breaking news
Other Sports
-
ప్రపంచకప్ టోర్నీకి సన్నాహాలు
న్యూఢిల్లీ: జూనియర్ హాకీ ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా... భారత జట్టు నాలుగు దేశాల సిరీస్కు సిద్ధమైంది. ఈ నెల 21 నుంచి 25 వరకు జర్మనీ వేదికగా జరగనున్న ఈ టోర్నీలో ఆతిథ్య జర్మనీ, ఆస్ట్రేలియా, స్పెయిన్లతో యువ భారత జట్టు తలపడనుంది. భారత జూనియర్ జట్టుకు అరిజీత్ సింగ్ హుందల్ సారథ్యం వహిస్తుండగా... అమీర్ అలీ వైస్కెపె్టన్గా వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్ కోసం భారత జట్టు బుధవారం బెంగళూరు నుంచి బెర్లిన్కు బయలుదేరింది. శనివారం జరగనున్న తొలి పోరులో ఆతిథ్య జర్మనీతో భారత్ తలపడనుంది. అనంతరం ఆదివారం ఆ్రస్టేలియాతో, మంగళవారం స్పెయిన్తో మ్యాచ్లు ఆడనుంది. రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరగనున్న ఈ సిరీస్లోని అన్నీ మ్యాచ్లు బెర్లిన్లో నిర్వహించనున్నారు. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఈ నెల 25న ఫైనల్ జరగనుంది. ‘2025 జూనియర్ హాకీ వరల్డ్కప్నకు ముందు ఈ టోర్నమెంట్ భారత జట్టుకు ఎంతో కీలకం కానుంది. మెగా టోర్నీకి ఎక్కువ రోజులు లేకపోవడంతో... ఇది సన్నద్ధతకు చక్కగా తోడ్పడనుంది. బలాబలాలను బేరీజు వేసుకోవడంతో పాటు జట్టు కూర్పును సిద్ధం చేసేందుకు ఉపకరిస్తుంది. ఇంకా మెరుగవ్వాల్సిన అంశాలేంటి అనేదానిపై కూడా ఒక స్పష్టత వస్తుంది. బలమైన ప్రత్యర్థులతో తలపడ్డప్పుడే మన బలహీనతలు బయటపడతాయి’అని హాకీ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది నవంబర్ 28 నుంచి డిసెంబర్ 10 వరకు భారత్ వేదికగా జూనియర్ హాకీ ప్రపంచకప్ జరగనుంది. -
సారీ... కోకో!
బెర్లిన్: తాజా ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ కోకో గాఫ్కు ప్రపంచ నంబర్వన్ ప్లేయర్ సబలెంకా (బెలారస్) క్షమాపణలు చెప్పింది. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కోసం ఇద్దరు తలపడగా... అమెరికన్ స్టార్ కోకో గాఫ్ విజేతగా నిలిచింది. మ్యాచ్ అనంతరం రన్నరప్ సబలెంకా మాట్లాడుతూ... తన స్వీయ తప్పిదాల వల్లే ప్రత్యర్థి గెలిచిందని, విజయంలో గాఫ్ పాత్రలేదన్నట్లుగా వ్యాఖ్యానించింది. మూడు గ్రాండ్స్లామ్ టైటిల్స్ విజేత అయిన సబలెంకా వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెలువెత్తాయి. దీంతో క్షమాపణలు కోరుతూ సబలెంకా లేఖ రాసింది. ‘నా వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. ఓ విజేతను ఉద్దేశించి అలా మాట్లాడాల్సింది కాదు. నా భావోద్వేగాలను నియంత్రించుకుని ఉంటే బాగుండేది. గాఫ్ను క్షమాపణలు కోరుతున్నాను. మనుషులందరూ పొరపాట్లు చేస్తుంటారు. జీవితంలో నేర్చుకునే దశలో ఉన్న నేను కూడా అంతే. తదనంతరం నేను మాట్లాడిన మాటలు నన్నే కలత పెట్టాయి. ముమ్మాటికి ఫ్రెంచ్ ఓపెన్ గెలిచే అర్హత గాఫ్కే ఉంది. ఆమె విజయాన్ని నేను మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నా’ అని లేఖలో పేర్కొంది. నిజానికి గాఫ్పై మాటలతో దాడి చేయాలనే ఉద్దేశం తనకు లేదని చెప్పింది. మ్యాచ్ ముగిసిన వెంటనే మీడియా సమావేశం జరగడం... ఫలితంతో నిరాశలో ఉన్న తాను అలా మాట్లాడాల్సి వ చ్చిందని వివరణ ఇ చ్చింది. ‘ఎప్పుడైనా సరై ప్రత్యరి్థని గౌరవించే నాకు ఇలా చిన్నబుచ్చే వ్యాఖ్యలు చేయడం పట్ల మనస్తాపం చెందాను. అందుకే మన్నించమని విజ్ఞప్తి చేస్తున్నాను. జీవితంలో నేను ఎప్పటికి గుర్తుంచుకోవాల్సిన పాఠం ఇది’ అని సబలెంకా తెలిపింది. బెలారస్ స్టార్, ప్రపంచ నంబర్వన్ సబలెంకా రెండు ఆ్రస్టేలియన్ ఓపెన్ (2023, 2024) టైటిల్స్తో పాటు ఒక యూఎస్ ఓపెన్ (2024) ట్రోఫీ గెలుచుకుంది. అయితే ప్రపంచ రెండో ర్యాంకర్ కోకో గాఫ్తో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో తడబడింది. ఏకంగా 70 అనవసర తప్పిదాలు చేసింది. గాఫ్ మాత్రం 30 తప్పిదాలే చేసి టైటిల్ విజేతగా నిలిచింది. కోకో గాఫ్ 2023లో సబలెంకాపైనే గెలిచి యూఎస్ ఓపెన్ టైటిల్ కూడా సాధించింది. -
ఆసియా కప్ పుట్బాల్ క్వాలిఫయర్స్ టోర్నీకి సౌమ్య
న్యూఢిల్లీ: ఆసియా కప్–2026 మహిళల ఫుట్బాల్ క్వాలిఫయర్స్ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 24 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో తెలంగాణకు చెందిన సౌమ్య గుగులోత్ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. దేశవాళీ లీగ్లో ఈస్ట్ బెంగాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సౌమ్య గత సీజన్లో భారత మహిళల ఉత్తమ ఫుట్బాలర్ అవార్డును అందుకుంది. ఆసియా కప్ క్వాలిఫయర్స్లో భాగంగా భారత జట్టు గ్రూప్ ‘బి’లో ఉంది. భారత జట్టుతోపాటు గ్రూప్ ‘బి’లో థాయ్లాండ్, మంగోలియా, తిమోర్ లెస్టె, ఇరాక్ జట్లున్నాయి. ఈనెల 23 నుంచి జూలై 5 వరకు జరిగే గ్రూప్ ‘బి’ మ్యాచ్లకు బ్యాంకాక్ ఆతిథ్యమిస్తుంది. ఈనెల 23న తమ తొలి మ్యాచ్లో మంగోలియాతో ఆడనున్న భారత జట్టు ఆ తర్వాత వరుసగా తిమోర్ లెస్టె (జూన్ 29న), ఇరాక్ (జూలై 2న), థాయ్లాండ్ (జూలై 5న) జట్లతో పోటీపడుతుంది. 2026 ఆసియా కప్ మహిళల ఫుట్బాల్ టోర్నీకి మార్చి 1 నుంచి 21 వరకు ఆ్రస్టేలియా ఆతిథ్యమిస్తుంది. మొత్తం 12 దేశాలు బరిలోకి దిగుతాయి. ఆతిథ్య దేశం హోదాలో ఆ్రస్టేలియా, 2022 టోర్నీ చాంపియన్ చైనా, 2022 టోర్నీ రన్నరప్ దక్షిణ కొరియా, 2022 టోర్నీలో మూడో స్థానం పొందిన జపాన్ జట్లు ఇప్పటికే నేరుగా అర్హత సాధించాయి. మిగిలిన ఎనిమిది బెర్త్లు క్వాలిఫయర్స్ టోర్నీ ద్వారా ఖరారవుతాయి. క్వాలిఫయర్స్ టోర్నీలో మొత్తం 34 జట్లు పాల్గొంటున్నాయి. 34 జట్లను ఎనిమిది గ్రూప్లుగా విభజించారు. ‘ఎ’, ‘బి’ గ్రూపుల్లో 5 జట్ల చొప్పున... మిగిలిన ‘సి’, ‘డి’, ‘ఈ’, ‘ఎఫ్’, ‘జి’, ‘హెచ్’ గ్రూపుల్లో 4 జట్ల చొప్పున ఉన్నాయి. ఎనిమిది గ్రూప్ల విజేత జట్లు వచ్చే ఏడాది ఆసియా కప్ టోర్నీకి అర్హత సాధిస్తాయి. భారత మహిళల ఫుట్బాల్ జట్టు: ఎలాంగ్బమ్ పంథోయ్ చాను, మోనాలీసా దేవి, పాయల్ బసుదె (గోల్కీపర్లు), హేమం షిల్కీ దేవి, కిరణ్ పిస్దా, మార్టినా థోక్చోమ్, స్వీటీ దేవి, నిర్మలా దేవి, పూర్ణిమ కుమారి, సంజు, రంజన చాను (డిఫెండర్లు), అంజు తమాంగ్, గ్రేస్ డాంగ్మె, కార్తీక అంగముత్తు, రత్నబాలా దేవి, ప్రియదర్శిని సెల్లాదురై, సంగీత బస్ఫోరె (మిడ్ ఫీల్డర్లు), లిండా కోమ్ సెర్టో, మాళవిక, మనీషా కల్యాణ్, మనీషా నాయక్, ప్యారీ జక్సా, రింపా హల్దర్, సౌమ్య గుగులోత్ (ఫార్వర్డ్స్). -
చెన్నై ఓపెన్ పునరాగమనం
చెన్నై: తమిళనాడు టెన్నిస్ అసోసియేషన్ (టీఎన్టీఏ) అధ్యక్షుడు, భారత మేటి ప్లేయర్ విజయ్ అమృత్రాజ్ కృషి ఫలించింది. మూడేళ్ల తర్వాత చెన్నై ఓపెన్ భారత టెన్నిస్లో పునరాగమనం చేయనుంది. ఈ అక్టోబర్లో టోర్నీ నిర్వహణకు మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) ఆమోదం తెలిపింది. అక్టోబర్ 27 నుంచి మెయిన్ డ్రా పోటీలు జరుగుతాయని టీఎన్టీఏ అధ్యక్షుడు విజయ్ అమృత్రాజ్ తెలిపారు. ‘మొత్తానికి మా ప్రయత్నాలు ఫలించాయి. చెన్నైలో మేటి అంతర్జాతీయ టెన్నిస్ టోర్నీకి మార్గం సుగమమైంది. ఈ టోర్నీని తిరిగి నగరంలో నిర్వహించాలనే మా ప్రయత్నాలకు మొదటి నుంచి వెన్నంటే ఉండి సహకరించిన తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి, తమిళనాడు స్పోర్ట్స్ అథారిటీకి కృతజ్ఞతలు’ అని విజయ్ అన్నారు. ప్రముఖ స్పోర్ట్స్ చానెల్ నెట్వర్క్ ఈ టోర్నీ మ్యాచ్లను ప్రసారం చేస్తుందన్నారు. చెన్నై అభిమానులు, భారత టెన్నిస్ ప్రియులు ఈ ఈవెంట్ను విజయవంతం చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. చివరి సారిగా చెన్నై ఓపెన్ డబ్ల్యూటీఏ–250 టోర్నమెంట్ను 2022లో నిర్వహించారు. చెక్ రిపబ్లిక్ ప్లేయర్ లిండా ఫ్రువిత్రొవా సింగిల్స్ చాంపియన్గా నిలిచింది. -
వరుసగా ఆరో పరాజయం
ఆంట్వర్ప్ (బెల్జియం): అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) యూరోపియన్ అంచె ప్రొ లీగ్లో భారత పురుషుల జట్టు నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. హార్దిక్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టు యూరోపియన్ అంచెలో వరుసగా ఆరో పరాజయాన్ని చవిచూసింది. ఆ్రస్టేలియా జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్లో టీమిండియా 2–3 గోల్స్ తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్కు ముందు నెదర్లాండ్స్తో రెండు మ్యాచ్ల్లో, అర్జెంటీనాతో రెండు మ్యాచ్ల్లో, ఆ్రస్టేలియాతో ఒక మ్యాచ్లో భారత జట్టు ఓటమి పాలైంది. ఆ్రస్టేలియాతో జరిగిన రెండో మ్యాచ్లో భారత జట్టు మ్యాచ్ మొదలైన మూడో నిమిషంలోనే ఖాతా తెరిచింది. సంజయ్ చేసిన గోల్తో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఆధిక్యంలోకి వెళ్లామన్న ఆనందం భారత్కు మరుసటి నిమిషంలోనే ఆవిరైంది. రెండు నిమిషాల వ్యవధిలో ఆస్ట్రేలియా రెండు గోల్స్ చేసి భారత్కు షాక్ ఇచి్చంది. నాలుగో నిమిషంలో టిమ్ బ్రాండ్, ఐదో నిమిషంలో బ్లేక్ గోవర్స్ ఆస్ట్రేలియాకు ఒక్కో గోల్ అందించారు. రెండో క్వార్టర్లో భారత్ మూడో గోల్ సమర్పించుకుంది. 18వ నిమిషంలో కూపర్ బర్న్స్ గోల్తో ఆస్ట్రేలియా 3–1తో ముందంజ వేసింది. మూడో క్వార్టర్లో దిల్ప్రీత్ సింగ్ గోల్తో భారత్ ఈ ఆధిక్యాన్ని 2–3కు తగ్గించింది. అనంతరం భారత జట్టు స్కోరును సమం చేసేందుకు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆ్రస్టేలియా చివరి పది నిమిషాల్లో మూడు పెనాల్టీ కార్నర్లు సంపాదించినా భారత గోల్కీపర్ కృషన్ బహదూర్ పాఠక్ నిర్వీర్యం చేశాడు. ఓవరాల్గా మ్యాచ్లో భారత జట్టుకు నాలుగు పెనాల్టీ కార్నర్లు రాగా ఒక్క దానిని సద్వినియోగం చేసుకుంది. మరోవైపు ఆ్రస్టేలియాకు ఎనిమిది పెనాల్టీ కార్నర్లు రాగా ఆ జట్టు కూడా ఒక్క దానిని లక్ష్యానికి చేర్చింది. ఈ మ్యాచ్లో బరిలోకి దిగడం ద్వారా భారత మాజీ కెప్టెన్, మిడ్ఫీల్డర్ మన్ప్రీత్ సింగ్ కెరీర్లో 400 మ్యాచ్లు పూర్తి చేసుకున్నాడు. మొత్తం తొమ్మిది జట్లు పోటీపడుతున్న 2024–2025 ప్రొ లీగ్లో భారత జట్టు 14 మ్యాచ్లు పూర్తి చేసుకుంది. ఐదు మ్యాచ్ల్లో గెలిచి, తొమ్మిది మ్యాచ్ల్లో ఓడింది. 15 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. భారత జట్టు తమ చివరి రెండు మ్యాచ్లను బెల్జియం జట్టుతో (జూన్ 21న, 22న) ఆడుతుంది. -
‘ప్రపంచ’ ఆర్చరీ పోటీలకు జ్యోతిసురేఖ, చికిత
పుణే: స్టార్ ఆర్చర్లు వెన్నం జ్యోతి సురేఖ, బొమ్మదేవర ధీరజ్ (ఆంధ్రప్రదేశ్), తనిపర్తి చికిత (తెలంగాణ) ప్రపంచ కప్ స్టేజ్–4 టోర్నీ, ప్రపంచ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనే భారత జట్టుకు ఎంపికయ్యారు. భారత ఆర్చరీ సంఘం (ఏఏఐ) ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించిన జాతీయ సెలక్షన్ ట్రయల్స్లో పలువురు స్టార్ ఆర్చర్లకు నిరాశ ఎదురైంది. ఒలింపియన్ అతాను దాస్, ప్రపంచ ఏడో ర్యాంకర్ అభిషేక్ వర్మ, ఈ ఏడాది ప్రపంచకప్ టోర్నీల్లో మూడు పతకాలు నెగ్గిన మధుర ట్రయల్స్లో విఫలమయ్యారు. ఆశ్చర్యకరంగా టీనేజ్ ఆర్చర్లు ‘ప్రపంచ’ పోటీలకు అర్హత సాధించడం విశేషం! 15 ఏళ్ల మహారాష్ట్ర ఆర్చర్లు గత ఖడకే, శర్వారీ మహిళల రికర్వ్ లో ... 16 ఏళ్ల ప్రీతిక మహిళల కాంపౌండ్లో భారత జట్టుకు ఎంపికయ్యారు. మహిళల కాంపౌండ్లో జ్యోతి సురేఖ (18.25 పాయింట్లు), పర్ణీత్ (14), ప్రీతిక (12.25) వరుసగా తొలి మూడు స్థానాలు పొందారు. చికిత (12.25) కూడా ప్రీతికతో సమవుజ్జీగా నిలిచినప్పటికీ ‘షూటాఫ్’తో చికిత నాలుగో స్థానానికి పరిమితమైంది. అయితే ఈ ప్రదర్శనతో ఆమె ప్రపంచకప్ ఈవెంట్కు అర్హత పొందగా... టాప్–3 ప్లేయర్లు రెండు మెగా ఈవెంట్లకూ క్వాలిఫై అయ్యారు. పురుషుల రికర్వ్లో అతాను దాస్ అర పాయింట్ (0.5) తేడాతో ప్రపంచ పోటీలకు దూరమయ్యాడు. ప్రపంచ కప్ స్టేజ్–4 ఈవెంట్ వచ్చే నెల 8 నుంచి 13 వరకు మాడ్రిడ్లో జరుగుతుంది. ప్రపంచ చాంపియన్ షిప్ను సెపె్టంబర్ 5 నుంచి 12 వరకు దక్షిణ కొరియాలో నిర్వహిస్తారు. -
ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమి..
ఎఫ్ఐహెచ్ మహిళల ప్రొ లీగ్లో భారత అమ్మాయిలు ఆఖరిదాకా పోరాడినా ఆస్ట్రేలియా చేతిలో పరాజయం తప్పలేదు. లండన్ వేదికగా శనివారం జరిగిన పోరులో మహిళల జట్టు 2–3 స్కోరుతో కంగారు చేతిలో కంగుతింది. ఆరంభంలో భారత అమ్మాయిలకు కలిసిరాలేదు. తొలిక్వార్టర్లో రెండు పెనాల్టీ కార్నర్లు లభించగా... భారత స్ట్రయికర్లు లక్ష్యం చేర్చేందుకు శతవిధాలా ప్రయతి్నంచారు.కానీ ప్రత్యర్థి డిఫెండర్లు, గోల్కీపర్ అలీషా సమన్వయంతో అడ్డుకున్నారు. అయితే రెండో క్వార్టర్ మొదలైన నిమిషంలోనే కౌట్నే షానెల్ (16వ నిమిషం) భారత రక్షణ పంక్తిని బోల్తాకొట్టించి ఆసీస్కు గోల్ తెచి్చపెట్టింది. ఇదే క్వార్టర్లో మరో పదినిమిషాలు గడిచేసరికి నెట్వద్ద చురుగ్గా మాటువేసిన లెక్సీ పికెరింగ్ (26వ నిమిషం) చాకచక్యంగా గోల్ చేసి ఆసీస్ ఆధిక్యాన్ని 2–0తో రెట్టింపు చేశారు.తిరిగి మూడో క్వార్టర్ మొదలైన కాసేపటికే టాటమ్ స్టివార్ట్ (35వ నిమిషం) పెనాల్టీ స్ట్రోక్తో కంగారూ సేన 3–0తో ఎదురులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఎట్టకేలకు మూడో క్వార్టర్ ముగిసే దశలో డ్రాగ్ఫ్లికర్ దీపిక (44వ నిమిషం) చేసిన గోల్తో భారత్ ఖాతా తెరువగలిగింది. 1–3తో తొలిసారి ఆధిక్యానికి గండికొట్టిన భారత్ మళ్లీ 6 నిమిషాల వ్యవధిలో దీపిక ఫ్లిక్ చేసిన బంతి రి»ౌండ్ కాగా... పక్కనే ఉన్న నేహా (52వ నిమిషం)సమయస్ఫూర్తితో ప్రత్యర్థి గోల్పోస్ట్లోకి తరలించింది. ఆఖర్లో స్కోరును సమం చేసే అవకాశం పెనాల్టీ కార్నర్ రూపంలో వచి్చనప్పటికీ గోల్గా మలచడంతో భారత స్ట్రయికర్లు విఫలమాయ్యరు. ఆదివారం ఇదే వేదికపై ఆ్రస్టేలియాతో భారత అమ్మాయిలు రెండో మ్యాచ్ ఆడతారు. -
భారత్కు మళ్లీ పరాజయమే...
అంట్వర్ప్ (బెల్జియం): ప్రత్యర్థులు మారుతున్నా... భారత్ ఫలితాలే మారడం లేదు. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్ యూరోప్ అంచె పోటీల్లో భారత సీనియర్ పురుషుల జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసలో ఐదో ఓటమిని చవిచూసిన భారత్... మూడో ప్రత్యర్థి చేతిలోనూ చిత్తయ్యింది. నెదర్లాండ్స్, అర్జెంటీనాల చేతిల్లో కంగుతిన్న భారత్... తాజాగా ఆస్ట్రేలియా ధాటికి తలవంచింది. శనివారం ఆసీస్తో జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 2–3 స్కోరు తేడాతో ఐరోపాలో అలవాటైన అపజయాన్ని మూటగట్టుకుంది. భారత్ తరఫున అభిషేక్ 8, 35వ నిమిషాల్లో రెండు గోల్స్ సాధించాడు. కంగారూ జట్టులో నాథన్ ఎఫ్రామస్ (42వ ని.), జోయెల్ రింటాల (56వ ని.), టామ్ క్రెయిగ్ (60వ ని.) తలా ఒక గోల్ చేశారు.నిజానికి ఈ ప్రొ లీగ్ హాకీలో మెరుగైన స్థానంతోనే నేరుగా వచ్చే ప్రపంచకప్కు అర్హత సాధించాలనుకున్న భారత్కు వరుస పరాభవ ఫలితాలు శరాఘాతమయ్యాయి. యూరోప్ లెగ్లో మొదట నెదర్లాండ్స్తో... తర్వాత అర్జెంటీనాతో ఆడిన రెండేసి చొప్పున ఆడిన మ్యాచ్ల్లో భారత్ ఓడింది. రెండు క్వార్టర్లు ఆధిక్యంలో ఉన్నా... ఆరంభంలో భారత్ దూకుడు కనబరిచింది. పది నిమిషాల్లోనే ప్రత్యర్థిపై ఆధిక్యత సాధించింది. ఆటగాళ్ల సమన్వయం, డిఫెండర్ల పట్టు... ఇలా ఇన్ని అనుకూలతలున్నప్పటికీ అన్నీ ఆరంభశూరత్వంగానే ఆవిరయ్యాయి. తొలి క్వార్టర్ 8వ నిమిషంలోనే అభిషేక్ గోల్తో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో క్వార్టర్లో మరో గోల్ సాధించలేకపోయినప్పటికీ ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో డిఫెండర్లు, స్ట్రయికర్లు సమష్టిగా శ్రమించారు. మూడో క్వార్టర్ మొదలైన ఐదు నిమిషాలకే అభిషేక్ మరో గోల్ భారత్ ఆధిక్యం కాస్తా 2–0కు పెరిగింది. ఇలా దాదాపు 41 నిమిషం దాకా కొనసాగిన భారత ఆధిపత్యానికి ఆ మరుసటి నిమిషంలోనే నాథన్ ఎఫ్రామస్ గండి కొట్టాడు. 2–1తో అప్పటికి మంచిస్థితిలోనే ఉంది. అయితే ఆఖరి క్వార్టర్ కూడా ముగిసే దశలో ఆసీస్కు లభించిన రెండు పెనాల్టీ కార్నర్లు భారత్ను నిండా ముంచేశాయి. 4 నిమిషాల వ్యవధిలో రింటాల (56వ ని.), క్రెయిగ్ (60వ ని.) పెనాల్టీ కార్నర్లను గోల్స్గా మలచడంతో భారత్కు మరో పరాజయం తప్పలేదు. నేడు ఇదే వేదికపై భారత్... ఆసీస్తో రెండో మ్యాచ్ ఆడుతుంది. -
నీరజ్ చోప్రా... ఎనిమిదేళ్ల తర్వాత
పారిస్: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పారిస్ డైమండ్ లీగ్లో టైటిల్ సాధించడమే లక్ష్యంగా సాధన చేస్తున్నాడు. ఈ ఏడాది రెండు టోర్నమెంట్లలో రెండో స్థానంలో నిలిచిన 27 ఏళ్ల నీరజ్... ఈ నెల 20 నుంచి జరగనున్న లీగ్లో అగ్ర స్థానం దక్కించుకోవాలని చూస్తున్నాడు. చివరిసారిగా 2017లో పారిస్ డైమండ్ లీగ్లో పాల్గొన్న నీరజ్... మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాత ఇందులో పాల్గొంటున్నాడు. ఈ మేరకు నిర్వాహకులు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘రెండు ఒలింపిక్ పతకాల విజేత నీరజ్ చోప్రా, రెండు సార్లు ప్రపంచ చాంపియన్ అండర్సన్ పీటర్స్తో పాటు ఇప్పటికే 90 మీటర్ల మార్క్ దాటిన మరో ఐదుగురు ప్రపంచ స్థాయి జావెలిన్ త్రోయర్లు బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారు’ అని నిర్వహకులు పేర్కొన్నారు. గతేడాది పారిస్ ఒలింపిక్స్ నేపథ్యంలో ఈ లీగ్కు దూరంగా ఉన్న నీరజ్ చోప్రా... ఈసారి సత్తాచాటాలని భావిస్తున్నాడు. ఈ లీగ్ అనంతరం చెక్ రిపబ్లిక్లో జరగనున్న గోల్డెన్ స్పైక్ అథ్లెటిక్స్ మీట్లో నీరజ్ పాల్గొననున్నాడు. ఆ తర్వాత భారత్లో తొలిసారి నిర్వహిస్తున్న ప్రపంచ స్థాయి జావెలిన్ త్రో పోటీల్లో నీరజ్ పాల్గొననున్నాడు. ‘నీరజ్ చోప్రా క్లాసిక్’ పేరుతో వచ్చే నెల 5న బెంగళూరు వేదికగా జరగనున్న ఈ ఈవెంట్కు ప్రపంచ అథ్లెటిక్ సమాఖ్య ‘ఎ’ కేటగిరీ గుర్తింపునిచి్చంది. ఇందులో అంతర్జాతీయ స్టార్ జావెలిన్ త్రోయర్లు పాల్గొననున్నారు. -
ఆర్య–అర్జున్ పసిడి గురి
మ్యూనిక్: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) మూడో ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత షూటర్లు అదరగొట్టారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో సురుచి స్వర్ణ పతకం సాధించగా... శనివారం భారత్ ఖాతాలో మరో పసిడి పతకం చేరింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో ఆర్య బోర్సే–అర్జున్ బబూతా జంట అద్వితీయమైన గురితో ఒలింపిక్ చాంపియన్ జిఫీ వాంగ్–లిహావో షెంగ్ (చైనా) ద్వయంపై గెలుపొందింది. ఫైనల్లో ఆర్య–అర్జున్ జోడీ 17–7తో చైనా జంటను చిత్తుచేసి అగ్ర స్థానంలో నిలిచింది.నార్వే జంటకు కాంస్య పతకం దక్కింది. భారత్కే చెందిన ఎలవెనిల్ వలరివన్–అంకుశ్ జాధవ్ జోడీ 631.8 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. పోటీల చివరి రోజు క్వాలిఫయింగ్ ఈవెంట్లో అర్జున్ 317.7 పాయింట్లు సాధించగా... ఆర్య 317.5 పాయింట్లు స్కోరు చేసింది. దీంతో ఓవరాల్గా 635.2 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి ఫైనల్కు అర్హత సాధించింది. ఈ ఏడాది ఏప్రిల్లో పెరూ రాజధాని లిమాలో జరిగిన రెండో ప్రపంచకప్ టోర్నీ రుద్రాం„Š పాటిల్తో కలిసి ఆర్య బోర్సే 10 మీటర్ల ఎయిర్ రైఫిల్లో రజత పతకం గెలిచింది. తాజా ప్రపంచకప్లో భారత్కు ఇది రెండో స్వర్ణం కాగా... ఓవరాల్గా నాలుగో పతకం. సిఫ్ట్ కౌర్ సమ్రా, ఎలవెనిల్ వలరివన్ వ్యక్తిగత కాంస్యాలు గెలుచుకున్నారు. ఇక పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్లకు నిరాశ ఎదురైంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మనూ భాకర్–ఆదిత్య మల్రా 577 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. సురుచి సింగ్–వరుణ్ తోమర్ జంట 576 పాయింట్లతో పదో స్థానానికి పరిమితమైంది. -
‘వారిద్దరిలా అభిమానాన్ని పొందలేదు’
బెల్గ్రేడ్: పురుషుల టెన్నిస్ను దాదాపు రెండు దశాబ్దాల పాటు ఫెడరర్, నాదల్, జొకోవిచ్ శాసించారు. ఫెడరర్ 20 గ్రాండ్స్లామ్ టైటిల్స్ గెలుచుకోగా, నాదల్ 22 గ్రాండ్స్లామ్ టైటిల్స్తో దానిని సవరించాడు. ఆ తర్వాత జొకొవిచ్ 24 గ్రాండ్స్లామ్ ట్రోఫీలు సాధించి అగ్ర స్థానాన నిలిచాడు. అయితే సుదీర్ఘ కెరీర్లో ఫెడరర్, నాదల్ అభిమానులకు చేరువైనంతగా జొకోవిచ్ కాలేకపోయాడు. ఆట అద్భుతమే అయినా కొన్నిసార్లు కోర్టులో తన ప్రవర్తన, మాటతీరు అతని ప్రతిష్టను కొంత తగ్గించాయి. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు స్వయంగా జొకోవిచ్ ఈ విషయాన్ని అంగీకరించాడు. ఫెడరర్, నాదల్ తరహాలో తాను టెన్నిస్ ప్రేమికుల నుంచి తగినంత అభిమానం పొందలేకపోయానని అతను వ్యాఖ్యానించాడు. ‘నాలో ఎన్నో లోపాలు ఉండవచ్చు. అది వాస్తవం. అయితే ఎప్పుడూ మనసులో చెడు ఆలోచనలు లేకుండా మంచి ఉద్దేశంతోనే నా జీవితాన్ని గడిపాను. నాకు నచ్చినట్లుగా బతికాను. కానీ ఫెడరర్, నాదల్తో పోలిస్తే చాలాసార్లు నేను ఎవరికీ అక్కర్లేని పసివాడిలా నన్ను చూశారు. ఈ కారణంగా చాలాసార్లు బాధపడ్డాను. ఎందుకు ఇలా జరుగుతోందని చాలాసార్లు నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. నా ప్రవర్తన మారితే అంతా బాగుంటుందని భావించి ఆ ప్రయత్నమూ చేశాను. అయినా సఫలం కాలేకపోయాను’ అని జొకోవిచ్ ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకే నన్ను పట్టించుకోలేదు... ఫెడరర్, నాదల్తో పోలిస్తే తనకు తగినంత గౌరవం దక్కకపోవడానికి భౌగోళిక పరిస్థితులు కూడా ఒక కారణమని జొకోవిచ్ అభిప్రాయపడ్డాడు. యూరోప్లోని ప్రముఖ దేశాల నుంచి వారిద్దరు వచ్చారని, తాను వారికి సవాల్ విసరడం కొందరికి నచ్చలేదని అతను అన్నాడు. ‘నాకు గుర్తింపు రాకముందే ఫెడరర్, నాదల్ సమఉజ్జీలైన ప్రత్యర్థులుగా పోరాడుతూ వచ్చారు. పశ్చిమాన బలమైన దేశాలైన స్విట్జర్లాండ్, స్పెయిన్ల నుంచి వారు వచ్చారు. కాబట్టి నాతో పోలిస్తే సహజంగానే వారికి ఎన్నో సంబంధాలు ఉన్నాయి. వీరిద్దరే గొప్ప ఆటగాళ్లు అనే కొందరి మనస్తత్వాన్ని నేను మార్చలేకపోయాను. పైగా నంబర్వన్ను అవుతాను అంటూ నేను చేసిన ప్రకటన చాలా మందికి నచ్చలేదు’ అని 38 ఏళ్ల జొకోవిచ్ గుర్తు చేసుకున్నాడు. వారిద్దరిపై గౌరవం ఉంది... ఫెడరర్, నాదల్లతో ఎన్నో గొప్ప మ్యాచ్లలో తలపడ్డానని, ఏనాడూ తప్పుగా మాట్లాడలేదని జొకో వ్యాఖ్యానించాడు. ‘మైదానంలో ప్రత్యర్థులైనంత మాత్రాన ఎవరినైనా ద్వేషిస్తామా. వారికి కీడు తలపెట్టాలని, ఏం చేసైనా ఓడించాలనే ఆలోచన కూడా ఎప్పుడూ రాలేదు. గెలుపు కోసమే పోరాడాం. మెరుగైన ఆటగాడే గెలిచాడు. వారిద్దరిపై నాకు ఎంతో గౌరవం ఉంది. ఒక్క చెడు మాట కూడా మాట్లాడలేదు. ఇకపై కూడా మాట్లాడను’ అని సెర్బియా స్టార్ తమ మనసులో మాట వెల్లడించాడు. ముగ్గురి ఆట భిన్నం... జొకోవిచ్ తన ఆటతో పాటు ఫెడరర్, నాదల్ ఆట గురించి కూడా విశ్లేషించాడు. ముగ్గురి ఆట భిన్నంగా ఉంటుందని అతను పోల్చాడు. ‘ఫెడరర్ చాలా ప్రతిభావంతుడు. అతని ఆట చాలా అందంగా అనిపిస్తుంది. అలవోకగా అతను కదిలి షాట్లు ఆడే తీరులో కూడా కళ కనిపిస్తుంది. నాదల్ దీనికి పూర్తిగా భిన్నం. అతని శారీరక సామర్థ్యం అసమానం. దానినే బాగా వాడుకుంటాడు. నా ఆట వీరిద్దరికి మధ్యలో ఉన్నట్లుగా ఉంటుంది. నాదల్ ప్రదర్శనతో నాకు దగ్గరి పోలికలు ఉన్నాయి. సమయం సాగుతున్నకొద్దీ మా ఆటలో మరిన్ని సొంత ప్రత్యేకతలు వచ్చి చేరాయి. ఒకరి ఆటను మరొకరు అభినందించుకుంటూ ముందుకు సాగాం. ఈ క్రమంలో మాలో పోటీతత్వం పెరిగి ఆట కూడా మరింత మెరుగైంది. వీరిద్దరితో హోరాహోరీ సమరాల్లో తలపడటం నాకు మేలు చేసింది. నా కెరీర్ ముందుకు సాగడంలో నిస్సందేహంగా వారి ప్రభావం ఉంది’ అని ఇటీవల జెనీవా ఓపెన్లో విజేతగా నిలిచి కెరీర్లో 100 సింగిల్స్ టైటిల్స్ పూర్తి చేసుకున్న జొకోవిచ్ వివరించాడు. -
భారత్ X ఆస్ట్రేలియా
లండన్: మహిళల హాకీ ప్రొ లీగ్ యూరోపియన్ అంచె పోటీల కోసం భారత జట్టు పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది. లోటుపాట్లను సవరించుకొని ఆస్ట్రేలియాను ‘ఢీ’కొట్టేందుకు రెడీ అయ్యింది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్లో 9 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్న భారత మహిళల జట్టు పట్టికలో ఎగబాకేందుకు యూరోప్ అంచెను సది్వనియోగం చేసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా మహిళల టీమ్ నేడు, రేపు వరుస మ్యాచ్ల్లో ఆసీస్తో తలపడుతుంది. ప్రస్తుత జట్టు యువ క్రీడాకారిణిలతో పాటు అనుభవజు్ఞల కలబోతతో సమతూకంగా ఉంది. యూరోప్ పర్యటనతో రాటుదేలాక సెపె్టంబర్లో జరిగే ఆసియా చాంపియన్షిప్ టైటిల్తో నేరుగా వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్కు అర్హత సాధించాలని మహిళల జట్టు లక్ష్యంగా పెట్టుకుంది. గట్టి ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు దీటుగానే సిద్ధమయ్యామని చీఫ్ కోచ్ హరేంద్ర సింగ్ అన్నారు. ‘ప్రతి విభాగం కూడా పటిష్టమయ్యేందుకు సమష్టిగా శ్రమించాం. అయితే రెండు విభాగాల్లో మరింత దృష్టి సారించాల్సి వచ్చింది. ఫలితాన్ని తారుమారు చేసే గోల్ కీపింగ్, డ్రాగ్ ఫ్లికింగ్ విభాగాలు అంత్యంత కీలకం’ అని కోచ్ అన్నారు. ఇందులో భాగంగానే డ్రాగ్ఫ్లికర్లు దీపిక, మనీషాలకు ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. యూరోప్ టూర్కు ముందే డ్రాగ్ ఫ్లిక్లో నిపుణుడైన నెదర్లాండ్స్ కోచ్ టూన్ సీప్మన్తో పది రోజుల పాటు ఇద్దరు శిక్షణ తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన డ్రాగ్ ఫ్లికర్లలో చాలా మంది సీప్మన్ శిష్యులే అని ఈ సందర్భంగా హరేంద్ర సింగ్ చెప్పుకొచ్చారు. ఇలా ప్రతి విభాగంలోనూ క్రీడాకారిణిలను దీటుగా తయారు చేస్తున్నామని చెప్పారు. భారత్ అంచె పోటీల్లో ప్రపంచ నంబర్వన్ నెదర్లాండ్స్ను 2–2తో భారత్ నిలువరించేందుకు ప్రత్యేక కోచింగ్లే దోహదం చేశాయన్నారు. భువనేశ్వర్లో జరిగిన ఆ మ్యాచ్లో భారత్ షూటౌట్లో గెలిచి బోనస్ పాయింట్ సాధించింది. పెర్త్ (ఆ్రస్టేలియా)లో ‘ఎ’ జట్టుతో ఆడిన ఫ్రెండ్లీ మ్యాచ్ల అనుభవం కూడా భారత అమ్మాయిలకు కలిసివస్తుందని చీఫ్ కోచ్ హరేంద్ర సింగ్ అన్నారు. ఆసీస్ సీనియర్ జట్టు బలాబలాలేంటో తమకు తెలుసని పరిస్థితులకు తగ్గట్లు వ్యూహాలతోనే బరిలోకి దిగుతామని చెప్పారు. కంగారూ టీమ్తో వరుస మ్యాచ్లు ముగిసిన వెంటనే ఇక్కడే 17, 18 తేదీల్లో పటిష్టమైన అర్జెంటీనాను ఎదర్కొంటుంది. అనంతరం బెల్జియంకు పయనమవుతుంది. అంట్వర్ప్లో 21, 22 తేదీలో జరిగే మ్యాచ్ల్లో మేటి జట్టయిన బెల్జియంతో ఢీకొంటుంది. చివరగా బెర్లిన్లో ఈ నెల 28, 29 తేదీల్లో చైనాతో జరిగే పోటీలతో యూరోప్ అంచె ప్రొ లీగ్ ముగుస్తుంది. -
‘స్వర్ణ’ సురుచి
మ్యూనిక్: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) మూడో ప్రపంచకప్ టోర్నీలో భారత జట్టుకు తొలి స్వర్ణ పతకం లభించింది. శుక్రవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో 19 ఏళ్ల సురుచి సింగ్ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ సీజన్లో సురుచి పోటీపడ్డ మూడు ప్రపంచకప్ టోర్నీల్లోనూ బంగారు పతకాలు గెలవడం విశేషం. ఎనిమిది మంది మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో సురుచి 241.9 పాయింట్లు స్కోరు చేసి విజేతగా అవతరించింది. కామిలీ జెద్రెజెవ్స్కీ (ఫ్రాన్స్; 241.7 పాయింట్లు) రజతం నెగ్గగా... కియాన్జున్ యావో (చైనా; 221.7 పాయింట్లు) కాంస్య పతకాన్ని సంపాదించింది. ఈ ఏడాది జాతీయ సీనియర్ జట్టులోకి వచ్చిన సురుచి ఏప్రిల్లో బ్యూనస్ ఎయిర్స్లో జరిగిన తొలి ప్రపంచకప్ టోర్నీలో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం, మిక్స్డ్ టీమ్ విభాగంలో కాంస్యం సాధించింది. ఏప్రిల్లోనే పెరూ రాజధాని లిమాలో జరిగిన రెండో ప్రపంచకప్ టోర్నీలో సురుచి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో, మిక్స్డ్ టీమ్ విభాగంలో బంగారు పతకాలు గెలిచింది. -
ఐదు రోజుల్లో మూడు ప్రపంచ రికార్డులు నెలకొల్పిన కెనడా స్విమ్మర్
విక్టోరియా: కెనడా స్టార్ స్విమ్మర్ సమ్మర్ మెకింటోష్ మరో ప్రపంచ రికార్డు తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచ చాంపియన్షిప్లో పాల్గొనే కెనడా జట్టును ఎంపిక చేసేందుకు నిర్వహించిన సెలెక్షన్ ట్రయల్స్లో 18 ఏళ్ల మెకింటోష్ ఐదు రోజుల వ్యవధిలో మూడో ప్రపంచ రికార్డు తిరగరాసింది. బుధవారం జరిగిన 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లీ రేసులో 4 నిమిషాల 23.65 సెకన్లలో లక్ష్యాన్ని చేరి తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డును (4 నిమిషాల 24.38 సెకన్లు) తిరగరాసింది.గత ఏడాది పారిస్ ఒలింపిక్స్లో మూడు స్వర్ణ పతకాలు సాధించిన మెకింటోష్... వచ్చే నెలలో సింగపూర్ వేదికగా జరగనున్న ప్రపంచ అక్వాటిక్స్ చాంపియన్షిప్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఈ ట్రయల్స్లో భాగంగా ఇప్పటికే మెకింటోష్ 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లీ, 400 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగాలలో రెండు ప్రపంచ రికార్డులు సృష్టించింది. ‘పోటీకి ముందే ఏదో ప్రత్యేకంగా చేస్తానని అనుకున్నా. నా కెరీర్లో ఇది అత్యుత్తమ టోర్నీ. ప్రపంచ రికార్డులు నమోదయ్యేవి బద్దలవడానికే. కొలనుకు వీడ్కోలు చెప్పేంతవరకు వాటిపై నా పేరే ఉండే విధంగా చూసుకుంటా’ అని మెకింటోష్ పేర్కొంది. -
సింగిల్స్ విజేతల ఖాతాలో రూ. 35 కోట్లు
లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్కు సంబంధించి ప్రైజ్మనీ వివరాలను నిర్వాహకులు ప్రకటించారు. ఈ ఏడాది పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు 30 లక్షల పౌండ్ల (రూ. 35 కోట్లు) చొప్పున లభిస్తాయి. రన్నరప్గా నిలిచిన క్రీడాకారులకు 15 లక్షల 20 వేల పౌండ్ల (రూ. 17 కోట్ల 68 లక్షలు) చొప్పున అందజేస్తారు. సెమీఫైనల్లో ఓడిన వారికి 7,75,000 పౌండ్ల (రూ. 9 కోట్లు) చొప్పున... క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగిన వారికి 4 లక్షల పౌండ్ల (రూ. 4 కోట్ల 65 లక్షలు) చొప్పున... ప్రిక్వార్టర్ ఫైనల్లో పరాజయం పాలైన వారికి 2,40,000 పౌండ్ల (రూ. 2 కోట్ల 79 లక్షలు) చొప్పున లభిస్తాయి. మూడో రౌండ్లో ఓడిన వారికి 1,52,000 పౌండ్ల (రూ. 1 కోటీ 72 లక్షలు) చొప్పున... రెండో రౌండ్లో వెనుదిరిగిన వారికి 99 వేల పౌండ్ల (రూ. 1 కోటీ 15 లక్షలు) చొప్పున, తొలి రౌండ్లో ఓడిన వారికి 66 వేల పౌండ్ల (రూ. 77 లక్షలు) చొప్పున అందజేస్తారు. పురుషుల, మహిళల డబుల్స్ విభాగంలో టైటిల్ సాధించిన జోడీలకు 6,80,000 పౌండ్ల (రూ. 7 కోట్ల 91 లక్షలు) చొప్పున లభిస్తాయి. ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీ జూన్ 30 నుంచి జూలై 13వ తేదీ వరకు జరుగుతుంది. గత సంవత్సరం పురుషుల సింగిల్స్లో అల్కరాజ్, మహిళల సింగిల్స్లో క్రెజికోవా (చెక్ రిపబ్లిక్) టైటిల్స్ సాధించారు. -
సిఫ్ట్ కౌర్కు కాంస్యం
మ్యూనిక్: ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్ ఖాతాలో రెండో పతకం చేరింది. గురువారం జరిగిన మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో భారత షూటర్ సిఫ్ట్ కౌర్ సమ్రా కాంస్య పతకం సాధించింది. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో సిఫ్ట్ కౌర్ 453.1 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. డ్యూస్టాడ్ జెనెట్ హెగ్ (నార్వే; 466.9 పాయింట్లు) స్వర్ణం, ఎమిలీ జెగీ (స్విట్జర్లాండ్; 464.8 పాయింట్లు) రజతం సొంతం చేసుకున్నారు. పంజాబ్కు చెందిన 23 ఏళ్ల సిఫ్ట్ కౌర్కు ఓవరాల్గా ప్రపంచకప్ టోర్నీలలో ఇది ఐదో పతకం కావడం విశేషం. మరోవైపు గురువారమే జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో భారత్కు నిరాశ ఎదురైంది. క్వాలిఫయింగ్లో అంకుశ్ జాదవ్ (631.7 పాయింట్లు) 11వ స్థానంలో, అర్జున్ బబూటా (629.1 పాయింట్లు) 43వ స్థానంలో, సందీప్ సింగ్ (628.3 పాయింట్లు) 53వ స్థానంలో నిలిచారు. -
‘ఫిఫా’ ప్రపంచకప్కు బ్రెజిల్ క్వాలిఫై
సావో పాలో: వచ్చే ఏడాది జరగనున్న ప్రతిష్టాత్మక ‘ఫిఫా’ ప్రపంచకప్నకు బ్రెజిల్, ఈక్వెడార్, ఆ్రస్టేలియా జట్లు అర్హత సాధించాయి. దక్షిణ అమెరికా అర్హత టోర్నీలో భాగంగా బ్రెజిల్ జట్టు మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన మ్యాచ్లో 1–0 గోల్ తేడాతో పరాగ్వేపై విజయం సాధించింది. తద్వారా ‘ఫిఫా’ వరల్డ్కప్ బెర్తు దక్కించుకుంది. ఇప్పటి వరకు ఐదుసార్లు (1958, 1962, 1970, 1994, 2002లో) చాంపియన్గా నిలిచిన బ్రెజిల్ 2022 ప్రపంచకప్లో క్వార్టర్ఫైనల్లో ఓడింది. మరోవైపు పెరూతో జరిగిన మ్యాచ్ను ‘డ్రా’ చేసుకోవడం ద్వారా ఈక్వెడార్ ముందంజ వేసింది. ఇప్పటికే వరల్డ్కప్నకు అర్హత సాధించిన డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా, కొలంబియాతో మ్యాచ్ను 1–1తో ‘డ్రా’ చేసుకుంది. 2026లో మూడు దేశాలు ఆతిథ్యమిస్తున్న ఫిఫా ప్రపంచకప్లో 48 జట్లు పాల్గొననున్నాయి. దక్షిణ అమెరికా అర్హత టోర్నీలో అర్జెంటీనా 35 పాయింట్లతో అగ్ర స్థానంలో ఉండగా... ఈక్వెడార్, బ్రెజిల్ చెరో 25 పాయింట్లతో వరుసగా రెండో, మూడో స్థానాల్లో ఉన్నాయి. దక్షిణ అమెరికా నుంచి వరల్డ్కప్నకు ఆరు జట్లు నేరుగా అర్హత సాధించనున్నాయి. బొలీవియాతో మ్యాచ్లో 0–2తో పరాజయం పాలైన చిలీ జట్టు... వరుసగా మూడోసారి విశ్వ సమరానికి దూరమైంది. మరోవైపు ఆ్రస్టేలియా వరుసగా ఆరో సారి ఫిఫా ప్రపంచకప్ బెర్తు దక్కించుకుంది. 2–1 గోల్స్ తేడాతో సౌదీ అరేబియాపై గెలవడం ద్వారా ఆసీస్ ముందంజ వేసింది. -
భారత్కు మరో పరాజయం
అమ్స్టెల్వీన్ (నెదర్లాండ్స్): అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్లో భారత పురుషుల జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. గత రెండు మ్యాచ్ల్లో నెదర్లాండ్స్ చేతిలో ఓడిన హర్మన్ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత జట్టు... మూడో మ్యాచ్లో అర్జెంటీనా చేతిలో కూడా ఓడింది. యూరప్ అంచె పోటీల్లో భాగంగా బుధవారం జరిగిన పోరులో టీమిండియా 3–4 గోల్స్ తేడాతో అర్జెంటీనా చేతిలో పరాజయం పాలైంది. గత రెండు మ్యాచ్ల్లో పెనాల్టీ కార్నర్లను గోల్స్గా మలచడంలో విఫలమైన భారత్... ఈసారి పేలవ డిఫెన్స్తో మూల్యం చెల్లించుకుంది. భారత్ తరఫున కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ (12వ, 33వ నిమిషాల్లో) రెండు గోల్స్ సాధించగా... అభిõÙక్ (42వ నిమిషంలో) ఒక గోల్ కొట్టాడు. అర్జెంటీనా తరఫున మాటియాస్ రే (3వ నిమిషంలో), లూకాస్ మార్టినేజ్ (17వ నిమిషంలో), శాంటియాగో టరాజొనా (34వ నిమిషంలో), లూకాస్ మెండెజ్ (46వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. భారత డిఫెండర్ల తప్పిదంతో ఆట ప్రారంభమైన మూడో నిమిషంలోనే కెప్టెన్ మాటియాస్ రే అర్జెంటీనా ఖాతా తెరిచాడు. హర్మన్ప్రీత్ గోల్తో టీమిండియా స్కోరు సమం చేసినా... మన రక్షణ పంక్తి పదే పదే తప్పిదాలకు పాల్పడటంతో అర్జెంటీనా దూకుడు పెంచగలిగింది. ఆఖర్లో పెనాల్టీ కార్నర్ రూపంలో స్కోరు సమం చేసే అవకాశం వచి్చనా... మనవాళ్లు దాన్ని గోల్గా మలచలేకపోయారు. గురువారం మరోసారి అర్జెంటీనాతో భారత్ తలపడనుంది. భారత్కు రెండో విజయంఆంట్వర్ప్ (బెల్జియం): యూరోప్ పర్యటనలో భారత జూనియర్ మహిళల హాకీ జట్టు జోరు కొనసాగుతోంది. తొలి మ్యాచ్లో ఆతిథ్య బెల్జియంపై విజయం సాధించిన భారత అమ్మాయిలు... బుధవారం రెండో మ్యాచ్లో 2–1 గోల్స్ తేడాతో మరో సారి బెల్జియంపై గెలుపొందారు. భారత్ తరఫున లాల్థాట్లుయాంగి (35వ నిమిషంలో), గీతా యాదవ్ (50వ నిమిషంలో) చెరో గోల్ చేశారు. బెల్జియం తరఫున్ వాన్ హెల్మోంట్ (48వ నిమిషంలో) ఏకైక గోల్ చేసింది. ఈ పర్యటనలో గురువారం భారత్ జట్టు చివరి మ్యాచ్ ఆడనుంది. -
మనూ భాకర్కు నిరాశ
మ్యూనిక్: ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ వరల్డ్ కప్లో రెండో రోజు బుధవారం భారత్ ఒక్క పతకం కూడా గెలుచుకోలేకపోయింది. పారిస్ ఒలింపిక్స్ కాంస్యపతక విజేత మనూ భాకర్, చైన్ సింగ్ తమ విభాగాల్లో ఫైనల్స్కు అర్హత సాధించినా మెడల్ మాత్రం దక్కలేదు. మహిళల 25 మీటర్ల పిస్టల్ క్వాలిఫయింగ్ ఈవెంట్లో మనూ 588 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచి ఫైనల్కు చేరింది. అయితే అసలు పోరులో ఆమె తడబడింది. ఫైనల్లో 20 పాయింట్లు మాత్రమే సాధించి మూడో ఎలిమినేషన్ రౌండ్ను దాటలేకపోయింది. ఇదే ఈవెంట్లో హైదరాబాద్ షూటర్ ఇషా సింగ్ కూడా నిరాశపర్చింది. క్వాలిఫయింగ్లో 585 పాయింట్లకే పరిమితమైన 11వ స్థానంలో నిలిచిన ఇషా ఫైనల్కు కూడా అర్హత సాధించలేదు. మరో భారత షూటర్ సిమ్రన్ప్రీత్ కౌర్ 32వ స్థానంలో నిలిచింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ ఈవెంట్లో చైన్ సింగ్ ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఇటీవల అర్జెంటీనాలో జరిగిన ప్రపంచ కప్లో కాంస్యం గెలిచిన చైన్ సింగ్ క్వాలిఫయింగ్లో ఐదో స్థానంలో ఫైనల్కు చేరినా పతకం మాత్రం దక్కలేదు. నేడు జరిగే పోటీల్లో భారత షూటర్లు అర్జున్ బబూటా, సందీప్ సింగ్, సిఫ్ట్ కౌర్, శ్రియాంక, ఆషి చౌక్సీ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. -
స్క్వాష్ కోహి‘నూర్’
‘పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది’ అన్నట్లు... ఆరేళ్లకే రాకెట్ పట్టిన ఆ చిన్నారి పదేళ్లు తిరిగేసరికి వరల్డ్ టాప్–10లో చోటు దక్కించుకుంది. మరో నాలుగేళ్లకే ప్రపంచ నంబర్వన్ ర్యాంక్ కైవసం చేసుకుంది. ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోని ఆ అమ్మాయి స్క్వాష్ లో రికార్డులు తిరగరాస్తూ ఎనిమిది సార్లు ప్రపంచ చాంపియన్షిప్ టైటిల్ గెలుచుకుంది. మనం ఇంతసేపు చెప్పుకున్నది ఈజిప్ట్ దేశానికి చెందిన నూర్ ఎల్ షెర్బిని గురించే! అద్దాల గోడల్లోకి అడుగు పెడితే అదర గొట్టడమే పనిగా పెట్టుకున్న ఈ ‘వారియర్ ప్రిన్సెస్’ ప్రస్థానాన్ని ఓసారి పరిశీలిస్తే... – సాక్షి క్రీడావిభాగం ఉత్తర ఆఫ్రికాలోని ఈజిప్ట్ దేశం... మానవ నాగరికత మూలాలకు నిదర్శనం. ‘పిరమిడ్’లు, ‘మమ్మీ’లు ఇలా ప్రాచీన ఆనవాళ్లకు నెలవు. అలాంటి దేశం ఇప్పుడు స్క్వాష్ కు పెట్టింది పేరుగా మారింది. గత పదేళ్ల ఫలితాలు చూసుకుంటే పురుషుల ప్రపంచ చాంపియన్షిప్లో ఎనిమిది సార్లు ఈజిప్ట్ ఆటగాళ్లే టైటిల్ గెలిస్తే... మహిళల విభాగంలో అయితే పదికి పదిసార్లు ఈజిప్ట్ ప్లేయర్లే చాంపియన్గా నిలిచారు. అందులో పదిసార్లూ నూర్ ఎల్ షెర్బిని ఫైనల్ ఆడటం మరో విశేషం. ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్ఏ) ఆధ్వర్యంలో 2015లో కౌలాలంపూర్లో జరిగిన వరల్ట్ చాంపియన్షిప్లో తొలిసారి విజేతగా నిలిచిన నూర్ 2016లో రన్నరప్తో సరిపెట్టుకుంది. ఆ తర్వాత వరుసగా 2017, 2018–19, 2019–20, 2020–21, 2022, 2023లో ప్రపంచ చాంపియన్గా నిలిచింది. గతేడాది ఫైనల్లో ఈజిప్్టకే చెందిన నౌరన్ గోహర్ చేతిలో ఓడిన 29 ఏళ్ల నూర్ గత నెలలో చికాగో వేదికగా జరిగిన టోర్నీలో టైటిల్ హస్తగతం చేసుకొని ఆ సంఖ్యను ఎనిమిదికి పెంచుకుంది. మహిళల విభాగంలో అత్యధిక సార్లు (8) ప్రపంచ చాంపియన్షిప్ టైటిల్స్ నెగ్గిన మలేసియా మాజీ స్క్వాష్ ప్లేయర్ నికోల్ డేవిడ్ సరసన చేరింది. మరోసారి విశ్వవిజేతగా నిలిస్తే నూర్ కొత్త చరిత్రను లిఖిస్తుంది. 13 ఏళ్లకే ప్రపంచ జూనియర్ చాంపియన్... ప్రపంచ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న నూర్... కుటుంబ నేపథ్యం ఆసక్తికరం. తండ్రి మంచి ఫుట్బాల్ ప్లేయర్ కాగా... తల్లి అథ్లెట్. చిన్నప్పుడే స్క్వాష్ పై ఆసక్తి కనబర్చిన ఆమె సోదరుడి ప్రోత్సాహంతో ప్రొఫెషనల్గా మారింది. ఎనిమిదేళ్లు రాకముందే సీనియర్ ప్లేయర్లను కంగుతినిపించడం అలవాటు చేసుకున్న ఈ పొడగరి... నైపుణ్యాలు పెంచుకుంటూ అంచెలంచెలుగా ఎదిగింది. 13 ఏళ్లకే ప్రపంచ జూనియర్ చాంపియన్గా అవతరించిన నూర్... ఈ ఘనత సాధించిన పిన్న వయసు్కరాలిగా రికార్డు సృష్టించింది. పద్నాలుగేళ్ల వయసులోనే ప్రపంచ టాప్–50లో చోటు దక్కించుకున్న ఈ చిన్నది... 2016లో తన 19 ఏళ్ల వయసులో వరల్డ్ నంబర్వన్గా నిలిచింది. ఏ క్రీడలో అయినా... ఉన్నత శిఖరాలను అధిరోహించడం ఒక ఎత్తు అయితే దాన్ని కొనసాగించడం మరో ఎత్తు. నూర్ రెండో కోవకే చెందుతుంది. నిలకడకు మారుపేరైన ఈ ఈజిప్ట్ ప్లేయర్ విజయగర్వం తలకెక్కించుకోకుండా ఎప్పటికప్పుడు ఆటకు మెరుగులు దిద్దుకుంటూ అత్యుత్తమ ప్లేయర్గా పరిణతి సాధిస్తోంది. ఫెడరర్ స్ఫూర్తితో... పొరబాటున కూడా ప్రత్యర్థి ప్లేయర్ను పల్లెత్తు మాట అనని నూర్ తన ఆరాధ్య ఆటగాడు రోజర్ ఫెడరర్ బాటలోనే ముందుకు సాగుతోంది. నూర్కు స్క్వాష్తో పాటు టెన్నిస్ అంటే వల్లమాలిన ప్రేమ. అందులోనూ స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ ఆటకు వీరాభిమాని. ఆధునిక టెన్నిస్లో మేరునగ«దీరుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఫెడరర్ను అమితంగా ఆరాధించే నూర్... కోర్టు బయట కూడా ఫెడరర్ వ్యవహార శైలిని అనుసరిస్తుంది. చిన్నప్పటి నుంచి స్క్వాష్ ఆడే అలవాటు ఉన్న ఫెడరర్... కొన్ని ప్రత్యేకమైన స్క్వాష్ స్ట్రోక్లను టెన్నిస్ కోర్టులో ప్రయోగించి ఫలితాలు రాబట్టాడు. 20 గ్రాండ్స్లామ్ టైటిళ్లు చేజిక్కించుకున్న ఫెడరర్ నడవడికను అనుకరించే నూర్ ... ఫెడరర్లాగే మృదుస్వభావి. ‘స్క్వాష్లో కాకుండా నేను ఆరాధించే ఏకైక ప్లేయర్ టెన్నిస్ దిగ్గజం ఫెడరర్.అతడి నుంచి ఎప్పుడూ స్ఫూర్తి పొందుతా. టెన్నిస్ కోర్టులో అతడు బ్యాక్ హ్యాండ్ స్ట్రోక్స్ కొడుతుంటే స్క్వాష్ ఆడినట్లే అనిపిస్తుంది. ప్రత్యర్థులతో అతడు తలపడే తీరు, వ్యవహరించే విధానం నాకెంతో ఇష్టం. జొకోవిచ్, నాదల్ వంటి వాళ్ల కంటే ఫెడరర్ శైలి భిన్నమైంది’ అని నూర్ పేర్కొంది. టీమ్ విభాగంలోనూ 5 స్వర్ణాలు 32్ఠ21 ఫీట్ల అద్దాల గదిని రెండో ఇంటిలా భావించే నూర్... అటు సింగిల్స్తో పాటు ఇటు టీమ్ విభాగాల్లోనూ ఆధిపత్యం కనబరుస్తోంది. ప్రపంచ చాంపియన్షిప్ సింగిల్స్లో 8 స్వర్ణాలు, 3 రజతాలు నెగ్గిన నూర్... టీమ్ విభాగంలో మరో 5 పసిడి పతకాలు, ఒక కాంస్యం గెలుచుకుంది. అభిమానులంతా ముద్దుగా ‘ది వారియర్ ప్రిన్సెస్’ అని పిలుచుకునే షెర్బిని అందుకు తగ్గట్లే పోరాట యోధురాలుగా గుర్తుంపు తెచ్చుకుంది. ఎలాంటి స్థితిలోనూ సానుకూల దృక్పథాన్ని వీడకపోవడం... చివరి క్షణం వరకు ఓటమిని అంగీకరించకపోవడం... తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవడం ఆమెను ఇతర ప్లేయర్ల కంటే భిన్నంగా నిలిపింది. ‘నా ముద్దు పేరంటే ఇష్టం. నా ఆటతీరుకు అది సరిగ్గా నప్పుతుంది. కోర్టు బయట నేను పూర్తి భిన్నంగా ఉంటా. ప్రతి మ్యాచ్ను నా తొలి పోరుగానే భావిస్తా. ప్రపంచ చాంపియన్షిప్ అయినా మామూలు టోర్నమెంట్ అయినా సమానమైన ప్రాధాన్యతనిస్తా. ఒత్తిడిని దరిచేరనివ్వక పోవడమే నా ప్రధాన బలం. నాపై అంచనాలు పెంచేసుకొని వాటిని అందుకోవాలని తపన పడను. మానసికంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా బరిలోకి దిగేందుకు ప్రయత్నిస్తా. దాని వల్లే మెరుగైన ఫలితాలు వస్తున్నాయి’ అని నూర్ తెలిపింది. 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్లో స్క్వాష్ ను భాగం చేయడంతో ఈసారి ఈజిప్ట్ ప్లేయర్లు పతకాలు కొల్లగొట్టడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తుంటే... వరుసగా పదేళ్లుగా ప్రపంచ చాంపియన్షిప్ ఫైనల్ ఆడిన నూర్ మాత్రం విశ్వక్రీడలకు చాలా దూరం ఉందని అప్పటి వరకు పరిస్థితులు ఎలా ఉంటాయో అని వినమ్రతతో బదులిచ్చింది. ‘ప్రతి ఒక్కరూ ఒలింపిక్స్ పతకాల గురించే ఆలోచిస్తున్నారు. అదంత సులభం కాదు. వచ్చే మూడేళ్లు ఎలా ఉంటుందో చెప్పలేం. విశ్వక్రీడల్లో పతకం నెగ్గడం ప్రతి ఒక్కరి కల. దాని కోసం ఇతర దేశాల ప్లేయర్లు కూడా గట్టి ప్రయత్నాలు చేస్తుంటారు’ అని నూర్ చెప్పుకొచ్చింది. -
మాడ్రిడ్ వీధుల్లో కొత్త ఎఫ్1 సర్క్యూట్
లండన్: స్పెయిన్లో కొత్త ఫార్ములావన్ ట్రాక్ సిద్ధమవుతోంది. మాడ్రిడ్ వీధుల గుండా పయనించే కొత్త సర్క్యూట్ వచ్చే ఏడాదే అందుబాటులోకి రానుంది. 2026 క్యాలెండర్లో జరిగే ఫార్ములావన్ రేసుల్లో సెప్టెంబర్ 13న కొత్త సర్క్యూట్పై స్పానిష్ గ్రాండ్ప్రి జరుగుతుందని ఎఫ్1 వర్గాలు తెలిపాయి. దీంతో వచ్చే ఏడాది స్పెయిన్లో రెండు ఫార్ములావన్ రేసులు నిర్వహిస్తారు. ఏళ్ల క్రితమే కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం బార్సిలోనా గ్రాండ్ప్రి కూడా నిర్వహిస్తారని ఎఫ్1 ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. అప్పట్లో కుదుర్చుకున్న ఒప్పందం గడువు 2026 వరకు ఉండటం వల్ల బార్సిలోనా రేస్ యథాతథంగా జరుగనుంది. అయితే ఓవరాల్గా మాత్రం ఫార్ములావన్ సీజన్లో మొత్తం 24 రేసుల్లో ఏమాత్రం మార్పుండదు. స్పెయిన్ రెండు రేసుల కోసం ఇటలీ రేసును వచ్చే ఏడాది తప్పించనున్నారు. ఇమోలాలో ఎమిలియా–రొమాగ్నా గ్రాండ్ప్రి వచ్చే సీజన్లో కనిపించదు. దీని స్థానంలో మాడ్రిడ్ వీధుల్లో కొత్త సర్క్యూట్పై రేసును నిర్వహిస్తారు. జన సంచారం ఉండే వీధుల గుండా రయ్... రయ్...మనే ఫార్ములావన్ కార్ల రేసులు కొత్తేం కాదు. ఇదివరకే మొనాకో, సింగపూర్ దేశాల్లో వీధుల్లోనే ఎఫ్1 సర్క్యూట్ ఉంది. అయితే రేసు జరిగే సమయంలో మాత్రం సాధారణ జనసంచారం కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తారు. వచ్చే మార్చి 8న ఆస్ట్రేలియన్ గ్రాండ్ప్రితో 2026 సీజన్ మొదలవుతుంది. పవిత్ర రంజాన్ నేపథ్యంలో బహ్రెయిన్, సౌదీ అరేబియాలలో జరిగే రేసులను ఏప్రిల్కు మార్చారు. డిసెంబర్లో జరిగే అబుదాబి గ్రాండ్ప్రితో వచ్చే సీజన్ ముగుస్తుంది. -
కాంస్య పతకం గెలిచిన భారత షూటర్ ఇలావేనిల్
అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) మూడో ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత్ కాంస్య పతకంతో ఖాతా తెరిచింది. జర్మనీలోని మ్యూనిక్లో మంగళవారం మొదలైన ఈ టోర్నీలో తొలి రోజు భారత్కు మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఇలావేనిల్ వలారివన్ కాంస్య పతకాన్ని అందించింది. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో 25 ఏళ్ల ఇలావేనిల్ 231.2 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. ఓవరాల్గా వరల్డ్కప్ టోర్నీలలో ఇలావేనిల్కిది ఏడో పతకం కావడం విశేషం.వాంగ్ జిఫె (చైనా; 252.7 పాయింట్లు) స్వర్ణ పతకాన్ని దక్కించుకోగా... క్వాన్ యుంజీ (దక్షిణ కొరియా; 252.6 పాయింట్లు) కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. క్వాలిఫయింగ్లో ఇలావేనిల్ 635.9 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచింది. టాప్–8లో నిలిచిన వారికి ఫైనల్ బెర్త్ లభించింది.మరోవైపు పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో భారత షూటర్ వరుణ్ తోమర్ 160.3 పాయింట్లు స్కోరు చేసి ఆరో స్థానంలో నిలిచాడు. భారత ఇతర పిస్టల్ షూటర్లు నిశాంత్ రావత్ 12వ స్థానంలో, అర్జున్ సింగ్ చీమా 20వ స్థానంలో, ఆదిత్య మాల్రా 30వ స్థానంలో నిలిచారు. -
ఈ ఏడాది... కలిసొచ్చింది!
