Other Sports
-
ధనవంతులకు మాత్రమే.. : పుల్లెల గోపీచంద్ ‘షాకింగ్’ కామెంట్స్
భారత బ్యాడ్మింటన్ దిగ్గజం, ఆల్ ఇంగ్లండ్ మాజీ చాంపియన్ పుల్లెల గోపీచంద్(Pullela Gopichand) సంచలన వ్యాఖ్యలు చేశాడు. ధనవంతులు మాత్రమే తమ పిల్లలను క్రీడలను కెరీర్గా ఎంచుకోవాలని సూచించాలన్నాడు. లేదంటే భవిష్యత్తులో చాలా కష్టాలు పడాల్సి వస్తుందని హెచ్చరించాడు. క్రీడాకారులకు తగినంత గుర్తింపు, దక్కాల్సిన గౌరవం దక్కడం లేదన్న ఆవేదనతో తాను ఇలా మాట్లాడుతున్నట్లు తెలిపాడు.కాగా భారత్లో బ్యాడ్మింటన్(Badminton) సూపర్ పవర్గా మారడంలో కీలక పాత్ర పోషించిన పుల్లెల గోపిచంద్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. క్రీడలను ప్రొఫెషన్గా ఎంచుకునే యువత సంఖ్య పెరుగుతుండటం సంతోషాన్ని ఇస్తుందన్నాడు. అయితే, అదే సమయంలో క్రీడాకారులలో కేవలం ఒక శాతం కంటే తక్కువ మంది కెరీర్ మాత్రమే సాఫీగా సాగిపోవడం కాస్త ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నాడు.ధనవంతులకు మాత్రమే..‘‘ధనికులై ఉండి లేదంటే.. వ్యాపారంలో బాగా లాభాలు ఆర్జిస్తున్న కుటుంబాల నుంచి వచ్చిన వారు మాత్రమే స్పోర్ట్స్ను కెరీర్గా ఎంచుకోవాలన్నది నా అభిప్రాయం. నేను మాత్రం సాధారణ కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులకు మాత్రం వారి పిల్లలను క్రీడల్లోకి పంపవద్దనే సలహా ఇస్తాను.క్రికెట్లో రాణించిన వాళ్లు అన్నిరకాలుగా కొంతమేర సక్సెస్ అవుతారు. కానీ ఇతర క్రీడల్లో రాణించే వాళ్ల పరిస్థితి ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం కదా. వారి త్యాగాలు, సేవలకు తగినంత మూల్యం అందుకోగలుగుతున్నారా?సర్, మేడమ్ అని సంబోధిస్తూ ఒలింపిక్ మెడల్స్ సాధించిన వాళ్లలో చాలా మంది రైల్వేస్, ఆర్బీఐ , ఇన్కమ్ టాక్స్, పోలీస్ ఉద్యోగాలు.. లేదంటే అంతకంటే తక్కువ కేడర్ కలిగిన జాబ్స్ చేస్తున్నారు. అయితే, ఓ సివిల్ సర్వెంట్ మాత్రం అరవై ఏళ్ల వరకు అన్ని రకాల ప్రయోజనాలు పొందుతారు. కానీ స్పోర్ట్స్ కోటాలో వచ్చిన వాళ్లు మాత్రం వారిని సర్, మేడమ్ అని సంబోధిస్తూ జీవితం గడపాలి.వారి దయాదాక్షిణ్యాల మీదే అంతా ఆధారపడి ఉంటుంది. కొంతమంది మాత్రమే క్రీడాకారులకు గౌరవం ఇస్తారు. అయితే, ఆటగాళ్ల పట్ల ప్రతికూల భావనలు ఉన్నవారు మాత్రం సులువుగా ఉద్యోగానికి వచ్చేశారని చులకనగా చూసే అవకాశం ఉంది. గత ఇరవై ఏళ్లలో దేశానికి ప్రాతినిథ్యం వహించిన ఆటగాళ్ల పరిస్థితి ఇప్పుడు ఇలా ఉందో చూశారా?ఈరోజు వారి సంపాదన ఎంత?వివిధ క్రీడల్లో వారు పతకాలు సాధించారు. కానీ ఈరోజు వారి సంపాదన ఎంత? వారి భవిష్యత్తు ఏమిటి? దేశానికి పతకాలు సాధించిపెడుతున్న వారికి అంతే స్థాయిలో రివార్డులు దక్కుతున్నాయా? మరి అలాంటప్పుడు పిల్లలను స్పోర్ట్స్ను కెరీర్గా ఎంచుకోవాలని ఎలా చెప్పగలం?ఒకవేళ మీరు స్పోర్ట్స్పర్సన్ కావాలని కచ్చితంగా నిర్ణయించుకుంటే... అప్పుడు ఇంగ్లిష్ భాషలో అనర్గళంగా మాట్లాడగల నైపుణ్యం కూడా సంపాదించండి. అదే విధంగా రిటైర్ అయిన తర్వాత ఏం చేయాలో కూడా ముందుగానే డిసైడ్ చేసుకోండి. ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో ఉండటం మాత్రం మర్చిపోకూడదు’’ అని ఆటలతో పాటు చదువు, కమ్యూనికేషన్ స్కిల్స్ పట్ల శ్రద్ధ చూపాలని వర్దమాన క్రీడాకారులకు గోపీచంద్ దిశానిర్దేశం చేశాడు. కాగా గోపీచంద్ అకాడమీ నుంచి సైనా నెహ్వాల్, పీవీ సింధు వంటి ఒలింపిక్ మెడలిస్టులు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన విషయం తెలిసిందే. ఇక గోపీచంద్ కుమార్తె గాయత్రి కూడా డబుల్స్ విభాగంలో ప్రతిభను నిరూపించుకుంటోంది.చదవండి: శెభాష్ అన్నా!.. జింబాబ్వే ఓపెనర్పై ఇంగ్లండ్ ఆల్రౌండర్ పోస్ట్ -
నేను రాజీనామా చేయలేదు
న్యూఢిల్లీ: భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అథ్లెట్స్ కమిషన్ చైర్పర్సన్, దిగ్గజ మహిళా బాక్సర్ మేరీకోమ్ తన పదవికి రాజీనామా చేయలేదని స్పష్టం చేసింది. పదవీకాలం ముగిసేవరకు బాధ్యతలు కొనసాగిస్తానని చెప్పింది. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్గా నిలిచిన ఆమె 2012 లండన్ ఒలింపిక్స్లో కాంస్య పతకం కూడా గెలుచుకుంది. 42 ఏళ్ల ఈ మణిపురి స్టార్ బాక్సర్ ఇటీవల డెహ్రాడూన్లో జరిగిన జాతీయ క్రీడల ముగింపు కార్యక్రమంలో పాల్గొంది. ఆ సమయంలో ఆమె అథ్లెట్స్ కమిషన్ పదవిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు నెట్టింట ప్రచారం జరిగింది. కానీ మేరీ మాత్రం తన వాట్సాప్ గ్రూప్ సంభాషణను తప్పుగా అన్వయిస్తూ మీడియాకు లీక్ చేశారని, రాజీనామా చేసినట్లు కూడా ప్రచారం చేశారని పేర్కొంది. ‘నేను అథ్లెట్స్ కమిషన్కు రాజీనామా చేయనేలేదు. 2026లో పూర్తయ్యే పదవీకాలం వరకు చైర్పర్సన్గా కొనసాగుతాను. ఆ రోజు నేను కమిషన్ సభ్యులతో అన్నది వేరు... నెట్టింట ప్రచారమైంది వేరు. అథ్లెట్స్ కమిషన్ సభ్యులు తమ పద్ధతి మార్చుకోవాలని సూచించాను. తనతో ప్రవర్తించే తీరు ఇలాగే కొనసాగితే రాజీనామాకు సైతం వెనుకాడనని చెప్పాను. కానీ రాజీనామా చేశానని చెప్పనే లేదు. నేను రాజీనామా చేశానంటున్నారు కదా! మరి రాజీనామా లేఖ ఏది? ఎవరైనా చూశారా? అని ప్రశ్నించింది. ఐఓఏ తన కుటుంబమని... దీంతో ఎప్పుడు విబేధించనని... ఇంతటితో వాట్సాప్ సంభాషణ వివాదానికి ముగింపు పలుకుతున్నానని చెప్పారు. 2022లో ఐఓఏ అథ్లెట్స్ కమిషన్కు మేరీకోమ్ చైర్పర్సన్గా ఎన్నికైంది. టేబుల్ టెన్నిస్ స్టార్ అచంట శరత్ కమల్ వైస్ చైర్మన్గా ఉన్నారు. ఇంకా ఈ కమిషన్లో రెండు ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు, మాజీ షాట్పుటర్ ఓం ప్రకాశ్ కర్హాన, ఒలింపియన్ శివ కేశవన్, లండన్ ఒలింపిక్స్ కాంస్య విజేత, షూటర్ గగన్ నారంగ్ (షూటర్), రోయర్ బజరంగ్ లాల్, ఫెన్సింగ్ ప్లేయర్ భవానీ దేవి, భారత మహిళల హాకీ మాజీ కెపె్టన్ రాణి రాంపాల్, టోక్యో ఒలింపిక్స్ రజత విజేత మీరాబాయి చాను సభ్యులుగా ఉన్నారు. -
‘నమ్మకం కోల్పోయాం’
దోహా: ప్రపంచ టెన్నిస్ నంబర్వన్ యానిక్ సినెర్ డోపింగ్ ఉదంతం... ఇటీవలే అతనికి విధించిన శిక్షపై సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశాడు. అంతర్జాతీయ టెన్నిస్ ఇంటిగ్రిటీ ఏజెన్సీ (ఐటీఐఏ), ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా)లు రెండూ పక్షపాత ధోరణితో వ్యవహరించాయని 24 గ్రాండ్స్లామ్ టైటిళ్ల చాంపియన్ బాహాటంగా తన అసంతృప్తిని వెలిబుచ్చాడు. ‘తాజా ఘటనతో టెన్నిస్ ప్లేయర్లంతా నమ్మకం కోల్పోయారు. ఎందుకంటే ఇటు ఐటీఐఏ కానీ, అటు ‘వాడా’ కానీ సహేతుకంగా వ్యవహరించలేదు. నిస్పక్షపాత వైఖరి కనబరచలేదు. ఈ రెండు సంస్థల తీరు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కానేకాదు. కచి్చతంగా ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నా... టెన్నిస్ క్రీడ ఇమేజ్ను దిగజార్చేలా వ్యవహరించాయి. సుదీర్ఘకాలంగా నానుతున్న సినెర్ డోపింగ్ ఉదంతానికి కంటితుడుపు శిక్షతో పలికిన ముగింపు అసమంజసంగా ఉంది. ఎందుకంటే నేను ఈ విషయమై చాలా మంది ప్లేయర్లతో మాట్లాడాను. వారి అభిప్రాయలను నాతో పంచుకున్నారు. వాళ్లందరు కూడా రెండుసార్లు పట్టుబడిన సినెర్కు విధించిన మూడు నెలల శిక్షపై అసంతృప్తిగా ఉన్నారు’ అని జొకోవిచ్ అన్నాడు. ‘సినెర్–ఐటీఐఏ–వాడా’ల మధ్య కుదిరిన ఒప్పందం జరిగిన తప్పిదానికి తగిన శిక్షను ఖరారు చేయలేకపోయిందని పెదవి విరిచాడు. సినెర్లాగే రెండు నమూనాల్లో పాజిటివ్గా తేలిన స్పానిష్ మహిళా ఫిగర్ స్కేటర్ లౌరా బార్కెలోపై ‘వాడా’ ఏకంగా ఆరేళ్ల నిషేధం తాజాగా తెరపైకి వచ్చింది. క్రీడాలోకంలో చర్చనీయాంశమైంది. ‘వాడా’ వివరణ ఇది... మాడ్రిడ్: డోపింగ్లో దొరికిన టెన్నిస్ స్టార్ సినెర్కు, స్పెయిన్ స్కేటర్ లౌరా బార్కెరోలకు వేర్వేరు శిక్షలు విధించడంపై ‘వాడా’ వివరణ ఇచ్చింది. ‘ఇద్దరి నమూనాల్లో పాజిటివ్గా తేలినప్పటికీ లౌరా తన శరీరంలోకి నిషిద్ధ ఉత్రేరకాలు ఎలా ప్రవేశించాయో సరైన కారణాన్ని చెప్పలేకపోయింది. ఈ కారణాన్ని బలపరిచే రుజువు (సాక్ష్యం)ను చూపించలేదు. కానీ సినెర్ కావాలని తీసుకోలేదని, బహుశా తాను తీసుకున్న మెడిసిన్ లేదంటే మసాజ్కు వాడిన తైలం రూపంలో తన శరీరంలోకి ప్రవేశించి ఉండొచ్చని తను వాడిన మెడిసిన్లతో సహా సంజాయిషీ ఇచ్చాడు’ అని ‘వాడా’ తెలిపింది. -
భారత హాకీ జట్లకు నిరాశ
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్ రెండో రౌండ్ మ్యాచ్ల్లో భారత పురుషుల, మహిళల జట్లకు నిరాశ ఎదురైంది. మంగళవారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్ల్లో భారత పురుషుల జట్టు 1–4 గోల్స్ తేడాతో ప్రపంచ మాజీ చాంపియన్ జర్మనీ జట్టు చేతిలో... భారత మహిళల జట్టు 3–4 గోల్స్ తేడాతో స్పెయిన్ జట్టు చేతిలో ఓడిపోయాయి. జర్మనీతో జరిగిన మ్యాచ్లో భారత్ తరఫున గుర్జంత్ సింగ్ (13వ నిమిషంలో) ఏకైక గోల్ చేశాడు. జర్మనీ తరఫున ఫ్లోరియన్ స్పెర్లింగ్ (7వ నిమిషంలో), థీస్ ప్రింజ్ (14వ నిమిషంలో), మైకేల్ స్ట్రుతోఫ్ (48వ నిమిషంలో), రాఫెల్ హార్ట్కోప్ (55వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. స్పెయిన్తో జరిగిన మ్యాచ్లో భారత మహిళల జట్టు తరఫున బల్జీత్ కౌర్ (19వ నిమిషంలో), సాక్షి రాణా (38వ నిమిషంలో), రుతుజా (45వ నిమిషంలో) ఒక్కో గోల్ నమోదు చేశారు. స్పెయిన్ జట్టుకు సోఫియా (21వ నిమిషంలో), లూసియా (52వ నిమిషంలో) ఒక్కో గోల్ చేయగా... ఎస్తెల్ (25వ, 49వ నిమిషాల్లో) రెండు గోల్స్ అందించింది. -
ఒలింపిక్స్కు ముందు ‘కామన్వెల్త్’ నిర్వహించండి.. భారత్కు సీజీఎఫ్ చీఫ్ సూచన
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం ఇటీవల తరచూ ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం తహతహలాడుతోంది. 2036 ఒలింపిక్స్ నిర్వహణకు ఆసక్తి కనబరుస్తోంది. అయితే భారత్ లక్ష్యం విశ్వక్రీడలైతే ముందుగా కామన్వెల్త్ క్రీడలు నిర్వహిస్తే ఇది మెగా ఈవెంట్కు ముందు మార్గదర్శకంగా ఉపయోగపడుతుందని కామన్వెల్త్ క్రీడల సమాఖ్య (సీజీఎఫ్) సీఈఓ కేటీ సాడ్లియెర్ సూచించారు. ప్రముఖ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన ‘గ్లోబల్ బిజినెస్ సమ్మిట్’లో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ఏ దేశానికైనా ఒలింపిక్స్ ఆతిథ్యమనేది గొప్ప కీర్తిని తెస్తుంది. అయితే అలాంటి ప్రతిష్టాత్మక క్రీడలకు ముందు కామన్వెల్త్ క్రీడలు (2030) నిర్వహిస్తే మేటి అంతర్జాతీయ ఈవెంట్కు సరైన సన్నాహకంగా, చక్కని ముందడుగుగా ఉపయోగపడుతుంది’ అని అన్నారు. భవిష్యత్తులో ఒలింపిక్స్ పతకాల పట్టికలో భారత్ టాప్–10లో నిలుస్తుందని ఆమె చెప్పారు. ‘భారత్ దశ, దిశ ఇప్పుడు మారుతోంది. సరైన నాయకత్వం, మౌలిక వసతుల కల్పన, ప్రామాణిక శిక్షణతో క్రీడల భవిష్యత్ మారబోతోంది. అంతర్జాతీయ క్రీడా వేదికలపై ప్రదర్శన, పతకాలనేవి ఆ దేశ ప్రతిష్టను కచ్చితంగా పెంచుతాయి. తప్పకుండా భారత్ క్రీడాశక్తిగా ఎదుగుతుంది’ అని కేటీ సాడ్లియెర్ తెలిపారు. సరిగ్గా పదిహేనేళ్ల క్రితం భారత్ ఒకే ఒక్కసారి 2010లో కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యమిచ్చింది. -
20 ఏళ్ల తర్వాత ఆల్ స్టార్ ఎన్బీఏ మ్యాచ్కు దూరమైన లెబ్రాన్ జేమ్స్
శాన్ఫ్రాన్సిస్కో: విఖ్యాత నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) లీగ్ ఆల్ స్టార్ మ్యాచ్కు అమెరికా దిగ్గజం లెబ్రాన్ జేమ్స్ తొలిసారి దూరమయ్యాడు. 20 ఏళ్ల తర్వాత లెబ్రాన్ జేమ్స్ లేకుండా ఆల్ స్టార్ మ్యాచ్ జరగడం గమనార్హం. 2005 నుంచి ప్రతి సీజన్లో ఆల్ స్టార్ మ్యాచ్లలో ఆడిన 40 ఏళ్ల లెబ్రాన్ ఈసారి చీలమండ గాయంతో ఆడలేకపోయాడు. రెగ్యులర్ సీజన్లో లాస్ఏంజెలిస్ లేకర్స్ జట్టుకు ఆడే లెబ్రాన్ ఆల్ స్టార్ మ్యాచ్లలో ఈసారి షకిల్లా ఓనీల్ జట్టుకు జట్టుకు ప్రాతినిధ్యం వహించాల్సింది. 2005లో తొలిసారి ఆల్ స్టార్ మ్యాచ్లో ఆడిన లెబ్రాన్ వరుసగా 20 ఏళ్లపాటు ఈ మేటి మ్యాచ్లలో భాగస్వామిగా ఉన్నాడు. 6 అడుగుల 9 అంగుళాల ఎత్తు, 113 కేజీల బరువున్న లెబ్రాన్ ఇప్పటి వరకు ఎన్బీఏ లీగ్లో 1,540 మ్యాచ్లు ఆడి అత్యధికంగా 41,641 పాయింట్లు స్కోరు చేశాడు. -
భారత ఫుట్బాల్ జట్టులో తెలంగాణ ప్లేయర్
న్యూఢిల్లీ: నాలుగు దేశాలు పాల్గొనే పింక్ లేడీస్ కప్ అంతర్జాతీయ మహిళల ఫుట్బాల్ టోర్నమెంట్ కోసం భారత జట్టును ప్రకటించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని షార్జాలో ఈనెల 20 నుంచి 26వ తేదీ వరకు ఈ టోర్నీ జరుగుతుంది. 23 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో తెలంగాణ అమ్మాయి, నిజామాబాద్ జిల్లాకు చెందిన గుగులోత్ సౌమ్య చోటు సంపాదించింది. ఈనెల 7 నుంచి అనంతపురంలో శిక్షణ శిబిరంలో పాల్గొంటున్న భారత జట్టు నేడు యూఏఈకి బయలుదేరి వెళుతుంది. భారత జట్టు తమ తొలి మ్యాచ్ను ఈనెల 20న జోర్డాన్తో... రెండో మ్యాచ్ను 23న రష్యాతో... మూడో మ్యాచ్ 26న దక్షిణ కొరియా జట్టుతో ఆడుతుంది. ఈ ఏడాది మే–జూన్లలో జరిగే ఆసియా కప్–2027 క్వాలిఫయర్స్ టోర్నీకి సన్నాహాల్లో భాగంగా పింక్ లేడీస్ కప్లో భారత జట్టు బరిలోకి దిగుతోంది.‘పింక్ లేడీస్ కప్ టోర్నీ ద్వారా భారత క్రీడాకారిణులకు తమ సామర్థ్యమేంటో తెలుస్తుంది. రష్యాతో పోలిస్తే దక్షిణ కొరియా జట్టు పూర్తి భిన్నంగా ఉంటుంది. రెండు జట్ల వీడియోలు పరిశీలించాను. రష్యా శైలితో పోలిస్తే కొరియా ఆటలో చాలా వేగం ఉంది. ఫలితంగా భారత జట్టు రెండు రకాలుగా వ్యూహాలు రచించి ఆడాల్సి ఉంటుంది’ అని భారత జట్టు హెడ్ కోచ్ క్రిస్పిన్ ఛెత్రి తెలిపాడు. భారత మహిళల ఫుట్బాల్ జట్టు: ఎలాంగ్బమ్ పంథోయ్ చాను, పాయల్ బసుదె, శ్రేయా హుడా (గోల్కీపర్లు), అరుణ బాగ్, కిరన్ పిస్దా, మార్టినా థోక్చోమ్, నిర్మలా దేవి ఫాన్జుబమ్, పూరి్ణమ కుమారి, సంజు, సిల్కీ దేవి హెమమ్, స్వీటీ దేవి ఎన్గాంగ్బమ్ (డిఫెండర్లు), బబీనా దేవి లిషామ్, గ్రేస్ డాంగ్మె, మౌసుమి ముర్ము, ప్రియదర్శిని సెల్లాదురై, ప్రియాంక దేవి నోరెమ్, రత్నబాల దేవి నోంగ్మైథెమ్ (మిడ్ ఫీల్డర్లు), కరిష్మా పురుషోత్తమ్, లిండా కోమ్ సెర్టో, మనీషా, రేణు, సంధ్య రంగనాథన్, సౌమ్య గుగులోత్ (ఫార్వర్డ్స్). -
రామ్కుమార్ సంచలనం
పుణే: మహా ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టెన్నిస్ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి ఆటగాడు రామ్కుమార్ రామనాథన్(Ramkumar Ramanathan) మెయిన్ ‘డ్రా’కు మరో విజయం దూరంలో నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో రామ్కుమార్ సంచలనం సృష్టించాడు. టాప్ సీడ్, ప్రపంచ 267వ ర్యాంకర్ ఇలియాస్ ఇమర్ (స్వీడన్)తో జరిగిన మ్యాచ్లో ప్రపంచ 403వ ర్యాంకర్ రామ్కుమార్ 5–7, 6–1, 6–4తో గెలుపొందాడు.ఒక గంట 52 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో రామ్కుమార్ తొమ్మిది ఏస్లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్లు చేశాడు. తన సర్వీస్ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. నేడు జరిగే క్వాలిఫయింగ్ రెండో రౌండ్ మ్యాచ్లో కిమర్ కాప్జాన్స్ (బెల్జియం)తో రామ్కుమార్ ఆడతాడు. ఈ మ్యాచ్లో నెగ్గిన ప్లేయర్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధిస్తాడు. చైనా జట్టుకు ఇండోనేసియా షాక్కింగ్డావో (చైనా): ఆసియా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో ఇండోనేసియా జట్టు తొలిసారి విజేతగా అవతరించింది. డిఫెండింగ్ చాంపియన్ చైనా జట్టుతో జరిగిన ఫైనల్లో ఇండోనేసియా 3–1తో నెగ్గింది. తొలి మ్యాచ్గా జరిగిన మిక్స్డ్ డబుల్స్లో రివాల్డీ–ఫాదియా జంట 21–11, 21–13తో జువాన్–మెంగ్ యింగ్ జోడీని ఓడించడంతో ఇండోనేసియా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది.ఇక రెండో మ్యాచ్గా జరిగిన పురుషుల సింగిల్స్లో ఫర్హాన్ 21–15, 21–13తో హు జె ఆన్ను ఓడించడంతో ఇండోనేసియా ఆధిక్యం 2–0కు పెరిగింది. మూడో మ్యాచ్గా జరిగిన మహిళల సింగిల్స్లో జు వెన్ జింగ్ 21–12, 21–13తో కుసుమ వర్ధినిపై గెలవడంతో చైనాకు తొలి విజయం దక్కింది. నాలుగో మ్యాచ్గా జరిగిన పురుషుల డబుల్స్లో షోహిబుల్ ఫిక్రి–డానియల్ మారి్టన్ జోడీ 21–15, 21–9తో చెన్ జుజున్–హువాంగ్ ది (చైనా) ద్వయంపై గెలిచి ఇండోనేసియాకు టైటిల్ను ఖరారు చేసింది. -
అనిసిమోవా అదరహో
దోహా: ఎనిమిదేళ్ల క్రితం మహిళల టెన్నిస్లో భవిష్యత్ తారగా గుర్తింపు తెచ్చుకున్న అమెరికా ప్లేయర్ అమండా అనిసిమోవా ఎట్టకేలకు తన కెరీర్లోనే గొప్ప విజయాన్ని అందుకుంది. గ్రాండ్స్లామ్ తర్వాత రెండో అత్యున్నత శ్రేణి అయిన మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) 1000 సిరీస్ టోర్నీలో ఆమె మొదటిసారి విజేతగా అవతరించింది. ఖతర్ ఓపెన్లో 23 ఏళ్ల అనిసిమోవా చాంపియన్గా నిలిచింది. దోహాలో జరిగిన సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 41వ ర్యాంకర్ అనిసిమోవా 6–4, 6–3తో 2017 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ ఎలెనా ఒస్టాపెంకో (లాత్వియా)పై గెలిచింది. అనిసిమోవాకు 5,97,000 డాలర్ల (రూ. 5 కోట్ల 17 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 2002లో మోనికా సెలెస్ తర్వాత ఖతర్ ఓపెన్లో విజేతగా నిలిచిన రెండో అమెరికా ప్లేయర్గా అనిసిమోవా గుర్తింపు పొందింది. ఈ గెలుపుతో అనిసిమోవా నేడు విడుదలయ్యే డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్లో కెరీర్ బెస్ట్ 18వ ర్యాంక్ను అందుకుంటుంది. ఓవరాల్గా అనిసిమోవా కెరీర్లో ఇది మూడో సింగిల్స్ టైటిల్. 2019లో బొగోటా ఓపెన్లో, 2022లో మెల్బోర్న్ ఓపెన్లో ఆమె టైటిల్స్ సాధించింది. -
భారత హాకీ జట్లకు మిశ్రమ ఫలితాలు
