breaking news
Rajanna
-
పొన్నరథంపై గోవిందుడు
● తిరువీధుల్లో తిలకించిన భక్తజనం ● మిన్నంటిన గోవింద నామస్మరణం సిరిసిల్లటౌన్: అశేష భక్తుల గోవిందనామస్మరణతో శ్రీశాల తిరువీధులు పులకించాయి. ఎనిమిది రోజులుగా సాగుతున్న శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి పొన్నరథోత్సవం జరిగింది. తిరుమలేశుని అనుబంధ ఆలయమైన సిరిసిల్ల తిరువీధుల్లో గోవిందుని రూపంలో శ్రీవారు పొన్న రథంపై విహరించారు. ఈసందర్బంగా సాయంత్రం 6గంటల నుంచే పొన్నవాహన ఉత్సవాలు నిర్వహించారు. కళాకారుల కోలాటాలు, భజన సంకీర్తనలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. రాత్రి 9 గంటలకు ప్రారంభమైన పొన్నరథాన్ని లాగడానికి భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. టీపీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, ఈవో మారుతిరావు, ఏఈవోలు కూనబోయిన సత్యం, పీసరి రవీందర్, ఆలయ కమిటీ మాజీ చైర్మన్లు ఉప్పుల విఠల్రెడ్డి, చేపూరి నాగరాజు, తీగల శేఖర్గౌడ్, అర్చకస్వాములు కృష్ణమాచారి తదితరులు పాల్గొన్నారు. కాళింగమర్దనంపై దేవదేవుడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం 11 గంటలకు కాలింగమర్ధన సేవ నిర్వహించారు. గోవిందా నామస్మరణతో మాడవీధులు పులకించిపోయాయి. కాళింగమర్దనంపై విచ్చేసిన దేవదేవుడికి భక్తులు మంగళహారతులతో నీరాజనం పలికారు. పొన్నసేవపై విహరిస్తున్న శ్రీవారిని దర్శించుకుంటున్న భక్తులుకాళింగమర్దనంపై విహరిస్తున్న శ్రీవారు -
ధాన్యం దళారుల పాలు
● పల్లెల్లోకి ప్రైవేట్ వ్యాపారులు ● ప్రారంభంకాని కొనుగోలు కేంద్రాలు ● మద్దతు ధర కోల్పోతున్న రైతులుఇల్లంతకుంట(మానకొండూర్): ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో ఇప్పటికే చేతికొచ్చిన ధాన్యాన్ని రైతులు ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. వరుసగా కురుస్తున్న వర్షాలకు ధాన్యం తడిస్తే రంగుమారుతుందనే భయంతో అన్నదాతలు సైతం వ్యాపారులు ఎంత ధర చెబితే అంతకే అమ్మేస్తున్నారు. ఇల్లంతకుంట మండలంలో ఈ ఖరీఫ్ సీజన్లో దాదాపు 25వేల ఎకరాల వరకు వరి సాగుచేశారు. మొదట సాగుచేసిన వరి పంటలు కోతకొచ్చాయి. పెద్దలింగాపూర్ ప్రాంతంలో చాలా మటుకు పంట కోతకొచ్చింది. గత వారం రోజులుగా పంటను కోస్తున్న రైతులు వర్షం కురుస్తుండడంతో భయాందోళన చెందుతున్నారు. ఒక్క పెద్దలింగాపూర్ గ్రామంలోనే ప్రైవేట్ వ్యాపారులు ఇప్పటి వరకు ఐదు లారీల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిసింది. పచ్చి వడ్లను క్వింటాల్కు రూ.1700 దళారులు కొనుగోలు చేస్తున్నారు. బస్తాకు రెండు కిలోల తరుగు తీస్తున్నారని రైతులు తెలిపారు. గత రబీ సీజన్లో ఇల్లంతకుంట మండలంలో 28 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఒక్క కేంద్రాన్ని కూడా ప్రారంభించలేదు. దీంతో చేసేదేమి లేక రైతులు ప్రైవేట్ వ్యాపారులకే విక్రయిస్తున్నారు. -
మిల్లర్లు నిబంధనలు పాటించాలి
● కలెక్టర్ హరితసిరిసిల్ల: జిల్లాలోని రైస్మిల్లర్లు నిబంధనలు పాటించాలని కలెక్టర్ ఎం.హరిత కోరారు. కలెక్టరేట్లో సోమవారం జిల్లాలో వరి ధాన్యం సేకరణ, బ్యాంక్ గ్యారెంటీ, సీఎమ్మార్ సరఫరాపై రైస్మిల్లర్లతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ రైస్మిల్లర్లు సీఎమ్మార్ సరఫరా చేయాలని, గత ఖరీఫ్లో జిల్లాలో 2.15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. ఈనెల మూడో వారంలో జిల్లాలో వరికోతలు మొదలు కానున్నాయని, ఈ సీజన్లో దాదాపు 2.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రానుందని అంచనా ఉన్నట్లు తెలిపారు. నిబంధనల ప్రకారం రైస్మిల్లర్లు బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పలువురు రైస్మిల్లర్లు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఎఫ్సీఐకి బియ్యం ఇచ్చేందుకు బెడ్స్ ఇప్పించాలని విన్నవించగా.. నిబంధవల ప్రకారం మిల్లర్లకు సహకరిస్తామని కలెక్టర్ తెలిపారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, జిల్లా పౌరసరఫరాల అధికారి చంద్రప్రకాశ్, డీఎం రజిత, జిల్లా రైస్మిల్లర్ల సంఘం ప్రతినిధులు చేపూరి నాగరాజు, పబ్బ నాగరాజు, గరిపెల్లి ప్రభాకర్ పాల్గొన్నారు. గ్రీన్ఫీల్డ్ కారిడార్ అభివృద్ధిపై కాన్ఫరెన్స్ గ్రీన్ఫీల్డ్ నాగ్పూర్–హైదరాబాద్ హైస్పీడ్ కారిడార్ అభివృద్ధిపై రోడ్డు భవనాల శాఖ చీఫ్ సెక్రటరీ వికాస్రాజ్ సోమవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు డీపీఆర్కు సహకరించాలని కోరారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ ఎం.హరిత, కలెక్టరేట్ పర్యవేక్షకులు శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు. -
నేతకార్మికులకు యారన్ సబ్సిడీ ఇవ్వండి
సిరిసిల్లటౌన్: ఇందిరా మహిళాశక్తి చీరలకు సంబంధించిన పవర్లూమ్స్, అనుబంధ రంగాల కార్మికులకు 10 శాతం యారన్ సబ్సిడీ అందించాలని పవర్లూమ్స్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మూశం రమేశ్ కోరారు. సిరిసిల్లలో సోమవారం పర్యటించిన చేనేత, జౌళిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్కు వినతిపత్రం అందించి మాట్లాడారు. మొదటి విడత ఆర్డర్ పూర్తికావస్తున్నందున కార్మికుల ఉపాధికి ఇబ్బంది కలగకుండా రెండో విడత ఆర్డర్ను అందించాలని కోరారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ, పట్టణ అధ్యక్షులు నక్క దేవదాస్, అక్తర్ అన్సారి పాల్గొన్నారు. -
ఇలాగైతే ఆడేదెలా ?
● ఏళ్లుగా కొనసాగుతున్న మినీస్టేడియం పనులు ● త్వరగా పూర్తిచేయాలంటున్న క్రీడాకారులువేములవాడఅర్బన్: గ్రామీణ ప్రాంతంలోని క్రీడాకా రుల్లో నైపుణ్యం పెంపు.. వారి టాలెంట్ను గుర్తించేందుకు చేపట్టిన మినీ స్టేడియం పనులు ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఆటలు ఆడేందుకు కనీ స సౌకర్యాలు లేక క్రీడాకారులు ఇబ్బంది పడుతున్నారు. వేములవాడలో 2014లో ప్రారంభించిన మినీస్టేడియం పనులు ఇంకా పూర్తికాలేదు. ఫలితంగా క్రీడాకారులకు మౌలిక వసతులు దరిచేరడం లేదు. రూ.2.10కోట్లతో 2014లో.. వేములవాడ మున్సిపల్ పరిధి నాంపల్లి శివారులో 5 ఎకరాల విస్తీర్ణంలో 13 జూలై 2014న అప్పటి ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు, అప్పటి స్పీకర్ మధుసూదనాచారి చేతుల మీదుగా రూ.2.10కో ట్లతో మినీస్టేడియం పనులు ప్రారంభించారు. సగం పనులు చేసిన కాంట్రాక్టర్ తర్వాత పట్టించుకోలేదు. రెండేళ్ల క్రితం మళ్లీ రూ.5కోట్లు మంజూరు కావడంతో మళ్లీ కొంత మేరకు పనులు చేసి నిలిపివేశారు. ఇటీవల మళ్లీ పనులు ప్రారంభించారు. చేయాల్సిన పనులు ఇవే.. మినీస్టేడియంలో క్రీడాకారుల కోసం ఆట స్థలం, ఆటలపోటీలను చూసేందుకు హాల్, ఇండోర్ స్టేడియం, సిబ్బంది కార్యాలయాలు, క్రీడాకారులకు స్నాన గదులు నిర్మించాల్సి ఉంది. -
గ్రీవెన్స్ డేకు 18 ఫిర్యాదులు
సిరిసిల్ల క్రైం: బాధితులకు భరోసాగా ఉండేందుకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతీ సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. 18 ఫిర్యాదులు స్వీకరించినట్లు వివరించారు. ఫిర్యాదులను పరిష్కరించాలని అధికారులకు ఫోన్చేసి ఆదేశించారు.న్యాయసేవల క్లినిక్ ప్రారంభంసిరిసిల్లకల్చరల్: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రాజీవ్నగర్ బస్తీ ఆస్పత్రిలో న్యాయ సేవల క్లినిక్ను సంస్థ జిల్లా కార్యదర్శి రాధికా జైస్వాల్ సోమవారం ప్రారంభించారు. డ్రగ్ అవేర్నెస్, వెల్నెస్, నేవిగేషన్ ఫర్ డ్రగ్ ఫ్రీ ఇండియా(డాన్)లో భాగంగా మత్తు పదార్థాలకు బానిసలైన వారిని గుర్తించి స్వస్థత చేకూర్చేందుకు ఈ కేంద్రం పనిచేస్తుందని తెలిపారు. లోక్ అదాలత్ సభ్యుడు చింతోజు భాస్కర్, మా నసిక వైద్య నిపుణుడు ప్రవీణ్, డాక్టర్ మణివర్మ, నర్సింగ్ ఆఫీసర్ స్వాతి పాల్గొన్నారు.రోడ్డు కబ్జాను అడ్డుకోండి సిరిసిల్లటౌన్: రోడ్డు కబ్జా చేసి నిర్మిస్తున్న భవనం పనులు అడ్డుకోవాలని ఏఐఎఫ్టీయూ న్యూ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సోమిశెట్టి దశరథం కోరారు. మున్సిపల్ ఎదుట సోమవారం నిరసన తెలిసిన సందర్భంగా మాట్లాడారు. విద్యానగర్ నుంచి తాడూరు వెళ్లే దారిలో సర్వేనంబర్ 526లో రోడ్డును ఆక్రమించి భవనం నిర్మిస్తున్నారన్నారు. వెంటనే ఆ నిర్మాణాన్ని అడ్డుకోవాలని కోరారు. కొత్తచెరువు నాలాలు, శాంతినగర్ రోడ్ డ్యామ్ ఆక్రమణలపై విచారణ చేపట్టాలని కోరారు. కొంపల్లి విజయ్కుమార్, తడుక రాములు, గుజ్జ దేవదాస్, సత్తయ్య, శ్రీధర్ పాల్గొన్నారు.తెల్లవార్లూ కురిసిన వర్షంసిరిసిల్ల: ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు వర్షం కురిసింది. కోనరావుపేటలో అత్యధికంగా 56.0 మిల్లీమీటర్లు కురిసింది. సిరిసిల్లలో 50.7, రుద్రంగిలో 28.7, చందుర్తిలో 24.4, బోయినపల్లిలో 17.8, వేములవాడలో 47.6, వీర్నపల్లిలో 27.6, వేములవాడ రూరల్లో 19.7, ఎల్లారెడ్డిపేటలో 42.0, గంభీరావుపేటలో 41.5, ముస్తాబాద్లో 43.4, తంగళ్లపల్లిలో 25.1, ఇల్లంతకుంటలో 10.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలో 33.5 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది.కష్టపడిన వారికి గుర్తింపుఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పార్టీలో దశాబ్దకాలంగా కష్టపడి పనిచేస్తున్న వారికి గుర్తింపు ఉంటుందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి కోరారు. ఎల్లారెడ్డిపేటలోని పార్టీ ఆఫీ స్లో సోమవారం ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల కార్యకర్తలతో సమావేశమయ్యారు. రెండు మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అన్ని స్థానాలు కైవసం చేసుకోవాలన్నారు. రాచర్లగొల్లపల్లికి చెందిన 50 మంది కాంగ్రెస్లో చేరారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, ఏఎంసీ చైర్మన్లు సాబేరా బేగం, రాములునాయక్, వైస్చైర్మన్లు గుండాడి రాంరెడ్డి, లక్ష్మణ్, పార్టీ మండలాధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, భూత శ్రీనివాస్ పాల్గొన్నారు.జిల్లా సరిహద్దుల్లో తనిఖీవేములవాడరూరల్: రాజన్నసిరిసిల్ల–జగిత్యాల జిల్లా సరిహద్దు మండలంలోని ఫాజుల్నగర్ వద్ద పోలీసులు సోమవారం రాత్రి తనిఖీలు చేపట్టారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో వాహనాలను ఆపి తనిఖీ చేశారు. రూ.50వేలకు మించి నగదు తరలిస్తే సీజ్ చేస్తామని ఎస్సై వెంకట్రాజం తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి, ధ్రువీకరణ పత్రాలు సరిగా లేని వారికి జరిమానా విధించారు.అన్నపూర్ణలో 3.38 టీఎంసీలుఇల్లంతకుంట(మానకొండూర్): అనంతగిరి అన్నపూర్ణ జలాశయం సామర్థ్యం 3.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.38 టీఎంసీలకు చేరింది. ఎత్తిపోతలు నిలిపివేసినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. -
సమస్యలు పరిష్కరించండి
● ఏడాది పొడవునా పని ఉండేలా చూడండి.. ● వస్త్రోత్పత్తిదారుల ‘కరెంట్’ సమస్యను పరిష్కరించండి ● మంత్రి సీతక్కకు వెల్లువలా వినతులుసిరిసిల్ల: నేతన్నలకు ఏడాది పొడవునా చేతినిండా పని ఉండేలా చూడాలని కొందరు.. ప్రభుత్వ ఆర్డర్లతోనే మేలైనా కూలీ వస్తోందని.. మరిన్ని ఆర్డర్లు ఇవ్వాలని మరికొందరు.. వస్త్రోత్పదారులపై విధిస్తున్న విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలని మరికొందరు.. ఇలా మంత్రి సీతక్కకు వినతలు వెల్లువలా వచ్చాయి. సిరిసిల్లలో తొలిసారి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశుసంక్షేమశాఖ మంత్రి సీతక్క సోమవారం పర్యటించారు. వెంకట్రావునగర్లోని పవర్లూమ్ కార్ఖానా నుంచి, ఇందిరానగర్లోని చీరల బట్టను సేకరించే గోదాం, ప్రాసెసింగ్ యూనిట్ వరకు వస్త్రోత్పత్తిలోని వివిధ దశలను పరిశీలించారు. నేతకార్మికులు, వైపని కార్మికులు, ఆసాములు, వస్త్రోత్పత్తిదారలతో మాట్లాడారు. మంత్రి హోదాలో తొలిసారి జిల్లాకు వచ్చిన సీతక్కకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చేనేత, జౌళిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కె.కె.మహేందర్రెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ వెల్ముల స్వరూపారెడ్డి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ప్రకాశ్, సంగీతం శ్రీనివాస్, ఆకునూరి బాలరాజు, సూర దేవరాజు, గడ్డం నర్సయ్య, వైద్య శివప్రసాద్, గౌతమ్, రెడ్డినాయక్, ఆడెపు చంద్రకళ, మడుపు శ్రీదేవి, కల్లూరి చందన, గోనె శరణ్య జౌళిశాఖ జేడీ ఎన్.వెంకటేశ్వర్రావు, వస్త్రోత్పత్తిదారులు గోవిందు రవి, ఆడెపు భాస్కర్, వెల్దండి దేవదాస్, అన్నల్దాస్ అనిల్కుమార్, తాటిపాముల దామోదర్ తదితరులు పాల్గొన్నారు. నేతకళాకారుడికి సన్మానం చేనేత శిల్పి నల్ల పరంధాములు తనయుడు నల్ల శ్రావణ్ను మంత్రి సీతక్క శాలువాతో సన్మానించారు. సీఎం రేవంత్రెడ్డి ముఖచిత్రాన్ని అగ్గిపెట్టెలో పట్టే శాలువాపై నేసారు. కరెంట్ సమస్యను పరిష్కరించండి చిన్నతరహా పరిశ్రమల పేరిట బ్యాక్ బిల్లింగ్ అని ‘సెస్’ అధికారులు కోర్టు ఆదేశాలను సాకుగా చూపి రూ.కోట్ల కరెంట్ బిల్లులు వేశారని మంత్రికి వస్త్రోత్పత్తిదారులు వివరించారు. బీఆర్ఎస్కు చెందిన ‘సెస్’ చైర్మన్ తమపై కక్ష గట్టి వేధిస్తున్నాడని, బ్యాక్ బిల్లింగ్ సమస్యను పరిష్కరించాలని విన్నవించారు. పట్టణంలోని బీ.వై.నగర్లో అందరికీ అందుబాటులో ఉన్న చేనేత, జౌళిశాఖ ఆఫీస్ను రగుడు శివారులోని కలెక్టరేట్కు మార్చారని, దాన్ని గతంలో కొనసాగించిన భవనంలోకి తరలించాలని పాలిస్టర్ అసోసియేషన్ ప్రతినిధులు వినతిపత్రం అందించారు. సిరిసిల్ల మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖలో పనిచేసే ఒప్పంద ఉద్యోగులను అకారణంగా విధుల నుంచి తప్పించారని, తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని కోరుతూ ఆయా సంస్థల్లో పనిచేసిన మాజీ ఉద్యోగులు మంత్రికి వినతిపత్రం అందించారు. -
పారదర్శకం
‘ఉపాధి’ ● జియో ఫెన్సింగ్తో కూలీల హాజరు ● పనుల గుర్తింపు సైతం ● ఉపాధిహామీ జాబ్కార్డులు 98వేలు ● గుర్తించిన పనులు 23వేలుముస్తాబాద్(సిరిసిల్ల): జాతీయ ఉపాధిహమీ పనుల్లో పారదర్శకతకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు జియో ట్యాగింగ్ ద్వారా కూలీల హాజరు నమోదు చేసిన అధికారులు ఇక నుంచి జియో ఫెన్సింగ్ ద్వారా పనులు, హాజరును నమోదు చేయనున్నారు. పనికి ముందు, తరువాత చేసిన పనులే కాదు.. కూలీల హాజరు నమోదును మూడుసార్లు చేసేందుకు జియో ఫెన్సింగ్ను ఉపయోగిస్తారు. ఈమేరకు టెక్నికల్ అసిస్టెంట్లకు ప్రభుత్వం ఇప్పటికే శిక్షణను ఇచ్చింది. జియో ఫెన్సింగ్ విధానంపై పక్షం రోజుల క్రితమే శిక్షణ తరగతులు నిర్వహించారు. అక్టోబర్ నుంచి చేపట్టబోయే కొత్త పనులను జియో ఫెన్సింగ్ చేయనున్నారు. జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరం రూ.21.78 కోట్ల విలువైన ఉపాధిహామీ పనులు చేపడుతున్నారు. ఏమిటీ జియో ఫెన్సింగ్ ఉపాధిహామీ గ్రామసభల్లో తీర్మానం చేసి గుర్తించిన పనులకు అధికారులు, సిబ్బంది ప్రతిపాదనలు చేస్తారు. పనుల మంజూరుకు ముందే టెక్నికల్ అసిస్టెంట్లు గుర్తించిన పనులకు జియోఫెన్సింగ్ చేస్తారు. ప్రత్యేక యాప్ ద్వారా పని ప్రదేశంలో జియోఫెన్సింగ్కు సరిహద్దులు నిర్ణయిస్తారు. గుర్తించిన పనిని నాలుగు వైపుల నుంచి ఆన్లైన్లో నమోదు చేస్తారు. పనికి ముందు.. పనికి మధ్యలో.. పని తరువాత.. జియో ఫెన్సింగ్ చేసి కూలీల నమోదు చేసి అప్లోడ్ చేస్తారు. గతంలో కూలీలు పనులు మొదలుపెట్టిన చోట నమోదైన ఫొటోతోపాటు గుర్తించిన పనిలో సరిహద్దులు దాటకుండా పని చేయాలి. ఫీల్డ్ అసిస్టెంట్లు, టీఏలు పనిప్రదేశంలో జియో ఫెన్సింగ్ ద్వారా గుర్తించి కూలీలకు పనులు అప్పగిస్తారు. దాని ప్రకారమే పనులు చేస్తారు. కూలీల హాజరు నమోదులో సులభతరం చేయడంతోపాటు పారదర్శకంగా పనులు జరిగేలా జియోఫెన్సింగ్ విధానం ఉపయోగపడుతుంది. కూలీలు పనులు చేసుకుంటూ కిలోమీటర్ల పరిధిలో నడిచి వెళ్తారు. పనులు పూర్తయిన తర్వాత మొదట ఫొటో దిగిన పని ప్రదేశానికి సదరు కూలీ రావాల్సి ఉంటుంది. దీంతో ఫీల్డ్ అసిస్టెంట్లు, కూలీలు ఇబ్బందులు పడేవారు. జియో ఫెన్సింగ్తో పని ప్రదేశంలో ఎక్కడ ఉన్న కూలీల హాజరును ఆన్లైన్ చేయవచ్చు. ఒకసారి ఒకే పని జియోఫెన్సింగ్ ద్వారా ఒకసారి చేపట్టిన పనిని మరోసారి చేపట్టరాదు. ఇప్పటి వరకు ఇలా అనేక చెరువులు, కుంటలు, కెనాల్స్ను పదుల సార్లు చేశారు. ఒకసారి జియోఫెన్సింగ్లో నమోదైన పనిని తిరిగి చేపట్టేందుకు వీలుకాదు. జియోఫెన్సింగ్ ద్వారా గుర్తించిన పనిప్రదేశంలో నాలుగు వైపులా నుంచి ఎక్కడి నుంచైన కూలీ హాజరును నమోదు చేయవచ్చు. జియో ట్యాగింగ్ ద్వారా గతంలో ఒక మూలనే కూలీ హాజరును తీసుకునేవారు. అయితే సెల్ఫోన్ నెట్వర్క్ లేనిచోట సాంకేతిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకరోజు మొబైల్ పనిచేయకుంటే ఆరోజు హాజరు నమోదుకాదు. దీని ద్వారా కూలీలు నష్టపోయే ప్రమాదం ఉంది.ఉపాధిహామీ పనుల్లో కూలీలుజాబ్కార్డులు : 98వేలు యాక్టివ్ జాబ్కార్డులు : 61వేలు గుర్తించిన కూలీలు : 2 లక్షలు యాక్టివ్ వర్కర్లు : 93వేలు గుర్తించిన పనులు : 23వేలు కేటాయించిన బడ్జెట్ : రూ.21.78 కోట్లు -
నేడు సిరిసిల్లకు మంత్రి సీతక్క
సిరిసిల్ల: పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సోమవారం జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. నేతకార్మికులు నేసిన ఇందిరా మహిళాశక్తి చీరలను పరిశీలించనున్నారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి పాల్గొంటారు. మంత్రి పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పార్టీ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్ తెలిపారు.ప్రజావాణి రద్దుసిరిసిల్ల: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే ప్రజావాణిని రద్దు చేసినట్లు కలెక్టర్ ఎం.హరిత ఆది వారం ప్రకటనలో తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ప్రజావాణిని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఉండబోదని కలెక్టర్ స్పష్టం చేశారు.రాజన్న సేవలో ఎస్పీవేములవాడ: రాజన్నను ఎస్పీ మహేశ్ బీ గీతే ఆదివారం రాత్రి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం అవకాశం కల్పించారు. అనంతరం అర్చకులు స్వామి వారి ప్రసాదాలు అందించారు.ఘనంగా కాకా జయంతిసిరిసిల్ల: బడుగు, బలహీనవర్గాల సంక్షేమం కోసం వెంకటస్వామి(కాకా) జీవితాంతం పోరాడారని మాలమహానాడు రాష్ట్ర నాయకుడు రాగుల రాములు పేర్కొన్నారు. సిరిసిల్లలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. మాజీ కౌన్సిలర్ రాగుల జగన్, బుచ్చిబాబు, రాకేశ్, పద్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.హిందువుల ఐక్యతకు పంచ పరివర్తన్ముస్తాబాద్(సిరిసిల్ల): పంచ పరివర్తన్ ద్వారా హిందువుల ఐక్యతకు ఆర్ఎస్ఎస్ కృషి చేస్తోందని జిల్లా సంచాలకుడు నిరంజనాచారి అన్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ముస్తాబాద్లో ఆదివారం పథ సంచలన్ నిర్వహించారు. జెడ్పీ స్కూల్ నుంచి పురవీధుల్లో నాలుగు మండలాల కార్యకర్తలు పథ సంచలన్ నిర్వహించారు. అనంతరం నిరంజనాచారి మాట్లాడుతూ 1925లో ప్రారంభమైన ఆర్ఎస్ఎస్ దేశభక్తి పూరిత, హిందుత్వ ఆధార సంస్థలతో ప్రపంచంలోని అనేక దేశాలలో పనిచేస్తుందన్నారు. ఖండ కార్యవాహ కరుణాకర్, జిల్లా సహ కార్యవాహ వుచ్చిడి పద్మారెడ్డి, మాజీ జెడ్పీటీసీ మట్ట వెంకటేశ్వర్రెడ్డి, సంతోష్రెడ్డి, సత్తయ్య, రాంగోపాల్, రమేశ్రెడ్డి, రమేశ్, వొరగంటి తిరుపతి, దేవేందర్, వెంకట్రెడ్డి, రాంరెడ్డి పాల్గొన్నారు.మునీరుద్దీన్కు పురస్కారంఇల్లంతకుంట(మానకొండూర్): అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఇల్లంతకుంటకు చెందిన ఎండీ మునీరుద్దీన్ జాతీయ ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్నారు. గురు స్టూడెంట్స్ పేరెంట్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం కరీంనగర్లో అందజేశారు. -
సంస్కృతి, సంప్రదాయాలు కాపాడుదాం
● టీడీఎఫ్ అమెరికా అధ్యక్షుడు శ్రీనివాస్ ● అమెరికాలో బతుకమ్మ సంబరాలుముస్తాబాద్(సిరిసిల్ల): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ భవిష్యత్ తరా లకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అమెరికా అధ్యక్షుడు శ్రీనివాస్ మణికొండ అన్నారు. టీడీఎఫ్ అమెరికా శాఖ ఆధ్వర్యంలో కాలిఫోర్నియాలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. మహిళలు తెలంగాణ సంప్రదాయ వస్త్రాలు ధరించి, తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి ఆడిపాడారు. అమెరికా టీడీఎఫ్ అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ గత ఇరవై ఐదేళ్లుగా టీడీఎఫ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. టీడీఎఫ్ ఇండియా అధ్యక్షుడు మట్ట రాజేశ్వర్రెడ్డి, రాజారెడ్డి, నిర్వాహకులు కీర్తి, సరిత, భార్గవి, శ్వేత, దివ్య, పల్లవి, స్రవంతి, అర్పిత తదితరులు పాల్గొన్నారు. -
పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలి
● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య కోరారు. మండల కేంద్రంలోని స్టార్ ఫంక్షన్హాల్లో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల పలు సర్వేసంస్థలు, పార్టీ సర్వేల ప్రకారం 95 శాతానికి పైగా సీట్లు బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పినట్లు గుర్తు చేశారు. టికెట్లు దక్కని వారు నిరాశ పడొద్దని కోరారు. పార్టీ అందరికీ అవకాశాలు ఇస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ బాకీకార్డులపై గ్రామాల్లో అవగాహన కల్పించాలని కోరారు. ఎల్లారెడ్డిపేట జెడ్పీటీసీ స్థానానికి చీటి రజిత–లక్ష్మణ్రావు, గుండారపు లహరి–కృష్ణారెడ్డి, పాశం సరోజన–దేవరెడ్డి, గుల్లపల్లి పద్మ–నర్సింహారెడ్డి, ఇల్లందుల గీతాంజలి–శ్రీనివాస్రెడ్డి ఆశిస్తున్నట్లు గుర్తించామన్నారు. పోటీలో ఇంకెవరైనా ఉంటే తమకు తెలపాలని కోరారు. 13 ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థులు తమ పేర్లను ఇచ్చారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వరస కృష్ణహరి, సింగిల్విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ పిల్లి రేణుక, నాయకులు అందె సుభాష్, ఎడ్ల సందీప్ పాల్గొన్నారు. -
కుమ్మరించిన వాన
సిరిసిల్ల: జిల్లాలో ఆదివారం అనూహ్యంగా వర్షం కురిసింది. పెద్దూరు వద్ద అత్యధికంగా 64.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కోనరావుపేట మండలం మర్తనపేట వద్ద 60.3 మిల్లీమీటర్లు, వేములవాడ శివారులోని నాంపల్లి వద్ద 39.0, గంభీరావుపేటలో 34.0, సిరిసిల్లలో 29.3, ముస్తాబాద్ మండలం నామాపూర్లో 26.3, ఇల్లంతకుంట మండలం కందికట్కూర్లో 24.5, ఎల్లారెడ్డిపేటలో 21.3, వేములవాడరూరల్ మండలం మల్లారంలో 16.3, తంగళ్లపల్లి మండలం నేరెళ్లలో 11.0, వీర్నపల్లి మండలం వన్పల్లిలో 10.5, కోనరావుపేట మండలం నిజా మాబాద్లో 9.8, వేములవాడ మండలం వట్టెంలలో 9.3, బోయినపల్లిలో 5.8, రుద్రంగిలో 2.0, చందుర్తి మండలం మరిగడ్డలో 0.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వేములవాడ: పట్టణంలో భారీ వర్షం కురవడంతో రాజన్న ఆలయం ఎదుట రోడ్డుపై వరద ప్రవహించింది. వర్షంలోనే తడుస్తూ భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ముస్తాబాద్: ముస్తాబాద్, గూడెం, పోతుగల్ గ్రామాల్లో కోతలకు వచ్చిన వరిపంట నేలవాలింది. ఈదురుగాలులతో వర్షం పడడంతో వరిపంట దెబ్బతిందని రైతు తాళ్ల చంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వీర్నపల్లి/కోనరావుపేట: మండలంలోని వాగులు, వంకలు పొంగిపొర్లాయి. కోనరావుపేట మండలంలోని అన్ని గ్రామాల్లో కలిపి సుమారు 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): నారాయణపూర్ శివారులోని దుర్గమ్మ ఆలయం వద్ద వర్షానికి చెట్టు నెలకూలింది. రోడ్డుపై పడడంతో నారాయణపూర్ నుంచి రాగట్లపల్లికి రాకపోకలు నిలిచిపోయాయి. -
అభ్యర్థుల గెలుపే లక్ష్యం
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోనరావుపేట(వేములవాడ): స్థానికసంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. కోనరావుపేటలోని ఆర్యవైశ్య కమ్యూనిటీహాల్లో ఆది వారం నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడారు. కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి బలమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి నిధులు ఖర్చు చేస్తోందన్నారు. ప్రతీ కార్యకర్త ఒక సైనికుడుగా పనిచేసి పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు. ప్రతిపక్షాలు చేస్తున్న రాద్దాంతం, వారి దిగజారుడు మాటలు పట్టించుకోకుండా ముందుకుపోవాలన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి న్యాయం చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిక మామిడిపల్లి మాజీ సర్పంచ్ కొక్కుల నర్సయ్య–భారత, విశ్వబ్రాహ్మణ సంఘం మండలాధ్యక్షుడు సంకోజి సత్తయ్య, శివంగాలపల్లి మాజీ సర్పంచ్ శివంగాల సురేశ్తోపాటు సుమారు 50 మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, వైస్చైర్మన్ ప్రభాకర్, సింగిల్విండో చైర్మన్ బండ నర్సయ్య, మండలాధ్యక్షుడు ఫిరోజ్ పాషా, మాజీ జెడ్పీటీసీ గొట్టె రుక్మిణి, యూత్ అధ్యక్షుడు బండి ప్రభాకర్ పాల్గొన్నారు. రుద్రంగి(వేములవాడ): రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రుద్రంగి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రుద్రంగిలోని శుభం గార్డెన్స్లో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. -
దుకాణాలు నిరుపయోగం
ఇది జిల్లా కేంద్రంలోని శివనగర్ పార్క్ వద్ద నిర్మించిన ఎకో ఫ్రెండ్లీ దుకాణాలు. నిర్మించినప్పటి నుంచి దుకాణాలన్నీ నిరుపయోగంగానే ఉన్నాయి. ఇలా సిరిసిల్లలో రూ.1.93 కోట్లతో మొత్తం 60 షాపులు ఎకో ఫ్రెండ్లీ దుకాణాల సముదా యాలను నాలుగు ప్రదేశాల్లో నిర్మించగా.. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వద్ద, రైతు బజా రు వద్ద షాపులు వినియోగంలో ఉండగా.. మిగతావి వృథాగా పడి ఉన్నాయి.ఇది తారకరామానగర్లోని ఎకోఫ్రెండ్లీ షాప్. కానీ షాపు రేకులను, ఇరువైపులా ఉన్న అడ్డుగోడల కోసం నిర్మించిన అట్టలను ఆకతాయిలు తొలగించడంతో అసాంఘిక కార్యక్రమాలకు స్థావరాలుగా మారాయి. మందుబాబులకు అడ్డాలుగా మారాయి. రాత్రి వేళల్లో ఆ షాపుల ముందు నుంచి వెళ్లేందుకు స్థానికులు భయపడుతున్నారు. అక్కడ నిర్మించిన టాయిటెట్లు, నేలపై పరిచిన టైల్స్ ఊడిపోయాయి.ఇది సిరిసిల్లలోని తారకరామానగర్ ప్రాంతం. ఇక్కడ వీధి వ్యాపారుల కోసం మున్సిపల్ అధికారులు 16 షాపులను ఏర్పాటు చేశారు. పేద వీధి వ్యాపారులు ఇక్కడి షాపుల్లో ఏదైనా వ్యాపారం చేసుకుంటూ.. ఉపాధి పొందాలని రూ.93లక్షలతో వీటిని నిర్మించారు. పర్యావరణ హితమైన ఎకో ఫ్రెండ్లీ రేకులు, సామాగ్రితో 2019లో నిర్మించారు. అప్పటి నుంచి నిరుపయోగంగానే ఉన్నాయి. -
కంటి నిండా నిద్ర
చేతి నిండా పని.. మరమగ్గాలు నడుపుతున్న ఇతను కోడం బాలకిషన్. జిల్లా కేంద్రంలోని విద్యానగర్లోని ఓ కార్ఖానాలో పాలిస్టర్ వస్త్రాన్ని ఉత్పత్తి చేస్తూ నెలకు రూ.8వేల నుంచి రూ.10 వేల సంపాదిస్తున్నాడు. నిత్యం 12 సాంచాల మధ్య 10 గంటలపాటు పని చేస్తున్నాడు. గతంలో రాత్రిపూట పని చేసేవాడు. కానీ ఇప్పుడు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తున్నాడు. వచ్చే కూలీలో నెలకు రూ.1200 చొప్పున త్రిఫ్ట్ పొదుపు పథకంలో చెల్లిస్తున్నాడు. రాత్రి డ్యూటీకి రాం రాం చెప్పి పొద్దంతా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇలా ఒక్కరు.. ఇద్దరు కాదు సిరిసిల్ల కార్మిక క్షేత్రంలో పలువురు నేతకార్మికులు రాత్పైల్ (నైట్ డ్యూటీ) రాం రాం చెబుతూ దిన్పైల్ (పొద్దంతా) పని చేస్తున్నారు. సిరిసిల్ల: వస్త్రోత్పత్తి ఖిల్లా.. సిరిసిల్లలో చిన్న మార్పు పెద్ద ఫలితాన్నిస్తోంది. రాత్పైల్(రాత్రి డ్యూటీ) రద్దు చేయడంతో కార్మికుల ఆరోగ్యంగా ఉండడంతోపాటు వస్త్రోత్పత్తి సైతం పెరిగింది. కార్మిక కుటుంబాలు సైతం సంతోషంగా ఉంటున్నాయి. ఇన్నాళ్లు సిరిసిల్లలో ఒక్క వారం రాత్రి, మరో వారం పగటి డ్యూటీలు ఉండేవి. రాత్రి డ్యూటీ చేసిన రోజుల్లో నేతకార్మికులు నిద్రలేమితో అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే వారు. నిద్ర రాకుండా మధ్య..మధ్యలో టీ తాగి వచ్చేవారు. వీరి కోసం పట్టణంలో ప్రత్యేక టీకొట్టులు సైతం ఉండేవి. ఇటీవల రాత్రి డ్యూటీలు రద్దు చేయడంతో పొద్దంతా పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఆర్డర్లు, పొరుగు రాష్ట్రాల వస్త్రోత్పత్తి ఆర్డర్లు రావడంతో నేతన్నలకు చేతినిండా పని ఉంటుంది. పని గంటలు తగ్గిస్తే.. సిరిసిల్లలో కార్మికులు అసంఘటిత రంగంలో ఉన్నారు. దీంతో పని గంటల సమస్యలు ఎదురవుతున్నాయి. పొద్దంతా పనిచేసినా 8 గంటల పని విధానం అమలు చేయాల్సిన అవసరం ఉంది. కార్మికులు డ్యూటీలోకి వచ్చిన తరువాత 8 గంటల పనిచేసి డ్యూటీ దిగేలా చేనేత, జౌళిశాఖ, కార్మికశాఖ అధికారులు ప్రణాళికను అమలు చేయాలి. మరో వైపు ఒక్కో కార్మికుడు 10 నుంచి 12 సాంచాలపై పాలిస్టర్ వస్త్రోత్పత్తి చేస్తున్నారు. ప్రభుత్వ వస్త్రోత్పత్తి ఆర్డర్లు అయితే 6 నుంచి 8 సాంచాలు నడిపిస్తున్నారు. ఇలా ఎక్కువ సాంచాలు నడపడం మూలంగా పని ఒత్తిడి పెరిగి అలసిపోతున్నారు. ఏదైనా సాంచాలు రిపేరు వస్తే ప్రత్యేక మెకానిక్లు(జాపర్లు) లేక కార్మికులే చేస్తున్నారు. కాలం చెల్లిన సాంచాలు తరచూ రిపేర్లతో వస్త్రోత్పత్తికి ఆటంకం ఏర్పడుతుంది. ఎంత వస్త్రాన్ని ఉత్పత్తి చేస్తే.. అంత మేరకు కూలీ రావడంతో కార్మికులు ఎక్కువ సాంచాలు నడిపేందుకు మొగ్గు చూపుతున్నారు. ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు రెండు షిఫ్టుల్లో 8 గంటల చొప్పున పనివిభజన జరగాల్సిన అవసరం ఉంది. ఆ 8 గంటల్లోనే నేతన్నలకు మెరుగైన కూలీ లభించే పని విధానం ఉండాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాంచాల మధ్య నవ్వుతున్న ఇతను దూస దేవరాజు. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీవై నగర్లో పవర్లూమ్ కార్మికుడు. ఉదయం 7 గంటలకు కార్ఖానాకు వచ్చి ఇలా సాంచాలు నడిపేందుకు సిద్ధమయ్యాడు. రాత్రంతా ఇంట్లోనే హాయిగా నిద్రపోవడంతో పనిచేసేందుకు ఉత్సాహంగా వచ్చాడు. గతంలో రాత్రి డ్యూటీ చేసి అలసిపోయి, నిద్రలేమితో బాధపడేవారు. కానీ ఇప్పుడు పొద్దంతా పనిచేస్తున్నాడు. నిత్యం ఆరు సాంచాలపై వస్త్రోత్పత్తి చేస్తూ.. నెలకు రూ.12 వేల నుంచి రూ.16వేల వరకు సంపాదిస్తున్నాడు. -
పని గంటలు కుదించాలి
