breaking news
Other Sports
-
ఐఓసీ అధ్యక్షురాలు క్రిస్టీ కోవెంట్రీతో జై షా భేటీ
న్యూఢిల్లీ: 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో క్రికెట్ పునరాగమనం చేస్తున్న నేపథ్యంలో... అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షురాలు క్రిస్టీ కొవెంట్రీతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అధ్యక్షుడు జై షా భేటీ అయ్యారు. లుసానేలో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. 1900 పారిస్లో జరిగిన ఒలింపిక్స్లో తొలిసారి క్రికెట్ పోటీలు నిర్వహించగా... ఆ తర్వాత మరెప్పుడూ విశ్వక్రీడల్లో క్రికెట్కు చోటు దక్కలేదు. ఇప్పుడు 128 ఏళ్ల తర్వాత లాస్ ఏంజెలిస్లో జరగనున్న ఒలింపిక్స్లో తిరిగి క్రికెట్ పోటీలు నిర్వహించనున్నారు. మహిళల, పురుషుల విభాగాల్లో ఆరేసి జట్లు ఒలింపిక్స్లో పాల్గొంటుండగా... టి20 ఫార్మాట్లో మ్యాచ్లు జరగనున్నాయి. ‘లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో క్రికెట్ పునరాగమనం చేయనుండగా... దీనిపై ఐఓసీ అధ్యక్షురాలు క్రిస్టీ కోవెంట్రీని కలవడం ఆనందంగా ఉంది.ఆ దిశగా ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధితో పాటు ఒలింపిక్ ఉద్యమంలో క్రికెట్ పాత్ర, దాని ప్రాధాన్యత గురించి చర్చించాం’ అని జై షా ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ఇదే అంశంపై ఐఓసీ అధ్యక్షురాలితో ఈ ఏడాది ఆరంభంలోనూ జై షా సమావేశమయ్యారు. -
దబంగ్ ఢిల్లీ x పుణేరి పల్టన్... నేడు ప్రొ కబడ్డీ లీగ్ ఫైనల్
లీగ్ దశలో టాప్–2లో నిలిచిన రెండు జట్ల మధ్య ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్ టైటిల్ పోరు జరగనుంది. మాజీ చాంపియన్స్ దబంగ్ ఢిల్లీ, పుణేరి పల్టన్ జట్లు రెండోసారి పీకేఎల్ విన్నర్స్ ట్రోఫీని అందుకోవాలనే లక్ష్యంతో నేడు జరిగే ఫైనల్లో తలపడనున్నాయి. న్యూఢిల్లీలోని త్యాగరాజ్ ఇండోర్ స్టేడియం ఈ మెగా ఫైనల్కు వేదిక కానుంది. ఈ సీజన్లో పుణేరి పల్టన్, దబంగ్ ఢిల్లీ జట్లు మూడుసార్లు తలపడ్డాయి. మూడు సార్లూ మ్యాచ్లు నిర్ణీత సమయంలో సమంగా ముగిసి ఫలితం ‘టైబ్రేక్’లో తేలింది. ‘టైబ్రేక్’లో దబంగ్ ఢిల్లీ రెండుసార్లు గెలుపొందగా... ఒకసారి పుణేరి పల్టన్ విజయాన్ని అందుకుంది. ఈ సీజన్లో ఢిల్లీ తరఫున ఫజల్, సౌరభ్, నీరజ్, ఆశు మలిక్... పుణేరి పల్టన్ తరఫున ఆదిత్య షిండే, అస్లామ్, పంకజ్ నిలకడగా రాణించారు. రాత్రి 8 గంటలకు మొదలయ్యే టైటిల్ పోరును స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లలో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
ఆసియా యూత్ గేమ్స్లో భారత్ పతకాల మోత..
బహ్రెయిన్ వేదికగా జరుగుతున్న ఆసియా యూత్ గేమ్స్ మూడో ఎడిషన్లో భారత బాక్సర్లు సత్తాచాటారు. ఈ పోటీల్లో భారత యువ బాక్సింగ్ బృందం ఐదు పతకాలు సాధించింది. అందులో మూడు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్య పతకం ఉంది. గురువారంగురువారం ఉదయం జరిగిన తొలి ఫైనల్(46 కేజీల విభాగం)లో భారత బాక్సర్ ఖుషీ చంద్.. చైనాకు చెందిన లూ జిన్క్సియుపై 4:1 తేడాతో ఓడించి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత 50 కేజీల విభాగంలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియాకు చెందిన మా జోంగ్ హ్యాంగ్తో జరిగిన బౌట్ తొలి రౌండ్లోనే 'రిఫరీ స్టాప్డ్ కాంటెస్ట్' (RSC) ద్వారా అహానా శర్మ విజయం సాధించింది.దీంతో భారత ఖాతాలో రెండు గోల్డ్మెడ్ చేరింది. ఇక 54 కేజీల ఈవెంట్లో ఉజ్బెకిస్తాన్కు చెందిన ముహమ్మదోవా కుమ్రినీసోపై 5:0 తేడాతో విజయం సాధించిన చంద్రిక భోరేషి పూజారి.. గోల్డ్మెడల్ను కైవసం చేసుకుంది. -
రష్మిక, సహజ శుభారంభం
చెన్నై: భారత్లో జరుగుతున్న మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ)–250 లెవెల్ ఏకైక టోర్నమెంట్ చెన్నై ఓపెన్లో తొలి రోజు భారత క్రీడాకారిణులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. భారత నంబర్వన్, తెలంగాణ అమ్మాయి సహజ యామలపల్లి... భారత రెండో ర్యాంకర్, తెలంగాణకే చెందిన భమిడిపాటి శ్రీవల్లి రష్మిక శుభారంభం చేసి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. అయితే ‘లక్కీ లూజర్’ హోదాలో మెయిన్ ‘డ్రా’లో చోటు పొందిన వైష్ణవి అడ్కర్... ‘వైల్డ్ కార్డు’తో ఆడిన రైజింగ్ స్టార్ మాయా రాజేశ్వరన్ తొలి రౌండ్లోనే వెనుదిరిగారు. ప్రపంచ 658వ ర్యాంకర్ మాయా రాజేశ్వరన్తో జరిగిన మ్యాచ్లో ప్రపంచ 346వ ర్యాంకర్ రష్మిక 6–1, 6–4తో గెలిచింది. 69 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో రష్మిక రెండు ఏస్లు సంధించి, ఒక డబుల్ ఫాల్ట్ చేసింది. తన సర్వీస్ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. రష్మిక తన తొలి సర్వీస్లో 32 పాయింట్లకుగాను 26 పాయింట్లు, రెండో సర్వీస్లో 20 పాయింట్లకుగాను 6 పాయింట్లు స్కోరు చేసింది. ప్రపంచ 207వ ర్యాంకర్ ప్రిస్కా నుగ్రోహో (ఇండోనేసియా)తో జరిగిన మ్యాచ్లో ప్రపంచ 344వ ర్యాంకర్ సహజ 6–4, 6–2తో విజయం సాధించింది. 2 గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్లో ‘బర్త్డే గర్ల్’ సహజ తన సర్వీస్ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. తొలి సర్వీస్లో 37 పాయింట్లకుగాను 22 పాయింట్లు... రెండో సర్వీస్లో 27 పాయింట్లకుగాను 14 పాయింట్లు స్కోరు చేసింది. మరో తొలి రౌండ్ మ్యాచ్లో వైష్ణవి 1–6, 2–6తో ప్రపంచ 78వ ర్యాంకర్, మూడో సీడ్ డొనా వెకిచ్ (క్రొయేషియా) చేతిలో ఓడిపోయింది. ప్రిక్వార్టర్ ఫైనల్స్లో డొనా వెకిచ్తో సహజ; ప్రపంచ 117వ ర్యాంకర్ కింబర్లీ బిరెల్ (ఆ్రస్టేలియా)తో రష్మిక తలపడతారు. రియా–రుతుజా జోడీ సంచలనం మహిళల డబుల్స్ విభాగంలోనూ భారత జోడీలకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. తొలి రౌండ్లో రియా భాటియా–రుతుజా భోస్లే జోడీ 6–2, 6–2తో మూడో సీడ్ దలీలా జకుపోవిచ్–నికా రాడిసికి (స్లొవేనియా) జంటను బోల్తా కొట్టించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. 80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో భారత జోడీ తమ ప్రత్యర్థుల సర్వీస్ను ఆరుసార్లు బ్రేక్ చేసి, తమ సర్వీస్ను రెండుసార్లు కోల్పోయింది. మరో మ్యాచ్లో మాయా రాజేశ్వరన్–వైష్ణవి అడ్కర్ (భారత్) జంట 6–2, 1–6, 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో అమీనా అన్‡్షబా–ఈడెన్ సిల్వా (బ్రిటన్) జోడీపై గెలిచి ముందంజ వేసింది. అయితే అంకిత రైనా–శ్రీవల్లి రష్మిక (భారత్) జోడీకి మాత్రం తొలి రౌండ్లోనే ఓటమి ఎదురైంది. అంకిత–రష్మిక జంట 6–7 (2/7), 2–6తో మాయి హొంటామా–అకీకో ఒమాయి (జపాన్) ద్వయం చేతిలో పరాజయం పాలైంది. -
ప్రిక్వార్టర్ ఫైనల్లో యూకీ జోడీ
పారిస్: భారత పురుషుల టెన్నిస్ డబుల్స్ నంబర్వన్ యూకీ బాంబ్రీ... పారిస్ ఓపెన్ ఏటీపీ మాస్టర్స్–1000 సిరీస్ టోర్నీలో శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో యూకీ బాంబ్రీ (భారత్)–ఆడమ్ పావ్లాసెక్ (చెక్ రిపబ్లిక్) ద్వయం 7–6 (7/5), 7–6 (7/3)తో ఆండ్రీ గొరాన్సన్ (స్వీడన్)–జాన్ జిలిన్స్కీ (పోలాండ్) జంటపై గెలుపొందింది. 1 గంట 44 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో యూకీ–పావ్లాసెక్ రెండు ఏస్లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్లు చేశారు. తొలి సర్వీస్లో 49 పాయింట్లకుగాను 34 పాయింట్లు... రెండో సర్వీస్లో 25 పాయింట్లకుగాను 13 పాయింట్లు సాధించారు. తమ సర్వీస్ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను మూడుసార్లు బ్రేక్ చేశారు. మరోవైపు భారత్కే చెందిన సీనియర్ స్టార్ రోహన్ బోపన్నకు నిరాశ ఎదురైంది. తొలి రౌండ్లో బోపన్న (భారత్)–అలెగ్జాండర్ బుబ్లిక్ (కజకిస్తాన్) ద్వయం 5–7, 2–6, 8–10తో ‘సూపర్ టైబ్రేక్’లో జాన్ పీర్స్ (ఆ్రస్టేలియా)–జేజే ట్రేసీ (అమెరికా) జంట చేతిలో పోరాడి ఓడిపోయింది. 70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో బోపన్న–బుబ్లిక్ నాలుగు ఏస్లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్లు చేశారు. తమ సర్వీస్ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను మూడుసార్లు బ్రేక్ చేశారు. అయితే సూపర్ టైబ్రేక్ కీలకదశలో బోపన్న ద్వయం పాయింట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. తొలి రౌండ్లో ఓడిన బోపన్న–బుబ్లిక్లకు 14,350 యూరోలు (రూ. 14 లక్షల 76 వేలు) ప్రైజ్మనీగా లభించింది. -
శ్రియాన్షి సంచలనం
సార్బ్రుకెన్ (జర్మనీ): హైలో ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి శ్రియాన్షి వలిశెట్టి సంచలనం సృష్టించింది. బుధవారం జరిగిన తొలి రౌండ్లో ప్రపంచ 48వ ర్యాంకర్ శ్రియాన్షి 21–19, 21–12తో ప్రపంచ 21వ ర్యాంకర్, మూడో సీడ్ లైన్ హోమార్క్ జార్స్ఫెల్డ్ (డెన్మార్క్)పై గెలుపొంది ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్ల్లో ఉన్నతి హుడా 21–4, 21–14తో జూలియానా (బ్రెజిల్)పై, రక్షిత శ్రీ 21–14, 21–16తో క్లారా అజుర్మెండి (స్పెయిన్)పై గెలుపొందగా... అన్మోల్ 24–26, 21–23తో జూలీ (డెన్మార్క్) చేతిలో... అనుపమ 19–21, 19–21తో పొలీనా (ఉక్రెయిన్) చేతిలో... తాన్యా 14–21, 13–21తో లిన్ సియాంగ్ టి (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయారు. శ్రీకాంత్ తొలి రౌండ్లోనే...పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ మాజీ నంబర్వన్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. భారత్కే చెందిన కిరణ్ జార్జితో జరిగిన మ్యాచ్లో శ్రీకాంత్ 19–21, 11–21తో ఓడిపోయాడు. భారత నంబర్వన్ లక్ష్య సేన్ 21–16, 22–20తో ప్రపంచ 7వ ర్యాంకర్ క్రిస్టో పొపోవ్ (ఫ్రాన్స్)ను బోల్తా కొట్టించాడు. మరో మ్యాచ్లో శంకర్ ముత్తుస్వామి (భారత్) 21–14, 18–21, 21–16తో లియోంగ్ జున్ హావో (మలేసియా)ను ఓడించాడు. -
క్వాలిఫయర్–2లో తెలుగు టైటాన్స్ పరాజయం... ఫైనల్లో పుణేరి పల్టన్
ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్లో తెలుగు టైటాన్స్ జట్టు పోరాటం ముగిసింది. న్యూఢిల్లీలో బుధవారం జరిగిన క్వాలిఫయర్–2 మ్యాచ్లో తెలుగు టైటాన్స్ జట్టు 45–50 పాయింట్ల తేడాతో మాజీ చాంపియన్ పుణేరి పల్టన్ చేతిలో ఓడిపోయింది. తెలుగు టైటాన్స్పై విజయంతో పుణేరి పల్టన్ జట్టు ప్రొ కబడ్డీ లీగ్లో మూడోసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. తొమ్మిదో సీజన్లో రన్నరప్గా నిలిచిన పుణేరి పల్టన్ జట్టు పదో సీజన్లో తొలిసారి చాంపియన్గా అవతరించింది. రేపు జరిగే ఫైనల్లో మాజీ విజేత దబంగ్ ఢిల్లీ జట్టుతో పుణేరి పల్టన్ తలపడుతుంది. టైటాన్స్తో జరిగిన పోరులో పుణేరి పల్టన్ జట్టు పలుమార్లు వెనుకంజలో ఉన్నా సంయమనం కోల్పోకుండా ఆడి చివరకు విజయాన్ని అందుకుంది. పుణేరి తరఫున రెయిడర్లు ఆదిత్య షిండే 22 పాయింట్లు, పంకజ్ మొహితే 10 పాయింట్లు స్కోరు చేశారు. టైటాన్స్ తరఫున కెప్టెన్ విజయ్ మలిక్, భరత్ మెరిపించినా ఇతర ఆటగాళ్లు తడబడటంతో ఓటమి తప్పలేదు. విజయ్ మలిక్ 11 పాయింట్లు, భరత్ 23 పాయింట్లు స్కోరు చేశారు. -
డూ ఆర్ డై రైడ్.. కట్ చేస్తే! తెలుగు టైటాన్స్ రైడర్ సంచలనం
ప్రో కబడ్డీ లీగ్-2025లో తెలుగు టైటాన్స్ స్టార్ ఆల్రౌండర్ భరత్ హుడా తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఢిల్లీ వేదికగా పుణేరి పల్టన్తో జరిగిన క్వాలిఫయర్-2లో కూడా తన రైడింగ్ స్కిల్తో అదరగొట్టాడు. ఓ డూ ఆర్ డై రైడ్లో హుడా అద్భుతం చేశాడు.ఈ మ్యాచ్ ఫస్ట్ హాఫ్లో వరుసగా రెండు రైడ్స్లో పాయింట్లు రాకపోవడంతో టైటాన్స్ డూ ఆర్ డై రైడ్ను ఎదుర్కొవాల్సి వచ్చింది. అవతలి ఎండ్లో ముగ్గురు పుణేరి ప్లేయర్లు ఉన్నారు. ఈ సమయంలో డూర్ ఆర్ డై రైడ్కు వెళ్లిన భరత్ హుడా.. ముగ్గురిని కూడా టచ్ చేసి తన ఎండ్కు వచ్చేశాడు. దీంతో పుణేరి పల్టన్ ఆలౌటైంది. ఒకే దెబ్బకు టైటాన్స్కు ఐదు పాయింట్లు వచ్చాయి. సూపర్ టాకిల్ అవకాశమున్నప్పటికి చాకచాక్యంగా భరత్ డిఫెండర్ల నుంచి తప్పించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ మ్యాచ్లో భరత్ 23 రైడ్ పాయింట్లు సాధించాడు.టైటాన్స్ ఓటమి..కాగా క్వాలిఫయర్-2లో క్వాలిఫయర్-2లో 50-45 తేడాతో టైటాన్స్ ఓటమి పాలైంది. దీంతో టోర్నీ నుంచి టైటాన్స్ ఇంటిముఖం పట్టింది. భరత్ హుడా అద్భుత పోరాటం వృథాగా మిగిలిపోయింది. ఇక శుక్రవారం జరగనున్న ఫైనల్ పోరులో దబాంగ్ ఢిల్లీ, పుణేరి పల్టన్ తలపడనున్నాయి. View this post on Instagram A post shared by Star Sports Telugu (@starsportstelugu) -
బాధపడొద్దు సార్.. ఈసారి కప్ తెలుగు టైటాన్స్దే!
ప్రోకబడ్డీ లీగ్-2025లో తెలుగు టైటాన్స్ అద్భుత ప్రయాణం కొనసాగుతోంది. మంగళవారం ఢిల్లీ వేదికగా జరిగిన ఎలిమినేటర్ 3లో పాట్నా పైరేట్స్ను 46-39 తేడాతో చిత్తు చేసిన టైటాన్స్.. క్వాలిఫయర్-2 పోరుకు అర్హత సాధించింది. బుధవారం జరగనున్న క్వాలిఫయర్-2లో పుణేరి పల్టన్తో టైటాన్స్ అమీతుమీ తెల్చుకోనుంది.కాగా తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టైటాన్స్ ప్లేఆఫ్స్కు అర్హత సాధించడంలో ఆ జట్టు హెడ్ కోచ్ కృష్ణన్ కుమార్ హుడా కీలక పాత్ర. ఈ ఏడాది సీజన్లో కృష్ణన్ కుమార్ పర్యవేక్షణలో టైటాన్స్ సంచలన ప్రదర్శన కనబరిచింది. లీగ్ దశలో వరుసగా ఐదు మ్యాచ్లలో విజయం సాధించిన తెలుగు టైటాన్స్.. ఇప్పుడు నాకౌట్స్లోనూ అదే జోరును కనబరుస్తోంది. మినీ-క్వాలిఫైయర్లో బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. ఎలిమినేటర్-3లో మూడుసార్లు ఛాంపియన్ అయిన పట్నా పైరేట్స్పై ఘన విజయం సాధించింది.కన్నీరు పెట్టుకున్న కృష్ణన్ కుమార్..కాగా ఎలిమినేటర్-3లో పాట్నాపై విజయం అనంతరం టైటాన్స్ హెడ్ కోచ్ కృష్ణన్ కుమార్ భావోద్వేగానికి లోనయ్యాడు. అధికారిక బ్రాడ్ క్రాస్టర్ స్టార్ స్పోర్ట్స్తో కృష్ణన్ మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యాడు."ఈ ఏడాది సీజన్లో మా జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. తొమ్మిది సీజన్ల తర్వాత ప్లేఆఫ్స్కు అర్హత సాధించాము. ఇప్పుడు సెమీఫైనల్(క్వాలిఫయర్-2) ఆడేందుకు సిద్దమయ్యాము. ఇది మాకు డూ-ఆర్-డై మ్యాచ్. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి ఫైనల్ పోరుకు అర్హత సాధించేందుకు ప్రయత్నిస్తాము. తెలుగు టైటాన్స్ ఇక్కడ వరకు వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. గతంలో మమ్మల్ని ప్రతీ జట్టు తేలికగా తీసుకునేది. రెండు పాయింట్లు సులువగా సాధించవచ్చు అని అనుకునేవాళ్లు. కానీ ఇప్పుడు ప్రతి జట్టు మమ్మల్ని చూసి భయపడుతోంది" అని హుడా పేర్కొన్నారు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన టైటాన్స్ అభిమానులు బాధ పడొద్దు సార్.. ఈసారి కప్ మనదే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కాగా పీఎకేఎల్ చరిత్రలో టైటాన్స్ క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడనుండడం ఇదే తొలిసారి.చదవండి: సూర్యకుమార్ యాదవ్ ప్రపంచ రికార్డు -
అతడొక అద్భుతం.. తెలుగు టైటాన్స్కు దొరికిన ఆణిముత్యం
ప్రొ కబడ్డీ లీగ్ (PKL) 12వ సీజన్లో తెలుగు టైటాన్స్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. తొలి పీకేఎల్ టైటిల్ను ముద్దాడేందుకు టైటాన్స్ అత్యంత చేరువలో ఉంది. మంగళవారం జరిగిన ఎలిమినేటర్-3లో మూడుసార్లు ఛాంపియన్ అయిన పట్నా పైరేట్స్పై 46-39 పాయింట్ల తేడాతో టైటాన్స్ ఘన విజయం సాధించింది. దీంతో క్వాలిఫయర్-2కు తెలుగు టైటాన్స్ అర్హత సాధించింది. బుధవారం జరగనున్న క్వాలిఫయర్-2లో పుణేరి పల్టన్ను ఓడించి తుది పోరుకు క్వాలిఫై అవ్వాలన్న పట్టుదలతో టైటాన్స్ ఉంది.దుమ్ములేపుతున్న భరత్కాగా తెలుగు టైటాన్స్ తమ తొలి టైటిల్కు చేరువ కావడంలో ఆల్రౌండర్ భరత్ హుడాది కీలక పాత్ర. ఈ ఏడాది సీజన్లో భరత్ తన అద్బుతమైన ప్రదర్శనలతో జట్టును విజయ పథంలో నడిపిస్తున్నాడు. గతంలో యూపీ యోధాకు ప్రాతినిథ్యం వహించిన భరత్ హుడాను.. ఈ ఏడాది వేలంలో రూ. 81 లక్షలకు టైటాన్స్ కొనుగోలు చేసింది. ఈ వేలంలో అతడు మూడవ అత్యంత ఖరీదైన ఆల్రౌండర్గా నిలిచాడు. అయితే టైటాన్స్ మెనెజ్మెంట్ తన పెట్టుకున్న నమ్మకాన్ని భరత్ వమ్ము చేయలేదు. భరత్ హూడా.. కెప్టెన్ విజయ్ మాలిక్తో కలిసి జట్టు రైడింగ్ విభాగాన్ని నడిపించే బాధ్యతను తీసుకున్నాడు. ఎలిమినేటర్-3 మ్యాచ్లో పాట్నా పైరేట్స్పై కూడా భరత్ సత్తాచాటాడు. 23 పాయింట్లు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు బెంగళూరు బుల్స్పై గెలుపొందిన మినీ క్వాలిఫయర్ మ్యాచ్లో అతడు 12 పాయింట్లతో రాణించాడు. మొత్తంగా అత్యధిక రైడ్ పాయింట్ల సాధించిన జాబితాలో భరత్ హుడా(207) నాలుగో స్ధానంలో కొనసాగుతున్నాడు. దీంతో అతడిపై టైటాన్స్ ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అతడు టైటాన్స్కు దొరికిన అణిముత్యమని కొనియాడుతున్నారు. మరోవైపు కెప్టెన్ విజయ్ మాలిక్(156) కూడా సత్తాచాటుతున్నాడు.చదవండి: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ -
పరాజయాన్ని ప్రేరణగా మార్చి...
సాక్షి క్రీడా విభాగం : గత ఏడాది పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించేందుకు జోర్డాన్లోని అమ్మాన్లో వరల్డ్ రెజ్లింగ్ ఒలింపిక్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్ (ఆసియా) జరుగుతోంది. భారత్లో జరిగిన సెలక్షన్ ట్రయల్స్లో గెలిచిన తర్వాత సుజీత్ కల్కాల్ ఇక్కడ బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. అయితే అనూహ్య వరదలు దుబాయ్ నుంచి ముంచెత్తడంతో అక్కడి నుంచి విమానంలో అతను సరైన సమయానికి అమ్మాన్ చేరలేకపోయాడు. దాంతో సుజీత్ తీవ్రమైన పోటీ ఉండే వరల్డ్ క్వాలిఫయర్స్లో తలపడాల్సి వచ్చింది. ఇస్తాంబుల్లో జరిగిన ఈ టోర్నీ లో ఈ ఈవెంట్ ఆరంభంలో సత్తా చాటిన సుజీత్ సెమీఫైనల్కు అర్హత సాధించాడు. మరొక్క విజయం సాధిస్తే చాలు పారిస్ ఒలింపిక్స్ టికెట్ ఖాయమయ్యేది. కానీ తర్వాతి రెండు బౌట్లలో ఓటమిపాలై అతను ఆ అవకాశాన్ని కోల్పోయాడు. రెండో బౌట్లోనైతే వరల్డ్ చాంపియన్ జైన్ రూథర్ఫోర్డ్తో హోరాహోరీగా తలపడి 2–2తో నిలిచాడు. అయితే చివరి పట్టు (క్రయిటీరియా) ప్రత్యరి్థది కావడంతో సుజీత్ ఓటమి నమోదైంది. అయితే సుజీత్ నిరాశ చెందలేదు. ఆ పరాజయం తన కర్తవ్యాన్ని గుర్తు చేస్తుందని, పరాజయాన్నే స్ఫూర్తిగా తీసుకుంటానంటూ నాటి పరాజయం ఫొటోను అతను తన ఫోన్ వాల్పేపర్గా పెట్టుకున్నాడు. ఎప్పుడు దానిని చూసినా ఇంకా సాధించాలనే ప్రేరణ తనకు దక్కుతుందని సుజీత్ చెబుతాడు. ‘నేను ఓడినా సరే ఈ రెండు మ్యాచ్లకు నా కెరీర్లో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పరాజయాలతో నేను ఎంతో నేర్చుకున్నాను’ అని సుజీత్ తెలిపాడు. సంపూర్ణ ఆధిపత్యం... ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని ఎంత వేగంగా తాను పైకి లేవగలనో సుజీత్ ఇటీవలే నిరూపించాడు. గత నెలలో క్రొయేషియాలో జరిగిన ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో సుజీత్ పతకమే లక్ష్యంగా బరిలోకి దిగాడు. క్వార్టర్ ఫైనల్లో 5–6తో ఇరాన్ రెజ్లర్ రెహమాన్ మూసా అమూజాద్ఖలీలి చేతిలో పోరాడి ఓడిపోయాడు. సుజీత్పై నెగ్గిన రెహమాన్ మూసా చివరకు ప్రపంచ చాంపియన్గా నిలిచాడు. రెహమాన్ ఫైనల్కు చేరుకోవడంతో సుజీత్కు ‘రెపిచాజ్’ రూపంలో కాంస్య పతకం సాధించే అవకాశం లభించింది. అయితే ‘రెపిచాజ్’ తొలి రౌండ్లో సుజీత్ 5–7తో రియల్ మార్షల్ రే వుడ్స్ (అమెరికా) చేతిలో ఓడిపోయి పతకానికి దూరమైపోయాడు. కానీ ఈ మెగా ఈవెంట్లో తాను చేసిన తప్పిదాలను సమీక్షించుకొని ప్రపంచ అండర్–23 చాంపియన్షిప్ పోటీలకు సిద్ధమయ్యాడు. సుజీత్ పకడ్బందీ సన్నాహాలు సత్ఫలితాలు ఇచ్చాయి. సెర్బియాలోని నోవిసాద్లో సోమవారం ముగిసిన ప్రపంచ అండర్–23 చాంపియన్షిప్లో సుజీత్ విశ్వవిజేతగా అవతరించాడు. తన కెరీర్లో తొలిసారి ప్రపంచ టైటిల్ను సాధించాడు. స్వర్ణ పతకం సాధించే క్రమంలో సుజీత్... క్వార్టర్ ఫైనల్లో రెండుసార్లు అండర్–23 వరల్డ్ చాంపియన్ బషీర్ మగోమెదోవ్ (రష్యా)పై 4–2తో... సెమీఫైనల్లో ప్రపంచ మాజీ జూనియర్ చాంపియన్ యుటో నిషియుచి (జపాన్)పై 3–2తో గెలుపొందాడు. నిషియుచితో జరిగిన బౌట్లో సుజీత్ చివరి సెకను వరకు ఓటమి అంగీకరించకూడదనే తత్వం విజయాన్ని అందించింది. బౌట్ ముగియడానికి 7 సెకన్లు మాత్రమే ఉన్నదశలో సుజీత్ 1–2తో వెనుకబడి పరాజయం అంచుల్లో నిలిచాడు. కానీ ఈ 7 సెకన్లలో సుజీత్ తన బలాన్నంతా కూడదీసుకున్నాడు. నిషియుచిని కింద పడేసి రెండు పాయింట్లు సాధించాడు. చివరకు 3–2తో నెగ్గిన సుజీత్ ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకున్నాడు. గత నెలలో జరిగిన సీనియర్ ప్రపంచ చాంపియన్íÙప్లో కాంస్య పతకం నెగ్గిన ఉమిద్జాన్ జలోలోవ్ (ఉజ్బెకిస్తాన్)తో సుజీత్ ఫైనల్ బౌట్కు సిద్ధమయ్యాడు. సూపర్ ఫామ్లో ఉన్న జలోలోవ్పై సుజీత్ నమ్మశక్యంకాని రీతిలో 10–0తో బ్రహ్మండ విజయాన్ని సాధించాడు. సుజీత్ డిఫెన్స్ను ఎలా ఛేదించాలో తెలుసుకునేలోపే జలోలోవ్ పది పాయింట్లు సమర్పించుకొని ఓటమిని మూటగట్టుకున్నాడు. 2 పాయింట్లే కోల్పోయి... ఈ రెండు మెగా ఈవెంట్లకు ముందు సుజీత్ జులైలో బుడాపెస్ట్లో జరిగిన యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ర్యాంకింగ్ సిరీస్లో స్వర్ణం సాధించి సత్తా చాటాడు. ఇదేమీ సాధారణ విజయం కాదని అతను ఓడించిన ఆటగాళ్లను చూస్తే అర్థమవుతుంది. ఒలింపిక్ కాంస్యపతక విజేత ఇస్లామ్ దుదేవ్, రెండు సార్లు ఒలింపిక్స్ ఆడిన వాజ్గన్ తెవన్యమ్, నాలుగు సార్లు యూరోపియన్ మెడలిస్ట్ అలీ రహీమ్జాదేలపై సుజీత్ విజయం సాధించాడు. ఈ టోర్నీలో నాలుగు బౌట్లలో కలిపి 33 పాయింట్లు సాధించిన అతను 2 పాయింట్లు మాత్రమే కోల్పోయి ఆధిపత్యం ప్రదర్శించాడు. ఈ ప్రదర్శనతో భవిష్యత్లో సుజీత్ అద్భుతాలు చేయగలడని అంచనాలు మరింత పెరిగాయి. ఓవరాల్గా ఈ ఏడాది ఐదు టోర్నీల్లో పోటీపడ్డ సుజీత్ 3 పతకాలు సాధించాడు. 21 బౌట్లలో పోటీపడ్డ సుజీత్ 17లో గెలుపొంది, 4లో ఓడిపోయాడు. 169 పాయింట్లు స్కోరు చేసి, ప్రత్యర్థులకు 37 పాయింట్లు మాత్రమే సమర్పించుకున్నాడు. భిన్నమైన శైలితో విజయాలు... సాధారణంగా ప్రత్యర్థిని అలసిపోయేలా చేసి ఆపై పైచేయి సాధించడం భారత రెజ్లర్ల శైలి. అంటే ఆరంభంలో వెనుకబడినా ఆ తర్వాత కోలుకొని పట్టు బిగిస్తారు. అయితే సుజీత్ శైలి దీనికి పూర్తిగా భిన్నం. సాధ్యమైనంత త్వరగా ఆటను ముగించడమే లక్ష్యంగా అతను బరిలోకి దిగుతాడు. సరిగ్గా చెప్పాలంటే టెక్నిక్పైనే అతను ఎక్కువగా దృష్టి పెట్టాడు. ఇతర ఆటగాళ్లతో పోలిస్తే సుజీత్ను టెక్నికల్ రెజ్లర్గా అంతా పిలుస్తారు. ఒలింపిక్స్ క్వాలిఫయింగ్లో ఓడిపోవడం ఒక రకంగా తనకు మేలు చేసిందని అతను అన్నాడు. అత్యున్నత స్థాయిలో ఆడేటప్పుడు లోపాలు ఎలా సరి చేసుకోవాలో తనకు అర్థమైందని, మ్యాట్ ట్రైనింగ్ తో పాటు స్ట్రెంత్ ట్రైనింగ్పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సుజీత్ చెప్పాడు. ఈ ఏడాది ప్రపంచ సీనియర్ చాంపియన్షిప్లో పతకం చేజారినా... తన అసలు లక్ష్యం మాత్రం 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో పతకం సాధించడమేనని తెలిపాడు.ఇంజినీరింగ్ను కాదని రెజ్లింగ్కు... ప్రస్తుతం భారత పురుషుల రెజ్లింగ్ ఫ్రీస్టయిల్ విభాగంలో సుజీత్ అగ్రశ్రేణి ఆటగాడిగా ఎదిగాడు. నిజానికి అతను ఆటలో చాలా ఆలస్యంగా వచ్చాడు. గత ఐదేళ్ల నుంచే పూర్తి స్థాయిలో రెజ్లింగ్పై దృష్టి పెట్టాడు. హరియాణాలోని భివాని సమీప గ్రామం ఇమ్లోటా అతని స్వస్థలం. అతని తండ్రి దయానంద్ రెజ్లింగ్లో మాజీ చాంపియన్ కావడంతోపాటు 2005 వరల్డ్ చాంపియన్షిప్లో గ్రీకో రోమన్ విభాగంలో పోటీ పడ్డాడు. అయితే మొదటి నుంచీ సుజీత్ చదువులో బాగా చురుగ్గా ఉండేవాడు. ఇంటర్మీడియట్లో 90 శాతానికి పైగా మార్కులు సాధించాడు. దాంతో తండ్రి కూడా చదువుపైనే దృష్టి పెట్టమని చెప్పాడు. కానీ ఈ కుర్రాడు నేను రెండూ చేయగలనంటూ అటు చదువు, ఇటు రెజ్లింగ్ కొనసాగించే ప్రయత్నం చేశాడు. సహజంగానే రెండింటిపై దృష్టి పెట్టలేకపోయాడు. చదువులో మంచి మార్కులు రాగా ... రెజ్లింగ్ అండర్–17, అండర్–19 స్థాయిల్లోనూ ఎలాంటి ఫలితాలు రాలేదు. ‘నేను ఇంజినీరింగ్ వైపు వెళ్లాలనే ఆలోచనతోనే ఉన్నాను. జేఈఈ ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతూ మాక్ టెస్టులకు కూడా హాజరయ్యాను. అప్పుడు నాన్న స్పష్టంగా చెప్పారు. రెండూ సాధ్యం కాదని, ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలని అన్నారు. చాలా ఆలోచించిన తర్వాత రెజ్లింగ్ వైపు మళ్లాను. నాకు ఈ ఆట అంటే చాలా ఇష్టం. సుశీల్ కుమార్, బజరంగ్ పూనియా ఆట చూస్తూ పెరిగాను దేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్ప విషయంగా భావించా’ అని సుజీత్ చెప్పాడు. దాంతో మరింత మెరుగైన శిక్షణ కోసం సోనీపథ్ చేరిన అతను కుల్దీప్ సింగ్ కోచింగ్లో రాటుదేలాడు. 2021లో ఇక్కడికి వచ్చిన సుజీత్ నాలుగేళ్లలో భారత అత్యుత్తమ రెజ్లర్లలో ఒకడిగా ఎదిగాడు. 2022లో తొలిసారి సీనియర్ నేషనల్స్లో పాల్గొన్న అనంతరం అతను వేగంగా దూసుకుపోయాడు. గత ఏడాది అండర్–23 ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్లో 70 కేజీల్లో పోటీపడి కాంస్య పతకాన్ని నెగ్గిన సుజీత్... ఆసియా అండర్–23 చాంపియన్షిప్లో రెండుసార్లు విజేతగా నిలిచాడు. -
భారత్లో ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్
సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్ టోర్నమెంట్కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. నవంబర్ 14 నుంచి 21 వరకు గ్రేటర్ నోయిడాలోని షహీద్ విజయ్ సింగ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఈ మెగా ఈవెంట్ జరగనుంది. మొత్తం 18 దేశాల నుంచి 140 మందికి పైగా అగ్రశ్రేణి బాక్సర్లు ఈ టోర్నమెంట్లో పాల్గొననున్నారు. వీరిలో ముగ్గురు ఒలింపిక్ పతక విజేతలు కూడా ఉండటం విశేషం. ఈ టోర్నమెంట్లో 20 మంది (10 మంది పురుషులు, 10 మంది మహిళలు)తో కూడిన బలమైన జట్టుతో భారత్ బరిలోకి దిగుతోంది. మాజీ ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్ (51 కేజీలు), ప్రస్తుత ప్రపంచ చాంపియన్లు జైస్మీన్ లంబోరియా (57 కేజీలు), మీనాక్షి (48 కేజీలు), రెండుసార్లు ఆసియా చాంపియన్ పూజా రాణి (80 కేజీలు) తదితర స్టార్ బాక్సర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. పురుషుల విభాగంలో ఈ సీజన్ ప్రపంచ కప్ టోర్నీల్లో పతకాలు సాధించిన హితేశ్ (70 కేజీలు), అభినాశ్ జమ్వాల్ (65 కేజీలు) మరోసారి మెరిపించడానికి సిద్ధమవుతున్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ బాక్సర్లు స్వదేశంలో పోటీ పడనుండటం మన దేశ బాక్సర్లకు తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశమని భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) అధ్యక్షుడు అజయ్ సింగ్ పేర్కొన్నారు. భారత పురుషుల జట్టు: జాదూమణి సింగ్ (48 కేజీలు), పవన్ (55 కేజీలు), సచిన్ (60 కేజీలు), అభినాశ్ జమ్వాల్ (65 కేజీలు), హితేశ్ (70 కేజీలు), సుమిత్ (75 కేజీలు), లక్ష్య చహర్ (80 కేజీలు), జుగ్నూ (85 కేజీలు), నవీన్ కుమార్ (90 కేజీలు), నరేందర్ (ప్లస్ 90 కేజీలు). భారత మహిళల జట్టు: మీనాక్షి (48 కేజీలు), నిఖత్ జరీన్ (51 కేజీలు), ప్రీతి (54 కేజీలు), జైస్మీన్ లంబోరియా (57 కేజీలు), పర్వీన్ హుడా (60 కేజీలు), నీరజ్ ఫొగాట్ (65 కేజీలు), అరుంధతి చౌధరీ (70 కేజీలు), స్వీటీ బూరా (75 కేజీలు), పూజా రాణి (80 కేజీలు), నుపుర్ (ప్లస్ 80 కేజీలు). -
క్వాలిఫయర్–2కు తెలుగు టైటాన్స్
న్యూఢిల్లీ: వరుస విజయాలతో విజృంభిస్తున్న తెలుగు టైటాన్స్ జట్టు ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్లో ఫైనల్కు విజయం దూరంలో నిలిచింది. మంగళవారం హోరాహోరీగా సాగిన ఎలిమినేటర్–3లో తెలుగు టైటాన్స్ 46–39 పాయింట్ల తేడాతో మూడుసార్లు చాంపియన్ పట్నా పైరేట్స్పై నెగ్గింది. టైటాన్స్ తరఫున భరత్ హూడా 23 పాయింట్లతో మెరిశాడు. పట్నా పైరేట్స్ తరఫున అయాన్ 22 పాయింట్లతో పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు. ఈ సీజన్లో అయాన్ 20కి పైగా పాయింట్లు సాధించడం ఇది ఆరోసారి. తద్వారా ఒకే సీజన్లో అత్యధిక సార్లు 20కి పైగా పాయింట్లు సాధించిన రెయిడర్గా అయాన్ చరిత్ర సృష్టించాడు. పీకేఎల్ 12వ సీజన్లో అయాన్ 316 పాయింట్లు సాధించడం విశేషం. గత సీజన్లో 184 పాయింట్లు నమోదు చేసుకున్న అతడు... ఈసారి పట్నా పైరేట్స్ ఎలిమినేటర్–3 వరకు రావడంలో కీలక పాత్ర పోషించాడు. ఇరు జట్లు మ్యాచ్ను దూకుడుగా ఆరంభించగా... టైటాన్స్ 29 రెయిడ్ పాయింట్లు, పట్నా 27 రెయిడ్ పాయింట్లు సాధించాయి. ఇరు జట్లు రెండేసి సార్లు ఆలౌట్ కాగా... రెండేసి ఎక్స్ట్రా పాయింట్లు సాధించాయి. ట్యాక్లింగ్లో మెరుగ్గా నిలిచిన టైటాన్స్ ముందంజ వేసింది. నేడు జరిగే క్వాలిఫయర్–2లో పుణేరి పల్టన్తో తెలుగు టైటాన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు శుక్రవారం ఫైనల్లో దబంగ్ ఢిల్లీతో టైటిల్ కోసం పోటీపడుతుంది. -
ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నా.. నా టార్గెట్ అదే: నిఖత్ జరీన్
రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్షిప్ గోల్డ్ మెడలిస్ట్ నిఖత్ జరీన్.. వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్కు సిద్దమవుతోంది. ఈ ఫైనల్లో అత్యధిక ర్యాంకింగ్ పాయింట్లను సాధించడంపై ఆమె దృష్టి సారించింది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ నవంబర్ 14 నుండి 21 వరకు గ్రేటర్ నోయిడాలో జరగనుంది. ఫ్లైవెయిట్, లైట్ ఫ్లైవెయిట్ విభాగాల్లో నిఖత్ పోటీపడనుంది. కాగా 2022 (ఇస్తాంబుల్), 2023 (న్యూఢిల్లీ)లో ప్రపంచ ఛాంపియన్షిప్ గోల్డ్ మెడల్స్ గెలుచుకున్న నిఖత్.. ఈ ఏడాది లివర్పూల్లో జరిగిన ఈ మెగా టోర్నీ క్వార్టర్ఫైనల్స్లో టర్కీకి చెందిన రెండుసార్లు ఒలింపిక్ రజత పతక విజేత బుస్ నజ్ చకిరోగ్లు (Buse Naz Çakiroglu) చేతిలో ఓడిపోయింది. ఈసారి మాత్రం ఎటువంటి తప్పిదాలు చేయకూడదని హైదరబాద్కు జరీన్ భావిస్తోంది."లివర్పూల్ వరల్డ్ ఛాంపియన్ షిప్లో ఓటమి నిరాశపరిచింది. అయితే ఒక సంవత్సరం విరామం తర్వాత తిరిగి వచ్చి భారత జట్టు తరపున రెండు బౌట్లు గెలిచి, రెండుసార్లు ఒలింపిక్ రజత పతక విజేతతో ఓడిపోయాను. ఆఖరి వరకు పోరాడి ఓడినందుకు గర్వంగా ఉంది. ఈ ఓటమి నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నాను.ఇప్పుడు భారత్ ఆతిథ్యమిస్తున్న వరల్డ్ కప్ ఫైనల్స్లో సత్తా చాటేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాను. ఈ టోర్నీ కోసం తీవ్రంగా శ్రమించాను. నాతో పాటు మిగితా బాక్సర్లు ఎక్కువగా కష్టపడుతున్నారు. లివర్పూల్లో కంటే ఇక్కడ మెరుగ్గా రాణిస్తామని ఆశిస్తున్నాను.రాబోయో అంతర్జాతీయ ఈవెంట్లలో పతకాలు గెలవడం మాకు చాలా ముఖ్యం. ఎందుకంటే ఆసియా క్రీడలు (Asian Games), కామన్వెల్త్ క్రీడల్లో (Commonwealth Games) సీడింగ్లు పొందడానికి మాకు గరిష్ట ర్యాంకింగ్ పాయింట్లు అవసరమని" మంగళవారం విలేకరుల సమావేశంలో నిఖత్ పేర్కొంది.కాగా వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్లో గోల్డ్ మెడల్ విజేతకు 300 పాయింట్లు, రజత పతకానికి 150 , కాంస్య పతకానికి 75 పాయింట్లు లభిస్తాయి. ఇక ఇది ఇలా ఉండగా.. ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్ 2025 కోసం భారత జట్టును భారత బాక్సింగ్ సమాఖ్య (BFI) మంగళవారం ప్రకటిచింది.పురుషులుహితేష్ (70 కేజీలు), అభినాష్ జమ్వాల్ (65 కేజీలు), జదుమణి సింగ్ (50 కేజీలు), పవన్ బర్త్వాల్ (55 కేజీలు), సచిన్ (60 కేజీలు), సుమిత్ (75 కేజీలు), లక్ష్య చాహర్ (80 కేజీలు), జుగ్నూ (85 కేజీలు), నవీన్ కుమార్ (90 కేజీలు), నరేందర్ (90+ కేజీలు)మహిళలునిఖత్ జరీన్ (51 కేజీలు), జైస్మిన్ లంబోరియా (57 కేజీలు), మినాక్షి (48 కేజీలు), పూజా రాణి (80 కేజీలు), సావీటీ బూరా (75 కేజీలు), నుపుర్ షెరాన్ (80+ కేజీలు), ప్రీతి (54 కేజీలు), పర్వీన్ (60 కేజీలు), నీరజ్ ఫోగట్ (670 కేజీలు), అరుంధతిక్ (670 కేజీలు) -
పాట్నాను చిత్తు చేసిన తెలుగు టైటాన్స్..
ప్రో కబడ్డీ లీగ్-2025లో తెలుగు టైటాన్స్ తమ జోరును కొనసాగిస్తోంది. మంగళవారం ఢిల్లీ వేదికగా పాట్నా పైరేట్స్తో జరిగిన ఎలిమినేటర్-3 మ్యాచ్లో 46-39 తేడాతో టైటాన్స్ విజయం సాధించింది. దీంతో క్వాలిఫయర్-2కు తెలుగు టైటాన్స్ అర్హత సాధించింది.టైటాన్స్ ఆల్రౌండర్ భరత్ హుడా మరోసారి తన అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ కీలక మ్యాచ్లో భరత్ ఏకంగా 23 పాయింట్లు సాధించాడు. అందులో 17 టచ్ పాయింట్లు, 6 బోనస్ పాయింట్లు ఉన్నాయి. కెప్టెన్ విజయ్ మాలిక్ మాత్రం కేవలం 5 పాయింట్లు తీసుకొచ్చాడు. పాట్నా రైడర్స్లో అయాన్ మినహా మిగితా అందవరూ విఫలమయ్యారు. బుధవారం జరగనున్న క్వాలిఫయర్-2లో పుణేరి పల్టన్తో టైటాన్స్ తలపడనుంది.చదవండి: PKL 2025: పాట్నాను చిత్తు చేసిన తెలుగు టైటాన్స్.. క్వాలిఫయర్-2కు అర్హత -
ప్రో కబడ్డీలో సంచలనం.. ఒకే రైడ్లో 7 పాయింట్లు! వీడియో వైరల్
ప్రోకబడ్డీ లీగ్-2025లో సంచలనం నమోదైంది. సోమవారం రాత్రి ఢిల్లీ వేదికగా పట్నా పైరేట్స్తో జరిగిన ఎలిమినేటర్2లో బెంగళూరు బుల్స్ స్టార్ రైడర్ శుభం బిటాకే అద్బుతం చేశాడు. ఒకే రైడ్లో ఏడు పాయింట్లు సాధించి అందరిని షాక్కు గురిచేశాడు.ఈ మ్యాచ్ ఫస్ట్ హాఫ్ ముగిసే సరికి పాట్నా పైరేట్స్ బెంగళూరు బుల్స్ పై 27-13 ఆధిక్యంలో నిలిచింది. దీంతో బెంగళూరుకు ఘోర ఓటమి తప్పదని అంతా భావించారు. కానీ శుభమ్ ఒక్క సంచలన రైడ్తో బెంగళూరును తిరిగి గేమ్లోకి తీసుకొచ్చాడు.పాట్నా డిఫెండర్లను చాకచాక్యంగా బురిడీ కొట్టించిన శుభమ్.. ఆరు టచ్ పాయింట్లు, ఒక్క బొనస్ పాయింట్ సాధించి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. కానీ ఆఖరిలో రైడర్లు, డిఫెండర్లు చిన్న చిన్న తప్పిదాలు చేయడంతో బెంగళూరు 46-37 తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.చరిత్ర సృష్టించిన శుభమ్..అయితే ఈ మ్యాచ్లో సూపర్ రైడ్తో మెరిసిన శుభమ్.. ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రోకబడ్డీ లీగ్ చరిత్రలో ఒకే రైడ్లో అత్యధిక వ్యక్తిగత పాయింట్లు సాధించిన ఆటగాడిగా బిటాకే నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు పర్దీప్ నర్వాల్ పేరిట ఉండేది. పీకేఎల్-2017లో పర్దీప్ ఒకే రైడ్లో 6 వ్యక్తిగత పాయింట్లు తీసుకొచ్చాడు. వాస్తవానికి ఆ రైడ్లో పర్దీప్.. 8 పాయింట్లు సాధించాడు. కానీ అందులో 6 వ్యక్తిగత పాయింట్లు కాగా.. మరో రెండు ఆలౌట్ పాయింట్లు ఉన్నాయి. చదవండి: PKL 2025: తెలుగు టైటాన్స్కు చావో రేవో మ్యాచ్.. ఓడితే పరిస్థితి ఏంటి? View this post on Instagram A post shared by Star Sports India (@starsportsindia) -
ఇంతకంటే గొప్పగా ‘ప్రతీకారం’ తీర్చుకోవచ్చా?
