Rajanna
-
● భూముల సర్వే సాగేదెలా? ● జిల్లాలో సర్వేయర్ల ఖాళీలు ● జిల్లా అధికారి.. వేములవాడ డిప్యూటీ ఇన్స్పెక్టర్ పోస్టులు ఖాళీ ● పల్లెల్లో పరిష్కారం కాని భూ వివాదాలు
సిరిసిల్ల: జిల్లాలో సర్వేయర్ల కొరత వేధిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 13 మండలాలకు 8 మంది మాత్రమే సర్వేయర్లు ఉన్నారు. జిల్లా స్థాయి అధికారి పోస్టు ఖాళీగానే ఉంది. ఏడాదిగా ఇన్చార్జీలతోనే నెట్టుకొస్తున్నారు. తమ భూమి హద్దులు చూపాలంటూ జిల్లాలోని రైతులు ప్రతీ నెల ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకుంటున్నారు. సర్వేయర్లు లేక క్షేత్రస్థాయిలో సర్వే చేయడం లేదు. ఫలితంగా జిల్లాలోని చాలా గ్రామాల్లో భూవివాదాలు సద్దుమణగడం లేదు. 91,416 సర్వేనంబర్లు.. 4,68,532 ఎకరాలు జిల్లాలోని 13 మండలాల వ్యాప్తంగా 171 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. 91,416 సర్వేనంబర్లలో 4,68,532 ఎకరాల భూమి ఉంది. ఈ భూములను ఐదు దశాబ్దాల క్రితం సర్వే చేయగా, ప్రస్తుతం హద్దులు చెరిగిపోయి వివాదాస్పదంగా మారుతున్నాయి. తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, బోయినపల్లి, వేములవాడరూరల్, రుద్రంగి మండలాల్లో సర్వేయర్లు లేరు. వేములవాడ డివిజన్ డిప్యూటీ సర్వే ఇన్స్పెక్టర్ పోస్టు ఖాళీగా ఉంది. ప్రతీ నెల రైతులు భూసర్వే కోసం రూ.40వేల వరకు చెల్లిస్తున్నారు. డబ్బులు చెల్లించి నిరీక్షణ భూముల సర్వేకు సంబంధించి ఒక్కో సర్వే నంబర్కు మండల సర్వేయర్కు రూ.250, ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్(జిల్లా స్థాయిలో) అయితే రూ.300 ప్రభుత్వానికి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించినా సర్వేలు జరగడం లేదు. సర్వేనంబర్ సరిహద్దుల భూముల యజమానులకు నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. గ్రామాల్లో వీఆర్ఏ(విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు) లేకపోవడంతో నోటీసులు జారీ చేయడం లేదు. మరోవైపు ప్రభుత్వపరంగా రైల్వేలైన్, అదనపు టీఎంసీ భూసేకరణ, పోడుభూముల హద్దుల నిర్ధారణ, సాగునీటి ప్రాజెక్టులకు భూసేకరణ వంటి పనుల్లో సర్వేయర్లు బిజీగా ఉంటున్నారు. దీంతో వందలాది దరఖాస్తులు పెండింగ్లో ఉంటున్నాయి. భూముల ధరలు పెరిగి వివాదాలు జిల్లాలో భూముల ధరలు బాగా పెరిగాయి. ఎక్కడ చూసినా ఎకరాకు రూ.20లక్షలకు తక్కువ లేదు. దీంతో సరిహద్దు వివాదాలు తలెత్తుతున్నాయి. ప్ర భుత్వ సర్వేయర్లు అయితే.. భూమి హద్దుల నక్షా(టీపన్) ప్రకారం కొలతలు నిర్ధారిస్తారని రైతులు ఆశిస్తున్నారు. ఏటా వర్షాకాలం ప్రారంభంలోనే భూ హద్దుల సమస్యలు తలెత్తుతూ శాంతిభద్రత స మస్యలుగా పరిణమిస్తున్నాయి. జిల్లాలో సర్వేయర్శాఖ అధికారులు డిజిటల్ గ్లోబల్ పోజిషల్ సిస్టమ్ (డీజీపీఎస్) విధానంలో శాటిలైట్ అనుసంధానంతో సర్వే చేయడంతో భూసేకరణ పనులు వేగవంతమయ్యాయి. అయినా సర్వే కోసం చలానా చెల్లించిన రైతులు వందల్లో ఉన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం మండలానికి ఒక సర్వేయర్తోపాటు డివిజన్ స్థాయిలోనూ డిప్యూటీ ఇన్స్పెక్టర్లను, జిల్లా అధికారిని నియమించాల్సిన అవసరం ఉంది. జిల్లాలో దరఖాస్తులు ఇలా..మండల సర్వేయర్ల కోసం 211 డివిజన్ సర్వే ఇన్స్పెక్టర్ 78 జిల్లా సర్వే ఇన్స్పెక్టర్ 89 మొత్తం 378సర్వే నంబరు, రైతుల వివరాలు మండలం సర్వే నం. రైతులు సిరిసిల్ల 2,565 3,287 తంగళ్లపల్లి 9,107 10,387 గంభీరావుపేట 9,423 9,691 ముస్తాబాద్ 9,633 11,192 ఎల్లారెడ్డిపేట 11,753 9,782 వీర్నపల్లి 1,148 3,018 వేములవాడఅర్బన్ 4,950 5,039 వేములవాడరూరల్ 6,081 6,415 ఇల్లంతకుంట 11,911 14,588 బోయినపల్లి 8,692 9,013 కోనరావుపేట 8,539 9,867 చందుర్తి 6,367 8,110 రుద్రంగి 1,247 2,751 మొత్తం 91,416 1,03,140 -
టాలెంట్ టెస్ట్లు నిర్వహించడం అభినందనీయం
సిరిసిల్లటౌన్: భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 24, 25వ తేదీల్లో పదో తరగతి విద్యార్థులకు నిర్వహించే టాలెంట్ టెస్ట్ కరపత్రాలను మంగళవారం డీఈవో జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ టాలెంట్ టెస్టులు నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యార్థులందరూ ఇలాంటి పోటీ పరీక్షలు రాసి పబ్లిక్ పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గుండెల్లి కళ్యాణ్కుమార్, మల్లారపు ప్రశాంత్ మాట్లాడుతూ, 24న సిరిసిల్ల డివిజన్, 25న వేములవాడ డివిజన్ వ్యాప్తంగా టెస్ట్ నిర్వహిస్తామని, రూ.30 పరీక్ష ఫీజు ఉంటుందని పేర్కొన్నారు. టెస్ట్లో పాల్గొనే విద్యార్థులు ఈనెల 23లోపు ఎస్ఎఫ్ఐ నాయకులు లేదా సంబంధిత పాఠశాలలో పేర్లు నమోదు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 78159 24830, 94417 60430, 99082 46341 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
నేతన్నలపై సర్కారు చిన్నచూపు
సిరిసిల్లటౌన్: నేతన్నలపై సర్కారు చిన్నచూపు చూస్తుందని పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ విమర్శించారు. మంగళవారం పట్టణంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పవర్లూమ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని ఈనెల 1న పాలిస్టర్ ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు, చేనేతజౌళి శాఖ ఏడీ, లేబర్ అధికారి, మ్యాక్స్ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు ఇచ్చినా ఎవ్వరూ ముందుకు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా సమస్యలు పరిష్కరించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని లేకుంటే ఈనెల 24న పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘ భవనం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు. ధర్నాలో పవర్లూమ్ కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ పట్టణ అధ్యక్షుడు నక్క దేవదాస్, సబ్బని వెంకటాద్రి, యేన్నం శేఖర్, బొద్దుల అశోక్, యేన్నం సంతోష్, మిట్టపల్లి వెంకటేశం, గడ్డం గణేశ్, సబ్బని బాలరాజు, గోరింటాకు మల్లేశం, బొప్పరాజు కుమారస్వామి, తాటికొండ రమేశ్, నాగుల కనకయ్య, గడ్డం సంజయ్కుమార్, కోడం సత్యనారాయణ, గోరింటాల జగదీశ్, రాపేల్లి లక్ష్మణ్, పోచమల్లు తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెసోళ్లకు అభివృద్ధి అంటే తెల్వదు
సిరిసిల్లటౌన్: అభివృద్ధి చేసే లక్షణం కాంగ్రెస్ సర్కారుకు ఉండదని, అందుకే ఆపార్టీ నేతలకు బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి కనిపించడం లేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. మంగళవారం ప్రెస్క్లబ్లో మాట్లాడారు. కేసీఆర్ అందించిన ప్రాజెక్టులతోనే తెలంగాణ సస్యశ్యామలం అయ్యిందన్న సత్యాన్ని కాంగ్రెసోళ్లు జీర్ణించుకోలేక అనేక ఆరోపణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ సిరిసిల్ల ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి చేస్తున్న ఆరోపణలు సత్యదూరమన్నారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, గ్రంథాలయ మాజీ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, కుంభాల మల్లారెడ్డి, గజభీంకార్ రాజన్న, వెంగళ శ్రీనివాస్, కోడం శంకర్, పోచవేని ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
మహాలక్ష్మి పథకంలో..
జిల్లా లబ్ధిదారులు సబ్సిడీ (రూ.కోట్లలో) జగిత్యాల 1,82,801 9.49 కరీంనగర్ 1,43,899 8.12 పెద్దపల్లి 1,05,913 5.54 సిరిసిల్ల 93,104 4.72జిల్లా కనెక్షన్లు సబ్సిడీ (రూ.కోట్లలో) కరీంనగర్ 1,33,872 594.82 పెద్దపల్లి 1,05,761 484.06 జగిత్యాల 1,71,940 719 సిరిసిల్ల 90,780 388.50 -
...అనే నేను!
● ఎమ్మెల్సీ ఎన్నికల్లో చర్చనీయాంశంగా అభ్యర్థుల పేర్లు ● విద్యాసంస్థ పేరుతో నరేందర్ రెడ్డి ● భార్యపేరు జత చేసుకుని హరికృష్ణ గెజిట్ ● తనకు కావాలనే ప్రాధాన్యం తగ్గించారని సింగ్ ఆరోపణ ● సాధారణంగానే టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లుసాక్షిప్రతినిధి,కరీంనగర్●: కరీంనగర్– మెదక్– నిజామాబాద్– ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్స్, టీచర్స్ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల పేర్లపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ మండలి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లు ఇంతకాలం ఒకలా.. ఇప్పుడు ఒకలా కనిపిస్తుండటమే ఇందుకు కారణం. సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఇంటిపేరు ముందుండి, ఆ తరువాత ఒంటి పేర్లు ఉండటం సహజం. అదే తెలుగు ఎన్ఆర్ఐలు అయితే కాస్త వైరెటీగా ఇంటి పేరును.. ఒంటి పేరు తరువాత పెట్టుకుంటారు. ఇక ఉత్తర భారతంలో అసలు పేరు తరువాతే ఇంటి పేరు ఉంటుంది. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఈ పేర్ల విషయంలో అభ్యర్థులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. తమ రంగంలో తమకు గుర్తింపు తెచ్చిన పేర్లతోనే బరిలో దిగుతుండటం విశేషం. ఈ అంశంపై ప్రజల్లో, నేతల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొందరు పేర్ల మార్పు విషయాన్ని వివాదంగా చూస్తున్నారు.. ఇదంతా పోలింగ్ బ్యాలెట్ వరుస క్రమంలో ముందుకు వచ్చేందుకు వేసిన ఎత్తుగడగా అభివర్ణిస్తున్నారు. మరికొందరు ఇందులో అసలు వివాదం ఏముంది? అని ప్రశ్నిస్తున్నారు. మార్పు కనిపించింది వీరిలోనే.. గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న ప్రధాన అభ్యర్థులందరికీ పేర్లలో చెప్పుకోదగ్గ మార్పులు చోటుచేసుకున్నాయి. ఉదాహరణకు కాంగ్రెస్ అభ్యర్థి వుట్కూరి నరేందర్ రెడ్డి పేరును.. అల్ఫోర్స్ నరేందర్రెడ్డి వుట్కూరిగా ముద్రించారు. ఇందుకోసం ఆయన ఎలాంటి గెజిట్ను విడుదల చేయలేదు. అదే సమయంలో తాజాగా నరేందర్రెడ్డి తన సతీమణి వనజా పేరును.. వనజారెడ్డిగా మారుస్తూ ఇటీవల గెజిట్ విడుదల చేయడం గమనార్హం. ఆల్ఫోర్స్ అనేది నరేందర్రెడ్డికి ఉనికి అని, ఆ విద్యాసంస్థలతోనే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు కాబట్టి.. పేరు అలా వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం. అదే సమయంలో బీఎస్పీ అభ్యర్థి పులి హరికృష్ణ పేరును ప్రసన్న హరికృష్ణగా పబ్లిష్ చేశారు. వాస్తవానికి ఆయన పులి హరికృష్ణ అయినప్పటికీ.. పోటీ పరీక్షలకు కంటెంట్ ఇచ్చిన క్రమంలో ప్రసన్న హరికృష్ణగానే ప్రసిద్ధి చెందారు. అందుకే, ప్రాచుర్యం పొందిన పేరుతో తన అధికారిక పేరుగా గెజిట్ తెచ్చుకుని మరీ మార్చుకున్నారు. వీరిలో ఎవరు గెలిచినా ఓడినా.. ఇకపై ఇవే పేర్లతో కొనసాగనున్నారు. ఈ విషయంపై ఏఐఎఫ్బీ బీఫామ్పై బరిలో ఉన్న మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తన పేరును 11వ స్థానానికి మార్చడంలో కుట్రదాగి ఉందని, కొందరు అభ్యర్థులకు నిబంధనలకు విరుద్ధంగా మేలు చేసినట్లుగా అధికారుల తీరు ఉందని ఆరోపిస్తున్నారు. తాను ప్రముఖ పార్టీ బీఫామ్ నుంచి పోటీ చేస్తున్నా.. తన పేరును కిందికి మార్చి ప్రాధాన్యం తగ్గించారని విమర్శించారు. అదే సమయంలో స్వతంత్ర అభ్యర్థి వేముల విక్రమ్రెడ్డి అనే అభ్యర్థి పేరుకు ముందర ‘జర్నలిస్టు’ అనే పదం వచ్చి చేరడం గమనార్హం. మరో ఇండిపెండెట్ మహమ్మద్ ముస్తాక్అలీ తన పేరుకు ముందు డాక్టర్ అని ప్రచారం జరిగినా.. తీరా పోస్టల్ బ్యాలెట్లో డాక్టర్ లేకుండానే పేరు ముద్రితమవడం గమనార్హం. టీచర్స్ ఎమ్మెల్సీలో ఇలాంటి చిత్రాలు పెద్దగా చోటు చేసుకోలేదు. -
● భూముల సర్వే సాగేదెలా? ● జిల్లాలో సర్వేయర్ల ఖాళీలు ● జిల్లా అధికారి.. వేములవాడ డిప్యూటీ ఇన్స్పెక్టర్ పోస్టులు ఖాళీ ● పల్లెల్లో పరిష్కారం కాని భూ వివాదాలు
సిరిసిల్ల: జిల్లాలో సర్వేయర్ల కొరత వేధిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 13 మండలాలకు 8 మంది మాత్రమే సర్వేయర్లు ఉన్నారు. జిల్లా స్థాయి అధికారి పోస్టు ఖాళీగానే ఉంది. ఏడాదిగా ఇన్చార్జీలతోనే నెట్టుకొస్తున్నారు. తమ భూమి హద్దులు చూపాలంటూ జిల్లాలోని రైతులు ప్రతీ నెల ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకుంటున్నారు. సర్వేయర్లు లేక క్షేత్రస్థాయిలో సర్వే చేయడం లేదు. ఫలితంగా జిల్లాలోని చాలా గ్రామాల్లో భూవివాదాలు సద్దుమణగడం లేదు. 91,416 సర్వేనంబర్లు.. 4,68,532 ఎకరాలు జిల్లాలోని 13 మండలాల వ్యాప్తంగా 171 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. 91,416 సర్వేనంబర్లలో 4,68,532 ఎకరాల భూమి ఉంది. ఈ భూములను ఐదు దశాబ్దాల క్రితం సర్వే చేయగా, ప్రస్తుతం హద్దులు చెరిగిపోయి వివాదాస్పదంగా మారుతున్నాయి. తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, బోయినపల్లి, వేములవాడరూరల్, రుద్రంగి మండలాల్లో సర్వేయర్లు లేరు. వేములవాడ డివిజన్ డిప్యూటీ సర్వే ఇన్స్పెక్టర్ పోస్టు ఖాళీగా ఉంది. ప్రతీ నెల రైతులు భూసర్వే కోసం రూ.40వేల వరకు చెల్లిస్తున్నారు. డబ్బులు చెల్లించి నిరీక్షణ భూముల సర్వేకు సంబంధించి ఒక్కో సర్వే నంబర్కు మండల సర్వేయర్కు రూ.250, ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్(జిల్లా స్థాయిలో) అయితే రూ.300 ప్రభుత్వానికి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించినా సర్వేలు జరగడం లేదు. సర్వేనంబర్ సరిహద్దుల భూముల యజమానులకు నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. గ్రామాల్లో వీఆర్ఏ(విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు) లేకపోవడంతో నోటీసులు జారీ చేయడం లేదు. మరోవైపు ప్రభుత్వపరంగా రైల్వేలైన్, అదనపు టీఎంసీ భూసేకరణ, పోడుభూముల హద్దుల నిర్ధారణ, సాగునీటి ప్రాజెక్టులకు భూసేకరణ వంటి పనుల్లో సర్వేయర్లు బిజీగా ఉంటున్నారు. దీంతో వందలాది దరఖాస్తులు పెండింగ్లో ఉంటున్నాయి. భూముల ధరలు పెరిగి వివాదాలు జిల్లాలో భూముల ధరలు బాగా పెరిగాయి. ఎక్కడ చూసినా ఎకరాకు రూ.20లక్షలకు తక్కువ లేదు. దీంతో సరిహద్దు వివాదాలు తలెత్తుతున్నాయి. ప్ర భుత్వ సర్వేయర్లు అయితే.. భూమి హద్దుల నక్షా(టీపన్) ప్రకారం కొలతలు నిర్ధారిస్తారని రైతులు ఆశిస్తున్నారు. ఏటా వర్షాకాలం ప్రారంభంలోనే భూ హద్దుల సమస్యలు తలెత్తుతూ శాంతిభద్రత స మస్యలుగా పరిణమిస్తున్నాయి. జిల్లాలో సర్వేయర్శాఖ అధికారులు డిజిటల్ గ్లోబల్ పోజిషల్ సిస్టమ్ (డీజీపీఎస్) విధానంలో శాటిలైట్ అనుసంధానంతో సర్వే చేయడంతో భూసేకరణ పనులు వేగవంతమయ్యాయి. అయినా సర్వే కోసం చలానా చెల్లించిన రైతులు వందల్లో ఉన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం మండలానికి ఒక సర్వేయర్తోపాటు డివిజన్ స్థాయిలోనూ డిప్యూటీ ఇన్స్పెక్టర్లను, జిల్లా అధికారిని నియమించాల్సిన అవసరం ఉంది. జిల్లాలో దరఖాస్తులు ఇలా..మండల సర్వేయర్ల కోసం 211 డివిజన్ సర్వే ఇన్స్పెక్టర్ 78 జిల్లా సర్వే ఇన్స్పెక్టర్ 89 మొత్తం 378సర్వే నంబరు, రైతుల వివరాలు మండలం సర్వే నం. రైతులు సిరిసిల్ల 2,565 3,287 తంగళ్లపల్లి 9,107 10,387 గంభీరావుపేట 9,423 9,691 ముస్తాబాద్ 9,633 11,192 ఎల్లారెడ్డిపేట 11,753 9,782 వీర్నపల్లి 1,148 3,018 వేములవాడఅర్బన్ 4,950 5,039 వేములవాడరూరల్ 6,081 6,415 ఇల్లంతకుంట 11,911 14,588 బోయినపల్లి 8,692 9,013 కోనరావుపేట 8,539 9,867 చందుర్తి 6,367 8,110 రుద్రంగి 1,247 2,751 మొత్తం 91,416 1,03,140 -
అక్షరాస్యత శాతం
కరీంనగర్ 69.2 పెద్దపల్లి 65.6 జగిత్యాల 60.2 సిరిసిల్ల 62.7ఉపాధి హామీ కూలీలు కరీంనగర్ 1,22,862 పెద్దపల్లి 1,17,821 జగిత్యాల 1,67,355 సిరిసిల్ల 97,252కరీంనగర్ 993 పెద్దపల్లి 992 జగిత్యాల 1,036 సిరిసిల్ల 1014సీ్త్ర, పురుష నిష్పత్తి (ప్రతీ వెయ్యి మంది పురుషులకు ఉన్న మహిళల సంఖ్య)పశుసంపద (గొర్రెలు) కరీంనగర్ 6,38,706 పెద్దపల్లి 5,49,286 జగిత్యాల 6,10,985 సిరిసిల్ల 3,88,227 -
విద్యార్థులకు కంటి పరీక్షలు
సిరిసిల్ల: జిల్లాలోని వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థులకు మంగళవారం జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమంలో భాగంగా కంటి సమస్యలతో బాధపడే విద్యార్థులకు పరీక్షలు చేశారు. చూపు లోపాలున్న విద్యార్థులకు మందులు అందిస్తారని, మరోసారి పరీక్షలు చేసి ఉచితంగా కంటి అద్దాలు అందిస్తారని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత తెలిపారు. కార్యక్రమంలో వేములవాడ ప్రాంతీయ వైద్యశాల పర్యవేక్షకులు డాక్టర్ పెంచలయ్య, ఆర్బీఎస్కే కోఆర్డినేటర్ డాక్టర్ నహిమ, డాక్టర్ కృష్ణవేణి, ఫార్మసిస్ట్లు విజయలక్ష్మి, అనురాధ తదితరులు పాల్గొన్నారు. ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించాలి సిరిసిల్లటౌన్: టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు మంగళవారం సిరిసిల్ల డిపోలో ‘పవర్ ఫుల్ (గొప్ప మార్పునకు శ్రీకారం)’ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా డిపో మేనేజర్ ప్రకాశ్రావు మాట్లాడుతూ, ప్రయాణికుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని, చేయి ఎత్తిన చోట ఆపడం, దింపడం, వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని సిబ్బందికి సూచించారు. ఉద్యోగుల్లో నూతనోత్తేజం, ప్రయాణికుల పట్ల సానుభూతి, రోడ్ సేఫ్టీ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. హర్భజన్సింగ్, శ్రీనివాస్, వేణు, రామకృష్ణ, రాంరెడ్డి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. సాగునీటి కోసం రైతుల నిరసన తంగళ్లపల్లి(సిరిసిల్ల): సాగునీటి కోసం మండలంలోని జిల్లెల్ల శివారు నక్కవాగు వద్ద మంగళవారం రైతులు నిరసన వ్యక్తం చేశారు. జిల్లెల్ల చుట్టుపక్కల గ్రామాలకు రావాల్సిన కాలువ నీటిని వేరే గ్రామాల వారు మళ్లించుకుపోతున్నారని ఆరోపించారు. నక్కవాగుకు వచ్చే నీటిని అడ్డుకుంటూ చెక్డ్యామ్ నిర్మించడంతో వాగులోకి నీరు రాలేని పరిస్థితి నెలకొందన్నా రు. నక్కవాగులోకి నీరు వస్తేనే వ్యవసాయం చే సుకోవడం వీలవుతుందని, అధికారులు సాగునీటి ఇబ్బందులు తొలగించాలని కోరారు. విద్యుత్ అధికారుల తనిఖీ వేములవాడఅర్బన్: వేములవాడ మున్సిపల్ పరిధిలోని పలు రైస్ మిల్లులను మంగళవారం విద్యుత్ విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు. మిల్లులకు విద్యుత్ అనుమతి, వినియోగిస్తున్న మోటార్లను పరిశీలించారు. విజిలెన్స్ ఏఈ స్రవంతి, వేములవాడ పట్టణ సెస్ ఏఈ సిద్ధార్థ, లైన్ ఇన్స్పెక్టర్ రాజయ్య ఉన్నారు. సాధారణ ప్రసవాలు ప్రోత్సహించాలి బోయినపల్లి(చొప్పదండి): పీహెచ్సీల్లో సాధారణ ప్రసవాలు ప్రోత్సహించి, మాతా శిశు మరణాలు తగ్గించాలని డీఎంహెచ్వో డాక్టర్ ఎస్.రజిత పేర్కొన్నారు. మండలంలోని కొదురుపాక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి రికార్డులను పరిశీలించారు. వైద్యాధికారి రేణుప్రియాంక, సిబ్బంది తదితరులు ఉన్నారు. జాతర ఏర్పాట్లు పరిశీలనవేములవాడఅర్బన్: రాజన్న సన్నిధిలో ఈనెల 25 నుంచి 27 వరకు జరిగే మహాశివరాత్రి జాతర నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా ఎస్పీ అఖిల్మహాజన్ ఆదేశాల మేరకు ప్రణాళికతో ముందుకెళ్తున్నామని వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం రాజన్న ఆలయంతో పాటు పరిసరాల ప్రాంతాలను ఆలయ ఈఈ రాజేశ్తో కలిసి సందర్శించారు. ఏఈ రామ్కిషన్రావు, డీఈ మహిపాల్, వేములవాడ టౌన్ ట్రాఫిక్ ఎస్సై రాజు తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి నిందితులపై నిఘా పెట్టాలి
సిరిసిల్లక్రైం: జిల్లాలో గంజాయి నివారణకు చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే పలు కేసుల్లోని నిందితులపై నిఘా తీవ్రం చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని ఠాణాల్లో నమోదైన గంజాయి కేసుల్లో నిందితులుగా ఉన్న వారి కదలికలు గమనిస్తూ స్పెషల్డ్రైవ్ చేపట్టాలన్నారు. గంజాయి కిట్ల సహాయంతో టెస్ట్లు చేసి పాజిటివ్గా వస్తే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అటవీ జంతువులను వేటాడే వారిపై నిఘా కఠినతరం చేయాలని, తరచు జంతువుల వేటకు వారిపై పీడీ యాక్ట్ అమలు చేయాలన్నారు. కులబహిష్కరణలకు పాల్పడుతే చట్టరీత్య చర్యలు తీసుకోవాలని సూచించారు. వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, సీఐలు వీరప్రసాద్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, ఎస్సైలు మారుతి, అశోక్, ప్రశాంత్రెడ్డి, పృథ్వీధర్గౌడ్, ప్రేమానందం, ఐటీ కోర్ ఎస్సై కిరణ్, డీసీఆర్బీ ఎస్సై జ్యోతి పాల్గొన్నారు. గ్రీవెన్స్డేకు 18 ఫిర్యాదులు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించి గ్రీవెన్స్ డేలో వివిధ సమస్యలపై 18 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ అఖిల్మహాజన్ తెలిపారు. సివిల్ తగాదాలను పరిష్కరించే సమయంలో చట్ట పరిధిలో సలహాలు ముందుకెళ్లాలని పోలీసులకు సూచించారు. ఇంటర్నల్ మార్కుల పరిశీలనఇల్లంతకుంట: మండలంలోని వల్లంపట్ల, రేపాక, పెద్దలింగాపూర్, వెల్జిపూర్, ఆదర్శ పాఠశాల పదో తరగతి విద్యార్థుల ఇంటర్నల్ మార్కులను ఉపాధ్యాయులు పరిశీలించారు. మండలంలోని గురుకుల, కేజీబీవీ, ఆదర్శ పాఠశాలతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఇంటర్నల్ మార్కుల పరిశీలన సోమవారంతో ముగిసింది. వల్లంపట్ల హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు దూస గోవర్ధన్, వెల్జీపూర్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులు కే రాజ్ కుమార్, పత్తి వంశీధర్ రెడ్డి, టీ నరేందర్ రెడ్డి, ఐరెడ్డి ప్రదీప్ రెడ్డి, తదితరులు ఉన్నారు. న్యూస్రీల్ -
గ్రాడ్యుయేట్స్ 3,55,159, టీచర్స్ 27,088
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్–మెదక్–నిజామాబాద్– ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రులు, ఉపాధ్యాయ స్థానాలకు తుది ఓటర్ల జాబితా ఖరారైంది. సోమవారం ఎన్నికల కమిషన్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. పట్టభద్రుల ఓటర్లుగా ఇప్పటి వరకు 3,55,159 మంది, ఉపాధ్యాయ ఓటర్లు 27,088 మంది ఎన్రోల్ చేసుకున్నారు. ఈనెల 3న నామినేషన్ ప్రక్రియ మొదలైంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 100 మంది అభ్యర్థులు 192 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 17 మంది అభ్యర్థులు 38 సెట్ల నామినేషన్లు వేశారు. ఉపసహంరణల అనంతరం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో 56 మంది, టీచర్స్ బరిలో 15 మంది నిలిచారు. ఇప్పటికే ఇటు గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈనెల 27న జరిగే ఎన్నిక కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా టాప్ ఓటర్ల జాబితాలో కొత్త, పాత జిల్లాలవారీగా చూసినా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముందంజలో ఉంది. మొత్తంగా 4 ఉమ్మడి జిల్లాలు, 15 కొత్త జిల్లాలలోని 3.55 లక్షల ఓటర్లలో పాత కరీంనగర్ జిల్లాలోనే 1,60,260 మంది గ్రాడ్యుయేట్లు ఎన్రోల్ అయి ఉన్నారు. ఇక టీచర్స్ నియోజకవర్గంలో మొత్తం 27,088 ఓటర్లకు 18,953మంది నమోదు చేసుకున్నారు. ఏ రకంగా చూసినా.. కొత్త, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఓటర్ల పరంగా అగ్రభాగాన ఉన్న నేపథ్యంలో నాయకులంతా ఈ జిల్లాపైనే ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. టీచర్స్, గ్రాడ్యుయేట్స్ నియోజవర్గాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా అత్యల్ప ఓట్లతో చివరి స్థానంలో నిలిచింది. ఈనెల 27న పోలింగ్ జరగనుండగా.. మార్చి 3న ఓట్ల లెక్కింపు, 8న ప్రక్రియ పూర్తికానుంది. ఎమ్మెల్సీ ఎన్నిక తుది ఓటర్లు ఖరారు ఓటర్లలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా టాప్ అందరి నేతల దృష్టి కన్నారంపైనే.. -
క్యూలైన్ ఏర్పాటు చేయండి
వేములవాడ రాజన్న దర్శనానికి సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేయాలి. సీనియర్ సిటిజన్ భక్తులు వేములవాడ రాజరాజేశ్వరుని శివరాత్రి సందర్భంగా ప్రత్యేక వేళల్లో దర్శనానికి ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేయాలి. సాధారణ లైన్లో నిల్చొనే అవకాశం ఉండదు. – సీనియర్ సిటిజన్లు కాలువ పనులు పూర్తి చేయండి ఇల్లంతకుంట(మానకొండూర్): అసంపూర్తిగా ఉన్న సాగునీటి కాలువలు పూర్తి చేయాలని ఇల్లంతకుంట మండలానికి చెందిన నాలుగు గ్రామాల రైతులు 50 మంది బైకులపై వెళ్లి కలెక్టర్ సందీప్కుమార్ ఝాకు విన్నవించారు. సిద్దిపేట జిల్లాలోని రంగనాయకసాగర్ ప్రాజెక్టు పరిధిలోని 11వ ప్యాకేజీలో భాగంగా చేపట్టిన కాలువ పనులు పూర్తి చేసి పంటలు ఎండిపోకుండా చూడాలని పెద్దలింగాపురం, చిక్కుడువానిపల్లి, రామాజీపేట, వెల్జిపురం గ్రామాల రైతులు కోరారు. పెద్దలింగాపురం వరకు కాలువ నిర్మించి వదిలేశారని, మరో 300 మీటర్ల కాలువ నిర్మిస్తే రంగనాయకసాగర్ నుంచి నీరు వచ్చేదన్నారు. కాల్వ పూర్తి చేయించాలని కోరారు. రైతులు అమ్ముల అశోక్, దేశెట్టి శ్రీనివాస్, పయ్యావుల బాలయ్య, గొడిశెల మల్లేశం, గాదె మధు తదితరులు ఉన్నారు. -
ఆర్టీసీ బస్సు.. కండీషన్ తుస్సు !