ఎంచుకున్న రంగంలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు...అది క్రీడా రంగమైతే ట్రోఫీ చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పోరాడతారు!ఎన్ని అవాంతరాలు ఎదురైనా ధైర్యంగా నిలబడతారు....అడ్డంకులను అధిగమిస్తూ గమ్యానికి చేరువవుతారు! సర్వశక్తులు ధారపోసినా కొన్నిసార్లు ఆశించిన ఫలితం రాదు...అయినా వెనకడుగు వేయకుండా ఎట్టకేలకు గెలుపు రుచి చూస్తారు! తాజా ఐపీఎల్ ఫలితాన్ని విశ్లేషిస్తే ఈ విషయం అవగతమవుతుంది. లీగ్ ప్రారంభం నుంచి ట్రోఫీ చేజిక్కించుకోవడం కోసం తహతహలాడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు... ఎట్టకేలకు 18వ సీజన్లో తమ కల నెరవేర్చుకుంది. ఐపీఎల్ ఆరంభం నుంచి బెంగళూరు జట్టుతోనే కొనసాగుతున్న ‘కింగ్’ విరాట్ కోహ్లి ఆ సంతోషంలో మునిగి తేలుతున్నాడు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది వివిధ క్రీడాంశాల్లో 11 జట్లు ఇలా తొలిసారి తమ ‘కప్పు కల’ను తీర్చుకున్నాయి. ఐపీఎల్లో ఆర్సీబీ తరహాలో... ఆ్రస్టేలియాలోని బిగ్బాష్ టి20 లీగ్లో హోబర్ట్ హరికేన్స్, చాంపియన్స్ లీగ్ ఫుట్బాల్ టోర్నమెంట్లో పారిస్ సెయింట్ జెర్మయిన్ (పీఎస్జీ), ఎఫ్ఏ కప్లో క్రిస్టల్ ప్యాలెస్ జట్లు ఈసారే తొలి టైటిల్ సాధించాయి. క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్బాల్ ఇలా వేర్వేరు ఆటల్లో తొలిసారి ట్రోఫీ చేజిక్కించుకున్న జట్లపై ప్రత్యేక కథనం... – సాక్షి క్రీడావిభాగం90 ఏళ్ల తర్వాత... బెల్జియంకు చెందిన ప్రముఖ ఫుట్బాల్ క్లబ్ రాయల్ యూనియన్ సెయింట్ గిల్లోయిస్ ఇప్పటి వరకు 12 టైటిల్స్ సాధించింది. అందులో 11 ట్రోఫీలను 1904 నుంచి 1935 మధ్య గెలుచుకున్న రాయల్ యూనియన్ 90 ఏళ్ల పోరాటం తర్వాత పన్నెండో టైటిల్ ఖాతాలో వేసుకుంది. ఒకదశలో ద్వితీయ డివిజన్కు పడిపోయిన ఆ జట్టు... తిరిగి పుంజుకొని విజయం సాధించడం విశేషం.క్రిస్టల్ ప్యాలెస్... 119 ఏళ్ల తర్వాత!ఐపీఎల్లో తొలి టైటిల్ గెలిచేందుకు బెంగళూరుకు 18 సీజన్లు ఎదురు చూడాల్సి వచ్చిందని అనుకుంటుంటే... ఫుట్బాల్ అసోసియేషన్ చాలెంజ్ కప్ (ఎఫ్ఏ కప్)లో క్రిస్టల్ ప్యాలెస్ జట్టు 119 సంవత్సరాల తర్వాత తొలిసారి చాంపియన్గా నిలిచింది. మే 17న జరిగిన ఫైనల్లో క్రిస్టల్ ప్యాలెస్ 1–0 గోల్స్ తేడాతో మాంచెస్టర్ సిటీ జట్టును ఓడించి టైటిల్ ఖాతాలో వేసుకుంది. శతాబ్దకాలంగా ఒక్కసారి కూడా కప్పు గెలవకపోయినా... తమ జట్టుకు అండగా నిలుస్తున్న అభిమానులకు ఈ విజయాన్ని అంకితమిచ్చింది. హోబర్ట్ హరికేన్స్ తొలిసారి...ఆస్ట్రేలియా ప్రఖ్యాత టి20 టోర్నమెంట్ బిగ్బాష్ లీగ్ లో కొత్త విజేత అవతరించింది. 2011 నుంచి నిర్వహిస్తున్న ఈ లీగ్లో హోబర్ట్ హరికేన్స్ మొదటిసారి ట్రోఫీ ముద్దాడింది. జనవరి 27న జరిగిన ఫైనల్లో హోబర్ట్ హరికేన్స్ 7 వికెట్ల తేడాతో సిడ్నీ థండర్స్పై గెలిచి విజేతగా నిలిచింది. ఓపెనర్ మిచెల్ ఓవెన్ (42 బంతుల్లో 108; 6 ఫోర్లు, 11 సిక్స్లు) సెంచరీతో చెలరేగడంతో ఫైనల్లో హరికేన్స్ సునాయాసంగా గెలుపొందింది. అదే బాటలో ఇండియానా పేసర్స్..నేషనల్ బాస్కెట్బాల్ సంఘం (ఎన్బీఏ) లీగ్లో కూడా ఈ ఏడాది కొత్త చాంపియన్ అవతరించడం ఖాయమైంది. ఇండియానా పేసర్స్, ఒక్లాహోమా థండర్ సిటీ జట్ల మధ్య ‘బెస్ట్ ఆఫ్ సెవెన్’ పద్ధతిలో టైటిల్ పోరు జరగనుంది. గతంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఇండియానా పేసర్స్ జట్టు... ఈ ఏడాది చక్కటి ఆటతీరుతో ఎన్బీఏ ఫైనల్కు అర్హత సాధించింది. శుక్రవారం జరిగిన తొలి ఫైనల్లో ఇండియానా పేసర్స్ 111–110తో ఒక్లాహోమా సిటీ థండర్పై నెగ్గగా... ఆదివారం జరిగిన రెండో ఫైనల్లో ఒక్లాహోమా సిటీ థండర్ 123–107తో ఇండియానా పేసర్స్ జట్టును ఓడించింది. ఏడింటిలో తొలుత నాలుగు మ్యాచ్ల్లో గెలిచిన జట్టు విజేతగా నిలుస్తుంది. పీఎస్జీ 43 ఏళ్ల తర్వాత...ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ లీగ్ ఫుట్బాల్ టోర్నమెంట్లో పారిస్ సెయింట్ జెర్మయిన్ (పీఎస్జీ) జట్టు తొలిసారి విజేతగా నిలిచింది. జూన్ 1న జరిగిన తుదిపోరులో పీఎస్జీ జట్టు 5–0 గోల్స్ తేడాతో ఇంటర్ మిలాన్ జట్టుపై గెలుపొందింది. సుదీర్ఘ చరిత్రగల యూరోపియన్ కప్లో పీఎస్జీ జట్టుకు 43 ఏళ్ల తర్వాత ఇదే మొదటి టైటిల్ కావడంతో అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి. 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ...టి20 ఫార్మాట్లో నిర్వహించిన తొలి ఐసీసీ ప్రపంచకప్ విజయవంతం కావడంతో ఆ మరుసటి ఏడాదే (2008)... ప్రతిష్టాత్మక ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది. అప్పటి నుంచి లీగ్లో పోటీ పడుతున్న ఆర్సీబీ జట్టు... ఎట్టకేలకు 18వ సీజన్లో విజేతగా నిలిచి ట్రోఫీని ముద్దాడింది. లీగ్ దశలో రెండో స్థానంలో నిలిచిన బెంగళూరు... క్వాలిఫయర్–1తో పాటు తుదిపోరులోనూ పంజాబ్ కింగ్స్ను ఓడించి టైటిల్ ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఫ్రాంఛైజీకి ప్రాతినిధ్యం వహించిన ఏకైక ప్లేయర్గా రికార్డుల్లోకి ఎక్కిన కోహ్లి ఎట్టకేలకు చాంపియన్ హోదా దక్కించుకున్నాడు. బ్యాటింగ్లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన కోహ్లి... కప్పును చేతబట్టి చిన్నపిల్లాడిలా సంబరాల్లో మునిగిపోవడం అభిమానులను ఎంతగానో అలరించింది. అర్ధశతాబ్దం తర్వాత...సుదీర్ఘ చరిత్ర ఉన్న బొలోగ్నా ఫుట్బాల్ క్లబ్... అర్ధశతాబ్దం తర్వాత కోపా ఇటాలియా కప్ చేజిక్కించుకుంది. మే 15న మిలాన్ వేదికగా జరిగిన తుదిపోరులో బొలోగ్నా జట్టు 1–0 గోల్స్ తేడాతో ఏసీ మిలాన్ జట్టుపై గెలిచింది. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు ప్రమాదకర జట్టుగా ముద్రపడ్డ బొలోగ్నా... ఎట్టకేలకు 51 సంవత్సరాల తర్వాత ఒక మేజర్ టోర్నమెంట్లో విజేతగా నిలిచింది. 1933 తర్వాత తొలిసారి...నెదర్లాండ్స్లోని డెవెంటర్ నగరానికి చెందిన ‘గో అహెడ్ ఈగల్స్’ ఫుట్బాల్ జట్టు... సుదీర్ఘ పోరాటం తర్వాత ఈ ఏడాది తమ తొలి టైటిల్ సాధించింది. 1920 నుంచి 1930 వరకు ప్రత్యర్థులను భయపెట్టిన ఈగల్స్... 1933 తర్వాత తొలి సారి డచ్ కప్ గెలుచుకుంది. ఏప్రిల్ 21న జరిగిన తుదిపోరు ‘షూటౌట్’లో ఈగల్స్ విజయం సాధించి కప్పు కల తీర్చుకుంది. స్టుట్గార్ట్ 28 ఏళ్ల తర్వాత... జర్మనీకి చెందిన ప్రముఖ ఫుట్బాల్ క్లబ్ వీఎఫ్బీ స్టుట్గార్ట్.. 28 ఏళ్ల తర్వాత డీఎఫ్బీ పోకల్ ఫైనల్లో విజేతగా నిలిచింది. మే 24న జరిగిన తుది పోరులో స్టుట్గార్ట్ 4–2 గోల్స్ తేడాతో అరిమినియా బీలెఫెల్డ్ జట్టును ఓడించింది. ఈ టోర్నీలో స్టుట్గార్ట్ విజేతగా నిలవడం ఇది నాలుగోసారి. అయితే దాదాపు మూడు దశాబ్దాలకు ముందే మూడుసార్లు చాంపియన్గా నిలిచిన స్టుట్గార్ట్... మళ్లీ ఇన్నాళ్లకు తమ టైటిల్స్ సంఖ్యను నాలుగుకు పెంచుకుంది.హ్యారీ కేన్కు మరింత ప్రత్యేకం...ఇంగ్లండ్ ఫుట్బాల్ జట్టు స్టార్ హ్యారీ కేన్కు కూడా ఈ ఏడాది చాలా గొప్పగా సాగింది. కెరీర్లో ఎన్నో అద్భుత విజయాలు సాధించిన కేన్కు టైటిల్ లోటు మాత్రం ఉండిపోయింది. అయితే ఈ ఇంగ్లండ్ స్ట్రయికర్ ఈ ఏడాది తన కప్పు కలను నెరవేర్చుకున్నాడు. బేయర్న్ మ్యూనిక్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ... బుండెస్లిగా ట్రోఫీ కైవసం చేసుకున్నాడు. ఈ లీగ్లో అత్యధిక గోల్స్ కొట్టిన కేన్... జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 70 ఏళ్ల తర్వాత...1955లో చివరిసారిగా ఎఫ్ఏ కప్ సొంతం చేసుకున్న న్యూ క్యాజిల్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్... ఏడు దశాబ్దాల తర్వాత ఇన్నాళ్లకు ఈ ఏడాది ఇంగ్లిష్ ఫుట్బాల్ లీగ్ కప్ గెలుచుకుంది. ఈ ఏడాది మార్చి 16న జరగిన తుదిపోరులో న్యూ క్యాజిల్ జట్టు 2–1 గోల్స్ తేడాతో లివర్పూల్ను మట్టికరిపించి చాంపియన్గా అవతరించింది. 17 ఏళ్ల తర్వాత...ఇంగ్లండ్కు చెందిన ప్రముఖ ఫుట్బాల్ క్లబ్ టోటెన్హామ్ హాట్స్పర్... 17 ఏళ్ల పోరాటం తర్వాత ఈ ఏడాది యూరోపా లీగ్ ట్రోఫీ దక్కించుకుంది. మే 22న జరిగిన ఫైనల్లో టోటెన్హామ్ ఎఫ్సీ 1–0 గోల్స్ తేడాతో మాంచెస్టర్ యునైటెడ్పై గెలిచి సంబరాల్లో మునిగిపోయింది. -
పోర్చు‘గోల్’ చేరింది
మ్యూనిక్: జగద్విఖ్యాత స్ట్రయికర్ క్రిస్టియానో రొనాల్డో నేషన్స్ లీగ్లో పోర్చుగల్ జట్టును విజేతగా నిలిపాడు. ఆద్యంతం ఉత్కంఠను రేపిన ఫైనల్లో రొనాల్డో నాయకత్వంలోని పోర్చుగల్ జట్టు ‘పెనాల్టీ షూటౌట్’లో 5–3తో డిఫెండింగ్ స్పెయిన్పై విజయం సాధించి ఈ టో ర్నీలో రెండోసారి విజేతగా నిలిచింది. 2018–2019లో తొలిసారి జరిగిన నేషన్స్ లీగ్ టోర్నీలోనూ పోర్చుగల్ జట్టుకే టైటిల్ లభించింది. నిర్ణీత సమయం, అదనపు సమయం ముగిసేవరకు పోర్చుగల్, స్పెయిన్ జట్లు 2–2 గోల్స్తో సమఉజ్జీగా నిలిచాయి. దీంతో ‘షూటౌట్’ అనివార్యమైంది.ఇందులో పోర్చుగల్ గోల్ కీపర్ డీగో కోస్టా కీలకపాత్ర పోషించాడు. నాలుగో పెనాల్టీకి దిగిన స్పెయిన్ స్ట్రయికర్ అల్వారో మొరాటా కిక్ను డీగో కోస్టా సమర్థంగా అడ్డుకోవడంతోనే పోర్చుగల్కు విజయం ఖాయమైంది. దీంతో మైదానంలోని రొనాల్డో అభిమానులు విజయ సంబరాల్లో మునిగితేలారు. స్పెయిన్ తరఫున మొదటి ముగ్గురు విజయవంతంగా గోల్స్ చేయగా... మొరాటా ఒక్కడే విఫలమయ్యాడు. అంతకుముందు రెగ్యులర్ టైమ్ మ్యాచ్ కూడా పోటాపోటీగా సాగింది. మ్యాచ్ తొలి అర్ధభాగంలో మార్టిన్ జుబిమెండి 21వ నిమిషంలో గోల్ చేసి స్పెయిన్ను 1–0తో ఆధిక్యంలో నిలిపాడు. అయితే ఐదు నిమిషాల వ్యవధిలోనే న్యూనొ మెండెస్ (26వ నిమిషంలో) గోల్ కొట్టడంతో 1–1తో స్కోరు సమమైంది. తిరిగి తొలి అర్ధభాగం ముగిసే ఆఖరి నిమిషంలో స్పెయిన్ ఆటగాడు ఒయర్లబెల్ (45వ నిమిషంలో) గోల్ చేసి 2–1తో ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ద్వితీయార్ధం మొదలయ్యాక పోర్చుగల్ ఈ స్కోరును సమం చేసేందుకు ఎంతగానో ప్రయత్నించినా... స్పెయిన్ రక్షణపంక్తి, గోల్ కీపర్ సమన్వయంతో ఒక్క షాట్ కూడా లక్ష్యాన్ని చేరలేదు. ఎట్టకేలకు స్టార్ స్ట్రయికర్ రొనాల్డో 61వ నిమిషంలో చేసిన గోల్ వల్లే పోర్చుగల్ మ్యాచ్లో నిలిచింది. దీంతో అంతర్జాతీయ ఫుట్బాల్ చరిత్రలో అతని రికార్డు గోల్ స్కోరు 138కి చేరింది. అక్కడ 2–2తో సమమైన స్కోరు నిర్ణీత సమయం, అదనపు సమయం ముగిసేవరకు కొనసాగింది. విజేతను తేల్చేందుకు షూటౌట్ను నిర్వహించగా స్పెయిన్ తరఫున మెరినో, బెయెనా, ఇస్కో సఫలమవగా, మొరాటా నిరాశపరిచాడు. పోర్చుగల్ తరఫున రామొస్, విటిన్హా, ఫెర్నాండెజ్, మెండెస్, నివెస్ ఇలా ఐదుగురు గోల్స్ చేయడంతో ట్రోఫీ చేజిక్కించుకుంది. విజయానంతరం 40 ఏళ్ల రొనాల్డో భావోద్వేగానికి గురయ్యాడు. ‘క్లబ్ల తరఫున ఇదివరకు ఎన్నో టైటిల్స్ గెలిచాను. కానీ అవేవీ పోర్చుగల్ విజయానికి సాటిరావు. దేశానికి ట్రోఫీ అందించిన ఆనందం ఎప్పటికీ ప్రత్యేకం’అని ఉబికివచ్చే కంటనీరును అదుపు చేసుకుంటూ వ్యాఖ్యానించాడు. -
సహజకు డబుల్స్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ35 మహిళల టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ సహజ యామలపల్లి డబుల్స్ టైటిల్ను సాధించింది. డొమినికన్ రిపబ్లిక్ రాజధాని సాంటో డొమింగోలో జరిగిన ఈ టోర్నీలో సహజ (భారత్)–హిరోకో కువాటా (జపాన్) జోడీ డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచింది. ఫైనల్లో సహజ–హిరోకో ద్వయం 6–3, 6–2తో ఎస్తెర్ అడెషినా (బ్రిటన్)–సోఫియా ఎలీనా (వెనిజులా) జంటపై గెలిచింది. ఐటీఎఫ్ సర్క్యూట్లో సహజకిదే తొలి డబుల్స్ టైటిల్. సింగిల్స్ విభాగంలో ఆమె నాలుగు టైటిల్స్ సొంతం చేసుకుంది. -
చరిత్ర సృష్టించిన ఫ్రెంచ్ ఓపెన్ 2025 ఫైనల్
కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్), యానిక్ సినెర్ (ఇటలీ) మధ్య నిన్న (జూన్ 8) జరిగిన ఫ్రెంచ్ ఓపెన్-2025 పురుషుల సింగిల్స్ ఫైనల్స్ మ్యాచ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఫ్రెంచ్ ఓపెన్ చరిత్రలో అత్యంత సుదీర్ఘంగా సాగిన ఫైనల్గా రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్ 5 గంటల 29 నిమిషాల పాటు సాగింది. గతంలో ఏ ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ మ్యాచ్ 5 గంటలు సాగలేదు. ఈ మ్యాచ్ 43 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. మాట్స్ విలాండర్, గులెర్మో విలాస్ మధ్య జరిగిన 1982 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ మ్యాచ్ 4 గంటల 47 నిమిషాలు సాగింది.THE WINNING MOMENT FOR CARLOS ALCARAZ. 🏆pic.twitter.com/U19wPhiEtT— Mufaddal Vohra (@mufaddal_vohra) June 8, 2025అల్కరాజ్ అదరహోఊహకందని మలుపుల మధ్య సాగిన తాజా ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) విజేతగా నిలిచాడు. ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ యానిక్ సినెర్పై (ఇటలీ) 4–6, 6–7 (4/7), 6–4, 7–6 (7/3), 7–6 (10/2)తో చిరస్మరణీయ విజయం సాధించాడు.5 గంటల 29 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో అల్కరాజ్ తొలి రెండు సెట్లను కోల్పోయినా... ఆందోళన చెందకుండా ఆడి తర్వాతి మూడు సెట్లలో నెగ్గి విజేతగా నిలిచాడు. నాలుగో సెట్లో అల్కరాజ్ ఏకంగా మూడు మ్యాచ్ పాయింట్లను కాచుకోవడం విశేషం. ఈ గెలుపుతో అల్కరాజ్ తన కెరీర్లో ఐదో గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్ను (2025, 2024 ఫ్రెంచ్ ఓపెన్... 2023, 2024 వింబుల్డన్... 2022 యూఎస్ ఓపెన్) దక్కించుకున్నాడు. అల్కరాజ్ ఇప్పటివరకు ఒక్క గ్రాండ్స్లామ్ ఫైనల్ కూడా ఓడిపోలేదు. మరోపక్క సినెర్కు కూడా ఇదే తొలి గ్రాండ్స్లామ్ ఫైనల్ పరాజయం. -
UEFA టైటిల్ గెలిచిన పోర్చుగల్.. కోహ్లి తరహాలో భావోద్వేగానికి లోనైన క్రిస్టియానో రొనాల్డో
పోర్చుగల్ దిగ్గజ ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో తన దేశానికి రెండో UEFA నేషన్స్ లీగ్ టైటిల్ను అందించాడు. జర్మనీలోని మ్యూనిచ్ వేదికగా ఆదివారం (జూన్ 8) జరిగిన ఫైనల్లో పోర్చుగల్ పెనాల్టీ షూటౌట్లో స్పెయిన్పై 5-3 గోల్స్తో నెగ్గి టైటిల్ను కైవసం చేసుకుంది. షూటౌట్కు ముందు ఇరు జట్లు 2-2 గోల్స్తో సమంగా నిలిచాయి. - Virat Kohli lifting IPL Trophy.- Cristiano Ronaldo lifting UEFA Trophy.TWO GOATs OF SPORTS. 🐐🙇 pic.twitter.com/WKXtmTel70— Tanuj (@ImTanujSingh) June 8, 2025ఎక్స్ట్రా టైమ్లో కూడా ఫలితం రాకపోవడంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. ఈ మ్యాచ్లో రొనాల్డో ఓ గోల్ చేశాడు. ఇది అతని కెరీర్లో 138 గోల్. నిర్ణీత సమయంలో తొలుత స్పెయిన్కు చెందిన మైఖేల్ ఒయార్జబాల్ గోల్ చేయగా.. రొనాల్డో తన గోల్తో స్కోర్ సమం చేశాడు. అనంతరం స్పెయిన్కు చెందిన మార్టిన్ జుబిమెండి రెండో గోల్ చేయగా.. పోర్చుగల్ తరఫున నునో మెండెస్ గోల్ చేసి స్కోర్ సమం చేశాడు.- Virat Kohli after winning the IPL Trophy.- Cristiano Ronaldo after winning the UEFA Nations trophy.TWO GOATS GOT EMOTIONAL..!!!! 🥹❤️ pic.twitter.com/Ms8poAVOQx— Tanuj (@ImTanujSingh) June 8, 2025మరోవైపు మూడో స్థానం కోసం జరిగిన పోటీలో కైలియన్ ఎంబపే నేతృత్వంలోని ఫ్రాన్స్ ఆతిథ్య దేశం జర్మనీపై 2-0 గోల్స్ తేడాతో నెగ్గింది.- Kohli after winning IPL Trophy.- Ronaldo after winning UEFA Trophy.TWO GOATS CRYING AFTER WINNING THE TROPHY. 🥹❤️ pic.twitter.com/8TFasrUWSn— Tanuj (@ImTanujSingh) June 8, 2025కోహ్లి తరహాలో భావోద్వేగానికి లోనైన రొనాల్డోఆర్సీబీ ఈ యేడు ఐపీఎల్ టైటిల్ గెలిచాక ఆ జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఏ రకంగా భావోద్వేగానికి లోనయ్యాడో, క్రిస్టియానో రొనాల్డో కూడా తన రెండో UEFA నేషన్స్ లీగ్ టైటిల్ గెలిచాక అదే తరహాలో ఎమోషనల్ అయ్యాడు. కోహ్లి, రొనాల్డో కంపారిజన్ ఇమేజ్లు ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతున్నాయి. Cristiano Ronaldo got Emotional when he's won the UEFA national league trophy for Portugal. 🥹- What a Video for UEFA history. ❤️pic.twitter.com/LZgq4vVDiP— Tanuj (@ImTanujSingh) June 8, 2025క్రికెట్ అభిమానులు కోహ్లి, రొనాల్డోను కీర్తిస్తున్నారు. ఇద్దరూ ఇద్దరే అంటూ ఆకాశానికెత్తుతున్నారు. కోహ్లి, రొనాల్డో లేటు వయసులోనూ అత్యుత్తమ ఫిట్నెస్ను కలిగి తమతమ క్రీడా విభాగాల్లో సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. -
స్వప్నిల్ గురి అదిరేనా?
మ్యూనిక్: పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత స్వప్నిల్ కుసాలే ప్రపంచకప్ పతకాలపై గురి పెట్టేందుకు తాజాగా సిద్ధమయ్యాడు. అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) వరల్డ్కప్ లో అతనితో పాటు మహిళా షూటర్, ఒలింపియన్ ఇలవేనిల్ వలారివన్లపై భారత్ ఆశలు పెట్టుకుంది. ఈ సీజన్లో జరుగుతున్న మూడో ప్రపంచకప్కు మ్యూనిక్ వేదిక కాగా... 78 దేశాలకు చెందిన 695 మంది మేటి షూటర్లు పాల్గొంటుండటంతో ప్రతీ ఈవెంట్లోనూ గట్టి పోటీ ఉండనుంది. గతేడాది పారిస్లో పతకాన్ని సాకారం చేసుకున్న కుసాలే ఈ ఏడాది దేశవాళీ సర్క్యూట్లో తన ఫామ్ను కొనసాగించాడు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్లో భారత ఆశాకిరణమయ్యాడు. రెండుసార్లు ఒలింపియన్ అయిన తమిళనాడు షూటర్ ఇలవేనిల్ పారిస్ మెగా ఈవెంట్ తర్వాత తిరిగి ఇప్పుడే అంతర్జాతీయ ఈవెంట్లో గురి పెట్టేందుకు సన్నద్ధమైంది. ఆమె గతంలో బ్యూనస్ఎయిర్స్ (అర్జెంటీనా), లిమా (పెరూ) ఈవెంట్లలో పాల్గొన్నప్పటికీ ఈ రెండు కేవలం ర్యాంకింగ్ పాయింట్ల (ఆర్పీఓ)కు పరిమితమైన పోటీలు మాత్రమే! వీటిని అంతర్జాతీయ షూటింగ్ పోటీలుగా పరిగణించరు. వీరిద్దరితో పాటు ఆసియా క్రీడల చాంపియన్ పలక్ గులియా మహిళల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో పతకాలపై గురి పెట్టనుంది. ఈ హరియాణా షూటర్తో పాటు కొత్తగా ఈ ప్రపంచకప్లో అరంగేట్రం చేయబోతున్న జాతీయ ఎయిర్ రైఫిల్ చాంపియన్ అనన్య నాయుడు, పురుషుల ఈవెంట్లో ఆదిత్య మల్రా, నిశాంత్ రావత్ కొత్తగా వరల్డ్కప్ బరిలో దిగుతున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ షూటర్ల నుంచి వచ్చే సవాళ్లను ఏ మేరకు ఎదుర్కొంటారో చూడాలి. ఓవరాల్గా ఈ టోర్నీలో భారత్ నుంచి 36 మంది షూటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన మద్దినేని ఉమామహేశ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో పోటీపడనున్నాడు. గత ఏడాది పారిస్ ఒలింపిక్స్లో రెండు కాంస్య పతకాలు నెగ్గిన పిస్టల్ షూటర్ మనూ భాకర్ ఈ ఏడాది రెండోసారి ప్రపంచకప్ టోర్నీ ఆడనుంది. లిమాలో జరిగిన ప్రపంచకప్ టోర్నీలో మనూ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో రజత పతకాన్ని సాధించింది. ఈ సీజన్లో ఇప్పటికే రెండు ప్రపంచకప్లు అర్జెంటీనా, పెరులో జరిగాయి. ఈ రెండు మెగా ఈవెంట్లలో కలిపి భారత్ ఆరు స్వర్ణాలు సహా 15 పతకాలు గెలుపొందింది. ఈ ప్రదర్శన ద్వారా అర్జెంటీనాలో రెండో స్థానం, పెరు ఈవెంట్లో మూడో స్థానంలో భారత్ నిలిచింది. అయితే మ్యూనిక్లో మాత్రం ఎక్కువ దేశాల నుంచి వందల సంఖ్యలో మేటి షూటర్లంతా బరిలో ఉండటంతో భారత్ ఏ స్థానంలో నిలుస్తుందో ఆసక్తికరంగా మారింది. చైనా తమ చాంపియన్ షూటర్లు జియి యు, లి యుహంగ్ సహా 22 మందితో మ్యూనిక్కు చేరుకోగా... ఆతిథ్య జర్మనీ మాజీ ఒలింపిక్, ప్రపంచ చాంపియన్ క్రిస్టియాన్ రిట్జ్, అన జాన్సెన్ సహా 27 మంది మేటి షూటర్లతో పతకాలపై గురి పెట్టింది. మరోవైపు ఫ్రాన్స్ తమ దిగ్గజ షూటర్ జీన్ క్విక్వాంపొయిక్స్తో పాటు 16 మందితో ప్రపంచకప్కు రెడీ అయ్యింది. ఇద్దరు ఒలింపిక్ చాంపియన్లు యంగ్ జిన్, ఒ యెజిన్లతో కూడిన 19 మంది కొరియన్ బృందం కూడా పతకాలు కొల్లగొట్టేందుకు సై అంటోంది. వీరితో పాటు పలువురు పారిస్ ఒలింపిక్ పతక విజేతలు, అమెరికా, ఇటలీ, కజకిస్తాన్ స్టార్ షూటర్లు మ్యూనిక్ వరల్డ్కప్కు వన్నెతెచ్చే రసవత్తరపోటీకి ‘ఢీ అంటే ఢీ’ అంటున్నారు. -
70వ ప్రయత్నంలో ఒకరు... 52వ ప్రయత్నంలో మరొకరు
పారిస్: పట్టువదలని విక్రమార్కుల్లా ప్రయత్నిస్తూనే... ఎట్టకేలకు తమ గ్రాండ్స్లామ్ డబుల్స్ టైటిల్ కలను నెరవేర్చుకున్నారు మార్సెల్ గ్రానోలెర్స్ (స్పెయిన్), హొరాసియో జెబలాస్ (అర్జెంటీనా). గెలవాలన్న కసి ఉండాలేగానీ వయసుతో సంబంధం లేదని వీరిద్దరూ నిరూపించారు. 39 ఏళ్ల గ్రానోలెర్స్ 2007 నుంచి... 40 ఏళ్ల జెబలాస్ 2009 నుంచి గ్రాండ్స్లామ్ టోర్నీలలో పోటీపడుతున్నారు. చివరకు ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్లో వీరిద్దరి గ్రాండ్స్లామ్ టైటిల్ స్వప్నం సాకారమైంది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో ఐదో సీడ్ గ్రానోలెర్స్–జెబలాస్ ద్వయం 6–0, 6–7 (5/7), 7–5తో ఎనిమిదో సీడ్ జో సాలిస్బరీ–నీల్ స్కప్స్కీ (బ్రిటన్) జంటను ఓడించి తమ కెరీర్లో తొలిసారి గ్రాండ్స్లామ్ టైటిల్ను దక్కించుకుంది. తాజా ఫ్రెంచ్ ఓపెన్కంటే ముందు గ్రానోలెర్స్ 69 సార్లు... జెబలాస్ 51 సార్లు గ్రాండ్స్లామ్ టోర్నీనల్లో బరిలోకి దిగారు. గతంలో గ్రానోలెర్స్... వింబుల్డన్ (2023, 2021), యూఎస్ ఓపెన్ (2019, 2014), ఫ్రెంచ్ ఓపెన్ (2014)లలో... జెబలాస్... వింబుల్డన్ (2023, 2021), యూఎస్ ఓపెన్ (2019)లలో ఫైనల్ చేరినా చివరకు రన్నరప్ ట్రోఫీలతోనే సరిపెట్టుకున్నారు. ఈసారి మాత్రం విజేతలుగా అవతరించి తమ చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్నారు. చాంపియన్గా నిలిచిన గ్రానోలెర్స్–జెబలాస్ జోడీకి 5,90,000 యూరోలు (రూ. 5 కోట్ల 76 లక్షలు) ప్రైజ్మనీగా లభించింది.మహిళల డబుల్స్ విభాగంలో పారిస్ ఒలింపిక్స్ చాంపియన్ జోడీ జాస్మిన్ పావోలిని–సారా ఎరాని (ఇటలీ) టైటిల్ సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో పావోలిని–సారా ఎరాని ద్వయం 6–4, 2–6, 6–1తో అనా డానిలినా (కజకిస్తాన్)–అలెగ్జాండ్రా క్రునిక్ (సెర్బియా) జంటను ఓడించింది. సారా ఎరానికిది ఆరో గ్రాండ్స్లామ్ డబుల్స్ టైటిల్. రొబెర్టా విన్సీ (ఇటలీ)తో కలిసి సారా ఎరాని గతంలో యూఎస్ ఓపెన్, వింబుల్డన్, ఆ్రస్టేలియన్ ఓపెన్ టైటిల్స్ సాధించింది. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్లోనూ సారా ఎరాని ఇటలీకే చెందిన ఆండ్రియా వావసోరితో జతకట్టి టైటిల్ గెలిచింది. మహిళల డబుల్స్ టైటిల్ గెలిచిన పావోలిని–సారా ఎరాని ఖాతాలో 5,90,000 యూరోలు (రూ. 5 కోట్ల 76 లక్షలు) ప్రైజ్మనీగా చేరాయి. -
భారత్ ఖాతాలో ఆరు స్వర్ణాలు
తైపీ సిటీ: తైవాన్ ఓపెన్ అంతర్జాతీయ అథ్లెటిక్స్ మీట్లో చివరిరోజు భారత అథెట్లు ఏకంగా అరడజను స్వర్ణ పతకాలతో మెరిశారు. మహిళల జావెలిన్ త్రోలో ఒలింపియన్ అన్ను రాణి... మహిళల 400 మీటర్ల హర్డిల్స్ విభాగంలో విత్యా రామ్రాజ్... మహిళల 800 మీటర్ల విభాగంలో పూజ... పురుషుల 800 మీటర్ల విభాగంలో కృషన్ కుమార్... పురుషుల జావెలిన్ త్రోలో రోహత్ యాదవ్ పసిడి పతకాలను సొంతం చేసుకున్నారు.పురుషుల 4–400 మీటర్ల రిలేలో సంతోష్, విశాల్, మనూ, ధరమ్వీర్లతో కూడిన భారత బృందం (3ని:05.58 సెకన్లు) బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. అన్ను రాణి జావెలిన్ను 56.82 మీటర్ల దూరం... రోహిత్ యాదవ్ 74.42 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచారు. విత్యా 400 మీటర్ల దూరాన్ని 56.53 సెకన్లలో పూర్తి చేసింది.పూజ 800 మీటర్లను 2ని:02.79 సెకన్లలో... కృషన్ కుమార్ 800 మీటర్ల దూరాన్ని 1ని:48.46 సెకన్లలో పూర్తి చేసి విజేతలుగా నిలిచారు. పురుషుల 400 మీటర్ల హర్డిల్స్లో యశస్ పలాక్ష (42.22 సెకన్లు) రజత పతకాన్ని గెల్చుకున్నాడు. మహిళల లాంగ్జంప్ ఈవెంట్లో భారత క్రీడాకారిణులు శైలీ సింగ్ (6.41 మీటర్లు) రజతం, అన్సీ సోజన్ (6.39 మీటర్లు) కాంస్య పతకం సొంతం చేసుకున్నారు. -
అల్కరాజ్ అదరహో
పారిస్: ఊహకందని మలుపులతో సాగిన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) పైచేయి సాధించాడు. వరుసగా రెండో ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్గా నిలిచాడు. ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ యానిక్ సినెర్ (ఇటలీ)తో ఆదివారం జరిగిన టైటిల్ పోరులో ప్రపంచ రెండో ర్యాంకర్, రెండో సీడ్ అల్కరాజ్ 4–6, 6–7 (4/7), 6–4, 7–6 (7/3), 7–6 (10/2)తో చిరస్మరణీయ విజయం సాధించాడు. 5 గంటల 29 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో అల్కరాజ్ తొలి రెండు సెట్లను చేజార్చుకున్నా... ఆందోళన చెందకుండా ఆడి తర్వాతి మూడు సెట్లలో నెగ్గి విజేతగా నిలిచాడు. నాలుగో సెట్లో అల్కరాజ్ ఏకంగా మూడు మ్యాచ్ పాయింట్లను కాచుకోవడం విశేషం. ఈ గెలుపుతో అల్కరాజ్ తన కెరీర్లో ఐదో గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్ను దక్కించుకున్నాడు. చాంపియన్గా నిలిచిన అల్కరాజ్కు 25 లక్షల 50 వేల యూరోలు (రూ. 24 కోట్ల 91 లక్షలు), రన్నరప్ సినెర్కు 12 లక్షల 75 వేల యూరోలు (రూ. 12 కోట్ల 45 లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి. అల్కరాజ్ ఆడిన ఐదు గ్రాండ్స్లామ్ ఫైనల్స్లోనూ విజయాన్ని అందుకోవడం విశేషం. ఇప్పటి వరకు అల్కరాజ్ 2025, 2024 ఫ్రెంచ్ ఓపెన్... 2023, 2024 వింబుల్డన్... 2022 యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీలలో టైటిల్స్ సాధించాడు. కెరీర్లో తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ ఆడిన సినెర్ తొలి రెండు సెట్లను సొంతం చేసుకొని టైటిల్ దిశగా సాగిపోయాడు. అయితే అల్కరాజ్ పట్టువీడలేదు. మూడో సెట్ నుంచి అనూహ్యంగా పుంజుకున్నాడు. మూడో సెట్లోని నాలుగో గేమ్లో, పదో గేమ్లో సినెర్ సర్వీస్లను బ్రేక్ చేసిన అల్కరాజ్ సెట్ను 6–4తో నెగ్గి మ్యాచ్లో నిలిచాడు. హోరాహోరీగా సాగిన నాలుగో సెట్లో అల్కరాజ్ టైబ్రేక్లో పైచేయి సాధించాడు. నిర్ణాయక ఐదో సెట్లో ఒకదశలో అల్కరాజ్ 5–4తో గెలుపు అంచులో నిలిచాడు. అయితే సినెర్ పదో గేమ్లో అల్కరాజ్ సర్వీస్ను బ్రేక్ చేసి స్కోరును 5–5తో సమం చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్లను నిలబెట్టుకోవడంతో స్కోరు 6–6తో సమమైంది. దాంతో చివరి సెట్లోనూ టైబ్రేక్ అనివార్యమైంది. ముందుగా 10 పాయింట్లు సాధించిన అల్కరాజ్ సెట్తోపాటు మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. -
French Open 2025: ఫైనల్ పోరులో అల్కరాజ్ X సినెర్
ఫ్రెంచ్ ఓపెన్-2025 పురుషుల సింగిల్స్ టైటిల్ పోరుకు రంగం సిద్దమైంది. ఆదివారం జరగనున్న ఫైనల్లో ప్రపంచ నంబర్వన్ యానిక్ సినెర్ (ఇటలీ)తో ప్రపంచ రెండో ర్యాంకర్, డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) అమీతుమీ తేల్చుకుంటాడు.ముఖాముఖి పోరులో అల్కరాజ్ 7–4తో సినెర్పై ఆధిక్యంలో ఉన్నాడు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన రెండో సెమీఫైనల్లో టాప్ సీడ్ సినెర్ 6–4, 7–5, 7–6 (7/3)తో సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ను ఓడించి తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్లో ఫైనల్లోకి ప్రవేశించాడు.కెరీర్లో 24 గ్రాండ్స్లామ్ టైటిల్స్ నెగ్గిన జొకోవిచ్ ఈ ఓటమి తర్వాత ఎర్రమట్టి కోర్టును ముద్దాడుతూ వెనుదిరిగాడు. వచ్చే ఏడాది తాను ఫ్రెంచ్ ఓపెన్లో ఆడేది లేనిది కచ్చ్చితంగా చెప్పలేనని 38 ఏళ్ల జొకోవిచ్ వ్యాఖ్యానించాడు.చదవండి: French Open 2025: ఫ్రెంచ్ ‘క్వీన్’ కోకో.. ఫైనల్లో సబలెంకా ఓటమి -
భారత బ్యాడ్మింటన్కు కొత్త ఊతం
న్యూఢిల్లీ: భారత్లో అంతర్జాతీయ స్థాయి షట్లర్లు నానాటికి తగ్గిపోతున్న నేపథ్యంలో మేటి షట్లర్లను తయారు చేయడమే లక్ష్యంగా భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) కొత్త ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా నాణ్యమైన విదేశీ కోచ్ల పదవీ కాలం పెంచడంతో పాటు క్షేత్రస్థాయిలో ఆటకు, ఆటగాళ్లకు ఊతమిచ్చే కార్యక్రమాలు చేపట్టడం, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన బ్యాడ్మింటన్ ప్లేయర్లకు నగదు పురస్కారాలు అందజేయాలని ‘బాయ్’ నిర్ణయించింది. ఈ మేరకు ‘బాయ్’ వార్షిక సర్వ సభ్య సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకుంది. దీనికోసం ప్రతియేటా రూ. 9 కోట్ల 75 లక్షలు ఖర్చు చేయాలని భావిస్తోంది. వివిధ సెంటర్లలో ఆటగాళ్లకు కోచింగ్ ఇస్తున్న మాజీ ఆటగాళ్లు జీత భత్యాలు పెంచడంతో పాటు పతకాలు తెచ్చిన షట్లర్లకు కూడా నగదు ప్రోత్సాహకాలు క్రమం తప్పకుండా అందజేయాలని చూస్తోంది. సీనియర్ జాతీయ ర్యాంకింగ్ పోటీల విజేతలకు రూ. 10 లక్షల చొప్పున, అండర్–19 ఈవెంట్ విజేతలకు రూ. 8 లక్షలు, మిగతా వయో విభాగాల విజేతలకు నగదు ప్రోత్సాహకాలు అందజేస్తామని ‘బాయ్’ అధ్యక్షుడు, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తెలిపారు. -
హంపి, గుకేశ్లకు మూడో స్థానం
స్టావెంజర్: కీలకదశలో తప్పిదాలు చేయడంతో... నార్వే ఓపెన్ చెస్ టోర్నమెంట్లో భారత స్టార్ క్రీడాకారులు కోనేరు హంపి, దొమ్మరాజు గుకేశ్ టైటిల్కు దూరమయ్యారు. మహిళల విభాగంలో హంపి... పురుషుల విభాగంలో క్లాసికల్ ఫార్మాట్ ప్రపంచ చాంపియన్ గుకేశ్ మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఈ టోర్నీలో హంపి 15 పాయింట్లు... గుకేశ్ 14.5 పాయింట్లు స్కోరు చేశారు. పురుషుల విభాగంలో నార్వే దిగ్గజం, ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్ (16 పాయింట్లు)... మహిళల విభాగంలో అనా ముజీచుక్ (16.5 పాయింట్లు) చాంపియన్స్గా అవతరించారు. పురుషుల విభాగంలో ఆరుగురు... మహిళల విభాగంలో ఆరుగురు చొప్పున పోటీపడగా... డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో గేమ్లను నిర్వహించారు. క్లాసికల్ గేమ్లోనే విజయం సాధిస్తే 3 పాయింట్లు లభిస్తాయి. ఒకవేళ క్లాసికల్ గేమ్ ‘డ్రా’గా ముగిస్తే విజేతను నిర్ణయించేందుకు అర్మగెడాన్ గేమ్ను నిర్వహిస్తారు. క్లాసికల్ గేమ్ను ‘డ్రా’ చేసుకొని, అర్మగెడాన్ గేమ్లో గెలిస్తే 1.5 పాయింట్లు లభిస్తాయి. క్లాసికల్ గేమ్ను ‘డ్రా’ చేసుకొని, అర్మగెడాన్ గేమ్లో ఓడిపోతే 1 పాయింట్ దక్కుతుంది. క్లాసికల్ గేమ్లో ఓడిపోతే ఎలాంటి పాయింట్లు లభించవు. పురుషుల విభాగం చివరి రౌండ్లో తెలంగాణ గ్రాండ్మాస్టర్, భారత నంబర్వన్ ఇరిగేశి అర్జున్, మాగ్నస్ కార్ల్సన్ గేమ్ 56 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. వీరిద్దరి మధ్య జరిగిన అర్మగెడాన్ గేమ్లో అర్జున్ 34 ఎత్తుల్లో కార్ల్సన్ను ఓడించాడు. ఫాబియానో కరువానా (అమెరికా)తో జరిగిన గేమ్లో గుకేశ్ 50 ఎత్తుల్లో ఓడిపోయాడు. ఒకవేళ కరువానాపై గుకేశ్ గెలిచి ఉంటే అతనికి టైటిల్ ఖరారయ్యేది. గుకేశ్పై నేరుగా క్లాసికల్ గేమ్లోనే నెగ్గడంతో కరువానా 15.5 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. 14 పాయింట్లతో హికారు నకముర (అమెరికా) నాలుగో స్థానంలో... 13 పాయింట్లతో అర్జున్ ఐదో స్థానంలో... 9.5 పాయింట్లతో వె యి (చైనా) చివరిదైన ఆరో స్థానంలో నిలిచారు. మహిళల విభాగంలో చివరి రౌండ్లో ప్రపంచ చాంపియన్ జు వెన్జున్ (చైనా)తో పోటీపడిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి హంపి 51 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. వీరిద్దరి మధ్య విజేతను నిర్ణయించేందుకు అర్మగెడాన్ గేమ్ నిర్వహించగా... హంపి 40 ఎత్తుల్లో జు వెన్జున్ను ఓడించింది. భారత్కే చెందిన మరో గ్రాండ్మాస్టర్ వైశాలితో జరిగిన చివరి గేమ్ను అనా ముజీచుక్ 33 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. అర్మగెడాన్ గేమ్లో వైశాలి చేతిలో అనా ముజీచుక్ ఓడిపోయినా టైటిల్ను ఖరారు చేసుకుంది. 16 పాయింట్లతో లె టింగ్జీ (చైనా) రెండో స్థానాన్ని పొందగా... 13.5 పాయింట్లతో జు వెన్జున్కు నాలుగో స్థానం లభించింది. 11 పాయింట్లతో వైశాలి ఐదో స్థానంలో, 9 పాయింట్లతో సారా ఖాదెమ్ (స్పెయిన్) చివరిదైన ఆరో స్థానంలో నిలిచారు. ఎవరికెంత ప్రైజ్మనీ అంటే? నార్వే చెస్ టోర్నీలో ఈసారి పురుషుల, మహిళల విభాగం ప్లేయర్లకు సమాన ప్రైజ్మనీ కేటాయించారు. విజేతగా నిలిచిన కార్ల్సన్, అనా ముజీచుక్లకు 7 లక్షల నార్వేజియన్ క్రోన్ల (రూ. 59 లక్షల 36 వేలు) చొప్పున లభించాయి. రన్నరప్గా నిలిచిన కరువానా, లె టింగ్జీలకు 3 లక్షల 50 వేల క్రోన్ల (రూ. 29 లక్షల 68 వేలు) చొప్పున దక్కాయి. మూడో స్థానంలో నిలిచిన గుకేశ్, హంపి 2 లక్షల క్రోన్ల (రూ. 16 లక్షల 96 వేలు) చొప్పున అందుకున్నారు. నాలుగో స్థానం పొందిన నకముర, జు వెన్జున్లకు 1 లక్ష 70 వేల క్రోన్ల (రూ. 14 లక్షల 41 వేలు) చొప్పున లభించాయి. ఐదో స్థానంలో నిలిచిన అర్జున్, వైశాలిలకు 1 లక్ష 50 వేల క్రోన్ల (రూ. 12 లక్షల 72 వేలు) చొప్పున... ఆరో స్థానంలో నిలిచిన వె యి, సారాలకు 1 లక్ష 20 వేల క్రోన్ల (రూ. 10 లక్షల 17 వేలు) చొప్పున దక్కాయి. -
గురి తప్పిన భారత బాణం
అంటాల్యా (తుర్కియే): తొలి రెండు ప్రపంచకప్ టోర్నీలలో కలిపి మొత్తం 11 పతకాలు (3 స్వర్ణాలు, 2 రజతాలు, 6 కాంస్యాలు) సాధించిన భారత ఆర్చర్లు మూడో ప్రపంచకప్ టోర్నీలో మాత్రం నిరాశ పరిచారు. ఒక్క పతకం కూడా గెలవకుండానే రిక్తహస్తాలతో వెనక్కి వచ్చారు. మొత్తం 10 విభాగాల్లో పోటీలు జరగ్గా... ఒక్క విభాగంలోనూ భారత ఆర్చర్లు పతకాన్ని సాధించలేకపోయారు. శనివారం పురుషుల, మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగం పోటీలు జరిగాయి. పురుషుల విభాగంలో భారత ఆర్చర్లు తరుణ్దీప్ రాయ్, పార్థ్ సాలుంఖే తొలి రౌండ్లోనే ఓడిపోగా... పారిస్ ఒలింపిక్స్లో పోటీపడ్డ ఆంధ్రప్రదేశ్కు చెందిన బొమ్మదేవర ధీరజ్, అతాను దాస్ (బెంగాల్) రెండో రౌండ్లో వెనుదిరిగారు. తరుణ్దీప్ రాయ్ 2–6 సెట్ పాయింట్లతో (28–30, 29–28, 27–31, 29–32) మథియాస్ క్రామెర్ (జర్మనీ) చేతిలో... పార్థ్ సాలుంఖే 2–6 సెట్ పాయింట్లతో (28–29, 25–28, 28–25, 27–30) లు షుయె (చైనా) చేతిలో ఓటమి పాలయ్యారు. రెండో రౌండ్ మ్యాచ్ల్లో ధీరజ్ 4–6 సెట్ పాయింట్లతో (30–30, 30–30, 31–30, 28–29, 28–30) టాంగ్ చి చున్ (చైనీస్ తైపీ) చేతిలో, అతాను దాస్ 4–6 సెట్ పాయింట్లతో (28–27, 30–31, 31–30, 30–31, 27–30) బ్రాడీ ఎలీసన్ (అమెరికా) చేతిలో ఓటమి చవిచూశారు. అంతకుముందు తొలి రౌండ్ మ్యాచ్ల్లో ధీరజ్ 6–5 సెట్ పాయింట్లతో (29–26, 30–28, 26–27, 29–29, 27–29, 9–8) జాక్ విలియమ్స్ (అమెరికా)పై, అతాను దాస్ 6–0త సెట్ పాయింట్లతో (30–28, 29–28, 30–29) తొమత్సు దైసుకె (జపాన్)పై విజయం సాధించారు. మహిళల రికర్వ్ విభాగంలో అంకిత భగత్ తొలి రౌండ్లో, దీపిక కుమారి రెండో రౌండ్లో, సిమ్రన్జీత్ కౌర్ క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించారు. అంకిత 2–6 సెట్ పాయింట్లతో (27–26, 26–28, 29–30, 28–29) దున్యా యెనిహయత్ (తుర్కియే) చేతిలో... దీపిక 0–6 సెట్ పాయింట్లతో (29–30, 27–28, 28–30) ఆన్ సాన్ (దక్షిణ కొరియా) చేతిలో... సిమ్రన్జీత్ 5–6 సెట్ పాయింట్లతో (29–28, 24–29, 27–24, 27–27, 23–29, 8–11) ఆన్ సాన్ చేతిలో ఓడిపోయారు. -
వయో మోసానికి పాల్పడిన రెజ్లర్లపై వేటు
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) వయో మోసానికి పాల్పడిన రెజ్లర్లపై కన్నెర్ర చేసింది. తప్పుడు వయసు ధ్రువీకరణ పత్రాలతో జూనియర్, వయో విభాగాల టోర్నీల్లో పాల్గొన్న 30 మంది రెజ్లర్లపై తాత్కాలిక సస్పెన్షన్ వేటు వేసింది. ఆరోపణల నేపథ్యంలో గత నెల ఏకంగా 400 మందిపై విచారణ జరిపినట్లు తెలిసింది. హరియాణాకు చెందిన కొందరు రెజ్లర్లు నకిలీ వయో ధ్రువీకరణ పత్రాలతో జూనియర్ స్ధాయి పోటీల్లో పాల్గొంటున్నారు. దీనిపై తరచూ ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఈసారి ఢిల్లీ ఆఖాడాలకు చెందిన రెజ్లర్లతో పాటు కోచ్లు రెజ్లింగ్ సమాఖ్యకు పెద్ద సంఖ్యలో ఫిర్యాదు చేశారు. తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలతో ఈ తతంగమంతా జరుగుతోందని డబ్ల్యూఎఫ్ఐ గుర్తించింది. దీంతో విచారణ చేపట్టడంతో 30 మంది పట్టుపడ్డారు. వెంటనే వారిపై నిషేధం విధించి జూనియర్ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అనర్హులుగా తేల్చింది. గత కొంతకాలంగా నరేలా జోన్, రోహిని జోన్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.చాలామంది హరియాణాకు చెందిన రెజ్లర్లు ఢిల్లీ నుంచి పోటీపడేందుకు వీలుగా బేగంపుర నుంచి నకిలీ జనన ధ్రువీకరణ పత్రాలు పొందారు. ఇలా 436 కేసులను పరిశీలించిన డబ్ల్యూఎఫ్ఐ... వర్ధమాన రెజ్లర్ల జీవితాలతో చెలగాటం ఆడకుండా... వారి భవిష్యత్తును కాలరాయకుండా తాత్కాలిక సస్పెన్షన్, మందలింపుతో సరిపెట్టింది. మరోమారు పునరావృమైతే గట్టి చర్యలుంటాయని హెచ్చరించింది. సస్పెండ్కు గురైనవారిలో ఇద్దరు వయసు పైబడిన రెజ్లర్లు బీహార్లో జరిగిన ఖేలో ఇండియా క్రీడల్లో పతకాలు కూడా గెలిచారు. దీనిపై నిర్వాహకులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. లైంగికల వేధింపులకు పాల్పడిన కోచ్ సస్పెండ్ లైంగిక వేధింపులకు పాల్పడిన కోచ్ను డబ్ల్యూఎఫ్ఐ సస్పెండ్ చేసింది. హరియాణాకు చెందిన కోచ్ సంజయ్ లాథర్ ఖేలో ఇండియా క్రీడల సందర్భంగా మహిళా రెజ్లర్లతో అనుచితంగా ప్రవర్తించాడు. పోటీలు ముగిసిన వెంటనే మహిళా రెజ్లర్ల గదులకు వెళ్లేవాడు. అతను లైంగిక వేధింపులకు గురిచేశాడని ఫిర్యాదులు చేయడంతో అతనిపై నిషేధం విధించారు. డబ్ల్యూఎఫ్ఐ అంతర్గత కమిటీ ఈ ఆరోపణలపై విచారణ చేపట్టింది. అతనిపై జీవితకాల నిషేధం విధించాలని సూచించింది. -
జ్యోతి యర్రాజీకి స్వర్ణ పతకం
తైపీ సిటీ: తైవాన్ ఓపెన్ అంతర్జాతీయ అథ్లెటిక్స్ మీట్లో తొలి రోజు భారత అథ్లెట్లు ఆరు స్వర్ణ పతకాలతో అదరగొట్టారు. తైపీ సిటీలో శనివారం జరిగిన పోటీల్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఇటీవల కొరియాలో జరిగిన ఆసియా చాంపియన్షిప్లో బంగారు పతకాన్ని గెలిచిన ఈ వైజాగ్ అమ్మాయి అదే జోరును తైవాన్ మీట్లో పునరావృతం చేసింది. 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును 25 ఏళ్ల జ్యోతి అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 12.99 సెకన్లలో ముగించి విజేతగా నిలిచింది. పురుషుల 110 మీటర్ల హర్డిల్స్లో భారత రన్నర్ తేజస్ శిర్సే (13.52 సెకన్లు) స్వర్ణ పతకాన్ని హస్తగతం చేసుకున్నాడు. పురుషుల 4్ఠ100 మీటర్ల రిలేలో గురీందర్వీర్ సింగ్, అనిమేశ్ కుజుర్, మణికంఠ హోబ్లిధర్, అమ్లాన్ బొర్గోహైన్లతో కూడిన భారత బృందం (38.75 సెకన్లు) బంగారు పతకాన్ని నెగ్గింది. మహిళల 4x100 మీటర్ల రిలేలో తెలంగాణ అమ్మాయి నిత్య గంధే, సుదీక్ష, స్నేహ, అభినయ సభ్యులుగా ఉన్న భారత జట్టు (44.06 సెకన్లు) స్వర్ణ పతకం దక్కించుకుంది. పురుషుల ట్రిపుల్ జంప్లో అబ్దుల్లా అబూబకర్ (16.21 మీటర్లు), మహిళల 1500 మీటర్ల విభాగంలో పూజ (4ని:11.63 సెకన్లు) బంగారు పతకాలు గెలిచారు. -
ఫ్రెంచ్ ‘క్వీన్’ కోకో.. ఫైనల్లో సబలెంకా ఓటమి
పారిస్: ఎర్రమట్టి కోటకు కొత్త రాణి వచ్చింది. అమెరికాకు చెందిన 21 ఏళ్ల కోకో గాఫ్ ఫ్రెంచ్ ఓపెన్ కొత్త చాంపియన్గా అవతరించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్, రెండో సీడ్ కోకో గాఫ్ 6–7 (5/7), 6–2, 6–4తో ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ అరీనా సబలెంకా (బెలారస్)పై విజయం సాధించింది. 2 గంటల 38 నిమిషాలపాటు జరిగిన ఈ హోరాహోరీ సమరంలో కోకో గాఫ్ తొలి సెట్ను కోల్పోయినా అధైర్యపడకుండా అసమాన పోరాటపటిమతో కోలుకుని సబలెంకాను బోల్తా కొట్టించింది. కోకో గాఫ్ కెరీర్లో ఇది రెండో గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్కాగా, తొలిసారి ఆమె ఫ్రెంచ్ ఓపెన్లో విజేతగా నిలిచింది. 2023 యూఎస్ ఓపెన్ ఫైనల్లో సబలెంకాపైనే గెలిచి కోకో గాఫ్ తన కెరీర్లో తొలి గ్రాండ్స్లామ్ టైటిల్ను అందుకోవడం విశేషం. 2022 ఫ్రెంచ్ ఓపెన్లో తొలిసారి ఫైనల్ చేరిన కోకో గాఫ్ పోలాండ్ స్టార్ ఇగా స్వియాటెక్ చేతిలో ఓడిపోయి రన్నరప్గా నిలిచింది. రెండో ప్రయత్నంలో మాత్రం కోకో అత్యుత్తమ ఆటతీరుతో విన్నర్స్ ట్రోఫీని ముద్దాడింది. చాంపియన్గా నిలిచిన కోకో గాఫ్కు 25 లక్షల 50 వేల యూరోలు (రూ. 24 కోట్ల 91 లక్షలు), రన్నరప్ సబలెంకాకు 12 లక్షల 75 వేల యూరోలు (రూ. 12 కోట్ల 45 లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి. తడబడి తేరుకొని... సబలెంకాతో జరిగిన తుది పోరులో కోకో గాఫ్ మ్యాచ్ కొనసాగినకొద్దీ రాటుదేలింది. తొలి సెట్ ఆరంభంలో 1–4తో వెనుకబడిన కోకో నెమ్మదిగా తేరుకుంది. సబలెంకా సర్వీస్ను రెండుసార్లు బ్రేక్ చేసి స్కోరును 4–4తో సమం చేసింది. ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్లను నిలబెట్టుకోవడంతో స్కోరు 6–6తో సమమైంది. టైబ్రేక్లో సబలెంకా పైచేయి సాధించి తొలి సెట్ను దక్కించుకుంది. రెండో సెట్లో కోకో అనూహ్యంగా విజృంభించగా, సబలెంకా తడబడింది. కోకో కేవలం రెండు గేమ్లు చేజార్చుకొని ఈ సెట్ను సొంతం చేసుకొని మ్యాచ్లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్లో సబలెంకా సర్వీస్ను రెండుసార్లు బ్రేక్ చేసిన కోకో తన సర్వీస్లను కాపాడుకొని విజయాన్ని ఖరారు చేసుకుంది. ఈ క్రమంలో స్టెఫీ గ్రాఫ్ (జర్మనీ) తర్వాత (1999లో మారి్టనా హింగిస్పై) వరల్డ్ నంబర్వన్తో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో తొలి సెట్ కోల్పోయాక కూడా విజేతగా నిలిచిన రెండో ప్లేయర్గా కోకో గాఫ్ గుర్తింపు పొందింది. -
నార్వే చెస్ టోర్నీ విజేతగా మాగ్నస్ కార్ల్సన్.. గుకేశ్కు నిరాశ
నార్వే చెస్ 2025 టోర్నమెంట్ విజేతగా ప్రపంచ నంబర్ 1 మాగ్నస్ కార్ల్సెన్ నిలిచాడు. ప్రస్తుత వరల్డ్ ఛాంపియన్, భారత యువ సంచలనం డి. గుకేష్, అమెరికా గ్రాండ్ మాస్టర్ ఫాబియానో కరువానాను ఓడించి టైటిల్ను మాగ్నస్ గెలుచుకున్నాడు. ఆఖరి రౌండ్లోకి వెళ్లేముందు కార్ల్సెన్, గుకేష్ మధ్య కేవలం అర పాయింట్ తేడా మాత్రమే ఉండేది. ఈ క్రమంలో గుకేశ్ కీలకమైన పదో రౌండ్లో ఫాబియానో కరువానాతో తలపడ్డాడు. నువ్వానేనా జరిగిన చివరి రౌండ్లో గుకేశ్ కాస్త ఒత్తిడికి లోనయ్యి ఓటమి చవిచూశాడు. దీంతో గుకేశ్ 14.5 పాయింట్లతో మూడో స్థానంలో పరిమియతమయ్యాడు. మరోవైపు కార్ల్సన్ చివరి రౌండ్లో అదరగొట్టాడు. భారత గ్రాండ్మాస్టర్ అర్జున్ ఎరిగైసితో గేమ్ను డ్రా చేసుకుని టోర్నీలో అగ్రస్థానంలో నిలిచిన కార్లెసెన్(16 పాయింట్లు) ఛాంపియన్గా అవతరించాడు. ఇక మహిళల విభాగంలోఉక్రెయిన్ గ్రాండ్మాస్టర్ అన్నా ముజిచుక్ 16.5 పాయింట్లతో విజేతగా నిలిచింది. భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి మూడో స్థానంతో టోర్నీని ముగించింది.చదవండి: రోహిత్ శర్మకు షాక్..! టీమిండియా కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్? -
‘ఆఖరి’ అంచెకు భారత్ ‘సై’
అమ్స్టెల్వీన్ (నెదర్లాండ్స్): అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్ హాకీ ఆఖరి అంచె పోటీలకు భారత జట్లు సిద్ధమయ్యాయి. ఈ యూరో అంచె పోటీల్లో అంచనాలకు మించి రాణించాలని, గరిష్ట పాయింట్లతో నేరుగా ప్రపంచకప్ బెర్తు సాధించాలని పురుషుల, మహిళల జట్లు పట్టుదలతో ఉన్నాయి. ముందుగా భారత పురుషుల జట్టు నేడు ఆతిథ్య నెదర్లాండ్స్తో తలపడుతుంది. భువనేశ్వర్ అంచె పోటీల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన భారత్ వచ్చే ప్రపంచకప్కు వేదికైన నెదర్లాండ్స్లోనూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. నేడు, 9వ తేదీన డచ్ టీమ్తో జరిగే రెండు మ్యాచ్ల్లోనూ విజయం సాధించడం ద్వారా యూరో అంచెకు శుభారంభం పలకాలని హర్మన్ప్రీత్ సింగ్ నేతృత్వంలోని భారత్ భావిస్తోంది. ప్రస్తుతం 15 పాయింట్లతో ఇంగ్లండ్ (16), బెల్జియం (16)ల తర్వాత మూడో స్థానంలో ఉన్న హర్మన్ బృందం ఈ ఆఖరి అంచె పోటీలతో మెరుగైన స్థానంలో నిలవాలని ఆశిస్తోంది. డ్రాగ్ఫ్లికర్ హర్మన్ప్రీత్, మిడ్ఫీల్డ్లో హార్దిక్ సింగ్లతో పాటు రక్షణ శ్రేణిలో అమిత్ రోహిదాస్, హర్మన్, జుగ్రాజ్, జర్మన్ప్రీత్లు స్థాయికి తగిన ఆటతీరును కనబరిస్తే గెలుపు ఏమంత కష్టం కాదు. భారత చీఫ్ కోచ్ క్రెయిగ్ ఫుల్టన్ తమ జట్టు అన్ని రంగాల్లోనూ మెరుగైందని, యువ ఆటగాళ్లు సైతం అనుభవం సంపాదించారని తప్పకుండా ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారని అన్నాడు. నెదర్లాండ్స్తో పోరు ముగిశాక భారత్ 11, 12 తేదీల్లో అర్జెంటీనాతో, 14, 15 తేదీల్లో ఆ్రస్టేలియాతో, 21, 22 తేదీల్లో బెల్జియంతో తలపడుతుంది. మరోవైపు మహిళల జట్టు యూరో అంచె పోటీలను లండన్లో ఆడనుంది. ఈ నెల 14 నుంచి భారత మహిళల జట్టు పోరు ప్రారంభం అవుతుంది. భారత జట్టు తొమ్మిది పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్లు ఆడిన భారత జట్టు రెండింటిలో మాత్రమే గెలిచింది. -
అయ్యయ్యో నవదీప్..!
