breaking news
Rajanna
-
గణపతి బొప్పా మోరియా
సిరిసిల్ల/సిరిసిల్లటౌన్: ‘గణపతి బొప్పా మోరియా’ అంటూ భక్తుల నినాదాలు మార్మోగాయి. వినాయక చవితి పండుగకు ఒక్క రోజు ముందు ఆదివారం సిరిసిల్లలో గణపతుల సందడి నెలకొంది. జిల్లా నలుమూలల నుంచి వినాయక మండపాల నిర్వాహకులు భారీ విగ్రహాలను తీసుకెళ్లారు. డీజే సౌండ్ మ్యూజిక్ మధ్య గణనాథులు మండపాలకు తరలిపోయారు. వినాయకుడి పూజ సామాగ్రి విక్రయాలతో మార్కెట్లో సందడి నెలకొంది. పత్రి, ఎలక్కాయ, పత్రికాయ, మామిడాకులు, అరటాకులు, పండ్లు, వివిధ రకాల పూలు, ఆకులు, ఓనగాయ, మక్కకంకులు కొనుక్కొని వెళ్లారు. గణనాథుడికి ఘన స్వాగతం పలుకుతూ.. గణేశ్ మండపాల నిర్వాహకులు సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. వినాయకుడి విగ్రహానికి గుడ్డను కట్టి.. భజన చేస్తూ.. మండపాలకు గతంలో తరలించేవారు. కానీ ఆగమనం పేరిట అదిరిపోయేలా.. ఆటాపాటలతో.. డీజే సౌండ్ సిస్టమ్స్తో ఘనంగా స్వాగతం చెబుతున్నారు. వారం రోజులుగా వినాయకుడి విగ్రహాలను మండపాలకు అంగరంగ వైభవంగా చేర్చుతున్నారు. ఆగమన వేడుకలను అదిరిపోయేలా నిర్వహిస్తున్నారు. ఇటీవల సిరిసిల్ల జూనియర్ కళాశాల మైదానంలో విశ్వదేవ్ మండప్ ఆధ్వర్యంలో ఆగమన వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. కళ్లు మిరిమిట్లు గొలిపే భారీ సెట్టింగులు.. వారణాసి గంగాహారతి బృందంతో ఏర్పాట్లు చేశారు. ఈ స్ఫూర్తితో జిల్లాలోని 260 గ్రామాల్లో 1,130 మండపాల నిర్వాహకులు ఘనమైన స్వాగతం పలుకుతున్నారు. -
ఇంటింటా అందిస్తూ..
సిరిసిల్లటౌన్/పెద్దపల్లి/మెట్పల్లి/ధర్మపురి: సిరిసిల్ల బల్దియా, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఏటా ఉచితంగా మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నారు. ఈ ఏడాది సైతం మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ ఆధ్వర్యంలో పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. సిరిసిల్లలోని చింతోజు భాస్కర్ మానేరు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పదేళ్లుగా మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నారు. 24వ వార్డులో మున్సిపల్ మాజీ వైస్చైర్మన్ మంచె శ్రీనివాస్ ఆధ్వర్యంలో శ్రీనిధి పరస్పర సంక్షేమ సంఘం ఏర్పాటు చేశారు. పదిహేనేళ్లుగా వార్డులోని 350 ఇళ్లకు మట్టి వినాయకులను అందిస్తున్నారు. శివనగర్ రాజరాజేశ్వరస్వామి ఆలయం వేదికగా ఏడాదికి 2 వేల వినాయక ప్రతిమలు పంపిణీ చేస్తున్నారు. ● పెద్దపల్లికి చెందిన దేవసాని పద్మ కుటుంబం పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా పదేళ్లుగా మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేస్తున్నారు. ● మెట్పల్లి లయన్స్క్లబ్ సభ్యులు మట్టి గణపతులను పూజించాలని ప్రచారం చేస్తున్నారు. 2009లో మెట్పల్లిలో లయన్స్క్లబ్ ఏర్పాటు చేశారు. ఏటా మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నట్లు అధ్యక్షుడు శ్రీనివాస్రావు తెలిపారు. ● ధర్మపురికి చెందిన గాజు భాస్కర్ పట్టణంలోని వివిధ వార్డుల్లో 500 మందికి మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలు వద్దని.. మట్టి విగ్రహాలను పూజిద్దామని ప్రచారం చేస్తున్నారు. -
విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే నిర్వహించాలి
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి సిరిసిల్లటౌన్: తెలంగాణ విమోచన దినోత్సవంపై అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ రెండేనని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి విమర్శించారు. ఈనెల 17 నుంచి అక్టోబర్ 17 వరకు నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఆదివారం సిరిసిల్ల పాతబస్టాండ్ వద్ద ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని శుద్ధి చేశారు. గోపి మాట్లాడుతూ 1947 ఆగస్టు 15న దేశమంతా స్వాతంత్య్రం వస్తే.. హైదరాబాద్ సంస్థానం మాత్రం ఆపరేషన్ పోలో తర్వాత 1948 సెప్టెంబర్ 17న భారత యూనియన్లో విలీనమైందని గుర్తు చేశారు. ఎర్రం మహేశ్, లింగంపల్లి శంకర్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు పొన్నాల తిరుపతిరెడ్డి, సిరికొండ శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు బర్కం లక్ష్మి, శీలం రాజు, దుమాల శ్రీకాంత్, అంకిరెడ్డి, రాజాసింగ్, మ్యాన రాంప్రసాద్, కొండ నరేశ్, ఉరవకొండ రాజు, మెరుగు శ్రీనివాస్ పాల్గొన్నారు. ‘ముసురు’కున్న వాన సిరిసిల్ల: జిల్లా అంతటా ఆదివారం ముసురు వర్షం కురిసింది. అత్యధికంగా ఇల్లంతకుంటలో 32.1 మిల్లిమీటర్ల వర్షం పడగా.. రుద్రంగిలో 5.8, చందుర్తిలో 10.9, వేములవాడ రూరల్లో 12.6, బోయినపల్లిలో 18.3, వేములవాడలో 13.6, సిరిసిల్లలో 7.9, కోనరావుపేటలో 10.2, వీర్నపల్లిలో 10.5, ఎల్లారెడ్డిపేటలో 13.1, గంభీరావుపేటలో 2.9, ముస్తాబాద్లో 10.2, తంగళ్లపల్లిలో 16.4 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. జిల్లా అంతటా సగటున 12.7 మిల్లీ మీటర్ల వర్షం నమోదైంది. పోపా ప్రతిభా పురస్కారాలు ప్రదానం సిరిసిల్ల అర్బన్ : చదువులో ప్రతిభ కనబర్చిన పద్మశాలీ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేసినట్లు పోపా బాధ్యులు మామిడాల భూపతి తెలిపారు. సిరిసిల్లలోని పద్మశాలి కల్యాణ భవన్లో ఆదివారం పోపా ఆధ్వర్యంలో పదోతరగతి, ఇంటర్, పాలీసెట్, ఎంసెట్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి అత్యధిక మార్కులు సాధించిన వారికి నగదు పారితోషికంతోపాటు, మెమొంటో, సర్టిఫికెట్లను ఎంఈవో రఘుపతి చేతుల మీదుగా అందజేసినట్లు తెలిపారు. గాజుల ప్రతాప్, ఎల్లారెడ్డిపేట ఎంఈవో గాలిపెల్లి కృష్ణహరి, సిరిపురం కృష్ణ, శ్రీనివాస్, గూడూరు ప్రవీణ్, గూడూరు రవీందర్, గడ్డం భగవత్, పోపా సభ్యులు ఆడెపు వేణు, చీరాల ప్రభాకర్, సత్యనారాయణ, అంకార జ్ఞానోబ పాల్గొన్నారు. జాతీయస్థాయి యోగా పోటీలకు ఎంపికగంభీరావుపేట(సిరిసిల్ల): రాష్ట్ర యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో మండలంలోని సైమా అకాడమీకి చెందిన ఐదుగురు క్రీడాకారులు పాల్గొన్నారు. 8–10 ఏళ్ల వయస్సు విభాగంలో వైష్ణవి రజతం సాధించింది. వచ్చే నెలలో జైపూర్లో జరిగే జాతీయస్థాయి యోగా పోటీలకు ఎంపికై ంది. వైష్ణవిని డీవైఎస్వో అజ్మీరా రాందాస్, యునాని డిస్పెన్సరీ మెడికల్ ఆఫీసర్ నవీన్కుమార్, యోగా కోచ్ దేవయ్య, ఉషు సెక్రటరీ విక్రం, పీఈటీ భాను, గంభీరావుపేట మార్నింగ్ వాకర్స్ సభ్యులు అభినందించారు. జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యురాలిగా లహరివేములవాడ: జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యురాలిగా తోట లహరి నియమితులయ్యారు. ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ను ఆదివారం కలిసి, కృతజ్ఞతలు తెలియజేశారు. అన్నపూర్ణ స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించి ఈ అవకాశం కల్పించినట్లు తెలిపారు. తన నియామకానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. -
ప్రజా రవాణా మరింత చేరువ
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ‘టీజీఎస్ ఆర్టీసీ సేవలు ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా మేనేజ్మెంట్ పనిచేస్తోంది. రద్దీకి అనుగుణంగా బస్సులు నడుపుతున్నాం. ఇప్పుటి వరకు 6.91కోట్ల మంది మహిళలు మహాలక్ష్మి ద్వారా ప్రయాణించారు. రూ.308.84 కోట్ల వరకు లబ్ధి పొందారు. ఈ పథకం గొప్ప మైలురాయి సాధించింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, ఎన్నికల ప్రక్రియ ప్రభుత్వ పాలసీ పరిధిలోనిది. రీజియన్ పరిధిలోని 11 డిపోల్లో 997బస్సులు రోజుకు 3లక్షల కిలోమీటర్లు తిరుగుతాయి. తద్వారా రూ.2.5కోట్ల ఆదాయం సమకూరుతోంది’ అని ఆర్టీసీ కరీంనగర్ ఆర్ఎం రాజు వివరించారు. ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలు వివరించారు. -
గణేశ్ మండపాలు
నిఘా నీడలో ● సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి ● శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు ● ఎస్పీ మహేశ్ బీ గీతేసిరిసిల్ల: గణేశ్ నవరాత్రుల సందర్భంగా మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, నిఘా ఉంచాలని, రేయింబవళ్లు మండపాల వద్ద నిర్వాహకుల పర్యవేక్షణ ఉండాలని ఎస్పీ మహేశ్ బీ గీతే సూచించారు. నవరాత్రి వేడుకలు, సోషల్ మీడియా పోస్టులపై పోలీస్ స్టేషన్ల వారీగా నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. డీజేలకు అనుమతించబోమని తెలిపారు. ఆదివారం పలు వివరాలు వెల్లడించారు. గణేశ్ మండపాల నిర్వాహకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. మాట్లాడుతున్న ఎస్పీ మహేశ్ బీ గీతే -
ఈ నెలాఖరున సీఎం బహిరంగ సభ
గంభీరావుపేట(సిరిసిల్ల): ఈ నెలాఖరున సిరిసిల్లలో సీఎం రేవంత్రెడ్డి బహిరంగ సభ ఉంటుందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కె.కె.మహేందర్రెడ్డి పేర్కొన్నారు. గంభీరావుపేట మండలం దమ్మన్నపేటలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ ఫామ్హౌస్ ఆదేశాలతో అసెంబ్లీ గేటు ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైడ్రామా సృష్టించారన్నారు. దళిత స్పీకర్ను బూతులతో తిట్టి అవమానపరిచారని, పసుపు నీళ్లు పోసి నేలను శుద్ది చేసి దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచారన్నారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కిందన్నారు. పర్శ హన్మండ్లు, మండల మాజీ అధ్యక్షుడు హమీద్, నాయకులు రాజనర్సింహారెడ్డి, బలరాంరెడ్డి, ఎలుక రాజు, గంగి స్వామి, అజాం, బాల్రెడ్డి, భాస్కర్నాయక్, విఠల్నాయక్, సంతోష్, శ్రీనివాస్, ప్రసాద్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. చందుర్తి(వేములవాడ): చందుర్తి తహసీల్దార్ ఆఫీస్ అధికారులపై సోషల్మీడియాలో ఓ పోస్టు వైరల్గా మారింది. మండలంలోని బండపల్లి మాజీ ఎంపీటీసీ గడ్డం రణధీర్రెడ్డి రెవెన్యూ కార్యాలయానికి సంబంధించిన నిధులు 2025 జనవరి 1 నుంచి 2026 ఆగస్టు 12 వరకు ఎంత ఖర్చు చేశారు? ఏయే అవసరాలకు వెచ్చించారన్న సమాచారం కోసం అర్జీ పెట్టుకున్నాడు. గ్యాప్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు ఎంత మందికి ఇచ్చారు? ఎంత మందికి రిజెక్టు చేశారు? అనే వివరాలు కావాలని ఆగస్టు 12న అర్జీ పెట్టుకున్నాడు. గ్యాప్ సరిఫ్టికెట్లు 45 మందికి, ఈడబ్ల్యూఎస్ 49 మందికి ఇవ్వగా.. 10 మందికి రిజెక్టు చేశామని సమాధానం ఇచ్చారు. అనుమానాలుంటే కార్యాలయంలో రికార్డులు చూసుకోవాలని ఈనెల 9న అధికారులు సమాధానం ఇచ్చారు. అంకెలు తప్ప సమగ్ర సమాచారం ఇవ్వలేదంటూ అధికారుల పనితీరును సోషల్మీడియాలో విమర్శించడం చర్చనీయంగా మారింది. -
మధుయాష్కిగౌడ్ను కలిసిన రవితేజగౌడ్
సిరిసిల్ల అర్బన్: ఆలిండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్(ఏఐపీసీ) చైర్పర్సన్గా నియమితులైన టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కిగౌడ్ను టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యుడు బుర్ర రవితేజగౌడ్ ఆదివారం కలిశారు. ఉస్మానియా విద్యార్థి నాయకులు వెంకట్, మహేశ్, పవన్ ఉన్నారు. విద్యుత్షాక్తో పాడిగేదె మృతిఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని రేపాకలో విద్యుత్ షాక్తో ఆదివారం పాడిగేదె మృతిచెందింది. గ్రామానికి చెందిన కోదని బాలయ్య తన పాడి గేదెను మేత కోసం తీసుకెళ్తుండగా మార్గమధ్యలో ఉన్న 25 కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఎర్త్ వైర్ తగిలి చనిపోయినట్లు ఎన్పీడీసీఎల్ ఏఈ నగేశ్కుమార్ తెలిపారు. ఎక్స్గ్రేషియా కోసం ఉన్నతాధికారులకు తెలియజేస్తామన్నారు. -
‘బీఆర్ఎస్ నేతలు తీరు మార్చుకోవాలి’
సిరిసిల్లటౌన్: బీఆర్ఎస్ నేతలు తీరు మార్చుకోవాలని సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు సూచించా రు. 39 వార్డుల కాంగ్రెస్ అధ్యక్షులు, క మిటీలతో ఆదివారం నిర్వహించిన స మావేశంలో పాల్గొన్నారు. ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకునూరి బాలరాజు, వెంగల లక్ష్మీనర్సయ్య, వెంగల అశోక్, కంసాల మల్లేశం పాల్గొన్నారు. లోక్ అదాలత్ సక్సెస్ : ఎస్పీసిరిసిల్ల: జిల్లాలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ సక్సెస్ అయిందని, దీని ద్వారా అనేక కేసులు పరిష్కారమయ్యాయని ఎస్పీ మహేశ్ బీ గీతే ఆదివారం తెలిపారు. సైబర్క్రైమ్ బాధితులకు రూ.2,79,030లకు పైగా రీఫండ్ అందజేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. విచారణలో ఉన్న 228 కేసులు, 56 పెట్టి, 823 డ్రంకెన్డ్రైవ్, 11,456 ట్రాఫిక్ చలాన్, 75 సైబర్క్రైమ్ కేసులు పరిష్కారమైనట్లు వివరించారు. కోర్టు మానిటరింగ్ ఎస్ఐ శ్రావణ్యాదవ్ తదితరులను ఎస్పీ అభినందించారు. -
చేపా..చేపా.. ఎక్కడున్నావ్?
● టెండర్లు దాఖలు చేసిన కాంట్రాక్టర్లు ● సీడ్ఫామ్స్ తనిఖీ చేస్తున్న అధికారులు ● నెలాఖరులోగా చేపపిల్లల పంపిణీ ! ● జిల్లాలో 1.46 కోట్ల పిల్లలు లక్ష్యంబోయినపల్లి(చొప్పదండి): మత్స్యకారులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా చేపట్టే చేపపిల్లల పంపిణీకి ఈ యేడాది జాప్యమవుతుంది. ఇప్పటికే పంపిణీ చేయాల్సి ఉండగా వివిధ కారణాలతో మొదలుకాలేదు. పలువురు కాంట్రాక్టర్లు చేపపిల్లల సరఫరాకు టెండర్లు దాఖలు చేయడంతో ఆలస్యంగా నైనా పంపిణీ చేయవచ్చని మత్స్యకారులు ఆశాభావంలో ఉన్నారు. 1.46 కోట్ల చేపపిల్లలు లక్ష్యం జిల్లాలో 1.46కోట్ల చేపపిల్లలు పంపిణీ చేయడం లక్ష్యం పెట్టుకున్నారు. బోయినపల్లి మండలం మాన్వాడ మిడ్మానేరు, గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు, ఇల్లంతకుంట మండలం అనంతగిరి, కోనరావుపేట మండలం మల్కపేట ప్రాజెక్టుల్లో ఏటా మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేపపిల్లలు వదులుతారు. ప్రభుత్వం బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యం చేస్తుందనే కారణంతో ప్రతీసారి చేపపిల్లలు పంపిణీ చేసే ఏజెన్సీలు ముందుకురావడం లేదు. ఈసారి నాలుగు ఏజెన్సీలు టెండర్లు దాఖలు చేశాయి. సిరిసిల్ల, వేములవాడ మండలంలోని పలు గ్రామాలతోపాటు బోయినపల్లి మండలం కొదురుపాక, వరదవెల్లి, నీలోజిపల్లి, నర్సింగాపూర్, జగ్గారావుపల్లి గ్రామాల్లో ఏటా ప్రాజెక్టులతోపాటు చెరువులు, కుంటల్లో చేప, రొయ్యపిల్లలు వదులుతున్నారు. సీడ్ ఫామ్స్ తనిఖీల్లో అధికారులు ఈ సీజన్లో చేప పిల్లలు సరఫరా చేయడానికి నలుగురు కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేసినట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి సౌజన్య తెలిపారు. ఇందులో భాగంగా బుధవారం నుంచి సీడ్ఫామ్స్ తనిఖీలు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో పెద్దపల్లి, కామారెడ్డి, ఖమ్మం జిల్లా నాచుపల్లి, తూర్పుగోదావవరి జిల్లాల్లోని సీడ్ పాయింట్లలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. తనిఖీల్లోని విషయాలతో నివేదికను మత్స్యశాఖ కమిషనర్కు సమర్పిస్తారు. క్వాలిఫై అయిన టెండర్ల నుంచి ఫైనాన్సియల్ బిడ్ ఓపెన్ చేస్తారు. ఎవరైతే తక్కువ మొత్తం కోట్చేసిన కాంట్రాక్టర్ ఉంటారో అతనికి టెండర్ ఫైనల్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెలాఖరు వరకు ఈ ప్రక్రియ పూర్తి అవుతుందని వివరించారు.జిల్లాలో చేపపిల్లలు పంపిణీ చేయడానికి నలుగురు కాంట్రాక్టర్లు టెండర్ దాఖలు చేశారు. టెండర్లు వేసిన కాంట్రాక్టర్ల సీడ్ఫామ్స్ల్లో కలెక్టర్ నియమించిన కమిటీ బృందం క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తుంది. ఈ నెలాఖరు వరకు చేప పిల్లల పంపిణీ చేస్తాం. – సౌజన్య, జిల్లా మత్స్యశాఖ అధికారి, సిరిసిల్లమత్స్యశాఖ స్వరూపంమత్స్య పారిశ్రామిక సంఘాలు 117 మహిళా సంఘాలు 47 మత్స్యకారులు 10,156 చేపపిల్లల పంపిణీ లక్ష్యం ఇలా మిడ్మానేరు 28.50 లక్షలు అప్పర్ మానేరు 10.50 లక్షలు అనంతగిరి రిజర్వాయర్ 13.69 లక్షలు మల్కపేట రిజర్వాయర్ 7.49 లక్షలు 456 చెరువుల్లో.. 87.82 లక్షలు -
మంథనిలో శతాబ్దపు ఉత్సవాలు
మంథని: మంత్రపురిలో 110 ఏళ్లుగా గణేశ్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. స్థానిక బ్రాహ్మణ సామాజికవర్గం వంటలు చేసేందుకు నాగ్పూర్కు వెళ్లేవారు. అక్కడి సాంప్రదాయాన్ని మంథనికి తీసుకొచ్చి గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించారు. నాగ్పూర్, మంథని మినహా దేశంలో ఎక్కడా సిద్ధి..బుద్ధి(భార్యలు) విగ్రహాలతో గణేశ్ దర్శనం లభించదు. మంథని పెంజేరుకట్ట హనుమాన్ ఆలయంలో సిద్ధి, బుద్ధి గణపతి ఉత్సవాలను 1916 నుంచి నిర్వహిస్తున్నారు. మోతారాం గారి రాజేశ్వర్రావు, టక్కేగారి మల్లన్న, మంథని లింగయ్య ఆధ్వర్యంలో ఆనాడు ఉత్సవాలు జరిగేవి. నడివీధిలో 1918 నుంచి నిర్వహిస్తున్నారు. మందాట వీదిలో గత 65 ఏళ్లుగా అఖండ గండదీపం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. -
నెల్లూరులో పుట్టి.. సిరిసిల్లలో గెలిచి
● 1989లో జనశక్తి మద్దతుతో ఎమ్మెల్యేగా ఎన్వీ కృష్ణయ్య విజయం ● నేడు 20వ వర్ధంతి సభ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి వామపక్ష విప్లవోద్యమాల వరకు సిరిసిల్ల చైతన్యవంతమైన భూమిక పోషించింది. ఎన్నికల బరిలో నక్సలైట్లు అభ్యర్థిని నిలిపి విజయం సాధించిన అరుదైన ఘటన ఈ నేల సొంతం. 1989 శాసనసభ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాకు చెందిన ఎన్వీ కృష్ణయ్య జనశక్తి అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. ఎన్వీ కృష్ణయ్య 20వ వర్ధంతి సందర్భంగా ఆనాటి పరిస్థితులపై ‘సాక్షి’ కథనం. – సిరిసిల్ల జనశక్తి ఉద్యమ చరిత్రలో మైలురాయి మూడున్నర దశాబ్దాలపాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయ చిత్రపటంలో జనశక్తి బలమైన ముద్రవేసింది. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్వీ కృష్ణయ్యను జనశక్తి చట్టసభలకు పంపింది. కృష్ణయ్య గెలుపులో అప్పటి జనశక్తి జిల్లా కార్యదర్శి బోడ లక్ష్మారెడ్డి అలియాస్ భూపతిరెడ్డి అలియాస్ సత్యం కీలక భూమిక పోషించారు. 1973లో కోనరావుపేట మండలం నిమ్మపల్లి భూపోరాటాలతో మొదలైన రైతుకూలీ సంఘం ఉద్యమం క్రమంగా సీపీఐ (ఎం.ఎల్) చండ్ర పుల్లారెడ్డి వర్గ సాయుధ పోరా టంగా మారింది. తొమ్మిది విప్లవ గ్రూపుల కలయికతో సీపీఐ(ఎం.ఎల్) జనశక్తి సాయుధ నక్సలైట్ల ఉద్యమంగా రూపాంతరం చెందింది. ‘దున్నే వాడిదే భూమి’ అనే నినాదంతో విస్తరించింది. ఎన్నికలు ఓ ఎత్తుగడ సాయుధ దళాలతో పోరా టాలు చేస్తూనే ఎన్నికలు వచ్చిన ప్రతీసారి బ్యాలెట్పోరును సాగిస్తున్నామని జనశక్తి నాయకులు చెప్పేవారు. 1983లో వై.కాశీపతి సిరిసిల్లలో ఎమ్మెల్యేగా పోటీచేశారు. 1994 ఎన్నికల్లో అజ్ఞాతంలో ఉన్న జె.చలపతిరావు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేశారు. అంతకుముందు రచయిత పెద్ద విమలక్క, మారోజు వీరన్న, గుంటి వేణు, బడే స్వామిదాస్, చెట్టి రాజేశ్వర్ ఎన్నికల బరిలో నిలిచారు. సిరిసిల్ల, జగిత్యాల, మెట్పల్లి, నేరెళ్ల, చొప్పదండి నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలో దింపింది. 1991 పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్వీ కృష్ణయ్య కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా పోటీచేశారు. అప్పట్లో లక్షన్నరకు పైగా ఓట్లు సాధించి జిల్లాలో ద్వితీయస్థానం పొందారు. 1995 స్థానిక సంస్థల ఎన్నికల్లో సిరిసిల్ల ప్రాంతంలోని పలు ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలను జనశక్తి కైవసం చేసుకుంది. సర్పంచ్గా గెలవా లన్నా, ఎంపీటీసీగా పోటీచేయాలన్న జనశక్తి కనుసన్నల్లో స్థానిక ఎన్నికలు జరిగేవి. ఆటుపోట్ల మధ్య జనశక్తి పార్టీ అగ్రనేత కూర రాజన్న, ఆయన సోదరుడు కూర దేవేందర్ ఉరఫ్ అమర్, మరో నేత సాగర్ ఉరఫ్ ఎడ్ల లక్ష్మీరాజం అరెస్టయ్యారు. అంతకుముందు జిల్లా కార్యదర్శిగా పనిచేసిన రణధీర్ ఉరఫ్ సాయిలు 46 మందితో అప్పటి సీఎం చంద్రబాబునాయుడు ఎదుట లొంగిపోయారు. నేడు సిరిసిల్లలో వర్ధంతి సభ ఎన్వీ కృష్ణయ్య 20వ వర్ధంతి సభను సిరిసిల్లలో ఆదివారం నిర్వహిస్తున్నారు. ఈమేరకు ఆ పార్టీ నాయకుడు సోమిశెట్టి దశరథం ఏర్పాట్లు చేస్తున్నారు. అసెంబ్లీ వేదికగా ఎన్కౌంటర్ ముచ్చట్లు ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా సిరిసిల్ల ఎమ్మెల్యే ఎన్వీ కృష్ణయ్య న్యాయ విచారణకు డిమాండ్ చేసేవారు. అసెంబ్లీ సమావేశాల్లో పోలీసుల హింస, బూటకపు ఎన్కౌంటర్లపై గొంతు వినిపించేవారు. కృష్ణయ్యకు తోడుగా ఖమ్మం, నల్గొండ జిల్లాల వామపక్ష ఎమ్మెల్యేలు గళం కలిపేవారు. ఎన్వీ కృష్ణయ్య డిమాండ్ మేరకు అప్పటి ప్రభుత్వం ఎన్కౌంటర్లపై ఆర్డీవో స్థాయిలో మెజిస్ట్రేరియల్ విచారణలకు ఆదేశించడం విశేషం. -
63 ఫీట్ల ఎకో గణేశుడు
హైదరాబాద్ తర్వాత పెద్దపల్లికి గుర్తింపు వచ్చేలా భారీ మట్టిగణపతిని ఏర్పాటు చేస్తున్నాం. నవరాత్రోత్సవాల్లో ప్రముఖుల ప్రవచనాలు, లక్షపుష్పార్చన, మహాహారతి, సహస్రదీపాలంకరణ ఇలా రోజుకో ప్రత్యేక కార్యక్రమం ఉండేలా ప్లాన్ చేస్తున్నాం. – శివంగారి సతీశ్, ఛత్రపతి యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడుపెద్దపల్లిరూరల్: పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఈసారి 63అడుగుల పంచముఖ గణపతి భక్తులకు దర్శనమిచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఛత్రపతి యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు శివంగారి సతీశ్ ఆధ్వర్యంలో ఏటా భారీ ఎకో గణేశుడు పూజలందుకుంటున్నాడు. 31ఏళ్లుగా ఉత్సవాలను నిర్వహిస్తుండగా.. ఎనిమిదేళ్లుగా భారీ మట్టి గణపతులను ఏర్పాటు చేస్తున్నారు. 36 ఫీట్ల ఎత్తుతో మొదలై ఈ ఏడాది 63 అడుగుల ఎత్తులో రూపుదిద్దుకుంటున్నాడు. ఖైరతాబాద్ తర్వాతిస్థానంలో పెద్దపల్లిలోనే భారీ గణేశుడు కొలువుదీరేలా నిర్వాహకులు సిద్ధం చేస్తున్నారు. -
రాజీతో శాశ్వత పరిష్కారం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీరజ సిరిసిల్ల: కక్షిదారులు వివాదాలను పెద్దవి చేసుకోకుండా రాజీతో శాశ్వతంగా పరిష్కరించుకోవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు పి.నీరజ పేర్కొన్నారు. ప్రీ–లిటిగేషన్ కేసులను పరస్పర అంగీకారంతో పరిష్కరించేందుకు లోక్ అదాలత్ వేదికగా నిలుస్తుందన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 12,666 కేసులు పరిష్కరించి, రూ.2,02,74,283 నష్టపరిహారం ఇప్పించారు. పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధిక జైస్వాల్, సీనియర్ సివిల్ జడ్జి లక్ష్మణాచారి, జూనియర్ సివిల్ జడ్జి మేఘన, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆవునూరి రమాకాంతరావు, సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి, లోక్ అదాలత్ సభ్యులు చింతోజు భాస్కర్, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు. -
ప్రణాళికతో చదివితే విజయం సాధ్యం
సిరిసిల్ల: ప్రణాళిక ప్రకారం చదివితే ఉద్యోగ వేటలో విజయం మీదేనని ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతీ, యువకులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఏయే సబ్జెక్టుల్లో బలహీనంగా ఉన్నారో గుర్తించి, ఆయా సబ్జెక్టులపై ఎక్కువ దృష్టి సారించాలన్నారు. ఏమైనా సందేహాలు వస్తుంటే వెంటనే నిపుణులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఒత్తిడికి లోనుకాకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగాలన్నారు. చిన్న చిన్న వైఫల్యాలకు నిరుత్సాహపడకుండా, వాటిని పాఠాలుగా తీసుకుని మరింత పట్టుదలతో ముందుకుసాగాలన్నారు. సబ్జెక్టుల వారీగా అవగాహన పోటీపరీక్షలకు అవసరమైన సబ్జెక్టుల వారీగా పరీక్షల విధానం, సమయపాలన, ప్రిపరేషన్ ప్రణాళిక, పరీక్షల్లో విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు, ఫిజికల్ టెస్ట్, గ్రౌండ్ ఈవెంట్స్కు సంబంధించిన అంశాలపై నిపుణులతో అవగాహన కల్పించారు. సిరిసిల్ల, వేములవాడ డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, సీఐలు శ్రీనివాస్, వీరప్రసాద్, వెంకటేశ్, రవీందర్, స్కిల్గురు డాక్టర్ విజయరఘు రామరాజు, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ మహేశ్కుమార్, నవీన్, సుందర్, అమరేశ్ పాల్గొన్నారు. కుడికాలువ ద్వారా నీరు విడుదల చేయాలి ఇల్లంతకుంట(మానకొండూర్): మిడ్మానేరు కుడికాలువ ద్వారా నీటిని విడుదల చేయాలని కోరుతూ మండలంలోని పొత్తూరు, వంతడుపుల గ్రామాల రైతులు శనివారం ధర్నా నిర్వహించారు. ఎస్సై ఉపేంద్రచారి పోలీస్ సిబ్బందితో సంఘటన స్థలాలకు చేరుకొని.. మిడ్మానేర్ డీఈ రఘుతో ఫోన్లో రైతులతో మాట్లాడించారు. రెండు రోజుల్లో నీటిని విడుదల చేయకుంటే పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామన్నారు. పట్నం శ్రీనివాస్, రోడ్ల కరుణాకర్రెడ్డి, రాగటి రమేశ్, ఉపసర్పంచ్ నరేశ్, పినకాశి అనిల్, కాట్నపల్లి రవీందర్రెడ్డి, పండుగ స్వామి, పరుశురాం పాల్గొన్నారు. ఐఎంఏ జిల్లా కార్యవర్గంసిరిసిల్లటౌన్: ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) జిల్లా నూతన కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా వేములవాడకు చెందిన జనరల్ ఫిజీషియన్ చీకోటి సంతోష్కుమార్ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా సిరిసిల్ల సరయు ఆసుపత్రి పిల్లల వైద్యనిపుణుడు తడుక సాయికుమార్, కోశాధికారిగా శ్రీమహాలక్ష్మి ఆస్పత్రి సీనియర్ కన్సల్టెంట్ ఎ.జైల్సింగ్, ఉపాధ్యక్షులుగా డాక్టర్ పి.యాదగిరి, డాక్టర్ జి.అభినయ్, సహ కార్యదర్శులుగా డాక్టర్ వెంకట్, డాక్టర్ మోహనకృష్ణ, డాక్టర్ చందన ఎన్నికయ్యారు. ఐఎంఏ మాజీ అధ్యక్షులు డాక్టర్ శోభారాణి స మక్షంలో ఈ ఎన్నికలు నిర్వహించగా, ఎన్నికల అధికారిగా డాక్టర్ మనోహర్ వ్యవహరించారు. సంతోష్కుమార్సాయికుమార్ -
ఎనౖభై ఏళ్ల వేడుక
సిరిసిల్లటౌన్: 80ఏళ్ల గణపయ్య ఉత్సవాలకు సిరిసిల్ల ముస్తామైంది. స్వాతంత్య్రానికి ముందే స్థానిక గాంధీచౌక్లో అప్పటి పుర ప్రముఖులు రుద్ర శంకరయ్య, మడూరి అంబాజి, భీమనాఽథిని నారాయణ, కుడిక్యాల రాజా రాం, ఎలగొండ నారాయణ మొదటి గణపతిని నెలకొల్పారు. ప్రస్తుతం మార్కండేయ భవనంలో పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో 80వ వార్షికోత్సవం జరుపుతుండగా అధ్యక్షుడిగా దూడం శంకర్ ఉన్నారు. ఆర్యవైశ్యులు ఆధ్వర్యంలో 1948 నుంచి నవరాత్రులకు అంకురార్పణ చేశారు. పెద్దబజారు హన్మాన్ ఆలయంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఎనభై ఏళ్లక్రితం పట్టణ ప్రముఖులు వినాయక ఉత్సవ సంఘం నెలకొల్పారు. వారి ఆదర్శంలోనే మేము వేడుకలు జరుపుతున్నాం. ప్రతి ఏడాది ఏకదంతుడికి నిత్య కై ంకర్యాలు, అన్నదానాలు ఇదే విధంగా నిర్వహిస్తాం. – డి.శంకర్, పద్మశాలీ సంఘం అధ్యక్షుడు -
నోటీసులు వచ్చిన ఓటర్లు గుర్తింపుకార్డులు ఇవ్వాలి
● కలెక్టర్ గరీమా అగ్రవాల్ తంగళ్లపల్లి(సిరిసిల్ల): ఎస్ఐర్ ప్రక్రియలో భాగంగా నోటీసులు వచ్చిన ఓటర్లు ఎన్నికల సంఘం సూచించిన 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి అందజేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ సూచించారు. మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్లోని 185 నుంచి 191 వరకు ఉన్న పోలింగ్ కేంద్రాలను శనివారం పరిశీలించారు. అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండే యువతీ యువకులు ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఆర్డీవో శ్రీధర్బాబు, తంగళ్లపల్లి సర్పంచ్ మోర లక్ష్మీరాజం, తహసీల్దార్ మురళీకృష్ణ పాల్గొన్నారు. -
దుబాయ్లో ఉన్నా.. లోక్ అదాలత్లో న్యాయం
● వీడియో కాల్లో మాట్లాడిన జడ్జి ● పరస్పర అంగీకారంతో కేసు క్లోజ్ వేములవాడ: దూరభారాలు సత్వర న్యాయానికి అడ్డంకి కాదని వేములవాడ లోక్అదాలత్ నిరూపించింది. ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన వ్యక్తి ఇక్కడి కోర్టులో కొనసాగుతున్న కేసును వర్చువల్గా హాజరై క్లోజ్ చేయించుకున్నారు. రుద్రంగి మండలం డెగావత్తండాకు చెందిన కున్సత్ సుమన్ రెండేళ్ల క్రితం కుటుంబంలో తలెత్తిన ఆస్తి వివాదం కేసు వరకు వెళ్లింది. రుద్రంగి పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. సుమన్ ఇటీవల దుబాయ్ వెళ్లాడు. రుద్రంగి ఎస్సై మోతీరాం కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చి శనివారం వేములవాడ కోర్టులో జరిగిన లోక్ అదాలత్కు హాజరయ్యేలా చూశారు. వీడియోకాల్ ద్వారా విచారణ కేసు విచారణలో భాగంగా వేములవాడ సీనియర్ సివిల్ జడ్జి అజయ్కుమార్ జాదవ్ దుబాయ్లో ఉన్న సుమన్తో వీడియోకాల్లో మాట్లాడారు. ఇరువర్గాలు రాజీకి రావడం, సుమన్ వర్చువల్గా సమ్మతి తెలపడంతో రెండేళ్లుగా నడుస్తున్న ఈ కేసును జడ్జి క్లోజ్ చేశారు. 429 కేసులు పరిష్కారం వేములవాడ కోర్టులో జరిగిన లోక్ అదాలత్లో 429 కేసులకు పరిష్కారం లభించినట్లు సీనియర్ సివిల్ జడ్జి అజయ్కుమార్ జాదవ్ తెలిపారు. బాధితులకు రూ.30,500 పరిహారం జమయినట్లు అధికారులు తెలిపారు. డీఎస్పీ శ్రీనివాసులు, పీపీ విక్రాంత్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పిట్టల మనోహర్, ఏపీపీలు బొడ్డు ప్రశాంత్, రజనీకాంత్, లోక్ అదాలత్ మెంబర్లు నేరెళ్ల తిరుమల్గౌడ్, అనిల్కుమార్, సీఐలు శ్రీనివాస్, కె.రవీందర్, ఎస్సైలు మోతీరాం, ప్రశాంత్ పాల్గొన్నారు. -
ఊరంతా ఒకే దేవుడు
వాతావరణం ఆకాశం మేఘావృతమవుతుంది. జిల్లాలో అక్కడక్కడ స్వల్పంగా వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. మంథని రూరల్: పెద్దపల్లి జిల్లా మంథని మండలం బెస్తపల్లి గ్రామంలో ఒకే సామాజికవర్గానికి చెందిన వారు ఉంటారు. అందరు కలిసికట్టుగా ఒకే మాటపై నిలబడతారు. అందరికి ఏదోఒక కుటుంబ బంధం ఉంటుంది. ప్రతీ పండుగను కలిసి చేసుకుంటారు. 30ఏళ్లుగా గ్రామస్తులు ఒక్కతాటిపై నిలిచి ఊరు మొత్తంలో ఒకే గణనాథుడి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు. గ్రామ నడిబొడ్డున ప్రతిమను ఏర్పాటు చేసి తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు చేసి ఊరంతా కలిసి గోదావరినదిలో నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. 1990లో నలుగురు వ్యక్తులు కలిసి గణనాథుడిని ప్రతిష్టించాలని ఆలోచన చేశారు. తాటా కులతో మండపం వేశారు. అదే ఆనవాయితీతో ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. -
అమ్మ..నాన్న.. ఇంటి భోజనం
వేములవాడ: పట్టణ బైపాస్ రోడ్డులోని బాలికల రెసిడెన్షియల్ స్కూల్ వద్ద శనివారం భావోద్వేగ వాతావరణం కనిపించింది. పిల్లల కోసం తల్లిదండ్రులు ఇంటి నుంచి టిఫిన్ బాక్సులు, క్యారేజీలు పట్టుకొచ్చారు. పాఠశాల కాంపౌండ్ బయట చెట్ల నీడన కూర్చొని తినిపిస్తూ కబుర్లు చెప్పారు. ఈనెల రోజుల్లో స్కూల్లో జరిగిన విశేషాలు అమ్మనాన్నలకు చెబుతూ ఇంటి నుంచి తెచ్చిన భోజనం తినగా.. పిల్లలతో గడిపిన క్షణాలను పదిలం చేసుకున్న తల్లిదండ్రులు భారంగా వెనుదిరగడం కనిపించింది. -
మట్టి కొరత.. ఇత్తడి విగ్రహం
కోరుట్లటౌన్: కోరుట్లలోని గాంధీరోడ్డులో గల పద్మశాలీ సంఘం భవనంలో 52 ఏళ్లుగా ఇత్తడి గణపతి ప్రతిష్టాపన ఆనవాయితీగా కొనసాగుతోంది. ఇత్తడి గణపతిని దర్శించుకునేందుకు కోరుట్లతో పాటు పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు. సుమారు 52ఏళ్ల క్రితం మట్టి దొరకని కరువు పరిస్థితుల్లో విగ్రహం తయారీకి ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో అప్పటి పద్మశాలీ సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో మద్రాసు నుంచి ఇద్దరు శిల్పులను కోరుట్లకు రప్పించి పంచలోహాలతో గణపతి విగ్రహాన్ని తయారు చేయించారు. అప్పటి నుంచి నేటి వరకు అదే విగ్రహానికి పూజలు చేస్తున్నారు. నవరాత్రులు ముగిసిన అనంతరం ఇత్తడి గణపతిని నిమజ్జనానికి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పవిత్ర జలాలను విగ్రహంపై చల్లి తిరిగి పద్మశాలీ సంఘం భవనానికి తీసుకువచ్చి భద్రపరుస్తారు. -
ఇదేంది సర్ !
