breaking news
Other Sports
-
పల్లెకు పరిచయమైన "వర్చువల్ రియాలిటీ గేమింగ్".. స్పందన మామూలుగా లేదు..!
వర్చువల్ రియాలిటీ గేమింగ్ (VR Gaming) అనేది గేమింగ్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పును తీసుకొచ్చిన సాంకేతికత. ఇది ఆటగాళ్లను త్రిమితీయ (3D) వాతావరణంలోకి తీసుకెళ్లి, నిజంగానే ఆ ప్రపంచంలో ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. ఈ క్రీడలను VR హెడ్సెట్, మోషన్ కంట్రోలర్ లాంటి సాధనాలను ఉపయోగించి ఆడతారు. VR Gamingను కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా విద్య, శిక్షణ, వైద్య రంగాల్లో కూడా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం దేశంలోని పెద్దపెద్ద నగరాల్లో మాత్రమే ఈ VR Gaming సెంటర్లు వెలిశాయి.Few youths opened a "Virtual Reality Gaming Centre" in Karnataka 's village. The response was overwhelming 🤩 pic.twitter.com/hNTfIY0qoQ— 👑Che_Krishna🇮🇳💛❤️ (@CheKrishnaCk_) July 14, 2025అయితే, ఇటీవల కర్ణాటకలోని హసన్ జిల్లాకు కొందరు ఔత్సాహిక యువకులు ఈ VR Gamingను ఓ మారుమూల పల్లెకు పరిచయం చేశారు. టెక్నాలజీ అంటే ఏమిటో తెలియని ఆ పల్లె ప్రజలు ఈ కాల్పనిక క్రీడలను తెగ ఎంజాయ్ చేశారు. సదరు యువత ఇచ్చిన Meta Quest VR Headsetలను ధరించి నిజంకాని ప్రపంచంలోకి వెళ్లిపోయారు.పిల్లలు, మహిళలు, వృద్దులు అన్న తేడా లేకుండా ఆ గ్రామంలోని ప్రతి ఒక్కరు VR Gamingతో కలిగిన కొత్త అనుభూతిని ఆస్వాధించారు. VR Gaming ద్వారా బాక్సింగ్, బిల్డింగ్పై నడవడం లాంటి కాల్పనిక క్రీడలను ఆడారు. ఈ VR Gaming కేంద్రానికి విశేషమైన స్పందన రావడంతో సదరు యువకులు దీనికి సంబంధించిన వీడియోను సోషల్మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు కూడా విపరీతమైన స్పందన వస్తుంది. -
పెళ్లిళ్లు.. విడాకులు.. హైదరాబాద్ స్పోర్ట్స్ స్టార్స్కి ఏమైంది..?
సెలబ్రిటీలకు సంబంధించి పెళ్లిళ్లు ఎంత గొప్పగా ప్రచారానికి నోచుకుంటాయో విడాకులు అంతకు మించి ప్రచారం పొందుతాయి. ఒకప్పుడు సినిమా సెలబ్రిటీలే వివాహ బంధాన్ని విఛ్చిన్నం చేసుకోవడంలో ముందుంటారని ఒక అభిప్రాయం ఉండేది. అయితే ఇప్పుడు అది దాదాపుగా అన్ని రంగాలకూ విస్తరించింది. అదే క్రమంలో ఇప్పుడు క్రీడారంగాన్ని కూడా అంటుకున్నట్టు కనిపిస్తోంది.తాజాగా బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తన విడాకుల నిర్ణయాన్ని ఇన్స్ట్రాగామ్ ద్వారా ప్రకటించారు. పారుపల్లి కశ్యప్తో (సైనా భర్త) విడిపోయే నిర్ణయం తాను స్వయంగా తీసుకున్నానని, ఈ ప్రయాణంలో ‘‘పీస్, గ్రోత్, హీలింగ్’’ కోసం ఇద్దరం ఒకే మాటతో ముందుకు వెళుతున్నామని తెలిపింది. ఇది ఓ రకంగా షాకింగ్ అనే చెప్పాలి.సాధారణంగా స్పోర్ట్స్ స్టార్స్కు సంబంధించిన విడాకుల అంశాలపై ముందస్తు అంచనాలు, సూచనలు ఏవీ వెలువడడం జరుగదు. అదే సినిమా రంగానికి చెందిన వాళ్లయితే విడిపోవడానికి కాస్త ముందుగానే మీడియా ఈ విషయాన్ని పసిగట్టేయగలుగుతుంది.ఇక్కడ మరో చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విశేషం ఏమిటంటే... హైదరాబాద్ నగరం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన క్రీడాకారులు, మరీ ముఖ్యంగా తమ క్రీడా విజయాలతో ఎందరో యువతులకు స్ఫూర్తిగా నిలిచిన మహిళలది ఇదే బాట కావడం. గతంలో ఇదే విధంగా విడిపోయిన ప్రముఖ క్రీడాకారిణుల్లో సానియా మీర్జా అందరికీ చిరపరిచితం.ఆటతోనే కాకుండా అందంతో కూడా అందరి మనసుల్నీ దోచుకున్న టెన్నిస్ స్టార్ సానియా.. పాకిస్తాన్ క్రికెటర్ షోయెబ్ మాలిక్ ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహ బంధం చివరికి 2024 లో ముక్కలైంది. సానియా మీర్జా కూడా హైదరాబాద్ వాసే కావడం గమనార్హం.మరో క్రీడాకారిణి కూడా ఇదే నగరం నుంచి విడాకులు తీసుకుంది. దాదాపు పదేళ్ల క్రితం వరకూ బ్యాడ్మింటన్ కి చిరునామాగా నిలిచిన గుత్తా జ్వాల చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఆమె 2005లో మరో బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కేవలం ఆరేళ్లకే అంటే 2011లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.నాటి ఒక యువ టాలీవుడ్ హీరోతో అనుబంధం అంటూ పుకార్లకు కూడా ఎదుర్కున్న గుత్తా జ్వాల కూడా హైదరాబాద్ వాసే. తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా హైదరాబాద్ ప్రతిష్టను నలుదిశలా చాటిన ఈ టాప్ స్పోర్ట్స్ స్టార్స్ యువతుల్లో క్రీడారంగం పట్ల ఎంతగా స్ఫూర్తి నింపారో తెలియంది కాదు.అయితే ఒకే నగరానికి చెందిన వీరంతా వ్యక్తిగత జీవితాల్లో ఒకే రకమైన ఒడిదుడుకులు ఎదుర్కోవడం విచిత్రం. కొసమెరుపు ఏమిటంటే... హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ క్రికెట్ చిత్ర పటంలో చేర్చిన మహ్మద్ అజారుద్దీన్ కూడా విడాకులు తీసుకోవడం. ఆయన 1996లో సినీనటి సంగీతా బిజిలానీని పెళ్లి చేసుకుని 2010లో విడాకులు తీసుకున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 114 ఏళ్ల దిగ్గజ మారథాన్ రన్నర్
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మారథాన్ రన్నర్గా పేరొందిన ఫౌజా సింగ్ 114 ఏళ్ల వయసులో ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సోమవారం మధ్యాహ్నం జలంధర్-పఠాన్కోట్ హైవేపై కారు ఢీకొనడంతో ఫౌజా సింగ్ తలకు తీవ్ర గాయమైంది. ఫౌజాను వెంటనే ఆసుపత్రికి తరలించగా.. రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ప్రాణాలు వదిలారు.ఫౌజా సింగ్ మృతదేహాన్ని విదేశాల్లో నివసిస్తున్న అతని పిల్లలు వచ్చే వరకు మార్చురీలో ఉంచనున్నారు. వారు వచ్చిన తర్వాతే అతని అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఫౌజా సింగ్ మరణం పట్ల పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా తీవ్ర విచారం వ్యక్తం చేశారు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫౌజా కుటుంబానికి, అతని అభిమానులకు సానుభూతి తెలియజేశారు. ఫౌజా ఆత్మకు శాశ్వత శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.114 ఏళ్ల వయసులోనూ ఫౌజా తన బలం మరియు నిబద్ధతతో తరతరాలను ప్రేరేపించాడని అన్నారు. గతేడాది 'నాషా ముక్త్ - రంగాలా పంజాబ్' మార్చ్లో ఫౌజాతో పాటు నడిచే గౌరవం లభించిందని గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు గులాబ్ చంద్ కటారియా తన అధికారిక ఫేస్బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు.కాగా, ఫౌజా సింగ్ 1911 ఏప్రిల్ 1న పంజాబ్లోని జలంధర్లో జన్మించారు. భార్య, కొడుకు మరణంతో ఫౌజా సింగ్ మానసిక సమస్యలతో పోరాడుతూ 1992లో మరాథాన్వైపు మళ్ళారు. అప్పటి నుంచి ఫౌజా మారథాన్లో సంచలన ప్రదర్శనలు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.ఫౌజా సింగ్ లండన్, టొరంటో, న్యూయార్క్ వంటి ప్రముఖ అంతర్జాతీయ మారథాన్లలో పాల్గొన్నారు. 42 కిలోమీటర్ల మారథాన్ను విజయవంతంగా పూర్తి చేయడంతో పాటు టొరంటో మారథాన్ను 5 గంటలు 44 నిమిషాలు 4 సెకన్లలో ముగించి రికార్డు నెలకొల్పాడు.ఫౌజా 2004 ఏథెన్స్ మరియు 2012 లండన్ ఒలింపిక్స్ లకు టార్చ్ బేరర్ గా ఉన్నాడు. దిగ్గజ ఫుట్బాలర్ డేవిడ్ బెక్హమ్, బాక్సింగ్ లెజెండ్ ముహమ్మద్ అలీతో కలిసి ఓ ప్రధాన క్రీడా బ్రాండ్ కోసం ప్రకటనలో కనిపించారు. -
ప్రేమతో టై... పెళ్లితో బ్రేక్!
మైదానంలో అలరించిన భారత క్రీడాకారులు పతకాలు, ట్రోఫీలతో పాటు అభిమానుల మనసుల్ని గెలుస్తారు. అలాగే తమ మనసు గెలిచిన వారితో మనసారా ఒక్కటవుతారు. టోరీ్నల్లో లాగానే మొదట పరిచయంతో ప్రేమపెళ్లికి ‘క్వాలిఫై’ అవుతారు. తర్వాత ‘మెయిన్ రౌండ్’లో ప్రేమించుకుంటారు. ‘ఫైనల్’కు వచ్చేసరికి పెళ్లి చేసుకుంటారు. అయితే ఇక్కడితోనే ‘పెళ్లి’ టైటిల్కు శుభం కార్డు పడుతుందనుకుంటే తప్పులో కాలేసినట్లే! కొన్నాళ్లకు, కొన్నేళ్లకు కొన్ని క్రీడా జంటలకు ‘విడాకులు’తో అశుభం కార్డు పడుతోంది. అలా ఈ కోవలో ఒక్క‘టై’.. ‘బ్రేక్’ చేసుకున్న జంటల కథలు...క్రీడాకారుల విజయాలు వార్తలవడం సహజం. విజయవంతమైన క్రేజీ స్టార్ల ప్రేమలు కూడా హాట్ న్యూస్లే! తర్వాత ఫారిన్ ట్రిప్పులు, చెట్టాపట్టాల్ అన్నీ కూడా మీడియా కంటపడకుండా ఉండవు. చివరకు పెళ్లి ముచ్చట ఇవన్నీ బాగానే ఉన్నా... కొందరి ‘ప్రేమ–పెళ్లి–విడాకుల’ తంతు పరిపాటిగా మారడమే క్రీడాకారుల దాంపత్య బంధాన్ని పలుచన చేస్తున్నాయి. తాజాగా వెటరన్ బ్యాడ్మింటన్ స్టార్ల జోడీ సైనా నెహా్వల్, పారుపల్లి కశ్యప్ తాము విడిపోతున్నట్లు ప్రకటించింది. గతంలో పాపులర్ షట్లర్లు గుత్తా జ్వాల, చేతన్ ఆనంద్లు బ్యాడ్మింటన్ కోర్టులో జోడీ కట్టి... తర్వాత పెళ్లి పీటలెక్కారు. కొన్నాళ్లకే కోర్టుకెక్కి విడాకులు తీసుకున్నారు. అయితే ఇటీవల ‘టై బ్రేక్’ జోడీల సంఖ్య ఎక్కువవుతోంది. వారి వివరాలివే...హార్దిక్ పాండ్యానటాషాభారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా సెర్బియన్ మోడల్ నటాషా స్టాంకోవిచ్ మనసుపడి మనువాడాడు. 2020లో కోవిడ్ సమయంలో ప్రపంచం మొత్తం లాక్డౌన్ అయిన సమయంలో తొలుత పెళ్లి చేసుకున్నారు. మళ్లీ 2023లో హిందూ, సెర్బియా మతాచారాల ప్రకారం మళ్లీ పెళ్లాడారు. కానీ ఇంతలా ఇష్టపడ్డ సెర్బియన్ నెచ్చెలితో పెళ్లి ముచ్చట కొన్నాళ్లకే ముగిసింది. 2024లో ఇద్దరు విడాకుల ప్రకటన చేశారు. ధావన్ అయేషాభారత క్రికెటర్ శిఖర్ ధావన్ సరిహద్దులు దాటిన ప్రేమ తదుపరి పెళ్లినాటి ప్రమాణాలు కూడా కొన్నేళ్ల తర్వాత గుదిబండగా మారడంతో చివరికి చెరోదారి చూసుకోవాల్సి వచి్చంది. మెల్బోర్న్లో స్థిరపడ్డ భారత సంతతికి చెందిన అయేషా ముఖర్జీతో మొదలైన పరిచయం కొన్నాళ్లకే ప్రణయానికి దారితీసింది. ధావన్ కంటే అయేషా ఏకంగా 12 ఏళ్లు పెద్ద వయసు్కరాలు. అయితే ఈ వయస్సు ప్రేమకి, పెళ్లికి అడ్డంకి కాలేదు. 2012లో వివాహబంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట పెళ్లి తర్వాత మనస్పర్థలతో 2023లో విడిపోయింది.చహల్ ధనశ్రీ భారత క్రికెట్లో మణికట్టు స్పిన్నర్గా బక్కపలుచని యోధుడు యజువేంద్ర చహల్ కొన్నాళ్లు వెలుగు వెలిగాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఐపీఎల్లో తమ జట్లకు చిరస్మరణీయ విజయాలు అందించిన చహల్... సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మతో ప్రేమలో పడ్డాడు. వీరిజంట నెట్టింట ‘మూడు రీల్స్... ఆరు జిగేల్స్’గా తెగ హల్చల్ చేసింది కొన్నాళ్లు! కానీ చిత్రంగా పెళ్లి మూణ్నాళ్ల ముచ్చటగానే చెదిరిపోయింది. ప్రేమ బాసలు, పెనవేసుకున్న ఊసులతో 2020లో మ్యారేజ్ చేసుకున్న చహల్–ధనశ్రీ వర్మ రెండేళ్లకే విడిపోయారు. 2022లో డివోర్స్ కార్డ్ వేశారు.షమీ హసీన్ జహన్ భారత సీనియర్ సీమర్ మొహమ్మద్ షమీ ప్రేమ పెళ్లి ముచ్చట వివాదాలు, ఆరోపణలతో నాలుగేళ్లకే క్లీన్»ౌల్డయ్యింది. తనకు పరిచయమైన హసీన్ జహన్తో కొంతకాలం ప్రేమాయణం జరిపిన తర్వాత 2014లో ఇద్దరు పెళ్లితో ఒక్కటయ్యారు. అయితే హసీన్ రచ్చకెక్కి మరీ గృహహింస కేసులు పెట్టి చివరకు 2018లో విడిపోయారు.సైనా కశ్యప్సింధు మేనియా ముందువరకు సైనానే సూపర్స్టార్గా వెలుగొందింది. కామన్వెల్త్ క్రీడల్లో రెండుసార్లు చాంపియన్గా నిలిచింది. ఎన్నో సూపర్ సిరీస్ టైటిళ్లు గెలిచింది. ఒకప్పుడు క్రీడా వార్తల్లో టెన్నిస్లో సానియా మీర్జా, బ్యాడ్మింటన్లో సైనాల విజయాలే పతాక శీర్షికలయ్యేవి. 2012–లండన్ ఒలింపిక్స్లో సైనా కాంస్య పతకం గెలుచుకుంది అంతగా పాపులారిటీ సంపాదించుకున్న ఆమె... గోపీచంద్ అకాడమీలో శిక్షణ సందర్భంగా పారుపల్లి కశ్యప్ను ప్రేమించింది. వీరి ప్రేమాయణం 2018లో మూడుముళ్ల బంధంగా మారింది. ఏడడుగులు నడిచిన ఈ జంట ఏడేళ్లు పూర్తయ్యేసరికి తమ బంధానికి బైబై చెప్పింది. -
Divorce: సైనా అలా.. పారుపల్లి కశ్యప్ ఇలా!.. ఇన్స్టా పోస్ట్ వైరల్
Saina Nehwal- Parupalli Kashyap Divorce: భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్స్ పతక విజేత సైనా నెహ్వాల్ (Saina Nehwal) తన భర్త పారుపల్లి కశ్యప్ (Parupalli Kashyap)తో విడిపోతున్నట్లు ప్రకటించింది. తాము సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆదివారం రాత్రి సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.ప్రకటన విడుదల చేసిన సైనాఈ మేరకు.. ‘‘జీవితం మనల్ని ఒక్కోసారి వేర్వేరు దిశల్లో ప్రయాణం చేయిస్తుంది. సుదీర్ఘ చర్చలు, ఆలోచనల తర్వాత.. నేను కశ్యప్ పారుపల్లి విడిపోవాలని నిర్ణయించుకున్నాం.శాంతియుత జీవనం, ఎదుగుదల, మానసిక ప్రశాంతత మా ఇరువురికీ ముఖ్యమని భావించి వేర్వేరు దారుల్లో ప్రయాణించాలని భావించాము. మా ఇద్దరి బంధానికి సంబంధించి నాకెన్నో మధురానుభూతులు ఉన్నాయి. ఇక ముందు కూడా స్నేహితుల్లా ముందుకు సాగుతాం.ఇలాంటి క్లిష్ట సమయంలో మా గోప్యత, గౌరవానికి భంగం కలగకుండా మా నిర్ణయాన్ని గౌరవించాలని కోరుకుంటున్నా’’ అని సైనా నెహ్వాల్ ఇన్స్టా స్టోరీ ద్వారా తమ విడాకుల విషయాన్ని వెల్లడించింది.బెస్టెస్ట్ అంటూ కశ్యప్ స్టోరీఅయితే, అదే సమయంలో పారుపల్లి కశ్యప్ మాత్రం విడాకుల గురించి ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు. అంతేకాదు.. సైనా కంటే ముందే ఓ పోస్ట్ను ఇన్స్టాలో షేర్ చేశాడు. ఇందులో కశ్యప్ తన స్నేహితులతో కలిసి వెకేషన్లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోను రీషేర్ చేస్తూ.. ‘‘బెస్టెస్ట్’’ అంటూ స్టోరీ పెట్టాడు.కపుల్ గోల్స్ సెట్ చేసిన క్రీడా జంట.. అంతలోనే..అయితే, సైనాతో ఉన్న పాత ఫొటోలన్నీ కూడా పారుపల్లి కశ్యప్ అలాగే ఉంచాడు. ఆమెతో కలిసి టూర్లకు వెళ్లిన ఫొటోలన్నీ తన సోషల్ మీడియా అకౌంట్లో అలాగే అట్టిపెట్టుకున్నాడు. కాగా భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్ దగ్గర శిక్షణ తీసుకున్న సైనా, కశ్యప్ చాలా ఏళ్లపాటు ప్రేమించుకున్నారు. 2018లో పెళ్లి బంధంతో ఒక్కటైన వీరు అన్యోన్యంగా ఉండేవారు. కెరీర్ పరంగానూ ఒకరికొరు అండగా ఉంటూ కపుల్ గోల్స్ సెట్ చేసే వాళ్లు.కానీ అకస్మాత్తుగా ఇలా సైనా నుంచి విడాకుల ప్రకటన రాగా.. కశ్యప్ మాత్రం ఇంకా స్పందించకపోవడం గమనార్హం. కాగా సైనాకు ప్రయాణాలు చేయడం అంటే చాలా ఇష్టం. కొన్నిసార్లు భర్త కశ్యప్తో పాటు టూర్లకు వెళ్లే సైనా.. మరికొన్ని సార్లు తన తల్లిదండ్రులతో కలిసి ప్రయాణాలు చేసేది. ఇందుకు సంబంధించిన జ్ఞాపకాలను ఫొటోల రూపంలో తన సోషల్ మీడియాలో షేర్ చేసేది సైనా. ఇక భర్తతో ఉన్న మధురానుభూతులను కూడా కెమెరాతో ఒడిసిపట్టి అభిమానులతో పంచుకునేది. చివరగా ఈ ఏడాది మేలో సైనా, కశ్యప్ సౌతాఫ్రికా టూర్కి వెళ్లినట్లుగా తెలుస్తోంది. అక్కడ సంతోషంగా గడిపిన క్షణాలను సైనా షేర్ చేసింది. అయితే, వీరి మధ్య విభేదాలు, విడాకులకు గల కారణం ఏమిటో మాత్రం తెలియదు.కెరీర్లో బెస్ట్కాగా సైనా లండన్ ఒలింపిక్స్-2012లో మహిళల సింగిల్స్ విభాగంలో కాంస్య పతకం గెలవగా.. అదే ఎడిషన్లో కశ్యప్ మెన్స్ సింగిల్స్లో క్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన భారత తొలి బ్యాడ్మింటన్ క్రీడాకారుడిగా కశ్యప్ చరిత్ర సృష్టించాడు. -
నాలుగో రౌండ్లో హంపి, దివ్య
బతూమి (జార్జియా): మహిళల ప్రపంచకప్ చెస్ నాకౌట్ టోర్నమెంట్లో భారత గ్రాండ్మాస్టర్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి కోనేరు హంపి, జూనియర్ ప్రపంచ చాంపియన్ దివ్య దేశ్ముఖ్ (మహారాష్ట్ర) నాలుగో రౌండ్లోకి దూసుకెళ్లారు. మూడో రౌండ్లో హంపి 1.5–0.5తో కులోన్ క్లౌడియా (పోలాండ్)పై, దివ్య 1.5–0.5తో టియోడోరా ఇంజాక్ (సెర్బియా)పై విజయం సాధించారు. ఆదివారం జరిగిన మూడో రౌండ్ రెండో గేమ్లో హంపి 44 ఎత్తుల్లో క్లౌడియాను ఓడించింది. ఇంజాక్తో జరిగిన రెండో గేమ్ను దివ్య 30 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. శనివారం జరిగిన మూడో రౌండ్ తొలి గేమ్ను హంపి 102 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకోగా... ఇంజాక్తో జరిగిన గేమ్లో దివ్య 39 ఎత్తుల్లో గెలిచింది. మూడో రౌండ్లోని రెండు గేమ్లు ముగిశాక భారత్కే చెందిన ద్రోణవల్లి హారిక–స్టావ్రూలా (గ్రీస్), వంతిక అగర్వాల్–కాటరీనా లాగ్నో (రష్యా), వైశాలి–కరిస్సా యిప్ (అమెరికా) 1–1తో సమంగా నిలిచారు. దాంతో ఈరోజు టైబ్రేక్ గేమ్లు నిర్వహించి విజేతలను నిర్ణయిస్తారు. -
జ్యోతి యర్రాజీ సర్జరీ సక్సెస్
సాక్షి, హైదరాబాద్: గాయంతో ఇబ్బంది పడుతున్న భారత స్టార్ అథ్లెట్ జ్యోతి యర్రాజీ మోకాలికి శస్త్రచికిత్స చేయించుకుంది. ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్ మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో 12.96 సెకన్ల టైమింగ్తో స్వర్ణం నెగ్గిన జ్యోతి... ప్రాక్టీస్ సందర్భంగా గాయపడింది. దీంతో పోటీలకు దూరమైన జ్యోతి... తాజాగా యాంటిరియర్ క్రూసియేట్ లిగమెంట్ (ఏసీఎల్)కు సర్జరీ చేయించుకున్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించింది. ప్రముఖ వైద్యుడు దిన్షా పర్దీవాలా పర్యవేక్షణలో జరిగిన శస్త్రచికిత్స విజయవంతమైందని తెలిపింది. ‘గత కొన్ని వారాలు భారంగా గడిచాయి. గాయం కారణంగా అమితంగా ఇష్టపడే అథ్లెటిక్స్కు దూరంగా ఉండాల్సి రావడం తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. ఈ శుక్రవారం సర్జరీ విజయవంతంగా పూర్తైంది. కష్ట సమయంలో అండగా నిలిచిన కుటుంబ సభ్యులు, కోచ్లు, భారత అథ్లెటిక్స్ సమాఖ్యకు ప్రత్యేక ధన్యవాదాలు. త్వరలోనే తిరిగి కోలుకుంటా. రెట్టించిన ఉత్సాహంతో ట్రాక్పై అడుగుపెట్టాలని భావిస్తున్నా’ అని జ్యోతి పేర్కొంది. ఇటీవల నిలకడగా రాణిస్తున్న జ్యోతి... టోక్యో వేదికగా జరగనున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో పాల్గొనాలని ఆశించినా... ఇప్పుడది సాధ్యపడేలా లేదు. వరల్డ్ అథ్లెటిక్స్ అర్హత మార్క్ 12.73 సెకన్లు కాగా... జ్యోతి నేరుగా ఈ అవకాశం దక్కించుకోకపోయినా ర్యాంకింగ్స్ ఆధారంగా ఆమెకు ఈ మెగా టోర్నీలో అవకాశం దక్కేది. -
భారత చెస్ 87వ గ్రాండ్మాస్టర్గా హరికృష్ణన్
చెన్నై: భారత చదరంగంలో మరో గ్రాండ్మాస్టర్ (జీఎం) అవతరించాడు. తమిళనాడుకు చెందిన 24 ఏళ్ల హరికృష్ణన్ ఈ ఘనత సాధించాడు. ఫ్రాన్స్లో ముగిసిన లా ప్లాగ్ని అంతర్జాతీయ చెస్ ఫెస్టివల్లో హరికృష్ణన్ జీఎం హోదా పొందడానికి అవసరమైన మూడో జీఎం నార్మ్ను ఖరారు చేసుకున్నాడు. భారత్కే చెందిన ఇనియన్తో గేమ్ను ‘డ్రా’ చేసుకున్న హరికృష్ణన్ నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో చివరి జీఎం నార్మ్ను అందుకున్నాడు. 2023లో బీల్ చెస్ ఫెస్టివల్లో తొలి జీఎం నార్మ్ పొందిన ఈ మాస్టర్ ఆఫ్ కామర్స్ (ఎంకామ్) విద్యార్థి ఈ ఏడాది జూన్లో స్పెయిన్లో జరిగిన అందుజార్ ఓపెన్లో రెండో జీఎం నార్మ్ పొందాడు. ‘చాలా ఆనందంగా ఉంది. ఏడేళ్ల క్రితం గ్రాండ్మాస్టర్ హోదా కోసం ప్రయత్నం మొదలైంది. గత మూడేళ్లలో క్రమం తప్పకుండా టోర్నీల్లో పోటీపడుతున్నాను. కానీ జీఎం నార్మ్లు సాధించలేకపోయాను. అయితే రెండు నెలల వ్యవధిలో రెండు జీఎం నార్మ్లు పొంది గ్రాండ్మాస్టర్ హోదా దక్కించుకోవడంతో చాలా సంతోషంగా ఉన్నాను’ అని తమిళనాడుకే చెందిన గ్రాండ్మాస్టర్ శ్యాం సుందర్ మోహన్రాజ్ వద్ద శిక్షణ తీసుకుంటున్న హరికృష్ణన్ వ్యాఖ్యానించాడు. -
వివాహబంధానికి సైనా, కశ్యప్ గుడ్బై
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా సైనా తమ విడాకుల విషయాన్ని ఆదివారం రాత్రి పోస్ట్ చేసింది. ‘జీవితం కొన్నిసార్లు మనల్ని వేర్వేరు దిశలకు తీసుకెళుతుంది. ఎంతో ఆలోచించి, సుదీర్ఘంగా చర్చించుకున్న తర్వాత నేను, కశ్యప్ విడిపోవాలనే నిర్ణయానికి వచ్చాం. పరస్పర అవగాహనతో సహృద్భావ వాతావరణంలో మా విడాకులు తీసుకుంటున్నాం. కశ్యప్తో నాకు ఎన్నో తీపి గుర్తులున్నాయి.ఇకపై మిత్రులుగా ఉంటాం. మా నిర్ణయాన్ని అందరు స్వాగతిస్తారని, ప్రైవసీని గౌరవిస్తారని ఆశిస్తున్నాం’ అని ఇన్స్టాలో పోస్ట్ చేసింది. పుల్లెల గోపీచంద్ వద్ద శిక్షణ తీసుకున్న సైనా, కశ్యప్లు 2018లో పెళ్లి చేసుకున్నారు. సైనా రెండుసార్లు కామన్వెల్త్ చాంపియన్గా నిలిచింది. 2012 లండన్ ఒలింపిక్స్లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. -
విన్నర్ సినెర్
లండన్: పచ్చిక కోర్టులపై తన ప్రతాపాన్ని చూపిన ఇటలీ స్టార్, ప్రపంచ నంబర్వన్ యానిక్ సినెర్ ‘వింబుల్డన్ గ్రాండ్స్లామ్’ చాంపియన్గా అవతరించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సినెర్ 4–6, 6–4, 6–4, 6–4తో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ రెండో ర్యాంకర్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్)ను ఓడించాడు. విజేతగా నిలిచిన సినెర్కు 30 లక్షల పౌండ్లు (రూ. 34 కోట్ల 85 లక్షలు), రన్నరప్ అల్కరాజ్కు 15 లక్షల 20 వేల పౌండ్లు (రూ. 17 కోట్ల 66 లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి. 3 గంటల 4 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో గెలవడం ద్వారా గత నెలలో ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో అల్కరాజ్ చేతిలో ఎదురైన ఓటమికి 23 ఏళ్ల సినెర్ బదులు తీర్చుకున్నాడు. అంతేకాకుండా తన కెరీర్లో తొలిసారి వింబుల్డన్ టైటిల్ను సాధించాడు. ఓవరాల్గా సినెర్ ఖాతాలో ఇది నాలుగో గ్రాండ్స్లామ్ టైటిల్ కావడం విశేషం. సినెర్ 2024, 2025లలో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్... 2024లో యూఎస్ ఓపెన్ టైటిల్ సాధించాడు. సినెర్ చేతిలో ఓటమితో గ్రాండ్స్లామ్ ఫైనల్లో అల్కరాజ్కు తొలిసారి పరాజయం ఎదురైంది. ఈ మ్యాచ్కంటే ముందు 22 ఏళ్ల అల్కరాజ్ ఫైనల్ చేరిన ఐదు గ్రాండ్స్లామ్ టోర్నీల్లోనూ (2022 యూఎస్ ఓపెన్; 2023 వింబుల్డన్; 2023 ఫ్రెంచ్ ఓపెన్; 2024 వింబుల్డన్; 2025 ఫ్రెంచ్ ఓపెన్) విజేతగా నిలిచాడు. తొలి సెట్ కోల్పోయినా... గతంలో అల్కరాజ్ చేతిలో ఎనిమిదిసార్లు ఓడిపోయి, నాలుగుసార్లు మాత్రమే నెగ్గిన సినెర్ వింబుల్డన్ ఫైనల్లో శుభారంభం చేయలేకపోయాడు. తొలి సెట్లో 4–2తో ఆధిక్యంలో ఉన్నప్పటికీ... అల్కరాజ్ ధాటికి సినెర్ వరుసగా నాలుగు గేమ్లు కోల్పోయి సెట్ను 4–6తో చేజార్చుకున్నాడు. తొలి సెట్ను కోల్పోయినా... ఆందోళన చెందకుండా సంమయనంతో ఆడిన సినెర్ రెండో సెట్లో తొలి గేమ్లోనే అల్కరాజ్ సర్వీస్ను బ్రేక్ చేశాడు. ఆ తర్వాత తన సర్వీస్లను నిలబెట్టుకొని సెట్ను 6–4తో నెగ్గి 1–1తో సమం చేశాడు. మూడో సెట్లోని తొమ్మిదో గేమ్లో అల్కరాజ్ సర్వీస్ను బ్రేక్ చేసి పదో గేమ్లో సర్వీస్ను నిలబెట్టుకున్న సినెర్ సెట్ను 6–4తో దక్కించుకున్నాడు. నాలుగో సెట్లోనూ సినెర్ దూకుడు కొనసాగించి మూడో గేమ్లో అల్కరాజ్ సర్వీస్ను బ్రేక్ చేశాడు. ఆ తర్వాత తన సర్వీస్లను కాపాడుకొని సెట్తోపాటు విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. -
నదీమ్తో నీరజ్ ఢీ
సిలేసియా (పోలాండ్): భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా... దాయాది పాకిస్తాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్తో పోటీకి సిద్ధమవుతున్నాడు. వచ్చే నెల 16న పోలాండ్ వేదికగా జరగనున్న సిలేసియా డైమండ్ లీగ్లో వీరిద్దరూ బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య శనివారం వివరాలు వెల్లడించింది. గతేడాది పారిస్ ఒలింపిక్స్లో చివరిసారిగా ఈ ఇద్దరు తలపడగా... నదీమ్ జావెలిన్ను 92.97 మీటర్ల దూరం విసిరి స్వర్ణం కైవసం చేసుకున్నాడు. నీరజ్ 89.45 మీటర్ల దూరంతో రజతం గెలుచుకున్నాడు. అంతకుముందు 2020 టోక్యో ఒలింపిక్స్లో చోప్రా పసిడి పతకం నెగ్గాడు. ఇటీవల భారత్ వేదికగా తొలిసారి జరిగిన అంతర్జాతీయ జావెలిన్ త్రో ఈవెంట్ ‘నీరజ్ చోప్రా క్లాసిక్’ టైటిల్ గెలిచిన 27 ఏళ్ల నీరజ్ చోప్రా జోరు మీదున్నాడు. ఈ సీజన్లో వరుసగా మూడు టైటిల్స్తో అతను ఇప్పటికే ‘హ్యాట్రిక్’ నమోదు చేశాడు. ‘నదీమ్, నీరజ్ మధ్య ఆసక్తికర పోరు ఖాయం. పారిస్ ఒలింపిక్స్ తర్వాత ఈ ఇద్దరు ఒకే టోర్నమెంట్లో పాల్గొంటుండటం ఇదే తొలిసారి. ఒకరు ప్రపంచ చాంపియన్, మరొకరు ఒలింపిక్ చాంపియన్. వారి మధ్య సమరాన్ని చూసేందుకు పోలాండ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాకిస్తాన్ అథ్లెట్ యూరోపియన్ లీగ్ల్లో పాల్గొనడం చాలా తక్కువ. మరి ఈ సారి అతడికి నీరజ్కు మధ్య పోటీ ఎలా సాగుతుందో చూడాలి’ అని లీగ్ నిర్వాహకులు వెల్లడించారు. ఈ ఏడాది తొలిసారి 90 మీటర్ల మార్క్ దాటిన నీరజ్ చోప్రా... మే నెలలో జరిగిన దోహా డైమండ్ లీగ్లో జావెలిన్ను 90.23 మీటర్ల దూరం విసిరి తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసుకున్నాడు.పారిస్ ఒలింపిక్స్ తర్వాత వరుసగా టోర్నీల్లో పాల్గొంటున్న నీరజ్ దిగ్గజ కోచ్ జాన్ జెలెజ్నీ దగ్గర శిక్షణ తీసుకుంటున్నాడు. మరోవైపు 28 ఏళ్ల నదీమ్... ఒలింపిక్ చాంపియన్గా నిలిచిన అనంతరం కేవలం ఒక్క టోర్నీలో మాత్రమే పాల్గొన్నాడు. సెపె్టంబర్లో టోక్యో వేదికగా ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ జరగనున్న నేపథ్యంలో ఈ లీగ్ ప్రాధాన్యత సంతరించుకుంది. 2023లో వరల్డ్ చాంపియన్గా నిలిచిన నీరజ్ దాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. -
సినెర్ X అల్కరాజ్
లండన్: ప్రతిష్ఠాత్మక గ్రాండ్స్లామ్ టోర్నీ వింబుల్డన్లో పురుషుల సింగిల్స్ ఫైనల్కు వేళయింది. ఆదివారం జరగనున్న ఈ తుది పోరులో ప్రపంచ నంబర్వన్ జానిక్ సినెర్ (ఇటలీ), రెండో ర్యాంకర్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) అమీతుమీ తేల్చుకోనున్నారు. గత నెల జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ ఫైనల్లోనూ ఈ ఇద్దరే తలపడగా... అల్కరాజ్ విజేతగా నిలిచాడు. ఇలా ఫ్రెంచ్ ఓపెన్ తర్వాత వింబుల్డన్లో ఆ ఇద్దరు ఆటగాళ్లే ఫైనల్లో తలపడనుండటం రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్), రాఫెల్ నాదల్ (స్పెయిన్) తర్వాత ఇదే తొలిసారి. ఈ ఇద్దరు దిగ్గజాలు 2006–2008 మధ్య వరుసగా మూడేళ్ల పాటు ఈ రెండు గ్రాండ్స్లామ్ ఫైనల్స్లో ఢీకొన్నారు. ఆ ఇద్దరు కెరీర్కు వీడ్కోలు పలకగా... 38 ఏళ్ల జొకోవిచ్ కూడా గతంలో మాదిరిగా దూకుడు కనబర్చలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా నవతరం నిలకడ కనబరుస్తోంది. అందులో ముఖ్యంగా 22 ఏళ్ల అల్కరాజ్, 23 ఏళ్ల సినెర్ తమ పోరాట పటిమతో అభిమానుల మనసు దోచుకుంటున్నారు. అల్కరాజ్ ఇప్పటివరకు ఐదు గ్రాండ్స్లామ్ టైటిల్స్ గెలవగా... సినెర్ మూడు నెగ్గాడు. గత 6 మేజర్ టైటిల్స్ను ఈ ఇద్దరే పంచుకోవడం విశేషం. ‘భవిష్యత్తు గురించి ఇప్పటి నుంచే ఆలోచించడం లేదు. ప్రస్తుతానికైతే సినెర్తో పోటీని ఆస్వాదిస్తున్నా. మున్ముందు కూడా ఇలాగే సాగుతుందని చెప్పలేను. దిగ్గజాల సరసన మా పేర్లు జోడించడం ఆనందమే’ అని అల్కరాజ్ అన్నాడు. వింబుల్డన్లో గత రెండేళ్లుగా తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తున్న ఈ స్పెయిన్ యంగ్స్టర్... ‘హ్యాట్రిక్’పై కన్నేశాడు. ఇప్పటి వరకు జాన్ బోర్గ్, సంప్రాస్, ఫెడరర్, జొకోవిచ్ వింబుల్డన్లో వరుసగా మూడు టైటిల్స్ సాధించగా... ఇప్పుడు ఆ జాబితాలో తన పేరు నమోదు చేసుకోవాలని అల్కరాజ్ తహతహలాడుతున్నాడు. సినెర్కు ఇది వరుసగా నాలుగో మేజర్ ఫైనల్ కాగా అందులో యూఎస్ ఓపెన్, ఆ్రస్టేలియా ఓపెన్లో విజయాలు సాధించాడు. గత నెలలో వీరిద్దరి మధ్య రోలాండ్ గారోస్లో 5 గంటల 29 నిమిషాల పాటు సాగిన సుదీర్ఘ ఫైనల్లో సినెర్పై అల్కరాజ్ విజయం సాధించగా... ఆ ఓటమికి బదులు తీర్చుకోవాలని ఇటలీ ప్లేయర్ భావిస్తున్నాడు. -
ఒక్కటే మిగిలింది!
సాక్షి క్రీడా విభాగం : 2019...ఇగా స్వియాటెక్ తొలి సారి గ్రాండ్స్లామ్ బరిలోకి దిగిన ఏడాది. అంటే 2020లో నిర్వహించని వింబుల్డన్ను మినహాయిస్తే 26 గ్రాండ్స్లామ్ టోర్నీల్లో ఆమె బరిలోకి దిగింది. ఏడేళ్ల కెరీర్ కూడా పూర్తి కాకముందే ఆమె ఖాతాలో ఇప్పుడు ఆరు టైటిల్స్ ఉన్నాయి. 24 ఏళ్ల వయసుకే ఇన్ని ఘనతలు సాధించిన ఇగా... పురుషుల, మహిళల విభాగంలో వింబుల్డన్ నెగ్గిన తొలి పోలండ్ ప్లేయర్గా నిలిచింది. దూకుడైన ఆటతో ఆమె అన్ని సర్ఫేస్లపై ఆధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చింది. స్వయంగా ఇగా మాటల్లోనే చెప్పాలంటే ‘భారీ సర్వీస్లు, టాప్ స్పిన్, పదునైన బ్యాక్హ్యాండ్ నా ప్రధాన బలాలు’. ఇదే ఆటపై ఇప్పుడు ఆమె ప్రపంచ మహిళల టెన్నిస్ను శాసిస్తోంది. శనివారం అనిసిమోవాతో జరిగిన ఫైనల్లో ఆమె ఆధిక్యం ప్రదర్శించిన తీరు స్వియాటెక్ పదునును చూపించింది. క్రీడాకారులు, ఒలింపిక్స్లో పాల్గొన్న రోయర్ అయిన తండ్రి ప్రోత్సాహంతో తొలి అడుగులు వేసిన ఆమె ఇప్పుడు అసాధారణ ప్రదర్శనతో శిఖరానికి చేరింది. ఆమె ప్రొఫెషనల్ కెరీర్లో తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. తొలిసారి 903వ ర్యాంక్తో డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్లో అడుగు పెట్టిన ఆమె మూడేళ్ల పాటు చెప్పుకోదగ్గ విజయాలతో దూసుకుపోయింది. స్వియాటెక్ కెరీర్లో మూడేళ్లు 2022, 2023, 2024 అద్భుతంగా సాగాయి. తొలి సారి వరల్డ్ నంబర్వన్గా నిలవడంతో పాటు మూడు సీజన్ల పాటు ఆమె దానిని నిలబెట్టుకోవడం విశేషం. ఐదేళ్ల వ్యవధిలో నాలుగు సార్లు క్లే కోర్టు ఫ్రెంచ్ ఓపెన్లో చాంపియన్గా నిలిచినా గ్రాస్ మాత్రం ఆమెకు కొరుకుడు పడలేదు. ఈ సారి విజేతగా నిలవడానికి ముందు ఆమె అత్యుత్తమ ప్రదర్శన క్వార్టర్ ఫైనల్ మాత్రమే. గత ఏడాదైతే మూడో రౌండ్లోనే నిష్క్రమించింది. ఆ తర్వాత నవంబరులో డోపింగ్ పరీక్షలో విఫలం కావడంతో కొత్త వివాదం రేగింది. సస్పెన్షన్ ముగిసి మళ్లీ బరిలోకి దిగిన తర్వాత 2025లో కూడా ఆమె ప్రదర్శన గొప్పగా లేదు. రెండు గ్రాండ్స్లామ్లు ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్లలో ఇగా సెమీఫైనల్కే పరిమితమైంది. అయితే గ్రాస్కోర్టులో ప్రాక్టీస్ను తొందరగా మొదలు పెట్టేందుకు ఇది ఉపకరించింది. వింబుల్డన్కు ముందు సన్నాహక గ్రాస్ కోర్టు టోర్నీ బాడ్ హాంబర్గ్ ఓపెన్లో ఫైనల్కు చేరడంతో కాస్త ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇప్పుడు దానినే కొనసాగిస్తూ పచ్చికపై తన చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. హార్డ్ కోర్ట్పై యూఎస్ ఓపెన్ నెగ్గగా...ఆ్రస్టేలియన్ ఓపెన్ మాత్రమే ఇంకా అందుకోవాల్సి వచ్చింది. ఇదే ఫామ్ కొనసాగితే 2026లోనే అది సాధ్యం కావచ్చు. -
వింబుల్డన్ క్వీన్ స్వియాటెక్
లండన్: పోలండ్ స్టార్ ఇగా స్వియాటెక్ అసాధారణ ఆటతో వింబుల్డన్లో విజయకేతనం ఎగురవేసింది. గ్రాస్ కోర్టుపై తిరుగులేని ప్రదర్శన కనబర్చిన ఇగా 2025 వింబుల్డన్ చాంపియన్గా నిలిచింది. శనివారం పూర్తి ఏకపక్షంగా సాగిన ఫైనల్లో ఎనిమిదో సీడ్ స్వియాటెక్ 6–0, 6–0తో 13వ సీడ్ అమందా అనిసిమోవా (అమెరికా)ను చిత్తు చిత్తుగా ఓడించింది. కేవలం 57 నిమిషాల్లోనే ముగిసిన ఈ పోరులో స్వియాటెక్ ముందు అమందా ఏమాత్రం నిలవలేకపోయింది. స్వియాటెక్ కెరీర్లో ఇది తొలి వింబుల్డన్ టైటిల్ కాగా...ఓవరాల్గా ఇది ఆరో గ్రాండ్స్లామ్. ఈ గెలుపుతో మూడు సర్ఫేస్ (హార్డ్, క్లే, గ్రాస్)లలోనూ గ్రాండ్స్లామ్ నెగ్గిన ప్లేయర్గా స్వియాటెక్ గుర్తింపు పొందింది. నాలుగు ఫ్రెంచ్ ఓపెన్లు, ఒక యూఎస్ ఓపెన్ ట్రోఫీ నెగ్గిన పోలండ్ స్టార్ కెరీర్లో ఇక ఆ్రస్టేలియన్ ఓపెన్ మాత్రమే మిగిలి ఉంది. ఫటాఫట్... మ్యాచ్కు ముందు మాజీ వరల్డ్ నంబర్వన్ స్వియాటెక్పై సహజంగానే గెలుపు అంచనాలు ఉన్నాయి. అయితే సెమీస్లో వరల్డ్ నంబర్వన్ సబలెంకాపై సంచలన విజయం సాధించిన అనిసిమోవా గట్టి పోటీనిస్తుందని అంతా భావించారు. అయితే పోలండ్ స్టార్ ముందు అమెరికన్ ప్లేయర్ ఆటలు ఏమాత్రం సాగలేదు. తొలి సెట్లో ఏకంగా 14 అన్ఫోర్స్డ్ ఎర్రర్స్ చేసిన అనిసిమోవా...రెండో సెట్లోనూ మరో 14 అన్ఫోర్స్డ్ ఎర్రర్స్తో ప్రత్యరి్థకి మ్యాచ్ను అప్పగించింది. తొలి ఫైనల్ ఆడుతున్న ఒత్తిడి అమెరికన్లో కనిపించగా...స్వియాటెక్ మాత్రం ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయింది. 3 ఏస్లు సంధించిన పోలండ్ ప్లేయర్ ప్రత్యర్థి సర్వీస్ను 6 సార్లు బ్రేక్ చేసింది. ఆరో గ్రాండ్స్లామ్తో ఇగా విజయగర్జన చేయగా... ఓటమి అనంతరం అనిసిమోవా కన్నీళ్లపర్యంతమైంది. 2018లో స్వియాటెక్ బాలికల సింగిల్స్లో వింబుల్డన్ టైటిల్ నెగ్గింది. 6 స్వియాటెక్ కెరీర్లో ఇది ఆరో గ్రాండ్స్లామ్ టైటిల్100 గ్రాండ్స్లామ్లో స్వియాటెక్కు ఇది వందో విజయం. 2019లో తొలి సారి బరిలోకి దిగిన ఆమె 120 మ్యాచ్లలో 100 గెలిచింది.114 వింబుల్డన్ ఫైనల్ ఇలా 6–0, 6–0 (డబుల్ బీగెల్)తో ముగియడం 114 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 1911 వింబుల్డన్ ఫైనల్లో డొరొతియా లాంబర్ట్ 6–0, 6–0తో డొరా బుత్బైని ఓడించింది. 1988 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో స్టెఫీగ్రాఫ్ 6–0, 6–0తో నటాషా జ్వెరెవాను చిత్తు చేసింది.నేడు పురుషుల సింగిల్స్ ఫైనల్అల్కరాజ్ (స్పెయిన్) X సినెర్ (ఇటలీ) రాత్రి గం. 8:30 నుంచి స్టార్ స్పోర్ట్స్లో ప్రత్యక్ష ప్రసారం -
ఆర్చరీ ప్రపంచకప్లో జ్యోతి సురేఖ ‘హ్యాట్రిక్’
మాడ్రిడ్: ఆంధ్రప్రదేశ్ స్టార్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ ప్రపంచకప్లో ‘హ్యాట్రిక్’ పతకాలు సాధించింది. అయితే కాంపౌండ్లో తృటిలో రెండు స్వర్ణావకాశాల్ని చేజార్చుకుంది. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో ఒక్కో రజతం, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కాంస్యం గెలుచుకుంది. కాంపౌండ్ వ్యక్తిగత ఫైనల్లో జ్యోతి 147–148తో ఎలా గిబ్సన్ (బ్రిటన్) చేతిలో పాయింట్ తేడాతో ఓడి రజతంతో తృప్తి పడింది. మరో కాంపౌండ్ టీమ్ ఈవెంట్ స్వర్ణ పతక పోరులో జ్యోతి, పర్ణిత్ కౌర్, ప్రీతికలతో కూడిన భారత జట్టు 225–227తో చైనీస్ తైపీకి చెందిన హువంగ్ జౌ, చెన్ యి సున్, చియు యు ఎర్ చేతిలో పరాజయం చవిచూసింది. మొదట 57–57తో తైపీ త్రయాన్ని నిలువరించిన భారత జట్టు... 58–56తో, 55–56తో మూడు రౌండ్లు ముగిసేసరికి 170–169తో ఆధిక్యంలో నిలిచింది. కానీ ఆఖరి నాలుగో రౌండ్లో గురి కుదరక రజతంతో సరిపెట్టుకుంది. మిక్స్డ్ టీమ్ ఈవెంట్ కాంస్య పతక పోరులో జ్యోతి సురేఖ (ఏపీ)–రిషభ్ యాదవ్ (హరియాణా) జోడీ 156–153తో పాలొ కొరాడో–డగ్లస్ నొలాస్కో (ఎల్ సాల్వడోర్) జంటపై గెలిచింది. -
Wimbledon 2025: వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేత స్వియాటెక్
ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీలో సరికొత్త ఛాంపియన్ అవతరించింది. వింబుల్డన్-2025 టోర్నీ మహిళల సింగిల్స్ విజేతగా పొలాండ్కు చెందిన ఇగా స్వియాటెక్ (Iga Swiatek) నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో అమెరికాకు చెందిన అమందా అనిస్మోవాకను 6-0, 6-0 తేడాతో చిత్తుగా ఓడించిన స్వియాటెక్.. తొలి వింబుల్డన్ టైటిల్ను సొంతంచేసుకుంది. రెండు సెట్లలోనూ పొలాండ్ భామ జోరు ముందు అమందా నిలవలేకపోయింది. కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. -
మూడో రౌండ్లో వంతిక
బతూమి (జార్జియా): మహిళల ప్రపంచకప్ చెస్ నాకౌట్ టోర్నమెంట్లో భారత క్రీడాకారిణి వంతిక అగర్వాల్ మూడో రౌండ్లోకి ప్రవేశించగా... పద్మిని రౌత్, ప్రియాంక రెండో రౌండ్లోనే ని్రష్కమించారు. ప్రపంచ మాజీ చాంపియన్ అన్నా ఉషెనినా (ఉక్రెయిన్)తో జరిగిన రెండో రౌండ్లో వంతిక 4.5–3.5తో విజయం సాధించింది. గురువారం రెండో రౌండ్లో రెండు గేమ్లు ముగిశాక ఇద్దరూ 1–1తో సమంగా ఉండటంతో శుక్రవారం టైబ్రేక్ నిర్వహించారు. టైబ్రేక్లో వంతిక 3.5–2.5తో గెలిచింది. ప్రపంచ మాజీ చాంపియన్ అలెగ్జాండ్రా కొస్టెనిక్ (స్విట్జర్లాండ్)తో జరిగిన పోరులో పద్మిని 3.5–4.5తో ఓడిపోయింది. గురువారం రెండు గేమ్లు ముగిశాక ఇద్దరూ 1–1తో సమంగా నిలిచారు. దాంతో శుక్రవారం టైబ్రేక్ గేమ్లు నిర్వహించగా... కొస్టెనిక్ 3.5–2.5తో పద్మినిని ఓడించింది. కులోన్ క్లౌడియా (పోలాండ్)తో జరిగిన పోటీలో ప్రియాంక 1–3తో ఓటమి పాలైంది. నేడు జరిగే మూడో రౌండ్ తొలి గేమ్లలో కులోన్ క్లౌడియాతో కోనేరు హంపి; టియోడొరా ఇంజాక్ (సెర్బియా)తో దివ్య దేశ్ముఖ్; కాటరీనా లాగ్నోతో వంతిక; స్టావ్రూలాతో ద్రోణవల్లి హారిక; కరిస్సా యిప్తో వైశాలి తలపడతారు. -
సెమీస్లో జొకోవిచ్కు షాక్
లండన్: కెరీర్లో రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్స్లామ్ టైటిల్ లక్ష్యంగా వింబుల్డన్ టోర్నీలో బరిలోకి దిగిన సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ ప్రస్థానం ముగిసింది. పురుషుల సింగిల్స్లో ఆరో సీడ్, ఆరుసార్లు చాంపియన్ జొకోవిచ్ సెమీఫైనల్లో నిష్క్రమించాడు. ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ యానిక్ సినెర్ (ఇటలీ) అద్భుతంగా ఆడి 6–3, 6–3, 6–4తో వరుస సెట్లలో జొకోవిచ్ను ఓడించి తొలిసారి వింబుల్డన్ టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 2017 తర్వాత వింబుల్డన్ టోర్నీలో జొకోవిచ్ ఫైనల్ చేరుకోకపోవడం ఇదే తొలిసారి. గత రెండేళ్లు ఫైనల్లో అల్కరాజ్ చేతిలో ఓడిన జొకోవిచ్ 2018, 2019, 2021, 2022లలో విజేతగా నిలిచాడు. కరోనా కారణంగా 2020లో వింబుల్డన్ టోర్నీని నిర్వహించలేదు. జొకోవిచ్తో 1 గంట 55 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్లో సినెర్ 12 ఏస్లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్ను ఐదు సార్లు బ్రేక్ చేశాడు. జొకోవిచ్ 12 ఏస్లు సంధించడంతోపాటు 28 అనవసర తప్పిదాలు చేశాడు. ‘హ్యాట్రిక్’ టైటిల్పై అల్కరాజ్ గురి తొలి సెమీఫైనల్లో 2023, 2024 చాంపియన్ అల్కరాజ్ (స్పెయిన్) 2 గంటల 49 నిమిషాల్లో 6–4, 5–7, 6–3, 7–6 (8/6)తో ఐదో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)పై గెలిచాడు. వరుసగా మూడో ఏడాది ఈ టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించాడు. ఆదివారం జరిగే ఫైనల్లో సినెర్తో అల్కరాజ్ తలపడతాడు. అల్కరాజ్ గెలిస్తే... జాన్ బోర్గ్, సంప్రాస్, ఫెడరర్, జొకోవిచ్ తర్వాత వింబుల్డన్లో ‘హ్యాట్రిక్’ టైటిల్స్ నెగ్గిన ఐదో ప్లేయర్గా నిలుస్తాడు. నేడు మహిళల సింగిల్స్ ఫైనల్ స్వియాటెక్ (పోలాండ్) X అనిసిమోవా (అమెరికా) రాత్రి గం. 8:30 నుంచి స్టార్ స్పోర్ట్స్లో ప్రత్యక్ష ప్రసారం -
సినియకోవా–వెర్బీక్ జోడీకి మిక్స్డ్ డబుల్స్ టైటిల్
లండన్: వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో కాటరీనా సినియకోవా (చెక్ రిపబ్లిక్)–సెమ్ వెర్బీక్ (నెదర్లాండ్స్) జోడీ విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో సినియకోవా–వెర్బీక్ ద్వయం 7–6 (7/3), 7–6 (7/3)తో లూసియా స్టెఫానీ (బ్రెజిల్)–జో సాలిస్బరీ (బ్రిటన్) జోడీపై విజయం సాధించింది. సినియకోవా–వెర్బీక్ జంటకు 6,80,000 పౌండ్లు (రూ. 7 కోట్ల 88 లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి. సినియకోవా కెరీర్లో ఇది 11వ గ్రాండ్స్లామ్ డబుల్స్ టైటిల్కాగా... ‘మిక్స్డ్’లో మాత్రం తొలి టైటిల్. మహిళల డబుల్స్లో సినియకోవా మూడుసార్లు చొప్పున ఆ్రస్టేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టోర్నీలలో... ఒకసారి యూఎస్ ఓపెన్లో టైటిల్స్ సాధించింది. అంతేకాకుండా టోక్యో ఒలింపిక్స్లో మహిళల డబుల్స్లో... పారిస్ ఒలింపిక్స్లో మిక్స్డ్ డబుల్స్లో స్వర్ణ పతకాలు సొంతం చేసుకుంది. మరోవైపు వెర్బీక్ తొలి గాండ్స్లామ్ టైటిల్ నెగ్గాడు. -
ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి
న్యూఢిల్లీ: యువ క్రీడాకారిణులు మరింత బాధ్యతగా ఆడాల్సిన అవసరముందని భారత మహిళల హాకీ జట్టు ప్రధాన కోచ్ హరేంద్ర సింగ్ అన్నాడు. లేకుంటే జట్టు సీనియర్ ప్లేయర్లపై ఎక్కువ ఆధారపడాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. మ్యాచ్కు ముందు ఎంత బాగా శిక్షణ పొందినా... ఒక్కసారి మైదానంలో అడుగు పెట్టాక అప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుంటూ ముందుకు సాగితేనే ఫలితాలు అనుకూలంగా వస్తాయని ఆయన వెల్లడించాడు. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్ యూరప్ అంచె పోటీల్లో భారత మహిళల హాకీ జట్టు ఎనిమిది మ్యాచ్ల్లోనూ ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.ఈ నేపథ్యంలో హరేంద్ర సింగ్ మాట్లాడుతూ... ‘ప్రొ లీగ్లో యువ జట్టుతో బరిలోకి దిగాం. పలువురు అనుభజు్ఞలైన ప్లేయర్లు గాయాలతో యూరప్ అంచె పోటీలకు దూరమవడం ఫలితాలపై ప్రభావం చూపింది. ముఖ్యంగా డిఫెన్స్ మరీ బలహీనంగా మారింది. దీంతో ప్రత్యర్థులు సులువుగా గోల్స్ చేస్తూ జట్టుపై ఒత్తిడి పెంచారు. దీనిపై మరింత కృషి చేయాల్సిన అవసరముంది. అనుభవరాహిత్యం కారణంగా యువ ప్లేయర్లు తాము మైదానంలో ఎక్కడ ఉన్నాం... తమ బాధ్యత ఏంటి అనే విషయంలో కాస్త అయోమయానికి గురయ్యారనేది సుస్పష్టం. అందుకే పరిస్థితులకు తగ్గట్లు ముందుకు సాగాలి. లేకుంటే తిరిగి సీనియర్ ఆటగాళ్లపైనే భారం మోపాల్సి ఉంటుంది. ఫీల్డ్లో నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం పనికిరాదు. ఎంత వేగంగా స్పందిస్తే అంత మెరుగైన ఫలితం సాధించవచ్చు. ప్రత్యర్థి సర్కిల్లోకి ప్రవేశిస్తే... గోల్ పోస్ట్పై దాడులు చేసేందుకు వెరవకూడదు. పదేపదే దాడులు చేస్తూ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెడితేనే మ్యాచ్పై పట్టు చిక్కుతుంది’ అని అన్నాడు. సీనియర్లు అందుబాటులో లేకే... అంతర్జాతీయ స్థాయిలో అపార అనుభవం ఉన్న ప్లేయర్లు వేర్వేరు కారణాలతో జట్టుకు దూరం కావడంతోనే యూరప్ అంచె పోటీల్లో భారత ఆటతీరు మరీ తీసుకట్టులా మారిందని హరేంద్ర సింగ్ అన్నాడు. ‘ప్రొ లీగ్ ప్రారంభానికి ముందు సుశీలా చాను జట్టుకు దూరమైంది. నిక్కీ ప్రధాన్, ఉదిత గాయాలతో ఇబ్బంది పడుతుండటంతో వారికి విశ్రాంతినివ్వాల్సి వచ్చింది. దీంతో ముగ్గురు ప్రధాన డిఫెండర్లు లేకపోవడంతో మన రక్షణ పంక్తి బలహీనపడింది. యువ స్ట్రయికర్ సంగీత కుమారి కూడా గాయం కారణంగా జట్టుకు దూరమైంది’ అని హరేంద్ర వెల్లడించాడు. ప్లేయర్ల మానసిక బలాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు హరేంద్ర అన్నాడు. ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ప్లేయర్లకు మానసికంగా దృఢంగా ఉండేవిధంగా శిక్షణ ఇచ్చిన మోహన్ అనే వ్యక్తిని జట్టు సహాయక సిబ్బందిలో చేర్చినట్లు తెలిపారు. ఒత్తిడిని అధిగమించడం, తక్షణం స్పందించే గుణం వంటి పలు కీలక అంశాల్లో అతడి శిక్షణ మన ప్లేయర్లకు ఎంతగానో ఉపయోగపడనుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 5 నుంచి 15 వరకు హాంగ్జౌ వేదికగా ఆసియ కప్ జరగనుండగా... ఆ లోపు ప్లేయర్లను మానసికంగా మరింత సంసిద్ధం చేస్తామని హరేంద్ర అన్నాడు. అవకాశాలను వినియోగించుకుంటేనే... ప్రొ లీగ్ యూరప్ అంచె పోటీల్లో భారత జట్టుకు ఎన్నో అవకాశాలు వచ్చినా... వాటిని సది్వనియోగ పరుచుకోలేకపోయింది. అనుభజు్ఞలు లేకపోవడంతో డిఫెన్స్ విభాగంలో వెనుకబడిన టీమిండియా... అటాకింగ్లోనూ ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా పెనాల్టీ కార్నర్లను గోల్స్గా మలచడంలో మనవాళ్లు మరింత దృష్టి పెట్టాల్సిన అవసరముంది. ‘పెనాల్టీ కార్నర్ల విషయంలో చాలా మెరుగపడాల్సి ఉంది. మెరుగైన ప్రత్యర్థులతో తలపడుతున్నప్పుడు ప్రతి అంశంలో పక్కాగా ఉండాలి. అది లోపించడం వల్లే ప్రో లీగ్ నుంచి ఉద్వాసన ఎదురైంది. అయితే ఇక్కడితో ఆగిపోము. ఈ లోపాలను సవరించుకొని మరింత బలంగా పుంజుకుంటాం. ప్రత్యర్థికి పదే పదే పెనాల్టీ కార్నర్ అవకాశాలు ఇవ్వడం దెబ్బకొట్టింది. అయితే సానుకూల అంశాలు కూడా ఉన్నాయి. మనకంటే మెరుగైన జట్లతో మ్యాచ్ల్లో సైతం అమ్మాయిలు ఆకట్టుకున్నారు. కొన్ని తప్పిదాలను పక్కన పెడితే ప్రపంచ స్థాయి ఆటతీరు కనబర్చారు. ఆసియా కప్ ప్రారంభానికి ముందే ఈ తప్పులను సరిదిద్దుకుంటాం. ప్లేయర్లకు పెద్దగా అనుభవం లేదు. వారిని నిందించాలనుకోవడం లేదు. ఏడుగురు ఆటగాళ్లకు ఇదే తొలి ప్రొ లీగ్’ అని హరేంద్ర అన్నాడు. -
సెమీఫైనల్లో జ్యోతి సురేఖ, పర్ణీత్
మాడ్రిడ్: ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్–4 టోర్నమెంట్ మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత్కు చెందిన వెన్నం జ్యోతి సురేఖ, పర్ణీత్ కౌర్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి సురేఖ 147–144తో హజల్ బురున్ (తుర్కియే)పై, పర్ణీత్ కౌర్ 142–141తో క్యూర్ గిరిడి (తుర్కియే)పై విజయం సాధించారు. మరోవైపు రికర్వ్ విభాగంలో భారత జట్లకు నిరాశ ఎదురైంది. భారత పురుషుల, మహిళల జట్లు కనీసం మూడో రౌండ్కు కూడా చేరుకోలేకపోయాయి. ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ బొమ్మదేవర ధీరజ్, రాహుల్, నీరజ్ చౌహాన్లతో కూడిన భారత పురుషుల జట్టు రెండో రౌండ్లో 2–6 (55–56, 54–57, 57–56, 54–56) సెట్ పాయింట్ల స్కోరుతో జ్విక్ ఎలీ, మార్కస్ అల్మీదా, మథియాస్ గోమ్స్లతో కూడిన బ్రెజిల్ జట్టు చేతిలో ఓడిపోయింది. దీపిక కుమారి, అంకిత, గాథ ఖడకేలతో కూడిన భారత మహిళల జట్టు కూడా రెండో రౌండ్లోనే వెనుదిరిగింది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన భారత జట్టు రెండో రౌండ్లో 3–5 (58–54, 55–55, 54–55, 53–54) సెట్ పాయింట్ల స్కోరుతో అమెలీ కార్డెయు, లీసా బార్బెలిన్, విక్టోరియా సెబాస్టియన్లతో కూడిన ఫ్రాన్స్ జట్టు చేతిలో ఓటమి పాలైంది. -
ఆరు స్థానాలు పడిపోయి...