సిరిసిల్లలో 8 గంటల పనివిధానం కోసం ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. సాంచాల మధ్య 10 నుంచి 12 గంటలు రెస్ట్ లేకుండా శ్రమించడం ఇబ్బందిగా ఉంది. రాత్రి పూట సాంచాలు బంద్ ఉండడం మంచి పరిణామం. కొందరు యజమానులు రాత్రి షిఫ్టుల్లోనూ పనిచేయిస్తున్నారు. కానీ పని గంటలను కుదిస్తే కార్మికులకు విశ్రాంతి దొరుకుతుంది. ఆరోగ్య సమస్యలు చాలా వరకు దూరమవుతాయి. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. – మూశం రమేశ్, కార్మిక నాయకుడు నిద్ర లేమితో అనేక రుగ్మతలు నిద్ర లేమి అనేక ఆరోగ్య సమస్యలకు, మానసిక రుగ్మతలకు కారణమవుతుంది. రాత్రిపూట బాగా నిద్రపోతే అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. సరైన నిద్ర లేకుంటే మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కోపం, చికాకు వంటి సమస్యలు ఎదురవుతాయి. షుగర్, బీపీ కంట్రోల్ తప్పుతుంది. కండరాల నొప్పులు వస్తాయి. ఎవరైనా సరే మంచి నిద్రపోవాలి. రాత్రి పూట నిద్రపోతే ఆరోగ్యం చాలా బాగుంటుంది. – డాక్టర్ ప్రవీణ్, మానసిక వైద్యనిపుణులు, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి -
సూర్యప్రభ, చంద్రప్రభలపై శ్రీవారి విహారం
సిరిసిల్లటౌన్: బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీవారు సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలపై ఊరేగారు. ఉదయం సూర్యప్రభ, రాత్రి శ్రీదేవీ, భూదేవీ సహితంగా వేంకటేశ్వరస్వామి చంద్రప్రభ వాహనాలపై పురవీధుల్లో విహరించారు. గోవింద నామస్మరణతో మాఢవీధులు మారుమోగాయి. సాయంత్రం 6 గంటలకు రంగనాయక తిరుప్పోలంపై విహరించారు. రంగనాయక తిరప్పోలం సేవ ఆకట్టుకుంది. ఆలయ ఈవో మారుతిరావు, ఏఈవోలు పీసరి రవీందర్, కూనబోయిన సత్యం, టీపీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, ఆలయ మాజీ చైర్మన్లు ఉప్పుల విఠల్రెడ్డి, చేపూరి నాగరాజు, తీగల శేఖర్గౌడ్, అర్చకస్వామి కృష్ణమాచారి పాల్గొన్నారు. -
సెల్యూట్ ‘108’
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: దసరా అంటేనే తెలంగాణలో పెద్ద పండగ. ఆ రోజున పిల్లాపాప అంతా వేడుకల్లో మునిగి తేలుతుంటారు. కానీ.. 108 సిబ్బంది మాత్రం ఎలాంటి పండుగ చేసుకోకుండా ప్రజల ప్రాణాలు కాపాడి మరోసారి తమ సేవాభావాన్ని చాటుకున్నారు. ఎక్కడ నుంచి అత్యవసర పరిస్థితి ఉందని ఫోన్ వచ్చినా ఆ రోజంతా సేవలందిస్తూ.. 108 ప్రా ధాన్యం మరోసారి లోకానికి చూపించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన 108 పథకం నేటికీ నిరంతరాయంగా ప్రజల ప్రాణాలను కాపాడుతూనే ఉంది. దసరా రోజున సైతం ఉమ్మడి జిల్లాలో విధులు నిర్వహించిన ఈఎంటీ (ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్) ఏకంగా 209 అత్యవసర కేసులు స్వీకరించారు. ఆపదలో ఉన్న వారిని క్షణాల్లో ఆదుకునే 108 సిబ్బంది పండగ రోజు కూడా సెలవు లేకుండా విధులు నిర్వహించి పదుల సంఖ్యలో ప్రజల ప్రాణాలు కాపాడారు. 209 కేసులు.. 150 మంది ప్రాణాలు దసరా పండుగ రోజు ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో మునుపెన్నడూ లేని విధంగా 209 కేసుల్లో 150 మంది బాధితులను కాపాడారు. 108 ఎమర్జెన్సీ మె డికల్ టెక్నీషియన్స్ (ఈఎంటీ)53, పైలెట్లు 53మంది పండుగ రోజు కూడా విశ్రమించకుండా మూడు షిఫ్టులలో విధులు నిర్వహించారు. తీవ్రంగా గాయపడిన వారిని కూడా ప్రాణనష్టం జరగకుండా ఆసుపత్రికి చేర్చేవరకు వైద్య సేవలు అందించారు. లిక్కర్ సేల్స్ పెరగడం ఈ ఏడాది దసరా పండుగ అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు రావడంతో ఉమ్మడి జిల్లాలో మద్యం ముందస్తు కొనుగోళ్లు విపరీతంగా జరిగాయి. గతేడాది దసరా సమయంలో వారం రోజుల్లో జరిగిన సేల్స్ ఈ ఏడాది మూడు రోజులలోనే మించిపోయాయి. దీంతో మద్యం మత్తులో వాహనాల నడిపి ప్రమాదాలకు గురైన వారి సంఖ్య ఎక్కువగా పెరిగింది. అయినప్పటికీ నిర్విరామ విధులతో 108 సిబ్బంది క్షతగాత్రులను కాపాడడంలో నిమగ్నమయ్యారు. సెల్యూట్ 108 అంటూ ప్రజల నుంచి అభినందనలు పొందారు. -
వాహనాల పెండింగ్ ట్యాక్స్ చెల్లించాలి
● రేపటి నుంచి స్పెషల్ డ్రైవ్ ● జిల్లా ఇన్చార్జి రవాణా శాఖ అధికారి వంశీధర్ సిరిసిల్ల: జిల్లాలో సరుకులు, ప్రయాణికులను చేరవేసే వాహనాలకు సంబంధించిన 4,419 గల వాహనాల యజమానులు పన్ను చెల్లించాలని జిల్లా ఇన్చార్జి రవాణాశాఖ అధికారి జి.వంశీధర్ శనివారం తెలిపారు. ఆయా వాహనదారులు రోడ్డు ట్యాక్స్ చెల్లించకుండా తిరుగుతున్నారని వివరించారు. సిరిసిల్ల డివిజన్కు సంబంధించి 2,787, వేములవాడ డివిజన్కు సంబంధించి 1,632 వాహనాల ట్యాక్స్ పెండింగ్లో ఉందని తెలిపారు. జిల్లాలో ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా 11,425 వాహనాలు తిరుగుతున్నాయని స్పష్టం చేశారు. ఇందులో సిరిసిల్ల రెవెన్యూ డివిజన్లో 6,647, వేములవాడ డివిజన్లో 4,778 వాహనాలు ఉన్నట్లు రవాణాశాఖ రికార్డులు చెబుతున్నాయన్నారు. ట్యాక్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని వాహనాల యజమానులు ట్యాక్స్ చెల్లించి ఫిట్నెస్ చేయించుకోవాలని సూచించారు. జిల్లాలో సోమవారం నుంచి ప్రత్యేక తనిఖీలు నిర్వహించి వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. స్పెషల్ డ్రైవ్లో పట్టుబడితే వాహనదారులకు అపరాధ రుసుంతో భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. -
రాజన్న ఆలయం మూసివేయొద్దు
వేములవాడ: ఆలయ విస్తరణ, అభివృద్ధి పేరుతో రాజన్న గుడిని మూసివేసి భక్తులను ఇబ్బందులకు గురి చేయొద్దని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి కోరారు. వేములవాడలో శనివారం విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధి పనులకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అభివృద్ధి పేరుతో రాజన్న గుడిని మూసివేసి భక్తులకు భీమన్న ఆలయంలో అనుమతినిస్తామని ప్రకటించడం సరైంది కాదన్నారు. గుడి పరిసరాల్లో ఎంతో మంది భక్తులను నమ్ముకుని చిరువ్యాపారులు ఉన్నారని, గుడిని మూసివేస్తే వారంతా ఉపాధి కోల్పోతారన్నారు. మాజీ ఎంపీపీ బండ మల్లేశం పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో దుర్గామాత శోభాయాత్ర
ఎల్లారెడ్డిపేట/ముస్తాబాద్(సిరిసిల్ల): నవరాత్రులు విశేష పూజలందుకున్న దుర్గామాత విగ్రహాలను భక్తులు శనివారం నిమజ్జనానికి తరలించారు. మండలకేంద్రంలోని దుర్గా భవాని సేవా సమితి సభ్యులు అమ్మవారిని విజయవాడ కృష్ణానదిలో నిమజ్జనం చేశారు. నారాయణపూర్లోని శ్రీనవదుర్గా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమ్మవారి చీరలకు లక్కీ డ్రా తీయగా 200 మంది పాల్గొనగా, 11 మంది చీరలను దక్కించుకున్నారు. ముస్తాబాద్లో మార్కండేయ భవన్, రాక్స్టార్ యూత్ ఆధ్వర్యంలో దుర్గామాత శోభా యాత్ర నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి పెద్ద చెరువులో నిమజ్జనం చేశారు. నారాయణపూర్లో దుర్గామాత శోభాయాత్రముస్తాబాద్లో దుర్గామాత శోభాయాత్రలో మహిళలు -
సమయపాలన పాటించాలి
● డీఎంహెచ్వో రజిత బోయినపల్లి(చొప్పదండి): పీహెచ్సీల్లో విధులు నిర్వహించే వైద్యసిబ్బంది సమయపాలన పాటించాలని డీఎంహెచ్వో రజిత ఆదేశించారు. మండలంలోని కొదురుపాక పీహెచ్సీని శనివారం తనిఖీ చేశారు. డాక్టర్, వైద్యసిబ్బంది హాజరు రిజిస్టర్, కేంద్ర ఆరోగ్య పథకాలకు సంబందించిన పలు రికార్డులను పరిశీలించారు. సకాలంలో విధులకు హాజరుకాకుంటే సీసీఏ రూల్స్ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఐదేళ్లలోపు చిన్నారుల వ్యాక్సిన్.. మందుల నిల్వలను పరిశీలించారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు సిరిసిల్లకల్చరల్/సిరిసిల్లటౌన్: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. సీనియర్ సిటిజన్ల సంఘం ఆధ్వర్యంలో వయోధికుల దినోత్సవం సందర్భంగా వస్త్రవ్యాపార సంఘం భవనంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వయోధికుల సంక్షేమ చట్టం ప్రకారం తల్లిదండ్రుల పోషణ బాధ్యతలు విస్మరించిన వారసులకు ఆస్తులను జప్తు చేస్తామన్నారు. వారసత్వంగా లభించిన ఆస్తులను తిరిగి వెనక్కి తీసుకునే అవకాశం ఉందన్నారు. నిరాధరణకు గురైన వయోవృద్ధులను ఆశ్రమాల్లో ఉంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం సీనియర్ సిటిజన్ల సంఘం బాధ్యులు ఆర్డీవోను సత్కరించారు. సంఘం అధ్యక్ష, కార్యదర్శులు చేపూరి బుచ్చయ్య, డాక్టర్ జనపాల శంకరయ్య, కోడం నారాయణ, దొంత దేవదాసు, మోతిలాల్, సి.రామరాజు, సజ్జనం శ్రీనివాస్, బాదం ప్రకాశ్, గౌరిశెట్టి ఆనందం, అంకారపు జ్ఞానోభ, పి.సత్యనారాయణ, బుర్ల సారంగం, నల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. స్థానిక పోరుకు సిద్ధం సిరిసిల్లటౌన్: స్థానిక సంస్థల పోరుకు సీపీఎం సిద్ధమైందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మూశం రమేశ్ స్పష్టం చేశారు. సిరిసిల్లలోని పార్టీ కార్యాలయంలో శనివారం ప్రెస్మీట్లో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఎం జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలకు పోటీ చేస్తుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అన్ని స్థానాల్లో పోటీ చేస్తామన్నారు. సీపీఎం కార్యదర్శివర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి, కోడం రమణ, సూరం పద్మ, శ్రీరాముల రమేశ్చంద్ర, సందుపట్ల పోచమల్లు, గడ్డం రాజశేఖర్ పాల్గొన్నారు. మహిళల శ్రమను గౌరవించాలిసిరిసిల్లటౌన్: శ్రామిక మహిళల శ్రమను గౌరవించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సీపీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ కోరారు. స్థానిక బీవైనగర్లోని అమృత్లాల్ శుక్లా కార్మిక భవన్లో శనివారం శ్రామిక మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర సదస్సు పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. దేశవ్యాప్తంగా శ్రామిక మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు ఆర్థిక, సామాజిక అణచివేత, పనిభద్రత, వేతనాలు లేని శ్రమ తదితర సమస్యలపై సీఐటీయూ శ్రామిక మహిళ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో నిరంతరం పోరాడుతుందన్నారు. భవిష్యత్ ఉద్యమ కార్యక్రమం రూపొందించేందుకు శ్రామిక మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర సదస్సు ఈనెల 5, 6 తేదీల్లో ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్నగర్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ సూరం పద్మ, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి, చందుపట్ల పోచమల్లు, లలిత, ఇందిర, ఎల్లవ్వ పాల్గొన్నారు. -
ఘనంగా దసరా
సిరిసిల్లటౌన్/వేములవాడ: జిల్లాలో దసరా వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. సిరిసిల్ల మానేరు వాగు తీరంలోని రాంలీల మైదానంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రావణ సంహారం నిర్వహించారు. ఎస్పీ మహేశ్ బీ గీతే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ససర్దేశాయ్ చెన్నమనేని శ్రీనివాస్రావుదేశాయ్, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు చేపూరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మేర్గు సత్యం, గౌరవ అధ్యక్షుడు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్, గాజుల వేణు, చేపూరి అశోక్, తదితరులు పాల్గొన్నారు. శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి భక్తజనులకు శమీ దర్శనం కల్పించారు. గురువారం సాయంత్రం అశ్వవాహనంపై బయలుదేరిన స్వామి వారు మానేరుతీరంలోని జమ్మిచెట్టు వద్దకు చేరుకోగా శమీపూజ జరిగింది. టీపీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, ఆలయ మాజీ చైర్మన్లు ఉప్పుల విఠల్రెడ్డి, చేపూరి నాగరాజు, తీగల శేఖర్గౌడ్, ఈవో మారుతిరావు, ఏఈవోలు పీసరి రవీందర్, కూనబోయిన సత్యం పాల్గొన్నారు. వేములవాడలో వైభవంగా ‘శమీయాత్ర’ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మహాలక్ష్మి ఆలయం వద్దనున్న జంబిచెట్టుకు పూజలు చేశారు. రాత్రి 9 గంటలకు జరిగే నిషిపూజ, ఏకాంతసేవ పూజలతో ఉత్సవాలు ముగిసినట్లు ఇన్చార్జి స్థానాచార్యులు ఉమేశ్శర్మ తెలిపారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఈవో రమాదేవి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. దసరాను పురస్కరించుకుని ఆలయంలో ఈవో రమాదేవి ఆయుధపూజ నిర్వహించారు. -
బ్రహ్మోత్సవం.. పులకించిన భక్తజనం
సిరిసిల్లటౌన్: ఐదు రోజులుగా కొనసాగుతున్న సిరిసిల్ల శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలతో కార్మికక్షేత్రం పులకించింది. వేడుకల్లో నాలుగు, ఐదు రోజుల్లో జరిగిన అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాల్లో భక్తులు దేవదేవునికి నీరాజనం పలికారు. గురు, శుక్రవారాల్లో శ్రీవారి వాహనసేవలు కనుల పండువగా సాగాయి. గురువారం విజయదశమిని పురస్కరించుకొని ఆలయంలో ఉదయం 8 గంటలకు హోమం, 10 గంటలకు సింహవాహనం, సాయంత్రం 5 గంటలకు అశ్వవాహనంపై శ్రీవారు విహరించారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు గరుడసేవ, రాత్రి 9 గంటలకు హనుమంత వాహనాలపై శ్రీదేవి, భూదేవి సహితంగా శ్రీవారిని మాడవీధుల్లో ఊరేగించారు. టీపీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, ఆలయ మాజీ చైర్మన్లు ఉప్పుల విఠల్రెడ్డి, తీగల శేఖర్గౌడ్, చేపూరి నాగరాజు, ఈవో మారుతిరావు, ఏఈవోలు పీసరి రవీందర్, ప్రధాన అర్చకులు కృష్ణమాచారి, వర్ధనాచారి పాల్గొన్నారు. నేత్రపర్వం శ్రీనివాస కల్యాణం బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీవారి కల్యాణోత్సవం జరిగింది. వేదపండితులు శ్రీలక్ష్మి, పద్మావతీవేంకటేశ్వరస్వామిల వివాహ వేడుకలను నిర్వహించారు. ఆలయ ఈవో మారుతిరావు, ఏఈవోలు పీసరి రవీందర్, కూనబోయిన సత్యం, అర్చకస్వాములు కృష్ణమాచారి, వర్ధనాచారి, సుకుమారాచారి, మాజీ చైర్మన్లు ఉప్పుల విఠల్రెడ్డి, మాజీ చైర్మన్లు తీగల శేఖర్గౌడ్, చేపూరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి వారుకళ్యాణ ం నిర్వహిస్తున్న అర్చకులు -
అన్ని స్థానాలు గెలవాలి
సాక్షి ప్రతినిది, కరీంనగర్: త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను కాంగ్రెస్ గెలవాలని కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ముఖ్యనాయకులంతా గాంధీభవన్లో మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నేతృత్వంలో స్థానిక సంస్థల అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ బలాలు, బలహీనతలు, అనుకూలతలు, అభ్యర్థుల ఎంపిక తదితరాల పై చర్చించారు. విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, విజయ రమణరావులతోపాటు ప్రణవ్బాబు (హుజురాబాద్), వెలిచాల రాజేందర్ రావు (కరీంనగర్), ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి (కరీంనగర్), కేకే మ హేందర్రెడ్డి (సిరిసిల్ల) తదితరులు పాల్గొన్నారు. అభ్యర్థుల ఎంపిక ఇలా అభ్యర్థుల ఎంపికపై కూలంకుశంగా చర్చ జరిగింది. ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక బాధ్యత డీసీసీలకే అప్పగించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులే స్థానికంగా బలాల ఆధారంగా ఎంపిక చేసుకునే వీలు కల్పించారు. జెడ్పీటీసీల విషయంలోనూ డీసీసీ అధ్యక్షులు నలుగురు అభ్యర్థులను ఎంపిక చేసి పీసీసీ అధ్యక్షుడికి పంపుతారు. అధిష్టానం రహస్యంగా సర్వే నిర్వహించి, నలుగురిలో ఒకరి పేరును ఖరారు చేస్తారు. అభ్యర్థుల జాబితాను మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులు అధిష్టానానికి అందజేసినట్లు సమాచారం. కోర్టు తీర్పు.. సంజయ్ జాబితాపై చర్చ స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్లను సవాలు చేస్తూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయంపైనా చర్చించారు. 42శాతం రిజర్వేషన్లకు అన్నిపార్టీలు తమ సానుకూలత వ్యక్తం చేశాయని, కోర్టు తీర్పు అనుకూలంగానే వస్తుందని సానుకూలత వ్యక్తం చేశారు. తీర్పు ప్రతికూలంగా వస్తే.. ఎలా వ్యవహరించాలో కూడా ప్రస్తావించినట్లు తెలిసింది. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సమావేశానికి హాజరై తాను సిద్ధం చేసిన జాబితాను అందజేసినట్లు తెలిసింది. జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ మాజీమంత్రి జీవన్రెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న విషయం తెలిసిందే. సంజయ్ చేరికను ఆదినుంచి వ్యతిరేకిస్తున్న జీవన్రెడ్డి.. తన వర్గీయులకు ఎలాగైనా టికెట్ ఇప్పించుకోవాలన్న పంతంతో ఉన్నారు. వీరిద్దరి విషయంలో ఎవరి జాబితా ఖరారు చేస్తారన్న విషయం అధిష్టానానికి చూసుకుంటుందని ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ మంత్రి ‘సాక్షి’కి తెలిపారు. -
కరీంనగర్, సిరిసిల్ల జెడ్పీ పీఠాలపై కాషాయ జెండా ఎగరేస్తాం
● కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్కరీంనగర్టౌన్: కరీంనగర్, సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాలను బీజేపీ కై వసం చేసుకోబోతోందని, సర్వే నివేదికలు ఇదే విషయం తేటతెల్లం చేస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం సాయంత్రం కరీంనగర్లోని ఈఎన్ గార్డెన్స్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మండలాధ్యక్షులు, జెడ్పీటీసీ ప్రభారీల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన బండి సంజయ్ మాట్లాడుతూ... కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను ఎప్పుడెప్పుడు ఓడిద్దామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని, తాను సైతం ఎన్నికలు ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. తాజామాజీ సర్పంచులు, రైతులు, మహిళలు, వృద్ధులు, నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగులే ఈసారి కాంగ్రెస్ ను ఓడించబోతున్నారని, బీజేపీకి వాళ్లే బ్రాండ్ అంబాసిడర్లు కాబోతున్నారన్నారు. అభ్యర్థులకు టిక్కెట్ల కేటాయింపు విషయాన్ని బీజేపీ రాష్ట్ర నాయకత్వం చూసుకుంటుందని, ఇప్పటికే సర్వేలు చేయిస్తోందని తెలిపారు. సర్వే నివేదికలను బట్టి గెలుపే ప్రాతిపదికన టిక్కెట్లు వస్తాయని స్పష్టం చేశారు. కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, రెడ్డబోయిన గోపి, మాజీ అధ్యక్షులు బాస సత్యనారాయణ, మాజీ మేయర్లు సునీల్రావు, డి.శంకర్, పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు, కోమాల అంజనేయులు, వాసాల రమేశ్ పాల్గొన్నారు. -
రూ.5.04కోట్లు తాగేశారు
● 232 బైకులు, 50 కార్ల విక్రయాలు ● పండుగ పూట జోరుగా వ్యాపారాలుసిరిసిల్లక్రైం: దసరా పండుగకు జిల్లాలో మద్యం, వాహనాల విక్రయాలు పెరిగాయి. ఈ ఏడాది దసరా, గాంధీ జయంతి ఒకే రోజున రావడంతో ప్రభుత్వ నిర్ణయంతో అక్టోబర్ 2న వైన్షాపులు మూసివేశారు. అయితే ముందు రోజే మద్యం కొనుగోలు చేసుకుని నిల్వ చేసుకున్నారు. ఈ దసరా సీజన్లో జిల్లా వ్యాప్తంగా రూ.5.04 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు అధికారుల అంచనా. వాహనాల కొనుగోళ్లు కూడా భారీగా జరిగాయి. కేంద్ర ప్రభుత్వం వాహనాలపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడం వినియోగదారులకు ఊరటనిచ్చింది. దీంతో పండుగ ఆఫర్లు, జీఎస్టీ తగ్గింపుతో కలిపి వాహన మార్కెట్ జోరందుకుంది. జిల్లాలో 232 ద్విచక్ర వాహనాలు, 50 కార్లు కొత్తగా కొనుగోలు చేశారు. రానున్న దీపావళి వరకు ఈ కొనుగోళ్ల ఊపు కొనసాగుతుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. -
డేంజర్ టర్నింగ్స్
బోయినపల్లి(చొప్పదండి): జిల్లాలో మూలమలుపులు ప్రమాదకరంగా ఉన్నాయి. వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. వేములవాడ డివిజన్లోని ఆర్అండ్బీ, పంచాయతీరాజ్శాఖ రోడ్లపై మూలమలుపులు మృత్యు పిలుపులుగా మారాయి. మలుపుల వద్ద కనీసం సూచికబోర్డులు కనిపించడం లేదు. హెచ్చరికబోర్డులు అసలే లేవు. సూచికలు కరువు బీటీ రోడ్డు వెంట ఉన్న మూలమలుపుల వద్ద పంచాయతీరాజ్ అధికారులు ప్రమాద సూచికలు పెట్ట లేదు. బోయినపల్లిలో మూలమలుపు వద్ద గతంలో ఓ లారీ ఇనుప విద్యుత్స్తంభాన్ని ఢీకొట్టింది. తరచూ ప్రమాదాలు ● కోనరావుపేట మండలం నిజామాబాద్–కోనరావుపేట మార్గంలోని ఓ మూలమలుపు వద్ద బైక్పై వస్తున్న వ్యక్తి అదుపుతప్పి పొలంలోకి దూసుకెళ్లి మృతిచెందాడు. బోయినపల్లి నుంచి వేములవాడ, బూర్గుపల్లి నుంచి కోరెం, తడగొండ నుంచి మల్కాపూర్, బోయినపల్లి నుంచి విలాసాగర్, మర్లపేట వెళ్లే రహదారుల్లో మూలమలుపులు ఉన్నాయి. బోయినపల్లి పోస్టాఫీసు, యూనియన్ బ్యాంకు, పాత సెస్ కార్యాలయాల వద్ద ఎదురుగా వాహనం వస్తే ఇబ్బంది ఏర్పడుతోందని ప్రయాణికులు అంటున్నారు. ఇక్కడ రెండు వాహనాలు ఎదురెదురుగా వస్తే ఒకటి వెనక్కి తీసుకుంటే మరొకటి ముందుకు వెళ్లే పరిస్థితి. బోయినపల్లి మండలం స్తంభంపల్లి నుంచి వేములవాడ వెళ్లే బీటీ రోడ్డులో వాటర్ప్లాంట్ వద్ద మూలమలుపు డేంజర్గా ఉంది. ● విలాసాగర్–కరీంనగర్ దారిలో హైస్కూల్ వద్ద టర్నింగ్ డేంజర్గా ఉంది. ● తడగొండ నుంచి మల్కాపూర్ వెళ్లే దారిలో పలు చోట్ల మూలమలుపులు ఉన్నాయి. ● వేములవాడ అర్బన్ మండలం నాంపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి గుడి పరిసరాల్లో టర్నింగ్ ఉంది. ● వేములవాడరూరల్ మండలంలో నూకలమర్రి–వట్టెంల, వేములవాడ–మల్లారం రోడ్డులో మూలమలుపులు ప్రమాదకరంగా ఉన్నాయి. ఈ చిత్రంలో ఒక టర్నింగ్ కోనరావుపేట నుంచి నిమ్మపల్లి, మరొకటి కోనరావుపేట నుంచి సిరిసిల్ల వెళ్తుంది. ఒకే చోట నుంచి రెండు చోట్లకు టర్నింగ్ తీసుకోవాల్సి ఉంది. ఏ వాహనం ఎటు వెళ్తుందో దగ్గరకు వచ్చే వరకు తెలియదు. ఇంత ప్రమాదకరంగా వాహనదారులు ప్రయాణిస్తున్నారు. -
మహాలక్ష్మీ నమోస్తుతి
వేములవాడ: దేవీ నవరాత్రోత్సవాల్లో భాగంగా చివరిరోజు గురువారం అమ్మవారు మహాలక్ష్మి (పాలవెల్లి) అలంకారంలో దర్శనమిచ్చారు. నాగిరెడ్డి మండపంలోని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అందమైన వేదికపైన మహాలక్ష్మి అవతారంలో ఉన్న అమ్మవారిని, బాలత్రిపుర సుందరాదేవి, శ్రీరాజరాజేశ్వరీ అమ్మవారిని మహాలక్ష్మి అలంకారాలతో అర్చకులు అలంకరించారు. వేములవాడ: బార్ అండ్ బెంచ్ బాధ్యతాయుతంగా మెదలుకోవాలని జూనియర్ సివిల్ జడ్జి ప్రవీణ్కుమార్ సూచించారు. వేములవాడ బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన గుడిసె సదానందం, సబ్కోర్టు ఏపీపీగా బాధ్యతలు చేపట్టిన అవధూత రజనీకాంత్లు శుక్రవారం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గడ్డం సత్యనారాయణరెడ్డి, ఉపాధ్యక్షుడు కటకం జనార్దన్, అడ్వకేట్లు నాగుల సత్యనారాయణ, రేగుల దేవేందర్, పొత్తూరు అనిల్కుమార్, వేముల సుధాకర్రెడ్డి, పెంట రాజు, పర్లపెల్లి అంజయ్య, నాగుల సంపత్, హరికృష్ణ, సంపత్, అన్నపూర్ణ, మనోహర్ తదితరులున్నారు. వీర్నపల్లి(సిరిసిల్ల): మండలంలోని వన్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని శంకర్నాయక్తండా, రెడ్డినాయక్తండాలకు వెళ్లే రోడ్డును గ్రామస్తులు బాగుచేసుకున్నారు. దసరా పండ గ పూట రెండు తండాల గిరిజనులు సొంత ఖ ర్చులతో తాత్కాలిక రోడ్డును బాగుచేసుకున్నా రు. గిరిజనులు మాట్లాడుతూ రెండు తండాల కు రోడ్డు లేక చాలా ఇబ్బంది పడుతున్నామని అధికారులకు చెప్పినా పట్టించుకోలేదన్నారు. సిరిసిల్లటౌన్: సులభ్ కాంప్లెక్స్లో సమస్యలు పరిష్కరించాలని సిరిసిల్ల పౌరసంక్షేమ సమితి అధ్యక్షుడు బియ్యంకార్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం మున్సిపల్ ఆఫీస్ ఎదుట నిరసన చేపట్టి మాట్లాడారు. మున్సిపల్ ద్వారా నిర్వహిస్తున్న లేబర్ అడ్డా దగ్గర సులభ్ కాంప్లెక్స్లో ఉచిత మూత్రశాల అని బోర్డులు ఉన్నా కూడా డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. ఉచితం బోర్డులు కనిపించకుండా కాగితాన్ని అంటించారన్నారు. సమితి ఉపాధ్యక్షులు చీకోటి అనిల్కుమార్, కోశాధికారి చిప్ప దేవదాస్, సభ్యులు వేముల పోశెట్టి పాల్గొన్నారు. బోయినపల్లి(చొప్పదండి): శ్రీరాజరాజేశ్వర(మిడ్మానేరు) ప్రాజెక్టు నుంచి ఎల్ఎండీకి 850 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ప్రాజెక్టులోకి వేయి క్యూసెక్కుల మేర వరద ఇన్ ఫ్లోగా చేరుతోంది. మిడ్మానేరు ప్రాజెక్టులో నీటిమట్టం 27.479 టీఎంసీలకు చేరింది. -
మానేరు తీరాన శమీ పూజోత్సవం
సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రం దసరా ఉత్సవాలకు పేరెన్నికై ంది. 800 ఏళ్ల క్రితమే శ్రీశాల(సిరిసిల్ల) క్షేత్రంలో కేశవనాథుని ఆలయం నిర్మితమైందని పురాణాలు చెబుతున్నాయి. కాకతీయుల కాలంలో మొగలాయిలు హిందూ ఆలయాలపై దాడి చేసిన సంఘటనకు సాక్ష్యంగా ధ్వంసమైన ఇక్కడి మూలవిరాట్టు విగ్రహం వాహనశాలలో భద్రంగా ఉంది. ఈ ఘటనపై ప్రజలు మనోవేదనకు గురవుతుండగా సిరిసిల్లను పాలిస్తున్న సర్దేశాయ్ చెన్నమనేని వంశస్తులు తుక్కారావు, మీనారావులకు స్వప్నంలో స్వామి వారు కనిపించి మాండవ్య మహానది(మానేరు) ప్రాంతంలో బర్రెంకల చెట్టుకింద భూమిలో ఉన్న విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించాలని చెప్పి అంతర్ధానమయ్యారు. దేశాయ్లు ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసి వాహనాలు, పొన్నసేవ, రథాన్ని చేయించారు. అప్పటి నుంచి సిరిసిల్లలో బహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అప్పటి నుంచి ఏటా దసరా రోజున మానేరు తీరాన గల జమ్మిగద్దెకు అశ్వవాహనంపై శ్రీవారు వచ్చినాకే శమీపూజలు నిర్వహిస్తారు. శమీవృక్షాన్ని తీసుకొచ్చి గద్దైపె ఏర్పాటు చేసే హక్కును ముదిరాజ్ కులస్తులకే ఉంది. శమీపూజ సమయంలో పాలపిట్టను దర్శించుకోవడం ఇక్కడి ప్రత్యేకత. ఆకట్టుకునే రావణ సంహారం మానేరుతీరాన గల రాంలీల మైదానంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రావణ సంహారం నిర్వహిస్తా రు. మానేరువాగు ఒ డ్డున ఏర్పాటు 20 అడుగుల ఎత్తులో పదితలల రావణాసురుడి ప్రతి మను దహనం చేసి చె డుపై సాధించిన విజయమే దసరాగా ఉత్సవాలు నిర్వహిస్తారు. చెన్నమనేని వంశస్తులు, ఇతర ముఖ్య అతిథుల చేతుల మీదుగా రావణవధ నిర్వహించడం ఇక్కడ దశాబ్దాలుగా కొనసాగుతోంది. -
ఆత్మీయతలు కనుమరుగయ్యాయి
సిరిసిల్ల: దసరా వచ్చిందంటే పల్లెలు సందడిగా మారిపోతుంటాయి. పుట్టిన ఊరిలోనే పుష్కలంగా ఉపాధి దొరికిన రోజుల్లో అందరూ ఒకే ఇంట్లో కలిసి ఉమ్మడి కుటుంబాలుగా ఉండేవారు. ప్రపంచీకరణ నేపథ్యంలో ఉపాధి వెతుక్కుంటూ పల్లె యువత ఖండాంతరాలు దాటిపోతున్నారు. ఒకప్పుడు నిత్యం సందడిగా ఉన్న పల్లె నేడు పండుగకో.. పబ్బానికో మాత్రమే నిండుగా కనిపిస్తుంది. మూడు దశాబ్దాల క్రితం విద్యాసంస్థలకు దసరా సెలువులు వచ్చాయంటే బంధువులందరూ ఒక్కచోట చేరేవారు. వారం, పది రోజులపాటు పల్లె కళకళలాడేది. పిల్లలకు స్కూల్ సెలవులు.. మహిళలకు బతుకమ్మ.. మగవారికి దసరా.. ఇలా ఆ సరదాలే వేరుగా ఉండేవి. నేడు అంతా మారిపోయింది. ఉపాధి కోసం పట్టణం, విదేశాల్లో స్థిరపడ్డ పిల్లలు ఒక్క రోజు ముందుగా వచ్చి పండుగ మరుసటి రోజే ఉద్యోగమంటూ వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో రాజన్నసిరిసిల్ల జిల్లాలోని సీనియర్ సిటిజన్స్ను ‘సాక్షి’ బుధవారం పలకరించగా.. వారు వెలిబుచ్చిన అభిప్రాయాలు.. ఆనాటి దసరా పండుగ సరదాల ఆవిష్కరణ ఇదీ.. మాది ముస్తాబాద్. ఆ రోజుల్లో దసరా ఎంతో ఉత్సాహంగా సాగేది. ఊరంతా కలిసి పెద్దచెరువు కట్టపైకి వెళ్లేవాళ్లం. అక్కడ పాలపిట్టను చూసి, జమ్మిచెట్టుకు మొక్కి వచ్చేవాళ్లం. కుటుంబ సభ్యులతోపాటు అందరం కలిసేది దసరా పండుగకే. దూరపు బంధువులు, ఎక్కడెక్కడో స్థిరపడిన స్నేహితులు.. ముస్తాబాద్కు వచ్చేది ఈ పండగ రోజే. ఆత్మీయ పలకరింపులతో ఎంతో ఉత్సాహంగా ఉండేది. – రాజూరి శేఖరయ్య, వ్యాపారి, సిరిసిల్ల మాది గంభీరావుపేట మండలం సముద్రలింగాపూర్. కానీ సిరిసిల్లలోనే స్థిరపడ్డాం. మా చిన్నతనంలో ఊరిలో దసరా పండుగ అంటే.. జమ్మిచెట్టు వద్దకు వెళ్లడం, ఊరిలో అందరూ కోలాటం ఆడుతూ.. జడలు వేసి.. విప్పుతూ.. ఎంతో సంబురంగా ఉండేది. జమ్మి ఆకు పెట్టుకుని ఆత్మీయంగా ఆలింగనం చేసుకునే వాళ్లం. ఇప్పుడు ఆనాటి ఆత్మీయత లేదు. బతుకమ్మ పండగకు దాండియా ఆడుతున్నారు. పాటలు పాడేవాళ్లు లేరు.. పండగ విశిష్టతను దెబ్బతీస్తున్నారు. – గంజి బుచ్చిలింగం, సిరిసిల్ల మా చిన్నతనంలో మా నాన్న ఎడ్లబండ్లపై వెళ్లి చెన్నూరు గో దావరి నదిలో స్నానాలు చేసే వాళ్లం. జమ్మి ఆకు(బంగారం) పెట్టుకుని దసరా జరుపుకునేవాళ్లం. శుచి, శుభ్రతకు మా నాన్న ప్రాధాన్యతనిచ్చేవారు. నిజానికి కరోనా వచ్చిన తరువాత కాళ్లు, చేతులు కడుక్కోవడం చూశాం. కానీ మా చిన్నతనంలో మా నాన్న ఇవన్నీ పాటించాలని చెప్పేవారు. దసరా పండుగ పూట స్నేహితులను కలిసేది. అందరం కలిసి భోజనం చేసేది. – శ్రీరాంభట్ల సంతోష్శర్మ, సిరిసిల్ల ఆనాటి సంతోషాలు ఇప్పుడు లేవు. మా చిన్నప్పుడు పండుగ చాలా గొప్పగా జరిగేది. ఆత్మీ యుల మధ్య పిండివంటలతో సందడిగా ఉండేది. దసరా పూ ట జంబీ(బంగారం) పెట్టుకుని ఆత్మీయతను పంచుకుని పులకించి పోయేవాళ్లం. ఊరంతా స్నేహితులతో కలిసి తిరిగేవాళ్లం. ఇప్పు డు అంతా సెల్ఫోన్ యుగమైపోయింది. మన పండుగల ప్రత్యేకత మరుగునపడుతుంది. వరసలు పె ట్టి పిలుచుంటూ ప్రేమగా ఉండేది. ఆనాటి ఆత్మీయతలు లేవు. – కొనుగుల్వార్ శ్రీనివాస్ -
హైదరాబాద్ టీ–20 జట్టుకు శ్రీవల్లి
కరీంనగర్స్పోర్ట్స్/ఇల్లంతకుంట(మానకొండూర్): హైదరాబాద్ మహిళల టీ–20 క్రికెట్ జట్టులో కరీంనగర్కు చెందిన క్రీడాకారిణి కట్ట శ్రీవల్లి చోటు సంపాదించింది. హైదరాబాద్ సీనియర్ మహిళల టీ–20 క్రికెట్ జట్టును క్రికెట్ సంఘం బాధ్యులు బుధవారం ప్రకటించారు. అక్టోబర్ 8 నుంచి మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో బీసీసీఐ టీ20 టోర్నీ ప్రారంభంకానుంది. టోర్నమెంట్లో భాగంగా పాల్గొనే హైదరాబాద్ సీనియర్ మహిళల జట్టులో శ్రీవల్లి చోటు దక్కించుకుంది. శ్రీవల్లి ఎంపికపై కరీంనగర్ జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు ఆగం రావుతోపాటు తల్లిదండ్రులు కట్ట ఉమా–లక్ష్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. శ్రీవల్లి స్వస్థలం రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామం. -
పాడిపంటలు బాగుండాలి
వేములవాడ: పాడిపంటలు బాగుండాలని, వ ర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలు సుఖ సంతో షాలతో ఉండాలని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ఆకాంక్షించారు. బుధవారం పట్టణంలోని ప్రధాన వీధులు, జంబిచెట్టు గద్దె, ప్రధాన కూడళ్ల నుంచి ఎడ్లబండ్ల ర్యాలీ నిర్వహించారు. వైన్స్ షాపులు కిటకిటసిరిసిల్లక్రైం: అక్టోబర్ 2న దసర పండుగ వస్తుండడం.. అదే రోజు గాంధీ జయంతి కావడంతో మాంసం విక్రయిస్తారా.. లేదా.. అనే సందేహాలు నెలకొన్నాయి. దీంతో చాలా మంది ముందస్తుగానే యాట పిల్లలను కొనుక్కొచ్చారు. అంతేకాకుండా బుధవారం రాత్రి జిల్లా వ్యాప్తంగా అన్ని వైన్ షాపుల వద్ద జనం రద్దీ పెరిగింది. గురువారం మద్యం విక్రయాలు ఉండవని ముందస్తుగానే పెద్ద మొత్తంలో మద్యం బాటిళ్లు కొనుక్కెళ్లారు. ఒక్క రోజు ముందే వ్యాపారులకు దసరా కిక్కెక్కింది. -
లండన్లో ఉంటున్నా దసరా సొంతూరిలోనే..
