా: ఫార్ములావన్ తాజా సీజన్లో తన జోరును కొనసాగిస్తూ మెర్సిడెస్ జట్టు టీనేజ్ డ్రైవర్ కిమీ ఆంటోనెల్లి ‘హ్యాట్రిక్’ విజయం అందుకున్నాడు. సీజన్లోని నాలుగో రేసు మయామి గ్రాండ్ప్రిలో ఇటలీకి చెందిన 19 ఏళ్ల ఆంటోనెల్లి విజేతగా నిలిచాడు. నిర్ణిత 57 ల్యాప్ల రేసును ‘పోల్ పొజిషన్’తో ప్రారంభించిన ఆంటోనెల్లి అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 1 గంట 33 నిమిషాల 19.273 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ప్రపంచ చాంపియన్ లాండో నోరిస్ (మెక్లారెన్) రెండో స్థానంలో నిలువగా... ఆస్కార్ పియాస్ట్రి (మెక్లారెన్) మూడో స్థానాన్ని పొందాడు. మొత్తం 22 మంది డ్రైవర్లలో నలుగురు రేసును పూర్తి చేయలేకపోయారు. సీజన్ తొలి రేసు ఆ్రస్టేలియన్ గ్రాండ్ప్రిలో మెర్సిడెస్కే చెందిన జార్జి రసెల్ విజేతగా నిలువగా... తర్వాతి మూడు రేసుల్లో (చైనా, జపాన్, మయామి) ఆంటోనెల్లికి టైటిల్ దక్కింది. ఫార్ములావన్ చరిత్రలో తన కెరీర్లోని తొలి మూడు పోల్ పొజిషన్ల నుంచి మూడు రేసుల్లోనూ గెలిచిన తొలి డ్రైవర్గా ఆంటోనెల్లి గుర్తింపు పొందాడు. తదుపరి రేసు కెనడియన్ గ్రాండ్ప్రి ఈనెల 24న జరుగుతుంది. 22 రేసుల ఈ సీజన్లో నాలుగు రేసులు ముగిశాక ఆంటోనెల్లి 100 పాయింట్లతో టాప్ ర్యాంక్లో ఉన్నాడు. -
చైనాదే థామస్ కప్ టైటిల్
హోర్సెన్స్ (డెన్మార్క్): ప్రతిష్టాత్మక థామస్ కప్ పురుషుల టీమ్ బ్యాడ్మింటన్ టోర్నీలో చైనా జట్టు 12వసారి విజేతగా నిలిచింది. తొలిసారి ఫైనల్ చేరిన ఫ్రాన్స్ జట్టుతో జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ చైనా 3–1తో విజయం సాధించింది. తొలి మ్యాచ్లో ప్రపంచ నంబర్వన్ షి యుకీ 85 నిమిషాల్లో 21–16, 16–21, 21–17తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ క్రిస్టో పొపోవ్ను ఓడించి చైనాకు 1–0 ఆధిక్యం అందించాడు.రెండో మ్యాచ్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ లీ షి ఫెంగ్ 43 నిమిషాల్లో 13–21, 10–21తో ప్రపంచ పదో ర్యాంకర్ అలెక్స్ లానియర్ చేతిలో ఓడిపోవడంతో స్కోరు 1–1తో సమమైంది. 96 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన మూడో మ్యాచ్లో ప్రపంచ 15వ ర్యాంకర్ వెంగ్ హాంగ్ యాంగ్ 22–20, 20–22, 21–19తో ప్రపంచ 17వ ర్యాంకర్ టోమా జూనియర్ పొపోవ్పై గెలిచి చైనాను 2–1తో ఆధిక్యంలో నిలిపాడు. నాలుగో మ్యాచ్లో హీ జి టింగ్–రెన్ జియాంగ్ యు ద్వయం 38 నిమిషాల్లో 21–13, 21–16తో ఎలోయ్ ఆడమ్–లియో రోసీ జోడీని ఓడించి చైనాకు 3–1తో విజయాన్ని అందించింది. సెమీఫైనల్లో ఓడిన భారత్, డెన్మార్క్ జట్లకు కాంస్య పతకాలు లభించాయి.12: థామస్ కప్ టైటిల్ను చైనా జట్టు ఇప్పటి వరకు 12 సార్లు గెల్చుకుంది. 1982, 1986, 1988, 1990, 2004, 2006, 2008, 2010, 2012, 2018, 2024, 2026లలో చైనా టైటిల్స్ సాధించింది. అత్యధిక సార్లు థామస్ కప్ నెగ్గిన జట్టుగా ఇండోనేసియా (14 సార్లు) అగ్రస్థానంలో ఉంది. మలేసియా (5 సార్లు) మూడో స్థానంలో ఉంది. భారత్, డెన్మార్క్, జపాన్ ఒక్కోసారి థామస్ కప్ టైటిల్ను సాధించాయి. -
చరిత్ర సృష్టించాడు!
మాడ్రిడ్: పురుషుల టెన్నిస్లో ప్రపంచ నంబర్వన్ యానిక్ సినెర్ అద్భుతం చేశాడు. గతంలో ఎవరికీ సాధ్యంకాని ఘనతను సాధించాడు. గ్రాండ్స్లామ్ తర్వాత అగ్రశ్రేణి టోర్నీలుగా పరిగణించే ‘మాస్టర్స్’ సిరీస్లో సినెర్ వరుసగా ఐదో టైటిల్ గెలిచాడు. ఆదివారం ముగిసిన మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో సినెర్ విజేతగా నిలిచాడు. ప్రపంచ 3వ ర్యాంకర్ జ్వెరెవ్ (జర్మనీ)తో జరిగిన ఫైనల్లో సినెర్ 6–1, 6–2తో అలవోకగా విజయం సాధించాడు.తద్వారా 36 ఏళ్ల చరిత్ర కలిగిన మాస్టర్స్ సిరీస్ టోర్నీల్లో వరుసగా ఐదు టైటిల్స్ గెలిచిన తొలి ప్లేయర్గా కొత్త రికార్డు నెలకొల్పాడు. గతంలో మూడుసార్లు జొకోవిచ్ (సెర్బియా), రాఫెల్ నాదల్ (స్పెయిన్) ఒకసారి వరుసగా నాలుగు మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ సాధించారు. గత ఏడాది పారిస్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టైటిల్ గెలిచిన సినెర్... ఈ ఏడాది మోంటెకార్లో, మయామి, ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టోరీ్నల్లో విజేతగా నిలిచాడు. చాంపియన్ సినెర్కు 10,07,165 యూరోల (రూ. 11 కోట్ల 21 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
చైనాకు కొరియా షాక్
హోర్సెన్స్ (డెన్మార్క్): నాలుగేళ్ల విరామం తర్వాత ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ మహిళల టీమ్ బ్యాడ్మింటన్ టోర్నీ లో దక్షిణ కొరియా జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో దక్షిణ కొరియా 3–1తో 16 సార్లు చాంపియన్ చైనా జట్టును బోల్తా కొట్టించి మూడోసారి ఉబెర్ కప్ను సొంతం చేసుకుంది. 2010, 2022లలో కూడా చైనా జట్టునే ఓడించి దక్షిణ కొరియా జట్టు ఉబెర్ కప్ను దక్కించుకుంది. పదోసారి చైనా జట్టుతో టైటిల్ పోరులో తలపడ్డ కొరియా ఈసారి పూర్తి ఆధిపత్యం కనబరిచింది. తొలి మ్యాచ్లో ప్రపంచ నంబర్వన్, ఒలింపిక్ చాంపియన్ ఆన్ సె యంగ్ 21–10, 21–13తో ప్రపంచ 2వ ర్యాంకర్ వాంగ్ జి యిపై 20వ సారి గెలిచి కొరియాకు శుభారంభం అందించింది. రెండో మ్యాచ్లో ప్రపంచ నంబర్వన్ జోడీ లియు షెంగ్ షు–టాన్ నింగ్ 21–15, 21–12తో జియోంగ్ నా యున్–లీ సో హీ జంటపై గెలిచి స్కోరును 1–1తో సమం చేసింది. మూడో మ్యాచ్లో ప్రపంచ 17వ ర్యాంకర్ కిమ్ గా యున్ 21–19, 21–15తో ప్రపంచ 4వ ర్యాంకర్ చెన్ యు ఫెను ఓడించి కొరియాకు 2–1తో ఆధిక్యం అందించింది. నాలుగో మ్యాచ్లో ప్రపంచ 170వ ర్యాంక్ జోడీ 16–21, 21–10, 21–13తో ప్రపంచ 4వ ర్యాంక్ ద్వయం జియా యి ఫాన్–జాంగ్ షు జియాన్ను కంగుతినిపించి కొరియాకు 3–1తో విజయాన్ని అందించింది. సెమీఫైనల్లో ఓడిన ఇండోనేసియా, జపాన్ జట్లకు కాంస్య పతకాలు లభించాయి. -
కాంస్యంతో సరి.. సెమీస్లో భారత్ పరాజయం!
ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ సెమీ ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు ఓటమిపాలైంది. ఫ్రాన్స్తో జరిగిన ఈ పోరులో 0–3తో వరుస సింగిల్స్ మ్యాచ్లలో పరాజయాన్ని ఎదుర్కొంది. తొలి సింగిల్స్ మ్యాచ్లో ఆయుశ్ శెట్టి 11–21, 9–21 స్కోరుతో క్రిస్టో పొపోవ్ చేతిలో ఓడిపోయాడు. 39 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది. రెండో సింగిల్స్లో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ కూడా ప్రత్యర్థి ముందు నిలవలేకపోయాడు. 16–21, 18–21తో వరుస గేమ్లలో అలెక్స్ లేనియర్ చేతిలో పోరాడి ఓడాడు. ఈ మ్యాచ్ కూడా 41 నిమిషాల్లో ముగిసింది. చావో రేవో తేల్చుకోవాల్సిన మూడో సింగిల్స్లో కూడా హెచ్ఎస్ ప్రణయ్ నిలవలేకపోయాడు. ఈ మ్యాచ్లో టోమా జూనియర్ పొపోవ్ 21–19, 21–16తో ప్రణయ్ను 48 నిమిషాల్లో చిత్తు చేశాడు. సెమీస్లో ఓటమితో భారత్ కాంస్య పతకంతో సంతృప్తి చెందింది. ఫలితం తేలిపోవడంతో తర్వాతి రెండు డబుల్స్ మ్యాచ్ల అవసరం రాలేదు. మోచేతి గాయం కారణంగా లక్ష్య సేన్ ఈ మ్యాచ్లో ఆడలేకపోయాడు. చదవండి: ‘పాండ్యాపై విద్వేషం.. కరువైన మద్దతు!’ -
చరిత్రకు చేరువలో...
మాడ్రిడ్: ఈ సీజన్లో అద్భుతమైన ఫామ్లో ఉన్న ఇటలీ టెన్నిస్ స్టార్, ప్రపంచ నంబర్వన్ యానిక్ సినెర్ కొత్త చరిత్ర సృష్టించేందుకు విజయం దూరంలో నిలిచాడు. వరుసగా ఐదు మాస్టర్స్ సిరీస్–1000 టైటిల్స్ గెలిచిన తొలి ప్లేయర్గా రికార్డు నెలకొల్పేందుకు సినెర్ సిద్ధమయ్యాడు. మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోరీ్నలో టాప్ సీడ్ సినెర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో సినెర్ 6–2, 6–4తో ఆర్థర్ ఫిల్స్ (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. సినెర్ కెరీర్లో ఇది 350వ విజయం కావడం విశేషం. 86 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్లో సినెర్ నాలుగు ఏస్లు సంధించి, ఒక డబుల్ ఫాల్ట్ చేశాడు. తొలి సరీ్వస్లో 21 పాయింట్లు, రెండో సర్వీస్లో 15 పాయింట్లు సాధించాడు. తన సరీ్వస్ను ఒక్కసారి కూడా కోల్పోని సినెర్ ప్రత్యర్థి సరీ్వస్ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. అలెగ్జాండర్ బ్లాక్స్ (బెల్జియం), అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో ఆదివారం జరిగే ఫైనల్లో సినెర్ తలపడతాడు. గత ఏడాది పారిస్ ఓపెన్ మాస్టర్స్ టైటిల్ గెలిచిన సినెర్... ఈ ఏడాది ఇండియన్ వెల్స్, మయామి ఓపెన్, మోంటెకార్లో ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోరీ్నల్లోనూ విజేతగా నిలిచాడు. మాడ్రిడ్ ఓపెన్లో ఫైనల్కు చేరడం ద్వారా... ఏటీపీ సర్క్యూట్లోని తొమ్మిది మాస్టర్స్ సిరీస్ టోరీ్నల్లో ఫైనల్ చేరిన నాలుగో ప్లేయర్గా, అతి పిన్న వయస్కుడిగా 24 ఏళ్ల సినెర్ గుర్తింపు పొందాడు. గతంలో రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), రాఫెల్ నాదల్ (స్పెయిన్) మాత్రమే ఈ ఘనత సాధించారు. -
నిషికొరి వీడ్కోలు
టోక్యో: పురుషుల టెన్నిస్లో ఆసియా అత్యుత్తమ ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న జపాన్ ప్లేయర్ కి నిషికొరి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ ఏడాది తర్వాత టెన్నిస్కు గుడ్బై చెప్పనున్నానని తెలిపాడు. 36 ఏళ్ల నిషికొరి 2014లో యూఎస్ ఓపెన్ ఫైనల్లో మారిన్ సిలిచ్ (క్రొయేషియా) చేతిలో ఓడి రన్నరప్గా నిలిచాడు. తద్వారా గ్రాండ్స్లామ్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో రన్నరప్గా నిలిచిన తొలి ఆసియా ప్లేయర్గా గుర్తింపు పొందాడు. 2007లో ప్రొఫెషనల్గా మారిన నిషికొరి 2016 రియో ఒలింపిక్స్లో కాంస్య పతకం గెలిచాడు. కాంస్య పతక మ్యాచ్లో అతను స్పెయిన్ దిగ్గజం రాఫెల్ నాదల్ను మూడు సెట్లలో ఓడించాడు. 2017లో కెరీర్ బెస్ట్ 4వ ర్యాంక్ అందుకున్న నిషికొరి ఆ్రస్టేలియన్ ఓపెన్లో నాలుగుసార్లు (2012, 2015, 2016, 2019)... ఫ్రెంచ్ ఓపెన్లో మూడుసార్లు (2015, 2017, 2019)... వింబుల్డన్ టోరీ్నలో రెండుసార్లు (2018, 2019) క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. కెరీర్ మొత్తంలో 12 ఏటీపీ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన నిషికొరి 451 మ్యాచ్ల్లో గెలిచి, 231 మ్యాచ్ల్లో ఓడిపోయాడు. 2019లో చివరిసారి బ్రిస్బేన్ ఓపెన్లో టైటిల్ నెగ్గిన నిషికొరి ఆ తర్వాత మరో టోరీ్నలో విజేతగా నిలువలేదు. భుజం గాయంతో బాధపడుతున్న నిషికొరి గత ఏడాది యూఎస్ ఓపెన్లో, ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్లోనూ ఆడలేదు. ప్రస్తుతం 464వ ర్యాంక్లో ఉన్న ఈ జపాన్ ప్లేయర్ చాలెంజర్ టోరీ్నల్లో ఆడుతున్నాడు. ఈ సీజన్లో ఐదు చాలెంజర్ టోరీ్నల్లో పోటీపడ్డ నిషికొరి ఒక్క దాంట్లోనూ కనీసం క్వార్టర్ ఫైనల్ చేరలేకపోయాడు. -
అదరగొట్టిన భారత్
హోర్సెన్స్ (డెన్మార్క్): తమదైన రోజున సహజశైలిలో చెలరేగితే... ప్రత్యర్థి జట్టులో తమకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న ఆటగాళ్లు ఉన్నా... అద్భుత ఫలితం సాధించవచ్చని భారత షట్లర్లు నిరూపించారు. ప్రతిష్టాత్మక థామస్ కప్ టీమ్ బ్యాడ్మింటన్ టోర్నిలో తమ అసాధారణ ప్రదర్శనతో భారత పురుషుల జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో టీమిండియా 3–0తో చైనీస్ తైపీ జట్టును చిత్తు చేసింది. ఈ విజయంతో సెమీఫైనల్కు చేరుకున్న భారత జట్టుకు కనీసం కాంస్య పతకం ఖాయమైంది. జపాన్, ఫ్రాన్స్ జట్ల మధ్య క్వార్టర్ ఫైనల్ విజేతతో నేడు జరిగే సెమీఫైనల్లో భారత జట్టు తలపడుతుంది. మరో క్వార్టర్ ఫైనల్లో చైనా 3–0తో మలేసియాపై గెలిచింది. థాయ్లాండ్, డెన్మార్క్ జట్ల మధ్య క్వార్టర్ ఫైనల్ విజేతతో నేడు జరిగే సెమీఫైనల్లో చైనా ఆడుతుంది. 2022లో తొలిసారి థామస్కప్ చాంపియన్గా అవతరించిన భారత జట్టు 2024లో మాత్రం క్వార్టర్ ఫైనల్లో చైనా జట్టు చేతిలో ఓడిపోయింది. 2 మ్యాచ్ పాయింట్లు కాపాడుకొని... చైనీస్ తైపీతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో తొలి మ్యాచ్లో ప్రపంచ 11వ ర్యాంకర్ లక్ష్య సేన్ 88 నిమిషాల్లో 18–21, 22–20, 21–17తో ప్రపంచ 6వ ర్యాంకర్ చౌ తియెన్ చెన్ను ఓడించాడు. ఈ పోరులో రెండు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని లక్ష్య సేన్ నెగ్గడం విశేషం. తొలి గేమ్ కోల్పోయిన లక్ష్య సేన్ రెండో గేమ్లో 18–20తో వెనుకబడి ఓటమి అంచుల్లో నిలిచాడు. ఈ దశలో సంయమనం కోల్పోకుండా ఆడిన లక్ష్య సేన్ వరుసగా 4 పాయింట్లు నెగ్గి 22–20తో గేమ్ను గెలిచి మ్యాచ్లో నిలిచాడు. నిర్ణాయక మూడో గేమ్లో లక్ష్య సేన్ 10–6తో ఆధిక్యంలోకి వెళ్లి ఆ ఆధిక్యాన్ని కాపాడుకొని విజయాన్ని అందుకున్నాడు. రెండో మ్యాచ్లో ప్రపంచ 4వ ర్యాంక్ జోడీ సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి 23–21, 19–21, 21–12తో ప్రపంచ 14వ ర్యాంక్ జంట చియు సియాంగ్ చెయి–వాంగ్ చి లిన్పై గెలిచి భారత ఆధిక్యాన్ని 2–0కు పెంచింది. మూడో మ్యాచ్లో ఆసియా చాంపియన్షిప్ రన్నరప్, ప్రపంచ 18వ ర్యాంకర్ ఆయుశ్ శెట్టి 48 నిమిషాల్లో 21–16, 21–17తో ఈ ఏడాది ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్, ప్రపంచ 8వ ర్యాంకర్ లిన్ చున్ యిని బోల్తా కొట్టించి భారత్కు సెమీఫైనల్ బెర్త్ను అందించాడు. ఫలితం తేలిపోవడంతో మిగతా రెండు మ్యాచ్లు నిర్వహించలేదు. -
సెమీఫైనల్లో తొలిసారి ‘లక్కీ లూజర్’
మూడు పుష్కరాల చరిత్ర ఉన్న మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ)–1000 టోర్నీల్లో ఇప్పటి వరకు చోటు చేసుకోని అద్భుతం మాడ్రిడ్ ఓపెన్లో నిజమైంది. ‘లక్కీ లూజర్’ హోదాలో మెయిన్ ‘డ్రా’లో అడుగు పెట్టిన ఆస్ట్రియా ప్లేయర్ అనస్తాసియా పొటపోవా ఏకంగా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. తద్వారా 1990 నుంచి జరుగుతోన్న డబ్ల్యూటీఏ–1000 సిరీస్ టోర్నీల్లో సెమీఫైనల్ బెర్త్ను దక్కించుకున్న తొలి ‘లక్కీ లూజర్’గా పొటపోవా గుర్తింపు పొందింది.మాడ్రిడ్లో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 56వ ర్యాంకర్ పొటపోవా 6–1, 6–7 (4/7), 6–3తో ప్రపంచ మాజీ నంబర్వన్, 2016 యూఎస్ ఓపెన్, 2021 వింబుల్డన్ టోర్నీ రన్నరప్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)పై సంచలన విజయం సాధించింది. ‘లక్కీ లూజర్’ ఎవరంటే... ఏదైనా టోర్నీ మెయిన్ ‘డ్రా’ ఖరారయ్యాక అందులోని ప్లేయర్లు గాయాల కారణంగా చివరి నిమిషంలో వైదొలుగుతారు. దాంతో నిర్వాహకులు క్వాలిఫయింగ్ ఫైనల్ రౌండ్లో ఓడిపోయిన అత్యుత్తమ ర్యాంక్ ఉన్న ప్లేయర్లకు ‘లక్కీ లూజర్స్’ హోదాలో మెయిన్ ‘డ్రా’లో ఆడే అవకాశం కల్పిస్తారు.మాడ్రిడ్ ఓపెన్లో పొటపోవాకు ఈ అనుభవమే ఎదురైంది. రష్యాలో జన్మించి ప్రస్తుతం ఆస్ట్రియా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పొటపోవా ఈ టోర్నీ సింగిల్స్ క్వాలిఫయింగ్ ఫైనల్ రౌండ్లో ఓడిపోయింది. ఫలితంగా మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించలేకపోయింది.అయితే మెయిన్ ‘డ్రా’లో చోటు పొందిన నలుగురు ప్లేయర్లు గాయాల కారణంగా చివరి నిమిషంలో వైదొలిగారు. దాంతో నిర్వాహకులు క్వాలిఫయింగ్ ఫైనల్ రౌండ్లలో ఓడిపోయిన నలుగురు అత్యుత్తమ ర్యాంక్ ఉన్న ప్లేయర్లకు మెయిన్ ‘డ్రా’లో ఆడే అవకాశం కల్పించారు. పొటపోవాతోపాటు పన్నా ఉడ్వార్డి (హంగేరి), అన్నా బ్లింకోవా (రష్యా), యులియా (ఉక్రెయిన్)లకు ‘లక్కీ లూజర్స్’గా మెయిన్ ‘డ్రా’లో చోటు కల్పించారు. ఉడ్వార్డి, బ్లింకోవా రెండో రౌండ్లో ఓడిపోగా... యులియా తొలి రౌండ్లో వెనుదిరిగింది. పొటపోవా మాత్రం ఒక్కో రౌండ్ను దాటుకుంటూ సెమీఫైనల్కు దూసుకొచ్చింది. -
పట్టుదలే పెట్టుబడిగా...
విశ్వ వేదికపై ఆసియా దేశాల ఆధిపత్యం ఉన్న క్రీడల్లో జూడో ఒకటి. జపాన్, ఉజ్బెకిస్తాన్, దక్షిణ కొరియా, మంగోలియా దేశాలు ఈ క్రీడలో ఎంతోమంది ప్రపంచ చాంపియన్లను అందించాయి. భారత్ విషయానికొస్తే ప్రాతినిధ్యమే తప్ప పతకాల గురించి ఆలోచిస్తే అత్యాశే అవుతుంది. కానీ ప్రతిభావంతులకు వెన్నుతట్టి ప్రోత్సహిస్తే ఈ క్రీడలోనూ భారత ప్లేయర్లు మెరిపిస్తారని మణిపూర్ అమ్మాయి ఇనున్గన్బీ తఖెల్లంబం నిరూపించింది. ఇటీవల చైనాలో జరిగిన ఆసియా సీనియర్ జూడో చాంపియన్షిప్లో ఇనున్గన్బీ 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. ఈ మెగా ఈవెంట్లో భారత్కు కాంస్యం రూపంలో పతకాన్ని అందించింది.భారత్ నుంచి చివరిసారి అనితా చాను రూపంలో ఆసియా జూడో చాంపియన్షిప్ మెడలిస్ట్ను చూశాము. 2013లో జరిగిన ఆసియా పోటీల్లో ఆమె కూడా కాంస్య పతకం సాధించింది. 13 ఏళ్ల తర్వాత అనితా చాను కోచ్ హోదాలో హాజరైన ఆసియా చాంపియన్షిప్లో భారత్కు మళ్లీ పతకం లభించింది. మహిళల 70 కేజీల విభాగంలో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఇనున్గన్బీ కాంస్య పతకం చేజిక్కించుకుంది. కాంస్య పతక పోరులో మంగోలియా జూడోకాపై ఇనున్గన్బీ నెగ్గింది. ఇక ఈ ఏడాది జరగనున్న కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్లో పతకాలు సాధించడమే తన తదుపరి లక్ష్యమని మణిపూర్కు చెందిన 27 ఏళ్ల ఇనున్గన్బీ వెల్లడించింది. చాన్నాళ్లుగా జాతీయ జట్టు బ్లేజర్ వెంట తీసుకెళ్తున్న అనిత ఎట్టకేలకు ఈ టోర్నీలో తొలిసారి దానిని ధరించింది. ‘కోచ్ అనిత మొదటి టోర్నీ నుంచి బ్లేజర్ వెంట పెట్టుకొని వస్తున్నారు. కానీ, ఇప్పటి వరకు దాన్ని వేసుకునే సందర్భం రాలేదు. ఈ టోర్నీ ఆరంభానికి ముందే ఆమె నన్ను అడిగారు. ఈ సారైనా బ్లేజర్ వేసుకోనిస్తావా అని. నేను అప్పుడే చెప్పా తప్పకుండా అని. ఎట్టకేలకు 13 ఏళ్ల తర్వాత నేను కాంస్యం సాధించడం ద్వారా పతక ప్రదానోత్సవం సందర్భంగా ఆమె బ్లేజర్ వేసుకున్నారు’ అని వెల్లడించింది. జూడోలో సాధారణంగా కోచ్లు ట్రాక్ సూట్లే ధరిస్తారు. పతక ప్రదానోత్సవంలో బ్లేజర్ వేసుకుంటారు. ‘భారత్ తరఫున చివరిసారిగా అనిత మేడమ్ ఈ పతకం నెగ్గారని నాకు తెలియదు. ఆమె 2013 కంటే చాలా ముందే మెడల్ గెలిచి ఉంటారని అనుకున్నా. ఆమె తర్వాత పతకం నెగ్గిన తొలి భారతీయురాలిని నేనే అని కోచ్లు చెప్పినప్పుడు నా ఆనందరం రెట్టింపు అయింది. 2021 నుంచి భారత సీనియర్ జట్టులో ఉన్నా. ఇప్పటి వరకు పాల్గొన్న ఏ టోర్నమెంట్లోనూ తొలి రౌండ్ దాటి ముందుకు వెళ్లలేకపోయా. ఇది నా కెరీర్లోనే అతిపెద్ద విజయం. ఈ ఫలితం నాలో ఆత్మవిశ్వాసం పెంపొందించింది’ అని ఇనున్గన్బీ చెప్పింది. గాయాల నుంచి కోలుకొని... దిగ్గజ బాక్సర్ మేరీకోమ్, మేటి వెయిట్లిఫ్టర్ కుంజారాణి దేవి వంటి సూపర్స్టార్స్ వచ్చిన నేల మణిపూర్ నుంచే ఇనున్గన్బీ వెలుగులోకి వచి్చంది. ఇతర ప్లేయర్ల లాగే ఆమె కూడా కెరీర్ తొలి నాళ్లలో అనేక ఆటలు ప్రయత్నించి చివరకు జూడోను ఎంచుకుంది. ‘చిన్నప్పటి నుంచి కుంజారాణి దేవి, మేరీకోమ్ వంటి వారు సాధించిన ఘనతల గురించి చాలా విన్నాను. వాళ్లలాగే దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని అనుకునేదాన్ని. వారి బాటలోనే క్రీడలను ఎంచుకోవాలని ముందే భావించా. ఫుట్బాల్ సహా చాలా ఆటలు ఆడా... కానీ జూడో నా దృష్టిని ఆకర్షించింది’ అని ఇనున్గన్బీ చెప్పింది. కెరీర్ ఆరంభంలో మణిపూర్లోని జాతీయ స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ పొందిన ఆమె... ఆ తర్వాత జాతీయ స్థాయిలో పతకాలు సాధించి సత్తా చాటింది. 2018లో ప్రాక్టీస్ సమయంలో తీవ్రంగా గాయపడిన ఇనున్గన్బీ... శస్త్రచికిత్స అనంతరం ఏడాది పాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఆ సమయంలో ఆమె పూర్తిగా చిక్కిపోయింది. ‘నా శరీరం పెన్సిల్ లాగా అయిపోయింది’ అని ఒక సందర్భంలో ఈ మణిపూర్ జూడోకా తెలిపింది. ఆ తర్వాత 2024లో అదే కాలికి మరోసారి గాయం కావడంతో చాన్నాళ్ల పాటు ఆటకు దూరమైంది. అయితే కిందపడ్డ ప్రతిసారీ పైకి లేవడం అలవర్చుకున్న ఈ మణిపూర్ ముత్యం... ఆసియా జూడో చాంపియన్షిప్లో అది్వతీయ ప్రదర్శనతో చరిత్ర లిఖించింది. క్వార్టర్ ఫైనల్లో ఉజ్బెకిస్తాన్ ప్లేయర్ షిరిన్జోన్ యుల్డోషోవా చేతిలో ఇనుంగాన్బి పరాజయం పాలైంది. అయితే ఉజ్బెకిస్తాన్ ప్లేయర్ ఫైనల్కు చేరడంతో... మన బాక్సర్కు రెపిచాజ్ అవకాశం దక్కింది. ‘క్వార్టర్లో ఓడి నిరాశగా ఉన్నప్పుడు మరో అవకాశం వచి్చంది. కాంస్య పతక పోరుకు ముందు ఈ చాన్స్ వదిలి పెట్టకూడదని బలంగా నిర్ణయించుకున్నా’ అని ఇనున్గన్బీ వెల్లడించింది. ఫుట్బాల్ వద్దనడంతో... నిరుపేద కుటుంబంలో జన్మించిన ఇనున్గన్బీకి బాక్సింగ్, రెజ్లింగ్లో కూడా ప్రవేశం ఉంది. తండ్రి ఫుట్బాల్ ఆడేందుకు నిరాకరించడంతో ఆమె తన దృష్టిని ఇండోర్ గేమ్స్ వైపు మరల్చుకుంది. రెజ్లింగ్ ప్రాక్టీస్ సమయంలో పక్కనే జూడో శిక్షణ సాగుతుంటే దాన్ని నిశితంగా పరిశీలించేంది. అందులో కొందరు ప్లేయర్లు నల్ల బెల్ట్లు, కొందరు తెల్ల బెల్ట్లు వేసుకునే వారు. అది ఆమెను బాగా ఆకర్షించింది. అందులోనూ తన ప్రత్యేకత చాటుకోవాలని భావించిన ఇనున్గన్బీ చివరకు జూడోలో అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగింది. ఆరంభంలో నాలుగేళ్ల పాటు ప్రాథమిక దశను దాటలేకపోయిన ఇనున్గన్బీ... ఆ తర్వాత నిలకడ కనబర్చింది. తొలిసారి 2021 ఆసియా జూడో చాంపియన్షిప్లో పాల్గొన్న ఈ మణిపూర్ ప్లేయర్ మొదటి రౌండ్లోనే పరాజయం పాలై ఇంటిబాట పట్టింది. ఆ తర్వాత గాయాలు వేధించినా... పట్టుదలే పెట్టుబడిగా పెట్టి... మొక్కవోని దీక్షతో ముందుకు సాగి... తాజాగా కాంస్య పతకం ఖాతాలో వేసుకుంది. గతేడాది జోర్డాన్లో జరిగిన ఆసియా ఓపెన్ జూడో పోటీల్లో ఇనున్గన్బీ పసిడి పతకం సాధించింది. ఈ జోరు ఇలాగే కొనసాగిస్తూ అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని పతకాలు సాధించాలనుకుంటున్న ఇనున్గన్బీకి మనమూ ఆల్ ద బెస్ట్ చెబుదాం! –సాక్షి క్రీడా విభాగం -
‘ఎల్లో’ కార్డులపై సడలింపులు!
వాషింగ్టన్: రాబోయే ఫుట్బాల్ ప్రపంచ కప్లో అగ్రశ్రేణి ఆటగాళ్లు అనూహ్యంగా కీలక మ్యాచ్లకు దూరం కాకూడదని భావిస్తున్న అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య (ఫిఫా) క్రమశిక్షణకు సంబంధించి పలు కొత్త నిబంధనలను తీసుకొచి్చంది. ఆటగాళ్లకు ‘ఎల్లో’ కార్డులు జారీ చేయడం, దానికి సంబంధించి శిక్షను అమలు చేసే విషయంలో సడలింపు ఇచ్చింది. సాధారణంగా వరుసగా రెండు ఎల్లో కార్డులు జారీ అయితే ఆ ఆటగాడు తర్వాతి మ్యాచ్లో ఆడకుండా సస్పెన్షన్ విధిస్తారు. కానీ ఇప్పుడు కొత్త నిబంధనన ప్రకారం టోరీ్నలో ఎల్లో కార్డుకు గురైనా సరే... నాకౌట్ మ్యాచ్లకు దూరమయ్యే అవకాశాలు తగ్గిపోతాయి. రెండుసార్లు ఎల్లో కార్డు రికార్డును అధికారులు తొలగిస్తారు. అంటే గ్రూప్ మ్యాచ్లలో ఎల్లో కార్డు అందుకున్నా... నాకౌట్కు ముందు దానిని పరిగణనలోకి తీసుకోరు. ఫలితంగా అతనిపై నిషేధం ఉండదు. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ తర్వాత కూడా ఇదే తరహాలో గత రికార్డును పక్కన పెట్టి కొత్తగా మొదలు పెట్టే అవకాశం ఇస్తారు. అంటే ఒకవేళ క్వార్టర్ ఫైనల్లో రెండో ఎల్లో కార్డులను ఎదుర్కొన్నా అతను సెమీస్ ఆడటంలో ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కీలక మ్యాచ్లకు టాప్ ప్లేయర్లు దూరం కాకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుందని ‘ఫిఫా’ అభిప్రాయ పడింది. మరోవైపు కొందరు ఆటగాళ్లు తమ నోటిపై చేతిని అడ్డుగా పెట్టుకొని ప్రత్యర్థి ఆటగాళ్లను దూషిస్తున్నారు. దీనిని నివారించేందుకు కూడా ‘ఫిఫా’ కొత్త నిబంధన తెచి్చంది. ఇకపై ఇలా నోటికి చేతిని అడ్డుగా పెట్టి గొడవకు దిగితే అతనికి రిఫరీ ఏకంగా ‘రెడ్ కార్డు’ జారీ చేయవచ్చు. -
రికార్డు ‘బ్రేక్’
ఏ క్రీడలో అయినా... రికార్డులు ఉండేది బద్దలు కావడానికే. అసాధ్యం అనుకున్న రికార్డులు సైతం అద్భుత ప్రదర్శన ముందు తలవంచాల్సిందే. ఇటీవల పురుషుల మారథాన్లో కెన్యా అథ్లెట్ సెబాస్టియన్ సావీ కూడా ఇలాంటి అద్భుతాన్ని ఆవిష్కరించాడు. ప్రతిష్టాత్మక లండన్ మారథాన్లో ఈ కెన్యా అథ్లెట్... 1 గంట 59 నిమిషాల 30 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఇప్పటి వరకు మారథాన్ను రెండు గంటల లోపు ఎవరూ పూర్తి చేయలేకపోగా... ఆ ఘనత సాధించిన తొలి అథ్లెట్గా సెబాస్టియన్ సావీ చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. వేర్వేరు క్రీడాంశాల్లో ఇలాంటి మరికొన్ని రికార్డులను ఓసారి పరిశీలిస్తే... సాహో... సెబాస్టియన్ మారథాన్లో కెన్యా రన్నర్లకు తిరుగులేదని సెబాస్టియన్ సావీ మరోసారి నిరూపించాడు. ఈ నెల 26న లండన్ మారరథాన్లో అతడు 42.195 కిలోమీటర్ల దూరాన్ని 1 గంట 59 నిమిషాల 30 సెకన్లలోనే చేరుకొని రికార్డు నెలకొల్పాడు. 2023లో కెన్యాకే చెందిన కెలి్వన్ కిప్టుమ్ 2 గంటల 35 సెకన్లలో మారథాన్ రేసును పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించగా... తాజాగా సెబాస్టియన్ దీన్ని సవరించాడు. భారత్ విషయానికి వస్తే... సావన్ భర్వాల్ ఇటీవల 48 ఏళ్ల జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ నెల 12 రోటెర్డామ్ మారథాన్ను సావన్ 2 గంటల 11 నిమిషాల 58 సెకన్లలో పూర్తి చేశాడు. దీంతో దిగ్గజ అథ్లెట్ శివనాథ్ సింగ్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు బద్దలైంది. 1978లో శివనాథ్ సింగ్ 2 గంటల 12 నిమిషాల్లో గమ్యాన్ని చేరగా... ఇప్పుడు రెండు సెకన్ల తేడాతో సావన్ నేషనల్ రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. 15సార్లు రికార్డు బద్దలు... పురుషుల పోల్వాల్ట్లో స్వీడన్కు చెందిన అర్మాండ్ డుప్లాంటిస్ రికార్డు స్థాయిలో ఏకంగా 15 సార్లు ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. ఈ విభాగంలో ప్రస్తుతం 6.31 మీటర్ల ఎత్తు దూకి డుప్లాంటిస్ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసుకున్నాడు. 2020 నుంచి డుప్లాంటిస్ ఈ రికార్డును తిరగరాస్తూ వస్తున్నాడు. అయితే అంతకుముందు ఉక్రెయిన్కు చెందిన సెర్గీ బుబ్కా 1993లో నమోదు చేసిన రికార్డు (6.15 మీటర్లు) 21 ఏళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉంది. 2014లో దాన్ని ఫ్రాన్స్కు చెందిన రెనాడ్ లావిలెనీ (6.16 మీటర్లు) బ్రేక్ చేయగా... ఆ తర్వాత నుంచి డుప్లాంటిస్ జోరు కొనసాగిస్తున్నాడు.41 ఏళ్ల తర్వాత... మహిళల 400 మీటర్ల పరుగులో నెదర్లాండ్స్కు చెందిన ఫెమ్కే బోల్ 41 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. 2023, ఫిబ్రవరి 19న జరిగిన పోటీల్లో బోల్ 400 మీటర్ల దూరాన్ని 49.26 సెకన్లలో పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. అంతకుముందు 1982లో చెకోస్లోవేకియాకు చెందిన జర్మిలా క్రాటోచ్విలోవా 49.59 సెకన్లతో రికార్డు సృష్టించగా... నాలుగు దశాబ్దాల తర్వాత నెదర్లాండ్స్ అథ్లెట్ దీన్ని బద్దలు కొట్టింది.35 ఏళ్లుగా పదిలంగా... పురుషుల లాంగ్జంప్లో 23 ఏళ్లుగా నిలిచి ఉన్న ప్రపంచ రికార్డును అమెరికా అథ్లెట్ 1991లో బద్దలు కొట్టగా... అప్పటి నుంచి ఈ రికార్డు అతడి పేరిటే ఉంది. అమెరికాకు చెందిన మైక్ పావెల్ 1991 ఆగస్టు 30న వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో 8.95 మీటర్ల దూరం దూకి ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతకుముదు ఈ ఘనత అమెరికాకే చెందిన బాబ్ బీమన్ పేరిట ఉంది. బాబ్ 1968లో 8.90 మీటర్ల దూరం లంఘించాడు.కెన్యా అథ్లెట్లదే హవా...మహిళల మారథాన్లో బ్రిటన్ రన్నర్ పౌలా రాడ్క్లిఫ్ నెలకొల్పిన రికార్డు 16 ఏళ్ల పాటు పదిలంగా కొనసాగింది. 2003లో రాడ్క్లిఫ్ 42.195 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల 15 నిమిషాల 56 సెకన్లలో పూర్తి చేయగా... 2019లో కెన్యా అథ్లెట్ బ్రిగిడ్ కొస్గెయ్ 2 గంటల 14 నిమిషాల 4 సెకన్లలో గమ్యాన్ని చేరి రికార్డు బ్రేక్ చేసింది. ఈ విభాగంలో ప్రస్తుతం కెన్యాకే చెందిన రుత్ చెప్గెటిచ్ (2 గంటల 9 నిమిషాల 56 సెకన్లు) పేరిట ఈ రికార్డు ఉంది. గ్యారీ సోబర్స్ పేరిట 36 ఏళ్లు... టెస్టు క్రికెట్లో ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు సుదీర్ఘ కాలం వెస్టిండీస్ దిగ్గజం గ్యారీ సోబర్స్ పేరిటే ఉంది. 1958లో పాకిస్తాన్తో మ్యాచ్లో సోబర్స్ 365 పరుగులు చేశాడు. 36 ఏళ్ల తర్వాత 1994లో ఈ రికార్డును విండీస్కే చెందిన బ్రియాన్ లారా ఇంగ్లండ్తో మ్యాచ్లో 375 పరుగులతో సవరించాడు. ఆ తర్వాత 2003లో ఆ్రస్టేలియా ప్లేయర్ మాథ్యూ హెడెన్ జింబాబ్వేపై 380 పరుగులతో లారా రికార్డును బ్రేక్ చేయగా... 2004లో లారా మరోసారి ఇంగ్లండ్పై 400 పరుగులు చేసి తిరిగి ఆ రికార్డును తన పేరిట మార్చుకున్నాడు. అప్పటి నుంచి ఈ ఘనత లారా పేరిటే కొనసాగుతోంది. → నాలుగేళ్ల క్రితం భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు థామస్ కప్ గెలుచుకుంది. 73 ఏళ్ల ఈ టోర్నమెంట్ చరిత్రలో భారత జట్టు థామస్ కప్ గెలవడం అదే మొదటిసారి. → ఇటీవల ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో ఫైనల్కు చేరడం ద్వారా భారత యువ షట్లర్ ఆయుశ్ శెట్టి 61 ఏళ్ల రికార్డును తిరగరాశాడు. చివరిసారిగా భారత్ నుంచి 1965లో దినేశ్ ఖన్నా ఈ టోర్నమెంట్లో ఫైనల్ ఆడారు. → భారత బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి 2023లో ఆసియా చాంపియన్షిప్లో స్వర్ణం గెలుచుకున్నారు. ఈ టోర్నీ చరిత్రలో డబుల్స్ విభాగంలో భారత్కు ఇదే తొలి పసిడి పతకం కాగా... ఓవరాల్గా 1965లో దినేశ్ ఖన్నా తర్వాత 58 ఏళ్లకు మరోసారి భారత్కు ఈ టోర్నమెంట్లో బంగారు పతకం లభించింది. → ఆంధ్రప్రదేశ్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ 2018 ఏప్రిల్లో ప్రపంచ నంబర్వన్ ర్యాంక్ అందుకున్నాడు. 1980లో మన దేశం నుంచి చివరిసారిగా ప్రకాశ్ పదుకోన్ ఈ ఘనత సాధించగా... 38 ఏళ్ల తర్వాత శ్రీకాంత్ దానిని పునరావృతం చేశాడు. → 2019 బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్షిప్లో కాంస్యం గెలుచుకోవడం ద్వారా సాయిప్రణీత్ 36 ఏళ్ల రికార్డు బ్రేక్ చేశాడు. 1983లో భారత్ నుంచి చివరిసారిగా ప్రకాశ్ పదుకోన్ ఈ టోర్నమెంట్లో పతకం గెలిచాడు. సాయిప్రణీత్ తర్వాత భారత్ నుంచి 2021లో కిడాంబి శ్రీకాంత్ రజతం... లక్ష్య సేన్ కాంస్యం... 2023లో ప్రణయ్ కాంస్యం సాధించారు. → బ్యాడ్మింటన్ మహిళల విభాగంలో ప్రపంచ చాంపియన్గా నిలిచిన తొలి భారత ప్లేయర్గా పీవీ సింధు రికార్డు సృష్టించింది. 2019లో సింధు ఈ ఘనత అందుకుంది. వరుస ఒలింపిక్స్లో (2016లో రజతం; 2020లో కాంస్యం) పతకాలు సాధించిన తొలి భారత మహిళా ప్లేయర్గానూ సింధు చరిత్రకెక్కింది.మరికొన్ని... బ్యాడ్మింటన్లో ఇలాంటి రికార్డులు చాలా ఉన్నాయి. భారత్ తరఫున తొలిసారి ప్రకాశ్ పదుకోన్ 1980లో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్ సాధించగా... 21 ఏళ్ల తర్వాత పుల్లెల గోపీచంద్ ఈ రికార్డును బద్దలు కొట్టాడు. ఆ తర్వాత మరే భారత షట్లర్ ఆల్ ఇంగ్లండ్ టోర్నమెంట్లో విజేతగా నిలవలేకపోయాడు. –సాక్షి క్రీడావిభాగం -
శభాష్ సౌరవ్
కార్లో (ఐర్లాండ్): భారత ప్లేయర్ సౌరవ్ కొఠారి సంచలనం సృష్టించాడు. వరుసగా రెండో ఏడాది ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్షిప్ (టైమ్ ఫార్మాట్)లో టైటిల్ సాధించాడు. బుధవారం జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ సౌరవ్ కొఠారి 1133–477 పాయింట్ల తేడాతో భారత్కే చెందిన 19 సార్లు ప్రపంచ చాంపియన్ పంకజ్ అద్వానీపై గెలుపొందాడు. నిరీ్ణత మూడు గంటలపాటు జరిగిన ఫైనల్లో సౌరవ్ ఏ దశలోనూ పంకజ్కు అవకాశం ఇవ్వలేదు. విజేతగా నిలిచిన సౌరవ్ కొఠారికి 5,000 డాలర్లు (రూ. 4 లక్షల 74 వేలు), రన్నరప్ పంకజ్కు 2,500 డాలర్లు (రూ. 2 లక్షల 37 వేలు) ప్రైజ్మనీగా లభించాయి. గత ఏడాది ఇదే వేదికపై జరిగిన ప్రపంచ చాంపియన్షిప్లో సౌరవ్ 725–480 పాయింట్ల తేడాతో పంకజ్ అద్వానీనే ఓడించడం గమనార్హం. ‘మా నాన్న కోసం ఈ టైటిల్ సాధించాలని అనుకున్నాను. ఈ ఏడాది ఆరంభంలో మా నాన్న కన్నుమూశారు. ఈ విజయం మా నాన్నకే అంకితం’ అని విజయానంతరం 41 ఏళ్ల సౌరవ్ వ్యాఖ్యానించాడు. -
ముగిసిన వేలం.. తెలంగాణ ప్లేయర్కు చోటు.. జట్ల వివరాలివే!