ప్రపంచ చాంపియన్, భారత గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ (D Gukesh)పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘‘ఆటలోనే కాదు.. వ్యక్తిత్వంలోనూ చాంపియన్వే’’ అంటూ కొనియాడుతున్నారు. పద్దెమినిదేళ్ల వయసులోనే ఇంత పరిణతి సాధించిన గుకేశ్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇంతకీ ఏం జరిగిందంటే.. అమెరికాలోని సెయింట్ లూసియాలో జరుగుతున్న క్లచ్ చెస్ చాంపియన్స్ షోడౌన్-2025 ఈవెంట్లో గుకేశ్.. అమెరికన్ గ్రాండ్మాస్టర్ హికారు నకమురా (Hikaru Nakamura)ను ఓడించాడు. ఆది నుంచే ఆత్మవిశ్వాసంతో పావులు కదిపిన ఈ చెన్నై చిన్నోడు 1.5- 0.5 తేడాతో నకమురాను ఓడించాడు.గుకేశ్ ‘కింగ్’ను ప్రేక్షకుల వైపు విసిరిన నకమురాఈ క్రమంలో గెలుపొందిన తర్వాత గుకేశ్ హుందాగా ప్రవర్తించిన తీరే అతడిపై ప్రశంసలకు కారణం. కాగా అక్టోబరు 6న ఆర్లింగ్టన్లో జరిగిన చెక్మేట్ ఈవెంట్ ఓపెనింగ్ లెగ్లోనూ గుకేశ్- నకమురా ముఖాముఖి తలపడ్డారు. ఈ గేమ్లో నకమురా గుకేశ్ను 5-0తో వైట్వాష్ చేశాడు.దీంతో భారత్పై అమెరికా విజయం ఖరారు కాగా.. నకమురా.. గుకేశ్ ‘కింగ్’ను ప్రేక్షకుల వైపు విసిరి సెలబ్రేట్ చేసుకున్నాడు. అయితే, గుకేశ్ మాత్రం సహనం కోల్పోకుండా.. సంయమనం పాటిస్తూ చిరునవ్వులు చిందిస్తూ ఉండిపోయాడు.ఇంతకంటే గొప్పగా ‘ప్రతీకారం’ తీర్చుకోవచ్చా?ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అయింది. అయితే, ఈసారి గుకేశ్ విజేతగా నిలిచాడు. అయినాసరే అప్పుడు 37 ఏళ్ల నకమురా చేసినట్లుగా ఓవరాక్షన్ చేయలేదు. నకమురా షేక్హ్యాండ్ ఇవ్వగా హుందాగా స్వీకరించిన గుకేశ్.. తర్వాత తనదైన శైలిలో పావులను బోర్డుపై అమరుస్తూ ఉండిపోయాడు. Revenge Is A Dish Best Served Cold 🥶 pic.twitter.com/icCvA1JA4u— Desidudewithsign (@Nikhilsingh21_) October 28, 2025 ఈ రెండు ఘటనలకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ.. నెటిజన్లు గుకేశ్ను ప్రశంసిస్తున్నారు. ‘‘ప్రతీకారం కంటే.. ఇలా చిన్న చిరునవ్వుతోనే ప్రత్యర్థిని మరింత గొప్పగా దెబ్బకొట్టవచ్చు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.చిన్న వయసులోనే చదరంగ రారాజుగాకాగా గతేడాది డిసెంబరులో గుకేశ్ ప్రపంచ చెస్ చాంపియన్గా అవతరించిన విషయం తెలిసిందే. సింగపూర్ సిటీ వేదికగా జరిగిన క్లాసికల్ ఫార్మాట్లో చైనా గ్రాండ్మాస్టర్, డిఫెండింగ్ చాంపియన్ డాంగ్ లిరెన్ను ఓడించడం ద్వారా గుకేశ్ విజేతగా నిలిచాడు. పద్దెమినిదేళ్ల వయసులోనే ఈ ఘనత సాధించి.. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ చాంపియన్గా నిలిచిన రెండో భారత క్రీడాకారుడిగా నిలిచాడు. ఈ క్రమంలో దాదాపు రూ. 11.45 కోట్ల ప్రైజ్మనీని గుకేశ్ అందుకున్నాడు.చదవండి: PKL 2025: తెలుగు టైటాన్స్కు చావో రేవో మ్యాచ్.. ఓడితే పరిస్థితి ఏంటి? -
తెలుగు టైటాన్స్కు చావో రేవో మ్యాచ్.. ఓడితే పరిస్థితి ఏంటి?
ప్రోకబడ్డీ లీగ్-2025లో వరుస విజయాలతో దూసుకు పోతున్న తెలుగు టైటాన్స్ కీలక పోరుకు సిద్దమైంది. మంగళవారం(అక్టోబర్ 28) ఢిల్లీ వేదికగా ఎలిమినేటర్-3లో పాట్నా పైరేట్స్తో తెలుగు టైటాన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్లో టైటాన్స్ విజయం సాధిస్తే బుధవారం జరిగే క్వాలిఫయర్-2లో పుణేరి పల్టాన్ను ఢీకొట్టనుంది.ఒకవేళ ఈ చావో రేవో మ్యాచ్లో తెలుగు టైటాన్స్ ఓటమి పాలైతే టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. కావరుస విజయాలతో జోరు మీదున్న తెలుగు టైటాన్స్కు పాట్నాను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ పైరేట్స్ జట్టులో అయాన్ లోచాబ్, మణీందర్ సింగ్ వంటి అద్బుతమైన రైడర్లు ఉన్నారు. వీరిద్దరూ చెలరేగితే టైటాన్స్కు కష్టాలు తప్పవు. ప్రస్తుత సీజన్లో అత్యధిక రైడ్ పాయింట్ల సాధించిన జాబితాలో అయాన్ (294) అగ్రస్దానంలో ఉన్నాడు. అదేవిధంగా పాట్నా డిఫెండర్ నవదీప్ నుంచి కూడా టైటాన్స్ రైడర్స్కు కష్టాలు ఎదురుకానున్నాయి. నవదీప్ 68 టాకిల్ పాయింట్లతో టాప్లో కొనసాగుతున్నారు. వీరిముగ్గురి జోరుకు కళ్లెం వేస్తే తెలుగు టైటాన్స్ విజయం నల్లేరు మీద నడక కానుంది. అయితే పీకేఎల్-12 వ సీజన్లో పాట్నా కంటే టైటాన్స్కే మెరుగైన రికార్డు ఉంది. తెలుగు టైటాన్స్ ఇప్పటివరకు 18 మ్యాచ్లు ఆడి పదింట విజయం సాధించగా.. పాట్నా 18 మ్యాచ్లు ఆడి కేవలం ఎనిమిదింట మాత్రమే విజయం సాధించింది. కానీ ఆరంభంలో తడబడిన పాట్నా.. వరుసగా ఎనిమిది మ్యాచ్ల్లో విజయం సాధించి ప్లే ఇన్స్కు ఆర్హత సాధించడం గమనార్హం.కాగా తెలుగు టైటాన్స్కు కెప్టెన్ విజయ్ మాలిక్, భరత్ హుడా అద్బుతమైన ఫామ్లో ఉండడం కలిసొచ్చే ఆంశంగా చెప్పుకోవాలి. సోమవారం బెంగళూరు బుల్స్తో జరిగిన మినీ క్వాలిఫయర్లో కూడా వీరిద్దరూ సత్తాచాటారు. తెలుగు టైటాన్స్ వర్సెస్ పాట్నా పైరేట్స్ స్టార్టింగ్ 7తెలుగు టైటాన్స్: చేతన్ సాహు, సాగర్, అజిత్ పవార్, విజయ్ మాలిక్ (కెప్టెన్), భరత్ హుడా, శుభమ్ షిండే, అంకిత్.పాట్నా పైరేట్స్: అంకిత్ కుమార్, దీపక్, బాలాజీ డి, అయాన్ లోహ్చాబ్, మిలన్ దహియా, నవదీప్ అంకిత్ జగ్లాన్ (కెప్టెన్).చదవండి: దబంగ్ ఢిల్లీ ఫైనల్కు -
Mexico City GP: నోరిస్... గెలుపు బాటలో...
మెక్సికో సిటీ: గత ఐదు రేసుల్లో ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయిన మెక్లారెన్ జట్టు డ్రైవర్ లాండో నోరిస్ మళ్లీ గెలుపు బాటలో పడ్డాడు. ఐదు రేసుల తర్వాత ఈ ఏడాది ఫార్ములావన్ (ఎఫ్1) సీజన్లో ఆరో విజయాన్ని అందుకున్నాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన మెక్సికో గ్రాండ్ప్రి రేసులో బ్రిటన్కు చెందిన లాండో నోరిస్ విజేతగా నిలిచాడు. ‘పోల్ పొజిషన్’తో ఈ రేసును ఆరంభించిన నోరిస్ నిరీ్ణత 71 ల్యాప్లను అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా ఒక గంట 37 నిమిషాల 58.574 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని అలంకరించాడు. ఈ సీజన్లో ఏడు విజయాలతో నిలకడగా రాణిస్తున్న మెక్లారెన్కే చెందిన మరో డ్రైవర్ ఆస్కార్ పియాస్ట్రి మెక్సికో గ్రాండ్ప్రిలో తడబడ్డాడు. చివరకు ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఫలితంగా 19 రేసులు ముగిశాక 346 పాయింట్లతో టాప్ ర్యాంక్లో ఉన్న పియాస్ట్రిమెక్సికో రేసు తర్వాత రెండో స్థానానికి పడిపోయాడు. మెక్సికో ట్రాక్పై రయ్మంటూ దూసుకుపోయిన నోరిస్ 25 పాయింట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 357 పాయింట్లతో డ్రైవర్స్ చాంపియన్íÙప్ రేసులో అగ్రస్థానానికి చేరుకున్నాడు.356 పాయింట్లతో పియాస్ట్రి రెండో స్థానంలో, 321 పాయింట్లతో వెర్స్టాపెన్ మూడో స్థానంలో ఉన్నారు. ఏప్రిల్లో ఐదో రేసు ముగిశాక నోరిస్ చివరిసారి టాప్ ర్యాంక్లో నిలిచాడు. ఆ తర్వాత పియాస్ట్రి మొదటి స్థానంలోకి వచ్చాడు. ఈ సీజన్లోని తొలి రేసు ఆ్రస్టేలియా గ్రాండ్ప్రిలో టైటిల్ నెగ్గి శుభారంభం చేసిన నోరిస్ ఆ తర్వాత మొనాకో, ఆ్రస్టియా, బ్రిటిష్ హంగేరి గ్రాండ్ప్రిలలో విజయం సాధించాడు. 24 రేసుల ఈ సీజన్లో ఇప్పటికి 20 రేసులు ముగిశాయి. తదుపరి రేసు సావోపాలోలో బ్రెజిలియన్ గ్రాండ్ప్రి నవంబర్ 9న జరుగుతుంది. గత రెండేళ్లుగా బ్రెజిలియన్ గ్రాండ్ప్రిలో విజేతగా నిలుస్తున్న వెర్స్టాపెన్ మెక్లారెన్ డ్రైవర్లను నిలువరిస్తూ ‘హ్యాట్రిక్’ సాధిస్తాడో లేదో వేచి చూడాలి. -
సుజీత్కు స్వర్ణ పతకం
నోవిసాద్ (సెర్బియా): ప్రపంచ అండర్–23 రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత రెజ్లర్ సుజీత్ కల్కాల్ స్వర్ణ పతకం సాధించాడు. సోమవారం రాత్రి జరిగిన పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగం ఫైనల్లో 22 ఏళ్ల సుజీత్ 10–0 పాయింట్ల తేడాతో ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో ఉమిద్జాన్ జలోలోవ్ (ఉజ్బెకిస్తాన్)పై గెలుపొందాడు. నిర్ణీత ఆరు నిమిషాల్లో... 4 నిమిషాల 53 సెకన్లు ముగిసిన దశలో సుజీత్ తన ప్రత్యర్థిపై 10 పాయింట్ల ఆధిక్యాన్ని సాధించాడు. దాంతో నిబంధనల ప్రకారం రిఫరీ బౌట్ను నిలిపివేసి సుజీత్ను విజేతగా ప్రకటించారు. అండర్–23 ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్ చరిత్రలో పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన మూడో భారతీయ రెజ్లర్గా సుజీత్ గుర్తింపు పొందాడు. 2022లో అమన్ సెహ్రావత్ (57 కేజీలు), 2024లో చిరాగ్ చికారా (57 కేజీలు) భారత్కు పసిడి పతకాలు అందించారు. తాజా ప్రదర్శనతో సుజీత్ తన కెరీర్లో తొలిసారి ప్రపంచ చాంపియన్గా అవతరించాడు. సుజీత్ 2022, 2025లలో ఆసియా అండర్–23 చాంపియన్షిప్లో, 2022లో ఆసియా అండర్–20 చాంపియన్షిప్లో స్వర్ణ పతకాలు సాధించాడు. -
తొలి రోజు మ్యాచ్లు రద్దు
చెన్నై: భారత్లో జరిగే ఏకైక మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) టూర్–250 లెవెల్ టోర్నీ చెన్నై ఓపెన్కు వర్షం అంతరాయం కలిగించింది. సోమవారం మొదలుకావాల్సిన మెయిన్ ‘డ్రా’ మ్యాచ్లు... ‘మోంథా’ తుపాను ప్రభావం కారణంగా నిలకడగా కురిసిన వర్షం కారణంగా సాధ్యపడలేదు. షెడ్యూల్ ప్రకారం సోమవారం 10 మ్యాచ్లు (2 డబుల్స్, 8 సింగిల్స్) జరగాల్సింది. అయితే వరుణ దేవుడి ప్రతాపంతో ఒక్క మ్యాచ్ కూడా ప్రారంభంకాలేదు. ఫలితంగా నిర్వాహకులు ఈ మ్యాచ్లను మంగళవారానికి వాయిదా వేశారు. -
దబంగ్ ఢిల్లీ ఫైనల్కు
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో రెండో టైటిల్ సాధించేందుకు దబంగ్ ఢిల్లీ సిద్ధమైంది. 2021 చాంపియన్ ఢిల్లీ మూడేళ్ల తర్వాత మళ్లీ ఫైనల్కు అర్హత సాధించింది. సోమవారం రసవత్తరంగా జరిగిన తొలి క్వాలిఫయర్లో దబంగ్ ఢిల్లీ టైబ్రేకర్లో 6–4 పాయింట్ల తేడాతో పుణేరి పల్టన్పై గెలిచింది. ఇరుజట్ల ఆటగాళ్లు హోరాహోరీగా తలపడటంతో నిరీ్ణత సమయం ముగిసేసరికి మ్యాచ్ 34–34 స్కోరు వద్ద ‘టై’ అయ్యింది. దబంగ్ జట్టులో నీరజ్ నర్వాల్ (7) చక్కని పోరాటపటిమ కనబరిచాడు. 14 సార్లు కూతకెళ్లిన అతను ఏడుసార్లు పాయింట్లను తెచ్చిపెట్టాడు. 3 సార్లు మాత్రం అవుటయ్యాడు. కెపె్టన్ ఆశు మలిక్ రెయిడింగ్లో 4 పాయింట్లు చేశాడు. డిఫెండర్లలో సౌరభ్, సందీప్ చెరో 3 పాయింట్లు చేయగా, సుర్జీత్ సింగ్, ఫజల్ అత్రాచలి, అజింక్య పొవార్ తలా 2 పాయింట్లు చేశారు. పుణేరి పల్టన్ తరఫున ఆదిత్య షిండే (10) రాణించాడు. 18 సార్లు కూతకెల్లిన అతను 8 సార్లు బోనస్ సహా విజయవంతగా పాయింట్లు తెచ్చాడు. పంకజ్ మోహితే (5) కూడా జట్టును గెలిపించేందుకు తీవ్రంగా చెమటోడ్చారు. డిఫెండర్లలో గౌరవ్ ఖత్రి (4), గుర్దీప్, అభినేశ్ చెరో 3 పాయింట్లు చేశారు. పీకేఎల్లో దబంగ్కిది మూడో ఫైనల్! 2019 సీజన్లోనూ తుదిపోరుకు అర్హత సంపాదించినప్పటికీ... బెంగాల్ వారియర్స్ చేతిలో టైటిల్ను కోల్పోయి రన్నరప్తో సరిపెట్టుకుంది. పట్టికలో టాప్–2లో నిలిచిన జట్ల మధ్య జరిగిన తొలి క్వాలిఫయర్లో ఓడినంత మాత్రాన పుణేరి టైటిల్ ఆశలకు తెరపడలేదు. బుధవారం జరిగే రెండో క్వాలిఫయర్లో పుణేరి పల్టన్ ఫైనల్ బెర్తు కోసం మళ్లీ తలపడుతుంది. రెండో ఎలిమినేటర్లో పట్నా పైరేట్స్ 46–37తో బెంగళూరు బుల్స్పై గెలిచింది. నేడు జరిగే మూడో ఎలిమినేటర్లో తెలుగు టైటాన్స్తో పట్నా పైరేట్స్ తలపడుతుంది. ఈ మ్యాచ్ విజేతతోనే పుణేరి తలపడుతుంది. -
గోవాతో నాకెన్నో జ్ఞాపకాలు: వరల్డ్ చాంపియన్ గుకేశ్
ఫిడే ప్రపంచకప్-2025 (FIDE World Cup 2025) టోర్నమెంట్కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. దాదాపు 23 ఏళ్ల తర్వాత తొలిసారి ఈ మెగా చెస్ ఈవెంట్కు వేదిక కాగా.. గోవాలో అక్టోబరు 31- నవంబరు 27 వరకు టోర్నీ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఉత్తర గోవాలోని ఓ రిసార్టులో టోర్నీ నిర్వహించనున్నారు.మొత్తంగా 82 దేశాల నుంచి 206 మంది చెస్ క్రీడాకారులు ప్రపంచకప్ టోర్నీలో పాల్గొనబోతున్నారు. నాకౌట్ ఫార్మాట్లో నిర్వహించే ఈ ఈవెంట్లో టాప్-3లో నిలిచిన వాళ్లు 2026 క్యాండిడేట్స్ ఈవెంట్కు అర్హత సాధించారు. విజేతకు ప్రైజ్మనీ 20,00,000 డాలర్లు.గోవాతో నాకెన్నో జ్ఞాపకాలుఈ నేపథ్యంలో వరల్డ్ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ (D Gukesh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘వరల్డ్కప్ టోర్నీ కోసం ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నా. స్వదేశంలో ఎక్కడ ఆడినా ఈ టోర్నీ ప్రత్యేకంగా మిగిలిపోతుంది.ముఖ్యంగా గోవాతో నాకెన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఇక్కడ నేను కొన్ని జూనియర్ లెవల్ ఈవెంట్లలో ఆడాను’’ అంటూ ఈ టాప్ సీడ్ హర్షం వ్యక్తం చేశాడు. కాగా గుకేశ్ 2019లో గోవా వేదికగా ఇంటర్నేషనల్ ఓపెన్ గ్రాండ్మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో పాల్గొన్నాడు. నాడు కేటగిరీ- ‘ఎ’ నుంచి పోటీపడిన గుకేశ్ పదో స్థానంతో ముగించాడు.ఫేవరెట్గా అనిశ్ గిరి కూడా..అయితే, ఈసారి ఏకంగా డిఫెండింగ్ చాంపియన్ హోదాలో గుకేశ్ బరిలోకి దిగనుండటం విశేషం. ఇక గుకేశ్తో పాటు.. నేపాల్ సంతతికి చెందిన డచ్ గ్రాండ్మాస్టర్ అనిశ్ గిరినీ టోర్నీలో ఫేవరెట్గా పోటీలో నిలిచాడు. ఇప్పటికే అతడు ఫిడే గ్రాండ్ స్విస్ టోర్నమెంట్-2025కి అర్హత సాధించాడు. కాగా 2005 నుంచి నాకౌట్ ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఫిడే వరల్డ్కప్ టోర్నీలో భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్తో పాటు అర్మేనియాకు చెందిన లెవాన్ ఆరోనియన్ మాత్రమే రెండుసార్లు టైటిల్ గెలవగలిగారు.చదవండి: Shreyas Iyer: పరిస్థితి సీరియస్?.. సిడ్నీకి పయనమైన తల్లిదండ్రులు! -
పీవీ సింధు కీలక నిర్ణయం.. ప్రకటన విడుదల
భారత బ్యాడ్మింటన్ దిగ్గజం, ఒలింపిక్ పతకాల విజేత పూసర్ల వెంకట సింధు (PV Sindhu) కీలక నిర్ణయం తీసుకుంది. 2025 సీజన్ను ముందుగానే ముగిస్తున్నట్లు తెలిపింది. గాయం బెడద కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం ప్రకటన విడుదల చేసింది.కీలక టోర్నీలకు పీవీ సింధు దూరంకాగా గత రెండు నెలలుగా కీలక టోర్నీలకు పీవీ సింధు దూరంగానే ఉంది. ఆర్కిటిక్ ఓపెన్, డెన్మార్క్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ రూపంలో మేజర్ టోర్నీలను మిస్ అయింది. చివరగా చైనా మాస్టర్స్ సూపర్ 750 టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్కు చేరిన సింధు.. ఆ తర్వాత పాదం నొప్పి (Foot Injury) కారణంగానే మరే టోర్నీల్లోనూ సింధు ఆడలేకపోయింది.ఇదే వాస్తవంఈ క్రమంలోనే 2025 సీజన్ను ముందుగానే ముగించాలని పీవీ సింధు నిర్ణయించుకుంది. ఈ మేరకు.. ‘‘యూరోపియన్ లెగ్కు ముందు మడిమకు గాయమైంది. ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అథ్లెట్ల కెరీర్లో గాయాలు భాగం. ఈ విషయాన్ని అంత తేలికగా అంగీకరించలేము. కానీ ఇదే వాస్తవం.క్రీడాకారుల సామర్థ్యం, ఓపికను గాయాలు పరీక్షిస్తూ ఉంటాయి. అయితే, అంతే వేగంగా.. మరింత బలంగా తిరిగి రావాలనే కసిని కూడా రగిలేలా చేస్తాయి. కోలుకునే ప్రక్రియ కొనసాగుతోంది.బలంగా తిరిగి వస్తాడాక్టర్ వైన్ లామ్బార్డ్, నిషా రావత్, చేతన పర్యవేక్షణలో.. నా కోచ్ ఇర్వాన్స్యా మార్గదర్శనం.. నా టీమ్ సహాయంతో సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతున్నా. వారి నమ్మకమే నన్ను ముందుకు నడిపిస్తోంది.మున్ముందు మరిన్ని విజయాలు సాధించేందుకు పట్టుదలగా ఉన్నా. నాపై ప్రేమను కురిపిస్తూ.. మద్దతుగా నిలుస్తున్న వారికి ధన్యవాదాలు. మాటల్లో చెప్పలేని భావన ఇది. నా ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది’’ అని పీవీ సింధు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.కాగా ముప్పై ఏళ్ల సింధు గత నాలుగేళ్లలో ఇలా సీజన్ను ముందుగానే ముగించడం ఇది మూడోసారి. 2022 కామన్వెల్త్ గేమ్స్ సమయంలోనూ సింధు గాయపడింది. ఇక ఐదుసార్లు వరల్డ్ చాంపియన్షిప్స్లో మెడల్ గెలిచిన సింధు.. మూడేళ్ల తర్వాత 2024లో తొలి టైటిల్ గెలిచింది. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సూపర్ 300లో విజేతగా నిలిచింది. కానీ ఈ ఏడాది ఈ టోర్నీలో సింధు కార్టర్ ఫైనల్ దాటి ముందుకు వెళ్లలేకపోయింది.వైవాహిక జీవితంలో..కాగా సింధు గతేడాది డిసెంబరులో వైవాహిక బంధంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. వ్యాపారవేత్త వెంకట దత్తసాయితో సింధు రాజస్తాన్లోని ఉదయ్పూర్ వేదికగా ఏడడుగులు వేసింది. భర్త ప్రోత్సాహంతో ముందుకు సాగుతున్న సింధు.. గాయం కారణంగా ఈసారి సీజన్ను ముందుగానే ముగించినా.. రెట్టించిన ఉత్సాహంతో తిరిగి రావాలని పట్టుదలగా ఉంది. ఇక రియో ఒలింపిక్స్-2016లో బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్లో రజతం గెలిచిన సింధు.. 2020 టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.చదవండి: Shreyas Iyer: పరిస్థితి సీరియస్?.. సిడ్నీకి పయనమైన తల్లిదండ్రులు!🙏❤️ pic.twitter.com/oiZLLl2TPj— Pvsindhu (@Pvsindhu1) October 27, 2025 -
అదరగొట్టిన తెలుగు టైటాన్స్
న్యూఢిల్లీ: సమష్టి ప్రదర్శనతో సత్తా చాటుతున్న తెలుగు టైటాన్స్ ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో ట్రోఫీ చేజిక్కించుకునే దిశగా మరో అడుగు వేసింది. ఈ సీజన్ ఆసాంతం నిలకడగా రాణిస్తున్న టైటాన్స్... ఆదివారం జరిగిన మినీ క్వాలిఫయర్లో 37–32 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్పై విజయం సాధించింది. దీంతో తెలుగు టైటాన్స్ ఎలిమినేటర్–3కి చేరింది. మంగళవారం జరగనున్న ఆ మ్యాచ్లో ఎలిమినేటర్–2 విజేతతో టైటాన్స్ తలపడుతుంది. కీలక పోరులో కెప్టెన్ విజయ్ మలిక్ 10 పాయింట్లతో, భరత్ 12 పాయింట్లతో మెరిశారు. బెంగళూరు బుల్స్ తరఫున అలీ రెజా 11 పాయింట్లతో పోరాడినా ఫలితం లేకపోయింది. ఆదివారమే జరిగిన ఎలిమినేటర్–1 లో పట్నా పైరేట్స్ 48–32తో జైపూర్ పింక్ పాంథర్స్పై గెలుపొందింది. పట్నా రైడర్ అయాన్ 20 పాయింట్లతో విజృంభించాడు. అయాన్కు ఇది ఐదో సూపర్–20 స్కోరు కావడం విశేషం. పీకేఎల్ చరిత్రలో ప్రదీప్ నర్వాల్, దేవాంక్ దలాల్ మాత్రమే ఐదు కంటే ఎక్కువ మ్యాచ్ల్లో 20 పాయింట్ల చొప్పున సాధించారు. ఈ విజయంతో పట్నా ఎలిమినేటర్–2కు అర్హత సాధించింది. నేడు లీగ్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన పుణేరి పల్టన్, దబంగ్ ఢిల్లీ క్వాలిఫయర్–1లో తలపడనున్నాయి. పట్నా పైరేట్స్, బెంగళూరు బుల్స్ జట్లు ఎలిమినేటర్–2లో ఆడతాయి. -
భారత షట్లర్లకు ఐదు పతకాలు
చెంగ్డూ (చైనా): ఆసియా అండర్–17, అండర్–15 బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత్ ఐదు పతకాలతో తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో అండర్–15 బాలికల సింగిల్స్ విభాగంలో షైనా మణిముత్తు... అండర్–17 బాలికల సింగిల్స్ విభాగంలో దీక్ష సుధాకర్ విజేతలుగా అవతరించి స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నారు. ఫైనల్స్లో షైనా 21–14, 22–20తో చిహారు టొమిటా (జపాన్)పై, దీక్ష 21–16, 21–9తో భారత్కే చెందిన లక్ష్య రాజేశ్పై విజయం సాధించారు. అండర్–17 బాలుర సింగిల్స్ విభాగంలో జగ్షేర్ సింగ్ ఖాన్గుర్రా... అండర్–17 మిక్స్డ్ డబుల్స్ విభాగంలో జగ్షేర్ సింగ్ కాజ్లా–జననిక జోడీ సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలు అందుకున్నారు. 2013 తర్వాత భారత్కు ఆసియా సబ్ జూనియర్ చాంపియన్షిప్లో రెండు బంగారు పతకాలు రావడం విశేషం. -
బోపన్న జంటకు నిరాశ
బాసెల్: స్విస్ ఇండోర్స్ బాసెల్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న (భారత్)–బెన్ షెల్టన్ (అమెరికా) జోడీకి నిరాశ ఎదురైంది. సెమీఫైనల్లో బోపన్నషెల్టన్ ద్వయం 6–7 (2/7), 5–7తో ఆడమ్ పావ్లాసెక్ (చెక్ రిపబ్లిక్)–జాన్ జిలిన్స్కీ (పోలాండ్) జంట చేతిలో ఓడిపోయింది. 86 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో ఇండో–అమెరికన్ జోడీ ఐదు ఏస్లు సంధించింది. తమ సర్వీస్ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను ఒకసారి బ్రేక్ చేసింది. సెమీస్లో ఓడిన బోపన్నషెల్టన్లకు 41,820 (రూ. 42 లక్షల 65 వేలు) యూరోల ప్రైజ్మనీతోపాటు 180 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ టోర్నీలో టాప్ సీడ్ మార్సెల్ గ్రానోలెర్స్ (స్పెయిన్)–హొరాసియో జెబలాస్ (అర్జెంటీనా) ద్వయం విజేతగా నిలిచింది. ఫైనల్లో గ్రానోలెర్స్–జెబలాస్ 6–2, 7–5తో పావ్లాసెక్–జిలిన్స్కీలపై గెలిచి 1,54,980 యూరోల (రూ. 1 కోటీ 58 లక్షలు) ప్రైజ్మనీని సొంతం చేసుకున్నారు. -
యూకీ జోడీ ఓటమి
వియన్నా (ఆ్రస్టియా): ఎర్స్టీ బ్యాంక్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో యూకీ బాంబ్రీ (భారత్)–ఆండ్రీ గొరాన్సన్ (స్వీడన్) జోడీకి సెమీఫైనల్లో పరాజయం ఎదురైంది. ఫ్రాన్సిస్కో కబ్రాల్ (పోర్చుగల్)–లుకాస్ మిడ్లెర్ (ఆ్రస్టియా)తో జరిగిన సెమీఫైనల్లో యూకీ–గొరాన్సన్ ద్వయం 4–6, 6–7 (5/7)తో పోరాడి ఓడిపోయింది. 91 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో యూకీ–గొరాన్సన్ రెండు ఏస్లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్లు చేశారు. తమ సర్వీస్ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను ఒక్కసారీ బ్రేక్ చేయలేకపోయారు. సెమీస్లో ఓడిన యూకీ–గొరాన్సన్లకు 45,360 యూరోల (రూ. 46 లక్షల 27 వేలు) ప్రైజ్మనీతోపాటు 180 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. డబుల్స్ విభాగంలో జూలియన్ క్యాష్–లాయిడ్ గ్లాస్పూల్ (బ్రిటన్) జోడీ టైటిల్ సాధించింది. ఫైనల్లో క్యాష్–గ్లాస్పూల్ ద్వయం 6–1, 7–6 (8/6)తో కబ్రాల్–మిడ్లెర్ జంటపై గెలిచింది. క్యాష్–గ్లాస్పూల్ జంట ఖాతాలో 1,68,120 యూరోలు (రూ. 1 కోటీ 71 లక్షలు) ప్రైజ్మనీగా చేరాయి. -
పీవీఎల్ చాంపియన్ బెంగళూరు
సాక్షి, హైదరాబాద్: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) నాలుగో సీజన్లో బెంగళూరు టోర్పిడోస్ జట్టు చాంపియన్గా అవతరించింది. ఆదివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో బెంగళూరు టోర్పిడోస్ 15–13, 16–4, 15–13తో ముంబై మిటియోస్ జట్టును ఓడించింది. అమెరికాకు చెందిన మ్యాట్ వెస్ట్ సారథ్యంలోని బెంగళూరు జట్టు ఫైనల్లో పూర్తి ఆధిపత్యం చలాయించింది. లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన ముంబై జట్టు ఫైనల్లో తేలిపోయింది. మరో అమెరికా ప్లేయర్ జెలెన్ పెన్రోజ్, భారత్కు చెందిన సేతు, జోయల్ బెంజమిన్, జిష్ణు ఆల్రౌండ్ ప్రదర్శనతో బెంగళూరుకు తొలిసారి పీవీఎల్ టైటిల్ను అందించారు. ముంబై తరఫున కెప్టెన్ అమిత్ గులియా, ఓం లాడ్ వసంత్, శుభమ్ ఆకట్టుకున్నారు. విజేతగా నిలిచిన బెంగళూరు జట్టుకు రూ. 40 లక్షలు... రన్నరప్ ముంబై జట్టుకు రూ. 30 లక్షలు ప్రైజ్మనీ లభించింది. పీవీఎల్ ‘బెస్ట్ బ్లాకర్’గా ప్రిన్స్ మలిక్ (గోవా గార్డియన్స్)... ‘బెస్ట్ అటాకర్’గా జోయల్ బెంజమిన్ (బెంగళూరు)... ‘బెస్ట్ సర్వర్’గా సేతు (బెంగళూరు)... ‘బెస్ట్ సెట్టర్’గా వసంత్ (ముంబై)... ‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్’గా మథియాస్ లాఫ్టెస్నెస్ (ముంబై)... ‘బెస్ట్ లిబెరో’గా ప్రభాకరన్ (అహ్మదాబాద్ డిఫెండర్స్)... ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్’గా జోయల్ బెంజమిన్ పురస్కారాలు గెల్చుకున్నారు. -
అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన కర్నూలు యువకుడు
రాంచీ వేదికగా జరిగిన నాలుగో దక్షిణాసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో (South Asian Athletics Championship 2025) ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన మొగలి వెంకట్రాం రెడ్డి (Mogali Venkatramreddy) సత్తా చాటాడు. 800 మీటర్ల పరుగు పోటీలో కాంస్య పతకం సాధించి దేశానికి, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచాడు. ఈ ఈవెంట్ను వెంకట్రాం రెడ్డి 1:52.37 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచాడు.ఈ గేమ్స్లో భారత్తో పాటు పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, అఫ్గానిస్తాన్ దేశాలకు చెందిన అథ్లెట్లు పాల్గొన్నారు.వెంకట్రాం రెడ్డి పతకం సాధించిన అనంతరం హైదరాబాద్లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) అథ్లెటిక్స్ కోచ్ డా. జి.వి. సుబ్బారావు స్పందించారు. "ఇది దేశానికి గర్వకారణం. వెంకట్రాం రెడ్డి అంతర్జాతీయ వేదికపై భారత జెండాను రెపరెపలాడించాడు. ఇది అతని శ్రమకు ఫలితమని అన్నాడు.వెంకట్రాం రెడ్డి ఇటీవల భువనేశ్వర్లో జరిగిన జూనియర్ నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో 800 మీటర్లు, 1500 మీటర్ల ఈవెంట్లలో స్వర్ణ పతకాలు సాధించి "గోల్డెన్ డబుల్" సాధించాడు. చదవండి: Women's CWC: అద్వితీయ ప్రస్థానం.. చరిత్ర తిరగేస్తే అంతా వారే..! -
జైపూర్, పట్నా ముందుకు
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్లో ఫైనల్ రేసులో పడేందుకు మాజీ చాంపియన్లు జైపూర్ పింక్పాంథర్స్, పట్నా పైరేట్స్ ఒక ముందడుగు వేశాయి. 5–8 స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య శనివారం ప్లే ఇన్ మ్యాచ్లు జరిగాయి. ఇందులో రెండు సార్లు చాంపియన్గా నిలిచిన జైపూర్ 30–27తో డిఫెండింగ్ చాంపియన్ హరియాణా స్టీలర్స్పై విజయం సాధించింది. ఈ మ్యాచ్లో గెలిచేందుకు పింక్పాంథర్స్ కడదాకా చెమటోడ్చింది. రెయిడర్లలో నితిన్ కుమార్ (7) ఒక్కడే ఆకట్టుకున్నాడు. 23 సార్లు కూతకెళ్లిన అతను ఏడుసార్లు పాయింట్లు తెచ్చిపెట్టగా, మూడుసార్లు అవుటయ్యాడు. డిఫెండర్లు ఆర్యన్ కుమార్ (5), దీపాన్షు ఖత్రి (4), మోహిత్ (3) సమన్వయంతో రాణించారు. హరియాణా తరఫున రెయిడర్లు శివమ్ పతారే (6), వినయ్ (4) చెప్పుకోదగ్గ పాయింట్లు సాధించారు. డిఫెండర్లలో నీరజ్ 5, కెప్టెన్ జైదీప్ 2 పాయింట్లు చేశారు. అనంతరం జరిగిన మరో ప్లే ఇన్ మ్యాచ్లో ‘హ్యాట్రిక్’ పీకేఎల్ చాంప్ పట్నా పైరేట్స్ 40–31తో యూ ముంబాను ఓడించింది. పైరేట్స్ జట్టులో అయాన్ (14), నవ్దీప్ (7), మిలన్ దహియా (5) కీలకపాత్ర పోషించారు. ముంబా తరఫున అజిత్ చౌహాన్ (12), సందీప్ (7), పర్వేశ్ భైన్స్వాల్ (3) రాణించారు. బెంగళూరుతో టైటాన్స్ ఢీ నేడు పాయింట్ల పట్టికలో మూడు, నాలుగో స్థానాల్లో నిలిచిన బెంగళూరు బుల్స్, తెలుగు టైటాన్స్ జట్ల మధ్య నేడు మినీ క్వాలిఫయర్ సంగ్రామం జరుగుతుంది. అయితే ఈ మినీ పోరాటంలో ఓడిన జట్టు ఉన్నపళంగా లీగ్ నుంచి ఇంటికెళ్లదు. రెండో ఎలిమినేటర్ మ్యాచ్ రూపంలో ఫైనల్ రేసులో సజీవంగా నిలిచే ఉంటుంది. నేడు జైపూర్ పింక్ పాంథర్స్, పట్నా పైరేట్స్ల మధ్య జరిగే తొలి ఎలిమినేటర్ విజేతతో సోమవారం జరిగే రెండో ఎలిమినేటర్లో తలపడుతుంది. ఇక మినీ క్వాలిఫయర్లో గెలిచిన జట్టేమో మంగళవారం జరిగే మూడో ఎలిమినేటర్కు అర్హత సాధిస్తుంది. -
ముంబై x బెంగళూరు
సాక్షి, హైదరాబాద్: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) టోర్నీ తుది పోరుకు చేరింది. నాలుగో సీజన్ విజేత ఎవరో నేడు తేలనుంది. ముంబై మిటియోస్, బెంగళూరు టార్పెడోస్ల మధ్య ఆదివారం ఇక్కడి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో టైటిల్ పోరు జరుగనుంది. ఈ లీగ్ ఆరంభం నుంచి ఇరు జట్లు కూడా నిలకడైన ప్రదర్శనతో అదరగొట్టాయి. లీగ్ దశలో ముంబై ఆడిన 7 మ్యాచ్ల్లో ఆరింట గెలిచి పట్టికలో అగ్ర స్థానంలో నిలిచింది. టార్పెడోస్ ఒక్క మ్యాచ్ తక్కువగా గెలిచిందంతే! ఏడు మ్యాచ్లాడిన బెంగళూరు ఐదింట విజయం సాధించింది. ఇప్పుడు ఈ టాప్–2 జట్లే అమీతుమీకి సిద్ధమవడంతో నేటి ఫైనల్ తుదికంటా ఆసక్తి రేపడం ఖాయం. బెంగళూరుకిది రెండో ఫైనల్. 2023లో తుది పోరుకు చేరినప్పటికీ... అహ్మదాబాద్ డిఫెండర్స్ చేతిలో ఓడి రన్నరప్తో సరిపెట్టుకుంది. రెండేళ్ల క్రితం చేజారిన టైటిల్ను ఈసారి కచ్చితంగా గెలవాలనే పట్టుదలతో బెంగళూరు ఆటగాళ్లున్నారు. లీగ్ టాపర్ ముంబై మిటియోస్కిది తొలి ఫైనల్ కాగా... ఆఖరి పోరులోనూ గెలిచి విజయవంతంగా సీజన్ను ముగించాలని ఆశిస్తోంది. మిటియోస్ కెప్టెన్ అమిత్ గులియా ఎప్పటిలాగే సమష్టి ప్రదర్శనపైనే ఆశలు పెట్టుకున్నాడు. ఆరంభం నుంచే మ్యాచ్లో పట్టు బిగించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతామని చెప్పాడు. మరోవైపు బెంగళూరు సారథి మ్యాట్ వెస్ట్ మాట్లాడుతూ ముంబైలాంటి గట్టి జట్టును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పాడు. తమ ఆటగాళ్లంతా ఫామ్లో ఉండటమే తమకు కలిసొచ్చే అంశమని చెప్పాడు. -
శ్రియా మిలింద్కు రజత పతకం
రిఫ్ఫా (బహ్రెయిన్): ఆసియా యూత్ గేమ్స్లో భారత్కు చెందిన శ్రియా మిలింద్ రజత పతకంతో మెరిసింది. మహిళల 50 కేజీల మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎమ్ఎమ్ఏ) కేటగిరీలో శ్రియా రజత పతకం కైవసం చేసుకుంది. దీంతో ఈ టోర్నీలో భారత పతకాల సంఖ్య 16 (2 స్వర్ణాలు, 6 రజతాలు, 8 కాంస్యాలు)కు చేరింది. శనివారం జరిగిన ఫైనల్లో కజకిస్తాన్కు చెందిన అమెలినా బకియేవా చేతిలో శ్రియా పరాజయం పాలైంది. అంతకుముందు శ్రియా యూఏఈ, కిర్గిస్తాన్ ప్లేయర్లపై గెలిచి గ్రూప్ టాపర్గా ముందంజ వేసింది. ఈ టోర్నమెంట్లో ఎమ్ఎమ్ఏ విభాగంలో భారత్కు ఇది రెండో పతకం. శుక్రవారం పురుషుల 80 కేజీల విభాగంలో వీర్ కాంస్యం గెలుచుకోగా... తాజాగా శ్రియా రజతం నెగ్గింది. కబడ్డీలో పురుషుల, మహిళల విభాగాల్లో భారత్ స్వర్ణాలు గెలిచింది. తైక్వాండోలో పురుషుల వ్యక్తిగత విభాగంలో దేబాశీశ్ దాస్, మిక్స్డ్ డబుల్స్లో యశ్విని సింగ్–శివాన్షు పటేల్ కాంస్యాలు గెలుచుకున్నారు. అథ్లెటిక్స్లో భారత్ 4 పతకాలు నెగ్గింది. శౌర్య అవినాశ్ (మహిళల 100 మీటర్ల హర్డిల్స్), ఎడ్విన్ జాసన్ (మహిళల 400 మీటర్లు), రాన్జానా యాదవ్ (మహిళల 5000 మీటర్ల నడక), ఓషిని (మహిళల డిస్కస్ త్రో) వెండి వెలుగులు విరజిమ్మారు. పలాశ్ మండల్ (పురుషుల 5000 మీటర్ల నడక), జుబిన్ (పురుషుల హైజంప్), జాస్మీన్ కౌర్ (మహిళల షాట్పుట్) కాంస్య పతకాలు గెలుచుకున్నారు. కురాశ్లో భారత్కు మూడు పతకాలు దక్కాయి. 14 ఏళ్ల కనిష్క బిధూరి రజతం... అరవింద్, ఖుషీ కాంస్యాలు సొంతం చేసుకున్నారు. -
రేపే పీవీఎల్ 2025 ఫైనల్.. టైటిల్ పోరుకు ముంబై, బెంగళూరు సై
హైదరాబాద్: ఆర్ఆర్ కేబుల్ ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) నాలుగో సీజన్ ఫైనల్ సమరానికి రంగం సిద్ధమైంది. ఆదివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరగనున్న ఈ తుది పోరులో ముంబై మీటియర్స్, బెంగళూరు టార్పెడోస్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.ఈ బ్లాక్బస్టర్ పోరుకు ముందు, ఇరు జట్ల కెప్టెన్లు, కోచ్లు వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొని, గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. ఫైనల్ పట్ల ఉత్కంఠ, పరస్పర గౌరవం, గెలవాలన్న బలమైన సంకల్పం వాళ్ళ మాటల్లో స్పష్టంగా కనిపించాయి. లీగ్ దశలో ముంబై మీటియర్స్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది.ఆడిన ఏడు మ్యాచ్ల్లో ఆరు గెలిచి, 17 పాయింట్లతో టేబుల్లో అగ్రస్థానంలో నిలిచింది. బెంగళూరు జట్టు క్రమశిక్షణ కలిగిన జట్టు అని, దాన్ని ఓడించాలంటే కేవలం తప్పులు చేయకుండా ఉంటే సరిపోదని, అంతకుమించి ఆడాలని ముంబై హెడ్ కోచ్ మాట్ వాన్ వెజెల్ పేర్కొన్నాడు. ప్రతి బంతిని జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయంలా ఆడటం తమ జట్టు మానసిక బలమని అన్నాడు. కెప్టెన్ అమిత్ గులియా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, గడిచిన పాయింట్ల గురించి కాకుండా రాబోయే పాయింట్పైనే దృష్టి సారిస్తామని, జట్టు సమష్టి కృషితో గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశాడు.మరోవైపు, బెంగళూరు టార్పెడోస్ సైతం బలమైన ప్రదర్శన చేసింది. లీగ్ దశలో ఏడు మ్యాచ్ల్లో ఐదు గెలిచి, 14 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ముంబై లీగ్లోనే అత్యంత నిలకడైన జట్టు అని బెంగళూరు హెడ్ కోచ్ డేవిడ్ లీ ప్రశంసించాడు. అయితే, ఫైనల్ ఫలితం ప్రత్యర్థి ఆటకంటే, తమ సొంత ప్రదర్శనపైనే ఆధారపడి ఉంటుందని, సర్వ్ అండ్ పాస్ గేమ్లో దూకుడుగా ఆడతామని స్పష్టం చేశాడు. ముంబైకి ఇది తొలి ఫైనల్ కాగా, 2023లో తన జట్టును ఫైనల్కు నడిపిన అనుభవం లీకి ఉంది.ఈసారి టైటిల్ గెలవడం ద్వారా ఏళ్ల కష్టానికి ప్రతిఫలం దక్కుతుందని అతను ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ ఫైనల్లో కీలక ఆటగాళ్ల మధ్య ఆసక్తికరమైన పోరు జరగనుంది. టార్పెడోస్ తరఫున అటాకర్ జోయెల్ బెంజమిన్ 103 పాయింట్లతో టాప్ స్కోరర్గా ఉండగా, ముంబైకి చెందిన శుభమ్ చౌదరి (102) అతని వెనుకే ఉన్నాడు. అయితే, బెంగళూరు అటాకర్లకు ముంబై బ్లాకర్లు పీటర్ ఓస్ట్విక్, శుభమ్ చౌదరి నుంకి గట్టి సవాలు ఎదురుకానుంది. ఈ ఈద్దరూ లీగ్లోని టాప్-5 బ్లాకర్లలో ఉన్నారు. అదే సమయంలో, బెంగళూరు సర్వర్ సేతు (11 సర్వ్ పాయింట్లు) ముంబైకి అతిపెద్ద ముప్పుగా పరిణమించే అవకాశం ఉంది.బెంగళూరు కెప్టెన్ మాట్ వెస్ట్ మాట్లాడుతూ, "మీరు ఎక్కడ ఉన్నారన్నది కాదు, మీరెలా ఆడతారన్నదే ముఖ్యం. మీ ఆటతీరు మార్చుకోవద్దు" అని సహచరులకు సలహా ఇచ్చాడు. ఫైనల్ ఆడే అరుదైన అవకాశాన్ని ఆస్వాదించాలని పిలుపునిచ్చాడు.ఫైనల్లో ఇరు జట్లు భారతీయ వాలీబాల్లోని అత్యుత్తమ ప్రదర్శనను కనబరుస్తాయని ఆశిస్తున్నట్లు రెండు జట్ల కోచ్ లు, కెప్టెన్లు ఆశాభావం వ్యక్తం చేశారు. "పీవీఎల్ చరిత్రలోనే ఇది అత్యుత్తమ మ్యాచ్లలో ఒకటిగా నిలుస్తుంది" అని ముంబై కెప్టెన్ గులియా ముగించాడు. -
పదేళ్ల ప్రాయంలోనే... ఎఫ్1 అకాడమీలో భారత రేసర్ అతీఖ
లండన్: భారత చిన్నారి రేసర్ అతీఖ మీర్ (Atiqa Mir)కు ప్రతిష్టాత్మక ఫార్ములావన్ అకాడమీలో ప్రవేశం లభించింది. ఈ నెల ఆరంభంలో జరిగిన ఆర్ఎంసీ చాంపియన్షిప్లో విజేతగా నిలువడం ద్వారా వెలుగులోకి వచ్చిన పదేళ్ల భారత బాలిక ప్రస్తుతం ఖతర్లో ఎంఈఎన్ఏ నేషన్ కప్లో పోటీ పడుతోంది. ఆమె ప్రతిభను గుర్తించిన ఫార్ములావన్ సంస్థ చాంపియన్స్ ఆఫ్ ద ఫ్యూచర్ అకాడమీ ప్రొగ్రామ్ (సీఓటీఎఫ్ఏ)లో భాగంగా అతీఖ మీర్కు ప్రవేశం కల్పించింది.ఇందులో భాగంగా యూఏఈలో జరిగే రెండు జాతీయ కార్టింగ్ చాంపియన్షిప్లలో పాల్గొనేందుకు కావాల్సిన శిక్షణ ఇస్తుంది. ఇందులో రాణిస్తే డిస్కవర్ యువర్ డ్రైవ్ (డీవైడీ) కార్యక్రమంలో ఇతర పోటీల్లో పాల్గొనేందుకు కూడా సహకారం అందజేస్తుంది. 2023లో సీఓటీఎఫ్ఏ ప్రారంభించినప్పటి నుంచి బాలికలు, మహిళా రేసర్లకు తమవంతు ప్రోత్సాహం అందిస్తూనే ఉన్నామని ఎఫ్1 అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ సుసీ వోల్ఫ్ తెలిపారు.ప్రస్తుతం ఈ కార్యక్రమంలో ప్రవేశం పొందినవారిలో 30 శాతం మంది బాలికలు ఉన్నారని.. మహిళా రేసర్ల ప్రతిభకు మెరుగులు దిద్దేందుకు తమ అకాడమీ కృషి చేస్తుందని వోల్ఫ్ అన్నారు. ప్రస్తుతం 27 మంది బాలిక రేసర్లు యూఏఈ, బ్రిటీష్ సిరీస్లలో పోటీపడేందుకు సిద్ధమవుతున్నారని వోల్ఫ్ వివరించారు. ఇదీ చదవండి: ఫైనల్లో ముంబై, బెంగళూరుసాక్షి, హైదరాబాద్: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) నాలుగో సీజన్లో బెంగళూరు టొర్పెడస్, ముంబై మెటియోర్స్ జట్లు టైటిల్ పోరుకు అర్హత సాధించాయి. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్లో ముంబై మెటియోర్స్ 15–8, 15–8, 16–14తో గోవా గార్డియన్స్ జట్టుపై... బెంగళూరు టొర్పెడస్ 10–15, 15–11, 15–13, 15–13తో అహ్మదాబాద్ డిఫెండర్స్ జట్టుపై విజయం సాధించాయి. ఆదివారం ఫైనల్ జరుగుతుంది. -
ప్లే ఆఫ్స్కు వేళాయె...