ఇల్లంతకుంట(మానకొండూర్): ఉపాధి కోసం విదేశాలకు వెళ్లినా పుట్టిన ఊరుపై మమకారం, స్నేహితులను కలవాలన్న తపనతో లండన్లో ఉంటున్నా ఏటా బతుకమ్మ, దసరా పండుగలకు స్వగ్రామానికి వస్తామంటున్నారు ఇల్లంతకుంటకు చెందిన అంతగిరి అశోక్కుమార్. మండల కేంద్రానికి చెందిన అంతగిరి అశోక్కుమార్ ఎమ్మెసీ, బీటెక్ పూర్తి చేసి పదిహేనేళ్ల క్రితం లండన్ వెళ్లి స్థిరపడ్డారు. లండన్లోని ప్రభుత్వ కార్యాలయంలో సాఫ్ట్వేర్గా విధులు నిర్వహిస్తూ స్వతంత్రంగా ఐటి కంపెనీ, రెస్టారెంట్ ఏర్పాటు చేసుకొని ఇతరులకు ఉపాధి కల్పిస్తున్నారు. అశోక్కుమార్ మాట్లాడుతూ సొంతూరిపై మమకారంతో దసరా, బతుకమ్మ పండుగలకు వస్తామని, బంధువులు, కుటుంబ సభ్యులను కలుసుకోవడం ఎంతో సంతోషాన్నిస్తుందని తెలిపారు. భార్య అర్చన సాఫ్ట్వేర్ ఉద్యోగి, ఇద్దరు కూతుళ్లు నక్షత్ర, జిష్ణుసాయి సాన్వి. -
రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలి
సిరిసిల్ల: జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్, ఎన్నికల అధికారి ఎం.హరిత సూచించారు. కలెక్టరేట్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్పై రాజకీయపార్టీల ప్రతినిధులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తామన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు ర్యాలీలు, సభలు, ప్రచారాలు నిబంధనల ప్రకారం నిర్వహించుకోవాలని సూచించారు. జిల్లాలో రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, రెండు, మూడో విడతలో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఫిర్యాదుల నమోదుకు కలెక్టరేట్లో హెల్ప్లైన్, ఫిర్యాదుల కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు లేవనెత్తిన సందేహాలకు అధికారులు సమాధానం ఇచ్చారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, సిరిసిల్ల ఆర్డీవో సీహెచ్ వెంకటేశ్వర్లు, జెడ్పీ డిప్యూటీ సీఈవో గీత, డీపీవో షరీఫొద్దీన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పార్టీ నాయకులు తీగల శేఖర్గౌడ్, గజభీంకార్ రాజన్న తదితరులు పాల్గొన్నారు. -
● ఈటలపై హుజూరాబాద్ బీజేపీ శ్రేణుల ఫిర్యాదు ● పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడంటూ రాష్ట్ర అధ్యక్షుడికి ఏకరువు ● ఇతర పార్టీల నుంచి అనుచరులకు టిక్కెట్లు ఇప్పిస్తాననడంపై మండిపడుతున్న నాయకులు
బీజేపీలో రచ్చకెక్కుతున్న విభేదాలు!సాక్షిప్రతినిధి, కరీంనగర్: భారతీయ జనతా పార్టీలో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్పై స్థానిక పార్టీ శ్రేణులు రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదులు అందజేశారు. గతంలో శామీర్పేట్లో హుజూరాబాద్ కేడర్తో సమావేశం ఏర్పాటు చేసి పార్టీపై, పార్టీలో ముఖ్య నాయకులపై ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. ఇటీవల హనుమకొండ జిల్లా కమలాపూర్లో లోకల్ బీజేపీ లీడర్లతో సమావేశమై స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ టికెట్ రాకుంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి టికెట్ ఇప్పిస్తానని హామీ ఇవ్వడం కలకలం రేపింది. బీజేపీలో ఉంటూ మరో పార్టీ టికెట్ ఇప్పిస్తానని ఈటల ఎలా హామీ ఇస్తారంటూ మండిపడుతున్నారు. కొత్త నేతలు, పాత నాయకులంటూ ఈటల రెండు వర్గాలుగా పార్టీ శ్రేణులను విభజిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, తన అనుచరులకు ఇతర పార్టీల నుంచైనా టికెట్లు ఇప్పిస్తానని హామీ ఇస్తున్నారని సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది బీజేపీనా? లేక ఈటల వ్యక్తిగత దుకాణమా? అని కొంతమంది నాయకులు చర్చించుకుంటున్నారు. ఈటల చర్యలపై అసంతృప్తిగా ఉన్న పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డితోపాటు మరికొంతమంది నాయకులు రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావును కరీంనగర్లో కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. హుజూరాబాద్లో బీజేపీని బలహీనపరుస్తూ వ్యక్తిగత అనుచరులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కొంతమంది సీనియర్ నాయకులు కూడా ఈటల వ్యవహరిస్తున్న తీరుపై మండిపడుతున్నారని తెలిసింది. అంతర్గత విభేదాలు ఇలానే కొనసాగితే రానున్న ఎన్నికల్లో ఈటల విధానం పార్టీకి ముప్పు తెస్తుందని బీజేపీ సీనియర్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతర్గతంగా ఈటలను కట్టడి చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. ఓ వైపు స్థానికసంస్థల్లో బలం పెంచుకొని రాబోయే అసెంబ్లీ ఎ న్నికల్లో అధికారంలోకి రావాలని కలలు కంటున్న బీజేపీ, మరోవైపు ఈటల మార్క్ రాజకీయాలతో ఇబ్బందుల్లో పడుతుందని పేర్కొంటున్నారు. పార్టీలో అంతర్గత విభేదాలతో రానున్న ఎన్నికల్లో బీజేపీకి ప్రతికూల ఫలితా లు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇక ఈటలపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వం ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకుంటుందో అన్నది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. -
హంస వాహనంపై స్వామి
సిరిసిల్లటౌన్: శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మూడు రోజులుగా సాగుతున్న బ్రహ్మోత్సవాల్లో బుధవారం మూలమంత్ర, మహామంత్ర హోమాలు, నిత్యపూర్ణాహుతి, నిత్యారాధన నిర్వహించారు. రాత్రి 9 గంటలకు హంస వాహనంపై శ్రీదేవి, భూదేవి సహిత శ్రీనివాసుడుని తిరువీధుల్లో ఊరేగించారు. గోవింద నామస్మరణతో మాఢవీదులు మారుమోగాయి. ఆలయ ఈవో మారుతిరావు, ఏఈవో పీసరి రవీందర్, కూనబోయిన సత్యం, అర్చకస్వాములు కృష్ణ్ణమాచారి, వర్ధనాచారి, టీపీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, ఆలయ మాజీ చైర్మన్లు ఉప్పుల విఠల్రెడ్డి, మాజీచైర్మన్లు తీగల శేఖర్గౌడ్, చేపూరి నాగరాజు పాల్గొన్నారు. -
అందరికి విజయాలు చేకూర్చాలి
● ఎస్పీ మహేశ్ బీ గీతే ● డీపీవోలో ఆయుధ, వాహన పూజ సిరిసిల్లక్రైం: విజయదశమి పండుగ ప్రజలకు విజయం చేకూర్చాలని ఎస్పీ మహేశ్ బీ గీతే ఆకాంక్షించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని ఆర్మ్డు రిజర్వ్ విభాగంలో బుధవారం ఆయుధ, వాహనపూజ నిర్వహించారు. దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులకు, సిబ్బందికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రశేఖర్రెడ్డి, ఆర్ఐలు మధుకర్, యాదగిరి, సీఐలు కృష్ణ, నాగేశ్వరావు, మధుకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మహాగౌరిగా అమ్మవారు
వేములవాడ: దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం రాజన్న సన్నిధిలో అమ్మవారు మహాగౌరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పురాణ నిధి యాప్ ఆవిష్కరణకరీంనగర్ కల్చరల్: దేవతా స్త్రోత్రాలతోపాటు పురాణ గాథలన్నీ సామాన్యులకు సైతం అర్థమయ్యేలా రూపొందించిన ‘పురాణ నిధి’ యాప్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పండితులు మంగళంపల్లి వేణుగోపాలశర్మ, పురాణం మహేశ్వరశర్మతో కలిసి మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. దేవతలు, హిందూ శాస్త్రాలకు సంబంధించి సామాన్యుల్లో నెలకొన్న అనేక సందేహాలను ఈ యాప్ ద్వారా నివృత్తి చేస్తుండటం సంతోషించదగ్గ పరిణామమన్నారు. గంభీరావుపేట(సిరిసిల్ల): గంభీరావుపేట సహకార సంఘ సభ్యులకు త్వరలో 8శాతం డీవిడెండ్ చెల్లించనున్నట్లు నాఫ్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు తెలిపారు. మంగళవారం నిర్వహించిన సంఘం మహజన సభలో మాట్లాడారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో సంఘం రూ.43కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిపి రూ. 36 లక్షల లాభాలు ఆర్జించడం జరిగిందన్నారు. వీటి నుంచి రూ.16లక్షలకు పైగా డీవిడెండ్ రూపంలో సభ్యుల వాటా ధనం ప్రకారం వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు. సభ్యుల సహకారం, నిబద్ధత, విశ్వాసం వల్లే సంఘం విజయపరంపర కొనసాగుతోందన్నారు. సహకార సంఘాల ద్వారా వరి ధాన్యం కొనుగోలు జరిగేలా చూడాలని సభలో సభ్యులు, రైతులు తీర్మానం చేశారు. దానిని జిల్లా ఉన్నతాధికారులకు పంపించనున్నట్లు తెలిపారు. సంఘ పరిధిలో 3,910 మంది సభ్యులుండగా, 1,491 మంది మాత్రమే క్రియాశీలకంగా ఉన్నారని, సభ్యులు పీఎం జీవన్ జ్యోతి, పీఎం సురక్ష బీమా చేయించుకోవాలని, ఆపద సమయంలో కుటుంబానికి ఆసరగా ఉంటాయన్నారు. సహకార శాఖ నోడల్ అధికారి గౌస్, వైస్ చైర్మన్ రామానుజాగౌడ్, బ్యాంక్ ప్రతినిధి శ్రీనివాస్రెడ్డి, సెస్ డైరెక్టర్ నారాయణరావు, సీఈవో రాజిరెడ్డి, డైరెక్టర్లు , నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
దావత్ షురూ!
‘తమ్మీ.. మన కులపెద్ద మనుషులతో మాట్లాడు.. దసరాకు యాటను కొనిస్త.. మీ కులసంఘంలోని ప్రతీఇంటికి పోగు చేరేలా నువ్వే చూసుకో.. ముఖ్యమైనోళ్లు ఉంటే చెప్పు.. వారికి క్వార్టర్ మందు కూడా ఇద్దాం.. ఎన్నికలప్పుడు ఓటుకు పైసలు గూడా ఇచ్చుడే.. కానీ గంపగుత్తగా ఓట్లు నాకే పడాలే.. మల్లా ఎవరికీ మాటివ్వకు’ – ఓ గ్రామానికి చెందిన సర్పంచ్ స్థానం ఆశావహుడి ఆఫర్ ‘అన్నా.. పార్టీలో కొన్నేళ్లుగా కష్టపడి పనిచేస్తున్న.. అధికారంలో ఉన్నా, లేకున్నా పార్టీతోనే ఉన్న.. ఇప్పుడు రిజర్వేషన్ కలిసొచ్చింది.. ఎమ్మెల్యే కూడా నాకు టికెట్ కన్ఫర్మ్ చేసిండు.. ఎంతఖర్చయినా పర్లేదు పెడత.. నాకు ఫుల్సపోర్ట్ జేస్తే.. జెడ్పీటీసీగా గెలుస్త’ – ముఖ్య నేతలతో దావత్ ఇస్తూ ఓ జెడ్పీటీసీ ఆశావహుడి వేడుకోలుసాక్షి పెద్దపల్లి: ఎన్నికలు అంటే సుక్క.. దసరా అంటే ముక్క.. ఇప్పుడు ఈ రెండు పెద్దపండుగలు కలిసే వచ్చా యి. పైగా రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. పండుగ సందర్భంగా ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ఆశావహులు ప్రలో భాలకు తెరతీస్తున్నారు. గ్రామాల్లో కులపెద్దలు, నలుగురిని ప్రభావితం చేసే కార్యకర్తలను మద్యంతో దావత్లు షురూ చేశారు. దసరా సందర్భంగా ఓటర్లకు మటన్పోగులు పంచిపెడుతూ ఖుషీ చేసేందుకు గ్రౌండ్వర్క్ చేసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా స్థానిక ఎన్నికలు జరిగే పల్లెల్లో ఎన్నికల వాతావరణం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మరికొందరు దసరా పండుగ రోజు రావణవధ కార్యక్రమాన్ని తమ సొంత డబ్బుతో భారీఎత్తున నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్నారు. మామూళ్లతో ముచ్చెముటలు తెలంగాణలో అతి పెద్దపండుగ దసరాకు నేతలు, ఊరులో పలుకుబడి కలిగినవారు తమ అనుచరులకు, తమ వద్ద పని చేసుకునేవారికి పండుగ సందర్భంగా ఎంతోకొంత దావత్ చేసుకునేందుకు డబ్బు లు ఇస్తుంటారు. కొన్నేళ్లుగా ఇది ఆనవాయితీగా వస్తోంది. పండుగ సమయంలోనే ఎన్నికలు రావడడంతో అడిగిన ప్రతీఒక్కరికి ఎంతోకొంత ముట్టజెప్పాల్సిన పరిస్థితి నెలకొందని ఆశావహులు తలలు పట్టుకుంటున్నారు. ఊళ్లకు లిక్కర్.. యథేచ్ఛగా బెల్ట్షాప్ల రన్ దసరా పండుగ రోజు వైన్స్షాప్లు మూసిఉంటాయి. ఆరోజు మహాత్మా గాంధీ జయంతి కావడంతో మాంసం, మద్యం విక్రయాలు ఉండవు. దీంతో తొలుత లిక్కర్ను పల్లెల్లోని బెల్ట్షాపులకు తరలిస్తుండగా, మరికొందరు నేతలు వైన్స్ షాప్లకు అడ్వాన్స్ చెల్లించి క్వార్టర్స్ను తమకు నమ్మకస్తుడైన లీడర్లకు చెందిన నివాసాలు, వ్యవసాయ పొలాల్లోకి డంప్ చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతోనే కోడ్ అమల్లోకి వచ్చినా.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పల్లెల్లో బెల్ట్షాపులు 24గంటలపాటు తెరిచే ఉంటున్నాయి. ఎన్నికల్లో మద్యం విక్రయాలు జోరుగా సాగుతాయనే ఆశతో బెల్ట్షాపు వ్యాపారులు భారీగా మద్యం డంప్ చేసుకుంటున్నారు. అధికార యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోందనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి.ఆశావహులు తమ గెలుపు కోసం ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ఆయా రాజకీయ పార్టీల్లోని ఆశావహులు.. కులసంఘాల ఆధారంగా మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కులంలో ఉన్నఓట్ల ఆధారంగా యాటలను కోయించి, ఇంటింటికీ మటన్ పోగులు పంపించేలా ప్లాన్ చేస్తున్నారు. పండుగపూట మచ్చిక చేసుకోకపోతే ఎన్నికల్లో ఫలితం బెడిసి కొడుతుందని.. ఒకరినిచూసి మరొకరు మద్యం, మాసం పంచేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికలు జరుగుతాయో, వాయిదా పడుతాయో అనే సందిగ్ధంలో ఉన్నా.. అశావహులు ఖర్చుకు భయపడకుండా వర్గాల వారీగా ఓటర్లను ఆకట్టుకునేందుకు వెనకాడడంలేదు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 60 జెడ్పీటీసీ, 646 ఎంపీటీసీలు, 1,226 పంచాయతీల్లో ఐదు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. -
రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ..
● రెండు, మూడో విడతలో పంచాయతీ ఎన్నికలు ● షెడ్యూల్ విడుదల చేసిన కలెక్టర్ హరిత సిరిసిల్ల: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను కలెక్టర్ ఎం.హరిత మంగళవారం విడుదల చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రెండు విడతల్లో, గ్రామపంచాయతీ ఎన్నికలు రెండు, మూడు విడతల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం ఎంపీటీసీ 123, జెడ్పీటీసీ 12 స్థానాలు ఉన్నాయని వెల్లడించారు. మొత్తం 260 గ్రామపంచాయతీలు, 2,268 వార్డులు ఉన్నాయని తెలిపారు. ● మొదటి విడతలో ఎన్నికలు జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు బోయినపల్లి, 11 స్థానాలు, 60 పోలింగ్ కేంద్రాలు. చందుర్తి, 10 స్థానాలు, 54 పోలింగ్ కేంద్రాలు. రుద్రంగి 5 స్థానాలు, 27 పోలింగ్ కేంద్రాలు. వేములవాడ అర్బన్ 6 స్థానాలు, 36 పోలింగ్ కేంద్రాలు. వేములవాడ రూరల్ 7 స్థానాలు, 40 పోలింగ్ కేంద్రాలు. కోనరావుపేట 12 స్థానాలు, 70 పోలింగ్ కేంద్రాలు. ఇల్లంతకుంట 14 స్థానాలు, 90 పోలింగ్ కేంద్రాలు. మొత్తం 65 స్థానాలు, 377 పోలింగ్ కేంద్రాలు. ● రెండో విడతలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు – తంగళ్ళపల్లి 14 స్థానాలు, 77 పోలింగ్ కేంద్రాలు. ఎల్లారెడ్డిపేట 13 స్థానాలు, 85 పోలింగ్ కేంద్రాలు. వీర్నపల్లి 5 స్థానాలు, 26 పోలింగ్ కేంద్రాలు. ముస్తాబాద్ 13 స్థానాలు, 75 పోలింగ్ కేంద్రాలు. గంభీరావుపేట 13 స్థానాలు, 69 పోలింగ్ కేంద్రాలు. మొత్తం 58 స్థానాలు, 332 పోలింగ్ కేంద్రాలు. ● రెండో విడతలో నిర్వహించే జీపీ స్థానాలు – గంభీరావుపేట జీపీలు 22, పోలింగ్ కేంద్రాలు 202. ముస్తాబాద్ జీపీలు 22, పోలింగ్ కేంద్రాలు 202. తంగళ్ళపల్లి జీపీ 30, పోలింగ్ కేంద్రాలు 2 52. ఇల్లంతకుంట జీపీ 35, పోలింగ్ కేంద్రాలు 294. కోనరావుపేట జీపీ 28, పోలింగ్ కేంద్రాలు 238. మొత్తం 137 జీపీ, 1188 పోలింగ్ కేంద్రాలు. ● మూడో విడతలో నిర్వహించే జీపీ స్థానాలు – వేములవాడ అర్బన్ జీపీలు 11, పోలింగ్కేంద్రాలు 104. రుద్రంగి జీపీలు 10, పోలింగ్ కేంద్రాలు 86. చందుర్తి జీపీలు 19, పోలింగ్కేంద్రాలు 174. వేములవాడ రూరల్ జీపీలు 17, పోలింగ్ కేంద్రాలు 146. బోయినపల్లి జీపీలు 23, పోలింగ్ కేంద్రాలు 212. వీర్నపల్లి జీపీలు 17, పోలింగ్ కేంద్రాలు 132. ఎల్లారెడ్డిపేట జీపీలు 26, పోలింగ్ కేంద్రాలు 226. మొత్తం 123 జీపీలు, 1,080 పోలింగ్ కేంద్రాలు. -
నిష్పక్షపాతంగా ఎన్నికల విధులు
● కలెక్టర్ ఎం.హరిత సిరిసిల్ల: జిల్లాలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారులు నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ ఎం.హరిత కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎంసీసీ)పై జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలకు కలెక్టరేట్లో మంగళవారం శిక్షణ నిర్వహించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో అధికారులు, సిబ్బంది పాల్గొన కూడదని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత రూ.50 వేల కంటే ఎక్కువ డబ్బు తరలిస్తే పట్టుకొని, వీడియో తీసి పంచనామా చేయాలని, అనంతరం డబ్బుకు సంబంధించి రసీదు అందజేయాలని సూచించారు. ఎంసీసీ నోడల్ ఆఫీసర్గా డీఆర్డీవో శేషాద్రిని నియమించారు. వేములవాడ ఆర్డీవో రాధాబాయి, జెడ్పీ సీఈవో వినోద్కుమార్, డీపీవో షరీఫోద్దీన్, ఎన్నికల మాస్టర్ ట్రైనర్ పాతూరి మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆది శేషునిపై దేవదేవుడు
శేష వాహనంపై విహరిస్తున్న స్వామివారలు సిరిసిల్లటౌన్: భక్తల నీరాజనాలతో శ్రీశాల పురవీధుల్లో దేవదేవుడు ఆదిశేషుని వాహనంపై విహరించారు. మంగళవారం సిరిసిల్ల శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు రెండోరోజు ఘనంగా నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి ఆలయంలో రక్షాబంధనము, రుత్విక్వరణము, అంకురారోపణము, ధ్వజా రోహనము రాత్రి 7గంటలకు భేరిపూజ, అగ్నిప్రతిష్ట తదితర పూజలు చేశారు. రాత్రి 9 గంటలకు శ్రీదేవి, భూదేవి సహితంగా వేంకటేశ్వరస్వామిని శేషవాహనంపై ఊరేగించారు. ఈవో మారుతిరావు, ఏఈవోలు కూనబోయిన సత్యం, పీసరి రవీందర్, ప్రధాన అర్చకస్వామి కృష్ణ్ణమాచారి, టీపీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, ఆలయ మాజీచైర్మన్లు ఉప్పుల విఠల్రెడ్డి, చేపూరి నాగరాజు, తీగల శేఖర్గౌడ్, పెద్ది శ్రీనివాస్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
ఈసారి గతానికి భిన్నంగా.. మరో ఛాన్స్ లేదు గురూ!
సిరిసిల్ల: స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో పల్లెల్లో రాజకీయ సందడి నెలకొంది. గతానికి భిన్నంగా రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఆశావహులు ఒక్కసారిగా ఎన్నికల బరిలో నిలిచేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.గతానికి భిన్నంగా..గతంలో ముందుగా ఒక్క నోటిఫికేషన్ జారీ అయ్యేది. అయితే ఎంపీటీసీ ఎన్నికలు, లేదా సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో ఏదో ఒక్కటి ముందు జరిగేవి. ఇలా జరగడం మూలంగా ముందుగా వచ్చిన ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఆ ఎన్నికల్లో మంచి ఓట్లు సాధించి, దరి దాపుల్లోకి వచ్చి ఓడిపోయినవారు.. మరోసారి వెంటనే వచ్చే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే అవకాశం ఉండేది. కానీ ఈ సారి “సానుభూతి’ చాన్స్ లేకుండానే నేరుగా ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ వెంటనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఫలితంగా ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు “సానుభూతి’ని మూటగట్టుకునే చాన్స్ లేకుండా పోయింది. రెండు ఎన్నికల్లో పోటీ చేసి అదృష్టాన్ని పరీక్షించుకోవాలి పరిస్థితి నెలకొంది. రెండింటికీ పోటీ చేస్తే.. నెగెటివ్ ఫలితాలు వస్తాయని కొందరు భావిస్తున్నారు. మొదటి ఎన్నికల్లో ఓడి.. రెండో ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఈ సారి లేవు. గతంలో చాలా మంది అభ్యర్థులు సర్పంచ్ పదవికి ఓడిపోయి, మళ్లీ ఎంపీటీసీ ఎన్నికల్లో గెలిచారు. ముందుగా ఎంపీటీసీగా ఓడిపోయి, తర్వాత సర్పంచ్గా గెలిచిన ఘటనలు ఉన్నాయి. ఈ సారి ఆ అవకాశం లేకుండా పోయింది. ఏది ఏమైనా ఈ సారి స్థానిక సంస్థల ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి.పార్టీ నేతలకు తలపోట్లుఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ పరంగా జరుగుతుండగా.. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు పార్టీ రహితంగా సాగుతాయి. ఈ నేపథ్యంలో ఒకేసారి అటు ఎంపీటీసీ, సర్పంచ్ అభ్యర్థులను ఆయా పార్టీ నేతలు ఎంపిక చేయాల్సి వస్తుంది. రెండు వేర్వేరుగా నోటిఫికేషన్లు వస్తే.. ఆయా పార్టీలకు కొంత సమయం దొరికి అభ్యర్థుల ఎంపిక సులభంగా ఉండేది. కానీ, ఇప్పుడు ఏకకాలంలో ఎన్నికలు రావడంతో ఒక్క ఊరిలో ఎంపీటీసీ అభ్యర్థిని, సర్పంచ్ అభ్యర్థిని, మండల స్థాయిలో జెడ్పీటీసీ అభ్యర్థిని, మళ్లీ గ్రామస్థాయిలో వార్డు సభ్యులను ప్యానల్గా నిలపాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో అన్ని పార్టీలకు ఈ జమిలి నోటిఫికేషన్ తలనొప్పిగా మారింది.రెండు విడతల్లో ఎంపీటీసీ, మూడు విడతల్లో సర్పంచ్రెండు విడతల్లో ఎంపీటీసీ, మూడు విడతల్లో సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు అధికారులు రంగం సిద్ధం చేశారు. మొదటి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు అక్టోబరు 11న నామినేషన్లు వేసేందుకు చివరి రోజు కాగా, అక్టోబరు 23న ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడత ఎన్నికలకు అక్టోబరు 15న నామినేషన్లకు చివరి రోజు. 27న రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు నవంబరు 11న వెలువడుతాయి. ఎన్నికలు జరిగిన తర్వాత ఫలితాల కోసం పక్షం రోజులు నిరీక్షించాల్సిన పరిస్థితి ఎదురైంది. అదే సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు అక్టోబరు 31, నవంబరు 4, 8వ తేదీల్లో మూడు విడతల్లో పూర్తి కానున్నాయి. ఎన్నికలు జరిగిన రోజు సాయంత్రమే ఫలితాలు వెలువడుతాయి. మొత్తంగా ఒకేసారి స్థానిక సంస్థల ఎన్నికలు వేగంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను జారీ చేస్తూ ఎన్నికల కోడ్ను అమలులోకి తెచ్చింది. -
ఇక సంగ్రామమే..
జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ మొత్తం జెడ్పీ చైర్మన్ కరీంనగర్ 03 00 06 06 15 బీసీ(జనరల్) సిరిసిల్ల 03 01 05 03 12 ఎస్సీ(జనరల్) జగిత్యాల 04 01 09 06 20 మహిళ(జనరల్) పెద్దపల్లి 06 03 00 04 13 మహిళ(జనరల్)సాక్షిప్రతినిధి, కరీంనగర్: సా్థనిక ఎన్నికలకు నగారా మోగింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీతోపాటు గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. తొలుత రెండు దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ.. తదుపరి మూడు దశల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. వచ్చే నెల 9నుంచి నవంబర్ 11వరకు ఎన్నికల పక్రియ కొనసాగనుంది. 33 రోజుల పాటు కోడ్ అమల్లో ఉండనుంది. పల్లెల్లో రాజకీయ సందడి జోరందుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ గెలుపే లక్ష్యంగా గ్రామాల వారీగా బలమైన అభ్యర్థుల కోసం వెతుకులాట ప్రారంభించగా, ఆశావహులు ఒక్కచాన్స్ ఇవ్వండంటూ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గతంకు భిన్నంగా... ఎప్పుడైనా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చే శాక, పంచాయతీ ఎన్నికలు నిర్వహించేవారు. ఈసారి రెండు ఎన్నికలను కలిపి నిర్వహిస్తుండటంతో పోటీ చేసి ఓడిపోతే ఇంట్లోనే కూర్చోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆశావహులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 646 ఎంపీటీసీ, 60 ఎంపీపీ, 60 జెడ్పీటీసీలకు, 1,226 సర్పంచ్ స్థానాలకు, 5,968 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం సీట్ల ల్లో 50శాతం తగ్గకుండా మహిళలకు కేటాయించారు. ముగ్గురు పిల్లలుంటే అనర్హులే.. కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించేందుకు 1994లో పంచాయతీరాజ్ చట్టంలో ఈ నిబంధన తీసుకొచ్చారు. దీని ప్రకారం ముగ్గురు పిల్ల లుంటే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు. తాజాగా ప్రభుత్వం ఈ నిబంధన ఎత్తివేయాలని ఆలోచించినా పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 21(3)ని సవరించలేదు. దీంతో ముగ్గురు పిల్లలు నిబంధన యథాతథంగా ఉండనుంది. కోర్టులో ఉండడంతో.. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రామచంద్రపల్లి, కుర్మపల్లి గ్రామాల విషయం కోర్టు పరిధిలో ఉండగా రిజర్వేషన్ ప్రక్రియ చేపట్టలేదు. మరోవైపు జిల్లా రిజర్వేషన్ల ప్రక్రియ వివరాలు వెల్లడించేందుకు జిల్లా పంచాయతీ అధికారి, డీపీఆర్వో సుముఖత చూపలేదు.జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ మొత్తం కరీంనగర్ 03 00 06 06 15 సిరిసిల్ల 03 01 05 03 12 జగిత్యాల 04 01 08 07 20 పెద్దపల్లి 05 03 00 05 13జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ మొత్తం సిరిసిల్ల 53 30 101 76 260 జగిత్యాల 68 31 153 133 385 పెద్దపల్లి 54 06 110 93 263 కరీంనగర్ – – – – –జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ మొత్తం కరీంనగర్ 39 00 73 58 170 సిరిసిల్ల 25 07 56 35 123 జగిత్యాల 26 07 52 41 126 పెద్దపల్లి 25 03 59 50 137 -
స్థానిక సమరానికి బీజేపీ సై
● ఢిల్లీలోనే కాదు గల్లీలోనూ కాషాయ జెండా ఎగరేయబోతున్నాం ● కరీంనగర్, సిరిసిల్ల జెడ్పీ పీఠాలను కై వసం చేసుకుంటాం ● కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ టౌన్: స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి బీజేపీ సిద్ధంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన కరీంనగర్ పార్లమెంట్ ప్రజల కోసం, కాషాయ జెండాను నమ్ముకున్న కార్యకర్తలను గెలిపించడం కోసం ఢిల్లీ ఎన్నికల్లోనే కాదు గల్లీ ఎన్నికల్లోనూ కొట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. కరీంనగర్, సిరిసిల్ల జిల్లా పరిషత్ పీఠాలపై కాషాయ జెండా ఎగరేసి తీరుతాం అని స్పష్టం చేశారు. పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న కార్యకర్తలకే ఈసారి ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో టిక్కెట్లు ఇస్తామని ప్రకటించారు. అభ్యర్థుల ఎంపిక కోసం ఇప్పటికే సర్వే టీంలు ఒక దఫా సర్వే పూర్తి చేశాయని, రిజర్వేషన్లు ఖరారైన నేపథ్యంలో సర్వే టీంలు రంగంలోకి దిగాయని అన్నారు. రిజర్వేషన్ల మూలంగా టిక్కెట్లు రాకపోయినా నిరాశ చెందవద్దని... వారికి పార్టీలో, ఇతరత్రా పదవుల్లో సముచిత స్థానం కల్పించి గౌరవిస్తామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడాన్ని భారతీయ జనతా పార్టీ పక్షాన స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. -
చిమ్మచీకటి.. బురద
చందుర్తి(వేములవాడ): చందుర్తి మండలం ఎన్గల్ గ్రామంలోని ఎస్సీ కాలనీలో అంధకారం నెలకొంది. బురదతో రోడ్డు అధ్వానంగా మారింది. వీధి దీపాలు లేక ఇరవై రోజులు గుడుస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు. ఐదు మాసాల క్రితం కాలనీలో సీసీ రోడ్డు వేస్తామని, రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించి గుంతలను చదును చేసి సిద్ధం చేయగా, గడువు దాటిపోయిందని, పనులను నిలిపి వేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయడంతో ఆ పనులు చేయకుండానే నిలిచి పోయాయి. దీంతో చిన్నపాటి వర్షం పడినా రోడ్డంతా బురదమయంగా మారుతోందని, దీనికి తోడు వీధి దీపాలు లేక తిప్పలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఎస్సీ కాలనీలో సమస్యలు తీర్చాలని కోరారు. -
సంస్కృతికి ప్రతీక బతుకమ్మ
చందుర్తి (వేములవాడ): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగా ప్రతీక అని నందిగామ అదనపు జూనియర్ సివిల్ జడ్జి గడ్డం వందన అన్నారు. వృత్తిరీత్యా ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా నందిగామ కోర్టులో అదనపు జూనియర్ సి విల్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం స్వగ్రామం చందుర్తి మండలం బండపల్లిలో తోటి మహిళలతో సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. వృత్తిరీత్యా ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా పుట్టిన పెరిగిన గ్రామస్తులతో సంబరాలు జరుపుకోవడం అదృష్టమన్నారు. పూలను పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణలో ఉందన్నారు. అనంతరం దుర్గామాత సన్నిధిలో జడ్జి వందనను గ్రామస్తులు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గడ్డం సత్యనారాయణరెడ్డి, వీడీసీ చైర్మన్ కటకం చంద్రయ్య, మాజీ సర్పంచ్ కటకం మల్లేశం, రెడ్డి సంఘం అధ్యక్షుడు గడ్డం రాజిరెడ్డి, తాడిశెట్టి తిరుపతిరెడ్డి, గడ్డం శ్రీనివాస్రెడ్డి, ఏనుగు లచ్చిరెడ్డి, గంప పవన్, బుర్ర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
● విప్ ఆది శ్రీనివాస్ కోనరావుపేట(వేములవాడ): అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. సోమవారం మండలంలోని నిజామాబాద్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి మాట్లాడారు. గ్రామాల్లో నాడు కాంగ్రెస్ ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లే తప్ప పదేళ్లలో గత ప్రభుత్వం ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కూడా కట్టించలేదని విమర్శించారు. ప్రజా ప్రభుత్వంలో పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ ఫిరోజ్పాషా, కిసాన్సెల్ జిల్లా అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్రెడ్డి, విండో చైర్మన్ బండ నర్సయ్య, మాజీ సర్పంచ్ అరుణ, నాయకులు చేపూరి గంగాధర్, గోపాల్, శోభన్, లంబ రాజు, బొర్ర రవి, లక్ష్మణ్, గొట్టె రుక్మిణి, కర్రోల్ల భాస్కర్, దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ భవనాలకు రూ.3.48 కోట్లు వేములవాడ: వేములవాడ నియోజకవర్గంలోని అంగన్వాడీ భవనాలకు రూ.3.48 కోట్ల నిధులు మంజూరైనట్లు విప్ ఆది శ్రీనివాస్ సోమవారం తెలిపారు. రుద్రంగి మండల పరిధిలోని అంగన్వాడీ సెంటర్ల నిర్మాణానికి రూ.1.08 కోట్లు, కోనరావుపేట మండల పరిధిలో రూ.96 లక్షలు, చందుర్తి మండల పరిధిలో రూ.36 లక్షలు, వేములవాడ అర్బన్ పరిధిలో రూ.36 లక్షలు, వేములవాడ రూరల్ పరిధిలో రూ.36 లక్షలు, మేడిపల్లి మండలంలోని ఎస్సీకాలనీ, భీమారం మండలం పసునూరులో, కథలాపూర్ మండలం అంబారిపేటలో భవనాలకు రూ.36 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. వేములవాడ రూరల్మండలం తుర్కాశినగర్, వట్టెం గ్రామపంచాయతీల నిర్మాణానికి రూ.40 లక్షలు, వేములవాడ అర్బన్ మండలం చంద్రగిరి పంచాయతీ కోసం రూ.20 లక్షలు, కోనరావుపేట మండలం శివంగలపల్లి పంచాయతీ కోసం రూ.20 లక్షలు, చందుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రహరీ నిర్మాణానికి రూ.12.50 లక్షలు, కోనరావుపేట జూనియర్ కళాశాల ప్రహరీ కోసం రూ.19.60 లక్షలు, కథలాపూర్ మండల కేంద్రంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణానికి రూ.17.50 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. న్యాయ నిర్మాణ భవన్ నమూనాసిరిసిల్లకల్చరల్: జిల్లా కేంద్రంలో నిర్మించ తలపెట్టిన న్యాయ నిర్మాణ భవన్ నమూనా ఇది. ప్రధాన ముఖ ద్వారానికి రెండు వైపులా ఐదేసి అంతస్తుల్లో సుమారు రూ.82 కోట్ల వ్యయంతో రూపుదిద్దుకోనుంది. ఒక్కో అంతస్తులో మూడు కోర్టు హాళ్లు, బార్ అసోసియేషన్ హాల్, లైబ్రరీ, వాష్రూములు, విశ్రాంతి గదులను నిర్మించనున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో సుమారు 300 కార్లకు పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించనున్నారు. -
బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ హరిత
● శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ మహేశ్ బీ గీతే అదనపు కలెక్టర్, జిల్లా అధికారులుసిరిసిల్ల: జిల్లా కలెక్టర్గా ఎం.హరిత సోమవారం విధుల్లో చేరారు. కలెక్టరేట్లో బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్కు అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. వేములవాడ ఆలయ ఈవో రమాదేవి ఆ ధ్వర్యంలో ఆలయ అర్చకులు వేదమంత్రాలతో కలెక్టర్కు ఆశీర్వాదం, రాజన్న ప్రసాదం అందించారు. అనంతరం వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, సిబ్బంది కలెక్టర్ను మర్యాదపూర్వకంగా క లిసి పుష్పగుచ్ఛాలు అందించారు. అలాగే కలెక్టర్ను జిల్లా టీఎన్జీవోఎస్ ప్రతినిధులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అధ్యక్షుడు, ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ఎలుసాని ప్రవీణ్కుమార్, ట్రెస్సా జిల్లా అధ్యక్షుడు జయంత్కుమార్, ఏఎస్వో జిల్లా అధ్యక్షుడు సుమన్, ఏఈఓఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్, పంచాయతీ కార్యదర్శుల జిల్లా అధ్యక్షుడు అనిల్కుమార్, హాస్టల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. పుష్పగుచ్ఛం అందజేత సిరిసిల్ల క్రైం/సిరిసిల్లఅర్బన్: కలెక్టర్గా హరిత బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ మహేశ్ బీగీతే మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే టీజీవో అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. టీజీవో జిల్లా అధ్యక్షుడు సమరసేన్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ హరితకు పూలమొక్క అందిస్తున్న ఎస్పీ మహేశ్ బీ గీతే, అదనపు కలెక్టర్ నగేశ్ -
మార్కెట్కు బతుకమ్మ కళ
సిరిసిల్లటౌన్: పండుగకు ఒకరోజు ముందే కార్మికక్షేత్రం సిరిసిల్ల సద్దుల బతుకమ్మ శోభను సంతరించుకుంది. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు గాంధీచౌక్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు, మార్కెట్, పాతబస్టాండు, పెద్దబజార్, కొత్తబస్టాండు, రైతుబజార్, గోపాల్నగర్ తదితర ప్రాంతాల్లో పూల విక్రయాలు కొనసాగాయి. రోడ్లపై విక్రయాలు సాగడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. కాగా ఈసారి బతుకమ్మ పూలు ప్రియమయ్యాయి. గునుగపూవు(మూడుకట్టలు) రూ.50, తంగేడు(మూడు కట్టలు) రూ.50, అడవిచామంతి(మూడుకట్టలు) రూ. 60, పట్టుకుచ్చులు(మూడుకట్టలు) రూ.100 చొప్పున అమ్మకాలు జరిగాయి. ఇవిగాక బతుకమ్మకు కావాల్సిన అన్నిరకాల పూలు తక్కువగా పూయడంతో డిమాండ్ పెరిగింది. -