ముంబై: అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) 7వ సీజన్ వేలం మంగళవారం ఘనంగా ముగిసింది. వేలంలో తెలంగాణ ఆటగాడు సూరావజ్జుల స్నేహిత్ను పుణే జాగ్వార్స్ జట్టు సొంతం చేసుకుంది. మహిళా ప్యాడ్లర్ దియా చిటాలే వేలంలో అత్యధిక విలువ పలికిన భారత ప్లేయర్గా నిలిచింది. దియాను కూడా పుణే జట్టు తీసుకుంది. ఇతర భారత స్టార్ ఆటగాళ్లలో మనుశ్ షాను ముంబై, మానవ్ ఠక్కర్ను యూపీ, మనిక బత్రాను అహ్మదాబాద్ టీమ్లు ఎంపిక చేసుకున్నాయి. యూటీటీ టోర్నీలో మొత్తం 7 జట్లు పాల్గొంటుండగా... సింగిల్ రౌండ్ రాబిన్ లీగ్ ఫార్మాట్లో ప్రతీ జట్టు మరో జట్టులో ఒక్కో సారి తలపడుతుంది. టాప్–4 టీమ్లు నాకౌట్ దశకు అర్హత సాధిస్తాయి. జూలై 9 నుంచి 26 వరకు గోవాలో టోర్నమెంట్ నిర్వహిస్తారు. గత సీజన్లో జైపూర్ పేట్రియాట్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన భారత నంబర్వన్, తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజ ఈసారి బరిలోకి దిగడం లేదు. వెన్ను నొప్పి గాయంతో ఆమె బాధపడుతోంది.జట్ల వివరాలు: అహ్మదాబాద్ పైపర్స్: మనిక బత్రా, కావ్య భట్, సానిల్ శెట్టి, పాయస్ జైన్, సోఫియా పల్కనొవా, ఏడ్రియన్ రసెన్ఫోస్. దబంగ్ ఢిల్లీ: సత్యన్ జ్ఞానశేఖరన్, దివ్యాంశి భౌమిక్, సుతీర్ఖ ముఖర్జీ, మారియా గ్జియో, యూసుఫ్ అబ్దుల్ అజీజ్, రీగన్ ఆల్బర్క్యూ. గోవా చాలెంజర్స్: దివ్యాంశ్ శ్రీవాత్సవ, అనన్య చండే, పీబీ అభినంద్, బెర్నడ్ జాక్స్, సిండ్రెలాడాస్, అల్వరో రాబుల్స్. కోల్కతా థండర్ బ్లేడ్స్: అంకుర్, ఐహిక ముఖర్జీ, జీత్ చంద్ర, తనీషా కొటెచా, ఎడ్వర్డ్ లోనెస్కూ, జెంగ్ జియాన్. పుణే జాగ్వార్స్: దియా చిటాలే, స్నేహిత్, ముదిత్ దాని, సయానిక మాజీ, ప్రీతిక పావడే, ఉమర్ అస్సార్. యు ముంబా: మనుశ్ షా, ఆకాశ్ పాల్, నిత్యశ్రీ మణి, అనూష కుటుంబలే, అనా హర్సీ, బార్డెట్ యూపీ ప్రొమిథెయన్స్: మానవ్ ఠక్కర్, సయాలీ వానీ, సుధాంశు, స్వస్తిక ఘోష్, యాంగ్జీ ల్యూ, రికార్డో వాల్తర్. -
గర్భధారణ చికిత్సలో భాగంగానే వాడాను!.. తప్పని నిషేధం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ నలుబోతు షణ్ముగ శ్రీనివాస్పై జాతీయ డోపింగ్ వ్యతిరేక సంస్థ (నాడా) తీవ్ర చర్యలు తీసుకుంది. శ్రీనివాస్పై నాలుగేళ్ల నిషేధం విధిస్తున్నట్లు ‘నాడా’ ప్రకటించింది. నిబంధనల ప్రకారం డోపింగ్ పరీక్షకు హాజరు కావాల్సిన ఏపీ అథ్లెట్ దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడంతో నిషేధానికి గురయ్యాడు. ‘పరీక్షల కోసం శాంపిల్స్ ఇవ్వకుండా తప్పించుకోవడం, తిరస్కరించడం, విఫలం కావడం’ శ్రీనివాస్ను నిషేధించడానికి కారణమని డోపింగ్ వ్యతిరేక క్రమశిక్షణా సంఘం (ఏడీడీపీ) స్పష్టం చేసింది. విజయవాడకు చెందిన 24 ఏళ్ల శ్రీనివాస్ 100 మీటర్ల, 200 మీటర్ల స్ప్రింట్ విభాగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు గెలుచుకున్నాడు.భారత జూనియర్ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ వద్ద శ్రీనివాస్ శిక్షణ పొందాడు. పరీక్షకు హాజరు కాకుండా సహకరించాడంటూ కోచ్ రమేశ్పై కూడా ‘నాడా’ గతంలోనే తాత్కాలిక సస్పెన్షన్ విధించగా... అప్పీల్ ప్యానెల్ ఇటీవలే ఆ నిషేధాన్ని తొలగించింది. గర్భధారణ చికిత్సలో భాగంగానే వాడానుమరోవైపు.. మహిళా అథ్లెట్ వీసీ విస్మయపై కూడా రెండేళ్ల నిషేధం పడింది. కేరళకు చెందిన విస్మయ 2018 జకార్తా ఆసియా క్రీడల 4*400 రిలే పోటీల్లో స్వర్ణం సాధించిన భారత జట్టులో సభ్యురాలిగా ఉంది. దాదాపు రెండేళ్ల క్రితం ఆమె నుంచి తీసుకున్న శాంపిల్స్లో డోపింగ్కు పాల్పడినట్లుగా తేలింది. నిషేధిక ఉత్ప్రేరకం క్లోమీఫీన్ తీసుకున్నట్లుగా బయపడింది. దీనిని సవాల్ చేస్తూ విస్మయ తన గర్భధారణ చికిత్సలో భాగంగా క్లోమీఫీన్ను వాడినట్లు, ఇది ఉత్ప్రేరకం కాదని వివరణ ఇచ్చింది. ‘నాడా’ మాత్రం ఆమె సమాధానంతో సంతృప్తి చెందకుండా రెండేళ్ల నిషేధం విధించింది. అయితే అక్టోబర్, 2024 నుంచే ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించింది. దాంతో మరో ఆరు నెలల్లో విస్మయ నిషేధం పూర్తవుతుంది. -
లీగ్ దశలోనే భారత్ అవుట్
హోర్సెన్స్ (డెన్మార్క్): ఉబెర్ కప్ మహిళల బ్యాడ్మింట్ టీమ్ టోర్నీలో ఈసారి భారత జట్టుకు నిరాశ ఎదురైంది. గత మూడు పర్యాయాల్లో నాకౌట్ దశకు అర్హత పొందిన టీమిండియా ఈసారి మాత్రం లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. క్వార్టర్ ఫైనల్ చేరాలంటే 16 సార్లు చాంపియన్ చైనా జట్టుపై కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో భారత జట్టు 0–5తో పరాజయం పాలైంది.గ్రూప్ ‘ఎ’లో ఆడిన మూడు మ్యాచ్ల్లో నెగ్గిన చైనా... భారత్, ఉక్రెయిన్ జట్లపై గెలిచిన డెన్మార్క్ క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించాయి. చైనాతో జరిగిన పోరులో తొలి మ్యాచ్లో పీవీ సింధు 78 నిమిషాల్లో 16–21, 21–19, 19–21తో ప్రపంచ రెండో ర్యాంకర్ వాంగ్ జి యి చేతిలో పోరాడి ఓడిపోయింది. నిర్ణాయక మూడో గేమ్లో సింధు ఒకదశలో 18–12తో ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత సింధు ఒక పాయింటే నెగ్గగా... వాంగ్ జి యి తొమ్మిది పాయింట్లు గెలిచి విజయాన్ని సొంతం చేసుకుంది. రెండో మ్యాచ్లో ప్రియ–శ్రుతి మిశ్రా 11–21, 8–21తో లియు షెంగ్ షు–టాన్ నింగ్ చేతిలో ఓడిపోయారు.మూడో మ్యాచ్లో ఇషారాణి బారువా 20–22, 13–21తో చెన్ యుఫె చేతిలో... నాలుగో మ్యాచ్లో తనీషా క్రాస్టో–సెల్వం కవిప్రియ 21–10, 12–21, 19–21తో లువో జు మిన్–జాంగ్ షు జియాన్ చేతిలో... ఐదో మ్యాచ్లో దేవిక సిహాగ్ 21–19, 17–21, 10–21తో జు వెన్ జింగ్ చేతిలో పరాజయం పాలయ్యారు. 2014, 2016 ఉబెర్ కప్ టోరీ్నల్లో సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలు గెలిచిన భారత జట్టు... 2018లో లీగ్ దశలోనే వెనుదిరిగింది. ఆ తర్వాత 2020, 2022, 2024లలో క్వార్టర్ ఫైనల్లో పరాజయం పాలైంది. -
బేసి సంవత్సరాల్లో ఆసియా క్రీడలు!
న్యూఢిల్లీ: నాలుగేళ్లకోసారి జరిగే ఆసియా క్రీడల నిర్వహణలో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్ వేదికగా ఏషియన్ గేమ్స్ జరగనుండగా... ఇక తదుపరి క్రీడలను ఐదేళ్ల తర్వాత నిర్వహించనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు 2014, 2018, 2022, 2026 ఇలా సరి సంఖ్య సంవత్సరాల్లో ఈ క్రీడలు నిర్వహిస్తుండగా... 2026 ఏషియన్ గేమ్స్ ముగిసిన అనంతరం బేసి సంఖ్య సంవత్సరంలో ఈ పోటీలు జరిపే దిశగా నిర్వాహకులు చర్యలు జరుపుతున్నారు. దీంతో ఒలింపిక్ క్రీడలకు ముందు ఇవి అర్హత పోటీలుగా ఉపయోగపడనున్నాయి. ప్రస్తుతం చైనాలో ఆసియా బీచ్ గేమ్స్ జరుగుతుండగా... ఈ సందర్భంగా ఆసియా ఒలింపిక్స్ కౌన్సిల్ (ఓసీఏ) కార్యవర్గం ఈ అంశంపై చర్చించింది. ప్రస్తుతం 2020, 2024, 2028, 2032 ఇలా సరి సంఖ్య సంవత్సరాల్లో ఒలింపిక్స్ జరుగుతుండగా... ఆసియా క్రీడలను బేసి సంఖ్యకు మార్చితే విశ్వక్రీడలకు ఒక్క ఏడాది ముందు వాటిని నిర్వహించే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది ఏషియన్ గేమ్స్ ముగిసిన అనంతరం 2030లో ఖతర్లోని దోహాలో ఈ క్రీడలు జరగాల్సి ఉంది. కానీ వాటిని ఒక ఏడాది వాయిదా వేసి 2031లో నిర్వహించే దిశగా అడుగులు పడుతున్నాయి. ‘ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ ఈ అంశంపై చర్చిస్తోంది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆసియా క్రీడల నిర్వహణ చేపడుతూనే ప్రేక్షకాదరణ, స్పాన్సర్షిప్ విలువ పెంచే దిశగా చర్చిస్తున్నారు. ఇది కార్యరూపం దాల్చితే ఖతర్లోని దోహాలో జరగాల్సిన 2030 ఆసియా క్రీడలు 2031కి వాయిదా పడతాయి. ఇదే జరిగితే ప్రతిష్టాత్మక ఒలింపిక్స్కు ముందు ఇవి అర్హత క్రీడలుగానూ ఉపయోగపడతాయి. దీంతో అన్నీ దేశాల అథ్లెట్లు ఇందులో పాల్గొనడానికి ఆసక్తి చూపుతారు. తద్వారా క్రీడలకు మరింత ఆదరణ పెరుగుతుంది’ అని అంతర్జాతీయ క్రీడా నిపుణుల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. -
ఫెలిక్స్ మళ్లీ వస్తోంది
లాస్ ఏంజెలిస్: ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్లో అత్యధిక పతకాలు సాధించిన మహిళా అథ్లెట్గా రికార్డు సృష్టించిన అలీసన్ ఫెలిక్స్ విశ్వక్రీడల్లో పునరాగమనం చేయనుంది. నాలుగేళ్ల క్రితమే ట్రాక్కు టాటా చెప్పి తల్లి అయిన ఫెలిక్స్... మరో రెండేళ్లలో అమెరికా వేదికగా జరగనున్న ఒలింపిక్స్లో పాల్గొనాలని భావిస్తోంది. 2004 ఎథెన్స్ ఒలింపిక్స్ నుంచి మొదలుకొని 2020 టోక్యో ఒలింపిక్స్ వరకు తన హవా కొనసాగించిన ఈ అమెరికా స్టార్... 2022లో కెరీర్కు వీడ్కోలు పలికింది. అయితే 40 ఏళ్ల వయసులో మాతృత్వపు మాధుర్యాన్ని అనుభవించిన తర్వాత తిరిగి ట్రాక్పై పరుగు తీయాలని నిర్ణయించుకుంది.ఇప్పటి వరకు ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్లో 11 పతకాలు (7 స్వర్ణాలు, 3 రజతాలు, 1 కాంస్యం) సాధించిన ఫెలిక్స్... ఒలింపిక్స్లో అత్యధిక పతకాలు సాధించిన మహిళా రన్నర్గా రికార్డు సృష్టించింది. 2012 లండన్ ఒలింపిక్స్ మహిళల 200 మీటర్ల విభాగంలో పసిడి గెలిచిన ఫెలిక్స్... మిగిలిన ఆరు స్వర్ణాలను రిలేలో సాధించింది. 2004 ఎథెన్స్ ఒలింపిక్స్ 200 మీటర్ల వ్యక్తిగత విభాగంలో రజతం సాధించడంతో ప్రారంభమైన ఆమె జోరు... 2020 టోక్యో ఒలింపిక్స్ వరకు సాగింది. ట్రాక్పై అడుగు పెడితే తిరుగు లేకుండా దూసుకెళ్లే ఫెలిక్స్ వరల్డ్ చాంపియన్షిప్స్లో 20 పతకాలు (14 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలు) చేజిక్కించుకుంది.ఇప్పటి వరకు ఐదు ఒలింపిక్స్లో పాల్గొన్న ఈ అమెరికా అథ్లెట్... 2028లో లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ నిర్వహణ కమిటీలో సభ్యురాలిగానూ కొనసాగుతోంది. సొంతగడ్డపై విశ్వక్రీడలు జరుగుతుండటంతో చివరి ప్రయత్నం చేయాలనుకుంటున్నట్లు ఆమె వెల్లడించింది. ‘సాహసోపేతమైన పనులు చేయొద్దని మనం చాలా మందికి చెబుతుంటాం.ఈ వయసులో నేను ఇంట్లోనే ఉండి పిల్లల ఆలనా పాలనా చూసుకోవాలి. కానీ అలాగే ఎందుకు చేయాలి. దీన్ని ఎందుకు మార్చకూడదు. లక్ష్యాన్ని చేరేందుకు మరోసారి ఎందుకు ప్రయత్నించకూడదు. ఫలితం ఎలా వచ్చినా నేను నా పిల్లలతోనే ఉంటాను. వాళ్లతో కలిసి సరదాగా గడుపుతూ అందరినీ ప్రోత్సహిస్తూ ఉంటాను. కానీ స్వదేశంలో జరిగిన ప్రధాన పోటీల్లో పాల్గొనలేకపోయాను అనే భావన మాత్రం ఉండదు కదా’ అని ఫెలిక్స్ వివరించింది. -
భారత్కు తప్పని చైనా గండం!
ప్రతిష్ఠాత్మక ఉబెర్ కప్లో భారత్ ఆట ముగిసింది. భారత మహిళల నంబర్వన్ షట్లర్ పీవీ సింధు చైనా గండాన్ని దాటి ముందుకెళ్లలేక చతికిలపడింది. విషయంలోకి వెళితే ఉబెర్ కప్లో భాగంగా గ్రూప్-ఏలో ఉన్న భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్లో చైనాతో తలపడింది. అయితే చైనా చేతిలో 5-0తో పరాజయం చవిచూసిన భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే నిర్ణయాత్మక సింగిల్స్ మ్యాచ్లో సింధు 16-21, 21-19, 19-21తో వాంగ్ జియి చేతిలో ఓటమి చవిచూసింది. దీంతో డబుల్స్లో తప్పక గెలవాల్సిన స్థితిలో ప్రియా కొన్జెంగమ్-శ్రుతి మిశ్రా జంట చైనా జంట చేతిలో ఓటమిపాలైంది. ఆ తర్వాత మరో డబుల్స్లో ట్రిసా జాలీ-కవిప్రియ సెల్వమ్ జోడి కూడా ఓటమి పాలవ్వడంతో భారత్ ఓటమి ఖరారైంది. ఈ నేపథ్యంలో రివర్స్ సింగిల్స్లో ఇషారాణి బరుహా తొలి గేమ్ను గెలిచినప్పటికీ ఆ తర్వాత వరుసగా రెండు గేముల్లో ఓటమిపాలైంది. ఇక థామస్ కప్లో భాగంగా పరుషుల విభాగంలో భారత జట్టు బుధవారం చైనాతో తలపడనుంది.చదవండి: పట్టించుకోని కోహ్లి.. కంటతడి పెట్టిన బుడ్డోడు! -
ఆసియా టోర్నీ నుంచి వైదొలిగిన భారత స్టార్
న్యూఢిల్లీ: స్వదేశంలో జరగనున్న ఆసియా సీనియర్ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో భారత స్టార్ వెయిట్లిఫ్టర్ మీరాబాయి చాను (48 కేజీలు) బరిలోకి దిగడం లేదు. భుజం గాయం నుంచి ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోకపోవడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మే 10 నుంచి 17వ తేదీ జరిగే ఈ మెగా ఈవెంట్కు గుజరాత్ రాజధాని గాంధీనగర్ ఆతిథ్యమివ్వనుంది. వాస్తవానికి ఆసియా చాంపియన్షిప్ ఏప్రిల్ 1 నుంచి 10వ తేదీ వరకు జరగాల్సింది. అయితే పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఈ ఈవెంట్ తేదీల్లో మార్పులు చేశారు. మీరాబాయి స్థానాన్ని కోమల్ కొహర్ భర్తీ చేసే అవకాశముంది. 2020 టోక్యో ఒలింపిక్స్లో రజత పతకం గెలిచిన మీరాబాయి...గత ఫిబ్రవరిలో జరిగిన జాతీయ చాంపియన్షిప్ సందర్భంగా గాయపడింది. జాతీయ చాంపియన్షిప్లో మీరాబాయి 48 కేజీల విభాగంలో 205 కేజీలు బరువెత్తి స్వర్ణ పతకం సాధించింది. ‘జాతీయ చాంపియన్షిప్లో మీరాబాయి భుజానికి గాయమైంది. ఈ గాయం నుంచి ఆమె ఇంకా కోలుకోలేదు. ఈ ఏడాది కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్షిప్ ఈవెంట్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పూర్తి ఫిట్గా లేకుండానే ఆసియా చాంపియన్షిప్లో బరిలోకి దిగి రిస్క్ తీసుకోవద్దని ఆమె భావిస్తోంది’ అని మీరాబాయి శిక్షణ బృందం వివరించింది. 👉2014 కామన్వెల్త్ గేమ్స్లో రజతం నెగ్గిన ఈ మణిపూర్ లిఫ్టర్... 2018, 2022 కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణ పతకాలు సొంతం చేసుకుంది. ఈసారీ పసిడి పతకం గెలిస్తే ఆమె ‘హ్యాట్రిక్’ సాధిస్తుంది. కామన్వెల్త్ గేమ్స్ జూలై 23 నుంచి ఆగస్టు 2 వరకు స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరగనున్నాయి. కామన్వెల్త్ గేమ్స్లో మీరాబాయి 48 కేజీల విభాగంలో పోటీపడుతుంది. 👉ఆసియా క్రీడలు ఈ ఏడాది సెప్టెంబరు 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్లోని ఐచి–నగోయాలలో జరుగుతాయి. 2022 ఆసియా క్రీడల్లో మీరాబాయి నాలుగో స్థానంలో నిలిచింది. మీరాబాయి కెరీర్లో ఆసియా క్రీడల పతకమే లోటుగా ఉంది. ఆసియా క్రీడల్లో మీరాబాయి 53 కేజీల విభాగంలో బరిలోకి దిగుతుంది. 👉కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల తర్వాత అక్టోబర్ 27 నుంచి నవంబర్ 8 వరకు చైనాలోని నింగ్బోలో ప్రపంచ చాంపియన్షిప్ జరగనుంది. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో మీరాబాయి మూడు పతకాలు గెలిచింది. 👉2017లో స్వర్ణం గెలిచిన ఆమె... 2022లో రజతం, 2025లో రజతం సాధించింది. లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీల్లో ప్రపంచ చాంపియన్షిప్ కూడా ఉంది. అంతర్జాతీయ వెయిట్లిఫ్టింగ్ సమాఖ్య ఇటీవల వెయిట్ కేటగిరీల్లో మార్పులు చేసింది. మీరాబాయి 48 కేజీల విభాగాన్ని తొలగించి ఆ స్థానంలో 53 కేజీల విభాగాన్ని చేర్చారు. -
‘ఎందుకీ డబుల్ గేమ్?’.. వినేశ్పై డబ్ల్యూఎఫ్ఐ ఆగ్రహం
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ సంచలన వ్యాఖ్యలు చేసింది. రెజ్లింగ్లోకి రీఎంట్రీ ఇవ్వకుండా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) తనను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటుందని పేర్కొంది. మీడియా ప్రతినిధులతో వినేశ్ ఫొగాట్ మాట్లాడుతూ.. ‘నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్లో పునరాగమనం చేయాలని ఆశిస్తున్నాను. రిజిస్ట్రేషన్ గడువు ఏప్రిల్ 30 వరకు ఉంది. అయితే నేను రిజిస్టర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే, గడువు ముగిసినట్లు పోర్టల్లో చూపిస్తోంది. ఈ విషయాన్ని డబ్ల్యూఎఫ్ఐ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్తో మాట్లాడేందుకు ప్రయత్నించాను. కానీ వారు నా ఫోన్కాల్కు రెస్పాండ్ అవ్వడం లేదు. నేను టోర్నీలో పాల్గొనాలని చూస్తుంటే ఫెడరేషన్ మాత్రం నన్ను ఉద్దేశపూర్వకంగానే రెజ్లింగ్లో రీఎంట్రీ ఇవ్వకుండా అడ్డుకుంటున్నట్లుగా అనిపిస్తోంది. ఫెడరేషన్ కప్లో పాల్గొందామంటే అక్కడ నిబంధనలు పూర్తిగా మార్చేశారు. ఇలా ప్రతి అంశంలోనూ డబ్ల్యూఎఫ్ఐ అడ్డుపడుతూనే వస్తోంది. ఏషియన్ గేమ్స్, ప్రపంచ చాంపియన్షిప్ వంటి సెలెక్షన్ ట్రయల్స్లో పోటీలో ఉండాలంటే ఈ టోర్నమెంట్ నాకు ఎంతో కీలకం.’ అని వినేశ్ ఆరోపించారు. వినేశ్ రిజిస్ట్రేషన్ చేసుకుంది: సంజయ్అయితే వినేశ్ ఆరోపణలపై డబ్ల్యూఎఫ్ఐ ప్రెసిడెంట్ సంజయ్ సింగ్ స్పందించారు. వినేశ్ ఫొగాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న ఫొటో స్క్రీన్షాట్ను సంజయ్ సింగ్ పంచుకున్నారు. ‘వినేశ్ లాగే చాలా మంది రెజ్లర్లు మొదట ఇదే సమస్యను ఎదుర్కొన్నారు. అయితే వారు మా స్టాఫ్తో మాట్లాడి సమస్యను పరిష్కరించుకున్నారు. ఇప్పటివరకు దాదాపు 800 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఒక్కరికి కూడా ఎలాంటి సమస్య రాలేదు. అయినా టోర్నీలో పాల్గొనకుండా తాము ఎవరిని అడ్డుకోవడం లేదు. వినేశ్ ఇప్పటికే తన రిజిస్ట్రేషన్ను పూర్తి చేసుకున్నారు. కానీ దీనిపై ఎందుకింత రాద్దాంతం చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. మీడియాతో మాట్లాడే బదులు ఆమె రెజ్లింగ్పై దృష్టి సారిస్తే బాగుంటుంది.’ అని ఘాటుగా వ్యాఖ్యానించాడు. ఇక ఏషియన్ గేమ్స్ సెప్టెంబర్లో, ఆ తర్వాత అక్టోబర్లో వరల్డ్ చాంపియన్షిప్ పోటీలు జరగనున్నాయి.2024 పారిస్ ఒలింపిక్స్లో బరువు ఎక్కువ ఉన్న కారణంగా వినేశ్ ఫొగాట్ పతకానికి అడుగుదూరంలో నిలిచిపోయింది. ఈ ఘటన తర్వాత వినేశ్ ఫొగాట్ అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించింది. అయితే గతేడాది డిసెంబర్లో తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్న వినేశ్ 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్లో పాల్గొంటానని ప్రకటించింది.చదవండి: ‘నన్ను రెచ్చగొట్టారు’.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు! -
వైభవ్ గురించి ఆమెను ఎందుకు అడిగారు?
క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం హాట్టాపిక్గా ఉన్న పేరు వైభవ్ సూర్యవంశీ. గతేడాది కాలంగా ఫార్మాట్లకు అతీతంగా పరుగుల వరద పారిస్తున్న ఈ పదిహేనేళ్ల పిల్లాడిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఐపీఎల్-2026లోనూ రాజస్తాన్ రాయల్స్ తరఫున ఈ లెఫ్టాండర్ బ్యాటర్ జోరు కొనసాగుతోంది.36 బంతుల్లోనే శతక్కొట్టి.. ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్లో మ్యాచ్లో వైభవ్ 36 బంతుల్లోనే శతక్కొట్టి.. విధ్వంసకర బ్యాటింగ్కు తాను పెట్టింది పేరని మరోసారి నిరూపించుకున్నాడు. ఈ నేపథ్యంలో దిగ్గజ క్రికెటర్లు సైతం అతడి ప్రతిభను కొనియాడుతూ కాబోయే సూపర్ స్టార్ అంటూ కితాబులిస్తున్నారు.వయసు అసలు లెక్కలోకే రాదుఈ నేపథ్యంలో ఒలింపిక్ పతకాల విజేత, భారత షూటర్ మనూ భాకర్కు ఓ కార్యక్రమం సందర్భంగా వైభవ్ సూర్యవంశీ గురించి ప్రశ్న ఎదురైంది. ఢిల్లీలో జరిగిన జాతీయ రైఫిల్ సమాఖ్య 75వ వార్షికోత్సవానికి హాజరైన ఆమె ఇందుకు బదులిస్తూ.. ‘‘అతడి చుట్టూ ఉన్న వాళ్లు.. మార్గదర్శనం చేసే వాళ్లు గొప్పగా ఉంటే.. వయసు అసలు లెక్కలోకే రాదు.అయినా ప్రతిభకు వయసుతో పనిలేదు. కొంతమంది అరవై ఏళ్లలో అద్భుతాలు చేస్తే.. మరికొందరికి ఆరేళ్లకే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి మన చుట్టూ ఉన్న వాళ్లు సరైన దారిలో నడిపిస్తే అనుకున్న లక్ష్యాలు చేరుకోవడం కాస్త సులువు అవుతుంది. టీమిండియా తదుపరి బిగ్ స్టార్ అతడే’’ అని పేర్కొంది.VIDEO | India's double Olympic medallist shooter Manu Bhaker says, “With the right mentorship, Vaibhav (Sooryavanshi) can be the next big star of Indian cricket.”(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/UZwA8iZwSk— Press Trust of India (@PTI_News) April 27, 2026ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. మనూ భాకర్ను ప్రశ్న అడిగిన విలేకరుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఐపీఎల్ జట్టు కోల్కతా నైట్ రైడర్స్ మాజీ టీమ్ డైరెక్టర్ జాయ్ భట్టాచార్య ఈ విషయంపై ఘాటుగా స్పందించాడు.ఆమె ఒలింపిక్ పతకాల విజేత‘‘ఆమె ఒలింపిక్ పతకాల విజేత. ఆమె క్రీడ, విజయాల గురించి కాకుండా వైభవ్ సూర్యవంశీ గురించి అడగడం ఎందుకు? మన దేశంలో క్రికెట్నే సర్వస్వంగా భావించేవాళ్లు ఉన్నారని తెలుసు. కానీ ఎక్కడ ఏ ప్రశ్న అడగాలో స్పోర్ట్స్ ఎడిటర్లకు తెలియదా?సూర్యవంశీ గురించి ఆమెను అడగాల్సిన అవసరం ఏముంది?.. హెడ్లైన్ కోసమే కదా ఇదంతా!.. ఒకవేళ మీరు వైభవ్ సూర్యవంశీని కలిస్తే అప్పుడు మనూ భాకర్ గురించి అడగండి. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి’’ అని భట్టాచార్య ఆగ్రహం వ్యక్తం చేశాడు.సిగ్గుపడండిమరికొందరు నెటిజన్లు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ‘‘యువ షూటర్ల గురించి దిగ్గజ క్రికెటర్లు ఎప్పుడైనా మాట్లాడారా? మరి మనూ భాకర్ వైభవ్ గురించి ఎందుకు మాట్లాడాలి? మీ ద్వంద్వ ప్రమాణాలకు సిగ్గుపడండి’’ అంటూ చురకలు అంటిస్తున్నారు. కాగా పారిస్ ఒలింపిక్స్లో మనూ భాకర్ రెండు పతకాలు గెలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. స్వతంత్ర భారత్లో ఒకే ఒలింపిక్స్లో రెండు పతకాలు సాధించిన తొలి ప్లేయర్గా ఆమె రికార్డు నెలకొల్పింది.చదవండి: సింధు కణతపై ‘టెంపుల్’.. స్పందించిన భర్త -
పీవీ సింధు కొత్త ప్రయాణం.. ఇకపై
హోర్సెన్స్ (డెన్మార్క్): భారత బ్యాడ్మింటన్ స్టార్, రెండు ఒలింపిక్ పతకాల విజేత పూసర్ల వెంకట (పీవీ) సింధుకు అరుదైన గౌరవం లభించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) కౌన్సిల్ సభ్యురాలిగా ఆమె కొత్త పాత్రలో కనిపించనుంది. నిజానికి గత ఏడాది డిసెంబర్లోనే బీడబ్ల్యూఎఫ్ అథ్లెటిక్స్ కమిషన్లోకి ఎంపిక కావడంతోనే సింధు అడుగులు ఈ వైపు పడ్డాయి. అయితే ఇప్పుడు బీడబ్ల్యూఎఫ్ కౌన్సిల్ సభ్యురాలిగా ఆమెకు అధికారికంగా గుర్తింపు లభించింది. అంతర్జాతీయ బ్యాడ్మింటన్లో ప్రస్తుతం చురుగ్గా ఆడుతూనే ఈ తరహాలో ఓటు హక్కుతో సహా పరిపాలన బృందంలో భాగం కావడం సింధు ఎంపికను ప్రత్యేకంగా మార్చింది. ఇక శనివారం జరిగిన బీడబ్ల్యూఎఫ్ వార్షిక సర్వసభ్య సమావేశంలో సింధు తన కొత్త హోదాలో పాల్గొనడం విశేషం. ప్లేయర్ల తరఫున ఆమె ప్రతినిధిగా వ్యవహరిస్తుంది. ఇకపై జరిగే బీడబ్ల్యూఎఫ్ అధికారిక సమావేశాలు, చర్చల్లో పాల్గొని సింధు షట్లర్ల తరఫున తగు సూచనలిస్తూ నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తుంది. ‘బీడబ్ల్యూఎఫ్లో ఇంత పెద్ద బాధ్యతను తీసుకొని ఆటగాళ్లను ప్రాతినిధ్యం వహించడం నాకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నా. బ్యాడ్మింటన్ నాకు ఎంతో ఇచ్చింది. నా వైపునుంచి ఆటకు ఉపయోగపడే అవకాశం రావడం అదృష్టం’ అని సింధు వ్యాఖ్యానించింది. -
లక్ష్యం నాకౌట్ బెర్త్
లండన్: రెండేళ్ల క్రితం సాధించిన ఫలితాన్ని పునరావృతం చేయాలనే పట్టుదలతో భారత పురుషుల, మహిళల టేబుల్ టెన్నిస్ (టీటీ) జట్లున్నాయి. నేటి నుంచి మొదలయ్యే ప్రతిష్టాత్మక ప్రపంచ టేబుల్ టెన్నిస్ టీమ్ చాంపియన్ష్ప్లో భారత జట్లు నాకౌట్ దశకు అర్హత సాధించడమే తొలి లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. మహిళల విభాగంలో భారత నంబర్వన్, ప్రపంచ 41వ ర్యాంకర్ ఆకుల శ్రీజ ఈ మెగా ఈవెంట్కు అందుబాటులో ఉండటం లేదు. ఈ నేపథ్యంలో భారత మహిళల జట్టు ఆశలన్నీ మరో స్టార్ ప్లేయర్ మనిక బత్రా (ప్రపంచ 49వ ర్యాంకర్)తోపాటు యశస్విని ఘోర్పడే (ప్రపంచ 88వ ర్యాంకర్), దియా చిటాలె (ప్రపంచ 92వ ర్యాంకర్), సుతీర్థ ముఖర్జీ (ప్రపంచ 120వ ర్యాంకర్), సిండ్రెల్లా దాస్ (ప్రపంచ 175వ ర్యాంకర్)లపై ఆధారపడి ఉన్నాయి. బెంగాల్కు చెందిన 16 ఏళ్ల సిండ్రెల్లా దాస్ ఈ మెగా ఈవెంట్కు భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న అతిపిన్న వయసు్కరాలిగా గుర్తింపు పొందనుంది. గ్రూప్–6లో ఉక్రెయిన్, ఉగాండా, రువాండా జట్లతో భారత్ ఆడనుంది. మంగళవారం జరిగే తొలి లీగ్ మ్యాచ్లో ఉగాండా జట్టుతో భారత్ తలపడుతుంది. అనంతరం బుధవారం ఉక్రెయిన్ జట్టుతో, గురువారం రువాండా జట్టుతో టీమిండియా పోటీపడుతుంది. నేరుగా నాకౌట్ దశకు అర్హత పొందాలంటే భారత్ గ్రూప్ ‘టాపర్’గా నిలవాల్సి ఉంటుంది. స్థాయికి తగ్గట్టు ఆడితే భారత జట్టుకు అంత కష్టమేమీ కాదు. మరోవైపు దిగ్గజం ఆచంట శరత్ కమల్ రిటైర్ కావడంతో... ఈసారి భారత పురుషుల జట్టు ఆశలన్నీ మానవ్ ఠక్కర్ (ప్రపంచ 38వ ర్యాంకర్), సత్యన్ జ్ఞానశేఖరన్ (ప్రపంచ 42వ ర్యాంకర్), మనుశ్ షా (ప్రపంచ 51వ ర్యాంకర్), హరీ్మత్ దేశాయ్ (ప్రపంచ 80వ ర్యాంకర్), పాయస్ జైన్ (ప్రపంచ 127వ ర్యాంకర్) ఆటతీరుపై ఆధారపడి ఉన్నాయి. గ్రూప్–7లో స్లొవేకియా, ట్యూనిషియా, గ్వాటెమాలా జట్లతో భారత్ పోటీపడుతుంది. మంగళవారం జరిగే తొలి లీగ్ మ్యాచ్లో ట్యూనిష్యాతో టీమిండియా ఆడుతుంది. అనంతరం బుధవారం స్లొవేకియా జట్టుతో, గురువారం గ్వాటెమాలా జట్టుతో భారత్ తలపడుతుంది. నేరుగా నాకౌట్ దశకు చేరాలంటే భారత్ గ్రూప్ ‘టాపర్’గా నిలవాలి. 2024 ప్రపంచ టీటీ టీమ్ చాంపియన్ష్ప్లో భారత పురుషుల, మహిళల జట్లు నాకౌట్ దశకు అర్హత పొంది తొలి రౌండ్లో వెనుదిరిగాయి. ఒకవేళ భారత జట్లు గ్రూప్ విజేతలుగా నిలవకపోతే... రెండో స్థానంలో నిలిచిన టాప్–6లో ఉండాలి. లేదంటే ఆఖరి అవకాశంగా నాలుగు ప్లే ఆఫ్ మ్యాచ్ల్లో విజేతగా ఉండాలి. -
తొలిసారి మహిళల రగ్బీ లీగ్
న్యూఢిల్లీ: గత ఏడాది మొదటిసారి పురుషుల కోసం భారత్లో రగ్బీ ప్రీమియర్ లీగ్ (ఆర్పీఎల్) జరగ్గా... రెండో ఏడాది ఏకకాలంలో పురుషులతోపాటు మహిళల రగ్బీ లీగ్ను నిర్వహించనున్నారు. జూన్ 16 నుంచి 28వ తేదీ వరకు హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియం రగ్బీ ప్రీమియర్ లీగ్కు ఆతిథ్యమిస్తుంది. క్రితంసారి పురుషుల విభాగంలో ఆరు జట్లు పోటీపడ్డాయి. ఆ ఆరు పురుషుల జట్లలో నుంచి నాలుగు జట్లతో (చెన్నై బుల్స్, ఢిల్లీ రెడ్జ్, ముంబై డ్రీమర్స్, కోల్కతా బంగా టైగర్స్) మహిళల విభాగం పోటీలు నిర్వహిస్తారు. జీఎంఆర్ స్పోర్ట్స్, రగ్బీ ఇండియా సహకారంతో రగ్బీ ప్రీమియర్ లీగ్ జరగనుంది. ఈనెల 30న హైదరాబాద్లో వేలం కార్యక్రమం జరగనుంది. చెన్నై బుల్స్, ఢిల్లీ రెడ్జ్, ముంబై డ్రీమర్స్, కోల్కతా బంగా టైగర్స్తోపాటు హైదరాబాద్ హీరోస్, బెంగళూరు బ్రేవ్హార్ట్స్ ఆర్పీఎల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి. గత ఏడాది ముంబైలో జరిగిన తొలి సీజన్లో చెన్నై బుల్స్ టైటిల్ సాధించింది. ‘మహిళల విభాగంలోనూ రగ్బీ ప్రీమియర్ లీగ్ నిర్వహించాలని కల కన్నాం. రెండో ఏడాదే మా కల నిజమవుతోంది. ఈ విషయంలో జీఎంఆర్ స్పోర్ట్స్ను, మా ఫ్రాంచైజీలను అభినందించాలి’ అని రగ్బీ ఇండియా అధ్యక్షుడు, సినీ నటుడు రాహుల్ బోస్ తెలిపాడు. -
క్వార్టర్స్లో భారత్
హోర్సెన్స్ (డెన్మార్క్): మాజీ చాంపియన్ భారత పురుషుల జట్టు థామస్ కప్ టీమ్ బ్యాడ్మింటన్ టోర్నీలో తొలి లక్ష్యాన్ని అందుకుంది. వరుసగా రెండో విజయంతో క్వార్టర్ ఫైనల్ బెర్త్ను అధికారికంగా ఖరారు చేసుకుంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా సోమవారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్లో భారత్ 5–0తో ఆ్రస్టేలియాను క్లీన్స్వీప్ చేసింది. గ్రూప్ ‘ఎ’లోని మరో మ్యాచ్లో చైనా 4–1తో కెనడాను ఓడించింది. రెండు విజయాలతో భారత్, చైనా జట్లు క్వార్టర్ ఫైనల్కు చేరుకోగా... రెండు ఓటములతో ఆ్రస్టేలియా, కెనడా జట్లు క్వార్టర్ ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించాయి. భారత్, చైనా జట్ల మధ్య బుధవారం జరిగే చివరి లీగ్ మ్యాచ్లో గెలిచిన జట్టు గ్రూప్ విజేతగా నిలుస్తుంది. ఆ్రస్టేలియాతో జరిగిన పోటీలో తొలి మ్యాచ్లో లక్ష్య సేన్ 21–14, 21–16తో స్టీఫెన్ సామ్ను ఓడించాడు. రెండో మ్యాచ్లో ఆసియా చాంపియన్షిప్ రన్నరప్ ఆయుశ్ శెట్టి 21–8, 21–6తో షెరీ ధండ్పై గెలిచాడు. మూడో మ్యాచ్లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి 21–14, 21–16తో రిజ్కీ హిదాయత్–జాక్ యులపై గెలిచి భారత్కు 3–0తో విజయాన్ని ఖరారు చేశారు. నాలుగో మ్యాచ్లో హెచ్ఎస్ ప్రణయ్ 21–11, 21–17తో రిషి హోండా భూపతిపై గెలిచి భారత ఆధిక్యాన్ని 4–0కు పెంచాడు. ఐదో మ్యాచ్లో హరిహరన్–ఎంఆర్ అరుŠజ్న్ 21–12, 21–10తో స్టీఫెన్ సామ్–అందికలపై గెలిచి టీమిండియాకు 5–0తో సంపూర్ణ విజయాన్ని కట్టబెట్టారు. 2022లో తొలిసారి థామస్ కప్ చాంపియన్గా నిలిచిన భారత జట్టు 2024లోనూ క్వార్టర్ ఫైనల్ చేరింది. అయితే చైనాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత జట్టు 1–3తో ఓడిపోయింది. -
థామస్ కప్లో సంచలనం.. క్వార్టర్స్కు భారత్
ప్రతిష్ఠాత్మక థామస్ కప్లో భారత జట్టు క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. గ్రూప్-ఏలో భాగంగా సోమవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో భారత్ 5-0తో విజయం సాధించింది. ఇప్పటికే కెనడాను 4-1తో మట్టికరిపించిన భారత్ గ్రూప్-ఏలో టేబుల్ టాపర్గా కొనసాగుతుంది. ఆస్ట్రేలియాతో మ్యాచ్కు భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగింది. సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్ స్థానంలో హెచ్ఎస్ ప్రణయ్ ఆడాడు.తొలుత సింగిల్స్లో లక్ష్యసేన్ 21-14, 21-16తో స్టీఫెన్ సామ్పై విజయం సాధించాడు. ఆ తర్వాత మరో సింగిల్స్లో ఆయుశ్ శెట్టి 21-8, 21-6తో శ్రేయ్ ధండ్పై విజయం సాధించడంతో భారత్ 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత డబుల్స్లో సాత్విక్-చిరాగ్ జోడి 21-14, 21-16తో రిజ్కీ హిదయత్-జాక్ యూ జంటపై గెలుపొందింది. ఆ తర్వాత రివర్స్ సింగిల్స్లో హెచ్ఎస్ ప్రణయ్ 21-11, 21-17తో రిషి హొండా భూపతిని, డబుల్స్లో హరిహరన్-అర్జున్ జోడి 21-12, 21-10తో అండికా రమడియన్-సామ్ జంటపై విజయం సాధించడంతో భారత్ 5-0తో స్పష్టమైన ఆధిక్యంతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ఇక బుధవారం భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్లో టాప్ సీడ్ చైనాతో తలపడనుంది. గత థామస్ కప్లో చైనా చేతిలో ఓడిన భారత్ క్వార్టర్స్కే పరిమితమైంది. అయితే ఈసారి మాత్రం టైటిల్ సాధించాలనే ధృడ నిశ్చయంతో ఉంది.Thomas Cup: India march into QF with 5-0 win over Australia in their 2nd group stage tie. India will take on powerhouse China in their final group stage clash. #ThomasCup2026 pic.twitter.com/DCeqYEeXZq— India_AllSports (@India_AllSports) April 27, 2026చదవండి: వైభవ్ ఇదేం పని.. ఫొటోకు వంద రూపాయలా? -
భారత్ మహిళల బ్యాడ్మింటన్ జట్టుకు తొలి విజయం
హోర్సెన్స్ (డెన్మార్క్): ఉబెర్ కప్ టీమ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత మహిళల జట్టు తొలి విజయం అందుకుంది. ఉక్రెయిన్ జట్టుతో జరిగిన గ్రూప్ ‘ఎ’ రెండో లీగ్ మ్యాచ్లో భారత్ 4–1తో గెలుపొందింది. తొలి మ్యాచ్లో ఉన్నతి హుడా 21–19, 22–20తో పొలీనా బురోవాపై నెగ్గింది. రెండో మ్యాచ్లో తన్వీ శర్మ 21–12, 17–21, 21–10తో యెహెనియా కాంటిమిర్ను ఓడించింది. మూడో మ్యాచ్లో దేవిక సిహాగ్ 23–21, 21–13తో మరియా స్టొలియారెంకోపై గెలిచి భారత్కు 3–0తో విజయాన్ని ఖరారు చేసింది. నాలుగో మ్యాచ్లో సెల్వం కవిప్రియ–సిమ్రన్ ద్వయం 11–21, 17–21తో పొలీనా బురోవా–యెహెనియా కాంటిమిర్ జోడీ చేతిలో ఓడిపోయింది. ఐదో మ్యాచ్లో పీవీ సింధు–తనీషా క్రాస్టో జోడీ 21–18, 21–15తో మరియా స్టొలియారెంకో–సోఫియా లావ్రోవా జంటపై విజయం సాధించింది. గ్రూప్ ‘ఎ’లోని మరో మ్యాచ్లో చైనా 5–0తో డెన్మార్క్ జట్టును ఓడించింది. వరుసగా రెండు విజయాలు సాధించిన చైనా జట్టు క్వార్టర్ ఫైనల్ బెర్త్ను దాదాపుగా ఖరారు చేసుకోగా... రెండో బెర్త్ కోసం భారత్, డెన్మార్క్, ఉక్రెయిన్ జట్లు రేసులో ఉన్నాయి. నేడు జరిగే చివరిదైన మూడో రౌండ్ లీగ్ మ్యాచ్ల్లో చైనాతో భారత్; డెన్మార్క్తో ఉక్రెయిన్ తలపడతాయి. -
సూపర్ సెబాస్టియన్
లండన్: ప్రతిష్టాత్మక లండన్ మారథాన్ రేసులో కెన్యా అథ్లెట్ సెబాస్టియన్ సావీ అద్భుతం చేశాడు. నిర్ణీత 42.195 కిలోమీటర్ల దూరాన్ని 1 గంట 59 నిమిషాల 30 సెకన్లలో పూర్తి చేసి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా మారథాన్ రేసును 2 గంటల్లోపు ముగించిన తొలి అథ్లెట్గా సెబాస్టియన్ గుర్తింపు పొందాడు. ఇదే రేసులో రెండో స్థానంలో నిలిచిన యోమిఫ్ కెజెల్చా (ఇథియోపియా) 1 గంట 59 నిమిషాల 41 సెకన్లలో గమ్యానికి చేరాడు. తద్వారా 2 గంటల్లో మారథాన్ పూర్తి చేసిన రెండో అథ్లెట్గా నిలిచాడు. జేకబ్ కిప్లిమో (ఉగాండా) 2 గంటల 28 సెకన్లలో రేసును ముగించి మూడో స్థానంలో నిలిచాడు. సెబాస్టియన్, కెజెల్చా, కిప్లియో ఒకేరోజు ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడం విశేషం. 2023 నుంచి కెల్విన్ కిప్టుమ్ పేరిట ఉన్న మారథాన్ ప్రపంచ రికార్డును (2 గంటల 35 సెకన్లు; చికాగో మారథాన్) ఆదివారం ఈ ముగ్గురూ సవరించారు. -
సింధు కణతపై ‘టెంపుల్’.. స్పందించిన భర్త
భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు ప్రస్తుతం ఉబెర్ కప్ టోర్నమెంట్తో బిజీగా ఉంది. డెన్మార్క్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో సింధు తన ఆట తీరుతోనే కాకుండా.. కుడి కణతపై ధరించిన ప్రత్యేక పరికరంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ డివైస్ పేరు ‘టెంపుల్’.ఎందుకీ ‘టెంపుల్’?జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ బృందం ఈ పరికరాన్ని అభివృద్ధి చేసింది. ఇది ఇంకా ప్రయోగ దశలోనే ఉండగా.. పీవీ సింధు ఓ అంతర్జాతీయ మ్యాచ్లో దీనిని ధరించడం విశేషం. మెదడులో రక్త ప్రవాహం, ఆక్సిజన్ స్థాయిలను ‘టెంపుల్’ రియల్ టైమ్లో కొలుస్తుందని సమాచారం. దీని ద్వారా మానసిక ఒత్తిడి, ఏకాగ్రత, మెదడు పనితీరును అంచనా వేయొచ్చని తెలుస్తోంది. నియర్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపి టెక్నాలజీతో ఇది మెదడులో ఆక్సిజన్ స్థాయిని కొలుస్తుందని సమాచారం. కేవలం ఇంచు పొడవు ఉండే ‘టెంపుల్’ను మూడు- నాలుగు గంటల పాటు ధరించవచ్చు. ఇది బ్రెయిన్ ఫిట్నెస్ ట్రాకర్లా ఉపయోగపడుతుందని సమాచారం. ముఖ్యంగా క్రీడాకారులు మ్యాచ్ ఆడే సమయంలో లేదంటే ప్రాక్టీస్ సెషన్లో ఏకాగ్రత ఏ స్థాయిలో ఉంది? మానసిక ఒత్తిడి, అలసట, రికవరీ తదితర అంశాలకు సంబంధించిన డేటా విశ్లేషణకు ఈ డివైస్ ఉపయోగపడనుంది.స్పందించిన సింధు భర్తఇక సింధు ధరించిన ‘టెంపుల్’ గురించి ఆమె భర్త వెంకటదత్త సాయి (Venkata Datta Sai) స్పందించారు. ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘ఈ డివైస్ ద్వారా తన మెట్రిక్స్ కొలుస్తున్నాము. ప్రస్తుతం ఇది ప్రయోగ దశలోనే ఉంది. దీని ద్వారా వస్తున్న ఫలితాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాము. ఆరంభ దశలో వస్తున్న ఫలితాలు ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నాయి’’ అని వెంకటదత్త సాయి హర్షం వ్యక్తం చేశారు. కాగా క్రీడా ప్రపంచంలో ఇప్పుడు ఈ ‘టెంపుల్’ డివైస్ చర్చనీయాంశంగా మారింది.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఉబర్ కప్ సింగిల్స్ మ్యాచ్లో 30 ఏళ్ల పీవీ సింధు తొలుత లీనీ క్రిస్టోఫర్సెన్ను ఎదుర్కొంది. ఆతిథ్య డెన్మార్క్ చెందిన 26 ఏళ్ల లినీని సింధు 21-13, 18-21, 21-17 తేడాతో ఓడించి గెలుపుజెండా ఎగురవేసింది. పందొమ్మిదేళ్లు కాదని గుర్తు చేస్తోందిఈ నేపథ్యంలో మ్యాచ్లు ముగించుకున్న తర్వాత పీవీ సింధు చేసిన పోస్ట్ వైరల్గా మారింది. ‘‘రెండు గంటల్లో రెండు మ్యాచ్లు.. కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. అప్పుడు నా శరీరం.. ‘ఇంకా నీ వయసు 19 కాదు అని మర్యాదగా గుర్తు చేసింది. రెండు మ్యాచ్లు గెలవడం సంతోషంగా ఉంది’’ అని సింధు క్యాప్షన్ జతచేసింది.చదవండి: వైభవ్ సూర్యవంశీ వద్దు!.. ఆ ఇద్దరిని సెలక్ట్ చేయండి! -
భారత్కు మిశ్రమ ఫలితాలు
హోర్సెన్స్ (డెన్మార్క్): ప్రతిష్టాత్మక థామస్ కప్, ఉబెర్ కప్ టీమ్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. థామస్ కప్లో భారత పురుషుల జట్టు గెలుపు బోణీ కొట్టగా... ఉబెర్ కప్లో భారత మహిళల జట్టు ఓడిపోయింది. కెనడాతో జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్లో భారత పురుషుల జట్టు 4–1తో గెలిచింది. తొలి మ్యాచ్లో ప్రపంచ 11వ ర్యాంకర్, భారత నంబర్వన్ లక్ష్య సేన్ 21–18, 19–21, 10–21తో ప్రపంచ 13వ ర్యాంకర్ విక్టర్ లాయ్ చేతిలో ఓడిపోయాడు. అయితే రెండో మ్యాచ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 21–10, 21–11తో జొనాథన్ బింగ్–కెవిన్ లీ జంటను ఓడించి స్కోరును 1–1తో సమం చేసింది. ఆ తర్వాత మూడో మ్యాచ్లో ఆసియా చాంపియన్షిప్ రన్నరప్ ఆయుశ్ శెట్టి 21–13, 21–17తో బ్రియాన్ యాంగ్పై గెలిచి భారత్కు 2–1తో ఆధిక్యం అందించాడు.నాలుగో మ్యాచ్లో హరిహరన్–ఎంఆర్ అర్జున్ ద్వయం 21–7, 21–15తో లిండెమన్–నిల్ యకూరా జోడీని ఓడించి భారత్కు 3–1తో విజయాన్ని ఖరారు చేసింది. ఐదో మ్యాచ్లో ప్రపంచ మాజీ నంబర్వన్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ 21–17, 21–12తో జోషువా నుగుయెన్పై నెగ్గడంతో భారత్ 4–1తో ముగించింది. సోమవారం జరిగే రెండో లీగ్ మ్యాచ్లో ఆ్రస్టేలియాతో భారత్ ఆడుతుంది. సింధు గెలిచినా.... మరోవైపు భారత మహిళల జట్టు గ్రూప్ ‘ఎ’ తొలి లీగ్ మ్యాచ్లో 2–3తో ఆతిథ్య డెన్మార్క్ చేతిలో ఓటమి పాలైంది. తొలి మ్యాచ్లో పీవీ సింధు 21–13, 18–21, 21–17తో లినె క్రిస్టోఫర్సన్ను ఓడించింది. రెండో మ్యాచ్లో ఉన్నతి హుడా 12–21, 23–25తో లినె జార్స్ఫెల్ట్ చేతిలో ఓడిపోయింది. మూడో మ్యాచ్లో ప్రియ–శ్రుతి మిశ్రా జోడీ 17–21, 21–11, 21–23తో అమెలియా–మెటీ వెర్జ్ జంట చేతిలో పరాజయం పాలైంది. నాలుగో మ్యాచ్లో తన్వీ శర్మ 21–19, 16–21, 16–21తో అమెలియా షుల్జ్ చేతిలో ఓటమి చెందడంతో భారత్ పరాజయం ఖరారైంది. నామమాత్రమైన చివరి మ్యాచ్లో సింధు–తనీషా క్రాస్టో ద్వయం తొలి గేమ్ను 19–21తో కోల్పోయి రెండో గేమ్లో 17–14తో ఆధిక్యంలో ఉన్న దశలో అలెగ్జాండ్రా బొయె–క్రిస్టీన్ బుష్ జోడీ గాయంతో వైదొలిగింది. నేడు జరిగే రెండో మ్యాచ్లో ఉక్రెయిన్తో భారత్ తలపడుతుంది. -
ప్రత్యక్ష ప్రసారం చూడలేమా!