సిరిసిల్ల: జిల్లా వ్యాప్తంగా ఓటర్ల జాబితాలో అక్షర దోషాలు, వయసు తేడాలు ఎక్కువగా ఉన్నాయి. ఓటర్ల జాబితా నమోదు సమయంలో ఇంగ్లిష్లో నమోదు చేయడంతో తెలుగులో జాబితా రావడంతో అనేక అక్షర దోషాలు నమోదయ్యాయి. ఫలితంగా ఇప్పుడు చాలా మంది ఓటర్ల నోటీసులు అందుకోవాల్సి వస్తుంది. మరోవైపు తల్లిదండ్రుల వయసుతో పిల్లల వయసును పోల్చినప్పుడు 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల తేడా మాత్రమే ఉండడంతో ఆ ఓటర్లను బోగస్గా భావిస్తున్నారు. నిజానికి వయసు నమోదులోనూ తేడా ఉండడమే ఇందుకు కారణం. ఖచ్చితమైన వయసు నిర్ధారణ పత్రాలను పరిశీలించకుండానే బూత్ లెవల్ ఆఫీసర్లు, అప్పట్లో వీఆర్వోలు ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు. ఆ ఓటర్ల జాబితాను ఆన్లైన్ చేయడంలో తప్పులు దొర్లి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
12 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నా
మాది జగిత్యాల జిల్లా మల్యాల మండలం. పన్నెడేళ్లుగా సిరిసిల్లలోనే ఉంటున్నా. ఇక్కడే ఓటుహక్కు ఉంది. మా ఊరిలో డెవిడ్ అని పిలిచే వారు. ఇక్కడ సత్యనారాయణగా గెజిట్ ద్వారా పేరు మార్చుకున్నా. ఓటర్ల సర్వేలో ఫొ టోలు, ఇతర ఆధారాలు అందించాను. అయినా.. మరోసారి నోటీసు రావడంతో విచారణకు వచ్చాను. – సత్యనారాయణ, సిరిసిల్లతలనొప్పిగా మారింది ఓటర్ల జాబితా సవరణ తలనొప్పిగా మారింది. నాకు 1,140 మంది ఓటర్ల జాబి తా ఇచ్చారు. పల్లెటూరు అయితే వెంటనే గుర్తుపడతాం. పట్టణం కావడంతో ఎవరూ.. ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు. అద్దెకు ఉండి వెళ్లిపోతారు. ఓటు ఉంటుంది. కానీ వాళ్ల అడ్రస్ తెలియదు. నా పరిధిలో అడ్రస్ లేని వారు 300 మంది ఉన్నారు. – కాసర్ల తార, బీఎల్వో, సిరిసిల్ల -
విద్యుత్ కోతలపై నిరసన
చందుర్తి(వేములవాడ): విద్యుత్ కోతలను నిరసిస్తూ చందుర్తిలో బీజేపీ నాయకులు శుక్రవారం చందర్తి బస్టాండ్ ప్రాంతంలో రాస్తారోకో చేపట్టారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గంటకు పైగా రాస్తారోకో చేయడంతో రెండు వైపులా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు అక్కడికి చేరుకొని నాయకులను రోడ్డుపై నుంచి లాగేయడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం 24 గంటలు వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేయాలని కోరుతూ డిప్యూటీ తహశీల్దార్ శ్రీలతకు వినతిపత్రం అందజేశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, సెస్ మాజీ చైర్మన్ అల్లాడి రమేశ్, పార్టీ మండల అధ్యక్షుడు మొకిలే విజేందర్, పార్టీ నియోజకవర్గ కన్వీనర్ మార్త సత్తయ్య, నాయకులు షిర్డీ మల్లేశం, పేరుక గంగరాజు, రాజశేఖర్, గంగస్వామి, చింతకుంట శ్రీనివాస్, పత్తిపాక శ్రీనివాస్, బద్దం తిరుమల్రెడ్డి, పర్శరాములు, జలగం శ్రీనివాస్రావు తదితరులు పాల్గొన్నారు. -
సమగ్ర ఓటర్ల సవరణ స్వరూపం
గ్రామాలు: 260పట్టణాలు: 02ఓటర్లు: 4,75,694బీఎల్వోలు : 549మృతులు : 12,791శాశ్వతంగా వెళ్లిపోయిన వారు: 25,926అడ్రస్ లేని వారు : 9,098అనామలీస్ జాబితాలోని ఓటర్లు : 78,835జనరేట్ అయిన నోటీసులు : 83,846నోటీసులు అందుకున్న వారు: 70,952నోటీసులు అందుకుని వచ్చిన వారు : 19,180తర్వాత వస్తామని సమాచారం ఇచ్చిన వారు: 103 -
జాగ్రత్తలు పాటించాలి
ముస్తాబాద్(సిరిసిల్ల): పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సౌకర్యాలు దరిచేరడం లేదు. పరిసరాల పరిశుభ్రత లోపించడం సర్వ సాధారణంగా మారింది. పల్లె.. పట్టణం అనే తేడా లేకుండా కాలుష్య కోరల్లో చిక్కుకున్నాం. రోజురోజుకు పెరుగుతున్న ప్లాస్టిక్ వినియోగం, పారిశుధ్య నిర్వహణలో ఇబ్బందులతో ప్రజలు రోగాలబారిన పడుతున్నారు. దీంతో గాలి, నీరు, భూమి, తినే ఆహారం కలుషితమై జీవరాశుల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తుంది. జిల్లాలో చెత్త సమస్య గ్రామాలను వెంటాడుతోంది. మండల కేంద్రాలు, పట్టణాల్లో కొంత నిర్వహణ ఉన్నప్పటికీ, వ్యర్థాలను ఏం చేయాలో తెలియక పంచాయతీ అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యర్థాలను నియంత్రించలేక సిబ్బంది, ఉద్యోగులు చేతులెత్తుస్తున్నారు. వ్యర్థాలతో జరిగే అనర్థాలు ఇవే.. చెత్త, ప్లాస్టిక్ వస్తువులతోపాటు ఇతర తడి, పొడి చెత్తను ఒకే చోట వేయడంతో కొంత భూమిలో కలిసిపోయిన కొంత అలాగే ఉంటుంది. దీంతో చాలా గ్రామాల్లో ప్లాస్టిక్ సంచులను కాల్చివేయడంతో గాలి కాలుష్యంగా మారుతుంది. అలాగే భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. చెరువులు, కుంటలలో నీరు రంగు మారుతోంది. రసాయన పదార్థాలు భూమిలోకి ఇంకిపోయి నీరు కలుషితమవుతోంది. చెత్త నుంచి వచ్చే పొగను పీల్చడం ద్వారా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు గాలిలో కలిసి జీవరాశులను ప్రమాదంలోకి నెట్టి వేస్తున్నాయి. దోమలు, దుర్వాసనతో డెంగీ, కలరా, మలేరియా, జ్వరాల బారిన పడుతున్నారు. డంపింగ్ యార్డులు నిరుపయోగం జిల్లాలోని 255 గ్రామాల్లో డంపింగ్యార్డులు నిర్మించారు. కానీ చాలా యార్డులు వృథాగానే ఉన్నాయి. తడి, పొడి చెత్తను వేరుచేసి, ఎరువులను తయారు చేయడం తగ్గిపోయింది. సిరిసిల్ల, వేములవాడ వంటి పట్టణాల్లో చెత్త నుంచి కరెంట్ ఉత్పత్తి చేసే ప్రక్రియ ఉన్నప్పటికీ అది గాలిని కలుషితం చేస్తుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్, కాగితం, గాజు, లోహాలను వేరుచేసి రీసైక్లింగ్కు పంపించాలి. ప్రజలను చైతన్యపరచడం ద్వారానే చెత్త, వ్యర్థాలను నిర్మూలించవచ్చు. ముఖ్యంగా ఫంక్షన్హాల్స్లో పెద్ద ఎత్తున జరిగే శుభకార్యాల్లో టన్నుల కొద్ది ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు ఉపయోగిండం, వాటిని నేరుగా డంపింగ్యార్డులకు తరలిస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదం. గంభీరావుపేట, ముస్తాబాద్, బోయినపల్లి, చందుర్తి, ఎల్లారెడ్డిపేట, వేములవాడ అర్బన్, ఇల్లంతకుంటల్లో పారిశుధ్య, చెత్త సమస్య అధికంగా ఉంది. చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలతో జిల్లాలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పారిశుధ్య నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించాలి. చెత్తను, ప్లాస్టిక్ను కాల్చకుండా ఎరువులు తయారు చేసేలా చర్యలు తీసుకోవాలి. శ్వాసకోస వ్యాధులే కాకుండా, క్యాన్సర్, చర్మవ్యాధులు ప్రబలుతున్నాయి. గాలి, నీరు కలుషితం కాకుండా చూసుకోవాలి. – డాక్టర్ చింతోజు శంకర్ -
ఆలయ పనులు వేగంగా చేయాలి
● కలెక్టర్ గరీమా అగ్రవాల్ వేములవాడ: వీటీఏడీఏ ఆధ్వర్యంలో చేపడుతున్న రాజన్న ఆలయం, నిత్యాన్నదాన సత్రం, బద్దిపోచమ్మ ఆలయ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. ఆర్అండ్బీ, ఇతర శాఖల అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. డ్రైనేజీ, విద్యుత్ టవర్లు, రోడ్డు పనులపై ఆరా తీశారు. ఆయా శాఖల అధికారులతో కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. పనులు వేగంగా పూర్తి చేసేందుకు కూలీల సంఖ్య పెంచాలని సూచించారు. ఆలయ ఈవో రమాదేవి, వేములవాడ ఆర్డీవో కేఎస్బీ కుమారి, ఆర్అండ్బీ ఎస్ఈ భీమ్లానాయక్, డీఈ శాంతయ్య, మున్సిపల్ కమిషనర్ లోకేశ్, నీటి పారుదలశాఖ అధికారి దయాకర్, తహసీల్దార్ జయంత్ ఉన్నారు. -
బీఆర్ఎస్ అసత్యాలు తిప్పికొడతాం
సిరిసిల్లటౌన్: బీఆర్ఎస్ నేతల అసత్య ప్రచారాలు తిప్పికొడతామని టీపీసీసీ అధికార ప్రతినిధి మేడి రవిచంద్ర పేర్కొన్నారు. జిల్లా కాంగ్రెస్ ఆఫీస్లో శుక్రవారం నిర్వహించిన ప్రెస్మీట్లో మాట్లాడారు. పోలీసులపై బీఆర్ఎస్ నాయకుల దౌర్జన్యం, ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్రెడ్డి స్పీకర్పై అసభ్యంగా మాట్లాడడం వంటి ఘటనలను ప్రజలు ఛీకొడుతున్నారన్నారు. బీజేపీ, బీఆర్ఎస్లు ఒకే గూటి పక్షుల్లా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దళితులకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరారు. కేటీఆర్ నిత్యం అబద్ధాలు ఆడుతూ సీఎం రేవంత్రెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, పట్టణాధ్యక్షుడు సూర దేవరాజు, ఫ్లోర్లీడర్ ఆడెపు చంద్రకళ, ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకునూరి బాలరాజు పాల్గొన్నారు. -
మట్టి గణపతిని పూజిద్దాం
● ఎస్పీ మహేశ్ బీ గీతే సిరిసిల్ల: మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదామని ఎస్పీ మహేశ్ బీ గీతే కోరారు. గణేశ్ నవరాత్రుల సందర్భంగా పోలీ స్ అధికారులు, సిబ్బందికి శుక్రవారం మట్టి వినాయడి ప్రతిమలను పంపిణీ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలిగించే పదార్థాలతో తయారైన విగ్రహాలను ఏర్పాటు చేయొద్దని కోరారు. మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలు పాటిస్తూ శాంతియుత వా తావరణంలో ఉత్సవాలు నిర్వహించాలన్నారు. ఎస్బీ సీఐ రవికుమార్ పాల్గొన్నారు. కుడికాలువకు నీటిని విడుదల చేయాలి ఇల్లంతకుంట(మానకొండూర్): మిడ్మానేరు కుడికాలువ ద్వారా నీటిని విడుదల చేయాలని కోరుతూ మండలంలోని గాలిపల్లి, తాళ్లపల్లి రై తులు శుక్రవారం గాలిపల్లిలో ధర్నాకు దిగారు. రైతులు మాట్లాడుతూ కుడికాలువపై ఆధారపడి వందలాది ఎకరాల్లో వరిపంట వేశామని, నీటిని విడుదల చేయకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లంతకుంట ఎస్సై ఉపేంద్రచారి, మిడ్మానేరు డీఈ సూర్యప్రకాశ్, ఏఈ వంశీ అక్కడికి వచ్చి రైతులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో శాంతించా రు. రెండు, మూడు రోజుల్లో సమస్య పరి ష్కారం కాకుంటే పెద్ద ఎత్తున ధర్నాకు దిగుతా మని హెచ్చరించారు. గాలిపల్లి సర్పంచ్ బద్దం శేఖర్రెడ్డి, ఎల్లారెడ్డి, శ్రీనివాస్, రాజమల్లు, నరేశ్, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. నాణ్యమైన వైద్యసేవలు అందించాలి వేములవాడరూరల్: నాణ్యమైన వైద్యసేవలందించాలని డీఎంహెచ్వో ఏంజెలా ఆల్ఫైడ్ సూ చించారు. వేములవాడ పరిధిలోని శాత్రాజుపల్లి ఆరోగ్య ఉపకేంద్రాన్ని శుక్రవారం సందర్శించా రు. మాత, శిశు ఆరోగ్య సేవలు, టీకాల కార్యక్రమం, మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధుల నివారణ చర్యలపై దృష్టి సారించారు. టీబీ ముక్త్ భారత్లో భాగంగా అవగాహన కల్పించాలని సూచించారు. డీపీవో రాజేందర్, సూపర్వైజర్ రాజయ్య, గంగమరాజు ఉన్నారు. ఎరువులు అందుబాటులో ఉంచాలి బోయినపల్లి(చొప్పదండి): రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉంచాలని డీఏ వో అఫ్జల్బేగం అన్నారు. మండలంలోని వెంకట్రావుపల్లి, ప్యాక్స్ నర్సింగాపూర్, బోయినపల్లి లోని విత్తన, ఎరువుల దుకాణాల్లో శుక్రవారం తనిఖీ చేశారు. విలాసాగర్లో డిజిటల్ క్రాప్ సర్వే నమోదు పరిశీలించారు. ఎంఏవో ప్రణీత, ఏఈవోలు రవళి, హరీష్ ఉన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపొద్దు వేములవాడ: మందు సేవించి వాహనాలు నడిపితే జైలుకు వెళ్లాల్సిందేనని వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ హెచ్చరించారు. డ్రంకెన్డ్రైవ్ తనిఖీలలో పట్టుబడ్డ 182 మందుబాబులను శుక్రవారం వేములవాడ కోర్టులో హాజరుపరి చారు. వీరికి మేజిస్ట్రేట్ మేఘన జరిమానాలు విధిస్తూ తీర్పు వెల్లడించినట్లు చెప్పారు. 52 మందికి ఒక్కొక్కరికి రూ.4వేల చొప్పున, 26 మందికి ఒక్కొక్కరికి రూ.5వేలు, 45 మందికి ఒక్కొక్కరికి రూ.3వేలు, 59 మందికి ఒక్కొక్కరికి రూ.2వేల చొప్పున జరిమానా విధించినట్లు చెప్పారు. అంతకుముందు మద్యం సేవించి పట్టుబడిన వారికి పోలీస్స్టేషన్ ఆవరణలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ట్రాఫిక్ ఆర్ఎస్సై దిలీప్కుమార్, సిబ్బంది ఉన్నారు. -
మహిళలు పారిశ్రామికవేత్తలుగా రాణించాలి
సిరిసిల్ల: మహిళలు పారిశ్రామికవేత్తలుగా రాణించాలని యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(యూఎన్ఐడీవో) ప్రతినిధి దేవజిత్దాస్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం యూఎన్ఐడీవో ఆధ్వర్యంలో జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సంస్థ(ఎన్ఐ–ఎంఎస్ఎంఈ) ఆధ్వర్యంలో మహిళలకు ఒక్క రోజు శిక్షణ నిర్వహించారు. దేవజిత్ దాస్ మాట్లాడుతూ మహిళల ఆధ్వర్యంలో పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. మహిళలు పొదుపు సంఘాలు, స్వయం సహాయక సంఘాల అనుసంధానంతో బ్యాంకు రుణాలు పొందవచ్చని, సంక్షేమ పథకాలను, సామాజిక భద్రత సౌకర్యం లభిస్తుందన్నారు. సూక్ష్మ బీమాపైనా అవగాహన పెంచుకోవాలన్నారు. ఎల్డీఎం రాజీవ్కుమార్, వివిధ సంస్థల ప్రతినిధులు అరవింద్రావు, కె.సూర్యప్రకాశ్గౌడ్, శరత్ ముత్యాల, జిగ్నేశ్ డేవ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉండలేకపోతున్నాం
ముస్తాబాద్ డంపింగ్ యార్డులో చెత్తను కాల్చడంతో పొగ విపరీతంగా వస్తుంది. రత్నాలకుంట, మానేరు కెనాల్లోకి మురుగుచేరి దుర్వాసన వస్తోంది. దోమలు, ఈగలతో జ్వరాలు వస్తున్నాయి. డంపింగ్యార్డులో చెత్తను కాల్చకుండా నిర్వీర్యం చేసేలా చర్యలు తీసుకోవాలి. – మాడూరి కిషన్, ముస్తాబాద్డంపింగ్యార్డును శుద్ధి చేశాం ముస్తాబాద్ డంపింగ్యార్డులో 20 ఏళ్లుగా పేరుకుపోయిన వ్యర్థాలు, చెత్తను సగానికి పైగా తొలగించాం. చెత్తను రీసైక్లింగ్ చేసే వ్యవస్థ ఖరీదైనది. ఎనిమిది నెలలుగా పారిశుధ్య చర్యలు తీసుకోవడంలో సిబ్బంది, మేము శ్రమిస్తున్నాం. మేజర్ పంచాయతీని పరిశుభ్రంగా ఉంచుతున్నాం. – మట్ట వెంకటేశ్వర్రెడ్డి, సర్పంచ్, ముస్తాబాద్ -
రోడ్డెక్కిన రైస్మిల్లర్లు
సిరిసిల్ల: జిల్లాలో రైస్మిల్లర్లు శుక్రవారం రోడ్డెక్కా రు. రైస్మిల్లులను బంద్చేసి అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. జిల్లా రైస్మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు పబ్బ నాగరాజు మాట్లాడుతూ ఎఫ్ఏక్యూ ధాన్యం మిల్లర్లకు ఇవ్వాలని, ఎఫ్సీఐ టెక్నికల్ స్టాప్ ద్వారా టెస్ట్ చేయాలన్నారు. సార్టెక్స్ రిజక్షన్స్ను మిల్లులకు అందించిన ధాన్యంలో తొలగించాలని, సీఎంఆర్లో 25 ఫెనాల్టీ, 12 శాతం వడ్డీని రద్దు చేయాలని కోరారు. మిల్లింగ్ చార్జీలను ఇతర రాష్ట్రాల తరహాలో రా రైస్కు క్వింటాలుకు రూ.100, బాయిల్డ్ రైస్ మిల్లులకు రూ.150 ఇవ్వాలని నాగరాజు కోరారు. రైస్ మిల్లులకు 125 హెచ్ పీ ఎల్టీ విద్యుత్ లైన్ సరిపోవడం లేదని 210 హెచ్పీ వరకు ఎల్టీ విద్యుత్గా పరిగణించాలని విన్నవించారు. గన్నీ రేట్లను రూ.50గా నిర్ధారించా లని, ఎఫ్సీఐ నిబంధనలు సరళతరం చేయాలన్నారు. ఖరీఫ్ ధాన్యాన్ని రా రైస్గా, రబీ ధాన్యాన్ని బాయిల్డ్ రైస్గా తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లుల్లో షార్ట్ఫాల్ను 20 శాతం మేరకు పెంచాలని, ధాన్యం బకాయిలను ఎంఎస్పీ ప్రకారం చెల్లిస్తామని రైస్ మిల్లర్లు స్పష్టం చేశారు. ఈమేరకు 14 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్కు అందించారు. రైస్మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు ఎస్.రాజిరెడ్డి, సీ.హెచ్.శ్రీనివాస్, గరిపెల్లి ప్రభాకర్, పి.అనిల్రావు, వి.వంశీధర్రావు, పి.సత్యంరావు, బందం అంజయ్య, మల్లేశం, అనంతుల శ్రీనివాస్, నగునూరి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
కొడుకు, అమ్మ చనిపోయారు
ఆ దుర్ఘటన జరిగిన రోజు మా బాబు అరుణ్ సాయి(5)కి జ్వరం రావడంతో మా అమ్మ భాగ్యమ్మ(45)తో కలిసి హాస్పిటల్కు బస్సులో బయల్దేరాం. కిక్కిరిసిన బస్సు అదుపుతప్పడంతో అందరూ అరవడం మాత్రమే గుర్తుంది. లేచేసరికి హాస్పిటల్లో బెడ్పై ఉన్నాను. ఈ ప్రమాదంలో నా కొడుకు అరుణ్సాయి, మా అమ్మ భాగ్యమ్మను కోల్పోయాను. ఆ విషయం రెండు రోజుల వరకు నాకు చెప్పలేదు. నా కొడుకు వయసు ఉన్న స్కూల్కి వెళ్లే పిల్లలను చూస్తే ప్రాణం విలవిల్లాడుతోంది. చేతికి పలుచోట్ల రాడ్లు పడడంతో ఏ పని చేయలేకపోతున్నాను. నేను ఇంటర్ వరకు చదువుకున్నాను. ప్రభుత్వం దయ తలసి ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పించాలని కోరుతున్నాను. – కొండ శైలజ, హిమ్మత్రావుపేట -
గణేశ్ నవరాత్రులు వైభవంగా నిర్వహిద్దాం
● ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాటు చేయాలి ● కలెక్టర్ గరీమా అగ్రవాల్సిరిసిల్ల: గణేశ్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిద్దామని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. కలెక్టరేట్లో గురువారం ఎస్పీ మహేశ్ బీ గీతే, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్లతో కలిసి సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో గణేశ్ నవరాత్రి వేడుకలు విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. మున్సి పల్, విద్యుత్, మత్స్య, పోలీస్, రవాణా, ఆర్ అండ్ బీ, నీటి పారుదల, వైద్య ఆరోగ్య శాఖల ఆధ్వర్యంలో చేపట్టే ఏర్పాట్లపై చర్చించారు. నిమజ్జనం సందర్భంగా క్రేన్స్, జేసీబీలు, విద్యుత్దీపాలు, నీటి సదుపాయం కల్పించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఎస్పీ మహేశ్ బీ గీతే మాట్లాడుతూ మండపాల నిర్వాహకులు తమ వివరాలు పోలీస్ శాఖ వెబ్సైట్లో నమోదు చేయాలని సూచించారు. ఆర్డీవోలు శ్రీధర్బాబు, కేఎస్బీ కుమారి, డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి హిమశ్రీ, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీని వాస్రెడ్డి, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, ఈఈ పీఆర్ సుదర్శన్రెడ్డి, నీటి పారుదల శాఖ అధికారి దయాకర్, వేములవాడ మున్సిపల్ కమిషనర్లు ఖదీర్పాషా, లోకేశ్, తహసీల్దార్లు మహేశ్, జయంత్, కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రవీణ్ పాల్గొన్నారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్ల ప్రణాళిక సిద్ధం చేయాలి జిల్లాలో ఖరీఫ్(వానాకాలం) సీజన్ ధాన్యం కొనుగోళ్లకు ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో 2.40 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని, 236 కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. అక్టోబరు చివరి వారంలో వడ్లు చేతికి వస్తాయని గన్నీసంచులు, ప్యాడీ క్లీనర్లు, వెయింగ్ మి షన్లు, తేమయంత్రాలు సిద్ధం చేయాలని, లారీల కాంట్రాక్టర్లు ఒప్పందం మేరకు లారీలను సిద్ధం చే యాలని సూచించారు. అదనపు కలెక్టర్ గడ్డం నగే శ్, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు శ్రీధర్బాబు, కేఎస్బీ కుమారి, డీసీఎస్వో బుచ్చిబాబు, డీఎం గోపాల్, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, జిల్లా సహకారశాఖ అధికారి రామకృష్ణ, వ్యవసాయశాఖ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా మార్కెటింగ్శాఖ అధికారి ప్రకాశ్, మార్క్ఫెడ్ అధికారి హబీబ్ పాల్గొన్నారు. ఆరోగ్య ఉపకేంద్రాలు పూర్తిచేయాలి జిల్లాలో ఆరోగ్య ఉపకేంద్రాల పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎన్హెచ్ఎం, 15వ ఆర్థిక సంఘం నిధులు ఇతర నిధులతో చేపట్టిన పనులపై సమీక్షించారు. 10 ఆరోగ్య ఉపకేంద్రాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని, మరో ఆరు భవనాలు తుది దశలో ఉన్నాయని అధికారులు వివరించారు. పీఆర్ ఈఈ సుదర్శన్రెడ్డి, టీజీఎంఎస్ ఐడీసీ ఈఈ విశ్వప్రసాద్, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్ పాల్గొన్నారు. ఆత్మహత్యల నివారణ పోస్టర్ ఆవిష్కరణ మానసిక ఒత్తిడి, మానసిక సమస్యలతో బాధపడేవారు మనోధైర్యంతో ముందుకుసాగాలని కలెక్టర్ కోరారు. ఆత్మహత్యల నివారణ దినం సందర్భంగా కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నంబర్ 14416 పోస్టర్లను ఎస్పీ మహేశ్ బీ గీతే, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్తో కలిసి ఆవిష్కరించారు. డాక్టర్ నయీమా జహా ఉన్నారు. మట్టి వినాయక విగ్రహాలను పూజించాలి పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను పూజించాలని కలెక్టర్ కోరారు. కలెక్టరేట్లో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఉచితంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్, ఎస్పీ చేతుల మీదుగా ప్రారంభించారు. మట్టివిగ్రహాలను పూజించాలనే పోస్టర్లను ఆవిష్కరించారు. జిల్లాలో రెండు వేల మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తామన్నారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఏఈఈ శ్రావణ్ పాల్గొన్నారు. -
కలలోనూ వెంటాడుతోంది
నా పేరు గోల్కొండ విజయ(58). మాది డబ్బు తిమ్మాయపల్లి గ్రామం. నా కూతురు సుమలత గర్భవతి కావడంతో ఆ రోజు హాస్పిటల్లో చూయించుకునేందుకు పయనమయ్యాం. క్షణాల్లో బస్సు బోల్తాపడడంతో జనాలు నాపై పడడంతో చేతులు, పక్కటెముకలు విరిగిగాయి. వెన్నుపూసకు గాయమై కదలలేని పరిస్థితుల్లో ఉన్న. నాపై నుంచి శవాలను తీసుకువెళ్తున్న దృశ్యం ఇంకా కళ్లలో మెదులుతోంది. ప్రమాదంలో నా బిడ్డను కోల్పోయా. నేను హాస్పిటల్లో ఆరు నెలలు ఉన్నా. ఇంటికి వచ్చేవరకు నా బిడ్డ చనిపోయిన విషయం నాకు చెప్పలేదు. ఇప్పటికీ ఆ ప్రమాదం కలలోనూ వెంటాడుతోంది. శరీరంలో పలుచోట్ల రాడ్లు వేసి ఆపరేషన్ చేయడంతో ఏ పని చేయలేకపోతున్నాను. నిలబడ్డానికి కూడా చేతనైత లేదు. పెద్ద సార్లు దయ తలచి నాకు పింఛన్ ఇప్పించాలని విన్నపం. – విజయ, తిమ్మాయపల్లి -
● సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి
ముస్తాబాద్(సిరిసిల్ల): ప్రశాంత వాతావరణంలో గణేశ్ ఉత్సవాలు నిర్వహించుకోవాలని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి సూచించారు. ముస్తాబాద్ పోలీస్స్టేషన్లో గణేశ్ ఉత్సవ నిర్వాహకులతో గురువారం సమావేశమయ్యారు. డీఎస్పీ మాట్లాడుతూ మండపాల వద్ద ప్రమాదాలు జరగకుండా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని, తొమ్మిది రోజులపాటు హిందూ సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించుకోవాలన్నారు. ఐక్యత, భక్తిభావం చాటేలా స్థానిక డప్పు కళాకారులతో శోభాయాత్ర నిర్వహించాలని సూచించారు. డీజేలకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. నిమజ్జనం సమయంలో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సీఐ నాగేశ్వర్రావు, తహసీల్దార్ ఫారూఖ్, ఎంపీడీవో లచ్చాలు, ఎస్సై జ్యోతి, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, సర్పంచ్లు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ ఎత్తివేయాలి
● పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య సిరిసిల్లటౌన్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ను ఎత్తివేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య డిమాండ్ చేశారు. సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో గురువారం ప్రెస్మీట్లో మాట్లాడారు. ఎరవెల్లిలో కేసీఆర్ ఇంటిపైకి కాంగ్రెస్ రౌడీలు, గూండాలను రేవంత్ స ర్కారు ఉసిగొల్పడం దారుణమన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులపై గన్నుపెట్టిన చరిత్ర రేవంత్రెడ్డిదన్నారు. చావు నోట్ల తలపెట్టి తెలంగాణ సాధించిన చరిత్ర కేసీఆర్ది అని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో రేవంత్రెడ్డికి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్, నాయకులు బొల్లి రా మ్మోహన్, మీసరగండ్ల అనిల్కుమార్, కుంబా ల మల్లారెడ్డి, దిడ్డి రాజు, మ్యాన రవి, బాలమ ల్లు, సాయికుమార్, కందుకూరి రామాగౌడ్, అనిల్గౌడ్, మొగిలి నాగరాజు పాల్గొన్నారు. ఒత్తిడి లేని జీవితం గడపాలి సిరిసిల్లటౌన్: కార్మికులు ఒత్తిడి లేని జీవితం గడపాలని సైకాలజిస్ట్ కె.పున్నంచందర్ పేర్కొన్నారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. సమస్యలు ఎదురైనప్పుడు ఒంటరిగా భరించకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులు, నిపుణులతో తమ ఆలోచనలు, భావాలను పంచుకోవాలని సూచించారు. సామాజిక కార్యకర్త వేముల మార్కండేయులు, మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్ సిబ్బంది రాపెల్లి లత, బూర శ్రీమతి, కొండ ఉమ తదితరులు పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధికి విరాళం వేములవాడ: రాజన్న ఆల అభివృద్ధి, విస్తరణ పనులకు మహారాష్ట్రలోని పర్భణికి చెందిన మనోజ్ ప్రకాశ్రావు రూ.51,111 విరాళంగా అందించారు. ఆలయ అకౌంట్స్ అడ్వయిజర్ ఆగంరావుకు గురువారం అందజేశారు. అనంతరం దాతకు అర్చకులు స్వామి వారి ప్రసాదం, ఆశీర్వచనం అందించారు. సాయుధ పోరాట వారోత్సవాలు సిరిసిల్లటౌన్: వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తి తో సిరిసిల్లలో వారం రోజులపాటు తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహించనున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్ పేర్కొన్నారు. సిరిసిల్లలో చాకలి ఐలమ్మ విగ్రహానికి గురువారం నివాళి అర్పించి మాట్లాడారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం జరిగిన పోరాట స్ఫూర్తితో జిల్లాలోని సమస్యలపై పోరాడుతామన్నారు. నాయకులు సూరం పద్మ, ఎలిగేటి రాజశేఖర్, శ్రీరాం సదానందం, బింగి సంపత్, ఆడెపు రజిత, పులి గోపాల్, గుండేటి వెంకటేశం, వడ్నాల వీరేశం, బోనాల రాజు, చిరంజీవులు, మార్కండేయులు పాల్గొన్నారు. మండపాల వద్ద నిబంధనలు పాటించాలిసిరిసిల్ల అర్బన్: గణేశ్ మండపాల వద్ద విద్యుత్ భద్రత నిబంధనలు పాటించాలని జిల్లా ఎస్ఈ శ్రీనివాస్రావు సూచించారు. మండపాల నిర్వాహకులు విగ్రహం ఎత్తును విద్యుత్ శాఖకు తెలియజేయాలని కోరారు. లైన్ల కింద మండపాలు ఏర్పాటు చేయరాదని, నాణ్యమైన వైర్లు, సరైన ఎర్తింగ్ వినియోగించాలని సూచించారు. స్తంభాలకు మండపాలు తగలకుండా చూడాలని, సర్వీస్ కేబుళ్లకు హుక్కులు ఉపయోగించరాదన్నారు. తడి చేతులతో స్విచ్లు, బోర్డులు తాకవద్దని తెలిపారు. మండపాల వద్ద వలంటీర్లను అందుబాటులో ఉంచాలన్నారు. ప్రమాదాలు జరిగిన వెంటనే విద్యుత్ టోల్ ఫ్రీ 1912కు సమాచారం అందించాలని కోరారు. -
రామగుండం గ్రిడ్ ఫెయిల్యూర్.. చీకట్లో దక్షిణ భారతం
కొండగట్టు ప్రమాద దృశ్యం (ఫైల్)ఎన్టీపీసీ పవర్ప్లాంట్2001, సెప్టెంబరు 11న అమెరికాలో ని ట్విన్ టవర్స్పై ఉగ్రదాడులు జరిగాయి. సరిగ్గా అదే రోజు ప్రస్తుత పెద్దపల్ల్లి జిల్లా ఎన్టీపీసీ రామగుండంలో సాంకేతిక సమస్య తలెత్తింది. సదరన్ గ్రిడ్ ఫెయిల్యూర్ వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిమ్మచీకట్లోకి జారిపోయింది. దీని ప్రభావం తమిళనాడు, కర్ణాటక, కేరళపైనా పడింది. ఫలితంగా రాష్ట్రమంతా కరెంటు లేదు. రైల్వే, కమ్యూనికేషన్స్, ఆపరేషన్లు కష్టంగా మారాయి. సాధారణ శస్త్రచికిత్సలు వాయిదాపడ్డాయి. అత్యవసరమైనచోట జనరేటర్లతో సర్దుకున్నారు. పత్రిక కార్యాలయాలు, టీవీ మీడియా ఆఫీసులు కరెంటు కష్టాలు చవిచూశాయి. బహుళ అంతస్తులు, అపార్ట్మెంట్ ప్రజలు లిఫ్టులు పనిచేయక ఇబ్బందులు పడ్డారు. మరునాడు రాత్రికి గ్రిడ్ పునరుద్ధరించారు. అప్పటి వరకూ అమెరికాపై దాడులు జరిగిన సంగతి దక్షిణ భారతవాసులకు తెలియకపోవడం గమనార్హం. ప్రపంచానికి నిరంతరం వెలుగులు పంచే రామగుండం ఎన్టీపీసీ ప్లాంట్లో దాదాపు రెండు రోజులపాటు విద్యుత్తు ఉత్పత్తి ఆగిపోవడం అదే తొలిసారి, చివరిసారి. సెప్టెంబరు 11న అమెరికాలో ఉగ్రదాడులు.. మనవద్ద కరెంటు పోవడంతో ప్రజల ఆందోళనతో అనేక పుకార్లు షికార్లు చేశాయి.25 ఏళ్ల క్రితం జరిగిన ఘటన మాకు ఇప్పటికీ షాకింగే. కరెంటు ఎందుకుపోయిందో తెలియదు. ఎప్పుడు వస్తుందంటే అధికారులు చెప్పలేమన్నారు. ఏదో పెద్ద సమస్య అని అర్థమైంది. షెడ్యూల్ ప్రకారం.. ఎమర్జెన్సీ ఆపరేషన్లను అవాయిడ్ చేయలేదు. కొన్ని జనరేటర్లు పెట్టి చేసేశాం, మరికొందరు వైద్యులు చీకటి ఉన్నా.. టార్చ్లైట్లు పెట్టి ఆపరేషన్లు పూర్తి చేశారు. కొన్నింటిని వాయిదా వేశాం. నా సర్వీసులో గోదావరిఖనిలో రెండు రోజులపాటు కరెంటు పోయిన సందర్భం అదే. అమెరికాపై ఉగ్రదాడి జరిగి వందలాదిమంది మరణించిన రోజు కావడంతో సెప్టెంబరు 11ను అంత తేలిగ్గా మర్చిపోలేం. – డాక్టర్ నిరంజన్, గోదావరిఖని 2018 సెప్టెంబరు 11.. అప్పటి అధికార టీఆర్ఎస్ పార్టీ.. తెలంగాణ ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో రాష్ట్రంలో ఎలక్షన్ వేడి మొదలైంది. జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (జగిత్యాల– శనివారంపేట సర్వీసు) కొండగట్టు వద్ద సామర్థ్యానికి మించి దాదాపు 100 మందికిపైగా ప్రయాణికులతో గుట్ట ఘాట్ రోడ్డు దిగుతోంది. ఆఖరు మలుపు వద్ద అదుపుతప్పి మట్టి కోసం తీసిన 12 అడుగుల గొయ్యిలో పడింది. చాలామంది ఒకరిపై ఒకరు పడిపోయారు. ఊపిరాడక, అంతర్గత గాయాలు, రక్తస్రావంతో 60మందికిపైగా మరణించారు. దేశంలోని ఏ రాష్ట్ర ఆర్టీసీ చరిత్రలోనూ ఇంతటి ప్రాణనష్టం జరగలేదు. హిమాచల్ప్రదేశ్, డార్జిలింగ్ వంటి ఎత్తయిన పర్వతాలు, లోయలున్న ప్రాంతాల్లో బస్సు పడిన ఘటనల్లోనూ ఈ స్థాయిలో ప్రాణనష్టం సంభవించకపోవడం గమనార్హం. బాధిత కుటుంబాలకు, క్షతగాత్రులకు నష్టపరిహారం అందినా.. వారి కుటుంబాలు రోడ్డు ప్రమాదం రూపంలో తగిలిన దెబ్బ నుంచి ఇంకా కోలుకోవడం లేదు. -
భిక్షాటనకో లెక్కుంది !