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ హాకీ లీగ్లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్ల్లో భారత జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ముందుగా భారత మహిళల జట్టు ‘షూటౌట్’లో 1–2తో ఇంగ్లండ్ జట్టు చేతిలో ఓడిపోగా... అనంతరం భారత పురుషుల జట్టు 2–0 గోల్స్ తేడాతో స్పెయిన్ జట్టుపై విజయం సాధించింది. భారత జట్టు తరఫున మన్దీప్ సింగ్ (32వ నిమిషంలో), దిల్ప్రీత్ సింగ్ (39వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. ఇంగ్లండ్–భారత్ మహిళల జట్ల మధ్య మ్యాచ్లో నిర్ణీత సమయం ముగిశాక రెండు జట్లు 2–2తో సమంగా నిలిచాయి. భారత్ తరఫున నవ్నీత్ కౌర్ (53వ నిమిషంలో), రుతుజా (57వ నిమిషంలో)... ఇంగ్లండ్ తరఫున పెయిజ్ గిలోట్ (40వ నిమిషంలో), టెసా హొవార్డ్ (56వ నిమిషంలో) ఒక్కో గోల్ నమోదు చేశారు. విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ నిర్వహించారు. తొలి ఐదు షాట్లు ముగిశాక రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. ఆ తర్వాత ఆరో షాట్లో రెండు జట్ల క్రీడాకారిణులు విఫలమయ్యారు. ఏడో షాట్లో భారత ప్లేయర్ లాల్రెమ్సియామి గురి తప్పగా... ఇంగ్లండ్ ప్లేయర్ సోఫీ హామిల్టన్ బంతిని లక్ష్యానికి చేర్చడంతో భారత్కు ఓటమి ఖరారైంది. -
జాతీయ రికార్డు బద్దలు కొట్టిన యువ అథ్లెట్
న్యూఢిల్లీ: భారత యువ అథ్లెట్ గుల్వీర్ సింగ్ (Gulveer Singh) బోస్టన్లో జరిగిన ఇన్విటేషనల్ టోర్నీలో జాతీయ రికార్డు నెలకొల్పాడు. 3000 మీటర్ల ఇండోర్ రేసులో గుల్వీర్ సింగ్ 7 నిమిషాల 38.26 సెకన్లలో లక్ష్యాన్ని చేరాడు. తద్వారా 16 ఏళ్ల క్రితం సురేందర్ సింగ్ (7:49.47) నెలకొల్పిన రికార్డును గుల్వీర్ బద్దలు కొట్టాడు. 2022 హాంగ్జూ ఆసియా క్రీడల 10,000 మీటర్ల పరుగులో కాంస్య పతకం సాధించిన గుల్వీర్... సీజన్ ఆరంభంలోనే రికార్డు నెలకొల్పడం ఆనందంగా ఉందన్నారు.‘సీజన్ తొలి ఇండోర్ టోర్నీలోనే మంచి ప్రదర్శన కనబర్చడం సంతోషంగా ఉంది. దీంతో ఆత్మవిశ్వాసం రెట్టింపు అయింది. ఈ స్ఫూర్తితో ఔట్ డోర్ ఈవెంట్లలోనూ సత్తా చాటుతా’ అని 26 ఏళ్ల గుల్వీర్ పేర్కొన్నాడు.ఇదే టోర్నీలో పాల్గొన్న భారత మరో రన్నర్ రాహుల్ 8 నిమిషాల 8.27 సెకన్లలో లక్ష్యాన్ని చేరాడు. ప్రస్తుతం గుల్వీర్ పేరిటే 5000 మీటర్లు, 10,000 మీటర్ల జాతీయ రికార్డులు ఉన్నాయి. 5000 మీటర్ల పరుగును 13 నిమిషాల 11.82 సెకన్లలో పూర్తి చేసిన గుల్వీర్... 10,000 మీటర్ల రేసును 27 నిమిషాల 14.88 సెకన్లలో లక్ష్యాన్ని చేరాడు. ఈ ఏడాది ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ జరగనున్న నేపథ్యంలో భారత మిడిల్, లాంగ్ డిస్టాన్స్ రన్నర్లు ప్రస్తుతం అమెరికాలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. -
జాతీయ కోచ్గా భారత దిగ్గజ షూటర్
భారత దిగ్గజ షూటర్ జస్పాల్ రాణా తిరిగి కోచ్గా జాతీయ షూటింగ్ జట్టుతో చేరాడు. భారత జాతీయ రైఫిల్ సమాఖ్య (ఎన్ఆర్ఏఐ).. జస్పాల్ రాణాను 25 మీటర్ల పిస్టల్ విభాగానికి ‘హై పెర్ఫార్మెన్స్’ కోచ్గా నియమించింది. అతడితో పాటు మాజీ ఆటగాడు జీతు రాయ్ను కూడా కోచింగ్ బృందంలో భాగం చేసింది.జీతూ ఆటగాడిగా ఆసియా క్రీడల్లో రెండు, కామన్వెల్త్ క్రీడల్లో రెండు పతకాలు గెలవడంతో పాటు ఆరు వరల్డ్ కప్ పతకాలు సాధించింది. అతని ఖాతాలో వరల్డ్ చాంపియన్íÙప్ రజతం కూడా ఉంది. తొలి సారి అతను కోచ్గా బాధ్యతలు చేపడుతున్నాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో జీతూ రాయ్ శిక్షణ ఇవ్వనున్నాడు.రైఫిల్ విభాగానికి హెడ్ కోచ్గా ఇటీవల ద్రోణాచార్య అవార్డు దక్కించుకున్న దీపాలీ దేశ్పాండేను ఎంపిక చేసింది. మొత్తంగా ఎన్ఆర్ఏఐ 16 మంది కొత్త కోచ్లను ఎంపిక చేసింది. వీరితో పాటు ఇప్పటికే ఉన్న 19 మందిని కూడా కొనసాగించనున్నారు.పిస్టల్ విభాగంలో జీతు యువ షూటర్లకు శిక్షణ ఇవ్వనుండగా... 10 మీటర్ల రైఫిల్ ఈవెంట్కు పూజ ఘట్కర్, 25 మీటర్ల పిస్టల్ విభాగానికి పెంబా తమాంగ్, స్కీట్కు అమరిందర్ చీమ, ట్రాప్కు వర్ష తోమర్ కోచ్లుగా వ్యవహరించనున్నారు. ఇద్దరు హై పెర్ఫార్మెన్స్ మేనేజర్లుగా మాన్షేర్ సింగ్, రోనక్ పండిట్ను ఎన్ఆర్ఏఐ నియమించింది. రాణాతో పాటు డీఎస్ చండేల్ (ఎయిర్ రైఫిల్), అన్వర్ సుల్తాన్ (ట్రాప్), మనోజ్ కుమార్ (50 మీటర్ల రైఫిల్) హై పెర్ఫార్మెన్స్ కోచ్లుగా వ్యవహరించనున్నారు. -
ఎట్టకేలకు సినెర్పై నిషేధం
లండన్: వరల్డ్ టాప్ ర్యాంక్ టెన్నిస్ ప్లేయర్ యానిక్ సినెర్పై ఎట్టకేలకు మూడు నెలల నిషేధం విధించారు. స్టార్ అయినా... ఎంతటి వారైనా... డోపింగ్కు పాల్పడితే శిక్ష తప్పదనే సంకేతాన్ని ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) ఇచ్చినట్లయ్యింది. దాదాపు ఏడాదిగా నలుగుతున్న ఈ కేసుకు ఎట్టకేలకు నిషేధంతో తెర పడనుంది. మూడు గ్రాండ్స్లామ్ల విజేత, ఇటలీకి చెందిన ప్రపంచ నంబర్వన్ సినెర్ గత మార్చిలో డోపింగ్లో పట్టుబడ్డాడు.అతని నమూనాల్లో నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలినా... ఈ టాప్ ర్యాంకర్పై అంతర్జాతీయ టెన్నిస్ ఇంటిగ్రిటీ ఏజెన్సీ (ఐటీఐఏ) మెతక వైఖరి అవలంభించింది. అతని టెస్టు ఫలితాన్ని ప్రపంచానికి తెలియనివ్వలేదు. కొన్ని నెలల తర్వాత బయటికి పొక్కినా కూడా 23 ఏళ్ల సినెర్ తను ఉద్దేశ పూర్వకంగా తీసుకోలేదని, బహుశా మసాజ్కు వాడిన తైలం వల్లా తన శరీరంలోకి ప్రవేశించి ఉండొచ్చనే వివరణతో ఐటీఐఏ సంతృప్తి చెంది పెద్దగా చర్యలేం తీసుకోలేదు. దీంతో టెన్నిస్ ఇంటిగ్రిటీపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు దిగ్గజాలు, స్టార్లు, విశ్లేషకులు ‘ఒక్కొక్కరికి ఒక్కోలా చట్టాలు–చర్యలా’ అంటు దుమ్మెత్తిపోశారు. అయినా ఐటీఐఏ నిమ్మకు నీరెత్తినట్లే ఉండిపోయింది కానీ చర్యలు మాత్రం చేపట్టలేదు. ‘వాడా’ మాత్రం పరీక్షల్లో పట్టుబడ్డాడు కాబట్టి ఏడాదైనా నిషేధం విధించాలని స్పోర్ట్స్ అర్బిట్రేషన్ కోర్టులో అప్పీల్ చేసింది. చివరకు తాజాగా ఐటీఐఏ, సినెర్, వాడాల మధ్య ఒప్పందం కుదరడంతో వాడా ఇటీవల అప్పీల్ను ఉపసంహరించుకుంది. ఒప్పందంలో భాగంగా మూడు నెలలు నిషేధం విధించేందుకు ఐటీఐఏ సిద్ధమవగా... సినెర్ కూడా విమర్శలకు చెక్ పెట్టేందుకు సమ్మతించడంతో డోపింగ్ వివాదం ముగిసింది. ఫిబ్రవరి 9వ తేదీ నుంచి మే 4 వరకు ఈ నిషేధం అమలవుతుంది. ఈ కాలంలో అతను ఏ స్థాయి టెన్నిస్ టోర్నీల్లో పాల్గొనేందుకు వీలుండదు. అయితే మే 25 నుంచి జరిగే సీజన్ రెండో గ్రాండ్స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్ ఆడేందుకు ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో అతను బరిలోకి దిగుతాడు. ఇదేం సస్పెన్షన్? సినెర్కు విధించిన మూడు నెలల శిక్ష పట్ల టెన్నిస్లో పలువురు ఆటగాళ్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గతంలో విమర్శించిన తరహాలోనే సినెర్ చాలా తక్కువ శిక్షతో బయటపడ్డాడని... టెన్నిస్లో ఒక్కో ఆటగాడికి ఒక్కో రకమైన నిబంధన ఉందని వారు వ్యాఖ్యానించారు. ‘సినెర్ సన్నిహితులు తమ పరపతిని బాగా ఉపయోగించినట్లుంది. కేవలం మూడు నెలల నిషేధంతో సరిపెట్టేలా చేసుకోగలిగారు. ఒక్క టైటిల్ వెనక్కి తీసుకోలేదు. కనీసం ప్రైజ్మనీలో కూడా కోత విధించలేదు. మరి అతను తప్పు చేసినట్లా, చేయనట్లా. టెన్నిస్కు దురదృష్టకరమైన రోజు. ఇక్కడ నిజాయితీ మిగల్లేదు’ అని కిరియోస్ అన్నాడు. మూడు గ్రాండ్స్లామ్ టైటిల్స్ గెలిచిన స్టాన్ వావ్రింకా కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ‘టెన్నిస్ ఇక ఏమాత్రం స్వచ్ఛమైన ఆట కానే కాదు’ అని చెప్పాడు. టెన్నిస్ ప్లేయర్స్ అసోసియేషన్ కూడా ‘ఇక్కడి వ్యవస్థ నిజంగా చెడిపోయింది. ఇది ఒక క్లబ్లా మాత్రమే వ్యవహరిస్తోంది. ఒక్కో కేసుకు ఒక్కో రకంగా స్పందిస్తోంది. అన్నింటా అసమానతలు ఉన్నాయి. ఎలాంటి పారదర్శకత, పద్ధతి లేవు. ఇది ఆటగాళ్లను అగౌరవపర్చడమే. ఇకపై మార్పు అవసరం’ అని స్పందించింది. -
అబ్బాయిల ఓటమి...అమ్మాయిల గెలుపు
భువనేశ్వర్: ఎఫ్ఐహెచ్ పురుషుల ప్రొ లీగ్లో భారత జట్టు పరాజయం పాలైంది. భారత అంచె పోటీల్లో భాగంగా శనివారం జరిగిన తొలి మ్యాచ్లో హర్మన్ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత్ 1–3 గోల్స్ తేడాతో స్పెయిన్ చేతిలో ఓడింది. 2024 పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక పోరులో భారత జట్టు చేతిలో ఎదురైన పరాజయానికి స్పెయిన్ బదులు తీర్చుకున్నట్లైంది. భారత్ తరఫున సుఖ్జీత్సింగ్ (25వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించాడు. స్పెయిన్ తరఫున బోర్జా లాకల్లె (28వ నిమిషంలో), ఇగ్నాషియా కొబొస్ (38వ ని.లో), బ్రూనో అవిలా (56వ ని.లో) తలా ఒక గోల్ చేశారు. భారత జట్టు పదే పదే దాడులు చేసినా స్పెయిన్ రక్షణ పంక్తి సమర్థవంతంగా అడ్డుకుంది. తొలి క్వార్టర్లో ఇరు జట్లు ఎంత ప్రయత్నించినా... గోల్ చేయలేకపోయాయి. రెండో క్వార్టర్ను ఇరు జట్లు మరింత దూకుడుగా ప్రారంభించాయి. ఈ క్రమంలో సుఖ్జీత్ సింగ్ గోల్తో భారత్ ఆధిక్యంలోకి వెళ్లగా... మూడు నిమిషాల వ్యవధిలోనే గోల్ కొట్టిన స్పెయన్ స్కోరు సమం చేసింది. ఆ తర్వాత వరుసగా రెండు క్వార్టర్స్లో ఒక్కో గోల్ బాదిన స్పెయిన్ మ్యాచ్ను చేజిక్కించుకుంది. ఆదివారం మరోసారి స్పెయిన్తో భారత్ ఆడనుంది. హోరాహోరీ పోరులో భారత అమ్మాయిల విజయం ఎఫ్ఐహెచ్ మహిళల ప్రొ లీగ్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. భారత అంచె పోటీల్లో భాగంగా శనివారం హోరాహోరీగా సాగిన తొలి పోరులో భారత్ 3–2 పాయింట్ల తేడాతో ఇంగ్లండ్పై విజయం సాధించింది. కళింగ స్టేడియంలో జరిగిన పోరులో తమకన్నా మెరుగైన ర్యాంక్ ఉన్న ఇంగ్లండ్ జట్టుపై భారత్ స్ఫూర్తిదాయకమైన ప్రదర్శన కనబర్చింది. భారత్ తరఫున వైష్ణవి (6వ నిమిషంలో), దీపిక (25వ ని.లో) నవ్నీత్ కౌర్ (59వ ని.లో) తలా ఒక గోల్ చేశారు. వైష్ణవి, దీపిక పెనాల్టీ కార్నర్లను గోల్స్గా మలచగా... ఆట ఆఖరి నిమిషంలో అదిరిపోయే ఫీల్డ్గోల్తో నవ్నీత్ జట్టుకు విజయాన్ని అందించింది. ఇంగ్లండ్ తరఫున డార్సీ బౌర్నె (12వ నిమిషంలో), ఫియానా క్రాక్లెస్ (58వ ని.లో) చెరో గోల్ కొట్టారు. ఎఫ్ఐహెచ్ ర్యాంకింగ్స్లో తొమ్మిదో స్థానంలో ఉన్న భారత్.. వైష్ణవి గోల్తో తొలి క్వార్టర్లోనే ఖాతా తెరిచింది. అయితే కాసేపటికే ఏడో ర్యాంక్లో ఉన్న ఇంగ్లండ్ స్కోరు సమం చేసింది. రెండో క్వార్టర్లో దీపిక గోల్తో ఆధిక్యంలోకి వెళ్లిన భారత్... సునాయాసంగానే మ్యాచ్ గెలిచేలా కనిపించింది. ఈ క్రమంలో గోల్కీపర్ సవిత పూనియా కొన్ని చక్కటి సేవ్లతో ప్రత్యర్థికి స్కోరు చేసే అవకాశం ఇవ్వలేదు. చివర్లో ఇంగ్లండ్ స్కోరు సమం చేసినా... నిమిషం వ్యవధిలోనే మరో గోల్ కొట్టిన భారత్ విజయం సాధించింది. ఆదివారం జరగనున్న మ్యాచ్లో మరోసారి ఇంగ్లండ్తో భారత అమ్మాయిల జట్టు తలపడుతుంది. -
గుకేశ్కు చివరి స్థానం
హాంబర్గ్ (జర్మనీ): ఫ్రీస్టయిల్ గ్రాండ్స్లామ్ చెస్ టూర్ టోర్నమెంట్లో ప్రపంచ చాంపియన్, భారత గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ నిరాశ పరిచాడు. శనివారం ముగిసిన ఈ టోర్నీలో గుకేశ్ ఆఖరి స్థానంతో సరిపెట్టుకున్నాడు. ప్లే ఆఫ్ పోరులో గుకేశ్ 0.5–1.5 పాయింట్ల తేడాతో అలిరెజా ఫిరౌజా (ఇరాన్) చేతిలో పరాజయం పాలయ్యాడు. క్వార్టర్ ఫైనల్లో ఫాబియానో కరువానా (అమెరికా) చేతిలో ఓడిన గుకేశ్... ప్లే ఆఫ్ రౌండ్లోనూ ఆకట్టుకోలేకపోయాడు. తొలి రౌండ్ను ‘డ్రా’చేసుకున్న గుకేశ్... రెండో రౌండ్లో తెల్ల పావులతో ఆడినా సత్తా చాటలేకపోయాడు. 30 ఎత్తుల్లో పరాజయం పాలయ్యాడు. ఓవరాల్గా విన్సెంట్ కైమెర్ (జర్మనీ) అగ్రస్థానం దక్కించుకోగా... ఫాబియా కరువానా (అమెరికా), మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. ఆ తర్వాత వరుసగా జవోఖిర్ సిందరోవ్ (ఉజ్బెకిస్తాన్; 4వ స్థానం), హికారు నకమురా (అమెరికా; 5వ స్థానం), నొడ్రిబెక్ అబ్దుసత్తరోవ్ (ఉజ్బెకిస్తాన్; 6వ స్థానం), అలిరెజా ఫిరౌజా (7వ స్థానం) నిలిచారు. ఎనిమిది మంది గ్రాండ్మాస్టర్లు పాల్గొన్న ఈ టోర్నీలో గుకేశ్ ఎనిమిదో స్థానంతో ముగించాడు. ఈ టోర్నీ మొత్తంలో గుకేశ్ ఒక్క మ్యాచ్లోనూ విజయం సాధించలేకపోయాడు. -
చెన్నైయిన్ విజయం
చెన్నై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో చెన్నైయిన్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) వరుసగా రెండో విజయం నమోదు చేసుకుంది. శనివారం జరిగిన పోరులో చెన్నైయిన్ ఎఫ్సీ 2–1 గోల్స్ తేడాతో పంజాబ్ ఎఫ్సీపై విజయం సాధించింది. చెన్నైయిన్ జట్టు తరఫున విల్మార్ జోర్డాన్ గిల్ (19వ నిమిషంలో), డానియల్ చిమ చుకువా (84వ నిమిషంలో) చెరో గోల్ చేశారు. పంజాబ్ జట్టు తరఫున లూకా మాజ్కెన్ (48వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించాడు. మ్యాచ్లో ఇరు జట్లు చెరో 12 షాట్లు ఆడాయి. అందులో ఐదేసి సార్లు ప్రత్యర్థి గోల్పోస్ట్పై దాడి చేశాయి. అయితే మ్యాచ్ ఆరంభంలోనే జోర్డాన్ గిల్ గోల్తో చెన్నైయిన్ జట్టు ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత పంజాబ్ జట్టు స్కోరు సమం చేసినా... మ్యాచ్ మరికాసేపట్లో ముగుస్తుందనగా... చెన్నైయిన్ మరో గోల్తో విజయం సాధించింది. తాజా సీజన్లో 21 మ్యాచ్లు ఆడిన చెన్నైయిన్ 6 విజయాలు, 9 పరాజయాలు, 6 ‘డ్రా’లతో 24 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో 10వ స్థానంలో ఉంది. శనివారమే జరిగిన మరో మ్యాచ్లో మోహన్ బగాన్ జట్టు 3–0 గోల్స్ తేడాతో కేరళా బ్లాస్టర్స్పై గెలుపొందింది. జేమీ మెక్లారెన్ (18వ, 40వ నిమిషాల్లో) డబుల్ గోల్స్తో విజృంభించగా... అల్బర్టో రోడ్రిగోజ్ (66వ నిమిషంలో) మరో గోల్ సాధించాడు. తాజా సీజన్లో 21 మ్యాచ్లు ఆడిన మోహన్ బగాన్ జట్టు 15 విజయాలు, 2 పరాజయాలు, 4 ‘డ్రా’లతో 49 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక ‘టాప్’లో సాగుతోంది. లీగ్లో భాగంగా ఆదివారం జరగనున్న మ్యాచ్లో మోహమ్మదన్ స్పోర్ట్స్ క్లబ్తో ఈస్ట్ బెంగాల్ జట్టు తలపడుతుంది. -
రన్నరప్ నికీ పునాచా జోడీ
న్యూఢిల్లీ: ఏటీపీ చాలెంజర్ 75 టోర్నీ ఢిల్లీ ఓపెన్లో భారత టెన్నిస్ ఆటగాడు నికీ పునాచా రన్నరప్గా నిలిచాడు. పురుషుల డబుల్స్ ఫైనల్లో రెండో సీడ్గా బరిలోకి దిగిన నికీ పునాచా–కోర్ట్నీ జాన్ లాక్ (జింబాబ్వే) జంట చేతిలో ఫైనల్లో ఓడి రన్నరప్గా నిలిచింది. శనివారం జరిగిన తుదిపోరులో అన్సీడెడ్ మసమిచి ఇమామురా–రియో నొగుచి (జపాన్) ద్వయం 6–4, 6–3తో నికీ–జాన్ లాక్ జోడీపై విజయం సాధించింది. తొలి సెట్ ఆరంభం నుంచే విజృంభించిన జపాన్ జోడీ... 4–1తో ముందంజ వేసింది. ఈ దశలో పుంజుకున్న పునాచా జంట 3–4తో ఆధిక్యాన్ని తగ్గించగలిగిందే తప్ప... చివరి వరకు అదే జోరు కొనసాగించలేక తొలి సెట్ కోల్పోయింది. రెండో సెట్లోనూ రాణించిన జపాన్ ద్వయం సునాయాసంగా సెట్తో పాటు టైటిల్ గెలుచుకుంది.మరో వైపు సింగిల్స్ విభాగంలో కైరియాన్ జాక్వెట్ (ఫ్రాన్స్), బిల్లీ హారిస్ (బ్రిటన్) ఫైనల్లోకి ప్రవేశించారు. తొలి సెమీస్లో జాక్వెట్ 6–3, 6–1తో విట్ కొప్రివా (చెక్ రిపబ్లిక్)పై...రెండో సెమీస్లో హారిస్ 4–6, 7–6 (7/4), 6–2తో ట్రిస్టన్ స్కూల్కేట్ (ఆ్రస్టేలియా)పై గెలుపొందారు. -
మంత్రి గారూ.. జోక్యం చేసుకోండి!
కేంద్ర క్రీడా శాఖా మంత్రి మన్సుఖ్ మాండవీయ(Mansukh Mandaviya)ను కలిసేందుకు భారత రెజ్లర్లు శనివారం ఆయన నివాసం వద్దకు వెళ్లారు. అల్బేనియాలో జరగనున్న అంతర్జాతీయ రెజ్లింగ్ ర్యాంకింగ్ సిరీస్కు తమను పంపేలా ఏర్పాట్లు చేయించాలని విజ్ఞప్తి చేయాలని భావించారు. అయితే, మంత్రి ఇంట్లో లేకపోవడంతో వారికి నిరాశే మిగిలింది.కాగా కేంద్ర క్రీడాశాఖ, భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI)ల మధ్య కొరవడిన సమన్వయంతో రెజ్లర్లు మూల్యం చెల్లించుకుంటున్నారు. ఇప్పటికే ఈ సీజన్లో తొలి ర్యాంకింగ్ సిరీస్ టోర్నమెంట్కు దూరమైన భారత రెజ్లర్లు... మళ్లీ ఇప్పుడు రెండో ర్యాంకింగ్ సిరీస్ టోర్నీకి వెళ్లలేని పరిస్థితి వచ్చింది. డబ్ల్యూఎఫ్ఐ నిర్ణీత సమయంలోగా అవసరమైన డాక్యుమెంట్లు సమకూర్చకపోవడంతో అల్బేనియాలో జరగనున్న అంతర్జాతీయ రెజ్లింగ్ ర్యాంకింగ్ సిరీస్కు రెజ్లర్లను పంపలేక పోతున్నామని క్రీడాశాఖ ... సమాఖ్య తీరుపై విమర్శించింది.సమాఖ్య నిర్వాకం వల్లే‘డబ్ల్యూఎఫ్ఐ ప్రతిపాదిత జాబితాను గడువులోగా పంపడంలో తాత్సారం చేసింది. భారత స్పోర్ట్స్ అథారిటీ (SAI)కి చాలా ఆలస్యంగా జాబితా చేరడంతో తదుపరి ప్రక్రియను చేపట్టలేకపోయాం. ఏదైనా అంతర్జాతీయ టోర్నీలకు వెళ్లాలంటే ఓ పద్ధతి ఉంటుంది. ముందస్తు ప్రతిపాదన, తదుపరి డాక్యుమెంట్ల పరిశీలన తదనంతరం తుది జాబితా ఆమోదించబడాలి. కానీ సమాఖ్య నిర్వాకం వల్లే జాబితా ఆలస్యమైంది. ఆమోదానికి దూరమైంది. దీంతో అథ్లెట్లు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయారు’ అని క్రీడాశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ విషయంలో క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవీయ జోక్యం కోరుతూ.. ఆసియా చాంపియన్ సునిల్ కుమార్, అండర్-23 ఆసియా చాంపియన్షిప్ స్వర్ణ పతక విజేత మీనాక్షితో పలువురు రెజ్లర్లు న్యూఢిల్లీలోని ఆయన ఇంటికి వెళ్లారు.మంత్రి గారూ.. జోక్యం చేసుకోండి!ఈ సందర్భంగా సునిల్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘మా తప్పు లేకపోయినా ర్యాంకింగ్ సిరీస్కు దూరమయ్యే పరిస్థితి వచ్చింది. మంత్రిగారి జోక్యంతోనైనా మాకు మేలు జరుగుతుందని ఇక్కడకు వచ్చాం. ఈ సిరీస్లో పాల్గొనడంవల్లమార్చిలో జరుగబోయే డ్రా, తొలి దశ బౌట్లలో మాకు కాస్త వెసలుబాటు కలుగుతుంది.అందుకే మా సమస్యను మంత్రిగారి దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తున్నాం’’ అని తెలిపాడు. అయితే, మధ్యాహ్నం రెండు గంటల వరకు దాదాపు పది మంది రెజ్లర్లు మాండవీయ నివాసం వద్ద పడిగాపులు కాసినా ఫలితం లేకపోయింది. ఆయన అందుబాటులోకి రాకపోవడంతో రెజ్లర్లు నిరాశగా తిరిగి వెళ్లిపోయారు. కాగా గతంలో క్రీడాశాఖ సస్పెన్షన్ వల్ల జాగ్రేబ్ ర్యాంకింగ్ సిరీస్కు భారత జట్టు దూరమైంది. ఇప్పుడు ఇరు సమాఖ్యల మధ్య సమన్వయలేమి వల్ల ఈ నెల 26 నుంచి మార్చి 2 వరకు టిరానాలో జరిగే ఈవెంట్కూ గైర్హాజరు అవుతోంది. ఇక భారత రెజ్లర్లు సీనియర్ ఆసియా చాంపియన్షిప్పైనే ఆశలు పెట్టుకున్నారు. జోర్డాన్లో మార్చి 25 నుంచి 30 వరకు ఆసియా ఈవెంట్ జరుగుతుంది. -
మేఘాలయలో కలుద్దాం!