టీమిండియా క్రికెట్ మ్యాచ్ ఆడుతుందంటే చాలు... అభిమానులు టీవీలకు అతుక్కుపోవడం మనదేశంలో తరాలుగా వస్తున్న ఆనవాయితీ! ఐపీఎల్ వచ్చాక వీక్షకుల సంఖ్య మరింత పెరిగింది. అరచేతిలో ప్రత్యక్ష ప్రసారం చూసే అవకాశం వచ్చినప్పటి నుంచి ఆ సంఖ్య కోట్లు దాటేసింది. ఇదే బాటలో బ్యాడ్మింటన్ లీగ్, రెజ్లింగ్ లీగ్, టేబుల్ టెన్నిస్ లీగ్, ఖో ఖో లీగ్, ప్రీమియర్ టెన్నిస్ లీగ్, ఆర్చరీ లీగ్ ఇలా లెక్కకు మిక్కిలి లీగ్లు కాస్తో కూస్తో ప్రేక్షకాదరణ దక్కించుకున్నాయి. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)... క్రికెట్ తరహాలో దేశవ్యాప్తంగా బాగా ఆదరణ దక్కించుకుంది. మట్టి ఆటతో మనకున్న అనుబంధాన్ని మ్యాట్పై చూపించడంతో గ్రామీణ ప్రేక్షకులు పీకేఎల్కు బ్రహ్మరథం పట్టారు. అయితే ఎటొచ్చి యావత్ ప్రపంచం వీపరీతంగా ఆదరించే ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నీ పోటీలకు మాత్రం మన దేశంలో ఆదరణ చాలా తక్కువ. మరికొద్ది రోజుల్లో ప్రతిష్టాత్మక ‘ఫిఫా’ వరల్డ్కప్ జరగనున్నా... ఇప్పటి వరకు మనదేశంలో ఈ టోర్నమెంట్ ప్రత్యక్ష ప్రసార హక్కులు దక్కించుకునేందుకు ఎవరూ ఆసక్తి కనబర్చడం లేదు. దీంతో ఉన్న కొద్దిమంది అభిమానులు కూడా ప్రపంచకప్ మ్యాచ్లను ప్రత్యక్షంగా చూసే అవకాశం కోల్పోనున్నారు. ఈ నేపథ్యంలో ‘ఫిఫా’ వరల్డ్కప్ ప్రత్యక్ష ప్రసార తీరు తెన్నులపై ప్రత్యేక కథనం... – సాక్షి క్రీడావిభాగం యావత్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించే ప్రపంచకప్ ఫుట్బాల్ సమరానికి సమయం దగ్గరపడుతోంది. నాలుగేళ్లకోసారి జరిగే ఫుట్బాల్ మహాసంగ్రామం జూన్ 11 నుంచి జూలై 19 వరకు సాగనుంది. నాలుగేళ్ల క్రితం ఖతర్లో జరిగిన ఈ మెగా టోర్నీని ఇప్పుడు మూడు దేశాలు కలిసి సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. కెనడా, మెక్సికో, అమెరికాలో ఈ వరల్డ్కప్ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ ఏడాది ఎన్నడూలేని విధంగా 48 జట్లు ట్రోఫీ కోసం పోటీ పడుతుండగా... మొత్తం 104 మ్యాచ్లు నిర్వహించనున్నారు. 48 జట్లను 12 గ్రూప్లుగా విభజించి పోటీలు నిర్వహించనున్నారు. గత వరల్డ్కప్లో కేవలం 64 మ్యాచ్లు మాత్రమే జరగ్గా... ఇప్పుడా సంఖ్య బాగా పెరిగింది. దీంతో సాధారణంగా ఆసక్తి కూడా మరింత పెరిగింది. ప్రపంచంలో 200కు పైగా దేశాల్లో ఫుట్బాల్ అభిమానులు ఉన్నారు. అందులో దాదాపు అన్నీ దేశాల్లో ఈ వరల్డ్కప్ ప్రసారాలు సాగనున్నాయి. కానీ మన దేశంలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ఐపీఎల్ ముగిసిన 11 రోజులకే... ప్రస్తుతం ఐపీఎల్ జోరుగా సాగుతుండటంతో... ఎక్కడ చూసినా ఫోర్లు, సిక్స్లు, స్కోర్ల ముచ్చట్లే వినిపిస్తున్నాయి. వచ్చే నెల 31వ తేదీతో ఐపీఎల్ ముగియనుండగా... ఆ తర్వాత 11 రోజులకే ప్రపంచకప్ ప్రారంభం కానుంది. క్రికెట్ను మతంలా భావించే మనదేశంలో మొదటి నుంచి ఫుట్బాల్కు ఆదరణ అంతంతమాత్రమే... ఈశాన్య రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్, కేరళ వంటి చోట్ల తప్ప ఫుట్బాల్పై ఆసక్తి కనబర్చే వారి సంఖ్య చాలా తక్కువ. మన దేశ ఫుట్బాల్ జట్టు కూడా అంతర్జాతీయ స్థాయిలో పెద్దగా విజయాలు సాధించలేక పోతుండటంతో పాటు... దక్షిణ అమెరికా, యూరప్ దేశాల హవా సాగే ఫుట్బాల్ వరల్డ్కప్పై మనవాళ్లకు ఆసక్తి తక్కువే. ఐపీఎల్ ప్రసార హక్కుల విలువ రోజు రోజుకు పెరుగుతూ ఉంటే... ఈ టోర్నమెంట్ ప్రసార హక్కులు కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం ఆశ్చర్యకరం. 100 నుంచి 35 మిలియన్ డాలర్లలకు... తాజా ప్రపంచకప్తో పాటు 2030లో జరగనున్న వరల్డ్కప్ను కలిపి సంయుక్త ప్రసార హక్కులను భారత మార్కెట్లో 100 మిలియన్ డాలర్లకు నిర్వాహకులు విక్రయించే ప్రయత్నం చేశారు. ఎలాంటి స్పందన లేకపోవడంతో రెండు టోర్నీల ప్రసార హక్కులను 35 మిలియన్ డాలర్లకు తగ్గించినా... ఎవరూ ఆసక్తి కనబర్చడం లేదు. ‘భారత్లో ఫుట్బాల్ వీక్షణ గత కొంతకాలంగా బాగా క్షీణిస్తోంది. ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ను చూస్తే 2013–14లో దాని విలువ 145 మిలియన్ డాలర్లు ఉండేది... అది ఇప్పుడు 60 మిలియన్ డాలర్లకు పడిపోయింది’ అని స్పోర్ట్స్ గేమింగ్ రంగ నిపుణుడు తెలిపాడు. చేతులు కాల్చుకున్న సోనీ, రిలయన్స్ 2014, 2018 ‘ఫిఫా’ వరల్డ్కప్ టోర్నీలను భారత్లో సోనీ స్పోర్ట్స్ ప్రసారం చేసింది. వీటితో 2016 యూరో కప్ను కలిపి మొత్తం 90 మిలియన్ డాలర్లకు వాణిజ్య హక్కులు దక్కించుకుంది. ఆ తర్వాత 2022 వరల్డ్కప్ ప్రసార హక్కులను 60 మిలియన్ డాలర్లకు రిలయన్స్ సొంతం చేసుకుంది. అయితే ఈ రెండు సంస్థలు కూడా ఆశించిన లాభాలు గడించలేకపోయాయి. దీంతో ఈసారి ప్రసార హక్కుల విషయంలో తర్జన భర్జన ఇంకా సాగుతోంది.‘భారత్లో కేవలం అభిమానులు లేకపోవడమే కాక... మరిన్ని కారణాలు కూడా ఉన్నాయి. అందుకే ప్రసార హక్కులు దక్కించుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఫుట్బాల్ వీక్షణల విషయంలో జపాన్తో భారత్ను పోల్చడం అవివేకం’ అని స్పోర్ట్స్ గేమింగ్ ఈ స్పోర్ట్స్ లైవ్ మేనేజింగ్ పార్ట్నర్ రోహిత్ అన్నారు. టైమింగ్తో తలనొప్పి... ఈసారి ఫుట్బాల్ పండగ జరుగుతున్న కెనడా, మెక్సికో, అమెరికా కాలమానంతోనూ మనకు ఇబ్బంది ఎదురవుతోంది. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి దాటాక, తెల్లవారుజామునే ఎక్కువ మ్యాచ్లు జరగనున్నాయి. దీంతో వీక్షకుల్లో పెద్దగా ఆసక్తి కనబడటం లేదు. ఎంత ప్రధానమైన ఈవెంట్ అయినా... ప్రేక్షకులు ఎక్కువగా వీక్షించే సమయంలో కాకుండా... అర్ధరాత్రి, అపరాత్రి ప్రసారం చేస్తే వీక్షణలు తగ్గడం సహజమే. ఈ టోర్నమెంట్లోని 104 మ్యాచ్ల్లో 14 మాత్రమే భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రికి ముందు ప్రారంభం కానున్నాయి. 2022 ఖతర్ వేదికగా జరిగిన టోర్నమెంట్లోని 64 మ్యాచ్ల్లో 44 మ్యాచ్లు ‘ప్రైమ్ టైమ్’లోనే ప్రసారమయ్యాయి. లాభాలు లేకే... మన దేశంలో 2022 ప్రపంచకప్ స్పోర్ట్స్–18, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం జరిగింది. జియో సినిమా యాప్లో ఉచితంగా లైవ్ అందించగా... స్పోర్ట్స్–18 ఛానల్ మాత్రం ఈ మెగా టోర్నీ కోసం నెలకు 12 రూపాయలు వసూలు చేసింది. ఫుట్బాల్ దేశాల్లో ఈ ధర ఎంత భారీగా ఉన్నా... వాటి వీక్షణల్లో ఎలాంటి మార్పు రాదని... కానీ మనదేశంలో మాత్రం ఫుట్బాల్ కోసం సభ్యత్వం తీసుకునే వారు చాలా తక్కువగా ఉంటారని నిపుణులు అంటున్నారు. ఏ రంగంలో అయినా లాభాలు రాకపోతే దాన్ని కొనసాగించడం కష్టమే కాబట్టి... ఏ రకంగా చూసుకున్న మన దేశంలో ఫిఫా ప్రపంచకప్నకు ఆదరణ పెద్దగా ఉండదనే ఉద్దేశంతోనూ ప్రసార హక్కులు కొనుగోలు చేసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. వాణిజ్య ప్రకటనలకు సమయమేది? భారత ఫుట్బాల్ జట్టు అంతర్జాతీయ మ్యాచ్లు ఆడుతున్న సమయంలో సైతం అభిమానులు లైవ్పై పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. ఇక ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) రోజురోజుకూ తన ప్రభావం కోల్పోతూ వస్తోంది. గత ఏడాది కాలంలో ఐఎస్ఎల్ ప్రసార హక్కుల విలువలో 97 శాతం తగ్గుదల నమోదైంది. క్రికెట్లో అయితే ఓవర్కు ఓవర్కు మధ్య వచ్చే వాణిజ్య ప్రకటనలతో ప్రసార కర్తలకు భారీగా డబ్బు వచ్చి పడుతుంది. కానీ... ఫుట్బాల్కు మన దేశంలో అంతటి ఆదరణ ఉండదని ప్రసార సంస్థల నిపుణులు అంటున్నారు. ‘క్రికెట్లో ఓవర్ మారినా, వికెట్ పడినా... వాణిజ్య ప్రకటనలకు వీలు ఉంటుంది. టెన్నిస్లోనూ సెట్ తర్వాత స్లాట్లు ఉంటాయి. కానీ ఫుట్బాల్లో మ్యాచ్లకు ముందు, తర్వాత, విరామంలో మాత్రమే ఆ అవకాశం ఉంటుంది. మధ్యమధ్యలో వాణిజ్య ప్రకటనలకు అవకాశం చాలా తక్కువ’ అని ఆయన అన్నారు. దూరదర్శన్కే చాన్స్... మనదేశంలోని ప్రముఖ ప్రసారకర్తలు జియో హాట్స్టార్, ఫ్యాన్కోడ్, సోనీ స్పోర్ట్స్, జీ ఎంటర్టైన్మెంట్లతో చర్చలు నిర్వహించాలని ‘ఫిఫా’ భావిస్తోంది. ఒకవేళ ప్రసార కర్తలు ఎవరూ ముందుకు రాకపోతే... ప్రభుత్వ ప్రసారకర్త దూరదర్శన్లో వరల్డ్కప్ ప్రసారమయ్యే అవకాశముంది. 1998, 2002, 2006 ప్రపంచకప్లోని పలు మ్యాచ్లను దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. 1998 ప్రపంచకప్ ప్రసార హక్కుల ద్వారా దూరదర్శన్ రూ. 3.5 కోట్ల లాభం కూడా పొందడం విశేషం. -
దివ్యాంశు–శాంభవి జోడీకి పసిడి పతకం
కైరో: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) జూనియర్ ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. శుక్రవారం భారత్ ఖాతాలో నాలుగో స్వర్ణ పతకం చేరింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో దివ్యాంశు దేవాంగన్–శాంభవి క్షీరసాగర్ జోడీ భారత్కు బంగారు పతకాన్ని అందించింది. నాలుగు జోడీల మధ్య జరిగిన ఫైనల్లో దివ్యాంశు–శాంభవి జంట 499.9 పాయింట్లు స్కోరు చేసి పసిడి పతకాన్ని దక్కించుకుంది. ఈ క్రమంలో కొత్త ప్రపంచ రికార్డును కూడా నమోదు చేసింది. సయ్ చియె యింగ్–చెన్ యు ఆన్ (చైనీస్ తైపీ) జంట 498.3 పాయింట్లో రజతం గెల్చుకోగా... టిఫెన్ పోమెస్–గాస్పర్డ్ లెసియర్ (ఫ్రాన్స్) జోడీ 434.4 పాయింట్లతో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. అంతకుముందు 17 జోడీలు పోటీపడ్డ క్వాలిఫయింగ్లో దివ్యాంశు–శాంభవి జంట 632 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలవడంతోపాటు ఫైనల్కు అర్హత సాధించింది. మరోవైపు పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో భారత్కు నిరాశ ఎదురైంది. ఎనిమిది మంది షూటర్లు ఎలిమినేషన్ పద్ధతిలో పోటీపడ్డ ఫైనల్లో భారత షూటర్ సమీర్ 7 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచాడు. అంతకుముందు 17 మంది షూటర్లు బరిలోకి దిగిన క్వాలిఫయింగ్లో సమీర్ 573 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచి ఫైనల్కు అర్హత పొందాడు. ప్రస్తుతం భారత్ 4 స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్యాలతో కలిపి 12 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. -
ఫ్రెంచ్ ఓపెన్కు అల్కరాజ్ దూరం
పారిస్: కుడి మణికట్టు గాయం కారణంగా ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నమెంట్తోపాటు రోమ్ ఓపెన్ మాస్టర్స్–1000 టోర్నీలో ఆడటం లేదని స్పెయిన్ టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ ప్రకటించాడు. 2024, 2025లలో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గినఅల్కరాజ్ గత ఏడాది రోమ్ ఓపెన్లోనూ విజేతగా నిలిచాడు. ఈ రెండు టోర్నీలకు అల్కరాజ్ దూరం కానుండటంతో 3000 ర్యాంకింగ్ పాయింట్లు కోల్పోనున్నాడు. గతవారం బార్సిలోనా ఓపెన్ సందర్భంగా అల్కరాజ్ మణికట్టు గాయంతో టోర్నీ మధ్యలోనే వైదొలిగాడు. -
విజయోస్తు!
నాలుగేళ్ల క్రితం జరిగిన అద్భుత ఘట్టాన్ని పునరావృతం చేయాలనే పట్టుదలతో భారత పురుషుల జట్టు... సెమీఫైనల్ చేరడమే తొలి లక్ష్యంగా భారత మహిళల జట్టు... ప్రతిష్టాత్మక టీమ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ థామస్ కప్, ఉబెర్కప్లలో బరిలోకి దిగనున్నాయి. హెచ్ఎస్ ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్ అసాధారణ ప్రదర్శనతో 2022లో భారత పురుషుల జట్టు తొలిసారి థామస్ కప్ టైటిల్ను సొంతం చేసుకుంది. సైనా నెహ్వాల్, పీవీ సింధు, గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్ప తదితరుల మెరుపులతో 2014, 2016లలో వరుసగా రెండు పర్యాయాలు భారత మహిళల జట్టు ఉబెర్ కప్లో సెమీఫైనల్ చేరుకొని కాంస్య పతకాలు సొంతం చేసుకుంది. ఈసారి అటు పురుషుల జట్టుతోపాటు ఇటు మహిళల జట్టుకు గ్రూప్ దశలో కాస్త అనుకూలమైన ‘డ్రా’నే పడింది. తమ గ్రూప్లో టాప్–2లో నిలిచి ముందుగా క్వార్టర్ ఫైనల్ చేరడమే భారత జట్ల లక్ష్యం కానుంది. ఆ తర్వాత క్వార్టర్ ఫైనల్ నాకౌట్ పోరులో నెగ్గితే సెమీఫైనల్ చేరి కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకుంటాయి. బలాబలాలను పరిశీలిస్తే భారత మహిళల జట్టుతో పోలిస్తే భారత పురుషుల జట్టుకు ఈసారి పతకం వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. హోర్సెన్స్ (డెన్మార్క్): ప్రణయ్... కిడాంబి శ్రీకాంత్... లక్ష్య సేన్... సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి... ఈ ఐదుగురికి ఎలా ఆడితే థామస్ కప్లో టైటిల్ సాధించగలమో తెలుసు. 2022లో టీమిండియాకు థామస్ కప్ దక్కడంలో ఈ ఐదుగురు కీలకపాత్ర పోషించారు. తాజాగా ఈ ఐదుగురికి ఆయుశ్ శెట్టి రూపంలో రైజింగ్ స్టార్ జత కలిశాడు. ఫలితంగా 2022 చాంపియన్ భారత జట్టు ఈసారి థామస్ కప్లో టైటిల్పై గురి పెట్టింది. సింగిల్స్లో రెండు, డబుల్స్లో ఒక విజయం లభిస్తే మ్యాచ్ వశమవుతుంది. ఈ నేపథ్యంలో పూర్తి బలగంతో థామస్ కప్లో అడుగు పెట్టిన భారత జట్టు రెండోసారి అద్భుతం చేస్తే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇటీవల చైనాలో జరిగిన ఆసియా చాంపియన్షిప్లో ఆయుశ్ శెట్టి రన్నరప్గా నిలిచి తన సత్తా చాటుకున్నాడు. ఫైనల్ చేరిన క్రమంలో టాప్–10లోని ముగ్గురు క్రీడాకారులను ఆయుశ్ ఓడించాడు. ఈ నేపథ్యంలో ఆయుశ్, లక్ష్య సేన్, ప్రణయ్, శ్రీకాంత్, సాత్విక్–చిరాగ్ తమ స్థాయికి తగ్గట్టు ఆడితే భారత జట్టు క్వార్టర్ ఫైనల్ చేరుకోవడం కష్టమేమీ కాదు. నేడు జరిగే గ్రూప్ ‘ఎ’ తొలి లీగ్ మ్యాచ్లో కెనడాతో భారత్ తలపడుతుంది. ఆ తర్వాత 27న ఆ్రస్టేలియాతో... 29న చైనాతో టీమిండియా మ్యాచ్లున్నాయి. మరోవైపు భారత మహిళల జట్టు ఆశలన్నీ సింగిల్స్ ప్లేయర్స్పైనే ఆధారపడి ఉన్నాయి. డబుల్స్ స్టార్ జోడీ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ వైదొలగడం భారత జట్టు విజయావకాశాలపై ప్రభావం చూపకుండా ఉండాలంటే... మూడు సింగిల్స్లో పీవీ సింధు, ఉన్నతి హుడా, తన్వీ శర్మ, దేవిక సిహాగ్లు గెలవాల్సి ఉంటుంది. గ్రూప్ ‘ఎ’లో ఉన్న భారత మహిళల జట్టు తమ తొలి మ్యాచ్ను నేడు ఆతిథ్య డెన్మార్క్ జట్టుతో ఆడుతుంది. గ్రూప్ ‘ఎ’లోనే చైనా, ఉక్రెయిన్ జట్లు కూడా ఉన్నాయి. చైనాపై భారత్ గెలిచే అవకాశాలు లేకపోవడంతో... క్వార్టర్ ఫైనల్ చేరాలంటే డెన్మార్క్, ఉక్రెయిన్ జట్లపై భారత్ నెగ్గాల్సి ఉంటుంది. డెన్మార్క్ చేతిలో భారత్ ఓడిపోతే మాత్రం నాకౌట్ అవకాశాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. డెన్మార్క్తో మ్యాచ్ అనంతరం భారత్ రెండో మ్యాచ్ను 25న ఉక్రెయిన్తో, మూడో మ్యాచ్ను 27న చైనాతో ఆడుతుంది. థామస్ కప్ టోర్నీకి భారత జట్టు: లక్ష్య సేన్, ఆయుశ్ శెట్టి, ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్, కిరణ్ జార్జి, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, హరిహరన్, ఎంఆర్ అర్జున్, ధ్రువ్ కపిల. ఉబెర్ కప్ టోర్నీకి భారత జట్టు: పీవీ సింధు, ఉన్నతి హుడా, తన్వీ శర్మ, దేవిక సిహాగ్, ఇషారాణి బారువా, తనీషా క్రాస్టో, ప్రియ కొంజెంగ్బమ్, శ్రుతి మిశ్రా, సెల్వం కవిప్రియ, సిమ్రన్. -
భారత్కు రాలేము.. కీలక టోర్నీ నుంచి పాకిస్తాన్ అవుట్
భారత్ వేదికగా జరగనున్న సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ (SAFF) మహిళల ఛాంపియన్షిప్ నుంచి పాకిస్తాన్ వైదొలిగింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ ఫుట్బాల్ సమాఖ్య ధ్రువీకరించింది. ఇరు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పీఎఫ్ఎఫ్ ఈ నిర్ణయం తీసుకుంది. పాక్ వైదొలగడంతో ఈ టోర్నమెంట్ను ఆరు జట్లతో మాత్రమే నిర్వహించనున్నారు.ఈ ఫుట్బాల్ టోర్నీ మే 25 నుండి జూన్ 6 వరకు గోవాలోని మార్గావ్ వేదికగా జరగనుంది. మొత్తం ఆరు జట్లను రెండు గ్రూపులుగా విభిజించారు. గ్రూపు-లో నేపాల్, శ్రీలంక, భూటాన్.. గ్రూపు-బిలో భారత్, బంగ్లాదేశ్, మాల్దీవులు. బంగ్లాదేశ్ డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగనుంది. అయితే సాఎఫ్ఫ్ టోర్నీలో భారత్కు తిరిగిలేని రికార్డు ఉంది. ఇప్పటివరకు టీమిండియా ఐదు సార్లు (2010, 2012, 2014, 2016, 2019) విజేతగా నిలిచింది.కాగా రాజకీయ ఉద్రిక్తతల కారణంగా భారత్ వేదికగా జరిగే టోర్నీలకు పాక్ దూరంగా ఉండడం ఇదేమి తొలిసారి కాదు. గతేడాది తమిళనాడులో జరిగిన పురుషుల జూనియర్ హాకీ ప్రపంచ కప్ నుండి పాక్ వైదొలిగింది. అంతకుముందు రాజ్గిర్లో ఆసియా కప్-2025కు కూడా తమ సీనియర్ పురుషుల జట్టును పాక్ పంపలేదు.భారత్ కూడా పాక్ వేదికగా క్రీడా ఈవెంట్లను బాయ్కాట్ చేస్తూ వస్తుంది. ఆసియా టీ20 కప్తో పాటు, ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లు ఆడేందుకు భారత క్రికెట్ జట్టు పాక్కు వెళ్లలేదు. తమ మ్యాచ్లో మెన్ ఇన్ బ్లూ శ్రీలంక, దుబాయ్ వేదికలగా ఆడింది.చదవండి: IPL 2026: సీఎస్కే జట్టులోకి యార్కర్ల కింగ్ -
పదేళ్ల తర్వాత... దక్షిణాసియా మహిళల ఫుట్బాల్ టోర్నీకి భారత్ ఆతిథ్యం
ఢాకా: దశాబ్దం తర్వాత భారత్ వేదికగా దక్షిణాసియా మహిళల ఫుట్బాల్ టోర్నమెంట్ జరగనుంది. ఈ ఏడాది మే 25 నుంచి జూన్ 6వ తేదీ వరకు జరిగే ఈ టోర్నీకి గోవా రాష్ట్రం ఆతిథ్యమిస్తుంది. భారత్లో చివరిసారి 2016లో (సిలిగురి, పశ్చిమ బెంగాల్) దక్షిణాసియా మహిళల ఫుట్బాల్ టోర్నీని నిర్వహించారు. ఈ టోర్నీకి సంబంధించి గ్రూప్ వివరాలను బుధవారం ఢాకాలోని దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య కార్యాలయంలో విడుదల చేశారు. గ్రూప్ ‘ఎ’లో నేపాల్ (87వ ర్యాంక్), శ్రీలంక (162), భూటాన్ (164)... గ్రూప్ ‘బి’లో భారత్ (69వ ర్యాంక్), బంగ్లాదేశ్ (112), మాల్దీవులు (167) జట్లున్నాయి. భారత్ తమ లీగ్ మ్యాచ్లను మే 25న మాల్దీవులతో, మే 31న బంగ్లాదేశ్తో ఆడుతుంది. లీగ్ దశ ముగిశాక రెండు గ్రూప్ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్ చేరుకుంటాయి. సెమీఫైనల్స్ జూన్ 3న జరుగుతాయి. ఫైనల్ను జూన్ 6న నిర్వహిస్తారు. పాకిస్తాన్ ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో ఆ జట్టు ఈ టోర్నీలో ఆడటం లేదు. అత్యధికంగా ఐదుసార్లు (2010, 2012, 2014, 2016, 2019) భారత జట్టు దక్షిణాసియా టోర్నీ టైటిల్స్ సాధించింది. -
బెస్ట్ అల్కరాజ్, సబలెంకా
మాడ్రిడ్: క్రీడా ప్రపంచంలో అస్కార్ అవార్డులుగా భావించే లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక ఈ కార్యక్రమం జరిగింది. 2025 సంవత్సరానికి గాను పురుషుల విభాగంలో ఉత్తమ క్రీడాకారుడిగా స్పెయిన్ టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్... మహిళల విభాగంలో ఉత్తమ క్రీడాకారిణిగా బెలారూస్ టెన్నిస్ స్టార్ సబలెంకా పురస్కారాలు అందుకున్నారు. 2000 సంవత్సరం నుంచి లారియస్ అవార్డులు ప్రతియేటా ఇస్తున్నారు. గత ఏడాది అల్కరాజ్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టైటిల్స్తోపాటు మరో ఆరు టోర్నీల్లో విజేతగా నిలిచాడు. ఆ్రస్టేలియన్ ఓపెన్లో క్వార్టర్ ఫైనల్ చేరిన ఈ స్పెయిన్ స్టార్, వింబుల్డన్ టోర్నీలో రన్నరప్గా నిలిచాడు. ఓవరాల్గా 71 మ్యాచ్ల్లో గెలిచి, 9 మ్యాచ్ల్లో ఓడిపోయాడు. 2026 సీజన్ను కూడా అల్కరాజ్ ఘనంగా ప్రారంభించాడు. ఆ్రస్టేలియన్ ఓపెన్లో తొలిసారి టైటిల్ గెలిచి టెన్నిస్లోని నాలుగు గ్రాండ్స్లామ్ టైటిల్స్ సొంతం చేసుకొని ‘కెరీర్ గ్రాండ్స్లామ్’ ఘనత సాధించాడు. గతవారం బార్సిలోనా ఓపెన్ టోర్నీలో మణికట్టు గాయానికి గురైన అల్కరాజ్ మాడ్రిడ్ మాస్టర్స్ టోర్నీ నుంచి వైదొలిగాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకుంటేనే ఫ్రెంచ్ ఓపెన్ బరిలోకి దిగుతానని 22 ఏళ్ల అల్కరాజ్ వ్యాఖ్యానించాడు. రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), రాఫెల్ నాదల్ (స్పెయిన్) తర్వాత ‘లారియస్ స్పోర్ట్స్మన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు గెల్చుకున్న నాలుగో టెన్నిస్ ప్లేయర్గా అల్కరాజ్ గుర్తింపు పొందాడు. మరోవైపు మహిళల టెన్నిస్ నంబర్వన్ సబలెంకా కూడా గతేడాది నిలకడగా రాణించింది. యూఎస్ ఓపెన్లో టైటిల్ నెగ్గిన సబలెంకా ఆ్రస్టేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్లో రన్నరప్గా నిలిచింది. సీజన్ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నీలోనూ రన్నరప్ ట్రోఫీ అందుకుంది. ఓవరాల్గా సీజన్లో నాలుగు టైటిల్స్ సొంతం చేసుకున్న ఆమె 63 మ్యాచ్ల్లో గెలిచి, 12 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ‘వరల్డ్ టీమ్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు ఫ్రాన్స్కు చెందిన ఫుట్బాల్ క్లబ్ పారిస్ సెయింట్ జెర్మయిన్ (పీఎస్జీ) గెల్చుకుంది. గత ఏడాది పీఎస్జీ జట్టు తొలిసారి ప్రతిష్టాత్మక చాంపియన్స్ లీగ్ టైటిల్ను సాధించింది. ‘టీమ్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు విభాగంలో భారత మహిళల క్రికెట్ జట్టు కూడా నామినేట్ అయింది. గత ఏడాది హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు తొలిసారి వన్డే వరల్డ్కప్ను సాధించింది. అయితే తుదకు ఈ అవార్డు పీఎస్జీ జట్టుకు లభించింది. రొమేనియా దిగ్గజ జిమ్నాస్ట్ నాడియా కొమనెసికి లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు దక్కింది. 64 ఏళ్ల నాడియా ఒలింపిక్స్ క్రీడల్లో 10కి 10 పాయింట్లు స్కోరు చేసిన తొలి జిమ్నాస్ట్గా రికార్డు నెలకొల్పింది. 1976 మాంట్రియల్ ఒలింపిక్స్లో ఆల్ అరౌండ్, అన్ఈవెన్ బార్స్, బ్యాలెన్స్ బీమ్ ఈవెంట్లలో నాడియా ‘పర్ఫెక్ట్ 10’ స్కోరుతో స్వర్ణ పతకాలు సాధించింది. అంతర్జాతీయ కెరీర్లో నాడియా మొత్తం తొమ్మిది ఒలింపిక్ పతకాలు, నాలుగు ప్రపంచ చాంపియన్షిప్ పతకాలు, మూడు వరల్డ్కప్ ఫైనల్ పతకాలు గెలుచుకుంది. లారియస్ అవార్డు విజేతల జాబితావరల్డ్ స్పోర్ట్స్మన్ ఆఫ్ ద ఇయర్: కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్, టెన్నిస్) వరల్డ్ స్పోర్ట్స్ఉమన్ ఆఫ్ ద ఇయర్: సబలెంకా (బెలారూస్, టెన్నిస్) వరల్డ్ టీమ్ ఆఫ్ ద ఇయర్: పారిస్ సెయింట్ జెర్మయిన్ (ఫ్రాన్స్, ఫుట్బాల్) వరల్డ్ బ్రేక్థ్రూ ఆఫ్ ద ఇయర్: లాండో నోరిస్ (బ్రిటన్, ఫార్ములావన్) వరల్డ్ కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్: రోరీ మెకిల్రాయ్ (నార్తర్న్ ఐర్లాండ్, గోల్ఫ్) వరల్డ్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ (దివ్యాంగులు): గాబ్రియెల్ అరుజో సాంతోస్ (బ్రెజిల్, స్విమ్మింగ్) వరల్డ్ యాక్షన్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్: చోల్ కిమ్ (అమెరికా, స్నో బోర్డ్) వరల్డ్ యంగ్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్: లామినె యామల్ (స్పెయిన్, ఫుట్బాల్) స్పోర్టింగ్ ఇన్స్పిరేషన్ అవార్డు: టోనీ క్రూస్ (జర్మనీ, ఫుట్బాల్) లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు: నాడియా కొమనెసి (రొమేనియా, జిమ్నాస్టిక్స్) స్పోర్ట్ ఫర్ గుడ్ అవార్డు: ఫుట్బాల్ మాస్ -
శివ నర్వాల్ పసిడి గురి
కైరో: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) జూనియర్ ప్రపంచకప్ టోర్నీలో తొలి రోజు భారత్కు మూడు పతకాలు లభించాయి. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్ శివ నర్వాల్ స్వర్ణ పతకం సొంతం చేసుకోగా... చిరాగ్ శర్మ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో శివ నర్వాల్ 241.8 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచాడు. 240 పాయింట్లతో సోదిక్జోన్ అబ్దుల్లాయెవ్ రజత పతకం... 218.9 పాయింట్లతో చిరాగ్ శర్మ కాంస్య పతకం నెగ్గారు. ఫైనల్లో పోటీపడ్డ భారత మూడో షూటర్ అభినవ్ దేశ్వాల్ 136.7 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచాడు. జూనియర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో భారత షూటర్ పనాహ్ బుగ్రా రజత పతకం సంపాదించింది. ఫైనల్లో పనాహ్ 250.6 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచింది. -
పంజాబ్ క్రీడాకారులకు హాకీ దిగ్గజం బోవెలాండర్ పాఠాలు!
చండీగఢ్: నెదర్లాండ్స్ హాకీ దిగ్గజం ఫ్లోరిస్ జాన్ బోవెలాండర్తో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ భేటీ అయ్యారు. ప్రతిష్టాత్మక ఆసియా చాంపియన్స్ ట్రోఫీకి ముందు రాష్ట్రంలో హాకీని మరింత బలోపేతం చేయడానికి బోవెలాండర్ సేవలను వినియోగించుకోవాలని ఆయన ప్రతిపాదించారు. ప్రస్తుతం నెదర్లాండ్స్ పర్యటనలో ఉన్న భగవంత్ మాన్... ఇందులో భాగంగా హాకీపై బోవెలాండర్తో సుదీర్ఘంగా చర్చించారు. హాకీకి పునరై్వభవం తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా బోవెలాండర్ అసాధారణ ప్రతిభను మాన్ ప్రశంసించారు. ఆయన క్రీడా ప్రయాణం ప్రపంచ వ్యాప్తంగా యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. ఈ ఏడాది అక్టోబర్లో జరగనున్న ఆసియా చాంపియన్స్ ట్రోఫీకి పంజాబ్ ఆతిథ్యమివ్వనుంది. ప్లేయర్ల నైపుణ్యాన్ని మరింత మెరుగు పరిచేందుకు పంజాబ్కు రావాల్సిందిగా బోవెలాండర్ను భగవంత్ మాన్ ఆహ్వానించారు. దీనికి డచ్ దిగ్గజం సుముఖత వ్యక్తం చేశాడు. చాంపియన్స్ ట్రోఫీకి ముందు బోవెలాండర్ భారత్కు రానున్నట్లు మాన్ వెల్లడించారు. ‘క్రీడా ప్రతిభను పెంపొందించడానికి, హాకీని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి పంజాబ్ కట్టుబడి ఉంది. ఆసియా చాంపియన్స్ ట్రోఫీకి తొలిసారి పంజాబ్ ఆతిథ్యమివ్వనుంది. భారత హాకీలో ఎప్పటి నుంచో పంజాబ్ కీలక పాత్ర పోషిస్తూ వస్తోంది. 50 మందికి పైగా పంజాబ్ ప్లేయర్లు హాకీలో ఒలింపిక్ పతకాలు సాధించారు. పది మందికిపైగా పంజాబ్ ప్లేయర్లు విశ్వక్రీడల్లో దేశానికి నాయకత్వం వహించారు. పంజాబీ ప్లేయర్ లేకుండా భారత హాకీ జట్టును ఊహించడం కష్టం. పారిస్ ఒలింపిక్స్లో కాంస్య పతకం గెలిచిన భారత జట్టులోనూ పది మంది పంజాబీ ప్లేయర్లు ఉన్నారు. అలాంటి ఘనచరిత్ర ఉన్న ప్లేయర్లకు దిశానిర్దేశం చేసేందుకు నెదర్లాండ్స్ హాకీ దిగ్గజం బోవెలాండర్ అంగీకరించారు. ఆసియా చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆయన మన ప్లేయర్లలో స్ఫూర్తినింపనున్నారు’ అని భగవంత్ మాన్ వెల్లడించారు. -
ఆసియా క్రీడల ప్రసార హక్కులు సోనీ నెట్వర్క్కు
న్యూఢిల్లీ: ఈ ఏడాది సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్ వేదికగా జరగనున్న 20వ ఆసియా క్రీడల ప్రసార హక్కులను సోనీ పిక్చర్స్ నెట్వర్క్ కైవసం చేసుకుంది. దీంతో ఏషియన్ గేమ్స్ను సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ చానల్స్తో పాటు సోనీ లివ్ యాప్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. చైనా వేదికగా జరిగిన గత ఆసియా క్రీడల్లో భారత్ 107 పతకాలతో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. ‘ఆసియా క్రీడా మహోత్సవ ప్రసార హక్కులు దక్కించుకోవడం గర్వంగా ఉంది. సోనీ టీవీకి ఈ అవకాశం రావడం ఇది మూడోసారి’ అని సోనీ నెట్వర్క్ ప్రతినిధి రాజేశ్ కౌల్ అన్నారు. జపాన్ వేదికగా జరగనున్న ఏషియన్ గేమ్స్లో మొత్తం 41 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఇందులో 32 ఒలింపిక్ క్రీడలు ఉన్నాయి. వీటితో పాటు మిక్స్డ్ మార్షల్, సర్ఫింగ్ వంటి కొత్త క్రీడలను సైతం ఇందులో చేర్చారు. ఈ క్రీడల్లో భాగంగా క్రికెట్, టెన్నిస్, కబడ్డీ, సెపక్తక్రా, కురాశ్ వంటి పలు క్రీడాంశాల్లో పోటీలు జరగనున్నాయి. ‘గత ఆసియా క్రీడల్లో భారత్ అద్భుత ప్రదర్శన కనబర్చంది. తొలిసారి వంద పతకాల మైలురాయిని దాటింది. ఇది దేశంలో పెరుగుతున్న క్రీడా సంస్కృతికి నిదర్శనం. ఈసారి అంతకుమించిన ప్రదర్శనతో రికార్డులు తిరగరాయడం ఖాయమే. అలాంటి స్ఫూర్తిదాయక క్షణాలను ప్రసారం చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’ అని రాజేశ్ వెల్లడించారు. -
తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడిగా శ్రీధర్ బాబు
సాక్షి, హైదరాబాద్: వచ్చే నాలుగేళ్ల కాలానికి తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం (బీఏటీ) నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. హైదరాబాద్లో జరిగిన వార్షిక సాధారణ సర్వసభ్య సమావేశంలో కొత్త కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయింది. తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడిగా ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నియమితులయ్యారు. ఉపాధ్యక్షులుగా వి.చాముండేశ్వరనాథ్, వై.ఉపేందర్ రావు, జి.వెంకట రావు, పి.రమేశ్ రెడ్డి, ఉప్పాల శ్రీనివాస్ గుప్తా ఎన్నికయ్యారు. జనరల్ సెక్రటరీగా భారత జట్టు హెడ్ కోచ్ పుల్లెల గోపీచంద్, కోశాధికారిగా కానూరి వంశీధర్ నియమితులయ్యారు. సంయుక్త కార్యదర్శులుగా ఎల్.రవికుమార్, పి.మనోజ్ కుమార్, ఎం.జితేందర్ రెడ్డి, యు.వి.ఎన్.బాబు వ్యవహరిస్తారు. ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా పి.రాంమోహన్ రావు, తోట రంగారావు, కె.శ్రీనివాస రావు, పుల్లూరి సుధాకర్, కొల్లి నాగవేణి ఎన్నికయ్యారు. సలహాదారుడిగా లక్ష్మణ్ కొసరాజు వ్యవహరిస్తారు. -
కేడీ జాదవ్కు ‘పద్మవిభూషణ్’పై తేల్చండి!
ముంబై: ప్రతిష్టాత్మక ఒలింపిక్ క్రీడల్లో భారత్కు తొలి వ్యక్తిగత పతకాన్ని అందించిన మహారాష్ట్ర రెజ్లర్ ఖషాబా దాదాసాహెబ్ (కేడీ) జాదవ్కు ‘పద్మవిభూషణ్’ పురస్కారం అందించే విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని బాంబే హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. దీనికి సంబంధించి గడువునిస్తూ మే 4లోగా తేల్చాలని స్పష్టం చేసింది. 1952 హెల్సింకీ ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన జాదవ్ 1984లో మృతి చెందారు.మరణాంతరం 2001లో ప్రభుత్వం ఆయనకు ‘అర్జున అవార్డు’ను ప్రకటించింది. అయితే దేశంలో రెండో అత్యుత్తమ పౌర పురస్కారం ‘పద్మవిభూషణ్’ను ఆయనకు ప్రకటించాలని కోరుతూ కుస్తీవీర్ ఖషాబా జాదవ్ ఫౌండేషన్ బాంబే హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాఖ్యం దాఖలు చేసింది. జాదవ్ కుమారుడు రంజిత్ ఈ ఫౌండేషన్ను ఏర్పాటు చేశాడు.గతంలో పలుమార్లు అవార్డు విషయంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడంతో ఇప్పుడు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. ఈ అంశంపై విచారించిన బాంబే హైకోర్టు (కొల్హాపూర్ బ్రాంచ్) న్యాయమూర్తులు జస్టిస్ మాధవ్ జామ్దార్, జస్టిస్ ప్రవీణ్ పాటిల్ కేంద్ర ప్రభుత్వానికి తాజాగా సూచనలు చేస్తూ కేసును మే 5కు వాయిదా వేశారు. -
నా ఫేవరెట్ నేనే...