న్యూఢిల్లీ: అంతర్జాతీయస్థాయిలో ఆశించిన ఫలితాలు సాధించడంలో విఫలమవుతోన్న భారత పురుషుల ఫుట్బాల్ జట్టు ప్రపంచ ర్యాంకింగ్స్లోనూ దిగజారింది. అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య (ఫిఫా) గురువారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో భారత జట్టు ఆరు స్థానాలు పడిపోయి 133వ ర్యాంక్లో నిలిచింది. గత తొమ్మిదేళ్లలో భారత్కిదే అత్యల్ప ర్యాంక్ కావడం గమనార్హం. ఈ ఏడాది జూన్ 4న థాయ్లాండ్తో జరిగిన అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్లో భారత బృందం 0–2 గోల్స్ తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత ఆసియా కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో హాంకాంగ్ చేతిలో 0–1తో పరాజయం పాలైంది. భారత జట్టు నిరాశాజనక ప్రదర్శన నేపథ్యంలో హెడ్ కోచ్ మనోలో తన పదవి నుంచి వైదొలిగాడు. 2016 డిసెంబర్లో భారత జట్టు అత్యల్పంగా 135వ ర్యాంక్లో నిలువగా... 1996 ఫిబ్రవరిలో అత్యుత్తమంగా 94వ స్థానాన్ని దక్కించుకుంది.1113.22 రేటింగ్ పాయింట్లతో భారత జట్టు ఆసియాలో 24వ స్థానంలో ఉంది. 210 దేశాలు ఉన్న ‘ఫిఫా’ ర్యాంకింగ్స్లో ప్రపంచ చాంపియన్ అర్జెంటీనా టాప్ ర్యాంక్లో కొనసాగుతుండగా... స్పెయిన్, ఫ్రాన్స్, ఇంగ్లండ్, బ్రెజిల్ జట్లు వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. -
మూడో రౌండ్లో హారిక, హంపి
బతూమి (జార్జియా): మహిళల ప్రపంచకప్ చెస్ నాకౌట్ టోర్నమెంట్లో భారత గ్రాండ్మాస్టర్లు, తెలుగు తేజాలు ద్రోణవల్లి హారిక, కోనేరు హంపి మూడో రౌండ్లోకి ప్రవేశించారు. నందిత (భారత్)తో జరిగిన రెండో రౌండ్లో హారిక 1.5–0.5తో... హంపి 1.5–0.5తో అఫ్రూజా ఖామ్దమోవా (ఉజ్బెకిస్తాన్)పై గెలుపొందారు. గురువారం జరిగిన రెండో రౌండ్ రెండో గేమ్లో హారిక 37 ఎత్తుల్లో నందితను ఓడించగా... అఫ్రూజాతో గేమ్ను హంపి 44 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. బుధవారం జరిగిన తొలి గేమ్లో అఫ్రూజాపై హంపి నెగ్గగా... నందితతో గేమ్ను హారిక ‘డ్రా’ చేసుకుంది. భారత్కే చెందిన వైశాలి, దివ్య దేశ్ముఖ్ కూడా మూడో రౌండ్కు చేరుకున్నారు. మరో ముగ్గురు భారత ప్లేయర్లు వంతిక అగర్వాల్, పద్మిని రౌత్ మూడో రౌండ్లో చోటు కోసం నేడు టైబ్రేక్ గేమ్లు ఆడనున్నారు. -
అనిసిమోవా అదరహో
లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్వన్ సబలెంకా (బెలారస్) వరుసగా మూడోసారి సెమీఫైనల్ అడ్డంకిని దాటలేకపోయింది. అమెరికా ప్లేయర్ అమండ అనిసిమోవా అద్భుత ఆటతీరు కనబరిచి టాప్ సీడ్ సబలెంకాను బోల్తా కొట్టించింది. 2 గంటల 37 నిమిషాలపాటు జరిగిన తొలి సెమీఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్ అనిసిమోవా 6–4, 4–6, 6–4తో సబలెంకాను ఓడించి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్స్లామ్ టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. 30 విన్నర్స్ కొట్టిన అనిసిమోవా ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. మరోవైపు సబలెంకా 37 అనవసర తప్పిదాలు చేసింది. కెరీర్లో 22వ సారి గ్రాండ్స్లామ్ టోర్నీ బరిలోకి దిగిన 23 ఏళ్ల అనిసిమోవా గ్రాండ్స్లామ్ టైటిల్కు విజయం దూరంలో నిలిచింది. రేపు జరిగే ఫైనల్లో ఐదు గ్రాండ్స్లామ్ టోర్నీల విజేత ఇగా స్వియాటెక్ (పోలాండ్)తో అనిసిమోవా తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ స్వియాటెక్ కేవలం 72 నిమిషాల్లో 6–2, 6–0తో బెలిండా బెన్చిచ్ (స్విట్జర్లాండ్)ను ఓడించి తన కెరీర్లో తొలిసారి వింబుల్డన్ టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించింది. -
ఇన్ స్టాల్ రీల్స్ చేసిన టెన్నిస్ ప్లేయర్.. హత్య చేసిన తండ్రి!
గురుగ్రామ్: హర్యానా రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ఇన్ స్టా రీల్స్ చేసిందని కన్న కూతురి జీవితాన్ని చిదిమేశాడు తండ్రి. టెన్నిస్లో ఎంతో భవిష్యత్ ఉన్న 25 ఏళ్ల రాధికా యాదవ్ను తండ్రి హత్య చేశాడు. గురుగ్రామ్ సుశాంక్ లోక్ ఫేజ్-2లో నివాసముంటున్న రాధికా యాదవ్ను.. తండ్రి గన్తో కాల్చి చంపాడు. ఇన్ స్టా రీల్కు సంబంధించి తండ్రీ కూతుళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇన్ స్టా రీల్ ఎందుకు చేశావని ఆగ్రహించిన తండ్రి.. కూతుర్ని నిలదీశాడు. ఈ విషయంపై కూతురు ఎదురు తిరిగింది. దాంతో కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని తండ్రి తన వద్ద ఉన్న గన్తో కాల్చి హత్య చేశాడు.తన లైసెన్స్డ్ రివాల్వర్తో కూతుర్ని తన ఇంటి వద్దే కాల్చి చంపాడు. కూతుర్ని చంపడమే లక్ష్యంగా మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. దాంతో తీవ్ర గాయాల పాలై రక్తపు మడుగులో ఉన్న ఆమెను ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. ఆమె మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కూతుర్ని హత్య చేసిన విషయాన్ని తండ్రి అంగీకరించడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. లైసెన్స్డ్ రివాల్వర్ను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. టెన్నిస్ ఖేలో డాట్ కామ్ ప్రకారం అంతర్జాతీయ టెన్నిస్ ఫెడరేషన్ డబుల్స్ ర్యాంకింగ్స్లో ఆమె 113వ స్థానంలో ఉంది. 2020, మార్చి 23వ తేదీన జన్మించిన రాధికా యాదవ్.. టెన్నిస్లో తన ఢవిష్యత్ను ఎతుక్కుంటూ ఒక్కో మెట్టూ ఎక్కుతూ వచ్చింది. ఈ క్రమంలో ఎన్నో పోటీల్లో విజేతగా నిలిచింది. తన భవిష్యత్ను మరింత మెరుగులు దిద్దుకునే క్రమంలో తండ్రి చేతిలో ప్రాణాలు కోల్పోవడంపై దేశ వ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. -
ఆగస్టు 29 నుంచి ప్రొ కబడ్డీ లీగ్
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్ ఈ ఏడాది ఆగస్టు 29 నుంచి ప్రారంభం కానుంది. ఇటీవల పీకేఎల్ వేలం ముగియగా... అన్ని ఫ్రాంచైజీలు జట్లను సిద్ధం చేసుకున్నాయి. త్వరలోనే వేదికలతో పాటు సీజన్ షెడ్యూల్ను విడుదల చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ‘12 ఫ్రాంచైజీలు వేలంలో తమ తమ జట్లను బలోపేతం చేసుకున్నాయి. 12వ సీజన్ కోసం అన్నీ జట్లు సమాయత్తమవుతున్నాయి. గతం కంటే మరింత రసవత్తరంగా మ్యాచ్లు జరగడం ఖాయం’ అని నిర్వాహకులు వెల్లడించారు. మే 31, జూన్ 1న ముంబై వేదికగా పీకేఎల్ వేలం పాట జరగగా... రికార్డు స్థాయిలో 10 మంది ఆటగాళ్లు కోటి రూపాయాల కంటే ఎక్కువ ధర దక్కించుకున్నారు. వచ్చే నెల ఆఖరులో ప్రారంభం కానున్న పీకేఎల్లో హర్యానా స్టీలర్స్ డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగనుంది. ఇక గత సీజన్లో 22 మ్యాచ్లాడిన తెలుగు టైటాన్స్... 12 విజయాలు, 10 పరాజయాలతో పట్టికలో ఏడో స్థానానికి పరిమితమైంది. -
స్టార్ టెన్నిస్ ప్లేయర్ రిటైర్మెంట్
లండన్: ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి వైదొలుగుతున్నట్లు ఇటలీ టెన్నిస్ స్టార్ ఫాబియో ఫాగ్నిని ప్రకటించాడు. వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ ఫాగ్నిని తొలి రౌండ్లో ఓడిపోయాడు. డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్తో జరిగిన ఈ మ్యాచ్లో 38 ఏళ్ల ఫాగ్నిని ఐదు సెట్లు పోరాడాడు. ఈ ఏడాది చివర్లో ఆటకు గుడ్బై చెప్పాలని ఫాగ్నిని అనుకున్నాడు. అయితే ఈ సీజన్లో వరుసగా పది పరాజయాలు ఎదురుకావడంతో వింబుల్డన్ టోర్నీ సందర్భంగానే అతను రిటైర్మెంట్ ప్రకటనను జారీ చేశాడు.‘ఆటకు గుడ్బై చెప్పాక ఏం చేస్తానో ఇప్పుడే చెప్పలేను. ప్రస్తుతం మాత్రం కుటుంబంతో గడుపుతాను’ అని కెరీర్లో 9 సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన ఫాగ్నిని తెలిపాడు. 2019లో మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్ టైటిల్ నెగ్గిన ఫాగ్నిని అదే ఏడాది కెరీర్ బెస్ట్ 9వ ర్యాంక్కు చేరుకున్నాడు. 2015 యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ చాంపియన్ ఫ్లావియా పెనెట్టా (ఇటలీ)ను పెళ్లి చేసుకున్న ఫాగ్నిని తన 20 ఏళ్ల కెరీర్లో మొత్తం 63 గ్రాండ్స్లామ్ టోర్నీలు ఆడాడు. 2011 ఫ్రెంచ్ ఓపెన్లో క్వార్టర్ ఫైనల్ చేరుకోవడమే గ్రాండ్స్లామ్ టోర్నీల్లో అతని అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన. ప్రస్తుతం ఫాగ్నిని 138వ ర్యాంక్లో ఉన్నాడు. -
ఇక చాలు!
మిల్టన్ కీన్స్ (ఇంగ్లండ్): సుదీర్ఘ కాలంగా ఫార్ములావన్ (ఎఫ్1) రెడ్బుల్ టీమ్ ప్రిన్సిపాల్గా వ్యవహరిస్తున్న క్రిస్టియన్ హార్నర్ను ఆ జట్టు ఆర్ధాంతరంగా తప్పించింది. 20 సంవత్సరాలుగా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ... 8 సార్లు డ్రైవర్స్ చాంపియన్షిప్ టైటిల్స్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించిన హార్నర్ను తొలగిస్తున్నట్లు రెడ్బుల్ బుధవారం ప్రకటించింది. అతడి సేవలకు ధన్యవాదాలు తెలిపిన రెడ్బుల్ యాజమాన్యం తప్పించడం వెనుక ఉన్న కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. ‘అతడు మా జట్టు చరిత్రలో ఎప్పటికీ ఒక ముఖ్యమైన వ్యక్తే’ అని ఏకవాక్య ప్రకటన విడుదల చేసింది. హార్నర్ చీఫ్గా ఉన్న సమయంలో రెడ్బుల్ జట్టు 405 రేసుల్లో పాల్గొని 124 విజయాలు సాధించింది. 8 డ్రైవర్స్ చాంపియన్షిప్ టైటిల్స్, 6 కన్స్ట్రక్టర్స్ టైటిల్స్ గెలుచుకుంది. హార్నర్ స్థానంలో రెడ్బుల్ జట్టు చీఫ్ ఎగ్జిక్యూటివ్గా తమ సొంత జట్టు రేసింగ్ బుల్స్కు చెందిన లారెంట్ మెకీస్కు బాధ్యతలు అప్పగించింది. ఈ నెల 27న జరగనున్న బెల్జియం గ్రాండ్ప్రితో మెకీస్ జట్టు బాధ్యతలు అందుకోనున్నాడు. ‘రేసింగ్ బుల్స్ జట్టు స్ఫూర్తి అద్భుతమైంది. ఇది కేవలం ప్రారంభమే అని బలంగా విశ్వసిస్తున్నా. రెడ్బుల్ అప్పగించిన బాధ్యతలను అందుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. సవాలుతో కూడుకున్నదే అయినా నా వంతు కృషి చేస్తా. డ్రైవర్లకు సహాయ సహకారాలు అందిస్తూ వారిని సరైన దిశలో నడిపించడమే నా బాధ్యత’ అని మెకీస్ ఒక ప్రకటనలో తెలిపాడు. అయితే అతడు ఇందులో కనీసం హార్నర్ పేరును ప్రస్తావించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇక మెకీస్ స్థానంలో అలాన్ పెర్మనే రేసింగ్ బుల్స్ డైరెక్టర్గా పదోన్నతి పొందాడు. ఆది నుంచి అతడే... రెడ్బుల్ జట్టు తొలిసారి 2005లో ఫార్ములావన్లో అడుగు పెట్టగా... అప్పటి నుంచి హార్నర్ టీమ్ ప్రిన్సిపాల్గా వ్యవహరిస్తూ వస్తున్నాడు. ఇటీవల బ్రిటన్ గ్రాండ్ప్రిలో సైతం హార్నర్ తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాడు. రెడ్బుల్ జట్టుకు చెందిన సెబాస్టియన్ వెటెల్, వెర్స్టాపెన్ వరుసగా నాలుగుసార్లు సార్లు చొప్పున డ్రైవర్స్ చాంపియన్షిప్ సాధించడం వెనక హార్నర్ కీలకంగా వ్యవహరించాడు. ఈ సీజన్లో మెక్లారెన్ డ్రైవర్లు సత్తా చాటుతుండగా... డిఫెండింగ్ చాంపియన్ వెర్స్టాపెన్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక జట్ల విషయానికి వస్తే రెడ్బుల్ నాలుగో స్థానంలో ఉంది. ఇటీవల బ్రిటన్ గ్రాండ్ప్రి సందర్భంగా... వచ్చే ఏడాది రెడ్బుల్తో కొనసాగడంపై ఇప్పుడే స్పష్టత ఇవ్వలేనని వెర్స్టాపెన్ వెల్లడించిన నేపథ్యంలో... ఆ జట్టు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో రెడ్బుల్ జట్టు నుంచి వైదొలుగుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కారు రూపకల్పనలో నిష్ణాతుడైన అడ్రియన్ రెడ్బుల్ను వీడి ఆస్టన్ మార్టిన్ జట్టుతో చేరగా... స్పోర్టింగ్ డైరెక్టర్ జొనాథన్ వెట్లీ సాబెర్కు మారాడు. ఇక గత సీజన్లో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయిన పెరెజ్ను రెడ్బుల్ జట్టు వదిలేసుకుంది. అతడి స్థానంలో లియామ్ లాసన్ను ఎంచుకుంది. 32 ఏళ్ల వయసులోనే... 1997లో డ్రైవర్గా కెరీర్ ప్రారంభించిన హార్నర్ 2005లో రెడ్బుల్ బాధ్యతలు చేపట్టే నాటికి అతడి వయసు కేవలం 32 సంవత్సరాలే. పిన్న వయసులోనే పెద్ద బాధ్యతలు అందుకున్న హార్నర్ రెండు దశాబ్దాల పాటు వాటిని సమర్థవంతంగా నిర్వర్తించాడు. ఆరంభంలో ‘పార్టీ టీమ్’గా ముద్ర పడ్డ జట్టును... వరుస విజయాలు సాధించే స్థాయికి తీసుకొచ్చాడు. హార్నర్ హయాంలో 2009లో తొలిసారి రెడ్బుల్ డ్రైవర్ వెటల్ చైనా గ్రాండ్ ప్రిలో విజయం సాధించగా... ఆ తర్వాత 2010 నుంచి వరుసగా నాలుగేళ్ల పాటు అతడు డ్రైవర్స్ చాంపియన్గా నిలిచాడు. 2016లో రెడ్బుల్ తరఫున మ్యాక్స్ వెర్స్టాపెన్ అరంగేట్రం చేయగా... ట్రాక్పై అడుగుపెట్టిన తొలి రేసు స్పానిష్ గ్రాండ్ ప్రిలో విజేతగా నిలిచిన ఈ ఘనత సాధించిన పిన్న వయస్కుడి (18 సంవత్సరాలు)గా రికార్డు సృష్టించాడు. 2019లో నెట్ఫ్లిక్స్లో విడుదలైన ‘డ్రైవ్ టు సరై్వవ్’ తొలి సీజన్ హార్నర్కు పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చింది. -
జ్యోతి సురేఖరిషభ్ జోడీ ప్రపంచ రికార్డు
మాడ్రిడ్: ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్–4 టోర్నమెంట్లో భారత జోడీ వెన్నం జ్యోతి సురేఖ–రిషభ్ యాదవ్ కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. కాంపౌండ్ విభాగం క్వాలిఫయింగ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో జ్యోతి సురేఖ (ఆంధ్రప్రదేశ్), రిషభ్ యాదవ్ (హరియాణా) ద్వయం 1431 పాయింట్లు స్కోరు చేసింది. తద్వారా 2023 యూరోపియన్ గేమ్స్లో 1429 పాయింట్లతో టాంజా జెలెన్థియెన్–మథియాస్ ఫులర్టన్ (డెన్మార్క్) నెలకొల్పిన ప్రపంచ రికార్డును సురేఖ–రిషభ్ ద్వయం బద్దలు కొట్టింది. మహిళల క్వాలిఫయింగ్లో జ్యోతి సురేఖ 715 పాయింట్లు ... పురుషుల క్వాలిఫయింగ్లో రిషభ్ 716 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచారు. ఫైనల్లో సురేఖ బృందం జ్యోతి సురేఖ, పర్ణీత్ కౌర్, ప్రీతికలతో కూడిన భారత మహిళల జట్టు కాంపౌండ్ టీమ్ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వాలిఫయింగ్లో భారత జట్టు 2116 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి నేరుగా క్వార్టర్ ఫైనల్కు ‘బై’ పొందింది. క్వార్టర్ ఫైనల్లో సురేఖ బృందం 235–226తో ఎల్ సాల్వడోర్ జట్టుపై... సెమీఫైనల్లో 230–226తో ఇండోనేసియాపై గెలిచింది. -
తొలిసారి సెమీస్లోకి...
లండన్: ఐదు గ్రాండ్స్లామ్ టోర్నీ టైటిల్స్ విజేత ఇగా స్వియాటెక్ (పోలాండ్) ఆరో ప్రయత్నంలో... ప్రపంచ మాజీ నాలుగో ర్యాంకర్ బెలిండా బెన్చిచ్ (స్విట్జర్లాండ్) తొమ్మిదో ప్రయత్నంలో... తొలిసారి వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో సెమీఫైనల్కు అర్హత సాధించారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ స్వియాటెక్ 6–2, 7–5తో 19వ ర్యాంకర్ సమ్సోనోవా (రష్యా)పై... 35వ ర్యాంకర్ బెన్చిచ్ 7–6 (7/3), 7–6 (7/2)తో 7వ ర్యాంకర్ మిరా ఆంద్రీవా (రష్యా)పై గెలుపొందారు. సెమీస్లో సినెర్తో జొకోవిచ్ ‘ఢీ’ పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్వన్ యానిక్ సినెర్ (ఇటలీ), ఏడుసార్లు చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా) సెమీఫైనల్లోకి ప్రవేశించారు. క్వార్టర్ ఫైనల్స్లో టాప్ సీడ్ సినెర్ 2 గంటల 19 నిమిషాల్లో 7–6 (7/2), 6–4, 6–4తో పదో సీడ్ బెన్ షెల్టన్ (అమెరికా)ను ఓడించగా... జొకోవిచ్ 3 గంటల 11 నిమిషాల్లో 6–7 (6/8), 6–2, 7–5, 6–4తో 22వ సీడ్ ఫ్లావియా కొ»ొల్లి (ఇటలీ)పై విజయం సాధించారు. రేపు జరిగే సెమీఫైనల్స్లో అల్కరాజ్ (స్పెయిన్)తో టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా); సినెర్తో జొకోవిచ్ తలపడతారు. -
రైజింగ్ ‘గ్రాండ్’ స్టార్
టెన్నిస్ రాకెట్ చేతపట్టిన ప్రతి ప్లేయర్ గ్రాండ్స్లామ్ ఆడాలనే కలలు కంటాడు. అందులోనూ 148 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన వింబుల్డన్ కోర్టులో అడుగు పెట్టాలనిఅందరికీ ఉంటుంది. కానీ దాన్ని కొందరు మాత్రమే నిజం చేసుకుంటారు. నాలుగు గ్రాండ్స్లామ్ టోర్నీలలో వింబుల్డన్కు ఉన్న క్రేజే వేరు. నిగనిగలాడే పచ్చిక కోర్టులు... ఎంత గొప్ప ప్లేయర్లయినా తెలుపు రంగు దుస్తులతోనే ఆడాలన్న నిబంధన... దీనిని ప్రతి ఒక్కరూ పాటించడం... ఇదొక అనిర్వచనీయ అనుభూతి. లండన్లోని ఆల్ ఇంగ్లండ్ క్లబ్లో నిర్వహించే ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఈసారి మన హైదరాబాద్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ (Bollipalli Rithvik Choudary) బరిలోకి దిగాడు. తొలి అడ్డంకిని దాటి రెండో రౌండ్కు చేరిన రిత్విక్... భవిష్యత్తుపై భరోసా పెంచుతున్నాడు. ఇప్పటి వరకు ముగ్గురు భారతీయులు మాత్రమే వింబుల్డన్ డబుల్స్ విభాగంలో విజేతలుగా నిలవగా... ఎప్పటికైనా ఇక్కడ చాంపియన్గా నిలవడమే తన జీవిత లక్ష్యమని రిత్విక్అంటున్నాడు. – సాక్షి క్రీడావిభాగం అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సాధించాలని చిన్నప్పటి నుంచి కలలు కన్న బొల్లిపల్లి రిత్విక్చౌదరీ కెరీర్లో రెండు ఏటీపీ–250 టోర్నీ డబుల్స్ టైటిల్స్ గెలిచాడు. అధిక శాతం ఆటగాళ్లు కెరీర్ తొలినాళ్లలో సింగిల్స్పై దృష్టి పెట్టి... ఇక చాలు అనుకుంటున్న దశలో డబుల్స్కు మారడం పరిపాటి. అయితే రిత్విక్మాత్రం అందుకు భిన్నంగా కెరీర్ ఆరంభంలోనే తన లక్ష్యాలపై స్పష్టత ఏర్పరచుకున్నాడు. తన ఆటతీరుకు డబుల్స్ అనుకూలంగా ఉంటుందని భావించిన రిత్విక్సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాడు. ఫలితంగా 24 ఏళ్ల వయసులోనే రెండు ఏటీపీ–250 టైటిల్స్ అతడి ఖాతాలో చేరాయి. ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్లో ప్రస్తుతం ప్రపంచ 79వ ర్యాంక్లో ఉన్న ఈ హైదరాబాదీ... ఈ ఏడాది వరుసగా మూడు గ్రాండ్స్లామ్ టోర్నమెంట్లలోనూ బరిలోకి దిగి నిలకడ కనబర్చాడు. ఆ్రస్టేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్లలో తొలి రౌండ్లోనే వెనుదిరిగిన రిత్విక్ వింబుల్డన్లో మాత్రం రెండో రౌండ్కు చేరుకున్నాడు. తొలిసారి వింబుల్డన్ బరిలోకి దిగడం చాలా ఆనందంగా ఉందన్న రిత్విక్... దీని వెనక తన తల్లిదండ్రులు ప్రతాప్, లక్ష్మీ త్యాగాలు ఎన్నో ఉన్నాయని పేర్కొన్నాడు. ప్రపంచంలో అత్యుత్తమ టోర్నమెంట్లో తల్లిదండ్రుల సమక్షంలో మ్యాచ్ నెగ్గడం మరిచిపోలేని అనుభూతి అని అన్నాడు. డ్యాన్సింగ్, డ్రాయింగ్ కాదని... క్రికెట్ను మతంలా భావించే మన దేశంలో... అందరిలాగే రిత్విక్కూడా పెద్దయ్యాక ప్రొఫెషనల్ క్రికెటర్గా మారాలనుకున్నాడు. ఏక కాలంలో అనేక అంశాలపై ఆసక్తి కనబరిచే పిల్లల్లాగే రిత్విక్పసితనంలో అన్నీ చేస్తూ హైపర్ యాక్టివ్గా ఉండేవాడు. డ్యాన్సింగ్, డ్రాయింగ్ ఇలా అన్నీట్లో ముందుండేవాడు. దీంతో అతడిని ఏదైనా ఆటలో శిక్షణ ఇప్పించాలని తల్లిదండ్రులు భావించారు. క్రికెట్ నేర్పించాలని అనుకున్నా... రిత్విక్వయసు మరీ చిన్నది కావడంతో బంతితో దెబ్బలు తగులుతాయేమోననే భయంతో తల్లిదండ్రులు అతడిని ఇంటికి సమీపంలోని టెన్నిస్ కోచింగ్ సెంటర్లో చేర్పించారు.సికింద్రాబాద్లోని రైల్వే రిక్రియేషన్ క్లబ్ మైదానం సమీపంలోని ‘ద స్కూల్ ఆఫ్ పవర్ టెన్నిస్’ సెంటర్లో కోచ్ సీవీ నాగరాజ్ వద్ద ఓనమాలు నేర్చుకున్న రిత్విక్అండర్–12, అండర్–16 స్థాయిలో జాతీయ నంబర్వన్గా నిలిచాడు. ఒలింపియన్, భారత డేవిస్కప్ జట్టు మాజీ సభ్యుడు, వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో ఆడిన విష్ణువర్ధన్, ఆసియా క్రీడల్లో, డేవిస్కప్లో, గ్రాండ్స్లామ్ టోర్నీల్లో ఆడిన సాకేత్ మైనేని కూడా ఒకప్పుడు ‘ద స్కూల్ ఆఫ్ పవర్ టెన్నిస్’ సెంటర్లోనే శిక్షణ తీసుకున్నారు. కోచ్ నాగరాజ్ వద్ద క్రమం తప్పకుండా తన ఆటకు మెరుగులు దిద్దుకున్న రిత్విక్ అంచలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నాడు. ప్రపంచంలో ఎన్ని టెన్నిస్ టోర్నీలు ఉన్నా వింబుల్డన్ మాత్రం ప్రత్యేకమని రిత్విక్తల్లి లక్ష్మి వెల్లడించారు. వింబుల్డన్ అధికారిక వెబ్సైట్ నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో లక్ష్మి... రిత్విక్ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. స్టెఫీ గ్రాఫ్, పీట్ సంప్రాస్, లియాండర్ పేస్, మహేశ్ భూపతి, సానియా మీర్జా (Sania Mirza) వంటి దిగ్గజ ఆటగాళ్లు విజేతలుగా నిలిచిన చోట తమ కుమారుడు కూడా ఆడటం మాటల్లో వర్ణించలేని అనుభూతి అని ఆమె అన్నారు. ఆర్థిక ఇబ్బందులకు ఎదురొడ్డి... టెన్నిస్ బాగా ఖర్చుతో కూడుకున్న క్రీడ కావడంతో ఒక దశలో రిత్విక్ శిక్షణకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే తమ కుమారుడి కెరీర్కన్నా తమకు ఏదీ ఎక్కువ కాదనుకున్న ఆ తల్లిదండ్రులు... రిత్విక్ లక్ష్యం కోసం అన్నీ వదిలేసుకున్నారు. ఎదుగుతున్న క్రమంలో అతడి ఆటతీరు ఆ నమ్మకాన్నివ్వగా... ఒక్కసారి ప్రొఫెషనల్ కెరీర్ ప్రారంభించాక ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. ‘వింబుల్డన్ ఆడుతున్నానని తెలిసినప్పుడు నా కన్నా మా అమ్మానాన్నే ఎక్కువగా సంతోషించారు. చిన్నప్పటి నుంచి ఇక్కడ ఆడాలని ఎన్నో కలలు కన్నా. ఇప్పటికి అది సాధ్యపడింది. దీని వెనక మా కుటుంబం మొత్తం కృషి ఉంది. ఈ విజయం నా ఒక్కడిది కాదు ఇందులో మా అమ్మ, నాన్న, అమ్మమ్మ పాత్ర ఎంతో ఉంది’ అని తొలి రౌండ్ విజయానంతరం రిత్విక్అన్నాడు. కొలంబియాకు చెందిన నికోలస్ బరియెంటోస్తో కలిసి పురుషుల డబుల్స్ బరిలోకి దిగిన రిత్విక్... రెండో రౌండ్లో ఆరో సీడ్ జోడీ జో సాలిస్బరీ–నీల్ స్కప్స్కీ (బ్రిటన్) చేతిలో పోరాడి ఓడిపోయారు. రిత్విక్వింబుల్డన్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించడంతో... చిన్నప్పటి నుంచి కన్న కల నిజమైనట్లు అనిపించింది. ప్రపంచంలో ఎన్ని టోర్నమెంట్లు ఉన్నా... వింబుల్డన్ అంటే వింబుల్డనే. ఆటలో హుందాతనానికి ఇది గొప్ప నిదర్శనం. ప్రపంచంలోని అత్యుత్తమ టోర్నీలో రిత్విక్ ఆడతాడని కలలో కూడా ఊహించలేదు. అందుకే లండన్లో అడుగు పెట్టిన మూడు రోజుల తర్వాత కూడా నమ్మశక్యంగా అనిపించలేదు. సంప్రాస్, స్టెఫీ గ్రాఫ్ వంటి దిగ్గజాలు ఆడిన చోట రిత్విక్ బరిలోకి దిగడం నాకెంతో గర్వంగా ఉంది. – లక్ష్మి, రిత్విక్తల్లి రిత్విక్ప్రొఫైల్పుట్టిన తేదీ, స్థలం: 17–1–2001; హైదరాబాద్ ఎత్తు: 6 అడుగుల 2 అంగుళాలు బరువు: 85 కేజీలు ప్రొఫెషనల్గా మారిన ఏడాది: 2022 డబుల్స్లో కెరీర్ బెస్ట్ ర్యాంక్: 65 (మార్చి;2025లో) ఏటీపీ టూర్లో నెగ్గిన డబుల్స్ టైటిల్స్: 2 (అల్మాటీ ఓపెన్–250 టోర్నీ; చిలీ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీ) ఏటీపీ చాలెంజర్ టూర్ టైటిల్స్: 5 ఐటీఎఫ్ సర్క్యూట్లో నెగ్గిన టైటిల్స్: 6 -
సబలెంకా శ్రమించి...
లండన్: ఈ ఏడాది వరుసగా మూడో గ్రాండ్స్లామ్ టోర్నీలో ఫైనల్ చేరేందుకు బెలారస్ స్టార్ సబలెంకా మరో విజయం దూరంలో నిలిచింది. ఈ సంవత్సరం ఆ్రస్టేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీల్లో ఫైనల్కు చేరి రన్నరప్తో సరిపెట్టుకున్న సబలెంకా... అదే జోరును వింబుల్డన్ టోర్నీలోనూ కొనసాగించి ఈ టోర్నీలో మూడోసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సబలెంకా 4–6, 6–2, 6–4తో ప్రపంచ 104వ ర్యాంకర్ లౌరా సిగెముండ్ (జర్మనీ)పై కష్టపడి గెలిచింది. 2 గంటల 54 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సబలెంకాకు 37 ఏళ్ల సిగెముండ్ నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైంది. క్వార్టర్ ఫైనల్ చేరే క్రమంలో ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోని సబలెంకా ఈ మ్యాచ్లో తొలి సెట్ను చేజార్చుకుంది. అయితే రెండో సెట్లో తేరుకున్న సబలెంకా మూడుసార్లు ప్రత్యర్థి సర్వీస్ను బ్రేక్ చేసింది. సెట్ను 6–2తో దక్కించుకొని మ్యాచ్లో నిలిచింది. మూడో సెట్లో ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. చివరకు పదో గేమ్లో సిగెముండ్ సర్వీస్ను బ్రేక్ చేసిన సబలెంకా విజయాన్ని ఖరారు చేసుకుంది.మ్యాచ్ మొత్తంలో రెండు ఏస్లు సంధించిన సబలెంకా నాలుగు డబుల్ ఫాల్ట్లు చేసింది. నెట్ వద్దకు 43 సార్లు దూసుకొచ్చి 25 సార్లు పాయింట్లు గెలిచింది. 29 విన్నర్స్ కొట్టిన ఈ బెలారస్ స్టార్ 36 అనవసర తప్పిదాలు చేసింది. తన సర్వీస్ను ఆరుసార్లు కోల్పోయి ప్రత్యర్థి సర్వీస్ను ఎనిమిదిసార్లు బ్రేక్ చేసింది. 2021, 2023లలో వింబుల్డన్లో సెమీఫైనల్ చేరి ఓడిపోయిన సబలెంకా రేపు జరిగే సెమీఫైనల్లో అనిసిమోవాతో ఆడుతుంది. తొలిసారి సెమీస్లో అనిసిమోవా నాలుగోసారి వింబుల్డన్ టోర్నీలో ఆడుతున్న ప్రపంచ 12వ ర్యాంకర్ అనిసిమోవా (అమెరికా) తొలిసారి సెమీఫైనల్కు అర్హత సాధించింది. క్వార్టర్ ఫైనల్లో అనిసిమోవా 6–1, 7–6 (11/9)తో పావ్లీచెంకోవా (రష్యా)పై నెగ్గింది. 22వసారి గ్రాండ్స్లామ్ టోర్నీ ఆడిన అనిసిమోవా 2019లో ఫ్రెంచ్ ఓపెన్లో సెమీఫైనల్కు చేరుకుంది. అల్కరాజ్ అలవోకగా... పురుషుల సింగిల్స్లో డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్ (స్పెయిన్) వరుసగా మూడో ఏడాది సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. కామెరాన్ నోరి (బ్రిటన్)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో అల్కరాజ్ 6–2, 6–3, 6–3తో గెలుపొందాడు. 99 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో అల్కరాజ్ 13 ఏస్లు సంధించి ప్రత్యర్థి సర్వీస్ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. సెమీఫైనల్లో అమెరికా ప్లేయర్, ప్రపంచ ఐదో ర్యాంకర్ టేలర్ ఫ్రిట్జ్తో అల్కరాజ్ తలపడతాడు. మరో క్వార్టర్ ఫైనల్లో ఫ్రిట్జ్ 6–3, 6–4, 1–6, 7–6 (7/4)తో ఖచనోవ్ (రష్యా)పై గెలిచి తన కెరీర్లో తొలిసారి వింబుల్డన్లో సెమీఫైనల్కు చేరాడు. గట్టెక్కిన సినెర్ సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్వన్ యానిక్ సినెర్ (ఇటలీ) కి అదృష్టం కలిసొచ్చింది. దిమిత్రోవ్ (బల్గేరియా) తో జరిగిన మ్యాచ్లో సినెర్ తొలి రెండు సెట్లను 3–6, 5–7తో కోల్పోయాడు. మూడో సెట్లో స్కోరు 2–2తో సమంగా ఉన్నపుడు దిమిత్రోవ్ గాయపడ్డాడు. దాంతో దిమిత్రోవ్ ఆటను కొనసాగించలేకపోవడంతో సినెర్ను విజేతగా ప్రకటించారు. గత ఐదు గ్రాండ్స్లామ్ టోర్నీలలో దిమిత్రోవ్ గాయాల కారణంగా వైదొలగడం గమనార్హం. -
పట్టుదల...పోరాటం...అద్భుతం
జనవరి 2022... ఆతిథ్య దేశం హోదాలో భారత మహిళల ఫుట్బాల్ జట్టు ఆసియా కప్లో తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. అయితే ఒక్కసారిగా ప్రపంచాన్ని తలకిందులు చేసిన కోవిడ్ మహమ్మారి ప్రభావం ఈ జట్టుపై కూడా పడింది. చైనీస్ తైపీతో తొలి మ్యాచ్ సమయానికి కోవిడ్ కారణంగా మన జట్టుకు కనీసం 13 మంది ప్లేయర్లు కూడా అందుబాటులో లేకుండా పోయారు. దాంతో నిబంధనల ప్రకారం మొదటి మ్యాచ్ నుంచే కాకుండా మొత్తం టోర్నీ నుంచి టీమ్ తప్పుకోవాల్సి వచ్చింది. క్వాలిఫయింగ్ పోటీలు లేని సమయంలో 2003లో చివరిసారిగా ఆసియా కప్కు నేరుగా అర్హత సాధించిన మన జట్టు ఈసారి ఎంతో ఉత్సాహంతో, పట్టుదలతో సొంతగడ్డపై ఆసియా కప్కు సన్నద్ధమైంది. అయితే అనూహ్య పరిణామాలు ఎదురు కావడం మన మహిళలకు ఇది తీరని వేదన మిగిల్చింది. ఇప్పుడు మూడున్నరేళ్ల తర్వాత క్వాలిఫయింగ్ టోర్నీలో సత్తా చాటి మన మహిళలు దర్జాగా ఆసియా కప్కు అర్హత సాధించారు. అయితే గత టోర్నీ, ప్రస్తుత క్వాలిఫికేషన్కు మధ్య ఎంతో పోరాటం ఉంది. సవాళ్లు, ప్రతికూలతలు అధిగమించి అమ్మాయిలు సాధించిన ఈ గెలుపునకు ఎంతో ప్రత్యేకత ఉంది. సాక్షి క్రీడా విభాగం : ఆసియా కప్లో ఆడకుండానే బరి నుంచి తప్పుకోవడం మొదలు ఇప్పుడు అర్హత సాధించడం వరకు భారత మహిళల ఫుట్బాల్ జట్టుకు ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి. సరైన దిశా నిర్దేశం లేకుండా, అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) తమ బాధ్యతను మరిచి పట్టించుకోకపోవడంతో అనాథలా కనిపించింది. అసలు జాతీయ జట్టు ఉందనే విషయాన్ని కూడా అంతా మర్చిపోయారు. ఒకటా, రెండా ఎన్నో పరిణామాలు మహిళల ఫుట్బాల్ పతనానికి దారి తీశాయి. అండర్–17 జట్టు కోచ్పై లైంగిక వేధింపుల ఆరోపణలు, ‘శాఫ్’ టోర్నీ సెమీస్లో నేపాల్ చేతిలో పరాజయం, అండర్–17 వరల్డ్ కప్లో ఆడిన మూడు మ్యాచ్లలో ఓడి నిష్క్రమణ, ఆసియా క్రీడల్లో చివరి స్థానం, ఒలింపిక్ క్వాలిఫయర్స్లో ఆఖరి స్థానం, పేరుకే ఇండియన్ ఉమెన్ లీగ్ ఉన్నా కనీస సౌకర్యాలు కల్పించలేని ఫెడరేషన్... ఇలా మహిళల జట్టుకు సమస్యలు నిర్విరామంగా సాగుతూనే వచ్చాయి. ఇలాంటి స్థితి నుంచి పైకి లేచి మన టీమ్ ఆసియా కప్కు అర్హత సాధించడం చిన్న విషయమేమీ కాదు. నాలుగు మ్యాచ్లలో నాలుగూ గెలవడం అసాధారణ ప్రదర్శనగా చెప్పవచ్చు. ముఖ్యంగా కొంత మంది ప్లేయర్లకు వ్యక్తిగతంగా కూడా ఇది ఎంతో ప్రత్యేక ఘనత. అందుకే థాయ్లాండ్తో మ్యాచ్ గెలవగానే వారంతా కన్నీళ్లపర్యంతమయ్యారు. వారి భావోద్వేగాలను నిలువరించడం ఎవరి వల్లా కాలేదు. వరుసగా కోచ్ల మార్పు... భారత మహిళల జట్టుకు ఎదురైన ఇటీవలి అనుభవాలు చూస్తే టీమ్ ఎలా నడుస్తోందో అర్థమవుతుంది. సంవత్సరాల తరపడి స్వయంగా ఫెడరేషన్ నిర్వహించే లీగ్లో కూడా ఆట జరుగుతుందా లేదా అనే సందేహాలు, జాతీయ శిబిరానికి వెళ్లినా తర్వాతి రోజు కోచ్ వస్తాడా లేదా అనుమానం, అసలు మహిళలుగా తమకు కనీస భద్రత కూడా ఉంటుందా లేదా అని పరిస్థితిని వారు దాటుకుంటూ వచ్చారు. ఏఐఎఫ్ఎఫ్ వరుసగా కోచ్లను మారుస్తూ పోయింది. డెనర్బై, సురేన్ ఛెత్రి, ఛోబా దేవి, సంతోష్ కశ్యప్, జోకిమ్ అలెగ్జాండర్సన్... ఇలా కోచ్లు రావడం, పోవడం జరిగిపోయాయి. చివరకు క్రిస్పిన్ ఛెత్రి చేతుల్లోకి కోచింగ్ బాధ్యతలు వచ్చాయి. అతనికి అసిస్టెంట్గా పీవీ ప్రియను తీసుకున్నారు. ఆసియా కప్ కోసం మన జట్టు థాయ్లాండ్లో అడుగు పెట్టినప్పుడు కూడా ఎలాంటి అంచనాలు లేవు. 2022లో కోవిడ్ కారణంగా టోర్నీకి దూరమైన జట్టులో ఉన్నవారిలో చాలామంది ఈ సారి కూడా టీమ్లో ఉన్నారు. నాటి గాయం వారి మనసుల్లో ఇంకా మిగిలే ఉంది.కోచ్పై లైంగిక వేధింపుల ఆరోపణ వివాదం వచ్చినప్పుడు అండర్–17 టీమ్లో భాగమైన హేమమ్ షిల్కీ దేవి, లిండా కోమ్, మార్టినా తోక్చోమ్ ఇప్పుడు సీనియర్ టీమ్లో ఉన్నారు. పురుషుల ఫుట్బాల్ జట్టు చిత్తుగా ఓడిన సందర్భాల్లోనూ వార్తల్లో ఉంటుండగా... మహిళల టీమ్ను అసలు ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఇలాంటి స్థితిలో వారు తమ పోరాటాన్ని మొదలు పెట్టారు. పటిష్ట ప్రత్యర్థి ని పడగొట్టి... మంగోలియాపై 13–0తో, తిమోర్ లెస్టెపై 4–0తో, ఆపై ఇరాక్పై 5–0తో ఘన విజయం... అంచనాలకు భిన్నంగా చక్కటి ప్రదర్శనతో మన మహిళలు వరుసగా మూడు విజయాలు సాధించారు. అయితే సరే ఆసియా కప్ క్వాలిఫికేషన్పై ఇంకా సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే చివరి లీగ్లో ఆతిథ్య థాయ్లాండ్ ప్రత్యరి్థగా ఎదురైంది. ‘ఫిఫా’ ర్యాంకింగ్స్లో మనకంటే ఎంతో ముందుండటం మాత్రమే కాదు, ఈ టీమ్ గత రెండు ‘ఫిఫా’ వరల్డ్ కప్లు కూడా ఆడింది. పైగా పెద్ద సంఖ్యలో విదేశీ ఆటగాళ్లు ఉండటంతో పాటు ప్రముఖ జపాన్ కోచ్ ఫుటోషీ ఐకెడా కోచింగ్ ఇస్తున్నాడు. మనకంటే బలమైన థాయ్లాండ్ జట్టు ఆరంభంలోనే దూకుడుగా ఆడి గోల్పోస్ట్పై దాడులు చేస్తూ ఆధిపత్యం ప్రదర్శించింది. అయితే భారత్ పదునైన డిఫెన్స్తో వాటిని నిలువరించగలిగింది. తాము ఇంత కాలంగా పడిన ఆవేదన, చేసిన పోరాటం వారిలో ఒక్కసారిగా స్ఫూర్తి నింపినట్లుంది. అంతే... ఆ తర్వాత జట్టులో ఒక్కసారిగా కొత్త ఉత్సాహం వచ్చింది. ప్రత్యర్థి ఎవరనేది పట్టించుకోకుండా చివరి వరకు పట్టు విడవకుండా చెలరేగిన జట్టు విజయాన్ని అందుకుంది.అన్ని రకాలుగా సన్నద్ధమై...మ్యాచ్ ముగిశాక సంగీత బస్ఫోర్ ఆనందానికి హద్దుల్లేవు. రెండు గోల్స్తో ఆమె ఈ చిరస్మరణీయ విజయంలో కీలకపాత్ర పోషించింది. కోవిడ్ కారణంగా 2022 ఆసియా కప్కు జట్టుకు దూరంగా కాగా, అంతకుముందే గాయంతో సంగీత టోర్నీ నుంచి తప్పుకుంది. 2019 నుంచి జట్టులో ప్రధాన సభ్యురాలిగా ఉన్న ఆమె ఆపై కోలుకోవడానికి ఏడాది పట్టింది. అదే సమయంలో ఆమె తండ్రిని కూడా కోల్పోయింది. సీనియర్ ప్లేయర్ అయిన తనకు భవిష్యత్తులో మళ్లీ ఎప్పుడు ఈ స్థాయిలో విజయానందం వరిస్తుందో అంటూ ఆమె ఆనందభాష్పాలు రాల్చింది. టోర్నీకి ముందు తమదైన రీతిలో ప్లేయర్లు సన్నద్ధమయ్యారు. మనీషా కళ్యాణ్, జ్యోతి చౌహాన్, తెలంగాణ ప్లేయర్ గుగులోత్ సౌమ్య యూరోపియన్ క్లబ్స్ ట్రయల్స్కు వెళ్లి కాంట్రాక్ట్లు పొంది తమ ఆటకు పదును పెట్టారు. మిగిలిన వారు ఐ–లీగ్లో బరిలోకి దిగి సాధ్యమైనంత ఎక్కువగా ప్రాక్టీస్పై దృష్టి పెట్టారు. ఈ విజయం కచ్చితంగా ఏఐఎఫ్ఎఫ్ది మాత్రం కాదు. తమ శక్తి, స్వేదం, కన్నీళ్లు ధారబోసిన 23 మంది మహిళా ఫుట్బాలర్లదే. వచ్చే ఏడాది ఆసియాకప్లో కూడా ఇదే రీతిలో సత్తా చాటితే వరల్డ్ కప్లో పాల్గొనే స్వప్నం కూడా సాకారమవుతుంది. -
రెండో రౌండ్లో వంతిక అగర్వాల్
బతూమి (జార్జియా): మహిళల ప్రపంచకప్ నాకౌట్ చెస్ టోర్నమెంట్లో భారత క్రీడాకారిణులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. వంతిక అగర్వాల్, పద్మిని రౌత్, పీవీ నందిత రెండో రౌండ్లోకి ప్రవేశించగా... కిరణ్ మనీషా మొహంతి తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. కె.ప్రియాంక భవిత్యం నేడు జరిగే టైబ్రేక్ గేమ్లలో తేలనుంది. తొలి రౌండ్లో వంతిక 1.5–0.5తో లాలా షొహోర్దోవా (తుర్క్మెనిస్తాన్)పై, పద్మిని 2–0తో జాంగ్ లాన్లిన్ (చైనా)పై, నందిత 2–0తో ఒరిట్జ్ అనాహి (ఈక్వెడార్)పై గెలుపొందారు. కిరణ్ మనీషా 0.5–1.5తో సాంగ్ యుజిన్ (చైనా) చేతిలో ఓడిపోయింది. తొలి రౌండ్లోని రెండు గేమ్లు ముగిశాక ప్రియాంక–గాల్ జొసోకా (హంగేరి) 1–1తో సమంగా నిలిచారు. షొహోర్దోవాతో ఆదివారం తొలి గేమ్ను ‘డ్రా’ చేసుకున్న వంతిక సోమవారం జరిగే రెండో గేమ్లో 29 ఎత్తుల్లో నెగ్గింది. జాంగ్ లాన్లిన్పై తొలి గేమ్లో గెలిచిన పద్మిని సోమవారం జరిగిన రెండో గేమ్లో 34 ఎత్తుల్లో... అనాహిపై తొలి గేమ్లో నెగ్గిన నందిత రెండో గేమ్లో 64 ఎత్తుల్లో విజయం అందుకున్నారు. సాంగ్ యుజిన్ చేతిలో తొలి గేమ్లో ఓడిపోయిన మనీషా రెండో గేమ్ను 30 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకొని ఇంటిదారి పట్టింది. -
ఐసీసీ సీఈఓగా సంజోగ్ గుప్తా
దుబాయ్: భారత మీడియా మొఘల్ సంజోగ్ గుప్తా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ (సీఈఓ)గా నియమితులయ్యారు. ఈ ఏడాది పాకిస్తాన్ ఆతిథ్యమిచ్చిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆ్రస్టేలియాకు చెందిన జెఫ్ అలర్డైస్ సీఈఓ పదవి నుంచి తప్పుకున్నారు. అప్పటి నుంచి ఈ పదవి ఖాళీగానే ఉండటంతో సంజోగ్ గుప్తాతో భర్తీ చేశారు. జియోస్టార్ నెట్వర్క్కు సీఈఓగా వ్యవహరించిన సంజోగ్కు మీడియా రంగంలో విశేషానుభవం ఉంది. దీంతో పాటు భారత్కే చెందిన జై షా ఐసీసీ చైర్మన్గా ఉండటం కూడా అంతర్జాతీయ క్రికెట్ వ్యవహారాలు చక్కబెట్టే పదవిని చేపట్టేందుకు కలిసొచ్చింది. అంతమాత్రాన పూర్తిగా జై షా చలవే అనలేం. ఎందుకంటే ఏళ్ల తరబడి మీడియా రంగంలో ఆయన విశేష కృషి చేశారు. అందువల్లేనేమో 2500 పైచిలుకు దరఖాస్తు చేసుకుంటే సంజోగ్నే సీఈఓ పదవి వరించింది. ఐసీసీలోని శాశ్వత, అనుబంధ సభ్యులైన 25 దేశాల నుంచి వేల సంఖ్యలో ఈ పదవి కోసం పోటీపడ్డారు. అనుభవం, పనితీరు ఆధారంగా ఒక్కో దేశం నుంచి 12 మంది చొప్పున తుది జాబితాకు ఖరారు చేయగా ఇందులో సంజోగ్ గుప్తా అర్హుడని ఐసీసీ కమిటీ భావించింది. ఈ నామినేషన్ల కమిటీలో ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖాజా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు చైర్మన్ రిచర్డ్ థాంప్సన్, లంక క్రికెట్ అధ్యక్షుడు షమ్మీ సిల్లా, భారత బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ సిఫార్సు మేరకే ఐసీసీ చైర్మన్ జై షా... సంజోగ్ను కొత్త సీఈఓగా నియమించారు. స్పోర్ట్స్ జర్నలిస్ట్గా వచ్చి... ఈ జనవరిలో పదవి నుంచి వైదొలిగిన అలర్డైస్ వారసుడిగా సంజోగ్ గుప్తా త్వరలోనే పదవీ బాధ్యతలు చేపడతారు. ఐసీసీ చైర్మన్ తర్వాత రెండో ప్రాధాన్య పదవి సీఈఓ. దీంతో ఈ రెండు కీలకమైన పదవుల్లో భారతీయులే కొలువుదీరడం విశేషం. జై షా భారత హోం మంత్రి అమిత్ షా తనయుడు. కానీ గుప్తా మాత్రం ఢిల్లీలోని ద ట్రైబ్యున్ పత్రికలో ఓ సాధారణ స్పోర్ట్స్ జర్నలిస్టుగా కెరీర్ను ప్రారంభించి మీడియా మొఘల్గా ఎదిగాడు. 2010లో స్టార్ ఇండియా (ప్రస్తుత జియో స్టార్)లో సహాయ ఉపాధ్యక్షుడిగా చేరిన సంజోగ్ తన నేర్పు, నైపుణ్యం, అంకితభావం, నిబద్ధతతో అంచెలంచెలుగా ఎదిగారు. కంటెంట్, ప్రొగ్రామింగ్, వ్యూహారచనతో ఓ చానెల్ నెట్వర్క్ను విస్తరించారు. మొదటి పదేళ్లు ఐపీఎల్ ‘సోనీ’ నెట్వర్క్లో ప్రసారమైంది. తర్వాత కోట్లు గుమ్మరించి ఐపీఎల్ సహా, ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్), ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్బాల్ (ఐఎస్ఎల్) సహా ఎన్నో ప్రీమియర్ లీగ్ను, గ్రాండ్స్లామ్ టోర్నీల ప్రసార హక్కుల్ని స్టార్ హస్తగతమయ్యేలా చేశారు. రిలయన్స్కు చెందిన వయాకామ్ 18 నెట్వర్క్ డిస్నీ స్టార్ను సొంతం చేసుకోవడంతో రిలయన్స్ యాజమాన్యం గతేడాది సంజోగ్ గుప్తాను సీఈఓగా నియమించింది. ఇప్పుడైతే ఏకంగా ఐసీసీలో ఏడో సీఈఓగా అంతర్జాతీయ క్రికెట్ను వ్యవహారాలను చక్కబెట్టే పనిలో పడతారు.7 ఐసీసీ సీఈఓగా నియమితుడైన ఏడో వ్యక్తి సంజోగ్ గుప్తా. గతంలో డేవిడ్ రిచర్డ్స్ (1993–2001), మాల్కం స్పీడ్ (2001–2008), హరూన్ లోర్గాట్ (2008–2012), డేవిడ్ రిచర్డ్సన్ (2012–2019), మనూ సాహ్ని (2019–2021), జెఫ్ అలర్డైస్ (2021–2025) ఈ బాధ్యతలు నిర్వర్తించారు. -
జొకోవిచ్ 16వసారి...