న్యూఢిల్లీ: నవదీప్ సింగ్ గుర్తున్నాడా... అదేనండీ మరుగుజ్జు జావెలిన్ త్రోయర్, పారిస్ పారాలింపిక్స్ (2024)లో ఎఫ్41 ఈవెంట్లో పోటీపడటంతోనే అందరిని ఆకర్షించాడు. పొట్టి కాళ్లతో చిట్టిచిట్టి అంగల్లు వేగంగా వేసుకుంటూ వెళ్లి ఈటెను విసిరిన ప్రదర్శన చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఆ ప్రదర్శనతోనే నవదీప్ బంగారు పతకంతో అందలమెక్కాడు. మన ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చటపడి మరీ అతనికి షేక్హ్యాండ్ ఇచ్చేందుకు నవదీప్తో సమానంగా ఫొటోలో కనిపించేందుకు కింద కూర్చున్నారు. అతని నెత్తికి టోపీపెట్టి అభినందించారు. అలా క్రీడాప్రియులకు పరిచయమైన నవదీప్కు లాస్ ఏంజెలిస్–2028 ఒలింపిక్స్ పెద్ద షాక్ ఇచ్చింది. అతను స్వర్ణం నిలబెట్టుకునే అవకాశం లేకుండా ‘ఎఫ్ 41’ కేటగిరీని తదుపరి విశ్వక్రీడల నుంచి తొలగించింది. రోస్టర్లో భాగంగా ఆతిథ్య దేశం కొన్ని క్రీడలు లేదంటే కేటగిరీలను పక్కనబెట్టే అవకాశం ఒలింపిక్ చార్టర్ కల్పిస్తుంది. ఇందులో భాగంగానే నవదీప్ ఈవెంట్తో పాటు డిస్కస్ త్రోయర్ యోగేశ్ కథునియా ‘ఎఫ్ 56’ కేటగిరీని సైతం లాస్ ఏంజెలిస్ నిర్వాహకులు తొలగించారు. పారిస్లో యోగేశ్ డిస్కస్ త్రో ‘ఎఫ్ 56’ కేటగిరీలో రజత పతకం గెలుపొందాడు. అయితే వీరిద్దరి కేటగిరీలు లాస్ ఏంజెలిస్ పారాలింపిక్స్లోని 552 మెడల్ ఈవెంట్లలో లేవు. ఓవరాల్గా 4400 అథ్లెట్ల కోటాలో ఏ మార్పు లేదు. టోక్యో, పారిస్ పారాలింపిక్స్లో కూడా 4400 మంది అథ్లెట్లు పోటీపడ్డారు. మిగతా క్రీడా ఈవెంట్లను సర్దుబాటు చేయడం ద్వారా 4400 అథ్లెట్ల కోటా అలాగే కొనసాగుతోంది. -
రూ. 500కే లవ్లీనా అకాడమీలో బాక్సింగ్ శిక్షణ
గువాహటి: భారత స్టార్ మహిళా బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్ తన ఒలింపిక్స్ కలను సాకారం చేసుకున్నట్లే మిగతా వారు కూడా ఒలింపియన్లుగా ఎదగాలనే లక్ష్యంతో అకాడమీని అందుబాటులోకి తెచ్చింది. ఉత్తర గువాహటిలోని బర్చండ్రాలో గురువారం లాంఛనంగా ప్రారంభమైన ఈ అకాడమీలో ఫీజు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. అందరూ వెచ్చించే విధంగా నెలకు కేవలం రూ. 500 చెల్లించి ఇక్కడ ‘పంచ్’లు నేర్చుకోవచ్చు. 8 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వయో విభాగాల్లో ప్రత్యేక శిక్షణ ఉంటుంది. అలాగే 18 ఏళ్ల పైబడిన వారికి కూడా కోచింగ్ ఇస్తారు. ఆమె లాభాపేక్షలేని కృషిని గుర్తించిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ రూ. 2 కోట్ల గ్రాంట్ను అందజేయనున్నట్లు ప్రకటించారు. లవ్లీనా తన అకాడమీకి ప్రభుత్వ స్థలాన్ని అడగలేదు. 2021లో సొంతంగా అకాడమీ ఏర్పాటు కోసం స్థలం కొనుగోలు చేసిన ఆమె మెరుగైన మౌలిక సదుపాయాలతో దాన్ని తీర్చిదిద్దింది. 26–26 సైజ్ బాక్సింగ్ రింగ్తో పాటు ఆధునిక పరికరాలతో కూడిన జిమ్ను ఏర్పాటు చేసింది. గువాహటిలో సకల హంగులతో నెలకొల్పిన తొలి బాక్సింగ్ అకాడమీగా చెప్పవచ్చు. అస్సాంతో పాటు ఈశాన్య రాష్ట్రాల బాలబాలికలు, యువత కోసం దీన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రతిభాసక్తులు ఉన్న వారు తమ నైపుణ్యాన్ని మెరుగుపర్చుకునేందుకు, ప్రొఫెషనల్ బాక్సర్లుగా తయారయ్యేందుకు ఈ అకాడమీ దోహదం చేస్తుందని ఈ సందర్భంగా లవ్లీనా పేర్కొంది. కొత్త తరం బాక్సర్లకు ఇదో వేదికగా మారాలని ఆకాంక్షించింది. ‘మేటి బాక్సర్లను తయారు చేయాలనే కలతో దీన్ని నిర్మించాను. ఇక్కడ శిక్షణ పొందిన బాక్సర్లు జాతీయ, అంతర్జాతీయస్థాయిలో పతకాలు తేవాలని, 2028కల్లా కొందరైనా బాక్సర్లు వెలుగులోకి రావాలని ఆశిస్తున్నాను’ అని 2020 టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం నెగ్గిన లవ్లీనా చెప్పింది. దశలవారీగా బాక్సర్లకు హాస్టల్ వసతి కల్పించాలనుకుంటున్నట్లు తెలిపింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వ సహకారాన్ని తీసుకుంటామని చెప్పింది. -
జోర్డాన్, ఉజ్బెకిస్తాన్ కొత్త చరిత్ర
దోహా: వచ్చే ఏడాది జరగనున్న ప్రతిష్టాత్మక ఫుట్బాల్ ప్రపంచకప్ టోర్నమెంట్కు చైనా దూరమైంది. ఆసియా జోన్ అర్హత పోటీల్లో భాగంగా జరిగిన మ్యాచ్లో చైనా 0–1 గోల్స్ తేడాతో ఇండోనేసియా చేతిలో పరాజయం పాలవడంతో... వరల్డ్కప్ రేసుకు దూరమైంది. ఇక ఉజ్బెకిస్తాన్, జోర్డాన్ తొలిసారి ప్రపంచకప్నకు అర్హత సాధించగా... క్వాలిఫయింగ్ పోటీల్లో చక్కటి ప్రదర్శన కనబర్చిన దక్షిణ కొరియా కూడా ముందంజ వేసింది.2026లో అమెరికా, మెక్సికో, కెనడా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ప్రపంచ కప్నకు ఇప్పటికి 10 జట్లు అర్హత సాధించాయి. ఆతిథ్య హోదాలో ఈ మూడు దేశాలు నేరుగా ముందంజ వేయగా... ఆసియా నుంచి జపాన్, ఇరాన్, జోర్డాన్, దక్షిణ కొరియా, ఉజ్బెకిస్తాన్... ఓసియానియా నుంచి న్యూజిలాండ్... దక్షిణ అమెరికా నుంచి అర్జెంటీనా వరల్డ్కప్ బెర్తులు దక్కించుకున్నాయి. ఆసియా క్వాలిఫయింగ్ పోటీల్లో భాగంగా... గురువారం అర్ధరాత్రి దాటాక ముగిసిన మ్యాచ్ల్లో ఆ్రస్టేలియా 1–0తో జపాన్పై, ఇండోనేసియా 1–0తో చైనాపై, జోర్డాన్ 3–0తో ఒమన్పై, సౌదీ అరేబియా 2–0తో బహ్రెయిన్పై, పాలస్తీనా 2–0తో కువైట్పై, ఖతార్ 1–0తో ఇరాన్పై విజయాలు సాధించాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఉజ్బెకిస్తాన్ మధ్య మ్యాచ్ 0–0తో ‘డ్రా’ కాగా... ఉత్తర కొరియా, కిర్గిస్తాన్ పోరు 2–2 గోల్స్తో సమమైంది. దక్షిణ కొరియా 2–0తో ఇరాక్పై గెలవడం ద్వారా వరుసగా 11వసారి వరల్డ్ కప్ బెర్త్ దక్కించుకుంది. యూఏఈ మ్యాచ్ ‘డ్రా’ అయినా... గ్రూప్ ‘ఎ’లో ఇరాన్ తర్వాత రెండో స్థానంలో నిలవడం ద్వారా ఉజ్బెకిస్తాన్ ముందంజ వేసింది. గ్రూప్ ‘బి’ నుంచి దక్షిణ కొరియా, జోర్డాన్ టోర్నీకి అర్హత సాధించాయి. గ్రూప్ ‘సి’ నుంచి పోటీపడుతున్న చైనా... ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్ల్లో 2 విజయాలు, 7 పరాజయాలతో 6 పాయింట్లు ఖాతాలో వేసుకొని చివరి స్థానంలో కొనసాగుతోంది. మరొక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉండగా... జపాన్ (20 పాయింట్లు), ఆస్ట్రేలియా (16 పాయింట్లు), సౌదీ అరేబియా (13 పాయింట్లు), ఇండోనేసియా (12 పాయింట్లు), బహ్రెయిన్ (6 పాయింట్లు)... చైనా కంటే ముందున్నాయి. 2022లో జరిగిన ప్రపంచకప్లో ఆసియా నుంచి 4 జట్లు మాత్రమే పాల్గొనగా... ఈసారి 8 జట్లు బరిలోకి దిగడం ఖాయమైంది. ఆఫ్రికా నుంచి 9 జట్లు, యూరప్ నుంచి 16 జట్లు వరల్డ్కప్లో పాల్గొననున్నాయి. ఈసారి ప్రపంచకప్లో మొత్తం 48 జట్లు పోటీపడుతున్నాయి.2026 ప్రపంచకప్ టోర్నీకి ఇప్పటి వరకు అర్హత సాధించిన జట్లుఆతిథ్య దేశాలు: అమెరికా, మెక్సికో, కెనడా. ఆసియా: జపాన్, ఇరాన్, జోర్డాన్, దక్షిణ కొరియా, ఉజ్బెకిస్తాన్. ఒసియానియా: న్యూజిలాండ్. దక్షిణ అమెరికా: అర్జెంటీనా. -
సాత్విక్–చిరాగ్ జోడీ ఓటమి
ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత పోరాటం ముగిసింది. జకార్తాలో శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీకి ఓటమి ఎదురైంది. ప్రపంచ ఏడో ర్యాంక్ ద్వయం మాన్ వె చోంగ్–టీ కాయ్ వున్ (మలేసియా)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 22వ ర్యాంక్ జోడీ సాత్విక్–చిరాగ్ 19–21, 16–21తో ఓటమి పాలైంది. క్వార్టర్ ఫైనల్లో ఓడిన సాత్విక్–చిరాగ్ జోడీకి 9,062 డాలర్ల (రూ. 7 లక్షల 77 వేలు) ప్రైజ్మనీతోపాటు 6,600 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. గతంలో మాన్ వె చోంగ్–టీ కాయ్ వున్లతో పోటీపడ్డ నాలుగుసార్లూ విజయం సాధించిన సాత్విక్–చిరాగ్ ద్వయం ఐదో ప్రయత్నంలో మాత్రం ఓటమిని మూటగట్టుకోవడం గమనార్హం. -
ఫైనల్లో అల్కరాజ్
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్లో డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ అల్కరాజ్ 4–6, 7–6 (7/3), 6–0, 2–0తో ఎనిమిదో సీడ్ లొరెంజో ముసెట్టి (ఇటలీ)పై గెలుపొందాడు. నాలుగో సెట్లో అల్కరాజ్ 2–0తో ఆధిక్యంలో ఉన్న దశలో గాయం కారణంగా ముసెట్టి వైదొలిగాడు. 2 గంటల 25 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో అల్కరాజ్కు తొలి రెండు సెట్లలో ఊహించని ప్రతిఘటన ఎదురైంది. తొలి సెట్ను కోల్పోయిన అల్కరాజ్ రెండో సెట్ను టైబ్రేక్లో గెలిచి పుంజుకున్నాడు. మూడో సెట్లో ముసెట్టి ఒక్క గేమ్ కూడా నెగ్గలేకపోయాడు. నాలుగో సెట్లో రెండు గేమ్లు ముగిశాక ముసెట్టి తొడ కండరాల గాయంతో ఆటను కొనసాగించలేనని చైర్ అంపైర్కు తెలపడంతో మ్యాచ్ను నిలిపివేసి అల్కరాజ్ను విజేతగా ప్రకటించారు. దాంతో 22 ఏళ్ల అల్కరాజ్ తన కెరీర్లో ఐదోసారి గ్రాండ్స్లామ్ ఫైనల్లోకి ప్రవేశించాడు. గతంలో ఆడిన నాలుగు గ్రాండ్స్లామ్ టోర్నీల ఫైనల్స్లో (2022 యూఎస్ ఓపెన్; 2023, 2024 వింబుల్డన్; 2024 ఫ్రెంచ్ ఓపెన్) అల్కరాజే గెలుపొందడం విశేషం. సినెర్ (ఇటలీ), జొకోవిచ్ (సెర్బియా) మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో ఆదివారం ఫైనల్లో అల్కరాజ్ తలపడతాడు. శనివారం మహిళల సింగిల్స్ ఫైనల్ జరగనుంది. ప్రపంచ నంబర్వన్ సబలెంకా (బెలారస్), ప్రపంచ రెండో ర్యాంకర్ కోకో గాఫ్ (అమెరికా) టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నారు. సబలెంకా తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్లో ఫైనల్కు చేరుకోగా ... 2022లో రన్నరప్గా నిలిచిన కోకో గాఫ్ రెండోసారి టైటిల్ పోరుకు అర్హత పొందింది. -
ఈసారి కొత్త ‘ఫ్రెంచ్’ క్వీన్
గత మూడేళ్లుగా పారిస్లోని ఎర్రమట్టి కోర్టులపై తన ఆధిపత్యం చాటుకున్న పోలాండ్ టెన్నిస్ స్టార్ ఇగా స్వియాటెక్ ఈసారి రిక్తహస్తాలతో వెనుదిరగనుంది. వరుసగా నాలుగో ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ నెగ్గాలని భావించిన స్వియాటెక్ను బెలారస్ స్టార్, ప్రపంచ నంబర్వన్ అరీనా సబలెంకా బోల్తా కొట్టించింది. మరోవైపు అమెరికా స్టార్ కోకో గాఫ్ కూడా తన జోరును కొనసాగిస్తూ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ‘వైల్డ్ కార్డు’తో బరిలోకి దిగిన ప్రపంచ 361వ ర్యాంకర్, ఫ్రాన్స్ రైజింగ్ స్టార్ లూయి బొయిసన్ ప్రస్థానం సెమీఫైనల్కు పరిమితమైంది. సబలెంకా ఫ్రెంచ్ ఓపెన్లో తొలిసారి ఫైనల్కు చేరడం... 2022లో తుది పోరుకు చేరి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్న కోకో గాఫ్ కూడా అంతిమ సమరానికి అర్హత పొందిన నేపథ్యంలో... ఈసారి ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్లో కొత్త చాంపియన్ అవతరించడం ఖరారైంది. శనివారం జరిగే ఫైనల్లో సబలెంకా, కోకో గాఫ్ అమీతుమీ తేల్చుకుంటారు. పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నమెంట్లో పోలాండ్ స్టార్, ప్రపంచ మాజీ నంబర్వన్ ఇగా స్వియాటెక్ 1457 రోజుల తర్వాత తొలి పరాజయాన్ని చవిచూసింది. 9–6–2021న చివరిసారి ఈ టోర్నీలో ఓడిపోయిన ఆమె వరుసగా 2022, 2023, 2024లలో ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్గా నిలిచింది. ఈసారీ స్వియాటెక్ గెలిచి ఉంటే ఓపెన్ శకంలో (1968 నుంచి) ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ను వరుసగా నాలుగేళ్లు నెగ్గిన తొలి క్రీడాకారిణిగా కొత్త చరిత్ర సృష్టించేది. తన అసమాన పోరాటంతో చరిత్ర పుటల్లో స్వియాటెక్కు స్థానం దక్కకుండా బెలారస్ స్టార్, ప్రపంచ నంబర్వన్ సబలెంకా చేసింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో టాప్ సీడ్ సబలెంకా 7–6 (7/1), 4–6, 6–0తో స్వియాటెక్ను ఓడించి తొలిసారి తన కెరీర్లో ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 2 గంటల 19 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్లో సబలెంకాకు తొలి రెండు సెట్లలో గట్టిపోటీ ఎదురైంది. తొలి సెట్ను టైబ్రేక్లో నెగ్గిన సబలెంకా రెండో సెట్ను చేజార్చుకుంది. నిర్ణాయక మూడో సెట్లో సబలెంకా చెలరేగిపోయింది.మూడుసార్లు స్వియాటెక్ సర్వీస్ను బ్రేక్ చేయడంతోపాటు తన సర్వీస్ను మూడుసార్లు నిలబెట్టుకొని విజయాన్ని ఖరారు చేసుకుంది. సబలెంకా దెబ్బకు మూడో సెట్లో స్వియాటెక్ ఒక్క గేమ్ కూడా నెగ్గలేకపోయింది. స్వియాటెక్తో 13వసారి తలపడ్డ సబెలంకా ఐదోసారి విజయాన్ని అందుకుంది. మ్యాచ్ మొత్తంలో మూడు ఏస్లు సంధించిన బెలారస్ స్టార్ రెండు డబుల్ ఫాల్ట్లు చేసింది. ఆరుసార్లు తన సర్వీస్ను కోల్పోయి ప్రత్యర్థి సర్వీస్ను ఎనిమిదిసార్లు బ్రేక్ చేసింది. 29 విన్నర్స్ కొట్టిన సబలెంకా 25 అనవసర తప్పిదాలు చేసింది. నెట్ వద్దకు ఎనిమిదిసార్లు దూసుకొచ్చి నాలుగుసార్లు పాయింట్లు గెలిచింది. మరోవైపు స్వియాటెక్ ఒక ఏస్తో సరిపెట్టుకొని, నాలుగు డబుల్ ఫాల్ట్లు చేసింది. 29 విన్నర్స్ కొట్టిన ఆమె ఏకంగా 42 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. సెమీస్లో జొకోవిచ్ పురుషుల సింగిల్స్ విభాగంలో సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ 4–6, 6–3, 6–2, 6–4తో గెలుపొంది ఈ టోర్నీలో 13వసారి సెమీఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకున్నాడు. రెండో సెమీఫైనల్లో 2022 రన్నరప్, ప్రపంచ రెండో ర్యాంకర్ కోకో గాఫ్ (అమెరికా) 6–1, 6–2తో లూయి బొయిసన్ (ఫ్రాన్స్)ను చిత్తుగా ఓడించింది. 69 నిమిషాల్లోనే ముగిసిన ఈ పోరులో కోకో గాఫ్ తన సర్వీస్ను ఒకసారి కోల్పోయి ప్రత్యర్థి సర్వీస్ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. 12 విన్నర్స్ కొట్టి, 15 అనవసర తప్పిదాలు చేసింది. నెట్ వద్దకు 13 సార్లు దూసుకొచ్చి 8 సార్లు పాయింట్లు నెగ్గింది. మరోవైపు ప్రిక్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా), క్వార్టర్ ఫైనల్లో ఆరోసీడ్ మిరా ఆంద్రీవా (రష్యా)లను ఓడించిన బొయిసన్ సెమీఫైనల్లో ఒత్తిడికి లోనై తడబడింది. కేవలం ఎనిమిది విన్నర్స్ కొట్టిన ఆమె 33 అనవసర తప్పిదాలు చేసింది. ఈ టోర్నీకి ముందు 361వ ర్యాంక్లో ఉన్న బొయిసన్ తాజా ప్రదర్శనతో సోమవారం విడుదలయ్యే ర్యాంకింగ్స్లో 68వ స్థానానికి చేరుకోనుంది. -
క్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ
జకార్తా: భారత స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లగా... పీవీ సింధు పరాజయంతో ఇంటిబాట పట్టింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్లో సాత్విక్–చిరాగ్ జంట 16–21, 21–18, 22–20తో రస్ముస్ జార్–ఫ్రెడెరిక్ సొగార్డ్ (డెన్మార్క్) జంటపై విజయం సాధించింది. 68 నిమిషాల పాటు సాగిన పోరులో భారత జోడీ తొలి గేమ్ కోల్పోయిన అనంతరం తిరిగి పుంజుకొని వరుస గేమ్ల్లో ప్రపంచ 16వ ర్యాంక్ జంటపై గెలుపొందింది. మిగిలిన విభాగాల్లో పోటీపడిన భారత షట్లర్లంతా ఓటమి పాలవడంతో ఈ టోర్నమెంట్లో సాత్విక్–చిరాగ్ మాత్రమే పోటీలో నిలిచారు. గత వారం సింగపూర్ ఓపెన్లో సెమీస్కు చేరిన ఈ జంట... క్వార్టర్స్లో శుక్రవారం ఏడో ర్యాంక్ జోడీ మాన్ వై చాంగ్–కై వున్ టీ (మలేసియా) తలపడనుంది. సింధు ఈసారి కూడా... గత మ్యాచ్లో ప్రపంచ మాజీ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్)పై చక్కటి విజయంతో ఆశలు రేపిన పీవీ సింధు... అదే జోరు కొనసాగించడంలో విఫలమైంది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో సింధు 22–20, 10–21, 18–21తో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ పోర్న్పవీ చోచువోంగ్ (థాయ్లాండ్) చేతిలో పోరాడి ఓడింది. 78 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి గేమ్ గెలిచిన అనంతరం మిగిలిన రెండు గేమ్ల్లో ఓటమి పాలైంది. ‘ఈ మ్యాచ్ ను విజయంతో ముగించాల్సింది. ఓవరాల్గా నా ప్రదర్శన బాగానే ఉంది. ఈ టోర్నీ నుంచి ఎంతో నేర్చుకున్నా. పొరబాట్లు సరిదిద్దుకొని తర్వాతి టోర్నీలో మరింత మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తా’ అని సింధు పేర్కొంది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్స్లో సతీశ్ కుమార్ కరుణాకరన్–ఆద్య వరియత్ ద్వయం 7–21, 12–21తో ఆరో సీడ్ దెచాపోల్–సుపిసారా (థాయ్లాండ్) జోడీ చేతిలో ఓడింది. 25 నిమిషాల్లో ముగిసిన పోరులో భారత జంట థాయ్లాండ్ ద్వయం జోరు ముందు నిలవలేకపోయింది. మహిళల డబుల్స్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జంట 13–21, 22–24తో యుకీ ఫుకుషిమా–మయు మత్సుమోటో (జపాన్) ద్వయం చేతిలో ఓడింది. -
టాప్ సీడ్పై రష్మిక విజయం
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ75 మహిళల టోర్నీలో హైదరాబాద్ క్రీడాకారిణి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక సంచలనం సృష్టించింది. అమెరికాలోని సౌత్ కరోలినా రాష్ట్రంలోని సమ్టర్ పట్టణంలో ఈ టోర్నీ జరుగుతోంది. గురువారం జరిగిన సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో ప్రపంచ 335వ ర్యాంకర్ రష్మిక 3–6, 6–3, 6–3తో టాప్ సీడ్, ప్రపంచ 212వ ర్యాంకర్ హనా చాంగ్ (అమెరికా)ను బోల్తా కొట్టించింది. 2 గంటల 31 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో రష్మిక ఒక ఏస్ కొట్టి, నాలుగు డబుల్ ఫాల్ట్లు చేసింది. తన సర్వీస్ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో అమెరికాకే చెందిన జూలియా ఫ్లిగ్నెర్తో రష్మిక తలపడుతుంది. డబుల్స్లో రష్మిక (భారత్)–కేథరీన్ సెబోవ్ (కెనడా) జోడీ క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. తొలి రౌండ్లో రష్మిక–కేథరీన్ ద్వయం 7–6 (8/6), 6–4తో అయానా అక్లి–డలేనా హెవిట్ (అమెరికా) జోడీపై గెలిచింది. -
భారత ఆర్చరీ జట్లకు నిరాశ
అంటాల్యా (తుర్కియే): ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–3 టోర్నమెంట్లో టీమ్ విభాగాల్లో భారత జట్లకు నిరాశ ఎదురైంది. కాంపౌండ్, రికర్వ్ విభాగాల్లో భారత బృందాలు పతకాలు గెల్చుకోవడంలో విఫలమయ్యాయి. మహిళల కాంపౌండ్ కాంస్య పతక మ్యాచ్లో వెన్నం జ్యోతి సురేఖ (ఆంధ్రప్రదేశ్), తనిపర్తి చికిత (తెలంగాణ), మధుర (మహారాష్ట్ర)లతో కూడిన భారత జట్టు 238–239తో అలెక్సిస్ రూయిజ్, ఒలీవియా డీన్, అబిగెయిల్లతో కూడిన అమెరికా జట్టు చేతిలో ఓడిపోయింది. బొమ్మదేవర ధీరజ్, అతాను దాస్, పార్థ్లతో కూడిన భారత పురుషుల రికర్వ్ జట్టు కూడా కాంస్య పతక మ్యాచ్లో ఓడిపోయింది. భారత బృందం 1–5తో ఫ్రాన్స్ జట్టు చేతిలో ఓటమి చవిచూసింది. అంకిత, దీపిక, సిమ్రన్జీత్లతో కూడిన భారత మహిళల రికర్వ్ జట్టు క్వార్టర్ ఫైనల్లో 1–5తో అమెరికా జట్టు చేతిలో ఓడిపోయింది. -
గాయత్రి–ట్రెసా జోడీ శుభారంభం
జకార్తా: ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్లో గాయత్రి–ట్రెసా ద్వయం 21–14, 22–20తో పొలీనా బురోవా–యెవెనియా కాంటెమిర్ (ఉక్రెయిన్) జంటపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకుంది. 34 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో భారత జోడీ తొలి గేమ్ను అలవోకగా సొంతం చేసుకోగా... రెండో గేమ్లో గట్టిపోటీ ఎదుర్కొంది. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో యుకీ ఫుకుషిమా–మయు మత్సుమోటో (జపాన్)లతో గాయత్రి–ట్రెసా తలపడతారు. మరోవైపు మిక్స్డ్ డబుల్స్ విభాగంలో భారత్కు మిశ్రమ ఫలితాలు లభించాయి. గద్దె రుతి్వక శివాని–రోహన్ కపూర్; తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల; అశిత్ సూర్య–అమృత జోడీలు తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టగా... సతీశ్ కుమార్ కరుణాకరన్–ఆద్య వరియత్ ద్వయం ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. సతీశ్–ఆద్య జోడీ 15–21, 21–16, 21–17తో యె హోంగ్ వె–నికోల్ గొంజాలెస్ చాన్ (చైనీస్ తైపీ) జంటపై విజయం సాధించింది. రుత్విక–రోహన్ 14–21, 9–21తో యుచి షిమోగామి–సయాక హొబారా (జపాన్) చేతిలో, అశిత్–అమృత 15–21, 9–21తో మాడ్స్ వెస్టెర్గార్డ్–క్రిస్టిన్ బుష్ (డెన్మార్క్) చేతిలో, తనీషా–ధ్రువ్ 11–21, 21–16, 14–21తో టాంగ్ జి చెన్–ఈ వె తో (మలేసియా) చేతిలో పరాజయం పాలయ్యారు. కిరణ్ జార్జి ఓటమి పురుషుల సింగిల్స్ విభాగంలో భారత పోరాటం ముగిసింది. తొలి రోజు మంగళవారం లక్ష్య సేన్, ప్రణయ్ తొలి రౌండ్లోనే నిష్క్రమించగా... రెండో రోజు బుధవారం కిరణ్ జార్జి కూడా తొలి రౌండ్ను దాటలేకపోయాడు. ప్రపంచ మాజీ చాంపియన్ లో కీన్ యె (సింగపూర్)తో జరిగిన మ్యాచ్లో కిరణ్ జార్జి 20–22, 9–21తో ఓడిపోయాడు. -
కరువానాపై అర్జున్ విజయం
స్టావెంజర్: నార్వే ఓపెన్ చెస్ టోర్నీలో భారత స్టార్ గ్రాండ్మాస్టర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. క్లాసికల్ ఫార్మాట్లో ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ జోరుకు బ్రేక్ పడగా... తెలంగాణ గ్రాండ్మాస్టర్, భారత నంబర్వన్ ఇరిగేశి అర్జున్ అద్భుత విజయంతో టైటిల్ రేసులోకి వచ్చాడు. ఎనిమిదో రౌండ్లో తమిళనాడుకు చెందిన 19 ఏళ్ల గుకేశ్ 50 ఎత్తుల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ హికారు నకముర (అమెరికా) చేతిలో ఓటమి పాలయ్యాడు. మరోవైపు ప్రపంచ మూడో ర్యాంకర్ అర్జున్ 71 ఎత్తుల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ ఫాబియానో కరువానా (అమెరికా)ను బోల్తా కొట్టించాడు. ఆరుగురు మేటి గ్రాండ్మాస్టర్ల మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగుతోన్న ఈ టోర్నీలో మరో రెండు రౌండ్లు మిగిలి ఉన్నాయి. క్లాసికల్ గేమ్లోనే విజయం సాధిస్తే 3 పాయింట్లు లభిస్తాయి. ఒకవేళ క్లాసికల్ గేమ్ ‘డ్రా’గా ముగిస్తే విజేతను నిర్ణయించేందుకు అర్మగెడాన్ గేమ్ను నిర్వహిస్తారు. క్లాసికల్ గేమ్ను ‘డ్రా’ చేసుకొని, అర్మగెడాన్ గేమ్లో గెలిస్తే 1.5 పాయింట్లు లభిస్తాయి. క్లాసికల్ గేమ్ను ‘డ్రా’ చేసుకొని, అర్మగెడాన్ గేమ్లో ఓడిపోతే 1 పాయింట్ దక్కుతుంది. క్లాసికల్ గేమ్లో ఓడిపోతే ఎలాంటి పాయింట్లు లభించవు. ఎనిమిదో రౌండ్ ముగిశాక కరువానా 12.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. 12 పాయింట్లతో కార్ల్సన్ రెండో స్థానంలో, 11.5 పాయింట్లతో నకముర, గుకేశ్ సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. 10.5 పాయింట్లతో అర్జున్ ఐదో స్థానంలో, వె యి (చైనా) 8 పాయింట్లతో చివరిదైన ఆరో స్థానంలో ఉన్నారు. ఇదే టోర్నీ మహిళల విభాగంలో భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి 13.5 పాయింట్లతో ఆధిక్యంలో నిలిచింది. ఎనిమిదో రౌండ్ గేమ్లో హంపి 58 ఎత్తుల్లో సారా ఖాదెమ్ (స్పెయిన్)ను ఓడించింది. భారత్కే చెందిన మరో గ్రాండ్మాస్టర్ వైశాలి 37 ఎత్తుల్లో ప్రపంచ చాంపియన్ జు వెన్జున్పై సంచలన విజయం సాధించింది. -
భళా బొయిసన్...
పారిస్: టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో మరో సంచలనం నమోదైంది. ‘వైల్డ్ కార్డు’తో ఈ టోర్నీలో బరిలోకి దిగిన ప్రపంచ 361వ ర్యాంకర్, ఫ్రాన్స్ ప్లేయర్ లూయి బొయిసన్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో అన్సీడెడ్ బొయిసన్ 7–6 (8/6), 6–3తో ప్రపంచ ఆరో ర్యాంకర్ మిరా ఆంద్రీవా (రష్యా)ను బోల్తా కొట్టించింది. తద్వారా 1989 తర్వాత కెరీర్లో ఆడుతున్న తొలి గ్రాండ్స్లామ్ టోర్నీలోనే సెమీఫైనల్కు చేరుకున్న ప్లేయర్గా బొయిసన్ గుర్తింపు పొందింది. చివరిసారి 1989లో మోనికా సెలెస్ (యుగోస్లావియా), జెన్నిఫర్ కాప్రియాటి (అమెరికా) ఫ్రెంచ్ ఓపెన్లోనే ఈ ఘనత సాధించారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా)ను ఓడించిన బొయిసన్ క్వార్టర్ ఫైనల్లోనూ అదే జోరు కనబరిచింది. 2 గంటల 8 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో 22 ఏళ్ల బొయిసన్ మూడు ఏస్లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్లు చేసింది. తన సర్వీస్ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. సెమీఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ కోకో గాఫ్ (అమెరికా)తో బొయిసన్ తలపడుతుంది. మరో క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ కోకో గాఫ్ 6–7 (6/8), 6–4, 6–1తో ఏడో సీడ్, ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ మాడిసన్ కీస్ (అమెరికా)పై గెలిచింది. సెమీస్లో అల్కరాజ్, సినెర్ పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్), ప్రపంచ నంబర్వన్ యానిక్ సినెర్ (ఇటలీ) సెమీఫైనల్లోకి అడుగు పెట్టారు. క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సినెర్ 6–1, 7–5, 6–0తో అలెగ్జాండర్ బుబ్లిక్ (కజకిస్తాన్)పై, అల్కరాజ్ 6–0, 6–1, 6–4తో 12వ సీడ్ టామీ పాల్ (అమెరికా)పై విజయం సాధించారు. సెమీఫైనల్లో ఎనిమిదో సీడ్ ముసెట్టి (ఇటలీ)తో అల్కరాజ్ ఆడతాడు. జొకోవిచ్ (సెర్బియా), జ్వెరెవ్ (జర్మనీ) మధ్య చివరి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ విజేతతో రెండో సెమీఫైనల్లో సినెర్ తలపడతాడు. -
క్వార్టర్ ఫైనల్లో భారత మహిళల ఆర్చరీ జట్టు
అంటాల్యా (తుర్కియే): ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–3 టోర్నమెంట్ క్వాలిఫయింగ్ రౌండ్లో భారత క్రీడాకారులు రాణించారు. మహిళల కాంపౌండ్ విభాగంలో మధుర ధమాంగావ్కర్ (మహారాష్ట్ర), తనిపర్తి చికిత (తెలంగాణ), వెన్నం జ్యోతి సురేఖ (ఆంధ్రప్రదేశ్)లతో కూడిన భారత జట్టు నేరుగా క్వార్టర్ ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది. కజకిస్తాన్, బ్రిటన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ విజేతతో క్వార్టర్ ఫైనల్లో భారత్ తలపడుతుంది. క్వాలిఫయింగ్లో భారత జట్టు ఓవరాల్గా 1777 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. మధుర 600 పాయింట్లతో నాలుగో స్థానంలో, చికిత 592 పాయింట్లతో 11వ స్థానంలో, జ్యోతి సురేఖ 585 పాయింట్లతో 19వ స్థానంలో నిలిచారు. పురుషుల రికర్వ్ క్వాలిఫయింగ్ రౌండ్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ బొమ్మదేవర ధీరజ్ 572 పాయింట్లు స్కోరు చేసి 13వ స్థానాన్ని దక్కించుకున్నాడు. భారత్కే చెందిన అతాను దాస్ 570 పాయింట్లతో 17వ స్థానంలో, పార్థ్ సాలుంఖే 565 పాయింట్లతో 26వ స్థానంలో నిలిచారు. ఓవరాల్గా భారత్ 1707 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచి రెండో రౌండ్కు అర్హత పొందింది. -
అర్జున్పై తొలిసారి నెగ్గిన గుకేశ్
స్టావెంజర్: గత ఏడాది ప్రపంచ చెస్ చాంపియన్గా అవతరించిన తర్వాత భారత గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ పాల్గొన్న పలు టోర్నీలలో ఆశించినస్థాయిలో రాణించలేకపోయాడు. అయితే నార్వే ఓపెన్ టోర్నీలో గుకేశ్ మళ్లీ ఫామ్లోకి వచ్చాడు. ఆరుగురు మేటి గ్రాండ్మాస్టర్ల మధ్య జరుగుతోన్న ఈ టోర్నీలో... గుకేశ్ ఆరో రౌండ్లో నార్వే దిగ్గజం, వరల్డ్ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్పై క్లాసికల్ ఫార్మాట్లో తొలిసారి గెలిచాడు. కార్ల్సన్ను ఓడించిన ఉత్సాహంలో గుకేశ్ క్లాసికల్ ఫార్మాట్లో మరో ప్రత్యర్థిపై తొలిసారి విజయాన్ని అందుకున్నాడు. ఆ ప్రత్యర్థి ఎవరో కాదు భారత్కే చెందిన యువ గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్. గతంలో అర్జున్తో పోటీపడిన ఆరుసార్లు గుకేశ్కు విజయం దక్కలేదు. ఒక గేమ్లో ఓడిపోయి, నాలుగు గేమ్లను ‘డ్రా’ చేసుకున్నాడు. ఏడో ప్రయత్నంలో మాత్రం గుకేశ్ పైచేయి సాధించాడు. మూడున్నర గంటలకుపైగా జరిగిన ఏడో రౌండ్ గేమ్లో గుకేశ్ తెల్ల పావులతో ఆడుతూ 92 ఎత్తుల్లో అర్జున్ను ఓడించాడు. ఈ విజయంతో గుకేశ్ 11.5 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకున్నాడు. 12.5 పాయింట్లతో ఫాబియానో కరువానా (అమెరికా) అగ్రస్థానంలో... 11 పాయింట్లతో మాగ్నస్ కార్ల్సన్ మూడో స్థానంలో ఉన్నారు. హికారు నకమురా (అమెరికా; 8.5 పాయింట్లు) నాలుగో స్థానంలో, అర్జున్ (7.5 పాయింట్లు) ఐదో స్థానంలో, వె యి (చైనా; 6.5 పాయింట్లు) ఆరో స్థానంలో ఉన్నారు. -
ప్రియమైన ప్రత్యర్థిపై ఘనమైన విజయం
ఆట ఏదైనా కొందరి పోరు చూస్తుంటే ముచ్చటేస్తుంది. చివర్లో విజేతగా ఎవరు అవతరించినా అభిమానులకు మాత్రం పైసా వసూల్ అవుతుంది. మహిళల బ్యాడ్మింటన్ విషయానికొస్తే భారత స్టార్ పీవీ సింధు, జపాన్ ప్లేయర్ నొజోమి ఒకుహారా మధ్య మైదానంలో వైరం ఇప్పటిది కాదు. 2012లో ఆసియా యూత్ అండర్–19 చాంపియన్షిప్లో వీరిద్దరి మధ్య తొలి పోరు జరిగింది. ఆ తర్వాత ఇద్దరూ తమ కెరీర్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ సీనియర్ స్థాయిలో చిరస్మరణీయ విజయాలు అందుకున్నారు. ప్రపంచ చాంపియన్గా అవతరించడంతోపాటు ప్రపంచ నంబర్వన్ ర్యాంక్లను అందుకున్నారు. ఈ క్రమంలో సింధు, ఒకుహారా మ్యాచ్లంటే బాడ్మింటన్ అభిమానులకు పసందైన విందుగా మారిపోయింది. ఒకసారి సింధు గెలిస్తే, మరోసారి ఒకుహారా నెగ్గి లెక్క సరిచేసేది. తాజాగా ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో వీరిద్దరు తొలి రౌండ్లోనే ఎదురెదురుగా తలపడ్డారు. ఇద్దరి మధ్య 20వ ముఖాముఖి పోరు ఎప్పటిలాగే ఆద్యంతం అద్భుతంగా సాగింది. 79 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో చివరకు సింధు గెలిచి తన ప్రియమైన ప్రత్యర్థిపై ఆధిపత్యం చాటుకుంది. మ్యాచ్ ముగిశాక ఈ చిరకాల ప్రత్యర్థులు పరస్పరం అభినందించుకోవడంతోపాటు... త్వరలో మరోసారి ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని తమ తమ సోషల్ మీడియా ఖాతాల్లో పేర్కొనడం విశేషం. జకార్తా: ఈ ఏడాది తొలి టైటిల్ కోసం ఎదురుచూస్తున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో తొలి అడ్డంకిని అధిగమించింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 22–20, 21–23, 21–15తో ప్రపంచ మాజీ చాంపియన్ నొజోమి ఒకుహరా (జపాన్)పై అద్భుత విజయం సాధించింది. 79 నిమిషాల పాటు సాగిన హోరాహోరీ పోరులో సింధు కీలకదశలో పాయింట్లు గెలిచి అనుకున్న ఫలితాన్ని అందుకుంది. సింధు, ఒకుహరా ఇప్పటి వరకు 20 సార్లు అమీతుమీ తలపడగా... అందులో సింధు 11వసారి గెలుపొందింది. ప్రిక్వార్టర్స్లో థాయ్లాండ్ ప్లేయర్ పొర్న్పవీ చొచువాంగ్తో సింధు ఆడనుంది. ఈ ఏడాది అత్యుత్తమంగా ఇండియా ఓపెన్ క్వార్టర్ ఫైనల్కు చేరిన సింధు... ఆ తర్వాత స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేక పలు టోర్నమెంట్లలో ఆరంభ దశల్లోనే వెనుదిరిగింది. మరోవైపు ఒకుçహారా పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. గత కొంతకాలంగా నిలకడలేమితో ఇబ్బందిపడుతున్న ఈ జపాన్ ప్లేయర్ బరిలోకి దిగిన చివరి ఆరు టోర్నీల్లో రెండో రౌండ్ దాటలేకపోయింది. ‘ఇటీవలి కాలంలో ఆరంభ రౌండ్లలోనే పరాజయాలు ఎదురయ్యాయి. అలాంటి దశలో ఈ విజయం చాలా ముఖ్యమైంది. ఒకుహరాతో ఆడటం ఎప్పుడూ ప్రత్యేకమే. తను అంత తేలికగా పరాజయాన్ని అంగీకరించదు. ఆటలో రోజురోజుకు చాలా మార్పులు వస్తున్నాయి. సుదీర్ఘ ర్యాలీలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అటాకింగ్ గేమ్ తగ్గి.. రక్షణాత్మక ధోరణిలో ఆడటం ఎక్కువైంది. ఇక అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ఆటకు ఫిట్నెస్ కీలకమే. దానిపై మరింత దృష్టి సారించాల్సి ఉంది. ఇండియా ఓపెన్లో క్వార్టర్ ఫైనల్ చేరిన తర్వాత స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయా. ఈ నేపథ్యంలో ఈ విజయం నాలో కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఓపికగా ఎదురుచూస్తే లయ అందిపుచ్చుకోవచ్చని నిరూపితమైంది. ఫలితంతో సంతోషంగా ఉన్నా. కానీ ఇంకా చాలా విషయాల్లో మెరుగవ్వాల్సి ఉంది. ముఖ్యంగా గాయాల బారిన పడకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నా’ అని సింధు మ్యాచ్ అనంతరం పేర్కొంది. సాత్విక్–చిరాగ్ జోడీ బోణీ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ శుభారంభం చేసింది. తొలి రౌండ్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 67 నిమిషాల్లో 18–21, 21–18, 21–14తో లియో రాలీ కర్నాండో–బాగస్ మౌలానా (ఇండోనేసియా) జంటపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరింది. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత స్టార్స్ లక్ష్య సేన్, హెచ్ఎస్ ప్రణయ్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. లక్ష్యసేన్ 11–21, 22–20, 15–21తో టాప్ సీడ్ షి యూఖీ (చైనా) చేతిలో ఓడాడు. 65 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి గేమ్లో పరాజయం పాలైన లక్ష్యసేన్... ఆ తర్వాత పుంజుకున్నా... కీలక సమయాల్లో పాయింట్లు గెలిచిన చైనా ప్లేయర్ మ్యాచ్ను కైవసం చేసుకున్నాడు. మరో మ్యాచ్లో ప్రణయ్ 17–21, 18–21తో ఫర్హాన్ (ఇండోనేసియా) చేతిలో ఓటమి పాలయ్యాడు. పుత్రి కుసుమ వర్ధిని (ఇండోనేసియా)తో జరిగిన మహిళల సింగిల్స్ మ్యాచ్లో మాళవిక బన్సోద్ (భారత్) 21–16, 16–15తో ఆధిక్యంలో ఉన్న దశలో గాయం కారణంగా వైదొలిగింది. ఇతర మ్యాచ్ల్లో అనుపమ (భారత్) 15–21, 9–21తో కిమ్ గా యిన్ (కొరియా) చేతిలో... రక్షిత శ్రీ (భారత్) 21–14, 15–21, 12–21 సుపనిద కటెథాంగ్ (థాయ్లాండ్) చేతిలో ఓటమి పాలయ్యారు. -
సెమీస్లో సబలెంకా
పారిస్: కెరీర్లో నాలుగో గ్రాండ్స్లామ్ టైటిల్ దిశగా ప్రపంచ నంబర్వన్, బెలారస్ స్టార్ సబలెంకా మరో అడుగు ముందుకు వేసింది. టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్లో టాప్ సీడ్ సబలెంకా రెండోసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. పారిస్ ఒలింపిక్స్ చాంపియన్, ఎనిమిదో సీడ్ కిన్వెన్ జెంగ్ (చైనా)తో మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సబలెంకా 7–6 (7/3), 6–3తో గెలుపొందింది. 1 గంటా 57 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సబలెంకాకు గట్టిపోటీ ఎదురైంది. తొలి సెట్లో ఒకదశలో సబలెంకా 2–4తో వెనుకబడింది. అయితే ఏడో గేమ్లో కిన్వెన్ తడబడి అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. కిన్వెన్ సర్వీస్ను బ్రేక్ చేసిన సబలెంకా ఆ తర్వాత తన సర్వీస్ను నిలబెట్టుకొని స్కోరును 4–4తో సమం చేసింది. అనంతరం ఇద్దరూ తమ సర్వీస్లను కాపాడుకోవడంతో స్కోరు 6–6తో నిలిచింది. టైబ్రేక్లో సబలెంకా జోరు కనబరిచి సెట్ను సొంతం చేసుకుంది. రెండో సెట్లో సబలెంకా ఏడో గేమ్లో, తొమ్మిదో గేమ్లో కిన్వెన్ సర్వీస్లను బ్రేక్ చేసి అదే జోరులో విజయాన్ని ఖరారు చేసుకుంది. మ్యాచ్ మొత్తంలో సబలెంకా ఆరు ఏస్లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్లు చేసింది. 20 విన్నర్స్ కొట్టిన ఈ బెలారస్ స్టార్ 18 అనవసర తప్పిదాలు చేసింది. నెట్ వద్దకు 14 సార్లు దూసుకొచ్చి ఎనిమిది సార్లు పాయింట్లు గెలిచింది. మరోవైపు కిన్వెన్ ఐదు ఏస్లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్లు చేసింది. 22 విన్నర్స్ కొట్టిన ఈ చైనా స్టార్ 31 అనవసరతప్పిదాలు చేసింది. సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్)తో సబలెంకా తలపడుతుంది. మరో క్వార్టర్ ఫైనల్లో స్వియాటెక్ 6–1, 7–5తో 13వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్)పై విజయం సాధించింది. 1 గంటా 41 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో స్వియాటెక్ మూడు ఏస్లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. ఫ్రెంచ్ ఓపెన్లో స్వియాటెక్కిది వరుసగా 26వ విజయం. 2022, 2023, 2024లలో విజేతగా నిలిచిన స్వియాటెక్ టైటిల్ నిలబెట్టుకోవడానికి రెండు విజయాల దూరంలో ఉంది. సెమీస్లో ముసెట్టి పురుషుల సింగిల్స్ విభాగంలో ఎనిమిదో సీడ్ లొరెంజో ముసెట్టి (ఇటలీ) సెమీఫైనల్లోకి దూసుకెళ్లగా... ప్రపంచ నంబర్వన్ యానిక్ సినెర్ (ఇటలీ) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. క్వార్టర్ ఫైనల్లో ముసెట్టి 6–2, 4–6, 7–5, 6–2తో 15వ సీడ్ టియాఫో (అమెరికా)పై గెలుపొందాడు. 2 గంటల 47 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో ముసెట్టి ఎనిమిది ఏస్లు సంధించాడు. తన ప్రత్యర్థి సర్వీస్ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. సోమవారం అర్ధరాత్రి తర్వాత ముగిసిన ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సినెర్ 6–1, 6–3, 6–4తో 17వ సీడ్ రుబ్లెవ్ (రష్యా)పై విజయం సాధించాడు. -
జూలై 5న నీరజ్ చోప్రా ‘క్లాసిక్’ ఈవెంట్
బెంగళూరు: భారత ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రా ఈ ఏడాది నిర్వహించ తలపెట్టిన అంతర్జాతీయ జావెలిన్ త్రో ఈవెంట్కు కొత్త షెడ్యూల్ ఖరారైంది. వచ్చేనెల 5న బెంగళూరులో ఈ ఈవెంట్ నిర్వహించనున్నారు. భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ), జేఎస్డబ్ల్యూ స్పోర్ట్స్ల ఉమ్మడి భాగస్వామ్యంతో చోప్రా గత నెలలోనే ఈ అంతర్జాతీయ ఈవెంట్ నిర్వహించాలనుకున్నాడు. కానీ పహల్గాంలో ఉగ్రదాడి దరిమిలా ‘ఆపరేషన్ సిందూర్’తో భారత్, పాక్ల మధ్య డ్రోన్ దాడులతో యుద్ధవాతావరణం నెలకొంది. దీంతో భారత్లోని కొన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలను మూసివేయడం తదితర ప్రతికూల పరిస్థితులతో మే 24న క్రీడాఈవెంట్ను నిర్వహించే వాతావరణం లేకపోయింది. ఈ జావెలిన్ త్రో టోర్నీయే కాదు... ప్రముఖ ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్ ఐపీఎల్ కూడా వాయిదా పడింది! ఇప్పుడు ఉద్రిక్తతలు సద్దుమణగడంతో నీరజ్ చోప్రా, జేఎస్డబ్ల్యూ స్పోర్ట్స్ వాయిదా పడిన ఈవెంట్ నిర్వహణకు తుదికసరత్తు పూర్తి చేసి జూలై 5 నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 12 మంది స్టార్ అంతర్జాతీయ జావెలిన్ త్రోయర్లు ఇందులో పాల్గొంటున్నారు. ఇందులో చోప్రా సహా ఐదుగురు భారత అథ్లెట్లు కాగా... ఏడుగురు విదేశీ అథ్లెట్లు ఉన్నారు. బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో ఈ పోటీలు జరుగుతాయి. భారత్ నుంచి నీరజ్తో పాటు ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో రజతం నెగ్గిన సచిన్ యాదవ్, కిషోర్ జేనా, రోహిత్ యాదవ్, సాహిల్ పాల్గొంటున్నారు. విదేశీ స్టార్లలో రెండుసార్లు ప్రపంచ చాంపియన్ అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా), 2016 రియో ఒలింపిక్స్ చాంపియన్ థామస్ రోహ్లెర్ (జర్మనీ), 2015 ప్రపంచ చాంపియన్ జూలియస్ యెగో (కెన్యా), కుర్టిస్ థాంప్సన్ (అమెరికా), ఆసియా క్రీడల కాంస్య పతక విజేత గెన్కీ డీన్ (జపాన్), రుమేశ్ పతిరగె (శ్రీలంక), లూయిజ్ మారిసియో (బ్రెజిల్) భారత్లో జరిగే ఈవెంట్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపించారు. ఈ పోటీలను ప్రత్యక్షంగా చూసేందుకు రూ. 199 నుంచి రూ. 9999 ధర పలికే టికెట్లను అందుబాటులో ఉంచారు. కార్పొరేట్ బాక్స్ ప్రేక్షకుల కోసం రూ. 44,999 టికెట్లు ఉన్నాయి. -
వేలంలో అన్సోల్డ్.. రిటైర్మెంట్ ప్రకటించిన పర్ధీప్ నర్వాల్
కబడ్డీ లెజెండ్, స్టార్ రైడర్ పర్దీప్ నర్వాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. హర్యానాకు చెందిన పర్దీప్ నర్వాల్.. ప్రొఫెషనల్ కబడ్డీకి రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రో కబడ్డీ లీగ్ (PKL) 2025 వేలంలో అమ్ముడుపోకపోవడంతో పర్దీప్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.స్పోర్ట్స్ బ్రాడ్క్టాస్టర్ సునీల్ తనేజాతో ఇంటారక్షన్లో పర్ధీప్ ఈ షాకింగ్ న్యూస్ను వెల్లడించాడు. కోచ్గా తన కొత్త అవతరామెత్తనున్నట్లు నర్వాల్ తెలిపాడు. ప్రో కబడ్డీ లీగ్ చరిత్రలో పర్దీప్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. పాట్నా పైరేట్స్ వరుసగా మూడు పీకెఎల్ టైటిల్స్ను గెలవడంలో నర్వాల్ది కీలక పాత్ర. అదేవిధంగా ప్రోకబడ్డీ లీగ్ హిస్టరీలో అత్యధిక రైడ్ పాయింట్లు సాధించిన రికార్డు కూడా నర్వాల్ పేరిట ఉంది. ఈ హర్యానా ఆటగాడు పీఎకెల్లో 190 మ్యాచ్లు ఆడి 1801 పాయింట్లు సాధించాడు. మ్యాచ్కు సగటున 9.47 రైడ్ సాధించడం విశేషం. అయితే గత నాలుగు సీజన్లలో పర్ధీప్ తన ఫామ్ను కోల్పోయి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. యుపి యోధాస్, బెంగళూరు బుల్స్ తరపున నర్వాల్ పెద్దగా రాణించలేకపోయాడు. కాగా గతంలో భారత కబడ్డీ జట్టుకు కూడా నర్వాల్ ఆడాడు.చదవండి: IPL 2025 Final: 'అతడితో పంజాబ్ జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే వార్ వన్ సైడే' -
కార్ల్సన్కు గుకేశ్ షాక్
స్టావెంజర్: మాగ్నస్ కార్ల్సన్... చెస్ గురించి తెలిసిన వారికి, క్రీడాభిమానులకూ సుపరిచితమైన పేరు... ప్రపంచ చదరంగంలో అతను 14 ఏళ్లుగా వరల్డ్ నంబర్వన్గా కొనసాగుతున్నాడు ... క్లాసికల్ ఫార్మాట్లో ఐదుసార్లు... ర్యాపిడ్ ఫార్మాట్లో ఐదుసార్లు... బ్లిట్జ్ ఫార్మాట్లో ఏకంగా ఎనిమిదిసార్లు విశ్వవిజేతగా నిలిచాడు. ఏమాత్రం చిన్న అవకాశం దొరికినా ఓటమి అంచుల్లో నుంచి విజయాన్ని అందుకోవడంలో దిట్ట. ఇలాంటి అసాధారణ నైపుణ్యమున్న ప్లేయర్తో గేమ్ ఆడుతూ ‘డ్రా’ చేసుకుంటే అది విజయంతో సమానం. ఇక నేరుగా గెలిస్తే అది పెద్ద సంచలనమే అవుతుంది.అలాంటి సంచలనమే నమోదు చేశాడు భారత యువ గ్రాండ్మాస్టర్, ప్రస్తుత ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్. ఆరుగురు మేటి గ్రాండ్మాస్టర్ల మధ్య జరుగుతున్న నార్వే ఓపెన్ టోర్నిలో కార్ల్సన్పై గుకేశ్ చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నాడు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని... తన కెరీర్లో తొలిసారి క్లాసికల్ గేమ్లో కార్ల్సన్పై గెలిచాడు. ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఆరో రౌండ్ గేమ్లో 19 ఏళ్ల గుకేశ్ తెల్ల పావులతో ఆడుతూ 62 ఎత్తుల్లో కార్ల్సన్ ఆట కట్టించాడు.నాలుగు గంటలపాటు జరిగిన ఈ గేమ్లో కార్ల్సన్ 52వ ఎత్తులో చేసిన తప్పిదాన్ని గుకేశ్ అనుకూలంగా మల్చుకొని సంచలన ఫలితం సాధించాడు. తనను ‘ఢీ’కొట్టే సరైన ప్రత్యర్థులు లేకపోవడంతో ప్రపంచ చాంపియన్షిప్పై ఆసక్తి కోల్పోయి కొన్నాళ్లుగా ఆ మెగా ఈవెంట్కు దూరంగా ఉంటున్న 34 ఏళ్ల కార్ల్సన్కు... భవిష్యత్లో గట్టి ప్రత్యర్థి కాగల సత్తా తనలో ఉందని గుకేశ్ నిరూపించుకున్నాడు. అసహనంతో... గుకేశ్ చేతిలో తొలిసారి ఓటమి చవిచూసిన కార్ల్సన్ పరాజయ భారాన్ని తట్టుకోలేకపోయాడు. ఊహించనిరీతిలో స్పందించాడు. తన నుంచి జరిగిన ఒక్క తప్పిదాన్ని అనుకూలంగా మల్చుకొని గుకేశ్ గెలుపు బాట పట్టడంతో కార్ల్సన్ ఆ కోపాన్నంతా తాము ఆడిన చెస్ బోర్డు టేబుల్పై చూపించాడు. తన పిడికిలితో ఒక్కసారిగా టేబుల్పై కార్ల్సన్ గట్టిగా కొట్టాడు. ఆ వెంటనే తమాయించుకున్న కార్ల్సన్ పావులను చెస్ బోర్డుపై అమర్చి... గుకేశ్కు వద్దకు వెళ్లి రెండుసార్లు సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కార్ల్సన్ను ఓడించిన తర్వాత గుకేశ్ కొన్ని క్షణాలపాటు షాక్లో ఉండిపోయి ఆ తర్వాత ఈ విజయాన్ని ఆస్వాదించాడు. ఆరో రౌండ్ తర్వాత గుకేశ్ 8.5 పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. -
