breaking news
Other Sports
-
దుబాయ్లో సెటిల్ అవుతున్న స్పోర్ట్స్ స్టార్స్!.. కారణం ఇదే
ఇటీవలి కాలంలో దుబాయ్ (Dubai)లో నివాసం ఏర్పరచుకుంటున్న క్రీడాకారుల సంఖ్య పెరిగిపోతోంది. వేల కోట్లకు అధిపతి అయిన పోర్చుగీస్ ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) నుంచి బాక్సర్ ఆమిర్ ఖాన్ దాకా చాలా మంది దుబాయ్లోనే సెటిల్ అయ్యేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.బిలియనీర్స్ ఐలాండ్లో..పోర్చుగల్కు చెందిన రొనాల్డో అల్ నసర్ (Al Nassr) జట్టుతో భారీ మొత్తానికి డీల్ కుదుర్చుకున్నాడు. దీంతో ఎక్కువ సమయం దుబాయ్లోనే గడుపుతున్న ఈ ఫుట్బాల్ కింగ్ గతేడాది జూన్లో ఓ భారీ ప్రాపర్టీ కొనుగోలు చేశాడు. బిలియనీర్స్ ఐలాండ్లోని జుమేరా బేలో భూమి కొనుక్కున్నాడు.వందల కోట్ల విలువైన పెంట్హౌజ్ఇక బ్రెజిల్ ఫుట్బాల్ లెజెండ్ నెయ్మార్ కూడా దుబాయ్లో భారీ పెట్టుబడి పెట్టాడు. బుగాటి రెసిడెన్స్లో అత్యాధునిక పెంట్హౌజ్ను రూ. 450 కోట్లకు పైగా వెచ్చించి సొంతం చేసుకున్నాడు. మరోవైపు.. బ్రిటిష్-పాకిస్తానీ బాక్సర్ ఆమిర్ ఖాన్ లండన్లో తనపై దాడి తర్వాత దుబాయ్కు మకాం మార్చాడు.ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ మొయిన్ అలీ కూడా కుటుంబంతో కలిసి దుబాయ్లో నివసిస్తున్నాడు. ‘‘ఈ భూమ్మీద ఉన్న అత్యంత సురక్షితమైన ప్రదేశం’’ అంటూ మొయిన్ అలీ పలు సందర్భాల్లో దుబాయ్పై ప్రశంసలు కురిపించాడు. వీరే కాదు.. టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ కూడా దుబాయ్ మరీనాలో ఇల్లు కొన్నాడు. భారత టెన్నిస్ లెజెండ్ సానియా మీర్జా కూడా దుబాయ్లోనే సెటిల్ అవడమే కాకుండా.. అక్కడే అకాడమీ కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.దుబాయ్కే ఎందుకు?దుబాయ్ విలాసాలకు పెట్టింది పేరు. అత్యాధునిక సౌకర్యాలు గల ఇళ్లు, అగ్ర శ్రేణి విద్యా సంస్థలు, అత్యాధునిక వైద్యం, వేగవంతమైన, సాఫీ ప్రయాణాలకు వీలైన మార్గాలు, గోల్డెన్ వీసా రూల్స్, రక్షణ విషయంలో ప్రభుత్వం తీసుకునే జాగ్రత్తలు వంటివి స్పోర్ట్స్ స్టార్స్ అనే కాదు.. ఇతర సెలబ్రిటీలు కూడా ఇక్కడ సెటిల్ అయ్యేందుకు ప్రధాన కారణాలు.అన్నింటికంటే.. ఇక్కడ పన్నులు తక్కువగా ఉండటం సెలబ్రిటీలను ఆకర్షించే మరో అంశం. ముఖ్యంగా ఫుట్బాలర్ లేదంటే అథ్లెట్ తమ సొంత దేశాల్లో 40- 50 శాతం టాక్స్ చెల్లిస్తుండగా.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో మాత్రం ఇది నామ మాత్రం లేదంటే కొన్నిసార్లు సున్నాగా ఉంటుందని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టు పేర్కొంది. చదవండి: ‘మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’;.. ధోని ఆరోజు చెప్పిన మాటతో ఇలా..: సిరాజ్ -
‘మిశ్రమ ఫలితాలు వచ్చాయి’
న్యూఢిల్లీ: ఈ ఏడాది స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో కాస్త వెనుకబడ్డ భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా... వచ్చే ఏడాది మెరుగైన ప్రదర్శన చేస్తానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. 2020 టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం, 2024 పారిస్ ఒలింపిక్స్లో రజతం నెగ్గిన నీరజ్... ఈ ఏడాది ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో పతకం సాధించడంలో విఫలమయ్యాడు. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన నీరజ్... రిక్తహస్తాలతో వెనుదిరిగాడు. ఈ ఏడాదే 90 మీటర్ల మార్క్ అందుకున్న నీరజ్ చోప్రాకు ఈ సీజన్ మిశ్రమ ఫలితాలనిచ్చిoది. ప్రస్తుతం జ్యూరిక్లో శిక్షణ పొందుతున్న 27 ఏళ్ల నీరజ్ చోప్రా... ఈ ఏడాది తన ప్రదర్శన... రానున్న టోర్నీలకు సన్నద్ధతపై ప్రత్యేకంగా మాట్లాడాడు. యూరప్లో శిక్షణ, స్విట్జర్లాండ్తో ఉన్న అనుబంధం... ఆ దేశ పర్యాటక శాఖ తనను ‘ఫ్రెండ్షిప్ అంబాసిడర్’గా నియమించడం వంటి వాటిపై నీరజ్ అభిప్రాయాలు అతడి మాటల్లోనే... » ఈ సీజన్లో చాలా సవాళ్లు ఎదురయ్యాయి. వాటి నుంచి ఎంతో నేర్చుకున్నా. ప్రతీ టోర్నమెంట్ నా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది. ఆ అనుభవం భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. » ప్రతి అంశంలో మెరుగయ్యేందుకు ఎప్పుడూ అవకాశం ఉంటుంది. ఎప్పటకప్పుడు ప్రేరణ పొందుతూ ముందుకు సాగడమే మన పని. » తదుపరి సీజన్లో మరింత మెరుగైన ప్రదర్శన చేసి బలంగా తిరిగి వచ్చేందుకు సిద్ధమవుతున్నా. ప్రపంచ చాంపియన్షిప్ సమయంలో వెన్నునొప్పితో ఇబ్బందిపడ్డా. ఇప్పుడు శరీరం ఫిట్గా ఉంది. రానున్న టోర్నీల్లో దాని ఫలితం తెలుస్తుంది. » తిరిగి లయ అందుకునేందుకు లుసానే అనువైన ప్రదేశం. ఇక్కడి ప్రకృతి అంటే ఇష్టం. పర్వతాలు, లోయలు మనసుకు ఎంతో అహ్లాదాన్నిస్తాయి. అవి శిక్షణ సమయంలో ఉల్లాసంగా ఉండేందుకు ఉపయోగపడతాయి. » మండు వేసవిలో సైతం ఇక్కడి పచ్చని వాతావరణం... శీతాకాల భావన కల్పిస్తుంది. ఇక్కడ నాకు ఎన్నో అనుభవాలు ఉన్నాయి. 2022లో జ్యూరిక్లో గెలిచిన డైమండ్ లీగ్ ట్రోఫీ నాకెంతో ప్రత్యేకం. ఆ తర్వాత 2023 ప్రపంచ చాంపియన్షిప్ కోసం కూడా ఇక్కడే సాధన చేశా... అప్పుడు పసిడి గెలుచుకున్నా. » డైమండ్ లీగ్ ట్రోఫీ గెలిచిన తర్వాత నా కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడి ప్రదేశాలు సందర్శించా. ఆ అనుభవం ఎన్నో మధురానుభూతులను అందించింది. » జీవితంలో ప్రతీది అనుకున్నట్లు సాగదని ‘కోవిడ్–19’ మహమ్మారితో తెలిసొచ్చి ంది. అప్పటి నుంచి ఆలోచన దృక్పథంలో మార్పు వచ్చింది. పరిస్థితులకు తగ్గట్లు మనల్ని మనం మార్చుకోక తప్పదు. » స్విట్జర్లాండ్లో సమయ పాలన తప్పనిసరి. మనకు నచ్చి న సమయంలో నచ్చి న చోటకు వెళ్లాలంటే కష్టం. ప్రజారవాణా వ్యవ్యస్థ చాలా పకడ్బందీగా ఉంటుంది. అందుకే వీలు ఉన్నప్పుడు పర్యటించేందుకు అనుగుణంగా రైలు పాస్ల విషయంలో సహాయం చేయమని స్విట్జర్లాండ్ పర్యాటక శాఖను అడుగుతుంటా. » స్విట్జర్లాండ్తో ఉన్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైంది. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఉంటున్నా. నాకు ఇక్కడ చాలా మంది తెలుసు. నా ప్రపంచ అథ్లెటిక్స్ ఏజెంట్లు కూడా స్విస్కు చెందిన వారే. యూరప్లో ఉంటే ఎక్కువగా స్విట్జర్లాండ్లోనే ఉంటాను. దీన్ని రెండో ఇల్లు అని పిలవలేను కానీ... తరచుగా వెళ్లేందుకు ఇష్టపడే ప్రదేశం అని మాత్రం చెప్పగలను. -
తెలుగు టైటాన్స్ జోరు
చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్–12) సాగే కొద్దీ తెలుగు టైటాన్స్ జోరు పెరుగుతోంది. ఈ లీగ్లో టైటాన్స్ జట్టు వరుసగా ఐదో విజయాన్ని సాధించింది. బుధవారం జరిగిన పోరులో తెలుగు టైటాన్స్ 46–29తో డిఫెండింగ్ చాంపియన్ హరియాణా స్టీలర్స్పై గెలుపొందింది. టైటాన్స్ జట్టులో ఆల్రౌండర్ భరత్ హుడా (20 పాయింట్లు) అదరగొట్టాడు. పీకేఎల్లో వందో మ్యాచ్ ఆడుతున్న భరత్ 18 సార్లు కూతకెళ్లి 16 పాయింట్లు తెచ్చిపెట్టాడు. ప్రత్యర్థి ఆటగాళ్లు రెయిడింగ్కు వస్తే నలుగుర్ని టాకిల్ చేశాడు. మరో ఆల్రౌండర్, కెపె్టన్ విజయ్ మలిక్ (8) కూడా టైటాన్స్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంకిత్ 3, చేతన్ సాహు, అవి దుహన్, అజిత్ పవార్, శుభమ్ షిండే తలా 2 పాయింట్లు చేశారు. హరియాణా ఆటగాళ్లు ప్రత్యర్థి జట్టుకు దీటుగా పాయింట్లు సాధించడంలో విఫలమయ్యారు. రెయిడర్ మయాంక్ సైని 5, కెపె్టన్ జైదీప్, వినయ్ చెరో 4 పాయింట్లు చేశారు. అనంతరం జరిగిన రెండో మ్యాచ్లో పుణేరి పల్టన్ 37–27తో యూ ముంబాపై జయభేరి మోగించింది. పుణేరి రెయిడర్ ఆదిత్య షిండే (14) రాణించాడు. మిగతా వారిలో కెపె్టన్ అస్లామ్ (5), పంకజ్ మోహితే (4) మెరుగ్గా ఆడారు. యూ ముంబా తరఫున రెయిడర్లు అజిత్ చౌహాన్ (10), సందీప్ (7) చక్కగా పోరాడారు. గురువారం జరిగే పోటీల్లో బెంగాల్ వారియర్స్తో దబంగ్ ఢిల్లీ, గుజరాత్ జెయంట్స్తో యూపీ యోధాస్ తలపడతాయి. -
కీలకపోరుకు భారత్ రెడీ
సింగపూర్: ఆసియా ఫుట్బాల్ సమాఖ్య (ఏఎఫ్సీ) ఆసియా కప్ క్వాలిఫయర్స్లో భారత ఫుట్బాల్ జట్టు క్లిష్టమైన సమరానికి సిద్ధమైంది. మూడో రౌండ్లో భాగంగా నేడు గ్రూప్ ‘సి’లోనే పటిష్టమైన సింగపూర్తో భారత్ తలపడుతుంది. ఈ క్వాలిఫయర్స్ కోసం ఏర్పాటు చేసిన జాతీయ శిక్షణ శిబిరానికి తొలిదశలో చాలా మంది ఆటగాళ్లు ‘క్లబ్’ జట్లు విడుదల చేయకపోవడంతో గైర్హాజరయ్యారు. తర్వాత అందరూ కలిసిరావడం జట్టుకు కాస్తా ఊరటనిచ్చింది. ‘సీఏఎఫ్ఏ నేషన్స్ కప్’కు దూరమైన భారత స్టార్ స్ట్రయికర్, మాజీ కెపె్టన్ సునీల్ ఛెత్రి తిరిగి జట్టులోకి రావడం జట్టు బలాన్ని కూడా పెంచింది. ఖాలిద్ జమీల్ కోచింగ్లోని భారత జట్టుకు ఈ మ్యాచ్ అత్యంత కీలకమైంది. నాలుగు జట్లు పోటీలో ఉన్న గ్రూప్ ‘సి’లో ప్రస్తుతం భారత్ అట్టడుగున నిలిచింది. గత నెలలో జరిగిన పోటీల్లో తమకన్నా తక్కువ స్థాయి బంగ్లాదేశ్తో 0–0తో డ్రా చేసుకున్న భారత్... తదుపరి హాంకాంగ్తో మ్యాచ్లో 0–1తో ఓటమి పాలైంది. దీంతో ఒకే ఒక్క పాయింట్తో భారత్ నాలుగో స్థానంలో ఉంది. మరోవైపు సింగపూర్ 4 పాయింట్లతో గ్రూప్ టాపర్గా నిలిచింది. సొంతగడ్డపై సింగపూర్దే పైచేయి ‘ఫిఫా’ ర్యాంకింగ్స్లో 134వ ర్యాంకుతో భారత్... 158 ర్యాంకర్ సింగపూర్ కంటే మెరుగైన స్థితిలో ఉన్నప్పటికీ ఫామ్లో, ఫలితాల్లో చిన్నజట్ల కంటే వెనుకబడే ఉంది. ముఖాముఖి పోరులోనూ భారత్ 12–11తో సింగపూర్పై పైచేయిగా కనబడుతోంది. అయితే సొంతగడ్డపై సింగపూర్ జోరు కొనసాగిస్తోంది. ఇక్కడ 15 మ్యాచ్లాడితే సింగపూర్ జట్టు 8 గెలిచింది. భారత్ ఆరు విజయాలతోనే సరిపెట్టుకుంది. ఒక మ్యాచ్ మాత్రం ‘డ్రా’గా ముగిసింది. ఇలాంటి పరిస్థితుల్లో... సొంతగడ్డపై బెబ్బులిలా గర్జిస్తోన్న సింగపూర్లాంటి గ్రూప్ టాపర్తో భారత్ గెలవాలంటే మాత్రం సర్వశక్తులు ఒడ్డాల్సిందే! -
అజేయంగా క్వార్టర్ ఫైనల్కు భారత్ అర్హత
సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచ జూనియర్ మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత జట్టు ‘హ్యాట్రిక్’ విజయంతో గ్రూప్ దశను ముగించింది. గువాహటిలో బుధవారం జరిగిన గ్రూప్ ‘హెచ్’ చివరి మ్యాచ్లో భారత్ 2–0 (45–37, 45–34)తో యూఏఈ జట్టును ఓడించింది. ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ నెగ్గిన భారత్ గ్రూప్ ‘హెచ్’లో అగ్రస్థానం సంపాదించి క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించింది. మొత్తం ఎనిమిది గ్రూపుల్లో ‘టాప్’ ర్యాంక్లో నిలిచిన ఎనిమిది జట్లు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశిస్తాయి. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో దక్షిణ కొరియాతో భారత్ ఆడుతుంది. భారత్, దక్షిణ కొరియా జట్లతోపాటు చైనా, జపాన్, అమెరికా, ఇండోనేసియా, మలేసియా, చైనీస్ తైపీ జట్లు కూడా క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాయి. -
దబంగ్ ఢిల్లీ జైత్రయాత్ర
చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో దబంగ్ ఢిల్లీ విజయాల పరంపర కొనసాగుతోంది. ప్రత్యర్థితో సంబంధం లేకుండా చెలరేగిపోతున్న అశు మలిక్ సారథ్యంలోని దబంగ్ ఢిల్లీ లీగ్లో 11వ విజయం అందుకుంది. మంగళవారం జరిగిన పోరులో దబంగ్ ఢిల్లీ ‘టైబ్రేక్’లో 9–3తో హరియాణా స్టీలర్స్ను ఓడించింది. నిర్ణీత సమయంలో రెండు జట్ల స్కోర్లు 33–33తో సమం కాగా... విజేతను నిర్ణయించేందుకు ‘5 రెయిడ్స్’ నిర్వహించారు. ఇందులో ఢిల్లీ 9 పాయింట్లతో సత్తాచాటగా... స్టీలర్స్ 3 పాయింట్లకే పరిమితమైంది. స్టీలర్స్కు ఇది వరుసగా నాలుగో పరాజయం. నిర్ణీత సమయంలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ తరఫున అజింక్య పవార్ 8 పాయింట్లు సాధించగా... నీరజ్, సౌరభ్ చెరో 6 పాయింట్లతో రాణించారు. స్టీలర్స్ తరఫున శివమ్ పతారే 10 పాయింట్లతో పోరాడినా ఫలితం లేకపోయింది. తాజా సీజన్లో 12 మ్యాచ్లాడిన ఢిల్లీ 11 విజయాలు, 1 పరాజయంతో 22 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక ‘టాప్’ ప్లేస్లో కొనసాగుతోంది. స్టీలర్స్ 12 మ్యాచ్ల్లో 6 విజయాలు, 6 పరాజయాలతో 12 పాయింట్లు సాధించి పట్టిక ఆరో స్థానంలో ఉంది. మరో మ్యాచ్లో తమిళ్ తలైవాస్ 56–37 పాయింట్ల తేడాతో పట్నా పైరెట్స్పై విజయం సాధించింది. తలైవాస్ తరఫున అర్జున్ దేశ్వాల్ 26 పాయింట్లతో విజృంభించగా... పట్నా పైరెట్స్ తరఫున అయాన్ 16, అంకిత్ 14 పాయింట్లు సాధించారు. వీరిద్దరు మినహా తక్కినవాళ్లు ఆకట్టుకోలేకపోవడంతో పైరెట్స్ ఓటమి తప్పలేదు. లీగ్లో భాగంగా బుధవారం హరియాణా స్టీలర్స్తో తెలుగు టైటాన్స్, యు ముంబాతో పుణేరి పల్టన్ తలపడనున్నాయి. -
అమన్పై ఏడాది నిషేధం
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్, పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అమన్ సెహ్రావత్పై ఏడాది నిషేధం పడింది. నిర్ణీత బరువు కంటే అధికంగా ఉన్న కారణంగా ఇటీవల ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్నకు దూరమైన అమన్పై భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) చర్యలు తీసుకుంది. గత నెలలో క్రొయేషియా వేదికగా జరిగిన వరల్డ్ చాంపియన్షిప్ 57 కేజీల విభాగంలో బరిలోకి దిగాల్సిన అమన్... 1700 గ్రాములు అధిక బరువు కారణంగా పోటీలకు దూరమయ్యాడు. దీంతో పతకం సాధిస్తాడనే ఆశలు ఉన్న అమన్ పోటీకి అనర్హుడిగా తేలడంతో డబ్ల్యూఎఫ్ఐ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంది. అమన్ వివరణతో అసంతృప్తి వ్యక్తం చేసిన కమిటీ... ఏడాది కాలం పాటు అతడు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది. ఈ నిషేధం గత నెల సెప్టెంబర్ 23 నుంచి అమల్లోకి వచ్చినట్లు డబ్ల్యూఎఫ్ఐ వెల్లడించింది. అతడి శిక్షణ సిబ్బందిని హెచ్చరించి వదిలేసింది. పోటీలకు రెండు వారాల ముందే క్రొయేషియాకు వెళ్లిన అమన్... పోటీలు ప్రారంభమయ్యే సమయానికి నిర్ణీత బరువును కొనసాగించలేకపోవడం తప్పుడు సంకేతమని డబ్ల్యూఎఫ్ఐ పేర్కొంది. ‘ఒలింపిక్ పతకం సాధించిన రెజ్లర్ నుంచి అత్యుత్తమ క్రమశిక్షణ ఆశిస్తాం. అలాంటిది నిర్ణీత బరువును కొనసాగించలేకపోవడం సరైంది కాదు. అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్టకు సంబంధించిన అంశంలో తాత్సారానికి తావు లేదు. ఇది దేశ ప్రజల ఆశలను వమ్ము చేయడమే’ అని డబ్ల్యూఎఫ్ఐ వెల్లడించింది. గతేడాది పారిస్ ఒలింపిక్స్ సందర్భంగా వినేశ్ ఫొగాట్, ఈ ఏడాది ప్రపంచ అండర్–20 చాంపియన్షిప్ సందర్భంగా నేహా సాంగ్వాన్ కూడా ఇలాగే అధిక బరువుతో పోటీలకు దూరమయ్యారు. -
ఆనంద్ x కాస్పరోవ్
సెయింట్ లూయిస్ (అమెరికా): చదరంగ దిగ్గజాలు గ్యారీ కాస్పరోవ్ (రష్యా), విశ్వనాథన్ ఆనంద్ (భారత్) మరోసారి ముఖాముఖి పోరుకు సిద్ధమయ్యారు. ‘క్లచ్ చెస్: ద లెజెండ్స్ టోర్నమెంట్’ పేరుతో ఈ ఇద్దరి మధ్య ర్యాపిడ్, బ్లిట్జ్ ఫార్మాట్లో మూడు రోజులపాటు టోర్నీని నిర్వహించనున్నారు. ‘చెస్ 960’ మ్యాచ్లో భాగంగా ఆనంద్, కాస్పరోవ్ 12 గేమ్లు ఆడతారు. ప్రతి రోజు వీరిద్దరి మధ్య నాలుగు గేమ్లు (రెండు ర్యాపిడ్, రెండు బ్లిట్జ్) జరుగుతాయి. మొదటి రోజున గేమ్ గెలిస్తే ఒక్కో పాయింట్ దక్కుతుంది. రెండో రోజున గేమ్ గెలిస్తే రెండు పాయింట్ల చొప్పున... మూడో రోజున గేమ్ గెలిస్తే మూడు పాయింట్ల చొప్పున లభిస్తాయి. విజేతకు 70 వేల డాలర్లు (రూ. 62 లక్షలు), రన్నరప్ ప్లేయర్కు 50 వేల డాలర్లు (రూ. 44 లక్షలు) అందజేస్తారు. అధికారికంగా ఆనంద్, కాస్పరోవ్ చివరిసారి 1995లో క్లాసికల్ వరల్డ్ చాంపియన్షిప్ టైటిల్ కోసం పోటీపడ్డారు. కాస్పరోవ్ 10.5–7.5తో ఆనంద్పై గెలిచి ప్రపంచ టైటిల్ దక్కించుకున్నాడు. 2004లో చెస్కు వీడ్కోలు పలికిన కాస్పరోవ్ ఎగ్జిబిషన్, బ్లిట్జ్ ఈవెంట్లలో... ఆనంద్ కొన్ని ఎంచుకున్న టోర్నీల్లో మాత్రమే బరిలోకి దిగుతున్నారు. -
PKL: దబంగ్ ఢిల్లీ ధమాకా... పదో విజయంతో..
చెన్నై: మాజీ చాంపియన్ దబంగ్ ఢిల్లీ ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్ (PKL 12)లో పదో విజయంతో ‘టాప్’ లేపింది. సోమవారం ఇక్కడ జరిగిన మ్యాచ్లో దబంగ్ ఢిల్లీ జట్టు 29–26తో మాజీ విజేత జైపూర్ పింక్పాంథర్స్పై గెలుపొందింది. కెప్టెన్, రెయిడర్ అశు మలిక్ 8 పాయింట్లతో అదరగొట్టాడు. 17 సార్లు కూతకెళ్లిన ఢిల్లీ కెపె్టన్ 8 సార్లు విజయవంతంగా పాయింట్లు తెచ్చాడు. డిఫెండర్ సందీప్ (7) కూడా రాణించడంతో దబంగ్ జట్టు ప్రత్యరి్థపై పైచేయి సాధించింది. ఆఖరి వరకు పోరాడినా..మరోవైపు జైపూర్ పింక్ పాంథర్స్ సమష్టిగా గెలిచేందుకు పోరాడింది. డిఫెండర్లు రెజా మీర్బగేరి (5), దీపాన్షు ఖత్రి (5), ఆర్యన్ కుమార్ (4) ప్రత్యర్థి రెయిడర్లను బెంబేలెత్తించారు. రెయిడర్లలో మీతు, అలీ సమది చెరో 2 పాయింట్లు చేశారు. 11 మ్యాచ్లాడిన దబంగ్ ఢిల్లీ 10 విజయాలతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. యూపీపై పట్నా గెలుపుఅనంతరం జరిగిన రెండో మ్యాచ్లో మూడుసార్లు చాంపియన్ పట్నా పైరేట్స్ 36–28తో యూపీ యోధాస్పై విజయం సాధించింది. పైరేట్స్ తరఫున రెయిడర్ అయాన్ (15) చెలరేగాడు. 21 సార్లు కూతకెళ్లిన అతను క్రమం తప్పకుండా పాయింట్లు తెచ్చిపెట్టాడు. మిగతా వారిలో డిఫెండర్లు నవ్దీప్ (5), దీపక్ (4) రాణించారు. యూపీ యోధాస్ జట్టులో రెయిడర్ గగన్ (10) ఒంటరి పోరాటం చేశాడు. మిగతా వారిలో శివమ్ (3), మహేందర్ సింగ్ (2), హితేశ్ (2), సుమిత్ (2) ఫర్వాలేదనిపించారు. ఇక మంగళవారం జరిగే మ్యాచ్ల్లో పట్నా పైరేట్స్తో తమిళ్ తలైవాస్, హరియాణా స్టీలర్స్తో దబంగ్ ఢిల్లీ తలపడనున్నాయి. చదవండి: Pro Kabaddi League: తెలుగు టైటాన్స్ గెలుపు జోరు.. -
గెలిస్తే గొప్పా?.. ఇంత పొగరు పనికిరాదు! వీడియో వైరల్
అమెరికాలోని ఆర్లింగ్టన్లో జరిగిన చెక్మేట్ ఈవెంట్ ఓపెనింగ్ లెగ్లో భారత్పై యూఎస్ఎ ఆధిపత్యం చెలాయించింది. ఆదివారం జరిగిన గేమ్లో అమెరికా గ్రాండ్ మాస్టర్ హికారు నకమురా.. ప్రపంచ ఛాంపియన్ డి గుకేష్ను 0-5 తేడాతో వైట్వాష్ చేశాడు.దీంతో భారత్పై అమెరికా విజయం సాధించింది. అయితే విజయం అనంతరం హికారు నకమురా ఓవరాక్షన్ చేశాడు. గేమ్ ముగిసిన వెంటనే ఈ అమెరికా చెస్ స్టార్ గుకేష్ కింగ్ను ప్రేక్షకులపైకి విసిరి సెలబ్రేట్ చేసుకున్నాడు.కానీ గుకేష్ మాత్రం సహనం కోల్పోకుండా పావులను అమర్చకుంటూ నవ్వుతూ ఉండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ క్రమంలో అతడిపై నెటిజన్లు విమర్శలు వర్షం కురిపిస్తున్నారు.మరీ అంత పొగరు పనికిరాదు అంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే తన చర్యలపై నకమురా స్పందించాడు. తాను గెలిచిన ప్రతీసారి కింగ్ను విసిరేస్తాను అని నకమురా చెప్పుకొచ్చాడు.HIKARU THROWS A PIECE TO THE CROWD TO CELEBRATE THE USA 5-0! @GMHikaru What an event!! 🔥👏 @CheckmateUSAIND pic.twitter.com/LGnM8JLulJ— Chess.com (@chesscom) October 5, 2025చదవండి: Pro Kabaddi League: తెలుగు టైటాన్స్ గెలుపు జోరు.. -
రయ్.. రయ్... రసెల్.. సింగపూర్ గ్రాండ్ప్రి టైటిల్ కైవసం
సింగపూర్: ఫార్ములావన్ తాజా సీజన్లో మెర్సిడెస్ డ్రైవర్ జార్జ్ రసెల్ తన ఖాతాలో రెండో విజయం వేసుకున్నాడు. ఆదివారం జరిగిన సింగపూర్ గ్రాండ్ప్రిలో రసెల్ విజేతగా నిలిచాడు. తుది రేసును ‘పోల్ పొజిషన్’ నుంచి ప్రారంభించిన రసెల్ వాయువేగంతో దూసుకెళ్లాడు. 62 ల్యాప్ల రేసును రసెల్ అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 1 గంట 40 నిమిషాల 22.367 సెకన్లలో పూర్తి చేశాడు. నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్, రెడ్బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ 1 గంట 40 నిమిషాల 27.792 సెకన్లలో రేసును పూర్తి చేసి రెండో స్థానం దక్కించుకున్నాడు.గత రెండు రేసుల్లో ‘టాప్’లో నిలిచిన వెర్స్టాపెన్ మూడో రేసులోనూ దూసుకెళ్లినా... పోల్ పొజిషన్ నుంచి రేసును ఆరంభించిన రసెల్దే పైచేయి అయింది. రెండేళ్ల క్రితం ఇక్కడే జరిగిన రేసు చివరి ల్యాప్లో ప్రమాదానికి గురైన రసెల్ ఇప్పుడు అదే చోట విజేతగా నిలిచాడు. ‘ఈ అనుభూతి బాగుంది. కొన్నాళ్ల క్రితం ఇక్కడ ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఆ రోజు పోడియంపై నిలవలేకపోయా. ఇప్పుడు అది సాధ్యమైంది’ అని విజయం అనంతరం రసెల్ అన్నాడు. కెనడా గ్రాండ్ప్రి తర్వాత రసెల్కు ఈ ఏడాది ఇది రెండో టైటిల్. మెక్లారెన్ డ్రైవర్లు లాండో నోరిస్ (1 గంట 40 నిమిషాల 28.433 సెకన్లు), ఆస్కార్ పియాస్ట్రి (1 గంట 40 నిమిషాల 30.513 సెకన్లు) వరుసగా మూడో, నాలుగో స్థానాల్లో నిలిచారు.ఈ సీజన్లో అప్రతిహత విజయాలతో దూసుకెళ్లిన మెక్లారెన్ డ్రైవర్లకు గత మూడు రేసుల నుంచి అగ్రస్థానం దక్కలేదు. మెర్సిడెస్కే చెందిన మరో డ్రైవర్ కిమి అంటొనెల్లి 1 గంట 40 నిమిషాల 56.048 సెకన్లు ఐదో స్థానం దక్కించుకోగా... చార్లెస్ లెక్లెర్క్ (1 గంట 41 నిమిషాల 8.363 సెకన్లు; ఫెరారీ) ఆరో స్థానంలో నిలిచాడు. ఏడుసార్లు ప్రపంచ చాంపియన్, ఫెరారీ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ (1 గంట 41 నిమిషాల 42.618 సెకన్లు) ఏడో స్థానానికి పరిమితమయ్యాడు. 24 రేసుల సీజన్లో 18 రేసులు ముగిసేసరికి ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్íÙప్లో పియాస్ట్రి 336 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... నోరిస్ 314 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. వెర్స్టాపెన్ 273 పాయింట్లతో మూడో స్థానాన్ని మరింత మెరుగు పర్చుకున్నాడు. తదుపరి రేసు ఈనెల 20న యునైటెడ్ స్టేట్స్ గ్రాండ్ప్రి జరుగనుంది. కన్స్ట్రక్టర్స్ చాంపియన్... మెక్లారెన్ ఫార్ములావన్ తాజా సీజన్లో మరో 6 రేసులు మిగిలుండగానే... మెక్లారెన్ జట్టు కన్స్ట్రక్టర్స్ (టీమ్) చాంపియన్íÙప్ కైవసం చేసుకుంది. 24 రేసుల సీజన్లో సింగపూర్ గ్రాండ్ప్రితో 18 రేసులు ముగియగా... 650 పాయింట్లతో మెక్లారెన్ జట్టు టీమ్ చాంపియన్షిప్ను కైవసం చేసుకుంది. తాజా సీజన్లో మెక్లారెన్ డ్రైవర్లు 12 రేసుల్లో విజేతలుగా నిలిచారు. అందులో ఆస్కార్ పియాస్ట్రి 7 రేసులు నెగ్గగా... మరో ఐదింట నోరిస్ అగ్రస్థానం దక్కించుకున్నాడు. కన్స్ట్రక్టర్స్ చాంపియన్íÙప్లో మెర్సిడెస్ 325 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా... ఫెరారీ 300 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. మిగిలిన రేసుల్లో ఈ రెండు జట్లకు మెక్లారెన్ను అధిగమించే అవకాశం లేకపోవడంతో... ఆ జట్టు టీమ్ చాంపియన్గా నిలిచింది. -
తెలుగు టైటాన్స్ గెలుపు జోరు..
చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో తెలుగు టైటాన్స్ విజయపరంపర కొనసాగుతోంది. ఆదివారం జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 40–35 పాయింట్ల తేడాతో యూపీ యోధాస్ను ఓడించింది. ఈ సీజన్లో టైటాన్స్ జట్టుకిది ఓవరాల్గా ఏడో విజయం కాగా... వరుసగా నాలుగో గెలుపు.టైటాన్స్ తరఫున భరత్ హుడా 14 పాయింట్లతో టాప్ స్కోరర్గా నిలిచాడు. కెపె్టన్ విజయ్ మలిక్ తొమ్మిది పాయింట్లతో మెరిశాడు. డిఫెండర్ శుబ్మన్ షిండే ఐదు పాయింట్లతో ఆకట్టుకున్నాడు. యూపీ యోధాస్ తరఫున భవానీ రాజ్పుత్ 16 పాయింట్లు సాధించినా ఫలితం లేకపోయింది. ఇప్పటి వరకు 12 మ్యాచ్లు ఆడిన తెలుగు టైటాన్స్ ఏడింటిలో గెలిచి, ఐదింటిలో ఓడి 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. మరో మ్యాచ్లో బెంగళూరు బుల్స్ 33–29తో తమిళ్ తలైవాస్పై గెలిచింది. నేడు జరిగే మ్యాచ్ల్లో జైపూర్ పింక్పాంథర్స్తో దబంగ్ ఢిల్లీ; యూపీ యోధాస్తో పట్నా పైరేట్స్ తలపడతాయి.చదవండి: ICC Womens World Cup 2025: పాక్పై భారత్ గెలుపు.. మహిళలూ మురిపించారు -
Al Ain Masters 2025: విజేత శ్రియాన్షి
అల్ అయిన్ (అబుదాబి): హైదరాబాద్ యువ షట్లర్ శ్రియాన్షి వలిశెట్టి అల్ అయిన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నీలో విజేతగా అవతరించింది. అబుదాబిలో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ విభాగంలో 18 ఏళ్ల శ్రియాన్షి టైటిల్ను సొంతం చేసుకుంది. పుల్లెల గోపీచంద్ అకాడమీకి చెందిన శ్రియాన్షి ఫైనల్లో భారత్కే చెందిన తస్నిమ్ మీర్పై 15–21, 22–20, 21–7తో విజయం సాధించింది. 49 నిమిషాల్లో ముగిసిన ఈ తుది పోరులో శ్రియాన్షి తొలి గేమ్లో తడబడింది. అయితే రెండో గేమ్లో తన తప్పిదాలను సరిదిద్దుకొని ప్రత్యరి్థపై పైచేయి సాధించింది. నిర్ణాయక మూడో గేమ్లో మాత్రం ప్రపంచ 61వ ర్యాంకర్ శ్రియాన్షి ధాటికి ప్రపంచ 59వ ర్యాంకర్ తస్నిమ్ తేలిపోయింది. 6–7తో వెనుకబడిన దశలో శ్రియాన్షి ఒక్కసారిగా చెలరేగిపోయి వరుసగా 15 పాయింట్లు సాధించి 21–7తో గేమ్తోపాటు మ్యాచ్ను సొంతం చేసుకుంది. తద్వారా తన కెరీర్లో తొలి వరల్డ్ టూర్–100 లెవెల్ టైటిల్ను గెల్చుకుంది. చాంపియన్ శ్రియాన్షికి 9,000 డాలర్ల (రూ. 7 లక్షల 99 వేలు) ప్రైజ్మనీ, 5,500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఇదే టోర్నీలో పురుషుల డబుల్స్ టైటిల్ను హరిహరన్–అర్జున్ (భారత్) జోడీ గెలుచుకుంది. ఫైనల్లో హరిహరన్–అర్జున్ ద్వయం 21–17, 21–18తో రేమండ్ ఇంద్ర–నికోలస్ (ఇండోనేసియా)పై నెగ్గింది. హరిహరన్ –అర్జున్ జోడీకి 9,480 డాలర్ల (రూ. 8 లక్షల 41 వేలు) ప్రైజ్మనీతోపాటు 5,500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
భారత్ రికార్డు ప్రదర్శన
న్యూఢిల్లీ: ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత అథ్లెట్లు నయా చరిత్ర సృష్టించారు. సొంతగడ్డపై జరిగిన పోటీల్లో రికార్డు స్థాయిలో 22 పతకాలు సాధించారు. పోటీల చివరి రోజు ఆదివారం భారత్ మూడు రజతాలు, ఒక కాంస్యంతో 4 పతకాలు ఖాతాలో వేసుకుంది. దీంతో ఈ వరల్డ్ చాంపియన్షిప్లో భారత పారా అథ్లెట్లు మొత్తం 22 పతకాల (6 స్వర్ణాలు, 9 రజతాలు, 7 కాంస్యాలు)తో పదో స్థానంలో నిలిచారు. ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్ చరిత్రలో భారత్ ఇప్పటి వరకు 2024లో (జపాన్) అత్యుత్తమంగా 17 పతకాలు సాధించింది. పతకాల పట్టికలో బ్రెజిల్ 44 (15 స్వర్ణాలు, 20 రజతాలు, 9 కాంస్యాలు) అగ్రస్థానంలో నిలిచింది. ఆదివారం మహిళల 100 మీటర్ల టి35 విభాగంలో ప్రీతిపాల్ 14.33 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రజత పతకం సాధించింది. టి35 200 మీటర్ల పరుగులో సైతం ప్రీతి కాంస్యం నెగ్గింది. పురుషుల జావెలిన్ ఎఫ్41 విభాగంలో పారిస్ పారాలింపిక్స్ స్వర్ణ పతక విజేత నవ్దీప్ సింగ్ రజతం గెలిచాడు. నవ్దీప్ జావెలిన్ను 45.46 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచాడు. మహిళల 200 మీటర్ల టి12 విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ సిమ్రన్ 24.42 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రెండో స్థానంలో నిలిచింది. పురుషుల 200 మీటర్ల టి44 విభాగంలో సందీప్ 23.60 సెకన్లలో లక్ష్యాన్ని చేరి కాంస్యం పతకం కైవసం చేసుకున్నాడు. -
షోయబ్ మాలిక్ విడాకుల వార్తలు;.. సానియా మీర్జా పోస్ట్ వైరల్
పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ (Shoaib Malik) మూడో వివాహ బంధం కూడా చిక్కుల్లో పడ్డట్టు వార్తలు వస్తున్నాయి. మూడో భార్య, నటి సనా జావెద్ (Sana Javed)తో విడాకులు తీసుకోవడానికి షోయబ్ సిద్ధపడ్డాడనేది వాటి సారాంశం.మనసు స్వచ్ఛంగా ఉన్నపుడు..ఈ నేపథ్యంలో భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా (Sania Mirza) సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టు వైరల్గా మారింది. ‘‘మనసు స్వచ్ఛంగా, ప్రశాంతంగా ఉన్నపుడు.. దానిని బయటకు చూపించేందుకు ఎలాంటి కృత్రిమ ఫిల్టర్ల అవసరం ఉండదు’’ అంటూ సానియా తన కుమారుడు ఇజహాన్, స్నేహితులతో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేసింది.కాగా టెన్నిస్లో ఉన్నత శిఖరాలు అధిరోహించిన హైదరాబాదీ సానియా మీర్జా.. పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ను 2010లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, అంతకంటే ముందే ఆయేషా సిద్ధిఖీ అనే మహిళతో షోయబ్కు వివాహం కాగా.. 2006లోనే విడాకులు తీసుకున్నాడు.షోయబ్కు సానియా విడాకులుఅయితే, సానియా మీర్జాతోనూ షోయబ్ బంధం ఎక్కువకాలం నిలవలేదు. 2023లో తాను షోయబ్కు విడాకులు ఇచ్చినట్లు సానియా మీర్జా గతేడాది ప్రకటించింది. అయితే, అంతకంటే ముందే నటి సనా జావెద్ను పెళ్లాడిన ఫొటోలను షోయబ్ సోషల్ మీడియాలో షేర్ చేయడం గమనార్హం.ఇక సనాకు ఇది రెండో వివాహం కాగా.. షోయబ్కు మూడోది. అయితే, పెళ్లికి ముందే వీరిద్దరు తమ పాత బంధాలను కొనసాగిస్తూనే.. ‘రిలేషన్షిప్’లోనే ఉన్నారనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సనా తన భర్తకు, షోయబ్ తన భార్యకు విడాకులు ఇచ్చి 2024లో అధికారికంగా పెళ్లి చేసుకున్నారు.ఆ ఫొటోలతో వదంతులకు చెక్అయితే, సనా- షోయబ్ మధ్య కూడా సఖ్యత చెడినట్లు ఇటీవల వదంతులు వ్యాపించాయి. ఓ కార్యక్రమంలో ఇద్దరూ ఒకే సోఫాలో కూర్చునప్పటికీ దూరం దూరంగా ఉండటం.. షోయబ్ ఆటోగ్రాఫులు ఇస్తున్నపుడు సనా ముఖం తిప్పేసుకోవడం ఇందుకు ఊతమిచ్చాయి.దీంతో సనా- షోయబ్ విడాకులు తీసుకోబోతున్నారంటూ కథనాలు వచ్చాయి. అయితే, భర్త షోయబ్తో కలిసి అమెరికాలో విహరిస్తున్న ఫొటోలను పంచుకోవడం ద్వారా సనా జావెద్ ఈ వదంతులకు చెక్ పెట్టింది. ఇద్దరూ కలిసి హాలీవుడ్ యూనివర్సల్ స్టూడియోస్ను సందర్శించిన ఫొటోలను సనా షేర్ చేసింది. షోయబ్ కూడా ఇవే ఫొటోలు షేర్ చేస్తూ.. ‘‘తనతో కలిసి ఇలా విహరించడం ఎల్లపుడూ సంతోషమే’’ అని పేర్కొన్నాడు.సానియా మీర్జా పోస్ట్ వైరల్ఇదిలా ఉంటే.. సానియా- షోయబ్లకు సంతానంగా కుమారుడు ఇజహాన్ జన్మించాడు. సానియా తన కుమారుడితో కలిసి ప్రస్తుతం దుబాయ్లో నివసిస్తోంది. ఇక ఇన్స్టాగ్రామ్లో పదమూడు మిలియన్లకు పైగా ఫాలోవర్లు కలిగి ఉన్న సానియా మీర్జా ఎప్పటికప్పుడు ఫొటోలు పంచుకుంటూనే ఉంటుంది. అయితే, శనివారం ఆమె పంచుకున్న ఫొటోలకు ఇచ్చిన క్యాప్షన్.. షోయబ్ మూడో పెళ్లి పెటాకులు అన్న వార్తల వేళ నెటిజన్లను ఆకర్షిస్తోంది.చదవండి: 50 ఓవర్ల క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ.. ఆసీస్ బ్యాటర్ విధ్వంసం View this post on Instagram A post shared by Sania Mirza (@mirzasaniar) -
PKL 12: పుణేరి పల్టన్ హ్యాట్రిక్
చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో పుణేరి పల్టన్ వరుసగా మూడో విజయం ఖాతాలో వేసుకుంది. శనివారం జరిగిన పోరులో పుణేరి పల్టన్ 41–36 పాయింట్ల తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్పై విజయం సాధించింది. పల్టన్ తరఫున ఆదిత్య షిండే 13 పాయింట్లు సాధించగా... కెప్టెన్ పంకజ్ మోహితె 8 పాయింట్లు సాధించాడు.మరోవైపు... జైపూర్ తరఫున అలీ సమది 22 పాయింట్లతో విజృంభించాడు. మరో మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ 47–40 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్పై గెలుపొందింది. ఆదివారం యూపీ యోధాస్తో తెలుగు టైటాన్స్, బెంగళూరు బుల్స్తో తమిళ్ తలైవాస్ తలపడతాయి. ఇదీ చదవండి: ఫైనల్లో తస్నీమ్, శ్రియాన్షి అల్ అయిన్ (యూఏఈ): భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్... అల్ అయిన్ మాస్టర్స్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సెమీఫైనల్లో పరాజయం పాలవగా... మహిళల విభాగంలో తస్నీమ్ మీర్, శ్రియాన్షి వలిశెట్టి ఫైనల్కు దూసుకెళ్లారు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో మూడో సీడ్ శ్రీకాంత్ 4–21, 21–11, 19–21తో రెండో సీడ్ ఆదిల్ షోలెహ్ (మలేసియా) చేతిలో పోరాడి ఓడాడు.ఇక మహిళల సింగిల్స్లో బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ జూనియర్ నంబర్వన్, 20 ఏళ్ల తస్నీమ్ మీర్ సత్తాచాటింది. సెమీస్లో ఆరో సీడ్ తస్నీమ్ 9–21, 21–17, 21–10తో ఐదో సీడ్ నెస్లిహన్ అరిన్ (తుర్కియే)పై విజయం సాధించింది. మరో సెమీస్లో ఏడో సీడ్ శ్రియాన్షి 21–11, 21–12తో చియారా మార్వెల్లా హండోయో (ఇండోనేసియా)పై గెలిచి తుదిపోరుకు అర్హత సాధించింది. ఆదివారం జరగనున్న మహిళల సింగిల్స్ ఫైనల్లో తస్నీమ్, శ్రియాన్షి టైటిల్ కోసం పోటీపడనున్నారు. ఈ ఇద్దరికీ ఇదే తొలి బీడబ్ల్యూఎఫ్ సూపర్–100 ఫైనల్. -
రసెల్కు పోల్ పొజిషన్
సింగపూర్: మెర్సిడెస్ డ్రైవర్ జార్జ్ రసెల్ ఫార్ములావన్ తాజా సీజన్లో రెండో సారి పోల్ పొజిషన్ సాధించాడు. శనివారం జరిగిన సింగపూర్ గ్రాండ్ప్రి క్వాలిఫయింగ్ రేసులో రసెల్ అందరికంటే ముందు నిలిచాడు. శుక్రవారం ప్రాక్టీస్ సందర్భంగా రసెల్ కారు ప్రమాదానికి గురవగా... దాని నుంచి వెంటనే తేరుకున్న మెర్సిడెస్ డ్రైవర్ క్వాలిఫయింగ్ రేసులో వాయువేగంతో దూసుకెళ్లాడు. రసెల్ 1 నిమిషం 29.158 సెకన్లలో ల్యాప్ను పూర్తి చేసి అగ్ర స్థానం దక్కించుకున్నాడు. డిఫెండింగ్ చాంపియన్, రెడ్బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ 1 నిమిషం 29.340 సెకన్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది జోరు కొనసాగిస్తున్న మెక్లారెన్ డ్రైవర్లు ఆస్కార్ పియాస్ట్రి, లాండో నోరిస్ ఈ క్వాలిఫయింగ్ రేసులో వెనుకబడిపోయారు. పియాస్ట్రి (1 నిమిషం 29.524 సెకన్లు) మూడో స్థానం దక్కించుకోగా... ఆంటొనెల్లి (1 నిమిషం 29.537 సెకన్లు; మెర్సిడెస్) నాలుగో స్థానంలో నిలిచాడు. నోరిస్ (1 నిమిషం 29.586 సెకన్లు) ఐదో ‘ప్లేస్’ దక్కించుకున్నాడు. ఏడుసార్లు ప్రపంచ చాంపియన్, ఫెరారీ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ 1 నిమిషం 29.688 సెకన్లతో ఆరో స్థానానికి పరిమితమయ్యాడు. ఆదివారం జరగనున్న ప్రధాన రేసును రసెల్ పోల్ పొజిషన్ నుంచి ప్రారంభించనున్నాడు. -
దబంగ్ ఢిల్లీ ‘టాప్’ షో
చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో దబంగ్ ఢిల్లీ జోరు కొనసాగుతోంది. వరుసగా మూడో మ్యాచ్లో విజయం సాధించిన దబంగ్ ఢిల్లీ జట్టు... తిరిగి పాయింట్ల పట్టికలో అగ్ర స్థానానానికి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన పోరులో దబంగ్ ఢిల్లీ 43–26 పాయింట్ల తేడాతో యూపీ యోధాస్ను మట్టికరిపించింది. ఢిల్లీ కెప్టెన్ అషు మాలిక్ 14 పాయింట్లతో విజృంభించగా... మిగిలినవాళ్లంతా అతడికి అండగా నిలిచారు. యూపీ యోధాస్ తరఫున గగన్ గౌడ 12 పాయింట్లతో పోరాడినా తక్కిన వాళ్ల నుంచి అతడికి సరైన సహకారం దక్కలేదు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో దబంగ్ ఢిల్లీ 22 రెయిడ్ పాయింట్లు సాధించగా... యోధాస్ 20 రెయిడ్ పాయింట్లు సాధించింది. అయితే ట్యాక్లింగ్లో సత్తాచాటిన ఢిల్లీ జట్టు 11 పాయింట్లు ఖాతాలో వేసుకోగా... యూపీ యోధాస్ 5 ట్యాక్లింగ్ పాయింట్లకే పరిమితమైంది. ఈ మ్యాచ్లో యూపీ యోధాస్ను ఢిల్లీ జట్టు మూడుసార్లు ఆలౌట్ చేసింది. తాజా సీజన్లో 10 మ్యాచ్లాడిన ఢిల్లీ 9 విజయాలు, ఒక పరాజయంతో 18 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక ‘టాప్’కు చేరింది. యూపీ యోధాస్ 10 మ్యాచ్ల్లో 4 విజయాలు, 6 పరాజయాలతో 8 పాయింట్లు సాధించి పట్టిక తొమ్మిదో స్థానంలో ఉంది. శుక్రవారమే జరిగిన మరో మ్యాచ్లో తమిళ్ తలైవాస్ 45–33 పాయింట్ల తేడాతో హర్యానా స్టీలర్స్పై గెలుపొందింది. తలైవాస్ సారథి అర్జున్ దేశ్వాల్ 22 పాయింట్లతో వీరవిహారం చేశాడు. శనివారం పుణేరి పల్టన్తో జైపూర్ పింక్ పాంథర్స్, గుజరాత్ జెయింట్స్తో బెంగాల్ వారియర్స్ తలపడనున్నాయి. -
మీరాబాయి చానుకు రజతం
ఫోర్డె (నార్వె): భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను... ప్రపంచ చాంపియన్షిప్లో రజత పతకంతో మెరిసింది. మహిళల 48 కేజీల విభాగంలో బరిలోకి దిగిన మీరా రెండో స్థానంలో నిలిచింది. 2017 ప్రపంచ చాంపియన్షిప్లో స్వర్ణం, 2022 టోర్నీలో రజతం నెగ్గిన మీరాబాయి... ఇప్పుడు మూడో పతకం ఖాతాలో వేసుకుంది. నార్వే వేదికగా జరిగిన పోటీల్లో మీరాబాయి 199 కేజీల (స్నాచ్లో 84 కేజీలు+క్లీన్ అండ్ జెర్క్లో 115 కేజీలు) బరువెత్తి రజతం కైవసం చేసుకుంది. ఉత్తర కొరియాకు చెందిన రి సాంగ్ గుమ్ 213 కేజీల (స్నాచ్లో 91 కేజీలు+క్లీన్ అండ్ జెర్క్లో 122 కేజీలు) బరువెత్తి ప్రపంచ రికార్డు నెలకొల్పడంతో పాటు పసిడి పతకం గెలుచుకుంది. థాయ్లాండ్కు చెందిన థాన్యాథోన్ సుక్చరోన్ 198 కేజీల (స్నాచ్లో 88 కేజీలు+క్లీన్ అండ్ జెర్క్లో 110 కేజీలు)తో కాంస్య పతకం నెగ్గింది. స్నాచ్లో తొలి ప్రయత్నంలోనే 84 కేజీల బరువెత్తని చాను... ఆ తర్వాత రెండు ప్రయత్నాల్లో 87 కేజీల బరువెత్తడంలో విఫలమైంది. మరోవైపు క్లీన్ అండ్ జెర్క్లో తొలుత 109 కేజీలు బరువెత్తిన మీరాబాయి... రెండో ప్రయత్నంలో 112 కేజీలు, మూడో ప్రయత్నంలో 115 కేజీల బరువెత్తింది. 2020 టోక్యో ఒలింపిక్స్లో సైతం చాను క్లీన్ అండ్ జెర్క్లో 115 కేజీల బరువు ఎత్తే రజత పతకం గెలుచుకుంది. ‘పతకం సాధించడం ఆనందంగా ఉంది. ఈ ప్రదర్శన నాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ లక్ష్యంగా సాగుతున్నా. ఈ క్రమంలో పాల్గొనే ప్రతి టోర్నీ దానికి సన్నాహకమే. త్వరలో జరగనున్న కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్లో మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయతి్నస్తా. పోటీపడ్డ ప్రతిసారీ కొత్తగా ఏదో ఒకటి నేర్చుకునేందుకు ప్రయత్నిస్తా. దేశానికి మరిన్ని పతకాలు అందించడమే నా ప్రధాన లక్ష్యం’ అని మీరాబాయి చెప్పింది. ఆమె కోచ్ విజయ్ శర్మ మాట్లాడుతూ... ఈ పతకం మీరాబాయి కఠోర సాధనకు ఫలితమని అన్నాడు. ‘ప్రపంచ చాంపియన్షిప్లో 200 కేజీల మార్క్ అందుకోవాలని మీరా లక్ష్యంగా పెట్టుకుంది. దానికి ఒక్క అడుగు దూరంలో నిలిచిపోయింది. రానున్న కాలంలో కామన్వెల్త్, ఆసియా గేమ్స్, ఒలింపిక్స్ జరగనున్న నేపథ్యంలో ఆమె తీవ్ర సాధన చేస్తోంది. తన బలం, ఆత్మవిశ్వాసం పెంపొందించుకునేందుకు కష్టపడుతోంది’ అని అన్నాడు. -
జైపూర్ పింక్ పాంథర్స్ 'సిక్సర్'
ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో జైపూర్ పింక్ పాంథర్స్ ఆరో విజయం నమోదు చేసుకుంది. హరియాణా స్టీలర్స్తో బుధవారం జరిగిన మ్యాచ్లో జైపూర్ 37–36 పాయింట్ల తేడాతో గెలిచింది. జైపూర్ తరఫున సాహిల్ 7, అలీ 6 పాయింట్లు సాధించారు.స్టీలర్స్ తరఫున వినయ్ 11 పాయింట్లతో పోరాడినా సరిపోలేదు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో స్టీలర్స్ 21 రెయిడ్ పాయింట్లు సాధించగా... జైపూర్ 16 రెయిడ్ పాయింట్లకే పరిమితమైంది. అయితే ఆలౌట్ పాయింట్లు, ఎక్స్ట్రా పాయింట్లలో ముందంజ వేసిన పింక్ పాంథర్స్ విజయం సాధించింది. తాజా సీజన్లో 10 మ్యాచ్లాడిన జైపూర్ పింక్ పాంథర్స్ 6 విజయాలు, 4 పరాజయాలతో 12 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఐదో స్థానానికి చేరింది. హర్యానా స్టీలర్స్ 10 మ్యాచ్లో 6 గెలిచి నాలుగింట ఓడి 12 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. మరో మ్యాచ్లో యు ముంబా 42–24 పాయింట్ల తేడాతో తమిళ్ తలైవాస్పై గెలుపొందింది. యు ముంబా తరఫున సందీప్ కుమార్ 12 పాయింట్లతో విజృంభించగా... తలైవాస్ తరఫున అత్యధికంగా రోహిత్ గోపాల్ 7 పాయింట్లు సాధించాడు. నేడు జరిగే మ్యాచ్ల్లో పుణేరి పల్టన్తో బెంగళూరు బుల్స్... గుజరాత్ జెయింట్స్తో యు ముంబా తలపడతాయి.చదవండి: AB de Villiers: ఆసియాకప్ ట్రోఫీ వివాదం.. టీమిండియాపై డివిలియర్స్ విమర్శలు -
చైనా ఓపెన్ చాంపియన్ సినెర్
బీజింగ్: ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన ఇటలీ టెన్నిస్ స్టార్ యానిక్ సినెర్ తన కెరీర్లో 21వ సింగిల్స్ టైటిల్ను సాధించాడు. బుధవారం ముగిసిన చైనా ఓపెన్ ఏటీపీ–500 టోర్నీలో ప్రపంచ రెండో ర్యాంకర్ సినెర్ చాంపియన్గా అవతరించాడు. ప్రపంచ 52వ ర్యాంకర్ లెర్నర్ టియెన్ (అమెరికా)తో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సినెర్ 6–2, 6–2తో గెలుపొందాడు. 72 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో సినెర్ పది ఏస్లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. ఈ ఏడాది సినెర్కిది మూడో టైటిల్. విజేతగా నిలిచిన సినెర్కు 7,51,075 డాలర్ల (రూ. 6 కోట్ల 65 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. రన్నరప్ లెర్నర్ ఖాతాలో 4,04,105 డాలర్ల (రూ. 3 కోట్ల 58 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 300 ర్యాంకింగ్ పాయింట్లు చేరాయి. -
13 పతకాలతో ముగింపు
అహ్మదాబాద్: ఆసియా అక్వాటిక్స్ చాంపియన్షిప్ పోటీలను భారత్ 13 పతకాలతో ముగించింది. ఓవరాల్గా తొమ్మిదో స్థానంలో నిలిచిన భారత్కు నాలుగు రజతాలు, తొమ్మిది కాంస్యాలు లభించాయి. చివరిరోజు బుధవారం భారత్ ఖాతాలో నాలుగు కాంస్య పతకాలు చేరాయి. మహిళల 400 మీటర్ల ఫ్రీస్టయిల్లో భవ్య సచ్దేవ (4ని:26.89 సెకన్లు) మూడో స్థానంలో నిలిచింది. పురుషుల 200 మీటర్ల బటర్ఫ్లయ్ ఈవెంట్లో సజన్ ప్రకాశ్ (1ని:57.90 సెకన్లు) కాంస్యం గెల్చుకున్నాడు. పురుషుల 100 మీటర్ల బ్యాక్స్ట్రోక్లో శ్రీహరి నటరాజ్ (55.23 సెకన్లు) కాంస్య పతకాన్ని సాధించాడు. శ్రీహరి నటరాజ్, రోహిత్ బెనెడిక్షన్, థామస్ దురై, ఆకాశ్ మణిలతో కూడిన భారత బృందం పురుషుల 4్ఠ100 మీటర్ల రిలేలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. ఓవరాల్గా ఈ టోర్నీలో శ్రీహరి ఏకంగా ఏడు పతకాలు సాధించడం విశేషం. చైనా 49 పతకాలతో ‘టాప్’ ర్యాంక్ను అందుకోగా... 18 పతకాలతో జపాన్ రెండో స్థానంలో నిలిచింది. -
విండీస్తో తొలి టెస్టుకు భారత్ సై..