లండన్: రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్స్లామ్ టైటిల్ వేటలో సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ మరో అడుగు ముందుకేశాడు. వింబుల్డన్ టోర్నీలో ఏడుసార్లు చాంపియన్ జొకోవిచ్ 16వసారి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ జొకోవిచ్ 1–6, 6–4, 6–4, 6–4తో 11వ సీడ్ అలెక్స్ డిమినార్ (ఆ్రస్టేలియా)పై నెగ్గాడు. 3 గంటల 19 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో జొకోవిచ్ తొలి సెట్లో కేవలం ఒక గేమ్ మాత్రమే గెలిచాడు. అయితే రెండో సెట్ నుంచి గాడిలో పడ్డ జొకోవిచ్ ప్రత్యరి్థకి ఆధిపత్యం చలాయించే అవకాశం ఇవ్వలేదు. మ్యాచ్ మొత్తంలో ఆరు ఏస్లు సంధించిన జొకోవిచ్ ఐదు డబుల్ ఫాల్ట్లు చేశాడు. నెట్ వద్దకు 52 సార్లు దూసుకొచ్చి 35 సార్లు పాయింట్లు నెగ్గిన జొకోవిచ్ 38 విన్నర్స్ కొట్టాడు. తన సర్వీస్ను ఆరుసార్లు కోల్పోయిన జొకోవిచ్ ప్రత్యర్థి సర్వీస్ను కూడా ఆరుసార్లు బ్రేక్ చేశాడు. ఓవరాల్గా వింబుల్డన్లో 101వ విజయం నమోదు చేసిన జొకోవిచ్ కెరీర్లో 63వసారి గ్రాండ్స్లామ్ టోర్నీల్లో క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించాడు. క్వార్టర్ ఫైనల్లో ఇటలీ ప్లేయర్ ఫ్లావియో కొబోలితో జొకోవిచ్ ఆడతాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్లో కొబోలి 6–4, 6–4, 6–7 (4/7), 7–6 (7/3)తో మారిన్ సిలిచ్ (క్రొయేషియా)పై... బెన్ షెల్టన్ (అమెరికా) 3–6, 6–1, 7–6 (7/1), 7–5తో సొనెగో (ఇటలీ)పై, డిఫెండింగ్ చాంపియన్ , రెండో సీడ్ అల్కరాజ్ (స్పెయిన్) 6–7 (5/7), 6–3, 6–4, 6–4తో 14వ సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా)పై విజయం సాధించారు. -
ఒకే రోజు రెండు వరల్డ్ రికార్డులు బద్దలు
యుజీన్ (అమెరికా): మిడిల్ డిస్టెన్స్ రన్నింగ్లో తమకు తిరుగులేదని కెన్యా మహిళా అథ్లెట్లు మరోసారి నిరూపించుకున్నారు. డైమండ్ లీగ్లో భాగంగా అమెరికాలోని యుజీన్లో జరిగిన ప్రిఫోంటెయిన్ క్లాసిక్ మీట్లో ఇద్దరు కెన్యా మహిళా అథెట్లు రెండు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టారు. మూడుసార్లు ఒలింపిక్ చాంపియన్ ఫెయిత్ కిపియేగాన్ 1500 మీటర్ల విభాగంలో... పారిస్ ఒలింపిక్స్లో రెండు స్వర్ణాలు గెలిచిన బిట్రెస్ చెబెట్ 5000 మీటర్లలో కొత్త ప్రపంచ రికార్డులు సృష్టించారు. 31 ఏళ్ల కిపియేగాన్ 1500 మీటర్ల దూరాన్ని 3 నిమిషాల 48.68 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచింది.ఈ క్రమంలో గత ఏడాది పారిస్ ఒలింపిక్స్లో 3 నిమిషాల 49.04 సెకన్లతో తానే నెలకొల్పిన ప్రపంచ రికార్డును కిపియేగాన్ తిరగరాసింది. కిపియేగాన్ 2016 రియో, 2020 టోక్యో, 2024 పారిస్ ఒలింపిక్స్లో స్వర్ణ పతకాలు గెలిచి 1500 మీటర్ల విభాగంలో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. మరోవైపు 5000 మీటర్ల దూరాన్ని 25 ఏళ్ల బిట్రెస్ చెబెట్ 13 నిమిషాల 58.06 సెకన్లలో ముగించి తన పేరిట కొత్త ప్రపంచ రికార్డును లిఖించుకుంది.5000 మీటర్ల దూరాన్ని 14 నిమిషాల్లోపు పూర్తి చేసిన తొలి మహిళా అథ్లెట్గా గుర్తింపు పొందిన చెబెట్... రెండేళ్ల క్రితం ప్రిఫోంటెయిన్ క్లాసిక్ మీట్లో 14 నిమిషాల 00.21 సెకన్లతో గుడాఫ్ సెగె (ఇథియోపియా) సృష్టించిన ప్రపంచ రికార్డును సవరించింది. గత ఏడాది పారిస్ ఒలింపిక్స్లో చెబెట్ 5000, 10,000 మీటర్ల విభాగాల్లో స్వర్ణ పతకాలు నెగ్గి విశ్వ క్రీడల్లో అరుదైన ‘డబుల్’ సాధించిన మూడో అథ్లెట్గా గుర్తింపు పొందింది. -
రెడ్డి భవానీకి వైఎస్ జగన్ శుభాకాంక్షలు
ఆసియా యూత్ అండ్ జూనియర్ ఛాంపియన్షిప్లో బంగారు పతకం సాధించిన రెడ్డి భవానీకి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan Mohan Reddy) శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.కాగా విజయనగరం జిల్లాకు చెందిన రెడ్డి భవానీ ఆసియా యూత్ & జూనియర్ ఛాంపియన్షిప్లో మహిళల 48 కిలోల వెయిట్లిఫ్టింగ్ విభాగంలో పోటీపడింది. మొత్తంగా 159 కిలోల బరువునెత్తి స్వర్ణం కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా రెడ్డి భవానీకి.. వైఎస్ జగన్ సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. Hearty congratulations to Reddy Bhavani from Vizianagaram district on her stunning Gold Medal win at the Asian Youth & Junior Championships! Here’s to many more milestones and memorable victories ahead. Keep shining, Bhavani! pic.twitter.com/nNwL5I0QoG— YS Jagan Mohan Reddy (@ysjagan) July 7, 2025 -
నా స్వప్నం సాకారమైంది: నోరిస్కు నాలుగో టైటిల్
సిల్వర్స్టోన్: ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన బ్రిటిష్ గ్రాండ్ప్రి ఫార్ములావన్ రేసులో బ్రిటన్ డ్రైవర్ లాండో నోరిస్ టైటిల్ సాధించాడు. ఆదివారం జరిగిన ఈ రేసులో మెక్లారెన్ జట్టుకు చెందిన నోరిస్ నిరీ్ణత 52 ల్యాప్లను అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 1 గంట 37 నిమిషాల 15.735 సెకన్లలో ముగించి విజేతగా అవతరించాడు. సొంతగడ్డపై నోరిస్కిదే తొలి విజయం కాగా... ఈ సీజన్లో నాలుగోది.నా స్వప్నం సాకారమైంది‘సొంతనగరంలో టైటిల్ నెగ్గాలని కలలు కన్నాను. నా స్వప్నం సాకారమైంది. ఈ చిరస్మరణీయ విజయాన్ని నా మనుసులో ఎల్లవేళలా దాచుకుంటాను’ అని విజయానంతరం నోరిస్ వ్యాఖ్యానించాడు. మెక్లారెన్ జట్టుకే చెందిన ఆస్కార్ పియాస్ట్రి రెండో స్థానంలో నిలిచాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ వెర్స్టాపెన్ (రెడ్బుల్) ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు.టాప్ ర్యాంక్లో పియాస్ట్రివర్షం అంతరాయం కలిగించిన ఈ రేసులో ఏకంగా ఐదుగురు డ్రైవర్లు కిమీ ఆంటోనెలి (మెర్సిడెస్), ఐజాక్ హద్జార్ (రేసింగ్ బుల్స్), బొర్టోలెటో (స్టేక్ ఎఫ్1), లియామ్ లాసన్ (రేసింగ్ బుల్స్), కొలాపింటో (అల్పైన్ టీమ్) రేసును పూర్తి చేయలేకపోయారు. 24 రేసుల సీజన్లో ఇప్పటికి 12 రేసులు ముగిశాయి. పియాస్ట్రి 234 పాయింట్లతో టాప్ ర్యాంక్లో కొనసాగుతుండగా... 226 పాయింట్లతో నోరిస్ రెండో స్థానంలో, 165 పాయింట్లతో వెర్స్టాపెన్ మూడో స్థానంలో ఉన్నారు. సీజన్లోని తదుపరి రేసు బెల్జియం గ్రాండ్ప్రి ఈనెల 27న జరుగుతుంది.బ్రిటిష్ గ్రాండ్ప్రిలో బ్రిటన్ డ్రైవర్కే టైటిల్ లభించడం ఇది 12సారి కావడం విశేషం. గతంలో స్టిర్లింగ్ మోస్, పీటర్ కోలిన్స్, క్లార్క్, స్టీవార్ట్, హంట్, జాన్ వాట్సన్, మాన్సెల్, డామన్ హిల్, జానీ హెర్బర్ట్, డేవిడ్ కౌతార్డ్, హామిల్టన్ ఈ రేసులో గెలిచారు. -
సబలెంకా జోరు
లండన్: టైటిల్ ఫేవరెట్స్లో ఒక్కొక్కరూ వెనుదిరుగుతుండగా... మరోవైపు అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ బెలారస్ స్టార్, ప్రపంచ నంబర్వన్ సబలెంకా ముందంజ వేసింది. ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీలో టాప్ సీడ్ సబలెంకా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సబలెంకా 6–4, 7–6 (7/4)తో ఎలీసా మెర్టెన్స్ (బెల్జియం)పై విజయం సాధించింది. 122 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సబలెంకాకు రెండు సెట్లలో గట్టిపోటీ ఎదురైంది. అయితే కీలకదశలో సబెలంకా పైచేయి సాధించి వరుస సెట్లలో విజయాన్ని ఖరారు చేసుకుంది. అర డజను ఏస్లు సంధించిన సబలెంకా ఒక్కడబుల్ ఫాల్ట్ మాత్రమే చేసింది. నెట్ వద్దకు 15 సార్లు దూసుకొచ్చి 10 సార్లు పాయింట్లు గెలిచింది. తన సరీ్వస్ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సరీ్వస్ను మూడుసార్లు బ్రేక్ చేసింది. 36 విన్నర్స్ కొట్టిన సబలెంకా 18 అనవసర తప్పిదాలు చేసింది. ఆరోసారి వింబుల్డన్ టోర్నీలో ఆడుతున్న సబలెంకా 2021లో, 2023లో సెమీఫైనల్లో ని్రష్కమించింది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్ల్లో అనస్తాసియా పావ్లీచెంకోవా (రష్యా) 7–6 (7/3), 6–4తో సోనె కర్తాల్ (బ్రిటన్)పై, లౌరా సిగెముండ్ (జర్మనీ) 6–3, 6–2తో సొలానా సియెరా (అర్జెంటీనా)పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. ఫ్రిట్జ్ మూడోసారి... పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ ఐదో ర్యాంకర్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా), కామెరాన్ నోరి (బ్రిటన్), కరెన్ ఖచనోవ్ (రష్యా) క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. జోర్డాన్ థాంప్సన్ (ఆ్రస్టేలియా)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ఫ్రిట్జ్ తొలి సెట్ను 6–1తో నెగ్గి, రెండో సెట్లో 3–0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఈ దశలో గాయం కారణంగా థాంప్సన్ వైదొలిగాడు. దాంతో ఈ టోర్నీలో ఫ్రిట్జ్ మూడోసారి క్వార్టర్ ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకున్నాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్లో కామెరాన్ నోరి 4 గంటల 27 నిమిషాల్లో 6–3, 7–6 (7/4), 6–7 (7/9), 6–7 (5/7), 6–3తో నికోలస్ జారీ (చిలీ)పై, ఖచనోవ్ 6–4, 6–2, 6–3తో కామిల్ మజార్జక్ (పోలాండ్)పై గెలుపొందారు. -
డిఫెండింగ్ చాంప్ క్రెజికొవా అవుట్
లండన్: ఈ వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీలో సీడెడ్ స్టార్ల పరాజయాల పరంపర కొనసాగుతోంది. మహిళల సింగిల్స్లో డిఫెండింగ్ చాంపియన్, 17వ సీడ్ బార్బర క్రెజికొవా (చెక్ రిపబ్లిక్)కు మూడో రౌండ్లోనే చుక్కెదురైంది. ఆమెతో పాటు 11వ సీడ్ రిబాకినా (కజకిస్తాన్), 16వ సీడ్ కసట్కినా (ఆ్రస్టేలియా), లోకల్ స్టార్ ఎమ్మా రాడుకాను (బ్రిటన్)ల ఆట కూడా ముగిసింది. టాప్సీడ్ సబలెంక, ఎనిమిదో సీడ్ స్వియాటెక్, ఏడో సీడ్ అండ్రీవా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. పురుషుల సింగిల్స్లో ప్రపంచ నంబర్వన్ యానిక్ సినెర్ సునాయాస విజయంతో ప్రిక్వార్టర్స్ చేరాడు. 11వ సీడ్ డిమినార్, 19వ సీడ్ దిమిత్రోవ్లు కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మూడు గ్రాండ్స్లామ్ టైటిళ్ల చాంపియన్, టాప్ సీడ్ సినెర్ (ఇటలీ) 6–1, 6–3, 6–1తో స్పెయిన్కు చెందిన మార్టినెజ్పై వరుస సెట్లలో గెలుపొందాడు. డిమినార్ (ఆ్రస్టేలియా) 6–4, 7–6 (7/5), 6–3తో హొల్మ్గ్రెన్ (డెన్మార్క్)పై, దిమిత్రోవ్ (బల్గేరియా) 6–3, 6–4, 7–6 (7/0)తో సెబాస్టియన్ అఫ్నెర్ (ఆ్రస్టియా)పై, మారిన్ సిలిచ్ (క్రొయేషియా) 6–3, 3–6, 6–2, 6–4 జేమే మునర్ (స్పెయిన్)పై విజయం సాధించారు. 25వ గ్రాండ్స్లామ్ టైటిల్ లక్ష్యంతో బరిలోకి దిగిన సెర్బియన్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ సునాయాస విజయంతో ప్రిక్వార్టర్స్ చేరాడు. ఆరో సీడ్ జొకో 6–3, 6–0, 6–4తో కెక్మనోవిచ్ (సెర్బియా)పై విజయం సాధించాడు. క్రెజికొవా మూడో రౌండ్లోనే... చెక్ రిపబ్లిక్ స్టార్, 17వ సీడ్ క్రెజికొవా టైటిల్ నిలబెట్టుకునే పోరాటానికి పదో సీడ్ ఎమ్మా నవారో (అమెరికా) చెక్పెట్టింది. మూడో రౌండ్లో నవారో 2–6, 6–3, 6–4తో క్రెజికొవాను ఓడించింది. 2021 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ క్రెజికొవాకు ఈ ఏడాది కలిసిరావడం లేదు. ఈ సీజన్ ఆరంభ గ్రాండ్స్లామ్ ఆ్రస్టేలియా ఓపెన్కు గైర్హాజరైన ఆమె ఫ్రెంచ్ ఓపెన్లో రెండో రౌండ్లోనే వెనుదిరిగింది. ఇప్పుడు ఇక్కడా పేలవ ప్రదర్శనతోనే టోర్నీ నుంచి ని్రష్కమించింది. ఏనాడు వింబుల్డన్లో తొలిరౌండ్ అడ్డంకిని దాటలేకపోయిన క్లారా టౌసన్ (డెన్మార్క్) ఈ సారి ప్రిక్వార్టర్స్ చేరింది. ఆమె 7–6 (8/6), 6–3తో వింబుల్డన్ (2022) మాజీ చాంపియన్, ఆ్రస్టేలియా ఓపెన్ (2023) మాజీ రన్నరప్ ఎలీనా రిబాకినా (కజకిస్తాన్)ను కంగుతినిపించింది. దీంతో గతేడాది సెమీఫైనలిస్ట్ అయిన రిబాకినా ఆట ఈ సీజన్లో మూడో రౌండ్తోనే ముగిసింది. ఈ ఏడాది ఆ్రస్టేలియా, ఫ్రెంచ్ ఓపెన్లలో ప్రిక్వార్టర్స్ చేరిన రిబాకినా... ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్లో నిరాశపరిచింది. ఓవరాల్గా వింబుల్డన్లోనే ఆమెకిది పేలవ ప్రదర్శన. ఇక్కడ 2021 నుంచి ఆడుతున్న ఆమె ఆ ఏడాది ప్రిక్వార్టర్స్ చేరింది. మరుసటి ఏడాది విజేతగా నిలిచింది. 2023, 2024లలో క్వార్టర్స్, సెమీస్ వరకు పోరాడింది. స్వియాటెక్, అండ్రీవా అలవోకగా... మహిళల సింగిల్స్లో ఎనిమిదో సీడ్ ఇగా స్వియాటెక్ (పోలండ్), అండ్రీవా (రష్యా) సునాయాస విజయాలతో ప్రిక్వార్టర్స్ చేరారు. ఐదు గ్రాండ్స్లామ్ టైటిళ్ల చాంపియన్ స్వియాటెక్ 6–2, 6–3తో కొలిన్స్ (అమెరికా)పై విజయం సాధించగా, ఏడో సీడ్ మిర్ర అండ్రీవా (రష్యా) కూడా 6–1, 6–3తో హెయిలీ బాప్టిస్ట్ (అమెరికా)పై వరుస సెట్లలో నెగ్గింది. ఈ సీజన్ ఆ్రస్టేలియా, ఫ్రెంచ్ ఓపెన్ల రన్నరప్ ప్రపంచ నంబర్వన్ సబలెంక (బెలారస్) 7–6 (8/6), 6–4తో రాడుకానుపై గెలుపొందింది. భారత జోడీలకు నిరాశపురుషుల డబుల్స్లో భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. యూకీ బాంబ్రీ తన అమెరికా భాగస్వామితో కలిసి మూడో రౌండ్లోకి దూసుకెళ్లగా, రిత్విక్ బొల్లిపల్లి, శ్రీరామ్ బాలాజీ జోడీలకు రెండోరౌండ్లో చుక్కెదురైంది. యూకీ బాంబ్రీ–రాబర్ట్ గాలొవే (అమెరికా) ద్వయం 6–3, 7–6 (8/6)తో నునొ బోర్జెస్ (పోర్చుగల్)–మార్కస్ గిరోన్ (అమెరికా) జంటపై గెలిచింది. రిత్విక్–నికోలస్ బారియెంటోస్ (కొలంబియా) జోడీ 4–6, 6–7 (7/9)తో ఆరో సీడ్ జో సలిస్బురి–నియోల్ స్కప్స్కీ (బ్రిటన్) జంట చేతిలో ఓటమి పాలైంది. శ్రీరామ్ బాలాజీ–మిగెల్ రెయిస్ (మెక్సికో) ద్వయం 4–6, 4–6తో నాలుగో సీడ్ మార్సెల్ గ్రెనొల్లర్స్ (స్పెయిన్)–హొరాసియో జె»ొల్లస్ (అర్జెంటీనా) జోడీ చేతిలో పరాజయం చవిచూసింది. -
సత్తా చాటిన భారత అమ్మాయిలు
చియాంగ్ మై (థాయిలాండ్): భారత మహిళల ఫుట్బాల్ జట్టు అసలు సమయంలో చెలరేగింది. క్వాలిఫయింగ్ టోర్నీలో సత్తా చాటి ఆసియా కప్కు అర్హత సాధించింది. 2003 తర్వాత మన మహిళలు ఆసియా కప్ నేరుగా అర్హత సాధించడం ఇదే తొలిసారి. శనివారం జరిగిన మ్యాచ్లో భారత్ 2–1 గోల్స్ తేడాతో ఆతిథ్య జట్టు థాయిలాండ్ను ఓడించింది. భారత్ తరఫున సంగీత బస్ఫోర్ రెండు గోల్స్ (28వ నిమిషం, 78వ నిమిషం) సాధించడం విశేషం. థాయిలాండ్ తరఫున చట్చవాన్ రాడ్థాంగ్ ఏకైక గోల్ (47వ నిమిషం) నమోదు చేసింది.ఈ మ్యాచ్కు ముందు ఇరు జట్ల మధ్య గోల్ వ్యత్యాసం కూడా (+22) కూడా సమానంగా ఉండటంతో ఇరు జట్లూ తప్పనిసరిగా గెలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగాయి. ‘ఫిఫా’ ర్యాంకింగ్స్లో భారత్కంటే 24 స్థానాలు ముందున్న థాయిలాండ్ ఫేవరెట్గా బరిలోకి దిగింది. అయితే మన అమ్మాయిల పట్టుదలకు విజయం వరించింది. గతంలో భారత్ ఎప్పుడూ థాయిలాండ్ను ఓడించలేదు. క్వాలిఫయింగ్ టోర్నీలో గ్రూప్ ‘బి’ నుంచి ఆడిన నాలుగు మ్యాచ్లలోనూ భారత మహిళలు విజయం సాధించి అగ్రస్థానంతో ముందంజ వేయడం విశేషం. టోర్నీలో గత మూడు మ్యాచ్లలో ఇరాక్, మంగోలియా, తిమోర్ లెస్ట్లను భారత్ ఓడించింది. ఆసియా కప్ టోర్నీ 2026లో ఆస్ట్రేలియాలో జరుగుతుంది. -
ఎదురులేని నీరజ్
బెంగళూరు: భారత్లో నిర్వహించిన తొలి అంతర్జాతీయ జావెలిన్ త్రో ఈవెంట్... ‘నీరజ్ చోప్రా క్లాసిక్’లో భారత స్టార్ నీరజ్ చోప్రా విజేతగా నిలిచాడు. ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య ‘ఎ’కేటగిరీ గుర్తింపునిచ్చిన ఈ టోర్నీలో శనివారం నీరజ్ జావెలిన్ను 86.18 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానం దక్కించుకున్నాడు. ఇటీవల పారిస్ డైమండ్ లీగ్, ఓస్ట్రావా గోల్డెన్ స్పైక్ టోర్నీల్లో టైటిల్స్ నెగ్గిన 27 ఏళ్ల నీరజ్ చోప్రాకు ఇది ‘హ్యాట్రిక్’టైటిల్ కావడం విశేషం. 2020 టోక్యో ఒలింపిక్స్లో పసిడి, 2024 పారిస్ ఒలింపిక్స్లో రజతం నెగ్గిన నీరజ్... సొంతగడ్డపై అంచనాలను అందుకుంటూ అదరగొట్టాడు. ప్రపంచ మాజీ చాంపియన్ జూలియన్ యెగో (84.51 మీటర్లు; కెన్యా), రమేశ్ పతిరగే (84.34 మీటర్లు; శ్రీలంక) వరుసగా రెండో, మూడో స్థానాల్లో నిలిచారు. భారత అథ్లెటిక్స్ సమాఖ్య, ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య, జేఎస్డబ్ల్యూ స్పోర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో నీరజ్ చోప్రా పర్యవేక్షణలో జరిగిన ఈ ఈవెంట్ విజయవంతం కాగా... విజేతలకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య బహుమతులు అందజేశారు. తొలి ప్రయత్నంలో ఫౌల్ చేసిన నీరజ్... రెండో త్రోలో జావెలిన్ను 82.99 మీటర్ల దూరం విసిరాడు. ఇక మూడో ప్రయత్నంలో ఈటెను 86.18 మీటర్ల దూరం విసిరి అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసిన నీరజ్ విజయనాదం చేశాడు. ఆ తర్వాత నాలుగో ప్రయత్నంలో మరోసారి ఫౌల్ చేసిన నీరజ్.. ఐదో ప్రయత్నంలో 84.07 మీటర్లు, ఆరో త్రోలో 82.22 మీటర్ల దూరం నమోదు చేసుకున్నాడు. మిగిలిన అథ్లెట్లెవరూ నీరజ్ దరిదాపుల్లోకి చేరుకోలేకపోవ డంతో భారత స్టార్ విజేతగా నిలిచాడు. -
స్వర్ణం గెలిచిన నీరజ్ చోప్రా.. సరికొత్త చరిత్ర
భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా మరోసారి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. భారత్లో తొలిసారి జరుగుతున్న అంతర్జాతీయ జావెలిన్ ఈవెంట్లో స్వర్ణ పతకంతో మెరిశాడు. బెంగళూరు వేదికగా తన పేరిట జరుగుతున్న ‘నీరజ్ చోప్రా క్లాసిక్’ టైటిల్ను ఈ గోల్డెన్ బాయ్ సొంతం చేసుకున్నాడు.ఈ క్రమంలో తన పేరిట జరుగుతున్న అంతర్జాతీయ పోటీలో తానే పసిడి పతకం గెలిచిన తొలి అథ్లెట్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. అత్యుత్తమంగా ఈటెను 86.18 మీటర్ల దూరం విసిరి నీరజ్ గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు. బెంగళూరులోని శనివారం నాటి ఈవెంట్కు శ్రీ కంఠీవరవ స్టేడియం వేదికైంది.ఇక కెన్యాకు చెందిన జూలియస్ యెగో 84.51 దూరం బల్లాన్ని విసిరి నీరజ్ తర్వాతి స్థానంలో నిలిచి రజత పతకం అందుకున్నాడు. శ్రీలంకకు చెందిన అండర్-16 మాజీ ఫాస్ట్ బౌలర్ రమేశ్ పతిరగె 84.34 మీటర్ల దూరం ఈటెను విసిరి కాంస్య పతకం గెలుచుకోగా.. భారత్కే చెందిన సచిన్ యాదవ్ తృటిలో కాంస్యాన్ని కోల్పోయాడు. అతడు అత్యుత్తమంగా బల్లాన్ని 82.33 మీటర్ల దూరం విసిరాడు.హ్యాట్రిక్ కొట్టిన నీరజ్ చోప్రాకాగా టోక్యో ఒలింపిక్స్-2020లో పసిడి పతకం గెలిచిన నీరజ్ చోప్రా.. 2024 పారిస్ ఒలింపిక్స్లో రజతం సొంతం చేసుకున్నాడు. అంతేకాదు..27 ఏళ్ల ఈ హర్యానా అథ్లెట్ ఖాతాలో ప్రపంచ చాంపియన్షిప్ స్వర్ణాలు, డైమండ్ లీగ్ టైటిల్స్.. అదే విధంగా ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో గెలిచిన పతకాలు ఉన్నాయి. ఇక ఇటీవల పారిస్ డైమండ్ లీగ్, ఓస్ట్రావా గోల్డెన్ స్పైక్ టోర్నీల్లో టైటిల్స్ కైవసం చేసుకున్న నీరజ్ చోప్రా.. తాజాగా నీరజ్ చోప్రా క్లాసిక్ ఈవెంట్ గెలిచి హ్యాట్రిక్ కొట్టాడు. ఈ ఈవెంట్లో నీరజ్ చోప్రా (భారత్)తో పాటు.. సిప్రియన్ మిర్జిగ్లాడ్ (పోలాండ్), లూయిజ్ మౌరిసియో డా సిల్వా (బ్రెజిల్), థామస్ రోలెర్ (జర్మనీ), కర్టిన్స్ థామ్సన్ (అమెరికా), మార్టిన్న్ కొనెస్నీ (చెక్ రిపబ్లిక్), జూలియస్ యెగో (కెన్యా), రమేశ్ పతిరగే (శ్రీలంక), సచిన్ యాదవ్ (భారత్), రోహిత్ యాదవ్ (భారత్), సాహిల్ సిల్వాల్ (భారత్), యశ్ వీర్ సింగ్ (భారత్) బరిలో దిగారు.NEERAJ CHOPRA WINS NC CLASSIC 2025! 🏆- The Winning Throw of 86.18m for G.O.A.T 🐐pic.twitter.com/nPaJhHuJmk— The Khel India (@TheKhelIndia) July 5, 2025 -
నవ శకానికి నాంది
బెంగళూరు: భారత్లో తొలిసారి జరుగుతున్న అంతర్జాతీయ జావెలిన్ ఈవెంట్కు రంగం సిద్ధమైంది. శనివారం బెంగళూరు వేదికగా ప్రతిష్ఠాత్మక ‘నీరజ్ చోప్రా క్లాసిక్’ ఈవెంట్ జరగనుంది. భారత స్టార్ జావెలిన్ త్రోయర్, ఒలింపిక్స్లో రెండు పతకాలు సాధించిన నీరజ్ చోప్రా పేరిట నిర్వహిస్తున్న ఈ టోర్నీలో 12 మంది జావెలిన్ త్రోయర్లు పాల్గొంటున్నారు. తన పేరిట జరుగుతున్న ఈ టోర్నీలో నీరజ్ ఫేవరెట్గా బరిలోకి దిగుతున్నాడు. ఇటీవల పారిస్ డైమండ్ లీగ్, ఓస్ట్రావా గోల్డెన్ స్పైక్ టోర్నీల్లో టైటిల్స్ నెగ్గిన 27 ఏళ్ల నీరజ్ చోప్రా... హ్యాట్రిక్ టైటిల్పై గురిపెట్టాడు. 2020 టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం, 2024 పారిస్ ఒలింపిక్స్లో రజతంతో పాటు... ప్రపంచ చాంపియన్షిప్ స్వర్ణాలు, డైమండ్ లీగ్ టైటిల్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు ఇలా అంతర్జాతీయ స్థాయిలో దాదాపు అన్నీ టోర్నీల్లో నీరజ్ సత్తా చాటాడు. ఇప్పుడు స్వదేశంలో నిర్వహిస్తున్న ‘నీరజ్ చోప్రా క్లాసిక్’ ఈవెంట్లో కూడా అదే పరంపర కొనసాగించాలని భావిస్తున్నాడు. దేశంలో అథ్లెటిక్స్కు మరింత ఊతం ఇచ్చేందుకు ఈ టోర్నీ దోహదపడుతుందన్న నీరజ్... యువ అథ్లెట్లు దీని నుంచి స్ఫూర్తి పొందితే సంతోíÙస్తానని వెల్లడించాడు. ఈ ఏడాది తొలిసారి 90 మీటర్ల మార్క్ అందుకున్న నీరజ్... అదే ప్రదర్శన పునరావృతం చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. మే నెలలో దోహా వేదికగా జరిగిన పోటీల్లో నీరజ్ తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసుకొని ఫుల్ జోష్లో ఉన్నాడు. భారత్లో నీరజ్ ఓ టోర్నీలో పాల్గొననుండటం ఏడాది విరామం తర్వాత ఇదే మొదటి సారి. భారత్లో ఇదే తొలిసారి.. భారత అథ్లెటిక్స్ సమాఖ్య, ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య, జేఎస్డబ్ల్యూ స్పోర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో నీరజ్ చోప్రా పర్యవేక్షణలో ఈ ఈవెంట్ జరుగుతోంది. ప్రస్తుతానికి ఈ ఈవెంట్లో జావెలిన్ త్రో పోటీలు మాత్రమే జరుగుతుండగా... భవిష్యత్తులో దీన్ని మరింత విస్తృతం చేయాలని నీరజ్ భావిస్తున్నాడు. ప్రతి ఏటా దీన్ని నిర్వహించడంతో పాటు మరిన్ని క్రీడాంశాలను జతచేసే ఆలోచన ఉన్నట్లు వెల్లడించాడు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం మే 24న హర్యానాలోని పంచకులలో ఈ ఈవెంట్ నిర్వహించాలని నిర్ణయించగా... అంతర్జాతీయ ప్రసారదారుల విజ్ఞప్తి మేరకు దీన్ని బెంగళూరుకు మార్చారు. అనంతరం సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఈవెంట్ తేదీ సైతం మారింది. ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య దీనికి ‘ఎ’ కేటగిరీ గుర్తింపునివ్వగా... భారత్లో జరుగుతున్న తొలి అంతర్జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీ ఇదే కావడం విశేషం. అయితే ఈవెంట్ ప్రారంభానికి ముందే పలువురు స్టార్ అథ్లెట్లు వేర్వేరు కారణాల వల్ల టోర్నీ నుంచి వైదొలిగారు. గ్రెనడాకు చెందిన రెండుసార్లు ప్రపంచ చాంపియన్ అండర్సన్ పీటర్స్ గాయం కారణంగా పోటీలకు దూరం కాగా... భారత్కు చెందిన కిషోర్ జెనా సైతం గాయంతో టోర్నీకి దూరమయ్యాడు. వరల్డ్ అథ్లెటిక్స్కు సన్నాహకంగా ఈ ఏడాది సెప్టెంబర్లో టోక్యో వేదికగా ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్íÙప్ జరగనుండగా... దానికి ఇది సన్నాహకంగా ఉపయోగపడనుంది. మొత్తం 12 మంది అథ్లెట్లు ఈ పోటీల్లో పాల్గొంటుండగా... అందులో ఐదుగురు త్రోయర్లు ఇప్పటికే వరల్డ్ అథ్లెటిక్స్ అర్హత మార్క్ (85.50 మీటర్లు) అందుకున్నారు. పాకిస్తాన్కు చెందిన ఒలింపిక్ చాంపియన్ అర్షద్ నదీమ్ను కూడా ఈ ఈవెంట్కు ఆహ్వానించగా... అతడు వ్యక్తిగత శిక్షణకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో పాల్గొనబోవడం లేదని ప్రకటించాడు. ఆ తర్వాత ఇరు దేశల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఆ ఊసే లేకుండా పోయింది. 2016 రియో ఒలింపిక్స్ చాంపియన్ థామస్ రోలెర్ (జర్మనీ), ప్రపంచ మాజీ చాంపియన్ జూలియస్ యెగో (కెన్యా), కర్టిస్ థామ్సన్ (అమెరికా) నుంచి నీరజ్కు ప్రధాన పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే యెగో, రోలెర్ ప్రస్తుతం ఫామ్లో లేరు. మార్టిన్ కొనెస్నీ (చెక్ రిపబ్లిక్), లూయిజ్ మౌరిసియో డా సిల్వా (బ్రెజిల్), రమేశ్ పతిరగే (శ్రీలంక), సిప్రియన్ మిర్జిగ్లాడ్ (పోలాండ్) సంచలనం నమోదు చేయాలని చూస్తున్నారు. భారత్ నుంచి నీరజ్ చోప్రాతో పాటు సచిన్ యాదవ్, యశ్వీర్ సింగ్, రోహిత్ యాదవ్, సాహిల్ సిల్వాల్ బరిలో దిగనున్నారు. ప్రస్తుతం దిగ్గజ కోచ్ జాన్ జెలెన్జీ వద్ద నీరజ్ శిక్షణ తీసుకుంటున్నాడు. ఇలాంటి టోర్నమెంట్ మనదేశంలో జరగాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నా. ఇప్పుడు దానికి సమయం ఆసన్నమైంది. కల నెరవేరినట్లు అనిపిస్తోంది. చాలా ఉత్సాహంగా ఉన్నా. ఒలింపిక్స్లో దేశం కోసం పతకాలు సాధించా. ఇప్పుడు దేశానికి తిరిగి ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నా. ఇది భారత యువ అథ్లెట్లకు, అభిమానులకు ఆనందం పంచుతుందనుకుంటున్నా. భారత అథ్లెటిక్స్లో నూతన అధ్యాయానికి ఇది నాంది. ఈ ఈవెంట్ ఇంత భారీ స్థాయిలో నిర్వహించేందుకు తోడ్పడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మనదేశంలో అంతర్జాతీయ పోటీలకు ఇది శుభారంభం. భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో టోర్నీలు జరగాలి. జర్మనీలో వారానికి ఒకటి చొప్పున కేటగిరి ‘ఎ’, ‘బి’, ‘సి’పోటీలు జరుగుతుంటాయి. మనం కూడా ఆ స్థాయికి చేరాలి. అప్పుడు దేశంలో క్రీడా సంస్కృతి పెరుగుతుంది. మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తా. అందుకోసం కఠోర సాధన చేస్తున్నా. ఈ పోటీల తర్వాత ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ కోసం ప్రాక్టీస్ ప్రారంభిస్తా. జావెలిన్ను విసిరే సమయంలో మరింత నియంత్రణ అవసరం. ప్రస్తుతం దానిపై దృష్టి పెట్టా. –నీరజ్ చోప్రాబరిలో ఉన్నది వీరే నీరజ్ చోప్రా (భారత్) సిప్రియన్ మిర్జిగ్లాడ్ (పోలాండ్) లూయిజ్ మౌరిసియో డా సిల్వా (బ్రెజిల్) థామస్ రోలెర్ (జర్మనీ) కర్టిన్స్ థామ్సన్ (అమెరికా) మార్టిన్న్ కొనెస్నీ (చెక్ రిపబ్లిక్) జూలియస్ యెగో (కెన్యా) రమేశ్ పతిరగే (శ్రీలంక) సచిన్ యాదవ్ (భారత్) రోహిత్ యాదవ్ (భారత్) సాహిల్ సిల్వాల్ (భారత్) యశ్ వీర్ సింగ్ (భారత్) -
ముందుకెవరు? ఇంటికెవరు?
చియాంగ్ మయ్ (థాయ్లాండ్): ఆసియా ఫుట్బాల్ సమాఖ్య (ఏఎఫ్సీ) మహిళల ఆసియా కప్ క్వాలిఫయర్స్లో భారత అమ్మాయిలకు అసలైన సవాల్ ఎదురవుతోంది. ర్యాంకింగ్లోనూ, పోటీలోనూ పటిష్టమైన థాయ్లాండ్తో ‘ఢీ’ కొట్టేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో నేడు గ్రూప్ దశలోని ఆఖరి క్వాలిఫయింగ్ పోరు రసవత్తరంగా జరుగనుంది. ఈ క్వాలిఫయింగ్ టోర్నీలో పాయింట్ల పరంగా, గోల్స్ పరంగా సమఉజ్జీలుగా ఉన్న ఇరు జట్లలో గెలిచిన జట్టే ఆసియా కప్ ఫుట్బాల్ టోర్నీకి అర్హత సాధిస్తుంది. ఏఎఫ్సీ ఆసియా కప్ టోర్నీ వచ్చే ఏడాది ఆ్రస్టేలియాలో జరుగుతుంది. ప్రస్తుత క్వాలిఫయర్స్లో సత్తా చాటుకున్నప్పటికీ థాయ్లాండ్పై ఏనాడూ గెలవని భారత్ ఈ చెత్త రికార్డును చెరిపేయాలన్నా... ఏఎఫ్సీ ఆసియా కప్కు అర్హత సాధించాలన్నా సర్వశక్తులు ఒడ్డాల్సిందే! గ్రూప్ ‘బి’లో భారత్, థాయ్లాండ్ జట్లు ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ గెలిచాయి. ఇరాక్, తిమోర్–లెస్టే, మంగోలియాలపై గెలుపొందిన రెండు జట్లు ఇప్పుడు ఆఖరి లీగ్లో ఎదురుపడుతున్నాయి. ఆఖరి మెట్టులో గట్టెక్కితే మాత్రం ఆసియా కప్ ఆడే అవకాశం లభిస్తుంది. ఇదే జరిగితే ‘ఫిఫా’ మహిళల ప్రపంచకప్ (2027) క్వాలిఫికేషన్ టోర్నీ ఆడే జట్టుగా చరిత్రలో నిలుస్తుంది. అందుకేనేమో కోచ్ క్రిస్పిన్ ఛెత్రి థాయ్లాండ్తో మ్యాచ్పై గంపెడాశలు పెట్టుకున్నారు. ఈ విజయంతో వచ్చే ఆసియా కప్ బెర్త్తో భారత ఫుట్బాల్ ముఖచిత్రమే మారుతుందని అన్నారు. దేశ ఫుట్బాల్ క్రీడకే కొత్త ఊపిరినిస్తుందని చెప్పారు. గతంలో 2003లో అమ్మాయిల జట్టు ఆసియా కప్ ఆడింది. కానీ అప్పుడు ఏఎఫ్సీ క్వాలిఫయర్స్ లేవు. ఎట్టకేలకు మళ్లీ మూడేళ్ల క్రితం 2022లో ఆతిథ్య జట్టుగా ఆడే భాగ్యం భారత్కు లభిస్తే ‘కరోనా’ మహమ్మారి గద్దలా తన్నుకుపోయినట్లు టోర్నీనే తుడిచి పెట్టేసింది. కోవిడ్ వల్ల భారత్ ఆ ఏడాది టోర్నీని నిర్వహించలేక పోయింది. ఇప్పుడు మాత్రం క్వాలిఫయింగ్ టోర్నీలో చేసిన పోరాటంతో దర్జాగా అర్హత సాధించాలనుకుంటున్న భారత్కు శనివారం విషమ పరీక్ష ఎదురవుతోంది. 13–0తో మంగోలియాపై, 4–0తో తిమోర్ లెస్టేపై, 5–0తో ఇరాక్పై గెలిచిన భారత్ ప్రత్యర్థులకు ఒక్క గోల్ ఇవ్వకుండా ఘనవిజయాలు సాధించింది. మరోవైపు థాయ్లాండ్ కూడా ఒక్క గోల్ ఇవ్వకుండానే జైత్రయాత్ర సాగించింది. ఈ ఆఖరి మజిలీనే ఇరు జట్లను ఒంటికాలుపై నిలబడేలా చేస్తుంది. సాధారణంగా గ్రూప్ దశలో షూటౌట్ నిర్వహించరు. అయితే ఇరు జట్లు సమఉజ్జీగా ఉండటంతో ఫలితం కోసం ఈ మ్యాచ్లో ‘షూటౌట్’ నిర్వహించడం ఖాయమైంది. -
కీస్ కథ ముగిసె...
లండన్: వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీలో స్టార్ ప్లేయర్ల నిష్క్రమణ పర్వం కొనసాగుతోంది. తాజాగా మహిళల సింగిల్స్ విభాగంలో ఆరో సీడ్, ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ మాడిసన్ కీస్ (అమెరికా)... ప్రపంచ మాజీ నంబర్వన్, నాలుగు గ్రాండ్స్లామ్ టోర్నీల విజేత నయోమి ఒసాకా (జపాన్) మూడో రౌండ్లో ఇంటిముఖం పట్టగా... పురుషుల సింగిల్స్ విభాగంలో నాలుగో సీడ్ జాక్ డ్రేపర్ (బ్రిటన్) రెండో రౌండ్లోనే వెనుదిరిగాడు.శుక్రవారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్లో ప్రపంచ 104వ ర్యాంకర్, 37 ఏళ్ల లౌరా సిగెముండ్ (జర్మనీ) 6–3, 6–3తో మాడిసన్ కీస్పై సంచలన విజయం సాధించి తన కెరీర్లో తొలిసారి వింబుల్డన్ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకుంది. 93 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో లౌరా తన సర్వీస్ను రెండుసార్లు కోల్పోయి ప్రత్యర్థి సర్వీస్ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. కీస్ నాలుగు డబుల్ ఫాల్ట్లతోపాటు 31 అనవసర తప్పిదాలు చేసింది. మరో మ్యాచ్లో పావ్లీచెంకోవా (రష్యా) 3–6, 6–4, 6–4 తో ఒసాకాను ఓడించి 2016 తర్వాత మరోసారి వింబుల్డన్ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకుంది. డ్రేపర్ అవుట్ పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో 2017 రన్నరప్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా) 2 గంటల 39 నిమిషాల్లో 6–4, 6–3, 1–6, 6–4తో డ్రేపర్ను ఓడించాడు. మరో రెండో రౌండ్ మ్యాచ్లో వరల్డ్ నంబర్వన్ యానిక్ సినెర్ (ఇటలీ) 6–1, 6–1, 6–3తో వుకిచ్ (ఆ్రస్టేలియా)పై గెలిచాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్ల్లో ఐదో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) 6–4, 6–3, 6–7 (5/7), 6–1తో ఫొకీనా (స్పెయిన్)పై, 14వ సీడ్ రుబ్లెవ్ (రష్యా) 7–5, 6–2, 6–3తో మనారినో (ఫ్రాన్స్)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. యూకీ జోడీ బోణీ మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో యూకీ బాంబ్రీ (భారత్)–జిన్యు జియాంగ్ (చైనా) జోడీ 6–3, 1–6, 7–6 (10/6)తో హారిసన్–నికోల్ మెలిచార్ (అమెరికా) ద్వయంపై గెలిచి రెండో రౌండ్కు చేరుకుంది. -
చెస్ను ఆస్వాదించలేకపోతున్నా
జాగ్రెబ్: ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్ మునుపటిలా తాను చెస్ ఆడటాన్ని ఆస్వాదించలేకపోతున్నానని చెప్పాడు. ఓ దశాబ్దంపాటు ప్రపంచ చెస్ చాంపియన్షిప్ టైటిల్ను నిలబెట్టుకున్న కార్ల్సన్ ఇటీవల భారత టీనేజ్ సంచలనం, ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ చేతిలో ఓడిపోతున్నాడు. ఇక్కడ జరుగుతున్న సూపర్ యునైటెడ్ ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నీలో గురువారం రెండోసారి గుకేశ్ చేతిలో కంగుతిన్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఆటపై ఆసక్తి తగ్గి బలహీన ప్లేయర్గా మారుతున్నానని వ్యాఖ్యానించాడు. అయితే ప్రపంచ చాంపియన్ గుకేశ్ అద్భుతంగా ఆడుతున్నాడని కితాబిచ్చాడు. అవకాశాల్ని ఒడిసిపట్టుకోవడం, సందర్భోచిత ఎత్తులు వేయడంలో అతని ఆటతీరు గొప్పగా ఉందన్నాడు. ‘నిజాయితీగా చెప్పాలంటే... ఇప్పుడు నేను చెస్ ఆడటాన్ని ఏమాత్రం ఆస్వాదించలేకపోతున్నాను. ఎత్తులు, పైఎత్తులపై ఆసక్తి సన్నగిల్లుతోంది. చెస్ బోర్డు ముందు కూర్చొని ఆడేటపుడు నాలో ఎలాంటి అనుభూతి కలగడం లేదు. అందుకే ఆటలో పేలవంగా ఆడుతున్నాను’ అని నార్వే సూపర్ స్టార్ అన్నాడు. 2013 నుంచి 2023 వరకు ప్రపంచ చెస్ను శాసించిన ఈ సూపర్ గ్రాండ్మాస్టర్ బరిలో ఉన్న పదేళ్లు టైటిల్ను నిలబెట్టుకోవడం విశేషం. రెండేళ్ల క్రితం కార్ల్సన్ స్వయంగా వైదొలగడంతోనే డింగ్ లిరెన్ (చైనా) చాంపియన్ అయ్యాడు. ఇతన్ని గతేడాది ఓడించిన గుకేశ్ సరికొత్త చాంపియన్గా అవతరించాడు. -
నా హృదయం ముక్కలైంది.. కుల్దీప్ యాదవ్ భావోద్వేగం
పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ డియాగో జోటాకు టీమిండియా క్రికెటర్ కుల్దీప్ యాదవ్ నివాళి అర్పించాడు. జోటా మరణంతో ఫుట్బాల్ ప్రపంచం మొత్తం మూగబోయిందని.. అతడు లేని లోటు ఎవరూ పూడ్చలేరంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. నా హృదయం ముక్కలైందిఈ మేరకు.. ‘‘2020 (లివర్పూల్)లో ఒప్పందం.. 20వ నంబర్ను సాధించావు.. అదే నీ శాశ్వత గుర్తింపుగా మార్చుకున్నావు. ఈరోజు ఫుట్బాల్ ఒక్కటే నిన్ను కోల్పోలేదు.ప్రపంచం మొత్తం చీకటిగా మారింది. పిచ్పై అడుగుపెట్టేటపుడు నీ చిరునవ్వే ఉజ్వలమైన కాంతిలా అనిపించేది. పోర్టో లేదంటే వోల్వ్స్.. లేదంటే లివర్పూల్.. ఎక్కడ ఉన్నా నువ్వు అందరి హృదయాలను గెలుచుకున్నావు.నీ కుటుంబానికి ఆ దేవుడు ధైర్యం అందించాలి. నీ ఆత్మకు శాంతి చేకూరాలి డియాగో’’ అంటూ ఇన్స్టా స్టోరీలో కుల్దీప్ యాదవ్ భావోద్వేగపూరిత నోట్ రాశాడు. హార్ట్బ్రేక్ ఎమోజీతో తన అభిమాన ఆటగాడికి నివాళి అర్పించాడు.కారు ప్రమాదంలో..కాగా పోర్చుగల్ ఫుట్బాల్ జట్టు ఫార్వర్డ్ ప్లేయర్ డియాగో జోటా రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన విషయం విదితమే. స్పెయిన్లో జరిగిన కారు ప్రమాదంలో 28 ఏళ్ల డియాగో జోటాతో పాటు అతడి సోదరుడు ఆండ్రె సిల్వా (25) దుర్మరణం పాలయ్యాడు. జమోరా నగరంలో బుధవారం అర్ధరాత్రి దాటాక ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటనలో ఇతర వాహనాల ప్రమేయం లేదని... అతి వేగంతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమిక అంచనాకు వచ్చారు.ఈ బంధం శాశ్వతంఅయితే ఘటన జరిగిన సమయంలో కారు ఎవరు నడుపుతున్నారనే అంశంపై స్పష్టత రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. జోటా ఇటీవలే తన ప్రియురాలు రూట్ కార్డోసోను వివాహమాడాడు. ‘ఈ బంధం శాశ్వతం’ అని సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించిన వారాల్లోనే అనుకోని ప్రమాదంలో జొటా కన్నుమూశాడు. వీరికి ముగ్గురు సంతానం.గత నెలలో పోర్చుగల్ జాతీయ జట్టు నేషన్స్ లీగ్ టైటిల్ సాధించడంలో జోటా కీలక పాత్ర పోషించాడు. మరోవైపు ఆండ్రె సిల్వా పోర్చుగల్ క్లబ్ పినాఫైల్ తరఫున పలు డివిజన్ లీగ్లలో పాల్గొన్నాడు. ‘ఈ విషాదం తీవ్రంగా బాధిస్తోంది’ అని లివర్పూల్ ఫుట్బాల్ క్లబ్ ప్రకటించింది. ఇలాంటి క్లిష్ట సమయంలో జోటా, ఆండ్రె కుటుంబానికి అండగా ఉంటామని వెల్లడించింది.లివర్పూల్ ప్రధాన ఆయుధం ప్రముఖ ఫుట్బాల్ క్లబ్ లివర్పూల్ తరఫున 123 మ్యాచ్లాడిన జోటా 47 గోల్స్ సాధించాడు. లెఫ్ట్ వింగ్లో ఫార్వర్డ్గా ఆడే డియాగో జోటా... అద్వితీయమైన ఫినిషింగ్, ప్రత్యర్థికి అంతుచిక్కని డ్రిబ్లింగ్లో సిద్ధహస్తుడు. చిన్నప్పటి నుంచి ఆటను ప్రేమించిన జోటా... జూనియర్ స్థాయిలో సంచలనాలతో వెలుగులోకి వచ్చాడు.లా లీగాలో అట్లెటికో మాడ్రిడ్ తరఫున 2016 నుంచి రెండు సీజన్లు ఆడిన జోటా... ఆ తర్వాత వివిధ క్లబ్లకు ప్రాతినిధ్యం వహించాడు. 2020 నుంచి లివర్పూల్ తరఫున కొనసాగుతున్న జొటా... మూడు మేజర్ ట్రోఫీలు గెలుచుకున్నాడు. గత సీజన్లో ప్రీమియర్ లీగ్ టైటిల్ గెలిచిన జట్టులో డియాగో ప్రధాన సభ్యుడు. ఇక 2019లో పోర్చుగల్ జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేసిన జోటా... కెరీర్లో 49 మ్యాచ్లాడి 14 గోల్స్ చేశాడు. ఇది తీరని లోటు... పోర్చుగల్ సాకర్ సమాఖ్య కూడా జోటా మృతికి సంతాపం తెలిపింది. ‘ఇది పూడ్చలేని లోటు. జాతీయ జట్టు తరఫున 50కి పైగా మ్యాచ్లు ఆడిన అద్భుత ఆటగాడు ఇలా అర్ధాంతరంగా మృతిచెందడం కలచివేస్తోంది. సహచరులు, ప్రత్యర్థులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ గౌరవించే అత్యుత్తమ ఆటగాడు అప్పుడే లోకం వీడి వెల్లడం బాధగా ఉంది’ అని ఒక ప్రకటనలో తెలిపింది.జోటా మృతికి సంతాపంగా... గురువారం పోర్చుగల్, స్పెయిన్ మహిళల జట్ల మధ్య యూరోపియన్ చాంపియన్షిప్ మ్యాచ్కు ముందు ఇరు జట్ల ఆటగాళ్లు ఒక నిమిషం పాటు మౌనం వహించారు. పోర్చుగల్ ప్రధానమంత్రి లూయిస్ మోంటెనెగ్రో కూడా డియాగో జోటా మృతికి సంతాపం ప్రకటించారు.‘మేము ఇద్దరు చాంపియన్లను కోల్పోయాము. వారి లోటు పోర్చుగల్ సాకర్కు తీరని లోటు. వారి వారసత్వాన్ని గౌరవించేందుకు మా వంతు కృషి చేస్తాం. దేశ ఖ్యాతిని పెంచిన ఆటగాళ్లో జోటా ఒకడు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. ఇది సాకర్కు విషాదకరమైన రోజు’ అని పేర్కొన్నారు.ఇక సహచర ఆటగాడు పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో... ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ‘ఇప్పటి వరకు జాతీయ జట్టులో డియాగోతో కలిసి ఆడాను. ఇంతలో ఇలా ఎలా జరిగిందో. ఇటీవలే జోటా వివాహం జరిగింది. కుటుంబంతో కలిసి సంతోషంగా గడుపుతాడు అనుకుంటే ఊహించని ఘటన అతడిని దూరం చేసింది. ఈ క్లిష్ట సమయంలో అతడి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. మేమందరం మిమ్మల్ని మిస్ అవుతాము’ అని రొనాల్డో అన్నాడు.మరోవైపు.. బాస్కెట్బాల్ దిగ్గజం లెబ్రాన్ జేమ్స్తో పాటు టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ వంటి పలు ప్లేయర్లతో పాటు... ఇతర క్లబ్లు, పలువురు ప్రముఖులు కూడా సంతాపం ప్రకటించారు. టీమిండియా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా జోటా మృతికి సంతాపం తెలిపాడు. కాగా కుల్దీప్ ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నాడు. అయితే, తొలి రెండు టెస్టుల్లోనూ అతడికి తుదిజట్టులో ఆడే అవకాశం లభించలేదు. చదవండి: వింబుల్డన్లో సంచలనాల మోత.. టాప్ సీడ్లకు ఊహించని షాకులు -
సంచలనాల మోత.. టాప్ సీడ్లకు ఊహించని షాకులు
టెన్నిస్ సీజన్ మూడో గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ వింబుల్డన్లో ఈ ఏడాది సంచలనాల మోత కొనసాగుతోంది. ముఖ్యంగా మహిళల సింగిల్స్ విభాగంలో టైటిల్ ఫేవరెట్స్ అనూహ్య పరాజయాలతో ఇంటిదారి పడుతున్నారు. ఇప్పటికే రెండో సీడ్ కోకో గాఫ్, మూడో సీడ్ జెస్సికా పెగూలా, ఐదో సీడ్ కిన్వెన్ జెంగ్, తొమ్మిదో సీడ్ పౌలా బదోసా తొలి రౌండ్లోనే నిష్క్రమించగా... తాజాగా వీరి సరసన గత ఏడాది రన్నరప్, నాలుగో సీడ్ జాస్మిన్ పావోలిని చేరింది. రష్యాకు చెందిన ప్రపంచ 80వ ర్యాంకర్, అన్సీడెడ్ కామిలా రఖిమోవా అద్భుత ఆటతో పావోలిని ఆట కట్టించి మూడో రౌండ్లోకి దూసుకెళ్లింది. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ క్రెజికోవా (చెక్ రిపబ్లిక్), మాజీ నంబర్వన్ నయోమి ఒసాకా (జపాన్) మూడో రౌండ్లోకి అడుగు పెట్టారు. లండన్: గత ఏడాది రెండు గ్రాండ్స్లామ్ టైటిల్స్కు గెలుపు దూరంలో ఉండిపోయిన ఇటలీ టెన్నిస్ స్టార్ జాస్మిన్ పావోలినికి ఈ సీజన్ కలిసి రావడం లేదు. ఆస్ట్రేలియన్ ఓపెన్లో మూడో రౌండ్లో వెనుదిరిగిన పావోలిని... ఫ్రెంచ్ ఓపెన్లో నాలుగో రౌండ్లో ఓడిపోగా... తాజాగా వింబుల్డన్ టోర్నీలో రెండో రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. రష్యాకు చెందిన అన్సీడెడ్ క్రీడాకారిణి, ప్రపంచ 80వ ర్యాంకర్ కామిలా రఖిమోవా 4–6, 6–4, 6–4తో ప్రపంచ ఐదో ర్యాంకర్, నాలుగో సీడ్ పావోలినిపై సంచలన విజయం సాధించింది.తద్వారా తన కెరీర్లో మూడోసారి ఓ గ్రాండ్స్లామ్ టోర్నీలో మూడో రౌండ్కు చేరుకుంది. గత ఏడాది ఫ్రెంచ్ఓపెన్ ఫైనల్లో స్వియాటెక్ చేతిలో... వింబుల్డన్ టోర్నీ ఫైనల్లో క్రెజికోవా చేతిలో ఓడిపోయి రన్నరప్గా నిలిచిన పావోలిని ఈ ఏడాది మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. రఖిమోవాతోజరిగిన పోరులో తొలి సెట్ను నెగ్గిన పావోలిని ఆ తర్వాత తడబడింది. 2 గంటల 19 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో పావోలిని 40 అనవసర తప్పిదాలు చేసి, 23 విన్నర్స్ కొట్టింది. తన సరీ్వస్ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను రెండుసార్లు బ్రేక్ చేసింది. రఖిమోవా 26 విన్నర్స్ కొట్టింది. నెట్ వద్దకు 12 సార్లు దూసుకొచ్చి ఎనిమిదిసార్లు పాయింట్లు గెలిచింది. స్వియాటెక్ ముందంజ... మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ క్రెజికోవా (చెక్ రిపబ్లిక్), మాజీ నంబర్వన్ నయోమి ఒసాకా (జపాన్), ఏడో సీడ్ మిరా ఆంద్రీవా (రష్యా), ఎనిమిదో సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్), మాజీ చాంపియన్ రిబాకినా (కజకిస్తాన్), పదో సీడ్ ఎమ్మా నవారో (అమెరికా) మూడో రౌండ్లోకి ప్రవేశించారు. రెండో రౌండ్ మ్యాచ్ల్లో క్రెజికోవా 6–4, 3–6, 6–2తో డొలెహిడి (అమెరికా)పై, ఒసాకా 6–3, 6–2తో సినియకోవా (చెక్ రిపబ్లిక్)పై, ఆంద్రీవా 6–1, 7–6 (7/4)తో బ్రాన్జెట్టి (ఇటలీ)పై, రిబాకినా 6–3, 6–1తో సాకరి (గ్రీస్)పై, నవారో 6–1, 6–2తో కుదెర్మెటోవా (రష్యా)పై, స్వియాటెక్ 5–7, 6–2, 6–1తో కేటీ మెక్నాలీ (అమెరికా)పై గెలిచారు. బాలాజీ జోడీ బోణీ పురుషుల డబుల్స్ విభాగంలో శ్రీరామ్ బాలాజీ (భారత్)–వరేలా (మెక్సికో) జోడీ శుభారంభం చేసింది. తొలి రౌండ్లో బాలాజీ–వరేలా ద్వయం 6–4, 6–4 తో లెర్నర్ టియెన్–కొవాసెవిక్ (అమెరికా) జంటను ఓడించింది. జొకోవిచ్... వరుసగా 16వసారి పురుషుల సింగిల్స్ విభాగంలో ఏడుసార్లు చాంపియన్, సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ వరుసగా 16వ సారి వింబుల్డన్ టోర్నీలో మూడో రౌండ్కు చేరుకున్నాడు. గత ఆరు పర్యాయాల్లో ఫైనల్ చేరిన జొకోవిచ్... గురువారం జరిగిన రెండో రౌండ్లో అలవోకగా గెలిచాడు. 1 గంటా 47 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో జొకోవిచ్ 6–3, 6–2, 6–0తో డేనియల్ ఇవాన్స్ (బ్రిటన్)పై గెలుపొందాడు. 11 ఏస్లు కొట్టిన జొకోవిచ్ రెండు డబుల్ ఫాల్ట్లు చేశాడు. 26 సార్లు నెట్ వద్దకు దూసుకొచ్చి 23 సార్లు పాయింట్లు గెలిచాడు. తన సర్వీస్ను ఒక్కసారి కూడా చేజార్చుకోని జొకోవిచ్ ప్రత్యర్థి సర్వీస్స్ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. -
భారత్కు రానున్న పాకిస్తాన్ జట్టు..!