● బ్రేక్డౌన్ అవుతున్న బస్సులు ● కాలంచెల్లిన వాహనాలతో పరేషాన్ ● బస్సుల నిర్వహణపై ప్రయాణికుల కస్సు ● డొక్కు బస్సులను తొలగించాలని డిమాండ్ ● స్క్రాప్కు వచ్చిన బస్సుల నిర్వహణపై ఆగ్రహంసిరిసిల్లటౌన్: ఆర్టీసీ బస్సు అదుపుతప్పుతోంది. కండీషన్ లేక కిర్రుమంటున్నాయి. కాలం చెల్లిన బస్సులు మార్గమధ్యలోనే మొరాయిస్తున్నాయి. పాతటైర్లు.. గలగల శబ్దాలు వచ్చే కిటికి అద్దాలు.. బ్రేక్ వేస్తే కిర్రుమంటూ కఠోరశబ్దాలు చేస్తూ ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇటీవల జిల్లాలో వరుసగా టైర్లు పేలి బస్సులు అదుపుతప్పిన ఘటనలు మరింత భయపెడుతున్నాయి. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ డిపోల్లోని బస్సుల కండీషన్పై ఫోకస్ కథనం. పగులుతున్న టైర్లు ● కామారెడ్డి నుంచి కరీంనగర్కు వస్తున్న ఆర్టీసీ ఆర్డినరీ బస్సు జనవరి 31న మాచారెడ్డి సమీపంలో టైరు పగలడంతో అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ● జనవరి 24న సిరిసిల్ల నుంచి ముస్తాబాద్కు 70 మంది ప్రయాణికులతో ఆర్డినరీ బస్సు బయలుదేరింది. తుర్కపల్లి సమీపంలోకి చేరుకోగానే టైర్ పగిలింది. బస్సు డ్రైవర్ చాకచక్యంతో బస్సును రోడ్డు పక్కన నిలిపాడు. ● ఈనెల 10న కామారెడ్డి నుంచి సిరిసిల్లకు వెళ్తున్న ఆర్డినరీ బస్సు ఎల్లారెడ్డిపేట శివారులోనే వెనుకటైర్ పేలడంతో బస్సు అదుపుతప్పింది. డ్రైవర్ చాకచక్యంతో కంట్రోల్ చేసి రోడ్డు పక్కనే నిలిపివేశాడు. రెండు డిపోలు.. 132 బస్సులు ● సిరిసిల్ల డిపోలో 67, వేములవాడలో 65 మొ త్తంగా 132 బస్సులు ఉన్నాయి. ఇందులో ఎక్స్ప్రెస్లు 53, డీలక్సులు 21, సూపర్లగ్జరీలు 2, పల్లెవెలుగులు 56 బస్సులు ఉన్నాయి. వీటిలో హైర్పర్చేస్ బస్సులు 70 ఉన్నాయి. నిత్యం సిరి సిల్ల, వేములవాడ డిపోల పరిధిలోని సుమారు 1100 ట్రిపుల్లో దాదాపు 56వేల కిలోమీటర్ల మేర నడుస్తాయి. నిత్యం జిల్లా వ్యాప్తంగా రెండు డిపోల బస్సుల్లో సుమారు లక్ష మంది ప్రయాణిస్తున్నారు. పర్యవేక్షణ లేక పరేషాన్ ● ఆర్టీసీ డిపోల్లో బస్సుల కండీషన్పై పర్యవేక్షణ కరువైంది. నిత్యం మెకానిక్లు షిఫ్టుల ప్రకారం బస్సులను మరమ్మతులు చేస్తుంటారు. షెడ్యూల్ 1, 2, 3, 4 ప్రకారం బస్సులను అన్ని విభాగాలను పర్యవేక్షిస్తుంటారు. ఆర్టీసీలో అన్ని బస్సులు ఎయిర్బ్రేక్ సిస్టమ్తో నడుస్తాయి. షెడ్యూల్–1లో ఎయిర్ ఇంప్రెషన్పై ఎక్కువగా పరిశీలిస్తారు. జాయింట్ రాడ్, టైర్లు, క్రాసులు తదితరాలను మెకానిక్లు పరిశీలిస్తారు. షెడ్యూల్–2లో ఏ టు జెడ్ వరకు పరిశీలిస్తారు. జాయింట్లు, టైర్లు, పులెయన్ పుష్ రాడ్లు ఇలా ముఖ్యమైన భాగాలను పరిశీలించాల్సి ఉంటుంది. షెడ్యూల్ 3, 4 ద్వారా రబ్బర్ ఐటమ్స్ మార్పులు, ఎస్టీ నట్లు మార్చడం, 15వేల కిలోమీటర్లు తిరిగిన ప్రతీ బస్సు ఇంజిన్, గేర్బాక్సులు, స్టీరింగ్, నట్లు బోల్టులు చెక్ చేస్తారు. ఇవన్నీ కాకుండా ప్రతీ రెండు రోజులకోసారి డ్రైవర్లు చెప్పిన వివిధ రిపేర్లతోపాటు సాధారణ సాంకేతిక సమస్యలను చెక్ చేయాల్సి ఉంటుంది. బ్యాటరీ కండీషన్, బస్సుల బాడీ కండీషన్లు చెక్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇరు డిపోల్లోని అధికారులు బస్సుల కండీషన్పై శ్రద్ధ చూపడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. నిర్వహణ లోపం ● సిరిసిల్ల, వేములవాడ డిపోల్లో 60 మంది గ్యారే జ్ మెకానిక్లు పనిచేస్తున్నారు. నిత్యం మెకా నిక్ల పర్యవేక్షణ తర్వాతే బస్సులు రోడ్డెక్కాలి. కానీ రెగ్యులర్గా మెకానిక్లు పరిశీలించడం లే దని తెలిసింది. వీరిపై అధికారుల పర్యవేక్షణ లే క పరిస్థితి ఇలా ఉందని సమాచారం. జిల్లా ప్ర జలకు ప్రధాన రవాణా సౌకర్యమైన బస్సుల్లో కనీస సౌకర్యాలు లేకపోవడం, బస్సులను కండీషన్లో నిర్వహించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. బస్సులు కండీషన్లోనే ఉన్నాయి బస్సులను కండీషన్ చెక్ చేశాకే రోడ్డుపైకి పంపిస్తున్నాం. బాడీ కండీషన్ సరిగ్గా లేని వాటిని ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయిస్తున్నాం. బస్సులో సమస్యలపై ప్రయాణికులు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. రెండు డిపోలకు కొత్తగా 25 బస్సులు కావాలని ఉన్నతాధికారులు, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే వాటిని వినియోగంలోకి తెస్తాం. – ప్రకాశ్రావు, శ్రీనివాస్, సిరిసిల్ల, వేములవాడ డీఎంలు మొరాయించిన ఆర్టీసీ బస్సు నడిరోడ్డుపై ప్రయాణికుల పాట్లు కాలినడకన అల్మాస్పూర్కు చేరుకున్న ప్రయాణికులుఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని అల్మాస్పూర్ సమీపంలో సోమవారం ఆర్టీసీ బస్సు మొరాయించింది. ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లోని అటవీ గ్రామాల ప్రయాణికులతో వస్తున్న ఆర్టీసీ బస్సు అల్మాస్పూర్ మల్లికార్జునస్వామి ఆలయం వద్ద ఆగిపోయింది. ఈ బస్సులో 110 మంది ప్రయాణిస్తున్నారు. ఓవర్లోడ్తోనే కదలడం లేదని డ్రైవర్ గుర్తించాడు. చేసేదేమి లేక ప్రయాణికులు అల్మాస్పూర్ వరకు కాలినడకన వచ్చి ఆటోల్లో మండల కేంద్రానికి చేరుకున్నారు. ఆర్టీసీ అధికారులు మారుమూల గ్రామాలకు, రోడ్లపై కండీషన్లో ఉన్న బస్సులు నడిపించాలని కోరుతున్నారు. ప్రయాణికుల అవస్థలు ఇలా.. చాలా బస్సులను రెగ్యులర్గా శుభ్రం చేయడం లేదు. ఫలితంగా బస్సుల్లోని సీట్ల మధ్య దుమ్ము లేస్తుంది. దుర్వాసన కూడా వస్తుంది. డీలక్స్, సూపర్లగ్జరీ బస్సులే కాకుండా ఎక్స్ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లోనూ సీట్లు విరిగిపోయి ఉన్నాయి. చాలా బస్సుల అద్దాలు సరిగ్గా పనిచేయడం లేదు. రబ్బర్ బీడింగ్లు లేకపోవడం, మరికొన్ని బస్సుల్లో కిటికీకి సరిపోయేలా అద్దం లేకుండా ఉంటున్నాయి. ఇలా సగం.. సగం అద్దాలతో చలికాలం చలిగాలి, ఎండాకాలం వడగాలులతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ నుంచి వచ్చే ఎక్స్ప్రెస్, డీలక్స్, సూపర్లగ్జరీ బస్సుల్లో అద్దాలు సరిగా లేక ప్రయాణికులు ఎండకు ఎండుతూ..వానకు తడుస్తూ..చలికి గజగజ వణుకుతూ ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. ప్రతీ టిక్కెటుకు నిర్ణీత సర్చార్జీలు, నిర్వహణ చార్జీలు వసూళ్లు చేస్తున్నా సౌకర్యాలు మాత్రం కల్పించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. -
రాజన్న ఆలయంలో ఆన్లైన్ సేవలు
వేములవాడఅర్బన్: రాజన్న ఆలయంలో ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయని, ఆలయంలో జరిగే నిత్య పూజలు వీక్షించేందుకు యూట్యూబ్ చానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఆలయ అధికారులు తెలిపారు. అధికారిక వెబ్సైట్ ద్వారా భక్తులు ఆన్లైన్లో సేవలు ముందుగానే బుక్ చేసుకోవచ్చని వివరించారు. https//vemulawadatemple.telangana.gov.in వెబ్సైట్లో, మొబైల్ అప్లికేషన్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చని వివరించారు. దేవాల య వసతి గదులు, ధర్మశాలలు, జాతరగ్రౌండ్లోని విచారణ కార్యాలయం ఈ టికెటింగ్ పద్ధతిలో తీసుకోవాలని సూచించారు. మీసేవ అప్లికేషన్, మీసేవ ఆన్లైన్ ద్వారా కూడ గదులు బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. -
అపర భగీరథుడు కేసీఆర్
● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యసిరిసిల్లటౌన్: కరువు నేల తెలంగాణను సస్యశ్యామలం చేసిన అపరభగీరథుడిగా మాజీ సీఎం కేసీఆర్ను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అభివర్ణించారు. సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. తెలంగాణ ఏర్పాటు అసాధ్యమన్న వారి మాటలను పటాపంచలు చేస్తూ స్వరాష్ట్రాన్ని సాధించిన ఽధీశాలిగా పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో దేశంలోనే రాష్ట్రాన్ని అభివృద్ధిలో నంబర్వన్ స్థానంలో ఉంచారని కొనియాడారు. తెలంగాణ భవన్లో కేక్ కోసి, మొక్కలు నాటారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ తాజామాజీ చైర్పర్సన్ జిందం కళ, సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ, నాయకులు బొల్లి రామ్మోహన్, మ్యాన రవి, కుంబాల మల్లారెడ్డి, దిడ్డి రాజు, గుండ్లపెల్లి పూర్ణచందర్, సత్తార్, గడ్డం లత, బత్తుల వనజ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సాధారణ ప్రసవాలు పెంచాలి ఎల్లారెడ్డిపేట/ముస్తాబాద్(సిరిసిల్ల): జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులలో రోగులకు నమ్మకం కల్పించేలా సాధారణ ప్రసవాలు పెంచాలని జిల్లా ఆస్పత్రుల సమన్వయాధికారి పెంచలయ్య సూచించారు. ఎల్లారెడ్డిపేట సామాజిక ఆస్పత్రి, గంభీరావుపేట కమ్యూనిటీ హెల్త్సెంటర్లను సోమవారం తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని మందులు, సిబ్బంది, రోగుల రికార్డులు పరిశీలించారు. వేసవిలో వడదెబ్బతో వచ్చే రోగులకు సకాలంలో వైద్యం అందించి ప్రాణాలు కాపాడాలన్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్లు బాబు, ప్రదీప్, ఓంకార్, సూపరింటెండెంటెంట్ డాక్టర్ సృజన్, ఆర్ఎంవో సింధూజ పాల్గొన్నారు. -
అర్జీలు పరిష్కరించండి
● ప్రజావాణిలో కలెక్టర్ సందీప్కుమార్ ఝా ● వివిధ సమస్యలపై 116 దరఖాస్తులుసిరిసిల్లటౌన్: ప్రజావాణిలో వివిధ సమస్యలపై వచ్చే అర్జీలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా జిల్లా అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో వినతిపత్రాలు స్వీకరించిన అనంతరం మాట్లాడారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి, పరిష్కరించాలని సూచించారు. వివిధ సమస్యలపై 116 దరఖాస్తులు వచ్చాయి. వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్, డీఆర్డీవో శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి జాతరలో చలివేంద్రం ఏర్పాటు చేసి, సామాజిక సేవ చేసే అవకాశం కల్పించాలని థర్డ్జెండర్స్ కోరగా.. వారితో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన పెట్రోల్బంక్లో ఎందుకు ఉపాధి వినియోగించుకోవడం లేదని అడిగారు. అయితే తమకు అక్కడ వసతులు లేవని వారు పేర్కొన్నారు. వసతులు సంక్షేమాధికారి కల్పిస్తారని ప్రభుత్వం కల్పించే ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.మండలాల్లో కందుల కొనుగోలు కేంద్రాలుసిరిసిల్ల: జిల్లాలోని మండలాల్లో కందుల కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం కందుల కొనుగోళ్లపై సమీక్షించారు. ఈనెల 22 నుంచి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని సూచించారు. జిల్లాలో 1,129 ఎకరాల్లో కందిపంట సాగుచేశారని, 6,211 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారన్నారు. గంభీరావుపేట, ఇల్లంతకుంట, ముస్తాబాద్, తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, చందుర్తి మండలాల్లో ఐకేపీ కేంద్రాలు, మిగితా ప్రాంతాల్లో పీఏసీఎస్ కేంద్రాల ద్వారా కందులు కొనాలని సూచించారు. 12 శాతం తేమ ఉంటే రూ.7,550 మద్దతు ధర లభిస్తుందని తెలిపారు. -
అనర్హుల భూమిని స్వాధీనం చేసుకోవాలి
తంగళ్లపల్లి మండలం ఒబు లాపూర్కు చెందిన ఓ ప్రభు త్వ ఉద్యోగి భా ర్య పేరున సర్వేనంబరు 237లో 1.20 ఎకరాలు అక్రమంగా లావ ణి పట్టా కలిగి ఉన్నారు. ప్రస్తుతం పట్టా య జమాని ప్రభుత్వం నుంచి పెన్షన్ పొందుతున్నారు. అతని ఇద్దరు కుమారులు ప్రభుత్వ ఉ ద్యోగంలో ఉన్నారు. వీరికి లావణి పట్టా ఎలా ఇస్తారు. పక్కనే గల మా స్థలాన్ని సైతం ఆక్రమించుకునేందుకు చూస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలి. – వెన్నమనేని రాంచందర్రావు, రిటైర్డ్ ఇన్చార్జి ఎంఈవో కాలుష్యం నుంచి కాపాడాలి -
‘భరోసా’తో బాధిత మహిళలకు రక్షణ
సిరిసిల్లక్రైం: బాధిత మహిళలు, బాలికలకు భరోసా కేంద్రం రక్షణగా నిలుస్తుందని ఎస్పీ అఖిల్మహాజన్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీనగర్కాలనీలోనిభరోసా సెంటర్ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. భరోసా కేంద్రం ద్వారా బాధిత మహిళలు, బాలికలకు న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు. బాధితులకు సహాయం అందించడం, ఆపదలో ఉన్న వారిని పోలీస్స్టేషన్లకు తరలించడం, సురక్షితమైన ప్రాంతంలో చేయూతనందించడం భరోసా కేంద్రాల లక్ష్యమన్నారు. సీఐలు కృష్ణ, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, ఏవో పద్మ, డీసీఆర్బీ ఎస్ఐ జ్యోతి, ఎస్సైలు అశోక్, పృథ్వీధర్గౌడ్, భరోసా సెంటర్ కోఆర్డినేటర్ శిల్ప, అధికారులు అనంత, స్వభావతి, వెన్నెల, మల్లీశ్వరి, వనిత పాల్గొన్నారు. ● ఎస్పీ అఖిల్ మహాజన్ -
పంటలను కాపాడుతాం
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పంటలను కాపాడేందుకు సాగునీరు అందిస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. మండలంలోని అ ల్మాస్పూర్ సమీపంలోని 9వ ప్యాకేజీ కాల్వను ఆదివారం పరిశీలించి మాట్లాడారు. మల్క పేట రిజర్వాయర్ నుంచి 9వ ప్యాకేజీ కెనాల్ ద్వారా బాకూర్పల్లితండా వరకు సాగునీరందిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడి నుంచి తి మ్మాపూర్లోని మైసమ్మచెరువు వరకు నీటిని తీసుకెళ్లి పొలాలకు అందిస్తామన్నారు. 9వ ప్యాకేజీ కాల్వలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాకే నీరు వస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. వచ్చే ఏడాదిలో మల్కపేట నుంచి ఎగువమానేరుకు నీటిని తరలిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ సాబేర బేగం, వైస్చైర్మన్ గుండాడి రామ్రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్స య్య, బండారి బాల్రెడ్డి, షేక్ గౌస్ పాల్గొన్నారు. రోడ్డు కోసం నిరసన ముస్తాబాద్(సిరిసిల్ల): ముస్తాబాద్–దుబ్బాక రోడ్డు విస్తరణ పనుల జాప్యంపై ముస్తాబాద్లో కేటీఆర్ సేన నాయకులు ఆదివారం నిరస న తెలిపారు. కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షుడు మెంగని మనోహర్ ఆధ్వర్యంలో చెవిలో పూలు పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఖండించారు. మనోహర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముస్తాబాద్ నుంచి మోహినికుంట వరకు డబుల్రోడ్డు నిర్మాణానికి రూ.24కోట్లు కేటీఆర్ మంజూరు చేశారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ పనులు రద్దు చేసిందన్నారు. శీలం స్వామి, వంగూరి దిలీప్, జహంగీర్, కరెడ్ల మల్లారెడ్డి, నరేంద్రచారి, సతీశ్, మనీశ్, వసంత్, శ్రావణ్, శ్రీకాంత్, మహేశ్, వెంకటేశ్, అశోక్, దేవేందర్, రాజు, శ్రీను పాల్గొన్నారు. కరాటేలో బాలికలకు బంగారు పతకాలు కోనరావుపేట(వేములవాడ): రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచి బాలికలు బంగారు పతకాలు సాధించారు. రాష్ట్రస్థాయి ఆల్ స్టైల్ కరాటే, కుంగ్ఫూ పోటీల్లో కోనరావుపేట మండలం బావుసాయిపేట ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. నలుగురు బాలికలు బంగారు పతకాలు సాధించినట్లు ఒకినోవా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఇన్స్ట్రక్టర్ శ్రీనివాస్ తెలిపారు. సీనియర్ కటాలో భూక్య గంగాదేవి గోల్డ్ మెడల్, ఎస్కే సల్మా గోల్డ్, జూనియర్ కటాలో జంగం శివాని గోల్డ్, హర్షిణి గోల్డ్ పతకాలు సాధించారు. వీరిని హెచ్ఎం చంద్రశేఖర్, కరాటే ఇన్స్ట్రక్టర్ శ్రీని వాస్, ఉపాధ్యాయులు అభినందించారు. -
బతుకు భారమై..