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో అలరించిన జాతీయ క్రీడలు అట్టహాసంగా ముగిశాయి. తదుపరి మేఘాలయ జాతీయ క్రీడల ఆతిథ్యానికి సిద్ధం కానుంది. 2027లో అక్కడ 39వ నేషనల్ గేమ్స్ జరుగనున్నాయి. శుక్రవారం మేఘాలయ ముఖ్యమంత్రి కొంగ్కల్ సంగ్మా క్రీడాజ్యోతి అందుకోవడంతో దీనికి సంబంధించిన లాంఛన ప్రకియ కూడా ముగిసింది. 18 రోజుల పాటు విజయవంతంగా నిర్వహించిన తాజా జాతీయ క్రీడల్లో సర్వీసెస్ 121 పతకాలతో ఓవరాల్ చాంపియన్షిప్ గెలుచుకుంది. సర్వీసెస్ క్రీడాకారులు 68 స్వర్ణాలు, 26 రజతాలు, 27 కాంస్యాలు గెలిచారు. మహారాష్ట్ర అత్యధికంగా 198 పతకాలు గెలిచినప్పటికీ పసిడి వేట (54 స్వర్ణాలు)లో వెనుకబడిపోవడంతో రెండో స్థానంలో నిలిచింది. 71 రజతాలు, 73 కాంస్యాలు మరాఠా క్రీడాకారులు చేజిక్కించుకున్నారు. హరియాణా 153 పతకాలు (48 పసిడి, 47 రజతాలు, 58 కాంస్యాలు) మూడో స్థానంలో నిలువగా, ఆతిథ్య ఉత్తరాఖండ్ 24 స్వర్ణాలు, 35 రజతాలు, 44 కాంస్యాలతో మొత్తం 103 పతకాలు సాధించి ఏడో స్థానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ (14 పతకాలు) 18వ స్థానంలో, తెలంగాణ (18 పతకాలు) 26వ స్థానంలో నిలిచాయి. 2036 ఒలింపిక్స్కు సిద్ధం: అమిత్ షా జాతీయ క్రీడల ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విశ్వక్రీడల నిర్వహణకు భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు. ‘క్రీడల్లో భారత్కు బంగారు భవిష్యత్తు ఉంది. 2036 ఒలింపిక్స్కు ఆతిథ్యమిచ్చేందుకు రెడీగా ఉంది. ఉత్తరాఖండ్ అంటేనే దేవభూమిగా ప్రసిద్ధి. అయితే తాజా ఈవెంట్ నిర్వహణ ద్వారా ఖేల్ భూమి అయ్యింది. కేవలం క్రీడల నిర్వహణే కాదు. ఆటగాళ్లు రాటుదేలిన తీరు సాధించిన ప్రగతి రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగంలో చేసిన విశేష కృషికి నిదర్శనం. గత జాతీయ క్రీడల్లో ఉత్తరాఖండ్ 21వ స్థానంలో నిలిచింది. తాజా క్రీడల్లో ఏడో స్థానానికి ఎగబాకింది. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం వల్లే క్రీడారంగంలో ఆ రాష్ట్రం ఇంతలా ఎదిగింది. ఇదే జోరు ఇకమీదటా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామి, కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉష, మేఘాలయ ముఖ్యమంత్రి కొంగ్కల్ సంగ్మా తదితరులు పాల్గొన్నారు. పీటీ ఉష మాట్లాడుతూ ‘ఈ మహత్తర ప్రయాణం ఇక్కడితో ముగిసేది కాదు. ఎల్లప్పుడు దిగి్వజయంగా సాగేది. భారత క్రీడల ప్రగతిని చాటేది’ అని ఆమె కితాబిచ్చారు. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ ‘2036 విశ్వక్రీడల్లో టాప్–10లో నిలిచేందుకు ఇదొక గొప్ప ఆరంభం. దేశంలో క్రీడాసంస్కృతి పెరుగుతుందనడానికి ఇదో నిదర్శనం’ అని అన్నారు. -
ఇంగ్లండ్తో భారత మహిళల తొలి పోరు
మరోవైపు మహిళల ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్లో భాగంగా నేడు జరగనున్న తొలి పోరులో ఇంగ్లండ్తో భారత్ తలపడుతుంది. ఆదివారం రెండో మ్యాచ్లోనూ ఇంగ్లండ్తో ఆడుతుంది. ఫలితాలతో సంబంధం లేకుండా మెరుగైన ఆటతీరు కనబర్చడమే తమ ముందున్న లక్ష్యమని భారత మహిళల హాకీ జట్టు సారథి సలీమా టెటె పేర్కొంది. మెరుగు పర్చుకోవాల్సిన అంశాలపై దృష్టి పెట్టేందుకు ఈ లీగ్ ఎంతగానో ఉపయోగపడుతుందిన సలీమా వెల్లడించింది. ఈ నెల 18, 19న స్పెయిన్తో... 21, 22న జర్మనీతో... 24, 25న నెదర్లాండ్స్తో భారత్ మ్యాచ్లు ఆడుతుంది. ‘మా ఆటపైనే ప్రధానంగా దృష్టి పెడతాం. పలువురు ప్లేయర్లు తొలిసారి ప్రొ లీగ్ మ్యాచ్లు ఆడనున్నారు. గెలుపోటములు ఆటలో భా గం. మా వరకు అత్యుత్తమ ప్రదర్శన చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. హరేంద్ర సింగ్ చీఫ్ కోచ్గా వచ్చినప్పటి నుంచి గేమ్ప్లాన్ మెరుగైంది. ప్లేయర్ల మధ్య అనుబంధం కూడా పెరిగింది. అదే మైదానంలో ప్రస్ఫుటమవుతోంది’ అని సలీమా వెల్లడించింది. -
‘ప్రతీ మ్యాచ్ గెలవడమే లక్ష్యం’
భువనేశ్వర్: వచ్చే ఏడాది హాకీ ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో... నేరుగా మెగా టోర్నీకి అర్హత సాధించేందుకు ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్లో ప్రతీ మ్యాచ్ గెలవాలనుకుంటున్నామని భారత హాకీ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ పేర్కొన్నాడు. లీగ్లో మంచి ప్రదర్శన కనబర్చి అగ్రస్థానంలో నిలవడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని హర్మన్ప్రీత్ అన్నాడు. లీగ్లో భాగంగా శనివారం తొలి పోరులో స్పెయిన్తో భారత్ తలపడుతుంది. అనంతరం ఆదివారం స్పెయిన్తో మరో మ్యాచ్ ఆడుతుంది. ఈ నెల 18న, 19న జర్మనీతో 21, 22న ఐర్లాండ్తో... 24, 25న ఇంగ్లండ్తో మ్యాచ్లు ఆడుతుంది. ‘హాకీ ఇండియా లీగ్ నుంచి మా శిక్షణ సాగుతూనే ఉంది. ఫిట్నెస్ కాపాడుకుంటూ ప్రాక్టీస్ చేస్తున్నాం. ఆటగాళ్లంతా మంచి ఉత్సాహంగా ఉన్నారు. ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకొని ప్రొ లీగ్లో అన్నీ మ్యాచ్లు గెలవడమే మా ప్రధాన లక్ష్యం’ అని హర్మన్ప్రీత్ అన్నాడు. 2026 ఆగస్టులో బెల్జియం, నెదర్లాండ్స్ వేదికగా హాకీ వరల్డ్ కప్ జరగనుంది. ‘హాకీ ఇండియా లీగ్ ద్వారా దేశవాళీ ఆటగాళ్ల ప్రతిభ వెలుగులోకి వచ్చింది. వారిని సక్రమంగా వినియోగించుకుంటే భవిష్యత్తులో మరింత మంచి ప్లేయర్లుగా ఎదుగుతారు. స్పెయిన్ గట్టి ప్రత్యర్థి, వారిని తక్కువ అంచనా వేయడం లేదు. మా వరకు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడంపైనే దృష్టి పెడతాం’అని హర్మన్ప్రీత్ పేర్కొన్నాడు. -
National games: తెలంగాణకు 2 కాంస్యాలు
డెహ్రాడూన్: జాతీయ క్రీడల్లో గురువారం తెలంగాణ రాష్ట్రానికి రెండు పతకాలు లభించాయి. నెట్బాల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో తెలంగాణ జట్టుకు కాంస్య పతకం దక్కగా... షూటింగ్ మిక్స్డ్ స్కీట్ టీమ్ ఈవెంట్లో బత్తుల మునేక్–రష్మీ రాథోడ్ జోడీ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.నెట్బాల్లో తెలంగాణ, ఛత్తీస్గఢ్ జట్ల మధ్య జరిగిన కాంస్య పతకం మ్యాచ్ 31–31 పాయింట్లతో ‘డ్రా’గా ముగిసింది. దాంతో రెండు జట్లకు కాంస్య పతకాలు ఖరారయ్యాయి. తెలంగాణ నెట్బాల్ జట్టు తరఫున బోడ విక్రమ్ రెడ్డి, అబ్దుల్ ఖాన్, అబ్దుల్ షరీఫ్, మొహమ్మద్ ఖాజాయుద్దీన్, శ్రవణ్ కుమార్, రఘునందన్, పులి రితిక రెడ్డి, గేయశ్రీ, శ్రుతి, గోపీ చంద్రిక, ముద్దం కీర్తన, సంహిత ప్రాతినిధ్యం వహించారు.షూటింగ్ మిక్స్డ్ స్కీట్ ఫైనల్లో ఆరు జోడీలు పోటీపడ్డాయి. 138 పాయింట్లతో ఇషాన్ సింగ్–రైజా ధిల్లాన్ (హరియాణా) జంట స్వర్ణం దక్కించుకోగా... భవతేజ్ సింగ్–గనీమత్ సెఖోన్ (పంజాబ్) ద్వయం రజతం సంపాదించింది. 133 పాయింట్లతో మునేక్–రష్మీ జంటకు కాంస్యం లభించింది. గురువారం పోటీలు ముగిశాక తెలంగాణ 18 పతకాలతో (3 స్వర్ణాలు, 3 రజతాలు, 12 కాంస్యాలు) 26వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ 14 పతకాలతో (7 స్వర్ణాలు, 1 రజతం, 6 కాంస్యాలు) 18వ స్థానంలో కొనసాగుతోంది. -
భారత్ X జపాన్
కింగ్డావో (చైనా): ఆసియా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత జట్టు కాంస్య పతకాన్ని నిలబెట్టుకునేందుకు విజయం దూరంలో నిలిచింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో జపాన్ జట్టుతో భారత్ తలపడుతుంది. ఈ మ్యాచ్లో భారత్ గెలిస్తే సెమీఫైనల్లోకి ప్రవేశించి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంటుంది. గురువారం జరిగిన గ్రూప్ ‘డి’ చివరి లీగ్ మ్యాచ్లో భారత్ 2–3తో దక్షిణ కొరియా జట్టు చేతిలో పోరాడి ఓడిపోయింది. తొలి మ్యాచ్లో ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో ద్వయం 21–11, 12–21, 15–21తో కి డాంగ్ జు–జియోంగ్ నా యున్ (కొరియా) జంట చేతిలో ఓడిపోయింది. రెండో మ్యాచ్లో మాళవిక బన్సోద్ 9–21, 10–21తో సిమ్ యు జిన్ చేతిలో పరాజయం పాలైంది. దాంతో భారత్ 0–2తో వెనుకబడింది. మూడో మ్యాచ్లో సతీశ్ కుమార్ కరుణాకరన్ 17–21, 21–18, 21–19తో చో జియోన్యోప్పై గెలుపొందాడు. నాలుగో మ్యాచ్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం 19–21, 21–16, 21–11తో కిమ్ ఇన్ జి–కిమ్ యు జుంగ్ జంటను ఓడించడంతో స్కోరు 2–2తో సమమైంది. నిర్ణాయక ఐదో మ్యాచ్లో సాతి్వక్ సాయిరాజ్–అర్జున్ జంట 14–21, 21–23తో జిన్ యోంగ్–నా సుంగ్ సెయోంగ్ జోడీ చేతిలో ఓడిపోవడంతో భారత ఓటమి ఖరారైంది. -
క్వార్టర్ ఫైనల్లో రిత్విక్ జోడీ
డెల్రే బీచ్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్కు చెందిన బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ పురుషుల డబుల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ టోర్నీ జరుగుతోంది. గురువారం జరిగిన తొలి రౌండ్లో రిత్విక్ చౌదరీ (భారత్)–నికోలస్ బారింటోస్ (కొలంబియా) ద్వయం 7–6 (7/4), 7–6 (7/5)తో రొంబోలి–జొర్మాన్ (బ్రెజిల్) జంటపై గెలిచింది. 1 గంట 40 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో రిత్విక్–బారింటోస్ జోడీ మూడు ఏస్లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్లు చేసింది. రెండు జోడీలు తమ సర్వీస్ను ఒక్కోసారి కోల్పోయాయి. రెండు సెట్లలోటైబ్రేక్లో రిత్విక్–బారింటోస్ ద్వయం పైచేయి సాధించింది. ఇదే టోర్నీలో ఆడుతున్న శ్రీరామ్ బాలాజీ (భారత్)–మిగెల్ రేయస్ వరేలా (మెక్సికో) జంట కూడా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. తొలి రౌండ్లో నాలుగో సీడ్ బాలాజీ–వరేలా ద్వయం 3–6, 6–2, 10–4తో లెర్నర్ టియెన్–ఈథన్ క్విన్ (అమెరికా) జంటపై గెలిచింది. -
మకావును మట్టికరిపించి...
కింగ్డావో (చైనా): ఆసియా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత జట్టు భారీ విజయంతో బోణీ కొట్టింది. మకావు జట్టుతో బుధవారం జరిగిన గ్రూప్ ‘డి’ తొలి లీగ్ మ్యాచ్లో టీమిండియా 5–0 తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ గెలుపుతో భారత జట్టుకు క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారైంది. మంగళవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్లో దక్షిణ కొరియా చేతిలో ఓడిన మకావు జట్టు వరుసగా రెండో ఓటమితో లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. ఇప్పటికే క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లిన దక్షిణ కొరియా నేడు భారత జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు గ్రూప్ ‘డి’ టాపర్గా నిలుస్తుంది. తొలి మ్యాచ్లో సతీశ్ కుమార్ కరుణాకరన్–ఆద్యా వరియత్ జోడీ 21–10, 21–9తో లోక్ చోంగ్ లియోంగ్–వెంగ్ చి ఎన్జీ జంటను ఓడించి భారత్కు 1–0 ఆధిక్యాన్ని అందించింది. రెండో మ్యాచ్లో లక్ష్య సేన్ 21–16, 21–12తో పాంగ్ ఫాంగ్ పుయ్పై గెలవడంతో భారత ఆధిక్యం 2–0కు పెరిగింది.మూడో మ్యాచ్లో రైజింగ్ స్టార్ మాళవిక బన్సోద్ 21–15, 21–9తో హావో వాయ్ చాన్ను ఓడించడంతో భారత్ 3–0తో విజయాన్ని ఖరారు చేసుకుంది.నాలుగో మ్యాచ్లో చిరాగ్ శెట్టి–అర్జున్ ద్వయం 21–15, 21–19తో చిన్ పోన్ పుయ్–కోక్ వెన్ వోంగ్ జోడీపై... ఐదో మ్యాచ్లో ట్రెసా జాలీ–పుల్లెల గాయత్రి జంట 21–10, 21–5తో ఎన్జీ వెంగ్ చి–పుయ్ చి వా ద్వయంపై గెలుపొందడంతో భారత విజయం 5–0తో సంపూర్ణమైంది. 2023లో దుబాయ్లో జరిగిన ఆసియా మిక్స్డ్ టీమ్ చాంపియన్షిప్లో భారత జట్టు కాంస్య పతకాన్ని సాధించింది. -
తెలంగాణ జిమ్నాస్ట్ నిష్కా అగర్వాల్కు స్వర్ణ పతకం
జాతీయ క్రీడల్లో తెలంగాణ ఖాతాలో మూడో పసిడి పతకం చేరింది. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో బుధవారం జరిగిన మహిళల ఆరి్టస్టిక్ జిమ్నాస్టిక్స్లో తెలంగాణ అమ్మాయి నిష్కా అగర్వాల్ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. టేబుల్ వాల్ట్ ఈవెంట్లో నిష్కా విజేతగా నిలిచింది. ఎనిమిది మంది పోటీపడ్డ ఫైనల్లో నిష్కా 12.717 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని దక్కించుకొని బంగారు పతకాన్ని హస్తగతం చేసుకుంది. ఈ జాతీయ క్రీడల్లో నిష్కాకిది రెండో పతకం. మంగళవారం జరిగిన ఆల్ అరౌండ్ ఈవెంట్లో నిష్కా కాంస్య పతకాన్ని సాధించింది. మరోవైపు పురుషుల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ 65 కేజీల విభాగంలో తెలంగాణ రెజ్లర్ నిఖిల్ యాదవ్ కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు. బుధవారం పోటీలు ముగిశాక తెలంగాణ 16 పతకాలతో (3 స్వర్ణాలు, 3 రజతాలు, 10 కాంస్యాలు) 25వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ 14 పతకాలతో (7 స్వర్ణాలు, 1 రజతం, 6 కాంస్యాలు) 18వ స్థానంలో నిలిచింది. -
చెస్ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేశి సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: యువ ఆటగాళ్లు కెరీర్లో ఎదిగేందుకు ప్రోత్సాహకంగా ఇప్పటి వరకు అందిస్తున్న ఆర్దిక సహకారాన్ని ఆపి వేయాలని ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై అంతర్జాతీయ ఈవెంట్లలో విజయాలు సాధిస్తేనే నగదు పురస్కారాలు లభిస్తాయి. చెస్లో గ్రాండ్మాస్టర్గా (జీఎం) మారితే రూ. 4 లక్షలు, ఇంటర్నేషనల్ మాస్టర్ (ఐఎం) సాధిస్తే రూ.1.5 లక్షలు ఇచ్చేవారు. అయితే వీటిని నిలిపివేయడం సరైన నిర్ణయం కాదని అగ్రశ్రేణి ఆటగాడు అర్జున్ ఇరిగేశి అభిప్రాయపడ్డాడు. ‘చెస్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వర్ధమాన ఆటగాళ్లకు ఈ సమస్య అర్థం కాకపోవచ్చు. కానీ వారిని ప్రోత్సహించే తల్లిదండ్రులకు మాత్రం ఈ నిర్ణయం తీవ్ర నిరాశ కలిగిస్తుంది. దీని వల్ల వారికి ఆర్దికపరమైన సమస్యలు వస్తాయి. డబ్బుల కోసం ప్రత్యామ్నాయాలు చూడాల్సి వస్తుంది. పిల్లలను ప్రోత్సహించాలనే ప్రేరణ తగ్గిపోతుంది. సరిగ్గా చెప్పాలంటే చెస్, చదువులో ఏదైనా ఎంచుకోవాల్సి వస్తే వారు ఆటను పక్కన పెట్టవచ్చు’ అని అర్జున్ వ్యాఖ్యానించాడు. -
36వసారి జాతీయ టైటిల్ సాధించిన పంకజ్ అద్వానీ
ఇండోర్: భారత స్టార్ క్యూయిస్ట్, ప్రపంచ చాంపియన్ పంకజ్ అద్వానీ తన ఖాతాలో 36వసారి జాతీయ టైటిల్ను జమ చేసుకున్నాడు. మంగళవారం జరిగిన 91వ జాతీయ స్నూకర్ చాంపియన్షిప్ ఫైనల్లో పంకజ్ 5–1 ఫ్రేమ్ల తేడాతో బ్రిజేశ్ దమానిపై నెగ్గాడు. ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న ఆసియా స్నూకర్ చాంపియన్షిప్లో పంకజ్తో పాటు బ్రిజేశ్ జాతీయ జట్టు తరఫున ఆడే అవకాశం దక్కించుకున్నారు. ‘అంతర్జాతీయ టోరీ్నల్లో పాల్గొనే అవకాశం ఇచ్చే ఈవెంట్ ఇదొక్కటే కావడంతో... తీవ్ర పోటీ ఎదురైంది. గ్రూప్ దశలో పేలవ ప్రదర్శన అనంతరం తిరిగి పుంజుకొని స్వర్ణం నెగ్గడం ఆనందంగా ఉంది. అంతర్జాతీయ వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉంది’ అని పంకజ్ అన్నాడు. -
సౌదీ అరేబియాలో ఇ–స్పోర్ట్స్ ఒలింపిక్స్
లుసానే (స్విట్జర్లాండ్): మొట్టమొదటి ఒలింపిక్స్ ఇ–స్పోర్ట్స్కు సౌదీ అరేబియా ఆతిథ్యమివ్వబోతోంది. 2027లో సౌదీ రాజధాని రియాద్లో ఎలక్ట్రానిక్ స్పోర్ట్స్ విశ్వక్రీడలు జరుగనున్నాయి. గతేడాది పారిస్ ఒలింపిక్స్ సందర్భంగా ఈ ఏడాదే ఇ–స్పోర్ట్స్ మెగా ఈవెంట్ నిర్వహించాలని మొదట అనుకున్నారు. అయితే ఇది కార్యరూపం దాల్చేందుకు ఇంకో రెండేళ్లు ఆలస్యమవుతుంది. అయితే 2027 నుంచి రెగ్యులర్గా ప్రతీ రెండేళ్లకోసారి మెగా ఈవెంట్ ఇ–స్పోర్ట్స్ నిర్వహించేందుకు సౌదీ ప్రభుత్వం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)తో 12 ఏళ్ల ఒప్పందం చేసుకుంది. గతేడాది జూలై, ఆగస్టు నెలల్లో రియాద్లో ఇ–స్పోర్ట్స్ ప్రపంచకప్ జరిగింది. కాల్ ఆఫ్ డ్యూటీ, ఫోర్ట్నైట్, స్ట్రీట్ ఫైటర్ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. అయితే ఇందులో సాధారణ షూటర్లకు అనుమతించేది లేనిది తేలలేదు. త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుంది. సౌదీ క్రీడల మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజిజ్ బిన్ తుర్కీ అల్ ఫైజల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ ఒలింపిక్స్ ఇ–స్పోర్ట్స్ క్రీడాంశాలపై చర్చించనుంది. ఇటీవల ఐఓసీ చైర్మన్ థామస్ బాచ్, సౌదీ రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ల మధ్య చర్చలు ఫలప్రదంగా జరగడంతో తాజాగా ఇ–స్పోర్ట్స్ విశ్వక్రీడలపై ప్రకటన వెలువడింది. అయితే ఇంకో రెండేళ్లలో జరిగే ఈ పోటీల కోసం ఈ ఏడాది నుంచే క్వాలిఫయింగ్ పోటీలు మొదలవుతాయని ఐఓసీ వర్గాలు తెలిపాయి. -
దోహా డైమండ్ లీగ్తో...
న్యూఢిల్లీ: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈ ఏడాదిలో మే నెలలో తిరిగి ట్రాక్పై అడుగు పెట్టనున్నాడు. దోహాలో జరగనున్న డైమండ్ లీగ్ ఈవెంట్లో నీరజ్ బరిలోకి దిగనున్నాడు. ఈ మేరకు భారత జాతీయ అథ్లెట్లిక్స్ చీఫ్ కోచ్ రాధాకృష్ణన్ నాయర్ వివరాలు వెల్లడించారు. ఇటీవల వివాహ బంధంలోకి అడుగు పెట్టిన నీరజ్ ప్రస్తుతం ప్రాక్టీస్ ప్రారంభించినట్లు రాధాకృష్ణన్ పేర్కొన్నాడు. ఒక సీజన్లో 14 డైమండ్ లీగ్ మీట్లు జరగనుండగా... దోహా ఈవెంట్ అందులో మూడోది. ఈ ఏడాది ఆగస్టు 27, 28న జ్యూరిక్లో డైమండ్ లీగ్ ఫైనల్ జరగనుంది. 26 ఏళ్ల నీరజ్ చోప్రా ప్రస్తుతం తన వ్యక్తిగత కోచ్ జాన్ జెలెజ్నీ (చెక్ రిపబ్లిక్)తో కలిసి పోచెఫ్స్టోమ్లో శిక్షణ పొందుతున్నాడు. ఒలింపిక్స్లో రెండు పతకాలు, ప్రపంచ చాంపియన్షిప్లో రెండు పతకాలు సాధించిన నీరజ్ చోప్రా 2020 టోక్యో, 2024 పారిస్ ఒలింపిక్స్కు ముందు కూడా పోచెఫ్స్ట్రోమ్లోనే సాధన చేశాడు. కెరీర్లో ఇప్పటి వరకు అత్యుత్తమంగా 89.94 మీటర్ల దూరం జావెలిన్ను విసిరిన నీరజ్... 90 మీటర్ల మార్క్ దాటడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. -
అన్నింటికంటే ‘మిక్స్డ్’ ముందు!