సాధారణంగా ఏ రంగంలో అయినా... ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకునే వాళ్లు... ‘రోల్ మోడల్స్’ను ఆదర్శంగా తీసుకోవడం పరిపాటి! కానీ భారత యువ రెజ్లర్ సుజీత్ కల్కల్ మాత్రం తన అభిమాన ఆటగాడు తానే అని అంటున్నాడు. ప్రాక్టీస్లో భాగంగా ఇతర సీనియర్ రెజ్లర్ల వీడియోలకు బదులు తన వీడియోలే చూసి స్ఫూర్తి పొందుతానని చెబుతున్నాడు. కాగా 2025 జూన్లో జరిగిన అండర్–23 ఆసియా చాంపియన్షిప్ నుంచి మొదలుకొని ఇప్పటి వరకు 65 కేజీల విభాగంలో పరాజయం ఎరగకుండా ముందుకు సాగుతున్న సుజీత్... బరిలోకి దిగిన ప్రతి టోర్నమెంట్లో పసిడి పతకం చేజిక్కించుకున్నాడు.ఇటీవల కిర్గిస్తాన్ రాజధాని బిష్కెక్లో జరిగిన ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో తొలిసారి స్వర్ణం నెగ్గిన సుజీత్... తనను ఎవరూ ఓడించలేరు అనే భ్రమలో మాత్రం లేనని వెల్లడించాడు.ఆ వివరాలు అతడి మాటల్లోనే...‘‘నేను ఎవరినీ అభిమానించను. ఇంకా చెప్పాలంటే నా అభిమాన రెజ్లర్ను నేనే. నా వీడియోలే ఎక్కువ చూస్తాను. ఆదివారం మొత్తం అదే పని పెట్టుకుంటా... నా ప్రాక్టీస్ బౌట్ల వీడియోలు చూసి స్వీయ విశ్లేషణ చేసుకుంటా. అప్పుడప్పుడూ యోగేశ్వర్ దత్, బజరంగ్ పూనియా, అమిత్ ధన్కర్ వంటి సీనియర్ల బౌట్లను పరిశీలిస్తా. వారి వేగం, బలం గమనిస్తా. కానీ ఎక్కువ శాతం మాత్రం నా బౌట్ వీడియోలే చూస్తా. దానికి ఇంకో కారణం కూడా ఉంది. ప్రాక్టీస్కే అధిక సమయం పోతుంది. ఆదివారం మాత్రమే వీలు దొరకుతుంది. అప్పుడు నా బౌట్లు చూసి అందులో లోపాలను గుర్తించి వాటిని అధిగమించేందుకు ప్రయత్నిస్తుంటా. నన్ను ఎవరూ ఓడించలేరు అనే భ్రమలో లేను. ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాలను చేరుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తుంటారు. ఆ రోజు పోటీలో ఎవరు మెరుగైన ప్రదర్శన కనబర్చారు అనేదానిపైనే విజయం ఆధారపడి ఉంటుంది. నా వరకైతే ఈ జోరు కొనసాగిస్తూ దేశానికి మరిన్ని పతకాలు అందించాలనుకుంటున్నా. గత రెండేళ్లుగా భారత రెజ్లర్ల చేతిలో ఒక్క బౌట్లోనూ ఓడలేదు. కానీ ఆసియా క్రీడల్లో ఇరాన్, జపాన్ రెజ్లర్లతో గట్టి పోటీ ఎదురవడం ఖాయం. దాని కోసం ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నా. మెరుగవ్వాల్సిన అంశాలపై దృష్టి పెట్టా. రెజ్లింగ్లో డిఫెన్స్దే కీలకపాత్ర. నా ప్రధాన బలం కూడా అదే. అటాకింగ్ గేమ్ పెంపొందించుకునేందుకు సాధన చేస్తున్నా. ఓర్పు పెంచుకుంటూ ప్రతిదాడిలో మరింత మెరుగయ్యేందుకు ప్రయత్నిస్తున్నా. భారత ఫ్రీస్టయిల్ హెడ్ కోచ్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలోని జాతీయ శిబిరం ఎంతో ఉపయుక్తకరంగా ఉంది. ప్రతి అంశంలో మరింత మెరుగయ్యేందుకు కోచ్లు అనునిత్యం సాధన చేయిస్తున్నారు. దాని ఫలితాలు మున్ముందు మీరంతా చూస్తారు. నా బరువు కేటగిరీ రెజ్లర్లతోనే కాకుండా... నా కంటే ఎక్కువ బరువున్న వారితోనూ సాధన చేస్తున్న. దాని వల్ల శక్తిని పెంపొందించుకోవడంతో పాటు... మరిన్ని మెలకువలు నేర్చుకోవచ్చు. ఈ ఏడాది ఆసియా క్రీడలతో పాటు ప్రపంచ చాంపియన్షిప్ జరగనున్నాయి. ఆ రెండు నాకు ఎంతో ముఖ్యం. నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఆసియా క్రీడల్లో వంద శాతం కష్టపడతా. ఇక గత ప్రపంచ చాంపియన్షిప్లో త్రుటిలో పతకం కోల్పోయా. ఈసారి అలాంటి తప్పిదాలకు తావివ్వకుండా పతకంతో తిరిగి వస్తా. అండర్–23 విభాగానికి సీనియర్ స్థాయికి పెద్ద తేడా ఏమీ లేదు. అందులోనూ ఇలాంటి పోటీనే ఉంటుంది. అయితే ప్రపంచ చాంపియన్షిప్ స్థాయి అన్నిటికంటే పెద్దది. అక్కడ పోటీ తీవ్రత అధికం. మామూలుగా ఎవరైనా మట్టిలో రెజ్లింగ్ ప్రారంభిస్తారు. కానీ నేను కెరీర్ ప్రారంభం నుంచే మ్యాట్పై పోటీపడటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడిని. మా నాన్న నన్ను ఆ దిశగా ప్రోత్సహించారు. దాని వల్ల నా డిఫెన్స్ మెరుగైంది. సీనియర్ వరల్డ్ చాంపియన్షిప్లో 10–15 సెకన్లు చేసిన చిన్న తప్పిదం వల్ల పతకం దక్కలేదు. కొన్నిసార్లు ఒత్తిడి కూడా ఫలితంపై ప్రభావం చూపుతుంది. ఇక మీదట అలాంటి తప్పులు చేయను. అభిమానుల ఆదరణ అమోఘం. వారు నా నుంచి మరిన్ని పతకాలు ఆశిస్తున్నారు. తప్పక వారి కోరిక నెరవేరుస్తా. నా వరకైతే నేను పతకాలు సాధించగలనని వంద శాతం నమ్ముతున్నా. కానీ భవిష్యత్తును ఎవరూ అంచనా వేయలేరు కదా!సంగీతంతో సేదతీరుతా...రోజులో ఎక్కువ శాతం మ్యాట్పై కుస్తీ పట్టడంతోనే సరిపోతుంది. అయితే ఖాళీ దొరికితే మాత్రం సంగీతం వింటాను. అప్పుడప్పుడు సినిమాలు చూస్తుంటా. అయితే అవన్నీ రెజ్లింగ్ తర్వాతే. కొన్ని సార్లు రిఫ్రెష్ అవడానికి పాటలు ఉపయోగపడతాయి. దేశానికి పతకాలు సాధించాలనే లక్ష్యంతో జీవితంలో ఎన్నో ఇష్టమైన విషయాలను పక్కన పెట్టా. కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడపడం చాలా తక్కువ. కెరీర్ కోసం నచ్చిన ఆహారాన్ని కూడా వదులుకున్నా. ఇవన్నీ రెజ్లింగ్ కోసమే. నాన్న దయానంద్ రెజ్లింగ్ కోచ్ కావడంతో ఇంట్లో కూడా ఆటకు సంబంధించిన చర్చ నడుస్తుంది. ఏ క్రీడలోనైనా నిలకడ ముఖ్యం. అదే ఇతరులతో మనల్ని భిన్నంగా చూపుతుంది’’ అని సుజీత్ కల్కల్ పేర్కొన్నాడు.– సాక్షి క్రీడా విభాగం -
భారత 95వ గ్రాండ్మాస్టర్గా అరోణ్యక్ ఘోష్
రెండేళ్ల నిరీక్షణకు తెరదించుతూ బెంగాల్కు చెందిన యువ చెస్ ప్లేయర్ అరోణ్యక్ ఘోష్ గ్రాండ్మాస్టర్ (జీఎం) హోదా సంపాదించాడు. బ్యాంకాక్ చెస్ క్లబ్ ఓపెన్ టోర్నమెంట్లో 22 ఏళ్ల ఈ కోల్కతా ప్లేయర్ జీఎం హోదా ఖరారు కావడానికి అవసరమైన మూడో నార్మ్ను సాధించాడు. నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత అరోణ్యక్ ఏడు పాయింట్లు స్కోరు చేసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. 2023లో సాంట్స్ ఓపెన్లో తొలి జీఎం నార్మ్ పొందిన అరోణ్యక్... 2024లో అనెమాస్ మాస్టర్స్ టోర్నీలో రెండో జీఎం నార్మ్ దక్కించుకున్నాడు. ర్యాపిడ్ ఫార్మాట్లో జాతీయ చాంపియన్గా ఉన్న అరోణ్యక్ గత ఏడాది ప్రపంచకప్ టోరీ్నకి అర్హత సాధించాడు. తొలి రౌండ్లో మటెసుజ్ బార్టెల్ (పోలాండ్)ను ఓడించిన అతను రెండో రౌండ్లో లెవోన్ అరోనియన్ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్లో 401వ ర్యాంక్లో ఉన్న అరోణ్యక్ ఖాతాలో 2533 ఎలో రేటింగ్ పాయింట్లున్నాయి. -
రెజ్లింగ్ ఫ్యాన్స్కు బిగ్ షాక్!
డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లింగ్ అభిమానులకు బిగ్ షాక్ తగిలింది. స్టార్ రెజ్లర్ బ్రాక్ లెస్నర్ (Brock Lesnar) అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించారు. రెజ్లిమేనియా 42 ఈవెంట్లో భాగంగా.. యువ రెజ్లర్ ఒబా ఫెమి చేతిలో లెస్నర్ ఓటమి పాలయ్యాడు. తదనంతరం లెస్నర్ చర్యతో ఫ్యాన్స్ దిగ్భ్రాంతికి లోనయ్యారు. వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్(WWE) అనేది ‘స్క్రిప్టెడ్ రెజ్లింగ్’ అనేది అందరికీ తెలిసే ఉంటుంది. ఈ ఫైటింగ్లో పాల్గొనే రెజ్లర్లు నిపుణుల సమక్షంలోనే ప్రాక్టీస్ చేసి స్టేజ్ ప్రదర్శనలు ఇస్తుంటారు. భారత కాలమానం ప్రకారం.. సోమవారం వేకువ జామున నెవెడా స్టేట్ లాస్ వెగాస్లో అలెజెయింట్ స్టేడియం వేదికగా రెజ్లిమేనియా 42 మెయిన్ ఈవెంట్ జరిగింది. అయితే.. ఆద్యంతం ఆకట్టుకుంటుందని భావించిన లెస్నర్-ఒబా మ్యాచ్.. నిమిషాల వ్యవధిలో ముగియడం రెజ్లింగ్ ఫ్యాన్స్ను నిరాశపరిచింది. డబ్ల్యూడబ్ల్యూఈలో ఇంతకాలం పవర్హౌస్గా పేరున్న లెస్నర్ ఏ దశలోనూ ఒబాకు పోటీ ఇవ్వలేకపోయాడు. తన ఫినిషింగ్ మూవ్ ఎఫ్-5 ఇచ్చినా.. ఒబా ఫెమి లేచి నిల్చోవడంతో అంతా షాక్లో ఉండిపోయారు. ఆ వెంటనే తన పవర్ బాంబ్ మూవ్తో ఒబా మ్యాచ్ను ముగించాడు. 48 ఏళ్ల వయసున్న బ్లాక్ లెస్నర్.. 27 ఏళ్ల నైజీరియా రెజ్లర్ ఒబా ఫెమి చేతిలో ఓటమితో అభిమానులు షాక్కు గురయ్యారు. ఆ వెంటనే స్టేజ్పైనే కూర్చుండిపోయిన లెస్నర్ తన గ్లౌస్, షూస్ను వదిలి అక్కడి ప్రేక్షకులకు అభివాదం చేస్తూ వీడ్కోలు సందేశం ఇచ్చాడు. తన మేనేజర్ పాల్ హేమన్ను కౌగిలించుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ పరిణామాలు లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూఈ కెరీర్ ముగింపు కావచ్చని భావిస్తున్నప్పటికీ.. ఈ ఏడాది సమ్మర్స్లామ్ ఈవెంట్లో లెస్నర్ చివరి మ్యాచ్ అడొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. BROCK LESNAR RETIRING? 👀Brock left his gear in the ring and hugged Paul Heyman as the crowd cheered thank you after his match at #WrestleMania pic.twitter.com/8ts2gJWYpR— SportsCenter (@SportsCenter) April 19, 2026ఇక.. డబ్ల్యూడబ్ల్యూఈకే ప్రధాన ఈవెంట్గా చెప్పుకునే రెజ్లిమేనియా ఈసారి చప్పగా సాగింది. ఏప్రిల్ 18–19 తేదీల్లో రెండు రోజులపాటు సాగాయి మ్యాచ్లు. లక్ష మందికి పైగా అభిమానులు హాజరైన ఈ ఈవెంట్కు రెజ్లర్(రిటైర్డ్)-యాక్టర్ జాన్ సీనా హోస్ట్గా వ్యవహరించాడు. అయితే మ్యాచ్ ఫలితాలు చాలా వరకు అభిమానులు పెదవి విరుస్తున్నారు. మరీ ముఖ్యంగా లెస్నర్ను అంత దారుణంగా ఓడిపోయేలా స్క్రిప్ట్ రాయడంపై మండిపడుతున్నారు. అన్డిస్ప్యుటెడ్ చాంపియన్షిప్ కోసం జరిగిన మ్యాచ్లో కోడి రోడ్స్.. రాండీ ఆర్టన్ను ఓడించాడు. తద్వారా కోడి రోడ్స్ తన చాంపియన్షిప్ను విజయవంతంగా కాపాడుకున్నాడు. అయితే ఈ మ్యాచ్ ఫలితంపైనా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక రోమన్ రేన్స్, సీఎం పంక్ను ఓడించి హెవీవెయిట్ టైటిల్ను నెగ్గాడు. ఉమెన్స్ వరల్డ్ చాంపియన్షిప్ పోరులో లివ్ మోర్గాన్ స్టెఫనీ వాక్వర్పై విజయం సాధించింది. బెక్కీ లించ్, ఏజే లీను ఓడించి ఉమెన్స్ ఇంటర్కాంటినెంటల్ టైటిల్ను గెలుచుకుంది. జేకబ్ ఫాటూ, డ్రూ మెక్ఇంటైర్పై విజయం సాధించాడు. ఉసోస్ & ఎల్ఏ నైట్లు ది విజన్-ఐషోస్పీడ్(ప్రముఖ య్యూట్యూబర్)ను ఓడించారు. రియా రిప్లీ, జేడ్ కార్గిల్ను ఓడించి మహిళల చాంపియన్షిప్ టైటిల్ను గెలిచింది. ట్రిక్ విలియమ్స్, సామీ జేన్ను ఓడించి యూస్ చాంపియన్షిప్ టైటిల్ను గెలిచాడు. ఫిన్ బాలర్, డొమినిక్ మిస్టీరియోను ఓడించాడు. గుంథర్, సెత్ రోలిన్స్ను ఓడించాడు. అయితే గుంథర్-రోలిన్స్ మ్యాచ్ ఒక్కటే ఈ ఈవెంట్కు హైలైట్గా నిలిచింది. -
బాలాజీ జోడీకి డబుల్స్ టైటిల్
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ డబుల్స్ ప్లేయర్ శ్రీరామ్ బాలాజీ తన కెరీర్లో 18వ ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్ను సాధించాడు. పోర్చుగల్లో జరిగిన ఒయిరాస్ ఏటీపీ–125 చాలెంజర్ టోర్నీలో శ్రీరామ్ బాలాజీ (భారత్)–నీల్ ఒబెర్లేట్నర్ (ఆ్రస్టియా) ద్వయం విజేతగా నిలిచింది. బారియెంటోస్ (కొలంబియా)–బెహర్ (గ్రీస్) జోడీతో జరిగిన ఫైనల్లో బాలాజీ–ఒబెర్లేట్నర్ జంట 6–7 (7/9), 6–4, 11–9తో ‘సూపర్ టైబ్రేక్’లో గెలిచింది. ఈ ఏడాది బాలాజీ–ఒబెర్లేట్నర్లకు నాలుగో డబుల్స్ టైటిల్ కావడం విశేషం. ఒక గంట 49 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో బాలాజీ, ఒబెర్లేట్నర్ ఏడు ఏస్లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్లు సాధించింది. తొలి సర్వీస్లో 38 పాయింట్లు, రెండో సర్వీస్లో 19 పాయింట్లు సంపాదించింది. టైటిల్ గెలిచిన బాలాజీ–ఒబెర్లేట్నర్లకు 9,010 యూరోల (రూ. 9 లక్షల 81 వేలు) ప్రైజ్మనీతోపాటు 125 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
జు వెన్జున్తో పోరుకు సిద్ధం: వైశాలి
చెన్నై: మహిళల ప్రపంచ చెస్ చాంపియన్షి ప్ టైటిల్ పోరు కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని భారత గ్రాండ్మాస్టర్ వైశాలి వ్యాఖ్యానించింది. సైప్రస్లో గతవారం ముగిసిన క్యాండిడేట్స్ టోర్నీ మహిళల విభాగంలో తమిళనాడుకు చెందిన 24 ఏళ్ల వైశాలి విజేతగా నిలిచింది. ఆదివారం ఉదయం స్వస్థలం చెన్నైకు చేరుకున్న వైశాలికి ఘనస్వాగతం లభించింది. క్యాండిడేట్స్ టోర్నీ విజేత హోదాలో వైశాలికి ప్రస్తుత ప్రపంచ చాంపియన్ జు వెన్జున్ (చైనా)తో ప్రపంచ చాంపియన్షిప్ మ్యాచ్లో తలపడే అవకాశం లభించింది. క్లాసికల్ ఫార్మాట్లో జు వెన్జున్ 2018 నుంచి విశ్వవిజేతగా కొనసాగుతోంది. ‘నా కల నిజమైనట్లు అనిపిస్తోంది. నేను ఎన్నో ప్రపంచ చాంపియన్షి ప్ మ్యాచ్లను చూశాను. ఇప్పుడు నేనే ప్రపంచ చాంపియన్షి ప్ మ్యాచ్ ఆడబోతున్నాను. ఈ పోరు కోసం నేను ఎదురుచూస్తున్నాను’ అని వైశాలి తెలిపింది. ఈ ఏడాది పురుషుల, మహిళల విభాగాల్లో ప్రపంచ చాంపియన్షి ప్ టైటిల్ పోరులో భారత గ్రాండ్మాస్టర్లు, తమిళనాడు ప్లేయర్లు (గుకేశ్, వైశాలి) బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ చాంపియన్షి ప్ మ్యాచ్ల ఆతిథ్య హక్కుల కోసం బిడ్ దాఖలు చేయాలని అఖిల భారత చెస్ సమాఖ్య నిర్ణయం తీసుకుంది. -
రేసింగ్లో విషాదం.. ఏడు కార్లు ఒకదానితో ఒకటి ఢీ!
ఫార్ములావన్ రేసింగ్లో విషాదం చోటుచేసుకుంది. శనివారం జర్మనీలోని నుర్బుర్గ్ రింగ్లో జరిగిన నుర్బుర్గ్ రింగ్ లాంగ్స్రెకెన్ సిరీస్ (ఎన్ఎస్ఎల్) క్వాలిఫయింగ్ రేసు విషాదాంతమైంది. ఏడు రేసింగ్ కార్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టడంతో వెటరన్ రేసింగ్ డ్రైవర్ 66 ఏళ్ల జుహా మియెట్టినెన్ ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం జుహా మియెట్టియెన్ బీఎండబ్ల్యూ 325ఐ రేసింగ్ కారుకు డ్రైవర్గా ఉన్నాడు. ఇక ఇదే రేసులో పాల్గొన్న నాలుగుసార్లు ఫార్ములా వన్ చాంపియన్ మాక్స్ వెర్స్టాపెన్ సహా మిగతా డ్రైవర్లు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. నాలుగు గంటలపాటు జరగాల్సిన ఈవెంట్లో రేస్ ప్రారంభమైన 25 నిమిషాలకే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ట్రాక్లోని క్లోస్టర్టాల్ వద్ద ఎత్తులో ఉన్నప్పుడు సెకన్ల వ్యవధిలో ఏడు కార్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే రేసును నిలిపేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పారా మెడికల్ సిబ్బంది జుహా మియెట్టియెన్ను కారులో నుంచి బయటికి తీసినప్పటికీ అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మిగతా వారిని ఆసుపత్రికి తరలించారు. ఇందులో వెర్స్టాపెన్ కూడా ఉన్నాడు. కాగా మియెట్టియెన్ మరణంపై ఎన్ఎస్ఎల్ నిర్వాహకులు విచారం వ్యక్తం చేశారు. ఇక మోటార్ స్పోర్ట్స్ నియంత్రణ సంస్థ (ఎఫ్ఐఏ) విచారం వ్యక్తం చేసింది. మియెట్టియెన్ మృతికి సంతాపం తెలిపిన ఎఫ్ఐఏ అతని కుటుంబసభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలిపింది. ఇక షెడ్యూల్ ప్రకారం ఆదివారం రేస్ జరుగుతుందని ఎన్ఎస్ఎల్ తెలిపింది. అయితే రేస్ ప్రారంభానికి ముందు మియెట్టియెన్ మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించనున్నారు. ఈ రేసులో మాక్స్ వెర్స్టాపెన్తో పాటు మెర్సిడెస్ రేసర్ లుకాస్ ఆర్ కూడా పాల్గొననున్నాడు. కాగా జుహా మియెట్టియెన్ మరణంపై మాక్స్ వెర్స్టాపెన్ స్పందించాడు. ‘మియెట్టియెన్ మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’ అని పోస్టు పెట్టాడు. View this post on Instagram A post shared by 24hNürburgring (@24hnbr) -
విభిన్న మస్కట్లకు ఆహ్వానం
న్యూఢిల్లీ: భారత్ వేదికగా జరగనున్న ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ కోసం ప్రత్యేక మస్కట్ రూపొందించేందుకు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) దేశవ్యాప్త పోటీని ప్రకటించింది. 17 ఏళ్ల తర్వాత భారత్లో జరుగనున్న ఈ పోటీలకు ‘బాయ్’ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో అభిమానులు, దేశ ప్రజలను భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో విభిన్న ఆలోచనలు, సరికొత్త ఆకృతులకు ఆహ్వానం పలుకుతోంది. ఈ ఏడాది ఆగస్టు 17–23 మధ్య న్యూఢిల్లీ వేదికగా ఈ చాంపియన్షిప్ జరగనుంది. గత దశాబ్దంలో ఈ చాంపియన్షిప్లో భారత షట్లర్లు 15 పతకాలు సాధించారు. పీవీ సింధు 2019లో చారిత్రాత్మక స్వర్ణం గెలవగా... గతేడాది సాత్విక్–చిరాగ్ జంట కాంస్యం నెగ్గింది. దేశ క్రీడా ప్రగతిని, సాంస్కృతిక వైభవాన్ని, బ్యాడ్మింటన్ విజయ యాత్రను ప్రతిబింబించే విధంగా మస్కట్ రూపకల్పన ఉండాలని ‘బాయ్’ భావిస్తోంది. వచ్చేనెల 10 వరకు జరగనున్న ఈ పోటీలో ఆసక్తిగల వారు ‘బాయ్’ అధికారిక వెబ్సైట్ https://www. badmintonindia.org/ ద్వారా పేరు నమోదు చేసుకోవచ్చు. విజేతకు రూ. 25 వేల నగదుతో పాటు... ఫైనల్ మ్యాచ్ వీఐపీ పాస్లు ఇవ్వనున్నారు. ‘దేశంలో బ్యాడ్మింటన్కు ఆదరణ బాగా పెరిగింది. ప్రాంతం, సంస్కృతి, నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతీచోట బ్యాడ్మింటన్ ఆడుతున్నారు. ప్రపంచ చాంపియన్షిప్ వంటి ప్రతిష్టాత్మక ఈవెంట్ను మన దేశంలో నిర్వహిస్తున్న సందర్భంగా... అభిమానులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతోనే మస్కట్ పోటీ ప్రారంభించాం’ అని ‘బాయ్’ కార్యదర్శి సంజయ్ మిశ్రా అన్నారు. -
2–2తో సమం
బ్యూనస్ ఎయిర్స్: ప్రపంచకప్, ఆసియా క్రీడలకు సన్నాహాల్లో భాగంగా అర్జెంటీనాలో పర్యటించిన భారత మహిళల హాకీ జట్టు ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. నాలుగు మ్యాచ్ల సిరీస్ను 2–2తో సమంగా ముగించింది. తొలి రెండు మ్యాచ్ల్లో ఓడిపోయిన భారత జట్టు తదుపరి రెండు మ్యాచ్ల్లో గెలిచి సిరీస్ను ‘డ్రా’ చేసుకుంది. తొలి మ్యాచ్లో భారత జట్టు 2–4తో ఓడిపోయింది. భారత్ తరఫున నవ్నీత్ కౌర్, అన్ను ఒక్కో గోల్ చేశారు. రెండో మ్యాచ్ను టీమిండియా 1–2తో చేజార్చుకుంది. భారత్ తరఫున ఇషిక ఏకైక గోల్ చేసింది. మూడో మ్యాచ్లో భారత బృందం 2–1తో గెలిచింది. భారత జట్టుకు నవ్నీత్ కౌర్, నేహా ఒక్కో గోల్ అందించారు. చివరిదైన నాలుగో మ్యాచ్లో భారత జట్టు ‘షూటౌట్’లో 3–2తో నెగ్గింది. -
ఉబెర్ కప్నుంచి తప్పుకున్న గాయత్రి – ట్రెసా జోడి
ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ టీమ్ ఈవెంట్ ఉబెర్ కప్లో భారత అవకాశాలకు దెబ్బ పడింది. భారత డబుల్స్ జోడి పుల్లెల గాయత్రి – ట్రెసా జాలీ ఈ టోర్నీనుంచి తప్పుకుంది. ట్రెసా మడమకు గాయం కావడంతో టీమ్ మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఆసియా చాంపియన్షిప్కు బయల్దేరే ముందు ప్రాక్టీస్లో తన సహచర ప్లేయర్ పాదంపై ట్రెసా కాలు పడటంతో ఆమెకు గాయమైందని భారత డబుల్స్ కోచ్ బి. సుమీత్ రెడ్డి వెల్లడించాడు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న ట్రెసా రీహాబిలిటేషన్ తర్వాత కోలుకునే అవకాశం ఉంది. గాయత్రి – ట్రెసా స్థానంలో ఉబెర్ కప్లో భారత్కు ప్రాతినిధ్యం వహించేందుకు శ్రుతి మిశ్రా – ప్రియ కొంజెన్బమ్లను ఎంపిక చేశారు. 2023లో జాతీయ చాంపియన్గా నిలిచిన ఈ జోడి 2024లో ఆసియా చాంపియన్షిప్ గెలిచిన జట్టులో సభ్యులుగా ఉన్నారు. డెన్మార్క్లోని హార్సెన్స్ వేదికగా ఏప్రిల్ 24 నుంచి మే 3 వరకు థామస్, ఉబెర్ కప్ టోర్నీలు జరుగుతాయి. మరో వైపు ఈ టోర్నీలో సాధన కోసం భారత పురుషుల డబుల్స్ జోడి సాతి్వక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి డెన్మార్క్ బయల్దేరుతున్నారు. -
అమ్మ తోడుగా...ఆనందంగా
పాఫోస్ (సైప్రస్): ‘ఫిడే’ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలవడం తనకు అంతా కలలా అనిపించిందని భారత గ్రాండ్మాస్టర్ ఆర్.వైశాలి తన స్పందనను వెల్లడించింది. బుధవారం ముగిసిన టోర్నీ చివరి రౌండ్లో కాటరీనా లాగ్నో (ఉక్రెయిన్)ను ఓడించి వైశాలి అగ్ర స్థానంతో ముగించింది. ఫలితంగా ఈ ఏడాది చివర్లో చైనా గ్రాండ్మాస్టర్ జు వెన్జున్తో వరల్డ్ చెస్ చాంపియన్షిప్లో తలపడేందుకు ఆమె అర్హత సాధించింది. ‘చాలా అద్భుతంగా. అంతా ఒక కలలా అనిపించింది. ఒక పాయింట్తో ఆధిక్యంలో ఉన్న సమయంలో జూ జినర్ చేతిలో ఓటమి ఒక్కసారిగా దెబ్బతీసింది. ఆ సమయంలో అందరూ పోటీలోకి వచ్చారు. అయితే చివరి రెండు రౌండ్లు మరింత ఏకాగ్రతతో పట్టుదలగా ఆడాను. నా అత్యుత్తమ ఆటను ప్రదర్శించి గెలవడంతో ఈ సంతోష క్షణాలు దక్కాయి’ అని వైశాలి పేర్కొంది. ఫామ్లోకి వచ్చి... గత రెండేళ్లుగా వైశాలి ప్రదర్శన గొప్పగా లేదు. ముఖ్యంగా సంవత్సర కాలంలో వరుసగా పరాజయాలు పలకరించాయి. వరల్డ్ కప్లో క్వార్టర్ ఫైనల్లో పరాజయం సహా దాదాపు అన్ని టోర్నీల్లో ఆరంభ రౌండ్లలోనే ఆమె ఆట ముగిసింది. ఒక్క గ్రాండ్స్విస్ టోర్నీలో మాత్రమే ఆమె చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇచ్చింది. టైబ్రేక్లో టైటిల్ సాధించిన వైశాలి గ్రాండ్స్విస్ను నిలబెట్టుకున్న తొలి ప్లేయర్గా ఘనత సాధించింది. ‘క్యాండిడేట్స్ టోర్నీ కోసం చాలా చాలా కష్టపడ్డాను. గత ఏడాది కాలంలో నా వైఫల్యాలను బట్టి చూస్తే రెట్టింపు సమయం సన్నద్ధం కావాల్సి వచ్చింది. సరైన సమయంలో ఫామ్లోకి రావడంతో గ్రాండ్స్విస్ విజ యం లభించింది. దాని వల్ల నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ గెలుపుతోనే నా జట్టు సభ్యులతో కలిసి మరింతగా దృష్టి పెట్టాను. గత రెండేళ్లలో ఆశించిన విజయాలు రాకపోయినా... ఆ కష్టమంతా ఇక్కడ ఫలితాన్ని అందించింది’ అని వైశాలి తన ఆనందాన్ని ప్రదర్శించింది. తక్కువ రేటింగ్ ఉన్నా... క్యాండిడేట్స్ టోర్నీలో పాల్గొన్న ఎనిమిది మందిలో అందరికంటే తక్కువ రేటింగ్ వైశాలిదే. మిగతా ఏడుగురు ఆమెకంటే మెరుగైన స్థితిలో ఉన్నవారే. ప్రస్తుతం ప్రపంచ క్లాసిక్ ర్యాంకింగ్స్లో 19వ స్థానంలో ఉన్న వైశాలి ఈ రకమైన ప్రతికూలతను కూడా అధిగమించి టైటిల్ సాధించడం ఆమె విజయాన్ని మరింత ప్రత్యేకంగా మార్చింది. ‘నాకు అందరికంటే తక్కువ సీడింగ్ ఉందనే విషయం బాగా తెలుసు. అయితే నా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తే ఎవరితోనైనా పోటీ పడి గెలవగలనని నమ్మాను. నా జట్టు సహచరులు నాపై నమ్మకం ఉంచారు. నన్ను అడుగడుగునా ప్రోత్సహిస్తూ ఫలితం సాధించేలా చూశారు. ఇలాంటి పెద్ద టోర్నీల్లో రేటింగ్కంటే గేమ్ల కోసం చేసే ప్రత్యేక సన్నద్ధతే కీలకంగా మారుతుంది’ అని వైశాలి అభిప్రాయపడింది. కుటుంబ అండదండలే కారణం... క్యాండిడేట్స్ టోర్నీలో మహిళల విభాగంలో వైశాలి బరిలోకి దిగితే మరో వైపు ఓపెన్ కేటగిరీలో ఆమె తమ్ముడు ప్రజ్ఞానంద కూడా పోటీ పడ్డాడు. ఎప్పటిలాగే వారి తల్లి నాగలక్ష్మి తన పిల్లలకు తోడుగా ఈ టోర్నీకి కూడా వచ్చింది. ‘కుటుంబ సభ్యులు తోడుగా ఉంటే ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ముఖ్యంగా తీవ్ర ఒత్తిడి ఉండే ఇలాంటి ఈవెంట్ల సమయంలో మానసికంగా కూడా అండదండలు అవసరం. అమ్మ, తమ్ముడు కూడా ఇక్కడే ఉండటం నాకు ఎంతో ప్రేరణగా నిలిచింది. వారు ప్రతీ దశలో నాకు మద్దతుగా నిలిచారు’ అని ఆమె భావోద్వేగంతో చెప్పింది. -
అటు రణరంగం... ఇటు జయకేతనం
ఒకవైపు స్వదేశంలో భీకర యుద్ధం... మరోవైపు క్రీడాంగణంలో ఇరాన్ మల్లయోధుల ఆధిపత్యం... అన్ని ప్రతికూలతలను అధిగమించి ఇరాన్ రెజ్లర్లు మరోసారి ఆసియా చాంపియన్షిప్లో పతకాల పంట పండించారు. ఈ మెగా ఈవెంట్కు సన్నద్ధమవుతున్న దశలో ఇరాన్లో యుద్ధం జరుగుతోంది. అయినప్పటికీ దాని ప్రభావం పడకుండా ఇరాన్ రెజ్లర్లు కిర్గిస్తాన్ రాజధాని బిష్కెక్లో గతవారం ముగిసిన ఆసియా చాంపియన్షిప్లో ఏకంగా 18 పతకాలు సాధించారు. ఇందులో ఆరు స్వర్ణాలు, ఆరు రజతాలు, ఆరు కాంస్యాలు ఉన్నాయి. దాంతో ఫ్రీస్టయిల్, గ్రీకో రోమన్ స్టయిల్లో ఇరాన్కే టీమ్ టైటిల్స్ లభించాయి. ప్రాణభయం వెంటాడుతున్నా అంతర్జాతీయ స్థాయిలో ఇరాన్ మల్లయోధులు తమ జెండా రెపరెపలాడించిన తీరుపై ప్రత్యేక కథనం... సాక్షి క్రీడావిభాగం ‘ఈ పతకం నాకు ఎంతో ప్రత్యేకం. నా దేశం ఉన్న పరిస్థితుల్లో దీన్ని సాధించడం అత్యంత సంతృప్తికరం. గతంలో ఎన్నో పతకాలు గెలిచినా దీని స్థానం వాటన్నింటికంటే ఎక్కువ’ ఇది ఇరాన్ స్టార్ రెజ్లర్ అమీర్ హుస్సేన్ జారే చేసిన వ్యాఖ్య. 2020 టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం, 2024 పారిస్ ఒలింపిక్స్లో రజతం సహా అంతర్జాతీయ స్థాయిలో లెక్కకు మిక్కిలి పతకాలు సాధించిన అమీర్ హుస్సేన్... ఆసియా చాంపియన్షిప్లో సాధించిన పతకానికి అంత ప్రత్యేక స్థానం ఇవ్వడం వెనక... ఇరాన్ ప్రస్తుత పరిస్థితుల ప్రభావం ఉంది. పురుషుల 125 కేజీల ఫ్రీస్టయిల్లో స్వర్ణ పతకం నెగ్గిన తర్వాత అమీర్ భావోద్వేగానికి గురవుతూ తన జాతీయ జెండాకు సెల్యూట్ చేస్తున్న దృశ్యం ప్రతి ఒక్కరినీ కదిలించింది. ఒకవైపు దేశంలో ఎక్కడ చూసిన బాంబు దాడులు, మిస్సైల్ మోతలతో దద్దరిల్లుతున్నా... ఇరాన్ రెజ్లర్లు మాత్రం ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో తమ ఆధిపత్యాన్ని వదులుకోలేదు. స్టేడియంపై బాంబుదాడితో ప్లేయర్లంతా పారిపోవాల్సిన పరిస్థితులు ఎదురైనా... ప్రాక్టీస్ వదలని ఇరాన్ రెజ్లర్లు ఈ పోటీల్లో తమ పోరాట పటిమతో పాటు గుండెధైర్యాన్ని సైతం ప్రపంచానికి చాటారు. సందిగ్ధత మధ్యే... ఆసియా చాంపియన్షిప్లో పాల్గొనడంపై తీవ్ర సందిగ్ధత మధ్య అరకొర ప్రాక్టీస్తోనే ఇరాన్ రెజ్లర్లు ఈ టోర్నీ బరిలోకి దిగారు. ‘ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ ఎదురు కాలేదు. శిక్షణపై దృష్టి కేంద్రీకరించడం పక్కన పెడితే... కనీసం సురక్షితంగా ఉంటే చాలు అనుకోవాల్సిన స్థితి. బాంబు దాడుల్లో ఏ క్షణం ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అనే ఆందోళన మధ్య మా రెజ్లర్లు సాధనపై మనసు లగ్నం చేయలేకపోయారు. ఒకవైపు రెజ్లర్లు సురక్షితంగా ఉండటం... మరోవైపు వారి కుటుంబాల క్షేమంపై ఆందోళన వెరసి ప్రాక్టీస్ అంతంతమాత్రంగానే సాగింది’ అని పెజ్మాన్ చెప్పారు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో ఇరాన్ రెజ్లర్లు సత్తా చాటడం వెనక టీమ్ స్పిరిట్ దాగి ఉంది. కష్టకాలంలో ఒకరికొకరు మద్దతుగా నిలుస్తూ... ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగారు. అందుకు తగ్గ ఫలితం సాధించారు. దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య కంటే... తమ పోరాటం పెద్దది కాదని ఎప్పటికప్పుడు ప్రేరణ పొందుతూ దేశ ప్రజల కోసం ఏదో సాధించాలనే తపనను పతకాల సాధనలో చూపెట్టారు. రోడ్డు మార్గం ద్వారా... ఆసియా చాంపియన్షిప్లో పాల్గొనేందుకు రెజ్లర్లు కిర్గిస్తాన్లోని బిష్కెక్కు వెళ్లాల్సి ఉండగా... బాంబుదాడులతో అంతర్జాతీయ విమానాశ్రయం ధ్వంసం కావడంతో రోడ్డు మార్గాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి దాదాపు 22 గంటల పాటు బస్సులో ప్రయాణించిన అనంతరం రెజ్లర్లు పోటీలు జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. ‘మా దేశంలో రెజ్లింగ్ సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. లాంటి దాడులకు భయపడి మా అస్థిత్వాన్ని కోల్పోకూడదని భావించాం. అందుకే ఎంత కష్టమైనా ఈ టోర్నమెంట్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నాం. దీని కోసం మా కోచ్లు మా కన్నా ఎక్కువ కష్టాలు పడ్డారు. దేశంపై మాకు ఎంతో ప్రేమ ఉంది. అదే మమ్మల్ని ఇక్కడి వరకు చేర్చింది. మ్యాట్పై అడుగు పెట్టిన ప్రతిసారి దేశ ప్రజలు నా వెంట ఉన్నారనే భావన కలుగుతుంది. అదే నాకు మరింత బలాన్ని ఇస్తుంది. ఈ జెండాను రెపరెపలాడించడమే నా లక్ష్యం అని కర్తవ్య బోధ చేసినట్లు అనిపిస్తుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు. ఏం జరిగినా మా దేశాన్ని ప్రేమించడం మాత్రం వదలం. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో ఎంతో మంది చిన్నారులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు. మతాలు, రాజకీయాలకు అతీతంగా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా అణచివేతను ఖండించాల్సిందే’ అని స్వర్ణం గెలిచిన అనంతరం అమీర్ హుసేన్ వెల్లడించాడు. ‘మైదానంపై దాడి హేయమైన చర్య’ తమ అస్థిత్వంపై జరిగిన ఈ దాడిని ఇరాన్ రెజ్లర్లు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ‘మీరు ఎంత ధనవంతులైనా, ఎంత బలీయులైనా... మరొకరిపై మీ శక్తిని ప్రయోగించాల్సిన అవసరం లేదు. మేము ఇరాన్ వాసులం. మా దేశంలో చిన్న భూభాగాన్ని కోల్పోవడానికి కూడా సిద్ధంగా లేము. మా దేశంపై దాడి చేసిన తర్వాత బదులివ్వకుండా ఎలా ఉంటాం. దేశ సరిహద్దులు క్షేమంగా ఉండాలని కోరుకోవడం ప్రతి పౌరుడి హక్కు. ఈ యుద్ధంలో ఇరాన్ తప్పక విజయం సాధిస్తుంది’ అని అమీర్ అన్నాడు. తమ మనసులోని మాటలను ప్రపంచం ముందు పెట్టడానికి ఈ టోర్నమెంట్ బాగా ఉపయోగపడిందని ఇరాన్ రెజ్లర్లు పేర్కొన్నారు. ‘ఐదు ప్రపంచకప్లు నిర్వహించిన ఆజాది మైదానంపై దాడి చేయడం హేయమైన చర్య. యుద్ధంలో ఇలాంటి స్థలాలపై దాడులు చేయడం సబబు కాదు. అయినా వారు మా గుండెధైర్యాన్ని దెబ్బకొట్టలేరు. ఆ స్టేడియం తిరిగి నిచ్చించుకుంటాం’ అని కోచ్ పెజ్మాన్ అన్నాడు.ఆసియా రెజ్లింగ్ చాంపియన్షిప్లో ఇరాన్ పతక వీరులుఫ్రీస్టయిల్ విభాగం: మిలాద్ జహంగీర్ (స్వర్ణం; 57 కేజీలు), అహ్మద్ మసూద్ (కాంస్యం; 61 కేజీలు), సినామెహదీ ఖలీలి (కాంస్యం; 70 కేజీలు), అమీర్ మొహమ్మద్ (కాంస్యం; 74 కేజీలు), కామ్రాన్ ఘసెమ్పూర్ (స్వర్ణం; 86 కేజీలు), మొహమ్మద్ మోబిన్ (స్వర్ణం; 92 కేజీలు), అమీర్ హమీద్ అజార్పిరా (రజతం; 97 కేజీలు), అమీర్ హుస్సేన్ అబ్బాస్ జారే (స్వర్ణం; 125 కేజీలు). గ్రీకో రోమన్ విభాగం: మొహమ్మద్ హాజీ అలీ (కాంస్యం; 55 కేజీలు), అలీ అబ్దుల్లా అహ్మదీ వఫా (కాంస్యం; 60 కేజీలు), ఇర్ఫాన్ బెహ్నామ్ జర్కానీ (రజతం; 63 కేజీలు), అహ్మద్ రెజా సైఫుల్లా (కాంస్యం; 67 కేజీలు), మొహమ్మద్ జావద్ సాదత్ (రజతం; 72 కేజీలు), అలీ జబీహుల్లా (రజతం; 77 కేజీలు), మొహమ్మద్ ఆమీన్ (రజతం; 82 కేజీలు), గులాం రెజా (రజతం; 87 కేజీలు), మొహమ్మదాదీ అబ్దుల్లా సరావి (స్వర్ణం; 97 కేజీలు), ఆమీన్ మీర్జాజాదే (స్వర్ణం; 130 కేజీలు).స్టేడియంపై బాంబు దాడిఅమెరికా, ఇజ్రాయిల్ సంయుక్త దాడులతో ఇరాన్ అతలాకుతలం అయ్యింది. వేలాది మంది ప్రాణాలు కోల్పోగా... లక్షలాది మంది తమ ఆనందమయ జీవనానికి దూరమయ్యారు. దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. ఈ యుద్ధం ప్రభావం రెజ్లర్లపై కూడా పడింది. ఆసియా చాంపియన్షిప్నకు ముందు ఇరాన్ రెజ్లర్లు పాల్గొనాల్సిన జాతీయ శిబిరంపై బాంబు దాడి జరిగింది. దీంతో క్యాంప్ను టెహ్రాన్ నుంచి మరో నగరమైన మజందరాన్కు మార్చాల్సి వచ్చింది. ఇరాన్ రెజ్లింగ్కు కేంద్ర బిందువైన టెహ్రాన్లోని ఆజాది ఇండోర్ స్టేడియం బాంబుదాడిలో పూర్తిగా ధ్వంసమైంది. ఒకప్పుడు వేలాది మంది అభిమానులు కూర్చొని మ్యాచ్లు వీక్షించిన మైదానం సిమెంట్ దిబ్బలా మారిపోయింది. ‘ఇది చాలా కఠినమైన పరిస్థితి. మా ప్లేయర్లు ప్రాక్టీస్ చేసే టెహ్రాన్ స్టేడియం బాంబు దాడికి గురైంది. మాపై బలవంతంగా మోపిన ఈ యుద్ధం... శిక్షణ కేంద్రాన్ని పూర్తిగా దెబ్బతీసింది’ అని ఇరాన్ రెజ్లింగ్ కోచ్ పెజ్మాన్ దొరోస్తాకర్ అన్నారు. -
వారెవ్వా వైశాలి
పాఫోస్ (సైప్రస్): ప్రతిష్టాత్మక క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ మహిళల విభాగంలో భారత గ్రాండ్మాస్టర్ వైశాలి టైటిల్ దక్కించుకుంది. బుధవారం ముగిసిన ఈ టోర్నీలో నిర్ణీత 14 రౌండ్ల తర్వాత తమిళనాడుకు చెందిన 24 ఏళ్ల వైశాలి 8.5 పాయింట్లతో చాంపియన్గా అవతరించింది. క్యాండిడేట్స్ టోర్నీ విజేత హోదాలో వైశాలి ఈ ఏడాది ప్రపంచ చాంపియన్షిప్ టైటిల్ కోసం డిఫెండింగ్ చాంపియన్ జు వెన్జున్ (చైనా)తో తలపడుతుంది. ప్రపంచ చాంపియన్షిప్ వేదికను, తేదీను ఇంకా ఖరారు చేయలేదు. ఎనిమిది మంది గ్రాండ్మాస్టర్ల మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ ఫార్మాట్లో జరిగిన క్యాండిడేట్స్ టోర్నీలో చివరిరోజు వైశాలి అద్భుతం చేసింది. గతంలో ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ చాంపియన్గా నిలిచిన కాటరీనా లాగ్నో (ఉక్రెయిన్)తో జరిగిన 14వ రౌండ్ గేమ్లో తెల్లపావులతో ఆడిన వైశాలి 48 ఎత్తుల్లో గెలిచింది. తద్వారా ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా నేరుగా ప్రపంచ చాంపియన్షిప్ మ్యాచ్కు అర్హత పొందింది. ఈ టోర్నీలో వైశాలి ఐదు గేముల్లో గెలిచి, ఏడు గేమ్లను ‘డ్రా’ చేసుకొని, రెండు గేముల్లో ఓడిపోయింది. బిబిసారా అసయుబయేవా (కజకిస్తాన్; 8 పాయింట్లు) రన్నరప్గా నిలువగా... జు జినెర్ (చైనా; 7.5), అలెగ్జాండ్రా గొర్యాక్చినా (రష్యా; 7.5 పాయింట్లు) వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. అనా ముజిచుక్ (ఉక్రెయిన్; 7 పాయింట్లు) ఐదో స్థానంలో, కాటరీనా లాగ్నో (6.5 పాయింట్లు) ఆరో స్థానంలో, దివ్య దేశ్ముఖ్ (భారత్; 5.5 పాయింట్లు) ఏడో స్థానంలో, టాన్ జోంగి (చైనా; 5.5 పాయింట్లు) చివరిదైన ఎనిమిదో స్థానంలో నిలిచారు. విజేతగా నిలిచిన వైశాలికి 28,000 యూరోలు (రూ. 30 లక్షల 81 వేలు) ప్రైజ్మనీ దక్కింది. 2011లో కోనేరు హంపి తర్వాత ప్రపంచ చాంపియన్షిప్ టైటిల్కు అర్హత పొందిన రెండో భారతీయ చెస్ క్రీడాకారిణిగా వైశాలి గుర్తింపు పొందింది. 2011 ప్రపంచ చాంపియన్షిప్లో హు ఇఫాన్ (చైనా) చేతిలో హంపి ఓడిపోయి రన్నరప్గా నిలిచింది. 2018 మేలో కాటరీనా లాగ్నోపై గెలిచి తొలిసారి ప్రపంచ చాంపియన్గా అవతరించిన జు వెన్జున్ ఆ తర్వాత నాలుగుసార్లు (2018 నవంబర్; 2020, 2023, 2025) ప్రపంచ టైటిల్ను నిలబెట్టుకుంది. మరోవైపు పురుషుల క్యాండిడేట్స్ టోర్నీలో ఉజ్బెకిస్తాన్ గ్రాండ్మాస్టర్ జవోఖిర్ సిందరోవ్ 10 పాయింట్లతో విజేతగా నిలిచాడు. ఈ ఏడాది చివర్లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ (భారత్)తో ప్రపంచ చాంపియన్షిప్ టైటిల్ కోసం సిందరోవ్ తలపడతాడు. వైశాలి తమ్ముడు, భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద 6 పాయింట్లతో ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. -
సంచలన నిర్ణయం.. 32 ఏళ్లకే రిటైర్మెంట్!