న్యూఢిల్లీ: దాదాపు రెండు నెలలుగా క్రీడాభిమానులను అలరిస్తున్న ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్ చివరి దశకు చేరుకుంది. హోరాహోరీ సమరాలు... ఉత్కంఠ రేపిన మ్యాచ్లతో సాగిన లీగ్ దశ ముగియగా... శనివారం నుంచి ప్లే ఆఫ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ సీజన్లో మొత్తం 12 జట్లు పోటీపడగా... అందులో పాయింట్ల పట్టికలో తొలి ఎనిమిది స్థానాల్లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్కు చేరాయి. గతం కంటే భిన్నంగా జరుగుతున్న ఈ సీజన్లో నేటి నుంచి మరింత రసవత్తర మ్యాచ్లు జరగనున్నాయి. లీగ్ దశలో జరిగిన 108 మ్యాచ్లను దేశంలోని నాలుగు నగరాల్లో నిర్వహించగా... ఇప్పుడు ఆఖరి అంకం ఢిల్లీలో సాగనుంది. ప్లే ఆఫ్స్ ప్రారంభానికి ముందు ట్రోఫీ కోసం పోటీపడుతున్న 8 జట్ల కెప్టెన్లతో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ‘ఈ సీజన్ చాలా హోరాహోరీగా సాగింది. లీగ్ దశలో జరిగిన మొత్తం 108 మ్యాచ్ల్లో 48 మ్యాచ్లు కేవలం 5 పాయింట్ల తేడాతో ఫలితం తేలాయి. 27 మ్యాచ్ల్లో చివరి 90 సెకన్లలో ఫలితాలు తారుమారయ్యాయి. సీజన్ మొత్తం దాదాపు అన్ని రోజులూ రెయిడర్లు ‘సూపర్–10’లు సాధించారు. ఇక చివరి దశకు సమయం ఆసన్నమైంది. ఈ వారం మరింత ఉత్కంఠగా ఉండబోనుంది’ అని పీకేఎల్ చైర్మన్ అనుపమ్ గోస్వామి అన్నారు. ఈ సీజన్తోనే పీకేఎల్లో ‘టై బ్రేకర్’ విధానాన్ని ప్రవేశ పెట్టగా... మరింత పోటీతత్వం కనిపించింది. ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకునేందుకు అన్నీ జట్లు హోరాహోరీగా పోరాడగా... లీగ్ దశలో అది్వతీయ ప్రదర్శన కనబర్చిన పుణేరి పల్టన్, దబంగ్ ఢిల్లీ చెరో 26 పాయింట్లతో పట్టిక తొలి రెండు స్థానాలు దక్కించుకున్నాయి. లీగ్ ప్రారంభమైన నెలన్నర వరకు పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న పట్నా పైరేట్స్... ఆ తర్వాత విజృంభించింది. వరుసగా ఐదు మ్యాచ్ల్లో నెగ్గి ఏడో స్థానంతో ప్లే ఆఫ్స్లో అడుగు పెట్టింది. ‘ఒత్తిడిలో జట్టును ఎలా నడిపించాలో నేర్చుకున్నాను. ఆ పాఠాలు ఇప్పుడు కెప్టెన్గా పరిస్థితులను అర్థం చేసుకునేందుకు ఉపయోగ పడుతున్నాయి. ఈ దశకు చేరుకోవడానికి జట్టుగా మేము ఎంతో కష్టపడ్డాం. అదే క్రమశిక్షణను ప్లే ఆఫ్స్లో కూడా కనబరుస్తాం’ అని పుణేరి పల్టన్ కెపె్టన్ అస్లమ్ ఇమాన్దార్ అన్నాడు. ‘ప్లే ఆఫ్స్లో ప్రతి పాయింట్ కీలకమే. ఒక్క రెయిడ్తో మ్యాచ్ మొత్తం మారిపోవచ్చు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ప్రశాంతంగా ఉండటమే నా బలం. దూకుడు మన దృష్టిని మరల్చుతుంది. ఒత్తిడి పెరుగుతున్నప్పుడు నన్ను నేను నియంత్రించుకుంటా. సీజన్ మొత్తం గొప్పగా పోరాడాం. ప్లే ఆఫ్స్లో కూడా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలని అనుకుంటున్నాం’ అని దబంగ్ ఢిల్లీ సారథి అశు మలిక్ వెల్లడించాడు. గతంతో పోలిస్తే కాస్త సంక్లిష్టంగా ఉన్న ప్లే ఆఫ్స్ విధానంలో... పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లకు ఫైనల్కు చేరేందుకు సులువైన అవకాశం ఉండగా... మిగిలిన జట్లు తుదిపోరుకు అర్హత సాధించాలంటే తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. పీకేఎల్ 12వ సీజన్ప్లే ఆఫ్స్ను ఓసారి పరిశీలిస్తే.. » శనివారం జరగనున్న తొలి ‘ప్లే ఇన్’ పోరులో డిఫెండింగ్ చాంపియన్ హరియాణా స్టీలర్స్తో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడనుంది. రెండో ‘ప్లే ఇన్’ మ్యాచ్లో యు ముంబాతో పట్నా పైరేట్స్ ఆడుతుంది. » ‘ప్లే ఇన్స్’లో గెలిచిన జట్లు... ఆదివారం జరగనున్న ఎలిమినేటర్–1లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. అదే రోజు మినీ క్వాలిఫయర్లో భాగంగా... పాయింట్ల పట్టికలో మూడో, నాలుగో స్థానంలో నిలిచిన బెంగళూరు బుల్స్, తెలుగు టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. » బెంగళూరు బుల్స్, తెలుగు టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఓడిన జట్టు... ఎలిమినేటర్–1 విజేతతో సోమవారం ఎలిమినేటర్–2 మ్యాచ్ ఆడనుంది. » ఎలిమినేటర్–2లో గెలిచిన జట్టు... బెంగళూరు బుల్స్, తెలుగు టైటాన్స్ మధ్య జరిగిన మినీ క్వాలిఫయర్ మ్యాచ్ విజేతతో మంగళవారం ఎలిమినేటర్–3 ఆడనుంది. » పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన పుణేరి పల్టన్, దబంగ్ ఢిల్లీ మధ్య సోమవారం క్వాలిఫయర్–1 జరగనుంది. » క్వాలిఫయర్–1లో విజయం సాధించిన జట్టు నేరుగా ఫైనల్ చేరనుండగా... ఓడిన జట్టుకు క్వాలిఫయర్–2 రూపంలో మరో అవకాశం ఉంది. » మంగళవారం జరిగే ఎలిమినేటర్–3లో గెలిచిన జట్టు... క్వాలిఫయర్–1లో ఓడిన టీమ్తో బుధవారం క్వాలిఫయర్–2 మ్యాచ్లో అమీతుమీ తేల్చుకోనుంది. » శుక్రవారం జరిగే ఫైనల్లో క్వాలిఫయర్–1, క్వాలిఫయర్–2 విజేతల మధ్య ట్రోఫీ కోసం ఫైనల్ ఫైట్ జరగనుంది. -
ఎన్బీఏలో బెట్టింగ్ కలకలం
న్యూయార్క్: అమెరికాలో ఎప్పుడూ ఆటతోనే పతాక శీర్షికలకెక్కే నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) తాజాగా అవినీతి మకిలీతో పత్రికలకెక్కింది. ఇన్సైడ్ ఇన్ఫర్మెషన్ (జట్టు అంతర్గత సమాచారం) లీక్ చేసి బెట్టింగ్కు పాల్పడటం, మాఫియా కుటుంబాలతో కలిసి క్రీడా పందెంల రిగ్గింగ్, పోకర్ గేమ్ల అనుచిత కార్యకలాపాలు ఎన్బీఏకు మచ్చతెచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) పోర్ట్లాండ్ ట్రెయిల్ బ్లేజర్స్ జట్టు హెడ్ కోచ్ చౌన్సే బిలప్స్, మయామి హీట్ జట్టు ప్లేయర్ టెర్రీ రోజియెర్ సహా 30 మందికి పైగా అరెస్టు చేసింది. దీనిపై ముమ్మర దర్యాప్తు చేపట్టినట్లు ఎఫ్బీఐ డైరెక్టర్ కశ్యప్ పటేల్ వెల్లడించారు. భారత సంతతికి చెందిన కశ్యప్ ప్రమోద్ పటేల్ ఆధ్వర్యంలోనే ఈ కేసు విచారణ జరుగుతోంది. గత కొన్నేళ్లుగా భారీఎత్తున ఈ బెట్టింగ్ మాఫియా మిలియన్ డాలర్లను ఆర్జించినట్లు ఎఫ్బీఐ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పెద్ద ఎత్తున జరిగిన నేరపూరిత కుట్రలో ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో ఉన్న కోచ్ బిలప్స్ ఉండటం ఎన్బీఏ వర్గాలను విస్మయపరిచింది. అమెరికాలోని ప్రధాన నగరాల్లో ఫిక్సింగ్ కార్యకలాపాల్లో బిలప్స్ హస్తముండగా, మయామి హీట్ ప్లేయర్ రోజియెర్ జట్టు గోప్యతకు భంగం కలిగేలా అంతర్గత సమాచారం లీక్ చేసి స్పాట్ బెట్టింగ్ తరహా మోసాలకు పాల్పడినట్లు ఎఫ్బీఐ డైరెక్టర్ కశ్యప్ తెలిపారు. బిలప్స్, రోజియెర్లవి రెండు వేర్వేరు కేసులు కాగా, ఈ రెండు కేసుల్లోనూ మాజీ ఎన్బీఏ సహాయ కోచ్, మాజీ ఆటగాడు డామన్ జోన్స్ నిందితుడని ఎఫ్బీఐ అధికారులు తెలిపారు. మరి ఎన్బీఏ ఏం చేసింది ఎన్బీఏ ప్రతిష్టకే మచ్చతెచ్చిన వ్యవహారంపై ఎన్బీఐ యాజమాన్యం తీవ్రంగా పరిగణించింది. రిగ్గింగ్, బెట్టింగ్, ఫిక్సింగ్ ఆరోపణల్లో అరెస్టయిన బిలప్స్, రోజియెర్, డామన్ జోన్స్లపై వేటు వేసింది. ఎన్బీఏ క్రీడా సమగ్రతను కాపాడేందుకు ఎఫ్బీఐ అధికారులు, పోలీసులు చేసే విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని ఎన్బీఏ ఒక ప్రకటనలో పేర్కొంది. గతంలో 2007లో కూడా ఎన్బీఏను బెట్టింగ్ ఉదంతం ఉక్కిరిబిక్కిరి చేసింది. అప్పుడు రిఫరీ టిమ్ డొనగే మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్లతో ఎన్బీఏకు మచ్చ తెచ్చారు. ఆ తర్వాత కూడా బ్రాడ్కాస్టింగ్ ఒప్పందంలో అనివీతి ఆరోపణలతో ఎన్బీఐ ప్రతిష్ట మసకబారింది. -
ప్రపంచకప్ నుంచి తప్పుకొన్న పాకిస్తాన్
నవంబర్ 28 నుంచి భారత్లో జరగాల్సిన పురుషుల జూనియర్ హాకీ వరల్డ్కప్ (Men's Hockey Junior World Cup 2025) నుంచి పాకిస్తాన్ తప్పుకొంది. భారత్తో సత్సంబంధాలు లేని కారణంగా ఈ మెగా టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు పాకిస్తాన్ హాకీ ఫెడరేషన్ (PHF) అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ హాకీ సమాఖ్య (FIH) ప్రకటన ద్వారా తెలియజేసింది.ఈ ఏడాది భారత్లో జరగాల్సిన హాకీ టోర్నీ నుంచి తప్పుకోవడం పాకిస్తాన్కు ఇది రెండోసారి. ఆగస్ట్లో జరగాల్సిన పురుషుల ఆసియా కప్ నుంచి కూడా పాక్ ఇదే కారణంగా వైదొలిగింది. అప్పుడు పాక్ స్థానాన్ని బంగ్లాదేశ్తో భర్తీ చేసి టోర్నీని కొనసాగించారు.తాజాగా జూనియర్ ప్రపంచకప్ నుంచి కూడా పాక్ తప్పుకోవడంతో అంతర్జాతీయ హాకీ సమాఖ్య ప్రత్యామ్నాయ జట్టును వెతికే పనిలో పడింది. టోర్నీ ప్రారంభానికి ఇంకా చాలా సమయం ఉండటంతో త్వరలో ప్రత్యామ్నాయ జట్టును ప్రకటించే అవకాశం ఉంది.పురుషుల జూనియర్ హాకీ ప్రపంచకప్ 2025 నవంబర్ 28 నుంచి డిసెంబర్ 28 మధ్యలో భారత్లోని చెన్నై, మధురై నగరాల్లో జరగాల్సి ఉంది. ఈ టోర్నీలో పాక్ భారత్, చిలీ, స్విట్జర్లాండ్లతో పాటు గ్రూప్-బిలో ఉంది.ప్రపంచకప్ నుంచి తప్పుకున్న అనంతరం PHF కార్యదర్శి రానా ముజాహిద్ మాట్లాడుతూ.. “ప్రస్తుత పరిస్థితుల్లో భారత్లో మా జట్టు ఆడడం సురక్షితం కాదని భావిస్తున్నాం. ఇటీవల UAEలో జరిగిన ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో భారత ఆటగాళ్లు మా ఆటగాళ్లతో చేతులు కలపలేదు. ట్రోఫీ అందుకోవడాన్ని కూడా తిరస్కరించారు. ఇది చాలా బాధాకరం. ఇలాంటి భావోద్వేగ పరిస్థితుల్లో మా జట్టును పంపడం సరికాదు” అని వ్యాఖ్యానించాడు.కాగా, ఈ ఏడాది ఏప్రిల్ 22న పాక్ ఉగ్రమూకలు పహల్గాంలో దాడులకు తెగబడి పదుల సంఖ్యలో అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇందుకు ప్రతిగా భారత్ "ఆపరేషన్ సిందూర్" పేరిట పాక్కు తగిన గుణపాఠం చెప్పింది. ఆతర్వాత భారత్-పాక్ల మధ్య క్రీడా సంబంధాలు దెబ్బతిన్నాయి. చదవండి: రోహిత్ శర్మకు అనుకూలం.. టీమిండియాకు వ్యతిరేకం -
చివరి బెర్త్ పట్నా పైరేట్స్దే
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్లో మూడుసార్లు చాంపియన్ పట్నా పైరేట్స్ ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకుంది. గురువారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో పట్నా 33–18 పాయింట్ల తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్పై విజయం సాధించింది. దీంతో లీగ్ దశలో 18 మ్యాచ్లాడిన పట్నా పైరేట్స్ 8 విజయాలు, 10 పరాజయాలతో 16 పాయింట్లు ఖాతాలో వేసుకొని ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. లీగ్ ఆరంభ దశలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన పైరేట్స్... వరుసగా ఐదో మ్యాచ్లో గెలిచి ముందంజ వేసింది. కీలకపోరులో పట్నా కెపె్టన్ అయాన్ 11 పాయింట్లతో సత్తా చాటాడు. మ్యాచ్ తొలి అర్ధభాగంలో హోరాహోరీ పోరాటం సాగడంతో ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి. ద్వితీయార్ధంలో విజృంభించిన పట్నా సమష్టిగా సత్తాచాటి ముందంజ వేసింది. గురువారంతో ఈ సీజన్ లీగ్ మ్యాచ్లు ముగిశాయి. చివరి రోజే జరిగిన ఇతర మ్యాచ్ల్లో యూపీ యోధాస్ 35–32తో యు ముంబాపై, బెంగళూరు బుల్స్ 54–26తో గుజరాత్ జెయింట్స్పై గెలుపొందాయి. యూపీ యోధాస్ తరఫున సురేందర్ గిల్, శివమ్ చెరో 7 పాయింట్లు సాధించగా... యు ముంబా తరఫున అజిత్ చవాన్ 11 పాయింట్లతో పోరాడాడు. గుజరాత్ జెయింట్స్తో పోరులో బెంగళూరు బుల్స్ రెయిడర్లు ఆకాశ్ 11, అలీ రెజా 10 పాయింట్లతో సత్తా చాటారు. గుజరాత్ జెయింట్స్ తరఫున శ్రీధర్ 8 పాయింట్లతో పోరాడాడు. ఈ సీజన్లో మొత్తం 12 జట్లు పోటీపడగా... వాటిలో 8 జట్లు (పుణేరి పల్టన్, దబంగ్ ఢిల్లీ, బెంగళూరు బుల్స్, తెలుగు టైటాన్స్, హర్యానా స్టీలర్స్, యు ముంబా, పట్నా పెరైట్స్, జైపూర్ పింక్ పాంథర్స్) ప్లే ఆఫ్స్కు చేరాయి. లీగ్లో నేడు విశ్రాంతి దినం కాగా... శనివారం నుంచి ప్లే ఆఫ్స్ ప్రారంభమవుతాయి. -
బీఎస్ఎఫ్ అరుదైన నిర్ణయం
న్యూఢిల్లీ: సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్)లో కానిస్టేబుల్ అయిన ఐదు నెలల కాలానికే మహిళా వుషు ప్లేయర్ శివాని హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి పొందింది. బీఎస్ఎఫ్లాంటి బలగాల్లో ఉన్న జవాన్లకు ప్రమోషన్ అంత సులువు కాదు. కనీసం 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల సర్వీస్ కాలం పూర్తవ్వాలి. కానీ 21 ఏళ్ల శివాని ప్రపంచ వుషు చాంపియన్షిప్ సాండా ఈవెంట్ 75 కేజీల విభాగంలో భారత్కు రజత పతకం తెచ్చిపెట్టడంతో అరుదైన ప్రమోషన్కు అర్హత సాధించింది. ఈ ఆగస్టు, సెపె్టంబర్ నెలల్లో బ్రెజిల్లో జరిగిన వుషు (చైనా మార్షల్ ఆర్ట్స్) పోటీల్లో శివాని రన్నరప్గా నిలువడంతో బీఎస్ఎఫ్లోకి వచ్చీరాగానే హెడ్ కానిస్టేబుల్ అయ్యింది. గురువారం బీఎస్ఎఫ్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డైరెక్టర్ జనరల్ (డీజీ) దల్జీత్ సింగ్ చౌదరి ప్రమోషన్కు సంబంధించిన రిబ్బన్ను ఖాకీ యూనిఫామ్లో ఉన్న శివానికి పిన్ చేశారు. ఏళ్ల తరబడి పనిచేస్తే గానీ రాని ప్రమోషన్ను ఇలా కట్టబెట్టాలంటే నిబంధనల సడలింపు, ప్రత్యేక అనుమతి తప్పనిసరి. దీనికోసం బీఎస్ఎఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రెయినింగ్ (డీఓపీటీ) వద్ద శాఖపరమైన అనుమతి తీసుకున్నట్లు బీఎస్ఎఫ్ వర్గాలు వెల్లడించాయి. ఈ జూలైలో అనూజ్ అనే కానిస్టేబుల్కు ఇలాంటి పదోన్నతే కల్పించారు. అతను ఏప్రిల్లో చైనాలో జరిగిన ప్రపంచకప్ సాండా ఈవెంట్ 52 కేజీల విభాగంలో రజత పతకం సాధించాడు. 2.7 లక్షల మందితో కూడిన బీఎస్ఎఫ్ బలగాలు క్లిష్టమైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం పగలనక రాత్రనక పహారా కాస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలు, క్లిష్టమైన లేదంటే ప్రత్యేక పరిస్థితుల్లో కూడా అంతర్గత భద్రతా ఏర్పాట్లలోనూ బీఎస్ఎఫ్ సిబ్బంది తలమునకలై శ్రమిస్తుంటుంది. -
కెన్యా స్టార్ అథ్లెట్ రుత్పై మూడేళ్ల నిషేధం
నైరోబి: మారథాన్లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన కెన్యా మహిళా అథ్లెట్ రుత్ చెప్నెటిక్ డోపింగ్లో దొరికిపోయింది. దీంతో అథ్లెట్ ఇంటిగ్రిటీ యూనిట్ (ఏఐయూ) ఆమెపై మూడేళ్ల నిషేధం విధించింది. రెండేళ్ల క్రితం చికాగో మారథాన్లో చెప్నెటిచ్ విజేతగా నిలిచింది. 2023లో అమెరికాలో జరిగిన ఈ సుదీర్ఘ పరుగును ఆమె 2 గంటల 9 నిమిషాల 56 సెకన్లలో పూర్తి చేసి రికార్డు సృష్టించింది. గత రికార్డు టైమింగ్ కంటే 1 నిమిషం 57 సెకన్ల ముందే పూర్తి చేసి కొత్త రికార్డు నెలకొల్పింది. అయితే ఈ ఏడాది మార్చిలో ఆమె నుంచి సేకరించిన నమూనాల్లో నిషిద్ధ ఉ్రత్పేరకాలు తీసుకున్నట్లు పరీక్షల్లో తేలింది. దీంతో జూలైలోనే ఆమెపై తాత్కాలిక నిషేధం విధించారు. తదుపరి ఏఐయూ విచారణలో ఆమె తను ఉద్దేశపూర్వకంగా తీసుకోలేదని వివరణ ఇచ్చింది. నమూనాల సేకరణకు కొద్ది రోజుల ముందే తాను అస్వస్థతకు గురైనపుడు పనిమనిషి ఇచి్చన మందు వల్లే ఉ్రత్పేరకాలు అందులో ఉండొచ్చని పేర్కొంది. దీనికి సంబంధించిన ఔషధం ఫొటోనూ ఏఐయూకు సమర్పించింది. అయితే ఓ ప్రొఫెషనల్ అథ్లెట్ అయివుండి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏదిపడితే అది వాడటం నిర్లక్ష్యం కిందకే వస్తుంది తప్ప... శిక్ష నుంచి తప్పించుకునేందుకు వీలుండదని ఏఐయూ మందలించింది. నాలుగేళ్ల నిషేధం విధించాల్సిన చోట, ఆమె తప్పు ఒప్పుకోవడంతో మూడేళ్ల నిషేధాన్ని ఖరారు చేసింది. ఈ ఏప్రిల్ 19 నుంచే ఈ నిషేధం అమల్లో ఉంటుందని ఏఐయూ వెల్లడించింది. -
పోరాడి ఓడిన రుత్విక–రోహన్ జోడీ
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారుల కథ ముగిసింది. మిక్స్డ్ డబుల్స్లో తెలంగాణ ప్లేయర్ గద్దె రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్) జోడీ... మహిళల సింగిల్స్లో ఉన్నతి హుడా... మహిళల డబుల్స్లో కవిప్రియ సెల్వం–సిమ్రన్ జంట ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగారు. ప్రపంచ ఐదో ర్యాంక్ ద్వయం థామ్ గికెల్–డెలై్ఫన్ డెల్ర్యూ (ఫ్రాన్స్)తో జరిగిన మ్యాచ్లో రుత్విక శివాని–రోహన్ కపూర్ జంట 23–21, 8–21, 17–21తో పోరాడి ఓడిపోయింది. 75 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో రుత్విక–రోహన్ తొలి గేమ్ను దక్కించుకున్నా... రెండో గేమ్లో తడబడ్డారు. నిర్ణాయక మూడో గేమ్లో రెండు జోడీలు ప్రతి పాయింట్కు తీవ్రంగా పోరాడాయి. ఒకదశలో రుత్విక–రోహన్ 17–15తో రెండు పాయింట్ల ఆధిక్యంలో నిలిచింది. కానీ గికెల్–డెల్ర్యూ ద్వయం ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఆరు పాయింట్లు సాధించి మూడో గేమ్తోపాటు మ్యాచ్ను సొంతం చేసుకుంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగిన రుత్విక–రోహన్ జంటకు 3,087 డాలర్ల (రూ. 2 లక్షల 71 వేలు) ప్రైజ్మనీతోపాటు 4,320 పాయింట్లు లభించాయి. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఉన్నతి హుడా 14–21, 11–21తో రెండో ర్యాంకర్ వాంగ్ జియి (చైనా) చేతిలో ఓడిపోయింది. ఉన్నతి ఖాతాలో 2,850 డాలర్ల (రూ. 2 లక్షల 50 వేలు) ప్రైజ్మనీతోపాటు 4,320 పాయింట్లు చేరాయి. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో కవిప్రియ–సిమ్రన్ ద్వయం 7–21, 9–21తో మూడో ర్యాంక్ జోడీ కిమ్ హై జియోంగ్–కాంగ్ హీ యోంగ్ (దక్షిణ కొరియా) చేతిలో పరాజయం పాలైంది. కవిప్రియ–సిమ్రన్ జోడీకి 3,087 డాలర్ల (రూ. 2 లక్షల 71 వేలు) ప్రైజ్మనీతోపాటు 4,320 పాయింట్లు లభించాయి. -
భరత్ ఒంటరి పోరాటం.. హర్యానా చేతిలో తెలుగు టైటాన్స్ చిత్తు
ప్రోకబడ్డీ లీగ్-2025 సీజన్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న తెలుగు టైటాన్స్కు హరియాణా స్టీలర్స్ ఊహించని షాకిచ్చింది. బుధవారం రాత్రి ఢిల్లీ వేదికగా హరియాణా స్టీలర్స్తో జరిగిన మ్యాచ్లో 34–45తో తెలుగు టైటాన్స్ పరాజయం పాలైంది.టైటాన్స్ జట్టులో ఆల్రౌండర్ భరత్ (16) ఒక్కడే పోరాడాడు. 17 సార్లు కూతకెళ్లిన అతను 15 పాయింట్లు తెచ్చాడు. ప్రత్యర్థి రెయిడర్ను టాకిల్ చేసి మరో పాయింట్ అందించాడు. సహచరుల్లో డిఫెండర్ అంకిత్ (5) మెరుగ్గా ఆడారు. వీరిద్దరూ మినహా మిగితా అందరూ దారుణంగా విఫలమయ్యారు.స్టీలర్స్ విజయంలో రెయిడర్లు వినయ్ (11), శివమ్ పతారే (8) కీలకపాత్ర పోషించారు. రెయిడింగ్లో చురుగ్గా వ్యవహరించిన ఇద్దరు అదేపనిగా పాయింట్లు తెచ్చిపెట్టారు. డిఫెండర్లలో రాహుల్ 4, నీరజ్, హర్దీప్, కెప్టెన్ జైదీప్ తలా 3 పాయింట్లు సాధించారు.కాగా తెలుగు టైటాన్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. ఇక గురువారం జరిగే పోటీల్లో బెంగళూరు బుల్స్తో గుజరాత్ జెయింట్స్; యూపీ యోధాస్తో యు ముంబా; పట్నా పైరేట్స్తో జైపూర్ పింక్పాంథర్స్ తలపడతాయి.చదవండి: సెమీఫైనల్లో స్థానం కోసం... -
‘లెఫ్టినెంట్ కల్నల్’ నీరజ్ చోప్రా
సాక్షి, న్యూఢిల్లీ: భారత స్టార్ జావెలిన్ త్రోయర్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రా ఖాతాలో మరో అరుదైన గౌరవం చేరింది. టెరిటోరియల్ ఆర్మీలో అతనికి ‘లెఫ్టినెంట్ కల్నల్’ గౌరవ హోదాను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధికారికంగా ప్రదానం చేశారు. ఢిల్లీలోని సౌత్ బ్లాక్లో బుధవారం దీనికి సంబంధించిన కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, టెరిటోరియల్ ఆర్మీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ వేడుకలో రక్షణ మంత్రి రాజ్నాథ్ స్వయంగా నీరజ్ చోప్రా భుజాలపై లెఫ్టినెంట్ కల్నల్ హోదా బ్యాడ్జ్లను అలంకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీరజ్ పట్టుదల, దేశభక్తి, నిరంతర శ్రమకు నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. హరియాణాకు చెందిన నీరజ్ 2016లో భారత సైన్యంలోని ‘ది రాజ్పుతానా రైఫిల్స్’లో సుబేదార్గా∙కెరీర్ను మొదలుపెట్టాడు. అంతర్జాతీయ స్థాయిలో అతని ఘనతలకు గుర్తింపుగా 2021లో సుబేదార్ నుంచి మేజర్గా పదోన్నతి కలి్పంచారు. ఆ మరుసటి ఏడాది ‘పరమ విశిష్ట సేవా పతకం’తో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. ఈ ఏడాది ఏప్రిల్ 16న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అతనికి టెరిటోరియల్ ఆర్మీలో గౌరవ కమిషన్ను మంజూరు చేశారు. తాజాగా కల్నల్ గౌరవ హోదా కట్టబెట్టారు. -
వెర్స్టాపెన్ పాంచ్ పటాకా
ఆస్టిన్ (అమెరికా): ఫార్ములావన్ (ఎఫ్1) 2025 సీజన్లో రెడ్బుల్ జట్టు డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ మరోసారి సత్తా చాటాడు. ఈ ఏడాది ఆరంభంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ నెదర్లాండ్స్ డ్రైవర్... ద్వితీయార్ధంలో అదరగొడుతున్నాడు. తాజాగా యునైటెడ్ స్టేట్స్ గ్రాండ్ప్రిలో వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. గత నాలుగు రేసుల్లో అతడికిది మూడో విజయం కావడం విశేషం. ఓవరాల్గా ఈ ఏడాది అతనికిది ఐదో టైటిల్. తుది రేసును ‘పోల్ పొజిషన్’ నుంచి ప్రారంభించిన వెర్స్టాపెన్ వాయు వేగంతో దూసుకెళ్లాడు. 56 ల్యాప్ల రేసును అందరికంటే ముందుగా, అందరికంటే వేగంగా 1 గంట 34 నిమిషాల 0.161 సెకన్లలో ముగించి అగ్రస్థానంలో నిలిచాడు. తద్వారా నాలుగుసార్లు వరల్డ్ చాంపియన్ వెర్స్టాపెన్ డ్రైవర్స్ చాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న మెక్లారెన్ డ్రైవర్లకు మరింత చేరువయ్యాడు. రేసు ఆరంభం నుంచే ప్రత్యర్థులకు అందకుండా దూసుకెళ్లిన డిఫెండింగ్ చాంపియన్ వెర్స్టాపెన్ సగం రేసు అయ్యేసారికి రెండో స్థానంలో ఉన్న డ్రైవర్ కంటే 10 సెకన్ల ఆధిక్యంలో నిలిచాడు. ఓవరాల్గా వెర్స్టాపెన్ కెరీర్లో ఇది 68వ టైటిల్. 24 రేసుల సీజన్లో 19 రేసులు ముగిసేసరికి ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్షిప్లో ఆస్కార్ పియాస్ట్రి 346 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... లాండో నోరిస్ 332 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. వెర్స్టాపెన్ 306 పాయింట్లతో మూడో స్థానాన్ని మరింత మెరుగు పర్చుకున్నాడు. ఈ సీజన్లో మరో ఐదు రేసులు మిగిలుండగా... డ్రైవర్స్ చాంపియన్షిప్ అగ్రస్థానంలో ఉన్న పియాస్ట్రి కంటే వెర్స్టాపెన్ 40 పాయింట్లు వెనుకబడి ఉన్నాడు. రెండో స్థానంలో ఉన్న నోరిస్కు, వెర్స్టాపెన్కు మధ్య 26 పాయింట్ల అంతరం ఉంది. పియాస్ట్రి, నోరిస్ కెరీర్లో తొలి డ్రైవర్స్ చాంపియన్షిప్ టైటిల్ కోసం తహతహలాడుతుంటే... ఇప్పటికే వరుసగా నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్గా నిలిచిన వెర్స్టాపెన్ ఐదోది ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్నాడు. ‘ఇప్పుడే చెప్పలేం కానీ అవకాశం మాత్రం ఉంది. చివరి వరకు ఇదే జోరు కొనసాగిస్తే సీజన్ ముగిసేసరికి అగ్రస్థానానికి చేరడం కష్టం కాదు. అందుకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని రేసు అనంతరం వెర్స్టాపెన్ పేర్కొన్నాడు. తదుపరి రేసు ఈ నెల 27 మెక్సికో గ్రాండ్ప్రి జరుగనుంది. -
సెమీఫైనల్ చేరని హైదరాబాద్ బ్లాక్హాక్స్
సాక్షి, హైదరాబాద్: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) నాలుగో సీజన్ను హైదరాబాద్ బ్లాక్హాక్స్ జట్టు పరాజయంతో ముగించింది. గచి్చ»ౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ బ్లాక్హాక్స్ 9–15, 13–15, 15–9, 13–15తో కోల్కతా థండర్బోల్ట్స్ జట్టు చేతిలో ఓడిపోయింది. బ్లాక్హాక్స్ తరఫున ప్రీత్ కరణ్, సాహిల్ కుమార్, యుదీ యామమోటో రాణించారు. నిర్ణీత ఏడు మ్యాచ్లు పూర్తి చేసుకున్న హైదరాబాద్ బ్లాక్హాక్స్ మూడింటిలో గెలిచి, నాలుగింటిలో ఓడి తొమ్మిది పాయింట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచి సెమీఫైనల్కు దూరమైంది. మరో మ్యాచ్లో కొచ్చి బ్లూ స్పైకర్స్ 15–13, 14–16, 17–15, 15–9తో అహ్మదాబాద్ డిఫెండర్స్ జట్టును ఓడించింది. ఈ లీగ్లో పోటీపడుతున్న మొత్తం పది జట్లను రెండు గ్రూప్లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో గోవా గార్డియన్స్, చెన్నై బ్లిట్జŠస్, కొచ్చి బ్లూ స్పైకర్స్, బెంగళూరు టొర్పెడస్, కోల్కతా థండర్బోల్ట్స్... గ్రూప్ ‘బి’లో హైదరాబాద్ బ్లాక్హాక్స్, ఢిల్లీ తూఫాన్స్, అహ్మదాబాద్ డిఫెండర్స్, ముంబై మెటియోర్స్, కాలికట్ హీరోస్ జట్లున్నాయి. ఒక్కో జట్టు ఏడు మ్యాచ్లు ఆడుతుంది. ఆయా జట్లు తమ గ్రూప్లోని నాలుగు జట్లతో, మరో గ్రూప్లోని మూడు జట్లతో మ్యాచ్లు ఆడతాయి. లీగ్ దశ ముగిశాక టాప్–4లో నిలిచిన జట్లు సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి. ఇప్పటికే ముంబై మెటియోర్స్, బెంగళూరు టొర్పెడస్, అహ్మదాబాద్ డిఫెండర్స్ జట్లు సెమీఫైనల్ బెర్త్లను ఖాయం చేసుకోగా... చివరిదైన నాలుగో బెర్త్ కోసం కోల్కతా థండర్బోల్ట్స్, ఢిల్లీ తుఫాన్స్, గోవా గార్డియన్స్ జట్లు బరిలో ఉన్నాయి. -
పీకేఎల్ ప్లే ఆఫ్స్కు హరియాణా, జైపూర్
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్లో ఘనవిజయంతో హరియాణా స్టీలర్స్... ఓటమి పాలైనప్పటికీ మెరుగైన పాయింట్లతో జైపూర్ పింక్పాంథర్స్ జట్లు ప్లేఆఫ్స్కు అర్హత సాధించాయి. మంగళవారం జరిగిన మ్యాచ్లో హరియాణా స్టీలర్స్ 50–32తో గుజరాత్ జెయింట్స్పై నెగ్గింది. స్టీలర్స్ రెయిడర్లు శివమ్ (17), వినయ్ (14) రాణించారు. అంతకుముందు జరిగిన మ్యాచ్లో యు ముంబా 37–36తో జైపూర్ పింక్పాంథర్స్పై గెలుపొందింది. ఫలితం పింక్పాంథర్స్ను నిరాశపరిచినప్పటికీ హరియాణా జట్టులాగే 8 విజయాలు, 16 పాయింట్లతో సమంగా నిలువడంతో జైపూర్కూ ప్లేఆఫ్స్ బెర్త్ దక్కింది. మొదటి మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 44–43తో తమిళ్ తలైవాస్పై గెలిచింది. ఇప్పటికే ఏడు జట్లు ప్లే ఆఫ్స్కు చేరగా చివరి బెర్త్ కోసం పట్నా పైరేట్స్ రేసులో ఉంది. -
11 ఓటములు.. విసిగి పోయిన హెడ్ కోచ్! ఏమి చేశాడంటే?
ప్రోకబడ్డీ లీగ్-2025 సీజన్లో యూపీ యోధాస్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. గత సీజన్లో గ్రూపు స్టేజికే పరిమితమైన యూపీ జట్టు.. ఇప్పుడు కూడా అదే తీరును కనబరుస్తోంది. ఇప్పటివరకు 17 మ్యాచ్లు ఆడిన యోధాస్ కేవలం ఆరింట మాత్రం విజయం సాధించి.. మిగితా 11 మ్యాచ్లలో ఓటములను చవిచూసింది. పర్దీప్ నర్వాల్, సురేందర్ గిల్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికి యూపీ యోధాస్ గెలుపు బాట పట్టడం లేదు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో యూపీ జట్టు 11వ స్దానంలో కొనసాగుతోంది.2017 నుండి 2023 వరకు ప్రతి సీజన్లో ప్లేఆఫ్లకు చేరిన తమ ఆరాధ్య జట్టు.. ఇప్పుడు ఈ తరహా ప్రదర్శన చేయడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో ఆ జట్టు హెడ్ కోచ్ జస్వీర్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. యూపీ యోధాస్ ఓటములకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాన కోచ్ పదవి నుంచి జస్వీర్ సింగ్ తప్పుకొన్నాడు. జైపూర్ పింక్ పాంథర్స్ చేతిలో యూపీ ఘోర పరాజయం పాలైన తర్వాత జస్వీర్ తన మనసులో మాటను వెల్లడించాడు. సీజన్ 5 నుండి యోధాస్ కోచింగ్ సెటప్లో అంతర్భాగంగా ఉన్న జస్వీర్ సింగ్.. తన షాకింగ్ నిర్ణయంతో అందరిని ఆశ్చర్యపరిచాడు.రైడర్స్ అట్టర్ ప్లాప్..ఈ సీజన్లో యూపీ యోధాస్ రైడర్స్ అట్టర్ ప్లాప్ అయ్యారు. పర్దీప్ నర్వాల్ వంటి స్టార్ రైడర్ సైతం పాయింట్లు తీసుకురావడంలో విఫలమయ్యాడు. మొత్తం యూపీ యోధాస్ ఇప్పటివరకు 718 రైడ్స్కు వెళ్లగా.. కేవలం 347 రైడ్ పాయింట్లు మాత్రమే సాధించింది. అందులో టచ్ పాయింట్స్ 229 కాగా.. బోనస్ పాయింట్స్ 118గా ఉన్నాయి. రైడ్ విజయ శాతం 38 % గా ఉంది. అటు డిఫెండర్స్ టాకిల్ విజయ శాతం 36%గా ఉంది.చదవండి: IND vs AUS: 244 పరుగులు.. 83.84 స్ట్రైక్ రేటు! అడిలైడ్లో అదరగొట్టిన విరాట్ కోహ్లి -
చిన్న వయసులోనే చెస్ గ్రాండ్మాస్టర్ కన్నుమూత
అమెరికన్ చెస్ గ్రాండ్మాస్టర్ డానియెల్ నారోడిట్స్కీ (Daniel Naroditsky) హఠాన్మరణం చెందాడు. 29 ఏళ్ల వయసులోనే తుదిశ్వాస విడిచాడు. డానియెల్ కోచ్గా పనిచేస్తున్న.. ‘ది చార్లెట్ చెస్ క్లబ్’ ఈ విషయాన్ని ధ్రువీకరించింది.డానియెల్ ఇకలేరు‘‘ప్రతిభావంతుడైన చెస్ క్రీడాకారుడు. గొప్ప కోచ్. చెస్ కమ్యూనిటీలో అందరికీ అత్యంత ఇష్టమైన వ్యక్తి. ఆట పట్ల ఆయన ప్రేమ, అంకితభావం అసాధారణం. ఎంతో మంది స్ఫూర్తిదాయకంగా నిలిచిన డానియెల్ ఇకలేరు’’ అంటూ డానియెల్ కుటుంబం అతడి మరణవార్తను తమకు తెలియజేసినట్లు.. నార్త్ కరోలినాలోని ఈ క్లబ్ ప్రకటన విడుదల చేసింది.చివరగా..అయితే, డానియెల్ మరణానికి గల కారణం మాత్రం తెలియరాలేదు. బాల్యం నుంచే చదరంగంపై మక్కువ పెంచుకున్న డానియెల్ అండర్-12 వరల్డ్ చాంపియన్షిప్ టైటిల్ గెలిచాడు. టీనేజ్లోనే చెస్ స్ట్రాటజీ బుక్స్ కూడా రాశాడు. కెరీర్లో ఉన్నతస్థాయికి చేరుకున్న డానియెల్.. చివరగా ఈ ఏడాది ఆగష్టులో యూఎస్ నేషనల్ బ్లిట్జ్ చాంపియన్షిప్ గెలిచాడు.కాగా తన గేమ్లను అభిమానులంతా ప్రత్యక్షంగా వీక్షించాలని డానియెల్ కోరుకునేవాడు. అలా వీలుకాని వాళ్ల కోసం లైవ్స్ట్రీమింగ్ చేయించేవాడు. ఈ విషయం గురించి అమెరికాకే చెందిన మరో గ్రాండ్మాస్టర్ హికారు నకముర మాట్లాడుతూ.. ‘‘అతడికి మ్యాచ్లను ప్రత్యక్ష ప్రసారం చేయడం ఇష్టం.నేను వెళ్లిపోయానని అనుకున్నారా?తద్వారా ఇతరులకు కూడా చెస్ గురించి నేర్చుకునే వీలు ఉంటుంది అనేవాడు. చెస్ ప్రపంచం అతడికి ఎంతగానో రుణపడి ఉంది’’ అని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. యూట్యూబ్ చానెల్ వేదికగా అభిమానులతో టచ్లో ఉండే డానియెల్.. చాన్నాళ్ల తర్వాత చివరగా పోస్ట్ చేసిన వీడియోలో.. ‘‘నేను వెళ్లిపోయానని మీరు అనుకున్నారా?.. మునుపటి కంటే మెరుగ్గా తిరిగి వస్తాను’’ అని పేర్కొన్నాడు. అయితే, అంతలోనే అతడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం అభిమానులకు తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది.జూనియర్ చెస్ ప్లేయర్లకు కోచ్గాకాగా డానియెల్ నారోడిట్స్కీ మృతి పట్ల అమెరికా చెస్ ప్లేయర్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. కాగా అజర్బైజాన్, ఉక్రెయిన్ నుంచి అమెరికాకు వచ్చిన యూదు వలసదారుల కుటుంబానికి చెందినవాళ్లలో డానియెల్ ఒకడు. కాలిఫోర్నియాలోని సాన్ మటియోలో జన్మించిన డానియెల్.. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో 2019లో హిస్టరీ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడు. తర్వాత అతడు నార్త్ కరోలినాకు తన మకాం మార్చాడు. అక్కడే చార్లెట్ క్లబ్లో జూనియర్ చెస్ ప్లేయర్లకు కోచ్గా మారాడు.చదవండి: SL vs BAN: 4 బంతుల్లో 4 వికెట్లు.. ఉత్కంఠ పోరులో బంగ్లాదేశ్ ఓటమి -
గుజరాత్పై తెలుగు టైటాన్స్ గెలుపు
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఆఖరి దశ పోటీల్లో తెలుగు టైటాన్స్ నిలకడగా రాణిస్తోంది. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లో టైటాన్స్ జట్టు 30–25 గుజరాత్ జెయింట్స్పై విజయం సాధించింది. టైటాన్స్ జట్టులో కెప్టెన్ విజయ్ మాలిక్ (8), భరత్ (7) పోటీపడి రాణించారు. ఇద్దరు ఆల్రౌండర్లు క్రమం తప్పకుండా పాయింట్లు తెచ్చిపెట్టారు. డిఫెండర్లు అజిత్ పవార్ (4), అంకిత్ (4)లు మెరుగ్గా ఆడారు. గుజరాత్ తరఫున రెయిడింగ్లో హిమాన్షు సింగ్ (6), కెప్టెన్ రాకేశ్ (5) రాణించగా, డిఫెండర్ లక్కీ శర్మ 4 పాయింట్లు సాధించాడు. మిగతా వారిలో ఆల్రౌండర్ మొహమ్మద్ రెజా (3), విశ్వనాథ్, నితిన్ పన్వార్ చెరో 2 పాయింట్లు చేశారు. 12వ సీజన్లో ఆరంభం నుంచే పట్టుదలగా ఆడుతున్న తెలుగు టైటాన్స్ 17 మ్యాచ్లాడి పదో విజయాన్ని నమోదు చేసింది.నేడు మ్యాచ్లకు విశ్రాంతి రోజు. రేపు జరిగే పోటీల్లో బెంగాల్ వారియర్స్తో తమిళ్ తలైవాస్ పోటీపడుతుంది. యూ ముంబాను జైపూర్ పింక్పాంథర్స్ ఢీకొంటుంది. హరియాణా స్టీలర్స్తో గుజరాత్ జెయంట్స్ తలపడుతుంది.ప్లేఆఫ్స్ చేరిన యూ ముంబాలీగ్లో మరో జట్టు యూ ముంబా కూడా ప్లే ఆఫ్స్ చేరింది. హరియాణా స్టీలర్స్తో హోరాహోరీగా సాగిన మ్యాచ్లో యూ ముంబా టై బ్రేకర్లో గెలిచి ముందంజ వేసింది. నిర్ణీత సమయం ముగిసే సరికి ఇరు జట్లు 37–37 స్కోరుతో సమంగా నిలిచాయి. దీంతో టైబ్రేక్ అనివార్యం కాగా యూ ముంబా రెయిడర్లు జట్టును గెలిపించారు. సందీప్ (9) అదరగొట్టాడు. 21 సార్లు కూతకెళ్లిన అతను 9 సార్లు విజయవంతంగా పాయింట్లు తెచ్చాడు. సహచరుల్లో అజిత్ చౌహాన్ (6), అమిర్ మొహమ్మద్ (6), సునీల్ కుమార్ (4), విజయ్ కుమార్ (3) రాణించారు. హరియాణా జట్టులో జైదీప్ (9) కడదాకా శ్రమించాడు. మిగతావారిలో సాహిల్ నర్వాల్ (6), శివమ్ పతారే (4), వినయ్ (3), రాహుల్ (3) మెరుగ్గా ఆడారు. ఆఖరి మూడో మ్యాచ్లో పట్నా పైరేట్స్ 38–27తో పుణేరి పల్టన్పై గెలుపొందింది. -
దస్ కా దమ్
న్యూఢిల్లీ: ఆసియా రోయింగ్ చాంపియన్షిప్లో భారత రోయర్లు సత్తాచాటారు. వియత్నాం వేదికగా జరిగిన టోర్నమెంట్లో ఒలింపియన్ బాల్రాజ్ పన్వర్ నేతృత్వంలోని భారత బృందం 10 పతకాల (3 స్వర్ణాలు, 5 రజతాలు, 2 కాంస్యాలు)తో మెరిసింది. పురుషుల సింగిల్స్ స్కల్ (ఎమ్1ఎక్స్) విభాగంలో బాల్రాజ్ పసిడి పతకం కైవసం చేసుకున్నాడు. లైట్ వెయిట్ డబుల్ స్కల్ (ఎల్ఎమ్2ఎక్స్) ఈవెంట్లో లక్ష్య, అజయ్ త్యాగి స్వర్ణ పతకం గెలుచుకోగా... పురుషుల క్వాడ్రపుల్ స్కల్ (ఎమ్4ఎక్స్) ఈవెంట్లో కుల్విందర్ సింగ్, నవ్దీప్ సింగ్, సత్నామ్ సింగ్, జకర్ ఖాన్తో కూడిన భారత బృందం బంగారు పతకం నెగ్గింది. ఇక మహిళల లైట్ వెయిట్ డబుల్స్ (ఎల్డబ్ల్యూ2) విభాగంలో గుర్బానీకౌర్–దిల్జ్యోత్ కౌర్ జంట రజత పతకం గెలుచుకుంది. తద్వారా ఆసియా చాంపియన్షిప్లో 15 ఏళ్ల భారత పతక నిరీక్షణకు ఈ జోడీ తెరదించింది. పురుషుల టీమ్ (ఎమ్8) విభాగంలో నితిన్ డియోల్, పర్విందర్ సింగ్, లఖ్వీర్ సింగ్, రవి, గుర్ప్రతాప్ సింగ్, భీమ్ సింగ్, జస్విందర్ సింగ్, కుల్బీర్, కిరణ్ సింగ్తో కూడిన భారత బృందం రజత పతకం ఖాతాలో వేసుకుంది. పురుషుల డబుల్ స్కల్ (ఎమ్2ఎక్స్)లో జస్పిందర్ సింగ్–సల్మాన్ ఖాన్ జంట రజతం గెలుచుకోగా... పురుషుల లైట్ వెయిట్ క్వాడ్రపుల్ స్కల్ (ఎల్ఎమ్4ఎక్స్)లో రోహిత్, ఉజ్వల్ కుమార్ సింగ్, లక్ష్య, అజయ్ త్యాగీతో కూడిన భారత బృందం రజతం చేజిక్కించుకుంది. లైట్వెయిట్ పురుషుల ఫోర్ (ఎల్ఎమ్4) ఈవెంట్లో సానీ కుమార్, ఇక్బాల్ సింగ్, బాబులాల్ యాదవ్, యోగేశ్ కుమార్తో కూడిన భారత జట్టు వెండి వెలుగులు విరజిమ్మింది. పురుషుల లైట్ వెయిట్ (ఎల్ఎమ్2)లో నితిన్ డియోల, పర్విందర్ సింగ్ కాంస్యం కైవసం చేసుకోగా... మహిళల టీమ్ (డబ్ల్యూ8) విభాగంలో గుర్బానీ కౌర్, దిల్జ్యోత్ కౌర్, సుమన్ దేవి, అలెనా ఆంటో, కిరణ్, పూనమ్, హౌబిజామ్ దేవితో కూడిన భారత జట్టు కాంస్యం నెగ్గింది. ఈ టోర్నమెంట్లో భారత్ నుంచి మొత్తం 37 మంది పోటీపడ్డారు. ఇందులో 25 మంది పురుష రోయర్లు కాగా, 12 మంది మహిళలున్నారు. -
ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో తన్వీ శర్మకు రజతం
భారత యువ షట్లర్ తన్వీ శర్మ ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో రజత పతకం కైవసం చేసుకుంది. గువాహటిలో జరిగిన టోర్నీ మహిళల సింగిల్స్ ఫైనల్లో తన్వీ పరాజయం పాలైంది. ఆదివారం జరిగిన తుదిపోరులో టాప్ సీడ్ తన్వీ శర్మ 7–15, 12–15తో రెండో సీడ్ అన్యాపత్ ఫిచిత్ఫోన్ (థాయ్లాండ్) చేతిలో ఓడింది. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో మహిళల సింగిల్స్లో భారత్ నుంచి అపర్ణ పోపట్ (1996లో రజతం), సైనా నెహ్వాల్ (2006లో రజతం, 2008లో స్వర్ణం) మాత్రమే పతకాలు గెలిచారు. మళ్లీ ఇప్పుడు 17 ఏళ్ల తర్వాత తన్వీ శర్మ ఆ జాబితాలో చోటు దక్కించుకుంది. మ్యాచ్ ఆరంభం నుంచే తన్వీ లయ కోల్పోయింది. ‘చాలా తప్పులు చేశా. మ్యాచ్ ప్రారంభం నుంచే తడబడ్డా. తొలి గేమ్ తర్వాత తేరుకొని... రెండో గేమ్లో గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రయత్నించా. 8–5తో ఆధిక్యంలో ఉన్న సమయంలో చేసిన తప్పిదంతో థాయ్ షట్లర్కు పట్టుబిగించే అవకాశం దక్కింది. ప్రత్యర్థి నా ఆటతీరును సులువుగా పట్టేసింది’ అని తన్వీ పేర్కొంది. -
పారా త్రోబాల్ ప్లేయర్కు రామన్న భరోసా..!