సొంతగడ్డపై టెస్టుల్లో భారత్ దాదాపు 12 ఏళ్ల పాటు ఎదురులేని జట్టుగా ఒక్క సిరీస్ కూడా ఓడిపోకుండా ఆధిపత్యం ప్రదర్శించింది. పర్యటనకు వచ్చిన పెద్ద జట్లు కూడా టీమిండియా జోరును ఆపలేకపోయాయి. అయితే పుష్కర కాలం తర్వాత బలహీనం అనుకున్న న్యూజిలాండ్ పెద్ద దెబ్బ కొట్టింది. గత ఏడాది అనూహ్యంగా కివీస్ చేతిలో భారత్ క్లీన్స్వీప్నకు గురైంది. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ మన టీమ్స్వదేశంలో టెస్టు మ్యాచ్ బరిలోకి దిగుతోంది. ఈసారి కూడా బలహీనమైన వెస్టిండీస్ ఎదురుగా ఉంది. ఇంగ్లండ్పై చక్కటి ప్రదర్శన తర్వాత ఎలాంటి ఉదాసీనతకు తావు ఇవ్వకుండా ఆడితే విండీస్పై పైచేయి ఖాయం. ఈ నేపథ్యంలో రెండు మ్యాచ్ల సిరీస్కు రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్: శుబ్మన్ గిల్ నాయకత్వంలో భారత జట్టు సొంతగడ్డపై తొలి టెస్టు సిరీస్ ఆడనుంది. వెస్టిండీస్తో జరిగే రెండు టెస్టుల సిరీస్లో భాగంగా నేటి నుంచి మొదటి టెస్టు జరుగుతుంది. సీనియర్లు కోహ్లి, రోహిత్, అశ్విన్ల రిటైర్మెంట్ తర్వాత టీమిండియా స్వదేశంలో ఆడనున్న మొదటి టెస్టు ఇదే కానుంది. ఇంగ్లండ్ గడ్డపై అద్భుత ఆటతో సిరీస్ను సమం చేసుకున్న టీమిండియా పటిష్టంగా కనిపిస్తోంది. మరోవైపు ఆసీస్తో ఆడిన గత టెస్టులో ‘27 ఆలౌట్’ తర్వాత విండీస్ ఇదే మ్యాచ్లో బరిలోకి దిగుతోంది. బలాబలాల్లో ఎంతో అంతరం కనిపిస్తుండగా, కరీబియన్ టీమ్ ఇక్కడ ఏమాత్రం పోటీనిస్తుందనేది సందేహమే. అదనపు పేసర్తో... సాధారణంగా స్వదేశంలో నల్లరేగడి మట్టితో సిద్ధం చేసే స్పిన్ అనుకూల పిచ్లపై భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి టీమ్ మేనేజ్మెంట్ ఉద్దేశపూర్వకంగా పేస్కు అనుకూలించే ‘ఎర్ర మట్టి’ పిచ్పై తమ సత్తాను పరీక్షించుకోవాలని భావిస్తోంది. దీని ప్రకారమే తుది జట్టు ఉండవచ్చు. ఇద్దరు ప్రధాన పేసర్లుగా బుమ్రా, సిరాజ్ ఖాయం. స్పిన్ ఆల్రౌండర్లుగా జడేజా, సుందర్ ఖాయం. అయితే మూడో స్పిన్నర్ అయిన కుల్దీప్, మరో పేసర్ మధ్య పోటీ ఉండవచ్చు. పిచ్ను బట్టి చూస్తే ప్రసిధ్ వైపే మొగ్గు కనిపిస్తోంది. అయితే ఆరో స్థానంలో ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ రెడ్డిని ఆడిస్తే అప్పుడు కుల్దీప్కు అవకాశం ఉంటుంది. నితీశ్ జట్టులోకి వస్తే బ్యాటర్ పడిక్కల్ను కూడా పక్కన పెట్టాల్సి రావచ్చు. ఇంగ్లండ్లో పెద్దగా ఆకట్టుకోకపోయినా నితీశ్పై సెలక్టర్లు నమ్మకం ఉంచారు. బ్యాటింగ్పరంగా యశస్వి, గిల్, రాహుల్ చక్కటి ఫామ్లో ఉండగా సుదర్శన్ కూడా ఇటీవల ఆ్రస్టేలియా ‘ఎ’పై సత్తా చాటాడు. అందరూ అంతంతే! ‘మా గెలుపుపై ఎవరికీ అంచనాలు లేకపోవడమే మా బలం. ఓటమి భయం లేకుండా స్వేచ్ఛగా ఆడతాం. కివీస్ను ఆదర్శంగా తీసుకుంటాం’ అని వెస్టిండీస్ కెప్టెన్ రోస్టన్ ఛేజ్ చెబుతున్నాడు. కానీ భారత్లో టెస్టులు అంటే ఎంతో కష్టమో విండీస్కు బాగా తెలుసు. 1994లో భారత్ను ఓడించిన తర్వాత ఇక్కడ ఆడిన 10 టెస్టుల్లో విండీస్ 8 ఓడి, 2 ‘డ్రా’ చేసుకుంది. 2018లో ఆడిన సిరీస్లో 2 టెస్టులూ మూడు రోజులకే ముగిశాయి! పట్టుదలగా క్రీజ్లో నిలబడి జట్టును నడిపించగల బ్యాటర్ ఎవరూ కనిపించడం లేదు. హోప్, ఛేజ్, వారికన్లకు మాత్రమే ఇక్కడ ఆడిన అనుభవం ఉండగా, జేడెన్ సీల్స్ ఇటీవల ఆకట్టుకుంటున్నాడు. ప్రధాన పేసర్లు అల్జారీ జోసెఫ్, షామర్ జోసెఫ్ గాయంతో సిరీస్కు దూరం కావడం పెద్ద లోటు. విండీస్ కూడా ముగ్గురు పేసర్లతో ఆడనుంది. పిచ్, వాతావరణం పిచ్పై పచ్చికను ఎక్కువగా ఉంచారు. పేస్ బౌలింగ్కు అనుకూలం కాగా బ్యాటర్లు పట్టుదల కనబర్చాల్సి ఉంది. నగరంలో అనూహ్యంగా కురుస్తున్న వర్షాలు మ్యాచ్కు స్వల్పంగా అంతరాయం కలిగించవచ్చు.తుది జట్లు (అంచనా) భారత్: గిల్ (కెప్టెన్ ), జైస్వాల్, రాహుల్, సుదర్శన్, జురేల్, నితీశ్ రెడ్డి/పడిక్కల్, జడేజా, సుందర్, బుమ్రా, సిరాజ్, కుల్దీప్/ప్రసిధ్.వెస్టిండీస్: ఛేజ్ (కెప్టెన్ ), చందర్పాల్, కెవ్లాన్ అండర్సన్, అతనజె, బ్రెండన్ కింగ్, షై హోప్, గ్రీవ్స్, పైర్, వారికన్, ఫిలిప్ అండర్సన్, సీల్స్. -
వాలీబాల్ పండుగకు వేళాయె.. నాలుగో సీజన్కు రంగం సిద్దం
హైదరాబాద్: దేశవ్యాప్తంగా వాలీబాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆర్ఆర్ కేబుల్ ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) నాలుగో సీజన్కు రంగం సిద్ధమైంది. పది జట్లు బరిలో నిలిచిన ఈ మెగా లీగ్ హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా గురువారం నుంచి సందడి చేయనుంది. తొలి రోజు ఆతిథ్య హైదరాబాద్ బ్లాక్ హాక్స్, డిఫెండింగ్ చాంపియన్ కాలికట్ హీరోస్ జట్ల మధ్య జరగనున్న హోరాహోరీ మ్యాచ్తో టోర్నమెంట్ ప్రారంభం కానుంది. సొంత గడ్డపై బరిలోకి దిగుతున్న హైదరాబాద్ బ్లాక్ హాక్స్కు బ్రెజిల్ ఆటగాడు పాలో లమౌనీర్ కెప్టెన్గా వ్యవహరిస్తుండగా, పటిష్టమైన కాలికట్ హీరోస్కు అనుభవజ్ఞుడైన మోహన్ ఉక్రపాండియన్ నాయకత్వం వహిస్తున్నాడు. ఈ సీజన్ ప్రారంభాన్ని పురష్కరించుకుని బుధవారం హైదరాబాద్లో నిర్వాహకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లీగ్ సహ-వ్యవస్థాపకుడు బేస్లైన్ వెంచర్స్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ తుహిన్ మిశ్రా, లీగ్ సీఈఓ జాయ్ భట్టాచార్య, టైటిల్ స్పాన్సర్ - ఆర్ ఆర్ కేబుల్ గ్లోబల్ డైరెక్టర్ కీర్తి కాబ్రా, ఆర్ఆర్ కేబుల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శిశిర్ శర్మ, స్కాపియా వ్యవస్థాపకుడు, CEO అనిల్ గోటేటి తో పాటు పది ఫ్రాంచైజీల కెప్టెన్లు హాజరయ్యారు. -
ఢిల్లీ వీధిలో జమైకన్ చిరుత
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో ‘జమైకన్ చిరుత’ ఉసేన్ బోల్ట్ సందడి చేశాడు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఈ స్ప్రింటర్ కోసం ఢిల్లీ కాసేపు అథ్లెటిక్ రన్నింగ్ ట్రాక్గా మారింది. ఆసియాలోనే అతిపెద్ద మసాలా దినుసుల మార్కెట్ అయిన ఢిల్లీ ‘ఖరి బౌలీ’లో స్ప్రింట్ దిగ్గజం బోల్ట్ భారత ఒలింపిక్ పతక విజేతలు పీవీ సింధు, పీఆర్ శ్రీజేశ్, జాతీయ 200 మీటర్ల అథ్లెటిక్స్ చాంపియన్ అనిమేశ్ కుజుర్లతో కలిసి అభిమానుల్ని ఉత్సాహపరిచాడు. ప్రముఖ విదేశీ అపారల్, స్పోర్ట్స్ కిట్ ఉత్పాదక సంస్థ ‘ప్యుమా’ ఏర్పాటు చేసిన ఈ ప్రచార కార్యక్రమం ఆద్యంతం ఉల్లాసభరితంగా సాగింది. ఢిల్లీ సుప్రసిద్ధ మార్కెట్ ‘ఖరి బౌలీ’ టెర్రస్ (రూఫ్ టాప్)పై ఏర్పాటు చేసిన ప్రత్యేక ట్రాక్పై బోల్ట్ సరదాగా పరుగు పెట్టాడు. ఈ సరదా సరదా రిలే పరుగు ఈవెంట్లో బోల్ట్తో బ్యాడ్మింటన్ స్టార్ సింధు, మాజీ హాకీ దిగ్గజ గోల్ కీపర్ శ్రీజేశ్, అనిమేశ్ బ్యాటన్ను పంచుకున్నారు. ‘క్రీడలంటే ఇదే... సరిహద్దులను చెరిపేసి, సంస్కృతిని సమ్మిళితం చేస్తూ సాగే పయనం’ అని బోల్ట్ అన్నాడు. భారత బ్యాడ్మింటన్ స్టార్ సింధు మాట్లాడుతూ ‘ఢిల్లీ నడిబొడ్డున బోల్ట్తో భుజం భుజం కలిపి పరుగు పెట్టడం స్ఫూర్తిదాయకంగా ఉంది. ఓ క్రీడాకారిణిగా జీవితంలో ఒక్కసారైన జగది్వఖ్యాత అథ్లెట్తో రీలే ఈవెంట్లో పాల్గొనాలనే కల ఇక కల కాదు. నేటితో అది నిజమైంది. నేను క్రీడను ఎందుకింతలా ప్రేమించానో నాకు గుర్తు చేసే క్షణమిది’ అని సంతోషం వ్యక్తం చేసింది. ఖరి బౌలీలోని రూఫ్ టాప్ ట్రాక్పై జమైకన్ స్ప్రింటర్ బోల్ట్తో పాల్గొన్న ఈ రీలే తన జీవితంలో చిరస్మరణీయమవుతుందని హాకీ లెజెండ్ శ్రీజేశ్ అన్నాడు. ముగ్గురు భారత క్రీడాకారులు బోల్ట్ ట్రేడ్మార్క్ విక్టరీ సెలబ్రేషన్ పోజు ‘లైట్నింగ్ బోల్ట్’తో దిగ్గజాన్ని అనుకరించి... అలరించారు. -
టైటాన్స్ ‘సిక్సర్’
చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్లో తెలుగు టైటాన్స్ తమ నిలకడైన ప్రదర్శనను కొనసాగిస్తోంది. మూడుసార్లు చాంపియన్ పట్నా పైరేట్స్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 37–28 పాయింట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ సీజన్లో తెలుగు టైటాన్స్కిది ఆరో విజయం కావడం విశేషం. టైటాన్స్ కెప్టెన్ విజయ్ మలిక్ 13 పాయింట్లతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.మొత్తం 23 సార్లు రెయిడింగ్కు వెళ్లిన విజయ్ 13 పాయింట్లు సాధించాడు. ఇందులో తొమ్మిది టచ్ పాయింట్లుకాగా... మూడు బోనస్ పాయింట్లు, ఒకటి టాకిల్ పాయింట్ ఉండటం విశేషం. మరో ఆల్రౌండర్ భరత్ 8 పాయింట్లు స్కోరు చేయగా... డిఫెండర్ అంకిత్ 4 పాయింట్లు సంపాదించాడు. చేతన్, శుభమ్ షిండే మూడు పాయింట్ల చొప్పున స్కోరు చేశారు. పట్నా పైరేట్స్ జట్టులో రెయిడర్ అయాన్ 13 పాయింట్లతో మెరిపించినా... ఇతర ప్లేయర్లు తడబడటంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. మరో మ్యాచ్లో పుణేరి పల్టన్ 49–44 పాయింట్లతో బెంగాల్ వారియర్స్ను ఓడించింది. పుణేరి తరఫున ఆదిత్య షిండే 18 పాయింట్లు, పంకజ్ మొహితే 13 పాయింట్లు సాధించారు. బెంగాల్ వారియర్స్ రెయిడర్ దేవాంక్ ఏకంగా 25 పాయింట్లు సాధించినా చివరకు ఆ జట్టును గట్టెక్కించలేకపోయాడు. నేడు జరిగే మ్యాచ్ల్లో హరియాణా స్టీలర్స్తో జైపూర్ పింక్ పాంథర్స్; యు ముంబాతో తమిళ్ తలైవాస్ తలపడతాయి. -
భారత టెన్నిస్ జట్టులో సహజ, రష్మిక
న్యూఢిల్లీ: బిల్లీజీన్ కింగ్ కప్ మహిళల టీమ్ టెన్నిస్ టోర్నీ ప్లే ఆఫ్స్లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. తెలంగాణకు చెందిన సహజ యామలపల్లి, భమిడిపాటి శ్రీవల్లి రషి్మక జట్టులో తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) తాజా సింగిల్స్ ర్యాంకింగ్స్లో సహజ 347వ స్థానంలో నిలిచి భారత నంబర్వన్ ర్యాంకర్గా... రషి్మక 374వ స్థానంలో నిలిచి భారత రెండో ర్యాంకర్గా ఉన్నారు. సహజ,రష్మికాలతోపాటు అంకిత రైనా (447వ ర్యాంక్), రియా భాటియా (499వ ర్యాంక్), ప్రార్థన తొంబారేలను జట్టులోకి ఎంపిక చేశారు. డబ్ల్యూటీఏ డబుల్స్ ర్యాంకింగ్స్లో ప్రార్థన 131వ స్థానంలో నిలిచిన భారత డబుల్స్ నంబర్వన్గా ఉంది. వైదేహి చౌధరీని రిజర్వ్ ప్లేయర్గా... జీల్ దేశాయ్, శ్రుతి అహ్లావత్లను ట్రెయినింగ్ క్యాంప్నకు ఎంపిక చేశారు. విశాల్ ఉప్పల్ నాన్ ప్లేయింగ్ కెపె్టన్గా, రాధిక కనిత్కర్ కోచ్గా వ్యవహరిస్తారు. బిల్లీ జీన్ కింగ్ కప్ క్వాలిఫయర్స్ నవంబర్ 14 నుంచి 16వ తేదీ వరకు బెంగళూరులో జరుగుతాయి. గ్రూప్ ‘జి’లో స్లొవేనియా, నెదర్లాండ్స్లతో భారత్ పోటీపడనుంది. గ్రూప్ ‘జి’ విజేత 2026 క్వాలిఫయర్స్కు అర్హత సాధిస్తుంది. మిగిలిన రెండు జట్లు వచ్చే ఏడాది గ్రూప్–1లో పోటీపడతాయి. -
యోధాస్పై జెయింట్స్ విజయం
చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్లో వరుసగా ఐదు ఓటముల తర్వాత గుజరాత్ జెయింట్స్ ఎట్టకేలకు విజయాన్ని అందుకుంది. మంగళవారం జరిగిన మ్యాచ్లో గుజరాత్ 33–27 పాయింట్ల తేడాతో యూపీ యోధాస్ను ఓడించింది. మొహమ్మద్ రెజా, అంకిత్ దహియా చెరో 8 పాయింట్లతో గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించగా... రాకేశ్ 6, హరీశ్ 4 పాయింట్లు సాధించారు. యూపీ తరఫున భవానీ రాజ్పుత్ 8 పాయింట్లు నమోదు చేయగా...గగన్ గౌడ 6, కెప్టెన్ సుమీత్ 4 పాయింట్లు సాధించారు. ఈ విజయం తర్వాత కూడా జెయింట్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగుతోంది. మరో మ్యాచ్లో హరియాణా స్టీలర్స్ను ఒక పాయింట్ తేడాతో ఓడించి దబంగ్ ఢిల్లీ తమ అగ్రస్థానాన్ని పటిష్టపర్చుకుంది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఢిల్లీ 38–37 పాయింట్లతో హరియాణా స్టీలర్స్పై గెలుపొందింది. దబంగ్ ఢిల్లీ ఆటగాళ్ళలో రెయిడర్ అశు మలిక్ చెలరేగిపోయాడు. అతనొక్కడే 15 పాయింట్లతో సత్తా చాటగా, నీరజ్ నర్వాల్ 6 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. మరోవైపు హరియాణా తరఫున అశుకంటే మెరుగైన ప్రదర్శనే కనబర్చినా... దురదృష్టవశాత్తూ వినయ్ జట్టును గెలిపించలేకపోయాడు. వినయ్ 18 పాయింట్లతో అదరగొట్టగా, కెప్టెన్ జైదీప్ 7, ఆశిష్ నర్వాల్ 5 పాయింట్లు సాధించారు. నేడు జరిగే మ్యాచ్లలో పట్నా పైరేట్స్తో తెలుగు టైటాన్స్... బెంగాల్ వారియర్స్తో పుణేరీ పల్టన్ తలపడతాయి. -
భళా బోపన్న...
టోక్యో: వయసు ఒక అంకె మాత్రమేనని... ఆడాలన్న ఉత్సాహం, గెలవాలన్న కసి ఉంటే... నాలుగు పదులు దాటినా అద్భుతాలు సాధించవచ్చని భారత టెన్నిస్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న మరోసారి నిరూపించాడు. జపాన్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీలో జపాన్ ప్లేయర్ టకెరు యుజుకితో కలిసి 45 ఏళ్ల రోహన్ బోపన్న డబుల్స్ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. తద్వారా ఏటీపీ–500 టోర్నీల చరిత్రలో ఫైనల్కు చేరిన అతిపెద్ద వయసు్కడిగా బోపన్న గుర్తింపు పొందాడు. సోమవారం జరిగిన సెమీఫైనల్లో బోపన్న–టకెరు ద్వయం 4–6, 6–3, 18–16తో ‘సూపర్ టైబ్రేక్’లో టాప్ సీడ్ క్రిస్టియన్ హ్యారీసన్–ఇవాన్ కింగ్ (అమెరికా) జోడీని బోల్తా కొట్టించింది. 94 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో బోపన్న జంట ‘సూపర్ టైబ్రేక్’లో మూడు మ్యాచ్ పాయింట్లను కాచుకొని గెలుపొందడం విశేషం. ‘సూపర్ టైబ్రేక్’లో ఒకదశలో 1–4తో వెనుకబడ్డ ఈ ఇండో–జపాన్ ద్వయం ఆ తర్వాత 8–9 వద్ద... 9–10 వద్ద... 12–13 వద్ద మూడుసార్లు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని గట్టెక్కింది. ఎనిమిది ఏస్లు సంధించిన బోపన్న–టకెరు మూడు డబుల్ ఫాల్ట్లు చేశారు. తమ సర్వీస్ను ఒకసారికోల్పోయి, ప్రత్యర్థుల సర్వీస్ను ఒకసారి బ్రేక్ చేశారు. నేడు జరిగే ఫైనల్లో హుగో నిస్ (మొనాకో)–ఎడువార్డ్ రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్)లతో బోపన్న–టకెరు తలపడతారు.64 బోపన్న తన కెరీర్లో ఇప్పటి వరకు 64 టోర్నీలలో డబుల్స్ విభాగంలో ఫైనల్కు చేరాడు. ఇందులో 26 సార్లు గెలిచి విజేతగా... 37 సార్లు ఓడిపోయి రన్నరప్గా నిలిచాడు. -
సెమీఫైనల్కు చేరిన అల్కరాజ్..
జపాన్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీలో ప్రపంచ నంబర్వన్ అల్కరాజ్ (స్పెయిన్) సెమీఫైనల్కు చేరాడు. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ అల్కరాజ్ 6–2, 6–4తో బ్రాండన్ నకషీమా (అమెరికా)పై గెలిచాడు. మ్యాచ్ ఆరంభం నుంచి ఆధిపత్యం కనబర్చిన ఈ యంగ్స్టర్... వరుస సెట్లలో ప్రత్యర్థిని మట్టికరిపించాడు. ఈ సీజన్లో అల్కరాజ్కు ఇది 65వ విజయం కావడం విశేషం. 2023 ఏటీపీ టూర్లో సైతం 65 మ్యాచ్లు గెలిచిన అల్కరాజ్... ఇప్పుడు మరోసారి ఆ ఘనత సాధించాడు. ‘మరో సెమీఫైనల్కు చేరడం ఆనందంగా ఉంది. జపాన్లో తొలి సారి ఆడుతున్నా. మొదటిసారే సెమీస్కు చేరుకోవడం చక్కటి ఉత్సాహాన్నిచ్చింది’అని 22 ఏళ్ల అల్కరాజ్ అన్నాడు. సెమీస్లో నాలుగో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే)తో అల్కరాజ్ ఆడతాడు. -
ఆకుల శ్రీజ శుభారంభం
బీజింగ్: వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) చైనా స్మాష్ టోర్నమెంట్లో భారత నంబర్వన్, తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజ శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 42వ ర్యాంకర్ శ్రీజ 11–6, 11–9, 11–7తో ప్రపంచ 103వ ర్యాంకర్ యాంగ్ యియున్ (చైనా)పై విజయం సాధించి రెండో రౌండ్లోకి దూసుకెళ్లింది. 25 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో శ్రీజ తన సర్వీస్లో 15 పాయింట్లు, ప్రత్యర్థి సర్వీస్లో 18 పాయింట్లు సాధించింది. మరోవైపు యాంగ్ తన సర్వీస్లో 11 పాయింట్లు, ప్రత్యర్థి సర్వీస్లో 11 పాయింట్లు దక్కించుకుంది. శ్రీజ కాకుండా భారత్ నుంచి మెయిన్ ‘డ్రా’లో మనిక బత్రా మాత్రమే బరిలో ఉంది. భారత్కే చెందిన అహిక ముఖర్జీ, స్వస్తిక ఘోష్, దియా చిటాలె, యశస్విని ఘోర్పడే క్వాలిఫయింగ్ రౌండ్ను దాటి మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందలేకపోయారు. మానవ్ బోణీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత నంబర్వన్, ప్రపంచ 42వ ర్యాంకర్ మానవ్ ఠక్కర్ గెలుపు బోణీ కొట్టాడు. తొలి రౌండ్లో మానవ్ 11–5, 11–6, 11–9తో ప్రపంచ 44వ ర్యాంకర్ ఫిన్ లు (ఆ్రస్టేలియా)పై గెలుపొందాడు. 20 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్లో మానవ్ తన సర్వీస్లో 18 పాయింట్లు, ప్రత్యర్థి సర్వీస్లో 15 పాయింట్లు సంపాదించాడు. భారత్కే చెందిన అంకుశ్ భట్టాచార్య తొలి రౌండ్లోనే వెనుదిరిగాడు. క్వాలిఫయర్గా మెయిన్ ‘డ్రా’లో అడుగు పెట్టిన అంకుర్ 11–3, 9–11, 10–12, 11–6, 8–11తో నికోలస్ లుమ్ (ఆ్రస్టేలియా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. భారత్కే చెందిన సత్యన్ జ్ఞానశేఖరన్, పాయస్ జైన్, సూరావజ్జుల స్నేహిత్, హర్మీత్ దేశాయ్, మనుశ్ షా క్వాలిఫయింగ్ రౌండ్ను అధిగమించడంలో విఫలమయ్యారు. -
డీఎస్పీగా సామ సాత్విక
సాక్షి, హైదరాబాద్: టెన్నిస్ కోర్టులో సంచలన విజయాలతో రాణించిన హైదరాబాద్ ప్లేయర్ సామ సాత్విక... తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్–1 పరీక్షల్లో సత్తా చాటి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) కొలువు సాధించింది. ఆరేళ్ల ప్రాయంలో టెన్నిస్ రాకెట్ చేతపట్టి జూనియర్ స్థాయిలో వరుస విజయాలతో దూసుకెళ్లిన సాత్విక... డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్లో 2020లో అత్యుత్తమంగా 809వ ర్యాంక్ సాధించింది.హార్డ్ కోర్ట్పై సత్తాచాటిన ఈ హైదరాబాదీ... 2019 దక్షిణాసియా క్రీడల మహిళల సింగిల్స్లో పసిడి పతకంతో మెరిసింది. 2022 తర్వాత ఆటకు విరామమిచ్చిన సాత్విక... తాజాగా గ్రూప్–1 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి డీఎస్పీ పోస్టుకు అర్హత సాధించింది. శనివారం హైదరాబాద్లోని శిల్ప కళా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 25 ఏళ్ల సాత్విక నియామక పత్రం అందుకుంది. ఐటీఎఫ్ సింగిల్స్ ర్యాంకింగ్స్లో అత్యుత్తమంగా 527వ స్థానంలో నిలిచిన సాత్విక ఆ తర్వాత టెన్నిస్ కాలమిస్ట్గానూ ఆకట్టుకుంది. -
కోకో గాఫ్ ముందంజ
బీజింగ్: అమెరికా టెన్నిస్ స్టార్ కోకో గాఫ్ చైనా ఓపెన్లో మూడో రౌండ్కు దూసుకెళ్లింది. డబ్ల్యూటీఏ–1000 సిరీస్ టోర్నీ మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో ఆదివారం గాఫ్ 6–4, 4–6, 7–5తో లేలా ఫెర్నాండెజ్ (కెనడా)పై విజయం సాధించింది. రెండో సీడ్గా బరిలోకి దిగిన గాఫ్ ఈ మ్యాచ్లో 4 ఏస్లు సంధించి... 6 డబుల్ ఫాల్ట్లు చేసింది. 8 బ్రేక్ పాయింట్లు కాచుకున్న గాఫ్... మొత్తం 108 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. మంగళవారం జరగనున్న మూడో రౌండ్లో బెన్చిచ్ (స్విట్జర్లాండ్)తో గాఫ్ తలపడనుంది. ఇతర మ్యాచ్ల్లో ప్రపంచ 66వ ర్యాంకర్ ఇవా లైస్ (జర్మనీ) 6–3, 1–6, 6–4తో ప్రపంచ పదో ర్యాంకర్ రిబాకినా (కజకిస్తాన్)పై... జాస్మిన్ పావోలిని (ఇటలీ) 6–3, 6–0తో సోఫియా కెనిన్ (అమెరికా)పై విజయాలు సాధించి ముందంజ వేశారు. అమెరికా ప్లేయర్ కెస్లెర్తో మ్యాచ్ సందర్భంగా గాయపడిన చెక్ రిపబ్లిక్ ప్లేయర్ క్రెజికోవా పోటీ నుంచి తప్పుకుంది. క్వార్టర్ ఫైనల్లో జ్వెరెవ్ మరోవైపు ఏటీపీ–500 పురుషుల టోర్నమెంట్ లో రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లాడు. ప్రిక్వార్టర్స్లో జ్వెరెవ్ 7–5, 3–6, 6–3తో కొరెన్టిన్ మౌటెట్ (ఫ్రాన్స్)పై విజయం సాధించాడు. క్వార్టర్స్లో డానియల్ మెద్వెదెవ్ (రష్యా)తో జ్వెరెవ్ తలపడనున్నాడు. మరో మ్యాచ్లో లొరెన్జో ముసెట్టి (ఇటలీ) 6–3, 6–3తో ఆడియన్ మన్నారినో (ఫ్రాన్స్)పై గెలిచి ముందంజ వేశాడు. -
అనుష్క అదుర్స్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) జూనియర్ ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత షూటర్ అనుష్క ఠాకూర్ గురి అదిరింది. జూనియర్ మహిళల 50 మీటర్ల ప్రోన్ ఈవెంట్లో స్వర్ణ పతకం నెగ్గిన అనుష్క... తాజాగా 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లోనూ మెరిసి పసిడి పతకాన్ని దక్కించుకుంది. ఆదివారం జరిగిన 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఫైనల్లో అనుష్క 461 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. భారత్కే చెందిన మహిత్ సంధూ 422.7 పాయింట్లతో ఐదో స్థానంలో, ప్రాచి గైక్వాడ్ 399.3 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచారు. జూనియర్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో భారత షూటర్ అడ్రియన్ కర్మాకర్ రజత పతకాన్ని సంపాదించాడు. అడ్రియన్ 454.8 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచాడు. మరో నాలుగు రోజులపాటు జరిగే ఈ టోర్నీలో ప్రస్తుతం భారత్ పతకాల పట్టికలో నంబర్వన్ ర్యాంక్లో కొనసాగుతోంది. భారత్ ఖాతాలో 4 స్వర్ణాలు, 6 రజతాలు, 4 కాంస్యాలతో కలిపి మొత్తం 13 పతకాలు ఉన్నాయి. -
సూపర్ శ్రీహరి
అహ్మదాబాద్: పదహారేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు భారత స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ తెరదించాడు. ఆసియా అక్వాటిక్స్ చాంపియన్షిప్లో ఒకేరోజు భారత్కు మూడు పతకాలు అందించి అబ్బురపరిచాడు. ఆదివారం మొదలైన ఈ మెగా ఈవెంట్లో శ్రీహరి పురుషుల 200 మీటర్ల ఫ్రీస్టయిల్, 50 మీటర్ల బ్యాక్స్ట్రోక్ వ్యక్తిగత విభాగాల్లో రజత పతకాలు నెగ్గగా... 4 x 100 మీటర్ల మెడ్లీ రిలే ఈవెంట్లో కాంస్యం నెగ్గిన భారత బృందంలో సభ్యుడిగా ఉన్నాడు. 2020 టోక్యో ఒలింపిక్స్, 2024 పారిస్ ఒలింపిక్స్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన 24 ఏళ్ల శ్రీహరి... 200 మీటర్ల ఫ్రీస్టయిల్ ఫైనల్ను 1ని:48.47 సెకన్లలో ముగించి రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. హైబో జు (చైనా; 1ని:46.83 సెకన్లు) స్వర్ణం... హినాటో అండో (జపాన్; 1ని:48.73 సెకన్లు) కాంస్యం సాధించారు. 50 మీటర్ల బ్యాక్స్ట్రోక్ ఫైనల్ను శ్రీహరి 25.46 సెకన్లలో ముగించి రెండో స్థానాన్ని సంపాదించాడు. గుకైలాల్ వాంగ్ (చైనా; 25.11 సెకన్లు) స్వర్ణం... ములున్ చువాంగ్ (చైనీస్ తైపీ; 25.50 సెకన్లు) కాంస్యం కైవసం చేసుకున్నారు. రిషభ్ దాస్, లిఖిత్ సెల్వరాజ్, బెనెడిక్షన్ బెనిస్టన్, శ్రీహరి నటరాజ్ సభ్యులుగా ఉన్న భారత బృందం 4x100 మీటర్ల మెడ్లీ ఫైనల్ను 3ని:40.87 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. తొలి రోజు పోటీలు ముగిశాక చైనా 11 స్వర్ణాలు, 2 కాంస్యాలతో కలిపి 13 పతకాలతో టాప్ ర్యాంక్లో ఉండగా... భారత్ మూడు పతకాలతో ఆరో స్థానంలో ఉంది. -
యువ భారత్ ఏడోసారి
చెన్నై: అండర్–17 దక్షణాసియా ఫుట్బాల్ సమాఖ్య (SAFF U17) చాంపియన్షిప్లో భారత జట్టు చాంపియన్గా నిలిచింది. శనివారం కొలంబో వేదికగా జరిగిన ఫైనల్లో భారత జట్టు పెనాల్టీ షూటౌట్లో బంగ్లాదేశ్పై విజయం సాధించి ట్రోఫీ చేజిక్కించుకుంది. ఈ టోర్నీలో భారత జట్టు విజేతగా నిలవడం ఇది ఏడోసారి. తుదిపోరు నిర్ణీత సమయంలో 2–2 గోల్స్తో సమం కాగా... అనంతరం విజేతను నిర్ణయించేందుకు నిర్వహించిన పెనాల్టీ షూటౌట్లో భారత్ 4–1తో ముందంజ వేసింది. భారత్ తరఫున డల్లామౌన్ గాంగ్టే (4వ నిమిషంలో), అజ్లాన్ షా (38వ నిమిషంలో) చెరో గోల్ చేశారు. షూటౌట్లో భారత్ నుంచి డల్లామౌన్ గాంగ్టే, కొరో కొన్థోజమ్, ఇంద్ర రాణా, శుభమ్ పునియా విజయంవంతం అయ్యారు. బంగ్లా నుంచి మనిక్ మాత్రమే గోల్ చేశాడు. పసిడి గురిన్యూఢిల్లీ: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) జూనియర్ ప్రపంచకప్ టోర్నీలో భారత షూటర్ల జోరు సాగుతోంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత షూటర్లు స్వర్ణ, రజతాలు ఖాతాలో వేసుకున్నారు. రష్మిక సెహగల్–కపిల్ శర్మ అదిరిపోయే గురితో పసిడి పతకం ఖాతాలో వేసుకున్నారు.ఇటీవల ఆసియా చాంపియన్షిప్ వ్యక్తిగత విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించిన రష్మిక–కపిల్ జోడీ... శనివారం మిక్స్డ్ ఈవెంట్ ఫైనల్లో 16–10 పాయింట్ల తేడాతో భారత్కే చెందిన వన్షిక–జొనాథన్ గావిన్ ఆంటోనీ జంటపై గెలుపొందింది. ఒర్టెగా కాస్ట్రో–లూకాస్ సెంచెజ్ (స్పెయిన్) ద్వయం కాంస్యం ఖాతాలో వేసుకుంది. అంతకుముందు క్వాలిఫయింగ్ రౌండ్లో రష్మిక–కపిల్ చెరో 291 పాయింట్లు స్కోరు చేసి 582 పాయింట్లతో అగ్రస్థానంతో ఫైనల్కు చేరారు.వన్షిక–జొనాథన్ ద్వయం 578 పాయింట్ల (287+291)తో రెండో స్థానం దక్కించుకుంది. ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ క్వాలిఫయింగ్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జోడీలు పసిడి పతకం కోసం పోటీ పడగా... మూడో, నాలుగో స్థానాల్లో నిలిచిన జంటల కాంస్య పతక పోరు జరిగింది. ఫైనల్లో ఆరంభం నుంచే రష్మిక–కపిల్ జంట ఆధిక్యం కొనసాగింది. ఇప్పటికే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పురుషుల వ్యక్తిగత విభాగంలో పసిడి పతకం ఖాతాలో వేసుకున్న జొనాథన్... ఫైనల్లో విజృంభించినా... వన్షిక పలుమార్లు తడబడంతో ఈ జోడీ రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.జూనియర్ మహిళల స్కీట్ విభాగంలో ఒలింపియన్ రైజా ఢిల్లాన్ రజత పతకం కైవసం చేసుకుంది. ఇటలీకి చెందిన అరియానా 53 పాయింట్లతో స్వర్ణం గెలుచుకోగా... ఢిల్లాన్ 51 పాయింట్లతో రజతం నెగ్గింది. భారత్కే చెందిన మాన్సి రఘువంశీ 41 పాయింట్లతో కాంస్య పతకం దక్కించుకుంది. జూనియర్ మెన్స్ స్కీట్ విభాగంలో భారత షూటర్లు హర్మెహర్ సింగ్, అతుల్ సింగ్ రజావత్ వరుసగా నాలుగో, ఐదో స్థానాల్లో నిలిచి పతకం కోల్పోయారు. మూడు రోజుల పోటీలు ముగిసేసరికి భారత్ 11 పతకాల (2 స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్యాలు)తో పట్టిక అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇటలీ (2 స్వర్ణాలు, 1 రజతం) రెండో స్థానంలో ఉండగా... తటస్థ అథ్లెట్స్ రెండు స్వర్ణాలు గెలిచి మూడో స్థానంలో ఉన్నారు. -
వరుసగా రెండో పరాజయం
కాన్బెర్రా: ఆ్రస్టేలియా పర్యటనలో భారత జూనియర్ మహిళల హాకీ జట్టు వరుసగా రెండో మ్యాచ్లో పరాజయం పాలైంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శనివారం జరిగిన రెండో పోరులో జ్యోతి సింగ్ సారథ్యంలోని భారత జట్టు 0–5 గోల్స్ తేడాతో ఆస్ట్రేలియా అండర్–21 జట్టు చేతిలో ఓడింది. గత మ్యాచ్లో గట్టి పోటీనిచ్చి పరాజయం పాలైన భారత అమ్మాయిలు... ఈ పోరులో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. ప్రత్యర్థికి కనీసం పోటీనివ్వలేక వెనుకబడింది. భారత్ ఒక్క గోల్ కూడా చేయలేకపోగా... ఆ్రస్టేలియా జట్టు తరఫున మకేలా జోన్స్ (10వ, 11వ, 52వ నిమిషాల్లో) హ్యాట్రిక్ గోల్స్తో విజృంభించింది. సమీ లవ్ (38వ నిమిషంలో), మిగాలియా హవెల్ (50వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. గత మ్యాచ్లో కేవలం ఒక్క గోల్ తేడాతో ఓడిన భారత్... ఈ మ్యాచ్లో ప్రత్యర్థి గోల్పోస్ట్పై దాడులు చేయడంలో విఫలమైంది. మ్యాచ్ ఆరంభం నుంచి అటాకింగ్ గేమ్ ఆడిన ఆ్రస్టేలియా అమ్మాయిలు... పదేపదే భారత గోల్పోస్ట్పై దాడులు చేస్తూ ఒత్తిడి కొనసాగించారు. ఈ ఏడాది డిసెంబర్లో చిలీ వేదికగా ఎఫ్ఐహెచ్ జూనియర్ మహిళల ప్రపంచకప్ జరగనుండగా... దానికి ముందు ఈ సిరీస్ను సన్నాహకంగా వినియోగించుకోవాలనుకున్న భారత్కు నిరాశ ఎదురవుతోంది. ఇరు జట్ల మధ్య సోమవారం ఇక్కడే మూడో మ్యాచ్ జరగనుంది. -
బెంగాల్ వారియర్స్ మూడో విజయం
జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో బెంగాల్ వారియర్స్ మూడో విజయం ఖాతాలో వేసుకుంది. శనివారం జరిగిన తొలి పోరులో బెంగాల్ వారియర్స్ 48–42 పాయింట్ల తేడాతో పట్నా పైరెట్స్పై విజయం సాధించింది. బెంగాల్ వారియర్స్ కెప్టెన్ దేవాంక్ 22 పాయింట్లతో విజృంభించడంతో జట్టు సునాయాసంగా గెలుపొందింది. హిమాన్షు నర్వాల్, అశీష్ మాలిక్ చెరో 5 పాయింట్లతో సారథికి అండగా నిలిచారు. పట్నా పైరెట్స్ తరఫున అయాన్ 15 పాయింట్లు, మణిందర్ సింగ్ 12 పాయింట్లతో పోరాడినా జట్టును గెలిపించలేకపోయారు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో ఇరు జట్లు రెయిడింగ్లో 29 పాయింట్లు సాధించగా... ట్యాక్లింగ్లో ముందంజ వేసిన బెంగాల్ను విజయం వరించింది. తాజా సీజన్లో 8 మ్యాచ్లాడిన బెంగాల్ వారియర్స్ 3 విజయాలు, 5 పరాజయాలతో 6 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక 10వ స్థానంలో కొనసాగుతోంది. ఇక పట్నా 8 మ్యాచ్ల్లో 2 విజయాలు, 6 పరాజయాలతో 4 పాయింట్లు సాధించి 11వ స్థానంలో ఉంది. మరో మ్యాచ్లో తమిళ్ తలైవాస్ 37–28 పాయింట్ల తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్పై గెలుపొందింది. తలైవాస్ కెప్టెన్ అర్జున్ దేశ్వాల్ 13 పాయింట్లు సాధించగా... పింక్ పాంథర్స్ తరఫున నితిన్ కుమార్ 8 పాయింట్లు సాధించాడు. లీగ్లో జైపూర్ అంచె పోటీలు ముగియగా... ఇక చైన్నై వేదికగా మ్యాచ్లు జరగనున్నాయి. లీగ్లో ఆదివారం విశ్రాంతి దినం కాగా... సోమవారం జరగనున్న మ్యాచ్ల్లో యూపీ యోధాస్తో గుజరాత్ జెయింట్స్, దబంగ్ ఢిల్లీతో హర్యానా స్టీలర్స్ తలపడనున్నాయి. -
సరైన టోర్నీలు ఎంపిక చేసుకోవాలి!