మద్దిమల్లతండాలో బీసీ మహిళకు చోటు
● ఊరంతా గిరిజనులే.. ● రిజర్వేషన్పై అవాకై ్కన పల్లె ప్రజలువీర్నపల్లి(సిరిసిల్ల): వీర్నపల్లి మండలంలోని మద్దిమల్ల గ్రామం నుంచి 2018లో మద్దిమల్లతండా విడిపోయి గ్రామపంచాయతీగా ఏర్పడింది. మద్దిమల్లతండా వాసులు అందరూ గిరిజనులే. అయితే సర్పంచ్ స్థానం మాత్రం బీసీలకు కేటాయించడంతో వారు అవాక్కయ్యారు. గ్రామ మాజీ సర్పంచ్ మాలోత్ జవహర్లాల్నాయక్ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ తమ తండాలో 642 జనాభా, 425 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. అందరూ ఎస్టీలేనని.. కానీ సర్పంచ్ స్థానాన్ని బీసీలకు రిజర్వ్ చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఎస్టీలకే ఇవ్వాలని కోరారు. -
పల్లెల్లో ‘ప్రాదేశిక’ పోరు
సిరిసిల్ల: పల్లెల్లో ప్రాదేశిక పోరుకు రంగం సిద్ధమైంది. జిల్లా ప్రజాపరిషత్, మండల ప్రజాపరిషత్ల పాలకవర్గాల పదవీకాలం 15 నెలల కిందటే ముగిసింది. అప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాల న కొనసాగుతుండగా.. 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనే ఊహగానాల మధ్య స్థానిక సంస్థల రిజర్వేషన్లను జిల్లా అధికారులు ఖరారు చేసి రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులకు నివేదించారు. అధికారికంగా రిజర్వేషన్లపై గెజిట్ జారీ కావాల్సి ఉంది. రాష్ట్ర స్థాయిలో జెడ్పీ చైర్మన్ స్థానాలకు రిజర్వేషన్లు కల్పించారు. రాజన్నసిరిసిల్ల జిల్లా జెడ్పీ చైర్పర్సన్ స్థానాన్ని ఎస్సీలకు కేటాయించారు. జిల్లాలో 12 జెడ్పీటీసీ స్థానాలు, మరో 12 ఎంపీపీ స్థానాలు, 123 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. వీటి రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఆ మూడు మండలాలకే జెడ్పీ చైర్పర్సన్ అవకాశం జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్థానాన్ని ఎస్సీలకు కేటాయించడంతో జెడ్పీటీసీ సభ్యులుగా ఎన్నికై న ఎస్సీ అభ్యర్థులకు ఆ పీఠం దక్కే అవకాశం ఉంది. ఇల్లంతకుంట, కోనరావుపేట, వేములవాడరూరల్ మండలాల్లో ఎస్సీ అభ్యర్థులు జెడ్పీటీసీలుగా ఎన్ని కయ్యే అవకాశం ఉంది. దీంతో ఆ మూడు మండలాల్లో ఎన్నికై న ఎస్సీ అభ్యర్థులే జెడ్పీ చైర్పర్సన్లు కానున్నారు. మరోవైపు జనరల్ స్థానాల్లోనూ ఎస్సీ అభ్యర్థులు ఎవరైనా ఎన్నికై తే వారికి అవకాశం లభించనుంది. జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ ఎమ్మెల్యే స్థానాలు పూర్తిగా ఉండగా.. మానకొండూ రు, చొప్పదండి నియోజకవర్గాలు పాక్షికంగా ఉన్నా యి. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు జెడ్పీటీసీ సభ్యులను, ఎంపీపీ అభ్యర్థులను నిర్ణయించే అ వకాశం ఉంది. ఎన్నికల్లో అయా పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత కూడా వారిపైనే ఉంటుంది. ఎంపీటీసీ సభ్యుల స్థానాలపై ఉత్కంఠ జిల్లాలో 123 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. ఆయా స్థానాల రిజర్వేషన్లను జిల్లా పరిషత్ అధికారులు ఖరారు చేశారు. ఈమేరకు రిజర్వేషన్ల నివేదికను పంచాయతీరాజ్ ఉన్నతాధికారులకు నివేదించారు. ఎంపీపీ స్థానాలపై ఎంపీటీసీ సభ్యుల గురి స్థానిక సంస్థల్లో ఎంపీటీసీ సభ్యులుగా ఎన్నికై .. రిజర్వేషన్ అనుకూలిస్తే.. ఎంపీపీ పీఠాన్ని దక్కించుకోవాలని పలువురు నాయకులు గురిపెట్టారు. ఎంపీపీ రిజర్వేషన్ స్థానాలను అనుసరించి, ఆయా స్థానాల్లో ఎంపీటీసీ సభ్యులుగా పోటీచేయాలని భావిస్తున్నారు. జనరల్ స్థానాల్లో పోటీ ఎక్కువగా ఉండగా.. మండల స్థాయిలో చక్రం తిప్పే ఎంపీపీ స్థానాలపై పలువురు గురిపెట్టారు. జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల రిజర్వేషన్లుమండలం జెడ్పీటీసీ ఎంపీపీ బోయినపల్లి బీసీ జనరల్ బీసీ మహిళ కోనరావుపేట ఎస్సీ జనరల్ ఎస్సీ జనరల్ తంగళ్లపల్లి బీసీ జనరల్ జనరల్ ఎల్లారెడ్డిపేట జనరల్ మహిళ బీసీ జనరల్ గంభీరావుపేట బీసీ జనరల్ బీసీ జనరల్ ముస్తాబాద్ బీసీ మహిళ ఎస్సీ మహిళ వీర్నపల్లి జనరల్ జనరల్ మహిళ రుద్రంగి ఎస్టీ జనరల్ ఎస్టీ జనరల్ వేములవాడరూరల్ ఎస్సీ జనరల్ ఎస్సీ జనరల్ వేములవాడఅర్బన్ బీసీ మహిళ బీసీ జనరల్ చందుర్తి జనరల్ జనరల్ ఇల్లంతకుంట ఎస్సీ మహిళ బీసీ మహిళ -
నంబరు ప్లేట్ల మార్పుపై ఆందోళన వద్దు
● జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్సిరిసిల్ల: వాహనాల నంబరు ప్లేట్ల మార్పుపై వాహనదారులు ఆందోళన చెందొద్దని జిల్లా రవాణాశాఖ అధికారి లక్ష్మణ్ ఆదివారం తెలిపారు. పాత వాహనాలకు హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్(హెచ్ఎస్ఆర్పీ)లు బిగించేందుకు ఎలాంటి గడువు విధించలేదని స్పష్టం చేశారు. ఈనెల 30లోగా హెచ్ఎస్ఆర్పీ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని లేకుంటే రవాణా, పోలీసుశాఖల ఆధ్వర్యంలో జరిమానాలు విధిస్తారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. వాహనాలకు నంబరు ప్లేట్ల మార్పు విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదన్నారు. సోషల్మీడియాలో వచ్చే ప్రచారాలు నమ్మొద్దని కోరారు. -
కాత్యాయినీ నమోస్తుతి
వేములవాడ: రాజన్న ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారు కాత్యాయినీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వడ్డేపెల్లి సాహిత్య పురస్కారం అందుకున్న కిరణ్ సిరిసిల్లకల్చరల్: ప్రముఖ లలితగీతాల కవి వడ్డేపెల్లి కృష్ణ స్మారకార్థం అఖిల భారత పద్మశాలి సంక్షేమ సంఘం జాతీయ సాహిత్య పురస్కారం జిల్లా కేంద్రానికి చెందిన వ్యాసకర్త చిటికెన కిరణ్కుమార్ అందుకున్నారు. హైదరాబాద్లోని కేంద్ర గ్రంథాలయ భవనంలో ఆదివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పురస్కారాన్ని ప్రదానం చేశారు. గ్రంథాలయం అధ్యక్షుడు రియాజ్ అలీ, పద్మశాలి అన్నసత్రాల మార్గదర్శకులు చిలువేరి కాశీనాథ్, సంక్షేమ సంఘం అధ్యక్షుడు తుమ్మ సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు బైరి శ్రీనివాస్, సూరేపల్లి రవికుమార్, పాలడుగు సరోజనీదేవి, కవయిత్రి డాక్టర్ రాధాకుసుమ, తుమ్మ జనార్దన్, సత్యవీణ పాల్గొన్నారు. రాజన్న అన్నదాన ట్రస్టుకు విరాళం వేములవాడ: రాజన్న అన్నదాన ట్రస్టుకు హైదరాబాద్లోని హిమాయత్నగర్కు చెందిన కొమురవెల్లి అశోక్–అనిత దంపతులు రూ.86వేలు విరాళంగా అందించారు. ఆలయ పర్యవేక్షకులు గౌరిబట్ల శ్రీనివాస్శర్మకు చెక్కును ఆదివారం అందజేశారు. ఎల్ఎండీకి నీటి విడుదల బోయినపల్లి(చొప్పదండి): మిడ్మానేరు ప్రాజెక్టు నుంచి ఎల్ఎండీకి 3వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ప్రాజెక్టులోకి 7,100 క్యూసెక్కుల మేర వరద ఇన్ఫ్లోగా చేరుతోంది. మిడ్మానేరు ప్రాజెక్టు నుంచి ప్యాకేజీ–9 మల్కపేటకు 561 క్యూసెక్కుల మేర నీరు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో నీటిమట్టం 27.143 టీఎంసీలకు చేరింది. నేడు ప్రజావాణి రద్దు సిరిసిల్ల: జిల్లాలో సోమవారం ప్రజావాణి రద్దు చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ తెలిపారు. భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు, జిల్లాలోని పలు చోట్ల సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్న నేపథ్యంలో ప్రజావాణి రద్దు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా ప్రజలు గమనించి సోమవారం ప్రజావాణికి కలెక్టరేట్కు రావద్దని నగేశ్ కోరారు. ముసురు వర్షం సిరిసిల్ల: జిల్లా వ్యాప్తంగా ఆదివారం ముసురు వర్షం కురిసింది. గంభీరావుపేట మండలంలో అత్యధికంగా 30.2 మిల్లీమీటర్ల వర్షం నమోదు కాగా.. రుద్రంగిలో 9.7 మిల్లీమీటర్లు, చందుర్తిలో 2.4, వేములవాడరూరల్లో 1.5, బోయినపల్లిలో 3.7, వేములవాడలో 2.8, సిరిసిల్లలో 5.4, కోనరావుపేటలో 4.8, వీర్నపల్లిలో 8.1, ఎల్లారెడ్డిపేటలో 29.7, ముస్తాబాద్లో 12.2, తంగళ్లపల్లిలో 4.3, ఇల్లంతకుంటలో 3.3 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా సగటున 9.1 మిల్లీ మీటర్ల ముసురు వర్షం నమోదైంది. -
స్థానిక సందడి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఎట్టకేలకు స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. గత కొన్ని నెలలుగా గ్రామాల వారీగా ఎదురుచూస్తున్న ఆశావహుల ఉత్కంఠకు తెరపడింది. కలిసొచ్చినా రిజర్వేషన్తో పలువురు సంబరాలు జరుపుకోగా, మరికొందరు నిరాశలో మునిగిపోయారు. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జీవో జారీ చేయగా, దానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం స్థానిక ఎన్నికల కసరత్తును పూర్తి చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ఆధారంగా, బీసీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన కులగణన ఆధారంగా డెడికేటెడ్ కమిటీ సిఫార్సులను అనుగుణంగా 42శాతం రిజర్వేషన్లు కల్పించింది. దీంతో గతంలో కన్నా అన్ని స్థానిక సంస్థల్లో బీసీల ప్రాతినిథ్యం పెరిగింది. ఎన్నికల పక్రియలో భాగంగా శనివారం తొలుత ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్స్కు రిజర్వేషన్లు రొటేషన్ పద్ధతిలో ఖరారు చేయగా, మహిళలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ఆయా కలెక్టరేట్లలో వివిధ రాజకీయపక్షాల సమక్షంలో కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, డీపీవోలు లాటరీ పక్రియ ద్వారా నిర్ణయించారు. పూర్తిస్థాయిలో రిజర్వేషన్లు కేటాయింపులు పూర్తాకాగానే జిల్లాలవారీగా రిజర్వేషన్ల గెజిట్ను ఆయా జిల్లా కలెక్టర్లు విడుదల చేయనున్నారు. రాజకీయ పార్టీల సమక్షంలో రిజర్వేషన్లు ఖరారు చేస్తుండటంతో తమ గ్రామంలో, తమ మండలంలో ఎంపీపీ ఏవరికి కేటాయించరో తెలుసుకునేందుకు ఓటర్లు ఆసక్తి చూపారు. తమకు రిజర్వేషన్ అనూకూలించని వారు తమ కుటుంబ సభ్యులను రంగంలోకి దించాలనే దిశగా పావులు కదుపుతున్నారు. త్వరలో స్థానిక ఎన్నికల నగారా మోగనుండటంతో పల్లెల్లో రాజకీయం వెడేక్కింది. రెండు మహిళలకు... ఎస్సీ, బీసీలకు ఒక్కోటి పెద్దపల్లి, జగిత్యాల జెడ్పీ చైర్మన్ స్థానాలను జనరల్ మహిళలకు కేటాయించగా, కరీంనగర్ జెడ్పీస్థానం బీసీ జనరల్కు, సిరిసిల్ల జెడ్పీ పీఠంను ఎస్సీ జనరల్కు కేటాయిస్తూ శనివారం రాత్రి పంచాయితీరాజ్శాఖ అధికారికంగా గెజిట్ విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాలోని నాలుగు జెడ్పీ చైర్మన్లలో రెండు మహిళలకు, ఎస్సీ, బీసీలకు ఒక్కోటి కేటాయించినట్లయింది. మొదలైన ఆశావహుల సందడి.. జెడ్పీటీసీ, ఎంపీపీ, గ్రామపంచాయతీల ఎన్నికలకు కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తికావడంతో ఆశావహుల్లో హడావుడి మొదలైంది. ముసాయిదా రిజర్వేషన్ల జాబితాను శనివారం జిల్లాల్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల ఎదుట ప్రదర్శించారు. ఈ క్రమంలో కలెక్టరేట్ కార్యాలయాలు, ఎంపీడీవో కార్యాలయాల వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు, ఆశావహులు క్యూకట్టారు. లాటరీ పక్రియలో పాల్గొన్న నేతలతో ఆశావాహులు ఫోన్లో ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈసారి ఎన్నికల్లో బీసీలకు అధికంగా సీట్లు కేటాయించడంతో ఉత్సాహం నెలకొంది. స్థానిక పోరు మరింత వేడెక్కింది. ఎన్నికలు జరిగేనా.. సామాజిక న్యాయం కలిగించేలా ప్రభుత్వం బీసీవర్గాలకు 42 శాతం రిజర్వేషన్లను అమలుచేస్తూ జీవోను విడుదల చేసింది. ఎన్నికల నిర్వహణకు ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ వెలువడవచ్చన్న అంచనాలు నెలకొన్న క్రమంలో బీసీ రిజర్వేషన్ల పెంపుకు వ్యతిరేకంగా పలువురు హైకోర్డుకు వెళ్లిన నేపథ్యంతో జీవో అమలుపై సందిగ్ధం నెలకొంది. ప్రభుత్వం ఇచ్చిన జీవో మేరకు ఎన్నికలు నిర్వహిస్తారా, లేక మరోసారి ఎన్నికలు వాయిదా పడే అవకాశాలుంటాయా అనేదాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ జనరల్ కరీంనగర్ 6 3 0 6 పెద్దపల్లి 5 3 0 5 జగిత్యాల 8 4 1 7 సిరిసిల్ల – – – –జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ జనరల్ కరీంనగర్ 6 3 0 6 పెద్దపల్లి 6 3 0 4 జగిత్యాల 9 4 1 6 సిరిసిల్ల – – – –పెద్దపల్లి జనరల్ మహిళసిరిసిల్ల ఎస్సీ జనరల్జగిత్యాల జనరల్ మహిళకరీంనగర్ బీసీ జనరల్ -
లింగ నిర్ధారణ నేరం
సిరిసిల్ల: గర్భస్థ లింగ నిర్ధారణ నేరమని తెలిసినా కొందరు డాక్టర్లు ప్రైవేటు స్కానింగ్ సెంటర్లలో పరీక్షలను దుర్వినియోగం చేస్తున్నారని జిల్లా వైద్యాధికారి రజిత పేర్కొన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్లో శనివారం పీసీపీఎన్డీటీ చట్టంపై సలహా సంఘం సమావేశం జరిగింది. రజిత మాట్లాడుతూ గర్భస్త పిండ నిర్ధారణ చేస్తూ పుట్ట బోయేది ఆడబిడ్డ అయితే అబార్షన్లకు పాల్పడుతున్నారన్నారు. ఇలాంటి వారిని గుర్తించి చర్యలు తీ సుకోవాలని కోరారు. బ్రూణహత్యలకు పాల్పడితే టోల్ఫ్రీ నంబర్ 94400 54641లో తెలియజేయాలన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్ అంజలి ఆల్ఫ్రెడ్, అధికా రులు సంపత్కుమార్, రాజకుమార్ ఉన్నారు. -
స్కందమాతా అలంకారంలో అమ్మవారు
వేములవాడ: నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రాజన్న ఆలయంలోని అమ్మవారు స్కందమాత రూపంలో భక్తులకు శనివారం దర్శనమిచ్చారు. ఆలయంలోని నాగిరెడ్డి మండపంలో ఏర్పాటు చేసిన అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. తంగళ్లపల్లి(సిరిసిల్ల): ఏటీసీ నైపుణ్య కోర్సులను యువత సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. మండలలోని మండెపల్లి ఐటీఐ కళాశాల ప్రాంగణంలో ఏటీసీ కోర్సులను సీఎం రేవంత్రెడ్డి వర్చువల్గా శనివారం ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందదర్రెడ్డి, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వెలుముల స్వరూపారెడ్డి, వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, జిల్లా ఉపాధి కల్పనాధికారి రాఘవేందర్, ప్రిన్సిపాల్ కవిత పాల్గొన్నారు. సిరిసిల్లకల్చరల్: మధ్యవర్తిత్వం ద్వారా కేసులు త్వరగా పరిష్కారమవుతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ పేర్కొన్నారు. తెలంగాణ మీడియేషన్, ఆర్బిట్రేషన్ సెంటర్ ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వ శిక్షణ పూర్తి చేసుకున్న న్యాయవాదులు శనివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తితోపాటు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధికా జైస్వాల్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ కుటుంబ తగాదాలు, చెక్బౌన్స్ కేసులు, బంధువుల మధ్య స్పర్థలు, ఆస్తి పంపకాల వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించాలని సూచించారు. సిరిసిల్లకల్చరల్: బతుకమ్మ, విజయదశమి పండుగల నిర్వహణ తేదీలపై సందిగ్ధతకు తెరపడింది. ఈనెల 30న సద్దుల బతుకమ్మ, అక్టోబర్ 2న విజయదశమి(దసరా) పండుగలు నిర్వహించుకోవాలని జిల్లాలోని అన్ని పురోహిత సమాజాలు తీర్మానించాయి. బతుకమ్మ పండుగ తేదీపై సందిగ్ధత తొలగిపోయింది. సిరిసిల్లలో దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మ జరుపుకోవడం ఆచారంగా వస్తోంది. ఈమేరకు పురోహితులు నిర్ణయం తీసుకున్నారు. కోనరావుపేట(వేములవాడ): హిందువుల ఐక్యతకు పంచపరివర్తన్ ద్వారా ఆర్ఎస్ఎస్ కృషిచేస్తుందని కరీంనగర్ జిల్లా సహకార్యవాహ ఉచ్చిడి పద్మారెడ్డి పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ వందేళ్ల స్థాపన ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్ శాఖ ఆధ్వర్యంలో ధర్మారంలో శనివారం విజయదశమి ఉత్సవాలు నిర్వహించారు. కరీంనగర్ డెయిరీ చైర్మన్ చలిమెడ రాజేశ్వర్రావు మాట్లాడుతూ క్రమశిక్షణ, సేవాగుణం కలగాలంటే పిల్లలను ఆర్ఎస్ఎస్ శాఖకు పంపించాలని సూచించారు. ఆర్ఎస్ఎస్లో నేర్పిన క్రమశిక్షణ, అంకితభావంతోనే కరీంనగర్ డెయిరీని అభివృద్ధి చేయగలిగానన్నారు. నగర సహ శారీరక్ ప్రముఖ్ మల్లేశం, ఉపమండల ప్రముఖ్ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బాపూజీ జీవితం నవతరానికి ప్రేరణ
కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలు వేస్తున్న ఆది శ్రీనివాస్ నివాళి అర్పిస్తున్న బీఆర్ఎస్ నాయకులు సిరిసిల్లటౌన్: ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం వన తరానికి ప్రేరణగా నిలుస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని సిరిసిల్లలో శనివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన విప్ శ్రీనివాస్ పూలమల వేసి నివాళి అర్పించారు. సిరిసిల్ల కాంగ్రెస్ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, టీపీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ వెల్ముల స్వరూపారెడ్డి, కాముని వనిత, గోలి వెంకటరమణ పాల్గొన్నారు. పార్టీలు..ప్రజాసంఘాలు ఆధ్వర్యంలో.. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు నిర్వహించారు. సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జిందం కళ, మంచె శ్రీనివాస్, దార్నం లక్ష్మీనారాయణ, గూడూరి ప్రవీణ్ పాల్గొన్నారు. బీజేపీ పట్టణాధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పార్టీ పార్లమెంటు కోకన్వీనర్ ఆడెపు రవీందర్, మోర రవి తదితరులు పాల్గొన్నారు. కొండా లక్ష్మణ్ జయంతి వేడుకలకు.. సిరిసిల్లక్రైం: దేశ స్వాతంత్య్రోద్యమం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ అలుపెరగని పోరాటం చేశారని ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అదనపు ఎస్పీ చంద్రయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రవి, ఆర్ఐలు మధుకర్, రమేశ్, ఏవో పద్మ పాల్గొన్నారు. -
రాజకీయాల్లో యువతను ప్రోత్సహించాలి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజకీయాల్లో అన్ని పార్టీలు యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని న్యాయవాది కొండపురం వెంకట్రెడ్డి, ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్కుమార్ కోరారు. మండల కేంద్రంలోని సాయి మణికంఠ గార్డెన్స్లో శనివారం వివిధ రాజకీయ పార్టీల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, మేధావులతో యూత్ ఇన్ పాలిటిక్స్ ఆధ్వర్యంలో రాజకీయంలో యువత అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బానోత్ తిరుపతినాయక్, రవితేజగౌడ్, నరేశ్నాయక్, సింగారం దేవరాజు, ప్రమోద్, మధు, ప్రవీణ్, శ్రీనివాస్, అరవింద్, రాము, క్రాంతికుమార్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
మూలవాగు మురిసింది
● ఎములాడ పూలజాతర ● సంబురంగా ఏడొద్దుల సద్దులు ● ఆడిపాడిన ఆడపడచులుజనసంద్రమైన మూలవాగువేములవాడ: సద్దుల సంబురంతో మూలవాగు మురిసింది. ఏడు రోజుల వేడుకతో వేములవాడ పూలవనంలా మారింది. గునుగు..తంగేడు..బంతి..చేమంతి పూలతో పేర్చిన బతుకమ్మలతో ఆడపడచులు శనివారం సాయంత్రం సంతోషంగా ఆడిపాడారు. మూలవాగు తీరానికి భారీగా తరలివచ్చిన జనంతో పూలజాతరగా మారిపోయింది. కిక్కిరిసిన జనం మధ్య బతుకమ్మ పాటలు మరింత సందడిగా మార్చాయి. మధ్యాహ్నం మున్సిపల్ కార్యాలయం నుంచి గౌరమ్మతల్లి విగ్రహాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సెస్ డైరెక్టర్ నామాల ఉమ, ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, వైస్చైర్మన్ రాకేశ్, కమిషనర్ అన్వేశ్, మేనేజర్ సంపత్రెడ్డి ప్రత్యేక పూజలు చేసి మూలవాగులోని బతుకమ్మ తెప్ప వద్ద ప్రతిష్ఠించారు. మూలవాగు ఒడ్డున భారీ శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. జిగేల్ మనిపించే విద్యుత్ కాంతుల నడుమ మహిళలు తరలివచ్చి మూలవాగులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. -
కలెక్టర్గా హరిత
సిరిసిల్ల: జిల్లా కలెక్టర్గా ఎం.హరితను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఆదేశాలు జారీ చేసింది. విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్న హరితను రాజన్న సిరిసిల్ల కలెక్టర్గా నియమించారు. ఇప్పటి వరకు కలెక్టర్గా పనిచేసిన సందీప్కుమార్ ఝాను తెలంగాణ ఆర్అండ్బీ స్పెషల్ సెక్రటరీగా నియమించారు. ఈమేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2024 జూన్ 16న జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సందీప్కుమార్ ఝా నిత్యం ప్రభుత్వ వైద్యశాలలను, పాఠశాలలను తనిఖీ చేశారు. కొన్ని వివాదాలు చుట్టిముట్టినా విద్య, వైద్యంపై ఆయన పనితీరు గీటురాయిగా తనదైన మార్కును నిలుపుకున్నారు. కోర్టు వివాదాలు, సెప్టెంబరు 17న ప్రొటోకాల్ వివాదం ఆయన బదిలీకి కారణమైనట్లుగా భావిస్తున్నారు. కొత్త కలెక్టర్గా నియమితులైన ఎం.హరిత గతంలో వరంగల్రూరల్ కలెక్టర్గా పనిచేశారు. 2013 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన హరిత జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. హరిత గతంలో.. ఎం.హరిత 2013 ఐఏఎస్ అధికారి. తెలంగాణ కేడర్కు చెందిన హరిత విద్యాశాఖ జాయింట్ సెక్రటరీగా, సహకారశాఖ డైరెక్టర్, రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటీవ్ సొసైటీస్గా పని చేశారు. 2022లో విద్యాశాఖ డిప్యూటీ సెక్రటరీగా, వరంగల్ రూరల్ కలెక్టర్గా బాధ్యతలు నిర్వహించారు. -
అతివేగం.. అధిక లోడ్
● గ్రానైట్ లారీల రాకపోకలతో రోడ్లు ధ్వంసం ● ప్రమాదకరంగా గంగాధర–కొదురుపాక రోడ్డు ● ధ్వంసమవుతున్న వంతెనలు ● ఇటీవల తరచూ ప్రమాదాలు ● భయాందోళనలో ప్రయాణికులుబోయినపల్లి(చొప్పదండి): హెవీ లోడ్.. హై స్పీడ్.. ఫలితంగా ఛిద్రమైన రోడ్లు. ఇదీ రెండు జిల్లాలను అనుసంధానం చేసే గంగాధర–కొదురుపాక రోడ్డు దుస్థితి. ఈ మార్గంలో నిత్యం పదుల సంఖ్యలో గ్రానైట్ లారీలు తిరుగుతుంటాయి. భారీ సైజులో బండరాళ్లతో వెళ్తుండడంతో రోడ్లు, వంతెనలు ధ్వంసమవుతున్నాయి. అంతేకాకుండా ఇటీవల రోడ్డు ప్రమాదాలు సైతం పెరిగిపోయాయి. పెద్ద గుట్ట మాదిరిగా వెళ్తున్న వాహనాలు చూస్తేనే ద్విచక్రవాహనదారులు, ఇతర ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు. భారీ సైజు బండరాళ్లు.. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని పలు గ్రానైట్ క్వారీల నుంచి బోయినపల్లి, కొదురుపాక గ్రామాల మీదుగా బావుపేట గ్రానెట్ ఫ్యాక్టరీలకు నిత్యం పెద్ద మొత్తంలో గ్రానెట్ బండ లారీలు వెళ్తుంటాయి. నర్సింగాపూర్ క్వారీల నుంచి పెద్ద స్లాబ్లను కరీంనగర్, బావుపేట తరలిస్తారు. నెల క్రితం కొదురుపాక నుంచి బోయినపల్లి వైపు వస్తున్న ఓ గ్రానైట్ లారీ పెట్రోల్బంక్ కల్వర్టు వద్ద బోల్తాపడింది. అదృష్టవశాత్తు డ్రైవర్కు ఏమీ కాలేదు. గతేడాది జూలైలో కొదురుపాక వద్ద ఓ గ్రానైట్ బండలారీ ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. నర్సింగాపూర్, వెంకట్రావుపల్లి రోడ్లపై గతంలో హెవీ లోడ్తో ఉన్న లారీలు దిగబడి ట్రాఫిక్జామ్ ఏర్పడింది. గంగాధర నుంచి వచ్చే బండ లారీలు బోయినపల్లి బస్టాండ్ ప్రాంతంలో విపరీతమైన వేగంతో వెళ్తుండడంతో బస్సుల కోసం ఎదురుచూసే ప్రయాణికులు, వివిధ పనులపై బస్టాండ్కు వచ్చే స్థానికులు భయాందోళన చెందుతున్నారు. గంగాధర నుంచి కొదురుపాక టు బావుపేట గంగాధర మండలంలోని పలు గ్రామాల నుంచి బోయినపల్లి మండలం కొదురుపాక, వెంకట్రావుపల్లి మీదుగా కొత్తపల్లి మండలం బావుపేట స్లాబ్ కటింగ్ ఫ్యాక్టరీలకు నిత్యం 10 నుంచి 20 సంఖ్యలో గ్రానైట్లారీలతో స్లాబ్లు తరలుతున్నాయి. బోయినపల్లి మండలం నర్సింగాపూర్ క్వారీల నుంచి సైతం గ్రానైట్లారీలు హెవీ లోడ్తో స్లాబ్లు జారవేస్తాయి. బావుపేట ఫ్యాక్టరీల్లో బండరాళ్లతో స్లాబ్స్ కట్ చేస్తారు. గంగాధర నుంచి బోయినపల్లి, కొదురుపాక వరకు డబుల్ రోడ్డు ఉండడంతో పదుల సంఖ్యలో గంగాధర మండలం నుంచి వచ్చే బండలారీలు బావుపేటకు తరలుతున్నాయి. గంగాధర మండలం మీదుగా బోయినపల్లి మండలం కొదురుపాక మీదుగా వెళ్లే బండలారీలు అతివేగంగా వెళ్తుంటాయి. అధికలోడ్ లారీలతో బోయినపల్లి, దేశాయిపల్లి వద్ద రోడ్లు, వంతెనలు పాడవుతున్నాయంటున్నారు.గంగాధర కొదురుపాక డబుల్రోడ్డుపై హెవీ లోడ్తో వెళ్లే బండలారీల ఫిట్నెస్పై ఆర్టీఏ అధికారులు తనఖీలు చేయడం లేదనే ఆరోపణలున్నాయి. లారీ ఫిట్నెస్ ఎలా ఉంది? ఎన్ని టన్నుల్లో స్లాబ్స్ తీసుకెళ్లవచ్చు అనే అంశాలను పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. వా హనపత్రాలు సరిగా ఉన్నాయా? లైసెన్స్ ఉన్న డ్రైవర్లు నడుపుతున్నారా? అనే వాటిని పరిశీలించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మైనింగ్ అధికారుల నిఘా కొరవడడంతో కొన్ని చోట్ల లీజ్ అగ్రిమెంట్లు ముగిసినా యథేచ్ఛగా గ్రానై ట్ తవ్వకాలు చేపడుతున్నారని, రాయల్టీ చెల్లించడం లేదనే ఆరోపణలున్నాయి. లీజ్ అగ్రిమెంట్ల గురించి పంచాయతీ కార్యదర్శులను, రెవె న్యూ అధికారులను అడిగితే తెలియదని దాటవేస్తున్నారు. నర్సింగాపూర్, కొత్తపేట క్వారీల్లో అ నుమతులకు మించి మైనింగ్ చేస్తున్నారని ఆరో పణలు ఉన్నాయి. నర్సింగాపూర్ గ్రామం కరీంనగర్కు దగ్గరగా ఉండడంతో అటువైపు అధికారులు వెళ్లడం లేదంటున్నారు. గ్రానెట్ ఫ్యాక్టరీల యాజమాన్యాలు రాజకీయ పలుకుబడి ఉపయోగించి తనిఖీలకు అధికారులు రాకుండా మేనేజ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. -
బోనాలపల్లెకు ప్రత్యేక బృందం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఎలగందులను ఆనుకుని ఉన్న బోనాలపల్లైపెకి పోలీసు తూటాలు దూసుకుపోయిన ఘటనపై రాష్ట్ర పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. హైదరాబాద్ నుంచి స్పెషల్ టీం గురు, శుక్రవారాల్లో బోనాలపల్లెలో పర్యటించింది. అనూహ్యంగా తమపై దూసుకొస్తున్న తూటాలతో ప్రాణహాని పొంచి ఉందని గ్రామస్తులు కొన్ని రోజులుగా ఆందోళన చెందుతున్న విషయం తెలిసిదే. కరీంనగర్ సీపీ ఇచ్చిన సమాచారంతో క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు డీజీపీ కార్యాలయం ప్రత్యేక బృందాన్ని పంపింది. ఇందులో గ్రేహౌండ్స్, ఐఎస్డబ్ల్యూ, ఇతర సాంకేతిక నిపుణులు ఉన్నారు. వీరు స్థానిక పోలీసులతో కలిసి తొలుత ఎలగందుల ఫైరింగ్ రేంజ్, అనంతరం బోనాలపల్లె గ్రామాన్ని సందర్శించి పలు విషయాలను సమగ్రంగా పరిశీలించారు. బోనాలపల్లెలో అమృతమ్మ అనే 80 ఏళ్లుపైబడిన వృద్ధురాలి తుంటికి తూటా గాయం అయిన విషయాన్ని ‘సాక్షి’ ఈనెల 22న ‘బోనాలపల్లెకు తూటా గాయం’ శీర్షికన ప్రచురించిన విషయం తెలిసిందే రిటెయినింగ్ వాల్ నిర్మించాలట ఎలగందుల ఫైరింగ్ రేంజ్లో ఫైరింగ్ జరుగుతున్న తీరు, టార్గెట్ను తాకిన తరువాత బుల్లెట్లు దిశను మార్చుకున్న తీరును ప్రత్యేక బృందం పరిశీలించింది. అనంతరం అక్కడ నుంచి పొరుగునే ఉన్న బోనాలపల్లె గ్రామానికి వెళ్లారు. అక్కడి భౌగోళిక పరిస్థితులు, బుల్లెట్లు దూసుకువచ్చిన తీరును అంచనా వేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఇకపై బుల్లెట్లు గ్రామంవైపునకు దూసుకు రాకుండా ఉండాలంటే.. ఫైరింగ్ రేంజ్ వెనకాల భారీ రీటెయినింగ్ వాల్ నిర్మించాలని అధికారులకు సూచించారు. దాంతో టార్గెట్ను తాకిన తరువాత వెనక ఉన్న రాళ్లను తాకి దిశ మార్చుకున్నా.. బులెట్లు బోనాలపల్లె వైపునకు దూసుకురాకుండా ఉంటాయని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని సీపీకి, డీజీపీకి సమర్పించబోయే నివేదికలో పొందుపరచనున్నారు. 9 ఎంఎం బుల్లెట్ కిలోమీటరు ప్రయాణం హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందానికి ఒక విషయం ఇప్పటికీ అంతు చిక్కడం లేదు. ఫైరింగ్ రేంజ్ నుంచి దాదాపు కిలోమీటరు దూరంలో ఉన్న అమృతమ్మకు బుల్లెట్ తాకడం వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. అమతమ్మను తాకింది ఎస్ఎల్ఆర్ నుంచి వెలువడిన తూటా అనుకున్నారు. కానీ అది 9ఎంఎం బుల్లెట్ అని హైదరాబాద్ నుంచి వచ్చిన సాంకేతిక బృందం ధ్రువీకరించింది. సాధారణంగా 9ఎంఎం బుల్లెట్ పిస్టల్ లేదా కార్బన్ నుంచి వచ్చి ఉంటుందని అంచనాకు వచ్చారు. సాధారణంగా పిస్టల్ నుంచి వెలువడిన 9ఎంఎం బుల్లెట్ ప్రయాణించే దూరం కిలోమీటర్ లోపే. కానీ, బహిరంగ ప్రదేశాల్లో ఇది సాధ్యం కాదు. గాలి వీచే దిశ, ఇతర ఆటంకాలు అనేక మార్గమధ్యలో తూటా వేగాన్ని ప్రభావితం చేస్తాయి. ఇక్కడ టార్గెట్ను తాకిన తరువాత కూడా కిలోమీటరు ప్రయాణం చేయడం పోలీసు అధికారులను విస్మయానికి గురిచేస్తోంది. ఈ విషయాన్ని మరింత లోతుగా అధ్యయనం చేసిన అనంతరం పూర్తిస్థాయి నివేదికలో పొందుపరచనున్నారు. పోలీసులు ఫైరింగ్ చేసిన బుల్లెట్లు ఇకపై గ్రామంవైపు రాకుండా చర్యలు చేపడతాం. ఇందుకోసం ఫైరింగ్ రేంజ్ సరిహద్దులో రిటెయినింగ్ వాల్ నిర్మిస్తాం. బుల్లెట్లు బోనాలపల్లెను తాకడానికి పక్కనే ఉన్న గుట్ట ఎత్తు తగ్గడం కారణం కాదు. హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం సూచనల ప్రకారం రక్షణ ఏర్పాట్లు చేపడతాం. – గౌస్ఆలం, సీపీ, కరీంనగర్ -
ఈ మట్టిలోనే పోరాట పటిమ
కోనరావుపేట(వేములవాడ): భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ నుంచి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ ప్రదర్శించిన తెగువ, పౌరుషం తెలంగాణ ఆత్మగౌరవానికి నిదర్శనమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఐలమ్మ జయంతి సందర్భంగా కోనరావుపేటలో మండల రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ మట్టిలోనే పోరాట పటిమ, తెగువ ఉందన్నారు. పోరాట యోధుల గురించి భావితరాలకు తెలియజేయాలనే కోఠి మహిళా విద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెట్టినట్లు తెలిపారు. కిసాన్సెల్ జిల్లా అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్రెడ్డి, కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ ఫిరోజ్పాషా, ఏఎంసీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, సింగిల్విండో చైర్మన్ బండ నర్సయ్య, చేపూరి గంగాధఽర్, లింబయ్య, రమేశ్రెడ్డి పాల్గొన్నారు. -
సిరిసిల్లలో ‘జోయ్అలుక్కాస్’ ప్రదర్శన
● మూడు రోజులపాటు విక్రయాలుసిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని వాసవీ కల్యాణ మండపంలో జోయ్ అలుక్కాస్ జ్యువెలరీ సంస్థ శుక్రవారం బిగ్ ప్రదర్శన, సేల్స్ ప్రారంభించింది. సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ఎండీ ఖదీర్పాషా, మాజీ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి ఈ ప్రదర్శనను ప్రారంభించారు. సిరిసిల్లలో శుక్ర, శని, ఆదివారాల్లో మూడు రోజులపాటు ప్రదర్శన కొనసాగుతోందని సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. సిద్దిపేట బ్రాంచ్ పరిధిలోని ఈ ప్రదర్శనలో సరికొత్త సేకరణలు, విశిష్ట ఆభరణాలు అందుబాటులో ఉంటాయని, గొప్ప తగ్గింపు ఆఫర్లతో విక్రయాలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. మానేరు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు చింతోజు భాస్కర్, సిరిసిల్ల ప్రెస్క్లబ్ అధ్యక్షుడు ఆకుల జయంత్కుమార్, వాసవీ కల్యాణ మండపం ఇన్చార్జి సురేశ్, జోయ్ అలుక్కాస్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. -
అధికారుల ఆటా..పాటా
సిరిసిల్ల/సిరిసిల్లకల్చరల్/సిరిసిల్లక్రైం: బతుకమ్మ వేడుకలను జిల్లా అధికారులు శుక్రవారం సాయంత్రం సంబురంగా నిర్వహించుకున్నారు. కలెక్టరేట్లో మహిళా ఉద్యోగులు, సిబ్బంది రంగురంగుల పూలతో బతుకమ్మలను సిద్ధం చేశారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝా జ్యోతి వెలిగించి వేడుకలు ప్రారంభించారు. జిల్లా న్యాయస్థానం ప్రాంగణంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ, మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి బి.పుష్పలత, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధికా జైస్వాల్, మొదటి అదనపు సివిల్ జడ్జి కావేటి సృజన, రెండో అదనపు సివిల్ జడ్జి గడ్డం మేఘన బతుకమ్మ ఆట పాటల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఎస్పీ మహేశ్ బీ గీతే, అదనపు ఎస్పీ శేషాద్రినిరెడ్డి సిబ్బందితో కలిసి బతుకమ్మ ఆడారు. ఆయా కార్యక్రమాల్లో సీనియర్ సివిల్ జడ్జి లక్ష్మణాచారి, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, ఆర్డీవో రాధాబాయి, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, డీవైఎస్వో రాందాస్, జిల్లా అధికారులు అఫ్జల్బేగం, సౌజన్య, లత, భారతి, రవీందర్రెడ్డి, రాఘవేందర్, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జూపెల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పోలీస్ కార్యాలయంలో ఎస్పీ, పోలీసులుకోర్టులో బతుకమ్మ ఆడుతున్న జడ్జీలు -
నంది, గరత్మంతుడు వాహనాలపై విహరింపు