రాజన్న సిరిసిల్ల జిల్లా, చంద్రంపేట గ్రామానికి చెందిన పారా త్రోబాల్ ప్లేయర్ మిట్టపల్లి అర్చన, స్వతహాగా ఎదిగి ఖేలో ఇండియా, నేషనల్ లెవెల్ పారా త్రోబాల్ స్థాయిలో సత్తా చాటి ఇప్పుడు ఇండియా తరపున తెలంగాణ నుంచి శ్రీలంకలో పారా త్రోబాల్ ఆడడానికి అర్హత సాధించారు.పేద కుటుంబానికి చెందిన అర్చనకు చిన్నతనం నుంచే క్రీడలంటే ఆసక్తి. అద్దె ఇంట్లో ఇద్దరు పిల్లలను పోషించుకుంటూ తనకు ఇష్టమైన ఆటలో గెలుపే లక్ష్యంగా కృషిచేస్తున్నారు.ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడం సోషల్ మీడియా ద్వారా తెల్సుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తనకు భరోసా ఇచ్చి క్రీడా పరికరాలు, ఆర్ధిక సహాయం చేసి మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారని అంటున్నారు పారా త్రోబాల్ ప్లేయర్ మిట్టపల్లి అర్చన. ఈ విషయాన్ని ‘ఎక్స్’లో బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసింది. ‘రామన్న అంటేనే ఒక భరోసా.. సామాన్యులకు కొండంత అండ’ అని బీఆర్ఎస్ పేర్కొంది. రామన్న భరోసా ❤️అన్నా అంటే చాలు.. నేనున్నానంటూ భుజం తట్టి ప్రోత్సాహిస్తాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా, చంద్రంపేట గ్రామానికి చెందిన పారా త్రోబాల్ ప్లేయర్ మిట్టపల్లి అర్చన, స్వతహాగా ఎదిగి ఖేలో ఇండియా, నేషనల్ లెవెల్ పారా త్రోబాల్ స్థాయిలో సత్తా చాటి ఇప్పుడు ఇండియా తరపున తెలంగాణ… https://t.co/Vjzaimft7r pic.twitter.com/mrI21wBFNe— BRS Party (@BRSparty) October 19, 2025 -
ప్లే ఆఫ్స్కు చేరిన తెలుగు టైటాన్స్
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో తెలుగు టైటాన్స్ జట్టు ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 40–31 పాయింట్ల తేడాతో పట్టిక అగ్రస్థానంలో ఉన్న పుణేరి పల్టన్పై గెలిచి ముందంజ వేసింది. టైటాన్స్ తరఫున భరత్ 11, విజయ్ మాలిక్ 10 పాయింట్లు సాధించారు.ఈ సీజన్లో టైటాన్స్ 16 మ్యాచ్లాడి 9 విజయాలు, 7 పరాజయాలతో 18 పాయింట్లతో నిలిచింది. మరో మ్యాచ్లో బెంగళూరు బుల్స్ 33–23 పాయింట్ల తేడాతో దబంగ్ ఢిల్లీపై గెలుపొందింది. ఈ విజయంతో బెంగళూరు బుల్స్ కూడా ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. ఇంకో మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ 38–30 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్పై గెలుపొందింది. -
భారత్కు రజత పతకం
జొహోర్ బారు (మలేసియా): సుల్తాన్ ఆఫ్ జొహోర్ కప్ అండర్–21 అంతర్జాతీయ పురుషుల హాకీ టోర్నమెంట్లో భారత జట్టు రజత పతకం దక్కించుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో రోహిత్ సారథ్యంలోని మూడు సార్లు చాంపియన్ టీమిండియా 1–2 గోల్స్ తేడాతో ఆ్రస్టేలియా చేతిలో ఓడింది. చివరి నిమిషంలో ప్రత్యర్థికి గోల్ చేసే అవకాశం ఇవ్వడంతో పాటు... పెనాల్టీ కార్నర్ అవకాశాలను వృథా చేసుకొని పరాజయం వైపు నిలిచింది. భారత్ తరఫున అన్మోల్ ఎక్కా (17వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించగా... ఆస్ట్రేలియా తరఫున ఇయాన్ గ్రాబెలార్ (13వ, 59వ నిమిషాల్లో) డబుల్ గోల్స్తో మెరిశాడు.తొలి క్వార్టర్లో ఆ్రస్టేలియా గోల్ చేసి ఆధిక్యం సాధించగా... రెండో క్వార్టర్లో అన్మోల్ గోల్తో భారత్ స్కోరు సమం చేసింది. ఆ తర్వాత ఇరు జట్లు ఎంత ప్రయత్నించినా మరో గోల్ చేయలేకపోయాయి. అయితే మ్యాచ్ మరో నిమిషంలో ముగుస్తుందనగా... వచ్చిన పెనాల్టీ కార్నర్ అవకాశాన్ని ఆ్రస్టేలియా సద్వినియోగం చేసుకొని ఆధిక్యం రెట్టింపు చేసుకుంది. గత మూడు ఫైనల్స్లో ఓడిన ఆ్రస్టేలియాకు ఇది నాలుగో ట్రోఫీ. భారత జట్టుకు చివరి నిమిషంలో ఏకంగా ఆరు పెనాల్టీ కార్నర్ అవకాశాలు దక్కగా... వాటిలో ఒక్కదాన్ని కూడా గోల్గా మలచలేకపోయింది. ఆస్ట్రేలియా గోల్ కీపర్ మాగ్నస్ మెక్కాస్లాండ్ చక్కటి ప్రదర్శన కనబర్చాడు. గత రెండు పర్యాయాలు కాంస్య పతకాలు సాధించిన భారత జట్టు... ఈసారి రజతం గెలుచుకుంది. -
ఫైనల్లో తన్వీ
గువాహటి: సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లో... భారత యువ షట్లర్ తన్వీ శర్మ అదరగొడుతోంది. 17 ఏళ్ల భారత నిరీక్షణకు తెరదించుతూ... ఈ టోర్నీలో పతకం ఖాయం చేసుకున్న ఈ 16 ఏళ్ల అమ్మాయి... ఇప్పుడు ఫైనల్కు దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో శనివారం టాప్ సీడ్ తన్వీ శర్మ 15–11, 15–9తో లియు సి యా (చైనా)పై విజయం సాధించింది. తద్వారా భారత్ నుంచి ఈ టోర్నీ ఫైనల్కు చేరిన మూడో ప్లేయర్గా తన్వీ నిలిచింది. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో మహిళల సింగిల్స్లో భారత్ నుంచి అపర్ణ పోపట్ (1996లో రజతం), సైనా నెహ్వల్ (2006లో రజతం, 2008లో స్వర్ణం) మాత్రమే పతకాలు గెలిచారు. నేడు జరగనున్న ఫైనల్లో రెండో సీడ్ అన్యాపత్ ఫిచిత్ఫోన్ (థాయ్లాండ్)తో తన్వీ అమీతుమీ తేల్చుకోనుంది. సెమీఫైనల్లో తన్వీకి ప్రత్యర్థి నుంచి పెద్దగా పోటీ ఎదురుకాలేదు. తొలి గేమ్లో తన్వీ 7–3తో స్పష్టమైన ఆధిక్యం కనబర్చగా... కాస్త పోరాడిన ప్రత్యర్థి 7–8తో తన్వీని సమీపించింది. ఆ తర్వాత తప్పిదాలకు అవకాశం ఇవ్వని భారత షట్లర్... వరుస పాయింట్లతో విజృంభించింది. రెండో సెట్లోనూ అదే జోరు కొనసాగిస్తూ మ్యాచ్ను కైవసం చేసుకుంది. మరోవైపు డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీ సెమీఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట పరాజయం పాలైంది. శనివారం పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ 21–23, 21–18, 16–21తో టకురో హోకి–యుగో (జపాన్) ద్వయం చేతిలో ఓడింది. -
ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్లో జ్యోతిసురేఖకు కాంస్యం
భారత టాప్ ఆర్చర్ వెన్నం జ్యోతిసురేఖ మరో కొత్త ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచ కప్ ఫైనల్ ఈవెంట్ (కాంపౌండ్ విభాగం)లో పతకం నెగ్గిన తొలి భారత మహిళా ఆర్చర్గా రికార్డు సృష్టించింది. చైనాలోని నన్జింగ్లో జరిగిన ఈ పోటీల్లో సురేఖ కాంస్య పతకం గెలుచుకుంది. ఎనిమిది మంది అగ్రశ్రేణి ఆర్చర్లు పాల్గొన్న ఈ పోటీల సెమీఫైనల్లో సురేఖ 143–145 స్కోరుతో వరల్డ్ నంబర్వన్ ఆండ్రియా బెకెరా (మెక్సికో) చేతిలో ఓటమిపాలైంది. అయితే కాంస్యం కోసం జరిగిన పోరులో సురేఖ 150–145 తేడాతో వరల్డ్ నంబర్ 2 ఎలియా గిబ్సన్ (గ్రేట్ బ్రిటన్)పై విజయం సాధించింది. ప్రస్తుత ఆసియా క్రీడల విజేత అయిన సురేఖ 15 బాణాలను ఎలాంటి పొరపాటుకు తావివ్వకుండా పక్కాగా సంధించి అందుబాటులో ఉన్న 150 పాయింట్లనూ సాధించడం విశేషం. గతంలో రెండు సార్లు వరల్డ్ కప్ ఆర్చరీ ఫైనల్ (2022, 2023) ఈవెంట్లో పాల్గొన్న సురేఖ పతకం సాధించడంలో విఫలమైంది. మరో వైపు పురుషుల కాంపౌండ్ విభాగంలో కాంస్య పతకం కోసం జరిగిన పోరులో భారత ఆటగాడు రిషభ్ యాదవ్ అతి స్వల్ప తేడాతో మైక్ స్కాలెసర్ (నెదర్లాండ్స్) చేతిలో ఓడి పతకాన్ని చేజార్చుకున్నాడు. -
దబంగ్ ఢిల్లీ మరో విజయం
ఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో దబంగ్ ఢిల్లీ జట్టు ఖాతాలో మరో విజయం చేరింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్కు చేరుకున్న ఢిల్లీ జట్టు శుక్రవారం జరిగిన పోరులో 37–31 పాయింట్ల తేడాతో తమిళ్ తలైవాస్పై గెలుపొందింది. ఢిల్లీ తరఫున అక్షిత్ ధుల్ 12 పాయింట్లతో సత్తా చాటగా... నవీన్ 6, ఫజల్ 5 పాయింట్లు సాధించారు. తలైవాస్ తరఫున అర్జున్ దేశ్వాల్ 11 పాయింట్లతో ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. తాజా సీజన్లో ఢిల్లీ 16 మ్యాచ్లు ఆడి 13 విజయాలు, 3 పరాజయాలతో 26 పాయింట్లు ఖాతాలో వేసుకొని రెండో స్థానంలో ఉంది. మరో మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ 42–29 పాయింట్ల తేడాతో యూపీ యోధాస్ను చిత్తుచేసింది. జైపూర్ తరఫున అలీ సమది 13 పాయింట్లు, నితిన్ 11 పాయింట్లతో రాణించగా... యోధాస్ తరఫున సురేందర్ 12 పాయింట్లతో పోరాడాడు. గ్రూప్ అడుగున ఉన్న జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో పట్నా పైరేట్స్ 51–49తో బెంగాల్ వారియర్స్పై నెగ్గింది. నేడు జరిగే మ్యాచ్ల్లో బెంగళూరు బుల్స్తో దబంగ్ ఢిల్లీ, తెలుగు టైటాన్స్తో పుణేరి పల్టన్, బెంగాల్ వారియర్స్తో జైపూర్ పింక్ పాంథర్స్ ఆడతాయి. -
తన్వీ తడాఖా...
గువాహటి: సుదీర్ఘ నిరీక్షణకు భారత యువ షట్లర్ తన్వీ శర్మ తెర దించించి. ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ మహిళల సింగిల్స్ విభాగంలో 17 ఏళ్ల తర్వాత భారత్కు పతకాన్ని ఖాయం చేసింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ తన్వీ శర్మ 13–15, 15–9, 15–10తో సాకి మత్సుమోటో (జపాన్)పై విజయం సాధించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. తద్వారా కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. నేడు జరిగే సెమీఫైనల్లో లియు సి యా (చైనా)తో తన్వీ తలపడుతుంది. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో మహిళల సింగిల్స్లో అపర్ణ పోపట్ (1996లో రజతం), సైనా నెహ్వాల్ (2006లో రజతం, 2008లో స్వర్ణం) మాత్రమే పతకాలు గెలిచారు. భారత్కే చెందిన మరో ప్లేయర్ ఉన్నతి హుడాకు నిరాశ ఎదురైంది. క్వార్టర్ ఫైనల్లో ఉన్నతి 12–15, 13–15తో అన్యాపత్ ఫిచిత్ఫోన్ (థాయ్లాండ్) చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్లో హైదరాబాద్ ప్లేయర్ టంకర తలశిల జ్ఞానదత్తుకు కూడా ఓటమి ఎదురైంది. జ్ఞానదత్తు 11–15, 13–15తో మూడో సీడ్ లియు యాంగ్ మింగ్ యు (చైనా) చేతిలో ఓడిపోయాడు. క్వార్టర్ ఫైనల్లో ఉన్నతి, జ్ఞానదత్తు గెలిచి ఉంటే ఈ ఇద్దరికి కూడా పతకాలు ఖాయమయ్యేవి. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన అరిగెల భార్గవ్ రామ్–గొబ్బూరు విశ్వతేజ్ (భారత్) జంట 12–15, 10–15తో చెన్ జున్ టింగ్–లియు జున్ రోంగ్ (చైనా) జోడీ చేతిలో... మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో భవ్య ఛాబ్రా–విశాఖ టొప్పో (భారత్) ద్వయం 9–15, 7–15తో హుంగ్ బింగ్ ఫు–చౌ యున్ ఆన్ (చైనీస్ తైపీ) జోడీ చేతిలో పరాజయం పాలై పతకాలకు దూరమయ్యాయి. -
టైటిల్ పోరుకు భారత్
జొహోర్ బారు (మలేసియా): సుల్తాన్ ఆఫ్ జొహోర్ కప్ అండర్–21 అంతర్జాతీయ పురుషుల హాకీ టోర్నీలో భారత జట్టు టైటిల్ పోరుకు అర్హత సాధించింది. శుక్రవారం ఆతిథ్య మలేసియా జట్టుతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో రోహిత్ సారథ్యంలోని టీమిండియా 2–1 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున గుర్జోత్ సింగ్ (22వ నిమిషంలో), ఆనంద్ కుష్వాహ (48వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. మలేసియా జట్టుకు నావినేశ్ పానికెర్ (43వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. 12వసారి ఈ టోర్నీలో ఆడుతున్న భారత జట్టు రికార్డుస్థాయిలో ఎనిమిదోసారి ఫైనల్కు చేరడం విశేషం. శుక్రవారం జరిగిన మరో రెండు లీగ్ మ్యాచ్లు ‘డ్రా’గా ముగిశాయి. న్యూజిలాండ్–బ్రిటన్ మ్యాచ్ 2–2 గోల్స్ వద్ద... ఆస్ట్రేలియా–పాకిస్తాన్ మ్యాచ్ 3–3 గోల్స్ వద్ద ‘డ్రా’ అయ్యాయి. ఆరు జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో శుక్రవారంతో లీగ్ దశ మ్యాచ్లు ముగిశాయి. 11 పాయింట్లతో ఆస్ట్రేలియా, 10 పాయింట్లతో భారత్ తొలి రెండు స్థానాల్లో నిలిచి నేడు టైటిల్ పోరులో తలపడతాయి. బ్రిటన్–పాకిస్తాన్ జట్ల మధ్య మూడో స్థానం కోసం మ్యాచ్ జరుగుతుంది. -
మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్
న్యూఢిల్లీ: ప్లేఆఫ్స్ రేసులో ఉన్న తెలుగు టైటాన్స్కు వరుస పరాజయాలు కుంగదీస్తున్నాయి. టైబ్రేక్కు దారితీసిన గత మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ చేతిలో ఓడిన తెలుగు టైటాన్స్ గురువారం జరిగిన పోరులో యు ముంబా చేతిలో 26–33తో పరాజయం పాలైంది. టైటాన్స్ జట్టులో ఆల్రౌండర్, కెప్టెన్ విజయ్ మలిక్ (10) ఒంటరి పోరాటం చేశాడు. రెయిడింగ్లో 17 సార్లు కూతకెళ్లి 9 పాయింట్లు తెచ్చాడు. ప్రత్యర్థి రెయిడర్ను టాకిల్ చేసి మరో పాయింట్ సాధించాడు. సహచరుల్లో భరత్ (5) మాత్రమే మెరుగ్గా ఆడాడు. డిఫెండర్లు అంకిత్ 3, అవి దుహన్, శుభమ్ షిండే చెరో 2 పాయింట్లు చేశారు. యు ముంబా తరఫున రెయిడర్ అజిత్ చౌహాన్ (8) రాణించాడు. ఇతనికి సహచరులు సందీప్ (4), రింకూ (4), అమిర్ మొహమ్మద్ (3), పర్వేశ్ (3)లను చక్కని సహకారం లభించింది. ప్రస్తుతం 8 విజయాలతో మూడో స్థానంలో ఉన్న తెలుగు టైటాన్స్కు ఈ సీజన్లో ఇక మూడే మ్యాచ్లు మిగిలున్నాయి. టైటాన్స్ రేపు పుణేరి పల్టన్తో పోటీపడుతుంది. అనంతరం 19న గుజరాత్, 22న ఆఖరి పోరులో హరియాణా స్టీలర్స్తో తలపడుతుంది. పాట్నా , హరియాణా గెలుపు అంతకుముందు హోరాహోరీగా జరిగిన తొలి మ్యాచ్లో మూడుసార్లు చాంపియన్ అయిన పట్నా పైరేట్స్ టైబ్రేక్లో బెంగళూరు బుల్స్పై గెలుపొందింది. నిర్ణీత సమయం ముగిసేసరికి ఇరుజట్లు 32–32 స్కోరుతో సమంగా నిలిచాయి. టైబ్రేక్లో పట్నా 6–5తో పైచేయి సాధించింది. పట్నా కెపె్టన్ అయాన్ రెయిడింగ్లో చెలరేగాడు. 20 సార్లు కూతకెళ్లిన అతను 14 సార్లు పాయింట్లతో వచ్చాడు. మిగతా వారిలో రెయిడర్ అంకిత్ కుమార్ (5), డిఫెండర్ నవ్దీప్ (4) రాణించారు. బెంగళూరు బుల్స్ తరఫున అలీ రెజా మీర్జాయిన్ (17) ఒక్కడే శ్రమించాడు. అనంతరం జరిగిన మూడో మ్యాచ్లో హరియాణా స్టీలర్స్ 53–26తో యూపీ యోధాస్పై ఘన విజయం సాధించింది. స్టీలర్స్ జట్టులో శివమ్ (15), జైదీప్ (6), సాహిల్ నర్వాల్ (4) రాణించారు. యూపీ తరఫు గగన్ గౌడ (7), భవానీ రాజ్పుత్, హితేశ్ చెరో 3 పాయింట్లు చేశారు. నేటి మ్యాచ్ల్లో బెంగాల్ వారియర్స్తో పట్నా పైరేట్స్, తమిళ్ తలైవాస్తో దబంగ్ ఢిల్లీ, జైపూర్ పింక్పాంథర్స్తో యూపీ యోధాస్ తలపడతాయి. -
చాంపియన్ స్విమ్మర్... 25 ఏళ్లకే రిటైర్మెంట్
బ్రిస్బేన్: అరిన్ ఎలిజబెత్ టిట్మస్ ఆస్ట్రేలియన్ స్విమ్మర్. అలాంటి... ఇలాంటి... స్విమ్మర్ కాదు. చాంపియన్... ఆహా... అంతకుమించే! ఈ అమ్మడు వయసు 25... పతకాల సంఖ్య బోలెడు. ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్షిప్, కామన్వెల్త్ గేమ్స్లాంటి ప్రతిష్టాత్మక క్రీడల్లో 32 పతకాలు. ఇందులో స్వర్ణాలే 18 అంటే... చాంపియన్ కాదు అంతకుమించి అనడంలో అతిశయోక్తి ఉండదేమో! మరో మెగా ఈవెంట్ లాస్ ఏంజెలిస్–2028 ఒలింపిక్స్కు సన్నద్ధమవుతుందనుకుంటే... ఆశ్చర్యకరంగా రిటైర్మెంట్ ప్రకటించింది. తన బంగారు క్రీడా భవిష్యత్తును పాతికేళ్లకే ముగించింది. గురువారం తన ఇన్స్ట్రాగామ్లో వీడియో సందేశంతో ఫాలోవర్లతో పాటు అభిమానుల్ని విస్మయపరిచింది. ‘నేనెప్పటికీ స్విమ్మింగ్నే ప్రేమిస్తాను. చిన్నప్పుటి నుంచే అదే నా లోకం. అయితే అదే మొత్తం జీవితం కాదని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. నా జీవితంలో స్విమ్మింగ్ కంటే ప్రధానమైనవి కూడా ఉన్నాయని ఈ మధ్యే గ్రహించాను. అందుకే ఇక చాలనుకుంటున్నా. ఇక్కడితోనే ఆటకు గుడ్బై చెప్పాలనుకుంటున్నా’ అని ఆ్రస్టేలియన్ స్టార్ స్విమ్మర్ వీడియోను పోస్ట్ చేసింది. గతేడాది జరిగిన పారిస్ ఒలింపిక్స్లో అమెరికా గ్రేట్ కేటీ లెడెకీ, కెనడా స్టార్ సమ్మర్ మెకింటోష్ లను వెనక్కి నెట్టి మరీ టిట్మస్ 400 మీటర్ల ఫ్రీస్టయిల్ టైటిల్ను నిలబెట్టుకుంది. ఈ ముగ్గురు కూడా దిగ్గజ స్విమ్మర్లు. అంతర్జాతీయ పోటీల్లో రికార్డులు నెలకొల్పినవారే కావడంతో పారిస్ ఈవెంట్లో గెలుపెవరిదనే అంచనాలు ఆకాశన్నంటాయి. చివరకు అరిన్ టిట్మసే ‘బంగారు చేప’గా నిలిచింది. తన రిటైర్మెంట్ సందేశంలోనూ ఈ పోటీనే తన ఫేవరెట్ ఈవెంట్గా పేర్కొంది. హేమాహేమీలతో దీటైన పోటీని ఆస్వాదించినట్లు చెప్పింది. పారిస్ ఈవెంట్కు ముందు, ఆ తర్వాత కొన్ని ఆరోగ్య సమస్యల్ని సైతం ఎదుర్కొన్నట్లు అరిన్ చెప్పింది. 2023లో కూడా ఆమెకు శస్త్రచికిత్స చేసి ట్యూమర్లు తొలగించారు. అయితే ఏడాదిలోపే ఈ ‘ఆపరేషన్’ను అధిగమించి పతకాల ఆపరేషన్ను విజయవంతం చేసుకుంది. తన 25 ఏళ్ల జీవితంలో 18 ఏళ్లు కొలనులోనే గడిచిందని ఆమె చెప్పుకొచ్చింది. అరిన్ ఘనతలివే... తొమ్మిదేళ్ల క్రితం అంటే 16 ఏళ్ల ప్రాయంలోనే అరిన్ టిట్మస్ అంతర్జాతీయ పతకాల వేట మొదలైంది. 2016లో మాయిలో జరిగిన జూనియర్ పాన్ పసిఫిక్ చాంపియన్షిప్లో ఆమె రజతం, కాంస్యం నెగ్గింది. ఇక సీనియర్ కేటగిరీలో అయితే బంగారు పతకాల మోతే మోగించింది. 200 మీటర్లు, 400 మీటర్లు, 800 మీటర్లు, ఫ్రీస్టయిల్, 4్ఠ200 మీటర్ల రిలే ఈవెంట్లలో 2018, 2022 కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణాలు నిలబెట్టుకుంది. హాంగ్జౌ (2018), గ్వాంగ్జు (2019) ప్రపంచ చాంపియన్షిప్లలోనూ టైటిల్స్ను నిలబెట్టుకుంది. టోక్యో ఒలింపిక్స్తో విశ్వక్రీడల బరిలో దిగిన ఆమె 200 మీటర్లు, 400 మీటర్ల విభాగాల్లో బంగారు పతకాలు గెలిచిన ఆమె పారిస్లో నిలబెట్టుకుంది. -
పోరాడి ఓడిన రిత్విక్ జోడీ
సాక్షి, హైదరాబాద్: అల్మాటీ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నమెంట్లో భారత డేవిస్కప్ జట్టు సభ్యుడు, హైదరాబాద్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీకి నిరాశ ఎదురైంది. కజకిస్తాన్లో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ రిత్విక్ చౌదరీ–అర్జున్ ఖడే (భారత్) జోడీ తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. మూడో సీడ్ జాకబ్ ష్నయిటర్–మార్క్ వాల్నర్ (జర్మనీ) జంటతో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్లో రిత్విక్–అర్జున్ జోడీ 7–6 (7/2), 6–7 (11/13), 6–10తో ‘సూపర్ టైబ్రేక్’లో పోరాడి ఓడిపోయింది. ఒక గంట 55 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో రిత్విక్–అర్జున్ రెండు ఏస్లుసంధించి, మూడు డబుల్ ఫాల్ట్లు చేశారు. మ్యాచ్ మొత్తంలో రెండు జోడీలు తమ సర్వీస్లను నిలబెట్టుకోవడం విశేషం. అయితే ‘సూపర్ టైబ్రేక్’లో జర్మనీ జోడీ పైచేయి సాధించి విజయాన్ని అందుకుంది. తొలి రౌండ్లో ఓడిన రిత్విక్–అర్జున్ జంటకు 5,740 (రూ. 5 లక్షలు) డాలర్ల ప్రైజ్మనీ లభించింది. ఈ ఓటమితో రిత్విక్ సోమవారం విడుదలయ్యే ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్లో 12 స్థానాలు పడిపోయి 70 నుంచి 82వ ర్యాంక్కు చేరుతాడు. -
హైదరాబాద్ బ్లాక్హాక్స్ గెలుపుబాట
సాక్షి, హైదరాబాద్: వరుసగా మూడు పరాజయాల తర్వాత హైదరాబాద్ బ్లాక్హాక్స్ జట్టు మళ్లీ విజయం రుచి చూసింది. ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) నాలుగో సీజన్లో హైదరాబాద్ బ్లాక్హాక్స్ ఖాతాలో రెండో విజయం చేరింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ బ్లాక్హాక్స్ 15–13, 20–18, 15–17, 15–9తో గోవా గార్డియన్స్ జట్టును ఓడించింది. ఈ గెలుపుతో బ్లాక్హాక్స్ ఏడు పాయింట్లతో ఆరో స్థానానికి చేరింది. యుదీ యామమోటో, సాహిల్, విటోర్, శిఖర్ సింగ్ స్మాష్లతో చెలరేగి బ్లాక్హాక్స్కు నిలకడగా పాయింట్లు అందించారు. సమష్టిగా రాణించి బ్లాక్హాక్స్ జట్టు మళ్లీ గెలుపు బాట పట్టినందుకు ఆనందంగా ఉందని యజమాని కంకణాల అభిషేక్ రెడ్డి వ్యాఖ్యానించారు. మ్యాచ్ మొత్తంలో బ్లాక్హాక్స్ 65 పాయింట్లు నెగ్గగా... ఇందులో సొంత సర్వీస్లో 20 పాయింట్లు, స్మాష్లతో 27 పాయింట్లు వచ్చాయి. -
రోహిత్, అర్షదీప్ పోరాటం వృధా.. ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి
మలేసియాలో జరుగుతున్న సుల్తాన్ ఆఫ్ జోహర్ కప్లో (Sultan of Johor Cup 2025) భారత జూనియర్ పురుషుల హాకీ జట్టుకు (Indian Junior Men's Hockey Team) తొలి పరాజయం ఎదురైంది. నిన్న (అక్టోబర్ 15) ఆస్ట్రేలియాతో జరిగిన పూల్ మ్యాచ్లో (India vs Australia) భారత్ 2-4 తేడాతో ఓటమి పాలైంది.భారత్ తరఫున కెప్టెన్ రోహిత్ (22వ నిమిషం), అర్ష్దీప్ సింగ్ (60వ నిమిషం) గోల్స్ సాధించగా.. ఆస్ట్రేలియా తరఫున ఆస్కార్ స్ప్రౌల్ (39, 42), ఆండ్రూ ప్యాట్రిక్ (40) మరియు కెప్టెన్ డిలన్ డౌనీ (51) గోల్స్ చేశారు.ఈ మ్యాచ్ తొలి క్వార్టర్లో భారత్ అద్భుతంగా ఆడింది. ఆదిలోనే గోల్ కీపర్ ప్రిన్స్ దీప్ సింగ్ చాకచక్యంగా వ్యవహరించి గోల్ను సేవ్ చేశాడు. 17వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్ను అన్మోల్ ఎక్కా గోల్గా మలచలేకపోయాడు. 22వ నిమిషంలో కెప్టెన్ రోహిత్ మ్యాచ్ తొలి గోల్ చేసి భారత్కు ఆధిక్యం అందించాడు.25వ నిమిషంలో అమీర్ అలీ సోలో రన్తో గోల్కి ప్రయత్నించగా.. ఆస్ట్రేలియా గోల్కీపర్ అద్భతంగా అడ్డుకున్నాడు.ఆతర్వాత కొద్ది నిమిషాలకే మ్యాచ్ భారత్వైపు నుంచి ఆస్ట్రేలియావైపు మళ్లింది. 39 నుంచి 42 నిమిషాల్లోపు ఆస్ట్రేలియా వరుసగా మూడు గోల్స్ చేసి మ్యాచ్పై పట్టు సాధించింది. ఆఖరి నిమిషంలో (60) అర్షదీప్ సింగ్ అద్భుతమైన డిఫ్లెక్షన్తో గోల్ చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.రేపు జరుగబోయే మ్యాచ్లో భారత్ ఆతిథ్య మలేసియాతో తలపడనుంది. ఈ మ్యాచ్ ఫలితంపై భారత సెమీస్ బెర్త్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం భారత్ 4 మ్యాచ్ల్లో 2 విజయాలు, ఓ డ్రా, ఓ ఓటమితో 7 పాయింట్లు కలిగి ఉండి పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 4 మ్యాచ్ల్లో 3 విజయాలు, ఓ డ్రాతో 10 పాయింట్లు కలిగి ఉండి టాప్ ప్లేస్లో కొనసాగుతుంది. చదవండి: సూపర్ సెంచరీతో కదంతొక్కిన ఆర్సీబీ కెప్టెన్ -
భారత క్రీడా చరిత్రలో ఇదే తొలిసారి.. ఆ యాప్లో స్ట్రీమింగ్
భారత్లో బాక్సింగ్కు ఆదరణ పెంచే దిశగా నటుడు, వ్యాపారవేత్త రానా దగ్గుబాటి తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో భాగంగా 'ఆంథోనీ పెట్టిస్ ఫైట్ క్లబ్' వ్యవస్థాపకుడు ఆంథోనీ పెట్టిస్తో ఒప్పందం కుదుర్చుకున్న రానా ‘బాక్సింగ్బే’ కో- ప్రమోటర్గా ఉన్నాడు.తాజాగా ఆంథోని పెట్టిస్ ఫైటింగ్ చాంపియన్షిప్ (APFC) ఇండియా అరుదైన ఘనత సాధించింది. అల్టిమేట్ ఫైటింగ్ చాంపియన్షిప్నకు చెందిన అధికారిక UFC యాప్లో ప్రత్యక్ష ప్రసారం కానున్న భారత తొలి కంబాట్ స్పోర్ట్గా నిలిచింది. ఈ యాప్ 200పైగా దేశాల్లో అభిమానులను అలరిస్తోంది.APFC ఇండియా 1 డిసెంబరు 5 నుంచి.. అదే విధంగా బాక్సింగ్బే 4 డిసెంబరు 21 నుంచి ఈ యాప్లో ప్రసారం కానున్నాయి. కాగా ఈ ఈవెంట్స్కు హైదరాబాద్, బెంగళూరుతో పాటు వైజాగ్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక రానా దగ్గుబాటి ప్రమోట్ చేస్తున్న బాక్సింగ్బే.. భారత బాక్సింగ్ మండలి, ఇండియన్ ప్రొ బాక్సింగ్ లీగ్ ఎకోసిస్టమ్లో భాగం. -
తెలుగు టైటాన్స్ పరాజయం
ఢిల్లీ: హోరాహోరీ పోరులో తెలుగు టైటాన్స్ ‘టైబ్రేక్’లో పరాజయం పాలైంది. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో భాగంగా బుధవారం జరిగిన పోరులో టైటాన్స్ 5–7 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్ చేతిలో ఓడింది. మొదట నిర్ణీత సమయంలో ఇరు జట్లు 45–45 పాయింట్లతో సమంగా నిలిచాయి. టైటాన్స్ తరఫున భరత్ 16 పాయింట్లతో సత్తా చాటగా... కెప్టెన్ విజయ్ మలిక్ 6 పాయింట్లు సాధించాడు. బెంగాల్ వారియర్స్ సారథి దేవాంక్ 18 పాయింట్లతో అదరగొట్టాడు. మన్జీత్ 7 పాయింట్లతో అతడికి అండగా నిలిచాడు. దీంతో ఫలితం తేల్చేందుకు ‘టైబ్రేక్’ నిర్వహించగా... బెంగాల్ వారియర్స్ మెరిపించింది. తాజా సీజన్లో 14 మ్యాచ్లాడిన తెలుగు టైటాన్స్ 8 విజయాలు, 6 పరాజయాలతో 16 పాయింట్లు ఖాతాలో వేసుకొని మూడో స్థానంలో ఉంది. బెంగాల్ వారియర్స్ 14 మ్యాచ్ల్లో 5 గెలిచి 9 ఓడి 10 పాయింట్లతో పట్టిక 11వ స్థానంలో నిలిచింది. మరో మ్యాచ్లో పుణేరి పల్టన్ 57–33 పాయింట్ల తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్పై గెలుపొందింది. పల్టన్ తరఫున పంకజ్ 9, గౌరవ్ ఖత్రి 7 పాయంట్లు సాధించగా... వైభవ్, అస్లమ్ చెరో ఆరు పాయింట్లు సాధించారు. జైపూర్ తరఫున అలీ సమదీ 14 పాయింట్లతో పోరాడినా ఫలితం లేకపోయింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్కు అర్హత సాధించిన పల్టన్ 16 మ్యాచ్ల్లో 13 విజయాలు, 3 పరాజయాలతో 26 పాయింట్లు ఖాతాలో వేసుకొని అగ్రస్థానాన్ని పటిష్టం చేసుకుంది. ఇంకో మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ 42–35 పాయింట్ల తేడాతో తమిళ్ తలైవాస్పై గెలిచింది. గుజరాత్ జెయింట్స్ తరఫున హిమాన్షు 13 పాయింట్లు సాధించగా... అంకిత్ దహియా, మొహమ్మద్ రెజా చెరో 6 పాయింట్లు సాధించారు. తలైవాస్ తరఫున అర్జున్ దేశ్వాల్ 12 పాయింట్లతో పోరాడాడు. లీగ్లో భాగంగా గురువారం మూడు మ్యాచ్లు జరగనున్నాయి. బెంగళూరు బుల్స్తో పట్నా పైరేట్స్, తెలుగు టైటాన్స్తో యు ముంబా, యూపీ యోధాస్తో హరియాణా స్టీలర్స్ తలపడనున్నాయి. -
16 ఏళ్ల తర్వాత... ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నీకి దక్షిణాఫ్రికా అర్హత
జొహనెస్బర్గ్: ఆతిథ్య దేశం హోదాలో చివరిసారి 2010లో ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నీలో ఆడిన దక్షిణాఫ్రికా జట్టు... ఆ తర్వాత వరుసగా మూడు ప్రపంచకప్ టోర్నీలకు అర్హత పొందడంలో విఫలమైంది. 16 ఏళ్ల విరామం తర్వాత దక్షిణాఫ్రికా మళ్లీ ప్రపంచకప్ టోర్నీలో ఆడే అవకాశాన్ని సంపాదించింది. ఆఫ్రికా జోన్ క్వాలిఫయింగ్లో భాగంగా గ్రూప్ ‘సి’లో దక్షిణాఫ్రికా అగ్రస్థానాన్ని దక్కించుకొని వచ్చే ఏడాది అమెరికా, కెనడా, మెక్సికోలలో జరిగే వరల్డ్కప్ టోర్నీ బెర్త్ను ఖరారు చేసుకుంది. ఆరు జట్లను గ్రూప్ ‘సి’లో దక్షిణాఫ్రికా పది మ్యాచ్లు ఆడి 18 పాయింట్లతో టాపర్గా నిలిచింది. రువాండాతో జరిగిన చివరి మ్యాచ్లో దక్షిణాఫ్రికా 3–0 గోల్స్ తేడాతో గెలిచింది. 1998, 2002 ప్రపంచకప్ టోర్నీల్లో ఆడిన దక్షిణాఫ్రికా 2010లో ఈ మెగా ఈవెంట్కు ఆతిథ్యమిచ్చింది. అయితే మూడు పర్యాయాలు దక్షిణాఫ్రికా గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. ఆఫ్రికా జోన్ నుంచి సెనెగల్, ఐవరీకోస్ట్ జట్లు కూడా 2026 ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించాయి. గ్రూప్ ‘బి’లో సెనెగల్, గ్రూప్ ‘ఎఫ్’లో ఐవరీకోస్ట్ జట్లు అగ్రస్థానంలో నిలిచాయి. 2026 ప్రపంచకప్లో మొత్తం 48 జట్లు పాల్గొంటాయి. ఆఫ్రికాకు 9 బెర్త్లు కేటాయించగా... తొమ్మిదీ ఖరారయ్యాయి. గతంలోనే ఆఫ్రికా నుంచి అల్జీరియా, ఈజిప్ట్, ట్యూనిషియా, మొరాకో, ఘనా, కెప్ వెర్డె ప్రపంచకప్కు అర్హత పొందాయి. ఖతర్, సౌదీ అరేబియా కూడా... ప్రపంచకప్లో ఆసియా దేశాలకు కేటాయించిన 8 బెర్త్లు కూడా ఖరారయ్యాయి. ఆసియా క్వాలిఫయింగ్ నాలుగో రౌండ్ గ్రూప్ విజేతల హోదాలో ఖతర్, సౌదీ అరేబియా జట్లు ప్రపంచకప్కు అర్హత పొందాయి. నాలుగో రౌండ్ గ్రూప్ ‘ఎ’ మ్యాచ్లో ఖతర్ 2–1తో యూఏఈ జట్టును ఓడించగా... ఇరాక్తో జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్ను సౌదీ అరేబియా 0–0తో ‘డ్రా’ చేసుకొని తమ గ్రూప్లలో అగ్రస్థానంలో నిలిచాయి. ఆసియా నుంచి గతంలో జపాన్, ఇరాన్, ఆ్రస్టేలియా, ఉజ్బెకిస్తాన్, జోర్డాన్, దక్షిణ కొరియా జట్లు ప్రపంచకప్కు అర్హత సాధించాయి. యూరప్ నుంచి ఇంగ్లండ్ ఆఫ్రికా, ఆసియా కోటాలు పూర్తి కాగా... యూరప్ నుంచి 2026 ప్రపంచకప్ టోర్నీకి అర్హత పొందిన తొలి జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది. ఐదు జట్లున్న గ్రూప్ ‘కె’లో ఇంగ్లండ్ ఆడిన ఆరు మ్యాచ్ల్లోనూ గెలిచి 18 పాయింట్లతో వరల్డ్కప్ బెర్త్ను దక్కించుకుంది. 17వసారి ప్రపంచకప్లో ఆడనున్న ఇంగ్లండ్ 1966లో ఏకైకసారి ప్రపంచకప్ విజేతగా నిలిచింది. యూరప్ నుంచి మరో 15 జట్లు ప్రపంచకప్కు అర్హత సాధించాల్సి ఉంది. -
అహ్మదాబాద్లో 2030 కామన్వెల్త్ గేమ్స్
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడలకు భారతదేశం రెండోసారి ఆతిథ్యం ఇవ్వనుంది. 2030లో జరిగే క్రీడలకు గుజరాత్లోని అహ్మదాబాద్ వేదిక కావడం దాదాపుగా ఖాయమైంది. ఈ క్రీడల కోసం బిడ్ వేసిన నగరాలలో అహ్మదాబాద్కు క్రీడలు కేటాయించాలంటూ కామన్వెల్త్ స్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సిఫారసు చేసింది. బోర్డు సిఫారసు చేయడమంటే దీనికి దాదాపు అధికారికంగా ఆమోద ముద్ర పడినట్లే. ఇక లాంఛన ప్రకటనే తరువాయి. నవంబర్ 26న జరిగే బోర్డు సమావేశంలో వేదిక పేరును ప్రకటిస్తారు. అహ్మదాబాద్తో పాటు నైజీరియా నగరం అబూజా పోటీలో నిలిచినా... ఎగ్జిక్యూటివ్ బోర్డు భారత్ వైపే మొగ్గు చూపింది. ఆఫ్రికా దేశంలో క్రీడలను మరింత అభివృద్ధి చేసి 2034లో పోటీలు నిర్వహించే దిశగా తాము సహకారం అందిస్తామని కూడా బోర్డు హామీ ఇచ్చింది. 2010లో తొలిసారి న్యూఢిల్లీలో భారత్ కామన్వెల్త్ క్రీడలను నిర్వహించింది. భారత్కు ఈ క్రీడల నిర్వహించే అవకాశం రావడం గొప్ప గౌరవమని మాజీ అథ్లెట్, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉష పేర్కొంది. 2036లో ఒలింపిక్ క్రీడలు నిర్వహించాలని ఆసక్తి ప్రదర్శిస్తున్న మన దేశానికి కామన్వెల్త్ పోటీల నిర్వహణతో తమ సత్తా చాటేందుకు తగిన అవకాశం లభిస్తోందని భారత ప్రభుత్వం భావిస్తోంది. ‘భారత క్రీడలకు సంబంధింది ఇదో గొప్ప క్షణం. ప్రపంచ క్రీడల్లో మన స్థాయి పెరుగుతోందని చెప్పడానికి ఇదో సూచిక. మన దేశాన్ని ఆటలో అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ వల్లే ఇది సాధ్యమైంది’ అని కేంద్ర క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవియా స్పందించారు. 2026లో జరిగే కామన్వెల్త్ క్రీడలకు స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరం వేదికవుతోంది. అయితే సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో వీటిని నిర్వహించే ప్రయత్నంలో పలు క్రీడలను తొలగించిన కమిటీ కేవలం రూ.1300 కోట్ల బడ్జెట్ను మాత్రమే వీటికి కేటాయించింది. ఈ నేపథ్యంలో 2030లో జరిగే పోటీల కోసం కోసం భారత్ ఎంత మొత్తం కేటాయిస్తుందనేది ఆసక్తికరం. గ్లాస్గోలో తొలగించిన, భారత్కు పతకావకాశం ఉన్న అన్ని క్రీడాంశాలను ఇందులో మళ్లీ చేర్చాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. -
కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ హక్కులను దక్కించుకున్న భారత్
భారత్ మరోసారి అంతర్జాతీయ క్రీడా వేదికగా నిలవబోతోంది. 2030 కామన్వెల్త్ గేమ్స్ (Common Wealth Games) నిర్వహణ హక్కులను భారత్ దక్కించుకుంది. గుజరాత్లోని అహ్మదాబాద్ (Ahmedabad) నగరాన్ని వేదికగా ఎంపిక చేస్తూ కామన్వెల్త్ స్పోర్ట్ బాడీ నిర్ణయం తీసుకుంది. లక్షా 32 వేల సామర్థ్యం కలిగిన నరేంద్ర మోదీ స్టేడియం (Narendra Modi Stadium) లాంటి ప్రపంచ ప్రఖ్యాత క్రీడా ప్రాంగణం ఉండటంతో అహ్మదాబాద్కు ఈ గౌరవం దక్కింది. నైజీరియాలోని అబూజా నగరంతో పోటీపడి అహ్మదాబాద్ ఆతిథ్య హక్కులు దక్కించుకుంది. నవంబర్ 26న గ్లాస్గోలో జరగనున్న CWG జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్య హక్కులను దక్కించుకోవడం భారత్కు ఇది రెండో సారి. 2010లో న్యూఢిల్లీ వేదికగా భారత్లో తొలిసారి ఈ క్రీడలు జరిగాయి. 2030 గేమ్స్కు ఓ ప్రత్యేకత ఉంది. ఇవి శతాబ్ది వేడుకలుగా జరుగనున్నాయి. 1930లో తొలిసారి ఈ క్రీడలు పరిచయం చేయబడ్డాయి. నాడు కెనడాలో హామిల్టన్లో ఈ క్రీడలు జరిగాయి.భారత్కు కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ అవకాశం దక్కడంపై కామన్వెల్త్ గేమ్స్ అసోసియేషన్ ఇండియా అధ్యక్షురాలు పి.టి ఉష స్పందించారు. 2030 కామన్వెల్త్ గేమ్స్ భారత యువతకు ప్రేరణగా నిలుస్తాయని అన్నారు. ఈ క్రీడల నిర్వహణ కామన్వెల్త్ దేశాల మధ్య భాగస్వామ్యాన్ని బలపరిచే గొప్ప అవకాశంగా పేర్కొన్నారు.కాగా, గత ఎడిషన్ (72వది) కామన్వెల్త్ గేమ్స్ ఇంగ్లండ్లోని బర్మింగ్హమ్ నగరంలో జరిగాయి. తదుపరి ఎడిషన్ వచ్చే ఏడాది జరుగనుంది. ఈసారి స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరం ఈ క్రీడలకు ఆతిథ్యమివ్వనుంది. చదవండి: చరిత్ర సృష్టించిన క్రిస్టియానో రొనాల్డో -
చరిత్ర సృష్టించిన క్రిస్టియానో రొనాల్డో
ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) (పోర్చుగల్) చరిత్ర సృష్టించాడు. ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్స్లో (FIFA World Cup 2026 Qualifiers) అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా అవతరించాడు. హంగేరీతో జరిగిన మ్యాచ్లో రెండు గోల్స్ చేసిన అనంతరం ఈ ఘనత సాధించాడు. గతంలో ఈ రికార్డు గ్వాటెమాలా ఆటగాడు కార్లోస్ రుయిజ్ పేరిట ఉండేది. రూయిజ్ ఖాతాలో 39 గోల్స్ ఉండగా.. తాజా ప్రదర్శన అనంతరం రొనాల్డో గోల్స్ సంఖ్య 41కి చేరింది.వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ చరిత్రలో టాప్-5 గోల్ స్కోరర్లు..రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్)- 41కార్లోస్ రుయిజ్ (గ్వాటెమాలా)- 39లియోనెల్ మెస్ (అర్జెంటీనా )- 36అలీ దయీ (ఇరాన్)- 35లెవండోవ్స్కీ (పోలాండ్)- 33కాగా, లిస్బన్ వేదికగా పోర్చుగల్, హంగేరి మధ్య జరిగిన మ్యాచ్ 2-2తో డ్రాగా ముగిసింది. పోర్చుగల్ తరఫున నమోదైన రెండు గోల్స్ రొనాల్డోనే చేశాడు. ఈ రెండు గోల్స్తో రొనాల్డో ఓవరాల్ గోల్స్ సంఖ్య 947కు చేరింది. ప్రత్యేకించి అంతర్జాతీయ మ్యాచ్ల్లో అతని గోల్స్ సంఖ్య 143కు పెరిగింది. 40 ఏళ్ల వయసులో రొనాల్డో రేసు గుర్రంలా పరిగెడుతూ 1000 గోల్స్ దిశగా దూసుకెళ్తున్నాడు.ఇదిలా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న 2026 ఫిఫా వరల్డ్కప్ క్వాలిఫయర్స్లో పోర్చుగల్ గ్రూప్-ఎఫ్ టాపర్గా కొనసాగుతోంది. నవంబర్ 14న ఐర్లాండ్తో జరిగే మ్యాచ్లో గెలిస్తే, ప్రపంచకప్కు అర్హత సాధిస్తుంది.చదవండి: చెలరేగిన షమీ.. భారత సెలెక్టర్లకు దిమ్మతిరిగే కౌంటర్ -
అలసిపోయా.. ఇక ఆడలేను
బెంగళూరు: ఆడాలని ఉన్నా ఆరోగ్యం, శరీరం సహకరించడం లేదని, అందుకే భారమైన హృదయంతో ఆటను మానేశానని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తెలిపారు. కర్ణాటకలోని ఉడుపి జిల్లా మణిపాల్ పట్టణంలో ఆమె మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఔత్సాహిక క్రీడాకారులకు తర్పీదు ఇచ్చేందుకు కూడా తనకు ఆసక్తి లేదన్నారు. హైదరాబాద్లో బ్యాడ్మింటన్ శిక్షణ ఇచ్చేందుకు మంచి అకాడమీలు ఉన్నాయని చెప్పారు. ‘శిక్షణ ఇవ్వడం చాలా కష్టమైన పని. అది ఆడడం కన్నా కష్టం. 10–15 గంటలపాటు నిలబడి శిక్షణ ఇవ్వాలంటే మామూలు విషయం కాదు. అయితే పిల్లలకు ఆటల్లో ఆసక్తి కలిగించేలా పని చేస్తున్నా’ అని వివరించారు. పిల్లలు సోషల్ మీడియాకు స్వస్తి చెప్పి అన్ని రకాల క్రీడల వైపు మొగ్గు చూపాలన్నారు. గతంలో తాను జీవితంలో ఎంతో ఒత్తిడికి లోనయ్యానని, 25 ఏళ్లు కుటుంబం, ఆహారం, స్నేహితులు అందరికీ దూరమైనట్లు తెలిపారు. -
కేప్ వెర్డె సంచలనం.. తొలిసారి ప్రపంచకప్ టోర్నీకి అర్హత
ప్రాయ (కేప్ వెర్డె): కేవలం 5 లక్షల 25 వేల జనాభా కలిగిన ఆఫ్రికా దేశం కేప్ వెర్డె అద్భుతం చేసింది. వచ్చే ఏడాది అమెరికా, కెనడా, మెక్సికోలలో జరిగే ఫుట్బాల్ ప్రపంచకప్ టోర్నీకి కేప్ వెర్డె అర్హత సాధించింది. ఆఫ్రికా జోన్ గ్రూప్ ‘డి’లో భాగంగా ఇస్వాతిని జట్టుతో జరిగిన మ్యాచ్లో కేప్ వెర్డె 3–0 గోల్స్ తేడాతో గెలిచింది. తొలిసారి అర్హతతద్వారా గ్రూప్ ‘డి’ విజేత హోదాలో ప్రపంచకప్ టోర్నీ బెర్త్ను ఖరారు చేసుకుంది. ఐస్లాండ్ తర్వాత ప్రపంచకప్ టోర్నీకి అర్హత పొందిన అతి తక్కువ జనాభా కలిగిన దేశంగా కేప్ వెర్డె గుర్తింపు పొందింది. 2018లో ఐస్లాండ్ జట్టు (3 లక్షల 25 వేల జనాభా) ప్రపంచకప్ టోర్నీకి తొలిసారి అర్హత పొందింది. మరో మూడు బెర్త్లుఇక 2026 ప్రపంచకప్ టోర్నీలో తొలిసారి 48 దేశాలు పాల్గొంటుండగా... ఆఫ్రికా జోన్కు 9 బెర్త్లు కేటాయించారు. ఆఫ్రికా జోన్ నుంచి ఇప్పటి వరకు అల్జీరియా, కేప్ వెర్డె, ఈజిప్ట్, ఘనా, మొరాకో, ట్యూనిషియా జట్లు అర్హత సాధించాయి. మరో మూడు బెర్త్లు ఖరారు కావాల్సి ఉన్నాయి. ఇక కేప్ వెర్డె ప్రపంచకప్ టోర్నీకి తొలిసారి అర్హత సాధించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి.CAPE VERDE, POPULATION 560,000, QUALIFY FOR A FIRST-EVER WORLD CUP 🇨🇻The second-smallest nation ever to achieve that feat. Every US state has a bigger population, yet the Blue Sharks are on their way to football's big dance 🦈Soak up these scenes 💙pic.twitter.com/aR2KMRLteE— Men in Blazers (@MenInBlazers) October 13, 2025 -
పైరేట్స్పై జెయింట్స్ గెలుపు
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్–12)లో టాప్–8 స్థానాలతో ప్లే ఆఫ్స్ లక్ష్యంగా గుజరాత్ జెయింట్స్ శ్రమించింది. మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్లో గుజరాత్ 40–32 స్కోరుతో మూడు సార్లు చాంపియన్ అయిన పట్నా పైరేట్స్పై విజయం సాధించింది. ఆరో నిమిషంలో సబ్స్టిట్యూట్ అయిన రెయిడర్ హిమాన్షు సింగ్ (11) వచి్చరాగానే పాయింట్ల పనిపట్టాడు. 21 సార్లు కూతకెళ్లిన అతను 11 సార్లు పాయింట్లతో వచ్చాడు. అతనితో పాటు ఆల్రౌండర్లు మొహమ్మద్ రెజా (8), నితిని పన్వార్ (5), రెయిడింగ్ రాకేశ్ (4) రాణించడంతో గుజరాత్ క్రమం తప్పకుండా స్కోరు చేసింది. పట్నా జట్టులో రెయిడర్ మన్దీప్ కుమార్ (12) ఒంటరి పోరాటం చేశాడు. 16 సార్లు రెయిడ్కు వెళ్లిన మన్దీప్ 12 సార్లు విజయవంతంగా పాయింట్లు తెచ్చిపెట్టాడు. రెయిడర్ అయాన్ (5), డిఫెండర్లు నవ్దీప్, అంకిత్ చెరో 4 పాయింట్లు చేసి రాణించారు. రెండో మ్యాచ్లో యూపీ యోధాస్ 32–31తో తమిళ్ తలైవాస్పై గెలుపొందింది. యోధాస్ తరఫున రెయిడర్లు గుమన్ సింగ్ (8), గగన్ గౌడ (6), డిఫెండర్ హితేశ్ (7) అదరగొట్టారు. తలైవాస్ జట్టులో కెప్టెన్ అర్జున్ దేశ్వాల్ (7), డిఫెండర్లు సాగర్ రాఠి (5), రోనక్ (4) రాణించారు. నేటి నుంచి ఈ నెల 23 తేదీ వరకు రోజూ మూడు మ్యాచ్లు జరుగనున్నాయి. ఈరోజు జరిగే మ్యాచ్ల్లో తెలుగు టైటాన్స్తో బెంగాల్ వారియర్స్, జైపూర్ పింక్పాంథర్స్తో పుణేరి పల్టన్, గుజరాత్ జెయంట్స్తో తమిళ్ తలైవాస్ తలపడనున్నాయి. -
భారత్–పాకిస్తాన్ హాకీ మ్యాచ్ ‘డ్రా’
జొహోర్ (మలేసియా): సుల్తాన్ ఆఫ్ జొహోర్ కప్ అండర్–21 అంతర్జాతీయ జూనియర్ హాకీ టోర్నీలో భారత్ ఖాతాలో తొలి ‘డ్రా’ చేరింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో మంగళవారం జరిగిన మూడో లీగ్ మ్యాచ్ను భారత జట్టు 3–3 గోల్స్తో ‘డ్రా’గా ముగించింది. భారత్ తరఫున అరిజిత్ సింగ్ (43వ నిమిషంలో), ఆనంద్ (47వ నిమిషంలో), మన్మీత్ (53వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. పాకిస్తాన్ తరఫున హన్నాన్ షాహిద్ (5వ నిమిషంలో) ఒక గోల్.. సుఫియాన్ ఖాన్ (39వ, 55వ నిమిషంలో) రెండు గోల్స్ చేశాడు. ఆరు జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో భారత్ ఏడు పాయింట్లతో ఆ్రస్టేలియాతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉంది. -
హరియాణా గెలుపుబాట
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్లో హరియాణా స్టీలర్స్ తమ వరుస పరాజయాల పరంపరకు బ్రేకులేసింది. సోమవారం ఇక్కడ జరిగిన లీగ్ మ్యాచ్లో హరియాణా 39–32తో మూడుసార్లు చాంపియన్ పట్నా పైరేట్స్పై గెలుపొందింది. ఐదు పరాజయాల తర్వాత స్టీలర్స్ పట్టుదలగా ఆడి ఈ మ్యాచ్ నెగ్గింది. హరియాణా తరఫున రెయిడర్ శివమ్ (12 పాయింట్లు) కీలకపాత్ర పోషించాడు. 13 సార్లు కూతకెళ్లిన అతను 11 పాయింట్లు తెచ్చాడు. ప్రత్యర్థి రెయిడర్ను టాకిల్ చేసి మరో పాయింట్ గెలిచాడు. రెయిడర్ వినయ్ (4), ఆల్రౌండర్ సాహిల్ నర్వాల్ (3) మెరుగ్గా ఆడగా... డిఫెండర్లలో కెపె్టన్ జైదీప్ (6), రాహుల్ (4), హర్దీప్ (3) రాణించారు. పట్నా జట్టులో రెయిడర్ అయాన్ (17) ఒంటరి పోరాటం చేశాడు. 24 సార్లు కూతకెళ్లిన అయాన్ 15 పాయింట్లు తెచ్చిపెట్టాడు. టాకిల్లోనూ 2 పాయింట్లు సాధించాడు. మిగతా వారిలో డిఫెండర్ నవ్దీప్ (4) మినహా ఇంకెవరూ చెప్పుకోదగిన ప్రదర్శనే ఇవ్వలేకపోయారు. అనంతరం జరిగిన రెండో మ్యాచ్లో యూపీ యోధాస్ 40–24తో యూ ముంబాపై విజయం సాధించింది. యోధాస్ జట్టులో రెయిడర్ గుమన్ సింగ్ (12) అదరగొట్టాడు. సహచరుల్లో భవాని రాజ్పుత్ (5), మహేందర్ సింగ్ (4), హితేశ్ (4) ఆషు సింగ్ (3) రాణించారు. యూ ముంబా జట్టులో రెయిడర్లు సందీప్ (7), అజిత్ చౌహాన (5) ఆకట్టుకున్నారు. నేడు ఇదే వేదికపై జరిగే పోటీల్లో పట్నా పైరేట్స్తో గుజరాత్ జెయంట్స్, యూపీ యోధాస్తో తమిళ్ తలైవాస్ తలపడతాయి. -
తొలి టైటిల్ వేటలో...