న్యూయార్క్: కేవలం నాలుగు గ్రాండ్స్లామ్ టోర్నీలకే పరిమితమైన ‘మిక్స్డ్ డబుల్స్’ ఈవెంట్ నానాటికీ తీసికట్టుగా జరుగకుండా... మరింత రసవత్తరంగా జరిగేలా... అందర్నీ ఆకర్షించేలా.. ఆదరణ పొందేలా... యూఎస్ ఓపెన్ నిర్వాహకులు గట్టి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ‘మిక్స్డ్’లో సరైన భాగస్వాముల ఎంపిక, తదనంతరం పురుషుల, మహిళ డబుల్స్, సింగిల్స్లలో తాజాగా ఆడేందుకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ప్రధాన టోర్నీకి ముందుగానే మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్ల్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. గేమ్ ఫార్మాట్ను మార్చింది. దీంతో పాటు ప్రత్యేకంగా మిక్స్డ్ డబుల్స్ విభాగం కోసం 10 లక్షల డాలర్లు (రూ.8.67 కోట్లు) ప్రైజ్మనీని కూడా పెంచింది. ఈ సీజన్ యూఎస్ ఓపెన్లో ఇబ్బడిముబ్బడిగా జోడీలను దించట్లేదు. 16 జోడీలే ‘మిక్స్డ్’ బరిలోకి దిగుతాయి. ఇందులో మెరుగైన ర్యాంకింగ్ ఆధారంగా ఎనిమిది జోడీలు, వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మరో ఎనిమిది జోడీలు మిక్స్డ్ టైటిల్ కోసం పోటీ పడతాయి. మెయిన్ ‘డ్రా’ మ్యాచ్లు మొదలుకావడానికి ఐదు రోజుల ముందే అంటే క్వాలిఫయింగ్ పోటీలు జరుగుతున్న సమయంలో మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్లు వరుసగా జరుగుతాయి. ఆ మరుసటి రోజే సెమీస్, ఫైనల్స్తో విజేత కూడా ఖాయమమవుతుంది. 6 గేములతో కూడా బెస్టాఫ్ త్రీ కాకుండా 4 గేములతో బెస్టాఫ్ త్రీ ఫార్మాట్లో మిక్స్డ్ పోటీలు నిర్వహిస్తారు. గతంలో 6–6 స్కోరుదాకా సాగితేనే టైబ్రేక్ చేసేవారు. కానీ ఇప్పుడు 4–4 వద్దే టైబ్రేక్ మొదలుపెడతారు. దీంతో పోటీ రసవత్తరంగా సాగడంతో పాటు రెండే రోజుల్లో (ఈ ఏడాది అయితే ఆగస్టు 19, 20 తేదీల్లోనే) మిక్స్డ్ డబుల్స్ విజేత ఎవరో తేలుతుంది. 2024లో యూఎస్ ఓపెన్లో సారా ఎరాని–ఆండ్రియా వావాసోరి (ఇటలీ) జోడీ విజేతగా నిలిచింది. -
జ్యోతి ‘డబుల్’ ధమాకా
డెహ్రాడూన్: భారత స్టార్ అథ్లెట్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ జాతీయ క్రీడల్లో మరోసారి ‘పసిడి’ ప్రదర్శనతో అదరగొట్టింది. మంగళవారం జరిగిన మహిళల అథ్లెటిక్స్ 200 మీటర్ల విభాగంలో విశాఖపట్నం జిల్లాకు చెందిన 25 ఏళ్ల జ్యోతి యర్రాజీ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. 200 మీటర్ల ఫైనల్ రేసును జ్యోతి అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 23.35 సెకన్లలో పూర్తి చేసి విజేతగా అవతరించింది. తెలంగాణ అమ్మాయి నిత్య (23.76 సెకన్లు) కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. గత ఆదివారం జ్యోతి 100 మీటర్ల హర్డిల్స్ ఈవెంట్లో వరుసగా మూడోసారి జాతీయ క్రీడల్లో బంగారు పతకం సాధించి ‘హ్యాట్రిక్’ నమోదు చేసిన సంగతి తెలిసిందే. జిమ్నాస్టిక్స్లో భాగమైన మహిళల ట్రాంపోలిన్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన షేక్ యాసీన్ స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. ఎనిమిది మంది పోటీపడిన ఫైనల్లో కాకినాడ జిల్లాకు చెందిన షేక్ యాసీన్ తన విన్యాసాలతో మెరిపించి 39.790 పాయింట్లతో విజేతగా నిలిచింది. 2022 గుజరాత్ జాతీయ క్రీడల్లో యాసీన్ రజతం నెగ్గింది. నందిని నిలకడగా... ఏడు క్రీడాంశాల సమాహారమైన మహిళల హెప్టాథ్లాన్ (100 మీటర్ల హర్డిల్స్, హైజంప్, షాట్పుట్, 200 మీటర్లు, లాంగ్జంప్, జావెలిన్ త్రో, 800 మీటర్లు) ఈవెంట్లో తెలంగాణకు చెందిన అంతర్జాతీయ క్రీడాకారిణి అగసార నందిని స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. రెండు రోజులపాటు జరిగిన ఈ ఈవెంట్లో నందిని మొత్తం 5601 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. అంతేకాకుండా ఈ ఏడాది మే 27 నుంచి 31 వరకు దక్షిణ కొరియాలో జరిగే ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలకు అర్హత సాధించింది. మహిళల ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ఆల్ అరౌండ్ విభాగంలో తెలంగాణ అమ్మాయి నిష్కా అగర్వాల్ (44.767 పాయింట్లు) కాంస్య పతకాన్ని సాధించింది. మరోవైపు మహిళల నెట్బాల్ ఫాస్ట్–5 ఈవెంట్లో తెలంగాణ జట్టుకు రజత పతకం లభించింది. ఫైనల్లో తెలంగాణ జట్టు 20–23తో హరియాణా చేతిలో ఓడిపోయింది. తెలంగాణ నెట్బాల్ జట్టు తరఫున నట్టి అఖిల, సయ్యదా మస్రతున్నీసా, జంగా సుప్లవి రాజ్, యరువా యషశ్రీ, సాయిప్రియ, కొమర రిషిక, అలోనా, తరుణ, అంజలి, యదనవేణి దీప్తి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ 14 పతకాలతో (7 స్వర్ణాలు, 1 రజతం, 6 కాంస్యాలు) 17వ స్థానంలో... తెలంగాణ 14పతకాలతో (2 స్వర్ణాలు, 3 రజతాలు, 9 కాంస్యాలు) 27వ స్థానంలో ఉన్నాయి. -
తెలంగాణ టీటీ జట్టుకు కాంస్యం
డెహ్రాడూన్: జాతీయ క్రీడల్లో (National Games) తెలంగాణ (Telangana) ఖాతాలో పదో పతకం చేరింది. సోమవారం జరిగిన టేబుల్ టెన్నిస్ (Table Tennis) (టీటీ) టీమ్ ఈవెంట్లో తెలంగాణ పురుషుల జట్టుకు కాంస్య పతకం లభించింది. సూరావజ్జుల స్నేహిత్, అలీ మొహమ్మద్, మొహమ్మద్ అలీ, స్వర్ణేందు చౌధురీ, సంతోష్ రమేశ్ కుమార్లతో కూడిన తెలంగాణ జట్టు సెమీఫైనల్లో ఓడిపోయింది. మహారాష్ట్రతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో తెలంగాణ 0–3తో పరాజయం పాలైంది. తొలి మ్యాచ్లో స్నేహిత్ 6–11, 7–11, 9–11తో జశ్ మోదీ చేతిలో... రెండో మ్యాచ్లో మొహమ్మద్ అలీ 9–11, 9–11, 6–11తో రీగన్ చేతిలో... మూడో మ్యాచ్లో స్వర్ణేందు చౌధురీ 12–10, 1–11, 9–11, 3–11తో చిన్మయ సోమయ్య చేతిలో ఓడిపోయారు. మరో సెమీఫైనల్లో తమిళనాడు 2–3తో పశి్చమ బెంగాల్ చేతిలో పరాజయం చూవిచూసి కాంస్యంతో సరిపెట్టుకుంది. ఫైనల్లో పశి్చమ బెంగాల్ 3–0తో మహారాష్ట్రపై నెగ్గి పసిడి పతకం సొంతం చేసుకుంది. మహిళల విభాగంలోనూ పశి్చమ బెంగాల్ జట్టుకే స్వర్ణ పతకం లభించింది. సుతీర్థ ముఖర్జీ, ఐహిక ముఖర్జీ, పొయ్మంతీ బైస్యా, మౌమా దాస్, మౌహిత దత్తాలతో కూడిన పశ్చిమ బెంగాల్ ఫైనల్లో 3–0తో మహారాష్ట్రపై గెలిచింది. సోమవారం క్రీడలు ముగిశాక తెలంగాణ 10 పతకాలతో (1 స్వర్ణం, 2 రజతాలు, 7 కాంస్యాలు) 29వ స్థానంలో ఉంది. -
రిటైర్మెంట్ వీడి మళ్లీ బరిలోకి దిగనున్న భారత స్క్వాష్ స్టార్
న్యూఢిల్లీ: దాదాపు ఏడాది క్రితం...భారత స్క్వాష్ (Squash) స్టార్ సౌరవ్ ఘోషాల్ (Sourav Ghoshal) ఆటకు గుడ్బై చెప్పాడు. ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్ఏ) టూర్లో భాగంగా చికాగోలో జరిగిన విండీ సిటీ ఓపెన్లో ఆడిన తర్వాత అతను రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే 38 ఏళ్ల ఘోషాల్ ఇప్పుడు మళ్లీ ఆటగాడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. రిటైర్మెంట్ వదిలి మైదానంలో పోటీ పడాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో గత నెలలో పీఎస్ఏలో సభ్యుడిగా తన పేరు నమోదు చేసుకున్న ఘోషాల్ చాలెంజర్ ఈవెంట్ ఆక్టేన్ సిడ్నీ క్లాసిక్లో బరిలోకి దిగుతున్నాడు. ‘టోర్నీల కోసం చేసే ప్రయాణాలు, ఆ పోటీని నేను మళ్లీ ఆస్వాదించాలనుకుంటున్నా. గత 20 ఏళ్లలో ఆటగాడిగా ఉన్నప్పుడు గడిపిన సమయంతో పోలిస్తే ఈ సారి 10 నెలల్లోనే అంతకంటే ఎక్కువ సమయంలో ఇంట్లో ఉన్నాను. ఈ సమయంలో భార్యాపిల్లలతో సంతోషంగా గడిపా. కనీసం మరో మూడేళ్లు ఆడగల సత్తా నాలో ఉందని భావిస్తున్నా. విరామ సమయంలో నా కెరీర్ను విశ్లేషించేందుకు ప్రయత్నించా. కాబట్టే ఇంకా ఆడాలనిపించింది. ఈ రెండో భాగం మొదటిదానికంటే బాగుంటుందని ఆశిస్తున్నా’ అని ఘోషాల్ చెప్పాడు. భారత్ తరఫున ఆడాలని... ఈ సారి పీఎస్ఏ టోర్నీలకంటే అంతర్జాతీయ ఈవెంట్లలో భారత్కు ప్రాతినిధ్యం వహించడమే తన మొదటి ప్రాధాన్యతగా అతను పెట్టుకున్నాడు. పురుషుల విభాగంలో భారత అత్యుత్తమ స్క్వాష్ ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న ఘోషాల్... సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో కలిపి కామన్వెల్త్ క్రీడల్లో 1 రజతం, 2 కాంస్యాలు, ఆసియా క్రీడల్లో 2 స్వర్ణాలు, 2 రజతాలు, 5 కాంస్యాలు గెలుచుకున్నాడు.భారత్ తరఫున దాదాపు అన్ని ఘనతలు అతని పేరిటే ఉన్నాయి. ‘పీఎస్ఏ నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా భారత్ తరఫున మాత్రం ఆడుతూ ఉండాలని భావించా. అయితే పీఎస్ఏలో కొనసాగితేనే జాతీయ జట్టు తరఫున ఎంపికయ్యే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని అర్థమైంది. భారత్ తరఫున ఇంకా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాననే నమ్మకం ఉంది. కొన్ని నెలల క్రితమే నా శిక్షణను మళ్లీ ప్రారంభించా. ఆరంభంలో ఫిట్నెస్పై మాత్రమే దృష్టి పెట్టి ఆపై సాధన కొనసాగించా. దాదాపు ఆరు నెలల మైదానానికి దూరమై మళ్లీ ఆడటం అంత సులువు కాదు’ అని ఘోషాల్ పేర్కొన్నాడు.ఒలింపిక్స్ ఆశలు... 2026 కామన్వెల్త్ క్రీడల నుంచి స్క్వాష్ను తప్పించినా... 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో స్క్వాష్ను చేర్చడం కూడా ఘోషాల్ భవిష్యత్తుపై ఆశలు పెంచింది. ‘కామన్వెల్త్ క్రీడల్లో మేం స్వర్ణం సాధించలేదు. ఈ సారి గెలవవచ్చని ఆశించా. అయితే ఇప్పుడు ఆ అవకాశం లేదు కాబట్టి ఏమీ చేయలేం. ఆసియా క్రీడల్లో మాత్రం రాణించే అవకాశం ఉంది. ఒలింపిక్స్లో పతకం అనేది నిజంగానే పెద్ద లక్ష్యం. నేను మన దేశం తరఫున ఆడిన పతకం గెలవగలిగితే అంతకన్నా గొప్ప విషయం ఉండదు. కానీ దానికి దాదాపు మూడేళ్లుకు పైగా సమయం ఉంది. ఇప్పటికిప్పుడైతే అంత దూరం ఆలోచించడం లేదు’ అని ఘోషాల్ అభిప్రాయపడ్డాడు. ఆక్టేన్ సిడ్నీ క్లాసిక్ టోర్నీలో తాను విజయం సాధిస్తానని అతను విశ్వాసం వ్యక్తం చేశాడు. -
‘స్పోర్ట్స్ డేటా గేమ్థాన్’ను ప్రారంభించింన FIFS..
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10, 2025: స్పోర్ట్స్ టెక్లో భారతదేశాన్ని గ్లోబల్ హబ్గా మార్చాలనే లక్ష్యంతో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫాంటసీ స్పోర్ట్స్ (FIFS) ఆధ్వర్యంలో డ్రీమ్11 సమర్పనలో స్పోర్ట్స్ AI ఛాలెంజ్ ‘స్పోర్ట్స్ డేటా గేమ్థాన్’ను ప్రారంభించింది. ఈ అధునాతన సాంకేతిక పోటీ డేటాను సమగ్రపరచడంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML) వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను క్రీడలకు ఉపయోగించుకోవడానికి నూతన మార్గాలను అన్వేషించే దిశగా అడుగులేస్తుంది.ఈ గేమ్థాన్లో ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ల నుండి విద్యార్థి జట్లు పాల్గొంటాయి. ఇందులో పాల్గొనే వారు ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సందర్భంగా రోజువారీ ఫాంటసీ స్పోర్ట్స్ ఫార్మాట్లో పోటీపడతారు. ముఖ్యంగా డేటా అనలిటిక్స్ నైపుణ్యాలను ఉపయోగించుకుంటూ, గేమ్థాన్ యొక్క బదిలీ పరిమితులు ఇతర నియమాలకు కట్టుబడి విజేతగా నిలవడానికి వ్యూహాన్ని రూపొందించడంలో ఏఐ, ఎమ్ఎల్ నమూనాలను నిర్మించాలి.ఈ ప్రతిష్టాత్మక పోటీకి 30 కి పైగా ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపాయి. వారి వ్యూహాత్మక ప్రణాళికలను సమీక్షించిన తర్వాత., IIT బాంబే, IIT ఢిల్లీ, IIT ఖరగ్పూర్, IIT కాన్పూర్, IIIT ధార్వాడ్ వంటి సంస్థల నుండి 52 జట్లు షార్ట్లిస్ట్ చేయబడ్డాయి. మొదటి మూడు జట్లు వరుసగా రూ.12.5 లక్షలు, 7.5 లక్షలు, 5 లక్షలు అందుకుంటూ మొత్తంగా 25 లక్షల బహుమతిని గెలుచుకుంటారు.గేమ్థాన్ అంతటా విద్యార్థులకు మద్దతుగా, FIFS ఇద్దరు నిపుణులను ఆన్-బోర్డ్ చేసింది - ప్రఖ్యాత క్రికెట్ విశ్లేషకుడు జాయ్ భట్టాచార్య మరియు USలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో AI వైస్ డీన్ ప్రొఫెసర్ విశాల్ మిశ్రా, విద్యార్థి బృందాలకు వారి నిపుణుల మార్గదర్శకత్వాన్ని అందిస్తారు.ఈ సందర్భంగా FIFS డైరెక్టర్ జనరల్ జాయ్ భట్టాచార్య మాట్లాడుతూ.., "స్పోర్ట్స్ డేటా గేమ్థాన్ యొక్క మొదటి ఎడిషన్ను ప్రారంభించడానికి మేము సంతోషిస్తున్నాము. మా ప్రయత్నానికి విశేష స్పందన లభిస్తుంది. ఈ గేమ్థాన్లో ప్రధానంగా యువతరం పోటీ పడటం పట్ల మేము సంతోషిస్తున్నామ’’ని అన్నారు.‘స్పోర్ట్స్ డేటా గేమ్థాన్’ అనేది ఆవిష్కరణకు ప్రోత్సాహక వేదికగా మారడంతో పాటు భారతదేశాన్ని స్పోర్ట్స్ టెక్నాలజీలో ప్రపంచ నేతగా ఎదగడమే లక్ష్యంగా ముందుకు తీసుకెళ్లన్నుంది. ఈ తరంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న స్పోర్ట్స్ అనలిటిక్స్ రంగంలో యువ ప్రతిభను పెంపొందించడంతో గేమ్థాన్ అభిమానుల భాగస్వామ్యాన్ని పునర్నిర్వచించడానికి.. అత్యాధునిక సాంకేతికత, డిజిటల్ కంటెంట్ అనుసంధానం చేసే విశిష్టమైన వ్యవస్థను పెంపొందిస్తుంది. -
PV Sindhu: కీలక టోర్నీకి దూరం.. భర్తతో ‘మ్యాచీ మ్యాచీ’!
ఆసియా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత పతకావకాశాలకు దెబ్బ పడింది. భారత స్టార్ షట్లర్, ప్రపంచ మాజీ చాంపియన్ పీవీ సింధు(PV Sindhu) కండరాల గాయం కారణంగా ఈ టోర్నీ నుంచి వైదొలిగింది. క్రితంసారి 2023లో దుబాయ్(Dubai)లో జరిగిన ఈ మెగా ఈవెంట్లో సింధు సభ్యురాలిగా ఉన్న భారత జట్టు కాంస్య పతకాన్ని(Bronze Medal) సాధించింది. గువాహటిలో ఈనెల నాలుగో తేదీన మొదలైన జాతీయ శిక్షణ శిబిరం సందర్భంగా సింధు ప్రాక్టీస్ సమయంలో గాయపడింది.ఎంఆర్ఐ స్కాన్ తీయగా సింధు కండరాల గాయం నుంచి కోలుకోవడానికి కొన్ని వారాల సమయం పడుతుందని తేలింది. దాంతో సింధు ఈ టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆసియా మిక్స్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ ఈనెల 11 నుంచి 15 వరకు చైనాలోని కింగ్డావో నగరంలో జరుగుతుంది. గ్రూప్ ‘డి’లో ఉన్న భారత్ ఈనెల 12న మకావు జట్టుతో, 13న దక్షిణ కొరియా జట్టుతో ఆడుతుంది. ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్ల (పురుషుల, మహిళల సింగిల్స్, పురుషుల, మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్) చొప్పున జరుగుతాయి. భారత బ్యాడ్మింటన్ జట్టు: లక్ష్య సేన్, ప్రణయ్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, ధ్రువ్ కపిల, అర్జున్, సతీశ్ కుమార్, మాళవిక బన్సోద్, గాయత్రి గోపీచంద్, ట్రెసా జాలీ, అశ్విని పొన్నప్ప, తనీషా క్రాస్టో, ఆద్య. మ్యాచీ మ్యాచీఇదిలా ఉంటే.. గాయం కారణంగా ఆటకు దూరమైన పీవీ సింధు వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించింది. భర్త వెంకట దత్తసాయితో కలిసి క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తోంది. ఈ క్రమంలో ఇద్దరూ చాక్లెట్ కలర్ దుస్తులు ధరించిన ఉన్న ఫొటోను షేర్ చేసిన సింధు.. ‘మ్యాచీ మ్యాచీ’ అంటూ మురిసిపోయింది.శభాష్ మానస్ న్యూఢిల్లీ: భారత పురుషుల టెన్నిస్ రైజింగ్ స్టార్ మానస్ ధామ్నే తన కెరీర్లో తొలి ప్రొఫెషనల్ టైటిల్ సాధించాడు. ట్యూనిషియాలో జరిగిన అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఎం15 టోర్నీలో 17 ఏళ్ల మానస్ విజేతగా నిలిచాడు. ఐటీఎఫ్ ర్యాంకింగ్స్లో 64వ స్థానంలో ఉన్న ఈ మహారాష్ట్ర కుర్రాడు ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో 2–6, 6–0, 6–2తో ఇటలీకి చెందిన లొరెంజో కార్బోనిపై గెలుపొందాడు.తద్వారా భారత్ నుంచి ఐటీఎఫ్ టైటిల్ నెగ్గిన రెండో అతి పిన్న వయస్కుడిగా మానస్ గుర్తింపు పొందాడు. ఈ రికార్డు యూకీ బాంబ్రీ (16 ఏళ్ల 10 నెలలు; 2009లో న్యూఢిల్లీ ఫ్యూచర్స్ టోర్నీ) పేరిట ఉంది. క్వాలిఫయర్గా ట్యూనిషియా ఎం15 టోర్నీలో మెయిన్ ‘డ్రా’లోకి అడుగు పెట్టిన మానస్ వరుసగా 8 మ్యాచ్లు గెలిచి చాంపియన్గా అవతరించడం విశేషం. ప్రస్తుత ప్రపంచ నంబర్వన్ యానిక్ సినెర్ మాజీ కోచ్ రికియార్డో పియాటి వద్ద మానస్ శిక్షణ తీసుకుంటున్నాడు. -
జ్యోతి ‘హ్యాట్రిక్’
డెహ్రాడూన్: జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ ఖాతాలో ఐదో స్వర్ణ పతకం చేరింది. ఆదివారం జరిగిన మహిళల అథ్లెటిక్స్ 100 మీటర్ల హర్డిల్స్లో జ్యోతి యర్రాజీ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. విశాఖపట్నం జిల్లాకు చెందిన జ్యోతి 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 13.10 సెకన్లలో ముగించి జాతీయ క్రీడల్లో కొత్త రికార్డును నెలకొల్పింది.జాతీయ క్రీడల్లో జ్యోతికిది వరుసగా మూడో స్వర్ణ పతకం కావడం విశేషం. ఇటీవల దక్షిణ మధ్య రైల్వేలో జూనియర్ క్లర్క్గా చేరిన జ్యోతి 2022 గుజరాత్, 2023 గోవా జాతీయ క్రీడల్లోనూ పసిడి పతకాలు సాధించింది. మరోవైపు 10 క్రీడాంశాల సమాహారమైన డెకాథ్లాన్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన రోహిత్ రోమన్ (6753 పాయింట్లు) కాంస్య పతకాన్ని సాధించాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ 12 పతకాలతో (5 స్వర్ణాలు, 1 రజతం, 6 కాంస్యాలు) 18వ స్థానంలో ఉంది.తెలంగాణకు రెండు కాంస్యాలు జాతీయ క్రీడల్లో ఆదివారం తెలంగాణకు రెండు కాంస్య పతకాలు లభించాయి. అథ్లెటిక్స్ మహిళల 4్ఠ100 మీటర్ల రిలేలో నిత్య, మైథిలి ఆకుమడుపుల, మాలోత్ సింధు, అగసార నందినిలతో కూడిన తెలంగాణ జట్టు (47.58 సెకన్లు) కాంస్య పతకాన్ని సాధించింది. మహిళల నెట్బాల్లో తెలంగాణ జట్టు సెమీఫైనల్లో 43ృ48 పాయింట్ల తేడాతో హరియాణా చేతిలో ఓడిపోయి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం తెలంగాణ 9 పతకాలతో (1 స్వర్ణం, 2 రజతాలు, 6 కాంస్యాలు) 29వ స్థానంలో ఉంది. -
ఫ్రీ స్టయిల్ చెస్ నాకౌట్కు గుకేశ్
హంబర్గ్ (జర్మనీ): భారత యువ గ్రాండ్మాస్టర్, ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ ఫ్రీస్టయిల్ గ్రాండ్స్లామ్ చెస్ టూర్లో నాకౌట్కు అర్హత సాధించాడు. శనివారం క్వాలిఫయర్స్ చివరి మ్యాచ్లో స్టార్ ప్లేయర్ మాగ్నస్ కార్ల్సన్ చేతిలో ఓటమి పాలైనప్పటికీ గుకేశ్ ముందంజ వేశాడు. ఈ టోర్నీ మొత్తంలో 9 మ్యాచ్లు ఆడిన గుకేశ్ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయాడు. ఒక్క మ్యాచ్లోనూ విజయం సాధించని భారత గ్రాండ్మాస్టర్... ఏడు మ్యాచ్లను ‘డ్రా’ చేసుకొని... మరో రెండు మ్యాచ్ల్లో ఓటమి పాలయ్యాడు. ఫలితంగా గుకేశ్ ఖాతాలో 3.5 పాయింట్లు చేరాయి. పది మంది ప్లేయర్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో ఎనిమిదో స్థానంలో నిలవడం ద్వారా గుకేశ్ నాకౌట్లో అడుగుపెట్టాడు. క్వాలిఫయింగ్ దశ ముగిసే సరికి ఫ్రాన్స్ గ్రాండ్మాస్టర్ అలిరెజా ఫిరౌజా, ఉజ్బేకిస్తాన్కు చెందిన జవోకిర్ సిందరోవ్ చెరో 6.5 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో నిలిచారు. అమెరికా గ్రాండ్మాస్టర్ ఫాబియానో కరున (6 పాయింట్లు) మూడో స్థానం దక్కించుకోగా... మాగ్నస్ కార్ల్సన్ (నార్వే), హికారు నకమురా (అమెరికా) చెరో 5.5 పాయింట్లతో వరుసగా నాలుగో, ఐదో స్థానాల్లో నిలిచారు. జర్మనీకి చెందిన విన్సెంట్ కైమెర్ 4 పాయింట్లతో ఆరో ‘ప్లేస్’ దక్కించుకున్నాడు. ఉజ్బేకిస్తాన్కు చెందిన నొదిర్బెక్ అబ్దుసత్తోరోవ్, గుకేశ్ చెరో 3.5 పాయింట్లతో వరుసగా ఏడు, ఎనిమిదో స్థానాల్లో నిలిచారు. -
చెన్నై ఏటీపీ టోర్నీ రన్నరప్గా సాకేత్ జోడీ
చెన్నై: ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్, భారత డేవిస్ కప్ జట్టు మాజీ సభ్యుడు సాకేత్ మైనేని ఈ సీజన్లో చెన్నై ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టోర్నీలో డబుల్స్ టైటిల్ నిలబెట్టుకోలేకపోయాడు. భారత సహచరుడు రామ్కుమార్ రామనాథన్తో కలిసి బరిలోకి దిగిన సాకేత్ చివరకు రన్నరప్తో సరిపెట్టుకున్నాడు. శనివారం జరిగిన తుదిపోరులో సాకేత్ – రామ్కుమార్ జోడి 4–6, 4–6తో షింటారో మొచిజుకి–కైటో వుసుగి (జపాన్) జంట చేతిలో పరాజయం చవిచూసింది. జపాన్ జోడీ మ్యాచ్ ఆరంభం నుంచే భారత ఆటగాళ్లపై పైచేయి సాధించింది. దీంతో తొలి సెట్ గెలిచేందుకు ఎంతోసేపు పట్టలేదు. తర్వాత రెండో సెట్లోనూ భారత జంట పుంజుకోలేకపోయింది. ఇదే అదనుగా షింటారో–కైటోలు చక్కని సమన్వయంతో వరుసగా రెండో సెట్తో పాటు టైటిల్ను గెలుచుకుంది. గతేడాది ఇక్కడ భారత ద్వయం టైటిల్ సాధించింది. ఈ సారీ టైటిల్ వేటలో నిలిచినా... చివరి మెట్టుపై చతికిలబడింది. సాకేత్–రామ్ కుమార్ జోడీ తదుపరి ఈ నెల 17 నుంచి పుణేలో జరిగే ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్ బరిలోకి దిగుతుంది. -
మాయ పోరాటం ముగిసె...
ముంబై: భారత టీనేజ్ టెన్నిస్ స్టార్ మాయ రాజేశ్వరన్ రేవతి సంచలన ప్రదర్శన సెమీ ఫైనల్లో ముగిసింది. ముంబై ఓపెన్ డబ్ల్యూటీఏ–125 టోర్నీలో వైల్డ్కార్డ్ ఎంట్రీతో బరిలోకి దిగిన ఆమె అద్భుత ప్రదర్శనతో పలువురు అంతర్జాతీయ క్రీడాకారిణులను కంగుతినిపించి ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. కానీ ఆమె జోరుకు సెమీస్లో చుక్కెదురైంది. శనివారం జరిగిన ఈ మ్యాచ్లో 15 ఏళ్ల భారత ప్లేయర్ 3–6, 1–6తో స్విట్జర్లాండ్కు చెందిన ప్రపంచ 117వ ర్యాంకర్ జిల్ టెచ్మన్ చేతిలో పరాజయం చవిచూసింది. మొత్తానికి బరిలోకి దిగిన తొలి సీనియర్ స్థాయి టోరీ్నలో మాయ చేసిన పోరాటం అందర్ని ఆకట్టుకుంది. రెండో సెమీస్లో ఎనిమిదో సీడ్ మనంచయ సవంగ్కావ్ (థాయ్లాండ్) 6–2, 6–2తో రెండో సీడ్ రెబెక్కా మరినో (కెనడా)పై గెలిచి ఫైనల్ చేరింది. టెచ్మన్, రెబెక్కాల మధ్య నేడు టైటిల్ పోరు జరుగనుంది. డబుల్స్లో డచ్ ప్లేయర్ అరియనె హర్తొనొతో కలిసి బరిలోకి దిగిన భారత స్టార్ ప్రార్థన తోంబరే తుదిపోరుకు అర్హత సాధించింది. -
తైక్వాండోలో హర్షప్రదకు రజతం... వరుణ్కు కాంస్యం
డెహ్రాడూన్: 38వ జాతీయ క్రీడల్లో శుక్రవారం తెలంగాణ ఖాతాలో ఒక పతకం... ఆంధ్రప్రదేశ్ ఖాతాలో ఒక పతకం చేరాయి. మహిళల తైక్వాండో (క్యోరుగీ) అండర్–73 కేటగిరీలో తెలంగాణకు చెందిన పాయం హర్షప్రద రజత పతకం సొంతం చేసుకుంది. ఫైనల్లో హర్షప్రద 0–2 తేడాతో ఇతిషా దాస్ (చండీగఢ్) చేతిలో పరాజయం పాలైంది.ప్రస్తుతం తెలంగాణ ఆరు పతకాలతో (1 స్వర్ణం, 1 రజతం, 4 కాంస్యాలు) 28వ స్థానంలో ఉంది. మరోవైపు పురుషుల తైక్వాండో అండర్–68 కేటగిరీలో ఆంధ్రప్రదేశ్కు చెందిన టి.వరుణ్ కాంస్య పతకం గెలిచాడు. సెమీఫైనల్లో వరుణ్ 0–2తో మహేంద్ర పరిహార్ (ఉత్తరాఖండ్) చేతిలో ఓడిపోయాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ 10 పతకాలతో (4 స్వర్ణాలు, 1 రజతం, 5 కాంస్యాలు) 18వ స్థానంలో ఉంది. మరిన్ని క్రీడా వార్తలుసెమీస్లో మాయ ముంబై: తన సంచలన ప్రదర్శన కొనసాగిస్తూ భారత టీనేజ్ టెన్నిస్ స్టార్ మాయ రాజేశ్వరన్ రేవతి ముంబై ఓపెన్ డబ్ల్యూటీఏ–125 టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 15 ఏళ్ల మాయ 6–4, 3–6, 6–2తో ప్రపంచ 285వ ర్యాంకర్ మి యామగుచి (జపాన్)పై గెలిచింది. రెండు గంటలపాటు సాగిన ఈ మ్యాచ్లో మాయ ఐదు ఏస్లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. స్పెయిన్లోని రాఫెల్ నాదల్ అకాడమీలో శిక్షణ పొందుతున్న మాయ నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ 117వ ర్యాంకర్ జిల్ టెచ్మన్ (స్విట్జర్లాండ్)తో తలపడుతుంది.భారత మూడో ర్యాంకర్, తెలంగాణకు చెందిన భమిడిపాటి శ్రీవల్లి రష్మిక పోరాటం ఈ టోరీ్నలో ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో రష్మిక 2–6, 2–6తో జిల్ టెచ్మన్ చేతిలో ఓడిపోయింది. క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలైన రష్మికకు 3,450 డాలర్ల (రూ. 3 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 27 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. రాజస్తాన్ రాయల్స్ స్పిన్ బౌలింగ్ కోచ్గా బహుతులేజైపూర్: భారత మాజీ లెగ్స్పిన్నర్ సాయిరాజ్ బహుతులే ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ జట్టుతో మరోసారి జత కట్టనున్నాడు. టీమ్ స్పిన్ బౌలింగ్ కోచ్గా బహుతులేను మేనేజ్మెంట్ ఎంపిక చేసింది. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) కోచ్లలో ఒకడిగా ఉన్న బహుతులే 2018–21 మధ్య కాలంలో కూడా రాజస్తాన్ రాయల్స్ సహాయక సిబ్బందిలో భాగంగా ఉన్నాడు.టీమ్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, బౌలింగ్ కోచ్ షేన్ బాండ్లతో కలిసి అతను పని చేస్తాడు. భారత జట్టు హెడ్ కోచ్గా ద్రవిడ్ ఉన్న సమయంలో రెండు వేర్వేరు సిరీస్లలో బహుతులే కోచింగ్ బృందంలో ఉన్నాడు. బహుతులే భారత్ తరఫున 2 టెస్టులు, 8 వన్డేలు ఆడి 5 వికెట్లు తీశాడు. -
చెప్పినా వినలేదు.. పాకిస్తాన్కు భారీ షాక్!