సోమవారం శ్రీ 17 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025అప్పులు చెల్లించలేక..జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలకేంద్రానికి చెందిన పిట్ల లింగన్నకు తోకల లక్ష్మితో 16 ఏళ్ల క్రితం వివాహమైంది. లింగన్న వ్యవసాయం, లక్ష్మీ బీడీలు చేసేవారు. లింగన్నకున్న మూడెకరాల్లో పసుపు, మొక్కజొన్న, సజ్జ, వరి పండించాడు. దిగుబడి సరిగా రాక రూ.16 లక్షలు అప్పు చేశాడు. అది వడ్డీతో కలిపి రూ.20 లక్షల వరకు అయ్యింది. ఈ సీజన్లో పసుపు రెండెకరాల్లో వేయగా దుంపకుళ్లు రోగం వచ్చింది. దీనికితోడు బ్యాంకులో తీసుకున్న రుణం రూ.2లక్షలు మాఫీ కాలేదు. రైతు భరోసా సమయానికి అందలేదు. ఆ ఆవేదనతో లింగన్న ఈ ఏడాది జనవరి 14న పురుగుల మందు తాగాడు. చికిత్స పొందుతూ 20వ తేదీన మృతిచెందాడు. లింగన్న కొడుకు హర్షవర్దన్ 8వ తరగతి, కూతురు నైనిక 2వ తరగతి చదువుతున్నారు. పెంకుటింట్లో నివసిస్తూ, బీడీలు చుడుతూ లక్ష్మి ఇద్దరు పిల్లలను పోషిస్తోంది. ఉన్న మూడెకరాలు అమ్మినా.. తన భర్త చేసిన అప్పులు తీరవని ఆవేదన వ్యక్తం చేస్తోంది లక్ష్మి. న్యూస్రీల్ -
● కలవరం రేపుతున్న రైతు ఆత్మహత్యలు ● ఏడాదిలో ఉమ్మడి జిల్లాలో దాదాపు 30 మంది బలవన్మరణం ● పంటలు సరిగా పండక పెరుగుతున్న అప్పులు ● వడ్డీలు కట్టలేక ప్రాణాలు తీసుకుంటున్న రైతులు ● రైతు భరోసా, రుణమాఫీ జాప్యంతో ఇబ్బందులు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఆరుగాలం శ్రమించి.. నలుగురికి పట్టెడన్నం పెట్టే అన్నదాత అలసిపోతున్నాడు. ఎంత కష్టపడ్డా.. ఫలితం రాకపోగా.. చేసిన అప్పులకు వడ్డీలు పెరిగి కట్టలేకపోతున్నాడు. రుణభారం భరించలేక జీవిత పోరాటంలో ఓడి ప్రాణాలు తీసుకుంటున్నాడు. నేలతల్లిని నమ్ముకున్న రైతుబిడ్డ మధ్యలోనే ఆ తల్లితో బంధం తెంచుకుని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతున్నాడు. దిగుబడి రాని పంటలు, పెరిగిన వడ్డీలకు భయపడి అప్పులోళ్లకు ముఖం చెల్లక ప్రాణాలు తీసుకుంటున్నాడు. ఉమ్మడి జిల్లాలో ఏడాది కాలంలో దాదాపు 30 మంది వరకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని సమాచారం. వరుసగా జరుగుతున్న ఆత్మహత్యలు అన్నదాత దయనీయ స్థితిని చెప్పకనే చెబుతున్నాయి. దీనికితోడు రైతు భరోసా, రుణమాఫీ సమయానికి కాకుండా జాప్యమవడం రైతుల ఆర్థిక ఇబ్బందులను మరింత పెంచేలా చేస్తున్నాయన్న విమర్శలు పెరుగుతున్నాయి. పాత జిల్లాలో కలకలం ఉమ్మడి జిల్లాలో రైతుల ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి. సాగును నమ్ముకుని అప్పులు చేసి పొలాలు కౌలుకు తీసుకుని మరీ సేద్యం చేస్తే.. చివరికి వడ్డీలు పెరిగి ప్రాణాలు తీసుకుంటున్నారు. ప్రాణాలు తీసుకుంటున్న రైతుల్లో 50 ఏళ్లలోపు వారే అధికంగా ఉండటం కలవరపెడుతోంది. చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక వేదనతో ప్రాణాలు తీసుకోవడంతో ఆ రైతుల కుటుంబాలు మరింత ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఏడాది కాలంలో కరీంనగర్లో 10 మంది, జగిత్యాలలో 6 మంది, సిరిసిల్లలో 10 మంది, పెద్దపల్లిలో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ప్రాణాలు తీసుకుంటున్న రైతుల్లో మెజారిటీ సాగు కోసం అధిక పొలం కౌలుకు తీసుకున్న వారే కావడం గమనార్హం. వీటికితోడు పిల్లల పెళ్లిళ్లు, చదువులకు అయ్యే ఖర్చ అదనం. ఫలితంగా రైతు చేస్తున్న అప్పులకు వడ్డీలు అమాంతం పెరిగిపోతున్నాయి. అన్ని కష్టాలకు ఓర్చి పండించిన పంట సరైన దిగుబడి రాక, అనుకున్న మేర గిట్టుబాట ధర రాకపోవడంతో రైతు కలత చెందుతున్నాడు. ముందున్న బాధ్యతలు, అప్పులు, వాటికి వడ్డీలు తలచుకుని ఈ లోకం నుంచి వెళ్లిపోతున్నాడు. ఉమ్మడి జిల్లాలో మరణించిన రైతులకు చెల్లించిన రైతు బీమా వివరాలుజిల్లా రైతులు బీమా కరీంనగర్ 234 రూ.11 కోట్లు రాజన్నసిరిసిల్ల 186 రూ.9.30 కోట్లు జగిత్యాల 378 రూ.18.90 కోట్లు పెద్దపల్లి 183 రూ.9.15 కోట్లు -
ఖాళీ బిందెలతో మహిళల నిరసన
ముస్తాబాద్(సిరిసిల్ల): మండలంలోని చీకోడులోని వడ్డెరకాలనీవాసులు నీటి కోసం ఖాళీ బిందెలతో ఆదివారం నిరసన తెలిపారు. కాలనీకి చెందిన శివరాత్రి రాజమణి మాట్లాడుతూ 15 రోజులుగా నల్లాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ అధికారులకు విన్నవిస్తే.. వాటర్ ట్యాంకర్ను ఏర్పాటు చేయగా.. అందులో చెత్త, నాచుతో కూడిన నీళ్లు వస్తున్నాయన్నారు. మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీ ఏర్పడిందని ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదన్నారు. ట్యాంకర్ నీరు బాగులేక, మిషన్ భగీరథ నీరు లీకేజీతో నీరు రాక ఇబ్బందులు పడుతున్నామన్నారు. వడ్డెరకాలనీకి శాశ్వత నీటి పరిష్కారం చూపాలని మహిళలు కోరారు. కోతులకు కొండెంగ ఫ్లెక్సీతో చెక్ చందుర్తి(వేములవాడ): పంటలను కోతుల బారి నుంచి కాపాడుకునేందుకు రైతులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. చందుర్తి మండలం మూడపల్లికి చెందిన చిలుక శంకర్ తాను సాగు చేసిన వరి పంటకు కోతుల బెడద తీవ్రంగా ఉంది. వాటి నుంచి పంటను కాపాడుకునేందుకు కొండెంగ బొమ్మ ఉన్న ఫ్లెక్సీలను పొలంలో ఏర్పాటు చేశాడు. అప్పటి నుంచి కోతుల రాక కొంతమేరకు తగ్గిందని రైతు తెలిపాడు. పంటను కాపాడుకునేందుకు..ఇల్లంతకుంట(మానకొండూర్): వరిపంటను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఎండలు ముదిరిపోవడంతో బోరుబావులు, వ్యవసాయబావుల్లో నీరు అడుగంటిపోయింది. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో పంటను కాపాడుకునేందుకు కొత్తగా బోర్లు వేయిస్తున్నారు. ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన రైతు ఉప్పునీటి దేవయ్య తనకున్న నాలుగు ఎకరాల్లో వరి సాగుచేశాడు. ప్రస్తుతం పంట పొట్టదశలో ఉంది. బోరు ఎత్తిపోవడంతో రూ.3లక్షలు వెచ్చించి రెండు రోజుల క్రితం మరో బోరు వేయించాడు. -
రోడ్డు మరమ్మతు పనులు పూర్తి చేయండి
● పలు రోడ్లు పరిశీలించిన కలెక్టర్ సందీప్కుమార్ ఝా ● పనుల్లో జాప్యం చేయొద్దని సూచన ● అనాథ ఆశ్రమానికి మతిస్థిమితం లేని మహిళ తరలింపుముస్తాబాద్/ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): జిల్లాలో హైబ్రిడ్ అన్యూటీ మోడల్(హమ్) ద్వారా చేపట్టిన రోడ్డు మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆదేశించారు. జిల్లాలోని ముస్తాబాద్–మోహినికుంట, గంభీరావుపేట–కామారెడ్డి, కోళ్లమద్ది, ఎల్లారెడ్డిపేట నుంచి మరిమడ్ల వరకు చేపట్టిన రహదారి పనులను ఆదివారం పరిశీలించారు. వెంకటాపూర్ నుంచి ముస్తాబాద్ మండలం నామాపూర్, ఇల్లంతకుంట నుంచి సిద్దిపేట రహదారి వరకు జరుగుతున్న రోడ్డు పనులను పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ సూచించారు. ఆర్అండ్బీ ఈఈ వెంకటరమణయ్య, డీఈ శాంతయ్య, ఏఈలు నిఖిల్, నవ్యశ్రీ తదితరులు ఉన్నారు. అనాథ ఆశ్రమానికి మహిళ తరలింపు ముస్తాబాద్లోని ఓ హోటల్ వద్ద ఉన్న మహిళను గమనించిన కలెక్టర్ తన వాహనాన్ని ఆపి వెంట నే ఆమె వద్దకు వచ్చి వివరాలు తెలుసుకున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న స్థానిక నేతలు దీటి నర్సింలు, మెంగని మనోహర్, శీలం స్వామి సదరు మహిళ వివరాలు తెలిపారు. పోతుగల్కు చెందిన తల్లీకూతుళ్లు మతిస్థిమితం లేక ముస్తాబాద్లో ఉంటున్నారని, ఇటీవల తల్లి మృతిచెందగా, కూతురు ఒంటరిగా మిగిలిందని తెలిపారు. వెంటనే జిల్లా సంక్షేమాధికారికి ఫోన్ చేసి సదరు మహిళకు జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందించి, ఆశ్రమానికి తరలించాలని ఆదేశించారు. వెంటనే చేరుకున్న సంక్షేమాధికారులు ఆమెకు చికిత్స అందించి, బద్దెనపల్లి ఆశ్రమానికి తరలించారు. -
చావు శరణ్యమై..
ప్రభుత్వం సాయం చేయాలి రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం జవారిపేట గ్రామానికి చెందిన రైతు కోమటి నాగరాజు (49) అప్పుల బాధ తాళలేక 2024 నవంబర్ 30న తనపొలం వద్ద క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మరణానంతరం భార్య లక్ష్మి తన కొడుకు రంజిత్తో కలిసి తనకున్న నాలుగెకరాలతోపాటు మరికొంత కౌలుకు తీసుకుని పత్తి, వరి సాగు చేస్తున్నారు. ముగ్గురు కూతుళ్లలో పెద్దమ్మాయి వివాహమైంది. రెండో కూతురు హైదరాబాద్లో ప్రైవేటు ఉద్యోగిని. చిన్న కూతురు కరీంనగర్లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. తమకు రైతు రుణమాఫీ కాలేదని లక్ష్మి తెలిపింది. తన భర్త పేరిట రైతుబీమా వచ్చినట్లు పేర్కొంది. బ్యాంకుల్లో అప్పులు ఉన్నాయని, ప్రభుత్వం సాయం చేసి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంటోంది. -
రోడ్డునపడిన కుటుంబం
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరిషరీఫ్ గ్రామానికి చెందిన చల్ల సమ్మయ్య, కోమల దంపతులకు కూతురు, కొడుకు శివసాగర్ ఉన్నారు. తండ్రి మూగవాడు కావడంతో తల్లి కోమలతో కలిసి శివసాగర్ వ్యవసాయం చేసేవాడు. వీరికి 20 గుంటల భూమి ఉండగా మరో ఏడెకరాలు కౌలుకు తీసుకున్నారు. పత్తి, వరిసాగు పెట్టుబడికి రూ.5లక్షల వరకు అప్పు చేశాడు. దిగుబడి రాక, అప్పులు తీర్చే మార్గంలేక మనస్తాపానికి గురై గతేడాది నవంబర్ 24న ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు మృతితో ఆ కుటుంబ పరిస్థితి దయనీయంగా మారింది. 20 గుంటల భూమి సమ్మయ్య పేరున ఉండడంతో శివసాగర్కు రైతుబీమా వర్తించలేదు. సమ్మయ్య బిజిగిరిషరీఫ్ దర్గా వద్ద భిక్షాటన చేస్తుండగా.. తల్లి వ్యవసాయ కూలీ పనులకు వెళ్తోంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ ఇంట్లో ఉంటున్నారు. -
కేసీఆర్నగర్లో ఆకస్మిక సర్వే
● పోలీస్, పంచాయతీరాజ్ సంయుక్త ఆపరేషన్ ● భారీగా మోహరించిన పోలీసులు, కార్యదర్శులు ● అరగంటలో సర్వేపూర్తి ● ఇళ్లలో లేనివారికి డోర్లాక్ నమోదుతంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని మండెపల్లి డబుల్ బెడ్రూం సముదాయం(కేసీఆర్నగర్ కాలనీ)లో ఆదివారం ఆకస్మికంగా ఇంటింటి సర్వే చేపట్టారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అనర్హులను ఏరివేసేందుకు ఈ ఆకస్మిక సర్వే నిర్వహించినట్లు తెలు స్తోంది. ఆదివారం ఉదయం 6 గంటలకే సిరిసిల్ల ని యోజకవర్గ పరిధిలోని వందకు పైగా పంచాయతీ కార్యదర్శులు కలెక్టరేట్లో ఆర్డీవో రాధాబాయి ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. కేసీఆర్నగర్లో ఇంటింటి సర్వే చేస్తున్నామని, ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలని సూచించారు. ఒక్కో కార్యదర్శికి 10 నుంచి 15 ఇళ్లు మాత్రమే కేటాయించారు. అనంతరం అందరూ ఒకేసారిగా కేసీఆర్నగర్ కాలనీకి చేరుకున్నారు. అప్పటికే జిల్లా పోలీసులు వంద మంది వరకు కాలనీని చుట్టుముట్టేశారు. పంచా యతీ కార్యదర్శులు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించారు. ఇల్లు అమ్ముకున్న వారిని, అద్దెకిచ్చిన వారిని, నివాసం ఉండని వారిని గుర్తించి వారి ఇంటిపట్టా రద్దుచేసి అర్హులకు కేటాయించేందుకు సర్వే చేసినట్లు తెలిసింది. అయితే ఆదివారం శుభకార్యాలున్నాయని, చాలా మంది వివాహాలు, ఇతర శుభకార్యాలకు వెళ్లారని.. ఆ సమయంలో వచ్చి సర్వే చేయడం సరికాదని పేర్కొంటున్నారు. -
వందశాతం పన్ను వసూలు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో ఆదివారం నాటికి వందశాతం ఇంటి పన్నులు వసూలు చేసినట్లు ఎంపీడీవో సత్తయ్య, ఎంపీవో జోగం రాజు తెలిపారు. వందశాతం పన్ను పూర్తి చేసిన సందర్భంగా వారు జీపీలలో పనిచేసే కారోబార్లు, బిల్ కలెక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం మండలంలోని వివిధ గ్రామాల్లో పన్ను వసూలుపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మండలంలో 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను ఇంటి పన్నులు రూ.1.05కోట్లు, ఇతర పన్నులు రూ.31.36లక్షలు ఉండగా పంచాయతీ అధికారులు, సిబ్బంది కష్టపడి వందశాతం పన్నులు వసూలు చేసినట్లు వివరించారు. ఇంటి యజమానులకు ముందస్తుగా డిమాండ్ నోటీసులు, గ్రామాల్లో దండోరా, మైకుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించి పన్నులు వసూలు చేశామన్నారు. ఇతర కొన్ని పన్నులకు సంబంధించి 71.40 శాతం వసూలు చేశామని, రెండు నెలల్లో మిగిలిన 29 శాతం పూర్తి చేస్తామన్నారు. ● జిల్లాలో మొదటి స్థానంలో ఎల్లారెడ్డిపేట -
బాల్యం.. బానిసెల్!
● అన్నం తినాలన్నా, హోంవర్క్ చేయాలన్నా స్మార్ట్ఫోన్ ఇవ్వాల్సిందే ● వీడియోలు, రీల్స్ చూడకపోతే ముద్ద దిగదు ● తల పట్టుకుంటున్న తల్లిదండ్రులు ● అలవాటు మానకపోతే ఆరోగ్యానికి హానికరం ● హెచ్చరిస్తున్న నిపుణులుకరీంనగర్ జిల్లాకు చెందిన ఓ బాలుడు నాలుగో తరగతి చదువుతున్నాడు. కరోనాకు ముందు వరకు చదువులో చురుగ్గా ఉండేవాడు. వైరస్ విజృంభిస్తున్న సమయంలో అందరూ ఇంటికే పరిమితమవడంతో ఆ చిన్నారి స్మార్ట్ఫోన్ చూడటం మొదలు పెట్టాడు. గంటల తరబడి చూశాడు. ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చాక ఫోన్లోనే లీనమవుతుండటంతో చదువుపై ధ్యాస లేక పూర్తిగా వెనకబడి పోయాడు. జగిత్యాల జిల్లాకు చెందిన ఓ బాలికదీ ఇదే పరిస్థితి. స్మార్ట్ఫోన్కు బానిసగా మారి, ఇవ్వకపోతే ఏడవడం, చెప్పినట్లు వినకపోవడం వంటివి చేస్తోంది. ఫోన్ ఇస్తేనే అన్నం తింటానంటూ భీష్మించుకు కూర్చుంటోంది. తల్లిదండ్రులు ఏమీ చేయలేక ఫోన్ ఇచ్చేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే పాప ఆరోగ్యం, భవిష్యత్ ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. సిరిసిల్ల జిల్లాకు చెందిన బాలుడు ఆరో తరగతి చదువుతున్నాడు. ఇంట్లో తల్లిఫోన్ చూడడం మొదలు పెట్టాడు. యూట్యూబ్లో చానెల్ క్రియేట్ చేశాడు. సొంతంగా రీల్స్ చేస్తూ సెల్కు బానిసయ్యాడు. ఇంటివద్దే కాదు.. స్కూల్లోనూ ఫోన్పైనే దృష్టిపెడుతూ.. చదువు పక్కన పెట్టాడు. గమనించిన క్లాస్ టీచర్ విద్యార్థితో పాటు తల్లిదండ్రులను మందలించింది. ఫోన్ ఇస్తే స్కూల్కు పంపొద్దని గట్టిగా హెచ్చరించింది. -
పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం
● డీఆర్డీవో శేషాద్రిసిరిసిల్ల: పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు సమతుల్యమైన ఆహారం తీసుకోవాలని డీఆర్డీవో శేషాద్రి కోరారు. జిల్లాలోని ఏపీఎంలు, సీసీలు, సెల్ఫ్హెల్ప్ గ్రూప్ సభ్యులకు శనివారం రెండో విడత శిక్షణ తరగతులు నిర్వహించారు. డీఆర్డీవో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలతో వెయ్యి రోజుల ప్రణాళికను అమలు చేయాలన్నారు. పెరటి తోటల్లో ఆకుకూరలు, కూరగాయలు, కోళ్లు పెంచుకునేలా మహిళలను ప్రోత్సహించాలని సూచించారు. గర్భిణులు మంచి ఆహారం తినేలా చూడాలన్నారు. అడిషనల్ డీఆర్డీవో గొట్టె శ్రీనివాస్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు సరిత, డీపీఎంలు పద్మయ్య, సుధారాణి తదితరులు పాల్గొన్నారు. రూ.5లక్షలతో ఇందిరమ్మ ఇల్లు ● గృహ నిర్మాణశాఖ పీడీ చిన్నయ్యఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేటలోని మండల పరిషత్ ఆఫీస్ వెనుక రూ.5లక్షలతోనే మోడల్ ఇంటిని నిర్మిస్తామని గృహనిర్మాణశాఖ పీడీ చిన్నయ్య పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం శనివారం స్థలాన్ని పరిశీలించారు. చిన్నయ్య మాట్లాడుతూ ఇంజినీర్లతో మాట్లాడి స్లాబ్ వేసే విషయంలో పలు మార్పులు తెచ్చామన్నారు. రూ.5లక్షల్లోపే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తవుతుందన్నారు. గృహనిర్మాణశాఖ డీఈ భాస్కర్, ఏఈ హమీద్, ఏఎంసీ వైస్చైర్మన్ గుండాడి రాంరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, పార్టీ మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, నాయకులు ఎస్కే గౌస్, చెన్నిబాబు, రాజు, లచ్చిరెడ్డి పాల్గొన్నారు. శాశ్వత పనులపై ప్రణాళికలు ● ఈవో వినోద్రెడ్డి వేములవాడ: రాజన్న ఆలయంలో ఏటా అవే పనులు చేస్తున్న వైనాన్ని ‘సాక్షి’లో శనివారం ప్రచురితమైన ‘శాశ్వత పనులపై పట్టింపేది’ కథనానికి ఆలయ ఈవో వినోద్రెడ్డి స్పందించారు. రాజన్న ఆలయ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం వీటీడీఏ ద్వారా మాస్టర్ప్లాన్ తయారు చేసిందని తెలిపారు. ఆలయ విస్తరణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, ఇటీవల సీఎం రేవంత్రెడ్డి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారని పేర్కొన్నారు. అయితే మహాశివరాత్రి జాతర మహోత్సవాలకు తాత్కాళిక ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. శాశ్వత పనులు అంచెలంచెలుగా చేపడతామని తెలిపారు. ఆటో కార్మికులకు పోలీస్శాఖ ‘అభయ్ ఇన్సూరెన్స్’ గంభీరావుపేట(సిరిసిల్ల): ఆటో కార్మికుల భద్రత కోసం పోలీస్శాఖ ‘అభయ్ ఇన్సూరెన్స్’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా గంభీరావుపేటలోని ఆటో కార్మికులకు ఎస్సై శ్రీకాంత్ శనివారం బీమాపత్రాలను అందించారు. ఆటోడ్రైవర్లు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సూచించారు. ఆటో యూనియన్ అధ్యక్షుడు ఇబాదుల్లాఖాన్, ఉపాధ్యక్షుడు గుడికాడి మహేశ్యాదవ్, కార్యదర్శి శంకర్, ముజీబ్, స్వామి, రాజారాం, భూమయ్య, రమేశ్, బాలభూదయ్య, రవినాయక్, చంద్రం పాల్గొన్నారు. ఇసుక ట్రాక్టర్ల అడ్డగింతకోనరావుపేట(వేములవాడ): మండలంలోని కనగర్తిలో గ్రామస్తులు శనివారం ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నారు. రెవెన్యూ అధికారులు కనగర్తి మూలవాగు నుంచి ఇసుక తరలించేందుకు అనుమతులు ఇచ్చారు. దీంతో కనగర్తి, ధర్మారం, నిజామాబాద్, సుద్దాల, పల్లిమక్త, నాగారం గ్రామాలకు చెందిన సుమారు 80 ట్రాక్టర్లు ఇసుక కోసం వచ్చాయి. ట్రాక్టర్లన్నీ ఒ క్కసారిగా రావడంతో గ్రామస్తులు అడ్డుకున్నా రు. ఇసుక తవ్వకాలతో వాగులో ఉన్న తాగునీటి బావికి ప్రమాదం ఏర్పడుతుందన్నారు. -
సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ
● వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి చందుర్తి(వేములవాడ): సీసీ కెమెరాలతో నేరాలు నియంత్రించవచ్చని వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి పేర్కొన్నారు. చందుర్తి మండలం మర్రిగడ్డలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను శనివారం చందుర్తి సీఐ వెంకటేశ్వర్లుతో కలిసి ప్రారంభించారు. ఏఎస్పీ మా ట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటుతో భద్రత ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. ప్ర మాదాలు, దొంగతనాలలో నిందితులను గు ర్తించవచ్చన్నారు. ప్రధాన రహదారులు, బస్టాండ్ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే నేరాలు అరికట్టవచ్చని తెలిపారు. ఎస్సై అంజయ్య, ప్రొబేషనరీ ఎస్సై అనిల్కుమార్, కార్యదర్శి కవిత, గ్రామస్తులు హరిబాబు, ఇందూరి మధు, బాల్రెడ్డి, జనార్దన్ పాల్గొన్నారు. -
No Headline
సిరిసిల్ల కల్చరల్/కరీంనగర్ స్పోర్ట్స్●: ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ లేని ఇల్లు లేదు. ప్రతీ కుటుంబంలో నాలుగేసి ఫోన్లు, ఒక్కోదాంట్లో రెండేసి సిమ్కార్డులు, వైఫై సౌకర్యంతో పాటు డిజిటల్ స్మార్ట్టీవీలు, కంప్యూటర్, ల్యాప్టాప్ వంటి ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం పెరిగిపోయింది. ఇదే సమయంలో ఇంట్లో ఉండే పిల్లలు క్రమంగా స్మార్ట్ఫోన్లకు బానిసవుతున్నారు. తినేటప్పుడు, హోమ్వర్క్ చేసేటప్పుడు ఫోన్ చూడాల్సిందే. బంధువుల ఇళ్లల్లో శుభకార్యాలకు హాజరైన సందర్భాల్లోనూ ఎవరినీ పట్టించుకోకుండా సెల్ఫోన్తో ఒంటరిగా గడిపే పిల్లలు చాలామంది కనిపిస్తున్నారు. వీడియోలు, రీల్స్ కనిపిస్తే తప్ప అన్నం ముద్ద దిగనంత వ్యసనంగా మారిపోయింది. దాదాపు అందరి ఇళ్లల్లోనూ ఇదే సమస్య. ఈ అలవాటు ఎలా మాన్పించాలో తెలియక బాధిత తల్లిదండ్రులు తల పట్టుకుంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 5 నుంచి 16 ఏళ్ల వయసున్న పిల్లలు దాదాపు 15.16 లక్షల వరకు ఉండగా వీరిలో సగానికి పైగా ఇలాంటోళ్లే ఉన్నారు. కోవిడ్ తెచ్చిన సమస్య కరోనా సమయంలో స్మార్ట్ఫోన్ డేటా వినియోగం పెరిగింది. ఆన్లైన్ తరగతులు పేరిట టీచర్లు ఫోన్లలోనే పిల్లలకు పాఠాలు చెప్పారు. ఆ అలవాటును చిన్నారులు కొనసాగిస్తున్నారు. బడి నుంచి ఇంటికి రావడమే ఆలస్యం.. ముందు మొబైల్ ఓపెన్ చే యాల్సిందే. లేకుంటే యుద్ధమే. ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్ అకౌంట్లు వాడేస్తున్నారు. స్కూల్లో ఇచ్చే ప్రాజెక్టుల్లో యూట్యూబ్, గూగుల్ నుంచి ఫొటోలు డౌన్లోడ్ చేసుకోవాలని ఉపాధ్యాయులే ప్రోత్సహిస్తున్నారు. ఈ రోజుల్లో పిల్లలకు అన్నం తినిపించడం పెద్ద పరీక్ష. గతంలో చందమామ రావే అంటే చాలు చిన్నారి నోట్లోని ముద్దను గుటుక్కున మింగేసే వాడు. ఇప్పుడా పరిస్థితుల్లేవు. వారికి అన్నం తినిపించాలంటే చరవాణి చూపించాలి. కదిలే ఎమోజీ బొమ్మలే కావాలి. లేదంటే కేకలేస్తారు. రెండేళ్లలోపువారికి ఫోన్ చూపించొద్దు అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ నివేదిక ప్రకారం.. రెండేళ్లలోపు పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో మొబైల్ చూపించకూడదు. రెండు నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు కేవలం గంట, ఐదు నుంచి ఎనిమిదేళ్లలోపు పిల్లలకు పెద్దల సమక్షంలో రెండు గంటలపాటు ఫోన్ ఇవ్వొచ్చు. ఆస్ట్రేలియా, లూసియానా, సౌత్ కరోలినా వంటి దేశాల్లో 16 ఏళ్లలోపు పిల్లలకు సెల్ఫోన్లు ఇవ్వడం నిషేధం.జాగ్రత్తలు తప్పనిసరి టీవీ, మొబైల్, ల్యాప్టాప్, కంప్యూటర్ వంటివి ఏవైనా సరే రెండు గంటలు దాటితే ప్రమాదమే. ప్రతీ 20 నిమిషాలకు 20 సెకన్లు విరామం ఇస్తూ 20 అడుగుల దూరం నుంచి చూడొచ్చు. అదీ విద్యాసంబంధ విషయాలకు మాత్రమే. ఎంటర్టైన్మెంట్ కంటెంట్ జోలికి వెళ్లకపోవడమే మంచిది. రాత్రి పడుకునే ముందు మొబైల్ చూడొద్దు. రాత్రి 8 గంటల తర్వాత ఇంటిని టెక్ ఫ్రీ జోన్గా మార్చేయాలి. అవసరం ఉన్నా సరే మొబైల్ డేటాకు దూరంగా ఉండాలి.సమస్యలు ఇవీ అధిక స్క్రీన్ టైమ్ వల్ల తలనొప్పి, మైగ్రేన్, డిజిటల్ ఐ స్ట్రెయిన్, కంటిచూపు మందగిస్తుంది. పిల్లలు శ్రద్ధగా వినే సామర్థ్యాన్ని కోల్పోతారు. ఫలితంగా చదువుకు దూరమయ్యే ప్రమాదముంది. ఎక్కువసేపు కూర్చొని ఉండటం, ఏం తింటున్నారో, ఎంత తింటున్నారో తెలియక బరువు పెరిగి, ఊబకాయులుగా మారుతారు. నిద్రలేమి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మొబైల్ గేమ్స్కు బానిసవుతారు. చిన్న వయసులోనే రక్తపోటు వస్తుంది. విపరీతమైన ఒత్తిడి, అనవసరమైన పోటీ భావన పెరిగి, మానసికంగా అస్థిరతకు లోనవుతారు. డిజిటల్ చాటింగ్కే ప్రాధాన్యత ఇస్తూ సహజ మానవ సంబంధాలకు దూరమవుతారు. -