ఇటీవల జరిగిన తీవ్ర పరిణామాల (పహల్గాం ఉగ్రదాడి, బదులుగా భారత్ ఆపరేషన్ సిందూర్) తర్వాత భారత్, పాక్ల మధ్య అన్ని విషయాల్లో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. క్రీడలకు సంబంధించి కూడా ఇదే పరిస్థితి. పాక్తో ఏ క్రీడలో అయినా తలపడేందుకు భారత్ నిరాసక్తత వ్యక్తం చేస్తుంది.అయితే తాజాగా జరుగుతున్న ఓ ప్రచారం భారత క్రీడాభిమానులకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆసియా కప్, జూనియర్ వరల్డ్కప్ టోర్నీల్లో పాల్గొనేందుకు పాకిస్తాన్ హాకీ జట్లు భారత్కు రానున్నాయట. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పాక్ హాకీ జట్లకు అనుమతి కూడా జారీ చేసినట్లు తెలుస్తుంది.వచ్చే నెల (అగస్ట్) 27 నుంచి సెప్టెంబర్ 7 వరకు బీహార్లోని రాజ్గిర్లో ఆసియా కప్ జరుగనుంది. ఈ టోర్నీ కోసం 31 మంది సభ్యుల పాకిస్తాన్ జట్టుకు భారత్కు రానున్నట్లు సమాచారం. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఓ కీలక అధికారి ప్రముఖ క్రీడా వెబ్సైట్ స్పోర్ట్స్స్టార్కు చెప్పాడు. జూనియర్ హాకీ వరల్డ్కప్ నవంబర్ 28 నుంచి డిసెంబర్ 10 వరకు చెన్నై, మధురై నగరాల్లో జరుగనుంది. ఈ టోర్నీలో పాల్గొనేందుకు కూడా పాకిస్తాన్కు అనుమతి లభించినట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే, భారత్, పాకిస్తాన్ త్వరలో క్రికెట్ ఆసియా కప్లో కూడా తలపడాల్సి ఉంది. అయితే, ఈ విషయంపై బీసీసీఐ ఇప్పటివరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖను సంప్రదించలేదు. ఈ టోర్నీపై ఎలాంటి అధికారిక సమాచారమూ లేదు. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది క్రికెట్ ఆసియా కప్ సెప్టెంబర్ 5 నుంచి 21వ తేదీ వరకు యూఏఈలో జరగాల్సి ఉంది. ఈ టోర్నీ టీ20 ఫార్మాట్లో జరుగనుంది. భారత్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో టోర్నీ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. -
భావోద్వేగంతో వీడ్కోలు పలికిన రొనాల్డో.. పోస్ట్ వైరల్
లివర్పూల్ ఫుట్బాల్ స్టార్ డియోగో జోటా (Diogo Jota) జీవితం అర్ధంతరంగా ముగిసిపోయింది. 28 ఏళ్లకే ఈ పోర్చుగల్ ఫుట్బాలర్కు నూరేళ్లూ నిండాయి. స్పెయిన్లో జరిగిన ఘోర ర కారు ప్రమాదం అతడిని బలిగొంది. ఈ దుర్ఘటనలో జోటాతో పాటు అతడి తమ్ముడు ఆండ్రీ సిల్వా (25) కూడా మృత్యువాత పడ్డాడు.కాగా ఆండ్రీ కూడా అన్న మాదిరే ప్రొఫెషనల్ ఫుట్బాల్ ప్లేయర్. వీరిద్దరి దుర్మరణంతో ఫుట్బాల్ ప్రపంచంలో తీవ్ర విషాదం నెలకొంది. ముఖ్యంగా పెళ్లైన పదిరోజులకే జోటా ఈ లోకాన్ని విడిచి శాశ్వతంగా వెళ్లిపోవడం.. అతడి భార్య రూటే కార్డొసోకు తీరని శోకాన్ని మిగిల్చింది. మర్చిపోలేని రోజుఇక చనిపోవడానికి కొన్ని గంటల ముందే జోటా.. తమ పెళ్లి వీడియోను షేర్ చేశాడు. ‘ఇది జీవితంలో మర్చిపోలేని రోజు’ అంటూ తన లవ్ లైఫ్లోని మధుర క్షణాలను అభిమానులతో పంచుకున్నాడు. వధూవరులుగా మారిన చిరకాల స్నేహితులు అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలో ఉంగరాలు మార్చుకుని వివాహ బంధంతో ఒక్కటైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ఈ వీడియోను చూసిన జోటా అభిమానులు తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు. ‘‘మీ ప్రేమను చూసి చూసి విధికి కన్నుకుట్టింది. వి మిస్ యూ’’ అంటూ జోటాకు సంతాపం తెలుపుతున్నారు. కాగా పది రోజుల క్రితమే.. తన చిన్ననాటి స్నేహితురాలు రూటేను జోటా పెళ్లి చేసుకున్నాడు. జోటాకు ఇప్పటికే ముగ్గురు పిల్లలు సంతానం. View this post on Instagram A post shared by Diogo Jota (@diogoj_18) రొనాల్డో భావోద్వేగంపోర్చుగల్ దిగ్గజ ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) సహచర ఆటగాడు జోటా దుర్మరణం పట్ల తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశాడు. ‘‘అసలు ఇది నిజమేనా?!.. ఇలాంటిది ఒకటి జరిగిందా?.. మనం ఇప్పుడే కదా జాతీయ జట్టులో కలిసి ఆడటం మొదలుపెట్టాము.మొన్ననే కదా నువ్వు పెళ్లి చేసుకున్నావు. నీ భార్య, పిల్లలు, కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నా. నువ్వు ఎల్లప్పుడూ వాళ్లతోనే ఉంటావని నాకు తెలుసు. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. డియోగో, ఆండ్రీ.. మీ ఇద్దరిని మేము చాలా మిస్సవుతాము’’ అంటూ రొనాల్డో భావోద్వేగపూరిత నోట్ షేర్ చేశాడు. డియోగో జోటా ఫొటో షేర్ చేస్తూ రొనాల్డో పెట్టిన ఈ పోస్టు కూడా పదికి పైగా మిలియన్ల వ్యూస్తో వైరల్గా మారింది.లివర్పూల్ తరఫున ఐదు టైటిళ్లులివర్పూల్ ఫుట్బాల్ క్లబ్ తరఫున డియోగో జోటా ప్రీమియర్ లీగ్తో పాటు రెండు నేషన్స్ లీగ్ టైటిళ్లు.. అదే విధంగా.. రెండు ఈఎఫ్ఎల్ టైటిళ్లూ గెలిచాడు. కాగా తమ స్టార్ ప్లేయర్ మృతి పట్ల లివర్పూల్ ఎఫ్సీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. డియోగో, ఆండ్రీ మరణం తమను తీవ్రంగా కలచివేసిందని.. ఇలాంటి క్లిష్ట సమయంలో వారి కుటుంబం ధైర్యంగా ఉండాలంటూ సంతాపం ప్రకటించింది. వారికి తాము ఎల్లవేళలా అండగా ఉంటామని తెలిపింది. View this post on Instagram A post shared by Cristiano Ronaldo (@cristiano) -
పెళ్లైన పదిరోజులకే ఫుట్బాల్ స్టార్ దుర్మరణం
లివర్పూల్ ఫుట్బాలర్, పోర్చుగీస్కు చెందిన డియోగో జోటా (Diogo Jota) దుర్మరణం చెందాడు. అతడు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడంతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్పెయిన్లోని జమోరా ప్రావిన్స్లో గురువారం ఈ ప్రమాదం జరిగింది. ఈ మేరకు స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి.కాగా ప్రమాద సమయంలో జోటాతో పాటు అతడి సోదరుడు ఆండ్రీ కూడా కారులోనే ఉన్నాడు. అతడు కూడా ప్రొఫెషనల్ ఫుట్బాలరే!.. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. కారు రోడ్డును ఢీకొట్టిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో అందులోని వారు సజీవ దహనం అయ్యారని తెలుస్తోంది.కాగా 28 ఏళ్ల జోటా పదిరోజుల క్రితమే పెళ్లి బంధంలో అడుగుపెట్టాడు. తన చిరకాల ప్రేయసి, జీవిత భాగస్వామి అయిన రూటే కార్డెసోను వివాహమాడాడు. ఇంతలోనే అతడు ప్రాణాలు కోల్పోవడం విషాదం. కాగా జోటాకు భార్య రూటేతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇక ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.కీలక విజయాల్లో పాత్రపోర్టోలో జన్మించిన జోటా.. 2016లో అట్లెటికో మాడ్రిడ్ క్లబ్లో చేరాడు. ఆ తర్వాత ప్రీమియర్ లీగ్, వోల్వర్హాంప్టన్ వాండరర్స్ తరఫున సత్తా చాటిన జోటా.. లివర్పూల్తో జట్టు కట్టిన తర్వాత తన కెరీర్లో ఉన్నత శిఖరాలకు చేరుకున్నాడు. జర్గన్ క్లాప్ నాయకత్వంలో ఎఫ్ఏ కప్, లీగ్ కప్ టైటిల్స్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే లివర్పూల్ అటాకింగ్ విభాగంలో ప్రధాన ఆటగాడిగా ఎదిగాడు. ఇక 2024-25 సీజన్లో లివర్పూల్ ప్రీమియర్ లీగ్ గెలవడంలోనూ జోటాది కీలక పాత్ర. ఇక పోర్చుగల్ జట్టు తరఫున కూడా అతడు రాణించాడు.రొనాల్డో సంతాపంజోటా మృతిపై పోర్చుగల్ దిగ్గజ ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో స్పందించాడు. నువ్వులేని లోటు ఎవరూ తీర్చలేరని.. నీ భార్యా, పిల్లలు, కుటుంబానికి ఆ దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. మరోవైపు.. లివర్పూల్ ఫుట్బాల్ క్లబ్ జోటా మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ విషాదకర విషయాన్ని నమ్మలేకపోతున్నామంటూ సంతాపం వ్యక్తం చేసింది.చదవండి: ఇకపై మళ్లీ ఆడగలనా? -
భారత్ జైత్రయాత్ర
చియాంగ్ మాయ్ (థాయ్లాండ్): ఆసియా కప్–2026 మహిళల ఫుట్బాల్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత జట్టు ‘హ్యాట్రిక్’ నమోదు చేసుకుంది. గత రెండు మ్యాచ్ల్లో అద్వితీయ విజయాలు సాధించిన భారత్... బుధవారం మూడో మ్యాచ్లో 5–0 గోల్స్ తేడాతో ఇరాక్ను చిత్తుచేసింది. మ్యాచ్ ఆరంభం నుంచే సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన టీమిండియా... ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగింది. భారత్ తరఫున సంగీత (14వ నిమిషంలో), మనీషా (44వ నిమిషంలో), కార్తీక అంగముత్తు (48వ నిమిషంలో), నిర్మలా దేవి (64వ నిమిషంలో), రతన్బాలా దేవి (80వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. ఓవరాల్గా ఈ టోర్నీలో మూడు మ్యాచ్లు ఆడిన భారత జట్టు... 22 గోల్స్ సాధించి ప్రత్యర్థికి ఒక్కటి కూడా ఇవ్వకపోవడం విశేషం. తొలి మ్యాచ్లో 13–0 గోల్స్ తేడాతో మంగోలియాను చిత్తుచేసిన టీమిండియా... తిమోర్ లెస్టెపై 4–0 గోల్స్ తేడాతో నెగ్గింది. తాజా పోరులో సంగీత గోల్తో ఖాతా తెరిచిన భారత్... మనీషా గోల్తో ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది. ప్రత్యర్థి నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురుకాకపోవడంతో తొలి అర్ధభాగం ముగిసేసరికి భారత్ 2–0తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్ధంలోనూ అదే జోరు కొనసాగిస్తూ మరో మూడు గోల్స్ కొట్టి మ్యాచ్ను ఏకపక్షం చేసింది. గాయం కారణంగా తెలంగాణ అమ్మాయి గుగులోత్ సౌమ్య ఈ మ్యాచ్కు అందుబాటులో లేకపోగా... మరింత ఆధిక్యం సాధించే పలు అవకాశాలను మన ప్లేయర్లు సది్వనియోగం చేసుకోలేకపోయారు. గ్రూప్ ‘బి’లో భాగంగా ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ గెలిచిన భారత్ 9 పాయింట్లతో పట్టిక అగ్రస్థానంలో ఉండగా... బుధవారమే జరిగిన మరో మ్యాచ్లో 11–0 గోల్స్ తేడాతో మంగోలియాపై గెలిచిన థాయ్లాండ్ కూడా 9 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. థాయ్లాండ్ కూడా టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ గెలవగా... ఓవరాల్గా 22 గోల్సే చేసిన థాయ్లాండ్ అచ్చం టీమిండియా లాగే ప్రత్యర్థికి ఒక్క గోల్ కూడా ఇవ్వలేదు. గ్రూప్ నుంచి ఒక్క జట్టే ముందంజ వేసే అవకాశం ఉండటంతో... ఇరు జట్ల మధ్య శనివారం జరిగే ఆఖరి గ్రూప్ మ్యాచ్కు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. చివరిసారి భారత జట్టు 2003లో ఆసియా కప్ ప్రధాన టోర్నీలో ఆడింది. ఆ తర్వాత భారత జట్టు ఈ టోర్నీకి అర్హత సాధించలేకపోయింది. -
కోకో గాఫ్కు 'షాక్'
వింబుల్డన్లో సంచలనాల మోత! ఇటీవల ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకొచ్చిన కోకో గాఫ్, గత వారం జర్మనీలో ఇగా స్వియాటెక్ను ఓడించి టైటిల్తో ఈ గ్రాస్కోర్టులోకి దిగిన పెగూలా, రెండుసార్లు వింబుల్డన్ చాంపియన్ క్విటొవా, ఈ ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనలిస్ట్ లోరెంజో ముసెట్టి, మూడు గ్రాండ్స్లామ్ టోర్నీల రన్నరప్ అలెగ్జాండర్ జ్వెరెవ్, మెద్వెదెవ్, రూనె, ఐదోసీడ్ జెంగ్ క్విన్వెన్, 15వ సీడ్ కరోలినా ముకొవా... ఇలా టాప్ స్టార్లకు ఈ వింబుల్డన్ చేదు ఫలితాలనిచ్చింది. పెద్ద సంఖ్యలో సీడెడ్ ప్లేయర్లు మోయలేని భారంతో తొలి రౌండ్లోనే నిష్క్రమించేలా చేసింది. లండన్: గ్రాస్కోర్టు గ్రాండ్స్లామ్ టోర్నీ వింబుల్డన్ ఈ సారి మూడు రోజులకే వెలవెలబోతోంది. పలువురు మేటి స్టార్లంతా ఈ కోర్టులో తొలి రౌండ్లోనే ఆఖరి మ్యాచ్ ఆడేసి వెళ్లిపోయారు. మిగిలిన కొద్దిమందిలో ఇంకెంత మంది కనీసం ప్రిక్వార్టర్స్ వరకైనా చేరతారో తెలియని పరిస్థితి. సంచలన ఫలితాలతో పురుషులు, మహిళల సింగిల్స్లో ఒకరో ఇద్దరో కాదు... ఏకంగా 23 మంది సీడెడ్ స్టార్లు తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. మహిళల సింగిల్స్లో 10 మంది, పురుషుల సింగిల్స్లో 13 మంది స్టార్లు... 2001 నుంచి టాప్–32 సీడింగ్స్ను గుర్తించాక ఇంత మంది సీడెడ్లు తొలి రౌండ్లోనే కంగుతినడం మొత్తం గ్రాండ్స్లామ్ల చరిత్రలోనే మొదటిసారి! ఫ్రెంచ్ ఓపెన్ తాజా చాంపియన్, అమెరికన్ స్టార్ కోకో గాఫ్ కథ తొలిరౌండ్లోనే అది కూడా క్వాలిఫయర్ చేతిలో ముగిసింది. రెండు వింబుల్డన్ టైటిళ్ల విజేత పెట్రా క్విటోవా మొదటి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. పురుషుల సింగిల్స్లో 25వ గ్రాండ్స్లామ్ టైటిల్ కోసం విక్రమార్క పోరాటం చేస్తున్న సెర్బియన్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్తో పాటు ప్రపంచ నంబర్వన్ యానిక్ సినెర్ శుభారంభం చేశారు. మూడో రౌండ్లో సబలెంక, అల్కరాజ్ మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో బెలారస్ స్టార్, టాప్ సీడ్ సబలెంక 7–6 (7/4), 6–4తో మేరి బౌజ్కొవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచింది. ఈ సీజన్లో రెండు గ్రాండ్స్లామ్ (ఆ్రస్టేలియా, ఫ్రెంచ్) టోర్నీల్లోనూ రన్నరప్గా నిలిచిన సబలెంకకు తొలిసెట్లో అన్సీడెడ్ ప్లేయర్ గట్టి పోటీ ఇచ్చినా టైబ్రేకర్తో గెలుపుబాట పట్టింది. మరో పోరులో ఆరో సీడ్ మాడిసన్ కీస్ 6–4, 6–2తో ఓల్గా డానిలోవిచ్ (సెర్బియా)పై వరుస సెట్లలో విజయం సాధించింది. పురుషుల సింగిల్స్లో వింబుల్డన్ (2023, 2024) ‘హ్యాట్రిక్’పై కన్నేసిన కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) సునాయాస విజయంతో మూడో రౌండ్లోకి దూసుకెళ్లాడు. ఇటీవల ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన రెండో సీడ్ స్పెయిన్ స్టార్ 6–1, 6–4, 6–4తో బ్రిటన్ ప్లేయర్ టార్వెట్ను ఓడించాడు. రెండోరౌండ్లో 12వ సీడ్ ఫ్రాన్సిస్ టియాఫె (అమెరికా)కు చుక్కెదురైంది. గత యూఎస్ ఓపెన్ సెమీఫైనలిస్ట్ టియాఫె 6–4, 4–6, 3–6, 5–7తో కామెరూన్ నోరి (బ్రిటన్) చేతిలో కంగుతిన్నాడు. 14వ సీడ్ రుబ్లెవ్ 6–7 (1/7), 6–4, 7–6 (7/5), 6–3తో లాయిడ్ హారిస్ (దక్షిణాఫ్రికా)పై గెలుపొందాడు. డయానా సంచలనం ఉక్రెయిన్ ప్లేయర్ డయానా యస్త్రెంస్కా లండన్లో టైటిల్ గెలవకుండానే పతాక శీర్షికల్లో నిలిచింది. 2018 నుంచి గ్రాండ్స్లామ్ బరిలో దిగుతున్నప్పటికీ ఏనాడూ సాధ్యమవని విజయాన్ని ఈ వింబుల్డన్ తొలి రౌండ్లోనే సాకారం చేసుకుంది. పారిస్ మట్టికోర్టులో (ఫ్రెంచ్ ఓపెన్)లో మహారాణిగా నిలిచిన అమెరికన్ స్టార్, రెండో సీడ్ కోకో గాఫ్కు కనీవినీ ఎరుగని షాక్ ఇచ్చింది. ఉక్రెయిన్ అనామక ప్లేయర్ను సులువుగానే ఓడిస్తుందనుకున్న ప్రపంచ రెండో ర్యాంకర్ గాఫ్ 6–7 (3/7), 1–6తో 42వ ర్యాంకర్ డయానా య్రస్తెంస్కా చేతిలో ఘోర పరాభవానికి గురైంది.ప్రపంచ నాలుగో ర్యాంకర్ పోలండ్ స్టార్ ఇగా స్వియాటెక్ తొలి రౌండ్ను వరుస సెట్లలోనే గెలిచింది. రష్యన్ ప్రత్యర్థి నుంచి తొలిసెట్లో ప్రతిఘటన ఎదురైనప్పటికీ ఐదు గ్రాండ్స్లామ్ టైటిళ్ల చాంపియన్ అయిన స్వియాటెక్ 7–5, 6–1తో పొలినా కుడెర్మటోవాపై గెలుపొందింది. 17వ సీడ్ బార్బర క్రెజ్సికొవా (చెక్ రిపబ్లిక్) 3–6, 6–2, 6–1తో అలెగ్జాండ్రా ఎలా (ఫిలిప్పీన్స్)పై నెగ్గింది. ఇంతేనా... మిగిలింది! చెప్పుకోదగ్గ స్టార్లు, కనీసం సెమీఫైనల్ గ్యారంటీ అనుకున్న ప్లేయర్లు సైతం ఆదిలోనే కంగు తినడంతో ఇక మిగిలింది కొందరే! నంబర్వన్ సబలెంక, మూడో టైటిల్పై కన్నేసిన డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్, 2023 వింబుల్డన్ చాంపియన్ మార్కెటా వొండ్రుసొవా, 2021 యూఎస్ ఓపెన్ చాంపియన్ ఎమ్మా రాడుకాను, పదో సీడ్ ఎమ్మా నవారో, యానిక్ సినెర్, రజతోత్సవ టైటిల్పై కన్నేసిన జొకోవిచ్ తదితర స్టార్లే మిగిలారు. అయితే ఇంతటి సంచలనాల పర్వంలో ఇక వీరిలో ఎవరెవరు క్వార్టర్స్ దాటుతారనేది ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. రెండో రౌండ్లోకి యూకీ జోడీ పురుషుల డబుల్స్లో భారత ఆటగాడు యూకీ బాంబ్రీ తన అమెరికన్ భాగస్వామితో కలిసి శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన తొలిరౌండ్లో 16వ సీడ్ యూకీ–రాబర్ట్ గాలొవే ద్వయం 7–6 (10/8), 6–4తో అర్నియోడో (మొనాకో)–గినార్డ్ (ఫ్రాన్స్) జంటపై గెలిచింది. రిత్విక్ బొల్లిపల్లి–బారియెంటోస్ (కొలంబియా) జోడీ 4–6, 6–4, 7–6 (13/11)తో గాఫిన్ (బెల్జియం)–ముల్లర్ (ఫ్రాన్స్) జంటపై గెలిచింది. వెటరన్ స్టార్ రోహన్ బోపన్న ద్వయంకు తొలిరౌండ్లోనే చుక్కెదురైంది. బోపన్న–సాండర్ గిల్లీ (బెల్జియం) జోడీ 3–6, 4–6తో మూడో సీడ్ క్రావిట్జ్ (జర్మనీ)–ప్యూట్జ్ (జర్మనీ) జంట చేతిలో ఓడింది. జొకోవిచ్ కష్టపడి... బిగ్–3లో కెరీర్ను కొనసాగిస్తున్న సెర్బియన్ దిగ్గజం జొకోవిచ్ రెండో సెట్లో ప్రత్యర్థి నుంచి సవాళ్లు ఎదురైనా అనుభవంతో అధిగమించాడు. ఆరో సీడ్ జొకో 6–1, 6–7 (7/9), 6–2, 6–2తో ముల్లర్ (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. తొలిరౌండ్లో మూడు గంటలకు పైగానే కోర్టులో శ్రమించి టోర్నీలో శుభారంభం చేశాడు. ప్రపంచ నంబర్వన్ యానిక్ సినెర్ (ఇటలీ) మాత్రం అలవోక విజయంతో ముందంజ వేశాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్, ఫ్రెంచ్ రన్నరప్ సినెర్ 6–4, 6–3, 6–0తో తన దేశ సహచరుడు ల్యూకా నార్డిని ఓడించగా... నాలుగో సీడ్ డ్రాపర్ (బ్రిటన్) 6–2, 6–2, 2–1తో ఆధిక్యంలో ఉండగా ప్రత్యర్థి బేజ్ (అర్జెంటీనా) రిటైర్డ్హర్ట్గా వెనుదిరిగాడు. గత యూఎస్ ఓపెన్ రన్నరప్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) 6–7 (6/8), 6–7 (8/10), 6–4, 7–6 (8/6), 6–4తో పెరికార్డ్ (ఫ్రాన్స్)పై ఐదు సెట్ల పోరాటం చేసి గట్టెక్కాడు. -
Neeraj Chopra Classic 2025: మరో స్టార్ అవుట్
బెంగళూరు: భారత్లో జరగనున్న తొలి అంతర్జాతీయ జావెలిన్ త్రో ఈవెంట్... ‘నీరజ్ చోప్రా క్లాసిక్’ నుంచి ప్రపంచ చాంపియన్ అండర్సన్ పీటర్స్ (గ్రెనడా) వైదొలిగాడు. మడమ గాయం కారణంగా 27 ఏళ్ల పీటర్స్ ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీ నుంచి తప్పుకొన్నాడు. ఇప్పటికే పలువురు జావెలిన్ త్రోయర్లు ఈ ఈవెంట్కు దూరం కాగా... ఇప్పుడు ఆ జాబితాలో పీటర్స్ కూడా చేరాడు. ఇక 2024 పారిస్ ఒలింపిక్స్లో కాంస్య పతకం నెగ్గిన పీటర్స్ స్థానాన్ని పోలాండ్కు చెందిన సిప్రియన్ మ్రిగ్లాడ్ భర్తీ చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.‘పీటర్స్ గాయం కారణంగా ‘నీరజ్ చోప్రా క్లాసిక్’ ఈవెంట్కు దూరమయ్యాడు. అతడి స్థానాన్ని పోలాండ్కు చెందిన అథ్లెట్ సిప్రియన్ భర్తీ చేస్తాడు’ అని వెల్లడించారు. అండర్ 23 యూరోపియన్ మాజీ చాంపియన్ అయిన సిప్రియన్ అత్యుత్తమ ప్రదర్శన 84.97 మీటర్లు. శనివారం బెంగళూరు వేదికగా జరగనున్న నీరజ్ చోప్రా క్లాసిక్ ఈవెంట్కు అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య ‘ఎ’ కేటగిరీ గుర్తింపునిచ్చింది.మొత్తం 12 మంది జావెలిన్ త్రోయర్లు పాల్గొంటున్న ఈ ఈవెంట్లో భారత్ నుంచి ఐదుగురు అథ్లెట్లు పోటీలో ఉన్నారు. అయితే వేర్వేరు కారణాల వల్ల ఇప్పటికే ముగ్గురు ప్లేయర్లు టోర్నీకి దూరం కాగా... వారి స్థానాల్లో ఇతరులను ఎంపిక చేశారు. భారత త్రోయర్ కిషోర్ జెనా గాయం కారణంగా ఈ ఈవెంట్కు దూరం కావడంతో అతడి స్థానంలో యశ్వీర్సింగ్ బరిలోకి దిగనున్నాడు. జెన్కీ డీన్ (జపాన్) స్థానాన్ని మార్టిన్ కొనెస్నీ (పోలాండ్)తో భర్తీ చేశారు.ఈ టోర్నీలో నీరజ్ చోప్రాతో పాటు అంతర్జాతీయ స్టార్లు జూలియస్ యెగో (కెన్యా), థామస్ రహ్లెర్ (జర్మనీ), సిప్రియన్ మ్రిగ్లాడ్, మార్టిన్ కొనెస్నీ, కర్టీస్ థాంప్సన్ (అమెరికా), లూయిస్ మౌరిసియో డా సిల్వా (బ్రెజిల్), రమేశ్ పతిరగె (శ్రీలంక) పాల్గొననున్నారు. భారత్ నుంచి నీరజ్తోపాటు సచిన్ యాదవ్, రోహిత్ యాదవ్, సాహిల్, యశ్వీర్ సింగ్ బరిలోకి దిగనున్నారు. -
దుబాయ్లో ప్రపంచ కబడ్డీ లీగ్
న్యూఢిల్లీ: మనదేశంలో విశేషాదరణ చూరగొన్న ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) త్వరలో విశ్వవ్యాప్తంగా కూత పెట్టేందుకు ముస్తాబైంది. ప్రపంచ సూపర్ కబడ్డీ లీగ్ (డబ్ల్యూఎస్కేఎల్)కు వచ్చే ఏడాది నుంచి శ్రీకారం చుట్టనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ప్రారంభ ప్రపంచ లీగ్ దుబాయ్లో వచ్చే ఫిబ్రవరి, మార్చి నెలలో నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అంతర్జాతీయ కబడ్డీ సమాఖ్య (ఐకేఎఫ్) భాగస్వామ్యంతో ఫ్రాంచైజీ లీగ్ నిర్వహిస్తామని డబ్ల్యూఎస్కేఎల్ వర్గాలు తెలిపాయి.మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీల్లో పటిష్టమైన భారత బలగం ప్రధాన భూమిక పోషించనుంది. ‘ఒక్క భారత్లోనే కాదు... ప్రపంచస్థాయిలోనే కబడ్డీ క్రీడా ఎంతో ఎదిగింది. అంతర్జాతీయ క్రీడల్లో మన గ్రామీణ ఆట ప్రముఖ స్థానం సంపాదించుకుంది. పీకేఎల్ ద్వారా దేశంలో సంపాదించుకున్న అభిమాన దళాన్ని ఇక మీదట ప్రపంచ వ్యాప్తంగా సంపాదించుకునేందుకు వరల్డ్ సూపర్ కబడ్డీ లీగ్ దోహదం చేస్తుంది.తద్వారా భవిష్యత్తులో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) గుర్తింపు కూడా పొందాలన్నదే మా ప్రధాన లక్ష్యం’ అని ఎస్జే కబడ్డీ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు శాంభవ్ జైన్ తెలిపారు. ఈ సంస్థ ఆధ్వర్యంలోనే డబ్ల్యూఎస్కేఎల్ టోర్నీ జరగనుంది. అంతర్జాతీయ కబడ్డీలో రాణిస్తున్న దక్షిణ కొరియా, ఇరాన్, థాయ్లాండ్, పాకిస్తాన్, మలేసియా, జపాన్, కెనడా, అమెరికా దేశాల కబడ్డీ సమాఖ్యలు ఈ లీగ్పై ఆసక్తి కనబరుస్తున్నాయని ఆయన చెప్పారు. ఒక్కో ఫ్రాంచైజీ ఆటగాళ్ల కొనుగోలు కోసం రూ. 48 కోట్ల పర్సు కలిగి ఉంటుంది. ముందుగా ఎనిమిది ఫ్రాంచైజీల ఎంపిక అనంతరం పూర్తిస్థాయి వివరాలు వెల్లడవుతాయని ఆయన పేర్కొన్నారు. -
సంజయ్ సారథ్యంలో...
న్యూఢిల్లీ: ప్రొ హాకీ లీగ్ యూరప్ అంచె పోటీల్లో భారత జట్టు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో... హాకీ ఇండియా (హెచ్ఐ) దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. యువ ఆటగాళ్లకు యూరప్లో మ్యాచ్ ప్రాక్టీస్ దక్కాలనే ఉద్దేశంతో... భారత ‘ఎ’ జట్టును యూరప్ పర్యటనకు పంపుతోంది. దీని కోసం మంగళవారం 20 మంది యువ ఆటగాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఈ పర్యటనలో భాగంగా ఈ నెల 8 నుంచి 20 మధ్య ఫ్రాన్స్, ఐర్లాండ్, నెదర్లాండ్స్ జట్లతో రెండేసి మ్యాచ్లు ఆడనున్న భారత ‘ఎ’ జట్టు... ఇంగ్లండ్, బెల్జియంతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ‘నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఈ టూర్ ఉపయోగపడుతుంది. ప్రతిభగల ప్లేయర్లను గుర్తించడంతో పాటు వారికి అంతర్జాతీయ స్థాయి మ్యాచ్ పరిస్థితులు కలి్పంచేందుకు ఇది తోడ్పడుతుంది’అని హాకీ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. భారత ‘ఎ’ జట్టుకు సంజయ్ సారథ్యం వహిస్తుండగా... రబిచంద్రసింగ్ వైస్ కెపె్టన్గా వ్యవహరించనున్నాడు. భారత జాతీయ జట్టుకు సహాయక కోచ్గా పనిచేస్తున్న శివేంద్ర సింగ్... ఈ టీమ్కు కోచ్గా వ్యవహరిస్తున్నాడు. ‘యూరప్ ఆటగాళ్ల శైలిని అర్థం చేసుకునేందుకు మన యువ ఆటగాళ్లకు ఈ పర్యటన ఎంతగానో ఉపయోగపడుతుంది. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడానికి ముందే అంతర్జాతీయ అనుభవం గడించడం ఆటగాళ్లకు ఎంతో తోడ్పడుతుంది’ అని శివేంద్ర సింగ్ అన్నాడు. దీంతో జాతీయ జట్టు భవిష్యత్తుకు భరోసా పెరుగుతుందని వెల్లడించాడు. భారత ‘ఎ’ హాకీ జట్టు: గోల్ కీపర్స్: పవన్, మోహిత్. డిఫెండర్స్: ప్రతాప్ లాక్రా, వరుణ్ కుమార్, అమన్దీప్ లాక్రా, ప్రమోద్, సంజయ్ (కెప్టెన్). మిడ్ఫీల్డర్స్: పూవన్న చందూర బాబీ, మొహమ్మద్ రాహిల్, రబిచంద్ర సింగ్, విష్ణుకాంత్ సింగ్, ప్రదీప్ సింగ్, రాజిందర్ సింగ్. ఫార్వర్డ్స్: అంగద్బీర్ సింగ్, బాబీ సింగ్ ధామి, మణీందర్ సింగ్, వెంకటేశ్ కెంచె, ఆదిత్య అర్జున్ లాథె, సెల్వమ్ కార్తీ, ఉత్తమ్ సింగ్. స్టాండ్బై: అంకిత్ (గోల్కీపర్), సునీల్ (డిఫెండర్), సుదీప్ (ఫార్వర్డ్). -
భారత సంతతి ఆటగాళ్లకు అవకాశం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రీడల్లో భారత్ను మరింత ఉన్నత స్థితికి చేర్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త క్రీడా విధానానికి ఆమోద ముద్ర పడింది. ‘ఖేలో భారత్ నీతి’ పేరుతో తయారు చేసిన ఈ పాలసీని తాజా కేబినెట్ సమావేశంలో ఆమోదించారు. క్రీడల్లో ప్రపంచ టాప్–5లో నిలిచేందుకు అవసరమైన రోడ్ మ్యాప్తో ఇది సిద్ధమైందని ప్రభుత్వం ప్రకటించింది. భారత్లో తొలిసారి 1984లో క్రీడా పాలసీ అమల్లోకి వచి్చంది. ఆ తర్వాత 2001లో దీనికి మార్పులు చేశారు. అప్పటి నుంచి అదే విధానం కొనసాగుతుండగా.. 2001లో పాలసీని సవరిస్తూ కొత్త అంశాలు చేర్చారు. విశ్వ వేదికపై చక్కటి ప్రదర్శన, ఆరి్థకాభివృద్ధికి క్రీడలు, సామాజిక వృద్ధికి క్రీడలు, ప్రజల్లో క్రీడల ద్వారా చైతన్యం, జాతీయ విద్యావిధానంతో కలిసి క్రీడాభివృద్ధి అనే ఐదు అంశాలతో ‘ఖేలో భారత్ నీతి’ని ముందుకు తీసుకొచ్చామని, ఇది కొత్త మార్పుకు శ్రీకారం అవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. మరోవైపు భారత సంతతికి చెంది విదేశాల్లో స్థిరపడిన ఆటగాళ్లు కూడా ఇకపై భారత్కు ప్రాతినిధ్యం వహించేందుకు మార్గం సుగమమైంది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం భారతీయ పాస్పోర్ట్ ఉన్నవారే దేశం తరఫున ఆడేందుకు అవకాశం ఉంది. భారత ఆటగాళ్లకే ఎక్కువ అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో 2008లో ఈ నిబంధనను తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో విదేశాల్లో ఉంటున్న ఏ ప్లేయర్ అయినా భారత్ తరఫున ఆడితే అతనికి వ్యక్తిగతంగా ఉపకరించడంతో పాటు ఇక్కడి వర్ధమాన, యువ ఆటగాళ్లకు కూడా సరైన మార్గనిర్దేశనం లభిస్తుందని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఇకపై విదేశాల్లో స్థిరపడినా, అక్కడే శిక్షణ పొందుతున్నా... టోరీ్నల్లో మాత్రం మన దేశం తరఫున బరిలోకి దిగవచ్చు. ఉదాహరణకు టెన్నిస్లో దిగ్గజ ఆటగాడు ఆనంద్ అమృత్రాజ్ కుమారుడు ప్రకాశ్ అమృత్రాజ్కు అమెరికా పౌరసత్వం ఉంది. అతను 2003–08 మధ్య డేవిస్కప్లో భారత్కు ప్రాతినిధ్యం వహించినా ... ఆ తర్వాత తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అతను మళ్లీ సొంత దేశం తరఫున ఆడేందుకు అవకాశం ఉంది. -
హ్యాట్రిక్పై భారత్ గురి
చియాంగ్ మాయ్ (థాయ్లాండ్): ఆసియా కప్–2026 మహిళల ఫుట్బాల్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత జట్టు ‘హ్యాట్రిక్’పై కన్నేసింది. గత రెండు మ్యాచ్ల్లో అద్వితీయ విజయాలు సాధించిన భారత్... బుధవారం మూడో మ్యాచ్లో ఇరాక్తో పోటీపడనుంది. గ్రూప్ ‘బి’లో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన టీమిండియా ప్రస్తుతం 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. తెలంగాణ ప్లేయర్ గుగులోత్ సౌమ్య గాయం కారణంగా ఈ మ్యాచ్కు దూరమైంది. తిమోర్ లెస్టెతో జరిగిన గత పోరులో సౌమ్య ముక్కుకు బలమైన గాయమైంది. తొలి మ్యాచ్లో మంగోలియాపై 13–0 గోల్స్ తేడాతో గెలిచిన మన అమ్మాయిలు... రెండో మ్యాచ్లో తిమోర్ లెస్టెపై 4–0 గోల్స్తో నెగ్గారు. ఈ మ్యాచ్లో కూడా అదే జోరు కొనసాగిస్తూ మరో భారీ విజయం ఖాతాలో వేసుకోవాలని కృతనిశ్చయంతో ఉన్నారు. గ్రూప్లో భాగంగా శనివారం ఆతిథ్య థాయ్లాండ్తో భారత్ చివరి గ్రూప్ మ్యాచ్ ఆడనుంది. అంతకుముందే అగ్రస్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవడమే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగనుంది. ‘థాయ్లాండ్తో చివరి మ్యాచ్ ఆడనున్నాం. అయితే ప్రస్తుతానికి మా దృష్టి ఇరాక్తో పోరుపైనే ఉంది. మంగోలియాపై థాయ్లాండ్ ఎన్ని గోల్స్ సాధిస్తుంది... మేము ఇరాక్పై ఎన్ని సాధించాలనే లెక్కలు పక్కన పెట్టి సానుకూల దృక్పథంతో బరిలోకి దిగుతాం. గత మ్యాచ్ ప్రదర్శనను దృష్టిలో పెట్టుకొని మెరుగవ్వాల్సిన విషయాల్లో మరింత సాధన చేశాం. ఒక్కో ప్లేయర్కు ప్రత్యేక బాధ్యతలు అప్పగించాం. ఇరాక్తో మ్యాచ్ను తేలికగా తీసుకోవడం లేదు. అందరికీ అవకాశం ఇస్తూ... చివరి మ్యాచ్ వరకు తాజాగా ఉంచాలనుకుంటున్నాం. రొటేషన్ పద్ధతిని సరిగ్గా వినియోగించుకుంటాం’ అని భారత కోచ్ క్రిస్పన్ ఛెత్రీ పేర్కొన్నాడు. ఈ టోర్నీ కోసం భారత జట్టు 23 మంది ప్లేయర్లను ఎంపిక చేయగా... గత రెండు మ్యాచ్ల్లో 22 మందికి మ్యాచ్ ఆడే అవకాశం దక్కింది. సరైన సమయంలో ప్లేయర్లకు విశ్రాంతినిస్తూ... సబ్స్టిట్యూట్లను సమర్థవంతంగా వినియోగించుకోవడంతోనే ఇది సాధ్యమైంది. మరోవైపు టోర్నీలో మూడు మ్యాచ్లాడిన ఇరాక్... ఒక విజయం, ఒక ఓటమి, ఒక ‘డ్రా’తో 4 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక మూడో స్థానంలో ఉంది. ప్రపంచ 173వ ర్యాంకర్ ఇరాక్... ఇదే టోర్నీలో తమ తొలి అంతర్జాతీయ విజయం (మంగోలియాపై 5–2 గోల్స్తో) నమోదు చేసుకుంది. -
భారత నంబర్వన్గా ప్రజ్ఞానంద
లుసానే (స్విట్జర్లాండ్): ఈ ఏడాది నిలకడగా రాణిస్తున్న తమిళనాడు చెస్ గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద... ఓపెన్ విభాగంలో భారత కొత్త నంబర్వన్ ప్లేయర్గా అవతరించాడు. ప్రపంచ చెస్ సమాఖ్య (ఫిడే) మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో 19 ఏళ్ల ప్రజ్ఞానంద 2779 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. గతవారం ఉజ్బెకిస్తాన్ రాజధాని తాషె్కంట్లో జరిగిన ఉజ్కప్ చెస్ టోర్నీలో ప్రజ్ఞానంద విజేతగా నిలవడంతో అతని ర్యాంక్ మెరుగైంది. ఇదే టోర్నీలో నాలుగో స్థానంలో నిలిచిన తెలంగాణ గ్రాండ్మాస్టర్, కొన్నాళ్లుగా భారత నంబర్వన్గా ఉన్న ఇరిగేశి అర్జున్ 2776 పాయింట్లతో నాలుగు నుంచి ఐదో ర్యాంక్కు పడిపోయాడు. క్లాసికల్ ఫార్మాట్లో ప్రపంచ చాంపియన్, భారత్కే చెందిన మరో గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ 2776 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నాడు. వెరసి టాప్–6లో ముగ్గురు భారత గ్రాండ్మాస్టర్లు ఉండటం విశేషం. ఓవరాల్గా టాప్–100లో భారత్ నుంచి విశ్వనాథన్ ఆనంద్ (13వ స్థానం), అరవింద్ చిదంబరం (24), విదిత్ సంతోష్ గుజరాతి (26), పెంటేల హరికృష్ణ (30), నిహాల్ సరీన్ (37), రౌనక్ సాధ్వాని (44), మురళీ కార్తికేయన్ (75), అభిమన్యు పురాణిక్ (93) ఉన్నారు. మాగ్నస్ కార్ల్సన్ (నార్వే; 2839 పాయింట్లు) ‘టాప్’ ర్యాంక్లో కొనసాగుతుండగా... హికారు నకముర (అమెరికా; 2807 పాయింట్లు) రెండో స్థానంలో, ఫాబియానో కరువానా (అమెరికా; 2784 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచారు. ఐదో ర్యాంక్లో హంపి మహిళల క్లాసికల్ ఫార్మాట్ ర్యాంకింగ్స్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్, భారత స్టార్ కోనేరు హంపి ఒక స్థానాన్ని మెరుగుపర్చుకుంది. గత నెలలో ఆరో స్థానంలో ఉన్న హంపి తాజా ర్యాంకింగ్స్లో 2536 పాయింట్లతో ఐదో ర్యాంక్కు చేరుకుంది. హైదరాబాద్కు చెందిన గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక కూడా ఒక స్థానం పురోగతి సాధించి 2488 పాయింట్లతో 12వ ర్యాంక్ను అందుకుంది. 2478 పాయింట్లతో వైశాలి 15వ ర్యాంక్లో, 2463 పాయింట్లతో దివ్య దేశ్ముఖ్ 18వ ర్యాంక్లో కొనసాగుతున్నారు. -
నిఖత్ జరీన్కు రజతం
జాతీయ సీనియర్ మహిళల ఎలైట్ బాక్సింగ్ టోర్నీలో భారత స్టార్, తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ (51 కేజీలు) రజత పతకం సాధించింది. హైదరాబాద్లో మంగళవారం ముగిసిన ఈ టోర్నీలో గాయం కారణంగా నిఖత్ ఫైనల్ బౌట్లో బరిలోకి దిగలేదు. దాంతో నిఖత్ ప్రత్యర్థి జ్యోతి (రైల్వేస్) రింగ్లోకి దిగకుండానే స్వర్ణ పతకాన్ని ఖరారు చేసుకుంది. రైల్వేస్ బాక్సర్లు మూడు స్వర్ణాలు, మూడు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం 9 పతకాలను గెల్చుకున్నారు. -
తిరోగమనంలో మన ‘స్టిక్’
సాక్షి క్రీడా విభాగం: భారత పురుషుల హాకీ జట్టు నెల రోజుల క్రితం వరకు కూడా ప్రపంచంలో బలమైన జట్లలో ఒకటిగా కనిపించింది. వరుస విజయాలు, ఫామ్లో చూస్తే సరైన దిశలో నడుస్తున్నట్లుగా, మున్ముందు మరింత మెరుగైన ప్రదర్శనతో దూసుకుపోయే సత్తా ఉన్న టీమ్లా అనిపించింది. ఇదే ఉత్సాహంతో యూరోపియన్ టూర్కు జట్టు సిద్ధమైంది. అయితే నెల రోజులు తిరిగేసరికి పరిస్థితి అంతా మారిపోయింది. ఇంతకాలం ఆశలు రేపిన జట్టు ఇదేనా అన్న తరహాలో ప్రొ లీగ్లో పేలవమైన ఆటను చూపించింది. ఆటగాళ్లతో పాటు కోచ్లు కూడా అంచనాలకు పూర్తి భిన్నంగా విఫల ప్రదర్శనతో వెనుదిరిగారు. పురుషుల జట్టుతో పోలిస్తే భారత మహిళల బృందం మరింత నాసిరకం ఆటను ప్రదర్శించింది. ఎంతో అనుభవం ఉన్నా... లీగ్లో కనీస స్థాయిలో ప్రమాణాలు కూడా చూపించకుండా చతికిల పడింది. మున్ముందు ప్రతిష్టాత్మక ఈవెంట్లు జరగనున్న నేపథ్యంలో ఈ రెండు టీమ్లు ఏమాత్రం పట్టు సాధిస్తాయనేది చూడాలి. మూడు నుంచి ఎనిమిదో స్థానానికి... భువనేశ్వర్లో జరిగిన తొలి అంచె ప్రొ లీగ్ పోటీల్లో 8 మ్యాచ్ల ద్వారా 15 పాయింట్లు సాధించిన భారత పురుషుల జట్టు మూడో స్థానంతో మెరుగైన రీతిలో ముగించింది. కానీ యూరోప్లో జరిగిన రెండో అంచె పోటీల్లో 8 మ్యాచ్లలో కేవలం 3 పాయింట్లు మాత్రమే రాబట్టగలిగింది. ఫలితంగా తొమ్మిది జట్ల టోర్నీలో ఎనిమిదో స్థానానికే పరిమితమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారత హాకీ చరిత్రలో తొలిసారి వరుసగా ఏడు మ్యాచ్లు ఓడిన చెత్త రికార్డు కూడా నమోదైంది. ఒకదశలో టైటిల్ రేసులో నిలిచిన జట్టు పరిస్థితి చివరకు ఇలా తయారైంది. ఐర్లాండ్లాంటి బలహీన జట్టుతో గెలిచిన అదృష్టం వల్ల ఆఖరి స్థానం రాకుండా తప్పించుకోగలిగింది! అయితే ఇన్ని మ్యాచ్లు ఓడినా ఇవన్నీ హోరాహోరీగా సాగి చివరి వరకు పోరాడినవి కావడం కొంత సానుకూలాంశం. ఈ ఏడు పరాజయాల్లో ఆరింటిలో భారత్ ఒకే ఒక గోల్ తేడాతో మాత్రమే ఓడింది. వాటిలో ఐదూ చివరి క్వార్టర్లోనే వచ్చాయి. చివర్లో డిఫెన్స్ వైఫల్యంతో ఇది జరిగింది. దీనిపై దృష్టి పెట్టి సరిదిద్దుకునే అవకాశం జట్టు ముందుంది. యూరోప్ టూర్ ఆరంభంలో వీసా సమస్యల వల్ల పలువురు ఆటగాళ్లు ఆలస్యంగా జట్టుతో చేరగా, గుర్జంత్ సింగ్, కెప్టెన్ హర్మన్ప్రీత్ గాయాలతో ఇబ్బంది పడ్డారు. పూర్తిగా అటాకింగ్పైనే దృష్టి పెట్టాలంటూ కోచ్ క్రెయిన్ ఫుల్టన్ కొత్త వ్యూహాన్ని తీసుకురావడంతో ఆటగాళ్లు ఒక్కసారిగా దానికి అనుగుణంగా మారలేకపోయారు. దీంతో మరో వైపు డిఫెన్స్ బలహీనంగా మారిపోయింది. ట్యాకిల్ సరిగా లేక, పొజిషనింగ్ సరిగా లేక జట్టు ఈ ఎనిమిది మ్యాచ్లలో 26 గోల్స్ సమర్పించుకుంది! మార్పులు ఉంటాయా... సీనియర్లు అమిత్ రోహిదాస్, జుగ్రాజ్ సింగ్, జర్మన్ప్రీత్ సింగ్, సంజయ్ పూర్తిగా విఫలం కాగా... అభిõÙక్ ఒక్కడే నాలుగు గోల్స్తో ఫర్వాలేదనిపించాడు. అయితే సర్కిల్ లోపల ఎక్కువ సేపు బంతిని ఉంచుకునే అతని బలహీనత కారణంగా ప్రత్యర్థులు సరైన డిఫెన్స్తో భారత్ మరిన్ని గోల్స్ చేయకుండా అడ్డుకోగలిగారు. ఇద్దరు గోల్ కీపర్లు కృషన్ పాఠక్, సూరజ్ కర్కేరా ఘోర వైఫల్యం శ్రీజేశ్ ఉన్నప్పుడు జట్టు గోల్కీపింగ్ స్థాయి ఎంత గొప్పగా ఉండేదో గుర్తు చేసింది. మన్దీప్ సింగ్, లలిత్, సుఖ్జీత్, దిల్ప్రీత్ కూడా ప్రభావం చూపలేకపోయారు. 400కు పైగా అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన మన్ప్రీత్ సింగ్తో పాటు హార్దిక్ సింగ్ మాత్రమే తమ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇచ్చినా అది జట్టు గెలిచేందుకు సరిపోలేదు. హర్మన్ప్రీత్ ఆడని మ్యాచ్లలో మన డ్రాగ్ ఫ్లికింగ్ మరీ పేలవంగా కనిపించింది. రోహిదాస్ అంచనాలను అందుకోలేకపోగా, జుగ్రాజ్ అయితే ఏకంగా పెనాల్టీ స్ట్రోక్ను కూడా గోల్గా మలచలేకపోయాడు. ప్రస్తుతం అంతర్జాతీయ హాకీలో ఎంతో కీలకమైన డ్రాగ్ఫ్లికింగ్లో పరిస్థితి మెరుగు కాకపోయే ఎలాంటి విజయాలను ఆశించలేం. మరో రెండు నెలల్లో భారత్లోనే ఆసియా కప్ ఉంది. దీని ద్వారా మన టీమ్ వరల్డ్ కప్కు అర్హత సాధించే అవకాశం ఉంది. అప్పటిలోగా జట్టులో ఏమైనా మార్పులు చేస్తారా, సీనియర్లను పక్కన పెట్టిన కొత్తవారికి అవకాశాలు ఇస్తారా అనే విషయంపై కోచ్ స్పష్టతనివ్వలేదు. స్వదేశంలో జరిగే జూనియర్ వరల్డ్ కప్లో కుర్రాళ్ల ప్రదర్శన తర్వాత దీనిపై అతను నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అరైజిత్ సింగ్, మొహమ్మద్ రాహిల్, సెల్వమ్ కార్తీలాంటి యువ ఆటగాళ్లు ప్రస్తుతానికి తమ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. 2023–24 ప్రొ లీగ్లో కూడా ఏడో స్థానంలో నిలిచిన టీమ్ ఆ తర్వాత కోలుకొని పారిస్ ఒలింపిక్స్లో కాంస్యం గెలిచే వరకు వెళ్లింది. ఇప్పుడు టీమ్కు అదే స్ఫూర్తి కావాలి. -
ఆయుశ్ అదరహో
అయోవా (అమెరికా): నిరీక్షణ ముగిసింది. ఈ ఏడాది భారత ప్లేయర్ ఖాతాలో తొలి అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీ టైటిల్ చేరింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన యూఎస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోరీ్నలో భారత ప్లేయర్ ఆయుశ్ శెట్టి విజేతగా అవతరించాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 34వ ర్యాంకర్ ఆయుశ్ శెట్టి 21–18, 21–13తో ప్రపంచ 33వ ర్యాంకర్ బ్రియాన్ యాంగ్ (కెనడా)పై గెలుపొందాడు. ఈ ఏడాది యాంగ్పై ఆయుశ్కిది మూడో విజయం కావడం విశేషం. మలేసియా ఓపెన్, తైపీ ఓపెన్ టోర్నీల్లోనూ యాంగ్పై ఆయుశ్ నెగ్గాడు. చాంపియన్గా నిలిచిన ఆయుశ్కు 18 వేల డాలర్ల (రూ. 15 లక్షల 45 వేలు) ప్రైజ్మనీతోపాటు 7000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. యాంగ్తో 47 నిమిషాలపాటు జరిగిన తుది పోరులో ఆయుశ్కు తొలి గేమ్లో గట్టిపోటీ ఎదురైంది. మూడుసార్లు ఇద్దరి స్కోర్లు సమమయ్యాయి. స్కోరు 19–18 వద్ద ఆయుశ్ వరుసగా రెండు పాయింట్లు నెగ్గి తొలి గేమ్ దక్కించుకున్నాడు. రెండో గేమ్లో మాత్రం ఆయుశ్ దూకుడు కనబరిచాడు. ఆరంభంలోనే 6–1తో ఆధిక్యంలోకి వెళ్లిన ఆయుశ్ ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని 11–6కు పెంచుకున్నాడు. యాంగ్ కోలుకునే ప్రయత్నం చేసినా జోరు మీదున్న ఆయుశ్ ఎలాంటి అవకాశం ఇవ్వకుండా గేమ్తోపాటు మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. 2023లో లక్ష్య సేన్ కెనడా ఓపెన్లో టైటిల్ సాధించిన తర్వాత ఆయుశ్ శెట్టి రూపంలో మరో భారత ప్లేయర్ అంతర్జాతీయ టోర్నీలో పురుషుల సింగిల్స్ టైటిల్ గెల్చుకున్నాడు. ‘సీనియర్ సర్క్యూట్లో నాకిదే తొలి టైటిల్. ఈ విజయం ఎంతో ప్రత్యేకం. చాలా సంతోషంగా ఉన్నా. గత వారం రోజులుగా అద్భుతంగా ఆడాను. ఇదే జోరును కెనడా ఓపెన్లోనూ కొనసాగిస్తాను’ అని కర్ణాటకకు చెందిన 20 ఏళ్ల ఆయుశ్ వ్యాఖ్యానించాడు. 6 అడుగుల 5 అంగుళాల ఎత్తున్న ఆయుశ్ 2023లో ప్రపంచ జూనియర్ చాంపియన్íÙప్లో కాంస్య పతకాన్ని సాధించి వెలుగులోకి వచ్చాడు. రన్నరప్ తన్వీ శర్మ యూఎస్ ఓపెన్ టోరీ్నలో భారత్కు ‘డబుల్ ధమాకా’ సృష్టించే అవకాశం చేజారింది. మహిళల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్ తన్వీ శర్మ రన్నరప్గా నిలిచింది. టాప్ సీడ్, ప్రపంచ 21వ ర్యాంకర్ బీవెన్ జాంగ్ (అమెరికా)తో జరిగిన ఫైనల్లో 16 ఏళ్ల తన్వీ శర్మ 11–21, 21–16, 10–21తో పోరాడి ఓడిపోయింది. కెరీర్లో తొలి వరల్డ్ టూర్ ఫైనల్ ఆడిన పంజాబ్కు చెందిన తన్వీ ప్రత్యరి్థకి గట్టిపోటీనిచి్చనా చివరకు అనుభవజు్ఞరాలైన బీవెన్ జాంగ్దే పైచేయి అయింది. ప్రపంచ ర్యాంకింగ్స్లో 66వ స్థానంలో ఉన్న తన్వీ శర్మకు 9,120 డాలర్ల (రూ. 7 లక్షల 82 వేలు) ప్రైజ్మనీతోపాటు 5950 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
గట్టెక్కిన అల్కరాజ్
‘హ్యాట్రిక్’ టైటిల్ లక్ష్యంగా వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నిలో బరిలోకి దిగిన స్పెయిన్ స్టార్ అల్కరాజ్కు ఊహించని ప్రతిఘటన ఎదురైంది. తొలి రౌండ్ అడ్డంకిని అలవోకగా అధిగమిస్తాడని భావించినా... ఇటలీ సీనియర్ ప్లేయర్ ఫాగ్నిని పోరాటపటిమ కారణంగా ఏకంగా 4 గంటల 37 నిమిషాలు చెమటోడ్చి... చివరకు ఐదు సెట్ల పోరులో అల్కరాజ్ గట్టెక్కాడు. లండన్: టెన్నిస్ సీజన్ మూడో గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ వింబుల్డన్లో తొలి రోజు సంచలన ఫలితాలు నమోదయ్యాయి. పురుషుల సింగిల్స్ విభాగంలో రష్యా స్టార్, తొమ్మిదో సీడ్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా), ఎనిమిదో సీడ్ హోల్గర్ రూనె (డెన్మార్క్) తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టగా... డిఫెండింగ్ చాంపియన్, రెండో సీడ్ అల్కరాజ్ (స్పెయిన్) తొలి రౌండ్ను దాటేందుకు తీవ్రంగా శ్రమించాడు. ప్రపంచ 138వ ర్యాంకర్ ఫాబియో ఫాగ్నిని (ఇటలీ)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్లో ప్రపంచ రెండో ర్యాంకర్ అల్కరాజ్ 7–5, 6–7 (5/7), 7–5, 2–6, 6–1తో గెలుపొంది రెండో రౌండ్కు చేరుకున్నాడు. 4 గంటల 37 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో అల్కరాజ్ 14 ఏస్లు సంధించి, 9 డబుల్ ఫాల్ట్లు చేశాడు. 62 అనవసర తప్పిదాలు చేసి, 52 విన్నర్స్ కొట్టాడు. తన సరీ్వస్ను ఐదుసార్లు కోల్పోయిన అల్కరాజ్... ప్రత్యర్థి సరీ్వస్ను ఏడుసార్లు బ్రేక్ చేశాడు. ఇతర మ్యాచ్ల్లో బెంజిమిన్ బోంజి (ఫ్రాన్స్) 3 గంటల 7 నిమిషాల్లో 7–6 (7/2), 3–6, 7–6 (7/3), 6–2తో మెద్వెదెవ్పై... నికోలస్ జారీ (చెక్ రిపబ్లిక్) 3 గంటల 34 నిమిషాల్లో 4–6, 4–6, 7–5, 6–3, 6–4తో హోల్గర్ రూనెపై గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించారు. వాలెంటిన్ రాయర్ (ఫ్రాన్స్)తో జరిగిన మ్యాచ్లో 24వ సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) తొలి రెండు సెట్లను 3–6, 2–6తో కోల్పోయాక వెన్నునొప్పితో ఆటను కొనసాగించలేక వైదొలిగాడు. నిశేష్ కు నిరాశ కెరీర్లో తొలిసారి వింబుల్డన్ టోర్నిలో ఆడుతున్న తెలుగు సంతతికి చెందిన అమెరికా ప్లేయర్ నిశేష్ బసవరెడ్డికి నిరాశ ఎదురైంది. తొలి రౌండ్లో 20 ఏళ్ల నిశేష్ 6–7 (5/7), 3–6, 2–6తో అమెరికాకే చెందిన లెర్నర్ టియెన్ చేతిలో ఓడిపోయాడు. నిశేష్కు 66,000 పౌండ్లు (రూ. 77 లక్షల 56 వేలు) ప్రైజ్మనీగా లభించాయి. కష్టపడ్డ కీస్ మహిళల సింగిల్స్లో ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ సబలెంకా (బెలారస్) శుభారంభం చేసింది. తొలి రౌండ్లో సబలెంకా 6–1, 7–5తో కార్సన్ బ్రాన్స్టిన్ (కెనడా)పై గెలిచింది. ఈ ఏడాది ఆ్రస్టేలియన్ ఓపెన్ చాంపియన్, ఆరో సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) గెలిచేందుకు కష్టపడింది. 2 గంటల 41 నిమిషాల పోరులో కీస్ 6–7 (4/7), 7–5, 7–5తో ఎలీనా రూసె (రొమేనియా)పై నెగ్గింది. 20వ సీడ్, 2017 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ ఒస్టాపెంకో (లాతి్వయా)... 2022, 2023 రన్నరప్ ఆన్స్ జబర్ (ట్యూనిషియా) తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. తొమోవా (బల్గేరియా)తో జరిగిన మ్యాచ్లో జబర్ తొలి సెట్ను 6–7 (5/7)తో కోల్పోయి, రెండో సెట్లో 0–2తో వెనుకబడిన దశలో గాయంతో వైదొలిగింది. బ్రిటన్ ప్లేయర్ సోనె కార్టల్ 7–5, 2–6, 6–2తో ఒస్టాపెంకోను ఓడించి రెండో రౌండ్కు చేరింది. టోర్నీ మొదటిరోజు రికార్డు స్థాయిలో 33 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దాంతో ఆటగాళ్లకు పట్టపగలే చుక్కలు కనబడ్డాయి. చాలా మంది ప్లేయర్లు మ్యాచ్ మధ్యలో బ్రేక్లు తీసుకుంటూ... ఐస్ ప్యాక్లతో శరీరాన్ని చల్లబర్చుకుంటూ... ఆటను కొనసాగించారు. -
ప్రొ లీగ్ నుంచి భారత జట్టు అవుట్
బెర్లిన్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్ నుంచి భారత మహిళల జట్టు ని్రష్కమించింది. ఆదివారం 2024–2025 సీజన్ ముగిసింది. చివరిదైన యూరోపియన్ అంచె పోటీల్లో ఆడిన అన్ని మ్యాచ్లు ఓడిపోయిన భారత్ చివరిదైన తొమ్మిదో స్థానంలో నిలిచి ప్రొ లీగ్ నుంచి అవుటైంది. చైనాతో జరిగిన ఆఖరి మ్యాచ్లో భారత్ 2–3 గోల్స్ తేడాతో ఓడిపోయింది. భారత జట్టుకు సునెలితా టొప్పో (9వ నిమిషంలో), రుతుజా (38వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. చైనా నుంచి జంగ్ ఇంగ్ (19వ, 39 నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... జు వెన్ యు (53వ నిమిషంలో) ఒక గోల్ సాధించింది. నిజానికి శనివారం చైనాతో జరిగిన తొలి మ్యాచ్ ఓటమితోనే ప్రొ లీగ్ బెర్త్ గల్లంతయ్యింది. అయితే అసాధ్యమైన భారీ గోల్స్ తేడాతో పేపర్లో ఉన్న అవకాశం తాజా పరాజయంతో దూరమైంది. తొమ్మిది జట్లు పోటీపడిన ఈ లీగ్లో భారత్ 16 మ్యాచ్లాడి 10 పాయింట్లతో అట్టడుగున నిలిచింది. ఇలా ఆఖరి స్థానంలో నిలిచిన జట్టు ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ నుంచి అనర్హతకు గురవుతుంది. మళ్లీ లీగ్లోకి అర్హత సంపాదించాలంటే వచ్చే ఏడాది ఎఫ్ఐహెచ్ నేషన్స్ కప్లో ఆడిన అందులో మెరుగైన స్థానం సాధిస్తేనే ప్రొ లీగ్ బెర్త్ లభిస్తుంది. -
టైటిల్కు చేరువలో...
అయోవా (అమెరికా): ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) టూర్లో ఈ ఏడాది భారత క్రీడాకారులెవరూ ‘సూపర్’ స్థాయి టోరీ్నల్లో టైటిల్ సాధించలేదు. అంతా అనుకున్నట్లు జరిగితే ... ఒకేసారి రెండు టైటిల్స్తో భారత షట్లర్లు ‘డబుల్’ ధమాకా సృష్టించే అవకాశముంది. ఏమాత్రం అంచనాలు లేకుండా యూఎస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీలో బరిలోకి దిగిన భారత యువ షట్లర్లు ఆయుశ్ శెట్టి, తన్వీ శర్మ టైటిల్కు కేవలం విజయం దూరంలో నిలిచారు. పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ 34వ ర్యాంకర్ ఆయుశ్ శెట్టి... మహిళల సింగిల్స్లో విభాగంలో ప్రపంచ 66వ ర్యాంకర్ తన్వీ శర్మ ఫైనల్లోకి దూసుకెళ్లారు. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ఆయుశ్ శెట్టి 21–23, 21–15, 21–14తో టాప్ సీడ్, ప్రపంచ ఆరో ర్యాంకర్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)పై సంచలన విజయం సాధించగా... 16 ఏళ్ల తన్వీ శర్మ 21–14, 21–16తో ఏడో సీడ్, ప్రపంచ 40వ ర్యాంకర్ పొలీనా (ఉక్రెయిన్)ను బోల్తా కొట్టించింది. ఫైనల్స్లో బ్రియాన్ యాంగ్ (కెనడా)తో ఆయుశ్; బీవెన్ జాంగ్ (అమెరికా)తో తన్వీ తలపడతారు. గత నెలలో శ్రీకాంత్ మలేసియా ఓపెన్ టోరీ్నలో ఫైనల్కు చేరి రన్నరప్గా నిలవడమే ఈ ఏడాది భారత షట్లర్ల అత్యుత్తమ ప్రదర్శన. ఫైనల్లో ఆయుశ్, తన్వీ విజయం సాధిస్తే భారత్కు ‘టైటిల్’ లోటు తీరుతుంది. -
రన్నరప్ యూకీ జోడీ
మలోర్కా (స్పెయిన్): కెరీర్లో ఐదో డబుల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత టెన్నిస్ స్టార్ యూకీ బాంబ్రీకి నిరాశ ఎదురైంది. మలోర్కా ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నమెంట్లో యూకీ బాంబ్రీ (భారత్)–రాబర్ట్ గాలోవే (అమెరికా) జోడీ రన్నరప్గా నిలిచింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో యూకీ–గాలోవే జోడీ 1–6, 6–1, 13–15తో ‘సూపర్ టైబ్రేక్’లో సాంటియాగో గొంజాలెజ్ (మెక్సికో)–ఆస్టిన్ క్రాయిసెక్ (అమెరికా) జోడీ జంట చేతిలో పోరాడి ఓడిపోయింది. 79 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో యూకీ–గాలోవే జోడీ ఏడు ఏస్లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్లు చేసింది. తమ సరీ్వస్ను రెండుసార్లు కోల్పోయిన ఈ ఇండో–అమెరికన్ ద్వయం ప్రత్యర్థుల సరీ్వస్ను రెండుసార్లు బ్రేక్ చేసింది. రన్నరప్ యూకీ–గాలోవో జంటకు 16,940 యూరోల (రూ. 16 లక్షల 95 వేలు) ప్రైజ్మనీతోపాటు 150 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 2023లో లాయిడ్ హారిస్ (దక్షిణాఫ్రికా)తో కలిసి ఇదే టోరీ్నలో యూకీ డబుల్స్ టైటిల్ను సాధించాడు. ఓవరాల్గా యూకీ తన కెరీర్లో నాలుగు ఏటీపీ డబుల్స్ టైటిల్స్ను సాధించి, మరో నాలుగింటిలో రన్నరప్గా నిలిచాడు. -
వెల్డన్ నోరిస్
స్పీల్బర్గ్ (ఆ్రస్టియా): ఫార్ములావన్ తాజా సీజన్లో మెక్లారెన్ డ్రైవర్ లాండో నోరిస్ తన ఖాతాలో మూడో విజయం జమ చేసుకున్నాడు. 2025 సీజన్లో 11వ రేసుగా ఆదివారం జరిగిన ఆ్రస్టియా గ్రాండ్ప్రిలో నోరిస్ విజేతగా నిలిచాడు. నిర్ణీత 70 ల్యాప్లను నోరిస్ అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా ఒక గంట 23 నిమిషాల 47.693 సెకన్లలో ముగించి అగ్రస్థానం దక్కించుకున్నాడు. మెక్లారెన్ జట్టుకే చెందిన ఆస్కార్ పియాస్ట్రి ఒక గంట 23 నిమిషాల 50.388 సెకన్లతో రెండో స్థానంలో నిలిచాడు. చివరగా జరిగిన కెనడా గ్రాండ్ప్రిలో ఈ ఇద్దరి కార్లు పరస్పరం ఢీకొనగా... తాజా రేసులో వీరి మధ్య ఆద్యంతం రసవత్తర పోటీ సాగింది. అయితే ఆఖర్లో వేగం పెంచిన నోరిస్ టైటిల్ హస్తగతం చేసుకున్నాడు. తద్వారా డ్రైవర్స్ ప్రపంచ చాంపియన్షి ప్ సాధించే దిశగా ముందడుగు వేశాడు. ‘మా ఇద్దరి మధ్య గట్టి పోటీ సాగింది. తొలి రెండు స్థానాల్లో నిలవడం ఆనందంగా ఉంది’ అని రేసు అనంతరం నోరిస్ అన్నాడు. ఫెరారీ డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ (1 గంట 24 నిమిషాల 7.513 సెకన్లు) మూడో స్థానంలో నిలవగా... ఏడుసార్లు ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ (1 గంట 24 నిమిషాల 16.713 సెకన్లు; ఫెరారీ) నాలుగో స్థానంలో, రసెల్ (1 గంట 24 నిమిషాల 50.089 సెకన్లు; మెర్సిడెస్) ఐదో స్థానంలో నిలిచారు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్, రెడ్బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ రేసును పూర్తి చేయలేకపోయాడు. మొత్తం 20 మంది డ్రైవర్లు పాల్గొన్న ఈ రేసులో 16 మంది మాత్రమే రేసు పూర్తిచేశారు. 24 రేసుల తాజా సీజన్లో ఇప్పటి వరకు 11 రేసులు ముగిశాయి. డ్రైవర్స్ చాంపియన్షి ప్లో 216 పాయింట్లతో ప్రియాస్ట్రి అగ్రస్థానంలోనే కొనసాగుతుండగా... 201 పాయింట్లతో నోరిస్ రెండో స్థానంలో, 155 పాయింట్లతో వెర్స్టాపెన్ మూడో స్థానంలో ఉన్నారు. సీజన్లోని తదుపరి రేసు బ్రిటన్ గ్రాండ్ప్రి జూలై 6న జరుగుతుంది. మరోవైపు ఫార్ములావన్ షెడ్యూల్లో 2041 వరకు ఆ్రస్టియా గ్రాండ్ప్రి కొనసాగనుంది. ఈ మేరకు ఆదివారం ఫార్ములావన్ నిర్వాహకులు వివరాలు వెల్లడించారు. -
జొకోవిచ్ సాధించేనా?