భిక్షాటన.. గంగిరెద్దుల వారి జీవనవిధానం. ఆచారం..వంశాచారంగా భావిస్తూ గంగిరెద్దులను పట్టుకొని ఊరూరా సంచార జీవనం గడుపుతుంటారు. అయితే భిక్షాటనలోనూ వీరు హద్దులు పెట్టుకున్నారు. దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీగా ఊర్లను పంచుకొని భిక్షాటనకు వెళ్తున్నారు. ఎవరైనా హద్దులు దాటి ఇతరుల పరిధిలోకి వచ్చి యాచిస్తే భారీ జరిమానా చెల్లించాల్సిందే. రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్థిరనివాసం ఏర్పరచుకుని ఏళ్లుగా భిక్షాటనతో సంచార జీవనం సాగిస్తున్న గంగిరెద్దుల కుటుంబాల జీవనశైలిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. – సిరిసిల్ల -
బెనిఫిట్స్ ఇవ్వాలి
రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ పొందడంలో కోర్టుతో నిమిత్తం లేకుండా నేరుగా ఏకమొత్తంలో చెల్లించాలి. 2024 నుంచి రిటైర్డ్ అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల బకాయిలు ఒకేసారి విడుదల చేయాలి. మూడేళ్లుగా ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించలేదు. – మల్లారపు పురుషోత్తం, ఆర్ఈడబ్ల్యూఏ జిల్లా అధ్యక్షుడు ఈహెచ్ఎస్లో తప్పులు సరిదిద్దాలి విశ్రాంత ఉద్యోగులకు ఎంప్లాయి హెల్త్ స్కీం (ఈహెచ్ఎస్)లో తప్పులు సరిదిద్ది కార్పోరేట్ వైద్యం అందించాలి. పెండింగ్లో ఉన్న ఆరు డీఏలు, బకాయిల డబ్బులు ఖాతాల్లో జమచేయాలి. కొత్త పీఆర్సీ ప్రకటించాలి. – ద్యావనపల్లి పరమేశ్, ఆర్ఈడబ్ల్యూఏ జిల్లా కార్యదర్శి -
రైతు అనుమానాస్పద మృతి
తంగళ్లపల్లి(సిరిసిల్ల): సిరిసిల్ల పట్టణం విద్యానగర్కు చెందిన రైతు జంగిటి శ్రీనివాస్(57) చింతల్ఠాణా శివారులోని తన పొలంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. బుధవారం ఉదయం పశువుల గడ్డి కోసం పొలానికి వెళ్లిన ఆయన సాయంత్రం 7 గంటలైనా ఇంటికి తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు పక్క పొలం వారికి ఫోన్ చేశారు. వారు వెళ్లి చూడగా శ్రీనివాస్ పొలంలో విగతజీవిగా పడి ఉన్నాడు. శ్రీనివాస్ మరణానికి గుండెపోటు కారణమా లేదా మరేదైనా అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. తంగళ్లపల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. సమగ్ర విద్యావిధానంపై శిక్షణసిరిసిల్లటౌన్: జిల్లా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో బుధవారం ఒక్క రోజు ఓరియంటేషన్ నిర్వహించారు. పద్మనాయక ఫంక్షన్హాల్లో ఎంఈవోలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, సీసీవోలు, సీఆర్పీలకు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్(సమగ్ర విద్యా విధానం)పై జరిగిన వర్క్షాప్లో ప్రశస్తయాప్, స్వచ్ఛ హరిత విద్యాలయ, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్పై అవగాహన కల్పించారు. జిల్లా విద్యాధికారి శ్రీరామ్ మొండయ్య, సెక్టోరియల్ ఆఫీసర్ పాషికంటి సతీశ్కుమార్, ఫిజియోథెరపిస్ట్ రాజేశ్, ఎంఈవోలు రామకృష్ణ, కిషన్, గంగారం, శ్రావణ్కుమార్, రఘుపతి, రవీందర్, మనోహర్రెడ్డి, కపిల నరేశ్ పాల్గొన్నారు. చోరీ కేసులో మరో నిందితుడి అరెస్టుగంగాధర: తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగల ముఠాలోని మరో నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్సై వంశీకృష్ణ పేర్కొన్నారు. గతంలో దొంగతనానికి పాల్పడిన నిందితుల్లో ఒకరైన గజవెల్లి వంశీ బుధవారం మధురానగర్లో దొంగతనం చేయడానికి వచ్చి, పోలీసులకు చిక్కాడు. తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చేసుకొని ఇటీవల దొంగతనానికి పాల్పడిన కొండ శశికాంత్, సీహెచ్.సంతోష్, గజవెల్లి వంశీతో కూడిన ముఠాపై నిఘా వేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న కొండ శశికాంత్ను ఇప్పటికే అరెస్టు చేయగా, వంశీని సైతం అదుపులోకి తీసుకుని, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న సంతోష్ కోసం గాలిస్తున్నారు. గంజాయి విక్రయ కేసులో ఐదేళ్ల జైలుకరీంనగర్ క్రైం: గంజాయితో పోలీసులకు పట్టుబడిన వ్యక్తికి ఐదేళ్ల జైలు, రూ.1,000 జరిమానా విధిస్తూ కరీంనగర్ మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి వెంకటేశ్ బుధవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం జగిత్యాలలోని తులసీనగర్కు చెందిన జంబార్తి ఈశ్వర్(24) శుభకార్యాలకు డెకరేషన్ పనులు చేసేవాడు. ఆర్థిక ఇబ్బందులతో గంజాయి విక్రయించి ఎక్కువ డబ్బు సంపాదించాలనుకున్నాడు. 2022 అక్టోబర్ 17న గంజాయి విక్రయించేందుకు మానకొండూర్ చెరువు కట్ట వద్దకు వెళ్లాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఈశ్వర్ను అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి కిలోకు పైగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేయగా, అప్పటి సీఐ ఎం.రాజ్కుమార్ దర్యాప్తు చేపట్టారు. సాక్షులను సీఎంఎస్ హెడ్ కానిస్టేబుల్ రాజేందర్, కోర్టు పీసీ మౌనిక న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి.శరత్ సాక్షులను విచారించారు. ఈశ్వర్ నేరానికి పాల్ప డినట్లు నిర్ధారించిన న్యాయమూర్తి ఐదేళ్ల జైలు, రూ.1,000 జరిమానా విధించారు. ఒకరిపై దాడిచేసిన ముగ్గురిపై కేసుజగిత్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని మంచినీళ్ల బావి వద్ద మంగళవారం రాత్రి పురాణం పవన్కుమార్పై దాడిచేసిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై కుమారస్వామి తెలిపారు. కరీంనగర్ సమీపంలోని దుర్శేడ్కు చెందిన పురాణం పవన్కుమార్ ట్రాలీ వాహనం నడుపుతుంటాడు. మంగళవారం ఆయిల్ కాటన్స్ తీసుకుని మెట్పల్లి వెళ్లి తిరిగి కరీంనగర్ వెళ్తుండగా మంచినీళ్ల బావివద్ద గొల్లపల్లి మండలం వెంగళాపూర్కు చెందిన దొనకంటి నరేశ్, లక్ష్మీపూర్కు చెందిన సంతోష్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి అతివేగంగా ఎందుకు వెళ్తున్నావంటూ వాహనాన్ని ఆపి దాడిచేశారు. బాధితుని ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ఘనంగా శ్రావణ పూజలు
వేములవాడ: భీమేశ్వరస్వామి ఆలయంలో బుధవారం శ్రావణమాస పూజలు వైభవంగా నిర్వహించారు. రాజన్న ఆలయంలో ఏకాంతంగా విశేష పూజలు చేయగా, భక్తుల కోసం భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణ మాసమంతా జరిగిన నిత్య రుద్రాభిషేక పూజా ఫలాలను సమర్పిస్తూ 11 మంది రుత్వికులతో 121 రుద్రాలతో విశేష రుద్రహవనం నిర్వహించారు. ఆలయ ఈవో రమాదేవి, పర్యవేక్షకులు శ్రీనివాస్శర్మ, నరేందర్ తదితరులు హాజరయ్యారు. మాస శివరాత్రిని పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరిపించారు. 30 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. ఆలయంలో ఈవో తనిఖీలు భీమేశ్వరస్వామి ఆలయంలో ఈవో రమాదేవి త నిఖీలు చేపట్టారు. సౌకర్యాలపై భక్తులతో ఆరా తీశారు. ప్రసాదం తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. ఏఈవో నాగుల మహేశ్, పర్యవేక్షకులు నరేందర్, భాస్కర్, శివసాయి, రాజేందర్, సీని యర్ అసిస్టెంట్లు శ్రీనివాస్, మహేశ్ ఉన్నారు. -
పెన్షన్ కథాచిత్రం
● పీఆర్సీల జాప్యం.. ● బెనిఫిట్స్ కోసం పండుటాకుల పడిగాపులు ● ఆ‘వేదనతో’ ఉద్యోగులు రి‘టైర్డ్’సిరిసిల్లటౌన్: వారి జీవితం మొత్తం ప్రభుత్వ ఉద్యోగులుగా సేవలందించారు. ఉద్యోగ విరమణ తర్వాత శేషజీవితాన్ని ప్రశాంతంగా గడుపుదామని ఆశిస్తే ప్రభుత్వ వైఖరితో ఆందోళన చెందుతున్నారు. మూడు దశాబ్దాల శ్రమకు ఫలితం దక్కలేదన్న ఆవేదనతో కుమిలిపోతున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక వృద్ధాప్యంలో అవసరాలు తీరే పరిస్థితి కనిపించడం లేదు. మూడున్నర దశాబ్దాల కష్టాన్ని ప్రభుత్వం వద్ద వివిధ రూపాల్లో పొదుపు చేసుకుంటే వాటన్నింటికీ గ్రాట్యూటీని కలిపి రావాల్సిన సొమ్ము ప్రభుత్వం నుంచి అందడం లేదు. ఒకప్పుడు విశ్రాంత ఉద్యోగులు పొందిన బెనిఫిట్స్ మాదిరిగా ఇప్పుడు రిటైర్డ్ ఉద్యోగులకు అందడం లేదు. అయోమయంలో 2,400 మంది పెన్షనర్లు జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసి రిటైర్డ్ అయిన వారు, ఫ్యామిలీ పెన్షనర్లు మొత్తంగా 2,400 మంది ఉన్నారు. వీరంతా ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ డబ్బులపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రతీ నెల ఒకటో తారీఖున వచ్చే పెన్షన్ డబ్బులతోనే కిరాణం, మందులు, ఇతర అవసరాలు తీర్చుకుంటున్నారు. పెన్షన్ డబ్బులతోనే కుటుంబాలను వెళ్లదీసే వారు చాలా మంది ఉన్నారు. ప్రణాళికాబద్ధంగా వినియోగించుకునే కొంతమంది పెన్షనర్లు తమ జీతంపై అత్యవసర పరిస్థితుల్లో బ్యాంకులు, ఇతర సంస్థలలో రుణాలు పొంది ఉన్నారు. ప్రతీనెల మొదటి వారంలో కిస్తులు చెల్లించాల్సి ఉంటోంది. ఒక్కో నెలలో ఏదైనా కారణాలతో జీతాలు ఆలస్యంగా వస్తే రుణదాతల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పెన్షనర్లకు కూడా ప్రభుత్వం ఈహెచ్ఎస్ కార్డులు అందివ్వగా.. అత్యవసర పరిస్థితుల్లో కార్పోరేట్ వైద్యం చేయించుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందించే ఆస్పత్రుల్లో ఈహెచ్ఎస్ పనిచేయకపోవడంతో పెన్షనర్లు నగదు పెట్టి చికిత్స చేయించుకుంటున్నారు. ఇందుకు రీయింబర్స్మెంట్ పొందే అవకాశం ఉండగా.. నిధుల్లేక ఏళ్లుగా రావడం లేదు. విశ్రాంత ఉద్యోగుల డిమాండ్లు ఇవీ.. -
యోగా సంబరం
● కరీంనగర్లో 13వ రాష్ట్రస్థాయి సబ్జూనియర్, జూనియర్ పోటీలు ● ఈనెల 11, 12న నిర్వహణ ● 890 మంది క్రీడాకారుల రాకకరీంనగర్స్పోర్ట్స్: రాష్ట్రస్థాయి యోగా క్రీడలకు కరీంనగర్ వేదిక కానుంది. 13వ రాష్ట్రస్థాయి సబ్జూనియర్, జూనియర్ స్పోర్ట్స్ చాంపియన్షిప్ పోటీలకు సర్వం సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ యోగా అసోసియేషన్ ఆదేశాల మేరకు, యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ల సహకారంతో జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్తపల్లి అల్ఫోర్స్ ఈ–టెక్నో స్కూల్లో ఈ నెల 11,12న పోటీలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 400 మంది బాలురు, 400 మంది బాలికలు, 50 మంది కోచ్లు, మేనేజర్లు, 40మంది రిఫరీలు, కలిపి మొత్తం 890 మంది ఈ పోటీల్లో పాల్గొననున్నారు. 8–10, 10–12, 12–14 సంవత్సరాల సబ్జూనియర్ విభాగాలతో పాటు 14–16, 16–18 సంవత్సరాల జూనియర్ విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన 30మందిని జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. రాజస్థాన్లోని జైపూర్లో అక్టోబర్ 3 నుంచి 10 వరకు జరిగే జాతీయస్థాయి పోటీల్లో తెలంగాణకు ప్రాతినిథ్యం వహించనున్నారు. -
ఖతార్లో ఉద్యోగావకాశాలు
● ఈనెల 17 నుంచి ఫ్రీ ఇంటర్వ్యూలువేములవాడ: ఖతార్లో వివిధ ఉద్యోగాల భర్తీకి జీటీఎం ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న ఆ సంస్థ ప్రతినిధి చీటి సతీష్రావు తెలిపారు. బాగేజ్ హ్యాండ్లర్లు, క్లీనర్లు, వెయిట్రెస్లు, సౌస్చెఫ్లు, కుక్లు, క్యాటరింగ్ సూపర్వైజర్ల పోస్టులను భర్తీ చేయనున్నట్లు వివరించారు. బాగేజ్ హ్యాండ్లర్, క్లీనర్ పోస్టులకు ఖతార్ 1,000 రియాల్స్ బేసిక్ వేతనం ఉండగా, సౌస్ చెఫ్కు రూ.5వేల రియాల్స్, సీనియర్ సీడీపీకి రూ.4వేల రియాల్స్, చీఫ్ స్టీవర్డ్కు 3,500 రియాల్స్ వరకు వేతనం ఉంటుందని వివరించారు. ఇతర పోస్టులకూ పోస్టును బట్టి 1,600 నుంచి 3,200 రియాల్స్ వరకు గ్రాస్ వేతనం ఉంటుందని పేర్కొన్నారు. ఉచిత భోజనం, వసతి, రవాణాతోపాటు వీసా, టికెట్, వైద్య సదుపాయాలను సంస్థ కల్పిస్తుందని వెల్లడించారు. వివరాలకు సికింద్రాబాద్ 83320 52299, నిజామాబాద్ 86868 60999, ఆర్మూర్ 83320 13999, జగిత్యాల 83320 42299, సిరిసిల్ల 93476 61522, ఆఫీస్ 040–42029999 నంబర్లపై సంప్రదించవచ్చని తెలిపారు.సెప్టెంబర్ 17 : సికింద్రాబాద్ – జీటీఎం ఇంటర్నేషనల్ కార్యాలయం సెప్టెంబర్ 18: సిరిసిల్ల, జగిత్యాల–(క్లీనర్, బాగేజ్ హ్యాండ్లర్ పోస్టులు) సెప్టెంబర్ 19: నిజామాబాద్, ఆర్మూర్ (క్లీనర్, బాగేజ్ హ్యాండ్లర్ పోస్టులు) -
అంగన్వాడీల్లో పోషణ సందడి
గంభీరావుపేట(సిరిసిల్ల): చిన్నారులు, గర్భిణీలు, బాలింతల్లో పోషకాహారంపై అవగాహన కల్పించడంతోపాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రొత్సహించేందుకు ఏటా జాతీయ పోషణ మాసం నిర్వహిస్తుంటారు. అందులో భాగంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బుధవారం నుంచి ప్రారంభమైన కార్యక్రమాలు వచ్చే నెల 9వ తేదీ వరకు కొనసాగనున్నాయి. చిన్నారులకు అందాల్సిన పౌష్టికాహారం, సమతుల ఆహారం, వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించనున్నారు. గర్భిణీలు, బాలింతలకు పోషకాహారం ప్రాధాన్యతను వివరించడంతోపాటు చిన్నారుల్లో పోషకాహార లోపం నివారించే చర్యలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహార ప్రదర్శనలు, అవగాహన సమావేశాలు, ఆరోగ్య పరీక్షలు, పోషణపై చర్చలు నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురానున్నారు. స్థానికంగా లభించే పౌష్టిక పదార్థాలతో సమతుల ఆహారం తయారు చేసుకునే విధానాలను వివరించనున్నారు. బాల్యం కోసం.. పోషణ మాసం చిన్నారుల ఎదుగుదలలో పోషకాహారం కీలకం. గర్భిణీలు, బాలింతలు పోషక విలువలు గల ఆహారం తీసుకోవాలని ఐసీడీఎస్ అధికారులు వివరించనున్నారు. పోషకాహారంపై ప్రతీ కుటుంబంలో అవగాహన పెంపొందించడమే పోషణ మాసోత్సవం ప్రధాన ఉద్దేశ్యం. అంగన్వాడీల వివరాలు ప్రాజెక్టులు కేంద్రాలు 2 587జిల్లాలో లబ్ధిదారులు ప్రాజెక్టు 7నెలల్లోపు మూడేళ్లలోపు ఆరేళ్లలోపు గర్భిణీలు బాలింతలు సిరిసిల్ల 1930 28827 9346 2110 1886 వేములవాడ 1052 6010 4590 1176 881సద్వినియోగం చేసుకోవాలి అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందే పోషకాహార సేవలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి. ఆరోగ్యకరమైన బాల్యంతోనే ఆరోగ్యకరమైన సమాజం నిర్మితమవుతుంది. ప్రతీ కుటుంబం పోషణమాసంలో భాగస్వామ్యం కావాలి. నెల రోజులపాటు లబ్ధిదారులకు పోషకాహార ప్రాధాన్యతపై నిర్ణీత షెడ్యూల్ ప్రకారం అవగాాహన కల్పించే కార్యక్రమాలు చేపడతాం. – స్వరూప, ఐసీడీఎస్ సూపర్వైజర్, గంభీరావుపేట -
316 క్వింటాళ్ల రేషన్బియ్యం పట్టివేత
సిరిసిల్ల అర్బన్: జిల్లా కేంద్రంలో రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచారన్న సమాచారంతో పౌరసరఫరాల శాఖ అధికారులు బుధవారం ఆకస్మికంగా దాడులు చేశారు. రగుడు వద్ద గల కనకదుర్గ ట్రేడర్స్ రైస్మిల్లులో నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన 316 క్వింటాళ్ల రేషన్బియ్యం స్వాధీనం చేసుకున్నారు. కనకదుర్గ ట్రేడర్స్ మిల్లును సీజ్ చేసి, బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్వో బుచ్చిబాబు తెలిపారు. తనిఖీల్లో డీటీవో సత్యనారాయణ, రజిత తదితరులు పాల్గొన్నారు. పట్టు రైతులకు ఆధునిక పద్ధతులపై అవగాహనతంగళ్లపల్లి: కేంద్ర సిల్క్బోర్డు చేపట్టిన ‘మేరా రేషమ్ మేరా అభియాన్’లో భాగంగా బుధవారం మండలంలోని మండెపల్లిలో పట్టు రైతులకు శిక్షణ నిర్వహించారు. ‘మల్బరీ తోటల ప్రాముఖ్యత – పట్టుపురుగుల పెంపకం గృహ నిర్వహణం’ అనే అంశంపై రైతులకు అవగాహన కల్పించారు. శాస్త్రవేత్తలు మల్లికార్జున, రాఘవేందర్ మాట్లాడుతూ షెడ్ల నిర్వహణ, మొక్కల మధ్య పాటించాల్సిన దూరం, కొమ్మల కత్తిరింపు(ప్రూనింగ్)పై వివరించారు. సెరీకల్చర్ అధికారి(ఎస్వో) జగన్, రైతులు పాల్గొన్నారు. నిరంతరం విద్యుత్ అందించాలిఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): నిరంతరం విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ మధుసూదన్ సూచించారు. మండలం కేంద్రంలోని 132 కేవీ సబ్స్టేషన్ను బుధవారం తనిఖీ చేశారు. విద్యుత్ అధికారులతో సరఫరాపై ఆపరేషన్ సమీక్ష నిర్వహించారు. గత మూడు నెలల్లో అత్యధికంగా విద్యుత్ వినియోగం రికార్డు నమోదవుతుందని తెలిపారు. అధిక వినియోగంతో అంతరాయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, వీలైనంత తక్కువ అంతరాయాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సోలార్ప్లాంట్ ప్రారంభం ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లిలో 1.6 మెగావాట్స్ సోలార్ ప్లాంటును జిల్లా విద్యుత్ శాఖ ఎస్సీ శ్రీనివాసరావు ప్రారంభించారు. ప్రతిరోజు 6వేల నుంచి 7వేల వరకు విద్యుత్ ఉత్పత్తి అవుతుందని తెలిపారు. అశోక్, డివిజనల్ ఇంజినీర్ అంజయ్య పాల్గొన్నారు. లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలి : ఎస్పీసిరిసిల్ల: జిల్లా న్యాయస్థానాల్లో ఈనెల 12న నిర్వహించే జాతీయ మెగా లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ మహేశ్ బీ గీతే బుధవారం కోరారు. రాజీ పడదగిన కేసులలో కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని సమయం, డబ్బు వృథా చేసుకోవద్దని సూచించారు. పోలీస్ అధికారులు, కోర్టు కానిస్టేబుళ్లు ఇరువర్గాలకు కౌన్సిలింగ్ చేసి రాజీ పడేలా అవగాహన కల్పించాలని సూచించారు. -
యువత ఆలోచనలకు జాతీయ వేదిక
సిరిసిల్ల అర్బన్: వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్–2027 క్విజ్ పోటీల్లో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ప్రిన్సిపాళ్లు, ప్రధానోపాధ్యాయులు ప్ర త్యేక చొరవ చూపాలని జిల్లా విద్యాధికారి ఎస్. మొండయ్య కోరారు. అందుకు సంబంధించిన పో స్టర్లను ఆవిష్కరించారు. డీఈవో మాట్లాడుతూ వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్–2027 యువత ఆలోచనలకు జాతీయ వేదిక కానుందన్నారు. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ పరిధిలోని మై భారత్ విభాగం ఆధ్వర్యంలో వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2027 కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జరిగే జా తీయ యువజనోత్సవంలో భాగంగా రూపొందించిన ఈ వేదిక ద్వారా దేశ భవిష్యత్, వినూత్న విధాన రూపకల్పనలో విద్యార్థులు, యువతీ, యు వకులు భాగస్వాములు కావాలని కో రారు. ఆసక్తి ఉన్న యువతీ, యువకులు మై భారత్.జీవోవీ.ఐఎన్ ద్వారా నమోదు చేసుకోవాలని జిల్లా కార్యక్రమ అధికారి జి.కిరణ్కుమార్ తెలిపారు. -
ఆలయ భూములపై సర్వే చేయండి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండల కేంద్రంలోని ఆలయాల భూములపై సర్వే చేయాలని బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యుడు చందుపట్ల లక్ష్మారెడ్డి, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు కిరణ్నాయక్ కోరారు. ఈమేరకు బుధవారం దేవాదాయ శాఖ కమిషనర్ సుప్రియకు భూముల వివరాలు తెలపాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ కేశవ పెరుమాండ్ల ఆలయం, రావిచెట్టు హనుమాన్ ఆలయం, శ్రీరుక్మిణి సమేత వేణుగోపాలస్వామి ఆలయ భూముల వివరాల కోసం వెంటనే సర్వే చేయాలన్నారు. గ్రామంలోని ఆలయాల భూములు అన్యాక్రాంతం అయ్యాయన్నారు. అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని కోరారు. కమిషనర్ స్పందిస్తూ ఆలయ భూముల వివరాలు త్వరలోనే తెలియజేస్తామని తెలిపారు. నాయకులు శ్రీనివాసరెడ్డి ఉన్నారు. -
విద్యుత్ సరఫరాలో లోపాలు అధిగమించాలి
● ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ టి.మధుసూదన్ సిరిసిల్లటౌన్: విద్యుత్ సరఫరాలో తలెత్తే లోపాలు అధిగమిస్తూ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ టి.మధుసూదన్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. సిరిసిల్లలోని విద్యుత్ స్టోర్లో బుధవారం ఆపరేషన్ సమీక్ష జరిపి మాట్లాడారు. రోజురోజుకు పెరుగుతున్న విద్యుత్ వినియోగంపై అధికారులతో మాట్లాడారు. పెద్దూరులోని 220 కేవీ సబ్స్టేషన్, 132 కేవీ ఎల్లారెడ్డిపేట సబ్స్టేషన్, జిల్లా స్టోర్స్ను తనిఖీ చేశారు. చీఫ్ ఇంజినీర్ బి.అశోక్, డివిజనల్ ఇంజినీర్ ఎన్.అంజయ్య పాల్గొన్నారు. -
ఆత్మహత్యలు చాలా తగ్గాయి
సిరిసిల్లలో ఒకప్పటితో పోల్చితే నేతకార్మికుల ఆత్మహత్యలు చాలా వరకు తగ్గాయి. పరిశ్రమలో పని లేకపోవడం అనేది లేదు. ఇప్పుడు కార్మికుల కొరత ఉంది. పని చేసే వారికి చేతి నిండా పని ఉంది. మెరుగైన ఉపాధి లభిస్తుంది. కొన్ని ఆత్మహత్యలు జరుగుతున్నా.. కారణాలు వేరే ఉంటున్నాయి. కార్మికుల్లో నైపుణ్యం పెరిగింది. – శ్రీరాం సంతోష్కుమార్, చేనేత, జౌళిశాఖ ఏడీఆత్మహత్య పరిష్కారం కాదు ఏ సమస్యకై నా ఆత్మహత్య పరిష్కారం కాదు. మానసిక ఒత్తిడి, అశాంతి, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఏమైనా సరే మానసిక వైద్యనిపుణుడిని సంప్రదించి కౌన్సిలింగ్ తీసుకోవాలి. భవిష్యత్పై ఆశలతో జీవించాలి. నిరాశపూరిత వాతావరణాన్ని దూరం చేసుకుంటూ మానసిక వికాసం పొందాలి. ఆత్మహత్యల నివారణపై అవగాహన కల్పించాలి. – డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్, జిల్లా వైద్యాధికారి -
అన్నదాత ఆగ్రహం
● గాలిపల్లిలో సొసైటీ గోదాముకు తాళం ● ధర్మారంలో రాస్తారోకోఇల్లంతకుంట/కోనరావుపేట: యూరియా లభించడం లేదని మండలంలోని గాలిపల్లి ప్యాక్స్ ఎరువుల గోదాముకు రైతులు బుధవారం తాళం వేశా రు. యూరియా యాప్ జిల్లా యూనిట్గా ఉండడంతో స్థానిక రైతులకు ఎరువులు దొరకడం లేదన్నా రు. మండల యూనిట్గా చేయాలని కోరారు. ప్యాక్స్ చైర్మన్ అనంతరెడ్డి, ఏఈవో రవళి, సొసైటీ కార్యదర్శి మల్లేశం చేరుకొని రైతులకు నచ్చజెప్పా రు. జిల్లా కోపరేటీవ్ అధికారి రామకృష్ణ రైతులతో ఫోన్లో మాట్లాడడంతో రైతులు తాళం తీశారు. ధర్మారంలో రాస్తారోకో కోనరావుపేట మండలం ధర్మారంలో సర్పంచ్, బీజేపీ మండలాధ్యక్షుడు మిర్యాల్కార్ బాలాజీ ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో చేశారు. రైతులు మాట్లాడుతూ వ్యవసాయానికి నాణ్యమైన కరెంట్ ఇవ్వాలని కోరారు. కాళేశ్వరం తొమ్మిదో ప్యాకేజీలో ఇంకా 22 ఎకరాల భూమి సేకరించి కాలువలు నిర్మించాలన్నారు. గంగుల ప్రశాంత్, పొన్నం పరశురాములు, గంగుల రమేశ్, మల్యాల సుమన్, మైలారం రమేశ్, అన్నబోయిన అభిషేక్, పొట్లపల్లి గోపి, తిరుపతి, బక్కయ్య, రాకేశ్, ఎల్లయ్య , విక్రం, రాజ్కుమార్ పాల్గొన్నారు. -
కుదిరిన కూలి ఒప్పందం
సిరిసిల్లటౌన్: కాటన్ చీరల ఉత్పత్తి కార్మికులు, ఆసాములతో యజమానులు కొత్త కూలి ఒప్పందం కుదిరింది. బుధవారం సిరిసిల్ల చేనేత వస్త్రవ్యాపార సంఘ భవనంలో ఇరు పక్షాల ప్రతినిధులు కలిసి నూతన కూలి ఒప్పందం చేసుకున్నారు. కాటన్ వస్త్రోత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు కట్టెకోల లక్ష్మీనారాయణ, చేనేత వస్త్రవ్యాపార సంఘం అధ్యక్షుడు తాటిపాముల దామోదర్తో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులతో కూలి చర్చలు జరిగాయి. కాటన్ వస్త్రానికి పవర్లూమ్ కార్మికులకు 20 కౌంటు ప్యాకకు గతంలో 10 పిక్కులకు 44 పైసలు ఉన్న కూలిని 60పైసలు, పాప్లిన్ వస్త్రం 10 పిక్కులకు 44 పైసలకు పెంచారు. ఆసాములకు సంబంధించి డబుల్ కూలి చెల్లించేలా ఇరు సంఘాలు అంగీకరించాయి. ఈ కూలి ఒప్పందం ఈనెల 15 నుంచి అమలులోకి వస్తుందని ప్రకటించారు. పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్, జిల్లా అధ్యక్షుడు కోడం రమణ మాట్లాడుతూ కార్మికులు, ఆసాములు సమ్మెకు వెళ్లకముందే కూలి పెంచడంపై యజమానులకు ధన్యవాదాలు తెలిపారు. ‘గుడ్ టచ్.. బ్యాడ్ టచ్’పై అవగాహన గంభీరావుపేట(సిరిసిల్ల): విద్యార్థులకు గుడ్ టచ్.. బ్యాడ్ టచ్పై అవగాహన కల్పిస్తున్నట్లు షీ టీం అధికారులు ప్రమీల, రవి తెలిపారు. మండలంలోని గజసింగవరం, గోరింటాల ప్రభుత్వ పాఠశాలల్లో బుధవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. గత నెలలో షీటీమ్కు వచ్చిన ఫిర్యాదుల్లో మూడు కేసులు నమోదు చేసి మహిళలను, విద్యార్థులను వేధిస్తున్న వారిని గుర్తించి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ చేసినట్లు తెలిపారు. వేధింపులకు గురైతే షీ టీమ్కు 87126 56425లో ఫిర్యాదు చేయాలని సూచించారు. శ్రీలత, ప్రియాంక, శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి సిరిసిల్లటౌన్: రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు శనిగరపు రజనీకాంత్ కోరారు. సిరిసిల్లలో బుధవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయిస్తామన్న హామీ అమలు చేయాలని కోరారు. నాయకులు మల్లారపు ప్రశాంత్, కడారి శివ, ముభారక్, రషీద్, సృజన్, శ్రీతన్, మహేశ్ పాల్గొన్నారు. ఉపసర్పంచుల చెక్పవర్ రద్దు చేయండి సిరిసిల్ల అర్బన్: గ్రామపంచాయతీల్లో అభివృద్ధి, పరిపాలనకు ఆటంకం కలుగుతున్న నేపథ్యంలో ఉపసర్పంచుల సంయుక్త చెక్పవర్ను రద్దు చేసి సర్పంచులకే పూర్తి అధికారాలు కల్పించాలని జిల్లాలోని సర్పంచులు బుధవారం అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్కు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ ఉపసర్పంచుల చెక్ పవర్, డిజిటల్ సంతకాల కారణంగా నిధుల వినియోగంలో జాప్యమవుతుందన్నారు. గ్రామాల్లో తాగునీరు, పారిశుధ్యం, వీధిదీపాలు, అత్యవసర పనులకు ఆటంకం కలుగుతుందని పేర్కొన్నారు. ఫీజు బకాయిలపై పోరుబాట సిరిసిల్లటౌన్: రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా బకాయిలు పెట్టిన ఫీజులు చెల్లించాలని కోరుతూ సిరిసిల్లలో డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు బుధవారం పోరుబాట పట్టాయి. టీపీడీఎంఏ, ఎస్యూపీఎంఏ ప్రతినిధుల ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ తీశారు. అంబేడ్కర్ చౌరస్తాలో మానవహారం చేపట్టారు. ప్రభుత్వం స్పందించి బకాయిలు చెల్లించాలని కోరారు. -
పర్యాటకరంగ అభివృద్ధికి చర్యలు
సిరిసిల్ల: జిల్లాలో పర్యాటకరంగ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు పర్యాటక రంగం అంశంపై పోటీలు నిర్వహించాలన్నారు. పర్యాటకరంగ అభివృద్ధికి నోడల్ అధికారిని నియమిస్తామన్నారు. అంతకుముందు వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర యువజన, పర్యాటక, సాంస్కృతికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణిప్రసాద్ మాట్లాడారు. టూరిజం శాఖ డీఈ శ్రీశైలం, డీవైఎస్వో రాందాస్, డీటీసీపీవో అన్సార్, అటవీశాఖ డిప్యూటీ రేంజ్ అధికారి మోహన్లాల్ పాల్గొన్నారు. పర్యాటక, చారిత్రక ప్రాంతాలపై ఉత్తమ రీల్స్ పోటీలు ఈనెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా జిల్లాలోని పర్యాటక, చారిత్రక ప్రాంతాలపై ఉత్తమ రీల్స్, వ్యూస్ పోటీలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ వద్ద ఉన్న ఫారెస్ట్ అర్బన్ పార్క్, వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ గుడి చెరువులో ఉన్న వీటీఏడీఏ పార్క్, నాంపల్లిగుట్టకు సంబంధించిన ఉత్తమ రీల్స్, ఎక్కువ వ్యూస్ వచ్చే వారు ఈనెల 20 వరకు పంపించాలని సూచించారు. అత్యుత్తమ రీల్స్కు మొదటి బహుమతి రూ.15వేలు, రెండో బహుమతి రూ.10వేలు, మూడో బహుమతి రూ.5 వేల చొప్పున ప్రోత్సాహకాలు అందజేస్తామని తెలిపారు. ఉత్తమ రీల్స్ రూపొందించి.. ఎక్కువ వ్యూస్ వచ్చిన రీల్స్ లింక్ 94402 39783కు వాట్సాప్ చేయాలని కోరారు. -
దృష్టిలోపం ప్రారంభ దశలోనే గుర్తించాలి
● జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్ సిరిసిల్ల: విద్యార్థుల్లో దృష్టిలోపాలను ప్రారంభ దశలోనే గుర్తించాలని జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్ కోరారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్లో బుధవారం రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమం(ఆర్బీఎస్కే)పై సమీక్షించారు. ‘నో స్కూల్ లెఫ్ట్ – నో చైల్డ్ లెఫ్ట్’ అనే లక్ష్యంతో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఈనెల 15 నుంచి సమగ్ర నేత్రపరీక్షలు చేయాలని సూచించారు. పరీక్షల వివరాలు సక్రమంగా నమోదు చేసి, అవసరమైన వారికి వైద్యసేవలు అందించాలన్నారు. డిప్యూటీ డీఎంహెచ్వో నాగేందర్బాబు, ఆర్బీఎస్కే ప్రోగ్రామ్ అధి కారి, వైద్యులు నయీమ్ జహా, సంపత్కుమార్, డిప్యూటీ మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, డీపీవో ఎన్హెచ్ఎం రాజేందర్ పాల్గొన్నారు. -
రయ్.. రయ్యంటూ..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: జాతీయ రహదారి 563పై రాకపోకలు ప్రారంభం అయ్యాయి. 68 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారి కరీంనగర్– వరంగల్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. కేవలం 40 నిమిషాల్లో రెండు నగరాల మధ్య వాహనాలు రాకపోకలు సాగించేలా ఈ రహదారిని నిర్మించిన సంగతి తెలిసిందే. మొన్నటి వరకు రహదారి మానకొండూరు సమీపంలోని ఖాదర్గూడం వరకు అందుబాటులో ఉండేది. దుర్శేడ్ వద్ద ర్యాంపు నిర్మించకపోవడంతో పెద్దపల్లి నుంచి వచ్చే వాహనాలకు ఇబ్బందిగా మారిందన్న శ్రీసాక్షిశ్రీ కథనంతో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) వారు కరీంనగర్– వరంగల్ సెక్షన్ దుర్శేడ్ వద్ద రోడ్డు చివర తాత్కాలిక ర్యాంప్ ఏర్పాటు చేశారు. దీంతో వరంగల్, పెద్దపల్లి, కరీంనగర్కు రాకపోకలు సాగించేందుకు వీలు చిక్కింది. జగిత్యాల– కరీంనగర్ సెక్షన్ పనులు మొదలయ్యే వరకు ఈ తాత్కాలిక ర్యాంప్ మీదుగా రాకపోకలు సాగనున్నాయి. ఈ రహదారిని అత్యంత వేగంగా పూర్తి చేసినందుకు హన్మకొండ కలెక్టర్ చేతుల మీదుగా ఎన్హెచ్–563 ప్రాజెక్టు డైరెక్టర్ కీర్తి భరద్వాజ్ అవార్డు అందుకోవడం విశేషం. ఇక అక్టోబరు మొదటి వారం నుంచి కొత్తగట్టు వద్ద ఏర్పాటు చేసిన టోల్గేట్ ద్వారా టోల్ చార్జీలు వసూలు చేయనున్నారు. జగిత్యాల– కరీంనగర్ సెక్షన్కు రూ.9కోట్లు దాదాపు రూ.రెండు వేల కోట్ల అంచనా వ్యయంతో 59 కిలోమీటర్ల ఎన్హెచ్– 563 జగిత్యాల– కరీంనగర్ సెక్షన్కు ఇటీవల టెండర్లు పిలిచారు. ఇవి త్వరలోనే ఖరారవనున్నాయి. ఇరుకుగా ఉన్న జగిత్యాల– కరీంనగర్ రోడ్డుపై రాకపోకలు అంటే ప్రతీరోజూ ఆర్టీసీ, ప్రైవేటు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గంగాధర వద్ద రైల్వేగేట్తో ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఎన్హెచ్ఏఐ అధికారులు టెండరు ఖరారయ్యేలోగా వాహనదారులకు వీలుగా ఉండేలా ట్రాఫిక్ను చక్కదిద్దేందుకు సిద్ధపడ్డారు. ఇందుకోసం దాదాపు రూ.9 కోట్లు విడుదల చేశారు. పలుచోట్ల రోడ్ల వెడల్పు, చెట్ల తొలగింపు, స్పీడ్ బ్రేకర్లు, ప్రమాదాలు జరిగే చోట సైన్ బోర్డులు ఏర్పాటు చేసే పని చేపడుతున్నారు. వరంగల్– కరీంనగర్ సెక్షన్లో పాత రహదారిని ఎన్హెచ్ఏఐ ఆధ్వర్యంలో 39కిలోమీటర్ల మేర అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. ర్యాంపులు, అండర్పాస్లు కావాలి ● దుర్శేడ్ వద్ద రోడ్డు చివర ఏర్పాటు చేసిన ర్యాంపుతో కరీంనగర్–వరంగల్– పెద్దపల్లి వెళ్లే వాహనాలకు కాస్త ఊరట లభించింది. రోడ్డు దిగాక.. కరీంనగర్ లేదా పెద్దపల్లి వైపు ఎలా వెళ్లాలి? అన్న విషయంలో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. ● పెద్దపల్లి నుంచి వచ్చేవారు దుర్శేడ్ పద్మనాయక భవనం వద్ద యూటర్న్ తీసుకుని ర్యాంపుమీదుగా హైవే ఎక్కాల్సి వస్తుంది. ఇక్కడ వాహనదారులు తికమకపడితే పరస్పరం ఢీకొనే ప్రమాదముంది. ● పెద్దపల్లి నుంచి వచ్చే వారికి జగిత్యాల వైపు నిర్మించినట్లుగా శాశ్వత ర్యాంపులు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. ● అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన ఈ రహదారికి శంకరపట్నం మండలం కొత్తగట్టు, గొల్లపల్లి వద్ద అండర్ పాస్లు నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. దీనిపై ఎన్హెచ్ఏఐ అధికారులు స్పందిస్తూ.. తమ కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేస్తే తప్పకుండా సమస్య పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. -
కార్మికక్షేత్రం మురిసింది!
కరువు తీరింది..సిరిసిల్ల: పవర్లూమ్స్ రాకతో వస్త్రోత్పత్తిలో వేగం పెరిగినా కార్మికుల జీవితాలు నెమ్మదించాయి. కుటుంబ పోషణ భారమై ఆర్థిక ఇబ్బందులు.. అనారోగ్య సమస్యలతో ఉసురుతీసుకున్న సంఘట నలో నిత్యకృత్యం. ఒక్క రోజు నలుగురు కార్మికుల ఆత్మహత్యలు.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు బలవన్మరణం.. ఇవన్నీ దశాబ్దం క్రితం సిరిసిల్లలో ఒకప్పటి మాట. కాలక్రమంలో పరిస్థితులు మారాయి. వస్త్రోత్పత్తిలో సిరిసిల్ల ఉపాధి కేంద్రమైంది. ఆత్మహత్యలు నిలిచిపోయాయి.. వలసలు ఆగిపోయాయి.. ఇప్పుడు చేతినిండా పనితో సిరిసిల్ల ముసిముసి నవ్వులతో మురిసిపోతోంది. వస్త్రోత్పత్తికి కేరాఫ్గా.. ఉమ్మడి రాష్ట్రంలో 74వేల మరమగ్గాలు ఉండగా.. ఒక్క సిరిసిల్లలోనే 27వేల మరమగ్గాలు ఉన్నాయి. తెలంగాణలో వస్త్రోత్పత్తికి కేరాఫ్ అడ్రస్గా సిరిసిల్ల నిలుస్తుంది. 24వేల మరమగ్గాలపై పాలిస్టర్ బట్ట ఉత్పత్తి అవుతుండగా.. మూడు వేల పవర్లూమ్స్పై కాటన్(ముతక రకం) బట్ట ఉత్పత్తి అవుతుంది. సిరిసిల్ల వస్త్రోత్పత్తి రంగంలో 25వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. వస్త్రపరిశ్రమకు అనుబంధంగా అద్దకం, సైజింగ్, వైపణి, వార్పిన్ పనులు ఉంటాయి. గతంలో ఉపాధి లేక నేత కార్మికులు పొట్ట చేతపట్టుకుని ముంబై, భీవండి, షోలాపూర్, సూరత్ వంటి ప్రాంతాలకు వలస వెళ్లే వారు. కానీ దశాబ్దకాలంగా సిరిసిల్ల కార్మికులు వలసలకు దూరమయ్యారు. బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల కార్మికులు ఇక్కడికొస్తున్నారు. వలసలకు నిలయమైన పట్టణం ఇప్పుడు ఉపాధి కేంద్రంగా భాసిల్లుతోంది. ఇదీ నేతన్నల ఆత్మహత్యల పరంపర సిరిసిల్ల పట్టణ శివారులోని రాజీవ్నగర్కు చెందిన కొండ కిష్టయ్య తన తల్లి, తండ్రి, భార్య ఇద్దరు బిడ్డలకు కూల్డ్రింక్లో విషం కలిపి ఇచ్చి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో కిష్టయ్య చిన్న కూతురు ఒక్కరే బతికిపోగా.. ఐదుగురు మరణించారు. ఈ ఘటన 2001లో జాతీయస్థాయిలో వార్తాంశమైంది. ఆ ఆత్మహత్యల పరంపర సిరిసిల్లలో కొనసాగుతూ వచ్చింది. మార్పునకు కారణాలివీ.. సిరిసిల్ల వస్త్రోత్పత్తి రంగానికి ప్రభుత్వ ఆర్డర్లు వస్తున్నాయి. గతంలో బతుకమ్మ చీరల ఆర్డర్లు రాగా.. ఇప్పుడు ఇందిరా మహిళాశక్తి చీరల ఆర్డర్లు రావడంతో కార్మికులకు మెరుగైన ఉపాధి లభిస్తుంది. వస్త్రపరిశ్రమ అనుబంధ రంగాల్లోనూ దాని ప్రభావం ఉంది. నేతకార్మికులకు పొదుపు పథకం త్రిఫ్ట్ అమలు చేస్తున్నారు. టవల్స్, లుంగీలు, దోవతులు, అంచుచీరలు, పట్టుచీరలు, మెహెందీ వంటి ఆధునిక వస్త్రాలను ఉత్పత్తి చేస్తూ.. బహిరంగ మార్కెట్లో పోటీ పడుతున్నారు. నేతన్నల జీవితాల్లో సామాజిక మార్పు కనిపిస్తోంది. కార్మిక క్షేత్రంలో ఆత్మహత్యలు తగ్గాయి. కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. కుటుంబ సమస్యలు.. వ్యక్తిగత ఆర్థిక ఇబ్బందులు కారణమవుతున్నాయి. సిరిసిల్ల పట్టణంలో ఆత్మహత్యల పరంపర సంవత్సరం ఆత్మహత్యల ప్రభుత్వ పరిహారం సంఖ్య పొందిన వారు 2010 84 04 2011 93 13 2012 99 19 2013 86 16 2014 65 10 2015 63 33 2016 32 12 2017 19 09 2018 12 02 2019 10 04 2020 06 04 2021 07 07 2022 08 06 2023 06 06 2024 05 05 2025 09 09 2026 03 03ఇప్పటి వరకు -
వసూళ్లు ఫుల్.. వసతులు నిల్ !