వరల్డ్ నంబర్ వన్ను ఓడించిన గుకేష్.. నిరాశతో టేబుల్ను కొట్టిన కార్ల్సన్
నార్వే చెస్ టోర్నమెంట్లో వరల్డ్ నెం1 మాగ్నస్ కార్ల్సెన్ను భారత యువ గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేష్ ఖంగుతిన్పించాడు. ఆదివారం ఆర్ధరాత్రి దాటాక జరిగిన ఈ టోర్నీ ఆరో రౌండ్లో కార్ల్సెన్ను గుకేష్ ఓడించాడు. ఆఖరివరకు నువ్వానేనా అన్నట్లు సాగిన ఈ గేమ్లో గుకేష్ పై చేయి సాధించాడు.ఈ గేమ్లో మధ్యవరకు కార్ల్సెన్ ఆధిపత్యం చెలాయించాడు. కానీ ఎండ్గేమ్ సమయానికి 34 ఏళ్ల కార్ల్సెన్ చేసిన ఒక చిన్న తప్పిదాన్ని గుకేష్ చక్కగా ఉపయోగించుకున్నాడు. కాగా క్లాసికల్ చెస్ పోటీలో కార్ల్సన్ను ఓడించడం గుకేశ్కు ఇదే తొలిసారి. ఈ గెలుపుతో గుకేష్ మూడు విలువైన పాయింట్లు సొంతం చేసుకున్నాడు.తద్వారా ఈ టోర్నీ పాయింట్ల పట్టికలో గుకేష్ రెండో స్ధానానికి దూసుకొచ్చాడు. ప్రస్తుతం అతని స్కోరు 8.5 పాయింట్లు కాగా, రెండో స్థానంలో ఉన్న అమెరికన్ గ్రాండ్మాస్టర్ ఫాబియానో కరువానాకు కేవలం ఒక పాయింట్ తక్కువగానే ఉన్నాడు. ఓ మై గాడ్.. !ఇక యువ గ్రాండ్మాస్టర్ చేతిలో ఓటమిని ప్రపంచ చెస్ దిగ్గజం కార్ల్సెన్ తట్టుకోలేకపోయాడు. తీవ్ర అసహనానికి గురైన మాగ్నస్.. ఓ మై గాడ్ అంటూ పిడికిలితో ఒక్కసారిగా చెస్బోర్డు టేబుల్ను బలంగా పంచ్ చేశాడు. అనంతరం గుకేశ్కు రెండు సార్లు సారీ చెప్పి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అదేవిధంగా వరల్డ్ నెంబర్ 1 ఆటగాడిని ఓడించిన గుకేష్.. కాసేపు షాక్లో ఉండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.OH MY GOD 😳🤯😲 pic.twitter.com/QSbbrvQFkE— Norway Chess (@NorwayChess) June 1, 2025 -
ప్రపంచ రెండో ర్యాంకర్ నకమురాపై అర్జున్ గెలుపు
స్టావెంజర్: నార్వే చెస్ టోర్నమెంట్లో తెలంగాణ గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్ అద్భుత విజయం అందుకున్నాడు. ప్రపంచ రెండో ర్యాంకర్ హికారు నకమురా (అమెరికా)తో జరిగిన ఐదో రౌండ్ గేమ్లో అర్జున్ అర్మగెడాన్ టైబ్రేక్ గేమ్లో గెలుపొందాడు. వీరిద్దరి మధ్య జరిగిన క్లాసికల్ ఫార్మాట్ గేమ్ 76 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. దాంతో విజేతను నిర్ణయించేందుకు అర్మగెడాన్ గేమ్ను నిర్వహించారు. ఈ గేమ్లో అర్జున్ 48 ఎత్తుల్లో నకమురాపై విజయం సాధించాడు. మరోవైపు ప్రపంచ చాంపియన్, భారత గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ ఐదో రౌండ్ గేమ్లో 56 ఎత్తుల్లో వె యి (చైనా) చేతిలో ఓడిపోయాడు. ఇదే టోర్నీ మహిళల విభాగంలో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి చైనా గ్రాండ్మాస్టర్ లె టింగ్జీపై అర్మగెడాన్ టైబ్రేక్ గేమ్లో 38 ఎత్తుల్లో గెలిచింది. అంతకుముందు వీరిద్దరి మధ్య క్లాసికల్ ఫార్మాట్ గేమ్ 31 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. భారత మరో గ్రాండ్మాస్టర్ వైశాలి 35 ఎత్తుల్లో స్పెయిన్కు చెందిన సారా ఖాడెమ్ను ఓడించింది. -
శభాష్ స్వితోలినా
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో సంచలనం చోటు చేసుకుంది. టైటిల్ ఫేవరెట్స్లో ఒకరైన ఇటలీ స్టార్, ప్రపంచ నాలుగో ర్యాంకర్, నాలుగో సీడ్ జాస్మిన్ పావోలిని ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఇంటిముఖం పట్టింది. ఉక్రెయిన్ సీనియర్ ప్లేయర్ ఎలీనా స్వితోలినా అద్భుత పోరాటపటిమ కనబరిచి జాస్మిన్ పావోలినిని బోల్తా కొట్టించింది. మూడు సార్లు మ్యాచ్ పాయింట్లను కాచుకొని స్వితోలినా గెలుపొందడం విశేషం. కెరీర్లో 12వసారి ఫ్రెంచ్ ఓపెన్లో ఆడుతోన్న 13వ సీడ్ స్వితోలినా తాజా విజయంతో ఐదోసారి ఈ మెగా టోర్నీలో క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించింది. 2 గంటల 24 నిమిషాలపాటు జరిగిన పోరులో స్వితోలినా 4–6, 7–6 (8/6), 6–1తో జాస్మిన్ను ఓడించి క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ స్వియాటెక్తో పోరుకు సిద్ధమైంది. తొలి సెట్ కోల్పోయిన స్వితోలినా రెండో సెట్లో 3–5తో వెనుకబడింది. ఎనిమిదో గేమ్లో జాస్మిన్ సర్వీస్ను బ్రేక్ చేసిన స్వితోలినా ఆధిక్యాన్ని 4–5కు తగ్గించింది. తొమ్మిదో గేమ్లో స్వితోలినా సర్వీస్లో జాస్మిన్ విజయానికి రెండు పాయింట్ల దూరంలో నిలిచింది. అయితే ఈ రెండింటిని కాపాడుకున్న స్వితోలినా తన సర్వీస్ను నిలబెట్టుకొని స్కోరును 5–5తో సమం చేసింది. అనంతరం స్కోరు 6–6తో సమం కావడంతో సెట్ టైబ్రేకర్కు దారి తీసింది. టైబ్రేక్లో జాస్మిన్ 6–5తో ఆధిక్యంలో నిలిచి విజయానికి పాయింట్ దూరంలో నిలిచింది. ఈసారీ స్వితోలినా సంయమనం కోల్పోకుండా ఆడి వరుసగా మూడు పాయింట్లు గెలిచి సెట్ను సొంతం చేసుకొని మ్యాచ్లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్లో స్వితోలినా చెలరేగిపోయి 4–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అదే జోరులో సెట్ను, మ్యాచ్ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో జాస్మిన్ తన సర్వీస్ను ఏడుసార్లు, స్వితోలినా ఆరుసార్లు కోల్పోయారు. స్వియాటెక్ వరుసగా ఆరోసారి... మరోవైపు డిఫెండింగ్ చాంపియన్, ఐదో సీడ్ ఇగా స్వియాటెక్ వరుసగా ఆరోసారి ఫ్రెంచ్ ఓపెన్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గత మూడేళ్లలో ఈ టోర్నీలో విజేతగా నిలిచిన స్వియాటెక్కు ప్రిక్వార్టర్ ఫైనల్లో గట్టిపోటీ ఎదురైంది. 12వ సీడ్ రిబాకినా (కజకిస్తాన్)తో జరిగిన మ్యాచ్లో స్వియాటెక్ 1–6, 6–3, 7–5తో నెగ్గి ముందంజ వేసింది. అరంటా సాంచెజ్ వికారియో (స్పెయిన్; 1991 నుంచి 2000 వరకు; 10 సార్లు) తర్వాత ఫ్రెంచ్ ఓపెన్లో వరుసగా ఆరు లేదా అంతకంటే ఎక్కువసార్లు క్వార్టర్ ఫైనల్ చేరిన రెండో ప్లేయర్గా స్వియాటెక్ గుర్తింపు పొందింది.రిబాకినాతో 2 గంటల 30 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో స్వియాటెక్ రెండు ఏస్లు సంధించి, ఏడు డబుల్ ఫాల్ట్లు చేసింది. నాలుగుసార్లు తన సర్వీస్ను కోల్పోయినా స్వియాటెక్ ప్రత్యర్థి సర్వీస్ను కూడా నాలుగుసార్లు బ్రేక్ చేసింది. 33 విన్నర్స్ కొట్టిన స్వియాటెక్ నెట్వద్దకు 11 సార్లు దూసుకొచ్చి ఎనిమిదిసార్లు పాయింట్లు గెలిచింది. సబలెంకా జోరు ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ సబలెంకా (బెలారస్), ఎనిమిదో సీడ్ కిన్వెన్ జెంగ్ (చైనా) కూడా క్వార్టర్ ఫైనల్ చేరుకున్నారు. సమ్సనోవా (రష్యా)తో 2 గంటల 47 నిమిషాలపాటు జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో కిన్వెన్ జెంగ్ 7–6 (7/5), 1–6, 6–3తో గెలిచి తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్లో క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. సబలెంకా 7–5,6 –3తో అనిసిమోవా (అమెరికా)ను ఓడించింది. తద్వారా సెరెనా విలియమ్స్ (అమెరికా) తర్వాత వరుసగా పదిసార్లు గ్రాండ్స్లామ్ టోర్నీల్లో క్వార్టర్ ఫైనల్ చేరుకున్న ప్లేయర్గా ఈ బెలారస్ స్టార్ ఘనత వహించింది. బోపన్న, యూకీ జోడీలు అవుట్ ఫ్రెంచ్ ఓపెన్లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న, యూకీ బాంబ్రీ జోడీలు మూడో రౌండ్లో నిష్క్రమించాయి. బోపన్న (భారత్)–ఆడమ్ పావ్లాసెక్ (చెక్ రిపబ్లిక్) ద్వయం 2–6, 6–7 (5/7)తో రెండో సీడ్ హ్యారీ హెలియోవారా (ఫిన్లాండ్)–హెన్రీ ప్యాటెన్ (బ్రిటన్) జోడీ చేతిలో ఓడిపోయింది.యూకీ బాంబ్రీ (భారత్)–రాబర్ట్ గాలోవే (అమెరికా) జంట 4–6, 4–6తో తొమ్మిదో సీడ్ క్రిస్టియన్ హారిసన్–ఇవాన్ కింగ్ (అమెరికా) జోడీ చేతిలో పరాజయం చవిచూసింది. మూడో రౌండ్లో ఓడిన బోపన్న, యూకీ జోడీలకు 43,500 యూరోల (రూ. 42 లక్షల 22 వేలు) చొప్పున ప్రైజ్మనీ లభించింది. మరోవైపు బాలుర సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో మానస్ ధామ్నె (భారత్) 5–7, 3–6తో రోనిత్ కర్కీ (అమెరికా) చేతిలో ఓటమి పాలయ్యాడు. జొకోవిచ్ ముందుకు పురుషుల సింగిల్స్ విభాగంలో మాజీ చాంపియన్, సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. మూడో రౌండ్ మ్యాచ్లో జొకోవిచ్ 6–3, 6–4, 6–2తో ఫిలిప్ మిసోలిచ్ (ఆ్రస్టియా)పై గెలుపొందాడు. 2 గంటల 8 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో జొకోవిచ్ ఆరు ఏస్లు సంధించాడు. ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. అమెరికా ప్లేయర్, ప్రపంచ 12వ ర్యాంకర్ టామీ పాల్ తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్లో క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో టామీ పాల్ 6–3, 6–3, 6–3తో పాపిరిన్ (ఆ్రస్టేలియా)పై విజయం సాధించాడు. -
పియాస్ట్రి ప్రతాపం
బార్సిలోనా (స్పెయిన్): క్వాలిఫయింగ్ సెషన్లో కనబరిచిన దూకుడును ప్రధాన రేసులోనూ కొనసాగిస్తూ... మెక్లారెన్ జట్టు డ్రైవర్ ఆస్కార్ పియాస్ట్రి ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో ఐదో విజయాన్ని అందుకున్నాడు. ఆదివారం జరిగిన స్పానిష్ గ్రాండ్ప్రిలో పియాస్ట్రి విజేతగా అవతరించాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన పియాస్ట్రి ఆద్యంతం ఆధిపత్యం చలాయించాడు. నిర్ణీత 66 ల్యాప్లను అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 1 గంట 32 నిమిషాల 57.375 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్లో పియాస్ట్రి చైనా గ్రాండ్ప్రి, బహ్రెయిన్ గ్రాండ్ప్రి, సౌదీ అరేబియా గ్రాండ్ప్రి, మయామి గ్రాండ్ప్రిలలో విజేతగా నిలిచాడు. మెక్లారెన్కే చెందిన లాండో నోరిస్ రెండో స్థానాన్ని పొందగా... ఫెరారీ డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ మాక్స్ వెర్స్టాపెన్ ఐదో స్థానంలో నిలిచినా... చివరి ల్యాప్లో జార్జి రసెల్ కారును ఢీకొట్టినందుకు అతనిపై 10 సెకన్ల పెనాల్టీని విధించారు. దాంతో వెర్స్టాపెన్ చివరకు పదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. మరోవైపు ఆస్టన్ మార్టిన్ జట్టు డ్రైవర్ లాన్స్ స్ట్రోల్ చేతిలో నొప్పి కారణంగా రేసులో పాల్గొనలేదు. మెర్సిడెస్ డ్రైవర్ కిమి ఆంటోనెలి 53వ ల్యాప్లో, అలెగ్జాండర్ ఆల్బోన్ (విలియమ్స్) 27వ ల్యాప్లో వైదొలిగారు. 24 రేసుల ఈ సీజన్లో 9 రేసులు ముగిశాయి. 186 పాయింట్లతో పియాస్ట్రి అగ్రస్థానంలో కొనసాగుతుండగా... 176 పాయింట్లతో నోరిస్ రెండో స్థానంలో, 137 పాయింట్లతో వెర్స్టాపెన్ మూడో స్థానంలో ఉన్నారు. సీజన్లోని తదుపరి రేసు కెనడియన్ గ్రాండ్ప్రి జూన్ 15న మాంట్రియల్లో జరుగుతుంది. -
చాంపియన్స్ లీగ్ విజేత పీఎస్జీ
మ్యూనిక్: ప్రతిష్టాత్మక చాంపియన్స్ లీగ్ ఫుట్బాల్ టోర్నమెంట్లో పారిస్ సెయింట్ జెర్మయిన్ (పీఎస్జీ) జట్టు తొలిసారి విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన తుది పోరులో పీఎస్జీ 5–0 గోల్స్ తేడాతో ఇంటర్ మిలాన్ జట్టుపై విజయం సాధించింది. పీఎస్జీ తరఫున డెసైర్ డౌ (20వ, 63వ నిమిషాల్లో) రెండు గోల్స్తో చెలరేగగా... అష్రఫ్ హాకిమి (12వ నిమిషంలో), ఖ్విచా క్వారట్స్ఖేలియా (73వ నిమిషంలో), సెన్నీ మయులు (86వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. మ్యాచ్ ఆద్యంతం పీఎస్జీ జట్టు ఆధిపత్యం కనబర్చగా... ఇటలీ క్లబ్ ఇంటర్ మిలాన్ జట్టు ఒక్క గోల్ కూడా సాధించలేకపోయింది. 60 శాతం బంతిని తమ ఆధినంలో పెట్టుకున్న పీఎస్జీ చిన్న చిన్న పాస్లతో ఫలితం రాబట్టింది. 70 ఏళ్ల చరిత్రగల యూరోపియన్ కప్ ఫైనల్లో ఇలా ఒక జట్టు ఏకపక్షంగా భారీ ఆధిక్యంతో విజయం సాధించడం ఇదే తొలిసారి. పీఎస్జీకి ఇదే మొదటి యూరోపియన్ కప్ టైటిల్ కాగా... ఏడో ఫైనల్ ఆడిన ఇంటర్ మిలాన్ జట్టు నాలుగోసారి రన్నరప్తో సరిపెట్టుకుంది. 1956లో తొలిసారి నిర్వహించిన ఈ టోర్నీలో రియల్ మాడ్రిడ్ జట్టు విజేతగా నిలవగా... ఇప్పుడు పీఎస్జీ రూపంలో 24వ విజేత అవతరించింది. మ్యూనిక్ వేదికగా ఇప్పటి వరకు ఐదుసార్లు ఈ టోర్నీ ఫైనల్ జరగగా... ఐదుసార్లూ కొత్త విజేత ఆవిర్భవించడం విశేషం. -
ప్రిక్వార్టర్స్లో సినెర్, జ్వెరెవ్
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో స్టార్లు, సీడెడ్ ఆటగాళ్ల జోరు కొనసాగుతోంది. పురుషుల సింగిల్స్లో ప్రపంచ నంబర్వన్ యానిక్ సినెర్, మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్, డిఫెండింగ్ చాంపియన్ కార్లొస్ అల్కరాజ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్లో రెండో సీడ్ కొకొ గాఫ్, మూడో సీడ్ పెగూలా, ఆరో సీడ్ అండ్రీవా ప్రిక్వార్టర్స్ చేరారు. అయితే భారత డబుల్స్ ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. వెటరన్ ప్లేయర్ రోహన్ బోపన్న తన చెక్ రిపబ్లిక్ భాగస్వామితో ముందంజ వేయగా... శ్రీరామ్ బాలాజీకి రెండో రౌండ్లోనే చుక్కెదురైంది. సులువుగా సినెర్... టాప్సీడ్ ఇటలీ స్టార్ యానిక్ సినెర్ క్లేకోర్ట్ టైటిల్ దిశగా మరో అడుగు ముందుకు వేశాడు. శనివారం జరిగిన మూడో రౌండ్లో మూడు గ్రాండ్స్లామ్ల చాంపియన్, నిరుటి ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనలిస్ట్ సినెర్ 6–0, 6–1, 6–2తో చెక్ రిపబ్లిక్ ఆటగాడు జిరి లెహెకాపై అలవోక విజయం సాధించాడు. గంటన్నర పాటు జరిగిన ఈ సమరంలో 3 ఏస్లు సంధించిన టాప్సీడ్ ఆటగాడు, 27 విన్నర్లు కొట్టాడు. లెహెక మూడు ఏస్లు సంధించినప్పటికీ 14 విన్నర్లే కొట్టగలిగాడు. గత ఫ్రెంచ్ ఓపెన్, తాజా ఆ్రస్టేలియన్ ఓపెన్ రన్నరప్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6–2, 7–6 (7/4), 6–1తో ఇటలీకి చెందిన ఫ్లావికొ కొబొలిపై గెలుపొందగా... స్పెయిన్ సంచలనం, రెండో సీడ్ అల్కరాజ్ 6–1, 6–3, 4–6, 6–4తో డమిర్ డిజుమ్హుర్ (బోస్నియా)పై విజయం సాధించాడు. పెగూలా జోరు మహిళల సింగిల్స్లో జరిగిన మూడో రౌండ్ మ్యాచ్లో జెస్సికా పెగూలా (అమెరికా) 3–6, 6–4, 6–2తో మార్కెటా వొండ్రుసొవా (చెక్ రిపబ్లిక్)పై గెలుపొందగా... రెండో సీడ్ కొకొ గాఫ్ (అమెరికా) 6–1, 7–6 (7/3)తో బొజ్కొవా (చెక్ రిపబ్లిక్)తో విజయం సాధించింది. ఆరో సీడ్ అండ్రీవా (రష్యా) 6–3, 6–1తో యూలియా పుతిత్సెవా (కజకిస్తాన్)పై సులువుగా గెలిచి ప్రిక్వార్టర్స్ చేరారు. అమెరికన్ ప్రత్యర్థుల మధ్య జరిగిన మరో పోరులో ఏడో సీడ్ మాడిసన్ కీస్ 4–6, 6–3, 7–5తో 31వ సీడ్ కెనిన్పై నెగ్గింది. డబుల్స్ ప్రిక్వార్టర్స్లో బోపన్న భారత అగ్రశ్రేణి డబుల్స్ ఆటగాడు రోహన్ బోపన్న పురుషుల డబుల్స్లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. శనివారం జరిగిన రెండో రౌండ్లో బోపన్న–పావ్లాసెక్ (చెక్ రిపబ్లిక్) జోడీ 6–7 (2/7), 7–6 (7/5), 6–2తో ఫ్రాన్స్కు చెందిన 13వ సీడ్ సాడియో డౌంబియా– ఫెబియెన్ రి»ొల్ జంటపై చెమటోడ్చి నెగ్గింది. ఇరు జోడీలు హోరాహోరీగా తలపడటంతో తొలి రెండు సెట్లు టైబ్రేక్కు దారితీసాయి. తొలిసెట్ కోల్పోయినప్పటికీ ఎలాంటి నిరుత్సాహానికి గురవని భారత్–చెక్ జోడీ రెండో సెట్లో పుంజుకొంది. టైబ్రేక్తో రెండో సెట్ను తర్వాత మూడో సెట్తో మ్యాచ్లో గెలుపొందింది. మరో డబుల్స్ ద్వయం శ్రీరామ్ బాలాజీకి రెండో రౌండ్లో చుక్కెదురైంది. బాలాజీ–రెయెస్ వారెలా (మెక్సికో) 3–6, 4–6తో ఇటలీకి చెందిన సిమోన్ బొలెలి– అండ్రియా వవసొరి జంట చేతిలో ఓటమి పాలైంది. -
24 పతకాలతో భారత్కు రెండో స్థానం
గుమి (దక్షిణ కొరియా): ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో ఆఖరి రోజు కూడా భారత్ పతకాల వేట కొనసాగింది. శనివారం జరిగిన చివరి రోజు పోటీల్లో అథ్లెట్లు మరో అర డజను (6) పతకాలు సాధించారు. జావెలిన్ త్రోయర్ సచిన్ యాదవ్, మహిళల 5000 మీ. పరుగులో పారుల్ చౌదరి రజతం గెలుపొందగా. మరో రజత పతకం మహిళల 4్ఠ100 మీ. రిలేలో లభించింది. పురుషుల 200 మీ. స్ప్రింట్లో అనిమేశ్ కుజూర్, మహిళల 800 మీ. పరుగులో పూజ సింగ్, మహిళల 400 మీ. హర్డిల్స్లో విత్య రామ్రాజ్ కాంస్య పతకాలు సాధించారు. ఈ పోటీల్లో రెండో పతకం గెలవాలని గంపెడాశలు పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ మేటి రన్నర్ జ్యోతి యర్రాజీకి 200 మీటర్ల పరుగులో నిరాశ ఎదురైంది. 100 మీ. హర్డిల్స్లో పసిడి పతకాన్ని నిలబెట్టుకున్న ఆమె... స్ప్రింట్లో మాత్రం 23.47 సెకన్ల టైమింగ్తో ఐదో స్థానానికి పరిమితమైంది. భారత్కు రెండో స్థానం ఓవరాల్గా భారత్ 24 పతకాలతో పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. గత బ్యాంకాక్ (2023లో 27 పతకాలు) ఈవెంట్తో పోల్చితే 3 పతకాలు తగ్గినా... బంగారంలో భారత్ మెరుగైంది. నాటి క్రీడల్లో 6 స్వర్ణాలు సాధిస్తే... తాజా ఈవెంట్లో 8 పసిడి పతకాలు సహా 10 రజతాలు, 6 కాంస్య పతకాలను భారత బృందం గెలిచింది. చైనా 32 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. బీజింగ్ బృందం 19 స్వర్ణాలు, 9 రజతాలు, 4 కాంస్య పతకాలు సాధించింది.28 పతకాలు గెలుచుకున్న జపాన్ మూడో స్థానంలో ఉంది. జపనీస్ అథ్లెట్లు రజతాలు (11), కాంస్యాలు (12) ఎక్కువగా సాధించినప్పటికీ స్వర్ణాల్లో (5) వెనుకబడటంతో మూడో స్థానం దక్కింది. ఈ ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్íÙప్ చరిత్రలో భారత్ 2017లో 29 పతకాలతో అగ్ర స్థానంలో నిలిచిన ఘనతను సొంతం చేసుకుంది. సొంతగడ్డ (భువనేశ్వర్)పై జరిగిన ఆ ఈవెంట్లో 10 స్వర్ణాలు, 6 రజతాలు, 13 కాంస్య పతకాలను భారత్ చేజిక్కించుకుంది. పారుల్కు రెండో రజతం ఈ పోటీల్లో ఇదివరకే మహిళల 3000 మీటర్ల స్టీపుల్చేజ్లో రజత పతకం సాధించిన పారుల్ చౌదరి డబుల్ ధమాకా సాధించింది. తాజాగా ఆమె మహిళల 5000 మీటర్ల పరుగు పందెంలో రెండో స్థానంతో పోడియంలో నిలిచింది. సుదీర్ఘ పరుగు పోటీని ఆమె 15 నిమిషాల 15.33 సెకన్లలో ముగించి రెండో రజత పతకాన్ని చేజిక్కించుకుంది. పురుషుల జావెలిన్ త్రోలో రైజింగ్ స్టార్ సచిన్ యాదవ్ ఈటెను 85.16 మీటర్ల దూరంలో విసిరి రజతం అందుకున్నాడు. ఈ క్రమంలో తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన (84.39 మీ.)ను అధిగమించాడు. సచిన్ సహచరుడు... ఫైనల్ బరిలో నిలిచిన యశ్వీర్ సింగ్ కూడా అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన (82. 57 మీటర్లు) నమోదు చేసినప్పటికీ ఐదో స్థానంలో నిలిచాడు. మహిళల 4x100 మీటర్ల రిలే ఈవెంట్లో తెలంగాణ అథ్లెట్ నిత్య గంధె, అభినయ, స్నేహ, శ్రావణి నందతో కూడిన భారత బృందం సీజన్ బెస్ట్ ప్రదర్శన 43.86 సెకన్లతో రెండో స్థానంతో రజత పతకాన్ని గెలుచుకుంది. విత్య, పూజలకు కాంస్యాలు ఆసియా క్రీడల కాంస్య పతక విజేత విత్య రామ్రాజ్ కాంస్య పతకం గెలిచింది. మహిళల 400 మీటర్ల హర్డిల్స్లో తమిళనాడుకు చెందిన 26 ఏళ్ల అథ్లెట్ పోటీని 56.46 సెకన్లలో పూర్తిచేసి మూడో స్థానంతో ‘పోడియం’లో నిలిచింది. శనివారం ఈ ఫైనల్స్ బరిలో నిలిచిన మరో భారత అథ్లెట్ అను రాఘవన్కు ఏడో స్థానం దక్కింది. ఆమె పోటీని 57.46 సెకన్లలో పూర్తి చేసింది. మహిళల ఈవెంట్లో మరో కాంస్యాన్ని పూజ సింగ్ సాధించింది. మహిళల 800 మీటర్ల పరుగులో పోటీపడిన ఆమె రేస్ను 2 నిమిషాల 01.89 సెకన్లలో పూర్తిచేసి మూడో స్థానంలో నిలిచింది.స్ప్రింట్లో దశాబ్దం తర్వాత...కొరియన్ గడ్డపై స్పింట్లో పతకానికి పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. పురుషుల 200 మీటర్ల పరుగులో అనిమేశ్ కుజూర్ కాంస్య పతకం సాధించాడు. శనివారం జరిగిన పోటీలో 21 ఏళ్ల ఒడిశా స్ప్రింటర్ పరుగును 20.32 సెకన్లలో పూర్తిచేసి జాతీయ రికార్డు నెలకొల్పాడు. కానీ వెంట్రుక వాసిలో 00.01 సెకన్ తేడాతో రజతం గెలిచే అవకాశాన్ని కోల్పోయాడు. అయితే అతని వ్యక్తిగత అత్యుత్తమ వేగాన్ని (20.40 సెకన్లు) మెరుగుపర్చుకున్నాడు. ఈ ఏడాది సీనియర్ అథ్లెటిక్స్లో ఆ టైమింగ్ను నమోదు చేశాడు. అబ్దుల్ అజీజ్ (సౌదీ అరేబియా; 20.31 సె.) రజతం నెగ్గారు. సరిగ్గా పదేళ్ల క్రితం (2015లో) 200 మీ. పరుగులో ధరమ్వీర్ సింగ్ కాంస్యంతో స్ప్రింట్లో భారత్ తొలి పతకం అందించాడు. ఆ తర్వాత నాలుగుసార్లు 2017, 2019, 2021, 2023 ఆసియా ఈవెంట్ జరిగినా... ఎవరూ స్ప్రింట్లో పతకం నెగ్గలేకపోయారు. -
పది మందికి రూ. 1 కోటికి పైగా...
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ సీజన్–12 కోసం జరిగిన వేలంలో ఆటగాళ్ల పంట పండింది. లీగ్ వేలం చరిత్రలో ఒకే సీజన్లో తొలిసారి 10 మందికి పైగా ఆటగాళ్లు రూ. 1 కోటికి మించి విలువ పలకడం విశేషం. గత సీజన్లో ‘అత్యంత విలువైన ఆటగాడి’ అవార్డు పొందిన ఇరాన్ ప్లేయర్ మొహమ్మద్ రెజా షాద్లుయికి రికార్డు స్థాయిలో రూ. 2.23 కోట్లు దక్కడం విశేషం. ఈ భారీ మొత్తానికి గుజరాత్ జెయింట్స్ రెజాను సొంతం చేసుకుంది. వరుసగా మూడు సీజన్లోనూ రూ. 2 కోట్లకు మించిన ధర పలికిన ఆటగాడిగా రెజా నిలవడం అతని స్థాయిని చూపిస్తోంది. భారత ఆటగాళ్లలో దేవాంక్ దలాల్ టాపర్గా నిలిచాడు. అతడిని వేలంలో బెంగాల్ వారియర్స్ రూ. 2.20 కోట్లకు గెలుచుకుంది. గత సీజన్లో దేవాంక్ బెస్ట్ రైడర్గా నిలిచి పట్నా పైరేట్స్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. తెలుగు టైటాన్స్ జట్టు వేలంలో భరత్ (రూ.81.50 లక్షలు), విజయ్ మలిక్ (రూ.51.50 లక్షలు), శుభమ్ షిండే (రూ. 80 లక్షలు)లను ఎంచుకుంది. -
సెమీస్లో సాత్విక్–చిరాగ్ జోడీ ఓటమి
సింగపూర్: భారత స్టార్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సెమీ ఫైనల్లో పరాజయం పాలైంది. వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీ పురుషుల డబుల్స్ సెమీస్లో శనివారం సాత్విక్–చిరాగ్ జంట 21–19, 10–21, 18–21తో ఆరోన్ చియా–సోహ్ యిక్ (మలేసియా) ద్వయం చేతిలో ఓడింది. 64 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి గేమ్ గెలిచిన భారత జోడీ... ఆ తర్వాత రెండో గేమ్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. నిర్ణయాత్మక మూడో గేమ్లో చక్కటి ప్రదర్శన కనబర్చినప్పటకీ... కీలక సమయాల్లో పాయింట్లు కోల్పోయి పరాజయం వైపు నిలిచింది. ఈ ఏడాది సాత్విక్–చిరాగ్ జోడీకి ఇది మూడో సెమీఫైనల్ ఓటమి. అంతకుముందు ఇండియా ఓపెన్, మలేసియా ఓపెన్లోనూ ఈ జంట సెమీస్లోనే పరాజయం పాలైంది. పారిస్ ఒలింపిక్స్లో మలేసియా ప్లేయర్ల చేతిలోనే ఓడి ఇంటి బాటప్టటిన భారత షట్లర్లు ఈ సారి కూడా వారిపై విజయం సాధించలేకపోయారు. -
‘స్వర్ణ’ నందిని
గుమి (దక్షిణ కొరియా): తెలుగు రాష్ట్రాల అథ్లెట్లు ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో పసిడి మెరుపులతో అదరగొడుతున్నారు. పోటీల మూడో రోజు ఆంధ్ర అథ్లెట్ జ్యోతి యర్రాజీ బంగారు పతకం సాధిస్తే... ఇప్పుడు నాలుగో రోజు శుక్రవారం తెలంగాణ అథ్లెట్ నందిని అగసార స్వర్ణ పతకం సాధించింది. మొత్తం మీద కొరియన్ గడ్డపై భారత బృందం స్వర్ణభేరి మోగిస్తోంది. నాలుగో రోజు పోటీల్లో మన నందినితో పాటు... లాంగ్ డిస్టెన్స్ రన్నర్ గుల్వీర్ సింగ్, హైజంపర్ పూజ సింగ్లు కూడా బంగారు పతకాలు గెలుపొందారు. దీంతో భారత్ ఇప్పటికే 18 పతకాలు సాధించింది. ఇందులో 8 స్వర్ణాలు, 7 రజతాలు, 3 కాంస్య పతకాలున్నాయి. ఇదే జోరు కొనసాగితే... గత 2023–బ్యాంకాక్ చాంపియన్షిప్లో పట్టుకొచ్చిన 27 పతకాల రికార్డును భారత్ అధిగమించే అవకాశముంది. ఇదివరకు 100 మీటర్ల హర్డిల్స్లో విజేతగా నిలిచిన జ్యోతి యర్రాజీ మరో పతకంపై గురిపెట్టింది. ఆమె 200 మీటర్ల పరుగులో ఫైనల్స్కు అర్హత సంపాదించింది. నిత్య గంధే కూడా ఫైనల్ చేరింది. పురుషుల 200 మీటర్ల స్ప్రింట్లో అనిమేశ్ కుజూర్ ఫైనల్ పరుగుకు సిద్ధమయ్యాడు. చైనా అథ్లెట్ను అధిగమించి... తెలంగాణ తేజం నందిని హెప్టాథ్లాన్లో పతకం కోసం పెద్ద పోరాటమే చేసింది. ఏడు క్రీడాంశాల సమాహారమైన ఈ ఈవెంట్లో నందిని చైనా అథ్లెట్ ఇచ్చిన గట్టి పోటీని తట్టుకొని... అగ్రస్థానం సాధించడం గొప్ప విశేషం. అందుకే ఎనిమిదేళ్ల తర్వాత ఈ క్లిష్టమైన హెప్టాథ్లాన్లో భారత్ బంగారు పతకం సాధించగలిగింది. 2017లో స్వప్న బర్మన్ తర్వాత ఆసియా ఈవెంట్లో బంగారం నెగ్గిన ఘనత మన నందినిదే కావడం గమనార్హం. సోమ బిస్వాస్ (2005లో) తర్వాత సుదీర్ఘ నిరీక్షిణకు ఆమె తెరదించితే... నందిని తాజాగా భారత్కు పసిడి పతకం తీసుకొచ్చింది. 100 మీటర్ల హర్డిల్స్, హైజంప్, షాట్పుట్, 200 మీటర్ల పరుగు, లాంగ్జంప్, జావెలిన్ త్రో, 800 మీటర్ల పరుగు ఇలా... ఈ ఏడు క్రీడాంశాల్లో మొత్తంగా కలిపి నందిని 5941 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఆరో ఈవెంట్ అయిన జావెలిన్ త్రోలో కేవలం 34.18 మీటర్ల పేలవ ప్రదర్శన తర్వాత రేసు (మొత్తం పాయింట్లు)లో వెనుకబడిన తెలంగాణ అథ్లెట్ ఆఖరి పోటీ అయిన 800 మీటర్ల పరుగును 2 నిమిషాల 15.54 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలువడంతో తిరిగి అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. నందినికి ఆఖరిదాకా సవాల్ విసిరిన చైనా హెప్టాథ్లెట్ లియు జింగ్యి 5869 పాయింట్లతో రజత పతకానికి పరిమితమైంది. నిజానికి చైనా క్రీడాకారిణి జావెలిన్ త్రో తర్వాత ఆధిక్యంలోకి వచ్చింది. అయితే నందిని 800 మీటర్ల పరుగులో పుంజుకోవడంతో చైనా అథ్లెట్ ‘బంగారు’ ఆశలు గల్లంతయ్యాయి. అనర్హతకు గురైన పురుషుల రిలే జట్టు మూడో రోజు పోటీల్లో మహిళలు, పురుషుల రిలే జట్లు పతకాలు సాధించగా... తాజాగా 4్ఠ100 మీటర్ల రిలే ఈవెంట్లో భారత పురుషుల జట్టు అనర్హతకు గురైంది. ప్రణవ్ గౌరవ్, రాహుల్, మణికంఠ, అమ్లన్ బొర్గొహైన్లతో కూడిన రిలే జట్టు ప్రిలిమినరీ రౌండ్లోనే అనర్హతకు గురైంది. ఒకరి నుంచి మరొకరు బ్యాట్ను అందుకునేందుకు అనుమతించే చోటు (చేంజ్ ఓవర్ జోన్)ని దాటి బ్యాటన్ను తీసుకోవడంతో (ప్రణవ్నుంచి రాహుల్) టీమ్ డిస్క్వాలిఫై అయింది. అయితే పురుషుల జావెలిన్ త్రోలో సచిన్, యశ్వీర్ ఫైనల్ పోటీలకు అర్హత సాధించారు.గుల్వీర్ అ‘ద్వితీయ’ంఆసియా చాంపియన్షిప్ మొదలైన రోజే 10 వేల మీటర్ల సుదీర్ఘ పరుగులో బంగారు పతకం సాధించిన గుల్వీర్ సింగ్ నాలుగో రోజు మరో పసిడిని పట్టాడు. శుక్రవారం పురుషుల 5000 మీటర్ల పరుగులో అతను విజేతగా నిలిచాడు. గుల్వీర్ 13 నిమిషాల 24.77 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచాడు. వెంట్రుక వాసిలో థాయ్లాండ్ అథ్లెట్ కీరన్ తుంతివతే (13:24.97 సెకన్లు)ను రజతానికి పరిమితం చేశాడు. పూజ ‘హై’జంప్హరియాణాకు చెందిన 18 ఏళ్ల టీనేజ్ అథ్లెట్ పూజ సింగ్ హైజంప్లో పసిడి శోభ తెచ్చింది. మహిళల హైజంప్లో ఆమె తన ఐదవ ప్రయత్నంలో 1.89 మీటర్ల ఎత్తులో జంప్ చేయడం ద్వారా తన వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శన నమోదు చేసింది. దీంతో ఆమెకు బంగారు పతకం లభించింది. పూజ ‘షో’తో ఉజ్బెకిస్తాన్ హైజంపర్ సఫినా సదుల్లెవా (1.86 మీటర్లు) రెండో స్థానంలో నిలిచి రజతంతో సరిపెట్టుకుంది. భవన నిర్మాణ కూలీ కుమార్తె అయిన పూజ రెండేళ్ల క్రితం ఆసియా అండర్–23 చాంపియన్షిప్ (2023)లోనూ బంగారు పతకంతో సత్తా చాటుకుంది. మహిళల 3000 మీటర్ల స్టీపుల్చేజ్లో పారుల్ చౌదరి రజతం గెలుపొందింది. 9 నిమిషాల 12.46 సెకన్లలో పోటీని పూర్తిచేసిన ఆమె జాతీయ రికార్డు నెలకొల్పింది. కేవలం 2 సెకన్ల తేడాతో పారుల్ స్వర్ణావకాశం చేజారింది. కజకిస్తాన్ అథ్లెట్ నోరా జెరుతో తనుయ్ (9:10.46 సెకన్లు) బంగారు పతకం గెలుచుకుంది. -
ప్రిక్వార్టర్స్లో సబలెంక, స్వియాటెక్
పారిస్: ప్రపంచ నంబర్వన్ అరియాన సబలెంక, డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వియాటెక్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. వీరిద్దరితో పాటు నాలుగో సీడ్ పావొలిని, ఎనిమిదో సీడ్ క్విన్వెన్ జెంగ్, 12వ సీడ్ రిబాకినాలు కూడా ప్రిక్వార్టర్స్ చేరారు. పురుషుల సింగిల్స్లో ఎనిమిదో సీడ్ లారెంజో ముసెట్టి, పదో సీడ్ హోల్గర్ రూన్లు కూడా ప్రిక్వార్టర్స్ సమరానికి అర్హత సంపాదించారు. పురుషుల డబుల్స్లో భారత ఆటగాడు యూకీ బాంబ్రీ తన అమెరికన్ భాగస్వామితో కలిసి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. అలవోక విజయంతో... మహిళల సింగిల్స్లో శుక్రవారం జరిగిన మూడో రౌండ్ పోటీల్లో నిరుటి క్వార్టర్ ఫైనలిస్ట్, తాజా ఆ్రస్టేలియన్ ఓపెన్ రన్నరప్ సబలెంక (బెలారస్) 6–2, 6–3తో సెర్బియన్ ప్లేయర్ ఓల్గా డానిలోవిచ్ అలవోక విజయం సాధించింది. కేవలం గంటా 19 నిమిషాల్లోనే సెర్బియన్ ప్రత్యర్థి ఆట కట్టించింది. గతేడాది ప్రిక్వార్టర్ ఫైనల్ దాకా పోరాడిన ఓల్గా ఈసారి మూడో రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. ఫ్రెంచ్ ఓపెన్లో హ్యాట్రిక్ చాంపియన్ (2022, 2023, 2024), పోలండ్ స్టార్ స్వియాటెక్ వరుసగా నాలుగో టైటిల్ దిశగా అడుగులు వేస్తోంది. మూడో రౌండ్లో ఐదో సీడ్ స్వియాటెక్ 6–2, 7–5తో జాక్వెలైన్ క్రిస్టిన్ (రొమేనియా)పై గెలుపొందగా, నిరుటి రన్నరప్, నాలుగో సీడ్ జాస్మిన్ పావొలిని (ఇటలీ) 6–4, 6–1తో ఉక్రెయిన్కు చెందిన యులియా స్టారొడుత్సెవాను ఓడించింది. 12వ సీడ్ ఎలీనా రిబాకినా (కజకిస్తాన్) 6–2, 6–2తో జెలీనా ఒస్టాపెంకో (లాత్వియా)పై గెలుపొందగా, ఆ్రస్టేలియన్ ఓపెన్ మాజీ రన్నరప్, చైనా స్టార్ క్విన్వెన్ జెంగ్ 6–3, 6–4తో విక్టోరియా ఎం»ొకొ (కెనడా)పై విజయం సాధించింది. చెమటోడ్చిన రూన్ పురుషుల సింగిల్స్లో జరిగిన మూడో రౌండ్ మ్యాచ్లో హోల్గర్ రూన్ (డెన్మార్క్) 4–6, 6–2, 5–7, 7–5, 6–2తో క్వెంటిన్ హలైస్ (ఫ్రాన్స్)పై చెమటోడ్చి నెగ్గాడు. ఎనిమిదో సీడ్ లారెంజో ముసెట్టి (ఇటలీ) 4–6, 6–4, 6–3, 6–2తో మరియానో నెవొన్ (అర్జెంటీనా) గెలుపొందగా, 12వ సీడ్ టామీ పాల్ (అమెరికా) 6–3, 3–6, 7–6 (9/7), 3–6, 6–3తో కరెన్ కచనొవ్ (రష్యా)పై పోరాడి గెలిచాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో యూకీ జోడీ భారత డబుల్స్ టెన్నిస్ స్టార్ యూకీ బాంబ్రీ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో యూకీ–గాలోవే (అమెరికా) ద్వయం 6–7 (4/7), 7–6 (7/4), 6–3తో ఏడో సీడ్ నికోల మెక్టిక్ (క్రొయేషియా)–మైకేల్ వీనస్ (ఆ్రస్టేలియా) జంటపై ఆఖరిదాకా పోరాడి గెలిచింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో యూకీ–గాలోవే జోడీ... అమెరికాకు చెందిన తొమ్మిదో సీడ్ క్రిస్టిన్ హ్యరీసన్– ఇవాన్ కింగ్ జంటతో తలపడుతుంది. -
సెమీస్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట
సింగపూర్: భారత స్టార్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సెమీ ఫైనల్కు దూసుకెళ్లింది. వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో భాగంగా శుక్రవారం క్వార్టర్స్లో సాత్విక్–చిరాగ్ జంట 21–17, 21–15తో ప్రపంచ నంబర్వన్ జోడీ గోహ్ జీ ఫెయి–నూర్ ఇజుద్దీన్ (మలేసియా)పై గెలుపొందింది. గాయాల కారణంగా మూడు నెలల విరామం అనంతరం బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్లో భారత జంట అదరగొడుతోంది. క్వార్టర్స్లో సంపూర్ణ ఆధిపత్యం కనబరుస్తూ వరల్డ్ నంబర్వన్ జోడీని వరుస గేమ్ల్లో చిత్తుచేసింది. ‘ఇది పెద్ద గెలుపు. ప్రస్తుతం మేం 27వ ర్యాంక్లో ఉన్నాం. అగ్ర స్థానంలో ఉన్న ప్లేయర్లపై గెలవడం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. మా ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నాం. మిగిలిన మ్యాచ్ల్లోనూ ఇదే తీవ్రత కొనసాగిస్తూ టైటిల్ అందుకోవాలనుకుంటున్నాం’ అని సాత్విక్–చిరాగ్ వెల్లడించారు. -
నార్వే చెస్ టోర్నీ.. గుకేశ్కు తొలి విజయం
స్టావెంజర్: వరల్డ్ చెస్ చాంపియన్, భారత గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ తన 19వ పుట్టిన రోజున కీలక గెలుపును తనకు తాను బహుమతిగా ఇచ్చుకున్నాడు. నార్వే చెస్ టోర్నమెంట్ తొలి రెండు రౌండ్లలో పరాజయం చవిచూసిన అతను మూడో రౌండ్లో గెలుపు నమోదు చేశాడు. హికారు నకముర (అమెరికా)తో గురువారం జరిగిన పోరులో గుకేశ్ 42 ఎత్తుల్లో విజయం సాధించాడు. టోర్నీ తొలి రౌండ్లో కార్ల్సన్, రెండో రౌండ్లో అర్జున్ ఇరిగేశి చేతిలో గుకేశ్ ఓటమిపాలయ్యాడు. గత రెండు పరాజయాలను మరచి ఒక కొత్త టోర్నీ తరహాలో ఈ రౌండ్ను మొదలు పెట్టానని, విజయం దక్కడం సంతోషంగా ఉందని గుకేశ్ వ్యాఖ్యానించాడు. మరో వైపు ఫాబియానో కరువానా (అమెరికా) చేతిలో అర్జున్ ఇరిగేశి పరాజయం పాలవగా...వీ యి (చైనా) చేతిలో అనూహ్యంగా మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) అనూహ్యంగా ఓటమిపాలయ్యాడు. మూడు రౌండ్ల తర్వాత కరువానా అగ్రస్థానంలో ఉండగా, అర్జున్ రెండో స్థానంలో ఉన్నాడు. మరో వైపు మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. మూడో రౌండ్లో హంపి...సారా ఖదమ్ (స్పెయిన్)పై గెలుపొందింది. మరో పోరులో జు వెన్ జున్ (చైనా)...భారత్కు చెందిన వైశాలిపై విజయం సాధించింది. -
జ్యోతి ‘పసిడి’ పరుగు
గుమి (దక్షిణ కొరియా): భారత క్రీడాకారులు ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో పతకాల పంట పండిస్తున్నారు. రెండో రోజు అర డజను (6) పతకాలు సాధించిన భారత బృందం మూడో రోజు కూడా మరో ఆరు పతకాలను గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యర్రాజీ 100 మీటర్ల హర్డిల్స్లో పసిడి పతకాన్ని నిలబెట్టుకుంది. పురుషుల 3000 మీ. స్టీపుల్చేజ్లో అవినాశ్ సబ్లే విజేతగా నిలువగా, 4x400 మీటర్ల రిలే ఈవెంట్లో భారత మహిళల బృందం స్వర్ణం సాధిస్తే... పురుషుల జట్టేమో రజతంతో సరిపెట్టుకుంది. మహిళల లాంగ్జంప్లో ఆన్సీ సోజన్ రజతం, శైలీ సింగ్ కాంస్య పతకాలు సాధించారు. ఓవరాల్గా ఈ మూడు రోజుల్లోనే భారత్ మొత్తం 14 పతకాలతో సత్తా చాటుకుంది. తొలి రోజు రెండు పతకాలు నెగ్గిన భారత బృందం ఈ చాంపియన్షిప్లో బుధవారం పోటీలు ముగిసే సరికి పతకాల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. తెలుగు తేజం కొత్త రికార్డు రెండేళ్ల క్రితం బ్యాంకాక్ (థాయ్లాండ్)లో జరిగిన ఆసియా చాంపియన్షిప్లో జ్యోతి యర్రాజీ బంగారు పతకాన్ని సాధించింది. తాజాగా ఇప్పుడు సరికొత్త రికార్డుతో తెలుగుతేజం స్వర్ణాన్ని నిలబెట్టుకుంది. గురువారం జరిగిన మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో పోటీని 12.96 సెకన్లలో పూర్తిచేసిన ఏపీ అథ్లెట్ విజేతగా నిలిచింది. ఈ క్రమంలో ఆమె 1998లో కజకిస్తాన్ అథ్లెట్ ఓల్గా షిషిజినా (13.04 సె.) రికార్డును అధిగమించింది. ఈ టైమింగ్నే 2011లో చైనా క్రీడాకారిణి సున్ యావె (13.04 సె.) నమోదు చేసింది. 2023–బ్యాంకాక్ ఈవెంట్లో జ్యోతి (13.09 సె.) బంగారు పతకాన్ని గెలిచింది. తద్వారా ఆసియా చాంపియన్షిప్ చరిత్రలో హర్డిల్స్లో స్వర్ణాలు నిలబెట్టుకున్న అరుదైన ఐదుగురు అథ్లెట్ల క్లబ్లో చేరింది. ఎమి అకిమొతొ (జపాన్; 1979, 1981, 1983), జాంగ్ యు (చైనా; 1991, 1993), సు యిన్పింగ్ (చైనా; 2003, 2005), సున్ యావె (చైనా; 2009, 2011)ల సరసన ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి నిలిచింది. 36 ఏళ్ల తర్వాత బంగారం భారత అథ్లెట్ అవినాశ్ సాబ్లే ఈ సీజన్ అత్యుత్తమ ప్రదర్శనతో భారత్కు 36 ఏళ్ల తర్వాత స్టీపుల్చేజ్లో పసిడి పతకాన్ని తెచ్చిపెట్టాడు. పురుషుల 3000 మీటర్ల స్టీపుల్చేజ్ పోటీని 8:20.92 సెకన్ల టైమింగ్తో అగ్ర స్థానంలో నిలిచాడు. గత ఏడాది భారత ఆటగాడు 8:09.91 సెకన్లతో జాతీయ రికార్డును నెలకొల్పాడు.చివరిసారిగా భారత్ ఈ క్రీడాంశంలో 1989లో బంగారు పతకం గెలిచింది. దినరామ్ విజేతగా నిలువగా, తొలిసారిగా పసడి నెగ్గిన ఘనత హర్బల్ సింగ్ (1975లో)కు దక్కింది. మహిళల 10వేల మీటర్ల పరుగులో ‘పోడియం’కు దూరమైన సంజీవని జాదవ్ (33:08.17 సె.), సీమా (33:08.23 సె.) వరుసగా ఐదు, ఆరో స్థానాల్లో నిలిచారు. రిలేలో పతకాల జోరు మూడో రోజు పోటీల్లో రిలే బృందాలు సత్తా చాటుకున్నాయి. మహిళల 4x400 మీటర్ల రిలే ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ కుంజా రజిత సహా జిస్నా మాథ్యూ, రూపల్ చౌదరి, శుభా వెంకటేశన్లతో కూడిన బృందం బంగారు పతకం సాధించింది. పోటీని అందరికంటే ముందుగా భారత జట్టు 3 నిమిషాల 34.18 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచింది. పురుషుల 4x400 మీటర్ల రిలే ఈవెంట్లో తృటిలో స్వర్ణావకాశం చేజారడంతో రజతం దక్కింది. జయ్ కుమార్, ధర్మ్వీర్ చౌదరి, మనూ తెక్కినలిల్, విశాల్లతో కూడిన భారత బృందం 3 నిమిషాల 03.67 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. కేవలం 0.15 సెకన్ల తేడాతో ఖతర్ జట్టు (3 ని.03.52 సె) బంగారు పతకం సాధించింది. మహిళల లాంగ్జంప్ ఈవెంట్లో ఆన్సీ సోజన్ రజతం గెలుపొందగా, షైలీ సింగ్ కాంస్య పతకం నెగ్గింది. ఆన్సీ 6.33 మీటర్లు దూకి రెండో స్థానం సాధించగా, షైలీ సింగ్ 6.30 మీటర్లతో ఆమె వెనక నిలిచింది. ఈ ఈవెంట్లో ఇరాన్ అథ్లెట్ మొబిని అరని (6.40 మీ.) స్వర్ణం గెలుచుకుంది. -
జ్వెరెవ్, సినెర్ మూడో రౌండ్లోకి...
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ స్టార్లు, సీడెడ్ క్రీడాకారులు మూడో రౌండ్లోకి అడుగుపెట్టారు. ప్రపంచ నంబర్వన్ ఆటగాడు యానిక్ సినెర్ (ఇటలీ), మూడో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) వరుస సెట్లలో ప్రత్యర్థులపై గెలిచి ముందంజ వేశారు. మహిళల సింగిల్స్లో రెండో సీడ్ కొకొ గాఫ్ (అమెరికా), మూడో సీడ్ పెగూలా (అమెరికా), ఆరో సీడ్ అండ్రీవా (రష్యా), ఏడో సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా)లు కూడా అలవోక విజయాలతో మూడో రౌండ్లోకి చేరుకున్నారు. టైటిలే లక్ష్యంగా... హార్డ్ కోర్టుల్లో (ఆ్రస్టేలియా ఓపెన్లో 2, యూఎస్ ఓపెన్లో 1) మూడు టైటిల్స్ సాధించిన టాప్సీడ్ ప్లేయర్ సినెర్ ఈసారి క్లే కోర్టు టైటిలే లక్ష్యంగా శ్రమిస్తున్నాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ఇటలీకి చెందిన నిరుటి సెమీఫైనలిస్ట్ సినెర్ 6–3, 6–0, 6–4తో రిచర్డ్ గాస్కెట్ (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. కేవలం రెండు గంటల్లోపే (1: 57 నిమిషాలు) వరుస సెట్లలో ప్రత్యర్థి ఆటకట్టించాడు. ప్రత్యర్థిపై మూడు ఏస్లు సంధించిన సినెర్ ఒక్క డబుల్ఫాల్ట్ కూడా చేయలేదు. 21 విన్నర్లు కొట్టిన సినెర్ ఫ్రాన్స్ ఆటగాడిపై సంపూర్ణ ఆధిపత్యం కొనసాగించాడు. గత ఫ్రెంచ్ ఓపెన్ ఫైనలిస్ట్, మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 3–6, 6–1, 6–2, 6–3తో జెస్పెర్ డి జోంగ్ (నెదర్లాండ్స్)పై విజయం సాధించాడు. తొలిసెట్ను కోల్పోయిన జర్మనీ స్టార్ తర్వాత వరుస సెట్లలో ఎలాంటి పొరపాటుకు తావివ్వకుండా పట్టుదలగా ఆడి గెలుపొందాడు. 17వ సీడ్ అండ్రీ రుబ్లెవ్ (రష్యా) 7–6 (7/1), 6–1, 7–6 (7/5)తో ఆడమ్ వాల్టన్ (ఆ్రస్టేలియా)పై గెలుపొందగా, తొమ్మిదో సీడ్ అలెక్స్ డిమినార్ (ఆ్రస్టేలియా)కు రెండో రౌండ్లోనే చుక్కెదురైంది. గత ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనలిస్ట్ డిమినార్ 6–2, 6–2, 4–6, 3–6, 2–6తో అనామక కజకిస్తాన్ ప్లేయర్ బబ్లిక్ చేతిలో కంగుతిన్నాడు. సెర్బియన్ స్టార్, ఆరోసీడ్ నొవాక్ జొకోవిచ్ 6–3, 6–2, 7–6 (7/1)తో మౌటెట్ (ఫ్రాన్స్)పై గెలుపొంది మూడో రౌండ్కు చేరుకున్నాడు. గాఫ్, అండ్రీవాల జోరు మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో రెండో సీడ్ కొకొ గాఫ్, ఆరో సీడ్ అండ్రీవా తమ ప్రత్యర్థుల్ని చాలా సులువుగా చిత్తు చేశారు. గాఫ్ (అమెరికా) 6–2, 6–4తో వాలెంతొవా (చెక్ రిపబ్లిక్)పై గంటా 15 నిమిషాల్లోనే గెలుపొందగా, అండ్రీవా 6–3, 6–4తో క్రూగెర్ (అమెరికా)ను గంటా 13 నిమిషాల్లోనే చిత్తు చేసింది. మూడో సీడ్ పెగూలా (అమెరికా) 6–3, 7–6 (7/3) అన్ లీ (అమెరికా)పై, ఏడో సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) 6–1, 6–3తో బౌల్టెర్ (ఇంగ్లండ్)పై విజయం సాధించారు. పదో సీడ్ బడొసా (స్పెయిన్) 3–6, 6–4, 6–4తో ఎలీనా గాబ్రియెలా రూస్ (రొమేనియా)పై గెలిచింది. శ్రీరామ్ బాలాజీ జోడీ కూడా... పురుషుల డబుల్స్లో మరో భారత జోడీ కూడా ముందంజ వేసింది. మెక్సికో ఆటగాడు మిగుల్ రేస్ వరెలాతో జతకట్టిన శ్రీరామ్ బాలాజీ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. బుధవారం అర్ధరాత్రి ముగిసిన ఈ తొలిరౌండ్ పోరులో బాలాజీ–మిగుల్ రేస్ జోడీ 6–2, 6–1తో యుంచవొకెత్ బూ (చైనా)–యుగొ కారబెలి (అర్జెంటీనా) జంటపై వరుస సెట్లలో అలవోక విజయం సాధించింది. -
భారత ఆటగాడిని అవమానించిన పాక్ టెన్నిస్ ప్లేయర్.. వైరల్ వీడియో
పాకిస్తాన్ టెన్నిస్ ప్లేయర్ ఒకరు భారత ఆటగాడిని అవమానించాడు. భారత్ చేతిలో ఓటమిని తట్టుకోలేక ఓవరాక్షన్ చేశాడు. మ్యాచ్ పూర్తయ్యాక షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు వెళ్లిన భారత ఆటగాడి పట్ల దురుసుగా ప్రవర్తించాడు. కోపంతో ఊగిపోతూ కరచాలనం చేసేందుకు నిరాకరించాడు. కజకిస్థాన్ వేదికగా జరిగిన ఏసియా-ఓసియానియా జూనియర్ డేవిడ్ కప్ (అండర్-16) టెన్నిస్ టోర్నీమెంట్లో ఇది జరిగింది. India defeats Pakistan 2-0 in Junior Davis CupLook at the Pakistan player's attitude on handshake after loosing, Pathetic Stuff! 😡 pic.twitter.com/8twsAbDqPd— India Insights 🇮🇳 (@India_insights0) May 27, 2025ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది. పాక్ ఆటగాడి ప్రవర్తనను భారత క్రీడాభిమానులు ఖండిస్తున్నారు. క్రీడాస్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించాడని మండిపడుతున్నారు. పాక్ ఆటగాళ్ల నుంచి ఇంతకంటే గొప్ప ప్రవర్తన ఆశించలేమంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. భారత్-పాక్ మధ్య యుద్దం తర్వాత జరిగిన ఘటన కావడంతో భారత అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు.కాగా, జూనియర్ డేవిడ్ కప్ టెన్నిస్ టోర్నీలో 11వ స్థానం కోసం జరిగిన ప్లే ఆఫ్స్ మ్యాచ్లో భారత్ పాక్ను 2-0 తేడాతో చిత్తుగా ఓడించింది. సింగిల్స్ మ్యాచ్ల్లో భారత ఆటగాళ్లు ప్రకాశ్ సర్రన్, తవిశ్ పహ్వా వరుస సెట్లలో పాక్ ఆటగాళ్లును ఓడించారు. -
పులి కడుపున పులే పుడుతుంది!