ముంబై: భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధుకు మరిన్ని టైటిల్స్ గెలిచే సత్తా ఉందని, ఎలా గెలవాలో కూడా తనకు బాగా తెలుసని... అయితే మూడు పదుల వయసును గుర్తించి ఇకపై ఆడాలని వెటరన్ షట్లర్ సైనా నెహ్వల్ సూచించింది. ఈ ఏడాది సింధుకు గడ్డు కాలం నడుస్తోంది. రెండు వరుస ఒలింపిక్స్లో పతకాల విజేత అయిన ఆమె ఈ సీజన్లో ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలుపొందలేకపోయింది. ఒక్క ప్రపంచ చాంపియన్షిప్ మినహా చాలా టోర్నీల్లో మొదటి లేదంటే రెండో రౌండ్లలోనే నిష్క్రమించింది. గతనెల జరిగిన ప్రపంచ చాంపియన్షిప్లో సింధు క్వార్టర్ ఫైనల్స్ చేరింది. ఈ నేపథ్యంలోనే ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సైనా మాట్లాడుతూ.. తన సహచర షట్లర్కు పలు సూచనలు చేసింది. ఆ వివరాలు ఆమే మాటల్లోనే...వయసు మాట వినాలి వయసు పైబడిన తర్వాత ఆడలేరని కాదు... మునుపటిలా ఆడలేమన్నది వాస్తవం. దీన్ని దృష్టిలో ఉంచుకొనే మన ఆట కొనసాగించాలి. సింధు కూడా ఇదే చేయాలి. ఆమెలో గెలిచే సత్తా ఇంకా వుంది. అయితే వరుసగా అన్ని ఆడుతూ వుండటమే సరికాదు. ఇలా అన్ని కాకుండా కొన్ని ఎంపిక చేసిన టోర్నీలు, బాగా అచ్చొచ్చే సిరీస్లు, తను గెలుపొందగలననే ఈవెంట్లను ఎంచుకొని అందులో ఆడితేనే సింధుకు మేలు చేస్తుంది. మూడు పదుల వయసొచ్చాక వరుసబెట్టి ఆడటం, గెలవడం, ర్యాంకును నిలకడగా కొనసాగించడం చాలా కష్టం. ఫలానా ప్రపంచ చాంపియన్షిప్ లేదంటే ఆసియా చాంపియన్షిప్లో అదరగొడతాను అనుకునే టోర్నీల్లో దిగి పూర్తిస్థాయి ఆత్మవిశ్వాసంతో అడొచ్చు. గెలవొచ్చు. ఆమెకు అన్నీ తెలుసు ఈ సీజన్లో సింధు బరిలోకి దిగాల్సిన టోర్నీలు ఇంకా ఉన్నాయి. తప్పకుండా అందులో రాణించే సత్తా ఆమెకు వుంది. ప్రపంచ చాంపియన్షిప్లో క్వార్టర్ ఫైనల్ చేరడం ద్వారా తనలో చేవ తగ్గలేదని నిరూపించుకుంది. తదుపరి టోర్నీల్లోనూ సింధు కచ్చితంగా మెరుగైన ప్రదర్శన ఇవ్వగలదు.పురుషుల సింగిల్స్కు ఢోకా లేదు భారత బ్యాడ్మింటన్లో పురుషుల సింగిల్స్ భవిష్యత్తుకు ఏ ఢోకా లేదు. లక్ష్యసేన్, ప్రియాన్షు రావత్, హెచ్.ఎస్. ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్ ఇలా పలువురు షట్లర్లు ఉన్నారు. కానీ మహిళల సింగిల్సే కాస్త ఇబ్బందికరం. ప్రస్తుతం ఒక్క సింధు మినహా ఈ కేటగిరీలో చెప్పుకోదగ్గ ప్లేయరే లేదు. యువ షట్లర్లు మరింత మంది రావాలి. కొందరు అడపాదడపా బాగానే ఆడుతున్నారు కానీ నిలకడగా రాణించే వారే కరువయ్యారు. వచ్చే నెల జూనియర్ ప్రపంచ చాంపియన్షిప్ జరుగనున్న నేపథ్యంలో భారత్ నుంచి ఎలాంటి ప్రతిభావంతులు వస్తారో చూడాలి. ప్రపంచ పురుషుల డబుల్స్లోనే సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ షెట్టిలది అసాధారణ జోడీ. ప్రతీ టోర్నీని గెలవగలిగే సత్తా ఈ జంటకు ఉంది. సాత్విక్–చిరాగ్ల ఆటతీరును చూసినా... ప్రపంచంలోనే నంబర్వన్ జోడీ ఆటను చూసినా ఒకే తీరుగా ఉంటుంది. -
అనిరుధ్ జోడీకి టైటిల్
సాక్షి, హైదరాబాద్: జింగ్షాన్ ఓపెన్ ఏటీపీ–100 చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో అనిరుధ్ చంద్రశేఖర్ జంట టైటిల్ చేజిక్కించుకుంది. చైనా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ పురుషుల డబుల్స్లో హైదరాబాద్కు చెందిన అనిరుధ్ చంద్రశేఖర్ (భారత్)–రిసీ స్టాల్డర్ (అమెరికా) జంట విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో అనిరు«ద్–రిసీ స్టాల్డర్ జోడీ 6–2, 2–6, 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో సుంగ్ హావో హువాంగ్ (చైనీస్ తైపీ)–యుసింగ్ పార్క్ (దక్షిణ కొరియా) ద్వయంపై గెలుపొందింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో అనిరుధ్ జంట 2 ఏస్లు సంధించి... 3 డబుల్ ఫాల్ట్లు చేసింది. తొలి సెట్ను సునాయాసంగానే నెగ్గిన అనిరు«ద్–స్టాల్డర్ జోడీకి రెండో సెట్లో ప్రత్యర్థి నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదురైంది. ఇక ఉత్కంఠభరితంగా సాగిన నిర్ణయాత్మక మూడో సెట్ ‘సూపర్ టైబ్రేక్’కు చేరగా... ఒత్తిడిని అధిగమించి కీలక సమయాల్లో పాయింట్లు సాధించిన భారత జంట విజేతగా నిలిచింది. 67 నిమిషాల పాటు సాగిన తుదిపోరులో 2 బ్రేక్ పాయింట్లు సాధించిన అనిరు«ద్–స్టాల్డర్ జోడీ... మొత్తం 49 పాయింట్లు నెగ్గింది. తమ సర్వీస్లో 34 పాయింట్లు సాధించి ముందంజ వేసింది. -
రజత దీప్తి
న్యూఢిల్లీ: తెలంగాణ పారా అథ్లెట్ జివాంజి దీప్తి ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో రజత పతకంతో మెరిసింది. పారిస్ పారాలింపిక్స్లో పసిడి పతకం నెగ్గిన దీప్తి... తాజా పోటీల్లో రజతం ఖాతాలో వేసుకుంది. మహిళల 400 మీటర్ల పరుగు టి20 విభాగంలో బరిలోకి దిగిన దీప్తి శనివారం ఫైనల్లో 55.16 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రెండో స్థానంలో నిలిచింది. ఈ సీజన్లో దీప్తికి ఇదే అత్యుత్తమ ప్రదర్శన కాగా... టర్కీకి చెందిన అయెసెల్ ఒండెర్ కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పుతూ 54.51 సెకన్లలో గమ్యాన్ని చేరి పసిడి పతకం కైవసం చేసుకుంది. ఉక్రెయిన్ యులియా షులియర్ (56.20 సెకన్లు)కు కాంస్యం దక్కింది. న్యూఢిల్లీ వేదికగా శనివారం ఘనంగా ప్రారంభమైన వరల్డ్ అథ్లెటిక్స్ పోటీల్లో తొలి రోజు భారత్ ఖాతాలో మూడు పతకాలు చేరాయి. దీప్తి రజతం చేజిక్కించుకోగా... హై జంప్లో భారత అథ్లెట్లు రెండు పతకాలు కైవసం చేసుకున్నారు. పురుషుల హై జంప్ టి42 విభాగంలో శైలేశ్ కుమార్ స్వర్ణం గెలుచుకోగా... వరుణ్ సింగ్ కాంస్యం నెగ్గాడు. శైలేశ్ 1.91 మీటర్ల ఎత్తు దూకి అగ్రస్థానంలో నిలవగా... పారా ఆసియా క్రీడల పతక విజేత వరుణ్ సింగ్ 1.85 మీటర్లతో కాంస్యం నెగ్గాడు. భారత్కే చెందిన రాహుల్ (1.78 మీటర్లు) నాలుగో స్థానంలో నిలిచాడు. -
వరల్డ్ చాంపియన్.. శీతల్ దేవి సరికొత్త చరిత్ర
భారత పారా ఆర్చర్ శీతల్ దేవి (Sheetal Devi) సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచ పారా ఆర్చరీ చాంపియన్షిప్ (Para World Archery Championship)లో భాగంగా మహిళల వ్యక్తిగత కాంపౌండ్ కేటగిరీలో సంచలన విజయం సాధించింది. వరల్డ్ నంబర్ వన్, టర్కీకి చెందిన ఓజ్నుర్ క్యూర్ గిర్డీని 146- 143 తేడాతో ఓడించి స్వర్ణ పతకం (Won Gold Medal) కైవసం చేసుకుంది.పద్దెమినిదేళ్ల వయసులోనేదక్షిణ కొరియాలోని గ్వాన్జూ వేదికగా శనివారం జరిగిన పోటీలో ఈ మేరకు శీతల్ దేవి పసిడి గెలిచింది. తద్వారా ఈ చాంపియన్షిప్లో చేతుల్లేకుండానే ఈ ఘనత సాధించిన ఆర్చర్గా ఆమె చరిత్రకెక్కింది. అంతేకాదు పద్దెమినిదేళ్ల వయసులోనే శీతల్ ఈ ఘనత సాధించడం విశేషం.అంతకు ముందు.. తోమన్ కుమార్తో కలిసి ఇదే ఈవెంట్లో మిక్స్డ్ టీమ్ విభాగంలో శీతల్ దేవి కాంస్యం గెలుచుకుంది. గ్రేట్ బ్రిటన్కు చెందిన జోడీ గ్రిన్హామ్- నాథన్ మాక్క్వీన్ను 152- 149తో ఓడించి ఈ పతకం సాధించింది శీతల్- తోమన్ జోడీ.అదే విధంగా.. మహిళల ఓపెన్ టీమ్ ఈవెంట్లో శీతల్ దేవి సరితతో కలిసి రజత పతకం సాధించింది. ఫైనల్లో టర్కీ పారా ఆర్చర్ల చేతిలో ఓడిపోవడం ద్వారా వీరు రన్నరప్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.రెండు చేతులు లేకుండానేజమ్ము కశ్మీర్కు చెందిన శీతల్ దేవి పుట్టడమే ‘ఫొలొమెలియా’ అనే శారీరక స్థితి వల్ల రెండు చేతులు లేకుండానే జన్మించింది. అయినా విధివంచితురాలినని కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కాళ్లను, భుజాలను, పంటి దవడలను ఉపయోగించి బాణం ప్రయోగించడం నేర్చుకుంది. అంచెలంచెలుగా ఎదిగి 2024లో పారిస్ పారా ఒలింపిక్స్లో పతకం గెలిచింది. సాధారణంగా విలు విద్య అంటేనే చేతులతో ప్రదర్శించేది. అలాంటిది చేతులే లేకుండా శీతల్ వేది బాణం వేయడం విశేషం. ఇప్పటికే ఎన్నో పతకాలు గెలుచుకున్న ఆమె ఇప్పుడు ఏకంగా వరల్డ్ చాంపియన్ అయింది.చదవండి: IND vs WI: ‘అతడి తండ్రి గట్టిగానే నిలదీశాడు.. అందుకే ఆ ప్లేయర్పై వేటు’ -
జొనాథన్ ‘పసిడి’ గురి.. రష్మికకు రజతం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) జూనియర్ ప్రపంచకప్ టోర్నీలో రెండో రోజు భారత్కు రెండు పతకాలు లభించాయి. జూనియర్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో జొనాథన్ గావిన్ ఆంటోనీ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకోగా... జూనియర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో రష్మిక సెహగల్ రజత పతకాన్ని దక్కించుకుంది. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో జొనాథన్ 244.8 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచాడు. అరిగి లుకా (ఇటలీ; 236.3 పాయింట్లు) రజతం, లుకాస్ సాంచెజ్ (స్పెయిన్; 215.1 పాయింట్లు) కాంస్యం గెల్చుకున్నారు. భారత్కే చెందిన చిరాగ్ శర్మ 115.6 పాయింట్లతో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. అంతకుముందు 21 మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్లో జొనాథన్ 586 పాయింట్లతో టాప్ ర్యాంక్లో, చిరాగ్ శర్మ 578 పాయింట్లతో రెండో ర్యాంక్లో నిలిచారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో భారత్ నుంచి ముగ్గురు రష్మిక సెహగల్, వన్షిక, మోహిని సింగ్ బరిలోకి దిగారు. రష్మిక 236.1 పాయింట్లతో రెండో స్థానంలో రజత పతకాన్ని సొంతం చేసుకుంది. వన్షిక 174.2 పాయింట్లతో ఐదో స్థానంలో, మోహిని 153.7 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచారు. రెండో రోజు పోటీలు ముగిశాక భారత్ 2 స్వర్ణాలు, 3 రజతాలు, 2 కాంస్యాలతో కలిపి ఏడు పతకాలతో టాప్ ర్యాంక్లో ఉంది. లలిత్ గేమ్ ‘డ్రా’ సాక్షి, గుంటూరు: జాతీయ సీనియర్ చెస్ చాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్ ఎంఆర్ లలిత్ బాబు ఖాతాలో వరుసగా రెండో ‘డ్రా’ చేరింది. విజ్ఞాన్ యూనివర్సిటీలో జరుగుతున్న ఈ టోరీ్నలో లలిత్ బాబు తొలి నాలుగు గేముల్లో గెలుపొందాడు. దీపన్ చక్రవర్తి (రైల్వేస్)తో శుక్రవారం జరిగిన ఆరో రౌండ్ గేమ్ను 35 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. సూర్యశేఖర గంగూలీ (పెట్రోలియం) తో గురువారం జరిగిన ఐదో రౌండ్ గేమ్ను లలిత్ 30 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ఆరో రౌండ్ తర్వాత లలిత్ బాబు ఐదు పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. -
ఒకే జట్టులో అర్జున్, గుకేశ్ ,హంపి, హారిక
ముంబై: ప్రపంచ చదరంగంలోని మేటి ప్లేయర్లు ఒకే వేదికపై వచ్చి ఎత్తుకు పైఎత్తులు వేసేందుకు సిద్ధమయ్యారు. టెక్ మహీంద్ర, అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) సంయుక్త ఆధ్వర్యంలో జరుగనున్న గ్లోబల్ చెస్ లీగ్ (జీసీఎల్) మూడో సీజన్కు సంబంధించి ఆటగాళ్ల డ్రాఫ్టింగ్ పూర్తయింది. భారత్ నుంచి తొమ్మిది మంది గ్రాండ్మాస్టర్లు ఆయా జట్లకు ప్రాతినిధ్యం వహిస్తారు. క్లాసికల్ ఫార్మాట్లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్, ప్రపంచ ర్యాంకర్ దొమ్మరాజు గుకేశ్... ప్రపంచ ఐదో ర్యాంకర్, తెలంగాణ గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్ ఒకే జట్టు తరఫున బరిలోకి దిగనున్నారు. గుకేశ్, అర్జున్లను పీబీజీ అలాస్కాన్ నైట్స్ జట్టు సొంతం చేసుకుంది. భారత స్టార్ మహిళా గ్రాండ్మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక కూడా ఒకే జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. ప్రపంచ మహిళల ర్యాపిడ్ ఫార్మాట్ చాంపియన్, ప్రపంచ ఐదో ర్యాంకర్ కోనేరు హంపి, ప్రపంచ 19వ ర్యాంకర్, హైదరాబాద్కు చెందిన హారికను అప్గ్రాడ్ ముంబా మాస్టర్స్ జట్టు దక్కించుకుంది. డిసెంబర్ 13 నుంచి 24వ తేదీ వరకు జరిగే ఈ మెగా లీగ్కు ముంబై ఆతిథ్యమిస్తుంది. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ గ్యాంజస్ గ్రాండ్మాస్టర్స్ జట్టు తరఫున కొనసాగుతుండగా... భారత నంబర్వన్ ప్రజ్ఞానంద అల్పైన్ ఎస్జీ పైపర్స్ జట్టుకు ఆడనున్నాడు. మొత్తం ఆరు జట్ల మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో టోర్నీ జరుగుతుంది. గేమ్లను ర్యాపిడ్ ఫార్మాట్లో నిర్వహిస్తారు. ఒక్కో జట్టులో ఆరుగురు ప్లేయర్లు ఉండగా... అందులో ఇద్దరు మహిళా క్రీడాకారిణులున్నారు. గ్లోబల్ చెస్ లీగ్ మూడో సీజన్ జట్ల వివరాలు అమెరికన్ గాంబిట్స్: హికారు నకముర (అమెరికా), రిచర్డ్ రాపోర్ట్ (హంగేరి), వ్లాదిస్లావ్ అర్తెమియెవ్ (రష్యా), బీబీసారా అసయుబయేవా (కజకిస్తాన్), టియోడోరా ఇంజాక్ (సెర్బియా), వొలోడార్ ముర్జిన్ (రష్యా). అల్పైన్ ఎస్జీ పైపర్స్: ఫాబియానో కరువానా (అమెరికా), ప్రజ్ఞానంద (భారత్), అనీశ్ గిరి (నెదర్లాండ్స్), హు ఇఫాన్ (చైనా), నినో బత్సియాష్విలి (జార్జియా), లియోన్ మెన్డోంకా (భారత్). గ్యాంజస్ గ్రాండ్మాస్టర్స్: విశ్వనాథన్ ఆనంద్ (భారత్), జవోఖిర్ సిందరోవ్ (ఉజ్బెకిస్తాన్), విన్సెంట్ కీమెర్ (జర్మనీ), స్టవ్రూలా సొలాకిడూ (గ్రీస్), పొలీనా షువలోవా (రష్యా), రౌనక్ సాధ్వాని (భారత్). అప్గ్రాడ్ ముంబా మాస్టర్స్: మాక్సిమి వాచియెర్ లాగ్రెవ్ (ఫ్రాన్స్), షఖిర్యార్ మమెదైరోవ్ (అజర్బైజాన్), వెస్లీ సో (అమెరికా), కోనేరు హంపి (భారత్), ద్రోణవల్లి హారిక (భారత్), బర్దియా దానేశ్వర్ (ఇరాన్). పీబీజీ అలాస్కాన్ నైట్స్: దొమ్మరాజు గుకేశ్ (భారత్), ఇరిగేశి అర్జున్ (భారత్), లీనియర్ డొమింగెజ్ (అమెరికా), సారాసాదత్ ఖాడెమ్ (స్పెయిన్), కాటరీనా లాగ్నో (రష్యా), డేనియల్ దర్ధా (బెల్జియం). త్రివేణి కాంటినెంటల్ కింగ్స్: అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్), యి వె (చైనా), విదిత్ సంతోష్ గుజరాతి (భారత్), అలెగ్జాండ్రా కొస్టెనిక్ (స్విట్జర్లాండ్), జు జినెర్ (చైనా), మార్క్ ఆండ్రియా మౌరిజి (ఫ్రాన్స్). -
క్రికెటర్ల నుంచి స్ఫూర్తి పొందా: బోల్ట్
ముంబై: క్రికెటర్లు మైదానంలో చూపే అంకితభావం... ఆట కోసం వారు కష్టపడే తీరు చూసి ఎంతగానో స్ఫూర్తి పొందినట్లు స్ప్రింట్ దిగ్గజం ఉసేన్ బోల్ట్ పేర్కొన్నాడు. క్రికెటర్లు గ్రౌండ్లో తమ సర్వస్వాన్ని అంకితం చేయడం... అథ్లెటిక్స్లో తాను రాణించేందుకు ప్రేరణనిచ్చిందని ఈ ‘జమైకా చిరుత’ వెల్లడించాడు. సుదీర్ఘకాలం పాటు పరుగుకు పర్యాయపదంగా నిలిచిన బోల్ట్ 8 ఒలింపిక్ స్వర్ణాలు, ప్రపంచ చాంపియన్షిప్లో 11 పతకాలు సాధించాడు. శుక్రవారం ముంబైలోని జమునాబాయి నర్సీ క్యాంపస్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో బోల్ట్ పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో క్రీడా రంగ ప్రముఖులతో పాటు బాలీవుడ్ తారలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోల్ట్ మాట్లాడుతూ... ‘నేను చిన్నప్పుడు క్రికెట్కు వీరాభిమానిని. క్రికెట్ ఎదుగుదలను చూశాను. క్రికెటర్ల ప్రతిభను, వారు పనిచేసే తీరును, వారు తమను తాము మలుచుకునే విధానం అథ్లెటిక్స్లో నాకు ఎంతగానో ప్రేరణనిచ్చాయి’ అని అన్నాడు. మైకెల్ హోల్డింగ్, కోట్నీ వాల్ష్, క్రిస్ గేల్ వంటి పలువురు ప్రఖ్యాత క్రికెటర్లు కూడా జమైకన్లే కాగా... వారి ప్రభావం తనపై అధికంగా ఉన్నట్లు బోల్ట్ పేర్కొన్నాడు. విజయానికి దగ్గరి దారులు ఉండవన్న బోల్ట్ కష్టపడితే తప్పక ఫలితం వస్తుందని అన్నాడు. ‘ప్రతి పనికి కష్టపడాల్సిందే. క్రీడల్లో అంకితభావం కూడా అవసరం. ట్రాక్ అండ్ ఫీల్డ్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే దానిపై ఎక్కువ కష్టపడ్డా. ఏ రంగంలోనైనా అగ్రస్థానానికి చేరడం అంత సులభం కాదు. పరిస్థితులు పరీక్షిస్తున్నప్పుడు కఠిన సమయాలను దాటుకుంటూ ప్రపంచంలో అత్యుత్తమ అథ్లెట్గా నన్ను నేను మలుచుకునేందుకు పట్టుదల, అంకితభావంతో కృషి చేశా. అందుకు తగ్గ ప్రతిఫలం సాధించా’ అని 39 ఏళ్ల బోల్ట్ అన్నాడు. పురుషుల 100 మీటర్ల పరుగులో ప్రపంచ రికార్డు (9.58 సెకన్లు) నెలకొల్పిన బోల్ట్... గతంలోనూ పలు సందర్భాల్లో తనకు క్రికెట్ మీద ఉన్న ఇష్టాన్ని వెల్లడించాడు. -
తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ 2025 విజేతగా జమాల్
హైదరాబాద్: ఎన్ఎస్ఎల్ లక్స్ సమర్పించిన తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ 2025 టైటిల్ను బంగ్లాదేశ్ స్టార్ గోల్ఫర్ జమాల్ హుస్సేన్ కైవసం చేసుకున్నాడు. హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ (హెచ్ జీ ఏ)లో శుక్రవారం జరగాల్సిన ఫైనల్ రౌండ్ భారీ వర్షం కారణంగా రద్దయింది. దీంతో టోర్నమెంట్ ఫలితాన్ని మూడు రౌండ్ల (54 హోల్స్) స్కోర్ల ఆధారంగా ప్రకటించారు.మూడో రౌండ్ ముగిసే సమయానికి 23-అండర్ 187 (61-62-64) అద్భుత స్కోర్తో ప్రత్యర్థులపై నాలుగు షాట్ల ఆధిక్యంలో ఉన్న జమాల్ హుస్సేన్ను విజేతగా ప్రకటించారు. 40 ఏళ్ల జమాల్కు ఇది కెరీర్లో ఆరవ టైటిల్. గత నవంబర్ తర్వాత మొదటిది. ఈ విజయంతో అతను రూ. 15 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు. ఫలితంగా పీజీటీఐ 2025 ఆర్డర్ ఆఫ్ మెరిట్లో 14 నుంచి 10వ స్థానానికి ఎగబాకాడు.చండీగఢ్కు చెందిన అక్షయ్ శర్మ (62-64-65) మొత్తంగా 19-అండర్ 191 స్కోర్తో రన్నరప్గా నిలిచాడు. అతను రూ. 10 లక్షల చెక్ను అందుకుని, పీజీటీఐ మెరిట్ జాబితాలో 34వ స్థానం నుంచి 21వ స్థానానికి చేరుకున్నాడు. బెంగళూరు ఆటగాడు ఖలీన్ జోషి (65-66-66) 13-అండర్ 197 స్కోర్తో మూడో స్థానంలో నిలిచాడు. ఢిల్లీకి చెందిన అర్జున్ ప్రసాద్ 11-అండర్ 199 స్కోర్తో ఆరో స్థానంలో నిలిచాడు. ఈ ప్రదర్శన తర్వాత తన సీజన్ ఆదాయం రూ. 69,71,599తో పీజీటీఐ ర్యాంకింగ్స్లో రెండో స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఈ టోర్నీలో పాల్గొనని యువరాజ్ సంధు (చండీగఢ్) రూ. 88,67,200 సంపాదనతో పీజీటీఐ మనీ లిస్ట్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక, స్థానిక గోల్ఫర్లలో హైదరాబాద్కు చెందిన విశేష్ శర్మ ఉత్తమ ప్రదర్శన కనబరిచాడు. అతను 5-అండర్ 205 స్కోర్తో 22వ స్థానంలో నిలిచాడు.ఈ టోర్నమెంట్లో జమాల్ హుస్సేన్ మూడు రౌండ్లలోనూ ఆధిక్యాన్ని ప్రదర్శించి, తన సమీప ప్రత్యర్థులకు ఏ దశలోనూ అవకాశం ఇవ్వలేదు.మొదటి రౌండ్ లో టోర్నమెంట్లోనే అత్యల్ప స్కోర్ (61) నమోదు చేసి తొలి రోజు నుంచే ఒక షాట్ ఆధిక్యంతో అగ్రస్థానంలో నిలిచాడు. తర్వాతి రౌండ్లలోనూ అదే జోరు కొనసాగించాడు. అత్యంత నిలకడైన ఆట తీరుకు నిదర్శనంగా 54 హోల్స్లో జమాల్ కేవలం ఒక్క బోగీ మాత్రమే నమోదు చేయడం విశేషం.విజయం అనంతరం జమాల్ హుస్సేన్ మాట్లాడుతూ, "ఈ సీజన్లో టైటిల్ గెలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. గతంలో రెండు సార్లు టైటిల్కు దగ్గరగా వచ్చి విఫలమయ్యాను. ఫైనల్ రౌండ్ ఆడాలని చాలా అనుకున్నాను. కానీ వాతావరణం మన చేతుల్లో లేదు. ఈ వారం మొత్తం నా డ్రైవింగ్, పుట్టింగ్ అద్భుతంగా ఉన్నాయి. మొదటి రౌండ్లో సాధించిన 61 స్కోర్ టోర్నీ విజవానికి మంచి పునాది వేసింది. వచ్చే నెలలో ఢిల్లీలో జరిగే డీపీ వరల్డ్ ఇండియా ఛాంపియన్షిప్లో రాణించడమే నా తదుపరి లక్ష్యం" అని అన్నాడు. -
ఘోర ప్రమాదం నుంచి కోలుకొని... ఐదేళ్ల తర్వాత రీఎంట్రీ
స్కార్పెరియా ఇ శాన్ పియరో (ఇటలీ): సుమారు ఐదేళ్ల క్రితం ఫార్ములా వన్ ట్రాక్పై ఘోర ప్రమాదం నుంచి బయటపడిన ఫ్రెంచ్ డ్రైవర్ రొమైన్ గ్రోజన్... తిరిగి స్టీరింగ్ చేతపట్టనున్నాడు. 2020 సీజన్ బహ్రెయిన్ గ్రాండ్ప్రి రేసులో అతడి కారు ఘోర ప్రమాదానికి గురైంది. వాయు వేగంతో దూసుకెళ్తున్న సమయంలో ఉన్నట్టుండి ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో గ్రొజాన్ కారు రెండు ముక్కలవగా... పెద్దఎత్తున మంటలు చెలరేగాయి.నమ్మశక్యంగా లేదుఅందులో చిక్కుకున్న గ్రొజాన్... కాలిన గాయాలతో బయటపడ్డాడు. చికిత్స అనంతరం కోలుకున్న అతడు ఇక అప్పటి నుంచి ఎఫ్1 రేసులకు దూరంగా ఉంటున్నాడు. కాగా... గ్రొజాన్ శుక్రవారం ఇటలీలోని ముగెల్లో సర్క్యూట్లో తన పాత జట్టు ‘హాస్’ తరఫున కొత్త కారును పరీక్షించనున్నాడు. ఈ సమయంలో కుటుంబ సభ్యుల ఫొటోలు ఉన్న హెల్మెట్ అతడు ధరించనున్నాడు.‘నిజంగా నమ్మశక్యంగా లేదు. ప్రమాదం జరిగి ఐదేళ్లు అయింది. పాత మిత్రులతో కలిసి తిరిగి కారు నడపనుండటం ప్రత్యేకమైన అనుభూతి’ అని గ్రొజాన్ పేర్కొన్నాడు. ప్రమాదం అనంతరం ఫార్ములావన్కు దూరమైన గ్రొజాన్... అమెరికా వేదికగా జరిగే ఇండి కార్, స్పోర్ట్స్ కార్ సిరీస్ల్లో పాల్గొంటున్నాడు.చదవండి: దబంగ్ ఢిల్లీ ‘టాప్’ షో -
దబంగ్ ఢిల్లీ ‘టాప్’ షో
జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో దబంగ్ ఢిల్లీ తిరిగి గెలుపుబాట పట్టింది. తొలి ఆరు మ్యాచ్ల్లో విజయాలు సాధించిన దబంగ్ ఢిల్లీ గత మ్యాచ్లో ఓడినా... వెంటనే కోలుకొని తిరిగి విజయం సాధించింది. లీగ్లో భాగంగా గురువారం జరిగిన పోరులో దబంగ్ ఢిల్లీ 47–26 పాయింట్ల తేడాతో యు ముంబాను మట్టికరిపించింది. దబంగ్ ఢిల్లీ తరఫున అశు మలిక్ 23 పాయింట్లతో విజృంభించాడు. నీరజ్ నర్వాల్ 7 పాయింట్లతో అతడికి అండగా నిలిచాడు. తాజా సీజన్లో 8 మ్యాచ్లాడిన దబంగ్ ఢిల్లీ 7 విజయాలు, ఒక పరాజయంతో 14 పాయింట్లు ఖాతాలో వేసుకొని తిరిగి పాయింట్ల పట్టికలో ‘టాప్’కు దూసుకెళ్లింది. మరో మ్యాచ్లో యూపీ యోధాస్ ‘టై బ్రేకర్’లో బెంగళూరు బుల్స్పై నెగ్గింది. నిర్ణీత సమయంలో ఇరు జట్ల పాయింట్లు 36–36తో సమం కాగా... విజేతను తేల్చేందుకు నిర్వహించిన టై బ్రేకర్లో యూపీ యోధాస్ 6–5తో బుల్స్ను చిత్తుచేసి ముందంజ వేసింది. యూపీ యోధాస్ తరఫున భవాని రాజ్పుత్ 10 పాయింట్లు సాధించాడు. శుక్రవారం లీగ్లో విశ్రాంతి దినం... శనివారం జరగనున్న మ్యాచ్ల్లో పట్నా పైరేట్స్తో బెంగాల్ వారియర్స్, జైపూర్ పింక్ పాంథర్స్తో తమిళ్ తలైవాస్ తలపడతాయి. -
క్లీన్స్వీప్...
న్యూఢిల్లీ: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) జూనియర్ ప్రపంచకప్ టోర్నమెంట్ను భారత షూటర్లు ఘనంగా ప్రారంభించారు. తొలి రోజు భారత షూటర్లు మొత్తం ఐదు పతకాలను సొంతం చేసుకున్నారు. జూనియర్ మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో భారత్ క్లీన్స్వీప్ చేసింది. టాప్–3లో భారత షూటర్లే నిలిచి స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించారు. అనుష్క ఠాకూర్ పసిడి పతకం నెగ్గగా... అన్షిక రజత పతకాన్ని, ఆద్య అగర్వాల్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. అనుష్క 621.6 పాయింట్లతో అగ్రస్థానంలో, అన్షిక 619.2 పాయింట్లతో రెండో స్థానంలో, ఆద్య 615.9 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచారు. భారత్కే చెందిన సానియా 610.9 పాయింట్లతో ఎనిమిదో స్థానాన్ని దక్కించుకోగా... నిమ్రత్ కౌర్ 604.3 పాయింట్లతో తొమ్మిదో స్థానాన్ని సంపాదించింది. మరోవైపు జూనియర్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్లో భారత్కు రెండు పతకాలు లభించాయి. దీపేంద్ర సింగ్ షెకావత్ 617.9 పాయింట్లతో రజత పతకం నెగ్గగా... రోహిత్ కన్యాన్ 616.3 పాయింట్లతో కాంస్య పతకాన్ని సాధించాడు. స్వతంత్ర అథ్లెట్గా పోటీపడ్డ రష్యా షూటర్ కామిల్ నురిఖెమెతోవ్ 618.9 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు. -
రేపు గ్లోబల్ చెస్ లీగ్ ప్లేయర్స్ డ్రాఫ్టింగ్
ముంబై: ప్రపంచ చదరంగ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్, ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్, గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద గ్లోబల్ చెస్ లీగ్ (జీసీఎల్) ‘ఐకాన్’ ప్లేయర్లుగా వ్యవహరించనున్నారు. గ్లోబల్ చెస్ లీగ్ మూడో సీజన్ ఆటగాళ్ల డ్రాఫ్టింగ్ శుక్రవారం జరగనుంది. ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) ఈ టోర్నమెంట్కు దూరం కాగా... ఈ ఏడాది డిసెంబర్ 13 నుంచి చెన్నై వేదికగా లీగ్ జరగనుంది. గత రెండు సీజన్లను వరుసగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, లండన్లో నిర్వహించారు. ఫిడే, టెక్ మహేంద్ర సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ లీగ్లో 6 ఫ్రాంఛైజీలు పాల్గొంటున్నాయి. అమెరికా గ్రాండ్మాస్టర్లు హికారు నకముర, ఫాబియానో కరువానా, అలీరెజా ఫిరూజా, లాగ్రేవ్ వంటి అంతర్జాతీయ స్టార్లు సహా మొత్తం 36 మంది ప్లేయర్లు ఈ డ్రాఫ్టింగ్లో పాల్గొననున్నారు. భారత గ్రాండ్మాస్టర్, తెలంగాణ ప్లేయర్ అర్జున్ ఇరిగేశి, అనీశ్ గిరి, ప్రపంచకప్ రన్నరప్ కోనేరు హంపి కూడా ఇందులో భాగం కానున్నారు. ఒక్కో ఫ్రాంఛైజీ ‘ఐకాన్ ప్లేయర్స్’, ‘మెన్స్’, ‘వుమెన్స్’, ‘అండర్–21’ వంటి నాలుగు విభాగాల్లో ఆటగాళ్లను ఎంపిక చేసుకోనుంది. ఒక్కో ఫ్రాంచైజీ ఒక ఐకాన్ ప్లేయర్, ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, ఒక అండర్–21 ప్లేయర్ను కలుపుకొని మొత్తం ఆరుగురిని ఎంపిక చేసుకోవచ్చు.‘జీసీఎల్ కేవలం ఒక టోర్నమెంట్ మాత్రమే కాదు. ఇది తెలివితేటలు, సమష్టితత్వం, సృజనాత్మకతకు సంబంధించిన వేడుక. మన దేశం నుంచి ప్రపంచ వేదికపై ఇలాంటి లీగ్ జరుగుతుండటం గర్వంగా ఉంది’ అని ఆనంద్ పేర్కొన్నాడు. -
హెండర్సన్కు అత్యధికం
న్యూఢిల్లీ: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) వేలంలో లియామ్ హెండర్సన్ అత్యధిక ధర పలికిన ప్లేయర్గా రికార్డుల్లోకెక్కాడు. బుధవారం నిర్వహించిన మినీ వేలంలో... ఆస్ట్రేలియా డిఫెండర్ కోసం హెచ్ఐఎల్ ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. చివరకు వేదాంత కళింగ లాన్సర్స్ జట్టు 42 లక్షల రూపాయలకు అతడిని సొంతం చేసుకుంది. భారత యువ ఆటగాళ్లు వివేక్ లాక్రా, అద్రోహిత్ ఎక్కా కూడా మంచి ధర దక్కించుకున్నారు. అంతర్జాతీయ ఆటగాళ్లలో నెదర్లాండ్స్ డిఫెండర్ సండెర్ డె విజిన్ను తమిళనాడు డ్రాగన్స్ జట్టు రూ. 36 లక్షలకు కొనుగోలు చేసుకుంది. జర్మనీకి చెందిన ప్రిన్జ్ను అంతే మొత్తానికి యూపీ రుద్రాస్ జట్టు తీసుకుంది. భారత టీనేజ్ గోల్కీపర్ లక్రా రూ. 2 లక్షల ధరతో వేలంలో ప్రవేశించగా... అతడి కోసం ఫ్రాంచైజీలు పోటీపడి ఆఖరికి బెంగాల్ టైగర్స్ 23 లక్షలకు సొంతం చేసుకుంది. మిడ్ఫీల్డర్ ఎక్కాను రూ. 11 లక్షలకు సూర్మా హాకీ క్లబ్ కొనుగోలు చేసుకుంది. 14 ఏళ్ల కేతన్ కుషా్వహాను బెంగాల్ టైగర్స్ జట్టు రూ. 2.5 లక్షలకు తీసుకుంది. మొత్తం వేలంలో అతడే అతి పిన్న వయసు్కడు. ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన భారత జట్టులో సభ్యుడైన రూపిందర్ పాల్ సింగ్ను ఎస్జీ పైపర్స్ జట్టు రూ. 12 లక్షలకు సొంతం చేసుకుంది. అతడితో పాటు బెల్జియంకు చెందిన రోమన్ డువెకొట్, నెదర్లాండ్స్కు చెందిన బ్రామ్ వ్యాన్ బాటమ్ను కూడా ఫ్రాంచైజీ తీసుకుంది. ఆ్రస్టేలియాకు చెందిన కూపర్ బర్న్స్ కోసం కళింగ లాన్సర్స్ జట్టు రూ. 34.5 లక్షలు వెచ్చించింది. మినీ వేలంలో కళింగ ఫ్రాంచైజీ ముగ్గురు భారత ఆటగాళ్లతో పాటు నలుగురు విదేశీ ప్లేయర్లను కొనుగోలు చేసుకుంది. ఆ్రస్టేలియా గోల్ కీపర్ స్నోడెన్ను రూ. 10 లక్షలకు సొంతం చేసుకున్న లాన్సర్స్... ఒడిశా జట్టు ప్లేయర్ సునీల్ను రూ. 2 లక్షల బేస్ ప్రైస్కు కొనుగోలు చేసుకుంది.క్రెయిగ్ మరాయిస్, బాబీ సింగ్ ధామీని రూ. 10 లక్షల చొప్పున కొనుగోలు చేసుకుంది. యూపీ రుద్రాస్ ఫ్రాంచైజీ యాజమాన్యం అర్ధాంతరంగా తప్పుకోవడంతో... ఆ జట్టు బాధ్యతలను హెచ్ఐఎల్ గవరి్నంగ్ కౌన్సిల్ తీసుకుంది. కొత్త యాజమాన్యం వచ్చేంత వరకు ఈ ఫ్రాంఛైజీ హెచ్ఐఎల్ ఆధ్వర్యంలో నడవనుంది. -
పోరాడి ఓడిన మేఘన రెడ్డి
కావోసియుంగ్ సిటీ (చైనీస్ తైపీ): కావోసియుంగ్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో తెలంగాణ అమ్మాయి మారెడ్డి మేఘన రెడ్డి పోరాటం ముగిసింది. క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించిన మేఘన... బుధవారం జరిగిన తొలి రౌండ్లో 21–19, 17–21, 14–21తో టాన్రుగ్ సెహెంగ్ (థాయ్లాండ్) చేతిలో పోరాడి ఓడిపోయింది. 64 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో మేఘన తొలి గేమ్ను దక్కించుకుంది. అయితే అదే జోరును తదనంతరం కొనసాగించలేకపోయింది. రెండో గేమ్లో ఒకదశలో 11–12తో ఒక్క పాయింట్ వెనుకంజలో నిలిచిన మేఘన... ఆ తర్వాత తడబడి చివరకు నాలుగు పాయింట్ల తేడాతో గేమ్ను కోల్పోయింది. నిర్ణాయక మూడో గేమ్లో టాన్రుగ్ ఆరంభంలోనే 4–0తో ఆధిక్యంలోకి వెళ్లగా... మేఘన ఒక్కసారి కూడా స్కోరును సమం చేయలేకపోయింది. ఇదే టోర్నీలో బరిలోకి దిగిన భారత ఇతర క్రీడాకారిణులు దేవిక సిహాగ్ 26–28, 21–17, 21–13తో లీ జిన్ యి మేగన్ (సింగపూర్)పై, ఇషారాణి బారువా 21–13, 21–10తో నూత్నలిన్ రత్తానపాన్వోంగ్ (థాయ్లాండ్)పై గెలుపొంది ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకోగా... మాన్సి సింగ్, అషి్మత చాలిహా తొలి రౌండ్లోనే ఓడిపోయారు. -
రిత్విక్–అర్జున్ జోడీ శుభారంభం
సాక్షి, హైదరాబాద్: జింగ్షాన్ ఓపెన్ ఏటీపీ–100 చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో భారత డేవిస్కప్ జట్టు సభ్యుడు, హైదరాబాద్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ డబుల్స్ విభాగంలో శుభారంభం చేశాడు. చైనాలో ఈ టోర్నీ జరుగుతోంది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో రిత్విక్–అర్జున్ ఖడే (భారత్) ద్వయం 6–3, 6–4తో ఒమర్ జసికా (ఆ్రస్టేలియా)–డెనిస్ యెవ్సెయెవ్ (కజకిస్తాన్) జోడీపై గెలుపొంది క్వార్టర్ ఫైనల్ చేరింది. 66 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో భారత జంట ఏడు ఏస్లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్లు చేసింది. తొలి సర్వీస్లో 36 పాయింట్లకుగాను 28... రెండో సర్వీస్లో 18 పాయింట్లకుగాను 11 పాయింట్లు సాధించింది. మరోవైపు ఇదే టోర్నీలో హైదరాబాద్కే చెందిన అనిరుధ్ చంద్రశేఖర్ (భారత్)–రీసీ స్టాల్డర్ (అమెరికా) ద్వయం కూడా క్వార్టర్ ఫైనల్ చేరింది. తొలి రౌండ్లో అనిరుధ్–స్టాల్డర్ జోడీ 1–6, 7–6 (7/3), 10–4తో ‘సూపర్ టైబ్రేక్’లో లియామ్ డ్రాక్సెల్ (కెనడా)–ఇలియట్ స్పిజిరి (అమెరికా) జంటను ఓడించింది. -
పాయింట్ తేడాతో గట్టెక్కిన టైటాన్స్
జైపూర్: ఈ సీజన్ ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్–12)లో నిలకడగా రాణిస్తున్న తెలుగు టైటాన్స్ ఐదో విజయాన్ని సాధించింది. మంగళవారం జరిగిన మ్యాచ్లో పాయింట్ తేడాతో గుజరాత్ జెయింట్స్పై గట్టెక్కింది. తెలుగు టైటాన్స్ 30–29తో గుజరాత్ను ఓడించింది. టైటాన్స్ జట్టులో ఆల్రౌండర్ భరత్ రాణించాడు. 17 సార్లు కూతకెళ్లిన అతను 9 పాయింట్లు సాధించాడు. కెప్టెన్ విజయ్ మలిక్ (7) కూడా రాణించడంతో తెలుగు జట్టు క్రమం తప్పకుండా స్కోరు చేసింది. డిఫెండర్లలో శుభమ్ షిండే (4), అంకిత్ (3) ఆకట్టుకున్నారు. గుజరాత్ జట్టులో మొహమ్మద్ రెజా (6) అదరగొట్టాడు. ఇతనికి ఆర్యవర్ధన్ (4), విశ్వంత్ (3), అంకిత్ దహియా (3), లక్కీ శర్మ (2), రోహిత్ నందల్ (2) సమష్టిగా సహకరించారు. అనంతరం జరిగిన హోరాహోరీ పోరులో జైపూర్ పింక్పాంథర్స్ టైబ్రేక్లో యు ముంబాపై గెలుపొందింది. నిర్ణీత సమయం ముగిసేసరికి ఇరుజట్లు 38–38 స్కోరుతో సమంగా నిలిచాయి. దీంతో టైబ్రేక్ నిర్వహించగా జైపూర్ 6–4తో యు ముంబాపై పైచేయి సాధించింది. పింక్ పాంథర్స్ తరఫున రెయిడర్ నితిన్ కుమార్ (14) అదరగొట్టాడు. 20 సార్లు కూతకెళ్లిన 14 పాయింట్లు తెచ్చిపెట్టాడు. మిగతావారిలో డిఫెండర్లు రెజా మిర్బగేరి (4), ఆశిష్ కుమార్ (3) మెరుగ్గా ఆడారు. యు ముంబా జట్టులోనూ రెయిడర్ సందీప్ (14) ప్రత్యర్థి జట్టుకు దీటుగా రాణించాడు. కూతకెళ్లిన ప్రతీసారి జైపూర్ ఆటగాళ్లను వణికించాడు. డిఫెండర్లలో లోకేశ్ (4), అనిల్ (3), పర్వేశ్ (2), రింకూ (2) ఉమ్మడిగా పాయింట్లు సాధించారు. నేడు విశ్రాంతి రోజు కాగా... గురువారం జరిగే పోటీల్లో బెంగళూరు బుల్స్తో యూపీ యోధాస్, దబంగ్ ఢిల్లీతో యు ముంబా తలపడతాయి. -
అమన్కు షోకాజ్ నోటీసు
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్, పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అమన్ సెహ్రావత్కు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈనెల 27వ తేదీలోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఇటీవల క్రొయేషియా రాజధాని జాగ్రెబ్ వేదికగా జరిగిన ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్ నుంచి అమన్ సెహ్రావత్ అధిక బరువు కారణంగా డిస్క్వాలిఫై అయ్యాడు. పురుషుల 57 కేజీల ఫ్రీస్టయిల్ కేటగిరీలో తలపడాల్సిన అమన్... నిర్ణీత బరువుకంటే 1700 గ్రాములు అధికంగా ఉండటంతో నిర్వాహకులు అతడిని పోటీ నుంచి తొలగించారు. వరల్డ్ చాంపియన్షిప్లో స్వర్ణం సాధిస్తాడని భావించిన అమన్ ఇలా అర్ధాంతరంగా వైదొలగడంపై డబ్ల్యూఎఫ్ఐ ఆగ్రహంగా ఉంది. ఈ పోటీలకు భారత్ నుంచి నలుగురు కోచ్లు వెళ్లగా... వారెవరూ అమన్ నిర్ణీత బరువు కొనసాగించడంలో తోడ్పాటు అందించకపోవడంతో సమాఖ్య వారికి కూడా నోటీసులిచ్చింది. ‘ఇది ఆమోదనీయం కాదు. దీని వెనక ఉన్న కారణాలను వెలికితీయాలి. రెండు నెలల వ్యవధిలో మన అత్యుత్తమ రెజ్లర్లకు ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. దీనిపై దృష్టి సారించాల్సిన అవసరముంది. అందుకే అమన్కు షోకాజ్ నోటీసులు జారీ చేశాం’ అని డబ్యూఎఫ్ఐ అధికారి తెలిపారు. చీఫ్ కోచ్ జగ్మందర్ సింగ్, వినోద్, వీరేందర్, నరేందర్లను కూడా దీనిపై వివరణ ఇవ్వాలని సమాఖ్య కోరింది. ‘జాగ్రెబ్లో జరిగిన పోటీల్లో పాల్గొనేందుకు భారత్ నుంచి మొత్తం 10 మంది రెజ్లర్లు, నలుగురు కోచ్లు వెళ్లారు. టోర్నీకి 15 రోజుల ముందే అక్కడికి చేరుకున్నారు. రెజ్లర్లందరూ తమ బరువును క్రమపద్ధతిలో ఉండే విధంగా చూసుకోవడం కోచ్ల కర్తవ్యం. అందుకే వారు కూడా దీనికి బాధ్యులే’ అని ఆ అధికారి వెల్లడించారు. సెలక్షన్ ట్రయల్స్ సమయం నుంచే బరువు విషయంలో పకడ్బందీగా ఉండాలని సమాఖ్య భావిస్తోంది. రెండు కేజీల వెసులుబాటు అంశాన్ని పక్కనపెట్టి నిర్దిష్టమైన బరువు కొనసాగించే విధంగా రెజ్లర్లకు ముందు నుంచే శిక్షణ ఇవ్వాలని అనుకుంటోంది. ‘మేము ఇప్పటికే కొంతమంది కోచ్లతో ఈ విషయాన్ని చర్చించాం. ఇలాంటి ప్రాక్టీస్ అవసరం లేదని చెప్పాం. అది అలవాటుగా మారిపోయి... ప్రధాన పోటీలకు మందు తక్కువ సమయంలో బరువు తగ్గించుకోవాల్సి రావడంతో రెజ్లర్లు ఇబ్బంది పడాల్సి వస్తోంది. త్వరలో జరగనున్న అండర్–23 ప్రపంచ చాంపియన్షిప్ ట్రయల్స్లో నిర్దిష్ట బరువును మాత్రమే అనుమతిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. వచ్చే నెల 20 నుంచి సెర్బియా వేదికగా అండర్–23 ప్రపంచ చాంపియన్షిప్ జరగనుండగా... దానికి ముందు లక్నో వేదికగా అక్టోబర్ 4, 5న ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఇటీవల అండర్–20 ప్రపంచ చాంపియన్షిప్ నుంచి ఓవర్ వెయిట్ కారణంగా అనర్హతకు గురైన యువ రెజ్లర్ నేహా సాంగ్వాన్పై డబ్ల్యూఎఫ్ఐ సస్పెన్షన్ వేటు వేసింది. పారిస్ ఒలింపిక్స్ ఫైనల్లో భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఇలాగే 100 గ్రాముల అధిక బరువుతో పతకం కోల్పోయిన విషయం తెలిసిందే. -
టీ తాగారు.. భారత్ దెబ్బకు తోకముడిచారు!.. పాక్ బుద్ధి మారదు!