● ఏసీ గదుల్లోనూ ఉక్కపోతనే.. ● కనిపించని పరిశుభ్రత ● పట్టించుకోని అధికారులు ● రాజన్న వసతిగృహాల్లో సమస్యల తిష్టవేములవాడ: భక్తుల ద్వారా అత్యధిక ఆదాయం వస్తున్నా వసతులు కల్పించడంలో రాజన్న ఆలయ అధికారులు విఫలమవుతూనే ఉన్నారు. రాజన్న ఆలయ పరిసరాల్లో పరిశుభ్రత లోపం.. వసతిగృహాల్లో దుర్వాసన వెదజల్లుతున్నా పట్టింపు కరువైంది. చివరికి ఏసీ వసతిగృహాల్లో ఏసీలు పనిచేయక అద్దె గదుల్లో ఉండలేకపోతున్నారు. రాజన్న వసతిగృహాల్లో అవస్థలపై సాక్షి ప్రత్యేక కథనం. పేరుకే వసతి గృహాలు వేములవాడలో భక్తుల కోసం ఆలయ ఆధ్వర్యంలో వసతిగృహాలు నిర్మించారు. నందీశ్వర, లక్ష్మీపార్వతి, పార్వతీపురం, భీమేశ్వర సదనాల్లో భక్తులకు గదులను అద్దెకు ఇస్తున్నారు. గదుల్లో ఏసీలు పనిచేయడం లేదు. దీంతో భక్తులు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోపిస్తున్న పారిశుధ్యం వసతి గదుల ఆవరణ, గదుల నిర్వహణ, ప్రాంగణాలు, పరిశుభ్రత లేని శౌచాలయాలతో దుర్గంధం వెదజల్లుతోంది. ఈ వాతావరణంతో భక్తులు అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉంది. వసతి గృహాల్లో తలెత్తుతున్న సమస్యలపై సిబ్బందిని ప్రశ్నిస్తే సరైన స్పందన లభించడం లేదు. అధికారుల పర్యవేక్షణ లోపించడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు. ఇప్పటికై నా ఆలయ ఉన్నతాధికారులు స్పందించి, వసతిగృహాల నిర్వహణను మెరుగుపరచాలని కోరుతున్నారు. దుర్వాసన వస్తోంది ఆలయ వసతి గదుల్లో దుర్వాస వస్తోంది. ఆలయ అధికారులు, సిబ్బంది పట్టించుకున్న పాపానపోవడం లేదు. వసతిగదుల్లో పరిశుభ్రత లోపిస్తుంది. పట్టించుకునే వారు లేరు. ఇప్పటికై నా అధికారులు వసతిగదులను నిత్యం శుభ్రం చేయాలి. – రాపెల్లి శ్రీధర్, స్థానికుడుఏసీ గదులు తీసుకుని కార్లో నిద్రపోయాం కుటుంబ సభ్యులతో వచ్చి భీమేశ్వర సదన్లో రెండు గదులు తీసుకున్నాం. ఇందుకు అద్దె కూడా చెల్లించాం. తీరా చూస్తే ఏసీ పనిచేయలేదు. అధికారులకు, సిబ్బందికి చెప్పినా పట్టించుకోలేదు. డబ్బులు వెచ్చించి మా కారులోనే ఏసీ ఆన్ చేసుకుని పడుకున్నాం. – గోనె కపిల్ దంపతులు, హైదరాబాద్రెండు రోజుల క్రితం రాజన్న దర్శనానికి హైదరాబాద్కు చెందిన గోనె కపిల్ కుటుంబ సభ్యులు వచ్చారు. భీమేశ్వర సదన్లో రెండు ఏసీ గదులు తీసుకున్నారు. తీరా ఏసీలు పనిచేయలేదు. అధికారులు, సిబ్బందికి చెప్పినా పట్టించుకోపోవడంతో నిరసనగా గదికి తాళాలు వేసి వెంట తీసుకెళ్లాడు. -
ఆయిల్పాంతో దీర్ఘకాలిక ఆదాయం
● కలెక్టర్ గరీమా అగ్రవాల్ ముస్తాబాద్(సిరిసిల్ల): ఆయిల్పాం సాగుతో రైతులకు దీర్ఘకాలికంగా ఆదాయం సమకూరుతుందని కలెక్టర్ గరీమా అగ్రవాల్ అన్నారు. ముస్తాబాద్ మండలం నామాపూర్లో ఆదర్శరైతు డాక్టర్ ఎరవెల్లి చంద్రశేఖర్రావు ఏడెకరాల్లో సాగు చేస్తున్న ఆయిల్ఫాంను మంగళవారం పరిశీలించారు. ఆయిల్పాం సాగుతో 15 టన్నుల ఆయిల్ గెలలు తీసి, రూ.3.45లక్షల ఆదాయం పొందారని కలెక్టర్ పేర్కొన్నారు. ఆయిల్పాం సాగుతో చీడ, కొతుల బాధలు ఉండవన్నారు. మార్కెటింగ్ సులభంగా వుంటుందని, నర్మెట్టకు సులభంగా ఆయిల్ గెలలను తరలించవచ్చన్నారు. నామాపూర్, బోయినపల్లి, నేరెళ్ల, సిరిసిల్లలో ఆయిల్ గెలల కలెక్షన్ సెంటర్లు ఉన్నాయన్నారు. అనంతరం గూడెంలో డబుల్బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఎంపీల్యాడ్స్తో వేసిన బోరు మోటారును ప్రారంభించారు. ప్రతీ గ్రామంలో హియరింగ్ సమావేశాలుఈసీ ఆదేశాల మేరకు ప్రతీ గ్రామంలో హియరింగ్ సమావేశాలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ గరీమా అగ్రవాల్ పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలం చీకొడులో నిర్వహిస్తున్న పబ్లిక్ హియరింగ్ సమావేశాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. బీఎల్వోలు, తహసీల్దార్లు, సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలో సర్ ప్రక్రియను పరిశీలించాలన్నారు. ఆర్డీవో శ్రీధర్బాబు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్బాబు, హౌసింగ్ పీడీ వెంకటమాధవరావు, డీఈఈ సాజిద్, సర్పంచ్లు శంకర్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
ఆధారాలు చూపినా పని అవుతలేదు
వేములవాడ మండలం తెట్టెకుంట శివారులోని సర్వే నంబరు 6లో నాకు ఐదున్నర గుంటల భూమి ఉంది. అగ్రహారం ఆలయానికి అరకిలోమీటరు దూరంలో నా భూమి ఉంటుంది. కానీ, ఆ సర్వే నంబరులోని భూమి రిజిస్ట్రేషన్ కాకుండా నిషేధిత జాబితాలో చేర్చారు. అన్ని ఆధారాలు చూపినా పని కావడం లేదు. నాలాంటి వాళ్లు అవసరాలకు అమ్ముకుందామంటే రిజిస్ట్రేషన్లు కాక ఇబ్బంది అవుతుంది. – అన్నారం రాజు, సిరిసిల్ల కలెక్టరేట్ నుంచి క్లారిటీ వస్తేనే.. వేములవాడ మండలం అగ్రహారం తెట్టెకుంట శివారులోని సర్వే నంబరు 6 మా రిజిస్ట్రేషన్ శాఖ రికార్డుల్లో ప్రొహిబీటెట్గా నమోదైంది. ఆ సర్వే నంబరులోని స్థలాలను రిజిస్ట్రేషన్ చేయడానికి వీలులేదు. కలెక్టరేట్ నుంచి ఆదేశాలు వస్తేనే ఆ స్థలాల రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉంటుంది. అప్పటి వరకు మేం ఏమీ చేయలేం. ఆ స్థలాల యజమానులు రెవెన్యూ అధికారులను సంప్రదించాలి. – విజయభాస్కర్, సబ్ రిజిస్ట్రార్, వేములవాడ సర్వేలతో సరిచేస్తున్నాం జిల్లాలో 22– జాబితాలో వ్యవసాయ భూములు ఏమీ లేవు. కొన్ని వ్యవసాయేతర భూములు నమోదయ్యాయి. వాటిని క్షేత్రస్థాయి సర్వేలతో సరి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు జిల్లాలో 22–ఎ సమస్యలతో కేవలం 11 ఫిర్యాదులు మాత్రమే అందాయి. వాటిని నిబంధనల మేరకు పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. – గడ్డం నగేశ్, అదనపు కలెక్టర్ -
22-ఏ
● అన్నీ వ్యవసాయేతర భూములే.. ● రిజిస్ట్రేషన్లకు బ్రేక్.. సామాన్యులకు షాక్ ● ఫిర్యాదులు చేసినా మోక్షం లేదుభూములు..● ‘ఇది వేములవాడ అర్బన్ మండలం తెట్టెకుంట శివారులోని సర్వేనంబరు 6లోని స్థలం. ఈ సర్వే నంబరులో మొత్తం 11 ఎకరాలు ఉండగా, అగ్రహారం ఆంజేయస్వామి ఆలయానికి 2.18 ఎకరాల భూమి ఉంది. ఆలయ భూమి ఉండడంతో ఆ సర్వే నంబరు మొత్తాన్ని 22–ఎ, 22–సీలో చేర్చి ఆలయ భూమిగా పేర్కొంటున్నారు. క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించిన అధికారులు.. ఆలయానికి 2.18 ఎకరాల భూమి దేవాదాయ శాఖ ఆధీనంలో ఉందని, మిగతా భూమి పట్టాదారుదేనని నివేదిక ఇచ్చారు. కానీ, ఇప్పటికీ ఆ 6 సర్వే నంబరులోని 8.22 ఎకరాల్లో చిన్న చిన్న ప్లాట్లు రిజిస్ట్రేషన్ కావడం లేదు. ఏనాడో కొనుగోలు చేసి పెట్టుకున్న ప్లాటు రిజిస్ట్రేషన్ కాక సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు.’ -
గణేశ్ నవరాత్రులు ప్రశాంతంగా జరుపుకోవాలి
సిరిసిల్ల/వేములవాడ: గణేశ్ నవరాత్రులను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ మహేశ్ బీ గీతే కోరారు. మంగళవారం సిరిసిల్ల పద్మనాయక కల్యాణ మండపం, వేములవాడ పట్టణంలోని మహాలింగేశ్వర ఫంక్షన్హాల్లో గణేశ్ మండపాల నిర్వాహకులు, కౌన్సిలర్లతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో మాట్లాడారు. గతేడాది నిమజ్జన వేడుకలకు అందరూ సహకరించారని, అక్కడక్కడ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే 8 కేసులు నమోదు అయ్యాయన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నిర్వాహకులు గణేశ్ పోర్టల్లో తమ మండపానికి సంబంధించిన వివరాలు నమోదు చేయాలన్నారు. ప్రజా రవాణా, అత్యవసర వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మండపాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి మండపాల వద్ద 24 గంటలూ వలంటీర్లు అందుబాటులో ఉండాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, జియో ట్యాగింగ్ చేస్తామన్నారు. పది అడుగుల కంటే ఎక్కువ ఎత్తున్న విగ్రహాల ఆగమనం సందర్భంగా పోలీసు శాఖకు సమాచారం అందించాలని, నిమజ్జనం రోజు నిర్దేశించిన ప్రదేశానికి వెళ్లాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. శోభా యాత్ర, నిమజ్జనం రోజు డీజేలకు అనుమతి లేదని, సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. సిరిసిల్ల , వేములవాడ డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు, సీఐలు శ్రీనివాస్, నాగేశ్వరరావు, వెంకటేశ్, వీరప్రసాద్, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు పాల్గొన్నారు. -
భగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు
సిరిసిల్లటౌన్: ఎమ్మెల్సీ తాత మధు వ్యాఖ్యలపై సిరిసిల్లలో కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. మంగళవారం పట్టణ అధ్యక్షుడు సూర దేవరాజు నేతృత్వంలో గాంధీ చౌరస్తాలో కేసీఆర్, తాత మధు దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈసందర్భంగా దేవరాజు మాట్లాడుతూ, అసెంబ్లీ స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధును వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలు మరోసారి దళితులను అవమానించేలా వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ప్రతిపక్ష నేత హోదాలో హుందాగా వ్యవహరించాలని, అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని డిమాండ్ చేశారు. కాగా, దిష్టిబొమ్మల దహనాన్ని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు, నేతల మధ్య వాగ్వాదాలతో జరిగిన తోపులాటల్లో ఓ హోంగార్డు కిందపడిపోయాడు. ఈనేపథ్యంలో అతను దేవరాజు కాలర్ పట్టుకుని లాగడం వివాదాస్పదమై ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీస్ ఉన్నతాధికారుల జోక్యం చేసుకుని ఇరువర్గాలను సముదాయించారు. జిల్లా గ్రంథాలయం చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, మున్సిపల్ ఫోర్ లీడర్ ఆడెపు చంద్రకళ, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకునూరి బాలరాజు, సంగీతం శ్రీనాథ్, ఎస్కే రియాజ్ తదితరులు పాల్గొన్నారు. -
మా సంగతేంటి..?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సింగరేణి మారుపేర్లపై ప్రభుత్వం తొలిసారిగా సానుకూల ప్రకటన చేయడం కార్మిక కుటుంబాల్లో ఆనందం నింపింది. సంస్థలో రెండుపేర్లతో పనిచేస్తున్న కార్మికులను ఇప్పటికే తాము గుర్తించామని, దీనిపై కమిటీ వేశామని, త్వరలోనే వారి సమస్యను పరిష్కరిస్తామని అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించడాన్ని సింగరేణి వ్యాప్తంగా కార్మికలోకం స్వాగతిస్తోంది. అదే సమయంలో తమ సమస్యలను కూడా పరిష్కరించాలని విశ్రాంత కార్మికులు వేడుకుంటున్నా రు. అదే రెండుపేర్ల సమస్య తమనూ నేటికీ వెంటా డుతోందని, కనీసం తాము మరణించేలోగానైనా సమస్య పరిష్కరించాలని ప్రభుత్వంతో విన్నవించుకుంటున్నారు. ఇప్పటికే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో అనేక ఇబ్బందులు పడుతున్నతాము.. ఆస్తుల మార్పిడి, ఆధార్కార్డులు, ఇతర గుర్తింపు కార్డుల విషయంలో చెప్పలేని పాట్లు, మానసిక వ్యధ అనుభవిస్తున్నామని వాపోతున్నారు. ఆస్తులు, పింఛన్ల విషయంలో.. ఇప్పటివరకూ రిటైర్డ్ అయిన వారిలో 35వేల మందికిపైగా విశ్రాంత కార్మికులు రెండుపేర్ల సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీరంతా 70 నుంచి 80ఏళ్లు పైబడిన వారే. వీరిలో సగానికిపైగా రెండు ఆధార్కార్డులు తీసుకున్నారు. ఇదే వీరికి శాపంగా పరిణమించింది. ప్రస్తుతం బ్యాంకులు కేవైసీలు అడుగుతున్న క్రమంలో ఆధార్కార్డులు మ్యాచ్ కాక సగానికిపైగా కార్మికుల పింఛన్లు నిలిచిపోయాయి. ఇప్పటికీ వీరి ఆస్తులు వారి సంతానం పేరిట మారకపోవడంతో తల పట్టుకుంటున్నారు. తాజాగా కాస్తోకూస్తో వస్తున్న పింఛన్లు కూడా నిలిచిపోవడంతో తల పట్టుకుంటున్నారు. తమకు కూడా అలియాస్ పేరుతో అవకాశం కల్పించాలని సీఎం రేవంత్రెడ్డిని కోరుతున్నారు. -
3,718 ఎకరాలు
● ‘ఇది సిరిసిల్లలోని బీవై నగర్ కార్మిక క్షేత్రం. నాలుగున్నర దశాబ్దాల కిందట ఇక్కడ రాయిని చెరువు ఉండేది. నేత కార్మికులు అధికంగా ఉన్న సిరిసిల్లలో నివాస స్థలాల లేక అప్పటి పాలకులు చెరువు శిఖంలో ఇళ్ల స్థలాలను పట్టాలుగా ఇవ్వడంతో బీవైనగర్, సుందరయ్యనగర్, తారక రామానగర్, ఇందిరానగర్లాంటి ప్రాంతాలు ఆవిర్భవించాయి. ఈ నాలుగు కార్మికవాడల్లో 8 వేల ఇళ్ల నిర్మాణాలు జరిగాయి. ఏదైనా ఆపద పడి ఇల్లును అమ్ముకుని సొమ్ము చేసుకుందామంటే.. రిజిస్ట్రేషన్ కావడం లేదు. కార్మిక వాడల్లో ఆస్తులున్నా అక్కరకు రావడం లేదు. ప్రభుత్వ రికార్డుల్లో 22–ఎ జాబితాలో చేరిపోయింది. ఫలితంగా సామాన్యులు బాండ్ పేపర్లపై ఇంటి నంబరుతో క్రయ, విక్రయాలు సాగిస్తున్నారు.’ -
బీఆర్ఎస్ నేతల ఆందోళన
సిరిసిల్లటౌన్: బీఆర్ఎస్ శ్రేణుల నిరసనలతో కార్మికక్షేత్రం దద్దరిల్లింది. మంగళవారం అంబేడ్కర్ చౌరస్తాలో వందలాది సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి, సీఎం రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రానివ్వకుండా పోలీసులతో అడ్డుకున్నారని, మహిళ ఎమ్మెల్యేల పట్ల అమానుషంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్రెడ్డి అప్రజాస్వామిక విధానాలను మానుకోవాలని సూచించారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో గద్దెనెక్కి ఒక్కటి కూడా అమలు చేయని చేతగాని ప్రభుత్వంగా విమర్శించారు. వందలాది సంఖ్యలో బీఆర్ఎస్ ఆందోళన నేపథ్యంలో పోలీస్, పార్టీ శ్రేణుల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. పలుమార్లు సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. చివరకు సీఎం ఫొటోలు చించి, కాంగ్రెస్ ఫ్లెక్సీ ముక్కలను దహనం చేశారు. తోపులాటలో బీఆర్ఎస్వీ నాయకుడు కంచర్ల రవిగౌడ్ తదితరులకు స్వల్ప గాయాలయ్యాయి. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాఫ్క్సాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, సెస్చైర్మన్ చిక్కాల రామారావు, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, వైస్చైర్మన్ దార్ల సందీప్, సిరిసిల్ల ఇన్చార్జి తుల ఉమ, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, గూడూరి ప్రవీణ్, బొల్లి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
గడువులోగా సీఎంఆర్ ఇవ్వాలి
సిరిసిల్ల: జిల్లాలోని రా, బాయిల్డ్ రైస్ మిల్లర్లు గడువులోగా సీఎంఆర్ ఇవ్వాలని పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ జీవీ శ్యాంప్రసాద్లాల్ కోరారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ గరీమా అగ్రవాల్తో కలిసి రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా మిల్లర్లు తప్పనిసరిగా బియ్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, డీసీఎస్వో బుచ్చిబాబు, పౌరసరఫరాల డీఎం గోపాల్ తదితరులు పాల్గొన్నారు. అక్రమ వెంచర్లపై కొరడాబోయినపల్లి(చొప్పదండి): మండలంలోని విలాసాగర్ గ్రామపంచాయతీ పరిధిలో అక్రమంగా ఏర్పాటు చేసిన వెంచర్లపై ఇన్చార్జి ఎంపీడీవో శ్రీధర్ ఆధ్వర్యంలో పంచాయతీ అధికారులు కొరడా ఝులిపించారు. సర్వేనంబర్ 15–ఏ, 15–బీ, 15–సీలో 2.20 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు అనుమతి లేకుండా వెంచర్ ఏర్పాటు చేశారు. నోటీసులు ఇచ్చినా బే ఖాతర్ చేయడంతో పాటు, సదరు ప్లాట్లను అమాయక ప్రజలకు అంటగడుతున్నట్లు సమాచారం అందుకున్న ఇంచార్జీ ఎంపీడీవో, కార్యదర్శి శేఖర్ మంగళవారం సిబ్బందితో మల్లేశంకు సంబంధించిన వెంచర్లో హద్దురాళ్లను తీయించారు. అలాగే సత్తవ్వకు సంబంధించిన అక్రమ లే అవుట్ వెంచర్పై నోటీసు అందచేసినట్లు కార్యదర్శి తెలిపారు. మాతృ, శిశు మరణాలను నివారించాలి సిరిసిల్ల: ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూ రాష్ట్రంలోనే జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ కోరారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్లో మంగళవారం ఆశా నోడల్ పర్సన్లలో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. జిల్లాలో మాతృ, శిశు మరణాలు సంభవించకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఆరోగ్య కేంద్రాల పరిధిలో జరుగుతున్న గర్భస్రావాలపై ప్రత్యేక నిఘా ఉంచి, కారణాలను విశ్లేషించి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఆశా నోడల్ పర్సన్స్ తమ పరిధిలోని ఆశా కార్యకర్తల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ, క్షేత్రస్థాయిలో ఆరోగ్య సేవలు ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోగ్రాం ఆఫీసర్లు రామకృష్ణ, సంపత్కుమార్, వేణుగోపాల్రెడ్డి, నయీమ్ జహా, సీహెచ్వో శాంత తదితరులు పాల్గొన్నారు. గల్ఫ్ కార్మికుల వేదిక ఆవిర్భావ వేడుకలుసిరిసిల్ల: వృత్తినైపుణ్యంతోనే రాణిస్తారని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని దుబాయిలోని భారత కాన్సులేట్ జనరల్ డాక్టర్ ఇమ్మడి విష్ణువర్దన్రెడ్డి అన్నారు. దుబాయి వేదికగా ఏర్పడిన గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక(జీడబ్ల్యూఏసీ) 10వ ఆవిర్భావ సమ్మేళనం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన విష్ణువర్దన్రెడ్డి మాట్లాడుతూ, జీడబ్ల్యూఏసీ సైనికులు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేశారని, ఎన్ఆర్ఐ పాలసీ నివేదిక తయారు చేయడం జరిగందని, రాష్ట్ర కేబినెట్ ముందుకు వెళ్లిందన్నారు. తెలంగాణ సాంస్కృతిక వారసత్వమైన బతుకమ్మ, బోనాలు, జానపద గీతాలను ప్రపంచంలో ఎక్కడున్నా సగర్వంగా ఆచరించి, ఆస్వాదించాలన్నారు. జీడబ్ల్యూఏసీ ప్రతినిధులు రాజ శ్రీనివాస్రావు, కృష్ణ దొనికెని, వంశీగౌడ్, రవి కటుకం తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రముఖ గాయని రేలరేల గంగ బృందం గీతాలు అలరించాయి. -
ఆశాకార్యకర్తల ముందస్తు అరెస్ట్
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ప్రభుత్వ హామీలపై బీఆర్ఎస్ పార్టీ నిరసనలతో హోరెత్తిస్తుంటే, ఉక్కిరిబిక్కిరవుతున్న పోలీసులు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలతో నిరసన చేపట్టే అన్ని వర్గాలపై నిర్బంధం కొనసాగిస్తున్నారు. అసెంబ్లీ ముట్టడికి వెళ్లి నిరసన తెలుపుతారనే ఉద్దేశంతో ఆశాకార్యకర్తలను పోలీసులు, ముందస్తు అరెస్టు చేశారు. మంగళవారం ఉద యం నుంచి రాత్రి 8 గంటలకు సొంత పూచీకత్తుపై ఎవరి ఊర్లకు వారిని పంపించారు. ఆశాకార్యకర్తలు శోభ, జ్యోత్స్న, దేవలక్ష్మి, దేవేంద్ర, సంతోష, కె.రజిత, ఎం.దేవేంద్ర, రజిత, మనూష, వాణి ఉన్నారు. ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లుసిరిసిల్ల: జిల్లాలో వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ కోరారు. కలెక్టరేట్ నుంచి మంగళవారం ఆర్డీ వోలు, తహసీల్దార్లు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డుల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. భూముల రీ సర్వే పకడ్బందీగా చేపట్టాలన్నారు. సర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. -
వెల్లివిరిసిన ఆధ్యాత్మికం
శ్రావణమాసం చివరి మంగళవారం సందర్భంగా కార్మికక్షేత్రం సిరిసిల్ల ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరిసింది. స్థానిక ఆర్యవైశ్య భవనంలో శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి మాతకు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీలలితా సహస్రనామ పారాయణం, కుంకుమార్చనలు నిర్వహించారు. ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు ఎల్లంకి వాణి, చేపూరి జమున, గౌరిశెట్టి ఇందిరా, అల్లాడి సరస్వతిదేవి, బుస్స ప్రసన్న, రాజూరి చంద్రకళ, ఎల్లంకి లక్ష్మి, గూడెల్లి కవిత, గౌరిశెట్టి బాలలక్ష్మి, పుల్లూరి సమత తదితరులు పాల్గొన్నారు. – సిరిసిల్లటౌన్ -
ప్రశాంతంగా గణేశ్ ఉత్సవాలు
సిరిసిల్ల: గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. ఈనెల 14 నుంచి నవరాత్రులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో జిల్లాల ఎస్పీలు, సీపీలు, పోలీస్ అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బందోబస్తు, భద్రత చర్యలపై దిశనిర్దేశం చేశారు. మండపాల వివరాలు, ఊరేగింపు మార్గాలు, సమయం వంటి సమాచారం సేకరించాలని సూచించారు. సున్నితమైన ప్రాంతాలు, వివాదాస్పద ప్రదేశాలను గుర్తించి నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డీజేలు, బాణసంచా వినియోగంపై నిబంధనలు అమలు చేయాలన్నారు. ప్రతీ మండపం వద్ద కనీసం ముగ్గురు వలంటీర్లు రేయింబవళ్లు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, జియోట్యాగింగ్ చేయాలన్నారు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులు, వదంతులు, రెచ్చగొట్టే వ్యాఖ్యలపై స్టేషన్ స్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు. గణేశ్ శోభాయాత్రలో ఆటంకాలు తలెత్తకుండా నిర్వహించడానికి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఎస్పీ మహేశ్ బీ గీతే, డీఎస్పీలు కె.నాగేంద్రచారి, జి.వెంకటేశ్వర్లు, సీఐ మధుకర్, ఆర్ఐ సురేష్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
బస్షెల్టర్ నిరుపయోగం
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూర్ మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాల ఎదుట ఉన్న బస్స్టాప్లోకి వెళ్లే పరిస్థితి లేదు. ఏపుగా గడ్డి పెరిగి బస్స్టాప్లోకి వెళ్లలేకుండా మారింది. సిరిసిల్లకు వెళ్లే ప్రయాణికులు, గురుకుల విద్యార్థుల తల్లిదండ్రులు ఈ స్టాప్లోనే వేచి ఉంటారు. అయితే బస్షెల్టర్ ఎదుట ఇలా గడ్డి పెరిగి, బురదమయంగా మారడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. మురుగునీటిని తొలగించి, గడ్డిని తీసేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, రాజన్న సిరిసిల్ల -
గుట్టుగా గుడి భూమి విక్రయం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండల కేంద్రంలోని కేశవపెరుమాండ్ల ఆలయానికి చెందిన సుమారు ఐదెకరాల భూమిని పూజారులు రాచర్లబొప్పాపూర్కు చెందిన ఓ వ్యాపారికి విక్రయించారని సర్పంచ్ ఎలగందుల నర్సింలు ఆధ్వర్యంలో ఎంపీడీవో సత్తయ్యకు సోమవారం ఫిర్యాదు చేశారు. సర్పంచ్ నర్సింలుతోపాటు గ్రామస్తులు మాట్లాడుతూ భూమి సంబంధికులకు ఫోన్ చేసి ఆరా తీసినట్లు తెలిపారు. ఆలయ భూమి ఇతరులకు చెందకుండా తిరిగి ఆలయానికి ఉండేలా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. సింగిల్విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, నాయకులు వెంకటనర్సింహరెడ్డి, గుండాడి వెంకట్రెడ్డి, గోపాల్రెడ్డి, దూస శ్రీనివాస్, రైతులు పాల్గొన్నారు. -
అక్షర దీపం వెలిగింది
● జగ్గారావు‘పల్లె’ చదివింది ● వయో‘జనులకు’ రాత్రి బడి చదువులు ● పోలీసుల ప్రోత్సాహం.. పల్లెజనం ఉత్సాహం ● ‘ప్రేరణ’తో చదువుల బాట ● నేడు అక్షరాస్యత దినోత్సవంసిరిసిల్ల: ఆ పల్లెలో అక్షర దీపం వెలిగింది. చైతన్య కాంతులు పల్లవించాయి. నాకెందుకు లే.. చదువు అంటూ మొదట్లో ముక్కు విరిచినా వృద్ధులే.. పలక, బలపం పట్టి అక్షరాలు దిద్దారు. వేలిముద్రలు వేసేవాళ్లంతా సంతకాలు నేర్చుకున్నారు. అంకెలు నేర్చుకొని ఫోన్ నంబర్లు రాస్తున్నారు.. ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి సమీపంలోని జగ్గారావుపల్లి సాధించిన అక్షర విజయం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అక్షర పథకాలకు కోట్లు వెచ్చించినా.. ఆచరణలో సాధ్యం కాని పనిని స్థానిక పోలీసులు పన్నెండేళ్ల కిందట సాధించారు. సిరిసిల్ల అప్పటి డీఎస్పీ దామెర నర్సయ్య, అప్పటి సిరిసిల్ల టౌన్ సీఐ విజయ్కుమార్ ప్రేరణతో గ్రామస్తులు అక్షరాలు దిద్దారు. 2014లో మూడు నెలల్లోనే ఆ పల్లె ప్రజలు సంతకాల సాక్షిగా అక్షరాస్యులుగా మారారు. సెప్టెంబరు 8న అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. చిన్న ఊరు.. పెద్ద విజయం జగ్గారావుపల్లిని సంపూర్ణ అక్షరాస్యత గ్రామంగా మార్చేందుకు పోలీసులు నడుం బిగించారు. అప్పటి సిరిసిల్ల డీఎస్పీ దామెర నర్సయ్య, అప్పటి సిరిసిల్ల టౌన్ సీఐ విజయ్కుమార్ ఆ ఊరిని సంపూర్ణ అక్షరాస్యత గ్రామంగా తీర్చిదిద్దేందుకు నిర్ణయించారు. ఈ మేరకు గ్రామస్తులతో మాట్లాడి రాత్రి బడి నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగానే చదువు విలువను అర్థమయ్యేలా వివరించేందుకు ప్రేరణ పేరుతో జానపద కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. చదువురాని వారిని గుర్తించేందుకు సర్వే చేశారు. ఊరిలో జనాభా 1050 ఉండగా.. చదువు రాని వారు 154 మంది ఉన్నట్లు గుర్తించారు. రాత్రి బడి ఏర్పాటు చేశారు. ఐదుగురు నిరక్షరాస్యులకు ఒక్కో విద్యావంతుడికి అక్షరాలు దిద్దించే బాధ్యత అప్పగించారు. రోజు రాత్రి 7 నుంచి 8 గంటల వరకు రాత్రి బడిలో అక్షరాలు దిద్దించారు. 2014 సెప్టెంబర్ 5న సంపూర్ణ అక్షరాస్యతకు శ్రీకారం చుట్టారు. సరిగ్గా మూడునెలల వ్యవధిలో జగ్గారావుపల్లిలోని 154 మందికి అక్షరాలు నేర్పించారు. సంతకాలు చేయడం రావడంతో అంకెలు నేర్చుకున్నారు. సెల్ఫోన్ నంబర్ రాయడం మొదలుపెట్టారు. రాత్రి బడి ఆ పల్లెలో అక్షర వెలుగులు నింపింది. ‘ఈచ్ వన్.. టీచ్ వన్’ ఫెయిల్ సంపూర్ణ అక్షరాస్యత లక్ష్యంగా ప్రభుత్వం ‘ఈచ్ వన్.. టీచ్ వన్’ పేరుతో 2020లో సర్వే చేసింది. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలతోపాటు 260 గ్రామాల్లో 49,977 మంది నిరక్షరాస్యులు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో పురుషులు 13,400, మహిళలు 36,577 మంది ఉన్నారు. జిల్లాలో అక్షరాస్యుల సంఖ్య 3,15,611 మంది ఉన్నట్లు 2011 జనాభా లెక్కల ప్రకారం వెల్లడైంది. ఇందులో పురుషులు 1,82,946, మహిళలు 1,32,665 మంది ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యులు 2,36,706 మంది ఉండగా.. పట్టణ ప్రాంతాల్లో 78,905 మంది ఉన్నట్లు తేలింది. చదువు రాని వారికి చదువు నేర్పే లక్ష్యంతో ‘ఈచ్ వన్.. టీచ్ వన్’ కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, విద్యాశాఖ, స్వచ్ఛంద సంస్థలు, అంగన్వాడీ టీచర్లు, మహిళా సంఘాలను భాగస్వాములను చేశారు. కానీ ఈ కార్యక్రమం అనేక కారణాలతో ఫెయిల్ అయింది. అయితే పోలీసుల చొరవతో జగ్గారావుపల్లి అక్షరాలు దిద్దింది. జగ్గారావుపల్లి,రాత్రి బడిలో మహిళలకు అక్షరాలు నేర్పిస్తున్న అప్పటి డీఎస్పీ దామెర నర్సయ్య -
పెండింగ్ డీఏలు మంజూరు చేయాలి
ముస్తాబాద్(సిరిసిల్ల): ఉపాధ్యాయుల పెండింగ్లో ఉన్న ఆరు డీఏలను వెంటనే మంజూరు చేయాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రావు ప్రభుత్వాన్ని కోరారు. ముస్తాబాద్, చీకోడు, గూడెం గ్రామాల్లో పీఆర్టీయూ సభ్యత్వ నమోదును సోమవారం చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాస్రావు మాట్లాడుతూ సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరారు. 51 శాతం ఫిట్మెంట్తో కొత్త పీఆర్సీ అమలు చేయాలని, మోడల్స్కూల్ ఉపాధ్యాయులకు 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలన్నారు. హైదరాబాద్లో నిర్వహించే టీజీఈ జేఏసీ మహాధర్నాకు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. మండలశాఖ అధ్యక్షుడు బాలకిషన్, ప్రధాన కార్యదర్శి శివశంకర్, సత్తయ్య, స్వామి, శంకర్, శివప్రసాద్ పాల్గొన్నారు. కొంత మంది సర్పంచులపై చిన్నచూపువేములవాడరూరల్: వేములవాడ రూరల్ మండలంలోని కొంతమంది సర్పంచ్లపై అధికారులు, కాంగ్రెస్ నాయకులు చిన్నచూపు చూస్తున్నారంటూ పలువురు సర్పంచులు కలెక్టర్ గరీమా అగ్రవాల్కు సోమవారం ఫిర్యాదు చేశారు. గ్రామాల్లో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల విషయం, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ విషయంలో సమాచారం ఇవ్వలేదన్నారు. పార్టీ జెండాపై గెలువకుండా ప్రజల అభిమానాలతో గెలిచిన సర్పంచ్లను అందరిని సమానంగా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు. సర్పంచులు జంకె మధు, సాండెసారి సౌజన్య, జుట్టు నరేశ్, సయ్యద్ షాదుల్లా, కడారి సంధ్య, ఇల్లందుల లాస్య ఉన్నారు. వైన్షాపుల్లో ఎనర్జీ డ్రింక్స్ విక్రయాలపై ఫిర్యాదువేములవాడరూరల్: మద్యం బాటిళ్లు విక్రయించాల్సిన బ్రాందీ షాపు నిర్వాహకులు ఎనర్జీ డ్రింక్ అమ్మడంతో చిరు వ్యాపారుల పొట్ట కొడుతున్నారని వేములవాడకు చెందిన బూర్ల ప్రదీప్ సోమవారం కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. పట్టణంలోని కొందరు వైన్షాపు నిర్వాహకులు వాటర్బాటిల్స్, కూల్డ్రింక్స్ ఇతర తినుబండారాలు కూడా విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. ఎలాంటి ఎనర్జీ డ్రింక్స్ విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మానసిక ఆందోళన... ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య జ్యోతినగర్: చదువుపై ఆందోళనతో ఇంటర్ విద్యార్థి అయాన్ ఖాన్(17) మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. ఎన్టీపీసీ కృష్ణానగర్లోని ఓ అపార్ట్మెంట్లో నివాసముంటున్న అంజత్ఖాన్ కుటుంబం ఆదివారం బంధువుల ఇంటికి వెళ్లింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న అయాన్ఖాన్ మానసిక వ్యథతో ఉరేసుకుని మృతి చెందాడు. రాత్రి సమయంలో కుటుంబసభ్యులు వచ్చి చూసేసరికి పైకప్పుకు వేలాడుతూ కనిపించడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. చదువుపై ధ్యాస కుదరడం లేదనే ఆందోళనతో విద్యార్థి మానసికంగా ఇబ్బందికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపినట్లు సమాచారం. మృతుడి తండ్రి అంజద్ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. బైక్ దొంగ అరెస్ట్జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలో ద్విచక్రవాహనాన్ని దొంగతనం చేసిన నిందితుడిని సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు. పట్టణంలోని గాంధీనగర్కు చెందిన కమలాకర్ తన ద్విచక్ర వాహనాన్ని గతనెల 17న ఇంటి ముందు పార్క్ చేశాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. బాధితుని ఫిర్యాదు మేరకు ఎస్సై కుమారస్వామి కేసు దర్యాప్తు చేపడుతుండగా.. సోమవారం మధ్యాహ్నం విద్యానగర్ బైపాస్రోడ్ నుంచి బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడిని రాయికల్ మండలం వీరాపూర్కు చెందిన షేక్ జమీల్గా గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసి బైక్ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. -
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
సిరిసిల్ల అర్బన్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయడం లేదని కలెక్టరేట్ ప్రజావాణిలో బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. అంతకుముందు కలెక్టరేట్ గేట్ వద్ద నిరసన తెలపగా.. పోలీసులకు, బీఆర్ఎస్ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, నాయకులు గూడూరి ప్రవీణ్, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ గడ్డం నగేశ్ను కలిసి ఫిర్యాదు అందజేశారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, బొల్లి రామ్మెహన్, మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ తదితరులు పాల్గొన్నారు. -
ఓటర్లకు నోటీస్ల భయం
వేములవాడ: సర్ నోటీస్లతో ఓటుహక్కును కాపాడుకునేందుకు ప్రజల ఆధారాలతో ఆఫీస్లు చుట్టూ తిరుగుతున్నారు. ఎస్ఐఆర్(సర్) సవరణకు వస్తున్న నోటీస్లు ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. దశాబ్ద కాలంగా ఒకే ప్రాంతంలో నివాసముంటున్న వారి పేర్లు కూడా ఓటర్ల జాబితా నుంచి గల్లంతవడం, సవరణ నోటీసులు చేతికి రావడంతో జనం బేజారవుతున్నారు. బీఎల్వో కుటుంబానికీ తప్పని తిప్పలు క్షేత్రస్థాయిలో విధుల్లో ఉన్న బీఎల్వో జ్యోతి కుటుంబానికి కూడా నోటీస్లు అందాయి. ఆమె తల్లి రాజమణి, కుమారుడు శివమణి, కూతురు హిమబిందు పేర్లు గల్లంతయ్యాయి. ఈమేరకు నోటీస్లు అందాయి. ఆధారాలతో రాకపోతే ఓటు రద్దు బెదిరింపులు! నోటీసులు అందుకున్న వారు నిర్ణీత తేదీ, సమయానికి సంబంధిత కార్యాలయానికి తగిన ఆధారాలతో హాజరుకావాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. వయోవృద్ధులు, మహిళలు తమ పనులు వదులుకుని, కాగితాలు చేతపట్టుకుని ఆఫీసుల వద్ద గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. సాంకేతిక లోపాలు, సిబ్బంది అలసత్వంతో పొరపాట్లు జరుగుతున్నాయని, విచారణ పేరిట ప్రజలను ఇబ్బందులకు గురిచేయకుండా క్షేత్రస్థాయి పరిశీలన ద్వారానే సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. 1956 నుంచి ఉంటున్నా వేములవాడలో 1956 నుంచి ఉంటున్నాను. నా పేరు కూడా సవరణ జాబితాలో గల్లంతైంది. దశాబ్దాలుగా ఇక్కడే ఉంటూ.. ప్రతీ ఎన్నికలోనూ ఓటుహక్కు వినియోగించుకుంటున్న. అయినా నోటీస్లు అందాయి. – కె.సాంబశివరావు, రిటైర్డ్ టీచర్ -
అక్కాచెల్లెళ్ల ‘గాజుల’ బంధం
గంభీరావుపేట(సిరిసిల్ల): పల్లె వాతావరణంలో సంప్రదాయాలు కొత్త ట్రెండ్స్తో మేళవించి సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా అక్కాచెల్లెళ్ల మధ్య ఉన్న ఆత్మీయతను చాటేందుకు గాజులు వేయించుకోవడం ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ట్రెండ్గా మారింది. పండుగలు, శుభకార్యాలు, కుటుంబ వేడుకల సందర్భంగా అక్కాచెల్లెళ్లు ఒకే రకమైన చీరలు, ఒకే డిజైన్ గాజులు ధరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అక్కాచెల్లెళ్ల అనుబంధానికి గాజులు సింగారించుకుంటున్నాయి. గాజుల గలగలలో సోదరీలు ప్రేమ పంచుకుంటున్నారు. మనస్సు నిండా ఆనందంతో చేతినిండా గాజులు వేసుకుంటున్నారు. ఇప్పుడు పల్లెల్లో ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. గాజులు వేయించుకుంటున్న అక్కాచెల్లెళ్లతో పల్లెల్లో సందడి నెలకొంటుంది. గాజుల చప్పుళ్లతో ఆప్యాయత చేతినిండా రంగురంగుల గాజులు ధరించి, అందరూ కలిసి ఒకే తరహాలో ఫొటోలు దిగడం యువతులు, మహిళల్లో ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా అక్కాచెల్లెళ్ల అనుబంధం, ప్రేమ, ఐక్యతను ప్రతిబింబించేలా గాజులు వేయించుకోవడం సోషల్ మీడియాలోనూ ప్రత్యేకంగా కనిపిస్తోంది. పల్లె నుంచి సోషల్ మీడియా వరకు.. గతంలో గాజులు అంటే పండుగలు, పెళ్లిళ్లు, సంప్రదాయ వేడుకలకే పరిమితమయ్యేవి. ఇప్పుడు కొత్త ఫ్యాషన్ జోడైంది. స్నేహితులు, అక్కాచెల్లెళ్లు కలిసి గాజులు వేయించుకుని శ్రీసిస్టర్ గ్యాంగ్శ్రీగా ఫొటోలు దిగుతూ జ్ఞాపకాలను పదిలం చేసుకుంటున్నారు. గాజుల గలగలలో అనుబంధం చేతికి అలంకారమే కాదు.. అక్కాచెల్లెళ్ల మధ్య ప్రేమకు ప్రతీకగా గాజులు మారుతున్నాయి. ఒకే రంగు.. ఒకే డిజైన్.. ఒకే ఆనందం.. ఇలా పల్లె మహిళల చేతుల్లో గాజుల గలగలలు కొత్త సందడిని తీసుకొస్తున్నాయి. అక్కాచెల్లెళ్లందరం కలిసి గాజుల పండుగ చేసుకున్నం. ప్రేమానురాగాలతో ఒకరికొకరం కొత్త గాజులు వేసుకున్నం. ఒకే రకమైన గాజులు ధరించి సంబురపడ్డాం. అక్కాచెల్లెళ్ల బంధాన్ని చాటి చెప్పేలా ఒకే డిజైన్, ఒకే రంగు గాజులు ధరించాం. మా అనుబంధం మరింత బలపడింది. – ఎర్ర లావణ్య, గంభీరావుపేట, -
జీడీకే–11గనిలో కార్మికుడికి గాయాలు
గోదావరిఖని: సింగరేణి సంస్థ రామగుండం డివిజన్–1 పరిధిలోని జీడీకే–11 గనిలో మొదటిషిఫ్టులో గని పైకప్పు కూలి కోల్కట్టర్ కార్మికుడు సార్ల సాగర్ గాయపడ్డాడు. గనిలోని 50వ లెవల్, 13వ డీప్, 3వ సీమ్లో పైకప్పు సేఫ్టీ పనిచేస్తున్న క్రమంలో పెద్దబండ కూలి కొంతబాగం నడుం, కాళ్లపై పడటంతో కుడికాలుకు గాయాలయ్యాయి. వెంటనే సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి, టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ మాదాసి రాంమూర్తి కార్మికుడిని పరామర్శించారు. లారీ డ్రైవర్ ఆత్మహత్యకోరుట్లరూరల్: పట్టణంలోని అల్లమయ్యగుట్టకాలనీకి చెందిన లారీ డ్రైవర్ ఈర్నాల రాజేశ్ (48)ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల కథనం ప్రకారం.. రాజేశ్ కొంతకాలంగా ఫిట్స్వ్యాధితో బాధ పడుతున్నాడు. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. రాజేశ్కు భార్య భాగ్య, నలుగురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. భాగ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఉపాధ్యాయురాలిపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు జగిత్యాలక్రైం: మల్లాపూర్ మండలంలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయురాలిని అసభ్యకరంగా సైగలు చేస్తూ ఇబ్బందికి గురిచేస్తున్న మరో ఉపాధ్యాయుడు ఆగుల్ల సత్యనారాయణపై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై కుమారస్వామి తెలిపారు. కరీంనగర్లోని తీగలగుట్టపల్లికి చెందిన ఆగుల్ల సత్యనారాయణ ప్రస్తుతం రాయికల్ మండలం భూపతిపూర్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో సదరు ఉపాధ్యాయురాలిని వెంబడిస్తూ.. అసభ్యంగా సైగలు చేస్తూ ఇబ్బందులకు గురిచేయగా గతంలో ఇతడిపై పట్టణ పోలీస్స్టేషన్లో రెండు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో అతడిని విధుల నుంచి సస్పెండ్ కూడా చేశారు. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. మళ్లీ సదరు ఉపాధ్యాయురాలికి అసభ్యకరంగా మెసేజ్లు పంపుతూ పెళ్లి చేసుకోవాలని వెంబడిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేశారు. సత్యనారాయణను సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు. -
భీమేశ్వర దర్శనం నయనానందకరం
వేములవాడ: శ్రావణమాసంలో చివరి సోమవారం సందర్భంగా భీమన్నను దర్శించుకునేందుకు 1,05,600లకు పైగా భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంతాలు రద్దీగా మారాయి. షవర్ల వద్ద స్నానాలు చేసిన భక్తులు కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకున్నారు. తడిబట్టలతో భీమన్నకు కోడె కట్టారు. అభిషేకాలు, అన్నపూజలు, సత్యనారాయణవ్రతాలు, కల్యాణాలు, కుంకుమపూజలు నిర్వహించారు. భక్తుల ద్వారా రూ.78 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఏర్పాట్లను డీఈవో ప్రతాప నవీన్, ఏఈవో మహేశ్, పర్యవేక్షకులు పరిశీలించారు. కోడె మొక్కులకు కొట్లాట భీమన్నకు కోడె మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో క్యూలైన్ భారీగా పెరిగిపోయింది. కోడె మొక్కులు చెల్లించుకునే ప్రాంతంలో గొడవ జరిగింది. పీఆర్వో కార్యాలయం నుంచి ఇచ్చే స్పెషల్ కోడె టికెట్లను అధికారులు నిలిపివేయడంతో గొడవ సద్దుమణిగింది. -
భీమన్న సేవలో జిల్లా జడ్జి
వేములవాడ: భీమన్నను జిల్లా ప్రిన్సిపల్ జడ్జి పి.నీరజ కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. వేదోక్త ఆశీర్వచనం అందించారు. విద్యుత్ భద్రతకు ప్రాధాన్యం సిరిసిల్లటౌన్: వినాయక వేడుకల్లో విద్యుత్ భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు టీజీఎన్పీడీసీఎల్ ఎస్ఈ గణేశ్ ప్రకటనలో తెలిపారు. గణేశ్ మండపాలు, నిమజ్జన మార్గాల్లో ప్రత్యే క తనిఖీలతో విద్యుత్ ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మండపా ల ఏర్పాటు, విద్యుత్ అలంకరణలు, విగ్రహా ల తరలింపు, నిమజ్జనం సమయంలో మండపాల నిర్వాహకులు, విద్యుత్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విద్యుత్ లైన్లకు సమీపంలో గణేశ్ విగ్రహాలు, క్రేన్లు, మెటల్ ఫ్రేములు తీసుకెళ్లడం ప్రమాదకరమన్నారు. తెగిపోయిన తీగలు, లూజ్ లైన్లు, ప్రమాదకర స్థితిలో ఉన్న విద్యుత్ స్తంభాలు కనిపిస్తే వెంటనే 1912 టోల్ఫ్రీ నంబర్కు సమాచారం ఇవ్వాలని కోరారు. లారీని అడ్డుకున్న గ్రామస్తులు తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని సారంపల్లిలో వేగంగా వెళ్తున్న లారీని గ్రామస్తులు అ డ్డుకున్నారు. వారం రోజులుగా గ్రామం నుంచి మట్టి తరలిస్తున్నారు. నెమ్మదిగా కాకుండా వేగంగా లారీలు వెళ్తుండడంపై గ్రామస్తులు ఆగ్రహించారు. వేగంగా వెళ్తున్న లారీని మొదట గ్రామపంచాయతీకి, ఆ తర్వాత తంగళ్లపల్లి పోలీస్స్టేషన్కు తరలించారు. నాంపల్లి గుట్టపై వాహనాల రద్దీ వేములవాడఅర్బన్: రాజన్న అనుబంధ ఆలయమైన నాంపల్లి గుట్టపై శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు బారులుతీరారు. గుట్ట పైకి వచ్చిన భక్తులు ఆహ్లాదకర వాతావరణంలో నరసింహుడిని, కాళీయమర్ధనంలోని నాగదేవతను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా అంతటా వర్షం సిరిసిల్ల: జిల్లా వ్యాప్తంగా ఆదివారం తెల్లవారుజామున వర్షం కురిసింది. బోయినపల్లిలో అత్యధికంగా 12.1 మిల్లీమీటర్లు పడింది. వేములవాడ, రుద్రంగి, చందుర్తిల్లో 1.7 మిల్లీ మీటర్ల, వేములవాడ రూరల్లో 2.8, సిరిసిల్లలో 0.2, కోనరావుపేటలో 1.6, ఎల్లారెడ్డిపేటలో 6.5, ముస్తాబాద్లో 1.3, తంగళ్లపల్లిలో 0.9, ఇల్లంతకుంటలో 2.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వీర్నపల్లి, గంభీరావుపేట మండలాల్లో పెద్దగా వర్షం పడలేదు. -
మూలవాగు.. సిరులసాగు
సిరిసిల్ల: ఎల్నినో తీవ్ర ప్రభావం ఉందని.. వరి వద్దు.. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని అధికారులు సూచించారు. అయితే జిల్లా రైతులు కాలానికి అనుగుణంగా విస్తారంగా వరి, పత్తి సాగుచేశారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 1,46,118 ఎకరాల్లో వరి పంట వేయగా.. 50,275 ఎకరాల్లో పత్తి సాగుచేశారు. 4,500 ఎకరాల్లో మొక్కజొన్న వేశారు. జిల్లాలో ప్రస్తుతం 2,10,380 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. వరి ఏపుగా ఎదుగుతుండగా పత్తిలో మాత్రం కలుపు సమస్య ఎక్కువగా ఉంది. కోనరావుపేట మండలం నిమ్మపల్లి మూలవాగు జలాశయం నిండడంతో ఈ ప్రాంత రైతులు వరి సాగుచేశారు. వట్టిమల్ల, నిమ్మపల్లి, బావుసాయిపేట, కొండాపూర్ గ్రామాల్లో పసిడి పంటలు కనుచూపు మేర పచ్చదనంతో అలరిస్తున్నాయి. ఎగసిపడుతున్న బోర్లు, పైకొచ్చిన భూగర్భ జలాలతో మూలవాగు పరిసరాల్లో ముచ్చటైన వరిసాగు ఆవిష్కృతమైంది. -
ఇక కాలేజీల్లో యూనిఫామ్ !