రెండేళ్ల క్రితం యూఎస్ ఓపెన్లో విజేతగా నిలిచి సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ తన కెరీర్లో 24వ గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్ సాధించాడు. ఈ క్రమంలో టెన్నిస్ చరిత్రలోఅత్యధిక గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్గా మార్గరెట్ కోర్ట్ (ఆ్రస్టేలియా) పేరిట ఉన్న రికార్డును జొకోవిచ్ సమం చేశాడు. మరొక్క గ్రాండ్స్లామ్ టైటిల్ సాధిస్తే జొకోవిచ్ ఎవరికీ సాధ్యం కాని ఘనతను తన పేరిట లిఖించుకుంటాడు. అయితే గత ఆరు గ్రాండ్స్లామ్ టోర్నీలలో ఈ సెర్బియా స్టార్కు నిరాశే ఎదురైంది. గతేడాది యూఎస్ ఓపెన్లో మూడో రౌండ్లో నిష్క్రమించిన జొకోవిచ్ మిగతా ఐదు గ్రాండ్స్లామ్ టోర్నీల్లో కనీసం సెమీఫైనల్ చేరుకున్నాడు. నిరుడు వింబుల్డన్ టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించిన జొకోవిచ్ స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ దూకుడుకు రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్నాడు. ఈ సంవత్సరం ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్లలో సెమీఫైనల్ చేరిన జొకోవిచ్ తనకెంతో కలిసొచ్చిన వింబుల్డన్ టోర్నీలో ‘రికార్డు’ టైటిల్ను అందుకోవాలని మరోసారి ప్రయత్నించనున్నాడు. లండన్: గత ఆరు వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నీలలో సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ ఫైనల్ చేరుకున్నాడు. నాలుగుసార్లు గెలిచి, రెండుసార్లు రన్నరప్గా నిలిచాడు. ఏడోసారి కూడా టైటిల్ ఫేవరెట్స్లో ఒకరిగా జొకోవిచ్ బరిలోకి దిగుతున్నాడు. నేటి నుంచి మొదలయ్యే ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో జొకోవిచ్ స్థాయికి తగ్గట్టు ఆడితే సెమీఫైనల్ వరకు చేరుకోవడం ఖాయం. అయితే తన 25వ గ్రాండ్స్లామ్ టైటిల్ కల నిజం కావాలంటే మాత్రం సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్ల్లో జొకోవిచ్ తన అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. అంతా అనుకున్నట్లు జరిగితే సెమీఫైనల్లో జొకోవిచ్ ప్రత్యర్థి గా ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ యానిక్ సినెర్ (ఇటలీ), ఫైనల్లో రెండో సీడ్, డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) ఎదురవుతారు. గత రెండేళ్లలో జొకోవిచ్ తుది పోరులో అల్కరాజ్ చేతిలోనే ఓడిపోయి రన్నరప్ ట్రోఫీలతో సరిపెట్టుకున్నాడు. ఇప్పటికే ఏడుసార్లు వింబుల్డన్ చాంపియన్గా నిలిచిన 38 ఏళ్ల జొకోవిచ్ వచ్చే ఏడాదికల్లా ఏమేరకు ఫిట్గా ఉంటాడో చెప్పలేం. సినెర్, అల్కరాజ్ రూపంలో ఇద్దరు స్టార్స్ దూసుకురావడంతో జొకోవిచ్ 25వ గ్రాండ్స్లామ్ టైటిల్ నిజం కావాలంటే వింబుల్డన్కు మించిన మరో అవకాశం లేదనే చెప్పాలి. మంగళవారం జరిగే తొలి రౌండ్లో ప్రపంచ 40వ ర్యాంకర్ అలెగ్జాండర్ ముల్లర్ (ఫ్రాన్స్)తో జొకోవిచ్ ఆడనున్నాడు. మరోవైపు కెరీర్లో ఫైనల్ చేరిన ఐదు గ్రాండ్స్లామ్ టోర్నీల్లోనూ విజేతగా నిలిచిన అల్కరాజ్పై మరోసారి అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఈసారి అల్కరాజ్ విజేతగా నిలిస్తే జాన్ బోర్గ్ (స్వీడన్), పీట్ సంప్రాస్ (అమెరికా), రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), జొకోవిచ్ తర్వాత వింబుల్డన్ టోర్నీలో ‘హ్యాట్రిక్ టైటిల్స్’ నెగ్గిన ఐదో ప్లేయర్గా నిలుస్తాడు. నేడు జరిగే తొలి రౌండ్ మ్యాచ్లో ఫాబియో ఫాగ్నిని (ఇటలీ)తో అల్కరాజ్ పోటీపడతాడు. టాప్ సీడ్ సినెర్ తొలి రౌండ్లో తన దేశానికి చెందిన లుకా నార్దీతో ఆడతాడు. ఈసారీ కొత్త చాంపియన్ వచ్చేనా! మహిళల సింగిల్స్ విభాగంలో కచ్చితమైన ఫేవరెట్స్ ఎవరూ కనిపించడం లేదు. పచ్చిక కోర్టులపై జరిగే వింబుల్డన్ టోర్నీలో 2017 నుంచి ప్రతి ఏడాది మహిళల సింగిల్స్లో కొత్త చాంపియన్ అవతరించారు. ఈ నేపథ్యంలో డిఫెండింగ్ చాంపియన్ బార్బరా క్రెజికోవా (చెక్ రిపబ్లిక్) తన టైటిల్ను నిలబెట్టుకుంటుందా లేదో వేచి చూడాలి. తొలి రౌండ్లో ఫిలిప్పీన్స్ సంచలనం అలెగ్జాండ్రా ఇయాలాతో క్రెజికోవా తలపడుతుంది. ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ సబలెంకా (బెలారస్), రెండో సీడ్ కోకో గాఫ్ (అమెరికా)తోపాటు మాజీ చాంపియన్స్ వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్), రిబాకినా (కజకిస్తాన్), జాస్మిన్ పావోలిని (ఇటలీ), మాడిసన్ కీస్ (అమెరికా), స్వియాటెక్ (పోలాండ్) ఈసారి టైటిల్ రేసులో ఉన్నారు. -
సెమీఫైనల్లో నిఖత్ జరీన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తేజం, రెండుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన నిఖత్ జరీన్ సొంతగడ్డపై జరుగుతున్న ఎలైట్ మహిళల బాక్సింగ్ టోర్నమెంట్లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన 51 కేజీల కేటగిరీ క్వార్టర్ ఫైనల్లో నిఖత్ 5–0తో కల్పన (సాయ్)పై ఏకపక్ష విజయం సాధించింది. మాజీ యూత్ ప్రపంచ చాంపియన్ అంకుషిత బొరో (టాప్స్) కూడా సెమీఫైనల్కు చేరింది. 65 కేజీ కేటగిరీలో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఆమె 5–0తో రాజస్తాన్ బాక్సర్ పార్థవిపై గెలిచింది. తెలంగాణ బాక్సర్లలో 65 కేజీల విభాగంలో యశి శర్మ 3–2తో సరిత రాయ్ (ఉత్తరప్రదేశ్)పై గెలుపొందగా, 60 కేజీల విభాగంలో గోనెళ్ల నిహారిక 5–0తో ప్రియాంక (చత్తీస్గఢ్)పై విజయం సాధించింది. అయితే నిరూపమ, చిలువేరు అపర్ణలకు క్వార్టర్స్లోనే చుక్కెదురైంది. 57 కేజీ కేటగిరీలో అపర్ణ 0–5తో కమల్జీత్ కౌర్ (ఏఐపీ) చేతిలో, 54 కేజీ కేటగిరీలో నిరూపమ 0–5తో తను (ఎస్ఎస్సీబీ) చేతిలో పరాజయం చవిచూశారు. 48 కేజీల్లో వహి వజీర్ 0–5తో మంజురాణి చేతిలో ఓడింది. -
ఎక్సలెన్సియా అద్భుత విజయం.. Varsity ఫుట్బాల్ ఛాంపియన్షిప్ కైవసం
సాక్షి, మొయినాబాద్: డెక్కన్ అరేనాలో జరిగిన 2025 Varsity ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో ఎక్సలెన్సియా జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ గార్డియంను ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచింది. దాదాపు 1,000 మంది అభిమానుల కోలాహలం మధ్య జరిగిన ఈ మ్యాచ్ భారతదేశ పాఠశాల క్రీడల చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచింది.ఆట ప్రారంభంలో గార్డియం ఆధిక్యత ప్రదర్శించినా, ఎక్సలెన్సియా పట్టుదలతో నిలబడి తొలి అర్ద భాగంలో గోల్స్ పడకుండా 0-0తో ముగించింది. సగం సమయం విరామంలో ఒక అద్భుతమైన వాతావరణం కనిపించింది. విద్యార్థుల బ్యాండ్ ప్రదర్శన, స్వచ్ఛంద సంస్థలు పెట్టిన ఆహార స్టాల్స్, ఉత్సాహంగా ఉన్న ప్రేక్షకుల సందడితో స్టేడియంలో పండుగ వాతావరణం నెలకొంది.అనంతరం రెండో అర్ద భాగం 58వ నిమిషంలో నిమిష్ 30 అడుగుల యార్డ్ నుంచి కొట్టిన అద్భుతమైన షాట్ స్టేడియం మొత్తాన్ని ఉర్రూతలూగించింది. ఆ ఒక్క గోల్తో ఎక్సలెన్సియా 1-0తో విజయాన్ని ఖాయం చేసుకుంది. చివరి విజిల్ మోగగానే ఎక్సలెన్సియా అభిమానులు మైదానంలోకి దూసుకొచ్చారు. మూడు నెలల క్రితం క్వాలిఫైయర్స్తో మొదలైన ఎక్సలెన్సియా ప్రస్థానం ఛాంపియన్షిన్ కైవసం చేసుకోవడంతో ముగిసింది.మ్యాచ్ అనంతరం నిమిష్కు బ్యాలన్ డి'ఓర్(Ballon d’Or), గోల్డెన్ బూట్ అవార్డులు లభించాయి. అభిమానులు రాత్రంతా నిమిష్ పేరుతో విజయ నినాదాలు చేశారు. ఇది కేవలం ఒక చివరి ఆట మాత్రమే కాదు. Varsity అనే ఒక కొత్త క్రీడా ఉద్యమం ఆవిర్భావం అని చెప్పొచ్చు. -
ఒకే గ్రూపులో భారత్, పాక్
లుసానే (స్విట్జర్లాండ్): ఈ ఏడాది భారత్ ఆతిథ్యమివ్వబోయే జూనియర్ పురుషుల ప్రపంచకప్ హాకీలో చిరకాల ప్రత్యర్థులు ఒకే గ్రూపులో తలపడనున్నారు. ఇక్కడ ఉన్న అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) హెడ్క్వార్టర్స్లో శనివారం ఈ యువ మెగా టోర్నీకి సంబంధించిన డ్రాను తీశారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఎఫ్ఐహెచ్ అధ్యక్షుడు తయ్యబ్ ఇక్రామ్, హాకీ ఇండియా కార్యదర్శి భోలానాథ్ సింగ్, డైరెక్టర్ ఆర్.కె.శ్రీవాస్తవ పాల్గొన్నారు. పూల్ ‘బి’లో ఆతిథ్య భారత్తో పాటు పాకిస్తాన్, చిలీ, స్విట్జర్లాండ్ జట్లున్నాయి. ముందెన్నడూ లేని విధంగా ఈ సారి ఏకంగా 24 జట్లు ప్రపంచకప్ బరిలో ఉన్నాయి. ఈ జట్లను ఆరు పూల్స్గా విభజించారు. ఒక్కో పూల్లో నాలుగు జట్లున్నాయి. భారత్లోని చెన్నై, మదురై వేదికల్లో ఈ నవంబర్ 28 నుంచి డిసెంబర్ 10 వరకు జూనియర్ ప్రపంచకప్ మ్యాచ్లు జరుగుతాయి. జర్మనీ డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ పూల్ ‘ఎ’లో ఉంది. గత 2023 ప్రపంచకప్ ఫైనల్లో జర్మనీ 2–1తో ఫ్రాన్స్ను ఓడించి విజేతగా ఆవిర్భవించింది. అయితే ఆ టోర్నీలో 16 జట్లే పోటీపడ్డాయి. కానీ ఈ సారి మరో 8 జట్లు కప్ కోసం పోటీపడతాయి. హాకీ ఇండియా కార్యదర్శి భోళనాథ్ మాట్లాడుతూ ‘ఈ ప్రపంచకప్తో భారత్లో హాకీ శోభ మరింత పెరగనుంది. మౌలిక వసతుల ఆధునీకరణ, మదురైలోని అధునాతన స్టేడియంలో మ్యాచ్లు విజయవంతగా నిర్వహిస్తాం’ అని అన్నారు. ఏ పూల్లో ఏ ఏ జట్లు... పూల్ ‘ఎ’: జర్మనీ, దక్షిణాఫ్రికా, కెనడా, ఐర్లాండ్; పూల్ ‘బి’: భారత్, పాకిస్తాన్, చిలి, స్విట్జర్లాండ్; పూల్ ‘సి’: అర్జెంటీనా, న్యూజిలాండ్, జపాన్, చైనా; పూల్ ‘డి’: స్పెయిన్, బెల్జియం, ఈజిప్టు, నబీబియా; పూల్ ‘ఇ’: మలేసియా, ఇంగ్లండ్, ఆస్ట్రియా, నెదర్లాండ్స్; పూల్ ‘ఎఫ్’: ఫ్రాన్స్, ఆ్రస్టేలియా, కొరియా, బంగ్లాదేశ్. -
నిఖత్ శుభారంభం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టార్ మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ జాతీయ ఎలైట్ మహిళల బాక్సింగ్ టోర్నమెంట్లో శుభారంభం చేసింది. రెండు సార్లు ప్రపంచ చాంపియన్ అయిన తెలంగాణ తేజం ధాటికి ఉత్తర ప్రదేశ్ ప్రత్యర్థి రాశి శర్మ చేతులెత్తేసింది. సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో శనివారం జరిగిన 48–51 కేజీ కేటగిరీ తొలిరౌండ్ బౌట్లో నిఖత్ జరీర్ 4–1తో రాశిపై ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. మొత్తం ఐదుగురు జడ్జిల్లో నలుగురు జడ్జిలు నిఖత్ విసిరిన పంచ్లకు 10 పాయింట్లు ఇచ్చారు. ప్రత్యర్థికి 9 పాయింట్లు ఇవ్వగా... ఒకే ఒక జడ్జి మాత్రం తెలంగాణ బాక్సర్కు 9 పాయింట్లు, రాశి శర్మకు 10 పాయింట్లు కేటాయించడంతో 4–1తో గెలిచింది. లేదంటే 5–0తో స్వీప్ చేసేది! హరియాణా బాక్సర్ అంజలి తొలిరోజే అనూహ్య ఫలితాన్ని సాధించింది. 57–60 కేజీ కేటగిరీలో ఆమె 3–1తో ప్రపంచ చాంపియన్షిప్ కాంస్య పతక విజేత మనీషా మౌన్ (టాప్స్)ను కంగు తినిపించింది. 45–48 కేజీ కేటగిరీలో 2023 ప్రపంచ చాంపియన్ నీతు (హరియాణా) 5–0తో రజనీ సింగ్ (ఉత్తరప్రదేశ్)పై గెలుపొందగా, 60–65 కేజీల కేటగిరీలో తెలంగాణ బాక్సర్ యశి శర్మ 5–0తో మోనిషా (తమిళనాడు)పై ఘన విజయం సాధించింది. 65–70 కేజీల కేటిగిరీలో పూజ (తెలంగాణ) 5–0తో గితిమోని గగొయ్ (సాయ్)పై నెగ్గగా... 75–80 కేజీల కేటగిరీలో బండి కీర్తి (తెలంగాణ)... ప్రత్యర్థి గరిమా (రాజస్తాన్) వాకోవర్ ఇవ్వడంతో ముందంజ వేసింది. 51–54 కేజీల కేటగిరీలో ‘టాప్స్’ బాక్సర్ లక్ష్మి 5–0తో రాగిని (ఉత్తరప్రదేశ్)పై గెలిచింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో నిఖత్ జరీన్... ‘సాయ్’ బాక్సర్ కల్పనతో తలపడుతుంది. -
నీరజ్ టాప్.. పాక్ నదీమ్ ర్యాంక్ ఎంతంటే?
అంతర్జాతీయ వేదికలపై అద్భుతమైన ప్రదర్శనలతో అదరగొట్టిన భారత స్టార్ జావలిన్ త్రోవర్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) టాప్ లేపాడు. నాలుగు రోజుల వ్యవధిలోనే 2 టైటిల్స్తో అదరగొట్టి మళ్లీ నంబర్ వన్ స్థానంలోకి దూసుకొచ్చాడు. పురుషుల జావెలిన్ త్రో ప్రపంచ ర్యాంకింగ్స్లో టాప్ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. గ్రెనడాకు చెందిన ఆండర్సన్ పీటర్స్ పక్కకు నెట్టి ఫస్ట్ ర్యాంక్ సాధించాడు.వరల్డ్ అథ్లెటిక్స్ ఈ వారం ప్రారంభంలో ర్యాంకింగ్స్ను అప్డేట్ చేసింది. దీని ప్రకారం 1,445 పాయింట్లతో నీరజ్ చోప్రా మొదటి స్థానం దక్కించుకున్నాడు. ఆండర్సన్ పీటర్స్ 1,431 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడని ఒలింపిక్స్.కామ్ వెల్లడించింది. పాకిస్తాన్ ఒలింపిక్ ఛాంపియన్ అర్షద్ నదీమ్ 1,370 పాయింట్లతో 4వ స్థానంలో ఉన్నాడు. దోహా డైమండ్ లీగ్లో ఈటెను 91.06 మీటర్లు విసిరి గోల్డ్ మెడల్ సాధించిన జర్మనీ త్రోవర్ జూలియన్ వెబర్ తాజా ర్యాంకింగ్స్లో 3వ స్థానంలో నిలిచాడు. చెక్ రిపబ్లిక్కు చెందిన టోక్యో 2020 ఒలింపిక్స్ రజత పతక విజేత జాకుబ్ వాడ్లెజ్ 5వ స్థానంలో ఉన్నాడు.పారిస్ ఒలింపిక్స్ తర్వాత, 2024 సెప్టెంబర్లో నీరజ్ చోప్రా.. అగ్రస్థానాన్ని కోల్పోయాడు. పారిస్ ఒలింపిక్స్లో అతడు రజత పతకం సాధించగా, పాకిస్తాన్ త్రోవర్ అర్షద్ నదీమ్ గోల్డ్ మెడల్ గెలిచాడు. పీటర్స్ కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు.చదవండి: ఏడాదికి రూ. 2 వేల కోట్లు, ప్రైవేటు జెట్.. ఇంకా!కాగా, పారిస్ డైమండ్ లీగ్ మీట్లో భాగంగా మంగళవారం జరిగిన పోటీల్లో టాప్లో నిలిచిన నీరజ్.. బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అంతకుముందు ఒస్ట్రావా గోల్డెన్ స్పైక్స్ అథ్లెటిక్స్ మీట్లోనూ స్వర్ణ పతకం సాధించి సత్తా చాటాడు. వరుసగా రెండు గోల్డ్ మెడల్స్ గెలవడంతో పురుషుల జావెలిన్ త్రో ప్రపంచ ర్యాంకింగ్స్లో మరోసారి నంబర్వన్గా నిలిచాడు. -
నిలవాలంటే గెలవాలి
బెర్లిన్: పరాజయాల పరంపరకు బ్రేక్ వేయడమే లక్ష్యంగా భారత మహిళల జట్టు చైనాతో పోరుకు సిద్ధమైంది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్లో అమ్మాయిల జట్టు వరుసగా ఆరు మ్యాచ్ల్లోనూ ఓడింది. దీంతో తీవ్రమైన ఒత్తిడిలో కూరుకుపోయిన భారత్ ఎలాగైన చైనాపై జరిగే పోరులో గెలవాలనుకుంటుంది. ఈ మ్యాచ్ కూడా ఓడితే సలీమా టెటె సారథ్యంలోని భారత జట్టు ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ నుంచి నిష్క్రమించడం దాదాపు ఖాయమవుతుంది. మొత్తం 9 జట్లు తలపడుతున్న ఈ టోర్నీలో 14 మ్యాచ్లాడిన మహిళల జట్టు 10 పాయింట్లతో అట్టడుగున ఉంది. ప్రొ లీగ్ నిబంధనల ప్రకారం అట్టడుగున నిలిచిన జట్టు ప్రస్తుత లీగ్లో చోటు కోల్పోతుంది. మళ్లీ ప్రొ లీగ్లో స్థానం కోసం ఎఫ్ఐహెచ్ నేషన్స్ కప్లో ఆడాల్సి ఉంటుంది. ఇలాంటి దుస్థితి నుంచి తప్పించుకోవాలంటే భారత్... చైనాపై గెలిచి తీరాలి. అప్పుడు అథమ స్థానం నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. హెడ్ కోచ్ హరేంద్ర సింగ్ కూడా తమ జట్టు ఈ యూరోపియన్ అంచెలో బోణీ చేయాలని గట్టిగా ఆశిస్తున్నాడు. ఈ ఏడాది సొంతగడ్డపై జరిగిన ప్రొ లీగ్లో రాణించిన జట్టు యూరోపియన్ అంచెకు వచ్చేసరికి చతికిలబడటం అనూహ్య పరిణామం. ఆ్రస్టేలియా, అర్జెంటీనా, బెల్జియంలతో జరిగిన రెండేసి మ్యాచ్ల్లో... మొత్తం ఆరు మ్యాచ్ల్లోనూ ఓడిపోవడం కోచ్ హరేంద్రకు ఏమాత్రం రుచించడం లేదు. కెపె్టన్ సలిమా టెటె ఈ డబుల్ హెడర్ (చైనాతో రెండు మ్యాచ్లు) కీలకమని చెప్పింది. భారత పురుషుల జట్టులాగే ఆఖర్లో బెల్జియంపై గెలిచినట్లే తాము కూడా చైనాపై గెలుస్తామని పేర్కొంది. చైనాతో చివరి సారిగా ఆడిన మ్యాచ్ల్లో భారత మహిళల జట్టు పైచేయి సాధించింది. గత నవంబర్లో బిహార్లో జరిగిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో లీగ్ దశలో 3–0తో గెలిచిన అమ్మాయిల జట్టు... ఫైనల్లో 1–0తో గెలిచి ట్రోఫీ కైవసం చేసుకుంది. ఇప్పుడు ఈ సానుకూల పరిస్థితుల్నే అనుకూలంగా మలచుకొని విజయం సాధించాలనే పట్టుదలతో భారత మహిళల జట్టు బరిలోకి దిగుతోంది. -
చాంపియన్ ప్రజ్ఞానంద
తాష్కెంట్: అందివచ్చిచన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న భారత యువ గ్రాండ్మాస్టర్, తమిళనాడు కుర్రాడు ప్రజ్ఞానంద... ఉజ్చెస్ కప్ మాస్టర్స్ అంతర్జాతీయ టోర్నీలో చాంపియన్గా నిలిచాడు. పది మంది మేటి గ్రాండ్మాస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీ శుక్రవారం ముగిసింది. నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత ప్రజ్ఞానందతోపాటు నొదిర్బెక్ అబ్దుసత్తోరోవ్ (ఉజ్బెకిస్తాన్), జవోఖిర్ సిందరోవ్ (ఉజ్బెకిస్తాన్) 5.5 పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచారు. దాంతో విజేతను నిర్ణయించేందుకు ఈ ముగ్గురి మధ్య టైబ్రేక్ గేమ్లను నిర్వహించారు. తొలి రౌండ్ టైబ్రేక్ గేమ్ల తర్వాత ముగ్గురూ 2 పాయింట్లతో సమంగా నిలిచారు. దాంతో ఈ ముగ్గురి మధ్య రెండో రౌండ్ టైబ్రేక్ గేమ్లు నిర్వహించారు. ఈసారి ప్రజ్ఞానంద 1.5 పాయింట్లతో టైటిల్ను ఖరారు చేసుకున్నాడు. 1 పాయింట్తో సిందరోవ్ రన్నరప్గా నిలిచాడు. అర పాయింట్తో నొదిర్బెక్ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. గురువారం ఎనిమిదో రౌండ్ ముగిశాక నొదిర్బెక్ 5.5 పాయింట్లతో అగ్రస్థానంలో, సిందరోవ్ 5 పాయింట్లతో రెండో స్థానంలో, ప్రజ్ఞానంద 4.5 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నారు. శుక్రవారం జరిగిన చివరిదైన తొమ్మిదో రౌండ్లో ప్రజ్ఞానంద 49 ఎత్తుల్లో నొదిర్బెక్ను ఓడించగా... పర్హామ్ మగ్సూద్ (ఇరాన్)తో జరిగిన గేమ్ను సిందరోవ్ ‘డ్రా’ చేసుకున్నాడు. దాంతో ఈ ముగ్గురూ 5.5 పాయింట్లతో ఉమ్మడిగా టాప్ ర్యాంక్లో నిలిచారు. తెలంగాణకు చెందిన భారత గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్ ఐదు పాయింట్లతో నాలుగో స్థానంతో ఈ టోర్నీని ముగించాడు. విజేతగా నిలిచిన ప్రజ్ఞానందకు 20 వేల డాలర్లు (రూ. 17 లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి. తాజా విజయంతో 19 ఏళ్ల ప్రజ్ఞానంద లైవ్ రేటింగ్స్లో 2778.3 పాయింట్లతో భారత నంబర్వన్ చెస్ ప్లేయర్గా అవతరించాడు. ప్రపంచ ర్యాంకింగ్స్లో ఈ తమిళనాడు గ్రాండ్మాస్టర్ నాలుగో స్థానానికి ఎగబాకాడు. 2776.6 పాయింట్లతో దొమ్మరాజు గుకేశ్ ఐదో స్థానంలో, 2775.7 పాయింట్లతో అర్జున్ ఆరో స్థానంలో ఉన్నారు. -
Ronaldo: ఏడాదికి రూ. 2000 కోట్లు, ప్రైవేట్ జెట్.. ఇంకా..!
పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo).. సౌదీ అరేబియాకు చెందిన ఫుట్బాల్ క్లబ్ అల్-నాస్ర్తో తెగదింపులు చేసుకున్నాడన్న వార్తలకు తెరపడింది. అల్-నాస్ర్ క్లబ్ తరపున మరో రెండేళ్ల పాటు ఆడేందుకు రొనాల్డో ఒప్పందం కుదుర్చుకున్నాడు.ఈ విషయాన్ని అల్-నాస్ర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. క్రిస్టియానో రొనాల్డో 2027 వరకు అల్-నాస్ర్ ఫుట్బాల్ క్లబ్లో కొనసాగనున్నాడు అని ఎక్స్లో రాసుకొచ్చింది. మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ నుంచి బయటకు వచ్చిన రొనాల్డో.. 2022 డిసెంబర్లో అల్-నాస్ర్ క్లబ్తో జతకట్టాడు.గత రెండు సీజన్లలో సౌదీ ప్రో లీగ్లో టాప్ స్కోరర్గా నిలిచిన రొనాల్డో, టైటిల్ను మాత్రం గెలుచుకోలేకపోయాడు. దీంతో ఈ పోర్చుగల్ కెప్టెన్ అల్ నాస్ర్కు వీడ్కోలు పలికి వేరో క్లబ్తో జతకట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు వార్తలు వినిపించాయి. కానీ అల్ నాస్ర్ క్లబ్ యాజమాన్యంతో చర్చలు అనంతరం రొనాల్డో తన నిర్ణయాన్నిమార్చుకున్నట్లు తెలుస్తోంది.అయితే సౌథీ ఫుట్బాల్ క్లబ్తో తన కాంట్రాక్ట్ను రెండేళ్ల పాటు పొడిగించుకున్నందుకు రోనాల్డో భారీ మొత్తాన్ని అందుకోనున్నట్లు తెలుస్తోంది.రొనాల్డోకు కళ్లే చెదిరే ఆఫర్..?👉టాక్ స్పోర్ట్ రిపోర్ట్ ప్రకారం.. అల్ నాస్ర్ క్లబ్ నుంచి రోనాల్డో ఏడాదికి 178 మిలియన్ పౌండ్లు(భారత కరెన్సీలో సుమారు. రూ.2000 కోట్లు) పారితోషికంగా తీసుకోనున్నట్లు సమాచారం. అదేవిధంగా మిగితా బెన్ఫిట్స్ కూడా రోనాల్డోకు ఉండనున్నాయి.👉సైనింగ్ బోనస్ కింద అతడికి తొలి ఏడాది 24.5 మిలియన్ పౌండ్లు(భారత కరెన్సీలో సుమారు రూ. 261 కోట్లు) అందుకోనున్నాడు.👉రెండో ఏడాదికి బోనస్ నగదు 30 మిలియన్ పౌండ్లు(రూ. 405 కోట్లు)కు పెరగనుంది.👉అల్ నాస్ర్ ఆసియా ఛాంపియన్స్ లీగ్ గెలిస్తే 5 మిలియన్ పౌండ్లు(రూ.53.4 కోట్లు) బోనస్ లభించనుంది.👉సౌదీ ప్రో లీగ్ ఛాంపియన్గా అల్ నాస్ర్ గెలిస్తే రొనాల్డోకు 8 మిలియన్ పౌండ్లు(రూ. 85 కోట్లు) బోనస్ లభించనుంది.👉గోల్డెన్ బూట్ గెలిస్తే రోనాల్డోకు 4 మిలియన్ పౌండ్ల(రూ. 42 కోట్లు) బోనస్ దక్కనుంది.👉అల్నాస్ర్లో ఓనర్షిప్ నుంచి 15 శాతం(అంచనా ప్రకారం 33 మిలియన్ పౌండ్లు) రొనాల్డో ఖాతాలో చేరనుంది.👉అదేవిధంగా ప్రతీ గోల్కు రొనాల్డోకు 80వేల ఫాండ్లు(భారత కరెన్సీలో సుమారు 85 లక్షలు) నగదు బహుమతిగా దక్కనుంది. ఈ బోనస్ రెండో ఏడాదికి 20 శాతం పెరగనుంది.👉 ప్రైవేట్ జెట్ ఖర్చులు కూడా అల్-నాస్ర్ క్లబ్ భరించనుంది. -
రేసు గుర్రానికి సెలవిచ్చిన అనుశ్
న్యూఢిల్లీ: భారత ఈక్వె్రస్టియన్ అనుశ్ అగర్వల్లా తన విజయాల కోసం సుదీర్ఘకాలంగా శ్రమించిన రేసు గుర్రానికి సెలవిచ్చాడు. సర్ కారామెల్లో అనే అశ్వంతో 25 ఏళ్ల అనుశ్ చెప్పుకోదగ్గ విజయాలు సాధించాడు. పారిస్ ఒలింపిక్స్లోనూ పోటీపడ్డాడు. ఆ విశ్వక్రీడల్లో డ్రెస్సెజ్ ఈవెంట్ను పూర్తి చేసిన తొలి భారతీయ రైడర్గా ఘనత వహించాడు. పతకం రౌండ్కు అర్హత సాధించలేకపోయినప్పటికీ గ్రూప్ ‘ఇ’లో డ్రెస్సెజ్ ఈవెంట్ పోటీలో తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఇలా తన ఒలింపిక్ ముచ్చట కూడా తీర్చిన గుర్రం కారామెల్లోకు గురువారం వీడ్కోలు పలికాడు. ‘థ్యాంక్యూ కారామెల్లో... నీవు కేవలం గుర్రానివే కాదు. అంతకుమించి మంచి భాగస్వామివి. నాకెంతో ముఖ్యమైన స్నేహితుడవు కూడా! నీవు నా కలల్నే కాదు... జాతి కలల్ని సాకారం చేశావ్. నీవల్లే ఒలింపిక్స్కు వెళ్లగలిగాను. మరెంతో మంది ఈక్వె్రస్టియన్లకు ప్రేరణగా నిలిచావు. నిన్ను నేను ఎప్పటికే మర్చిపోను. ఇన్నేళ్లు నా కోసం చెమటోడ్చిన నీకు విశ్రాంతి కావాలనే ఈ నిర్ణయం తీసుకున్నాను. హ్యాపి రిటైర్మెంట్ కారామెల్లో’ అని భావోద్వేగంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. -
తరుణ్ శుభారంభం
అయోవా (అమెరికా): యూఎస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. తెలంగాణ ప్లేయర్, ప్రపంచ 54వ ర్యాంకర్ తరుణ్ మన్నేపల్లి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా... ప్రపంచ మాజీ నంబర్వన్ కిడాంబి శ్రీకాంత్, ప్రపంచ 37వ ర్యాంకర్ ప్రియాన్షు రజావత్, ప్రపంచ 57వ ర్యాంకర్ శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్, ప్రపంచ 61వ ర్యాంకర్ రిత్విక్ సంజీవి సతీశ్ కుమార్ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. తొలి రౌండ్లో తరుణ్ 19–21, 21–18, 21–18తో ప్రపంచ 53వ ర్యాంకర్ అర్నాడ్ మెర్క్లే (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. 70 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన ఈ పోరులో కీలకదశలో తరుణ్ పాయింట్లు గెలిచి విజయాన్ని అందుకున్నాడు. తొలి గేమ్ను కోల్పోయిన తరుణ్... రెండో గేమ్లో స్కోరు 18–18 వద్ద వరుసగా మూడు పాయింట్లు నెగ్గి గేమ్ను దక్కించుకొని మ్యాచ్లో నిలిచాడు. నిర్ణాయక మూడో గేమ్లో 14–16తో వెనుకబడిన దశలో తరుణ్ విజృంభించి వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 19–16తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత రెండు పాయింట్లు చేజార్చుకున్న తరుణ్ వెంటనే తేరుకొని మరో రెండు పాయింట్లు నెగ్గి గేమ్తోపాటు మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత్కే చెందిన ఆయుశ్ శెట్టితో తరుణ్ తలపడతాడు. ఈ సీజన్లో తరుణ్ ఏడు టోర్నీల్లో ఆడి రెండింటిలో క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. మరోవైపు ప్రపంచ 50వ ర్యాంకర్ శ్రీకాంత్ 19–21, 21–12, 14–21తో ప్రపంచ 77వ ర్యాంకర్ హ్యారీ హువాంగ్ (ఇంగ్లండ్) చేతిలో, ప్రియాన్షు 10–21, 21–12, 7–21తో 106వ ర్యాంకర్ టింగ్ యెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో, శంకర్ 13–21, 19–21తో లియావో జు ఫు (చైనీస్ తైపీ) చేతిలో, రిత్విక్ 18–21, 12–21తో ఎనోగట్ రాయ్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయారు. శ్రియాన్షికి నిరాశ మహిళల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ క్రీడాకారిణి శ్రియాన్షి వలిశెట్టి, తాన్యా హేమంత్ తొలి రౌండ్లోనే నిష్క్రమించగా... భారత్కే చెందిన అన్మోల్ ఖరబ్, ఆకర్షి కశ్యప్, తన్వీ శర్మ, ఐరా శర్మ తొలి రౌండ్లో విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. శ్రియాన్షి 16–21, 21–23తో ఏడో సీడ్ పొలీనా బురోవా (ఉక్రెయిన్) చేతిలో, తాన్యా 21–10, 22–24, 16–21తో అమేలీ షుల్జ్ (డెన్మార్క్) చేతిలో ఓటమి పాలయ్యారు. అన్మోల్ 16–21, 21–13, 21–19తో తెరెజా స్విబికోవా (చెక్ రిపబ్లిక్)పై, ఆకర్షి 21–19, 21–10తో లియాంగ్ టింగ్ యు (చైనీస్ తైపీ)పై, తన్వీ శర్మ 21–19, 21–9తో రెండో సీడ్ ఎన్గుయెన్ థుయ్ లిన్ (వియత్నాం)పై గెలిచారు. హుంగ్ యిటింగ్ (చైనీస్ తైపీ)తో జరిగిన మ్యాచ్లో ఐరా శర్మ తొలి గేమ్ను 12–21తో కోల్పోయి, రెండో గేమ్ను 21–16తో సొంతం చేసుకుంది. నిర్ణాయక మూడో గేమ్లో స్కోరు 6–6తో సమంగా ఉన్నపుడు హుంగ్ యిటింగ్ గాయం కారణంగా మాŠయ్చ్ నుంచి వైదొలిగింది. మిక్స్డ్ డబుల్స్లో టాప్ సీడ్ తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల (భారత్) ద్వయం 21–17, 16–21, 17–21తో లిన్ యు చియె–హుంగ్ యుఎన్ (చైనీస్ తైపీ) జోడీ చేతిలో ఓడిపోయింది. -
భారత్ ‘తీన్మార్’
కౌలాలంపూర్: తుది పోరులో అదరగొట్టిన భారత స్క్వాష్ క్రీడాకారులు ఆసియా డబుల్స్ స్క్వాష్ చాంపియన్షిప్లో క్లీన్స్వీప్ చేశారు. ఫైనల్ చేరిన మూడు విభాగాల్లోనూ విజేతగా నిలిచి మూడు స్వర్ణ పతకాలతో మెరిశారు. పురుషుల డబుల్స్లో అభయ్ సింగ్–వెలవన్ సెంథిల్ కుమార్ జోడీ... మహిళల డబుల్స్లో అనాహత్ సింగ్–జోష్నా చినప్ప ద్వయం... మిక్స్డ్ డబుల్స్ లో అభయ్ సింగ్–అనాహత్ సింగ్ జంట పసిడి పతకాలను సొంతం చేసుకున్నాయి. పురుషుల డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ అభయ్–సెంథిల్ జోడీ 9–11, 11–5, 11–5తో నూర్ జమాన్–నాసిర్ ఇక్బాల్ (పాకిస్తాన్) జంటను ఓడించింది. మహిళల డబుల్స్ తుది పోరులో అనాహత్–జోష్నా ద్వయం 8–11, 11–9, 11–10తో ఐనా అమాని–జిన్ యింగ్ యీ (మలేసియా) జోడీపై విజయం సాధించింది. మిక్స్డ్ డబుల్స్ టైటిల్ సమరంలో అభయ్–అనాహత్ జంట 11–9, 11–7తో రాచెల్ అర్నాల్డ్–అమీòÙన్రాజ్ చందరన్ (మలేసియా) ద్వయంపై గెలుపొందింది. -
నేటి నుంచి ‘పంచ్’ పండుగ
సాక్షి, హైదరాబాద్: టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గోహైన్, రెండుసార్లు ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్తో పాటు పలువురు అంతర్జాతీయ బాక్సర్లు మహిళల ఎలైట్ బాక్సింగ్ టోర్నమెంట్ బరిలో దిగనున్నారు. హైదరాబాద్లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం వేదికగా నేటి నుంచి ప్రారంభంకానున్న ఈ టోర్నీ జూలై 1న ముగియనుంది. 10 వెయిట్ కేటగిరీల్లో పోటీలు జరగనుండగా... 15 యూనిట్లకు చెందిన 100 మందికిపైగా బాక్సర్లు ఇందులో పాల్గొననున్నారు. తెలంగాణ బాక్సింగ్ సంఘం, భారత బాక్సింగ్ సమాఖ్య, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ సంయుక్తంగా ఈ టోర్నీని నిర్వహించనున్నాయి. ఆతిథ్య తెలంగాణతో పాటు రైల్వేస్, హరియాణా, ఆలిండియా పోలీస్, సర్వీసెస్, పంజాబ్, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్తాన్, మహారాష్ట్ర, తమిళనాడు, సిక్కీం, భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కంబైన్డ్ నేషనల్ ఎక్స్లెన్ సెంటర్ టీమ్, టాప్స్ కోర్, డెవలప్మెంట్ జట్లు బరిలోకి దిగుతాయి. ప్రపంచ చాంపియన్షిప్ కాంస్య పతక విజేత మనీషా, ఒలింపియన్ ప్రీతి, వరల్డ్ యూత్ చాంపియన్ అరుంధతి చౌధరీ కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఒక్కో విభాగంలో స్వర్ణ, రజతాలు సాధించిన బాక్సర్లు... పాటియాలాలో జరిగే ఎలైట్ జాతీయ శిబిరానికి ఎంపిక కానున్నారు. ‘భారత మహిళల బాక్సింగ్లోని పోటీతత్వానికి ఈ టోర్నమెంట్ నిదర్శనం కానుంది. అనుభవజు్ఞలు, యువ బాక్సర్ల మిళితమైన ఈ టోర్నమెంట్ ద్వారా కొత్తగా బాక్సింగ్లో అడుగుపెట్టిన వాళ్లు అనుభవం గడిస్తారు. మెరుగైన ప్రదర్శన కనబర్చిన వాళ్లను జాతీయ శిబిరానికి ఎంపిక చేస్తాం. కొత్త ప్రతిభను వెలికి తీసేందుకు ఇది ఉపయోగపడనుంది. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఇది ఉపకరిస్తుంది’ అని భారత బాక్సింగ్ సమాఖ్య అధ్యక్షుడు అజయ్ సింగ్ పేర్కొన్నారు. ఒక్కో జట్టు నుంచి 10 మంది బాక్సర్లు బరిలోకి దిగనున్నారు. ప్రపంచ బాక్సింగ్ నిబంధనల ప్రకారం నిర్వహించనున్న ఈ టోర్నమెంట్ ఒక్క బౌట్లో మూడు రౌండ్లు ఉంటాయి. ఒక్కో రౌండ్ వ్యవధి 3 నిమిషాలు కాగా... రౌండ్ల మధ్యలో ఒక్కో నిమిషం విరామం ఉటుంది. -
భారీ బృందంతో బరిలోకి భారత్
న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరిగే ప్రతిష్టాత్మక ఆసియా అండర్–19 జూనియర్ టీమ్, వ్యక్తిగత బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత్ భారీ బృందంతో బరిలోకి దిగనుంది. ఐదు విభాగాల్లో కలిపి భారత్ నుంచి మొత్తం 19 మంది క్రీడాకారులు ఈ టోర్నీ లో పోటీపడనున్నారు. ఇండోనేసియాలోని సోలో నగరంలో జూలై 18 నుంచి 27వ తేదీ వరకు ఈ టోర్నీని నిర్వహిస్తారు. భారత జట్టులో తెలంగాణ నుంచి నలుగురు... ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు. తెలంగాణకు చెందిన ప్రణవ్ రామ్ నాగలింగం పురుషుల సింగిల్స్లో, తన్వీ రెడ్డి అంద్లూరి మహిళల సింగిల్స్లో ఆడతారు. తెలంగాణకే చెందిన వెన్నెల కలగోట్ల సింగిల్స్తోపాటు డబుల్స్లో, మిక్స్డ్ డబుల్స్లో మంచాల కీర్తి పోటీపడుతారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన అరిగెల భార్గవ్ రామ్, గొబ్బూరు విశ్వతేజ్ పురుషుల డబుల్స్లో... కోడె విష్ణు కేదార్ మిక్స్డ్ డబుల్స్లో బరిలోకి దిగుతారు. భారత జట్టు: అన్ష్ నేగి, లాల్థజువాలా, రౌనక్ చౌహాన్, ప్రణవ్ రామ్ నాగలింగం (పురుషుల సింగిల్స్). రుజులా రాము, తన్వీ శర్మ, తన్వీ రెడ్డి అంద్లూరి, వెన్నెల కలగోట్ల (మహిళల సింగిల్స్). అరిగెల భార్గవ్ రామ్, గొబ్బూరు విశ్వతేజ్, భవ్య ఛాబ్రా, పరమ్ (పురుషుల డబుల్స్). వెన్నెల, రేషిక, గాయత్రి, మాన్సా రావత్ (మహిళల డబుల్స్). కోడె విష్ణు కేదార్, మంచాల కీర్తి, లాల్రామ్సాంగా, తారిణి సూరి (మిక్స్డ్ డబుల్స్). -
మహిళల గేమ్ మారింది
బెంగళూరు: భారత మహిళల బ్యాడ్మింటన్కు సైనా నెహ్వాల్ జోష్ తెస్తే... పతకాలు, ఘన విజయాలతో ముఖచిత్రాన్నే మార్చిన స్టార్ షట్లర్ మాత్రం ముమ్మూటికి పీవీ సింధునే! ఒలింపిక్ పతకాలు, ప్రపంచ చాంపియన్షిప్, కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల పతకాలతో చైనాకు సవాల్గా నిలిచిన బ్యాడ్మింటన్ తార సింధు కొంతకాలంగా పతకాల వేటలో వెనుకబడింది. అయితే రేసులో వెనుకబడినా... తన సత్తాలో ఏ మార్పూ లేదని చెప్పింది. ఆధునిక మహిళల బ్యాడ్మింటన్ ఆటతీరు చెప్పుకోదగ్గ స్థాయిలో మారిందని వివరించింది. కోర్టులో ఎదురుపడే ప్రత్యర్థులే కాదు... సుదీర్ఘ ర్యాలీలు సైతం మహిళా షట్లర్ల సామర్థ్యానికి కఠిన పరీక్ష పెడుతున్నాయని చెప్పింది. ఇక్కడి స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కేంద్రానికి వచ్చిన సింధు మీడియాతో ముచ్చటించిన కబుర్లు ఆమె మాటల్లోనే... ‘సింగిల్స్’ అప్పట్లా లేదు బ్యాడ్మింటన్లో ప్రత్యేకించి మహిళల సింగిల్స్ పూర్తిగా మారింది. మొదట్లో అటాకింగ్, వేగవంతమైన ర్యాలీలే కనిపించేవి. మ్యాచ్ను ముగించేవి. కానీ ఇప్పుడు సుదీర్ఘ ర్యాలీలు మరింత పోటీని తెచ్చాయి. దీని వల్ల మ్యాచ్లు పోటాపోటీగా చాలా సేపు సాగుతున్నాయి. ప్రతీ పాయింట్ను కాపాడుకునేందుకు రక్షణాత్మక ధోరణితో ఆడుతుండటంతోనే మ్యాచ్ల టైమింగ్ పెరుగుతోంది. మారిన పరిస్థితులకు తగ్గట్టే మన ఆటతీరు మార్చుకోవాల్సిందే. ఫిట్నెస్ కీలకం ఆటలో దూకుడు కనబర్చాలంటే... అభివృద్ధి చెందుతున్న టెంపోకు అనుగుణంగా మన ఆటతీరును మార్చాలంటే ఫిట్నెసే కీలకం. అందుకే నేను నా శారీరక సత్తాను మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెట్టాను. అప్పుడే నేను సహనంతో కోర్టులో ఎంతసేపైనా ఆడగలుగుతాను. ఇప్పుడు ప్రత్యర్థిపై ఫోకస్ కంటే ఇలాంటి మార్పులపైనే మరింత దృష్టి సారించాల్సిన అవసరం వచ్చింది. కొత్త కోచ్ కూడా సుదీర్ఘ సమయం ఆడటంపైనే శిక్షణ ఇస్తున్నారు. ఎప్పుడూ ఒకేలా ఉండలేం ఎవరైనా సరే ఎప్పుడు కూడా ఒకేలా ఉండలేరు. ఆడలేరు. పదేళ్ల క్రితం ఆడిన ఆటే ఇప్పుడు ఆడాలంటే ఎలా? అప్పటి ఆట, శిక్షణ, పరిస్థితులు వేరు. ఇప్పుడు ఎదురవుతున్న సవాళ్లు వేరు. ఇవన్నీ అర్థం చేసుకొని ఆడగలగడమే ముఖ్యం. అయితే కెరీర్లో నా సాఫల్యాల పట్ల సంతృప్తిగానే ఉన్నాను. కామన్వెల్త్, ఆసియా, ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్షిప్ పతకాలన్నీ గెలిచాను. ఇప్పుడు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడితే చాలు. మళ్లీ పతకాల బాట పట్టొచ్చు. ఫలితాలు నిరాశ పరిచాయి కొన్నాళ్లుగా కోర్టులో ఫలితాలు, నా ఆటతీరు నిరాశపరిచిన మాట నిజమే. అయితే ఈ వైఫల్యాలను అధిగమించేందుకు ఇటీవల తీవ్రమైన కసరత్తులు చేశాను. ఐదారు టోర్నీల్లో తొలి రౌండ్లలోనే ఓడిపోయాను. ఇప్పుడలా ఉండదు. తప్పకుండా మెరుగైన ఆటతీరునే చూస్తారు. క్లిష్టమైన ప్రత్యర్థులు ఎదురైనపుడే మనం మరింత కష్టపడతాం. నేను కూడా అంతే సానుకూల దృక్పథంతో అడుగు ముందుకు వేయాలనుకుంటున్నాను. -
అఖిల భారత చెస్ సమాఖ్య కొత్త పథకం
న్యూఢిల్లీ: యువ క్రీడాకారులకు ఆర్థికపరంగా అండగా నిలిచేందుకు అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) కొత్త పథకంతో ముందుకు వచ్చింది. ఇకపై జాతీయ స్థాయి క్రీడాకారులకు శిక్షణ తదితర అవసరాల కోసం ఉపకార వేతనం అందిస్తామని ప్రకటించింది. దీనికి సంబంధించి ఏప్రిల్–జూన్ మధ్య కాలానికి ఇప్పటికే రూ. 42.30 లక్షలను నేరుగా ఆటగాళ్ల అకౌంట్లకు బదిలీ చేసింది.ఈ పథకం ద్వారా ప్రయోజనం అందుకునే వారిలో అండర్–7 నుంచి అండర్–19 వయో విభాగాల క్రీడాకారులు ఉన్నారు. రూ. 60 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు ఒక్కో ఆటగాడికి లభించాయి. ‘భారత చెస్లో తొలిసారి బాలుర విభాగంలో 39 మంది, బాలికల విభాగంలో 39 మంది ఆటగాళ్లను గుర్తించి భవిష్యత్తు కోసం వారిని తీర్చిదిద్దుతున్నాం. దీని ద్వారా వారికి కీలక దశలో ఆర్థికపరంగా వెసులుబాటు లభిస్తుంది.ఇతరత్రా కూడా అన్ని రకాలుగా మేం మద్దతు అందిస్తాం. మరోవైపు జాతీయ స్థాయి టోర్నీల సంఖ్యను పెంచి పోటీల్లో పాల్గొనే అవకాశాలు కూడా పెంచుతాం. దాని వల్ల మంచి ప్రతిభ వెలుగులోకి వస్తుంది’ అని ఏఐసీఎఫ్ అధ్యక్షుడు నితిన్ నారంగ్ తెలిపారు. ఈ జాబితాలో తెలంగాణ నుంచి దివిత్ రెడ్డి , నిధీశ్ శ్యామల్ (అండర్–9), శ్రీరామ్ ఆదర్శ్ ఉప్పల, బి.కీర్తిక (అండర్–17), శరణ్య దేవి నరహరి (అండర్–13), ఆదిరెడ్డి అర్జున్, వేల్పుల సరయు (అండర్–19) ఉన్నారు. -
భారత షూటింగ్ లీగ్కు అనూహ్య స్పందన
న్యూఢిల్లీ: భారత షూటింగ్ లీగ్ (ఎస్ఎల్ఐ)లో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా షూటర్లు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న ఈ లీగ్ కోసం ఇప్పటి వరకు దేశవిదేశాలకు చెందిన 400 మందికి పైగా షూటర్లు పేర్లు నమోదు చేసుకున్నట్లు జాతీయ రైఫిల్ సంఘం (ఎన్ఆర్ఏఐ) బుధవారం వెల్లడించింది. ఇందులో కజకిస్తాన్, రష్యా, ఇరాన్, హంగేరి, క్రొయేషియా, అజర్బైజాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, గ్రెనెడా, ఇటలీ, ఆ్రస్టేలియా, ఆ్రస్టియా, సెర్బియా, అమెరికా, స్పెయిన్, థాయ్లాండ్, జర్మనీ, చెక్ రిపబ్లిక్, నార్వే, సాన్ మారినో, రొమానియా దేశాలకు చెందిన షూటర్లు ఉన్నారు. తొలిసారి నిర్వహిస్తున్న ఈ లీగ్కు అనూహ్య స్పందన రావడం ఆనందంగా ఉందని ఎన్ఆర్ఏఐ అధ్యక్షుడు కాళికేశ్ నారాయణ్ సింగ్ పేర్కొన్నారు. ‘ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న భారత షూటింగ్ లీగ్ పై స్పష్టమైన అవగాహనతో ఉన్నాం. ప్రపంచ స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నాం. భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలిచేవిధంగా సహృద్భావ వాతావరణంలో పోటీలు నిర్వహిస్తాం’ అని అన్నారు. జూలై వరకు పేర్లు నమోదు చేసుకునే ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 2 వరకు ఎస్ఎల్ఐ తొలి సీజన్ జరిగే అవకాశం ఉంది. లీగ్లో పిస్టల్ విభాగంలో 10 మీటర్లు, 25 మీటర్లు... రైఫిల్ విభాగంలో 10 మీటర్లు, 50 మీటర్లు, ‘త్రీ’ పొజిషన్... షాట్గన్ విభాగంలో ట్రాప్, స్కీట్లో పోటీలు నిర్వహించనున్నారు. లీగ్లో కనీసం ఆరు జట్లు పాల్గొననుండగా... రెండు గ్రూప్లుగా విభజించి పోటీలు చేపట్టనున్నారు. ఆటగాళ్లను ఎలైట్ చాంపియన్స్, వరల్డ్ ఎలైట్, నేషనల్ చాంపియన్స్, యూత్ చాంపియన్స్ అనే నాలుగు కేటగిరీల్లో విభజించనున్నారు -
జర్మనీ ఫుట్బాల్ సమాఖ్యకు జరిమానా
బెర్లిన్: జర్మనీ ఆతిథ్యమిచ్చిన 2006 ప్రపంచకప్ పన్ను ఎగవేత కేసులో జర్మనీ ఫుట్బాల్ సమాఖ్యకు జరిమానా పడింది. ఈ కేసులో సుదీర్ఘ వాదనల అనంతరం ఫ్రాంక్ఫర్ట్ స్థానిక కోర్టు బుధవారం తీర్పు వెల్లడించింది. పన్ను ఎగవేతకు పాల్పడిన జర్మనీకి 1,28,000 డాలర్లు (రూ. 1 కోటీ 10 లక్షలు) జరిమానా విధించింది. ప్రపంచకప్ ప్రారంభానికి ఒక ఏడాది ముందు అంటే 2005లో ‘ఫిఫా’ నిర్దేశించిన పన్నులు చెల్లించడంలో జర్మనీ విఫలమైంది.దీంతో జరిమానా భారీ మొత్తంలో ఉండాలని ‘ఫిఫా’ తరఫున న్యాయవాదులు పట్టుబట్టారు. ప్రపంచకప్ ప్రారంబోత్సవం కోసం తీసుకున్న రుణాన్ని దాచిపెట్టిన జర్మనీ ఫుట్బాల్ సమాఖ్య.. ఓ ఏడాది తర్వాత దాన్ని వ్యాపార ఖర్చుగా తప్పుగా వెల్లడించింది. ఆ తర్వాత దాన్ని రద్దు చేసింది. ఈ మొత్తం వ్యవహారంతో సంబంధం ఉన్న జర్మనీ ఫుట్బాల్ సమాఖ్య ప్రతినిధులు జ్వాన్జిగర్, వోల్ఫ్గ్యాంగ్, నీర్స్బాచ్, హోర్ట్స్ స్మిత్లపై తొలుత విచారణ సమయంలో అభియోగాలు మోపారు. వాటిని ఖండించిన ఈ ముగ్గురూ జరిమానాలు చెల్లించిన తర్వాత వారిపై వేసిన విచారణలను రద్దు చేశారు. -
మాగ్నస్ కార్ల్సెన్కు చెమటలు పట్టించిన 9 ఏళ్ల ఢిల్లీ బాలుడు
ప్రపంచ చెస్ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్సెన్కు ఢిల్లీకి చెందిన తొమ్మిదేళ్ల ఆరిత్ కపిల్ చెమటలు పట్టించాడు. మంగళవారం అర్ధరాత్రి ప్రముఖ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో జరిగిన 'ఎర్లీ టైటిల్డ్ ట్యూస్డే' చెస్ టోర్నమెంట్లో కార్ల్సెన్ను ఆరిత్ ఓడించినంత పనిచేశాడు.తొమ్మిదేళ్ల అరిత్ ఎత్తుల ముందు ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన కార్ల్సెన్ తడబడ్డాడు. అయితే ఆఖరి రౌండ్లో సమయం దగ్గరపడుతుండంతో కపిల్ తనకు లభించిన అవకాశాన్ని ఉపయెగించుకోలేకపోయాడు. దీంతో గేమ్ డ్రాగా ముగిసింది.ఆరిత్ ఈ ఈవెంట్లో జార్జియా నుంచి పాల్గోన్నాడు. అతడు ప్రస్తుతం జార్జియా వేదికగా జరుగుతున్న అండర్-10 ప్రపంచ ఛాంపియన్షిప్లో పోటీపడుతున్నాడు. ఇప్పటికే రెండు రౌండ్లలో విజయం సాధించిన అరిత్..బుధవారం తన మూడవ గేమ్ ఆడనున్నాడు. అంతకుముందు అండర్-9 ప్రపంచ ఛాంపియన్షిప్ రన్నరప్గా ఆరిత్ నిలిచాడు.మరోవైపు భారత్కు చెందిన వి. ప్రణవ్ 10 పాయింట్లతో ఈ 'ఎర్లీ టైటిల్డ్ ట్యూస్డే' టైటిల్ను సొంతం చేసుకున్నాడు. అమెరికన్ గ్రాండ్మాస్టర్ హాన్స్ మోక్ నీమాన్ , కార్ల్సెన్ ఇద్దరూ 9.5 పాయింట్లతో ముగించారు. కానీ టైబ్రేక్లో నీమాన్ రెండవ స్థానాన్ని దక్కించుకున్నాడు.చదవండి: అనుభవం ఉండి ఏం లాభం?.. మరీ ఇలా ఆడతావా?: డీకే ఫైర్ -
ఆండీ ముర్రే అరుదైన ఘనత
లండన్: వింబుల్డన్ గ్రాండ్స్లామ్ ఈవెంట్ మరో రెండేళ్లలో150వ వార్షికోత్సవం జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో బ్రిటన్ మేటి టెన్నిస్ ఆటగాడు ఆండీ ముర్రే విగ్రహాన్ని ఆవిష్కరించాలని ఆల్ ఇంగ్లండ్ క్లబ్ భావించింది. దీని కోసం ముర్రే సంబంధిత కళాకారులతో కలిసి పనిచేయనున్నట్లు తెలిసింది. ముర్రే చుట్టుకొలతలు, ఒద్దిక, పొడవుల్ని వారితో పంచుకోనున్నాడు. నిజానికి ‘బిగ్–త్రీ’ ఫెడరర్–నాదల్–జొకోవిచ్లతో ముర్రే సమకాలికుడైనప్పటికీ ఆ ముగ్గురితో పోల్చదగిన దిగ్గజమైతే కాదు. అయితే ముర్రే 2013లో వింబుల్డన్ టైటిల్తో 77 ఏళ్ల బ్రిటన్ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించడం ద్వారా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 1936లో ఫ్రెడ్ పెర్రీ గెలిచిన తర్వాత మరే బ్రిటన్ ప్లేయర్ వింబుల్డన్లో గెలుపొందలేకపోయాడు.ఏడున్నర దశాబ్దాల తర్వాత ఎట్టకేలకు ముర్రే వింబుల్డన్ టైటిల్తో బ్రిటన్ ముచ్చట తీర్చాడు. 2027లో జరిగే 150 ఏళ్ల వింబుల్డన్ పండగలో ముర్రేతో పాటు పెర్రీ విగ్రహాన్ని కూడా ఆవిష్కరిస్తారు. ముర్రే తన కెరీర్లో మూడు గ్రాండ్స్లామ్ టైటిళ్లను గెలిచాడు. 2012లో యూఎస్ ఓపెన్ గెలిచిన అతను 2013, 2016లలో వింబుల్డన్ విజేతగా నిలిచాడు. ఇక ఈ సీజన్ వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నీ ఈ నెల 30 నుంచి జరుగుతుంది. ఇదీ చదవండి: క్వార్టర్స్లో యూకీ జోడీ మలోర్కా (స్పెయిన్): వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీకి సన్నాహాల్లో భాగంగా మలోర్కా ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో బరిలోకి దిగిన భారత స్టార్ యూకీ బాంబ్రీ శుభారంభం చేశాడు. రాబర్ట్ గాలోవే (అమెరికా)తో జత కలిసి ఈ టోర్నీలో పోటీపడుతున్న యూకీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు.పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో యూకీ–గాలోవే ద్వయం 6–3, 6–3తో గ్రెగోరి జాక్–అలెగ్జాండర్ ముల్లర్ (ఫ్రాన్స్) జోడీపై విజయం సాధించింది. 75 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో యూకీ–గాలోవే ఆరు ఏస్లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్లు చేశారు. తమ సర్వీస్ను ఒక్కసారి కూడా చేజార్చుకోని యూకీ–గాలోవే ప్రత్యర్థి సర్వీస్ను మూడుసార్లు బ్రేక్ చేశారు. -
అన్నీ ఆయనే చూసుకున్నాడు
న్యూఢిల్లీ: ఒలింపిక్స్ చరిత్రలో తొలి పతకాన్ని గెలిచిన భారత మహిళా రెజ్లర్గా ఘనత వహించిన సాక్షి మలిక్ తన అంతరంగాన్ని ఆవిష్కరించింది. ఓ అథ్లెట్గా ఎదిగిన వైనం, తల్లిగా... భార్యగా... మారిన విధానంతో ‘గేమ్ ఆన్’ తొలి ఎపిసోడ్ రూపుదిద్దుకుంది. ప్రీతి దహియా హోస్ట్గా వ్యవహరించిన ఈ పాడ్కాస్ట్లో సాక్షి తనను తాను పరిచయం చేసుకుంది. తన రెజ్లింగ్ పయనం... గృహిణిగా బాధ్యతలు ఇలా పదిలమైన జ్ఞాపకాలు, మధురమైన క్షణాలు అన్ని పంచుకుంది. క్రికెట్ మతమైన దేశంలో మిగతా ఆటల్లోని ఆణిముత్యాల్ని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో సాక్షి సంగతులన్నీ ఇలా చెప్పుకొచ్చింది. ‘ప్రేమ, పెళ్లికి ముందే సత్యవర్త్ కడియాన్ ఓ రెజ్లర్గానే తెలుసు. 2011లో ఇ చ్చిన పుస్తకం, నేను రాసుకున్న ఊసులు, పోడియంపై ఊహించుకున్న బాసలు, రాత్రిళ్లు త్రివర్ణ పతకంతో పాటే నిదరోవడం అన్ని ఓ మెరుపు కలలు కానే కావు. నిజ జీవితంలో నిజమైన అనుభూతులు’ అని ముచ్చటగా చెప్పింది. రెజ్లింగ్లో నా అడుగులు ‘మా కుటుంబంలో రెజ్లర్లు ఎవరూ లేరు. అలాంటి నాకు రెజ్లింగ్పై ఆసక్తి కలగడానికి జపాన్ దిగ్గజ రెజ్లర్ సావోరి యోషిదానే కారణం. ఓసారి విమానంలో విదేశీయానం చేసిన నాకు మూడుసార్లు ఒలింపిక్ చాంపియన్ అయిన ఆమె గురించి తెలిసింది. అప్పుడే నా కెరీరే రెజ్లింగ్ అయ్యింది. రెజ్లింగే తదనంతరం జీవితమైంది. కెనడాలో జరిగిన ప్రపంచ చాంపియన్షిప్లో నా అభిమాన రెజ్లర్ యోషిదాను కలుసుకోవడంతో ఆనందం రెట్టింపైంది. అప్పుడే అనుకున్న నాకు ఆడబిడ్డ పుడితే యోషిదా పేరే పెట్టాలని! చివరకు అనుకున్నట్లే భగవంతుడు కుమార్తెనే ఇచ్చాడు. నేను గట్టిగా అనుకున్న పేరే పెట్టుకున్నాను’ ఫేస్బుక్ రిక్వెస్ట్తో... ‘నేను... నా భర్త సత్యవర్త్ బాల్యం గడిపింది, చదివింది ఒకే చోటే అయినా కూడా ఒకరికొకరం తెలియదు. ఓ ఫేస్బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్తో మొదట టెక్ట్స్ (అక్షరాలు) కలిసింది. ఆ తర్వాతే మాట, బాట అన్ని కలిశాయి. రెజ్లింగ్ కెరీర్ కూడా ఇద్దరివి సమాంతరంగానే సాగాయి. మా క్రీడా ప్రయాణం, ప్రేమాయనం, 2014 కామన్వెల్త్ క్రీడల్లో పతకాల విజయం అన్ని కలిసే పయనించాయి. గ్లాస్గోలో రజతాలు గెలిచినపుడే సత్యవర్త్ ప్రేమ ప్రస్తావన తెచ్చాడు. కానీ నేనైతే ఒలింపిక్ పతకం వచ్చేదాకా ప్రేమపంజరంలో ఇరుక్కోనని చెప్పా. అప్పుడు నా జీవితమంతా రెజ్లింగే. నేను ఆశించినట్లే తను నా ప్రేమకై నిరీక్షించాడు. నా లక్ష్యం (రియో ఒలింపిక్ పతకం) సాకారమవగానే మా ప్రేమ తీరం కూడా చేరుకున్నాం’.ప్రసవానికి ముందు రోజు కూడా... ‘నేను నా కుమార్తెను ప్రసవించడానికి ముందు రోజు కూడా బాగా సిద్దమయ్యాను. ఎందుకంటే నేనొక అథ్లెట్ను. ప్రసవానంతర ఒత్తిడి నన్ను దరిచేరదని భావించా. కానీ చిత్రంగా నేను ఇంటికెళ్లగానే పది–పదిహేను రోజుల పాటు ఏడుపును ఆపుకోలేకపోయాను. నా దగ్గరే బిడ్డ వుండటం కూడా కష్టంగా ఉండేది. అసలేమి జరుగుతుందో అర్థమయ్యేది కాదు అప్పుడు. నెలలు గడిచేకొద్దీ పరిస్థితిలో మార్పొచ్చింది. ఇప్పుడు పాపకు ఏడు నెలలు నిండాయి. మా అందరిలో ఆమెనే బలవంతురాలని అనిపిస్తుంది. చాలా ముద్దొస్తుంది. ఎంతటి క్రీడాకారులైనా కూడా మాతృత్వపు భావోద్వేగాలకు అతీతులు కాలేరనే విషయం అప్పుడే నాకు అర్థమైంది. ఇందులో ముఖ్యంగా నా భర్త అండదండల గురించి చెప్పుకోవాలి. ఎంతో ఓపిగ్గా, మురిపెంగా పాపని నన్ను చూసుకున్నారు’.జపనీస్ దిగ్గజం పేరది ‘మా ముద్దుల పాప పేరు యోషిదా. బహుశా మేమిద్దరం రెజ్లర్లు కావడంతో పాటు నాకెంతగానో స్ఫూర్తినిచి్చన జపాన్ రెజ్లింగ్ దిగ్గజం సావోరి యోషిదా పేరే పెట్టుకున్నాం. మా బిడ్డకు అమ్మలాలన తక్కువైనా తండ్రి ప్రేమ మాత్రం అపారం. నేను ఆరోగ్యంగా ఉండేందుకు, తగినంత విశ్రాంతి తీసుకునేందుకు సత్యవర్త్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాడు. రోజూ రాత్రి 11 నుంచి తెల్లవారు జాము 3 గంటల వరకు నా భర్తే తల్లి పాత్ర పోషిస్తాడు. ఆ తర్వాత 3 నుంచి ఉదయం 8 గంటల వరకు నేను పాప సంగతి చూసుకుంటాను. ఈ సమయంలోనే సత్యవర్త్ విశ్రాంతి తీసుకుంటాడు’. -
విజేత లలిత్
ముంబై: ఆరియన్ప్రొ ముంబై ఓపెన్ అంతర్జాతీయ గ్రాండ్మాస్టర్ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ ముసునూరి రోహిత్ (ఎంఆర్) లలిత్ బాబు చాంపియన్గా అవతరించాడు. మంగళవారం ముగిసిన ఈ టోర్నీలో విజయవాడకు చెందిన 32 ఏళ్ల లలిత్ బాబు ఎనిమిది పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. లలిత్తోపాటు అర్మేనియాకు చెందిన మామికోన్ ఘరిబియాన్ కూడా 8 పాయింట్లు సంపాదించాడు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా విజేతను నిర్ణయించగా... లలిత్ బాబుకు టైటిల్ ఖరారైంది. 150 మంది ప్లేయర్ల మధ్య స్విస్ ఫార్మాట్లో తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో లలిత్ బాబు ఏడు గేముల్లో గెలిచి, మరో రెండు గేమ్లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచాడు. చివరిదైన తొమ్మిదో రౌండ్లో నల్ల పావులతో ఆడిన లలిత్ 72 ఎత్తుల్లో జార్జియా గ్రాండ్మాస్టర్ లెవాన్ పాంట్సులయపై గెలుపొందాడు. 2012లో భారత 26వ గ్రాండ్మాస్టర్ (జీఎం)గా అవతరించిన లలిత్ బాబు 2014 చెస్ ఒలింపియాడ్లో కాంస్య పతకం గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. కామన్వెల్త్ చాంపియన్గా నిలిచిన లలిత్ ఆసియా చాంపియన్షిప్లో రజతం కూడా సాధించాడు. ఓవరాల్గా లలిత్ తన కెరీర్లో ఇప్పటి వరకు 20 స్వర్ణాలు, 15 రజతాలు, 14 కాంస్య పతకాలు సాధించాడు. -
‘పట్టుదలతో కట్టిపడేశాడు’
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రస్తుత అధ్యక్షుడు, గతంలో బీసీసీఐ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించిన జై షాపై భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసలు కురిపించాడు. 2019 నుంచి 2022 వరకు గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా వ్యవహరించిన సమయంలో జై షా బోర్డు కార్యదర్శిగా పనిచేశాడు. వీరిద్దరి మధ్య చక్కటి అనుబంధం ఉంది. రాజకీయ నేపథ్యం ఉన్న జై షా నిజాయితీ, పట్టుదల తనను ఎంతో ఆకట్టుకున్నాయని గంగూలీ పేర్కొన్నాడు. ‘అప్పగించిన పనులు పూర్తి చేయడంలో జై షా చాలా ప్రత్యేకం. అతడు భారత క్రికెట్ అభివృద్ధికి సహకరించాడు. రాజకీయ నేపథ్యం నుంచి రావడంతో అతడి నిర్ణయాల్లో మొండితనం, ఓరకమైన దృఢత్వం ఉంటుందని ఆశించా. కానీ అందుకు భిన్నమైన తీరుతో నిజాయితీ, పట్టుదలతో ఆకట్టుకున్నాడు. ఎప్పుడూ ఆట గురించే ఆలోచిస్తాడు. దీన్ని మరింత మెరుగు పరిచేందుకు ఎలాంటి చర్యలు చేపట్టొచ్చా అని మార్గాలు వెతుకుతుంటాడు’ అని గంగూలీ అన్నాడు. కోవిడ్–19 వంటి క్లిష్ట సమయంలో బోర్డు అధ్యక్ష, కార్యదర్శులుగా పనిచేసిన గంగూలీ, జై షా ఆటగాళ్ల సంరక్షణ కోసం ఎన్నోచర్యలు చేపట్టారు. కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా క్రీడా కార్యకలాపాలు ఆగిపోయిన దశలోనూ ‘బయోబబుల్’ వంటి ప్రత్యేక ఏర్పాట్లతో ద్వైపాక్షిక సిరీస్లు, ఐపీఎల్ వంటి టోర్నీలను నిర్వహించారు. 2022లో పదవీకాలం ముగియడంతో గంగూలీ స్థానంలో రోజర్ బిన్నీ బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగా... గతేడాది వరకు కార్యదర్శిగా కొనసాగిన 36 ఏళ్ల జై షా... 2024 నవంబర్లో ఐసీసీ చైర్మన్గా నియమితుడయ్యాడు. తద్వారా పిన్న వయసులో ఈ బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా నిలిచాడు. ‘2019లో తొలిసారి అతడిని కలిశాను. గుజరాత్ క్రికెట్ సంఘంలో పనిచేసి వచ్చాడు. చిన్నపిల్లవాడిలా కనిపించాడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా అండగా నిలిచేవాడు. ఏ సమయంలో అయినా సంప్రదించగానే స్పందించేవాడు. అతడికి ఆటపై స్పష్టమైన అభిప్రాయాలు, అవగాహన ఉంది. ఆటగాళ్లకు ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటాడు. క్రికెట్ను మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఉన్నత లక్ష్యం అతని ఎదుగుదలకు సహకరించింది. అనుభవంతో మరింత రాటుదేలాడు. ఇప్పుడు క్రికెట్లో అత్యున్నత పదవైన ఐసీసీ చైర్మన్ బాధ్యతలు చేపడుతున్నాడు. నిజాయితీగా పనులు పూర్తి చేస్తాడు. ఇప్పటికీ అతడితో మంచి అనుబంధం కొనసాగుతోంది’ అని గంగూలీ వివరించాడు. -
నీరజ్ చోప్రాకు స్వర్ణ పతకం
ఒ్రస్టావా (చెక్ రిపబ్లిక్): భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా... ఒ్రస్టావా గోల్డెన్ స్పైక్ అథ్లెటిక్స్ మీట్లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. గతవారం పారిస్ డైమండ్ లీగ్ మీట్లో ‘టాప్’లో నిలిచిన నీరజ్... మంగళవారం జరిగిన పోటీల్లో జావెలిన్ను 85.29 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానం దక్కించుకున్నాడు. నాలుగు రోజుల వ్యవధిలో నీరజ్కు ఇది రెండో టైటిల్ కావడం విశేషం. ఈ మీట్లో తొలిసారి బరిలోకి దిగిన నీరజ్ అందరికంటే మెరుగైన ప్రదర్శనతో విజేతగా నిలిచాడు. డౌ స్మిత్ (84.12 మీటర్లు; దక్షిణాఫ్రికా), అండర్సన్ పీటర్స్ (83.63 మీటర్లు; గ్రెనెడా) వరుసగా రెండో, మూడో స్థానాల్లో నిలిచారు. తొలి ప్రయత్నంలో ఫౌల్ చేసిన నీరజ్... రెండో ప్రయత్నంలో ఈటెను 83.45 మీటర్ల దూరం విసిరాడు.మూడో ప్రయత్నంలో అత్యుత్తమంగా 85.29 మీటర్ల దూరాన్ని నమోదు చేసుకున్న భారత అథ్లెట్.. తర్వాతి ప్రయత్నాల్లో ఆకట్టుకోలేకపోయాడు. నీరజ్ కోచ్, చెక్ రిపబ్లిక్ గ్రేట్ అథ్లెట్ జాన్ జెలెజ్నీ గతంలో ఈ మీట్లో తొమ్మిదిసార్లు విజేతగా నిలిచాడు. -
ఆటకు హాకీ స్టార్ లలిత్ బైబై
న్యూఢిల్లీ: భారత వెటరన్ హాకీ ఆటగాడు లలిత్ ఉపాధ్యాయ్ అంతర్జాతీయ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టోక్యో ఒలింపిక్స్, పారిస్ ఒలింపిక్స్లలో కాంస్య పతకం గెలుపొందిన భారత జట్టులో ఫార్వర్డ్ ప్లేయర్గా కీలకపాత్ర పోషించాడు. పదేళ్ల సుదీర్ఘ కెరీర్కు వీడ్కోలు పలికేందుకు ఇదే సరైన సమయమని ఉత్తరప్రదేశ్కు చెందిన 31 ఏళ్ల లలిత్ భావించాడు. 2014 ప్రపంచకప్ ద్వారా అంతర్జాతీయ కెరీర్లో అడుగుపెట్టిన ఈ స్టార్ ఫార్వర్డ్ ఆటగాడు జట్టు విజయాల్లో తన వంతు పాత్రను నిలకడగా పోషించేవాడు. ఆటలో దూకుడు కనబరిచే అతను తన ప్రవర్తనతో జెంటిల్మన్ ప్లేయర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజా సీజన్ ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్లో ఆదివారం బెల్జియంతో మ్యాచ్ అనంతరం లలిత్ ఉపాధ్యాయ్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ‘కేవలం అరకొర వసతులుండే ఓ మారుమూల పల్లెతో మొదలైన నా పయనం సుదీర్ఘకాలం కొనసాగడమే కాదు... నా కలల్ని సాకారం చేసింది. అన్నింటికి మించి దేశం తరఫున ఆడటం గొప్ప గౌరవాన్నిచ్చింది. రెండుసార్లు పోడియంపై నిల్చోని ఒలింపిక్ పతకాలు అందుకోవడం అంతులేని ఆనందాన్నిచ్చింది’ అని తన రిటైర్మెంట్ సందేశంలో పేర్కొన్నాడు. అలనాటి హాకీలో ఘనమైన కీర్తిని గడించిన భారత జట్టు... ఆధునిక హాకీలో మాత్రం వెనుకబడింది. ఇలా ఎన్నో ఏళ్ల తర్వాత భారత హాకీ జట్టు ఎట్టకేలకు 2021 టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకంతో పోడియంలో మువ్వన్నెల జెండాను సగర్వంగా ఎగిరేలా చేసింది. తదుపరి పారిస్ విశ్వక్రీడల్లోనూ ఈ పతకాన్ని నిలబెట్టుకుంది. ఈ రెండు సందర్భాల్లోనూ లలిత్ ఉపాధ్యాయ్ కేవలం జట్టు సభ్యుడి పాత్రకే పరిమితం కాకుండా... ఫార్వర్డ్లో నిలకడను ప్రదర్శించి జట్టు విజయానికి దోహదం చేసిన వారిలో ఒకడిగా నిలిచాడు. పదేళ్ల సుదీర్ఘ కెరీర్లో 183 అంతర్జాతీయ మ్యాచ్లాడిన లలిత్ 67 గోల్స్ సాధించాడు. ఆసియా చాంపియన్స్ ట్రోఫీ (2016, 2018), ఆసియా కప్ (2017) విజయాలతో పాటు, హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్స్ (2017)లో కాంస్యం, 2018 చాంపియన్స్ ట్రోఫీ (2018)లో రజతం, ఆసియా క్రీడలు (2018)లో కాంస్యం, 2022లో స్వర్ణం గెలిచిన జట్టులో ఫార్వర్డ్ ప్లేయర్గా పలు గోల్స్ సాధించాడు. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ హాకీ (2021–22)లో మూడో స్థానంలో నిలిచిన టీమిండియా ప్లేయర్గాను ఉన్నాడు. హాకీ మైదానంలో అతని ప్రదర్శన భారత్కు గోల్స్, పతకాలు తెచి్చపెడితే... అతని కృషికి భారత ప్రభుత్వం 2021లో అర్జున అవార్డుతో సత్కరించింది. -
నా లక్ష్యం... ‘టోక్యో స్వర్ణం’
ఒ్రస్టావా (చెక్ రిపబ్లిక్): భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈ సీజన్లో తన ప్రధాన లక్ష్యం ప్రపంచ చాంపియన్షిప్ టైటిలే అని స్పష్టం చేశాడు. చోప్రా తను ఆశించిన 90 మీటర్ల మార్క్తో కాకపోయినా... పారిస్ డైమండ్ లీగ్లో 88.16 మీటర్ల దూరంలో ఈటెను విసిరి అగ్రస్థానంలో నిలిచాడు. తాజాగా ఇక్కడ జరిగే ‘గోల్డెన్ స్పైక్ అథ్లెటిక్స్ మీట్’లో పాల్గొనేందుకు వచ్చిన భారత స్టార్ మరో విజయంపై కన్నేశాడు. రెండు ఒలింపిక్ పతకాల విజేత అయిన నీరజ్ తన ప్రదర్శనకు చెక్ రిపబ్లిక్ గ్రేట్ జాన్ జెలెజ్నీ కోచింగ్ ఎంతో దోహదం చేసిందని అన్నాడు. అతని శిక్షణలోనే రాటుదేలిన 27 ఏళ్ల భారత స్టార్ ఈ సీజన్లో జరిగిన ప్రారంభ దోహా డైమండ్ లీగ్లో తొలిసారిగా 90 మీటర్ల మార్క్ను అందుకున్నాడు. ఈ నేపథ్యంలో చోప్రా మాట్లాడుతూ ‘మేటి అథ్లెట్, కోచ్ అయిన జెలెజీ్నతో కలిసి పనిచేయడం చాలా సంతోషానిస్తోంది. ఆయన ఇచ్చిన సూచనలు, కిటుకులతోనే ఈ ఏడాది 90 మీటర్ల మార్క్ను దాటేశాను. దీన్ని పునరావృతం చేయడంపై దృష్టిసారించాను. ఇక్కడి నైంబర్క్లో అహ్లాదకర వాతావరణంలో ట్రెయినింగ్ సెషన్ పూర్తిచేశాను. తప్పకుండా ఒ్రస్టావాలో నా శక్తి మేర రాణిస్తాను. అయితే నా ప్రధాన లక్ష్యం మాత్రం టోక్యోలో జరిగే ప్రపంచ చాంపియన్షిప్లో నెగ్గడమే. ఇందుకోసమే క్రమం తప్పకుండా చెమటోడ్చుతున్నాను. తీరిక లేకుండా ఇటు ట్రెయినింగ్ సెషన్స్, అటు డైమండ్ లీగ్లలో పోటీపడుతున్నా’ అని అన్నాడు. ఈ సెప్టెంబర్ 13 నుంచి 21 వరకు టోక్యోలో ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్షిప్ పోటీలు జరుగనున్నాయి. టోక్యో ఒలింపిక్స్లోనే స్వర్ణం గెలుపొందిన తొలి భారతీయ అథ్లెట్ అక్కడ మరో పతకాన్ని ఆశిస్తున్నాడు. ప్రస్తుతం ఒ్రస్టావా మీట్కు రావడం చాలా ఆనందంగా ఉందని చోప్రా అన్నాడు. ఒకప్పుడు ఇక్కడ జరిగే పోటీల్లో గ్రేటెస్ట్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ పోటీని టీవీల్లో చూసి మురిసేవాడినని ఇప్పుడు అదే వేదికపై తాను పోటీ పడుతున్నానని చెప్పుకొచ్చాడు. మంగళవారం ఒస్ట్రావా గోల్డెన్ స్పైక్ మీట్ జరుగుతుంది. -
భారత్ 13 మంగోలియా 0
చియాంగ్ మాయ్ (థాయ్లాండ్): ఆసియా కప్–2026 మహిళల ఫుట్బాల్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత జట్టు శుభారంభం చేసింది. గ్రూప్ ‘బి’లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్లో భారత్ 13–0 గోల్స్ తేడాతో మంగోలియా జట్టును చిత్తు చేసింది. భారత్ తరఫున ప్యారీ జక్సా ఐదు గోల్స్ (29వ, 45వ, 46వ, 52వ, 55వ నిమిషాల్లో)తో అదరగొట్టగా... తెలంగాణ అమ్మాయి సౌమ్య గుగులోత్ (20వ, 59వ నిమిషాల్లో), ప్రియదర్శిని సెల్లాదురై (73వ, 86వ నిమిషాల్లో) రెండు గోల్స్ చొప్పున చేశారు. సంగీత (8వ నిమిషంలో), రింపా హల్దర్ (67వ నిమిషంలో), మాళవిక (71వ నిమిషంలో), గ్రేస్ డాంగ్మె (75వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. గోల్స్ పరంగా ఆసియా కప్ చరిత్రలోనే భారత జట్టుకిది అతిపెద్ద విజయం కావడం విశేషం. 1997లో, 2005లో గ్వామ్ జట్టుపై భారత్ 10–0 గోల్స్ తేడాతో గెలిచింది. తాజా ఫలితంతో భారత జట్టు తమ రికార్డును మెరుగుపర్చుకుంది. గత సీజన్లో ‘భారత ఉత్తమ ఫుట్బాల్ క్రీడాకారిణి’ అవార్డు గెల్చుకున్న సౌమ్య అందించిన పాస్ను లక్ష్యానికి చేర్చి సంగీత భారత్ ఖాతా తెరిచింది. ఆ తర్వాత రింపా క్రాస్ పాస్ను హెడర్ షాట్తో సౌమ్య గోల్గా మలిచింది. విరామ సమయానికి ముందు ప్యారీ జక్సా రెండు గోల్స్ చేయడంతో భారత్ తొలి అర్ధభాగం ముగిసేసరికి 4–0 తో ముందంజ వేసింది. రెండో అర్ధభాగంలో భారత్ మరింత దూకుడును పెంచింది. భారత్ తమ తదుపరి మ్యాచ్ను ఈనెల 29న తిమోర్ లెస్టె జట్టుతో ఆడుతుంది. చివరిసారి భారత జట్టు 2003లో ఆసియా కప్ ప్రధాన టోర్నీలో ఆడింది. -
దివిత్ రెడ్డికి కాంస్య పతకం
హైదరాబాద్: జాతీయ అండర్–9 చెస్ చాంపియన్షిప్ ఓపెన్ విభాగంలో తెలంగాణకు చెందిన అదుళ్ల దివిత్ రెడ్డి కాంస్య పతకం సాధించాడు. హరియాణాలో జరిగిన ఈ టోర్నీలో నిర్ణీత 11 రౌండ్ల తర్వాత దివిత్తోపాటు మరో ఐదుగురు 8.5 పాయింట్లతో ఉమ్మడిగా మూడో స్థానంలో నిలిచారు.మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్ను వర్గీకరించగా... దివిత్కు కాంస్య పతకం ఖరారైంది. 10 పాయింట్లతో సాతి్వక్ స్వయిన్ (ఒడిశా) విజేతగా అవతరించగా... 9.5 పాయింట్లతో ఆది్వక్ అభినవ్ కృష్ణ (కర్ణాటక) రన్నరప్గా నిలిచాడు. 150 మంది ప్లేయర్ల మధ్య స్విస్ ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీలో దివిత్ ఏడు గేముల్లో గెలిచి, మూడు గేమ్లను ‘డ్రా’ చేసుకొని, ఒక గేమ్లో మాత్రమే ఓడిపోయాడు.గత ఏడాది నవంబర్లో ఇటలీలో జరిగిన ప్రపంచ క్యాడెట్ చెస్ చాంపియన్ షిప్లో దివిత్ రెడ్డి అండర్–8 ఓపెన్ విభాగంలో... ఏప్రిల్లో అల్బేనియాలో జరిగిన ప్రపంచ క్యాడెట్ ర్యాపిడ్ చాంపియన్షిప్ అండర్–8 ఓపెన్ విభాగంలో స్వర్ణ పతకాలు సాధించడం విశేషం. మరోవైపు బాలికల విభాగంలో తెలంగాణకు చెందిన సాయి అన్షిత 8.5 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్యం చేజార్చుకుంది.వ్రిత్తి అగర్వాల్కు కాంస్య పతకంభువనేశ్వర్: జాతీయ సీనియర్ అక్వాటిక్స్ చాంపియన్షిప్లో తెలంగాణ పతకాల బోణీ చేసింది. తెలంగాణకు చెందిన వ్రిత్తి అగర్వాల్ మహిళల 400 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించింది. ఆదివారం జరిగిన 400 మీటర్ల ఫైనల్ను వ్రిత్తి 4 నిమిషాల 30.05 సెకన్లలో ముగించి మూడో స్థానాన్ని దక్కించుకుంది. భవ్య సచ్దేవ (ఢిల్లీ; 4ని:26.66 సెకన్లు) స్వర్ణ పతకం... అదితి సతీశ్ హెగ్డే (మహారాష్ట్ర; 4ని:29.48 సెకన్లు) రజత పతకం గెల్చుకున్నారు. -
‘క్వీన్స్ క్లబ్’ కింగ్ అల్కరాజ్.. ప్రైజ్ మనీ ఎంతంటే?