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మైదానంలో పాకిస్తాన్ ఆటగాళ్ల వెకిలి చేష్టలు ఎక్కువయ్యాయి. భారత్పై తమదే పైచేయి అని నమ్మించే ప్రయత్నంలో బొక్కబోర్లా పడుతున్నా వారి తీరు మాత్రం మారడం లేదు. సీనియర్ క్రికెటర్లకు తామేమీ తీసిపోమన్మట్లుగా ఫుట్బాల్ యువ ఆటగాళ్లు కూడా ఓవరాక్షన్తో వివాదాలకు కారణమవుతున్నారు.కాగా జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. ఇందుకు భారత ఆర్మీ ఉగ్రమూకలకు గట్టి కౌంటర్ ఇచ్చింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రస్థావరాలను ‘ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)’తో నేలమట్టం చేసింది. అయితే, ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం దాడి చేస్తే.. అందుకు ప్రతిగా పాక్ ఆర్మీ ముందుకు వచ్చి మరోసారి తమ బుద్ధిని చాటుకుంది. ఈ క్రమంలో పాక్తో అన్ని సంబంధాలు.. ముఖ్యంగా క్రీడల్లోనూ వారితో ఎలాంటి పోటీ వద్దంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి. అయితే, ఆసియాకప్-2025 (Asia Cup 2025) టోర్నీలో మాత్రం టీమిండియా పాక్తో ఆడేందుకు భారత ప్రభుత్వం అనుమతినిచ్చింది. బహుళ దేశాలు పాల్గొంటున్న టోర్నీ కావున ఇందుకు సమ్మతించింది.పప్పులు ఉడకపోవడంతోఈ నేపథ్యంలో లీగ్ దశలో పాక్ ఆటగాళ్లతో టీమిండియా కరచాలనానికి నిరాకరించింది. దీనిని అవమానంగా భావించిన పాక్.. ఐసీసీకి ఫిర్యాదు చేసింది. తమ పప్పులు ఉడకపోవడంతో ఆదివారం నాటి సూపర్-4 మ్యాచ్లో ఆటగాళ్లు మైదానంలో ఆటతో కాకుండా తమ చేష్టలతో కవ్వింపులకు పాల్పడ్డారు.ఇక పాక్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ అర్ధ శతకం (58) పూర్తి చేసుకోగానే.. ఏకే-47 మాదిరి బ్యాట్ ఎక్కుపెట్టి ప్రేక్షకులను కాలుస్తున్నట్లు సంబరాలు చేసుకున్నాడు. మరోవైపు.. హ్యారిస్ రవూఫ్ (Haris Rauf).. ‘మీ యుద్ధ విమానాలను కూల్చామన్నట్లుగా’ టీమిండియా అభిమానులకు సైగ చేశాడు.టీ తాగారు.. తోక ముడిచారుతాజాగా ఫుట్బాల్ మ్యాచ్లో కూడా పాక్కు చెందిన ఓ ఆటగాడు ఇదే తరహాలో భారత జట్టును రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. కొలంబో వేదికగా దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య (శాఫ్) అండర్–17 టోర్నమెంట్లో భాగంగా సోమవారం గ్రూప్-‘బి’లోని చివరి మ్యాచ్లో భారత్- పాక్ తలపడ్డాయి. భారత్ తరఫున దలాల్మువాన్ గాంగ్టే 31వ నిమిషంలో గోల్ చేయగా.. 43వ నిమిషంలో పాక్ ప్లేయర్ మొహమ్మద్ అబ్దుల్లా ఒక గోల్ సాధించాడు. ఈ క్రమంలోనే పాక్ ఆటగాళ్లు అతి చేశారు. టీ తాగుతున్నట్లుగా అభినయిస్తూ భారత జట్టును టీజ్ చేశారు. కాగా గతంలో సర్జికల్ స్ట్రైక్స్ సందర్భంగా ఎయిర్ఫోర్స్ వింగ్ అభినందన్ వర్ధమాన్ అనూహ్య రీతిలో పాక్ ఆర్మీ చేతికి చిక్కగా.. ఆయన టీ తాగుతున్నట్లుగా ఉన్న ఫొటోను విడుదల చేసింది.అయితే, 2019 నాటి ఈ ఘటనలో అభినందన్ దాదాపు 60 గంటలపాటు పాక్ నిర్బంధంలో ఉండగా.. జనీవా ఒప్పందం ప్రకారం తిరిగి భారత్కు అప్పగించారు. ఇపుడు ఇదే విషయాన్ని గుర్తుచేస్తున్నట్లుగా పాక్ యువ ఆటగాడు వ్యవహరించడం విశేషం.భారత్ చేతిలో ఓటములేఅయితే, ఈ మ్యాచ్లో భారత్- పాకిస్తాన్ను 3-2తో ఓడించడంతో పరాజయ భారంతో దాయాది తోకముడిచింది. ఇక ఈ గెలుపుతో భారత్ గ్రూప్-బి టాపర్గా సెమీస్ చేరగా.. రెండో స్థానంలో పాక్ కూడా క్వాలిఫై అయింది. సెమీ ఫైనల్లో భారత్- నేపాల్తో, పాకిస్తాన్ బంగ్లాదేశ్తో తలపడతాయి. ఇదిలా ఉంటే.. ఆసియా కప్ టీ20 టోర్నీలో భారత్ లీగ్, సూపర్ దశలో పాక్ను చిత్తు చేసింది.చదవండి: ఎవర్నీ లెక్కచేయను.. నా తీరే అంత.. నచ్చినట్లు చేస్తా: పాక్ బ్యాటర్ ఎక్స్ట్రాలుSuch a disgraceful celebration by Pakistani U17 Team at SAFF, Glad we beat them 3-2 today! pic.twitter.com/kfksfrP4h3— The Khel India (@TheKhelIndia) September 22, 2025 -
ఫ్రాంఛైజీ సహ యజమానిగా కేఎల్ రాహుల్
పనాజీ (గోవా): టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) ప్రైమ్ వాలీబాల్ లీగ్ (PVL)లో వ్యాపార భాగస్వామిగా అడుగు పెట్టాడు. ఈ టోర్నీలోని జట్టు అయిన గోవా గార్డియన్స్కు అతడు సహ యజమానిగా వ్యవహరిస్తాడు. హైదరాబాద్లో అక్టోబర్ 2 నుంచి 26 వరకు పీవీఎల్ జరుగుతుంది. వాలీ బాల్ లీగ్లో ఈ సీజన్తోనే గోవా జట్టు తొలిసారి అడుగు పెడుతోంది. రాజు చేకూరి ఈ టీమ్కు యజమానిగా ఉన్నాడు. కీలక మలుపుఇప్పుడు రాహుల్ కొత్తగా టీమ్తో జత కట్టాడు. ‘భారత క్రీడల్లో ప్రైమ్ వాలీబాల్ లీగ్ ఒక కీలక మలుపు. ప్రేక్షకులకు మరింత చేరువ అవుతూ ఈ ఆట స్థాయిని పెంచేందుకు ఇది ఉపకరిస్తుంది. చిన్నప్పటినుంచి వాలీబాల్ను ఎంతో ఇష్టంగా చూసేవాడిని. ఇప్పుడు అదే క్రీడకు సంబంధించిన లీగ్లో నేనూ భాగం కావడం సంతోషంగా ఉంది’ అని రాహుల్ వ్యాఖ్యానించాడు. ఇదీ చదవండి: డికాక్ రిటైర్మెంట్ వెనక్కి... జొహన్నెస్బర్గ్: దక్షిణాఫ్రికా వికెట్ కీపర్, బ్యాటర్ క్వింటన్ డికాక్ తిరిగి వన్డేలు ఆడేందుకు ‘సై’ అంటున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్కు గతంలో ఇచ్చిన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. దీంతో పాకిస్తాన్లో పర్యటించే దక్షిణాఫ్రికా జట్టుకు అతన్ని ఎంపికచేశారు. ఈ ఎడంచేతి ఓపెనింగ్ బ్యాటర్ 2023లో భారత్లో జరిగిన వన్డే ప్రపంచకప్ అనంతరం రిటైర్ అయ్యాడు. గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్ వరకు పొట్టి ఫార్మాట్లో ఆడినప్పటికీ తర్వాత మాజీ కోచ్ రాబ్ వాల్టర్ తమ దీర్ఘకాలిక జట్టు సన్నద్ధత–లక్ష్యాల్లో భాగంగా డికాక్కు టీ20ల్లో అవకాశమివ్వలేదు. కానీ ఇప్పుడు నమీబియాతో జరిగే ఏకైక టి20 మ్యాచ్ కోసం ప్రకటించిన దక్షిణాఫ్రికా జట్టులో డికాక్కు చోటు దక్కింది. ఈ మేరకు ప్రస్తుత సఫారీ కోచ్ షుక్రి కాన్రడ్ మాట్లాడుతూ డికాక్ మళ్లీ పరిమిత ఓవర్ల క్రికెట్కు తిరిగిరావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇది జట్టుకు బలాన్నిస్తుందని అన్నారు. అయితే సఫారీ జట్టుకు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ‘గద’ను అందించిన కెపె్టన్ తెంబా బవుమా గాయంతో పాక్తో రెండు టెస్టుల సిరీస్కు దూరమయ్యాడు. వచ్చే నెలలో లాహోర్, రావల్పిండి వేదికలపై రెండు టెస్టుల సిరీస్ జరుగుతుంది. -
యూపీ యోధాస్ ఘనవిజయం
జైపూర్: వరుస పరాజయాల పరంపరకు యూపీ యోధాస్ జట్టు బ్రేక్ వేసి గెలుపుబాట పట్టింది. ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్లో యూపీ యోధాస్ 39–22తో తమిళ్ తలైవాస్పై ఘనవిజయం సాధించింది. ఆరంభం నుంచి యూపీ ఆటగాళ్లు సమష్టిగా పాయింట్లు రాబట్టారు. గగన్ గౌడ (7), భవానీ రాజ్పుత్ (6), శివమ్ చౌధరీ (5) రెయిడింగ్లో అదరగొట్టారు. డిఫెండర్లలో కెపె్టన్ సుమిత్ (5), మహేందర్ సింగ్ (4), అశు సింగ్ (4), హితేశ్ (2)లు ప్రత్యర్థి రెయిడర్లను టాకిల్తో కట్టడి చేశారు. తమిళ్ తలైవాస్ తరఫున డిఫెండర్ నితేశ్ కుమార్ (7) ఆకట్టుకున్నాడు. మిగతావారిలో నరేందర్ (4) మినహా ఇంకెవరూ చెప్పుకోదగ్గ పాయింట్లే సాధించలేకపోయారు. నాలుగు పరాభవాల తర్వాత యూపీ ఈ మ్యాచ్ గెలిచింది. ఈ సీజన్లో ఇప్పటివరకు 7 మ్యాచ్లాడిన యోధాస్ మూడు మ్యాచ్ల్లోనే నెగ్గింది. మరోవైపు 8 మ్యాచ్ల్లో పోటీపడిన తలైవాస్ ఐదు మ్యాచ్ల్లో ఓడింది. అంతకుముందు జరిగిన తొలి మ్యాచ్లో బెంగళూరు బుల్స్ 28–24తో గుజరాత్ జెయింట్స్పై గెలుపొందింది. బుల్స్ తరఫున రెయిడర్ ఆకాశ్ షిండే (7), కెపె్టన్, డిఫెండర్ యోగేశ్ (6) రాణించారు. ఆశిష్ మలిక్, దీపక్ శంకర్ చెరో 4 పాయింట్లు చేశారు. గుజరాత్ జట్టులో ఆల్రౌండర్ విశ్వనాథ్ (5), డిఫెండర్ లక్కీ శర్మ (5) మెరుగ్గా ఆడారు. మిగతావారిలో ప్రతీక్ దహియా (4), శుభమ్ కుమార్ (4), రాకేశ్ (4) ఆకట్టుకున్నారు. నేడు జరిగే మ్యాచ్ల్లో గుజరాత్ జెయింట్స్తో తెలుగు టైటాన్స్; జైపూర్ పింక్ పాంథర్స్తో యు ముంబా తలపడతాయి. . -
మా వల్ల కాదంటూ మరో ఫ్రాంచైజీ అవుట్
న్యూఢిల్లీ: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)కు మరో ఫ్రాంచైజీ గుడ్బై చెప్పేసింది. లక్నో ఫ్రాంచైజీ యూపీ రుద్రాస్ లీగ్ నుంచి పూర్తిగా వైదొలగుతున్నట్లు ప్రకటించింది. నిర్వహణ సవాళ్ల కారణంగా లీగ్లో కొనసాగలేమని యాజమాన్యం వెల్లడించింది. భరించలేని ఆరి్థకభారం వల్లే లీగ్ నుంచి తప్పుకుంటున్నామని స్పష్టం చేసింది. ఇది చాలా కఠినమైన నిర్ణయమని యూపీ రుద్రాస్ టీమ్ డైరెక్టర్ సెడ్రిక్ డిసౌజా తెలిపారు. ‘హాకీ ఇండియా మొదలుపెట్టిన హెచ్ఐఎల్ మేం ఎంతో విలువిచ్చాం. ఎప్పటికీ గౌరవిస్తూనే ఉంటాం. కానీ ఆర్థిక సవాళ్లు మమ్మల్ని లీగ్లో కొనసాగేందుకు అసాధ్యంగా మార్చాయి. దీర్ఘ కాలిక లక్ష్యాలతో పనిచేసే అవకాశం లేకపోవడంతో తప్పుకుంటున్నాం. అయితే భారత్లో హాకీ ఉన్నత శిఖరాల్లో నిలువాలని ఆకాంక్షిస్తున్నాం’ అని సెడ్రిక్ డిసౌజా అన్నారు. ఈ జట్టుకు ఆడిన భారత హాకీ వైస్ కెప్టెన్ హార్దిక్ సింగ్ మాట్లాడుతూ యూపీ రుద్రాస్కు ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పాడు. అభిమానులు సైతం మా జట్టును ఆదరించారని అన్నాడు. కానీ ఇప్పుడా అధ్యాయం ముగిసిపోవడం విచారకరమన్నాడు. లీగ్కు దూరమైన మూడో జట్టు రుద్రాస్. ఇదివరకే మహిళల చాంపియన్ జట్టు ఒడిశా వారియర్స్ సహా పురుషుల్లో గోనాసిక టీమ్ లీగ్కు రాంరాం చెప్పాయి. దీంతో వచ్చే సీజన్ కోసం రాంచీ రాయల్ టస్కర్స్ (ఇరు విభాగాల్లో)తో రెండు జట్లను భర్తీ చేసుకోగా... తాజాగా హాకీ ఇండియా (హెచ్ఐ)కి రుద్రాస్ షాకిచ్చింది. -
భారత్కు రానున్న అథ్లెటిక్స్ దిగ్గజం ఉసేన్ బోల్ట్
అథ్లెటిక్స్ దిగ్గజం ఉసేన్ బోల్ట్ రెండోసారి భారత్కు రానున్నాడు. బెంగళూరు ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ), ముంబై సిటీ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) జట్ల మధ్య అక్టోబర్ 1న ముంబైలో జరిగే ఎగ్జిబిషన్ ఫుట్బాల్ మ్యాచ్లో బోల్ట్ బరిలోకి దిగుతాడు. తొలి అర్ధభాగం బెంగళూరు జట్టుకు, రెండో అర్ధభాగంలో ముంబై జట్టుకు బోల్ట్ ప్రాతినిధ్యం వహిస్తాడు. భారత ఫుట్బాలర్లతోపాటు, బాలీవుడ్, ఇతర రంగాల ప్రముఖులు ఈ మ్యాచ్లో బోల్ట్తో కలిసి సరదాగా ఆడతారు. ప్రముఖ స్పోర్ట్స్ షూ తయారీ సంస్థ ప్యూమా ఈ మ్యాచ్ను ఏర్పాటు చేస్తోంది. ఈ మ్యాచ్కంటే ముందు బోల్ట్ సెపె్టంబర్ 26 నుంచి 28 వరకు ఢిల్లీ, ముంబైలలో పలు ప్రైవేట్ ఈవెంట్లలో పాల్గొంటాడు. ‘భారత్కు మరోసారి రావడానికి ఉత్సాహంతో ఉన్నాను. క్రీడల పట్ల ఇక్కడి ప్రజలకు ఎంతో మక్కువ ఉంది. భారీ సంఖ్యలో నన్ను అభిమానించే వాళ్లు కూడా ఉన్నారు’ అని 2014లో తొలిసారి భారత్కు వచ్చిన 39 ఏళ్ల బోల్ట్ వ్యాఖ్యానించాడు. 2017లో అథ్లెటిక్స్కు గుడ్బై చెప్పిన బోల్ట్ ఒలింపిక్స్లో 8 స్వర్ణాలు, ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో 11 స్వర్ణాలు, 2 రజతాలు, ఒక కాంస్యం సాధించాడు. -
ఫుట్బాల్లోనూ పాక్పై భారత్దే పైచేయి
కొలంబో: ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నీలో పాకిస్తాన్ జట్టును భారత జట్టు చితక్కొట్టగా... మరోవైపు ఫుట్బాల్లోనూ పాకిస్తాన్ జట్టుపై భారత్ తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య (శాఫ్) అండర్–17 టోర్నమెంట్లో భాగంగా పాకిస్తాన్తో సోమవార జరిగిన గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్లో భారత్ 3–2 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున దలాల్మువాన్ గాంగ్టే (31వ నిమిషంలో), గున్లేబా వాంగ్ఖెరాక్పమ్ (64వ నిమిషంలో), రహాన్ అహ్మద్ (74వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. పాకిస్తాన్ జట్టుకు హంజా యాసిర్ (71వ నిమిషంలో), మొహమ్మద్ అబ్దుల్లా (43వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. ఈ విజయంతో భారత్ గ్రూప్ ‘బి’లో ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ గెలిచి తొమ్మిది పాయింట్లతో టాపర్గా నిలిచింది. ఆరు పాయింట్లతో పాకిస్తాన్ రెండో స్థానాన్ని దక్కించుకుంది. గ్రూప్ ‘బి’ నుంచి భారత్, పాకిస్తాన్ జట్లు సెమీఫైనల్ చేరుకున్నాయి. గ్రూప్ ‘ఎ’ నుంచి బంగ్లాదేశ్, నేపాల్ జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. ఈనెల 25న జరిగే సెమీఫైనల్స్లో బంగ్లాదేశ్తో పాకిస్తాన్; నేపాల్తో భారత్ తలపడతాయి. -
దివ్య దేశ్ముఖ్కు వైల్డ్ కార్డు
న్యూఢిల్లీ: భారత మహిళా గ్రాండ్మాస్టర్, మహిళల చెస్ ప్రపంచకప్ చాంపియన్ దివ్య దేశ్ముఖ్ ఈ ఏడాది మరోసారి పురుషుల ఈవెంట్లో పాల్గొనేందుకు సిద్ధమైంది. ఇటీవలే గ్రాండ్ స్విస్ టోర్నీలో పురుష గ్రాండ్మాస్టర్లతో పోటీపడ్డ దివ్య... అక్టోబర్ 31 నుంచి నవంబర్ 27 వరకు భారత్లోని గోవా వేదికగా జరిగే పురుషుల ప్రపంచకప్ టోర్నీలో బరిలోకి దిగనుంది. వాస్తవానికి దివ్యకు ఈ టోర్నీలో పాల్గొనే అవకాశం లేకపోయినా... చివరి నిమిషంలో ఒక ప్లేయర్ వైదొలగడంతో ఆ స్థానాన్ని దివ్య దేశ్ముఖ్తో భర్తీ చేశారు. ఈ టోర్నీలో ఆడాలని మహిళల ప్రపంచ నంబర్వన్ హు ఇఫాన్ (చైనా), ప్రస్తుత ప్రపంచ చాంపియన్ జు వెన్జున్ (చైనా)లకు నిర్వాహకులు ఆహ్వానించారు. అయితే ఈ ఇద్దరు చైనా గ్రాండ్మాస్టర్లు ప్రపంచకప్లో ఆడేందుకు రాలేమని తెలిపారు. నాకౌట్ ఫార్మాట్లో జరిగే ప్రపంచకప్లో మొత్తం 206 మంది ప్లేయర్లు పోటీపడతారు. టాప్–3లో నిలిచిన వారు వచ్చే ఏడాది జరిగే క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధిస్తారు. భారత్ నుంచి ఈ టోర్నీలో 20 మంది ప్లేయర్లు ఆడనున్నారు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్, ఇరిగేశి అర్జున్, ప్రజ్ఞానంద, విదిత్, అరవింద్ చిదంబరం, పెంటేల హరికృష్ణ, నిహాల్ సరీన్, మురళీ కార్తికేయన్, ప్రాణేశ్, ఇనియన్, ఎస్ఎల్ నారాయణన్, దీప్తాయన్ ఘోష్, సూర్యశేఖర గంగూలీ, కార్తీక్ వెంకటరామన్, రాజా రితి్వక్, ఆరోన్యక్ ఘోష్, లలిత్ బాబు, హిమల్ గుసెయిన్, హర్షవర్ధన్, నీలాశ్ సాహా పోటీపడనున్నారు. -
HPL: కిదాంబి శ్రీకాంత్ కొత్త ప్రయాణం.. ఇన్వెస్టర్గా
సాక్షి, హైదరాబాద్: భారత ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, పురుషుల సింగిల్స్ ప్రపంచ మాజీ నంబర్ 1 కిదాంబి శ్రీకాంత్ కొత్త ప్రయాణం ఆరంభించాడు. హైదరాబాద్ పికిల్బాల్ లీగ్ (HPL)లో అధికారిక పెట్టుబడిదారుడిగా, భాగస్వామిగా నంది ఛార్జర్స్ ఫ్రాంచైజీలో చేరారు. శ్రీకాంత్ రాకతో ఈ లీగ్కు అత్యున్నత స్థాయి క్రీడా ప్రమాణాలను తీసుకువస్తుందని నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది అక్టోబర్లో హైదరాబాద్లో ప్రారంభం కానున్న పికిల్బాల్ క్రీడకు ఇది మరింత ప్రాముఖ్యతను ఇస్తుందన్నారు.కాగా శ్రీకాంత్ తన కెరీర్లో 12కి పైగా అంతర్జాతీయ టైటిల్స్ సాధించాడు. ప్రపంచ బ్యాడ్మింటన్లో దేశ స్థాయిని పెంచడంలో తన వంతుగా కీలక పాత్ర పోషించారు. ఇక ఇప్పుడు నంది ఛార్జర్స్ జట్టుతో కలసి ఛాంపియన్ల ఆలోచనను, పోటీ స్ఫూర్తిని పికిల్బాల్లోకి తీసుకురానున్నాడు.సంతోషంగా ఉంది"హైదరాబాద్ పికిల్బాల్ లీగ్లో భాగం కావడం, నంది ఛార్జర్స్తో చేతులు కలపడం నాకు నిజంగా సంతోషంగా ఉంది. పికిల్బాల్ చాలా వేగంగా, డైనమిక్గా ఉంటుంది. భారతదేశంలోని అభిమానులతో కనెక్ట్ అవడానికి కావాల్సినవన్నీ ఇందులో ఉన్నాయి. ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది. చూడటానికి థ్రిల్లింగ్గా, అత్యంత పోటీతత్వంతో ఉంటుంది.నా క్రీడా అనుభవాన్ని ఒక కొత్త రంగంలోకి తీసుకువచ్చి.. ఈ లీగ్ ప్రాముఖ్యతను పెంచడానికి సహాయపడటం నన్ను ఎంతో ఉత్తేజపరిచే విషయం. ఈ ప్రయాణం ప్రారంభంలోనే భాగం కావడం ఎంతో ఉత్సాహాన్నిస్తోంది. నంది ఛార్జర్స్ జట్టు ఉత్సాహంగా ఆడుతూ అందరికీ స్ఫూర్తినిస్తుందని నేను నమ్ముతున్నా" అని కిదాంబి శ్రీకాంత్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు.మా ప్రధాన లక్ష్యం అదేనంది ఛార్జర్స్ ఫ్రాంచైజీ యజమాని అనిరుధ్ పొన్నాల మాట్లాడుతూ, "శ్రీకాంత్ను నంది ఛార్జర్స్ కుటుంబంలోకి స్వాగతించడం మాకు చాలా ఆనందంగా ఉంది. భారతదేశపు గొప్ప బ్యాడ్మింటన్ క్రీడాకారులలో ఒకరిగా ఆయన స్థాయి మా జట్టుకు అపారమైన విశ్వసనీయతను, శక్తిని తీసుకువస్తుంది. అద్భుతమైన నైపుణ్యం, పోటీతత్వం, గెలుపు స్ఫూర్తిని చూపిస్తూ మా జట్టును ముందుకు తీసుకెళ్లాలన్నదే మా ప్రధాన లక్ష్యం" అని తెలిపారు. కాగా హైదరాబాద్ పికిల్బాల్ లీగ్లో ఎనిమిది ఫ్రాంచైజీ జట్లు ఉంటాయి. అక్టోబర్ 10 నుంచి నవంబర్ 28 వరకు ప్రతి శుక్రవారం రాత్రి మ్యాచ్లు జరుగుతాయి. -
స్వియాటెక్ ఖాతాలో 25వ టైటిల్
సియోల్: ఈ సీజన్లో అద్భుతమైన ఫామ్లో ఉన్న పోలాండ్ టెన్నిస్ స్టార్ ఇగా స్వియాటెక్ తన ఖాతాలో మరో టైటిల్ జమ చేసుకుంది. ఆదివారం ముగిసిన కొరియా ఓపెన్ డబ్ల్యూటీఏ–500 టోర్నీలో స్వియాటెక్ విజేతగా నిలిచింది. ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ స్వియాటెక్ 1–6, 7–6 (7/3), 7–5తో రెండో సీడ్ ఎకతెరీనా అలెగ్జాండ్రోవా (రష్యా)పై గెలిచింది. స్వియాటెక్ కెరీర్లో ఇది 25వ సింగిల్స్ టైటిల్కాగా... ఈ ఏడాది మూడో టైటిల్. 2 గంటల 41 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో స్వియాటెక్కు గట్టిపోటీ ఎదురైంది. కేవలం రెండు ఏస్లు సంధించిన స్వియాటెక్ ఏకంగా తొమ్మిది డబుల్ ఫాల్ట్లు చేసింది. తన సర్వీస్ను ఐదుసార్లు కోల్పోయిన ఈ పోలాండ్ స్టార్ ప్రత్యర్థి సర్వీస్ను మూడుసార్లు బ్రేక్ చేసింది. విజేతగా నిలిచిన స్వియాటెక్కు 1,64,000 డాలర్ల (రూ. 1 కోటీ 44 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
ఇటలీ జట్టుదే బిల్లీ జీన్ కింగ్ కప్
షెన్జెన్ (చైనా): డిఫెండింగ్ చాంపియన్ ఇటలీ బిల్లీ జీన్ కింగ్ కప్ను నిలబెట్టుకుంది. ప్రముఖ డేవిస్ కప్ తరహా మహిళల టీమ్ టెన్నిస్ టోర్నీలో ఇటలీ మళ్లీ విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్స్లో ఇటలీ 2–0 తేడాతో అమెరికాపై ఘనవిజయం సాధించింది. ఇటలీ స్టార్లు జాస్మిన్ పావోలిని, ఎలిసాబెట్టా కొకియారెటో వరుస సింగిల్స్ మ్యాచ్ల్లో గెలుపొందారు. ఫలితం తేలిపోవడంతో డబుల్స్ మ్యాచ్ నిర్వహించాల్సిన అవసరం రాలేదు. ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ పావోలిని 6–4, 6–2తో ఏడో ర్యాంకర్ జెస్సికా పెగూలాను కంగుతినిపించింది. రెండో సింగిల్స్లో 91వ ర్యాంకర్ కొకొయారెటో 6–4, 6–4తో 11వ ర్యాంకులో ఉన్న ఎమ్మా నవారోను మట్టికరిపించింది. బ్రిటన్తో జరిగిన సెమీఫైనల్లో వరుస మ్యాచ్ల్లో అమెరికాను గెలిపించిన పెగులా, నవారో తుదిపోరులో మాత్రం చేతులెత్తేశారు. ఇటలీకి చెందిన ఒలింపిక్ చాంపియన్స్ పావోలిని, సారా ఎరానిలను బరిలోకి దించడం ద్వారా ఈ టోర్నీ చరిత్రలో ఆరో టైటిల్ సాధించింది. గత మూడు టోర్నీల్లో ఫైనల్స్కు చేరిన ఇటలీ 2023లో మాత్రం కెనడా చేతిలో ఓడి రన్నరప్గా నిలిచింది. మరోవైపు అత్యధికంగా 18 సార్లు విజేతగా నిలిచిన అమెరికా 2017 తర్వాత మళ్లీ టైటిల్ గెలుపొందలేకపోయింది. బిల్లీ జీన్ కింగ్ కప్ను గతంలో ఫెడ్ కప్గా నిర్వహించేవారు. 2020–21 సీజన్ నుంచే బిల్లీ జీన్ కింగ్ కప్గా పేరు మార్చారు. -
వెల్డన్ వెర్స్టాపెన్
బాకు (అజర్బైజాన్): ఫార్ములావన్ తాజా సీజన్లో రెడ్బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ వరుసగా రెండో విజయం ఖాతాలో వేసుకున్నాడు. ఇటీవల ఇటాలియన్ గ్రాండ్ప్రి టైటిల్చేజిక్కించుకున్న డిఫెండింగ్ చాంపియన్ వెర్స్టాపెన్... ఆదివారం అజర్బైజాన్ గ్రాండ్ప్రిలో విజేతగా నిలిచాడు. ఈ ఏడాది ఇది 17వ రేసు కాగా... అందులో వెర్స్టాపెన్కు నాలుగో విజయం. ఆదివారం జరిగిన ప్రధాన రేసును పోల్ పొజిషన్తోప్రారంభించిన వెర్స్టాపెన్ 51 ల్యాప్లను అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 1 గంట 33 నిమిషాల 26.408 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు. రేసు ఆరంభం నుంచే వాయువేగంతో దూసుకెళ్లిన నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్ వెర్స్టాపెన్ ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆద్యంతం ఆధిక్యంలో కొనసాగాడు. వెర్స్టాపెన్ వరుసగా రెండు రేసులు నెగ్గడం ఈ ఏడాది ఇదే తొలిసారి. మెర్సిడెస్కు చెందిన రసెల్ 1 గంట 33 నిమిషాల 41.017 సెకన్లలోలో పూర్తి చేసి రెండో స్థానం దక్కించుకున్నాడు. విలియమ్స్ రేసింగ్కు చెందిన కార్లోస్ సెయింజ్ 1 గంట 33 నిమిషాల 45.607 సెకన్లతో మూడో స్థానంలో నిలిచాడు. ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్షిప్ రేసులో అగ్రస్థానంలో ఉన్న మెక్లారెన్ డ్రైవర్ ఆస్కార్ పియాస్ట్రి కారు తొలి ల్యాప్లోనే ప్రమాదానికి గురవడంతో రేసును పూర్తి చేయలేకపోయాడు. ఏడు సార్లు ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ (1 గంట 34 నిమిషాల 2.718 సెకన్లు; ఫెరారీ) ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ‘ప్రతికూల పరిస్థితుల్లో ఇలాంటి ప్రదర్శన చేయడం ఆనందంగా ఉంది. గాలి ప్రభావంతో ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తూ ముందుకు సాగా. ఈ ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నా’ అని వెర్స్టాపెన్ పేర్కొన్నాడు. 24 రేసుల సీజన్లో 17 రేసులు ముగిసేసరికి ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్షిప్లో పియాస్ట్రి 324 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... నోరిస్ 299 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. తాజా విజయంతో వెర్స్టాపెన్ 255 పాయింట్లతో మూడో స్థానాన్ని మరింత మెరుగు పర్చుకున్నాడు. తొలి స్థానంలో ఉన్న పియా్రస్టికి వెర్స్టాపెన్కు మధ్య 69 పాయింట్లు తేడా ఉంది. తదుపరి రేసు అక్టోబర్ 5న సింగపూర్ గ్రాండ్ప్రి జరుగనుంది.67 ఫార్ములావన్ కెరీర్లో వెర్స్టాపెన్ సాధించిన విజయాలు. అత్యధిక విజయాలు సాధించిన డ్రైవర్ల జాబితాలో వెర్స్టాపెన్ మూడో స్థానంలో ఉన్నాడు. లూయిస్ హామిల్టన్ (బ్రిటన్; 105) తొలి స్థానంలో, మైకేల్ షుమాకర్ (జర్మనీ; 91) రెండో స్థానంలో ఉన్నారు. కెరీర్ మొత్తంలో 226 రేసుల్లో పోటీపడ్డ వెర్స్టాపెన్ ఇప్పటివరకు 120 సార్లు టాప్–3లో నిలిచాడు. -
రజతంతో వీడ్కోలు
టోక్యో: తన 17 ఏళ్ల అంతర్జాతీయ అథ్లెటిక్స్ కెరీర్కు జమైకా దిగ్గజం షెల్లీ ఆన్ ఫ్రేజర్ ప్రైస్ ఘనంగా ముగింపు పలికింది. ఆదివారం ముగిసిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో చివరిసారి ట్రాక్పై బరిలోకి దిగిన 38 ఏళ్ల షెల్లీ మహిళల 4–100 మీటర్ల రిలే విభాగంలో జమైకా బృందానికి రజత పతకం అందించింది. షెల్లీ, టియా క్లేటన్, టీనా క్లేటన్, జొనెల్లీ స్మిత్లతో కూడిన జమైకా బృందం 41.79 సెకన్లలో రేసును ముగించి రెండో స్థానంలో నిలిచింది. 100 మీటర్లు, 200 మీటర్ల వ్యక్తిగత విభాగాల్లో స్వర్ణ పతకాలు గెలిచిన అమెరికా స్టార్ మెలిస్సా జెఫర్సన్ వుడెన్ తన ఖాతాలో మూడో స్వర్ణ పతకాన్ని జమ చేసుకుంది. మెలిస్సా, ట్వానిషా టెర్రీ, కేలా వైట్, షకారి రిచర్డ్సన్లతో కూడిన అమెరికా రిలే జట్టు 41.75 సెకన్లలో గమ్యానికి చేరి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. సినా మేయర్, రెబెకా హాస్, సోఫియా జంక్, గినా లుకెన్కెంపర్లతో కూడిన జర్మనీ జట్టుకు కాంస్య పతకం లభించింది. 2008 నుంచి అంతర్జాతీయ అథ్లెటిక్స్లో ఉన్న షెల్లీ తన కెరీర్లో 8 ఒలింపిక్ పతకాలు (4 స్వర్ణాలు, 3 రజతాలు, 1 కాంస్యం) గెల్చుకుంది. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో 17 పతకాలు (10 స్వర్ణాలు, 6 రజతాలు, 1 కాంస్య) సొంతం చేసుకుంది. అమెరికాదే అగ్రస్థానం ఆదివారంతో ముగిసిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో మరోసారి అమెరికా అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అమెరికా 16 స్వర్ణాలు, 5 రజతాలు, 5 కాంస్యాలతో కలిపి మొత్తం 26 పతకాలతో టాప్ ర్యాంక్లో నిలిచింది. 7 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలు నెగ్గిన కెన్యా 11 పతకాలతో రెండో స్థానంలో... 3 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్యం నెగ్గిన కెనడా ఐదు పతకాలతో మూడో స్థానంలో నిలిచాయి. ఓవరాల్గా 54 దేశాలు కనీసం ఒక కాంస్య పతకాన్ని సాధించాయి. -
ఏడేళ్ల తర్వాత...
గురుగ్రామ్: హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ యడ్లపల్లి ప్రాంజల ఏడేళ్ల విరామం తర్వాత అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) సర్క్యూట్లో డబుల్స్ టైటిల్ను సాధించింది. ఆదివారం ముగిసిన ఐటీఎఫ్ డబ్ల్యూ–15 మహిళల టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్కే చెందిన చిలకలపూడి శ్రావ్య శివానితో కలిసి ప్రాంజల డబుల్స్ విభాగంలో టైటిల్ను సొంతం చేసుకుంది. ఫైనల్లో ప్రాంజల–శివాని జోడీ 6–4, 6–0తో భారత్కే చెందిన మహిక ఖన్నా–సోహిని మొహంతి ద్వయంపై గెలుపొందింది. 63 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో ప్రాంజల–శ్రావ్య శివాని ద్వయం ప్రత్యర్థి జంట సర్వీస్ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. ప్రాంజల కెరీర్లో ఇది ఏడో ఐటీఎఫ్ డబుల్స్ టైటిల్. 2018లో చివరిసారి ఆమె రుతుజా భోసలేతో కలిసి థాయ్లాండ్లో రెండు డబుల్స్ టైటిల్స్ సాధించింది. 2017లో నాలుగు డబుల్స్ టైటిల్స్ నెగ్గింది. సింగిల్స్ విషయానికొస్తే ప్రాంజల నాలుగు టైటిల్స్ నెగ్గగా... 2021లో చివరిసారి బెంగళూరు ఓపెన్లో విజేతగా నిలిచింది. ఆ తర్వాత గాయాల బారిన పడటంతో ప్రాంజల కెరీర్ తడబడింది. మరోవైపు శ్రావ్య శివాని కెరీర్లో ఇది మూడో ఐటీఎఫ్ డబుల్స్ టైటిల్. 25 ఏళ్ల శ్రావ్య శివాని 2021లో షర్మదా బాలుతో కలిసి మొనాస్టిర్ ఓపెన్ టోర్నీలో, 2022లో సిలైన్ సిమున్యు (ఐర్లాండ్)తో కలిసి నైరోబి ఓపెన్ టోర్నీలో డబుల్స్ టైటిల్ గెలిచింది. -
రన్నరప్ సాత్విక్–చిరాగ్ జోడీ
షెన్జెన్: ఈ ఏడాది తొలి టైటిల్ సాధించాలని ఆశించిన భారత బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టికి మరోసారి నిరాశ ఎదురైంది. ఆదివారం ముగిసిన చైనా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో సాత్విక్–చిరాగ్ ద్వయం రన్నరప్గా నిలిచింది. 45 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ 19–21, 15–21తో ప్రపంచ నంబర్వన్ జంట కిమ్ వన్ హో–సియో సెయంగ్ జే (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయింది. రన్నరప్గా నిలిచిన సాత్విక్–చిరాగ్లకు 43,750 (రూ. 38 లక్షల 54 వేలు) డాలర్ల ప్రైజ్మనీతోపాటు 9350 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఫైనల్లో తొలి గేమ్లో 14–7తో ఆధిక్యంలో నిలిచిన భారత జంట దానిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైంది.ఒక్క గేమ్ కూడా కోల్పోకుండా ఫైనల్ చేరిన సాత్విక్–చిరాగ్ తుది పోరులో మాత్రం వరుస గేముల్లో ఓటమి పాలయ్యారు. గతవారం హాంకాంగ్ ఓపెన్ టోర్నీలోనూ రన్నరప్గా నిలిచిన సాత్విక్–చిరాగ్... అంతకుముందు ప్రపంచ చాంపియన్షిప్లో కాంస్యం గెల్చుకుంది. సింగిల్స్ విజేత ఆన్ సె యంగ్ ఈ సీజన్లో తన జోరు కొనసాగిస్తూ ప్రపంచ నంబర్వన్, దక్షిణ కొరియా స్టార్ ఆన్ సె యంగ్ మరో టైటిల్ గెలిచింది. చైనా మాస్టర్స్ టోర్నీ మహిళల సింగిల్స్ ఫైనల్లో ఆన్ సె యంగ్ 21–11, 21–3తో ప్రపంచ మూడో ర్యాంకర్ హాన్ యువె (చైనా)పై గెలిచింది. ఈ ఏడాది ఆన్ సె యంగ్ ఖాతాలో ఇది ఏడో టైటిల్ కావడం విశేషం. -
హుబైదా–ప్రేమ్ జంటకు కాంస్యం
బీజింగ్: పారా బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ టోరీ్నలో భారత ప్లేయర్లు అబు హుబైదా–ప్రేమ్ కుమార్ కాంస్య పతకం సాధించారు. డబ్ల్యూహెచ్1–డబ్ల్యూహెచ్2 కేటగిరీలో టాప్ సీడ్గా బరిలోకి దిగిన భారత జోడీ... సెమీఫైనల్లో చైనా ద్వయం చేతిలో ఓడింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీస్లో అబు హుబైదా–ప్రేమ్కుమార్ ఆలె జంట 4–21, 10–21తో మాయి జియాన్పెంగ్–క్యూ జిమో జోడీ చేతిలో పరాజయం పాలైంది. గ్రూప్ ‘ఎ’లో ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండు విజయాలు, ఒక పరాజయంతో భారత షట్లర్లు సెమీఫైనల్కు అర్హత సాధించారు. ‘ప్రతి మ్యాచ్లో కొత్త సవాలే. వాటిని దాటితేనే ఫలితాలు మనకు అనుకూలంగా వస్తాయి. అంతర్జాతీయ స్థాయిలో పతకం సాధించడం ఎంత కష్టమో మాకు తెలుసు. ఈ కాంస్యం భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించగలమనే నమ్మకాన్ని పెంచింది’ అని అబు హుబైదా పేర్కొన్నాడు. ఇటీవల థాయ్లాండ్ వేదికగా జరిగిన ఆఇసయా పారా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లోనూ ఈ జంట పతకం నెగ్గింది. చిన్నప్పుడు పోలియో మహమ్మారి బారినపడి కాళ్లు కోల్పోయిన 31 ఏళ్ల హుబైదా... వైకల్యాన్ని అధిగమిస్తూ నాలుగుసార్లు జాతీయ చాంపియన్గా నిలిచాడు. అంతర్జాతీయ స్థాయిలో సైతం అతడు నిలకడగా పతకాలు సాధించాడు. ఉగాండా పారా బ్యాడ్మింటన్ చాంపియన్íÙప్, ఈజిప్ట్ పారా బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్లోనూ అతడు కాంస్య పతకాలు సాధించాడు. ఇక భారత సైన్యంలో సేవలందిస్తూ 2009లో స్పైనల్కార్డ్ గాయానికి గురైన ప్రేమ్ కుమార్ ఆలె 2014 నుంచి అంతర్జాతీయ స్థాయిలో బ్యాడ్మింటన్ ఆడుతున్నాడు. -
హర్యానా స్టీలర్స్ ఆరో విజయం
జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో హర్యానా స్టీలర్స్ ఆరో విజయం తమ ఖాతాలో వేసుకుంది. శనివారం జరిగిన పోరులో హర్యానా స్టీలర్స్ 38–36 పాయింట్ల తేడాతో తమిళ్ తలైవాస్పై విజయం సాధించింది. స్టీలర్స్కు ఇది వరుసగా నాలుగో గెలుపు కావడం విశేషం. హర్యానా స్టీలర్స్ తరఫున శివమ్ 9 పాయింట్లు, వినయ్ 7 పాయింట్లతో సత్తాచాటగా... తమిళ్ తలైవాస్ తరఫున అర్జున్ దేశ్వాల్ 13 పాయింట్లతో పోరాడాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో హర్యానా 20 రెయిడ్ పాయింట్లు సాధించగా... తలైవాస్ 22 పాయింట్లు సాధించింది. ట్యాక్లింగ్లో ఇరు జట్లు తొమ్మిదేసి పాయింట్లు సాధించాయి. అయితే ఎక్స్ట్రా పాయింట్లలో ముందున్న హర్యానా గెలుపొందింది. తాజా సీజన్లో 8 మ్యాచ్లాడిన స్టీలర్స్ 6 విజయాలు, 2 పరాజయాలతో 12 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక మూడో స్థానానికి చేరింది. మరో మ్యాచ్లో పట్నా పైరెట్స్ 33–30 పాయింట్ల తేడాతో దబంగ్ ఢిల్లీపై విజయం సాధించింది. సీజన్ ఆరంభం నుంచి ఓటమి ఎరగకుండా దూసుకెళ్తున్న దబంగ్ ఢిల్లీకి ఆరు విజయాల తర్వాత ఇదే తొలి పరాజయం. పట్నా తరఫున సబ్స్టిట్యూట్ ప్లేయర్ అంకిత్ రాణా 12 పాయింట్లతో విజృంభించాడు. అంకిత్ జగ్లాన్ 6, అయాన్ 5 పాయింట్లతో అతడికి అండగా నిలిచారు. దబంగ్ ఢిల్లీ తరఫున నీరజ్ నర్వాల్ 8, అషు మాలిక్ 6 పాయింట్లు సాధించారు. తాజా సీన్లో పట్నా పైరెట్స్ 7 మ్యాచ్లాడి 2 విజయాలు, 5 పరాజయాలతో 4 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక తొమ్మిదో స్థానంలో నిలిచింది. మరోవైపు ఢిల్లీ 7 మ్యాచ్లాడి 6 విజయాలు, ఒక పరాజయంతో 12 పాయింట్లతో పట్టిక రెండో స్థానంలో కొనసాగుతోంది. లీగ్లో ఆదివారం విశ్రాంతి దినం కాగా... సోమవారం గుజరాత్ జెయింట్స్తో బెంగళూరు బుల్స్, తమిళ్ తలైవాస్తో యూపీ యోధాస్ తలపడతాయి. -
జ్యోతి సింగ్ సారథ్యంలో...
న్యూఢిల్లీ: భారత జూనియర్ మహళల హాకీ జట్టుకు జ్యోతి సింగ్ సారథిగా ఎంపికైంది. ఈ నెలాఖరులో ఐదు మ్యాచ్ల సిరీస్ ఆడేందుకు భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. కాన్బెర్రా జాతీయ హాకీ సెంటర్ వేదికగా జరిగే ఈ సిరీస్ కోసం హాకీ ఇండియా శనివారం 23 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్లో చిలీ వేదికగా ఎఫ్ఐహెచ్ జూనియర్ మహిళల ప్రపంచకప్ జరగనుండగా... దానికి ముందు ఈ సిరీస్ సన్నాహకంగా ఉపయోగించుకోవాలని భారత జట్టు భావిస్తోంది. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రో లీగ్ సందర్భంగా భారత సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన డిఫెండర్ జ్యోతి సింగ్ జట్టుకు కెపె్టన్గా వ్యవహరించనుంది. నిధి, హర్ష రాణి గోల్ కీపింగ్ బాధ్యతలు మోయనుండగా... జ్యోతి, మనీషా, మమిత ఓరమ్, సాక్షి శుక్ల, పూజ సాహు, నందినితో డిఫెన్స్ బలంగా ఉంది. మిడ్ఫీల్డ్లో ప్రియాంక యాదవ్, సాక్షి రాణా, శైలిమా చాను, రజని, ఇషిక, సునేలితా టొప్పో, అనిషా సాహు కీలకం కానున్నారు. లాల్రిన్పుయి, నిషా మింజ్, పూర్ణిమ యాదవ్, సోనమ్, కనిక సివాచ్, సుఖ్వీర్ కౌర్ ఫార్వర్డ్లుగా వ్యవహరించనున్నారు. ‘ఇది మంచి బృందం. జట్టులో ప్రతి ఒక్కరూ శిక్షణ శిబిరంలో కఠోర సాధన చేశారు. అన్నీ విభాగాల్లో జట్టు సమతూకంగా ఉంది. పరిస్థితులను అర్థం చేసుకొని బాధ్యతలు నిర్వర్తించే ప్లేయర్లు చాలా మంది ఉన్నారు. ఆ్రస్టేలియా పర్యటన ద్వారా తగిన అనుభవం వస్తుంది. అది ఎఫ్ఐహెచ్ జూనియర్ మహిళల ప్రపంచకప్లో ఉపయోగపడుతుంది. వరల్డ్కప్నకు ముందు ప్రపంచ అత్యుత్తమ జట్టుతో తలపడే అవకాశం దక్కింది. ఈ సిరీస్ మన ప్లేయర్లకు చాలా ఉపయోగ పడుతుంది. ఈ మ్యాచ్ల ద్వారా మెరుగవ్వాల్సిన అంశాలను గుర్తిస్తాం. వాటి ఆధారంగా జూనియర్ ప్రపంచకప్ వరకు జట్టును మరింత బలంగా తీర్చిదిద్దుతాం’ అని భారత కోచ్ తుషార్ ఖండేకర్ అన్నాడు. -
వెర్స్టాపెన్కు పోల్ పొజిషన్
బాకు (అజర్బైజాన్): రెడ్బుల్ డ్రైవర్, ఫార్ములావన్ మాజీ చాంపియన్ మ్యాక్స్ వెర్స్టాపెన్ అజర్బైజాన్ సర్క్యూట్పై దూసుకెళ్లాడు. శనివారం జరిగిన రేసులో పోల్ పొజిషన్ సాధించాడు. క్వాలిఫయింగ్లో వెర్స్టాపెన్ అందరికంటే వేగంగా 1 నిమిషం 41.117 సెకన్లలో ల్యాపును పూర్తిచేశాడు. ఈ సీజన్లో అతనికిది ఆరో పోల్ పొజిషన్ కాగా... ఏడుసార్లు చాంపియన్ అయిన బ్రిటన్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ (ఫెరారి)కు ఈ గ్రాండ్ప్రి కలిసిరాలేదు. అతను ఏకంగా 12వ స్థానంలో నిలిచి నిరాశపరిచాడు. శనివారం జరిగిన బాకు సిటీ సర్క్యూట్ అత్యంత క్లిష్టంగా సాగింది. ఏకంగా ఆరు మంది రేసర్ల కార్లు ప్రమాదానికి గురయ్యాయి. చాంపియన్షిప్లో లీడర్బోర్డులో ఉన్న మెక్లారెన్ రేసర్ ఆస్కార్ పియాస్ట్రి కారు కూడా ప్రమాదానికి గురైంది. దీంతో ప్రధాన రేసుకు అతను దూరమయ్యాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును వెర్స్టాపెన్ మొదటి స్థానం నుంచి ప్రారంభిస్తారు. బాకు సర్క్యూట్ రేసర్లను బాగా ఇబ్బంది పెట్టింది. ప్రతికూల వాతావరణం కూడా డ్రైవర్ల కష్టాలను పెంచింది. అదేపనిగా వర్షం, రికార్డు స్థాయిలో ఏకంగా ఆరుగురు రేసర్ల కార్లు ప్రమాదానికి గురవడం ఆందోళనకు గురిచేసింది. పియాస్ట్రీ సహా, ఫెరారీ డ్రైవర్ లెక్లెర్క్, ఒలీవర్ బియర్మన్ (హాస్), అలెక్స్ అల్బన్ (విలియమ్స్), హుల్కెన్బర్గ్ (సాబెర్), పియెర్ గాస్లీ (ఆల్పైన్స్) ప్రమాదాలతో ప్రధాన రేసుకు అర్హత సాధించలేకపోయారు. -
చైనా మాస్టర్స్ టోర్నీ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ
షెన్జెన్ (చైనా): భారత అగ్రశ్రేణి జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి వరుసగా రెండో టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. చైనా మాస్టర్స్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సాత్విక్–చిరాగ్ ద్వయం టైటిల్ పోరుకు అర్హత సంపాదించింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో ఎనిమిదో సీడ్ భారత జోడీ వరుస సెట్లలో మాజీ ప్రపంచ చాంపియన్స్, రెండో సీడ్ ఆరోన్ చియా–సో వూ యిక్ (మలేసియా) జంటపై అద్భుత విజయం సాధించింది. సాత్విక్–చిరాగ్ ద్వయం 21–17, 21–14తో మలేసియన్ ప్రత్యర్థి జంటను ఓడించింది. రెండుసార్లు ఒలింపిక్ పతకాలు నెగ్గిన ప్రత్యర్థి జంట ఈ సెమీస్ మ్యాచ్కు ముందు భారత ద్వయంపై 11–4 తేడాతో ఆధిపత్యంలో ఉంది. అలాంటి జోడీపై సాత్విక్–చిరాగ్లు ఈ సెమీస్లో మాత్రం చెలరేగారు. కేవలం 41 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆట కట్టించి విజయం సాధించారు. ప్రపంచ చాంపియన్షిప్లో కాంస్య పతకంతో హాంకాంగ్ ఓపెన్ బరిలోకి దిగిన భారత జంట రన్నరప్గా నిలిచింది. ఇప్పుడు ఇదే ఉత్సాహంతో టైటిల్పై కన్నేసింది. నేడు జరిగే ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ టాప్ సీడ్ కిమ్ వోన్ హో–సియో సియంగ్ జే జంటతో తలపడుతుంది. -
తెలుగు టైటాన్స్ గెలుపుబాట
జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో తెలుగు టైటాన్స్ తిరిగి గెలుపుబాట పట్టింది. గత మూడు మ్యాచ్ల్లో ఓడిన టైటాన్స్ శుక్రవారం జరిగిన పోరులో 43–29 పాయింట్ల తేడాతో తమిళ్ తలైవాస్పై విజయం సాధించింది. టైటాన్స్ కెపె్టన్ విజయ్ మలిక్ 10 పాయింట్లతో విజృంభించాడు. భరత్ 8 పాయింట్లతో అతడికి సహకరించాడు. తమిళ్ తలైవాస్ తరఫున కెప్టెన్ అర్జున్ దేశ్వాల్ 7 పాయింట్లతో పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు. తాజా సీజన్లో 9 మ్యాచ్లు ఆడిన తెలుగు టైటాన్స్ 4 విజయాలు, 5 పరాజయాలతో 8 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో నాలుగో స్థానానికి చేరింది. మరో మ్యాచ్లో హర్యానా స్టీలర్స్ 34–30 పాయింట్ల తేడాతో పుణేరి పల్టన్ చేతిలో ఓడింది. టేబుల్ టాపర్ పుణేరి పల్టన్కు వరుసగా మూడు విజయాల తర్వాత ఇదే తొలి ఓటమి. హర్యానా స్టీలర్స్ తరఫున వినయ్ 13 పాయింట్లు సాధించగా... పుణేరి పల్టన్ తరఫున పంకజ్ 14 పాయింట్లతో పోరాడాడు. నేడు జరిగే మ్యాచ్ల్లో పట్నా పైరెట్స్తో దబంగ్ ఢిల్లీ, హరియాణా స్టీలర్స్తో తమిళ్ తలైవాస్ తలపడతాయి. -
ప్రదర్శన బాగున్నా...పతకం తెస్తేనే మజా!