గంభీరావుపేట(సిరిసిల్ల): ఇన్నాళ్లు పాఠశాలల స్థాయి విద్యార్థులకే పరిమితమైన యూనిఫామ్ కాలేజీ విద్యార్థులకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని విద్యార్థులకు యూనిఫామ్ అందించేందుకు చర్యలు చేపట్టింది. కొలతలు తీసుకుంటున్న మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని విద్యార్థులకు యూనిఫామ్ అందించేందుకు మహిళా సంఘాల సభ్యులు రంగంలోకి దిగారు. విద్యార్థుల కొలతలు తీసుకుంటూ, వాటికి అనుగుణంగా యూనిఫామ్స్ కుట్టే పనులు మొదలుపెట్టారు. దీంతో మహిళా సంఘాల సభ్యులకు ఉపాధి అవకాశాలు లభించడంతోపాటు విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్స్ అందే అవకాశం ఏర్పడింది. 10 కళాశాలలు.. 2,500 మంది విద్యార్థులు జిల్లాలో 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సుమారు 2,500 మంది ఇంటర్ విద్యార్థులు ఉన్నారు. వీరందరికీ యూనిఫామ్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు పాఠశాల స్థాయిలోనే యూనిఫామ్స్ ఉండగా, తొలిసారిగా ఇంటర్ విద్యార్థులకు అందిస్తున్నారు. తేడా కనిపించకుండా ఉండాలనే.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు అందరూ ఒకే రకమైన దుస్తుల్లో వస్తున్నారు. అదే కాలేజీలకు వచ్చేసరికి యూనిఫాం లేకపోయేసరికి ఒక్కో విద్యార్థి ఒక్కో రంగు దుస్తులతో వస్తున్నారు. దీంతో విద్యార్థుల మధ్య తారతమ్యాలు పొడచూపుతున్నాయి. ఈ భావనలను నివారించేందుకు ప్రభుత్వం యూనిఫాం పంపిణీకి శ్రీకారం చుట్టింది. యూనిఫామ్ అమలుతో విద్యార్థుల మధ్య ఆర్థిక స్థాయి, దుస్తుల విషయంలో తేడాలు కనిపించకుండా ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. అందరూ ఒకే విధమైన దుస్తుల్లో కళాశాలకు రావడం ద్వారా సమానత్వ భావన పెంపొందడంతోపాటు క్రమశిక్షణ పెరుగుతుందని చెబుతున్నారు. ఎంఈవోల పర్యవేక్షణ యూనిఫామ్ కొలతలు, క్లాత్ పంపిణీ, కుట్టు పనులు తదితర ప్రక్రియలను ఎంఈవోల పర్యవేక్షణలో కొనసాగిస్తున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా యూనిఫామ్స్ సిద్ధం చేసి, నిర్ణీత సమయంలో అందించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. నీలిరంగు చొక్కా, బ్లూ కలర్ ప్యాంట్తో యూనిఫామ్స్ ఇస్తున్నారు. -
● మరుగున పడుతున్న టాయిలెట్ల నిర్వహణ ● పనికిరాకుండా స్మార్ట్ టాయిలెట్స్ ● పట్టించుకోని అధికారులు, పాలకులు
సిరిసిల్లటౌన్: స్వచ్ఛ సిరిసిల్లలో స్మార్ట్ వాష్రూమ్స్ తుప్పుబడుతున్నాయి. గతంలో జాతీయ అవార్డులు సాధించిన పట్టణంలో ఇప్పుడు ఒకటికి, రెంటికి స్థానికులు తిప్పలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి వచ్చి పోయే సందర్శకులకు అత్యవసర పరిస్థితిలో ఇబ్బంది పడుతున్నారు. ఉగ్గపడుతూ.. తెలిసిన వారింటికి వెళ్లే దుస్థితి ఉంది. జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్, కొత్తబస్టాండు, కొత్తచెరువు, మానేరుతీరం, ప్రధాన జంక్షన్లు, షాపింగ్ ఏరియాల్లో టాయిలెట్స్ లేక జనాలు ఇబ్బంది పడుతున్నారు. ఇలా అయితే ఎలా ? పట్టణంలో టాయిలెట్స్ ఇలా..టాయిలెట్స్(పురుషులు) 39(సీట్లు) టాయిలెట్స్(మహిళలు) 29(సీట్లు) బాత్రూమ్స్(పురుషులు) 06 బాత్రూమ్స్(మహిళలు) 04 యూరినల్స్(పురుషులు) 33 -
సహకారంలో అవినీతి దాపరికం!
చందుర్తి(వేములవాడ): దోచుకున్నోనికి దోచుకున్నంత అనే మాటలు చందుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘానికి చక్కగా సరిపోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.2లక్షల్లోపు రుణాలు మాఫీ చేయడంతో సంఘంలో జరిగిన అక్రమాలు వెలుగుచూశాయి. దీంతో సహకార సంఘం అధికారులు 2024, ఆగస్టులో 51 విచారణ చేపట్టారు. అక్రమార్కులను గుర్తించేందుకు విచారణ అధికారులకు ఏడాది పట్టింది. ఈ విచారణలో సీఈవో గంగారెడ్డి రూ.1.03కోట్లు సొంతానికి వాడుకున్నట్లు గుర్తించగా, మిగతా రూ.65లక్షలు దీర్ఘకాలిక, స్వల్పకాలిక వ్యక్తిగత రుణాలు అందించారు. ఆ రుణాలను 2008 నుంచి రికవరీ చేయలేదు. ఇంత అవినీతి జరిగినా సహకార సంఘంలో ఏటా జరిగిన ఆడిట్లో తప్పుడు నివేదికలను ఇచ్చిన ఆడిట్ అధికారులపై చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యమేమిటని సహకార సంఘం సభ్యులు ప్రశ్నిస్తున్నారు. పక్కదారి పట్టించిన సొమ్మును బహిర్గతం చేసిన, రికార్డులను ఆడిట్ చేసిన రికార్డులో ఆడిట్ అధికారులు వివరాలు గోప్యంగా ఉంచడంతో విచారణ అధికారులను తప్పు పడుతున్నారు. రికార్డులు పరిశీలనలతో వెలుగులోకి.. సహకార సంఘంలో జరిగిన లావాదేవీలకు సంబంధించిన పుస్తకాలు, రికార్డులను, ఖాతాలను పరిశీలించిన సలు వ్యత్యాసాలను 51 విచారణలో గుర్తించారు. నిధుల వినియోగం, బకాయిల వసూళ్లు, ఖాతాల నిర్వహణ అంశాల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు విచారణలో ప్రస్తావించినట్లు సమాచారం. రూ.1.68 కోట్ల వ్యవహారంపై చర్చ సంఘానికి సంబంధించిన సుమారు రూ.1.68 కోట్ల వరకు విచారణలో బహిర్గతం చేసి ఏడాదిన్నర కాలం గడిచినా రికవరీ చేయలేదు. నోటీసులతో సరిపెట్టారు. ఇంత భారీ మొత్తానికి సంబంధించిన వ్యవహరంలో సీఈవో గంగారెడ్డి రెండేళ్ల క్రితం సస్పేన్షన్ అయ్యారు. నిధుల దుర్వినియోగానికి సహకరించిన అధికారులను ఎందుకు కాపాడుతున్నారంటూ సంఘం సభ్యులు, రైతుల్లో ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. పాలకవర్గ బాధ్యులపై రికవరీ ఏదీ ? సంఘం పరిధిలోని సభ్యులకు వ్యక్తిగత, దీర్ఘకాలిక రుణాల వసూళ్లల్లో బాధ్యులైన పాలకవర్గ సభ్యులకు రూ.65లక్షల రికవరీకి నోటీసులు ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు వాటి రికవరీ కోసం ఎలాంటి ఒత్తిళ్లు చేయలేదు. 2008 నుంచి రుణాలు ఉన్నాయని ప్రస్తుతం ఉన్న పాలకవర్గం సభ్యులే కాకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న సభ్యులు బాధ్యత వహించాలని సహకార సంఘం ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాలు కాగితాలకే పరిమితమయ్యాయి. సంఘ సభ్యుల సమక్షంలో వివరాలు వెల్లడించాలి చందుర్తి సహకార సంఘం పరిధిలోని సభ్యుల సమక్షంలో సహకార సంఘం ఉన్నతాధికారుల సభ్యుల సమక్షంలో అవినీతి, అక్రమాలు వెల్లడించాలి. ఇప్పటి వరకు చేపట్టిన చర్యలు, వసూలు చేసిన సొమ్ము వివరాలు, మిగిలిన సొమ్ము రికవరీకి ఎలా చేస్తారో బహిరంగంగా వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా సంఘంలో అవినీతి అక్రమాలు జరిగిన సంవత్సరాల్లో ఆడిట్ చేసిన అధికారుపై, రైతులు ప్రమేయం లేకుండా ఎలాంటి విచారణ లేకుండా రెండుసార్లు రుణాలను మంజూరి చేసిన బ్యాంకు సిబ్బంది ఎవరెవరూ అన్న వివరాలను ఉన్నతాధికారులు వివరించి , ఇక ముందు ఇలాంటి అవినతీ , అక్రమాలు జరగకుండా చర్యలు చేపట్టాలని సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. లీగల్ చర్యలకు సిద్ధమవుతున్నాం చందుర్తి సహకార సంఘంలో 51 విచారణ నివేదిక ఆధారంగా బాధ్యులైన వారిపై లీగల్గా చర్యలు చేపట్టేందుకు నివేదికలను సిద్ధం చేసుకుంటున్నాం. సంఘంలో అవినీతి, అక్రమాలకు బాధ్యులైన ఏ ఒక్కరిని వదిలిపెట్టబోం. దాదాపు 15 ఏళ్ల రికార్డులు, ఖాతాలు పరిశీలించి.. పక్కదారి పట్టిన సొమ్మును ప్రకటించాం. సంఘం పరిధిలోని సభ్యులు ఎవరూ అనుమానాలు పడొద్దు. సహకార చట్టం ద్వారా చర్యలు తప్పవు. – రామకృష్ణ, జిల్లా సహకార సంఘం అధికారి, రాజన్న సిరిసిల్ల -
సర్పంచ్పై కలెక్టర్కు ఫిర్యాదు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎలగందుల నర్సింలు గ్రామ పంచాయతీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్ గరీమా అగ్రవాల్కు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు కామారెడ్డి నవీన్రెడ్డి ఆదివారం తెలిపారు. ఐదు నెలల క్రితం రెండో బైపాస్రోడ్డులోని కామారెడ్డి నవీన్రెడ్డి ఇంటి నుంచి రెండో బైపాస్రోడ్డు వరకు సీసీ రోడ్డు నిర్మించారు. కాగా సర్పంచ్ ఎలగందుల నర్సింలు ఆ రోడ్డును గత నెల 2న జేసీబీ సాయంతో ధ్వంసం చేశాడని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ వెంటనే విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. -
ధరలు ప్రదర్శించాలి
స్మార్ట్ సిరిసిల్ల స్ఫూర్తిని కొనసాగించేలా పట్టణంలో నలువైపులా కొత్తగా పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి. ఇప్పుడున్న సులభ్ కాంప్లెక్సుల్లో నిర్వాహకులు దోపిడీకి పాల్పడకుండా ధరల పట్టిక, సమయపాలన బోర్డులు ఏర్పాటు చేయాలి. టాయిలెట్స్ శుభ్రంగా ఉంచడం లేదు. తొట్టీలు పాడైనా మార్చడం లేదు. ఫినాయిల్, బ్లీచింగ్ చేయడం లేదు. అధికారులకు చెబితే పట్టించుకోవడం లేదు. – బియ్యంకార్ శ్రీనివాస్, సిరిసిల్ల ప్రతిపాదనలు పూర్తయ్యాయి పాతబస్టాండులో సులభ్ కాంప్లెక్సు స్థానంలో మోడల్ టాయిలెట్స్ నిర్మిస్తున్నాం. అక్కడ ప్రయాణికుల కోసం తాత్కాలిక టాయిలెట్స్ ఏర్పాటు చేశాం. స్మార్ట్ వాష్రూమ్స్ స్థానంలో కొత్త నిర్మాణం కోసం ప్రతిపాదనలు చేశాం. త్వరలోనే కార్యరూపం దాల్చుతుంది. పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. – ఎం.ఎ.ఖదీర్పాషా, మున్సిపల్ కమిషనర్. సిరిసిల్ల -
ఇసుక రీచ్లపై నిబంధనలు పాటించాలి : కలెక్టర్
సిరిసిల్ల: జిల్లాలో కొత్త ఇసుక రీచ్లపై ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ.. అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ సూచించారు. కలెక్టరేట్లో శనివారం జిల్లా స్థాయి ఇసుక కమిటీ(డీఎల్ఎస్సీ) సమావేశం నిర్వహించారు. టీజీఎండీసీ పీవో శ్రీని వాస్, మైనింగ్ ఏడీ క్రాంతికుమార్, నీటి పారుదల శాఖ అధికారులు ప్రశాంత్, కిశోర్కుమార్, మున్సి పల్ కమిషనర్ ఖదీర్పాషా, తహసీల్దార్లు మహేశ్, మురళి, పర్యవేక్షకులు ప్రవీణ్ పాల్గొన్నారు. ఎరువుల కొరత లేదు చందుర్తి(వేములవాడ): ఎరువులకు కొరత లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. చందుర్తి పీఏసీఎస్లోని ఎరువుల నిల్వలు తనిఖీ చేశారు. యూరియా కోసం పీఏసీఎస్కు వచ్చిన రైతులతో మాట్లాడారు. వేములవాడ ఆర్డీవో కేఎస్బీ కుమారి, జిల్లా సహకార అధికారి రామకృష్ణ, ఏడీఏ ప్రదీప్ ఉన్నారు. 15న రాజన్న కోడెలు పంపిణీ వేములవాడఅర్బన్: రాజన్న కోడెలను ఈనెల 15న పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ గరీమా అగ్రవాల్ తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రైతులకు 150 జతలు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. 1.5 నుంచి 5 ఎకరాల వరకు సాగు భూమి ఉన్న రైతులు ఈనెల 10 వరకు https//rajannasiricilla. telangana.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. -
మట్టి రోడ్డు పునరుద్ధరణ
గంభీరావుపేట(సిరిసిల్ల): గంభీరావుపేట, లింగన్నపేట మధ్య మానేరువాగుపై మళ్లీ తాత్కాలిక మట్టి రోడ్డు ఏర్పాటు చేశారు. ‘వాగొచ్చె.. రోడ్డు పాయే’ శీర్షికన సాక్షిలో శనివారం ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. ప్రస్తుతం ద్విచక్రవాహనాలు, లైట్వెహికిల్స్ వెళ్లేలా తాత్కాలికంగా మట్టి రోడ్డును పునరుద్ధరించారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు, హెవీ వెహికిల్స్ మినహా మిగతా వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. అధ్యాపకులకు సన్మానం సిరిసిల్ల అర్బన్: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న పలువురు ఉత్తమ అధ్యాపకులకు తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్(టీజీవో) ఆధ్వర్యంలో శనివా రం సన్మానించారు. జిల్లా ఇంటర్ విద్య కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా ఇంటర్ విద్యాధికారి శరత్కుమార్ చేతుల మీదుగా 10 మంది అధ్యాపకులకు అవార్డులు ప్రదానం చేశారు. టీజీవో అసోసియేషన్ అధ్యక్షుడు సయ్యద్ జబీ, సంఘం నాయకులు బొల్గం సాగర్, రసూల్, అహ్మద్ పాల్గొన్నారు. సర్కారు బడికి పూర్వ విద్యార్థి కానుక సిరిసిల్లటౌన్: విద్యాబుద్ధులు నేర్చుకున్న విద్యాలయానికి పూర్వ విద్యార్థి బోర్వెల్, మోటార్ అందించారు. సిరిసిల్లకు చెందిన ఎన్ఆర్ఐ డాక్టర్ కుసుమ విఠల్, ఆయన కుమారుడు కుసుమ శరత్ సిరిసిల్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు బోర్వెల్, మోటార్ అందించారు. శనివారం స్థానిక కౌన్సిలర్ గెంట్యాల శ్యామల చేతుల మీదుగా ప్రారంభించారు. కుసుమ రామయ్య జ్ఞాపకార్థం రూ.1.50లక్షలతో బోర్ ఏర్పాటు చేశారు. డాక్టర్ కుసుమ శరత్, పాఠశాల హెచ్ఎం బైరి రవీందర్, రిటైర్డ్ ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం మ్యాన ఆంజనేయులు, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ విజయ రఘునందన్, గాజుల ప్రతాప్ పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలి సిరిసిల్లటౌన్: మున్సిపల్ పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీపీఐ పట్టణ కార్యదర్శి పంతం రవి కోరారు. ఈమేరకు కార్మికుల సమస్యలను వివరిస్తూ సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ఎం.ఎ.ఖదీర్పాషాకు వినతిపత్రం అందించారు. కొన్ని వార్డుల్లో 15 రోజులకోసారి డ్రైనేజీ శుభ్రం చేయడం లేదన్నారు. ఇప్పటికైనా కొత్త పాలకవర్గం మున్సిపల్ సిబ్బందిని పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గుంటి వేణు, సోమ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఖాళీ బిందెలతో నిరసన గంభీరావుపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్లో తాగునీటి సమస్య తీర్చండి అంటూ కొందరు మహిళలు శనివా రం ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ కొన్ని వీధుల్లో నల్లా కనెక్షన్లు బ్లాక్ అయ్యాయని, మిషన్ భగీరథ నీళ్లు మురి కిగా వస్తున్నాయన్నారు. పంచాయతీ పరిధి లోని బోర్లు మరమ్మతులకు నోచుకోవడం లేదన్నారు. నీటి కోసం చేనుల వద్దకు వెళ్లే పరిస్థితులు వచ్చాయన్నారు. ఆరు మండలాల్లో చిరుజల్లులు సిరిసిల్ల: జిల్లాలోని ఆరు మండలాల్లో శనివారం చిరుజల్లులు కురిశాయి. కోనరావుపేటలో 7.3 మిల్లీమీటర్లు, వీర్నపల్లిలో 2.8, ఇల్లంతకుంటలో 1.0, తంగళ్లపల్లిలో 0.8, గంభీరావుపేటలో 0.5, వేములవాడలో 0.9 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. -
జానపద కెరటాలు!
మట్టి పరిమళాలు..వారికి పల్లె పాటలంటే ప్రాణం. జానపదాలకు అందమైన అర్థాలు అల్లి.. బాణీకట్టి తమ గొంతుకతో పాడి పాటకే జీవం పోస్తున్నారు. పల్లెటూరు నుంచి సినిమాల్లో పాడేవరకూ ఎదిగిన జానపద స్వరం చుంచు నాగవ్వది. చదువు రాకున్నా.. పాటనే శ్వాసగా మార్చుకుని.. తెలంగాణ మట్టి వాసనను తన గొంతుతో జగమంతా పరిచయం చేస్తున్నారు నాగవ్వ. అమ్మమ్మ, తాతయ్యల ఊరి మట్టి వాసనతో మొదలై.. కోట్లాది వ్యూస్, సినిమా స్వరాలతో దూసుకుపోతున్నారు మల్లిక్ తేజ. పల్లె యాసలో ఉండే తీయదనం, జానపదంలో పలికే జీవధార ఆయన పాటలకు ప్రాణం పోస్తున్నాయి. పల్లెగుండె చప్పుడును తన గొంతుకగా మార్చుకున్నాడు మరో కళాకారుడు గడ్డం రమేశ్. మట్టి వాసనలు.. పల్లె జీవన సౌందర్యం, బతుకమ్మ, బోనాల విశిష్టతను నరనరానా జీర్ణించుకుని జానపదానికి సరికొత్త ఊపిరి పోస్తున్నారు. తండ్రి యక్షగాన వారసత్వాన్ని ఒంటపట్టించుకుని, కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకుంటూ తెలంగాణ జానపద శిఖరంగా ఎదుగుతున్నారు. – గొల్లపల్లి – వివరాలు 8లోu -
సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులు
సిరిసిల్ల: సమాజాన్ని మార్చే శక్తి ఉపాధ్యాయుల చేతుల్లో ఉందని, విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో శనివారం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పురస్కారాలకు ఎంపికైన జిల్లాలోని 37 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ తల్లిదండ్రుల తరువాత విద్యార్థులను ప్రభావం చూపేది ఉపాధ్యాయులేనన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, అబ్దుల్ కలాం, మహాత్మా జ్యోతిరావు పూలే దంపతుల బోధనలు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు టీచర్లే రోల్ మాడల్ విద్యార్థులకు టీచర్లు రోల్ మోడల్ అని కలెక్టర్ గరీమా అగ్రవాల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా తాను ఆరో తరగతిలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పద్యం, స్పీచ్ ఇవ్వడం మరిచిపోలేని అనుభూతి అని గుర్తు చేసుకున్నారు. అప్పటి తమ మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ జిల్లా కలెక్టర్ను కలిసి ఆమె మాటలతో స్ఫూర్తి పొందానన్నారు. అవార్డు పొందిన ఉపాధ్యాయులు వీరే.. జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు పొందిన వారిలో చిట్నేని శ్రీకాంత్రావు, తిరుమల మనోహరాచారి, ఆడెపు రాజేశం, అజ్మీరా మదన్లాల్, గుర్రం సందీప్, నర్ర శ్రీనివాసరెడ్డి, మధుకర్రెడ్డి, గంప లక్ష్మీనారాయణ, ఎం.లక్ష్మయ్య, మోహమ్మద్ రహీం, సీహెచ్.రమాదేవి, ఎం.కోటేశ్వర్, కొప్పు రాములు, వెంగల మహేశ్, మాదాడి వెంకటరావు, కుమ్మరి మల్లేశం, సీహెచ్.మాధవిలత, ఎన్.కనకయ్య, ఈ.శ్రీనివాస్, కపిల్ల నరేశ్, రామగిరి స్వరాజ్యలక్ష్మి, కొత్తపల్లి మమత, యాస శ్రీలత, డి.రఘు, ఎం.సుజాత, బోనగిరి రాజేందర్, ఊతం విజయకుమార్, దరిపెల్లి రాజేశం, బొల్లి రమేశ్, అణువోజు రాజు, తెల్ల వకుల, మేకల పద్మ, మామిళ్ల విఠల్, కె.జయలక్ష్మి, ఆర్.వసంత, బి.సుధారాణి, టి.గీత ఉన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, డీఈవో మొండయ్య, కోనరావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య పాల్గొన్నారు. -
ఆధునికతతో సృజనాత్మక వస్త్రోత్పత్తులు
● వినూత్న ప్రయోగాల శిల్పి నల్ల విజయ్కుమార్ ● భవిష్యత్లో విజయ్కుమార్తో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయిస్తా ● సిరిసిల్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావుసిరిసిల్ల/వేములవాడ: మరమగ్గాలు వచ్చిన తరువాత ఆధునికతతో నాణ్యమైన వస్త్రోత్పత్తులు, వినూత్న ఆవిష్కరణ చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు పేర్కొన్నారు. సిరిసిల్లలో నల్ల విజయ్కుమార్ ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ జకార్డ్ టెక్నాలజీతో నడిచే కార్ఖానాను శనివారం ప్రారంభించి మాట్లాడారు. నాలుగు దశాబ్దాల కిందటే చేనేత కళాకారుడు నల్ల పరంధాములు అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసి సిరిసిల్ల చేనేత కళావైభవాన్ని చాటి చెప్పారన్నారు. పరంధాములు వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన కుమారుడు విజయ్ వినూత్న ప్రయోగాలు చేస్తున్నారని ప్రశంసించారు. వెండి వెన్నెల చీర ఆవిష్కరణ ‘షిఫ్ట్ జకార్డ్’ పేరుతో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని వెండి, బంగారంతో ప్రత్యేకమైన చీరలను రూపొందిస్తున్నారని కేటీఆర్ అభినందించారు. ‘వెండి వెన్నెల’ పేరుతో రూపొందించిన చీర అద్భుతంగా ఉందని అభినందించారు. భవిష్యత్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత రంగాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు. విజయ్ కోసం అద్భుతమైన కర్మాగారం ఏర్పాటు చేసి, అవసరమైన సబ్సిడీలు అందిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ వేములవాడ ఇన్చార్జి చలిమెడ లక్ష్మీనర్సింహరావు, జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, మాజీ జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ వైస్చైర్మన్ దార్ల సందీప్, బీఆర్ఎస్ నాయకులు గూడూరి ప్రవీణ్, జిందం చక్రపాణి, మంచె శ్రీనివాస్, దార్నం లక్ష్మీనారాయణ, తుమ్మ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ జిల్లా బిడ్డగా విద్యార్థులకు అండగా నిలుస్తా సిరిసిల్ల ఎమ్మెల్యేగా, మాజీ మంత్రిగా, ఈ జిల్లా బిడ్డగా విద్యార్థులకు అండగా నిలుస్తానని కేటీఆర్ పేర్కొన్నారు. వేములవాడ మండలం అగ్రహారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు 20 రోజులకు పైగా ఆందోళన చేస్తుండగా.. శనివారం వారిని కలిసి మాట్లాడారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడొద్దన్నారు. బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మినరసింహరావు, సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్రెడ్డి, కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు. -
పాత పద్ధతిలో ఎరువులు సరఫరా చేయాలి
కోనరావుపేట(వేములవాడ): యాప్ను తొలగించి.. పాత పద్ధతిలోనే ఎరువులు సరఫరా చేయాలని కోరుతూ నిజామాబాద్ క్రాసింగ్ వద్ద రైతులు శనివారం బైఠాయించారు. వారు మాట్లాడుతూ యాప్లో బుకింగ్, సర్వర్ సమస్యలతో కొద్ది రోజు లుగా ఇబ్బందులు ఎదురువుతున్నాయన్నారు. చేతికొచ్చిన పంటకు యూరియా వేసే కీలక తరుణంలో అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోందన్నారు. డిజిటల్ ప్రక్రియ పేరుతో క్షేత్రస్థాయిలో రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపసర్పంచ్ లంబ రాజు, కాంగ్రెస్ గ్రామాధ్యక్షుడు ముత్యాల శ్రీని వాస్రెడ్డి, నాయకులు పర్శరాములు, భాస్కర్రెడ్డి, తాళ్లపెల్లి మధు, శ్రీకాంత్, మహేశ్, లంబ వేణు పాల్గొన్నారు. రైతుల ఆందోళన కోనరావుపేట మండలం సుద్దాలలోని సింగిల్విండో గోదాం వద్ద రైతులు ఆందోళన చేశారు. యూరియా ఆన్లైన్లో బుకింగ్ చేద్దామంటే 5 నిమి షాల్లో ఖాళీ కావడంపై వ్యవసాయాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఇన్చార్జి వ్యవసాయాధికారి దుర్గరాజు చేరుకుని రైతులతో మాట్లాడారు. రెండు రోజుల్లో యూరియా వస్తుందని తెలిపారు. -
అక్షర దీపాలు.. ఆదర్శ మూర్తులు
శనివారం శ్రీ 5 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026కృష్ణం వందే జగద్గురుమ్చందుర్తి(వేములవాడ): రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.విజయలక్ష్మి బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ రూపొందించే పాఠ్య పుస్తకాల ప్రణాళిక కమిటీలో సభ్యురాలుగా కొనసాగుతున్నారు. విద్యారంగంలో విశిష్ట సేవలతో పాటు విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారు. కళాశాలలో విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థుల ప్రతిభను వెలికితీయడం, క్రమశిక్షణతో కూడిన విద్యాబోధనకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ప్రభుత్వం రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డుకు ఎంపిక చేసింది. అవార్డును ఈనెల 5న హైదరాబాద్లోని రవీంద్రభారతిలో సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదగా అందుకోనున్నారు. విద్యార్థుల భవిష్యత్ కోసం మరింత అంకితభావంతో పని చేస్తానని విజయలక్ష్మి వెల్లడించారు.కథలాపూర్(వేములవాడ): 2026 ఏడాదికి రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డుకు ఎంపికై న జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్య్రాల ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న గుండు విజయ్ 2008లో ఉద్యోగంలో చేరాడు. మండలంలోని సిరికొండ, అంబారి పేట పాఠశాలల్లో పనిచేశాడు. 2018లో తాండ్య్రాలకు బదిలీపై వచ్చారు. అప్పుడు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 90మంది విద్యార్థులు ఉండగా, గతేడాది సంఖ్య 153కు పెరిగింది. ప్రీ ప్రైమరీకి అనుమతి రావడంతో ఈసారి ప్రవేశాలు పెరిగి 176 మంది చదువుతున్నారు. విజయ్ ప్రీ ప్రైమరీ తరగతికి పుస్తకాలు రూపకల్పన చేసి, ఎఫ్ఎల్ఎన్లో 90శాతం ఫలితాలు సాధించడంతో అధికారుల మెప్పు పొందాడు. కరోనా సమయంలో ఆన్లైన్లో పాఠాలు బోధిస్తూ, విద్యార్థులు సెల్ఫోన్ ద్వారా సమాధానాలు రాసేలా వర్క్షీడ్ తయారు చేశాడు.గురుబ్రహ్మ.. గురు విష్ణు.. గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పర బ్రహ్మ.. తస్మై శ్రీ గురవే నమః.. అంటూ ప్రతీ వ్యక్తి నాలుగు గోడల మధ్య నేర్చుకునే అక్షరాలు వారి జీవితంలో వెలుగును నింపుతాయి. తల్లిదండ్రులు జన్మనిస్తే... బడిలో పాఠాలు చెప్పే గురువులు ఆ జన్మకు సాకారాన్ని అందిస్తారు. మొన్నటి వరకు ఉపాధ్యాయులు పుస్తకంలోని పాఠాలను బోధించేవారు. మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ప్రతీ అంశాన్ని ప్రయోగాత్మకంగా వివరిస్తున్నారు. జీవితంలో ఎలా స్థిరపడొచ్చు అనే అంశాన్ని విద్యార్థులకు పాఠశాలస్థాయిలోనే చెబుతున్నారు. ప్రస్తుత కార్పొరేట్ పోటీ ప్రపంచంలో సర్కారు బడి అభివృద్ధికి తమవంతు కృషి చేస్తున్నారు. ఆటల్లో జాతీయస్థాయిలో రాణించేలా తర్ఫీదు ఇస్తున్నారు. తరగతి గదుల్లో వినూత్నంగా బోధన అందిస్తూ.. మా మంచి మా‘స్టార్లు’ అనిపించుకుంటున్నారు. నేడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనాలు..!! -
విద్యార్థుల ముంగిటకు విజ్ఞానం
జ్యోతినగర్: పాఠ్యపుస్తకాల్లోని అంశాలు బోధించడమే కాకుండా విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందిస్తూ, ప్రయోగాత్మక విద్యకు పెద్దపీట వేస్తున్నారు ఉపాధ్యాయుడు గూళ్ల అంజన్కుమార్. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ జ్యోతినగర్లోని జెడ్పీహెచ్ఎస్లో స్కూల్ అసిస్టెంట్(బయోసైన్స్)గా పనిచేస్తున్న అంజన్కుమార్ విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా జీవశాస్త్రాన్ని ప్రయోగాత్మక పద్ధతుల్లో బోధిస్తున్నారు. క్లిష్టమైన అంశాలను ప్రయోగాలు, నమూనాలు, దృశ్య ప్రదర్శనల ద్వారా వివరిస్తున్నారు. విద్యార్థులు స్వయంగా పరిశీలించి, ప్రశ్నించి, తెలుసుకునే విధానాన్ని ప్రోత్సహిస్తున్నారు. మొబైల్ ల్యాబొరేటరీ ద్వారా విజ్ఞాన కార్యక్రమాల నిర్వహణ తదితర సేవలకు గుర్తింపుగా 2024లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. -
క్రీడల్లో పదును పెట్టి.. జాతీయస్థాయికి చేర్చి
జమ్మికుంట: గ్రామీణ పాఠశాలల్లో చదివే విద్యార్థుల క్రీడా ప్రతిభకు పదును పెడుతూ జాతీయస్థాయిలో రాణించేలా తీర్చిదిద్దుతున్నాడు జమ్మికుంట మండలంలోని కోరపల్లి ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు జిట్టబోయిన శ్రీను. 2012లో ఫిజికల్ డైరెక్టర్గా ఉద్యోగంలో చేరాడు. వివిధ పాఠశాలల్లో పనిచేస్తూ విద్యార్థులకు క్రీడల్లో కీలకమైన మెలకువలు నేర్పిస్తున్నారు. జాతీయస్థాయిలో బంగారు పతకాలు సాధించేలా తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం కోరపల్లి పాఠశాల నుంచి శ్రీను శిక్షణలో వనరసు సుశాంత్, ఇంజం రీతిక, ఎన్.లౌక్యశ్రీ, పింగిళి అక్షర జాతీయస్థాయి హ్యాండ్బాల్పోటీల్లో ప్రతిభ చూపారు. శ్రీను తన కెరియర్లో 80మంది క్రీడాకారులను తయారు చేశాడు. పలువురు ఇండియన్ ఆర్మీ, వివిధ పాఠశాలల్లో వ్యాయమ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. శ్రీను జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యాడు. -
యూనిఫాం తయారీతో ఉపాధి
తంగళ్లపల్లి: ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల యూనిఫాంలు కుట్టించే బాధ్యతను అప్పగించడం ద్వారా మహిళా సంఘాల సభ్యుల ఉపాధికి బలమైన మార్గం ఏర్పడిందని కలెక్టర్ గరీమా అగ్రవాల్ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని మండెపల్లిలో శ్రీ రేణుక మాత మహిళాశక్తి టైలరింగ్ సెంటర్ను సందర్శించారు. ఒక మహిళ రోజూ ఎన్ని జతల దుస్తులు కుడుతున్నారు, వారికొచ్చే రాబడి ఎంత అనే వివరాలు తెలుసుకున్నారు. పనులను నాణ్యతతో, వేగవంతంగా పూర్తిచేసి విద్యార్థులకు అందజేయాలని సూచించారు. ప్రత్యామ్నాయ పంటలతో ఆదాయం ప్రత్యామ్నాయ పంటల సాగుతో రైతులు నిరంతర ఆదాయం పొందవచ్చని కలెక్టర్ గరీమా అగ్రవాల్ తెలిపారు. మంగళవారం మండలంలోని దేశాయిపల్లిలో రైతులు కంకణాల రమేశ్, కంకణాల రాజు సాగు చేస్తున్న కూరగాయల తోటలు, పరిపల్లి మహేందర్ పొలంలో నిర్మిస్తున్న ఫార్మ్ పాండ్ను పరిశీలించి అభినందించారు. నీటి ఎద్దడి సమయంలో వరికి బదులుగా ఆరుతడి పంటలు వేయడం మంచి ఫలితాలనిస్తుందన్నారు. సర్పంచ్ గాధగోని సాగర్, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, డీఏవో అఫ్జల్ బేగం, ఉద్యానవన శాఖ అధికారి శరత్బాబు, తహసీల్దార్ మురళికృష్ణ, ఎంపీడీవో రమేశ్ తదితరులు పాల్గొన్నారు. క్రీడలతో శారీరక దృఢత్వం ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): క్రీడలతో శారీరక దృఢత్వం కలుగుతుందని జిల్లా యువజన, క్రీడల అధికారి అజ్మీర రాందాస్ పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ హైస్కూల్లో మంగళవారం మండల స్థాయి ఎస్జీఎఫ్ క్రీడాపోటీలను ప్రారంభించారు. మొదటి రోజు బాలికల అండర్– 14, 17 విభాగాల్లో కబడ్డీ, వాలీబాల్, ఖోఖో పోటీలు నిర్వహించారు. ఎంఈవో కృష్ణహరి, ఎస్జీఎఫ్ మండల కన్వీనర్ అక్బర్, క్రీడాకారులు పాల్గొన్నారు. నేత్రదానం గొప్ప సామాజిక సేవ సిరిసిల్ల: నేత్రదానం గొప్ప సామాజిక సేవ అని, మరణానంతరం మరో ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించే గొప్ప దైవకార్యమని డీఎంహెచ్వో ఎంజెలా ఆల్ఫ్రెడ్ అన్నారు. జాతీయ నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని నెహ్రునగర్ హైస్కూల్లో మంగళవారం విద్యార్థులతో నేత్రదాన ప్రతిజ్ఞ చేయించారు. నేత్రదానంపై ప్రజల్లో ఉన్న అపోహాలను తొలగించి సంపూర్ణ అవగాహన కల్పించాలన్నారు. జిల్లా అంధత్వ నివారణ ప్రోగ్రాం అధికారి డాక్టర్ నయీమా జహా తదితరులు పాల్గొన్నారు. రచయితలూ.. సమాజానికి వైద్యులే సిరిసిల్ల: సమాజ హితం కోరేదే సాహిత్యమని, సాహిత్యకారులు తమ ఉత్తమ రచనలతో సమాజానికి వైద్యం చేసే వైద్యులేనని తెలంగాణ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రముఖ పిల్లల వైద్య నిపుణుడు రచయిత డాక్టర్ గుండ్లూరి సురేంద్రబాబు అన్నారు. సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలంగాణ సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సాహిత్యంలో ఒక రోజు శిక్షణ కార్యశాలను మంగళవారం నిర్వహించారు. ప్రముఖ కథా రచయిత డాక్టర్ పెద్దింటి అశోక్కుమార్ కథలు రాయడం ఎలా..! అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. తెలంగాణ సారస్వత పరిషత్ సంచాలకులు రచయిత గరిపల్లి అశోక్, ప్రిన్సిపాల్ విజయ రఘునందన్, తెలుగు అధ్యాపకులు సామల వివేకానంద్ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి చర్యలు
సిరిసిల్ల: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజల అభ్యున్నతికి అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కోరారు. కలెక్టరేట్లో మంగళవారం కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బి గీతే, కమిషన్ సభ్యులతో కలిసి అధికారులతో సమీక్షించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అందుతున్న సంక్షేమపథకాలు, అట్రాసిటీ కేసుల పరిష్కారంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ, ప్రభుత్వం అందించే అన్ని పథకాలు అర్హులైన ఎస్సీ, ఎస్టీలకు అందేలా చూడాలన్నారు. జిల్లాలో అట్రాసిటీ కేసుల నమోదు, చార్జ్షీట్ దాఖలు, దర్యాప్తు త్వరితగతిన, పారదర్శకంగా పూర్తి చేయాలని ఆదేశించారు. బాధితులకు నష్ట పరిహారం అందేలా చూడాలన్నారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పారిశుధ్య కార్మికులకు ఎస్బీఐ బ్యాంక్ ఖాతాలు తీయించాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం కలెక్టర్ గరీమా అగ్రవాల్ మాట్లాడుతూ, జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ విద్యాలయాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యాలయాల్లో ఏమైనా ఇబ్బందులుంటే ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామన్నారు. పారదర్శకంగా విచారణ ఎస్పీ మహేశ్ బి గీతే మాట్లాడుతూ, జిల్లాలో నమోదైన అట్రాసిటీ కేసులను పారదర్శకంగా విచారణ జరుపుతున్నామని వివరించారు. వివిధ దశల్లో ఉన్న కేసులను వేగవంతంగా పూర్తి చేసి బాధితులకు న్యాయం కలిగేలా చూస్తామన్నారు. కలెక్టర్కు అభినందన కలెక్టర్ గరీమా అగ్రవాల్ సేవలను చైర్మన్ వెంకటయ్య అభినందించారు. కలెక్టర్ అందరికీ ఒకే న్యాయం చేస్తారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలకు మరింత ఉత్తమ సేవలు అందించాలని సూచించారు. పోలీసులు, ఇతర శాఖల అధికారుల సేవలను అభినందించారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, డీఆర్వో జయశ్రీ, వేములవాడ ఆర్డీవో కేఎస్బీ కుమారి, డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్రెడ్డి, సీపీఓ శ్రీనివాసాచారి, ఎస్టీ సంక్షేమ శాఖ అధికారి సంగీత, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాస్థాయి యోగా పోటీలు
సిరిసిల్లటౌన్: జిల్లాకేంద్రంలోని ఆర్యవైశ్య భవనంలో మంగళవారం జిల్లా స్థాయి యోగా చాంపియన్ షిప్ పోటీలు జరిగాయి. ఎనమిది మండలాల నుంచి కేజీబీవీ, ట్రైబల్ వెల్ఫేర్ వసతి గృహాల విద్యార్థులు పాల్గొని నైపుణ్యాన్ని ప్రదర్శించారు. యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో విద్యార్థులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. డీవైఎస్వో రాందాసు చేతుల మీదుగా మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. ఉప్పల శ్రీనివాస్, ఆడెపు రవీందర్, కల్లూరి రాజు, వెల్దండి శంకర్, గాజుల నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్హెచ్ 563.. సూపర్ ఫాస్ట్!