ఒడెన్స్: ఈ ఏడాది అందని ద్రాక్షగా ఊరిస్తున్న డబుల్స్ టైటిల్ కోసం భారత బ్యాడ్మింటన్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి మరో ప్రయత్నం చేయనుంది. నేడు మొదలయ్యే డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో సాత్విక్–చిరాగ్ ద్వయం బరిలోకి దిగనుంది. ఆరో సీడ్గా పోటీపడుతున్న సాత్విక్–చిరాగ్ జోడీ తొలి రౌండ్లో క్రిస్టోఫర్ గ్రిమ్లే–మాథ్యూ గ్రిమ్లే (స్కాట్లాండ్) ద్వయంతో తలపడుతుంది. పురుషుల డబుల్స్లో భారత్ నుంచి మరో జంట పృథ్వీ కృష్ణమూర్తి రాయ్–సాయిప్రతీక్ కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇటీవల సాత్విక్–చిరాగ్ ద్వయం వరుసగా చైనా ఓపెన్, హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీల్లో ఫైనల్ చేరి రన్నరప్ ట్రోఫీలతో సరిపెట్టుకుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో, సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో, ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో, మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో సాత్విక్–చిరాగ్ సెమీఫైనల్లో ఓడిపోయారు. ఈ నేపథ్యంలో అద్భుతమైన ఫామ్లో ఉన్న సాత్విక్–చిరాగ్ జోడీ డెన్మార్క్ ఓపెన్లోనూ టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగుతుంది. పురుషుల సింగిల్స్లో భారత్ నుంచి లక్ష్య సేన్, ఆయుశ్ శెట్టి బరిలో ఉన్నారు. ప్రపంచ 28వ ర్యాంకర్ ఆయుశ్ శెట్టి తొలి రౌండ్లో టోమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్)తో... ప్రపంచ 19వ ర్యాంకర్ లక్ష్య సేన్ తొలి రౌండ్లో ఎన్హట్ నుగుయెన్ (ఐర్లాండ్)తో ఆడతారు. మహిళల సింగిల్స్లో భారత్ నుంచి కేవలం అన్మోల్ ఖరబ్ మాత్రమే పోటీపడుతోంది. గతవారం ఆర్క్టిక్ ఓపెన్లో సెమీఫైనల్ చేరిన అన్మోల్ తొలి రౌండ్లో ఏడో సీడ్ పుత్రి కుసుమ వర్దాని (ఇండోనేసియా)తో తలపడనుంది. మహిళల డబుల్స్లో రుతపర్ణ–శ్వేతాపర్ణ పాండా... సెల్వం కవిప్రియ–సిమ్రన్... మిక్స్డ్ డబుల్స్లో గద్దె రుత్విక శివాని–రోహన్ కపూర్... తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల... లక్షిత–మోహిత్ జగ్లాన్ జోడీలు పోటీపడతాయి. 3 డెన్మార్క్ ఓపెన్ టోర్నీ చరిత్రలో భారత్ నుంచి ముగ్గురు క్రీడాకారులు టైటిల్స్ సాధించారు. పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రకాశ్ పడుకోన్ (1980లో), కిడాంబి శ్రీకాంత్ (2017లో)... మహిళల సింగిల్స్ విభాగంలో సైనా నెహ్వల్ (2012లో) చాంపియన్స్గా నిలిచారు. -
వెన్నెల, జ్ఞానదత్తు శుభారంభం
గువాహటి: సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ వ్యక్తిగత విభాగంలో భారత క్రీడాకారులు శుభారంభం చేశారు. భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ క్రీడాకారులు టంకర తలశిల జ్ఞానదత్తు, కలగోట్ల వెన్నెల తొలి రౌండ్లో విజయాలు సాధించి రెండో రౌండ్లోకి దూసుకెళ్లారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో 17 ఏళ్ల జ్ఞానదత్తు 5–15, 15–7, 15–7తో మిలాన్ మెస్టెర్హాజి (హంగేరి)పై... మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో వెన్నెల 15–1, 15–6తో సియోఫ్రా ఫ్లిన్ (ఐర్లాండ్)పై గెలుపొందారు. ‘నేను తొలిసారి ప్రపంచ చాంపియన్షిప్లో పోటీపడుతున్నాను. దాంతో తొలి గేమ్లో కాస్త ఒత్తిడికి గురయ్యా. యూరోప్ ప్లేయర్తో రెండోసారి తలపడ్డా. దాంతో యూరోప్ ఆటగాళ్ల ఆటతీరును అర్ధం చేసుకోవడానికి కాస్త సమయం తీసుకున్నా. రెండో గేమ్ నుంచి నేను సహజశైలిలో ఆడి విజయాన్ని అందుకున్నా’ అని ఈ మెగా ఈవెంట్లో టీమ్ విభాగంలో తొలిసారి కాంస్యం గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న జ్ఞానదత్తు వ్యాఖ్యానించాడు. మరోవైపు మిక్స్డ్ డబుల్స్ విభాగంలో హైదరాబాద్కే చెందిన కోడె విష్ణుకేదార్–మంచాల కీర్తి ద్వయం కూడా గెలుపు బోణీ కొట్టింది. తొలి రౌండ్లో విష్ణు–కీర్తి జోడీ 15–7, 15–8తో మొస్లెనా కొరామా–ఒబపోంబా అదుమింటా (ఘనా) జంటపై గెలిచింది. -
ఘనా ఐదోసారి...
అక్రా: వచ్చే ఏడాది జరిగే పురుషుల ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్కు ఆఫ్రికా జోన్ నుంచి ఘనా జట్టు అర్హత సాధించింది. ఆఫ్రికాక్వాలిఫయింగ్లో భాగంగా గ్రూప్ ‘ఐ’ విజేత హోదాలో ఘనా జట్టుకు ప్రపంచకప్ బెర్త్ ఖరారైంది. కోమోరోస్ జట్టుతో ‘డ్రా’ చేసుకుంటే ప్రపంచకప్ బెర్త్ ఖాయమయ్యే పరిస్థితిలో ఘనా జట్టు 1–0 గోల్ తేడాతో గెలిచింది. ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్లో టోటెన్హమ్ జట్టుకు ఆడే మొహమ్మద్ కుడుస్ 47వ నిమిషంలో గోల్ చేసి ఘనా జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. 2026 ఫుట్బాల్ ప్రపంచకప్ టోర్నీకి అమెరికా, కెనడా, మెక్సికో ఉమ్మడిగా ఆతిథ్యమివ్వనున్నాయి. మొత్తం 48 జట్లు పాల్గొంటాయి. ఇప్పటికి 19 జట్లు అర్హత పొందాయి. ఇందులో ఆతిథ్య దేశాలైన అమెరికా, కెనడా, మెక్సికో జట్లకు నేరుగా అర్హత దక్కింది. ఆఫ్రికా జోన్ నుంచి 9 జట్లకు అవకాశం ఉండగా... ఇప్పటికి ఐదు జట్లు (మొరాకో, ట్యూనిషియా, ఈజిప్్ట, అల్జీరియా, ఘనా) బెర్త్లు దక్కించుకున్నాయి. ఐదోసారి ప్రపంచకప్ ఆడనున్న ఘనా జట్టు 2010లో క్వార్టర్ ఫైనల్ చేరి తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. -
జపాన్ ఓపెన్ స్క్వాష్ టోర్నీ విజేత జోష్నా చినప్ప
అంచనాలకు మించి రాణించిన భారత స్క్వాష్ స్టార్ జోష్నా చినప్ప తన కెరీర్లో 11వ అంతర్జాతీయ సింగిల్స్ టైటిల్ను సాధించింది. యోకోహామాలో సోమవారం ముగిసిన జపాన్ ఓపెన్ ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్ఏ) టూర్ చాలెంజర్ టోర్నీలో 39 ఏళ్ల జోష్నా చాంపియన్గా నిలిచింది. 38 నిమిషాలపాటు జరిగిన తుది పోరులో ప్రపంచ 117వ ర్యాంకర్ జోష్నా 11–5, 11–9, 6–11, 11–8తో ప్రపంచ 53వ ర్యాంకర్, మూడో సీడ్ హయా అలీ (ఈజిప్్ట)పై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో జోష్నా 11–7, 11–1, 11–5తో ప్రపంచ 73వ ర్యాంకర్, నాలుగో సీడ్ రాణా ఇస్మాయిల్ (ఈజిప్్ట)పై గెలుపొందింది. తాజా టైటిల్తో జోష్నా ప్రపంచ ర్యాంకింగ్స్లో మళ్లీ టాప్–100లోకి వచ్చింది. ఈ టోర్నీలో 117వ ర్యాంక్ హోదాలో బరిలోకి దిగిన జోష్నా విజేతగా నిలవడంతో ఆమె ఖాతాలో 300 ర్యాంకింగ్ పాయింట్లు చేరాయి. తాజా ర్యాంకింగ్స్లో ఆమె ఏకంగా 30 స్థానాలు ఎగబాకి 87వ ర్యాంక్లో నిలిచింది. 22 ఏళ్ల తనఅంతర్జాతీయ కెరీర్లో జోష్నా 2016లో కెరీర్ బెస్ట్ 10వ ర్యాంక్కు చేరుకుంది. ఓవరాల్గా 187 టోర్నీల్లో పోటీపడ్డ జోష్నా మొత్తం 428 మ్యాచ్లు ఆడింది. ఇందులో 253 మ్యాచ్ల్లో గెలిచి, 175 మ్యాచ్ల్లో ఓడిపోయింది. -
ప్రపంచ స్కేటింగ్ చాంపియన్షిప్కు తెలంగాణ యువకుడి ఎంపిక
నవంబర్ 7 నుంచి 15 వరకు ఖజకిస్తాన్లో జరగనున్న జూనియర్ వరల్డ్ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ చాంపియన్షిప్కు తెలంగాణ యువకుడు ప్రణవ్ మాదవ్ సురపనేని ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఐస్ స్కేటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ISAI) అధికారికంగా ప్రకటించింది. ISAI అధ్యక్షుడు అమితాబ్ శర్మ ఓ లేఖ ద్వారా ప్రణవ్ ఎంపికను ధృవీకరించారు.ఆ లేఖలో అమితాబ్ ప్రణవ్ ఇటీవలి ప్రదర్శనలను కొనియాడాడు. ప్రణవ్ వరల్డ్ చాంపియన్షిప్ అర్హతకు అవసరమైన టైమింగ్ను క్లాక్ చేసి, దేశానికి గర్వకారణంగా నిలిచాడని ప్రశంసించారు. తెలంగాణ నుంచి వరల్డ్ చాంపియన్షిప్కు అర్హత సాధించిన ఏకైక అథ్లెట్ ప్రణవ్ అని తెలిపారు.ప్రణవ్ ఎంపికను పురస్కరించుకుని, అతనికి ప్రోత్సాహం అందించాలని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీని కోరారు. వింటర్ స్పోర్ట్స్ను ప్రోత్సహిస్తూ, ప్రతిభావంతులైన అథ్లెట్లను పెంపొందించడంలో మీ సహకారం అమూల్యమైందని లేఖలో పేర్కొన్నారు. అంతర్జాతీయ వేదికపై భారత్కు ప్రాతినిథ్యం వహించనున్న ప్రణవ్కు శుభాకాంక్షలు తెలిపారు. -
మ్యాచ్ హోరాహోరీ... పుణేరిదే విక్టరీ
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్–12)లో ఇప్పటికే ప్లేఆఫ్స్కు చేరిన దబంగ్ ఢిల్లీ, పుణేరి పల్టన్ మధ్య జరిగిన హోరాహోరీ పోరులో పుణేరి పైచేయి సాధించింది. స్కోర్లు సమమైన ఈ మ్యాచ్లో పల్టన్ జట్టు ‘టైబ్రేక్’ రెయిడ్లతో గెలుపొందింది. మ్యాచ్ ఆరంభం నుంచే పోటాపోటీగా సాగింది. దీంతో నిరీ్ణత సమయం ముగిసేసరికి 38–38తో స్కోరు సమమైంది. పుణేరి రెయిడర్లలో పంకజ్ (7), ఆదిత్య షిండే (6), మోహిత్ (5) క్రమం తప్పకుండా పాయింట్లు తెచ్చిపెట్టారు. ఆల్రౌండర్, కెపె్టన్ అస్లామ్ ఇనామ్దార్ (6)తో పాటు, డిఫెండర్ గౌరవ్ ఖత్రి (4) కూడా రాణించాడు. దబంగ్ తరఫున రెయిడర్ అజింక్య పవార్ 10 పాయింట్లు సాధించాడు. మిగతా వారిలో డిఫెండర్ సౌరభ్ (6), ఆల్రౌండర్ నవీన్ (5), నీరజ్ నర్వాల్ (4) అదరగొట్టారు. మ్యాచ్ విజేతను నిర్ణయించేందుకు నిర్వహించిన టైబ్రేక్లో పుణేరి రెయిడర్లు అందరూ పాయింట్లు తెచ్చిపెట్టడంతో ఢిల్లీకి ఓటమి తప్పలేదు. ఈ విజయంతో పట్టికలో టాప్–2 స్థానాలు తారుమారు అయ్యాయి. అగ్రస్థానంలో ఉన్న దబంగ్ రెండో స్థానానికి, రెండో స్థానంలో ఉన్న పుణేరి పల్టన్ అగ్రస్థానానికి ఎగబాకింది. అనంతరం జరిగిన రెండో మ్యాచ్లో బెంగళూరు బుల్స్ 43–32తో బెంగాల్ వారియర్స్పై గెలిచింది. ఆల్రౌండర్ అలీ రెజా (18) చెలరేగాడు. రెయిడింగ్లో 16 పాయింట్లు, టాకిల్తో 2 పాయింట్లు తెచ్చిపెట్టాడు. మిగతా సహచరుల్లో రెయిడర్ ఆశిష్ మలిక్ (7), డిఫెండర్ దీపక్ శంకర్ (6)సైతం పోటీపడి పాయింట్లు తెచ్చారు. బెంగాల్ జట్టు రెయిడర్లలో కెపె్టన్ దేవాంక్ (13), హిమాన్షు నర్వాల్ (7) రాణించారు. నేడు జరిగే పోటీల్లో పట్నా పైరేట్స్తో హరియాణా స్టీలర్స్, యూ ముంబాతో యూపీ యోధాస్ తలపడతాయి. -
కోకోదే పైచేయి
అవుహాన్ (చైనా): ఆద్యంతం నిలకడగా రాణించిన అమెరికా టెన్నిస్ స్టార్, ప్రపంచ మూడో ర్యాంకర్ కోకో గాఫ్ ఈ ఏడాది తన ఖాతాలో రెండో టైటిల్ను జమ చేసుకుంది. ఈ సీజన్లో ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టైటిల్ గెలిచిన కోకో గాఫ్... ఆదివారం ముగిసిన వుహాన్ ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 టోర్నీలో చాంపియన్గా నిలిచింది. అమెరికాకే చెందిన ప్రపంచ 6వ ర్యాంకర్ జెస్సికా పెగూలాతో జరిగిన తుది పోరులో కోకో గాఫ్ 6–4, 7–5తో గెలుపొందింది. 1 గంట 42 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో కోకో నాలుగు ఏస్లు సంధించి, ఎనిమిది డబుల్ ఫాల్ట్లు చేసింది. తన సర్వీస్ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. విజేతగా నిలిచిన కోకో గాఫ్కు 5,96,000 డాలర్ల (రూ. 5 కోట్ల 28 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.2 చైనా ఆతిథ్యమిస్తున్న రెండు డబ్ల్యూటీఏ– 1000 టోర్నీల్లో (బీజింగ్ ఓపెన్, వుహాన్ ఓపెన్) విజేతగా నిలిచిన రెండో ప్లేయర్ కోకో గాఫ్. గతంలో ఫ్రాన్స్ ప్లేయర్ కరోలినా గార్సియా (2017లో) మాత్రమే ఈ ఘనత సాధించింది.9 హార్డ్ కోర్టులపై తాను ఆడిన తొమ్మిది టోర్నీల ఫైనల్స్లోనూ కోకో గాఫ్ చాంపియన్ కావడం విశేషం. -
యువ భారత్ జోరు
జొహర్ (మలేసియా): సుల్తాన్ జొహర్ కప్లో భారత జూనియర్ పురుషుల హాకీ జట్టు జోరు కొనసాగుతోంది. తొలి పోరులో బ్రిటన్ను చిత్తు చేసిన యువభారత్... రెండో మ్యాచ్లో న్యూజిలాండ్ను మట్టికరిపించింది. ఆదివారం జరిగిన పోరులో భారత్ 4–2 గోల్స్ తేడాతో న్యూజిలాండ్పై విజయం సాధించింది. భారత్ తరఫున అర్ష్ దీప్ సింగ్ (2వ నిమిషంలో), పీబీ సునీల్ (15వ నిమిషంలో), అరిజిత్సింగ్ హుండల్ (26వ నిమిషంలో), రోషన్ కుజుర్ (47వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. న్యూజిలాండ్ తరఫున గస్ నెల్సన్ (41వ నిమిషంలో), ఎయిడెన్ మ్యాక్స్ (52వ నిమిషంలో) చెరో గోల్ కొట్టారు. మ్యాచ్ ప్రారంభమైన రెండో నిమిషంలోనే ప్రత్యర్థి డిఫెన్స్ బలహీనతలను సొమ్ము చేసుకుంటూ అర్‡్షదీప్ గోల్ సాధించడంతో యువ భారత జట్టు ఖాతా తెరిచింది. న్యూజిలాండ్ కీపర్ బంతిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా... రెండోసారి అవకాశం దక్కించుకున్న అర్‡్షదీప్ విజయవంతంగా బంతిని నెట్లోకి పంపాడు. తొలి క్వార్టర్ ఆఖర్లో వచ్చిన పెనాల్టీ కార్నర్ అవకాశాన్ని సునీల్ సది్వనియోగం చేసుకోవడంతో భారత జట్టు 2–0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో క్వార్టర్లో అరైజీత్ సింగ్ హుండల్ గోల్తో భారత్ ఆధిక్యం మరింత పెరిగింది. ఎట్టకేలకు 41వ నిమిషంలో న్యూజిలాండ్ తొలి గోల్ నమోదు చేసుకుంది. ఇక చివరి క్వార్టర్లో మరో పెనాల్టీ కార్నర్ అవకాశాన్ని రోషన్ కుజుర్ గోల్గా మలచగా... ఆఖర్లో న్యూజిలాండ్ మరో గోల్ చేసినా లాభం లేకపోయింది. టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ గెలిచిన భారత జట్టు... తదుపరి మ్యాచ్లో మంగళవారం దాయాది పాకిస్తాన్తో తలపడనుంది. -
వారెవ్వా వాలెంటిన్...
షాంఘై: ఊహకందని ప్రదర్శనతో ఆద్యంతం అదరగొట్టిన మొనాకో టెన్నిస్ ప్లేయర్ వాలెంటిన్ వాచెరోట్ తన కెరీర్లోనే చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నాడు. ఆదివారం ముగిసిన షాంఘై ఓపెన్ ఏటీపీ మాస్టర్స్–1000 సిరీస్ టోర్నీలో ప్రపంచ 204వ ర్యాంకర్ వాలెంటిన్ చాంపియన్గా అవతరించాడు. క్వాలిఫయింగ్ రౌండ్లో రెండు మ్యాచ్ల్లో గెలిచి మెయిన్ ‘డ్రా’లో అడుగు పెట్టిన వాలెంటిన్... మెయిన్ ‘డ్రా’లోనూ మెరిపించాడు. ఫైనల్లో వాలెంటిన్ 4–6, 6–3, 6–3తో ఆర్థర్ రిండెర్నీచ్ (నెదర్లాండ్స్)పై గెలుపొంది తన కెరీర్లో తొలి టైటిల్ను సొంతం చేసుకున్నాడు. విజేతగా నిలిచిన వాలెంటిన్కు 11 లక్షల 24 వేల 380 డాలర్ల (రూ. 9 కోట్ల 97 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ‘కంటి నుంచి ఆనందభాష్పాలు వస్తున్నాయి. జరిగింది నమ్మశక్యంగా లేదు. ఏటీపీ సర్క్యూట్లో నాకిది నాలుగో సీజన్ మాత్రమే. నా విజయం వెనుక నా శిక్షణ సిబ్బంది పాత్ర ఎంతో ఉంది’ అని ఏటీపీ సర్క్యూట్లో టైటిల్ నెగ్గిన తొలి మొనాకో ప్లేయర్గా గుర్తింపు పొందిన వాలెంటిన్ వ్యాఖ్యానించాడు. క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో వాలెంటిన్ 7–6 (7/4), 6–3తో నిశేష్ బసవరెడ్డి (అమెరికా)పై, రెండో రౌండ్లో 4–6, 7–6 (7/5), 6–4తో లియామ్ డ్రాక్సెల్ (కెనడా)పై గెలిచి మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో వాలెంటిన్ 6–3, 6–4తో లాస్లో జెరె (సెర్బియా)పై, రెండో రౌండ్లో 3–6, 6–3, 6–4తో 14వ సీడ్ అలెగ్జాండర్ బుబ్లిక్ (కజకిస్తాన్)పై, మూడో రౌండ్లో 6–0, 3–1తో 20వ సీడ్ టామస్ మఖాచ్ (చెక్ రిపబ్లిక్–రిటైర్డ్)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో 4–6, 7–6 (7/1), 6–4తో 27వ సీడ్ టాలన్ గ్రీక్స్పూర్ (నెదర్లాండ్స్)పై, క్వార్టర్ ఫైనల్లో 2–6, 7–6 (7/4), 6–4తో 10వ సీడ్ హోల్గర్ రూనె (డెన్మార్క్)పై, సెమీఫైనల్లో 6–3, 6–4తో నాలుగో సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)పై విజయం సాధించాడు. 5 కెరీర్లో తొలి టైటిల్ ‘మాస్టర్స్ సిరీస్’ టోర్నీని సాధించిన ఐదో ప్లేయర్గా వాలెంటిన్ నిలిచాడు. గతంలో రొబెర్టో కార్రెటెరో, అల్బెర్ట్ పొరా్టస్, క్రిస్ వుడ్రఫ్, జాకుబ్ మెన్సిక్ ఈ ఘనత సాధించారు. 3 క్వాలిఫయర్ హోదాలో ఏటీపీ మాస్టర్స్ సిరీస్ టైటిల్ గెలిచిన మూడో ప్లేయర్గా వాలెంటిన్ నిలిచాడు. గతంలో రొబెర్టో కార్రెటెరో (స్పెయిన్; 1996లో హంబర్గ్ ఓపెన్), అల్బెర్ట్ పొరా్టస్ (స్పెయిన్; 2001లో హంబర్గ్ ఓపెన్) మాత్రమే ఈ ఘనత సాధించారు. 204 ఏటీపీ మాస్టర్స్ సిరీస్ (1990లో) టోర్నీలు ప్రవేశపెట్టాక మాస్టర్స్ సిరీస్ టైటిల్ గెలిచిన అతి తక్కువ ర్యాంకర్గా వాలెంటిన్ (204వ ర్యాంక్) గుర్తింపు పొందాడు. -
బెంగళూరు బుల్స్ జోరు
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్–12)లో ప్లేఆఫ్స్ రేసులో పడేందుకు బెంగళూరు బుల్స్ జోరు పెంచుతోంది. ఈ సీజన్లో ఏడో విజయాన్ని సాధించి పాయింట్ల పట్టికలో టాప్–5లో నిలిచింది. శనివారం ఇక్కడ జరిగిన మ్యాచ్లో బెంగళూరు ఆల్రౌండ్ ప్రదర్శనతో జైపూర్ పింక్పాంథర్స్పై ఘనవిజయం సాధించింది. బుల్స్ 47–26తో రెండుసార్లు చాంపియన్ అయిన జైపూర్ను చిత్తు చేసింది. బెంగళూరు ఆల్రౌండర్ అలీరెజా మిర్జాయిన్ ప్రత్యర్థి జట్టును బెంబేలెత్తించాడు. 22 సార్లు కూతకెళ్లిన అతను 12 పాయింట్లను తెచ్చిపెట్టాడు. కెప్టెన్, డిఫెండర్ యోగేశ్ (8) జైపూర్ రెయిడర్లను వణికించాడు. రెయిడర్లను 8 సార్లు విజయవంతంగా టాకిల్ చేశాడు. అతనితో పాటు డిఫెన్స్లో దీపక్ శంకర్ (5), సంజయ్ (3) రాణించారు. రెయిడర్లలో ఆశిష్ మాలిక్ (5), ఆకాశ్ షిండే (4)లు అదరగొట్టారు. పింక్పాంథర్స్ జట్టులో రెయిడర్లు అలీ సమది (9), వినయ్ (6) ఆకట్టుకున్నారు. కానీ సహచరుల నుంచి మద్దతు లేకపోవడంతో టాకిల్లో పదేపదే వెనుకబడింది. ఈ సీజన్లో జైపూర్ జట్టుకు ఇది ఏడో పరాజయం!ప్లేఆఫ్స్ చేరిన పుణేరి పల్టన్మాజీ చాంపియన్ (2023) పుణేరి పల్టన్ 12వ సీజన్లో ప్లేఆఫ్స్కు చేరింది. శనివారం జరిగిన రెండో మ్యాచ్లో పుణేరి జట్టు 36–23తో తమిళ్ తలైవాస్పై గెలుపొందింది. రెయిడర్ పంకజ్ మోహితే (9), కెప్టెన్ అస్లామ్ ఇనామ్దార్ (7), ఆల్రౌండర్ గుర్దీప్ (5), డిఫెండర్ విశాల్ భరద్వాజ్ (4) క్రమం తప్పకుండా పాయింట్లు చేసి పుణేరి పల్టన్ విజయంలో కీలకపాత్ర పోషించారు. తలైవాస్ తరఫున కెప్టెన్ అర్జున్ దేశ్వాల్ (6), అరుళ్ (4), నితీశ్ కుమార్ (3) రాణించారు. లీగ్లో 14 పోటీలాడిన పుణేరి 11 మ్యాచ్ల్లో గెలిచి కేవలం 3 మ్యాచ్ల్లోనే ఓడింది. ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరిన దబంగ్ ఢిల్లీ, పుణేరి పల్టన్ జట్లు నేడు జరిగే తొలి మ్యాచ్లో తలపడనున్నాయి. మరో పోరులో బెంగాల్ వారియర్స్తో బెంగళూరు బుల్స్ పోటీపడుతుంది. -
యువ భారత్ శుభారంభం
జొహర్ బహ్రు (మలేసియా): భారత జూనియర్ పురుషుల హాకీ జట్టు... సుల్తాన్ ఆఫ్ జొహర్ కప్లో శుభారంభం చేసింది. టోర్నీలో భాగంగా శనివారం జరిగిన పోరులో రోహిత్ సారథ్యంలోని యువ భారత జట్టు 3–2 గోల్స్ తేడాతో గ్రేట్ బ్రిటన్ను చిత్తుచేసింది. కెప్టెన్ రోహిత్ (45వ, 52వ నిమిషాల్లో) రెండు గోల్స్తో విజృంభించగా... రణ్వీత్ సింగ్ (23వ నిమిషంలో) ఓ గోల్ సాధించాడు. గ్రేట్ బ్రిటన్ తరఫున మైఖేల్ రొయ్డెన్ (26వ నిమిషంలో), కాడెన్ డ్రాసే (46వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. తొలి క్వార్టర్లో ఇరు జట్లు హోరాహోరీగా పోరాడగా... ఏ జట్టూ ఖాతా తెరవలేకపోయింది. మ్యాచ్ 13వ నిమిషంలో భారత జట్టుకు తొలి పెనాల్టీ కార్నర్ అవకాశం రాగా... దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. 16వ నిమిషంలో వచ్చిన మరో అవకాశాన్ని కూడా గోల్గా మలచలేకపోయింది. రెండో క్వార్టర్ మధ్యలో గుర్జ్యోత్ సింగ్ ప్రత్యర్థులను బోల్తా కొట్టిస్తూ బంతిని రణ్వీత్కు అందించగా... అతడు దాన్ని గోల్పోస్ట్లోకి పంపి భారత్కు మొదటి గోల్ అందించాడు. కాసేపటికే ఇంగ్లండ్ స్కోరు సమం చేయగా... మూడో క్వార్టర్లోనూ ఇరు జట్లు గోల్స్ కోసం తీవ్రంగా శ్రమించాయి. 45వ నిమిషంలో బ్రిటన్ స్ట్రయికర్లు చేసిన ప్రయత్నాల్ని భారత గోల్కీపర్ ప్రిన్స్దీప్ సింగ్ సమర్థవంతంగా అడుకున్నాడు. అదే సమయంలో రోహిత్ పెనాల్టీ కార్నర్ను గోల్గా మలచడంతో భారత్ ఆధిక్యం రెట్టింపు కాగా... తర్వాతి నిమిషంలోనే పెనాల్టీ స్ట్రోక్ను వినియోగించుకున్న గ్రేట్ బ్రిటన్ స్కోరును మరోసారి సమం చేసింది. ఇక చివరి క్వార్టర్లో వరుసగా మూడు పెనాల్టీ కార్నర్ అవకాశాలు దక్కించుకున్న భారత్... మూడోదాన్ని గోల్గా మలచి విజయంతో మ్యాచ్ను ముగించింది. టోర్నీలో భాగంగా ఆదివారం న్యూజిలాండ్తో భారత్ తలపడనుంది. -
చాంపియన్ కాస్పరోవ్
సెయింట్ లూయిస్ (అమెరికా): భారత చదరంగ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ క్లచ్ చెస్ లెజెండ్స్ మ్యాచ్లో రష్యా దిగ్గజం గ్యారీ కాస్పరోవ్ చేతిలో పరాజయం పాలయ్యాడు. ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య జరిగిన పోరులో 62 ఏళ్ల కాస్పరోవ్ 13–11 పాయింట్ల తేడాతో ఆనంద్పై గెలుపొందాడు. అధికారికంగా ఆనంద్, కాస్పరోవ్ చివరిసారి 1995లో న్యూయార్క్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ 107వ అంతస్తులో క్లాసికల్ వరల్డ్ చాంపియన్షిప్ టైటిల్ కోసం పోటీపడ్డారు. కాస్పరోవ్ 10.5–7.5తో ఆనంద్పై గెలిచి ప్రపంచ చాంపియన్షిప్ టైటిల్ దక్కించుకున్నాడు. కాస్పరోవ్ 30 ఏళ్ల తర్వాత కూడా అదే ఆటతీరు చూపెట్టాడు. ఈ పోరులో మొత్తం 12 గేమ్లు నిర్వహించాల్సి ఉండగా... చివరి రెండు బ్లిట్జ్ గేమ్లకంటే ముందే కాస్పరోవ్ గెలిచాడు. విజేత కాస్పరోవ్కు 70 వేల డాలర్లు (రూ. 62 లక్షలు), రన్నరప్ ఆనంద్కు 50 వేల డాలర్లు (రూ. 44 లక్షలు) ప్రైజ్మనీ లభించింది. ఈ పోరు నిబంధనల ప్రకారం తొలి రోజున గేమ్లో గెలిస్తే ఒక పాయింట్... ‘డ్రా’ చేసుకుంటే అర పాయింట్ కేటాయించారు. రెండో రోజు జరిగిన గేమ్లో గెలిస్తే 2 పాయింట్లు... ‘డ్రా’ చేసుకుంటే ఒక పాయింట్ ఇచ్చారు. మూడో రోజు శనివారం గేమ్ గెలిచిన వారికి 3 పాయింట్లు కేటాయించారు. ‘ఇది చాలా ముఖ్యమైనది అని చెప్పలేను... కానీ విజయం సాధిస్తానని ఊహించలేదు. చాలా మంది అభిమానులు ఈ మ్యాచ్ను ఫాలో అయ్యారు. సామాజిక మాధ్యమాల్లో ఇది చాలా ప్రధాన్యత సంతరించుకుంది. రెండో గేమ్ అనంతరం రిలాక్స్ అయ్యాను. నా అంచనాలకు మించి రాణించాను’ అని కాస్పరోవ్ అన్నాడు. -
సెమీఫైనల్లో అన్మోల్ పరాజయం
వాంటా (ఫిన్లాండ్): భారత రైజింగ్ షట్లర్ అన్మోల్ ఖరబ్... అర్క్టిక్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సెమీఫైనల్లో పరాజయం పాలైంది. చక్కటి ఆటతీరుతో సెమీస్ వరకు చేరిన అన్మోల్... ప్రపంచ నాలుగో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్) చేతిలో ఓడింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 62వ ర్యాంకర్ అన్మోల్ 10–21, 13–21తో మూడుసార్లు ప్రపంచ చాంపియన్ యామగుచి చేతిలో ఓడింది. 29 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో ఫరీదాబాద్కు చెందిన 18 ఏళ్ల టీనేజ్ షట్లర్ అన్మోల్... యామగుచి ఎదుట నిలువలేకపోయింది. వరుస గేమ్ల్లో ఓడి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. రెండు గేమ్ల్లోనూ అన్మోల్ కాస్త పోరాటం కనబర్చినా... జపాన్ స్టార్ అనుభవం ముందు అది సరిపోలేదు. తొలిసారి సూపర్–500 టోర్నమెంట్లో సెమీస్కు చేరిన అన్మోల్ అక్కడితోనే వెనుదిరిగింది. ఈ ప్రదర్శనతో అన్మోల్కు 18,050 డాలర్ల (సుమారు 16 లక్షలు) ప్రైజ్మనీ లభించింది. -
ముచ్చటగా మూడోసారి పీవీ సింధు
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు (PV Sindhu)... బ్యాడ్మింటన్ ప్రపంచ సమాఖ్య (BWF) అథ్లెట్స్ కమిషన్లో మూడోసారి చోటు దక్కించుకుంది. 2025 నుంచి 2029 నవంబర్ వరకుగానూ బీడబ్ల్యూఎఫ్ శుక్రవారం సభ్యుల పేర్లను వెల్లడించింది. సింధు 2017 నుంచి కమిషన్లో కొనసాగుతోంది. ఇక 2020 బీడబ్ల్యూఎఫ్ సమగ్రత అంబాసిడర్గానూ ఉంది. తాజాగా అన్ సె యంగ్ (కొరియా), దోహా హానీ (ఈజిప్ట్), జియా యి ఫ్యాన్ (చైనా), డెబోరా జిల్లే (నెదర్లాండ్స్)తో కలిసి సింధు అథ్లెట్స్ కమిషన్కు ఎంపికైంది. ఎలాంటి పోటీ లేకపోవడంతో వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రతి నిర్ణయ ప్రభావం వారిపైనే‘బీడబ్ల్యూఎఫ్నకు అథ్లెట్లే కీలకం. మేం తీసుకునే ప్రతి నిర్ణయ ప్రభావం వారిపైనే పడుతుంది. బీడబ్ల్యూఎఫ్ అథ్లెట్స్ కమిషన్... ప్రపంచ బ్యాడ్మింటన్ సమాజాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు దోహదపడుతుంది. కొత్త సభ్యులకు శుభాకాంక్షలు. వీరి చేరికతో కమిషన్ మరింత బలోపేతం అవుతుంది. మనందరం కలిసి బ్యాడ్మింటన్ను ప్రపంచంలోని ప్రముఖ క్రీడల్లో ఒకటిగా నిలిపేందుకు కృషి చేయాలి. భవిష్యత్తు కార్యచరణ రూపొందించడంలో వారి సహకారాన్ని ఆశిస్తున్నాము’ అని బీడబ్ల్యూఎఫ్ అధ్యక్షుడు ఖున్యింగ్ పటామా లీస్వాడ్రకుల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అథ్లెట్స్ కమిషన్ బీడబ్ల్యూఎఫ్ కౌన్సిల్కు సంప్రదింపుల సంస్థగా పనిచేస్తుంది. టోర్నమెంట్ల నియమ నిబంధనలు, అథ్లెట్ల సంక్షేమం, అంతర్జాతీయ సర్క్యూట్లో ఎదురయ్యే సవాళ్లు ఇలా పలు కీలక అంశాలపై కమిషన్ సూచనలు చేయనుంది. ప్రస్తుతం కమిషన్లో ఐదుగురు సభ్యులు ఉండగా... కో అప్షన్ మెంబర్ను ఎంపిక చేయడం ద్వారా ఆ సంఖ్యను ఆరుకు పెంపొందించుకునే అవకాశం బీడబ్ల్యూఎఫ్నకు ఉంది. కొత్తగా ఏర్పడిన కమిషన్... త్వరలో చైర్మన్ను ఎన్నిక చేసుకోనుంది. ఇదీ చదవండి: భారత జట్టులో శ్రీజ, స్నేహిత్ భువనేశ్వర్: ఆసియా టేబుల్ టెన్నిస్ (టీటీ) టీమ్ చాంపియన్షిప్ పోటీలకు రంగం సిద్ధమైంది. శనివారం నుంచి ఈ నెల 15 వరకు భువనేశ్వర్ వేదికగా జరగనున్న ఈ టోర్నమెంట్లో తెలంగాణ ప్లేయర్లు ఆకుల శ్రీజ, సురావజ్జుల స్నేహిత్ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. వీరితో పాటు స్టార్ ప్లేయర్లు మనికా బత్రా, దియా చిటాలే, స్వస్తిక ఘోష్, మానవ్ ఠక్కర్ జాతీయ జట్టు తరఫున బరిలోకి దిగనున్నారు. అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య, ఆసియా టేబుల్ టెన్నిస్ యూనియన్, భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య సంయుక్తంగా ఈ టోర్నీ నిర్వహిస్తున్నాయి. చైనా, జపాన్, కొరియా, చైనీస్ తైపీ, బంగ్లాదేశ్ సహా మొత్తం 22 దేశాలకు చెందిన 500 మందికి పైగా ప్లేయర్లు ఇందులో పాల్గొంటున్నారు. ఇప్పటికే భారత్కు చేరుకున్న పలువురు అంతర్జాతీయ స్టార్లు ప్రాక్టీస్లో నిమగ్నమయ్యారు. ఈ టోర్నమెంట్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన జట్టు 2026లో లండన్ వేదికగా జరగనున్న ప్రపంచ టేబుల్ టెన్నిస్ టీమ్ చాంపియన్షిప్నకు అర్హత సాధించనుంది. భారత జట్టు: మహిళల విభాగం: ఆకుల శ్రీజ, మనిక బత్రా, దియా చిటాలే, యశస్విని, స్వస్తిక ఘోష్. పురుషుల విభాగం: మానవ్ ఠక్కర్, మనుశ్ షా, స్నేహిత్, అంకుర్ భట్టాచార్య, పాయస్ జైన్. -
పోరాడి ఓడిన హైదరాబాద్ బ్లాక్హాక్స్
సాక్షి, హైదరాబాద్: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) నాలుగో సీజన్లో భాగంగా గచి్చ»ౌలి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ బ్లాక్హాక్స్ 10–15, 14–16, 15–17తో ఢిల్లీ తూఫాన్స్ చేతిలో పోరాడి ఓడిపోయింది. ఈ లీగ్లో ఆడిన తొలి రెండు మ్యాచ్ల్లో ఓడిన ఢిల్లీ జట్టు మూడో మ్యాచ్లో తొలి విజయాన్ని అందుకుంది. మ్యాచ్ మొత్తంలో హైదరాబాద్ 39 పాయింట్లు సాధించగా... ఇందులో సొంత సరీ్వస్లో 10 పాయింట్లు, స్పైక్ షాట్లతో 17 పాయింట్లు వచ్చాయి. అంతకుముందు తెలంగాణ రాష్ట్ర క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి, తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) చైర్మన్ శివసేనా రెడ్డి ఈ మ్యాచ్కు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. హైదరాబాద్ బ్లాక్హాక్స్ యజమాని కంకణాల అభిõÙక్ రెడ్డి వీరిద్దరికి స్వాగతం పలికి ఆటగాళ్లను పరిచయం చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని... దేశంలోని పలు నగరాల్లో జరగాల్సిన ఈ సీజన్ పీవీఎల్ పోటీలు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు మొత్తం హైదరాబాద్లోనే నిర్వహించడానికి చొరవ తీసుకున్న హైదరాబాద్ జట్టు యజమాని అభిక్ రెడ్డిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. మరో మ్యాచ్లో అహ్మదాబాద్ డిఫెండర్స్ 12–15, 15–12, 15–12, 16–14తో డిఫెండింగ్ చాంపియన్ కాలికట్ హీరోస్పై గెలిచింది. -
ఈ నెల 31న పీకేఎల్ ఫైనల్
న్యూఢిల్లీ: హోరాహోరీ పోరాటాలతో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్న ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్ ఫైనల్ ఈ నెల 31న జరగనుంది. శనివారం నుంచి ఢిల్లీ అంచె పోటీలు ప్రారంభం కానుండగా... లీగ్ దశ ముగిసిన అనంతరం ప్లే ఆఫ్స్ కూడా ఢిల్లీలోనే నిర్వహించనున్నారు. ఈ మేరకు శుక్రవారం పీకేఎల్ నిర్వాహకులు ప్లే ఆఫ్స్ షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 23తో లీగ్ దశకు తెరపడనుండగా... పాయింట్ల పట్టికలో తొలి 8 స్థానాల్లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్కు చేరుతాయి. జట్ల మధ్య మరింత పోటీ పెంచేందుకు... తాజా సీజన్ నుంచి పీకేఎల్లో పలు మార్పులు చేశారు. ఈ నెల 25 నుంచి జరగనున్న ‘ప్లే ఇన్స్’లో పట్టికలో 5వ స్థానం నుంచి 8వ స్థానం వరకు నిలిచిన జట్లు తలపడతాయి. అందులో గెలిచిన జట్టు ప్లేఆఫ్స్లో అడుగు పెడుతుంది. అక్టోబర్ 26 నుంచి 29 వరకు ప్లే ఆఫ్స్ జరుగుతాయి. తొలి రోజు ఎలిమినేటర్–1, మినీ క్వాలిఫయర్... మరుసటి రోజు ఎలిమినేటర్–2, క్వాలిఫయర్–1 నిర్వహిస్తారు. అక్టోబర్ 28న ఎలిమినేటర్–3, 29న క్వాలిఫయర్–2 నిర్వహిస్తారు. ఇందులో మెరుగైన ప్రదర్శన చేసిన జట్లు ఈ నెల 31 శుక్రవారం జరగనున్న ఫైనల్కు అర్హత సాధిస్తాయి. తాజా సీజన్లో మొత్తం 12 జట్లు పాల్గొంటుండగా... అభిమానుల్లో ఆసక్తి పెంపొందించేందుకే ఎక్కువ జట్లు ప్లే ఆఫ్స్ చేరే విధంగా టోర్నీని మార్చారు. దీంతో హోరాహోరీ పోరాటాలు పెరగడంతో పాటు... ప్రతి జట్టుకు ఫైనల్కు చేరేందుకు అవకాశం ఉంటుంది. ఢిల్లీలో ఫైనల్ నిర్వహించనుండటం ఇది నాలుగోసారి. ఇక ఈ సీజన్లో విజృంభిస్తున్న దబంగ్ ఢిల్లీ జట్టు... ఇప్పటికే టాప్–8 చోటు ఖాయం చేసుకుంది. -
ప్లే ఆఫ్స్కు దబంగ్ ఢిల్లీ
చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో అదరగొడుతున్న దబంగ్ ఢిల్లీ ‘ప్లే ఆఫ్స్’ బెర్త్ను ఖరారు చేసుకుంది. తద్వారా తాజా సీజన్లో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. సీజన్ ఆరంభం నుంచి తిరుగులేని ప్రదర్శన కనబరుస్తున్న దబంగ్ ఢిల్లీ శుక్రవారం జరిగిన పోరులో గుజరాత్ జెయింట్స్ను చిత్తు చేసింది. రెయిడర్లు రాణించడంతో దబంగ్ ఢిల్లీ 39–33 పాయింట్ల తేడాతో గుజరాత్పై గెలుపొందింది. దబంగ్ ఢిల్లీ తరఫున అక్షిత్ ధుల్ 12 పాయింట్లతో సత్తా చాటాడు. గుజరాత్ జెయింట్స్ తరఫున హిమాన్షు 11 పాయింట్లు సాధించాడు. అశు మలిక్ గైర్హాజరీలో అక్షిత్ సూపర్ రెయిడ్లతో చెలరేగడంతో ఢిల్లీ విజయం ఖాయమైంది. ఓవరాల్గా ఈ మ్యాచ్లో ఢిల్లీ 23 రెయిడ్ పాయింట్లు సాధిస్తే... జెయింట్స్ 16కే పరిమితమైంది. ట్యాక్లింగ్లో గుజరాత్ 15 పాయింట్లు ఖాతాలో వేసుకోగా... ఢిల్లీ 10 పాయింట్లు సాధించింది. తాజా సీజన్లో 14 మ్యాచ్లాడిన ఢిల్లీ 12 విజయాలు, 2 పరాజయాలతో 24 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక ‘టాప్’లో నిలిచింది. శనివారం నుంచి పీకేఎల్ పోటీలు ఢిల్లీ వేదికగా జరగనుండగా... సొంతగడ్డపై అడుగుపెట్టకముందే ఢిల్లీ జట్టు ‘ప్లే ఆఫ్స్’ బెర్తు ఖరారు చేసుకుంది. గుజరాత్ జెయింట్స్ 13 మ్యాచ్ల్లో 4 విజయాలు, 9 పరాజయాలతో 8 పాయింట్లు సాధించి పట్టిక పదో స్థానంలో కొనసాగుతోంది. మరోమ్యాచ్లో యు ముంబా 48–29 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్పై నెగ్గింది. యు ముంబా తరఫున సందీప్ కుమార్ 13, అజిత్ చవాన్ 12 పాయింట్లు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. బెంగాల్ వారియర్స్ తరఫున దేవాంక్ 14 పాయింట్లతో ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. ఈ విజయంతో యు ముంబా పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకగా... బెంగాల్ వారియర్స్ 9వ స్థానంలో ఉంది. లీగ్లో భాగంగా శనివారం బెంగళూరు బుల్స్తో జైపూర్ పింక్ పాంథర్స్, తమిళ్ తలైవాస్తో పుణేరి పల్టన్ తలపడనున్నాయి. -