న్యూఢిల్లీ: భారత కొత్త జావెలియన్ త్రో సంచలనం సచిన్ యాదవ్ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో ఆకట్టుకున్నాడు. పాల్గొన్న తొలి ప్రపంచ ఈవెంట్లోనే తన ప్రదర్శనతో దిగ్గజాలు నీరజ్ చోప్రా, జూలియన్ వెబర్లను అధిగమించడం మంచి అనుభూతినిషినప్పటికీ కాంస్యం చేజారడం తీవ్ర నిరుత్సాహపరిచిందని అన్నాడు. గురువారం జరిగిన పోటీల్లో ఉత్తరప్రదేశ్కు చెందిన 25 ఏళ్ల సచిన్ ఈటెను 86.27 మీటర్ల దూరం విసిరి నాలుగో స్థానంలో నిలిచాడు. కాంస్య విజేత కుర్టిస్ థామ్సన్ (అమెరికా; 86.67 మీటర్లు)కు కేవలం 40 సెంటిమీటర్ల దూరంతో పతకం అవకాశాన్ని కోల్పోయాడు. అయితే 6 అడుగుల 5 అంగుళాల ఎత్తున్న సచిన్... రెండు ఒలింపిక్ పతకాల విజేత నీరజ్ చోప్రా (84.03 మీటర్లు), ఒలింపిక్ చాంపియన్ అర్షద్ నదీమ్ (పాకిస్తాన్; 82.75 మీటర్లు), టోక్యో డైమండ్ లీగ్ చాంప్ వెబెర్ (జర్మనీ; 86.11 మీటర్లు)లాంటి హేమాహేమీలను అధిగమించడం విశేషం. ఈ సందర్భంగా పలు అంశాలపై సచిన్ వెలుబుచ్చిన అభిప్రాయాలు అతని మాటల్లోనే... ఘనంగానే ఆరంభించా ప్రారంభ త్రో బాగా మురిపించింది. వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలించాయి. నా శరీర స్పందన, ఆటతీరు కూడా ఉత్సాహపరిచింది. తొలి త్రో వెళ్లిన దూరం, నేల తాకిన చోటు చూశాక పతకం గెలుస్తాననే ధీమా వచ్చింది. మిగతా ప్రయత్నాల్లో ఒక్కసారి అయిన 87 మీటర్ల దూరం ఈటెను విసురుతాననే నమ్మకం కలిగింది. ప్రపంచంలోనే అత్యుత్తమ అథ్లెట్లతో పోటీపడుతున్న నాకు సహజంగానే తదుపరి ప్రదర్శన మించి ఉంటుందనే భావించాను. నా శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ మిగతా ఐదు ప్రయత్నాల్లో ఆరంభ త్రోను మెరుగుపర్చుకోకపోవడం వల్లే ప్రపంచ చాంపియన్షిప్ పతకం కోల్పోయాను. నీరజ్ 2 పతకాలు ఖాయమన్నాడు సీనియర్ సహచరుడు, స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రాతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూనే ఉన్నాను. ఫైనల్ ఈవెంట్ జరుగుతున్న సమయంలోనూ మేమిద్దరం ముచ్చటించుకున్నాం. నా తొలి త్రో చూసిన వెంటనే చోప్రా నాతో ఈ ఈవెంట్లో దేశానికి రెండు పతకాలు ఖాయమయ్యాయన్నాడు. అతను వెన్నెముక సమస్యతో బాధపడుతున్నప్పటికీ మంచి ప్రదర్శన ఇస్తాడనే అనుకున్నాను. కానీ నీరజ్... ప్రదర్శనలో నా కంటే వెనుకబడిపోవడం చాలా బాధనిపించింది. టోక్యో ఒలింపిక్స్ నుంచి పోడియంలో ఉంటున్న అతను చివరకు ఇక్కడ పతకానికి దూరమవడం నా బాధను రెట్టింపు చేసింది. ఆటలు, అథ్లెట్లు ఎరుగరు నా ప్రదర్శనతో మా గ్రామంలో (భాగ్పట్ జిల్లాలోని ఖేరా) ఎక్కడలేని హడావుడి మొదలైంది. కొందరు జర్నలిస్టులు మా తల్లిదండ్రులతో మాట్లాడారంట. ఆటలు, అథ్లెట్లు, పతకాలంటే వాళ్లకి అస్సలు తెలినే తెలియదు. వాళ్లకు తెలిసిందల్లా తమ కుమారుడికి మంచి ఉద్యోగం, చక్కని జీవితం లభిస్తే చాలనుకునే అమాయకులు. ముఖ్యంగా నన్ను ఓ ప్రభుత్వ ఉద్యోగిగా చూడాలనుకున్నారు. 2023లో ఉత్తరప్రదేశ్ పోలీస్ శాఖలో ఉద్యోగం దొరకడంతోనే వారి ఆనందానికి హద్దుల్లేవు. అలాంటిది ఇప్పుడు జర్నలిస్టులు, ఫొటోగ్రాఫర్లు వచ్చి తమని ప్రముఖంగా ఫొటోలు తీసారని నా తల్లి గొప్పగా చెప్పింది. నా గాయంతో అప్పులపాలయ్యాం నిజం చెప్పాలంటే నాకు అసలు నాణ్యమైన కోచ్ లేడు. మరో జావెలిన్ త్రోయర్ సందీప్ యాదవ్ నా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాడు. అతనే గతేడాది నాకు పారాలింపిక్ స్వర్ణ విజేతలు సుమిత్, నవ్దీప్ల కోచ్ నవల్ సింగ్కు పరిచయం చేశాడు. ఇక కెరీర్ తొలినాళ్లలో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. 2021లో నా భుజానికి అయిన గాయంతో మా నాన్న చాలా ఖర్చు చేశాడు. తెలిసిన వాళ్లు, తెలియని వాళ్ల దగ్గర అప్పులు చేసి నన్ను బాగు చేశాడు. మళ్లీ ఈ ఏడాది ఉత్తరాఖండ్ జాతీయ క్రీడల్లో స్వర్ణం గెలిచినప్పుడు కూడా చీలమండ గాయంతో ఇబ్బందిపడ్డాను. అయితే అప్పటికీ ఇప్పటికీ ఎంతో మారింది. ఇప్పుడు నేను ‘టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం (టాప్స్)లో ఉన్నాను. వ్యక్తిగత స్పాన్సర్షిప్ కూడా లభించింది. కాబట్టి ఇప్పుడు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురవలేదు. పునరావాస శిబిరంలోనే గాయానికి చికిత్స తీసుకుని వెంటనే మెరుగయ్యాను. సచిన్కు చీఫ్ కోచ్ కితాబు క్రీడాశాఖ ప్రోత్సాహకాలతో సచిన్ యాదవ్కు నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలో దిగ్గజ రష్యన్ కోచ్ సెర్గెయ్ మకరొవ్ శిక్షణ జతయ్యింది. సచిన్ టాలెంట్ను గుర్తించిన ఆయన వెంటనే చిన్నచిన్న తప్పు ఒప్పులను సరిచేశారు. మెలకువలు నేరి్పంచారు. ట్రెయినింగ్ సెషన్స్లో 90 మీటర్ల దూరం కూడా ఈటెను విసిరాడని, అతను భారత జావెలిన్ త్రోలో నీరజ్కు ధీటుగా పతకాలు సాధిస్తాడని చీఫ్ కోచ్ మకరొవ్ కితాబిచ్చారు. ఇలా ముగిస్తానని అనుకోలేదు: నీరజ్న్యూఢిల్లీ: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో ఎనిమిదో స్థానంలో నిలిచి నిరాశ పరిచిన భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా... విరామం అనంతరం బలంగా తిరిగి వస్తానని ధీమా వ్యక్తం చేశాడు. టోక్యో వేదికగా జరిగిన ఫైనల్లో జావెలిన్ను 84.03 మీటర్ల దూరం విసిరిన డిఫెండింగ్ చాంపియన్ నీరజ్ చోప్రా... ఐదో త్రో అనంతరం ఎలిమినేట్ అయ్యాడు. ఇదే పోటీలో భారత్కు చెందిన మరో త్రోయర్ సచిన్ యాదవ్ జావెలిన్ను 86.27 మీటర్ల దూరం విసిరి నాలుగో స్థానంలో నిలిచాడు. సచిన్కు ఇదే వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. ‘సీజన్ను ఇలా ముగిస్తానని అనుకోలేదు. దేశం తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేయాలనే ఉద్దేశంతోనే టోక్యో ప్రపంచ చాంపియన్షిప్లో అడుగుపెట్టా. కానీ అది సాధ్యపడలేదు. అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మరింత బలంగా తిరిగివస్తా. సచిన్ యాదవ్ వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడం ఆనందంగా ఉంది. అతడు త్రుటిలో పతకం కోల్పోయాడు’ అని నీరజ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఈ సందర్భంగా పతక విజేతలకు నీరజ్ అభినందనలు తెలిపాడు. 27 ఏళ్ల నీరజ్ చోప్రా 2020 టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణ పతకం... 2024 పారిస్ ఒలింపిక్స్లో రజత పతకం... 2022 ప్రపంచ చాంపియన్ షిప్లో రజతం... 2023 ప్రపంచ చాంపియన్షిప్లో పసిడి పతకం సాధించాడు. -
బోల్ట్ సరసన లైల్స్
టోక్యో: జమైకా దిగ్గజ అథ్లెట్ ఉసేన్ బోల్ట్కు మాత్రమే సాధ్యమైన ఘనతను అమెరికా స్టార్ అథ్లెట్ నోవా లైల్స్ సాధించాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో వరుసగా నాలుగోసారి పురుషుల 200 మీటర్ల విభాగంలో లైల్స్ విజేతగా నిలిచాడు. 42 ఏళ్ల ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ చరిత్రలో ఉసేన్ బోల్ట్ (2009, 2011, 2013, 2015లలో) తర్వాత 200 మీటర్ల విభాగంలో వరుసగా నాలుగు స్వర్ణ పతకాలు నెగ్గిన రెండో అథ్లెట్గా లైల్స్ గుర్తింపు పొందాడు. శుక్రవారం జరిగిన 200 మీటర్ల ఫైనల్ రేసును లైల్స్ 19.52 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని సంపాదించి పసిడి పతకం గెలిచాడు. 2019, 2022, 2023 ప్రపంచ చాంపియన్షిప్లలోనూ ఈ విభాగంలో లైల్స్ విజేతగా నిలిచాడు. మెలిస్సా ‘స్ప్రింట్ డబుల్’ మరోవైపు మహిళల 200 మీటర్ల విభాగంలో అమెరికాకే చెందిన మెలిస్సా జెఫర్సన్ వుడెన్ స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. 200 మీటర్ల ఫైనల్ రేసును మెలిస్సా 21.68 సెకన్లలో పూర్తి చేసి విజేతగా అవతరించింది. 100 మీటర్ల విభాగంలోనూ మెలిస్సాకే బంగారు పతకం లభించింది. 2013లో షెల్లీ ఆన్ ఫ్రేజర్ ప్రైస్ తర్వాత ఒకే ప్రపంచ చాంపియన్షిప్లో 100, 200 మీటర్ల విభాగాల్లో పసిడి పతకాలు నెగ్గిన రెండో అథ్లెట్గా మెలిస్సా గుర్తింపు పొందింది. -
సెమీస్లో సాత్విక్–చిరాగ్ జోడీ
షెన్జెన్: ఈ ఏడాది తొలి టైటిల్ కోసం వేచి చూస్తున్న భారత బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ ఆ దిశగా మరో అడుగు వేసింది. చైనా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో సాత్విక్–చిరాగ్ ద్వయం సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జంట 21–14, 21–14తో రెన్ జియాంగ్ యు–జియె హావోనన్ (చైనా) జోడీపై విజయం సాధించింది. 38 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్లో రెండు గేముల్లోనూ భారత జోడీ ఆధిపత్యం కనబరిచింది. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంక్ జోడీ ఆరోన్ చియా–సో వుయ్ యిక్ (మలేసియా)తో సాత్విక్–చిరాగ్ జంట తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సాత్విక్–చిరాగ్ ద్వయం 4–11తో వెనుకంజలో ఉంది. సింధు ఎనిమిదో‘సారీ’ మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ పీవీ సింధు పోరాటం ముగిసింది. ప్రపంచ నంబర్వన్ ఆన్ సె యంగ్ (దక్షిణ కొరియా)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 14వ ర్యాంకర్ సింధు 14–21, 13–21తో పరాజయం పాలైంది. ఆన్ సె యంగ్తో ఇప్పటి వరకు ఆడిన ఎనిమిదిసార్లూ సింధు ఓడిపోవడం గమనార్హం. ఈ కొరియా స్టార్తో ఆడిన ఎనిమిది మ్యాచ్ల్లో సింధు ఒక్క గేమ్ మాత్రమే గెలవగలిగింది. క్వార్టర్ ఫైనల్లో ఓడిన సింధుకు 6,875 డాలర్ల (రూ. 6 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 6050 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
కాంస్యంతో సత్తా చాటిన ఆర్నవ్ రెడ్డి
ఆసియా ఓపెన్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ చాంపియన్షిప్లో తెలంగాణకు చెందిన పెంటాల ఆర్నవ్ రెడ్డి సత్తా చాటాడు. కాంస్య పతకం సాధించి దేశానికి, రాష్ట్రానికి గర్వకారణమయ్యాడు. డెహ్రాడూన్లోని హిమాద్రి ఐస్ రింక్ వేదికగా జరిగిన చాంపియన్షిప్లో.. 333 మీటర్ రేసులో ఆర్నవ్ మూడో స్థానంలో నిలిచాడు. తద్వారా అంతర్జాతీయ స్థాయిలో స్పీడ్ స్కేటింగ్లో భారత అథ్లెటిక్ విభాగం సాధిస్తున్న పురోగతిలో తానూ భాగమయ్యాడు.తెలంగాణకు చెందిన ఆర్నవ్ రెడ్డి అత్తాపూర్లో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. డీపీఎస్ ఏరోసిటీ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నాడు. ఆర్నవ్ అంతర్జాతీయ స్థాయికి ఎదగడంలో కోచ్లు ఎంఏ ఖాదీర్, సయ్యద్ ఎహ్సాన్ అహ్మద్, సయ్యద్ సఫీ హుసైనీ పాత్ర కీలకం. ఇక ఆర్నవ్ తల్లిదండ్రులు పెంటాల తిరుపతి రెడ్డి, స్మిత. ఎల్లవేళలా కుమారుడి వెన్నంటి ప్రోత్సహించే తిరుపతిరెడ్డి దంపతులు ఈ విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కాగా ఆగష్టు 20- 23 వరకు ఆసియా ఓపెన్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ చాంపియన్షిప్ జరిగింది. -
పుణేరి పల్టన్ ‘టాప్’ షో
జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో పుణేరి పల్టన్ ‘హ్యాట్రిక్’ విజయం నమోదు చేసుకొని పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. గత రెండు మ్యాచ్ల్లో నెగ్గిన పుణేరి పల్టన్ గురువారం జరిగిన పోరులో యు ముంబాపై ఏకపక్ష విజయం సాధించింది. సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన పుణేరి పల్టన్ 40–22 పాయింట్ల తేడాతో యు ముంబాను చిత్తుచేసింది. పుణేరి పల్టన్ జట్టు తరఫున స్టువర్ట్ సింగ్ 8 పాయింట్లు, గుర్దీప్ 5 పాయింట్లు సాధించగా... అభినేష్, గౌరవ్ ఖత్రి చెరో 4 పాయింట్లు సాధించారు. యు ముంబా జట్టు తరఫున అమీర్ మొహమ్మద్ 6 పాయింట్లతో పోరాడినా ఫలితం లేకపోయింది. ఓవరాల్గా ఈ మ్యాచ్లో యు ముంబా జట్టు 12 రెయిడ్ పాయింట్లు సాధించగా... ఫుణేరి పల్టన్ జట్టు 14 రెయిడ్ పాయింట్లు ఖాతాలో వేసుకుంది. అయితే ట్యాక్లింగ్లో యు ముంబా 6 పాయింట్లకు పరిమితం కాగా... పల్టన్ 20 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. తాజా సీజన్లో 8 మ్యాచ్లాడిన పుణేరి పల్టన్ 6 విజయాలు, 2 పరాజయాలతో 12 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక ‘టాప్’ ప్లేస్కు చేరింది. మరో మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ 45–41తో బెంగాల్ వారియర్స్పై గెలుపొందింది. జైపూర్ రైడర్లు నితిన్ 13, అలీ 12 పాయింట్లతో విజృంభించగా... వారియర్స్ తరఫున దేవాంక్ 16, మన్ప్రీత్ 10 పాయింట్లు సాధించారు. దేవాంక్కు ఇది వరుసగా ఏడో ‘సూపర్–10’ కావడం విశేషం. ఈ లీగ్ చరిత్రలో అత్యంత వేగంగా (38 మ్యాచ్ల్లో) 400 రెయిడ్ పాయింట్లు సాధించిన ప్లేయర్గా దేవాంక్ నిలిచాడు. నేడు పుణేరి పల్టన్తో హరియాణా స్టీలర్స్, తమిళ్ తలైవాస్తో తెలుగు టైటాన్స్ ఆడతాయి. -
ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు వేళాయె!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)... ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)... ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)... హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)... అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ)... రగ్బీ ప్రీమియర్ లీగ్ (ఆర్పీఎల్)... టెన్నిస్ ప్రీమియర్ లీగ్ (టీపీఎల్)... ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్)... ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)... ఇలా అన్ని ఆటల్లో లీగ్ల హవా సాగుతున్న వేళ...కొత్తగా ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)కు కూడా వచ్చే నెలలో తెరలేవనుంది. న్యూఢిల్లీ: ప్రతిభకు పట్టం కడుతూ... ఆటకు మరింత విస్తృత ప్రచారం కల్పిస్తూ... ప్రపంచ ఆర్చరీలో భారత్ను నంబర్వన్గా నిలపడమే లక్ష్యంగా ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు అంకురార్పణ జరిగింది. అక్టోబర్ 2 నుంచి 12 వరకు దేశ రాజధాని న్యూఢిల్లీలో జరగునున్న ఆర్చరీ ప్రీమియర్ లీగ్ వివరాలను గురువారం నిర్వాహకులు వెల్లడించారు. మొత్తం ఆరు జట్లు పాల్గొననున్న ఈ లీగ్లో 48 మంది ఆర్చర్లు బరిలోకి దిగనున్నారు. వారిలో 12 మంది విదేశీయులు కాగా... మిగిలిన 36 మంది స్వదేశీ ఆర్చర్లు. ప్రపంచ నంబర్వన్ ఆర్చర్లు ఆండ్రియా బెకెర్రా (కాంపౌండ్), బ్రాడీ ఎలీసన్ (రికర్వ్) ఈ లీగ్లో భాగం కానున్నారు. భారత్ నుంచి స్టార్ ఆర్చర్లు వెన్నం జ్యోతి సురేఖ, దీపిక కుమారి, అతాను దాస్, బొమ్మదేవర ధీరజ్ ఇలా పలువురు ఆర్చర్లు వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్కే చెందిన చిట్టిబొమ్మ జిజ్ఞాస్, మాదాల సూర్య హంసిని, తెలంగాణ అమ్మాయి తనపర్తి చికిత కూడా ఈ లీగ్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఈ లీగ్తో భారత ఆర్చరీ ముఖచిత్రం మారిపోతుందని భారత ఆర్చరీ సంఘం (ఏఏఐ) భావిస్తోంది. ‘ఆర్చరీలో మనకు ఘన చరిత్ర ఉంది. పురాతన కాలం నుంచి మన దేశంలో విలువిద్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది. వరల్డ్కప్, వరల్డ్ చాంపియన్షిప్స్, ఆసియా చాంపియన్షిప్స్, కామన్వెల్త్ చాంపియన్షిప్స్ ఇలా ప్రతి పోటీలోనూ భారత ఆర్చర్లు పతకాలు సాధించారు. ఒలింపిక్స్లో మాత్రం పతకం ఇంకా బాకీ ఉంది. ఈ లీగ్ ద్వారా ఆ ముచ్చట కూడా తీరడం ఖాయమే’ అని ఏఏఐ కార్యదర్శి వీరేంద్ర సచ్దేవ్ అన్నారు. » ఒక్కో జట్టులో నలుగురు మహిళలు, నలుగురు పురుష ఆర్చర్ల చొప్పున 8 మంది ఉంటారు. ఇందులో ఇద్దరు విదేశీయులు, ఆరుగురు భారత ఆర్చర్లు ఉంటారు. విదేశీయుల్లో ఒకరు పురుష ఆర్చర్, మరొకరు మహిళా ఆర్చర్ ఉంటారు. » భారత ఆర్చరీ అసోసియేషన్ ఇటీవల నిర్వహించిన సెలెక్షన్ ట్రయల్స్తో పాటు ప్రపంచ ర్యాంకింగ్స్ ఆధారంగా ఆర్చర్లను ఎంపిక చేశారు. » కాంపౌండ్, రికర్వ్ విభాగాల్లో ఒలింపిక్ ప్రమాణాలకు తగ్గట్లు 70 మీటర్లు, 50 మీటర్లలో పోటీలు జరుగుతాయి. ఈ లీగ్ మొత్తం ప్రైజ్మనీ 2 కోట్ల రూపాయలు. » రౌండ్ రాబిన్ పద్ధతిలో రోజుకు మూడు మ్యాచ్లు (20 నిమిషాలు) నిర్వహిస్తారు. అంతర్జాతీయ స్థాయిలో బాణం సంధించేందుకు 20 సెకన్ల సమయం ఇస్తుండగా... ఈ లీగ్లో 15 సెకన్లకు తగ్గించారు. » రికర్వ్ విభాగంలో మూడో ర్యాంకర్ దీపిక కుమారి, ఆంధ్రప్రదేశ్కు చెందిన ధీరజ్తో పాటు వెటరన్స్ అతాను దాస్, తరుణ్దీప్ ఉన్నారు. » కాంపౌండ్ విభాగంలో ప్రపంచ రికార్డు హోల్డర్ వెన్నం జ్యోతి సురేఖ, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ రిషభ్ యాదవ్, అభిషేక్ వర్మ, ప్రథమేశ్, ప్రియాంశ్, పర్ణీత్ కౌర్ బరిలో ఉన్నారు. ఏ జట్టులో ఎవరున్నారంటే...పృథ్వీరాజ్ యోధాస్ (ఢిల్లీ): మాటియస్ గ్రాండె, ఆండ్రియా బికెర్రా, అభిషేక్ వర్మ, గాథ, ప్రియాంశ్, శర్వరి, క్రిష్ కుమార్, ప్రాంజల్. చెరో ఆర్చర్స్ (జార్ఖండ్): మాథియస్ ఫుల్లెర్టన్, క్యాథరినా బ్యూర్, రాహుల్, ప్రీతిక ప్రదీప్, అతాను దాస్, మాదాల సూర్య హంసిని, సాహిల్ రాజేశ్, కుంకుమ్ మొహొద్. కాకతీయ నైట్స్ (తెలంగాణ): నికో వైనెర్, ఎలియా క్యానల్స్, నీరజ్, వెన్నం జ్యోతి సురేఖ, రోహిత్, అవ్నీత్, చిట్టిబొమ్మ జిజ్ఞాస్, తిషా పునియా. చోళా చీఫ్స్ (తమిళనాడు): బ్రాడీ ఎలీసన్, మీరి మారిటా, రిషభ్ యాదవ్, దీపిక కుమారి, తరుణ్దీప్ రాయ్, తనిపర్తి చికిత, పులకిత్, అన్షిక కుమారి. మైటీ మరాఠాస్ (మహారాష్ట్ర): మైక్ స్కాలెస్సర్, అలెగ్జాండ్రా వాలెన్సియా, బొమ్మదేవర ధీరజ్, పరీ్ణత్ కౌర్, అమన్ సైనీ, భజన్ కౌర్, మృణాల్ చౌహాన్, మధుర. రాజ్పుతానా రాయల్స్ (రాజస్తాన్): మెటా గాజోజ్, ఎల్లా గిబ్సన్, ప్రథమేశ్, అంకిత, ఓజస్ ప్రవీణ్, బసంతి, సచిన్ గుప్తా, స్వాతి. ఏపీఎల్ డైరెక్టర్గా అనిల్ కామినేని ఈ లీగ్కు రూపకల్పన చేసిన ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ కామినేని... ఏపీఎల్ డైరెక్టర్గా వ్యవహరించనున్నారు. ప్రపంచ అగ్రశ్రేణి ఆర్చర్లు పాల్గొంటున్న ఈ లీగ్తో భారత ఆర్చర్లకు ఎంతో లాభం జరుగుతుందని అనిల్ వెల్లడించారు. ‘ప్రపంచ ఆర్చరీ సంఘంతో ఈ లీగ్ గురించి చర్చించాం. ఇకపై ప్రతీఏటా దీన్ని నిర్వహిస్తామని అందుకు తగ్గట్లు అంతర్జాతీయ షెడ్యూల్ రూపొందించాలని చెప్పాం. ప్రస్తుతం ఆర్చరీలో దక్షిణ కొరియా ఆధిపత్యం కొనసాగుతోంది. ఆరంభ లీగ్లో పలువురు కొరియా స్టార్లు పాల్గొనేందుకు ఆసక్తి చూపారు. అయితే ఈ లీగ్ సమయంలో వారి దేశంలో సెలెక్షన్ ట్రయల్స్ ఉన్నాయి. ఫలితంగా ఈసారి నుంచి కాకుండా వచ్చే ఏడాది కొరియా ప్లేయర్లను కూడా చూడవచ్చు’ అని అనిల్ తెలిపారు. సినీనటుడు రామ్చరణ్ ఈ లీగ్కు అంబాసిడర్గా వ్యవహరించనున్నాడు. ప్రతిభను గుర్తించి మరింత సానబెట్టేందుకు ఈ లీగ్ ఎంతగానో ఉపకరించనుంది. ప్రపంచ ఆర్చరీలో భారత దేశాన్ని అగ్రస్థానంలో నిలపడమే ధ్యేయంగా ఈ లీగ్ రూపకల్పన చేసినట్లు డైరెక్టర్ అనిల్ కామినేని వెల్లడించారు. ఆర్చరీలో కొత్త విప్లవం తీసుకొచ్చి తద్వారా ప్రపంచంలో తిరుగులేని శక్తిగా నిలపడమే తమ ధ్యేయమని తెలిపారు. ఈ క్రమంలోనే ఆర్చరీని మరింత మందికి చేరువ చేసేందుకు రామ్చరణ్ను అంబాసిడర్గా ఎంపికచేసినట్లు వివరించారు. -
వరల్డ్ X యూరప్
శాన్ఫ్రాన్సిస్కో (అమెరికా): ప్రపంచ పురుషుల టెన్నిస్లోని మేటి ఆటగాళ్లతో ప్రతి యేటా నిర్వహించే ‘లేవర్ కప్’ టోర్నమెంట్కు రంగం సిద్ధమైంది. నేటి నుంచి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో మూడు రోజులపాటు ఈ టోర్నీ జరుగుతుంది. టీమ్ యూరప్, టీమ్ వరల్డ్ జట్ల మధ్య ఈ టోర్నీని నిర్వహిస్తారు. 2017లో మొదలైన ఈ టోర్నీ 2020లో కరోనా మహమ్మారి కారణంగా జరగలేదు. ఇప్పటి వరకు ఏడుసార్లు ఈ టోర్నీ జరగ్గా... ఐదుసార్లు టీమ్ యూరప్ (2017, 2018, 2019, 2021, 2024), రెండుసార్లు టీమ్ వరల్డ్ (2022, 2023) ‘లేవర్ కప్’ చాంపియన్గా నిలిచాయి. ఈసారి టీమ్ యూరప్ తరఫున ప్రపంచ నంబర్వన్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్), మూడో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), 11వ ర్యాంకర్ హోల్గర్ రూనె (డెన్మార్క్), 12వ ర్యాంకర్ కాస్పర్ రూడ్ (నార్వే), 17వ ర్యాంకర్ జాకుబ్ మెన్సిఖ్ (చెక్ రిపబ్లిక్), 22వ ర్యాంకర్ టామస్ మఖచ్ (చెక్ రిపబ్లిక్), 25వ ర్యాంకర్ ఫ్లావియో కొ»ొల్లి (ఇటలీ) ఆడనున్నారు. టీమ్ వరల్డ్ తరఫున ప్రపంచ 5వ ర్యాంకర్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా), 8వ ర్యాంకర్ అలెక్స్ డిమినార్ (ఆ్రస్టేలియా), 21వ ర్యాంకర్ ఫ్రాన్సిస్కో సెరున్డోలో (అర్జెంటీనా), 32వ ర్యాంకర్ అలెక్స్ మిచెల్సన్ (అమెరికా), 42వ ర్యాంకర్ జోవా ఫోన్సెకా (బ్రెజిల్), 62వ ర్యాంకర్ రిలీ ఒపెల్కా (అమెరికా), 86వ ర్యాంకర్ జెన్సన్ బ్రూక్స్బై (అమెరికా) బరిలోకి దిగుతారు. టీమ్ యూరప్ జట్టుకు ఫ్రెంచ్ ఓపెన్ మాజీ చాంపియన్ యానిక్ నోవా (ఫ్రాన్స్)... టీమ్ వరల్డ్ జట్టుకు అమెరికా మేటి ప్లేయర్, ఎనిమిది గ్రాండ్స్లామ్ సింగిల్స్ నెగ్గిన ఆండ్రీ అగస్సీ కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. -
సింధు సంచలనం
షెన్జెన్: ఈ ఏడాది తొలి టైటిల్ కోసం వేచి చూస్తున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు... చైనా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీ లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 14వ ర్యాంకర్ సింధు సంచలన విజయం నమోదు చేసింది. ప్రపంచ ఆరో ర్యాంకర్ పోర్న్పవీ చోచువోంగ్ (థాయ్లాండ్)తో జరిగిన మ్యాచ్లో సింధు 21–15, 21–15తో గెలుపొందింది. 41 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో సింధుకు రెండో గేమ్లో కాస్త పోటీ ఎదురైంది. తొలి గేమ్ ఆరంభంలో తొలి పాయింట్ చేజార్చుకున్న సింధు ఆ తర్వాత వరుసగా ఆరు పాయింట్లు సాధించి 6–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. స్కోరు 6–4 వద్ద సింధు మళ్లీ చెలరేగి వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 11–4తో ముందంజ వేసింది. అనంతరం ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని తొలి గేమ్ దక్కించుకుంది. రెండో గేమ్ హోరాహోరీగా సాగింది. పలుమార్లు ఇద్దరి స్కోరు సమమయ్యాయి. స్కోరు 13–13 వద్ద సింధు విజృంభించి వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 18–13తో ఆధిక్యంలోకి వెళ్లింది. అదే జోరులో గేమ్తోపాటు మ్యాచ్ను సొంతం చేసుకుంది. ఈ గెలుపుతో చోచువోంగ్తో ముఖాముఖి రికార్డులో సింధు 7–5తో ఆధిక్యంలోకి వెళ్లింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ ఆన్ సె యంగ్ (దక్షిణ కొరియా)తో సింధు తలపడుతుంది. ఆన్ సె యంగ్తో ఇప్పటి వరకు ఏడుసార్లు ఆడిన సింధు ఒక్కసారి కూడా నెగ్గలేదు. ఆన్ సె యంగ్తో జరిగిన ఏడు మ్యాచ్ల్లో సింధు ఒక్క గేమ్ మాత్రమే గెలవగలిగింది. క్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్ –చిరాగ్ శెట్టి (భారత్) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–13, 21–12తో సియాంగ్ చియె చియు–వాంగ్ చి లిన్ (చైనీస్ తైపీ) జంటపై గెలిచింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో రెన్ జియాంగ్ యు–జియె హావోనన్ (చైనా)లతో సాత్విక్–చిరాగ్ తలపడతారు. -
కాంస్యం నెగ్గిన అంతిమ్
ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత్ ఖాతాలో తొలి పతకం చేరింది. క్రొయేషియాలో గురువారం జరిగిన మహిళల 53 కేజీల విభాగంలో అంతిమ్ పంఘాల్ కాంస్య పతకం సాధించింది. గురువారం జరిగిన కాంస్య పతక బౌట్లో హరియాణాకు చెందిన 21 ఏళ్ల అంతిమ్ 9–1తో ఎమ్మా జోనా డెనిస్ మాల్ ్మగ్రెన్ (స్వీడన్)పై గెలుపొందింది. ప్రపంచ చాంపియన్షిప్ చరిత్రలో అంతిమ్కిది రెండో పతకం, 2023లోనూ ఆమె కాంస్యం సాధించింది. వినేశ్ ఫొగాట్ (2019, 2022లలో కాంస్యం) తర్వాత ప్రపంచ చాంపియన్షిప్ పోటీల్లో రెండు పతకాలు గెలిచిన రెండో భారతీయ మహిళా రెజ్లర్గా అంతిమ్ గుర్తింపు పొందింది. ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ పోటీల్లో భారత్ నుంచి అల్కా (2006లో కాంస్యం), బబిత (2012లో కాంస్యం), గీతా ఫొగాట్ (2012లో కాంస్యం), పూజ (2018లో కాంస్యం), అన్షు (2021లో రజతం), సరిత (2021లో కాంస్యం), మాన్సి (2024లో కాంస్యం) కూడా పతకాలు నెగ్గారు. -
ఆర్చరీ ప్రీమియర్ లీగ్ బ్రాండ్ అంబాసిడర్గా గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
భారత్లో తొలిసారి జరుగనున్న ఆర్చరీ ప్రీమియర్ లీగ్(ఏపీఎల్)కు గ్లోబల్ ఐకాన్ రామ్చరణ్ బ్రాండ్ అంబాసిడర్గా నియమితుడయ్యారు. ఈ విషయాన్ని జాతీయ ఆర్చరీ అసోసియేషన్(ఏఏఐ) గురువారం అధికారికంగా ప్రకటించింది. ఏపీఎల్ అరంగేట్రం ఎడిషన్ న్యూఢిల్లీలోని యమున స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా అక్టోబర్ 2 నుంచి 12వ తేదీ వరకు జరుగనుంది.ఈ లీగ్లో ఆతిథ్య భారత్లోని పురుష, మహిళా కాంపౌండ్, రికర్వ్ ఆర్చర్లతో పాటు వివిధ దేశాల ఆర్చర్లు పోటీ పడనున్నారు. దేశీయ ఆర్చరీకి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంతో పాటు భారత ఒలింపిక్ మూమెంట్ను మరింత ముందుకు తీసుకుపోయే ఉద్దేశంతో ఈ లీగ్ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ లీగ్లో మొత్తం ఆరు ఫ్రాంచైజీలు ఉంటాయి. ఇందులో 36 మంది భారత టాప్ ఆర్చర్లతో పాటు 12 మంది అంతర్జాతీయ ఆర్చర్లు పోటీ పడనున్నారు. ఈ లీగ్ ఫ్లడ్ లైట్ల వెలుతురులో జరుగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా డైనమిక్ ఫార్మాట్ ద్వారా ఆర్చర్లు రికర్వ్, కాంపౌండ్ విభాగాల్లో పోటీ పడతారు. View this post on Instagram A post shared by Archery Premier League (@archerypremierleague)ఏపీఎల్ బ్రాండ్ అంబాసిడర్గా నియమితుడైన సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. ఆర్చరీ అనే క్రీడ క్రమశిక్షణ, ఫోకస్, స్థితిస్థాపకతను కలిగి ఉంటుంది. ఈ కారణంగానే ఏపీఎల్తో బంధం ఏర్పరచుకున్నాను. ఆర్చరీ ప్రీమియర్ లీగ్లో భాగం కావడం గర్వంగా ఉంది. ఈ లీగ్ భారత ఆర్చర్లకు గ్లోబల్ స్పాట్లైట్లో మెరిసే అవకాశం కల్పిస్తుంది. భవిష్యత్ అథ్లెట్లకు స్ఫూర్తిగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నాడు.జాతీయ ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షుడు అర్జున్ ముండా మాట్లాడుతూ.. దేశంలోని మారుమూల గ్రామాల్లో ఉన్న ఆర్చర్లకు ప్రతిభ నిరూపించుకునేందుకు ఏపీఎల్ వేదికగా ఉపయోగపడనుంది. ఈ లీగ్ వారి భవిష్యత్ లక్ష్యాలను ఆవిష్కరించేందుకు తోడ్పడుతుందన్న గట్టి నమ్మకం మాకుంది. ఆర్చరీని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు ఈ లీగ్ దోహదపడుతుంది. రామ్చరణ్ లాంటి స్టార్ హీరో బ్రాండ్ అంబాసీడర్గా ఉండటం వల్ల దేశంలోని చాలా మంది యువత ఆర్చరీ పట్ల ఆకర్షితులయ్యే ఆస్కారం ఉంటుందని అన్నారు.ఏఏఐ ప్రధాన కార్యదర్శి వీరేంద్ర సచ్దేవా మాట్లాడుతూ.. దేశంలోని మిగతా లీగ్ల నుంచి స్ఫూర్తి పొందుతూ ఆర్చరీ లీగ్ను ఏర్పాటు చేశాం. ఏపీఎల్ను ప్రొఫెషనల్ స్థాయికి తగ్గట్లుగా నిర్వహిస్తాం. ఇది కేవలం లీగ్ మాత్రమే కాదు, భారత ఒలింపిక్ స్వప్నాన్ని సాకారం చేసే మెట్టుగా మారనుంది. రామ్చరణ్ బ్రాండ్ అంబాసిడర్ ఉండటం ద్వారా ఈ లీగ్కు ప్రపంచ వ్యాప్తంగా మెరుగైన ఆదరణ లభిస్తుందన్న నమ్మకం ఉందని అన్నారు. -
నిరాశపరిచిన నీరజ్ చోప్రా.. స్వర్ణం గెలిచిన చోట కనీసం కాంస్యం కూడా లేకుండా..!
టోక్యోలో జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ 2025లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా దారుణంగా విఫలమయ్యాడు. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన నీరజ్.. అంచనాలు తలకిందులు చేస్తూ ఎనిమిదో స్థానంతో (84.03 మీటర్లు) ముగించాడు. 2021 ఒలింపిక్స్లో ఇదే ప్లేస్లో (టోక్యో) స్వర్ణం గెలిచిన నీరజ్.. ఈసారి కనీసం కాంస్యం కూడా సాధించలేక ఉసూరుమనిపించాడు. 26 పోటీల తర్వాత నీరజ్ పతక రహితుడిగా మిగలడం ఇదే మొదటిసారి. ఈ పోటీలకు ముందు పాల్గొన్న డైమండ్ లీగ్లో నీరజ్ రెండో స్థానంలో (85.01) నిలిచాడు. ఈ పోటీల్లో ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చెందిన కెషోర్న్ వాల్కాట్కు స్వర్ణం దక్కింది. 2012 ఒలింపిక్స్ ఛాంపియన్ అయిన వాల్కాట్ బల్లాన్ని (జావలిన్) 88.16 మీటర్ల దూరం విసిరాడు. బల్లాన్ని 87.38 మీటర్ల దూరం విసిరిన ఆండర్సన్ పీటర్స్కు (గ్రెనడా) రజతం దక్కింది. కర్టిస్ థామ్సన్కు (యూఎస్ఏ, 86.67) కాంస్యం లభించింది.ఈ పోటీల క్వాలిఫికేషన్లోనే బల్లాన్ని 84.85 మీటర్ల దూరం విసిరిన నీరజ్.. ఫైనల్స్లో అంతకంటే హీన ప్రదర్శన చేసి 84.03 మీటర్ల దూరంతో సరిపెట్టుకున్నాడు.మొదటి ప్రయత్నంలో 83.65 మీటర్లు నమోదు చేసిన నీరజ్.. రెండో ప్రయత్నంలో 84.03 మీటర్లతో స్వల్ప మెరుగుదల చూపించాడు. మూడో త్రో ఫౌల్ అయ్యింది. నాలుగో త్రోలో 82.86 మీటర్లు మాత్రమే వచ్చాయి. ఐదో త్రోలో తడబడి మరోసారి ఫౌల్ చేసిన నీరజ్, పోటీ నుంచి నిష్క్రమించాడు.ఇదే పోటీల్లో భారత్కే చెందిన సచిన్ యాదవ్ నీరజ్ కంటే మెరుగైన ప్రదర్శన చేసి మెప్పించాడు. బల్లాన్ని 86.27 మీటర్ల దూరం విసిరి తృటిలో కాంస్యం (నాలుగో స్థానం) మిస్ అయ్యాడు. ఇదే పోటీలో పాకిస్తాన్కు చెందిన అర్షద్ నదీమ్ నీరజ్ కంటే దారుణమైన ప్రదర్శన (82.75 మీటర్లు) చేసి పదో స్థానంలో నిలిచాడు. -
ఉసేన్ బోల్ట్ నెట్వర్త్ ఎంతో తెలుసా?.. వందల కోట్లు ఉన్నా..
జమైకా ‘చిరుత’ ఉసేన్ బోల్ట్ (Usain Bolt) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఒలింపిక్స్లో తొమ్మిది పసిడి పతకాలు కైవసం చేసుకున్న చరిత్ర అతడిది. 2008 బీజింగ్, 2012 లండన్, 2016 రియో ఒలింపిక్స్లో ఈ అథ్లెట్.. 100 మీ., 200 మీ.. 4*100 మీ. రిలేలలో ఈ మేరకు మెడల్స్ సాధించాడు.క్రికెటర్ కావాలని కలనిజానికి ఉసేన్ బోల్ట్ చిన్ననాటి నుంచి క్రికెటర్ కావాలని కలలు కనేవాడు. ఫాస్ట్ బౌలర్గా నిలదొక్కుకోవాలని ప్రయత్నాలు చేశాడు. అయితే, పాఠశాల స్థాయిలో క్రికెట్ టోర్నీలో ఆడుతున్నపుడు బోల్ట్ను చూసిన ఓ కోచ్.. నీకున్న మెరుపు వేగం అథ్లెట్గా ఎదిగేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు.దీంతో ఆ దిశగా తన ప్రయాణం మొదలుపెట్టిన ఈ జమైకన్.. ప్రపంచంలోని అత్యుత్తమ స్ప్రింటర్లలో ఒకడిగా ఎదిగాడు. అంతేకాదు.. కొంతమంది క్రికెటర్లకూ సాధ్యం కాని విధంగా వందల కోట్లు సంపాదించాడు.అయితే, ఒకప్పటి ఈ ‘చిరుత’.. ఇప్పుడు మెట్లు ఎక్కాలన్నా ఆయాసం వస్తోందంటూ తన ఫిట్నెస్ సమస్యల గురించి చెప్పి మరోసారి వార్తల్లోకి వచ్చాడు. అంతేకాదు.. తాను ఇంట్లోనే ఎక్కువగా ఉంటానని.. పిల్లలతో ఆడుకోవడం, సినిమాలు చూడటం ఇవే తన హాబీలు అని చెప్పాడు. ఈ నేపథ్యంలో ఉసేస్ బోల్ట్ నెట్వర్త్ ఎంత అన్న విషయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.ఒక్క బ్రాండ్ ద్వారానే ఏడాదికి రూ. 75 కోట్లు!రిటైర్మెంట్ తర్వాత కూడా ఉసేన్ బోల్ట్ క్రేజ్ తగ్గలేదు. విశ్వ క్రీడల్లో తన విజయ ప్రస్థానాన్ని అతడు.. వ్యాపార సామ్రాజ్యానికి పునాదిగా మార్చుకున్నాడు. ప్రముఖ బ్రాండ్ పూమా ప్రమోషన్ ద్వారా ఏడాదికే బోల్ట్ రూ. 75 కోట్ల మేర ఆర్జిస్తున్నట్లు సమాచారం.అంతేకాదు.. వీసా, గాటొరేడ్, నిసాన్లకు కూడా అతడు అంబాసిడర్గా ఉన్నాడు. అదే విధంగా.. వివిధ కార్యక్రమాలకు హాజరుకావడం, బ్రాండ్ టై-అప్ల ద్వారా బోల్ట్ బాగానే సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.వ్యాపార రంగంలో..రిటైర్మెంట్ తర్వాత బోల్ట్ వ్యాపార రంగంపై దృష్టి సారించాడు. తనకున్న రెస్టారెంట్ చైన్ ‘ట్రాక్స్ అండ్ రికార్డ్స్’ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించాడు. అంతేకాదు.. బోల్ట్ మొబిలిటీ పేరిట మొదలైన ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీకి అతడు సహ వ్యవస్థాపకుడు కూడా!మొత్తానికి ఇలా రెండు చేతులా సంపాదన పోగేస్తున్న బోల్ట్ నెట్వర్త్.. అక్షరాలా ఏడు వందల యాభై కోట్ల రూపాయలు (రూ. 750 కోట్లు) అని వివిధ నివేదికల ద్వారా వెల్లడవుతోంది.నిరాడంబర జీవితంజమైకాలోని షేర్వుడ్ కంటెంట్లో 1986లో జన్మించిన ఉసేన్ బోల్ట్.. ప్రస్తుతం కింగ్స్టన్లో జీవిస్తున్నాడు. తన సహచరి కేసీ బెనెట్, తమ కుమార్తె ఒలింపియా, కవల కుమారులు థండర్- సెయింట్లతో కలిసి నిరాడంబర జీవితం గడుపుతున్నాడు.చదవండి: రూ. 4 వేల కోట్ల ప్యాలెస్.. 560 కిలోల బంగారం, వెండి రైలు, రథం.. ఇంకా.. -
ప్రధాని మోదీకి మెస్సీ జన్మదిన కానుక
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ జన్మదినం (బుధవారం) సందర్భంగా క్రీడాలోకం శుభాకాంక్షలు తెలిపింది. పలు రంగాలకు చెందిన ప్రముఖులు ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని పుట్టిన రోజు సందర్భంగా... అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ 2022 ఫిఫా ప్రపంచకప్ గెలిచిన జెర్సీని బహుమతిగా పంపించాడు. రెండు మూడు రోజుల్లో మెస్సీ అందించిన జెర్సీని ప్రధానికి బహుకరించనున్నట్లు ప్రమోటర్ సతాద్రు దత్తా వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబర్లో మెస్సీ భారత్లో పర్యటించనున్నాడు. ఇందులో భాగంగా కోల్కతా, ముంబై, ఢిల్లీలో అతడు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నాడు. ‘మెస్సీని కలిసినప్పుడు ప్రధాని 75వ పుట్టిన రోజు రానుందని చెప్పాను. దీంతో అతడు వరల్డ్కప్ విన్నింగ్ జెర్సీపై తన ఆటోగ్రాఫ్ చేసి ప్రధాని నరేంద్ర మోదీకి ఇవ్వాల్సిందిగా నాకు చెప్పాడు’ అని సతాద్రు దత్తా తెలిపారు. మెస్సీ పర్యటనలో భాగంగా... ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసే అవకాశం ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా–2025’ పేరిట మెస్సీ పర్యటన కోల్కతా నుంచి ప్రారంభం కానుంది. 2011లో చివరిసారిగా మెస్సీ భారత్లో పర్యటించాడు. వెనిజులాతో ఫిఫా ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడేందుకు అర్జెంటీనా జట్టు అప్పట్లో కోల్కతాకు వచ్చింది. మరోవైపు ఈ ఏడాది నవంబర్లో అర్జెంటీనా జట్టు ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడేందుకు కేరళాలోపర్యటించనుందని... ఆ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి అబ్దురెహమాన్ వెల్లడించారు. -
వరల్డ్ కప్ ఫైనల్కు మను, సురుచి, ఇషా
న్యూఢిల్లీ: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్కప్ ఫైనల్కు భారత్ నుంచి 8 మంది షూటర్లు అర్హత సాధించారు. ఈ ఏడాది డిసెంబర్ 4 నుంచి 9 వరకు ఖతర్ వేదికగా జరగనున్న ఈ టోర్నీలో మన దేశం నుంచి పారిస్ ఒలింపిక్స్ పతక విజేత మనూ భాకర్తో పాటు మరో ఏడుగురు షూటర్లు బరిలోకి దిగనున్నారు. 12 వ్యక్తిగత ఒలింపిక్ ఈవెంట్లలో ఈ ఏడాది అత్యుత్తమ షూటర్ను నిర్ణయించేందుకు ఈ టోర్నీ నిర్వహిస్తున్నారు. వీటిలో ఐదింట భారత షూటర్లు పోటీపడుతున్నారు. స్టార్ షూటర్ మనూ భాకర్ రెండు విభాగాల్లో వరల్డ్కప్ ఫైనల్కు ఎంపికైంది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్తో పాటు, 25 మీటర్ల విభాగంలో మను పోటీపడనుంది. ఇక ఈ సీజన్లో చక్కటి గురితో మూడు స్వర్ణాలు కైవసం చేసుకున్న టీనేజర్ సురుచి సింగ్ కూడా భారత్ నుంచి బరిలోకి దిగనుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో బ్యూనస్ ఎయిర్స్, లిమా, మ్యూనిక్లలో సురుచి పసిడి పతకాలు ఖాతాలో వేసుకుంది. ఇక ఇటీవల నింగ్బో ప్రపంచకప్లో స్వర్ణంతో మెరిసిన హైదరాబాద్ షూటర్ ఇషా సింగ్ సైతం ఈ టోర్నీలో పాల్గొననుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో ఇషా పోటీపడనుంది. ప్రపంచ మాజీ చాంపియన్ రుద్రాంక్ష్ పాటిల్, అర్జున్ బబూతా పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగానికి ఎంపికయ్యారు. రుద్రాంక్ష్ బ్యూనస్ ఎయిర్స్ వరల్డ్కప్లో స్వర్ణంతో మెరవగా... ఒలింపియన్ అర్జున్ లిమా ప్రపంచకప్లో రజతం గెలుచుకున్నాడు. ఆసియా చాంపియన్, ప్రపంచ రికార్డు హోల్డర్ సిఫ్ట్ కౌర్ సమ్రా... మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్లో, ఒలింపియన్ విజయ్వీర్ సిద్ధూ పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్లో పోటీ పడనున్నారు. సిఫ్ట్ కౌర్ సమ్రా బ్యూనస్ ఎయిర్స్ ప్రపంచకప్లో స్వర్ణం గెలవగా... అదే పోటీలో విజయ్వీర్ పసిడి నెగ్గాడు.మహిళల 25 మీటర్ల విభాగంలో సిమ్రన్ప్రీత్ కౌర్ బ్రార్ కూడా వరల్డ్కప్ ఫైనల్ అవకాశం దక్కించుకుంది. లిమా ప్రపంచకప్లో రజతం నెగ్గడం ద్వారా సిమ్రన్కు ఈ చాన్స్ దక్కింది. వరల్డ్కప్ ఫైనల్లో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించిన వారికి వరుసగా 5000 యూరోలు (రూ. 5 లక్షల 20 వేలు), 4000 యూరోలు (రూ. 4 లక్షల 16 వేలు), 2000 యూరోలు (రూ. 2 లక్షల 8 వేలు) ప్రైజ్మనీగా లభిస్తాయి. ఈ ఏడాది జరిగిన నాలుగు వరల్డ్కప్ వేర్వేరు విభాగాల్లో కలిసి భారత షూటర్లు 22 పతకాలు సాధించింది. అందులో 9 స్వర్ణాలు, 6 రజతాలు, 7 కాంస్యాలు ఉన్నాయి. -
మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్
జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో తెలుగు టైటాన్స్కు ‘హ్యాట్రిక్’ పరాజయం ఎదురైంది. బుధవారం జరిగిన తొలి పోరులో టైటాన్స్ 29–33 పాయింట్ల తేడాతో దబంగ్ ఢిల్లీ చేతిలో ఓడింది. టైటాన్స్కు ఇది వరుసగా మూడో పరాజయం కాగా... ఆడిన ఆరో మ్యాచ్లోనూ గెలిచిన దబంగ్ ఢిల్లీ 12 పాయింట్లతో పట్టిక అగ్రస్థానంలో కొనసాగుతోంది. లీగ్లో భాగంగా వైజాగ్లో ‘హ్యాట్రిక్’ విజయాలు నమోదు చేసుకున్న తెలుగు టైటాన్స్ జట్టు... పోటీలు జైపూర్కు తరలిన తర్వాత ఒక్క మ్యాచ్లోనూ విజయం సాధించలేదు. తాజా పోరులో టైటాన్స్ తరఫున కెప్టెన్ విజయ్ మలిక్ 5 పాయింట్లు సాధించగా... మన్జీత్, అజిత్ పవార్ చెరో 4 పాయింట్లు సాధించారు. మరోవైపు దబంగ్ ఢిల్లీ తరఫున నీరజ్ నర్వాల్ 9 పాయింట్లు సాధించగా... సౌరభ్, ఫజల్ ఐదేసి పాయింట్లతో విజయంలో కీలకపాత్ర పోషించారు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో టైటాన్స్ 13 రెయిడ్ పాయింట్లు సాధించగా... ఢిల్లీ 15 ఖాతాలో వేసుకుంది. ట్యాక్లింగ్లో టైటాన్స్కు 12 పాయింట్లు దక్కగా... ఢిల్లీ 15 పాయింట్లతో ముందంజ వేసింది. తాజా సీజన్లో 8 మ్యాచ్లాడిన టైటాన్స్ 3 విజయాలు, 5 పరాజయాలతో ఆరు పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో 8వ స్థానంలో ఉంది. మరో మ్యాచ్లో హర్యానా స్టీలర్స్ 43–32 పాయింట్ల తేడాతో పట్నా పైరెట్స్పై గెలుపొందింది. హర్యానా తరఫున శివమ్ 15 పాయింట్లతో విజయంలో కీలక పాత్ర పోషించాడు. పట్నా పైరెట్స్ తరఫున అయాన్ 7 పాయింట్లతో పోరాడాడు. లీగ్లో భాగంగా గురువారం జైపూర్ పింక్ పాంథర్స్తో బెంగాల్ వారియర్స్, యు ముంబాతో పుణేరి పల్టన్ ఆడతాయి. -
పతకంపై నీరజ్ గురి
టోక్యో: అంతా అనుకున్నట్లు జరిగితే... ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో ఈరోజు భారత్ పతకాల బోణీ కొట్టనుంది. పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్లో భారత్ నుంచి డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ నీరజ్ చోప్రా, రైజింగ్ స్టార్ సచిన్ యాదవ్ ఫైనల్కు అర్హత సాధించారు. భారత్కే చెందిన మరో ఇద్దరు జావెలిన్ త్రోయర్లు యశ్వీర్ సింగ్, రోహిత్ యాదవ్ ఫైనల్కు చేరుకోలేకపోయారు. 2022 ప్రపంచ చాంపియన్షిప్లో రజత పతకం... 2023 ప్రపంచ చాంపియన్షిప్లో స్వర్ణ పతకం సాధించిన నీరజ్ చోప్రా ‘హ్యాట్రిక్ పతకం’ లక్ష్యంగా నేడు మెడల్ రౌండ్లో బరిలోకి దిగనున్నాడు. బుధవారం జరిగిన జావెలిన్ త్రో క్వాలిఫయింగ్ రౌండ్లో నీరజ్ ఒక్క ప్రయత్నంలోనే ఫైనల్ బెర్త్ను దక్కించుకున్నాడు. క్వాలిఫయింగ్లో ఒక్కో జావెలిన్ త్రోయర్కు మూడు అవకాశాలు ఇస్తారు. జావెలిన్ను కనీసం 84.50 మీటర్ల దూరం విసిరిన వారు లేదా టాప్–12లో నిలిచిన వారు ఫైనల్కు అర్హత పొందుతారు. గ్రూప్ ‘ఎ’లో పోటీపడ్డ నీరజ్ తన మొదటి ప్రయత్నంలోనే జావెలిన్ను 84.85 మీటర్ల దూరం విసిరి ఫైనల్ బెర్త్ను దక్కించుకున్నాడు. గ్రూప్ ‘ఎ’.. గ్రూప్ ‘బి’ నుంచి ఓవరాల్గా ఏడుగురు జావెలిన్ త్రోయర్లు మాత్రమే అర్హత ప్రమాణాన్ని అధిగమించారు. మరో ఐదుగురికి ర్యాంక్ ప్రకారం ఫైనల్ బెర్త్ను కేటాయించారు. అర్హత ప్రమాణాన్ని అధిగమించిన ఏడుగురిలో నీరజ్ చోప్రాతోపాటు ఆండర్సన్ పీటర్స్ (గ్రెనెడా; 89.53 మీటర్లు), జూలియన్ వెబెర్ (జర్మనీ; 87.21 మీటర్లు), జూలియస్ యెగో (కెన్యా; 85.96 మీటర్లు), వెగ్నెర్ (పోలాండ్; 85.67 మీటర్లు), పారిస్ ఒలింపిక్స్ చాంపియన్ అర్షద్ నదీమ్ (పాకిస్తాన్; 85.28 మీటర్లు), కుర్టిస్ థాంప్సన్ (అమెరికా; 84.72 మీటర్లు) ఉన్నారు. ఓవరాల్గా 8 నుంచి 12 స్థానాల్లో నిలిచిన జాకుబ్ వెద్లెచ్ (చెక్ రిపబ్లిక్; 84.11 మీటర్లు), కెషార్న్ వాల్కట్ (ట్రినిడాడ్ అండ్ టొబాగో; 83.93 మీటర్లు), సచిన్ యాదవ్ (భారత్; 83.67 మీటర్లు), కామెరాన్ మెసెన్టైర్ (ఆ్రస్టేలియా; 83.03 మీటర్లు), రుమేశ్ థరంగ (శ్రీలంక; 82.80 మీటర్లు) కూడా ఫైనల్లో చోటు సంపాదించారు.భారత కాలమానం ప్రకారం ఈరోజు మధ్యాహ్నం 3 గంటల 53 నిమిషాల నుంచి పురుషుల జావెలిన్ త్రో ఫైనల్ జరుగుతుంది. మరోవైపు ట్రిపుల్ జంప్ క్వాలిఫయింగ్లో భారత క్రీడాకారులు ప్రవీణ్ చిత్రవేల్ (16.74 మీటర్లు) 15వ స్థానంలో, అబూబకర్ (16.33 మీటర్లు) 24వ స్థానంలో నిలిచారు. 200 మీటర్లలో జాతీయ చాంపియన్ అనిమేశ్ కుజుర్ హీట్స్లోనే వెనుదిరిగాడు. -
తెలంగాణ వెయిట్లిఫ్టింగ్ పేరిట అక్రమాలు
తెలంగాణ వెయిట్లిఫ్టింగ్ సంఘం అధ్యక్షుడు డి.సాయిలు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు సంబంధం లేని వ్యక్తులు నకిలీ పత్రాలు, ఫోర్జరీ సంతకాలతో తమ సంఘాన్ని కబ్జా చేశారని ఆరోపించారు. కోదాడకు చెందిన శ్రుతి అనే మహిళ తమ సంఘం పేరిట అక్రమాలకు పాల్పడుతోందని అన్నారు. తెలంగాణ వెయిట్లిఫ్టింగ్ సంఘంతో సంబంధమే లేని ఆమె.. నకిలీ వెయిట్లిఫ్టింగ్ అసోసియేషన్ను ఏర్పాటు చేసి అక్రమంగా పోటీలను నిర్వహిస్తుందని తెలిపారు. గతంలో వేసిన అడ్హక్ కమిటీకి చైర్మన్గా ఉన్న సుబ్రమణ్యం, వెంకటరమణ, హన్మంత్రాజ్తో కలిసి నిధుల దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు.సభ్యత్వమే లేని సంఘాలకు ఓటు హక్కు కల్పించి, సభ్యత్వం ఉన్న సంఘాల గుర్తింపు రద్దు చేశారని అన్నారు. నకిలీ సంఘాలతో ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. శ్రుతి నడుపుతున్న సంఘంలో పోలీసు, ఐటీ, పోస్టల్ డిపార్ట్మెంట్లకు చెందిన ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. వీరిలో సగం మందికి వారు సభ్యులుగా ఉన్న విషయమే తెలీదని అన్నారు.జాతీయ వెయిట్లిఫ్టింగ్ సంఘంలోని ఓ పెద్ద మనిషి, శాట్లోని ఓ డిప్యూటీ డైరెక్టర్, తెలంగాణ ఒలింపిక్ సంఘం మాజీ కార్యదర్శి జగదీశ్వర్ యాదవ్ అండదండలతో శ్రుతి పేట్రేగిపోతుందని ఆరోపించారు. ఈ విషయాన్ని క్రీడా మంత్రి వాకిటి శ్రీహరి దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు. తెలంగాణ వెయిట్లిఫ్టింగ్ సంఘం పేరిట శ్రుతి చేస్తున్న అక్రమాలపై విజిలెన్స్ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. -
తల్లి కళ్లల్లో ఆనందం.. ఈ విజయం ఎంతో ప్రత్యేకం!