సాక్షిప్రతినిధి, కరీంనగర్●జాతీయరహదారి–563 ఇక అందుబాటులోకి రానుంది. వరంగల్– కరీంనగర్ సెక్షన్లో 68 కిలో మీటర్ల దూరం ఉన్న ఈ రహదారిపై ఎన్హెచ్ఏఐ అధికారులు శనివారం నుంచి ట్రయల్ రన్కు అనుమతించారు. అత్యంత ఆధునిక ప్రమాణాలతో ప్రమాదాలు నివారించేలా 24గంటల రియల్టైం మానిటరింగ్ ఉండేలా రహదారిని తీర్చిదిద్దారు. ఖమ్మం నుంచి జగిత్యాల వరకు నిర్మించనున్న ఎన్హెచ్–563లో భాగంగా కీలకమైన 68కిలోమీటర్ల వరంగల్–కరీంనగర్ సెక్షన్ పనులను రూ.2,486 కోట్లతో పూర్తిచేశారు. మూడేళ్లలో పనులు దాదాపు 95శాతం మేర పూర్తయ్యాయి. వరంగల్ నుంచి దుర్శేడ్ వరకు రోడ్డు పూర్తయినా.. ప్రస్తుతానికి మానకొండూరు సమీపంలోని ఖాదర్గూడెం వరకు మాత్రమే అందుబాటులోకి తీసుకురానున్నారు. మరోవైపు దాదాపు రూ.2,000 కోట్లకుపైగా అంచనా వ్యయంతో జగిత్యాల–కరీంనగర్ సెక్షన్ పనులకు ఇటీవల టెండర్లు పిలిచిన సంగతి తెలిసిందే. త్వరలోనే ప్రధాని నరేంద్రమోదీ వరంగల్లోని మామునూరు విమానాశ్రయం పనుల ప్రారంభోత్సవంతోపాటు ఎన్హెచ్–563ని జాతికి అంకితం చేయనున్నారు. ప్రస్తుతం దుర్శేడ్ వరకు ఎన్హెచ్ 563 పనులు పూర్తయ్యాయి. కానీ...పెద్దపల్లి నుంచి వచ్చే వాహనాలకు ఈ రోడ్డు ఎక్కేందుకు ర్యాంప్ నిర్మించలేదు. ఈ విషయాన్ని ‘సాక్షి’ ఆగస్టు 5వ తేదీన ‘వరంగల్కు దారేది?’ అన్న శీర్షికన కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన ఎన్హెచ్ఏఐ అధికారులు ర్యాంపు నిర్మాణం ప్రారంభించామని తెలిపారు. ఈ వారంలోనే అందుబాటులోకి తీసుకువస్తామని ‘సాక్షి’కి తెలిపారు. ప్రజలకు ఎక్కడ ఇబ్బంది ఉన్నా తమకు వెంటనే సంప్రదించాలని సూచించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా పాత రహదారిని సైతం ఎన్హెచ్ఏఐ అభివృద్ధి చేసింది. దాదాపు 39 కిమీల మేర రోడ్డుకు మరమ్మతులు నిర్వహించింది. సదాశివపల్లి వద్ద తాత్కాలిక ట్రాఫిక్ ఐలాండ్ ఏర్పాటు చేశారు. హసన్పర్తి వద్ద ఉన్న ప్రమాదకర మలుపు తీవ్రత తగ్గించారు. చింతగట్టు ఔటర్ రింగ్ రోడ్డు (బీమారం) వద్ద వాటర్ లాగింగ్ ఏరియాను సరిదిద్దుతున్నారు. ● 68 కిలోమీటర్ల పొడవున్న నాలుగులేన్ల రోడ్డును అత్యాధునిక సదుపాయాలతో నిర్మించారు. దీనిపై అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ను వాడుతున్నారు. కొత్తగట్టు వద్ద టోల్ప్లాజా నిర్మించారు. అక్టోబరు ఒకటి నుంచి ఈ మార్గంలో ప్రయాణించేవారికి టోల్ వసూలు చేస్తారు. ● ఈ రోడ్డును 100 కిమీల గరిష్ట వేగంతో వెళ్లేందుకు వీలుగా నిర్మించారు. ప్రతీ కిలోమీటరుకు కుడి, ఎడమవైపులకు సోలార్ సీసీ కెమెరాలు అమర్చారు. కొత్తగట్టులో కమాండ్ కంట్రోల్ రూం నిర్మించారు. అక్కడ నుంచే 24 గంటల రియల్ టైం మానిటరింగ్ చేస్తారు. ● ఈ రోడ్డెక్కిన వాహనం ఏదైనా సరే.. ఎక్కడ ఏ సమయానికి ఎక్కింది? ఎక్కడ దిగింది? ఎక్కడ ప్రమాదం జరిగింది? అనే విషయాలను నిరంతరం గమనిస్తుంటారు. ప్రమాదం జరిగినా, వాహనం నిలిచిపోయినా వెంటనే కొత్తగట్టు కమాండ్ కంట్రోల్ అంబులెన్స్ లేదా టోయింగ్ వాహనాలను పంపి ట్రాఫిక్ క్లియర్ చేస్తారు. ● ప్రతీ కిలోమీటరుకు ఒక ఎమర్జెన్సీ ల్యాండ్ లైన్ ఫోన్ (సేవ్ అవర్ సోల్/ ఎస్వోఎస్) ఏర్పాటు చేశారు. దీనిపై ఎలాంటి నంబరు డయల్ చేయనవరసం లేదు. కేవలం ఫోన్ రిసీవర్ ఎత్తగానే నేరుగా కొత్తగట్టు కమాండ్ కంట్రోల్కు కాల్ వెళ్లిపోతుంది. ● మితిమీరిన వేగంతో వెళ్లినా, ప్రమాదానికి కారణమైనా, నిబంధనలు ఉల్లంఘించిన వాహనాల నంబర్లు వెంటనే సీసీ కెమెరాలు వీడియో ఇన్సిడెంట్ డిటెక్షన్ సిస్టం (వీఐడీఎస్) ద్వారా పసిగట్టి పోలీసుశాఖకు పంపుతాయి. ● ఇంతకాలం వరంగల్ – కరీంనగర్ మధ్య పాత రహదారి సుమారు 72 కిలోమీటర్లకుపైగా ఉండే ది. తాజా రహదారి మాత్రం 68 కిమీ కావడం గ మనార్హం. వాన నీటిని ఒడిసిపట్టి భూగర్భంలోకి ఇంకేలా రహదారి పొడవునా.. రోడ్డుకు దిగువన ప్రత్యేకంగా ఇంకుడు గుంతలు నిర్మించారు. ● ఎలాంటి పశువులు అడ్డురాకుండా నిర్మించిన ఎలివేటెడ్ హైవే. మధ్యలో మీడియన్ ప్లాంటేషన్ పూర్తయింది. దాదాపు ప్రతీ గ్రామం వద్ద అండర్పాస్లు, సర్వీసురోడ్లు నిర్మించారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా.. హన్మకొండలోని హంటర్రోడ్డులో ఉన్న ఎన్హెచ్ఏఐ కార్యాలయంలో దరఖాస్తు ఇవ్వాలని అధికారులు స్పష్టంచేశారు. ● మొత్తం ప్రాజెక్టు సమాచారం తెలిపే స్కానర్లు రోడ్డు పొడవునా ఏర్పాటు చేశారు. ఊరుపేర్లు, తరువాత స్టాప్లు, రోడ్డు భద్రత, వాహనాల వేగంపై అవగాహన కలిగేలా సైన్ బోర్డులు అమర్చారు.శనివారం నుంచి వాహనాలకు అనుమతి -
బీజేపీ ఆఫీస్పై దాడి అప్రజాస్వామికం
సిరిసిల్లటౌన్: బీజేపీ కార్యాలయంపై దాడి అప్రజాస్వామ్యంమని బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో చేపట్టిన ధర్నాలో మాట్లాడారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకవపోవడం శోచనీయమన్నారు. నల్గొండ జిల్లాలో బీజేపీ జిల్లా అధ్యక్షుల ఇంటిపై జరిగిన దాడి ఘటనను పరిశీలించేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వెళ్తున్న సమయంలో కూడా దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం సీఎం దిష్టిబొమ్మను నాయకులు దహనం చేశారు. తొలుత సీఎం చిత్రపటాన్ని దహనం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈక్రమంలో పోలీసులు, నాయకుల మధ్య తోపులాట జరిగి కొద్ది సేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దుమాల శ్రీకాంత్, పొన్నాల తిరుపతిరెడ్డి, కర్నె హరీశ్, మీసా సంజీవ్, ఆసాని రామలింగారెడ్డి, ఉడుగుల యాదగిరి, కిరణ్నాయక్, డాక్టర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
అక్రమ కేసులు ఎత్తేయాలి
సిరిసిల్లటౌన్: ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీపై అక్రమ కేసులు ఎత్తివేయాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం డీసీసీ ఆఫీస్ ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమంలో మాట్లాడారు. ఉత్తరాఖండ్లో మల్లికార్జున్ ఖర్గే ప్రసంగించిన వేదికను గంగాజలంతో శుద్ధిచేసిన బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని త్వరలోనే వారికి సరైన రీతిలో బుద్ధిచెబుతారన్నారు. పట్టణ, మండల అధ్యక్షులు సూర దేవరాజు, సుడుది రాజేందర్, జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, కౌన్సిలర్లు బొద్దుల శ్రీనివాస్, గంగరాజు, వెంగళ లీలా లక్ష్మీనరసయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాట నరసయ్య, గడ్డం నరసయ్య, రాగుల జగన్, వంగ గిరిధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు
సిరిసిల్ల: అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లాలో మొదటి విడత మంజూరైన ఇందిరమ్మ ఇళ్లలో నిర్మించుకోని 710 మంది స్థానంలో కొత్త వారికి మంజూరు పత్రాలను గురువారం సిరిసిల్లలో పంపిణీ చేశారు. ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ పేదల సొంతింటి కలను ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు ఇస్తున్నామని తెలిపారు. కొత్త రేషన్ కార్డులు ఇచ్చి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని వివరించారు. కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. వేగంగా ఇళ్లు నిర్మించుకోవాలి కలెక్టర్ గరీమా అగ్రవాల్ మాట్లాడుతూ... సొంతిల్లు ప్రతి ఒక్కరి కల అని, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పొందిన వారు ప్రభుత్వం నిర్ణయించిన విస్తీర్ణంలో త్వరగా ముగ్గు పోసుకోవాలని సూచించారు. నియోజకవర్గానికి 2వేల ఇళ్ల చొప్పున మంజూరు చేశారని తెలిపారు. మండలాల వారీగా స్టాల్స్ ఏర్పాటు చేసి మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కె.కె.మహేందర్రెడ్డి, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, మున్సిపల్ చైర్మన్లు జిందం కళాచక్రపాణి, పుల్కం రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్లు తిరుపతి, కచ్చకాయల ఎల్లయ్య, ఆర్.రాజు, వెల్ముల స్వరూప, సబేరా బేగం, రాణి, రాములునాయక్, విజయ, హౌసింగ్ పీడీ వెంకటమాధవరావు, సిరిసిల్ల ఆర్డీవో శ్రీధర్బాబు, పరిశ్రమల శాఖ జీఎం హన్మంతు, తహసీల్దార్ మహేశ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు సూర దేవరాజు, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ విప్ ఆడెపు చంద్రకళ పాల్గొన్నారు. -
ఎకై ్సజ్ సీఐ, ఎస్సైల బదిలీ
సిరిసిల్ల: ఎకై ్సజ్శాఖ కుదుపునకు గురైంది. ఉన్నఫలంగా జిల్లాలోని ఎకై ్సజ్ సీఐలు, ఎస్సైలను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎల్లారెడ్డిపేట సీఐ ఎం.శ్రీనివాస్ను హన్మకొండకు, వేములవాడ సీఐ రాజశేఖర్ను కొత్తగూడెంకు, సిరిసిల్ల ఎస్సై ప్రణీత్ను ఖమ్మం–1కు, డీటీఎఫ్ ఎస్సై శైలజను భూపాలపల్లికి, వేములవాడ ఎస్సై కె.శ్రీనివాస్ను హసన్పర్తికి, మరో ఎస్సై రవిని నిజామాబాద్ ఎన్ఫోర్స్మెంట్కు బదిలీ చేశారు. వరంగల్ అర్బన్ సీఐ ప్రభాకర్రెడ్డిని వేములవాడకు, బెల్లంపల్లి సీఐ శారదను సిరిసిల్లకు, ఆదిలాబాద్ ఎస్సై విజయేందర్ను సిరిసిల్లకు, హన్మకొండ నుంచి ఎస్సై జి.రమ్యను వేములవాడకు బదిలీ చేశారు. ఈమేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. మిడ్మానేరు నీటిని విడుదల చేయాలి ఇల్లంతకుంట(మానకొండూర్): మిడ్మానేరు కుడికాలువ ద్వారా సాగునీటిని విడుదల చేయాలని వల్లంపట్ల, వంతడుపుల, నారెడ్డిపల్లి, రంగంపేట రైతులు గురువారం వంతడుపుల బ్రిడ్జిపైన బైఠాయించారు. రైతులు మాట్లాడుతూ సాగునీరు లేక వరి పొలాలు ఎండిపోతున్నాయన్నారు. తహసీల్దార్ సురేష్ చేరుకొని రైతులతో మాట్లాడి నీటిపారుదల అధికారులతో మాట్లాడుతానని హామీ ఇవ్వడంతో నిరసన విరమించా రు. కేతిరెడ్డి వెంకట్రెడ్డి, బీఆర్ఎస్ ఇల్లంతకుంట మండల అధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి, మాజీ జెడ్పీటీసీ సిద్ధం వేణు, వంతడుపుల మాజీ సర్పంచ్ కట్ట వెంకటరెడ్డి, అనిల్ పాల్గొన్నారు. పల్లగుట్టను పరిరక్షించాలి సిరిసిల్లటౌన్: ముస్తాబాద్ మండల్ గూడూరు, నామాపూర్ మధ్య గల పల్లగుట్టను పరిరక్షించాలని సీపీఐ జిల్లా నాయకులు గుంటి వేణు కోరారు. సిరిసిల్లలోని కార్మిక భవన్లో గురువారం సీపీఐ నాయకులు పంతం రవి, సోమ నాగరాజుతో కలిసి మాట్లాడారు. కోట్లాది రూపాయల విలువైన రంగురాళ్ల దోపిడీకి అడ్డుకట్ట వేయాలన్నారు. పల్లగుట్ట రాళ్లగుట్ట కాదని.. గూడూరుకు సహజ రక్షణగా ఉందన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాణిప్రసాద్కు పురస్కారం సిరిసిల్లటౌన్: బాలసాహితీవేత్త డాక్టర్ కందేపి రాణీప్రసాద్ అంతర్జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. బాలసాహిత్యంలో దాదాపు 60 రచనలు చేశారు. పిల్లల కోసం అనేక పాఠ్యాంశాలను సులభంగా చదువుకునేలా టీచింగ్ ఎయిడ్స్ తయారు చేసిన ఆమెను సెప్టెంబరులో మలేషియాలో జరిగే వేడుకలలో ఆమెను అవార్డుకు ఎంపిక వేశారు. సైన్స్, యాత్ర, కళలకు అనువాదాలకు సంబంధించి చేసిన రచనలకు పురస్కారానికి ఎంపిక చేసినట్లు గ్లోబల్ పీస్ ఫౌండేషన్ పేర్కొంది. డ్రైవింగ్ స్కూల్లో జపాన్ బృందం తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని మండెపల్లి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్(ఐడీటీఆర్)ను గురువారం జపాన్ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా ఐటీడీఆర్లో డ్రైవింగ్ శిక్షణ ఇచ్చే విధానాన్ని యంత్రాలను పరిశీలించారు. డ్రైవింగ్ స్టిమ్యులేటర్ను పరిశీలించి డ్రైవింగ్ చేశారు. జపాన్ బృందం ఓసి బుచి, రాజ్కుమార్, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, ఐడిటీఆర్ ప్రిన్సిపాల్ దురై మురుగన్ పాల్గొన్నారు. కొండాపూర్కు బస్సు ప్రారంభం కోనరావుపేట: మండలంలోని కొండాపూర్కు బస్సు సౌకర్యం లేక గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. సర్పంచ్ వంకాయల గౌతమి ఈ విషయాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన సిరిసిల్ల డిపో మేనేజర్ ప్రకాశ్రావుతో మాట్లాడారు. ప్రభుత్వ విప్ చొరవతో గురువారం నుంచి గ్రామానికి తిరిగి బస్సు రాకపోకలు ప్రారంభమయ్యాయి. -
జ్ఞానదీపికలు మేటిగురువులు
కరీంనగర్ సిటీ/రాయికల్/కథలాపూర్/రామగుండం/చొప్పదండి/తిమ్మాపూర్/సిరిసిల్ల టౌన్/చందుర్తి: ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు అధ్యాపకులు, ఉపాధ్యాయుల పనితీరుకు గుర్తింపు లభించింది. ఈనెల 5న ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఉన్నతవిద్య, విద్యాశాఖ ఉత్తమ పురస్కారాలు ప్రకటించింది. శాతవాహన వర్సిటీ వృక్షశాస్త్ర ప్రొఫెసర్ పడాల తిరుపతి, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం అధ్యాపకుడు డి.హరికాంత్, రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.విజయలక్ష్మి ఉత్తమ అధ్యాపకులుగా ఎంపికయ్యారు. పడాల తిరుపతి జగిత్యాల జిల్లా రాయికల్ వాస్తవ్యుడు. ఆయనను ఉపాధ్యా య సంఘం రాష్ట్ర సేవ విభాగం కన్వీనర్ చెరుకు మహేశ్వరశర్మ, టీఆర్టీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ముక్కెర శేఖర్, ఎంఈవో రాఘవులు అభినందించారు. డి.హరికాంత్ 2015 నుంచి శాతవాహన వర్సిటీలో సహాయ ఆచార్యుడిగా పనిచేస్తున్నారు. గతంలో కామర్స్ విభాగం అధిపతిగా, బీవోఎస్ చైర్మన్గా, హాస్టల్స్ చీఫ్ వార్డెన్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్గా, స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ, యూసీసీబీఎం ప్రిన్సిపాల్గా పనిచేశారు. వైస్చాన్స్లర్ ఓఎస్డీగా సేవలు అందిస్తున్నారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా.. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్య్రాల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు గుండు విజయ్, పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పొట్యాల హైస్కూల్ మ్యాథ్స్ ఉపాధ్యాయుడు గద్దె శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్ మోడల్ స్కూల్ ఉపాధ్యాయుడు గూట్ల మధుసూదన్, ఇదే జిల్లా తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడు షరీఫ్ అహ్మద్, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల బాలికల హైస్కూల్ ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు చేరాల తిరుపతి రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. వీరంతా పనితీరులో ప్రత్యేకత.. వృత్తిధర్మాన్ని అంకిత భావంతో నిర్వహించడం తదితరాల కారణంగా ఉత్తములుగా ఎంపికయ్యారు. ఎంపికై న అధ్యాపకులను, ఉపాధ్యాయులను పలువురు విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు, విద్యాభిమానులు అభినందించారు.చేరాల తిరుపతిపడాల తిరుపతిగుండు విజయ్హరికాంత్గద్దె శ్రీనివాస్గూట్ల మధుసూదన్ షరీఫ్విజయలక్ష్మి -
చెరువు నిండదు
చినుకు ఆగదు.. సిరిసిల్ల: జిల్లాలో చిన్ననీటి వనరుల కిందట 44వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఏడాది వానాకాలం పంటలకు నీటి ఇబ్బంది లేక పోగా.. యాసంగికి మాత్రం సాగునీటి ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు. ఈ ఏడాది జూన్లో వర్షాకాలం మొదలైంది. కాలం కరిగిపోయినా భారీ వర్షాలు కురువక పోవడంతో చెరువుల్లోకి నీరు చేరలేదు. నిత్యం ముసురు కురుస్తున్నా చెరువులు, కుంటలు నిండే అవకాశం కనిపించడం లేదు. ఇంకా వర్షాకాలం మరో నెల రోజులుండగా భారీ వర్షాలపై రైతులు ఆశలు పెట్టుకుంది. జిల్లాలో రోజూ వర్షం కురుస్తూనే ఉన్నా.. చెరువుల్లోకి వరద చేరలేదు. సగానికి పైగా చెరువులకు జలకళ సంతరించనే లేదు. ఈ వర్షాకాలం పంటకు ఇబ్బంది లేకపోయినా.. వచ్చే సీజన్లో పంటలకు మాత్రం ఏమాత్రం నీరు సరిపోదు అని రైతులు వాపోతున్నారు. వర్షపాతం వివరాలు(మిల్లీ మీటర్లలో) మండలం గతేడాది ఈ ఏడాది సాధారణం తేడా శాతం రుద్రంగి 500.4 467.0 628.9 – 26 చందుర్తి 624.2 541.1 647.9 – 16 వేములవాడ రూరల్ 584.2 554.2 609.5 – 09 బోయినపల్లి 528.6 539.0 539.0 – 00 వేములవాడ 638.0 728.3 622.0 17 సిరిసిల్ల 534.3 583.5 592.7 – 02 కోనరావుపేట 560.8 677.2 534.0 27 వీర్నపల్లి 643.4 720.8 566.5 27 ఎల్లారెడ్డిపేట 599.0 742.5 557.1 33 గంభీరావుపేట 714.7 584.5 541.3 08 ముస్తాబాద్ 635.5 497.8 482.3 03 తంగళ్లపల్లి 703.9 619.8 599.4 03 ఇల్లంతకుంట 788.2 498.9 466.7 07 ఇది గంభీరావుపేట మండలంలోని వెంకటాద్రి చెరువు. ప్రస్తుతం 80 శాతం మేరకు నిండింది. మరో 20 శాతం నిండితే మత్తడి దూకుతుంది. దీని కింద 600 ఎకరాల ఆయకట్టు ఉండగా... వానాకాలం పంటకు సాగునీటికి ఇబ్బంది లేదు. యాసంగి పంటలకు భరోసా లేదు. చెరువు మత్తడి పారితేనే యాసంగికి ఢోకా ఉండకపోయేది. ఇది గంభీరావుపేట మండలం నర్మాల శివారులోని ఎగువ మానేరు జలాశయం. రెండు టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల ఎగువ మానేరు జలాశయంలో కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో కురిసిన వర్షాలతో పూర్తి స్థాయిలో నిండి మత్తడి దూకింది. ఈ జలాశయంలోని నీటి మట్టాన్ని కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతే క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లాలోని భారీ, మధ్యతరహా జలాశయాలు పూర్తి స్థాయిలో నిండగా.. చెరువు, కుంటలు ఇంకా నిండలేదు. చిన్ననీటి వనరుల స్వరూపం మొత్తం చెరువులు 656 నీటిశాతం చెరువులు 0–25 247 25–50 192 50–75 89 75–100 91 మత్తడి దూకినవి 37 తెగిన, బుంగపడినవి 02 -
రేషన్బియ్యంలో నూకలు
ముస్తాబాద్(సిరిసిల్ల): సన్నబియ్యం స్థానంలో అధిక శాతం నూకలే వచ్చాయని గూడెం లబ్ధిదారులు చేసిన ఫిర్యాదుతో జిల్లా అధికారులు స్పందించారు. ఈమేరకు గూడెం రేషన్షాపును జిల్లా పౌరసరఫరాల అధికారులు గురువారం సందర్శించారు. రేషన్ బియ్యంలో అధికశాతం నూకలే ఉండడంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లామని కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు బాలయ్య తెలిపారు. స్పందించిన అధికారులు దుకాణాల్లో దించిన బియ్యాన్ని తిరిగి తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేశారన్నారు. నాణ్యమైన సన్నబియ్యం సరఫరా చేయాలని సర్పంచ్ తాటిపల్లి శంకర్ కోరారు. మాజీ ఎంపీటీసీ బొప్ప శ్రీధర్, డీలర్లు ఉన్నారు. -
మెరుగైన వైద్యసేవలు అందించాలి
వేములవాడఅర్బన్: ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్వో ఏంజెలా ఆల్ఫ్రెడ్ సూచించారు. వేములవాడ మండలం చీర్లవంచ పీహెచ్సీని గురువారం సందర్శించారు. పీహెచ్సీలో అమలవుతున్న వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎన్సీడీ స్క్రీనింగ్ జరిగేలా చూడాలన్నారు. డెంగీ, మలేరియా, వైరల్ఫీవర్స్ తదితర వ్యాధులపై ప్రత్యేక దృష్టి సారించి, ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలన్నారు. డిప్యూటీ డీఎంహెచ్వో నాగేందర్ బాబు, ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ వేణుగోపాల్రెడ్డి, డాక్టర్ రామకృష్ణ తదితరులు ఉన్నారు. -
జేఎన్టీయూ స్కామ్!
సాక్షిప్రతినిధి,కరీంనగర్ ●: కొండగట్టు జేఎన్టీయూలో వెలుగుచూసిన జీఎస్టీ కుంభకోణం కలకలం రేపుతోంది. ఇప్పటికే హైదరాబాద్ జేఎన్టీయూలో రూ.1,000 కోట్ల ఫిక్స్ డ్ డిపాజిట్లలో గోల్మాల్ వెలుగుచూసిన దరిమి లా.. దానికి అనుబంధంగా ఉన్న కొండగట్టు జేఎన్టీ యూ ఇంజినీరింగ్ కళాశాలలోనూ సరిగా అలాంటి కుంభకోణమే బయటపడడం చర్చనీయాంశంగా మారింది. విద్యార్థులు కళాశాలకు చెల్లించిన ఫీజులో చెల్లించాల్సిన జీఎస్టీలో తేడాలు రావడంతో గడబిడ మొదలైంది. కొండగట్టు జేఎన్టీయూలో విద్యార్థులు చెల్లించిన ఫీజు నుంచి జీఎస్టీకి కట్టాల్సి న రూ.5.23 లక్షలను ఓ క్లర్కు తన కూతురు, అల్లుడు ఖాతాలోకి మళ్లించాడన్న ఆరోపణలపై ఉన్నతాధికారుల ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం వెలుగుచూసిన స్కాం రూ.5.23 లక్షలకే పరిమితమా.. అంతకన్నా ఎక్కువగా ఉందా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అదే సమయంలో కేవలం ఏడాది కాలంలో ఈ కుంభకోణం జరగలేదని, గత పదేళ్లుగా ఇదే పంథాలో ఆర్థిక అక్రమాలు జరుగుతున్నాయన్న ప్రచారం ఊపందుకోవడంతో అందరి దృష్టి కొండగట్టు జేఎన్టీయూపై పడింది. గతంలో హెచ్చరించినా మారని తీరు జీఎస్టీలో తేడాలు నమోదు కావడం ఇదే తొలిసారి కాదు. వాస్తవానికి రెండేళ్ల క్రితం ఓ ఉన్నతాధికారి వద్దకు ఇలాగే జీఎస్టీ బిల్లులలో తేడాగా నమోదు చేసి తీసుకెళ్లిన సందర్భంలో ఆ ఉద్యోగికి అక్షింతలు పడ్డాయని సమాచారం. సదరు ఉద్యోగి తన తప్పును కప్పిపుచ్చుకునే యత్నం చేయగా.. తన వద్ద లెక్కలు సరిగ్గా ఉండాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఉన్నతాధికారి స్పష్టం చేశారని తెలిసింది. ఆ వాగ్వాదం అనంతరం సదరు ఉద్యోగి మెడికల్ లీవుపై నెలరోజులపాటు వెళ్లాడు. అదే సమయంలో జేఎన్టీయూ హైదరాబాద్ నుంచి ఓ అధికారి ఆ ఉద్యోగికి దన్నుగా నిలిచాడని ప్రచారం సాగుతోంది. అతను వారం లీవులు పెడితే.. అందులో రెండురోజులే అధికారికంగా నమోదయ్యేదని, మిగిలినవి పనిదినాలుగా సంతకాలు చేయించుకునేవారని ప్రచారం సాగుతోంది. ఈ లెక్కన ప్రస్తుతం వెలుగు చూసిన స్కాంలో పోలీసులు కేవలం పాత్రధారుడిపైనే కేసు నమోదు చేశారని, అసలు సూత్రధారి వేరే ఉన్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. పోలీసులు లోతుగా ఆరా తీయాలని లేకపోతే మరో ఉద్యోగిని బలిపశువు చేసి సూత్రధారులు తప్పించుకుంటారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.జేఎన్టీయూకు అనుబంధంగా కొండగట్టులో ఉన్న ఇంజినీరింగ్ కళాశాలలో ఉపకార వేతనాలు రాని విద్యార్థులు నేరుగా హాస్టల్కు చెల్లించే ఫీజులు కాలేజ్ అకౌంట్ కాకుండా యూనివర్సిటీలో పని చేసే ఉద్యోగి అకౌంట్కు వెళ్లడంపై పూర్తి విచారణ జరగాలి. ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగి జేఎన్టీయూలో పెద్దస్థాయి అధికారి అండ ఉంటేనే ఈ విధంగా చేయగలుగుతాడు. కేవలం ఏడాది ఫీజులపై కాకుండా గత మూడు విద్యా సంవత్సరాలు జరిగిన ఫీజుల లావాదేవీలపై విచారణ జరిపించాలి. అసలు దోషులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి. – మణికంఠ రెడ్డి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు -
సోనియాగాంధీని విమర్శించే హక్కు కేటీఆర్కు లేదు
సిరిసిల్ల అర్బన్ : కాంగ్రెస్ అధినాయకురాలు సోనియాగాంధీని విమర్శించే హక్కు కేటీఆర్కు లేదని రాష్ట్ర ఎస్సీసెల్ జనరల్ సెక్రెటరీ ఆకునూరి బాలరాజు అన్నారు. గురువారం పట్టణంలోని ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఎంతో మంది అమరవీరుల త్యాగాలను గుర్తించి సోనియా గాంధీ తెలంగాణను ఇచ్చిందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు మూడెకరాల భూమిని ఇస్తానని హామీలిచ్చి ఎందుకు అమలు చేయలేదన్నారు. బీసీ నాయకుల పట్ల కొండూరి రవీందర్రావు మాట్లాడిన తీరును ఖండిస్తున్నామన్నారు. వెయ్యిరోజుల పాలన అని బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని, మరి కేసీఆర్ వెయ్యి రోజుల్లో ఒక్కసారైనా ప్రజల సమస్యలపై అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదని వారు ప్రశ్నించారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు రాగుల జగన్, కంసాల మల్లేశం, బైరగోని రమేశ్, కొమ్ము త్యాగరాజు, తదితరులు పాల్గొన్నారు. -
నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు
ఎల్లారెడ్డిపేట: నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరుచేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి అన్నారు. మండలానికి చెందిన ఇందిరమ్మ పథకం కింద ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు ఓసీడీ ప్రొసీడింగ్ పత్రాలను గురువారం అందజేశారు. మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను ఎంపీడీవో సత్తయ్య అందజేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సుడిది రాజేందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాట నరసయ్య, పట్టణ అధ్యక్షుడు చెన్ని బాబు, నాయకులు లక్ష్మారెడ్డి, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాజీయే రాజ మార్గం
సిరిసిల్ల: రాజీయే రాజమార్గమని, కోర్టు కేసుల్లో ఇరుపక్షాలు రాజీ చేసుకోవడం ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికర సంస్థ అధ్యక్షురాలు పి.నీరజ పేర్కొన్నారు. జిల్లా కోర్టు సముదాయంలో గురువారం సిరిసిల్ల, వేములవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ కేసులు పరస్పర అంగీకారంతో పరిష్కారమవడం ద్వారా ప్రజలు దీర్ఘకాలిక న్యాయ ప్రక్రియల నుంచి విముక్తి పొందుతారని తెలిపారు. ఎన్ఐ యాక్ట్ (చెక్ బౌన్స్) కేసులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధిక జైస్వాల్, సీనియర్ సివిల్ జడ్జి, సిరిసిల్ల డీఎల్ఎస్ఏ ఇన్చార్జి కార్యదర్శి పి.లక్ష్మణాచారి, సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆవునూరి రమాకాంతరావు, ప్రధాన కార్యదర్శి సి.హెచ్.వెంకయ్య పాల్గొన్నారు. -
బాకీ కార్డు పేరుతో దుష్ప్రచారం
వేములవాడ: బీఆర్ఎస్ బాకీ కార్డు పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని, ఆ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. గత వెయ్యిరోజులుగా ప్రతిపక్ష నేతగా కేసీఆర్ విఫల మయ్యారని పేర్కొంటూ రాజీనామా చేయాలని కోరుతూ గురువారం వేములవాడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 500 మీటర్ల భారీ ఫ్లెక్సీతో ర్యాలీ తీశారు. విప్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు అమలు చేసిన పథకాలను రద్దు చేయకుండా, కొత్తగా 120కి పైగా కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. తెలంగాణ సమాజానికి బాకీ పడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం కాదని, కల్వకుంట్ల కుటుంబమన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన తర్వాత రాష్ట్రాన్ని భారీ అప్పుల్లోకి నెట్టిందని ఆరోపించారు. కేసీఆర్ ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వర్తించకుండా ఫామ్హౌస్కే పరిమితమవుతున్నారని, వెంటనే రాజీనామా చేయాలని కోరారు. ఆరు గ్యారెంటీల అమలుపై ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. ప్రజలకు వాస్తవాలు వివరించేందుకే ఈ భారీ ఫ్లెక్సీ ప్రదర్శన చేపట్టామని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, ఏఎంసీ చైర్మన్ రొండి రాజు పాల్గొన్నారు. -
పశుసంవర్ధక శాఖ అధికారికి వినతిపత్రం
తంగళ్లపల్లి: జిల్లాలోని గొర్ల పెంపకందారుల సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించి కొత్త కార్యవర్గాలను ఏర్పాటు చేయాలని కోరుతూ సంఘం నాయకులు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారికి గురువారం వినతిపత్రం అందజేశారు. జిల్లాలోని దాదాపు 250 గ్రామాల్లో 189 సొసైటీలు ఉన్నాయని ఒక్కో సొసైటీలో వంద మందికిపైగా సభ్యులతో కలిపి జిల్లా వ్యాప్తంగా సుమారు 70 వేల మంది గొర్ల పెంపకదారులు, గొల్ల కురుమలు ఉన్నారన్నారు. ఇతర జిల్లాల్లో మాదిరిగానే జిల్లాలోనూ గ్రామాల వారీగా ఎన్నికలు జరిపి కొత్త కార్యవర్గాలను ఎన్నుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు జక్కుల నాగరాజ్ యాదవ్, బండి దేవేందర్ యాదవ్, చీమల ప్రశాంత్ యాదవ్, వేల్పుల శ్రీకాంత్ యాదవ్, సింగర్ వేణి లచ్చయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆత్మవిశ్వాసం పెరిగింది
టాస్క్ శిక్షణ ద్వారా అందరి ఎదుట ధైర్యంగా మాట్లాడడం వచ్చింది. మన ఆలోచనలను స్పష్టంగా చెప్పడం నేర్చుకుంటున్నాం. ముఖ్యంగా ఆత్మవిశ్వాసం పెరిగింది. భవిష్యత్లో ఇంటర్వ్యూలు ధైర్యంగా ఎదుర్కొనేందుకు ఈ శిక్షణ ఎంతగానో దోహదపడుతుంది. – శృతి, డిగ్రీ విద్యార్థిని విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యం విద్యార్థులను విద్యతోపాటు ఉద్యోగావకాశాలు అందిపుచ్చుకునేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా టాస్క్ శిక్షణ ఇస్తున్నాం. మాట్లాడే సామర్థ్యం, వ్యక్తిత్వ వికాసం, ఉద్యోగ ఇంటర్వ్యూలను ఎదుర్కొనే విధానం నేర్పిస్తాం. విద్యా సంవత్సరంలో నాలుగైదు పర్యాయాలు శిక్షణ తరగతులు నిర్వహిస్తాం. మొదటి దశ ఓరియంటేషన్ ప్రోగ్రాం ముగిసింది. – జనగామ శ్రావణ్రావు, టాస్క్ కో–ఆర్డినేటర్, ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల ఉద్యోగ నైపుణ్యాలు అవసరం విద్యార్థులకు విద్యతోపాటు ఉద్యోగం సాధించే నైపుణ్యాలు అవసరం. ఆ దిశగా టాస్క్ ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందిస్తున్నాం. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు టాస్క్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కళాశాలలో టాస్క్ను సమర్థవంతంగా అమలు చేస్తున్నాం. – విజయలక్ష్మి, ప్రిన్సిపాల్, ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల -
తెలుగు అక్షరాలతో చీర
బాసర: సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు నల్ల జగదీశ్వర్ రూపొందించిన తెలుగు అక్షరాల చీరను బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారికి శుక్రవారం సమర్పించనున్నారు. జగదీశ్వర్ ఈ చీరను స్వయంగా నేశాడు. తెలుగుభాషపై ఉన్న అభిమానం, చేనేత కళపై తనకున్న ఆసక్తికి ప్రతీకగా చీర నేసినట్లు తెలిపాడు. అమ్మవారికి సమర్పించే అవకాశం రావడం తన పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నాడు. తెలుగు అక్షరాలతో రూపొందించిన చీర భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఉన్నత లక్ష్యాలు సాధించాలిఎల్లారెడ్డిపేట: మండలకేంద్రంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో గురువారం ఫ్రెషర్స్ డే వేడుకల నిర్వహించారు. జిల్లా కో– ఆర్డినేటింగ్ ఆఫీసర్ సుష్మిత హాజరయ్యారు. విద్యార్థుల నృత్యాలు అలరించాయి. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కిరణ్కుమార్ పాల్గొన్నారు. డివైడర్ను ఢీకొట్టిన వ్యాన్ బోయినపల్లి: కరీంనగర్–సిరిసిల్ల ప్రధాన రహదారిలో మండలంలోని వెంకట్రావుపల్లి పరిసరాల్లో ఓ డీసీఎం వ్యాన్ గురువారం డివైడర్పైకి దూసుకెళ్లింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు. సిరిసిల్ల నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న వ్యాన్ అదుపు తప్పడంతో డివైడర్పైకి దూసుకెళ్లింది. కొంత మేర డివైడర్ దెబ్బతినడంతోపాటు వాహనం ముందు భాగం దెబ్బతింది. దరఖాస్తులు ఆహ్వానంసిరిసిల్ల అర్బన్: జిల్లాలోని అర్బన్ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో గెస్ట్ టీచర్ హిందీ, పీఈటీ, అకౌంటెంట్, అసిస్టెంట్ కుక్, స్కావెంజర్, క్లీనింగ్ పర్సన్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి మొండయ్య ప్రకటనలో కోరారు. గెస్ట్ టీచర్ హిందీకి ఎంఏ బీఈడీ, పీఈటీకి ఇంటర్ లేదా డి.పి.ఈ.డి అర్హత ఉండాలని పేర్కొన్నారు. అకౌంటెంట్కు డిగ్రీతోపాటు ట్యాలీలో అనుభవం ఉంటే ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. అసిస్టెంట్ కుక్కు పదో తరగతి ఉత్తీర్ణులు, 18 నుంచి 44 ఏళ్లు ఉన్న వారు అర్హులని పేర్కొన్నారు. ఈనెల 3 నుంచి 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు సిరిసిల్లలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో సమర్పించాలని, పూర్తి వివరాలకు 81256 58243లో సంప్రదించాలని కోరారు. వృద్ధుని ఆత్మహత్యకోనరావుపేట(వేములవాడ): ఒంటరితనం భ రించలేక ఓ వృద్ధుడు బలవన్మరణానికి పాల్ప డ్డాడు. కోనరావుపేట మండలం రామన్నపేటకు చెందిన నేతుల రాజయ్య(80) సుతారి కార్మికుడిగా పనిచేసేవాడు. రాజయ్య భార్య లచ్చవ్వ, కుమారుడు దశరథం కొన్నేళ్ల క్రితం మృతి చెందారు. ముగ్గురు కూతుళ్లకు వివాహం చేసిన రాజయ్య కొంతకాలంగా ఒంటరితనంతో బాధపడుతున్నాడు. బుధవారం రాత్రి ఆత్మహత్యకు ప్రయత్నించగా సర్పంచ్ లక్ష్మి భర్త రాజశేఖర్రెడ్డి అడ్డుకొని ఇంటికి పంపించాడు. మళ్లీ గురువారం తెల్లవారుజామున గ్రామశివారులోని ఓ చెట్టుకు ఉరివేసుకున్నాడు. కోనరావుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బీజేపీ నాయకుల అరెస్టు ఇల్లంతకుంట: రాష్ట్ర బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకుల దాడి, సంత్ రవిదాస్ చిత్రపటానికి నల్ల రంగు వేయడాన్ని నిరసిస్తూ మండలకేంద్రంలో గురువారం మండల బీజేపీ కార్యకర్తలు సీఎం దిష్టిబొమ్మ దహనం చేసేందకు యత్నించగా పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై ఉపేంద్ర చారి, ఎస్సై 2 లక్పతి సిబ్బందితో అడ్డుకున్నారు. బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి మామిడి హరీశ్, బీజేపీ మండల అధ్యక్షుడు భూమళ్ల అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి కరికె నవీన్కుమార్, అసెంబ్లీ కో కన్వీనర్ బత్తిని స్వామి పాల్గొన్నారు. రెడ్డి కార్పొరేషన్కు నిధులు కేటాయించాలి బోయినపల్లి: రాష్ట్రంలో పేద రెడ్లకు ఉపాధి అవకాశాల కల్పనకోసం ఏర్పాటు చేస్తామన్న రెడ్డి కార్పొరేషన్కు వెంటనే నిధులు విడుదల చేయాలని రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఈనెల 8న హైదరాబాద్లో జరిగే రెడ్డిల నిరసన దీక్ష పోస్టర్ను గురువారం ఆవిష్కరించారు. -