వేములవాడ: రాజన్న ఆలయంలో కొనసాగుతున్న దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి స్వామి వారు నంది, గరత్మంతుడు వాహనాలపై ఊరేగారు. వాతావరణం మేఘావృతం కావడంతో గ్రామసేవను రద్దు చేసినట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ రొండి రాజు పాల్గొన్నారు.వేములవాడ: నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన అమ్మవారు శుక్రవారం కూష్మాండ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద ఎత్తున మహిళలు అమ్మవారిని దర్శించుకున్నారు. ఇల్లంతకుంట(మానకొండూర్): మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండు పరిసరాల్లో మూత్రశాలల నిర్మాణానికి శుక్రవారం ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ ఈఈ ఆంజనేయులు, సిరిసిల్ల డిపో మేనేజర్ ప్రకాశ్రావు స్థలాన్ని పరిశీలించారు. ఈనెల 21న కలెక్టర్ సందీప్కుమార్ ఝా, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ బస్టాండ్ ఆవరణలో మూత్రశాలలు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ఈమేరకు అధికారులు స్థలాన్ని పరిశీలించి, ఎంపీడీవో శశికళతో మాట్లాడారు. ఆర్టీసీ సిబ్బంది శ్రీనివాస్గౌడ్, లక్ష్మీనారాయణ, కాంట్రాక్టర్ బద్దం హనుమంతరెడ్డి పాల్గొన్నారు. గంభీరావుపేట(సిరిసిల్ల): మండలంలోని నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టు వద్ద లో లెవల్ వంతెన కింద వరద ప్రవాహానికి వచ్చి తట్టుకున్న బండరాళ్లు, చెట్ల కొమ్మలు, మట్టిని శుక్రవారం జేసీబీతో శుభ్రం చేయించారు. ఇవి తట్టుకోవడంతో వరద బ్రిడ్జిపై నుంచి వెళ్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు గురువారం పరిశీలించి మాజీ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఈ పనులు చేపట్టారు. లోలెవల్ వంతెన కింద ప్రవాహానికి అడ్డుగా ఉన్న వాటిని తొలగించడంతో బ్రిడ్జి కింది నుంచి నీరు వెళ్లే అవకాశం కలిగింది. సిరిసిల్లఅర్బన్: మూడు నెలలుగా గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు ఇవ్వడం లేద ని, వెంటనే విడుదల చేయాలని కోరుతూ శుక్రవారం కలెక్టరేట్ వద్ద జీపీ యూనియన్ ఆధ్వర్యంలో బతుకమ్మ ఆడి నిరసన తెలి పారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నల్దాస్ గణేశ్ మాట్లాడుతూ దసర, బతుకమ్మ పండగలకు వేతనాలు రాక పస్తులుండే పరిస్థితి నెలకొందన్నారు. శనివారం నుంచి అత్యవసర సేవలు బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఎగమంటి ఎల్లారెడ్డి, వర్కోలు మల్ల య్య, బుర్ర శ్రీనివాస్, అక్కల అంజాగౌడ్, శ్రీనివాస్, నర్సయ్య, లక్ష్మణ్ పాల్గొన్నారు. వైన్స్లకు దరఖాస్తుల స్వీకరణసిరిసిల్ల/సిరిసిల్లక్రైం: జిల్లాలో 2025– 2027 సంవత్సరానికి 48 మద్యం షాపులకు శుక్రవారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని కలెక్టర్ సందీప్కుమార్ ఝా తెలిపారు. ఈనెల 26న టెండర్ అప్లికేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా, అక్టోబర్ 18వ తేదీ ఆఖరి గడువుగా ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. వచ్చే నెల 23న దుకాణాల డ్రా తీయనున్నారని పేర్కొన్నారు. తొలి రోజు దరఖాస్తులు రాలేవని ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. ప్రతీరోజు ఉదయం 11 గంటల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. -
ఇష్టంతో చదివి ఉన్నతంగా ఎదగాలి
● కలెక్టర్ సందీప్కుమార్ ఝా ● ఎల్లారెడ్డిపేటలో ఇందిరమ్మ ఇళ్ల పరిశీలనసిరిసిల్ల/ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): విద్యార్థులు ఇష్టంతో చదువుకొని వైద్యులు, ఇంజినీర్లు, లాయర్లు, బిజినెస్మెన్లుగా ఎదగాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా కోరారు. ఎల్లారెడ్డిపేటలోని ప్రభుత్వ జూని యర్ కాలేజీలో శుక్రవారం నిర్వహించిన పేరెంట్స్, టీచర్స్ మీటింగ్కు హాజరై మాట్లాడారు. కళాశాలలో ప్రహరీ, నూతన తరగతి గదుల నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం బస్సు సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి వై.శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.పద్మావతి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సాబేరబేగం, తహసీల్దార్ సుజాత, ఎంపీడీవో సత్తయ్య పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు పరిశీలన మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ పరిశీలించారు. పలువురి ఇళ్లు స్లాబ్ దశకు చేరుకోగా.. డబ్బులు వచ్చాయా.. అని ఆరా తీశారు. అర్హులు త్వరగా ఇళ్లు పూర్తి చేసుకోవాలని సూచించారు. మండలంలోని రాచర్లగుండారం– రాచర్లతిమ్మాపూర్ మార్గంలో రోడ్డు కొంత దెబ్బతిందని సీసీరోడ్డు మంజూరు చేయాలని ఎంపీడీవో సత్తయ్యను ఆదేశించారు. నారాయణపూర్లోని ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ పరిశీలించారు. తరగతి గది తుది దశ పనులు దసరా సెలవులు ముగిసేలోగా పూర్తి చేయాలని సూచించారు. ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి కలెక్టరేట్లో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జ్యోతి ప్రజ్వలన చేసి, ఐలమ్మ చిత్రపటానికి పూల మాలలు వేసి, నివాళి అర్పించారు. జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి సౌజన్య, జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్ బేగం, డీవైఎస్వో రాందాస్, రజక సంఘం సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు దండు శ్రీని వాస్, మైపాల్ బండి, దండు సురేశ్, వేములవాడ శ్రీనివాస్, మధు, గౌరయ్య, కంసాల మల్లేశం, మారుపాక శ్రీనివాస్ పాల్గొన్నారు. -
లిక్కర్..టెండర్
సాక్షి పెద్దపల్లి/సిరిసిల్ల: మద్యం దుకాణాల టెండర్లకు ప్రభుత్వం గురువారం మార్గదర్శకాలు జారీ చేసింది. ఆయా జిల్లాల కలెక్టర్లు లక్కీ డ్రా ద్వారా సామాజికవర్గాల వారీగా రిజర్వేషన్లకు అనుగుణంగా దుకాణాలు కేటాయించారు. శుక్రవారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రస్తుతం నడుస్తున్న వైన్స్ కాలపరిమితి నవంబర్ 30తో ముగియనుండగా రెండు నెలల ముందుగానే ప్రభుత్వం టెండర్లకు ఆహ్వానించింది. దీంతో ప్రస్తుతం మద్యం దుకాణాలు నిర్వహిస్తున్న వ్యాపారులతో పాటు గతంలో లక్కీడ్రాలో అదృష్టం వరించని వారు మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమతున్నారు. లైసెన్స్ కాలం 01.12.2025 నుంచి 30.11.2027 వరకు నిర్ణయించారు. ఈ ఏడాది స్థానిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మద్యం విక్రయాలు భారీస్థాయిలో ఉండే అవకాశముంది. దీంతో గతం కన్నా పెద్దసంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఎకై ్సజ్శాఖ అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 287 మద్యం దుకాణాలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 287 మద్యం దుకాణాలు ఉన్నాయి. మద్యంషాపుల్లో రిజర్వేషన్ ప్రకారం.. గౌడ కులస్తులకు 15శాతం, ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు 5శాతం దుకాణాలను కేటాయించనున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎస్టీ జనాభా తక్కువగా ఉండటంతో షాపులు కేటాయించలేదు. దీంతో 53 షాపులను గౌడ్స్, 31 దుకాణాలు ఎస్సీలకు కేటాయించారు. మిగిలిన అన్ని షాపులను ఆన్రిజర్వ్ కేటగిరీలో చేర్చారు. దీంతో ఈ దుకాణాలకు ఏ సామాజికవర్గం వారైనా టెండర్ దాఖలు చేయవచ్చును. ఒక్కో దుకాణానికి రూ.3 లక్షల ఫీజు ఉమ్మడి జిల్లాలోని ఒక్కో వ్యక్తి ఒక్కో దుకాణానికి ఎన్ని దరఖాస్తులనైనా సమర్పించవచ్చు. ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్రంలో ఏ మద్యం దుకాణానికై నా టెండర్ వేయవచ్చు. ఒక్కో దరఖాస్తుకు గతంలో రూ.2లక్షలు (నాన్ రిఫండెబుల్) ఉండగా, ఈసారి ఆ ఫీజును రూ.3లక్షలకు పెంచారు. గతేడాది ఉమ్మడి జిల్లాలో 10,734 దరఖాస్తులు రాగా, ప్రభుత్వానికి టెండర్ల ద్వారా రూ.214.68 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి ఫీజు పెరగటంతో ఆదాయం మరింత పెరగనుంది. దరఖాస్తు ఫీజును డీడీగా, చలాన్ రూపంలోగాని చెల్లించవచ్చు. దరఖాస్తులను ఆయా జిల్లా ఎకై ్సజ్ శాఖ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తారు. ఆరు శ్లాబుల్లో లైసెన్స్ల జారీ.. మొత్తం ఆరు శ్లాబుల్లో ఎకై ్సజ్శాఖ లైసెన్స్లు జారీ చేయనుంది. 2011 జనాభా లెక్క ప్రకారం 5వేల వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో సంవత్సరానికి ఎక్సైజ్ ట్యాక్స్ రూ.50 లక్షలు, 5వేల నుంచి 50 వేలు జనాభా ఉన్న పాంతాల్లో రూ.55 లక్షలు, 50 వేల నుంచి 1 లక్ష జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.60 లక్షలు, లక్ష నుంచి 5 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.65 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.85 లక్షలు, ఇక 20 లక్షలపైన జనాభా ఉన్న ప్రాంతాల్లో సంవత్సరానికి ఎకై ్సజ్ ఫీజు రూ.కోటి పది లక్షలుగా నిర్ణయించారు. అయితే, లాటరీ ద్వారా లిక్కర్ షాపులను పొందిన వారు ప్రభుత్వానికి చెల్లించాల్సిన వార్షిక ఫీజును ప్రతి ఏటా ఆరు స మాన వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. 25 నెలల లైసెన్స్ కాలానికి గాను 1/4వ వంతు అంటే 25 శాతం సమానమైన బ్యాంక్ గ్యారంటీ ప్రభుత్వానికి సమర్పించాలి.జిల్లా మొత్తం గౌడ్స్కు ఎస్సీలకు గతంలో వచ్చిన వచ్చిన ఆదాయం కరీంనగర్ 94 17 9 4,040 80.80 జగిత్యాల 71 14 8 2,636 52.72 పెద్దపల్లి 74 13 8 2,022 40.44 సిరిసిల్ల 48 09 6 2,036 40.72 మొత్తం 287 53 31 10,734 214.68 -
దీపావళికి గృహ ప్రవేశాలు చేయాలి
● కలెక్టర్ సందీప్కుమార్ ఝా సిరిసిల్ల/చందుర్తి(వేములవాడ): దీపావళి పండుగ వరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకుని, గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉండాలని లబ్ధిదారులను కలెక్టర్ సందీప్కుమార్ ఝా కోరారు. చందుర్తి మండలం కట్టలింగంపేటలోని పల్లికొండ మౌని క, మారుపాక నర్సవ్వ, కొంక సృజన, చందుర్తిలోని పోంశెట్టి లక్ష్మిల ఇళ్లను గురువారం పరిశీలించారు. ఇసుక రవాణా చేసే ట్రాక్టర్ యాజమానులు కూలీ ల ఖర్చులు మినహాయించి ట్రిప్పునకు రూ.1500 కన్న ఎక్కువ వసూలు చేస్తే తమ దృష్టికి తేవాలన్నారు. గృహ నిర్మాణ సంస్థ అధికారులు ఎప్పటికప్పుడు ఫొటోలు ఆన్లైన్ చేసి బిల్లులు త్వరగా అందలే చూడాలని సూచించారు. హౌసింగ్ శాఖ పీడీ శంకర్రెడ్డి, ఏఈ రాజమోహన్ ఉన్నారు. మాన్యువల్ స్కావెంజర్ విముక్తి జిల్లాపై అభ్యంతరాల ఆహ్వానం మాన్యువల్ స్కావెంజర్ విముక్తి జిల్లాగా ప్రకటించేందుకు అభ్యంతరాలుంటే ఐదు రోజుల్లో తెలపాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా కోరారు. జిల్లా స్థాయి కమిటీ జిల్లలోని 260 గ్రామాలు, సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో సర్వే చేసి మాన్యువల్ స్కావెంజర్లను గుర్తించలేదని పేర్కొన్నారు. ఆ కమిటీ నివేదిక ప్రకారం మాన్యువల్ స్కావెంజర్ విముక్తి జిల్లాగా ప్రకటించాలని సిపార్సు చేసిందన్నారు. అభ్యంతరాలుంటే జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి ఆఫీస్లో ఐదు రోజు ల్లో తెలపాలని కోరారు. అభ్యంతరాలు రాకుంటే అపరిశుభ్రమైన మరుగుదొడ్ల నుంచి విముక్తి పొందిన జిల్లాగా అధికారికంగా ప్రకటిస్తామని స్పష్టం చేశారు. మద్యం షాప్లకు డ్రా పద్ధతిలో రిజర్వేషన్లు జిల్లాలో 2025–2027 సంవత్సరానికి మద్యం షాపులకు రిజర్వేషన్లు డ్రా పద్ధతిలో ఖరారు చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు. నూతన మద్యం దుకాణాల రిజర్వేషన్ల ఖరారుకు కలెక్టరేట్లో డ్రా తీశారు. 48 దుకాణాలకు గౌడ్లకు 9, ఎస్సీలకు 5 కేటాయించినట్లు తెలిపారు. ఎస్సీలకు 14, 28, 34, 40, 43 నంబర్ల దుకాణాలు, గౌడ్లకు 02, 15, 17, 18, 33, 36, 38, 46, 48 నంబర్ల దుకాణాలు వచ్చినట్లు తెలిపారు. జిల్లా ఎకై ్సజ్ అధికారి రాధాకృష్ణారెడ్డి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్రెడ్డి, బీసీ సంక్షేమశాఖ అధికారి సౌజన్య, ఆబ్కారీ సీఐలు పాల్గొన్నారు. -
ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ: ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. పట్టణంలోని వాసవి ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన రాజశ్యామల దేవి కుంకుమ పూజ, పల్లకీసేవలో పాల్గొన్నారు.వేములవాడరూరల్: వేములవాడరూరల్, వేములవాడ అర్బన్, చందుర్తి, బోయినపల్లి మండలాల ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లతో గురువారం డీఆర్డీవో ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఫీల్డ్ అసిస్టెంట్లు బహిష్కరించారు. వారు మాట్లాడుతూ తమకు మూడు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదన్నారు. జీతాలు రాక తమ జీవనం అస్తవ్యస్తంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. బతుకమ్మ, దసరా పండుగకు జీతం రాక కుటుంబాన్ని పోషించుకోలేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ డీఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. సిరిసిల్లటౌన్: దీన్దయాల్ జయంతి వేడుకలను సిరిసిల్లలోని బీజేపీ ఆఫీస్లో గురువారం నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ జీవితం అందరికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రం మహేశ్, రాష్ట్ర నాయకులు లింగంపల్లి శంకర్, మ్యాన రాంప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షుడు శీలం రాజు, ఉపాధ్యక్షురాలు శ్రీమతి బర్కం లక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి బర్కం నవీన్, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్, రేగుల సంతోశ్బాబు పాల్గొన్నారు. సిరిసిల్లటౌన్: స్వచ్ఛత హీ సేవాలో భాగంగా సిరిసిల్ల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో గురువారం ‘ఏక్ దిన్–ఏక్ గంట–ఏక్ సాథ్–శ్రమదాన్’ నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో కొత్తచెరువు బండ్, పరిసర ప్రాంతాల్లో చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. కమిషనర్ మాట్లాడుతూ పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యతగా పేర్కొన్నారు. తడి, పొడి చెత్తగా వేరు చేసి మున్సిపాలిటీ వాహనానికి ఇవ్వాలని సూచించారు. స్వచ్ఛత హీ సేవాలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రం చేసేందుకు కనీసం గంట సమయం కేటాయించాలని కోరారు. రుద్రంగి(వేములవాడ): స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీని గురువారం ఇంటర్మీడియట్ బోర్డ్ అబ్జర్వర్ రమణారావు, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వై.శ్రీనివాస్ గురువారం పర్యవేక్షించారు. శుక్రవారం జరిగే మెగా పేరెంట్, టీచర్ మీటింగ్కు సంబంధించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని కోరారు. కళాశాల ప్రిన్సిపాల్ భార్గవిదేవి తదితరులు పాల్గొన్నారు. -
వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ నిర్మాణం
● విద్యాభారతి దక్షిణమధ్య క్షేత్ర కార్యదర్శి లక్ష్మణ్రావు వేములవాడ: వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ నిర్మాణం చేయడమే ఆర్ఎస్ఎస్ లక్ష్యమని విద్యాభారతి దక్షిణమధ్య క్షేత్ర కార్యదర్శి అయాచితుల లక్ష్మణరావు పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ వందేళ్ల స్థాపన ఉత్సవాల్లో భాగంగా వేములవాడ ఖండ ఆధ్వర్యంలో గురువారం విజయదశమి ఉత్సవం జరిగింది. హిందువులలో ఐక్యతను పెంపొందిస్తుందన్నారు. హిందూత్వ జీవన విధానం, విశ్వశాంతికి ఆధారమని పేర్కొన్నారు. డాక్టర్ కె.మనోహర్, కొండం పుల్లారెడ్డి, గ్రామాల స్వయం సేవకులు పాల్గొన్నారు. -
జీతాలు ఇచ్చి ఆదుకోండి
● ఎల్లారెడ్డిపేటలో స్వీపర్ల ర్యాలీ ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): తొమ్మిది నెలలుగా జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నామని, పండుగ పూటనైనా ఇచ్చి ఆదుకోవాలని కోరుతూ స్వీపర్లు, స్కావెంజర్లు గురువారం ఎల్లారెడ్డిపేటలో ర్యాలీ తీశారు. అనంతరం ఎంఈవో కృష్ణహరికి వినతిపత్రం అందించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆదర్శ కమిటీల ద్వారా నియమించిన స్కావెంజర్లకు పోయిన ఏడాది ఐదు నెలల 15 రోజులు, ఈ ఏడాదిలో నాలుగు నెలల జీతాలు ఖాతాల్లో జమచేయాలని కోరారు. విద్యార్థుల సంఖ్యను బట్టి కాకుండా అందరికీ ఒకేరకమైన జీతాలు ఇవ్వాలని కోరారు. నాయకులు మీసం లక్ష్మణ్, వెంకటేశ్, మహేశ్, వరలక్ష్మి, సాయికృష్ణ, నర్సయ్య, రజిత, లత, మంజుల, నర్సవ్వ, నాగమణి, అంజవ్వ తదితరులు పాల్గొన్నారు. -
కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తాం..
గంభీరావుపేట(సిరిసిల్ల): మండలంలోని నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టు వద్ద లోలెవల్ వంతెనలు ముని గిపోయి నిలిచిపోతున్న రాకపోకల విషయాన్ని మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తానని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు పేర్కొన్నారు. ఎగువమానేరు పొంగడంతో నెల రోజులుగా రాకపోకలు నిలిచిపోగా రవీందర్రావు గురువారం పరిశీలించారు. వరద ప్రవా హానికి వచ్చిన చెట్లు, రాళ్లు, మట్టి తట్టుకొని లోలెవల్ వంతెనలు మునిగిపోతున్నాయన్నారు. వర్షం ముసురుకుందిసిరిసిల్ల: జిల్లాలో గురువారం వర్షం ముసురుకుంది. రుద్రంగిలో 3.2 మిల్లీమీటర్లు, చందుర్తిలో 1.9, వేములవాడ రూరల్లో 2.1, బోయినపల్లిలో 2.0, సిరిసిల్ల, కోనరావుపేట, వేములవాడలో 1.3, వీర్నపల్లిలో 1.2, ఎల్లారెడ్డిపేటలో 0.4, ముస్తాబాద్లో 1.0, తంగళ్లపల్లిలో 1.8, ఇల్లంతకుంటలో 1.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. గంభీరావుపేటలో పెద్దగా వర్షం పడలేదు. -
ప్రధాన న్యాయమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు శోచనీయం
సిరిసిల్లకల్చరల్: దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్పై అనుచిత వ్యాఖ్యలు శోచనీయమని, సోషల్ మీడియాలో పోస్టు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా న్యాయవాదుల సంఘం డిమాండ్ చేసింది. ఈమేరకు న్యాయవాదులు ఎస్పీ మహేశ్ బీ గీతేను గురువారం కలిసి వినతిపత్రం అందించారు. బార్ అసోసియేషన్ కార్యదర్శి తంగళ్లపల్లి వెంకటి మాట్లాడుతూ సిద్దిపేట కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది పొద్దుటూరి శ్రీకాంత్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ ఫొటోను వాట్సాప్లో అనుచిత పోస్టు పెట్టారన్నారు. మరో న్యాయవాది ఎం.మరళీమోహన్రావు అవమానించేలా వ్యాఖ్యానిస్తూ పోస్టు చేశాడని తెలిపారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఘొల్లుమన్న గోపాల్రావుపల్లె
సిరిసిల్ల/తంగళ్లపల్లి(సిరిసిల్ల): పోరుబాట పట్టిన ఊరిబిడ్డ అమరుడయ్యాడని గోపాల్రావుపల్లె ఘొల్లుమంది. నవయవ్వనంలో అడవిబాట పట్టిన యువకుడు 70 ఏళ్ల వయసులో నమ్మినబాటలోనే ప్రాణాలు విడిచాడని ఊరు, వాడ కన్నీటిపర్యంతమైంది. ఇన్నాళ్లు ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా తమ ఊరి పిలగాడు ఉన్నాడేమోనని ఆతృతగా వార్తలు విన్న ఆ గ్రామస్తులు నేడు విగతజీవిగా చూసి గుండెలవిసేలా రోదించారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్ కొస అలియాస్ సాధు అంత్యక్రియలు స్వగ్రామం తంగళ్లపల్లి మండలం గోపాల్రావుపల్లెలో గురువారం కుటుంబ సభ్యులు, పౌరహక్కుల నేతలు, బంధువులు, స్నేహితుల అశ్రునయనాల మధ్య పూర్తయ్యాయి. – వివరాలు 10లో.. -
దుర్గామాతకు బోనం మొక్కులు
చందుర్తి(వేములవాడ): మండల కేంద్రంలోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాతకు గురువారం భక్తులు బోనం మొక్కులు చెల్లించుకున్నారు. డప్పుచప్పుళ్లు.. పోతరాజుల విన్యసాల మధ్య బోనాలతో మహిళలు తరలివచ్చారు. బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహరావు, సెస్ డైరెక్టర్ పొన్నాల శ్రీనివాస్రావు, సింగిల్విండో అధ్యక్షుడు తిప్పని శ్రీనివాస్, మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్య, రుద్రంగి మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు ఏనుగు శ్రీనివాస్, మార్త గంగాధర్, సిరికొండ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
సిరిసిల్ల కలెక్టర్ తీరు ఆక్షేపణీయం
సాక్షి, హైదరాబాద్: తమ ఆదేశాలు పాటించకపోగా భూ నిర్వాసితురాలిపై క్రిమినల్ కేసు పెట్టి రాజన్న సిరిసిల్ల కలెక్టర్ చట్ట నియమాలను ఉల్లంఘించారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్ హక్కులను, స్వేచ్ఛాయుత జీవనాన్ని, ప్రాథమిక హక్కులను హరించేలా ప్రవర్తించారని మండిపడింది. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తీరు ఆక్షేపణీయమని, ఆయను పిలిచి తీవ్రంగా మందలించాలని సీఎస్ను ఆదేశించింది. ఇంకా సర్వీసు ఉన్నందున ఆయన సర్వీసులో కొనసాగాలన్న ఒకే ఒక్క కోణంలో చూసి నేరుగా తామే చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయడం లేదని చెప్పింది. పిటిషనర్పై ప్రభుత్వం కేసు ఉపసంహరించుకుంటామని చెప్పినందున వేరే ఉత్తర్వులు అవసరం లేదంటూ నిర్వాసితురాలి పిటిషన్ను అనుమతిస్తూ తీర్పునిచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అనుపురం గ్రామానికి చెందిన వనపట్ల కవిత ఇంటిని ప్రభుత్వం 2004లో సేకరించింది. అయితే నిర్వాసితుల జాబితాలో తన పేరు లేదంటూ కవిత హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ జాబితాలో ఆమె పేరు చేర్చి పరిహారం చెల్లించాలని హైకోర్టు గతంలో ఆదేశించింది. ఈ ఉత్తర్వులు అమలు కాలేదంటూ కవిత కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయగా పరిహారం చెల్లించాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రభుత్వం అప్పీల్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాలు విచారణలో ఉన్నాయి. కలెక్టర్ లేఖ ఆధారంగా ఎఫ్ఐఆర్ కోర్టును తప్పుదోవపట్టించి ఉత్తర్వులు పొందారంటూ కవితపై సివిల్/క్రిమినల్ చర్యలకు ఉపక్రమించాలని ఆర్డీవో, వేములవాడ తహసీల్దార్కు కలెక్టర్ లేఖలు రాశారు. ఈ లేఖ ఆధారంగా తహసీల్దార్ ఫిర్యాదు చేయడంతో వేములవాడ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలంటూ కవిత అప్పుడు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి విచారణ చేపట్టి న్యాయస్థానాలపై కలెక్టర్కు గౌరవం లేదన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. తప్పుడు సమాచారంతో కోర్టు నుంచి ఉత్తర్వులు పొంది ఉంటే తమకు చెప్పకుండా పిటిషనర్పై పోలీసు కేసు నమోదు పెట్టడం చట్టవిరుద్ధమని అప్పుడు తీర్పు ఇచ్చారు. కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా చర్యలు తీసుకొనే అధికారం కలెక్టర్కు లేదన్నారు. -
మానాలలో రాష్ట్ర విజిలెన్సు అధికారుల విచారణ
రుద్రంగి(వేములవాడ): మండలంలోని మానాల గ్రామంలో రాష్ట్ర విజిలెన్సు అధికారి ముకుందరెడ్డి, ఎఫ్ఆర్వో ఖలీలొద్దీన్తో కలిసి బుధవారం విచారణ చేపట్టారు. మానాలలో అటవీభూమిలో చెట్ల నరికివేతపై గ్రామస్తుల నిరసనలు, అటవీ భూముల కబ్జా శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఫారెస్ట్ అధికారులు స్పందించారు. మానాల గ్రామ ప్రజలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కోతకు గురైన నీలగిరితోటను పరిశీలించారు. కొట్టివేసిన చెట్ల స్థానంలో మళ్లీ మొక్కలు నాటుతామని హామీ ఇచ్చారు. రుద్రంగి ఎస్సై శ్రీనివాస్, పోలీస్, ఫారెస్టు సిబ్బంది ఉన్నారు. -
అంజన్న భక్తులకు వసతి
వేములవాడఅర్బన్: వేములవాడ మండలం అగ్రహారంలోని జోడాంజనేయస్వామి ఆలయంలో అభివృద్ధి పనులు వేగం పుంజకున్నాయి. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల మధ్య రెండు మున్సిపాలిటీల ప్రజలకు అందుబాటులో ఈ ఆలయం ఉంటుంది. ఇక్కడ కొత్త వాహనాల పూజలు చేయడం ప్రత్యేకం. అంతేకాకుండా హనుమాన్ జయంతి వేడుకలు సైతం ఘనంగా నిర్వహిస్తుంటారు. అంజన్న మాలధారులు చాలా మంది రాత్రి వేళ ఆలయ పరిసరాల్లో నిద్ర చేసేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. అయితే వసతి సరిగా లేక భక్తులు ఇబ్బంది పడ్డారు. భక్తుల సమస్యలు పరిష్కరించేందుకు ఇటీవల నిధులు మంజూరు చేశారు. వీటితో పనులు మొదలయ్యాయి. నిధులు రాకతో పనుల్లో వేగం అగ్రహారం అంజన్న ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక దృష్టి సారించారు. సాండ్ఫండ్ రూ.31లక్షలతో ఆర్చిగేటు ప్రకారం, సాలహారం పనులు చేయనున్నారు. ఆలయం లోపల పరిసరాల్లో చుట్టూ రూ.34లక్షలతో గ్రానెట్, మార్బుల్ వేయనున్నారు. ఇప్పటికే ఆలయ అభివృద్ధి పనులు వేగవంతంగా నడుస్తున్నాయి. ప్రతిపాదనలు సిద్ధం అంజన్న ఆలయం ముందు స్థలంలో సుమారుగా రూ.50లక్షలతో రేకులషెడ్డు, ఆలయం పక్క ప్రాంతంలో సుమారు రూ.50 లక్షలతో కమ్యూనిటీహాల్ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ రెండు పనులకూ నిధులు కేటాయించాలని భక్తులు కోరుతున్నారు. అగ్రహారం హనుమాన్ ఆల యం పనులు వేములవాడ ఎ మ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీ నివాస్, కలెక్టర్ సందీప్ కుమా ర్ ఝా సహాకారంతో ప్రారంభమై నడుస్తున్నాయి. పనులు చాల వేగవంతంగా నడుస్తున్నాయి. రెండు నెలల్లో మొత్తం పనులు పూర్తవుతాయి. – అగ్రహారం అంజన్న ఆలయ ఈవో నాగరపు శ్రీనివాస్ -
పేదల ఆత్మగౌరవ ప్రతీక ఇందిరమ్మ ఇల్లు
● ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వేములవాడ/కోనరావుపేట: పేదల ఆత్మగౌరవ ప్రతీక ఇందిరమ్మ ఇల్లు అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ పట్టణ పరిధిలోని 39 మందికి, కోనరావుపేట మండలంలోని 52 మంది లబ్ధిదారులకు బుధవారం సీఎమ్మార్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం నిమ్మపల్లిలో సుంకె మాధవి నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇంటిని పరిశీలించారు. విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు చూపిస్తే మేము ఓట్లు అడగబో మని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేని ఊరు తాము చేపిస్తే మీరు (బీఆర్ఎస్) ఓట్లు అడగకుండా ఉండాలని సవాల్ విసిరారు. ఎన్నికల హామీలు నెరవేరుస్తూ ముందుకెళ్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు షేక్ ఫిరోజ్పాషా, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, వైస్చైర్మన్ తాళ్లపెల్లి ప్రభాకర్, డైరెక్టర్లు బాశెట్టి నాగరాజు, అజీమ్, నాయకులు మానుక సత్యం, చేపూరి గంగాధర్, పెంతల శ్రీనివాస్, నందూగౌడ్, ప్రకాశ్ పాల్గొన్నారు. -
ఆరోగ్య కేంద్రం తనిఖీ
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా వైద్యాధికారిణి రజిత తనిఖీ చేశారు. డీఎంహెచ్వో రజిత మాట్లాడుతూ ఆరోగ్య మహిళ శక్తివంతమైన కుటుంబం అనే కార్యక్రమం నిర్వహించే వైద్య శిబిరాలను తనిఖీ చేశారు. గొల్లపల్లి, వెంకటాపూర్ ఆరోగ్య ఉపకేంద్రాల్లో వైద్యశిబిరాలు నిర్వహించారు. ఆర్బీఎస్కే డాక్టర్ నహీమ తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్లటౌన్: అంతర్జాతీయ పారా త్రో క్రీడాకారిణి మిట్టపల్లి అర్చనకు ప్రభుత్వం తరఫున రూ.59వేల ఆర్థిక సహాయం అందింది. రాష్ట్ర క్రీడలశాఖ మంత్రి వాకిటి శ్రీహరి మంజూరు చేసిన రూ.59వేలు ఆమె బ్యాంక్ ఖాతాలో జమయ్యాయి. డిసెంబర్లో శ్రీలంకలో జరిగే అంతర్జాతీయపోటీల్లో పాల్గొననుంది. ఇందుకు అయ్యే ఖర్చును ప్రభుత్వం భరించేందుకు ముందుకొచ్చింది. డీపీఆర్వో శ్రీధర్ సస్పెన్షన్సిరిసిల్లటౌన్: జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి వంగరి శ్రీధర్ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ సందీప్కుమార్ ఝా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా అధికారుల మిత్రుల సంఘం వాట్సాప్ గ్రూప్లో ఓ కార్టూన్ను డీపీఆర్వో శ్రీధర్ షేర్ చేశారు. వివాదాస్పదమైన ఈ కార్టూన్ను ప్రస్తావిస్తూ.. సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
‘కడారి’ కడచూపునకు నిరీక్షణ
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్ కొస మృతదేహాన్ని చూసేందుకు కుటుంబ సభ్యులకు బుధవారం రాత్రి వరకు నిరీక్షణ తప్పలేదు. రాత్రి 8 గంటల తర్వాత పోస్టుమార్టం పూర్తి చేసి మృతదేహాన్ని అప్పగించారు. మంగళవారం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్కు వెళ్లిన కుటుంబ సభ్యులు బుధవారం రాత్రి వరకు ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ, పోలీస్స్టేషన్ల వద్దనే ఎదురుచూశారు. గురువారం ఉదయం వరకు స్వగ్రామం తంగళ్లపల్లి మండలం గోపాల్రావుపల్లెకు చేరుకోనుంది. అనంతరం అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. – సిరిసిల్ల/తంగళ్లపల్లి(సిరిసిల్ల) – వివరాలు IIలో.. -
ఎల్ఎండీకి నీటి విడుదల
బోయినపల్లి: మిడ్మానేరు నుంచి ఎల్ఎండీకి 9వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ఎస్సారెస్పీ నుంచి 4,500, మరో 3500 వేల క్యూసెక్కులు వరద వస్తోంది. ఆకాశం మేఘావృతమవుతుంది. జిల్లాలో స్వల్పంగా వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. ముస్తాబాద్(సిరిసిల్ల): మండలంలోని పోతుగల్లో దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం మహా చండీయాగం నిర్వహించారు. వేదపండితులు కాళీచరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యాగంలో మాజీ సర్పంచ్ గౌతంరావు, దుర్గామాత ఉత్సవ కమిటీ అధ్యక్షుడు భూదయ్య, చెక్కపల్లి రాజు, భాను, అంజయ్య, ధర్మేందర్, నవీన్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. వేములవాడ: ప్రకృతిని ఆరాధించే గొప్ప పండుగ బతుకమ్మ అని వేములవాడ జూనియర్ సివిల్ జడ్జి జ్యోతిర్మయి పేర్కొన్నారు. కోర్టు ఆవరణలో బుధవారం నిర్వహించి బతుకమ్మ వేడుకల్లో మహిళా న్యాయవాదులు, కోర్టు సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుండ రవి, ట్రెజరర్ బొజ్జ మహేందర్, ఉపాధ్యక్షుడు కట్కం జనార్దన్, ఏజీపీ బొడ్డు ప్రశాంత్, భాను, మహిళా ప్రతినిధి పద్మ తదితరులు పాల్గొన్నారు. ఇల్లంతకుంట: మిడ్మానేరు నుంచి అన్నపూర్ణ జలాశయంలోకి ఎత్తిపోతలు బుధవారం నిలిపివేశారు. ప్రస్తుతం అన్నపూర్ణ ప్రాజెక్టులో 3.29 టీఎంసీల నీరు ఉంది. -
కంపోస్టు షెడ్లు ఖాళీ !
ముస్తాబాద్(సిరిసిల్ల): జిల్లాలో వర్మికంపోస్టు షెడ్లు నిరుపయోగంగా మారాయి. మూడేళ్ల క్రితం అధికారులు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వర్మికంపోస్టు తయారీని ఇప్పుడు మరిచిపోయారు. రూ.2.50 లక్షలతో నిర్మించిన షెడ్లు వృథాగా పడి ఉన్నాయి. పల్లెల్లో సంపూర్ణ పారిశుధ్యమే లక్ష్యంగా ఉపాధిహామీలో చేపట్టిన కంపోస్టుషెడ్లు ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాయి. పట్టించుకునే వారు లేక పంచాయతీలకు ఆదాయం సైతం రావడం లేదు. కంపోస్టు షెడ్ల లక్ష్యం ఇదీ.. గ్రామాల్లో ఇళ్ల నుంచి తడి, పొడి చెత్తను పంచాయతీ కార్మికులు సేకరిస్తారు. ట్రాక్టర్లు, ఆటోలలో సేకరించిన చెత్తను షెడ్లకు తరలిస్తారు. అక్కడ ప్లాస్టిక్, ఇతర వస్తువులను వేరు చేసి కంపార్టుమెంట్లలో వేస్తారు. రెండు ప్రత్యేక కంపార్టుమెంట్లలో చెత్త, కుళ్లిన కూరగాయలు, ఇతర వస్తువులను వేస్తారు. దీనిపై వానపాములను వేసి కుళ్లపెడతారు. అది 40 రోజులకు ఎరువుగా మారుతుంది. ఆ ఎరువును సేకరించి గ్రామాల్లో అవసరమైన వారికి విక్రయించి ఆదాయం పొందుతారు. అలాగే వ్యర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించి, ఎరువుగా మార్చేందుకు, వ్యర్థాల విభజనకు చర్యలు చేపడతారు. ముస్తాబాద్ మండలం మద్దికుంట, పోతుగల్, గూడెం గ్రామాలు వర్మికంపోస్టు ఎరువులను విక్రయించి భారీగా ఆదాయం పొందాయి. కానీ నేడు వర్మికంపోస్టు తయారీని పట్టించుకోవడం లేదు. -
పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం
సిరిసిల్లటౌన్/వేములవాడరూరల్: పౌష్టికాహారంతోనే చిన్నారులు, బాలింతలు సంపూర్ణ ఆరోగ్యం పొందుతారని డీడబ్ల్యూవో లక్ష్మీరాజం పేర్కొన్నారు. సిరిసిల్ల, వేములవాడ రూరల్ మండలం జయవరంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. సీడీపీవో ఉమారాణి, సూపర్వైజర్లు సుష్మిత, సరిత, మహిళా సాధికారత కేంద్రం సమన్వయకర్త రోజా తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్లటౌన్: శ్రామిక వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సీపీఐ పోరాటాలు చేస్తుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్ పేర్కొన్నారు. సిరిసిల్లలోని కార్మిక భవనంలో బుధవారం నిర్వహించిన ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గం, కౌన్సిల్ సమావేశంలో మాట్లాడారు. గ్రామపంచాయతీ కార్మికులకు నాలుగు నెలలుగా వేతనాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు అజ్జ వేణు, నాయకులు కడారి రాములు, నల్ల చంద్రమౌళి, పంతం రవి, మీసం లక్ష్మణ్, కేవీ అనసూర్య, దుడ్రపెళ్లి రవీందర్, బచ్చుపల్లి శంకర్, పండుగ పోచమల్లు పాల్గొన్నారు. ముస్తాబాద్(సిరిసిల్ల): హిందూత్వ జీవన విధానం విశ్వశాంతికి మూలమని ఆర్ఎస్ఎస్ జిల్లా సహ కార్యవాహ వుచ్చిడి పద్మారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని చీకోడులో బుధవారం ఆర్ఎస్ఎస్ వందేళ్ల స్థాపన, విజయ దశమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పద్మారెడ్డి మాట్లాడుతూ హిందువుల ఐక్యతకు పంచ పరివర్తన్ ద్వారా ఆర్ఎస్ఎస్ కృషి చేస్తుందన్నారు. అన్ని మతాలను సమన్వయపరిచి సనాతన జీవన విలువలు హిందూత్వంలో ఉన్నాయన్నారు. కరెడ్ల మల్లారెడ్డి, కరుణాకర్, బాధ నరేశ్, సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్లటౌన్: దళితవాడల్లో వెయ్యి గుడుల నిర్మాణం కన్నా వెయ్యి బడులు, ఆరోగ్య కేంద్రాలు నిర్మించాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్బాబు కోరారు. సిరిసిల్లలోని చేనేత, వస్త్ర వ్యాపార సంఘం భవనంలో బుధవారం నిర్వహించిన కేవీపీఎస్ జిల్లా రెండో మహాసభల్లో మాట్లాడారు. ఆర్ఎస్ఎస్, బీజేపీలు చేస్తున్న రాజ్యాంగ రద్దు కుట్రలను యువతరం ప్రతిఘటించాలని కోరారు. ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్కు అప్పచెప్పే విధానాలపై పోరాడాలన్నారు. జిల్లా కార్యదర్శి ఎర్రవెళ్లి నాగరాజు, రాష్ట్ర సహాయ కార్యదర్శి తిప్పారపు సురేశ్, నాయకులు మూషం రమేశ్, మల్లారపు అరుణ్, విమల, గన్నేరపు నర్సయ్య, రమేశ్చంద్ర, సూరం పద్మ తదితరులు పాల్గొన్నారు. -
టీఎన్జీవోల భూమి ఎక్కడ?