సమర్కండ్ (ఉజ్బెకిస్తాన్): క్లిష్టంగా గడుస్తున్న ఈ సంవత్సరంలో తాజా ఫిడే గ్రాండ్ స్విస్ టైటిల్ కొత్త ఉత్సాహాన్నిచ్చిందని భారత గ్రాండ్మాస్టర్ వైశాలి రమేశ్బాబు తెలిపింది. తాను మరింత మెరుగయ్యేందుకు, రాణించేందుకు ఇది ఔషధంలా పనిచేస్తుందని చెప్పింది. మహిళల ఎలైట్ ఈవెంట్లో వరుసగా రెండుసార్లు విజేతగా నిలిచిన తొలి భారత క్రీడాకారిణిగా ఆమె ఘనత వహించింది. 24 ఏళ్ల ఈ చెన్నై గ్రాండ్మాస్టర్ వచ్చే ఏడాది క్యాండిడేట్స్ టోర్నీకి సైతం అర్హత సాధించిన సంగతి తెలిసిందే. నాకెన్నో గుణపాఠాలు నేర్పాయి‘గత విజయంతో పోల్చుకుంటే ఇది ముమ్మాటికి కఠినమైంది. 2023లో నేను ఫామ్లో ఉన్నాను. నిలకడగా విజయాలు సాధిస్తున్న సమయంలో గ్రాండ్ స్విస్ టైటిల్ గెలవడం ఏమంత కష్టం కాలేదు. కానీ ఇప్పుడు అంతా సులువుగా రాలేదు. నేను ఎప్పట్లాగే కష్టపడుతున్నప్పటికీ ఈ ఏడాది ఫలితాలు మాత్రం తీవ్రంగా నిరాశపరుస్తూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో లభించిన టైటిల్ నన్ను మార్చింది. చాలా టోర్నీలలో ఆడటం ద్వారా గత రెండేళ్లుగా ఎంతో అనుభవాన్ని గడించా. అయితే గతేడాది క్యాండిడేట్స్ టోర్నీలో వరుసగా నాలుగు గేమ్లు ఓడిపోవడం, ఆ తర్వాత మింగుడుపడని ఫలితాలు నాకెన్నో గుణపాఠాలు నేర్పాయి. నేనొక ప్లేయర్గా మరింత బాగా ఆడేందుకు, ఓ వ్యక్తిగా దృఢంగా తయారయ్యేందుకు దోహదం చేశాయి’ అని వైశాలి పేర్కొంది. ఈ ఏడాది సొంతగడ్డపై జరిగిన చెన్నై గ్రాండ్మాస్టర్స్ టోర్నమెంట్లో తొమ్మిది రౌండ్ల పాటు వరుస వైఫల్యాలతో కేవలం 1.5 పాయింట్లే సాధించడం, మహిళల ప్రపంచకప్లో క్వార్టర్ ఫైనల్లో తన్ జొంగ్జీ (చైనా) చేతిలో ఓడిపోవడం వైశాలిని కుంగుదీసింది. తల్లి కళ్లల్లో ఆనందం‘చెన్నై టోర్నీలో ఏకంగా ఏడు గేముల్లో ఓడాను. ఇంకా చెప్పాలంటే ఓ వారమంతా ఓటములతోనే గడిచిపోయింది. అప్పుడు ఏదోలా అనిపించింది. మంచో చెడో కూడా అర్థమయ్యేది కాదు. కానీ గెలిస్తే నన్ను ఎవరు ఆపలేరనే ఆత్మవిశ్వాసం లభిస్తుంది. అదే ఇప్పుడు జరిగింది’ అని వైశాలి వివరించింది. ఇక ఫిడే గ్రాండ్ స్విస్ టైటిల్ గెలిచిన తర్వాత తల్లి నాగలక్ష్మి, తమ్ముడు ప్రజ్ఞానందతో కలిసి వైశాలి సంబరాన్ని పంచుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Pride, love, and a mother’s touch ❤️🇮🇳 Vaishali Rameshbabu, her mother Nagalakshmi, and her brother Praggnanandhaa R.#FIDEGrandSwiss @chessvaishali pic.twitter.com/NIYX5I3fs8— International Chess Federation (@FIDE_chess) September 16, 2025 -
వారియర్స్ విక్టరీ
జైపూర్: వైఫల్యాలతో సతమతమవుతున్న మాజీ చాంపియన్ బెంగాల్ వారియర్స్... ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్లో ఎట్టకేలకు గెలుపుబాట పట్టింది. మంగళవారం జరిగిన పోరులో 41–37తో యూపీ యోధాస్పై గెలుపొందింది. 2019 సీజన్ చాంపియన్ వారియర్స్ నాలుగు వరుస పరాజయాల తర్వాత మళ్లీ విజయం సాధించింది. ఆరు మ్యాచ్లాడిన బెంగాల్కు ఇది రెండో విజయం మాత్రమే! ఈ మ్యాచ్లో వారియర్స్ కెపె్టన్ దేవాంక్ (17 పాయింట్లు) తనదైన శైలిలో రాణించాడు. మిగతా వారిలో ఆశిష్ (6), మన్ప్రీత్ (5), పార్థిక్ (3) మెరుగ్గా ఆడారు. యూపీ తరఫున రెయిడర్లు గగన్ గౌడ (7), గుమన్ సింగ్ (5), డిఫెండర్లు అçశు సింగ్, హితేశ్ చెరో 4 పాయింట్లు స్కోరు చేశారు. రెండో మ్యాచ్లో తమిళ్ తలైవాస్ 35–29తో బెంగళూరు బుల్స్పై నెగ్గింది. తమిళ్ తరఫున అర్జున్ (13), నరేందర్ (5), రోనక్ (4) బాగా ఆడారు. నేడు జరిగే పోటీల్లో తెలుగు టైటాన్స్తో దబంగ్ ఢిల్లీ, హరియాణా స్టీలర్స్తో పట్నా పైరేట్స్ తలపడతాయి. -
'స్ప్రింట్ క్వీన్' పరుగు ఆగింది
3 ఒలింపిక్ స్వర్ణాలు... 10 ప్రపంచ చాంపియన్షిప్ స్వర్ణాలు... డైమండ్ లీగ్ ఫైనల్స్లో 5 సార్లు విజేత... ‘పాకెట్ రాకెట్’ అథ్లెట్ షెల్లీ ఆన్ ఫ్రేజర్ అసాధారణ ఘనతల్లో ఇవి కొన్ని... సుదీర్ఘ కాలం మహిళల స్ప్రింట్స్లో మెరుపులా వెలిగిన షెల్లీ వరల్డ్ చాంపియన్షిప్తో ఆట నుంచి తప్పుకుంది... రెండు దశాబ్దాల అసాధారణ అథ్లెటిక్స్ కెరీర్లో ఎన్నో రికార్డులు సృష్టించి ‘ఆల్టైమ్ గ్రేట్’గా నిలిచిన ఆమె టోక్యోలో జరుగుతున్న ప్రపంచ చాంపియన్షిప్లో చివరిసారి బరిలోకి దిగి ట్రాక్కు గుడ్బై చెప్పింది... గత పారిస్ ఒలింపిక్స్లో గాయం తర్వాతే ట్రాక్కు దూరమవ్వాలని భావించినా... అభిమానుల కోసం ఆగిన షెల్లీ చివరకు వీడ్కోలు పలికింది. – సాక్షి క్రీడా విభాగంసరిగ్గా 18 ఏళ్ల క్రితం జపాన్లోనే షెల్లీ ఆన్ విజయ ప్రస్థానం మొదలైంది. ఒసాకాలో జరిగిన ప్రపంచ చాంపియన్షిప్లో జమైకా 4–100 మీటర్ల రిలే టీమ్ సభ్యురాలిగా రజతం సాధించడంతో ఆమె కెరీర్లో తొలి పతకాన్ని అందుకుంది. ఆ తర్వాత శిఖరాలకు చేరిన షెల్లీ ఇప్పుడు తన కెరీర్లో ఆఖరి రేసులో పాల్గొని జపాన్లోనే ముగించడం విశేషం. తన ప్రధాన ఈవెంట్, ట్రాక్ చరిత్రలో అత్యుత్తమ అథ్లెట్లలో ఒకరిగా గుర్తింపునిచ్చిన 100 మీటర్ల పరుగులో పాల్గొన్న ఆమె ఆరో స్థానంతో ముగించింది. అయితే 38 ఏళ్ల వయసులో ఇలాంటి ప్రదర్శన ఇవ్వడం సాధారణ విషయమేమీ కాదు. ట్రాక్ అండ్ ఫీల్డ్ ప్రపంచంలో రెండు అత్యుత్తమ వేదికలు ఒలింపిక్స్ (మొత్తం 8 పతకాలు), వరల్డ్ చాంపియన్షిప్ (మొత్తం 16 పతకాలు) కలిపి ఓవరాల్గా 24 పతకాలతో షెల్లీ తనకంటూ ప్రత్యేక చరిత్ర సృష్టించుకుంది. బోల్ట్కు దీటుగా... దశాబ్ద కాలం పాటు మహిళల విభాగంలో ట్రాక్ను షెల్లీ శాసించింది. కరీబియన్ దేశాల తరఫున ఒలింపిక్ స్వర్ణం గెలిచిన తొలి మహిళగా నిలిచిన ఆమె, ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా గుర్తింపు పొందిన 276 రేస్లలో పాల్గొని అథ్లెటిక్స్ అభిమానులకు చేరువైంది. కెరీర్లో రంగురంగుల హెయిర్ స్టయిల్లతో బరిలోకి దిగుతూ ఆటతో పాటు ఇతరత్రా కూడా అనేక ఆకర్షణలు ప్రదర్శించిన ఆమె టోక్యోలో తన ఆఖరి రేసులో కూడా జమైకా జాతీయ రంగులు ఆకుపచ్చ, పసుపు కలగలిపిన జుట్టు, నెయిల్ పాలిష్తో బరిలోకి దిగి అలరించింది. అద్భుతమైన ప్రదర్శనల తర్వాత కొన్నిసార్లు వెనుకబడినా... కోలుకొని షెల్లీ మళ్లీ పైకెగసిన తీరు, తాను అనుకున్న విధంగా కెరీర్ను ముగించడం యువ మహిళా అథ్లెట్లకు ప్రేరణగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. జమైకాకే చెందిన అథ్లెటిక్స్ దిగ్గజం బోల్ట్ తన పరుగుతో ప్రపంచాన్ని ఊపేస్తున్న సమయంలోనే షెల్లీ అంతర్జాతీయ ప్రస్థానం కూడా సాగింది. బోల్ట్కు సమాంతరంగా పత కాలు గెలవడంతో పాటు తనకంటూ జమైకా స్టార్గా ప్రత్యేక అధ్యాయాన్ని రచించుకోవడంలో సఫలమైంది. మూడు సార్లూ పతకాలతో... కనీస సౌకర్యాలు కూడా కరువైన పేద కుటుంబంతో పుట్టిన షెల్లీ చిన్నతనంలోనే తండ్రి దూరమయ్యాడు. ఇద్దరు సోదరులతో పాటు ఆమె తల్లి వీధిలో చిన్న చిన్న వస్తువులు అమ్మేది. అలాంటి నేపథ్యం నుంచి వచ్చి ఈ స్థాయికి ఎదగడం షెల్లీ ఘనతకు తార్కాణం. కోచ్ల మాటల చెప్పాలంటే అథ్లెటిక్స్లో సహజ ప్రతిభతో ఆమె దూసుకుపోగలిగింది. పాఠశాల స్థాయిలోనే ఆమె పరుగు అందరి దృష్టినీ ఆకర్షించిన తర్వాత వేర్వేరు దశల్లో వరుసగా సత్తా చాటుతూ తనను తాను రుజువు చేసుకుంది. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో 100 మీటర్ల పరుగులో పాల్గొన్నప్పుడు ఫైనల్కు చేరితే చాలని అనుకుంది. ఎలాంటి అంచనాలు లేకపోవడమే ఆమెకు మేలు చేసింది. ఎదురు లేకుండా దూసుకుపోయి స్వర్ణం సాధించడంతో షెల్లీ పేరు మారుమ్రోగిపోయింది. 2012 లండన్ ఒలింపిక్స్ వచ్చేసరికి ఆమె అప్పటికే స్టార్గా మారిపోయింది. గత కాలపు దిగ్గజం ఫ్లారెన్స్ గ్రిఫిత్ జాయ్నర్ సరసన ఆమెను చేర్చి అంతా ఆమె ప్రదర్శన కోసం ఎదురు చూశారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ షెల్లీ మరో పసిడిని గెలుచుకుంది. 2016 రియో ఒలింపిక్స్లో సెమీఫైనల్ తర్వాతే కాలి గాయం ఇబ్బంది పెట్టడంతో చివరకు కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే రిలేలో జమైకా జట్టుకు రజతం అందిచింది. పునరాగమనం ఘనంగా... రియో ఒలింపిక్స్ తర్వాత కెరీర్ మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా బిజీ అయింది. 2017లో కొడుకు పుట్టిన తర్వాత తన ప్రాధాన్యతలు మారిపోయాయని ఆమె చెప్పుకుంది. ఆమె ఆటకు గుడ్బై చెప్పినట్లేనని అంతా భావించారు. అయితే ‘మామీ రాకెట్’గా కొత్త గుర్తింపు తెచ్చుకున్న తర్వాత కూడా ట్రాక్పై షెల్లీ జోరు సాగింది. సిజేరియన్ ఆపరేషన్ తర్వాత మూడు నెలల పాటు ప్రత్యేకంగా ఫిట్నెస్పై దృష్టి పెట్టి ఫ్రేజర్ పునరాగమనం చేసింది. అమ్మగా మారిన తర్వాత కూడా వరల్డ్ చాంపియన్షిప్లో ఏకంగా 3 స్వర్ణాలు, 3 రజతాలు, మరో కాంస్యం గెలవడం ఆమె సత్తాకు నిదర్శనం. 2020 టోక్యో ఒలింపిక్స్లో కూడా 100 మీటర్ల పరుగులో రజతాన్ని సాధించి తనలో పదును తగ్గలేదని నిరూపించింది. 2024 పారిస్ ఒలింపిక్స్లో 200 మీటర్లకు దూరంగా ఉంటానని ముందే చెప్పిన ఆమె... 100 మీటర్లలలో పతకం గెలిచి తప్పుకోవాలని భావించింది. అయితే అనూహ్యంగా గాయంతో సెమీస్కు ముందు తప్పుకోవాల్సి వచ్చింది. దాంతో రిటైర్మెంట్ను ఏడాది పాటు వాయిదా వేసి షెల్లీ ఇప్పుడు నిష్క్రమించింది. తాను సంతృప్తిగా తప్పుకుంటున్నానని, ఇన్ని ఘనతల తర్వాత ఎలాంటి చింతా లేదని ఈ జమైకా స్టార్ వ్యాఖ్యానించింది.‘అమ్మ’గా గెలిచి...కొన్నాళ్ల క్రితం షెల్లీ కొడుకు, ఎనిమిదేళ్ల జ్యోన్ ఆమె వద్దకు వచ్చి... ‘అమ్మా...మా స్కూల్లో స్టూడెంట్స్ తల్లుల కోసం పరుగు పందెం పెడుతున్నారు. నువ్వు తప్పనిసరిగా పాల్గొనాల్సిందే’ అని కోరాడు. తాను ఇందులో పాల్గొనడం ఏమిటి అని సందేహించినా కొడుకు మీద ప్రేమతో కాదనలేకపోయింది. వరల్డ్ చాంపియన్ పోటీలో ఉంటే తిరుగేముంది! రేసు మొదలు కాగానే సహజంగానే ఎవరికీ అందనంత వేగంతో షెల్లీ దూసుకుపోయి విజేతగా నిలిచింది. ఆ గెలుపులో బిడ్డ ఆనందం చూసి మురిసిపోయింది. ‘వాళ్లు నన్ను అనుమతిస్తారనే అసలు అనుకోలేదు. అయినా వారికీ అవకాశం ఉందని ఇతర పిల్లలు తల్లులు భావించడమే నాకు అమితాశ్చర్యం కలిగించింది’ అని ఆమె చెప్పింది. -
27 నిమిషాల్లోనే...
షెన్జెన్: చైనా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ పీవీ సింధు శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 18వ ర్యాంకర్ సింధు 21–5, 21–10తో ప్రపంచ 44వ ర్యాంకర్ జూలీ దవాల్ జేకబ్సన్ (డెన్మార్క్)పై గెలిచింది. కేవలం 27 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్లో సింధుకు ఏ దశలోనూ ప్రత్యర్థి నుంచి ఇబ్బంది ఎదురుకాలేదు. తొలి గేమ్ ఆరంభంలో సింధు చెలరేగి వరుసగా 12 పాయింట్లు నెగ్గడం విశేషం. ఈ గెలుపుతో ఈ సీజన్లో స్విస్ ఓపెన్ తొలి రౌండ్లో జూలీ చేతిలో ఎదురైన ఓటమికి సింధు బదులు తీర్చుకుంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ పోర్న్పవీ చోచువోంగ్ (థాయ్లాండ్)తో సింధు ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 6–5తో ఆధిక్యంలో ఉంది. మరోవైపు పురుషుల సింగిల్స్లో భారత రైజింగ్ స్టార్ ఆయుశ్ శెట్టికి నిరాశ ఎదురైంది. తొలి రౌండ్లో ఆయుశ్ 19–21, 21–12, 16–21తో ప్రపంచ ఐదో ర్యాంకర్ చౌ టియెన్ చౌ (చైనీస్ తైపీ) చేతిలో పోరాడి ఓడిపోయాడు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో గద్దె రుతి్వక శివాని–రోహన్ కపూర్ (భారత్) జోడీ 17–21, 11–21తో యుచి షిమోగామి–సయాక హొబారా (జపాన్) జంట చేతిలో పరాజయం పాలైంది. కెరీర్ బెస్ట్ ర్యాంక్లో... గతవారం హాంకాంగ్ ఓపెన్లో క్వార్టర్ ఫైనల్ చేరిన ఆయుశ్ మంగళవారం విడుదలైన ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ర్యాంకింగ్స్లో కెరీర్ బెస్ట్ ర్యాంక్ను అందుకున్నాడు. నాలుగు స్థానాలు ఎగబాకిన ఆయుశ్ 27వ ర్యాంక్లో నిలిచాడు. హాంకాంగ్ ఓపెన్లో రన్నరప్గా నిలిచిన లక్ష్య సేన్ మూడు స్థానాలు మెరుగుపర్చుకొని 17వ ర్యాంక్కు చేరుకున్నాడు. -
సర్వేశ్కు ఆరో స్థానం
టోక్యో: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత హైజంపర్ సర్వేశ్ కుశారే తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఫైనల్లో 30 ఏళ్ల సర్వేశ్ ఆరో ప్రయత్నంలో 2.28 మీటర్ల ఎత్తును అధిగమించాడు. ఈ క్రమంలో 2.27 మీటర్లతో 2022లో నమోదు చేసిన తన అత్యుత్తమ ప్రదర్శనను సవరించాడు. అనంతరం 2.31 మీటర్ల ఎత్తును అధిగమించేందుకు సర్వేశ్ మూడుసార్లు యత్నించి విఫలమవ్వడంతో అతనికి ఆరో స్థానం దక్కింది. హమీష్ కెర్ (న్యూజిలాండ్; 2.36 మీటర్లు)... సాంగ్హైక్ వూ (దక్షిణ కొరియా; 2.34 మీటర్లు), జాన్ స్టెఫెలా (చెక్ రిపబ్లిక్; 2.31 మీటర్లు) వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు గెలిచారు. భారత అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్లో ఈరోజు క్వాలిఫయింగ్ రౌండ్ జరగనుంది. గ్రూప్ ‘ఎ’లో డిఫెండింగ్ చాంపియన్ నీరజ్ చోప్రా (భారత్), సచిన్ యాదవ్ (భారత్) ... గ్రూప్ ‘బి’లో భారత్ నుంచి మరో ఇద్దరు (రోహిత్ యాదవ్, యశ్వీర్ సింగ్) జావెలిన్ త్రోయర్లు బరిలో ఉన్నారు. ఫైనల్లో చోటు సంపాదించేందుకు 84.50 మీటర్లను కనీస అర్హత ప్రమాణంగా నిర్ణయించారు. -
చరిత్రలో భారత్కు తొలి స్వర్ణం
స్పీడ్ స్కేటింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్లో భారత్కు తొలి స్వర్ణం దక్కింది. చైనాలో జరుగుతున్న 2025 ఎడిషన్లో తమిళనాడుకు చెందిన 22 ఏళ్ల యువ స్కేటర్ ఆనంద్కుమార్ వేల్కుమార్ భారత్కు ఈ అపురూప గౌరవాన్ని అందించాడు. 1000 మీటర్ల సీనియర్ స్ప్రింట్లో ఆనంద్కుమార్ వేల్కుమార్ 1:24.924 సెకన్ల టైమింగ్తో రేసును పూర్తి చేసి స్పీడ్ స్కేటింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్ చరిత్రలో భారత్కు తొలి స్వర్ణ పతకం సాధించి పెట్టాడు.ఇదే టోర్నీలో ఆనంద్కుమార్ 500 మీటర్ల స్ప్రింట్లో కాంస్య పతకం సాధించాడు. ఈ టోర్నీలో ఆనంద్కుమార్ సాధించిన విజయాలు భారతదేశంలో స్పీడ్ స్కేటింగ్కు కొత్త దిశను చూపించాయి. ఇప్పటివరకు అంతర్జాతీయ స్థాయిలో ఈ క్రీడలో భారత్కు పెద్దగా గుర్తింపు లేదు.ఆనంద్కుమార్ స్వర్ణం సాధించిన అనంతరం ప్రపంచం దృష్టి భారత్పై పడింది. అతని విజయాలు యూరప్, లాటిన్ అమెరికా, ఈస్ట్ ఆసియా ఆధిపత్యాన్ని ఛాలెంజ్ చేస్తూ, భారత రోలర్ స్పోర్ట్స్కు విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చాయి.ఆనంద్కుమార్కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. అతని విజయాలు దేశానికి గర్వకారణమని అన్నారు. ఆనంద్కుమార్ అంకితభావం, శ్రమ భారత యువతకు స్ఫూర్తిదాయకమని ఎక్స్ ద్వారా తెలిపారు.జూనియర్ విభాగంలో కృష్ శర్మకు స్వర్ణంస్పీడ్ స్కేటింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్లో జూనియర్ విభాగంలోనూ భారత్కు స్వర్ణం దక్కింది. క్రిష్ శర్మ 1000 మీటర్ల స్ప్రింట్లో భారత్కు తొలి గోల్డ్ మెడల్ అందించాడు. -
ఒకప్పుడు ‘చిరుత’.. ఇప్పుడు మెట్లు ఎక్కాలన్నా ఆయాసమే!
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు..! ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుతాయి.. జమైకా ‘చిరుత’ ఉసేన్ బోల్ట్ (Usain Bolt) పరిస్థితే ఇందుకు ఓ ఉదాహరణ. ఒకప్పుడు మెరుపు వేగంతో పరిగెత్తి రికార్డులు కొల్లగొట్టిన ఈ అథ్లెట్.. ఇప్పుడు పట్టుమని పది మెట్లు ఎక్కడానికి కూడా ఆయాసపడుతున్నాడట.తొమ్మిది స్వర్ణాలుఉసేన్ బోల్టే స్వయంగా ఈ విషయాన్ని చెప్పాడు. 100 మీ., 200 మీ.. 4*100 మీ రిలేలలో మూడు ఒలింపిక్స్లో మూడేసి చొప్పున తొమ్మిది స్వర్ణాలు గెలిచిన ఘనత ఉసేన్ బోల్ట్ది. 2008 బీజింగ్ ఒలింపిక్స్, 2012 లండన్ ఒలింపిక్స్, 2016 రియో ఒలింపిక్స్లో బోల్ట్ ఈ మేరకు పతకాలు గెలుచుకున్నాడు.అయితే, అనూహ్య రీతిలో 2017లో బోల్ట్ అథ్లెటిక్ ప్రయాణం అర్ధంతరంగా ముగిసిపోయింది. ఆ ఏడాది వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో 4*100 మీ రిలేలో పాల్గొన్న బోల్ట్.. కండరాలు పట్టేయడంతో సగం దూరంలోనే కుప్పకూలిపోయాడు. అథ్లెటిక్స్ ట్రాక్పై బోల్ట్ అద్భుత ప్రయాణం చివరకు అలా ముగిసిపోయింది.నాకేమీ పనిలేదుఇక బోల్ట్ ఇప్పుడు తన కుటుంబంతోనే ఎక్కువగా సమయం గడుపుతున్నాడు. ది గార్డియన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘పిల్లలు స్కూల్కు వెళ్లే సమయంలో.. వారిని చూసేందుకు నిద్రలేస్తాను. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తా.నిజానికి చేయడానికి నాకేమీ పనిలేదు. అలా చిల్ అవుతూ ఉంటా అంతే!.. కొన్నిసార్లు వర్కౌట్లు చేస్తుంటా. మూడ్ బాగుంటే వెబ్ సిరీస్లు చూస్తూ ఉంటా. పిల్లలు వచ్చేంత వరకు ఇలా టైమ్పాస్ చేస్తా.ఇంట్లోనే సినిమాలు చూస్తాఆ తర్వాత సమయమంతా వాళ్లతోనే.. నాపై విసుగు వచ్చేంత వరకు వారితో ఆడుతూనే ఉంటా. ఆ తర్వాత ఇంట్లోనే సినిమాలు చూస్తా. ఇక జిమ్లోనే ఎక్కువగా వర్కౌట్లు చేస్తా. కానీ అదైతే నాకు పెద్దగా ఇష్టం ఉండదు.ఆయాస పడుతున్నాకాకపోతే తప్పక వర్కౌట్లు చేస్తా. నిజానికి నేను రన్నింగ్ మొదలుపెట్టాలని అనుకుంటున్నా. ఎందుకంటే.. మెట్లు ఎక్కేటపుడు శ్వాస సరిపోవడం లేదు. ఆయాస పడుతున్నా. అందుకే ఇకపై మరింత శ్రద్ధగా వర్కౌట్లు చేసి నా బ్రీత్ను సరి చేసుకుంటా’’ అని ఉసేన్ బోల్ట్ చెప్పుకొచ్చాడు.కాగా జమైకన్ ఇన్ఫ్లూయెన్సర్ కాసీ బెనెట్తో చాన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నాడు 39 ఏళ్ల బోల్ట్. ఆమె ద్వారా.. అతడికి కూతురు ఒలింపియా (2020), కవల కుమారులు థండర్- సెయింట్ (2021) కలిగారు.చదవండి: టీమిండియా ‘బిగ్ లూజర్’ అంటూ కామెంట్లు?.. పాక్ మీడియాపై పాంటింగ్ ఫైర్ -
ఇంగ్లండ్లో భారత్–పాక్ మ్యాచ్లు
లుసానే: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) హాకీ ప్రొ లీగ్ కొత్త సీజన్ ఈ డిసెంబర్లోనే మొదలవుతుంది. 2025–26కు సంబంధించిన ప్రొ లీగ్ డిసెంబర్ 9 నుంచి అర్జెంటీనా, ఐర్లాండ్లలో జరుగుతుందని హాకీ వర్గాలు తెలిపాయి. ఈ సీజన్లో ఐర్లాండ్ మహిళల జట్టు, పాకిస్తాన్ పురుషుల జట్టు కొత్తగా చేరుతున్నాయి. ఈ రెండు జట్లు నేషన్స్ కప్ హాకీ టోర్నమెంట్ నుంచి అర్హత సాధించినట్లు ఎఫ్ఐహెచ్ తెలిపింది. వచ్చే సీజన్ మొత్తం 10 దేశాల్లో జరుగనుంది. రికార్డుస్థాయిలో 144 మ్యాచ్లు నిర్వహించనున్నారు. భారత్లో ఫిబ్రవరి 10 నుంచి 15 వరకు జరుగుతాయి. భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జూన్ 23 నుంచి 28 మధ్య ఇంగ్లండ్ వేదికగా రెండు మ్యాచ్లు జరుగుతాయి. ఈ లీగ్లో విజేతగా నిలిచిన జట్లు 2028 ఒలింపిక్స్కు అర్హత సాధిస్తాయి. డిసెంబర్ 9న జరిగే పురుషుల ఈవెంట్ తొలి మ్యాచ్లో జర్మనీతో బెల్జియం తలపడుతుంది. దీంతో పాటు ఇంగ్లండ్ ఆడే మ్యాచ్లు కూడా ఐర్లాండ్లోనే జరుగుతాయి. అదే రోజు అర్జెంటీనాలో జరిగే మ్యాచ్లో ప్రస్తుత చాంపియన్ నెదర్లాండ్స్తో పాకిస్తాన్ ఢీకొంటుంది. అనంతరం చైనా, స్పెయిన్, ఆ్రస్టేలియా, భారత్, ఇంగ్లండ్, నెదర్లాండ్స్, బెల్జియం, జర్మనీలలో జూన్ 28 వరకు లీగ్ దశ మ్యాచ్లే జరుగుతాయి. -
డుప్లాంటిస్... ప్రపంచ రికార్డు నంబర్ 14
ఊహించిన అద్భుతమే జరిగింది. పోల్ వాల్ట్లో మరోసారి ప్రపంచ రికార్డు బద్దలయింది. మారింది వేదిక మాత్రమే... ప్రపంచ రికార్డు సృష్టించిన వ్యక్తి మాత్రం మారలేదు... వరల్డ్ రికార్డు నెలకొల్పడం... మళ్లీ దానిని సవరించడం... తన ఖాతాలో పసిడి పతకం వేసుకోవడం... సమీప ప్రత్యర్థులను రెండో స్థానానికే పరిమితం చేయడం... పోల్ వాల్ట్ క్రీడాంశం పేరు చెబితే తనను తప్పనిసరిగా గుర్తు చేసుకునేలా రోజురోజుకూ రాటుదేలుతూ దూసుకుపోతున్న ఆ అథ్లెట్ ఎవరో కాదు... స్వీడన్ స్టార్ అర్మాండో డుప్లాంటిస్... బరిలో దిగితే ప్రపంచ రికార్డుపైనే గురి పెట్టే ఈ సూపర్ స్టార్ పోల్ వాల్టర్ సోమవారం టోక్యోలో మెరిశాడు. కళ్లు చెదిరే ప్రదర్శనతో తన ఖాతాలో 14వ ప్రపంచ రికార్డు వేసుకోవడంతోపాటు... ప్రపంచ చాంపియన్షిప్ చరిత్రలో వరుసగా మూడు స్వర్ణాలు సాధించి... ఈ క్రీడాంశంలో దిగ్గజం సెర్గీ బుబ్కా సరసన డుప్లాంటిస్ చేరాడు. టోక్యో: అథ్లెటిక్స్ అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూసిన పురుషుల పోల్ వాల్ట్ ఈవెంట్లో ప్రపంచ, ఒలింపిక్ చాంపియన్ అర్మాండో డుప్లాంటిస్ అలరించాడు. సోమవారం జరిగిన ఫైనల్లో స్వీడన్కు చెందిన 25 ఏళ్ల డుప్లాంటిస్ కొత్త ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 6.30 మీటర్ల ఎత్తుకు ఎగిరిన డుప్లాంటిస్ తన కెరీర్లో 14వ సారి ప్రపంచ రికార్డును లిఖించాడు. గత నెలలో హంగేరి రాజధాని బుడాపెస్ట్లో జరిగిన మీట్లో 6.29 మీటర్లతో తానే నెలకొలి్పన ప్రపంచ రికార్డును డుప్లాంటిస్ సవరించాడు. విజేతగా నిలిచిన డుప్లాంటిస్కు 70 వేల డాలర్లు (రూ. 61 లక్షల 68 వేలు) ప్రైజ్మనీగా, ప్రపంచ రికార్డు సృష్టించినందుకు లక్ష డాలర్లు (రూ. 88 లక్షల 12 వేలు) బోనస్గా లభించాయి. 12 మంది పోటీపడ్డ ఫైనల్లో డుప్లాంటిస్ తన ఆరో ప్రయత్నంలో 6.15 మీటర్ల ఎత్తును అధిగమించి స్వర్ణ పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. కరాలిస్ (గ్రీస్; 6 మీటర్లు) రజత పతకం నెగ్గగా... కురి్టస్ మార్షల్ (ఆ్రస్టేలియా; 5.95 మీటర్లు) కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. పసిడి పతకం ఖాయమయ్యాక డుప్లాంటిస్ ప్రపంచ రికార్డుపై గురి పెట్టాడు. తొలి రెండు ప్రయత్నాల్లో 6.30 మీటర్ల ఎత్తును అధిగమించడంలో విఫలమైన డుప్లాంటిస్ మూడో ప్రయత్నంలో సఫలమై ప్రపంచ రికార్డును అందుకున్నాడు. డుప్లాంటిస్ కెరీర్లో ఇది వరుసగా 49వ విజయంకాగా... మేజర్ టోరీ్నల్లో ఐదో టైటిల్. టోక్యో ఒలింపిక్స్, పారిస్ ఒలింపిక్స్లో స్వర్ణ పతకాలు గెలిచిన డుప్లాంటిస్.. 2022 ప్రపంచ చాంపియన్íÙప్లో, 2023 ప్రపంచ చాంపియన్షిప్లో బంగారు పతకాలు సాధించాడు. తాజా విజయంతో డుప్లాంటిస్ ప్రపంచ చాంపియన్íÙప్లో ‘హ్యాట్రిక్’ స్వర్ణాలను సొంతం చేసుకున్నాడు. సెర్గీ బుబ్కా తర్వాత వరుసగా మూడు ప్రపంచ చాంపియన్íÙప్లలో బంగారు పతకాలు గెలిచిన రెండో పోల్ వాల్టర్గా డుప్లాంటిస్ గుర్తింపు పొందాడు. సెర్గీ బుబ్కా (సోవియట్ యూనియన్/ఉక్రెయిన్) వరుసగా ఆరు ప్రపంచ చాంపియన్íÙప్లలో (1983, 1987, 1991, 1993, 1995, 1997) స్వర్ణ పతకాలు సాధించాడు. -
ఉత్కంఠపోరులో తెలుగు టైటాన్స్ ఓటమి..
జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్–12)లో తెలుగు టైటాన్స్కు బెంగళూరు బుల్స్ చేతిలో పరాజయం ఎదురైంది. సోమవారం జరిగిన హోరాహోరీ మ్యాచ్లో బెంగళూరు 34–32 పాయింట్ల తేడాతో టైటాన్స్పై గెలుపొందింది. మ్యాచ్ ముగిసే దశలో అనూహ్యంగా ఆధిక్యాన్ని కోల్పోయిన తెలుగు టైటాన్స్ చివరకు 2 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. టైటాన్స్ జట్టులో ఆల్రౌండర్లు భరత్, కెపె్టన్ విజయ్ మలిక్ అదరగొట్టారు. 19 సార్లు కూతకెళ్లిన భరత్ 13 పాయింట్లు తెచ్చిపెట్టాడు. 18 సార్లు రెయిడింగ్ చేసిన విజయ్ 9 పాయింట్లు సాధించాడు. బెంగళూరు తరఫున అలీరెజా మిర్జాయిన్ (11) రాణించాడు. కీలక తరుణంలో పాయింట్లు చేసి జట్టును గెలిపించాడు. మిగతా వారిలో డిఫెండర్లు యోగేశ్ 3, దీపక్ శంకర్ 2, రెయిడర్ ఆకాశ్ షిండే 2 పాయింట్లు సాధించారు. ఈ సీజన్లో 6 మ్యాచ్లాడిన తెలుగు జట్టుకిది మూడో పరాజయం.అంతకుముందు జరిగిన తొలి మ్యాచ్లో హరియాణా స్టీలర్స్ 40–37తో గుజరాత్ జెయింట్స్పై గెలుపొందింది. స్టీలర్స్ తరఫున రెయిడర్లు శివమ్ పతారే (12), వినయ్ (8), డిఫెండర్లు జైదీప్ (6), సాహిల్ నర్వాల్ (4), రాహుల్ (3) రాణించారు.గుజరాత్ జట్టులో రెయిడర్ రాకేశ్ (14) చక్కని పోరాటం చేశాడు. 21 సార్లు కూతకెళ్లిన అతను 14 సార్లు విజయవంతంగా పాయింట్లు తెచ్చాడు. మిగతావారిలో నితిన్ పన్వార్ 3, లక్కీ శర్మ, శుభమ్ కుమార్ చెరో 2 పాయింట్లు చేశారు. నేడు జరిగే మ్యాచ్ల్లో బెంగాల్ వారియర్స్తో యూపీ యోధాస్, తమిళ్ తలైవాస్తో బెంగళూరు బుల్స్ తలపడతాయి.చదవండి: Asia Cup 2025: శ్రమించి గెలిచిన శ్రీలంక -
క్వాలిఫయింగ్లోనే...
టోక్యో: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో మూడో రోజు కూడా భారత క్రీడాకారులకు నిరాశే మిగిలింది. పురుషుల లాంగ్జంప్ ఈవెంట్లో శ్రీశంకర్ మురళీ క్వాలిఫయింగ్లోనే ని్రష్కమించాడు. 19మంది అథ్లెట్లు పోటీపడ్డ గ్రూప్ ‘ఎ’లో శ్రీశంకర్ 14వ స్థానంలో నిలిచాడు. మూడు ప్రయత్నాల్లో శ్రీశంకర్ వరుసగా 7.78 మీటర్లు, 7.59 మీటర్లు, 7,70 మీటర్ల దూరం దూకాడు. కనీసం 8.15 మీటర్ల దూరం దూకిన వారికి ఫైనల్ బెర్త్ లభిస్తుంది. ఓవరాల్గా 36 మంది పోటీపడ్డ క్వాలిఫయింగ్లో శ్రీశంకర్ 25వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. మరోవైపు మహిళల 3000 మీటర్ల స్టీపుల్ఛేజ్లో భారత క్రీడాకారిణులు పారుల్, అంకిత హీట్స్లోనే వెనుదిరిగారు. ఓవరాల్గా పారుల్ (9ని:22.24 సెకన్లు) 20వ స్థానంలో, అంకిత (10ని:03.22 సెకన్లు) 35వ స్థానంలో నిలిచారు. పురుషుల 110 మీటర్ల హర్డిల్స్లో తేజస్ షిర్సే (13.57 సెకన్లు) 29వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. -
వెల్డన్ వైశాలి
సమర్కండ్ (ఉజ్బెకిస్తాన్): ఆద్యంతం నిలకడగా రాణించిన భారత మహిళా గ్రాండ్మాస్టర్ వైశాలి రమేశ్బాబు అనుకున్న ఫలితం సాధించింది. సోమవారం ముగిసిన గ్రాండ్ స్విస్ చెస్ టోర్నీ మహిళల విభాగంలో చాంపియన్గా నిలిచింది. నిరీ్ణత 11 రౌండ్ల తర్వాత తమిళనాడు అమ్మాయి వైశాలి, కాటరీనా లాగ్నో (రష్యా) 8 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్ను వర్గీకరించగా... 24 ఏళ్ల వైశాలికి టైటిల్ ఖాయమైంది. కాటరీనా లాగ్నో రన్నరప్గా నిలిచింది. వరుసగా రెండోసారి గ్రాండ్ స్విస్ టోరీ్నలో టైటిల్ నెగ్గిన వైశాలితోపాటు కాటరీనా లాగ్నో వచ్చే సంవత్సరం జరిగే క్యాండిడేట్స్ టోరీ్నకి అర్హత పొందారు. వైశాలికి 90 వేల డాలర్లు (రూ. 79 లక్షల 33 వేలు), కాటరీనా లాగ్నోకు 75 వేల డాలర్లు (రూ. 66 లక్షల 10 వేలు) ప్రైజ్మనీగా లభించాయి. భారత్ నుంచి ముగ్గురు... ఎనిమిది మంది మధ్య జరిగే క్యాండిడేట్స్ టోరీ్నకి ఇప్పటికి ఏడుగురు అర్హత సాధించగా... అందులో ముగ్గురు భారత గ్రాండ్మాస్టర్లు (కోనేరు హంపి, దివ్య దేశ్ముఖ్, వైశాలి) ఉండటం విశేషం. అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) 2024–2025 మహిళా ఈవెంట్స్ విజేతకు చివరిదైన ఎనిమిదో బెర్త్ ఖరారు అవుతుంది. క్యాండిడేట్స్ టోర్నీ విజేత ప్రస్తుత మహిళల ప్రపంచ చాంపియన్ జు వెన్జున్తో 2026 వరల్డ్ టైటిల్ కోసం తలపడుతుంది. చివరి రౌండ్ గేమ్లు ‘డ్రా’ గ్రాండ్ స్విస్ టోర్నీ చివరిదైన 11వ రౌండ్లో వైశాలి, కాటరీనా తమ ప్రత్యర్థులతో గేమ్లను ‘డ్రా’ చేసుకున్నారు. ప్రపంచ మాజీ చాంపియన్ టాన్ జోంగి (చైనా)తో జరిగిన గేమ్ను వైశాలి 43 ఎత్తుల్లో... ఉల్వియా (అజర్బైజాన్)తో గేమ్ను కాటరీనా లాగ్నో 30 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నారు. ఈ టోరీ్నలో వైశాలి ఆరు గేముల్లో గెలిచి, నాలుగు గేమ్లను ‘డ్రా’ చేసుకొని, ఒక గేమ్లో ఓడిపోగా... కాటరీనా లాగ్నో ఐదు గేముల్లో నెగ్గి, ఆరు గేమ్లను ‘డ్రా’గా ముగించింది. భారత్కే చెందిన మరో గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక 6.5 పాయింట్లతో 14వ స్థానంలో నిలిచింది. మరోవైపు గ్రాండ్ స్విస్ టోర్నీ ఓపెన్ విభాగంలో అనీశ్ గిరి (నెదర్లాండ్స్–8 పాయింట్లు) విజేతగా... మథియాస్ బ్లూబామ్ (జర్మనీ–7.5 పాయింట్లు) రన్నరప్గా నిలిచి వచ్చే ఏడాది క్యాండిడేట్స్ టోరీ్నకి అర్హత సాధించారు. చాంపియన్ అనీశ్ గిరికి 90 వేల డాలర్లు (రూ. 79 లక్షల 33 వేలు), రన్నరప్ మథియాస్కు 75 వేల డాలర్లు (రూ. 66 లక్షల 10 వేలు) ప్రైజ్మనీగా లభించాయి. -
భారత స్టార్కు ఊహించని షాక్
జాగ్రెబ్ (క్రొయేషియా): స్వర్ణ పతకం గెలవడమే లక్ష్యంగా ప్రపంచ చాంపియన్షిప్కు సిద్ధమైన భారత స్టార్ రెజ్లర్ అమన్ సెహ్రావత్కు ఊహించని షాక్ ఎదురైంది. గత ఏడాది పారిస్ ఒలింపిక్స్లో కాంస్య పతకం నెగ్గిన ఈ రెజ్లర్ అనర్హతకు గురయ్యాడు. తన వెయిట్ కేటగిరీలో అధిక బరువు వల్లే అతను ప్రతిష్టాత్మక చాంపియన్షిప్ నుంచి నిష్క్రమించాడు. సాధారణంగా.. పోటీలకు ముందు రెజ్లర్కు బరువును (వెయింగ్) చూస్తారు.1.7 కేజీలు అధిక బరువుపురుషుల 57 కేజీల ఫ్రీస్టయిల్ కేటగిరీలో తలపడేందుకు సిద్ధమైన అమన్ ఉండాల్సిన బరువుకంటే ఏకంగా 1.7 కేజీలు (1700 గ్రాములు) అధిక బరువు ఉండటంతో నిర్వాహకులు డిస్క్వాలిఫై చేశారు. ‘ఇది చాలా దురదృష్టకరం. అమన్లాంటి రెజ్లర్ తన బరువును అదుపులో ఉంచుకోకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. బరువును తూచే వెయింగ్ మిషిన్పై అతను నిలబడితే 1.7 కేజీలు అధికంగా ఉన్నట్లు కనిపించింది. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. అతను అంత బరువు ఎలా పెరిగాడో అర్థమవడం లేదు’ అని జాగ్రెబ్లో ఉన్న భారత జట్టు అధికారి ఒకరు వెల్లడించారు.100 గ్రాములు ఎక్కువ ఉన్నాకాగా యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) నిబంధనల ప్రకారం ప్రపంచకప్, ర్యాంకింగ్ సిరీస్ టోర్నీల్లో ఉండాల్సిన బరువు కంటే రెండు కేజీల అదనపు బరువును కూడా అనుమతిస్తారు. అయితే ప్రపంచ చాంపియన్ షిప్, ఒలింపిక్స్లాంటి మెగా టోర్నీల్లో మాత్రం 100 గ్రాములున్నా వెంటనే అనర్హత వేటు వేస్తారు. నెల వ్యవధిలోనేగత నెల 25నే అమన్ జాగ్రెబ్కు చేరుకున్నాడు. పలువురు భారత రెజ్లర్లతో కలిసి ఈవెంట్ కోసం ముమ్మరసాధనలో నిమగ్నమయ్యాడు. కానీ ఇంత చేసీ కీలకమైన బరువును అదుపులో ఉంచుకోవడంలో విఫలమయ్యాడు. నెల వ్యవధిలోనే భారత బృందానికి ఇది రెండో డిస్క్వాలిఫై! మహిళా రెజ్లర్ నేహా సాంగ్వాన్ (59 కేజీల కేటగిరీ) గత నెల బల్గేరియాలో జరిగిన అండర్–20 ప్రపంచ చాంపియన్షిప్లో 600 గ్రాములు అధిక బరువు వల్ల అనర్హతకు గురైంది.నిజానికి ఆమె తాజాగా క్రొయేషియా రాజధాని జాగ్రెబ్లో జరుగుతున్న ఈవెంట్లో కూడా పాల్గొనేందుకు సీనియర్ జట్టుకు ఎంపికైంది. అయితే బరువు నియంత్రణలో పదేపదే నిర్లక్ష్యం వహిస్తున్న ఆమెను భారత రెజ్లింగ్ సమాఖ (డబ్ల్యూఎఫ్ఐ) ఈ టోర్నీ నుంచి తప్పించడంతో పాటు రెండేళ్ల నిషేధం కూడా విధించింది. ఆరోజు హృదయం ముక్కలుపారిస్ ఒలింపిక్స్లో భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కష్టపడి ఒక్కో విజయంతో ఫైనల్కు చేరింది. ఓడినా కనీసం రజతం ఖాయమనుకుంటే... స్వర్ణ పతక పోరుకు నిమిషాల ముందు ఆమె కేవలం 100 గ్రాముల అధిక బరువుతో బంగారం లాంటి అవకాశాన్ని కోల్పోయింది. ఇది ఆమెనే కాదు భారత క్రీడాలోకానికే గుండె పగిలినంత పనైంది. -
అటు సెవిల్లె... ఇటు మెలిస్సా
టోక్యో: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో జమైకా కొత్త చిరుత ఒబ్లిక్ సెవిల్లె పురుషుల 100 మీటర్ల స్వర్ణం కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్ రేసును ఒబ్లిక్ 9.77 సెకన్లలో ముగించి అగ్రస్థానం దక్కించుకున్నాడు. ఉసెన్ బోల్ట్ (2016) తర్వాత ప్రపంచ చాంపియన్షిప్లో పసిడి పతకం నెగ్గిన తొలి జమైకా రన్నర్గా ఒబ్లిక్ సెవిల్లె నిలిచాడు. సెవిల్లెకు ఇదే వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన కాగా... జమైకాకే చెందిన ఒలింపిక్ రజత పతక విజేత కిషానె థామ్సన్ (9.82 సెకన్లు) రజతం దక్కించుకున్నాడు. డిఫెండింగ్ చాంపియన్, అమెరికా అథ్లెట్ నోవా లైల్స్ (9.89 సెకన్లు) కాంస్యం గెలుచుకున్నాడు. ‘ప్రపంచ చాంపియన్షిప్ పురుషుల 100 మీటర్ల పరుగులో ఉసెన్ బోల్ట్ తర్వాత జమైకా అథ్లెట్కు స్వర్ణం దక్కడం ఇదే తొలిసారి. ఈ టోర్నీ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యా. సెమీస్లో నా ప్రదర్శనతో సంతృప్తిపడలేకపోయా. ఫైనల్లో శక్తినంతా కూడగట్టుకొని ప్రయత్నించా. నా పూర్తి సామర్థ్యంతో పరుగు తీస్తే... అందరికంటే ముందు నిలవగలనని విశ్వసించా’ అని 24 ఏళ్ల సెవిల్లె వెల్లడించాడు. పోటీలో ఉన్న అందరిలో అత్యుత్తమ వ్యక్తిగత టైమింగ్ ఉన్న థామ్సన్ ఆరంభంలోనే వెనుకబడిపోయాడు. ఇక అక్కడి నుంచి ఏ దశలోనూ సెవిల్లెను వెనక్కి నెట్టలేకపోయిన ఈ జమైకా అథ్లెట్ రెండో స్థానంతో సంతృప్తి పడాల్సి వచి్చంది. మహిళల 100 మీటర్లలో అమెరికా అథ్లెట్ మెలిస్సా జెఫర్సన్ వుడెన్ విజేతగా నిలిచింది. ఫైనల్లో మెలిస్సా 10.61 సెకన్లలో లక్ష్యాన్ని చేరి విజేతగా అవతరించింది. ప్రపంచ చాంపియన్షిప్లో ఇది సంయుక్తంగా అత్యుత్తమ టైమింగ్ కాగా... రెండో స్థానంలో నిలిచిన టీనా క్లాటన్ కంటే 0.15 సెకన్ల ముందే మెలిస్సా రేసు పూర్తి చేసింది. వరల్డ్ చాంపియన్షిప్ పోటీల్లో ఇదే అత్యధిక గెలుపు వ్యత్యాసం. జమైకాకు చెందిన టీనా క్లాటన్ (10.76 సెకన్లు), జూలియన్ అల్ఫ్రెడ్ (10.84 సెకన్లు; సెయింట్ లూసియా) వరుసగా రజత, కాంస్యాలు దక్కించుకున్నారు. జమైకా స్టార్ అథ్లెట్ షెల్లీ ఆన్ ఫ్రెజర్ ప్రైస్ 11.3 సెకన్లతో ఆరో స్థానానికి పరిమితమైంది. రెండో రోజు పోటీలు ముగిసేసరికి అమెరికా 5 స్వర్ణాలు, ఒక కాంస్యంతో మొత్తం 6 పతకాలు సాధించి పట్టిక అగ్రస్థానంలో కొనసాగుతుండగా... కెన్యా (2 స్వర్ణాలు), జమైకా (1 స్వర్ణం, 2 రజతాలు) వరుసగా రెండో, మూడో స్థానాల్లో ఉన్నాయి. కెనడా, ఫ్రాన్స్, స్పెయిన్ కూడా ఒక్కో పసిడి పతకం ఖాతాలో వేసుకున్నాయి. -
తుది పోరులో తడబాటు
హాంగ్జౌ (చైనా): వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్ మహిళల హాకీ టోర్నీకి నేరుగా అర్హత సాధించాలని ఆశించిన భారత జట్టుకు నిరాశే ఎదురైంది. ఆసియా కప్ టోర్నీలో భారత జట్టు రన్నరప్ ట్రోఫీతో సంతృప్తి పడింది. ఆతిథ్య చైనా జట్టుతో ఆదివారం జరిగిన ఫైనల్లో సలీమా టెటె నాయకత్వంలోని టీమిండియా 1–4 గోల్స్ తేడాతో ఓడిపోయింది. మ్యాచ్ మొదలైన తొలి నిమిషంలోనే లభించిన పెనాల్టీ కార్నర్ను నవ్నీత్ కౌర్ గోల్గా మలచడంతో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత చైనా పుంజుకోవడంతో భారత్ ఈ ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో విఫలమైంది. 21వ నిమిషంలో జిజియా ఒయు గోల్తో చైనా స్కోరును 1–1తో సమం చేసింది. ఆ తర్వాత హాంగ్ లీ (41వ నిమిషంలో), మెరోంగ్ జు (51వ నిమిషంలో), జియాకి జాంగ్ (53వ నిమిషంలో) ఒక్కో గోల్ చేసి చైనాకు విన్నర్స్ ట్రోఫీతోపాటు ప్రపంచ కప్ బెర్త్ను అందించారు. మ్యాచ్ మొత్తంలో భారత్కు ఐదు పెనాల్టీ కార్నర్లు... చైనాకు ఆరు పెనాల్టీ కార్నర్లు రాగా... రెండు జట్లు ఒక్కో దానిని మాత్రమే సద్వినియోగం చేసుకున్నాయి. భారత క్రీడాకారిణి ఉదిత ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డును గెల్చుకుంది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్లో జపాన్ 2–1తో దక్షిణ కొరియాను ఓడించింది. -
జైస్మీన్, మీనాక్షి ‘పసిడి’ పంచ్
లివర్పూల్ (ఇంగ్లండ్): ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత మహిళా బాక్సర్లు నాలుగు పతకాలతో మెరిశారు. జైస్మీన్ లంబోరియా (57 కేజీలు), మీనాక్షి హుడా (48 కేజీలు) పసిడి పతకాలతో అదరగొట్టగా... నుపుర్ షెరాన్ (ప్లస్ 80 కేజీలు) రజత పతకం, పూజా రాణి (80 కేజీలు) కాంస్య పతకం సొంతం చేసుకున్నారు. ఆదివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో హరియాణాకు చెందిన మీనాక్షి ఫైనల్లో 4–1తో పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత కిజైబీ నజిమ్ (కజకిస్తాన్)ను బోల్తా కొట్టించి తన కెరీర్లో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. గత జూలైలో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో కిజైబీ చేతిలో ఎదురైన పరాజయానికి మీనాక్షి ఈ గెలుపుతో బదులు తీర్చుకుంది. శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన 57 కేజీల ఫైనల్లో హరియాణాకే చెందిన జైస్మీన్ 4–1తో పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత జూలియా జెరెమెటా (పోలాండ్)ను ఓడించి విశ్వవిజేతగా అవతరించింది. ‘నా అనుభూతిని మాటల్లో వర్ణించలేను. గత రెండు ప్రపంచ చాంపియన్షిప్లలో క్వార్టర్ ఫైనల్స్లో వెనుదిరిగాను. ఈసారి ఎలాగైనా విజేతగా తిరిగి రావాలనే లక్ష్యంతో నా ఆటతీరులో మార్పులు చేసుకొని అనుకున్న ఫలితాన్ని సాధించాను’ అని జైస్మీన్ వ్యాఖ్యానించింది. ప్లస్ 80 కేజీల ఫైనల్లో నుపుర్ 2–3తో అగాటా కమర్స్కా (పోలాండ్) చేతిలో పోరాడి ఓడిపోయింది. 80 కేజీల సెమీఫైనల్లో పూజా రాణి 1–4తో ఎమిలీ (ఇంగ్లండ్) చేతిలో పరాజయం పాలై కాంస్య పతకాన్ని దక్కించుకుంది. 10 ప్రపంచ చాంపియన్షిప్ చరిత్రలో స్వర్ణ పతకాలు నెగ్గిన భారత మహిళా బాక్సర్లు. ఈ జాబితాలో మేరీకోమ్, నిఖత్ జరీన్, సరితా దేవి, జెన్నీ, లేఖ, నీతూ, లవ్లీనా, స్వీటీ బూరా, జైస్మీన్, మీనాక్షి ఉన్నారు. -
భారత్ ఖాతాలో మరో గోల్డ్మెడల్.. ఫైనల్లో మీనాక్షి అదుర్స్
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్- 2025లో భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం చేరింది. మహిళల 48 కిలోల విభాగంలో మీనాక్షి హుడా బంగారు పతకం చేసుకుంది. ఆదివారం జరిగన ఫైనల్ పోరులో కజకిస్తాన్కు చెందిన నాజిమ్ కైజైబేను 4-1 స్ప్లిట్ డెసిషన్తో మీనాక్షి ఓడించింది. ఈ ఫైనల్ మ్యాచ్లో పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అయిన నాజిమ్ నుంచి భారత బాక్సర్కు గట్టి పోటీ ఎదరైంది. ప్రత్యర్ధిపై తన పంచ్లతో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన మీనాక్షి.. తొలి రౌండ్ను 4-1తో సొంతం చేసుకుంది. ఆ తర్వాత నాజిమ్ అద్భుతమైన కమ్ బ్యాక్ ఇచ్చింది. దీంతో రెండో రౌండ్లో మీనాక్షిపై నాజీమ్ 3-2తో విజయం సాధించింది. మూడో రౌండ్లో ఈ ఇద్దరూ బాక్సర్లు హోరాహోరీగా తలపడ్డారు. నిర్ణీత సమయంలో ఎవరూ పాయింట్లు సాధించకపోవడంతో నలుగురు న్యాయమూర్తులు మీనాక్షికి అనుకూలంగా ఓటు వేశారు. దీంతో 4-1 తేడాతో మీనాక్షి స్వర్ణం సొంతం చేసుకుంది. ఇదే టోర్నమెంట్లో భారత బాక్సర్ లంబోరియా 57 కేజీల విభాగంలో బంగారు పతకం సాధించింది. -
PKL 12: తమిళ్ తలైవాస్ సంచలన నిర్ణయం!.. జన్మలో కబడ్డీ ఆడనంటూ..