గోల్ఫ్ సామ్రాజ్యానికి రారాజు, అంతర్జాతీయ గోల్ఫ్ దిగ్గజం టైగర్ వుడ్స్ కుమారుడు చార్లీ వుడ్స్ తన తండ్రి బాటలోనే నడుస్తున్నాడు. 16 ఏళ్ల చార్లీ వుడ్స్ తన తొలి అమెరికన్ జూనియర్ గోల్ఫ్ అసోసియేషన్ (AJGA) టైటిల్ను గెలుచుకున్నాడు. బుధవారం ఫ్లోరిడాలోని బౌలింగ్ గ్రీన్లో జరిగిన టీమ్ టేలర్ మేడ్ ఇన్విటేషనల్ టోర్నీ విజేతగా నిలిచాడు. అమెరికన్ జూనియర్ గోల్ఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నమెంట్లో చార్లీ అదరగొట్టాడు. చివరి రౌండ్ సమయానికి ఓవర్నైట్ లీడర్ ల్యూక్ కోల్టన్ కంటే జూనియర్ వుడ్స్ వెనకబడి ఉన్నాడు. కానీ ఆఖరి రౌండ్లో మాత్రం చేసిన చార్లీ.. సిక్స్-అండర్ పార్ 66 సాధించి టైటిల్ను సొంతం చేసుకున్నాడు. ఈ రౌండ్లో చార్లీ వుడ్స్ ఎనిమిది బర్డీలు, రెండు బోగీలు సాధించాడు. ఓవరాల్గా 15-అండర్ 201తో వుడ్స్ ముగించాడు.చదవండి: Gautam Gambhir: నేను సెలక్టర్ను కాదు.. నన్ను ఎందుకు అడుగుతారు -
ఆసియాలో ఆరు పతకాల జోరు
గుమి (దక్షిణ కొరియా) : ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత జోరు కొనసాగుతోంది. తొలి రోజు రెండు పతకాలు సాధించిన భారత అథ్లెట్లు... రెండో రోజు పోటీల్లో ఒక స్వర్ణం సహా మొత్తం ఆరు పతకాలు కైవసం చేసుకున్నారు. 4్ఠ400 మీటర్ల మిక్స్డ్ రిలే టీమ్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు పసిడి పతకం నిలబెట్టుకోగా... డెకాథ్లాన్లో తేజస్విన్ శంకర్, పురుషుల ట్రిపుల్ జంప్లో ప్రవీణ్ చిత్రవేల్ రజత పతకాలతో మెరిశారు. మహిళల 400 మీటర్ల పరుగులో రూపాల్ చౌదరి, మహిళల 1500 మీటర్ల పరుగులో పూజ కూడా రజత పతకాలు సాధించగా... పురుషుల 1500 మీటర్ల పరుగులో యూనుస్ షా కాంస్యం గెలుచుకున్నాడు.దీంతో భారత ఖాతాలో మొత్తంగా 8 పతకాలు (2 స్వర్ణాలు, 4 రజతాలు, 2 కాంస్యాలు) చేరాయి. 26వ ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీల్లో భాగంగా బుధవారం జరిగిన 4్ఠ400 మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో రూపాల్ చౌదరి, సంతోష్ కుమార్, విశాల్, సుభ వెంకటేశన్తో కూడిన భారత బృందం 3 నిమిషాల 18.12 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్ర స్థానంలో నిలిచింది. 2023లో జరిగిన ఆసియా చాంపియన్షిప్లో స్వర్ణం నెగ్గిన భారత జట్టులో సభ్యురాలైన సుభ ఈసారి కూడా సత్తా చాటింది. చైనా (3 నిమిషాల 20.52 సెకన్లు), శ్రీలంక (3 నిమిషాల, 21.95 సెకన్లు) బృందాలు వరసగా రెండో, మూడో స్థానాల్లో నిలిచినా... అనర్హత వేటుకు గురయ్యాయి. దీంతో ఆ తర్వాత నిలిచిన కజకిస్తాన్ (3 నిమిషాల 22.70 సెకన్లు), కొరియా (3 నిమిషాల 22.87 సెకన్లు) జట్లకు రజత, కాంస్యాలు దక్కాయి. పోటీల తొలి రోజు పురుషుల 10,000 మీటర్ల పరుగులో భారత అథ్లెట్ గుల్విర్ సింగ్ స్వర్ణం గెలుచుకోగా.. 20 కిలోమీటర్ల రేస్ వాక్లో సెబాస్టియన్ కాంస్యం గెలుచుకున్నాడు. రూపాల్ డబుల్ ధమాకా... మిక్స్డ్ టీమ్ విభాగంలో స్వర్ణం నెగ్గిన రూపాల్ మహిళల 400 మీటర్ల ఈవెంట్లో రజతం కూడా గెలుచుకొని డబుల్ ధమాకా మోగించింది. మహిళల ఈవెంట్లో రూపాల్ 52.68 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రెండో స్థానంలో నిలిచింది. ఇదే విభాగంలో బరిలోకి దిగిన విద్య రామ్రాజ్ 53.00 సెకన్లలో లక్ష్యాన్ని చేరి ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. ననాకో మసుమొటో (52.17 సెకన్లు; జపాన్)కు స్వర్ణం, జానిబిబి హుకుమోవా (52.79 సెకన్లు; ఉజ్బెకిస్తాన్)కు కాంస్యం గెలుచుకుంది.2022 ప్రపంచ అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో రెండు పతకాలు (4్ఠ400 మీటర్ల రిలే, 400 మీటర్ల పరుగు) సాధించిన రూపాల్ ఈ టోర్నీలోనూ రెండు పతకాలు నెగ్గడం విశేషం. ఉత్తరప్రదేశ్కు చెందిన రైతు కుటుంబం నుంచి వచ్చిన రూపాల్... గాయాల బారిన పడకుండా మెరుగైన ఫలితాలు సాధించడమే తన లక్ష్యమని పేర్కొంది. ‘పతకం సాధించడం ఆనందంగా ఉన్నా... ఫలితాలతో సంతృప్తిగా లేను. మరింత మెరుగైన టైమింగ్ సాధించాలనుకున్నా. దాని కోసం కఠోర సాధన చేస్తున్నా. గాయాల బారిన పడకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్న’ అని 20 ఏళ్ల రూపాల్ పేర్కొంది.యూనుస్కు కాంస్యం పురుషుల 1500 మీటర్ల పరుగులో యూనుస్ 3 నిమిషాల 43.03 సెకన్లలో లక్ష్యాన్ని చేరి కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. కజుటో లిజావా (3 నిమిషాల 42.56 సెకన్లు; జపాన్) వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో పసిడి గెలుచుకోగా... జియాంగ్ లీ (3 నిమిషాల 42.79 సెకన్లు; దక్షిణ కొరియా) కాంస్యం దక్కించుకున్నాడు. పురుషుల 400 మీటర్ల ఫైనల్లో విశాల్ వ్యక్తిగత అత్యుత్తమ టైమింగ్ (45.57 సెకన్లు)తో రేసును ముగించినా... నాలుగో స్థానంతోనే సరిపెట్టుకున్నాడు. 4x400 మీటర్ల మిక్స్డ్ రిలేలో పసిడి గెలిచిన భారత జట్టులో సభ్యుడైన విశాల... వ్యక్తిగత విభాగంలో మెరుగైన ప్రదర్శనే చేసినా పతకం మాత్రం సాధించలేకపోయాడు. పూజకు రజతంమహిళల 1500 మీటర్ల పరుగులో భారత అథ్లెట్ పూజ 4 నిమిషాల 10.83 సెకన్లలో గమ్యాన్ని చేరి రజతం నెగ్గింది. భారత్ కే చెందిన లిలి దాస్ (4 నిమిషాల 13.81 సెకన్లు) నాలుగో స్థానంలో నిలిచి పతకానికి దూరమైంది. లి చున్హి (4 నిమిషాల 10.58 సెకనర్లు; చైనా)కి పసిడి, టొమాకా కైమురా (4 నిమిషాల 11.56 సెకన్లు; జపాన్)కు కాంస్య పతకాలు దక్కాయి.» ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యర్రాజీ తదుపరి రౌండ్కు అర్హత సాధించింది. మహిళల హర్డిల్స్లో జ్యోతి 13.18 సెకన్లలో లక్ష్యాన్ని చేరి ముందంజ వేసింది. » మహిళల లాంగ్జంప్లో శైలీ సింగ్, ఆన్సీ సోజన్ ఫైనల్కు అర్హత సాధించారు. బుధవారం క్వాలిఫయింగ్ ఈవెంట్లో శైలీ సింగ్ 6.17 మీటర్లు దూకగా... ఆన్సీ 6.14 మీటర్ల దూరం లంఘించింది. ప్రవీణ్ మూడో ప్రయత్నంలో...పురుషుల ట్రిపుల్ జంప్లో ప్రవీణ్ చిత్రవేల్ రజత పతకంతో మెరిశాడు. బుధవారం పోటీల్లో ప్రవీణ్ 16.90 మీటర్ల దూరం దూకి రెండో స్థానంలో నిలిచాడు. ‘పరిస్థితులు అనుకూలించాయి. తొలి రెండు ప్రయత్నాల్లో టాప్–8లో ఉంటే చాలు అనుకున్నా. మూడో ప్రయత్నంలో శక్తినంతా కూడదీసుకొని లంఘించా. ఆ తర్వాత వర్షం కారణంగా అంతరాయం కలగింది. దీంతో కాస్త ఇబ్బందిపడ్డా. పతకం సాధించడం సంతోషంగా ఉంది’ అని ప్రవీణ్ పేర్కొన్నాడు. తొలి ప్రయత్నంలో 16.60 మీటర్లు దూకిన ప్రవీణ్, రెండో ప్రయత్నంలో 16.67 మీటర్లు లంఘించాడు. తేజస్విన్కు సిల్వర్భారత స్టార్ అథ్లెట్ తేజస్విన్ శంకర్ డెకథ్లాన్లో రజతం గెలుచుకున్నాడు. 10 ఈవెంట్ల (100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, షాట్పుట్, హై జంప్, 400 మీటర్ల పరుగు, 110 మీటర్ల హర్డిల్స్, డిస్కస్ త్రో, పోల్ వాల్ట్, జావెలిన్ త్రో, 1500 మీటర్ల పరుగు) సమాహారమైన ఈ పోటీలో తేజస్విన్ 7618 పాయింట్లతో రెండో స్థానం దక్కించుకున్నాడు. ఫై జియాంగ్ (7634; చైనా)కు స్వర్ణం, కిసుకే ఒకుడా (7602; జపాన్)కు కాంస్య పతకం లభించింది. -
యువ భారత్ ‘హ్యాట్రిక్’
రొసారియో (అర్జెంటీనా): నాలుగు దేశాల జూనియర్ మహిళల హాకీ టోర్నమెంట్లో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. తొలి రెండు మ్యాచ్ల్లో విజయాలు సాధించిన యువ భారత్... ఆతిథ్య అర్జెంటీనాతో జరిగిన హోరాహోరీ పోరులో షూటౌట్లో విజయం సాధించి ‘హ్యాట్రిక్’ నమోదు చేసుకుంది. నిర్ణీత సమయంలో ఇరు జట్ల స్కోర్లు 1–1 గోల్స్తో సమం కాగా... అనంతరం విజేతను నిర్ణయించేందుకు నిర్వహించిన షూటౌట్లో భారత్ 2–0తో గెలుపొందింది. మ్యాచ్లో భారత్ తరఫున కనిక (44వ నిమిషంలో) ఏకైక గోల్ చేయగా... అర్జెంటీనా తరఫున మిలాగ్రోస్ డెల్ వాలె (10వ నిమిషంలో) ఒక గోల్ చేసింది. అర్జెంటీనా జట్టు తొలి క్వార్టర్లోనే గోల్ చేసి ఆధిక్యంలోకి దూసుకెళ్లగా... మూడో క్వార్టర్లో కనిక గోల్తో భారత్ స్కోర్లు సమం చేయగలిగింది. షూటౌట్లో భారత్ తరఫున లాల్రిన్పుయి, లాల్థన్ట్లుంగి విజయవంతం అయ్యారు. యువ భారత జట్టు కెప్టెన్ నిధి గోల్కీపర్గా అర్జెంటీనా ప్లేయర్ల దాడులను సమర్థవంతంగా అడ్డుకోవడంతో భారర్లీ టోర్నమెంట్లో వరుసగా మూడో విజయం నమోదు చేసుకుంది. తదుపరి మ్యాచ్లో శుక్రవారం చిలీతో భారత్ తలపడుతుంది. -
సాత్విక్–చిరాగ్ జోడీ బోణీ
సింగపూర్: మూడు నెలల విరామం అనంతరం బరిలోకి దిగిన భారత స్టార్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో బోణీ కొట్టింది. వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీ పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో బుధవారం సాత్విక్–చిరాగ్ జోడీ 21–16, 21–13 చూంగ్ హోన్ జియాన్–మొహమ్మద్ హైకాల్ (మలేసియా) జంటపై గెలుపొందింది. 37 నిమిషాల పాటు సాగిన పోరులో ప్రపంచ మాజీ నంబర్వన్ ద్వయం వరుస గేమ్ల్లో విజయం సాధించింది. చిరాగ్ గాయం కారణంగా ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ నుంచి తప్పుకున్న ఈ జంట... పూర్తి ఫిట్నెస్తో కోర్టులో సత్తా చాటింది. ప్రస్తుతం ప్రపంచ 27వ ర్యాంక్లో ఉన్న సాత్విక్–చిరాగ్ జోడీకి... 41వ ర్యాంకర్ మలేసియా జోడీపై ఇది రెండో విజయం. ఈ సీజన్లో మలేసియా ఓపెన్, ఇండియా ఓపెన్లో సెమీస్కు చేరిన ఈ జంట... ఆ తర్వాత గాయాల కారణంగా ప్రధాన టోర్నీలకు దూరమైంది. ప్రిక్వార్టర్స్లో గాయత్రి జోడీ మహిళల డబుల్స్ తొలి రౌండ్లో గాయత్రి గోపీచంద్–ట్రెసా జాలీ జోడీ రెండో రౌండ్కు చేరుకుంది. బుధవారం తొలి రౌండ్లో గాయత్రి–ట్రెసా జంట 21–14, 19–21, 21–17తో చాంగ్ చింగ్ హూయి–యాంగ్ చింగ్ టున్ (చైనీస్ తైపీ) ద్వయంపై గెలచి ప్రిక్వార్టర్స్కు చేరింది. మిక్స్డ్ డబుల్స్లో రోహన్ కపూర్–గద్దె రుత్విక శివాని జోడీ ప్రిక్వార్టర్ ఫైనల్స్లో అడుగుపెట్టింది. రోహన్–శివాని జంట 21–16, 21–19 చెన్ జీ యీ–ఫ్రాన్సెస్కా కార్బెట్ (అమెరికా) ద్వయంపై గెలుపొందింది. మహిళల సింగిల్స్లో ఆకర్షి కశ్యప్, ఉన్నతి హూడా పోరాడి ఓడారు. ఆకర్షి కశ్యప్ 21–17, 13–21, 7–21తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ హాన్ యీ చేతిలో ఉన్నతి 21–13, 9–21, 15–21తో ప్రపంచ రెండో ర్యాంకర్ వాంగ్ జీ యీ చేతిలో పరాజయం పాలయ్యారు. సుమారు గంట పాటు సాగిన ఈ రెండు మ్యాచ్ల్లో తొలి గేమ్లో విజయం సాధించిన అనంతరం భారత షట్లర్లు పట్టు సడలించి టోర్నీ నుంచి నిష్క్రమించారు. అనుపమా ఉపాధ్యాయ 12–21, 16–21తో సంగ్ షో యున్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడగా... మహిళల డబుల్స్లో వైష్ణవి–అలీషా జంట పరాజయం పాలైంది. లక్ష్యసేన్కు గాయం పురుషుల సింగిల్స్లో భారత నంబర్వన్ లక్ష్యసేన్ టోర్నీ నుంచి అర్ధాంతరంగా వైదొలిగాడు. లిన్ చున్ యూ (చైనీస్ తైపీ)తో తొలి రౌండ్ మ్యాచ్ 21–15, 17–21, 5–13తో ఉన్న సమయంలో గాయం కారణంగా లక్ష్యసేన్ వైదొలిగాడు. ‘వెన్ను నొప్పితో లక్ష్యసేన్ తొలి రౌండ్ నుంచి వైదొలిగాడు. టోర్నీ ఆరంభానికి ముందు ప్రాక్టీస్ నుంచే లక్ష్య ఈ గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. నొప్పి మరింత ఎక్కువ కావడంతో మూడో గేమ్ మధ్యలో ఆట నుంచి తప్పుకున్నాడు. లక్ష్యసేన్ వీలైనంత త్వరగా కోలుకునే విధంగా వైద్య బృందం చికిత్స అందిస్తోంది. ఇండోనేసియా ఓపెన్ వరకు అతడు తిరిగి పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడనే నమ్మకముంది’ అని అతడి తండ్రి, కోచ్ డీకే సేన్ పేర్కొన్నాడు. -
మూడో రౌండ్కు పావొలిని
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీ మహిళల విభాగం గత ఏడాది రన్నరప్ జాస్మిన్ పావొలిని ఈ సారి కూడా చక్కటి ప్రదర్శనతో దూసుకుపోతోంది. నాలుగో సీడ్ పావొలిని (ఇటలీ) టోర్నమెంట్ మూడో రౌండ్లోకి అడుగు పెట్టింది. బుధవారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్లో ఆమె 6–3, 6–3 స్కోరుతో అజ్లా టాంజొనొవిక్ (ఆ్రస్టేలియా)పై విజయం సాధించింది. ఒక గంటా 21 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో 24 విన్నర్స్ కొట్టిన పావొలిని 3 ఏస్లు బాదింది. పురుషుల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్, రెండో సీడ్ కార్లోస్ అల్కరాజ్ కూడా ముందంజ వేశాడు. అయితే అతనికి రెండో రౌండ్లో కాస్త పోటీ ఎదురైంది. ఈ మ్యాచ్లో అల్కరాజ్ (స్పెయిన్) 6–1, 4–6, 6–1, 6–2 స్కోరుతో ఫాబియాన్ మారోజాన్ (హంగేరీ)ని ఓడించాడు. ప్రపంచ 56వ ర్యాంకర్ మారోజాన్ అనూహ్యంగా ఒక సెట్ నెగ్గినా...వెంటనే కోలుకున్న అల్కరాజ్ పైచేయి సాధించాడు. 2 గంటల 9 నిమిషాల పాటు ఈ మ్యాచ్ సాగింది. వరల్డ్ నంబర్వన్, టాప్ సీడ్ అరైనా సబలెంకా (బెలారస్) కూడా మూడో రౌండ్కు చేరింది. రెండో రౌండ్ మ్యాచ్లో సబలెంకా 6–3, 6–1తో జిల్ టీక్మన్ (స్విట్జర్లాండ్)ను ఓడించింది.పురుషుల సింగిల్స్లో ఏడో సీడ్ కాస్పర్ రూడ్ రెండో రౌండ్లోనే నిష్క్రమించాడు. అన్సీడెడ్ నూనో బోర్జెస్ (పోర్చుగల్) 2–6, 6–4, 6–1, 6–0తో రూడ్ (నార్వే)ని ఓడించాడు. మరో రెండో రౌండ్ మ్యాచ్లో ఎనిమిదో సీడ్ లొరెంజో ముసెట్టి (ఇటలీ) 6–4, 6–0, 6–4తో డేనియల్ గలాన్ (కొలంబియా)పై గెలిచి ముందంజ వేశాడు.మహిళల సింగిల్స్లో డిఫెండింగ్ చాంపియన్, నాలుగు సార్లు విజేత ఇగా స్వియాటెక్ మరో టైటిల్ దిశగా ముందడుగు వేసింది. రెండో రౌండ్లో స్వియాటెక్ 6–1, 6–2తో ఎమా రాడుకాను (బ్రిటన్)ను చిత్తు చేసింది. ఇతర రెండో రౌండ్ మ్యాచ్లలో ఎనిమిదో సీడ్ కిన్వెన్ జెంగ్ (చైనా) 6–2, 6–3తో ఎమీలియా అరాంగో (కొలంబియా)పై, 13వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 7–6 (7/4), 7–5తో అనా బొండర్ (హంగేరీ)పై గెలుపొందారు. రిత్విక్ జోడి పరాజయం... గ్రాండ్స్లామ్ ఈవెంట్లో తొలి విజయం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న హైదరాబాద్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరికి మరోసారి నిరాశే ఎదురైంది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లోనే రిత్విక్ (భారత్) – నికొలస్ బరింటోస్ (కొలంబియా) జోడి ఓటమిపాలైంది. జాకబ్ ఫియర్లీ (బ్రిటన్) – గాబ్రియెల్ డియాలో (కెనడా) ద్వయం 6–0, 6–2తో రిత్విక్–నికొలస్ జంటను చిత్తు చేసింది. 56 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది. మరో వైపు ఇద్దరు భారత ఆటగాళ్లు రోహన్ బొపన్న, యూకీ బాంబ్రీ తమ భాగస్వాములతో కలిసి రెండో రౌండ్కు చేరుకున్నారు. బోపన్న – ఆడమ్ పావ్లాసెక్ (చెక్ రిపబ్లిక్) జోడి 7–6 (8/6), 5–7, 6–1 స్కోరుతో రాబర్ట్ క్యాష్ (అమెరికా) – జె ట్రేసీ (అమెరికా)ను ఓడించారు. మరో మ్యాచ్లో యూకీ బాంబ్రీ (భారత్) – రాబర్ట్ గాలొవే (అమెరికా) జంట తొలి రౌండ్లో 6–3, 6–7 (8/10), 6–3 స్కోరుతో రాబిన్ హాస్ (నెదర్లాండ్స్) – హెన్డ్రిక్ జెబెన్స్ (జర్మనీ)పై గెలుపొంది ముందంజ వేసింది. -
సినెర్ ముందంజ
పారిస్: ప్రపంచ నంబర్వన్ యానిక్ సినెర్, సెర్బియన్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో అలవోక విజయాలతో శుభారంభం చేశారు. అయితే మాజీ ప్రపంచ నంబర్వన్, 11వ సీడ్ రష్యన్ స్టార్ డానిల్ మెద్వెదెవ్కు తొలి రౌండ్లోనే ఊహించని షాక్ ఎదురైంది. మహిళల సింగిల్స్లో అమెరికన్ స్టార్లు కొకొ గాఫ్, మాడిసన్ కీస్ వరుస సెట్లతో ప్రత్యర్థుల్ని చిత్తు చేసి రెండో రౌండ్లోకి ప్రవేశించారు. మిగతా సీడెడ్ క్రీడాకారిణుల్లో జెస్సికా పెగూలా, మిర అండ్రీవా ముందంజ వేశారు. గత ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనలిస్ట్ కొకొ గాఫ్ (అమెరికా) 6–2, 6–2తో గడెక్కి (ఆస్ట్రేలియా)పై గెలుపొందగా... అజరెంకా (బెలారస్) 6–0, 6–0తో విక్మయెర్ (బెల్జియం)పై నెగ్గింది. మూడో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా) 6–2, 6–4తో అన్క టొడొని (రొమేనియా)పై, ఆరో సీడ్ మిర అండ్రీవా (రష్యా) 6–4, 6–3తో క్రిస్టీనా బుక్సా (స్పెయిన్)పై విజయం సాధించారు. 12వ సీడ్ రిబాకినా 6–1, 4–6, 6–4తో రియెరా (అర్జెంటీనా)పై గెలుపొందగా, ఏడో సీడ్ కీస్ (అమెరికా) 6–2, 6–1తో సవిల్లే (ఆస్ట్రేలియా)ను ఓడించింది. సోఫియా కెనిన్ (అమెరికా) 6–3, 6–1తో గ్రాచెవా (ఫ్రాన్స్)పై గెలిచింది. జొకో అలవోకగా... మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలిరౌండ్ మ్యాచ్లో జొకోవిచ్ 6–3, 6–3, 6–3తో అమెరికన్ ప్లేయర్ మెక్డొనాల్డ్పై సునాయాస విజయంతో ముందంజ వేశాడు. తాజా ఆ్రస్టేలియన్ ఓపెన్ చాంపియన్, టాప్ సీడ్ ఇటలీ స్టార్ సినెర్ 6–4, 6–3, 7–5తో రిండెర్క్నెచ్ (ఫ్రాన్స్) గెలుపొందాడు. మూడో సెట్లో స్థానిక ప్లేయర్ నుంచి గట్టీపోటీ ఎదురైనప్పటికీ మరో సెట్కు అవకాశమివ్వకుండా మూడు సెట్లలోనే ప్రపంచ నంబర్వన్ ఆటగాడు ముగించాడు. ఈ సీజన్ మెద్వెదెవ్కు నిరాశనే మిగిలిస్తోంది. ఆ్రస్టేలియన్ ఓపెన్లో రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టిన ఈ 11వ సీడ్ రష్యన్ స్టార్ ఇక్కడ తొలిరౌండ్లోనే 5–7, 3–6, 6–4, 6–1, 5–7తో కామెరూన్ నోరీ (బ్రిటన్) చేతిలో కంగుతిన్నాడు. బల్గేరియాకు చెందిన 16వ సీడ్ దిమిత్రోవ్ 6–2, 6–3 2–6తో అమెరికన్ క్వాలిఫయర్ కిన్పై రెండు సెట్లతో ఆధిక్యంలో ఉండగా రిటైర్డ్హర్ట్గా కోర్టు నుంచి నిష్క్రమించాడు.ఏడో సీడ్ కాస్పెర్ రూడ్ (నార్వే) 6–3, 6–4, 6–2తో రమొస్ వినొలస్ (స్పెయిన్)పై, గత ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్, ఈ సీజన్ ఆ్రస్టేలియన్ ఓపెన్ రన్నరప్ మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6–3, 6–3, 6–4తో లర్నెర్ టియెన్ (అమెరికా)పై గెలుపొందారు. -
గుల్వీర్కు గోల్డ్
గుమి (దక్షిణ కొరియా): ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ పసిడి పతకంతో సత్తా చాటాడు. 10,000 మీటర్ల పరుగులో భారత అథ్లెట్ అగ్ర స్థానంలో నిలిచి స్వర్ణం కైవసం చేసుకున్నాడు. 20 కిలోమీటర్ల రేస్ వాక్లో భారత్కు చెందిన సెర్విన్ సెబాస్టియన్ కాంస్య పతకంతో మెరిశాడు. దీంతో పోటీల తొలి రోజు భారత్ ఖాతాలో రెండు పతకాలు చేరాయి. ఆసియా క్రీడల్లో కాంస్యం నెగ్గిన 26 ఏళ్ల గుల్వీర్... మంగళవారం 10,000 మీటర్ల రేసును 28 నిమిషాల 38.63 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణం గెలుచుకున్నాడు. గుల్వీర్కు ఇదే తొలి ఆసియా చాంపియన్షిప్ స్వర్ణం. మెబుకి సుజుకి (28 నిమిషాల 43.84 సెకన్లు; జపాన్), అల్బర్ట్ రోప్ (28 నిమిషాల 46.82 సెకన్లు; బహ్రెయిన్) వరుసగా రజత, కాంస్యాలు గెలుచుకున్నారు. భారత్కే చెందిన సావన్ బర్వాల్ 28 నిమిషాల 50.53 సెకన్లలో లక్ష్యాన్ని చేరి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. తొలి రోజు పోటీలు ముగిసేసరికి భారత్ ఒక స్వర్ణం, ఒక కాంస్యంతో పతకాల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. 5 స్వర్ణాలు, 2 రజతాలతో చైనా నంబర్వన్గా ఉండగా... 3 రజతాలు, 2 కాంస్యాలతో జపాన్ మూడో స్థానంలో ఉంది. చివరి 200 మీటర్లలో వేగం పెంచి.. ఉత్తరప్రదేశ్లోని నిరుపేద రైతు కుటుంబానికి చెందిన గుల్వీర్ సింగ్ ఇప్పటికే జాతీయ రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో అతడు 10,000 మీటర్ల రేసును 27 నిమిషాల 00.22 సెకన్లలో పూర్తి చేసి రికార్డు సృష్టించాడు. మంగళవారం రేసులో చివరికి వచ్చేసరికి మూడో స్థానంలో కనిపించిన గుల్వీర్... మరో 200 మీటర్లలో రేసు ముగుస్తుందనగా వేగం పెంచాడు. ఒక్కొక్క సహచరుడిని వెనక్కి నెడుతూ చిరుతలా దూసుకొచ్చాడు. ఆఖరి వరకు అదే కొనసాగిస్తూ ఫినిషింగ్ లైన్ దాటాడు. ‘విజేతగా నిలవాలనే లక్ష్యంతోనే బరిలోకి దిగా. టైమింగ్పై కాకుండా అందరికంటే ముందుండాలని అనుకున్నా. స్వర్ణం గెలవడం ఆనందంగా ఉంది. దీంతో నా ర్యాంకింగ్ మరింత మెరుగవనుంది. ఈ ఏడాది సెపె్టంబర్లో టోక్యో వేదికగా జరగనున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్నకు అర్హత సాధించడానికి అది తోడ్పడనుంది’అని గుల్వీర్ పేర్కొన్నాడు. భారత్ నుంచి 1975లో హరిచంద్, 2017 లక్ష్మణన్ పసిడి పతకాలు గెలవగా... ఇప్పుడు గుల్వీర్ ఆ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. 5000 మీటర్ల పరుగులోనూ జాతీయ రికార్డు కలిగిన గుల్వీర్ ఇక్కడ కూడా ఆ విభాగంలో పోటీపడనున్నాడు. 2023 ఆసియా చాంపియన్షిప్ 5000 మీటర్ల పరుగులో గుల్వీర్ కాంస్యం నెగ్గగా... ఇప్పుడు పతకం రంగు మార్చాలని కృతనిశ్చయంతో ఉన్నాడు.డెకాథ్లాన్లో తేజస్విన్ దూకుడు... భారత స్టార్ అథ్లెట్ తేజస్విన్ శంకర్ డెకథ్లాన్ (100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, షాట్పుట్, హై జంప్, 400 మీటర్ల పరుగు, 110 మీటర్ల హర్డిల్స్, డిస్కస్ త్రో, పోల్ వాల్ట్, జావెలిన్ త్రో, 1500 మీటర్ల పరుగు)లో సత్తాచాటుతున్నాడు. పోటీల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన ఐదు ఈవెంట్లలో శంకర్ దుమ్మురేపాడు. దీంతో సగం పోటీలు ముగిసేసరికి తేజస్విన్ అగ్రస్థానంలో ఉన్నాడు. పురుషుల 400 మీటర్ల పరుగులో విశాల్ ఫైనల్కు చేరగా... మహిళల 400 మీటర్ల పరుగులో రూపాల్ చౌధరీ, విదయ రామ్రాజ్ తుది రేసుకు అర్హత సాధించారు. పురుషుల హై జంప్లో భారత అథ్లెట్ అనిల్ కుషారె 2.10 మీటర్ల ఎత్తు దూకి ఫైనల్కు అర్హత సాధించాడు. పురుషుల 1500 మీటర్ల రేసులో యూనుస్ షా ఫైనల్కు చేరాడు. మహిళల జావెలిన్ త్రోలో అన్ను రాణి నాలుగో స్థానంలో నిలిచి పతకానికి దూరమైంది. సెబాస్టియన్కు కాంస్యం పురుషుల 20 కిలోమీటర్ల రేస్వాక్లో సెబాస్టియన్ 1 గంట 21 నిమిషాల 13.60 సెకన్లలో లక్ష్యాన్ని చేరి మూడో స్థానంలో నిలిచాడు. ‘పతకం నెగ్గడం సంతోషంగా ఉంది. విజేతల మధ్య పెద్ద అంతరం లేదు. ఆసియా చాంపియన్షిప్లో ఇదే నా తొలి పతకం’అని సెబాస్టియన్ అన్నాడు. వాంగ్ జవో (1 గంట 20 నిమిషాల 36.90 సెకన్లు; చైనా), కెంటా యొషికవా (1 గంట 20 నిమిషాల 44.90 సెకన్లు; జపాన్) వరుసగా స్వర్ణ, రజతాలు గెలుచుకున్నారు. ఇదే విభాగంలో పోటీపడిన మరో భారత వాకర్ అమిత్ 1 గంట 22 నిమిషాల 14.30 సెకన్లలో లక్ష్యాన్ని చేరి ఐదో స్థానంలో నిలిచాడు. -
వరల్డ్ చాంపియన్షిప్ పతకమే లక్ష్యం
న్యూఢిల్లీ: దాదాపు ఏడాది క్రితం... పారిస్ ఒలింపిక్స్... 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్... భారత్కు చెందిన 23 ఏళ్ల సిఫ్ట్ కౌర్ సమ్రాపై భారీ అంచనాలు ఉన్నాయి. కచ్చితంగా పతకం సాధించగల షూటర్ల జాబితాలో ఆమె కూడా ఉంది. సంవత్సరం ముందు ఇదే ఈవెంట్లో సిఫ్ట్ ప్రపంచ రికార్డును నమోదు చేయడం కూడా అందుకు ఒక కారణం. అయితే అసలు సమయంలో రైఫిల్ గురి చెదిరింది. సగటు భారత అభిమాని కూడా ఆశ్చర్యపోయే రీతిలో ఒక్కసారిగా పేలవ ప్రదర్శన నమోదైంది.32 మంది పోటీ పడితే సిఫ్ట్ కౌర్ 31వ స్థానంతో ముగించింది! ఈ షాక్కు ఒక్కసారిగా సిఫ్ట్ ఆట నుంచి తప్పనిసరిగా విరామం తీసుకోవాల్సి వచ్చింది. ఇకపై భవిష్యత్తు గురించి సందేహించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎట్టకేలకు నాటి పరాభవం నుంచి కోలుకున్న సిఫ్ట్ ఇప్పుడు మళ్లీ చిరునవ్వులు చిందించింది. ఇటీవల జరిగిన వరల్డ్ కప్లో ఆమె స్వర్ణంతో మెరిసి ఒలింపిక్ బాధను కాస్త మర్చిపోయేలా చేసుకుంది. నిరాశ నుంచి కోలుకొని... పారిస్లో ఘోర ప్రదర్శన తర్వాత సిఫ్ట్ కౌర్ మానసికంగా చాలా కుంగిపోయింది. ఆ ఈవెంట్ ముగిసిన సమయం నుంచి ఆమెను సాధారణ స్థితికి తెచ్చేందుకు తల్లిదండ్రులు, సోదరుడు ఎంతో శ్రమించాల్సి వచ్చింది. పారిస్ ఒలింపిక్స్ వేదిక నుంచి ఆమెను విహారయాత్ర కోసం వారు మరో నగరానికి తీసుకెళ్లి సరదాగా గడిపి వచ్చారు. స్వదేశానికి తిరిగొచ్చాక తండ్రి మరో రూపంలో ఆమెను బిజీగా ఉంచే ప్రయత్నం చేశారు. మళ్లీ మళ్లీ వైఫల్యం గురించి, స్కోర్ల గురించి ఆలోచించకుండా సరదాగా గన్స్తో ఆడుతున్నట్లుగానే ఆడమంటూ రైఫిల్ రేంజ్కే తీసుకెళ్లే ఓదార్చే ప్రయత్నం చేశాడు. మన దేశంలో అభిమానులు ఒలింపిక్స్ క్రీడలకు అన్నింటికంటే చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని... అందరి దృష్టీ వాటి ఫలితాలపైనే ఉండటం వల్ల అసలు సమయంలో తాను తీవ్ర ఒత్తిడికి లోనైనట్లు సిఫ్ట్ చెప్పుకుంది. కోలుకునేందుకు కొంత సమయం పట్టినా... తాను వెనక్కి వెళ్లి ఫలితాన్ని మార్చలేను కాబట్టి ఇక ఆలోచించడం అనవసరం అని ఆమె భావించింది. జాతీయ స్థాయి పోటీలతో... దాదాపు ఆరు నెలల తర్వాత సిఫ్ట్ మళ్లీ షూటింగ్లో పోటీ పడేందుకు సిద్ధమైంది. అందుకు ముందుగా పెద్ద ఆలోచనలు పెట్టుకోకుండా జాతీయ క్రీడల్లో పాల్గొంది. ఆమె స్థాయికి ఈ క్రీడలు చిన్నవే అయినా... ఆరంభానికి ఇదే సరైందని సిఫ్ట్ భావించింది. సహజంగానే స్వర్ణం నెగ్గడంతో కాస్త ఆత్మవిశ్వాసం వచ్చింది. ఆ తర్వాత వరుసగా రెండు సెలక్షన్ ట్రయల్స్లో పాల్గొని అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ చేసిన 595 పాయింట్ల స్కోరు పారిస్లో సాధించి ఉంటే ఆమె ఫైనల్స్కు చేరేది! తాజా ప్రదర్శనతో అర్జెంటీనాలో జరిగే వరల్డ్ కప్ షూటింగ్కు సిఫ్ట్ ఎంపికైంది. సవాల్ను అధిగమించి... బ్యూనస్ఎయిర్స్లో కొత్తగా నిర్మించిన రేంజ్లో వరల్డ్ కప్ స్థాయి పోటీలు జరగడం ఇదే తొలిసారి. వాతావరణం, గాలి దిశ... ఇలా అన్నీ కొత్తగానే ఉండటంతో సిఫ్ట్ కాస్త ఆందోళన చెందింది. 16.1 డిగ్రీల ఉష్ణోగ్రతలో మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు పోటీలు మొదలైనా ఇంకా చలిగానే ఉంది. తమ సన్నాహాలతో పోలిస్తే ఇది పూర్తిగా భిన్నమైన పరిస్థితి. అయితే పట్టుదలగా ఆడి క్వాలిఫికేషన్ను ఆమె అధిగమించింది. ఆపై ఫైనల్ పోరులో మళ్లీ తడబాటు. ‘నీలింగ్’ పొజిషన్ ముగిసేసరికి ఆమె చివరి స్థానంలో ఉంది. ‘ప్రొన్’ పొజిషన్ కాస్త మెరుగ్గా ఆడినా ఆ తర్వాతా అదే ఆఖరి స్థానం! ఆ తర్వాత తనకిష్టమైన ‘స్టాండింగ్’ పొజిషన్కు ఆమె సిద్ధమైంది. అసాధారణ ప్రదర్శన కనబరిస్తే గానీ ముందుకెళ్లే అవకాశం లేదు. ఇలాంటి సమయంలో సిఫ్ట్ తన ఆటకు పదును పెట్టింది. అద్భుతంగా లక్ష్యంపైకి బుల్లెట్లు సంధిస్తూ దూసుకుపోయింది. తుది ఫలితం చూస్తే 458.6 పాయింట్ల స్కోరుతో సిఫ్ట్కు స్వర్ణ పతకం. ‘నీలింగ్’ ముగిసిన తర్వాత సిఫ్ట్కంటే ఏకంగా 7.2 పాయింట్లు ముందంజలో ఉన్న జర్మనీ షూటర్ అనితను వెనక్కి నెట్టిన సిఫ్ట్ అగ్రస్థానం సాధించడం విశేషం. ఇప్పుడు సిఫ్ట్ తర్వాతి లక్ష్యం వరల్డ్ షూటింగ్ చాంపియన్షిప్. నవంబర్లో జరిగే ఈ పోటీల్లో చెలరేగి భారత్ తరఫున తొలి స్వర్ణం సాధించిన మహిళగా నిలవాలని సిఫ్ట్ కౌర్ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసమే ఇప్పుడు తీవ్ర సాధనను కొనసాగిస్తోంది. -
సింధు, ప్రణయ్ శుభారంభం
సింగపూర్: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్ సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేశారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీ మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో పీవీ సింధు 21–14, 21–9 తేడాతో వెన్ యూ జాంగ్ (కెనడా)పై విజయం సాధించింది. 31 నిమిషాల్లో ముగిసిన పోరులో పూర్తి ఆధిపత్యం కనబర్చిన తెలుగమ్మాయి వరస గేమ్ల్లో గెలుపొందింది. బుధవారం జరగనున్న ప్రిక్వార్టర్స్లో టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, ప్రపంచ ఐదో ర్యాంకర్ చెన్ యూ ఫీ (చైనా)తో సింధు తలపడనుంది. పురుషుల సింగిల్స్లో ప్రపంచ 34వ ర్యాంకర్ ప్రణయ్ 19–21, 21–16, 21–14తో రాస్మస్ గెమ్కే (డెన్మార్క్)పై గెలుపొందాడు. 72 నిమిషాల పాటు సాగిన హోరాహోరీ పోరులో తొలి గేమ్లో ఓడిన అనంతరం తిరిగి పుంజుకున్న ప్రణయ్... ప్రత్యర్థిపై ఆధిపత్యం కనబరుస్తూ మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. తదుపరి రౌండ్లో ఫ్రాన్స్ షట్లర్ క్రిస్టోవ్ పొపోవ్తో ప్రణయ్ అమీతుమీ తేల్చుకోనున్నాడు. కాగా ఈ టోర్నీలో మిగిలిన భారత షట్లర్లకు నిరాశ ఎదురైంది. మహిళల సింగిల్స్లో మాళవిక బన్సోద్, అన్మోల్ పరాజయం పాలవగా... పురుషుల సింగిల్స్లో ప్రియాన్షు రజావత్, కిరణ్ జార్జ్కు నిరాశ తప్పలేదు. మాళవిక, ప్రియాన్షు తొలి గేమ్ గెలిచినప్పటికీ అదే జోరు కొనసాగించడంలో విఫలమై పరాజయాల పాలయ్యారు. మాళవిక 21–14, 18–21, 11–21తో ఎనిమిదో సీడ్ సుపనిడా కటెథాంగ్ (థాయ్లాండ్) చేతిలో... ప్రియాన్షు 21–14, 10–21, 14–21తో ఏడో సీడ్ నరోకా (జపాన్) చేతిలో ఓడాడు. అన్మోల్ 11–21, 22–24తో చెన్ చేతిలో... కిరణ్ జార్జ్ 19–21, 17–21తో వెంగ్ హాంగ్ యాంగ్ (చైనా) చేతిలో సంతోష్ రామ్రాజ్ 14–21, 8–21తో కిమ్ గా ఇన్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడారు. మిక్స్డ్ డబుల్స్లో ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో, అషిత సూర్య–అమృత ప్రథమేశ్ జోడీలు నిరాశ పరచగా... మహిళల డబుల్స్లో కవిప్రియ సెల్వం–సిమ్రన్ సింగ్ తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. -
PKL 2025: యు ముంబా హెడ్ కోచ్గా అనిల్
ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో యు ముంబా జట్టుకు అనిల్ చప్రానా హెడ్ కోచ్గా వ్యవహరించనున్నాడు. పీకేఎల్ 11వ సీజన్లో యు ముంబా జట్టుకు హెడ్ కోచ్గా ఉన్న గులామ్రజా మజందరాని (ఇరాన్) సీజన్ ముగిశాక తన బాధ్యతల నుంచి వైదొలిగాడు.గత సీజన్లో అనిల్ చప్రానా యు ముంబా జట్టుకు అసిస్టెంట్ కోచ్గా పని చేశాడు. గులాంరజా తప్పుకున్న తర్వాత 12వ సీజన్ కోసం భారత మాజీ ప్లేయర్ రాకేశ్ కుమార్ను యు ముంబా కొత్త హెడ్ కోచ్గా నియమించుకుంది. అయితే ఆదివారం అనూహ్య పరిణామంచోటు చేసుకుంది. రాకేశ్ను హెడ్ కోచ్ పదవి నుంచి తప్పిస్తున్నామని ముంబా సీఈఓ సుహైల్ చందోక్ తెలిపారు. రాకేశ్తో సంప్రదింపులు చేశాకే ఈ నిర్ణయం తీసుకున్నామని చందోక్ వివరించారు. 2022లో యు ముంబా జట్టుకు హెడ్ కోచ్గా ఉన్న అనిల్ చప్రానాకు మరోసారి ఆ బాధ్యతలు అప్పగిస్తున్నామని, అసిస్టెంట్ కోచ్గా పారి్థబన్ను ఎంపిక చేశామని సోమవారం సదరు ఫ్రాంచైజీ పేర్కొంది. ఈనెల 31న, జూన్ 1న పీకేఎల్ 12వ సీజన్ కోసం ఆటగాళ్ల వేలం కార్యక్రమం జరగనుంది. 2014లో పీకేఎల్ ఆరంభ సీజన్ నుంచి పోటీపడుతున్న యు ముంబా జట్టు రెండుసార్లు రన్నరప్గా, ఒకసారి చాంపియన్గా (2015) నిలిచింది. గత సీజన్లో యు ముంబా టాప్–6లో నిలిచి ఎలిమినేటర్ మ్యాచ్లో పట్నా పైరేట్స్ చేతిలో ఓడింది. -
‘పోల్’ దాటడమే పరీక్ష!
సాక్షి క్రీడా విభాగం: ఒకవైపు ప్రపంచ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు తీవ్ర ఒత్తిడి మధ్య ప్రయాణానికి సిద్ధమవుతున్న తరుణం... మరోవైపు పోటీలు జరిగే దేశంలో ఉండే పరిస్థితులు, అనుకూలతల గురించి ఆలోచిస్తూ తమ వ్యూహాలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం... సాధారణంగా అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ఇలాంటి దశను ఎదుర్కొంటూనే ఉంటారు. టీమ్ గేమ్లకు సంబంధించి ఏర్పాట్లను చక్కబెట్టేందుకు ప్రత్యేక బృందాలు అందుబాటులో ఉంటాయి. అదే వ్యక్తిగత క్రీడాంశాల్లో పాల్గొనే ఆటగాళ్లు మాత్రం అన్నీ తామే చూసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ విషయంలో ఎన్నో ఏర్పాట్లు, మరెన్నో అదనపు జాగ్రత్తలతో వారు పోటీలకు వెళుతుంటారు. కానీ ఇలాంటి ఆటగాళ్లకు విమానాశ్రయంలో ప్రతీసారి నిబంధనల పేరుతో ప్రతిబంధకాలు ఎదురవుతూనే ఉంటాయి. ప్రశాంతంగా, సమస్య లేకుండా ప్రయాణం చేయాల్సిన అథ్లెట్లు సామాన్యుల తరహాలో అనేక తనిఖీలను ఎదుర్కొంటూ అడ్డంకులను అధిగమించాల్సి ఉంటుంది. భారత డెకాథ్లెట్ తేజస్విన్ శంకర్కు ప్రతీసారి ఇలాంటి అనుభవమే ఎదురవుతూ ఉంటుంది. 2022 ఆసియా క్రీడల డెకాథ్లాన్ (పది క్రీడాంశాల సమాహారం) ఈవెంట్లో శంకర్ రజత పతకం సాధించాడు. ఈ పోటీల్లో భాగంగా అతను పోల్వాల్ట్ ఈవెంట్లో కూడా పాల్గొనాల్సి ఉంటుంది. దాని కోసమే అతను ఎక్కడికైనా తన సొంత ‘పోల్’లను తీసుకెళతాడు. సుమారు 15.7 అడుగుల పొడవు ఉండే ఈ పోల్ను ముందుగా విమానాశ్రయం కార్గోలోకి తీసుకెళ్ళడం మొదలు విమానం దిగిన తర్వాత ఆయా ఎయిర్పోర్ట్నుంచి బయటకు తీసుకు రావడం వరకు పెద్ద ప్రహసనం సాగుతుంది. భారత్లో జరిగే ఈవెంట్లలో అయితే అతను తన పోల్లను ట్రైన్ల ద్వారా సునాయాసంగా పంపించేస్తాడు. అదే విదేశాలకు వెళ్లేటప్పుడే సమస్య ఎదురవుతుంది. టోర్నీ జరిగే సమయంలో నిర్వాహకులు పోల్లను సిద్ధం చేస్తారు కానీ కొత్తవాటిని ఉపయోగించడంలో చాలా సమస్యలు ఉంటాయి. వాటి పొడవు, బరువును బట్టి ప్రాక్టీస్లో వాడటం బాగా అలవాటైన పోల్లనే పోటీల్లోనూ వాడితే సౌకర్యంగా ఉంటుంది. అందుకే తేజస్విన్ కూడా ఎక్కడికి వెళ్లినా వాటిని తీసుకెళతాడు. యూరోప్, అమెరికా దేశాల్లో ఇలాంటి సమస్య తక్కువ. అగ్రశ్రేణి అథ్లెట్లంతా ఈ రెండు ఖండాల్లో తమకు అనువైన చోట ఒక్కో సెట్ను ఉంచుతారు. వాటిని తరలించడంలో వారికి పెద్దగా ఇబ్బంది ఎదురు కాదు. ఈనెల 27 నుంచి దక్షిణ కొరియాలో జరిగే ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తేజస్విన్ పాల్గొంటున్నాడు. అతని ఈవెంట్ రెండు రోజులపాటు ఉంటుంది. మే 27న తొలి రోజు ఐదు ఈవెంట్స్ (100 మీటర్లు, లాంగ్జంప్, షాట్పుట్, హైజంప్, 400 మీటర్లు)... రెండో రోజు మే 28న మరో ఐదు ఈవెంట్స్ (110 మీటర్ల హర్డిల్స్, డిస్కస్ త్రో, పోల్వాల్ట్, జావెలిన్ త్రో, 1500 మీటర్లు) జరుగుతాయి. అత్యధిక పాయింట్లు సాధించిన టాప్–3 డెకాథ్లెట్లకు వరుసగా స్వర్ణ, రజత, కాంస్యాలు లభిస్తాయి. ఈ నేపథ్యంలో తేజస్విన్ తన గతానుభవాలను వివరించాడు. వివరాలు అతని మాటల్లోనే.... ‘నా ఈవెంట్కు సంబంధించిన స్పోర్ట్స్ ఎక్విప్మెంట్లో జావెలిన్, డిస్కస్, షాట్పుట్ సహా అన్నింటిని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సాధారణ చెకింగ్ ద్వారానే నేను దాటించ గలుగుతాను. కానీ అసలు సమస్య పోల్వాల్ట్ పోటీల్లో వాడే పోల్ గురించే వస్తుంది. దాదాపు 5 మీటర్ల పొడవు ఉండే పోల్ను తీసుకెళ్లడం నాకు ఎప్పుడూ సమస్యే. అన్నింటికంటే ముందు ప్రధాన ద్వారం వద్దే సీఐఎస్ఎఫ్ జవాన్లు నన్ను ఆపేస్తారు. నా గురించి మొత్తం చెప్పిన గతంలోనూ ఇలా వెళ్లానని వివరించాల్సి వస్తుంది. మరోవైపు ప్రయాణీకులేమో నేనేదో ఆయుధాలు తీసుకెళుతున్నట్లు చూస్తారు. సాధారణంగా లగేజీకి వాడే రెండు కార్గో లిఫ్ట్లలో ఈ పోల్లు పట్టవు. అందుకే మరో లిఫ్ట్ను వాడాల్సి ఉంటుంది. మొదటిసారి నేను ఈ పోల్స్ తీసుకొని భారత్కు తిరిగొచ్చాక వాటిని ఎలా బయటకు తీసుకురావాలో తెలీక కొందరు అధికారులు వెనక్కి పంపాలని కూడా ఆలోచించారు. చివరకు నాలుగు రోజుల తర్వాత అలాంటి వాటి కోసం స్టీల్ గేట్ ఒకటి ఉంటుందని తెలిసింది. దానిని కేవలం ప్రధానమంత్రి విదేశాలకు వెళ్లేటప్పుడు మాత్రమే వాడతారని వారు చెప్పారు. ఈ గేట్ను వాడేందుకు నేను ముందుగా సదరు ఎయిర్లైన్స్ అధికారుల లెటర్ తీసుకోవాలి. ఆపై సెక్యూరిటీ హెడ్, కస్టమ్స్ హెడ్తో కూడా దానిపై సంతకం చేయించాలి. వేర్వేరు చోట్ల బిజీగా ఉండేవారంతా ఒకే సమయంలో మనకు దొరకరు. చివరకు ఆ స్టీల్ గేట్ను తెరుస్తారు. ఈ ప్రక్రియ అంతా దాదాపు ఐదు గంటల పాటు సాగుతుంది! అందుకే నేను ప్రయాణ సమయానికన్నా ఎన్నో గంటల ముందు అక్కడుంటాను. కాస్త ఆలస్యం అయితే వారు నన్ను పట్టించుకోరు. ఎన్నిసార్లు నేను ఇదే చేస్తున్నా ప్రతీసారి మళ్లీ కొత్తగా మొదలు పెట్టాల్సి ఉంటుంది. భారత్ నుంచి వెళ్లిన తర్వాత మనం ఏ దేశంలో అడుగుపెడుతున్నాం అనేదానిపై తర్వాతి అంశాలు ఆధారపడి ఉంటాయి. కొన్ని ఎయిర్లైన్స్లు బాగా సహకరిస్తే కొన్ని పోల్స్ను తీసుకెళ్లమని గట్టిగా చెప్పేస్తాయి. నాకు ఇదంతా చేయడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. అయితే పతకం గెలిచి వస్తున్నప్పుడు ఎంతో చక్కగా మనకు సహాయం చేస్తారు కూడా. ఇది ఒక అథ్లెట్గా నాకు కలిగే ఆనందం’ అని తేజస్విన్ వివరించాడు. -
సబలెంకా సులువుగా...
ఎర్రమట్టి కోర్టులపై తన ఆధిపత్యం నిరూపించునే దిశగా బెలారస్ టెన్నిస్ స్టార్ సబలెంకా అడుగు వేసింది. తనకు అంతగా కలిసిరాని ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో ప్రపంచ నంబర్వన్ సబలెంకా శుభారంభం చేసింది. టాప్ సీడ్ హోదాలో బరిలోకి దిగిన ఆమె తొలి మ్యాచ్లో దుమ్మురేపింది. రష్యా ప్లేయర్ కమిల్లా రఖిమోవాతో జరిగిన పోరులో సబలెంకా కేవలం ఒక్క గేమ్ మాత్రమే కోల్పోయి విజయాన్ని ఖరారు చేసుకుంది. వరుసగా ఎనిమిదో ఏడాది ఫ్రెంచ్ ఓపెన్లో ఆడుతున్న సబలెంకా గత ఏడాది సెమీఫైనల్ చేరుకొని తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. మూడు గ్రాండ్స్లామ్ టైటిల్స్ (2 ఆస్ట్రేలియన్ ఓపెన్, 1 యూఎస్ ఓపెన్) సాధించిన సబలెంకా స్థాయికి తగ్గట్టు ఆడితే ఫ్రెంచ్ ఓపెన్లో అద్భుతం సృష్టించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పారిస్: టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్లో తొలి రోజు ఎలాంటి సంచలనాలు నమోదు కాలేదు. మహిళల సింగిల్స్లో ఫేవరెట్స్లో ఒకరైన నంబర్వన్ సబలెంకా గెలుపు బోణీ కొట్టింది. ఆదివారం జరిగిన తొలి రౌండ్లో సబలెంకా 6–1, 6–0తో ప్రపంచ 86వ ర్యాంకర్ కమిల్లా రఖిమోవా (రష్యా)పై అలవోకగా గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. 60 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో ఐదు ఏస్లు సంధించిన సబలెంకా ఒక డబుల్ ఫాల్ట్ చేసింది. తన సర్వీస్ను ఒక్కసారి కూడా కోల్పోని ఆమె ప్రత్యర్థి సర్వీస్ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. 30 విన్నర్స్ కొట్టిన సబలెంకా 17 అనవసర తప్పిదాలు చేసింది. మరోవైపు ఎనిమిదో సీడ్ కిన్వెన్ జెంగ్ (చైనా), 13వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 11వ సీడ్ డయానా ష్నైడర్ (రష్యా) కూడా తొలి రౌండ్లో విజయం సాధించి రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. తొలి రౌండ్ మ్యాచ్ల్లో కిన్వెన్ జెంగ్ 6–4, 6–3తో పావ్లీచెంకోవా (రష్యా)పై, స్వితోలినా 6–1, 6–1తో జెనిప్ సోన్మెజ్ (తుర్కియే)పై, డయానా 7–6 (7/3), 6–2తో క్వాలిఫయర్ సొబోలియెవా (ఉక్రెయిన్)పై గెలిచారు. ముసెట్టి ముందంజ పురుషుల సింగిల్స్ విభాగంలో ఎనిమిదో సీడ్ ముసెట్టి (ఇటలీ), 12వ సీడ్ టామీ పాల్ (అమెరికా), 15వ సీడ్ టియాఫో(అమెరికా) శుభారంభం చేశారు. తొలి రౌండ్ మ్యాచ్ల్లో ముసెట్టి 7–5, 6–2, 6–0తో హాన్్ఫమన్ (జర్మనీ)పై, టామీ పాల్ 6–7 (3/7), 6–2, 6–3, 6–1తో ఎల్మెర్ మోలెర్ (డెన్మార్క్)పై, టియాఫో 6–4, 7–5, 6–4తో సఫిలిన్ (రష్యా)పై విజయం సాధించారు. నాదల్కు సన్మానం రికార్డుస్థాయిలో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను 14 సార్లు గెలిచిన స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్కు ఆదివారం నిర్వాహకులు సన్మానించారు. ఈ కార్యక్రమానికి స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్, బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే హాజరై నాదల్తో ఫొటోలు దిగారు. గత ఏడాది ఆటకు గుడ్బై చెప్పిన నాదల్ తన కెరీర్లో మొత్తం 22 గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించాడు. -
స్వప్నం సాకారం
మోంటెకార్లో: టెన్నిస్లో ‘వింబుల్డన్’... బ్యాడ్మింటన్లో ‘ఆల్ ఇంగ్లండ్’... ఫార్ములావన్లో ‘మొనాకో’ గ్రాండ్ప్రి... ఆయా క్రీడాంశాల్లోని క్రీడాకారులు పై మూడింటిలో గెలిస్తే ఎంతో గొప్పగా, ఎంతో గౌరవంగాభావిస్తారు. బ్రిటన్ రేసింగ్ డ్రైవర్ లాండో నోరిస్ ఆదివారం మొనాకో వీధుల్లో తన చిన్ననాటి కలను నిజం చేసుకున్నాడు. ఎంతో ఘన చరిత్ర కలిగిన మొనాకో గ్రాండ్ప్రిలో నోరిస్ విజేతగా అవతరించాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన లాండో నోరిస్ నిర్ణీత 78 ల్యాప్లను అందరికంటే వేగంగా, అందరికంటే వేగంగా 1 గంట 40 నిమిషాల 33.843 సెకన్లలో ముగించి టైటిల్ సాధించాడు. ‘ఎంతో గొప్పగా అనిపిస్తోంది. ఏనాటికైనా మొనాకో గ్రాండ్ప్రిలో విజేతగా నిలవాలని చిన్ననాటి నుంచి కలలు కన్నాను. ఇప్పుడు నా స్వప్నం సాకారమైంది’ అని ఈ సీజన్లో రెండో విజయాన్ని అందుకున్న నోరిస్ వ్యాఖ్యానించాడు. మొనాకో గ్రాండ్ప్రి మొత్తం వీధుల్లోనే జరుగుతుంది కాబట్టి నిర్వాహకులు ఈ రేసులో ప్రత్యేక నిబంధనను ప్రవేశపెట్టారు. ఈసారి డ్రైవర్లందరూ కచ్చితంగా రెండుసార్లు పిట్ స్టాప్లోకి వెళ్లి టైర్లు మార్చుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ‘పోల్ పొజిషన్’ నుంచి రేసును ఆరంభించిన నోరిస్ 20వ ల్యాప్ వరకు ఆధిక్యంలో ఉన్నాడు. ఆ తర్వాత 20వ ల్యాప్లో నోరిస్ పిట్ స్టాప్లోకి వెళ్లడంతో రెడ్బుల్ జట్టు డ్రైవర్ వెర్స్టాపెన్ ఆధిక్యంలోకి వచ్చాడు. వెర్స్టాపెన్ 29వ ల్యాప్లో తొలిసారి పిట్ స్టాప్లోకి వెళ్లాడు. ఆ తర్వాత వెర్స్టాపెన్ 77వ ల్యాప్ వరకు ఆధిక్యంలో ఉన్నా రెండోసారి పిట్ స్టాప్లోకి వెళ్లలేదు. 77వ ల్యాప్లో వెర్స్టాపెన్ పిట్ స్టాప్లోకి ప్రవేశించగా... ఇదే అదనుగా నోరిస్ దూసుకుపోయి మళ్లీ ఆధిక్యంలోకి వచ్చి చివరి ల్యాప్ను పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.ఫెరారీ డ్రైవర్ లెక్లెర్క్ రెండో స్థానంలో, ఆస్కార్ పియాస్ట్రి (మెక్లారెన్) మూడో స్థానంలో నిలిచారు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ వెర్స్టాపెన్ నాలుగో స్థానంతోసరిపెట్టుకున్నాడు. మాజీ చాంపియన్ లూయిస్ హామిల్టన్కు ఐదో స్థానం దక్కింది. ఇద్దరు డ్రైవర్లు ఫెర్నాండో అలోన్సో (ఆస్టన్ మార్టిన్), పియరీ గ్యాస్లీ (అల్పైన్) రేసును పూర్తి చేయలేకపోయారు. ప్రస్తుత సీజన్లో ఎనిమిది రేసులు ముగిశాయి. ఆరింటిలో మెక్లారెన్ డ్రైవర్లు, రెండింటిలో రెడ్బుల్ డ్రైవర్లు విజేతలుగా నిలిచారు. డ్రైవర్స్ చాంపియన్షిప్లో 161 పాయింట్లతో ఆస్కార్ పియాస్ట్రి తొలి స్థానంలో, 158 పాయింట్లతో లాండో నోరిస్ రెండో స్థానంలో, 136 పాయింట్లతో వెర్స్టాపెన్ మూడో స్థానంలో ఉన్నారు. సీజన్లోని తదుపరి రేసు స్పానిష్ గ్రాండ్ప్రి జూన్ 1న జరుగుతుంది. -
రన్నరప్ శ్రీకాంత్
కౌలాలంపూర్: కెరీర్లో మరో అంతర్జాతీయ టైటిల్ సాధించాలని ఆశించిన భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్కు నిరాశ ఎదురైంది. మలేసియా ఓపెన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో ప్రపంచ మాజీ నంబర్వన్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ శ్రీకాంత్ రన్నరప్గా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 65వ ర్యాంకర్ శ్రీకాంత్ 11–21, 9–21తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ లీ షి ఫెంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. 36 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో శ్రీకాంత్ అడపాదడపా మెరిపించినా చివరకు చైనా ప్లేయర్దే పైచేయి అయింది. రన్నరప్గా నిలిచిన శ్రీకాంత్కు 18,050 డాలర్ల (రూ. 15 లక్షల 35 వేలు) ప్రైజ్మనీతోపాటు 7800 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ‘మళ్లీ పోడియంపైకి వచ్చి పతకం అందుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తోంది. ఫైనల్ ఫలితం నిరాశపరిచినా, ఓవరాల్గా ఈ టోర్నీలో నా ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నా’ అని 32 ఏళ్ల శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు. 2017లో ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ సాధించిన తర్వాత శ్రీకాంత్ మరో అంతర్జాతీయ టైటిల్ నెగ్గలేకపోయాడు. 2019లో ఇండియా ఓపెన్లో, 2021 ప్రపంచ చాంపియన్షిప్లో ఫైనల్ చేరిన శ్రీకాంత్ రన్నరప్తో సరిపెట్టుకున్నాడు. -
జొకోవిచ్ 100 నాటౌట్
జెనీవా: టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) వందో సింగిల్స్ టైటిల్ ఖాతాలో వేసుకున్నాడు. జెనీవా ఓపెన్లో చాంపియన్గా నిలవడం ద్వారా జొకో ఈ ఘనత సాధించాడు. తద్వారా ఓపెన్ ఎరాలో 100 సింగిల్స్ టైటిల్స్ సాధించిన మూడో ప్లేయర్గా జొకోవిచ్ రికార్డుల్లోకి ఎక్కాడు. జిమ్మి కానర్స్ (109; అమెరికా), రోజర్ ఫెదరర్ (103; స్విట్జర్లాండ్) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ జొకోవిచ్ 5–7, 7–6 (7/2), 7–6 (7/2)తో హబర్ట్ హుర్కాజ్ (పోలాండ్)పై విజయం సాధించాడు. తొలి సెట్లో పరాజయం పాలైన జొకో... హోరాహోరీగా సాగిన మిగిలిన రెండు సెట్లను టై బ్రేకర్ ద్వారా గెలుచుకున్నాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో హుర్కాజ్ 19 ఏస్లు సంధించగా... జొకోవిచ్ 6 ఏస్లకే పరిమితమైనా కీలక సమయాల్లో పాయింట్లు కొల్లగొట్టాడు. హుర్కాజ్ 112 పాయింట్లు నెగ్గగా... జొకో 121 పాయింట్లు సాధించాడు. 2024 పారిస్ ఒలింపిక్స్లో 99వ టైటిల్ ఖాతాలో వేసుకున్న జొకోవిచ్... ఫ్రెంచ్ ఓపెన్ ప్రారంభానికి ముందు ‘సెంచరీ’ పూర్తి చేసుకున్నాడు. పారిస్ ఒలింపిక్స్లో స్వర్ణం గెలిచిన అనంతరం జొకో... షాంఘై మాస్టర్స్, మియామి మాస్టర్స్ టోర్నమెంట్ ఫైనల్స్కు చేరినా టైటిల్ గెలవలేకపోయాడు. ‘వందో టైటిల్ నెగ్గడం చాలా ఆనందంగా ఉంది. ఈ క్షణం కోసం ఎతో కష్టపడ్డా. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నా. హబర్ట్ సర్వీస్ను బ్రేక్ చేయడం చాలా కష్టంగా అనిపించింది. అయినా ప్రయత్నించి సఫలమయ్యా’ అని జొకో అన్నాడు. 2006లో తొలి టైటిల్ నెగ్గిన జొకోవిచ్... 19 ఏళ్ల కెరీర్లో మూడంకెల సంఖ్యకు చేరుకున్నాడు. ఈ క్రమంలో ఓపెన్ ఎరాలో 20 వేర్వేరు సీజన్లలో టైటిల్స్ నెగ్గిన తొలి ప్లేయర్గా చరిత్రకెక్కాడు. ఇప్పటికే 24 గ్రాండ్స్లామ్ టైటిల్స్ ఖాతాలో వేసుకున్న జొకోవిచ్... నేటి నుంచి ప్రారంభం కానున్న ఫ్రెంచ్ ఓపెన్లో మరోసారి విజేతగా నిలిచేందుకు కసరత్తు చేస్తున్నాడు. మట్టి కోర్టులో జరగనున్న ఈ టోర్నీ తొలి రౌండ్లో సోమవారం మెకెంజీ మెక్డొనాల్డ్ (అమెరికా)తో జొకోవిచ్ తలపడనున్నాడు. -
మరో టైటిల్ వేటలో... అల్కరాజ్
పారిస్: సీజన్ రెండో గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్కు నేడు తెర లేవనుంది. గతేడాది ఒలింపిక్స్లో తలపడిన టెన్నిస్ సూపర్ స్టార్లందరూ మళ్లీ పారిస్లో పోరాడేందుకు వచ్చేశారు. క్లే కోర్టులో సత్తా చాటేందుకు సై అంటున్నారు. డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్ (స్పెయిన్) ట్రోఫీని నిలబెట్టుకునే పనిలో ఉంటే... ప్రపంచ నంబర్వన్ యానిక్ సినెర్ (ఇటలీ) టైటిల్ సాధించేందుకు వచ్చాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్తో సత్తా చాటుకున్న సినెర్ డోపింగ్ మరకను దాటేశాడు. ఇప్పుడిక్కడ ప్రెంచ్ ముచ్చట తీర్చుకోవాలని అనుకుంటున్నాడు. వీరిద్దరితో పాటు టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ కూడా 25వ గ్రాండ్స్లామ్ టైటిల్ కోసం కాచుకున్నాడు. దీనికోసం రెండేళ్లుగా పెద్ద పోరాటమే చేస్తున్నాడు. ఈ సీజన్ ఆరంభ గ్రాండ్స్లామ్ ఆ్రస్టేలియన్ ఓపెన్లో సెమీస్ చేరిన నొవాక్ రోలండ్ గారోస్లో చివరిసారిగా 2023లో టైటిల్ గెలిచాడు. ఆ ఏడాది వింబుల్డన్ (రన్నరప్) తప్ప మూడు టైటిళ్లను కైవసం చేసుకున్న జొకోవిచ్కు గత సీజన్ తీవ్ర నిరాశను మిగిల్చింది.ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయాడు. దీంతో ‘గ్రాండ్స్లామ్ రజతోత్సవం’ కోసం ఈ ఫ్రెంచ్ ఓపెన్లో సెర్బియన్ స్టార్ గంపెడాశలతో బరిలోకి దిగుతున్నాడు. సరిగ్గా తొమ్మిది నెలల క్రితం ఇక్కడే ఒలింపిక్స్లో చాంపియన్గా నిలిచిన జొకోకు మళ్లీ కాలం కలిసొస్తే ‘గ్రాండ్–25’ సాకారం అవుతుంది. తొలి రౌండ్లలో నిరుటి విజేత అల్కరాజ్... క్వాలిఫయర్ గులియో జెప్పియెరి (ఇటలీ)తో, సినెర్... రిండెర్క్నెచ్ (ఫ్రాన్స్)తో, ఆరో సీడ్ జొకోవిచ్... షెవ్చెంకో (కజకిస్తాన్)తో ఫ్రెంచ్ సమరాన్ని ప్రారంభించనున్నారు. దాదాపు 2 దశాబ్దాల తర్వాత నాదల్ లేని క్లేకోర్ట్ ఈవెంట్ జరగబోతోంది. 2005 నుంచి 2024 వరకు పోటీపడిన స్పెయిన్ దిగ్గజం 22 గ్రాండ్స్లామ్ టైటిళ్లలో 14 ఫ్రెంచ్ ఓపెన్లోనే సాధించడం విశేషం. సబలెంక, స్వియాటెక్లే ఫేవరెట్లు మహిళల సింగిల్స్లో టాప్ సీడ్ అరియాన సబలెంక (బెలారస్), స్వియాటెక్ (పోలండ్)లు టైటిల్ ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నారు. గతేడాది ఆస్ట్రేలియన్, యూఎస్ ఓపెన్లు గెలిచిన సబలెంకకు ఈ ఏడాది ఆరంభ గ్రాండ్స్లామ్లో టైటిల్ పోరులో చుక్కెదురైంది. ఇప్పుడు టైటిల్ గెలిచేదాకా నిలకడైన ఆటతీరును కనబరచాలనే లక్ష్యంతో ప్రపంచ నంబర్వన్ సబలెంక బరిలోకి దిగుతోంది. మరోవైపు ‘క్లేకోర్టు రాణి’గా ఎదిగిన స్వియాటెక్ రోలండ్ గారోస్లో ఐదో టైటిల్పై కన్నేసింది. ఫ్రెంచ్ ఓపెన్లో ఆమె హ్యాట్రిక్ సహా నాలుగు (2020, 2022, 2023, 2024) ట్రోఫీలు సాధించింది. తొలి రౌండ్ పోటీల్లో రష్యన్ అన్సీడెడ్ రకిమొవాతో సబలెంక... రెబెక్కా స్రాంకొవా (స్లొవేకియా)తో స్వియాటెక్ పోటీపడనున్నారు. గత యూఎస్ ఓపెన్ రన్నరప్, మూడో సీడ్ జెస్సికా పెగులా (అమెరికా)... రొమేనియన్ ప్లేయర్ అన్క టొడోనితో, ఆ్రస్టేలియన్ ఓపెన్ చాంపియన్ మాడిసన్ కీస్ (అమెరికా) క్వాలిఫయర్ డెరియా సవిల్లే (ఆస్ట్రేలియా)తో... రెండో సీడ్ కొకొ గాఫ్ (అమెరికా) అన్సీడెడ్ ఒలీవియా గడెకి (ఆ్రస్టేలియా)తో తలపడతారు. -
నోరిస్కు పోల్ పొజిషన్
మొనాకో: ఫార్ములా వన్ సీజన్ తొమ్మిదో రేసు మొనాకో గ్రాండ్ ప్రిలో మెక్లారెన్ డ్రైవర్ లాండో నోరిస్ పోల్ పొజిషన్ సాధించాడు. ఈ క్రమంలో నోరిస్ ట్రాక్ రికార్డును తిరగరాశాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ ఈవెంట్లో నోరిస్ 1 నిమిషం 9.954 సెకన్లలో ల్యాప్ను పూర్తిచేసి అగ్రస్థానంలో నిలిచాడు. 2019లో లూయిస్ హామిల్టన్ టైమింగ్ను తాజాగా నోరిస్ అధిగమించాడు. ఈ సీజన్ ఆరంభ ఆ్రస్టేలియా గ్రాండ్ ప్రి తర్వాత నోరిస్కు ఇదే తొలి పోల్ పొజిషన్. ఆదివారం జరగనున్న ప్రధాన రేసును అతడు తొలి స్థానం నుంచి ప్రారంభించనున్నాడు.గతేడాది ఈ రేసులో విజేతగా నిలిచిన స్థానిక డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ (1 నిమిషం 10.063 సెకన్లు; ఫెరారీ) రెండో స్థానం దక్కించుకోగా... మెక్లారెన్ జట్టుకే చెందిన ఆస్కార్ పియాస్ట్రి (1 నిమిషం 10.063 సెకన్లు) మూడో స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది అంతగా ఆకట్టుకోలేకపోయిన ఏడుసార్లు ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ (1 నిమిషం 10.382 సెకన్లు) నాలుగో స్థానంలో నిలవగా... డిఫెండింగ్ చాంపియన్, రెడ్బుల్ రేసర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ (1 నిమిషం 10.669 సెకన్లు) ఐదో ప్లేస్ దక్కించుకున్నాడు. ఈ సీజన్లో మెక్లారెన్ డ్రైవర్ల జోరు సాగుతుండగా... ఎనిమిది రేసులు ముగిసేసరికి డ్రైవర్స్ చాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో పియాస్ట్రి 146 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. లాండోనోరిస్ 133 పాయింట్లతో రెండో ప్లేస్లో కొనసాగుతుండగా... నాలుగు సార్లు ప్రపంచ చాంపియన్ వెర్స్టాపెన్ (124 పాయింట్లు) మూడో స్థానంలో ఉన్నాడు. -
శ్రీకాంత్ ఎట్టకేలకు ఫైనల్కు...