సాక్షిప్రతినిధి, కరీంనగర్: వారంతా విశ్రాంత ఉద్యోగులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. 40 ఏళ్ల క్రితం ప్రభుత్వం వీరికి ఇంటిస్థలం కేటాయించింది. దాన్ని కబ్జాదారులు మాయం చేయగా.. మూడు దశాబ్దాల పోరాటం తరువాత మరో చోట 20ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించిన అధికారులు నేటికీ ప్రొసీడింగ్స్ ఇవ్వడం లేదు. దీంతో ఎనిమిదేళ్లుగా ముదిమి వయసులో ఇంటిస్థలానికి అనుమతులు ఇవ్వాలంటూ కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఒకటి, కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు దశాబ్దాలుగా కబ్జాకు గురైన తమ స్థలానికి ప్రత్యామ్నాయం చూపాలంటూ ఈ సీనియర్ సిటీజన్లు చేస్తున్న పోరాటం నేటికీ ఆగడం లేదు. నగర శివారుల్లో టీఎన్జీవోలకు కేటాయించిన స్థలం కబ్జా అయినప్పటికీ.. ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో 40ఏళ్లుగా తీరని అన్యాయమే మిగిలిందని ఆవేదన చెందుతున్నారు. అసలేం జరిగింది? 1980లో ఉమ్మడి జిల్లాలోని 930మంది టీఎన్జీవోలు కలిసి ఇంటి స్థలాల కోసం హౌసింగ్ సొసైటీగా ఏర్పడ్డారు. తమకు ఇంటిస్థలాలు కేటాయించాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. స్పందించిన అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్ వీరికి మూడు చోట్ల ఇంటి స్థలాలు కేటాయించారు. తొలుత కరీంనగర్ కమాన్రోడ్లోని పాతచెరువు సమీపంలో సర్వే నంబరు 415లో 18 ఎకరాలు, ఎర్రగుంట సమీపంలో సర్వే నంబరు 918లో 14 ఎకరాలు కేటాయించారు. ఈ రెండు స్థలాలను టీఎన్జీవోలకు ప్రభుత్వం స్వాధీనం చేసింది. ఈ స్థలాల్లో 304 మంది టీఎన్జీవోలు ఇండ్లు నిర్మించుకున్నారు. మూడోచోటుగా బొమ్మకల్ గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబరు 96లో 20ఎకరాల భూమిని కేటాయించారు. ఈ భూమి తమది అంటూ స్థానిక నేతలు అభ్యంతరం తెలిపారు. ఆ భూమిని కబ్జా చేశారు. దీన్ని స్వాధీనం చేసుకునేందుకు టీఎన్జీవోలు 2017 వరకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తిమ్మాపూర్లో చూసినప్పటికీ బొమ్మకల్లో కబ్జా అయిన 20 ఎకరాల విలువైన స్థలం గురించి ఇటు టీఎన్జీవో పెద్దలు, అటు కలెక్టర్ కార్యాలయం, రెవెన్యూ ఉన్నతాధికారులు ఎవరూ పట్టించుకోలేదు. ఫలితంగా రూ.కోట్లాది విలువైన స్థలం కబ్జాదారుల వశమైంది. దీంతో అప్పటి నుంచి ప్రయత్నించగా.. ఎట్టకేలకు ప్రత్యామ్నాయ భూమిని చూపిస్తే కేటాయిస్తామన్నారు. దాదాపు మూడుదశాబ్దాలపాటు అన్వేషించిన టీఎన్జీవోలు చివరికి 2017లో తిమ్మాపూర్ మండలంలోని యాదవులపల్లి సర్వే 502, 522లలో దాదాపు 21 ఎకరాల ప్రభుత్వ ఖాళీ స్థలం ఉందని గుర్తించి అధికారులకు విన్నవించారు. నివేదికను రెవెన్యూ అధికారులు కలెక్టర్ కార్యాలయానికి పంపినా.. ఇంతవరకూ ఎలాంటి ప్రొసీడింగ్స్ ఇవ్వలేదు. ఎనిమిదేళ్లుగా కాళ్లు అరిగేలా తిరుగుతున్నా నేటికీ న్యాయం జరగడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి స్థలాలు రాకుండా మిగిలిన 626 మందిలో దాదాపు 100 మంది మరణించారని, 200 మందికిపైగా అనారోగ్యంతో మంచాన పడ్డారని, దాదాపు 40 ఏళ్లుగా సాగుతున్న పోరాటాన్ని ఇకనైనా గుర్తించి న్యాయం చేయాలని సీఎం, కలెక్టర్కు విజ్ఞప్తి చేస్తున్నారు. -
జాతీయస్థాయి ఆర్చరీ పోటీలకు మహేందర్
సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రానికి చెందిన ఆడెపు మహేందర్ ఆర్చరీలో జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. శాతవాహన విశ్వవిద్యాలయం తీరందోళి (ఆర్చరీ) రాష్ట్రస్థాయి ఎంపిక పరీక్షలు ఈనెల 22న కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో జరిగాయి. యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ఓ కళాశాల విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. ఈసందర్భంగా మహేందర్ జాతీయస్థాయి పోటీలకు శాతవాహన యూనివర్సిటీకి ప్రాతినిఽ ద్యం వహిస్తారు. అక్టోబర్ 23 నుంచి 26 వరకు పంజాబ్ రాష్ట్రంలో జరిగే పోటీల్లో పాల్గొననున్నారు. వైద్య శిబిరాలను వినియోగించుకోవాలిసిరిసిల్లఅర్బన్: స్వస్త్ నారి స్వశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈనెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించే వైద్య శిబిరాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని డీఎంహెచ్వో రజిత తెలిపారు. మంగళవారం సిరిసిల్ల పట్టణ పరిధిలోని చిన్నబోనాల, సుందరయ్యనగర్లో నిర్వహించిన వైద్య శిబిరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. శిబిరాల్లో నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ లాంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. వైద్య శిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇల్లంతకుంట: అనంతగిరి అన్నపూర్ణ జలాశయం నుంచి రంగనాయకసాగర్కు 3,300 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 3.5 టీఎంసీలు కాగా, 3.26 టీఎంసీల నీరు ఉంది. బోయినపల్లి: మిడ్మానేరులోకి మంగళవారం 5,300 క్యూసెక్కుల ఇన్ఫ్లోగా వస్తోంది. ఎస్సారెస్పీ నుంచి 4,500 క్యూసెక్కుల నీరు వరదకాలువ ద్వారా చేరుతోంది. -
బ్రహ్మచారిణిగా అమ్మవారు
వేములవాడ: దేవీ నవరాత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం వేములవాడ రాజన్న ఆలయంలో రాజేశ్వరిదేవి అమ్మవారు బ్రహ్మచారిణి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.సీఎంను కలిసిన విప్వేములవాడ: వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ పనులపై ఇటీవల శృంగేరి పీఠాధిపతులను కలిసివచ్చిన నేపథ్యంలో విప్ ఆది శ్రీనివాస్ మంగళవారం సీఎం రేవంత్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు విప్ తెలిపారు. ఆయన వెంట సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి ఉన్నారు.భీమేశ్వర సదన్లోకి ఈవో కార్యాలయంవేములవాడ: రాజన్న ఆలయ విస్తరణ పనుల్లో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆలయంలోని కార్యాలయాలను తాత్కాలికంగా భీమేశ్వర సదన్కు మా ర్చారు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో), ఇంజనీరింగ్, అకౌంట్స్, పరిపాలన, లీజుల విభాగా లు, ఇతర విభాగాలు భీమేశ్వర సదన్కు తాత్కాలికంగా మారాయి. నూతనంగా ఏర్పాటు చేసిన ఈవో కార్యాలయంలో అర్చకులు మంగళవారం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈవో రమాదేవి తమ విధులు ప్రారంభించారు. ఈ మార్పు ఆలయ విస్తరణ పనులు పూర్తయ్యే వరకు కొనసాగనుందని, తద్వారా ఆలయ పరిపాలన సజావుగా కొనసాగుతుందని ఈవో తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ఉద్యోగులు ఈవోను సత్కరించారు.ఆయుర్వేద వైద్య శిబిరంసిరిసిల్లటౌన్: ధన్వంతరి పుట్టినరోజు సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని కుసుమరామయ్య ఉన్నత పాఠశాలలో పదవ జాతీయ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మెగా క్యాంపు నిర్వహించి ప్రజలకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. జిల్లా అధికారి డాక్టర్ శశిప్రభ, ఆయుర్వేద క్యాంప్ ఇన్చార్జి డాక్టర్ కళ్యాణి, వైద్యులు స్వరూప, స్వాతి, శ్వేత, డీపీఎంవో తిరుపతి, ఫార్మసిస్ట్ పుష్పలత, ప్రవీణ్, లావణ్య, ఎస్ఎన్ఓస్ సరోజ, జిల్లా యునాని డిస్పెన్సరీ యోగా శిక్షకుడు బి.శ్రీనివాస్, టి.స్వప్న, కృష్ణ, రిషిక, అశోక్, పుష్పలత, శిరీష, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్, పాఠశాల హెచ్ఎం మోతిలాల్, ఎన్జీవో అధ్యక్షుడు చింతోజు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.పారిశుధ్య చర్యలు చేపట్టాలిముస్తాబాద్(సిరిసిల్ల): పండుగల నేపథ్యంలో గ్రామాల్లో సంపూర్ణ పారిశుధ్య చర్యలు తీసుకోవాలని డీఎల్పీవో వీరభ్రదయ్య అన్నారు. మంగళవారం ముస్తాబాద్ మేజర్ పంచాయతీని సందర్శించి రికార్డులు పరిశీలించారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రధాన కూడళ్లతోపాటు, చెరువులు, వాగుల వద్ద లైటింగ్ ఏర్పాటు చేయాలని, రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బతుకమ్మ ఆడే ప్రాంతంలో బురద లేకుండా చూడాలన్నారు. ఎంపీవో వాజిద్, ఈవో రమేశ్, సిబ్బంది ఉన్నారు.జిల్లాలో మోస్తరు వర్షంసిరిసిల్ల: జిల్లాలో మంగళవారం మోస్తరు వర్షం కురిసింది. వేములవాడలో అత్యధికంగా 25.8 మి.మీ పడగా, గంభీరావుపేట 24.7, ఎల్లారెడ్డిపేట 13.7, ఇల్లంతకుంట 11.4, రుద్రంగి 6.8, వేములవాడరూరల్ 6.5, సిరిసిల్ల 1.6, కోనరావుపేట 2.2, ముస్తాబాద్ 3.0, తంగళ్లపల్లి 2.9, వీర్నపల్లి 0.3 మి.మీ, చందుర్తి బోయినపల్లి మండలాల్లో పెద్దగా వర్షం పడలేదు. -
వంతెన నిర్మించాలని నిరసన
వంతెనల నిర్మాణంపై పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండలంలోని ఎన్గల్ ఎల్లమ్మ ఆలయం ఎదుట మంగళవారం ప్రజా గొంతుక చీఫ్ పుప్పాల మోహన్ ఆధ్వర్యంలో చెవిలో చెట్టుకొమ్మలు పెట్టుకుని నిరసన తెలిపారు. ఎన్గల్ శివారులోని వాగుపై వంతెనలు లేక రేణుక ఎల్లమ్మ, పెద్దమ్మ ఆలయాలకు వెళ్లే వారితో పాటు రైతులు, కూలీలు, గీతకార్మికులు ఇబ్బందిపడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికై నా వంతెనల నిర్మాణం చేపట్టాలని లేకుంటే గ్రామస్తుల సహకారంతో భారీ ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. – చందుర్తి(వేములవాడ) -
జోరు వాన
సిరిసిల్ల: సోమవారం జోరుగా వాన కురిసింది. వేములవాడలో 25.8, గంభీరావుపేటలో 24.7, ఎల్లారెడ్డిపేటలో 13.7, ఇల్లంతకుంటలో 11.4 మి.మీ వర్షం కురిసింది. మంగళవారం శ్రీ 23 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025వైభవంగా శరన్నవరాత్రోత్సవాలువేములవాడ: శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శరన్నవరాత్రోత్సవాలు సోమవారం వైభవంగా ఆరంభమయ్యాయి. ఆలయ అర్చకులు ఉదయం 6.50 గంటలకు స్వస్తి పుణ్యహవచనం, రుత్విక్ వరణం, పంచగవ్య మిశ్రణం, అఖండ దీపస్థాపన, కలశస్థాపనం, గాయత్రి ప్రతిష్ట నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు శ్రీరాజరాజేశ్వరీదేవీ శైలపుత్రి అలంకారంలో నాగిరెడ్డి మండపంలో దర్శనం ఇచ్చారు. -
శాతవాహన స్నాతకోత్సవానికి రండి
● హాజరుకానున్న కేంద్రీయ విద్యాలయ వైస్చాన్స్లర్ బీజేరావు సప్తగిరికాలనీ(కరీంనగర్): శాతవాహన విశ్వవిద్యాలయం రెండో స్నాతకోత్సవానికి సిద్ధమైంది. గవర్నర్, శాతవాహన చాన్స్లర్ జిష్ణుదేవ్ వర్మ నవంబర్ 7న స్నాతకోత్సవం నిర్వహణకు అనుమతినిచ్చినట్లు వర్సిటీ వైస్చాన్స్లర్ ఉమేశ్కుమార్ తెలిపారు. ఈమేరకు ఆయన సోమవారం గవర్నర్ను కలిశారు. హైదరాబాద్లోని కేంద్రీయ విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ బీజేరావు హాజరుకానున్నట్లు తెలిపా రు. స్నాతకోత్సవం సందర్భంగా విద్యార్థులకు బంగారు పతకాలు, పీహెచ్డీ పరిశోధకులకు డాక్టరేట్ పట్టాలు అందజేస్తామన్నారు. 2019 ఆగస్టులో తొలిస్నాతకోత్సవం జరిగిందని, ఇప్పుడు ద్వితీయ స్నాతకోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. -
కలెక్టరేట్లో జిమ్
రాజన్నసిరిసిల్ల కలెక్టరేట్లో కొత్తగా జిమ్ ఏర్పాటు చేశారు. మొదటి అంతస్తులో ఆఫీస్ స్టాఫ్ మధ్యాహ్నం భోజనం చేసే ప్రదేశంలో అద్దాలతో కూడిన ప్రత్యేకమైన క్యాబిన్ను ఏర్పాటు చేసి జిమ్ పరికరాలు బిగించారు. ట్రేడ్మిల్, సైకిలింగ్ మిషన్తోపాటు మజిల్మిల్ను ఏర్పాటు చేశారు. మరోవైపు టేబుల్ టెన్నిస్ను ఏర్పాటు చేశారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝా చొరవతో జిమ్ను ఏర్పాటు చేయడం విశేషం. కలెక్టర్, అదనపు కలెక్టర్ క్యాంపు ఆఫీస్ల్లో నివాసం ఉండే అధికారులు జిమ్ చేసుకునే అవకాశం ఉంది. – సిరిసిల్ల -
కలవారి కోడలు ఉయ్యాలో..
సిరిసిల్లటౌన్/వేములవాడ: బతుకమ్మ వేడుకలను జిల్లాలోని మహిళలు సంబురంగా నిర్వహించుకుంటున్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో సోమవారం నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, ఉమ్మడి జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జిందం కళ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. వేములవాడలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా మహిళలు రాజన్న ఆలయంలో బతుకమ్మ ఆడా రు. ధర్మగుండంలో నిమజ్జనం చేశారు. తల్లి చేతిలో బతుకమ్మను మాయం చేసిండ్రు ఆత్మగౌరవానికి ప్రతీకై న బతుకమ్మను తెలంగాణ తల్లిచేతిలో లేకుండా రేవంత్రెడ్డి సర్కారు మాయం చేసిందని అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ భవన్లో బతుకమ్మ వేడుకలకు హాజరైన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మలు, బోనాలను నెత్తిన పెట్టుకుని మహిళలు ఉద్యమించిన విషయాన్ని గుర్తు చేశారు. వలసపాలనలో వివక్షకు గురైన బతుకమ్మ పండుగకు బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వం తరఫున ఆడపడుచులకు చీరెలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఆడపడుచులకు ఇస్తామన్న రెండేసి చీరలు ఎటుపోయాయని ప్రశ్నించారు. -
వెంకన్న బ్రహ్మోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు
● సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు సిరిసిల్లటౌన్: శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. తన కార్యాలయంలో బ్రహ్మోత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై సోమవారం పోలీస్, మున్సిపల్, వైద్యం, ఫైర్ తదితర శాఖల అధికారులతో సమీక్షించారు. భక్తులకు వసతులు కల్పించాలని సూచించారు. మాడవీధుల్లో చలువ పందిళ్లు, మౌలిక వసతుల ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం బ్రహ్మోత్సవాల పోస్టర్లను డీఎస్పీ చంద్రశేఖర్రెడ్డితోపాటుగా ఆవిష్కరించారు. మున్సిపల్ కమిషనర్ ఎంఏ ఖదీర్పాషా, ఆలయ ప్రధాన అర్చకులు మాడంరాజు కృష్ణమాచారి, టీపీసీసీ కో–ఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్ పాల్గొన్నారు. -
అందరూ బాగుండాలి
వేములవాడ: అమ్మవారి దీవెనలతో సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు బాగుండాలని మొక్కుకున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. దేవీ శరన్నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని వేములవాడ రాజన్నను, అమ్మవారలను సోమవారం దర్శించుకున్నారు. ఏఈవో అశోక్, ఇతర అధికారులు ఉన్నారు. సిరిసిల్లటౌన్: జిల్లాలోని 108 వాహనాలను ఈఏంఆర్ఏ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ రాష్ట్ర ఆడిటింగ్ అధికారి వెంకటేశ్ సోమవారం తనిఖీ చేపట్టారు. జిల్లా ఆస్పత్రిలో నిలిపి ఉంచిన నియోనాటల్ అంబులెన్స్, 108 వాహనాలను తనిఖీ చేశారు, వెంటిలేటర్, మానిటర్, ఇన్ఫ్యూజన్ పంప్, ఆక్సిజన్ సిలిండర్లు, అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్సకు ఉపయోగించే పరికరాల పనితీరును పరిశీలించారు, వాహనాలలోని రికార్డులను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన సేవలు అందించేందుకు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గోల్డెన్ అవర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలిపారు. కార్యక్రమంలో 108 సిబ్బంది పెద్ది శ్రీనివాస్, బుర్ర స్వాతి, నునావత్ మదన్, బత్తుల రాజు, మామిడాల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్లటౌన్: చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో పాఠశాల స్థాయి నుంచి జాతీయస్థాయి వరకు బాలబాలికలకు నిర్వహిస్తున్న చిన్మయ గీతా పఠన పోటీలలో సిరిసిల్ల చిన్నారులు రాణించారు. కరీంనగర్లో నిర్వహించిన పోటీల్లో స్థానిక శ్రీసరస్వతీ శిశు మందిర్ విద్యార్థులు దూస రుత్విక్, కొయ్యడ స్వస్తిక్, కొక్కుల ప్రశస్త, మ్యాన శ్రీహిత, గాజుల తేజశ్రీ , చిన్మయ బాలవిహార్ నుంచి కుడిక్యాల తేజస్వి పాల్గొన్నారు. జిల్లా స్థాయి పోటీల్లో మ్యాన శ్రీహిత, ప్రథమ, కుడిక్యాల తేజస్వి ద్వితీయ, గాజుల తేజశ్రీ తృతీయ స్థానాల్లో రాణించారు. మ్యాన శ్రీహిత నవంబర్ 9న కడపలో నిర్వహించే రెండు తెలుగు రాష్ట్రాల రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. వీరిని చిన్మయ మిషన్ సిరిసిల్ల అధ్యక్షుడు సజ్జనం శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ లకావత్ మోతిలాల్, ఉపాధ్యక్షులు గజ్జెల్లి రామచంద్రం, శ్రీపతి కోటేశ్వరి, ప్రధాన కార్యదర్శి నల్ల సత్యనారాయణ అభినందించారు. సిరిసిల్లటౌన్: పదో అంతర్జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని సిరిసిల్లలో సోమవారం నిర్వహించారు. జిల్లా ఆయుశ్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి నుంచి గాంధీమార్కెట్ చౌరస్తా వరకు ర్యాలీ తీశారు. జిల్లా ఆయుష్ నోడల్ అధికారి డాక్టర్ శశిప్రభ, జిల్లా ప్రోగ్రాం అధికారి తిరుపతి, డాక్టర్ స్వరూప, డాక్టర్ స్వాతి, ఫార్మసిస్ట్ ప్రవీణ్, పుష్పలత, పీఎన్వో సరోజ, లావణ్య, యోగా శిక్షకులు బి.శ్రీనివాస్, టి.స్వప్న, ఎలిగేటి కృష్ణ, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్ పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పెన్షన్దారులకు, వికలాంగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుతూ వికలాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, గీత, బీడీ కార్మికులు సోమవారం రాచర్లగొల్లపల్లి పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఖానాపురం లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం వికలాంగులకు రూ.6వేలు, కొత్త పెన్షన్దారులకు రూ.4వేలు ఇవ్వాలని కోరారు. కార్యదర్శి రామకృష్ణకు వినతిపత్రం అందజేశారు. అందె శామ్యూల్, అంజలి, నాగరాజు, అంజవ్వ, ఎల్లవ్వ, సునంద, రేణుక, నర్సయ్య, బాలయ్య పాల్గొన్నారు. -
‘కొస’ముట్టని ప్రస్థానం
సిరిసిల్ల: దశాబ్దాల క్రితం ఉద్యమబాట పట్టిన మావోయిస్ట్ అగ్రనేతలు నేలకొరుగుతున్నారు. ప్రజాసమస్యలపై ఆయుధం పట్టిన వారు.. ఎన్కౌంటర్లో తూటాలకు బలైపోతున్నారు. నాలుగు దశాబ్దాల క్రితం ఆనాటి పరిస్థితులతో అడవీబాట పట్టిన అన్నలు ఉద్యమదారిలో అర్ధంతరంగా అసువులు బాస్తున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్లో సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు, జిల్లాకు చెందిన కడారి సత్యనారాయణరెడ్డి అలియస్ కొస ప్రాణాలు కోల్పోయారు. ఆనాటి పరిస్థితులు.. ఉద్యమబాటపై కథనం.. – IIలో.. -
మావోయిస్టులకు ఎదురుదెబ్బ
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/సాక్షి, సిద్దిపేట/సిరిసిల్ల: ఛత్తీస్గఢ్–మహారాష్ట్ర సరిహద్దులోని అబూజ్మడ్ అడవుల్లో సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కడారి సత్యనారాయణరెడ్డి (67) అలియాస్ కోసా, కట్టా రామచంద్రారెడ్డి (63) అలియాస్ వికల్ప్ మృతి చెందారు. ఈ ఘటనపై నారాయణపూర్ ఎస్పీ రాబిన్సన్ గుడియా మాట్లాడుతూ.. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో మహారాష్ట్రకు సమీప సరిహద్దులో ముస్ఫర్షి దగ్గరున్న దట్టమైన అడవుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారనే సమాచారం శుక్రవారమే పోలీసులకు అందిందని, దీంతో భద్రతాదళాలు మావోలు తలదాచుకున్న ప్రదేశాన్ని రెండు వైపుల నుంచి చుట్టుముడుతూ ముందుకు వెళ్లాయన్నారు. సోమవారం ఉదయం ఇరువర్గాల మధ్య కాల్పులు జరగ్గా, కడారి సత్యనారాయణరెడ్డి, కట్టా రామచంద్రారెడ్డి చనిపోయినట్టుగా గుర్తించామని వివరించారు. ఘటనా స్థలం నుంచి ఒక ఏకే 47, ఒక ఇన్సాస్, ఒక బీఎల్జీ, పేలుడు పదార్థాలతోపాటు మావోయిస్టుల వ్యక్తిగత సామగ్రి, విప్లవ సాహిత్యం స్వా«దీనం చేసుకున్నామని తెలిపారు. మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వాన్ని పద్ధతి ప్రకారం భద్రతా దళాలు తుదముట్టిస్తున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్షా ఎక్స్లో పోస్ట్ చేశారు. రెడ్ టెర్రర్కు రోజులు దగ్గరపడ్డాయని పేర్కొన్నారు. ఇద్దరూ ఇద్దరే.. 21వ ఆవిర్భావ వేడుకలు మొదలైన రెండో రోజే మావోయిస్టు పార్టీ ఇద్దరు అగ్రనేతలను కోల్పోయింది. అందులో ఒకరైన కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్ కోసా స్వస్థలం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాల్రావుపల్లె. సత్యనారాయణరెడ్డి తండ్రి కిష్టారెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తల్లి అన్నమ్మ గృహిణి. సోదరుడు కరుణాకర్రెడ్డి రిటైర్డ్ ఎంఈవో. 1980 దశకంలో అప్పటి పీపుల్స్వార్ పార్టీలో చేరిన సత్యనారాయణరెడ్డి 45 ఏళ్లుగా ఇంటి ముఖం చూడలేదు. ఆయన తండ్రి కిష్టారెడ్డి 2013 జూన్ 8న మరణించాడు. తల్లి అన్నమ్మ 2012 నవంబర్ 14న గోపాల్రావుపల్లెలో అనారోగ్యంతో మృతిచెందారు. సత్యనారాయణరెడ్డి సిరిసిల్లలో ప్రాథమికవిద్య అభ్యసించి పెద్దపల్లి ఐటీఐలో చదువుకున్నారు. అక్కడే బసంత్నగర్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగంలో చేరిన సత్యనారాయణరెడ్డి కార్మీకుల హక్కుల కోసం ఉద్యమించారు. ఈ క్రమంలో సిమెంట్ ఫ్యాక్టరీ మేనేజర్ హత్యకు గురికాగా.. ఆ కేసులో సత్యనారాయణరెడ్డి జైలుకు వెళ్లాడు. జైలు నుంచి వచ్చాక అప్పటి సింగరేణి కార్మిక సమాఖ్య(సికాస)లో చురుకైన నాయకుడిగా పనిచేస్తూ పీపుల్స్వార్లో చేరారు. చనిపోయే వరకూ కేంద్ర కమిటీ సభ్యుడి హోదాలో సెంట్రల్ రీజినల్ బ్యూరో ఇన్చార్జ్ బాధ్యతలు చూస్తున్నారు. పార్టీ వ్యూహకర్తల్లో కీలకమైన వ్యక్తిగా ఉన్నారు. దండకారణ్యంలో విప్లవ పోరాటానికి పునాదులు వేసిన వారిలో సత్యనారాయణరెడ్డి ఒకరు. అతని తలపై మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు రూ.3 కోట్ల రివార్డును ప్రకటించాయి. కట్టా రామచంద్రారెడ్డి : మరో కేంద్ర కమిటీ సభ్యుడు కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ రాజుదాదా, అలియాస్ వికల్ప్కు గుడ్సా ఉసెండీ అనే పేరు కూడా ఉంది. ఈ పేరుతో అనేక దాడుల్లో ఆయన పాల్గొన్నారు. పీపుల్స్వార్ పార్టీకి సంబంధించి ఆర్కే పేరు ఎంత పాపులరో, ఛత్తీసగఢ్లో గుడ్సా ఉసెండీ అనే పేరుకు అంత ప్రాముఖ్యత ఉంది. ఛత్తీస్గఢ్ నుంచి హిడ్మా నూతన నేతగా ఎదిగే వరకు దళాల్లోకి కొత్తగా వచ్చిన సభ్యులు గుడ్సా ఉసెండీ పేరు పెట్టుకునేందుకే ఆసక్తి చూపించేవారు. పదవ తరగగతి వరకు కోహెడలోని ప్రభుత్వ పాఠశాలలో చదివారు. టీటీసీ పూర్తి అయిన తర్వాత కరీంనగర్ జిల్లా కాటారం మండలం పెంచికలపేట గ్రామంలో ప్రభుత్వ టీచర్గా ఉద్యోగం వచ్చింది. ఆ ప్రాంతంలో పీపుల్స్వార్ ప్రభావం ఎక్కువగా ఉండేది. తర్వాత బదిలీపై కోహెడ మండలం వరికొలుకు వచ్చారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే పీపుల్స్ వార్ సిద్ధాంతాలకు ఆకర్షితుయ్యాడు. అప్పటికే శాంతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రభుత్వ టీచర్ ఉద్యోగానికి లాంగ్ లీవ్ పెట్టి ఎల్ఎల్బీ చేసేందుకు ఔరంగబాద్కు వెళ్లాడు. అక్కడి నుంచే 1989 సంవత్సరంలో భార్య శాంతితో కలసి పీపుల్స్వార్లో చేరేందుకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. 12 సంవత్సరాల క్రితం రాయ్పూర్లో భార్య శాంతి, పిల్లలతో సహా లోంగిపోయారు. వీరు ప్రస్తుతం హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. మూడున్నర దశాబ్ధాలుగా పీపుల్స్వార్, మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో రామచంద్రారెడ్డి పని చేశారు. ఇతనిపై 40 లక్షల రివార్డు ఉంది. కూతురి వివాహానికి సైతం రాలేదు. డీజీపీ చెప్పినట్టుగానే.. మావోయిస్టు పార్టీ చీఫ్ నంబాళ కేశవరావు ఎన్కౌంటర్ 2025 మే 21న జరిగింది. ఈ సమయంలో ఛత్తీస్గఢ్ డీజీపీ అరుణ్దేవ్ గౌతమ్ మాట్లాడుతూ.. మావోయిస్టు పార్టీలో అగ్రనేతలంతా తమ రాడార్లో ఉన్నారని, సరైన సమయం వచ్చినప్పుడు ఆపరేషన్లు చేపడుతున్నామని, అలాంటి ఓ ఆపరేషన్లో నంబాల ఎన్కౌంటర్ జరిగిందని తెలిపారు. ఆయన చెప్పినట్టుగానే గత మే నుంచి వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లలో ఆ పార్టీకి చెందిన అగ్రనేతలు చనిపోతున్నారు. – జూన్లో తెంటు లక్ష్మీనరసింహాచలం అలియాస్ సుధాకర్, జూలైలో గాజర్ల ఉదయ్ అలియాస్ గణేశ్ చనిపోయారు. – సెప్టెంబరులో అయితే కోలుకోలేని దెబ్బ పడింది. ఒకే నెలలో మోడెం బాలకృష్ణ అలియాస్ మనోజ్, పర్వేశ్ అలియాస్ సహదేవ్, కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణరెడ్డి మొత్తం నలుగురు చనిపోయారు. – అంతకుముందు ఏప్రిల్లో ప్రయాగ్మాంఝీ, జనవరిలో చలపతి మరణించారు. – మరో కేంద్ర కమిటీ సభ్యురాలు సుజాత లొంగిపోగా, మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ పార్టీ లైన్తో విభేదించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. -
చక..చకా పనులు
వేములవాడ: రాజన్న ఆలయ విస్తరణ పనులు చేపట్టేందుకు భీమన్నగుడిలో నిర్మాణాలు, క్యూలైన్లు, షెడ్ల నిర్మాణాలు చకచకా సాగుతున్నాయి. ఆలయం పక్కనే ఉన్న ఈవో కార్యాలయం, మెయిన్ గెస్ట్హౌస్, ప్రసాదాల తయారీ గోదాం, అకౌంట్స్ విభాగాల భవనాలను కూల్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. భీమన్న గుడిలోకి క్యూలైన్లు, ఈశాన్యం పెద్ద దర్వాజ, మండపాలు, షెడ్ల నిర్మాణం పనులు వేగం అందుకున్నాయి. వేదపాఠశాలను శివస్వాముల భవనంలోకి మార్చుతూ ఈ భవనంలో ప్రసాదాల తయారీ గోదాంను తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ పనులు పూర్తయిన వెంటనే భీమన్నగుడిలో దర్శనాలు ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఈవో కార్యాలయం, ఇంజినీరింగ్ విభాగం, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, అకౌంట్స్ ఆఫీస్, ప్రొటోకాల్ ఆఫీస్, ఆలయ మెయిన్ గోదాంలను భీమేశ్వర సదన్లోని మొదటి అంతస్తులోకి తరలిస్తున్నారు. ఈవో కార్యాలయం కూల్చివేత పనులు ఆదివారం నుంచి ప్రారంభించారు. విద్యానగర్లో బతుకమ్మ ఆడుతున్న మహిళలు -
వేతనాలు లేక వెతలు తీరక !
● ‘ఉపాధి’ సిబ్బందికి అందని వేతనాలు ● నాలుగు నెలలుగా ఎదురుచూపులే.. ● పండుగకు తప్పని ఆర్థిక తిప్పలు ● కూలీలకూ రూ.11కోట్లకు పైగా బకాయిలుఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ చందుర్తి మండల కేంద్రానికి చెందిన ఉపాధిహామీ కూలీ మర్రి ఎల్లవ్వ. ఈమె ఏప్రిల్, మే నెలల్లో ఐదు వారాలపాటు ఉపాధిహామీ పనికి వెళ్లింది. రెండు వారాల డబ్బులు చెల్లించగా.. మరో మూడు వారాల డబ్బులు రావాల్సి ఉంది. ఈ సమస్యను జిల్లా వ్యాప్తంగా 67,990 మంది కూలీలు ఎదుర్కొంటున్నారు. వీరికి రూ.11,01,38,030 కూలీ డబ్బులు రావాల్సి ఉంది. చందుర్తి (వేములవాడ): వలసల నివారణకు ప్రవేశపెట్టిన ఉపాధిహామీ పథకం లక్ష్యం నీరుగారుతోంది. స్థానికంగానే పని కల్పించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ పథకంలో పనిచేసిన కూలీలకు నాలుగు నెలలుగా వేతనాలు అందడం లేదు. పనులు చేసినా పస్తులుండే పరిస్థితి వచ్చిందని జిల్లాలోని ఉపాధిహామీ కూలీలు వాపోతున్నారు. సిబ్బంది, ఉద్యోగులదీ అదే పరిస్థితి ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న సిబ్బందితోపాటు ఉద్యోగులు కూడా వేతనాల కోసం ఎదురుచూసే దుస్థితి నెలకొంది. నిత్యం కూలీలతో పనులు చేయిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు మూడు నెలలుగా వేతనాలు అందలేవు. మండలాల్లో పనిచేస్తున్న ఏపీవోలు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఇంజినీరింగ్ కన్సల్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లకు రెండు నెలలుగా వేతనాలు అందక ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగభద్రత లేక వేతనాలు అందక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు పని దినాలను బట్టి వేతనాలు అందిస్తుండడంతో.. చేసిన పనికి డబ్బులు రాకపోవడంతో పలువురు కూలీలు పనులు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో ఫీల్డ్ అసిస్టెంట్లకు సైతం వేతనాల్లో కోత పడేలా ఉందని వారు వాపోతున్నారు.మండలం కూలీలు డబ్బులు బోయినపల్లి 4,641 రూ.43,14,352 చందుర్తి 4,842 రూ.87,78,857 ఇల్లంతకుంట 7,942 రూ.1,27,43,810 గంభీరావుపేట 8,406 రూ.2,13,42,525 కోనరావుపేట 7,312 రూ.1,35,40,739 ముస్తాబాద్ 7,011 రూ.92,32,851 రుద్రంగి 2,359 రూ.36,11,226 తంగళ్లపల్లి 7,566 రూ.88,99,015 వీర్నపల్లి 4,913 రూ.1,17,34,766 వేములవాడ 1,301 రూ.11,50,834 వేములవాడరూరల్ 3,246 రూ.33,88,132 ఎల్లారెడ్డిపేట 8,451 రూ.1,14,01,283 ఏపీడీ 01 ప్లాంటేషన్ సూపర్వైజర్ 01 ఔట్సోర్సింగ్ సిబ్బంది 04 ఏపీవోలు 09 కంప్యూటర్ ఆపరేటర్లు 19 ఇంజినీరింగ్ కన్సల్టెంట్లు 05 టెక్నికల్ అసిస్టెంట్లు 34 ఫీల్డ్ అసిస్టెంట్లు 152 -
పితృదేవతలకు సంతర్పణ
సిరిసిల్లటౌన్: పెద్దల అమావాస్యను సిరిసిల్ల పట్టణ ప్రజలు ఆదివారం భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. బాధ్రపద అమావాస్య రోజున పితృదేవతలకు బియ్యం ఇవ్వడం ఆనవాయితీ. పట్టణంలోని వేదపండితులు, పూజారులకు పెద్దల పేరున బియ్యం, కూరగాయలు ఇచ్చి ఆశీర్వాదాలు పొందారు. బియ్యం ఇచ్చేందుకు భారీగా తరలిరావడంతో స్థానిక పెద్దబజారు హనుమాన్ ఆలయం, వెంకటేశ్వర ఆలయం, గీతానగర్ సమీపంలోని కాలనీల్లో అయ్యవార్లు, బ్రాహ్మణులు, జంగమయ్య ఇళ్ల వద్ద భారీ క్యూలైన్లు కనిపించాయి. బియ్యం, ఉప్పు, పప్పు, చింతపండు, నూనెలు ఇచ్చారు. -
ఏమేమి పువ్వొప్పునే..