ప్రొ కబడ్డి లీగ్ ఫ్రాంఛైజీ తమిళ్ తలైవాస్ (Tamil Thalaivas) సంచలన నిర్ణయం తీసుకుంది. తమ కెప్టెన్, భారత కబడ్డీ జట్టు సారథి పవన్ సెహ్రావత్ (Pawan Sehrawat)ను టీమ్ నుంచి తొలగించింది. ఇందుకు సంబంధించి శనివారం అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది.అందుకే ఈ నిర్ణయం‘‘క్రమశిక్షణా రాహిత్యం కారణంగా పవన్ సెహ్రావత్ను ఇంటికి పంపించివేశాము. ఈ సీజన్లో అతడు ఇక మా జట్టులో భాగంగా ఉండడు. జట్టుకు సంబంధించిన ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నాము’’ అని తమిళ్ తలైవాస్ స్పష్టం చేసింది.ఒక వ్యక్తి కారణంగానే ఇలా..ఈ ఆరోపణలపై పవన్ సెహ్రావత్ తాజాగా స్పందించాడు. ‘‘ఫ్రాంఛైజీ పెట్టిన పోస్టు చూసి నాకు చాలా మంది ఫోన్లు, మెసేజ్లు చేశారు. వారందరికీ ధన్యవాదాలు. తొమ్మిదో సీజన్లో కూడా నేను ఈ జట్టులోనే ఉన్నాను. గాయపడిన సమయంలో వారు నాకు అండగా నిలిచారు.మా తమ్ముడు అర్జున్తో కలిసి జట్టును ముందుకు తీసుకువెళ్లేందుకు నేను ఎన్నో ప్రణాళికలు రచించాను. అయితే ఒక వ్యక్తి కారణంగా మేము ఆ పని పూర్తిచేయలేకపోయాము’’ అని పవన్ సెహ్రావత్ తెలిపాడు.దోషినని తేలితే.. ఇక జన్మలో కబడ్డీ ఆడనుఅదే విధంగా.. ‘‘ఈ ఫ్రాంఛైజీ నా మీద క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డాననే ఆరోపణలు చేస్తోంది. నేను భారత జట్టులో ఉన్నాను. క్రమశిక్షణ అంటే ఏమిటో నాకు తెలుసు. నిజంగా వారు ఆరోపించినట్లు నేను దోషినని తేలితే.. ఇక జన్మలో కబడ్డీ ఆడను’’ అంటూ పవన్ సెహ్రావత్ సవాలు విసిరాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.రూ. 59.5 లక్షల భారీ ధరకాగా గతేడాది వరకు పవన్ సెహ్రావత్ తెలుగు టైటాన్స్కు ఆడాడు. అయితే, ఈసారి వేలంలో రూ. 59.5 లక్షల భారీ ధరకు తమిళ్ తలైవాస్ పవన్ను కొనుగోలు చేసి.. కెప్టెన్గా నియమించింది. ఇక ఈ సీజన్లో తలైవాస్ ఆడిన తొలి మూడు మ్యాచ్లలో పవన్ భాగమయ్యాడు.అయితే, జైపూర్ లెగ్లో భాగంగా బెంగాల్ వారియర్స్తో ఆడాల్సిన మ్యాచ్కు పవన్ హాజరు కాలేదు. జట్టుతో కలిసి అతడు జైపూర్కు ప్రయాణం చేయలేదు. ఇక ఈ మ్యాచ్లో అర్జున్ దేశ్వాల్ తమిళ్ తలైవాస్ సారథిగా వ్యవహరించి జట్టుకు విజయం అందించాడు.రెండు గెలిచి..ఇదిలా ఉంటే.. ప్రొ కబడ్డి లీగ్ పన్నెండో సీజన్లో తమిళ్ తలైవాస్ మిశ్రమ ఫలితాలు చవిచూస్తోంది. ఇప్పటికి ఆడిన నాలుగు మ్యాచ్లలో రెండు గెలిచింది. నాలుగు పాయింట్లతో ప్రస్తుతం పట్టికలో ఏడో స్థానంలో ఉంది. అయితే, కెప్టెన్ పవన్ సెహ్రావత్ వంటి ఆల్రౌండర్ను వదులుకుని పెద్ద సాహసమే చేసింది. ఇక ఈ సీజన్లో పవన్ 22 రెయిడింగ్ పాయింట్లు సాధించగలిగాడు.చదవండి: పాక్తో మ్యాచ్ బహిష్కరించాలంటూ విజ్ఞప్తులు!.. ఆటగాళ్లకు గంభీర్ మెసేజ్ ఇదే.. Pawan Sehrawat gives clarification on undisciplinary allegation by Tamil Thalaivas 😲🎥 - Pawan Sehrawat/Insta#PKL | #PKL12 | #ProKabaddiLeague | #Kabaddi | #PKLSeason12 | #ProKabaddi | #PawanSehrawat | #TamilThalaivas pic.twitter.com/xrbrSeJEoJ— Khel Kabaddi (@KhelNowKabaddi) September 14, 2025 -
World Boxing Championships 2025: చరిత్ర సృష్టించిన భారత బాక్సర్
భారత బాక్సింగ్ చరిత్రలో సువర్ణాధ్యాయం లిఖించబడింది. లివర్పూల్లో జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్-2025లో ముగ్గురు మహిళా బాక్సర్లు పతకాలు సాధించారు. నుపూర్ 80 ప్లస్ కేజీల విభాగంలో రజత పతకం సాధించగా.. పూజా రాణి 80 కేజీల విభాగంలో కాంస్యం.. తాజాగా జైస్మిన్ లంబోరియా 57 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించారు. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు ఇప్పటివరకు వచ్చిన అత్యుత్తమ ఫలితం (ముగ్గురు మహిళా బాక్సర్లకు పతకాలు) ఇదే.చరిత్ర సృష్టించిన లంబోరియా తాజాగా జరిగిన 57 కేజీల విభాగం ఫైనల్లో జైస్మిన్ లంబోరియా పోలాండ్కి చెందిన ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్ జూలియా సెరెమెటాపై 4-1 స్ప్లిట్ డెసిషన్తో విజయం సాధించి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు ఇదే తొలి స్వర్ణం. నూతన గ్లోబల్ బాక్సింగ్ గవర్నింగ్ బాడీగా 'వరల్డ్ బాక్సింగ్' ఏర్పడ్డాక జరుగుతున్న తొలి వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఇదే.నుపూర్కు రజతంఇదే టోర్నీలో 80 ప్లస్ కేజీల విభాగంలో నుపుర్ గోల్డ్ మిస్ అయ్యింది. అగాటా కాజ్మార్స్కాతో (పోలాండ్) ఫైనల్లో నుపుర్ 2-3తో పోరాడి ఓడింది.పూజా రాణికి కాంస్యం80 కేజీల విభాగంలో పూజా రాణి కాంస్యంతో సరిపెట్టుకుంది. ఇంగ్లండ్కి చెందిన ఎమిలీ ఆస్క్విత్తో సెమీఫైనల్లో గట్టిగానే పోరాడింది.భారత బాక్సింగ్లో చారిత్రక ఘట్టంభారత బాక్సింగ్ చరిత్రలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్లో తొలిసారి ముగ్గురు మహిళా బాక్సర్లు ఫైనల్స్కు చేరారు. జైస్మిన్, నుపుర్ ఇది వరకే స్వర్ణం, రజతం సాధించగా.. మీనాక్షి 48 కేజీ విభాగంలో స్వర్ణం కోసం పోటీపడాల్సి ఉంది. -
తెలుగు టైటాన్స్ పరాజయం
జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో వరుస విజయాలతో జోరు మీదున్న తెలుగు టైటాన్స్కు పరాజయం ఎదురైంది. వైజాగ్ వేదికగా ఆడిన గత మూడు మ్యాచ్ల్లోనూ నెగ్గిన తెలుగు టైటాన్స్ శనివారం 33–39 పాయింట్ల తేడాతో పుణేరి పల్టన్ చేతిలో ఓడింది. ఈ సీజన్లో టైటాన్స్కు ఇది మూడో పరాజయం. తెలుగు టైటాన్స్ తరఫున భరత్ 12 పాయింట్లతో విజృంభించగా... కెపె్టన్ విజయ్ మాలిక్ 7 పాయింట్లు సాధించాడు. పల్టన్ తరఫున అస్లమ్ ఇనామ్దార్, గౌరవ్ చెరో 7 పాయింట్లు సాధించారు. విశాల్ భరద్వజ్ (6 పాయింట్లు), ఆదిత్య (5 పాయింట్లు), పంకజ్ (5 పాయింట్లు) కూడా మెరవడంతో పల్టన్ ముందంజ వేసింది. ఈ మ్యాచ్లో టైటాన్స్ 21 రెయిడ్ పాయింట్లు సాధించగా... పల్టన్ 15కే పరిమితమైంది. ట్యాక్లింగ్లో పల్టన్ 17 పాయింట్లు సాధిస్తే తెలుగు టైటాన్స్ పది పాయింట్లకే పరిమితమైన పరాజయం పాలైంది. లీగ్లో భాగంగా ఆరు మ్యాచ్లు ఆడిన టైటాన్స్ మూడింట గెలిచి మరో మూడు మ్యాచ్ల్లో ఓడి 6 పాయింట్లతో పట్టిక నాలుగో స్థానంలో కొనసాగుతోంది. మరో మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ 41–29 పాయింట్ల తేడాతో యూపీ యోధాస్పై గెలుపొందింది. పింక్ పాంథర్స్ తరఫున నితిన్ కుమార్ 11 పాయింట్లు, అలీ సమది 10 పాయింట్లతో సత్తాచాటారు. యూపీ యోధాస్ తరఫున గగన్ గౌడ 15 పాయింట్లతో ఒంటరి పోరాటం చేసినా లాభం లేకపోయింది. ఓవరాల్గా ఈ మ్యాచ్లో యూపీ యోధాస్ 22 రెయిడ్ పాయింట్లు సాధించగా... జైపూర్ పింక్ పాంథర్స్ 21 సాధించింది. అయితే ట్యాక్లింగ్లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన పింక్ పాంథర్స్ 12 పాయింట్లు సాధిస్తే... యూపీ యోధాస్ 4 పాయింట్లకే పరిమితమైంది. -
ఆసియాకప్ మహిళల హాకీ ఫైనల్లో భారత్
హాంగ్జౌ (చైనా): భారత మహిళల హాకీ జట్టు ఆసియా కప్ టోర్నమెంట్ ఫైనల్కు దూసుకెళ్లింది. ‘సూపర్–4’ దశ చివరి మ్యాచ్లో శనివారం డిఫెండింగ్ చాంపియన్ జపాన్తో పోరును భారత జట్టు 1–1 గోల్స్తో ‘డ్రా’ చేసుకుంది. భారత్ తరఫున బ్యూటీ డుంగ్ డుంగ్ 7వ నిమిషంలో గోల్ సాధించింది. చివరి క్వార్టర్ వరకు ఆధిక్యాన్ని కొనసాగించిన టీమిండియా... విజయం సాధించడం ఖాయమే అనుకుంటుండగా... 58వ నిమిషంలో కోబయకావా షిహో గోల్తో జపాన్ స్కోరు సమం చేసింది. ఇరు జట్ల మధ్య గ్రూప్ దశలో జరిగిన మ్యాచ్ సైతం ‘డ్రా’గానే ముగిసింది. మరో మ్యాచ్లో చైనా 1–0 గోల్స్ తేడాతో దక్షిణ కొరియాపై గెలవడంతో టీమిండియా ఫైనల్కు అర్హత సాధించింది. దీంతో ‘సూపర్–4’ దశలో మూడు మ్యాచ్లాడిన భారత్ ఒక విజయం, ఒక పరాజయం, ఒక ‘డ్రా’తో 4 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక రెండో స్థానంతో ఫైనల్లో అడుగుపెట్టింది. నేడు జరగనున్న ఫైనల్లో చైనాతో భారత్ తలపడనుంది. ఇందులో గెలిచిన జట్టు వచ్చే ఏడాది బెల్జియం, నెదర్లాండ్స్ వేదికగా జరగనున్న ప్రపంచకప్నకు నేరుగా అర్హత సాధిస్తుంది. -
క్వాలిఫయర్స్కు భారత్
బీల్ (స్విట్జర్లాండ్): మూడు దశాబ్దాల తర్వాత డేవిస్ కప్లో భారత జట్టు ఓ ఘనమైన విజయంతో ముందంజ వేసింది. డేవిస్ కప్ టెన్నిస్ వరల్డ్ గ్రూప్–1 టైలో భాగంగా స్విట్జర్లాండ్తో జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 3–1తో విజయం సాధించింది. తొలి రోజు కొత్త కుర్రాడు దక్షిణేశ్వర్తో పాటు భారత స్టార్ సుమిత్ నగాల్ వరుస విజయాలతో సింగిల్స్లో 2–0తో క్లీన్స్వీప్ చేసిన భారత్కు రెండో రోజు శనివారం డబుల్స్లో పరాజయం ఎదురైంది. దీంతో భారత్ ఆధిక్యం 2–1కి తగ్గింది. ఈ దశలో రివర్స్ సింగిల్స్ బరిలోకి దిగిన భారత నంబవర్వన్ టెన్నిస్ స్టార్ సుమిత్ 6–1, 6–3తో హెన్రీ బెర్నెట్పై విజయం సాధించాడు. దీంతో ఈ ‘టై’లో భారత్ గెలుపొందింది. ఫలితం రావడంతో నామమాత్రమైన రెండో రివర్స్ సింగిల్స్ మ్యాచ్ను నిర్వహించలేదు. మూడేళ్ల క్రితం 2022లో డెన్మార్క్పై గెలిచినప్పటికీ ఇది న్యూఢిల్లీ వేదికపై జరిగింది. తాజా విజయంతో డేవిస్ కప్ క్వాలిఫయర్స్కు భారత్ అర్హత సాధించింది. తొలిరౌండ్ డేవిస్ కప్ క్వాలిఫయర్స్ పోటీలు వచ్చే జనవరిలో జరుగుతాయి. అంతకుముందు జరిగిన డబుల్స్లో భారత బృందానికి నిరాశ ఎదురైంది. శ్రీరామ్ బాలాజీతో జోడీగా బరిలోకి దిగిన తెలంగాణ ఆటగాడు రితి్వక్ బొల్లిపల్లి జంటకు ఆతిథ్య స్విట్జర్లాండ్ జోడీ చేతిలో చుక్కెదురైంది. రితి్వక్–బాలాజీ ద్వయంకు 7–6 (8/3), 4–6, 5–7తో జాకుబ్ పాల్–డామినిక్ స్ట్రికెర్ జంట చేతిలో పరాజయం ఎదురైంది. మొత్తమ్మీద విదేశీ గడ్డపై భారత్ చివరిసారిగా 1993లో గెలిచింది. -
ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ
హాంకాంగ్: భారత బ్యాడ్మింటన్ అగ్ర శ్రేణి డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో టైటిల్ పోరుకు సిద్ధమైంది. సింగిల్స్లో లక్ష్యసేన్ కూడా ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ప్రపంచ ర్యాంకింగ్స్లో 20వ స్థానంలో ఉన్న భారత ఆటగాడు 23–21, 22–20తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్, మూడో సీడ్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)ని కంగు తినిపించాడు. సుమారు గంటపాటు హోరా హోరీగా జరిగిన సమరంలో లక్ష్యసేన్ ఏ దశలోనూ పట్టు సడలించలేదు. నేడు జరిగే టైటిల్ పోరులో చైనాకు చెందిన రెండో సీడ్ లి షి ఫెంగ్తో అమీతుమీ తేల్చుకోనున్నాడు. ఈ ఏడాది సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి అద్భుతమైన ఫామ్లో ఉన్నప్పటికీ సెమీస్తోనే ఆగిపోతున్నారు. ఆరు టోర్నీల్లో సెమీస్తోనే ముగిసిన భారత జోడీ పోరాటం ఇక్కడ ఫైనల్కు చేరింది. ఈ సీజన్లో తొలిసారి సాత్విక్–చిరాగ్లు ఎట్టకేలకు టైటిల్ వేటలో అడుగు దూరంలో ఉన్నారు. తాజా ప్రపంచ చాంపియన్షిప్లో కాంస్య విజేత అయిన భారత డబుల్స్ జోడీ వరుస సెట్లలో చైనీస్ తైపీకి చెందిన బింగ్ వే లిన్–చెన్ చెంగ్ కున్ జంటను కంగుతినిపించింది. ప్రపంచ తొమ్మిదో ర్యాంకులో ఉన్న సాత్విక్–చిరాగ్ ద్వయం 21–17, 21–15తో తైపీ జోడీని కంగుతినిపించింది. ఆదివారం జరిగే టైటిల్ పోరులో ఎనిమిదో సీడ్ భారత జోడీ... పారిస్ ఒలింపిక్స్లో రజత పతక విజేతలైన లియాంగ్ వే కెంగ్–వాంగ్ చాంగ్ (చైనా) జంటతో తలపడుతుంది. -
ISSF World Cup: ఎట్టకేలకు భారత్ బోణీ.. స్వర్ణం గెలిచిన ఇషా
అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ISFF) తాజా సీజన్లోని చివరి ప్రపంచకప్లో భారత షూటర్ ఇషా సింగ్ (Esha Singh) సత్తా చాటింది. మహిళల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. తద్వారా ఈ మెగా ఈవెంట్లో భారత్కు తొలి మెడల్ అందించింది. కాగా చైనాలోని నింగ్బోలో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ టోర్నీలో తొలి నాలుగు రోజుల్లో భారత్ కనీసం ఒక్క కాంస్య పతకం కూడా నెగ్గలేకపోయింది.వైఫల్యాల పరంపరషూటింగ్ ఈవెంట్లో ఇన్ని రోజులైనా కూడా భారత్ బోణీ కొట్టలేకపోవడం బహుశా ఇటీవల ఇదే తొలిసారి!.. పురుషులు, మహిళల ఈవెంట్లలో శుక్రవారం వరకు వరుస వైఫల్యాల పరంపర కొనసాగింది. శుక్రవారం జరిగిన మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో మెహులీ ఘోష్, మానిని కౌశిక్ అత్యంత పేలవ ప్రదర్శనతో నిరాశపరిచారు. 2023లో బాకులో జరిగిన ప్రపంచ చాంపియన్షిప్లో కాంస్యం నెగ్గిన మెహులీ క్వాలిఫయింగ్లో 583 పాయింట్లతో 23వ స్థానంలో నిలిచింది.ఇక మానిని 580 పాయింట్లతో 45వ స్థానానికి పరిమితమైనింది. తెలంగాణకు చెందిన మరో షూటర్ రాపోలు సురభి భరద్వాజ్ 578 పాయింట్లతో ఏకంగా 52వ స్థానంలో నిలిచింది. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్ భవేశ్ షెకావత్ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. క్వాలిఫికేషన్ రౌండ్లో అతను నాలుగో స్థానంలో నిలువడం ద్వారా ఫైనల్ చేరే అవకాశాల్ని సజీవంగా ఉంచుకున్నాడు.ఇషాకు ఇదే తొలి స్వర్ణంఈ క్రమంలో భారత్ ఆశలన్నీ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో పోటీపడే రిథమ్ సాంగ్వాన్, ఇషా సింగ్, సురభి రావులపై నిలవగా.. 20 ఏళ్ల ఇషా శనివారం పసిడి పతకం గెలిచింది. నింగ్బో స్పోర్ట్స్ సెంటర్లో జరిగిన పోటీ ఫైనల్లో యావో కియాంగ్జున్ (చైనా)ను 0.1 పాయింట్ తేడాతో ఓడించి స్వర్ణం కైవసం చేసుకుంది. ఇక ఒలింపిక్ చాంపియన్ ఓ యెజిన్ (సౌత్ కొరియా) కాంస్యం దక్కించుకుంది.కాగా ప్రపంచకప్ ఈవెంట్లో ఇషాకు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. ఇక ఈ తెలంగాణ షూటర్ గెలుపుతో.. ఈ ఈవెంట్లో బోణీ కొట్టిన భారత్ పతకాల పట్టికలో ఎట్టకేలకు చోటు సంపాదించింది. ప్రస్తుతానికి ఐదో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఆతిథ్య దేశం చైనా రెండు స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఒక కాంస్యంతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.చదవండి: బీసీసీఐ కూడా చెప్పినట్లే వినాలి! -
బీసీసీఐ కూడా చెప్పినట్లే వినాలి!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం క్రీడలు, క్రీడాకారుల అభివృద్ధికే పెద్దపీట వేస్తోందని, తద్వారా భారత్ను ప్రపంచ టాప్–10 క్రీడా దేశాల్లో నిలపడమే లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. శుక్రవారం ఇక్కడ జరిగిన ‘ప్లేకామ్ బిజినెస్ ఆఫ్ స్పోర్ట్స్ సమ్మిట్’లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ‘గతంలో క్రీడా సమాఖ్యల్లో తిష్ట వేసుకు కూర్చున్న సమస్యలు, వివాదాలే పతాక శీర్షికలయ్యేవి. ప్రస్తుతం మేం ఈ వివాదాలను పక్కనబెట్టి అథ్లెట్ల ప్రదర్శన మెరుగుపర్చడంపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాం. అంతర్జాతీయ క్రీడల్లో భారత ఆటగాళ్లు పోడియంలో నిలిచేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. కొత్తగా తీసుకొచ్చిన క్రీడా బిల్లు కూడా తగవుల్ని పరిష్కరించడంతో పాటు క్రీడాకారుల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తుంది. అథ్లెట్లు రాణించేందుకు ఎల్లవేళలా కృషి చేస్తున్నాం’ అని అన్నారు. బీసీసీఐ కూడా చెప్పినట్లే వినాలి!దేశంలోని క్రీడా సమాఖ్యలన్నీ క్రీడా బిల్లుకు లోబడే ఉండాలని నిర్ణయించామని, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కూడా కొత్త క్రీడా పాలసీ ప్రకారమే నడచుకోవాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. తద్వారా ప్రతీ సమాఖ్యలోనూ జవాబుదారీతనాన్ని పెంచామని అన్నారు. అంతర్జాతీయ క్రీడల్లో పురుషులకు దీటుగా భారత మహిళా అథ్లెట్లు పోటీపడాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని మంత్రి వివరించారు. ప్రభుత్వం చేపట్టిన ‘ఫిట్ ఇండియా’, ‘ఖేలో ఇండియా’, టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం (టాప్స్) కార్యక్రమాలు అథ్లెట్ల కోసమే రూపొందించామని మాండవీయ తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ దూరదృష్టితో వ్యవహరిస్తున్నారని, భారత క్రీడావికాసం కోసం ప్రణాళికబద్ధంగా కృష్టి చేస్తున్నారని ఆయన చెప్పారు. పదేళ్ల ప్రణాళికతో క్రీడాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మన్సుఖ్ మాండవీయ అన్నారు. క్షేత్రస్థాయిలోఇక భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రతిభాన్వేషణ పోటీలను పెంచుతామని చెప్పారు. కేవలం నగరాలు, అకాడమీలే కాదు... మారుమూల గ్రామాలు, పట్టణాల్లో ఉన్న ప్రతిభావంతులను పాఠశాల స్థాయి పోటీల్లో గుర్తించి నాణ్యమైన శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమని చెప్పారు. -
గుకేశ్ను నిలువరించిన దివ్య
సమర్కండ్ (ఉజ్బెకిస్తాన్): గ్రాండ్ స్విస్ అంతర్జాతీయ చెస్ టోర్నీ ఓపెన్ విభాగంలో పోటీపడుతున్న భారత మహిళా గ్రాండ్మాస్టర్ దివ్య దేశ్ముఖ్ నాలుగో ‘డ్రా’ నమోదు చేసింది. ప్రపంచ చాంపియన్, భారత గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్తో శుక్రవారం జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్ను దివ్య 103 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. ఇటీవల మహిళల ప్రపంచకప్ టోర్నీలో విజేతగా నిలిచిన దివ్య రేటింగ్ 2478 పాయింట్లు కాగా... గుకేశ్ రేటింగ్ 2767 పాయింట్లు. ఈ టోర్నీలో వరుసగా మూడు పరాజయాల తర్వాత గుకేశ్ ‘డ్రా’తో గట్టెక్కాడు. ఎనిమిదో రౌండ్లో భారత గ్రాండ్మాస్టర్లు ఇరిగేశి అర్జున్, నిహాల్ సరీన్, ప్రజ్ఞానంద, ప్రణవ్, అభిమన్యు పురాణిక్, లియోన్, ఆదిత్య మిట్టల్, రౌనక్ సాధ్వాని, నారాయణన్, ఆర్యన్ చోప్రా తమ గేమ్లను ‘డ్రా’ చేసుకోగా... విదిత్, పెంటేల హరికృష్ణ ఓటమి చవిచూశారు. కార్తికేయన్ మురళీ మాత్రం విజయాన్ని అందుకున్నాడు. మహిళల విభాగంలో భారత గ్రాండ్మాస్టర్ వైశాలి తొలి ఓటమి చవిచూసింది. బీబీసారా అసబయేవా (కజకిస్తాన్)తో జరిగిన గేమ్లో వైశాలి 39 ఎత్తుల్లో ఓడిపోయింది. ఓల్గా గిర్యా (రష్యా)తో జరిగిన గేమ్ను ద్రోణవల్లి హారిక 43 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. ఎనిమిదో రౌండ్ తర్వాత వైశాలి 6 పాయింట్లతో మరో ఇద్దరితో కలిసి రెండో స్థానంలో, హారిక 4.5 పాయింట్లతో 20వ స్థానంలో ఉన్నారు. -
అథ్లెటిక్స్ ‘ప్రపంచం’ పిలుస్తోంది!
198 దేశాలు... 2000లకు పైగా అథ్లెట్లు... 49 ఈవెంట్లు... రికార్డులు బద్దలు కొట్టేందుకు... అంతర్జాతీయ వేదికపై అందరి దృష్టిని ఆకర్షించేందుకు... అథ్లెట్లందరూ ‘సై’ అంటున్నారు. స్ప్రింట్ రేసుల్లో అగ్రరాజ్యం అమెరికా ఆధిపత్యం కొనసాగుతుందా.... మిడిల్ డిస్టెన్స్ రన్నింగ్లో ఆఫ్రికా తమ హవా కొనసాగిస్తుందా... ఫీల్డ్ ఈవెంట్స్లో యూరోపియన్లు తమ సత్తా చాటుకుంటారా... ఇవన్నీ తెలుసుకోవాలంటే క్రీడాభిమానులు నేటి నుంచిమొదలయ్యే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్పై దృష్టి సారించాల్సిందే. 1983లో ఫిన్లాండ్ రాజధాని హెల్సింకిలో తొలిసారి ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీలకు వేదిక కాగా... తాజాగా 20వ ఎడిషన్కు జపాన్ రాజధాని టోక్యో ముస్తాబైంది. ఈ మెగా ఈవెంట్ జపాన్లో జరగడం ఇది మూడోసారి. ఇంతకుముందు 1991లో టోక్యో, 2007లో ఒసాకా ప్రపంచ చాంపియన్షిప్కు ఆతిథ్యమిచ్చాయి. టోక్యో: ఒలింపిక్స్ క్రీడలు... ఫుట్బాల్ ప్రపంచకప్... ఆ తర్వాత క్రీడాభిమానుల దృష్టిని ఆకర్షించేది ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్. రెండేళ్లకోసారి జరిగే ఈ మెగా ఈవెంట్కు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి తొమ్మిది రోజులపాటు జరిగే ప్రపంచ చాంపియన్షిప్లో మొత్తం 198 దేశాల అథ్లెట్లు 49 ఈవెంట్లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తొలి రోజు ఐదు ఈవెంట్లలో అథ్లెట్లు మెడల్స్ కోసం బరిలోకి దిగనున్నారు.పురుషుల, మహిళల 35 కిలోమీటర్ల రేస్ వాక్... అనంతరం పురుషుల షాట్పుట్, మహిళల 10,000 మీటర్లు, మిక్స్డ్ 4–400 మీటర్ల రిలే ఫైనల్ ఈవెంట్లు జరుగుతాయి. పురుషుల, మహిళల 100 మీటర్ల విభాగాల్లో ప్రిలిమినరీ రౌండ్లు ఉంటాయి. పురుషుల, మహిళల 100 మీటర్ల సెమీఫైనల్స్, ఫైనల్స్ ఆదివారం జరుగుతాయి. ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో నిషేధం ఎదుర్కొంటున్న రష్యా అథ్లెట్లు ఈ మెగా ఈవెంట్లో ‘తటస్థ అథ్లెట్లు’గా పోటీపడనున్నారు. జమైకా దిగ్గజ మహిళా స్ప్రింటర్ షెల్లీ ఆన్ ఫ్రేజర్ ‘టోక్యో’లో తన కెరీర్ను ముగించనుంది. ఇప్పటి వరకు ఆమె ప్రపంచ చాంపియన్షిప్లలో వ్యక్తిగత, టీమ్ రిలే ఈవెంట్స్లో కలిపి మొత్తం 16 పతకాలు సాధించింది. ఇందులో 10 స్వర్ణాలు, 5 రజతాలు, ఒక కాంస్యం ఉన్నాయి. మరోవైపు పురుషుల పోల్ వాల్ట్లో స్వీడన్ స్టార్ డుప్లాంటిస్ ప్రధాన ఆకర్షణ కానున్నాడు. ఇప్పటికే 13 సార్లు పోల్వాల్ట్లో ప్రపంచ రికార్డులు నెలకొల్పిన డుప్లాంటిస్ స్వర్ణం సాధించి ప్రపంచ చాంపియన్షిప్లో ‘హ్యాట్రిక్’ నమోదు చేయాలని పట్టుదలతో ఉన్నాడు. 2022, 2023 ప్రపంచ చాంపియన్షిప్లలో బంగారు పతకాలు నెగ్గిన డుప్లాంటిస్, 2019లో రజత పతకం సాధించాడు. నీరజ్ ఈవెంట్ 17న, 18న... ప్రపంచ చాంపియన్షిప్లో ఈసారి భారత్ నుంచి 19 మంది క్రీడాకారులు పోటీపడుతున్నారు. అయితే అందరి దృష్టి మాత్రం జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాపైనే ఉంది. ఈ మెగా ఈవెంట్లో 2022లో రజతం, 2023లో స్వర్ణం గెలిచిన నీరజ్... మళ్లీ విజేతగా నిలిస్తే... ప్రపంచ చాంపియన్షిప్లో వరుసగా రెండుసార్లు బంగారు పతకాలు నెగ్గిన మూడో జావెలిన్ త్రోయర్గా గుర్తింపు పొందుతాడు. గతంలో జాన్ జెలెజ్నీ (1993, 1995), అండర్సన్ పీటర్స్ (2019, 2022) మాత్రమే ఈ ఘనత సాధించారు. నీరజ్ చోప్రా జావెలిన్ త్రో ఈవెంట్ రెండు రోజులపాటు జరుగుతుంది. ఈనెల 17న క్వాలిఫయింగ్... 18న ఫైనల్ ఉంటాయి. జావెలిన్ త్రోలో భారత్ నుంచి నీరజ్ చోప్రాతోపాటు సచిన్ యాదవ్, యశ్వీర్ సింగ్, రోహిత్ యాదవ్ బరిలో ఉన్నారు. మహిళల జావెలిన్ త్రోలో భారత స్టార్ అన్ను రాణి ఐదోసారి (2017, 2019, 2022, 2023) ప్రపంచ చాంపియన్షిప్లో పోటీపడనుంది. 2019, 2022లో ఫైనల్ చేరిన అన్ను రాణి ఈసారి ఏం చేస్తుందో వేచి చూడాలి. తొలి రోజు శనివారం భారత్ నుంచి నలుగురు అథ్లెట్లు బరిలో ఉన్నారు. పురుషుల 35 కిలోమీటర్ల రేస్ వాక్లో రామ్బాబూ, సందీప్ కుమార్... మహిళల 35 కిలోమీటర్ల రేస్ వాక్లో ప్రియాంక గోస్వామి... మహిళల 1500 మీటర్ల హీట్స్లో పూజ పోటీపడతారు. ఇదీ భారత బృందం... పురుషుల విభాగం: నీరజ్ చోప్రా, సచిన్ యాదవ్, యశ్వీర్ సింగ్, రోహిత్ యాదవ్ (జావెలిన్ త్రో), గుల్వీర్ సింగ్ (5000, 10000 మీటర్లు), ప్రవీణ్ చిత్రావెల్, అబ్దుల్లా అబూబాకర్ (ట్రిపుల్ జంప్), మురళీ శ్రీశంకర్ (లాంగ్జంప్), సర్వేశ్ కుషారే (హైజంప్), అనిమేశ్ కుజుర్ (200 మీటర్లు), తేజస్ షిర్సే (110 మీటర్ల హర్డిల్స్), సెర్విన్ సెబాస్టియన్ (20 కిలోమీటర్ల రేస్ వాక్), రామ్బాబూ, సందీప్ కుమార్ (35 కిలోమీటర్ల రేస్ వాక్). మహిళల విభాగం: అన్ను రాణి (జావెలిన్ త్రో), పారుల్ చౌధరీ, అంకిత దయాని (3000 మీటర్ల స్టీపుల్ఛేజ్), పూజ (800, 1500 మీటర్లు), ప్రియాంక గోస్వామి (35 కిలోమీటర్ల రేస్ వాక్).443 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ చరిత్రలో అమెరికా సాధించిన పతకాలు. ఇందులో 195 స్వర్ణాలు, 134 రజతాలు, 114 కాంస్యాలు ఉన్నాయి. ‘ఆల్టైమ్ పతకాల పట్టిక’లో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతుండగా... 171 పతకాలతో (65 స్వర్ణాలు, 58 రజతాలు, 48 కాంస్యాలు) కెన్యా రెండో స్థానంలో ఉంది.3 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత్కు లభించిన పతకాలు. 2003లో అంజూ జార్జి మహిళల లాంగ్జంప్లో కాంస్యం నెగ్గగా.. పురుషుల జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా 2022లో రజతం, 2023లో స్వర్ణం గెలిచాడు. ఆల్టైమ్ పతకాల పట్టికలో భారత్... బుర్కినఫాసో, ట్యునీసియాలతో కలిసి సంయుక్తంగా 65వ స్థానంలో ఉంది. -
సెమీస్లో సాత్విక్–చిరాగ్ జోడీ
హాంకాంగ్: ఈ ఏడాది తమ అద్భుత ఫామ్ కొనసాగిస్తూ... భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ఆరో టోర్నమెంట్లో సెమీఫైనల్కు దూసుకెళ్లింది. హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–14, 20–22, 21–16తో జునైది ఆరిఫ్–రాయ్ కింగ్ యాప్ (మలేసియా) జంటపై విజయం సాధించింది. 64 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో భారత జోడీకి గట్టిపోటీనే ఎదురైంది. తొలి గేమ్ నెగ్గిన భారత ద్వయం రెండో గేమ్లో తడబడింది. 16–20తో వెనుకబడిన దశలో ఒక్కసారిగా విజృంభించి వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి స్కోరును 20–20తో సమం చేసింది. అయితే మలేసియా జోడీ వరుసగా రెండు పాయింట్లు గెలిచి గేమ్ను సాధించి మ్యాచ్లో నిలిచింది. నిర్ణాయక మూడో గేమ్లో సాత్విక్–చిరాగ్ తమ వ్యూహాలను మార్చి ఆడి పైచేయి సాధించారు. స్కోరు 6–5 వద్ద సాత్విక్–చిరాగ్ వరుసగా నాలుగు పాయింట్లు సాధించి 10–5తో ముందంజ వేశారు. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని విజయాన్ని ఖాయం చేసుకున్నారు. లక్ష్య సేన్దే పైచేయి... పురుషుల సింగిల్స్ విభాగంలో భారత నంబర్వన్ లక్ష్య సేన్ సెమీఫైనల్లో అడుగు పెట్టాడు. భారత రెండో ర్యాంకర్ ఆయుశ్ శెట్టితో జరిగిన క్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ 66 నిమిషాల్లో 21–16, 17–21, 21–13తో విజయం సాధించి ఈ ఏడాది రెండో టోర్నీలో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. ఈ ఏడాది 13 టోర్నీల్లో ఆడిన లక్ష్య సేన్ మకావ్ ఓపెన్లో సెమీఫైనల్ చేరుకున్నాడు. -
‘పసిడి’ పోరుకు జైస్మీన్, నుపుర్
లివర్పూల్: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో మహిళా బాక్సర్లు నాలుగు పతకాలు ఖరారు చేసుకొని భారత్ పరువును నిలబెట్టారు. 57 కేజీల విభాగంలో జైస్మీన్ లంబోరియా, ప్లస్ 80 కేజీల విభాగంలో నుపుర్ షెరాన్ ఫైనల్లోకి దూసుకెళ్లి పసిడి పతకాలకు విజయం దూరంలో నిలిచారు. 48 కేజీల విభాగంలో మీనాక్షి హుడా సెమీఫైనల్లోకి ప్రవేశించి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. 80 కేజీల విభాగంలో ఇప్పటికే పూజా రాణి సెమీఫైనల్ చేరి పతకాన్ని ఖాయం చేసుకున్న సంగతి తెలిసిందే. శుక్రవారం జరిగిన 57 కేజీల విభాగం సెమీఫైనల్లో జైస్మీన్ 5–0తో అల్కాలా కరోలినా (వెనిజులా) ఘనవిజయం సాధించింది. ఫైనల్లో జూలియా జెరెమిటా (పోలాండ్)తో జైస్మీన్ తలపడుతుంది. అల్కాలాతో జరిగిన బౌట్లో జైస్మీన్ ఆద్యంతం ఆధిపత్యం కనబరిచింది. మూడు రౌండ్లలోనూ భారత బాక్సరే పైచేయి సాధించింది. ప్లస్ 80 కేజీల విభాగం సెమీఫైనల్లో నుపుర్ 5–0తో సేమా దుజ్టాస్ (టర్కీ)పై గెలుపొందింది. 48 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్లో మీనాక్షి 5–0తో అలైస్ పంఫేరి (ఇంగ్లండ్)పై నెగ్గింది. నేడు జరిగే సెమీఫైనల్లో లుట్సైఖాన్ (మంగోలియా)తో మీనాక్షి తలపడుతుంది. మరోవైపు పురుషుల విభాగంలో భారత్కు నిరాశ ఎదురైంది. 12 ఏళ్ల తర్వాత భారత పురుష బాక్సర్లు ప్రపంచ చాంపియన్షిప్ నుంచి రిక్తహస్తాలతో వెనుదిరిగారు. బరిలో మిగిలిన చివరి బాక్సర్ జాదూమణి సింగ్ (50 కేజీలు) కూడా ఓడిపోయాడు. క్వార్టర్ ఫైనల్లో జాదూమణి సింగ్ 0–4తో వరల్డ్ చాంపియన్ సంజార్ తషె్కన్బె (కజకిస్తాన్) చేతిలో పరాజయం పాలయ్యాడు. 2023 ప్రపంచ చాంపియన్షిప్లో భారత్కు మూడు కాంస్యాలు లభించాయి. -
బెంగళూరు బుల్స్ ‘హ్యాట్రిక్’ విజయం
జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో బెంగళూరు బుల్స్ జట్టు ‘హ్యాట్రిక్’ నమోదు చేసుకుంది. శుక్రవారం జరిగిన తొలి పోరులో బెంగళూరు బుల్స్ 28–23 పాయింట్ల తేడాతో మాజీ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్పై గెలుపొందింది. బెంగళూరు తరఫున అలీ రెజా 8 రెయిడ్ పాయింట్లతో సత్తా చాటగా... దీపక్ (5 పాయింట్లు), సత్యప్ప (4 పాయింట్లు) రాణించారు. జైపూర్ జట్టు తరఫున నితిన్ కుమార్ 8 పాయింట్లతో పోరాడినా ఫలితం లేకపోయింది. మరో మ్యాచ్లో తమిళ్ తలైవాస్ 46–36 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్పై విజయం సాధించింది. తలైవాస్ తరఫున అర్జున్ దేశ్వాల్ 17 పాయింట్లతో విజృంభించాడు. బెంగాల్ వారియర్స్ తరఫున దేవాంక్ 13 పాయింట్లతో పోరాడాడు. లీగ్లో భాగంగా నేడు యూపీ యోధాస్తో జైపూర్ పింక్ పాంథర్స్... పుణేరి పల్టన్తో తెలుగు టైటాన్స్ ఆడతాయి. -
భారత్ వర్సెస్ స్విట్జర్లాండ్
బీల్ (స్విట్జర్లాండ్): వచ్చే ఏడాది డేవిస్కప్ క్వాలిఫయర్స్లో చోటు కోసం భారత పురుషుల టెన్నిస్ జట్టు కీలకపోరుకు సిద్ధమైంది. శుక్రవారం నుంచి రెండు రోజులపాటు స్విట్జర్లాండ్ జట్టుతో వరల్డ్ గ్రూప్ తొలి రౌండ్లో భారత్ ఆడనుంది. ముఖాముఖి పోరులో భారత్ 2–1తో స్విట్జర్లాండ్పై ఆధిక్యంలో ఉంది. భారత్ తరఫున సింగిల్స్లో సుమిత్ నగాల్, దక్షిణేశ్వర్ సురేశ్, డబుల్స్లో హైదరాబాద్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ–శ్రీరామ్ బాలాజీ జోడీ బరిలోకి దిగనుంది. నేడు జరిగే రెండు సింగిల్స్ మ్యాచ్ల్లో జెరోమ్ కిమ్తో దక్షిణేశ్వర్ సురేశ్; మార్క్ ఆండ్రియా హుస్లెర్తో సుమిత్ నగాల్ తలపడతారు. శనివారం మూడు మ్యాచ్లు జరుగుతాయి. డబుల్స్ మ్యాచ్లో జాకబ్ పాల్–డొమినిక్ స్ట్రికర్ జంటతో రిత్విక్–శ్రీరామ్ బాలాజీ ద్వయం పోటీపడుతుంది. అనంతరం జెరోమ్ కిమ్తో నగాల్; హుస్లెర్తో సురేశ్ ఆడతారు. గురువారం ‘డ్రా’ కార్యక్రమం కంటే ముందు భారత టెన్నిస్ జట్టుకు స్విట్జర్లాండ్లోని భారత రాయబారి మృదుల్ కుమార్ సన్మానించారు. -
చైనా, ఉజ్బెక్ క్లబ్లతో ఈస్ట్ బెంగాల్ పోరు
న్యూఢిల్లీ: భారత ఫుట్బాల్ క్లబ్ ఈస్ట్ బెంగాల్ జట్టుకు ఏఎఫ్సీ మహిళల చాంపియన్షిప్ గ్రూప్ ‘బి’లో చోటు దక్కింది. కౌలాలంపూర్లో తీసిన ‘డ్రా’లో ఈస్ట్ బెంగాల్ మహిళల జట్టుకు ఒక రకంగా ఇది క్లిష్టమైన పోరే! ‘బి’ గ్రూపులో చైనా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్లకు చెందిన క్లబ్లతో ఈస్ట్ బెంగాల్ తలపడనుంది. ఈ సీజన్ భారత మహిళల లీగ్లో విజేతగా నిలువడం ద్వారా ఈస్ట్ బెంగాల్ ఎఫ్సీ ఏఎఫ్సీ మహిళల టోర్నీకి అర్హత సంపాదించింది.తెలంగాణకు చెందిన సౌమ్య గుగులోత్ ఈస్ట్ బెంగాల్కు టైటిల్ దక్కడంలో కీలకపాత్ర పోషించింది. వివిధ దేశాలకు చెందిన దేశవాళీ చాంపియన్లు ఈ టోర్నీలో పోటీ పడతాయి. మొత్తం 12 జట్లను మూడు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ‘బి’లో చైనాకు చెందిన వుహాన్ జియాంగ్దా, ఇరానీ చాంపియన్ బమ్ ఖటూన్, ఉజ్బెకిస్తాన్కు చెందిన పీఎఫ్సీ నసఫ్ మహిళల క్లబ్ జట్లు (డబ్ల్యూఎఫ్సీ) ఉన్నాయి. జియాంగ్లా ఐదుసార్లు చైనీస్ లీగ్లో విజేతగా నిలిచింది. బమ్ ఖటూన్ (ఇరాన్) అయితే ఏఎఫ్సీ టోర్నీకి అర్హత సాధించడం ఇది నాలుగోసారి. ఇక ఉజ్బెకిస్తాన్లో తిరుగులేని దేశవాళీ జట్టు పీఎఫ్సీ నసఫ్. ఈ జట్టు ఏకంగా 16 సార్లు అక్కడ విజేతగా నిలిచింది. ఇలాంటి ఘనాపాటిలతో భారత అమ్మాయిలు ఏ మేరకు తలపడతారో చూడాలి. నవంబర్లో జరిగే చాంపియన్స్ లీగ్ మ్యాచ్ల్లో ఈ మూడు జట్లతో ఈస్ట్ బెంగాల్ క్లబ్ తలపడుతుంది. ఒక్కో గ్రూప్ నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్ దశకు అర్హత సాధిస్తాయి.ఈ ఆరు జట్లతో పాటు మూడు గ్రూపుల్లో ఉన్న అత్యుత్తమ మూడో స్థానంలో ఉన్న మరో రెండు జట్లకు నాకౌట్ భాగ్యం దక్కుతుంది. వచ్చే ఏడాది మార్చిలో క్వార్టర్ ఫైనల్ పోటీలు, మే నెలలో సెమీస్ మ్యాచ్లు నిర్వహిస్తారు.ఈస్ట్ బెంగాల్ ఎఫ్సీ షెడ్యూల్ నవంబర్ 17: ఈస్ట్ బెంగాల్ X బమ్ ఖటూన్ ఎఫ్సీ (ఇరాన్ టీమ్) నవంబర్ 20: ఈస్ట్ బెంగాల్ X వుహాన్ జియాంగ్దా (చైనా టీమ్) నవంబర్ 23: ఈస్ట్ బెంగాల్ X పీఎఫ్సీ నసఫ్ (ఉజ్బెక్ టీమ్) -
భారత షూటర్లకు మళ్లీ నిరాశే
నింగ్బో (చైనా): భారత షూటర్ల నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు కూడా క్వాలిఫికేషన్ రౌండ్లలోనే గురి కుదరక పతకం బరికి దూరమవుతున్నారు. చైనాలో జరుగుతున్న అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచకప్లో గురువారం జరిగిన పోటీల్లో ఆంధ్రప్రదేశ్ షూటర్ మద్దినేని ఉమా మహేశ్ సహా దివ్యాన్‡్ష, రాహీ సర్నోబత్లు క్వాలిఫయింగ్లోనే వెనుదిరిగారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ క్వాలిఫికేషన్లో దివ్యాన్‡్ష 630 స్కోరుతో 19వ స్థానంలో నిలిచాడు. ఉమామహేశ్ 627.7 పాయింట్లు స్కోరు చేసి 39 స్థానంలో, మరో భారత మరో షూటర్ నీరజ్ కుమార్ (626.1) 54వ స్థానంలో నిలిచారు. మహిళల ర్యాపిడ్ ఫైర్ క్వాలిఫికేషన్లో అభిజ్ఞ అశోక్ పాటిల్ 583 స్కోరుతో 11వ స్థానంలో నిలిచింది. టీఎస్ దివ్య (581), ఒలింపియన్, ఆసియా క్రీడల చాంపియన్ రాహీ సర్నోబత్ (581)లు వరుసగా 16, 17 స్థానాలు పొందారు. ఇప్పుడిక భారత్ ఆశలన్నీ మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్పైనే ఉన్నాయి. మెహులీ ఘోష్, తెలంగాణ అమ్మాయి సురభి రాపోలు, మానిని కౌశిక్లు బరిలో ఉన్నారు. -
మళ్లీ ఓడిన గుకేశ్
సమర్కండ్ (ఉజ్బెకిస్తాన్): గ్రాండ్ స్విస్ అంతర్జాతీయ చెస్ టోర్నీ ఓపెన్ విభాగంలో ప్రపంచ చాంపియన్, భారత గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్కు వరుసగా మూడో పరాజయం ఎదురైంది. గురువారం జరిగిన ఏడో రౌండ్లో గుకేశ్ 52 ఎత్తుల్లో ఇదిజ్ గురెల్ (టర్కీ) చేతిలో ఓడిపోయాడు. ఐదో రౌండ్లో అభిమన్యు మిశ్రా (అమెరికా) చేతిలో, ఆరో రౌండ్లో నికోలస్ (గ్రీస్) చేతిలో ఓడిన గుకేశ్ ... ఏడో రౌండ్ తర్వాత మూడు పాయింట్లతో 84వ స్థానంలో ఉన్నాడు. మరోవైపు తెలంగాణ గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్ తొలి పరాజయాన్ని చవిచూశాడు. మథియాస్ బ్లూబామ్ (జర్మనీ)తో జరిగిన గేమ్లో అర్జున్ 51 ఎత్తుల్లో ఓడిపోయాడు. ఓపెన్ విభాగంలో పోటీపడుతున్న భారత మహిళా గ్రాండ్మాస్టర్ దివ్య దేశ్ముఖ్ రెండో విజయం అందుకుంది. ఇవిచ్ వెల్మిర్ (సెర్బియా)తో జరిగిన గేమ్లో దివ్య 49 ఎత్తుల్లో గెలిచింది. -
పూజా రాణికి పతకం ఖాయం
లివర్పూల్: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్ మహిళల విభాగంలో భారత్కు మూడో పతకం ఖాయమైంది. ఇప్పటికే నుపుర్ షెరాన్ (ప్లస్ 80 కేజీలు), జైస్మీన్ లంబోరియా (57 కేజీలు) సెమీఫైనల్కు చేరి కనీసం కాంస్య పతకాలు ఖాయం చేసుకోగా... 80 కేజీల విభాగంలో పూజా రాణి కూడా సెమీస్లో అడుగు పెట్టింది. తొలి రౌండ్లో ‘బై’ దక్కించుకున్న 34 ఏళ్ల పూజ క్వార్టర్ ఫైనల్లో 3:2 తేడాతో ఎమిలియా కొటెరస్కా (పోలాండ్)పై విజయం సాధించింది. సెమీఫైనల్లో ఎమిలీ అస్క్విత్ (స్విట్జర్లాండ్)తో పూజ తలపడనుంది. పురుషుల 65 కేజీల విభాగంలో అభినాశ్ జమ్వాల్ 1:4తో ఒలింపిక్ కాంస్య పతక విజేత లాషా గురులి (జార్జియా) చేతిలో ఓడాడు. ఇక భారత్ నుంచి జాదూమణి సింగ్ (48 కేజీలు), మీనాక్షి (48 కేజీలు) మాత్రమే పోటీలో ఉన్నారు. తాష్కెంట్లో జరిగిన గత ప్రపంచ చాంపియన్షిప్లో భారత్ నుంచి దీపక్ భోరియా (51 కేజీలు), హుసాముద్దీన్ (57 కేజీలు), నిశాంత్ దేవ్ (71 కేజీలు) కాంస్యాలు సాధించారు. -
దబంగ్ ఢిల్లీ ‘పాంచ్ పటాకా’
విశాఖ స్పోర్ట్స్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో దబంగ్ ఢిల్లీ జోరు కొనసాగుతోంది. సీజన్ ఆరంభం నుంచి పరాజయం ఎరగకుండా దూసుకెళ్తున్న దబంగ్ ఢిల్లీ వరుసగా ఐదో మ్యాచ్లోనూ నెగ్గింది. గురువారం జరిగిన పోరులో దబంగ్ ఢిల్లీ 38–28 పాయింట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్ను చిత్తు చేసింది. దీంతో ఆడిన అన్నీ మ్యాచ్ల్లో నెగ్గిన ఢిల్లీ 10 పాయింట్లతో పట్టిక అగ్రస్థానంలో కొనసాగుతోంది. కెప్టెన్ అశు మలిక్ 14 పాయింట్లతో ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అజింక్యా పవార్, ఫజల్ చెరో 5 పాయింట్లతో సారథికి అండగా నిలిచారు. రెయిడింగ్లో ఇరు జట్లు సమంగానే నిలిచినా... ట్యాక్లింగ్లో ఢిల్లీ 13 పాయింట్లు సొంతం చేసుకోగా... గుజరాత్ 5 పాయింట్లకే పరిమితమైంది. జెయింట్స్ తరఫున ప్రతీక్ 9 పాయింట్లతో పోరాడాడు. మరో మ్యాచ్లో యు ముంబా 40–39 పాయింట్ల తేడాతో పట్నా పైరెట్స్పై గెలిచింది. యు ముంబా తరఫున అమీర్ మొహమ్మద్ 12 పాయింట్లు, అనిల్ 9 పాయింట్లు సాధించారు. పట్నా తరఫున అయాన్ 21 పాయింట్లతో ఒంటరి పోరాటం చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. గురువారంతో విశాఖపట్నం అంచె పోటీలు ముగియగా... నేటి నుంచి జైపూర్ వేదికగా టోర్నీ కొనసాగుతుంది. ఈ రోజు మ్యాచ్ల్లో జైపూర్ పింక్ పాంథర్స్తో బెంగళూరు బుల్స్... తమిళ్ తలైవాస్తో బెంగాల్ వారియర్స్ తలపడతాయి. -
ఆయుశ్ సంచలనం