లండన్: ఈ ఏడాది తన అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తూ స్పెయిన్ టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ ఐదో సింగిల్స్ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం ముగిసిన క్వీన్స్ క్లబ్ ఏటీపీ–500 టోర్నీలో ప్రపంచ రెండో ర్యాంకర్ అల్కరాజ్ చాంపియన్గా నిలిచాడు. 2 గంటల 8 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ అల్కరాజ్ 7–5, 6–7 (5/7), 6–2తో జిరీ లెహెస్కా (చెక్ రిపబ్లిక్)పై గెలుపొందాడు.ప్రైజ్మనీ ఎంతంటే? విజేత అల్కరాజ్కు 4,71,755 యూరోల (రూ. 4 కోట్ల 70 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 500 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ లెహెస్కాకు 2,53,790 యూరోల (రూ. 2 కోట్ల 53 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 330 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఫైనల్లో అల్కరాజ్ 18 ఏస్లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్లు చేశాడు. ప్రత్యర్థి సర్వీస్ను మూడుసార్లు బ్రేక్ చేసిన అల్కరాజ్ తన సర్వీస్ను ఒక్కసారి కూడా కోల్పోలేదు. ఓవరాల్గా అల్కరాజ్ కెరీర్లో ఇది 21వ సింగిల్స్ టైటిల్. ఈ ఏడాది అల్కరాజ్ రొటర్డామ్ ఓపెన్, మోంటెకార్లో మాస్టర్స్, రోమ్ మాస్టర్స్, ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీల్లో విజేతగా నిలిచాడు.ఇదీ చదవండి: రెండేళ్ల తర్వాత... మరో సింగిల్స్ టైటిల్బెర్లిన్: హోరాహోరీ పోరులో పైచేయి సాధించిన చెక్ రిపబ్లిక్ టెన్నిస్ స్టార్ మర్కెటా వొండ్రుసోవా... రెండేళ్ల తర్వాత తన కెరీర్లో మరో సింగిల్స్ టైటిల్ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన బెర్లిన్ ఓపెన్ డబ్ల్యూటీఏ–500 టోర్నీలో 25 ఏళ్ల వొండ్రుసోవా విజేతగా అవతరించింది. 2 గంటల 16 నిమిషాలపాటు జరిగిన తుది పోరులో ప్రపంచ 164వ ర్యాంకర్ వొండ్రుసోవా 7–6 (12/10), 4–6, 6–2తో ప్రపంచ 49వ ర్యాంకర్ జిన్యు వాంగ్ (చైనా)పై విజయం సాధించింది.2023లో వింబుల్డన్ గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గి సంచలనం సృష్టించిన వొండ్రుసోవా ఆ తర్వాత మరో టైటిల్ను అందుకోలేకపోయింది. జిన్యు వాంగ్తో జరిగిన ఫైనల్లో వొండ్రుసోవా ఆరు ఏస్లు సంధించి, ఏడు డబుల్ ఫాల్ట్లు చేసింది. తన సర్వీస్ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. టైటిల్ గెలిచే క్రమంలో వొండ్రుసోవా సెమీఫైనల్లో ప్రపంచ నంబర్వన్ సబెలెంకా (బెలారస్)పై, తొలి రౌండ్లో ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ మాడిసన్ కీస్ (అమెరికా)పై, క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మాజీ రెండో ర్యాంకర్ ఆన్స్ జబర్ (ట్యూనిషియా)పై నెగ్గడం విశేషం. విజేతగా నిలిచిన వొండ్రుసోవాకు 1,42,610 యూరోల (రూ. 1 కోటీ 42 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
భారత్ ‘పసిడి’ పట్టు
వుంగ్ తౌ (వియత్నాం): తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భారత పురుషుల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ జట్టు... ఆసియా అండర్–23 చాంపియన్íÙప్లో టీమ్ టైటిల్ను సొంతం చేసుకుంది. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో భారత రెజ్లర్లు ఆరు స్వర్ణ పతకాలు, ఒక రజత పతకంతో కలిపి మొత్తం ఏడు పతకాలతో టాప్ ర్యాంక్లో నిలిచింది. భారత్ తరఫున నిఖిల్ (61 కేజీలు), సుజీత్ కల్కాల్ (65 కేజీలు), జైదీప్ (74 కేజీలు), చందర్ మోహన్ (79 కేజీలు), సచిన్ (92 కేజీలు), విక్కీ (97 కేజీలు) పసిడి పతకాలను గెల్చుకున్నారు. జస్పూరణ్ సింగ్ (125 కేజీలు) రజత పతకాన్ని సాధించాడు. ఫైనల్స్లో నిఖిల్ 7–2తో మెరీ బజర్బయేవ్ (కజకిస్తాన్)పై, సుజీత్ 10–0తో ఉమిద్జాన్ జలోలోవ్ (ఉజ్బెకిస్తాన్)పై, జైదీప్ 7–0తో జఫర్బెక్ (ఉజ్బెకిస్తాన్)పై, చందర్ మోహన్ 5–2తో బెజెన్జోవ్ (తుర్క్మెనిస్తాన్)పై, సచిన్ 5–2తో తుముర్బాటర్ (మంగోలియా)పై, విక్కీ 9–6తో నూర్దౌలత్ బెకెనోవ్ (కజకిస్తాన్)పై నెగ్గారు. జస్పూరణ్ 3–4తో బత్బాయెర్ (మంగోలియా) చేతిలో ఓడిపోయాడు. ఇదే టోరీ్నలో భారత మహిళల ఫ్రీస్టయిల్ జట్టు కూడా పోటీపడ్డ 10 వెయిట్ కేటగిరీల్లో పతకాలు గెలిచి టీమ్ టైటిల్ను సాధించింది. -
విజయంతో ముగించిన భారత్
అంతర్జాతీయ హాకీ సమాఖ్య 2024–2025 ప్రొ లీగ్ను భారత పురుషుల జట్టు విజయంతో ముగించింది. యూరోపియన్ చివరి అంచె లీగ్లో భాగంగా ఆదివారం ఆంట్వర్ప్లో ఆతిథ్య బెల్జియం జట్టుతో జరిగిన మ్యాచ్లో టీమిండియా 4–3 గోల్స్ తేడాతో గెలుపొందింది. యూరోపియన్ అంచెలో భారత్కు దక్కిన ఏకైక విజయం ఇదే కావడం గమనార్హం. యూరోపియన్ అంచెలో భారత్ వరుసగా ఏడు మ్యాచ్ల్లో ఓడిపోయి, చివరి మ్యాచ్లో నెగ్గి ఊపిరి పీల్చుకుంది.ఈ మ్యాచ్లో భారత్ తరఫున సుఖ్జీత్ సింగ్ (21వ, 35వ నిమిషంలో) రెండు గోల్స్ చేయగా... అమిత్ రోహిదాస్ (36వ నిమిషంలో), కెప్టేన్ హర్మన్ప్రీత్ సింగ్ (59వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. బెల్జియం జట్టు తరఫున స్లూవర్ (8వ నిమిషంలో), స్టాక్బ్రోయెక్స్ (34వ నిమిషంలో), హుగో (41వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు.మొత్తం తొమ్మిది జట్ల మధ్య జరుగుతున్న ప్రొ లీగ్లో భారత జట్టు తమ 16 మ్యాచ్లను పూర్తి చేసుకుంది. 6 మ్యాచ్ల్లో గెలిచి, 10 మ్యాచ్ల్లో ఓడిపోయిన భారత్ 18 పాయింట్లతో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. మరోవైపు భారత మహిళల జట్టు వరుసగా ఆరో పరాజయాన్ని చవిచూసింది. బెల్జియంతో ఆదివారం జరిగిన మ్యాచ్లో భారత్ 0–2తో ఓడిపోయింది. -
డోపింగ్... ప్రమాద ఘంటికలు!
న్యూఢిల్లీ: క్రీడల నుంచి డోపింగ్ను రూపుమాపాలని ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా... సత్ఫలితాలు మాత్రం రావడం లేదు. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (వాడా) పరీక్షల ఫలితాల్లో భారత్ ప్రమాదకర స్థాయిలో నిలుస్తోంది. 2023 సంవత్సరానికి గానూ ‘వాడా’ నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో భారత్ 3.8 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. 5,606 నమూనాలు సేకరించగా... అందులో 3.8 శాతం అంటే 214 మంది అథ్లెట్లు నిషేధిత ఉ్రత్పేరకాలు తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. అంతకముందు సంవత్సరంలో 3,865 నమూనాల్లో భారత డోపింగ్ రేటు 3.2గా ఉంది. 5,606 నమూనాల్లో 2,748 నమూనాలు పోటీలు జరుగుతున్న సమయంలో తీసుకున్నవి కావడం గమనార్హం. నిషేధిత ఉ్రత్పేరకాలు వాడిన జాబితాలో చైనా (28,197 నమూనాల్లో 0.2శాతం), అమెరికా (6798 నమూనాల్లో 1.0 శాతం), ఫ్రాన్స్ (11,368 నమూనాల్లో 0.9 శాతం), జర్మనీ (15,153 నమూనాల్లో 0.4 శాతం), రష్యా (10,395 నమూనాల్లో 1.0 శాతం) మెరుగ్గా ఉండగా... భారత్ ప్రమాదకర స్థాయిలో ఉంది. సేకరించిన నమూనాల్లో భారత్ నుంచి 214 మంది పాజిటివ్గా తేలగా... ఫ్రాన్స్ నుంచి 105 మంది, రష్యా నుంచి 99 మంది, అమెరికా నుంచి 66 మంది, చైనా నుంచి 60 మంది, జర్మనీ నుంచి 57 మంది అథ్లెట్లు డోపింగ్లో దొరికారు. -
నీరజ్ ‘టాప్’ త్రో
నా ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నా. జావెలిన్ విసరడానికి ముందు నా రనప్ వేగంగా ఉంది. దాన్ని అదుపు చేయలేకపోయా. అయినా ఫలితం ఆనందాన్నిచి్చంది. మరో నాలుగు రోజుల్లో జరగనున్న ఓ్రస్టావా గోల్డెన్ స్పైక్ అథ్లెటిక్ మీట్లో పాల్గొననున్నా. అందుకే కాస్త విశ్రాంతి అవసరం. 90 మీటర్ల మార్క్ దాటిన తర్వాత సగం ఒత్తిడి దూరమైనట్లు అనిపించింది. ఇక నిలకడగా అదే దూరాన్ని కొనసాగించడంపై దృష్టి పెడతా. అయితే పోటీ జరిగే రోజు పరిస్థితులు, వాతావరణం, శరీర తీరును బట్టి ప్రదర్శనలో మార్పులు రావడం సహజం. అంతర్జాతీయ పోటీల్లో నిలకడగా 90 మీటర్ల దూరాన్ని కొనసాగించాలంటే మరింత దృఢంగా ఉండాలి. దాని కోసం సాధన కొనసాగిస్తా. జావెలిన్ విసిరే సమయంలో నియంత్రణ ముఖ్యం. శిక్షణ సమయంలో దానిపై దృష్టి సారిస్తా. ప్రదర్శనలో చిన్న చిన్న లోపాలు జరుగుతూ ఉంటాయి. వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరముంది. ఈ సీజన్లో మరిన్ని పోటీల్లో పాల్గొననున్నా. అందుకే నిలకడగా మెరుగైన ప్రదర్శన చేయాలనుకుంటున్నా. టోక్యో ఒలింపిక్స్లో పసిడి పతకం సాధించినప్పటి నుంచి దేశంలో జావెలిన్ త్రోకు ఆదరణ మరింత పెరిగింది. ఇప్పుడు నీరజ్ చోప్రా క్లాసిక్ ఈవెంట్ నిర్వహిస్తుండటం చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో ఇది మరింత పెద్ద స్థాయికి చేరడం ఖాయం. -నీరజ్ చోప్రా పారిస్: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పారిస్ డైమండ్ లీగ్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ మీట్లో నీరజ్ జావెలిన్ను 88.16 మీటర్ల దూరం అగ్ర స్థానంలో నిలిచాడు. రెండేళ్లలో నీరజ్కు ఇదే తొలి డైమండ్ లీగ్ టైటిల్ కాగా... 90 మీటర్ల మార్క్ దాటకుండానే భారత స్టార్ నంబర్వన్గా నిలవడం విశేషం. జర్మనీకి చెందిన జులియన్ వెబర్ 87.88 మీటర్ల దూరంతో రెండో స్థానంలో నిలిచాడు. బ్రెజిల్కు చెందిన లూయిజ్ మారిసియో డా సిల్వా 86.62 మీటర్ల దూరంతో మూడో స్థానం దక్కించుకున్నాడు. తొలి ప్రయత్నంలోనే అత్యుత్తమ ప్రదర్శన చేసిన నీరజ్... ఆ తర్వాత రెండో ప్రయత్నంలో జావెలిన్ను 85.10 మీటర్లు విసిరాడు... ఆ తర్వాత మూడు సార్లు ఫౌల్ చేసిన భారత అథ్లెట్... ఆఖరి ప్రయత్నంలో 82.89 మీటర్ల దూరం నమోదు చేసుకున్నాడు. కేషార్న్ వాల్కాట్ (81.66 మీటర్లు; ట్రినిడాడ్, టొబాగో) నాలుగో స్థానం దక్కించుకోగా... రెండుసార్లు ప్రపంచ చాంపియన్ అండర్సన్ పీటర్స్ (80.29 మీటర్లు; గ్రెనడా), జూలియన్ యోగో (80.26 మీటర్లు; కెన్యా) వరుసగా ఐదో, ఆరో స్థానాల్లో నిలిచారు.సీజన్లో తొలి టైటిల్...భారత అథ్లెటిక్స్ గతిని మార్చిన నీరజ్ ఈ సీజన్లో తొలి టైటిల్ ఖాతాలో వేసుకున్నాడు. చివరిసారిగా 2023లో లుసానే డైమండ్ లీగ్లో విజేతగా నిలిచిన నీరజ్... ఆ తర్వాత ఈ రెండేళ్లలో బరిలోకి దిగిన ఆరు డైమండ్ లీగ్ల్లో రెండో స్థానానికే పరిమితమయ్యాడు. పారిస్ డైమిండ్ లీగ్లో చివరిసారిగా 2017లో పోటీపడిన నీరజ్... జూనియర్ ప్రపంచ చాంపియన్గా బరిలోకి దిగి ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 2020 టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం నెగ్గిన భారత జావెలిన్ త్రోయర్... 2024 పారిస్ ఒలింపిక్స్లో రజత పతకం గెలుచుకున్నాడు. గత నెలలో జరిగిన దోహా డైమండ్ లీగ్లో 90 మీటర్ల మార్క్ దాటిన ఈ హర్యానా త్రోయర్... దూరంతో పాటు ఫిట్నెస్పై కూడా దృష్టి పెట్టాడు. ఈ నెల 24 నుంచి జరగనున్న గోల్డెన్ స్పైక్ అథ్లెటిక్ మీట్లో పాల్గొననున్న 27 ఏళ్ల నీరజ్... ఆ తర్వాత భారత్లో తొలిసారి నిర్వహిస్తున్న అంతర్జాతీయ జావెలిన్ త్రో ఈవెంట్ ‘నీరజ్ చోప్రా క్లాసిక్‘లో పాల్గొననున్నాడు. బెంగళూరు వేదికగా వచ్చే నెల 5న ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్కు ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య ‘ఎ’ కేటగిరీ గుర్తింపునిచ్చింది. -
కజకిస్తాన్ ప్లేయర్ బుబ్లిక్ సంచలనం
హాలె (జర్మనీ): హాలె ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీలో ప్రపంచ నంబర్వన్, డిఫెండింగ్ చాంపియన్ యానిక్ సినెర్కు అనూహ్య పరాజయం ఎదురైంది. కజకిస్తాన్కు చెందిన ప్రపంచ 45వ ర్యాంకర్ అలెగ్జాండర్ బుబ్లిక్ అద్భుత ఆటతీరుతో సినెర్ను బోల్తా కొట్టించి తన కెరీర్లోనే గొప్ప విజయాన్ని అందుకున్నాడు. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో బుబ్లిక్ 3–6, 6–3, 6–4తో టాప్ సీడ్ సినెర్ను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 2 గంటల 2 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో 6 అడుగుల 5 అంగుళాల ఎత్తు, 82 కేజీల బరువున్న బుబ్లిక్ 15 ఏస్లు సంధించి, ఆరు డబుల్ ఫాల్ట్లు చేశాడు.తన సర్వీస్ను ఒకసారి కోల్పోయిన బుబ్లిక్ ప్రత్యర్థి సరీ్వస్ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. ఇటీవల ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో అల్కరాజ్ (స్పెయిన్) చేతిలో ఓడిపోయి రన్నరప్గా నిలిచిన సినెర్ ఈ మ్యాచ్లో ఆరు ఏస్లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్లు చేశాడు. 30 విన్నర్స్ కొట్టిన ఈ ఇటాలియన్ ప్లేయర్ 25 అనవసర తప్పిదాలు చేశాడు. ఓవరాల్గా ఈ ఏడాది సినెర్ మూడు మ్యాచ్ల్లోనే ఓడిపోయాడు. అల్కరాజ్తో జరిగిన రోమ్ ఓపెన్ మాస్టర్స్ టోర్నీ ఫైనల్లో, ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో ఓడిన సినెర్ తాజాగా బుబ్లిక్ చేతిలో ఓడిపోయాడు. సినెర్ను ఓడించిన ఉత్సాహంలో బుబ్లిక్ హాలె ఓపెన్లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. క్వార్టర్ ఫైనల్లో బుబ్లిక్ 7–6 (7/2), 6–3తో ప్రపంచ 23వ ర్యాంకర్, ఏడో సీడ్ టామస్ మఖాచ్ (చెక్ రిపబ్లిక్)పై గెలుపొందాడు. -
Neeraj Chopra: ప్యారిస్ డైమండ్ లీగ్ విజేతగా భారత సూపర్ స్టార్
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) డైమండ్ లీగ్ విజేతగా నిలిచాడు. జర్మనీ బల్లెం వీరుడు జూలియన్ వెబర్ను ఓడించి చాంపియన్గా అవతరించాడు. ప్యారిస్ (Paris Diamond League)లో జరిగిన ఈ పోటీలో భారత సూపర్స్టార్ నీరజ్ చోప్రా తన తొలి ప్రయత్నంలో ఈటెను 88.16 మీటర్ల దూరం విసిరాడు. ఇదే ఈ పోటీలో అత్యుత్తమం కావడంతో అతడు టైటిల్ను సొంతం చేసుకున్నాడు.ఇక రెండో ప్రయత్నంలో 85.10 మీటర్లు విసిరిన ఈ హర్యానా అథ్లెట్.. తదుపరి మూడు ప్రయత్నాల్లో ఫౌల్ అయ్యాడు. అయితే, ఆఖరిదైన ఆరో త్రోలో 82.89 మీటర్ల దూరం బల్లాన్ని విసిరాడు. మరోవైపు.. వెబర్ తన తొలి ప్రయత్నంలో 87.88 మీటర్లు విసరగా అదే అతడి బెస్ట్గా నిలిచింది. దీంతో నీరజ్ తర్వాతి స్థానాన్ని వెబర్ ఆక్రమించగా.. బ్రెజిల్కు చెందిన లూయిజ్ మారీషియో డా సిల్వా 86.62 మీటర్ల దూరం (రెండో ప్రయత్నం) ఈటెను విసిరి మూడో స్థానంలో నిలిచాడు.కాగా నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం గెలిచిన విషయం తెలిసిందే. అయితే, ప్యారిస్ ఒలింపిక్స్లో మాత్రం ఈ గోల్డెన్ బాయ్ రజతంతో సరిపెట్టుకున్నాడు. ఇదిలా ఉంటే... గత నెలలో దోహా డైమండ్ లీగ్ జరగగా నీరజ్ చోప్రా 90.23 మీటర్ల దూరం బల్లెం విసిరి రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. నాడు జూలియన్ వెబర్ 91.06 మీటర్ల దూరం ఈటెను త్రో చేసి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత పోలండ్ మీట్లోనూ ఈ ఇద్దరే తొలి రెండు స్థానాల్లో నిలిచారు. తాజాగా ప్యారిస్ డైమండ్ లీగ్లోనూ ఇదే పునరావృతం చేశారు.చదవండి: యశస్వి జైస్వాల్ ప్రపంచ రికార్డు.. బ్రాడ్మన్నే అధిగమించాడు!NEERAJ CHOPRA WINS PARIS DIAMOND LEAGUE💎- The best attempt of 88.16m in first throw 🔥🤩 pic.twitter.com/dhYVQPUr5E— The Khel India (@TheKhelIndia) June 20, 2025 -
హారికకు మూడో స్థానం
సెయింట్ లూయిస్ (అమెరికా): కెయిన్స్ కప్ అంతర్జాతీయ మహిళల చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్మాస్టర్, హైదరాబాద్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక మూడో స్థానాన్ని దక్కించుకుంది. మరోవైపు భారత నంబర్వన్, ఆంధ్రప్రదేశ్కు చెందిన స్టార్ గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి వరుసగా మూడో ఓటమి చవిచూసి ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. అలీనా కషిన్స్కాయ (పోలాండ్)తో జరిగిన చివరిదైన తొమ్మిదో రౌండ్ గేమ్ను హారిక 38 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించి 5 పాయింట్లతో మూడో స్థానాన్ని ఖరారు చేసుకుంది. గత ఏడాది కూడా మూడో స్థానంలో నిలిచిన హారిక ఈ ఏడాది టోర్నీలో కేవలం కోనేరు హంపి చేతిలో ఓడిపోయి... మిగతా ఎనిమిది గేముల్లో రెండింటిలో గెలిచి, ఆరింటిని ‘డ్రా’ చేసుకుంది. ఆరో రౌండ్ తర్వాత అగ్రస్థానంలో నిలిచిన హంపి వరుసగా మూడు గేముల్లో ఓడిపోయి 4.5 పాయింట్లతో ఐదో స్థానాన్ని పొందింది. ఏడో రౌండ్లో కరిసా యిప్ (అమెరికా) చేతిలో, ఎనిమిదో రౌండ్లో నినో బత్సియా‹Ùవిలి (జార్జియా) చేతిలో ఓడిన హంపి 46 ఎత్తుల్లో మరియా ముజీచుక్ (ఉక్రెయిన్) చేతిలో పరాజయం పాలైంది. హంపితోపాటు నానా జాగ్నిద్జె (జార్జియా), బీబీసారా అసబయేవా (కజకిస్తాన్), అలీషా 4.5 పాయింట్లతో ఉమ్మడిగా నాలుగో స్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్ను వర్గీకరించగా... నానా జాగ్నిద్జె నాలుగో స్థానంలో, హంపి ఐదో స్థానంలో, బీబీసారా ఆరో స్థానంలో, అలీషా ఏడో స్థానంలో నిలిచారు. పది మంది మేటి క్రీడాకారిణుల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీని నిర్వహించగా... 6 పాయింట్లతో కరిసా యిప్ (అమెరికా) చాంపియన్గా అవతరించింది. 5.5 పాయింట్లతో అలైస్ లీ (అమెరికా) రన్నరప్గా నిలిచింది. విజేత కరిసా యిప్నకు 60 వేల డాలర్లు (రూ. 51 లక్షల 96 వేలు), రన్నరప్ అలైస్ లీకి 50 వేల డాలర్లు (రూ. 43 లక్షల 30 వేలు), మూడో స్థానంలో నిలిచిన హారికకు 40 వేల డాలర్లు (రూ. 34 లక్షల 64 వేలు) ప్రైజ్మనీగా లభించాయి. -
నెలకు రూ. 25 వేలు
న్యూఢిల్లీ: భారత హాకీ ప్లేయర్లకు నెలవారీ భత్యం ఇచ్చేందుకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ముందుకొచ్చింది. ఇప్పటి వరకు కేవలం ప్రదర్శన ఆధారంగా మాత్రమే ప్లేయర్లకు నజరానాలు అందుతుండగా... ఇప్పుడు అలా కాకుండా ప్రభుత్వం తరఫున ప్రతి నెల ఒక్కో ప్లేయర్కు రూ. 25 వేలు భత్యంగా ఇవ్వాలని క్రీడా శాఖ నిర్ణయించింది. ఈ అంశంపై చాన్నాళ్లుగా చర్చలు జరుగుతుండగా... హాకీ ఇండియా ప్రతిపాదనను కేంద్రం అంగీకరించింది. జాతీయ శిబిరాలకు ఎంపికయ్యే పురుష, మహిళా ప్లేయర్లకు ఈ భత్యం అందించనున్నట్లు వెల్లడించింది. ‘ఆటగాళ్లకు నెలవారీ ప్రోత్సహకంగా భత్యం రూపంలో అందించాలని హాకీ ఇండియా చాలా రోజులుగా కోరుతోంది. వారి డిమాండ్కు అంగీకారం తెలిపాం. ప్రతిభ గల ఆటగాళ్లకు అండగా నిలిస్తే మరిన్ని మెరుగైన ఫలితాలు వస్తాయి’ అని కేంద్ర క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. → పురుషుల విభాగంలో 40 మంది ఆటగాళ్లు, మహిళల విభాగంలో 40 మంది ప్లేయర్లకు ఈ భత్యాలు అందించనుంది. → టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్)లో భాగంగా గురువారం నిర్వహించిన ‘మిషన్ ఒలింపిక్ కమిటీ’లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. → కోర్ గ్రూప్ ప్లేయర్లకు రూ. 50 వేల చొప్పున దక్కనున్నాయి. దీని వల్ల ప్రభుత్వానికి నెలకు రూ. 20 లక్షలు ఖర్చు కానున్నాయి. → హాకీ ఇండియా ప్రతి నెలా ప్లేయర్ల జాబితాను క్రీడాశాఖకు పంపనుంది. ఫిట్నెస్, ఫామ్ ఆధారంగా ప్లేయర్ల ఎంపిక జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. → ప్రస్తుతం హాకీ ఆటగాళ్లు వారు ప్రాతినిధ్యం వహిస్తున్న విభాగాలు, సంస్థలు, బోర్డుల నుంచి జీతాలు పొందుతున్నారు. వీటికి అదనంగా అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన సమయంలో లభించే ప్రైజ్మనీని పంచుకుంటున్నారు. → భారత పురుషుల హాకీ జట్టు గత కొంతకాలంలో ఎంతో మెరుగైంది. 2020 టోక్యో ఒలింపిక్స్, 2024 పారిస్ ఒలింపిక్స్లో వరుసగా కాంస్య పతకాలు సాధించింది. మరోవైపు టోక్యో ఒలింపిక్స్లో నాలుగో స్థానంలో నిలిచిన మహిళల జట్టు... పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించలేకపోయింది. → ప్రస్తుతం భారత పురుషుల, మహిళల హాకీ జట్లు ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ యూరోప్ అంచె పోటీల్లో పాల్గొంటున్నాయి. అయితే కఠిన పరిస్థితుల్లో ఇరు జట్లు విజయాలు సాధించలేక ఇబ్బంది పడుతున్నాయి. → ‘టాప్స్’లో భాగంగా హాకీ ఆటగాళ్లకే కాకుండా ఇతర క్రీడలకు చెందిన ప్లేయర్లకు సైతం క్రీడా మంత్రిత్వ శాఖ తాజాగా నిధులు విడుదల చేసింది. → టెన్నిస్ ఆటగాళ్లు సాకేత్ మైనేని, జీవన్ నెడుంజెళియాన్తో పాటు మరో ముగ్గురు మహిళా ప్లేయర్లకు కలిపి రూ. 1.38 కోట్లు వేర్వేరు కారణాల కోసం విడుదల చేసింది. మొత్తంగా ఈ భేటీలో అథ్లెట్ల కోసం మొత్తం రూ. 4.28 కోట్ల నిధులు విడుదల చేశారు. ఇందులో పలువురు పారా అథ్లెట్లు కూడా ఉన్నారు. → ప్రతిభకు పట్టం కట్టే విధానంలో సాంకేతికతను వినియోగించుకోవాలని కేంద్ర క్రీడా శాఖ నిర్ణయించింది. గ్రామీణ స్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించిన అథ్లెట్లను ఖేలో ఇండియా రీజనల్ సెంటర్లలో అవకాశం కలి్పంచి వారి మెరుగుదలను నమోదు చేయాలని నిర్ణయించింది. వయో విభాగాలను బట్టి ప్రతిభావంతులకు మరింత ప్రోత్సాహం అందించనుంది. -
నెదర్లాండ్స్, స్లొవేనియాలతో భారత్ ‘ఢీ’
బెంగళూరు: ప్రతిష్టాత్మక బిల్లీ జీన్ కింగ్ వరల్డ్ టీమ్ మహిళల టెన్నిస్ టోర్నమెంట్ ప్లే ఆఫ్స్ మ్యాచ్లకు భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఈ ఏడాది నవంబర్ 14 నుంచి 16 వరకు బెంగళూరులోని ఎస్ఎం కృష్ణ టెన్నిస్ స్టేడియంలో ఈ టోర్నీ జరగనుంది. భారత్తోపాటు ఇతర దేశాల్లో ఇవే తేదీల్లో ఇతర గ్రూప్ల ప్లే ఆఫ్స్ టోర్నీలను నిర్వహిస్తారు. ‘ప్లే ఆఫ్స్’కు మొత్తం 21 జట్లు అర్హత పొందాయి. 21 జట్లను ఏడు గ్రూప్లుగా విభజించారు. ఒక్కో గ్రూప్లో మూడు జట్లకు చోటు కల్పించారు. గ్రూప్ విజేతగా నిలిచే ఏడు జట్లు వచ్చే ఏడాది బిల్లీ జీన్ కింగ్ కప్ వరల్డ్ గ్రూప్ క్వాలిఫయర్స్కు అర్హత సాధిస్తాయి. 2021 తర్వాత వరల్డ్ గ్రూప్ ‘ప్లే ఆఫ్స్’కు అర్హత పొందిన భారత జట్టుకు గ్రూప్ ‘జి’లో చోటు దక్కింది. గ్రూప్ ‘జి’లోనే నెదర్లాండ్స్, స్లొవేనియా జట్లు కూడా ఉన్నాయి. వచ్చే ఏడాది వరల్డ్ గ్రూప్ క్వాలిఫయర్స్కు అర్హత సాధించాలంటే భారత్ తమ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాల్సి ఉంటుంది. పుణేలో ఇటీవల జరిగిన ఆసియా జోన్ క్వాలిఫయర్స్ టోర్నీలో టాప్–2లో నిలవడం ద్వారా భారత్, న్యూజిలాండ్ జట్లు ‘ప్లే ఆఫ్స్’ టోర్నీకి అర్హత పొందాయి. హైదరాబాద్ ప్లేయర్ భమిడిపాటి శ్రీవల్లి రష్మిక అద్భుత ఆటతీరు కనబరిచి తాను ఆడిన ఐదు మ్యాచ్ల్లోనూ గెలిచి భారత్ విజయంలో ముఖ్యపాత్ర పోషించింది. రష్మికతోపాటు సహజ యామలపల్లి, అంకిత రైనా, వైదేహి, ప్రార్థన, మాయా రాజేశ్వరన్ జట్టులో ఇతర సభ్యులుగా ఉన్నారు. గట్టిపోటీ తప్పదు... వరల్డ్ గ్రూప్ క్వాలిఫయర్స్కు తొలిసారి అర్హత పొందాలంటే భారత్ విశేషంగా రాణించాల్సి ఉంటుంది. భారత్ ప్రత్యర్థులుగా ఉన్న నెదర్లాండ్స్, స్లొవేనియాలతో పోలిస్తే టీమిండియా నుంచి ఒక్కరు కూడా టాప్–300 ర్యాంకింగ్స్లో లేకపోవడం గమనార్హం. మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) తాజా సింగిల్స్ ర్యాంకింగ్స్లో భారత్ నుంచి శ్రీవల్లి రష్మిక (322), సహజ (342), అంకిత రైనా (347), వైదేహి (368) మాత్రమే టాప్–400లో ఉన్నారు. డబుల్స్లో మాత్రం భారత్ నుంచి ఇద్దరు టాప్–200లో ఉన్నారు.ప్రార్థన తొంబారే 145వ ర్యాంక్లో, అంకిత రైనా 190వ ర్యాంక్లో ఉన్నారు. నెదర్లాండ్స్ జట్టులో సింగిల్స్ విభాగంలో టాప్–100లో ఇద్దరు సుజాన్ లామెన్స్ (70), అరంటా రుస్ (91)... డబుల్స్లో టాప్–100లో ఇద్దరు డెమీ షుర్స్ (18), ఇసాబెల్లి హవెర్లాగ్ (91) ఉన్నారు. స్లొవేనియా జట్టులో సింగిల్స్ విభాగంలో టాప్–250లో ఇద్దరు వెరోనికా ఎర్జావెక్ (172), తమారా జిదాన్సెక్ (206)... డబుల్స్లో టాప్–300లో ఇద్దరు కాజా జువాన్ (259), ఇవా ఫాల్క్నర్ (219) ఉన్నారు. బిల్లీ జీన్ కింగ్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్స్ గ్రూప్ వివరాలు గ్రూప్ ‘ఎ’: కెనడా, డెన్మార్క్, మెక్సికో. గ్రూప్ ‘బి’: పోలాండ్, రుమేనియా, న్యూజిలాండ్. గ్రూప్ ‘సి’: స్లొవేకియా, స్విట్జర్లాండ్, అర్జెంటీనా. గ్రూప్ ‘డి’: చెక్ రిపబ్లిక్, కొలంబియా, క్రొయేషియా. గ్రూప్ ‘ఇ’: ఆస్ట్రేలియా, బ్రెజిల్, పోర్చుగల్. గ్రూప్ ‘ఎఫ్’: జర్మనీ, బెల్జియం, తుర్కియే. గ్రూప్ ‘జి’: నెదర్లాండ్స్, స్లొవేనియా, భారత్. -
అగ్ర స్థానమే లక్ష్యంగా...
పారిస్: భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా ఈ సీజన్లో అగ్ర స్థానం లక్ష్యంగా మరో టోర్నీలో బరిలోకి దిగనున్నాడు. ఈ ఏడాది 90 మీటర్ల మార్క్ను అందుకున్న ఈ మాజీ ఒలింపిక్, వరల్డ్ చాంపియన్ పారిస్ డైమండ్ లీగ్లో టాప్ ర్యాంక్పై కన్నేశాడు. జర్మన్ స్టార్ జులియన్ వెబెర్, రెండుసార్లు ప్రపంచ చాంపియన్ అండర్సన్ పీటర్స్ (గెనడా) తదితర హేమాహేమీలంతా ఈ మీట్లో ఉండటంతో జావెలిన్ త్రో పోటీ ఆద్యంతం రసవత్తరంగా జరగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పైగా 8 మంది బరిలోకి దిగుతున్న ఫైనల్ ఈవెంట్లో ఐదుగురు జావెలిన్ త్రోయర్లు 90 మీటర్ల మార్క్ను అధిగమించిన వారే ఉండటం పోటీని దీటుగా మార్చేసింది. భారత కాలమానం ప్రకారం నీరజ్ ఈవెంట్ రాత్రి 1 గంట 12 నిమిషాలకు మొదలవుతంది. గత నెలలో జరిగిన దోహా డైమండ్ లీగ్ మీట్లో వెబెర్... నీరజ్ చోప్రాను అధిగమించాడు. వెబెర్ ఈటెను 91.06 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో ... చోప్రా 90.23 మీటర్లతో రెండో స్థానంలో నిలిచారు. అనంతరం జరిగిన పోలాండ్ మీట్లో ఇద్దరు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చలేకపోయినా... మళ్లీ తొలి రెండు స్థానాల్లో నిలిచారు. -
దేశానికి ఆడకుంటే...
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ ఆటగాళ్లు దేశం తరఫున ఆడకపోతే ప్రోత్సాహకాల్ని తిరిగి రాబడతామని భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) స్పష్టం చేసింది. కొంతకాలంగా పేరొందిన ఆటగాళ్లు దేశాన్ని విస్మరించి ఏటీపీ టోర్నీలకే ప్రాధాన్యమివ్వడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘సాయ్’... ఆటగాళ్లలో జవాబుదారీతనాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పథకాలు, ప్రోత్సాహకాల రూపేణా ఆర్థిక సాయం పొందిన ఆటగాళ్లు సహేతుక కారణాలు లేకుండా దేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు నిరాకరిస్తే ఇచ్చిన మొత్తాన్ని వెనక్కి తీసుకుంటామని ప్రకటించింది. టార్గెట్ ఒలింపిక్ పొడియం పథకం (టాప్స్) ఎప్పటి నుంచో అమలవుతున్నప్పటికీ... ప్రత్యేకంగా ఆసియా క్రీడల్లో పతకాలే లక్ష్యంగా టార్గెట్ ఆసియా క్రీడల గ్రూప్ (టీఏజీజీ) పథకాన్ని కొత్తగా ఈ ఏడాదే తీసుకొచ్చింది. దీనికింద పలువురు ప్లేయర్లకు విదేశీ కోచ్లతో శిక్షణ, విదేశీ పర్యటనల కోసం భారత్ నిధులు మంజూరు చేస్తోంది. ఇలా పథకాలతో ఆర్థికసాయం, ప్రోత్సాహకాలు పొందిన ఆటగాళ్లు దేశానికి ప్రాతినిధ్యం వహించాలంటే మాత్రం ముఖం చాటేస్తున్నారు. భారత మేటి సింగిల్స్ ఆటగాడు సుమిత్ నగాల్ డేవిస్ కప్ ఆడేందుకు అదేపనిగా ససేమిరా అంటున్నాడు. గతేడాది పాకిస్తాన్, స్వీడన్... ఈ ఏడాది టోగోతో డేవిస్ కప్ మ్యాచ్లు ఆడకుండా తప్పించుకున్నాడు. ఇలాగే శశికుమార్ ముకుంద్, యూకీ బాంబ్రీలు కూడా డేవిస్ కప్ పోటీలపై అనాసక్తి కనబరుస్తున్నారు. కానీ ఏటీపీ, గ్రాండ్స్లామ్ టోర్నీలు ఆడేందుకు మాత్రం ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ ముగ్గురితో పాటు రాంకుమార్ రామనాథన్, శ్రీరామ్ బాలాజీ, సాకేత్ మైనేని, రిత్విక్ బొల్లిపల్లి, మహిళా ప్లేయర్లు భమిడిపాటి శ్రీవల్లి రష్మిక, సహజ యామలపల్లి, వైదేహి చౌధరీ, రుతుజా, మాయా రాజేశ్వరన్లకు టీఏజీజీ కింద ఆర్థిక అండదండలు లభిస్తున్నాయి. ‘సాయ్’ తాజా నిర్ణయాన్ని అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) సహా డేవిస్ కప్ కెపె్టన్ రోహిత్ రాజ్పాల్, బిల్లీ జీన్ కింగ్ కప్ కెప్టెన్ విశాల్ ఉప్పల్ స్వాగతించారు. -
వారికి నా సహకారం ఎప్పుడూ ఉంటుంది: కంగనా రనౌత్
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి, లోక్సభ సభ్యురాలు కంగనా రనౌత్ ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్నకు బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికైంది. ఈ ఏడాది సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 వరకు న్యూఢిల్లీ వేదికగా ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ జరగనుంది. వందకు పైగా దేశాల నుంచి పారా అథ్లెట్లు ఈ చాంపియన్షిప్లో పాల్గొంటారు. ‘పారా అథ్లెట్లకు ఎప్పుడూ నా సహకారం ఉంటుంది. వాళ్లు ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొని ప్రపంచ స్థాయికి వచ్చారు. వారి ఘనతలను గుర్తించాల్సిన అవసరముంది. పారా అథ్లెటిక్స్ అనేవి కేవలం క్రీడలు మాత్రమే కాదు. దాని వెనక వారి పోరాటం, గుండె ధైర్యం దాగి ఉంటుంది. అలాంటి చాంపియన్లకు అంబాసిడర్గా వ్యవహరించనుండటం గర్వంగా భావిస్తున్నా’ అని కంగనా వెల్లడించింది. భారత పారాలింపిక్ కమిటీ అధ్యక్షుడు, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఝఝారియా... కంగనా అంకితభావం, స్ఫూర్తిని కొనియాడాడు. -
ప్రపంచకప్ టోర్నీకి సన్నాహాలు
న్యూఢిల్లీ: జూనియర్ హాకీ ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా... భారత జట్టు నాలుగు దేశాల సిరీస్కు సిద్ధమైంది. ఈ నెల 21 నుంచి 25 వరకు జర్మనీ వేదికగా జరగనున్న ఈ టోర్నీలో ఆతిథ్య జర్మనీ, ఆస్ట్రేలియా, స్పెయిన్లతో యువ భారత జట్టు తలపడనుంది. భారత జూనియర్ జట్టుకు అరిజీత్ సింగ్ హుందల్ సారథ్యం వహిస్తుండగా... అమీర్ అలీ వైస్కెపె్టన్గా వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్ కోసం భారత జట్టు బుధవారం బెంగళూరు నుంచి బెర్లిన్కు బయలుదేరింది. శనివారం జరగనున్న తొలి పోరులో ఆతిథ్య జర్మనీతో భారత్ తలపడనుంది. అనంతరం ఆదివారం ఆ్రస్టేలియాతో, మంగళవారం స్పెయిన్తో మ్యాచ్లు ఆడనుంది. రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరగనున్న ఈ సిరీస్లోని అన్నీ మ్యాచ్లు బెర్లిన్లో నిర్వహించనున్నారు. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఈ నెల 25న ఫైనల్ జరగనుంది. ‘2025 జూనియర్ హాకీ వరల్డ్కప్నకు ముందు ఈ టోర్నమెంట్ భారత జట్టుకు ఎంతో కీలకం కానుంది. మెగా టోర్నీకి ఎక్కువ రోజులు లేకపోవడంతో... ఇది సన్నద్ధతకు చక్కగా తోడ్పడనుంది. బలాబలాలను బేరీజు వేసుకోవడంతో పాటు జట్టు కూర్పును సిద్ధం చేసేందుకు ఉపకరిస్తుంది. ఇంకా మెరుగవ్వాల్సిన అంశాలేంటి అనేదానిపై కూడా ఒక స్పష్టత వస్తుంది. బలమైన ప్రత్యర్థులతో తలపడ్డప్పుడే మన బలహీనతలు బయటపడతాయి’అని హాకీ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది నవంబర్ 28 నుంచి డిసెంబర్ 10 వరకు భారత్ వేదికగా జూనియర్ హాకీ ప్రపంచకప్ జరగనుంది. -
సారీ... కోకో!