No Headline
సిరిసిల్ల: మేలుకో యువతరమా.. అంటూ సిరిసిల్ల మెడికల్ కాలేజీ విద్యార్థులు ప్లాష్మాబ్ నిర్వహించారు. సిరిసిల్లలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద శనివారం ఎంబీబీఎస్ ఫస్టియర్ విద్యార్థులు.. యువతరం చెడు వ్యసనాలు మానుకోవాలని సందేశాన్నిస్తూ ప్రదర్శన చేశారు. యువత చెడు వ్యసనాలకు వైపు వెళ్లకుండా మంచి మార్గంలో వెళ్తూ ఉన్నత శిఖరాలు చేరుకోవాలని అందరికీ స్ఫూర్తినిచ్చారు. అంబేడ్కర్ చౌరస్తాలో మెడికల్ కాలేజీ విధ్యార్థులు హఠాత్తుగా వచ్చి పాటకు అనుగుణంగా డ్యాన్స్ చేస్తుండడంతో అక్కడ ఉన్న వారు అవాక్కయ్యారు. డ్యాన్స్ చేస్తూ మాదక ద్రవ్యాలతో కలిగే నష్టాలను వివరించడం ఆకట్టుకుంది. సిరిసిల్ల మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ బైరి లక్ష్మీనారాయణ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణ్, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీనారాయణ, డిప్యూటీ సూపరింటెంండెంట్ డాక్టర్ చీకోటి సంతోష్కుమార్, సిరిసిల్ల టౌన్ సీఐ కె.కృష్ణ, సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ నాగార్జున చక్రవర్తి, ట్రాఫిక్ ఎస్సై రమేశ్, ఎంబీబీఎస్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు పాల్గొన్నారు. మేలుకో యువతరమా..ఫ్లాష్మాబ్ -
ఇసుక రవాణాపై నిఘా పెట్టాలి
● మాదక ద్రవ్యాలను కట్టడి చేయాలి ● కలెక్టర్ సందీప్కుమార్ ఝా ● ఆర్డీవోలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్సిరిసిల్ల: జిల్లాలో ఇసుక రవాణాపై నిఘా పెట్టాలని ఆర్డీవోలు, తహసీల్దార్లను కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆదేశించారు. ఇసుక రవాణాపై కలెక్టరేట్ నుంచి శనివారం సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో అనుమతి ఉన్న ఇసుక రీచ్ల నుంచి మాత్రమే తరలించాలని, వే బిల్, డ్రైవర్కు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలు, ఇతర అవసరాలకు ఇసుక అవసరం ఉంటుందని తెలిపారు. అక్రమంగా ఇసుక తరలించే వారిపై కేసులు పెట్టాలని, ఆయా చోట్ల ఇసుక అక్రమంగా తరలించకుండా కందకాలు తవ్వించాలని ఆదేశించారు. సిరిసిల్ల ఇన్చార్జి ఆర్డీవో రాధాభాయ్, వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్, తహసీల్దార్లు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాలను కట్టడి చేయాలి జిల్లాలో మాదకద్రవ్యాలను పూర్తిస్థాయిలో కట్టడి చేయాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా కోరారు. కలెక్టరేట్లో ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి జిల్లాస్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం మాదకద్రవ్యాలు సరఫరా, వినియోగంపై కఠినంగా ఉందన్నారు. డ్రగ్స్ నియంత్రణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రణాళికాబద్ధంగా నియంత్రించాలని సూచించారు. మాదక ద్రవ్యాలకు బానిసైన వారిని గుర్తించి అవసరమైన చికిత్స, కౌన్సిలింగ్ అందించాలన్నారు. అటవీ భూముల్లో గంజాయి సాగు చేస్తే వెంటనే తొలగించాలన్నారు. జిల్లాలోని ఆసుపత్రులు, మెడికల్ షాపులలో స్టాక్ వివరాలను ప్రతి నెల తనిఖీ చేయాలని సూచించారు. ఎస్పీ అఖిల్ మహజన్ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టామని తెలిపారు. గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు అందరూ భాగస్వామ్యం కావాలని కోరారు. వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రజిత, డ్రగ్ ఇన్స్పెక్టర్ భవాని ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు
● డీఎంహెచ్వో రజిత సిరిసిల్ల: జిల్లాలోని బడి పిల్లలకు ఉచితంగా నేత్ర వైద్యపరీక్షలు చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఎస్.రజిత సూచించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆఫీస్లో శుక్రవారం ఆర్బీఎస్కే సిబ్బంది, వైద్యాధికారులతో సమీక్షించారు. రజిత మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు కంటిపరీక్షలు నిర్వహించాలన్నారు. అవసరమైన వారికి అద్దాలు ఉచితంగా అందించాలని సూచించారు. జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి సంపత్ ఆర్బీఎస్కే ప్రోగ్రాం ఆఫీసర్ నయీమ జహ పాల్గొన్నారు. ముందస్తుగా గుర్తిస్తే నివారించవచ్చు ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): క్యాన్సర్ను ముందస్తుగా గుర్తిస్తే నివారించవచ్చని డీఎంహెచ్వో రజిత తెలిపారు. ‘రాచపుండు సలుపుతోంది’ శీర్షికన ‘సాక్షి’లో శుక్రవారం ప్రచురితమైన కథనానికి వైద్యశాఖ అధికారులు స్పందించారు. మొదటి, రెండు స్టేజీల్లోపే గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చన్నారు. జంకుఫుడ్ తీసుకోవద్దని పేర్కొన్నారు. పాడయిన, మాడిపోయిన ఆహారం తింటే క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. గోదావరి జలాలకు హారతి ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మల్కపేట నుంచి 9వ ప్యాకేజీకి నీటిని విడుదల చేయగా.. కాంగ్రెస్ నాయకులు శుక్రవారం హారతి ఇచ్చి, పూజలు చేశారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ తొమ్మిదో ప్యాకేజీ కెనాల్ ద్వారా మల్కపేట రిజర్వాయర్ నుంచి మూడు రోజులుగా నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. బాకూర్పల్లితండా వరకు చేరుకున్న ఈ నీటిని రైతులు వ్యవసాయ పొలాలకు వినియోగించుకొని పంటలు ఎండిపోకుండా కాపాడుకుంటున్నారన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఏఎంసీ చైర్పర్సన్ సాబేర బేగం, వైస్చైర్మన్ గుండాటి రామ్రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, తిరుపతిరెడ్డి, కృష్ణారెడ్డి, బండారి బాల్రెడ్డి, రొడ్డ రామచంద్రం పాల్గొన్నారు. దేవునిగుట్టతండాకు చేరిన మల్కపేట నీరుఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్టతండాకు మల్కపేట రిజర్వాయర్ నుంచి కాలువల వెంట సాగునీరు అందడంపై గిరిజన రైతులు సంబరాలు జరుపుకున్నారు. నిన్నటి వరకు సాగునీరు లేక పంటలు ఎండిపోవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. దేవునిగుట్టతండాలో గిరిజన రైతులు ఎండిన పొలాల్లో మేకలను తిప్పారు. ఈ నేపథ్యంలోనే మల్కపేట నుంచి నీరంది మళ్లీ పంటలకు జీవకళ రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎల్ఎండీకి నీటి విడుదల బోయినపల్లి(చొప్పదండి): మిడ్మానేరు నుంచి ఎల్ఎండీకి నీటి విడుదల కొనసాగుతోంది. ఎల్ఎండీకి 2500 క్యూసెక్కులు, కుడికాల్వ ద్వారా 400 క్యూసెక్కులు, ఎడమకాలువకు 5 క్యూసెక్కుల మేర నీరు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి 196 క్యూసెక్కుల స్వల్ప ఇన్ఫ్లో వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటిమట్టం 19.64 టీఎంసీలకు చేరింది. గ్రీన్ ఇండియా చాలెంజ్ విజయవంతం చేద్దాం వేములవాడ: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఈనెల 17న గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి, సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు కోరారు. వేములవాడలోని తన స్వగృహంలో శుక్రవారం వృక్షార్చన పోస్టర్ను ఆవిష్కరించారు. నాటిన మొక్కలతో సెల్ఫీ దిగి 90003 65000కు వాట్సాప్ చేయాలని కోరారు. -
అనేక ఇబ్బందులు
ఒంటరిగా వెళ్లేందుకు మహిళా అధికారులు జంకుతున్నారు. పొలం గట్ల మీద పాములు కనబడటం, జారిపడి గాయాలపాలు అవుతున్నారు. సర్వేలో గర్భిణులు, బాలింతలకు ఎలాంటి మినహాయింపు ఇవ్వకపోవడం దారుణం. ఏ రాష్ట్రంలో లేని నిబంధన మన రాష్ట్రంలో ఉంది. ఎండలో అలిసిపోతున్నాం. 2018లో ట్యాబ్లు ఇచ్చారు. మూడు నాలుగేళ్లకే పాడయ్యాయి. డీసీఎస్ సర్వే కోసం ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసుకునే క్రమంలో వ్యక్తిగత సమాచారం కోల్పోతామని ఆందోళన చెందుతున్నాం. ఇతర రాష్ట్రాల్లో ఇదే పనిని ఔట్సోర్సింగ్కు ఇచ్చారు. – వినయ్, ఏఈవోల సంఘం అధ్యక్షుడు, పెద్దపల్లి -
● అమెరికా ఆంక్షలపై తల్లిదండ్రుల్లో ఆందోళన ● పార్ట్టైం జాబ్లపై కొరడా ● పిల్లలు ఖర్చులు తల్లిదండ్రులు పంపించాల్సిందే.. ● పల్లెల్లో అమెరికా ఆశలపై నీళ్లు
ముస్తాబాద్(సిరిసిల్ల): అగ్రరాజ్యం అమెరికా వెళ్లాలన్న విద్యార్థులు, తల్లిదండ్రుల ఆశలపై ట్రంప్ సర్కార్ నీళ్లు చల్లింది. అమెరికా ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలతో విద్యార్థులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పటికే అమెరికా వెళ్లి ఎంఎస్ చేసిన విద్యార్థులే కాదు, బీటెక్ చేసి అమెరికా వెళ్లి ఎంఎస్ చేయాలనుకునే విద్యార్థులు ట్రంప్ ఆంక్షలతో ఇబ్బంది పడే పరిస్థితులు వచ్చాయి. పార్ట్టైం జాబ్ చేస్తూ ఎంఎస్ చదవాలనే వారికి ఇక ఎంతమాత్రం అవకాశం ఇచ్చేది లేదని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. దీంతో జిల్లా నుంచి వెళ్లిన చాలా మంది విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఓపీటీపైనే ఆశలు అమెరికాలో ఎంఎస్ పీజీ చేసే విద్యార్థులు తాత్కాలిక ఉద్యోగాల కోసం ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రెయినింగ్(ఓపీటీ) చేస్తారు. శిక్షణ కోసం అమెరికా రాయబార కార్యాలయంలో ఎంఎస్ పూర్తి చేసిన వారు తమ పేర్లను నమోదు చేసుకుంటారు. వారి సంఖ్య కూడా గతేడాది కంటే ఎక్కువగా నమోదు కావడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఎంఎస్ కోసం నా లుగేళ్లు అమెరికాలో ఉండే అవకాశం ఉంది. రెండేళ్లలో కోర్సు పూర్తి చేస్తే.. మరో రెండేళ్లలో ఉద్యోగం సాధించుకోవచ్చు. అయితే ఉద్యోగం వచ్చే వరకు పార్ట్టైం జాబ్ చేయరాదన్న నిబంధనలు అమలులోకి రావడంతో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్లో హెచ్–1బీ వీసాలు రావడం కూడా కష్టంగా మారుతుందనే భావన వ్యక్తమవుతోంది. మరోవైపు ఇండియాలో ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్)లో అవకాశాలు భారీగా ఉండబోతున్నాయన్న సంకేతాలు విద్యార్థులకు ఊరట కలిగిస్తున్నాయి. అయినా అమెరికా వెళ్లాలన్న మధ్యతరగతి కుటుంబాల్లోని విద్యార్థుల కలలు నెరవేరేలా కనిపించడం లేదు. అప్పు చేసి అమెరికాకు.. జిల్లాకు చెందిన విద్యార్థులు అమెరికాలో దాదాపు 500 వరకు ఉన్నట్లు అంచనా. ఇందులో అత్యధిక శాతం మంది పీజీ చదివేందుకు వెళ్లిన వారే. ఉద్యోగాలు చేస్తున్న వారికి ఎలాంటి ఇబ్బంది లేకున్నప్పటికీ.. విద్యార్థుల పరిస్థితి ఏంటనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను అప్పు చేసి అమెరికాలో ఎమ్మెస్ చదివించేందుకు పంపించారు. ఇలాంటి వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఒక్కో విద్యార్థిపై దాదాపు రూ.50లక్షలు వ్యయం చేసే పరిస్థితులు ఉన్నాయని పోతుగల్కు చెందిన మాజీ సర్పంచ్ ద్యావతి పండరి తెలిపారు. నెలకు రూ.లక్ష వరకు ఖర్చు అవుతుందని, రెండేళ్లు ఎమ్మెస్ చదివేందుకు అయ్యే ఖర్చులు అదనమని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను పంపించే సమయంలో మంచి పేరున్న కన్సల్టెన్సీల వద్దకు వెళ్లాలని ఆయన సూచిస్తున్నారు. ఇతను ముస్తాబాద్కు చెందిన సాయి. అమెరికాలోని బోస్టన్లో ఓ యూనివర్సిటీలో గత ఆగస్టులో ఎంఎస్ పూర్తి చేశాడు. అదే యూనివర్సిటీలో పార్ట్టైం జాబ్ చేసి, నెలకు రూ.లక్ష వరకు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం జాబ్ సెర్చ్లో ఉన్నాడు. ఈక్రమంలో ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ విద్యార్థులు పార్ట్టైం ఉద్యోగాలు చేయరాదనే ఆంక్షలు విధించడంతో సాయి తాను చేస్తున్న పార్ట్టైం జాబ్ను ఈనెలలోనే కోల్పోయాడు. ప్రస్తుతం ఇంటర్వ్యూలకు వెళ్తున్న సాయికి ఉద్యోగం వస్తే ఇబ్బంది లేదు. లేకపోతే ప్రతీ నెల రూ.లక్ష వరకు తల్లిదండ్రులు పంపించా ల్సిందే. ఇలాంటి పరిస్థితి జిల్లా నుంచి ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన చాలా మంది విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు మా అబ్బాయి న్యూయార్క్లో ఉన్నాడు. ఆరు నెలల క్రితమే ఎమ్మెస్ పూర్తి చేశాడు. ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. పార్ట్టైం జాబ్లపై ఆంక్షలు విధించారని తెలిపాడు. దీంతో ఖర్చులకు ఇంటి నుంచే డబ్బులు పంపిస్తున్నాం. పీఎం మోదీపైనే తల్లిదండ్రులు, విద్యార్థులు ఆశలు పెట్టుకున్నారు. – రమేశ్, ముస్తాబాద్ ఆందోళన చెందవద్దు అమెరికాలో చదవులకు, ఉద్యోగాలకు ఢోకా లేదు. టాలెంట్ ఉన్న వారికి అవకాశాలు వస్తాయి. ఇప్పుడు ఇండియాలో ఏఐ రంగంలో ఉద్యోగావకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆంక్షలు ఎక్కువ రోజులు ఉండకపోవచ్చనే భావన కూడా ఉంది. తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందకుండా పాజిటివ్గా ఉండాలి. పుకార్లు నమ్మొద్దు. – బి.శ్రీనివాస్రెడ్డి, సియాటెల్ -
సంజీవయ్య జీవితం ఆదర్శం
● జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ సత్యనారాయణగౌడ్ ● ఘనంగా సంజీవయ్య జయంతి సిరిసిల్లటౌన్: అట్టడుగు వర్గాల నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన దామోదరం సంజీవయ్య భావితరాలకు స్ఫూర్తిదాయకమని జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్ పేర్కొన్నారు. సంజీవయ్య జయంతిని పురస్కరించుకొని స్థానిక పాతబస్టాండ్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, సంజీవయ్యనగర్ యువజన సంఘం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఏఎంసీ చైర్మన్ వెల్ముల స్వరూపరెడ్డి, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత, నాయకులు రాగుల జగన్, జక్కుల యాదగిరి, రాగుల రాములు, పాటి కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఫీజు బకాయిలు విడుదల చేయండి
సిరిసిల్లటౌన్: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజు బకాయిలు, స్కాలర్షిప్స్ విడుదల చేయాలని ఎస్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుండెల్లి కల్యాణ్, మల్లారపు ప్రశాంత్ డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం సిగ్గుచేటన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ సర్కారు తీవ్రంగా విఫలమైందని, ఎస్ఎఫ్ఐ నాయకులు సురేష్, కుమార్, అజయ్, నిఖిల్, సమీర్, సంజయ్ ,శివశంకర్ పాల్గొన్నారు. -
వడగాల్పులపై అవగాహన కల్పించాలి
● జిల్లాలో ‘సమ్మర్ హీట్ వేవ్’ కమిటీలు ● కలెక్టర్ సందీప్కుమార్ ఝాసిరిసిల్ల: జిల్లాలో వడగాల్పులతో నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని, ‘సమ్మర్ హీట్ వేవ్’ కమిటీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా కోరారు. కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే వేసవిలో వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రిలోని ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలన్నారు. మార్చి నుంచి జూలై వరకు అవసరమైన మేరకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలన్నారు. వేసవిలో జాగ్రత్తలు వివరిస్తూ ప్రచారబోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో చలివేంద్రాల ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా అధికారుల సోషల్ మీడియా ద్వారా ఎండ వేడిమి నుంచి సంరక్షించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారం చేయాలన్నారు. ఉపాధిహామీ పనుల సమయాన్ని మార్పు చేయాలని తెలిపారు. జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత, ఇన్చార్జి డీపీవో శేషాద్రి, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి రవీందర్రెడ్డి, జిల్లా పౌరసంబంధాల అధికారి వి.శ్రీధర్, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. డీఈఈటీలో విద్యార్థుల పేర్లు నమోదు చేయండి డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ(డీఈఈటీ)లో విద్యార్థుల వివరాల నమోదుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కోరారు. కలెక్టరేట్లో శుక్రవారం డీఈఈటీ యాప్పై అధికారులతో సమీక్షించారు. డీఈఈటీలో నమోదైతే విద్యార్థులకు ఉన్న నైపుణ్యాల అర్హత ప్రకారం ప్రైవేట్రంగంలోని ఉద్యోగావవకాశాల వివరాలు తెలుస్తాయన్నారు. జిల్లాలోని ఐటీఐ, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఉత్తీర్ణులైన వారి వివరాలు 15 రోజులలో నమోదయ్యేలా చూడాలన్నారు. పరిశ్రమల శాఖ జీఎం హన్మంతు, ఏడీ భారతి, జిల్లా రవాణాశాఖ అధికారి లక్ష్మణ్, ఎస్సీ కార్పొరేషన్ అధికారి విజయలక్ష్మి పాల్గొన్నారు. పాఠ్యాంశాలపై పట్టు సాధిస్తే 10 జీపీఏ సాధ్యం తంగళ్లపల్లి(సిరిసిల్ల): విద్యార్థులు ప్రతీ సబ్జెక్టులోని పాఠ్యాంశాలపై పట్టు సాధించాలని.. తద్వారా పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు పొందవచ్చని కలెక్టర్ సందీప్కుమార్ ఝా సూచించారు. తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి సాంఘిక సంక్షేమ బాలి కల గురుకుల పాఠశాలను శుక్రవారం తనిఖీ చే శారు. వంటగది, స్టోర్రూమ్లో నిల్వచేసిన బి య్యం, ఇతర ఆహార పదార్థాల తయారీకి సిద్ధం చేసిన సరుకుల నాణ్యతను పరిశీలించారు. అనంతరం ఆరు నుంచి ఇంటర్మీడియెట్ వరకు ప్రతీ తరగతి గదిలోని వెళ్లి విద్యార్థినులతో మాట్లాడారు. మ్యాథ్స్, బాటనీ పాఠాలను విద్యార్థినులకు బోధించి వారి సందేహాలను నివృత్తి చేసి వార్షిక పరీక్షలలో 10 జీపీఏ సాధించాలని ఉత్తేజా న్ని నింపారు. కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాల ఆవరణ, పరిసరాలు శుభ్రం చేయించాలని అధి కారులను ఆదేశించారు. ప్రిన్సిపాల్ దర్శనాల పద్మ, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పొలానికి ఎట్ల పోవాలె?
● మహిళా అగ్రికల్చర్ ఆఫీసర్ల అగచాట్లు ● డీటెయిల్ క్రాప్ సర్వే కోసం పడరాని పాట్లు ● నిర్మానుష్య ప్రాంతాల్లో భయంభయంగా.. ● పురుగులు, పుట్టలు, రైలుపట్టాలు దాటుతూ సర్వే ● యాప్, సర్వర్ సతాయింపులు ● ఇతర రాష్ట్రాల్లో మహిళలు దూరం ● ప్రాణాలకు తెగించి, ఆత్మగౌరవాన్ని చంపుకుంటున్నామని ఆవేదన ● గర్భిణులు, బాలింతలకూ దొరకని మినహాయింపు పెద్దపల్లి: బురదలో కూరుకుపోయిన బండితో ఏఈవో ఆపసోపాలుజగిత్యాల జిల్లా పరిధిలోని ఓ గ్రామంలో ఊరికి దూరంగా పొలం ఉంది. వెళ్లేందుకు సరైన దారిలేదు. పొలానికి వెళ్లాలంటే కల్లు కాంపౌండ్ దాటాలి. అక్కడ కల్లు తాగేవాళ్లు ఒంటరిగా వస్తున్న మహిళా ఏఈవోను చూసి వెకిలిగా నవ్వారు.. అవేమీ పట్టించుకోకుండా ముందుకెళ్తే.. పొలంగట్టుపై బుసలు కొడుతూ నాగుపాము అంతెత్తున లేచింది. ఆ మహిళా ఏఈవోకు ప్రాణాలు పోయినంత పనైంది.జిల్లా ఏఈవోలు మహిళలు సాగుచేసినభూమి డీసీఎస్ (ఎకరాల్లో) (ఎకరాల్లో) సిరిసిల్ల 53 28 2,34,000 24,499 జగిత్యాల 71 34 1,39,000 19,000 కరీంనగర్ 75 13 3,03,000 59,005 పెద్దపల్లి 55 21 2,10,975 18,692 -
మొండి బకాయిదారులపై చట్టపరమైన చర్యలు
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థకు పన్నులు చెల్లించని మొండి బకాయిదారులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కమిషనర్ చాహత్ బాజ్పేయి హెచ్చరించారు. గురువారం నగరపాలకసంస్థ కార్యాలయంలో పన్నుల వసూళ్లపై ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారులు ప్రభుత్వ,ప్రైవేట్ సంస్థలకు సంబంధించిన పన్నుల వసూళ్లపైనా దృష్టి పెట్టాలన్నారు. కొద్ది సంవత్సరాలుగా ఆస్తి పన్నులు చెల్లించని మొండి బకాయిదారులకు నోటీసులు జారీ చేయాలని ఆర్ఐలను ఆదేశించారు. ఇటీవల డ్రాలో షెట్టర్లు పొంది, ఒప్పందం చేసుకోని వ్యాపారులకు నోటీసులు ఇవ్వాలన్నారు. -
చనిపోతానంటూనే..