అంతర్జాతీయ ఫుట్బాల్ సంఘాల సమాఖ్య (FIFA) పాకిస్తాన్ ఫుట్బాల్ సమాఖ్యపై సస్పెన్షన్ వేటు వేసింది. ‘ఫిఫా’ నియమావళికి అనుగుణంగా పాక్ ఫుట్బాల్ సమాఖ్య (PSF) నిర్వహణ జరగకపోవడంతో ‘ఫిఫా’ శుక్రవారం ఆ దేశ సమాఖ్యపై నిషేధం విధించింది. ‘ఫిఫా’ నియమావళి ప్రకారం నడుచుకునేలా పీఎఫ్ఎఫ్ నిబంధనల్ని సవరించుకోవాలని.. తద్వారా దేశంలో ఆటపై జవాబుదారీతనం పెరగాలని ‘ఫిఫా’ పలు సూచనల్ని చేసినా... పీఎఫ్ఎఫ్ పెడచెవిన పెట్టింది. నిషేధాజ్ఞలుంటాయని హెచ్చరించినా సవరణలు చేయకపోవడంతో ‘ఫిఫా’ తాజాగా సమాఖ్యను సస్పెండ్ చేసింది.అదే విధంగా తాము సూచించిన సవరణలు పూర్తి చేసేదాకా నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. 2019 జూన్లో ‘ఫిఫా’ నియమించిన కమిటీనే పీఎఫ్ఎఫ్ వ్యవహారాలను చక్కబెడుతోంది. కానీ హరూన్ మాలిక్ నేతృత్వంలోని ఈ కమిటీని అక్కడి ప్రభుత్వం శాసించడంతో ఎన్నికల నిర్వహణ, నిబంధనల్లో సవరణల ప్రక్రియ మాత్రం చేపట్టలేకపోయింది.ఈ నేపథ్యంలో హరూన్ తమపై వేటు తప్పదని ఇటీవల పార్లమెంటరీ ప్యానెల్ దృష్టికి తెచ్చినా అక్కడి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ‘ఫిఫా’ నియమావళికి తగ్గ మార్పుచేర్పులకు పాక్ ప్రభుత్వ ఆజమాయిషీలోని సమాఖ్య సిద్ధంగా లేదని హరూన్ మాలిక్ ఇటీవల వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ‘ఫిఫా’ కఠిన చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. 2017 నుంచి పాక్ సమాఖ్యపై వేటు పడటం ఇది మూడోసారి! మరిన్ని క్రీడావార్తలు40 ఏళ్ల వయసులో 40 పాయింట్లు!.. లెబ్రాన్ జేమ్స్ కొత్త రికార్డు లాస్ఏంజెలిస్: అమెరికా బాస్కెట్బాల్ దిగ్గజం లెబ్రాన్ జేమ్స్ ప్రతిష్టాత్మక నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) లీగ్లో అరుదైన ఘనతను నమోదు చేశాడు. ఒక ఎన్బీఏ గేమ్లో 40కి పైగా పాయింట్లు సాధించిన అతి పెద్ద వయస్కుడిగా అతను నిలిచాడు. గురువారం లెబ్రాన్ గోల్డెన్ స్టేట్ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో 120–112 పాయింట్ల తేడాతో లాస్ఏంజెలిస్ లేకర్స్ విజయం సాధించింది. ఇందులో లెబ్రాన్ ఒక్కడే 42 పాయింట్లు సాధించాడు. గత ఏడాది డిసెంబర్ 30న లెబ్రాన్ 40 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. గతంలో ఆల్టైమ్ గ్రేట్ మైకేల్ జోర్డాన్ 40 ఏళ్ల 3 రోజుల వయసులో (2003లో వాషింగ్టన్ విజార్డ్స్ తరఫున) ఒక గేమ్లో 40కి పైగా పాయింట్లు నమోదు చేశాడు. ఈ రికార్డును ఇప్పుడు లెబ్రాన్ సవరించాడు.పోరాడి ఓడిన రిత్విక్ జోడీ సాక్షి, హైదరాబాద్: డాలస్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ పేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. అమెరికాలోని టెక్సస్లో జరుగుతున్న ఈ టోర్నీ పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో రిత్విక్ (భారత్)–నికోలస్ బారింటోస్ (కొలంబియా) ద్వయం 6–7 (4/7), 7–5, 6–10తో ‘సూపర్ టైబ్రేక్’లో రాజీవ్ రామ్–ఆస్టిన్ క్రాయిసెక్ (అమెరికా) జంట చేతిలో ఓడిపోయింది.1 గంట 57 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో రిత్విక్–బారింటోస్ మూడు ఏస్లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్లు చేశారు. తమ సర్వీస్ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను రెండుసార్లు బ్రేక్ చేశారు. అయితే నిర్ణాయక సూపర్ టైబ్రేక్లో అనుభవజ్ఞులైన రాజీవ్ రామ్, క్రాయిసెక్ పైచేయి సాధించి విజయాన్ని ఖరారు చేసుకున్నారు. రిత్విక్–బారింటోస్లకు 11,840 డాలర్ల (రూ. 10 లక్షల 38 వేలు) ప్రైజ్మనీ లభించింది. గత ఏడాది అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్ సర్క్యూట్లో నిలకడగా రాణించిన రిత్విక్ ... గత వారం భారత్–టోగో జట్ల మధ్య న్యూఢిల్లీలో జరిగిన వరల్డ్ గ్రూప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్ ద్వారా డేవిస్ కప్లో అరగేంట్రం చేశాడు. -
ఫైనల్లో సాకేత్–రామ్ జోడీ
చెన్నై: కొత్త ఏడాదిలో ఆడుతున్న మూడో టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్, భారత డేవిస్కప్ జట్టు మాజీ సభ్యుడు సాకేత్ మైనేని(Saket Myneni) టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. భారత్కే చెందిన రామ్కుమార్ రామనాథన్తో జత కట్టిన సాకేత్ చెన్నై ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి సెమీఫైనల్లో మూడో సీడ్, డిఫెండింగ్ చాంపియన్ సాకేత్–రామ్కుమార్ (భారత్) ద్వయం 7–6 (7/5), 7–6 (10/8)తో టాప్ సీడ్ రే హో (చైనీస్ తైపీ)–మాథ్యూ క్రిస్టోఫర్ రోమియోస్ (ఆ్రస్టేలియా) జోడీపై సంచలన విజయం సాధించింది. 98 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సాకేత్–రామ్ ఐదు ఏస్లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్లు చేశారు. రెండు జోడీలు తమ సర్వీస్లను రెండేసి సార్లు కోల్పోయాయి. అయితే టైబ్రేక్లో మాత్రం సాకేత్–రామ్ ద్వయం పైచేయి సాధించి విజయాన్ని ఖరారు చేసుకుంది. నేడు జరిగే ఫైనల్లో షింటారో మొచిజుకి–కైటో యుసుగి (జపాన్) జోడీతో సాకేత్–రామ్ ద్వయం తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో మొచిజుకి–యుసుగి జంట 4–6, 6–4, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో రెండో సీడ్ జీవన్ నెడుంజెళియన్–విజయ్ సుందర్ ప్రశాంత్ (భారత్) జోడీపై గెలిచింది. -
ఒడిశాపై గోవా గెలుపు
గోవా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్లో గోవా ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) 2–1 స్కోరుతో ఒడిశా జట్టుపై విజయం సాధించింది. జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్లో గోవా తరఫున బ్రిసన్ డ్యూబెన్ ఫెర్నాండెజ్ 29వ నిమిషంలో గోల్ సాధించి గోవాకు తొలి ఆధిక్యం ఇచ్చాడు. ఒడిశా ఆటగాడు లాల్తతంగ ఖవిహ్రింగ్ (47వ నిమిషంలో) చేసిన సెల్ఫ్ గోల్ గోవా ఆధిక్యాన్ని రెట్టింపు చేసింది. 54వ నిమిషంలో ఒడిశా స్ట్రయికర్ కేపీ రాహుల్ గోల్ చేసినప్పటికీ గోవా విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయాడు. నిజానికి ఈ మ్యాచ్లో ఒడిశా తమ దాడులకు పదునుపెట్టలేకపోయింది. అవతలివైపు నుంచి గోవా ఎఫ్సీ ఆటగాళ్లు మాత్రం పదేపదే ప్రత్యర్థి గోల్పోస్ట్వైపు దూసుకొచ్చి ఏకంగా 20 షాట్లు కొట్టారు. లక్ష్యంపై ఆరుసార్లు గురిపెట్టగా ఒకసారి గోల్తో విజయవంతమైంది. ఒడిశా 15 షాట్లు ఆడినా... కేవలం ప్రత్యర్థి గోల్పోస్ట్పై రెండే సార్లు దాడి చేసింది. ఇందులో ఒకసారి మాత్రం ఫలితాన్ని సాధించింది. గోవా ఆటగాళ్లు మైదానంలో పాదరసంలా కదిలారు. బంతిని ప్రత్యర్థులకంటే తమ ఆధీనంలో ఉంచుకునేందుకు అదేపనిగా చకచకా పాస్లు చేశారు. శుక్రవారం షిల్లాంగ్లో జరిగే పోరులో నార్త్ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సీ జట్టుతో ముంబై సిటీ ఎఫ్సీ తలపడుతుంది. -
15 పాయింట్లతో మూడు గేమ్లు!
న్యూఢిల్లీ: గత కొంతకాలంగా మెరుపు వేగంలో ముగిసే ఆటలపై పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా బ్యాడ్మింటన్ కూడా అటువైపే పయనించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్ ) 21 పాయింట్లతో మూడు గేముల (బెస్టాఫ్ త్రీ) స్కోరింగ్ విధానాన్ని అమలు చేస్తోంది. ఆయా దేశాల్లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లోనూ ఇదే స్కోరింగ్తో టోర్నీలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఆట మరింత రసవత్తరంగా జరిగేందుకు, మ్యాచ్ చకచకా ముగిసిపోయేందుకు కొత్త స్కోరింగ్ విధానం అమలు చేసేందుకు బీడబ్ల్యూఎఫ్ సిద్ధమైంది. ఇప్పుడున్న మూడు గేమ్లను 15 పాయింట్లతో ముగించి ఆటలో వేగం పెంచనుంది. తద్వారా కొత్తతరం ప్రేక్షకుల్ని ఆకర్శించాలని, సుదీర్ఘంగా సాగదీయకుండా, నిమిషాల్లో మ్యాచ్ ఫలితం వచ్చేలా కొత్త స్కోరింగ్ విధానాన్ని ఈ ఏప్రిల్ నుంచే అమలు చేయాలని బీడబ్ల్యూఎఫ్ కౌన్సిల్ నిర్ణయించింది. నవంబర్లో కౌలాలంపూర్లో జరిగే బీడబ్ల్యూఎఫ్ అత్యున్నత సమావేశానికి ముందు ఆరు నెలల పాటు ఈ స్కోరింగ్ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశాక... ఆ సమావేశంలో సమీక్షించి తుది నిర్ణయాన్ని తీసుకుంటారు. ‘కాంటినెంటల్ చాంపియన్షిప్లు, గ్రేడ్–3 టోర్నమెంట్లు, జాతీయ, అంతర్జాతీయ లీగ్లు, జాతీయ టోర్నీల్లో ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఈ కొత్త స్కోరింగ్ పద్ధతిని అవలంభిస్తారు’ అని బీడబ్ల్యూఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త విధానం వల్ల మ్యాచ్ల్లో పోటీ మరింత పెరుగుతుందని, ప్రతీ పాయింట్ కోసం ప్రత్యర్థులు దీటుగా సన్నద్ధమై బరిలోకి దిగుతారని, మ్యాచ్ త్వరగా ముగియడం కాదు... పోటాపోటీగా జరగడం ఖాయమని బీడబ్ల్యూఎఫ్ వివరణ ఇచ్చింది. నిజానికి 15 పాయింట్ల ‘బెస్టాఫ్ త్రీ’ గేమ్లు కొత్తేం కాదు. అంతర్జాతీయ బ్యాడ్మింటన్లో గతంలో ఏళ్ల తరబడి ఈ స్కోరింగ్ పద్ధతిలో మ్యాచ్లు జరిగాయి. తర్వాత 7 పాయింట్లతో ‘బెస్టాఫ్ ఫైవ్’ పద్ధతిలోనూ కొన్నాళ్లు జరిగాయి. క్రమానుగతంగా మారుతుండగా 2014లో తొలిసారి 11 పాయింట్లతో ‘బెస్టాఫ్ ఫైవ్’ స్కోరింగ్ పద్ధతి తెరపైకి వచ్చింది. కానీ బీడబ్ల్యూఎఫ్లోని సభ్యదేశాలు సమ్మతించకపోవడంతో ఆ ఏడాది, తర్వాత 2021లో బీడబ్ల్యూఎఫ్ కౌన్సిల్లో కనీస మద్దతు లభించక మరోసారి ఇలా రెండుసార్లూ ప్రతిపాదన దశలోనే ఆ స్కోరింగ్ (11 పాయింట్ల బెస్టాఫ్ ఫైవ్) పద్ధతిని ఉపసంహరించుకున్నారు. దీంతో 2006 నుంచి స్థిరంగా ప్రస్తుత 21 పాయింట్ల స్కోరింగే కొనసాగుతోంది. -
‘కామన్వెల్త్’లో స్విమ్మింగ్, సైక్లింగ్లకు పెద్దపీట
గ్లాస్గో: వచ్చే ఏడాది జరిగే కామన్వెల్త్ గేమ్స్లో క్రీడల్ని కుదించినప్పటికీ కొన్ని క్రీడలకు పెద్దపీట వేశారు. ముఖ్యంగా సైక్లింగ్, స్విమ్మింగ్, పారా పోటీల్లో గణనీయంగా పతకాల ఈవెంట్లు పెంచారు. దీంతో వచ్చే ఏడాది గ్లాస్గో ఆతిథ్యమివ్వబోయే ఈ కామన్వెల్త్ మెగా ఈవెంట్లో 200కు పైగా బంగారు పతకాలు అథ్లెట్ల పరం కానున్నాయి. దాదాపు 60 ఏళ్ల తర్వాత మిక్స్డ్ 4–400 మీటర్ల రిలే విభాగాన్ని తిరిగి ఈ కామన్వెల్త్లో చేర్చారు. చివరిసారిగా 1966లో మిక్స్డ్ రిలే విభాగం పోటీలు నిర్వహించాక తదనంతరం క్రీడల్లో ఆ ఈవెంట్కు మంగళం పాడారు. దీనిపై ప్రపంచ అథ్లెటిక్స్ అధ్యక్షుడు సెబాస్టియన్ కో హర్షం వ్యక్తం చేశారు. 1930 నుంచి 1966 వరకు కామన్వెల్త్లో అలరించిన మిక్స్డ్ రిలే ఈవెంట్ మళ్లీ ఆరు దశాబ్దాల తర్వాత గ్లాస్గోలో పతకాల కోసం పరుగుపెట్టబోతోంది’ అని అన్నారు. పారా అథ్లెటిక్స్లోని 10 ఈవెంట్లలో ఏకంగా ఆరు క్రీడాంశాలకు గేమ్స్ ఆర్గనైజింగ్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రికార్డుస్థాయిలో 47 పతకాలు పారా అథ్లెట్లు అందుకోనున్నారు. సైక్లింగ్లో 26 పతకాల ఈవెంట్లు (పారా సైక్లింగ్ కలిపి), స్విమ్మింగ్, పారా స్విమ్మింగ్లలో 56 పతకాలు ఈతకొలనులో కొల్లగొట్టనున్నారు. ఈ సారి కొత్తంగా 800 మీటర్ల ఫ్రీస్టయిల్, 1500 మీటర్ల మహిళల ఫ్రీస్టయిల్ రేసుల్ని చేర్చారు. 2026లో జూలై 23 నుంచి ఆగస్టు 2 వరకు 11 రోజుల పాటు గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ జరుగనున్నాయి. పది క్రీడాంశాలు జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, పారా అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, వీల్చైర్ బాస్కెట్బాల్, బాక్సింగ్, స్విమ్మింగ్, పారా స్విమ్మింగ్ , బౌల్స్, పారా బౌల్స్ (ఇండోర్), జూడో, నెట్బాల్, ట్రాక్ సైక్లింగ్, పారా సైక్లింగ్, వెయిట్లిఫ్టింగ్, పారా పవర్లిఫ్టింగ్లో పోటీలుంటాయి. కామన్వెల్త్ ఎరెనా, సర్ క్రిస్ హో వెలొడ్రోమ్, స్కాటిష్ ఎగ్జిబిషన్ సెంటర్ (ఎస్ఈసీ), స్కాట్స్టౌన్ స్టేడియం, టోల్క్రాస్ ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ సెంటర్ వేదికల్లో పది రోజుల పాటు పోటీలు జరుగుతాయి. తొలి రోజు కేవలం ఆరంభ వేడుకలు నిర్వహిస్తారు. -
స్వప్నిల్కు కాంస్యం
డెహ్రాడూన్: జాతీయ క్రీడల్లో ఒలింపిక్ పతక విజేత స్వప్నిల్ కుసాలె కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. షూటింగ్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రి పొజిషన్ విభాగంలో మహారాష్ట్ర షూటర్ స్వప్నిల్ మూడో స్థానంలో నిలిచాడు. ఈ విభాగంలో సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు (ఎస్ఎస్సీబీ) తరఫున బరిలోకి దిగిన 25 ఏళ్ల నీరజ్ కుమార్ 464.1 పాయింట్లతో స్వర్ణం చేజిక్కించుకున్నాడు. మధ్యప్రదేశ్కు చెందిన ఐశ్వరి ప్రతాప్ సింగ్ (462.4 పాయింట్లు) రజత పతకం దక్కించుకోగా... పారిస్ ఒలింపిక్స్ కాంస్యం నెగ్గి ఈ విభాగంలో దేశానికి తొలి పతకం అందించిన స్వప్నిల్ (447.7 పాయింట్లు) కాంస్యం గెలుచుకున్నాడు. మరోవైపు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో సురుచి సింగ్–ప్రమోద్ (హరియాణా) 17–7 పాయింట్ల తేడాతో అంజలి షెఖావత్–ఉమేశ్ చౌదరీ (రాజస్తాన్)పై గెలిచి పసిడి ఖాతాలో వేసుకుంది. రాహి సర్ణోబత్–ప్రణవ్ అరవింద్ పాటిల్ (మహారాష్ట్ర) జట్టు కాంస్యం గెలుచుకుంది. సుదీర్ఘ కాలంగా భారత టాప్ ఆర్చర్గా ఉన్న దీపిక కుమారి పసిడిని అందుకుంది. పారిస్ ఒలింపిక్స్లో పతకం సాధించడంలో విఫలమైన దీపిక నేషనల్ గేమ్స్లో జార్ఖండ్ తరఫున బరిలోకి దిగి వ్యక్తిగత విభాగంతో పాటు టీమ్ ఈవెంట్లోనూ స్వర్ణం కైవసం చేసుకుంది. పురుషుల విభాగంలో నాలుగుసార్లు ఒలింపిక్స్లో పాల్గొన్న సీనియర్ ఆర్చర్ తరుణ్దీప్ రాయ్ను ఓడించిన 18 ఏళ్ల బెంగాల్ ఆర్చర్ జుయెల్ సర్కార్ జాతీయ చాంపియన్గా అవతరించాడు. మరో వైపు బాక్సింగ్లో లవ్లీనా బోర్గొహైన్, ఆరు సార్లు ఆసియా చాంపియన్ శివ థాపా విజయాలు సాధించారు. మహిళల 75 కేజీల విభాగంలో లవ్లీనా తిరుగులేని ప్రదర్శన కనబర్చగా... పురుషుల 64 కేజీల విభాగంలో శివ థాపా (అసోం) సత్తాచాటాడు. -
ఫెరారీ రిజర్వ్ డ్రైవర్గా జో గ్వాన్యు
ఫార్ములావన్లో బరిలోకి దిగిన తొలి చైనా డ్రైవర్గా గుర్తింపు పొందిన జో గ్వాన్యు తన కెరీర్లో గొప్ప పురోగతి సాధించాడు. 2025 సీజన్కుగాను విఖ్యాత ఫెరారీ జట్టులో రిజర్వ్ డ్రైవర్గా స్థానం దక్కించుకున్నాడు. రెండో రిజర్వ్ డ్రైవర్గా ఆంటోనియో జియోవినాజి కొనసాగుతాడు. ఈ సీజన్లో ఫెరారీ జట్టుకు రెగ్యులర్ డ్రైవర్లయిన లూయిస్ హామిల్టన్, చార్లెస్ లెక్లెర్క్లలో ఒకరు ప్రధాన రేసులో బరిలోకి దిగే అవకాశం లేకపోతే వారి స్థానాల్లో జో గ్వాన్యు లేదా జియోవినాజిలకు చాన్స్ లభిస్తుంది. 25 ఏళ్ల జో గ్వాన్యు 2022లో అల్ఫా రోమియో జట్టు తరఫున ఫార్ములావన్లో అరంగేట్రం చేశాడు. 2024లో అల్ఫా రోమియో జట్టు తమ పేరును సాబెర్గా మార్చుకుంది. వరుసగా మూడేళ్లు అల్ఫా రోమియో/సాబెర్ జట్టుకు ప్రధాన డ్రైవర్గా వ్యవహరించిన జో గ్వాన్యు మొత్తం 68 రేసుల్లో పోటీపడ్డాడు. ఓవరాల్గా ఏడుసార్లు టాప్–10లో నిలిచాడు. 2022లో కెనడా గ్రాండ్ప్రిలో, 2024లో ఖతర్ గ్రాండ్ప్రిలో గ్వాన్యు అత్యుత్తంగా ఎనిమిదో స్థానంలో నిలిచాడు. సాకేత్–రామ్ జంట శుభారంభంచెన్నై ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో సాకేత్–రామ్కుమార్ రామనాథన్ (భారత్) జోడీ 6–3, 6–1తో కిమర్ కాప్జాన్స్ (బెల్జియం)–ఎర్గీ కిర్కిన్ (టర్కీ) ద్వయంపై అలవోకగా గెలిచింది. 53 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో సాకేత్–రామ్ ద్వయం ఎనిమిది ఏస్లు సంధించింది. తమ సరీ్వస్ను ఒక్కసారి కూడా కోల్పోకుండా ప్రత్యర్థి సరీ్వస్ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. భారత్కే చెందిన విజయ్ సుందర్ ప్రశాంత్–జీవన్ నెడుంజెళియన్ జంట 6–3, 3–6, 13–11తో చిరాగ్ దుహాన్–దేవ్ జావియా (భారత్) జోడీపై నెగ్గి క్వార్టర్ ఫైనల్ చేరింది. -
Ranji Trophy QFs: ముంబై- హర్యానా మ్యాచ్ వేదికను మార్చిన బీసీసీఐ
ముంబై: డిఫెండింగ్ చాంపియన్ ముంబై(Mumbai), హరియాణా జట్ల మధ్య ఈనెల 8 నుంచి జరగాల్సిన రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్(Ranji Trophy Quarter Finals) వేదిక మారింది. హరియాణాలోని లాహ్లీలో జరగాల్సిన ఈ మ్యాచ్ను కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్కు మార్చారు. హరియాణాలో చలితీవ్రత అధికంగా ఉండటంతో పాటు... ఉదయం పూట పొగమంచు కప్పేస్తుండటంతో లాహ్లీలో నిర్వహించాల్సిన మ్యాచ్ను కోల్కతాకు మార్చినట్లు బీసీసీఐ నుంచి సమాచారం అందింది’ అని ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) అధ్యక్షుడు అజింక్య నాయక్ బుధవారం పేర్కొన్నారు.కాగా 42 సార్లు రంజీ ట్రోఫీ విజేతగా నిలిచిన ముంబై జట్టు ఈసారి కూడా ఫేవరెట్గా బరిలోకి దిగనుంది. సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే(Ajinkya Rahane) సారథ్యం వహిస్తున్న ముంబై జట్టులో భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పేస్ ఆల్రౌండర్లు శివమ్ దూబే, శార్దుల్ ఠాకూర్ వంటి పలువురు స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. మిగిలిన మూడు క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్లు షెడ్యూల్ ప్రకారమే నిర్వహించనున్నారు. రాజ్కోట్ వేదికగా సౌరాష్ట్ర, గుజరాత్ క్వార్టర్ ఫైనల్... నాగ్పూర్ వేదికగా విదర్భ, తమిళనాడు పోరు... పుణేలో జమ్ముకశ్మీర్, కేరళ మ్యాచ్లు జరగనున్నాయి. మరిన్ని క్రీడా వార్తలుభారత బ్యాడ్మింటన్ జట్టులో జ్ఞాన దత్తు, తన్వీ రెడ్డి న్యూఢిల్లీ: డచ్ ఓపెన్, జర్మనీ ఓపెన్ అండర్–17 జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లలో పాల్గొనే భారత జట్లను ప్రకటించారు. జాతీయ జూనియర్ చాంపియన్, హైదరాబాద్ కుర్రాడు జ్ఞాన దత్తుతోపాటు హైదరాబాద్కే చెందిన మరో ప్లేయర్ తన్వీ రెడ్డి భారత జట్టులోకి ఎంపికయ్యారు. డచ్ ఓపెన్ ఫిబ్రవరి 26 నుంచి మార్చి 2 వరకు... జర్మన్ ఓపెన్ మార్చి 5 నుంచి 9 వరకు జరుగుతాయి.మనుష్–దియా జోడీ ఓటమి న్యూఢిల్లీ: సింగపూర్ స్మాష్ వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) టోర్నమెంట్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో మనుష్ షా–దియా చిటాలె (భారత్) ద్వయం పోరాటం ముగిసింది. బుధవారం సింగపూర్లో జరిగిన మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో మను‹Ù–దియా జోడీ 11–9, 4–11, 8–11, 8–11తో అల్వారో రాబెల్స్–మరియా జియో (స్పెయిన్) జంట చేతిలో ఓడిపోయింది. క్వార్టర్స్లో ఓడిన మనుష్–దియా జోడీకి 2000 డాలర్ల (రూ. 1 లక్ష 74 వేలు) ప్రైజ్మనీతోపాటు 350 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. క్వార్టర్స్లో రియా–రష్మిక జోడీముంబై: ఎల్ అండ్ టి ముంబై ఓపెన్ డబ్ల్యూటీఏ–125 టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక–రియా భాటియా (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో రషి్మక–రియా ద్వయం 5–7, 6–2, 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో మియా హొంటామా–క్యోకా ఒకమురా (జపాన్) జంటను ఓడించింది. 89 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో భారత జోడీ రెండు ఏస్లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్లు చేసింది.తమ సర్వీస్ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. రుతుజా భోస్లే (భారత్)–అలీసియా బార్నెట్ (బ్రిటన్); ప్రార్థన తొంబారే (భారత్)–అరీన్ హర్తానో (నెదర్లాండ్స్) జోడీలు కూడా క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాయి. నేడు జరిగే సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్లో అలెగ్జాండ్రా క్రునిక్ (సెర్బియా)తో రష్మిక; రెబెకా మరీనో (కెనడా)తో అంకిత రైనా; జరీనా దియాస్ (కజకిస్తాన్)తో మాయ రాజేశ్వరి తలపడతారు. -