దబంగ్ ఢిల్లీ జోరుకు బెంగాల్ బ్రేక్
చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో అప్రతిహత విజయాలతో దూసుకెళ్తున్న దబంగ్ ఢిల్లీకి రెండో పరాజయం ఎదురైంది. లీగ్లో భాగంగా గురువారం జరిగిన పోరులో దబంగ్ ఢిల్లీ 36–37 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్ చేతిలో ఓడింది. దబంగ్ ఢిల్లీ తరఫున నీరజ్ నర్వాల్ 6, అజింక్యా పవార్ 5 పాయింట్లు సాధించారు. బెంగాల్ వారియర్స్ కెప్టెన్ దేవాంక్ దలాల్ 12 పాయింట్లతో విజృంభించాడు. ప్రత్యర్థితో సంబంధం లేకుండా దూసుకెళ్తున్న దబంగ్ ఢిల్లీ జోరుకు బెంగాల్ వారియర్స్ బ్రేక్ వేసింది. ఓవరాల్గా ఈ మ్యాచ్లో ఢిల్లీ 23 రెయిడ్ పాయింట్లు సాధించగా... బెంగాల్ వారియర్స్ 20 రెయిడ్ పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ట్యాక్లింగ్లో మెరుగైన ప్రదర్శన చేసిన వారియర్స్ 13 పాయింట్లు సాధిస్తే... ఢిల్లీ 9 పాయింట్లకే పరిమితమైంది. తాజా సీజన్లో 13 మ్యాచ్లాడిన ఢిల్లీ 11 విజయాలు, 2 పరాజయాలతో 22 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక ‘టాప్’లో కొనసాగుతోంది. బెంగాల్ వారియర్స్ 11 మ్యాచ్ల్లో 4 విజయాలు, 7 పరాజయాలతో 8 పాయింట్లు సాధించి పదో స్థానంలో కొనసాగుతోంది. ఉత్కంఠభరితంగా సాగిన మరో మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ 41–39 పాయింట్ల తేడాతో యూపీ యోధాస్పై నెగ్గింది. -
రక్షించిన రహీమ్ అలీ
సింగపూర్: ఆసియా ఫుట్బాల్ సమాఖ్య (ఏఎఫ్సీ) ఆసియా కప్ క్వాలిఫయర్స్లో భారత ఫుట్బాల్ జట్టు ఆశలు సజీవంగా ఉంచుకుంది. మూడో రౌండ్లో భాగంగా గ్రూప్ ‘సి’లో పటిష్ట సింగపూర్తో మ్యాచ్ను భారత్ ‘డ్రా’ చేసుకుంది. గురువారం సింగపూర్తో జరిగిన పోరును భారత్ 1–1 గోల్స్తో ‘డ్రా’గా ముగించింది. భారత్ తరఫున రహీమ్ అలీ (90వ నిమిషంలో) అద్భుత గోల్ సాధించగా... సింగపూర్ తరఫున ఇఖ్సాన్ ఫండీ (45+1వ నిమిషంలో) ఓ గోల్ చేశాడు. కేవలం పది మంది ఆటగాళ్లతోనే ద్వితీయార్ధం మొత్తం పోరాడిన భారత్... ప్రత్యర్థిని నిలువరించడం విశేషం. ఖాలిద్ జమీల్ శిక్షణలోని భారత జట్టు... గొప్ప పోరాట పటిమ కనబర్చింది. మ్యాచ్ ఆరంభం నుంచి సింగపూర్ జట్టు ఆధిపత్యం సాగింది. 60 శాతానికి పైగా బంతిని నియంత్రణలో పెట్టుకున్న ఆ జట్టు... పకడ్బందీ పాసింగ్తో భారత డిఫెన్స్ను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. సొంతగడ్డపై పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడిన సింగపూర్... చిన్నచిన్న పాస్లతో బంతిని ఏమారుస్తు మన డిఫెండర్లను బోల్తా కొట్టించింది. తొలి అర్ధభాగం ముగియడానికి క్షణాల ముందు ఇఖ్సాన్ ఫండీ భారత డిఫెన్స్ లోపాలను వాడుకుంటూ చక్కటి గోల్ చేయడంతో ఆతిథ్య జట్టు ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అప్పటికే భారత డిఫెండర్ సందేశ్ జింఘాన్కు రెఫరీ రెండుసార్లు యెల్లో కార్డు చూపడంతో... 47వ నిమిషంలో అతడు మైదానం వీడాల్సి వచ్చింది. అప్పటికే ప్రత్యర్థికి ఆధిక్యం అప్పగించుకున్న టీమిండియా... ఇక ఆ తర్వాత చివరి వరకు 10 మంది ప్లేయర్లతోనే ఆడింది. మ్యాచ్ మొత్తం 90 నిమిషాల్లో భారత జట్టుకు ఒక్కటంటే ఒక్క అవకాశం కూడా రాలేదు. ఇక సింగపూర్ విజయం ఖాయమైపోయిన దశలో సబ్స్టిట్యూట్గా బరిలోకి దిగిన రహీమ్ అలీ అద్భుతం చేశాడు. అఖర్లో అవకాశం దక్కించుకున్న రహీమ్ చక్కటి గోల్తో భారత జట్టును పోటీలోకి తెచ్చాడు. దీంతో స్కోరు 1–1తో సమం కాగా... ఆ తర్వాత మిగిలిన సమయంలో ఇరు జట్లు ఎంత ప్రయత్నించినా మరో గోల్ సాధించలేకపోవడంతో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. గ్రూప్ ‘సి’లో ఇప్పటి వరకు మూడు మ్యాచ్లాడిన భారత్... హాంకాంగ్ చేతిలో ఓడి... బంగ్లాదేశ్, సింగపూర్లతో మ్యాచ్లను ‘డ్రా’ చేసుకొంది. 2 పాయింట్లతో పట్టిక మూడో స్థానంలో ఉంది. సింగపూర్ 5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఒక్కో గ్రూప్లో టాప్లో నిలిచిన జట్టు మాత్రమే 2027 ఆసియాకప్నకు అర్హత సాధించనుంది. గ్రూప్ దశలో ఒక్కో జట్టు మిగిలిన మూడు జట్లతో ఇంటా బయట మ్యాచ్లు ఆడనుంది. ఇరు జట్ల మధ్య 14న గోవా వేదికగా రెండో మ్యాచ్ జరగనుంది. -
చెన్నై చెంతకు రిత్విక్
ముంబై: తెలంగాణ ఆటగాడు రిత్విక్ బొల్లిపల్లి చెన్నై స్మాషర్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు. వేలంలో చెన్నై ఫ్రాంచైజీ అతని కోసం పోటీపడిమరీ దక్కించుకుంది. టెన్నిస్ ప్రీమియర్ లీగ్ (టీపీఎల్) ఏడో సీజన్ కోసం గురువారం ఆటగాళ్ల వేలాన్ని నిర్వహించారు. భారత టెన్నిస్ దిగ్గజాలు లియాండర్ పేస్, మహేశ్ భూపతి, సానియా మీర్జాలు వేలంలో సందడి చేశారు. గురువారం అత్యధిక మొత్తం లభించిన ఇద్దరు ఆటగాళ్లలో తెలంగాణ టెన్నిస్ ప్లేయర్ రిత్విక్, శ్రీరామ్ బాలాజీ ఉన్నారు. రూ. 12 లక్షలతో రిత్విక్ను స్మాషర్స్ కొనుగోలు చేయగా, అంతే మొత్తంతో శ్రీరామ్ బాలాజీని గుర్గావ్ గ్రాండ్ స్లామర్స్ చేజిక్కించుకుంది. తెలంగాణ మహిళా ప్లేయర్ భమిడిపాటి శ్రీవల్లిని రోహన్ బోపన్న నేతృత్వంలోని ఎస్జీ పైపర్స్ బెంగళూరు దక్కించుకుంది. ఇటీవల జరిగిన బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 పోరులో శ్రీవల్లి ఆకట్టుకోవడంతో బెంగళూరు ఆమె కోసం రూ.8.60 లక్షలు వెచి్చంచింది. రామ్కుమార్ రామనాథన్ కంటే కూడా శ్రీవల్లికే ఎక్కువ మొత్తం లభించింది. బెంగళూరు రామ్కుమార్ను రూ. 7.20 లక్షలకు కొనుగోలు చేసింది. ఎస్జీ పైపర్స్ జట్టు సీఈఓ అయిన మహేశ్ భూపతి మాట్లాడుతూ తమ బెంగళూరు జట్టు అనుభవజ్ఞులు యువ ఆటగాళ్ల మేలవింపుతో పటిష్టంగా ఉందని అన్నాడు. ‘ఈ సీజన్లో జట్టు కూర్పు పట్ల సంతోషంగా ఉన్నాం. రోహన్ బోపన్న, శ్రీవల్లి, రామ్కుమార్ లాంటి మేటి ఆటగాళ్లు మా జట్టులో ఉన్నారు. ఈ సీజన్లో వీరంతా తప్పకుండా రాణిస్తారు’ అని భూపతి ఆశాభావం వ్యక్తం చేశాడు. డిఫెండింగ్ చాంపియన్ హైదరాబాద్ స్ట్రయికర్స్ తెలుగు ఆటగాడు విష్ణువర్ధన్ను తిరిగి జట్టులోకి తీసుకుంది. అతన్ని రూ. 6 లక్షలకు దక్కించుకోగా... ఫ్రాన్స్ స్టార్ కారోల్ మోనెట్ను రూ. 10.60 లక్షలకు కొనుగోలు చేసింది. జీఎస్ ఢిల్లీ ఏసెస్ ఫ్రాంచైజీ బెల్జియంకు చెందిన సోఫియా కొస్టాలస్ను రూ. 11 లక్షలకు, డబుల్స్ స్పెషలిస్టు జీవన్ నెదున్జెళియాన్ను రూ. 6 లక్షలకు కొనుక్కుంది. యశ్ ముంబై ఈగల్స్ జట్టు మరియం బొల్కవద్జె (జార్జియా), నిక్కీ పూనచలను చెరో రూ. 6 లక్షలతో దక్కించుకుంది. టీపీఎల్ ఏడో సీజన్ పోరు డిసెంబర్ 9న మొదలై 14న జరిగే ఫైనల్తో ముగియనుంది. -
ఆనంద్ వెనుకంజ
సెయింట్ లూయిస్ (అమెరికా): జగద్విఖ్యాత చెస్ దిగ్గజాలు విశ్వనాథన్ ఆనంద్, గ్యారీ కాస్పరోవ్ల మధ్య జరుగుతున్న క్లచ్ చెస్ టోర్నీలో భారత గ్రాండ్మాస్టర్కు తొలిరోజు కలిసిరాలేదు. దీంతో రష్యన్ గ్రాండ్మాస్టర్ కాస్పరోవ్ పైచేయి సాధించాడు. గురువారం జరిగిన నాలుగు గేమ్ల ఫలితాల అనంతరం కాస్పరోవ్ 2.5–1.5తో ఆనంద్పై ఆధిక్యంలో ఉన్నాడు. తద్వారా రిటైర్ అయిన 21 ఏళ్ల తర్వాత బరిలోకి దిగిన 62 ఏళ్ల రష్యన్ దిగ్గజం తనలో గెలిచేసత్తా ఏమాత్రం తగ్గలేదని తన ‘ఎత్తులు–పైఎత్తుల’తో చాటాడు. ముందుగా జరిగిన రెండు గేమ్లు కూడా డ్రాగానే ముగిశాయి. దీంతో ఇద్దరు 1–1తో సమవుజ్జీలుగా నిలిచారు. మూడో గేమ్లో కాస్పరోవ్ విజయం సాధించడంతో 2–1తో పైచేయి సాధించాడు. తర్వాత జరిగిన నాలుగో రౌండ్ గేమ్ డ్రాగా ముగియడంతో ఇద్దరికి చెరో అర పాయింట్ లభించింది. ఈ టోర్నీలో రెండో రోజు కూడా నాలుగు గేమ్లు జరుగుతాయి. రెండు ర్యాపిడ్, రెండు బ్లిట్జ్ గేమ్లు కాగా... రెండో రోజు విజయం సాధిస్తే 2 పాయింట్లు, మూడో రోజు విజయానికి 3 పాయింట్లు లభిస్తాయి. ఈ నేపథ్యంలో శుక్ర, శనివారాల్లో జరిగే పోటీలు మరింత ఆసక్తికరంగా జరగనున్నాయి. -
సెమీస్తో పతకాన్ని ఖాయం చేసుకున్న భారత్
ప్రపంచ జూనియర్ మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత జట్టు పతకంతో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. సొంతగడ్డపై జరుగుతున్న ఈ ఈవెంట్లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత జట్టు 44–45, 45–30, 45–33తో దక్షిణ కొరియాపై విజయం సాధించింది. సెమీస్ చేరడం ద్వారా కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. బాలుర డబుల్స్లో భార్గవ్ రామ్–విశ్వతేజ్ జంట 5–9తో చొ హ్యోంగ్ వూ–లీ హ్యోంగ్ వూ జోడీ చేతిలో ఓడింది. బాలికల డబుల్స్లో వెన్నెల–రిషిక జోడీ 10–9తో చివోన్ హ్యూ– మున్ ఇన్ సియో జంటపై గెలిచింది. తర్వాత బాలుర సింగిల్స్లో రౌనక్ చౌహాన్ 11–9తో చొయ్ అహ్ సియంగ్ను ఓడించాడు. కానీ మిక్స్డ్ డబుల్స్లో లాల్రామ్సంగ–అన్య బిష్త్ జోడీ 4–9తో లీ–చివోన్ జంట చేతిలో ఓడింది. కీలకమైన మహిళల సింగిల్స్ రెండు మ్యాచ్ల్లోనూ ఉన్నతి హుడా గెలుపొందడంతో భారత్ విజయం సాధించింది. -
దుబాయ్లో సెటిల్ అవుతున్న స్పోర్ట్స్ స్టార్స్!.. కారణం ఇదే
ఇటీవలి కాలంలో దుబాయ్ (Dubai)లో నివాసం ఏర్పరచుకుంటున్న క్రీడాకారుల సంఖ్య పెరిగిపోతోంది. వేల కోట్లకు అధిపతి అయిన పోర్చుగీస్ ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) నుంచి బాక్సర్ ఆమిర్ ఖాన్ దాకా చాలా మంది దుబాయ్లోనే సెటిల్ అయ్యేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.బిలియనీర్స్ ఐలాండ్లో..పోర్చుగల్కు చెందిన రొనాల్డో అల్ నసర్ (Al Nassr) జట్టుతో భారీ మొత్తానికి డీల్ కుదుర్చుకున్నాడు. దీంతో ఎక్కువ సమయం దుబాయ్లోనే గడుపుతున్న ఈ ఫుట్బాల్ కింగ్ గతేడాది జూన్లో ఓ భారీ ప్రాపర్టీ కొనుగోలు చేశాడు. బిలియనీర్స్ ఐలాండ్లోని జుమేరా బేలో భూమి కొనుక్కున్నాడు.వందల కోట్ల విలువైన పెంట్హౌజ్ఇక బ్రెజిల్ ఫుట్బాల్ లెజెండ్ నెయ్మార్ కూడా దుబాయ్లో భారీ పెట్టుబడి పెట్టాడు. బుగాటి రెసిడెన్స్లో అత్యాధునిక పెంట్హౌజ్ను రూ. 450 కోట్లకు పైగా వెచ్చించి సొంతం చేసుకున్నాడు. మరోవైపు.. బ్రిటిష్-పాకిస్తానీ బాక్సర్ ఆమిర్ ఖాన్ లండన్లో తనపై దాడి తర్వాత దుబాయ్కు మకాం మార్చాడు.ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ మొయిన్ అలీ కూడా కుటుంబంతో కలిసి దుబాయ్లో నివసిస్తున్నాడు. ‘‘ఈ భూమ్మీద ఉన్న అత్యంత సురక్షితమైన ప్రదేశం’’ అంటూ మొయిన్ అలీ పలు సందర్భాల్లో దుబాయ్పై ప్రశంసలు కురిపించాడు. వీరే కాదు.. టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ కూడా దుబాయ్ మరీనాలో ఇల్లు కొన్నాడు. భారత టెన్నిస్ లెజెండ్ సానియా మీర్జా కూడా దుబాయ్లోనే సెటిల్ అవడమే కాకుండా.. అక్కడే అకాడమీ కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.దుబాయ్కే ఎందుకు?దుబాయ్ విలాసాలకు పెట్టింది పేరు. అత్యాధునిక సౌకర్యాలు గల ఇళ్లు, అగ్ర శ్రేణి విద్యా సంస్థలు, అత్యాధునిక వైద్యం, వేగవంతమైన, సాఫీ ప్రయాణాలకు వీలైన మార్గాలు, గోల్డెన్ వీసా రూల్స్, రక్షణ విషయంలో ప్రభుత్వం తీసుకునే జాగ్రత్తలు వంటివి స్పోర్ట్స్ స్టార్స్ అనే కాదు.. ఇతర సెలబ్రిటీలు కూడా ఇక్కడ సెటిల్ అయ్యేందుకు ప్రధాన కారణాలు.అన్నింటికంటే.. ఇక్కడ పన్నులు తక్కువగా ఉండటం సెలబ్రిటీలను ఆకర్షించే మరో అంశం. ముఖ్యంగా ఫుట్బాలర్ లేదంటే అథ్లెట్ తమ సొంత దేశాల్లో 40- 50 శాతం టాక్స్ చెల్లిస్తుండగా.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో మాత్రం ఇది నామ మాత్రం లేదంటే కొన్నిసార్లు సున్నాగా ఉంటుందని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టు పేర్కొంది. చదవండి: ‘మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’;.. ధోని ఆరోజు చెప్పిన మాటతో ఇలా..: సిరాజ్ -
‘మిశ్రమ ఫలితాలు వచ్చాయి’
న్యూఢిల్లీ: ఈ ఏడాది స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో కాస్త వెనుకబడ్డ భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా... వచ్చే ఏడాది మెరుగైన ప్రదర్శన చేస్తానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. 2020 టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం, 2024 పారిస్ ఒలింపిక్స్లో రజతం నెగ్గిన నీరజ్... ఈ ఏడాది ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో పతకం సాధించడంలో విఫలమయ్యాడు. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన నీరజ్... రిక్తహస్తాలతో వెనుదిరిగాడు. ఈ ఏడాదే 90 మీటర్ల మార్క్ అందుకున్న నీరజ్ చోప్రాకు ఈ సీజన్ మిశ్రమ ఫలితాలనిచ్చిoది. ప్రస్తుతం జ్యూరిక్లో శిక్షణ పొందుతున్న 27 ఏళ్ల నీరజ్ చోప్రా... ఈ ఏడాది తన ప్రదర్శన... రానున్న టోర్నీలకు సన్నద్ధతపై ప్రత్యేకంగా మాట్లాడాడు. యూరప్లో శిక్షణ, స్విట్జర్లాండ్తో ఉన్న అనుబంధం... ఆ దేశ పర్యాటక శాఖ తనను ‘ఫ్రెండ్షిప్ అంబాసిడర్’గా నియమించడం వంటి వాటిపై నీరజ్ అభిప్రాయాలు అతడి మాటల్లోనే... » ఈ సీజన్లో చాలా సవాళ్లు ఎదురయ్యాయి. వాటి నుంచి ఎంతో నేర్చుకున్నా. ప్రతీ టోర్నమెంట్ నా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది. ఆ అనుభవం భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. » ప్రతి అంశంలో మెరుగయ్యేందుకు ఎప్పుడూ అవకాశం ఉంటుంది. ఎప్పటకప్పుడు ప్రేరణ పొందుతూ ముందుకు సాగడమే మన పని. » తదుపరి సీజన్లో మరింత మెరుగైన ప్రదర్శన చేసి బలంగా తిరిగి వచ్చేందుకు సిద్ధమవుతున్నా. ప్రపంచ చాంపియన్షిప్ సమయంలో వెన్నునొప్పితో ఇబ్బందిపడ్డా. ఇప్పుడు శరీరం ఫిట్గా ఉంది. రానున్న టోర్నీల్లో దాని ఫలితం తెలుస్తుంది. » తిరిగి లయ అందుకునేందుకు లుసానే అనువైన ప్రదేశం. ఇక్కడి ప్రకృతి అంటే ఇష్టం. పర్వతాలు, లోయలు మనసుకు ఎంతో అహ్లాదాన్నిస్తాయి. అవి శిక్షణ సమయంలో ఉల్లాసంగా ఉండేందుకు ఉపయోగపడతాయి. » మండు వేసవిలో సైతం ఇక్కడి పచ్చని వాతావరణం... శీతాకాల భావన కల్పిస్తుంది. ఇక్కడ నాకు ఎన్నో అనుభవాలు ఉన్నాయి. 2022లో జ్యూరిక్లో గెలిచిన డైమండ్ లీగ్ ట్రోఫీ నాకెంతో ప్రత్యేకం. ఆ తర్వాత 2023 ప్రపంచ చాంపియన్షిప్ కోసం కూడా ఇక్కడే సాధన చేశా... అప్పుడు పసిడి గెలుచుకున్నా. » డైమండ్ లీగ్ ట్రోఫీ గెలిచిన తర్వాత నా కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడి ప్రదేశాలు సందర్శించా. ఆ అనుభవం ఎన్నో మధురానుభూతులను అందించింది. » జీవితంలో ప్రతీది అనుకున్నట్లు సాగదని ‘కోవిడ్–19’ మహమ్మారితో తెలిసొచ్చి ంది. అప్పటి నుంచి ఆలోచన దృక్పథంలో మార్పు వచ్చింది. పరిస్థితులకు తగ్గట్లు మనల్ని మనం మార్చుకోక తప్పదు. » స్విట్జర్లాండ్లో సమయ పాలన తప్పనిసరి. మనకు నచ్చి న సమయంలో నచ్చి న చోటకు వెళ్లాలంటే కష్టం. ప్రజారవాణా వ్యవ్యస్థ చాలా పకడ్బందీగా ఉంటుంది. అందుకే వీలు ఉన్నప్పుడు పర్యటించేందుకు అనుగుణంగా రైలు పాస్ల విషయంలో సహాయం చేయమని స్విట్జర్లాండ్ పర్యాటక శాఖను అడుగుతుంటా. » స్విట్జర్లాండ్తో ఉన్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైంది. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఉంటున్నా. నాకు ఇక్కడ చాలా మంది తెలుసు. నా ప్రపంచ అథ్లెటిక్స్ ఏజెంట్లు కూడా స్విస్కు చెందిన వారే. యూరప్లో ఉంటే ఎక్కువగా స్విట్జర్లాండ్లోనే ఉంటాను. దీన్ని రెండో ఇల్లు అని పిలవలేను కానీ... తరచుగా వెళ్లేందుకు ఇష్టపడే ప్రదేశం అని మాత్రం చెప్పగలను. -
తెలుగు టైటాన్స్ జోరు
చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్–12) సాగే కొద్దీ తెలుగు టైటాన్స్ జోరు పెరుగుతోంది. ఈ లీగ్లో టైటాన్స్ జట్టు వరుసగా ఐదో విజయాన్ని సాధించింది. బుధవారం జరిగిన పోరులో తెలుగు టైటాన్స్ 46–29తో డిఫెండింగ్ చాంపియన్ హరియాణా స్టీలర్స్పై గెలుపొందింది. టైటాన్స్ జట్టులో ఆల్రౌండర్ భరత్ హుడా (20 పాయింట్లు) అదరగొట్టాడు. పీకేఎల్లో వందో మ్యాచ్ ఆడుతున్న భరత్ 18 సార్లు కూతకెళ్లి 16 పాయింట్లు తెచ్చిపెట్టాడు. ప్రత్యర్థి ఆటగాళ్లు రెయిడింగ్కు వస్తే నలుగుర్ని టాకిల్ చేశాడు. మరో ఆల్రౌండర్, కెపె్టన్ విజయ్ మలిక్ (8) కూడా టైటాన్స్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంకిత్ 3, చేతన్ సాహు, అవి దుహన్, అజిత్ పవార్, శుభమ్ షిండే తలా 2 పాయింట్లు చేశారు. హరియాణా ఆటగాళ్లు ప్రత్యర్థి జట్టుకు దీటుగా పాయింట్లు సాధించడంలో విఫలమయ్యారు. రెయిడర్ మయాంక్ సైని 5, కెపె్టన్ జైదీప్, వినయ్ చెరో 4 పాయింట్లు చేశారు. అనంతరం జరిగిన రెండో మ్యాచ్లో పుణేరి పల్టన్ 37–27తో యూ ముంబాపై జయభేరి మోగించింది. పుణేరి రెయిడర్ ఆదిత్య షిండే (14) రాణించాడు. మిగతా వారిలో కెపె్టన్ అస్లామ్ (5), పంకజ్ మోహితే (4) మెరుగ్గా ఆడారు. యూ ముంబా తరఫున రెయిడర్లు అజిత్ చౌహాన్ (10), సందీప్ (7) చక్కగా పోరాడారు. గురువారం జరిగే పోటీల్లో బెంగాల్ వారియర్స్తో దబంగ్ ఢిల్లీ, గుజరాత్ జెయంట్స్తో యూపీ యోధాస్ తలపడతాయి. -
కీలకపోరుకు భారత్ రెడీ
సింగపూర్: ఆసియా ఫుట్బాల్ సమాఖ్య (ఏఎఫ్సీ) ఆసియా కప్ క్వాలిఫయర్స్లో భారత ఫుట్బాల్ జట్టు క్లిష్టమైన సమరానికి సిద్ధమైంది. మూడో రౌండ్లో భాగంగా నేడు గ్రూప్ ‘సి’లోనే పటిష్టమైన సింగపూర్తో భారత్ తలపడుతుంది. ఈ క్వాలిఫయర్స్ కోసం ఏర్పాటు చేసిన జాతీయ శిక్షణ శిబిరానికి తొలిదశలో చాలా మంది ఆటగాళ్లు ‘క్లబ్’ జట్లు విడుదల చేయకపోవడంతో గైర్హాజరయ్యారు. తర్వాత అందరూ కలిసిరావడం జట్టుకు కాస్తా ఊరటనిచ్చింది. ‘సీఏఎఫ్ఏ నేషన్స్ కప్’కు దూరమైన భారత స్టార్ స్ట్రయికర్, మాజీ కెపె్టన్ సునీల్ ఛెత్రి తిరిగి జట్టులోకి రావడం జట్టు బలాన్ని కూడా పెంచింది. ఖాలిద్ జమీల్ కోచింగ్లోని భారత జట్టుకు ఈ మ్యాచ్ అత్యంత కీలకమైంది. నాలుగు జట్లు పోటీలో ఉన్న గ్రూప్ ‘సి’లో ప్రస్తుతం భారత్ అట్టడుగున నిలిచింది. గత నెలలో జరిగిన పోటీల్లో తమకన్నా తక్కువ స్థాయి బంగ్లాదేశ్తో 0–0తో డ్రా చేసుకున్న భారత్... తదుపరి హాంకాంగ్తో మ్యాచ్లో 0–1తో ఓటమి పాలైంది. దీంతో ఒకే ఒక్క పాయింట్తో భారత్ నాలుగో స్థానంలో ఉంది. మరోవైపు సింగపూర్ 4 పాయింట్లతో గ్రూప్ టాపర్గా నిలిచింది. సొంతగడ్డపై సింగపూర్దే పైచేయి ‘ఫిఫా’ ర్యాంకింగ్స్లో 134వ ర్యాంకుతో భారత్... 158 ర్యాంకర్ సింగపూర్ కంటే మెరుగైన స్థితిలో ఉన్నప్పటికీ ఫామ్లో, ఫలితాల్లో చిన్నజట్ల కంటే వెనుకబడే ఉంది. ముఖాముఖి పోరులోనూ భారత్ 12–11తో సింగపూర్పై పైచేయిగా కనబడుతోంది. అయితే సొంతగడ్డపై సింగపూర్ జోరు కొనసాగిస్తోంది. ఇక్కడ 15 మ్యాచ్లాడితే సింగపూర్ జట్టు 8 గెలిచింది. భారత్ ఆరు విజయాలతోనే సరిపెట్టుకుంది. ఒక మ్యాచ్ మాత్రం ‘డ్రా’గా ముగిసింది. ఇలాంటి పరిస్థితుల్లో... సొంతగడ్డపై బెబ్బులిలా గర్జిస్తోన్న సింగపూర్లాంటి గ్రూప్ టాపర్తో భారత్ గెలవాలంటే మాత్రం సర్వశక్తులు ఒడ్డాల్సిందే! -
అజేయంగా క్వార్టర్ ఫైనల్కు భారత్ అర్హత
సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచ జూనియర్ మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత జట్టు ‘హ్యాట్రిక్’ విజయంతో గ్రూప్ దశను ముగించింది. గువాహటిలో బుధవారం జరిగిన గ్రూప్ ‘హెచ్’ చివరి మ్యాచ్లో భారత్ 2–0 (45–37, 45–34)తో యూఏఈ జట్టును ఓడించింది. ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ నెగ్గిన భారత్ గ్రూప్ ‘హెచ్’లో అగ్రస్థానం సంపాదించి క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించింది. మొత్తం ఎనిమిది గ్రూపుల్లో ‘టాప్’ ర్యాంక్లో నిలిచిన ఎనిమిది జట్లు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశిస్తాయి. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో దక్షిణ కొరియాతో భారత్ ఆడుతుంది. భారత్, దక్షిణ కొరియా జట్లతోపాటు చైనా, జపాన్, అమెరికా, ఇండోనేసియా, మలేసియా, చైనీస్ తైపీ జట్లు కూడా క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాయి. -
దబంగ్ ఢిల్లీ జైత్రయాత్ర
చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో దబంగ్ ఢిల్లీ విజయాల పరంపర కొనసాగుతోంది. ప్రత్యర్థితో సంబంధం లేకుండా చెలరేగిపోతున్న అశు మలిక్ సారథ్యంలోని దబంగ్ ఢిల్లీ లీగ్లో 11వ విజయం అందుకుంది. మంగళవారం జరిగిన పోరులో దబంగ్ ఢిల్లీ ‘టైబ్రేక్’లో 9–3తో హరియాణా స్టీలర్స్ను ఓడించింది. నిర్ణీత సమయంలో రెండు జట్ల స్కోర్లు 33–33తో సమం కాగా... విజేతను నిర్ణయించేందుకు ‘5 రెయిడ్స్’ నిర్వహించారు. ఇందులో ఢిల్లీ 9 పాయింట్లతో సత్తాచాటగా... స్టీలర్స్ 3 పాయింట్లకే పరిమితమైంది. స్టీలర్స్కు ఇది వరుసగా నాలుగో పరాజయం. నిర్ణీత సమయంలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ తరఫున అజింక్య పవార్ 8 పాయింట్లు సాధించగా... నీరజ్, సౌరభ్ చెరో 6 పాయింట్లతో రాణించారు. స్టీలర్స్ తరఫున శివమ్ పతారే 10 పాయింట్లతో పోరాడినా ఫలితం లేకపోయింది. తాజా సీజన్లో 12 మ్యాచ్లాడిన ఢిల్లీ 11 విజయాలు, 1 పరాజయంతో 22 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక ‘టాప్’ ప్లేస్లో కొనసాగుతోంది. స్టీలర్స్ 12 మ్యాచ్ల్లో 6 విజయాలు, 6 పరాజయాలతో 12 పాయింట్లు సాధించి పట్టిక ఆరో స్థానంలో ఉంది. మరో మ్యాచ్లో తమిళ్ తలైవాస్ 56–37 పాయింట్ల తేడాతో పట్నా పైరెట్స్పై విజయం సాధించింది. తలైవాస్ తరఫున అర్జున్ దేశ్వాల్ 26 పాయింట్లతో విజృంభించగా... పట్నా పైరెట్స్ తరఫున అయాన్ 16, అంకిత్ 14 పాయింట్లు సాధించారు. వీరిద్దరు మినహా తక్కినవాళ్లు ఆకట్టుకోలేకపోవడంతో పైరెట్స్ ఓటమి తప్పలేదు. లీగ్లో భాగంగా బుధవారం హరియాణా స్టీలర్స్తో తెలుగు టైటాన్స్, యు ముంబాతో పుణేరి పల్టన్ తలపడనున్నాయి. -
అమన్పై ఏడాది నిషేధం
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్, పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అమన్ సెహ్రావత్పై ఏడాది నిషేధం పడింది. నిర్ణీత బరువు కంటే అధికంగా ఉన్న కారణంగా ఇటీవల ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్నకు దూరమైన అమన్పై భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) చర్యలు తీసుకుంది. గత నెలలో క్రొయేషియా వేదికగా జరిగిన వరల్డ్ చాంపియన్షిప్ 57 కేజీల విభాగంలో బరిలోకి దిగాల్సిన అమన్... 1700 గ్రాములు అధిక బరువు కారణంగా పోటీలకు దూరమయ్యాడు. దీంతో పతకం సాధిస్తాడనే ఆశలు ఉన్న అమన్ పోటీకి అనర్హుడిగా తేలడంతో డబ్ల్యూఎఫ్ఐ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంది. అమన్ వివరణతో అసంతృప్తి వ్యక్తం చేసిన కమిటీ... ఏడాది కాలం పాటు అతడు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది. ఈ నిషేధం గత నెల సెప్టెంబర్ 23 నుంచి అమల్లోకి వచ్చినట్లు డబ్ల్యూఎఫ్ఐ వెల్లడించింది. అతడి శిక్షణ సిబ్బందిని హెచ్చరించి వదిలేసింది. పోటీలకు రెండు వారాల ముందే క్రొయేషియాకు వెళ్లిన అమన్... పోటీలు ప్రారంభమయ్యే సమయానికి నిర్ణీత బరువును కొనసాగించలేకపోవడం తప్పుడు సంకేతమని డబ్ల్యూఎఫ్ఐ పేర్కొంది. ‘ఒలింపిక్ పతకం సాధించిన రెజ్లర్ నుంచి అత్యుత్తమ క్రమశిక్షణ ఆశిస్తాం. అలాంటిది నిర్ణీత బరువును కొనసాగించలేకపోవడం సరైంది కాదు. అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్టకు సంబంధించిన అంశంలో తాత్సారానికి తావు లేదు. ఇది దేశ ప్రజల ఆశలను వమ్ము చేయడమే’ అని డబ్ల్యూఎఫ్ఐ వెల్లడించింది. గతేడాది పారిస్ ఒలింపిక్స్ సందర్భంగా వినేశ్ ఫొగాట్, ఈ ఏడాది ప్రపంచ అండర్–20 చాంపియన్షిప్ సందర్భంగా నేహా సాంగ్వాన్ కూడా ఇలాగే అధిక బరువుతో పోటీలకు దూరమయ్యారు. -
ఆనంద్ x కాస్పరోవ్
సెయింట్ లూయిస్ (అమెరికా): చదరంగ దిగ్గజాలు గ్యారీ కాస్పరోవ్ (రష్యా), విశ్వనాథన్ ఆనంద్ (భారత్) మరోసారి ముఖాముఖి పోరుకు సిద్ధమయ్యారు. ‘క్లచ్ చెస్: ద లెజెండ్స్ టోర్నమెంట్’ పేరుతో ఈ ఇద్దరి మధ్య ర్యాపిడ్, బ్లిట్జ్ ఫార్మాట్లో మూడు రోజులపాటు టోర్నీని నిర్వహించనున్నారు. ‘చెస్ 960’ మ్యాచ్లో భాగంగా ఆనంద్, కాస్పరోవ్ 12 గేమ్లు ఆడతారు. ప్రతి రోజు వీరిద్దరి మధ్య నాలుగు గేమ్లు (రెండు ర్యాపిడ్, రెండు బ్లిట్జ్) జరుగుతాయి. మొదటి రోజున గేమ్ గెలిస్తే ఒక్కో పాయింట్ దక్కుతుంది. రెండో రోజున గేమ్ గెలిస్తే రెండు పాయింట్ల చొప్పున... మూడో రోజున గేమ్ గెలిస్తే మూడు పాయింట్ల చొప్పున లభిస్తాయి. విజేతకు 70 వేల డాలర్లు (రూ. 62 లక్షలు), రన్నరప్ ప్లేయర్కు 50 వేల డాలర్లు (రూ. 44 లక్షలు) అందజేస్తారు. అధికారికంగా ఆనంద్, కాస్పరోవ్ చివరిసారి 1995లో క్లాసికల్ వరల్డ్ చాంపియన్షిప్ టైటిల్ కోసం పోటీపడ్డారు. కాస్పరోవ్ 10.5–7.5తో ఆనంద్పై గెలిచి ప్రపంచ టైటిల్ దక్కించుకున్నాడు. 2004లో చెస్కు వీడ్కోలు పలికిన కాస్పరోవ్ ఎగ్జిబిషన్, బ్లిట్జ్ ఈవెంట్లలో... ఆనంద్ కొన్ని ఎంచుకున్న టోర్నీల్లో మాత్రమే బరిలోకి దిగుతున్నారు. -
PKL: దబంగ్ ఢిల్లీ ధమాకా... పదో విజయంతో..
చెన్నై: మాజీ చాంపియన్ దబంగ్ ఢిల్లీ ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్ (PKL 12)లో పదో విజయంతో ‘టాప్’ లేపింది. సోమవారం ఇక్కడ జరిగిన మ్యాచ్లో దబంగ్ ఢిల్లీ జట్టు 29–26తో మాజీ విజేత జైపూర్ పింక్పాంథర్స్పై గెలుపొందింది. కెప్టెన్, రెయిడర్ అశు మలిక్ 8 పాయింట్లతో అదరగొట్టాడు. 17 సార్లు కూతకెళ్లిన ఢిల్లీ కెపె్టన్ 8 సార్లు విజయవంతంగా పాయింట్లు తెచ్చాడు. డిఫెండర్ సందీప్ (7) కూడా రాణించడంతో దబంగ్ జట్టు ప్రత్యరి్థపై పైచేయి సాధించింది. ఆఖరి వరకు పోరాడినా..మరోవైపు జైపూర్ పింక్ పాంథర్స్ సమష్టిగా గెలిచేందుకు పోరాడింది. డిఫెండర్లు రెజా మీర్బగేరి (5), దీపాన్షు ఖత్రి (5), ఆర్యన్ కుమార్ (4) ప్రత్యర్థి రెయిడర్లను బెంబేలెత్తించారు. రెయిడర్లలో మీతు, అలీ సమది చెరో 2 పాయింట్లు చేశారు. 11 మ్యాచ్లాడిన దబంగ్ ఢిల్లీ 10 విజయాలతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. యూపీపై పట్నా గెలుపుఅనంతరం జరిగిన రెండో మ్యాచ్లో మూడుసార్లు చాంపియన్ పట్నా పైరేట్స్ 36–28తో యూపీ యోధాస్పై విజయం సాధించింది. పైరేట్స్ తరఫున రెయిడర్ అయాన్ (15) చెలరేగాడు. 21 సార్లు కూతకెళ్లిన అతను క్రమం తప్పకుండా పాయింట్లు తెచ్చిపెట్టాడు. మిగతా వారిలో డిఫెండర్లు నవ్దీప్ (5), దీపక్ (4) రాణించారు. యూపీ యోధాస్ జట్టులో రెయిడర్ గగన్ (10) ఒంటరి పోరాటం చేశాడు. మిగతా వారిలో శివమ్ (3), మహేందర్ సింగ్ (2), హితేశ్ (2), సుమిత్ (2) ఫర్వాలేదనిపించారు. ఇక మంగళవారం జరిగే మ్యాచ్ల్లో పట్నా పైరేట్స్తో తమిళ్ తలైవాస్, హరియాణా స్టీలర్స్తో దబంగ్ ఢిల్లీ తలపడనున్నాయి. చదవండి: Pro Kabaddi League: తెలుగు టైటాన్స్ గెలుపు జోరు.. -
గెలిస్తే గొప్పా?.. ఇంత పొగరు పనికిరాదు! వీడియో వైరల్
అమెరికాలోని ఆర్లింగ్టన్లో జరిగిన చెక్మేట్ ఈవెంట్ ఓపెనింగ్ లెగ్లో భారత్పై యూఎస్ఎ ఆధిపత్యం చెలాయించింది. ఆదివారం జరిగిన గేమ్లో అమెరికా గ్రాండ్ మాస్టర్ హికారు నకమురా.. ప్రపంచ ఛాంపియన్ డి గుకేష్ను 0-5 తేడాతో వైట్వాష్ చేశాడు.దీంతో భారత్పై అమెరికా విజయం సాధించింది. అయితే విజయం అనంతరం హికారు నకమురా ఓవరాక్షన్ చేశాడు. గేమ్ ముగిసిన వెంటనే ఈ అమెరికా చెస్ స్టార్ గుకేష్ కింగ్ను ప్రేక్షకులపైకి విసిరి సెలబ్రేట్ చేసుకున్నాడు.కానీ గుకేష్ మాత్రం సహనం కోల్పోకుండా పావులను అమర్చకుంటూ నవ్వుతూ ఉండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ క్రమంలో అతడిపై నెటిజన్లు విమర్శలు వర్షం కురిపిస్తున్నారు.మరీ అంత పొగరు పనికిరాదు అంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే తన చర్యలపై నకమురా స్పందించాడు. తాను గెలిచిన ప్రతీసారి కింగ్ను విసిరేస్తాను అని నకమురా చెప్పుకొచ్చాడు.HIKARU THROWS A PIECE TO THE CROWD TO CELEBRATE THE USA 5-0! @GMHikaru What an event!! 🔥👏 @CheckmateUSAIND pic.twitter.com/LGnM8JLulJ— Chess.com (@chesscom) October 5, 2025చదవండి: Pro Kabaddi League: తెలుగు టైటాన్స్ గెలుపు జోరు.. -
రయ్.. రయ్... రసెల్.. సింగపూర్ గ్రాండ్ప్రి టైటిల్ కైవసం
సింగపూర్: ఫార్ములావన్ తాజా సీజన్లో మెర్సిడెస్ డ్రైవర్ జార్జ్ రసెల్ తన ఖాతాలో రెండో విజయం వేసుకున్నాడు. ఆదివారం జరిగిన సింగపూర్ గ్రాండ్ప్రిలో రసెల్ విజేతగా నిలిచాడు. తుది రేసును ‘పోల్ పొజిషన్’ నుంచి ప్రారంభించిన రసెల్ వాయువేగంతో దూసుకెళ్లాడు. 62 ల్యాప్ల రేసును రసెల్ అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 1 గంట 40 నిమిషాల 22.367 సెకన్లలో పూర్తి చేశాడు. నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్, రెడ్బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ 1 గంట 40 నిమిషాల 27.792 సెకన్లలో రేసును పూర్తి చేసి రెండో స్థానం దక్కించుకున్నాడు.గత రెండు రేసుల్లో ‘టాప్’లో నిలిచిన వెర్స్టాపెన్ మూడో రేసులోనూ దూసుకెళ్లినా... పోల్ పొజిషన్ నుంచి రేసును ఆరంభించిన రసెల్దే పైచేయి అయింది. రెండేళ్ల క్రితం ఇక్కడే జరిగిన రేసు చివరి ల్యాప్లో ప్రమాదానికి గురైన రసెల్ ఇప్పుడు అదే చోట విజేతగా నిలిచాడు. ‘ఈ అనుభూతి బాగుంది. కొన్నాళ్ల క్రితం ఇక్కడ ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఆ రోజు పోడియంపై నిలవలేకపోయా. ఇప్పుడు అది సాధ్యమైంది’ అని విజయం అనంతరం రసెల్ అన్నాడు. కెనడా గ్రాండ్ప్రి తర్వాత రసెల్కు ఈ ఏడాది ఇది రెండో టైటిల్. మెక్లారెన్ డ్రైవర్లు లాండో నోరిస్ (1 గంట 40 నిమిషాల 28.433 సెకన్లు), ఆస్కార్ పియాస్ట్రి (1 గంట 40 నిమిషాల 30.513 సెకన్లు) వరుసగా మూడో, నాలుగో స్థానాల్లో నిలిచారు.ఈ సీజన్లో అప్రతిహత విజయాలతో దూసుకెళ్లిన మెక్లారెన్ డ్రైవర్లకు గత మూడు రేసుల నుంచి అగ్రస్థానం దక్కలేదు. మెర్సిడెస్కే చెందిన మరో డ్రైవర్ కిమి అంటొనెల్లి 1 గంట 40 నిమిషాల 56.048 సెకన్లు ఐదో స్థానం దక్కించుకోగా... చార్లెస్ లెక్లెర్క్ (1 గంట 41 నిమిషాల 8.363 సెకన్లు; ఫెరారీ) ఆరో స్థానంలో నిలిచాడు. ఏడుసార్లు ప్రపంచ చాంపియన్, ఫెరారీ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ (1 గంట 41 నిమిషాల 42.618 సెకన్లు) ఏడో స్థానానికి పరిమితమయ్యాడు. 24 రేసుల సీజన్లో 18 రేసులు ముగిసేసరికి ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్íÙప్లో పియాస్ట్రి 336 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... నోరిస్ 314 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. వెర్స్టాపెన్ 273 పాయింట్లతో మూడో స్థానాన్ని మరింత మెరుగు పర్చుకున్నాడు. తదుపరి రేసు ఈనెల 20న యునైటెడ్ స్టేట్స్ గ్రాండ్ప్రి జరుగనుంది. కన్స్ట్రక్టర్స్ చాంపియన్... మెక్లారెన్ ఫార్ములావన్ తాజా సీజన్లో మరో 6 రేసులు మిగిలుండగానే... మెక్లారెన్ జట్టు కన్స్ట్రక్టర్స్ (టీమ్) చాంపియన్íÙప్ కైవసం చేసుకుంది. 24 రేసుల సీజన్లో సింగపూర్ గ్రాండ్ప్రితో 18 రేసులు ముగియగా... 650 పాయింట్లతో మెక్లారెన్ జట్టు టీమ్ చాంపియన్షిప్ను కైవసం చేసుకుంది. తాజా సీజన్లో మెక్లారెన్ డ్రైవర్లు 12 రేసుల్లో విజేతలుగా నిలిచారు. అందులో ఆస్కార్ పియాస్ట్రి 7 రేసులు నెగ్గగా... మరో ఐదింట నోరిస్ అగ్రస్థానం దక్కించుకున్నాడు. కన్స్ట్రక్టర్స్ చాంపియన్íÙప్లో మెర్సిడెస్ 325 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా... ఫెరారీ 300 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. మిగిలిన రేసుల్లో ఈ రెండు జట్లకు మెక్లారెన్ను అధిగమించే అవకాశం లేకపోవడంతో... ఆ జట్టు టీమ్ చాంపియన్గా నిలిచింది. -
తెలుగు టైటాన్స్ గెలుపు జోరు..
చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో తెలుగు టైటాన్స్ విజయపరంపర కొనసాగుతోంది. ఆదివారం జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 40–35 పాయింట్ల తేడాతో యూపీ యోధాస్ను ఓడించింది. ఈ సీజన్లో టైటాన్స్ జట్టుకిది ఓవరాల్గా ఏడో విజయం కాగా... వరుసగా నాలుగో గెలుపు.టైటాన్స్ తరఫున భరత్ హుడా 14 పాయింట్లతో టాప్ స్కోరర్గా నిలిచాడు. కెపె్టన్ విజయ్ మలిక్ తొమ్మిది పాయింట్లతో మెరిశాడు. డిఫెండర్ శుబ్మన్ షిండే ఐదు పాయింట్లతో ఆకట్టుకున్నాడు. యూపీ యోధాస్ తరఫున భవానీ రాజ్పుత్ 16 పాయింట్లు సాధించినా ఫలితం లేకపోయింది. ఇప్పటి వరకు 12 మ్యాచ్లు ఆడిన తెలుగు టైటాన్స్ ఏడింటిలో గెలిచి, ఐదింటిలో ఓడి 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. మరో మ్యాచ్లో బెంగళూరు బుల్స్ 33–29తో తమిళ్ తలైవాస్పై గెలిచింది. నేడు జరిగే మ్యాచ్ల్లో జైపూర్ పింక్పాంథర్స్తో దబంగ్ ఢిల్లీ; యూపీ యోధాస్తో పట్నా పైరేట్స్ తలపడతాయి.చదవండి: ICC Womens World Cup 2025: పాక్పై భారత్ గెలుపు.. మహిళలూ మురిపించారు -
Al Ain Masters 2025: విజేత శ్రియాన్షి
అల్ అయిన్ (అబుదాబి): హైదరాబాద్ యువ షట్లర్ శ్రియాన్షి వలిశెట్టి అల్ అయిన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నీలో విజేతగా అవతరించింది. అబుదాబిలో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ విభాగంలో 18 ఏళ్ల శ్రియాన్షి టైటిల్ను సొంతం చేసుకుంది. పుల్లెల గోపీచంద్ అకాడమీకి చెందిన శ్రియాన్షి ఫైనల్లో భారత్కే చెందిన తస్నిమ్ మీర్పై 15–21, 22–20, 21–7తో విజయం సాధించింది. 49 నిమిషాల్లో ముగిసిన ఈ తుది పోరులో శ్రియాన్షి తొలి గేమ్లో తడబడింది. అయితే రెండో గేమ్లో తన తప్పిదాలను సరిదిద్దుకొని ప్రత్యరి్థపై పైచేయి సాధించింది. నిర్ణాయక మూడో గేమ్లో మాత్రం ప్రపంచ 61వ ర్యాంకర్ శ్రియాన్షి ధాటికి ప్రపంచ 59వ ర్యాంకర్ తస్నిమ్ తేలిపోయింది. 6–7తో వెనుకబడిన దశలో శ్రియాన్షి ఒక్కసారిగా చెలరేగిపోయి వరుసగా 15 పాయింట్లు సాధించి 21–7తో గేమ్తోపాటు మ్యాచ్ను సొంతం చేసుకుంది. తద్వారా తన కెరీర్లో తొలి వరల్డ్ టూర్–100 లెవెల్ టైటిల్ను గెల్చుకుంది. చాంపియన్ శ్రియాన్షికి 9,000 డాలర్ల (రూ. 7 లక్షల 99 వేలు) ప్రైజ్మనీ, 5,500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఇదే టోర్నీలో పురుషుల డబుల్స్ టైటిల్ను హరిహరన్–అర్జున్ (భారత్) జోడీ గెలుచుకుంది. ఫైనల్లో హరిహరన్–అర్జున్ ద్వయం 21–17, 21–18తో రేమండ్ ఇంద్ర–నికోలస్ (ఇండోనేసియా)పై నెగ్గింది. హరిహరన్ –అర్జున్ జోడీకి 9,480 డాలర్ల (రూ. 8 లక్షల 41 వేలు) ప్రైజ్మనీతోపాటు 5,500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
భారత్ రికార్డు ప్రదర్శన
న్యూఢిల్లీ: ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత అథ్లెట్లు నయా చరిత్ర సృష్టించారు. సొంతగడ్డపై జరిగిన పోటీల్లో రికార్డు స్థాయిలో 22 పతకాలు సాధించారు. పోటీల చివరి రోజు ఆదివారం భారత్ మూడు రజతాలు, ఒక కాంస్యంతో 4 పతకాలు ఖాతాలో వేసుకుంది. దీంతో ఈ వరల్డ్ చాంపియన్షిప్లో భారత పారా అథ్లెట్లు మొత్తం 22 పతకాల (6 స్వర్ణాలు, 9 రజతాలు, 7 కాంస్యాలు)తో పదో స్థానంలో నిలిచారు. ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్ చరిత్రలో భారత్ ఇప్పటి వరకు 2024లో (జపాన్) అత్యుత్తమంగా 17 పతకాలు సాధించింది. పతకాల పట్టికలో బ్రెజిల్ 44 (15 స్వర్ణాలు, 20 రజతాలు, 9 కాంస్యాలు) అగ్రస్థానంలో నిలిచింది. ఆదివారం మహిళల 100 మీటర్ల టి35 విభాగంలో ప్రీతిపాల్ 14.33 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రజత పతకం సాధించింది. టి35 200 మీటర్ల పరుగులో సైతం ప్రీతి కాంస్యం నెగ్గింది. పురుషుల జావెలిన్ ఎఫ్41 విభాగంలో పారిస్ పారాలింపిక్స్ స్వర్ణ పతక విజేత నవ్దీప్ సింగ్ రజతం గెలిచాడు. నవ్దీప్ జావెలిన్ను 45.46 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచాడు. మహిళల 200 మీటర్ల టి12 విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ సిమ్రన్ 24.42 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రెండో స్థానంలో నిలిచింది. పురుషుల 200 మీటర్ల టి44 విభాగంలో సందీప్ 23.60 సెకన్లలో లక్ష్యాన్ని చేరి కాంస్యం పతకం కైవసం చేసుకున్నాడు. -
షోయబ్ మాలిక్ విడాకుల వార్తలు;.. సానియా మీర్జా పోస్ట్ వైరల్
పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ (Shoaib Malik) మూడో వివాహ బంధం కూడా చిక్కుల్లో పడ్డట్టు వార్తలు వస్తున్నాయి. మూడో భార్య, నటి సనా జావెద్ (Sana Javed)తో విడాకులు తీసుకోవడానికి షోయబ్ సిద్ధపడ్డాడనేది వాటి సారాంశం.మనసు స్వచ్ఛంగా ఉన్నపుడు..ఈ నేపథ్యంలో భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా (Sania Mirza) సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టు వైరల్గా మారింది. ‘‘మనసు స్వచ్ఛంగా, ప్రశాంతంగా ఉన్నపుడు.. దానిని బయటకు చూపించేందుకు ఎలాంటి కృత్రిమ ఫిల్టర్ల అవసరం ఉండదు’’ అంటూ సానియా తన కుమారుడు ఇజహాన్, స్నేహితులతో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేసింది.కాగా టెన్నిస్లో ఉన్నత శిఖరాలు అధిరోహించిన హైదరాబాదీ సానియా మీర్జా.. పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ను 2010లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, అంతకంటే ముందే ఆయేషా సిద్ధిఖీ అనే మహిళతో షోయబ్కు వివాహం కాగా.. 2006లోనే విడాకులు తీసుకున్నాడు.షోయబ్కు సానియా విడాకులుఅయితే, సానియా మీర్జాతోనూ షోయబ్ బంధం ఎక్కువకాలం నిలవలేదు. 2023లో తాను షోయబ్కు విడాకులు ఇచ్చినట్లు సానియా మీర్జా గతేడాది ప్రకటించింది. అయితే, అంతకంటే ముందే నటి సనా జావెద్ను పెళ్లాడిన ఫొటోలను షోయబ్ సోషల్ మీడియాలో షేర్ చేయడం గమనార్హం.ఇక సనాకు ఇది రెండో వివాహం కాగా.. షోయబ్కు మూడోది. అయితే, పెళ్లికి ముందే వీరిద్దరు తమ పాత బంధాలను కొనసాగిస్తూనే.. ‘రిలేషన్షిప్’లోనే ఉన్నారనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సనా తన భర్తకు, షోయబ్ తన భార్యకు విడాకులు ఇచ్చి 2024లో అధికారికంగా పెళ్లి చేసుకున్నారు.ఆ ఫొటోలతో వదంతులకు చెక్అయితే, సనా- షోయబ్ మధ్య కూడా సఖ్యత చెడినట్లు ఇటీవల వదంతులు వ్యాపించాయి. ఓ కార్యక్రమంలో ఇద్దరూ ఒకే సోఫాలో కూర్చునప్పటికీ దూరం దూరంగా ఉండటం.. షోయబ్ ఆటోగ్రాఫులు ఇస్తున్నపుడు సనా ముఖం తిప్పేసుకోవడం ఇందుకు ఊతమిచ్చాయి.దీంతో సనా- షోయబ్ విడాకులు తీసుకోబోతున్నారంటూ కథనాలు వచ్చాయి. అయితే, భర్త షోయబ్తో కలిసి అమెరికాలో విహరిస్తున్న ఫొటోలను పంచుకోవడం ద్వారా సనా జావెద్ ఈ వదంతులకు చెక్ పెట్టింది. ఇద్దరూ కలిసి హాలీవుడ్ యూనివర్సల్ స్టూడియోస్ను సందర్శించిన ఫొటోలను సనా షేర్ చేసింది. షోయబ్ కూడా ఇవే ఫొటోలు షేర్ చేస్తూ.. ‘‘తనతో కలిసి ఇలా విహరించడం ఎల్లపుడూ సంతోషమే’’ అని పేర్కొన్నాడు.సానియా మీర్జా పోస్ట్ వైరల్ఇదిలా ఉంటే.. సానియా- షోయబ్లకు సంతానంగా కుమారుడు ఇజహాన్ జన్మించాడు. సానియా తన కుమారుడితో కలిసి ప్రస్తుతం దుబాయ్లో నివసిస్తోంది. ఇక ఇన్స్టాగ్రామ్లో పదమూడు మిలియన్లకు పైగా ఫాలోవర్లు కలిగి ఉన్న సానియా మీర్జా ఎప్పటికప్పుడు ఫొటోలు పంచుకుంటూనే ఉంటుంది. అయితే, శనివారం ఆమె పంచుకున్న ఫొటోలకు ఇచ్చిన క్యాప్షన్.. షోయబ్ మూడో పెళ్లి పెటాకులు అన్న వార్తల వేళ నెటిజన్లను ఆకర్షిస్తోంది.చదవండి: 50 ఓవర్ల క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ.. ఆసీస్ బ్యాటర్ విధ్వంసం View this post on Instagram A post shared by Sania Mirza (@mirzasaniar) -
PKL 12: పుణేరి పల్టన్ హ్యాట్రిక్
చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో పుణేరి పల్టన్ వరుసగా మూడో విజయం ఖాతాలో వేసుకుంది. శనివారం జరిగిన పోరులో పుణేరి పల్టన్ 41–36 పాయింట్ల తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్పై విజయం సాధించింది. పల్టన్ తరఫున ఆదిత్య షిండే 13 పాయింట్లు సాధించగా... కెప్టెన్ పంకజ్ మోహితె 8 పాయింట్లు సాధించాడు.మరోవైపు... జైపూర్ తరఫున అలీ సమది 22 పాయింట్లతో విజృంభించాడు. మరో మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ 47–40 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్పై గెలుపొందింది. ఆదివారం యూపీ యోధాస్తో తెలుగు టైటాన్స్, బెంగళూరు బుల్స్తో తమిళ్ తలైవాస్ తలపడతాయి. ఇదీ చదవండి: ఫైనల్లో తస్నీమ్, శ్రియాన్షి అల్ అయిన్ (యూఏఈ): భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్... అల్ అయిన్ మాస్టర్స్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సెమీఫైనల్లో పరాజయం పాలవగా... మహిళల విభాగంలో తస్నీమ్ మీర్, శ్రియాన్షి వలిశెట్టి ఫైనల్కు దూసుకెళ్లారు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో మూడో సీడ్ శ్రీకాంత్ 4–21, 21–11, 19–21తో రెండో సీడ్ ఆదిల్ షోలెహ్ (మలేసియా) చేతిలో పోరాడి ఓడాడు.ఇక మహిళల సింగిల్స్లో బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ జూనియర్ నంబర్వన్, 20 ఏళ్ల తస్నీమ్ మీర్ సత్తాచాటింది. సెమీస్లో ఆరో సీడ్ తస్నీమ్ 9–21, 21–17, 21–10తో ఐదో సీడ్ నెస్లిహన్ అరిన్ (తుర్కియే)పై విజయం సాధించింది. మరో సెమీస్లో ఏడో సీడ్ శ్రియాన్షి 21–11, 21–12తో చియారా మార్వెల్లా హండోయో (ఇండోనేసియా)పై గెలిచి తుదిపోరుకు అర్హత సాధించింది. ఆదివారం జరగనున్న మహిళల సింగిల్స్ ఫైనల్లో తస్నీమ్, శ్రియాన్షి టైటిల్ కోసం పోటీపడనున్నారు. ఈ ఇద్దరికీ ఇదే తొలి బీడబ్ల్యూఎఫ్ సూపర్–100 ఫైనల్. -
రసెల్కు పోల్ పొజిషన్
సింగపూర్: మెర్సిడెస్ డ్రైవర్ జార్జ్ రసెల్ ఫార్ములావన్ తాజా సీజన్లో రెండో సారి పోల్ పొజిషన్ సాధించాడు. శనివారం జరిగిన సింగపూర్ గ్రాండ్ప్రి క్వాలిఫయింగ్ రేసులో రసెల్ అందరికంటే ముందు నిలిచాడు. శుక్రవారం ప్రాక్టీస్ సందర్భంగా రసెల్ కారు ప్రమాదానికి గురవగా... దాని నుంచి వెంటనే తేరుకున్న మెర్సిడెస్ డ్రైవర్ క్వాలిఫయింగ్ రేసులో వాయువేగంతో దూసుకెళ్లాడు. రసెల్ 1 నిమిషం 29.158 సెకన్లలో ల్యాప్ను పూర్తి చేసి అగ్ర స్థానం దక్కించుకున్నాడు. డిఫెండింగ్ చాంపియన్, రెడ్బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ 1 నిమిషం 29.340 సెకన్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది జోరు కొనసాగిస్తున్న మెక్లారెన్ డ్రైవర్లు ఆస్కార్ పియాస్ట్రి, లాండో నోరిస్ ఈ క్వాలిఫయింగ్ రేసులో వెనుకబడిపోయారు. పియాస్ట్రి (1 నిమిషం 29.524 సెకన్లు) మూడో స్థానం దక్కించుకోగా... ఆంటొనెల్లి (1 నిమిషం 29.537 సెకన్లు; మెర్సిడెస్) నాలుగో స్థానంలో నిలిచాడు. నోరిస్ (1 నిమిషం 29.586 సెకన్లు) ఐదో ‘ప్లేస్’ దక్కించుకున్నాడు. ఏడుసార్లు ప్రపంచ చాంపియన్, ఫెరారీ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ 1 నిమిషం 29.688 సెకన్లతో ఆరో స్థానానికి పరిమితమయ్యాడు. ఆదివారం జరగనున్న ప్రధాన రేసును రసెల్ పోల్ పొజిషన్ నుంచి ప్రారంభించనున్నాడు. -
దబంగ్ ఢిల్లీ ‘టాప్’ షో
చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో దబంగ్ ఢిల్లీ జోరు కొనసాగుతోంది. వరుసగా మూడో మ్యాచ్లో విజయం సాధించిన దబంగ్ ఢిల్లీ జట్టు... తిరిగి పాయింట్ల పట్టికలో అగ్ర స్థానానానికి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన పోరులో దబంగ్ ఢిల్లీ 43–26 పాయింట్ల తేడాతో యూపీ యోధాస్ను మట్టికరిపించింది. ఢిల్లీ కెప్టెన్ అషు మాలిక్ 14 పాయింట్లతో విజృంభించగా... మిగిలినవాళ్లంతా అతడికి అండగా నిలిచారు. యూపీ యోధాస్ తరఫున గగన్ గౌడ 12 పాయింట్లతో పోరాడినా తక్కిన వాళ్ల నుంచి అతడికి సరైన సహకారం దక్కలేదు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో దబంగ్ ఢిల్లీ 22 రెయిడ్ పాయింట్లు సాధించగా... యోధాస్ 20 రెయిడ్ పాయింట్లు సాధించింది. అయితే ట్యాక్లింగ్లో సత్తాచాటిన ఢిల్లీ జట్టు 11 పాయింట్లు ఖాతాలో వేసుకోగా... యూపీ యోధాస్ 5 ట్యాక్లింగ్ పాయింట్లకే పరిమితమైంది. ఈ మ్యాచ్లో యూపీ యోధాస్ను ఢిల్లీ జట్టు మూడుసార్లు ఆలౌట్ చేసింది. తాజా సీజన్లో 10 మ్యాచ్లాడిన ఢిల్లీ 9 విజయాలు, ఒక పరాజయంతో 18 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక ‘టాప్’కు చేరింది. యూపీ యోధాస్ 10 మ్యాచ్ల్లో 4 విజయాలు, 6 పరాజయాలతో 8 పాయింట్లు సాధించి పట్టిక తొమ్మిదో స్థానంలో ఉంది. శుక్రవారమే జరిగిన మరో మ్యాచ్లో తమిళ్ తలైవాస్ 45–33 పాయింట్ల తేడాతో హర్యానా స్టీలర్స్పై గెలుపొందింది. తలైవాస్ సారథి అర్జున్ దేశ్వాల్ 22 పాయింట్లతో వీరవిహారం చేశాడు. శనివారం పుణేరి పల్టన్తో జైపూర్ పింక్ పాంథర్స్, గుజరాత్ జెయింట్స్తో బెంగాల్ వారియర్స్ తలపడనున్నాయి. -
మీరాబాయి చానుకు రజతం
ఫోర్డె (నార్వె): భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను... ప్రపంచ చాంపియన్షిప్లో రజత పతకంతో మెరిసింది. మహిళల 48 కేజీల విభాగంలో బరిలోకి దిగిన మీరా రెండో స్థానంలో నిలిచింది. 2017 ప్రపంచ చాంపియన్షిప్లో స్వర్ణం, 2022 టోర్నీలో రజతం నెగ్గిన మీరాబాయి... ఇప్పుడు మూడో పతకం ఖాతాలో వేసుకుంది. నార్వే వేదికగా జరిగిన పోటీల్లో మీరాబాయి 199 కేజీల (స్నాచ్లో 84 కేజీలు+క్లీన్ అండ్ జెర్క్లో 115 కేజీలు) బరువెత్తి రజతం కైవసం చేసుకుంది. ఉత్తర కొరియాకు చెందిన రి సాంగ్ గుమ్ 213 కేజీల (స్నాచ్లో 91 కేజీలు+క్లీన్ అండ్ జెర్క్లో 122 కేజీలు) బరువెత్తి ప్రపంచ రికార్డు నెలకొల్పడంతో పాటు పసిడి పతకం గెలుచుకుంది. థాయ్లాండ్కు చెందిన థాన్యాథోన్ సుక్చరోన్ 198 కేజీల (స్నాచ్లో 88 కేజీలు+క్లీన్ అండ్ జెర్క్లో 110 కేజీలు)తో కాంస్య పతకం నెగ్గింది. స్నాచ్లో తొలి ప్రయత్నంలోనే 84 కేజీల బరువెత్తని చాను... ఆ తర్వాత రెండు ప్రయత్నాల్లో 87 కేజీల బరువెత్తడంలో విఫలమైంది. మరోవైపు క్లీన్ అండ్ జెర్క్లో తొలుత 109 కేజీలు బరువెత్తిన మీరాబాయి... రెండో ప్రయత్నంలో 112 కేజీలు, మూడో ప్రయత్నంలో 115 కేజీల బరువెత్తింది. 2020 టోక్యో ఒలింపిక్స్లో సైతం చాను క్లీన్ అండ్ జెర్క్లో 115 కేజీల బరువు ఎత్తే రజత పతకం గెలుచుకుంది. ‘పతకం సాధించడం ఆనందంగా ఉంది. ఈ ప్రదర్శన నాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ లక్ష్యంగా సాగుతున్నా. ఈ క్రమంలో పాల్గొనే ప్రతి టోర్నీ దానికి సన్నాహకమే. త్వరలో జరగనున్న కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్లో మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయతి్నస్తా. పోటీపడ్డ ప్రతిసారీ కొత్తగా ఏదో ఒకటి నేర్చుకునేందుకు ప్రయత్నిస్తా. దేశానికి మరిన్ని పతకాలు అందించడమే నా ప్రధాన లక్ష్యం’ అని మీరాబాయి చెప్పింది. ఆమె కోచ్ విజయ్ శర్మ మాట్లాడుతూ... ఈ పతకం మీరాబాయి కఠోర సాధనకు ఫలితమని అన్నాడు. ‘ప్రపంచ చాంపియన్షిప్లో 200 కేజీల మార్క్ అందుకోవాలని మీరా లక్ష్యంగా పెట్టుకుంది. దానికి ఒక్క అడుగు దూరంలో నిలిచిపోయింది. రానున్న కాలంలో కామన్వెల్త్, ఆసియా గేమ్స్, ఒలింపిక్స్ జరగనున్న నేపథ్యంలో ఆమె తీవ్ర సాధన చేస్తోంది. తన బలం, ఆత్మవిశ్వాసం పెంపొందించుకునేందుకు కష్టపడుతోంది’ అని అన్నాడు. -
జైపూర్ పింక్ పాంథర్స్ 'సిక్సర్'
ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో జైపూర్ పింక్ పాంథర్స్ ఆరో విజయం నమోదు చేసుకుంది. హరియాణా స్టీలర్స్తో బుధవారం జరిగిన మ్యాచ్లో జైపూర్ 37–36 పాయింట్ల తేడాతో గెలిచింది. జైపూర్ తరఫున సాహిల్ 7, అలీ 6 పాయింట్లు సాధించారు.స్టీలర్స్ తరఫున వినయ్ 11 పాయింట్లతో పోరాడినా సరిపోలేదు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో స్టీలర్స్ 21 రెయిడ్ పాయింట్లు సాధించగా... జైపూర్ 16 రెయిడ్ పాయింట్లకే పరిమితమైంది. అయితే ఆలౌట్ పాయింట్లు, ఎక్స్ట్రా పాయింట్లలో ముందంజ వేసిన పింక్ పాంథర్స్ విజయం సాధించింది. తాజా సీజన్లో 10 మ్యాచ్లాడిన జైపూర్ పింక్ పాంథర్స్ 6 విజయాలు, 4 పరాజయాలతో 12 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఐదో స్థానానికి చేరింది. హర్యానా స్టీలర్స్ 10 మ్యాచ్లో 6 గెలిచి నాలుగింట ఓడి 12 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. మరో మ్యాచ్లో యు ముంబా 42–24 పాయింట్ల తేడాతో తమిళ్ తలైవాస్పై గెలుపొందింది. యు ముంబా తరఫున సందీప్ కుమార్ 12 పాయింట్లతో విజృంభించగా... తలైవాస్ తరఫున అత్యధికంగా రోహిత్ గోపాల్ 7 పాయింట్లు సాధించాడు. నేడు జరిగే మ్యాచ్ల్లో పుణేరి పల్టన్తో బెంగళూరు బుల్స్... గుజరాత్ జెయింట్స్తో యు ముంబా తలపడతాయి.చదవండి: AB de Villiers: ఆసియాకప్ ట్రోఫీ వివాదం.. టీమిండియాపై డివిలియర్స్ విమర్శలు -
చైనా ఓపెన్ చాంపియన్ సినెర్
బీజింగ్: ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన ఇటలీ టెన్నిస్ స్టార్ యానిక్ సినెర్ తన కెరీర్లో 21వ సింగిల్స్ టైటిల్ను సాధించాడు. బుధవారం ముగిసిన చైనా ఓపెన్ ఏటీపీ–500 టోర్నీలో ప్రపంచ రెండో ర్యాంకర్ సినెర్ చాంపియన్గా అవతరించాడు. ప్రపంచ 52వ ర్యాంకర్ లెర్నర్ టియెన్ (అమెరికా)తో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సినెర్ 6–2, 6–2తో గెలుపొందాడు. 72 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో సినెర్ పది ఏస్లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. ఈ ఏడాది సినెర్కిది మూడో టైటిల్. విజేతగా నిలిచిన సినెర్కు 7,51,075 డాలర్ల (రూ. 6 కోట్ల 65 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. రన్నరప్ లెర్నర్ ఖాతాలో 4,04,105 డాలర్ల (రూ. 3 కోట్ల 58 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 300 ర్యాంకింగ్ పాయింట్లు చేరాయి. -
13 పతకాలతో ముగింపు
అహ్మదాబాద్: ఆసియా అక్వాటిక్స్ చాంపియన్షిప్ పోటీలను భారత్ 13 పతకాలతో ముగించింది. ఓవరాల్గా తొమ్మిదో స్థానంలో నిలిచిన భారత్కు నాలుగు రజతాలు, తొమ్మిది కాంస్యాలు లభించాయి. చివరిరోజు బుధవారం భారత్ ఖాతాలో నాలుగు కాంస్య పతకాలు చేరాయి. మహిళల 400 మీటర్ల ఫ్రీస్టయిల్లో భవ్య సచ్దేవ (4ని:26.89 సెకన్లు) మూడో స్థానంలో నిలిచింది. పురుషుల 200 మీటర్ల బటర్ఫ్లయ్ ఈవెంట్లో సజన్ ప్రకాశ్ (1ని:57.90 సెకన్లు) కాంస్యం గెల్చుకున్నాడు. పురుషుల 100 మీటర్ల బ్యాక్స్ట్రోక్లో శ్రీహరి నటరాజ్ (55.23 సెకన్లు) కాంస్య పతకాన్ని సాధించాడు. శ్రీహరి నటరాజ్, రోహిత్ బెనెడిక్షన్, థామస్ దురై, ఆకాశ్ మణిలతో కూడిన భారత బృందం పురుషుల 4్ఠ100 మీటర్ల రిలేలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. ఓవరాల్గా ఈ టోర్నీలో శ్రీహరి ఏకంగా ఏడు పతకాలు సాధించడం విశేషం. చైనా 49 పతకాలతో ‘టాప్’ ర్యాంక్ను అందుకోగా... 18 పతకాలతో జపాన్ రెండో స్థానంలో నిలిచింది. -
విండీస్తో తొలి టెస్టుకు భారత్ సై..
సొంతగడ్డపై టెస్టుల్లో భారత్ దాదాపు 12 ఏళ్ల పాటు ఎదురులేని జట్టుగా ఒక్క సిరీస్ కూడా ఓడిపోకుండా ఆధిపత్యం ప్రదర్శించింది. పర్యటనకు వచ్చిన పెద్ద జట్లు కూడా టీమిండియా జోరును ఆపలేకపోయాయి. అయితే పుష్కర కాలం తర్వాత బలహీనం అనుకున్న న్యూజిలాండ్ పెద్ద దెబ్బ కొట్టింది. గత ఏడాది అనూహ్యంగా కివీస్ చేతిలో భారత్ క్లీన్స్వీప్నకు గురైంది. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ మన టీమ్స్వదేశంలో టెస్టు మ్యాచ్ బరిలోకి దిగుతోంది. ఈసారి కూడా బలహీనమైన వెస్టిండీస్ ఎదురుగా ఉంది. ఇంగ్లండ్పై చక్కటి ప్రదర్శన తర్వాత ఎలాంటి ఉదాసీనతకు తావు ఇవ్వకుండా ఆడితే విండీస్పై పైచేయి ఖాయం. ఈ నేపథ్యంలో రెండు మ్యాచ్ల సిరీస్కు రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్: శుబ్మన్ గిల్ నాయకత్వంలో భారత జట్టు సొంతగడ్డపై తొలి టెస్టు సిరీస్ ఆడనుంది. వెస్టిండీస్తో జరిగే రెండు టెస్టుల సిరీస్లో భాగంగా నేటి నుంచి మొదటి టెస్టు జరుగుతుంది. సీనియర్లు కోహ్లి, రోహిత్, అశ్విన్ల రిటైర్మెంట్ తర్వాత టీమిండియా స్వదేశంలో ఆడనున్న మొదటి టెస్టు ఇదే కానుంది. ఇంగ్లండ్ గడ్డపై అద్భుత ఆటతో సిరీస్ను సమం చేసుకున్న టీమిండియా పటిష్టంగా కనిపిస్తోంది. మరోవైపు ఆసీస్తో ఆడిన గత టెస్టులో ‘27 ఆలౌట్’ తర్వాత విండీస్ ఇదే మ్యాచ్లో బరిలోకి దిగుతోంది. బలాబలాల్లో ఎంతో అంతరం కనిపిస్తుండగా, కరీబియన్ టీమ్ ఇక్కడ ఏమాత్రం పోటీనిస్తుందనేది సందేహమే. అదనపు పేసర్తో... సాధారణంగా స్వదేశంలో నల్లరేగడి మట్టితో సిద్ధం చేసే స్పిన్ అనుకూల పిచ్లపై భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి టీమ్ మేనేజ్మెంట్ ఉద్దేశపూర్వకంగా పేస్కు అనుకూలించే ‘ఎర్ర మట్టి’ పిచ్పై తమ సత్తాను పరీక్షించుకోవాలని భావిస్తోంది. దీని ప్రకారమే తుది జట్టు ఉండవచ్చు. ఇద్దరు ప్రధాన పేసర్లుగా బుమ్రా, సిరాజ్ ఖాయం. స్పిన్ ఆల్రౌండర్లుగా జడేజా, సుందర్ ఖాయం. అయితే మూడో స్పిన్నర్ అయిన కుల్దీప్, మరో పేసర్ మధ్య పోటీ ఉండవచ్చు. పిచ్ను బట్టి చూస్తే ప్రసిధ్ వైపే మొగ్గు కనిపిస్తోంది. అయితే ఆరో స్థానంలో ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ రెడ్డిని ఆడిస్తే అప్పుడు కుల్దీప్కు అవకాశం ఉంటుంది. నితీశ్ జట్టులోకి వస్తే బ్యాటర్ పడిక్కల్ను కూడా పక్కన పెట్టాల్సి రావచ్చు. ఇంగ్లండ్లో పెద్దగా ఆకట్టుకోకపోయినా నితీశ్పై సెలక్టర్లు నమ్మకం ఉంచారు. బ్యాటింగ్పరంగా యశస్వి, గిల్, రాహుల్ చక్కటి ఫామ్లో ఉండగా సుదర్శన్ కూడా ఇటీవల ఆ్రస్టేలియా ‘ఎ’పై సత్తా చాటాడు. అందరూ అంతంతే! ‘మా గెలుపుపై ఎవరికీ అంచనాలు లేకపోవడమే మా బలం. ఓటమి భయం లేకుండా స్వేచ్ఛగా ఆడతాం. కివీస్ను ఆదర్శంగా తీసుకుంటాం’ అని వెస్టిండీస్ కెప్టెన్ రోస్టన్ ఛేజ్ చెబుతున్నాడు. కానీ భారత్లో టెస్టులు అంటే ఎంతో కష్టమో విండీస్కు బాగా తెలుసు. 1994లో భారత్ను ఓడించిన తర్వాత ఇక్కడ ఆడిన 10 టెస్టుల్లో విండీస్ 8 ఓడి, 2 ‘డ్రా’ చేసుకుంది. 2018లో ఆడిన సిరీస్లో 2 టెస్టులూ మూడు రోజులకే ముగిశాయి! పట్టుదలగా క్రీజ్లో నిలబడి జట్టును నడిపించగల బ్యాటర్ ఎవరూ కనిపించడం లేదు. హోప్, ఛేజ్, వారికన్లకు మాత్రమే ఇక్కడ ఆడిన అనుభవం ఉండగా, జేడెన్ సీల్స్ ఇటీవల ఆకట్టుకుంటున్నాడు. ప్రధాన పేసర్లు అల్జారీ జోసెఫ్, షామర్ జోసెఫ్ గాయంతో సిరీస్కు దూరం కావడం పెద్ద లోటు. విండీస్ కూడా ముగ్గురు పేసర్లతో ఆడనుంది. పిచ్, వాతావరణం పిచ్పై పచ్చికను ఎక్కువగా ఉంచారు. పేస్ బౌలింగ్కు అనుకూలం కాగా బ్యాటర్లు పట్టుదల కనబర్చాల్సి ఉంది. నగరంలో అనూహ్యంగా కురుస్తున్న వర్షాలు మ్యాచ్కు స్వల్పంగా అంతరాయం కలిగించవచ్చు.తుది జట్లు (అంచనా) భారత్: గిల్ (కెప్టెన్ ), జైస్వాల్, రాహుల్, సుదర్శన్, జురేల్, నితీశ్ రెడ్డి/పడిక్కల్, జడేజా, సుందర్, బుమ్రా, సిరాజ్, కుల్దీప్/ప్రసిధ్.వెస్టిండీస్: ఛేజ్ (కెప్టెన్ ), చందర్పాల్, కెవ్లాన్ అండర్సన్, అతనజె, బ్రెండన్ కింగ్, షై హోప్, గ్రీవ్స్, పైర్, వారికన్, ఫిలిప్ అండర్సన్, సీల్స్. -
వాలీబాల్ పండుగకు వేళాయె.. నాలుగో సీజన్కు రంగం సిద్దం
హైదరాబాద్: దేశవ్యాప్తంగా వాలీబాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆర్ఆర్ కేబుల్ ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) నాలుగో సీజన్కు రంగం సిద్ధమైంది. పది జట్లు బరిలో నిలిచిన ఈ మెగా లీగ్ హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా గురువారం నుంచి సందడి చేయనుంది. తొలి రోజు ఆతిథ్య హైదరాబాద్ బ్లాక్ హాక్స్, డిఫెండింగ్ చాంపియన్ కాలికట్ హీరోస్ జట్ల మధ్య జరగనున్న హోరాహోరీ మ్యాచ్తో టోర్నమెంట్ ప్రారంభం కానుంది. సొంత గడ్డపై బరిలోకి దిగుతున్న హైదరాబాద్ బ్లాక్ హాక్స్కు బ్రెజిల్ ఆటగాడు పాలో లమౌనీర్ కెప్టెన్గా వ్యవహరిస్తుండగా, పటిష్టమైన కాలికట్ హీరోస్కు అనుభవజ్ఞుడైన మోహన్ ఉక్రపాండియన్ నాయకత్వం వహిస్తున్నాడు. ఈ సీజన్ ప్రారంభాన్ని పురష్కరించుకుని బుధవారం హైదరాబాద్లో నిర్వాహకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లీగ్ సహ-వ్యవస్థాపకుడు బేస్లైన్ వెంచర్స్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ తుహిన్ మిశ్రా, లీగ్ సీఈఓ జాయ్ భట్టాచార్య, టైటిల్ స్పాన్సర్ - ఆర్ ఆర్ కేబుల్ గ్లోబల్ డైరెక్టర్ కీర్తి కాబ్రా, ఆర్ఆర్ కేబుల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శిశిర్ శర్మ, స్కాపియా వ్యవస్థాపకుడు, CEO అనిల్ గోటేటి తో పాటు పది ఫ్రాంచైజీల కెప్టెన్లు హాజరయ్యారు. -
ఢిల్లీ వీధిలో జమైకన్ చిరుత
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో ‘జమైకన్ చిరుత’ ఉసేన్ బోల్ట్ సందడి చేశాడు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఈ స్ప్రింటర్ కోసం ఢిల్లీ కాసేపు అథ్లెటిక్ రన్నింగ్ ట్రాక్గా మారింది. ఆసియాలోనే అతిపెద్ద మసాలా దినుసుల మార్కెట్ అయిన ఢిల్లీ ‘ఖరి బౌలీ’లో స్ప్రింట్ దిగ్గజం బోల్ట్ భారత ఒలింపిక్ పతక విజేతలు పీవీ సింధు, పీఆర్ శ్రీజేశ్, జాతీయ 200 మీటర్ల అథ్లెటిక్స్ చాంపియన్ అనిమేశ్ కుజుర్లతో కలిసి అభిమానుల్ని ఉత్సాహపరిచాడు. ప్రముఖ విదేశీ అపారల్, స్పోర్ట్స్ కిట్ ఉత్పాదక సంస్థ ‘ప్యుమా’ ఏర్పాటు చేసిన ఈ ప్రచార కార్యక్రమం ఆద్యంతం ఉల్లాసభరితంగా సాగింది. ఢిల్లీ సుప్రసిద్ధ మార్కెట్ ‘ఖరి బౌలీ’ టెర్రస్ (రూఫ్ టాప్)పై ఏర్పాటు చేసిన ప్రత్యేక ట్రాక్పై బోల్ట్ సరదాగా పరుగు పెట్టాడు. ఈ సరదా సరదా రిలే పరుగు ఈవెంట్లో బోల్ట్తో బ్యాడ్మింటన్ స్టార్ సింధు, మాజీ హాకీ దిగ్గజ గోల్ కీపర్ శ్రీజేశ్, అనిమేశ్ బ్యాటన్ను పంచుకున్నారు. ‘క్రీడలంటే ఇదే... సరిహద్దులను చెరిపేసి, సంస్కృతిని సమ్మిళితం చేస్తూ సాగే పయనం’ అని బోల్ట్ అన్నాడు. భారత బ్యాడ్మింటన్ స్టార్ సింధు మాట్లాడుతూ ‘ఢిల్లీ నడిబొడ్డున బోల్ట్తో భుజం భుజం కలిపి పరుగు పెట్టడం స్ఫూర్తిదాయకంగా ఉంది. ఓ క్రీడాకారిణిగా జీవితంలో ఒక్కసారైన జగది్వఖ్యాత అథ్లెట్తో రీలే ఈవెంట్లో పాల్గొనాలనే కల ఇక కల కాదు. నేటితో అది నిజమైంది. నేను క్రీడను ఎందుకింతలా ప్రేమించానో నాకు గుర్తు చేసే క్షణమిది’ అని సంతోషం వ్యక్తం చేసింది. ఖరి బౌలీలోని రూఫ్ టాప్ ట్రాక్పై జమైకన్ స్ప్రింటర్ బోల్ట్తో పాల్గొన్న ఈ రీలే తన జీవితంలో చిరస్మరణీయమవుతుందని హాకీ లెజెండ్ శ్రీజేశ్ అన్నాడు. ముగ్గురు భారత క్రీడాకారులు బోల్ట్ ట్రేడ్మార్క్ విక్టరీ సెలబ్రేషన్ పోజు ‘లైట్నింగ్ బోల్ట్’తో దిగ్గజాన్ని అనుకరించి... అలరించారు. -
టైటాన్స్ ‘సిక్సర్’
చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్లో తెలుగు టైటాన్స్ తమ నిలకడైన ప్రదర్శనను కొనసాగిస్తోంది. మూడుసార్లు చాంపియన్ పట్నా పైరేట్స్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 37–28 పాయింట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ సీజన్లో తెలుగు టైటాన్స్కిది ఆరో విజయం కావడం విశేషం. టైటాన్స్ కెప్టెన్ విజయ్ మలిక్ 13 పాయింట్లతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.మొత్తం 23 సార్లు రెయిడింగ్కు వెళ్లిన విజయ్ 13 పాయింట్లు సాధించాడు. ఇందులో తొమ్మిది టచ్ పాయింట్లుకాగా... మూడు బోనస్ పాయింట్లు, ఒకటి టాకిల్ పాయింట్ ఉండటం విశేషం. మరో ఆల్రౌండర్ భరత్ 8 పాయింట్లు స్కోరు చేయగా... డిఫెండర్ అంకిత్ 4 పాయింట్లు సంపాదించాడు. చేతన్, శుభమ్ షిండే మూడు పాయింట్ల చొప్పున స్కోరు చేశారు. పట్నా పైరేట్స్ జట్టులో రెయిడర్ అయాన్ 13 పాయింట్లతో మెరిపించినా... ఇతర ప్లేయర్లు తడబడటంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. మరో మ్యాచ్లో పుణేరి పల్టన్ 49–44 పాయింట్లతో బెంగాల్ వారియర్స్ను ఓడించింది. పుణేరి తరఫున ఆదిత్య షిండే 18 పాయింట్లు, పంకజ్ మొహితే 13 పాయింట్లు సాధించారు. బెంగాల్ వారియర్స్ రెయిడర్ దేవాంక్ ఏకంగా 25 పాయింట్లు సాధించినా చివరకు ఆ జట్టును గట్టెక్కించలేకపోయాడు. నేడు జరిగే మ్యాచ్ల్లో హరియాణా స్టీలర్స్తో జైపూర్ పింక్ పాంథర్స్; యు ముంబాతో తమిళ్ తలైవాస్ తలపడతాయి. -
భారత టెన్నిస్ జట్టులో సహజ, రష్మిక
న్యూఢిల్లీ: బిల్లీజీన్ కింగ్ కప్ మహిళల టీమ్ టెన్నిస్ టోర్నీ ప్లే ఆఫ్స్లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. తెలంగాణకు చెందిన సహజ యామలపల్లి, భమిడిపాటి శ్రీవల్లి రషి్మక జట్టులో తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) తాజా సింగిల్స్ ర్యాంకింగ్స్లో సహజ 347వ స్థానంలో నిలిచి భారత నంబర్వన్ ర్యాంకర్గా... రషి్మక 374వ స్థానంలో నిలిచి భారత రెండో ర్యాంకర్గా ఉన్నారు. సహజ,రష్మికాలతోపాటు అంకిత రైనా (447వ ర్యాంక్), రియా భాటియా (499వ ర్యాంక్), ప్రార్థన తొంబారేలను జట్టులోకి ఎంపిక చేశారు. డబ్ల్యూటీఏ డబుల్స్ ర్యాంకింగ్స్లో ప్రార్థన 131వ స్థానంలో నిలిచిన భారత డబుల్స్ నంబర్వన్గా ఉంది. వైదేహి చౌధరీని రిజర్వ్ ప్లేయర్గా... జీల్ దేశాయ్, శ్రుతి అహ్లావత్లను ట్రెయినింగ్ క్యాంప్నకు ఎంపిక చేశారు. విశాల్ ఉప్పల్ నాన్ ప్లేయింగ్ కెపె్టన్గా, రాధిక కనిత్కర్ కోచ్గా వ్యవహరిస్తారు. బిల్లీ జీన్ కింగ్ కప్ క్వాలిఫయర్స్ నవంబర్ 14 నుంచి 16వ తేదీ వరకు బెంగళూరులో జరుగుతాయి. గ్రూప్ ‘జి’లో స్లొవేనియా, నెదర్లాండ్స్లతో భారత్ పోటీపడనుంది. గ్రూప్ ‘జి’ విజేత 2026 క్వాలిఫయర్స్కు అర్హత సాధిస్తుంది. మిగిలిన రెండు జట్లు వచ్చే ఏడాది గ్రూప్–1లో పోటీపడతాయి. -
యోధాస్పై జెయింట్స్ విజయం
చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్లో వరుసగా ఐదు ఓటముల తర్వాత గుజరాత్ జెయింట్స్ ఎట్టకేలకు విజయాన్ని అందుకుంది. మంగళవారం జరిగిన మ్యాచ్లో గుజరాత్ 33–27 పాయింట్ల తేడాతో యూపీ యోధాస్ను ఓడించింది. మొహమ్మద్ రెజా, అంకిత్ దహియా చెరో 8 పాయింట్లతో గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించగా... రాకేశ్ 6, హరీశ్ 4 పాయింట్లు సాధించారు. యూపీ తరఫున భవానీ రాజ్పుత్ 8 పాయింట్లు నమోదు చేయగా...గగన్ గౌడ 6, కెప్టెన్ సుమీత్ 4 పాయింట్లు సాధించారు. ఈ విజయం తర్వాత కూడా జెయింట్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగుతోంది. మరో మ్యాచ్లో హరియాణా స్టీలర్స్ను ఒక పాయింట్ తేడాతో ఓడించి దబంగ్ ఢిల్లీ తమ అగ్రస్థానాన్ని పటిష్టపర్చుకుంది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఢిల్లీ 38–37 పాయింట్లతో హరియాణా స్టీలర్స్పై గెలుపొందింది. దబంగ్ ఢిల్లీ ఆటగాళ్ళలో రెయిడర్ అశు మలిక్ చెలరేగిపోయాడు. అతనొక్కడే 15 పాయింట్లతో సత్తా చాటగా, నీరజ్ నర్వాల్ 6 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. మరోవైపు హరియాణా తరఫున అశుకంటే మెరుగైన ప్రదర్శనే కనబర్చినా... దురదృష్టవశాత్తూ వినయ్ జట్టును గెలిపించలేకపోయాడు. వినయ్ 18 పాయింట్లతో అదరగొట్టగా, కెప్టెన్ జైదీప్ 7, ఆశిష్ నర్వాల్ 5 పాయింట్లు సాధించారు. నేడు జరిగే మ్యాచ్లలో పట్నా పైరేట్స్తో తెలుగు టైటాన్స్... బెంగాల్ వారియర్స్తో పుణేరీ పల్టన్ తలపడతాయి. -
భళా బోపన్న...
టోక్యో: వయసు ఒక అంకె మాత్రమేనని... ఆడాలన్న ఉత్సాహం, గెలవాలన్న కసి ఉంటే... నాలుగు పదులు దాటినా అద్భుతాలు సాధించవచ్చని భారత టెన్నిస్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న మరోసారి నిరూపించాడు. జపాన్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీలో జపాన్ ప్లేయర్ టకెరు యుజుకితో కలిసి 45 ఏళ్ల రోహన్ బోపన్న డబుల్స్ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. తద్వారా ఏటీపీ–500 టోర్నీల చరిత్రలో ఫైనల్కు చేరిన అతిపెద్ద వయసు్కడిగా బోపన్న గుర్తింపు పొందాడు. సోమవారం జరిగిన సెమీఫైనల్లో బోపన్న–టకెరు ద్వయం 4–6, 6–3, 18–16తో ‘సూపర్ టైబ్రేక్’లో టాప్ సీడ్ క్రిస్టియన్ హ్యారీసన్–ఇవాన్ కింగ్ (అమెరికా) జోడీని బోల్తా కొట్టించింది. 94 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో బోపన్న జంట ‘సూపర్ టైబ్రేక్’లో మూడు మ్యాచ్ పాయింట్లను కాచుకొని గెలుపొందడం విశేషం. ‘సూపర్ టైబ్రేక్’లో ఒకదశలో 1–4తో వెనుకబడ్డ ఈ ఇండో–జపాన్ ద్వయం ఆ తర్వాత 8–9 వద్ద... 9–10 వద్ద... 12–13 వద్ద మూడుసార్లు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని గట్టెక్కింది. ఎనిమిది ఏస్లు సంధించిన బోపన్న–టకెరు మూడు డబుల్ ఫాల్ట్లు చేశారు. తమ సర్వీస్ను ఒకసారికోల్పోయి, ప్రత్యర్థుల సర్వీస్ను ఒకసారి బ్రేక్ చేశారు. నేడు జరిగే ఫైనల్లో హుగో నిస్ (మొనాకో)–ఎడువార్డ్ రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్)లతో బోపన్న–టకెరు తలపడతారు.64 బోపన్న తన కెరీర్లో ఇప్పటి వరకు 64 టోర్నీలలో డబుల్స్ విభాగంలో ఫైనల్కు చేరాడు. ఇందులో 26 సార్లు గెలిచి విజేతగా... 37 సార్లు ఓడిపోయి రన్నరప్గా నిలిచాడు. -
సెమీఫైనల్కు చేరిన అల్కరాజ్..