చెరువులను అభివృద్ధి చేయాలి
సిరిసిల్ల: జిల్లాలో అటవీ శాఖ ఆధ్వర్యంలో చెరువుల సంరక్షణ, అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, జిల్లా అటవీశాఖ అధికారి సత్యనారాయణతో కలిసి సమీక్షించారు. చెరువులు(వెట్ల్యాండ్స్) నీరు నిల్వ ఉండే భూములు ప్రకృతి సమతుల్యతకు కీలకమన్నారు. జిల్లాలో గుర్తించిన 164 చెరువులను అటవీ, నీటి పారుదల ఇతర శాఖల సమన్వయంతో సర్వే, మ్యాపింగ్, ఆన్లైన్లో నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. వాటి అభివృద్ధికి అటవీ శాఖకు ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. ఆయా జల వనరుల అభివృద్ధితో వలస, స్థానిక పక్షులు, జంతువులకు ఉపయోగపడుతుందన్నారు. భూముల రీసర్వేలో భాగస్వాములు కావాలి జిల్లాలో భూముల రీసర్వేలో ఆయా శాఖల అధికారులు భాగస్వాములు కావాలని కలెక్టర్ కోరారు. రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా సర్వే కొనసాగుతుందని తెలిపారు. అటవీ, నీటి పారుదల, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు తమ శాఖలకు చెందిన భూముల వివరాలు సర్వే అధికారులకు ఇవ్వాలని, సర్వేలో పాల్గొనాలని ఆదేశించారు. సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు శ్రీధర్బాబు, కేఎస్బీ కుమారి, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, జిల్లా మత్స్యశాఖ అధికారి సౌజన్య, నీటి పారుదల శాఖ అధికారి ప్రశాంత్ కుమార్ పాల్గొన్నారు. సీఎమ్మార్ డెలివరీ పూర్తి చేయాలి జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) డెలివరీని గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్తో కలిసి పౌరసరఫరాల అధికారులతో సమీక్షించారు. గత రెండు సీజన్లకు సంబంధించిన సీఎమ్మార్ పూర్తిచేయాలని, డిఫాల్టర్ మిల్లుల బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. డీసీఎస్వో ఎల్.బుచ్చిబాబు, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ గోపాల్ పాల్గొన్నారు. -
‘టాస్క్’తో నైపుణ్య వికాసం
గంభీరావుపేట(సిరిసిల్ల): డిగ్రీ, పీజీ చదువులతోపాటు ఉద్యోగాలు సాధించే నైపుణ్యాలను నేర్పిస్తున్నారు. భవిష్యత్పై భరోసా కల్పిస్తున్నారు. కొన్ని రోజులుగా గంభీరావుపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో నిర్వహిస్తున్న టాస్క్ శిక్షణ గురువారం ముగిసింది. డిగ్రీ ఫస్టియర్ విద్యార్థులు 200 మంది ఉద్యోగాలకు అవసరమైన వివిధ నైపుణ్యాలు సాధించారు. సంభాషణ నైపుణ్యాలు, ఆంగ్ల భాషలో మాట్లాడే సామర్థ్యం, వ్యక్తిత్వ వికాసం, బృంద స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు, సమయపాలన వంటి అంశాలను అభివృద్ధి చేయడానికి టాస్క్ శిక్షణలో ఇస్తారు. ఉద్యోగ సాధనకు మార్గదర్శకత్వం ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునే విధానం, స్వీయ వివరాల పత్రం తయారీ, ఇంటర్వ్యూలను ఎదుర్కొనే తీరు, గ్రూప్ డిస్కషన్లో పాల్గొనే విధానం వంటి అంశాలపై విద్యార్థులకు దశలవారీగా అవగాహన కల్పిస్తారు. దీంతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగడంతో పాటు ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకునే సామర్థ్యం పెరుగుతుంది. సాంకేతిక నైపుణ్యాలకు ప్రాధాన్యం ప్రస్తుతం కంప్యూటర్, డిజిటల్ పరిజ్ఞానం, సాంకేతిక నైపుణ్యాలను కూడా విద్యార్థులకు అందించడంపై టాస్క్ దృష్టి సారిస్తోంది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడంతోపాటు శిక్షణ, ఉద్యోగావకాశాలు, ఉద్యోగ నియామకాలపై మార్గదర్శకత్వం అందించనుంది. గ్రామీణ విద్యార్థులకు ప్రయోజనం గంభీరావుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థుల్లో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులే. అలాంటి వారికి కళాశాల విద్యార్థులకు విద్యతో పాటు భవిష్యత్లో ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలను అందించడం వారికి ప్రయోజనకరంగా మారనుంది. విద్యను ఉద్యోగ నైపుణ్యాలతో అనుసంధానం చేసి ఉపాధికి సిద్ధం చేయడమే లక్ష్యంగా టాస్క్ అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. -
ఆర్టీసీకి గి‘రాఖీ’
కరీంనగర్: రక్షాబంధన్ టీజీఎస్ ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. పండగ వేళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 11 డిపోల పరిధిలో ఆగస్టు 27 నుంచి 31 వరకు 4,940 బస్సులు నడిపారు. ఇవి 21.40 లక్షల కిలోమీటర్లు తిరిగి ఏకంగా 27.39 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. వీరిలో 19.55 లక్షల మంది మహిళలు ఉన్నారు. మొత్తం రవాణా ద్వారా రూ.14.78 కోట్ల ఆదాయం సమకూరింది. ● మహిళల ప్రయాణానికే రూ.8.50 కోట్ల విలువ మహాలక్ష్మి పథకంతో మహిళల రాకపోకలు భారీగా పెరిగాయి. జీరో టికెట్ల విలువ రూ.8.50 కోట్లుగా నమోదైంది. సాధారణ టికెట్ల ద్వారా వచ్చిన వసూళ్లతో కలిపి సంస్థకు గణనీయమైన ఆదాయం లభించింది. ఐదు రోజుల వ్యవధిలో సగటున రోజుకు రూ.2.95 కోట్ల ఆదాయం సమకూరగా, దాదాపు 5.47 లక్షల మంది రోజువారీగా ప్రయాణించినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ● రాఖీ రోజే రూ.3.60 కోట్లు... రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆగస్టు 28న 988 బస్సులు అదనంగా నడపగా, 6.38 లక్షల మంది రాకపోకలు సాగించారు. ఇందులో 4.73 లక్షల మంది మహిళలు ఉన్నారు. ఆ రోజు ఆర్టీసికి రూ.3.60 కోట్ల ఆదాయం లభించింది. జీరో టికెట్ల రూపంలోనే రూ.2.20 కోట్ల విలువైన ప్రయాణం నమోదైంది. ● ఆదాయంలో కరీంనగర్–2 డిపో అగ్రస్థానం కరీంనగర్–2 డిపో రూ.2.24 కోట్లతో ఆదాయంలో ప్రథమ స్థానంలో నిలిచింది. గోదావరిఖని రూ.2.05 కోట్లు, జగిత్యాల రూ.1.65 కోట్లు ఆర్జించి తర్వాతిస్థానాల్లో ఉన్నాయి. కరీంనగర్–1 డిపో రూ.1.58 కోట్లు, హుస్నాబాద్ రూ.1.71 కోట్లు, హుజూరాబాద్ రూ.1.20 కోట్లు, కోరుట్ల రూ.1.06 కోట్లు, మెట్పల్లి రూ.0.97 కోట్లు, సిరిసిల్ల రూ.1.03 కోట్లు, వేములవాడ రూ.1.08 కోట్లు, మంథని రూ.0.86 కోట్ల వసూళ్లు సాధించాయి. ● ప్రయాణికుల సంఖ్యలో గోదావరిఖని ముందంజ గోదావరిఖని డిపో 3.89 లక్షలమందిని గమ్యస్థాలకు చేర్చి మొదటిస్థానంలో నిలిచింది. జగిత్యాల 3.37 లక్షలు, కరీంనగర్–1 డిపో బస్సుల్లో 3.16 లక్షల మంది ప్రయాణించారు. కరీంనగర్–2 డిపో బస్సుల్లో 2.85 లక్షలు, హుజూరాబాద్ 2.55 లక్షలు, హుస్నాబాద్ 2.19 లక్షలు, మెట్పల్లి 2.01 లక్షలు, కోరుట్ల 2.01 లక్షలు, వేములవాడ 2.07 లక్షలు, సిరిసిల్ల 1.89 లక్షలు, మంథని డిపో బస్సులు 1.32లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. ఆగస్టు 27 నుంచి 31 వరకు వచ్చిన ఆదాయం డిపో ఆదాయం ప్రయాణికులు (రూ.కోట్లలో) (లక్షల్లో) కరీంనగర్–1 1.58 3.16 కరీంనగర్–2 2.24 2.85 గోదావరిఖని 2.05 3.89 హుస్నాబాద్ 1.71 2.19 హుజూరాబాద్ 1.20 2.55 జగిత్యాల 1.65 3.37 కోరుట్ల 1.06 2.07 మంథని 0.86 1.32 మెట్పల్లి 0.97 2.01 సిరిసిల్ల 1.03 1.89 వేములవాడ 1.08 2.07 పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని సాధారణ సర్వీసులతో పాటు అదనపు బస్సులు నడిపించాం. ముందస్తు టికెట్ రిజర్వేషన్ల సంఖ్యను పెంచడంతో పాటు అవసరమైన ప్రాంతాలకు ఇతర డిపోల నుంచి సర్వీసులు నడిపించాం. దీంతో మహిళలు, సాధారణ ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వస్థలాలకు చేరుకోగలిగారు. రాఖీ పండగ నేపథ్యంలో డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది సమన్వయంతో పనిచేయడం వల్ల రవాణా వ్యవస్థ సజావుగా సాగింది. – రాజు, రీజినల్ మేనేజర్, కరీంనగర్ -
క్రీడలతో మానసికోల్లాసం
ముస్తాబాద్: క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని ఎంఈవో రవీందర్ అన్నారు. మండలంలోని నామాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో ఎస్జీఎఫ్ క్రీడల ముగింపు గురువారం జరిగాయి. బాలబాలికలకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు డీసీసీ ప్రధాన కార్యదర్శి యెల్ల బాల్రెడ్డి బహుమతులు అందజేశారు. అండర్–14, అండర్–17 విభాగాల్లో బాలబాలికలకు మూడు రోజులపాటు క్రీడా పోటీలు నిర్వహించారు. ప్రతిభ చాటిన విద్యార్థులను జిల్లాస్థాయి ఎస్జీఎఫ్ పోటీలకు ఎంపిక చేశారు. సర్పంచ్ అనిల్, ఆత్మ డివిజన్ కమిటీ చైర్మన్ కొండం రాజిరెడ్డి, ఉపసర్పంచ్ కొమురయ్య, ఏఎంసీ వైస్చైర్మన్ వెల్ముల రాంరెడ్డి, హెచ్ఎం హన్మంత్రెడ్డి, పీఈటీలు పాల్గొన్నారు. -
● రెండు నెలలుగా అందని వేతనాలు ● పట్టించుకోని పాలకులు, అధికారులు ● జీతాల్లో కోతలు.. ఆందోళనలో కార్మికులు
వేతన వెతలువేములవాడ/వేములవాడరూరల్: పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నిత్యం శ్రమిస్తున్న పారిశుధ్య కార్మికులు జీతాలు అందక ఇబ్బందిపడుతున్నారు. నిత్యం కంపు వాసన మధ్య శ్రమిస్తున్న వీరికి ఇప్పటి వరకు వస్తున్న వేతనంలోనూ కోత విధిస్తున్నారు. దీంతో కార్మికులు వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. భారంగా జీవితాలు వేములవాడ మున్సిపాలిటీలో దాదాపు 100 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వారికి రెండు నెలలుగా వేతనాలు అందలేదు. దీంతో ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు, నిత్యావసరాల కొనుగోళ్లు ఇబ్బందిగా మారాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పు చేసి కుటుంబ అవసరాలు తీర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొంటున్నారు. జీవో 1181తో కోతలు చెత్త సేకరించే డ్రైవర్ల వేతనాల్లో కోత విధించడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ప్రభుత్వం ఇటీవల జీవో నంబర్ 1181 విడుదల చేసింది. దీని ద్వారా మున్సిపాలిటీ కార్మికుల వేతనాల్లో భారీగా కోత పడుతుంది. గతంలో ప్రతిరోజూ కష్టపడి పనిచేసే డ్రైవర్లకు నెలకు రూ.20,500 వేతనం లభించేది. కానీ ఈ జీవోతో రూ. 16,600కు తగ్గించేశారు. ఇందులో నుంచే పీఎఫ్ కట్ చేస్తారు. కొందరు కార్మికులకు వెయ్యి నుంచి రూ.3వేల మధ్య వేతన కోత పడుతుంది. ఒక వైపు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుంటే ప్రభుత్వం వేతనాలు తగ్గించడంపై కార్మి కులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాత పద్ధతి ప్రకారమే వేతనాలు ఇవ్వాలని కోరుతున్నారు.వేతన కోతలు పడే సిబ్బంది వివరాలు డ్రైవర్లు 11 కంప్యూటర్ ఆపరేటర్లు 02 వాటర్ సప్లయ్ సిబ్బంది 21 -
జోహార్ వైఎస్సార్
డీసీసీ ఆఫీసులో నివాళి అర్పిస్తున్న నాయకులువేములవాడలో నివాళి అర్పిస్తున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు సిరిసిల్లటౌన్/వేములవాడ: పేద, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతే లక్ష్యంగా వైఎస్సార్ పనిచేశారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కొనియాడారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా వేములవాడ, సిరిసిల్ల పట్టణాల్లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. డీసీసీ ఆఫీస్లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. వేములవాడ మున్సిపల్ చైర్మన్ రాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సూర దేవరాజు, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకునూరి బాలరాజు, రాగుల జగన్, కూరపాటి శ్రీశైలం, లింగంపల్లి గంగరాజు, అలువాల చందు, చొక్కాల రాము, బొప్ప దేవయ్య, మేకల కమలాకర్ పాల్గొన్నారు. -
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
● ఎస్పీ మహేశ్ బీ గీతే సిరిసిల్ల: చదువుతోపాటు సైబర్ నేరాలు, మోసాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ మహేశ్ బీ గీతే కోరారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో బుధవారం నర్సింగ్ కాలేజీలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ నేటి డిజిటల్ యుగంలో సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో, అదే స్థాయిలో నేరాలు పెరుగుతున్నాయన్నారు. విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా ద్వారా నకిలీ అకౌంట్లు, ఫేక్ లింకులు, పార్ట్టైమ్ ఉద్యోగాలు, స్కాలర్షిప్స్, గిఫ్ట్ ఆఫర్లు, లక్కీ డ్రా పేర్లతో మోసాలు జరుగుతున్నాయన్నారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, వీడియో కాల్స్, సందేశాలు లేదా లింకులను నమ్మొద్దని కోరారు. వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులకు ఇవ్వద్దని సూచించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు. సైబర్ భద్రత పోస్టర్ ఆవిష్కరణ వినాయక చవితి సందర్భంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో రూపొందించిన అవగాహన పోస్టర్ను ఆవిష్కరించారు. డీఎస్పీ నా గేంద్రచారి, సీఐ శ్రీనివాస్, సైబర్క్రైమ్ ఎస్సై జునైద్, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ అనిత, సిబ్బంది గంగిరెడ్డి, రాజు, శ్రీకాంత్, విజయ్ ఉన్నారు. -
పేదల వైద్యానికి అండగా సీఎమ్మార్ఎఫ్
● ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బోయినపల్లి(చొప్పదండి): పేదల వైద్యానికి ముఖ్యమంత్రి సహాయ నిధితో ప్రభుత్వం అండగా ఉంటుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 22 మందికి రూ.6.97 లక్షల విలువ గల చెక్కులను బుధవారం గంగాధర క్యాంపు కార్యాలయంలో అందించారు. ఏఎంసీ చైర్మెన్ బోయిని ఎల్లేశ్యాదవ్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కొమ్మనబోయిన సువీన్యాదవ్, ప్యాక్స్ ఛైర్మన్ దుర్గారెడ్డి, నాయకులు వన్నెల రమణారెడ్డి, పర్లపల్లి వేణుగోపాల్, పులి లక్ష్మీపతి, కల్లెపెల్లి చెంద్రయ్య, మాడిశెట్టి మునీందర్, తిరుపతిరెడ్డి, పురుశోత్తంరెడ్డి,సుదర్శన్, ప్రవీణ్ పాల్గొన్నారు. రీ సర్వే పకడ్బందీగా చేపట్టాలి ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): భూముల రీ సర్వే పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ అధికారులను ఆదేశించారు. మండలంలోని సర్వాయిపల్లిలో రోవర్ యంత్రాలతో చేపడుతున్న భూముల రీ సర్వేను బుధవారం పరిశీలించారు. రెవెన్యూ, అటవీ భూముల రీ సర్వే వివరాలు తెలుసుకున్నారు. ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాస్, నాయబ్ తహసీల్దార్ వేణు తదితరులు ఉన్నారు. హక్కుల కోసం ఉద్యమిస్తాం ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రెడ్డి సామాజిక వర్గం సమస్యల పరిష్కారం, హక్కుల సాధనకు ఉద్యమిస్తామని రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఒక్క రోజు దీక్షను విజయవంతం చేయాలని కోరారు. ఈనెల 8న హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద చేపట్టే ఒక్క రోజు దీక్ష పోస్టర్ను రెడ్డి సంఘం మండల అధ్యక్షుడు కుంభాల సుధాకర్రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఆవిష్కరించి మాట్లాడారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.వేయి కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం రాజబహద్దూర్ వెంకటరామిరెడ్డి ట్రస్ట్ కోసం 15 ఎకరాలు కేటాయించగా, ప్రస్తుత ప్రభుత్వం తీసుకోవడం అన్యాయమన్నారు. పారిపల్లి సంజీవరెడ్డి, వంగ శ్రీకాంత్రెడ్డి, గుర్రాల చంద్రమోహన్రెడ్డి, గోవూరి ప్రదీప్రెడ్డి, నేవూరి శ్రీనివాస్రెడ్డి, బాపురెడ్డి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘పల్లె’ పాలనపై సర్పంచులకు పాఠాలుసిరిసిల్ల: పల్లె పాలన, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంపై మహిళా సర్పంచులకు మూడు రోజుల శిక్షణ హైదరాబాద్లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ మానవ వనరుల అభివృద్ధి సంస్థ(డీఎంసీహెచ్ఆర్డీఏ)లో జరిగింది. గ్రామ సర్పంచుల విధులు, బాధ్యతలు, పంచాయతీరాజ్ చట్టం ఏం చెబుతుందని అనే అంశాలపై మూడు రోజులపాటు పాఠాలు బోధించారు. ఇటీవల కొత్తగా ఎన్నికై న సర్పంచులకు పల్లె పాలనపై అవగాహన కల్పించారు. జిల్లా నుంచి కోనరావుపేట మండలం బావుసాయిపేట సర్పంచ్ షేక్ యాస్మిన్పాషా, వేములవాడ రూరల్ మండలం అనుపురం సర్పంచ్ శేర్ల రాజేశ్వరి, చంద్రగిరి సర్పంచ్ ముత్త సంజన, ఇల్లంతకుంట మండలం జంగారెడ్డిపల్లె సర్పంచ్ సునీతలు పాల్గొన్నారు. ఆగస్ట్ 31, సెప్టెంబరు 1, 2 తేదీల్లో శిక్షణను పూర్తి చేసుకున్న సర్పంచ్లకు ధ్రువీకరణ పత్రాలను అధికారులు అందించారు. శిక్షణలో తంగళ్లపల్లి సర్పంచ్ తంగళ్లపల్లి(సిరిసిల్ల): హైదరాబాద్లో నిర్వహిస్తున్న శిక్షణకు తంగళ్లపల్లి సర్పంచ్ మోర లక్ష్మీరాజం హాజరయ్యారు. గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళికపై సర్పంచులకు అవగాహన కల్పిస్తున్నారు. -
లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోండి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీరజ సిరిసిల్ల: జిల్లా కోర్టులో ఈనెల 12న నిర్వహించే లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని, పెండింగ్ కేసులు పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికర సంస్థ అధ్యక్షురాలు పి.నీరజ కోరారు. జిల్లా కోర్టు సముదాయంలో బుధవారం న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, పోలీసు, ఎకై ్సజ్శాఖ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లా న్యాయమూర్తి నీరజ మాట్లాడుతూ పెండింగ్ కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకోవాలని సూచించారు. పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధిక జైస్వాల్, సీనియర్ సివిల్ జడ్జి లక్ష్మణాచారి, వేములవాడ సీనియర్ సివిల్ జడ్జి అజయ్కుమార్ జాదవ్, ఎకై ్సజ్ ఎస్డీపీఈవో హిమశ్రీ, సిరిసిల్ల, వేములవాడ డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు, జూనియర్ సివిల్ జడ్జి మేఘన, సీఐలు వెంకటేశ్, నాగేశ్వర్రావు పాల్గొన్నారు. -
వైద్యం.. దైన్యం
సిరిసిల్లటౌన్: నిన్న.. మొన్నటి వరకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించే సిరిసిల్ల ధర్మాస్పత్రిలో నేడు పరిస్థితులు అధ్వానస్థితికి పడిపోయాయి. అత్యవసర స్థితిలో వచ్చే పేదలపై సిబ్బంది తీరు ఇబ్బందిగా ఉంటోంది. అధికారుల పట్టింపులేమితో జిల్లా ఆస్పత్రి నిర్లక్ష్యానికి కేరాఫ్గా మారింది. కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన వైద్యం అందుతుందని ఆశతో వచ్చే నిరుపేదలకు కొద్దిరోజులుగా నిరాశే ఎదురవుతోంది. రోగులపై కొందరు డాక్టర్లు, నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న వైనంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సిబ్బంది బాధ్యత లేమి.. వివిధ వ్యాధులతో వచ్చే రోగులు, ప్రమాదాల బారిన పడి వచ్చే క్షతగాత్రులపై కొంతమంది సిబ్బంది బాధ్యతగా వ్యవహరించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో వైద్యం జాప్యం చేయడం, అచేతన స్థితిలో వచ్చే వారిని కనీసం స్ట్రెచర్పై కూడా తీసుకురావడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. నిత్యం జిల్లా నలుమూలల నుంచి వందలాది మంది రోగులు ఆస్పత్రికి వస్తుంటారు. వీరిని పట్టించుకునే వారు కరువయ్యారని ఇటీవల చోటుచేసుకున్న సంఘటనలు చెబుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి ఓపీ కౌంటర్ల దగ్గర గంటల తరబడి వేచి చూసి వార్డుల్లో చేరిన రోగులను సకాలంలో పరీక్షించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇక విధుల్లో ఉండాల్సిన కొందరు సిబ్బంది సమయపాలన పాటించడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. ఆధునిక పరికరాలు ఉన్నా.. దశాబ్దకాలంగా జిల్లా ఆస్పత్రిలో ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి అత్యాధునిక వైద్య పరికరాలు, మందులను అందుబాటులో ఉంచింది. ఇక్కడికి జిల్లాలోని మారుమూల గ్రామాలతోపాటు పక్క జిల్లాల నుంచి చికిత్స కోసం వస్తున్నారు. వారిపై సిబ్బంది అలసత్వం పెరిగిపోవడం వివాదాలకు తావిస్తోంది. గర్భిణులపై నర్సింగ్ సిబ్బంది కఠినంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సాయిగణేశ్ మెరుగైన వైద్యం అందిస్తున్నాం ప్రతీ రోజు వందల సంఖ్యలో వచ్చే రోగులకు సకల వసతులు, మెరుగైన వైద్యం అందిస్తున్నాం. ఇటీవల వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపట్టాం. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. రోగులపై సిబ్బంది బాధ్యత, స్నేహపూర్వకంగా మెదిలేలా ఆదేశాలిచ్చాం. కొన్ని సందర్భాలలో రోగుల సహాయకులు కూడా సిబ్బందికి సహకరించాల్సి ఉంటుంది. – డాక్టర్ సుమన్ మోహన్రావు, ఆర్ఎంవో ఇటీవల జరిగిన సంఘటనలు బైక్ పై నుంచి పడి గాయాలతో వారం క్రితం సిరిసిల్ల వాసి చంద్రకాంత్ ఆస్పత్రికి వెళ్లగా డ్యూటీలో ఉన్న సిబ్బంది డ్రెస్సింగ్ చేసే టైము కాలేదని నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ విషయాన్ని బాధితులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా చికిత్స చేయకుండా మూడు గంటలు నిలబెట్టుకున్నారు. ఇల్లంతకుంట మండలం గొల్లపల్లికి చెందిన దాసరి హర్షిణికి వారం క్రితం పాప పుట్టింది. రెండు రోజులపాటు ఆరోగ్యంగా ఉన్న శిశువు టీకా వేయగా జ్వరం వచ్చి మృతిచెందింది. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంతోనే తమ చిన్నారి చనిపోయినట్లు బాధితులు ఉన్నతాధికారులతో వాగ్వాదానికి దిగారు. జిల్లా కేంద్రంలోని నెహ్రూనగర్కు చెందిన డెలివరీ బాయ్గా పనిచేసే ఎనగంటి సాయిగణేశ్ గత గురువారం రాత్రి బైక్పై నుంచి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో కాలర్బోన్ విరిగిపోగా.. జిల్లా ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. బాధితుడికి ఆపరేషన్ చేయాల్సి ఉంది. అయితే నాలుగు రోజులు గడిచినా ఆపరేషన్ చేయకపోగా, సిబ్బంది సూటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టారు. కాలర్బోన్ విరిగిన తనను కనీసం స్ట్రెచ్చర్పై కూడా తీసుకెళ్లకుండా నడిపిస్తూ ఎక్స్రే తదితర టెస్టులకు తిప్పి చివరికి ఐదో రోజు ఆపరేషన్ చేసినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం కడుపునొప్పితో మల్లారెడ్డిపేట నుంచి రాజు అడ్మిట్ అయ్యాడు. రాత్రి వేళలో ఆస్పత్రి బంగ్లాపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు వెళ్తుండగా చనిపోయాడు. ఆస్పత్రిలో సరైన సెక్యూరిటీ ఉంటే రాజు బతికి ఉండేవాడని విమర్శలు వెల్లువెత్తాయి. -
నిబంధనల ప్రకారమే..
నిబంధనల ప్రకారం అన్ని మున్సిపాలిటీల్లో ఒకేలా ఉండాలని ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 1181 ప్రకారం వేతనాలు ఇవ్వడం జరుగుతుంది. గతంలోని వేతనాల్లో జరిగిన ఆడిట్ నిబంధనల ప్రకారం వ్యత్యాసాన్ని సడలించి ఇవ్వడం జరుగుతుంది. – లోకేశ్, మున్సిపల్ కమిషనర్, వేములవాడదుర్వాసన మధ్య డ్యూటీ చేస్తున్నాం నేను వేములవాడ మున్సిపాలిటీలో ఏడేళ్లుగా డ్రైవర్గా పనిచేస్తున్నాను. గతంలో రూ.20,500 జీతం వచ్చేది. కొత్త జీవోతో రూ.14,400 చేతికి అందుతున్నాయి. ఇంత నష్టపోతే మేము ఎట్లా బతకాలి. ప్రభుత్వం స్పందించి పాత వేతనాలు ఇవ్వాలి. – ఎడ్ల బాలకృష్ణ, మున్సిపల్ డ్రైవర్ పాత వేతనం పునరుద్ధరించాలి ఏళ్లుగా పనిచేస్తున్న మాపై జీవో 1181 తెచ్చి నిలువునా ముంచారు. ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ స్పందించి మా సమస్యను పరిష్కరించాలి. వెంటనే జీవో 1181ను సవరించి పాత జీతం వచ్చేలా చూడాలి. – పిట్టల రాజశేఖర్, మున్సిపల్ డ్రైవర్ -
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ
● కలెక్టర్ గరీమా అగ్రవాల్ సిరిసిల్ల: ఓటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ను ప్రతీ పోలింగ్ కేంద్రంలో ఈనెల 5, 6, 12, 13 తేదీల్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ గరీమా అగ్రవాల్ బుధవారం తెలిపారు. బూత్ లెవల్ అధికారులు(బీఎల్వో)లు ప్రత్యేక ప్రచార కార్యక్రమం జరిగే రోజుల్లో నిర్ధేశిత పోలింగ్ స్టేషన్లలో అందుబాటులో ఉంటారన్నారు. బూత్ లెవల్ ఏజెంట్లు(బీఎల్ఏ) ఆ రోజుల్లో హాజరవుతారని వివరించారు. వారి సమక్షంలో ము సాయిదా ఓటరు జాబితాను పరిశీలించి, తప్పులు, సవరణలు, ఇతర లోపాలను గుర్తిస్తారని వివరించా రు. ఓటర్లు పోలింగ్ స్టేషన్లకు హాజరై ముసాయిదా జాబితాను పరిశీలించవచ్చన్నారు. ఫారం–6, 7, 8 ద్వారా ఓటర్లు తమ అభ్యంతరాలు తెలపవచ్చన్నారు. సకాలంలో పరీక్షల నివేదికలు అందించాలి సిరిసిల్ల: సకాలంలో వైద్యపరీక్షల నివేదికలు అందించాలని జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్ కోరారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ను బుధవారం తనిఖీ చేశారు. వివిధ రకాల పరీక్షలు, నమూనాల సేకరణను పరిశీలించారు. టీ–హబ్ ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ వేణుగోపాల్రెడ్డి ఉన్నారు. మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లపై సమీక్ష జిల్లాలోని మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ల(ఎంఎల్హెచ్పీల) పనితీరుపై డీఎంహెచ్వో ఏంజెలా ఆల్ఫ్రెడ్ సమీక్షించారు. జిల్లాలోని హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల ద్వారా ప్రజలకు అందుతున్న వైద్యసేవలు, సాధారణ వ్యాధుల నిర్వహణ, తల్లి–శిశు ఆరోగ్యం, వ్యాధి నిరోధక కార్యక్రమాలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, రికార్డుల నిర్వహణను సమీక్షించారు. ప్రోగ్రాం అధికారులు రామకృష్ణ, వేణుగోపాల్రెడ్డి, సంపత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అనుమానంతో భార్యను చంపిన భర్త
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అనుమానం పెనుభూతంగా మారి కట్టుకున్న భార్యను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు ఓ భర్త. కూతురిపై దాడి చేస్తున్న క్రమంలో అడ్డువచ్చిన అత్త కూడా కత్తిపోట్లకు గురై కరీంనగర్ ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఈ సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిర ఒడ్డరికాలనీలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ ఓదెల వెంకటేశ్ తెలిపిన వివరాల ప్రకారం... రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిర వడ్డెరకాలనీకి చెందిన గండికోట చంద్రయ్య–ఎల్లవ్వ దంపతుల కూతురు జ్యోతి(28)ని ముస్తాబాద్ మండలం చీకోడుకు చెందిన పల్లపు సురేష్కు ఇచ్చి పదేళ్ల క్రితం వివాహం చేశారు. కొంతకాలం వీళ్ల కాపురం సజావుగా సాగి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు జన్మించారు. కొంతకాలంగా దంపతుల మధ్య కలహాలు చోటుచేసుకున్నాయి. ఎనిమిది నెలల క్రితం రెండుసార్లు చీకోడులో జ్యోతిని చంపడానికి సురేష్ ప్రయత్నించాడు. ఒకరోజు నిద్రిస్తుండగా దిండుతో చంపడానికి ప్రయత్నించగా.. తప్పించుకొని తన కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. దీంతో వారు వెళ్లి జ్యోతిని పుట్టింటికి తీసుకొచ్చారు. అప్పుడు జ్యోతి ఫిర్యాదుతో ముస్తాబాద్ ఠాణాలో సురేష్పై కేసు నమోదైంది. అప్పటి నుంచి ఎనిమిది నెలలుగా పుట్టింట్లోనే ఉంటోంది. గ్రామానికి సమీపంలో ఉన్న అర్బన్పార్క్లో మృతురాలు జ్యోతి దినసరి కూలీగా పని చేస్తుంది. ఆమె మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని అనుమానంతో సురేష్ పలుమార్లు జ్యోతిని, వారి బంధువులను దూషించాడు. ఈ క్రమంలో సురేష్ మరో ముగ్గురితో కారులో వచ్చి పదిర బస్టాండ్లో మధ్యాహ్నం నుంచి జ్యోతి కోసం కాపు కాశాడు. జ్యోతి తన తల్లి ఎల్లవ్వతో కలిసి కరీంనగర్ ఆస్పత్రిలో చూపించుకోవడానికి వెళ్లింది. చీకటి పడే సమయంలో బస్సు దిగి ఒడ్డెరకాలనీకి వెళ్తుండగా వెంబడించి కత్తితో దాడి చేశాడు. అడ్డుకోబోయిన అత్తపై కూడా కత్తితో దాడి చేశాడు. జ్యోతి మృతి చెందినట్లు నిర్ధారించుకొని కత్తిని అక్కడే వదిలేసి అదే కారులో పరారయ్యాడు. నిందితుడు సురేష్ సిరిసిల్ల పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలిసింది. మృతురాలికి ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. -
ధర్మాస్పత్రిలో నిర్లక్ష్యం
సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రంలోని ధర్మాస్పత్రిలో సిబ్బంది తీరు అమానవీయంగా ఉందని.. వైద్యం చేయకపోగా.. సూటిపోటీ మాటలతో మానసిక క్షోభకు గురిచేస్తున్నారని బాధితుడు సాయిగణేశ్ కన్నీటిపర్యంతమయ్యాడు. బాధితుడు తెలిపిన వివరాలు. స్థానిక నెహ్రూనగర్కు చెందిన ఎనగంటి సాయిగణేశ్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి గోపాల్నగర్లో బైక్ అదుపుతప్పి కిందపడడంతో కాలర్బోన్ విరిగింది. వెంటనే కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుంచి వైద్యం చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. నాలుగు రోజులు గడిచినా ఆపరేషన్ చేయడం లేదు. నొప్పిని తట్టుకోలేక సాయిగణేశ్ ఆపరేషన్ చేయాలని కోరగా.. సూటిపోటీ మాటలతో ఇబ్బందిపెట్టారు. సోమవారం శస్త్రచికిత్స చేయడానికి వైద్యులు పిలువగా ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ గడ్డం, మీసాలు తీసుకోలేదు.. ఆపరేషన్ చేయం పో.. అంటూ బయటకు పంపించాడు. ఈ విషయం మీడియాకు తెలియడంతో చివరికి ఆపరేషన్ చేశారు. ఈ విషయమై జిల్లా ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ సంతోష్కుమార్ను వివరణ కోరగా.. ఆర్థో విభాగంలో క్రమ పద్ధతిలో ఆపరేషన్లు చేస్తున్నట్లు తెలిపారు. మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. వైద్యసిబ్బంది పట్టించుకోవడం లేదు సూటిపోటీ మాటలతో మానసిక క్షోభ కన్నీటిపర్యంతమైన బాధితుడు -
భర్త తిట్టిండని ఆత్మహత్యాయత్నం
● సిరిసిల్ల సఖీ సెంటర్లో మహిళ అఘాయిత్యం ● జిల్లా ఆస్పత్రిలో చికిత్ససిరిసిల్లటౌన్: సిరిసిల్ల సఖీ సెంటర్లో కౌన్సిలింగ్ కోసం వచ్చిన వివాహిత శ్వేత భర్త తిట్టాడని సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అచేతన స్థితిలో ఉన్న శ్వేతను సిబ్బంది జిల్లా ఆస్పత్రికి తరలించి వైద్యం చేయిస్తున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లికి చెందిన నక్క శ్వేత–సంపత్ దంపతులకు ఏడేళ్ల పాప. శ్వేత మల్యాలలో వ్యవసాయశాఖలో ఏఈవోగా పనిచేస్తుంది. భార్యభర్తలకు కొన్ని రోజులుఆ గొడవలు ఉన్నాయి. ఈక్రమంలోనే సంపత్పై వరకట్నం కేసు నమోదైంది. రెండు రోజుల తన కూతురిని తీసుకొని తన భర్త వద్దకు వెళ్లగా మళ్లీ గొడవైంది. దీంతో ఆమె చందుర్తి పోలీసులను ఆశ్రయించగా వారు ఆదివారం రాత్రి సిరిసిల్ల సఖీ సెంటర్కు కౌన్సిలింగ్ కోసం పంపించారు. సోమవారం సఖీ సెంటర్లో కౌన్సిలింగ్ చేయాల్సి ఉండగా.. సంపత్ సాయంత్రం వచ్చి శ్వేతను తిట్టినట్లు సిబ్బంది తెలి పారు. భర్త తిట్టిండని కోపంతో యాంటిబయోటి క్స్ మాత్రలను మింగింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. -
పశ్చిమ ముఖ శివలింగం
దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా పశ్చిమ ద్వారం, పశ్చిమముఖం కలిగిన శివలింగం మంథనిలోనే ఉంది. భిక్షేశ్వరాలయంగా పిలువబడే ఈ ఆలయంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు జరుపుతారు. శ్రావణంలో శివపార్వతుల పూజకు ప్రాధాన్యత ఉండడంతో సోమవారం శివాలయాలను దర్శించి పూజలు చేస్తారు. శ్రీలేశ్వర– సిద్ధేశ్వర, సురాబాండేశ్వరుడు, గౌతమేశ్వర, ఓంకారేశ్వరుడు కొలుౖవై ఉన్నారు. ఇలా శ్రావణంలో నెలరోజులపాటు భక్తులు భక్తిశ్రద్ధలతో దేవతామూర్తులను కొలిచేందుకు మంత్రపురి సిద్ధంగా ఉంది. -
ఆన్లైన్ చేస్తేనే బోనస్!