హాలెప్ వీడ్కోలు
బుకారెస్ట్ (రొమేనియా): మాజీ ప్రపంచ నంబర్వన్ మహిళా టెన్నిస్ ప్లేయర్ సిమోనా హాలెప్ (రొమేనియా) కెరీర్కు వీడ్కోలు పలికింది. డోపింగ్ సస్పెన్షన్తో పాటు గాయాల కారణంగా చాన్నాళ్లుగా ఇబ్బంది పడుతున్న 33 ఏళ్ల హాలెప్... బుధవారం ప్రొఫెషనల్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించింది. రెండు గ్రాండ్స్లామ్ టైటిల్స్ సాధించిన హాలెప్... టాన్సిల్వేనియా ఓపెన్ తొలి రౌండ్లో పరాజయం ఆనంతరం తన నిర్ణయాన్ని వెల్లడించింది. ‘ఇది సంతోషమో, బాధో అర్థం కావడం లేదు. కానీ ఈ నిర్ణయంతో నా మనసు ప్రశాంతంగా ఉంటుంది అని మాత్రం చెప్పగలను. ప్రొఫెషనల్ టెన్నిస్ ఆడేందుకు నా శరీరం సహకరించదని అనిపిస్తోంది. అందుకే ఆట నుంచి తప్పుకుంటున్నా. ఈ స్థాయికి చేరేందుకు ఎన్నో కష్టాలు పడ్డా. చివరి మ్యాచ్లో మెరుగైన ప్రదర్శన చేయలేకపోయా. అయినా అభిమానుల సమక్షంలో మైదానంలో దిగడాన్ని ఆస్వాదించా’ అని హాలెప్ పేర్కొంది. 2017లో డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచిన హాలెప్... ఆ తర్వాత గాయాలు, నిషేధం కారణంగా 870వ ర్యాంక్కు పడిపోయింది. టాన్సిల్వేనియా ఓపెన్లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఆమె బుధవారం జరిగిన మ్యాచ్లో 1–6, 1–6తో లుసియా బ్రాంజెట్టి (రొమేనియా) చేతిలో ఓడింది. మోకాలు, భుజం గాయాలతో ఇబ్బంది పడుతున్న హాలెప్ ఇటీవల ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీ క్వాలిఫయింగ్ టోర్నీ నుంచి కూడా తప్పుకుంది. 2018 ఫ్రెంచ్ ఓపెన్, 2019 వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టైటిల్స్ నెగ్గిన హాలెప్ మరో మూడు గ్రాండ్స్లామ్ (2014, 2017 ఫ్రెంచ్ ఓపెన్, 2018 ఆస్ట్రేలియా ఓపెన్) టోర్నీల్లో రన్నరప్గా నిలిచింది. 2022 యూఎస్ ఓపెన్ తొలి రౌండ్ పరాజయం అనంతరం డోపింగ్ కారణంగా హాలెప్ ప్రొఫెషనల్ కెరీర్కు దూరమైంది. దీంతో ఆమె మీద నాలుగు సంవత్సరాల నిషేధం పడింది. దీనిపై హాలెప్ కోర్ట్ ఆఫ్ అర్బిట్రేషన్ స్పోర్ట్లో అప్పీల్ చేసుకోగా... నిషేధాన్ని 9 నెలలకు తగ్గించారు. అయితే గాయాల బెడద ఎక్కువవడంతో తిరిగి కోర్టులో పూర్వ వైభవం సాధించలేకపోయింది. కెరీర్ విశేషాలు 24 మొత్తం గెలిచిన సింగిల్స్ టైటిల్స్ 2 సాధించిన గ్రాండ్స్లామ్ టైటిల్స్ (2018 ఫ్రెంచ్ ఓపెన్; 2019 వింబుల్డన్) 580 కెరీర్లో గెలిచిన మ్యాచ్లు 243 కెరీర్లో ఓడిన మ్యాచ్లు 1 అత్యుత్తమ ర్యాంక్ (అక్టోబర్ 9, 2017) 64 ప్రపంచ నంబర్వన్గా ఉన్న వారాలు గ్రాండ్స్లామ్ టోర్నీలలో గెలుపోటములు (112/44) » ఆ్రస్టేలియన్ ఓపెన్ (12 సార్లు): 31/12 » ఫ్రెంచ్ ఓపెన్ (11 సార్లు): 32/11 » వింబుల్డన్ (10 సార్లు): 29/9 » యూఎస్ ఓపెన్ (12 సార్లు): 20/12 సంపాదించిన మొత్తం ప్రైజ్మనీ 4,02,32,663 డాలర్లు (రూ. 351 కోట్లు) -
ఆంధ్రప్రదేశ్కు మూడో స్వర్ణం
డెహ్రాడూన్: జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ ఖాతాలో మూడో స్వర్ణ పతకం చేరింది. బుధవారం మహిళల కనోయ్ స్లాలోమ్ కే–1 విభాగంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన నాగిడి గాయత్రి పసిడి పతకం సాధించింది. అంతకుముందు వెయిట్లిఫ్టింగ్లో నీలంరాజు, పల్లవి బంగారు పతకాలు గెలిచిన సంగతి తెలిసిందే. బుధవారమే ఆర్చరీలో ఆంధ్రప్రదేశ్కు ఒక రజతం, ఒక కాంస్యం లభించాయి. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో తిరుమూరు గణేశ్ మణిరత్నం–మాదాల సూర్య హంసిని జోడీ రజత పతకం గెలిచింది. ఫైనల్లో గణేశ్–సూర్య హంసిని ద్వయం 148–154 పాయింట్ల తేడాతో రిషభ్ యాదవ్–దీప్షిక (హరియాణా) జంట చేతిలో ఓడింది. కాంపౌండ్ పురుషుల వ్యక్తిగత విభాగంలో తిరుమూరు గణేశ్ మణిరత్నం కాంస్య పతకం సంపాదించాడు. తెలంగాణకు కాంస్యం మరోవైపు తెలంగాణ ఖాతాలో బుధవారం ఒక కాంస్య పతకం చేరింది. మహిళల ఆర్చరీ కాంపౌండ్ టీమ్ విభాగంలో చికిత, మానస నయన, శ్రేష్ణ రెడ్డి, మన్సూరా హసీబాలతో కూడిన తెలంగాణ జట్టు కాంస్య పతకాన్ని దక్కించుకుంది. తెలంగాణ జట్టు 232 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. బుధవారం పోటీలు ముగిశాక ఆంధ్రప్రదేశ్ 3 స్వర్ణాలు, 1 రజతం, 4 కాంస్యాలతో కలిపి 8 పతకాలతో 18వ స్థానంలో... తెలంగాణ 1 స్వర్ణం, 3 కాంస్యాలతో కలిపి 4 పతకాలతో 25వ స్థానంలో ఉన్నాయి. -
స్విమ్మర్లు ధినిధి, శ్రీహరి నటరాజ్లకు చెరో తొమ్మిది పసిడి పతకాలు
జాతీయ క్రీడల్లో కర్ణాటక స్విమ్మర్లు ధినిధి డెసింగు, శ్రీహరి నటరాజ్ పతకాల పంట పండించారు. ఉత్తరాఖండ్లో జరుగుతున్న 38వ జాతీయ క్రీడల స్విమ్మింగ్ ఈవెంట్లో ఈ ఇద్దరూ చెరో 9 పసిడి పతకాలు ఖాతాలో వేసుకున్నారు. పారిస్ ఒలింపిక్స్లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన 14 ఏళ్ల ధినిధి మహిళల 100 మీటర్ల ఫ్రీస్టయిల్లో జాతీయ రికార్డు తిరగరాస్తూ స్వర్ణం చేజిక్కించుకోవడంతో పాటు... 400 మీటర్ల ఫ్రీస్టయిల్, మిక్స్డ్ 4్ఠ400 ఫ్రీస్టయిల్, 200 మీటర్ల ఫ్రీస్టయిల్, 100 మీటర్ల బటర్ఫ్లయ్, 4్ఠ100 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలే, 50 మీటర్ల ఫ్రీస్టయిల్, 4x200 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలే, మిక్స్డ్ 4x100 మీటర్ల మెడ్లేలో పసిడి పతకాలతో మెరిసింది. దీంతో పాటు 50 మీటర్ల బటర్ఫ్లయ్లో రజతం, 4x100 మీటర్ల రిలే మెడ్లేలో కాంస్యంతో మొత్తం 11 పతకాలు ఖాతాలో వేసుకుంది. పురుషుల విభాగంలో శ్రీహరి మొత్తం 10 పతకాలు (9 స్వర్ణాలు, 1 రజతం) సాధించాడు. మంగళవారంతో జాతీయ క్రీడల్లో స్విమ్మింగ్ పోటీలు ముగియగా... ఓవరాల్గా పట్టికలో కర్ణాటక 37 పతకాలతో (22 స్వర్ణాలు, 10 రజతాలు, 5 కాంస్యాలు)తో అగ్రస్థానంలో ఉంది. -
తెలంగాణకు తొలి స్వర్ణం
డెహ్రాడూన్: జాతీయ క్రీడల్లో తెలంగాణ ఖాతాలో మొదటి స్వర్ణం చేరింది. మహిళల బాస్కెట్బాల్ 3X3 ఈవెంట్లో తెలంగాణ జట్టు తొలి స్థానంలో నిలిచింది. ఫైనల్లో తెలంగాణ 21–11 పాయింట్ల తేడాతో కేరళపై విజయం సాధించింది. పసిడి పతకం సాధించిన మహిళల జట్టులో గులాబ్ షా అలీ, ఎస్.పుష్ప, కేబీ హర్షిత, పి.ప్రియాంక సభ్యులుగా ఉన్నారు. రెండేళ్ల క్రితం గోవా జాతీయ క్రీడల్లోనూ ఇదే ఈవెంట్లో విజేతగా నిలిచిన తెలంగాణ తమ స్వర్ణాన్ని నిలబెట్టుకుంది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో 14–12 తేడాతో తమిళనాడును ఓడించి మధ్యప్రదేశ్ కాంస్యం సొంతం చేసుకుంది. అంతకుముందు సెమీస్లో తెలంగాణ 18–11తో తమిళనాడును... కేరళ 13–10తో మధ్యప్రదేశ్ను ఓడించాయి. మరో వైపు పురుషుల బాస్కెట్బాల్ 3–3 ఈవెంట్లో మధ్యప్రదేశ్, కేరళ, తమిళనాడు స్వర్ణ, రజత, కాంస్యాలు గెలుచుకున్నాయి. ఫైనల్లో మధ్యప్రదేశ్ 22–20 తేడాతో కేరళను ఓడించింది. కాంస్యం కోసం జరిగిన మ్యాచ్లో తమిళనాడు చేతిలో 16–21తో ఓడిన తెలంగాణ నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్కు మూడు కాంస్యాలు మరోవైపు ఆంధ్రప్రదేశ్కు మంగళవారం మూడు కాంస్య పతకాలు లభించాయి. పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో కర్రి సాయిపవన్–షేక్ గౌస్ జోడీ... కనోయింగ్–కయాకింగ్ క్రీడాంశంలోని పురుషుల స్లాలోమ్–కే1 ఈవెంట్లో కొల్లకాని విష్ణు... మహిళల స్లాలోమ్–సీ1 ఈవెంట్లో దొడ్డి చేతన భగవతి కాంస్య పతకాలు సాధించారు. బ్యాడ్మింటన్ డబుల్స్ సెమీఫైనల్లో సాయిపవన్–షేక్ గౌస్ ద్వయం 13–21, 12–21తో నితిన్–ప్రకాశ్ రాజ్ (కర్ణాటక) జంట చేతిలో ఓడి కాంస్య పతకాన్ని ఖరారు చేసుకుంది. మంగళవారం పోటీలు ముగిశాక ఆంధ్రప్రదేశ్ ఆరు పతకాలతో 21వ స్థానంలో, మూడు పతకాలతో తెలంగాణ 24వ స్థానంలో ఉన్నాయి. -
రష్మిక సంచలనం
ముంబై: ఎల్ అండ్ టి ముంబై ఓపెన్ డబ్ల్యూటీఏ–125 టెన్నిస్ టోర్నమెంట్లో భారత మూడో ర్యాంకర్, హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక సంచలనంతో శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 325వ ర్యాంకర్ రష్మిక 6–1, 6–0తో ప్రపంచ 182వ ర్యాంకర్ ఎలీనా ప్రిడాన్కినా (రష్యా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 64 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో రష్మిక కేవలం ఒక్క గేమ్ మాత్రమే కోల్పోవడం విశేషం. రెండు ఏస్లు సంధించిన రష్మిక మూడు డబుల్ ఫాల్ట్లు చేసింది. తన సర్వీస్ను ఒక్కసారి చేజార్చుకున్న రష్మిక ప్రత్యర్థి సర్వీస్ను ఏడుసార్లు బ్రేక్ చేసింది. ఓవరాల్గా మ్యాచ్ మొత్తంలో ప్రిడాన్కినా తన సర్వీస్ను ఒక్కసారి కూడా నిలబెట్టుకోకపోవడం గమనార్హం. భారత్కే చెందిన అంకిత రైనా, మాయ రేవతి రాజేశ్వరన్ కూడా తొలి రౌండ్లో నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. 15 ఏళ్ల క్వాలిఫయర్ మాయ 6–4, 6–1తో ఇరీనా షైమనోవిచ్ (బెలారస్)పై, అంకిత రైనా 6–2, 6–2తో భారత్కే చెందిన వైష్ణవి అడ్కర్పై విజయం సాధించారు. -
మెస్సీ కాదు!.. నేనే అత్యుత్తమ ఆటగాడిని: రొనాల్డో
దాదాపు దశాబ్ద కాలానికి పైగా ఫుట్బాల్ ప్రపంచంలో మకుటం లేని మహారాజులుగా వెలుగొందుతున్నారు పోర్చుగల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo)- అర్జెంటీనా లెజెండ్ లియోనల్ మెస్సీ(Lionel Messi). అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకునే ఈ ఇద్దరికీ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అయితే, ఈ వీళ్లిద్దరిలో ఎవరు గొప్ప అన్న చర్చ ఎప్పుడూ ఆసక్తికరమే.ఈ విషయంపై రొనాల్డో స్వయంగా స్పందించాడు. చాలా మంది మెస్సీకే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్(GOAT) బిరుదు ఇచ్చేందుకు మొగ్గుచూపవచ్చని అభిప్రాయపడ్డాడు. అయితే, తాను మాత్రం పరిపూర్ణ ఫుట్బాలర్ని అని పేర్కొన్న రొనాల్డో.. ఫుట్బాల్ చరిత్రలో తన కంటే గొప్ప ఆటగాడు లేడని అనడం విశేషం.నేనే ‘కంప్లీట్ ప్లేయర్’స్పానిష్ మీడియా అవుట్లెట్ లాసెక్టా టీవీకి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో క్రిస్టియానో రొనాల్డో మాట్లాడుతూ.. ‘‘నాలాగా ప్రపంచంలో పరిపూర్ణమైన ఫుట్బాలర్ మరెవరూ లేరని అనుకుంటా. ఇప్పటి వరకు ఉన్న ఫుట్బాల్ ఆటగాళ్లందరిలో నేనే ‘కంప్లీట్ ప్లేయర్’. నేను అన్ని రకాలుగా ఫుట్బాల్ ఆడగలను. చాలా మంది మెస్సీ, మారడోనా లేదంటే.. పీలే పేరు చెప్తారేమో!చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాడినివాళ్ల అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను. ఏదేమైనా మోస్ట్ కంప్లీట్ ప్లేయర్ మాత్రం నేనే! ఫుట్బాల్ చరిత్రలోనే నేను అత్యుత్తమ ఆటగాడిని. నా కంటే మెరుగ్గా ఆడే ఫుట్బాలర్ను ఇంత వరకూ చూడలేదు. ఇవి నా మనస్ఫూర్తిగా చెబుతున్న మాటలు’’ అని పేర్కొన్నాడు.అదే విధంగా మెస్సీతో తన అనుబంధం గురించి చెబుతూ.. ‘‘మెస్సీతో నాకు ఎప్పుడూ ఎలాంటి సమస్యా లేదు. గత పదిహేనేళ్లుగా మేము అవార్డులు పంచుకుంటున్నాం. మా మాధ్య ఎలాంటి గొడవలు లేవు. అంతా సవ్యంగానే ఉంది.తనకోసం నేను ఆంగ్లాన్ని తర్జుమా చేసిన సందర్భాలు ఉన్నాయి. అప్పట్లో భలే సరదాగా ఉండేవాళ్లం. ఇక ఆటగాళ్లుగా మేము ప్రత్యర్థులమే కదా. తను తన క్లబ్కి, నేను నా క్లబ్కి మద్దతుగా ఉంటాం. జాతీయ జట్ల విషయంలోనూ అంతే. అయితే, ఆటతీరు ఎలా ఉందన్న అంశంపై పరస్పరం చర్చించుకుంటూ.. ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. మా మధ్య ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన పోటీయే ఉంటుంది’’ అని రొనాల్డో తెలిపాడు.కాగా 2002లో పోర్చుగీస్ క్లబ్ స్పోర్టింగ్ జీపీ తరఫున ప్రొఫెషనల్ ఫుట్బాలర్గా ఎంట్రీ ఇచ్చిన రొనాల్డో.. క్లబ్, అంతర్జాతీయ స్థాయిలో కలిపి ఓవరాల్గా 923 గోల్స్తో టాప్ గోల్స్కోరర్గా కొనసాగుతున్నాడు. తన సుదీర్ఘ కెరీర్లో ఎన్నో రికార్డులు సాధించిన రొనాల్డోకు ఫిఫా వరల్డ్కప్ మాత్రం అందని ద్రాక్షగా మిగిలిపోయింది. 648 మిలియన్ల మంది ఫాలోవర్లుఅయితే, ఈ విషయంలో మెస్సీదే పైచేయి. కెప్టెన్గా అర్జెంటీనాకు ప్రపంచకప్ అందించిన ఘనత అతడికి దక్కింది. ఇక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఫాలోవర్ల విషయంలోనూ రొనాల్డో- మెస్సీ మధ్య పోటీ ఉంది. అయితే, ఇందులో పోర్చుగీస్ ఆటగాడిదే ఆధిపత్యం. ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్లు రొనాల్డోకు ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో అతడికి ఏకంగా 648 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా.. మెస్సీకి 504 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.చదవండి: CT 2025: సమయం మించిపోలేదు.. అతడిని జట్టులోకి తీసుకోండి: అశ్విన్ -
‘నేనూ.. మావారు’ : క్లాసిక్ కాంజీవరం చీరలో పీవీ సింధు
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సిందులో మరోసారి తన ఎటైర్తో అందర్నీ ఆకర్షించింది. సింధు కోర్టులో మెరుపు షాట్లతో అబ్బుర పర్చడంమాత్రమే కాదు, తనదైన శైలి ఫ్యాషన్తో అందమైన చీర కట్టుతో ఆకట్టుకుంది. ‘మీ అండ్ మైన్’ అంటూ ఇన్స్టాలో ఒక ఫోటోను పోస్ట్ చేసింది. దీంతో అభిమానులను ఆమె లుక్కి ఫిదా అవుతూ కామెంట్స్పెట్టారు.ఫ్రెండ్ పెళ్లికి వెళ్లిన పీవీ సింధు క్లాసిక్ ఇండియన్ కాంజీవరం చీరలో అద్భుతంగా కనిపించింది. అందమైన బిగ్ జరీ బోర్డ్ పట్టుచీరలో నవ్వుతూ యువరాణిలా కనిపించింది. చీర అంతా తెల్లటి ఎంబ్రాయిడరీ అందంగా కనిపిస్తోంది. దీనికి జతగా మల్టీ లేయర్ నెక్లెస్, మ్యాచింగ్ చెవిపోగులతో తన లుక్ ను మరింత ఎలివేట్ చేసుకుంది. మృదువైన కర్ల్స్లో స్టైల్ చేసి అలా వదిలేసింది. ఇదీ చదవండి: ఇన్నాళ్లకు శుభవార్త, ప్రముఖ ఫ్యాషన్ స్టైలిస్ట్ ఫోటోలు వైరల్వెంకట దత్త సాయి విషయానికొస్తే, అతను తెల్లటి కుర్తా-పైజామా సెట్లో ఎప్పటిలాగానే మెరిసిపోయాడు. తన లుక్ను మరింతగా పెంచుతూ,పీచ్-హ్యూడ్ఎంబ్రాయిడరీ జాకెట్ ధరించాడు. ఇంకా గోల్డెన్ ఎంబ్రాయిడరీ, బటన్స్ జాకెట్కు ట్రెండీ స్టైల్ను జోడించాయి. View this post on Instagram A post shared by PV Sindhu (@pvsindhu1) కాగా రెండుసార్లు ఒలింపియన్ అయిన సింధు గత సంవత్సరం డిసెంబర్లో వ్యాపారవేత్త వెంకట దత్త సాయిని వివాహం చేసుకుంది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో ప్రతీది ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మెహిందీ, సంగీత్ వేడుకల్లో అందంగాముస్తాబై, ఫ్యాషన్ ప్రియులు కూడా ఆశ్చర్యపోయేలా చేశారు. సమయానికి తగ్గట్టుఅద్భుతమైన సాంప్రదాయ దుస్తులతో ఈ జంట అందరి దృష్టిని తమవైపు తిప్పుకున్నారు. మ్యాచింగ్ డైమండ్ ఆభరణాలతో పీవీ సింధు కొత్త ట్రెండ్ను క్రియేట్ చేసింది.ఇదీ చదవండి: తెల్లవెంట్రుకలను చూసి చింతించాల్సిన అవసరం లేదు! ఇంట్రస్టింగ్ స్టోరీ -
నందినికి నజరానా.. నగదు ప్రోత్సాహకంగా రూ. లక్ష
సాక్షి, హైదరాబాద్: ఆసియా క్రీడల కాంస్య పతక విజేత, హైదరాబాద్ యువ అథ్లెట్ అగసార నందినికి హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) అధ్యక్షుడు, అక్షర విద్యాసంస్థల చైర్మన్ అరశనపల్లి జగన్మోహన్ రావు అండగా నిలిచారు. అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ (ఉప్పల్ బ్రాంచ్)లో జరిగిన వార్షికోత్స వేడుకలో నందినిని జగన్మోహన్ రావు ఘనంగా సత్కరించారు. ఉత్తరాఖండ్లో జరుగుతున్న జాతీయ క్రీడల్లో ఈనెల 8వ తేదీన తెలంగాణకు తరఫున బరిలోకి దిగుతున్న నందినికి రూ.1 లక్ష చెక్ను నగదు ప్రోత్సాహకంగా ఆయన అందించారు.భవిష్యత్లో కూడా నందినికి అన్ని విధాలా అండగా ఉంటానని ఈ సందర్భంగా జగన్మోహన్ రావు హామీ ఇచ్చారు. సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి, అనేక కష్టాలను అధిగమించి ఈ స్థాయికి చేరుకున్న నందిని విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని జగన్మోహన్ రావు సూచించారు. నందిని 2028 లాస్ఏంజెలిస్ ఒలింపిక్స్లో పతకం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.అనంతరం నందిని మాట్లాడుతూ... ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణ, పట్టుదలతో కృషి చేస్తే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని, అందుకు తానే ఒక ఉదాహరణ అని చెప్పింది. తల్లిదండ్రులు పిల్లల ఇష్టాలను తెలుసుకొని వారికి నచ్చిన రంగంలో ప్రోత్సహించాలని కోరింది. అనంతరం పాఠశాలలో వివిధ పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నందిని పతకాలను ప్రదానం చేసింది. ఈ కార్యక్రమంలో అక్షర విద్యాసంస్థల సీఈఓ ఎ.మదన్మోహన్ రావు, ఫైనాన్స్ డైరెక్టర్ రామారావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సరితా రావు, ప్రిన్సిపాల్ స్వప్న తదితరులు పాల్గొన్నారు. మరిన్ని క్రీడా వార్తలుశ్రీనిధి డెక్కన్ ఎఫ్సీ జట్టుకు నాలుగో విజయం సాక్షి, హైదరాబాద్: ఐ–లీగ్ జాతీయ ఫుట్బాల్ లీగ్లో హైదరాబాద్కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) జట్టు ఖాతాలో నాలుగో విజయం చేరింది. హైదరాబాద్లో సోమవారం జరిగిన మ్యాచ్లో శ్రీనిధి డెక్కన్ జట్టు 3–0 గోల్స్ తేడాతో ఐజ్వాల్ ఎఫ్సీ జట్టుపై గెలిచింది. శ్రీనిధి డెక్కన్ జట్టు తరఫున గుర్ముఖ్ సింగ్ (5వ నిమిషంలో), లాల్రొమావియా (24వ నిమిషంలో), డేవిడ్ కాస్టనెడా మునోజ్ (33వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. 12 జట్లు పోటీపడుతున్న ఈ లీగ్లో శ్రీనిధి జట్టు 12 మ్యాచ్లు పూర్తి చేసుకుంది. నాలుగింటిలో గెలిచి, మూడింటిని ‘డ్రా’ చేసుకొని, ఐదింటిలో ఓడి 15 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. ఈనెల 6న హైదరాబాద్లో జరిగే తదుపరి మ్యాచ్లో రియల్ కశ్మీర్ ఎఫ్సీ జట్టుతో శ్రీనిధి జట్టు తలపడుతుంది. సుశ్రుత–శ్రీశాన్వి జోడీకి కాంస్య పతకం సాక్షి, హైదరాబాద్: జాతీయ సబ్ జూనియర్, క్యాడెట్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్షిప్లో తెలంగాణకు కాంస్య పతకం లభించింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలో జరిగిన ఈ టోరీ్నలో అండర్–15 బాలికల డబుల్స్ విభాగంలో సుశ్రుత అనియా ఆనంద్–శ్రీశాన్వి కామారపు (తెలంగాణ) జోడీ కాంస్య పతకాన్ని దక్కించుకుంది. సెమీఫైనల్లో సుశ్రుత–శ్రీశాన్వి ద్వయం 11–13, 6–11, 9–11తో దివ్యాంశి–నైషా (మహారాష్ట్ర) జంట చేతిలో ఓడిపోయింది. తెలంగాణ జట్టుకు ఎస్.ప్రణీత్, ఎం.చైతన్య కోచ్లుగా వ్యవహరించారు. -