హాంకాంగ్: భారత బ్యాడ్మింటన్ రైజింగ్ స్టార్ ఆయుశ్ శెట్టి హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో సంచలనం సృష్టించాడు. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్, 2023 ప్రపంచ చాంపియన్షిప్ రన్నరప్ కొడాయ్ నరోకా (జపాన్)ను బోల్తా కొట్టించాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 31వ ర్యాంకర్ ఆయుశ్ 72 నిమిషాల్లో 21–19, 12–21, 21–14తో ఐదో సీడ్ నరోకాను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. భారత నంబర్వన్ లక్ష్య సేన్ కూడా క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. సహచరుడు హెచ్ఎస్ ప్రణయ్తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ 15–21, 21–18, 21–10తో గెలుపొంది క్వార్టర్ ఫైనల్లో ఆయుశ్ శెట్టితో తలపడేందుకు సిద్ధమయ్యాడు. మరో మ్యాచ్లో కిరణ్ జార్జి (భారత్) 6–21, 12–21తో చౌ టియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 18–21, 21–15, 21–11తో పిరత్చాయ్ సుఖ్ఫున్–పకాపోన్ తీరత్సాకుల్ (థాయ్లాండ్) జంటపై గెలిచి క్వార్టర్ ఫైనల్ చేరింది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రుతపర్ణ–శ్వేతాపర్ణ (భారత్) జోడీ 13–21, 7–21తో లి యి జింగ్–లువో జు మిన్ (చైనా) జంట చేతిలో ఓడిపోయింది. -
బ్యాడ్మింటన్లో తెలంగాణ అమ్మాయికి రజతం
గ్వాటెమాల అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయి రూహి రాజు సత్తా చాటింది. ఈ టోర్నీలో రన్నరప్గా నిలిచిన 22 ఏళ్ల రూహి రజత పతకాన్ని సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన ఫైనల్లో కొలంబియాకు చెందిన జూలియానా గిరాల్డో చేతిలో 10-21, 15-21 తేడాతో ఆమె ఓటమి చవిచూసింది.అన్సీడెడ్ ప్లేయర్గా ఈ ఈవెంట్లోకి అడుగుపెట్టిన రూహి రాజు.. క్వార్టర్ ఫైనల్లో గ్వాటెమాలకు చెందిన టాప్ సీడ్ నైక్ సోటోమేయర్ను 21-23, 21-19, 21-16 తేడాతో ఓడించింది. ఆతర్వాత హైదరాబాద్ అమ్మాయి సెమీఫైనల్లో పెరూ స్టార్ మియాహిరాపై 21-18, 21-17 తేడాతో విజయం సాధించింది.కానీ టోర్నీ అసాంతం అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన రూహి రాజు.. ఆఖరి మొట్టుపై మాత్రం బోల్తా పడింది. రూహి రాజు గతంలో సుచిత్ర బ్యాడ్మింటన్ అకాడమీ ప్రధాన కోచ్, వ్యవస్థాపకుడు ప్రదీప్ రాజు వద్ద శిక్షణ తీసుకుంది. -
సింధుకు షాక్
హాంకాంగ్: ఈ ఏడాది తొలి టైటిల్ కోసం భారత స్టార్ ప్లేయర్ పీవీ సింధు వేట ఇంకా కొనసాగనుంది. హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ –500 బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రపంచ 14వ ర్యాంకర్ సింధు తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. ప్రపంచ 27వ ర్యాంకర్, అన్సీడెడ్ లినె క్రిస్టోఫర్సన్ (డెన్మార్క్)తో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 21–15, 16–21, 19–21తో ఓటమి పాలైంది. గతంలో లినె క్రిస్టోఫర్సన్తో ఆడిన ఐదుసార్లూ విజయం సాధించిన సింధు ఆరోసారి మాత్రం ఓటమి తప్పలేదు. 58 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సింధు నిర్ణాయక మూడో గేమ్లో 16–13తో, 17–15తో ఆధిక్యంలోకి వెళ్లి విజయం దిశగా సాగింది. ఈ కీలక తరుణంలో సింధు అనవసర తప్పిదాలు చేయడం... 15–17తో వెనుకబడిన లినె వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి ఒక్కసారిగా 19–17తో ముందంజ వేసింది. ఆ తర్వాత సింధు ఒక పాయింట్ గెలిచినా... ఆ వెంటనే లినె రెండు పాయింట్లు నెగ్గి తన కెరీర్లో తొలిసారి భారత స్టార్పై విజయాన్ని ఖాయం చేసుకుంది. భారత్కే చెందిన అనుపమ, రక్షిత శ్రీ కూడా తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. అనుపమ 17– 21, 22–20, 14–21తో తొమ్మిదో ర్యాంకర్ టొమోకా మియకాజి (జపాన్) చేతిలో, రక్షిత శ్రీ 13–21, 7–21తో ప్రపంచ మాజీ చాంపియన్ రచనోక్ (థాయ్లాండ్) చేతిలో ఓడిపోయారు. లక్ష్య సేన్, ప్రణయ్ ముందంజ పురుషుల సింగిల్స్ విభాగంలో బరిలోకి దిగిన నలుగురు భారత క్రీడాకారులు లక్ష్య సేన్, ప్రణయ్, కిరణ్ జార్జి, ఆయుశ్ శెట్టి శుభారంభం చేశారు. తొలి రౌండ్ మ్యాచ్ల్లో లక్ష్య సేన్ 22–20, 16–21, 21–15తో వాంగ్ జు వె (చైనీస్ తైపీ)పై, ప్రణయ్ 21–17, 21–14తో లు గ్వాంగ్ జు (చైనా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లో ముఖాముఖి పోరుకు సిద్ధమయ్యారు. కిరణ్ జార్జి 21–16, 21–11తో జియా హెంగ్ జేసన్ (సింగపూర్)పై, ఆయుశ్ 15–21, 21–19, 21–13తో సు లి యాంగ్ (చైనీస్ తైపీ)లపై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్నారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో రుతపర్ణ–శ్వేతాపర్ణ (భారత్) ద్వయం 21–17, 21–9తో పాంగ్ వనెస్సా–వాంగ్ సమ్ (హాంకాంగ్) జంటను ఓడించింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో గద్దె రుత్విక శివాని–రోహన్ (భారత్) జోడీ 14–21, 17–21తో ప్రపంచ రెండో ర్యాంక్ జంట ఫెంగ్ యాన్ జె–హువాంగ్ డాంగ్ పింగ్ (చైనా) చేతిలో... తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల (భారత్) ద్వయం 16– 21, 11–21తో చెన్ చెంగ్ కువాన్–సు యిన్ హుయ్ (చైనీస్ తైపీ) జంట చేతిలో ఓడిపోయాయి. -
తెలుగు టైటాన్స్ ‘హ్యాట్రిక్’
విశాఖ స్పోర్ట్స్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) సీజన్–12లో తెలుగు టైటాన్స్ వరుసగా మూడో విజయంతో సత్తా చాటింది. హోం గ్రౌండ్లో ఐదు మ్యాచ్లు ఆడిన తెలుగు టైటాన్స్ తొలి రెండు మ్యాచ్లలో ఓడినా...ఇప్పుడు ‘హ్యాట్రిక్’ విజయంతో వైజాగ్ అంచెను ముగించింది. బుధవారం జరిగిన పోరులో టైటాన్స్ 45–37 స్కోరుతో యు ముంబాను చిత్తు చేసింది. టైటాన్స్ తరఫున భరత్ హుడా 13 పాయింట్లతో చెలరేగగా... చేతన్ సాహు 6, కెపె్టన్ విజయ్ మలిక్ 5 పాయింట్లతో అతనికి సహకరించారు. చివరి 10 నిమిషాల్లో కాస్త పోరాడిన ముంబా ప్రత్యర్థిని ‘ఆలౌట్’ చేయగలిగినా పాయింట్ల అంతరం మాత్రమే తగ్గించ గలిగింది. ముంబా ఆటగాళ్లలో సందీప్, ఆమిర్ మొహమ్మద్ చెరో 7 పాయింట్లు సాధించారు.మరో మ్యాచ్లో పుణేరీ పల్టన్ 43–32 తేడాతో యూపీ యోధాస్పై గెలిచిది. నేడు జరిగే మ్యాచ్లలో యు ముంబాతో పట్నా పైరేట్స్, దబంగ్ ఢిల్లీతో గుజరాత్ జెయింట్స్ తలపడతాయి. తొలి 28 మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చిన విశాఖపట్నంలో నేటితో పీకేఎల్ పోటీలు ముగియనున్నాయి. రేపటి నుంచి జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ ఇండోర్ స్టేడియం వేదికగా టోర్నీ కొనసాగుతుంది. -
పాకిస్తాన్కు ఆహ్వానం పంపిన హాకీ ఇండియా
చెన్నై: పురుషుల జూనియర్ హాకీ ప్రపంచకప్లో యువ భారత జట్టు తొలి మ్యాచ్లో చిలీ జట్టుతో తలపడనుంది. చెన్నై, మదురై వేదికగా మొత్తం 24 దేశాల మధ్య ఈ ఏడాది నవంబర్ 28 నుంచి డిసెంబర్ 10 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ను మంగళవారం విడుదల చేశారు. పాకిస్తాన్, చిలీ, స్విట్జర్లాండ్తో కలిసి భారత జట్టు పూల్ ‘బి’ నుంచి పోటీపడుతుంది.ఇక టోర్నీ ఆరంభ రోజే చిలీతో భారత్ మ్యాచ్ జరగనుంది. మరుసటి రోజు పాకిస్తాన్తో... డిసెంబర్ 2న స్విట్జర్లాండ్ భారత్ మ్యాచ్లు ఆడనుంది. షెడ్యూల్ విడుదల కార్యక్రమంలో అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్షుడు తయ్యబ్ ఇక్రామ్, హాకీ ఇండియా (హెచ్ఐ) కార్యదర్శి భోళానాథ్ సింగ్, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు. పాకిస్తాన్ జట్టుకు ఆహ్వానం పంపాంఅయితే ఈ టోర్నీలో పాల్గొనేందుకు పాకిస్తాన్ హాకీ జట్టు... భారత్కు వస్తుందా లేదా అనే అంశంపై మాత్రం స్పష్టత లోపించింది. ఆతిథ్య హోదాలో హాకీ ఇండియా అన్నీ ఏర్పాట్లు చేస్తోంది.‘పాకిస్తాన్ జట్టుకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నాం. ఆసియా కప్ సమయంలో కూడా పాకిస్తాన్ జట్టుకు ఆహ్వానం పంపాం. కానీ భద్రతా కారణాల దృష్ట్యా వారు రాలేదు. జూనియర్ ప్రపంచకప్నకు సైతం మా నుంచి అధికారిక ఆహ్వానం పంపించాం’ అని హాకీ ఇండియా అధ్యక్షుడు దిలిప్ టిర్కీ అన్నారు. చదవండి: Asia Cup 2025: భారత్-పాక్ మ్యాచ్ టికెట్లు ఇంకా అమ్ముడుపోలేదు.. ఆసక్తి తగ్గిందా..? ఆగ్రహమా..? -
దబంగ్ ఢిల్లీ దూకుడు
విశాఖ స్పోర్ట్స్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో దబంగ్ ఢిల్లీ జోరు కొనసాగుతోంది. తిరుగులేని ప్రదర్శనతో దూసుకెళ్తున్న దబంగ్ ఢిల్లీ లీగ్లో వరుసగా నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది. మంగళవారం జరిగిన తొలి పోరులో దబంగ్ ఢిల్లీ 45–34 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్పై సునాయాస విజయం సాధించింది. కెపె్టన్ అశు మలిక్ 16 పాయింట్లతో విజృంభించగా... అజింక్య పవార్ (8 పాయింట్లు), నీరజ్ నర్వాల్ (6 పాయింట్లు) సారథికి సహకరించారు.బెంగాల్ వారియర్స్ కెపె్టన్ దేవాంక్ 12 పాయింట్లు సాధించగా... విశ్వాస్ 9 పాయింట్లతో పోరాడాడు. అయితే మ్యాచ్ ఆరంభంలోనే దబంగ్ ఢిల్లీ ఆధిక్యం సాధించింది. నీరజ్, అజింక్య సూపర్ రెయిడ్లతో ఢిల్లీ జట్టు వరుస పాయింట్లు సాధించగా... ఆ తర్వాత అశు చెలరేగిపోయాడు. ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిచిన దబంగ్ ఢిల్లీ 8 పాయింట్లతో పట్టిక అగ్రస్థానంలో కొనసాగుతోంది. బెంగాల్ వారియర్స్ 4 మ్యాచ్లాడి ఒక విజయం, 3 పరాజయాలతో 2 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక అట్టడుగున ఉంది. మరో మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు ‘గోల్డెన్ రైడ్’లో గుజరాత్ జెయింట్స్పై విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య జరిగిన పోరు నిర్ణీత సమయంలో 30–30 పాయింట్లతో సమం కాగా... విజేతను నిర్ణయించేందుకు ‘గోల్డెన్ రైడ్’ నిర్వహించాల్సి వచ్చింది. మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ తరఫున నితిన్ కుమార్ 15 పాయింట్లతో సత్తా చాటగా... గుజరాత్ జెయింట్స్ తరఫున రాకేశ్ 11 పాయింట్లు సాధించాడు. నేడు జరిగే మ్యాచ్ల్లో యు ముంబాతో తెలుగు టైటాన్స్... యూపీ యోధాస్తో పుణేరి పల్టన్ తలపడనున్నాయి. -
పతకానికి విజయం దూరంలో నిఖత్ జరీన్
లివర్పూల్: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత స్టార్, రెండుసార్లు విశ్వవిజేత నిఖత్ జరీన్ మూడో పతకానికి విజయం దూరంలో నిలిచింది. ఇంగ్లండ్లో జరుగుతున్న ఈ మెగా టోర్నీలో తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్ 51 కేజీల విభాగంలో క్వార్టర్ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో నిఖత్ 5:0తో జపాన్కు చెందిన యునా నిషినాకాపై విజయం సాధించింది. 29 ఏళ్ల నిఖత్ 2022, 2023 ప్రపంచ చాంపియన్షిప్లలో స్వర్ణ పతకాలు గెలిచింది. మరోవైపు 48 కేజీల విభాగంలో మీనాక్షి హుడా కూడా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించి పతకానికి గెలుపు దూరంలో నిలిచింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో మీనాక్షి 5:0తో వాంగ్ కియుపింగ్ (చైనా)పై గెలుపొందింది. పురుషుల విభాగంలో భారత బాక్సర్లు సుమిత్ కుందు (75 కేజీలు), సచిన్ సివాచ్ (60 కేజీలు), నరేందర్ (ప్లస్ 90 కేజీలు), లక్ష్య చహర్ (80 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగారు. సుమిత్ 0:5తో రామి కివాన్ (బల్గేరియా) చేతిలో, సచిన్ 1:4తో బిబార్స్ జెక్సన్ (కజకిస్తాన్) చేతిలో, నరేందర్ 1:4తో డీగో లెంజీ (ఇటలీ) చేతిలో, లక్ష్య చహర్ 0:3తో సీజర్ యోజెర్లిన్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయారు. పురుషుల విభాగంలో భారత్ నుంచి ప్రస్తుతం ఇద్దరు బాక్సర్లు మాత్రమే బరిలో మిగిలారు -
ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ
హాంకాంగ్: భారత డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–13, 18–21, 21–10తో చియు సియాంగ్ చియె–వాంగ్ చి లిన్ (చైనీస్ తైపీ) జంటపై విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరుకుంది. పురుషుల సింగిల్స్ విభాగంలో కిరణ్ జార్జి (భారత్) మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. క్వాలిఫయింగ్ మ్యాచ్ల్లో కిరణ్ జార్జి 21–14, 21–13తో చియెమ్ జూన్ వె (మలేసియా)పై, 21–18, 21–14తో శంకర్ ముత్తుస్వామి (భారత్)లపై గెలుపొందాడు. మరోవైపు హైదరాబాద్ ప్లేయర్ తరుణ్ మన్నేపల్లి మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందలేకపోయాడు. క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో తరుణ్ 28–26, 21–13తో ప్రపంచ మాజీ నంబర్వన్, భారత్కే చెందిన కిడాంబి శ్రీకాంత్ను ఓడించి... రెండో రౌండ్లో 23–21, 13–21, 18–21తో జస్టిన్ హో (మలేసియా) చేతిలో ఓడిపోయాడు. -
బెంగళూరు బుల్స్కు రెండో విజయం
విశాఖ స్పోర్ట్స్: ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్లో మాజీ చాంపియన్ బెంగళూరు బుల్స్ ఖాతాలో రెండో విజయం చేరింది. హరియాణా స్టీలర్స్తో సోమవారం ఆసక్తికరంగా సాగిన మ్యాచ్లో బెంగళూరు బుల్స్ 40–33 పాయింట్ల తేడాతో గెలుపొందింది. బెంగళూరు తరఫున అలీ రెజా 12 పాయింట్లు సాధించగా, యోగేశ్ 6 పాయింట్లు సాధించాడు. హరియాణా ఆటగాళ్లలో శివమ్ పటారే 7, మయాంక్ సైనీ 6 పాయింట్లతో రాణించారు. మరోవైపు మూడుసార్లు చాంపియన్ పట్నా పైరేట్స్ ఎట్టకేలకు గెలుపు బోణీ చేసింది. మూడు పరాజయాల తర్వాత ఆ జట్టు తొలి విజయాన్ని అందుకుంది. పుణేరి పల్టన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో పట్నా పైరేట్స్ 48–37 పాయింట్ల తేడాతో నెగ్గింది. పైరేట్స్ రెయిడర్ అయాన్ లోచబ్ ఒంటి చేత్తో జట్టును గెలిపించాడు. అయాన్ ఒక్కడే 21 పాయింట్లు సాధించడం విశేషం. తొలి అర్ధ భాగంలోనే అయాన్ ‘సూపర్ 10’ సహా ప్రత్యర్థిని రెండు సార్లు ఆలౌట్ చేసిన పట్నా 27–10 తేడాతో ముందంజలో నిలిచింది. రెండో అర్ధభాగంలో సమష్టితత్వంతో కోలుకున్న పుణేరి పదునైన ఆటతో చెలరేగినా భారీ వ్యత్యాసాన్ని తగ్గించలేకపోయింది. పైరేట్స్ను రెండుసార్లు ఆలౌట్ చేసి రెండో అర్ధభాగంలో 27–21తో పైచేయి సాధించినా తుది ఫలితంలో మాత్రం 11 పాయింట్ల తేడాతో నిరాశ తప్పలేదు. పుణేరి తరఫున సచిన్ 6, అభిషేక్ గున్గే 5 పాయింట్లు నమోదు చేశారు. నేడు జరిగే మ్యాచ్లలో దబంగ్ ఢిల్లీతో బెంగాల్ వారియర్స్...గుజరాత్ జెయింట్స్తో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడతాయి. -
జోరు కొనసాగించాలని...
హాంకాంగ్: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో తాజా కాంస్య పతకంతో జోరు మీదున్న భారత అగ్రశ్రేణి డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి హంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. పురుషుల డబుల్స్లో ప్రపంచ మూడో ర్యాంకు ద్వయం ఇటీవల పారిస్లో జరిగిన ఈవెంట్లో సత్తా చాటుకుంది. భారత బ్యాడ్మింటన్లోనే అత్యంత నిలకడైన షట్లర్లుగా ఖ్యాతి గాంచిన వీరిద్దరు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) టూర్ ఈవెంట్లలో సెమీఫైనల్, ఫైనల్స్ చేరారు. ఇండియా ఓపెన్ సహా మలేసియా, చైనా, సింగపూర్ టోర్నీల్లో రాణించిన సాత్విక్–చిరాగ్ జంటకు హాంకాంగ్ టోర్నీలో ఎనిమిదో సీడ్ కేటాయించారు. పురుషుల డబుల్స్ తొలి మ్యాచ్లో ఎనిమిదో సీడ్ భారత జోడీ తొలి రౌండ్లో చైనీస్ తైపీకి చెందిన చియు హియాంగ్–వాంగ్ చి లిన్ జంటతో తలపడనుంది. సింధు సత్తా చాటేనా! రెండు వరుస ఒలింపిక్ పతకాల విజేత, భారత స్టార్ పీవీ సింధు ఇటీవల జరిగిన ప్రపంచ చాంపియన్íÙప్లో క్వార్టర్ ఫైనల్ చేరింది. ఈ పయనంలో ఆమె తనకన్నా ర్యాంకింగ్లో మెరుగైనా చైనా సూపర్స్టార్ వాంగ్ జి యిని కంగుతినిపించి తన పూర్వ వైభవాన్ని చాటుకుంది. ఇప్పుడు ఇదే ఉత్సాహంతో హాంకాంగ్ టోర్నీపై కన్నేసింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఈ ఆంధ్రప్రదేశ్ షట్లర్ డెన్మార్క్ ప్లేయర్ లినె క్రిస్టోఫెర్సన్తో తలపడుతుంది. ఆమెతో పాటు మహిళల సింగిల్స్లో అనుపమ, రక్షిత శ్రీలు బరిలో ఉన్నారు. పురుషుల సింగిల్స్లో భారత మేటి ఆటగాడు లక్ష్యసేన్ తన ఫామ్ను అందిపుచ్చుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ టోర్నీని సానుకూలంగా మలచుకోవాలని ఆశిస్తున్నాడు. తొలి రౌండ్లో అతను వాంగ్ జు వీ (చైనీస్ తైపీ)ను ఎదుర్కోనున్నాడు. యూఎస్ ఓపెన్ చాంపియన్ ఆయుశ్ షెట్టి... లూ గ్వాంగ్ జు (చైనా)తో, ప్రణయ్... ఐదో సీడ్ కొడాయ్ నరొకా (జపాన్)తో పోటీపడనున్నారు. ప్రపంచ మాజీ నంబర్వన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్, తరుణ్ మన్నేపల్లి క్వాలిఫయర్స్లో తలపడనున్నారు. పురుషుల డబుల్స్లో హరిహరన్–రూబన్ కుమార్, మహిళల డబుల్స్లో రుతపర్ణ–శ్వేతపర్ణ జోడీలు బరిలోకి దిగుతున్నాయి. మిక్స్డ్ డబుల్స్లో హైదరాబాద్కు చెందిన గద్దె రుతి్వక శివాని... రోహన్ కపూర్తో జోడీ కట్టింది. -
భారత్కు మూడో స్థానం
హిసోర్ (తజికిస్తాన్): సెంట్రల్ ఏషియన్ ఫుట్బాల్ అసోసియేషన్స్ (సీఏఎఫ్ఏ) నేషన్స్ కప్ టోర్నీలో భారత జట్టుకు మూడో స్థానం లభించింది. ఒమన్ జట్టుతో సోమవారం జరిగిన వర్గీకరణ మ్యాచ్లో భారత్ ‘షూటౌట్’లో 3–2తో విజయం సాధించింది. అంతర్జాతీయ స్థాయిలో ఒమన్ జట్టుపై భారత్కిదే తొలి గెలుపు కావడం విశేషం. నిరీ్ణత సమయం ముగిసేసరికి రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. ఒమన్ తరఫున జమీల్ (55వ నిమిషంలో) గోల్ చేయగా... 80వ నిమిషంలో ఉదాంత సింగ్ గోల్తో భారత్ స్కోరును సమం చేసింది. ‘షూటౌట్’లో ఒమన్ ఆటగాళ్లు తొలి రెండు షాట్లను వృథా చేయగా... చివరిదైన ఐదో షాట్ను భారత గోల్కీపర్ గుర్ప్రీత్ సింగ్ సంధూ నిలువరించి జట్టును గెలిపించాడు. భారత్ తరఫున లాలియన్జువాలా, రాహుల్ భెకె, జితిన్ గోల్స్ చేయగా... అన్వర్ అలీ, ఉదాంత సింగ్ గురి తప్పారు. -
గుకేశ్కు అభిమన్యు షాక్
సమర్కండ్ (ఉజ్బెకిస్తాన్): అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) గ్రాండ్ స్విస్ టోర్నీలో సోమవారం సంచలనం చోటు చేసుకుంది. ఐదో రౌండ్లో భారత గ్రాండ్మాస్టర్, ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్కు అనూహ్య పరాజయం ఎదురైంది. భారత సంతతికి చెందిన అమెరికా గ్రాండ్మాస్టర్, 16 ఏళ్ల అభిమన్యు మిశ్రా 61 ఎత్తుల్లో గుకేశ్ను ఓడించాడు. మరో గేమ్లో టాప్ సీడ్, భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద 55 ఎత్తుల్లో మథియాస్ బ్లూబామ్ (జర్మనీ) చేతిలో ఓటమి పాలయ్యాడు. తెలంగాణ గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్ 37 ఎత్తుల్లో నికిత వితియుగోవ్ (ఇంగ్లండ్)పై గెలుపొందాడు. ఈ టోర్నీలో మూడు గేముల్లో నెగ్గి, రెండు గేమ్లను ‘డ్రా’ చేసుకున్న అర్జున్ మరో ముగ్గురితో కలిసి ఉమ్మడిగా రెండో స్థానంలో ఉన్నాడు. -
అల్కరాజ్ ‘సిక్సర్’
న్యూయార్క్: మూడు నెలల వ్యవధిలో మూడోసారి చిరకాల ప్రత్యర్థులు కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్), యానిక్ సినెర్ (ఇటలీ) మధ్య ‘గ్రాండ్స్లామ్ ఫైనల్’ సమరం... ప్రతి పాయింట్కూ హోరాహోరీ తప్పదని... ఐదు సెట్ల పోరు ఖాయమని అభిమానులు భావించారు. కానీ అల్కరాజ్ అలాంటి అవకాశం ఇవ్వలేదు. 2 గంటల 42 నిమిషాల్లో డిఫెండింగ్ చాంపియన్ సినెర్ను 6–2, 3–6, 6–1, 6–4తో ఓడించి రెండోసారి యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను దక్కించుకున్నాడు. విజేత అల్కరాజ్కు 50 లక్షల డాలర్లు (రూ. 44 కోట్ల 11 లక్షలు), రన్నరప్ సినెర్కు 25 లక్షల డాలర్లు (రూ. 22 కోట్ల 5 లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి. తాజా విజయంతో అల్కరాజ్ రెండేళ్ల తర్వాత మళ్లీ ప్రపంచ నంబర్వన్ ర్యాంక్నూ అందుకున్నాడు. ఇప్పటికే అల్కరాజ్ రెండుసార్లు చొప్పున ఫ్రెంచ్ ఓపెన్ (2024, 2025), వింబుల్డన్ (2023, 2024), యూఎస్ ఓపెన్ (2022, 2025) టైటిల్స్ నెగ్గాడు. రెండు బ్రేక్ పాయింట్లతో... ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో ఐదు సెట్లలో సినెర్ను ఓడించిన అల్కరాజ్... వింబుల్డన్ టోర్నీ ఫైనల్లో నాలుగు సెట్లలో సినెర్ చేతిలో ఓడిపోయాడు. ఈ నేపథ్యంలో యూఎస్ ఓపెన్ తుదిపోరుపై అందరికీ ఆసక్తి ఏర్పడింది. అయితే ఒక్క సెట్ కూడా కోల్పోకుండా ఫైనల్ చేరిన అల్కరాజ్ తొలి గేమ్ నుంచే తన జోరు కనబరిచాడు. రెండో గేమ్లో, ఏడో గేమ్లో సినెర్ సర్వీస్ను బ్రేక్ చేసిన అల్కరాజ్ తొలి సెట్ను సొంతం చేసుకున్నాడు. రెండో సెట్లో సినెర్ పుంజుకున్నాడు. నాలుగో గేమ్లో అల్కరాజ్ సర్వీస్ను బ్రేక్ చేసి తన సర్వీస్లను నిలబెట్టుకొని సెట్ను గెల్చుకున్నాడు. ఇక మూడో సెట్లో అల్కరాజ్ అసాధారణ ప్రదర్శన ముందు సినెర్ తేలిపోయాడు. 5–0తో ఆధిక్యంలోకి వెళ్లిన అల్కరాజ్ ఆ తర్వాత ఒక గేమ్ కోల్పోయి సెట్ను దక్కించుకున్నాడు. నాలుగో సెట్ పోటాపోటీగా సాగినా ఐదో గేమ్లో సినెర్ సర్వీస్ను బ్రేక్ చేసిన అల్కరాజ్ ఆ తర్వాత తన సర్వీస్లను కాపాడుకొని విజయాన్ని ఖాయం చేసుకున్నాడు.2 అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ర్యాంకింగ్స్ మొదలయ్యాక (1973లో) ఒకే సీజన్లో రెండు గ్రాండ్స్లామ్ టోర్నీ ఫైనల్స్లో వరల్డ్ నంబర్వన్ను ఓడించిన రెండో ప్లేయర్గా అల్కరాజ్ గుర్తింపు పొందాడు. ఇంతకుముందు రాఫెల్ నాదల్ మాత్రమే ఈ ఘనత సాధించాడు. 2008లో నాదల్ ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టోర్నీ ఫైనల్స్లో నాటి నంబర్వన్ ఫెడరర్ (స్విట్జర్లాండ్)పై గెలిచి విజేతగా నిలిచాడు.2 జాన్ బోర్గ్ (స్వీడన్ –7 టైటిల్స్) తర్వాత 23 ఏళ్ల లోపే ఆరు గ్రాండ్స్లామ్ టైటిల్స్ నెగ్గిన రెండో ప్లేయర్గా అల్కరాజ్ (22 ఏళ్ల 111 రోజులు) నిలిచాడు.1 మూడు వేర్వేరు కోర్టులపై (హార్డ్, క్లే, గ్రాస్) రెండుసార్లు చొప్పున గ్రాండ్స్లామ్ టైటిల్స్ నెగ్గిన అతిపిన్న వయస్కుడిగా అల్కరాజ్ గుర్తింపు పొందాడు.6 అల్కరాజ్ కెరీర్లో నెగ్గిన గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్స్. ఓపెన్ శకంలో (1968 నుంచి) కనీసం ఆరు గ్రాండ్స్లామ్ టైటిల్స్ నెగ్గిన క్రీడా కారుల జాబితాలో స్టీఫెన్ ఎడ్బర్గ్ (స్వీడన్), బోరిస్ బెకర్ (జర్మనీ) సరసన అల్కరాజ్ చేరాడు. ఈ జాబితాలో జొకోవిచ్ (24), నాదల్ (22), ఫెడరర్ (20), సంప్రాస్ (14), జాన్ బోర్గ్ (11), జిమ్మీ కానర్స్, ఇవాన్ లెండిల్, అగస్సీ (8 చొప్పున), విలాండర్, జాన్ మెకన్రో (7 చొప్పున) ముందున్నారు. -
సింగపూర్పై 12–0తో గెలిచి ‘సూపర్–4’ దశకు భారత్
హాంగ్జౌ (చైనా): ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్ లీగ్ దశను భారత జట్టు అజేయంగా ముగించింది. సింగపూర్ జట్టుతో సోమవారం జరిగిన పూల్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్లో భారత్ 12–0 గోల్స్తో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నవ్నీత్ కౌర్ (14వ, 20వ, 28వ నిమిషాల్లో), ముంతాజ్ ఖాన్ (2వ, 32వ, 39వ నిమిషాల్లో) మూడు గోల్స్ చొప్పున చేశారు. నేహా (11వ, 38వ నిమిషాల్లో) రెండు గోల్స్ సాధించింది. లాల్రెమ్సియామి (13వ నిమిషంలో), ఉదిత (29వ నిమిషంలో), షరి్మలా (45వ నిమిషంలో), రుతుజా (53వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. థాయ్లాండ్తో జరిగిన తొలి మ్యాచ్లో 11–0తో నెగ్గిన భారత్... జపాన్తో రెండో మ్యాచ్ను 2–2తో ‘డ్రా’ చేసుకుంది. పూల్ ‘బి’లో భారత్, జపాన్ జట్లు ఏడు పాయింట్లతో సమంగా నిలిచినా... ఎక్కువ గోల్స్ చేసిన భారత్కు అగ్రస్థానం ఖాయమైంది. జపాన్కు రెండో స్థానం దక్కింది. పూల్ ‘బి’ నుంచి భారత్, జపాన్... పూల్ ‘ఎ’ నుంచి చైనా, దక్షిణ కొరియా జట్లు ‘సూపర్–4’ దశకు అర్హత సాధించాయి. బుధవారం జరిగే ‘సూపర్–4’ మ్యాచ్ల్లో కొరియాతో భారత్; జపాన్తో చైనా తలపడతాయి. ‘సూపర్–4’ మ్యాచ్లు ముగిశాక తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్కు అర్హత పొందుతాయి. విజేత జట్టు వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్ టోరీ్నకి అర్హత సాధిస్తుంది. -
మానవ శక్తికి కొత్త నిర్వచనం.. 510 కిలోల బరువును సునాయాసంగా ఎత్తేశాడు..!
ఐస్లాండ్కు చెందిన ప్రఖ్యాత స్ట్రాంగ్మాన్ హాఫ్థోర్ బ్జోర్న్సన్ (Hafthor Bjornsson) మానవ శక్తికి కొత్త నిర్వచనం చెప్పాడు. బర్మింగ్హమ్లో జరిగిన 2025 వరల్డ్ డెడ్లిఫ్ట్ ఛాంపియన్షిప్లో ఊహకందని విధంగా 510 కిలో బరువు (1,124.4 పౌండ్లు) ఎత్తాడు. ఈ క్రమంలో తన పేరిటే ఉండిన ప్రపంచ రికార్డును (505 కిలోలు) తిరగరాశాడు. బ్జోర్న్సన్ 500 కిలోలకు పైగా డెడ్లిఫ్ట్ చేయడం ఇది మూడోసారి. 2020లో 501 కిలోలు, 2025 జులై 505 కిలోల బరువులు ఎత్తాడు. తాజా ఉదంతంతో బ్జోర్న్సన్ మానవ శక్తి సామర్థ్యానికి కొత్త ప్రమాణాన్ని స్థాపించాడు. అతని శ్రమ, పట్టుదల, శరీర సామర్థ్యం ప్రపంచానికి ప్రేరణగా నిలుస్తున్నాయి.510kg / 1124lbs DEADLIFT WORLD RECORD pic.twitter.com/WMKUqQvvzr— Hafþór J Björnsson (@ThorBjornsson_) September 6, 20252018లో వరల్డ్ స్ట్రాంగ్మాన్గా అవతరించిన బ్జోర్న్సన్.. ఆతర్వాత Arnold Strongman Classic, Europe’s Strongest Man పోటీలు గెలిచి, ఒకే సంవత్సరంలో ఈ ఘనతలు సాధించిన ఏకైక వ్యక్తిగా చరిత్రకెక్కాడు. 36 ఏళ్ల బ్జోర్న్సన్ తన కెరీర్లో 129కి పైగా ప్రపంచ రికార్డులు, 32 అంతర్జాతీయ టైటిళ్లు సాధించాడు. బ్జోర్న్సన్ Game of Thrones సినిమాలో “The Mountain” పాత్రతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. -
యూఎస్ ఓపెన్ విజేత అల్కరాజ్.. అరుదైన ఘనత
స్పానిష్ యువ సంచలనం కార్లోస్ ఆల్కరాజ్ 2025 యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను సాధించాడు. ఫైనల్లో ఇటలీకి చెందిన జానిక్ సినర్ను 6–2, 3–6, 6–1, 6–4 తేడాతో ఓడించి, రెండో యూఎస్ ఓపెన్ను (2022, 2025), ఓవరాల్గా ఆరో గ్రాండ్స్లామ్ను (2022 యూఎస్ ఓపెన్, 2023 వింబుల్డన్, 2024 ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, 2025 ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్) సొంతం చేసుకున్నాడు.ఈ గెలుపుతో అల్కరాజ్ నంబర్ వన్ స్థానాన్ని కూడా తిరిగి దక్కించకున్నాడు. అల్కరాజ్ 23 ఏళ్ల వయసులోనే మూడు వేర్వేరు సర్ఫేస్లపై (క్లే, గ్రాస్, హార్డ్కోర్ట్) బహుళ గ్రాండ్స్లామ్ టైటిళ్లు గెలిచిన అరుదైన ఆటగాడిగా నిలిచాడు. అల్కరాజ్, సినర్ ఈ ఏడాది వరుసగా మూడో గ్రాండ్స్లామ్ ఫైనల్స్లో తలపడ్డాడు. ఇందులో సినర్ వింబుల్డన్ విజేతగా నిలువగా.. అల్కరాజ్ మిగతా రెండు (ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్) గెలిచాడు.మ్యాచ్ విషయానికొస్తే.. ఆర్థర్ ఆష్ స్టేడియంలో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్లో అల్కరాజ్ తన అద్భుతమైన ఫుట్వర్క్, శక్తివంతమైన ఫోర్హ్యాండ్స్తో సినర్ను కట్టడి చేశాడు. ఆట ప్రారంభం నుంచే దూకుడు ప్రదర్శించిన అల్కరాజ్ తొలి సెట్ గెలిచి, రెండో సెట్ కోల్పోయినప్పటికీ.. తిరిగి పుంజుకున్నాడు. ఈ మ్యాచ్లో అల్కరాజ్ ఫస్ట్-సర్వ్ అద్భుతంగా ఉండింది. ఇందులో అతను 83 శాతం విజయవంతమయ్యాడు. ఇదే అతని ఆటకు స్థిరతనిచ్చింది. మ్యాచ్ ఆధ్యాంతం అల్కరాజ్ ఫోర్హ్యాండ్ వేగం 100mph పైబడి ఉండింది. ఈ శక్తివంతమైన షాట్లే సినర్ను వెనక్కి నెట్టాయి. ఈ మ్యాచ్లో అల్కరాజ్ అసమాన మానసిక స్థైర్యాన్ని ప్రదర్శించాడు. కీలక పాయింట్లలో ఒత్తిడిని ఎదుర్కొని, క్లచ్ షాట్లతో మ్యాచ్ను తనవైపు తిప్పుకున్నాడు.సినర్ విషయానికొస్తే.. తొలి సెట్ కోల్పోయినప్పటికీ, రెండో సెట్లో అద్భుతంగా పుంజుకున్నాడు. ఈ మ్యాచ్లో సినర్ బేస్లైన్ కంట్రోల్ బాగా ఉండింది. ర్యాలీల్లో స్థిరత్వాన్ని ప్రదర్శించాడు. అన్ ఫోర్స్డ్ ఎర్రర్లు తక్కువగా ఉన్నాయి. ఫుట్వర్క్, బ్యాక్ హ్యాండ్ ఎగ్జిక్యూషన్ బాగానే ఉన్నాయి.అయితే సర్వీస్లో లోపాలు అతని కొంపముంచాయి. సినర్ ఫస్ట్-సర్వ్ విజయశాతం కేవలం 48 శాతంగా ఉంది. అలాగే సినర్ అల్కరాజ్కు బ్రేక్ అవకాశాలు చాలా ఇచ్చాడు. అతని ఆటకు తగిన విధంగా స్పందించలేకపోయాడు. మూడో సెట్ కోల్పోవడం సినర్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. ఓవరాల్గా చూస్తే ఈ మ్యాచ్లో సినర్ అల్కరాజ్తో పోటీలో వెనుకపడ్డాడు. -
తెలుగు టైటాన్స్కు రెండో విజయం
విశాఖ స్పోర్ట్స్: ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్ లో తెలుగు టైటాన్స్ రెండో విజయాన్ని సాధించింది. ఆదివారం జరిగిన మ్యాచ్ లో టైటాన్స్ 44–34 తో బెంగాల్ వారియర్స్పై నెగ్గింది. టైటాన్స్ జట్టులో భరత్ 12, విజయ్ 11 పాయింట్లు సాధించారు. రెయిడర్ చేతన్ సాహు, డిఫెండర్ అంకిత్ చెరో 5 పాయింట్లు చేశారు. బెంగాల్ తరఫున కెప్టెన్ దేవాంక్ ఒంటరి పోరాటం చేసి 13 పాయింట్లు సాధించాడు. డిఫెండర్లలో నితీశ్ (6), ఆశిష్ (5) మెరుగ్గా ఆడారు. అనంతరం పోటాపోటీగా జరిగిన రెండో మ్యాచ్లో రెండుసార్లు విజేతగా నిలిచిన జైపూర్ పింక్ పాంథర్స్ 35–36తో దబంగ్ ఢిల్లీ చేతిలో ఓడిపోయింది. దబంగ్ కెప్టెన్ అశు మలిక్ 21 పాయింట్లు సాధించాడు. జైపూర్ తరఫున రెయిడర్లు నితిన్ (14), సాహిత్ (10) రాణించారు. నేడు జరిగే మ్యాచ్ల్లో హరియాణాతో బెంగళూరు బుల్స్, పుణేరి పల్టన్తో పట్నా పైరేట్స్ తలపడతాయి. -
మనదే ఆసియా కప్
రాజ్గిర్ (బిహార్): మ్యాచ్ మ్యాచ్కూ రాటుదేలిన భారత పురుషుల హాకీ జట్టు అసలు సిసలు సమరంలోనూ తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. సొంతగడ్డపై జరిగిన ఆసియా కప్ టోర్నీలో హర్మన్ప్రీత్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టు చాంపియన్గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత జట్టు 4–1 గోల్స్ తేడాతో డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియా జట్టును ఓడించింది. ఈ విజయంతో ఆసియా కప్ విజేత హోదాలో... భారత జట్టు వచ్చే ఏడాది ఆగస్టులో బెల్జియం–నెదర్లాండ్స్లో జరిగే ప్రపంచ కప్ టోర్నీకి నేరుగా అర్హత సాధించింది. కొరియాతో జరిగిన ఫైనల్లో భారత్ తరఫున దిల్ప్రీత్ సింగ్ (28వ, 45వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... సుఖ్జీత్ సింగ్ (1వ నిమిషంలో), అమిత్ రోహిదాస్ (50వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. కొరియా జట్టుకు డెయిన్ సన్ (51వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. విజేతగా నిలిచిన భారత జట్టుకు హాకీ ఇండియా నజరానా ప్రకటించింది. జట్టులోని ప్రతి సభ్యుడికి రూ. 3 లక్షల చొప్పున... సహాయక సిబ్బందికి రూ. 1 లక్ష 50 వేల చొప్పున నగదు పురస్కారం అందజేయనుంది. ఆసియా కప్ను అత్యధికంగా ఐదుసార్లు నెగ్గిన కొరియా జట్టును ఏమాత్రం తక్కువ అంచనా వేయకుండా ఫైనల్లో భారత్ పక్కా వ్యూహంతో ఆడింది. తొలి నిమిషం నుంచే సమన్వయంతో కదులుతూ దాడులు చేసింది. ఫలితంగా తొలి నిమిషంలోనే భారత్ ఖాతా తెరిచింది. ఆ తర్వాత భారత్ జోరు కొనసాగించగా... ఆతిథ్య జట్టు దాడులను అడ్డుకోవడంలోనే కొరియాకు సమయం సరిపోయింది. మ్యాచ్ మొత్తం భారత్ ఒకేతీరుగా ఆడటంతో కొరియాకు తేరుకునే అవకాశం లేకుండా పోయింది. నాలుగు గోల్స్ సమర్పించుకున్నాక కొరియా ఖాతా తెరిచినా అప్పటికే ఆలస్యమైపోయింది. మ్యాచ్ మొత్తంలో భారత్కు రెండు పెనాల్టీ కార్నర్లు రాగా ఒక దానిని సద్వినియోగం చేసుకుంది. ఒక పెనాల్టీ స్ట్రోక్ను వృథా చేసింది. కొరియా జట్టుకు లభించిన మూడు పెనాల్టీ కార్నర్లలో ఒక దానిని గోల్గా మలిచింది. అంతకుముందు మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్లో మలేసియా 4–1తో చైనాపై గెలిచింది.4: ఆసియా కప్ టైటిల్ సాధించడం భారత్కిది నాలుగోసారి. గతంలో భారత్ 2003, 2007, 2017లలో విజేతగా నిలిచింది. కొరియా అత్యధికంగా ఐదుసార్లు ఆసియా కప్ విజేతగా నిలిచింది.164: తాజా ఆసియా కప్లో నమోదైన మొత్తం గోల్స్. ఇందులో 97 ఫీల్డ్ గోల్స్ కాగా... 59 పెనాల్టీ కార్నర్ల ద్వారా, 8 పెనాల్టీ స్ట్రోక్ల ద్వారా వచ్చాయి. మలేసియా ప్లేయర్ అఖీముల్లా 12 గోల్స్తో టోర్నీ టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత్ తరఫున అభిõÙక్, హర్మన్ప్రీత్, సుఖ్జీత్ 6 గోల్స్ చొప్పున చేశారు.39: తాజా ఆసియా కప్లో అత్యధిక గోల్స్ చేసిన జట్టుగా భారత్ (39) నిలిచింది. ఈ టోర్నీలో భారత్ ఆరు మ్యాచ్ల్లో గెలిచి, ఒక మ్యాచ్ను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచింది. -
ఆసియకప్ విజేతగా టీమిండియా..
హాకీ ఆసియా కప్- 2025 విజేతగా భారత్ నిలిచింది. ఆదివారం రాజ్గిర్ వేదికగా జరిగిన ఫైనల్ పోరులో సౌత్ కొరియాను 4-1 తేడాతో టీమిండియా చిత్తు చేసింది. దీంతో ఎనిమిదేళ్ల తర్వాత భారత హాకీ జట్టు ఆసియాకప్ టైటిల్ను సొంతం చేసుకుంది. ఈ విజయంతో వచ్చే ఏడాది జరగనున్న హాకీ వరల్డ్కప్కు భారత్ నేరుగా ఆర్హత సాధించింది.ఓవరాల్గా భారత్కు ఇది నాల్గో ఆసియాకప్ టైటిల్. చివరగా 2017 బంగ్లాదేశ్లో జరిగిన హాకీ ఆసియాకప్ను ఇండియా గెలుచుకుంది. ఈ తుది పోరులో భారత్ తరపున దిల్ప్రీత్ సింగ్ రెండు గోల్స్ సాధించగా.. సుఖ్జీత్, అమిత్ రోహిదాస్ చెరో గోల్ సాధించింది. నిర్ణీత సమయంలో భారత్ నాలుగు గోల్స్ సాధించగా.. కొరియా కేవలం ఒక్క గోల్కే పరిమితమైంది. రెండు గోల్స్తో మెరిసిన దిల్ప్రీత్కు ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు లభించింది. భారత హాకీ జట్టుకు వైఎస్ జగన్ అభినందనలుఆసియాకప్లో అద్భుత విజయం సాధించిన భారత హాకీ జట్టుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలియజేశారు. ‘టీమిండియాకు హృదయపూర్వక అభినందనలు. భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలి’ అని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఈ మేరకు ‘ ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు జగన్.Heartiest congratulations to Team India on a magnificent victory at the Asia Cup 2025 in Rajgir, Bihar! Wishing the entire team continued success, good health, and glory in the years ahead.#HockeyIndia pic.twitter.com/80jd1hj5s3— YS Jagan Mohan Reddy (@ysjagan) September 7, 2025 -
World Archery Championships: భారత్కు గోల్డ్ మెడల్.. జ్యోతి జోడీకి రజతం
ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్షిప్-2025లో భారత ఆర్చర్లు సత్తాచాటారు. ఈ మెగా ఈవెంట్లో భారత్కు రెండు పతకాలు లభించాయి. రిషబ్ యాదవ్, అమన్ సైని, ప్రథమేష్ ఫుగేలతో కూడిన భారత పురుషల జట్టు స్వర్ణ పతకం కైవసం చేసుకోగా.. మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో రిషబ్- వెన్నం జ్యోతిసురేఖ జోడికి రజత పతకం దక్కింది.ఆదివారం జరిగిన ఫైనల్లో తొలుత భారత మెన్స్ టీమ్ ఫ్రాన్స్తో తలపడింది. హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో కేవలం రెండు పాయింట్ల తేడాతో ఇండియా విజయం సాధించింది. రిషబ్ అండ్ కో 235 పాయింట్లు సాధించగా ఫ్రాన్స్ 233 పాయింట్లు సాధించింది. భారత పురుషుల జట్టు ఈ మెగా ఈవెంట్లో స్వర్ణం సాధించడం ఇదే తొలిసారి. మరోవైపు కాంపౌండ్ మిక్సిడ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో సురేఖ, రిషబ్ యాదవ్లతో కూడిన భారత జట్టు తృటిలో స్వర్ణాన్ని చేజార్చుకుంది. ఫైనల్ లో నెదర్లాండ్స్ జోడి చేతిలో 157-155 తేడాతో ఓటమి పాలయ్యారు. కేవలం రెండు పాయింట్ల తేడాతో పసడి పతకాన్ని భారత్ కోల్పోయింది. ప్రపంచ ఛాంపియన్షిప్లో అత్యధిక పతకాలు గెలిచిన భారత ఆర్చర్గా ఇప్పటికే రికార్డు సాధించిన జ్యోతి సురేఖకు ఇది తొమ్మిదో పతకం కావడం విశేషం.చదవండి: పాక్లో మ్యాచ్ జరుగుతుండగా ఉగ్రదాడి.. సౌతాఫ్రికా పర్యటనపై నీలినీడలు? -
యూఎస్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న సబలెంకా
బెలారస్ క్రీడాకారిణి, ప్రపంచ నంబర్ వన్ అరినా సబలెంకా వరుసగా రెండో ఏడాది యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ను ఎగరేసుకుపోయింది. ఫైనల్లో ఆమె అమెరికాకు చెందిన అమండ అనిసిమోవాను వరుస సెట్లలో (6–3, 7–6(3)) ఓడించింది. 94 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో సబలెంక 13 విన్నర్లు కొట్టి, 15 అన్ఫోర్స్డ్ ఎర్రర్లు మాత్రమే చేసింది. అనిసిమోవా 29 అన్ఫోర్స్డ్ ఎర్రర్లు, 7 డబుల్ ఫాల్ట్స్ చేసి తడబడింది.ఈ మ్యాచ్లో సబలెంక తన శక్తివంతమైన సర్వ్లు, ఖచ్చితమైన గ్రౌండ్స్ట్రోక్లతో అనిసిమోవాను కట్టడి చేసింది. రెండో సెట్ టైబ్రేక్కి వెళ్లినా, ఆమె మానసిక స్థైర్యాన్ని చూపించి విజయం సాధించింది.సబలెంకకు ఇది నాలుగో గ్రాండ్స్లామ్ టైటిల్. అన్ని టైటిళ్లను ఆమె హార్డ్కోర్ట్లపైనే సాధించింది. దీంతో ఆమెకు హార్డ్కోర్డ్ల రాణిగా గుర్తింపు వచ్చింది. సబలెంక 2023, 2024లో వరుసగా ఆస్ట్రేలియా ఓపెన్ టైటిళ్లు సాధించి.. 2024, 2025లో వరుసగా యూఎస్ ఓపెన్ను గెలిచింది. వరుసగా రెండు యూఎస్ ఓపెన్ టైటిళ్లు సాధించడంతో సబలెంక సెరీనా విలియమ్స్ సరసన చేరింది. సెరీనా కూడా గతంలో వరుసగా రెండు ఎడిషన్లలో యూఎస్ ఓపెన్ విజేతగా నిలిచింది.టైటిల్ గెలిచిన అనంతరం సబలెంక మాట్లాడుతూ.. ఇది నా జీవితంలో మరచిపోలేని క్షణం. నా దేశానికి, అభిమానులకు ఈ విజయం అంకితమని తెలిపింది. తాజా విజయంతో సబలెంక 100 గ్రాండ్ స్లామ్ మ్యాచ్లు గెలిచిన రెండో మహిళగానూ గుర్తింపు పొందింది. సబలెంక ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్లోనూ ఫైనల్కు చేరి కోకో గాఫ్ చేతిలో పరాజయంపాలై రన్నరప్తో సరిపెట్టుకుంది.