● కాలువలో దూకి వృద్ధురాలి ఆత్మహత్య ఎలిగేడు(పెద్దపల్లి): సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన పొన్నం కనకమ్మ(78) గురువారం ఎస్సారెస్పీ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై సదన్ కుమార్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. కొంతకాలం క్రితం మతిస్థిమితం కోల్పోయిన కనకయ్య.. తాను చనిపోతా అంటూ గ్రామస్తులకు చెబుతూ వస్తోంది. ఈ క్రమంలోనే కాలువ వెంట తిరుగుతూ అందులో దూకింది. అటుగా వెళ్తున్న ఉపాధ్యాయుడు, అదే గ్రామానికి చెందిన కొండ తిరుపతిగౌడ్ ఆమెను కాపాడి ఇంటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత కాసేపటికే వృద్ధురాలు చనిపోయింది. మృతురాలి కుమారుడు పొన్నం మల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు. మృతురాలి భర్త కొమురయ్య గతంలోనే చనిపోయాడు. వారికి ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వృద్ధురాలి ఆత్మహత్య కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): పెద్దరాతుపల్లి గ్రామానికి చెందిన బొజ్జం రాజమ్మ(75) వృద్ధాప్యం బాధ భరించలేక పురుగులమందు తాగి ఆత్మహ్యత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. బుధవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగుల మందుతాగింది. ఆ తర్వాత కరీంనగర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసునమోదు చేసుకున్నారు. పశువుల పాక దగ్ధం ● పాడి గేదె సజీవ దహనం జగిత్యాలరూరల్: జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలో గురువారం ఉదయం ప్రమాదవశాత్తు నిప్పంటుకుని ఓ పశువుల పాక దగ్ధం కావడంతో పాటు, అందులో ఉన్న పాడి గేదె సజీవ దహనమైంది. వివరాలిలా ఉన్నాయి. జాబితాపూర్లోని అదె మోహన్కుచెందిన పశువుల పాకలో గురువారం ఉదయం ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. స్థానికులు గమనించి అందులోని పశువులను వదిలిపెట్టగా ఒక పాడిగేడె సజీవ దహనమైంది. పక్కనే ఉన్న రాజిరెడ్డి, మత్తయ్య, రాజేందర్లకు చెందిన సుమారు రూ.లక్ష విలువైన పశుగ్రాసం కూడా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది అక్కడకు చేరుకొని మంట లు ఆర్పేసి పెను ప్రమాదాన్ని నివారించారు. అడవికి నిప్పువీర్నపల్లి: కంచర్ల అల్మాస్పూర్ గ్రామాల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు అడవికి నిప్పటించారు. స్థానికులు గమనించి వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా అల్మాస్పూర్ సెక్షన్ ఆఫీ సర్ పద్మలత, ఎఫ్బీవో సతీశ్తో కలిసి మంటలు ఆర్పివేశారు. ఈ సందర్భంగా కంచర్ల గ్రామస్తులు మాట్లాడుతూ.. వారం క్రితం గ్రామంలోని కోతులను గ్రామస్తులంతా అడవిలోకి కోతులను తరిమా రు. ఇప్పుడు అడవికి నిప్పంటుకోవడంతో మళ్లీ కోతులు గ్రామంలోకి వచ్చి హంగామా చేస్తాయని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి అడవికి నిప్పుపెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
మొండి బకాయిదారులపై చట్టపరమైన చర్యలు
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థకు పన్నులు చెల్లించని మొండి బకాయిదారులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కమిషనర్ చాహత్ బాజ్పేయి హెచ్చరించారు. గురువారం నగరపాలకసంస్థ కార్యాలయంలో పన్నుల వసూళ్లపై ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారులు ప్రభుత్వ,ప్రైవేట్ సంస్థలకు సంబంధించిన పన్నుల వసూళ్లపైనా దృష్టి పెట్టాలన్నారు. కొద్ది సంవత్సరాలుగా ఆస్తి పన్నులు చెల్లించని మొండి బకాయిదారులకు నోటీసులు జారీ చేయాలని ఆర్ఐలను ఆదేశించారు. ఇటీవల డ్రాలో షెట్టర్లు పొంది, ఒప్పందం చేసుకోని వ్యాపారులకు నోటీసులు ఇవ్వాలన్నారు. -
బైలకుప్పే సందర్శన
కరీంనగర్టౌన్: కేంద్ర హోంశాఖ సహా య మంత్రి బండి సంజయ్ కుమార్ రెండ్రోజుల పర్యటనలో భాగంగా కర్నాటకలోని మైసూర్ జిల్లాలోని టిబెటియన్ శరణార్థుల పునరావాస కేంద్రమైన బైలకుప్పేను సందర్శించారు. టిబెటియన్ శరణార్థుల స్థితిగతులు, సమస్యలను తెలు సుకునేందుకు బైలకుప్పేకు వెళ్లిన కేంద్ర మంత్రి బండి సంజయ్కి బౌద్ద మత గురువు 14వ దలైలామా ప్రతినిధి జుగ్మే జిగ్నే, మైసూర్ కాలనీల ప్రధాన ప్రతినిధి జూనియర్ జుగ్మే సుల్ట్రాన్, జిల్లా మైనారిటీ అధికారి శిల్ప, స్థానిక అధికారులు ఘన స్వాగతం పలికారు. స్థానిక గోల్డెన్ టెంపుల్, పద్మ సంభవ, బుద్ధ, అమితాయుస్ల ఎత్తయిన (40 అడుగుల) భవ్య విగ్రహాలను, ఫిలాసఫీ యూనివర్శిటీ టెంపుల్, ఆర్గానిక్ రీసెర్చ్ ట్రైనింగ్ సెంటర్, ఓల్డెజ్ హోంను సందర్శించారు. శుక్రవారం ఉద యం బండి సంజయ్ 14వ బౌద్ద మతగురువు దలైలామాతో భేటీ కానున్నారు. -
నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యం సాధించాల్సిందే..
గోదావరిఖని: రక్షణతో కూడిన వార్షిక బొగ్గు ఉత్పత్తి సాధించాల్సిందేనని సింగరేణి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ) బలరాం సూచించారు. డైరెక్టర్లు ఎల్వీ సూర్యనారాయణ, కె.వెంకటేశ్వర్లుతో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ఆర్జీ–1 ఏరియా జీడీకే–5 ఓసీపీ, జీడీకే–11గనిని గురువారం సీఎండీ సందర్శించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి సాధించేందుకు అనుసరించాల్సిన ప్రణాళికపై కార్మికులతో ముఖాముఖి నిర్వహించారు. ఉద్యోగులు ఎనిమిది గంటలపాటు విధులు నిర్వహించాలన్నారు. భారీ యంత్రాల వినియోగ సమయాన్ని పెంచాలని అన్నారు. కాలం చెల్లించిన యంత్రాల స్థానంలో కొత్తవాటిని కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరం నిర్దేశించిన 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించడంలో ప్రతీఒక్కరు పట్టుదలతో ముందుకు సాగాలని ఆయన సూచించారు. గైర్హాజర్ లేకుండా నిర్దేశిత ఉత్పత్తి లక్ష్య సాధనలో పాలుపంచుకోవాలని పేర్కొన్నారు. ఈసందర్భంగా సూపర్వైజర్లు, మైనింగ్ సిబ్బంది, కోల్కట్టర్, సపోర్ట్మెన్తోపాటు కంటిన్యూస్ మైనర్ ఆపరేటర్లు తదితరుల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ కొరిమి రాజ్కుమార్, ఆర్జీ–1 జీఎం లలిత్కుమార్, సేఫ్టీ జీఎం గుపాత, క్వాలిటీ జీఎం భైద్యా, ఏజెంట్ శ్రీనివాస్, ప్రాజెక్టు ఆఫీసర్ చంద్రశేఖర్, ఏసీఎంవో కిరణ్ రాజ్కుమార్, డీజీఎం(పర్సనల్) కిరణ్ బాబు తదితరులు పాల్గొన్నారు. లాభాలు సాధిస్తేనే మనుగడ సింగరేణి సీఎండీ బలరాం -
గ్రామాల వారీగా క్యాన్సర్ రోగుల వివరాలు
లింగన్నపేట 67 ఎల్లారెడ్డిపేటల 10 పోతుగల్ 04 ఇల్లంతకుంట 13 కోనరావుపేట 20 తంగళ్లపల్లి 01 నేరెళ్ల 03 చీర్లవంచ 03 హన్మాజీపేట 15 చందుర్తి 03 బోయినపల్లి 01 కొదురుపాక 07 పీఎస్ నగర్ 05 ఏబీ నగర్ 02నోట్ : ఇవి అధికారిక లెక్కలు మాత్రమే. అనధికారికంగా ఇంతకు ఏడు రెట్లకు పైగా క్యాన్సర్ రోగులు ఉన్నారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
కథలాపూర్(వేములవాడ): కథలాపూర్ మండలం పోసానిపేట గ్రామశివారులో సాయికుమార్(26) అనే యువకుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందినట్లు ఎస్సై నవీన్కుమార్ తెలిపారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రానికి చెందిన జక్కుల సాయికుమార్కు పోసానిపేటకు చెందిన మానసతో ఆరేళ్ల క్రితం వివాహమైందన్నారు. సాయికుమార్ ఐదు రోజుల క్రితం అత్తగారింటికి వచ్చి వెళ్లరని తెలిపారు. అప్పటి నుంచి కనిపించకపోవడంతో ఈనెల 12న కథలాపూర్ పోలీస్స్టేషన్లో అతడి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారన్నారు. గురువారం ఉదయం పోసానిపేట గ్రామశివారులోని వ్యవసాయబావిలో సాయికుమార్ మృత దేహం కనిపించిందన్నారు. మృతుడి తండ్రి జక్కుల మల్లేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్ల ఎస్సై వివరించారు. కారు ఢీకొని గీత కార్మికుడి దుర్మరణం ఓదెల(పెద్దపల్లి): మడక గ్రామంలో గురువారం కారు ఢీకొని గీతకార్మికుడు మ్యాడగొని శంకరయ్య(52) మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. కల్లుగీసేందుకు తాటిచెట్టు ఎక్కిన శంకరయ్య.. తన బైక్పై ఇంటకి బయలు దేరాడు. ఈ క్రమంలో అజాగ్రత్తగా కారునడుపుకుంటూ వచ్చిన సాయిశ్వేతన్ వెనుక నుంచి శంకరయ్యను ఢీకొట్టాడు. తీవ్రగాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే శంకరయ్య మృతిచెందాడు. మృతుడికి భార్య రాధ, కుమారుడు మ్యాడగొని శ్రీకాంత్గౌడ్, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. మతిస్థిమితం లేని వ్యక్తి మృతి కరీంనగర్రూరల్: కరీంనగర్ పరిధిలోని తీగలగుట్టపల్లి రైల్వేగేట్ సమీపంలో గత నెల 30న ఓ వ్యక్తి ఎడమ కాలికి తీవ్రగాయం కావడంతో స్థానికుల సమాచారంతో పోలీసులు చికిత్స కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ వ్యక్తి చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు మృతిచెందాడు. అయితే మృతుడికి మతిస్థిమితం లేదని, పేరు అడిగితే రాజయ్య అని, ఊరు బోనగిరి అని చెప్పాడని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రిలో భద్రపరిచారు. కుటుంబసభ్యులు, బంధువులు మృతుడిని గుర్తించినట్లయితే కరీంనగర్రూరల్ పోలీసులను సంప్రదించాలని సీఐ ప్రదీప్కుమార్ సూచించారు. కుక్కల దాడిలో బాలుడికి తీవ్ర గాయాలుతంగళ్లపల్లి(సిరిసిల్ల): కుక్కల దాడిలో తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మకాలనీకి చెందిన బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. ఓబులాపూర్కు చెందిన చెల్ల శ్రీవర్దన్ కుటుంబం గురువారం ఇందిరమ్మకాలనీలోని బంధువుల ఇంటికి వెళ్లింది. ఆ బాలుడు ఇంటి బయట ఆడుకుంటుండగా కుక్కలు దాడి చేశాయి. కుటుంబసభ్యులు వాటిని తరిమికొట్టి, తీవ్రంగా గాయపడిన శ్రీవర్దన్ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. కుక్కల బెడద తీవ్రంగా ఉందని, అధికారులు దూరంగా తరలించాలని స్థానికులు కోరుతున్నారు. బైక్ దొంగల అరెస్టుకరీంనగర్రూరల్: కరీంనగర్ రైల్వేస్టేషన్లో బైక్ దొంగతనం చేసిన ఇద్దరు వ్యక్తులను గురువారం అరెస్టు చేసినట్లు కరీంనగర్రూరల్ పోలీస్స్టేషన్ సీఐ ప్రదీప్కుమార్ తెలిపారు. సీఐ వివరాల ప్రకారం ఈ నెల 4న సుభాశ్నగర్కు చెందిన తిరుపతి తన స్నేహితుడిని రైలు ఎక్కించేందుకు బైక్పై కరీంనగర్ రైల్వేస్టేషన్కు వెళ్లాడు. బైక్ను పార్కింగ్ చేసి రైలు ఎక్కించి తిరిగి వచ్చి చూసేసరికి బైక్ కన్పించకపోవడంతో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. గురువారం ఉదయం 8గంటలకు అపోలోరీచ్ ఆస్పత్రి వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టగా మెట్పల్లికి చెందిన షేక్మదర్, పవన్కుమార్లు దొంగిలించిన బైక్పై వస్తుండగా పట్టుకున్నారు. రైల్వేస్టేషన్లో మరోబైక్ను దొంగిలించేందుకు వస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీఐ ప్రదీప్కుమార్ తెలిపారు. కారు బోల్తామల్యాల(చొప్పదండి): మల్యాల మండలం రాంపూర్ గ్రామశివారులో గురువారం కారు బోల్తా పడిండి. రాంపూర్కు చెందిన బత్తుల రమేశ్తో పాటు మరో ముగ్గురు మహిళలు కాసారం వెళ్లి, రాంపూర్కు తిరిగి వస్తుండగా.. వడ్డెర కాలనీ సమీపంలో కారు అదుపు తప్పి బోల్తా పడింది. కారు దెబ్బతినగా, అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదు. యువకుడిపై దాడి.. నలుగురిపై కేసుఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): కల్లు చోరీకి వచ్చాడన్న అనుమానంతో ఓ యువకుడి పై స్థానిక గౌడ కులస్తులు దాడి చేసిన ఘటన ఎల్లారెడ్డిపేట మండలం సింగా రంలో చోటుచేసుకుంది. ఎస్సై రమాకాంత్ వివరాల ప్రకారం.. సింగారానికి చెందిన వాసరి భరత్కుమార్(26)కు పుట్టుకతోనే కంటిచూపు సరిగా కనిపించదు. ఈ నెల 8న రాత్రి 11.30 గంటలకు కల్లు డిపో వద్ద ఉండగా.. గౌడ కులస్తులు ముస్లిం కిష్టయ్య, గుడిసె నాగరాజు, జాగిరి సంతోష్, గనగోని శ్రీనివాస్ కల్లు దొంగతనానికి వచ్చాడేమోనన్న అనుమానంతో అతన్ని తాడుతో కట్టేసి, కర్రలతో తీవ్రంగా కొట్టారు. బాధితుడి తల్లి లత ఫిర్యాదు మేరకు ఆ నలుగురిపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు
కరీంనగర్క్రైం: వ్యవసాయ భూమి హద్దుల విషయ ంలో చెలరేగిన వివాదంలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన తండ్రి,కొడుకులు బోనగిరి ఓదేలు(60), బోనగిరి జంపయ్య(32)కు జీవితఖైదుతో పా టు రూ.2,500 చొప్పున జరిమానా విధిస్తూ కరీంనగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ గురువారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకా రం.. శంకరపట్నం మండలం మెట్పల్లి గ్రామానికి చెందిన రాచమల్ల రామలింగు, రాచమల్ల సంపత్ తండ్రీకొడుకులు. ఈరికి గ్రామశివారులో ఐదెకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉంది. వీరి భూ మి పక్కనే శంకరపట్నం మండలం కేశవపట్నానికి చెందిన బోనగిరి జంపయ్య, ఓదేలు వ్యవసాయ భూమి ఉంది. వీరి ఇరువురి మధ్య హద్దుల విషయ ంలో గొడవలు జరుగుతున్నాయి. 2020 డిసెంబర్ 10న ఉదయం 11గంటల ప్రాంతంలో రాచమల్ల సంపత్(40) తన వ్యవసాయ భూమి వద్ద ఒంటరి గా ఉండగా జంపయ్య, ఓదేలు గొడ్డలి, రాడ్డు, కర్రలతో దాడి చేయగా.. సంపత్ అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి భార్య రజిత ఇచ్చిన ఫిర్యాదుతో శంకరపట్నం పోలీసులు జంపయ్య, ఓదేలుపై కే సు నమోదు చేశారు. అప్పటి సీఐ ఈ.కిరణ్ దర్యా ప్తు చేశారు. ఈ కేసులో సాక్ష్యులను అడిషనల్ పబ్లి క్ ప్రాసిక్యూటర్ జూలూరు శ్రీరాములు విచారించా రు. సాక్ష్యాధారాలు పరిశీలించిన జడ్జి ప్రతిమ నేరస్తులకు జీవితఖైదు, జరిమానా విధించారు. -
ముదిరాజ్ల అభివృద్ధికి కృషి
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ముదిరాజ్ల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లతిమ్మాపూర్లో ముదిరాజ్ సంఘం నూతన భవనాన్ని గురువారం ప్రారంభించి, మాట్లాడారు. బీసీ కులాల అభివృద్ధి కోసం 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడతామన్నారు. ఇప్పటివరకు కులగణన సర్వేలో పాల్గొనని వారు ఈ నెల 16 నుంచి 28 వరకు చేపట్టే సర్వేలో పాల్గొనాలని సూచించారు. పంటలను కాపాడుతాం ఎగువ మానేరుకు మల్కపేట రిజర్వాయర్ నుంచి నీటిని వదిలి, ఆయకట్టు పంటలను కాపాడుతామని ప్రభుత్వ శ్రీనివాస్ హామీ ఇచ్చారు. నాగంపేటలో రూ.8 కోట్లతో పంపుసెట్లను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. కాల్వల్లో మట్టి తొలగింపు పనులు ముమ్మరంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, ఏఎంసీ చైర్మన్ సాబేర బేగం, మత్స్యకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు చొప్పరి రామచంద్రం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, పార్టీ మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
కోరుట్ల బస్టాండ్లో చోరీ
కోరుట్ల: కోరుట్ల ఆర్టీసి బస్టాండ్లో గురువారం వెలిచాల రుచిత బ్యాగులోని పర్సును గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. బాదితురాలి కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన రుచిత మూడు రోజుల క్రితం కథలాపూర్ మండలం తాండ్రియాల గ్రామామైన తన తల్లి గారింటికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఆదిలాబాద్ వెళ్లేందుకు కోరుట్ల బస్లాండ్లో దిగింది. మళ్లీ వెరే బస్సు ఎక్కి తన బ్యాగును చూడగా బ్యాగులో ఉన్న పర్సు కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. బస్సు ఎక్కే క్రమంలో రద్దీ ఉండటంతో తన బ్యాగులో ఉన్న పర్సును ఎవరో దొంగిలించారని, అందులో నాలుగు తులాల బంగారం, రూ.700 ఉన్నట్లు తెలిపింది. బస్టాండ్లోని సీసీ కెమెరా ఫుటేజ్లను సీఐ సురేశ్బాబు, ఎస్సై శ్రీకాంత్లు పరిశీలించగా ఇద్దరు మహిళలు దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ● నాలుగు తులాల బంగారం, నగదు అపహరణ -
ప్రేమ, పెళ్లి
స్థిరపడ్డాకే..● అమ్మానాన్న అభిప్రాయానికి విలువ ఇవ్వాలి ● ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ డిబెట్లో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థినులుసిరిసిల్ల కల్చరల్: ప్రేమ ఒక అనిర్వచనీయమైన భావన. చెప్పలేని అనుభూతి. చివరి మజిలీ అంటూ లేని ప్రయాణం. ఎన్ని కష్టాలు వచ్చినా ఆగిపోయేది కాదు. కాలం మారే కొద్దీ పెరిగే ఫీలింగ్. శుక్రవారం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ సిరిసిల్లలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థినులతో గురువారం డిబేట్ నిర్వహించింది. ఈ సందర్భంగా తాము పరిణతి చెంది, జీవితంలో స్థిరపడ్డాకే ప్రేమ, పెళ్లి గురించి ఆలోచిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అనురాధ, లెక్చరర్లు పాల్గొన్నారు. -
సాగు నీరు విడుదల
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్ నుంచి 9వ ప్యాకేజీ ద్వారా పంట పొలాలకు నీటిని విడుదల చేశారు. ‘జల‘వెల.. విలవిల’ శీర్షికన సాక్షిలో గురువారం ప్రచురితమైన కథనానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించి, నీరు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో, ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్టతండా శివారులోని మైసమ్మ చెరువును నింపుతున్నారు. ఈ చెరువు తూము ద్వారా రాచర్లతిమ్మాపూర్, బాకూర్పల్లితండా, రాచర్లగొల్లపల్లి, దేవునిగుట్టతండా, అల్మాస్పూర్, అక్కపల్లి, బుగ్గరాజేశ్వరతండా గ్రామాల పరిధిలోని ఆయకట్టు భూములకు సాగు నీరందించనున్నారు. రెండు రోజుల్లోనే పంట పొలాలకు పూర్తిస్థాయిలో నీరు చేరనుండటంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేటితో ముగియనున్న ‘సహకార’ పదవీకాలంసిరిసిల్ల: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గ పదవీకాలం నేటితో ముగియనుంది. అయితే, పదవీ కాలం పొడిగిస్తారా.. పర్సన్ ఇన్చార్జిలను నియమిస్తారా.. అనే అంశంపై స్పష్టం లేదు. జిల్లాలోని మొత్తం 24 సంఘాల్లో 74,728 మంది సభ్యులుండగా.. 35,776 మందికి ఓటు హక్కు ఉంది. ఒక్కో సహకార సంఘంలో 13 డైరెక్టర్ స్థానాలున్నాయి. ఎన్నికలు నిర్వహిస్తారా.. పర్సన్ ఇన్చార్జిలను నియమిస్తారా అనే విషయమై అధికారిక సమాచారం లేదని జిల్లా సహకార అధికారి రామకృష్ణ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ముందుకెళ్తామని పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనలపై అవగాహన ఉండాలి● డీపీవో, నోడల్ అధికారి శేషాద్రి సిరిసిల్ల: సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల బాధ్యతలను పారదర్శకంగా నిర్వర్తించాలని డీపీవో, నోడల్ అధికారి శేషాద్రి సూచించారు. కలెక్టరేట్లో గురువారం ఎన్నికల రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల నిబంధనల స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే పొరపాట్లకు ఆస్కారం ఉండదన్నారు. ఏ సందేహాలున్నా అధికారులను అడిగి నివృత్తి చేసుకోవాలని చెప్పారు. నామినేషన్ల స్వీకరణకు అనువుగా ఉండే పంచాయతీ కార్యాలయాన్ని ముందుగానే ఎంపిక చేసుకొని, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ పక్రియలను చేపట్టాలన్నారు. అభ్యర్థులు ఎన్ని సెట్ల నామినేషన్లు సమర్పించినా అన్నింటినీ పరిశీలించాలని పేర్కొన్నారు. ఆర్వోలు 194, మంది ఏఆర్వోలు 75 మంది హాజరయ్యారు. డీఎల్పీవో నరేశ్, మాస్టర్ ట్రైనర్ మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్పై బురదజల్లడం మానుకోవాలి ● మాజీ ఎంపీ వినోద్కుమార్సిరిసిల్లటౌన్: మాజీ సీఎం కేసీఆర్పై బురదజల్లడం మానుకొని, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి కాళేశ్వరం నీరందించే పనిలో పని లో ఉండాలని సీఎం రేవంత్రెడ్డికి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ హితవు పలి కారు. గురువారం సాయంత్రం సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరు ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డలో చిన్న లోపం తలెత్తితే రిపేర్ చేయించకుండా కేసీఆర్ను బద్నాం చేయడాన్ని ప్రజలు విమర్శిస్తున్నారని అన్నారు. ప్రాజెక్టులోకి వస్తున్న నీటిని సముద్రం పాలు చేయకుండా ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టులో లోపం వస్తే రూ.5 వేల కోట్లతో పునఃనిర్మాణం చేస్తున్నారని, వారిలాగే ఇక్కడి ప్రభుత్వం బాధ్యతగా మెదలాలని సూచించారు. రైతులకు యూరియా అందుబాటులో లేదని, వెంటనే ఇవ్వాలని కోరారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు చక్రపాణి, నాయకులు రామ్మోహన్, రాఘవరెడ్డి, మల్లారెడ్డి తదితరులున్నారు. -
నమ్మకం ఉండాలి
ప్రేమ, పెళ్లి మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనవి. కాబట్టి, ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. అంతకంటే ముందు పేరెంట్స్కి ప్రాధాన్యత ఇవ్వాలి. వాళ్ల నిర్ణయాలు, ఆలోచనలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. – తేజస్విని తేడా తెలియాలి ప్రేమకు, ఆకర్షణకు మధ్య తేడా తెలియాలి. తెలుసుకోకుండా కాస్త ఆదరణ, ఆప్యాయత చూపించేసరికి ప్రేమగా భావించి, మోసపోవొద్దు. ఎవరి ట్రాప్లోనూ పడకుండా నియంత్రించుకోగలిగే శక్తి ఉండాలి. – అనుప్రియ -