బెర్లిన్: తాజా ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ కోకో గాఫ్కు ప్రపంచ నంబర్వన్ ప్లేయర్ సబలెంకా (బెలారస్) క్షమాపణలు చెప్పింది. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కోసం ఇద్దరు తలపడగా... అమెరికన్ స్టార్ కోకో గాఫ్ విజేతగా నిలిచింది. మ్యాచ్ అనంతరం రన్నరప్ సబలెంకా మాట్లాడుతూ... తన స్వీయ తప్పిదాల వల్లే ప్రత్యర్థి గెలిచిందని, విజయంలో గాఫ్ పాత్రలేదన్నట్లుగా వ్యాఖ్యానించింది. మూడు గ్రాండ్స్లామ్ టైటిల్స్ విజేత అయిన సబలెంకా వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెలువెత్తాయి. దీంతో క్షమాపణలు కోరుతూ సబలెంకా లేఖ రాసింది. ‘నా వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. ఓ విజేతను ఉద్దేశించి అలా మాట్లాడాల్సింది కాదు. నా భావోద్వేగాలను నియంత్రించుకుని ఉంటే బాగుండేది. గాఫ్ను క్షమాపణలు కోరుతున్నాను. మనుషులందరూ పొరపాట్లు చేస్తుంటారు. జీవితంలో నేర్చుకునే దశలో ఉన్న నేను కూడా అంతే. తదనంతరం నేను మాట్లాడిన మాటలు నన్నే కలత పెట్టాయి. ముమ్మాటికి ఫ్రెంచ్ ఓపెన్ గెలిచే అర్హత గాఫ్కే ఉంది. ఆమె విజయాన్ని నేను మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నా’ అని లేఖలో పేర్కొంది. నిజానికి గాఫ్పై మాటలతో దాడి చేయాలనే ఉద్దేశం తనకు లేదని చెప్పింది. మ్యాచ్ ముగిసిన వెంటనే మీడియా సమావేశం జరగడం... ఫలితంతో నిరాశలో ఉన్న తాను అలా మాట్లాడాల్సి వ చ్చిందని వివరణ ఇ చ్చింది. ‘ఎప్పుడైనా సరై ప్రత్యరి్థని గౌరవించే నాకు ఇలా చిన్నబుచ్చే వ్యాఖ్యలు చేయడం పట్ల మనస్తాపం చెందాను. అందుకే మన్నించమని విజ్ఞప్తి చేస్తున్నాను. జీవితంలో నేను ఎప్పటికి గుర్తుంచుకోవాల్సిన పాఠం ఇది’ అని సబలెంకా తెలిపింది. బెలారస్ స్టార్, ప్రపంచ నంబర్వన్ సబలెంకా రెండు ఆ్రస్టేలియన్ ఓపెన్ (2023, 2024) టైటిల్స్తో పాటు ఒక యూఎస్ ఓపెన్ (2024) ట్రోఫీ గెలుచుకుంది. అయితే ప్రపంచ రెండో ర్యాంకర్ కోకో గాఫ్తో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో తడబడింది. ఏకంగా 70 అనవసర తప్పిదాలు చేసింది. గాఫ్ మాత్రం 30 తప్పిదాలే చేసి టైటిల్ విజేతగా నిలిచింది. కోకో గాఫ్ 2023లో సబలెంకాపైనే గెలిచి యూఎస్ ఓపెన్ టైటిల్ కూడా సాధించింది. -
ఆసియా కప్ పుట్బాల్ క్వాలిఫయర్స్ టోర్నీకి సౌమ్య
న్యూఢిల్లీ: ఆసియా కప్–2026 మహిళల ఫుట్బాల్ క్వాలిఫయర్స్ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 24 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో తెలంగాణకు చెందిన సౌమ్య గుగులోత్ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. దేశవాళీ లీగ్లో ఈస్ట్ బెంగాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సౌమ్య గత సీజన్లో భారత మహిళల ఉత్తమ ఫుట్బాలర్ అవార్డును అందుకుంది. ఆసియా కప్ క్వాలిఫయర్స్లో భాగంగా భారత జట్టు గ్రూప్ ‘బి’లో ఉంది. భారత జట్టుతోపాటు గ్రూప్ ‘బి’లో థాయ్లాండ్, మంగోలియా, తిమోర్ లెస్టె, ఇరాక్ జట్లున్నాయి. ఈనెల 23 నుంచి జూలై 5 వరకు జరిగే గ్రూప్ ‘బి’ మ్యాచ్లకు బ్యాంకాక్ ఆతిథ్యమిస్తుంది. ఈనెల 23న తమ తొలి మ్యాచ్లో మంగోలియాతో ఆడనున్న భారత జట్టు ఆ తర్వాత వరుసగా తిమోర్ లెస్టె (జూన్ 29న), ఇరాక్ (జూలై 2న), థాయ్లాండ్ (జూలై 5న) జట్లతో పోటీపడుతుంది. 2026 ఆసియా కప్ మహిళల ఫుట్బాల్ టోర్నీకి మార్చి 1 నుంచి 21 వరకు ఆ్రస్టేలియా ఆతిథ్యమిస్తుంది. మొత్తం 12 దేశాలు బరిలోకి దిగుతాయి. ఆతిథ్య దేశం హోదాలో ఆ్రస్టేలియా, 2022 టోర్నీ చాంపియన్ చైనా, 2022 టోర్నీ రన్నరప్ దక్షిణ కొరియా, 2022 టోర్నీలో మూడో స్థానం పొందిన జపాన్ జట్లు ఇప్పటికే నేరుగా అర్హత సాధించాయి. మిగిలిన ఎనిమిది బెర్త్లు క్వాలిఫయర్స్ టోర్నీ ద్వారా ఖరారవుతాయి. క్వాలిఫయర్స్ టోర్నీలో మొత్తం 34 జట్లు పాల్గొంటున్నాయి. 34 జట్లను ఎనిమిది గ్రూప్లుగా విభజించారు. ‘ఎ’, ‘బి’ గ్రూపుల్లో 5 జట్ల చొప్పున... మిగిలిన ‘సి’, ‘డి’, ‘ఈ’, ‘ఎఫ్’, ‘జి’, ‘హెచ్’ గ్రూపుల్లో 4 జట్ల చొప్పున ఉన్నాయి. ఎనిమిది గ్రూప్ల విజేత జట్లు వచ్చే ఏడాది ఆసియా కప్ టోర్నీకి అర్హత సాధిస్తాయి. భారత మహిళల ఫుట్బాల్ జట్టు: ఎలాంగ్బమ్ పంథోయ్ చాను, మోనాలీసా దేవి, పాయల్ బసుదె (గోల్కీపర్లు), హేమం షిల్కీ దేవి, కిరణ్ పిస్దా, మార్టినా థోక్చోమ్, స్వీటీ దేవి, నిర్మలా దేవి, పూర్ణిమ కుమారి, సంజు, రంజన చాను (డిఫెండర్లు), అంజు తమాంగ్, గ్రేస్ డాంగ్మె, కార్తీక అంగముత్తు, రత్నబాలా దేవి, ప్రియదర్శిని సెల్లాదురై, సంగీత బస్ఫోరె (మిడ్ ఫీల్డర్లు), లిండా కోమ్ సెర్టో, మాళవిక, మనీషా కల్యాణ్, మనీషా నాయక్, ప్యారీ జక్సా, రింపా హల్దర్, సౌమ్య గుగులోత్ (ఫార్వర్డ్స్). -
చెన్నై ఓపెన్ పునరాగమనం
చెన్నై: తమిళనాడు టెన్నిస్ అసోసియేషన్ (టీఎన్టీఏ) అధ్యక్షుడు, భారత మేటి ప్లేయర్ విజయ్ అమృత్రాజ్ కృషి ఫలించింది. మూడేళ్ల తర్వాత చెన్నై ఓపెన్ భారత టెన్నిస్లో పునరాగమనం చేయనుంది. ఈ అక్టోబర్లో టోర్నీ నిర్వహణకు మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) ఆమోదం తెలిపింది. అక్టోబర్ 27 నుంచి మెయిన్ డ్రా పోటీలు జరుగుతాయని టీఎన్టీఏ అధ్యక్షుడు విజయ్ అమృత్రాజ్ తెలిపారు. ‘మొత్తానికి మా ప్రయత్నాలు ఫలించాయి. చెన్నైలో మేటి అంతర్జాతీయ టెన్నిస్ టోర్నీకి మార్గం సుగమమైంది. ఈ టోర్నీని తిరిగి నగరంలో నిర్వహించాలనే మా ప్రయత్నాలకు మొదటి నుంచి వెన్నంటే ఉండి సహకరించిన తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి, తమిళనాడు స్పోర్ట్స్ అథారిటీకి కృతజ్ఞతలు’ అని విజయ్ అన్నారు. ప్రముఖ స్పోర్ట్స్ చానెల్ నెట్వర్క్ ఈ టోర్నీ మ్యాచ్లను ప్రసారం చేస్తుందన్నారు. చెన్నై అభిమానులు, భారత టెన్నిస్ ప్రియులు ఈ ఈవెంట్ను విజయవంతం చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. చివరి సారిగా చెన్నై ఓపెన్ డబ్ల్యూటీఏ–250 టోర్నమెంట్ను 2022లో నిర్వహించారు. చెక్ రిపబ్లిక్ ప్లేయర్ లిండా ఫ్రువిత్రొవా సింగిల్స్ చాంపియన్గా నిలిచింది. -
వరుసగా ఆరో పరాజయం
ఆంట్వర్ప్ (బెల్జియం): అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) యూరోపియన్ అంచె ప్రొ లీగ్లో భారత పురుషుల జట్టు నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. హార్దిక్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టు యూరోపియన్ అంచెలో వరుసగా ఆరో పరాజయాన్ని చవిచూసింది. ఆ్రస్టేలియా జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్లో టీమిండియా 2–3 గోల్స్ తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్కు ముందు నెదర్లాండ్స్తో రెండు మ్యాచ్ల్లో, అర్జెంటీనాతో రెండు మ్యాచ్ల్లో, ఆ్రస్టేలియాతో ఒక మ్యాచ్లో భారత జట్టు ఓటమి పాలైంది. ఆ్రస్టేలియాతో జరిగిన రెండో మ్యాచ్లో భారత జట్టు మ్యాచ్ మొదలైన మూడో నిమిషంలోనే ఖాతా తెరిచింది. సంజయ్ చేసిన గోల్తో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఆధిక్యంలోకి వెళ్లామన్న ఆనందం భారత్కు మరుసటి నిమిషంలోనే ఆవిరైంది. రెండు నిమిషాల వ్యవధిలో ఆస్ట్రేలియా రెండు గోల్స్ చేసి భారత్కు షాక్ ఇచి్చంది. నాలుగో నిమిషంలో టిమ్ బ్రాండ్, ఐదో నిమిషంలో బ్లేక్ గోవర్స్ ఆస్ట్రేలియాకు ఒక్కో గోల్ అందించారు. రెండో క్వార్టర్లో భారత్ మూడో గోల్ సమర్పించుకుంది. 18వ నిమిషంలో కూపర్ బర్న్స్ గోల్తో ఆస్ట్రేలియా 3–1తో ముందంజ వేసింది. మూడో క్వార్టర్లో దిల్ప్రీత్ సింగ్ గోల్తో భారత్ ఈ ఆధిక్యాన్ని 2–3కు తగ్గించింది. అనంతరం భారత జట్టు స్కోరును సమం చేసేందుకు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆ్రస్టేలియా చివరి పది నిమిషాల్లో మూడు పెనాల్టీ కార్నర్లు సంపాదించినా భారత గోల్కీపర్ కృషన్ బహదూర్ పాఠక్ నిర్వీర్యం చేశాడు. ఓవరాల్గా మ్యాచ్లో భారత జట్టుకు నాలుగు పెనాల్టీ కార్నర్లు రాగా ఒక్క దానిని సద్వినియోగం చేసుకుంది. మరోవైపు ఆ్రస్టేలియాకు ఎనిమిది పెనాల్టీ కార్నర్లు రాగా ఆ జట్టు కూడా ఒక్క దానిని లక్ష్యానికి చేర్చింది. ఈ మ్యాచ్లో బరిలోకి దిగడం ద్వారా భారత మాజీ కెప్టెన్, మిడ్ఫీల్డర్ మన్ప్రీత్ సింగ్ కెరీర్లో 400 మ్యాచ్లు పూర్తి చేసుకున్నాడు. మొత్తం తొమ్మిది జట్లు పోటీపడుతున్న 2024–2025 ప్రొ లీగ్లో భారత జట్టు 14 మ్యాచ్లు పూర్తి చేసుకుంది. ఐదు మ్యాచ్ల్లో గెలిచి, తొమ్మిది మ్యాచ్ల్లో ఓడింది. 15 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. భారత జట్టు తమ చివరి రెండు మ్యాచ్లను బెల్జియం జట్టుతో (జూన్ 21న, 22న) ఆడుతుంది. -
‘ప్రపంచ’ ఆర్చరీ పోటీలకు జ్యోతిసురేఖ, చికిత
పుణే: స్టార్ ఆర్చర్లు వెన్నం జ్యోతి సురేఖ, బొమ్మదేవర ధీరజ్ (ఆంధ్రప్రదేశ్), తనిపర్తి చికిత (తెలంగాణ) ప్రపంచ కప్ స్టేజ్–4 టోర్నీ, ప్రపంచ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనే భారత జట్టుకు ఎంపికయ్యారు. భారత ఆర్చరీ సంఘం (ఏఏఐ) ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించిన జాతీయ సెలక్షన్ ట్రయల్స్లో పలువురు స్టార్ ఆర్చర్లకు నిరాశ ఎదురైంది. ఒలింపియన్ అతాను దాస్, ప్రపంచ ఏడో ర్యాంకర్ అభిషేక్ వర్మ, ఈ ఏడాది ప్రపంచకప్ టోర్నీల్లో మూడు పతకాలు నెగ్గిన మధుర ట్రయల్స్లో విఫలమయ్యారు. ఆశ్చర్యకరంగా టీనేజ్ ఆర్చర్లు ‘ప్రపంచ’ పోటీలకు అర్హత సాధించడం విశేషం! 15 ఏళ్ల మహారాష్ట్ర ఆర్చర్లు గత ఖడకే, శర్వారీ మహిళల రికర్వ్ లో ... 16 ఏళ్ల ప్రీతిక మహిళల కాంపౌండ్లో భారత జట్టుకు ఎంపికయ్యారు. మహిళల కాంపౌండ్లో జ్యోతి సురేఖ (18.25 పాయింట్లు), పర్ణీత్ (14), ప్రీతిక (12.25) వరుసగా తొలి మూడు స్థానాలు పొందారు. చికిత (12.25) కూడా ప్రీతికతో సమవుజ్జీగా నిలిచినప్పటికీ ‘షూటాఫ్’తో చికిత నాలుగో స్థానానికి పరిమితమైంది. అయితే ఈ ప్రదర్శనతో ఆమె ప్రపంచకప్ ఈవెంట్కు అర్హత పొందగా... టాప్–3 ప్లేయర్లు రెండు మెగా ఈవెంట్లకూ క్వాలిఫై అయ్యారు. పురుషుల రికర్వ్లో అతాను దాస్ అర పాయింట్ (0.5) తేడాతో ప్రపంచ పోటీలకు దూరమయ్యాడు. ప్రపంచ కప్ స్టేజ్–4 ఈవెంట్ వచ్చే నెల 8 నుంచి 13 వరకు మాడ్రిడ్లో జరుగుతుంది. ప్రపంచ చాంపియన్ షిప్ను సెపె్టంబర్ 5 నుంచి 12 వరకు దక్షిణ కొరియాలో నిర్వహిస్తారు. -
ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమి..
ఎఫ్ఐహెచ్ మహిళల ప్రొ లీగ్లో భారత అమ్మాయిలు ఆఖరిదాకా పోరాడినా ఆస్ట్రేలియా చేతిలో పరాజయం తప్పలేదు. లండన్ వేదికగా శనివారం జరిగిన పోరులో మహిళల జట్టు 2–3 స్కోరుతో కంగారు చేతిలో కంగుతింది. ఆరంభంలో భారత అమ్మాయిలకు కలిసిరాలేదు. తొలిక్వార్టర్లో రెండు పెనాల్టీ కార్నర్లు లభించగా... భారత స్ట్రయికర్లు లక్ష్యం చేర్చేందుకు శతవిధాలా ప్రయతి్నంచారు.కానీ ప్రత్యర్థి డిఫెండర్లు, గోల్కీపర్ అలీషా సమన్వయంతో అడ్డుకున్నారు. అయితే రెండో క్వార్టర్ మొదలైన నిమిషంలోనే కౌట్నే షానెల్ (16వ నిమిషం) భారత రక్షణ పంక్తిని బోల్తాకొట్టించి ఆసీస్కు గోల్ తెచి్చపెట్టింది. ఇదే క్వార్టర్లో మరో పదినిమిషాలు గడిచేసరికి నెట్వద్ద చురుగ్గా మాటువేసిన లెక్సీ పికెరింగ్ (26వ నిమిషం) చాకచక్యంగా గోల్ చేసి ఆసీస్ ఆధిక్యాన్ని 2–0తో రెట్టింపు చేశారు.తిరిగి మూడో క్వార్టర్ మొదలైన కాసేపటికే టాటమ్ స్టివార్ట్ (35వ నిమిషం) పెనాల్టీ స్ట్రోక్తో కంగారూ సేన 3–0తో ఎదురులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఎట్టకేలకు మూడో క్వార్టర్ ముగిసే దశలో డ్రాగ్ఫ్లికర్ దీపిక (44వ నిమిషం) చేసిన గోల్తో భారత్ ఖాతా తెరువగలిగింది. 1–3తో తొలిసారి ఆధిక్యానికి గండికొట్టిన భారత్ మళ్లీ 6 నిమిషాల వ్యవధిలో దీపిక ఫ్లిక్ చేసిన బంతి రి»ౌండ్ కాగా... పక్కనే ఉన్న నేహా (52వ నిమిషం)సమయస్ఫూర్తితో ప్రత్యర్థి గోల్పోస్ట్లోకి తరలించింది. ఆఖర్లో స్కోరును సమం చేసే అవకాశం పెనాల్టీ కార్నర్ రూపంలో వచి్చనప్పటికీ గోల్గా మలచడంతో భారత స్ట్రయికర్లు విఫలమాయ్యరు. ఆదివారం ఇదే వేదికపై ఆ్రస్టేలియాతో భారత అమ్మాయిలు రెండో మ్యాచ్ ఆడతారు. -
భారత్కు మళ్లీ పరాజయమే...
అంట్వర్ప్ (బెల్జియం): ప్రత్యర్థులు మారుతున్నా... భారత్ ఫలితాలే మారడం లేదు. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్ యూరోప్ అంచె పోటీల్లో భారత సీనియర్ పురుషుల జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసలో ఐదో ఓటమిని చవిచూసిన భారత్... మూడో ప్రత్యర్థి చేతిలోనూ చిత్తయ్యింది. నెదర్లాండ్స్, అర్జెంటీనాల చేతిల్లో కంగుతిన్న భారత్... తాజాగా ఆస్ట్రేలియా ధాటికి తలవంచింది. శనివారం ఆసీస్తో జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 2–3 స్కోరు తేడాతో ఐరోపాలో అలవాటైన అపజయాన్ని మూటగట్టుకుంది. భారత్ తరఫున అభిషేక్ 8, 35వ నిమిషాల్లో రెండు గోల్స్ సాధించాడు. కంగారూ జట్టులో నాథన్ ఎఫ్రామస్ (42వ ని.), జోయెల్ రింటాల (56వ ని.), టామ్ క్రెయిగ్ (60వ ని.) తలా ఒక గోల్ చేశారు.నిజానికి ఈ ప్రొ లీగ్ హాకీలో మెరుగైన స్థానంతోనే నేరుగా వచ్చే ప్రపంచకప్కు అర్హత సాధించాలనుకున్న భారత్కు వరుస పరాభవ ఫలితాలు శరాఘాతమయ్యాయి. యూరోప్ లెగ్లో మొదట నెదర్లాండ్స్తో... తర్వాత అర్జెంటీనాతో ఆడిన రెండేసి చొప్పున ఆడిన మ్యాచ్ల్లో భారత్ ఓడింది. రెండు క్వార్టర్లు ఆధిక్యంలో ఉన్నా... ఆరంభంలో భారత్ దూకుడు కనబరిచింది. పది నిమిషాల్లోనే ప్రత్యర్థిపై ఆధిక్యత సాధించింది. ఆటగాళ్ల సమన్వయం, డిఫెండర్ల పట్టు... ఇలా ఇన్ని అనుకూలతలున్నప్పటికీ అన్నీ ఆరంభశూరత్వంగానే ఆవిరయ్యాయి. తొలి క్వార్టర్ 8వ నిమిషంలోనే అభిషేక్ గోల్తో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో క్వార్టర్లో మరో గోల్ సాధించలేకపోయినప్పటికీ ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో డిఫెండర్లు, స్ట్రయికర్లు సమష్టిగా శ్రమించారు. మూడో క్వార్టర్ మొదలైన ఐదు నిమిషాలకే అభిషేక్ మరో గోల్ భారత్ ఆధిక్యం కాస్తా 2–0కు పెరిగింది. ఇలా దాదాపు 41 నిమిషం దాకా కొనసాగిన భారత ఆధిపత్యానికి ఆ మరుసటి నిమిషంలోనే నాథన్ ఎఫ్రామస్ గండి కొట్టాడు. 2–1తో అప్పటికి మంచిస్థితిలోనే ఉంది. అయితే ఆఖరి క్వార్టర్ కూడా ముగిసే దశలో ఆసీస్కు లభించిన రెండు పెనాల్టీ కార్నర్లు భారత్ను నిండా ముంచేశాయి. 4 నిమిషాల వ్యవధిలో రింటాల (56వ ని.), క్రెయిగ్ (60వ ని.) పెనాల్టీ కార్నర్లను గోల్స్గా మలచడంతో భారత్కు మరో పరాజయం తప్పలేదు. నేడు ఇదే వేదికపై భారత్... ఆసీస్తో రెండో మ్యాచ్ ఆడుతుంది. -
నీరజ్ చోప్రా... ఎనిమిదేళ్ల తర్వాత
పారిస్: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పారిస్ డైమండ్ లీగ్లో టైటిల్ సాధించడమే లక్ష్యంగా సాధన చేస్తున్నాడు. ఈ ఏడాది రెండు టోర్నమెంట్లలో రెండో స్థానంలో నిలిచిన 27 ఏళ్ల నీరజ్... ఈ నెల 20 నుంచి జరగనున్న లీగ్లో అగ్ర స్థానం దక్కించుకోవాలని చూస్తున్నాడు. చివరిసారిగా 2017లో పారిస్ డైమండ్ లీగ్లో పాల్గొన్న నీరజ్... మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాత ఇందులో పాల్గొంటున్నాడు. ఈ మేరకు నిర్వాహకులు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘రెండు ఒలింపిక్ పతకాల విజేత నీరజ్ చోప్రా, రెండు సార్లు ప్రపంచ చాంపియన్ అండర్సన్ పీటర్స్తో పాటు ఇప్పటికే 90 మీటర్ల మార్క్ దాటిన మరో ఐదుగురు ప్రపంచ స్థాయి జావెలిన్ త్రోయర్లు బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారు’ అని నిర్వహకులు పేర్కొన్నారు. గతేడాది పారిస్ ఒలింపిక్స్ నేపథ్యంలో ఈ లీగ్కు దూరంగా ఉన్న నీరజ్ చోప్రా... ఈసారి సత్తాచాటాలని భావిస్తున్నాడు. ఈ లీగ్ అనంతరం చెక్ రిపబ్లిక్లో జరగనున్న గోల్డెన్ స్పైక్ అథ్లెటిక్స్ మీట్లో నీరజ్ పాల్గొననున్నాడు. ఆ తర్వాత భారత్లో తొలిసారి నిర్వహిస్తున్న ప్రపంచ స్థాయి జావెలిన్ త్రో పోటీల్లో నీరజ్ పాల్గొననున్నాడు. ‘నీరజ్ చోప్రా క్లాసిక్’ పేరుతో వచ్చే నెల 5న బెంగళూరు వేదికగా జరగనున్న ఈ ఈవెంట్కు ప్రపంచ అథ్లెటిక్ సమాఖ్య ‘ఎ’ కేటగిరీ గుర్తింపునిచి్చంది. ఇందులో అంతర్జాతీయ స్టార్ జావెలిన్ త్రోయర్లు పాల్గొననున్నారు. -
ఆర్య–అర్జున్ పసిడి గురి
మ్యూనిక్: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) మూడో ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత షూటర్లు అదరగొట్టారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో సురుచి స్వర్ణ పతకం సాధించగా... శనివారం భారత్ ఖాతాలో మరో పసిడి పతకం చేరింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో ఆర్య బోర్సే–అర్జున్ బబూతా జంట అద్వితీయమైన గురితో ఒలింపిక్ చాంపియన్ జిఫీ వాంగ్–లిహావో షెంగ్ (చైనా) ద్వయంపై గెలుపొందింది. ఫైనల్లో ఆర్య–అర్జున్ జోడీ 17–7తో చైనా జంటను చిత్తుచేసి అగ్ర స్థానంలో నిలిచింది.నార్వే జంటకు కాంస్య పతకం దక్కింది. భారత్కే చెందిన ఎలవెనిల్ వలరివన్–అంకుశ్ జాధవ్ జోడీ 631.8 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. పోటీల చివరి రోజు క్వాలిఫయింగ్ ఈవెంట్లో అర్జున్ 317.7 పాయింట్లు సాధించగా... ఆర్య 317.5 పాయింట్లు స్కోరు చేసింది. దీంతో ఓవరాల్గా 635.2 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి ఫైనల్కు అర్హత సాధించింది. ఈ ఏడాది ఏప్రిల్లో పెరూ రాజధాని లిమాలో జరిగిన రెండో ప్రపంచకప్ టోర్నీ రుద్రాం„Š పాటిల్తో కలిసి ఆర్య బోర్సే 10 మీటర్ల ఎయిర్ రైఫిల్లో రజత పతకం గెలిచింది. తాజా ప్రపంచకప్లో భారత్కు ఇది రెండో స్వర్ణం కాగా... ఓవరాల్గా నాలుగో పతకం. సిఫ్ట్ కౌర్ సమ్రా, ఎలవెనిల్ వలరివన్ వ్యక్తిగత కాంస్యాలు గెలుచుకున్నారు. ఇక పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్లకు నిరాశ ఎదురైంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మనూ భాకర్–ఆదిత్య మల్రా 577 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. సురుచి సింగ్–వరుణ్ తోమర్ జంట 576 పాయింట్లతో పదో స్థానానికి పరిమితమైంది. -
‘వారిద్దరిలా అభిమానాన్ని పొందలేదు’
బెల్గ్రేడ్: పురుషుల టెన్నిస్ను దాదాపు రెండు దశాబ్దాల పాటు ఫెడరర్, నాదల్, జొకోవిచ్ శాసించారు. ఫెడరర్ 20 గ్రాండ్స్లామ్ టైటిల్స్ గెలుచుకోగా, నాదల్ 22 గ్రాండ్స్లామ్ టైటిల్స్తో దానిని సవరించాడు. ఆ తర్వాత జొకొవిచ్ 24 గ్రాండ్స్లామ్ ట్రోఫీలు సాధించి అగ్ర స్థానాన నిలిచాడు. అయితే సుదీర్ఘ కెరీర్లో ఫెడరర్, నాదల్ అభిమానులకు చేరువైనంతగా జొకోవిచ్ కాలేకపోయాడు. ఆట అద్భుతమే అయినా కొన్నిసార్లు కోర్టులో తన ప్రవర్తన, మాటతీరు అతని ప్రతిష్టను కొంత తగ్గించాయి. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు స్వయంగా జొకోవిచ్ ఈ విషయాన్ని అంగీకరించాడు. ఫెడరర్, నాదల్ తరహాలో తాను టెన్నిస్ ప్రేమికుల నుంచి తగినంత అభిమానం పొందలేకపోయానని అతను వ్యాఖ్యానించాడు. ‘నాలో ఎన్నో లోపాలు ఉండవచ్చు. అది వాస్తవం. అయితే ఎప్పుడూ మనసులో చెడు ఆలోచనలు లేకుండా మంచి ఉద్దేశంతోనే నా జీవితాన్ని గడిపాను. నాకు నచ్చినట్లుగా బతికాను. కానీ ఫెడరర్, నాదల్తో పోలిస్తే చాలాసార్లు నేను ఎవరికీ అక్కర్లేని పసివాడిలా నన్ను చూశారు. ఈ కారణంగా చాలాసార్లు బాధపడ్డాను. ఎందుకు ఇలా జరుగుతోందని చాలాసార్లు నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. నా ప్రవర్తన మారితే అంతా బాగుంటుందని భావించి ఆ ప్రయత్నమూ చేశాను. అయినా సఫలం కాలేకపోయాను’ అని జొకోవిచ్ ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకే నన్ను పట్టించుకోలేదు... ఫెడరర్, నాదల్తో పోలిస్తే తనకు తగినంత గౌరవం దక్కకపోవడానికి భౌగోళిక పరిస్థితులు కూడా ఒక కారణమని జొకోవిచ్ అభిప్రాయపడ్డాడు. యూరోప్లోని ప్రముఖ దేశాల నుంచి వారిద్దరు వచ్చారని, తాను వారికి సవాల్ విసరడం కొందరికి నచ్చలేదని అతను అన్నాడు. ‘నాకు గుర్తింపు రాకముందే ఫెడరర్, నాదల్ సమఉజ్జీలైన ప్రత్యర్థులుగా పోరాడుతూ వచ్చారు. పశ్చిమాన బలమైన దేశాలైన స్విట్జర్లాండ్, స్పెయిన్ల నుంచి వారు వచ్చారు. కాబట్టి నాతో పోలిస్తే సహజంగానే వారికి ఎన్నో సంబంధాలు ఉన్నాయి. వీరిద్దరే గొప్ప ఆటగాళ్లు అనే కొందరి మనస్తత్వాన్ని నేను మార్చలేకపోయాను. పైగా నంబర్వన్ను అవుతాను అంటూ నేను చేసిన ప్రకటన చాలా మందికి నచ్చలేదు’ అని 38 ఏళ్ల జొకోవిచ్ గుర్తు చేసుకున్నాడు. వారిద్దరిపై గౌరవం ఉంది... ఫెడరర్, నాదల్లతో ఎన్నో గొప్ప మ్యాచ్లలో తలపడ్డానని, ఏనాడూ తప్పుగా మాట్లాడలేదని జొకో వ్యాఖ్యానించాడు. ‘మైదానంలో ప్రత్యర్థులైనంత మాత్రాన ఎవరినైనా ద్వేషిస్తామా. వారికి కీడు తలపెట్టాలని, ఏం చేసైనా ఓడించాలనే ఆలోచన కూడా ఎప్పుడూ రాలేదు. గెలుపు కోసమే పోరాడాం. మెరుగైన ఆటగాడే గెలిచాడు. వారిద్దరిపై నాకు ఎంతో గౌరవం ఉంది. ఒక్క చెడు మాట కూడా మాట్లాడలేదు. ఇకపై కూడా మాట్లాడను’ అని సెర్బియా స్టార్ తమ మనసులో మాట వెల్లడించాడు. ముగ్గురి ఆట భిన్నం... జొకోవిచ్ తన ఆటతో పాటు ఫెడరర్, నాదల్ ఆట గురించి కూడా విశ్లేషించాడు. ముగ్గురి ఆట భిన్నంగా ఉంటుందని అతను పోల్చాడు. ‘ఫెడరర్ చాలా ప్రతిభావంతుడు. అతని ఆట చాలా అందంగా అనిపిస్తుంది. అలవోకగా అతను కదిలి షాట్లు ఆడే తీరులో కూడా కళ కనిపిస్తుంది. నాదల్ దీనికి పూర్తిగా భిన్నం. అతని శారీరక సామర్థ్యం అసమానం. దానినే బాగా వాడుకుంటాడు. నా ఆట వీరిద్దరికి మధ్యలో ఉన్నట్లుగా ఉంటుంది. నాదల్ ప్రదర్శనతో నాకు దగ్గరి పోలికలు ఉన్నాయి. సమయం సాగుతున్నకొద్దీ మా ఆటలో మరిన్ని సొంత ప్రత్యేకతలు వచ్చి చేరాయి. ఒకరి ఆటను మరొకరు అభినందించుకుంటూ ముందుకు సాగాం. ఈ క్రమంలో మాలో పోటీతత్వం పెరిగి ఆట కూడా మరింత మెరుగైంది. వీరిద్దరితో హోరాహోరీ సమరాల్లో తలపడటం నాకు మేలు చేసింది. నా కెరీర్ ముందుకు సాగడంలో నిస్సందేహంగా వారి ప్రభావం ఉంది’ అని ఇటీవల జెనీవా ఓపెన్లో విజేతగా నిలిచి కెరీర్లో 100 సింగిల్స్ టైటిల్స్ పూర్తి చేసుకున్న జొకోవిచ్ వివరించాడు. -
భారత్ X ఆస్ట్రేలియా
లండన్: మహిళల హాకీ ప్రొ లీగ్ యూరోపియన్ అంచె పోటీల కోసం భారత జట్టు పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది. లోటుపాట్లను సవరించుకొని ఆస్ట్రేలియాను ‘ఢీ’కొట్టేందుకు రెడీ అయ్యింది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్లో 9 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్న భారత మహిళల జట్టు పట్టికలో ఎగబాకేందుకు యూరోప్ అంచెను సది్వనియోగం చేసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా మహిళల టీమ్ నేడు, రేపు వరుస మ్యాచ్ల్లో ఆసీస్తో తలపడుతుంది. ప్రస్తుత జట్టు యువ క్రీడాకారిణిలతో పాటు అనుభవజు్ఞల కలబోతతో సమతూకంగా ఉంది. యూరోప్ పర్యటనతో రాటుదేలాక సెపె్టంబర్లో జరిగే ఆసియా చాంపియన్షిప్ టైటిల్తో నేరుగా వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్కు అర్హత సాధించాలని మహిళల జట్టు లక్ష్యంగా పెట్టుకుంది. గట్టి ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు దీటుగానే సిద్ధమయ్యామని చీఫ్ కోచ్ హరేంద్ర సింగ్ అన్నారు. ‘ప్రతి విభాగం కూడా పటిష్టమయ్యేందుకు సమష్టిగా శ్రమించాం. అయితే రెండు విభాగాల్లో మరింత దృష్టి సారించాల్సి వచ్చింది. ఫలితాన్ని తారుమారు చేసే గోల్ కీపింగ్, డ్రాగ్ ఫ్లికింగ్ విభాగాలు అంత్యంత కీలకం’ అని కోచ్ అన్నారు. ఇందులో భాగంగానే డ్రాగ్ఫ్లికర్లు దీపిక, మనీషాలకు ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. యూరోప్ టూర్కు ముందే డ్రాగ్ ఫ్లిక్లో నిపుణుడైన నెదర్లాండ్స్ కోచ్ టూన్ సీప్మన్తో పది రోజుల పాటు ఇద్దరు శిక్షణ తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన డ్రాగ్ ఫ్లికర్లలో చాలా మంది సీప్మన్ శిష్యులే అని ఈ సందర్భంగా హరేంద్ర సింగ్ చెప్పుకొచ్చారు. ఇలా ప్రతి విభాగంలోనూ క్రీడాకారిణిలను దీటుగా తయారు చేస్తున్నామని చెప్పారు. భారత్ అంచె పోటీల్లో ప్రపంచ నంబర్వన్ నెదర్లాండ్స్ను 2–2తో భారత్ నిలువరించేందుకు ప్రత్యేక కోచింగ్లే దోహదం చేశాయన్నారు. భువనేశ్వర్లో జరిగిన ఆ మ్యాచ్లో భారత్ షూటౌట్లో గెలిచి బోనస్ పాయింట్ సాధించింది. పెర్త్ (ఆ్రస్టేలియా)లో ‘ఎ’ జట్టుతో ఆడిన ఫ్రెండ్లీ మ్యాచ్ల అనుభవం కూడా భారత అమ్మాయిలకు కలిసివస్తుందని చీఫ్ కోచ్ హరేంద్ర సింగ్ అన్నారు. ఆసీస్ సీనియర్ జట్టు బలాబలాలేంటో తమకు తెలుసని పరిస్థితులకు తగ్గట్లు వ్యూహాలతోనే బరిలోకి దిగుతామని చెప్పారు. కంగారూ టీమ్తో వరుస మ్యాచ్లు ముగిసిన వెంటనే ఇక్కడే 17, 18 తేదీల్లో పటిష్టమైన అర్జెంటీనాను ఎదర్కొంటుంది. అనంతరం బెల్జియంకు పయనమవుతుంది. అంట్వర్ప్లో 21, 22 తేదీలో జరిగే మ్యాచ్ల్లో మేటి జట్టయిన బెల్జియంతో ఢీకొంటుంది. చివరగా బెర్లిన్లో ఈ నెల 28, 29 తేదీల్లో చైనాతో జరిగే పోటీలతో యూరోప్ అంచె ప్రొ లీగ్ ముగుస్తుంది. -
‘స్వర్ణ’ సురుచి
మ్యూనిక్: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) మూడో ప్రపంచకప్ టోర్నీలో భారత జట్టుకు తొలి స్వర్ణ పతకం లభించింది. శుక్రవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో 19 ఏళ్ల సురుచి సింగ్ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ సీజన్లో సురుచి పోటీపడ్డ మూడు ప్రపంచకప్ టోర్నీల్లోనూ బంగారు పతకాలు గెలవడం విశేషం. ఎనిమిది మంది మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో సురుచి 241.9 పాయింట్లు స్కోరు చేసి విజేతగా అవతరించింది. కామిలీ జెద్రెజెవ్స్కీ (ఫ్రాన్స్; 241.7 పాయింట్లు) రజతం నెగ్గగా... కియాన్జున్ యావో (చైనా; 221.7 పాయింట్లు) కాంస్య పతకాన్ని సంపాదించింది. ఈ ఏడాది జాతీయ సీనియర్ జట్టులోకి వచ్చిన సురుచి ఏప్రిల్లో బ్యూనస్ ఎయిర్స్లో జరిగిన తొలి ప్రపంచకప్ టోర్నీలో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం, మిక్స్డ్ టీమ్ విభాగంలో కాంస్యం సాధించింది. ఏప్రిల్లోనే పెరూ రాజధాని లిమాలో జరిగిన రెండో ప్రపంచకప్ టోర్నీలో సురుచి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో, మిక్స్డ్ టీమ్ విభాగంలో బంగారు పతకాలు గెలిచింది. -
ఐదు రోజుల్లో మూడు ప్రపంచ రికార్డులు నెలకొల్పిన కెనడా స్విమ్మర్
విక్టోరియా: కెనడా స్టార్ స్విమ్మర్ సమ్మర్ మెకింటోష్ మరో ప్రపంచ రికార్డు తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచ చాంపియన్షిప్లో పాల్గొనే కెనడా జట్టును ఎంపిక చేసేందుకు నిర్వహించిన సెలెక్షన్ ట్రయల్స్లో 18 ఏళ్ల మెకింటోష్ ఐదు రోజుల వ్యవధిలో మూడో ప్రపంచ రికార్డు తిరగరాసింది. బుధవారం జరిగిన 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లీ రేసులో 4 నిమిషాల 23.65 సెకన్లలో లక్ష్యాన్ని చేరి తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డును (4 నిమిషాల 24.38 సెకన్లు) తిరగరాసింది.గత ఏడాది పారిస్ ఒలింపిక్స్లో మూడు స్వర్ణ పతకాలు సాధించిన మెకింటోష్... వచ్చే నెలలో సింగపూర్ వేదికగా జరగనున్న ప్రపంచ అక్వాటిక్స్ చాంపియన్షిప్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఈ ట్రయల్స్లో భాగంగా ఇప్పటికే మెకింటోష్ 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లీ, 400 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగాలలో రెండు ప్రపంచ రికార్డులు సృష్టించింది. ‘పోటీకి ముందే ఏదో ప్రత్యేకంగా చేస్తానని అనుకున్నా. నా కెరీర్లో ఇది అత్యుత్తమ టోర్నీ. ప్రపంచ రికార్డులు నమోదయ్యేవి బద్దలవడానికే. కొలనుకు వీడ్కోలు చెప్పేంతవరకు వాటిపై నా పేరే ఉండే విధంగా చూసుకుంటా’ అని మెకింటోష్ పేర్కొంది. -
సింగిల్స్ విజేతల ఖాతాలో రూ. 35 కోట్లు
లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్కు సంబంధించి ప్రైజ్మనీ వివరాలను నిర్వాహకులు ప్రకటించారు. ఈ ఏడాది పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు 30 లక్షల పౌండ్ల (రూ. 35 కోట్లు) చొప్పున లభిస్తాయి. రన్నరప్గా నిలిచిన క్రీడాకారులకు 15 లక్షల 20 వేల పౌండ్ల (రూ. 17 కోట్ల 68 లక్షలు) చొప్పున అందజేస్తారు. సెమీఫైనల్లో ఓడిన వారికి 7,75,000 పౌండ్ల (రూ. 9 కోట్లు) చొప్పున... క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగిన వారికి 4 లక్షల పౌండ్ల (రూ. 4 కోట్ల 65 లక్షలు) చొప్పున... ప్రిక్వార్టర్ ఫైనల్లో పరాజయం పాలైన వారికి 2,40,000 పౌండ్ల (రూ. 2 కోట్ల 79 లక్షలు) చొప్పున లభిస్తాయి. మూడో రౌండ్లో ఓడిన వారికి 1,52,000 పౌండ్ల (రూ. 1 కోటీ 72 లక్షలు) చొప్పున... రెండో రౌండ్లో వెనుదిరిగిన వారికి 99 వేల పౌండ్ల (రూ. 1 కోటీ 15 లక్షలు) చొప్పున, తొలి రౌండ్లో ఓడిన వారికి 66 వేల పౌండ్ల (రూ. 77 లక్షలు) చొప్పున అందజేస్తారు. పురుషుల, మహిళల డబుల్స్ విభాగంలో టైటిల్ సాధించిన జోడీలకు 6,80,000 పౌండ్ల (రూ. 7 కోట్ల 91 లక్షలు) చొప్పున లభిస్తాయి. ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీ జూన్ 30 నుంచి జూలై 13వ తేదీ వరకు జరుగుతుంది. గత సంవత్సరం పురుషుల సింగిల్స్లో అల్కరాజ్, మహిళల సింగిల్స్లో క్రెజికోవా (చెక్ రిపబ్లిక్) టైటిల్స్ సాధించారు. -
సిఫ్ట్ కౌర్కు కాంస్యం
మ్యూనిక్: ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్ ఖాతాలో రెండో పతకం చేరింది. గురువారం జరిగిన మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో భారత షూటర్ సిఫ్ట్ కౌర్ సమ్రా కాంస్య పతకం సాధించింది. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో సిఫ్ట్ కౌర్ 453.1 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. డ్యూస్టాడ్ జెనెట్ హెగ్ (నార్వే; 466.9 పాయింట్లు) స్వర్ణం, ఎమిలీ జెగీ (స్విట్జర్లాండ్; 464.8 పాయింట్లు) రజతం సొంతం చేసుకున్నారు. పంజాబ్కు చెందిన 23 ఏళ్ల సిఫ్ట్ కౌర్కు ఓవరాల్గా ప్రపంచకప్ టోర్నీలలో ఇది ఐదో పతకం కావడం విశేషం. మరోవైపు గురువారమే జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో భారత్కు నిరాశ ఎదురైంది. క్వాలిఫయింగ్లో అంకుశ్ జాదవ్ (631.7 పాయింట్లు) 11వ స్థానంలో, అర్జున్ బబూటా (629.1 పాయింట్లు) 43వ స్థానంలో, సందీప్ సింగ్ (628.3 పాయింట్లు) 53వ స్థానంలో నిలిచారు. -
‘ఫిఫా’ ప్రపంచకప్కు బ్రెజిల్ క్వాలిఫై
సావో పాలో: వచ్చే ఏడాది జరగనున్న ప్రతిష్టాత్మక ‘ఫిఫా’ ప్రపంచకప్నకు బ్రెజిల్, ఈక్వెడార్, ఆ్రస్టేలియా జట్లు అర్హత సాధించాయి. దక్షిణ అమెరికా అర్హత టోర్నీలో భాగంగా బ్రెజిల్ జట్టు మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన మ్యాచ్లో 1–0 గోల్ తేడాతో పరాగ్వేపై విజయం సాధించింది. తద్వారా ‘ఫిఫా’ వరల్డ్కప్ బెర్తు దక్కించుకుంది. ఇప్పటి వరకు ఐదుసార్లు (1958, 1962, 1970, 1994, 2002లో) చాంపియన్గా నిలిచిన బ్రెజిల్ 2022 ప్రపంచకప్లో క్వార్టర్ఫైనల్లో ఓడింది. మరోవైపు పెరూతో జరిగిన మ్యాచ్ను ‘డ్రా’ చేసుకోవడం ద్వారా ఈక్వెడార్ ముందంజ వేసింది. ఇప్పటికే వరల్డ్కప్నకు అర్హత సాధించిన డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా, కొలంబియాతో మ్యాచ్ను 1–1తో ‘డ్రా’ చేసుకుంది. 2026లో మూడు దేశాలు ఆతిథ్యమిస్తున్న ఫిఫా ప్రపంచకప్లో 48 జట్లు పాల్గొననున్నాయి. దక్షిణ అమెరికా అర్హత టోర్నీలో అర్జెంటీనా 35 పాయింట్లతో అగ్ర స్థానంలో ఉండగా... ఈక్వెడార్, బ్రెజిల్ చెరో 25 పాయింట్లతో వరుసగా రెండో, మూడో స్థానాల్లో ఉన్నాయి. దక్షిణ అమెరికా నుంచి వరల్డ్కప్నకు ఆరు జట్లు నేరుగా అర్హత సాధించనున్నాయి. బొలీవియాతో మ్యాచ్లో 0–2తో పరాజయం పాలైన చిలీ జట్టు... వరుసగా మూడోసారి విశ్వ సమరానికి దూరమైంది. మరోవైపు ఆ్రస్టేలియా వరుసగా ఆరో సారి ఫిఫా ప్రపంచకప్ బెర్తు దక్కించుకుంది. 2–1 గోల్స్ తేడాతో సౌదీ అరేబియాపై గెలవడం ద్వారా ఆసీస్ ముందంజ వేసింది. -
భారత్కు మరో పరాజయం
అమ్స్టెల్వీన్ (నెదర్లాండ్స్): అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్లో భారత పురుషుల జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. గత రెండు మ్యాచ్ల్లో నెదర్లాండ్స్ చేతిలో ఓడిన హర్మన్ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత జట్టు... మూడో మ్యాచ్లో అర్జెంటీనా చేతిలో కూడా ఓడింది. యూరప్ అంచె పోటీల్లో భాగంగా బుధవారం జరిగిన పోరులో టీమిండియా 3–4 గోల్స్ తేడాతో అర్జెంటీనా చేతిలో పరాజయం పాలైంది. గత రెండు మ్యాచ్ల్లో పెనాల్టీ కార్నర్లను గోల్స్గా మలచడంలో విఫలమైన భారత్... ఈసారి పేలవ డిఫెన్స్తో మూల్యం చెల్లించుకుంది. భారత్ తరఫున కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ (12వ, 33వ నిమిషాల్లో) రెండు గోల్స్ సాధించగా... అభిõÙక్ (42వ నిమిషంలో) ఒక గోల్ కొట్టాడు. అర్జెంటీనా తరఫున మాటియాస్ రే (3వ నిమిషంలో), లూకాస్ మార్టినేజ్ (17వ నిమిషంలో), శాంటియాగో టరాజొనా (34వ నిమిషంలో), లూకాస్ మెండెజ్ (46వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. భారత డిఫెండర్ల తప్పిదంతో ఆట ప్రారంభమైన మూడో నిమిషంలోనే కెప్టెన్ మాటియాస్ రే అర్జెంటీనా ఖాతా తెరిచాడు. హర్మన్ప్రీత్ గోల్తో టీమిండియా స్కోరు సమం చేసినా... మన రక్షణ పంక్తి పదే పదే తప్పిదాలకు పాల్పడటంతో అర్జెంటీనా దూకుడు పెంచగలిగింది. ఆఖర్లో పెనాల్టీ కార్నర్ రూపంలో స్కోరు సమం చేసే అవకాశం వచి్చనా... మనవాళ్లు దాన్ని గోల్గా మలచలేకపోయారు. గురువారం మరోసారి అర్జెంటీనాతో భారత్ తలపడనుంది. భారత్కు రెండో విజయంఆంట్వర్ప్ (బెల్జియం): యూరోప్ పర్యటనలో భారత జూనియర్ మహిళల హాకీ జట్టు జోరు కొనసాగుతోంది. తొలి మ్యాచ్లో ఆతిథ్య బెల్జియంపై విజయం సాధించిన భారత అమ్మాయిలు... బుధవారం రెండో మ్యాచ్లో 2–1 గోల్స్ తేడాతో మరో సారి బెల్జియంపై గెలుపొందారు. భారత్ తరఫున లాల్థాట్లుయాంగి (35వ నిమిషంలో), గీతా యాదవ్ (50వ నిమిషంలో) చెరో గోల్ చేశారు. బెల్జియం తరఫున్ వాన్ హెల్మోంట్ (48వ నిమిషంలో) ఏకైక గోల్ చేసింది. ఈ పర్యటనలో గురువారం భారత్ జట్టు చివరి మ్యాచ్ ఆడనుంది. -
మనూ భాకర్కు నిరాశ
మ్యూనిక్: ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ వరల్డ్ కప్లో రెండో రోజు బుధవారం భారత్ ఒక్క పతకం కూడా గెలుచుకోలేకపోయింది. పారిస్ ఒలింపిక్స్ కాంస్యపతక విజేత మనూ భాకర్, చైన్ సింగ్ తమ విభాగాల్లో ఫైనల్స్కు అర్హత సాధించినా మెడల్ మాత్రం దక్కలేదు. మహిళల 25 మీటర్ల పిస్టల్ క్వాలిఫయింగ్ ఈవెంట్లో మనూ 588 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచి ఫైనల్కు చేరింది. అయితే అసలు పోరులో ఆమె తడబడింది. ఫైనల్లో 20 పాయింట్లు మాత్రమే సాధించి మూడో ఎలిమినేషన్ రౌండ్ను దాటలేకపోయింది. ఇదే ఈవెంట్లో హైదరాబాద్ షూటర్ ఇషా సింగ్ కూడా నిరాశపర్చింది. క్వాలిఫయింగ్లో 585 పాయింట్లకే పరిమితమైన 11వ స్థానంలో నిలిచిన ఇషా ఫైనల్కు కూడా అర్హత సాధించలేదు. మరో భారత షూటర్ సిమ్రన్ప్రీత్ కౌర్ 32వ స్థానంలో నిలిచింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ ఈవెంట్లో చైన్ సింగ్ ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఇటీవల అర్జెంటీనాలో జరిగిన ప్రపంచ కప్లో కాంస్యం గెలిచిన చైన్ సింగ్ క్వాలిఫయింగ్లో ఐదో స్థానంలో ఫైనల్కు చేరినా పతకం మాత్రం దక్కలేదు. నేడు జరిగే పోటీల్లో భారత షూటర్లు అర్జున్ బబూటా, సందీప్ సింగ్, సిఫ్ట్ కౌర్, శ్రియాంక, ఆషి చౌక్సీ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. -
స్క్వాష్ కోహి‘నూర్’
‘పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది’ అన్నట్లు... ఆరేళ్లకే రాకెట్ పట్టిన ఆ చిన్నారి పదేళ్లు తిరిగేసరికి వరల్డ్ టాప్–10లో చోటు దక్కించుకుంది. మరో నాలుగేళ్లకే ప్రపంచ నంబర్వన్ ర్యాంక్ కైవసం చేసుకుంది. ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోని ఆ అమ్మాయి స్క్వాష్ లో రికార్డులు తిరగరాస్తూ ఎనిమిది సార్లు ప్రపంచ చాంపియన్షిప్ టైటిల్ గెలుచుకుంది. మనం ఇంతసేపు చెప్పుకున్నది ఈజిప్ట్ దేశానికి చెందిన నూర్ ఎల్ షెర్బిని గురించే! అద్దాల గోడల్లోకి అడుగు పెడితే అదర గొట్టడమే పనిగా పెట్టుకున్న ఈ ‘వారియర్ ప్రిన్సెస్’ ప్రస్థానాన్ని ఓసారి పరిశీలిస్తే... – సాక్షి క్రీడావిభాగం ఉత్తర ఆఫ్రికాలోని ఈజిప్ట్ దేశం... మానవ నాగరికత మూలాలకు నిదర్శనం. ‘పిరమిడ్’లు, ‘మమ్మీ’లు ఇలా ప్రాచీన ఆనవాళ్లకు నెలవు. అలాంటి దేశం ఇప్పుడు స్క్వాష్ కు పెట్టింది పేరుగా మారింది. గత పదేళ్ల ఫలితాలు చూసుకుంటే పురుషుల ప్రపంచ చాంపియన్షిప్లో ఎనిమిది సార్లు ఈజిప్ట్ ఆటగాళ్లే టైటిల్ గెలిస్తే... మహిళల విభాగంలో అయితే పదికి పదిసార్లు ఈజిప్ట్ ప్లేయర్లే చాంపియన్గా నిలిచారు. అందులో పదిసార్లూ నూర్ ఎల్ షెర్బిని ఫైనల్ ఆడటం మరో విశేషం. ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్ఏ) ఆధ్వర్యంలో 2015లో కౌలాలంపూర్లో జరిగిన వరల్ట్ చాంపియన్షిప్లో తొలిసారి విజేతగా నిలిచిన నూర్ 2016లో రన్నరప్తో సరిపెట్టుకుంది. ఆ తర్వాత వరుసగా 2017, 2018–19, 2019–20, 2020–21, 2022, 2023లో ప్రపంచ చాంపియన్గా నిలిచింది. గతేడాది ఫైనల్లో ఈజిప్్టకే చెందిన నౌరన్ గోహర్ చేతిలో ఓడిన 29 ఏళ్ల నూర్ గత నెలలో చికాగో వేదికగా జరిగిన టోర్నీలో టైటిల్ హస్తగతం చేసుకొని ఆ సంఖ్యను ఎనిమిదికి పెంచుకుంది. మహిళల విభాగంలో అత్యధిక సార్లు (8) ప్రపంచ చాంపియన్షిప్ టైటిల్స్ నెగ్గిన మలేసియా మాజీ స్క్వాష్ ప్లేయర్ నికోల్ డేవిడ్ సరసన చేరింది. మరోసారి విశ్వవిజేతగా నిలిస్తే నూర్ కొత్త చరిత్రను లిఖిస్తుంది. 13 ఏళ్లకే ప్రపంచ జూనియర్ చాంపియన్... ప్రపంచ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న నూర్... కుటుంబ నేపథ్యం ఆసక్తికరం. తండ్రి మంచి ఫుట్బాల్ ప్లేయర్ కాగా... తల్లి అథ్లెట్. చిన్నప్పుడే స్క్వాష్ పై ఆసక్తి కనబర్చిన ఆమె సోదరుడి ప్రోత్సాహంతో ప్రొఫెషనల్గా మారింది. ఎనిమిదేళ్లు రాకముందే సీనియర్ ప్లేయర్లను కంగుతినిపించడం అలవాటు చేసుకున్న ఈ పొడగరి... నైపుణ్యాలు పెంచుకుంటూ అంచెలంచెలుగా ఎదిగింది. 13 ఏళ్లకే ప్రపంచ జూనియర్ చాంపియన్గా అవతరించిన నూర్... ఈ ఘనత సాధించిన పిన్న వయసు్కరాలిగా రికార్డు సృష్టించింది. పద్నాలుగేళ్ల వయసులోనే ప్రపంచ టాప్–50లో చోటు దక్కించుకున్న ఈ చిన్నది... 2016లో తన 19 ఏళ్ల వయసులో వరల్డ్ నంబర్వన్గా నిలిచింది. ఏ క్రీడలో అయినా... ఉన్నత శిఖరాలను అధిరోహించడం ఒక ఎత్తు అయితే దాన్ని కొనసాగించడం మరో ఎత్తు. నూర్ రెండో కోవకే చెందుతుంది. నిలకడకు మారుపేరైన ఈ ఈజిప్ట్ ప్లేయర్ విజయగర్వం తలకెక్కించుకోకుండా ఎప్పటికప్పుడు ఆటకు మెరుగులు దిద్దుకుంటూ అత్యుత్తమ ప్లేయర్గా పరిణతి సాధిస్తోంది. ఫెడరర్ స్ఫూర్తితో... పొరబాటున కూడా ప్రత్యర్థి ప్లేయర్ను పల్లెత్తు మాట అనని నూర్ తన ఆరాధ్య ఆటగాడు రోజర్ ఫెడరర్ బాటలోనే ముందుకు సాగుతోంది. నూర్కు స్క్వాష్తో పాటు టెన్నిస్ అంటే వల్లమాలిన ప్రేమ. అందులోనూ స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ ఆటకు వీరాభిమాని. ఆధునిక టెన్నిస్లో మేరునగ«దీరుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఫెడరర్ను అమితంగా ఆరాధించే నూర్... కోర్టు బయట కూడా ఫెడరర్ వ్యవహార శైలిని అనుసరిస్తుంది. చిన్నప్పటి నుంచి స్క్వాష్ ఆడే అలవాటు ఉన్న ఫెడరర్... కొన్ని ప్రత్యేకమైన స్క్వాష్ స్ట్రోక్లను టెన్నిస్ కోర్టులో ప్రయోగించి ఫలితాలు రాబట్టాడు. 20 గ్రాండ్స్లామ్ టైటిళ్లు చేజిక్కించుకున్న ఫెడరర్ నడవడికను అనుకరించే నూర్ ... ఫెడరర్లాగే మృదుస్వభావి. ‘స్క్వాష్లో కాకుండా నేను ఆరాధించే ఏకైక ప్లేయర్ టెన్నిస్ దిగ్గజం ఫెడరర్.అతడి నుంచి ఎప్పుడూ స్ఫూర్తి పొందుతా. టెన్నిస్ కోర్టులో అతడు బ్యాక్ హ్యాండ్ స్ట్రోక్స్ కొడుతుంటే స్క్వాష్ ఆడినట్లే అనిపిస్తుంది. ప్రత్యర్థులతో అతడు తలపడే తీరు, వ్యవహరించే విధానం నాకెంతో ఇష్టం. జొకోవిచ్, నాదల్ వంటి వాళ్ల కంటే ఫెడరర్ శైలి భిన్నమైంది’ అని నూర్ పేర్కొంది. టీమ్ విభాగంలోనూ 5 స్వర్ణాలు 32్ఠ21 ఫీట్ల అద్దాల గదిని రెండో ఇంటిలా భావించే నూర్... అటు సింగిల్స్తో పాటు ఇటు టీమ్ విభాగాల్లోనూ ఆధిపత్యం కనబరుస్తోంది. ప్రపంచ చాంపియన్షిప్ సింగిల్స్లో 8 స్వర్ణాలు, 3 రజతాలు నెగ్గిన నూర్... టీమ్ విభాగంలో మరో 5 పసిడి పతకాలు, ఒక కాంస్యం గెలుచుకుంది. అభిమానులంతా ముద్దుగా ‘ది వారియర్ ప్రిన్సెస్’ అని పిలుచుకునే షెర్బిని అందుకు తగ్గట్లే పోరాట యోధురాలుగా గుర్తుంపు తెచ్చుకుంది. ఎలాంటి స్థితిలోనూ సానుకూల దృక్పథాన్ని వీడకపోవడం... చివరి క్షణం వరకు ఓటమిని అంగీకరించకపోవడం... తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవడం ఆమెను ఇతర ప్లేయర్ల కంటే భిన్నంగా నిలిపింది. ‘నా ముద్దు పేరంటే ఇష్టం. నా ఆటతీరుకు అది సరిగ్గా నప్పుతుంది. కోర్టు బయట నేను పూర్తి భిన్నంగా ఉంటా. ప్రతి మ్యాచ్ను నా తొలి పోరుగానే భావిస్తా. ప్రపంచ చాంపియన్షిప్ అయినా మామూలు టోర్నమెంట్ అయినా సమానమైన ప్రాధాన్యతనిస్తా. ఒత్తిడిని దరిచేరనివ్వక పోవడమే నా ప్రధాన బలం. నాపై అంచనాలు పెంచేసుకొని వాటిని అందుకోవాలని తపన పడను. మానసికంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా బరిలోకి దిగేందుకు ప్రయత్నిస్తా. దాని వల్లే మెరుగైన ఫలితాలు వస్తున్నాయి’ అని నూర్ తెలిపింది. 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్లో స్క్వాష్ ను భాగం చేయడంతో ఈసారి ఈజిప్ట్ ప్లేయర్లు పతకాలు కొల్లగొట్టడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తుంటే... వరుసగా పదేళ్లుగా ప్రపంచ చాంపియన్షిప్ ఫైనల్ ఆడిన నూర్ మాత్రం విశ్వక్రీడలకు చాలా దూరం ఉందని అప్పటి వరకు పరిస్థితులు ఎలా ఉంటాయో అని వినమ్రతతో బదులిచ్చింది. ‘ప్రతి ఒక్కరూ ఒలింపిక్స్ పతకాల గురించే ఆలోచిస్తున్నారు. అదంత సులభం కాదు. వచ్చే మూడేళ్లు ఎలా ఉంటుందో చెప్పలేం. విశ్వక్రీడల్లో పతకం నెగ్గడం ప్రతి ఒక్కరి కల. దాని కోసం ఇతర దేశాల ప్లేయర్లు కూడా గట్టి ప్రయత్నాలు చేస్తుంటారు’ అని నూర్ చెప్పుకొచ్చింది. -
మాడ్రిడ్ వీధుల్లో కొత్త ఎఫ్1 సర్క్యూట్
లండన్: స్పెయిన్లో కొత్త ఫార్ములావన్ ట్రాక్ సిద్ధమవుతోంది. మాడ్రిడ్ వీధుల గుండా పయనించే కొత్త సర్క్యూట్ వచ్చే ఏడాదే అందుబాటులోకి రానుంది. 2026 క్యాలెండర్లో జరిగే ఫార్ములావన్ రేసుల్లో సెప్టెంబర్ 13న కొత్త సర్క్యూట్పై స్పానిష్ గ్రాండ్ప్రి జరుగుతుందని ఎఫ్1 వర్గాలు తెలిపాయి. దీంతో వచ్చే ఏడాది స్పెయిన్లో రెండు ఫార్ములావన్ రేసులు నిర్వహిస్తారు. ఏళ్ల క్రితమే కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం బార్సిలోనా గ్రాండ్ప్రి కూడా నిర్వహిస్తారని ఎఫ్1 ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. అప్పట్లో కుదుర్చుకున్న ఒప్పందం గడువు 2026 వరకు ఉండటం వల్ల బార్సిలోనా రేస్ యథాతథంగా జరుగనుంది. అయితే ఓవరాల్గా మాత్రం ఫార్ములావన్ సీజన్లో మొత్తం 24 రేసుల్లో ఏమాత్రం మార్పుండదు. స్పెయిన్ రెండు రేసుల కోసం ఇటలీ రేసును వచ్చే ఏడాది తప్పించనున్నారు. ఇమోలాలో ఎమిలియా–రొమాగ్నా గ్రాండ్ప్రి వచ్చే సీజన్లో కనిపించదు. దీని స్థానంలో మాడ్రిడ్ వీధుల్లో కొత్త సర్క్యూట్పై రేసును నిర్వహిస్తారు. జన సంచారం ఉండే వీధుల గుండా రయ్... రయ్...మనే ఫార్ములావన్ కార్ల రేసులు కొత్తేం కాదు. ఇదివరకే మొనాకో, సింగపూర్ దేశాల్లో వీధుల్లోనే ఎఫ్1 సర్క్యూట్ ఉంది. అయితే రేసు జరిగే సమయంలో మాత్రం సాధారణ జనసంచారం కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తారు. వచ్చే మార్చి 8న ఆస్ట్రేలియన్ గ్రాండ్ప్రితో 2026 సీజన్ మొదలవుతుంది. పవిత్ర రంజాన్ నేపథ్యంలో బహ్రెయిన్, సౌదీ అరేబియాలలో జరిగే రేసులను ఏప్రిల్కు మార్చారు. డిసెంబర్లో జరిగే అబుదాబి గ్రాండ్ప్రితో వచ్చే సీజన్ ముగుస్తుంది. -
కాంస్య పతకం గెలిచిన భారత షూటర్ ఇలావేనిల్
అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) మూడో ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత్ కాంస్య పతకంతో ఖాతా తెరిచింది. జర్మనీలోని మ్యూనిక్లో మంగళవారం మొదలైన ఈ టోర్నీలో తొలి రోజు భారత్కు మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఇలావేనిల్ వలారివన్ కాంస్య పతకాన్ని అందించింది. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో 25 ఏళ్ల ఇలావేనిల్ 231.2 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. ఓవరాల్గా వరల్డ్కప్ టోర్నీలలో ఇలావేనిల్కిది ఏడో పతకం కావడం విశేషం.వాంగ్ జిఫె (చైనా; 252.7 పాయింట్లు) స్వర్ణ పతకాన్ని దక్కించుకోగా... క్వాన్ యుంజీ (దక్షిణ కొరియా; 252.6 పాయింట్లు) కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. క్వాలిఫయింగ్లో ఇలావేనిల్ 635.9 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచింది. టాప్–8లో నిలిచిన వారికి ఫైనల్ బెర్త్ లభించింది.మరోవైపు పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో భారత షూటర్ వరుణ్ తోమర్ 160.3 పాయింట్లు స్కోరు చేసి ఆరో స్థానంలో నిలిచాడు. భారత ఇతర పిస్టల్ షూటర్లు నిశాంత్ రావత్ 12వ స్థానంలో, అర్జున్ సింగ్ చీమా 20వ స్థానంలో, ఆదిత్య మాల్రా 30వ స్థానంలో నిలిచారు. -
ఈ ఏడాది... కలిసొచ్చింది!