కౌలాలంపూర్: భారత సీనియర్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ నాలుగేళ్ల తర్వాత టైటిల్ పోరుకు అర్హత సంపాదించాడు. మలేసియా మాస్టర్స్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో శ్రీకాంత్ 21–18, 24–22తో ప్రపంచ 23వ ర్యాంకర్ యుషి తనాకా (జపాన్)పై తుదికంటా పోరాడి గెలిచాడు. ప్రతీ గేమ్లోనూ జపనీస్ ప్రత్యర్థి నుంచి కఠినమైన సవాళ్లు ఎదురైనా... ఏ దశలోనూ పట్టుసడలించని భారత స్టార్ వరుస గేముల్లోనే మ్యాచ్ను ముగించాడు. ‘చాలా అనందంగా ఉంది. గతేడాది ఎక్కువ మ్యాచ్లు ఆడలేదు. ఈ ఫలితం కోసం ఎంతగానో శ్రమించాను’ అని శ్రీకాంత్ అన్నాడు. 32 ఏళ్ల ఈ షట్లర్ చివరిసారిగా 2021లో జరిగిన ప్రపంచ చాంపియన్షిప్లో ఫైనల్ చేరి రజతంతో సరిపెట్టుకున్నాడు. అయితే బీడబ్ల్యూఎఫ్ టూర్ టోర్నీల విషయానికొస్తే అతను ఆరేళ్ల తర్వాత టైటిల్ పోరుకు అర్హత సాధించినట్లయింది. 2019లో జరిగిన ఇండియా ఓపెన్లో ఆంధ్రప్రదేశ్ వెటరన్ స్టార్ రన్నరప్గా నిలిచాడు. నేడు జరిగే ఫైనల్లో ప్రపంచ 65వ ర్యాంకర్ శ్రీకాంత్ చైనాకు చెందిన రెండో సీడ్ లీ షి ఫెంగ్తో తలపడతాడు. -
క్రీడాకారుల మధ్య అనుబంధం ఉండాలి
గచ్చిబౌలి: ఆటగాళ్లకు అభిమానులు అందించే ప్రోత్సాహం, ఉత్సాహం ఎంతో శక్తిని అందిస్తాయని, వీరి మధ్య అనుబంధం ఎప్పటికప్పుడు బలోపేతం అవుతూ ఉండాలని ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్, అర్జున అవార్డ్ గ్రహీత పుల్లెల గోపీచంద్ అన్నారు. భారత బ్యాడ్మింటన్ ఆటగాళ్లను, అభిమానులను ఒకే వేదికపైకి తీసుకొచ్చే ‘ఫ్యాన్ లీ’ యాప్ ను గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శుక్రవారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ డిజిటల్ యుగంలో క్రీడాకారులపై సానుకూల ప్రభావాన్ని చూపించే విధంగా అభిమానులకు ఆరోగ్యకరమైన సమాచారాన్ని అందించే డిజిటల్ వేదికల అవసరం ఎంతైనా ఉందన్నారు. ‘బ్యాడ్మింటన్ ఇండియా’ పేరుతో దేశంలోని అగ్రశ్రేణి ఆటగాళ్లు, యువ ప్రతిభావంతులు, అభిమానులను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకురావడం అనే ఆలోచనను అభినందించారు. సోషల్ మీడియా యుగంలో ఆటగాళ్లతో అభిమానుల సత్సంబంధాలు ఉండాలని, ట్రోలింగ్స్ వంటివి దూరం కావాలని ఆకాంక్షించారు. ఈ ఆవిష్కరణలో ఫ్యాన్లీ సహ వ్యవస్థాపకులు శ్రీనివాసన్ బాబు, శరవణన్ కనగరాజు, శ్రీదేవి సిరాలతో పాటు రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
గార్సియా గుడ్బై.. అదే లాస్ట్
పారిస్: డబుల్స్లో రెండుసార్లు సొంతగడ్డపై ఫ్రెంచ్ ఓపెన్ డబుల్స్ టైటిల్ గెలిచిన ఫ్రాన్స్ మహిళా టెన్నిస్ స్టార్ కరోలినా గార్సియా (Caroline Garcia)... తన కెరీర్లో చివరిసారి గ్రాండ్స్లామ్ టోర్నీ ఆడనుంది. ఆదివారం నుంచి మొదలయ్యే టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్లో ఆఖరిసారి బరిలోకి దిగుతున్నానని 31 ఏళ్ల గార్సియా శుక్రవారం ప్రకటించింది.2016లో, 2022లో ఫ్రాన్స్కే చెందిన క్రిస్టినా మ్లాడెనోవిచ్తో కలిసి ఫ్రెంచ్ ఓపెన్లో డబుల్స్ టైటిల్స్ సాధించిన గార్సియాకు సింగిల్స్ అంతగా కలిసి రాలేదు. వరుసగా 14వసారి ఫ్రెంచ్ ఓపెన్లో ఆడుతున్న గార్సియా 2017లో క్వార్టర్ ఫైనల్ చేరుకొని తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. కెరీర్ మొత్తంలో 51 గ్రాండ్స్లామ్ టోర్నిలలో సింగిల్స్ విభాగంలో ఆడిన గార్సియా ఒక్కసారి మాత్రమే సెమీఫైనల్ దశకు (2022 యూఎస్ ఓపెన్) చేరుకోగలిగింది. 2018లో కెరీర్ అత్యుత్తమ ర్యాంక్ నాలుగో స్థానాన్ని అందుకున్న గార్సియా 2022లో కాలి గాయంతో కొంతకాలం ఆటకు దూరమైంది. ఈ గాయం నుంచి తేరుకున్నాక గార్సియా అదే ఏడాది నాలుగు టైటిల్స్ సొంతం చేసుకోవడం విశేషం.‘వీడ్కోలు పలికే సమయం వచ్చేసింది. 15 ఏళ్లుగా అత్యున్నత స్థాయిలో నిర్విరామంగా ఆడుతున్నాను. గత 25 ఏళ్లుగా ప్రతి క్షణం టెన్నిస్కే అంకితం చేశాను. ఇప్పుడు టెన్నిస్కు స్వస్తి చెప్పి కొత్త అధ్యాయం మొదలు పెట్టేందుకు సిద్ధమవుతున్నాను. ఫ్రెంచ్ ఓపెన్ (French Open) తర్వాత ఒకట్రెండు టోర్నిలు ఆడి ఆటకు గుడ్బై చెబుతాను’ అని గార్సియా తెలిపింది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్లో 145వ స్థానంలో ఉన్న గార్సియా ఫ్రెంచ్ ఓపెన్ తొలి రౌండ్లో బెర్నార్డా పెరాతో ఆడుతుంది. చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్11- కెరీర్లో గార్సియా సాధించిన సింగిల్స్ టైటిల్స్. 8- కెరీర్లో గార్సియా నెగ్గిన డబుల్స్ టైటిల్స్ 35- ఓవరాల్గా సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో గార్సియా ఫైనల్ చేరిన టోర్నిల సంఖ్య 471- సింగిల్స్లో గార్సియా గెలిచిన మ్యాచ్లు.Dear tennis,It’s time to say goodbye.After 15 years competing at the highest level, and more than 25 years putting pretty much every second of my life into it, I feel ready to start a new chapter.My tennis journey hasn’t always been easy. Since my early days, tennis has been… pic.twitter.com/6OLuSU4Se3— Caroline Garcia (@CaroGarcia) May 23, 2025 -
నీరజ్ చోప్రాకు రెండో స్థానం
చోర్జో (పోలాండ్): ఈ సీజన్లో తాను పాల్గొన్న రెండో ఈవెంట్లోనూ భారత స్టార్ జావెలిన్ త్రోయర్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. శుక్రవారం జరిగిన జానుస్ కుసోన్స్కీ స్మారక అథ్లెటిక్స్ మీట్లో నీరజ్ చోప్రా చివరిదైన ఆరో ప్రయత్నంలో తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. 27 ఏళ్ల నీరజ్ చివరి ప్రయత్నంలో జావెలిన్ను 84.14 మీటర్ల దూరం విసిరి మూడో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకాడు. ఈనెల 16న జరిగిన దోహా డైమండ్ లీగ్ మీట్లోనూ నీరజ్ రెండో స్థానాన్ని సాధించాడు. దోహా డైమండ్ లీగ్ మీట్లో అగ్రస్థానంలో నిలిచిన జూలియన్ వెబెర్ (జర్మనీ) అదే జోరును ఇక్కడా కొనసాగించాడు. జూలియన్ వెబెర్ జావెలిన్ను 86.12 దూరం విసిరి తొలి స్థానాన్ని పొందగా... రెండుసార్లు ప్రపంచ చాంపియన్ అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా; 83.24 మీటర్లు) మూడో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. తొలి ప్రయత్నంలో ఫౌల్ చేసిన నీరజ్ రెండో ప్రయత్నంలో జావెలిన్ను 81.28 మీటర్ల దూరం విసిరాడు. ఆ తర్వాత మూడు, నాలుగు ప్రయత్నాల్లో ఫౌల్ చేసిన నీరజ్ ఐదో ప్రయత్నంలో జావెలిన్ను 81.80 మీటర్ల దూరం విసిరాడు. ఆ తర్వాత చివరి ప్రయత్నంలో తన ప్రదర్శనను మరింత మెరుగుపర్చుకొని రెండో స్థానాన్ని ఖరారు చేసుకున్నాడు. -
14 నెలల తర్వాత...
కౌలాలంపూర్: ఎట్టకేలకు భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేశాడు. మలేసియా ఓపెన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో 32 ఏళ్ల శ్రీకాంత్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 65వ ర్యాంకర్ శ్రీకాంత్ 24–22, 17–21, 22–20తో ప్రపంచ 18వ ర్యాంకర్ టోమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. 74 నిమిషాలపాటు హోరాహోరీగా జరిగిన పోరులో శ్రీకాంత్ కీలకదశలో చెలరేగి తుది ఫలితాన్ని శాసించాడు. నిర్ణాయక మూడో గేమ్లో శ్రీకాంత్ ఒకదశలో 7–11తో వెనుకబడ్డాడు. కానీ సంయమనం కోల్పోకుండా తన అనుభవాన్నంతా రంగరించి పోరాడిన శ్రీకాంత్ 14–14తో స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత 16–14తో ఆధిక్యంలోకి వెళ్లిన శ్రీకాంత్ అదే జోరును కొనసాగించి 20–17తో విజయం అంచుల్లో నిలిచాడు. అయితే పొపోవ్ వరుసగా మూడు పాయింట్లు నెగ్గి స్కోరును 20–20తో సమం చేశాడు. కానీ శ్రీకాంత్ మరో అవకాశం ఇవ్వకుండా వరుసగా రెండు పాయింట్లు నెగ్గి గేమ్తోపాటు మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. 2024 మార్చిలో స్విస్ ఓపెన్లో చివరిసారి శ్రీకాంత్ సెమీఫైనల్ చేరుకున్నాడు. ఆ తర్వాత శ్రీకాంత్ 14 అంతర్జాతీయ టోర్నీల్లో పోటీపడ్డా క్వార్టర్ ఫైనల్ దశను దాటి ముందుకెళ్లలేకపోయాడు. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ 23వ ర్యాంకర్ యుషి తనాకా (జపాన్)తో శ్రీకాంత్ తలపడతాడు. మరోవైపు మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల (భారత్) జోడీ పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో తనీషా–ధ్రువ్ ద్వయం 22–24, 13–21తో జియాంగ్ జెన్ బాంగ్–వె యా జిన్ (చైనా) జోడీ చేతిలో ఓడిపోయింది. -
హాకీ ఇండియా లీగ్.. పాకిస్తాన్ ఆడుతుందా?
నోయిడా: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) 2026 సీజన్ వచ్చే ఏడాది జనవరి 5న ప్రారంభం కానుంది. ఈ మేరకు హాకీ ఇండియా (హెచ్ఐ) కార్యదర్శి భోళానాథ్ సింగ్ వివరాలు వెల్లడించారు. ఏడేళ్ల విరామం తర్వాత గతేడాది తిరిగి నిర్వహించిన హెచ్ఐఎల్కు మంచి ఆదరణ లభించగా ఈసారి మహిళల లీగ్లో మరో రెండు జట్లను పెంచనున్నట్లు భోళానాథ్ తెలిపారు. ‘హెచ్ఐఎల్ (HIL 2026) వచ్చే సీజన్ తేదీలు ఖరారయ్యాయి. పురుషుల విభాగంలో 8 ఫ్రాంఛైజీలు యథావిథిగా పాల్గొంటుండగా... మహిళల విభాగంలో గత సీజన్లో పాల్గొన్న నాలుగు జట్లతో పాటు మరో రెండు జట్లు అదనంగా చేరనున్నాయి. వేదిక ఇంకా ఖరారు కాలేదు. విదేశీ ఆటగాళ్ల వెసులుబాటుకు తగ్గట్లే షెడ్యూల్ను జనవరి 5 నుంచి ప్రారంభిస్తున్నాం’ అని భోళానాథ్ వెల్లడించారు.ఇక గత సీజన్కు సంబంధించి కొంత మంది ప్లేయర్లకు డబ్బులు చెల్లించలేదనే వార్తల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు. ఫ్రాంఛైజీలన్నీ హెచ్ఐఎల్ నియమావళిని పాటిస్తున్నాయని తెలిపారు. హాకీ ప్లేయర్లు (Hockey Players) చదువు కొనసాగించేందుకు వీలుగా అమిటీ యూనివర్సిటీతో హాకీ ఇండియా ఎంఓయూ కుదుర్చుకుంది. దీని ద్వారా ప్లేయర్లు ఎక్కడి నుంచి అయినా ఆన్లైన్ ద్వారా తమ చదువు కొనసాగించే అవకాశం దక్కింది.కేంద్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం మరోవైపు భారత్ వేదికగా ఈ ఏడాది చివర్లో జరగనున్న ఆసియా కప్ హాకీ (Asia Cup Hockey) టోర్నమెంట్లో పాకిస్తాన్ పాల్గొనే అంశంలో తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వానిదే అని హాకీ ఇండియా వెల్లడించింది. ప్రభుత్వం సూచనల మేరకే నడుచుకుంటామని వెల్లడించింది. చదవండి: ప్రొ హాకీ లీగ్కు భారత్ జట్టు ప్రకటన -
ప్రొ హాకీ లీగ్కు భారత జట్టు ప్రకటన
న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరగనున్న ఎఫ్ఐహెచ్ హాకీ ప్రొ లీగ్ యూరప్ అంచె పోటీల కోసం హాకీ ఇండియా (హెచ్ఐ) జట్టును ప్రకటించింది. జూన్ 7 నుంచి యూరప్లోని అమ్స్టెల్వీన్, నెదర్లాండ్స్, అంట్వెర్ప్, బెల్జియంలో భారత పురుషుల హాకీ జట్టు మ్యాచ్లు ఆడనుంది. దీని కోసం గురువారం 24 మందితో కూడిన జట్టును ప్రకటించింది. జూన్ 7, 9న నెదర్లాండ్స్తో, 11, 12న అర్జెంటీనాతో టీమిండియా తపలడుతుంది. ఆ తర్వాత 14, 15న ఆ్రస్టేలియాతో, 21, 22న బెల్జియంతో మ్యాచ్లు ఆడుతుంది. ఈ ఏడాది ఆరంభంలో భువనేశ్వర్ వేదికగా జరిగిన హాకీ ప్రొ లీగ్ అంచె పోటీల్లో 8 మ్యాచ్లాడిన భారత్ 5 విజయాలతో 15 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ‘అనుభవజు్ఞలు, యువ ఆటగాళ్లతో జట్టు సమతూకంగా ఉంది. ప్లేయర్లంతా బాగా సాధన చేశారు. హాకీ ప్రపంచకప్నకు అర్హత సాధించే నేపథ్యంలో... ప్రతి పాయింట్ కీలకం కావడంతో అన్నీ మ్యాచ్ల్లో విజయాలు సాధించేందుకు ప్రయత్నిస్తాం. పెనాల్టీ కార్నర్లను సది్వనియోగం చేసుకునే అంశంలో మరింత దృష్టిపెట్టాం’అని భారత హెడ్ కోచ్ క్రెయిగ్ ఫాల్టన్ అన్నాడు. పరాజయాలను ‘డ్రాలుగా... ‘డ్రా’లను విజయాలుగా మలచడమే లక్ష్యంగా ఉన్నామన్నాడు. భారత పురుషుల హాకీ జట్టు గోల్కీపర్స్: కృషన్ బహదూర్ పాఠక్, సూరజ్, డిఫెండర్స్: సుమిత్, అమిత్ రొహిదాస్, జుగ్రాజ్ సంగ్, నీలమ్ సంజీప్, హర్మన్ప్రీత్ సింగ్, జర్మన్ప్రీత్ సింగ్, సంజయ్, యశ్దీప్ సివాచ్, మిడ్ఫీల్డర్స్: రాజ్ కుమార్ పాల్, నీలకంఠ శర్మ, హార్దిక్ సింగ్, రాజిందర్ సింగ్, మన్ప్రీత్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్, శంషేర్ సింగ్, ఫార్వర్డ్స్: గుర్జాంత్ సింగ్, అభిషేక్, శైలానంద్ లక్రా, మన్దీప్ సింగ్, లలిత్ కుమార్ ఉపాధ్యాయ్, దిల్ప్రీత్ సింగ్, సుఖ్జీత్ సింగ్. -
పతకమే లక్ష్యంగా...
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యర్రాజి ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్ కోసం ముమ్మరంగా సాధన చేస్తోంది. ఈ నెల 27 నుంచి 31 వరకు దక్షిణ కొరియాలో జరగనున్న ఈ టోర్నీ మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో జ్యోతి డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగనుంది. 2023లో బ్యాంకాక్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో తెలుగమ్మాయి స్వర్ణం సాధించింది. 2024 పారిస్ ఒలింపిక్స్లో నిరాశజనక ప్రదర్శన తర్వాత గాయాల నుంచి కోలుకున్న 25 ఏళ్ల జ్యోతి పూర్తి స్థాయిలో సత్తా చాటేందుకు తన టెక్నిక్లో మార్పులు చేసుకొని పాత పద్ధతిలోనే ప్రాక్టీస్ చేస్తున్నట్లు వెల్లడించింది. ‘పారిస్ విశ్వక్రీడల కోసం ‘సెవెన్ స్ట్రయిడ్’ టెక్నిక్ ప్రయత్నించాను. కానీ అది నాకు ఉపయోగపడలేదు. దాని వల్ల రెండుసార్లు గాయపడ్డా. అందుకే పాత పద్దతైన ‘ఎయిట్ స్ట్రయిడ్’లోనే పరుగెత్తాలని నిర్ణయించుకున్నా. గాయాల బారిన పడకుండా ఉంటే 13 సెకన్ల లోపే లక్ష్యాన్ని చేరుతాననే నమ్మకముంది’ అని జ్యోతి చెప్పింది. హర్డిల్స్ మధ్య అడుగుల వ్యూహాన్ని స్ట్రయిడ్ అంటారు. 100 మీటర్ల హర్డిల్స్లో జాతీయ రికార్డు (12.78 సెకన్లు) కలిగిన జ్యోతి... గత ఆసియా చాంపియన్షిప్ 200 మీటర్ల పరుగులో రజత పతకం కూడా నెగ్గింది. ఈ క్రీడల్లో పాల్గొనేందుకు 59 మందితో కూడిన భారత అథ్లెట్ల బృందం గురువారం దక్షిణ కొరియాకు బయల్దేరింది. -
క్వార్టర్ఫైనల్లో శ్రీకాంత్
కౌలాలంపూర్: తొలి రౌండ్లో మెరుగైన ర్యాంకింగ్ ప్లేయర్లపై రాణించిన భారత షట్లర్లకు ప్రిక్వార్టర్స్లో మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మలేసియా ఓపెన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా, హెచ్.ఎస్.ప్రణయ్, ఆయుశ్ శెట్టి, సతీశ్ కుమార్ కరుణాకరన్లకు పరాజయం ఎదురైంది. మిక్స్డ్ డబుల్స్లో ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో జోడీ క్వార్టర్స్ చేరగా... మహిళల డబుల్స్లో ప్రేరణ అల్వేకర్–మృణ్మయి దేశ్పాండేలకు నిరాశ ఎదురైంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రేరణ–మృణ్మయి జంట 9–21, 14–21తో సూ యిన్ హుయ్–లిన్ జి యున్ (చైనీస్ తైపీ) జంట చేతిలో పరాజయం చవిచూసింది. మిక్స్డ్ డబుల్స్లో తనీషా–ధ్రువ్ కపిల జోడీ 21–17, 18–21, 21–15తో ఫ్రాన్స్కు చెందినలీ పాలెర్మో–జులియెన్ మైమో జంటపై గెలిచింది. శ్రీకాంత్ వరుస గేముల్లో... పురుషుల సింగిల్స్లో ఒక్క శ్రీకాంత్ మాత్రమే ముందంజ వేశాడు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 65వ ర్యాంక్ ప్లేయర్ శ్రీకాంత్ 23–21, 21–17తో తనకన్నా మెరుగైన 33వ ర్యాంకర్ ఎన్హట్ ఎన్గుయెన్ (ఐర్లాండ్)పై వరుస గేముల్లో విజయం సాధించాడు. ఈ రెండు గేములు గెలిచేందుకు శ్రీకాంత్ 59 నిమిషాలు పాటు చెమటోడ్చాడు. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ ఫ్రాన్స్కు చెందిన తొమా పొపొవ్తో తలపడతాడు. మిగతా పురుషుల సింగిల్ పోటీల్లో సతీశ్ కరుణాకరన్ 14–21, 16–21తో క్రిస్టో పొపొవ్ (ఫ్రాన్స్) చేతిలో పరాజయం చవిచూశాడు. ఆశించిన స్థాయి ఆటతీరు కనబరచలేకపోయిన ప్రణయ్ 9–21, 18–21తో వరుస గేముల్లో యుషి తనక (జపాన్) చేతిలో కంగుతినగా... ఆయుశ్ శెట్టి 13–21, 17–21తో తొమ పొపొవ్ ధాటికి నిలువలేకపోయాడు. -
అతడి బాటలో నడుస్తా.. ప్రొఫెషనల్గా సిమ్రన్జీత్ కౌర్
న్యూఢిల్లీ: భారత మహిళా బాక్సర్ సిమ్రన్జీత్ కౌర్ ప్రొఫెషనల్గా మారనుంది. ప్రపంచ చాంపియన్షిప్లో కాంస్యం నెగ్గిన 29 ఏళ్ల సిమ్రన్జీత్ కౌర్ (Simranjeet Kaur)... అమెరికా మాజీ బాక్సర్ రాయ్ జోన్స్, భారత బాక్సర్ మన్దీప్ జాంగ్రాతో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది భారత్ నుంచి నిశాంత్ దేవ్, అమిత్ పంఘాల్ ప్రొఫెషనల్గా మారగా... ఇప్పుడు ఆ జాబితాలో సిమ్రన్జీత్ కూడా చేరింది.కాగా 2020 టోక్యో ఒలింపిక్స్లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన సిమ్రన్జీత్... ఆసియా చాంపియన్షిప్స్లో పలు పతకాలు నెగ్గింది. ఈ ఏడాది జాతీయ చాంపియన్షిప్ 65 కేజీల విభాగంలో రెండో స్థానంలో నిలిచిన కౌర్... అమెచ్యూర్ బాక్సింగ్ నుంచి ప్రొఫెషనల్గా మారాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది.అతడి బాటలోనే నడుస్తూ‘ప్రొఫెషనల్ కెరీర్ ప్రారంభించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. మన్దీప్ జాంగ్రా ఇప్పటికే దేశం గర్వపడే విజయాలు సాధించారు. అతడి బాటలోనే నడుస్తూ మెరుగైన ఫలితాలు సాధించేందుకు నావంతు ప్రయత్నం చేస్తా. ఈ ప్రయాణంలో రాయ్ జోన్స్ సహకారం మరవలేను’ అని సిమ్రన్జీత్ పేర్కొంది. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో కాంస్యం నెగ్గిన భారత బాక్సర్ విజేందర్ సింగ్... దేశం నుంచి తొలి ప్రొఫెషనల్ బాక్సర్గా మారగా... ఆ తర్వాత వికాస్ కృషన్, సరితా దేవి, నీరజ్ గోయత్ వంటి పలువురు బాక్సర్లు ప్రొఫెషనల్స్గా మారారు. కాగా పంజాబ్ నుంచి తొలి మహిళా ప్రొఫెషనల్ బాక్సర్గా సిమ్రన్ నిలవనుండటం విశేషం. భారత జట్టు పసిడి బోణీన్యూఢిల్లీ: జూనియర్ ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో భారత జట్టు పసిడి బోణీ కొట్టింది. జర్మనీ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో హరియాణాకు చెందిన యువ షూటర్ కనక్ స్వర్ణ పతకంతో మెరిసింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో బుధవారం 17 ఏళ్ల కనక్ 239 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. 8 మంది షూటర్లు పాల్గొన్న 24 షాట్ల తుదిపోరులో కనక్ తన గురితో అదరగొట్టింది.‘ఆరంభంలో కాస్త ఒత్తిడికి లోనయ్యా. కానీ ఆ తర్వాత మెరుగైన ప్రదర్శన చేయడం ఆనందంగా ఉంది.’ అని కనక్ వెల్లడించింది. మాల్దోవాకు చెందిన అన్నా డుల్స్ 1.7 పాయింట్ల తేడాతో రెండో స్థానంలో నిలిచి రజతం దక్కించుకోగా... చెన్ యెన్ చింగ్ (చైనీస్ తైపీ) కాంస్యం గెలుచుకుంది. అంతకుముందు జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్లో భారత్ నుంచి ఇద్దరు షూటర్లు ఫైనల్కు అర్హత సాధించారు. కనక్ 571 పాయింట్లతో, ప్రాచి 572 పాయింట్లతో తుదిపోరుకు చేరారు. -
సంచలనాల మోత
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారులు అదర గొట్టారు. తొలి రౌండ్లో నలుగురు భారత ప్లేయర్లు కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్, సతీశ్ కుమార్ కరుణాకరన్, ఆయుశ్ శెట్టి తమకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న ఆటగాళ్లను బోల్తా కొట్టించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఈ సీజన్లో ఫామ్లో లేని ప్రపంచ మాజీ నంబర్వన్, ప్రస్తుత 65వ ర్యాంకర్ శ్రీకాంత్ 23–21, 13–21, 21–11తో ప్రపంచ 13వ ర్యాంకర్ లు గ్వాంగ్ జు (చైనా)ను ఓడించాడు. మరో మ్యాచ్లో ప్రపంచ 35వ ర్యాంకర్ ప్రణయ్ 19–21, 21–17, 21–16తో ప్రపంచ 12వ ర్యాంకర్ కెంటా నిషిమోటో (జపాన్)పై సంచలన విజయం సాధించాడు. ప్రపంచ 51వ ర్యాంకర్ సతీశ్ కుమార్ కరుణాకరన్ 21–13, 21–14తో ప్రపంచ 9వ ర్యాంకర్ చౌ టియెన్ చెన్ (చైనీస్ తైపీ)ను కంగుతినిపించాడు. ప్రపంచ 41వ ర్యాంకర్ ఆయుశ్ శెట్టి 20–22, 21–10, 21–8తో ప్రపంచ 30వ ర్యాంకర్ బ్రియాన్ యాంగ్ (కెనడా)పై గెలుపొందాడు.అయితే భారత్కే చెందిన ప్రపంచ 34వ ర్యాంకర్ ప్రియాన్షు రజావత్కు నిరాశ ఎదురైంది. ప్రియాన్షు 15–21, 17–21తో జియా హెంగ్ జేసన్ టెహ్ (సింగపూర్) చేతిలో ఓడిపోయాడు. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్లో క్రిస్టో పొపోవ్ (ఫ్రాన్స్)తో సతీశ్; యుషి టనాకా (జపాన్)తో ప్రణయ్; ఎన్హట్ ఎన్గుయెన్ (ఐర్లాండ్)తో శ్రీకాంత్; తొమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్)తో ఆయుశ్ శెట్టి తలపడతారు. సింధుకు నిరాశ మహిళల సింగిల్స్ విభాగంలో భారత్కు నిరాశాజనక ఫలితాలు వచ్చాయి. బరిలో ఉన్న నలుగురు క్రీడాకారిణులు పీవీ సింధు, ఉన్నతి హుడా, ఆకర్షి కశ్యప్, మాళవిక తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. ప్రపంచ 16వ ర్యాంకర్ సింధు 11–21, 21–14, 15–21తో ప్రపంచ 26వ ర్యాంకర్ థుయ్ లిన్ ఎన్గుయెన్ (వియత్నాం) చేతిలో ఓడిపోయింది. ఇతర మ్యాచ్ల్లో ఉన్నతి 12–21, 20–22తో లిన్ సియాంగ్ టి (చైనీస్ తైపీ) చేతిలో, ఆకర్షి 9–21, 8–21తో పుత్రి కుసుమ వర్థిని (ఇండోనేసియా) చేతిలో, మాళవిక 21–19, 18–21, 8–21తో చియు పిన్ చియాన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి పాలయ్యారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో గద్దె రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్) జోడీ 10–21, 14–21తో గువో జిన్ వా–చెన్ ఫాంగ్ హుయ్ (చైనా) జంట చేతిలో ఓడిపోగా... తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల (భారత్) ద్వయం 21–18, 15–21, 21–14తో అద్నాన్–సారి జమాల్ (ఇండోనేసియా) జోడీపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. పురుషుల డబుల్స్లో పృథ్వీ కృష్ణమూర్తి రాయ్–సాయిప్రతీక్; హరిహరన్–రూబన్ కుమార్ (భారత్) జోడీలు తొలి రౌండ్లోనే ఓడిపోయాయి. -
శ్రీకాంత్ ముందంజ
కౌలాలంపూర్: ఈ ఏడాది ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న ప్రపంచ మాజీ నంబర్వన్, భారత అగ్రశ్రేణి షట్లర్ కిడాంబి శ్రీకాంత్ మళ్లీ ఫామ్లోకి వచ్చేందుకు కష్టపడుతున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం మొదలైన మలేసియా ఓపెన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో శ్రీకాంత్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. క్వాలిఫయింగ్ దశలో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ గెలిచిన శ్రీకాంత్ మెయిన్ ‘డ్రా’లోకి అడుగు పెట్టాడు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్లో 65వ స్థానంలో ఉన్న శ్రీకాంత్ తొలి రౌండ్లో 21–8, 21–13తో కువో కువాన్ లిన్ (చైనీస్ తైపీ)పై గెలుపొందాడు. అనంతరం రెండో రౌండ్లో 9–21, 21–12, 21–6తో హువాంగ్ యి కాయ్ (చైనీస్ తైపీ)పై నెగ్గి క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లోకి ప్రవేశించాడు. మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో ఆరో సీడ్, చైనా ప్లేయర్ లు గ్వాంగ్ జుతో శ్రీకాంత్ తలపడతాడు. 2021 ప్రపంచ చాంపియన్షిప్లో కాంస్య పతకం నెగ్గిన 32 ఏళ్ల శ్రీకాంత్ ఈ ఏడాది ఎనిమిది టోర్నీల్లో ఆడినా ఏ టోర్నీలోనూ క్వార్టర్ ఫైనల్ దాటి ముందుకెళ్లలేకపోయాడు. మరోవైపు గతవారం థాయ్లాండ్ ఓపెన్లో ప్రిక్వార్టర్ ఫైనల్ వరకు దూసుకెళ్లిన హైదరాబాద్ ప్లేయర్ తరుణ్ మన్నెపల్లికి ఈ టోర్నీలో నిరాశ ఎదురైంది. క్వాలిఫయింగ్ తొలి రౌండ్లోనే తరుణ్ వెనుదిరిగాడు. తరుణ్ 13–21, 21–23తో పనిత్చఫోన్ తీరారత్సకుల్ (థాయ్లాండ్) చేతిలో ఓడిపోయాడు. భారత్కే చెందిన మరో ప్లేయర్ శంకర్ ముత్తుస్వామి 20–22, 20–22తో జు జువాన్ చెన్ (చైనా) చేతిలో ఓటమి చవిచూశాడు. మహిళల సింగిల్స్లో భారత రైజింగ్ స్టార్ అన్మోల్ ఖరబ్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లోనే ని్రష్కమించింది. అన్మోల్ 14–21, 18–21తో హుంగ్ యి టింగ్ (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం పాలైంది. మిక్స్డ్ డబుల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో మోహిత్–లక్షిత జగ్లాన్ ద్వయం 15–21, 16–21తో మింగ్ యాప్ టూ–లీ యు షాన్ (చైనీస్ తైపీ) జంట చేతిలో ఓడిపోయింది. అన్ని విభాగాల్లో మెయిన్ ‘డ్రా’ మ్యాచ్లు నేడు మొదలవుతాయి. -
వ్యభిచారం కేసులో ఒలింపిక్ చాంపియన్ అరెస్టు
కొలంబస్: అమెరికా స్టార్ రెజ్లర్ కైల్ స్నైడర్ వ్యభిచారం కేసులో అరెస్టయ్యాడు. 20 ఏళ్ల వయసులో రియో ఒలింపిక్స్ (2016)లో ఫ్రీస్టయిల్ 97 కేజీల విభాగంలో స్వర్ణ పతకం గెలిచిన స్నైడర్ టోక్యో ఒలింపిక్స్ (2020)లో రజత పతకం సాధించాడు. పిన్నవయసులో అమెరికా రెజ్లింగ్ చాంపియన్గా ఘనతకెక్కిన స్నైడర్ను వ్యభిచారం కేసులో ఈ నెల 9న అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో స్నైడర్ హోటల్ గదిలో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. 29 ఏళ్ల స్నైడర్ను తాజాగా కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి అతనికి 250 అమెరికన్ డాలర్లు (రూ. 21,386) జరిమానా విధించడంతో పాటు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి కోసం ఒక రోజంతా పని చేయాలని ఆదేశించారు. తీర్పు అనంతరం తన తప్పుపట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేసిన రెజ్లర్ ఇకపై సరైన నిర్ణయాలతో జీవితాన్ని కొనసాగిస్తానని, తన తప్పువల్ల కుటుంబం పడిన వేదన తనకు అర్థమైందని వాపోయాడు. అతని భార్య మ్యాడీ ఫుట్బాల్ ప్లేయర్! రెండు వరుస ఒలింపిక్స్లో పతకాలు గెలిచిన స్నైడర్ గతేడాది పారిస్ ఒలింపిక్స్లో కాంస్య పతక పోరులో ఓడి నాలుగో స్థానంలో నిలిచాడు. ప్రపంచ చాంపియన్షిప్లో స్నైడర్ మూడు స్వర్ణ పతకాలు (2015, 2017, 2022), రెండు రజత పతకాలు (2018, 2021), రెండు కాంస్య పతకాలు (2019, 2023) సాధించాడు. అమెరికాలోని నేషనల్ కాలేజ్ అథ్లెటిక్ అసోసియేషన్ (ఎన్సీఏఏ) క్రీడల్లో మూడుసార్లు చాంపియన్గా నిలిచాడు. ఓవరాల్గా తన 12 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో స్నైడర్ 30 స్వర్ణ పతకాలు, 5 రజత పతకాలు, 7 కాంస్య పతకాలు గెలిచాడు. 199 బౌట్లలో నెగ్గి, 21 బౌట్లలో మాత్రమే ఓడిపోయాడు. ఇటీవలే అతను రియల్ అమెరికన్ ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ లీగ్లో పాల్గొనేందుకు కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు. -
సుమిత్ నగాల్ శుభారంభం
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో భారత నంబర్వన్ సుమిత్ నగాల్ శుభారంభం చేశాడు. పారిస్లో మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో ప్రపంచ 170వ ర్యాంకర్ సుమిత్ 6–1, 6–1తో ప్రపంచ 141వ ర్యాంకర్ మిచెల్ క్రుగెర్ (అమెరికా)పై గెలుపొందాడు. 74 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సుమిత్ ఒక ఏస్ సంధించి, ఒక డబుల్ ఫాల్ట్ చేశాడు. తన సర్వీస్ను ఒక్కసారి కూడా కోల్పోని సుమిత్ ప్రత్యర్థి సర్వీస్ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. సుమిత్ నెగ్గిన మొత్తం 59 పాయింట్లలో 22 విన్నర్స్ ఉన్నాయి. 14 అనవసర తప్పిదాలు చేసిన సుమిత్ నెట్ వద్దకు 10 సార్లు దూసుకొచ్చి ఎనిమిది సార్లు పాయింట్లు గెలిచాడు. రెండో రౌండ్లో ప్రపంచ 225వ ర్యాంకర్ జురిజ్ రొడియోనోవ్ (ఆ్రస్టియా)తో సుమిత్ తలపడతాడు. 27 ఏళ్ల సుమిత్ తన కెరీర్లో ఎనిమిదిసార్లు గ్రాండ్స్లామ్ టోర్నీల్లో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. ఆ్రస్టేలియన్ ఓపెన్లో మూడుసార్లు, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్లో ఒక్కోసారి, యూఎస్ ఓపెన్లో మూడుసార్లు అతను మెయిన్ ‘డ్రా’లో పోటీపడ్డాడు. 2020 యూఎస్ ఓపెన్లో, 2024 ఆ్రస్టేలియన్ ఓపెన్లో రెండో రౌండ్కు చేరడం సుమిత్ గ్రాండ్స్లామ్ కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది. -
సోషల్ మీడియా పోస్ట్తో.. రూ. 14 కోట్ల జాబ్ పోయింది
లండన్: ఇంగ్లండ్ మాజీ ఫుట్బాల్ ఆటగాడు, కామెంటేటర్ గ్యారీ లినేకర్ (Gary Lineker) బీబీసీ వ్యాఖ్యాత స్థానం నుంచి వైదొలగనున్నాడు. సామాజిక మాధ్యమాల్లో జియోనిజానికి సంబంధించిన పోస్ట్ పెట్టిన కారణంగా పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్న గ్యారీ... ఇప్పుడు వ్యాఖ్యాతగా తప్పుకోనున్నాడు. మీడియా సెలబ్రిటీగా మంచి పేరున్న 64 ఏళ్ల లినేకర్... అత్యధిక పారితోషికం అందుకుంటున్న బ్రిటిష్ జాతీయ ప్రసారకుడిగా ఉన్నాడు. బీబీసీలో వ్యాఖ్యాతగా అతడు ఏడాదికి దాదాపు 1.7 మిలియన్ల అమెరికా డాలర్లు (రూ. 14 కోట్ల 52 లక్షలు) ప్రతిఫలంగా పొందుతున్నాడు.‘జియోనిజం రెండు నిమిషాల్లో వివరించొచ్చు’ అనే క్యాప్షన్తో కూడిన ఎలుక చిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో లినేకర్పై విమర్శలు గుప్పుమన్నాయి. యూదు వ్యతిరేక భావజాలం కలిగిన ఇలాంటి పోస్టు పెట్టినందుకు లినేకర్ ఇప్పటికే బహిరంగ క్షమాపణలు చెప్పినప్పటికీ... బీబీసీ గౌరవ మర్యాదలకు భంగం కలిగించినందుకు సోషల్ మీడియా పాలసీ (Social Media Policy) ప్రకారం అతడిపై యాజమాన్యం చర్యలు తీసుకుంది. ఇంగ్లండ్ జాతీయ జట్టు తరఫున 80 మ్యాచ్లాడిన లినేకర్... 48 గోల్స్ చేశాడు. 1986 ప్రపంచకప్లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు.చదవండి: భారత టాప్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాపై గగన్ నారంగ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ -
నీరజ్ చోప్రాపై గగన్ నారంగ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్
న్యూఢిల్లీ: భారత టాప్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఇటీవలే 90 మీటర్ల మార్క్ను అధిగమించి ఇకపై మరింత పెద్ద లక్ష్యాలపై దృష్టి పెట్టాడు. తాజా ప్రదర్శనతో నీరజ్పై ఒక పెద్ద భారం దిగిపోయిందని, మున్ముందు అతని నుంచి ఇంకా మెరుగైన ప్రదర్శనను ఆశించవచ్చని భారత మాజీ షూటర్, 2012 లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత గగన్ నారంగ్ (Gagan Narang) అభిప్రాయపడ్డాడు. దోహాలో జరిగిన డైమండ్ లీగ్ పోటీల్లో భాగంగా జావెలిన్ను నీరజ్ 90.23 మీటర్ల దూరం విసిరాడు.‘ఇంత కాలం నీరజ్ తన వీపుపై 90 మీటర్ల లక్ష్యం అనే పెద్ద బరువును మోసుకొని తిరిగాడు. అతని మనసులో కూడా అదే భావనతో ఒత్తిడి పెరిగింది. ఇప్పుడు అదంతా తొలగిపోయింది. ఇకపై మరింత స్వేచ్ఛగా ఆడి ఇంతకంటే మెరుగైన ఆటతీరును ప్రదర్శించేందుకు అవకాశం లభించింది. నేను కూడా ఒక దశలో 600/600 పాయింట్ల కోసం ఎంతో శ్రమించా. 597–599 చాలాసార్లు సాధించినా అసలైన అంకె మాత్రం రాలేదు. ఎట్టకేలకు దానిని అందుకున్న తర్వాత స్వేచ్ఛ లభించినట్లయింది’ అని గగన్ అన్నాడు. నీరజ్ చోప్రా (Neeraj Chopra) సాధించిన ఘనతలు కేవలం దూరానికి సంబంధించినవి మాత్రమే కాదని, అంతర్జాతీయ వేదికలపై అతని స్థాయిని చూపించాయని గగన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.‘దోహాలో నీరజ్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. అతను సాధించిన చాలా పెద్ద ఘనత. అయితే దీనిని కేవలం 90 మీటర్ల దూరం అనే లెక్కల్లోనే చూడవద్దు. భారత అథ్లెటిక్స్కు సంబంధించి అతను చరిత్రను తిరగరాస్తున్నాడు. ఒక తరం మొత్తానికి స్ఫూర్తిగా నిలిచాడు. సీజన్లో ఇది తొలి టోర్నీ మాత్రమే. మున్ముందు చాలా పోటీలు ఉన్నాయి. కాబట్టి మైలురాయిని దాటడమే కాదు సరైన సమయంలో సరైన ఫలితం సాధించడం కూడా ముఖ్యం’ అని ఈ హైదరాబాదీ షూటర్ వ్యాఖ్యానించాడు.మరోవైపు షూటింగ్ లీగ్ నిర్వహించాలనే ఆలోచన పట్ల అతను సానుకూలంగా స్పందించాడు. ‘చాలా కాలంగా దీని గురించి చర్చ సాగింది. మన షూటర్లు జర్మనీలోని బుండెస్లీగాలో ఆడేందుకు వెళుతుంటారు. ఇప్పుడు మనకూ ఒక లీగ్ ఉంటుంది. ప్రతీ జట్టులో సీనియర్, యూత్, జూనియర్ ఆటగాళ్లు ఉండటం షూటింగ్కు మేలు చేస్తుంది. లీగ్ నిర్వహణకు ఇది సరైన సమయం కూడా’ అని గగన్ నారంగ్ విశ్లేషించాడు.చదవండి: PKL వేలం.. అతడిపై కన్నేసిన ఫ్రాంఛైజీలు.. రిటెన్షన్ జాబితా ఇదే -
PKL వేలం.. అతడిపై కన్నేసిన ఫ్రాంఛైజీలు.. రిటెన్షన్ జాబితా ఇదే
ఐపీఎల్ తర్వాత ప్రేక్షకాదరణలో రెండో స్థానంలో నిలిచిన ప్రొ కబడ్డీ లీగ్ (PKL) 12వ సీజన్కు ముందు ఆటగాళ్ల వేలం ప్రక్రియకు నిర్వాహకులు సర్వం సిద్ధం చేస్తున్నారు. దబంగ్ ఢిల్లీ స్టార్ రెయిడర్ నవీన్ కుమార్ (Naveen Kumar) తొలిసారి పీకేఎల్ వేలానికి వచ్చాడు. అతడిపై కన్నేసిన ఫ్రాంఛైజీలుకాగా దబంగ్ ఢిల్లీ (Dabang Delhi) 8వ సీజన్లో విజేతగా నిలిచింది. ఈ ఫ్రాంచైజీ తరఫున ఆరు సీజన్లు ఆడిన నవీన్ 1102 రెయిడింగ్ పాయింట్లు సాధించాడు. అలాంటి ఆటగాడిని ఢిల్లీ వదిలేసుకోవడంతో మిగతా ఫ్రాంచైజీలు అతనిపై కన్నేశాయి.ఇలా విడుదల, అట్టిపెట్టుకున్న ఆటగాళ్లకు సంబంధించిన పూర్తి వివరాలను 12 ఫ్రాంచైజీలు ప్రకటించాయి. అన్ని ఫ్రాంచైజీలు కలిపి 83 మందిని రిటెయిన్ (అట్టిపెట్టుకోవడం) చేసుకున్నాయి. నాలుగు కేటగిరీలుమొత్తం నాలుగు కేటగిరీలుగా ఆటగాళ్లను అట్టిపెట్టుకునే వీలుంది. ఎ, బి, సి, డిగా విభజించిన రిటెయినర్లలో ఎ ఆటగాడికి రూ. 30 లక్షలు, బి ప్లేయర్కు రూ. 20 లక్షలు, సి, డి ఆటగాళ్లకు వరుసగా రూ. 13 లక్షలు, రూ. 9 లక్షలు చెల్లించాల్సివుంటుంది.ఒక్కో ఫ్రాంచైజీ గరిష్ట పరిమితి రూ. 5 కోట్లకు లోబడే రిటెయిన్ మొత్తాన్ని తీసివేయగా మిగిలిన మొత్తంతో ఆటగాళ్లను వేలంలో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ముంబైలో ఈ నెల 31, జూన్ 1 తేదీల్లో రెండు రోజుల పాటు కబడ్డీ ఆటగాళ్ల వేలం పాట జరుగనుంది.ఫ్రాంఛైజీలు అట్టిపెట్టుకున్న ప్లేయర్లుబెంగాల్ వారియర్స్: విశ్వాస్, యశ్ మలిక్, మన్జీత్, దీప్ కుమార్, సుశీల్ కాంబ్రేకర్. బెంగళూరు బుల్స్: చంద్ర నాయక్, లక్కీ కుమార్, మన్జీత్, పంకజ్. దబంగ్ ఢిల్లీ: సందీప్, మోహిత్. గుజరాత్ జెయింట్స్: హిమాన్షు సింగ్, హిమాన్షు, ప్రతీక్ దహియా, రాకేశ్. హరియాణా స్టీలర్స్: రాహుల్ సెప్తాల్, వినయ్, శివమ్ అనీల్, జైదీప్, జయసూర్య, విశాల్ తటే, సాహిల్ మనికందన్, వికాస్ రామదాస్ జాదవ్. జైపూర్ పింక్పాంథర్స్: రెజా మిర్బాఘెరి, అభిషేక్, రోనక్ సింగ్, నితిన్ కుమార్, సోంబిర్, రితిక్ శర్మ. పట్నా పైరేట్స్: హమిద్ మిర్జాయి నదిర్, త్యాగరాజన్ యువరాజ్, సుధాకర్, అయాన్, నవ్దీప్, దీపక్, సాహిల్ పాటిల్. పుణేరి పల్టన్: అభినేశ్, గౌరవ్ ఖత్రి, పంకజ్ మోహితే, అస్లామ్ ముస్తఫా, మోహిత్ గోయత్, దాదాసొ శివాజీ పూజారి, ఆదిత్య తుషార్ షిండే. తమిళ్ తలైవాస్: మొయిన్ షఫాగి, హిమాన్షు, సాగర్, నితేశ్ కుమార్, నరేందర్, రోనక్, విశాల్ చహల్, ఆశిష్, అనూజ్ గవాడే, ధీరజ్ రవీంద్ర బైల్మరే. తెలుగు టైటాన్స్: శంకర్ భీమ్రాజ్, అజిత్ పాండురంగ పవార్, అంకిత్, ప్రఫుల్ జవారే, సాగర్ చేతన్ సాహు, నితిన్, రోహిత్. యు ముంబా: సునీల్ కుమార్, రోహిత్, అమిర్ మొహమ్మద్, సతీశ్ కన్నన్, ముకిలన్ షణ్ముగమ్, అజిత్ చౌహాన్, దీపక్ కుండు, లోకేశ్ గోస్లియా, సన్నీ.యూపీ యోధాస్: సుమిత్, భవానీ రాజ్పుత్, సాహుల్ కుమార్, సురేందర్ గిల్, అషు సింగ్, హితేశ్ గగన గౌడ, శివమ్ చౌదరి, జయేశ్ వికాస్ మహాజన్, గంగారామ్, సచిన్, కేశవ్ కుమార్.చదవండి: Football Tournament: ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. -
టైటిల్ బోణీ చేసేనా?
కౌలాలంపూర్: ఈ ఏడాది స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోతున్న భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు మరో టోరీ్నకి సిద్ధమయ్యారు. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న మలేసియా మాస్టర్స్ వరల్డ్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గత కొంత కాలంగా లయ దొరకబుచ్చుకోలేక ఇబ్బంది పడుతున్న స్టార్ షట్లర్లు పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్ ఈసారైనా మెరుగైన ప్రదర్శన చేయాలని భావిస్తున్నారు. గత నెల సుదిర్మన్ కప్లో భాగంగా ఇండోనేసియా, డెన్మార్క్ చేతిలో ఓడిన ఈ ఇద్దరు తిరిగి సత్తా చాటాలని భావిస్తున్నారు. ఒలింపిక్స్ క్రీడల్లో రెండు పతకాలు సాధించిన సింధు ప్రస్తుతం ప్రపంచ 16వ ర్యాంక్లో కొనసాగుతోంది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 27వ ర్యాంకర్ నుగుయెన్ థుయ్ లిన్ (వియత్నాం)తో సింధు తలపడుతుంది. పురుషుల సింగిల్స్లో ఐదో సీడ్ కెంటా నిషిమోటో (జపాన్)తో 35వ ర్యాంకర్ ప్రణయ్ అమీతుమీ తేల్చుకోనున్నాడు. మూడో సీడ్ చౌ టైన్ చెన్ (చైనీస్ తైపీ)తో సతీశ్ కుమార్ కరుణాకరన్, బ్రియాన్ యంగ్ (కెనడా)తో ఆయుశ్ శెట్టి, జియా హెంగ్ జాసన్ (సింగపూర్)తో ప్రియాన్షు రజావత్ తలపడనున్నారు. మహిళల సింగిల్స్లో సింధుతో పాటు ఉన్నతి హూడా, ఆకర్షి కశ్యప్, మాళవిక బన్సోద్ పోటీ పడుతున్నారు. పురుషుల డబుల్స్లో సాయి ప్రతీక్–పృథ్వీ కృష్ణమూర్తి, హరిహరన్–రూబన్ కుమార్ బరిలో ఉన్నారు. మహిళల డబుల్స్లో నాలుగు జోడీలు పోటీలో ఉన్నాయి. మిక్స్డ్ డబుల్స్లో రుతి్వక శివాని–రోహన్ కపూర్, ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో, అషిత్ సూర్య–అమృత, ఆద్య–సతీశ్ కుమార్ బరిలో దిగనున్నారు. ఇక ప్రధాన పోటీలకు ముందు జరగనున్న క్వాలిఫయింగ్ టోర్నీ పురుషుల విభాగంలో ప్రపంచ మాజీ నంబర్వన్ కిడాంబి శ్రీకాంత్తో పాటు శంకర్ ముత్తుస్వామి, తరుణ్ మన్నెపల్లి మంగళవారం బరిలోకి దిగనున్నారు. మహిళల విభాగం నుంచి అన్మోల్ పోటీలో ఉంది. -
ఉత్కంఠ పోరులో భారత్ విజయం..
సౌత్ ఆసియన్ ఫుట్బాల్ ఫెడరేషన్(SAFF) అండర్-19 చాంపియన్షిప్ విజేతగా భారత్ అవతరించింది. ఆదివారం అరుణాచల్ ప్రదేశ్లోని గోల్డెన్ జూబ్లీ స్టేడియంలో జరిగిన ఫైనల్ పోరులో బంగ్లాను ఓడించి భారత్ టైటిల్ను కైవసం చేసుకుంది.ఆఖరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన మ్యాచ్లో పెనాల్టీ షూటౌట్( 4-3)లో యంగ్ ఇండియా విజయం సాధించింది. ముందుగా నిర్ణీత సమయంలో ఇరు జట్లు చెరో గోల్తో సమంగా నిలిచారు. దీంతో ఫలితాన్ని తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్ను నిర్వహించారు.పెనాల్టీ షూటౌట్లో కూడా ఆసక్తికరంగా సాగింది. పెనాల్టీ షూటౌట్లో 3-3తో సమంగా ఉన్నసమయంలో కెప్టెన్ షమీ సింగమాయుమ్ అద్బుతమైన గోల్ కొట్టి భారత్కు అద్బుతమైన విజయాన్ని అందించాడు. భారత్కు ఇది రెండవ శాఫ్ అండర్-19 టైటిల్ కావడం విశేషం.చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. విరాట్ కోహ్లి రికార్డు బ్రేక్ -
నిధి నాయకత్వంలో...