రెండుసార్లు ఒలింపిక్ చాంపియన్, డెన్మార్క్కు చెందిన స్టార్ షట్లర్ విక్టర్ ఆక్సెల్సెన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 32 ఏళ్ల వయసులోనే ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్కు రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులను షాక్కు గురి చేశాడు. గత రెండేళ్లుగా తన కెరీర్ను తీవ్రంగా ప్రభావితం చేసిన దీర్ఘకాలిక తీవ్రమైన వెన్ను గాయం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆక్సెల్సెన్ తెలిపాడు.తన రిటైర్మెంట్ విషయాన్ని ఆక్సెల్సెన్ ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నాడు. నేను చాలా కాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్నాను. గత సంవత్సరం ఏప్రిల్లో శస్త్రచికిత్స జరిగింది. విస్తృతమైన పునరావాసం పొందాను, కానీ అక్టోబర్లో నాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అప్పటి నుంచి, నేను ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోతున్నా. వెన్నునొప్పి కారణంగా ఆటపై కూడా సరిగ్గా దృష్టి పెట్టలేకపోతున్నా. దీంతో ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాల్సిన సమయం వచ్చినట్లుగా అనిపించింది. అందుకే ఈ నిర్ణయం. డాక్టర్తో మాట్లాడిన తర్వాతే రిటైర్మెంట్పై ఒక నిర్ణయానికి వచ్చాను. డాక్టర్ కూడా దీర్ఘకాలిక ఆరోగ్యంపై దృష్టి పెట్టమని సలహా ఇచ్చారు. దీనిని అంగీకరించడానికి కష్టంగా ఉన్నప్పటికీ పరిస్థితులు ఈ నిర్ణయం తీసుకునేలా చేశాయి. త్వరలో వెన్నుకు సర్జరీ జరగనుంది. అది విజయవంతం కాకపోతే మరోసారి ఆపరేషన్ చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇకపై ఆడడం కుదరదని తెలిసే ఈ నిర్ణయం తీసుకున్నా.1994లో జన్మించిన ఆక్సెల్సెన్ ఆరేళ్ల వయసులోనే బ్యాడ్మింటన్ ఆటపై ఇష్టాన్ని పెంచుకున్నాడు. 2010లో అతను బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ జూనియర్ చాంపియన్షిప్లను గెలుచుకొని చరిత్ర సృష్టించాడు. అలా చేసిన మొదటి యూరోపియన్ ఆటగాడిగా నిలిచాడు. అదే సంవత్సరం, అతను సీనియర్ స్థాయిలో అరంగేట్రం చేసి, సైపర్స్ ఇంటర్నేషనల్ టైటిల్ గెలుచుకోవడం ద్వారా తన కెరీర్ను ఘనంగా ప్రారంభించాడు. 2014లో స్విస్ ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ గెలిచాడు. ఇక ఒలింపిక్స్ విషయానికొస్తే 2016లో కాంస్యం, 2020, 2024 ఒలింపిక్స్లో ఏకంగా స్వర్ణాలు గెలుచుకున్నాడు. ఇక ప్రపంచ చాంపియన్షిప్లో 2014లో కాంస్యం గెలిచిన ఆక్సెల్సెన్ 2017, 2022లో స్వర్ణం కైవసం చేసుకున్నాడు. 2020, 2022లో ప్రతిష్ఠాత్మ ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ను కైవసం చేసుకొన్నాడు. అంతేకాదు 180 వారాలకు పైగా విక్టర్ ఆక్సెల్సెన్ నంబర్వన్ స్థానంలో కొనసాగాడు. సింగిల్స్లో 572 విజయాలు, 160 ఓటములతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. View this post on Instagram A post shared by Olympic Khel (@olympickhel) View this post on Instagram A post shared by Viktor Axelsen (@viktoraxelsen) -
భారత్లో మళ్లీ ఫార్ములావన్ రేసుకు ప్రయత్నాలు!
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది భారత్లో ఫార్ములావన్ రేసు నిర్వహించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. గ్రేటర్ నోయిడాలో2011, 2012, 2013లలో ఇండియన్ గ్రాండ్ప్రి పేరుతో ఎఫ్1 రేసులు జరిగాయి. అనంతరం ట్యాక్స్ చెల్లింపు రాయితీలు ఇవ్వకపోవడం, ఇతరత్రా కారణాలతో 2014 నుంచి ఎఫ్1 రేసులు భారత్లో కొనసాగించేందుకు ఫార్ములావన్ నిర్వాహకులు ఆసక్తి చూపలేదు. ‘వచ్చే ఏడాది భారత్లో ఎఫ్1 రేసు నిర్వహించేందుకు మూడుసంస్థలు ఆసక్తిగా ఉన్నాయి. విధివిధానాలు ఖరారు చేయడానికి ఆరు నెలలు పడుతుంది. భారత్లో ఎఫ్1 పునరాగమనం చేసేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. పన్ను రాయితీలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని మాండవీయ తెలిపారు. -
కత్తిదూస్తే రాణిరుద్రమలే!
వరంగల్ స్పోర్ట్స్: రాజులు పోయారు.. రాజ్యాలు పోయాయి. వారి తెగువ, ఆయుధ విద్యను ఇప్పటికీ ఓరుగల్లు ఆడబిడ్డలు వారసత్వంగా కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కత్తిసాము(ఫెన్సింగ్) క్రీడ ఉనికి పదిలంగానే ఉంది. ప్రపంచ ప్రఖ్యాత క్రీడల్లో ఫెన్సింగ్ మూడో స్థానంలో నిలుస్తోంది. అభివృద్ది చెందిన నగరాలు, దేశాలకు మాత్రమే పరిమితమైన ఈ గేమ్లో రాణిస్తున్నారు ఉమ్మడి వరంగల్కు చెందిన ఆడబిడ్డలు. రాణి రుద్రమదేవీలా కత్తి దూస్తున్న ఆ ఇద్దరి నేపథ్యమే ఈ వారం ‘సాక్షి’ స్పెషల్ స్టోరీ.అంతర్జాతీయ వేదికపై ప్రదర్శనవరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటకు చెందిన గొర్రె శ్రీజ డిగ్రీ చదువుతూ మహారాష్ట్ర సాయ్ అకాడమీలో ఫెన్సింగ్లో శిక్షణ పొందుతోంది. 4వ తరగతిలో హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో చేరిన శ్రీజ 9వ తరగతి వరకు అక్కడే చదువుతూ ఫెన్సింగ్లో శిక్షణ పొందింది. అనంతరం ఎన్ఐఎస్ పంజాబ్లో సీటు సాధించి కత్తి యుద్ధంలో ప్రతిభ కనబర్చి అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ఇప్పటి వరకు 20కిపైగా జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించింది. అంతర్జాతీయ స్థాయిలో బల్గేరియా, ఇటలీలో జరిగిన చాంపియన్షిప్లో తనదైన ప్రతిభ చాటింది. ఎప్పటికై నా భారత్ తరఫున ఒలింపిక్స్లో పాల్గొని పతకం సాధించడమే తన లక్ష్యమని శ్రీజ చెబుతోంది.పది పోటీల్లో ప్రతిభహనుమకొండ జిల్లా హసన్పర్తి మండల కేంద్రానికి చెందిన కడార్ల స్కావెస్లా స్పోర్ట్స్ కోటాలో ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతోంది. పదో తరగతిలో ఫెన్సింగ్లో శిక్షణ ప్రారంభించిన స్కావెస్లా కేవలం ఐదేళ్లలో పదికి పైగా రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించింది. మరింత మెరుగైన శిక్షణ అందిస్తే అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించి వరంగల్ జిల్లాకు పేరు తీసుకొస్తానని స్కావెస్లా చెబుతోంది. -
అమన్కు రజతం
బిష్కెక్ (కిర్గిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో చివరిరోజు భారత్కు రెండు రజతాలు, ఒక కాంస్య పతకం లభించాయి. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అమన్ సెహ్రావత్ (61 కేజీలు), ముకుల్ దహియా (86 కేజీలు) రజత పతకాలు నెగ్గగా... దినేశ్ (125 కేజీలు) కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. ఫైనల్స్లో అమన్ 10–13తో క్వాంగ్ మ్యోంగ్ కిమ్ (ఉత్తర కొరియా) చేతిలో, ముకుల్ 0–7తో కామ్రాన్ ఘాసెమ్పూర్ (ఇరాన్) చేతిలో ఓడిపోయారు. కాంస్య పతక బౌట్లో దినేశ్ 12–1తో తుర్దుబెకోవ్ (కిర్గిస్తాన్)పై గెలిచాడు. ఓవరాల్గా పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత్ 2 స్వర్ణాలు, 3 రజతాలు, ఒక కాంస్యం గెలిచి 162 పాయింట్లతో రన్నరప్గా నిలిచింది. 4 స్వర్ణాలు, 3 రజతాలు, ఒక కాంస్యం గెలిచి 178 పాయింట్లతో ఇరాన్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. -
ఆర్చరీలో సురేఖ బృందానికి స్వర్ణం
ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నమెంట్ మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో భారత జట్టుకు స్వర్ణ పతకం లభించింది. సీనియర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ వెన్నం జ్యోతి సురేఖ, మధుర, ప్రగతిలతో కూడిన భారత జట్టు ఫైనల్లో 233–232 (59–58, 55–59, 59–57, 60–58) పాయింట్ల తేడాతో అలెక్సిస్ రుయిజ్, పియర్స్, ఒలివియా డీన్లతో కూడిన అమెరికా జట్టును ఓడించింది. ఓవరాల్గా సురేఖ కెరీర్లో ఇది 12వ ప్రపంచకప్ పసిడి పతకం కావడం విశేషం. తొలి రౌండ్ నుంచే భారత్, అమెరికా ఢీ అంటే ఢీ అన్నట్ల పోటీపడ్డాయి. తొలి రౌండ్లో భారత్ 59-58తో అమెరికాపై స్వల్ప ఆధిక్యం ప్రదర్శించగా, రెండో రౌండ్లో ఆధిక్యం 114-117 తగ్గింది. అయితే మూడో రౌండ్ ముగిసే సరికి 173-174తో స్వల్ప వెనుకంజలో ఉన్న భారత్ చివర్లో ఆరు పది పాయింట్లు ఖాతాలో వేసుకోవడంతో పసిడి ఖాతాలో చేరింది.చదవండి: అథ్లెటిక్స్లో సంచలనం.. బోల్ట్ రికార్డు బద్దలు! -
అదరగొట్టిన భారత రెజ్లర్లు..
బిష్కెక్ (కిర్గిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో శనివారం భారత రెజ్లర్లు రెండు స్వర్ణ పతకాలు, ఒక రజతం, ఒక కాంస్యం సొంతం చేసుకున్నారు. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో సుజీత్ కల్కాల్ (65 కేజీలు), అభిమన్యు (70 కేజీలు) పసిడి పతకాలతో మెరిపించగా... సందీప్ సింగ్ మాన్ (79 కేజీలు) రజతం... అంకుశ్ (57 కేజీలు) కాంస్యం దక్కించుకున్నారు. ఈ ఏడాది అజేయంగా ఉన్న సుజీత్ ఫైనల్లో 8–1 పాయింట్ల తేడాతో ఉమిద్జాన్ జలోలోవ్ (ఉజ్బెకిస్తాన్)ను అలవోకగా ఓడించాడు. ఈ విజయంతో సుజీత్ 2019లో బజరంగ్ పూనియా తర్వాత 65 కేజీల విభాగంలో ఆసియా చాంపియన్గా అవతరించిన భారత రెండో రెజ్లర్గా గుర్తింపు పొందాడు. మరోవైపు అభిమన్యు 5–3తో తుల్గా తుముర్ ఒచిర్ (మంగోలియా)పై గెలుపొందాడు. 79 కేజీల ఫైనల్లో సందీప్ సింగ్ 1–2తో కీవన్ ఘరెదాగి (జపాన్) చేతిలో ఓడిపోయాడు. 57 కేజీల కాంస్య పతక బౌట్లో అంకుశ్ 8–2తో ఫుగా ససాకి (జపాన్)పై విజయం సాధించాడు. 97 కేజీల కాంస్య పతక బౌట్లో విక్కీ 5–7తో షెర్జాద్ పొయోనోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. ఫైనల్లో అమన్, ముకుల్ టోర్నీ చివరిరోజు ఆదివారం భారత్కు మరో రెండు స్వర్ణ పతకాలు లభించే అవకాశం ఉంది. 61 కేజీల విభాగంలో అమన్ సెహ్రావత్, 86 కేజీల విభాగంలో ముకుల్ దహియా ఫైనల్లోకి ప్రవేశించారు. సెమీఫైనల్స్లో అమన్ 11–9తో అహ్మద్ (ఇరాన్)పై, ముకుల్ 12–6తో బొలాత్ సకాయెవ్ (కజకిస్తాన్)పై గెలిచారు. 125 కేజీల విభాగం సెమీఫైనల్లో దినేశ్ 0–2తో షరిపోవ్ (బహ్రెయిన్) చేతిలో ఓడిపోయి నేడు కాంస్య పతకం కోసం పోటీపడతాడు. -
సంచలనం సృష్టించిన భారత యువ షట్లర్
ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పెను సంచలనం నమోదైంది. భారత యువ షట్లర్ అయుష్ శెట్టి ప్రపంచ నంబర్ 1 షట్లర్ కున్లావుట్ విటిడ్సార్న్ (థాయ్లాండ్)ను మట్టికరిపించి చరిత్ర సృష్టించాడు. కర్ణాటకకు చెందిన 20 ఏళ్ల ఆయుష్.. ఈ టోర్నీ సెమీస్లో కున్లావుట్పై 10-21, 21-19, 21-17 తేడాతో గెలిచి పురుషుల సింగిల్స్ ఫైనల్లోకి ప్రవేశించాడు. తద్వారా భారత తరఫున ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఫైనల్కు (సింగిల్స్) చేరిన రెండో పురుష షట్లర్గా (దినేశ్ ఖన్నా (1965), ఓవరాల్గా మూడో భారత షట్లర్గా రికార్డుల్లోకెక్కాడు.75 నిమిషాల పాటు సాగిన సెమీస్లో ఆయుష్ మొదటి గేమ్ కోల్పోయినా, ఆతర్వాత అద్భుత పోరాటపటిమతో వరుసగా రెండు సెట్లు గెలిచి గేమ్ను కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో ఆయుష్.. షి యు కీ (చైనా), చౌ టియెన్ చెన్ (చైనీస్ తైపీ) మధ్య జరిగే రెండో సెమీస్ విజేతతో తలపడతాడు. అయుష్ 2023 వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్లో కాంస్యం సాధించిన తర్వాత వార్తల్లోకెక్కాడు. -
సాకర్ సంగ్రామం ముంగిట అభిమానులకు షాక్!
మరో రెండు నెలల్లో సాకర్ మహాసంగ్రామం మొదలుకానుంది. జూన్ 11 నుంచి ఫిఫా ప్రపంచకప్ ప్రారంభం కానుండడంతో టోర్నీకి సంబంధించి పాల్గొనబోయే జట్లు, మ్యాచ్ షెడ్యూల్ వివరాలను ఇప్పటికే ఫిఫా సమాఖ్య విడుదల చేసింది. అయితే ఫుట్బాల్ ఆటను మైదానంలో వీక్షిస్తే వచ్చే మజానే వేరు. 90 నిమిషాల్లో ముగిసిపోయే మ్యాచ్ చూసేందుకు అభిమానులు తండోపతండాలుగా వస్తుం టారు. సాకర్ ఫీవర్ ఉన్నన్నాళ్లు స్టేడియాలన్నీ ప్రేక్షకులతో కిక్కిరిసిపోవడం ఖాయం. కానీ 2026 ఫిఫా ప్రపంచకప్కు సంబంధించి టికెట్ల ధరల విషయం మాత్రం ఒక ఆందోళన కలిగిస్తోంది. ఈసారి టికెట్ రేట్ల ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో సాధారణ అభిమానులకు మ్యాచ్ వీక్షించడం సాధ్యమయ్యేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ ఏడాది ప్రపంచ కప్ టికెట్ల ధరలను ఫిఫా భారీగా పెంచేసింది. ఇప్పటికే ఉన్న కేటగిరీలకు తోడు కొత్తగా ‘ఫ్రంట్ కేటగిరీ’ పేరుతో మరింత ఖరీదైన టిక్కెట్లను ప్రవేశపెట్టింది. దీంతో మ్యాచ్లను ప్రత్యక్షంగా వీక్షించడం సాధారణ అభిమానులకు ఖరీదైన వ్యవహారంగా మారనుంది. జూన్ 12న అమెరికాలోని ఇంగిల్వుడ్లో జరిగే అమెరికా ఆరంభ మ్యాచ్ టికెట్ల ధరలు భారీగా పెరిగాయి. ముందువరుసలోని ‘ఫ్రంట్ కేటగిరీ’ ఒక టికెట్ ధర 4,105 డాలర్లుగా నిర్ణయించారు. ఇది భారత కరెన్సీలో సుమారు రూ.3.4 లక్షలు . గతంలో ఇదే కేటగిరీ గరిష్ట ధర 2,735 డాలర్లు (సుమారు రూ.2.25 లక్షలు)గా ఉండేది. ఇప్పుడు కొత్త కేటగిరీలతో ధరలు మరింత పెరిగాయి.అదేవిధంగా, ఫీఫా కొత్తగా ప్రవేశపెట్టిన ‘ఫ్రంట్ కేటగిరీ 2’టికెట్ల ధరలు 1,940 నుంచి 2,330 డాలర్ల వరకు ఉన్నాయి. ఇది భారత కరెన్సీలో సుమారు రూ.1.6 లక్షల నుంచి రూ.1.9 లక్షల వరకు ఉంటుంది. ఈ ధరలు చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. కెనడా ఆరంభ మ్యాచ్కు కూడా ఫ్రంట్ కేటగిరీ ఒక టికెట్ ధర 3,360 (సుమారు రూ.2.8 లక్షలు)గా నిర్ణయించారు. రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్కు కూడా ధరలు ఎక్కువగానే ఉన్నాయి. ఫిలడెల్ఫియాలో జరిగే మ్యాచ్కు టికెట్ ధర 905 డాలర్లు (సుమారు రూ.75,000)గా ఉంది. ఇక ఫైనల్ మ్యాచ్ విషయానికి వస్తే, టికెట్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.న్యూజెర్సీలోని మెట్అఫ్ స్టేడియంలో జూలై 19న జరిగే ఫైనల్ మ్యాచ్ టికెట్ గరిష్ట ధర 10,990 డాలర్లుగా నిర్ణయించగా, ఇది భారత కరెన్సీలో సుమారు రూ.9 లక్షలకు పైగా ఉంటుంది. డిసెంబర్ లో ఇదే టికెట్ ధర 8,680 డాలర్లు (సుమారు రూ.7.20 లక్షలు)గా ఉండేది. అదే విధంగా, కేటగిరీ 2 టికెట్లు 5,575 నుంచి 7,380 డాలర్లు (రూ.4.6 లక్షలు – రూ.6.1 లక్షలు), కేటగిరీ 3 టికెట్లు 4,185 నుంచి 5,785 డాలర్లు (రూ.3.5 లక్షలు - రూ.4.8 లక్షలు) వరకు పెరిగాయి. మొత్తం మీద యుద్ధం ప్రభావం, ఆర్థిక అనిశ్చితి ఫిఫా ప్రపంచకప్ టికెట్ ధరల పెరుగుదలకు ఒక కారణంగా చెప్పొచ్చు. ప్రీమియం అనుభవం పేరుతో ఫిఫా కొత్త కేటగిరీలను తీసుకువచ్చినప్పటికీ, సాధారణ అభిమానులకు మ్యాచ్లను ప్రత్యక్షంగా వీక్షించడం కష్టతరంగా మారింది. జూన్ 11 నుంచి జూలై 19 వరకు జరగనున్న ఫిఫా ప్రపంచకప్కు అమెరికా, మెక్సికో, కెనడా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి.చదవండి: ‘అడ్డుగోడలా నిలబడితే విజయం ఎలా వస్తుంది?’ -
విజేత నైశిక్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: గోండ్వానా కప్ అఖిల భారత టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ గనగామ నైశిక్ రెడ్డి విజేతగా నిలిచాడు. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ నైశిక్ 7–6 (7/4), 6–4తో టాప్ సీడ్ ప్రసాద్ ఇంగాలె (మహారాష్ట్ర)ను బోల్తా కొట్టించాడు. సెమీఫైనల్లో నైశిక్ 7–6 (7/5), 6–2తో మహదేవ్ బంగార్గి (మహారాష్ట్ర)పై, క్వార్టర్ ఫైనల్లో 6–2, 6–4తో ముకేశ్ చావ్డా (గుజరాత్)పై గెలుపొందాడు. విజేత నైశిక్కు ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి అరుణ్ సావ్ విన్నర్స్ ట్రోఫీ అందజేశారు. హైదరాబాద్లో జాతీయ గ్రాస్కోర్టు మాజీ చాంపియన్ సురేశ్ కృష్ణ, కాజా వినాయక్ శర్మ, ఒలింపియన్ విష్ణువర్ధన్ పర్యవేక్షణలో నైశిక్ శిక్షణ తీసుకుంటున్నాడు. -
అనూహ్య మార్పు.. జూనియర్ హాకీ జట్టుకు కొత్త కోచ్
న్యూఢిల్లీ: భారత జూనియర్ మహిళల హాకీ జట్టుకు టిమ్ వైట్ కొత్త కోచ్గా ఎంపికయ్యాడు. 2023 నుంచి మన అమ్మాయిల జట్టుకు తుషార్ ఖండేకర్ కోచ్గా వ్యవహరిస్తుండగా... అతడి స్థానంలో అంతర్జాతీయ స్థాయిలో విశేష అనుభవం ఉన్న ఆస్ట్రేలియాకు చెందిన వైట్ను హాకీ ఇండియా (హెచ్ఐ) కొత్త కోచ్గా నియమించింది. కోచ్ మార్పునకు కారణం వెల్లడించని హాకీ ఇండియా... వైట్ ఎప్పటి వరకు ఆ పదవిలో ఉంటాడనే అంశంలోనూ స్పష్టతనివ్వలేదు. హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో వైట్ తమిళనాడు డ్రాగన్స్ జట్టుకు ప్రధాన కోచ్గా వ్యవహరిస్తున్నాడు. గతంలో బెల్జియం, ఆ్రస్టేలియా జూనియర్ జట్లకు కూడా వైట్ కోచ్గా పనిచేశాడు. వైట్ శిక్షణలో బెల్జియం అండర్ –21 మహిళల జట్టు జూనియర్ ప్రపంచకప్ కప్లో కాంస్య పతకం నెగ్గింది. 2021 నుంచి 2024 వరకు బెల్జియం సీనియర్ జట్టుతోనూ వైట్ కలిసి పనిచేశాడు. ఆ సమయంలో విశేషంగా రాణించిన బెల్జియం జట్టు ప్రపంచ ర్యాంకింగ్స్లో 12వ స్థానం నుంచి మూడో ‘ప్లేస్’కు చేరింది. ఆస్ట్రేలియాకు కోచ్గా వ్యవహరించిన సయమంలో జూనియర్ ప్రపంచకప్లో ఆ జట్టు కాంస్యం గెలిచింది. ‘తమిళనాడు డ్రాగన్స్ జట్టుకు కోచ్గా భారత్లో చాలా సమయం గడిపా. అక్కడి హాకీ ఘన సంస్కృతి నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. జూనియర్ వరల్డ్కప్లో భాగంగా... భారత్తో జరిగిన మ్యాచ్ల సమయంలో యువ నైపుణ్యం నన్ను కట్టిపడేసింది. అలాంటి అత్యుత్తమ అథ్లెట్లతో పూర్తిస్థాయిలో కలిసి పనిచేయనుండటం నాకు లభించిన గొప్ప అవకాశంగా భావిస్తున్నా. సీనియర్ జట్టులో స్థానం కోసం పోటీపడగల సామర్థ్యం ఉన్న పటిష్టమైన ప్లేయర్లను తయారు చేయడమే నా లక్ష్యం. అటాకింగ్ గేమ్కు పదును పెడుతూనే... డిఫెన్స్లోనూ మరింత క్రమశిక్షణ పెంచాలని భావిస్తున్నా. మైదానంలో అడుగు పెట్టిన తర్వాత 60 నిమిషాల పాటు అత్యున్నత స్థాయిలో రాణించేందుకు శారీరకంగా, మానసికంగా సిద్ధం కావడం చాలా ముఖ్యం. ఒత్తిడిలోనూ చక్కటి సమన్వయంతో ముందుకు సాగడంపై దృష్టి పెట్టి అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటాం. సీనియర్ స్థాయి ప్లేయర్లను సైతం ఓడించగల ఆత్మస్థైర్యం ఉన్న ప్లేయర్లను తీర్చిదిద్దుతా’ అని వైట్ అన్నాడు. కొత్త కోచ్ రాకతో మన హాకీకి మరింత ప్రయోజనం చేకూరుతుందని హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ అన్నాడు. ‘ఆస్ట్రేలియా, బెల్జియం జూనియర్ జట్లకు కోచింగ్ ఇచ్చిన అనుభవం ఉన్న వైట్... భారత జట్టుతో చేరడంతో మన ప్లేయర్ల నైపుణ్యాలు కూడా మరింత పెరుగుతాయి. అతడి అనుభవం మనజట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుంది’ అని టిర్కీ పేర్కొన్నాడు. చదవండి: ‘బంతి మీదే దృష్టి.. బౌలర్ వైపు కన్నెత్తి చూడను!’ -
ఆయుశ్ సంచలనం
నింగ్బో (చైనా): బరిలోకి దిగిన తొలిసారే భారత రైజింగ్ స్టార్ ఆయుశ్ శెట్టి ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో పోటీపడుతున్న ఈ కర్ణాటక షట్లర్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. ప్రపంచ నాలుగో ర్యాంకర్, 2024 ఆసియా చాంపియన్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)తో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 25వ ర్యాంకర్ ఆయుశ్ 23–21, 21–17తో సంచలన విజయం సాధించాడు. 54 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో ఆయుశ్ నిలకడగా ఆడుతూ క్రిస్టీని కట్టిపడేశాడు. తొలి గేమ్లో 18–20తో వెనుకబడ్డ ఆయుశ్ సంయమనం కోల్పోకుండా ఆడి వరుసగా మూడు పాయింట్లు గెలిచి 21–20తో ముందంజ వేశాడు. ఆ తర్వాత క్రిస్టీ 21–21తో స్కోరును సమం చేయగా... ఆయుశ్ ఈసారి వరుసగా రెండు పాయింట్లు నెగ్గి గేమ్ను దక్కించుకున్నాడు. తొలి గేమ్ను సొంతం చేసుకున్న ఉత్సాహంలో ఆయుశ్ రెండో గేమ్లో మరింత జోరు పెంచాడు. తొలుత 5–2తో, ఆ తర్వాత 8–6తో, 14–10తో ఆధిక్యంలోకి వెళ్లాడు. క్రిస్టీ కోలుకునే ప్రయత్నం చేసినా ఆయుశ్ ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా సాధించిన ఆధిక్యాన్ని కాపాడుకొని చివరకు రెండో గేమ్తోపాటు మ్యాచ్ను కైవసం చేసుకున్నాడు. నేడు జరిగే సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్, 2023 విశ్వవిజేత కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్లాండ్)తో ఆయుశ్ తలపడతాడు. 7 ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పురుషుల సింగిల్స్లో పతకం గెలిచిన ఏడో భారతీయ ప్లేయర్ ఆయుశ్ శెట్టి. గతంలో హెచ్ఎస్ ప్రణయ్ (2018లో కాంస్యం), అనూప్ శ్రీధర్ (2007లో కాంస్యం), పుల్లెల గోపీచంద్ (2000లో కాంస్యం), ప్రకాశ్ పదుకొనే (1976లో కాంస్యం), దినేశ్ ఖన్నా (1965లో స్వర్ణం, 1969లో కాంస్యం), సురేశ్ గోయల్ (1965లో కాంస్యం) ఈ ఘనత సాధించారు. -
‘చనిపోయేలోపు ఫిఫా వరల్డ్కప్లో భారత జట్టును చూడాలి’
క్రికెట్తో పోలిస్తే భారత్లో ఫుట్బాల్కు ఆదరణ తక్కువే. బైచుంగ్ భుటియా, సునీల్ ఛెత్రీ.. ఈ ఇద్దరే భారత్ ఫుట్బాల్లో కాస్త తెలిసిన ముఖాలు. అసలు మనకంటూ ఒక ఫుట్బాల్ టీం ఉందన్న సంగతి కూడా చాలా మందికి తెలియదు. పాశ్చాత్య దేశాల్లో ఫుట్బాల్కు ఉండే క్రేజ్ వేరు. క్రికెట్లో వరల్డ్కప్ ఎలాగూ ఫుట్బాల్లో ప్రతిష్ఠాత్మక ఫిఫా ప్రపంచకప్ కూడా అలాంటిదే. ఇంకా చెప్పాలంటే ఐసీసీ వరల్డ్కప్ కంటే ఎక్కువే అని చెప్పొచ్చు. ఫిఫా వరల్డ్కప్లో ఒక్కసారైనా ఆడాలని చాలా దేశాలు కలలు కూడా కంటాయి.ఈ నేపథ్యంలోనే దేశవాలీలో ఫుట్బాల్ ఆటకు మళ్లీ తిరిగి పూర్వవైభవం తెచ్చేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు మినర్వా ఫుట్బాల్ క్లబ్ ఓనర్, కోచ్ రంజిత్ బజాజ్ వెల్లడించారు. తాను చనిపోయేలోగా భారత సీనియర్ జట్టును ఫిఫా ప్రపంచకప్లో చూస్తానంటూ ఆశాభావం వ్యక్తం చేశాడు. అంతర్జాతీయంగా భారత్ను ఫుట్బాల్లోనూ ఉన్నతస్థాయికి చేర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.ఇటీవలే అండర్-15 మెడిటేరియన్ ఇంటర్నేషనల్ కప్ (ఎంఐసీ)లో భారత్కు చెందిన మినర్వా ఫుట్బాల్ క్లబ్ తమ ప్రదర్శనతో అదరగొట్టింది. ముఖ్యంగా ప్రిక్వార్టర్స్లో మినర్వా జట్టు 6-0 తేడాతో లివర్పూల్ జట్టును ఓడించి సంచలనం సృష్టించింది. ఎంఐసీ కప్లో తొలిసారి ఆడుతున్నప్పటికీ ఏ బెరుకు లేకుండా ఆడిన మినర్వా జట్టు క్వార్టర్స్లో ఓడినప్పటికీ టోర్నీని ఐదో స్థానంతో ముగించి బెస్ట్ ప్రదర్శన నమోదు చేసింది.అయితే మినర్వా ఫుట్బాల్ క్లబ్ ఏర్పడడం వెనుక ఆ జట్టు కోచ్ రంజిత్ బజాజ్ చాలా ఏళ్ల శ్రమ దాగుంది. తాజాగా చందాలు పోగు చేసి మరీ తన జట్టును స్పెయిన్లో జరిగిన ఎంఐసీ కప్ ఆడేందుకు పంపించడం గమనార్హం. అయితే మార్చి 16న మినర్వా క్లబ్ జట్టును పంపించడానికి ముందు రంజిత్ బజాజ్ ఒక వీడియోను పంచుకున్నారు. అందులో ఆయన ఇచ్చిన సందేశం ప్రతీ ఒక్కరిని కంటతడి పెట్టించేలా ఉంది. మొత్తం జట్టును స్పెయిన్కు పంపేందుకు తన ఆస్తులను అమ్మినప్పటికీ మరో కోటి రూపాయలు తక్కువ పడింది. దీంతో ఇన్స్టాగ్రామ్ వేదికగా డబ్బు సహాయం అందజేయాలని తన ఫాలోవర్లను కోరారు. ఆయన ఫాలోవర్లంతా ఈ విషయాన్ని షేర్ చేసి 27 లక్షల రూపాయలు ఆయనకు అందజేశారు. మొత్తంగా ఎలాగోలా తన జట్టును ఎంఐసీ కప్ ఆడేందుకు పంపించారు. View this post on Instagram A post shared by Ranjit Bajaj (@ranjitbajaj)మినర్వా ఫుట్బాల్ క్లబ్ జట్టు 2022లో మెనా కప్, 2023లో బ్రెజిల్ను ఓడించి గోథియా కప్ను కైవసం చేసుకుంది. కానీ సరైన ఫండ్స్ లేకపోవడంతో 2024లో ఒక్క టోర్నీ కూడా ఆడలేకపోయింది. ఇది భారత్లోని ప్రతిభావంతమైన ఫుట్బాల్ ఆటగాళ్లపై తీవ్ర ప్రభావం చూపిందని రంజిత్ బజాజ్ ఆవేదన వ్యక్తం చేశారు.ఎవరీ రంజిత్ బజాజ్?రంజిత్ బజాజ్ (Ranjit Bajaj) భారత ఫుట్బాల్ రంగంలో, ముఖ్యంగా గ్రాస్రూట్ స్థాయిలో ప్రతిభను గుర్తించి వారిని ఆటగాళ్లుగా తయారు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. చండీగఢ్లో మినర్వా అకాడమీ నెలకొల్పి యువ ఫుట్బాల్ ఆటగాళ్లకు శిక్షణ ఇస్తూ భారత ఫుట్బాల్ భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారు. సందేశ్ జింగాన్, కమల్జిత్ సింగ్, జీక్సన్ సింగ్ (ఫిఫా వరల్డ్కప్లో భారత్ తరఫున మొదటి గోల్ చేసిన ఆటగాడు) వంటి ప్రముఖ ఆటగాళ్లంతా ఈయన అకాడమీ నుంచే వచ్చారు. భారత ఫుట్బాల్ అభివృద్ధి కోసం, ముఖ్యంగా యువతకు అవకాశం కల్పించడం కోసం ఆయన తన ఆస్తులను (భార్య బంగారు ఆభరణాలు) సైతం తాకట్టు పెట్టి అకాడమీని నడిపారు. తనకు ఎవరు సహాయం చేసేందుకు ముందుకు రానప్పటికీ 2020 నుంచి మినర్వా అకాడమీ తరఫున 250 మందికి పైగా ఆటగాళ్లకు వంద శాతం స్కాలర్షిప్లు ఇచ్చి వాళ్లను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దారు. తాను చనిపోయేలోగా భారత సీనియర్ జట్టు ఫిఫా ప్రపంచకప్లో పాల్గొనేలా చూడడమే తన కల అని రంజిత్ బజాజ్ చాలాసార్లు చెప్పుకొచ్చారు. మరి ఆయన కల నెరవేరాలని ఆశిద్దాం.ఫుట్బాల్లోనూ స్వర్ణయుగం..ఒకప్పుడు ఆసియాలోని అత్యుత్తమ జట్లలో ఒకటిగా పరిగణించబడిన మన ఫుట్బాల్ టీం 1950 నుంచి 1960 మధ్య స్వర్ణయుగాన్ని చూసింది. హైదరాబాద్కు చెందిన సయ్యద్ అబ్దుల్ రహీం పర్యవేక్షణలో భారతదేశం 1951, 1962 ఆసియా క్రీడల్లోనూ స్వర్ణ పతకాలను గెలుచుకోవడంతో పాటు 1956 ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్లో నాలుగో స్థానంలో నిలిచి ఔరా అనిపించింది. అయితే భారత జట్టు ఎప్పుడు ఫిఫా ప్రపంచకప్లో పాల్గొనలేదు.కానీ 1950 ఫిఫా వరల్డ్కప్లో మాత్రం క్వాలిఫికేషన్ గ్రూప్లోని ఇతర దేశాలన్నీ వైదొలగడంతో 1950 ప్రపంచ కప్కు డిఫాల్ట్గా అర్హత సాధించింది. అయితే, టోర్నమెంట్ ప్రారంభానికి ముందే భారత్ టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. భారత జట్టు ఆసియా ఫుట్బాల్ ఛాంపియన్షిప్ అయిన ఏఎఫ్సీ ఆసియా కప్లో ఐదుసార్లు పాల్గొని , 1964 లో రన్నరప్గా నిలిచింది .దక్షిణాసియాలో పాపులర్ టోర్నీగా పిలవబడే దక్షిణాసియా ఫుట్బాల్ ఫెడరేషన్ కప్ (శాప్-SAFF) కప్లో అజేయమైన టీమ్గా రికార్డు ఉంది. 1993లో ప్రారంభమైనప్పటి నుంచి ఈ టోర్నమెంట్ను భారత్ రికార్డు స్థాయిలో ఎనిమిది సార్లు గెలుచుకుంది.🚨 India’s Minerva Football Club thrashed Liverpool FC 6–0. 🗿Man, Indian football has serious potential.Completely outplayed and knocked out Liverpool and reached the QF in the MIC Cup 2026 U-15 — pure attitude.Proud moment for India 🇮🇳 pic.twitter.com/DEibSGT7YR— Sonu (@Cricket_live247) April 3, 2026చదవండి: వారెవ్వా మినర్వా.. తొలిసారి ఆడినా అదరగొట్టింది! -
భారత మహిళల పంచ్ అదుర్స్
ఉలాన్బాటర్ (మంగోలియా): ఆసియా సీనియర్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత మహిళా బాక్సర్లు తమ పంచ్ పవర్ను చాటుకున్నారు. గురువారం జరిగిన ఫైనల్స్లో నలుగురు భారత బాక్సర్లు మీనాక్షి హుడా (48 కేజీలు), ప్రీతి పవార్ (54 కేజీలు), అరుంధతి చౌధరీ (70 కేజీలు), ప్రియ ఘన్ఘస్ (60 కేజీలు) పసిడి పతకాలతో మెరిశారు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ జైస్మీన్ లంబోరియా (57 కేజీలు), అల్ఫియా పఠాన్ (ప్లస్ 80 కేజీలు) మాత్రం రజత పతకాలతో సరిపెట్టుకున్నారు.ఫైనల్స్లో మీనాక్షి 5–0తో నొముందరి (మంగోలియా)పై, ప్రీతి 5–0తో మూడుసార్లు ప్రపంచ చాంపియన్, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత హువాంగ్ సియావో వెన్ (చైనీస్ తైపీ)పై గెలిచారు. అరుంధతి 4–1తో బకిత్ సెడిష్ (కజకిస్తాన్)పై, ప్రియ 3–0తో వన్ ఉన్ గ్యోంగ్ (ఉత్తర కొరియా)పై నెగ్గారు. జైస్మీన్ 0–5తో పున్రావి ర్యునర్స్ (థాయ్లాండ్) చేతిలో, అల్ఫియా 0–5తో దినా ఇస్లామ్బెకోవా (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయారు. తెలంగాణ స్టార్, రెండుసార్లు ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్ (51 కేజీలు)... టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గొహైన్ (75 కేజీలు), పూజా రాణి (80 కేజీలు), అంకుశిత బోరో (65 కేజీలు) సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలు సాధించారు. ఓవరాల్గా ఈ మెగా ఈవెంట్లో బరిలోకి దిగిన 10 వెయిట్ కేటగిరీల్లోనూ భారత బాక్సర్లు పతకాలు నెగ్గడం విశేషం. -
సింధు పరాజయం... క్వార్టర్ ఫైనల్లో ఆయుశ్
నింగ్బో (చైనా): ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ నుంచి ఆయుశ్ శెట్టి మినహా మిగతా భారత షట్లర్లు ప్రిక్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించారు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో పీవీ సింధు 18–21, 8–21తో రెండో సీడ్ వాంగ్ జి యి (చైనా) చేతిలో ఓడిపోయింది. మరో మ్యాచ్లో ఉన్నతి హుడా 17–21, 9–21తో టొమోకా మియజకి (జపాన్) చేతిలో ఓటమి పాలైంది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 25వ ర్యాంకర్ ఆయుశ్ శెట్టి 21–16, 21–12తో ప్రపంచ 20వ ర్యాంకర్ చి యు జెన్ (చైనీస్ తైపీ)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. భారత్కే చెందిన హెచ్ఎస్ ప్రణయ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 12–21, 19–21తో వెంగ్ హాంగ్ యాంగ్ (చైనా) చేతిలో పరాజయం చవిచూశాడు. మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్లో తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల (భారత్) ద్వయం 13–21, 14–21తో నాలుగో సీడ్ చెన్ టాంగ్ జి–టో ఈ వె (మలేసియా) జంట చేతిలో ఓడిపోయింది. మహిళల డబుల్స్ మ్యాచ్లో శ్రుతి మిశ్రా–ప్రియ (భారత్) జోడీ 10–21, 13–21తో యూకీ ఫకుషిమా–మయు మత్సుమోటో (జపాన్) జంట చేతిలో పరాజయం పాలైంది. -
భారత్కు రెండో ఓటమి
న్యూఢిల్లీ: బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 మహిళల టీమ్ టెన్నిస్ టోర్నీలో భారత జట్టుకు రెండో పరాజయం ఎదురైంది. ఇండోనేసియాతో గురువారం జరిగిన లీగ్ మ్యాచ్లో భారత్ 0–3తో ఓడింది. తొలి మ్యాచ్లో వైష్ణవి అడ్కర్ 7–6 (7/3), 6–7 (3/7), 3–6తో ప్రిస్కా నుగ్రోహో చేతిలో... రెండో మ్యాచ్లో సహజ యామలపల్లి 2–6, 1–6తో జనైస్ టిజెన్ చేతిలో... మూడో మ్యాచ్లో అంకిత రైనా–రుతుజా 3–6, 6–7 (4/7)తో అల్దిలా సుత్జియాది–జనైస్ టిజెన్ చేతిలో ఓటమి పాలయ్యారు. నేడు జరిగే నాలుగో మ్యాచ్లో మంగోలియాతో భారత్ ఆడుతుంది. ఆరు జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో కొరియా, ఇండోనేసియా ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ గెలిచి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. -
కాంస్యాలు గెలిచిన హన్సిక, నేహా
బిష్కెక్ (కిర్గిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో గురువారం భారత్కు రెండు కాంస్య పతకాలు లభించాయి. మరో పతకం ఖరారైంది. మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో హన్సిక లాంబా (55 కేజీలు), నేహా (59 కేజీలు) కాంస్య పతకాలు నెగ్గగా... మీనాక్షి (53 కేజీలు) ఫైనల్లోకి దూసుకెళ్లింది. కాంస్య పతక బౌట్లలో హన్సిక 6–1తో అరుకె కదిర్బెక్ (కిర్గిస్తాన్)పై, నేహా 10–4తో బొలోర్తుయా (మంగోలియా)పై గెలిచారు. మీనాక్షి క్వార్టర్ ఫైనల్లో 15–4తో ఎస్బోసినోవా (ఉజ్బెకిస్తాన్)పై, సెమీఫైనల్లో 4–2తో సెయంగ్ పార్క్ (దక్షిణ కొరియా)పై నెగ్గింది. నేడు జరిగే ఫైనల్లో చైనా రెజ్లర్ జిన్ జాంగ్తో మీనాక్షి తలపడుతుంది. 72 కేజీల విభాగంలో హర్షిత కాంస్యం కోసం పోరాడనుంది. సెమీఫైనల్లో హర్షిత 2–7తో మహిరో యోషిటాకె (జపాన్) చేతిలో ఓడిపోయింది. -
రాకెట్ నేలకేసి కొట్టి...
మోంటెకార్లో: ప్రపంచ మాజీ నంబర్వన్, రష్యా టెన్నిస్ ప్లేయర్ డానిల్ మెద్వెదెవ్ సంయమనం కోల్పోయాడు. మోంటెకార్లో మాస్టర్స్ టోర్నమెంట్లో భాగంగా... ఘోర పరాజయం మూటగట్టుకున్న మెద్వెదెవ్ తన రాకెట్ను విరగ్గొట్టాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో పదో ర్యాంకర్ మెద్వెదెవ్ 0–6, 0–6తో బెరెటిని (ఇటలీ) చేతిలో పరాజయం పాలయ్యాడు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన మెద్వెదెవ్ తన రాకెట్ను వరుసగా ఏడుసార్లు నేలకేసి కొట్టి విరగ్గొట్టాడు. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించిన మెద్వెదెవ్... క్రీడా కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డాడు. దీంతో అతడిపై భారీ జరిమానా పడే అవకాశం ఉంది. తొలి సెట్ కోల్పోయి అసహనంలో ఉన్న మెద్వెదెవ్... రెండో సెట్లో తన తొలి సర్వీస్ కోల్పోయిన సమయంలో ఈ చర్యకు పాల్పడ్డాడు. 2021 యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టైటిల్ నెగ్గిన మెద్వెదెవ్ ఈ మ్యాచ్ను 49 నిమిషాల్లోనే కోల్పోయాడు. గతంలో బెరెటినితో ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ నెగ్గిన ఈ రష్యా ఆటగాడు... ఈసారి మాత్రం అదే జోరు కనబర్చలేకపోయాడు. ఇటీవల ప్రపంచ నంబర్వన్ అల్కరాజ్పై విజయం సాధించిన మెద్వెదెవ్... మట్టి కోర్టులో జరిగిన ఈ పోరులో స్థాయికితగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. 1973లో ఏటీపీ ర్యాంకింగ్స్ ప్రారంభమైనప్పటి నుంచి వరల్డ్ టాప్–10 ఆటగాడిని 6–0, 6–0తో ఓడించిన ఐదో ప్లేయర్గా బెరెటిని నిలిచాడు. దీన్ని ‘డబుల్ బేగల్’ అంటారు. చివరిసారిగా దశాబ్దం క్రితం ఇటాలియన్ ఓపెన్లో డేవిడ్ గాఫిన్ (బెల్జియం) 6–0, 6–0తో బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్)ను చిత్తు చేశాడు. -
‘పోడియంపై ఇక ఒంటరిని కాను’
కోల్కతా: వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్లో స్వర్ణ, రజతాలు భారత్కే దక్కడం సంతోషంగా ఉందని... భారత స్టార్ పారా ఆర్చర్ శీతల్ దేవి పేర్కొంది. పారా ఆర్చరీలో లెక్కకు మిక్కిలి అవార్డులు, రికార్డులు తన పేరిట లిఖించుకున్న శీతల్ దేవి... సహచర పారా ఆర్చర్ పాయల్ నాగ్ ప్రదర్శనను కొనియాడింది. గతంలో పోడియంపై నిలిచినప్పుడు దేశం తరఫున తాను మాత్రమే గెలుస్తున్నట్లు ఒంటరి తనంగా ఉండేదని... ఇప్పుడు తనకు తోడు దొరికినట్లు అనిపిస్తోందని చెప్పింది. ఇటీవల బ్యాంకాక్ వేదికగా జరిగిన వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ కాంపౌండ్ మహిళల ఫైనల్లో ప్రపంచ నంబర్వన్ ఆర్చర్ శీతల్పై భారత్కే చెందిన 18 ఏళ్ల పాయల్ నాగ్ విజయం సాధించింది. దీంతో పసిడితో పాటు రజత పతకం భారత్కే దక్కింది. ఈ నేపథ్యంలో గురువారం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్లో శీతల్ మాట్లాడుతూ...‘గతంలో నేను ఒక్క దాన్నే గెలుస్తున్నట్లు అనిపించేది. ఇప్పుడు పాయల్ వచ్చింది. చాలా సంతోషం. తను చక్కటి ప్రదర్శనతో విజయం సాధించింది. ఇద్దరం కలిసి దేశానికి మరిన్ని పతకాలు అందిస్తాం. ఆటలో గెలుపోటములు సహజం. ఆ రోజు నాకన్నా పాయల్ చాలా బాగా బాణాలు సంధించింది. దీంతో రెండు పతకాలు మనకే దక్కాయి. ఆసియా క్రీడలు, పారాలింపిక్స్లో దేశానికి మరిన్ని పతకాలు అందిస్తాం’ అని వెల్లడించింది. ఒడిశాలోని బాలాంగిర్కు చెందిన పాయల్ నాగ్... చిన్నప్పుడే విద్యుదాఘాతానికి గురైంది. మూడో తరగతి చదువుతున్న సమయంలో తండ్రి పనిచేస్తున్న భవనం వద్ద కరెంట్ షాక్కు గురైంది. దీంతో రెండు చేతులతో పాటు... రెండు కాళ్లు మోకాలి కింది వరకు తొలగించాల్సి వచ్చింది. అనంతరం ఆర్చరీని కెరీర్గా ఎంచుకున్న పాయల్... అంచెలంచెలుగా ఎదుగుతూ అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. శీతల్పై గెలవడం పాయల్కు ఇది రెండోసారి. గతంలో నేషనల్ చాంపియన్షిప్లోనూ శీతల్పై పాయల్ పైచేయి సాధించింది. -
పాకిస్తాన్కు కొత్త హెడ్కోచ్.. ఆటగాళ్లలో తీవ్ర అసంతృప్తి
కరాచీ: పాకిస్తాన్ హాకీ సమాఖ్య (పీహెచ్ఎఫ్) తమ సీనియర్ టీమ్ హెడ్ కోచ్ ఎంపికకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం టీమ్కు కోచ్గా ఉన్న ఆస్ట్రేలియన్ కొలిన్ బ్యాచ్ స్థానంలో స్వదేశీ కోచ్ను ప్రకటించింది. మాజీ ఒలింపియన్ మన్జూర్ ఉల్ హసన్ పాక్ టీమ్కు హెడ్ కోచ్గా వ్యవహరిస్తాడు. రాబోయే ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్, ప్రపంచ కప్లలో పాల్గొనే టీమ్ మన్జూర్ శిక్షణలోనే సన్నద్ధమవుతుంది. మాజీ ఆటగాళ్లు హసన్ సర్దార్, ఇస్లాహుద్దీన్ సిద్దిఖీలతో కూడిన పీహెచ్ఎఫ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కమిటీ సిఫారసుపై కొత్త కోచ్ ఎంపిక జరిగింది. తీవ్ర అసంతృప్తిఅయితే మన్జూర్ను కోచ్గా నియమించడంపై పాక్ జట్టులో ఆటగాళ్లు తీవ్ర అసంతృప్తికి గురైనట్లు సమాచారం. తాజా నిర్ణయం పట్ల వారు నిర్ఘాంతపోయారు. 70వ, 80వ దశకాల్లో డిఫెండర్గా మన్జూర్ పాక్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అనూహ్య ప్రకటన‘ఆటగాడిగా మన్జూర్కు మంచి గుర్తింపు ఉన్న మాట వాస్తవమే. అయితే కోచ్గా ఆయనను ఎంపిక చేయడం అంటే తీవ్ర నిరాశాజనక ఫలితాలను కొనితెచ్చుకోవడమే. కొలిన్ బ్యాచ్ అన్ని రకాలుగా అర్హుడైన కోచ్. మేమంతా ఆయన శిక్షణతో సంతోషంగా ఉన్నాం. ఆధునిక హాకీకి సంబంధించి అన్ని అంశాలపై అవగాహన ఉంది. ప్రొ లీగ్, వరల్డ్ కప్లాంటి పెద్ద ఈవెంట్లలో మమ్మల్ని కొలిన్ సమర్థంగా నడిపిస్తాడని భావించిన తరుణంలో ఈ అనూహ్య ప్రకటన వచ్చింది’ అని పాక్ జాతీయ జట్టులోని ఒక ఆటగాడు వ్యాఖ్యానించాడు. ఎనిమిదేళ్ల విరామం తర్వాత పాకిస్తాన్ ఈ ఏడాది జరిగే ప్రపంచ కప్నకు అర్హత సాధించింది. చదవండి: IPL 2026: బీసీసీఐ కొత్త నిబంధనలు -
ఆయుశ్ అద్భుతం
నింగ్బో (చైనా): ఆసియా సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత రైజింగ్ స్టార్ ఆయుశ్ శెట్టి సంచలనంతో శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన తొలి రౌండ్లో ప్రపంచ 25వ ర్యాంకర్ ఆయుశ్ 21–13, 21–16తో ప్రపంచ ఏడో ర్యాంకర్ లిన్ షి ఫెంగ్ (చైనా)ను బోల్తా కొట్టించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 51 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో రెండు గేముల్లోనూ ఆయుశ్ తొలుత వెనుకబడ్డా... సంయమనం కోల్పోకుండా ఆడి ఆధిక్యంలోకి వచ్చాడు. అదే జోరులో గేమ్లను సొంతం చేసుకున్నాడు. భారత్కే చెందిన హెచ్ఎస్ ప్రణయ్ కూడా ముందంజ వేశాడు. ప్రణయ్ 24–22, 21–12తో నుగుయెన్ హాయ్ డాంగ్ (వియత్నాం)పై గెలుపొందాడు. అయితే పతకం సాధిస్తాడనుకున్న భారత నంబర్వన్ లక్ష్య సేన్, ప్రపంచ మాజీ నంబర్వన్ కిడాంబి శ్రీకాంత్ తొలి రౌండ్లోనే నిష్క్రమించి నిరాశపరిచారు. ప్రపంచ 22వ ర్యాంకర్ లీ చెయుక్ యి (హాంకాంగ్)తో జరిగిన మ్యాచ్లో లక్ష్య సేన్ 12–21, 19–21తో ఓడిపోయాడు. లీ చెయుక్ చేతిలో లక్ష్య సేన్కిది నాలుగో ఓటమి కావడం గమనార్హం. ఈ ఏడాది మలేసియా ఓపెన్లోనూ లీ చెయుక్ చేతిలో లక్ష్య సేన్ వరుస గేముల్లో పరాజయం పాలయ్యాడు. ప్రపంచ మాజీ చాంపియన్ లో కీన్ యెవ్ (సింగపూర్)తో జరిగిన మ్యాచ్లో శ్రీకాంత్ 21–18, 9–21, 11–21తో ఓటమి చవిచూశాడు. 52 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో శ్రీకాంత్ తొలి గేమ్ను సొంతం చేసుకున్నా... అదే జోరును కొనసాగించడంలో విఫలమై ఓటమి మూటగట్టుకున్నాడు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిమ్రన్–కవిప్రియ సెల్వం (భారత్) జోడీ 9–21, 8–21తో లీ యి జింగ్–లువో జు మిన్ (చైనా) జంట చేతిలో ఓడిపోయింది. మరో మ్యాచ్లో శ్రుతి మిశ్రా–ప్రియ (భారత్) ద్వయం 21–15, 17–21, 21–13తో ఫామ్ థి డియు లె–ఫామ్ థి కాన్ (వియత్నాం) జంటపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. -
22 ఏళ్ల తర్వాత...