● ప్రభుత్వం ప్రకటించిన ఏడు రకాలకే అవకాశం ● ఆన్లైన్కు ఈనెల 10 వరకు గడువు ● 1.72 లక్షల ఎకరాల్లో వరి సాగు చందుర్తి(వేములవాడ): రాష్ట్ర ప్రభుత్వం సన్నవడ్లకు ఇస్తానన్న క్వింటాల్కు రూ.500 బోనస్పై సవాలక్ష కొర్రీలు పెడుతుంది. ప్రభుత్వం ప్రకటించిన ఏడు రకాలు సన్నాలకే బోనస్ వర్తిస్తుందని ప్రకటించింది. అంతేకాకుండా ఏ సన్నరకాలు సాగుచేస్తున్నారో ఆన్లైన్ చేయాల్సిందే. అప్పుడు బోనస్ వర్తిస్తుందని ప్రభుత్వం నిబంధనలు పెట్టడంతో రైతులు ఆగమాగమవుతున్నారు. అన్నదాతల ఆన్లైన్ కష్టాలపై ఫోకస్. 1.72 లక్షల ఎకరాల్లో వరిసాగు ఈ వానాకాలంలో జిల్లా వ్యాప్తంగా 1.84 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారని వ్యవసాయాధికారుల అంచనా వేయగా 12 వేల ఎకరాల వరకు తగ్గిందని భావిస్తున్నారు. అత్యధిక సంఖ్యలో రైతులు సన్నవడ్లు సాగు చేశారు. ప్రభుత్వం ప్రకటించిన ఏడు రకాలను 90వేల ఎకరాల్లో సాగు చేసి ఉంటారని అధికారుల అంచనా. మరో 50 వేల ఎకరాల్లో ఇతర సన్నాలు, మిగతా 32 వేల ఎకరాల్లో దొడ్డు రకపు వడ్లు సాగు చేసినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. బోనస్పై నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన సన్నరకాలకు బోనస్ అందించేందుకు పలు నిబంధనలు విధిస్తుంది. ప్రభుత్వం సూచించిన ఏడు రకాల వంగడాలు ఆర్ఎన్ఆర్ 15048, కేఎన్ఎం 1638, బీపీటీ 5204, హెచ్ఎంటీ సోనా, జైశ్రీరాం, డబ్ల్యూజీఎల్44, కేఎన్ఎం 7715 సాగు చేయాలని సూచించింది. వీటిని ఆన్లైన్లో నమోదు చేయాలని మరో నిబంధన పెట్టింది. దీంతో రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన డీలర్ వద్దకు వెళ్లి బిల్లు, ఆధార్కార్డు, పట్టాదారు పాస్ పుస్తకంతో వివరాలు నమోదు చేయించాల్సి ఉంటుంది. ఆన్లైన్ను ఈనెల 10లోపు చేసుకోవాలనే గడువు విధించింది. ఏఈవోల వద్ద సెల్ఫ్ డిక్లరేషన్ రైతులు గత సీజన్లో తమ పంట పొలాల్లో సాగు చేసుకున్న విత్తనాలనే ఇప్పుడు సాగులోకి వాడుకున్న, పరిశోధన స్థానాల నుంచి కొనుగోలు చేసి వాడుకున్న సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. ఇప్పటికే రైతులు సాగుచేసిన పంటలకు ఎరువులను యాప్ల ద్వారా బుకింగ్ చేసుకునేందుకు ఇబ్బంది పడుతున్న రైతులు పంటల వివరాలు ఆన్లైన్ చేయించుకునేందుకు పడుతున్న తిప్పలు అన్నీ.. ఇన్నీ కావు. -
చేపల వేటకు వెళ్లి మృతి
మంథనిరూరల్: పొట్టచేతపట్టుకుని కూలీపనుల కోసం స్వరాష్ట్రం విడిచి తెలంగాణకు వచ్చిన ఓ వలస కూలీ ప్రమాదవశాత్తు చెరువులోపడి మృతి చెందిన సంఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవిసోమన్పల్లిలో చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ఝార్ఖండ్ రాష్ట్రం ఫలామౌ జిల్లా చీలిభర్వాపి గ్రామానికి చెందిన చోటు భయ్యాన్(26) మృతి చెందాడు. పోలీస్ల కథనం ప్రకారం.. అడవిసోమన్పల్లి గ్రామంలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నిర్మాణం జరుగుతుండగా ఈ పనులను ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వలస కూలీలు చేస్తున్నారు. సోమవారం ఉదయం చోటు భయ్యాన్తోపాటు మరికొందరు యువకులు సమీపంలోని చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లారు. ప్రమాదవశాత్తు ఇద్దరు యువకులు చెరువులో పడిపోగా ఒకరు వెనక్కి వచ్చి ఒడ్డుకు చేరుకున్నారు. చోటు భయ్యాన్ నీటిలోనే మునిగిపోయాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మంథని ఫైర్ ఆఫీసర్ శివశంకర వరప్రసాద్, ఏఎస్ఐ మల్లయ్యగౌడ్ తమ సిబ్బంది చందర్, శ్రవణ్కుమార్, నరేందర్, నాగరాజుతో అక్కడకు చేరుకున్నారు. చోటు భయ్యాన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కొద్ది సేపటికే ఆ యువకుడి మృతదేహాన్ని గుర్తించి ఒడ్డుకు తీసుకువచ్చారు. కూలీలు కన్నీటిపర్వంతమయ్యారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
ప్రజలను మోసం చేస్తే చర్యలు
● డీఎస్పీ శ్రీనివాసులువేములవాడ అర్బన్: క్షుద్రపూజలు, చేతబడులు, మంత్రాలు, తాయత్తులతో అనారోగ్య సమస్యలు పరిష్కరిస్తామని నమ్మించి మోసాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని డీఎస్పీ శ్రీనివాసులు హెచ్చరించారు. సోమవారం రాత్రి వేములవాడ మండలం చీర్లవంచ, అగ్రహారం, తెట్టెకుంటల్లో మంత్రాలు, తాయత్తులు కట్టే వారి కోసం దాడులు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ మంత్రాలు, తాయత్తులతో దీర్ఘకాలిక వ్యాధులను నయం చేస్తామంటూ ప్రజలు మోసం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. సోదాల్లో నాటు వైద్యానికి సంబంధించిన మూలికలు, తాయత్తులు, పసుపు, కుంకుమ ప్యాకెట్లు, వివిధ రకాల పూజా సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. సీఐలు బి.వీరప్రసాద్, శ్రీనివాస్, సబ్ డివిజన్ ఎస్సైలు రమేశ్, రామ్మోహన్, శ్రీనివాస్, రాహుల్రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
లాడ్జిలో వ్యక్తి ఆత్మహత్య
కరీంనగర్క్రైం/వేములవాడ: కరీంనగర్ అల్కాపురికాలనీలోని ఓ లాడ్జిలో వేములవాడకు చెందిన నరాల కార్తీక్ (33) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆగస్టు 30న పని నిమిత్తం కరీంనగర్ వెళ్తున్నానని భార్యకు చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన కార్తీక్, ఫోన్ చేస్తే స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించారు. సోమవారం లాడ్జి వద్ద అతడి కారు కనిపించడంతో సిబ్బందిని సంప్రదించగా, గదిలో సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని మృతిచెందినట్లు గుర్తించారు. గతంలో చిట్టీల వ్యాపారం, అనంతరం రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహించిన కార్తీక్ ఆర్థికనష్టాలు, అప్పుల కారణంగా ఇబ్బందులకు గురైనట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడి భార్య ఫిర్యాదులో పేర్కొన్నారు. కరీంనగర్ వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ప్రాచీన సంస్కృతికి నిలువుటద్దం రామగిరి ఖిల్లా
తెలుగునేల పుణికిపుచ్చుకొన్న శిల్పకళా సంపద, ప్రాచీన సంస్కృతికి అద్దం పడుతోంది రామగిరి ఖిల్లా. క్రీ.శ.1వ శతాబ్దంలో రామగిరి కోటగా రూపుదిద్దుకుంది. రామగిరి మండలంలో ఈ ఖిల్లా ఉంది. ఎంతోఎత్తు గల దుర్గం, అనేక రాతికట్టడాలు, బురుజులు, ఫీనాలతో విరాజిల్లుతోంది. దుర్గం అంతర్భాగంలో సాలుకోట, సింహాలకోట, జంగేకోట, ప్రతాపరుద్రులకోట, అశ్వాల, కొలువుశాల, మొఘల్శాల, చెరశాల, గజశాల, భజనశాల, సభాస్థలితో పాటు రహస్య స్థలాలు, రహస్య మార్గాలు, సొరంగాలు, తీపులు, ఫిరంగి గుండ్లు దర్శనమిస్తాయి. తెలంగాణలోని దుర్గాల్లో ఈ దుర్గం పటిష్టంగా ఉండి వజ్రకూటంగా ప్రసిద్ధి చెందింది. -
పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు
సిరిసిల్ల/తంగళ్లపల్లి: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు, రూ.5వేలు జరిమానా విధిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధికా జైస్వాల్ సోమవారం తీర్పు వెలువరించినట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మైనర్ బాలికను జనగాంకు చెందిన యటెల్లి విజయ్ లైంగిక వేధింపులకు గురిచేశారు. బాలిక తల్లి ఫిర్యాదుతో అప్పటి ఎస్సై లక్ష్మారెడ్డి కేసు నమోదు చేసి, నిందితుడిని రిమాండ్కు తరలించారు. నేరం రుజువు కావడంతో నిందితుడైన యేటల్లి విజయ్కు 20 ఏళ్ల జైలు, రూ.5000 జరిమాన విధిస్తూ తీర్పు నిచ్చారు. నిందితుడికి శిక్ష పడేందుకు సమన్వయంతో పని చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని, పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ఎస్పీ మహేశ్ బీ గీతే అభినందించారు. మహిళా మావోయిస్టు రాధక్క మృతి పెద్దపల్లి : మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ మాజీ సభ్యుడు పుల్లూరి ప్రసాద్రావు అలియాస్ చంద్రన్న సహచరి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కమిటీ సభ్యురాలు కోర్సింగే మోతీబాయి అలియాస్ రాధక్క సోమవారం మృతి చెందారని మాజీ మావోయిస్టు తెలిపారు. ఆదిలాబాద్లోని రిమ్స్ ఆస్పత్రిలో చికి త్స పొందుతూ సాయంత్రం 5.55 గంటలకు కన్నుమూశారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆదిలాబాద్ మండలం పిప్పల్దరి గ్రామంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని బంధవులు తెలిపారు. చివరిచూపుకోసం వచ్చేవారు ఆదిలాబాద్ నుంచి కలెక్టర్ చౌరస్తా మీదుగా ఎస్పీ క్యాంప్ ఆఫీస్ రోడ్డు గుండా అంకోలి గ్రామం మీదుగా పిప్పల్ దరికి చేరుకోవాలని వారు సూచించారు. యువకుడిపై గొడ్డలితో దాడితంగళ్లపల్లి(సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. మోతె రాజు(18)పై మా మిడాల రాజు(26) సోమవారం రాత్రి గొడ్డలి తో దాడి చేశాడు. స్థానికుల కథనం ప్రకారం.. మోతె రాజుకు మామిడాల రాజు, మామిడాల అక్కవ్వ(45)లకు మధ్య కొంతకాలంగా వివాదాలు ఉన్నాయి. ఈక్రమంలో సోమవారం రాత్రి మోతె రాజు.. మామిడాల రాజు ఇంటికి వెళ్లగా ఆగ్రహించిన రాజు గొడ్డలితో దాడి చేశాడు. గాయపడ్డ మోతె రాజును స్థానికులు 108 ద్వారా సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీర్నపల్లి: మండలంలో అటవీశాఖ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై వేముల లక్ష్మణ్ తెలిపారు. భూక్య తండా పంచా యతీ పరిధిలోని రాశిగుట్ట తండాకు చెందిన తేజా వత్ మోహన్, తేజావత్ రమేశ్ అలియాస్ సంతోష్పై ఫారెస్ట్ బీట్ అధికారి తిరుపతి నాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
మాదాపూర్లో వ్యక్తి ఆత్మహత్య
కోరుట్లరూరల్: మండలంలోని మాదాపూర్ గ్రామానికి చెందిన అల్లెపు రమేశ్ (32) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శ్యాంరాజ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం రమేశ్ కొంతకాలం దుబాయ్ వెళ్లాడు. నెలరోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. అప్పటినుంచి భార్యతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం మద్యం సేవించి వచ్చిన రమేశ్ గదిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రమేశ్కు ఇద్దరు పిల్లలున్నారు. తండ్రి అల్లెపు గంగారాజం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చెట్టును ఢీకొట్టిన కారు ● ముగ్గురికి స్వల్ప గాయాలు ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పీఆర్వో ప్రయాణిస్తున్న కారు సోమవారం ప్రమాదానికి గురైంది. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లి శివారులోని సత్తెపీరీల దర్గా వద్ద చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. వేములవాడ నుంచి కామారెడ్డి వెళ్తుండగా కారు అదుపుతప్పి మూలమలుపు వద్ద చెట్టును ఢీకొట్టింది. కారు నుజ్జునుజ్జయ్యింది. క్షతగాత్రులను కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. -
ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యం
● ఎస్పీ మహేశ్ బీ గీతే సిరిసిల్ల: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, బాధితులకు సత్వర న్యాయం అందించేందుకే గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నామని ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. జిల్లా పోలీస్ ఆఫీస్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేకు 26 ఫిర్యాదులు వచ్చాయి. బాధితులతో మాట్లాడిన ఎస్పీ ప్రజల సమస్యలపై ఆయా పోలీస్స్టేషన్ల ఎస్హెచ్వోలతో ఫోన్లో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు. పోలీస్యాక్ట్ అమలు జిల్లాలో శాంతి భద్రతల దృష్టిలో ఉంచుకొని పోలీస్ యాక్ట్–1861 ప్రకారం నెల రోజులపాటు అమలులో ఉంటుందని ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లు నిర్వహించరాదన్నారు. శిక్షణలో సర్పంచులుఇల్లంతకుంట/కోనరావుపేట: గ్రామాలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న శిక్షణకు జిల్లా నుంచి ఇద్దరు సర్పంచులు పాల్గొంటున్నారు. హైదరాబాదులోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో మూడు రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి ఇల్లంతకుంట మండలం జంగారెడ్డిపల్లి సర్పంచ్ పండుగ సునిత, కోనరావుపేట మండలం బావుసాయిపేట సర్పంచ్ షేక్ యాస్మిన్పాషా ఎంపికయ్యారు. సిరిసిల్ల: జిల్లాలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నిరంతరం వైద్యసేవలు, మందులు అందిస్తూ పర్యవేక్షించాలని డీఎంహెచ్వో ఏంజెలా ఆల్ఫ్రెడ్ కోరారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్లో సోమవారం పీహెచ్సీల వైద్యులు, సిబ్బందితో సమీక్షించారు. డీఎంహెచ్వో మాట్లాడుతూ క్షయవ్యాధి నియంత్రణ(ఎన్టీఈపీ), కుష్ఠు నిర్మూలన (ఎన్ఎల్ఈపీ), జాతీయ ఎయిడ్స్ నియంత్రణ(ఎన్ఏసీపీ), అంధత్వ నియంత్రణ, దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నియంత్రణ, అసంక్రమిక వ్యాధుల నియంత్రణ (ఎన్పీసీడీసీఎస్), సార్వత్రిక రోగనిరోధక టీకాల(యూఐపీ) కార్యక్రమాలపై సమీక్షించారు. ప్రోగ్రాం అధికారులు సంపత్కుమార్, రామకృష్ణ, వేణుగోపాల్రెడ్డి, నయిమా జహా పాల్గొన్నారు. కోనరావుపేట(వేములవాడ): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు బీడీ కార్మికులందరికీ పింఛన్ మంజూరు చేసి నెలకు రూ.4,016 జీవనభృతి అందించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి డిమాండ్ చేశారు. కోనరావుపేట ఎంపీడీవో కార్యాలయం ఎదుట సోమవా రం ఆందోళన చేశారు. బీడీ కార్మికులకు ఇచ్చి న ఎన్నికల హామీ అమలు చేయాలని డి మాండ్ చేశారు. తెలంగాణ బీడీ, సీగార్ వర్క ర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సూ రం పద్మ, ఉపాధ్యక్షురాలు దాసరి రూప, జిల్లా క మిటీ సభ్యులు లింగంపల్లి జ్యోతి పాల్గొన్నారు. సిరిసిల్లటౌన్: మహిళలు ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకుని ఆర్థిక స్వావలంబన సాధించా లని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సూర దేవరాజు కోరారు. బీవైనగర్లోని ఏసుక్రీస్తు శిష్య బృందం చర్చిలో పాస్టర్ జాన్ హైజగ్ ఆధ్వర్యంలో దీపాల వత్తులు తయారీ మిషన్ను ప్రారంభించి మాట్లాడారు. ఇంటివద్దే ఉపాధి కల్పించేలా కుటీర పరిశ్రమ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. దీని ద్వారా మహిళలు ఇంటివద్దే రోజుకు రూ.500 నుంచి రూ.వేయి వరకు సంపాదించే అవకాశం ఉందన్నారు. వంగరి అనిల్, ఆడెపు ప్రసాద్, సూర రాజు, రమేశ్, మల్లేశం పాల్గొన్నారు. -
సోషల్ మీడియాను వినియోగించుకోండి
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్వేములవాడ/వేములవాడరూరల్: ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను ఖండించాలని, ఇందుకు సోషల్మీడియాను వినియోగించుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించారు. వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ కమిటీ సభ్యులు సోమవారం విప్ను కలిశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి గ్రామస్థాయి కార్యకర్తల కృషి ఎంతగానో ఉందన్నారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, రూరల్ పార్టీ అధ్యక్షుడు సోయినేని కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. చెరువుల మరమ్మతు ప్రతిపాదనలు చేయండి నియోజకవర్గంలోని 394 చెరువులను పరిశీలించి.. చేపట్టాల్సిన మరమ్మతు పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించారు. నియోజకవర్గ ఇరిగేషన్ అధికారులతో తన నివాసంలో సోమవారం సమీక్షించారు. నీటిపారుదలశాఖ ఎస్ఈ రమేశ్, ఈఈ ప్రశాంత్, డీఈ దయాకర్ పాల్గొన్నారు. -
సమ్మెబాటలో కాటన్ కార్మికులు
● చీరల కూలి పెంచాలని డిమాండ్సిరిసిల్లటౌన్: కార్మికక్షేత్రంలో సమ్మైసెరన్ మోగింది. తమ సమస్యలను యజమానులు పరిష్కరించకపోవడంతో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాటన్ చీరల ఉత్పత్తిదారులు ఆసాములు, కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. స్థానిక అంబాభవాని ఆలయంలో సోమవారం నుంచి సమ్మె చేపట్టారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ మాట్లాడుతూ కాటన్ చీరలను ఉత్పత్తి చేస్తున్న యజమానులు కూలి పెంచకుండా కార్మికులను, ఆసాములను శ్రమదోపిడీకి గురి చేస్తున్నారన్నారు. కూలి పెంచాలని యజమానులకు డిమాండ్ నోటీసులు ఇచ్చినా పట్టించుకోవడం లేదన్నారు. చీరకు కార్మికులకు రూ.100, ఆసాములకు రూ.150 కూలీ ఇవ్వాలని కోరారు. -
ఆలకించండి.. ఆదుకోండి
● కలెక్టరేట్ బాట పట్టిన బాధితులు ● అర్జీలు స్వీకరించిన కలెక్టర్ గరీమా అగ్రవాల్సిరిసిల్ల అర్బన్: పింఛన్ మంజూరు చేయాలని ఒకరు.. భూమికి పట్టాలు ఇప్పించాలని మరొకరు.. తమ గ్రామానికి బీటీ రోడ్డు వేయించాలని గ్రామస్తులు.. ఇలా తమ సమస్యలను కలెక్టర్కు విన్నవించేందుకు సోమవారం కలెక్టరేట్ బాట పట్టారు. ప్రజావాణిలో కలెక్టర్ను కలిసి తమ విన్నపాలు అందించారు. వివిధ సమస్యలపై 162 అర్జీలు స్వీకరించిన కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడారు. ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవో కార్యాలయాల్లో 8 దరఖాస్తులు రాగా, మండల పరిషత్లలో 90 దరఖాస్తులు వచ్చాయి. -
రోడ్డుపై వెళ్లేదెలా?
ఇది వీర్నపల్లి మండలం శాంతినగర్ శివారులోని రోడ్డు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం చీమన్పల్లి–శాంతినగర్ మధ్య రోడ్డు బురదమయంగా మారి జర్రునజారుతుంది. చిన్నపాటి వర్షం పడినా ప్రయాణం ప్రాణాంతకంగా మారుతుంది. ఎర్రనిమట్టిని పోసి రోడ్డు పనులు చేపట్టి మధ్యలో వదిలేయడంతో ఇలా బురదతో నిండిపోయింది. నిజానికి ఇది రాజన్నసిరిసిల్ల–నిజామాబాద్ జిల్లాల మధ్య అటవీ ప్రాంతం గుండా వెళ్లే అంతర్ జిల్లా రహదారి. వేములవాడ–సిరికొండ(వీఎస్) రోడ్డు. 56 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మధ్యలో శాంతినగర్–చీమన్పల్లి మధ్య రోడ్డు ఇలా బురదమయంగా మారి వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉంది.సిరిసిల్ల: రాజన్నసిరిసిల్ల, నిజామాబాద్ జిల్లాలను కలిపే రోడ్డు అధ్వానంగా మారింది. ఎర్రమట్టి పోయడంతో చిన్నపాటి వర్షానికి బురదమయంగా మారుతుంది. సిరిసిల్ల నుంచి సిరికొండకు వెళ్లే రోడ్డు ద్వారా దూరభారం తగ్గుతుంది. జిల్లా ప్రజలు నిజామాబాద్కు వెళ్లేందుకు ఇది దగ్గరిదారి. డబుల్ రోడ్డు నిర్మాణం పూర్తికాకపోవడం.. ఎర్రమట్టి పోయడంతో చిరుజల్లులకే బురదగా మారుతుంది. ఈ రోడ్డు దుస్థితిపై గ్రౌండ్ రిపోర్టు. దగ్గరిదారి.. బురదమయం సిరిసిల్ల, వేములవాడ పట్టణ ప్రజలు నిజామాబాద్ జిల్లాకు కోరుట్ల, మెట్పల్లి, ఆర్మూర్ మీదుగా ఒక మార్గం, కామారెడ్డి, డిచ్పల్లి మీదుగా మరో మార్గం ద్వారా వెళ్లాలి. కానీ సిరిసిల్ల నుంచి సిరికొండ మార్గం చాలా దగ్గరి దారి. సిరికొండ వరకు డబుల్ రోడ్డు పూర్తయితే.. నేరుగా భీంగల్, ఆర్మూర్ మీదుగా నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకోవచ్చు. సిరికొండ, దర్పల్లి, ఇందల్వాయి మీదుగా మరో మార్గంలోనూ వెళ్లే అవకాశం ఉంది. కానీ సిరికొండ, వీర్నపల్లి మండలాల పరిధిలోని రోడ్డు బాగా లేకపోవడంతో వాహనదారులు జంకుతున్నారు. కోనరావుపేట మండలం మరిమడ్ల, వీర్నపల్లి మండలం శాంతినగర్, సిరికొండ మండలం తాటిపల్లి, చీమన్పల్లి మధ్య ఉన్న 8 కిలోమీటర్ల రోడ్డును విస్తరించి డబుల్ రోడ్డుగా మార్చితే.. రెండు జిల్లాల మధ్య దూరభారం తప్పుతుంది. వేములవాడ–సిరికొండ రోడ్డుకు మోక్షమేదీ? వేములవాడ–సిరికొండ మధ్య 56 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి భవనాల శాఖ మూడు దశాబ్దాలుగా ప్రతిపాదిస్తోంది. ఇప్పటికే వేములవాడ నుంచి హన్మాజిపేట వరకు డబుల్ రోడ్డు ఉంది. ఇక్కడి నుంచి బావుసాయిపేట శివారు వరకు 10.6 కిలోమీటర్ల డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ.23 కోట్లు సెంట్రల్ రోడ్ ఫడ్స్(సీఆర్ఎఫ్)లో మంజూరయ్యాయి. ఈ రోడ్డు నిర్మాణానికి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, స్థానిక ఎంపీ బండి సంజయ్కుమార్, వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఇటీవల శంకుస్థాపన చేశారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా కల్వర్టులను విస్తరించారు. కానీ రోడ్డు వెడల్పు చేసే పనులు మొదలు కాలేదు. ఈ రోడ్డు పూర్తయితే.. రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయి. బావుసాయిపేట నుంచి వట్టిమల్ల శివారు వరకు, మరిమడ్ల నుంచి తాటిపల్లి సరిహద్దు వరకు డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాల్సి ఉంది.ఇది కోనరావుపేట మండలం మరిమడ్ల శివారులోని అహ్మద్హుస్సేన్నగర్, నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తాటిపల్లి మధ్య రోడ్డు. వేములవాడ–సిరికొండ రోడ్డులోని ఓ భాగం. ఇక్కడ కూడా డబుల్ రోడ్డు నిర్మించకపోవడంతో ఎప్పుడో వేసిన తారు చెదిరిపోయింది. దీనిపై ప్రయాణించేవారు రెండు జిల్లాల సరిహద్దుల్లోని రోడ్డును చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు జిల్లాల అధికారులు పట్టించుకోకపోవడంతో శివారు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. -
రాజన్న సిరిసిల్ల
గరిష్టం/కనిష్టం31.0/24.0మంగళవారం శ్రీ 1 శ్రీ సెప్టెంబర్ శ్రీ 20267వేములవాడ: శ్రావణమాసం మూడో సోమవారం సందర్భంగా భీమన్న ఆలయంలో మహాలింగార్జన వైభవంగా జరిగింది. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.వేములవాడ అర్బన్: ఎకో క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం చెట్లకు రాఖీలు కట్టినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టి.శంకర్ తెలిపారు. ఎకో క్లబ్ కోఆర్డినేటర్ కె.వై.కరుణ, పాల్గొన్నారు.జిల్లాలో ఆకాశం మేఘావృతమవుతుంది. స్వల్పంగా వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. -
● ట్రెజరీ విధానానికి స్వస్తి ● బ్యాంకు ఖాతాల్లోకి ప్రభుత్వ గ్రాంట్లు
గంభీరావుపేట(సిరిసిల్ల): గ్రామ పంచాయతీలకు ఆర్థికపరమైన స్వయం ప్రతిపత్తి కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే గ్రాంట్లు నేరుగా గ్రామపంచాయతీల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టంలో సవరణకు ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు కేంద్ర ఆర్థిక సంఘం నిధులు మాత్రమే నేరుగా గ్రామపంచాయతీల ఖాతాలకు చేరుతుండగా.. రాష్ట్ర ప్రభుత్వ నిధులు ట్రెజరీ వ్యవస్థ ద్వారా బిల్లుల ఆధారంగా విడుదలయ్యేవి. దీంతో అభివృద్ధి పనులు, కార్మికుల వేతనాలు, నిర్వహణ ఖర్చుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతుండేది. ఈ నిర్ణయంతో జిల్లాలోని 255 గ్రామపంచాయతీల్లో సమస్యలకు చెక్ పడనుంది. ఇకపై జాప్యం జరుగదు ట్రైజరీ విధానంతో పంచాయతీలు ప్రతీ ఖర్చుకు బిల్లులు సమర్పించి అధికారుల అనుమతులు తీసుకోవాల్సి వచ్చేది. నిధుల విడుదల ఆలస్యం కావడంతో పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్ ఇతర గ్రామాభివృద్ధి పనులు నిలిచిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కొన్నిసార్లు ప్రతిపాదించిన మొత్తాలకు కోత విధించి నిధులు విడుదల కావడంతో ఇబ్బందులు ఎదురయ్యేవి. అభివృద్ధి పనులకు ఊతం ఇకపై నిధులు నేరుగా పంచాయతీ ఖాతాల్లో జమ కావడంతో అవసరమైన పనులను వేగంగా చేపట్టే అవకాశం లభించనుంది. కార్మికుల వేతనాల చెల్లింపులు, గ్రామాభివృద్ధి కార్యక్రమాలు, అత్యవసర పనుల నిర్వహణలో ఆలస్యం తగ్గనుందని అధికారులు, ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. పారదర్శకతకు ప్రాధాన్యం నిధుల వినియోగంపై గ్రామపంచాయతీలకు అధిక స్వేచ్ఛ లభిస్తున్న నేపథ్యంలో అడిట్ వ్యవస్థను మరింత కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది. నిధుల వినియోగం, లెక్కల నిర్వహణపై ప్రభుత్వం త్వరలో సమగ్ర మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో గ్రామపంచాయతీల ఆర్థిక వ్యవహారాల్లో స్వయం ప్రతిపత్తి పెరగడంతో పాటు గ్రామీణాభివృద్ధి పనులు మరింత వేగంగా జరిగే అవకాశాలు మెరుగుపడనున్నాయి. -
ఇందిరమ్మ ఇళ్లతో సొంతింటి కల సాకారం
చందుర్తి(వేములవాడ): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద కుటుంబాల సొంతింటి కల సాకారమవుతుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం మండలంలోని దేవునితండాలో ఇందిరమ్మ గృహ ప్రవేశానికి హాజరై దంపతులకు నూతనవస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులందరికీ రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, ఎవరూ ఆందోళనకు గురి కావద్దన్నారు. గత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఏ ఒక్కరికి ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్రెడ్డి గృహాలకు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, ఉచిత బస్సు, సన్న బియ్యం తదితర పథకాలను అందజేస్తున్నామన్నారు. మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గుంతలమయంఎల్లారెడ్డిపేట నుంచి వీర్నపల్లి మండలానికి వెళ్లే ప్రధాన రహదారిపై ప్రయాణం చేయడానికి వాహనదారులు జంకుతున్నారు. మండల కేంద్ర శివారులోని చిట్టివాగుపై వంతెన సమీపంలో దారిపై అడుగుకో గుంత ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎల్లారెడ్డిపేట– వీర్నపల్లి మండలాలను కలుపుకొని 30 గ్రామాలకు వెళ్లడానికి వాహనదారులకు ఇదే ప్రధాన రహదారి. కాగా, రోడ్డుకు మరమ్మతు చేయించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకొని రోడ్డుకు మరమ్మతు చేసి ఇబ్బందులు తొలగించాలని వాహనదారుల కోరుతున్నారు. – ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల) -
రేపు జిల్లాకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ రాక
సిరిసిల్ల: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్, ఐదుగురు సభ్యుల బృందం సెప్టెంబరు 1న జిల్లాకు రానున్నట్లు జిల్లా అధికార వర్గాలు ఆదివారం తెలిపాయి. చైర్మన్ బక్కి వెంకటయ్య, సభ్యులు కుస్రం నీలాదేవి, రాంబాబునాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణికుంట్ల ప్రవీణ్ కలెక్టరేట్కు చేరుకుని జిల్లా అధికారులతో సమీక్షించనున్నారు. ఈ మేరకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభసిరిసిల్లఅర్బన్: హైదరాబాద్ జింఖానా గ్రౌండ్లో ఇటీవల జరిగిన అథ్లెటిక్స్ మీట్లో మాస్టర్ అథ్లెట్లు అద్భుత ప్రతిభ కనబర్చి పతాకాలు సాధించారు. 65 ఏళ్ల విభాగంలో మల్యాల లక్ష్మి 3 కిలోమీటర్ల వాక్లో గోల్డ్ మెడల్, 400 మీటర్లలో సిల్వర్ మెడల్ సాధించారు. 35 ఏళ్ల విభాగంలో కె.అశోక్ డిస్క్ వాక్లో గోల్డ్ మెడల్, 1,500 మీటర్లలో బ్రాంజ్ మెడల్ సాధించాడు. 35 ఏళ్ల విభాగంలో సుల్తానా డిస్క్వాక్లో గోల్డ్ మెడల్ సాధించారు. విజేతలను జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ గొట్టిముక్కుల శేఖర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జ్ఞానోభా, రామానుజమ్మ, గొట్టె అంజయ్య అభినందించారు. సిరిసిల్ల నుంచి జేబీఎస్కు ప్రత్యేక బస్సులు సిరిసిల్లఅర్బన్: సిరిసిల్ల ఆర్టీసీ డిపో నుంచి జేబీఎస్(జూబ్లీ బస్ స్టేషన్)కు ప్రత్యేక రిజర్వేషన్ ఎక్స్ప్రెస్ బస్సులను నడుపుతున్నట్లు డిపో మేనేజర్ ప్రకాశ్రావు తెలిపారు. ఈ నెల 31 సోమవారం నుంచి బస్సులు నడుస్తాయన్నారు. సిరిసిల్ల నుంచి ఉదయం 5 గంటలకు ప్రారంభమై ప్రతీ అరగంటకు ఒకటి చొప్పున ఉదయం 8.15 గంటల వరకు బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రత్యేక రిజర్వేషన్ బస్సులను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎకరాకు రూ.20 లక్షలు చెల్లించాలితంగళ్లపల్లి: మండలంలోని మండెపల్లి గ్రామంలో సర్వే నంబర్ 377లో భూములు కోల్పోయిన సుమారు 200 కుటుంబాలకు తక్షణమే న్యాయం చేయాలని సీపీఐ నాయకుడు గుంటి వేణు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పేదల జీవనోపాధి కోసం సుమారు 350 ఎకరాలు కేటాయించారని, అందులో అధిక శాతం దళిత కుటుంబాలే ఉన్నాయన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఆ భూములను గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రభుత్వ అవసరాలకు వాడుకుందే తప్ప బాధితులకు ఎలాంటి పరిహారం ఇవ్వలేదని ఆరోపించారు. పైగా కొన్ని భూములను కొనుగోలు చేశామంటూ బీఆర్ఎస్కు చెందిన కొందరు వ్యక్తులు ఆక్రమణలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ అవసరాలకు వినియోగించిన భూములకు ఎకరానికి రూ.20 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కోరారు. వీలైన చోట భూములను తిరిగి లబ్ధిదారులకే అప్పగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సోమ నాగరాజు, ఎలగందుల రాజు పాల్గొన్నారు. ‘చేయూత’ గడువు పెంచాలి సిరిసిల్లటౌన్: చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు పెంచాలని సీపీఐ పట్టణ కార్యదర్శి పంతం రవి డిమాండ్ చేశారు. ఆదివారం సిరిసిల్ల లోని కార్మికభవనంలో లాల్ బహుట చేనేత, పవర్లూమ్స్ కార్మిక సంఘం సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, చేనేత జౌళిశాఖ అధికారులు, సిబ్బంది తీరుతో సిరిసిల్ల పవర్లూమ్, అనుబంధ రంగాల కార్మికులకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. దరఖాస్తు గడువు ముగుస్తున్నా జౌళిశాఖ అధికారులు నేతన్న చేయూత పథకానికి అవసరమైన కార్డులు జారీ చేయడం లేదన్నారు. దీంతో కార్మికులకు నష్టం జరిగే అవకావం ఉందన్నారు. అధికారులు తమ పని విధానాన్ని మార్చుకోకుంటే పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. అజ్జ వేణు, సోమ నాగరాజు, హరికృష్ణ, రాజమల్లు పాల్గొన్నారు. -
దొరకని దొంగలు
సిరిసిల్ల: జిల్లాలో తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తూ చోరీలు జరుగుతున్నాయి. పొద్దంతా రెక్కీ నిర్వహిస్తూ.. రాత్రి వేళ దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ జనవరి నుంచి ఆగస్ట్ 31 వరకు మొత్తం 244 రోజులు కాగా, జిల్లాలో 204 దొంగతనాలు జరిగాయి. అంటే సెలవు రోజులను మినహాయిస్తే జిల్లాలో రోజుకో చోరీ జరిగినట్లు భావిస్తున్నారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన ఓ దొంగ ఆలయాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. ఆలయాల్లో దొరికిన సొత్తు అమ్ముకుంటూ జల్సాలు చేస్తున్నారు. గతంలో జైలుకు వెళ్లి వచ్చిన సదరు నిందితుడు స్నేహితులతో కలిసి మళ్లీ దొంగతనాలకు పాల్పడ్డారు. ఆ దొంగల ముఠాను సిరిసిల్ల పోలీసులు పట్టుకుని జైలుకు పంపించారు. ఇటీవల కోనరావుపేట మండలం నిమ్మపల్లిలోనూ నాలుగు ఇళ్లలో దొంగలు పడ్డారు. ముస్తాబాద్ మండలం వెంకట్రావుపల్లిలో ఆగస్ట్ మొదటి వారంలో మూడిళ్లలో దొంగలుపడ్డారు. మిట్టపల్లి రాజు ఇంటి తాళం పగులగొట్టి బీరువాను తెరిసి బంగారం, వెండి దోచుకెళ్లారు. అంతకు ముందు రెండిళ్లలో దొంగలు పడ్డారు. ఇలా జిల్లా వ్యాప్తంగా ప్రతి వారం రోజుల్లో నాలుగైదు దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. గొర్రెల మందలకు రక్షణ కరువు జిల్లాలో గొర్రెల మందలు పొలాల దగ్గర, ఆరు బయట, దొడ్డిలో ఉంటాయి. ఇటీవల కాలంలో దొంగలు ట్రాలీ ఆటోల్లో వచ్చి గొర్రెలను ఎత్తుకెళ్లిన ఘటనలు ఉన్నాయి. రాత్రి వేళల్లో రక్షణ లేకుండా ఉండే గొర్రెల మందల వద్దకు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చిన తెల్లారేలోగా గొర్రెలను ఆటోలో వేసుకుని వెళ్లారు. వ్యవసాయ మోటార్లు, ఇతర వస్తువులు సైతం దొంగలపాలవుతున్నాయి. దొంగల బాధకు కొందరు కాపరులు గొర్రెల మందలు ఉండే ప్రదేశంలో సీసీ కెమెరాలు అమర్చి రాత్రి వేళ కాపలాగా నిద్రిస్తున్నారు. నిద్రపోతున్న నిఘా నేత్రాలు జిల్లాలో పోలీసులు సామాజిక బాధ్యతగా ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. జిల్లా వ్యాప్తంగా ప్రధాన రహదారులు, గ్రామాల్లో అంతర్గత రహదారుల వెంట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించి నిఘా ఉంచారు. కాగా, ఇటీవల కాలంలో చాలా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు సరిగా పని చేయకపోవడం, సాంకేతిక సమస్యలు రావడంతో మళ్లీ రిపేరు చేయక నిఘా నిద్రపోతుంది. అనేక ప్రాంతాల్లో చాలా రోజుల కిందట బిగించిన సీసీ కెమెరాల కళ్లు మసకబారి పోయి, దుమ్ము పట్టి నేలచూపులు చూస్తున్నాయి. అవి బాగా పని చేస్తే.. కనీసం నిఘా నీడలో నేరాలను నియంత్రించేందుకు అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు బాగానే పని చేస్తున్నాయి. మరోవైపు వ్యక్తిగతంగా ప్రైవేటు వ్యక్తులు, వ్యాపార వర్గాలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం విశేషం. కానీ, పాడైన కెమెరాలను రిపేరు చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు జిల్లాలో జరిగిన చోరీలు నమోదైన దొంగతనాలు: 204కోల్పోయిన సొత్తు: రూ.1,19,68,281దొంగలు దొరికిన కేసులు: 93రికవరీ సొత్తు: రూ.20,81,820పట్టుబడని దొంగతనం కేసులు: 111రికవరీ కాని సొత్తు: 98,86,461‘ఇది కోనరావుపేట మండలం శివంగళపల్లె. ఓ ఇంట్లో దొంగలు పడి బంగారు ఆభరణాలు, ఇతర సామగ్రిని ఎత్తుకెళ్లగా.. ఏఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ నాగేంద్రచారి ఘటన స్థలానికి వెళ్లి విచారించారు. అప్పటి సీఐ, ఎస్సై సైతం క్షేత్రస్థాయిలో విచారణ జరిపారు. ఇదే మండలంలోని మర్తనపేటలో జరిగిన దొంగతనం కేసులో నిందితులను పట్టుకునేందుకు జాగిలాలతో అన్వేషించారు.’ జిల్లాలో.. గ్రామాలు 260 గ్రామీణ పోలీస్స్టేషన్లు 11 పట్టణ పోలీస్స్టేషన్లు 02 గ్రామీణ సర్కిళ్లు 04 డివిజన్లు 02 ఏటీఎం దొంగలను గుర్తించాం ఎల్లారెడ్డిపేటలో ఏటీఎం దోపిడీకి పాల్పడిన దొంగలను గుర్తించాం. హర్యానాకు చెందిన వారిగా గుర్తించి పోలీసు బృందం అక్కడి వరకు వెళ్లింది. దొంగలు ఇంకా పట్టుబడలేదు. వారి కోసం అన్వేషణ కొనసాగుతుంది. జిల్లాలో దొంగతనాల కట్టడికి పోలీస్ పెట్రోలింగ్ పెంచాం. శాంతిభద్రతల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. – మహేశ్ బి గీతే, ఎస్పీ -
● కొండాపూర్లో 6 నెలల క్రితం మద్యపాన నిషేధ తీర్మానం ● గ్రామపంచాయతీ నిబంధనలు ఉల్లంఘన
కోనరావుపేట(వేములవాడ): గ్రామంలో విచ్చలవిడిగా విక్రయిస్తున్న మద్యం అమ్మకాలను అరికట్టేందుకు పంచాయతీ పాలకవర్గం తీసుకున్న మద్యపాన నిషేధం నీరుగారుతోంది. కోనరావుపేట మండలం కొండాపూర్లో మద్యం విక్రయాలు చేపట్టకూడదని పంచాయతీ పాలకవర్గం ఏకాభిప్రాయానికి వచ్చి సర్పంచ్ వంకాయల గౌతమి ఆధ్వర్యంలో మార్చి 1న గ్రామసభ నిర్వహించి అందరి సమక్షంలో మద్యపాన నిషేధానికి తీర్మానం చేశారు. గ్రామంలో మద్యం అమ్మినవారికి రూ. 10వేల జరిమానా, పట్టించిన వారికి రూ.5 వేల నజరానా ప్రకటించారు. కాగా గ్రామంలో ఆది వారం పోచమ్మ బోనాల పండుగను పురస్కరించుకొని బెల్ట్షాపు నిర్వాహకులు మద్యపాన నిషేధం తీర్మానాన్ని తుంగలో తొక్కుతూ మద్యం అమ్మకాలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించొద్దంటూ నిర్వాహకులను గ్రామస్తులు నిలదీసినా అమ్మకాలు ఆపడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. బెల్ట్షాప్ నిర్వాహకులపై ఎకై ్సజ్, పోలీస్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
జిల్లా అంతటా చిరుజల్లులు
సిరిసిల్ల: జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఆదివారం రాత్రి వరకు తుంపర వానలు పడ్డాయి. బోయినపల్లిలో అత్యధికంగా 14.6 మిల్లీమీటర్ల వర్షం పడగా.. రుద్రంగి 5.9, చందుర్తి 11.9, వేములవాడరూరల్ 7.0, వేములవాడ 6.2, సిరిసిల్ల 0.7, కోనరావుపేట 8.0, వీర్నపల్లి 0.4, ఎల్లారెడ్డిపేట 3.3, ముస్తాబాద్ 0.8, తంగళ్లపల్లి 6.1, ఇల్లంతకుంటలో 2.5 మి.మీ వర్షం కురిసింది. గంభీరావుపేటలో పెద్దగా వర్షం పడలేదు. జిల్లాలో సగటు వర్షపాతం 5.2 మిల్లీ మీటర్లుగా నమోదైంది. రుద్రంగి మండలంలో లోటు వర్షపాతం ఉండగా, వేములవాడ, కోనరావుపేట, వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాల్లో కాస్త మెరుగైన వర్షం కురిసింది. విజయవంతం చేయాలివీర్నపల్లి(సిరిసిల్ల): ప్రభుత్వం మారినా ప్రజలకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలే గ్రామాల్లో భరోసాగా నిలుస్తున్నారని, అదే స్ఫూర్తితో ముందుకెళ్లాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పిలుపునిచ్చారు. ఆదివారం వీర్నపల్లిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన హామీలను నమ్మి మోసపోయిన తీరుపై, ప్రభుత్వం 1,000 రోజులుగా అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై సెప్టెంబర్ 2 నుంచి 7 వరకు చేపట్టే నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. మండల అధ్యక్షుడు రాజిరెడ్డి, సెస్ డైరెక్టర్ మాడుగుల మల్లేశం, మాల్లరపు అరుణ్కుమార్, ఎండీ చాంద్పాషా తదితరులు పాల్గొన్నారు. -
పాఠశాల పనులు త్వరగా పూర్తి చేయండి
రుద్రంగి(వేములవాడ): రుద్రంగి మండలం గైదిగుట్ట తండా గ్రామంలో నిర్మిస్తున్న ట్రైబల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆదేశించారు. ఆదివారం ట్రైబల్ వెల్ఫేర్ బాలికల పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ట్రైబల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల పనులు పూర్తికాక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకు వస్తే పరిష్కరించి సహకారం అందిస్తానన్నారు. నాయకులు, అధికారులు పాల్గొన్నారు.