జపాన్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీలో ప్రపంచ నంబర్వన్ అల్కరాజ్ (స్పెయిన్) సెమీఫైనల్కు చేరాడు. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ అల్కరాజ్ 6–2, 6–4తో బ్రాండన్ నకషీమా (అమెరికా)పై గెలిచాడు. మ్యాచ్ ఆరంభం నుంచి ఆధిపత్యం కనబర్చిన ఈ యంగ్స్టర్... వరుస సెట్లలో ప్రత్యర్థిని మట్టికరిపించాడు. ఈ సీజన్లో అల్కరాజ్కు ఇది 65వ విజయం కావడం విశేషం. 2023 ఏటీపీ టూర్లో సైతం 65 మ్యాచ్లు గెలిచిన అల్కరాజ్... ఇప్పుడు మరోసారి ఆ ఘనత సాధించాడు. ‘మరో సెమీఫైనల్కు చేరడం ఆనందంగా ఉంది. జపాన్లో తొలి సారి ఆడుతున్నా. మొదటిసారే సెమీస్కు చేరుకోవడం చక్కటి ఉత్సాహాన్నిచ్చింది’అని 22 ఏళ్ల అల్కరాజ్ అన్నాడు. సెమీస్లో నాలుగో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే)తో అల్కరాజ్ ఆడతాడు. -
ఆకుల శ్రీజ శుభారంభం
బీజింగ్: వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) చైనా స్మాష్ టోర్నమెంట్లో భారత నంబర్వన్, తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజ శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 42వ ర్యాంకర్ శ్రీజ 11–6, 11–9, 11–7తో ప్రపంచ 103వ ర్యాంకర్ యాంగ్ యియున్ (చైనా)పై విజయం సాధించి రెండో రౌండ్లోకి దూసుకెళ్లింది. 25 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో శ్రీజ తన సర్వీస్లో 15 పాయింట్లు, ప్రత్యర్థి సర్వీస్లో 18 పాయింట్లు సాధించింది. మరోవైపు యాంగ్ తన సర్వీస్లో 11 పాయింట్లు, ప్రత్యర్థి సర్వీస్లో 11 పాయింట్లు దక్కించుకుంది. శ్రీజ కాకుండా భారత్ నుంచి మెయిన్ ‘డ్రా’లో మనిక బత్రా మాత్రమే బరిలో ఉంది. భారత్కే చెందిన అహిక ముఖర్జీ, స్వస్తిక ఘోష్, దియా చిటాలె, యశస్విని ఘోర్పడే క్వాలిఫయింగ్ రౌండ్ను దాటి మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందలేకపోయారు. మానవ్ బోణీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత నంబర్వన్, ప్రపంచ 42వ ర్యాంకర్ మానవ్ ఠక్కర్ గెలుపు బోణీ కొట్టాడు. తొలి రౌండ్లో మానవ్ 11–5, 11–6, 11–9తో ప్రపంచ 44వ ర్యాంకర్ ఫిన్ లు (ఆ్రస్టేలియా)పై గెలుపొందాడు. 20 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్లో మానవ్ తన సర్వీస్లో 18 పాయింట్లు, ప్రత్యర్థి సర్వీస్లో 15 పాయింట్లు సంపాదించాడు. భారత్కే చెందిన అంకుశ్ భట్టాచార్య తొలి రౌండ్లోనే వెనుదిరిగాడు. క్వాలిఫయర్గా మెయిన్ ‘డ్రా’లో అడుగు పెట్టిన అంకుర్ 11–3, 9–11, 10–12, 11–6, 8–11తో నికోలస్ లుమ్ (ఆ్రస్టేలియా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. భారత్కే చెందిన సత్యన్ జ్ఞానశేఖరన్, పాయస్ జైన్, సూరావజ్జుల స్నేహిత్, హర్మీత్ దేశాయ్, మనుశ్ షా క్వాలిఫయింగ్ రౌండ్ను అధిగమించడంలో విఫలమయ్యారు. -
డీఎస్పీగా సామ సాత్విక
సాక్షి, హైదరాబాద్: టెన్నిస్ కోర్టులో సంచలన విజయాలతో రాణించిన హైదరాబాద్ ప్లేయర్ సామ సాత్విక... తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్–1 పరీక్షల్లో సత్తా చాటి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) కొలువు సాధించింది. ఆరేళ్ల ప్రాయంలో టెన్నిస్ రాకెట్ చేతపట్టి జూనియర్ స్థాయిలో వరుస విజయాలతో దూసుకెళ్లిన సాత్విక... డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్లో 2020లో అత్యుత్తమంగా 809వ ర్యాంక్ సాధించింది.హార్డ్ కోర్ట్పై సత్తాచాటిన ఈ హైదరాబాదీ... 2019 దక్షిణాసియా క్రీడల మహిళల సింగిల్స్లో పసిడి పతకంతో మెరిసింది. 2022 తర్వాత ఆటకు విరామమిచ్చిన సాత్విక... తాజాగా గ్రూప్–1 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి డీఎస్పీ పోస్టుకు అర్హత సాధించింది. శనివారం హైదరాబాద్లోని శిల్ప కళా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 25 ఏళ్ల సాత్విక నియామక పత్రం అందుకుంది. ఐటీఎఫ్ సింగిల్స్ ర్యాంకింగ్స్లో అత్యుత్తమంగా 527వ స్థానంలో నిలిచిన సాత్విక ఆ తర్వాత టెన్నిస్ కాలమిస్ట్గానూ ఆకట్టుకుంది. -
కోకో గాఫ్ ముందంజ
బీజింగ్: అమెరికా టెన్నిస్ స్టార్ కోకో గాఫ్ చైనా ఓపెన్లో మూడో రౌండ్కు దూసుకెళ్లింది. డబ్ల్యూటీఏ–1000 సిరీస్ టోర్నీ మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో ఆదివారం గాఫ్ 6–4, 4–6, 7–5తో లేలా ఫెర్నాండెజ్ (కెనడా)పై విజయం సాధించింది. రెండో సీడ్గా బరిలోకి దిగిన గాఫ్ ఈ మ్యాచ్లో 4 ఏస్లు సంధించి... 6 డబుల్ ఫాల్ట్లు చేసింది. 8 బ్రేక్ పాయింట్లు కాచుకున్న గాఫ్... మొత్తం 108 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. మంగళవారం జరగనున్న మూడో రౌండ్లో బెన్చిచ్ (స్విట్జర్లాండ్)తో గాఫ్ తలపడనుంది. ఇతర మ్యాచ్ల్లో ప్రపంచ 66వ ర్యాంకర్ ఇవా లైస్ (జర్మనీ) 6–3, 1–6, 6–4తో ప్రపంచ పదో ర్యాంకర్ రిబాకినా (కజకిస్తాన్)పై... జాస్మిన్ పావోలిని (ఇటలీ) 6–3, 6–0తో సోఫియా కెనిన్ (అమెరికా)పై విజయాలు సాధించి ముందంజ వేశారు. అమెరికా ప్లేయర్ కెస్లెర్తో మ్యాచ్ సందర్భంగా గాయపడిన చెక్ రిపబ్లిక్ ప్లేయర్ క్రెజికోవా పోటీ నుంచి తప్పుకుంది. క్వార్టర్ ఫైనల్లో జ్వెరెవ్ మరోవైపు ఏటీపీ–500 పురుషుల టోర్నమెంట్ లో రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లాడు. ప్రిక్వార్టర్స్లో జ్వెరెవ్ 7–5, 3–6, 6–3తో కొరెన్టిన్ మౌటెట్ (ఫ్రాన్స్)పై విజయం సాధించాడు. క్వార్టర్స్లో డానియల్ మెద్వెదెవ్ (రష్యా)తో జ్వెరెవ్ తలపడనున్నాడు. మరో మ్యాచ్లో లొరెన్జో ముసెట్టి (ఇటలీ) 6–3, 6–3తో ఆడియన్ మన్నారినో (ఫ్రాన్స్)పై గెలిచి ముందంజ వేశాడు. -
అనుష్క అదుర్స్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) జూనియర్ ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత షూటర్ అనుష్క ఠాకూర్ గురి అదిరింది. జూనియర్ మహిళల 50 మీటర్ల ప్రోన్ ఈవెంట్లో స్వర్ణ పతకం నెగ్గిన అనుష్క... తాజాగా 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లోనూ మెరిసి పసిడి పతకాన్ని దక్కించుకుంది. ఆదివారం జరిగిన 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఫైనల్లో అనుష్క 461 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. భారత్కే చెందిన మహిత్ సంధూ 422.7 పాయింట్లతో ఐదో స్థానంలో, ప్రాచి గైక్వాడ్ 399.3 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచారు. జూనియర్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో భారత షూటర్ అడ్రియన్ కర్మాకర్ రజత పతకాన్ని సంపాదించాడు. అడ్రియన్ 454.8 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచాడు. మరో నాలుగు రోజులపాటు జరిగే ఈ టోర్నీలో ప్రస్తుతం భారత్ పతకాల పట్టికలో నంబర్వన్ ర్యాంక్లో కొనసాగుతోంది. భారత్ ఖాతాలో 4 స్వర్ణాలు, 6 రజతాలు, 4 కాంస్యాలతో కలిపి మొత్తం 13 పతకాలు ఉన్నాయి. -
సూపర్ శ్రీహరి
అహ్మదాబాద్: పదహారేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు భారత స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ తెరదించాడు. ఆసియా అక్వాటిక్స్ చాంపియన్షిప్లో ఒకేరోజు భారత్కు మూడు పతకాలు అందించి అబ్బురపరిచాడు. ఆదివారం మొదలైన ఈ మెగా ఈవెంట్లో శ్రీహరి పురుషుల 200 మీటర్ల ఫ్రీస్టయిల్, 50 మీటర్ల బ్యాక్స్ట్రోక్ వ్యక్తిగత విభాగాల్లో రజత పతకాలు నెగ్గగా... 4 x 100 మీటర్ల మెడ్లీ రిలే ఈవెంట్లో కాంస్యం నెగ్గిన భారత బృందంలో సభ్యుడిగా ఉన్నాడు. 2020 టోక్యో ఒలింపిక్స్, 2024 పారిస్ ఒలింపిక్స్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన 24 ఏళ్ల శ్రీహరి... 200 మీటర్ల ఫ్రీస్టయిల్ ఫైనల్ను 1ని:48.47 సెకన్లలో ముగించి రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. హైబో జు (చైనా; 1ని:46.83 సెకన్లు) స్వర్ణం... హినాటో అండో (జపాన్; 1ని:48.73 సెకన్లు) కాంస్యం సాధించారు. 50 మీటర్ల బ్యాక్స్ట్రోక్ ఫైనల్ను శ్రీహరి 25.46 సెకన్లలో ముగించి రెండో స్థానాన్ని సంపాదించాడు. గుకైలాల్ వాంగ్ (చైనా; 25.11 సెకన్లు) స్వర్ణం... ములున్ చువాంగ్ (చైనీస్ తైపీ; 25.50 సెకన్లు) కాంస్యం కైవసం చేసుకున్నారు. రిషభ్ దాస్, లిఖిత్ సెల్వరాజ్, బెనెడిక్షన్ బెనిస్టన్, శ్రీహరి నటరాజ్ సభ్యులుగా ఉన్న భారత బృందం 4x100 మీటర్ల మెడ్లీ ఫైనల్ను 3ని:40.87 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. తొలి రోజు పోటీలు ముగిశాక చైనా 11 స్వర్ణాలు, 2 కాంస్యాలతో కలిపి 13 పతకాలతో టాప్ ర్యాంక్లో ఉండగా... భారత్ మూడు పతకాలతో ఆరో స్థానంలో ఉంది. -
యువ భారత్ ఏడోసారి
చెన్నై: అండర్–17 దక్షణాసియా ఫుట్బాల్ సమాఖ్య (SAFF U17) చాంపియన్షిప్లో భారత జట్టు చాంపియన్గా నిలిచింది. శనివారం కొలంబో వేదికగా జరిగిన ఫైనల్లో భారత జట్టు పెనాల్టీ షూటౌట్లో బంగ్లాదేశ్పై విజయం సాధించి ట్రోఫీ చేజిక్కించుకుంది. ఈ టోర్నీలో భారత జట్టు విజేతగా నిలవడం ఇది ఏడోసారి. తుదిపోరు నిర్ణీత సమయంలో 2–2 గోల్స్తో సమం కాగా... అనంతరం విజేతను నిర్ణయించేందుకు నిర్వహించిన పెనాల్టీ షూటౌట్లో భారత్ 4–1తో ముందంజ వేసింది. భారత్ తరఫున డల్లామౌన్ గాంగ్టే (4వ నిమిషంలో), అజ్లాన్ షా (38వ నిమిషంలో) చెరో గోల్ చేశారు. షూటౌట్లో భారత్ నుంచి డల్లామౌన్ గాంగ్టే, కొరో కొన్థోజమ్, ఇంద్ర రాణా, శుభమ్ పునియా విజయంవంతం అయ్యారు. బంగ్లా నుంచి మనిక్ మాత్రమే గోల్ చేశాడు. పసిడి గురిన్యూఢిల్లీ: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) జూనియర్ ప్రపంచకప్ టోర్నీలో భారత షూటర్ల జోరు సాగుతోంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత షూటర్లు స్వర్ణ, రజతాలు ఖాతాలో వేసుకున్నారు. రష్మిక సెహగల్–కపిల్ శర్మ అదిరిపోయే గురితో పసిడి పతకం ఖాతాలో వేసుకున్నారు.ఇటీవల ఆసియా చాంపియన్షిప్ వ్యక్తిగత విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించిన రష్మిక–కపిల్ జోడీ... శనివారం మిక్స్డ్ ఈవెంట్ ఫైనల్లో 16–10 పాయింట్ల తేడాతో భారత్కే చెందిన వన్షిక–జొనాథన్ గావిన్ ఆంటోనీ జంటపై గెలుపొందింది. ఒర్టెగా కాస్ట్రో–లూకాస్ సెంచెజ్ (స్పెయిన్) ద్వయం కాంస్యం ఖాతాలో వేసుకుంది. అంతకుముందు క్వాలిఫయింగ్ రౌండ్లో రష్మిక–కపిల్ చెరో 291 పాయింట్లు స్కోరు చేసి 582 పాయింట్లతో అగ్రస్థానంతో ఫైనల్కు చేరారు.వన్షిక–జొనాథన్ ద్వయం 578 పాయింట్ల (287+291)తో రెండో స్థానం దక్కించుకుంది. ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ క్వాలిఫయింగ్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జోడీలు పసిడి పతకం కోసం పోటీ పడగా... మూడో, నాలుగో స్థానాల్లో నిలిచిన జంటల కాంస్య పతక పోరు జరిగింది. ఫైనల్లో ఆరంభం నుంచే రష్మిక–కపిల్ జంట ఆధిక్యం కొనసాగింది. ఇప్పటికే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పురుషుల వ్యక్తిగత విభాగంలో పసిడి పతకం ఖాతాలో వేసుకున్న జొనాథన్... ఫైనల్లో విజృంభించినా... వన్షిక పలుమార్లు తడబడంతో ఈ జోడీ రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.జూనియర్ మహిళల స్కీట్ విభాగంలో ఒలింపియన్ రైజా ఢిల్లాన్ రజత పతకం కైవసం చేసుకుంది. ఇటలీకి చెందిన అరియానా 53 పాయింట్లతో స్వర్ణం గెలుచుకోగా... ఢిల్లాన్ 51 పాయింట్లతో రజతం నెగ్గింది. భారత్కే చెందిన మాన్సి రఘువంశీ 41 పాయింట్లతో కాంస్య పతకం దక్కించుకుంది. జూనియర్ మెన్స్ స్కీట్ విభాగంలో భారత షూటర్లు హర్మెహర్ సింగ్, అతుల్ సింగ్ రజావత్ వరుసగా నాలుగో, ఐదో స్థానాల్లో నిలిచి పతకం కోల్పోయారు. మూడు రోజుల పోటీలు ముగిసేసరికి భారత్ 11 పతకాల (2 స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్యాలు)తో పట్టిక అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇటలీ (2 స్వర్ణాలు, 1 రజతం) రెండో స్థానంలో ఉండగా... తటస్థ అథ్లెట్స్ రెండు స్వర్ణాలు గెలిచి మూడో స్థానంలో ఉన్నారు. -
వరుసగా రెండో పరాజయం
కాన్బెర్రా: ఆ్రస్టేలియా పర్యటనలో భారత జూనియర్ మహిళల హాకీ జట్టు వరుసగా రెండో మ్యాచ్లో పరాజయం పాలైంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శనివారం జరిగిన రెండో పోరులో జ్యోతి సింగ్ సారథ్యంలోని భారత జట్టు 0–5 గోల్స్ తేడాతో ఆస్ట్రేలియా అండర్–21 జట్టు చేతిలో ఓడింది. గత మ్యాచ్లో గట్టి పోటీనిచ్చి పరాజయం పాలైన భారత అమ్మాయిలు... ఈ పోరులో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. ప్రత్యర్థికి కనీసం పోటీనివ్వలేక వెనుకబడింది. భారత్ ఒక్క గోల్ కూడా చేయలేకపోగా... ఆ్రస్టేలియా జట్టు తరఫున మకేలా జోన్స్ (10వ, 11వ, 52వ నిమిషాల్లో) హ్యాట్రిక్ గోల్స్తో విజృంభించింది. సమీ లవ్ (38వ నిమిషంలో), మిగాలియా హవెల్ (50వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. గత మ్యాచ్లో కేవలం ఒక్క గోల్ తేడాతో ఓడిన భారత్... ఈ మ్యాచ్లో ప్రత్యర్థి గోల్పోస్ట్పై దాడులు చేయడంలో విఫలమైంది. మ్యాచ్ ఆరంభం నుంచి అటాకింగ్ గేమ్ ఆడిన ఆ్రస్టేలియా అమ్మాయిలు... పదేపదే భారత గోల్పోస్ట్పై దాడులు చేస్తూ ఒత్తిడి కొనసాగించారు. ఈ ఏడాది డిసెంబర్లో చిలీ వేదికగా ఎఫ్ఐహెచ్ జూనియర్ మహిళల ప్రపంచకప్ జరగనుండగా... దానికి ముందు ఈ సిరీస్ను సన్నాహకంగా వినియోగించుకోవాలనుకున్న భారత్కు నిరాశ ఎదురవుతోంది. ఇరు జట్ల మధ్య సోమవారం ఇక్కడే మూడో మ్యాచ్ జరగనుంది. -
బెంగాల్ వారియర్స్ మూడో విజయం
జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో బెంగాల్ వారియర్స్ మూడో విజయం ఖాతాలో వేసుకుంది. శనివారం జరిగిన తొలి పోరులో బెంగాల్ వారియర్స్ 48–42 పాయింట్ల తేడాతో పట్నా పైరెట్స్పై విజయం సాధించింది. బెంగాల్ వారియర్స్ కెప్టెన్ దేవాంక్ 22 పాయింట్లతో విజృంభించడంతో జట్టు సునాయాసంగా గెలుపొందింది. హిమాన్షు నర్వాల్, అశీష్ మాలిక్ చెరో 5 పాయింట్లతో సారథికి అండగా నిలిచారు. పట్నా పైరెట్స్ తరఫున అయాన్ 15 పాయింట్లు, మణిందర్ సింగ్ 12 పాయింట్లతో పోరాడినా జట్టును గెలిపించలేకపోయారు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో ఇరు జట్లు రెయిడింగ్లో 29 పాయింట్లు సాధించగా... ట్యాక్లింగ్లో ముందంజ వేసిన బెంగాల్ను విజయం వరించింది. తాజా సీజన్లో 8 మ్యాచ్లాడిన బెంగాల్ వారియర్స్ 3 విజయాలు, 5 పరాజయాలతో 6 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక 10వ స్థానంలో కొనసాగుతోంది. ఇక పట్నా 8 మ్యాచ్ల్లో 2 విజయాలు, 6 పరాజయాలతో 4 పాయింట్లు సాధించి 11వ స్థానంలో ఉంది. మరో మ్యాచ్లో తమిళ్ తలైవాస్ 37–28 పాయింట్ల తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్పై గెలుపొందింది. తలైవాస్ కెప్టెన్ అర్జున్ దేశ్వాల్ 13 పాయింట్లు సాధించగా... పింక్ పాంథర్స్ తరఫున నితిన్ కుమార్ 8 పాయింట్లు సాధించాడు. లీగ్లో జైపూర్ అంచె పోటీలు ముగియగా... ఇక చైన్నై వేదికగా మ్యాచ్లు జరగనున్నాయి. లీగ్లో ఆదివారం విశ్రాంతి దినం కాగా... సోమవారం జరగనున్న మ్యాచ్ల్లో యూపీ యోధాస్తో గుజరాత్ జెయింట్స్, దబంగ్ ఢిల్లీతో హర్యానా స్టీలర్స్ తలపడనున్నాయి. -
సరైన టోర్నీలు ఎంపిక చేసుకోవాలి!
ముంబై: భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధుకు మరిన్ని టైటిల్స్ గెలిచే సత్తా ఉందని, ఎలా గెలవాలో కూడా తనకు బాగా తెలుసని... అయితే మూడు పదుల వయసును గుర్తించి ఇకపై ఆడాలని వెటరన్ షట్లర్ సైనా నెహ్వల్ సూచించింది. ఈ ఏడాది సింధుకు గడ్డు కాలం నడుస్తోంది. రెండు వరుస ఒలింపిక్స్లో పతకాల విజేత అయిన ఆమె ఈ సీజన్లో ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలుపొందలేకపోయింది. ఒక్క ప్రపంచ చాంపియన్షిప్ మినహా చాలా టోర్నీల్లో మొదటి లేదంటే రెండో రౌండ్లలోనే నిష్క్రమించింది. గతనెల జరిగిన ప్రపంచ చాంపియన్షిప్లో సింధు క్వార్టర్ ఫైనల్స్ చేరింది. ఈ నేపథ్యంలోనే ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సైనా మాట్లాడుతూ.. తన సహచర షట్లర్కు పలు సూచనలు చేసింది. ఆ వివరాలు ఆమే మాటల్లోనే...వయసు మాట వినాలి వయసు పైబడిన తర్వాత ఆడలేరని కాదు... మునుపటిలా ఆడలేమన్నది వాస్తవం. దీన్ని దృష్టిలో ఉంచుకొనే మన ఆట కొనసాగించాలి. సింధు కూడా ఇదే చేయాలి. ఆమెలో గెలిచే సత్తా ఇంకా వుంది. అయితే వరుసగా అన్ని ఆడుతూ వుండటమే సరికాదు. ఇలా అన్ని కాకుండా కొన్ని ఎంపిక చేసిన టోర్నీలు, బాగా అచ్చొచ్చే సిరీస్లు, తను గెలుపొందగలననే ఈవెంట్లను ఎంచుకొని అందులో ఆడితేనే సింధుకు మేలు చేస్తుంది. మూడు పదుల వయసొచ్చాక వరుసబెట్టి ఆడటం, గెలవడం, ర్యాంకును నిలకడగా కొనసాగించడం చాలా కష్టం. ఫలానా ప్రపంచ చాంపియన్షిప్ లేదంటే ఆసియా చాంపియన్షిప్లో అదరగొడతాను అనుకునే టోర్నీల్లో దిగి పూర్తిస్థాయి ఆత్మవిశ్వాసంతో అడొచ్చు. గెలవొచ్చు. ఆమెకు అన్నీ తెలుసు ఈ సీజన్లో సింధు బరిలోకి దిగాల్సిన టోర్నీలు ఇంకా ఉన్నాయి. తప్పకుండా అందులో రాణించే సత్తా ఆమెకు వుంది. ప్రపంచ చాంపియన్షిప్లో క్వార్టర్ ఫైనల్ చేరడం ద్వారా తనలో చేవ తగ్గలేదని నిరూపించుకుంది. తదుపరి టోర్నీల్లోనూ సింధు కచ్చితంగా మెరుగైన ప్రదర్శన ఇవ్వగలదు.పురుషుల సింగిల్స్కు ఢోకా లేదు భారత బ్యాడ్మింటన్లో పురుషుల సింగిల్స్ భవిష్యత్తుకు ఏ ఢోకా లేదు. లక్ష్యసేన్, ప్రియాన్షు రావత్, హెచ్.ఎస్. ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్ ఇలా పలువురు షట్లర్లు ఉన్నారు. కానీ మహిళల సింగిల్సే కాస్త ఇబ్బందికరం. ప్రస్తుతం ఒక్క సింధు మినహా ఈ కేటగిరీలో చెప్పుకోదగ్గ ప్లేయరే లేదు. యువ షట్లర్లు మరింత మంది రావాలి. కొందరు అడపాదడపా బాగానే ఆడుతున్నారు కానీ నిలకడగా రాణించే వారే కరువయ్యారు. వచ్చే నెల జూనియర్ ప్రపంచ చాంపియన్షిప్ జరుగనున్న నేపథ్యంలో భారత్ నుంచి ఎలాంటి ప్రతిభావంతులు వస్తారో చూడాలి. ప్రపంచ పురుషుల డబుల్స్లోనే సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ షెట్టిలది అసాధారణ జోడీ. ప్రతీ టోర్నీని గెలవగలిగే సత్తా ఈ జంటకు ఉంది. సాత్విక్–చిరాగ్ల ఆటతీరును చూసినా... ప్రపంచంలోనే నంబర్వన్ జోడీ ఆటను చూసినా ఒకే తీరుగా ఉంటుంది. -
అనిరుధ్ జోడీకి టైటిల్
సాక్షి, హైదరాబాద్: జింగ్షాన్ ఓపెన్ ఏటీపీ–100 చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో అనిరుధ్ చంద్రశేఖర్ జంట టైటిల్ చేజిక్కించుకుంది. చైనా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ పురుషుల డబుల్స్లో హైదరాబాద్కు చెందిన అనిరుధ్ చంద్రశేఖర్ (భారత్)–రిసీ స్టాల్డర్ (అమెరికా) జంట విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో అనిరు«ద్–రిసీ స్టాల్డర్ జోడీ 6–2, 2–6, 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో సుంగ్ హావో హువాంగ్ (చైనీస్ తైపీ)–యుసింగ్ పార్క్ (దక్షిణ కొరియా) ద్వయంపై గెలుపొందింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో అనిరుధ్ జంట 2 ఏస్లు సంధించి... 3 డబుల్ ఫాల్ట్లు చేసింది. తొలి సెట్ను సునాయాసంగానే నెగ్గిన అనిరు«ద్–స్టాల్డర్ జోడీకి రెండో సెట్లో ప్రత్యర్థి నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదురైంది. ఇక ఉత్కంఠభరితంగా సాగిన నిర్ణయాత్మక మూడో సెట్ ‘సూపర్ టైబ్రేక్’కు చేరగా... ఒత్తిడిని అధిగమించి కీలక సమయాల్లో పాయింట్లు సాధించిన భారత జంట విజేతగా నిలిచింది. 67 నిమిషాల పాటు సాగిన తుదిపోరులో 2 బ్రేక్ పాయింట్లు సాధించిన అనిరు«ద్–స్టాల్డర్ జోడీ... మొత్తం 49 పాయింట్లు నెగ్గింది. తమ సర్వీస్లో 34 పాయింట్లు సాధించి ముందంజ వేసింది. -
రజత దీప్తి
న్యూఢిల్లీ: తెలంగాణ పారా అథ్లెట్ జివాంజి దీప్తి ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో రజత పతకంతో మెరిసింది. పారిస్ పారాలింపిక్స్లో పసిడి పతకం నెగ్గిన దీప్తి... తాజా పోటీల్లో రజతం ఖాతాలో వేసుకుంది. మహిళల 400 మీటర్ల పరుగు టి20 విభాగంలో బరిలోకి దిగిన దీప్తి శనివారం ఫైనల్లో 55.16 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రెండో స్థానంలో నిలిచింది. ఈ సీజన్లో దీప్తికి ఇదే అత్యుత్తమ ప్రదర్శన కాగా... టర్కీకి చెందిన అయెసెల్ ఒండెర్ కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పుతూ 54.51 సెకన్లలో గమ్యాన్ని చేరి పసిడి పతకం కైవసం చేసుకుంది. ఉక్రెయిన్ యులియా షులియర్ (56.20 సెకన్లు)కు కాంస్యం దక్కింది. న్యూఢిల్లీ వేదికగా శనివారం ఘనంగా ప్రారంభమైన వరల్డ్ అథ్లెటిక్స్ పోటీల్లో తొలి రోజు భారత్ ఖాతాలో మూడు పతకాలు చేరాయి. దీప్తి రజతం చేజిక్కించుకోగా... హై జంప్లో భారత అథ్లెట్లు రెండు పతకాలు కైవసం చేసుకున్నారు. పురుషుల హై జంప్ టి42 విభాగంలో శైలేశ్ కుమార్ స్వర్ణం గెలుచుకోగా... వరుణ్ సింగ్ కాంస్యం నెగ్గాడు. శైలేశ్ 1.91 మీటర్ల ఎత్తు దూకి అగ్రస్థానంలో నిలవగా... పారా ఆసియా క్రీడల పతక విజేత వరుణ్ సింగ్ 1.85 మీటర్లతో కాంస్యం నెగ్గాడు. భారత్కే చెందిన రాహుల్ (1.78 మీటర్లు) నాలుగో స్థానంలో నిలిచాడు. -
వరల్డ్ చాంపియన్.. శీతల్ దేవి సరికొత్త చరిత్ర
భారత పారా ఆర్చర్ శీతల్ దేవి (Sheetal Devi) సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచ పారా ఆర్చరీ చాంపియన్షిప్ (Para World Archery Championship)లో భాగంగా మహిళల వ్యక్తిగత కాంపౌండ్ కేటగిరీలో సంచలన విజయం సాధించింది. వరల్డ్ నంబర్ వన్, టర్కీకి చెందిన ఓజ్నుర్ క్యూర్ గిర్డీని 146- 143 తేడాతో ఓడించి స్వర్ణ పతకం (Won Gold Medal) కైవసం చేసుకుంది.పద్దెమినిదేళ్ల వయసులోనేదక్షిణ కొరియాలోని గ్వాన్జూ వేదికగా శనివారం జరిగిన పోటీలో ఈ మేరకు శీతల్ దేవి పసిడి గెలిచింది. తద్వారా ఈ చాంపియన్షిప్లో చేతుల్లేకుండానే ఈ ఘనత సాధించిన ఆర్చర్గా ఆమె చరిత్రకెక్కింది. అంతేకాదు పద్దెమినిదేళ్ల వయసులోనే శీతల్ ఈ ఘనత సాధించడం విశేషం.అంతకు ముందు.. తోమన్ కుమార్తో కలిసి ఇదే ఈవెంట్లో మిక్స్డ్ టీమ్ విభాగంలో శీతల్ దేవి కాంస్యం గెలుచుకుంది. గ్రేట్ బ్రిటన్కు చెందిన జోడీ గ్రిన్హామ్- నాథన్ మాక్క్వీన్ను 152- 149తో ఓడించి ఈ పతకం సాధించింది శీతల్- తోమన్ జోడీ.అదే విధంగా.. మహిళల ఓపెన్ టీమ్ ఈవెంట్లో శీతల్ దేవి సరితతో కలిసి రజత పతకం సాధించింది. ఫైనల్లో టర్కీ పారా ఆర్చర్ల చేతిలో ఓడిపోవడం ద్వారా వీరు రన్నరప్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.రెండు చేతులు లేకుండానేజమ్ము కశ్మీర్కు చెందిన శీతల్ దేవి పుట్టడమే ‘ఫొలొమెలియా’ అనే శారీరక స్థితి వల్ల రెండు చేతులు లేకుండానే జన్మించింది. అయినా విధివంచితురాలినని కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కాళ్లను, భుజాలను, పంటి దవడలను ఉపయోగించి బాణం ప్రయోగించడం నేర్చుకుంది. అంచెలంచెలుగా ఎదిగి 2024లో పారిస్ పారా ఒలింపిక్స్లో పతకం గెలిచింది. సాధారణంగా విలు విద్య అంటేనే చేతులతో ప్రదర్శించేది. అలాంటిది చేతులే లేకుండా శీతల్ వేది బాణం వేయడం విశేషం. ఇప్పటికే ఎన్నో పతకాలు గెలుచుకున్న ఆమె ఇప్పుడు ఏకంగా వరల్డ్ చాంపియన్ అయింది.చదవండి: IND vs WI: ‘అతడి తండ్రి గట్టిగానే నిలదీశాడు.. అందుకే ఆ ప్లేయర్పై వేటు’ -
జొనాథన్ ‘పసిడి’ గురి.. రష్మికకు రజతం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) జూనియర్ ప్రపంచకప్ టోర్నీలో రెండో రోజు భారత్కు రెండు పతకాలు లభించాయి. జూనియర్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో జొనాథన్ గావిన్ ఆంటోనీ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకోగా... జూనియర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో రష్మిక సెహగల్ రజత పతకాన్ని దక్కించుకుంది. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో జొనాథన్ 244.8 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచాడు. అరిగి లుకా (ఇటలీ; 236.3 పాయింట్లు) రజతం, లుకాస్ సాంచెజ్ (స్పెయిన్; 215.1 పాయింట్లు) కాంస్యం గెల్చుకున్నారు. భారత్కే చెందిన చిరాగ్ శర్మ 115.6 పాయింట్లతో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. అంతకుముందు 21 మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్లో జొనాథన్ 586 పాయింట్లతో టాప్ ర్యాంక్లో, చిరాగ్ శర్మ 578 పాయింట్లతో రెండో ర్యాంక్లో నిలిచారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో భారత్ నుంచి ముగ్గురు రష్మిక సెహగల్, వన్షిక, మోహిని సింగ్ బరిలోకి దిగారు. రష్మిక 236.1 పాయింట్లతో రెండో స్థానంలో రజత పతకాన్ని సొంతం చేసుకుంది. వన్షిక 174.2 పాయింట్లతో ఐదో స్థానంలో, మోహిని 153.7 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచారు. రెండో రోజు పోటీలు ముగిశాక భారత్ 2 స్వర్ణాలు, 3 రజతాలు, 2 కాంస్యాలతో కలిపి ఏడు పతకాలతో టాప్ ర్యాంక్లో ఉంది. లలిత్ గేమ్ ‘డ్రా’ సాక్షి, గుంటూరు: జాతీయ సీనియర్ చెస్ చాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్ ఎంఆర్ లలిత్ బాబు ఖాతాలో వరుసగా రెండో ‘డ్రా’ చేరింది. విజ్ఞాన్ యూనివర్సిటీలో జరుగుతున్న ఈ టోరీ్నలో లలిత్ బాబు తొలి నాలుగు గేముల్లో గెలుపొందాడు. దీపన్ చక్రవర్తి (రైల్వేస్)తో శుక్రవారం జరిగిన ఆరో రౌండ్ గేమ్ను 35 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. సూర్యశేఖర గంగూలీ (పెట్రోలియం) తో గురువారం జరిగిన ఐదో రౌండ్ గేమ్ను లలిత్ 30 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ఆరో రౌండ్ తర్వాత లలిత్ బాబు ఐదు పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. -
ఒకే జట్టులో అర్జున్, గుకేశ్ ,హంపి, హారిక
ముంబై: ప్రపంచ చదరంగంలోని మేటి ప్లేయర్లు ఒకే వేదికపై వచ్చి ఎత్తుకు పైఎత్తులు వేసేందుకు సిద్ధమయ్యారు. టెక్ మహీంద్ర, అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) సంయుక్త ఆధ్వర్యంలో జరుగనున్న గ్లోబల్ చెస్ లీగ్ (జీసీఎల్) మూడో సీజన్కు సంబంధించి ఆటగాళ్ల డ్రాఫ్టింగ్ పూర్తయింది. భారత్ నుంచి తొమ్మిది మంది గ్రాండ్మాస్టర్లు ఆయా జట్లకు ప్రాతినిధ్యం వహిస్తారు. క్లాసికల్ ఫార్మాట్లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్, ప్రపంచ ర్యాంకర్ దొమ్మరాజు గుకేశ్... ప్రపంచ ఐదో ర్యాంకర్, తెలంగాణ గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్ ఒకే జట్టు తరఫున బరిలోకి దిగనున్నారు. గుకేశ్, అర్జున్లను పీబీజీ అలాస్కాన్ నైట్స్ జట్టు సొంతం చేసుకుంది. భారత స్టార్ మహిళా గ్రాండ్మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక కూడా ఒకే జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. ప్రపంచ మహిళల ర్యాపిడ్ ఫార్మాట్ చాంపియన్, ప్రపంచ ఐదో ర్యాంకర్ కోనేరు హంపి, ప్రపంచ 19వ ర్యాంకర్, హైదరాబాద్కు చెందిన హారికను అప్గ్రాడ్ ముంబా మాస్టర్స్ జట్టు దక్కించుకుంది. డిసెంబర్ 13 నుంచి 24వ తేదీ వరకు జరిగే ఈ మెగా లీగ్కు ముంబై ఆతిథ్యమిస్తుంది. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ గ్యాంజస్ గ్రాండ్మాస్టర్స్ జట్టు తరఫున కొనసాగుతుండగా... భారత నంబర్వన్ ప్రజ్ఞానంద అల్పైన్ ఎస్జీ పైపర్స్ జట్టుకు ఆడనున్నాడు. మొత్తం ఆరు జట్ల మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో టోర్నీ జరుగుతుంది. గేమ్లను ర్యాపిడ్ ఫార్మాట్లో నిర్వహిస్తారు. ఒక్కో జట్టులో ఆరుగురు ప్లేయర్లు ఉండగా... అందులో ఇద్దరు మహిళా క్రీడాకారిణులున్నారు. గ్లోబల్ చెస్ లీగ్ మూడో సీజన్ జట్ల వివరాలు అమెరికన్ గాంబిట్స్: హికారు నకముర (అమెరికా), రిచర్డ్ రాపోర్ట్ (హంగేరి), వ్లాదిస్లావ్ అర్తెమియెవ్ (రష్యా), బీబీసారా అసయుబయేవా (కజకిస్తాన్), టియోడోరా ఇంజాక్ (సెర్బియా), వొలోడార్ ముర్జిన్ (రష్యా). అల్పైన్ ఎస్జీ పైపర్స్: ఫాబియానో కరువానా (అమెరికా), ప్రజ్ఞానంద (భారత్), అనీశ్ గిరి (నెదర్లాండ్స్), హు ఇఫాన్ (చైనా), నినో బత్సియాష్విలి (జార్జియా), లియోన్ మెన్డోంకా (భారత్). గ్యాంజస్ గ్రాండ్మాస్టర్స్: విశ్వనాథన్ ఆనంద్ (భారత్), జవోఖిర్ సిందరోవ్ (ఉజ్బెకిస్తాన్), విన్సెంట్ కీమెర్ (జర్మనీ), స్టవ్రూలా సొలాకిడూ (గ్రీస్), పొలీనా షువలోవా (రష్యా), రౌనక్ సాధ్వాని (భారత్). అప్గ్రాడ్ ముంబా మాస్టర్స్: మాక్సిమి వాచియెర్ లాగ్రెవ్ (ఫ్రాన్స్), షఖిర్యార్ మమెదైరోవ్ (అజర్బైజాన్), వెస్లీ సో (అమెరికా), కోనేరు హంపి (భారత్), ద్రోణవల్లి హారిక (భారత్), బర్దియా దానేశ్వర్ (ఇరాన్). పీబీజీ అలాస్కాన్ నైట్స్: దొమ్మరాజు గుకేశ్ (భారత్), ఇరిగేశి అర్జున్ (భారత్), లీనియర్ డొమింగెజ్ (అమెరికా), సారాసాదత్ ఖాడెమ్ (స్పెయిన్), కాటరీనా లాగ్నో (రష్యా), డేనియల్ దర్ధా (బెల్జియం). త్రివేణి కాంటినెంటల్ కింగ్స్: అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్), యి వె (చైనా), విదిత్ సంతోష్ గుజరాతి (భారత్), అలెగ్జాండ్రా కొస్టెనిక్ (స్విట్జర్లాండ్), జు జినెర్ (చైనా), మార్క్ ఆండ్రియా మౌరిజి (ఫ్రాన్స్). -
క్రికెటర్ల నుంచి స్ఫూర్తి పొందా: బోల్ట్
ముంబై: క్రికెటర్లు మైదానంలో చూపే అంకితభావం... ఆట కోసం వారు కష్టపడే తీరు చూసి ఎంతగానో స్ఫూర్తి పొందినట్లు స్ప్రింట్ దిగ్గజం ఉసేన్ బోల్ట్ పేర్కొన్నాడు. క్రికెటర్లు గ్రౌండ్లో తమ సర్వస్వాన్ని అంకితం చేయడం... అథ్లెటిక్స్లో తాను రాణించేందుకు ప్రేరణనిచ్చిందని ఈ ‘జమైకా చిరుత’ వెల్లడించాడు. సుదీర్ఘకాలం పాటు పరుగుకు పర్యాయపదంగా నిలిచిన బోల్ట్ 8 ఒలింపిక్ స్వర్ణాలు, ప్రపంచ చాంపియన్షిప్లో 11 పతకాలు సాధించాడు. శుక్రవారం ముంబైలోని జమునాబాయి నర్సీ క్యాంపస్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో బోల్ట్ పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో క్రీడా రంగ ప్రముఖులతో పాటు బాలీవుడ్ తారలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోల్ట్ మాట్లాడుతూ... ‘నేను చిన్నప్పుడు క్రికెట్కు వీరాభిమానిని. క్రికెట్ ఎదుగుదలను చూశాను. క్రికెటర్ల ప్రతిభను, వారు పనిచేసే తీరును, వారు తమను తాము మలుచుకునే విధానం అథ్లెటిక్స్లో నాకు ఎంతగానో ప్రేరణనిచ్చాయి’ అని అన్నాడు. మైకెల్ హోల్డింగ్, కోట్నీ వాల్ష్, క్రిస్ గేల్ వంటి పలువురు ప్రఖ్యాత క్రికెటర్లు కూడా జమైకన్లే కాగా... వారి ప్రభావం తనపై అధికంగా ఉన్నట్లు బోల్ట్ పేర్కొన్నాడు. విజయానికి దగ్గరి దారులు ఉండవన్న బోల్ట్ కష్టపడితే తప్పక ఫలితం వస్తుందని అన్నాడు. ‘ప్రతి పనికి కష్టపడాల్సిందే. క్రీడల్లో అంకితభావం కూడా అవసరం. ట్రాక్ అండ్ ఫీల్డ్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే దానిపై ఎక్కువ కష్టపడ్డా. ఏ రంగంలోనైనా అగ్రస్థానానికి చేరడం అంత సులభం కాదు. పరిస్థితులు పరీక్షిస్తున్నప్పుడు కఠిన సమయాలను దాటుకుంటూ ప్రపంచంలో అత్యుత్తమ అథ్లెట్గా నన్ను నేను మలుచుకునేందుకు పట్టుదల, అంకితభావంతో కృషి చేశా. అందుకు తగ్గ ప్రతిఫలం సాధించా’ అని 39 ఏళ్ల బోల్ట్ అన్నాడు. పురుషుల 100 మీటర్ల పరుగులో ప్రపంచ రికార్డు (9.58 సెకన్లు) నెలకొల్పిన బోల్ట్... గతంలోనూ పలు సందర్భాల్లో తనకు క్రికెట్ మీద ఉన్న ఇష్టాన్ని వెల్లడించాడు. -
తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ 2025 విజేతగా జమాల్
హైదరాబాద్: ఎన్ఎస్ఎల్ లక్స్ సమర్పించిన తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ 2025 టైటిల్ను బంగ్లాదేశ్ స్టార్ గోల్ఫర్ జమాల్ హుస్సేన్ కైవసం చేసుకున్నాడు. హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ (హెచ్ జీ ఏ)లో శుక్రవారం జరగాల్సిన ఫైనల్ రౌండ్ భారీ వర్షం కారణంగా రద్దయింది. దీంతో టోర్నమెంట్ ఫలితాన్ని మూడు రౌండ్ల (54 హోల్స్) స్కోర్ల ఆధారంగా ప్రకటించారు.మూడో రౌండ్ ముగిసే సమయానికి 23-అండర్ 187 (61-62-64) అద్భుత స్కోర్తో ప్రత్యర్థులపై నాలుగు షాట్ల ఆధిక్యంలో ఉన్న జమాల్ హుస్సేన్ను విజేతగా ప్రకటించారు. 40 ఏళ్ల జమాల్కు ఇది కెరీర్లో ఆరవ టైటిల్. గత నవంబర్ తర్వాత మొదటిది. ఈ విజయంతో అతను రూ. 15 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు. ఫలితంగా పీజీటీఐ 2025 ఆర్డర్ ఆఫ్ మెరిట్లో 14 నుంచి 10వ స్థానానికి ఎగబాకాడు.చండీగఢ్కు చెందిన అక్షయ్ శర్మ (62-64-65) మొత్తంగా 19-అండర్ 191 స్కోర్తో రన్నరప్గా నిలిచాడు. అతను రూ. 10 లక్షల చెక్ను అందుకుని, పీజీటీఐ మెరిట్ జాబితాలో 34వ స్థానం నుంచి 21వ స్థానానికి చేరుకున్నాడు. బెంగళూరు ఆటగాడు ఖలీన్ జోషి (65-66-66) 13-అండర్ 197 స్కోర్తో మూడో స్థానంలో నిలిచాడు. ఢిల్లీకి చెందిన అర్జున్ ప్రసాద్ 11-అండర్ 199 స్కోర్తో ఆరో స్థానంలో నిలిచాడు. ఈ ప్రదర్శన తర్వాత తన సీజన్ ఆదాయం రూ. 69,71,599తో పీజీటీఐ ర్యాంకింగ్స్లో రెండో స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఈ టోర్నీలో పాల్గొనని యువరాజ్ సంధు (చండీగఢ్) రూ. 88,67,200 సంపాదనతో పీజీటీఐ మనీ లిస్ట్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక, స్థానిక గోల్ఫర్లలో హైదరాబాద్కు చెందిన విశేష్ శర్మ ఉత్తమ ప్రదర్శన కనబరిచాడు. అతను 5-అండర్ 205 స్కోర్తో 22వ స్థానంలో నిలిచాడు.ఈ టోర్నమెంట్లో జమాల్ హుస్సేన్ మూడు రౌండ్లలోనూ ఆధిక్యాన్ని ప్రదర్శించి, తన సమీప ప్రత్యర్థులకు ఏ దశలోనూ అవకాశం ఇవ్వలేదు.మొదటి రౌండ్ లో టోర్నమెంట్లోనే అత్యల్ప స్కోర్ (61) నమోదు చేసి తొలి రోజు నుంచే ఒక షాట్ ఆధిక్యంతో అగ్రస్థానంలో నిలిచాడు. తర్వాతి రౌండ్లలోనూ అదే జోరు కొనసాగించాడు. అత్యంత నిలకడైన ఆట తీరుకు నిదర్శనంగా 54 హోల్స్లో జమాల్ కేవలం ఒక్క బోగీ మాత్రమే నమోదు చేయడం విశేషం.విజయం అనంతరం జమాల్ హుస్సేన్ మాట్లాడుతూ, "ఈ సీజన్లో టైటిల్ గెలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. గతంలో రెండు సార్లు టైటిల్కు దగ్గరగా వచ్చి విఫలమయ్యాను. ఫైనల్ రౌండ్ ఆడాలని చాలా అనుకున్నాను. కానీ వాతావరణం మన చేతుల్లో లేదు. ఈ వారం మొత్తం నా డ్రైవింగ్, పుట్టింగ్ అద్భుతంగా ఉన్నాయి. మొదటి రౌండ్లో సాధించిన 61 స్కోర్ టోర్నీ విజవానికి మంచి పునాది వేసింది. వచ్చే నెలలో ఢిల్లీలో జరిగే డీపీ వరల్డ్ ఇండియా ఛాంపియన్షిప్లో రాణించడమే నా తదుపరి లక్ష్యం" అని అన్నాడు. -
ఘోర ప్రమాదం నుంచి కోలుకొని... ఐదేళ్ల తర్వాత రీఎంట్రీ
స్కార్పెరియా ఇ శాన్ పియరో (ఇటలీ): సుమారు ఐదేళ్ల క్రితం ఫార్ములా వన్ ట్రాక్పై ఘోర ప్రమాదం నుంచి బయటపడిన ఫ్రెంచ్ డ్రైవర్ రొమైన్ గ్రోజన్... తిరిగి స్టీరింగ్ చేతపట్టనున్నాడు. 2020 సీజన్ బహ్రెయిన్ గ్రాండ్ప్రి రేసులో అతడి కారు ఘోర ప్రమాదానికి గురైంది. వాయు వేగంతో దూసుకెళ్తున్న సమయంలో ఉన్నట్టుండి ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో గ్రొజాన్ కారు రెండు ముక్కలవగా... పెద్దఎత్తున మంటలు చెలరేగాయి.నమ్మశక్యంగా లేదుఅందులో చిక్కుకున్న గ్రొజాన్... కాలిన గాయాలతో బయటపడ్డాడు. చికిత్స అనంతరం కోలుకున్న అతడు ఇక అప్పటి నుంచి ఎఫ్1 రేసులకు దూరంగా ఉంటున్నాడు. కాగా... గ్రొజాన్ శుక్రవారం ఇటలీలోని ముగెల్లో సర్క్యూట్లో తన పాత జట్టు ‘హాస్’ తరఫున కొత్త కారును పరీక్షించనున్నాడు. ఈ సమయంలో కుటుంబ సభ్యుల ఫొటోలు ఉన్న హెల్మెట్ అతడు ధరించనున్నాడు.‘నిజంగా నమ్మశక్యంగా లేదు. ప్రమాదం జరిగి ఐదేళ్లు అయింది. పాత మిత్రులతో కలిసి తిరిగి కారు నడపనుండటం ప్రత్యేకమైన అనుభూతి’ అని గ్రొజాన్ పేర్కొన్నాడు. ప్రమాదం అనంతరం ఫార్ములావన్కు దూరమైన గ్రొజాన్... అమెరికా వేదికగా జరిగే ఇండి కార్, స్పోర్ట్స్ కార్ సిరీస్ల్లో పాల్గొంటున్నాడు.చదవండి: దబంగ్ ఢిల్లీ ‘టాప్’ షో -
దబంగ్ ఢిల్లీ ‘టాప్’ షో
జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో దబంగ్ ఢిల్లీ తిరిగి గెలుపుబాట పట్టింది. తొలి ఆరు మ్యాచ్ల్లో విజయాలు సాధించిన దబంగ్ ఢిల్లీ గత మ్యాచ్లో ఓడినా... వెంటనే కోలుకొని తిరిగి విజయం సాధించింది. లీగ్లో భాగంగా గురువారం జరిగిన పోరులో దబంగ్ ఢిల్లీ 47–26 పాయింట్ల తేడాతో యు ముంబాను మట్టికరిపించింది. దబంగ్ ఢిల్లీ తరఫున అశు మలిక్ 23 పాయింట్లతో విజృంభించాడు. నీరజ్ నర్వాల్ 7 పాయింట్లతో అతడికి అండగా నిలిచాడు. తాజా సీజన్లో 8 మ్యాచ్లాడిన దబంగ్ ఢిల్లీ 7 విజయాలు, ఒక పరాజయంతో 14 పాయింట్లు ఖాతాలో వేసుకొని తిరిగి పాయింట్ల పట్టికలో ‘టాప్’కు దూసుకెళ్లింది. మరో మ్యాచ్లో యూపీ యోధాస్ ‘టై బ్రేకర్’లో బెంగళూరు బుల్స్పై నెగ్గింది. నిర్ణీత సమయంలో ఇరు జట్ల పాయింట్లు 36–36తో సమం కాగా... విజేతను తేల్చేందుకు నిర్వహించిన టై బ్రేకర్లో యూపీ యోధాస్ 6–5తో బుల్స్ను చిత్తుచేసి ముందంజ వేసింది. యూపీ యోధాస్ తరఫున భవాని రాజ్పుత్ 10 పాయింట్లు సాధించాడు. శుక్రవారం లీగ్లో విశ్రాంతి దినం... శనివారం జరగనున్న మ్యాచ్ల్లో పట్నా పైరేట్స్తో బెంగాల్ వారియర్స్, జైపూర్ పింక్ పాంథర్స్తో తమిళ్ తలైవాస్ తలపడతాయి. -
క్లీన్స్వీప్...
న్యూఢిల్లీ: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) జూనియర్ ప్రపంచకప్ టోర్నమెంట్ను భారత షూటర్లు ఘనంగా ప్రారంభించారు. తొలి రోజు భారత షూటర్లు మొత్తం ఐదు పతకాలను సొంతం చేసుకున్నారు. జూనియర్ మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో భారత్ క్లీన్స్వీప్ చేసింది. టాప్–3లో భారత షూటర్లే నిలిచి స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించారు. అనుష్క ఠాకూర్ పసిడి పతకం నెగ్గగా... అన్షిక రజత పతకాన్ని, ఆద్య అగర్వాల్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. అనుష్క 621.6 పాయింట్లతో అగ్రస్థానంలో, అన్షిక 619.2 పాయింట్లతో రెండో స్థానంలో, ఆద్య 615.9 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచారు. భారత్కే చెందిన సానియా 610.9 పాయింట్లతో ఎనిమిదో స్థానాన్ని దక్కించుకోగా... నిమ్రత్ కౌర్ 604.3 పాయింట్లతో తొమ్మిదో స్థానాన్ని సంపాదించింది. మరోవైపు జూనియర్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్లో భారత్కు రెండు పతకాలు లభించాయి. దీపేంద్ర సింగ్ షెకావత్ 617.9 పాయింట్లతో రజత పతకం నెగ్గగా... రోహిత్ కన్యాన్ 616.3 పాయింట్లతో కాంస్య పతకాన్ని సాధించాడు. స్వతంత్ర అథ్లెట్గా పోటీపడ్డ రష్యా షూటర్ కామిల్ నురిఖెమెతోవ్ 618.9 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు.