భారత్లో పర్యటించనున్న మాజీ బాక్సింగ్ లైట్ వెయిట్ ఛాంపియన్
భారత్లో పోరాట క్రీడలను ప్రోత్సహించడానికి.. అలాగే అంతర్జాతీయ, దేశీయ ప్రతిభ మధ్య అంతరాన్ని తగ్గించడానికి మాజీ యుఎఫ్సి లైట్ వెయిట్ ఛాంపియన్ ఆంథోనీ పెట్టిస్ మొదటిసారి (మార్చిలో) భారత్లో పర్యటించనున్నాడు. ఆరు భారతీయ నగరాల్లో (ఢిల్లీ, జైపూర్, ముంబై, గోవా, హైదరాబాద్, బెంగళూరు) ఆంథోనీ పెట్టిస్ ఫైటింగ్ ఛాంపియన్షిప్ (APFC), ఇండియన్ ప్రో బాక్సింగ్ లీగ్ (IPBL) మధ్య బాక్సింగ్ పోటీలు జరుగనున్నాయి. ఏపీఎఫ్సీ భారత పర్యటన ఖరారైన విషయాన్ని ఐపీబీఎల్ నిర్ధారించింది. 'ROAD TO IPBL' పేరుతో సాగే ఈ పర్యటనలో WBC ఇండియా ఛాంపియన్ శబరి జైశంకర్.. మాజీ బెల్లాటర్ బాంటమ్వెయిట్ ఛాంపియన్ సెర్గియో పెట్టిస్ (ఆంథోనీ పెట్టిస్ సోదరుడు) మధ్య ప్రధాన పోటీ జరుగనుంది.అమెరికన్ మిక్స్డ్ మార్షల్ ఆర్టిస్ట్ అయిన సెర్గియో పెట్టిస్.. ప్రస్తుతం బెల్లాటర్ MMAతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. బెల్లాటర్లో చేరడానికి ముందు సెర్గియో అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్షిప్ (UFC)లో పోటీ పడ్డాడు. అక్కడ బాంటమ్వెయిట్ విభాగంలో అగ్రశ్రేణి యోధులలో ఒకరిగా గుర్తింపు పొందాడు.సెర్గియో ప్రత్యర్థి శబరి జైశంకర్ భారతదేశపు అగ్రశ్రేణి ప్రొఫెషనల్ బాక్సర్. శబరి జైశంకర్.. WBC ఇండియా, WBC ఆస్ట్రలేసియా, WBC మిడిల్ ఈస్ట్ టైటిళ్లతో సహా బహుళ ప్రపంచ బాక్సింగ్ కౌన్సిల్ (WBC) టైటిళ్లను గెలుచుకున్నారు.'రోడ్ టు IPBL' ఇండియా టూర్ అనేది కేవలం బాక్సింగ్ మ్యాచ్ల శ్రేణి మాత్రమే కాదు. ఇది ప్రపంచ పోరాట క్రీడల వేడుక. ఇది భారతీయ అభిమానులు మరియు పోరాట క్రీడాకారుల అభిరుచిని రేకెత్తించడానికి ప్రపంచంలోని అత్యుత్తమమైన వాటిని ఒకచోటికి చేర్చింది. మేము సందర్శించే ప్రతి నగరంలో IPBL ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లడం మరియు మరపురాని క్షణాలను సృష్టించాలని భావిస్తున్నాము. ఇది ప్రారంభం మాత్రమే. మేము చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాము అని IPBL వ్యూహాత్మక భాగస్వామి రానా దగ్గుబాటి అన్నారు.IPBL బాక్సింగ్ గురించి:IPBL బాక్సింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (www.indianproboxingleague.com) భారతదేశంలోని ఒక ప్రముఖ బాక్సింగ్ ప్రమోషన్ కంపెనీ. ఇది బాక్సింగ్ క్రీడను ఉన్నతీకరించడానికి మరియు దేశవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి బాక్సర్ల ప్రతిభను ప్రదర్శించడానికి అంకితం చేయబడింది. బాక్సింగ్ యొక్క ఉత్సాహం మరియు అభిరుచిని విస్తృత ప్రేక్షకులకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఇది ఏర్పడింది. -
Tata Steel Chess Masters: ఛాంపియన్గా ప్రజ్ఞానంద
టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్-2025కు ఎండ్ కార్డ్ పడింది. ఈ టోర్నీ విజేతగా భారత గ్రాండ్మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద(Praggnanandhaa) నిలిచాడు. నెదర్లాండ్స్లోని విక్ ఆన్ జీ వేదికగా జరిగిన టై బ్రేకర్లో వరల్డ్ ఛాంపియన్ డి గుకేశ్పై ప్రజ్ఞానంద విజయం సాధించాడు. కాగా అంతకుముందు చివరి రౌండ్లో గుకేశ్, ప్రజ్ఞానానంద ఇద్దరూ తమ మ్యాచ్లలో ఓటమి చవిచూశారు.జర్మన్ గ్రాండ్ మాస్టర్ జీఎమ్ విన్సెంట్ ప్రగ్నందందాను ఓడించగా.. గుకేష్ను అర్జున్ ఎరిగైసి ఖంగుతిన్పించాడు. దీంతో 8.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్న గుకేశ్, ప్రజ్ఞానంద.. టైటిల్ కోసం టైబ్రేకర్లో తలపడ్డారు. టైబ్రేకర్లో తొలి గేమ్లో గుకేష్ విజయం సాధించగా, రెండో గేమ్లో ప్రజ్ఞానంద గెలుపొందాడు.ఫలితంగా విజేతను తేల్చేందుకు సడన్ డెత్ నిర్వహించాల్సి వచ్చింది. ఇందులో ప్రజ్ఞానంద విజయం సాధించి టైటిల్ను సొంతం చేసుకున్నాడు. ఈ టోర్నీ చివరి రౌండ్(13వ రౌండ్)లో ప్రజ్ఞానంద 2741 పాయింట్లతో అగ్రస్ధానంలో నిలవగా.. దొమ్మరాజు గుకేశ్(2777) రెండో స్ధానంలో నిలిచాడు.చదవండి: టీ20 వరల్డ్ కప్ విజేతలకు బీసీసీఐ భారీ నజరానా.. ఎన్ని కోట్లంటే? -
భారత్ 4 టోగో 0
న్యూఢిల్లీ: డేవిస్కప్ టీమ్ టెన్నిస్ టోర్నీలో భారత జట్టు వరల్డ్ గ్రూప్–1లోనే కొనసాగనుంది. టోగో జట్టుతో జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్లో భారత్ 4–0తో విజయం సాధించింది. తొలి రోజు శనివారం జరిగిన రెండు సింగిల్స్లో భారత ఆటగాళ్లు శశికుమార్ ముకుంద్, రామ్కుమార్ రామనాథన్ గెలుపొందగా... రెండో రోజు ఆదివారం జరిగిన డబుల్స్ మ్యాచ్లో బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ–శ్రీరామ్ బాలాజీ జంట 6–2, 6–1తో ఎంలాపా అకోమోలో–ఇసాక్ పాడియో (టోగో) ద్వయంపై నెగ్గింది. దాంతో భారత్ 3–0తో విజయాన్ని ఖరారు చేసుకుంది. ఫలితం తేలిపోయినా ప్రాక్టీస్ కోసం భారత జట్టు నాలుగో మ్యాచ్ను ఆడేందుకు సిద్ధమైంది. నాలుగో మ్యాచ్లో కరణ్ సింగ్ 6–2, 6–3తో పాడియోను ఓడించాడు. నామమాత్రమైన ఐదో మ్యాచ్ను ఆడకూడదని రెండు జట్లు నిర్ణయం తీసుకున్నాయి. డబుల్స్ మ్యాచ్ ద్వారా హైదరాబాద్ ప్లేయర్ రితి్వక్ చౌదరీ డేవిస్కప్లో అరంగేట్రం చేశాడు. -
బెంగాల్ టైగర్స్ విజయ గర్జన
రూర్కెలా: పది నిమిషాల వ్యవధిలో మూడు గోల్స్... ఆ తర్వాత మ్యాచ్ మరో ఆరు నిమిషాల్లో ముగుస్తుందనగా మరో గోల్... వెరసి పురుషుల హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో ష్రాచి రార్ బెంగాల్ టైగర్స్ జట్టు చాంపియన్గా అవతరించింది. శనివారం హోరాహోరీగా జరిగిన ఫైనల్లో రూపిందర్ సింగ్ పాల్ కెప్టెన్సీలోని బెంగాల్ టైగర్స్ జట్టు 4–3 గోల్స్ తేడాతో హైదరాబాద్ తూఫాన్స్ జట్టును ఓడించింది. బెంగాల్ టైగర్స్ జట్టు తరఫున జుగ్రాజ్ సింగ్ (25వ, 32వ, 35వ నిమిషాల్లో) మూడు గోల్స్ చేసి ‘హ్యాట్రిక్’ నమోదు చేయగా... స్యామ్ లేన్ (54వ నిమిషంలో) గెలుపు గోల్ కొట్టాడు. హైదరాబాద్ తూఫాన్స్ తరఫున గొంజాలో పీలాట్ (9వ, 39వ నిమిషాల్లో) రెండు గోల్స్ సాధించగా... అమన్దీప్ లాక్రా (26వ నిమిషంలో) ఒక గోల్ చేశాడు. ఏడేళ్ల విరామం తర్వాత హాకీ ఇండియా లీగ్ను పునరుద్ధరించారు. గత ఏడాది డిసెంబర్ 28వ తేదీన హాకీ ఇండియా లీగ్ మొదలైంది. విజేతగా నిలిచిన బెంగాల్ టైగర్స్ జట్టుకు రూ. 3 కోట్లు... రన్నరప్ హైదరాబాద్ తూఫాన్స్ జట్టుకు రూ. 2 కోట్లు... మూడో స్థానంలో నిలిచిన సూర్మా హాకీ క్లబ్ జట్టుకు రూ. 1 కోటి నగదు పురస్కారం లభించింది. మొత్తం ఎనిమిది జట్లు పోటీపడ్డ హెచ్ఐఎల్లో లీగ్ దశ మ్యాచ్లు ముగిశాక బెంగాల్ టైగర్స్ జట్టు 19 పాయింట్లతో టాపర్గా నిలిచింది. తుదకు బెంగాల్ టైగర్స్ జట్టుకే టైటిల్ లభించడం విశేషం. హెచ్ఐఎల్ ‘బెస్ట్ గోల్ కీపర్’గా బ్రికమ్జీత్ సింగ్ (రూ. 10 లక్షలు; హైదరాబాద్ తూఫాన్స్)... ‘అప్కమింగ్ ప్లేయర్’గా అర్ష్ దీప్ (రూ. 10 లక్షలు; హైదరాబాద్ తూఫాన్స్)... ‘టాప్ స్కోరర్’గా జుగ్రాజ్ సింగ్ (బెంగాల్ టైగర్స్; రూ. 10 లక్షలు)... ‘బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ సుఖ్జీత్ సింగ్ (రూ. 20 లక్షలు; బెంగాల్ టైగర్స్) ఎంపికయ్యారు. యూపీ రుద్రాస్ జట్టుకు ‘ఫెయిర్ ప్లే’ అవార్డు లభించింది. 8 పాల్గొన్న జట్లు 44 మొత్తం జరిగిన మ్యాచ్లు 199 నమోదైన మొత్తం గోల్స్ 103 ఫీల్డ్ గోల్స్ 89 పెనాల్టీ కార్నర్ గోల్స్ 7 పెనాల్టీ స్ట్రోక్ గోల్స్ 95 క్రీడాకారులకు లభించిన గ్రీన్ కార్డులు 16 క్రీడాకారులకు లభించిన ఎల్లో కార్డులు -
పసిడి పతకం నెగ్గిన పల్లవి
డెహ్రాడూన్: జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్కు రెండో స్వర్ణ పతకం లభించింది. శనివారం జరిగిన మహిళల వెయిట్లిఫ్టింగ్ 71 కేజీల విభాగంలో సనాపతి పల్లవి పసిడి పతకం సొంతం చేసుకుంది. పల్లవి మొత్తం 212 కేజీల బరువెత్తి అగ్రస్థానంలో నిలిచింది. పల్లవి స్నాచ్లో 94 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్లో 118 కేజీలు బరువెత్తింది. శుక్రవారం పురుషుల 67 కేజీల విభాగంలో నీలంరాజు ఆంధ్రప్రదేశ్కు తొలి బంగారు పతకాన్ని అందించాడు. -
Yoga: అడిషనల్ ఎస్పీ వాసుదేవరెడ్డికి కాంస్యం
పోలీసుగా రక్షణ బాధ్యతలు నిర్వహిస్తూనే క్రీడలు, యోగాలో రాణిస్తున్నారు అడిషనల్ ఎస్పీ వాసుదేవరెడ్డి. కరీంనగర్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ అండ్ డ్యూటీ మీట్లో ఇంటలిజెన్స్ వింగ్ తరపున పాల్గొన్న వాసుదేవరెడ్డి యోగా విభాగంలో కాంస్య పతకం గెలుచుకున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి చేతుల మీదుగా పతకం అందుకున్నారు.కరీంనగర్ జిల్లాకు చెందిన వాసుదేవరెడ్డి, కాకతీయ యూనివర్సిటీ నుంచి డిగ్రీ చదివారు. 1996 బ్యాచ్లో ఎస్సైగా ఎంపికై వేర్వేరు హోదాల్లో పదవీ బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం సీఎం సెక్యూరిటీ, ఇంటలిజెన్స్ వింగ్లో అడిషనల్ ఎస్పీగా పని చేస్తున్నారు.గత 25 సంవత్సరాలుగా యోగాను క్రమం తప్పకుండా చేస్తోన్న వాసుదేవరెడ్డి.. ప్రతీ జూన్ 21న, కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఇంటర్నేషనల్ యోగా డేలో క్రమం తప్పకుండా పాల్గొంటున్నారు. యోగా చేయడం వల్ల శారీరక క్రమశిక్షణతో పాటు మానసిక సంసిద్ధత లభిస్తోందని అని ఆయన అన్నారు. ప్రతీ ఒక్కరు యోగాను అనుసరిస్తే.. జీవితంలోని ఎన్నో సమస్యల నుంచి బయటపడతారని చెప్పారు. యోగాలో తనకు పతకం లభించడం పట్ల వాసుదేవరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. -
థాయ్లాండ్ మాస్టర్స్.. ముగిసిన భారత్ పోరు
బ్యాంకాక్: థాయ్లాండ్ మాస్టర్స్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్ విభాగంలో కిడాంబి శ్రీకాంత్, శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్... మహిళల సింగిల్స్ లో రక్షిత శ్రీ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లలో శ్రీకాంత్ 17–21, 16–21తో వాంగ్ జెంగ్ జింగ్ (చైనా) చేతిలో; శంకర్ ముత్తుస్వామి 21–19, 18–21, 13–21తో జు జువాన్ చెన్ (చైనా) చేతిలో; రక్షిత శ్రీ 21–19, 14–21, 9–21తో థ మోన్ వన్ నితిత్ క్రాయ్ (థాయ్ లాండ్) చేతిలో పరాజయం పాలయ్యారు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాయి ప్రతీక్–పృథ్వీ కృష్ణమూర్తి రాయ్ జోడీ (భారత్) 19–21, 18–21తో డేనియల్ మార్టిన్–షోహిబుల్ ఫిక్రి (ఇండోనేసియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
యూకీ బాంబ్రీ జంట పరాజయం
పారిస్: మోంట్ పెలియర్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్)–ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) జోడీకీ నిరాశ ఎదురైంది. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ యూకీ బాంబ్రీ–ఇవాన్ డోడిగ్ ద్వయం 4–6, 5–7తో మాన్యుయెల్ గినార్డ్–గ్రెగోరి జాక్ (ఫ్రాన్స్) జంట చేతిలో ఓటమి పాలైంది. 92 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్ లో ఇండో–క్రొయేషియన్ జంట తమ సర్వీస్ ను రెండుసార్లు చేజార్చుకుంది. యూకీ–డోడిగ్ జోడీకి 5,500 యూరోల (రూ. 4 లక్షల 95 వేలు) ప్రైజ్ మనీతోపాటు 45 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.ముగిసిన భారత్ పోరుబ్యాంకాక్: థాయ్ లాండ్ మాస్టర్స్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్ విభాగంలో కిడాంబి శ్రీకాంత్, శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్... మహిళల సింగిల్స్ లో రక్షిత శ్రీ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లలో శ్రీకాంత్ 17–21, 16–21తో వాంగ్ జెంగ్ జింగ్ (చైనా) చేతిలో; శంకర్ ముత్తుస్వామి 21–19, 18–21, 13–21తో జు జువాన్ చెన్ (చైనా) చేతిలో; రక్షిత శ్రీ 21–19, 14–21, 9–21తో థ మోన్ వన్ నితిత్ క్రాయ్ (థాయ్ లాండ్) చేతిలో పరాజయం పాలయ్యారు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాయి ప్రతీక్–పృథ్వీ కృష్ణమూర్తి రాయ్ జోడీ (భారత్) 19–21, 18–21తో డేనియల్ మార్టిన్–షోహిబుల్ ఫిక్రి (ఇండోనేసియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
హైదరాబాద్ X బెంగాల్
రూర్కేలా: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో హైదరాబాద్ తూఫాన్స్, ష్రాచీ రార్ బెంగాల్ టైగర్స్ జట్లు ఫైనల్కు దూసుకెళ్లాయి. శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్లో హైదరాబాద్ తూఫాన్స్ 3–1 గోల్స్ తేడాతో సూర్మా హాకీ క్లబ్పై విజయం సాధించగా... హోరాహోరీగా సాగిన పోరులో ష్రాచీ రార్ బెంగాల్ టైగర్స్ షూటౌట్లో తమిళనాడు డ్రాగన్స్పై గెలుపొందింది. హైదరాబాద్ జట్టు తరఫున అమన్దీప్ లక్రా (25వ నిమిషంలో), జాకబ్ అండర్సన్ (35వ నిమిషంలో), నీలకంఠ శర్మ (43వ నిమిషంలో) తలా ఒక గోల్ చేశారు. సూర్మ హాకీ క్లబ్ తరఫున మ్యాచ్ చివరి నిమిషంలో జెరెమీ హెవార్డ్ (60వ ని.లో) ఏకైక గోల్ కొట్టాడు. మ్యాచ్ ఆరంభం నుంచి పూర్తి ఆధిపత్యం కనబర్చిన హైదరాబాద్ తూఫాన్స్ ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగింది. ఇక బెంగాల్ టైగర్స్, తమిళనాడు డ్రాగన్స్ మధ్య తీవ్ర ఉత్కంఠ భరితంగా సాగిన మరో సెమీస్లో నిర్ణీత సమయంలో ఇరు జట్లు 2–2 గోల్స్తో సమంగా నిలిచాయి. బెంగాల్ టైగర్స్ తరఫున ప్రదీప్ సింగ్ సంధు (30వ నిమిషంలో), స్యామ్ లేన్ (53వ ని.లో) చెరో గోల్ చేయగా... డ్రాగన్స్ తరఫున నాథన్ ఎప్రామ్స్ (18వ ని.లో), సెల్వం కార్తి (32వ ని.లో) ఒక్కో గోల్ కొట్టారు. దీంతో ఫలితం తేల్చేందుకు షూటౌట్ నిర్వహించగా... బెంగాల్ టైగర్స్ జట్టు ‘సడెన్ డెత్’లో 6–5 గోల్స్ తేడాతో తమిళనాడు డ్రాగన్స్ పై గెలిచింది. ఆదివారం జరగనున్న తుది పోరులో బెంగాల్ టైగర్స్తో హైదరాబాద్ తూఫాన్స్ టైటిల్ కోసం పోటీ పడనుంది. -
భారత్ X టోగో
న్యూఢిల్లీ: డేవిస్ కప్ ప్రపంచ గ్రూప్–1 ప్లే ఆఫ్స్లో భారత టెన్నిస్ జట్టు ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ ఈవెంట్లో టోగో జట్టుతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. శనివారం జరగనున్న పురుషుల సింగిల్స్ మ్యాచ్ల్లో శశికుమార్ ముకుంద్, రామ్కుమార్ రామనాథన్ బరిలోకి దిగనుండగా... ఆదివారం జరగనున్న రెండు డబుల్స్ మ్యాచ్లో శ్రీరామ్ బాలాజీ–రిత్విక్ బొల్లిపల్లి, రివర్స్ సింగిల్స్లో శశికుమార్ ముకుంద్, రామ్కుమార్ రామ్నాథన్ ఆడనున్నారు. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే... భారత జట్టు సెప్టెంబర్లో జరగనున్న వరల్డ్ గ్రూప్–1లో పోటీ పడనుంది. చాన్నాళ్ల తర్వాత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న శశికుమార్ ముకుంద్ మెరుగైన ప్రదర్శన చేయాలని చూస్తుండగా... ఇటీవల తన తొలి గ్రాండ్స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్ బరిలోకి దిగిన తెలుగు కుర్రాడు బొల్లిపల్లి రిత్విక్ చౌదరి జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేయనున్నాడు.శ్రీరామ్ బాలాజీతో కలిసి అతడు డబుల్స్ మ్యాచ్ ఆడనున్నాడు. ఇటీవలి కాలంలో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న రిత్విక్ చౌదరి మాట్లాడుతూ... ‘కల నిజమైనట్లు ఉంది. జాతీయ జట్టు తరఫున మంచి ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తా’ అని అన్నాడు. రిత్విక్తో కలిసి ఆడటం ఆనందంగా ఉందని ఇద్దరి మధ్య చక్కటి అవగాహన ఉందని... పరిస్థితులను త్వరగా ఆకలింపు చేసుకోవడం రిత్విక్కు అలవాటు అని బాలాజీ పేర్కొన్నాడు. శనివారం జరగనున్న తొలి సింగిల్స్ మ్యాచ్లో లివో అజావోన్ (టోగో)తో శశికుమార్ ముకుంద్, థామస్ సెటోజీ (టోగో)తో రామ్కుమార్ రామనాథన్ తలపడనున్నారు. -
ముగిసిన భారత్ పోరు
బ్యాంకాక్: థాయ్ లాండ్ మాస్టర్స్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్ విభాగంలో కిడాంబి శ్రీకాంత్, శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్... మహిళల సింగిల్స్ లో రక్షిత శ్రీ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లలో శ్రీకాంత్ 17–21, 16–21తో వాంగ్ జెంగ్ జింగ్ (చైనా) చేతిలో; శంకర్ ముత్తుస్వామి 21–19, 18–21, 13–21తో జు జువాన్ చెన్ (చైనా) చేతిలో; రక్షిత శ్రీ 21–19, 14–21, 9–21తో థ మోన్ వన్ నితిత్ క్రాయ్ (థాయ్ లాండ్) చేతిలో పరాజయం పాలయ్యారు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాయి ప్రతీక్–పృథ్వీ కృష్ణమూర్తి రాయ్ జోడీ (భారత్) 19–21, 18–21తో డేనియల్ మార్టిన్–షోహిబుల్ ఫిక్రి (ఇండోనేసియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ కు తొలి పసిడి పతకం
డెహ్రడూన్: జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పతకాల బోణీ కొట్టాయి. శుక్రవారం పురుషుల వెయిట్ లిఫ్టింగ్ 67 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు కొమెర నీలం రాజు పసిడి పతకాన్ని సాధించాడు. నీలం రాజు మొత్తం 289 కేజీలు (స్నాచ్ లో 128+క్లీన్ అండ్ జర్క్ లో 161) బరువెత్తి అగ్ర స్థానంలో నిలిచాడు. పురుషుల సైక్లింగ్ రోడ్ రేసు మాస్ స్టార్ట్ ఈవెంట్ లో తెలంగాణ ప్లేయర్ ఆశీర్వాద్ సక్సేనా (2గం:48ని:39.029 సెకన్లు) మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. మరోవైపు భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ బింద్యారాణి దేవి జాతీయ క్రీడల్లో పసిడి పతకంతో సత్తాచాటింది. మహిళల 55 కేజీల విభాగంలో బింద్యారాణి 201 కేజీల (88+113) బరువెత్తి స్వర్ణం కైవసం చేసుకుంది. బింద్యారాణి స్నాచ్లో 88 కేజీల బరువెత్తి జాతీయ రికార్డు నెలకొల్పింది. గతంలో మీరాబాయి చాను ఈ విభాగంలో 86 కేజీల బరువెత్తగా... ఇప్పుడు బింద్యారాణి దాన్ని బద్దలు కొట్టింది. -
క్వార్టర్స్లో శ్రీకాంత్, శంకర్
బ్యాంకాక్: థాయ్లాండ్ మాస్టర్స్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగం భారత ప్లేయర్లు కిడాంబి శ్రీకాంత్, శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్ విభాగంలో రక్షిత శ్రీ క్వార్టర్ ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్ల్లో శ్రీకాంత్ 21–19, 21–15తో జేసన్ గుణవాన్ (హాంకాంగ్)పై, శంకర్ 9–21, 21–10, 21–17తో చికో ద్వి వర్దోయో (ఇండోనేసియా)పై, రక్షిత శ్రీ 21–15, 21–12తో క్లౌ టాంగ్ టుంగ్ (చైనీస్ తైపీ)పై గెలుపొందారు.మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో గద్దె రుతి్వక శివాని–రోహన్ కపూర్ (భారత్) ద్వయం 19–21, 15–21తో రచాపోల్–నాథమోన్ (థాయ్లాండ్) జంట చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సాయిప్రతీక్–పృథ్వీ కృష్టమూర్తి రాయ్ (భారత్) జోడీ 14–21, 21–10, 21–9తో విచాయాపోంగ్–నారుసెట్ (థాయ్లాండ్) ద్వయంపై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. -
హర్మన్ప్రీత్ సారథ్యంలో...