పాథుమ్ థాని (థాయ్లాండ్): ఆసియా కప్ మహిళల అండర్–20 ఫుట్బాల్ టోర్నమెంట్ను భారత జట్టు విజయంతో ముగించింది. బుధవారం జరిగిన గ్రూప్ ‘సి’ చివరి లీగ్ మ్యాచ్లో భారత జట్టు 3–1 గోల్స్ తేడాతో చైనీస్ తైపీ జట్టును ఓడించింది. భారత్ తరఫున శిబాని దేవి నోంగ్మెకాపమ్ (32వ, 87వ నిమిషాల్లో) రెండు గోల్స్ సాధించగా... భూమిక దేవి ఖుముక్చామ్ (26వ నిమిషంలో) ఒక గోల్ చేసింది. చైనీస్ తైపీ తరఫున సబ్స్టిట్యూట్ కావో సిన్ (90+3వ నిమిషంలో) ఏకైక గోల్ నమోదు చేసింది. 2004 తర్వాత ఆసియా కప్ అండర్–20 మహిళల టోర్నీలో భారత జట్టుకిదే తొలి విజయం కావడం విశేషం. నాలుగు జట్లున్న గ్రూప్ ‘సి’లో భారత జట్టు తమ మూడు మ్యాచ్లను పూర్తి చేసుకుంది. రెండు మ్యాచ్ల్లో ఓడిన భారత్ ఒక మ్యాచ్లో గెలిచి మూడు పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. మూడు గ్రూప్ల నుంచి టాప్–2లో నిలిచిన ఆరు జట్లతోపాటు మూడు గ్రూప్ల్లో మూడో స్థానంలో నిలిచిన రెండు అత్యుత్తమ జట్లు క్వార్టర్ ఫైనల్ చేరుకుంటాయి. గ్రూప్ ‘బి’లో ఉజ్బెకిస్తాన్, జోర్డాన్ జట్ల మధ్య మ్యాచ్ ‘డ్రా’గా ముగిస్తే భారత జట్టు నాకౌట్ దశకు అర్హత సాధించేది. అయితే జోర్డాన్పై ఉజ్బెకిస్తాన్ భారీ విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ చేరుకోవడంతోపాటు భారత జట్టు నాకౌట్ దశకు చేరే అవకాశాలకు తెరదించింది. -
నితేశ్కు రజతం
బిష్కెక్ (కిర్గిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో బుధవారం భారత్కు మూడు పతకాలు లభించాయి. పురుషుల గ్రీకో రోమన్ స్టయిల్లో భారత రెజ్లర్లు నితేశ్ (97 కేజీలు) రజత పతకం దక్కించుకోగా... ప్రిన్స్ (82 కేజీలు), సచిన్ సెహ్రావత్ (67 కేజీలు) కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. డిఫెండింగ్ చాంపియన్ మొహమ్మధాది సరావి (ఇరాన్)తో జరిగిన ఫైనల్లో నితేశ్ 1–7 పాయింట్ల తేడాతో ఓడిపోయాడు. దిదార్ అమన్జరోవ్ (తుర్క్మెనిస్తాన్)తో జరిగిన కాంస్య పతక బౌట్లో ప్రిన్స్ 10–1తో విజయం సాధించాడు. అబ్దుమలిక్ అమినోవ్ (ఉజ్బెకిస్తాన్)తో జరిగిన కాంస్య పతక బౌట్లో సచిన్ 6–5 పాయింట్ల తేడాతో గెలిచాడు. ఓవరాల్గా గ్రీకో రోమన్ విభాగంలో భారత రెజ్లర్లు రెండు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం ఐదు పతకాలు సొంతం చేసుకున్నారు. టీమ్ ర్యాంకింగ్స్లో భారత్ 115 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. 195 పాయింట్లతో ఇరాన్ గ్రీకో రోమన్ విభాగంలో అగ్రస్థానాన్ని సంపాదించింది. 154 పాయింట్లతో కిర్గిస్తాన్ రెండో స్థానంలో, 136 పాయింట్లతో ఉజ్బెకిస్తాన్ మూడో స్థానంలో నిలిచాయి. బుధవారమే మొదలైన మహిళల ఫ్రీస్టయిల్ ఈవెంట్లో భారత రెజ్లర్లు హన్సిక లాంబా (55 కేజీలు), నేహా (59 కేజీలు) నేడు కాంస్య పతకాల కోసం పోటీపడతారు. సెమీఫైనల్లో హన్సిక 1–11తో యుజువాన్ లీ (చైనా) చేతిలో, నేహా 5–12తో మెంగ్యు జి (చైనా) చేతిలో ఓడిపోయారు. భారత్కే చెందిన కాజల్ (76 కేజీలు), నీలమ్ (50 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో పరాజయం చవిచూశారు. -
తెలంగాణ జిమ్నాస్ట్లకు 27 పతకాలు
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా లెవెల్ వైజ్ జిమ్నాస్టిక్స్ చాంపియన్షిప్లో తెలంగాణ ప్లేయర్లు అదరగొట్టారు. న్యూఢిల్లీలోని ద జిమ్నాస్టిక్ అకాడమీలో ఇటీవల జరిగిన ఈ టోర్నీలో తెలంగాణ చిన్నారులు 25 రజత పతకాలు, రెండు కాంస్య పతకాలతో మెరిశారు. మొత్తం 27 పతకాలు సొంతం చేసుకొని ఓవరాల్గా రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. టేబుల్ వాల్ట్, అన్ఈవెన్ బార్స్, బ్యాలెన్సింగ్ బీమ్, ఫ్లోర్ ఎక్సర్సైజ్ ఈవెంట్స్లో పోటీలు నిర్వహించారు. ఈ టోర్నీలో పతకాలు సాధించిన తెలంగాణ జిమ్నాస్ట్లను బుధవారం హైదరాబాద్లోని వందన బద్రుక ఇన్స్టిట్యూట్ కల్పతరులో అంతర్జాతీయ ప్లేయర్, జాతీయ చాంపియన్, జాతీయ జడ్జి ప్రియాంక అభినందించింది. ఈ టోర్నీలో పతకాలు గెలిచిన తెలంగాణ జిమ్నాస్ట్ల వివరాలు ఇలా ఉన్నాయి. బాలికలు (లెవెల్–1): హియా యాదవ్, ప్రణవి షా, జెకా నవాజ్, అయేషా సిద్దిఖి, ఆద్య కపూర్, మెహర్ అగర్వాల్. బాలురు (లెవెల్–1): అన్షుల్ యాదవ్, ఆకుల అద్వైత్, చందూరి అద్వైత్, గొల్ల విదిత్, ఎన్.సిద్విక్ రెడ్డి, రేయాంశ్ రావు. బాలికలు (లెవెల్–2): మాన్వీ రెడ్డి, మండవ మైరా, అనన్య రెడ్డి, కృషా జైన్, కృత్యా కొయిరాలా, వర్ణిక రెడ్డి, రియానా రెడ్డి, ఆర్ణవి చందూరి, ఆముక్త. బాలురు (లెవెల్–2): చొక్కారపు లౌక్య విరాట్. బాలికలు (లెవెల్–3): ఇనారా రుక్మిణి. బాలికలు (లెవెల్–4): సిమోన్ పెస్తోంజి. బాలికలు (లెవెల్–6): ఖుషీ రాయ్. -
భారత జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్ల రీఎంట్రీ
ఏప్రిల్ 13–17 వరకు అర్జెంటీనాలో జరుగబోయే నాలుగు మ్యాచ్ల సిరీస్ కోసం 24 మంది సభ్యుల భారత మహిళల హాకీ జట్టును హాకీ ఇండియా ఇవాళ (ఏప్రిల్ 8) ప్రకటించింది. స్టార్ ప్లేయర్లు సవితా పూనియా (గోల్ కీపర్), దీపిక (ఫార్వర్డ్) ఈ సిరీస్తో రీఎంట్రీ ఇచ్చారు. సలీమా టేటే కెప్టెన్గా కొనసాగుతారు. జ్యోతి, ముంతాజ్ ఖాన్ జట్టులోకి తిరిగి వచ్చారు. రుతుజా, ఇషికా, సాక్షి రాణా వంటి యువ ప్లేయర్లకు కూడా ఈ జట్టులో చోటు దక్కింది. సవితతో పాటు మరో గోల్ కీపర్గా బిచు దేవి ఎంపికయ్యారు.డిఫెండర్లుగా నిక్కీ ప్రధాన్, ఇషికా చౌధరి, సుశీలా చాను, మనీషా చౌహాన్, లల్తంత్లుయాంగి, జ్యోతి, ఉదితా చోటు దక్కించుకున్నారు. మిడ్ఫీల్డర్లుగా వైష్ణవి విఠల్ ఫల్కే, సాక్షి రాణా, సునెలితా టోప్పో, సలీమా టేటే, నేహా, దీపికా సోరెంగ్, రుతుజా దాదాసో పిసాల్, ఇషికా .. ఫార్వర్డ్ ప్లేయర్లుగా బల్జీత్ కౌర్, నవనీత్ కౌర్, దీపికా, అన్ను, బ్యూటీ దుంగ్దుంగ్, లాల్రెమ్సియామి, ముంతాజ్ ఖాన్ వ్యవహరించనున్నారు.ఈ సిరీస్ భారత జట్టుకు హాకీ వరల్డ్ కప్ 2026, ఆసియా గేమ్స్కు ముందు కీలకమైందిగా పరిగణించబడుతుంది. అర్జెంటీనా వంటి బలమైన జట్టుతో ఆడటం యువ ప్లేయర్లకు విలువైన అనుభవంగా నిలువనుంది. -
పాపం.. గర్ల్ఫ్రెండ్ చేసిన పనికి సిన్నర్ ఏమవుతాడో!
ప్రస్తుతం టెన్నిస్లో జానిక్ సిన్నర్, కార్లోస్ అల్కరాజ్లు ఒకరితో ఒకరు పోటీ పడడం మస్తు మజాను అందిస్తుంది. ఈ ఇద్దరు టెన్నిస్ ర్యాంకింగ్స్లో తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఒకప్పుడు నాదల్, ఫెదరర్, జొకోవిచ్ మధ్య పోటీ ఎంత రసవత్తరంగా ఉండేదో అదే తరహాలో ఇప్పుడు సిన్నర్, అల్కరాజ్లు ఎక్కడ తలపడినా ఆ మ్యాచ్కు యమా క్రేజ్ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ ఇద్దరు మాంటే కార్లో మాస్టర్స్ టెన్నిస్ టోర్నీలో ఆడుతున్నారు. ప్రస్తుతం జానిక్ సిన్నర్ డెన్మార్క్కు చెందిన మోడల్ లైలా హసనోవిక్తో లవ్లో ఉన్న సంగతి తెలిసిందే. సిన్నర్ ఏ టోర్నీ ఆడినా అక్కడ హసనోవిక్ ప్రత్యక్షమయ్యేది. అయితే తాజాగా మాంటే కార్లో టెన్నిస్ టోర్నీలో మాత్రం ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.హసనోవిక్ తన ప్రియుడి మ్యాచ్కు కాకుండా సిన్నర్ చిరకాల ప్రత్యర్థి అల్కరాజ్ మ్యాచ్కు హాజరవ్వడమే ఇక్కడ అతిపెద్ద ట్విస్ట్. టోర్నీలో భాగంగా అల్కరాజ్ తన తొలి మ్యాచ్లో సెబాస్టియన్ బేజ్ను 6-1, 6-3తో ఓడించాడు. కేవలం 70 నిమిషాల పాటు సాగిన మ్యాచ్లో హసనోవిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎందుకంటే అల్కరాజ్ ఆడుతున్నంత సేపు హసనోవిక్ అతడిని కళ్లార్పకుండా చూసింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అంతకముందు రోజు తన బాయ్ఫ్రెండ్ సిన్నర్ మ్యాచ్కు కూడా హసనోవిక్ హాజరయ్యింది. కాగా తొలి రౌండ్ మ్యాచ్లో సిన్నర్ 6-3, 6-0తో హ్యూగో హంబర్ట్ను సులువుగా ఓడించి రెండో రౌండ్లో అడుగుపెట్టాడు. మరి ఈ ఇద్దరు ఈ టోర్నీలో తలపడినప్పుడు హసపనోవిక్ ఎవరి ఆట చూస్తుందో తెలియడానికి కొద్ది రోజులు ఆగాల్సిందే.Laila Hasanovic watching alcaraz today pic.twitter.com/6J7vuRdATj— Kieza (@Czekoladka32904) April 7, 2026చదవండి: జైస్వాల్ బ్యాట్ వెనుక ఇంత కథ దాగుందా! -
ప్రపంచ రికార్డుతో పసిడి పతకం
గ్రనాడా (స్పెయిన్): రైఫిల్, పిస్టల్ ప్రపంచకప్ టోర్నమెంట్ను భారత బృందం పసిడి పతకంతో, ప్రపంచ రికార్డుతో ప్రారంభించింది. మంగళవారం మొదలైన సీజన్ తొలి ప్రపంచకప్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన ముకేశ్ నేలవల్లి, హరియాణా అమ్మాయి పలక్ గులియా అద్భుతం చేశారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో ముకేశ్–పలక్ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో కొత్త ప్రపంచ రికార్డును కూడా సృష్టించారు. 42 జోడీలు పోటీపడ్డ క్వాలిఫయింగ్ రౌండ్లో ముకేశ్ (294)–పలక్ (287) ద్వయం 581 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో... కియాన్జున్ యావో–హు కాయ్ (చైనా) జోడీ 586 పాయింట్లతో అగ్రస్థానాన్ని సంపాదించి స్వర్ణ–రజత పతక పోరుకు అర్హత సాధించాయి. వెరోనికా–అకోస్ కరోలీ (హంగేరి; 580 పాయింట్లు), నటాలియా ప్రాడో–నికోలస్ మౌరెర్ (అమెరికా; 578 పాయింట్లు) జోడీలు వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచి కాంస్య పతక మ్యాచ్కు అర్హత పొందాయి. ఫైనల్లో ముకేశ్ (244.7 పాయింట్లు)–పలక్ (243 పాయింట్లు) జోడీ 487.7 పాయింట్లు స్కోరు చేసి కొత్త ప్రపంచ రికార్డును లిఖించి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్ వేదికగా జరిగిన ఆసియా చాంపియన్షిప్లో నిగీనా సైదుకులోవా–ముఖమ్మద్ కమలోవ్ (ఉజ్బెకిస్తాన్; 481.3 పాయింట్లు) నెలకొల్పిన ప్రపంచ రికార్డును ముకేశ్–పలక్ బద్దలు కొట్టారు. కియాన్జున్ యావో –హు కాయ్ (484.8 పాయింట్లు) జోడీ రజత పతకాన్ని గెల్చుకుంది. మరోవైపు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత్కు నిరాశే మిగిలింది. క్వాలిఫయింగ్లో సోనమ్–గజానన్ (భారత్; 631.4 పాయింట్లు) జోడీ ఆరో స్థానంలో ... శ్రుతి–అర్ష్ దీప్ సింగ్ (భారత్; 628 పాయింట్లు) జంట 19వ స్థానంలో నిలిచింది.గురి పెడితే పతకమే...గుంటూరు జిల్లాకు చెందిన 20 ఏళ్ల ముకేశ్ కొన్నాళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్నాడు. బరిలో దిగిన ప్రతి టోర్నీలో ఏదో ఒక పతకంతో తిరిగొస్తున్నాడు. రెండేళ్ల క్రితం పెరూలో జరిగిన జూనియర్ ప్రపంచ చాంపియన్షిప్లో 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో ముకేశ్ స్వర్ణం గెలిచి విశ్వవిజేతగా నిలిచాడు. అదే ఈవెంట్లో మరో రెండు కాంస్యాలు కూడా సాధించాడు. ఈ ఏడాది న్యూఢిల్లీలో జరిగిన జూనియర్ ప్రపంచకప్లో ముకేశ్ స్వర్ణ, రజత, కాంస్య పతకాలు గెలిచాడు. ఈ సంవత్సరమే న్యూఢిల్లీ వేదికగా జరిగిన ఆసియా జూనియర్ చాంపియన్షిప్లో ముకేశ్ ఒక స్వర్ణం, రెండు రజతాలు, ఒక కాంస్యం సొంతం చేసుకున్నాడు. సీనియర్స్థాయిలో తొలిసారి ప్రపంచకప్లో పసిడి పతకంతో ముకేశ్ శుభారంభం చేసి తనకెంతో ఉజ్వల భవిష్యత్ ఉందని చాటి చెప్పాడు. -
భారత రెజ్లర్ లలిత్కు రజత పతకం
బిష్కెక్ (కిర్గిస్తాన్): ఆసియా రెజ్లింగ్ చాంపియన్షిప్ పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో భారత రెజ్లర్లు లలిత్ (55 కేజీలు) రజత పతకం... సునీల్ (87 కేజీలు) కాంస్య పతకం నెగ్గారు. ఫైనల్లో లలిత్ 0–9తో బొటిరోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. కాంస్య పతక బౌట్లో సునీల్ 5–4తో రసులోవ్ (ఉజ్బెకిస్తాన్)పై గెలిచాడు. 77 కేజీల కాంస్య పతక బౌట్లో భారత రెజ్లర్ అమన్ 14–15తో యోంగన్ (కొరియా) చేతిలో ఓడిపోయాడు. -
ఫైనల్లో జైస్మీన్
ఉలాన్బాటర్ (మంగోలియా): ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్లు జైస్మీన్ లంబోరియా (57 కేజీలు), మీనాక్షి హుడా (48 కేజీలు), విశ్వనాథ్ సురేశ్ (50 కేజీలు), సచిన్ సివాచ్ (60 కేజీలు) ఫైనల్లోకి దూసుకెళ్లారు. సెమీఫైనల్స్లో జైస్మీన్ 3–2తో నిగీనా ఉక్తమోవా (ఉజ్బెకిస్తాన్)పై, మీనాక్షి 4–1తో థిప్సాచా (థాయ్లాండ్)పై, విశ్వనాథ్ 5–0తో సాన్జార్ (కజకిస్తాన్)పై, సచిన్ 4–1తో రువామ్థామ్ (థాయ్లాండ్)పై గెలిచారు. ఆకాశ్ (75 కేజీలు), లోకేశ్ (85 కేజీలు), నరేందర్ బెర్వాల్ (ప్లస్ 90 కేజీలు), హర్‡్ష (90 కేజీలు) సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. ఓవరాల్గా ఈ టోరీ్నలో ఎనిమిది మంది భారత బాక్సర్లు ఫైనల్లోకి ప్రవేశించారు. -
కొండా శ్రేయాన్ష్ మురళీ కృష్ణ పటేల్ ప్రపంచ రికార్డు
అత్యంత పిన్న వయస్సులోనే చదరంగంలో ప్రపంచ రికార్డు సాధించిన బాలుడిగా కొండా శ్రేయాన్ష్ మురళీ కృష్ణ పటేల్ నిలిచాడు. రెండు సంవత్సరాల 11 నెలల వయసులో ఈ ఘనత సాధించాడు. రాయ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రెండు అసాధారణ రికార్డులను నెలకొల్పి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (లండన్) స్థానం సాధించిన కొండా శ్రేయాన్ష్ కృష్ణ పటేల్ నిలిచాడు. 15 నిమిషాల 52 సెకండ్స్ లలో 93 బ్యాక్ ర్యాంక్ చెక్ మేట్స్ ను పరిష్కరించడంతో పాటు, 1 గంట 9 నిమిషాల 9 సెకండ్స్ లలో 21 చెస్ బోర్డ్ లను అమర్చి రెండు ప్రపంచ రికార్డులను సాధించి చరిత్ర సృష్టించాడు.జూబ్లీహిల్స్లోని ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ కాలనీ కల్చరల్ సెంటర్లో మంగళవారం వేడుకగా ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి హాజరయ్యారు.శ్రేయాన్ష్ కృష్ణ పటేల్ ప్రపంచ రికార్డ్ సాధించి, భరతమాత ముద్దు బిడ్డగా, అపార మేధస్సు కలిగిన స్వామి వివేకానందునిగా అవతరించాడని మంత్రి వాకిటి శ్రీహరి ప్రశంసించారు. మరోవైపు.. తన మనవడి ప్రతిభను చూసి మంత్రి సురేఖ మురిసిపోయారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ, శ్రీయాన్ష్ తల్లి కొండా సుస్మిత పటేల్ ఉద్వేగంతో ఆనంద భాష్పాలు రాల్చారు.కాగా రాయ్ చెస్ అకాడమీ తరఫున క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కొండా శ్రేయాన్ష్ పటేల్కు ట్రోఫీలు, సర్టిఫికెట్ లను ప్రదానం చేశారు. త్వరలో వరల్డ్ బుక్ ఆఫ్ లండన్ ద్వారా బ్రిటిష్ పార్లమెంట్లో సత్కారంతో పాటు సర్టిఫికెట్ను శ్రేయాన్ష్ కృష్ణ పటేల్ పొందనున్నాడు. -
భారత జట్టులో హైదరాబాద్ కుర్రాడు
సాక్షి, హైదరాబాద్: ఆసియా ఓసియానియా జూనియర్ డేవిస్కప్ ఫైనల్ క్వాలిఫయింగ్ టోర్నీలో పాల్గొనే భారత టెన్నిస్ జట్టును ప్రకటించారు. ముగ్గురు సభ్యులతో కూడిన భారత జట్టులో హైదరాబాద్కు చెందిన 15 ఏళ్ల హృతిక్ కటకం చోటు సంపాదించాడు. న్యూఢిల్లీలో జరిగిన సెలెక్షన్ ట్రయల్స్ టోర్నీలో హృతిక్ ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలుపొంది అగ్రస్థానంలో నిలిచాడు. జాతీయ బాలుర సింగిల్స్ ర్యాంకింగ్స్లో మూడో స్థానంలో ఉన్న హృతిక్ ట్రినిటీస్ చాలెంజర్స్ టెన్నిస్ అకాడమీలో కోచ్ హెన్రీ ప్రవీణ్ వద్ద శిక్షణ తీసుకుంటున్నాడు. కాగా ఆసియా ఓసియానియా టోర్నీ మే 18 నుంచి 23వ తేదీ వరకు కజకిస్తాన్లో జరుగుతుంది. హృతిక్తోపాటు రిభవ్ సరోహా (చండీగఢ్), తవిష్ పహ్వా (హరియాణా) కూడా భారత జట్టులో ఎంపికయ్యారు. -
వారెవ్వా మినర్వా.. తొలిసారి ఆడినా అదరగొట్టింది!
భారత్కు చెందిన మినర్వా ఫుట్బాల్ క్లబ్ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. అండర్-15 మెడిటేరియన్ ఇంటర్నేషనల్ కప్ (ఎంఐసీ) టోర్నీలో తొలిసారి ఆడుతున్నప్పటికీ మినర్వా ఫుట్బాల్ క్లబ్ తమ ప్రదర్శనతో అదరగొట్టింది. క్వార్టర్స్లో ఓటమి పాలైనప్పటికీ మినర్వా ఫుట్బాల్ క్లబ్ తమ ఆటతో ఫుట్బాల్ అభిమానుల మనసులను దోచేసింది. గ్రూప్ దశలో మినర్వా క్లబ్ తొలి మ్యాచ్లో 3-0తో కెనెడా బ్రేవ్స్ను, ఆ తర్వాత బొకా ఎఫ్సీపై 4-1తో, ఈఎఫ్ సాంటాపై 1-0తో విజయాలు సాధించి టేబుల్ టాపర్గా నిలిచి ప్రిక్వార్టర్స్లో అడుగుపెట్టింది. ప్రిక్వార్టర్స్లో బలమైన లివర్పూల్ ఎఫ్సీ జూనియర్స్ జట్టును 0-6తో ఓడించి మినర్వా ఫుట్బాల్ క్లబ్ సంచలన విజయాన్ని అందుకొని క్వార్టర్స్లో అడుగుపెట్టింది. అయితే క్వార్టర్స్లో స్పానిష్ క్లబ్ యూఈ ఫిగర్స్ చేతిలో 2-1 తేడాతో ఓడిన మినర్వా క్లబ్ ఇంటిబాట పట్టింది. అయితే ప్రిక్వార్టర్స్లో లివర్పూల్ను 6-0తో చిత్తు చేయడం ద్వారా మినర్వా ఫుట్బాల్ క్లబ్ అరుదైన ఘనత సాధించింది. మెడిటేరియన్ ఇంటర్నేషనల్ కప్లో ఇంగ్లీష్ జెయింట్స్ను చిత్తు చేసిన తొలి భారత ఫుట్బాల్ క్లబ్గా మినర్వా జట్టు చరిత్రకెక్కింది. లివర్పూల్తో మ్యాచ్లో మినర్వా ఫుట్బాల్ క్లబ్ తరఫున మొహమ్మద్ ఆజమ్ ఖాన్ (ఆట రెండో నిమిషం, 36 వ నిమిషం), అమర్సన్ సింగ్ (11వ నిమిషం), సింగ్ (25, 28వ, 47వ నిమిషం)లో గోల్స్ చేశారు. ఈ నేపథ్యంలో మినర్వా ఫుట్బాల్ క్లబ్ ప్రదర్శనపై కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుక్ మాండవీయ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.‘భారత ఫుట్బాల్లో ఇది కొత్త ఆరంభం. అంతర్జాతీయంగా భారత ఫుట్బాల్ మరింత దేదీప్యమానంగా వెలుగొందాలని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు.ఇక గతేడాది మినర్వా ఫుట్బాల్ క్లబ్ మూడో ట్రోఫీలను సొంతం చేసుకుంది. స్వీడన్లో జరిగిన గోతియా కప్, డెన్మార్క్లో జరిగిన డానా కప్, నార్వేలో జరిగిన నార్వే కప్లను గెలుచుకుంది.pic.twitter.com/MYMO4G8A83— Follow @barcanation6 (@barcanationvid1) April 3, 2026చదవండి: ‘త్యాగాలు చేశా.. ఐపీఎల్ వల్ల కెరీర్ నాశనమైంది’ -
నిఖత్కు నిరాశ
ఉలాన్బాటర్ (మంగోలియా): ఆసియా సీనియర్ బాక్సింగ్ చాంపియన్షిప్లో సోమవారం భారత బాక్సర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. రెండుసార్లు ప్రపంచ చాంపియన్, తెలంగాణ స్టార్ నిఖత్ జరీన్ (51 కేజీలు), టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గోహైన్ (75 కేజీలు), అంకుశిత బోరో (65 కేజీలు), పూజా రాణి (85 కేజీలు) సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. భారత్కే చెందిన ప్రీతి పవార్ (54 కేజీలు), ప్రియ (60 కేజీలు), అరుంధతి (70 కేజీలు) సెమీఫైనల్లో విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లారు. సెమీఫైనల్స్లో నిఖత్ 0–5తో వు యు (చైనా) చేతిలో ఓడిపోయింది. పారిస్ ఒలింపిక్స్లోనూ వు యు చేతిలోనే నిఖత్ ఓటమి పాలైంది.లవ్లీనా 0–5తో అజీజా జొకిరోవా (ఉజ్బెకిస్తాన్) చేతిలో, అంకుశిత 0–3తో నియెన్ చిన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో, పూజా రాణి 0–5తో నాదెజ్దా రియాబెట్స్ (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయారు. ఇతర సెమీఫైనల్స్లో ప్రీతి 5–0తో పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత ఎజి ఇమ్ (దక్షిణ కొరియా)పై, అరుంధతి 4–1తో ఒయ్షా తొయ్రోవా (ఉజ్బెకిస్తాన్)పై, ప్రియ 5–0తో నమున్ మోన్ఖోర్ (మంగోలియా)పై గెలుపొందారు. -
‘పసిడి’ రేసులో లలిత్
బిష్కెక్ (కిర్గిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత్కు ఒక పతకం ఖరారైంది. మరో రెండు పతకాలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. సోమవారం మొదలైన ఈ మెగా ఈవెంట్ పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో భారత రెజ్లర్ లలిత్ (55 కేజీలు) ఫైనల్లోకి దూసుకెళ్లాడు. నేడు జరిగే స్వర్ణ–రజత పతక బౌట్లో ఇఖ్తియోర్ బొతిరోవ్ (ఉజ్బెకిస్తాన్)తో తలపడతాడు. అంతకుముందు లలిత్ క్వార్టర్ ఫైనల్లో 9–8తో మిజుకి అరాకి (జపాన్)పై, సెమీఫైనల్లో 11–3తో హువోయింగ్ షి (చైనా)పై గెలుపొందాడు. మరోవైపు భారత్కే చెందిన అమన్ (77 కేజీలు), సునీల్కుమార్ (87 కేజీలు) సెమీఫైనల్లో ఓడిపోయి నేడు కాంస్య పతకాల కోసం పోటీపడనున్నారు. జోగిందర్ రాఠి (130 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో, సన్నీ కుమార్ (63 కేజీలు) క్వాలిఫయింగ్ రౌండ్లో నిష్క్రమించారు. జోగిందర్, సన్నీ కుమార్లను ఓడించిన రెజ్లర్లు ఫైనల్కు చేరుకోవడంలో విఫలం కావడంతో భారత రెజ్లర్లకు కాంస్య పతకం కోసం పోటీపడే అవకాశం కూడా చేజారింది. నేడు జరిగే ఐదు వెయిట్ కేటగిరీల్లో సాహిన్ (60 కేజీలు), సచిన్ (67 కేజీలు), అనిల్ (72 కేజీలు), ప్రిన్స్ (82 కేజీలు), నితేశ్ (87 కేజీలు) తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. -
వైదొలిగిన సాత్విక్–చిరాగ్ జోడీ
నింగ్బో (చైనా): ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత్ పతకావకాశాలపై దెబ్బ పడింది. మంగళవారం మొదలయ్యే ఈ మెగా ఈవెంట్ నుంచి భారత రెండు డబుల్స్ స్టార్స్ జోడీలు వైదొలిగాయి. గాయం కారణంగా సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి... పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ఈ టోర్నీకి దూరమయ్యారు. సాత్విక్ భుజం గాయం నుంచి ఇంకా కోలుకోలేదని... అందుకే ఈ టోర్నీలో ఆడటంలేదని భారత డబుల్స్ కోచ్ టాన్ కిమ్ హెర్ తెలిపాడు. డబుల్స్లో పతకం ఆశలు ఆవిరి కావడంతో ఇక అందరి దృష్టి సింగిల్స్ స్టార్స్ లక్ష్య సేన్, పీవీ సింధులపై ఉంది. పురుషుల సింగిల్స్లో లక్ష్య సేన్, ప్రణయ్, ఆయుశ్ శెట్టి, కిడాంబి శ్రీకాంత్... మహిళల సింగిల్స్లో సింధు, మాళవిక, ఉన్నతి హుడా, తన్వీ శర్మ బరిలో ఉన్నారు. 1965లో దినేశ్ ఖన్నా పురుషుల సింగిల్స్లో పసిడి పతకం గెలిచిన తర్వాత భారత్కు సింగిల్స్లో మరో స్వర్ణ పతకం లభించలేదు. -
భారత్కు ఐదు పతకాలు ఖాయం
ఉలాన్బాటర్ (మంగోలియా): ఆసియా సీనియర్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత్కు మరో ఐదు పతకాలు ఖాయమయ్యాయి. మహిళల విభాగంలో ప్రపంచ చాంపియన్స్ జైస్మీన్ లంబోరియా (57 కేజీలు), మీనాక్షి హుడా (48 కేజీలు)... పురుషుల విభాగంలో లోకేశ్ (85 కేజీలు), ఆకాశ్ (75 కేజీలు), హర్ష్చౌధరీ (90 కేజీలు) సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. తద్వారా కనీసం కాంస్య పతకాలను ఖరారు చేసుకున్నారు. జియి చెన్ (చైనా)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో జైస్మీన్ 5–0తో... యుకా సదమత్సు (జపాన్)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో మీనాక్షి 5–0తో ఏకపక్ష విజయాలు అందుకున్నారు. లోకేశ్ 5–0తో గిచాయి కిమ్ (దక్షిణ కొరియా)పై, ఆకాశ్ 5–0తో యాలాస్ బగ్తియరోవ్ (తుర్క్మెనిస్తాన్)పై, హర్ష్5–0తో తినిస్తాన్ అలీబయెవ్ (కిర్గిస్తాన్)పై గెలుపొందారు. ఓవరాల్గా ఈ టోర్నీలో మహిళల విభాగంలో బరిలోకి దిగిన 10 మంది భారత బాక్సర్లు సెమీఫైనల్ చేరుకోగా... పురుషుల విభాగంలో ఆరుగురు ఈ ఘనత సాధించారు. -
శ్రీనిధి డెక్కన్ ఎఫ్సీ ఖాతాలో మరో ‘డ్రా’
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఫుట్బాల్ లీగ్ (ఐఎఫ్ఎల్)లో హైదరాబాద్కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) జట్టు ఖాతాలో మూడో ‘డ్రా’ చేరింది. ఐజ్వాల్ ఎఫ్సీ జట్టుతో సొంతగడ్డపై ఆదివారం జరిగిన మ్యాచ్ను శ్రీనిధి డెక్కన్ జట్టు 1–1 గోల్స్తో ‘డ్రా’గా ముగించింది. 29వ నిమిషంలో కెపె్టన్ డేవిడ్ కాస్టనెడా మునోజ్ చేసిన గోల్తో శ్రీనిధి జట్టు 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 87వ నిమిషంలో శ్రీనిధి జట్టు డిఫెండర్ జగ్దీప్ సింగ్ సెల్ఫ్ గోల్ చేయడంతో ఐజ్వాల్ జట్టు స్కోరును సమం చేసింది. మొత్తం పది జట్లు పోటీపడుతున్న ఈ లీగ్లో శ్రీనిధి జట్టు ఏడు మ్యాచ్లు పూర్తి చేసుకుంది. మూడు మ్యాచ్ల్లో గెలిచి, మూడు మ్యాచ్లను ‘డ్రా’ చేసుకొని, ఒక మ్యాచ్లో ఓడి 12 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఈనెల 12న హైదరాబాద్లో జరిగే తదుపరి మ్యాచ్లో రాజస్తాన్ యునైటెడ్ ఎఫ్సీ జట్టుతో శ్రీనిధి డెక్కన్ జట్టు పోటీపడుతుంది. -
వైశాలికి రెండో గెలుపు
పెయియా (సైప్రస్): క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ మహిళల విభాగంలో భారత గ్రాండ్మాస్టర్ వైశాలి వరుసగా రెండో విజయం నమోదు చేసింది. టాన్ జోంగి (చైనా)తో ఆదివారం జరిగిన ఏడో రౌండ్ గేమ్లో వైశాలి 51 ఎత్తుల్లో గెలుపొందింది. ఏడో రౌండ్ తర్వాత వైశాలి నాలుగు పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకింది. ఉక్రెయిన్ గ్రాండ్మాస్టర్ అనా ముజిచుక్ 4.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. పురుషుల విభాగంలో వైశాలి తమ్ముడు, భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద ఖాతాలో ఐదో ‘డ్రా’ చేరింది. ఫాబియానో కరువానా (అమెరికా)తో జరిగిన ఏడో రౌండ్ గేమ్ను ప్రజ్ఞానంద 38 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ప్రస్తుతం ప్రజ్ఞానంద 3.5 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. -
కార్ల్సన్ వింత ప్రవర్తన.. తోటి ప్లేయర్కు అవమానం!
ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్ తన తోటి ప్లేయర్ను అవమానించి మరోసారి వార్తల్లో నిలిచాడు. జర్మనీలోని కార్ల్స్రూహే వేదికగా గ్రెంకె చెస్ ఫ్రీస్టైల్ ఓపెన్ టోర్నీలో ఈ ఘటన చోటుచేసుకుంది. టోర్నీలో భాగంగా రెండో రౌండ్లో కార్ల్సన్ కజకిస్తాన్కు చెందిన రెండో ర్యాంకర్ (మహిళల విభాగంలో) అలువా నూర్మన్తో తలపడాల్సి ఉంది. కార్ల్సన్ వచ్చి తన కుర్చీలో కూర్చోగానే అలువా ‘మీతో ఒక సెల్ఫీ దిగొచ్చా’ అని కార్ల్సన్ను అడిగింది. కార్ల్సన్ ఒప్పుకోవడంతో అలువా తన బ్యాగులో నుంచి ఫోన్ తీసి కార్ల్సన్తో సెల్ఫీ దిగింది. ఆ సమయంలో కార్ల్సన్ కూడా నవ్వుతూ ఫొటోకు ఫోజిచ్చాడు. కాసేపటికే అపరిచితుడిలా మారిన కార్ల్సన్ ఉన్నట్టుండి తన సీటు నుంచి లేచి మ్యాచ్ల నిర్వహణ చూస్తున్న ఆర్బిటర్ను పిలిచి విషయం చెప్పాడు. దీంతో ఆర్బిటర్ అలువా నూర్మన్ వద్దకు వచ్చి ‘మీ ఫోను ఇచ్చేయండి’ అని అడిగాడు. దీంతో నూర్మన్ తన బ్యాగులో నుంచి ఫోన్ తీసి ఆర్బిటర్కు ఇచ్చేసింది. ఫోన్ను కార్ల్సన్కు చూపించిన ఆర్బిటర్ ‘ఓకే నా’ అన్నట్లుగా సైగలు చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను చెస్ బేజ్ ఇండియా షేర్ చేసుకోవడంతో వైరల్గా మారింది. కానీ ఆర్బిటర్ చర్యను మాత్రం ఎవరు తప్పుబట్టడం లేదు. ఎందుకంటే నిబంధనల ప్రకారం చెస్ గేమ్లో ఫోన్ వాడడం లేదా ఉపయోగించడం నిషేధం. గేమ్ ఆడేటప్పుడు ఆటగాళ్లు కూడా మొబైల్ను తమ వద్ద పెట్టుకోకూడదు. కార్ల్సన్ అందుకే అలువా నూర్మన్ వద్ద ఫోన్ ఉందని, అది రూల్స్కు విరుద్ధం కావడంతో ఆర్బిటర్కు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. అయితే గతేడాది డిసెంబర్లో కార్ల్సన్ ఫిడే వరల్డ్ బ్లిట్జ్ చాంపియన్షిప్లో తెలంగాణ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేసి చేతిలో ఓటమిని తట్టుకోలేక విచిత్రంగా ప్రవర్తించాడు. మ్యాచ్ ఓటమిని తట్టుకోలేని కార్ల్సన్.. అర్జున్ షేక్ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేయగా, కార్ల్సన్ మాత్రం కోపంతో టేబుల్ను బలంగా కొడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో అప్పట్లో సంచలనంగా మారింది.Kazakhstan no.2 Woman Alua Nurman takes a selfie with her opponent Magnus Carlsen before the start of Round 2 at the @GRENKEChess Freestyle Open! Before the start of the round, an Arbiter comes and takes Alua's phone with him.Video: @ram_abhyudaya/ ChessBase India pic.twitter.com/3KZ8lc17sh— ChessBase India (@ChessbaseIndia) April 3, 2026చదవండి: రోహిత్ దెబ్బకు ఢిల్లీ క్యాపిటల్స్కు మైండ్ బ్లాక్! -
సత్తా చాటిన పంకజ్ అద్వానీ
లూథియానా: దిగ్గజ క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ పూల్ నేషనల్స్లో కూడా సత్తా చాటాడు. తొలిసారి ఈ టోర్నీలో పాల్గొన్న పంకజ్ 10 బాల్ పూల్ ఈవెంట్లో విజేతగా నిలిచాడు. ఫైనల్లో పంకజ్ (పీఎస్పీబీ) 11–9 స్కోరుతో పుష్పేందర్ సింగ్ (ఆర్ఎస్పీబీ)ని ఓడించాడు. ఒక దశలో 0–3తో వెనుకబడి పంకజ్ కోలుకొని స్కోరును 3–3తో సమం చేయడంతో పాటు ఆ తర్వాత వేగంగా దూసుకుపోయాడు. మహిళల విభాగంలో చిత్ర మగిమైరాజ్ టైటిల్ సొంతం చేసుకుంది. -
శీతల్కు పాయల్ షాక్!
బ్యాంకాక్: వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్లో భారత జట్టు 7 స్వర్ణాలు సహా మొత్తం 16 పతకాలు సాధించి అగ్రస్థానంతో ముగించింది. అయితే టోర్నీలో సంచలన ప్రదర్శన చివరి రోజు శనివారం వచ్చింది. కాంపౌండ్ మహిళల ఫైనల్ విభాగంలో వరల్డ్ నంబర్వన్, స్టార్ పారా ఆర్చర్ శీతల్దేవికి అనూహ్య పరాజయం ఎదురైంది. ఈ పోరులో భారత్కే చెందిన పాయల్ నాగ్ 139–136 స్కోరుతో శీతల్పై విజయం సాధించింది. గత ఏడాది దుబాయ్లో జరిగిన ఆసియా యూత్ పారా గేమ్స్లో పాల్గొన్న పాయల్కు ఇది రెండో అంతర్జాతీయ టోర్నీ మాత్రమే. ఓపెనింగ్ ఎండ్లో పాయల్ 27–25తో ముందంజ వేయగా, సెకండ్ ఎండ్ ముగిసే సరికి శీతల్ రాణించడంతో స్కోరు 54–54తో సమమైంది. అయితే చివరి ఎండ్లో మళ్లీ సత్తా చాటిన పాయల్ పైచేయి సాధించింది. ఒడిషాలోని బాలాంగిర్కు చెందిన పాయల్ కరెంట్ షాక్ కారణంగా రెండు చేతులు, రెండు కాళ్ల మోకాలి కింది భాగాలు కోల్పోయింది. ఏడాదిన్నర క్రితం జైపూర్లో జరిగిన జాతీయ పారా నేషనల్స్లో కూడా శీతల్పై పాయల్ గెలుపొందింది. -
భారత మహిళల జోరు
పాఫోస్ (సైప్రస్): వరల్డ్ క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ మహిళల విభాగంలో భారత గ్రాండ్మాస్టర్లు వైశాలి రమేశ్బాబు, దివ్య దేశ్ముఖ్ సత్తా చాటారు. వీరిద్దరు శనివారం జరిగిన తమ ఆరో రౌండ్ గేమ్లలో విజయాలు అందుకున్నారు. వైశాలి 47 ఎత్తుల్లో కేటరినా లాగ్నో (రష్యా)ను ఓడించగా...దివ్య 46 ఎత్తుల్లో బిబిసర అసుబయెవా (కజకిస్తాన్)పై గెలుపొందింది. వీరిద్దరికి టోర్నీలో ఇదే తొలి విజయం కావడం విశేషం. మరో వైపు పురుషుల విభాగంలో భారత గ్రాండ్మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద మరో గేమ్ను ‘డ్రా’గా ముగించాడు. శనివారం జరిగిన ప్రజ్ఞానంద, నకమురా మధ్య జరిగిన ఆరో రౌండ్ పోరు 23 ఎత్తులో సమంగా ముగిసింది. -
పతకాలకు అడుగుదూరంలో భారత బాక్సర్లు
ఉలాన్బాటర్ (మంగోలియా): ఆసియా సీనియర్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత్కు మూడు పతకాలు ఖాయమయ్యాయి. శుక్రవారం జరిగిన మహిళల విభాగంలో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ (51 కేజీలు)తోపాటు హరియాణాకు చెందిన ప్రియ ఘన్ఘస్ (60 కేజీలు), ప్రీతి పవార్ (54 కేజీలు) సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. సెమీఫైనల్ చేరిన ఈ ముగ్గురికీ కనీసం కాంస్య పతకాలు లభిస్తాయి. జియాన్ బాగుహిన్ (ఫిలిప్పీన్స్)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో నిఖత్ తొలి రౌండ్లోనే విజయాన్ని అందుకుంది. నిఖత్ పంచ్లకు జియాన్ ఎదురు నిలువలేదు. దాంతో రిఫరీ బౌట్ను నిలిపివేసి నిఖత్ను విజేతగా ప్రకటించారు. ఇతర క్వార్టర్ ఫైనల్స్లో ప్రియ 4:1తో చెంగ్యు యాంగ్ (చైనా)పై గెలుపొందగా... ప్రీతి 5:0తో మున్గున్ సెట్సెగ్ (మంగోలయా)ను ఓడించింది. పురుషుల విభాగంలో భారత బాక్సర్ దీపక్ (70 కేజీలు) నిరాశపరిచాడు. క్వార్టర్ ఫైనల్లో దీపక్ 1:4తో జాయెద్ ఇసాహష్ (జోర్డాన్) చేతిలో ఓడిపోయాడు. -
చెస్లో అద్భుతాలు సృష్టిస్తోన్న చిచ్చరపిడుగు
న్యూఢిల్లీ: భారత సంతతికి చెందిన చెస్ చిచ్చరపిడుగు బోధన శివనందన్ ఇంగ్లండ్ మహిళల చెస్ టాప్ ర్యాంకర్గా అవతరించింది. శుక్రవారం విడుదల చేసిన అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) రేటింగ్స్లో ఇంగ్లండ్కు చెందిన 11 ఏళ్ల బోధన 2366 పాయింట్లు సాధించి 72వ ర్యాంక్లో నిలిచింది. తొలిసారి టాప్–100లోకి వచ్చిన బోధన ఈ క్రమంలో 2306 పాయింట్లతో ఇంగ్లండ్ టాప్ ప్లేయర్గా ఉన్న 25 ఏళ్ల లాన్ యావోను అధిగమించింది. తమిళనాడులోని తిరుచిరాపల్లికి చెందిన బోధన తల్లిదండ్రులు 2007లో ఇంగ్లండ్కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. గత ఏడాది ఉమన్ ఇంటర్నేషనల్ మాస్టర్ హోదా పొందిన బోధన ఇటీవల జరిగిన యూరోపియన్ క్లబ్ కప్లో ప్రపంచ మాజీ చాంపియన్ మరియా ముజిచుక్ (ఉక్రెయిన్)పై సంచలన విజయం నమోదు చేసింది. 10వ ర్యాంక్లో అర్జున్ మరోవైపు ఓపెన్ కేటగిరీలో తెలంగాణ ప్లేయర్ ఇరిగేశి అర్జున్ భారత నంబర్వన్గా కొనసాగుతున్నాడు. తాజా రేటింగ్స్లో అర్జున్ 2751 పాయింట్లతో 10వ ర్యాంక్లో నిలిచాడు. 2741 పాయింట్లతో ప్రజ్ఞానంద 12వ ర్యాంక్లో, 2732 పాయింట్లతో ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ 15వ ర్యాంక్లో ఉన్నారు. మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి 2535 పాయింట్లతో ఐదో ర్యాంక్లో ఉంది. 2510 పాయింట్లతో దివ్య దేశ్ముఖ్ పదో ర్యాంక్లో, 2470 పాయింట్లతో ద్రోణవల్లి హారిక 18వ ర్యాంక్లో, 2470 పాయింట్లతోనే వైశాలి 19వ ర్యాంక్లో ఉన్నారు. -
ప్లేఆఫ్ బెర్త్ లక్ష్యంగా...