వేధింపులకు గురిచేస్తే చర్యలు
కరీంనగర్క్రైం: యువకులు మహిళలను, యువతులను వేధింపులకు గురిచేస్తే చట్టపరంగా చర్యలు తప్పవు. ఇబ్బందులకు గురైనవారు షీటీంనంబర్ 8712670759 లేదా డయల్ 100కు సమాచారం ఇస్తే నిమిషాల వ్యవధిలోనే మీ ముందు ఉంటాం. కరీంనగర్ షీటీంకు నెలకు 25 నుంచి 30 ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రెండు ఎఫ్ఐఆర్లు కాగా, గతేడాది 40 ఎఫ్ఐఆర్లు నమోదు చేశాం. ఫిర్యాదు వచ్చిన వెంటనే నిందితుడిని పిలిపించి బాధితులు కోరుకుంటే సంబంధిత పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేస్తున్నాం. ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ ఇస్తున్నాం. – శ్రీలత, ఉమెన్ టౌన్ సీఐ, షీటీం ఇన్చార్జి, కరీంనగర్ప్రేమ.. రెండక్షరాలు.. రెండు హృదయాల కలయిక.. ఇద్దరి జీవితాల్లో వెలుగుల దీపిక. మనసులు కలిశాక.. ఎన్ని కష్టాలొచ్చినా.. తోడునీడగా ఉండి, జీవితాంతం కలిసి నడిస్తేనే అసలైన ప్రేమ. అలాంటి ప్రేమకు ఎందరో అక్షరరూపంగా నిలిచారు. ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. పదేళ్ల క్రితం ప్రేమంటే అద్భుతం.. అదో ఆనందం.. ప్రేమించి, పెళ్లి చేసుకుంటే ఆశ్చర్యం. కానీ, కాలం మారుతుంటే అందులో అర్థం మారుతోంది. ప్రస్తుతం.. ప్రేమంటే అంత టైం లేదంటున్నారు యువత. చదువు, కెరియర్ ఫస్ట్ అని, ఆ తర్వాతే ప్రేమైనా.. పెళ్లయినా అని చెప్పుకొస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొన్ని గ్రామాలు ప్రేమ వివాహాలకు కేరాఫ్గా నిలుస్తుండగా.. పలువురు లవ్ మ్యారేజ్ చేసుకొని, కుటుంబాలతో ఆనందంగా గడుపుతున్నారు. నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా అలాంటి వారిపై ప్రత్యేక కథనాలు.● ప్రేమించి, పెళ్లి చేసుకుని ఆదర్శంగా నిలుస్తున్న జంటలు ● ప్రేమ వివాహాలకు కేరాఫ్గా నిలుస్తున్న కొన్ని గ్రామాలు ● ముందు కెరియర్.. తర్వాతే ప్రేమ.. పెళ్లి అంటున్న నేటి యువత ● నేడు ప్రేమికుల దినోత్సవంపెద్దలను ఒప్పించాలి పేరెంట్స్ను గౌరవించే సంస్కారం లేని వాళ్లు పార్ట్నర్ను గౌరవిస్తారనే గ్యా రంటీ లేదు. కాబట్టి, ప్రేమ అనివార్యమైనప్పుడు పెద్దలను ఒప్పించేంత స్వచ్ఛత దానికి ఉండాలి. అలాంటి ప్రేమే నిలబడుతుంది. – కార్లెన్ప్రశ్న: బర్డ్ ఫ్లూ అంటే ఏమిటి? జవాబు: బర్డ్ ఫ్లూ హైపోజెనిక్ ఏవియర్ ఇన్ఫ్లూయెంజా అనే వైరస్ ద్వారా సోకుతుంది. ఇది సాధారణంగా కోళ్లలో కనిపిస్తుంది. ఒక కోడికి వ్యాధి సోకితే మిగతా వాటికి వచ్చే ప్రమాదం ఉంది. అందుకే కోళ్లఫారాల్లో కోళ్లు ఒకేసారి పెద్ద సంఖ్యలో చనిపోతుంటాయి. ఈ వైరస్ ఇప్పటివరకు మన జిల్లాలో విస్తరించలేదు. ప్రశ్న: తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? జవాబు: కోళ్ల ఫారాలకు ఇతరులను రానీయొద్దు. యజమానులు సైతం మాస్కులు ధరించి వెళ్లాలి. కోళ్లను తెచ్చే, తీసుకుపోయే వాహనాలు, కోడిగుడ్ల వాహనాలను పూర్తిగా శానిటేషన్ చేశాకే లోపలికి అనుమతించాలి. కోళ్లు ఉండే ప్రదేశాలను సైతం తరచూ శానిటేషన్ చేస్తుండాలి. చనిపోతే పడేయకుండా గోతి తవ్వి పూడ్చాలి. లేదంటే దహనం చేయాలి. ప్రశ్న: వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయి? జవాబు: బర్డ్ ఫ్లూ సోకిన కోళ్ల తల వాపుగా ఉంటుంది. ముక్కులో నుంచి ద్రవాలు కారుతుంటాయి. కోళ్లు శ్వాస తీసుకునేందుకు చాలా ఇబ్బంది పడుతాయి. తీవ్ర ఉష్ణోగ్రతతో ఉంటాయి. ఆహారం తీసుకోవడం మానేస్తాయి. ప్రశ్న: మనుషులకు సోకే అవకాశం ఉందా? జవాబు: ఇప్పటివరకు బర్డ్ ఫ్లూ మూలంగా మనుషులు చనిపోయిన దాఖలాలు లేవు. కానీ, జాగ్రత్తగా ఉండాలి. హాఫ్ బాయిల్డ్ ఎగ్స్, చికెన్ తినకూడదు. ప్రశ్న: మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?జవాబు: జిల్లా వ్యాప్తంగా 13 మండలాల్లో ర్యాపిడ్ రియాక్షన్ టీమ్స్ ఏర్పాటు చేశాం. వీటిలో ఒక వెటర్నరీ డాక్టర్, ఒకరు పారా వెటర్నరీ సిబ్బంది ఉంటారు. జిల్లాలో 14.50 లక్షల కోళ్ల కెపాసిటీ ఉన్న 126 పౌల్ట్రిఫామ్స్ ఉన్నాయి. సంబంధిత యజమానుల ఫోన్ నంబర్లు తీసుకొని, ఎప్పటికప్పుడు వారిని చైతన్యపరుస్తాం. ఎటువంటి పరిస్థితులొచ్చినా ఎదుర్కోడానికి మా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది. న్యూస్రీల్ -
జీవితాన్ని పాడు చేసుకోవద్దు
ప్రేమ, పెళ్లి అంశాలపై నిర్ణయం తీసుకునే ముందు మనం జీవితంలో స్థిరపడ్డామా లేదా అనేది ఆలోచించుకోవాలి. టీనేజ్లో పరిపక్వత లేని నిర్ణయాలతో ముందుకెళ్లి, విలువైన జీవితాన్ని పాడు చేసుకోవద్దు. – ముస్కాన్ ప్రేమ సిమ్కార్డులా మారింది ఈ కాలం ప్రేమ సిమ్కార్డులా మారి, వాడి, వదిలేసే పరిస్థితికి వచ్చింది. అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూసి, పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లకు భద్రత, బాధ్యత ఎక్కువ. అందుకే అరేంజ్డ్ మ్యారేజ్ బెటర్. – ఎన్.శ్రీహారిక ఆత్మగౌరవం పోగొట్టుకోవద్దు ముందు ఆడపిల్లగా సమాజంలో మన సామర్థ్యాన్ని నిరూపించుకోవాలి. ఆత్మగౌరవం పోగొట్టుకోవద్దు. ప్రేమ ప్రస్తావన వస్తే అమ్మానాన్న గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాలి. పరస్పర గౌరవం ముఖ్యం. – రాజేశ్వరి -
భక్తులకు సౌకర్యాలు కల్పించండి
● ఎస్పీ అఖిల్ మహాజన్ ● వేములవాడలో మహాశివరాత్రి జాతర ఏర్పాట్లు పరిశీలనవేములవాడ: గత మహాశివరాత్రి జాతర అనుభవాలను దృష్టిలో పెట్టుకొని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, సీఐలు వీరప్రసాద్, శ్రీనివాస్, ఆలయ ఈవో వినోద్రెడ్డి, ఈఈ రాజేశ్ తదితరులతో కలిసి గురువారం ఆలయంతోపాటు పరిసరాలు, పార్కింగ్ స్థలం, క్యూలైన్లు, ధర్మగుండం, కల్యాణకట్ట, భక్తులు విడిది చేసే ప్రాంతాల్లో కలియతిరిగారు. ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్న మహాశివరాత్రి జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈసారి భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నందున, వాహనాల పార్కింగ్ స్థలాల సంఖ్య పెంచాలని చెప్పారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ట్రాఫిక్ డ్రైవర్షన్ల వద్ద సూచిక బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రధాన ఆలయం, అనుబంధ దేవాలయాలు, పార్కింగ్ ప్రదేశాలు, శివార్చన స్థలం, ట్రాఫిక్ జంక్షన్ల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి, సీసీ కెమెరాలు బిగించాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ అన్వేశ్, ఆలయ డీఈ మహిపాల్రెడ్డి, ఏఈవో శ్రవణ్కుమార్, ఏఈ రాంకిషన్రావు, ఎస్సైలు ప్రేమానందం, రాజు తదితరులు పాల్గొన్నారు. -
ప్రేమనగర్.. మరిమడ్ల
కోనరావుపేట(వేములవాడ)/ఇల్లంతకుంట: ప్రేమ పెళ్లిళ్లకు నిలయంగా నిలుస్తోంది కోనరావుపేట మండలం మరిమడ్ల. ఈ గ్రామంలో 30కి పైగా జంటలు కులాంతర వివాహాలు చేసుకున్నాయి. ఊరి జనాభా నాలుగు వేలు ఉండగా.. దశాబ్దకాలంగా పదుల సంఖ్యలో జంటలు ఒక్కటయ్యాయి. కట్నాలు లేకుండా ఆదర్శ పెళ్లిళ్లు సైతం చేసుకున్నారు. ప్రభుత్వం జరిపించే కల్యాణ మస్తు సామూహిక వివాహ వేదికలో నిజామాబాద్ జిల్లాకు చెందిన రవికుమార్తో ముంబయికి చెందిన రజిత వివాహాన్ని మరిమడ్లవాసులు దగ్గరుండి జరిపించారు. జింక నరేందర్ అనే యువకుడు ముంబయికి చెందిన మరో సామాజికవర్గానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడు. అమ్మాయిని మరిమడ్లకు తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని వెల్జిపూర్లో 1,620 జనాభా ఉంటుంది. గ్రామంలో 17 మంది యువతీ యువకులు ప్రేమపెళ్లిళ్లు చేసుకున్నారు. -
బర్డ్ ఫ్లూపై అలర్ట్ అయ్యాం
● పౌల్ట్రీ యజమానులకు సూచనలిస్తున్నాం ● జిల్లా పశువైద్యాధికారి రవీందర్రెడ్డిసిరిసిల్లటౌన్: బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తిపై జిల్లా పశుసంవర్థక శాఖ అలర్ట్ అయ్యిందని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ రవీందర్రెడ్డి తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని మండలాల్లో వెటర్నరీ అధికారులు కోళ్ల ఫారాలను సందర్శిస్తూ.. యజమానుకుల సూచనలు ఇస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు బర్డ్ ఫ్లూతో మనుషులకు ఎలాంటి హాని జరగలేదన్న ఆయన వైరస్ విస్తృతి, నివారణ అంశాలను గురువారం ‘సాక్షి’ ఇంటర్వ్యూలో వెల్లడించారు. -
ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్ల ఉపసంహరణ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు వేసిన 13 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఇందులో 12 మంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులు కాగా ఒకరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కావడం గమనార్హం. తాజా ఉపసహంరణలు పోగా.. గ్రాడ్యుయేట్స్ ఎన్నికల పోటీలో 56 మంది అభ్యర్థులు మిగిలారు. ఇక టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకరు ఉపసంహరించుకోగా.. 15 మంది బరిలో నిలిచారు. విత్డ్రా చేసుకున్న గ్రాడ్యుయేట్స్ అభ్యర్థులు గవ్వల లక్ష్మి, ఎడ్ల సాయి కృష్ణప్రియ, కావూరి సత్యనారాయణగౌడ్, ఆలగొండ కృష్ణహరి, నాలకంటి యాదగిరి, బడే నరసయ్య, లింగాల శ్రీనివాస్, రేకల సైదులు, మదనం గంగాధర్, లింగం కృష్ణ, సోమగాని నరేందర్, దార మనోహర్ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులు గవ్వల శ్రీకాంత్ పెండింగ్ వేతనాలివ్వాలిసిరిసిల్లటౌన్: జిల్లాలోని గ్రామ పంచాయతీ కార్మి కుల వేతనాలు గత జూలై నుంచి నవంబర్ వరకు పెండింగ్లో ఉన్నాయని, వెంటనే చెల్లించాలని సీఐ టీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు సుధాకర్ డిమా ండ్ చేశారు. గురువారం కలెక్టరేట్ ఎదుట కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పెండింగ్ వేతనాలు విడుదల చేసినా జిల్లాకు చెందినవారికి ఇవ్వ డం లేదని ఆరోపించారు. కలెక్టర్ ఆఫీసులో వినతి పత్రం అందించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ, జీపీ కార్మికుల యూనియన్ జిల్లా అధ్యక్షుడు నర్సయ్య, నాయకులు పాల్గొన్నారు. -
ఇష్టపడ్డాం.. కష్టపడ్డాం
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం కనగర్తి గ్రామానికి చెందిన పర్లపల్లి శ్రీనివాస్, స్రవంతి దంపతులు వీరు. జమ్మికుంటలోని ప్రయివేటు జూనియర్ కళాశాలలో 2008లో ఇంటర్ చదివే రోజుల్లో ప్రేమలో పడ్డారు. ఐదేళ్ల తర్వాత స్నేహితుల సహకారంతో 2012లో ప్రేమపెళ్లి చేసుకొని ఒకటయ్యారు. కులాలు వేరు కావడంతో పెళ్లికి అమ్మాయి కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. ఇందుకోసం చాలా కష్టపడ్డారు. అయినా ఇద్దరూ అన్యోన్యంగా జీవిస్తున్నారు. శ్రీనివాస్ ప్రస్తుతం కారు నడుపుకుంటూ కుటంబాన్ని పోషిస్తున్నాడు. స్రవంతి గృహిణి. వీరికి ఒక కుమార్తె ఉంది. ‘మా జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా.. ప్రస్తుతం మా పాపతో ప్రయాణం గర్వంగా కొనసాగుతోంది’ అని శ్రీనివాస్ చెప్పుకొచ్చాడు. -
కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలి
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్రెడ్డిని గెలిపించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. వేములవాడలోని ఓ బంకెట్ హా ల్లో గురువారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో పదేళ్లలో చేయలేని అభివృద్ధిని ఏడాదిలో చేశామని తెలిపారు. డీఎస్సీ వేశామని, ఇప్పటివరకు 55 వేల ఉద్యోగాలిచ్చామని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలను రాబోయే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సెమీఫైనల్గా భావించి, పని చేయాలని సూచించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతీరోజు 18 గంటలు కష్టపడి పనిచేస్తూ రాష్ట్రాన్ని గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ఏఎంసీ చైర్మన్ రాజు, జిల్లా గ్రంథాయల సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, నాయకులు పాల్గొన్నారు. -
పెద్దలను ఒప్పించి..
కోల్సిటీ(రామగుండం): గోదావరిఖనికి చెందిన గొడిశల శారద– నరేశ్ పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. శారదను ఉన్నత విద్యనభ్యసిస్తున్న సమయంలో నరేశ్ ప్రేమించాడు. తొలత వీరిప్రేమను ఇరుకుటుంబాలు వ్యతిరేకించాయి. వారి కుటుంబాలను ఈ ప్రేమికులు ఒప్పించి 2013లో ప్రేమ వివాహం చేసుకున్నారు. నరేశ్ ఎంబీఏ చదవగా, శారద డిగ్రీ పూర్తి చేసింది. వీరి ప్రేమకు గుర్తుగా మొదటిసారి కూతురు అక్షితరాయ్ జన్మించగా, ఆ తర్వాత కుమారుడు అమోగ్, కూతురు ఆరూహ్య అనే ఇద్దరు కవలలు పుట్టారు. నరేశ్ విద్యార్థి ఉద్యమాలతోపాటు, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సైతం విస్తృత స్థాయిలో పాల్గొన్నారు. 2016లో సింగరేణిలో ఉద్యోగం పొందిన నరేశ్, ప్రస్తుతం జీడీకే 11వ ఇంక్లై న్ గనిలో పని చేస్తూనే, ఏఐటీయూసీ యూనియన్ అసిస్టెంట్ పిట్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నాడు. -
ఏమిటంటే!
ప్రేమంటే..పెద్దల అంగీకారంతో... ఇల్లందకుంట: కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన జవ్వాజి అనిల్– కల్యాణి దంపతులు వీరు జమ్మికుంట ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాలలో చదువుతున్న కాలంలో 2012లో ఇరువురు ప్రేమలో పడ్డారు. పెద్దలను ఒప్పంచి 2018లో వివాహం చేసుకున్నారు. అనిల్ వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ‘మా వైవాహిక జీవితం అన్యోన్యంగా సాగుతోంది. ప్రేమపెళ్లి అందంగా ఉంటుంది. ఒకరికి ఒకరు తెలిసిన తర్వాత వివాహం చేసుకుంటే ఆ బంధం బలంగా ఉంటుంది. ఏమైనా సమస్యలు తలెత్తినా అర్థంచేసుకుని సర్దుకుంటారు. ప్రేమించిన వారిని పెళ్లి చేసుకుంటే జీవితం సంతోషంగా ఉంటుంది’. అని అనిల్ చెప్పుకొచ్చాడు. -
రాచపుండు సలుపుతోంది..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాచపుండు(క్యాన్సర్) ప్రాణాలను కబళిస్తోంది. వ్యాధి గురించి తెలుసుకునేలోపే ప్రాణాలు హరించుకుపోతున్నాయి. జిల్లాలో ఇటీవల క్యాన్సర్ రోగుల సంఖ్య భారీగా పెరిగిపోవడం ఆందోళనకు గురిచేస్తుంది. అసలు క్యాన్సర్కు కారణాలు తెలియక ప్రజలు భయపడుతున్నారు. ప్రధానంగా ఈ వ్యాధి మహిళలో ఎక్కువ వస్తోంది. రాజన్నసిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అధికారుల లెక్కల ప్రకారం 160 మంది రోగులు ఉంటే.. క్షేత్రస్థాయిలో వాస్తవంగా బాధితులు వెయ్యికి పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ 160 మంది రోగుల్లో 120 మందికి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే వైద్యం అందుతోంది. మిగతా వారు ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో విస్తరిస్తున్న క్యాన్సర్ వ్యాధిపై ‘సాక్షి’ ఫోకస్. నారాయణపూర్, లింగన్నపేటల్లోనే అత్యధికం జిల్లా వ్యాప్తంగా అధికారుల లెక్కల ప్రకారం 160 మంది రోగులు ఉంటే నారాయణపూర్ గ్రామంలో 10కి పైగా, లింగన్నపేటల్లో 67 మందికి పైగా బాధితులు ఉన్నారు. అయితే ఈ సంఖ్య వాస్తవంగా మూడింతలకు పైగానే బాధితులు ఉన్నట్లు గ్రామస్తుల ద్వారా తెలిసింది. ఇటీవల ఆయా గ్రామాల్లో వరుస మరణాలు సంభవించడం భయాందోళనకు గురిచేస్తుంది. కారణాలు తెలియక అయోమయం క్యాన్సర్ వ్యాధి రావడానికి గల కారణాలు తెలియక ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. అత్యధిక కేసులు గల గ్రామాలలో కనీసం ఫాస్డ్ఫుడ్ సెంటర్లు కూడా లేవు. ఇప్పటి వరకు క్యాన్సర్లతో మరణించిన వారు సైతం దురలవాట్లు లేని వారే. అయినా మరణిస్తుండడంతో ఆయా గ్రామాల్లో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు జిల్లాలో ఎక్కువగా క్యాన్సర్తో ఇబ్బంది పడుతున్న గ్రామాల్లో పర్యటిస్తే కారణాలు తెలియవచ్చనే భావన గ్రామస్తుల్లో వ్యక్తమవుతుంది. ఎక్కువగా ఇవే.. ● మహిళల్లో ఎక్కువగా బ్రెస్డ్, సర్వైకల్ క్యాన్సర్లు సోకుతున్నాయి. ఈ రెండు రకాల క్యాన్సర్లతో జిల్లాలో 87 మంది బాధపడుతున్నారు. ● నోటిక్యాన్సర్తో 26 మంది ఇబ్బంది పడుతున్నారు. ● ఇతర క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారు 47 మంది ఉన్నారు. గుర్తిస్తే కాపాడవచ్చు ఎలాంటి క్యాన్సర్లను అయినా మొదటి స్టేజీలో గుర్తిస్తే ప్రాణాలు కాపాడవచ్చని వైద్యులు తెలుపుతున్నారు. మన శరీరంలో కొత్తగా మార్పులు వస్తున్నాయంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. మహిళల్లో ఎక్కువగా వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్లను వారే సులభంగా గుర్తించవచ్చంటున్నారు. బ్రెస్ట్లో చిన్న సైజులో గడ్డలు కొత్తగా ఏర్పడితే వెంటనే వైద్యపరీక్షలు చేయించుకోవాలంటున్నారు. అదే సమయంలో ఎక్కువగా దగ్గు రావడం, రక్తం వాంతులు కావడం, తరచూ రక్తహీనతతో బాధపడుతుంటే క్యాన్సర్లకు దారి తీయవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. కబళిస్తున్న క్యాన్సర్ గుర్తించేలోపు మృత్యువాత లింగన్నపేట, నారాయణపూర్లలో అత్యధిక మరణాలు అధికారికంగా రాజన్నసిరిసిల్ల జిల్లాలో 160 మంది బాధితులు అనధికారికంగా వెయ్యికి పైగా కేసులు అవగాహనతోనే నివారించవచ్చంటున్న వైద్యులు ఇది గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామం. ఈ ఊరిలో జిల్లా వైద్యశాఖ అధికారుల లెక్కల ప్రకారం క్యాన్సర్ రోగులు 67 మంది వరకు ఉన్నారు. అసలు క్యాన్సర్ వ్యాధి ఎందుకొస్తుందో తెలియక గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. అధికారుల లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా 160 క్యాన్సర్ కేసులుంటే ఒక్క ఈ గ్రామంలోనే 67 మంది బాధితులు ఉన్నారు. వ్యాధి గురించి తెలుసుకొని, వైద్యులకు చూయించుకునేలోపే తీవ్రమై ప్రాణాలు పోతున్నాయి. వైద్యులకు అన్నీ చెప్పుకోవాలి ఎలాంటి ఆరోగ్య ఇబ్బందులు ఉన్నా వైద్యులకు అన్నీ చెప్పుకుంటేనే సమస్య పరిష్కారమవుతుంది. ఫస్ట్ స్టేజీలో ఉంటే వందశాతం బతికించవచ్చు. రెండో స్టేజీలో ఉన్నప్పుడు గుర్తిస్తే చికిత్సతో 80 శాతం వరకు వ్యాధిని నయం చేసే అవకాశాలు ఉన్నాయి. మూడు, నాలుగు స్టేజీలలో ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా ఉంటుంది. ప్రధానంగా జంక్ఫుడ్కు దూరంగా ఉండాలి. మాడిపోయిన, పాసిపోయిన ఆహారపదార్థాలు అసలే తీసుకోవద్దు. శరీరంలో కొత్తగా ఏదైనా గడ్డలు ఏర్పడితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. మహిళల్లో ఎక్కువగా బ్రె స్ట్, పురుషుల్లో లివర్ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. – డాక్టర్ రామకృష్ణ, క్యాన్సర్ జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ -
మహాజాతర ఏర్పాట్లు పరిశీలన
● ఉత్సవాల సమయంలో ఉద్యోగులకు సెలవులు రద్దువేములవాడ: మహాశివరాత్రి జాతర కోసం చేస్తున్న పనులను ఆలయ ఈవో కొప్పుల వినోద్రెడ్డి, అధికారులు బుధవారం పరిశీలించారు. కోడెల క్యూలైన్, ఉచిత టిఫిన్, భోజనం, లడ్డూ కౌంటర్, సులభ్ కాంప్లెక్స్, పార్కింగ్ ఏరియా, చలువ పందిళ్ల పనులను పర్యవేక్షించారు. భక్తులకు ఇబ్బందులు రాకుండా అన్ని శాఖల సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. మహాశివరాత్రి జాతర మహోత్సవాలు ముగిసే వరకు అత్యవసర పరిస్థితుల్లో మినహా ఆలయ ఉద్యోగులెవరూ సెలవులు పెట్టుకోవద్దంటూ ఈవో ఆదేశాలు జారీ చేశారు. రాజన్న హుండీని ఈనెల 19న లెక్కించనున్నట్లు తెలిపారు. ఈఈ రాజేశ్, డీఈలు రఘునందన్, మైపాల్రెడ్డి, ఏఈ రాంకిషన్రావు, లక్ష్మణ్రావు, ఏఈవో శ్రావణ్, పర్యవేక్షకులు వరి నర్సయ్య, సంజీవరావు పాల్గొన్నారు. -
ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించాలి
● డీఆర్డీవో శేషాద్రి సిరిసిల్ల: ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని డీఆర్డీవో శేషాద్రి కోరారు. జిల్లాలోని ఏపీఎంలు, సీసీలు, సెల్ఫ్హెల్ప్ గ్రూప్ సభ్యులకు బుధవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. డీఆర్డీవో మాట్లాడుతూ మహిళల్లో పోషకాహార లోపాలు లేకుండా మంచి ఆహారం తీసుకునేలా అవగాహన కల్పించా లన్నారు. పెరటితోటల్లో ఆకుకూరలు, కూరగాయలను, కోళ్లను పెంచుకునేలా మహిళలను ప్రోత్సహించాలన్నారు. గర్భిణులు పోషకాహారం తినేలా అంగన్వాడీ కేంద్రాలతో సమన్వయం చేసుకుంటూ.. పౌష్టిహాకారాన్ని అందించాలన్నారు. వెయ్యి రోజుల ప్రణాళికలో భాగంగా గర్భిణులు, బాలింతులు, పసిపిల్లలకు రెండేళ్లు వచ్చే వరకు సమతుల్యమైన ఆహారం అందేలా చూడాలన్నారు. అడిషనల్ డీఆర్డీవో గొట్టె శ్రీనివాస్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు సరిత, డీపీఎంలు పద్మయ్య, సుధారాణి, ఏపీఎంలు చంద్రయ్య, సుదర్శన్, మల్లేశం, లింగంగౌడ్, ఐదు మండలాల సీసీలు పాల్గొన్నారు. -
పులి భయం వీడెదెప్పుడో!