బెంగళూరు: ఈ ఏడాది డిసెంబర్లో జరిగే మహిళల జూనియర్ ప్రపంచకప్ టోర్నమెంట్కు సన్నాహాల్లో భాగంగా భారత జట్టు ఈ నెలలో నాలుగు దేశాల టోర్నీలో పోటీపడనుంది. అర్జెంటీనాలోని రొసారియా నగరంలో ఈనెల 25 నుంచి జూన్ 2వ తేదీ వరకు జరిగే ఈ టోర్నీలో భారత్తోపాటు అర్జెంటీనా, చిలీ, ఉరుగ్వే జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీలో ఆడనున్న భారత జట్టును శనివారం హాకీ ఇండియా ప్రకటించింది. 24 మంది సభ్యులతో కూడిన టీమిండియాకు గోల్కీపర్ నిధి నాయకత్వం వహిస్తుంది. డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగే ఈ టోర్నీలో భారత జట్టు తమ తొలి మ్యాచ్ను మే 25న చిలీతో ఆడుతుంది. ఆ తర్వాత టీమిండియా వరుసగా ఉరుగ్వేతో (మే 26న), అర్జెంటీనాతో (మే 28న), చిలీతో (మే 30న), ఉరుగ్వేతో (జూన్ 1న), అర్జెంటీనాతో (జూన్ 2న) తలపడతుంది. ‘ఈ టోర్నీ ద్వారా మా అత్యుత్తమ క్రీడాకారిణులు ఎవరో గుర్తిస్తాము. మరో ఆరు నెలల్లో జూనియర్ ప్రపంచకప్ జరగనుంది. తాజా టోర్నీ మన అమ్మాయలకు అంతర్జాతీయ అనుభవం కలిపిస్తుంది’ అని భారత జూనియర్ జట్టు కోచ్ తుషార్ ఖాండ్కర్ తెలిపారు. భారత జూనియర్ మహిళల హాకీ జట్టు: నిధి (కెప్టెన్, గోల్కీపర్), ఏంజిల్ హర్షరాణి మింజ్ (గోల్కీపర్), మమితా ఓరమ్, లాల్తట్లుయాంగి, మనీషా, పూజా సాహూ, పార్వతి టొప్నో, నందిని, సాక్షి శుక్లా (డిఫెండర్లు), ప్రియాంక యాదవ్, అనీషా సాహూ, రజని కెర్కెట్టా, బినిమా ధన్, ఖైడెమ్ షిలీమా చాను, సంజన హోరో, సుప్రియా కుజుర్, ప్రియాంక డోగ్రా (మిడ్ ఫీల్డర్లు), హీనా బానో, సోనమ్, సుఖ్వీర్ కౌర్, గీతా యాదవ్, లాల్రిన్పుయ్, కనిక సివాచ్, కర్మన్ప్రీత్ కౌర్ (ఫార్వర్డ్లు). స్టాండ్బై: విద్యశ్రీ, హుదా ఖాన్, ముని్మని దాస్, సెలెస్టినా హోరో. -
విజేత ప్రజ్ఞానంద
బుకారెస్ట్: గ్రాండ్ చెస్ టూర్లో భాగంగా నిర్వహించిన సూపర్బెట్ క్లాసిక్ టోర్నమెంట్లో భారత గ్రాండ్మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద చాంపియన్గా అవతరించాడు. పది మంది మేటి గ్రాండ్మాస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీ జరిగింది. నిర్ణిత తొమ్మిది రౌండ్ల తర్వాత ప్రజ్ఞానంద, మాక్సిమి లాగ్రెవ్ (ఫ్రాన్స్), అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్) 5.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. దాంతో విజేతను నిర్ణయించేందుకు వీరిద్దరి మధ్య టైబ్రేక్ గేమ్లు నిర్వహించారు. అలీరెజాతో గేమ్ను ‘డ్రా’ చేసుకున్న ప్రజ్ఞానంద.. లాగ్రెవ్పై గెలిచి 1.5 పాయింట్లతో టైటిల్ను ఖరారు చేసుకున్నాడు. విజేత ప్రజ్ఞానందకు 77,667 డాలర్లు (రూ. 66 లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి. ప్రపంచ చాంపియన్, భారత గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ నాలుగు పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచాడు. -
ఎయిర్ ట్యాక్సీల్లో వేదికలకు రవాణా.. ఇలా ఇదే తొలిసారి
లాస్ ఏంజెలిస్: వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఒలింపిక్స్ క్రీడల్లో ఇప్పటి వరకు ఆటగాళ్లు, ప్రేక్షకులు, వీఐపీలు కార్లు, బస్సుల్లోనే వేదికలకు చేరేవారు. కానీ లాస్ ఏంజెలిస్లో 2028లో జరిగే విశ్వక్రీడలు ‘విహంగ విహారానికి’ సిద్ధమవుతున్నాయి. మరో మూడేళ్లలో అమెరికాలోని ప్రఖ్యాత నగరంలో జరిగే ఈ మెగా ఈవెంట్లో ‘ఎయిర్ ట్యాక్సీ’లను వినియోగిస్తామని ఆర్గనైజింగ్ కమిటీ తెలిపింది.ఆటగాళ్లు, వీఐపీలే కాదు... సాధారణ ప్రేక్షకులు సైతం విహంగ విహారం చేస్తూ ఆయా వేదికలకు చేరుకుంటారు. విశ్వక్రీడల్లో ఈ తరహా ఎయిర్ ట్యాక్సీలు నిర్వహించనుండటం చరిత్రలోనే తొలిసారి కానుంది. తద్వారా ఎవరికీ ప్రయాణ బడలిక లేకుండా కేవలం పది నుంచి 20 నిమిషాల్లోపే వేదికలకు చేరవేయవచ్చని నిర్వాహకులు ప్రణాళికలతో ఉన్నారు. సోఫీ స్టేడియం, లాస్ ఏంజెలిస్ మెమోరియల్ కొలిజియం, శాంటా మోనికా, ఆరెంజ్ కౌంటీ, హాలీవుడ్ వేదికలకు ఎయిర్ ట్యాక్సీలను వినియోగించే ఆలోచనతో ఉన్నట్లు ఆర్గనైజింగ్ కమిటీ సీఈఓ ఆడమ్ గోల్డ్స్టెయిన్ తెలిపారు. అమెరికా భవిష్య ప్రయాణ ముఖచిత్రాన్నే లాస్ ఏంజెలిస్ విశ్వక్రీడలు మార్చబోతున్నాయని చెప్పారు. ఇదీ చదవండి: ఫైనల్లో అల్కరాజ్రోమ్: స్పెయిన్ టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ తన కెరీర్లో 25వ టోరీ్నలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. రోమ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో అల్కరాజ్ 6–3, 7–6 (7/4)తో లొరెంజో ముసెట్టి (ఇటలీ)పై విజయం సాధించాడు. 2 గంటల 3 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో అల్కరాజ్ ఒక ఏస్ సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్లు చేశాడు. తన సర్వీస్ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. ఈ ఏడాది నాలుగో టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించిన అల్కరాజ్ రెండు టోర్నీల్లో (మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్; రోటర్డామ్ ఓపెన్) విజేతగా నిలిచి, బార్సిలోనా ఓపెన్లో రన్నరప్తో సరిపెట్టుకున్నాడు. యానిక్ సినెర్ (ఇటలీ), టామీ పాల్ (అమెరికా) మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో ఫైనల్లో అల్కరాజ్ తలపడతాడు. -
PKL: పీకేఎల్ ఆటగాళ్ల వేలం.. తేదీలు ఇవే
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ (Pro Kabaddi League) 12వ సీజన్కు ముందు ఆటగాళ్ల వేలం ప్రక్రియను ఈ నెల 31, జూన్ 1 తేదీల్లో నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముంబైలో నిర్వహించే ఈ వేలానికి సంబంధించిన సమాచారాన్ని ఇదివరకే 12 ఫ్రాంచైజీ యాజమాన్యాలకు తెలియజేశామని నిర్వాహకులు వెల్లడించారు. కాగా 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన 11 సీజన్లలో 8 వేర్వేరు జట్లు టైటిళ్లు గెలుపొందడం విశేషం. ఈ నేపథ్యంలో కబడ్డీ లీగ్లో పలానా జట్టు ఫేవరెట్ అనే మాటే లేకుండా ప్రతీ జట్టు టైటిల్ కోసం పోరాడుతూనే ఉంది. దీంతో యేటికేడు కబడ్డీ కూతకు ఆదరణ అంతకంతకు పెరుగుతూనే ఉండటం విశేషం. బెంగాల్ వారియర్స్ కోచ్గా నవీన్ ఈ ఏడాది జరిగే 12వ సీజన్ పీకేఎల్ కోసం బెంగాల్ వారియర్స్ తమ జట్టు హెడ్ కోచ్గా నవీన్ కుమార్ను నియమించింది. ప్రస్తుతం కోచ్గానే కాదు... అంతకుముందు ఆటగాడిగాను అతనికి మంచి రికార్డు ఉంది. దక్షిణాసియా క్రీడలు (2006), ఆసియా క్రీడలు (2006), కబడ్డీ ప్రపంచకప్ (2007), ఆసియా ఇండోర్ క్రీడల్లో (2007) భారత్ స్వర్ణాలు గెలిచిన బృందంలో అతను సభ్యుడిగా ఉన్నాడు. కోచ్గానూ నిరూపించుకున్నాడు.గతంలో అతను భారత జాతీయ, దేశవాళీ జట్లకు కోచింగ్ సేవలందించాడు. భారత నేవి, స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) జట్లకు కోచ్గా వ్యవహించాడు. ఆటలో కడదాకా కనబరిచే పోరాటస్ఫూర్తి, ఏ దశలోనూ కుంగిపోని సానుకూల దృక్పథం అతన్ని మేటి కోచ్గా నిలబెడుతోంది. 12 ఫ్రాంచైజీలు తలపపడిన గత సీజన్లో బెంగాల్ పదో స్థానంతో నిరాశపరిచింది.ఈ నేపథ్యంలో వేలానికి ముందే అతన్ని నియమించుకోవడం ద్వారా సరైన ఆటగాళ్ల కొనుగోలు, జట్టు కూర్పు, పటిష్టమైన దళాన్ని తయారు చేసుకోవడానికి కావాల్సినంత సమయం లభిస్తుందని ఫ్రాంచైజీ యాజమాన్యం భావించింది. బెంగాల్కు కోచింగ్ పట్ల నవీన్ కుమార్ హర్షం వ్యక్తం చేశాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వారియర్స్ను దీటైన జట్టుగా, బరిలో ఎదురులేని ప్రత్యర్థిగా తయారు చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నాడు. చదవండి: రోహిత్ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం.. మామగారి వెనుక దాక్కున్న రితిక! -
ప్రపంచం ‘కన్ను’గప్పి నాటకాలు.. ఎట్టకేలకు పాపం పండింది!
బాకు (అజర్బైజాన్): ప్రపంచాన్ని ‘గుడ్డి’గా నమ్మించిన అజర్బైజాన్ పారా జూడో క్రీడాకారిణి పాపం పండింది. జీవితకాల నిషేధానికి గురైంది. ఒక శాతం కూడా దృష్టిలోపం లేకపోయినా... నకిలీ అంధత్వ సర్టిఫికెట్తో అంతర్జాతీయ పోటీల్లో అజర్బైజాన్ జూడో క్రీడాకారిణి షహానా హాజియెవా (Shahana Haji) పతకాలు గెలిచింది. ఇప్పుడు పాపం పండటంతో ‘పోడియం’కెక్కిన ఆమె పాతాళానికి పడిపోయింది.అసలు విషయమేమిటంటే... 26 ఏళ్ల హాజియెవా టోక్యో పారాలింపిక్స్లో దృష్టి లోపం ఉన్న జూడో క్రీడాకారిణిల విభాగంలో (48 కేజీలు) పోటీపడి బంగారు పతకం గెలుపొందింది. కాలచక్రం తిరిగేసరికి ఈ లోపల మరో పారాలింపిక్స్ క్రీడలు (పారిస్) కూడా ముగిశాయి. ఇన్నాళ్లూ బాగానే ఉంది. కానీ ఈనెల కజకిస్తాన్లోని అస్తానాలో ప్రపంచ పారా జూడో చాంపియన్షిప్ జరిగింది. ఇందులో కళ్లున్నా... కనపడనట్లు ఆడిన కపట నాటకం బయటపడింది.ఈవెంట్ సందర్భంగా నిర్వహించిన అంధత్వ పరీక్షలో విస్తుపోయే వాస్తవం వెలుగులోకి వచ్చింది. షహానా హాజియెవాకు రెండు కళ్లు వందశాతం కనిపిస్తూనే ఉన్నాయని తేలింది. ఎలాంటి దృష్టి లోపం, పాక్షిక అంధత్వం కూడా లేదని తేలింది. దీంతో ప్రపంచ పారాలింపిక్ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెపై జీవితకాల నిషేధం విధించింది. ప్రపంచం ‘కన్ను’గప్పిన ఆమె మోసంతో ఇప్పుడు పారా క్రీడలు కాదుకదా అసలైన క్రీడల్లో కూడా పాల్గొనే అర్హతను పూర్తిగా కోల్పోయింది.అజర్బైజాన్కే చెందిన ఎల్నారా నిజామ్లికి పాక్షిక దృష్టి లోపం ఉంది. కానీ ఆమె పూర్తి అంధత్వంతో ‘జే1’ కేటగిరీలో పాల్గొనాలని చూసిన మోసం కూడా బట్టబయలైంది. అయితే ఆమెకు ‘జే2’ కేటగిరీ (పాక్షిక అంధత్వం)లో పాల్గొనే అవకాశమిచ్చారు. అజర్బైజాన్ జాతీయ పారాలింపిక్ సంఘం తమ అథ్లెట్ల కపట నాటకంపై స్పందించింది. ఇద్దరిపై చర్యలు తీసుకుంటామని చెప్పింది. -
నీరజ్ 90.23 మీటర్లు
దోహా: 90 మీటర్లు... ఇంకెప్పుడు..? ఇంకెప్పుడు..? ఇంకెప్పుడు..? అని కొన్నేళ్లుగా అందరి నుంచి ఎదురవుతున్న ప్రశ్నలకు భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా శుక్రవారం సమాధానం ఇచ్చాడు. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఎట్టకేలకు భారత స్టార్ తన కెరీర్లో తొలిసారి 90 మీటర్ల మైలురాయిని అధిగమించాడు. శుక్రవారం ఖతర్ రాజధాని దోహాలో జరిగిన డైమండ్ లీగ్ మీట్లో నీరజ్ చోప్రా తన కెరీర్ బెస్ట్ ప్రదర్శనను నమోదు చేశాడు.27 ఏళ్ల నీరజ్ తన మూడో ప్రయత్నంలో జావెలిన్ను 90.23 మీటర్ల దూరం విసిరాడు. ఈ క్రమంలో నీరజ్ తన పేరిటే ఉన్న (2022 స్టాక్హోమ్ డైమండ్ లీగ్ మీట్లో 89.94 మీటర్లు) జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు. విఖ్యాత కోచ్ జాన్ జెలెజ్నీ వద్ద శిక్షణ ప్రారంభించాక బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్లోనే నీరజ్ తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడం విశేషం. 11 మంది మేటి జావెలిన్ త్రోయర్లు పోటీపడ్డ దోహా డైమండ్ లీగ్ మీట్లో జూలియన్ వెబెర్ (జర్మనీ; 91.06 మీటర్లు) అగ్రస్థానాన్ని క్కించుకున్నాడు. నీరజ్ చోప్రా (90.23 మీటర్లు) రెండో స్థానం సంపాదించగా... అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా; 86.64 మీటర్లు) మూడో స్థానాన్ని పొందాడు. భారత్కే చెందిన కిశోర్ కుమార్ జేనా (78.60 మీటర్లు) ఎనిమిదో స్థానంతో సంతృప్తి పడ్డాడు. డైమండ్ లీగ్ మీట్లలో అథ్లెట్లకు పతకాలు బదులుగా పాయింట్లు కేటాయిస్తారు. టాప్–8లో నిలిచిన వారికి వరుసగా 8, 7, 6, 5, 4, 3, 2, 1 పాయింట్లు లభిస్తాయి. వెబెర్కు 8 పాయింట్లు, నీరజ్కు 7 పాయింట్లు, పీటర్స్కు 6 పాయింట్లు దక్కాయి.నిర్ణిత నాలుగు మీట్లు ముగిశాక టాప్–7లో నిలిచిన వారు ఫైనల్ మీట్లో పోటీపడతారు. సీజన్ తొలి మీట్లో నీరజ్ తొలి ప్రయత్నంలో జావెలిన్ను 88.44 మీటర్ల దూరం విసిరి శుభారంభం చేశాడు. ఆ తర్వాత రెండో ప్రయత్నంలో అతను ఫౌల్ చేశాడు. మూడో ప్రయత్నంలో నీరజ్ జావెలిన్ 90.23 మీటర్లకు వెళ్లింది. నాలుగో ప్రయత్నంలో నీరజ్ జావెలిన్ను 80.56 మీటర్ల దూరం విసరగా... ఐదో ప్రయత్నంలో ఫౌల్ చేశాడు. చివరిదైన ఆరో ప్రయత్నంలో నీరజ్ జావెలిన్ను 88.20 మీటర్లు విసిరాడు. 3 ఆసియా నుంచి జావెలిన్ను 90 మీటర్లకంటే ఎక్కువ దూరం విసిరిన మూడో ప్లేయర్గా నీరజ్ చోప్రా గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో అర్షద్ నదీమ్ (పాకిస్తాన్; 92.97 మీటర్లు), చావో సున్ చెంగ్ (చైనీస్ తైపీ; 91.36 మీటర్లు) ఉన్నారు. ఓవరాల్గా 25 మంది క్రీడాకారులు జావెలిన్ను 90 మీటర్ల కంటే ఎక్కువ దూరం విసిరారు. -
మైదానంలో మాత్రమే!
దోహా: భారత స్టార్ జావెలిన్ త్రోయర్, రెండు వరుస ఒలింపిక్ పతకాల విజేత నీరజ్ చోప్రా తన పాక్ ప్రత్యర్థి అర్షద్ నదీమ్తో గల అనుబంధంపై స్పష్టత ఇచ్చాడు. దోహా డైమండ్ లీగ్లో పాల్గొనేందుకు వచ్చిన అతను పతకంపై గురి పెట్టాడు. విమర్శలపై సమాధానమిచ్చాడు. భారత్, పాక్ల మధ్య యుద్ధవాతావరణాన్ని సృష్టించిన ఉద్రిక్త పరిస్థితుల మధ్య పాకిస్తాన్కు చెందిన జావెలిన్ త్రోయర్, పారిస్ ఒలింపిక్ చాంపియన్ అర్షద్ నదీమ్కు భారత్లో జరిగే ఈవెంట్ కోసం ఆహ్వానం పలకడంపై నీరజ్ చోప్రా సహా అతని కుటుంబసభ్యులపై కూడా తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోశారు. వీటిని తాళలేక చోప్రా వివరణ కూడా ఇవ్వాల్సి వచ్చింది. మొత్తానికి బెంగళూరులో వచ్చే వారం నిర్వహించతలపెట్టిన ‘ఎన్సీ క్లాసిక్’ ఈవెంట్ నిరవధిక వాయిదా పడింది. అయితే తమ ఇద్దరి బంధంపై తాజాగా నీరజ్ స్పష్టత ఇచ్చాడు. ‘ముందుగా మీకో విషయం స్పష్టం చేయదల్చుకుంటున్నా... అర్షద్తో నాకున్నది పోటీల సందర్భంగా ఉండే స్నేహమే! అంతేతప్ప బలమైన అనుబంధం, ప్రాణ స్నేహితులం ఏమాత్రం కాదు. అయితే ఇప్పుడు నెలకొన్న పరిస్థితులతో కనీసం ముందరిలా ఉంటామో లేదో కూడా తెలీదు. ఒకవేళ అతను సంస్కారం చూపితే నేను చూపుతా. అంతకుమించి ఇంకేమీ ఉండదు. మైదానంలో అథ్లెట్లుగా మాట్లాడుకుంటాం. అథ్లెట్ మిత్రులుగానే మెలుగుతాం. అంతే!’ అని అన్నాడు. మొదట్లో కష్టమనిపించినా... ప్రస్తుత కోచ్, లెజెండ్ జాన్ జెలెజ్నితో మొదట్లో శిక్షణ చాలా కష్టమనిపించిందని, కఠినంగా ఉండేదని అయితే ఇప్పుడా సమస్య లేదని నీరజ్ వివరించాడు. ‘నా పాత కోచ్ క్లాస్ బార్టొనీట్జ్ శైలి వేరు. ప్రస్తుత కోచ్ జెలెజ్నీ శైలి పూర్తి భిన్నం. అతనితో కలిసి పని (శిక్షణ) చేయడానికి ఇబ్బంది పడ్డాను. చాలా విభిన్నమైన శిక్షణ శైలి అతనిది. తర్వాతర్వాత అలవాటు పడ్డాక అంతా సర్దుకుంది. జెలెజ్నీ కోచింగ్లో ఎంతటి నిష్ణాతుడో అందరికీ తెలుసు. నా టెక్నిక్, రనప్ ఇపుడంతా మెరుగైంది. అలాగని పాత కోచ్ క్లాస్ తక్కువేమీ కాదు. నాలుగైదేళ్లు అతని శిక్షణలోనే రాటుదేలాను’ చోప్రా అన్నాడు. టైటిల్ లక్ష్యంతో చోప్రా... దోహా డైమండ్ లీగ్ మాజీ చాంపియన్ నీరజ్ చోప్రా మరోసారి టైటిల్ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నాడు. ఈ స్టార్ జావెలిన్ త్రోయర్ ఫామ్లో ఉన్నాడు. నిలకడగా రాణిస్తున్నాడు. ఇలాంటి అనుకూలతలతో ఈ లీగ్లో స్వర్ణం చేజిక్కించుకోవడం అతనికి ఏమంత కష్టం కానేకాదు. శుక్రవారం జరిగే జావెలిన్ త్రో ఈవెంట్లో భారత స్టార్కు రెండు సార్లు ప్రపంచ చాంపియన్, పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా) నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశముంది. అతనితో పాటు జాకుబ్ వాద్లెచ్ (చెక్), జర్మనీకి చెందిన జులియన్ వెబెర్, మ్యాక్స్ డెహ్నింగ్, జూలియుస్ యెగో (కెన్యా), రొడెరిక్ గెన్కీ డీన్ (జపాన్)లు నీరజ్ చోప్రాకు పోటీ ఇవ్వనున్నారు. అంతర్జాతీయ పోటీల్లో తలపడే ప్రత్యర్థులందరూ ఈ డైమండ్ లీగ్ బరిలో ఉన్నారు. అయితే పాక్ చాంపియన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ మాత్రం గైర్హాజరయ్యాడు. లీగ్ కోసం ఎంతో కసరత్తు చేశానని పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతానని చోప్రా చెప్పాడు. స్టీపుల్చేజ్లో గుల్వీర్, పారుల్ నీరజ్ జావెలిన్ త్రోలో పతకంపై గురిపెట్టగా, మిగతా భారత అథ్లెట్లు గుల్వీర్ సింగ్, పారుల్ చౌధరీ స్టీపుల్చేజ్లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. జాతీయ రికార్డు నెలకొల్పిన గుల్వీర్ పురుషుల 5000 మీటర్ల పోటీలో పొడియంలో నిలవాలని గంపెడాశలు పెట్టుకున్నాడు. మహిళల 3000 మీటర్ల స్టీపుల్చేజ్లో పారుల్ చౌధరీ గట్టి పోటీ ఇచ్చేందుకు సై అంటోంది. -
‘ఒలింపిక్ క్రీడలను దత్తత తీసుకుంటాం’
న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత ధనిక బోర్డు అయిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మన దేశంలో ఇతర క్రీడలకు అండగా నిలవాలని యోచిస్తోంది. కనీసం రెండు లేదా మూడు ఒలింపిక్ క్రీడలను దత్తత తీసుకోవాలని భావిస్తున్నట్లు బీసీసీఐ తమ ఆలోచనను కేంద్ర క్రీడా శాఖకు తెలియజేసింది. మంత్రి మన్సుఖ్ మాండవియాతో గురువారం బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బీసీసీఐ ఈ ప్రతిపాదన చేసింది ‘మా ప్రతిపాదనను బీసీసీఐ స్వాగతించింది. ఏ క్రీడలను ఎంచుకుంటే బాగుంటుందనే విషయం తుది నిర్ణయం కేంద్ర క్రీడాశాఖకే వదిలేశాం. ఆయా క్రీడల్లోనూ ఒలింపిక్ కేంద్రాలను ఏర్పాటు చేసి కనీసం 100 నుంచి 200 మందికి అత్యుత్తమ శిక్షణ ఇప్పిస్తాం. ఒలింపిక్ క్రీడలను దృష్టిలో ఉంచుకొని ఈ క్రీడల సన్నాహాలు ఉంటాయి’ అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ సమావేశంలో 58 కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. క్రికెట్ బోర్డు తాజా ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించిన వీరు తాము కూడా సహకారం అందిస్తామని హామీ ఇవ్వడం విశేషం. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 23 నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ శిక్షణా కేంద్రాలు నడుస్తున్నాయి. ఇందులో బాక్సింగ్ (రోహ్టక్), స్విమ్మింగ్, షూటింగ్ (న్యూఢిల్లీ)లలో మాత్రం ఒకే క్రీడాంశంలో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. విభిన్న క్రీడాంశాలకు కేంద్రంగా పటియాలా, బెంగళూరులలో ‘సాయ్’ కేంద్రాలు నడుస్తున్నాయి. గతంలోనూ పలు మార్లు బీసీసీఐ ఆరి్థకపరంగా ఇతర క్రీడలకు సహకారం అందించింది. ఆటలను దత్తత తీసుకోవాలనే తాజా ప్రతిపాదనపై మున్ముందు మరింత స్పష్టత రానుంది. భారత సంతతికి చెందిన విదేశాల్లో స్థిరపడిన ఓవర్సీస్ సిటిజన్ (ఓసీఐ)లు క్రీడల్లో మన దేశానికి ప్రాతినిధ్యం వహించరాదనే నియమం ప్రస్తుతం అమల్లో ఉంది. దీనిని తొలగించాలని కూడా కేంద్ర క్రీడాశాఖ యోచిస్తోంది. అక్కడ ఆటలో నిష్ణాతులైన తర్వాత మన దేశం తరఫున వచ్చి ఆడితే ఇక్కడి ప్లేయర్లకు కూడా మేలు జరుగుతుందని, వ్యవస్థలో కొత్త మార్పులు వస్తాయని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. మరోవైపు వివిధ క్రీడా సమాఖ్యలు తమలోని వర్గాల మధ్య విభేదాలను పరిష్కరించుకుంటేనే ఆట బాగుపడుతుందని... క్రీడలను కోర్టులు నడపడం సరైందని కాదని మంత్రి అభిప్రాయపడ్డారు. వారందరితో సమావేశంపై సమస్యను పరిష్కరించేందుకు మంత్రి స్వయంగా సిద్ధమయ్యారు. -
ముగిసిన భారత్ పోరు
బ్యాంకాక్: థాయ్లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్ విభాగంలో తరుణ్ మన్నేపల్లి... మహిళల సింగిల్స్ విభాగంలో ఉన్నతి హుడా, మాళవిక బన్సోద్, ఆకర్షి కశ్యప్... మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ ప్రిక్వార్టర్ ఫైనల్ను దాటలేకపోయారు. క్వాలిఫయర్ హోదాలో మెయిన్ డ్రాలో అడుగు పెట్టిన తరుణ్ గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో 14–21, 16–21తో ప్రపంచ మూడో ర్యాంకర్ ఆండెర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు. 42 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో తరుణ్ రెండో గేమ్లో కాస్త పోటీనిచ్చాడు. మహిళలసింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్లో ఉన్నతి హుడా 14–21, 11–21తో ప్రపంచ రెండో ర్యాంకర్ పోర్న్పవీ చోచువోంగ్ (థాయ్లాండ్) చేతిలో, మాళవిక 12–21, 16–21తో ప్రపంచ మాజీ చాంపియన్ ఇంతనోన్ రచనోక్ (థాయ్లాండ్) చేతిలో, ఆకర్షి కశ్యప్ 9–21, 14–21తో సుపనిద కటెథోంగ్ (థాయ్లాండ్) చేతిలో ఓటమి చవిచూశారు. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం 20–22, 14–21తో రుయ్ హిరోకామి–సయాకా హొబారా (జపాన్) జోడీ చేతిలో ఓడిపోయింది. ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) టూర్ టోర్నీలలో భారత్ నుంచి ఒక్కరు కూడా ఫైనల్ చేరుకోలేకపోయారు. -
పోలాండ్ ఈవెంట్కు నీరజ్
న్యూఢిల్లీ: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పోలాండ్ టోర్నీలో పాల్గొనేందుకు సిద్ధమయ్యాడు. నిజానికి చోప్రా ఈ నెల 24న ‘ఎన్సీ క్లాసిక్’ టోర్నమెంట్ను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాడు. కానీ భారత్, పాక్ల మధ్య ఉద్రిక్త పరిస్థితుల వల్ల పలు విమానాశ్రయాల మూసివేతతో అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలనుకున్న ఎన్సీ క్లాసిక్ ఈవెంట్ నిరవధికంగా వాయిదా పడింది. ఇపుడు ఇదే సమయంలో పోలాండ్లో జరిగే ఈవెంట్లో నీరజ్ బరిలోకి దిగుతాడు. ఈ నెల 23న అక్కడ ‘ఒర్లిన్ జానుస్జ్ కుసొసిన్సికి మెమోరియల్ ఈవెంట్’ జరుగనుంది. ఈ ఈవెంట్లో పలువురు అంతర్జాతీయ మేటి జావెలిన్ త్రోయర్లు పాల్గొంటారు. రెండుసార్లు ప్రపంచ చాంపియన్, పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా), జులియన్ వెబెర్ (జర్మనీ), పోలాండ్ జాతీయ రికార్డు నెలకొల్పిన మార్సిన్ క్రుకొవ్స్కీ తదితరులు పాల్గొంటారు. ఈ సీజన్లో దక్షిణాఫ్రికా ఈవెంట్తో ఈ సీజన్కు శ్రీకారం చుట్టిన చోప్రా ఈ నెల 16న దోహా డైమండ్ లీగ్లో పాల్గొనాల్సి ఉంది. -
గడుల ఆట... కొత్త బాట!
ప్రపంచ బ్లిట్జ్ చెస్ చాంపియన్షిప్ పోటీలు మారబోతున్నాయి. దీంతో గడుల్లో వేసే ఎత్తులు, పైఎత్తులు కొత్త ఫార్మాట్లో జరగనున్నాయి. అయితే ఈ తరహా ఫార్మాట్ ఇప్పుడైతే ఖతర్లో జరిగే టోర్నీలో నిర్వహిస్తారు. ఆ తర్వాత కొనసాగుతుందో లేదో టోర్నీ జరిగిన విధానం, ఆసక్తిగొలిపిన వైనాన్ని బట్టి అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) తుది నిర్ణయం తీసుకుంటుంది. మొత్తానికి ఇన్నాళ్లు జరిగిన ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నీలది ఒక లెక్కయితే... దోహాలో జరగబోయేది మాత్రం కొత్త లెక్క! ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్షిప్ మాత్రం మారలేదు. తెలుగుతేజం, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి డిఫెండింగ్ చాంపియన్ హోదాతో బరిలోకి దిగనుంది. టూకీగా... ఇదీ టోర్నీ కహానీ! ‘ఫిడే’ ప్రపంచ ర్యాపిడ్–బ్లిట్జ్ టోర్నీకి దోహా (ఖతర్) ఆతిథ్య వేదిక కాగా... డిసెంబర్ 26 నుంచి 31 వరకు ఆరు రోజులపాటు ఈ పోటీలు జరుగుతాయి. టోర్నీ మొత్తం ప్రైజ్మనీ: 10 లక్షల యూరోలు (భారత కరెన్సీలో రూ. 9.58 కోట్లు). ఓపెన్ కేటగిరీ విజేతలకు ర్యాపిడ్, బ్లిట్జ్ (3.5 లక్షల యూరోల చొప్పున) 7 లక్షల యూరోలు (రూ. 6.7 కోట్లు), మహిళల విభాగం విజేతలకు 3 లక్షల యూరోలు (రూ.2.87 కోట్లు). ర్యాపిడ్, బ్లిట్జ్లకు లక్షన్నర యూరోల చొప్పున కేటాయించారు. బ్లిట్జ్ ఫార్మాట్ మార్పులివి... ఈ ప్రపంచ బ్లిట్జ్ చాంపియన్షిప్ పోటీల్లో నాకౌట్ దశను మరింత క్రమబద్దీకరించారు. అంటే గతంలో ఎనిమిది మందితో మొదలయ్యే క్వార్టర్ ఫైనల్ నాకౌట్ దశ స్థానంలో ఇప్పుడు నలుగురు మాత్రమే పాల్గొనే సెమీఫైనల్ను తీసుకొచ్చారు. ఈ టోర్నీల తొలిదశ స్విస్ లీగ్ పద్ధతి నుంచి నేరుగా సెమీఫైనల్స్ పోటీలే జరుగుతాయి. మధ్య ఎనిమిది మంది బరిలో ఉండే క్వార్టర్ ఫైనల్స్ ఉండవిక! ఈ మార్పుతో ఒరిగేదేంటి? ‘ఫిడే’ అధికారుల వివరణ ప్రకారం కొత్త బ్లిట్జ్ ఫార్మాట్లో స్విస్ లీగ్ పద్ధతి నుంచి నాకౌట్ చేరే వరకు ప్రతీ మ్యాచ్ ఆసక్తికరంగా, పోటాపోటీగా జరిగే అవకాశముంటుంది. స్విస్ లీగ్ దశలో ఎక్కువ మ్యాచ్లు ఆడటం వల్ల ఇందులో నిలకడైన ప్రదర్శన కనబరిచిన వారే చివరకు నాకౌట్ దశ (సెమీస్)కు అర్హత సాధిస్తారు. అంటే ఒకరితో ఒక ఎత్తు పొరపాటుతో ఓడిన మ్యాచ్, మరొకరు ఒక పైఎత్తుతో గెలిచిన మ్యాచ్ల వల్ల నాకౌట్ అవకాశాలు కోల్పోరు. ఎందుకంటే విరివిగా ఉండే లీగ్ మ్యాచ్ల వల్ల ఒక పొరపాటును అధిగమించి మరో మ్యాచ్లో గెలిచే అవకాశాలుంటాయి. బ్లిట్జ్లో 19 రౌండ్లు ఓపెన్ కేటగిరీలో బ్లిట్జ్ చాంపియన్షిప్ 19 రౌండ్ల పాటు జరుగుతుంది. మహిళల విభాగంలో 15 రౌండ్ల పాటు నిర్వహిస్తారు. అనంతరం నలుగురు చొప్పున సెమీఫైనల్కు చేరతారు. ఇక్కడి నుంచి గెలిచిన ఇద్దరి మధ్య ఫైనల్ పోరు జరుగుతుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని, నియమనిబంధనల్ని ఫిడే వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. యథాతథంగానే ర్యాపిడ్ ఈవెంట్ బ్లిట్జ్ పోరు మారింది. కానీ ర్యాపిడ్ చాంపియన్షిప్ను ఫిడే మార్చలేదు. ఓపెన్ కేటగిరీలో 13 రౌండ్లు, మహిళల విభాగంలో 11 రౌండ్ల మ్యాచ్లు జరుగుతాయి. అగ్రస్థానంలో నిలిచిన వారే విజేతగా ఆవిర్భవిస్తారు. ఒకవేళ టాప్లో పాయింట్లు సమంగా ఉంటే మాత్రం విజేతను తేల్చడానికి ప్లేఆఫ్ పోటీని నిర్వహిస్తారు. గత ఏడాది న్యూయార్క్ వేదికగా ప్రపంచ ర్యాపిడ్, చెస్ చాంపియన్షిప్ జరిగింది. ర్యాపిడ్ ఫార్మాట్ ఓపెన్లో విభాగంలో రష్యాకు చెందిన 18 ఏళ్ల ముర్జిన్... మహిళల విభాగంలో భారత స్టార్ కోనేరు హంపి విజేతలుగా నిలిచారు. బ్లిట్జ్ ఫార్మాట్ ఓపెన్ విభాగంలో ఇయాన్ నిపోమ్నిషి (రష్యా), కార్ల్సన్ (నార్వే) సంయుక్త విజేతలుగా నిలువగా... మహిళల విభాగంలో చైనాకు చెందిన జు వెన్జున్ టైటిల్ సాధించింది. -
సినెర్ ముందంజ
రోమ్: నిషేధం గడువు పూర్తయ్యాక బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్లో ప్రపంచ పురుషుల టెన్నిస్ నంబర్వన్ యానిక్ సినెర్ జోరు కొనసాగిస్తున్నాడు. రోమ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో సినెర్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ప్రపంచ 18వ ర్యాంకర్ ఫ్రాన్సిస్కో సెరున్డోలో (అర్జెంటీనా)తో జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సినెర్ 7–6 (7/2), 6–3తో విజయం సాధించాడు. 2 గంటల 17 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సినెర్ రెండు ఏస్లు సంధించాడు. తన సర్వీస్ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్విస్ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. ఏడుసార్లు నెట్ వద్దకు దూసుకొచి్చన సినెర్ నాలుగుసార్లు పాయింట్లు గెలిచాడు. సెరున్డోలో 14 సార్లు నెట్ వద్దకు వచ్చి ఎనిమిది సార్లు పాయింట్లు సొంతం చేసుకున్నాడు. 17 విన్నర్స్ కొట్టిన సినెర్ 30 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు సెరున్డోలో 29 విన్నర్స్ కొట్టి ఏకంగా 53 అనవసర తప్పిదాలు చేశాడు. 91 సర్వీస్ పాయింట్లలో సినెర్ 51 పాయింట్లు... 86 సర్విస్ పాయింట్లలో సెరున్డోలో 47 పాయింట్లు సాధించారు. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ కాస్పర్ రూడ్ (నార్వే)తో సినెర్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో సినెర్ 3–0తో రూడ్పై ఆధిక్యంలో ఉన్నాడు. మరోవైపు ప్రపంచ మూడో ర్యాంకర్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. ప్రపంచ ఐదో ర్యాంకర్ జాక్ డ్రేపర్ (బ్రిటన్)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో అల్కరాజ్ 6–4, 6–4తో విజయం సాధించాడు. సెమీస్లో కోకో గాఫ్ రోమ్ ఓపెన్ మహిళల టోర్నీలో ప్రపంచ మూడో ర్యాంకర్, అమెరికా స్టార్ కోకో గాఫ్ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. ప్రపంచ ఏడో ర్యాంకర్ మీరా ఆంద్రియెవా (రష్యా)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో కోకో గాఫ్ 6–4, 7–6 (7/5)తో గెలుపొందింది. ఒక గంట 32 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో కోకో గాఫ్ తన సర్విస్ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. -
తరుణ్ శుభారంభం
బ్యాంకాక్: థాయ్లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ ప్లేయర్ తరుణ్ మన్నేపల్లి శుభారంభం చేశాడు. క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లో అడుగు పెట్టిన తరుణ్ తొలి రౌండ్లో ప్రపంచ 45వ ర్యాంకర్ జస్టిన్ హో (మలేసియా)పై గెలుపొంది ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. 48 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో ప్రపంచ 53వ ర్యాంకర్ తరుణ్ 21–16, 21–19తో జస్టిన్ హో ఆట కట్టించాడు. క్వాలిఫయింగ్ ఫైనల్ రౌండ్లో ప్రపంచ మాజీ నంబర్వన్, భారత్కే చెందిన కిడాంబి శ్రీకాంత్ను బోల్తా కొట్టించిన తరుణ్ అదే జోరును మెయిన్ ‘డ్రా’లోనూ కొనసాగించాడు. తొలి గేమ్లో ఒకదశలో 8–11తో వెనుకబడిన తరుణ్ ఆ తర్వాత ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఏడు పాయింట్లు గెలిచి 15–11తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అదే దూకుడుతో ఆడి తొలి గేమ్ను దక్కించుకున్నాడు. వరుసగా మూడు పాయింట్లు నెగ్గి రెండో గేమ్ను ఆరంభించిన తరుణ్ ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్నాడు. ఒకదశలో జస్టిన్ హో 15–16తో ఆధిక్యాన్ని ఒక పాయింట్కు తగ్గించాడు. అయితే తరుణ్ రెండు పాయింట్లు గెలిచి 18–15తో ముందంజ వేశాడు. ఆ తర్వాత జస్టిన్ స్కోరును సమం చేసేందుకు యతి్నంచినా చివరకు తరుణ్ రెండు పాయింట్ల ఆధిక్యంతో గేమ్తోపాటు మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు.మరోవైపు పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో నేరుగా పోటీపడ్డ ఇద్దరు భారత ఆటగాళ్లు లక్ష్య సేన్, ప్రియాన్షు రజావత్ తొలి రౌండ్ను దాటలేకపోయారు. లక్ష్య సేన్ 18–21, 21–9, 17–21తో ఎన్హట్ నుగుయెన్ (ఐర్లాండ్) చేతిలో, ప్రియాన్షు 13–21, 21–17, 16–21తో అల్వీ ఫర్హాన్ (ఇండోనేసియా) చేతిలో పోరాడి ఓడిపోయారు. ప్రిక్వార్టర్స్లో గాయత్రి–ట్రెసా జోడీ మహిళల డబుల్స్లో భారత్కు చెందిన పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా... రష్మీ గణేశ్–సానియా సికందర్ (భారత్); సెల్వం కవిప్రియ–సిమ్రన్ సింఘి (భారత్) జంటలు తొలి రౌండ్లోనే నిష్క్రమించాయి. గాయత్రి–ట్రెసా ద్వయం 21–15, 21–13తో జిన్ యె–కార్మెన్ టింగ్ (మలేసియా) జంటను ఓడించింది. రష్మీ–సానియా 11–21, 5–21తో టాన్ పియర్లీ–థినా (మలేసియా) చేతిలో, కవిప్రియ–సిమ్రన్ 17–21, 17–21తో బెన్యాపా–నుంతాకర్న్ (థాయ్లాండ్) చేతిలో పరాజయం పాలయ్యారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో పృథ్వీ కృష్ణమూర్తి రాయ్–సాయిప్రతీక్ (భారత్) జంట 20–22, 21–17, 18–21తో ఆరిఫ్ జునైది–రాయ్ కింగ్ (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోయింది. ఉన్నతి, ఆకర్షి గెలుపు మహిళల సింగిల్స్ విభాగంగలో భారత క్రీడాకారిణులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ఉన్నతి హుడా, ఆకర్షి కశ్యప్, మాళవిక బన్సోద్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టగా... రక్షిత శ్రీ, అనుపమ తొలి రౌండ్లో ఓడిపోయారు. ఉన్నతి 21–14, 18–21, 23–21తో థమోన్వన్ (థాయ్లాండ్)పై, ఆకర్షి 21–16, 20–22, 22–20తో కవోరు సుగియామ (జపాన్)పై, మాళవిక 21–12, 13–21, 21–17తో నెస్లిహాన్ అరిన్ (తుర్కియే)పై విజయం సాధించారు. రక్షిత శ్రీ 18–21, 7–21తో యో జియా మిన్ (ఇండోనేసియా) చేతిలో, అనుపమ 11–21, 9–21తో ఇంతనోన్ రచనోక్ (థాయ్లాండ్) చేతిలో ఓటమి చవిచూశారు. -
భారత్లో ఆసియా కప్ హాకీ: పాక్కు ఎంట్రీ కష్టమే
న్యూఢిల్లీ: భారత్లో జరిగే పురుషుల ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో పాకిస్తాన్ పాల్గొనడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. పహల్గాంలో ఉగ్రదాడి తదనంతరం భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల కాస్తా యుద్ధ వాతావరణాన్ని సృష్టించింది. చివరకు కాల్పుల విరమణతో భారత్ వైపు నుంచి ప్రతిదాడులు తప్పినా... పాక్ నుంచి చీకటి పడగానే డ్రోన్ల దాడి ఎదురవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ హాకీ జట్టును కేంద్ర ప్రభుత్వం అనుమతించే అవకాశాలే లేవు. దీనిపై హాకీ ఇండియా (హెచ్ఐ) భారత ప్రభుత్వ సలహా కోరగా... ప్రభుత్వం నుంచి ప్రతిస్పందన రాలేదు. ఆగస్టు 27 నుంచి సెపె్టంబర్ 7 వరకు బిహార్లోని రాజ్గిర్ వేదికగా ఆసియా కప్ టోర్నీ జరగనుంది. ఇందులో ఆతిథ్య భారత్ సహా జపాన్, కొరియా, చైనా, మలేసియా, ఒమన్, చైనీస్ తైపీ, పాకిస్తాన్ పోటీపడతాయి. ప్రపంచకప్ హాకీకి ఈ ఆసియా కప్ క్వాలిఫయింగ్ టోర్నీగా జరుగుతోంది. నెదర్లాండ్స్, బెల్జియం సంయుక్తంగా ఆతిథ్యమివ్వబోతున్న ప్రపంచకప్ హాకీ టోర్నీ వచ్చే ఏడాది జరుగుతుంది. భారత్లో జరిగే టోర్నీ కోసం పాక్ను అనుమతించకపోవడం గతంలోనూ జరిగింది. 2016లో పఠాన్కోట్లో భారత ఎయిర్బేస్పై ఉగ్రదాడి జరగడంతో ఆ ఏడాది జరిగిన జూనియర్ ప్రపంచకప్ హాకీలో పాక్కు అనుమతించలేదు. ఏదేమైనా ప్రభుత్వ ఆదేశాలు, మార్గదర్శకాల ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుందని హాకీ ఇండియా సెక్రటరీ జనరల్ భోళానాథ్ సింగ్ చెప్పారు. అనుమతిస్తారా, నిరాకరిస్తారా అన్నది ప్రభుత్వం చేతుల్లో ఉందని, దీనిపై ముందస్తుగా తాము చెప్పడానికేమీ లేదని ఆయన చెప్పారు. ఆసియా టోర్నీలో పాక్ స్థానంలో మలేసియాను ఆడించే అవకాశమైంది. ఈ టోర్నీలో ఐదుసార్లు విజేత అయిన దక్షిణ కొరియా డిఫెండింగ్ చాంపియన్ హోదాతో బరిలోకి దిగుతుంది. కొరియా తర్వాత దాయాది దేశాలు చెరో నాలుగుసార్లు ఆసియా కప్ గెలిచాయి. -
నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం.. ఇకపై లెఫ్టినెంట్ కల్నల్గా
భారత స్టార్ జావెలిన్ త్రోయర్, ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం లభించింది. నీరజ్ చోప్రాకు టెరిటోరియల్ ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాను భారత సైన్యం ప్రధానం చేసింది . ఈ మేరకు బుధవారం కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ గెజిట్ జారీ చేసింది. నీరజ్ కొత్త ర్యాంక్ ఏప్రిల్ 16, 2025 నుండి అమల్లోకి వచ్చింది."1948 టెరిటోరియల్ ఆర్మీ రెగ్యులేషన్స్లోని పేరా 31 ద్వారా ఇవ్వబడిన అధికారాలను వినియోగించుకుని నీరజ్ చోప్రాకు లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ ర్యాంకును ప్రధానం చేయడానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారని" రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.కాగా నీరజ్ ముందుగా 2016 నయీబ్ సుబేదార్ హోదాలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్గా భారత సైన్యంలో చేరాడు. ఆ తర్వాత టోక్యో ఒలింపిక్స్-2021లో గోల్డ్ మెడల్ సాధించడంతో సుబేదార్గా పదోన్నతి పొందాడు. కాగా నీరజ్ చోప్రా..ఇండియన్ అథ్లెటిక్స్ హిస్టరీలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్లో భారత్కు బంగారు పతకాన్ని తీసుకొచ్చిన నీరజ్.. పారిస్ ఒలింపిక్స్లో రజత పతకంతో సత్తాచాటాడు. ఈ క్రమంలోనే గోల్డెన్ బాయ్కు లెఫ్టినెంట్ కల్నల్ హోదా లభించింది. కాగా దేశానికి చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ ప్రత్యేక హోదా భారత సైన్యం సత్కరిస్తోంది. ఈ గౌరవ హోదా పొందిన ఆరో క్రీడాకారుడిగా నీరజ్ నిలిచాడు. నీరజ్ కంటే ముందు ప్రముఖ షూటర్లు అభినవ్ బింద్రా, విజయ్ కుమార్.. దిగ్గజ క్రికెటర్లు కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని ఈ అరుదైన గౌరవాన్ని పొందారు. -
ఒకప్పుడు బాక్సింగ్ చాంపియన్.. ఇప్పుడు రామ్ చరణ్ బౌన్సర్!
దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్తో తలపడ్డ యోధుడు అతడు.. ఐదుసార్లు బ్రిటిష్ హెవీవెయిట్ చాంపియన్షిప్ గెలిచిన వీరుడు.. అంతేకాదు నాలుగుసార్లు కామన్వెల్త్ చాంపియన్గా నిలిచిన ఘనత అతడిది.. కానీ ఇప్పుడు ఓ ఈవెంట్లో బౌన్సర్..ఆ బాక్సింగ్ చాంపియన్ పేరు జూలియస్ ఫ్రాన్సిస్ (Julius Francis). కాగా టాలీవుడ్ హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charana) మైనపు విగ్రహాన్ని ఇటీవలే.. లండన్లోని మేడమ్ టుస్సాడ్స్ (Madame Tussauds) మ్యూజియంలో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి కుటుంబంతో సహా చెర్రీ హాజరయ్యాడు.ఈ సందర్భంగా రామ్ చరణ్ తన అభిమానులను కలిసేందుకు మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో బౌన్సర్ల బృందంలో బ్రిటిష్ హెవీవెయిట్ చాంపియన్ బాక్సర్ జూలియస్ ఫ్రాన్సిస్ కూడా కనిపించడం విశేషం.అంతేకాదు.. ఫ్రాన్సిస్ తన బాక్సింగ్ బెల్టును తీసుకుని రామ్ చరణ్ దగ్గరికి వచ్చి.. దానిని తన భుజం చుట్టూ వేయాల్సిందిగా కోరాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ఎవరీ జూలియస్ ఫ్రాన్సిస్?1993- 2006 మధ్య జూలియస్ ఫ్రాన్సిస్ ప్రొపెఫషనల్ బాక్సర్గా ఉన్నాడు. 2000 సంవత్సరంలో దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్తో తలపడ్డ అతడు.. ఓటమి చవిచూశాడు. అరవై ఏళ్ల జూలియస్ ఓవరాల్గా తన కెరీర్లో 23 విజయాలు సాధించి.. ఇరవై నాలుగింటిలో ఓడిపోయాడు.ఇక 2007లో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ బౌట్లోనూ జూలియస్ ఫ్రాన్సిస్ పాల్గొన్నాడు. 2012లో నటనా రంగంలోనూ అడుగుపెట్టాడు. ఆ తర్వాత 2022లో యూకేలో ఓ రెస్టారెంట్ బయట ఇంగ్లండ్ ఫుట్బాల్ జట్టు అభిమానులతో ఓ వ్యక్తికి గొడవ జరుగగా.. అక్కడే బౌన్సర్గా ఉన్న ఫ్రాన్సిస్ సదరు ఫ్యాన్స్ను నెట్టివేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో చాలాకాలం తర్వాత ఫ్రాన్సిస్ మరోసారి తెరమీదకు వచ్చాడు. ఇదిలా ఉంటే.. బాక్సర్ మైక్ టైసన్కు టాలీవుడ్తో అనుబంధం ఏర్పడిన విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమాలో అతడు కీలక పాత్రలో కనిపించాడు.చదవండి: ‘మాక్స్వెల్ను పెళ్లి చేసుకోలేదు కాబట్టే ఇలా’!.. మండిపడ్డ ప్రీతి జింటా.. -
కోచ్ ముర్రేతో జొకోవిచ్ తెగదెంపులు
లండన్: ఒక దిగ్గజ ప్లేయర్తో మరో మాజీ వరల్డ్ నంబర్వన్ కోచింగ్ అనుబంధం ఆరు నెలలకే ముగిసింది. సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ తన కోచ్, బ్రిటన్ మాజీ ప్లేయర్ ఆండీ ముర్రేతో తెగదెంపులు చేసుకున్నాడు. ఇకపై వీరిద్దరు కలిసి పని చేయరని ముర్రే మేనేజర్ ప్రకటించాడు. గత ఏడాది ముర్రే ఆటగాడిగా రిటైర్ అయిన తర్వాత తనకు కోచింగ్ సహకారం కావాలంటూ జొకోవిచ్ స్వయంగా ముర్రేను సంప్రదించాడు. దాంతో వీరిద్దరు ఈ ఏడాది తొలి గ్రాండ్స్లామ్ టోర్నీ ఆ్రస్టేలియన్ ఓపెన్కు ముందు జత కట్టారు. అయితే ఇది ఎక్కువ కాలం సాగలేదు. తన స్థాయికి తగ్గ ఆటతీరును కనబర్చలేక వరుసగా ఓడుతున్న జొకోవిచ్ ఈ సీజన్లో ఇంకా ఒక్క టైటిల్ కూడా నెగ్గలేదు. నిజానికి రాబోయే క్లే కోర్టు సీజన్ ముగిసే వరకు కూడా తనకు ముర్రే కోచ్గా వ్యవహరిస్తాడని గతంలోనే జొకోవిచ్ చెప్పినా... చివరకు దానికి చాలా ముందే ఇద్దరూ విడిపోయారు. ‘గత ఆరు నెలలుగా నాకు అందించిన సహకారానికి కృతజ్ఞతలు. కోర్టులో కఠోర శ్రమతో పాటు కోర్టు బయట కూడా రోజులు బాగా గడిచాయి’ అని జొకోవిచ్ సోషల్ మీడియాలో ముర్రే గురించి పోస్ట్ చేయగా...తనకు కోచ్గా అవకాశం ఇచ్చిన జొకోవిచ్కు ముర్రే కూడా థ్యాంక్స్ చెప్పాడు. ఇప్పటికే 24 గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన 37 ఏళ్ల జొకోవిచ్ మరో గ్రాండ్స్లామ్ టైటిల్ సాధిస్తే టెన్నిస్ చరిత్రలో అత్యధిక గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్స్ గెలిచిన ప్లేయర్గా ఆల్టైమ్ రికార్డు నెలకొల్పుతాడు. మహిళల విభాగంలో ఆ్రస్టేలియా క్రీడాకారిణి మార్గరెట్ కోర్ట్ 24 గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించింది. ప్రస్తుతం మార్గరెట్ కోర్ట్, జొకోవిచ్ పేరిట సంయుక్తంగా ఈ రికార్డు ఉంది. కెరీర్లో 99 సింగిల్స్ టైటిల్స్ సాధించిన జొకోవిచ్ 100వ టైటిల్ కోసం నిరీక్షిస్తున్నాడు. తదుపరి ఈనెల 18 నుంచి 24వ తేదీ వరకు జరిగే జెనీవా ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో జొకోవిచ్ బరిలోకి దిగనున్నాడు. ఈ టోర్నీలో జొకోవిచ్ గెలిస్తే జిమ్మీ కానర్స్ (109; అమెరికా), రోజర్ ఫెడరర్ (103; స్విట్జర్లాండ్) తర్వాత 100 సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన మూడో క్రీడాకారిడిగా గుర్తింపు పొందుతాడు. -
శ్రీకాంత్కు చుక్కెదురు
బ్యాంకాక్: ప్రపంచ మాజీ నంబర్వన్, భారత అగ్రశ్రేణి షట్లర్ కిడాంబి శ్రీకాంత్ నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. థాయ్లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన శ్రీకాంత్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించడంలో విఫలమయ్యాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ చివరి రౌండ్ మ్యాచ్లో తెలంగాణకు చెందిన తరుణ్ మన్నేపల్లి 21–16, 21–19తో శ్రీకాంత్ను బోల్తా కొట్టించి మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందాడు.అంతకుముందు క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో 23 ఏళ్ల తరుణ్ 17–21, 21–19, 21–17తో కువో కువాన్ లిన్ (చైనీస్ తైపీ)పై, 32 ఏళ్ల శ్రీకాంత్ 21–15, 21–17తో శంకర్పై గెలుపొందారు. భారత్కే చెందిన ఆయుశ్ శెట్టి, ఐరా శర్మ కూడా మెయిన్ ‘డ్రా’కు చేరుకోలేకపోయారు. క్వాలిఫయింగ్ ఫైనల్ రౌండ్ మ్యాచ్ల్లో ఆయుశ్ శెట్టి 14–21, 20–22తో జస్టిన్ హో (మలేసియా) చేతిలో, ఐరా 12–21, 18–21తో థమన్వోన్ (థాయ్లాండ్) చేతిలో ఓడిపోయారు. మిక్స్డ్ డబుల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో మొహిత్–లక్షిత (భారత్) జోడీ 8–21, 10–21తో ఎన్జీ సాజ్ యావు–చాన్ యిన్ చాక్ (హాంకాంగ్) ద్వయం చేతిలో ఓడింది. -
భారత్ను సెమీస్కు చేర్చిన రోహెన్ సింగ్
దక్షిణాసియా అండర్–19 పురుషుల ఫుట్బాల్ చాంపియన్షిప్లో భారత జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. అరుణాచల్ప్రదేశ్లో మంగళవారం జరిగిన గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్లో భారత్ 4–0 గోల్స్ తేడాతో నేపాల్ జట్టును ఓడించి గ్రూప్ ‘టాపర్’గా నిలిచి సెమీఫైనల్కు అర్హత పొందింది. భారత్ తరఫున చాపామాయుమ్ రోహెన్ సింగ్ (28వ, 76వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... ఒమంగ్ డోడుమ్ (29వ నిమిషంలో), డానీ మీటీ (84వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. ఈనెల 16న జరిగే సెమీఫైనల్లో మాల్దీవులు జట్టుతో భారత్ తలపడుతుంది. -
తెలంగాణ జిమ్నాస్ట్ నిష్కా అగర్వాల్కు స్వర్ణం
ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2025లో తెలంగాణ యువ జిమ్నాస్ట్ నిష్కాఅగర్వాల్ స్వర్ణ పతకంతో మెరిసింది. న్యూఢిల్లీలో జరుగుతున్న ఈ గేమ్స్లో హైదరాబాద్కు చెందిన 17 ఏళ్ల నిష్కా ఆర్టిస్టిక్స్ జిమ్నాస్టిక్స్ ఆల్ అరౌండ్ విభాగంలో విజేతగా నిలిచింది. నిష్కా 44.333 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని పొందింది. అనుష్క పాటిల్ (మహారాష్ట్ర; 42.067 పాయింట్లు) రజతం, సారా రవూల్ (మహారాష్ట్ర; 41.233 పాయింట్లు) కాంస్యం సాధించారు. -
భారత జట్టు ప్రకటన
న్యూఢిల్లీ: ప్రొ హాకీ లీగ్ చివరి అంచె టోర్నమెంట్లో పాల్గొనే భారత మహిళల జట్టును ప్రకటించారు. 24 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు జార్ఖండ్కు చెందిన మిడ్ఫీల్డర్ సలీమా టెటె సారథ్యం వహిస్తుంది. పంజాబ్కు చెందిన ఫార్వర్డ్ నవ్నీత్ కౌర్ వైస్ కెపె్టన్గా వ్యవహరిస్తుంది. ప్రొ హాకీ లీగ్ చివరి అంచె మ్యాచ్లు జూన్ 14 నుంచి 29వ తేదీ వరకు యూరోప్లోని జర్మనీ,బ్రిటన్, బెల్జియం దేశాల్లో జరుగుతాయి.ఈ టోర్నీలో భారత జట్టు మొత్తం ఎనిమిది మ్యాచ్లు ఆడుతుంది. ఆస్ట్రేలియా, అర్జెంటీనా, బెల్జియం, చైనా జట్లతో భారత్ రెండు మ్యాచ్ల చొప్పున ఆడుతుంది. భారత జట్టు వరుసగా జూన్ 14, 15వ తేదీల్లో లండన్లో ఆ్రస్టేలియా జట్టుతో... జూన్ 17, 18వ తేదీల్లో లండన్లో అర్జెంటీనాతో... జూన్ 21, 22వ తేదీల్లో ఆంట్వర్ప్లో బెల్జియంతో... జూన్ 28, 29వ తేదీల్లో బెర్లిన్లో చైనా జట్టుతో పోటీపడుతుంది. తొమ్మిది జట్లు పోటీపడుతున్న ప్రొ హాకీ లీగ్లో భారత్ ఇప్పటి వరకు 8 మ్యాచ్లు పూర్తి చేసుకుంది. ఇందులో రెండు మ్యాచ్ల్లో గెలిచి, రెండు మ్యాచ్లను ‘డ్రా’ చేసుకొని, నాలుగు మ్యాచ్ల్లో ఓడిపోయింది. మొత్తం తొమ్మిది పాయింట్లతో భారత్ ఆరో స్థానంలో ఉంది. టోర్నీ ముగిశాక చివరిదైన తొమ్మిదో స్థానంలో నిలిచిన జట్టు వచ్చే సీజన్లో ప్రొ లీగ్ నుంచి బయటకు వచ్చి నేషన్స్ కప్లో ఆడాల్సి ఉంటుంది. ప్రొ లీగ్ విజేత జట్టు తదుపరి ప్రపంచకప్ టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తుంది.భారత మహిళల హాకీ జట్టుసలీమా టెటె (కెప్టెన్), నవ్నీత్ కౌర్ (వైస్ కెప్టెన్), సవిత, బిచ్చూదేవి (గోల్ కీపర్లు), సుశీలా చాను, జ్యోతి, సుమన్ దేవి, జ్యోతి సింగ్, ఇషిక చౌధరీ, జ్యోతి ఛత్రి (డిఫెండర్లు), వైష్ణవి విఠల్ ఫాడ్కే, సుజాత కుజుర్, మనీశా చౌహాన్, నేహా, లాల్రెమ్సియామి, షర్మిలా దేవి, సునెలితా టొప్పో, మహిమా టెటె (మిడ్ ఫీల్డర్లు), దీపిక, దీపిక సోరెంగ్, బల్జీత్ కౌర్, రుతుజా, బ్యూటీ డుంగ్డుంగ్, సాక్షి రాణా (ఫార్వర్డ్లు). -
గాయత్రి–ట్రెసా జాలీ జోడీ పునరాగమనం
బ్యాంకాక్: గాయాల కారణంగా సుదిర్మన్ కప్ ప్రపంచ మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఆడలేకపోయిన భారత మహిళల డబుల్స్ నంబర్వన్ జోడీ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (Treesa Jolly) ద్వయం పునరాగమనం చేయనుంది. మంగళవారం నుంచి మొదలయ్యే థాయ్లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం బరిలోకి దిగనుంది. తొలి రౌండ్లో ఒంగ్ జిన్ యి–కార్మెన్ తింగ్ (మలేసియన్) జంటతో గాయత్రి–ట్రెసా ద్వయం తలపడుతుంది.మరోవైపు పురుషుల సింగిల్స్లో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ సహా యువ బ్యాడ్మింటన్ తారలు ఆయుశ్ షెట్టి, ఉన్నతి హుడాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. నేడు క్వాలిఫయింగ్ పోటీలు జరుగుతాయి. 20 ఏళ్ల ఆయుశ్, 17 ఏళ్ల ఉన్నతిలు తమ జోరు కొనసాగించేందుకు పట్టుదలతో ఉన్నారు. గతవారం జరిగిన చైనీస్ తైపీ ఓపెన్లో ఈ ఇద్దరు సెమీఫైనల్స్ చేరి భారత బ్యాడ్మింటన్ భవిష్యత్కు కొత్త ఊపిరిలూదారు.అయితే ఈ టోర్నీలో వీరిద్దరు క్వాలిఫయింగ్ మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. ఆయుశ్, ఉన్నతిలు ఉన్న ఫామ్ దృష్ట్యా మెయిన్ ‘డ్రా’ చేరడం ఏమంత కష్టం కాదు. తొలి మ్యాచ్లో ఆయుశ్ ఫిన్లాండ్కు చెందిన జొకిమ్ ఒల్టార్ఫ్ తో, మహిళల క్వాలిఫయర్స్లో ఉన్నతి... స్థానిక ప్లేయర్ తమోన్వన్ నితిటిక్రాయ్తో తలపడతారు. బుధవారం జరిగే మెయిన్ ‘డ్రా’ తొలి మ్యాచ్లో భారత స్టార్ లక్ష్యసేన్ ఐర్లాండ్ ఆటగాడు ఎన్హత్ నెన్గుయెన్ను ఎదుర్కొంటాడు.గాయం నుంచి కోలుకోకపోవడంతో సుదిర్మన్ కప్కు దూరంగా ఉన్న లక్ష్యసేన్ తాజా టోర్నీ ద్వారా తన ఫిట్నెస్ను పరీక్షించుకోనున్నాడు. మరో మ్యాచ్లో నిలకడగా రాణిస్తున్న ప్రియాన్షు రజావత్... అల్వీ ఫర్హాన్ (ఇండోనేసియా)తో తలపడతాడు. మహిళల సింగిల్స్లో భారత మేటి షట్లర్ మాళవిక న్సోద్... తుర్కియేకు చెందిన నెస్లిహన్ యిగిత్తో జరిగే తొలి రౌండ్ పోరుతో థాయ్ ఓపెన్ను ప్రారంభించనుంది. మిగతా మ్యాచ్ల్లో మాజీ జాతీయ చాంపియన్ అనుపమకు మొదటి రౌండ్లోనే గట్టి సవాల్ ఎదురవుతోంది. ఆమె మాజీ ప్రపంచ చాంపియన్ రత్చనోక్ ఇంతనాన్ (థాయ్లాండ్)ను ఎదుర్కోనుంది. -
నెరవేరిన కేన్ కల
బెర్లిన్: ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు కాదు... ఏకంగా ఆరుసార్లు కెరీర్లో మేజర్ ట్రోఫీలు సాధించే అవకాశాన్ని త్రుటిలో కోల్పోయిన ఇంగ్లండ్ ఫుట్బాల్ జట్టు కెప్టెన్ హ్యారీ కేన్ ఏడో ప్రయత్నంలో విజయవంతమయ్యాడు. ప్రతిష్టాత్మక జర్మనీ అంతర్జాతీయ ఫుట్బాల్ లీగ్ బుండెస్లీగాలో హ్యారీ కేన్ తన స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. 2024–2025 బుండెస్లీగా సీజన్లో బాయెర్న్ మ్యూనిక్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) జట్టును విజేతగా నిలబెట్టాడు. ఈ క్రమంలో తన కెరీర్లో లోటుగా ఉన్న మేజర్ ట్రోఫీని అందుకున్నాడు.బొరుసియా మొంచెన్గ్లాడ్బాచ్ క్లబ్తో జరిగిన 33వ లీగ్ మ్యాచ్లో మాన్యుయెల్ నెయుర్ సారథ్యంలోని బాయెర్న్ మ్యూనిక్ జట్టు 2–0 గోల్స్ తేడాతో గెలిచింది. తద్వారా ఈ సీజన్లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే బాయెర్న్ మ్యూనిక్ జట్టు రికార్డుస్థాయిలో 33వసారి బుండెస్లీగా టైటిల్ను హస్తగతం చేసుకుంది. మ్యూనిక్ జట్టుకు హ్యారీ కేన్ (31వ నిమిషంలో), మైకేల్ ఒలిస్ (90వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. ఈ సీజన్లు 30 మ్యాచ్లు ఆడిన హ్యారీ కేన్ 25 గోల్స్తో టాప్ స్కోరర్గా ఉన్నాడు. సీజన్లోని చివరి మ్యాచ్ మే 17న హఫెన్హీమ్ జట్టుతో బాయెర్న్ మ్యూనిక్ జట్టు ఆడుతుంది.మొత్తం 18 జట్లు ఇంటా, బయట పద్ధతిలో బుండెస్లీగాలో పోటీపడుతున్నాయి. ఒక్కో జట్టు 34 మ్యాచ్లు ఆడుతుంది. 33 మ్యాచ్లు పూర్తి చేసుకున్న బాయెర్న్ మ్యూనిక్ జట్టు 24 విజయాలు సాధించింది. 7 మ్యాచ్లను ‘డ్రా’ చేసుకొని, 2 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 95 గోల్స్ సాధించి, 32 గోల్స్ను సమర్పించుకుంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 79 పాయింట్లతో టాప్ ర్యాంక్ను ఖరారు చేసుకుంది.68 పాయింట్లతో బాయెర్ 04 లెవెర్కుసెన్ జట్టు రన్నరప్ ట్రోఫీని ఖరారు చేసుకుంది. 31 హ్యారీ కేన్ సారథ్యంలో ఇంగ్లండ్ జట్టు 2021, 2024 ‘యూరో’ టోరీ్నలో రన్నరప్గా నిలిచింది. హ్యారీ కేన్ సభ్యుడిగా ఉన్న టోటెన్హామ్ హాట్స్పర్ క్లబ్ జట్టు 2015, 2019లలో ఇంగ్లిష్ ఫుట్బాల్ లీగ్ కప్లో రన్నరప్గా... 2019 చాంపియన్స్ లీగ్లో రన్నరప్గా నిలిచింది. 2023లో కేన్ సభ్యుడిగా ఉన్న బాయెర్న్ మ్యూనిక్ జట్టు జర్మన్ సూపర్ కప్లో రెండో స్థానాన్ని దక్కించుకుంది. దాంతో ఆరుసార్లు హ్యారీ కేన్కు టైటిల్ దక్కినట్టే దక్కి చేజారిపోయింది. అయితే ఏడో ప్రయత్నంలో హ్యారీ కేన్ ఖాతాలో బుండెస్లీగా రూపంలో మేజర్ టైటిల్ చేరింది. -
త్రుటిలో చేజారిన పతకాలు
అల్ అయిన్ (యూఏఈ): ఆసియా వ్యక్తిగత చెస్ చాంపియన్షిప్ బ్లిట్జ్ విభాగంలో భారత్కు త్రుటిలో రెండు కాంస్య పతకాలు చేజారాయి. పురుషుల విభాగంలో తమిళనాడు గ్రాండ్మాస్టర్ మురళీ కార్తికేయన్... మహిళల విభాగంలో ఒడిశా అమ్మాయి పద్మిని రౌత్ నాలుగో స్థానంలో నిలిచి కాంస్య పతకాలను కోల్పోయారు. నిరీ్ణత తొమ్మిది రౌండ్ల తర్వాత కార్తికేయన్ ఏడు పాయింట్లతో మరో ముగ్గురితో కలిసి ఉమ్మడిగా నాలుగో స్థానంలో నిలిచాడు. దాంతో మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్ను వర్గీకరించారు.రుడిక్ మకారియన్ (రష్యా)కు మూడో స్థానంతోపాటు కాంస్య పతకం ఖరారైంది. కార్తికేయన్కు నాలుగో స్థానం, నీలాశ్ సాహా (భారత్)కు ఐదో స్థానం, జియాంగ్ హావోచెన్ (చైనా)కు ఆరో స్థానం లభించాయి. పురుషుల విభాగంలో మొత్తం 111 మంది ప్లేయర్లు పోటీపడగా... 8 పాయింట్లతో 15 ఏళ్ల ఇవాన్ జెమ్లియాన్స్కి (రష్యా) విజేతగా అవతరించాడు. ఇరాన్కు చెందిన 15 ఏళ్ల సినా మొవాహెద్ 7.5 పాయింట్లతో రజతాన్ని దక్కించుకున్నాడు. మహిళల విభాగంలో నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత పద్మిని రౌత్, యుజిన్ సాంగ్ (చైనా), ఎల్నాజ్ కలియాక్మెత్ (కజకిస్తాన్) ఏడు పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచారు. దాంతో మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా కాంస్య పతకాన్ని ఖరారు చేయగా... యుజిన్ సాంగ్కు కాంస్యం లభించింది. పద్మిని నాలుగో స్థానంలో, ఎల్నాజ్ ఐదో స్థానంలో నిలిచారు. 7.5 పాయింట్లతో అలువా నుర్మాన్ (కజకిస్తాన్), వాలెంటీనా గునీనా (రష్యా) సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్లను వర్గీకరించగా... నుర్మాన్కు స్వర్ణం, గునీనాకు రజతం లభించాయి. ఆసియా టోర్నిలో రష్యా ప్రాతినిధ్యం ఎందుకంటే... ఉక్రెయిన్, రష్యా యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) రష్యా క్రీడాకారులు అంతర్జాతీయ టోర్నిలలో రష్యా తరఫున పాల్గొనడంపై నిషేధం విధించాయి. అయితే రష్యా క్రీడాకారులు దేశం తరఫున కాకుండా తటస్థ క్రీడాకారులుగా పాల్గొనవచ్చని ఐఓసీ వెసులుబాటు కల్పించింది. దాంతో పలువురు రష్యా క్రీడాకారులు అంతర్జాతీయ టోర్నిలలో ఆయా క్రీడా సమాఖ్య పతాకాలపై బరిలోకి దిగుతున్నారు. ఇక రష్యా చెస్ క్రీడాకారుల విషయానికొస్తే 2023లో రష్యా యూరోపియన్ చెస్ యూనియన్ నుంచి బయటకు వచ్చి ఆసియా సమాఖ్యలో చేరింది. పలు టోర్నీలలో రష్యా ప్లేయర్లు ప్రపంచ చెస్ సమాఖ్య (ఫిడే) తరఫున పాల్గొంటున్నారు. తాజాగా ఆసియా చాంపియన్షిప్లో రష్యా క్రీడాకారులు ‘ఫిడే’ పతాకంపై పోటీపడుతున్నారు. -
భారత్ ‘పాంచ్ పటాకా’
షాంఘై: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–2 టోర్నమెంట్లో భారత కాంపౌండ్ ఆర్చర్లు 5 పతకాలతో సత్తాచాటారు. వ్యక్తిగత విభాగంలో మధుర స్వర్ణ పతకంతో మెరిసింది. దీంతో ఈ టోర్నీలో భారత ఆర్చర్లకు మొత్తంగా 2 స్వర్ణాలు, ఒక రజతం, 2 కాంస్యాలు దక్కాయి. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత ఫైనల్లో మధుర 139–138తో కార్సన్ (అమెరికా)పై గెలుపొందింది. మహారాష్ట్రకు చెందిన 24 ఏళ్ల మధుర ఈ టోర్నీలో ఓవరాల్గా మూడు పతకాలు గెలుచుకుంది. వ్యక్తిగత విభాగంలో పసిడి నెగ్గిన మధుర... టీమ్ ఈవెంట్లో రజతం, మిక్స్డ్ విభాగంలో కాంస్యం గెలిచిన జట్లలో కూడా సభ్యురాలు. ఫైనల్లో మొదట ‘పర్ఫెక్ట్ 30’ పాయింట్లు సాధించిన మధుర ఆ తర్వాత ఆకట్టుకోలేకపోయింది. ఒకదశలో వరుసగా రెండు సార్లు 8 పాయింట్లతో పాటు ఒకసారి 7 పాయింట్లు ఖాతాలో వేసుకొని 81–85తో వెనుకంజలో పడింది. తర్వాతి రౌండ్లో మెరుగైన ప్రదర్శనతో స్కోరును 110–110తో సమం చేసి... అదే జోరు కొనసాగిస్తూ పసిడి ఖాతాలో వేసుకుంది. అంతకుముందు కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో భారత పురుషుల జట్టు స్వర్ణం గెలుచుకుంది. అభిషేక్ వర్మ, రిషభ్ యాదవ్, ఓజస్ ప్రవీణ దేవ్తలేలతో కూడిన భారత పురుషుల జట్టు ఆదివారం జరిగిన ఫైనల్లో 232–228 పాయింట్ల తేడాతో మెక్సికో జట్టుపై గెలుపొందింది. ఇక పురుషుల వ్యక్తిగత విభాగంలో 22 ఏళ్ల రిషభ్ యాదవ్ కాంస్య పతకంతో మెరిశాడు. షూటాఫ్లో అతడు దక్షిణ కొరియా ఆర్చర్పై విజయం సాధించాడు. వెన్నం జ్యోతి సురేఖ (ఆంధ్రప్రదేశ్), తనిపర్తి చికిత (తెలంగాణ), మధుర (మహారాష్ట్ర) లతో కూడిన భారత మహిళల కాంపౌండ్ జట్టు రజత పతకం చేజిక్కించుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో సురేఖ, చికిత, మధుర త్రయం. 221–234తో మెక్సికో జట్టు చేతిలో ఓడింది. ఇక మిక్స్డ్ టీమ్ విభాగంలో మధుర–అభిõÙక్ వర్మ జంట కాంస్యం గెలుచుకుంది. కాంస్య పతక పోరులో భారత జోడీ 144–142 పాయింట్ల తేడాతో ఫాటిన్ నూర్ఫతే–మొహమ్మద్ జువైదీ (అమెరికా)పై గెలుపొందింది. తాజా ప్రదర్శనతో భారత కాంపౌండ్ జట్టు భవిష్యత్తుపై మరిన్ని అంచనాలు పెరుగుతున్నాయి. తొలి సారి 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో ఆర్చరీ కాంపౌండ్ టీమ్ ఈవెంట్ను ప్రవేశపెడుతున్నారు. ఇదే జోరు కొనసాగిస్తే మనకు ఒలింపిక్స్కు పతకం సాధించేందుకు మంచి అవకాశం ఉంది. -
మూడు పతకాలకు విజయం దూరంలో
షాంఘై: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–2 టోర్నమెంట్లో భారత ఆర్చర్లు మూడు విజయాలు సాధిస్తే మూడు పతకాలను ఖరారు చేసుకుంటారు. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో అభిషేక్ వర్మ (ఢిల్లీ)–మధుర (మహారాష్ట్ర) జోడీ కాంస్య పతకం కోసం పోటీపడనుండగా... మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో దీపిక కుమారి... పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో పార్థ్ సాలుంఖే సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. సెమీఫైనల్లో గెలిస్తే దీపిక, పార్థ్ స్వర్ణ, రజత పతకాల కోసం రేసులో నిలుస్తారు. సెమీఫైనల్లో ఓడిపోతే కాంస్య పతకం కోసం పోటీపడతారు. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ సెమీఫైనల్లో అభిషేక్–మధుర ద్వయం 156–158తో ఎల్లా గిబ్సన్–అజయ్ స్కాట్ (బ్రిటన్) జంట చేతిలో ఓడిపోయింది. నేడు జరిగే కాంస్య పతక మ్యాచ్లో ఫాటిన్ నూర్ఫతే–మొహమ్మద్ జువైదీ (అమెరికా)లతో అభిషేక్, మధుర తలపడతారు. పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో ఒలింపియన్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్ రాయ్ తొలి రౌండ్లో, అతాను దాస్ క్వార్టర్ ఫైనల్లో ని్రష్కమించారు. ధీరజ్ 5–6తో అబ్దుల్లా (టర్కీ) చేతిలో, తరుణ్దీప్ 5–6తో తెత్సుయ (జపాన్) చేతిలో, అతాను దాస్ 2–6తో కిమ్ వూజిన్ (కొరియా) చేతిలో ఓడిపోయారు. పార్థ్ సాలుంఖే తొలి రౌండ్లో 6–5తో 2020 టోక్యో ఒలింపిక్స్ స్వర్ణపతక విజేత మెటీ గాజోజ్ (టర్కీ)పై, రెండో రౌండ్లో 6–5తో తెత్సుయ (జపాన్)పై, మూడో రౌండ్లో 6–2తో రియాన్ ట్యాక్ (ఆస్ట్రేలియా)పై, క్వార్టర్ ఫైనల్లో 6–2తో కిమ్ జె డియోక్ (కొరియా)పై గెలుపొందాడు. మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో ‘ట్రిపుల్ ఒలింపియన్’ దీపిక కుమారి తొలి రౌండ్లో 6–4తో లూసియా (స్పెయిన్)పై, రెండో రౌండ్లో 6–0తో డయానా (కజకిస్తాన్)పై, మూడో రౌండ్లో 6–4తో విక్టోరియా (ఫ్రాన్స్)పై, క్వార్టర్ ఫైనల్లో 6–2తో లీ జియామన్ (చైనా)పై విజయం సాధించింది. భారత్కే చెందిన అంకిత మూడో రౌండ్లో 3–7తో లిమ్ సిహైన్ (కొరియా) చేతిలో, అన్షిక తొలి రౌండ్లో 5–6తో ఎలీసా టార్ట్లెర్ (జర్మనీ) చేతిలో, సిమ్రన్జిత్ తొలి రౌండ్లో 3–7తో యుహెరా రుకా (జపాన్) చేతిలో ఓటమి చవిచూశారు. -
మేమంతా మీ వెంటే...