న్యూఢిల్లీ: రోజుల వ్యవధిలోనే జరిగే బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 టోర్నమెంట్లో సత్తా చాటేందుకు భారత మహిళల టెన్నిస్ జట్టు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఢిల్లీకి చేరుకున్న జట్టు సభ్యులంతా తుది కసరత్తుల్లో చెమటోడ్చుతున్నారు. పురుషుల టీమ్ టెన్నిస్లో జరిగే డేవిస్ కప్లాగే మహిళల విభాగంలో యేటా ఈ బిల్లీ జీన్ కింగ్ కప్ జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ నెల 7 నుంచి 11 వరకు ఢిల్లీలోని డీఎల్టీఏ కాంప్లెక్స్లో ఆసియా ఓసియానియా గ్రూప్–1 టోర్నీని నిర్వహిస్తారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్లో ఆతిథ్య భారత్ సహా ఆరు జట్లు బరిలో ఉన్నాయి. ఇండోనేసియా, కొరియా, మంగోలియా, న్యూజిలాండ్, థాయ్లాండ్లు మిగతా జట్లు కాగా... తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నవంబర్లో జరిగే ప్లే ఆఫ్స్కు అర్హత సాధిస్తాయి. చిట్టచివరి రెండు జట్లు మాత్రం వచ్చే ఏడాది జరిగే ఆసియా–ఓసియానియా గ్రూప్–2కు దిగజారుతాయి. కీలకమైన ఈ టోర్నీకి ముందు జట్టు సన్నద్ధతపై కెప్టెన్ విశాల్ ఉప్పల్ మాట్లాడుతూ భారత అమ్మాయిల జట్టు మరోసారి ప్లే–ఆఫ్స్ బెర్తు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. హార్డ్కోర్టుల్ని ఆకళింపు చేసుకునేందుకే కాస్త ముందుగా వచ్చామని... రాగానే కసరత్తు మొదలుపెట్టామని చెప్పాడు. జట్టు అనుభవజు్ఞలు, యువ క్రీడాకారిణిలతో సమతుల్యంగా ఉందన్నాడు. వరుసగా ఈ ఏడాది కూడా ప్లే ఆఫ్స్ బెర్తు సాధించే సత్తా ఈ జట్టుకు ఉందన్నాడు. భారత జట్టులో ఇద్దరు తెలంగాణ ప్లేయర్లు శ్రీవల్లి రష్మిక, సహజ యామలపల్లి ఉన్నారు. వీరితో పాటు రుతుజా బోసలే, అంకిత రైనా, వైదేహి, కొత్త ప్లేయర్ వైష్ణవి ఆడ్కర్ మిగతా సభ్యులు. భారత మూడో ర్యాంకర్ వైదేహి మాట్లాడుతూ ప్రస్తుత టోర్నీలో పటిష్టమైన జట్టే బరిలోకి దిగుతోందని చెప్పింది. ప్రతీ జట్టుపై విజయం సాధించేందుకు మా వంతు కృషి చేస్తామని తెలిపింది. గత 2025–26 సీజన్లో నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకున్న సహజ మాట్లాడుతూ ‘ఎదురయ్యే ప్రతీ ప్రత్యరి్థని దీటుగా ఎదుర్కొంటాం. గతేడాది ప్లేఆఫ్స్ అనుభవం కూడా గడించాం. ఇప్పడు కూడా స్ఫూర్తిదాయక పోరాటం కనబరిచేందుకు సిద్ధంగా ఉన్నాం. టెన్నిస్ వ్యక్తిగత ఈవెంట్ అయినా... ఇక్కడ మాత్రం జట్టుగా ఆడుతున్నాం. మా అందరిలోనూ ఇప్పుడు నా అనే కంటే మా మ్యాచ్లనే సమష్టి భావనే ఉంది’ అని పేర్కొంది. ఆశించిన ఫలితాలు సాధిస్తామనే ధీమాను శ్రీవల్లి రషి్మక వ్యక్తం చేసింది. -
డోపింగ్ అనర్హుల జాబితాలో భారత్ ‘టాప్’
న్యూఢిల్లీ: డోపింగ్ ఉల్లంఘనల్లో భారత్ చెత్త రికార్డు మూటగట్టుకుంది. గతంలో అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్స్ (ఏఐయూ) అనర్హులైన అథ్లెట్ల జాబితాలో కెన్యా అగ్రస్థానంలో ఉండగా... తాజా నివేదికలో కెన్యాను అధిగమించి భారత్ తొలి స్థానానికి చేరింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నాటికి మన దేశానికి చెందిన 148 మంది ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు డోపింగ్ ఉల్లంఘనలకు పాల్పడి నిషేధం ఎదుర్కొంటున్నారు. కెన్యా (146 మంది అథ్లెట్లు), రష్యా (66 మంది అథ్లెట్లు) వరుసగా రెండో, మూడో స్థానాల్లో ఉన్నాయి. ఈ జాబితాలో మహిళల 100 మీటర్ల జాతీయ రికార్డు హోల్డర్ ద్యుతీ చంద్, మిడిల్ డిస్టాన్స్ రన్నర్ పర్వేజ్ ఖాన్, తమిళనాడు స్పింటర్ శేఖర్ ధనలక్ష్మి ఉన్నారు. ద్యుతీ చంద్పై 2022 డిసెంబర్లో నాలుగు సంవత్సరాల నిషేధం పడగా... పర్వేజ్పై విధించిన నిషేధం జూలై 2030 వరకు కొనసాగనుంది. ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య ఆధ్వర్యంలో స్వతంత్రంగా పనిచేసే ఏఐయూ అన్నీ దేశాల డోపింగ్ వివరాలు సేకరిస్తుంది. డోపింగ్ను రూపుమాపాలని కంకణం కట్టుకున్న భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) దీనితో సంబంధం ఉన్న కేంద్రాలను గుర్తించడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటోంది. అథ్లెట్లు డోపింగ్కు పాల్పడటం వెనక శిక్షకుల హస్తం కూడా ఉంటుందని భావిస్తున్న ఏఎఫ్ఐ... కోచ్లందరూ తమ వద్ద పేరు నమోదు చేసుకోవాలని కోరింది. ఏఎఫ్ఐలో నమోదు చేసుకోని కోచ్లను బ్లాక్లిస్ట్లో పెట్టడంతో పాటు... వారి వద్ద శిక్షణ తీసుకున్న వారిని జాతీయ అవార్డులకు అనర్హులుగా ప్రకటించింది. 2024 పారిస్ ఒలింపిక్స్ తర్వాత ఏఎఫ్ఐ జాతీయ శిబిరాలను వికేంద్రీకరించింది. ప్రస్తుతం రిలే జట్లకు మాత్రమే నేషనల్ క్యాంప్లు నిర్వహిస్తోంది. మిగిలిన అగ్రశ్రేణి అథ్లెట్లందరూ రిలయన్స్, జేఎస్డబ్ల్యూ, టాటా వంటి ప్రైవేటు సంస్థలు... ఆర్మీ, నేవీ వంటి ప్రభుత్వ విభాగాల పర్యవేక్షణలో శిక్షణ పొందుతున్నారు. -
ఆ రెండింటి కలయిక నేను: సానియా మీర్జా భావోద్వేగం
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ హైదరాబాదీ స్టార్ ఎన్నో సవాళ్లు అధిగమించి అంతర్జాతీయ స్థాయిలో టెన్నిస్ స్టార్గా గుర్తింపు పొందింది. తన 20 ఏళ్ల కెరీర్లో సానియా మీర్జా మొత్తంగా 43 డబుల్స్ టైటిళ్లు సాధించింది. కెరీర్లో అత్యున్నత స్థాయికిఇందులో మూడు మహిళల డబుల్స్ గ్రాండ్స్లామ్ టైటిళ్లు, మూడు మిక్స్డ్ డబుల్స్ గ్రాండ్స్లామ్ టైటిళ్లు ఉండటం విశేషం. కెరీర్లో అత్యున్నత స్థాయికి ఎదిగిన సానియా మీర్జా.. వ్యక్తిగత జీవితంలో మాత్రం చేదు అనుభవాలు చవిచూసింది. తొలుత సొహ్రాబ్ అనే వ్యక్తితో సానియా నిశ్చితార్థం చేసుకోగా.. ఆ బంధం పెళ్లి వరకు రాలేదు.షోయబ్తో వివాహం, విడాకులుఆ తర్వాత పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ను ప్రేమించిన సానియా మీర్జా.. అతడితో వివాహ బంధంలో అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో సానియాపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ జరిగింది. అయినా సరే ఆమె ఏనాడూ ధైర్యం కోల్పోకుండా ట్రోలర్స్కు గట్టి కౌంటర్ ఇచ్చింది. ఇక షోయబ్- సానియాలకు కుమారుడు ఇజహాన్ సంతానం.కాగా కొన్నాళ్ల క్రితం షోయబ్ మాలిక్ నటి సనా జావేద్ను పెళ్లి చేసుకున్న తర్వాత.. సానియా- షోయబ్ల విడాకుల వ్యవహారం బయటకు వచ్చింది. షోయబ్ ప్రవర్తనతో విసిగిపోయిన సానియా.. తానే అతడికి విడాకులు ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం కుమారుడితో కలిసి సానియా దుబాయ్లో నివసిస్తోంది. టెన్నిస్ అకాడమీ వ్యవహారాలతో బిజీగా గడుపుతోంది.ఆ రెండింటి కలయిక నేనుఈ నేపథ్యంలో తాజాగా ఇన్స్టా వేదికగా సానియా మీర్జా భావోద్వేగ పోస్టు పెట్టగా వైరల్గా మారింది. "కొన్ని రోజులు ఆమె యోధురాలిగా ఉంటుంది. మరికొన్నిసార్లు కుప్పకూలిపోతుంది. చాలాసార్లు ఈ రెండింటి కలయికగా ఆమె ఉంటుంది. అయితే, ప్రతి రోజు ఆమె ఉనికి మాత్రం అలాగే ఉంటుంది.ధైర్యంగా నిలబడటం.. పరిస్థితులతో పోరాడటం.. నిరంతరం కొత్తగా ఏదైనా ప్రయత్నించడం.. ఆమెకు అలవాటు. ఆ ఆమెను నేనే’’ అని సానియా స్ఫూర్తిదాయక వాక్యాలు పంచుకుంది. చదవండి: Sheetal Devi: పోరాటానికి పరిమితులెందుకు? -
‘మెస్సీ బృందం మమ్మల్ని మోసం చేసింది’
అర్జెంటీనా ఫుట్బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ బృందం తమను మోసం చేసిందని కేరళ క్రీడామంత్రి అబ్దురహిమన్ ఆరోపించారు. కేరళలో పర్యటించి మ్యాచ్ ఆడేందుకు మెస్సీ, అర్జెంటీనా టీమ్కు స్పాన్సర్ల ద్వారా రూ. 250 కోట్లు ఇచ్చినట్టు చెప్పాడు. అయితే, డబ్బులు తీసుకొన్న తర్వాత హామీని నిలబెట్టుకోలేదన్నాడు. మరో ఐదు దేశాలను కూడా ఇలాగే మోసగించిన విషయం తమ విచారణలో తెలిసిందన్నాడు. ‘డబ్బు తీసుకొంటారు.. కానీ, ఆడటానికి రారు. అర్జెంటీనా జట్టుపై కేసు వేయాల్సిన పరిస్థితి. వారు తప్పకుండా నష్టపరిహారం చెల్లించాల’ని అబ్దురహిమన్ డిమాండ్ చేశాడు. గత డిసెంబర్లో మెస్సీ భారత్లో పర్యటించిన సంగతి తెలిసిందే. కోల్కతా, హైదరాబాద్లో మెస్సీ బృందం ఫ్రెండ్లీ మ్యాచ్లు ఆడింది.కాగా ఈ ఏడాది జూన్ 11 నుంచి ఫిఫా ప్రపంచకప్ జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే ఫిఫా 48 జట్లతో కూడిన వివరాలను, మ్యాచ్లకు సంబంధించి పూర్తి షెడ్యూల్ విడుదల చేసింది. కాగా రెండురోజుల క్రితం ఫిఫా ప్రపంచకప్ కోసం అర్జెంటీనా ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడుతు న్న సంగతి తెలిసిందే. సొంతగడ్డపై జాంబియాతో ఆడిన మ్యాచ్ మెస్సీకి చివరిదనే ప్రచారం జరిగిన వేళ.. మైదానంలోనే మెస్సీ కంటతడి పెట్టిన దృశ్యాలు వైరల్ అయ్యాయి.ఫిఫా ప్రపంచకప్కు ఇప్పటికే అర్హత సాధించిన అర్జెంటీనా గ్రూప్-జేలో ఉంది. ఇదే గ్రూప్లో ఉన్న అల్జీరియా, ఆస్ట్రియా, జోర్డాన్లతో అర్జెంటీనా మ్యాచ్లు ఆడనుంది. జూన్ 11 నుంచి జూలై 19 వరకు ఫిఫా ప్రపంచకప్కు అమెరికా, కెనడా, మెక్సికోలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి.చదవండి: ‘ఎందుకంత ద్వేషం.. నేను ఆడడం ఇష్టం లేదా?’ -
శ్రీనిధి డెక్కన్ ఎఫ్సీ ఖాతాలో రెండో ‘డ్రా’
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఫుట్బాల్ లీగ్ (ఐఎఫ్ఎల్)లో హైదరాబాద్కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) జట్టు ఖాతాలో రెండో ‘డ్రా’ చేరింది. షిల్లాంగ్ లాజోంగ్ క్లబ్తో జరిగిన మ్యాచ్ను శ్రీనిధి డెక్కన్ జట్టు 0–0తో ‘డ్రా’గా ముగించింది. నిర్ణీత సమయంలో రెండు జట్లు గోల్ చేయడంలో విఫలమయ్యాయి. శ్రీనిధి జట్టు గోల్కీపర్ కమల్జీత్ సింగ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ మ్యాచ్లో హెడ్ కోచ్ కార్లోస్ వాజ్ పింటో శ్రీనిధి తుది జట్టులో రెండు మార్పులు చేశాడు. నానాటో లూయిస్, వాన్లాన్రెమ్డికా జట్టులోకి వచ్చారు. ఆట 11వ నిమిషంలో శ్రీనిధి కెపె్టన్ డేవిడ్ కాస్టనెడా కొట్టిన షాట్ను షిల్లాంగ్ గోల్కీపర్ రింబాయ్ అడ్డుకున్నాడు. చివర్లో 86వ నిమిషంలో పౌలో సెజార్ హెడర్ను మరోసారి రింబాయ్ నిలువరించాడు. మ్యాచ్ ‘డ్రా’ కావడంతో రెండు జట్లకు ఒక్కో పాయింట్ లభించింది. పది జట్లు పోటీపడుతున్న ఈ లీగ్లో శ్రీనిధి డెక్కన్ జట్టు ఆరు మ్యాచ్లు పూర్తి చేసుకుంది. మూడు మ్యాచ్ల్లో గెలిచి, రెండు మ్యాచ్లను ‘డ్రా’ చేసుకొని, ఒక మ్యాచ్లో ఓడిపోయింది. 11 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. డైమండ్ హార్బర్ ఫుట్బాల్ క్లబ్ 13 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. శ్రీనిధి జట్టు తమ తదుపరి మ్యాచ్ను హైదరాబాద్లో ఈనెల ఐదో తేదీన ఐజ్వాల్ ఎఫ్సీ జట్టుతో ఆడుతుంది. -
‘మేం మోసగాళ్లలా కనిపిస్తున్నామా’
పెయియా (సైప్రస్): ప్రతిష్టాత్మక క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో ఆటగాళ్లు ‘మోసాలకు’ పాల్పడకుండా ఉండేందుకు అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) తీసుకుంటున్న అతి జాగ్రత్తలపై అమెరికా గ్రాండ్మాస్టర్ హికారు నకమురా తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. తమను ఇజ్రాయెల్ గూఢచార సంస్థ ‘మొసాద్’కు చెందిన వ్యక్తుల్లా చూస్తున్నారని అతను ధ్వజమెత్తాడు. క్యాండిడేట్స్ టోర్నీ పురుషుల విభాగంలో పాల్గొంటున్న ఎనిమిది మంది గ్రాండ్మాస్టర్లలో నకమురా ఒకడు. ఈ టోర్నీలో విజేతగా నిలిచే ఆటగాడు ఈ ఏడాది చివర్లో జరిగే వరల్డ్ చాంపియన్షిప్ పోరులో ప్రస్తుత విజేత గుకేశ్ దొమ్మరాజుతో తలపడతాడు. సైప్రస్లో జరుగుతున్న ఈ టోర్నీలో ఆటగాళ్లు ఎలాంటి మోసాలకు పాల్పడకుండా ఉండేందుకు ‘ఫిడే’ పలు జాగ్రత్తలు తీసుకుంది. మెటల్ డిటెక్టర్లతో పాటు ఈసారి మరిన్ని కొత్త తరహా స్కానర్లను టోర్నీ జరిగే వేదికపై ఏర్పాటు చేసింది. ఈ తరహా అతి జాగ్రత్త నకమురాకు ఆగ్రహం తెప్పించింది. ‘అసలు ఆటగాళ్లు గేమ్ ఆడుతూ మోసం చేయడానికి ప్రయత్నిస్తారనే ఆలోచనే పనికిమాలినదని అని నా నమ్మకం. కొందరు ఆటగాళ్లే ఇలాంటి ఏర్పాటు కావాలని అడిగారని విన్నాను. ఇది పూర్తిగా అర్థరహితం. గేమ్కు ముందు గేమ్ తర్వాత కూడా వారు మమ్మల్ని స్కాన్ చేస్తున్నారు. మెటల్ డిటెక్టర్లే కాకుండా వేరుగా ప్రత్యేక స్కానర్లూ ఉన్నాయి. మేమేమైనా ఇరాన్లో పని చేస్తున్న ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ ఏజెంట్లమా? ఫిడే వాస్తవంలోకి రావాలి. మేం చెస్ ప్లేయర్లం మాత్రమే’ అని నకమురా వ్యాఖ్యానించాడు. అసలు ఈ తరహా ఏర్పాటు చేయడానికి సరైన కారణం కూడా లేదని ఈ అమెరికా గ్రాండ్మాస్టర్ అభిప్రాయపడ్డాడు. ‘ఆటగాళ్ల మోసం గురించి అతి చేస్తున్నట్లుగా నాకు అనిపిస్తోంది. ఏదో ఒక చిన్న ఓపెన్ టోర్నీ అంటే ఏమైనా అనుకోవచ్చు. అక్కడంటే స్కానర్లవంటివి ఉండవు. కానీ ఇంత పెద్ద టోర్నీలో ఆటగాళ్లంతా ఒకే చోట ఉన్నారు. కెమెరాలు ఉన్నాయి. ఆర్బిటర్స్ ప్రతీ ఒక్కరినీ చూస్తున్నారు. ఎవరో ఒకరు లోపలి నుంచే సహాయం అందిస్తే తప్ప తప్పుడు పనులు చేయడానికి చాన్స్ ఉండదు’ అని నకమురా వివరించాడు. యుద్ధ వాతావరణం మధ్య సైప్రస్లో జరుగుతున్న ఈ టోర్నీ నుంచి భద్రతా కారణాలతో భారత క్రీడాకారిణి కోనేరు హంపి తప్పుకోగా... టోర్నీ ఆరంభానికి ముందు నకమురా కూడా బహిరంగంగా తన ఆందోళనను వ్యక్తం చేశాడు. -
రూ.10.23 లక్షలకు ఒక్క టికెట్
జ్యూరిక్: గతంలో తల తాకట్టు పెట్టి అయినా ఫుట్బాల్ వీరాభిమానులు ప్రపంచకప్ టికెట్లు కొని మ్యాచ్ల్ని ప్రత్యక్షంగా తిలకించేవారు. ఇప్పుడైతే ఏకంగా ఇల్లే తాకట్టు పెట్టాలేమో! ఎందుకంటే యావత్ ప్రపంచాన్నే ఫుట్బాల్ ఫీవర్తో ఊపేసే ‘ఫిఫా’ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ టికెట్ ధర అక్షరాలా రూ. 10,23,212. అమెరికా కరెన్సీలో 10,990 డాలర్లు. ఈ మొత్తంతో కేవలం 90 నిమిషాల టైటిల్ పోరును చూస్తారు. మన దేశంలో ఈ మొత్తంతో ఏడున్నర (75 గ్రాముల) తులాల బంగారు ఆభరణాల్ని కొనేయొచ్చు. ఫుట్బాలా... మజాకా! త్వరలో అమెరికా, మెక్సికో, కెనడా వేదికలపై ప్రపంచకప్ ఫుట్బాల్ సంగ్రామం జరుగనుంది. ఇందులో భాగంగా రెండో కేటగిరీ, మూడో కేటగిరీ టికెట్ల ధరల్ని ‘ఫిఫా’ ఖరారు చేసింది. మొదట గతేడాది డిసెంబర్లో ‘డ్రా’ విడుదల చేసిన సందర్భంలో తొలి దశలో 8680 డాలర్ల (రూ.8 లక్షలు) ధరతో కొన్ని టికెట్లను విక్రయించారు. టోర్నీ దగ్గర పడుతుండటంతో ఫుట్బాల్ క్రేజీ ప్రపంచకప్ను క్యాష్ చేసుకునే పనిలో ‘ఫిఫా’ పడింది. ఇందులో భాగంగా కేటగిరీ–2 టికెట్లను తొలి దశలో 5575 డాలర్ల (రూ.5.20 లక్షలు)కు విక్రయించగా... ఇప్పుడు 7380 డాలర్ల (రూ.6.87 లక్షలు)కు పెంచేసింది. కేటగిరీ–3 టికెట్ల ధరలు అప్పుడు 4185 డాలర్లు (రూ.3.90 లక్షలు) ఉంటే... ఇప్పుడు 5785 డాలర్ల (రూ.5.38 లక్షలు)కు హెచ్చింపు చేసింది. ఈ టికెట్లను కొనేందుకు అభిమానులు ‘ఫిఫా’ వెబ్సైట్ను గమనిస్తూ ఉండాలని, సేల్ విండో తెరవగానే నిమిషాల్లోనే అమ్ముడయ్యే అవకాశముందని ‘ఫిఫా’ తెలిపింది. మెగా ఈవెంట్లో గ్రూప్ దశలో 72 మ్యాచ్లు ఉండగా... బుధవారం 17 మ్యాచ్లకు సంబంధించిన టికెట్లనే అందుబాటులో ఉంచింది. నాకౌట్ దశ పోటీల టికెట్లు పై జాబితాలో లేవు. జూన్ 12న పరాగ్వే–అమెరికా మధ్య జరిగే మ్యాచ్ కోసం ప్రీమియం ధర టికెట్లన్నీ అమ్ముడుపోగా... కేవలం 2735 డాలర్ల (రూ.2.54 లక్షల) టికెట్లు కొన్ని మిగిలున్నాయి. అయితే జూన్ 19న ఆ్రస్టేలియా, అమెరికా మధ్య జరిగే మ్యాచ్ కోసం ఒక్క టికెట్ కూడా లేదు. అన్ని కేటగిరీల టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్మడయ్యాయి. అమెరికాలో 11 వేదికలు, మెక్సికోలో 3, కెనడాలో 2 వేదికల్లో సాకర్ సంగ్రామం జరుగుతుంది. -
గోల్ఫ్తో ఎంతో ప్రయోజనం: యువీ
న్యూఢిల్లీ: గోల్ఫ్ ఆడటం ద్వారా ఒత్తిడి తగ్గుతుందని భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అన్నాడు. టీమిండియా తరఫున టి20, వన్డే ప్రపంచకప్లు నెగ్గిన ఈ ఆల్రౌండర్... క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత గోల్ఫ్పై దృష్టి పెట్టాడు. క్రికెట్ కెరీర్కు ముందే గోల్ఫ్ ఆడి ఉంటే ఇంకా ఎంతో ప్రయోజనం చేకూరేదని... ఇప్పటికైనా యువ ఆటగాళ్లు క్రికెట్తో పాటు గోల్ఫ్ ప్రాక్టీస్ చేస్తే సేద తీరడంతో పాటు ఒత్తిడి దూరమవుతుందని యువీ హితవు పలికాడు. ప్రస్తుతం యువరాజ్ ఇండియన్ గోల్ఫ్ ప్రీమియర్ లీగ్ (ఐజీపీఎల్)కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నాడు. గురువారం ఐజీపీఎల్ 10 ఫ్రాంచైజీల జెర్సీ ఆవిష్కరణలో యువరాజ్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ... ‘క్రికెటర్లు క్రికెట్తో పాటు గోల్ఫ్ కూడా ఆడాలి. నేను ముందే ఈ పని చేయాల్సింది. అది నాకు క్రికెట్లో చాలా సహాయపడి ఉండేది. ఆ్రస్టేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా క్రికెటర్లు చిన్నప్పటి నుంచే గోల్ఫ్ ఆడుతారు. కానీ మనదేశంలో గోల్ఫ్ను కేవలం ఉన్నత వర్గాల క్రీడగా పరిగణిస్తారు. ఈ వైఖరిలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. గోల్ఫ్ను పాఠశాల స్థాయికి తీసుకెళ్తున్నాం. ప్రతి ఒక్కరూ ప్రతీ క్రీడను ప్రయత్నించాలని భావిస్తున్నాం.మనదేశంలో క్రికెట్ అతిపెద్ద ఆట అని నాకు తెలుసు. కానీ గోల్ఫ్ కూడా ఉత్తేజకరమైన క్రీడే. అందరూ దీన్ని ప్రయత్నించాలి. దేశానికి ప్రాతినిధ్యం వహించిన ప్లేయర్గా ఇతర క్రీడలకు కూడా నా వంతు సాయం చేయాలనుకుంటున్నా. ఐజీపీఎల్ లీగ్ గోల్ఫ్కు మరింత ప్రచారం కల్పిస్తోంది. దీని ద్వారా ఈ ఆట ఎక్కువ మందికి చేరువవుతుంది. ఇప్పుడు టీవీల్లో చూసే పిల్లలు... భవిష్యత్తులో గోల్ఫ్ ఆడేందుకు ఉత్సాహం చూపుతారు’ అని పేర్కొన్నాడు. -
విజేతలు శ్రీచరణ్ తేజ్, చిద్విలాసిని
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ అండర్–15 బాలుర విభాగంలో కొండ్లాపు శ్రీచరణ్ తేజ్, అండర్–15 బాలికల విభాగంలో కుమ్మరికుంట్ల చిద్విలాసిని విజేతలుగా నిలిచారు. సరూర్నగర్ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో వివిధ వయో విభాగంలో తెలంగాణ జిల్లాల నుంచి 300 మందికిపైగా పోటీపడ్డారు. నిర్ణీత ఐదు రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో శ్రీచరణ్ తేజ్ 4.5 పాయింట్లు సాధించగా... చిది్వలాసిని 3.5 పాయింట్లు స్కోరు చేసింది. తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం జనరల్ సెక్రటరీ జయచంద్ర విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఆర్.చంద్రమౌళి చీఫ్ ఆర్బిటర్గా, ఆర్.శ్రీరామ్ డిప్యూటీ ఆర్బిటర్గా వ్యవహరించారు. వివిధ వయో విభాగాల్లో టాప్–3లో నిలిచిన ప్లేయర్లు వివరాలు ఇలా ఉన్నాయి. అండర్–15 విభాగం: బాలురు: 1. శ్రీచరణ్ తేజ్ (4.5 పాయింట్లు), 2. బొబ్బిలి సుజయ్ (4 పాయింట్లు), 3. జక్కరాజు జై శ్రేయాన్స్ (4 పాయింట్లు). బాలికలు: 1. చిది్వలాసిని (3.5 పాయింట్లు), 2. లేఖ్యశ్రీ సాన్వి (3 పాయింట్లు), 3. ఎ.ప్రణతి (2.5 పాయింట్లు). అండర్–13 విభాగం: బాలురు: 1. ధ్రువ్ శ్రీవాస్తవ (5 పాయింట్లు), 2. ఎస్.శశాంక్ (5 పాయింట్లు), 3. జి.రుషికేశ్ ( 4 పాయింట్లు). బాలికలు: 1. కె.లాస్య (4 పాయింట్లు), 2. చేట్ల వేదశ్రుతి (3 పాయింట్లు), 3. గౌలీకర్ సుహాసిక (3 పాయింట్లు). అండర్–11 విభాగం: బాలురు: 1. కేఎస్ విశిష్ట్ శ్రీరామ్ (5 పాయింట్లు), 2. పి.చార్వీక్ సాయి (4.5 పాయింట్లు), 3. కొత్తపల్లి దేవాంశ్ (4.5 పాయింట్లు). బాలికల విభాగం: 1. పొలిశెట్టి ధృతి (4 పాయింట్లు), 2. కె.తేజస్వి (4 పాయింట్లు), 3. మునిపల్లి ఆశ్రిత (4 పాయింట్లు). అండర్–9 విభాగం: బాలురు: 1. అంబటి ప్రసిధ్ (5 పాయింట్లు), 2. బి.యజత్ రెడ్డి (5 పాయింట్లు), 3. పట్లోళ్ల ధ్రువిన్ రెడ్డి (4 పాయింట్లు). బాలికలు: 1. జి.శాన్విత (3 పాయింట్లు), 2. సాన్విక (3 పాయింట్లు), 3. ముద్దాల కుముద (3 పాయింట్లు). అండర్–7 విభాగం: బాలురు: 1. రంగనాధ వేద ఆర్క (5 పాయింట్లు), 2. ఎస్. తనవ్ ఇషాన్ (5 పాయింట్లు), 3. గూడురు విహాన్ (4 పాయింట్లు). బాలికలు: 1. మెహరీన్ షేక్ సుహీరా (4 పాయింట్లు), 2. ఆవుల శ్రేయాంశి (3 పాయింట్లు), 3. రంగనాధ ఐరా అర్ణి (3 పాయింట్లు). -
Italy World Cup: అయ్యో ఇటలీ!
ఒకప్పుడు ఫుట్బాల్ ప్రపంచాన్ని తన కనుసన్నలతో ఏలిన ఇటలీ... ఇప్పుడు వరుసగా మూడోసారి ‘ఫిఫా’ వరల్డ్కప్ టోరీ్నకి అర్హత సాధించలేక చతికిలబడింది. రికార్డు స్థాయిలో నాలుగుసార్లు ప్రపంచకప్ను ముద్దాడిన ఇటలీ... తాజా క్వాలిఫయర్స్ చివరి రౌండ్లో బోస్నియా అండ్ హెర్గెగోవినా జట్టు చేతిలో ఓడిపోయింది. మరో మూడు నెలల్లో జరిగే 2026 వరల్డ్కప్లో పాల్గొనే అవకాశం కోల్పోయింది. 2006లో చివరిసారి ట్రోఫీ చేజిక్కించుకున్న ఇటలీ... ఆ తర్వాత నుంచి స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చడంలో విఫలమవుతూ వస్తోంది. ‘కర్ణుడి చావుకు లక్ష కారణాలు’ అన్న చందంగా... ఇటలీ జట్టు పేలవ ఆటతీరుకు కారణాలెన్నో. క్రికెట్లో వెస్టిండీస్ మాదిరిగా ఒకప్పుడు అరవీర భయంకర ప్లేయర్లతో ప్రత్యర్థులను గడగడలాడించి నాలుగుసార్లు విశ్వవిజేతగా నిలిచిన ఇటలీ... ఇప్పుడు అస్థిత్వం కోసం పోరాడుతోంది. క్లబ్ గేమ్స్, మ్యాచ్ రెవెన్యూ, టికెట్ ఆదాయం, ప్రకటనల రాబడి, మౌలిక వసతులను పట్టించుకోకోకపోవడం, యువతకు ప్రోత్సాహం కరువవడం ఇలా ప్రతి అంశంలో నానాటికి తీసికట్టులా మారుతున్న ఇటలీ ఫుట్బాల్ తీరును ఓసారి పరిశీలిస్తే... సాక్షి క్రీడావిభాగం : ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలో ఇప్పటి వరకు 22 సార్లు వరల్డ్ కప్ జరగ్గా... అందులో ఆరుసార్లు ఇటలీ ఫైనల్ చేరింది. నాలుగుసార్లు (1934, 1938, 1982, 2006లో) ట్రోఫీ చేజిక్కించుకున్న ఇటలీ... 1970, 1994లో రన్నరప్గా నిలిచింది. బ్రెజిల్ ఐదుసార్లు (1958, 1962, 1970, 1994, 2002లో) ప్రపంచ విజేతగా నిలవగా... ఆ తర్వాత జర్మనీ (1954, 1974, 1990, 2014)తో కలిసి ఇటలీ సంయుక్తంగా రెండో స్థానంలో ఉంది. ఈ ఏడాది జూన్–జూలైలో కెనడా, మెక్సికో, అమెరికా వేదికగా ఇటలీ లేకుండానే ప్రపంచకప్ జరగనుంది. గత రెండు (2018, 2022లో) పర్యాయాలు కూడా వరల్డ్కప్నకు అర్హత సాధించలేకపోయిన ఇటలీ జట్టు... అంతకుముందు 2010, 2014లో గ్రూప్ దశను దాటలేకపోయింది. 2006లో చివరిసారిగా చాంపియన్గా నిలిచిన ఇటలీ... ఆ తర్వాత ప్రధాన ప్లేయర్లు ఆటకు వీడ్కోలు పలకడం... యువతరం ఆ స్థాయిలో రాణించలేకపోవడంతో గత రెండు దశాబ్దాల్లో ప్రభావం కోల్పోతూ వచి్చంది. క్రికెట్లో ‘మెన్ ఇన్ బ్లూ’గా టీమిండియాకు ఎంత ఆదరణ ఉందో... ఫుట్బాల్లో ‘ద బ్లూస్’ (అజూరి)గా ఇటలీకి అంతకంటే ఎక్కువ స్టార్డమ్ ఉంది. అలాంటి ఇటలీ ఇప్పుడు వరుసగా మూడోసారి (2018, 2022, 2026), ఓవరాల్గా నాలుగోసారి (1958లో తొలిసారి) వరల్డ్కప్నకు దూరమైంది. జట్ల సంఖ్య పెరిగినా... 2022లో ఖతర్ వేదికగా జరిగిన ప్రపంచకప్లో 32 జట్లు పాల్గొనగా... ఈసారి ఆ సంఖ్యను 48కి పెంచారు. ఇలాంటి సమయంలోనూ ఇటలీ క్వాలిఫై కాకపోవడం ఆ జట్టు పడిపోతున్న ప్రమాణాలకు నిదర్శనం. వరల్డ్కప్ క్వాలిఫయర్స్లో భాగంగా బుధవారం జరిగిన పోరులో ఇటలీ పెనాల్టీ షూటౌట్లో బోస్నియా అండ్ హెర్జెగోవినా చేతిలో ఓడింది. తొలుత నిరీ్ణత సమయంలో ఇరు జట్లు 1–1 గోల్స్ సాధించడంతో మ్యాచ్ ‘డ్రా’కాగా... విజేతను నిర్ణయించేందుకు నిర్వహించిన పెనాల్టీ షూటౌట్లో బోస్నియా 4–1 గోల్స్ తేడాతో ఇటలీని బోల్తా కొట్టించింది. దీంతో ఇటలీ ఆటగాళ్లకు వరుసగా మూడోసారి నిరాశ తప్పలేదు. మరో వెస్టిండీస్ మాదిరిగా... 2006లో వరల్డ్కప్ గెలిచిన అనంతరం ఇటలీ జట్టు 2020లో యూరో కప్ ఫైనల్లో ఇంగ్లండ్ను ఓడించి చాంపియన్గా నిలిచింది. ఆ తర్వాత ఏ టోర్నమెంట్లోనూ ఆకట్టుకోలేకపోయింది. 2006లో ఇటలీ జట్టు వరల్డ్ చాంపియన్గా నిలవడంలో కీలకపాత్ర పోషించిన మిడ్ఫీల్డర్ గటుసో... ప్రస్తుతం జట్టు కోచ్గా వ్యవహరిస్తున్నప్పటికీ అతడు ఇటలీ రాత మార్చలేకపోయాడు. ప్రస్తుతానికైతే ఎలాంటి చర్యలు ఉండవని ఇటలీ ఫుట్బాల్ సమాఖ్య అధ్యక్షుడు గాబ్రియల్ గ్రావినా ప్రకటించినా... ఇలాగే కొనసాగితే క్రికెట్లో వెస్టిండీస్ మాదిరిగా ఫుట్బాల్లో ఇటలీ ప్రభ కూడా మసకబారడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్టార్లు లేకపోయినా... గొప్ప క్రమశిక్షణ, అంతకుమించిన అంకితభావంతో ఒకప్పుడు ఇటలీ జట్టు మైదానంలో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టేది. అర్జెంటీనాకు లియోనల్ మెస్సీ, పోర్చుగల్కు క్రిస్టియానో రొనాల్డో లాగా... ఇటలీ జట్టుకు స్టార్ ప్లేయర్ల అండ లేకపోయినా... ఆ జట్టు సమష్టితత్వానికి పెట్టింది పేరు. చక్కటి సమన్వయం అంతకుమించిన నైపుణ్యంతో గ్రౌండ్లో మ్యాజిక్ చేసే ఇటలీ జట్టులో ప్రస్తుతం బృంద స్ఫూర్తి లోపించిందనేది సుస్పష్టం. 1992 నుంచి 1996 వరకు వరుసగా మూడుసార్లు యూరోపియన్ చాంపియన్గా నిలిచిన ఇటలీ... 2006లో తమ దేశ ఫుట్బాల్ చరిత్రలోనే అత్యంత పటిష్ట జట్టుతో బరిలోకి దిగి వరల్డ్ చాంపియన్గా నిలిచింది. ఆ తర్వాతి నుంచి దేశంలో ఆటకు ఆదరణ తగ్గుతూ వస్తోంది. ఒకప్పుడు క్లబ్ ఫుట్బాల్లో సైతం ఇటలీ జట్ల హవా సాగేది. కానీ గత దశాబ్దకాలాన్ని పరిశీలిస్తే ఆ వైభవం మచ్చుకైనా కనిపించడం లేదు. నానాటికి ఇటలీ ఆట తీసికట్టుగా మారుతుండటంతో... ప్రేక్షకుల్లో ఆటపై ఆదరణ సైతం తగ్గుతోందని ఇటీవలి ఆదాయ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకప్పుడు జాతీయ జట్టు మైదానంలో అడుగు పెడుతోందంటే... స్టేడియం అభిమానులతో కిక్కిరిసిపోయేది. టికెట్ ఆదాయం, మైదానంలో ప్రకటనల రాబడితో పాటు... టీవీ రైట్స్ రూపంలో పెద్ద ఎత్తున డబ్బు వచ్చేది. కానీ గత రెండు దశాబ్దాల్లో పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. టీవీ రైట్స్ విషయంలోనూ ఇటలీ చాలా వెనుకబడిపోయింది. ఇది పరోక్షంగా ఆటపై పెట్టుబడి పెట్టడంలో వెనకడుగు వేసేలా చేసింది. మరి వీటన్నింటినీ అధిగమించి 2030లో మొరాకో, పోర్చుగల్, స్పెయిన్లో జరిగే ప్రపంచకప్ వరకైనా ఇటలీ జట్టు గాడిన పడుతుందా చూడాలి! కింకర్తవ్యం గతంలో అర్జెంటీనా (1970), ఇంగ్లండ్ (1974) వంటి జట్లు సైతం ప్రపంచకప్నకు అర్హత సాధించలేకపోయిన సందర్భాలున్నాయి. అయితే అవి వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టి లోపాలను సరిచేసుకొని సత్తా చాటాయి. ఇటలీ మాత్రం ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు కనిపించడం లేదు. ఒకప్పుడు సాకర్ ప్రపంచాన్ని ఏలిన ఇటలీ... ఇప్పుడు వరుసగా మూడోసారి ప్రపంచకప్నకు క్వాలిఫై కాలేదంటే... వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోంది. గత దశాబ్ద కాలంగా పేలవ ఆటతీరు రోజు రోజుకు ప్రమాణాలు దిగజార్చుకున్న ఇటలీ... ఈ పరాజయంతోనైనా కళ్లు తెరుస్తుందా చూడాలి. ఇటలీ ఫుట్బాల్ తిరిగి గాడిన పడాలంటే... సమస్య మూలాలను గుర్తించాల్సిన అవసరముంది. సమాఖ్యను ప్రక్షాళన చేయడం... మౌలిక వసతులు పెంపొందించడం... యువతకు సరైన మార్గనిర్దేశం చేయడం... ఆటగాళ్లకు అండగా నిలవడం వీటన్నింటీపై దృష్టి సారించడం ముఖ్యం.గ్రూప్ దశలో తడబడి... యూరోపియన్ జోన్లో భాగంగా అన్ని జట్లను 12 గ్రూప్లుగా విభజించారు. గ్రూప్లో ‘టాపర్’గా నిలిచిన 12 జట్లు ముందుగా ప్రపంచకప్ బెర్త్లు దక్కించుకున్నాయి. ఇటలీ ఉన్న గ్రూప్ ‘ఐ’ నుంచి నార్వే 24 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ముందంజ వేసింది. ఇటలీ ఎనిమిది మ్యాచ్లు ఆడి ఆరింట విజయం సాధించి 18 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఒకవేళ ఇటలీ గ్రూప్ దశలోనే మొదటి స్థానంలో నిలిస్తే ప్రపంచకప్కు అర్హత పొందేది. కానీ రెండో స్థానంలో నిలవడంతో ప్రపంచకప్ బెర్త్ కోసం తదుపరి దశ ఆడాల్సి వచ్చింది. 12 గ్రూపుల్లో రెండో స్థానంలో నిలిచిన 12 జట్లు... నేషన్స్ లీగ్లో నాలుగు గ్రూప్ల విజేతలతో కలిపి 16 జట్లు తదుపరి దశలో పోటీపడ్డాయి. 16 జట్లను నాలుగు గ్రూప్లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో ఇటలీ తొలి మ్యాచ్లో 2–0తో నార్తర్న్ ఐర్లాండ్ను... బోస్నియా ‘పెనాల్టీ షూటౌట్’లో 4–2తో వేల్స్పై గెలిచి ప్రపంచకప్ బెర్త్ కోసం పోటీపడ్డాయి. బెర్త్ను ఖరారు చేసే మ్యాచ్లో 15వ నిమిషంలో కీన్ చేసిన గోల్తో ఇటలీ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 79వ నిమిషంలో తబాకోవిచ్ గోల్తో బోస్నియా 1–1తో స్కోరును సమం చేసింది. ఆ తర్వాత ఇరు జట్లు మరో గోల్ చేయలేకపోవడంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ నిర్వహించారు. ‘షూటౌట్’లో బోస్నియా ఆటగాళ్లు వరుసగా నాలుగు షాట్లను గోల్స్గా మలిచారు. ఇటలీ తరఫున తొలి షాట్లో ఎస్పెసిటో, మూడో షాట్లో క్రిస్టాంటీ గురి తప్పగా... రెండో షాట్ను టొనాలి సఫలమయ్యాడు. నాలుగో షాట్ను బోస్నియా ప్లేయర్ బజ్రాక్తారెవిచ్ లక్ష్యానికి చేర్చడంతో ఇటలీ ఓటమి ఖరారుకాగా... బోస్నియా రెండోసారి ప్రపంచకప్కు అర్హత సాధించింది. 40 ఏళ్ల తర్వాత... ప్రపంచకప్ టోర్నీకి ఇరాక్ అర్హత మోంటెరే (మెక్సికో): నాలుగు దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ ఇరాక్ జట్టు పురుషుల ఫుట్బాల్ ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించింది. బుధవారం జరిగిన ఇంటర్ కాంటినెంటల్ ప్లే ఆఫ్ మ్యాచ్లో ఇరాక్ 2–1 గోల్స్ తేడాతో బొలీవియా జట్టును ఓడించింది. తద్వారా 1986 తర్వాత మళ్లీ ప్రపంచకప్ టోరీ్నలో ఆడే అవకాశాన్ని సంపాదించింది. ఇరాక్ తరఫున అలీ అల్మహది (18వ నిమిషంలో), ఐమెన్ హుస్సేన్ (38వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. బొలీవియా జట్టుకు మోజెస్ పనియగువా (38వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. నెల రోజుల క్రితం వరకు ఇరాక్ జట్టు ఈ ప్లే ఆఫ్ మ్యాచ్ ఆడుతుందా లేదా అనే అనుమానం ఉంది. పశి్చమాసియాలో యుద్ధం కారణంగా ఇరాక్ గగనతలం మూసేశారు. మెక్సికోలో ఇరాక్ రాయబార కార్యాలయం లేకపోవడంతో ఇరాక్ ఆటగాళ్లకు వీసా ఇబ్బందులు తలెత్తాయి. మెక్సికో విదేశాంగ శాఖ మంత్రి చొరవతో ఇరాక్ ఆటగాళ్లకు వీసాలు లభించాయి. వివిధ మార్గాల్లో 25 గంటలపాటు ప్రయాణించి మార్చి 21వ తేదీన మెక్సికోకు ఇరాక్ జట్టు చేరుకోగలిగింది. డీఆర్ కాంగో పేరుతో తొలిసారి... బుధవారంతో ప్రపంచకప్ క్వాలిఫయింగ్ మ్యాచ్లు ముగిశాయి. మెక్సికోలో జరిగిన ఇంటర్ కాంటినెంటల్ ప్లే ఆఫ్ మ్యాచ్లో ఆఫ్రికా ఖండానికి చెందిన డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో 1–0తో జమైకాను ఓడించింది. ప్రపంచకప్ బెర్త్ దక్కించుకుంది. డీఆర్ కాంగో ఇంతకుముందు జైర్ పేరుతో 1974 ప్రపంచకప్లో ఆడింది. 1998 నుంచి డీఆర్ కాంగో పేరుతో బరిలోకి దిగి 28 ఏళ్ల తర్వాత ప్రపంచకప్లో అడుగు పెట్టనుంది. ఇతర క్వాలిఫయింగ్ చివరి రౌండ్ మ్యాచ్ల్లో స్వీడన్ 3–2తో పోలాండ్పై, చెక్ రిపబ్లిక్ ‘షూటౌట్’లో 3–1తో డెన్మార్క్పై, టర్కీ 1–0తో కొసోవోపై గెలిచి ప్రపంచకప్ బెర్త్లు ఖరారు చేసుకున్నాయి. -
ఫ్యాన్స్కు షాక్.. ఒక్కో టిక్కెట్ ధర రూ. 10 లక్షలు!