● గుట్టల్లో అధికారుల జల్లెడ ● కనిపించని జాడ ● భయాందోళనలో గ్రామస్తులువేములవాడరూరల్: పులి సంచరిస్తుందన్న ఫారెస్ట్ అధికారుల మాటలు అటవీ చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. అటవీని ఆనుకుని ఉన్న పొలాల వద్దకు వెళ్లేందుకు రైతులు జంకుతున్నారు. గత పది రోజులుగా వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి ఫారెస్ట్ ఏరియాలో పులి తిరుగుతోందని అధికారులు పాదముద్రలు సేకరించే పనిలో పడ్డారు. అయితే ఇప్పటి వరకు పులి జాడ తెలియకపోవడం.. ఎటు వైపు వెళ్లిందో తెలియక అటవీ సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కనిపించని ఆనవాళ్లు.. అయినా వీడని భయం వేములవాడ నియోజకవర్గంలోని నూకలమర్రి, రుద్రంగి, చందుర్తి, కోనరావుపేట, వేములవాడ మండలాల్లో ఎక్కువ అటవీప్రాంతం విస్తరించి ఉంది. ఈ ప్రాంతాల్లో పులి సంచరిస్తుందని అధికారులు చెప్పడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పులి తిరుగుతున్నట్లు చెప్పడంతో గ్రామీణులు ఉపాధిహామీ, వ్యవసాయ పనులకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. పులి రోజుకు కనీసం 30 నుంచి40 కిలోమీటర్లు సంచరిస్తుందని అధికారులు చెబుతున్నారు. అయితే దాని ఆచూకీ దొరక్కపోవడంపై భయాందోళనలు మొదలయ్యాయి.పర్యవేక్షిస్తున్నాం వేములవాడ నియోజకవర్గంలో పులి సంచరిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో అడవిలో నిత్యం సిబ్బందితో పర్యవేక్షిస్తున్నాం. పులి రోజుకు 25 నుంచి 30 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీంతో వేములవాడ నియోజకవర్గంలో ఫారెస్టు ప్రాంతం తక్కువగా ఉండడం, నీరు లేకపోవడం, జంతువులు లభించకపోవడంతో పులి మరో ప్రాంతానికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. – ఖలీలొద్దీన్, ఎఫ్ఆర్వో, వేములవాడ -
కలిసొస్తే పోటీకి సై
● రిజర్వేషన్ల వైపు నేతల చూపు ● ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో ఏది ముందోనని చర్చ ● రెండు ఎన్నికలకు అధికారుల ఏర్పాట్లు ● ఇప్పటికే ఓటర్ల జాబితా వెల్లడిసిరిసిల్ల: పల్లెల్లోని నేతలు ఎన్నికలపై దృష్టి సారించారు. గ్రామ సర్పంచ్, ఎంపీటీసీల సభ్యుల ఎన్నికల్లో ఏది ముందు వచ్చినా బరిలో దిగేందుకు కసరత్తు మొదలుపెట్టారు. రిజర్వేషన్లు కలిసొస్తే ఎలాగైనా గెలవాల్సిందేనని పట్టుదలతో జన, అర్థబలాలు సమీకరించుకుంటున్నారు. సర్పంచుల పదవీకాలం ముగిసి ఏడాది కావస్తుండగా, ఎంపీటీసీలు, జెడ్పీటీల పదవీకాలం ముగిసి ఆరు నెలలు దాటింది. ఇన్నాళ్లు ఏ పదవీ లేకుండా గ్రామాల్లో ఉంటున్న నాయకులు ఎలాగైనా బరిలో దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం బీసీ జనగణన చేపట్టడంతో బీసీల రిజర్వేషన్లు పెరుగుతాయనే ప్రచారం జోరందుకుంది. దీంతో బీసీ నాయకుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో రిజర్వేషన్లపై చర్చసాగుతోంది. అసలు ఏ ఎన్నికలు ముందు గ్రామ సర్పంచ్ ఎన్నికలు ముగిసి ఎక్కువ కాలం కావడం, పార్టీ రహితంగా జరిగే ఈ ఎన్నికలను ముందుగా నిర్వహించాలని నిర్ణయించి పోలింగ్ కేంద్రాల ఎంపిక, వార్డుల విభజన, ఓటర్ల జాబితా వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు బ్యాలెట్ బాక్స్లను సిద్ధం చేసి నోటిఫికేషన్ జారీయే తరువాయి అన్నట్లుగా రంగం సిద్ధమైంది. కానీ ముందుగా మండల పరిషత్, జిల్లా పరిషత్ పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండగా.. పదోతరగతి, ఇంటర్ పరీక్షలు ముంచుకొస్తున్నాయి. ఇలాంటి తరుణంలో స్థానికసంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేది ఇంకా నిర్ధారణ కాలేదు. జిల్లా అధికారులు మాత్రం సవరించిన ఓటర్ల జాబితా వెల్లడించారు. కొత్త రిజర్వేషన్ల.. పాతవేనా? 2019లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కేటాయించిన రిజర్వేషన్లను కొనసాగిస్తారా? మళ్లీ మార్పులు, చేర్పులు చేస్తారా? అనే చర్చ సాగుతోంది. బీసీ కులగణన నేపథ్యంలో రిజర్వేషన్లు ఏమైనా పెరుగుతాయా? అనే సందేహాలు నెలకొన్నాయి. పార్టీ సహితంగా జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సత్తాచాటాలని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు చూస్తున్నాయి. స్థానిక సంస్థల స్వరూపం గ్రామాలు 260వార్డులు 2,268మండలాలు 12జెడ్పీటీసీలు 12ఎంపీపీలు 12ఎంపీటీసీలు 123మండలాల వారీగా ఓటర్లుమండలం పురుషులు మహిళలు థర్డ్ జెండర్ మొత్తం బోయినపల్లి 15,001 16,019 – 31,020 చందుర్తి 13,444 14,651 – 28,095 ఇల్లంతకుంట 19,775 20,977 – 40,752 గంభీరావుపేట 17,889 19,061 01 36,951 కోనరావుపేట 17,174 18,057 – 35,231 ముస్తాబాద్ 18,833 19,984 – 38,817 రుద్రంగి 6,435 7,176 03 13,614 తంగళ్లపల్లి 18,809 19,891 – 38,700 వీర్నపల్లి 5,911 6,063 – 11,974 వేమువాడఅర్బన్ 9,099 9,623 16 18,738 వేములవాడరూరల్ 9,119 9,918 – 19,017 ఎల్లారెడ్డిపేట 19,705 21,182 – 40,887 మొత్తం 1,71,174 1,82,602 20 3,53,796 -
జలవెల..
గురువారం శ్రీ 13 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025చామనపల్లిలో నీళ్లందక ఎండిపోయిన వరికథలాపూర్ మండలం కలిగోట శివారులో అడుగంటిన సూరమ్మ చెరువుకథలాపూర్/రుద్రంగి: జగిత్యాల జిల్లా కథలా పూర్ మండలంలోని చాలా గ్రామాలకు ప్రధాన సాగునీటి వనరు అయిన కలిగోట శివారులోని సూరమ్మ చెరువు అడుగంటిపోయింది. మండలంలోని బొమ్మెన ప్రాజెక్టు, తాండ్య్రాల ఊరచెరువు, దుంపేట గ్రామాల చెరువులకు ఈ చెరువు నీరే ప్రధానం కాగా.. వాటికింద వేసిన పంటలు ఎండిపోతున్నాయి. కలిగోట, అంబారిపేట, పోతారం, తాండ్య్రాల గ్రామాల్లోని బోరుబావుల్లో నీరు కొద్దిగానే వస్తోందని రైతులు తెలిపారు. వచ్చే రెండునెలలు పంటలు కాపాడుకోవడం ఎలా అని ఆందోళన చెందుతున్నారు. ఎల్లంపల్లి ఎత్తిపోతలతో సూరమ్మ చెరువు నింపాలని కోరుతున్నారు.బోరు వేసినా లాభం లేదు నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న వేశాను. బాయిల నీళ్లు లేకపోవడంతో రూ.2లక్షలతో కొత్తగా బోరు వేయించిన. అయినా నీళ్లు అందడంలేదు. ఇప్పటికే నీరు లేకపోవడంతో రెండు ఎకరాల్లో మొక్కజొన్న పంట ఎండిపోగా మిగితా పంటకూడా ఎండిపోయేలా ఉంది. – బోగొండ రాజు, రైతు, చామనపల్లి, కరీంనగర్కరీంనగర్రూరల్: ఈ ఫొటో కరీంనగర్ మండలం చామనపల్లిలోనిది. ఓ వైపు ఎస్సారెస్పీ నీళ్లు అందక, మరోవైపు వ్యవసాయబావుల్లోని నీరు సరిపోక వేసిన వరి ఇలా ఎండిపోతోంది. పెట్టిన పెట్టుబడి అయినా చేతికొస్తుందా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని పలువురు రైతులు మొక్కజొన్న సాగు చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోతోంది. ఎండిపోతున్న పంటలను కాపాడుకునేందుకు కొంతమంది కొత్తగా బోర్లను వేయిస్తుండగా.. మరికొందరు బావుల్లో పూడిక తీయిస్తున్నారు. భూగర్భజలాలు అడుగంటడంతో రైతులు చేస్తున్న చివరి ప్రయత్నాలు ఫలించడంలేదు.సూరమ్మ చెరువు నింపాలి వర్షాలు బాగా కురిశాయని కలిగోట గ్రామంలో ఎక్కువగా వరి సాగు చేసినం. సూరమ్మ చెరువులో నీళ్లు అడుగంటిపోయాయి. మా గ్రామ శివారులోని సగం బోరుబావుల్లో ఇప్పుడు కొద్దిగానే నీళ్లు వస్తున్నాయి. ఇట్లుంటే వరికి నీళ్లందడం కష్టం. పంటలు ఎండిపోయి పెట్టుబడి కూడా రాని పరిస్థితి. సూరమ్మ చెరువు నింపాలి. – గంగం గంగారెడ్డి, రైతు, కలిగోట, కథలాపూర్ఆశల యాసంగి అన్నదాతను ఉసూరుమనిపిస్తోంది. లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి పంటవేస్తే ఆదిలోనే నీటిగోస ఎదురవుతోంది. శివరాత్రికి ముందే ఎండలు దంచికొడుతుండగా.. వాగుల్లో నీరు ఆవిరవుతోంది. ఫిబ్రవరి రెండోవారంలోనే చెరువులు వెలవెలబోతున్నాయి. బోర్లు వట్టిపోయి.. గుంటభూమి కూడా తడవని పరిస్థితి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నెలకొంది. జిల్లాలో వరి, మొక్కజొన్న ఎక్కువగా సాగు చేయగా.. చాలా ప్రాంతాల్లో పీచుపెట్టక ముందే మొక్కజొన్న ఎండిపోతోంది. దీంతో పంట పశువుల పాలవుతోంది. కలుపు దశలో ఉన్న వరికి నీరందకపోవడంతో పంట ఎదుగుదల లోపించింది. భూమి బీటలుబారి పొలాలు ఎండిపోతున్నాయి. ఎస్సారెస్పీ నీరు చివరి ఆయకట్టుకు అందకపోతుండగా.. ఉమ్మడి జిల్లాలోని ప్రధాన జలాశయాల్లో సైతం నీటిమట్టం తగ్గుతోంది. ఫిబ్రవరిలోనే ఇలా ఉంటే.. పంటలు చేతికందుతాయో.. లేదోనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. – వివరాలు 8లోu●విలవిల ముదురుతున్న ఎండలు.. ఎండుతున్న పంటలు అడుగంటుతున్న జలవనరులు..వట్టిపోతున్న బోర్లు ఉమ్మడి జిల్లాలో పశువుల మేతగా పంటలు ఆందోళన చెందుతున్న అన్నదాతలు వేసవికి ముందే ప్రమాద ఘంటికలు -
మందులు అందుబాటులో ఉంచుకోవాలి
● జిల్లా వైద్యాధికారి రజిత ఎల్లారెడ్డిపేట/గంభీరావుపేట(సిరిసిల్ల): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కుక్క, పాముకాటు వ్యాక్సిన్లతోపాటు అన్నిరకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత సూచించారు. ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట పీహెచ్సీలను బుధవారం తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని రికా ర్డులు పరిశీలించారు. వైద్యసిబ్బంది హాజరు రిజిష్టర్ను తనిఖీ చేశారు. వైద్యులు వేణుగోపాల్రెడ్డి, మండల వైద్యాధికారి సారియా అంజుమ్, పీహెచ్ఎన్ రజినీ పాల్గొన్నారు. సభ్యత్వ నమోదులో ముందుండాలి సిరిసిల్లటౌన్: సభ్యత్వ నమోదులో దేశంలోనే తెలంగాణ ముందంజలో నిలిచిందని, ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలో జిల్లాను ముందుంచా లని మహిళా కాంగ్రెస్ జిల్లా ఇన్చార్జి కృష్ణవేణి కోరారు. డీసీసీ ఆఫీసులో బుధవారం జిల్లా మహిళా కాంగ్రెస్ విభాగం సభ్యత్వ నమోదు సమావేశం నిర్వహించారు. మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, ఏఎంసీ చైర్మన్, సిరిసిల్ల టౌన్ అధ్యక్షురాలు వెలు ముల స్వరూప, నాయకులు కోడం అరుణ, మడుపు శ్రీదేవి, గట్టు రుక్మిణి, సత్యలక్ష్మి, హారిక, లహరి, సత్యప్రసన్న పాల్గొన్నారు. ‘బీసీలకు రిజర్వేషన్లపై సిద్ధం’ సిరిసిల్లటౌన్: బీసీ కులగణనతో వెనుకబడినవర్గాల అభ్యున్నతిపై కాంగ్రెస్ సర్కారు చిత్తశుద్ధి చాటిందని ఆ పార్టీ సిరిసిల్ల పట్టణాధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్ పేర్కొన్నారు. ప్రెస్క్లబ్లో బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందని, బీఆర్ఎస్ కూడా ఇదే పద్ధతిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, నాయకులు రాగుల జగన్, బీమారం శ్రీనివాస్, కమలాకర్రావు, నేరెళ్ల శ్రీకాంత్గౌడ్, కిరణ్, రాము పాల్గొన్నారు. కేసీఆర్ పాలనలోనే సుభిక్షం వేములవాడరూరల్: కేసీఆర్ పదేళ్ల పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని, కాంగ్రెస్ ఏడా ది పాలనలో అవస్థలు పడుతున్నారని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు అన్నారు. వేములవాడ రూరల్ మండల ముఖ్యకార్యకర్తల సమావేశం బుధవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరుగ్యారంటీలు అమలు చేయడంలో విఫలమైందన్నారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలని కోరారు. -
నియమావళిని అమలు చేయండి
● అనుమానాలుంటే ఉన్నతాధికారులను సంప్రదించాలి ● మాస్టర్ ట్రెయినర్లు ● ఆర్వో, ఏఆర్వోలకు శిక్షణసిరిసిల్ల: ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఎన్నికల కమిషన్ నియయాలు అమలు చేయాలని మాస్టర్ ట్రెయినర్లు సూచించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల విధుల నిర్వహణపై కలెక్టరేట్లో బుధవారం రిటర్నింగ్ ఆఫీసర్(ఆర్వో), అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ (ఏఆర్వో)లకు శిక్షణ ఇచ్చారు. మాస్టర్ ట్రెయినర్లు మాట్లాడుతూ ఎన్నికల విధులను ఎంతో జాగ్రత్తగా నిర్వర్తించాలని, నియమ, నిబంధనల గురించి స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఉంటుందని స్పష్టం చేశారు. ఎలక్షన్ కమిషన్ హ్యాండ్బుక్ చదువుకోవాలన్నారు. సందేహాలుంటే అధికారులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, పార్టీ గుర్తుల కేటాయింపులు, బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ విధానం, ఓట్ల లెక్కింపు మోడల్ తదితర అంశాలపై 10 మంది మాస్టర్ ట్రెయినర్లు వివరించారు. జెడ్పీ డిప్యూటీ సీఈవో ఎం.గీత, మాస్టర్ ట్రెయినర్ మహేందర్రెడ్డి పాల్గొన్నారు. -
ఆందోళన వద్దు
యూరియా కోసం● సీజన్కు సరిపడా నిల్వలు ఉన్నాయి ● కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు ● ‘సాక్షి’తో జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్బేగంసిరిసిల్ల: జిల్లాలో యాసంగి సీజన్కు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని, యూరియా కొరత లేదని జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్ బేగం అన్నారు. జిల్లావ్యాప్తంగా 13 మండలాల పరిధిలో లక్షా 80వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేశారని, ఈ సీజన్కు సరిపడా ఎరువుల నిల్వలు ఉన్నాయని వివరించారు. ఎవరైనా ఎక్కడైనా యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లాలో అక్కడక్కడ యూరియా కొరత ఉన్నట్లు ప్రచారం జరగుతుండగా.. మంగళవారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. సహకార సంఘాల ద్వారా సరఫరా జిల్లా వ్యాప్తంగా 24 వ్యవసాయ సహకార సంఘాలు ఉండగా.. వాటి ద్వారా క్షేత్రస్థాయిలో యూరియా సరఫరా చేస్తున్నాం. ఇప్పటికే 1,300 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు వచ్చింది. మార్క్ఫెడ్ అధికారులతో కలెక్టర్ సందీప్కుమార్ ఝా మాట్లాడి మరో 400 మెట్రిక్ టన్నుల యూరియా తెప్పించారు. సీజన్ మొత్తానికి 1,800 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా, ఇప్పటికే 1,700 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు వచ్చింది.వరి సాగే ఎక్కువ జిల్లాలో లక్షా 80వేల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేశారు. అందులో ఒక్క వరి పంటనే లక్షా 77వేల ఎకరాల్లో వేశారు. మొక్కజొన్న 1,400 ఎకరాలు, కూరగాయల సాగు 1,500 ఎకరాల్లో ఉంది. మరో వంద ఎకరాల్లో అన్ని పంటలు కలిపి వేశారు. ఈ యాసంగి సీజన్కు 1,800 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అంచనా వేశాం. ఈ మేరకు బఫర్ నిల్వలు అందుబాటులో ఉంచాం.ఆన్లైన్లో రైతుల వివరాలు యూరియా సరఫరాకు సంబంధించి ఆన్లైన్లో రైతుల వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. రైతుకు ఎన్ని ఎకరాల భూమి ఉంటే.. ఎకరానికి రెండు బస్తాల చొప్పున యూరియా అందిస్తున్నాం. ఇలా వివరాలు నమోదు చేసి రైతు వేలి ముద్రను తీసుకుని ఇవ్వడంతో కొంత ఆలస్యమవుతుంది. సహకార సంఘాల్లో ఎక్కువ మంది సిబ్బంది లేక.. యూరియా వచ్చిందని తెలియగానే రైతులు ఒక్కసారిగా ఎక్కువ సంఖ్యలో రావడంతో క్యూ పద్ధతిలో వివరాలు నమోదు చేసి అందరికీ ఇస్తున్నారు. అందుకే కొన్ని ప్రాంతాల్లో యూరియా కోసం క్యూ లైన్ ఉంటున్నట్లు ప్రచారం జరుగుతుందే తప్ప కొరత ఏమీ లేదు.రెండు దఫాలుగా వేయాలి రైతులు ఒకేసారి కాకుండా రెండు దఫాలుగా పంటకు యూరియా వేయాలి. ఎకరానికి రెండు బస్తాలు సరిపోతాయి. కానీ కొందరు మూడు బస్తాలు వేస్తున్నారు. ఇది తప్పు. రెండు విడతల్లో రెండు బస్తాలు వేస్తే సరిపోతుంది. కొందరు రెండు బస్తాలు వేసి ఆదర్శంగా ఉంటున్నారు.కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు యూరియా, పొటాష్ను ఎవరైనా వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. ప్యాక్స్లతో పాటు, ప్రైవేటు డీలర్ల వద్ద ఎరువుల నిల్వలు ఉన్నాయి. వచ్చే సీజన్ కోసం ఎరువులు కొనకుండా.. రైతులు ఈ సీజన్ కోసం మాత్రమే కొనుగోలు చేయాలి. జిల్లాలో రైతుల అవసరాల మేరకు ఎరువులను అందుబాటులో ఉంచుతాం. -
మండలి బరిలో జాతీయ పార్టీలే!