న్యూఢిల్లీ: పాకిస్తాన్ సైన్యం దుశ్చర్యలను తమ ప్రాణాలు పణంగా పెట్టి ఎదుర్కొంటున్న భారత త్రివిధ దళాలకు క్రీడా దిగ్గజాలు మద్దతు పలికారు. క్రికెట్ స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి సహా చాంపియన్ అథ్లెట్ నీరజ్ చోప్రా, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధులు దేశ ప్రజల సంరక్షణ కోసం పగలనక... రాత్రనక శ్రమిస్తున్న సాయుధ బలగాల ధైర్యానికి సెల్యూట్ చేశారు. ప్రాణాలొడ్డి పోరాడుతున్న భారత సేనల ధైర్య సాహసాల్ని స్టార్లంతా కొనియాడారు. సోషల్ మీడియా వేదికగా తామంతా సైన్యం వెంటే అని స్థయిర్యం పెంచారు. దేశ రక్షణే లక్ష్యంగా శ్రమిస్తోన్న భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్లను చూసి గర్వపడుతున్నా. త్రివిధ దళాలు తీసుకునే ప్రతీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నా. ఈ పోరాటయోధుల వల్లే భారత్ తలెత్తుకొని నిలబడుతోంది. దేశం కోసం అహరి్నశలు శ్రమించే మీ వెంటే జాతి మొత్తం నడుస్తుంది. ఇలాంటి సందర్భంలో ప్రతి భారతీయుడు బాధ్యతగా మెలగాలి. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాన్ని ఎక్కడికక్కడ కట్టడి చేయాలని విజ్ఞప్తి. –భారత కెప్టెన్ రోహిత్ శర్మసాయుధ బలగాలకు నా సలామ్. ఎలాంటి విపత్కర పరిస్థితులకైనా ఎదురునిలిచి దేశాన్ని కాపాడే మన వీరుల ధైర్యసాహసాలకు జేజేలు పలుకుతున్నాం. భారత్ కోసం మీరు, మీ కుటుంబసభ్యులు చేసే త్యాగాలకు మేమంతా రుణపడే ఉంటాం. –విరాట్ కోహ్లి ఉగ్రవాదులను హతమార్చితే మౌనంగా ఉండాల్సిన చోట పాక్ యుద్ధాన్ని ఎంచుకొని తమ వక్రబుద్ధిని మరోమారు చూపింది. దీనికి తగిన గుణపాఠం మా సైన్యం మీకు నేర్పుతుంది. ఆ పాఠమెలా ఉంటుందంటే జీవితంలో మీరెప్పుడు మర్చిపోరు. –వీరేంద్ర సెహ్వాగ్ టెర్రరిజంపై పోరాటం... దేశ రక్షణకోసం మీరు కనబరిచే సాహసాలు మాకెంతో గర్వకారణం. సరిహద్దుల్లో మీరున్నారనే ధైర్యమే దేశాన్ని ధీమాగా నడిపిస్తోంది.–నీరజ్ చోప్రాభారత దళాలు చూపే ధైర్యం, క్రమశిక్షణ, త్యాగాలే దేశానికి బలం. ఆపరేషన్ సిందూర్ను విజయవంతంగా నిర్వహించి మన పతకాన్ని రెపరెపలాడించిన మీ నిస్వార్థసేవల్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. జై హింద్. –పీవీ సింధు -
‘నీరజ్ చోప్రా క్లాసిక్’ ఈవెంట్ వాయిదా
న్యూఢిల్లీ: భారతదేశంలో తొలిసారి నిర్వహించ తలపెట్టిన అంతర్జాతీయ జావెలిన్ టోర్నమెంట్ ‘నీరజ్ చోప్రా క్లాసిక్’ ఈవెంట్ వాయిదా పడింది. భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఈవెంట్ను వాయిదా వేశారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 24న బెంగళూరు వేదికగా ఈ మీట్ జరగాల్సి ఉండగా... భారత్, పాక్ దాడుల నేపథ్యంలో టోర్నమెంట్ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం నీరజ్ చోప్రా వెల్లడించాడు. ‘ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ‘నీరజ్ చోప్రా క్లాసిక్’ తొలి ఎడిషన్ను వాయిదా వేశాం. ఈవెంట్లో పాల్గొనే అథ్లెట్లు, భాగస్వాముల క్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం. సుదీర్ఘ చర్చల అనంతరం ఈ నిర్ణయానికి వచ్చాం. త్వరలోనే తదుపరి కార్యచరణ వెల్లడిస్తాం. ఈ క్లిష్ట సమయంలో దేశంతో దృఢంగా నిలబడటం చాలా ముఖ్యం. ప్రజల రక్షణ కోసం సరిహద్దుల్లో భద్రతా బలగాలు పోరాడుతున్నాయి. మేమంతా వారి వెంటే. జై హింద్’ అని నీరజ్ చోప్రా పేర్కొన్నాడు. -
భారత్ చేజారిన కాంస్యం
షాంఘై: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–2 టోర్నమెంట్లో భారత రికర్వ్ పురుషుల, మహిళల జట్లు పతకం సాధించడంలో విఫలమయ్యాయి. ధీరజ్ బొమ్మదేవర (ఆంధ్రప్రదేశ్), అతాను దాస్ (బెంగాల్), తరుణ్దీప్ రాయ్ (సిక్కిం)లతో కూడిన భారత పురుషుల జట్టు త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకోగా... దీపిక కుమారి (జార్ఖండ్), అంకిత (బెంగాల్), అన్షిక కుమారి (బిహార్)లతో కూడిన భారత మహిళల జట్టు మాత్రం రెండో రౌండ్లోనే వెనుదిరిగింది. కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత ప్లేయర్లు మధుర (మహారాష్ట్ర), రిషభ్ యాదవ్ (హరియాణా) సెమీఫైనల్ చేరుకొని పతకాల వేటలో నిలిచారు. క్రిస్టియన్ స్టాడర్డ్, బ్రాడీ ఎలీసన్, జాక్ విలియమ్స్లతో కూడిన అమెరికా జట్టుతో కాంస్య పతక మ్యాచ్లో భారత పురుషుల జట్టు 3–5 సెట్ పాయింట్లతో ఓడిపోయింది. తొలి సెట్ను అమెరికా 57–56తో నెగ్గి 2 పాయింట్లు సాధించింది. రెండో సెట్ 56–52తో అమెరికా ఖాతాలోనే వెళ్లింది. అమెరికా ఆధిక్యం 4–0కు పెరిగింది. మూడో సెట్ను భారత్ 55–54తో గెలిచి 2 పాయింట్లు సంపాదించింది. నాలుగో సెట్లో రెండు జట్లు 56–56తో సమంగా నిలిచాయి. దాంతో రెండు జట్లకు ఒక్కో పాయింట్ దక్కింది. ఓవరాల్గా అమెరికా 5–3తో విజయాన్ని ఖరారు చేసుకొని కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. అంతకుముందు భారత జట్టు 5–4తో (53–51, 55–58, 55–56, 54–53, 29–27) కజకిస్తాన్పై గెలిచింది. నాలుగు సెట్ల తర్వాత రెండు జట్లు 4–4తో సమంగా నిలిచాయి. దాంతో ‘షూట్ ఆఫ్’ నిర్వహించగా... భారత్ పైచేయి సాధించింది. క్వార్టర్ ఫైనల్లో భారత్ 6–0తో (58–56, 57–56, 55–53)తో ఇటలీపై నెగ్గింది. సెమీఫైనల్లో టీమిండియా 4–5తో (51–54, 50–56, 56–55, 55–53, 25–26) ‘షూట్ ఆఫ్’లో ఫ్రాన్స్ జట్టు చేతిలో ఓడిపోయింది. తొలి రౌండ్లో ‘బై’ పొంది నేరుగా రెండో రౌండ్ మ్యాచ్ ఆడిన భారత మహిళల జట్టు 4–5తో (49–50, 52–54, 52–45, 55–48, 26–27)తో ‘షూట్ ఆఫ్’లో అలెజాంద్రా వలెన్సియా, వాలెంటీనా వాజ్క్వెజ్, మోంటాయ అల్ఫారోలతో కూడిన మెక్సికో జట్టు చేతిలో ఓడిపోయింది. చికిత, జ్యోతి సురేఖలకు నిరాశ మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, తెలంగాణ క్రీడాకారిణి తనిపర్తి చికిత, ప్రపంచ చాంపియన్ అదితి స్వామి నిరాశపరచగా... మధుర సెమీఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్లో మధుర 142–141తో జ్యోతి సురేఖను ఓడించింది. రెండో రౌండ్ మ్యాచ్ల్లో చికిత 134–138తో అదెల్ జెక్సెన్బినోవా (కజకిస్తాన్) చేతిలో, అదితి 129–140తో కార్సన్ క్రాహి (అమెరికా) చేతిలో ఓడిపోయారు.పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత క్వార్టర్ ఫైనల్లో రిషభ్ డెన్మార్క్కు చెందిన మథియాస్ ఫులర్టన్పై గెలిచాడు. నిర్ణీత 15 బాణాల తర్వాత ఇద్దరూ 147–147తో సమంగా నిలిచారు. ‘షూట్ ఆఫ్’లోనూ ఇద్దరూ 10 పాయింట్లు స్కోరు చేశారు. అయితే రిషభ్ సంధించిన బాణం కేంద్ర బిందువుకు అతి సమీపంగా ఉండటంతో అతనికి సెమీఫైనల్ బెర్త్ ఖరారైంది. -
ఉజ్బెకిస్తాన్తో భారత్ ‘ఢీ’
న్యూఢిల్లీ: ఈ నెలాఖరులో భారత సీనియర్ మహిళల ఫుట్బాల్ జట్టు ఉజ్బెకిస్తాన్తో రెండు అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్లు ఆడనుంది. మే 30వ తేదీన తొలి మ్యాచ్... జూన్ 3వ తేదీన రెండో మ్యాచ్ జరుగుతుంది. బెంగళూరులోని పడుకోన్–ద్రవిడ్ సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్లెన్స్ ఈ రెండు మ్యాచ్లకు వేదిక కానుంది. ప్రపంచ ర్యాంకింగ్స్లో ప్రస్తుతం భారత జట్టు 69వ ర్యాంక్లో, ఉజ్బెకిస్తాన్ 50వ ర్యాంక్లో ఉన్నాయి. ఇరు జట్లు ఇప్పటి వరకు 13 సార్లు తలపడ్డాయి. తొమ్మిది మ్యాచ్ల్లో ఉజ్బెకిస్తాన్, ఒక మ్యాచ్లో భారత్ గెలిచాయి. మరో మూడు మ్యాచ్లు ‘డ్రా’గా ముగిశాయి. ప్రస్తుతం భారత జట్టు హెడ్ కోచ్ క్రిస్పిన్ ఛెత్రి పర్యవేక్షణలో 2026 ఆసియా కప్ క్వాలిఫయింగ్ మ్యాచ్లకు సిద్ధమవుతోంది. మే 1 నుంచి జరుగుతున్న శిక్షణ శిబిరంలో భారత క్రీడాకారిణులు పాల్గొంటున్నారు. ఈ శిబిరంలో తెలంగాణ అమ్మాయి సౌమ్య గుగులోత్ కూడా ఉంది. ఈ సీజన్లో సౌమ్య నిలకడగా రాణించి 2025 సంవత్సరానికి భారత ఉత్తమ మహిళా ఫుట్బాలర్ అవార్డును గెల్చుకుంది. ఆసియా కప్ క్వాలిఫయింగ్ టోర్నీ జూన్ 23 నుంచి జూలై 5వ తేదీ వరకు థాయ్లాండ్లో జరగనుంది. గ్రూప్ ‘బి’లో మంగోలియా, తిమోర్లెస్టె, ఇరాక్, థాయ్లాండ్ జట్లతో కలిసి భారత్ ఉంది. భారత ప్రాబబుల్స్: పాయల్, ఎలాంగ్బమ్ పంథోయ్ చాను, కీషమ్ మెలోడి చాను, మోనాలిసా దేవి, పూరి్ణమ కుమారి, నిర్మలా దేవి, మారి్టనా థోక్చోమ్, శుభాంగి సింగ్, సంజు, మాలతి ముండా, తోయ్జామ్ థోయ్బిసనా చ ఆను, రంజన చాను, స్వీటీ దేవి, వికసిత్ బరా, హేమం షిల్కీ దేవి, కిరణ్ పిస్డా, రత్నబాలా దేవి, ముస్కాన్ సుబ్బా, లిషామ్ బబీనా దేవి, కార్తీక అంగముత్తు, సిండీ కల్నే, సంగీత బస్ఫోరె, ప్రియదర్శిని, బేబీ సనా, సంతోష్, అంజు తమాంగ్, మౌసుమి ముర్ము, మాళవిక, సంధ్య రంగనాథన్, సౌమ్య గుగులోత్, సులాంజన రౌల్, లిండా కోమ్ సెర్టో, రింపా హల్దర్, మనీషా నాయక్, రేణు, కరిష్మా పురుషోత్తం, సుమతి కుమారి, మనీషా కల్యాణ్, గ్రేస్ డాంగ్మె. -
ఒస్ట్రావా గోల్డెన్ స్పైక్ మీట్లో నీరజ్ చోప్రా
న్యూఢిల్లీ: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా... వచ్చే నెలలో చెక్ రిపబ్లిక్లో జరగనున్న ఒస్ట్రావా గోల్డెన్ స్పైక్ అథ్లెటిక్స్ మీట్లో పాల్గొననున్నాడు. గత రెండు సార్లు గాయాల కారణంగా ఈ టోర్నీకి దూరంగా ఉన్న నీరజ్ చోప్రా... జూన్ 24న జరిగే మీట్లో బరిలోకి దిగనున్నాడు. 2020 టోక్యో ఒలింపిక్స్లో పసిడి పతకం, 2024 పారిస్ ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన నీరజ్ చోప్రా... ప్రస్తుతం కొత్త కోచ్ జాన్ జెలెజ్నీ వద్ద శిక్షణ తీసుకుంటున్నాడు. ‘ఒస్ట్రావా గోల్డెన్ స్పైక్ మీట్లో పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ మీట్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నా. నా కోచ్ జెలెజ్నీ గతంలో ఈ టోర్నీలో చాలా సార్లు విజేతగా నిలవడంతో పాటు... ఈవెంట్ డైరెక్టర్గానూ ఉన్నారు’ అని నీరజ్ పేర్కొన్నాడు. 1961 నుంచి జరుగుతున్న ఈ మీట్కు ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య... గోల్డ్ లెవల్ మీట్ గుర్తింపునిచ్చింది. ఈ నెల 16న దోహా డైమండ్ లీగ్లో పాల్గొననున్న ప్రపంచ చాంపియన్షిప్ స్వర్ణ పతక విజేత నీరజ్... ఈ నెల 24 భారత్లో తొలిసారి జరగనున్న ‘నీరజ్ చోప్రా క్లాసిక్’ ఈవెంట్లో పాల్గొననున్నాడు. బిజీ షెడ్యూల్ కారణంగా ఈ నెల 27 నుంచి 31 వరకు దక్షిణ కొరియాలో జరగనున్న ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్ నుంచి నీరజ్ తప్పుకున్నాడు. -
Operation Sindoor: ఈ ఒక్క ఫొటో చాలు: సానియా మీర్జా పోస్ట్ వైరల్
‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) నేపథ్యంలో భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా (Sania Mirza) సోషల్ మీడియాలో స్పందించిన తీరు వైరల్ అవుతోంది. ఈ దేశ ఐక్యతకు ఇదే సరైన నిదర్శనం అంటూ ఆమె పంచుకున్న ఫొటో నెటిజన్ల మనసు దోచుకుంటోంది. కాగా జమ్మూకశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడికి బదులు తీర్చుకునేందుకు భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన విషయం తెలిసిందే. ఇరవై ఆరు మంది అమాయకుల ప్రాణాలు పొట్టనబెట్టుకున్న ముష్కరులకు మెరుపు దాడులతో మన సైన్యం సమాధానమిచ్చింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని దాదాపు తొమ్మిది స్థావరాలను ధ్వంసం చేసింది. తద్వారా ఉగ్రవాదాన్ని సహించేది లేదని మరోసారి భారత్ స్పష్టమైన సందేశాన్ని దాయాదికి అందించింది.పేరు సరిగ్గా సరిపోయిందంటూఇక ఈ ఆపరేషన్కు సిందూర్ అనే పేరు సరిగ్గా సరిపోయిందంటూ బాధిత కుటుంబాలతో పాటు యావత్ భారతావని ప్రశంసిస్తోంది. అమాయకపు ఆడపడుచుల నుదిటి సిందూరం చెరిగేపోయేలా పాశవిక దాడికి తెగబడిని ఉగ్రవాదులకు ‘రక్త సిందూరం’తో సమాధానమిచ్చారని.. ఇది సరైన నివాళి అని ఉద్వేగానికి లోనవుతున్నారు.మహిళా శక్తి, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకలుగాఅదే విధంగా.. ఈ ఆపరేషన్కు సంబంధించిన ప్రెస్మీట్లో మిలిటరీ బ్రీఫింగ్కు ఇద్దరూ మహిళా సైనికాధికారులు నాయకత్వం వహించడం కూడా జాతి హృదయాలు ఉప్పొంగేలా చేసింది. కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్... భారత దేశపు మహిళా శక్తి, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకలుగా తాము చేపట్టిన ఆపరేషన్ గురించి వివరిస్తూ ఉంటే భారతీయల గుండెలు గర్వంతో నిండిపోయాయి.ఈ ఒక్క ఫొటో చాలువాళ్లిద్దరు అలా చెరోవైపు ప్రెస్ మీట్లో కూర్చుని ఐక్యతకు ప్రతీకలా నిలిచిన తీరు నిజమైన దేశభక్తుల రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. ఈ దృశ్యాన్ని ఇన్స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. ‘‘ఈ శక్తివంతమైన ఫొటో.. మనమంతా ఒక్కటే జాతి అనేందుకు నిలువెత్తు నిదర్శనంలా నిలిచింది’’ అని సానియా మీర్జా పేర్కొన్నారు.మరోవైపు.. సరిహద్దుల్లో తీవ్రవాదులను తుదముట్టించేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’పై క్రీడాలోకం హర్షం వ్యక్తం చేసింది. తాజా ఘటనపై పలువురు క్రీడాకారులు స్పందిస్తూ మన దేశ ఘనతను కీర్తించారు. ఏకత్వంలో నిర్భీతిఇక టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్.. ‘ఏకత్వంలో నిర్భీతి. ఎల్లలెరుగని బలం. మన ప్రజలే మన దేశానికి బలం. మనమంతా ఒక్కటే. ప్రపంచంలో తీవ్రవాదానికి చోటు లేదు. జైహింద్’ అంటూ వ్యాఖ్యానించాడు. పేసర్ షమీ, మాజీ క్రికెటర్లు సెహ్వాగ్, రైనా, ఇర్ఫాన్ పఠాన్, శిఖర్ ధావన్ కూడా ఇదే తరహాలో స్పందించారు.‘మీపై ఎవరైనా రాళ్లు విసిరితే మీరు పూలు విసరండి. అయితే అది పూలకుండీతో సహా విసరండి’ అని సెహ్వాగ్ ట్వీట్ చేయగా, ‘ప్రతికూల పరిస్థితులను కూడా భారత సైన్యం తమకు అనుకూలంగా మార్చుకొని విజయం సాధించింది. ప్రమాదకర సమయంలో వారి ధైర్యాన్ని చూసి గర్విస్తున్నాం’ అని షమీ స్పందించాడు.బాక్సింగ్లో ఒలింపిక్ పతక విజేత విజేందర్ సింగ్ ‘భారత్ మాతాకీ జై’ అని ట్వీట్ చేయగా... పఠాన్, సైనా నెహ్వాల్ ‘జైహింద్’ అంటూ మద్దతు పలికారు. ‘మన సైనికులు కేవలం భయపెట్టడంతో ఆగిపోరు. వారు ఏదైనా చేసి చూపిస్తారు’ అని బాక్సర్ నిఖత్ జరీన్ పేర్కొంది. మన సైనికుల భద్రత గురించి తాను ప్రార్థన చేస్తున్నట్లు ఒలింపియన్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ వెల్లడించింది.చదవండి: సరైన సమాధానం.. సాక్ష్యం కనబడుతోందా?.. ఆపరేషన్ సిందూర్పై స్పందనలు -
రెండు స్వర్ణాలపై భారత్ గురి
షాంఘై: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–2 టోర్నమెంట్లో భారత్కు రెండు పతకాలు ఖాయమయ్యాయి. బుధవారం జరిగిన కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో భారత పురుషుల, మహిళల జట్లు ఫైనల్లోకి దూసుకెళ్లాయి. ఫలితంగా భారత్ ఖాతాలో కనీసం రెండు స్వర్ణాలు లేదా రెండు రజతాలు చేరనున్నాయి. వెన్నం జ్యోతి సురేఖ (ఆంధ్రప్రదేశ్), తనిపర్తి చికిత (తెలంగాణ), మధుర (మహారాష్ట్ర)లతో కూడిన భారత మహిళల కాంపౌండ్ జట్టు... అభిõÙక్ వర్మ, రిషభ్ యాదవ్, ఓజస్ ప్రవీణ్ దేవ్తలేలతో కూడిన భారత పురుషుల కాంపౌండ్ జట్టు టైటిల్ పోరుకు అర్హత సాధించాయి. మరోవైపు మెక్సికో పురుషుల, మహిళల జట్లు కూడా ఫైనల్లోకి అడుగు పెట్టాయి. శనివారం భారత్, మెక్సికో జట్లు రెండు స్వర్ణాల కోసం పోటీపడతాయి. క్వాలిఫయింగ్లో అగ్రస్థానంలో నిలిచినందుకు... భారత జట్లకు నేరుగా క్వార్టర్ ఫైనల్కు ‘బై’ లభించింది. క్వార్టర్ ఫైనల్లో భారత మహిళల జట్టు 232–229 పాయింట్ల తేడాతో అదెల్ జెక్సెన్బినోవా, విక్టోరియా లియాన్, రొక్సానా యునోసోవాలతో కూడిన కజకిస్తాన్ జట్టును ఓడించింది. సెమీఫైనల్లో భారత జట్టు 232–230 పాయింట్లతో ఎల్లా గిబ్సన్, ఇసబెల్లా కార్పెంటర్, లేలా అనిసన్లతో కూడిన బ్రిటన్ జట్టుపై గెలిచింది. క్వార్టర్ ఫైనల్లో భారత పురుషుల జట్టు 239–232 పాయింట్ల తేడాతో అజయ్ స్కాట్, ఆడమ్ కార్పెంటర్, ల్యూక్ డేవిస్లతో కూడిన బ్రిటన్ జట్టుపై నెగ్గింది. సెమీఫైనల్లో భారత బృందం 232–231 పాయింట్ల తేడాతో మథియాస్ ఫులర్టన్, మారి్టన్ డామ్స్బో, నిక్లాస్ బ్రెడాల్లతో కూడిన డెన్మార్క్ జట్టును ఓడించింది. తొమ్మిదో స్థానంలో ధీరజ్ బుధవారం జరిగిన రికర్వ్ విభాగం పురుషుల క్వాలిఫయింగ్లో భారత ఆర్చర్లు అంతగా ఆకట్టుకోలేకపోయారు. పారిస్ ఒలింపియన్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ బొమ్మదేవర ధీరజ్ 677 పాయింట్లు స్కోరు చేసి తొమ్మిదో స్థానంలో నిలిచాడు. 666 పాయింట్లతో తరుణ్దీప్ రాయ్ 28వ స్థానంలో, 652 పాయింట్లతో అతాను దాస్ 57వ స్థానంలో, 651 పాయింట్లతో పార్థ్ సాలుంఖే 60వ స్థానంలో నిలిచారు. ఓవరాల్గా 1995 పాయింట్లు స్కోరు చేసి ఏడో స్థానంలో నిలిచిన భారత్కు తొలి రౌండ్లో ‘బై’ లభించింది.రికర్వ్ విభాగం మహిళల క్వాలిఫయింగ్లో భారత స్టార్ దీపిక కుమారి 655 పాయింట్లు సాధించి 12వ స్థానాన్ని దక్కించుకుంది. 652 పాయింట్లతో అంకిత 17వ స్థానంలో, 642 పాయింట్లతో అన్షిక 29వ స్థానంలో, 637 పాయింట్లతో సిమ్రన్జిత్ కౌర్ 39వ స్థానంలో నిలిచారు. ఓవరాల్గా 1949 పాయింట్లతో భారత్ మూడో స్థానంలో నిలిచిన భారత్కు తొలి రౌండ్లో ‘బై’ దక్కింది. -
సాక్ష్యం కనబడుతోందా?: ఆపరేషన్ సిందూర్పై భారత బాక్సర్ రియాక్షన్
ఆపరేషన్ సిందూర్.. యావత్ భారతావని నోట ఇప్పుడిదే మాట.. పహల్గామ్ ఉగ్రదాడికి భారత సైన్యం సరైన రీతిలో సమాధానం ఇచ్చిందంటూ సర్వత్రా హర్షాతిరేకాలు.. ఉన్మాదంతో అమాయకపు ఆడబిడ్డల నుదిటిన సిందూరం తుడిపేసిన ముష్కరులకు అదే పేరుతో బదులిచ్చినందుకు సెల్యూట్ అంటూ ఆర్మీపై ప్రశంసల జల్లు..జై హింద్భారత క్రీడాలోకం కూడా ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పట్ల హర్షం వ్యక్తం చేస్తోంది. టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్, మాజీ క్రికెటర్లు వీరేందర్ సెహ్వాగ్, ఆకాశ్ చోప్రా, సురేశ్ రైనా జై హింద్ అంటూ భారత సైన్యానికి తమ మద్దతు తెలియజేశారు.సరైన సమాధానంఇక ప్రముఖ బాక్సర్ గౌరవ్ బిధూరి (Gaurav Bidhuri) భారత ఆర్మీని ప్రశంసిస్తూనే.. విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చాడు. ‘‘మనం మన ఇళ్లల్లో ప్రశాంతంగా నిద్రపోతున్న వేళ.. మన సైన్యం ఆపరేషన్ సిందూర్ అమలు చేసింది.కానీ మనమేమో రోజూ ఇక్కడ స్టూడియ్లో కూర్చుని.. ‘మోదీ జీ యుద్ధం చేయండి! ఇంకెందుకు వాళ్లపై దాడులు చేయడం లేదు’ అంటూ అరుస్తూ ఉంటాము.ఇప్పుడు అందరికీ సరైన సమాధానం దొరికింది కదా!.. ఇంట్లో కూర్చుని ఎవరైనా ఉచిత సలహాలు ఇవ్వవచ్చు. కానీ ఇలాంటి సైనిక చర్యలు చేపట్టాలంటే కచ్చితమైన ప్రణాళిక, వ్యూహాలు, ప్రత్యర్థి స్పందించే తీరుకు ఎలా బదులివ్వాలి.. పరిణామాలను ఎలా ఎదుర్కోవాలి.. ఇలా ఎన్నో ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.మన ఆర్మీ అందుకు తగ్గ సమయం తీసుకుని సరైన సమయంలో పంజా విసిరింది. ఒక్క మిషన్తో 8-9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశారు’’ అని గౌరవ్ బిధూరి IANSతో పేర్కొన్నాడు.ఈ సాక్ష్యం సరిపోతుందా? అదే విధంగా.. పహల్గామ్ దాడికి పాకిస్తాన్ కారణం అనడానికి ఆధారాలు చూపాలన్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదికి మరోసారి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. ‘‘కొంతమంది మాకు ఆధారాలు కావాలని డిమాండ్ చేశారు కదా! ఇప్పటికైనా అర్థమైందా? ఈ సాక్ష్యం సరిపోతుందా? అంతా స్పష్టంగానే ఉంది కదా! ఇంతకంటే గొప్పగా ఇంకేమైనా కావాలా?’’ అంటూ గౌరవ్ బిధూరి ఆఫ్రిది చురకలు అంటించాడు.అదే విధంగా.. ‘‘ఏదేమైనా ఈరోజు దేశం మొత్తం భారత సైన్యం, మన నాయకత్వం వెంట ఉంది. ఇది కేవలం ప్రతిచర్య మాత్రమే కాదు.. న్యాయం చేయడం కూడా! మనపై దాడి చేయాలనుకునేవారికి సందేశం. మీ చర్యలకు తప్పకుండా బదులిస్తామనే సంకేతం. జై హింద్’’ అంటూ గౌరవ్ బిధూరి ఉద్వేగానికి లోనయ్యాడు.కాళ్ల పారాణి ఆరకముందే చెరిగిన సిందూరంకాగా జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో గత నెల ఉగ్రవాదులు మారణహోం సృష్టించిన విషయం విదితమే.ప్రశాంత బైసరన్ లోయలో కల్లోలం సృష్టించి ఇరవై ఆరు మంది పర్యాటకులను కాల్చి చంపేశారు. మతం పేరు అడుగుతూ పురుషుల ప్రాణాలు తీశారు. మొదటగా నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ (26)ను కాల్చారు. నవ వరుడైన వినయ్ భార్య హిమాన్షితో కలిసి హనీమూన్కు రాగా.. ఉగ్రవాదుల దుశ్చర్యతో పెళ్తైన ఆరు రోజులకే ఆమె నుదిటి సిందూరం చెరిగిపోయింది.హిమాన్షితో మాదిరే మరికొంత మంది మహిళలు తమ భర్తల్ని కోల్పోగా.. ఆపరేషన్ సిందూర్ పేరిట ఉగ్రవాదులకు ఆర్మీ ఇలా సరైన విధంగా బుద్ధిచెప్పింది. తెల్లవారుజామున ఒంటి గంట తర్వాత దాదాపు ఇరవై మూడు నిమిషాల పాటు జరిగిన ఆపరేషన్లో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. కాగా పహల్గామ్ ఘటనలో ఇంకొందరు తమ తండ్రి, సోదరుడు, కుమారులను కోల్పోయారు. చదవండి: Operation Sindoor: ఎవరీ కల్నల్ సోఫియా, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ -
చైనా నుంచి తొలిసారి...
ఫెఫీల్డ్ (ఇంగ్లండ్): బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, డైవింగ్, స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, షూటింగ్, వెయిట్లిఫ్టింగ్ క్రీడాంశాల్లో ఎంతోమంది ప్రపంచ చాంపియన్లను అందించిన చైనా నుంచి తాజాగా ప్రొఫెషనల్ స్నూకర్ క్రీడాంశంలో తొలిసారి విశ్వవిజేత అవతరించాడు. ఇంగ్లండ్లో జరిగిన ప్రపంచ ప్రొఫెషనల్ స్నూకర్ చాంపియన్షిప్లో చైనాకు చెందిన 28 ఏళ్ల జావో జిన్టాంగ్ మొదటిసారి చాంపియన్గా నిలిచాడు. ‘బెస్ట్ ఆఫ్ 35’ ఫ్రేమ్స్ పద్ధతిలో రెండు రోజులపాటు జరిగిన ఫైనల్లో క్వాలిఫయర్ జావో జిన్టాంగ్ 18–12 ఫ్రేమ్ల తేడాతో వేల్స్కు చెందిన మూడుసార్లు ప్రపంచ చాంపియన్ మార్క్ విలియమ్స్పై విజయం సాధించాడు. జావో జిన్టాంగ్ 141–0, 100–38, 47–44, 28–66, 77–49, 71–61, 119–0, 95–0, 0–86, 8–65, 85–9, 74–0, 14–62, 0–72, 96–23, 71–63, 43–71, 76–5, 18–66, 65–7, 85–45, 104–1, 14–84, 79–26, 63–36, 30–101, 1–62, 6–96, 0–73, 110–8 స్కోరుతో 50 ఏళ్ల విలియమ్స్ను ఓడించాడు. విజేత జిన్టాంగ్కు 5,00,000 పౌండ్లు (రూ. 5 కోట్ల 63 లక్షలు) ప్రైజ్మనీగా దక్కింది. -
‘నీరజ్ చోప్రా క్లాసిక్’ ఈవెంట్ టికెట్ల రేట్లు ఇలా.. రూ. 199 నుంచి..
బెంగళూరు: భారత దేశంలో మొదటిసారి నిర్వహిస్తున్న ‘నీరజ్ చోప్రా క్లాసిక్’ జావెలిన్ ఈవెంట్కు సంబంధించిన టికెట్ల విక్రయం ప్రారంభమైంది. టోక్యో ఒలింపిక్స్ పసిడి పతక విజేత నీరజ్ చోప్రా పేరిట ఈ నెల 24న నిర్వహించనున్న ఈ ఈవెంట్లో నీరజ్తో పాటు థామస్ రోలెర్ (జర్మనీ), అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా) వంటి పలువురు అంతర్జాతీయ స్టార్ జావెలిన్ త్రోయర్లు పాల్గొంటున్నారు. ఈ ఈవెంట్కు సంబంధించిన టికెట్లను ‘డిస్ట్రిక్ట్’ యాప్లో అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు సోమవారం వెల్లడించారు. టికెట్ల ధర రూ. 199 నుంచి 9,999గా నిర్ణయించారు. రూ. 44,999 ధర గల ఐదు కార్పొరేట్ బాక్స్లు కూడా అందుబాటులో ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. మొత్తం స్టేడియంలో 12 వేల టికెట్లు అందుబాటులో ఉన్నాయి. దేశంలో నిర్వహిస్తున్న తొలి అంతర్జాతీయ జావెలిన్ ఈవెంట్ కావడంతో... కర్ణాటక ఒలింపిక్ సంఘం, క్రీడా మంత్రిత్వ శాఖ దీని నిర్వహణను ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నాయి. అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య కూడా దీనికి ‘గోల్డ్ ఈవెంట్’ స్థాయి కల్పించింది.ఇవీ చదవండి: కాంస్యం నెగ్గిన పర్వ్లిమా (పెరూ): భారత యువ వెయిట్ లిఫ్టర్ పర్వ్ చౌధరీ ప్రపంచ యూత్, జూనియర్ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్íÙప్లో కాంస్య పతకంతో మెరిశాడు. పురుషుల 96 కేజీల విభాగంలో పర్వ్ 315 కేజీల బరువెత్తి మూడో స్థానంలో నిలిచాడు. స్నాచ్లో 140 కేజీల బరువెత్తిన పర్వ్... క్లీన్ అండ్ జెర్క్లో మరో 175 కేజీల బరువు ఎత్తాడు. ఈ టోర్నమెంట్లో భారత్కు ఇది మూడో పతకం కావడం విశేషం.ఇప్పటికే జ్యోష్న సబర్ (40 కేజీల), హర్షవర్ధన్ సాహూ (49 కేజీలు) కాంస్యాలు గెలుచుకోగా... ఇప్పుడు పర్వ్ ఆ సంఖ్యను మూడుకు పెంచాడు. ప్రపంచ చాంపియన్షిప్లలో ఓవరాల్ లిఫ్టింగ్తో పాటు స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్లో వేర్వేరుగా పతకాలు ఇస్తారు. సినెర్ పునరాగమనంరోమ్: ప్రపంచ నంబర్వన్ టెన్నిస్ ప్లేయర్ యానిక్ సినెర్ (ఇటలీ)పై విధించిన నిషేధం పూర్తయింది. దీంతో స్వదేశంలో జరగనున్న ఇటాలియన్ ఓపెన్ ద్వారా సినెర్ పునరాగమనం చేయనున్నాడు. ఈ టోర్నీలో ఇటలీకి చెందిన ప్రపంచ నంబర్వన్ ఆటగాడు పాల్గొననుండటం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ టోర్నీ తొలి రౌండ్లో సినెర్కు ‘బై’ దక్కగా... శుక్రవారం జరగనున్న రెండో రౌండ్లో సినెర్ ఆడనున్నాడు.వరల్డ్ యాంటీ డోపింగ్ ఎజెన్సీ (వాడా) సినెర్పై విధించిన నిషేధం సోమవారంతో ముగియగా... ఈ ఇటలీ ఆటగాడు ప్రాక్టీస్ ప్రారంభించాడు. తమ అభిమాన ఆటగాడి సాధన చూసేందుకు వేలాదిగా ప్రేక్షకులు తరలివచ్చారు. ఈ సీజన్ ఆరంభ గ్రాండ్స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గిన అనంతరం సినెర్ కోర్టులో అడుగు పెట్టలేదు. ఈ నెల 25 నుంచి ఫ్రెంచ్ ఓపెన్ ప్రారంభం కానుండగా... దానికి ముందు ఇటాలియన్ ఓపెన్ సినెర్కు మంచి ప్రాక్టీస్ కానుంది. ఇటాలియన్ ఓపెన్లో చివరిసారిగా 1976లో ఇటలీకి చెందిన అడ్రియానో పనట్టా విజేతగా నిలిచాడు. ఆ తర్వాత ఇటలీ ప్లేయర్లు ఎవరూ ఇటాలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గలేదు. -
పియాస్ట్రిదే పైచేయి.. 1997 తర్వాత ఇదే తొలిసారి...
ఫ్లోరిడా: గత నాలుగేళ్లు ఫార్ములావన్ ప్రపంచ చాంపియన్షిప్ టైటిల్ సాధించిన రెడ్బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్కు ఈ సీజన్లో తీవ్రమైన పోటీ ఎదురవుతోంది. క్వాలిఫయింగ్ సెషన్లో అదరగొడుతున్న వెర్స్టాపెన్ను ప్రధాన రేసులో మాత్రం మెక్లారెన్ డ్రైవర్లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఫార్ములావన్ 2025 సీజన్లో భాగంగా జరిగిన ఆరో రేసు మయామి గ్రాండ్ప్రిలో మెక్లారెన్ జట్టు డ్రైవర్ ఆస్కార్ పియాస్ట్రి విజేతగా నిలిచాడు. నిర్ణీత 57 ల్యాప్ల రేసును పియాస్ట్రి అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 1 గంట 28 నిమిషాల 51.587 సెకన్లలో పూర్తి చేసి ఈ సీజన్లో నాలుగో గెలుపును, వరుసగా మూడో విజయాన్ని అందుకున్నాడు.రెండో స్థానంలో లాండో నోరిస్మెక్లారెన్కే చెందిన లాండో నోరిస్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. గత ఏడాది ఈ రేసులో విజేతగా నిలిచిన నోరిస్ ఈసారి 1 గంట 28 నిమిషాల 56.217 సెకన్లలో రేసును పూర్తి చేశాడు. మెర్సిడెస్ డ్రైవర్ జార్జి రసెల్ మూడో స్థానాన్ని పొందగా... ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన ప్రపంచ చాంపియన్ వెర్స్టాపెన్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. నలుగురు డ్రైవర్లు లియామ్ లాసన్ (వీసా క్యాష్ రేసింగ్ బుల్స్), గాబ్రియెల్ బొర్టొలెటో (స్టేక్ టీమ్ కిక్ సాబెర్), ఒలివెర్ బియర్మన్ (మనీగ్రామ్ హాస్), జాక్ దూహాన్ (అల్పైన్ టీమ్) మధ్యలోనే వైదొలిగారు. లాసన్ 36వ ల్యాప్లో, బొర్టొలెటో 30వ ల్యాప్లో, బియర్మన్ 27వ ల్యాప్లో, దూహాన్ తొలి ల్యాప్లో తప్పుకున్నారు.1997 తర్వాత తొలిసారి... నాలుగో స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన పియాస్ట్రి ఆరంభంలో వెనుకబడ్డాడు. అయితే 14వ ల్యాప్లో వెర్స్టాపెన్ను వెనక్కి నెట్టి ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని చివరిదాకా కాపాడుకొని చాంపియన్గా నిలిచాడు. తద్వారా 1997 తర్వాత ఫార్ములావన్లో వరుసగా మూడు రేసుల్లో నెగ్గిన మెక్లారెన్ డ్రైవర్గా పియాస్ట్రి గుర్తింపు పొందాడు. చివరిసారి మెక్లారెన్ తరఫున మికా హకినెన్ ఈ ఘనత సాధించాడు.1997 సీజన్ చివరి రేసులో నెగ్గిన హకినెన్ 1998 సీజన్లోని తొలి రెండు రేసుల్లోనూ విజేతగా నిలిచాడు. ఇక 24 రేసుల తాజా సీజన్లో ఆరు రేసులు ముగిశాక ఆస్కార్ పియాస్ట్రి 131 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక 115 పాయింట్లతో నోరిస్ రెండో స్థానంలో, 99 పాయింట్లతో వెర్స్టాపెన్ మూడో స్థానంలో నిలిచారు. కన్స్ట్రక్టర్స్ చాంపియన్షిప్లో మెక్లారెన్ 246 పాయింట్లతో టాప్ ర్యాంక్లో కొనసాగుతోంది. సీజన్లోని తదుపరి రేసు ఎమిలియా రొమాగ్నా గ్రాండ్ప్రి (ఇటలీ) ఈనెల 18న జరుగుతుంది. -
మూడోసారి టైటిల్... సబలెంకా ప్రైజ్మనీ ఎంతంటే?
మాడ్రిడ్: ఈ ఏడాది తన అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తూ ప్రపంచ నంబర్వన్ అరీనా సబలెంకా (Aryna Sabalenka- బెలారస్) మూడో సింగిల్స్ టైటిల్ను తన ఖాతాలో జమ చేసుకుంది. మాడ్రిడ్ ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 సిరీస్ టోర్నీలో టాప్ సీడ్ సబలెంకా మూడోసారి చాంపియన్గా నిలిచింది. అమెరికా స్టార్, ప్రపంచ నాలుగో ర్యాంకర్ కోకో గాఫ్ (Coco Gauff)తో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో సబలెంకా 6–3, 7–6 (7/3)తో విజయాన్ని అందుకొని మూడోసారి మాడ్రిడ్ ఓపెన్ టైటిల్ను దక్కించుకుంది. 2023, 2021లలో కూడా సబలెంకా ఈ టోర్నీలో చాంపియన్గా నిలిచింది.ఈ క్రమంలో పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) తర్వాత మాడ్రిడ్ ఓపెన్ టైటిల్ను మూడుసార్లు గెలిచిన రెండో ప్లేయర్గా సబలెంకా గుర్తింపు పొందింది. ఓవరాల్గా సబలెంకా కెరీర్లో ఇది 19వ టైటిల్కాగా, ఈ ఏడాది మూడోది. ఈ సంవత్సరం ఆమె బ్రిస్బేన్ ఓపెన్, మయామి ఓపెన్లలో విజేతగా నిలిచింది. కోకో గాఫ్తో 1 గంటా 39 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సబలెంకా రెండు ఏస్లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్లు చేసింది.రూ. 9 కోట్ల 40 లక్షలుతన సర్వీస్ను రెండుసార్లు కోల్పోయిన బెలారస్ స్టార్ ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. 142 పాయింట్లకుగాను సబలెంకా 81 పాయింట్లు, కోకో గాఫ్ 61 పాయింట్లు గెలిచారు. విజేతగా నిలిచిన సబలెంకాకు 9,85,030 యూరోల (రూ. 9 కోట్ల 40 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. రన్నరప్ కోకో గాఫ్కు 5,23,870 (రూ. 5 కోట్లు) యూరోల ప్రైజ్మనీతోపాటు 650 ర్యాంకింగ్ పాయింట్లు దక్కాయి. ఒసాకా ఖాతాలో టైటిల్ మాలో (ఫ్రాన్స్): నాలుగేళ్ల నిరీక్షణకు తెరదించుతూ జపాన్ టెన్నిస్ స్టార్ నయోమి ఒసాకా (Naomi Osaka) డబ్ల్యూటీఏ సింగిల్స్ టైటిల్ను సాధించింది. ఆదివారం ముగిసిన ఎల్ ఓపెన్ 35 డబ్ల్యూటీఏ–125 టోరీ్నలో ఒసాకా విజేతగా నిలిచింది. 2021 ఆ్రస్టేలియా ఓపెన్ గ్రాండ్స్లామ్ టైటిల్ తర్వాత ఒసాకాకు ఇదే తొలి టైటిల్ కావడం విశేషం. ఫైనల్లో ఒసాకా 6–1, 7–5తో కాజా జువాన్ (స్లొవేనియా)పై విజయం సాధించింది.మ్యాచ్ ఆరంభం నుంచే సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన రెండో సీడ్ ఒసాకా... ఒక ఏస్ కొట్టి 6 డబుల్ ఫాల్ట్లు చేసింది. 6 బ్రేక్ పాయింట్లు కాచుకున్న ఈ మాజీ ప్రపంచ నంబర్వన్... ఓవరాల్గా 70 పాయింట్లు సాధించింది. 2023 జూలైలో పాపకు జన్మనిచ్చిన ఒసాకా ఆ తర్వాత నెగ్గిన తొలి డబ్ల్యూటీఏ టైటిల్ ఇదే. ఇటీవలి కాలంలో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న 27 ఏళ్ల ఒసాక ఈ ఏడాది తొలి గ్రాండ్స్లామ్ టోర్న ఆస్ట్రేలియా ఓపెన్లో మూడో రౌండ్లో పరాజయం పాలైంది. చదవండి: కెప్టెన్గానే కాదు.. వైస్ కెప్టెన్గానూ బుమ్రా అవుట్!.. రేసులో మూడు పేర్లు.. -
మా ప్రయాణం అద్భుతం ఒలింపిక్ పతకమే లక్ష్యం
భారత బ్యాడ్మింటన్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ రాటుదేలుతూ వస్తోంది. గతేడాది పారిస్ ఒలింపిక్స్ అవకాశం తృటిలో కోల్పోయినా... ప్రపంచ ర్యాంకింగ్స్లో టాప్–10లోకి దూసుకొచ్చింది. 9వ ర్యాంకుతో ఈ ఘనతకెక్కిన తొలి భారత మహిళల జంటగా నిలిచింది. బిజీగా గడిచిన గత సీజన్లో విజయాలు ఆత్మవిశ్వాసాన్ని పెంచితే... వరల్డ్ టూర్ ఫైనల్స్ లాంటి మేజర్ టోర్నీలు పాఠాలు నేర్పాయని ఇద్దరు చెప్పుకొచ్చారు. ఓ ఇంటర్వ్యూలో ఇద్దరు తాము జోడీకట్టిన తీరు నుంచి విజయాలు, సాఫల్యాల దాకా తమ అభిప్రాయాల్ని పంచుకున్నారు. 2021లో మొదలైన మీ ప్రయాణం ఎలా సాగుతోంది? గాయత్రి: మొదట్లో నేను సింగిల్స్ ఆడేదాన్ని. కానీ డబుల్స్ అయితే ఇంకా బాగా ఆడతాననిపించింది. దీంతో ట్రెసాతో జోడీ కట్టాను. నేను అనుకున్నట్లుగానే కొన్ని టోర్నీల్లోనే డబుల్స్లో రాణించగలగడం మరింత ఆనందాన్నిచ్చింది. తర్వాత ఏడాదే ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్ (2022) ఆడి సెమీస్ చేరాం. అలాంటి ప్రతిష్టాత్మక టోర్నీల్లో ఇంత త్వరగా ఆడతామనుకోలేదు. అక్కడి నుంచే మా జోడీ మరింత బలపడింది. మా పయనం అద్భుతంగా సాగుతోంది. మేటి ప్రత్యర్థులతో ఎన్నో మ్యాచ్లు గెలిచాం. ఎంతో నేర్చుకున్నాం. ట్రెసా: 2021లో మేమిద్దరం కలిసి ఆడటం మొదలుపెట్టాం. అప్పటినుంచే గాయత్రి గురించి తెలుసుకున్నాను. కోర్టులో జోడీగా, కోర్టు బయట స్నేహితులుగా మా బంధం పటిష్టమైంది. ఆటలోనే కాదు... అవసరమైన ప్రతీసారి నాకు చాలా మద్దతుగా నిలుస్తుంది. నాకు ఏదైనా సాయం అవసరమైనా గాయత్రి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. గతేడాది సాధించిన సయ్యద్ మోడి టైటిల్ ఎలాంటి సంతృప్తినిచ్చింది? గాయత్రి: బీడబ్ల్యూఎఫ్ సర్క్యూట్లో భాగమైన సయ్యద్ మోడి టైటిల్ను సాధించేవరకు తెలియదు... మేమే ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళల జోడీ అని! అందుకే ఆ విజయం ఎప్పటికీ ప్రత్యేకమైంది. దేశానికి ట్రోఫీ తెచ్చిపెట్టడం గొప్ప అనుభూతినిచ్చింది. ఆ విజయానందంలో మేమిద్దరం భావోద్వేగానికి గురయ్యాం. అది ఇప్పటికీ గుర్తుంది. ట్రెసా: ఇలాంటి మేజర్ టోర్నీ టైటిల్స్ గెలుపొందాలన్నదే మా ఉమ్మడి కల. ఫైనల్లో గెలిచి... పోడియంపై నిలిచి... గర్వంగా బంగారు పతకాల్ని అందుకోవడం మంచి అనుభూతినిచి్చంది. ఇలాంటి సంతోషాన్ని మాటల్లో చెప్పలేం. పారిస్ ఒలింపిక్స్ అవకాశాన్ని కోల్పోయిన మీరు లాస్ ఏంజెలిస్ లక్ష్యాన్ని ఎలా చేరుకుంటారు? గాయత్రి: పారిస్ ఛాన్స్ చేజార్చుకోవడంతోనే మా ఒలింపిక్స్ కల అంతమవలేదు. మా మనోధైర్యం కోల్పోలేదు. తదుపరి లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ రూపంలో మరో అవకాశముంది. మరింత కష్టపడతాం. ప్రతి టోర్నీని అనుకూలంగా మలచుకుంటాం. ఒక్క ఒలింపిక్సే టోర్నమెంట్ కాదు. ఎన్నో ముఖ్యమైన టోర్నీలూ ఉన్నాయి. అన్నింటా సత్తా చాటడమే మా లక్ష్యం. ట్రెసా: అవును... ఆ ఒలింపిక్స్కు దూరమయ్యాం. మేం అర్హత సాధించలేకపోవడం మమ్మల్ని నిరాశపరిచింది. కానీ వచ్చే ఒలింపిక్స్ కోసం ఇప్పటినుంచే శ్రమిస్తాం. ప్రతి క్యాలెండర్ ఇయర్లోని టోర్నీలన్నీ ఆడటం ద్వారా ర్యాంకింగ్కు మెరుగుపర్చుకొని అర్హత సాధిస్తాం. గతేడాది బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ అనుభవం గురించి చెబుతారా? గాయత్రి: హాంగ్జౌలో జరిగిన ఈ టోర్నీలో తొలి పోరులో చైనాకు చెందిన లియు–తన్ జంటను ఎదుర్కొన్న మాకు పరాజయం తప్పలేదు. అయితే రెండో మ్యాచ్లో మలేసియన్ జోడీ పిర్లి తన్–తినాలపై గెలుపొందడంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. కానీ మూడో మ్యాచ్లో నమీ మత్సుయమ–చిహరు షిదా (జపాన్) జోడీ చేతిలో ఓడటంతో ముందుకెళ్లే అవకాశాల్ని కోల్పోయాం. అయితే అనుభవ పాఠాలైతే నేర్చుకోగలిగాం. ట్రెసా: సీజన్ ముగింపు టోర్నీలో అంతా మేటి ప్రత్యర్థులే ఎదురవుతారు. రెడ్ మ్యాట్పై ఆడే మ్యాచ్ల్ని టీవీల్లో చూశాను. గతేడాది ప్రత్యక్షంగా ఆడాను. చైనాలోని స్టేడియాలు, మ్యాచ్లపై ఉండే అంచనాలు నిజంగా గొప్పగా ఉంటాయి. అక్కడ మేం ఆడిన మ్యాచ్లు, అనుభవం చాలా దోహదపడుతుందని అనుకుంటున్నా. గుత్తా జోడీ ర్యాంకింగ్ను అధిగమించడం ఎలా అనిపిస్తోంది?గాయత్రి: గుత్తా జ్వాల–అశ్విని పొన్నప్పల 10వ ర్యాంకును అధిగమించిన భారత మహిళల ద్వయంగా నిలువడం చాలా ఆనందాన్నిచ్చింది. మొదట ఈ ర్యాంకు ఘనత తెలియదు. నిజానికి మా లక్ష్యం గుత్తా జోడీ ర్యాంకింగ్ను చెరిపేయడం కాదు. మేం టాప్–10లోకి దూసుకెళ్లడం. మొత్తానికి భారత మహిళల డబుల్స్లో ఇలా మెరుగైన ర్యాంకింగ్ సాధించడం మా శ్రమకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నాం. ట్రెసా: నిజానికి గత క్యాలెండర్ ఇయర్ చాలా బిజీగా గడిచింది. అందుకే కఠినమైన టోర్నీలను ఎంపిక చేసుకొని ఆడటం. విజయాలు సాధించడం వల్లే మా ర్యాంకుల్లో మెరుగుదల కనిపించింది. ఇలాంటి మైలురాళ్లు ఎవరికైనా ఆనందాన్నే ఇస్తాయి.