అమెరికా, మెక్సికో, కెనడా దేశాలు సంయుక్తంగా ఫిఫా ప్రపంచకప్-2026కు కౌంట్ డౌన్ మొదలైంది. జూన్ 11 నుంచి జూలై 19 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. ఈ ఫుట్బాల్ ప్రపంచకప్లో మొత్తం 48 జట్లు పాల్గొనున్నాయి. కాగా ఈ మెగా ఈవెంట్కు సంబంధించిన టికెట్ ధరలు టికెట్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.లాస్ట్-మినిట్ సేల్స్ ఫేజ్ పేరిట టికెట్ల విక్రయాలు బుధవారం నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే ఫైనల్ మ్యాచ్ టాప్ కేటగిరీ టికెట్ ధరను ఫిఫా ఏకంగా 10,990 డాలర్లకు (సుమారురూ.9.16 లక్షలు) పెంచింది. గత డిసెంబర్లో టోర్నమెంట్ డ్రా సమయంలో ఇదే టికెట్ ధర 8,680 డాలర్లుగా ఉండేది. మెక్సికో సిటీలో జరిగే ప్రారంభ మ్యాచ్ టికెట్ ధర 2,355 డాలర్ల నుండి 2,985 డాలర్లకు పెరిగింది. కాగా ఫిఫా ఈసారి 'డైనమిక్ ప్రైసింగ్' విధానాన్ని అమలు చేస్తోంది. అంటే డిమాండ్ను బట్టి టికెట్ ధరలు మారుతూ ఉంటాయి. ఇదే విధానం విమానం టికెట్ల బుకింగ్లో కూడా ఉంటుంది. అయితే ఫిఫా అనుసరిస్తున్న ఈ ధరల విధానంపై అమెరికా కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు."ఫిఫా ప్రపంచకప్-2026 కోసం 'డైనమిక్ ప్రైసింగ్' విధానాన్ని అమలు చేయడం సరికాదు. ఇది సామాన్య సాకర్ అభిమానులను క్రీడకు దూరం చేస్తుంది" అని 69 మంది డెమొక్రాటిక్ సభ్యులు ఫిఫా అధ్యక్షుడు జియాని ఇన్ఫాంటినోకు లేఖ రాశారు. ఫిఫా ప్రపంచకప్కు అర్హత సాధించిన జట్లు ఇవే?గ్రూప్ ఎ – మెక్సికో, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, చెకియాగ్రూప్ బి – కెనడా, బోస్నియా మరియు హెర్జెగోవినా, ఖతార్, స్విట్జర్లాండ్గ్రూప్ సి – బ్రెజిల్, మొరాకో, హైతీ, స్కాట్లాండ్గ్రూప్ డి – యుఎస్ఎ, పరాగ్వే, ఆస్ట్రేలియా, టర్కీగ్రూప్ ఇ – జర్మనీ, కురసావో, ఐవరీ కోస్ట్, ఈక్వెడార్గ్రూప్ ఎఫ్ – నెదర్లాండ్స్, జపాన్, స్వీడన్, ట్యునీషియాగ్రూప్ జి – బెల్జియం, ఈజిప్ట్, ఇరాన్, న్యూజిలాండ్గ్రూప్ హెచ్ – స్పెయిన్, కేప్ వెర్డే, సౌదీ అరేబియా, ఉరుగ్వేగ్రూప్ ఐ – ఫ్రాన్స్, సెనెగల్, నార్వే, ఇరాక్/బొలీవియాగ్రూప్ జె – అర్జెంటీనా, అల్జీరియా, ఆస్ట్రియా, జోర్డాన్గ్రూప్ కె – పోర్చుగల్, డిఆర్ కాంగో, ఉజ్బెకిస్తాన్, కొలంబియాగ్రూప్ ఎల్ – ఇంగ్లాండ్, క్రొయేషియా, ఘానా, పనామాచదవండి: IPL 2026: పాపం అర్జున్ టెండూల్కర్.. జట్టు మారినా? -
క్వార్టర్ ఫైనల్లో విశ్వనాథ్, సచిన్
ఉలాన్బాటర్ (మంగోలియా): ఆసియా సీనియర్ బాక్సింగ్ చాంపియన్షిప్లో మూడో రోజు బరిలోకి దిగిన ఇద్దరు భారత బాక్సర్లు ఏకపక్ష విజయాలు నమోదు చేశారు. పురుషుల 50 కేజీల విభాగంలో విశ్వనాథ్ సురేశ్... 60 కేజీల విభాగంలో సచిన్ సివాచ్ తొలి రౌండ్లో గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు.విశ్వనాథ్ 5:0తో బెక్జాత్ ఎర్గెషోవ్ (కిర్గిస్తాన్)పై గెలుపొందగా... సచిన్ 4:1తో బుయన్దలై బయార్ఖు (మంగోలియా)ను ఓడించాడు. క్వార్టర్ ఫైనల్లో చెంగ్ వె లీ (చైనీస్ తైపీ)తో సచిన్... సన్జార్ తష్కెన్బే (కజకిస్తాన్)తో విశ్వనాథ్ తలపడతారు. -
30 ఏళ్ల తర్వాత తొలి విజయం..
కొచ్చి: నామమాత్రమైన మ్యాచ్లో భారత పురుషుల ఫుట్బాల్ జట్టు మెరిసింది. హాంకాంగ్ జట్టుతో మంగళవారం జరిగిన ఆసియా కప్ 2027 క్వాలిఫయింగ్ టోర్నీ చివరి మ్యాచ్లో టీమిండియా 2–1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. అయినప్పటికీ గ్రూప్ ‘సి’లో భారత్ ఐదు పాయింట్లతో చివరిదైన నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. భారత్, బంగ్లాదేశ్ ఐదు పాయింట్లతో సమంగా నిలిచినా... మెరుగైన గోల్స్ సగటుతో బంగ్లాదేశ్కు మూడో స్థానం, భారత్కు నాలుగో స్థానం ఖరారయ్యాయి. హాంకాంగ్ ఎనిమిది పాయింట్లతో రెండో స్థానంలో నిలువగా... సింగపూర్ 14 పాయింట్లతో అగ్రస్థానాన్ని సంపాదించి ఆసియా కప్ టోర్నీకి అర్హత సాధించింది.గతేడాది భారత పౌరసత్వాన్ని తీసుకున్న ఆస్ట్రేలియా ఫుట్బాలర్ రియాన్ విలియమ్స్ తొలిసారి టీమిండియా తరఫున అంతర్జాతీయ మ్యాచ్లో బరిలోకి దిగాడు. 32 ఏళ్ల విలియమ్స్ నాలుగో నిమిషంలోనే భారత్కు తొలి గోల్ అందించాడు. 50వ నిమిషంలో ఆకాశ్ మిశ్రా గోల్తో భారత్ 2–0తో ముందంజ వేసింది. 65వ నిమిషంలో ఎవర్టన్ కమార్గో గోల్తో హాంకాంగ్ ఖాతా తెరిచింది. అయితే తదుపరి 35 నిమిషాలు హాంకాంగ్ ఆటగాళ్లను భారత్ నిలువరించి ఈ టోర్నీని గెలుపుతో ముగించడంలో విజయవంతమైంది. కాగా కొచ్చి మైదానంలో భారత ఫుట్బాల్ టీం 30 ఏళ్ల తర్వాత విజయాన్ని అందుకోవడం విశేషం. -
కంటతడి పెట్టిన లియోనల్ మెస్సీ!
లియోనల్ మెస్సీ.. పరిచయం అక్కర్లేని పేరు. ఈతరం ఫుట్బాల్ ఆటగాళ్లలో ఆల్ టైమ్ గ్రేట్గా ఈ అర్జెంటీనా స్టార్ను అభివర్ణిస్తుంటారు. ఆయన అభిమాన బలం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ప్రస్తుతం మెస్సీ వయస్సు 38 ఏళ్లు కావడంతో అతడి రిటైర్మెంట్పై ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. జూన్లో మొదలుకానున్న ఫిఫా ప్రపంచకప్ 2026 మెస్సీ ఆఖరి టోర్నీ అని ప్రచారం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో సొంతగడ్డపై చివరి మ్యాచ్ ఆడడంతో మెస్సీ ఉద్వేగానికి గురయ్యాడు. విషయంలోకి వెళితే మంగళవారం రాత్రి బ్యూనస్ఎయిర్స్ వేదికగా అర్జెంటీనా, జాంబియా మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో అర్జెంటీనా ఒక గోల్ కొట్టడంతో పాటు మరొక గోల్ కొట్టడంలో అసిస్ట్ చేశాడు. మ్యాచ్లో అర్జెంటీనా 5-0తో జాంబియాను చిత్తుగా ఓడించింది. తొలి హాఫ్ ముగియడానికి ముందు కెరీర్లో 116వ గోల్ సాధించిన మెస్సీ అంతకముందు మ్యాచ్ ఆరంభంలో జులియన్ అల్వారెజ్కు పాస్ అందించాడు. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత తన సహచరులతో కలిసి మైదానంలో నిలబడిన సమయంలో స్టాండ్స్లోని ప్రేక్షకులు ‘మెస్సీ.. మెస్సీ’ అంటూ అరవడం మొదలెట్టారు. ఇది చూసిన మెస్సీ కళ్లలో దుఃఖం ఆగలేదు. వెంటనే తలను కిందకు దించి కంటి నుంచి వచ్చిన నీరును తుడుచుకోవడం కెమెరాలకు చిక్కింది. అర్జెంటీనా తరఫున తన హోంగ్రౌండ్లో చివరి మ్యాచ్ ఆడడాన్ని జీర్ణించుకోలేకే మెస్సీ కంటతడి పెట్టినట్లు అభిమానులు కామెంట్ చేశారు. ఇక ఫిఫా ప్రపంచకప్కు ఇప్పటికే అర్హత సాధించిన అర్జెంటీనా గ్రూప్-జేలో ఉంది. ఇదే గ్రూప్లో ఉన్న అల్జీరియా, ఆస్ట్రియా, జోర్డాన్లతో అర్జెంటీనా మ్యాచ్లు ఆడనుంది. టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఉన్న అర్జెంటీనాకు గ్రూప్ దశలో సులువైన డ్రానే లభించింది. ప్రపంచకప్కు సన్నాహకంగా అర్జెంటీనా వరుస ఫ్రెండ్లీ మ్యాచ్లు ఆడుతూ వస్తోంది. ఇప్పటికే మారిటానియా, జాంబియాలతో మ్యాచ్లు ముగించుకున్న అర్జెంటీనా తమ తదుపరి మ్యాచ్ను సెర్బియాతో ఆడనుంది.2022లో అర్జెంటీనా ఫిఫా వరల్డ్కప్ సాధించడంలో మెస్సీ కీలకపాత్ర పోషించాడు. ఆ ప్రపంచకప్లో నాయకుడిగా, ఆటగాడిగా జట్టును నడిపించిన మెస్సీ ఫ్రాన్స్తో జరిగిన ఫైనల్లో రెండు గోల్స్ కొట్టడమే గాక, టోర్నీ మొత్తంగా ఏడు గోల్స్ కొట్టి ‘గోల్డెన్ బాల్’ అవార్డును సొంతం చేసుకున్నాడు. 36 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన మెస్సీ ఆ జట్టు దిగ్గజ కెప్టెన్లు డానియెల్ పసరెల్లా, డీగో మారడోనా సరసన చోటు దక్కించుకున్నాడు. LIONEL MESSI GOAL FOR ARGENTINA 🐐🇦🇷 pic.twitter.com/9jxqpLWeSc— Ayuba | Football News (@ayubafootball) April 1, 20262005లో అర్జెంటీనా జాతీయ జట్టులోకి వచ్చిన మెస్సీ ఇప్పటివరకు 198 మ్యాచ్ల్లో 116 గోల్స్ సాధించాడు. చివరగా మెస్సీ సారథ్యంలో 2024లో మినీ ప్రపంచకప్గా పిలుచుకునే కోపా అమెరికా కప్ను అర్జెంటీనా కైవసం చేసుకుంది. తాజాగా మరోసారి కోచ్ లియోనెల్ స్కలోని మార్గదర్శకత్వంలో మెస్సీ నాయకత్వంలో అర్జెంటీనా వరుసగా రెండోసారి విజేతగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ ప్రపంచ కప్లో మెస్సికి ఆడాలనే ఉన్నప్పటికీ కోచ్, బోర్డు తీసుకునే నిర్ణయంపై సందిగ్ధం నెలకొంది. ఇక ప్రతిష్ఠాత్మక ఫిఫా ప్రపంచకప్కు అమెరికా, కెనడా, మెక్సికోలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. జూన్ 11 నుంచి జూలై 19 వరకు ఫిఫా వరల్డ్కప్ జరగనుంది.🚨💣 Deeply emotional scenes unfolding in Argentina 🇦🇷🥹Lionel Messi is currently playing what is expected to be his LAST match with the national team on Argentine soil.The final chapter at home for the greatest of all time before the 2026 World Cup. This one really hurts.… pic.twitter.com/yW8WaYYxyi— Topskills Sports UK (@topskillsportuk) April 1, 2026చదవండి: ‘స్నేహితుల్లేరు.. మా నాన్న ఫేవరెట్ క్రికెటర్ కాదు’ -
మరో 4 నెలల్లో వరల్డ్కప్.. ప్రాక్టీస్ మొదలు పెట్టనున్న భారత్
న్యూఢిల్లీ: ఈ ఏడాది జరిగే రెండు ప్రతిష్టాత్మక ఈవెంట్లకు భారత మహిళల హాకీ జట్టు సన్నాహాలు మొదలుపెట్టనుంది. ఆగస్టులో నెదర్లాండ్స్–బెల్జియంలలో జరిగే ప్రపంచకప్ టోర్నీకి... సెప్టెంబర్–అక్టోబర్లలో జపాన్లో జరిగే ఆసియా క్రీడలకు టీమిండియా సమాయత్తం కానుంది. ఈ నేపథ్యంలో ఫిట్నెస్ను మరింత మెరుగుపర్చుకోవాలని... మైదానంలో అమలు చేసే వ్యూహాలకు పదును పెట్టుకోవాలని భారత బృందం నిర్ణయించుకుంది. రేపటి నుంచి బెంగళూరులోని భారత స్పోర్ట్స్ అథారిటీ ఎక్స్లెన్స్ సెంటర్లో జరిగే ఈ శిబిరంలో 31 మంది ప్రాబబుల్స్ పాల్గొంటారు. ఈ నెలారంభంలో హైదరాబాద్ వేదికగా జరిగిన ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో సలీమా టెటె సారథ్యంలోని భారత జట్టు రన్నరప్గా నిలిచి వరల్డ్కప్ బెర్త్ను దక్కించుకుంది. ‘రాబోయే సీజన్ అత్యంత పోటీతత్వంతో కూడింది. దీని కోసం మేము చేస్తున్న సన్నద్ధతలో భాగమే ఈ శిబిరం. ఆటలో నిలకడను పెంపొందించడం, మా వ్యూహాలను మరింత మెరుగుపరుచుకోవడం ఈ శిబిరం ఉద్దేశం. రాబోయే రెండు ప్రతిష్టాత్మక టోరీ్నల్లో ఒత్తిడిని అధిగమించి, కీలక సమయాల్లో రాణించగలిగే జట్టును రూపొందించాలని భావిస్తున్నాం’ అని భారత మహిళల జట్టు హెడ్ కోచ్ జోర్డ్ మరీన్ తెలిపారు. భారత మహిళల హాకీ ప్రాబబుల్స్సవిత పూనియా, మాధురి కిండో, బిచ్చూ దేవి ఖరీబం, బన్సారి సోలంకి (గోల్కీపర్లు), నిక్కీ ప్రధాన్, ఇషిక చౌధరీ, జ్యోతి సింగ్, లాల్థట్లాంగి, జ్యోతి, ఉదిత, శిల్పి దబాస్ (డిఫెండర్లు), సుశీలా చాను, మనీషా చౌహాన్, వైష్ణవి ఫాల్కే, సాక్షి రాణా, సునెలితా టొప్పో, సలీమా టెటె, నేహా, ఇషిక (మిడ్ ఫీల్డర్లు), దీపిక సోరెంగ్, రుతుజా పిసాల్, బల్జీత్ కౌర్, నవ్నీత్ కౌర్, దీపిక, అన్ను, బ్యూటీ డుంగ్డుంగ్, హీనా బానో, సోనమ్, లాల్రెమ్సియామి, ముంతాజ్ ఖాన్, సంగీత కుమారి (ఫార్వర్డ్స్). -
పోరాటానికి పరిమితులెందుకు?
ఎవరైనా, ఎక్కడైనా పతకాల వేటలో పడి... గెలిస్తే సరి ఇలా కష్టపడ్డాను. జీవితాన్నే ధారపోశాను అన్నట్లు చెబుతారు. అదే ఓడిపోతే మాత్రం వెంటనే వచ్చే నోటి మాట సరైన మౌలిక వసతులు లేవని, సమాఖ్యలోని రాజకీయాలే ఆటగాళ్ల భవిష్యత్తును కాలరాస్తున్నాయని! అన్నీ ఉండి అనే వాళ్ల తూటా మాటలివి. కానీ శీతల్ దేవి అలా కాదు. గురిపెట్టేందుకు కళ్లున్నా... విల్లును పట్టుకునేందుకు, బాణం లాగడానికి చేతి వేళ్లు కాదు కదా... అసలు చేతులే లేవు. అయినా సరే గురిపెట్టింది లక్ష్యంపై! ఉన్న రెండు కాళ్లతో విల్లును సరిచేసుకుంటుంది. కాలి వేళ్లతో బాణాన్ని సంధిస్తుంది. 2022 నుంచి అంతర్జాతీయ మెగా ఈవెంట్లలో పతకాలు గెలిచింది. తాజాగా ప్రపంచ అత్యుత్తమ ఆర్చర్ (2025) అవార్డే ఆమెను వరించేలా ఎదిగింది.అందరూ పతకం కోసం ఆశపడతారు. కానీ ‘పతకమే’ ఆమె ప్రతిభకు దాసోహమంటుంది. ఈ పోటీల్లో కొందరు గెలుస్తారు. కానీ ఆమె బరిలోకి దిగితే ఆ‘పోటీ’నే మురుస్తుంది. మరికొందరేమో పోరాడి ఓడినా తమ ప్రదర్శనతో తృప్తి చెందుతారు. కానీ ఆమె పోరు... ఆడే తీరు...చూసి ఆ ప్రదర్శనకే వన్నెతెస్తుంది. ఆమెనే కశ్మీరీ పారా ఆర్చర్ శీతల్ దేవి. చేతులు ముడుచుకొని తీరిగ్గా కాలక్షేపం చేసే దేశంలో చేతుల్లేని శీతల్ ఏ దేశమేగినా... ఏ ఈవెంట్లో కాలిడినా భారతావని పొగిడే పతకం తెస్తోంది. కొన్నేళ్లుగా పతకాల పనిపట్టిన 19 ఏళ్ల టీనేజర్ను తాజాగా ‘వరల్డ్ పారా ఆర్చర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డే పట్టుకుంది. ఈ సందర్భంగా ఆమె విజయవంతమైన పయనంపై చెప్పిన సంగతులివి... చాలా ప్రత్యేకం... చిరస్మరణీయం.. ఇది చాలా ప్రత్యేకమైన అనుభూతినిస్తోంది. ప్రపంచంలోని అత్యుత్తమ ఆర్చర్లలో ఒకరిగా నామినేట్ అవడమే సాఫల్యమనుకుంటే... ఏకంగా పురస్కారాన్నే గెలుపొందడం చిరస్మరణీయంగా మార్చింది. అందుకే ఇది చాలా చాలా ప్రత్యేకమైందంటాను. ఎదురైన ప్రతీ ఎదురుదెబ్బకు నిలిచి నేను పడిన కఠోర శ్రమకు, త్యాగానికి ఈ అవార్డు ప్రతిబింబం. పతకాల కోసం పాటుపడితే అవార్డే వచ్చింది. ఈ ప్రదర్శనలో నా తల్లిదండ్రులు, కోచ్ నా వెన్నంటే నిలిచారు. వారి అండదండలే ఈ పురస్కారానికి కారణం. మీకు పరిమితులు పెట్టెదెవరు?పరిధి, పరిమితులు ఉండాలి. కానీ ప్రతి దానికి ఉండనక్కర్లేదు. ముఖ్యంగా మనకు, మన ఎదుగుదలకు, సాఫల్యానికి పరిమితులెందుకు? అందుకే అంటాను... మీ పరిమితులను నిర్ణయించే అధికారం ఇంకెవరికీ ఇవ్వకండి. మీరేంటో మీకు బాగా తెలుసు. మీరేం చేయగలరో కూడా మీకే తెలుసు. ఇన్ని తెలిసిన మీకు పరిమితులు ఎవరో విధించే అవకాశం ఎప్పటికీ ఇవ్వకూడదు. అలాంటప్పుడే మనం విజయవంతమవుతాం గుర్తుంచుకోండి. ఉదయం మొదలుపెడితే... నా శిక్షణ ప్రతీ రోజు ఉదయం 8 గంటలకే మొదలవుతుంది. సాయంత్రం 6 అయితేగానీ ముగిసిపోదు. మధ్యలో రెండు గంటలు మాత్రం తినడానికి కాస్త విశ్రాంతి తీసుకునేందుకు బ్రేక్ ఇస్తాను. నాకిది రొటీన్. సుదీర్ఘ సమయం నేను ఎంచుకున్న ‘రేంజ్’పైనే దృష్టి పెడతాను. అస్తమానం బాణాలే సంధిస్తూ కూర్చోను. శారీరక ఫిట్నెస్, మానసిక స్థైర్యం పెరిగేందుకు కూడా కసరత్తు చేస్తాను. సాంకేతికంగా మెరుగయ్యేందుకు ఎప్పటికప్పుడు ప్రత్యేక శ్రద్ద చూపిస్తాను. గతేడాది అలా చేయడం వల్లే నిర్దిష్ట లక్ష్యాలను చేరుకోగలిగాను.శీతల్ పతకాలివి...శీతల్ పతకాల వేట 15 ఏళ్లకే ప్రారంభమైంది. అది కూడా ప్రతిష్టాత్మక ఆసియా పారా క్రీడల్లో..! హాంగ్జౌ (చైనా)లో జరిగిన 2022 మెగా ఈవెంట్లో వ్యక్తిగత, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లలో బంగారు పతకాలు నెగ్గిన శీతల్ డబుల్స్లో రజతాన్ని గెలుచుకుంది. ఆ మరుసటి ఏడాది ప్రపంచ చాంపియన్షిప్లో రజతంతో మెరిసింది. ఆసియా చాంపియన్షిప్ (బ్యాంకాక్)లో స్వర్ణం, రజతం సాధించింది. 2024 పారిస్లో జరిగిన పారలింపిక్స్లో మిక్స్డ్ టీమ్లో కాంస్యం చేజిక్కించుకుంది. గతేడాది ప్రపంచ చాంపియన్షిప్ (కొరియా) లో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు గెలిచింది. -
ఇటలీకి షాక్.. ఫిపా ప్రపంచకప్కు అనర్హత
ఫుట్బాల్లో ఇటలీ జట్టుది చెరగని ప్రస్థానం. నాలుగుసార్లు (1934,1938,1982,2006 ) ఫిఫా చాంపియన్గా నిలిచిన ఇటలీ మరో రెండుసార్లు యూరోపియన్ చాంపియన్గా (1968,2020) అవతరించింది. గియాన్లుగీ బఫన్, పాలో మల్దిని, రాబర్టో బగ్గియో, ఫాఇయో కన్నావరో, ఫ్రానెస్కో టొట్టి, ఆండ్రియా పిర్లో, లుగీ రివా, గిసెప్పీ మియాజ్జా వంటి స్టార్ దిగ్గజ ఆటగాళ్లు ఇటలీకి ప్రాతినిధ్యం వహించారు. కానీ ఇదంతా గతం. ఇప్పుడు మాత్రం ఇటలీ ఫుట్బాల్ జట్టు ఫిఫా ప్రపంచకప్కు అర్హత సాధించేందుకు నానా తంటాలు పడాల్సి వస్తోంది. వరుసగా మూడోసారి ఫిఫా ప్రపంచకప్కు అర్హత సాధించడంలో ఇటలీ విఫలమైంది. మంగళవారం ఫిఫా క్వాలియర్స్ ప్లేఆఫ్స్ ఫైనల్లో బోస్నియాతో జరిగిన మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. దీంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. అయితే పెనాల్టీ షూటౌట్లో ఇటలీ 1-4 తేడాతో బోస్నియా చేతిలో ఓటమి చవిచూసింది. ఈ నేపథ్యంలో నాలుగుసార్లు ఫిఫా చాంపియన్ అయిన ఇటలీ వరుసగా మూడోసారి (2018, 2022, 2026) ఫిఫా ప్రపంచకప్కు అర్హత సాధించని తొలి జట్టుగా చెత్త రికార్డును మూటగట్టుకుంది. అంతేకాదు 2006లో చివరిసారి ఫిఫా చాంపియన్గా నిలిచిన ఇటలీ అప్పటి నుంచి ఒక్క నాకౌట్ మ్యాచ్లో కూడా విజయం సాధించలేకపోయింది. మరోవైపు బోస్నియా జట్టు ఫిఫా ప్రపంచకప్కు అర్హత సాధించడం ఇది రెండోసారి.అయితే క్రికెట్లో ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్లో ఇటలీ తొలిసారి పాల్గొంది. ఆడుతుంది తొలి ప్రపంచకప్ అయినప్పటికీ తమ కంటే ఎన్నోరేట్లు మెరుగైన నేపాల్ను ఓడించి తొలి విజయాన్ని అందుకుంది. క్రికెట్లో ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుకుంటున్న ఇటలీ ఫుట్బాల్ ఆటలో మాత్రం తిరోగమనం దిశగా పయనిస్తోంది. నిరసనలు..ఇటలీ ప్రతిష్ఠాత్మక ఫిఫా ప్రపంచకప్కు అర్హత సాధించకపోవడంతో ఆ దేశంలో నిరసనలు మిన్నంటాయి. నాలుగుసార్లు ఫిఫా విజేత అయిన ఇటలీ వరుసగా మూడోసారి ఫిఫా ప్రపంచకప్కు అర్హత సాధించకపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటలీ ఓటమిని తట్టుకోలేక కొంతమంది కన్నీటి పర్యంతమవ్వగా, మరికొందరు మాత్రం ఇటలీ ఫుట్బాల్ క్లబ్ అసోసియేషన్ వద్దకు చేరుకొని నిరసనలు చేపట్టారు.🇧🇦: ✅✅✅✅🇮🇹: ❌✅❌BOSNIA BEAT ITALY ON PENALTIES AND WILL PLAY AT THE 2026 @FIFAWorldCup 🎉#WCQ | #EuropeanQualifiers pic.twitter.com/pgfeHWkENU— beIN SPORTS (@beINSPORTS_EN) March 31, 2026చదవండి: అరంగేట్రంలోనే అదరగొట్టాడు.. ఎవరీ కూపర్! -
వైశాలి, దివ్య ‘హ్యాట్రిక్’ డ్రా
పెయియా (సైప్రస్): క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ మహిళల విభాగంలో భారత గ్రాండ్మాస్టర్లు వైశాలి, దివ్య దేశ్ముఖ్ వరుసగా మూడో ‘డ్రా’ నమోదు చేశారు. అనా ముజిచుక్ (ఉక్రెయిన్)తో మంగళవారం జరిగిన మూడో రౌండ్ గేమ్ను వైశాలి 41 ఎత్తుల్లో... అలెగ్జాండ్రా గొర్యాక్చినా (రష్యా)తో జరిగిన మూడో రౌండ్ గేమ్ను దివ్య 81 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించారు. ఓపెన్ విభాగంలో వైశాలి తమ్ముడు, భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద తొలి ఓటమి చవిచూశాడు.జవోఖిర్ సిందరోవ్ (ఉజ్బెకిస్తాన్)తో జరిగిన మూడో రౌండ్ గేమ్లో ప్రజ్ఞానంద 40 ఎత్తుల్లో ఓడిపోయాడు. ఓపెన్ విభాగంలో, మహిళల విభాగంలో ఎనిమిది మంది గ్రాండ్మాస్టర్ల మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో 14 రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతోంది. నిర్ణిత 14 రౌండ్ల తర్వాత అత్యధిక పాయింట్లు సాధించిన ప్లేయర్లు విజేతలుగా నిలుస్తారు. మహిళల విభాగం చాంపియన్ ప్రస్తుత విశ్వవిజేత జు వెన్జున్తో... ఓపెన్ విభాగం విన్నర్ ప్రస్తుత జగజ్జేత గుకేశ్తో ప్రపంచ చాంపియన్షీప్ టైటిల్ కోసం తలపడతారు. -
నికిత్ శ్రీ చక్రికి రజత పతకం
జాతీయ ఆర్చరీ చాంపియన్షిప్లో నికిత్ శ్రీ చక్రి ఆకుల సత్తా చాటాడు. రికర్వ్ అండర్-10 బాలుర విభాగంలో రజత పతకం గెలిచాడు. అంతేకాదు జాతీయ స్థాయిలో రెండో ర్యాంకు సాధించాడు. ఈ నేపథ్యంలో నికిత్కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.2025-26లో నికిత్ శ్రీ చక్రి సాధించిన విజయాలుజాతీయ ఆర్చరీ చాంపియన్షిప్ (రికర్వ్ అండర్-10)- సిల్వర్ మెడల్తెలంగాణ రాష్ట్ర ఆర్చరీ చాంపియన్షిప్స్ (రికర్వ్ అండర్-10)- సిల్వర్ మెడల్రంగారెడ్డి జిల్లా ఆర్చరీ చాంపియన్షిప్ (రికర్వ్ అండర్-10)- గోల్డ్ మెడల్తమిళనాడు స్టేట్ ఓపెనర్ ఆర్చరీ చాంపియన్షిప్ (రికర్వ్ అండర్-10)- గోల్డ్ మెడల్సౌత్ ఇండియన్ ఓపెనర్ ఆర్చరీ చాంపియన్షిప్ (రికర్వ్ అండర్-10)-గోల్డ్ మెడల్ -
బెంగాల్లో అనూహ్య పరిణామం.. బీజేపీలోకి టెన్నిస్ దిగ్గజం
దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మంగళవారం కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు, రాష్ట్ర మాజీ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందర్ సమక్షంలో కాషాయ కండువాను కప్పుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.పేస్ పాపులారిటీ యువ ఓటర్లపై సానుకూల ప్రభావం చూపుతుందని బీజేపీ బలంగా నమ్ముతోంది. 1973 జూన్ 17న కోల్కతాలో లియాండర్ పేస్ జన్మించారు. 1996 అట్లాంటా ఒలింపిక్స్లో పురుషుల సింగిల్స్లో బ్రెజిల్కు చెందిన ఫెర్నాండో మెలిగెనిని ఓడించి పేస్ కాంస్యం గెలిచారు. వ్యక్తిగత ఒలింపిక్ పతకం గెలిచిన కేడీ జాధవ్ తర్వాత తొలి భారతీయ క్రీడాకారుడిగా పేస్ నిలిచారు.ప్రొఫెషనల్ టెన్నిస్లో సింగిల్స్ కంటే డబుల్స్పై దృష్టి సారించిన పేస్ పురుషుల గ్రాండ్స్లామ్ టోర్నీల్లో డబుల్స్లో ఎనిమిది సార్లు, పది సార్లు మిక్స్డ్ డబుల్స్ లో టైటిల్స్ సాధించాడు. దేశానికి చేసిన సేవలకుగాను 1990లో అర్జున, 1996లో ఖేల్ రత్న, 2001లో పద్మశ్రీ, 2014 జనవరిలో పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. బెంగాల్ రాజకీయాల్లో కీలకమైన యువత, క్రీడాభిమానులను ఆకర్షించేందుకు పేస్ను తమ పార్టీలోకి ఆహ్వానించడాన్ని బీజేపీ చేపట్టిన వ్యూహాత్మక అడుగుగా పరిగణిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల వేడిలో ఉన్న పశ్చిమ బెంగాల్ రాజకీయాలకు ఇది కీలక పరిణామం. #WATCH | Delhi: Former ace Tennis star Leander Paes joins the BJP, in the presence of Union Ministers Kiren Rijiju and Sukanta Majumdar. pic.twitter.com/qIDW1OovWz— ANI (@ANI) March 31, 2026 -
స్పోర్ట్స్ హ్యాకథాన్లో 2,132 వినూత్న ఆవిష్కరణలు
సాక్షి, హైదరాబాద్: క్రీడలు, సాంకేతికత, ఆవిష్కరణలను ఒకే వేదికపైకి తీసుకొచ్చిన స్పోర్ట్స్ హ్యాకథాన్ ఘనంగా ముగిసింది. గచ్చిబౌలి స్టేడియంలో 24 గంటల నిరంతర కార్యక్రమంగా నిర్వహించిన ఈ వినూత్న హ్యాకథాన్లో రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులు, క్రీడాకారులు, స్టార్టప్లు, యువ ఆవిష్కర్తలు పాల్గొని మొత్తం 2,132 ఆవిష్కరణలు రూపొందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జయేశ్ రంజన్, ఐఏఎస్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (క్రీడలు), తెలంగాణ ప్రభుత్వం, ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ యువతలో సృజనాత్మకతను వెలికితీసే ఇలాంటి వేదికలు అత్యంత అవసరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉప సభాపతి బండా ప్రకాశ్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తదితర ప్రముఖులు కూడా పాల్గొన్నారు.ఈ హ్యాకథాన్లో ప్రత్యేకత ఏమిటంటే, కరాటే, వాలీబాల్, స్విమ్మింగ్, ఫెన్సింగ్, పవర్లిఫ్టింగ్, చెస్, క్యారమ్ వంటి మొత్తం 24 క్రీడలు భాగస్వామ్యం కావడం. పాల్గొన్న వారు క్రీడల్లో పాల్గొంటూనే వాటిలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి, వాటికి వినూత్న పరిష్కారాలను ఆవిష్కరించారు. ఈ ఆలోచనలను “పిచ్ అరేనా” వేదికపై నిపుణులు, అధికారులు, పెట్టుబడిదారుల ముందు ప్రదర్శించారు.హ్యాకథాన్లో వచ్చిన ఆవిష్కరణలు క్రీడల పనితీరు మెరుగుదల, శిక్షణ విధానాలు, ఫ్యాన్ ఎంగేజ్మెంట్, స్పోర్ట్స్ టెక్నాలజీ వంటి విభాగాల్లో కొత్త దారులను చూపిస్తున్నాయి. ఈ 2,132 ఆవిష్కరణలను సావనీర్ రూపంలో ప్రచురించేందుకు నిర్వాహకులు ప్రణాళిక రూపొందించారు.హ్యాకథాన్ బ్రాండ్ ఓనర్ సందీప్ కుమార్ మక్తాల మాట్లాడుతూ... 'క్రీడలు కేవలం ఆటలకే పరిమితం కావు. అవి ఆవిష్కరణలకు కూడా మార్గం చూపుతాయి. ఈ హ్యాకథాన్ ద్వారా యువతలో ఉన్న అపార సృజనాత్మకత వెలుగులోకి వచ్చింది. ఈ ఆవిష్కరణలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడం మా లక్ష్యం' అని తెలిపారు.చదవండి: రంగుమారిన మరుక్షణం మాట మార్చాడు! -
ప్రతిభకు పురస్కారం
లుసానే: భారత మహిళా పారా ఆర్చర్ శీతల్ దేవి ప్రతిభకు ప్రపంచ పురస్కారం దక్కింది. భుజాల నుంచే రెండు చేతులు లేని ఈ కశీ్మరి ఆర్చర్ అంతర్జాతీయ పారా క్రీడల్లో సత్తాచాటుతోంది. దీంతో 2025 ఏడాదికి సంబంధించి ప్రపంచ ఆర్చరీ ప్రకటించిన ‘పారా ఆర్చర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు శీతల్ దేవికి దక్కింది. గతేడాది గ్వాంగ్జూ (దక్షిణ కొరియా)లో జరిగిన ప్రపంచ పారా ఆర్చరీ చాంపియన్షిప్లో ఆమె అసాధారణ ప్రదర్శనతో స్వర్ణ పతకం సాధించింది. ఇందులో బరిలోకి దిగిన ఆమె అసలు చేతులే లేని ఏకైక మహిళా ఆర్చర్... వ్యక్తిగత కాంపౌండ్ ఈవెంట్లో చేతులుండి వైకల్యమున్న ప్రపంచ స్థాయి పారా ఆర్చర్లను ఢీకొట్టి మరీ విజేతగా నిలిచింది. తన కాలి వేళ్లు, భుజం సాయంతో విల్లును లక్ష్య బిందువుపై ఎక్కుపెట్టే ప్రతిభ చూపరుల్ని ఇట్టే ఆకట్టుకుంటుంది. ఒకసారి ఆమె పోటీ మొదలైతే ప్రేక్షకులెవరూ కనులు తిప్పుకోనివ్వని నైపుణ్యం ఆమె సొంతం. ఈ నైపుణ్యంతోనే అంతర్జాతీయ ఈవెంట్లలో పతకాల్ని సాధిస్తున్న శీతల్కు వార్షిక అవార్డుల రేసులో ప్రపంచ ఆర్చరీ పట్టం కట్టింది. ‘పారా ఆర్చర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు ఎంపిక చేసింది. కొరియాలో జరిగిన ఆర్చరీ పోటీల్లో ఆమె కేవలం ఒక స్వర్ణంతోనే సరిపెట్టుకోలేదు... మహిళల టీమ్ ఈవెంట్లో రజతం, మిక్స్డ్ టీమ్లో కాంస్యం సాధించింది. ప్రపంచ ఆర్చరీ అవార్డులకు నామినేట్ కావడం ఇప్పుడు పురస్కారానికి ఎంపికవడం చాలా సంతోషాన్నిచి్చందని, వ్యక్తిగతంగా ఈ అవార్డు తన గుండెను తాకిందని శీతల్ దేవి భావోద్వేగంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పారిస్లో జరిగిన పారాలింపిక్స్లోనూ ఈ కశ్మీరీ ఆర్చర్ సత్తా చాటుకుంది. ఆమె మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కాంస్యం నెగ్గింది. 2022 పారా ఆసియా క్రీడల్లో వ్యక్తిగత ఈవెంట్లో రజతం, 2023 ఆసియా చాంపియన్íÙప్లో రజతం గెలుచుకుంది. ప్రపంచ ఆర్చరీలో ఈ తరహా అవార్డుల్ని 2011లో ప్రారంభించారు. అసాధారణ నైపుణ్యం కనబరిచిన ఆర్చర్లు, పారా ఆర్చర్ల ఘనతను గుర్తించడమే ఈ అవార్డుల ముఖ్య ఉద్దేశం. చదవండి: ‘మ్యాచ్ ఓటమి బాధ కలిగించలేదు’ -
సినెర్దే మయామి మాస్టర్స్
ఫ్లోరిడా: ప్రపంచ నంబర్వన్ ర్యాంక్ చేజార్చుకున్నా... మరోసారి ‘టాప్’ క్లాస్ ఆటతీరును ప్రదర్శించి ఇటలీ టెన్నిస్ స్టార్ యానిక్ సినెర్ కెరీర్లో ఏడో మాస్టర్స్ సిరీస్ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన మయామి ఓపెన్ ఏటీపీ మాస్టర్స్–1000 సిరీస్ టోర్నీలో ప్రపంచ రెండో ర్యాంకర్ సినెర్ రెండోసారి చాంపియన్గా నిలిచాడు. ఫైనల్లో సినెర్ 6–4, 6–4తో ప్రపంచ 14వ ర్యాంకర్ జిరీ లెహెస్కా (చెక్ రిపబ్లిక్)పై విజయం సాధించాడు. సినెర్కు 11,51,380 డాలర్ల (రూ. 10 కోట్ల 89 లక్షలు) ప్రైజ్మనీ, 1000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ లెహెస్కాకు 6,12,340 డాలర్ల (రూ. 5 కోట్ల 79 లక్షలు) ప్రైజ్మనీ, 650 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఓవరాల్గా సినెర్ కెరీర్లో ఇది 26వ సింగిల్స్ టైటిల్. 93 నిమిషాలపాటు జరిగిన తుది పోరులో సినెర్ పది ఏస్లు సంధించి, ఒక డబుల్ ఫాల్ట్ చేశాడు. తొలి సర్వీస్లో 33 పాయింట్లు, రెండో సర్వీస్లో తొమ్మిది పాయింట్లు సాధించాడు. మూడుసార్లు తన సర్వీస్ బ్రేక్ పాయింట్లు కాపాడుకున్న ఈ ఇటలీ స్టార్ ప్రత్యర్థి సర్వీస్ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. 2024లో తొలిసారి మయామి ఓపెన్లో టైటిల్ నెగ్గిన సినెర్ గత ఏడాది తనపై విధించిన మూడు నెలల నిషేధం కారణంగా బరిలోకి దిగలేదు. రెండు వారాల క్రితం ఇండియన్ వెల్స్ ఓపెన్లో టైటిల్ నెగ్గిన సినెర్ మయామి ఓపెన్లోనూ విజేతగా నిలవడం ద్వారా ‘సన్షైన్ డబుల్’ సాధించిన ఎనిమిదో ప్లేయర్గా గుర్తింపు పొందాడు. ఇండియన్ వెల్స్, మయామి ఓపెన్ టోర్నీ టైటిల్స్ను వరుసగా గెలిస్తే ‘సన్షైన్ డబుల్’గా పరిగణిస్తారు. ఈ రెండు టోర్నీల్లో ఒక్క సెట్ కూడా కోల్పోకుండా సినెర్ చాంపియన్గా నిలిచాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్గా రికార్డు సృష్టించాడు. చదవండి: IPL 2026: బ్లూ సోఫాలో అంబానీ ఫ్యామిలీ! -
మాజీ సీఎం కూతురికి వేధింపులు
భారత ఫుట్బాల్ సమాఖ్య (AIFF) అధ్యక్షుడు కల్యాణ్ చౌబేపై మహిళల కమిటీ హెడ్ వలంకా అలేమావో వేధింపుల ఆరోపణలు చేశారు. మార్చి 29న ఢిల్లీలోని ఫుట్బాల్ హౌస్లో జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఆమె ఓ లేఖలో పేర్కొన్నారు. ఆ సమావేశంలో చౌబే, ఉపాధ్యక్షుడు హారిస్, డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎం. సత్యనారాయణ తనను హేళన చేసి మాట్లాడారని వలంకా ఆరోపించారు. అధ్యక్షుడు చౌబే తన స్వరాన్ని అణచివేసి, అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని అన్నారు. అంతటితో ఆగకుండా గట్టిగా మాట్లాడి భయపెట్టే ప్రయత్నం చేశారని లేఖలో ప్రస్తావించారు. వలంకా అలేమావో ఎవరు..? AIFF మహిళల విభాగపు అధిపతి అయిన వలంకా అలేమావో గోవా మాజీ ముఖ్యమంత్రి చర్చిల్ అలేమావో కుమార్తె. ఆమె చర్చిల్ బ్రదర్స్ ఫుట్బాల్ క్లబ్కు కూడా CEOగా వ్యవహరిస్తారు. 2025–2029 కాలానికి FIFA మహిళల ఫుట్బాల్ అభివృద్ధి కమిటీలో నియమితులైన తొలి భారతీయ మహిళ వలంకా. వివాదం నేపథ్యం మహిళల ఆసియా కప్ ప్రచారంలో జట్టు నిర్వహణ, లాజిస్టిక్స్లో జరిగిన పరిపాలనా తప్పిదాలపై వలంకా చౌబేకు లేఖ రాసి, బాధ్యత వహించాలని కోరారు. అలాగే ప్రధాన నిర్ణయాల్లో మహిళల కమిటీని సంప్రదించడం లేదని నిలదీశారు. ఈ విషయమై ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో చర్చ జరుగుతుండగా, చౌబే సహనం కోల్పోయారని తెలుస్తుంది. -
టైగర్వుడ్స్కు ట్రంప్ మాజీ భార్య వార్నింగ్!
గోల్ఫ్ దిగ్గజం టైగర్ వుడ్స్ ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ జూనియర్ మాజీ భార్య వెనెస్సా ట్రంప్తో రిలేషన్షిప్లో ఉన్నాడు. ఇటీవలే టైగర్వుడ్స్ను డ్రైవింగ్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ (డీయూఐ) కింద ఫ్లోరిడా పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం టైగర్వుడ్స్ను మార్టిన్ కౌంటీ జైలుకు తీసుకెళ్లారు. ఆ తర్వాత బెయిల్పై విడుదలయిన టైగర్వుడ్స్పై అతడి భాగస్వామి వెనెస్సా ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా టైగర్వుడ్స్ తన ప్రవర్తన, పద్దతులను మార్చుకోకపోతే విడిచిపెట్టి వెళ్లిపోతానంటూ బెదిరింపులకు దిగినట్లు వార్తలు వస్తున్నాయి. డైలీమెయిల్ కథనం ప్రకారం.. వెనెస్సా ట్రంప్ టైగర్వుడ్స్కు ఇదే అతడికి చివరి అవకాశమని, ఒకవేళ మళ్లీ ఎలాంటి తప్పు చేసి జైలుకెళితే మాత్రం తమ రిలేషన్షిప్కు ఎండ్కార్డ్ పడినట్లేనని అర్థం చేసుకోవాలని తెలిపింది. ‘ఇది కచ్చితంగా టైగర్వుడ్స్కు రెడ్ ఫ్లాగ్ వంటిది. సమస్యలన్నింటిని పరిష్కరించుకొని సక్రమంగా ఉంటే మంచిది. లేదంటే రిలేషన్షిప్కు ఎండ్కార్డ్ వేసి నా దారి నేను చూసుకోవాల్సి ఉంటుంది. ’ అని వెనెస్సా ఘాటుగానే హెచ్చరించినట్లు డైలీమెయిల్ పేర్కొంది.కాగా అమెరికన్ మోడల్ అయిన వెనెస్సా ట్రంప్ 2005 నవంబర్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడు జూనియర్ డొనాల్డ్ ట్రంప్ను పెళ్లాడింది. 2018లో విడాకులు తీసుకున్న ఈ జంటకు కాయ్ ట్రంప్ సంతానం. ఆ తర్వాత గోల్ప్ దిగ్గజం టైగర్వుడ్స్తో రిలేషన్షిప్లో ఉన్నట్లు 2024లో తొలిసారి వార్తలు బయటకొచ్చాయి. టైగర్వుడ్స్ మార్చి 2025లో వెనెస్సాను తన భాగస్వామిగా పరిచయం చేస్తూ ఇన్స్టాగ్రామ్లో అధికారికంగా పోస్టు పెట్టాడు. అప్పటినుంచి ఈ ఇద్దరు లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారు. తాజాగా టైగర్వుడ్స్ ప్రవర్తనతో విసిగిపోయిన వెనెస్సా మరోసారి ఇలా చేస్తే మాత్రం రిలేషన్ బ్రేకప్ చేసుకుంటానని బెదిరింపులకు దిగడం ఆసక్తిగా మారింది.చదవండి: అంతుచిక్కని శార్దూల్ ఠాకూర్!