● అకస్మాతుగా తెరమీదికి రెండు నేషనల్ పార్టీలు ● ఏఐఎఫ్బీ నుంచి సింగ్, బీఎస్పీ నుంచి ప్రసన్న హరికృష్ణ ● వీరికి టికెట్ నిరాకరించిన బీఆర్ఎస్ అధిష్టానం ● కేసీఆర్ బొమ్మతో వెళ్లి ఏఐఎఫ్బీ బీఫాం ఇచ్చిన సింగ్ ● ప్రచారంలో దూకుడు పెంచిన నరేందర్రెడ్డి, అంజిరెడ్డి ● టీచర్స్లో జాతీయపార్టీల అభ్యర్థులు ఇద్దరుసాక్షిప్రతినిధి,కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్–ఆదిలాబాద్–మెదక్–నిజామాబాద్ మండలి ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ ముగింపు రోజు నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతం పోటీ చేస్తున్న ప్రధాన పార్టీ అభ్యర్థులంతా జాతీయ పార్టీల తరఫున బరిలోకి దిగుతుండటం గమనార్హం. గ్రాడ్యుయేట్స్ బరిలో నలుగురు అభ్యర్థులు ఉండగా.. టీచర్స్ బరిలో ఇద్దరు పోటీ చేస్తున్నారు. వీరిలో గ్రాడ్యుయేట్స్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ నుంచి అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్రెడ్డి, బీజేపీ నుంచి చిన్నమైల్ అంజిరెడ్డి ముందే బీఫాంలు ఖరారు చేసుకుని ప్రచారం ప్రారంభించారు. కానీ..రవీందర్సింగ్, ప్రసన్నహరికృష్ణలు బీఆర్ఎస్ టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నించి భంగపడ్డారు. నామినేషన్ ఆఖరురోజైన సోమవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎలాగోలా పోటీకి సిద్ధమైన సింగ్ ఏఐఎఫ్బీ నుంచి, హరికృష్ణ బీఎస్పీ తరఫున బీఫాంలు సమర్పించడం చర్చనీయాంశంగా మారింది. ముందుకు వచ్చేందుకే.. చివరి నిమిషం వరకు రవీందర్ సింగ్, ప్రసన్న హరికృష్ణ స్వతంత్రంగా బరిలో ఉంటారన్న ప్రచా రం జరిగింది. అయితే వీరిద్దరూ బీఫాం సమర్పించే వరకు ఇతర పార్టీలో చేరిన విషయం గో ప్యంగా ఉంచారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పదుల సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. స్వతంత్రులు గా ఉంటే ఎక్కడో ఆఖరున పేరుంటుంది. కానీ.. జాతీయ పార్టీ అభ్యర్థులు బ్యాలెట్లో ముందు ఉంటారు. అందుకే.. ఆయాపార్టీల అభ్యర్థులుగా బరిలోకి దిగితే.. తమకు బ్యాలెట్లో ప్రాధాన్యం దక్కుతుందన్న ఆలోచనతో జాతీయ పార్టీల నుంచి బీఫాం పొందినట్లు సమాచారం. సోమవారం రవీందర్సింగ్ తన అనుచరులతో కలిసి కేసీఆర్ చిత్రపటంతో వెళ్లి మరీ నామినేషన్ వేశారు. దీంతో రవీందర్సింగ్ బీఆర్ఎస్లో ఉన్నట్టా? లేనట్లా? అన్న విషయమై పార్టీలో గందరగోళం నెలకొంది. దీనిపై సింగ్ మాట్లాడుతూ.. పార్టీ టికెట్ ఇస్తుందని ఎంతో ఆశపడ్డానన్నారు. ఇప్పటికై నా ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తనకు మద్దతుగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీచర్స్లో ఇద్దరే.. టీచర్స్ ఎమ్మెల్సీ విషయానికి వస్తే.. బీజేపీ నుంచి మల్క కొమురయ్య పోటీ చేస్తుండగా, బీఎస్పీ నుంచి యటకారి సాయన్న బరిలో ఉన్నారు. వీరిద్దరూ ప్రచారం స్పీడ్ పెంచారు. టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో వీరిద్దరే జాతీయ పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండటం గమనార్హం. ఇక ఎస్టీయూ, టీపీఆర్టీయూ బలపరిచిన సిట్టింగ్ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, యూటీఎఫ్, ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు, టీపీటీఎఫ్ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి వై.అశోక్ కుమార్ కూడా ప్రచారం ముమ్మరం చేశారు.దూకుడు పెంచిన నరేందర్రెడ్డి, అంజిరెడ్డి..కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ప్రచారంలో దూకుడు పెంచారు. సోమవారం మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్తోపాటు ఉమ్మడి జిల్లా విప్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేగా పోటీచేసిన అభ్యర్థులంతా మద్దతుతో భారీర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీతో కాంగ్రెస్ నాయకుల్లో కొత్తజోష్ నెలకొంది. ఇదే ఉత్సాహంతో నరేందర్ రెడ్డి ప్రచారం స్పీడ్ పెంచారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. కాలేజీలకు వెళ్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నియామకాలు, నోటిఫికేషన్లు వివరిస్తున్నారు. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న చిన్నమైల్ అంజిరెడ్డి కూడా ప్రచారంపై దృష్టి సారించారు. ఆయన సతీమణి గోదావరి కూడా అంజిరెడ్డి తరఫున ప్రచారం ముమ్మరం చేశారు.కొత్తేమీ కాదు.. ఆఖరునిమిషంలో అసంతృప్తులు ఏఐఎఫ్బీ టికెట్ తెచ్చుకోవడం ఉమ్మడి జిల్లాలో కొత్తేం కాదు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ రెబల్ కోరుకంటి చందర్ రామగుండం ఎమ్మెల్యేగా ఏఐఎఫ్బీపైనే గెలిచిన విషయం తెలిసిందే. ఆ తరువాత పాత జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏఐఎఫ్బీ తన సత్తాచాటింది. అలాగే బీఎస్పీ 2014 ఎన్నికల్లో అసెంబ్లీలో రెండు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది. 2018 ఎన్నికల్లోనూ బీఎస్పీ నుంచి పలువురు సీనియర్ లీడర్లు పోటీ చేశారు. -
ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన ఉండాలి
● సీపీవో, మ్యాన్ పవర్ అండ్ ట్రైనింగ్ నోడల్ అధికారి శ్రీనివాసాచారిసిరిసిల్ల: కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలతో కూడిన ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసన మండలి సభ్యుల ఎన్నికలకు సంబంధించి పోలింగ్ పక్రియపై సంపూర్ణ అవగాహన ఉండాలని జిల్లా ముఖ్యప్రణాళిక అధికారి, మ్యాన్ పవర్ అండ్ ట్రైనింగ్ నోడల్ అధికారి పీబీ శ్రీనివాసాచారి కోరారు. జిల్లా ఎన్ని కల అధికారి, కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆదేశాల మేరకు కలెక్టరేట్లో మంగళవారం ప్రిసైడింగ్, సహా య ప్రిసైడింగ్ అధికారులు, ఓపీవోలకు మొదటి విడత శిక్షణ ఇచ్చారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ పక్రియ కొంత భిన్నంగా ఉంటుందని వివరించారు. 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, గడువులోపు క్యూ లైన్లో ఉన్నవారికి టోకెన్ నంబర్లు అందించి ఓటింగ్ చేయించాలన్నారు. 26న ఉదయం 8 గంటలకు ప్రిసైడింగ్ అధికారులు తమ బృందంతో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు చేరుకోవాలని, పోలింగ్ సామగ్రి, బ్యాలెట్ బాక్సులను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు తీసుకెళ్లేందుకు అనుమతి లేదన్నారు. పోలింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలను మాస్టర్ ట్రైనర్లు పి.మహేందర్రెడ్డి, శ్రీధర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో వివరించారు. జిల్లాలో పీవోలు 42, ఏపీవో 42, ఓపీవో 97, మైక్రో అబ్జర్వర్స్ 17 మందిని కేటా యించగా, కామన్ పోలింగ్ కేంద్రాలు 7, జనరల్ కేంద్రాలు 27 ఏర్పాటు చేయనున్నారు. శిక్షణలో జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం పాల్గొన్నారు. -
పీఎంశ్రీ స్కూళ్లలో పనులు పూర్తి చేయండి
సిరిసిల్ల: జిల్లాలో పీఎంశ్రీ (ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైసింగ్ ఇండియా)పథకంలో ఎంపికై న పాఠశాలల్లో అభివృద్ధి పనులను ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆదేశించా రు. మంగళశారం కలెక్టరేట్లో సమీక్షించారు. జిల్లాలో 16 స్కూల్స్ పీఎంశ్రీలో ఎంపికయ్యాయని, వాటిలో మౌలిక వసతులు ఫర్నిచర్, ఇంటర్నెట్, టచ్ స్క్రీన్, శుద్ధమైన తాగునీరు, కంప్యూటర్లు, సైన్స్ల్యాబ్ పరికరాలు, కిచెన్ గార్డెన్, సోలార్ పవర్ ప్యానెల్స్, సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేసి సన్నద్ధం చేయాలన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. సౌకర్యాలు ఎలా ఉన్నాయి? గంభీరావుపేట(సిరిసిల్ల): మండలంలోని నర్మాల గురుకుల బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ సందీప్కుమార్ ఝా మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యాలయంలో సౌకర్యాలు, మెనూపై ఆరా తీశారు. తరగతి గదులు, కిచెన్, స్టోర్రూమ్లో ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని తెలుసుకున్నారు. పలు సబ్జెక్టుల్లో ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. ప్రిన్సిపాల్ సృజన, ఉపాధ్యాయులు ఉన్నారు. ● కలెక్టర్ సందీప్కుమార్ ఝా -
నామినేషన్ల పరిశీలన పూర్తి
సాక్షిప్రతినిధి,కరీంనగర్: కరీంనగర్–మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు దాఖలైన నామినేషన్ల పరిశీలన ముగిసింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి 100 మంది అభ్యర్థులు 192 నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో వివిధ కారణాల వల్ల 32 మంది నామినేషన్లు తిరస్కరణకు గురికాగా, 68 మంది ఆమోదించారు. టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 17 మంది 38 నామినేషన్లు దాఖలు చేయగా ఒకరి నామినేషన్ రిజెక్ట్ అయింది. ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ అభ్యర్థులు నామినేషన్ల సమర్పించిన సందర్భంలో ఏవైనా లోపాలు ఉంటే గుర్తించి అభ్యర్థులకు షార్ట్ మెమోలు ఇచ్చి సరిచేసుకునేందుకు అవకాశం కల్పించామని అన్నారు. సరైన ఫార్మాట్లో సమర్పించని నామినేషన్లను తిరస్కరించినట్లు వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సంజయ్ రామన్, అడిషనల్ కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్, డీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్, ఏవో నరేందర్, తహసీల్దార్లు, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు సంజయ్ కుమార్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు బెన్హర్ మహేశ్ దూత్ ఎక్క హాజరయ్యారు. అనుమతి లేని భవనం కూల్చివేతవేములవాడరూరల్: వేములవాడ మున్సిపల్ పరిధి కోనాయపల్లిలో అనుమతి లేకుండా అదనంగా నిర్మించిన స్లాబ్ను అధికారులు కూల్చివేశారు. సదరు యజమాని జీప్లస్ టూ అనుమతి తీసుకుని అదనంగా మరో స్లాబ్ నిర్మించారని ఓ వ్యక్తి మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయగా, యజమానికి నోటీసులు జారీ అయ్యాయి. దీంతో అతడు కోర్టును ఆశ్రయించాడు. అక్రమ నిర్మాణం కూల్చివేయాలని కోర్టు తీర్పు చెప్పడంతో మంగళవారం మున్సిపల్, ఫైర్ అధికారులు కూల్చి వేశారు. ఫేక్ కాల్స్పై అప్రమత్తంగా ఉండాలిసిరిసిల్లటౌన్: ట్రేడ్ లైసెన్సు చెల్లించాలంటూ వస్తున్న ఫేక్ కాల్స్పై పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య పేర్కొన్నారు. సిరిసిల్ల మున్సిపల్ ఉద్యోగుల పేరుతో కొందరు ట్రేడ్ లైసెన్స్ల కోసం 81060 26047 నంబర్, ఇతర నంబర్ల నుంచి ఫోన్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. లైసెన్సు తీసుకోవాలని షాప్ యజమానుల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారని, అధికారిక వెబ్సైట్స్, మున్సిపల్ కార్యాలయంలో మాత్రమే ఫీజు చెల్లించాలని కోరారు. ఫేక్ కాల్స్పై పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. సమర్థవంతంగా విధులు నిర్వహించాలిసిరిసిల్ల: ఆశ కార్యకర్తలు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ వైద్య, ఆరోగ్యశాఖ లక్ష్యాలను సాధించాలని డీఎంహెచ్వో డాక్టర్ రజిత అన్నారు. కలెక్టరేట్లో మంగళవారం ఆశ నోడల్ పర్సన్స్తో సమీక్షించారు. సకాలంలో విధులకు హాజరుకావాలని సూచించారు. పోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ అనిత, సీహెచ్వో శాంత, బాలచంద్రం పాల్గొన్నారు. అంతకుముందు పట్టణ ఆరోగ్య కేంద్రం, తంగళ్లపల్లి పీహెచ్సీని తనిఖీ చేశారు. ఆరోగ్య సేవలో జిల్లాను ముందుంచాలని సూచించారు. మిడ్మానేరులో 20 టీఎంసీలు బోయినపల్లి: మిడ్మానేరులో 20.39 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మంగళవారం ఎల్ఎండీకి 2,500, కుడి కాల్వ ద్వారా 300, ఎడమకాలువ ద్వారా 5 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. -
ఆశలు ఆవిరి
సిరిసిల్ల పట్టణంలో విలీనమైన గ్రామాలకు మినహాయింపునిస్తూ మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపింది. ఏడు గ్రామాలు మున్సిపల్ నుంచి విడి పోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం స్పందించి మళ్లీ గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయాలని సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు గతంలో స్పష్టం చేశారు.సిరిసిల్ల పట్టణంలో బలవంతంగా విలీనం చేసిన రగుడు, చంద్రంపేట, ముష్టిపల్లి, చిన్నబోనాల, పెద్ద బోనాల, పెద్దూరు, సర్దాపూర్ గ్రామాలను మున్సిపల్ నుంచి వేరు చేసి గ్రామపంచాయతీలుగా ఉంచేలా కృషి చేస్తానని, ఏడు గ్రామాల ప్రజల ముంగిట ప్రమాణం చేస్తూ 2023 నవంబరు 28న కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి బాండ్ పేపర్ రాసిచ్చారు.సిరిసిల్ల: సిరిసిల్లలో విలీనమైన ఏడు గ్రామాలు, వేములవాడ పరిధిలో ఐదు గ్రామాలను పట్టణాల నుంచి విడదీసి మళ్లీ గ్రామపంచాయతీలను చేయాలనే ప్రతిపాదనలకు మోక్షం లభించలేదు. మరోవైపు ప్రభుత్వం వద్ద ఉన్న విభజన ఫైల్ను పక్కన పెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు మున్సిపాలిటీల నుంచి గ్రామాలను విడదీయాల్సి ఉండగా గ్రామాల విభజనను పక్కన పెట్టినట్లు సమాచారం. మరో వైపు ముందుగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో శివారు పల్లెల ఆశలు ఆవిరయ్యాయి. ఎందుకు విలీనమయ్యాయి సిరిసిల్ల 2016 అక్టోబరులో జిల్లా కేంద్రమైంది. కానీ జనాభా 83వేల వరకు ఉంది. లక్ష జనాభా ఉంటే ద్వితీయ శ్రేణి మున్సిపాలిటీల జాబితాలో చేరుతుంది. ఫలితంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా భారీగా నిధులు సమకూరుతాయి. పట్టణ వైశాల్యం, మున్సిపల్ వార్డులు పెరుగుతాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతుందనే లక్ష్యంతో 2018లో సిరిసిల్ల శివారులోని ఏడు గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేశారు. కోర్టుకెక్కిన పల్లెలు సిరిసిల్లలో విలీనమైన ఏడు గ్రామాల తరుఫున పెద్దూరు, సర్దాపూర్ వాసులు హైకోర్టును ఆశ్రయించారు. అప్పట్లో ఆయా గ్రామాల ప్రజలు విలీనాన్ని వ్యతిరేకించారు. శ్రీపల్లెలను చంపేస్తారా.. పట్టణీకరణ పేరిట పంచాయతీలను పట్టణాల్లో కలిపేస్తారాశ్రీ అంటూ న్యాయస్థానం విలీన పల్లెల పిటిషన్లపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కానీ, చివరికి ప్రభుత్వ వాదనతో ఏకీభవిస్తూ విలీనం జరిగిపోయింది. పదేళ్ల వరకు ఎలాంటి ఆస్తి పన్నులు ఆ పల్లెల్లో పెంచమని, వేగంగా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వం స్పష్టం చేసింది. మున్సిపల్ ఎన్నికలతో పాటు ఆ పల్లెల్లో వార్డు కౌన్సిలర్ ఎన్నికలు జరిగాయి. మున్సిపాల్టీల్లోనే శివారు పల్లెలు గతంలో సిరిసిల్లలో ఏడు, వేములవాడలో ఐదు గ్రామాలు విలీనం విభజన ఫైల్ పక్కన పెట్టిన ప్రభుత్వంఅభివృద్ధి అంతంతే సిరిసిల్లలో విలీనమైన ఏడు గ్రామాల్లో ఐదేళ్లలో అభివృద్ధి పనులు అంతంతే జరిగాయి. పంచాయతీ రికార్డులన్నీ మున్సిపల్కు అప్పగించారు. సిబ్బందిని సైతం మున్సిపల్లో కలిపేశారు. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేసే ఉపాధి వంటి పథకాలు ఆ గ్రామాలకు దూరమయ్యాయి. ఆస్తి తదితర పన్నులు భారీగా పెరిగాయి. ఫలితంగా పట్టణాల్లో చిక్కిన పల్లెలు అభివృద్ధి లేక, పన్నుల భారంతో విలవిల్లాడుతున్నాయి. మున్సిపల్ నుంచి విడదీసి ఏడు గ్రామాలతో సిరిసిల్ల అర్బన్ మండలం ఏర్పాటు చేయాలనే ఆందోళనకు దిగారు. మొత్తంగా విలీన పల్లెల్లో ఒకరకమైన వ్యతిరేకభావం నెలకొంది. వేములవాడ పట్టణంలోనూ తిప్పాపూర్, అయ్యోరుపల్లె, కోనాయపల్లె, శాత్రాజుపల్లె, నాంపల్లి గ్రామాలను బలవంతంగా విలీనం చేశారు. ఆ ఊర్లు కూడా గ్రామాలుగా ఉండాలని కోరుకుంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే విలీన గ్రామాలను వేరు చేసి ఎన్నికలు నిర్వహిస్తారనే ఆశ ఉండేది. కానీ విభజన ఊసే లేకుండా ఎన్నికలకు ఏర్పాట్లు జరగడంతో విలీనమైన పల్లెలకు ఇప్పట్లో మోక్షం లేకుండాపోయింది. -
జాతరకు పటిష్ట ఏర్పాట్లు
సిరిసిల్ల: మహాశివరాత్రి జాతరకు వేములవాడలో పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా సూచించారు. కలెక్టరేట్లో సోమవారం ఎస్పీ అఖిల్మహాజన్, వేములవా డ ఆలయ ఈవో వినోద్రెడ్డిలతో కలిసి జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షించారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝా మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఈనెల 25 నుంచి 27 వరకు జరిగే మహాశివరాత్రి జాతరను విజయవంతం చేయాలని కోరారు. అదనపు సెల్టవర్లు.. 857 బస్సులు సెల్ఫోన్ సిగ్నల్ సమస్యను దృష్టిలో పెట్టుకొని టెలికాం ఆపరేటర్లతో చర్చించి తాత్కాలిక టవ ర్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వివిధ డిపోల నుంచి 857 బస్సులు నడిపించనున్నట్లు తెలిపారు. 20 లక్షల లీటర్ల నీటిని మిషన్ భగీరథ ద్వారా సరఫరా చేయనున్నట్లు ఆ శాఖ అధికారులు వెల్లడించారు. 500 మంది పారి శుధ్య సిబ్బంది అందుబాటులో ఉంటారని వే ములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేశ్ పేర్కొన్నారు. 8 అగ్నిమాపక వాహనాలు, ఇప్పటికే 260 సీసీ కెమెరాలు ఉండగా మరో 180 కెమెరాలు అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలి పారు. 24 మంది గజ ఈతగాళ్లు అందుబాటులో ఉంటారన్నారు. 3 లక్షల లడ్డూలు సిద్ధం చేయనున్నట్లు ఈవో వినోద్రెడ్డి తెలిపారు. గుడిచెరువు ప్రాంతంలో భక్తులకు ఉచితంగా అల్పాహారం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రోడ్లపై గుంతలు పూడ్చండి ● వేములవాడకు వచ్చే అన్ని ప్రధాన రహదారుల్లోని గుంతలను పూడ్చివేయాలని కలెక్టర్ ఆదేశించారు. ● జాతర విధుల నిర్వహణకు వచ్చే సిబ్బందికి, ముఖ్య అతిథులకు వసతిసౌకర్యం కల్పించాలని సూచించారు. భక్తుల కోసం చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. ● తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని, చలివేంద్రాలు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. ● ప్రధాన ఆలయం, తిప్పాపూర్ బస్టాండ్, కోరుట్ల బస్టాండ్, జగిత్యాల రోడ్డు, పార్కింగ్ దగ్గర హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ● వేములవాడ పరిసరాల్లో మద్యం విక్రయాలు నిషేధించాలన్నారు. ● సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఏర్పాట్లు చేయాలన్నారు. పోలీసులకు వసతి కల్పించాలి జిల్లా ఎస్పీ అఖీల్ మహాజన్ మాట్లాడుతూ గతం కంటే ఎక్కువగా పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయాలని, అక్కడ పోలీసుల కోసం టెంట్, తాగునీటి సరఫరా ఉండాలని సూచించారు. అదనపు ఎస్పీ శేషాద్రినిరెడ్డి, ఆర్డీవో రాజేశ్వర్, ఆలయ ఈవో వినోద్రెడ్డి, డీపీవో శేషాద్రి, డీటీవో లక్ష్మణ్, డీడబ్ల్యూవో లక్ష్మీరాజం, జెడ్పీ సీఈవో వినోద్రెడ్డి, డీఎంహెచ్వో ఎస్.రజిత, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమిషనర్లు సమ్మయ్య, అన్వేష్, వేములవాడ టౌన్, రూరల్ సీఐలు వీరప్రసాద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 25 నుంచి 27 వరకు మహాశివరాత్రి జాతర భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జాతర ఏర్పాట్లపై సమీక్షా సమావేశం -
ఆఖరిరోజు అట్టహాసంగా..
● ముగిసిన గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ నామినేషన్లు ● ఒకేరోజు నామినేషన్ వేసిన 59 మంది అభ్యర్థులు ● రెండుస్థానాలకు కలిపి మొత్తం 117 దాఖలు ● ప్రధాన పోటీదారులంతా మిలియనీర్లే ● రూ.120 కోట్లతో ముందంజలో అంజిరెడ్డి ● జనసంద్రమైన కరీంనగర్ వీధులుసాక్షిప్రతినిధి,కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్– మెదక్– ఆదిలాబాద్– నిజామాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ ప్రక్రియ ముగిసింది. సో మవారం ఆఖరురోజు కావడంతో అభ్యర్థులు భారీగా వచ్చారు. అనుచరులు, కార్యకర్తలు వెంట రాగా వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. చివరిరోజు 59 నామినేషన్లు వచ్చిన ట్లు అధికారులు తెలిపారు. ఇందులో 51 గ్రాడ్యుయేట్స్ కోసం రాగా.. మిగిలిన 8 టీచర్స్ స్థానానికి వచ్చినట్లు వివరించారు. ఇప్పటి వరకూ గ్రాడ్యుయేట్స్కు 100మంది అభ్యర్థులు 192సెట్లు, టీచర్స్ ఎమ్మెల్సీకి 17మంది 38సెట్ల నామినేషన్లు వేసినట్లు తెలిపారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కరీంనగర్ నగర వీధులన్నీ ర్యాలీలతో నిండిపోయాయి. కాంగ్రెస్ తరఫున పలువురు మంత్రులు హాజరు కాగా.. ఆఖరి రోజు ప్రధాన అభ్యర్థులు ర్యాలీల కోసం భారీగా జనసమీకరణ చేయడంతో నగర వీధులన్నీ సందడిగా మారాయి. కళాకారుల ఆటపాటలు, డప్పువాయిద్యాలతో హోరెత్తాయి. ● కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్రెడ్డి రెండోసెట్ నామి నేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట పీసీసీ మహేశ్కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్కుమార్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, విప్లు ఆదిశ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, విజయరమణరావు, మక్కాన్సింగ్ పాల్గొన్నారు. ● బీఎస్పీ నుంచి ప్రసన్న హరికృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. మాజీ మేయర్ రవీందర్సింగ్, ట్రస్మా శేఖర్రావులు భారీగా అనుచరులు తరలిరాగా స్వతంత్రులుగా నామినేషన్ వేశారు. రవీందర్సింగ్ కేసీఆర్ చిత్రపటంతో వెళ్లి నామి నేషన్ వేయడం గమనార్హం. వీరిద్దరూ బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే అయినా.. ఈసారి స్వతంత్రులుగా బరిలోకి దిగడం విశేషం. ● ఎస్టీయూ, టీపీఆర్టీయూ బలపరిచిన సిట్టింగ్ ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి టీచర్ ఎమ్మెల్సీకి నామినేషన్ వేశారు. ఆయన వెంట హర్షవర్దన్రెడ్డి, సత్యనారాయణ, షాబీర్, తిరుపతి, గజేందర్, రవి ఉన్నారు. ● టీఎస్యూటీఎఫ్, ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు బలపరిచిన కరీంనగర్ నియోజకవర్గ టీపీటీఎఫ్ టీచర్ల ఎమ్మెల్సీ అభ్యర్థి వై.అశోక్ కుమార్ నామినేషన్ వేశారు. నల్గొండ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.బరిలో మిలియనీర్లే..చిన్నమైల్ అంజిరెడ్డి వ్యక్తిగత ఆస్తులు: రూ.120,40,41,274 భార్య ఆస్తులు : రూ.54,79,63023 మొత్తం రూ.175 కోట్లపై చిలుకు బంగారం వ్యక్తిగతం: 250 గ్రాములు (విలువ రూ.19.32 లక్షలు) భార్య పేరిట 1,850 గ్రాములు (విలువ రూ.1.43 కోట్లు)అల్ఫోర్స్ నరేందర్రెడ్డి వ్యక్తిగత ఆస్తులు: రూ.30,00,59,840 భార్య పేరిట: రూ.13,38,36,263 (ఆయన భార్యకు క్రిస్టా కారు, అరకిలో బంగారం) ఉమ్మడి ఆస్తులు రూ. రెండు కోట్లు మొత్తం రూ.45.50 కోట్లుమల్క కొమురయ్య వ్యక్తిగత ఆస్తులు: రూ.32,08,62,420, ఆయన భార్యకు: రూ.29,55,03,158 మొత్తం కలిపి: రూ.61,63,65,578 భార్య వద్ద 4,457 గ్రాముల బంగారం (విలువ.రూ.17,93 కోట్లు) వంగ మహేందర్ రెడ్డి చరాస్తులు రూ.1,19,14,753, స్థిరాస్తులు రూ.8,56,90,056 మొత్తం రూ.20,48,04,809 ప్రసన్న హరికృష్ణ వ్యక్తిగత ఆస్తులు: రూ.49.07 లక్షలు భార్య పేరిట: రూ.2.16 కోట్లు మొత్తం రూ.2.65 కోట్లు భార్యవద్ద 300 గ్రాముల బంగారం సర్దార్ రవీందర్ సింగ్ చరాస్తులు రూ.1,10,09,802, స్థిరాస్తులు రూ. 73,81,000 మొత్తం: 1.83 కోట్లు -
ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్గా తీసుకోండి
● స్థానిక సంస్థల్లో ఈ ఫలితం ప్రభావం ● ఏడుగురు మంత్రులకు 42 నియోజకవర్గాల బాధ్యతలు ● పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్కరీంనగర్ కార్పొరేషన్: ‘ఎమ్మెల్సీ ఎన్నిక మనకు ప్రతిష్టాత్మకం. ఈ ఎన్నికల్లో విజయంతోనే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల విజయానికి బాటలు పడతాయి. అలసత్వం వద్దు... సీరియస్గా తీసుకోండి’.. అంటూ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ పార్టీ శ్రేణులు, నాయకులకు దిశానిర్దేశం చేశా రు. సోమవారం కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వి.నరేందర్రెడ్డి నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులతో ఓ హోటల్లో అంతర్గత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ ఎన్నిక ఫలితం ప్రభా వం చూపుతుందన్నారు. ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలోని 42అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలను ఏడుగురు మంత్రులకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. మరో పదిహేను రోజు లే గడువు ఉన్నందున మంగళవారం నుంచి క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ఉధృతం చేయాలని సూచించారు. పట్టభద్రుల అభ్యర్థి వి.నరేందర్రెడ్డి మాట్లాడుతూ తనకు ఎమ్మెల్సీ టి.జీవన్రెడ్డి రోల్ మాడల్ అన్నారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీత క్క, కొండా సురేఖ, ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్కుమార్, ఎమ్మెల్సీ టి.జీవన్రెడ్డి,ఎమ్మెల్యేలు విజయరమణారా వు, కవ్వంపల్లి సత్యనారాయణ, మక్కాన్సింగ్రాజ్ఠాకూర్, మేడిపల్లి సత్యం, ఎడమ బొజ్జ, మైనంపల్లి రోహిత్, మాజీ ఎమ్మెల్సీ షబ్బీర్అలీ, తూర్పు నిర్మల జగ్గారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు సత్తు మల్లేశం, సుడా చైర్మన్ కె.నరేందర్రెడ్డి పాల్గొన్నారు. నరేందర్రెడ్డి నామినేషన్ సందర్భంగా ఎస్ఆర్ఆర్ కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇంతకీ ఎన్ని వేల ఉద్యోగాలు? ర్యాలీలో మాట్లాడిన వారంతా తమ ప్రభుత్వం వచ్చాక వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని చెప్పడానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఒక్కొక్కరు ఒక్కో రకమైన సంఖ్య చెప్పారు. ఒకరు 53 వేల ఉద్యోగాలని....మరొకరు 54 వేలని... 55 వేలని...56 వేల ఉద్యోగాలు భర్తీ చేసామని మంత్రులు, నాయకులు చెప్పడంతో పార్టీ శ్రేణులు గందరగోళానికి గురయ్యారు.