● మానేరుతీరం.. పూలవనం సిరిసిల్లటౌన్/వేములవాడ: జిల్లాలోని వీధులు విరివనాలయ్యాయి. మానేరుతీరంలో పూలజాతర వెలసింది. ఒక్కేసి పువ్వేసి చందమామ అంటూ జిల్లాలోని గ్రామాలు మారుమోగాయి. తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుమ్మ వేడుకలు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. ‘బతుకమ్మ..బతుకమ్మ ఉయ్యాలో..’ అంటూ ఆడపడచులు ఎంగిలిపూల పండుగను సంబురంగా జరుపుకున్నారు. బతుకమ్మ ఆటలు.. కొలాటాలతో సిరిసిల్ల పట్టణంలో మహిళలు సంతోషంగా ఆడిపాడారు. మానేరుతీరంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ తొట్టిలలో నిమజ్జనం చేశారు. పసుపు, కుంకుమలు, వాయినాలు ఇచ్చుపుచ్చుకున్నారు. ఫలహారాలతో గౌరమ్మకు నైవేద్యం సమర్పించారు. వేములవాడ రాజన్న ఆలయం వద్ద స్థానిక మహిళలు బతుకమ్మ సంబరాలను అంగరంగ వైభవంగా చేసుకున్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద బతుకమ్మ ఆట ఆడిన మహిళలు మూలవాగులోని తెప్ప వద్ద నిమజ్జనం చేశారు. -
పకడ్బందీగా పెట్రోలింగ్
మహేశ్ బీ గీతే, ఎస్పీ సిరిసిల్లక్రైం: బతుకమ్మ, దసరా పండుగలతో విద్యాసంస్థలకు దాదాపు పక్షం రోజులపాటు సెలవులు రావడంతో పలువురు పట్టణాల నుంచి స్వగ్రామాలకు వెళ్తున్నారు. ఇదే అదునుగా దొంగలు తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తున్నారు. తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడ్డ ఘటనలు గతంలో అనేకం ఉన్నాయి. సొంతూళ్లకు వెళ్తున్న వారు సమీప ఠాణాలో సమాచారం ఇస్తే ఆ ప్రాంతంలో గస్తీ పెంచుతామని ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. సెలవుల నేపథ్యంలో జిల్లాలో పెట్రోలింగ్ను మరింత పకడ్బందీగా చేపడతామన్నారు. దొంగతనాలను కట్టడి చేసేందుకు ఇప్పటికే పోలీసులకు పలు సూచనలు చేసినట్లు తెలిపారు. పండుగల సెలవుల నేపథ్యంలో జిల్లాలో తీసుకుంటున్న భద్రతచర్యలు, ప్రజలు తీసుకోవాల్సిన ముందుజాగ్రత్తలపై జిల్లా ఎస్పీ మహేశ్ బి గీతే ‘సాక్షి’తో పలు విషయాలు పంచుకున్నారు. ఆయన మాటల్లోనే.. -
ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సిరిసిల్ల: ఓటర్ జాబితాను స్పెషల్ ఇంటెన్సివ్ రివి జన్(ఎస్ఐఆర్) కోసం ఏ, బీ, సీ, డీగా విభజించి, ఈనెల 23లోపు ఎస్ఐఆర్ పనులు పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా సూచించారు. కలెక్టరేట్లో శనివారం రెవెన్యూ అధికారులతో సమీక్షించా రు. 2002 నాటి ఎస్ఐఆర్ డేటాను 2025 డేటాతో పరిశీలించి కామన్గా ఉన్న పేర్లు మినహాయించి 2002 తర్వాత ఓటరుగా నమోదైన వారి వివరాలను మరోసారి ధ్రువీకరించాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుత ఓటర్ జాబితా, 2002లో ఉన్న ఓటర్ల కామన్ డేటాతో కేటగిరీ ఏ, 2002లో నమోదు కాకుండా 1987 కంటే ముందు జన్మించిన ఓటర్లతో కేటగిరీ బీ, 1987 నుంచి 2004 మధ్య పుట్టి ఉంటే కేటగిరీ సీ, 2004 తర్వాత ఉంటే కేటగిరీ డీ కింద పరిగణించాలని సూచించారు. ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబాయి పాల్గొన్నారు. బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి బతుకమ్మ ఉత్సవాలను ఈనెల 21 నుంచి 30 వరకు ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ కోరారు. గ్రామపంచాయతీల పరిధిలోని చెరువులను పరిశుభ్రంగా ఉంచి, వెలుతురు, ఇతర వసతులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈనెల 30న గ్రాండ్ ఫినాలే ‘సద్దుల బతుకమ్మ’ను ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సన్నద్ధం కావాలని సూచించారు. ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని రోడ్ల మరమ్మతులకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి రోడ్లు, ఇందిరమ్మ ఇండ్ల పురోగతిని శనివారం పరిశీలించారు. నారెడ్డిపల్లి రోడ్డు పనులు చేపట్టాలని, తాళ్లపల్లి నుంచి బేగంపేట వెళ్లే రోడ్డులో ఉన్న అంపు ఒర్రైపె బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. కార్లు వెళ్లలేని పలు రోడ్లను ఎమ్మెల్యే, కలెక్టర్లు ద్విచక్రవాహనాలపై వెళ్లి పరిశీలించారు. -
సెలవుల పూట.. ఇంటి బాట
బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు శనివారం ఇంటిబాట పట్టారు. సిరిసిల్లతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న గురుకులాలు, కస్తూర్భా విద్యాసంస్థల విద్యార్థినులను తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు రావడంతో హాస్టళ్ల వద్ద సందడి కనిపించింది. వీరంతా తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు సిరిసిల్లలోని కొత్త, పాత బస్టాండ్లకు చేరుకోవడంతో రద్దీగా మారింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, రాజన్నసిరిసిల్ల -
డిగ్రీ కళాశాల స్థలం కబ్జా
● ఏళ్లుగా పట్టించుకోని అధికారులు ● క్రమంగా ఆక్రమిస్తున్న ● ఉన్నతాధికారులకు ఫిర్యాదువేములవాడఅర్బన్: అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ స్థలంలో కబ్జాలపర్వం కొనసాగుతోంది. దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం ఏర్పాటైన కాలేజీ స్థలం కాలక్రమేన ఆక్రమణలకు గురవుతోంది. కాలేజీకి చుట్టుపక్కల నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారే తమ సామాజిక అవసరాల కోసం ఆక్రమించేస్తున్నారు. ఈ విషయం ఇటీవల వసతిగృహం నిర్మాణానికి స్థలాన్ని జిల్లా అధికారులు పరిశీలించిన సమయంలో వెలుగుచూసింది. 1987లో 25 ఎకరాలు వేములవాడ మండలం అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలను 1987లో ఏర్పాటు చేశారు. చంద్రగిరి గ్రామపంచాయతీ పరిధిలోని తెట్టకుంట రెవెన్యూలోని సర్వే నంబర్ 38 కేకేలో 25 ఎకరాల భూమిని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు కేటాయించారు. కరీంనగర్–సిరిసిల్ల ప్రధాన రహదారిని ఆనుకుని డిగ్రీ కాలేజీని నిర్మింంచారు. విశాలమైన మైదానం ఉంది. అయితే భవన నిర్మాణ సమయంలో కాలేజీకి ముందు మాత్రమే ప్రహరీ నిర్మించారు. వెనుకభాగం, పక్క భాగం ప్రహరీ లేకపోవడంతో ఆక్రమణలకు గురవుతుంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 25 తరగతి గదులు ఉన్నాయి. డిగ్రీ కళాశాలలో మొత్తం 190 మంది విద్యార్థులు చదువుతున్నారు. 2021లో ఇదే కళాశాల భవనంలో జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలను తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. డిగ్రీ కళాశాల తరగతి గదుల నుంచి 15 గదులను జేఎన్టీయూ కాలేజీకి అప్పగించారు. దీంతో రెండు కళాశాలలకు ఇరుకుగా మారడంతో విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు. ఒక సంవత్సరం మాత్రమే తాత్కలికంగా నడుస్తుందన్న జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ నాలుగేళ్లుగా ఇక్కడే కొనసాగుతోంది. ఆక్రమణల్లో స్థలం డిగ్రీ కళాశాల స్థలానికి ప్రహరీ లేకపోవడంతో ఆక్రమణలకు గురవుతోంది. కళాశాల వెనుక భాగం చిన్నగా బండరాళ్లు ఉండడంతో ఓ సామాజికవర్గానికి చెందిన వారు ఆలయాన్ని నిర్మించారు. కళాశాల భవనానికి పక్క భాగం ప్రహరీ లేకపోవడంతో ఆ ప్రాంతంలోని కాలనీవాసులు సమాధులు ఏర్పాటు చేశారు. ఎలాంటి గోడ లేకపోవడంతో కొందరు ఆకతాయిలకు రాత్రి, పగలు అడ్డాగా మారిందని స్థానికులు పేర్కొంటున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలాన్ని కాపాడాలని విద్యార్థులు, స్థానికులు కోరుతున్నారు. మహిళ వసతిగృహం డిగ్రీ కళాశాల ఆవరణలో ఇటీవల కళాశాలకు పీఎం ఉషా(ప్రధానమంత్రి ఉచ్చతర శిక్షా అభియాన్)లో రూ.10కోట్లతో మహిళ వసతిగృహం నిర్మాణానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. పనులు కూడా ప్రారంభమయ్యాయి. అన్ని హంగులతో కూడిన వసతిగృహం ఏర్పాటు చేయనున్నారు. వసతిగృహంలో సుమారుగా 300 మందికి వసతి కల్పించనున్నారు. -
ఖైదీలకు ఉపాధి అవకాశాలు
● కరీంనగర్ జైలు బంకు సేవలు భేష్ ● జైళ్లశాఖ డీజీ సౌమ్యమిశ్రా కరీంనగర్క్రైం: జైళ్లలో ఖైదీలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, కరీంనగర్లో ఖైదీలు తయారు చేసిన అగర్బత్తీలు రాష్ట్రవ్యాప్తంగా విక్రయమవుతున్నాయని జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్యామిశ్రా అన్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ జైలుకు ఓ ట్రక్కు, అగర్బత్తీల తయారీ మిషన్, జిరాక్స్ మిషన్, కంప్యూటర్లు బహూకరించారు. వాటిని శనివారం జైళ్లశాఖ డీజీ సౌమ్య ఐజీ సంపత్, కరీంనగర్ జైలు సూపరింటెండెంట్ విజయ్దేని, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చీఫ్ మేనేజర్ స్వామినాథన్తో కలిపి ఆవిష్కరించా రు. అనంతరం మాట్లాడుతూ ఇండియన్ ఆయిల్ ఆధ్వర్యంలో జైళ్లశాఖకు పెద్దఎత్తున సహాయం అందించారని తెలిపారు. జైలు, ఇండియన్ ఆయిల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న కరీంనగర్ పెట్రోల్ బంక్ సేవల్లో ప్రథమస్థానంలో కొనసాగుతోందన్నారు. కరీంనగర్ జైలులో తయారవుతున్న అగర్బత్తీలు రాష్ట్రస్థాయిలో పెరుగాంచాయన్నారు. కరీంనగర్ జైలులో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేసి ఖైదీలకు డిజిటల్ టెక్నాలజీపై అవగాహన కల్పిస్తామన్నారు. అనంతరం జైలులో ఖైదీల యోగక్షేమాలు, సదుపాయాలను పరిశీలించారు. జైలర్లు పి.శ్రీనివాస్, బి.రమేశ్, ఎ.శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ జైలర్లు ఎల్.రమేశ్, అజయ్చారి ఉన్నారు. -
హాస్టల్ భవనాన్ని మార్చండి
● తల్లిదండ్రుల నిరసన సిరిసిల్ల అర్బన్: పెద్దూరులోని మహాత్మాజ్యోతిబాపూలే గురుకుల పాఠశాల హాస్టల్ను మార్చాలని కోరుతూ విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం సిరిసిల్ల– కామారెడ్డి ప్రధాన రహదారిపై నిరసన తెలిపారు. వారు హాస్టల్లో 379 మంది విద్యార్థులు ఉండగా 8 గదులు మాత్రమే ఉన్నాయన్నారు. కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో తరగతికి 70 మంది వరకు విద్యార్థులు ఉండగా.. అందులోనే చదువుకోవడం, పడుకోవడం ద్వారా ఇబ్బంది పడుతున్నారన్నారు. పోలీసులు అక్కడికి చేరుకొని వారిని సముదాయించి ఆందోళన విరమింపజేశారు. వీర్నపల్లి(సిరిసిల్ల): వీర్నపల్లి మండల కేంద్రంలోని కస్తూర్భాగాంధీ విద్యాలయం సిబ్బందికి శనివారం నోటీస్లు వచ్చాయి. పాఠశాలలో శుక్రవారం అల్పాహారంలో పురుగులు వచ్చిన ఘటనపై డీఈవో వినోద్కుమార్ స్పందించారు. ఈ షోకాజ్ నోటీసులకు కేజీబీవీ సిబ్బంది సంజాయిషీ సైతం ఇచ్చారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత పడతామని లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చామని కేజీబీవీ ఎస్వో శకుంతల తెలిపారు. భక్తులపై దాడి చేస్తే కేసులు పెడతాంవేములవాడ: రాజన్నను దర్శించుకునేందుకు వచ్చే భక్తులపై దాడులకు దిగినా, భయభ్రాంతులకు గురిచేస్తూ డబ్బులు డిమాండ్ చేసినా కేసులు నమోదు చేస్తామని సీఐ శ్రీనివాస్ హెచ్చరించారు. పట్టణంలో రోడ్లపై తిరుగుతున్న పలువురు హిజ్రాలకు శనివారం పట్టణ పోలీస్స్టేషన్ ఆవరణలో సీఐ కౌన్సెలింగ్ చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని కందికట్కూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ఉపాధ్యాయులను కేటాయించాలని కోరుతూ విద్యార్థుల తల్లిదండ్రులు శని వారం బీటీ రోడ్డుపై బైటాయించారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 65 మంది విద్యార్థులు, ప్రీప్రైమరీలో మరో 22 మంది ఉంటే.. ఇద్దరు టీచర్లు మాత్రమే ఉన్నారని తెలిపారు. మరో టీచర్ను కేటాయించాలని డిమాండ్ చేశారు. అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను కలిసి పాఠశాల పరిస్థితులపై విన్నవించారు. వైభవంగా మహాలింగార్చనవేములవాడ: రాజన్న సన్నిధిలో శనివారం రాత్రి మహాలింగార్చన వైభవంగా నిర్వహించారు. స్వామి వారి మహామంటపంలో ఆలయ అర్చకులు రెండు గంటలపాటు ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం మాసశివరాత్రి వేడుకలు నిర్వహించారు. సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రంలోని ప్రజలను కుక్కలు, కోతుల నుంచి రక్షించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్ కోరారు. స్థానిక బీవై నగర్లోని అమృత్లాల్ శుక్లా కార్మిక భవనంలో శనివారం విలేకరుల స మావేశంలో మాట్లాడారు. సిరిసిల్ల పట్టణంలో కుక్కలు, కోతులు గుంపులుగా తిరుగుతూ ప్రజలపై దాడి చేస్తున్నాయన్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. నాయకులు కోడం రమణ, జిందం కమలాకర్ పాల్గొన్నారు. -
గునుగు నవ్వింది
తంగేడు పూసింది– నేటి నుంచి పూల జాతర – బతుకమ్మ సంబరాలకు సిద్ధమవుతున్న ఆడపడుచులు – ఎంగిలిపూలతో వేడుకలు ప్రారంభం 30ఎస్ఆర్ఎల్301,302,303,304) బతుకమ్మ సంబరాల దృశ్యాలు (పాత చిత్రాలు) –––––––––––––––––––––––––––––––––––– చినుకుల చాటు నుంచి కురిసిన మంచు బిందువులు గుమ్మడి ఆకును అలంకరించగా.. సూర్యుడి కన్నా ముందే గుమ్మడి పువ్వు ప్రకాశించగా.. పచ్చపచ్చని తీగల మధ్య ముద్దగౌరమ్మ ముద్దుగా కనిపించగా.. నేలపై పాలు పారినట్లు గునుగు నవ్వంగా.. తంగేడు తన్మయం చెందగా.. పట్టుకుచ్చు పురివిప్పగా.. తొలిపొద్దున చేనులో నుంచి తెంపుకొచ్చి.. దేవుళ్ల ఎదుట ఉంచి.. అందంగా పేర్చి, గౌరమ్మను చేర్చి ఆడపడుచులు ఆడిపాడే బతుకమ్మ పండుగ వచ్చేసింది. నేటి ఎంగిలిపూలతో మొదలయ్యే వేడుక.. సద్దుల బతుకమ్మతో ముగియనుంది. – కరీంనగర్ కల్చరల్/విద్యానగర్/సిరిసిల్లకల్చరల్/కోరుట్ల –––––––––––––––––––––––––––––––––––– వీధులు.. పూల వనాలు రామరామరామ ఉయ్యాలో.. రామనే సీరామ ఉయ్యాలో.. సిరుల మాతల్లి ఉయ్యాలో.. సిరులతో రావమ్మా ఉయ్యాలో.. అని పాడుకుంటూ ఊరూవాడా తొమ్మిది రోజుల పాటు ఆడబిడ్డలు ఆడిపాడే పండుగ వచ్చేసింది. బతుకమ్మ తెలంగాణ ఆడబిడ్డలకు పెద్ద పండుగ. ఆశ్వయుజ పాఢ్యమి నుంచి ఎంగిలిపూలతో మొదలై తొమ్మిదో రోజు సద్దులతో ముగిసే బతుకమ్మ సంబరాలతో పల్లె, పట్టణాల్లోని వీధులన్నీ పూలవనాలుగా మారనున్నాయి. ఆశ్వయుజ మాసంలో విరివిగా పూసే గుమ్మడి, తంగేడు, గునుగు, పట్టుకుచ్చులు, చామంతి, కట్ల, గోరింటా వంటి పూలతో సిబ్బిలో కళాత్మకంగా బతుకమ్మను పేర్చి సాయంత్రం ఆడపడుచులందరూ ఒక్కచోట చేరి రామరామ అంటూ రమణీయంగా ఆడిపాడనున్నారు. గౌరమ్మకు మొక్కి చల్లంగా చూడమని వేడుకోనున్నారు. –––––––––––––––––––––––––––––––––––– ఆడపడుచుల వేడుక బతుకమ్మ అంటే బతుకునిచ్చే వేడుక. చిన్నాపెద్దా సంతోషంగా ఉండాలని ఆశీర్వదించే అమ్మవారి దీవెన. తల్లి కటాక్షాన్ని ఆకాంక్షిస్తూ ఆడపడుచులంతా ఒక చోట చేరి ఆటపాటలతో సందడి చేస్తారు. అత్తవారింటికి వెళ్లిన ఆడపిల్లలు బతుకమ్మ పండుగకి పుట్టింటికి రావడంతో ఆ ఇల్లు కొత్తకళను సంతరించుకుంటుంది. బతుకమ్మ పండుగ మొదటిరోజు సందడి ఉంటుంది. కాబట్టి సమీపంలోని చేనూచెలకా నుంచి ఒకరోజు ముందే అవసరమైన పూల సేకరణ జరుగుతుంది. తడి వస్త్రంలో కప్పి ఉంచి వాడిపోకుండా జాగ్రత్త పడతారు. మరుసటి రోజు ఆ పూలతో బతుకమ్మను పేరుస్తారు. ముందురోజు పూలతో పేరుస్తారు కాబట్టి ఎంగిలిపూల బతుకమ్మగా పిలుస్తారు. –––––––––––––––––––––––––––––––––––– కనిపించని గునుగు గునుగుపువ్వు బతుకమ్మ కూర్పులో కీలకం. ఆ రోజుల్లో పట్నాలు.. పల్లెల పరిసరాల్లో ఎక్కడ చూసినా గునుగుపూలకు కొదువ ఉండేది కాదు. ఇప్పుడు పరిస్థితి మారింది. గునుగు పువ్వు దొరకాలంటే కష్టమవుతోంది. ఎక్కడో మారుమూల పల్లెల్లో.. బీడుభూముల్లో అక్కడక్కడా కనబడుతున్నా.. అనుకున్న రీతిలో లేకపోవడం కలవరపెడుతోంది. ఫలితంగా మార్కెట్లో సరుకుగా మారిపోయింది. ఔషధ గుణాలతో అలరించే గునుగుపూలకు రంగులు పూస్తుండటం మరో సమస్యగా మారింది. ఇప్పుడు గునుగు చిన్నకట్ట రూ.50కి ఇస్తున్నారు. కొంచెం పెద్దకట్ట కావాలంటే రూ.వంద వరకు చెల్లించాల్సిందే. ఈ పది రోజుల పాటు గునుగుపూలకు ఎక్కడాలేని డిమాండ్ ఏర్పడనుంది. –––––––––––––––––––––––––––––––––––– రాజన్న పాట వినాల్సిందే 20ఎస్ఆర్ఎల్226: రేపాక గ్రామానికి చెందిన మీసాల రాజయ్య ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రేపాకకు చెందిన మీసాల రాజయ్య బతుకమ్మ పాటల స్పెషలిస్ట్. తెలంగాణ సంప్రదాయాలు కనుమరుగవుతున్న నేటికాలంలో మహిళలు బతుకమ్మను వదిలిపెడుతున్నారు. ఇలాంటి తరుణంలో రాజయ్య గళంలో బతుకమ్మ పాటల తోట ఉంటోంది. మహిళలకన్నా మధురంగా బతుకమ్మ పాటలు పాడుతున్నాడు. రాజయ్య జానపద యక్షగాన కళాకారుడు. జానపద యక్షగానాలను తన 27వ ఏటే ప్రారంభించాడు. తన సొంత గ్రామంలో బతుకమ్మ పాట పాడుతూ.. బతుకమ్మ పాట రాజయ్యగా గుర్తింపు తెచ్చుకున్నాడు. –––––––––––––––––––––––––––––––––––– 60 ఏళ్లనుంచి ఆడుతున్న మల్యాల: నా పదేళ్ల వయసు నుంచి బతుకమ్మ ఆడుతున్న. పొద్దంతా పనికి పోయి వచ్చి పొద్దూకి ఇంటి వెనక ఉన్న గుమ్మడి పూలతో రోజు బతుకమ్మ పేర్చి ఆడేవాళ్లం. బతుకమ్మ పండుగ నాటికి పూలు పూసేలా పెరట్ల రంగు రంగుల బంతిపూల మొక్కలు, పట్టుకుచ్చుల మొక్కలు పెట్టేవాళ్లం. బతుకమ్మ పండుగకు పూలు కోసుకువచ్చే దాన్ని. తీరొక్కపూలతో పెద్దగా పేర్చేవాళ్లం. పనికి పోయి వచ్చిన తర్వాత వాడకట్టోళ్లందరం చప్పట్లు కొట్టుకుంటూ.. పాటలు పాడుకుంటూ బతుకమ్మ ఆడితే పనికిపోయిన అలసట పోయేది. – ఇట్టిరెడ్డి భూమవ్వ, గుడిపేట, మల్యాల(20సీపీడీ205) –––––––––––––––––––––––––––––––––––– సీ్త్ర అస్తిత్వానికి అద్దం ఫెర్టిలైజర్సిటీ: బతుకమ్మ పండుగ సీ్త్రల అస్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. బతుకమ్మ పాటలో సీ్త్రల జీవనశైలి, కుటుంబ అనుబంధాలను చాటుతుంది. బతుకమ్మ పాటలు గ్రామీణ ప్రాంతాల్లో ఉమ్మడి కుటుంబాల బంధాలను చూపుతుంది. మారుతున్న కాలంతో పాటు బతుకమ్మ పండుగ కొత్త రూపు సంతరించుకుంది. నేటి యువతరం దాండియా ఆటలు, కోలాటలు, డీజే పాటలతో బతుకమ్మ పండుగ ప్రసిద్ధిని మరుగున పడేలా చేస్తున్నారు. – తాళ్ల లక్ష్మి, గృహిణి, గోదావరిఖని(20జీడీకే151) –––––––––––––––––––––––––––––––––––– నుదుటి సిందూరం పండుగల్లో ముఖ్యమైది బతుకమ్మ. ఆడవాళ్లకు ఇష్టమైన వేడుక. పెళ్లయి అత్తారిళ్లకు వెళ్లినవారు పుట్టింటికి చేరుకుని, బంధుమిత్రులతో కలిసి జ్ఞాపకాలు నెమరేసుకునే పండుగ. మన సంప్రదాయాలు, సంస్కృతికి అద్దంగా నిలుస్తుంది. తెలంగాణ పర్వదినాల్లో పూల దేవత పూజదే ప్రాముఖ్యత. – వాసాల స్నేహ, సాయినగర్, కరీంనగర్ (20కెఎన్టి76) విభిన్నం బతుకమ్మఆడపడుచుల వేడుక బతుకమ్మ అంటే బతుకునిచ్చే వేడుక. చిన్నాపెద్దా సంతోషంగా ఉండాలని ఆశీర్వదించే అమ్మవారి దీవెన. తల్లి కటాక్షాన్ని ఆకాంక్షిస్తూ ఆడపడుచులంతా ఒక చోట చేరి ఆటపాటలతో సందడి చేస్తారు. అత్తవారింటికి వెళ్లిన ఆడపిల్లలు బతుకమ్మ పండుగకి పుట్టింటికి రావడంతో ఆ ఇల్లు కొత్తకళను సంతరించుకుంటుంది. బతుకమ్మ పండుగ మొదటిరోజు సందడి ఉంటుంది. కాబట్టి సమీపంలోని చేనూచెలకా నుంచి ఒకరోజు ముందే అవసరమైన పూల సేకరణ జరుగుతుంది. తడి వస్త్రంలో కప్పి ఉంచి వాడిపోకుండా జాగ్రత్త పడతారు. మరుసటి రోజు ఆ పూలతో బతుకమ్మను పేరుస్తారు. ముందురోజు పూలతో పేరుస్తారు కాబట్టి ఎంగిలిపూల బతుకమ్మగా పిలుస్తారు. వీధులు.. పూల వనాలు రామరామరామ ఉయ్యాలో.. రామనే సీరామ ఉయ్యాలో.. సిరుల మాతల్లి ఉయ్యాలో.. సిరులతో రావమ్మా ఉయ్యాలో.. అని ఊరూవాడా తొమ్మిది రోజుల పాటు ఆడబిడ్డలు ఆడిపాడే పండుగ వచ్చేసింది. ఆశ్వయుజ పాఢ్యమి నుంచి ఎంగిలిపూలతో మొదలై తొమ్మిదో రోజు సద్దులతో ముగిసే బతుకమ్మ సంబరాలతో పల్లె, పట్టణాల్లోని వీధులన్నీ పూలవనాలు గా మారనున్నాయి. ఆశ్వయుజ మాసంలో విరి విగా పూసే పూలతో సిబ్బిలో పేర్చి సాయంత్రం ఆడపడుచులందరూ ఒక్కచోట చేరి రామరామ అంటూ రమణీయంగా ఆడిపాడనున్నారు. కనిపించని గునుగు గునుగుపువ్వు బతుకమ్మ కూర్పులో కీలకం. ఆ రోజుల్లో పట్నాలు.. పల్లెల పరిసరాల్లో ఎక్కడ చూసినా గునుగుపూలకు కొదువ ఉండేది కాదు. ఇప్పుడు గునుగు దొరకాలంటే కష్టమవుతోంది. ఎక్కడో మారుమూల పల్లెల్లో.. బీడుభూముల్లో కనబడుతున్నా.. అనుకున్న రీతిలో లేకపోవడం కలవరపెడుతోంది. ఫలితంగా మార్కెట్లో సరుకుగా మారిపోయింది. ఔషధ గుణాలతో అలరించే గునుగుపూలకు రంగులు పూస్తుండటం మరో సమస్యగా మారింది. గునుగు చిన్నకట్ట రూ.50కి ఇస్తున్నారు. కొంచెం పెద్దకట్ట కావాలంటే రూ.వంద వరకు చెల్లించాల్సిందే. ఈ పది రోజుల పాటు గునుగుపూలకు ఎక్కడాలేని డిమాండ్ ఏర్పడనుంది.రాజన్న పాట వినాల్సిందే ఇల్లంతకుంట: ఇల్లంతకుంట మండలం రేపాకకు చెందిన మీసాల రాజయ్య బతుక మ్మ పాటల స్పెషలిస్ట్. మ హిళలకన్నా మధురంగా పాడుతున్నాడు. రాజయ్య జానపద యక్షగాన కళాకారుడు. జానపద యక్షగానాలను తన 27వ ఏటే ప్రారంభించాడు. సొంత గ్రామంలో బతుక మ్మ పాటలు పాడుతూ.. గుర్తింపు తెచ్చుకున్నాడు. 60 ఏళ్లనుంచి ఆడుతున్న మల్యాల: పదేళ్ల వయసు నుంచి బతుకమ్మ ఆడుతున్న. పొద్దంతా పనికి పోయి వచ్చి పొద్దూకి ఇంటి వెనక ఉన్న గుమ్మడి పూలతో బతుకమ్మ పేర్చి ఆడేవాళ్లం. వాడకట్టోళ్లందరం చప్పట్లు కొట్టుకుంటూ.. పాటలు పాడుకుంటూ బతుకమ్మ ఆడితే పనికిపోయిన అలసట పోయేది. – ఇట్టిరెడ్డి భూమవ్వ, గుడిపేట, మల్యాల నుదుటి సిందూరం పండుగల్లో ముఖ్యమైంది బతుకమ్మ. ఆడవాళ్లకు ఇష్టమైన వేడుక. పెళ్లయి అత్తారిళ్లకు వెళ్లినవారు పుట్టింటికి చేరుకుని, బంధుమిత్రులతో కలిసి జ్ఞాపకాలు నెమరేసుకునే పండుగ. మన సంప్రదాయాలు, సంస్కృతికి అద్దంగా నిలుస్తుంది. తెలంగాణ పర్వదినాల్లో పూల దేవత పూజదే ప్రాముఖ్యత. – వాసాల స్నేహ, సాయినగర్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. అయితే జిల్లాలోని విభిన్న సాంస్కృతుల కారణంగా బతుకమ్మను కూడా విభిన్న తీరిలో జరుపుకుంటారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని వేములవాడ, మానకొండూర్ మండలం శ్రీని వాస్నగర్, రాఘవాపూర్, కరీంనగర్ పరిధిలోని బొమ్మకల్, ఇల్లంతకుంట మండలం పరిధిలోని కొన్ని గ్రామాల్లో ఏడు రోజులకే సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించుకుంటారు. మెజారిటీ ప్రాంతాల్లో తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ ఆడతారు. రుద్రంగి, చందుర్తి మండలాల్లోని కొన్ని గ్రామాల్లో దసరా మరునాడు బతుకమ్మ ఆడడం ఆనవా యితీ. అదే విధంగా జగిత్యాల జిల్లాలో బావి బతుకమ్మ ఆడతారు. ఎంగిలిపూల రోజున మధ్యలో బావి లాంటి గుంత తవ్వి చుట్టూ బతుకమ్మలు పెట్టి ఆడతారు. తొమ్మిదిరోజులు ఇదే విధంగా ఆడతారు. సద్దుల బతుమ్మ అనంతరం బావిని పూడ్చుతారు.1వ రోజు ఎంగిలి పూల బతుకమ్మ 2వ రోజు అటుకుల బతుకమ్మ 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ 4వ రోజు నానే బియ్యం 5వ రోజు అట్ల బతుకమ్మ 6వ రోజు అలిగిన బతుకమ్మ 7వ రోజు వేపకాయ బతుకమ్మ 8వ రోజు వెన్నముద్దల బతుకమ్మ 9వ రోజు సద్దుల బతుకమ్మచినుకుల చాటు నుంచి కురిసిన మంచు బిందువులు ముత్యం మాదిరిగా గుమ్మడి ఆకును అలంకరించగా.. సూర్యుడి కన్నా ముందే గుమ్మడి పువ్వు ప్రకాశించగా.. పచ్చపచ్చని తీగల మధ్య ముద్దగౌరమ్మ ముద్దుగా కనిపించగా.. నేలపై పాలు పారినట్లు గునుగు నవ్వంగా.. తంగేడు తన్మయం చెందగా.. పట్టుకుచ్చు పురివిప్పగా.. తొలిపొద్దున చేనులో నుంచి తెంపుకొచ్చి.. దేవుళ్ల ఎదుట ఉంచి.. అందంగా పేర్చి, గౌరమ్మను చేర్చి ఆడపడుచులు ఆడిపాడే బతుకమ్మ పండుగ వచ్చేసింది. నేటి ఎంగిలిపూలతో మొదలయ్యే వేడుక.. సద్దుల బతుకమ్మతో ముగియనుంది. – కరీంనగర్ కల్చరల్/విద్యానగర్/సిరిసిల్లకల్చరల్/కోరుట్ల -
వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి
జిల్లా ఆస్పత్రిలో కుక్కకాటుకు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. కుక్కకాటు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వాటికి అనుగుణంగా సత్వర చికిత్స కోసం సిబ్బందిని అప్రమత్తం చేశాం. బాధితులు నాటువైద్యం చేయించుకోకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందాలి. కుక్కకాటుతో రేబిస్ వ్యాఽధి సోకకుండా టీటీ, ఏఆర్వీ, ఇమ్యూనోగ్లోబిలెన్స్ ఇంజక్షన్లు, ఇతర అన్ని మందులు అందుబాటులో ఉన్నాయి. – డాక్టర్ క్రాంతికుమార్, ప్రొఫెసర్ జనరల్ విభాగం -
పిక్కలు తీస్తున్న కుక్కలు
సిరిసిల్లటౌన్: కుక్కలు రెచ్చిపోతున్నాయి. మనుషులు కనిపిస్తే చాలు దాడి చేస్తున్నాయి. గుంపులుగా తిరుగుతూ మనుషులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. వాహనాలపై వెళ్తున్న వారిని వెంబడిస్తూ పిక్కలు తీస్తున్నాయి. పాఠశాలలకు వెళ్లే చిన్నారుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఒక్కరు వస్తే చాలు గుంపులుగా చేరి మీద పడుతున్నాయి. జిల్లాలో రెచ్చిపోతున్న కుక్కలపై ఫోకస్. నియంత్రణ ఎక్కడ? సిరిసిల్లతోపాటు జిల్లాలోని ఏ పల్లెలో చూసినా కుక్కలు రోడ్లపైన గుంపులుగా తిరుగుతున్నాయి. ఈ ఏడాదిలో ఆరు నెలల్లోనే జిల్లా ఆస్పత్రిలో 885 కుక్కకాటు కేసులు నమోదుకావడాన్ని పరిశీలిస్తే జిల్లాలో కుక్కల స్వైరవిహారం ఏవిధంగా ఉందో అర్థమవుతుంది. ఇంత జరుగుతున్నా వీధికుక్కల దాడులను నిలువరించే వారు లేరని ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. గతంలో మున్సిపల్ ఆధ్వర్యంలో కుక్కల జనాభా నియంత్రణకు చర్యలు చేపట్టేవారు. చాలా రోజులుగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కుక్కకాటుకు సరైన కాలంలో ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే ప్రాణాంతకమే. అధికారులు కుక్కల జనాభా నియంత్రణపై దృష్టి పెట్టకపోవడంతో వాటి సంతతి పెరిగిపోతోంది. జాగ్రత్తలు.. చర్యలు ● కుక్క కరిచిన వెంటనే ఆ భాగాన్ని డిటర్జెంట్ లేదా డెటాల్ సబ్బుతో ఐదు నిమిషాలపాటు శుభ్రం చేయాలి. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ● యానిమల్ బర్త్ కంట్రోల్(ఏబీసీ)లో భాగంగా జంతువుల కుటుంబ నియంత్రణ కమిటీ ఆధ్వర్యంలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ● ఏబీసీ ఏజెన్సీని నియమించి వీధికుక్కలు, కోతులు, ఇతర జంతువుల నియంత్రణ చర్యలు తీసుకోవాలి. ● కుక్క, కోతులు, రోడ్లపై తిరిగే జంతువులకు కుటుంబ నియంత్రణ చేస్తే మున్సిపల్ ద్వారా ఏజెన్సీకి ఫీజు చెల్లించే అవకాశం ఉంది. సదరు ఏజెన్సీ జిల్లాలో లేదన్న విమర్శలు ఉన్నాయి. ● హాస్టల్స్, రెస్టారెంట్లు, ప్రైవేటు హాస్టల్స్, ఫంక్షన్హాళ్లలో మిగిలిన ఆహారాన్ని ఎక్కడ పడితే అ క్కడ పడేయడంతో కుక్కల సంచారం పెరిగింది. ● పశువులకు ముందస్తుగా వ్యాక్సిన్ వేస్తే.. రేబిస్ వ్యాధి ఉన్న కుక్క కరిచినా వాటికి ఎలాంటి హాని జరుగదు.ఫిబ్రవరి 132 మార్చి 118 ఏప్రిల్ 133 మే 107 జూన్ 92 జూలై 100 ఆగస్టు 102 సెప్టెంబర్ 101 -
ప్యాక్స్ పర్సన్ ఇన్చార్జి చైర్మన్గా తిరుపతిరెడ్డి
ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని గాలిపల్లి ప్యాక్స్ పర్సన్ ఇన్చార్జి చైర్మన్గా అన్నాడి అనంతరెడ్డి, ఇల్లంతకుంట ప్యాక్స్ పర్సన్ ఇన్చార్జి చైర్మన్గా రొడ్ల తిరుపతిరెడ్డిలను కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు డీసీవో రామకృష్ణ శుక్రవారం తెలిపారు. నిబంధనల ప్రకారం డిఫాల్ట్ ఆఫ్ లోన్స్ కింద ఇల్లంతకుంట ప్యాక్స్లో ఒకరిని, గాలిపల్లి ప్యాక్స్లో ఇద్దరిని తొలగించినట్లు పేర్కొన్నారు. ఇల్లంతకుంటలో కార్యదర్శి రవీందర్రెడ్డి, పర్సన్ ఇన్చార్జి మెంబర్లు గొడుగు తిరుపతి, నరసింహారెడ్డి, గజ్జల సత్యం, కట్ట లచ్చయ్య, సుధాకర్రెడ్డి పాల్గొన్నారు. -
బాలసాహితీవేత్తలను ప్రోత్సహించాలి
● రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కేవీ రమణాచారి గంభీరావుపేట(సిరిసిల్ల): బడి పిల్లలు ఎంతో నైపుణ్యంతో రాసిన బాలసాహిత్యం ‘పెద్దబడిలో చిన్నపిల్లల కథలు’ అనే పుస్తకాన్ని శుక్రవారం రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కేవీ రమణాచారి ఆవిష్కరించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని హైస్కూల్లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమానికి బహుభాషవేత్త నలిమెల భాస్కర్తో కలిసి హాజరయ్యారు. కేవీ రమణాచారి మాట్లాడుతూ విద్యార్థులు ఇలాగే కృషి చేస్తే ఉన్నత స్థానాలకు ఎదుగుతారని ఆకాంక్షించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నలిమెల భాస్కర్ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి ఉన్నతంగా ఎదగాలన్నారు. కథలు రాసిన విద్యార్థులను, పుస్తక రూపకల్పనకు, రచనలకు ప్రోత్సహించిన ఉపాధ్యాయులు వీఆర్ శర్మ, గరిపల్లి అశోక్, అంజన్రెడ్డి, దబ్బెడ హనుమాండ్లను అభింనందించారు. అనంతరం నారాయణపూర్ హైస్కూల్లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరై విద్యార్థులు తమ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో మార్గనిర్ధేశం చేశారు. స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం తిరుమల మనోహరాచారి, ప్రాణహిత ఎడ్యుకేషన్ ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు. వేములవాడ: వేములవాడ సబ్కోర్డు ఏపీపీ(అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్)గా అవదూత రజనీకాంత్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. వేములవాడ బార్ అసోసియేషన్ అడ్వకేట్లు రజనీకాంత్కు శుభాకాంక్షలు తెలిపారు. ఇల్లంతకుంట(మానకొండూర్): అనంతగిరి అన్నపూర్ణ జలాశయంలో శుక్రవారం 3.27 టీఎంసీలకు నీరు చేరింది. అన్నపూర్ణ జలాశయం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 3.5 టీఎంసీలు. మిడ్మానేరు నుంచి అన్నపూర్ణ జలాశయంలోకి, అన్నపూర్ణ నుంచి రంగనాయకసాగర్లోకి నీటిని ఎత్తిపోస్తున్నారు. సిరిసిల్లకల్చరల్: న్యాయవాదులపై దాడులను నిరసిస్తూ జిల్లాలో అడ్వకేట్లు శుక్రవారం విధులు బహిష్కరించారు. నల్లరిబ్బన్లు ధరించి కోర్టు ప్రాంగణంలో నిరసన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అడ్డుకోవాలని కోరారు. నిరసనలో జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జూపెల్లి శ్రీనివాసరావు, న్యాయవాదులు తంగళ్లపల్లి వెంకటి, ఆవునూరి రమాకాంత్రావు, ఎస్.వసంతం, బి.రవీందర్రావు, అనిల్కుమార్, నర్సింగరావు, ధర్మేందర్, రాజమల్లు తదితర 100 మంది న్యాయవాదులు పాల్గొన్నారు. చందుర్తి(వేములవాడ): మండల కేంద్రం శివారులో వాహనాలను ఎన్ఫోర్స్మెంట్ ఆర్టీ ఏ అధికారులు శుక్రవారం తనిఖీలు చేశారు. ప్యాసింజర్ ఆటోలను, వ్యాన్లు, మినీగూడ్స్, ట్రాక్టర్లను తనిఖీ చేశారు. ధ్రువీకరణపత్రాలు సరిగా లేని వాహనాలను గుర్తించి సీజ్ చేస్తామని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వంశీధర్ తెలిపారు. ట్రెయినీ అధికారులు మనోజ్కుమార్, కానిస్టేబుల్ ప్రశాంత్ పాల్గొన్నారు. -