ఎంచుకున్న రంగంలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు...అది క్రీడా రంగమైతే ట్రోఫీ చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పోరాడతారు!ఎన్ని అవాంతరాలు ఎదురైనా ధైర్యంగా నిలబడతారు....అడ్డంకులను అధిగమిస్తూ గమ్యానికి చేరువవుతారు! సర్వశక్తులు ధారపోసినా కొన్నిసార్లు ఆశించిన ఫలితం రాదు...అయినా వెనకడుగు వేయకుండా ఎట్టకేలకు గెలుపు రుచి చూస్తారు! తాజా ఐపీఎల్ ఫలితాన్ని విశ్లేషిస్తే ఈ విషయం అవగతమవుతుంది. లీగ్ ప్రారంభం నుంచి ట్రోఫీ చేజిక్కించుకోవడం కోసం తహతహలాడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు... ఎట్టకేలకు 18వ సీజన్లో తమ కల నెరవేర్చుకుంది. ఐపీఎల్ ఆరంభం నుంచి బెంగళూరు జట్టుతోనే కొనసాగుతున్న ‘కింగ్’ విరాట్ కోహ్లి ఆ సంతోషంలో మునిగి తేలుతున్నాడు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది వివిధ క్రీడాంశాల్లో 11 జట్లు ఇలా తొలిసారి తమ ‘కప్పు కల’ను తీర్చుకున్నాయి. ఐపీఎల్లో ఆర్సీబీ తరహాలో... ఆ్రస్టేలియాలోని బిగ్బాష్ టి20 లీగ్లో హోబర్ట్ హరికేన్స్, చాంపియన్స్ లీగ్ ఫుట్బాల్ టోర్నమెంట్లో పారిస్ సెయింట్ జెర్మయిన్ (పీఎస్జీ), ఎఫ్ఏ కప్లో క్రిస్టల్ ప్యాలెస్ జట్లు ఈసారే తొలి టైటిల్ సాధించాయి. క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్బాల్ ఇలా వేర్వేరు ఆటల్లో తొలిసారి ట్రోఫీ చేజిక్కించుకున్న జట్లపై ప్రత్యేక కథనం... – సాక్షి క్రీడావిభాగం90 ఏళ్ల తర్వాత... బెల్జియంకు చెందిన ప్రముఖ ఫుట్బాల్ క్లబ్ రాయల్ యూనియన్ సెయింట్ గిల్లోయిస్ ఇప్పటి వరకు 12 టైటిల్స్ సాధించింది. అందులో 11 ట్రోఫీలను 1904 నుంచి 1935 మధ్య గెలుచుకున్న రాయల్ యూనియన్ 90 ఏళ్ల పోరాటం తర్వాత పన్నెండో టైటిల్ ఖాతాలో వేసుకుంది. ఒకదశలో ద్వితీయ డివిజన్కు పడిపోయిన ఆ జట్టు... తిరిగి పుంజుకొని విజయం సాధించడం విశేషం.క్రిస్టల్ ప్యాలెస్... 119 ఏళ్ల తర్వాత!ఐపీఎల్లో తొలి టైటిల్ గెలిచేందుకు బెంగళూరుకు 18 సీజన్లు ఎదురు చూడాల్సి వచ్చిందని అనుకుంటుంటే... ఫుట్బాల్ అసోసియేషన్ చాలెంజ్ కప్ (ఎఫ్ఏ కప్)లో క్రిస్టల్ ప్యాలెస్ జట్టు 119 సంవత్సరాల తర్వాత తొలిసారి చాంపియన్గా నిలిచింది. మే 17న జరిగిన ఫైనల్లో క్రిస్టల్ ప్యాలెస్ 1–0 గోల్స్ తేడాతో మాంచెస్టర్ సిటీ జట్టును ఓడించి టైటిల్ ఖాతాలో వేసుకుంది. శతాబ్దకాలంగా ఒక్కసారి కూడా కప్పు గెలవకపోయినా... తమ జట్టుకు అండగా నిలుస్తున్న అభిమానులకు ఈ విజయాన్ని అంకితమిచ్చింది. హోబర్ట్ హరికేన్స్ తొలిసారి...ఆస్ట్రేలియా ప్రఖ్యాత టి20 టోర్నమెంట్ బిగ్బాష్ లీగ్ లో కొత్త విజేత అవతరించింది. 2011 నుంచి నిర్వహిస్తున్న ఈ లీగ్లో హోబర్ట్ హరికేన్స్ మొదటిసారి ట్రోఫీ ముద్దాడింది. జనవరి 27న జరిగిన ఫైనల్లో హోబర్ట్ హరికేన్స్ 7 వికెట్ల తేడాతో సిడ్నీ థండర్స్పై గెలిచి విజేతగా నిలిచింది. ఓపెనర్ మిచెల్ ఓవెన్ (42 బంతుల్లో 108; 6 ఫోర్లు, 11 సిక్స్లు) సెంచరీతో చెలరేగడంతో ఫైనల్లో హరికేన్స్ సునాయాసంగా గెలుపొందింది. అదే బాటలో ఇండియానా పేసర్స్..నేషనల్ బాస్కెట్బాల్ సంఘం (ఎన్బీఏ) లీగ్లో కూడా ఈ ఏడాది కొత్త చాంపియన్ అవతరించడం ఖాయమైంది. ఇండియానా పేసర్స్, ఒక్లాహోమా థండర్ సిటీ జట్ల మధ్య ‘బెస్ట్ ఆఫ్ సెవెన్’ పద్ధతిలో టైటిల్ పోరు జరగనుంది. గతంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఇండియానా పేసర్స్ జట్టు... ఈ ఏడాది చక్కటి ఆటతీరుతో ఎన్బీఏ ఫైనల్కు అర్హత సాధించింది. శుక్రవారం జరిగిన తొలి ఫైనల్లో ఇండియానా పేసర్స్ 111–110తో ఒక్లాహోమా సిటీ థండర్పై నెగ్గగా... ఆదివారం జరిగిన రెండో ఫైనల్లో ఒక్లాహోమా సిటీ థండర్ 123–107తో ఇండియానా పేసర్స్ జట్టును ఓడించింది. ఏడింటిలో తొలుత నాలుగు మ్యాచ్ల్లో గెలిచిన జట్టు విజేతగా నిలుస్తుంది. పీఎస్జీ 43 ఏళ్ల తర్వాత...ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ లీగ్ ఫుట్బాల్ టోర్నమెంట్లో పారిస్ సెయింట్ జెర్మయిన్ (పీఎస్జీ) జట్టు తొలిసారి విజేతగా నిలిచింది. జూన్ 1న జరిగిన తుదిపోరులో పీఎస్జీ జట్టు 5–0 గోల్స్ తేడాతో ఇంటర్ మిలాన్ జట్టుపై గెలుపొందింది. సుదీర్ఘ చరిత్రగల యూరోపియన్ కప్లో పీఎస్జీ జట్టుకు 43 ఏళ్ల తర్వాత ఇదే మొదటి టైటిల్ కావడంతో అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి. 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ...టి20 ఫార్మాట్లో నిర్వహించిన తొలి ఐసీసీ ప్రపంచకప్ విజయవంతం కావడంతో ఆ మరుసటి ఏడాదే (2008)... ప్రతిష్టాత్మక ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది. అప్పటి నుంచి లీగ్లో పోటీ పడుతున్న ఆర్సీబీ జట్టు... ఎట్టకేలకు 18వ సీజన్లో విజేతగా నిలిచి ట్రోఫీని ముద్దాడింది. లీగ్ దశలో రెండో స్థానంలో నిలిచిన బెంగళూరు... క్వాలిఫయర్–1తో పాటు తుదిపోరులోనూ పంజాబ్ కింగ్స్ను ఓడించి టైటిల్ ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఫ్రాంఛైజీకి ప్రాతినిధ్యం వహించిన ఏకైక ప్లేయర్గా రికార్డుల్లోకి ఎక్కిన కోహ్లి ఎట్టకేలకు చాంపియన్ హోదా దక్కించుకున్నాడు. బ్యాటింగ్లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన కోహ్లి... కప్పును చేతబట్టి చిన్నపిల్లాడిలా సంబరాల్లో మునిగిపోవడం అభిమానులను ఎంతగానో అలరించింది. అర్ధశతాబ్దం తర్వాత...సుదీర్ఘ చరిత్ర ఉన్న బొలోగ్నా ఫుట్బాల్ క్లబ్... అర్ధశతాబ్దం తర్వాత కోపా ఇటాలియా కప్ చేజిక్కించుకుంది. మే 15న మిలాన్ వేదికగా జరిగిన తుదిపోరులో బొలోగ్నా జట్టు 1–0 గోల్స్ తేడాతో ఏసీ మిలాన్ జట్టుపై గెలిచింది. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు ప్రమాదకర జట్టుగా ముద్రపడ్డ బొలోగ్నా... ఎట్టకేలకు 51 సంవత్సరాల తర్వాత ఒక మేజర్ టోర్నమెంట్లో విజేతగా నిలిచింది. 1933 తర్వాత తొలిసారి...నెదర్లాండ్స్లోని డెవెంటర్ నగరానికి చెందిన ‘గో అహెడ్ ఈగల్స్’ ఫుట్బాల్ జట్టు... సుదీర్ఘ పోరాటం తర్వాత ఈ ఏడాది తమ తొలి టైటిల్ సాధించింది. 1920 నుంచి 1930 వరకు ప్రత్యర్థులను భయపెట్టిన ఈగల్స్... 1933 తర్వాత తొలి సారి డచ్ కప్ గెలుచుకుంది. ఏప్రిల్ 21న జరిగిన తుదిపోరు ‘షూటౌట్’లో ఈగల్స్ విజయం సాధించి కప్పు కల తీర్చుకుంది. స్టుట్గార్ట్ 28 ఏళ్ల తర్వాత... జర్మనీకి చెందిన ప్రముఖ ఫుట్బాల్ క్లబ్ వీఎఫ్బీ స్టుట్గార్ట్.. 28 ఏళ్ల తర్వాత డీఎఫ్బీ పోకల్ ఫైనల్లో విజేతగా నిలిచింది. మే 24న జరిగిన తుది పోరులో స్టుట్గార్ట్ 4–2 గోల్స్ తేడాతో అరిమినియా బీలెఫెల్డ్ జట్టును ఓడించింది. ఈ టోర్నీలో స్టుట్గార్ట్ విజేతగా నిలవడం ఇది నాలుగోసారి. అయితే దాదాపు మూడు దశాబ్దాలకు ముందే మూడుసార్లు చాంపియన్గా నిలిచిన స్టుట్గార్ట్... మళ్లీ ఇన్నాళ్లకు తమ టైటిల్స్ సంఖ్యను నాలుగుకు పెంచుకుంది.హ్యారీ కేన్కు మరింత ప్రత్యేకం...ఇంగ్లండ్ ఫుట్బాల్ జట్టు స్టార్ హ్యారీ కేన్కు కూడా ఈ ఏడాది చాలా గొప్పగా సాగింది. కెరీర్లో ఎన్నో అద్భుత విజయాలు సాధించిన కేన్కు టైటిల్ లోటు మాత్రం ఉండిపోయింది. అయితే ఈ ఇంగ్లండ్ స్ట్రయికర్ ఈ ఏడాది తన కప్పు కలను నెరవేర్చుకున్నాడు. బేయర్న్ మ్యూనిక్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ... బుండెస్లిగా ట్రోఫీ కైవసం చేసుకున్నాడు. ఈ లీగ్లో అత్యధిక గోల్స్ కొట్టిన కేన్... జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 70 ఏళ్ల తర్వాత...1955లో చివరిసారిగా ఎఫ్ఏ కప్ సొంతం చేసుకున్న న్యూ క్యాజిల్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్... ఏడు దశాబ్దాల తర్వాత ఇన్నాళ్లకు ఈ ఏడాది ఇంగ్లిష్ ఫుట్బాల్ లీగ్ కప్ గెలుచుకుంది. ఈ ఏడాది మార్చి 16న జరగిన తుదిపోరులో న్యూ క్యాజిల్ జట్టు 2–1 గోల్స్ తేడాతో లివర్పూల్ను మట్టికరిపించి చాంపియన్గా అవతరించింది. 17 ఏళ్ల తర్వాత...ఇంగ్లండ్కు చెందిన ప్రముఖ ఫుట్బాల్ క్లబ్ టోటెన్హామ్ హాట్స్పర్... 17 ఏళ్ల పోరాటం తర్వాత ఈ ఏడాది యూరోపా లీగ్ ట్రోఫీ దక్కించుకుంది. మే 22న జరిగిన ఫైనల్లో టోటెన్హామ్ ఎఫ్సీ 1–0 గోల్స్ తేడాతో మాంచెస్టర్ యునైటెడ్పై గెలిచి సంబరాల్లో మునిగిపోయింది. -
పోర్చు‘గోల్’ చేరింది
మ్యూనిక్: జగద్విఖ్యాత స్ట్రయికర్ క్రిస్టియానో రొనాల్డో నేషన్స్ లీగ్లో పోర్చుగల్ జట్టును విజేతగా నిలిపాడు. ఆద్యంతం ఉత్కంఠను రేపిన ఫైనల్లో రొనాల్డో నాయకత్వంలోని పోర్చుగల్ జట్టు ‘పెనాల్టీ షూటౌట్’లో 5–3తో డిఫెండింగ్ స్పెయిన్పై విజయం సాధించి ఈ టో ర్నీలో రెండోసారి విజేతగా నిలిచింది. 2018–2019లో తొలిసారి జరిగిన నేషన్స్ లీగ్ టోర్నీలోనూ పోర్చుగల్ జట్టుకే టైటిల్ లభించింది. నిర్ణీత సమయం, అదనపు సమయం ముగిసేవరకు పోర్చుగల్, స్పెయిన్ జట్లు 2–2 గోల్స్తో సమఉజ్జీగా నిలిచాయి. దీంతో ‘షూటౌట్’ అనివార్యమైంది.ఇందులో పోర్చుగల్ గోల్ కీపర్ డీగో కోస్టా కీలకపాత్ర పోషించాడు. నాలుగో పెనాల్టీకి దిగిన స్పెయిన్ స్ట్రయికర్ అల్వారో మొరాటా కిక్ను డీగో కోస్టా సమర్థంగా అడ్డుకోవడంతోనే పోర్చుగల్కు విజయం ఖాయమైంది. దీంతో మైదానంలోని రొనాల్డో అభిమానులు విజయ సంబరాల్లో మునిగితేలారు. స్పెయిన్ తరఫున మొదటి ముగ్గురు విజయవంతంగా గోల్స్ చేయగా... మొరాటా ఒక్కడే విఫలమయ్యాడు. అంతకుముందు రెగ్యులర్ టైమ్ మ్యాచ్ కూడా పోటాపోటీగా సాగింది. మ్యాచ్ తొలి అర్ధభాగంలో మార్టిన్ జుబిమెండి 21వ నిమిషంలో గోల్ చేసి స్పెయిన్ను 1–0తో ఆధిక్యంలో నిలిపాడు. అయితే ఐదు నిమిషాల వ్యవధిలోనే న్యూనొ మెండెస్ (26వ నిమిషంలో) గోల్ కొట్టడంతో 1–1తో స్కోరు సమమైంది. తిరిగి తొలి అర్ధభాగం ముగిసే ఆఖరి నిమిషంలో స్పెయిన్ ఆటగాడు ఒయర్లబెల్ (45వ నిమిషంలో) గోల్ చేసి 2–1తో ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ద్వితీయార్ధం మొదలయ్యాక పోర్చుగల్ ఈ స్కోరును సమం చేసేందుకు ఎంతగానో ప్రయత్నించినా... స్పెయిన్ రక్షణపంక్తి, గోల్ కీపర్ సమన్వయంతో ఒక్క షాట్ కూడా లక్ష్యాన్ని చేరలేదు. ఎట్టకేలకు స్టార్ స్ట్రయికర్ రొనాల్డో 61వ నిమిషంలో చేసిన గోల్ వల్లే పోర్చుగల్ మ్యాచ్లో నిలిచింది. దీంతో అంతర్జాతీయ ఫుట్బాల్ చరిత్రలో అతని రికార్డు గోల్ స్కోరు 138కి చేరింది. అక్కడ 2–2తో సమమైన స్కోరు నిర్ణీత సమయం, అదనపు సమయం ముగిసేవరకు కొనసాగింది. విజేతను తేల్చేందుకు షూటౌట్ను నిర్వహించగా స్పెయిన్ తరఫున మెరినో, బెయెనా, ఇస్కో సఫలమవగా, మొరాటా నిరాశపరిచాడు. పోర్చుగల్ తరఫున రామొస్, విటిన్హా, ఫెర్నాండెజ్, మెండెస్, నివెస్ ఇలా ఐదుగురు గోల్స్ చేయడంతో ట్రోఫీ చేజిక్కించుకుంది. విజయానంతరం 40 ఏళ్ల రొనాల్డో భావోద్వేగానికి గురయ్యాడు. ‘క్లబ్ల తరఫున ఇదివరకు ఎన్నో టైటిల్స్ గెలిచాను. కానీ అవేవీ పోర్చుగల్ విజయానికి సాటిరావు. దేశానికి ట్రోఫీ అందించిన ఆనందం ఎప్పటికీ ప్రత్యేకం’అని ఉబికివచ్చే కంటనీరును అదుపు చేసుకుంటూ వ్యాఖ్యానించాడు. -
సహజకు డబుల్స్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ35 మహిళల టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ సహజ యామలపల్లి డబుల్స్ టైటిల్ను సాధించింది. డొమినికన్ రిపబ్లిక్ రాజధాని సాంటో డొమింగోలో జరిగిన ఈ టోర్నీలో సహజ (భారత్)–హిరోకో కువాటా (జపాన్) జోడీ డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచింది. ఫైనల్లో సహజ–హిరోకో ద్వయం 6–3, 6–2తో ఎస్తెర్ అడెషినా (బ్రిటన్)–సోఫియా ఎలీనా (వెనిజులా) జంటపై గెలిచింది. ఐటీఎఫ్ సర్క్యూట్లో సహజకిదే తొలి డబుల్స్ టైటిల్. సింగిల్స్ విభాగంలో ఆమె నాలుగు టైటిల్స్ సొంతం చేసుకుంది. -
చరిత్ర సృష్టించిన ఫ్రెంచ్ ఓపెన్ 2025 ఫైనల్
కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్), యానిక్ సినెర్ (ఇటలీ) మధ్య నిన్న (జూన్ 8) జరిగిన ఫ్రెంచ్ ఓపెన్-2025 పురుషుల సింగిల్స్ ఫైనల్స్ మ్యాచ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఫ్రెంచ్ ఓపెన్ చరిత్రలో అత్యంత సుదీర్ఘంగా సాగిన ఫైనల్గా రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్ 5 గంటల 29 నిమిషాల పాటు సాగింది. గతంలో ఏ ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ మ్యాచ్ 5 గంటలు సాగలేదు. ఈ మ్యాచ్ 43 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. మాట్స్ విలాండర్, గులెర్మో విలాస్ మధ్య జరిగిన 1982 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ మ్యాచ్ 4 గంటల 47 నిమిషాలు సాగింది.THE WINNING MOMENT FOR CARLOS ALCARAZ. 🏆pic.twitter.com/U19wPhiEtT— Mufaddal Vohra (@mufaddal_vohra) June 8, 2025అల్కరాజ్ అదరహోఊహకందని మలుపుల మధ్య సాగిన తాజా ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) విజేతగా నిలిచాడు. ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ యానిక్ సినెర్పై (ఇటలీ) 4–6, 6–7 (4/7), 6–4, 7–6 (7/3), 7–6 (10/2)తో చిరస్మరణీయ విజయం సాధించాడు.5 గంటల 29 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో అల్కరాజ్ తొలి రెండు సెట్లను కోల్పోయినా... ఆందోళన చెందకుండా ఆడి తర్వాతి మూడు సెట్లలో నెగ్గి విజేతగా నిలిచాడు. నాలుగో సెట్లో అల్కరాజ్ ఏకంగా మూడు మ్యాచ్ పాయింట్లను కాచుకోవడం విశేషం. ఈ గెలుపుతో అల్కరాజ్ తన కెరీర్లో ఐదో గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్ను (2025, 2024 ఫ్రెంచ్ ఓపెన్... 2023, 2024 వింబుల్డన్... 2022 యూఎస్ ఓపెన్) దక్కించుకున్నాడు. అల్కరాజ్ ఇప్పటివరకు ఒక్క గ్రాండ్స్లామ్ ఫైనల్ కూడా ఓడిపోలేదు. మరోపక్క సినెర్కు కూడా ఇదే తొలి గ్రాండ్స్లామ్ ఫైనల్ పరాజయం. -
UEFA టైటిల్ గెలిచిన పోర్చుగల్.. కోహ్లి తరహాలో భావోద్వేగానికి లోనైన క్రిస్టియానో రొనాల్డో
పోర్చుగల్ దిగ్గజ ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో తన దేశానికి రెండో UEFA నేషన్స్ లీగ్ టైటిల్ను అందించాడు. జర్మనీలోని మ్యూనిచ్ వేదికగా ఆదివారం (జూన్ 8) జరిగిన ఫైనల్లో పోర్చుగల్ పెనాల్టీ షూటౌట్లో స్పెయిన్పై 5-3 గోల్స్తో నెగ్గి టైటిల్ను కైవసం చేసుకుంది. షూటౌట్కు ముందు ఇరు జట్లు 2-2 గోల్స్తో సమంగా నిలిచాయి. - Virat Kohli lifting IPL Trophy.- Cristiano Ronaldo lifting UEFA Trophy.TWO GOATs OF SPORTS. 🐐🙇 pic.twitter.com/WKXtmTel70— Tanuj (@ImTanujSingh) June 8, 2025ఎక్స్ట్రా టైమ్లో కూడా ఫలితం రాకపోవడంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. ఈ మ్యాచ్లో రొనాల్డో ఓ గోల్ చేశాడు. ఇది అతని కెరీర్లో 138 గోల్. నిర్ణీత సమయంలో తొలుత స్పెయిన్కు చెందిన మైఖేల్ ఒయార్జబాల్ గోల్ చేయగా.. రొనాల్డో తన గోల్తో స్కోర్ సమం చేశాడు. అనంతరం స్పెయిన్కు చెందిన మార్టిన్ జుబిమెండి రెండో గోల్ చేయగా.. పోర్చుగల్ తరఫున నునో మెండెస్ గోల్ చేసి స్కోర్ సమం చేశాడు.- Virat Kohli after winning the IPL Trophy.- Cristiano Ronaldo after winning the UEFA Nations trophy.TWO GOATS GOT EMOTIONAL..!!!! 🥹❤️ pic.twitter.com/Ms8poAVOQx— Tanuj (@ImTanujSingh) June 8, 2025మరోవైపు మూడో స్థానం కోసం జరిగిన పోటీలో కైలియన్ ఎంబపే నేతృత్వంలోని ఫ్రాన్స్ ఆతిథ్య దేశం జర్మనీపై 2-0 గోల్స్ తేడాతో నెగ్గింది.- Kohli after winning IPL Trophy.- Ronaldo after winning UEFA Trophy.TWO GOATS CRYING AFTER WINNING THE TROPHY. 🥹❤️ pic.twitter.com/8TFasrUWSn— Tanuj (@ImTanujSingh) June 8, 2025కోహ్లి తరహాలో భావోద్వేగానికి లోనైన రొనాల్డోఆర్సీబీ ఈ యేడు ఐపీఎల్ టైటిల్ గెలిచాక ఆ జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఏ రకంగా భావోద్వేగానికి లోనయ్యాడో, క్రిస్టియానో రొనాల్డో కూడా తన రెండో UEFA నేషన్స్ లీగ్ టైటిల్ గెలిచాక అదే తరహాలో ఎమోషనల్ అయ్యాడు. కోహ్లి, రొనాల్డో కంపారిజన్ ఇమేజ్లు ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతున్నాయి. Cristiano Ronaldo got Emotional when he's won the UEFA national league trophy for Portugal. 🥹- What a Video for UEFA history. ❤️pic.twitter.com/LZgq4vVDiP— Tanuj (@ImTanujSingh) June 8, 2025క్రికెట్ అభిమానులు కోహ్లి, రొనాల్డోను కీర్తిస్తున్నారు. ఇద్దరూ ఇద్దరే అంటూ ఆకాశానికెత్తుతున్నారు. కోహ్లి, రొనాల్డో లేటు వయసులోనూ అత్యుత్తమ ఫిట్నెస్ను కలిగి తమతమ క్రీడా విభాగాల్లో సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. -
స్వప్నిల్ గురి అదిరేనా?
మ్యూనిక్: పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత స్వప్నిల్ కుసాలే ప్రపంచకప్ పతకాలపై గురి పెట్టేందుకు తాజాగా సిద్ధమయ్యాడు. అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) వరల్డ్కప్ లో అతనితో పాటు మహిళా షూటర్, ఒలింపియన్ ఇలవేనిల్ వలారివన్లపై భారత్ ఆశలు పెట్టుకుంది. ఈ సీజన్లో జరుగుతున్న మూడో ప్రపంచకప్కు మ్యూనిక్ వేదిక కాగా... 78 దేశాలకు చెందిన 695 మంది మేటి షూటర్లు పాల్గొంటుండటంతో ప్రతీ ఈవెంట్లోనూ గట్టి పోటీ ఉండనుంది. గతేడాది పారిస్లో పతకాన్ని సాకారం చేసుకున్న కుసాలే ఈ ఏడాది దేశవాళీ సర్క్యూట్లో తన ఫామ్ను కొనసాగించాడు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్లో భారత ఆశాకిరణమయ్యాడు. రెండుసార్లు ఒలింపియన్ అయిన తమిళనాడు షూటర్ ఇలవేనిల్ పారిస్ మెగా ఈవెంట్ తర్వాత తిరిగి ఇప్పుడే అంతర్జాతీయ ఈవెంట్లో గురి పెట్టేందుకు సన్నద్ధమైంది. ఆమె గతంలో బ్యూనస్ఎయిర్స్ (అర్జెంటీనా), లిమా (పెరూ) ఈవెంట్లలో పాల్గొన్నప్పటికీ ఈ రెండు కేవలం ర్యాంకింగ్ పాయింట్ల (ఆర్పీఓ)కు పరిమితమైన పోటీలు మాత్రమే! వీటిని అంతర్జాతీయ షూటింగ్ పోటీలుగా పరిగణించరు. వీరిద్దరితో పాటు ఆసియా క్రీడల చాంపియన్ పలక్ గులియా మహిళల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో పతకాలపై గురి పెట్టనుంది. ఈ హరియాణా షూటర్తో పాటు కొత్తగా ఈ ప్రపంచకప్లో అరంగేట్రం చేయబోతున్న జాతీయ ఎయిర్ రైఫిల్ చాంపియన్ అనన్య నాయుడు, పురుషుల ఈవెంట్లో ఆదిత్య మల్రా, నిశాంత్ రావత్ కొత్తగా వరల్డ్కప్ బరిలో దిగుతున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ షూటర్ల నుంచి వచ్చే సవాళ్లను ఏ మేరకు ఎదుర్కొంటారో చూడాలి. ఓవరాల్గా ఈ టోర్నీలో భారత్ నుంచి 36 మంది షూటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన మద్దినేని ఉమామహేశ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో పోటీపడనున్నాడు. గత ఏడాది పారిస్ ఒలింపిక్స్లో రెండు కాంస్య పతకాలు నెగ్గిన పిస్టల్ షూటర్ మనూ భాకర్ ఈ ఏడాది రెండోసారి ప్రపంచకప్ టోర్నీ ఆడనుంది. లిమాలో జరిగిన ప్రపంచకప్ టోర్నీలో మనూ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో రజత పతకాన్ని సాధించింది. ఈ సీజన్లో ఇప్పటికే రెండు ప్రపంచకప్లు అర్జెంటీనా, పెరులో జరిగాయి. ఈ రెండు మెగా ఈవెంట్లలో కలిపి భారత్ ఆరు స్వర్ణాలు సహా 15 పతకాలు గెలుపొందింది. ఈ ప్రదర్శన ద్వారా అర్జెంటీనాలో రెండో స్థానం, పెరు ఈవెంట్లో మూడో స్థానంలో భారత్ నిలిచింది. అయితే మ్యూనిక్లో మాత్రం ఎక్కువ దేశాల నుంచి వందల సంఖ్యలో మేటి షూటర్లంతా బరిలో ఉండటంతో భారత్ ఏ స్థానంలో నిలుస్తుందో ఆసక్తికరంగా మారింది. చైనా తమ చాంపియన్ షూటర్లు జియి యు, లి యుహంగ్ సహా 22 మందితో మ్యూనిక్కు చేరుకోగా... ఆతిథ్య జర్మనీ మాజీ ఒలింపిక్, ప్రపంచ చాంపియన్ క్రిస్టియాన్ రిట్జ్, అన జాన్సెన్ సహా 27 మంది మేటి షూటర్లతో పతకాలపై గురి పెట్టింది. మరోవైపు ఫ్రాన్స్ తమ దిగ్గజ షూటర్ జీన్ క్విక్వాంపొయిక్స్తో పాటు 16 మందితో ప్రపంచకప్కు రెడీ అయ్యింది. ఇద్దరు ఒలింపిక్ చాంపియన్లు యంగ్ జిన్, ఒ యెజిన్లతో కూడిన 19 మంది కొరియన్ బృందం కూడా పతకాలు కొల్లగొట్టేందుకు సై అంటోంది. వీరితో పాటు పలువురు పారిస్ ఒలింపిక్ పతక విజేతలు, అమెరికా, ఇటలీ, కజకిస్తాన్ స్టార్ షూటర్లు మ్యూనిక్ వరల్డ్కప్కు వన్నెతెచ్చే రసవత్తరపోటీకి ‘ఢీ అంటే ఢీ’ అంటున్నారు. -
70వ ప్రయత్నంలో ఒకరు... 52వ ప్రయత్నంలో మరొకరు
పారిస్: పట్టువదలని విక్రమార్కుల్లా ప్రయత్నిస్తూనే... ఎట్టకేలకు తమ గ్రాండ్స్లామ్ డబుల్స్ టైటిల్ కలను నెరవేర్చుకున్నారు మార్సెల్ గ్రానోలెర్స్ (స్పెయిన్), హొరాసియో జెబలాస్ (అర్జెంటీనా). గెలవాలన్న కసి ఉండాలేగానీ వయసుతో సంబంధం లేదని వీరిద్దరూ నిరూపించారు. 39 ఏళ్ల గ్రానోలెర్స్ 2007 నుంచి... 40 ఏళ్ల జెబలాస్ 2009 నుంచి గ్రాండ్స్లామ్ టోర్నీలలో పోటీపడుతున్నారు. చివరకు ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్లో వీరిద్దరి గ్రాండ్స్లామ్ టైటిల్ స్వప్నం సాకారమైంది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో ఐదో సీడ్ గ్రానోలెర్స్–జెబలాస్ ద్వయం 6–0, 6–7 (5/7), 7–5తో ఎనిమిదో సీడ్ జో సాలిస్బరీ–నీల్ స్కప్స్కీ (బ్రిటన్) జంటను ఓడించి తమ కెరీర్లో తొలిసారి గ్రాండ్స్లామ్ టైటిల్ను దక్కించుకుంది. తాజా ఫ్రెంచ్ ఓపెన్కంటే ముందు గ్రానోలెర్స్ 69 సార్లు... జెబలాస్ 51 సార్లు గ్రాండ్స్లామ్ టోర్నీనల్లో బరిలోకి దిగారు. గతంలో గ్రానోలెర్స్... వింబుల్డన్ (2023, 2021), యూఎస్ ఓపెన్ (2019, 2014), ఫ్రెంచ్ ఓపెన్ (2014)లలో... జెబలాస్... వింబుల్డన్ (2023, 2021), యూఎస్ ఓపెన్ (2019)లలో ఫైనల్ చేరినా చివరకు రన్నరప్ ట్రోఫీలతోనే సరిపెట్టుకున్నారు. ఈసారి మాత్రం విజేతలుగా అవతరించి తమ చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్నారు. చాంపియన్గా నిలిచిన గ్రానోలెర్స్–జెబలాస్ జోడీకి 5,90,000 యూరోలు (రూ. 5 కోట్ల 76 లక్షలు) ప్రైజ్మనీగా లభించింది.మహిళల డబుల్స్ విభాగంలో పారిస్ ఒలింపిక్స్ చాంపియన్ జోడీ జాస్మిన్ పావోలిని–సారా ఎరాని (ఇటలీ) టైటిల్ సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో పావోలిని–సారా ఎరాని ద్వయం 6–4, 2–6, 6–1తో అనా డానిలినా (కజకిస్తాన్)–అలెగ్జాండ్రా క్రునిక్ (సెర్బియా) జంటను ఓడించింది. సారా ఎరానికిది ఆరో గ్రాండ్స్లామ్ డబుల్స్ టైటిల్. రొబెర్టా విన్సీ (ఇటలీ)తో కలిసి సారా ఎరాని గతంలో యూఎస్ ఓపెన్, వింబుల్డన్, ఆ్రస్టేలియన్ ఓపెన్ టైటిల్స్ సాధించింది. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్లోనూ సారా ఎరాని ఇటలీకే చెందిన ఆండ్రియా వావసోరితో జతకట్టి టైటిల్ గెలిచింది. మహిళల డబుల్స్ టైటిల్ గెలిచిన పావోలిని–సారా ఎరాని ఖాతాలో 5,90,000 యూరోలు (రూ. 5 కోట్ల 76 లక్షలు) ప్రైజ్మనీగా చేరాయి. -
భారత్ ఖాతాలో ఆరు స్వర్ణాలు
తైపీ సిటీ: తైవాన్ ఓపెన్ అంతర్జాతీయ అథ్లెటిక్స్ మీట్లో చివరిరోజు భారత అథెట్లు ఏకంగా అరడజను స్వర్ణ పతకాలతో మెరిశారు. మహిళల జావెలిన్ త్రోలో ఒలింపియన్ అన్ను రాణి... మహిళల 400 మీటర్ల హర్డిల్స్ విభాగంలో విత్యా రామ్రాజ్... మహిళల 800 మీటర్ల విభాగంలో పూజ... పురుషుల 800 మీటర్ల విభాగంలో కృషన్ కుమార్... పురుషుల జావెలిన్ త్రోలో రోహత్ యాదవ్ పసిడి పతకాలను సొంతం చేసుకున్నారు.పురుషుల 4–400 మీటర్ల రిలేలో సంతోష్, విశాల్, మనూ, ధరమ్వీర్లతో కూడిన భారత బృందం (3ని:05.58 సెకన్లు) బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. అన్ను రాణి జావెలిన్ను 56.82 మీటర్ల దూరం... రోహిత్ యాదవ్ 74.42 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచారు. విత్యా 400 మీటర్ల దూరాన్ని 56.53 సెకన్లలో పూర్తి చేసింది.పూజ 800 మీటర్లను 2ని:02.79 సెకన్లలో... కృషన్ కుమార్ 800 మీటర్ల దూరాన్ని 1ని:48.46 సెకన్లలో పూర్తి చేసి విజేతలుగా నిలిచారు. పురుషుల 400 మీటర్ల హర్డిల్స్లో యశస్ పలాక్ష (42.22 సెకన్లు) రజత పతకాన్ని గెల్చుకున్నాడు. మహిళల లాంగ్జంప్ ఈవెంట్లో భారత క్రీడాకారిణులు శైలీ సింగ్ (6.41 మీటర్లు) రజతం, అన్సీ సోజన్ (6.39 మీటర్లు) కాంస్య పతకం సొంతం చేసుకున్నారు. -
అల్కరాజ్ అదరహో
పారిస్: ఊహకందని మలుపులతో సాగిన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) పైచేయి సాధించాడు. వరుసగా రెండో ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్గా నిలిచాడు. ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ యానిక్ సినెర్ (ఇటలీ)తో ఆదివారం జరిగిన టైటిల్ పోరులో ప్రపంచ రెండో ర్యాంకర్, రెండో సీడ్ అల్కరాజ్ 4–6, 6–7 (4/7), 6–4, 7–6 (7/3), 7–6 (10/2)తో చిరస్మరణీయ విజయం సాధించాడు. 5 గంటల 29 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో అల్కరాజ్ తొలి రెండు సెట్లను చేజార్చుకున్నా... ఆందోళన చెందకుండా ఆడి తర్వాతి మూడు సెట్లలో నెగ్గి విజేతగా నిలిచాడు. నాలుగో సెట్లో అల్కరాజ్ ఏకంగా మూడు మ్యాచ్ పాయింట్లను కాచుకోవడం విశేషం. ఈ గెలుపుతో అల్కరాజ్ తన కెరీర్లో ఐదో గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్ను దక్కించుకున్నాడు. చాంపియన్గా నిలిచిన అల్కరాజ్కు 25 లక్షల 50 వేల యూరోలు (రూ. 24 కోట్ల 91 లక్షలు), రన్నరప్ సినెర్కు 12 లక్షల 75 వేల యూరోలు (రూ. 12 కోట్ల 45 లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి. అల్కరాజ్ ఆడిన ఐదు గ్రాండ్స్లామ్ ఫైనల్స్లోనూ విజయాన్ని అందుకోవడం విశేషం. ఇప్పటి వరకు అల్కరాజ్ 2025, 2024 ఫ్రెంచ్ ఓపెన్... 2023, 2024 వింబుల్డన్... 2022 యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీలలో టైటిల్స్ సాధించాడు. కెరీర్లో తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ ఆడిన సినెర్ తొలి రెండు సెట్లను సొంతం చేసుకొని టైటిల్ దిశగా సాగిపోయాడు. అయితే అల్కరాజ్ పట్టువీడలేదు. మూడో సెట్ నుంచి అనూహ్యంగా పుంజుకున్నాడు. మూడో సెట్లోని నాలుగో గేమ్లో, పదో గేమ్లో సినెర్ సర్వీస్లను బ్రేక్ చేసిన అల్కరాజ్ సెట్ను 6–4తో నెగ్గి మ్యాచ్లో నిలిచాడు. హోరాహోరీగా సాగిన నాలుగో సెట్లో అల్కరాజ్ టైబ్రేక్లో పైచేయి సాధించాడు. నిర్ణాయక ఐదో సెట్లో ఒకదశలో అల్కరాజ్ 5–4తో గెలుపు అంచులో నిలిచాడు. అయితే సినెర్ పదో గేమ్లో అల్కరాజ్ సర్వీస్ను బ్రేక్ చేసి స్కోరును 5–5తో సమం చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్లను నిలబెట్టుకోవడంతో స్కోరు 6–6తో సమమైంది. దాంతో చివరి సెట్లోనూ టైబ్రేక్ అనివార్యమైంది. ముందుగా 10 పాయింట్లు సాధించిన అల్కరాజ్ సెట్తోపాటు మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. -
French Open 2025: ఫైనల్ పోరులో అల్కరాజ్ X సినెర్
ఫ్రెంచ్ ఓపెన్-2025 పురుషుల సింగిల్స్ టైటిల్ పోరుకు రంగం సిద్దమైంది. ఆదివారం జరగనున్న ఫైనల్లో ప్రపంచ నంబర్వన్ యానిక్ సినెర్ (ఇటలీ)తో ప్రపంచ రెండో ర్యాంకర్, డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) అమీతుమీ తేల్చుకుంటాడు.ముఖాముఖి పోరులో అల్కరాజ్ 7–4తో సినెర్పై ఆధిక్యంలో ఉన్నాడు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన రెండో సెమీఫైనల్లో టాప్ సీడ్ సినెర్ 6–4, 7–5, 7–6 (7/3)తో సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ను ఓడించి తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్లో ఫైనల్లోకి ప్రవేశించాడు.కెరీర్లో 24 గ్రాండ్స్లామ్ టైటిల్స్ నెగ్గిన జొకోవిచ్ ఈ ఓటమి తర్వాత ఎర్రమట్టి కోర్టును ముద్దాడుతూ వెనుదిరిగాడు. వచ్చే ఏడాది తాను ఫ్రెంచ్ ఓపెన్లో ఆడేది లేనిది కచ్చ్చితంగా చెప్పలేనని 38 ఏళ్ల జొకోవిచ్ వ్యాఖ్యానించాడు.చదవండి: French Open 2025: ఫ్రెంచ్ ‘క్వీన్’ కోకో.. ఫైనల్లో సబలెంకా ఓటమి -
భారత బ్యాడ్మింటన్కు కొత్త ఊతం
న్యూఢిల్లీ: భారత్లో అంతర్జాతీయ స్థాయి షట్లర్లు నానాటికి తగ్గిపోతున్న నేపథ్యంలో మేటి షట్లర్లను తయారు చేయడమే లక్ష్యంగా భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) కొత్త ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా నాణ్యమైన విదేశీ కోచ్ల పదవీ కాలం పెంచడంతో పాటు క్షేత్రస్థాయిలో ఆటకు, ఆటగాళ్లకు ఊతమిచ్చే కార్యక్రమాలు చేపట్టడం, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన బ్యాడ్మింటన్ ప్లేయర్లకు నగదు పురస్కారాలు అందజేయాలని ‘బాయ్’ నిర్ణయించింది. ఈ మేరకు ‘బాయ్’ వార్షిక సర్వ సభ్య సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకుంది. దీనికోసం ప్రతియేటా రూ. 9 కోట్ల 75 లక్షలు ఖర్చు చేయాలని భావిస్తోంది. వివిధ సెంటర్లలో ఆటగాళ్లకు కోచింగ్ ఇస్తున్న మాజీ ఆటగాళ్లు జీత భత్యాలు పెంచడంతో పాటు పతకాలు తెచ్చిన షట్లర్లకు కూడా నగదు ప్రోత్సాహకాలు క్రమం తప్పకుండా అందజేయాలని చూస్తోంది. సీనియర్ జాతీయ ర్యాంకింగ్ పోటీల విజేతలకు రూ. 10 లక్షల చొప్పున, అండర్–19 ఈవెంట్ విజేతలకు రూ. 8 లక్షలు, మిగతా వయో విభాగాల విజేతలకు నగదు ప్రోత్సాహకాలు అందజేస్తామని ‘బాయ్’ అధ్యక్షుడు, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తెలిపారు. -
హంపి, గుకేశ్లకు మూడో స్థానం
స్టావెంజర్: కీలకదశలో తప్పిదాలు చేయడంతో... నార్వే ఓపెన్ చెస్ టోర్నమెంట్లో భారత స్టార్ క్రీడాకారులు కోనేరు హంపి, దొమ్మరాజు గుకేశ్ టైటిల్కు దూరమయ్యారు. మహిళల విభాగంలో హంపి... పురుషుల విభాగంలో క్లాసికల్ ఫార్మాట్ ప్రపంచ చాంపియన్ గుకేశ్ మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఈ టోర్నీలో హంపి 15 పాయింట్లు... గుకేశ్ 14.5 పాయింట్లు స్కోరు చేశారు. పురుషుల విభాగంలో నార్వే దిగ్గజం, ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్ (16 పాయింట్లు)... మహిళల విభాగంలో అనా ముజీచుక్ (16.5 పాయింట్లు) చాంపియన్స్గా అవతరించారు. పురుషుల విభాగంలో ఆరుగురు... మహిళల విభాగంలో ఆరుగురు చొప్పున పోటీపడగా... డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో గేమ్లను నిర్వహించారు. క్లాసికల్ గేమ్లోనే విజయం సాధిస్తే 3 పాయింట్లు లభిస్తాయి. ఒకవేళ క్లాసికల్ గేమ్ ‘డ్రా’గా ముగిస్తే విజేతను నిర్ణయించేందుకు అర్మగెడాన్ గేమ్ను నిర్వహిస్తారు. క్లాసికల్ గేమ్ను ‘డ్రా’ చేసుకొని, అర్మగెడాన్ గేమ్లో గెలిస్తే 1.5 పాయింట్లు లభిస్తాయి. క్లాసికల్ గేమ్ను ‘డ్రా’ చేసుకొని, అర్మగెడాన్ గేమ్లో ఓడిపోతే 1 పాయింట్ దక్కుతుంది. క్లాసికల్ గేమ్లో ఓడిపోతే ఎలాంటి పాయింట్లు లభించవు. పురుషుల విభాగం చివరి రౌండ్లో తెలంగాణ గ్రాండ్మాస్టర్, భారత నంబర్వన్ ఇరిగేశి అర్జున్, మాగ్నస్ కార్ల్సన్ గేమ్ 56 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. వీరిద్దరి మధ్య జరిగిన అర్మగెడాన్ గేమ్లో అర్జున్ 34 ఎత్తుల్లో కార్ల్సన్ను ఓడించాడు. ఫాబియానో కరువానా (అమెరికా)తో జరిగిన గేమ్లో గుకేశ్ 50 ఎత్తుల్లో ఓడిపోయాడు. ఒకవేళ కరువానాపై గుకేశ్ గెలిచి ఉంటే అతనికి టైటిల్ ఖరారయ్యేది. గుకేశ్పై నేరుగా క్లాసికల్ గేమ్లోనే నెగ్గడంతో కరువానా 15.5 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. 14 పాయింట్లతో హికారు నకముర (అమెరికా) నాలుగో స్థానంలో... 13 పాయింట్లతో అర్జున్ ఐదో స్థానంలో... 9.5 పాయింట్లతో వె యి (చైనా) చివరిదైన ఆరో స్థానంలో నిలిచారు. మహిళల విభాగంలో చివరి రౌండ్లో ప్రపంచ చాంపియన్ జు వెన్జున్ (చైనా)తో పోటీపడిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి హంపి 51 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. వీరిద్దరి మధ్య విజేతను నిర్ణయించేందుకు అర్మగెడాన్ గేమ్ నిర్వహించగా... హంపి 40 ఎత్తుల్లో జు వెన్జున్ను ఓడించింది. భారత్కే చెందిన మరో గ్రాండ్మాస్టర్ వైశాలితో జరిగిన చివరి గేమ్ను అనా ముజీచుక్ 33 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. అర్మగెడాన్ గేమ్లో వైశాలి చేతిలో అనా ముజీచుక్ ఓడిపోయినా టైటిల్ను ఖరారు చేసుకుంది. 16 పాయింట్లతో లె టింగ్జీ (చైనా) రెండో స్థానాన్ని పొందగా... 13.5 పాయింట్లతో జు వెన్జున్కు నాలుగో స్థానం లభించింది. 11 పాయింట్లతో వైశాలి ఐదో స్థానంలో, 9 పాయింట్లతో సారా ఖాదెమ్ (స్పెయిన్) చివరిదైన ఆరో స్థానంలో నిలిచారు. ఎవరికెంత ప్రైజ్మనీ అంటే? నార్వే చెస్ టోర్నీలో ఈసారి పురుషుల, మహిళల విభాగం ప్లేయర్లకు సమాన ప్రైజ్మనీ కేటాయించారు. విజేతగా నిలిచిన కార్ల్సన్, అనా ముజీచుక్లకు 7 లక్షల నార్వేజియన్ క్రోన్ల (రూ. 59 లక్షల 36 వేలు) చొప్పున లభించాయి. రన్నరప్గా నిలిచిన కరువానా, లె టింగ్జీలకు 3 లక్షల 50 వేల క్రోన్ల (రూ. 29 లక్షల 68 వేలు) చొప్పున దక్కాయి. మూడో స్థానంలో నిలిచిన గుకేశ్, హంపి 2 లక్షల క్రోన్ల (రూ. 16 లక్షల 96 వేలు) చొప్పున అందుకున్నారు. నాలుగో స్థానం పొందిన నకముర, జు వెన్జున్లకు 1 లక్ష 70 వేల క్రోన్ల (రూ. 14 లక్షల 41 వేలు) చొప్పున లభించాయి. ఐదో స్థానంలో నిలిచిన అర్జున్, వైశాలిలకు 1 లక్ష 50 వేల క్రోన్ల (రూ. 12 లక్షల 72 వేలు) చొప్పున... ఆరో స్థానంలో నిలిచిన వె యి, సారాలకు 1 లక్ష 20 వేల క్రోన్ల (రూ. 10 లక్షల 17 వేలు) చొప్పున దక్కాయి. -
గురి తప్పిన భారత బాణం
అంటాల్యా (తుర్కియే): తొలి రెండు ప్రపంచకప్ టోర్నీలలో కలిపి మొత్తం 11 పతకాలు (3 స్వర్ణాలు, 2 రజతాలు, 6 కాంస్యాలు) సాధించిన భారత ఆర్చర్లు మూడో ప్రపంచకప్ టోర్నీలో మాత్రం నిరాశ పరిచారు. ఒక్క పతకం కూడా గెలవకుండానే రిక్తహస్తాలతో వెనక్కి వచ్చారు. మొత్తం 10 విభాగాల్లో పోటీలు జరగ్గా... ఒక్క విభాగంలోనూ భారత ఆర్చర్లు పతకాన్ని సాధించలేకపోయారు. శనివారం పురుషుల, మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగం పోటీలు జరిగాయి. పురుషుల విభాగంలో భారత ఆర్చర్లు తరుణ్దీప్ రాయ్, పార్థ్ సాలుంఖే తొలి రౌండ్లోనే ఓడిపోగా... పారిస్ ఒలింపిక్స్లో పోటీపడ్డ ఆంధ్రప్రదేశ్కు చెందిన బొమ్మదేవర ధీరజ్, అతాను దాస్ (బెంగాల్) రెండో రౌండ్లో వెనుదిరిగారు. తరుణ్దీప్ రాయ్ 2–6 సెట్ పాయింట్లతో (28–30, 29–28, 27–31, 29–32) మథియాస్ క్రామెర్ (జర్మనీ) చేతిలో... పార్థ్ సాలుంఖే 2–6 సెట్ పాయింట్లతో (28–29, 25–28, 28–25, 27–30) లు షుయె (చైనా) చేతిలో ఓటమి పాలయ్యారు. రెండో రౌండ్ మ్యాచ్ల్లో ధీరజ్ 4–6 సెట్ పాయింట్లతో (30–30, 30–30, 31–30, 28–29, 28–30) టాంగ్ చి చున్ (చైనీస్ తైపీ) చేతిలో, అతాను దాస్ 4–6 సెట్ పాయింట్లతో (28–27, 30–31, 31–30, 30–31, 27–30) బ్రాడీ ఎలీసన్ (అమెరికా) చేతిలో ఓటమి చవిచూశారు. అంతకుముందు తొలి రౌండ్ మ్యాచ్ల్లో ధీరజ్ 6–5 సెట్ పాయింట్లతో (29–26, 30–28, 26–27, 29–29, 27–29, 9–8) జాక్ విలియమ్స్ (అమెరికా)పై, అతాను దాస్ 6–0త సెట్ పాయింట్లతో (30–28, 29–28, 30–29) తొమత్సు దైసుకె (జపాన్)పై విజయం సాధించారు. మహిళల రికర్వ్ విభాగంలో అంకిత భగత్ తొలి రౌండ్లో, దీపిక కుమారి రెండో రౌండ్లో, సిమ్రన్జీత్ కౌర్ క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించారు. అంకిత 2–6 సెట్ పాయింట్లతో (27–26, 26–28, 29–30, 28–29) దున్యా యెనిహయత్ (తుర్కియే) చేతిలో... దీపిక 0–6 సెట్ పాయింట్లతో (29–30, 27–28, 28–30) ఆన్ సాన్ (దక్షిణ కొరియా) చేతిలో... సిమ్రన్జీత్ 5–6 సెట్ పాయింట్లతో (29–28, 24–29, 27–24, 27–27, 23–29, 8–11) ఆన్ సాన్ చేతిలో ఓడిపోయారు. -
వయో మోసానికి పాల్పడిన రెజ్లర్లపై వేటు
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) వయో మోసానికి పాల్పడిన రెజ్లర్లపై కన్నెర్ర చేసింది. తప్పుడు వయసు ధ్రువీకరణ పత్రాలతో జూనియర్, వయో విభాగాల టోర్నీల్లో పాల్గొన్న 30 మంది రెజ్లర్లపై తాత్కాలిక సస్పెన్షన్ వేటు వేసింది. ఆరోపణల నేపథ్యంలో గత నెల ఏకంగా 400 మందిపై విచారణ జరిపినట్లు తెలిసింది. హరియాణాకు చెందిన కొందరు రెజ్లర్లు నకిలీ వయో ధ్రువీకరణ పత్రాలతో జూనియర్ స్ధాయి పోటీల్లో పాల్గొంటున్నారు. దీనిపై తరచూ ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఈసారి ఢిల్లీ ఆఖాడాలకు చెందిన రెజ్లర్లతో పాటు కోచ్లు రెజ్లింగ్ సమాఖ్యకు పెద్ద సంఖ్యలో ఫిర్యాదు చేశారు. తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలతో ఈ తతంగమంతా జరుగుతోందని డబ్ల్యూఎఫ్ఐ గుర్తించింది. దీంతో విచారణ చేపట్టడంతో 30 మంది పట్టుపడ్డారు. వెంటనే వారిపై నిషేధం విధించి జూనియర్ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అనర్హులుగా తేల్చింది. గత కొంతకాలంగా నరేలా జోన్, రోహిని జోన్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.చాలామంది హరియాణాకు చెందిన రెజ్లర్లు ఢిల్లీ నుంచి పోటీపడేందుకు వీలుగా బేగంపుర నుంచి నకిలీ జనన ధ్రువీకరణ పత్రాలు పొందారు. ఇలా 436 కేసులను పరిశీలించిన డబ్ల్యూఎఫ్ఐ... వర్ధమాన రెజ్లర్ల జీవితాలతో చెలగాటం ఆడకుండా... వారి భవిష్యత్తును కాలరాయకుండా తాత్కాలిక సస్పెన్షన్, మందలింపుతో సరిపెట్టింది. మరోమారు పునరావృమైతే గట్టి చర్యలుంటాయని హెచ్చరించింది. సస్పెండ్కు గురైనవారిలో ఇద్దరు వయసు పైబడిన రెజ్లర్లు బీహార్లో జరిగిన ఖేలో ఇండియా క్రీడల్లో పతకాలు కూడా గెలిచారు. దీనిపై నిర్వాహకులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. లైంగికల వేధింపులకు పాల్పడిన కోచ్ సస్పెండ్ లైంగిక వేధింపులకు పాల్పడిన కోచ్ను డబ్ల్యూఎఫ్ఐ సస్పెండ్ చేసింది. హరియాణాకు చెందిన కోచ్ సంజయ్ లాథర్ ఖేలో ఇండియా క్రీడల సందర్భంగా మహిళా రెజ్లర్లతో అనుచితంగా ప్రవర్తించాడు. పోటీలు ముగిసిన వెంటనే మహిళా రెజ్లర్ల గదులకు వెళ్లేవాడు. అతను లైంగిక వేధింపులకు గురిచేశాడని ఫిర్యాదులు చేయడంతో అతనిపై నిషేధం విధించారు. డబ్ల్యూఎఫ్ఐ అంతర్గత కమిటీ ఈ ఆరోపణలపై విచారణ చేపట్టింది. అతనిపై జీవితకాల నిషేధం విధించాలని సూచించింది. -
జ్యోతి యర్రాజీకి స్వర్ణ పతకం
తైపీ సిటీ: తైవాన్ ఓపెన్ అంతర్జాతీయ అథ్లెటిక్స్ మీట్లో తొలి రోజు భారత అథ్లెట్లు ఆరు స్వర్ణ పతకాలతో అదరగొట్టారు. తైపీ సిటీలో శనివారం జరిగిన పోటీల్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఇటీవల కొరియాలో జరిగిన ఆసియా చాంపియన్షిప్లో బంగారు పతకాన్ని గెలిచిన ఈ వైజాగ్ అమ్మాయి అదే జోరును తైవాన్ మీట్లో పునరావృతం చేసింది. 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును 25 ఏళ్ల జ్యోతి అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 12.99 సెకన్లలో ముగించి విజేతగా నిలిచింది. పురుషుల 110 మీటర్ల హర్డిల్స్లో భారత రన్నర్ తేజస్ శిర్సే (13.52 సెకన్లు) స్వర్ణ పతకాన్ని హస్తగతం చేసుకున్నాడు. పురుషుల 4్ఠ100 మీటర్ల రిలేలో గురీందర్వీర్ సింగ్, అనిమేశ్ కుజుర్, మణికంఠ హోబ్లిధర్, అమ్లాన్ బొర్గోహైన్లతో కూడిన భారత బృందం (38.75 సెకన్లు) బంగారు పతకాన్ని నెగ్గింది. మహిళల 4x100 మీటర్ల రిలేలో తెలంగాణ అమ్మాయి నిత్య గంధే, సుదీక్ష, స్నేహ, అభినయ సభ్యులుగా ఉన్న భారత జట్టు (44.06 సెకన్లు) స్వర్ణ పతకం దక్కించుకుంది. పురుషుల ట్రిపుల్ జంప్లో అబ్దుల్లా అబూబకర్ (16.21 మీటర్లు), మహిళల 1500 మీటర్ల విభాగంలో పూజ (4ని:11.63 సెకన్లు) బంగారు పతకాలు గెలిచారు. -
ఫ్రెంచ్ ‘క్వీన్’ కోకో.. ఫైనల్లో సబలెంకా ఓటమి
పారిస్: ఎర్రమట్టి కోటకు కొత్త రాణి వచ్చింది. అమెరికాకు చెందిన 21 ఏళ్ల కోకో గాఫ్ ఫ్రెంచ్ ఓపెన్ కొత్త చాంపియన్గా అవతరించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్, రెండో సీడ్ కోకో గాఫ్ 6–7 (5/7), 6–2, 6–4తో ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ అరీనా సబలెంకా (బెలారస్)పై విజయం సాధించింది. 2 గంటల 38 నిమిషాలపాటు జరిగిన ఈ హోరాహోరీ సమరంలో కోకో గాఫ్ తొలి సెట్ను కోల్పోయినా అధైర్యపడకుండా అసమాన పోరాటపటిమతో కోలుకుని సబలెంకాను బోల్తా కొట్టించింది. కోకో గాఫ్ కెరీర్లో ఇది రెండో గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్కాగా, తొలిసారి ఆమె ఫ్రెంచ్ ఓపెన్లో విజేతగా నిలిచింది. 2023 యూఎస్ ఓపెన్ ఫైనల్లో సబలెంకాపైనే గెలిచి కోకో గాఫ్ తన కెరీర్లో తొలి గ్రాండ్స్లామ్ టైటిల్ను అందుకోవడం విశేషం. 2022 ఫ్రెంచ్ ఓపెన్లో తొలిసారి ఫైనల్ చేరిన కోకో గాఫ్ పోలాండ్ స్టార్ ఇగా స్వియాటెక్ చేతిలో ఓడిపోయి రన్నరప్గా నిలిచింది. రెండో ప్రయత్నంలో మాత్రం కోకో అత్యుత్తమ ఆటతీరుతో విన్నర్స్ ట్రోఫీని ముద్దాడింది. చాంపియన్గా నిలిచిన కోకో గాఫ్కు 25 లక్షల 50 వేల యూరోలు (రూ. 24 కోట్ల 91 లక్షలు), రన్నరప్ సబలెంకాకు 12 లక్షల 75 వేల యూరోలు (రూ. 12 కోట్ల 45 లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి. తడబడి తేరుకొని... సబలెంకాతో జరిగిన తుది పోరులో కోకో గాఫ్ మ్యాచ్ కొనసాగినకొద్దీ రాటుదేలింది. తొలి సెట్ ఆరంభంలో 1–4తో వెనుకబడిన కోకో నెమ్మదిగా తేరుకుంది. సబలెంకా సర్వీస్ను రెండుసార్లు బ్రేక్ చేసి స్కోరును 4–4తో సమం చేసింది. ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్లను నిలబెట్టుకోవడంతో స్కోరు 6–6తో సమమైంది. టైబ్రేక్లో సబలెంకా పైచేయి సాధించి తొలి సెట్ను దక్కించుకుంది. రెండో సెట్లో కోకో అనూహ్యంగా విజృంభించగా, సబలెంకా తడబడింది. కోకో కేవలం రెండు గేమ్లు చేజార్చుకొని ఈ సెట్ను సొంతం చేసుకొని మ్యాచ్లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్లో సబలెంకా సర్వీస్ను రెండుసార్లు బ్రేక్ చేసిన కోకో తన సర్వీస్లను కాపాడుకొని విజయాన్ని ఖరారు చేసుకుంది. ఈ క్రమంలో స్టెఫీ గ్రాఫ్ (జర్మనీ) తర్వాత (1999లో మారి్టనా హింగిస్పై) వరల్డ్ నంబర్వన్తో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో తొలి సెట్ కోల్పోయాక కూడా విజేతగా నిలిచిన రెండో ప్లేయర్గా కోకో గాఫ్ గుర్తింపు పొందింది. -
నార్వే చెస్ టోర్నీ విజేతగా మాగ్నస్ కార్ల్సన్.. గుకేశ్కు నిరాశ
నార్వే చెస్ 2025 టోర్నమెంట్ విజేతగా ప్రపంచ నంబర్ 1 మాగ్నస్ కార్ల్సెన్ నిలిచాడు. ప్రస్తుత వరల్డ్ ఛాంపియన్, భారత యువ సంచలనం డి. గుకేష్, అమెరికా గ్రాండ్ మాస్టర్ ఫాబియానో కరువానాను ఓడించి టైటిల్ను మాగ్నస్ గెలుచుకున్నాడు. ఆఖరి రౌండ్లోకి వెళ్లేముందు కార్ల్సెన్, గుకేష్ మధ్య కేవలం అర పాయింట్ తేడా మాత్రమే ఉండేది. ఈ క్రమంలో గుకేశ్ కీలకమైన పదో రౌండ్లో ఫాబియానో కరువానాతో తలపడ్డాడు. నువ్వానేనా జరిగిన చివరి రౌండ్లో గుకేశ్ కాస్త ఒత్తిడికి లోనయ్యి ఓటమి చవిచూశాడు. దీంతో గుకేశ్ 14.5 పాయింట్లతో మూడో స్థానంలో పరిమియతమయ్యాడు. మరోవైపు కార్ల్సన్ చివరి రౌండ్లో అదరగొట్టాడు. భారత గ్రాండ్మాస్టర్ అర్జున్ ఎరిగైసితో గేమ్ను డ్రా చేసుకుని టోర్నీలో అగ్రస్థానంలో నిలిచిన కార్లెసెన్(16 పాయింట్లు) ఛాంపియన్గా అవతరించాడు. ఇక మహిళల విభాగంలోఉక్రెయిన్ గ్రాండ్మాస్టర్ అన్నా ముజిచుక్ 16.5 పాయింట్లతో విజేతగా నిలిచింది. భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి మూడో స్థానంతో టోర్నీని ముగించింది.చదవండి: రోహిత్ శర్మకు షాక్..! టీమిండియా కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్? -
‘ఆఖరి’ అంచెకు భారత్ ‘సై’
అమ్స్టెల్వీన్ (నెదర్లాండ్స్): అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్ హాకీ ఆఖరి అంచె పోటీలకు భారత జట్లు సిద్ధమయ్యాయి. ఈ యూరో అంచె పోటీల్లో అంచనాలకు మించి రాణించాలని, గరిష్ట పాయింట్లతో నేరుగా ప్రపంచకప్ బెర్తు సాధించాలని పురుషుల, మహిళల జట్లు పట్టుదలతో ఉన్నాయి. ముందుగా భారత పురుషుల జట్టు నేడు ఆతిథ్య నెదర్లాండ్స్తో తలపడుతుంది. భువనేశ్వర్ అంచె పోటీల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన భారత్ వచ్చే ప్రపంచకప్కు వేదికైన నెదర్లాండ్స్లోనూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. నేడు, 9వ తేదీన డచ్ టీమ్తో జరిగే రెండు మ్యాచ్ల్లోనూ విజయం సాధించడం ద్వారా యూరో అంచెకు శుభారంభం పలకాలని హర్మన్ప్రీత్ సింగ్ నేతృత్వంలోని భారత్ భావిస్తోంది. ప్రస్తుతం 15 పాయింట్లతో ఇంగ్లండ్ (16), బెల్జియం (16)ల తర్వాత మూడో స్థానంలో ఉన్న హర్మన్ బృందం ఈ ఆఖరి అంచె పోటీలతో మెరుగైన స్థానంలో నిలవాలని ఆశిస్తోంది. డ్రాగ్ఫ్లికర్ హర్మన్ప్రీత్, మిడ్ఫీల్డ్లో హార్దిక్ సింగ్లతో పాటు రక్షణ శ్రేణిలో అమిత్ రోహిదాస్, హర్మన్, జుగ్రాజ్, జర్మన్ప్రీత్లు స్థాయికి తగిన ఆటతీరును కనబరిస్తే గెలుపు ఏమంత కష్టం కాదు. భారత చీఫ్ కోచ్ క్రెయిగ్ ఫుల్టన్ తమ జట్టు అన్ని రంగాల్లోనూ మెరుగైందని, యువ ఆటగాళ్లు సైతం అనుభవం సంపాదించారని తప్పకుండా ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారని అన్నాడు. నెదర్లాండ్స్తో పోరు ముగిశాక భారత్ 11, 12 తేదీల్లో అర్జెంటీనాతో, 14, 15 తేదీల్లో ఆ్రస్టేలియాతో, 21, 22 తేదీల్లో బెల్జియంతో తలపడుతుంది. మరోవైపు మహిళల జట్టు యూరో అంచె పోటీలను లండన్లో ఆడనుంది. ఈ నెల 14 నుంచి భారత మహిళల జట్టు పోరు ప్రారంభం అవుతుంది. భారత జట్టు తొమ్మిది పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్లు ఆడిన భారత జట్టు రెండింటిలో మాత్రమే గెలిచింది.