న్యూఢిల్లీ: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) పురుషుల ప్రొ లీగ్లో పాల్గొనే భారత ప్రాబబుల్స్ను ప్రకటించారు. ప్రస్తుత కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ సారథ్యంలోనే భారత బృందం తొలి అంచె పోటీల్లో బరిలోకి దిగనుంది. హాకీ ఇండియా లీగ్, జూనియర్ టోర్నీలలో ఆయా ఆటగాళ్లు కనబరిచిన ప్రదర్శన ఆధారంగా మొత్తం 32 మందిని ఈ టోర్నీ కోసం ఎంపిక చేశారు. ఫిబ్రవరి 15 నుంచి 25వ తేదీ వరకు జరిగే మ్యాచ్ల్లో స్పెయిన్, జర్మనీ, ఐర్లాండ్, ఇంగ్లండ్ జట్లతో భారత జట్టు రెండేసి మ్యాచ్లు ఆడుతుంది. 2023–2024 ప్రొ లీగ్ సీజన్లో భారత జట్టు ఏడో స్థానంలో నిలిచింది. భారత హాకీ ప్రాబబుల్స్: కృషన్ బహదూర్ పాఠక్, సూరజ్ కర్కెరా, ప్రిన్స్దీప్ సింగ్ (గోల్కీపర్లు). డిఫెండర్లు: హర్మన్ప్రీత్ సింగ్, జర్మన్ప్రీత్ సింగ్, అమిత్ రోహిదాస్, సుమిత్, సంజయ్, జుగ్రాజ్ సింగ్, నీలం సంజీప్ జెస్, వరుణ్ కుమార్, యశ్దీప్ సివాచ్. మిడ్ఫీల్డర్లు: రాజ్కుమార్ పాల్, షంషేర్ సింగ్, మన్ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్, నీలకంఠ శర్మ, రబిచంద్ర సింగ్, రాజిందర్ సింగ్. ఫార్వర్డ్స్: అభిషేక్, సుఖ్జీత్ సింగ్, లలిత్ కుమార్ ఉపాధ్యాయ్, మన్దీప్ సింగ్, గుర్జంత్ సింగ్, అంగద్బీర్ సింగ్, బాబా సింగ్ ధామి, శిలానంద్ లాక్రా, దిల్ప్రీత్ సింగ్, అరిజిత్ సింగ్ హుండల్, ఉత్తమ్ సింగ్, అర్ష్ దీప్ సింగ్. -
బాక్సింగ్కు మనోజ్ వీడ్కోలు
న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత... ‘డబుల్ ఒలింపియన్’ భారత స్టార్ మనోజ్ కుమార్ బాక్సింగ్ నుంచి వీడ్కోలు తీసుకున్నాడు. త్వరలో కోచ్ రూపంలో ముందుకు వస్తానని హరియాణాకు చెందిన 39 ఏళ్ల మనోజ్ గురువారం ప్రకటించాడు. 2010 ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణ పతకం (64 కేజీలు) గెలిచిన మనోజ్... 2018 గోల్డ్కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్లో కాంస్య పతకం (69 కేజీలు) సాధించాడు. 2012 లండన్ ఒలింపిక్స్లో, 2016 రియో ఒలింపిక్స్లో పోటీపడ్డ మనోజ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించాడు. 2007, 2013 ఆసియా చాంపియన్షిప్లలో కాంస్య పతకాలు నెగ్గిన మనోజ్ 2016 దక్షిణాసియా క్రీడల్లో పసిడి పతకం సొంతం చేసుకున్నాడు. -
క్వార్టర్ ఫైనల్లో అనిరుధ్ జోడీ
సాక్షి, హైదరాబాద్: బ్రిస్బేన్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్–75 టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్ పురుషుల డబుల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఆ్రస్టేలియాలోని బ్రిస్బేన్ నగరంలో జరుగుతున్న ఈ టోరీ్నలో బుధవారం జరిగిన డబుల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్ అనిరుధ్ (భారత్)–చార్లెస్ బ్రూమ్ (బ్రిటన్) ద్వయం 6–4, 6–3తో హేడెన్ జోన్స్–పావ్లె మారిన్కోవ్ (ఆ్రస్టేలియా) జోడీపై విజయం సాధించింది. మరోవైపు ఫ్రాన్స్లో జరుగుతున్న మాంట్పెలియర్ ఏటీపీ–250 టోరీ్నలో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) ద్వయం క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలి రౌండ్లో యూకీ–ఒలివెట్టి జంట 7–5, 3–6, 10–8తో జేకబ్ ష్నయిటర్–మార్క్ వాల్నర్ (జర్మనీ) ద్వయంపై గెలుపొందింది. మరో మ్యాచ్లో విజయ్ సుందర్ ప్రశాంత్–జీవన్ నెడుంజెళియన్ (భారత్) జోడీ 1–6, 5–7తో ఫ్లావియో కొ»ొల్లి (ఇటలీ)–జొనాథన్ ఎసెరిక్ (ఫ్రాన్స్) జంట చేతిలో ఓడిపోయింది. సహజ, రషి్మక ఓటమి పుణే: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ75 మహిళల టోర్నమెంట్లో భారత నంబర్వన్, తెలంగాణ అమ్మాయి సహజ యామలపల్లి, భారతమూడో ర్యాంకర్, తెలంగాణకే చెందిన భమిడిపాటి శ్రీవల్లి రషి్మక పోరాటం ముగిసింది. బుధవారం జరిగిన సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్ల్లో సహజ 4–6, 3–6తో టాప్ సీడ్ లియోలియా జీన్జీన్ (ఫ్రాన్స్) చేతిలో... రషి్మక 6–7 (2/7), 2/6)తో మూడో సీడ్ పన్నా ఉడ్వార్డి (హంగేరి) చేతిలో ఓడిపోయారు. -
ఒంటరిగా ఆధిక్యంలో గుకేశ్
విక్ ఆన్ జీ (నెదర్లాండ్స్): టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో పదో రౌండ్ తర్వాత భారత గ్రాండ్మాస్టర్, ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్(D Gukesh ) 7.5 పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలో ఉన్నాడు. మాక్స్ వార్మెర్డామ్ (నెదర్లాండ్స్)తో బుధవారం జరిగిన పదో రౌండ్ గేమ్లో గుకేశ్ 34 ఎత్తుల్లో గెలిచాడు. ప్రపంచ చెస్ ఛాంపియన్గా నిలిచిన తర్వాత గుకేశ్కు ఇదే మొదటి టోర్నమెంట్ కావడం గమనార్హం. మరోవైపు ఉజ్బెకిస్తాన్ గ్రాండ్మాస్టర్ నోడిర్బెక్ అబ్దుసత్తోరోవ్ 7 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. రష్యాకు చెందిన అలెక్సీ సరానాను నోడిర్బెక్ ఓడించాడు. ఇక భారత్కే చెందిన గ్రాండ్మాస్టర్లు ప్రజ్ఞానంద 6.5 పాయింట్లతో మూడో స్థానంలో, ఇరిగేశి అర్జున్ 3 పాయింట్లతో 13వ స్థానంలో ఉన్నారు. 14 మంది మేటి గ్రాండ్మాస్టర్ల మధ్య 13 రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతోంది.చదవండి: జనాయ్ భోంస్లే కాదు.. సిరాజ్ డేటింగ్లో ఉన్నది ఆమెతోనే? -
శ్రీకాంత్ శుభారంభం
బ్యాంకాక్: కొత్త ఏడాదిలో భారత స్టార్ షట్లర్, ప్రపంచ మాజీ నంబర్వన్ కిడాంబి శ్రీకాంత్ తొలి విజయం అందుకున్నాడు. థాయ్లాండ్ మాస్టర్స్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రపంచ 47వ ర్యాంకర్ శ్రీకాంత్ శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శ్రీకాంత్ 21–13, 21–18తో డానిల్ దుబోవెంకో (ఇజ్రాయెల్)పై గెలుపొంది ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 36 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్లో శ్రీకాంత్ తొలి గేమ్ ఆరంభంలో వరుసగా ఆరు పాయింట్లు గెలిచి 6–0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత ఇదే జోరును కొనసాగించి గేమ్ను దక్కించుకున్నాడు. రెండో గేమ్లో శ్రీకాంత్కు కాస్త ప్రతిఘటన ఎదురైంది. స్కోరు 15–15తో సమమైన దశలో శ్రీకాంత్ ఒక్కసారిగా విజృంభించి వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 19–15తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత మూడు పాయింట్లు కోల్పోయిన శ్రీకాంత్ రెండు పాయింట్లు గెలిచి గేమ్తోపాటు మ్యాచ్ను హస్తగతం చేసుకున్నాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్ల్లో తెలంగాణ ప్లేయర్ తరుణ్ మన్నేపల్లి 11–21, 15–21తో చికో వార్దోయో (ఇండోనేసియా) చేతిలో, ఆయుశ్ శెట్టి 15–21, 17–21తో జింగ్ హాంగ్ కోక్ (మలేసియా) చేతిలో, మిథున్ మంజునాథ్ 14–21, 13–21తో షోలే ఐదిల్ (మలేసియా) చేతిలో, సతీశ్ కుమార్ 15–21, 18–21తో అల్వీ ఫర్హాన్ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయారు. మరో మ్యాచ్లో శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్ (భారత్) 15–21, 21–15, 21–19తో జూన్ వె చీమ్ (మలేసియా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. మహిళల సింగిల్స్లో రక్షిత శ్రీ ముందంజ వేయగా... తాన్యా హేమంత్, తారా షా, శ్రియాన్షి వలిశెట్టి తొలి రౌండ్లో ఓడిపోయారు. రక్షిత శ్రీ 21–19, 21–16తో లుయో యు వు (చైనా)పై గెలుపొందగా... తాన్యా 21–15, 11–21, 13–21తో కిసోనా సెల్వదురయ్ (మలేసియా) చేతిలో, తారా షా 15–21, 16–21తో థమనోవన్ నితిత్క్రాయ్ (థాయ్లాండ్) చేతిలో, శ్రియాన్షి 17–21, 13–21తో పిచమోన్ (థాయ్లాండ్) చేతిలో పరాజయం పాలయ్యారుమిక్స్డ్ డబుల్స్లో తెలంగాణ అమ్మాయి గద్దె రుత్విక శివాని ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. తొలి రౌండ్లో రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్) జంట 21–8, 21–16తో వీరాఫట్–సరారట్ (థాయ్లాండ్) జోడీపై విజయం సాధించింది. -
వందన పునరాగమనం
న్యూఢిల్లీ: వచ్చే నెలలో స్వదేశంలో జరిగే అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) మహిళల ప్రొ లీగ్లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 24 మంది సభ్యులతో కూడిన ఈ బృందానికి సలీమా టెటె నాయకత్వం వహిస్తుంది. నవ్నీత్ కౌర్ వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తుంది. వెటరన్ స్ట్రయికర్ వందన కటారియా జాతీయ జట్టులోకి పునరాగమనం చేసింది. గత ఏడాది జరిగిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీకి గాయం కారణంగా దూరమైన వందన ప్రస్తుతం పూర్తి ఫిట్నెస్ సంతరించుకోవడంతో ఆమెను ఎంపిక చేశారు. ఉత్తరప్రదేశ్కు చెందిన 32 ఏళ్ల వందన భారత్ తరఫున 317 మ్యాచ్లు ఆడి 158 గోల్స్ సాధించింది. 2016 రియో ఒలింపిక్స్, 2020 టోక్యో ఒలింపిక్స్లో భారత్కు ప్రాతినిధ్యం వహించింది. 2022 బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్లో కాంస్య పతకం నెగ్గిన టీమిండియాలోనూ వందన సభ్యురాలిగా ఉంది. 2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లో కాంస్యం... 2018 జకార్తా ఆసియా క్రీడల్లో రజతం... 2022 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచిన భారత జట్టులోనూ వందన భాగస్వామిగా ఉంది. 2021లో ‘అర్జున అవార్డు’ సొంతం చేసుకున్న వందనకు 2022లో కేంద్రం నుంచి ‘పద్మశ్రీ’ కూడా వరించింది. వందనతోపాటు డిఫెండర్లు నిక్కీ ప్రధాన్, జ్యోతి ఛత్రి, బల్జీత్ కౌర్, ముంతాజ్ ఖాన్, రుతుజాలకు కూడా జాతీయ జట్టులో స్థానం లభించింది. ఫిబ్రవరి 15 నుంచి 25 వరకు భువనేశ్వర్లో జరిగే భారత అంచె ప్రొ లీగ్లో భారత్తోపాటు జర్మనీ, స్పెయిన్, నెదర్లాండ్స్, ఇంగ్లండ్ జట్లు పోటీపడతాయి. భారత జట్టు తమ మ్యాచ్లను ఫిబ్రవరి 15, 16వ తేదీల్లో ఇంగ్లండ్తో... 18, 19వ తేదీల్లో స్పెయిన్తో... 21, 22వ తేదీల్లో జర్మనీతో... 24, 25వ తేదీల్లో నెదర్లాండ్స్తో తలపడుతుంది. భారత మహిళల హాకీ జట్టు సవిత పూనియా, బిచ్చూ దేవి ఖరిబం (గోల్కీపర్లు), సుశీలా చాను, నిక్కీ ప్రధాన్, ఉదిత, జ్యోతి, ఇషికా చౌధరీ, జ్యోతి ఛత్రి (డిఫెండర్లు). వైష్ణవి విఠల్ ఫాల్కే, నేహా, మనీషా చౌహాన్, సలీమా టెటె (కెప్టెన్), సునెలితా టొప్పో, లాల్రెమ్సియామి, బల్జీత్ కౌర్, షర్మిలా దేవి (మిడ్ ఫీల్డర్లు), నవ్నీత్ కౌర్ (వైస్ కెప్టెన్), ముంతాజ్ ఖాన్, ప్రీతి దూబే, రుతుజా పిసాల్, బ్యూటీ డుంగ్డుంగ్, సంగీత కుమారి, దీపిక, వందన కటారియా. -
ఒలింపిక్స్ నిర్వహణకు భారత్ సిద్ధం: ప్రధాని మోదీ
గ్రామీణ ప్రతిభకు పట్టం కట్టే జాతీయ క్రీడలు... అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం ఉత్తరాఖండ్ వేదికగా 38వ జాతీయ క్రీడలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. వచ్చే నెల 14 వరకు జరగనున్న ఈ క్రీడల్లో 10 వేల మందికి పైగా అథ్లెట్లు పాల్గొంటున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఆవిర్భవించి 25 ఏళ్లు అయిన సందర్భంగా ఈ క్రీడలకు ఆతిథ్యమిస్తున్న ఆ రాష్ట్రం... ఆద్యంతం తమ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఆరంభ వేడుకలు నిర్వహించింది.ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ ... 2036లో భారత్లో ఒలింపిక్స్ నిర్వహించడమే తమ లక్ష్యమని... దీంతో దేశవ్యాప్తంగా క్రీడలకు మరింత ఆదరణ పెరుగుతుందని అన్నారు. ‘మీ సామర్థ్యాలను పెంపొందించుకునేందుకు ప్రయ త్నాలు కొనసాగించండి.వాటికి మద్దతివ్వడంపై మేము దృష్టి పెడతాం. దేశాభివృద్ధిలో క్రీడలు ముఖ్యమైన భాగం అని బలంగా విశ్వసిస్తున్నాం. విశ్వక్రీడలకు ఆతిథ్యమిచ్చేందుకు ఆసక్తిగా ఉన్నాం. ఒలింపిక్స్ ఎక్కడ జరిగినా అన్నీ రంగాలు లాభపడతాయి. ఇలాంటి మెగా టోర్నీలతో అథ్లెట్లకు మరింత మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి’ అని నరేంద్ర మోదీ అన్నారు. కాగా రెండేళ్ల క్రితం ముంబై వేదికగా జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సెషన్లో ప్రధాని మోదీ 2036 ఒలింపిక్స్ఆతిథ్యానికి సిద్ధం అని ప్రకటించగా... దీనికి సంబంధించిన నివేదికను భారత ఒలింపిక్ సంఘం.. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి అందించింది.ఈ క్రీడలకు డెహ్రాడూన్ ప్రధాన వేదిక కాగా... మొత్తం 7 నగరాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. 18 రోజుల పాటు జరగనున్న ఈ ఆటల్లో 32 క్రీడాంశాల్లో పోటీలు జరగనున్నాయి. జాతీయ క్రీడల ఆరంభ వేడుకలు సాంస్కృతిక నృత్య కళారూపం ‘తాండవ్’తో ప్రారంభం కాగా.. ప్రముఖ సినీ గాయకుడు జుబిన్ నౌటియాల్ ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంది. అంతకుముందు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామితో కలిసి ప్రధాని మోదీ గోల్ఫ్ కార్ట్లో మైదానమంతా కలియతిరిగారు.అనంతరం స్థానిక సంప్రదాయ దుస్తుల్లో అథ్లెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అథ్లెట్ల మార్చ్పాస్ట్ అనంతరం ఉత్తరాఖండ్కు చెందిన భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్... క్రీడాజ్యోతిని ప్రధాని మోదీకి అందించారు. జ్యోతిని నిర్దిష్ట ప్రదేశంలో పెట్టిన ప్రధాని... క్రీడలు అధికారికంగా ప్రారంభమైనట్లు ప్రకటించారు. ఆరంభ వేడుకలు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్’ స్ఫూర్తి ప్రస్ఫుటించాయని ప్రధాని అన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర పక్షి మోనల్ను పోలి ఉండే విధంగా ‘మౌలి’ మస్కట్ను రూపొందించారు. మరిన్ని క్రీడావార్తలు2న రాష్ట్ర ర్యాంకింగ్ చెస్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం (టీజీసీఏ) ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2వ తేదీన రాష్ట్ర ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ జరగనుంది. బషీర్బాగ్ సమీపంలో లాల్బహదూర్ స్టేడియం యోగా హాల్లో ఈ టోర్నీని ఏర్పాటు చేశారు. అండర్–7, 9, 11, 13, 15 బాలబాలికల విభాగాల్లో ఈ టోర్నీ జరుగుతుంది.1–1–2010న లేదా ఆ తర్వాత పుట్టిన వారే ఈ టోర్నీలో ఆడేందుకు అర్హులు. స్విస్ ఫార్మాట్లో ఐదు రౌండ్లపాటు టోర్నీని నిర్వహిస్తారు. ప్రతి విభాగంలో టాప్–10లో నిలిచిన ప్లేయర్లకు ట్రోఫీలు, సర్టిఫికెట్లు, పతకాలు అందజేస్తామని టీజీసీఏ అధ్యక్షుడు కేఎస్ ప్రసాద్ తెలిపారు. ఈ టోర్నీలో పాల్గొనాలనుకునే వారు తమ ఎంట్రీలను జనవరి 31వ తేదీలోపు పంపించాలి. స్పాట్ ఎంట్రీలు స్వీకరించరు. వివరాలకు 7337578899 లేదా 7337399299 ఫోన్నంబర్లలో సంప్రదించాలి. శ్రీనిధి, నామ్ధారి మ్యాచ్ ‘డ్రా’ చండీగఢ్: ఐ–లీగ్లో శ్రీనిధి డెక్కన్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) మూడో ‘డ్రా’ నమోదు చేసుకుంది. మంగళవారం నామ్ధారి ఫుట్బాల్ క్లబ్తో జరిగిన పోరును శ్రీనిధి జట్టు 1–1 గోల్స్తో ‘డ్రా’గా ముగించింది. శ్రీనిధి డెక్కన్ జట్టు తరఫున విలియమ్ అల్వెస్ ఒలీవైరా (45+1వ నిమిషంలో), నామ్ధారి జట్టు తరఫున క్లెడ్సన్ కార్వాలో డిసిల్వా (33వ నిమిషంలో) చెరో గోల్ చేశారు. ఇరు జట్లు తొలి అర్ధభాగంలోనే ఒక్కో గోల్ సాధించాయి.ద్వితీయార్ధంలో రెండు జట్లు ఎంత ప్రయత్నించినా మరో గోల్ చేయలేకపోయాయి. గత నాలుగు మ్యాచ్ల్లో శ్రీనిధి జట్టుకు ఇది మూడో ‘డ్రా’ కాగా... వరుస విజయాలతో దూసుకెళ్తున్న నామ్ధారి జట్టు గెలుపు జోరుకు శ్రీనిధి క్లబ్ అడ్డుకట్ట వేసింది. తాజా సీజన్లో 11 మ్యాచ్లాడిన శ్రీనిధి జట్టు 3 విజయాలు, 5 పరాజయాలు, 3 ‘డ్రా’లతో 12 పాయింట్లు ఖాతాలో వేసుకొని 8వ స్థానంలో ఉంది. 11 మ్యాచ్లాడిన నామ్ధారి ఫుట్బాల్ క్లబ్ 6 విజయాలు, 2 పరాజయాలు, 3 ‘డ్రా’లతో 21 పాయింట్లు సాధించి ‘టాప్’లో కొనసాగుతోంది. -
సహజ, రష్మిక శుభారంభం
పుణే: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ75 మహిళల టోర్నమెంట్లో భారత నంబర్వన్, తెలంగాణ అమ్మాయి సహజ యామలపల్లి, భారతమూడో ర్యాంకర్, తెలంగాణకే చెందిన భమిడిపాటి శ్రీవల్లి రష్మిక శుభారంభం చేశారు. మంగళవారం జరిగిన సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్ల్లో సహజ 6–7 (4/7), 6–1, 6–3తో నహో సాటో (జపాన్)పై... శ్రీవల్లి రష్మిక 6–1, 6–2తో అలానా స్మిత్ (అమెరికా)పై గెలిచారు. క్వాలిఫయర్ నహో సాటోతో 2 గంటల 35 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో సహజ తొలి సెట్ను టైబ్రేక్లో కోల్పోయింది. తొలి సెట్ చేజార్చుకున్నా ఆందోళన చెందకుండా సంయమనంతో ఆడిన సహజ పుంజుకుంది. ఆ తర్వాత కేవలం నాలుగు గేమ్లు కోల్పోయి రెండు సెట్లు నెగ్గి విజయాన్ని ఖరారు చేసుకుంది. అలానా స్మిత్తో 80 నిమిషాల్లో ముగిసిన మ్యాచ్లో రష్మిక కేవలం మూడు గేమ్లు మాత్రమే చేజార్చుకుంది. భారత్కే చెందిన వైదేహి, వైష్ణవి, అంకిత రైనా తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. వైదేహి 3–6, 3–6తో తాతియానా ప్రొజోరోవా (రష్యా) చేతిలో, వైష్ణవి 3–6, 4–6తో ఫాన్గ్రాన్ టియాన్ (చైనా) చేతిలో, అంకిత రైనా 7–6 (8/6), 4–6, 3–6తో ఎలీనా ప్రిదాన్కినా (రష్యా) చేతిలో ఓడిపోయారు. డబుల్స్ తొలి రౌండ్లో రష్మిక–వైదేహి ద్వయం 2–6, 1–6తో మరియా కొజిరెవా–ఇరీనా శ్యామనోవిచ్ (రష్యా) జోడీ చేతిలో ఓడిపోయింది. ప్రాంజలకు నిరాశ హైదరాబాద్కే చెందిన మరో ప్లేయర్ యడ్లపల్లి ప్రాంజలకు నిరాశ ఎదురైంది. క్వాలిఫయింగ్ సింగిల్స్ తొలి రౌండ్లో ప్రాంజల 4–6, 4–6తో నహో సాటో (జపాన్) చేతిలో ఓడిపోయింది. డబుల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో ప్రాంజల–జీల్ దేశాయ్ (భారత్) ద్వయం 2–6, 4–6తో డయానా మర్సిన్కెవికా (లాత్వియా)–నహో సాటో (జపాన్) జంట చేతిలో పరాజయం పాలైంది. 2019లో కెరీర్ బెస్ట్ 265వ ర్యాంక్కు చేరుకున్న 25 ఏళ్ల ప్రాంజల ఆ తర్వాత గాయాల బారిన పడింది. గత ఏడాది ఒక్క టోర్నీలోనూ ఆడని ప్రాంజల ఈ ఏడాది గతవారం న్యూఢిల్లీలో జరిగిన ఐటీఎఫ్ డబ్ల్యూ50 టోర్నీతో పునరాగమనం చేసింది. -
Hockey India League 2024-25: సెమీస్లో బెంగాల్ టైగర్స్
రూర్కెలా: పురుషుల హాకీ ఇండియా లీగ్లో ష్రాచి రార్ బెంగాల్ టైగర్స్ జట్టు సెమీఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది. సోమవారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్లో బెంగాల్ టైగర్స్ 2–1 గోల్స్ తేడాతో ఢిల్లీ ఎస్జీ పైపర్స్ జట్టును ఓడించింది. ఈ గెలుపుతో బెంగాల్ టైగర్స్ జట్టు 18 పాయింట్లతో అగ్రస్థానానికి దూసుకొచ్చింది. మిగిలిన మూడు మ్యాచ్ల ఫలితాలు ఎలా ఉన్నా బెంగాల్ జట్టు టాప్-4లోనే ఉండనుంది. నిన్ననే జరిగిన మరో మ్యాచ్లో జేఎస్డబ్ల్యూ సూర్మా హాకీ క్లబ్.. వేదాంత కలింగ లాన్సర్స్పై 5-2 గోల్స్ తేడాతో గెలుపొందింది. సూర్మా హాకీ క్లబ్ తరఫున టీమిండియా కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ 32, 54 నిమిషాల్లో గోల్స్ చేయగా.. ప్రభ్జోత్ సింగ్ 26వ నిమిషంలో.. నికోలస్ కీనన్ 33వ నిమిషంలో.. మణిందర్ సింగ్ 51వ నిమిషంలో గోల్స్ చేశారు. లాన్సర్స్ తరఫున దిల్ప్రీత్ సింగ్ 5వ నిమిషంలో, థియరీ బ్రింక్మన్ 44వ నిమిషంలో.. గుర్సబ్జిత్ సింగ్ 56వ నిమిషంలో గోల్స్ చేశారు. ఈ గెలుపుతో సూర్మా హాకీ క్లబ్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. ఇదిలా ఉంటే, మహిళా క్రీడాకారిణుల కోసం తొలిసారి నిర్వహించిన మహిళల హాకీ ఇండియా లీగ్ (డబ్ల్యూహెచ్ఐఎల్) టోర్నమెంట్లో ఒడిశా వారియర్స్ జట్టు చాంపియన్గా అవతరించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో నేహా గోయల్ సారథ్యంలోని ఒడిశా వారియర్స్ 2-1 గోల్స్ తేడాతో జేఎస్డబ్ల్యూ సూర్మా హాకీ క్లబ్ జట్టును ఓడించింది. రుతుజా దాదాసో పిసాల్ (20వ, 56వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేసి ఒడిశా వారియర్స్ విజయంలో కీలకపాత్ర పోషించింది. సలీమా టెటె కెప్టెన్సీలో ఆడిన సూర్మా క్లబ్ జట్టుకు పెన్నీ స్క్విబ్ (28వ నిమిషంలో) ఏకైక గోల్ అందించింది. విజేతగా నిలిచిన ఒడిశా వారియర్స్ జట్టుకు రూ. 1 కోటి 50 లక్షల ప్రైజ్మనీ లభించింది. రన్నరప్ సూర్మా క్లబ్ జట్టుకు రూ. 1 కోటి ప్రైజ్మనీ దక్కింది. మూడో స్థానంలో నిలిచిన ష్రాచి రార్ బెంగాల్ టైగర్స్ జట్టు రూ. 50 లక్షల ప్రైజ్మనీ సొంతం చేసుకుంది. -
‘నంబర్ వన్’గా సహజ.. సుమిత్, బోపన్నలకు షాక్!
సాక్షి, హైదరాబాద్: రెండు నెలల విరామం తర్వాత తెలంగాణ టెన్నిస్ క్రీడాకారిణి సహజ యామలపల్లి(Sahaja Yamalapalli) మళ్లీ టాప్–300లోకి దూసుకు వచ్చింది. సోమవారం విడుదల చేసిన మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ-WTA) తాజా సింగిల్స్ ర్యాంకింగ్స్లో సహజ ఏకంగా 21 స్థానాలు పురోగతి సాధించి 294వ స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్లో భారత్ నుంచి అత్యుత్తమ ర్యాంక్ సహజదే కావడం విశేషం. ఫలితంగా ఆమె మళ్లీ భారత నంబర్వన్ ప్లేయర్గా నిలిచింది. తొమ్మిది స్థానాలు పడిపోయిన అంకిత రైనా 295వ ర్యాంక్కు చేరుకోగా... తెలంగాణకే చెందిన మరో ప్లేయర్ భమిడిపాటి శ్రీవల్లి రష్మిక 332వ ర్యాంక్లో ఉంది. ఇక 2024 నవంబర్ 286వ స్థానంలో నిలిచిన సహజ ఆ తర్వాత ర్యాంకింగ్స్లో పడిపోయి 300 నుంచి బయటకు వచ్చింది. అయితే గతవారం బెంగళూరులో జరిగిన అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ100 టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరుకోవడంతో ఆమె ర్యాంక్ మెరుగైంది. నగాల్ ర్యాంక్ 106 న్యూఢిల్లీ: అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ర్యాంకింగ్స్లో భారత ప్లేయర్ సుమిత్ నగాల్(Sumit Nagal) ర్యాంక్ దిగజారింది. పది నెలల తర్వాత అతను టాప్–100లో చోటు కోల్పోయాడు. సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో నగాల్ 15 స్థానాలు పడిపోయి 106వ ర్యాంక్లో నిలిచాడు. గత ఏడాది ఫిబ్రవరిలో టాప్–100లోకి వచ్చిన నగాల్ గత వారం వరకు వందలోపు కొనసాగాడు. అయితే ఆస్ట్రేలియన్ ఓపెన్లో తొలి రౌండ్లోనే ఓడిపోవడంతో నగాల్ ర్యాంక్ పడిపోయింది. భారత్కే చెందిన శశికుమార్ ముకుంద్ 365వ ర్యాంక్లో, రామ్కుమార్ రామనాథన్ 406వ ర్యాంక్లో, కరణ్ సింగ్ 496వ ర్యాంక్లో ఉన్నారు.టాప్–20లో చోటు కోల్పోయిన బోపన్న మరోవైపు పురుషుల డబుల్స్ ర్యాంకింగ్స్లో భారత వెటరన్ స్టార్ రోహన్ బోపన్న(Rohan Bopanna) ఐదు స్థానాలు పడిపోయి 21వ ర్యాంక్లో నిలిచాడు. గత ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్లో విజేతగా నిలిచిన బోపన్న ఈసారి తొలి రౌండ్లోనే వెనుదిరగడం అతని ర్యాంక్పై ప్రభావం చూపింది. టాప్–100లో భారత్ నుంచి ఆరుగురు ఉండటం విశేషం. యూకీ బాంబ్రీ 47వ ర్యాంక్లో ఎలాంటి మార్పులేదు. శ్రీరామ్ బాలాజీ 64వ ర్యాంక్లో ఉండగా... హైదరాబాద్ ప్లేయర్ బొల్లిపల్లి రితి్వక్ చౌదరీ ఏడు స్థానాలు పడిపోయి 79వ ర్యాంక్కు చేరుకున్నాడు. అర్జున్ ఖడే 83వ ర్యాంక్లో, జీవన్ నెడుంజెళియన్ సరిగ్గా 100వ ర్యాంక్లో ఉన్నారు.