పార్టీకి కార్యకర్తలే బలం
● బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు కోనరావుపేట(వేములవా): పార్టీకి కార్యకర్తలే బలం, బలగమని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు పేర్కొన్నారు. మండలంలోని మల్కపేటలో శుక్రవారం నిర్వహించిన మండలస్థాయి విస్తృత సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తులు ఎవరూ చెరుపలేరన్నారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పునాదితో ప్రభుత్వం ఏర్పాటు చేసి 22 నెలల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఎన్నికల హామీల అమలులో విఫలమవుతున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే తమ పార్టీ కార్యకర్తలపై అనవసరపు కేసులు పెడుతున్నారన్నారు. ప్రెస్మీట్లలో మేము నిలదీస్తేనే సమస్యలు పరిష్కరిస్తున్నారని.. ఇది మీ ప్రజాపాలన అని ఎద్దేవా చేశారు. పార్టీ మండలాధ్యక్షుడు మల్యాల దేవయ్య, సెస్ వైస్చైర్మన్ తిరుపతి, సీనియర్ నాయకులు రాఘవరెడ్డి, చంద్రయ్య, ప్రభాకర్రావు, రామ్మోహన్రావు, గోపు పర్శయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘బతుకమ్మ’కు ఇందిరమ్మ చీరలు
సిరిసిల్ల: తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయ పండుగ బతుకమ్మకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి చీరలను కానుకగా అందిస్తుంది. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలలోని (ఎస్హెచ్జీ) సభ్యులకు సీఎం రేవంత్రెడ్డి కానుకగా ఈ సద్దుల బతుకమ్మకు చీరలను పంపిణీ చేస్తున్నారు. జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులకు చీరలు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆగస్టు 26న సిరిసిల్ల వేదికగా రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, రాష్ట్ర చేనేత జౌళిశాఖ కమిషనర్ శైలజారామయ్యర్ ఇందిరా మహిళాశక్తి చీరలను ప్రదర్శించారు. ఏకరూపం, పాలపిట్ట రంగుల్లో ఆకర్షణీయంగా ఉన్నాయి. సిరిసిల్ల నుంచి సూరత్ సిరిసిల్లలో 4.24 కోట్ల మీటర్ల చీరల బట్ట ఉత్పత్తి ఆర్డర్లు ఇవ్వగా.. ఇప్పటి వరకు 2.50 కోట్ల మీటర్లు ఉత్పత్తి చేశారు. 10వేల మగ్గాలపై 131 మ్యాక్స్ సంఘాల్లో ఇందిరా మహిళాశక్తి చీరలు తయారయ్యాయి. నేతకార్మికులు ఉత్పత్తి చేసిన చీరలను చేనేత, జౌళిశాఖ సేకరించింది. ఆ బట్టను ప్రాసెసింగ్, ప్రింటింగ్ చేయించేందుకు గుజరాత్లోని సూరత్కు పంపించారు. అక్కడ పాలపిట్ట కలర్లో బార్డర్ అంచుతో చీరలను సిద్ధం చేశారు. చీరల ఆర్డర్లతో స్థానిక నేతన్నలకు 10 నెలలపాటు చేతి నిండా పని లభించింది. నవ్యత.. నాణ్యత గతంలో బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తే.. అవి కట్టుకోడానికి అనువుగా లేవని, పొలాల వద్ద రక్షణ గా కట్టుకున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వయంగా అన్నారు. ఈ నేపథ్యంలో ఇందిరా మహిళాశక్తి చీరలను నవ్యత, నాణ్యతతో ఉత్పత్తి చేశారు. వస్త్రోత్పత్తిదారులకు వేములవాడలోని టెస్కో యారన్ డిపో నుంచి నూలు(ధారం)ను జౌళిశాఖ అధికారులే సరఫరా చేశారు. నాణ్యమైన నూలును అందించడంతో అంచుతో కూడిన తెల్లని చీరలను తయారు చేశారు. జిల్లాలోని మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్న 50 ఏళ్లు పైబడి గోచీ చీరలను కట్టే వారికి ప్రత్యేకంగా 9.30 మీటర్ల పొడవైన చీరలను పంపిణీ చేయనున్నారు. గోచీ చీరలు కట్టే వారి సంఖ్యను 12,067గా నిర్ధారించారు. ఈ మేరకు గోచీ చీరలను తెప్పిస్తున్నారు. మరో వైపు మిగతా వారికి 6.30 మీటర్ల చీరలను అందించనున్నారు. కలెక్టర్ అధ్యక్షతన కమిటీ జిల్లా స్థాయిలో చీరల పంపిణీకి కలెక్టర్ సందీప్కుమార్ ఝా అధ్యక్షతన కమిటీ ఉంటుంది. మండలాల్లో ఎంపీడీవోలు, మున్సిపాలిటీల్లో కమిషనర్ల పర్యవేక్షణలో చీరల పంపిణీ కొనసాగనుంది. ఈనెల 21న చిన్న బతుకమ్మ వేడుకలు ప్రారంభమవుతుండడంతో చీరలను ఎప్పుడు పంపిణీ చేయాలో ప్రభుత్వమే తేదీని నిర్ణయించనుంది. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, వీవోలు, పట్టణాల్లో వార్డు అధికారులు, ఆర్పీలు ఇన్చార్జీలుగా చీరల పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేశారు.మండలం వీవోఏలు మహిళాసంఘాలు మహిళలు బోయినపల్లి 31 816 9,766 చందుర్తి 30 760 9,052 ఇల్లంతకుంట 46 1,122 13,186 గంభీరావుపేట 44 1,157 12,791 కోనరావుపేట 41 1,037 11,942 ముస్తాబాద్ 54 1,210 14,169 రుద్రంగి 14 386 4,464 తంగళ్లపల్లి 49 1,101 12,462 వీర్నపల్లి 18 347 4,041 వేములవాడ 17 413 4,923 వేములవాడరూరల్ 21 496 5,923 ఎల్లారెడ్డిపేట 46 1,170 12,878 మొత్తం 411 10,015 1,15,597 -
నిత్య సాధన చేయించాలి
● అప్పుడే విద్యార్థులు పట్టు సాధిస్తారు ● కలెక్టర్ సందీప్కుమార్ ఝాసిరిసిల్ల/కోనరావుపేట(వేములవాడ): విద్యార్థులతో నిత్యం సాధన చేయిస్తేనే పాఠ్యాంశాలపై పట్టు సాధిస్తారని కలెక్టర్ సందీప్కుమార్ ఝా సూచించారు. కోనరావుపేటలోని మోడల్ స్కూల్ను శుక్రవారం తనిఖీ చేశారు. తరగతిగదులు, అటల్ టింకరింగ్ ల్యాబ్లను పరిశీలించారు. ఉపాధ్యాయులు బోధిస్తున్న తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. విద్యార్థులను వివిధ సబ్జెక్టులపై ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. పాఠశాల ఆవరణలో చెత్తాచెదారం లేకుండా చూడాలన్నారు. స్పెషలిస్ట్ డాక్టర్లతో పరీక్షలు మహిళల సంపూర్ణ ఆరోగ్యం కోసం స్వస్త్ నారీ, స్వశక్తి పరివార్ అభియాన్లో చేపట్టిన వైద్యశిబి రాల్లో స్పెషలిస్ట్ డాక్టర్లతో పరీక్షలు చేయించాలని క లెక్టర్ సందీప్కుమార్ ఝా సూచించారు. కలెక్టరేట్లో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షించా రు. కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబరు 17 నుంచి అ క్టోబర్ 2 వరకు జిల్లాలో 99 ఆరోగ్య వైద్యశిబిరాలు నిర్వహించాలన్నారు. హైపర్ టెన్షన్, డయాబెటీస్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, అనేమియా, టీబీ నిర్ధారణ పరీక్షలు చేయాలని తెలి పారు. జిల్లాలోని ప్రతీ గర్భిణీ వందశాతం ఏఎన్సీ చెకప్ చేయించుకునేలా చూడాలన్నారు. మహిళలకు వ్యక్తిగత పరిశుభ్రత, పౌష్టికాహారంపై అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రజిత, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ అంజలి ఆల్ఫ్రెడ్, సంపత్కుమార్, నయిమా జహా, రాజేందర్ పాల్గొన్నారు. ఓటర్ల జాబితాను రివిజన్ చేయాలి ఓటర్ల జాబితాను తప్పులు లేకుండా స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్(ఎస్.ఐ.ఆర్) చేపట్టాలని కలెక్టర్ కోరారు. 2002 నాటి ఓటర్ల జాబితాతో పోల్చుతూ తప్పులను సరిచేయాలన్నారు. అంతకుముందు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబాయి, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
రాజన్న సిరిసిల్ల
శనివారం శ్రీ 20 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025Iబోయినపల్లి(వేములవాడ): విలాసాగర్ హైస్కూ ల్ విద్యార్థులకు శుక్రవారం గుడ్ టచ్..బ్యాడ్ టచ్పై అవగాహన కల్పించారు. వేధింపులకు గురైతే షీటీమ్కు ఫిర్యాదు చేయాలన్నారు. ఆకాశం మేఘావృతమవుతుంది. జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. రాత్రి ఈదురుగాలులు వీస్తాయి.రుద్రంగి(వేములవాడ): స్థానిక రెండుగట్ల వాగు బ్రిడ్జి, కాలువ, చెక్డ్యామ్ను ఇరిగేషన్, ఫారెస్ట్ అధికారులు శుక్రవారం పరిశీలించారు. మరమ్మతుకు అంచనాలు రూపొందించనున్నారు. -
హోంగార్డులు క్రమశిక్షణతో పనిచేయాలి
● ఎస్పీ మహేశ్ బి గీతేసిరిసిల్ల: పోలీస్శాఖలో అంతర్భాగమైన హోంగార్డులు క్రమశిక్షణతో పనిచేయాలని జిల్లా ఎస్పీ మహేశ్ బి గీతే పేర్కొన్నారు. జిల్లా పోలీస్ ఆఫీస్లో శుక్రవారం హోంగార్డులను డీజీపీ ఆఫీస్ ద్వారా వచ్చిన రెయిన్కోట్స్ను పంపిణీ చేశారు. ఎస్పీ మహేశ్ బి గీతే మాట్లాడుతూ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులు పోలీసులతోపాటే నిరంతరం సేవలను అందిస్తున్నారని, ప్రతీ పోలీస్స్టేషన్లో పోలీసు సిబ్బందితోపాటు విధులు నిర్వహిస్తున్నారన్నారు. హోంగార్డులు క్లిష్ట పరిస్థితుల్లోనూ బందోబస్తు విధులను సమర్థంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. ఏమైనా సమస్యలుంటే నేరుగా తనని సంప్రదించాలన్నారు. వర్షాకాలంలో అత్యవసర సమయాల్లో రెయిన్కోట్స్ ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏఎస్పీలు శేషాద్రినిరెడ్డి, చంద్రయ్య, ఆర్ఐలు యాదగిరి, హోమ్గార్డ్స్ పాల్గొన్నారు. -
వెదురు ఉత్పత్తులను ప్రోత్సహించాలి
సిరిసిల్లటౌన్: ప్రపంచ వెదురు దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో జిల్లా మేదరి సంఘం ఆధ్వర్యంలో గురువారం వేడుకలు నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు కోన బాలశేఖర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టాలని, వెదురు ఉత్పత్తులను ప్రోత్సహించాలని కోరారు. వెదురుతో తయారుచేసిన వస్తువులను ప్రదర్శించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోన శ్రీనివాస్, జిల్లా కోశాధికారి బొల్లం రామ్సాగర్, జిల్లా ప్రచార కార్యదర్శి వేముల అంజయ్య, సిరిసిల్ల మండలాధ్యక్షుడు పోతు బాలయ్య, గంభీరావుపేట మండలాధ్యక్షుడు పోతు దేవయ్య, చందుర్తి మండలాధ్యక్షుడు రేషం రామస్వామి, రేషం శ్రీనివాస్, పోతు లక్ష్మీరాజం, ఇందూరి ఎల్లయ్య, బొల్లం రాజయ్య, అలిపిరెడ్డి బాలకృష్ణ, కనికరం రాజు, కనికరం రాజయ్య పాల్గొన్నారు. -
వరదకాలువలో కొట్టుకొచ్చిన మహిళ శవం
● మోర్తాడ్ మండలానికి చెందిన వృద్ధురాలిగా గుర్తింపు మల్యాల: మండలంలోని నూకపల్లి శివారు వరదకాలువలో ఓ మహిళ మృతదేహం కొట్టుకొచ్చింది. ఆ శవాన్ని నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన ప్రభావతిగా మల్యాల పోలీసులు గుర్తించారు. ఎస్సై నరేశ్కుమార్ కథనం ప్రకారం.. కామణి ప్రభావతి (66) కొంతకాలంగా మతిస్థిమితం లేక బాధపడుతోంది. ఈనెల 16న ఇంట్లో నుండి వెళ్లిపోయింది. బంధువులు మోర్తాడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి కుమారుడు శ్రీనివాస్ వెతుకుతున్నాడు. వరదకాలువలో శవమై కొట్టుకురావడంతో స్థానికుల సమాచారం మేరకు పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. శ్రీనివాస్ను పిలిపించగా.. తన తల్లిగా గుర్తించాడు. కేసు నమోదు చేసినట్లు మల్యాల పోలీసులు తెలిపారు. వృద్ధురాలి మెడలోంచి బంగారం చోరీజగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం సంగంపల్లికి చెందిన నేరెల్ల లచ్చవ్వ మెడలోంచి గురువారం మధ్యాహ్నం గుర్తుతెలియని దొంగ తులంన్నర బంగారు ఆభరణాన్ని ఎత్తుకెళ్లాడు. లచ్చవ్వ వద్దకు వచ్చిన ఓ వ్యక్తి ఆమెను మాటల్లో దింపి బంగారు కుత్తికట్టును లాక్కుని పారిపోయాడు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు వచ్చేసరికి దొంగ పారిపోయాడు. రూరల్ సీఐ సుధాకర్, ఎస్సై సదాకర్ సంఘటన స్థలానికి చేరుకుని గ్రామంలోని సీసీ పుటేజీలు, ప్రధాన రహదారుల్లోని సీసీ పుటేజీని పరిశీలించారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. గ్రామాల్లో అనుమానితులు కన్పిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ సుధాకర్ అన్నారు. రాజన్న హుండీ ఆదాయం రూ.1.21 కోట్లువేములవాడ: రాజన్నను దర్శించుకున్న భక్తులు హుండీలలో వేసిన కట్న, కానుకలను ఆలయ అధికారులు గురువారం ఓపెన్స్లాబ్లో లెక్కించారు. ఈ లెక్కింపును ఈవో రమాదేవి పర్యవేక్షించారు. రూ.1,21,70,150 నగదు, బంగారం 64 గ్రాములు, వెండి 7.300 కిలోలు వచ్చినట్లు ఈవో తెలిపారు. ఏసీ కార్యాలయ పరిశీలకులు సత్యనారాయణ, ఆలయ అధికారులు, శ్రీశివరామకృష్ణ భజన మండలి సభ్యులు పాల్గొన్నారు. ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట రూ.93వేలకు టోకరాకరీంనగర్ క్రైం: నగరానికి చెందిన వ్యక్తికి ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు రూ.93వేలకు పైగా టోకరా వేశారు. త్రీటౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. నగరంలోని మారుతినగర్కు చెందిన శ్రీరామోజు రఘు టెలిగ్రాంయాప్లో ట్రెడింగ్కు సంబంధించిన ఓ లింకును క్లిక్ చేశాడు. క్యూఆర్ కోడ్ ద్వారా మొదట రూ.20వేలు పంపాలని, అధిక మొత్తంలో తిరిగి చెల్లిస్తామని వాట్సప్లో సందేశం పంపడంతో డబ్బులు పంపించాడు. తరువాత పలు దఫాలుగా రూ.93వేలు వసూలు చేశారు. కొద్దిసేపటికి అవతలివైపు నుంచి స్పందన లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని త్రీటౌన్ సీఐ జాన్రెడ్డి తెలిపారు. ఏపీ సైబర్ క్రైం పోలీసుల అదుపులో మల్యాల యువకులుమల్యాల: మండల కేంద్రానికి చెందిన ఇద్దరు యువకులను ఓ సైబర్క్రైం కేసులో ఏపీ సైబర్ క్రైం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీలో జరిగిన ఓ సైబర్క్రైం కేసులో మండలకేంద్రానికి చెందిన ఇద్దరు యువకులు ఉన్నారని, తమ స్నేహితుడికి బ్యాంకు ఖాతా ఇవ్వడంతో వారి ఖాతాల్లో రూ.2లక్షలు జమ అయ్యాయని, ఆ మొత్తాన్ని డ్రా చేసి ఇచ్చారన్న సమాచారం మేరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మానవ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలిజగిత్యాల: మానవ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని డీఈవో రాము అన్నారు. జిల్లా కేంద్రంలోని టీచర్స్ భవన్లో మాట్లాడారు. అక్రమ రవాణా నిర్మూలనలో ప్రజలు భాగస్వామ్యం అయినప్పుడే సమూలంగా నిర్మూలించవచ్చన్నారు. ప్రజల స్వచ్ఛంద సంస్థ విద్యా పరిశోదన శిక్షణ మండలి ఆధ్వర్యంలో అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. -
భారీ స్కాలర్షిప్తో ‘అల్ఫోర్స్ అటెమ్ట్– 2025’
● రూ.54,44,444 స్కాలర్షిప్ పోస్టర్ను ఆవిష్కరించిన చైర్మన్ నరేందర్ రెడ్డికొత్తపల్లి(కరీంనగర్): అల్ఫోర్స్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఈనెల 22వ తేదీ నుంచి 25 తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలోని అల్ఫోర్స్ విద్యా సంస్థల్లో రెండేళ్లపాటు ఇవ్వబడే ఐఐటీ/నీట్ శిక్షణలో రాయితీ పొందడానికి స్కాలర్షిప్ టెస్టులను నిర్వహిస్తున్నట్లు ఆ విద్యా సంస్థల చైర్మన్ వి.నరేందర్రెడ్డి తెలిపారు. కరీంనగర్ వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ విద్యా సంస్థల కేంద్ర కార్యాలయంలో గురువారం అటెమ్ట్–2025 వాల్పోస్టర్ ఆవిష్కరించారు. నరేందర్రెడ్డి మాట్లాడుతూ ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు 35ఏళ్లుగా రాష్ట్ర విద్యారంగానికి చేయూతనివ్వడంతో పాటు ఎంతోమంది విద్యార్థులను అత్యుత్తమంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. పదోతరగతి విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిభ చూపిన వారికి సుమారు రూ.54,44,444 విలువగల స్కాలర్షిప్ అందజేయడం జరుగుతుందని తెలిపారు. మరిన్ని వివరాలకు 91335 37444/ 91602 94441/92469 34456/92469 34441 సెల్ నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు. -
విద్యార్థులు డ్రగ్స్కు దూరంగా ఉండాలి
● జడ్జి రాధిక జైశ్వాల్ ఇల్లంతకుంట(మానకొండూర్): విద్యార్థులు మత్తు పదార్థాలు, డ్రగ్స్కు దూరంగా ఉండాలని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ జడ్జి రాధిక జైశ్వాల్ కోరారు. ఇల్లంతకుంటలోని ప్రభుత్వ హైస్కూల్లో గురువారం ఏర్పాటు చేసిన చట్టాలపై అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మత్తుపదార్థాల అలవాట్లతో జీవితంలో అనేక నష్టాలు జరుగుతాయన్నారు. పిల్లలహక్కులు, పోక్సో చట్టం గురించి వివరిస్తూ వివిధ చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. హైకోర్టు అడ్వకేట్ ఎడపల్లి హరీశ్, హెచ్ఎం ప్రేమలత, మహేశ్చంద్ర, రమణారెడ్డి, మంజుల, లత, అనిల్కుమార్ పాల్గొన్నారు. శేషాద్రినిరెడ్డికి పదోన్నతివేములవాడ: వేములవాడ ఎస్డీపీవోగా విధులు నిర్వహిస్తున్న శేషాద్రినిరెడ్డికి ప్రభుత్వం అడిషనల్ ఎస్పీగా పదోన్నతి కల్పించింది. వేములవాడలోనే పోస్టింగ్ ఇస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమేరకు ఆమె అడిషనల్ ఎస్పీ హోదాలో వేములవాడ సబ్ డివిజన్ ప్రజలకు సేవలందించనున్నారు. కష్టపడితేనే విజయం సిరిసిల్లకల్చరల్: కష్టపడి చదువుకోవడం ద్వారానే విజేతలుగా మారుతారని ప్రభుత్వ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థి, విశ్రాంత ఇంజినీర్ పత్తిపాక మదన్ పేర్కొన్నారు. నిత్య జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమానికి గురువారం హాజరయ్యారు. కళాశాల ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. సామాన్యులకు దేశభక్తి భావాన్ని విద్యార్థి దశలోనే అందజేస్తున్న వినూత్న కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలని సూచించారు. ప్రిన్సిపాల్ కనకశ్రీ విజయ రఘునందన్, విశ్రాంత ప్రిన్సిపాల్ గాజుల ప్రతాప్, కళాశాల అధ్యాపకులు సామల వివేకానంద, శ్రీధర్, వెంకటేశం, కేదారేశ్వర్, కనకయ్య, రాజయ్య, చంద్రమౌళి, ఆంజనేయులు, సరోజ, విజయ, రాజశేఖర్, శ్రీనివాస్, సుజిత, నర్మద పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం సిరిసిల్లఅర్బన్: పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని మున్సిపల్ కమిషనర్ ఎంఏ ఖదీర్పాషా పేర్కొన్నారు. స్వచ్ఛత హీ సేవా–2025 కార్యక్రమంలో భాగంగా చిన్నబోనాల బాలికల గురుకుల విద్యాలయంలో స్వచ్ఛతా హీ సేవపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కమిషనర్ మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందన్నారు. కొనసాగుతున్న ఎత్తిపోతలు ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని అనంతగిరి అన్నపూర్ణ జలాశయంలోకి మిడ్మానేరు నుంచి 3,200 క్యూసెక్కుల నీరు వస్తోంది. అదేవిధంగా అన్నపూర్ణ జలాశయం నుంచి రంగనాయకసాగర్లోకి 3,300 క్యూసెక్కుల నీరు వెళ్తోంది. అన్నపూర్ణ జలాశయం నీటి సామర్థ్యం 3.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.27 టీఎంసీలకు చేరింది. -
ఎందుకు చంపారు
ఎలా చంపారు?సాక్షి,పెద్దపల్లి/మంథని: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టువామన్రావు, నాగమణిల హత్యకేసులో విచారణకు సీబీఐ రంగంలోకి దిగింది. ఈ కేసులో ఓ బీఆర్ఎస్ నేతకు సంబంధం ఉందంటూ వామన్రావు తండ్రి కిషన్రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆగస్టు 12న సుప్రీంకోర్టు కేసును సీబీఐకి అప్పగించింది. రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా గత ప్రభుత్వం 2022లో నిషేధం విధించగా.. ఈ ఉత్తర్వులను ప్రస్తుతం ఉపసహంరించుకోవడంతో గురువారం సీబీఐ అధికారులు పెద్దపల్లి జిల్లాలో విచారణ చేపట్టారు. దీంతో ఈ హత్య కేసులో ఏమైనా కుట్రకోణం ఉందా? అరెస్ట్ అయిన నిందితులే కాకుండా ఇతరుల పాత్ర ఏమైనా ఉందా..? అనే కోణంలో దర్యాప్తు చేపట్టనుండగా.. వామన్రావు దంపతుల హత్యకేసు ఉమ్మడి జిల్లాలో మరోసారి చర్చనీయాంశంగా మారింది. 55 నెలల తరువాత పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగుకు చెందిన హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టువామన్రావు, నాగమణి దంపతులు 2021 ఫిబ్రవరి 17న రామగిరి పోలీస్స్టేషన్ పరిధిలోని కల్వచర్ల సమీపంలో హత్యకు గురయ్యారు. కేసు విచారణ ప్రారంభించిన పోలీసులు ప్రధాన నిందితులతో పాటు సహకరించిన ఏడుగురిని అరెస్ట్ చేసి జైలుకు పంపిచారు. కొద్దిరోజులకు బెయిల్పై బయటకు వచ్చారు. కేసులో అప్పటి పోలీసు యంత్రాంగం సరైన దిశలో విచారణ చేపట్టలేదని, కీలక నిందుతుడిని తప్పించారంటూ వామన్రావు తండ్రి కిషన్రా వు ఆరోపించారు. సీబీఐ దర్యాప్తుతోనే తనకు న్యా యం జరుగుతుందంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు తీర్పుతో హత్య జరిగి నాలుగేళ్ల 7నెలలకు సీబీఐ విచారణ చేపట్టింది. కేసు విచారణలో భాగంగా ముగ్గురు సీబీఐ అధికారుల బృందం గురువారం మంథనిలో పర్యటించారు. మొదట వామన్రావు తండ్రి కిషన్రావు, సోదరుడు చంద్రశేఖర్, కుటుంబ సభ్యులను వారి స్వగ్రామం గుంజపడుగులో కలిసి వివరాలు తెలుసుకున్నారు. మంథని కోర్టు ఆవరణలో పలు అంశాలను పరిశీలించారు. అక్కడి నుంచి హత్య జరిగిన ప్రదేశానికి వచ్చి పరిశీలించారు. సీబీఐ బృందానికి రామగుండం కమిషనరేట్ ఆవరణలో ఓ కార్యాలయాన్ని కేటాయించారు. కేసు సమన్వయం చేసేందుకు గోదావరిఖని ఏసీపీ మడత రమేశ్ను కేటాయించారు. కేసు పూర్వాపరాలతో పాటు ఫిర్యాదు, ఎఫ్ఐఆర్, రిమాండ్ కేసు డైరీ, చార్జీషీట్లను పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ చేపడుతున్నారు. రెండు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే పుట్టమధు చేసిన వాఖ్యలకు నిరసనగా అతని ఇంటి ఎదుట కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేయగా, అన్ని మండలాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు పోటాపోటీగా ధర్నాలు, బహిరంగ విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా జంట హత్యకేసుల్లో సీబీఐ ఎంట్రీతో జిల్లాలో రాజకీయం మరింత హీటెక్కింది.సీబీ‘ఐ’ ఎంట్రీ! -
సైబర్ వారియర్లతో నేరాల నియంత్రణ
● ఎస్పీ మహేశ్ బి గీతే సిరిసిల్లక్రైం: సైబర్ వారియర్లతో జిల్లాలో సైబర్ నేరాలను నియంత్రిస్తున్నామని ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. ఆన్లైన్ మోసాలను అరికట్టడం, తక్షణ చర్యలతో బాధితులకు న్యాయం చేయడంలో కృషి చేసిన సైబర్ సెల్ ఆర్ఎస్సై జునైద్, శ్రీకాంత్, డిస్ట్రిక్ట్ సైబర్ క్రైమ్ రాజశేఖర్, వెంకటరమణలను అభినందించారు. ప్రశంసాపత్రలు, ప్రోత్సహకాలు అందజేసి మాట్లాడారు. సైబర్ నేరాలపై సైబర్ వారియర్లు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫోన్ చేయాలని, ఎన్సీఆర్పీ పోర్టల్, సమీప ఠాణాలో ఫిర్యాదు చేయాలని సూచించారు. సెలవులో మున్సిపల్ కమిషనర్ వేములవాడ: మున్సిపల్ కమిషనర్ సెలవుపై వెళ్లడంతో ఆయన స్థానంలో ఇన్చార్జి కమిషనర్గా మేనేజర్ సంపత్రెడ్డిని కలెక్టర్ నియమించారు. వ్యక్తిగత అవసరాలపై కమిషనర్ సెలవుపై వెళ్లినట్లు మున్సిపల్ వర్గాలు తెలిపాయి. -
తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకులకు కౌన్సెలింగ్
వీణవంక: తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకులకు వీణవంక మండలం బేతిగల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించారు. గ్రామానికి చెందిన కంబాల రాయమల్లు– చెన్నమ్మలకు ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. కొడుకులు పోషించడం లేదని ఇటీవల కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. హుజూరాబాద్ ఆర్డీవో రమేశ్బాబు కౌన్సెలింగ్ ఇచ్చి నెలకు ఒక్కొక్కరు రూ.4వేల చొప్పున ఇవ్వాలని ఆదేశించారు. ఆర్డీవో ఆదేశాలను అమలు చేస్తున్నారా లేదా అని గురువారం జిల్లా సంక్షేమ ఆధికారి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఆవరణలో విచారించారు. ఇద్దరు కుమారులు పోషించడంలేదని తల్లిదండ్రులు చెప్పడంతో వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. తల్లిదండ్రుల పోషణను చూసుకోవాలని చెప్పడంతో పాటు రూ.16వేలు ఇప్పించారు. ఆర్ఐ రవి, డీవీసీ కౌన్సిలర్ పద్మావతి, సాయికిరణ్, వినోద్, ఆంజనేయులు ఉన్నారు. -
అరటి సాగు చేయండి
జగిత్యాలఅగ్రికల్చర్: వరి, మొక్కజొన్న పంటలకు భిన్నంగా అరటి సాగు చేసి ఆదాయం పొందాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్యామ్ప్రసాద్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్లో అరటిసాగుపై గురువారం అవగాహన కల్పించారు. అరటి సాగుతో తక్కువ కాలంలో ఎక్కువ ఆదాయం వస్తుందన్నారు. ఎకరాకు రూ.28వేల సబ్సిడీ ఇస్తున్నామని తెలిపారు. జిల్లాలో 1500 ఎకరాల నుంచి 25 ఎకరాలకు సాగు పడిపోయిందని నియోజకవర్గ ఉద్యాన శాఖ అధికారి స్వాతి అన్నారు. అభ్యుదయ రైతు జితేందర్రావు మాట్లాడుతూ ఢిల్లీ, హైదరాబాద్ అరటి వ్యాపారులు బైబ్యాక్ పద్ధతిలో కొనుగోలుకు సిద్ధంగా ఉన్నారన్నారు. హెచ్ఈవో అనిల్, ఆయిల్ పాం ప్రతినిధి విజయ్భరత్, డ్రిప్ కంపెనీ ప్రతినిధి దేవేందర్రెడ్డి, రైతులు పాల్గొన్నారు. ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేసిన మహిళపై కేసుకరీంనగర్క్రైం: కరీంనగర్లోని ఓ బ్యూటీ సంస్థకు చెందిన ఫేక్ సర్టిఫికేట్లు తయారు చేసిన మహిళపై త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. బ్యూటీ సంస్థ ప్రతినిధి శైలజ ఇచ్చిన ఫిర్యాదుతో కృష్ణవేణి అనే మహిళపై కేసు నమోదు చేశారు. -
రేషన్షాపుల్లోనే దొడ్డుబియ్యం
పెగడపల్లి: మండలంలోని రేషన్ దుకాణాల్లో క్వింటాళ్ల కొద్ది దొడ్డు బియ్యం మూలుగుతున్నాయి. ఈ ఏడాది మార్చి నుంచి ప్రభుత్వం రేషన్కార్డుదారులకు సన్నబియ్యం అందిస్తున్న విషయం తెల్సిందే. అయితే అప్పటికే దుకా ణాల్లో నిల్వ ఉన్న దొడ్డుబియ్యం అలాగే ఉండిపోయాయి. ఆ బియ్యం ఎలుకలు, పందికొక్కులకు ఆహారంగా మారుతున్నాయి. ఆర్నెళ్ల క్రితం రేషన్ దుకాణాలకు చేర్చిన దొడ్డుబియ్యాన్ని తిరిగి గోదాములకు పంపించాల్సి ఉండగా.. పట్టించుకునేవారు లేకపోవడంతో అలాగే ఉండిపోతున్నాయి. ఏ దుకాణంలో చూసినా 15 నుంచి 20 క్వింటాళ్లు వరకు నిల్వలు పేరుకుపోయాయి. మరోవైపు సన్యబియ్యం స్టాక్ వస్తే ఇబ్బందిగా ఉందని, అధికారులు స్పందించి దొడ్డు బియ్యాన్ని గోదాములకు తరలించాలని డీలర్లు కోరుతున్నారు. ఈ విషయమై డిప్యూటీ తహసీల్దార్ లాస్యశ్రీని వివరణ కోరగా దొడ్డ బియ్యం నిల్వలపై ఉన్నతాధికారులు, సివిల్ సప్లై అధికారులకు సమాచారం ఇచ్చామన్నారు. -
22 నుంచి దేవీ నవరాత్రోత్సవాలు
● 30న మహాసరస్వతీ పూజ ● అక్టోబర్ 1న తెప్పోత్సవంవేములవాడ: రాజన్న ఆలయంలో ఏటా జరిగే శ్రీదేవీ నవరాత్రోత్సవాలు ఈ ఏడాది 22 నుంచి అక్టోబర్ 2 వరకు వైభవంగా నిర్వహిస్తామని ఆలయ ఈవో రమాదేవి బుధవారం ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయని, భక్తులకు దర్శనం, వసతి, రవాణా సౌకర్యాలు సమకూరుస్తున్నట్లు పేర్కొన్నారు. ఉత్సవాల ప్రత్యేకత ఈ ఉత్సవాలు రాజన్న ఆలయంలో అత్యంత ప్రాధాన్యం కలిగినవి. నిత్యం విభిన్నమైన వాహనసేవలు భక్తులను ఆధ్యాత్మిక భక్తి ప్రవాహంలో ముంచెత్తుతాయి. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు ఈ వేడుకల్లో హాజరయ్యేందుకు వేములవాడకు తరలివస్తారు. ఈనెల 29న ఉదయం 9.30 గంటలకు నక్షత్ర పుస్తకరూపిణి మహాసరస్వతీ పూజ, 30న రాత్రి 8 గంటలకు మహిషాసుర మర్ధని అమ్మవారికి మహాపూజ, అక్టోబర్ 1న రాత్రి 8.15 గంటలకు పూర్ణాహుతి, బలిహరణం, స్వామి వారి ధర్మగుండంలో తెప్పోత్సవం, 2న విజయదశమి సందర్భంగా ఆయుధ పూజ, అంబారీసేవ, శమీపూజలు నిర్వహించనున్నట్లు ఈవో రమాదేవి వివరించారు. -
హుండీలే టార్గెట్
● ఆలయాల్లో వరుస చోరీలు ధర్మారం(ధర్మపురి): ధర్మారం మండలంలో దొంగలు హుండీలను టార్గెట్ చేసి వరుసగా చోరీలకు పాల్పడుతున్నారు. మండలంలోని నాలుగు ఆలయాల్లో హుండీలు పగులగొట్టి అందినకాడికి దోచుకెళ్లారు. దీంతో పోలీసులకు ఆలయ కమిటీ చైర్మన్లు, గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. కాగా, పోలీసుల నుంచి సరైన స్పందన లభించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధర్మారం మండలం గోపాల్రావుపేటలోని శ్రీ వేంకటేశ్వరాలయం, నందిమేడారం అమరేశ్వరాలయం, ఇదే గ్రామంలోని హనుమాన్ ఆలయంలో దొంగలు హుండీలను పగులకొట్టి నగదు ఎత్తుకెళ్లారు. పోలీసులు ఒకవైపు నిఘా పెట్టినా తాజాగా సోమవారం రాత్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో దొంగలు హుండీ పగులగొట్టేందుకు చేసిన ప్రయత్నం విఫలం కావడంతో అక్కడే పడేసి వెళ్లిపోయారు. దీంతో ఆలయ చైర్మన్ ఈవోకు సమాచారం ఇవ్వడంతో అదే రోజు హుండీ డబ్బులు లెక్కించారు. వరుస చోరీలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాగా నందిమేడారం అమరేశ్వరాలయం చైర్మన్ కోరిక మేరకు ఎన్ఆర్ఐ దామోదర్యాదవ్ ట్రస్టు ఆధ్వర్యంలో సోలార్ సీసీ కెమెరాలను ట్రస్టు కోఆర్డినేటర్ వేల్పుల నాగరాజు అందించారు. దొంగల బెడదతోనే హుండీ లెక్కింపు ధర్మారం మండలం శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో సోమవారం రాత్రి దొంగలు ముసుగుతో వచ్చి హుండీ పగులగొట్టేందుకు ప్రయత్నించారు. హుండీకి నాలుగు రకాల తాళాలు వేయడంతో పగులగొట్టడం సాధ్యం కాలేదు. దీంతో వదిలిపెట్టి వెళ్లిపోవడం సీసీ కెమెరాల్లో రికార్డయింది. హుండీని పగులగొట్టడంతోనే నగదు లెక్కించినట్లు ఆలయ చైర్మన్ సంతోష్ తెలిపారు. దొంగలను పట్టుకుంటాం ఆలయాల్లో వరుస చోరీలు జరగడంతో నిఘా పెట్టాం. ఫింగర్ ప్రింట్ తీసుకున్నాం. పాత నేరస్తుల ఫింగర్ ప్రింట్లను టాలీ చేస్తున్నాం. సీడీఆర్ కాల్డాటాపై విచారణ చేస్తున్నాం. రాత్రి వేళ వాచ్మెన్ను ఏర్పాటు చేసుకోవాలని ఆలయ కమిటీలకు సూచించాం. – ఎస్సై ప్రవీణ్కుమార్ -
ఘనంగా ఆది శ్రీనివాస్ జన్మదిన వేడుకలు
వేములవాడ: ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ 58వ జన్మదిన వేడుకలు జిల్లా వ్యాప్తంగా గురువారం ఘనంగా నిర్వహించారు. వేములవాడలోని తెలంగాణచౌక్ వద్ద 58 కిలోల కేక్ను కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు. పార్టీ శ్రేణులు ఆది శ్రీనివాస్ను గజమాలతో సత్కరించారు. లింగంపల్లి మాజీ సర్పంచ్ సామ కవితాతిరుపతిరెడ్డి, శాత్రాజుపల్లి మాజీ ఎంపీటీసీ సంగ స్వామియాదవ్, ఈవో రమాదేవి, ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, సీఐలు, ఎస్సైలు, తహశీల్దారులు, ఎంపీడీవోలు శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం శుభాకాంక్షలు విప్ ఆది శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాసేవలో నిమగ్నమై రాష్ట్రాభివృద్ధికి, రాష్ట్రంలో ప్రజాపాలనలో భాగస్వామ్యమై ముందుకుసాగాలని లెటర్ ద్వారా కోరారు. గ్రామగ్రామాన వేడుకలు రుద్రంగిలోని శ్రీలక్ష్మీనరసింహాస్వామిని ఆది శ్రీని వాస్ దర్శించుకున్నారు. సిరిసిల్లలోని గాంధీచౌక్లో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారా యణగౌడ్, టీపీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీని వాస్ పాల్గొన్నారు. వేములవాడరూరల్లో ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, వేములవాడఅర్బన్ మండలం నంది కమాన్ వద్ద కేక్ కోసి స్వీట్లు పంచారు. కోనరావుపేటలో షేక్ ఫిరోజ్పాషా, ఎల్లారెడ్డిపేటలో వంగ గిరిధర్రెడ్డి, తంగళ్లపల్లిలో సత్తు శ్రీని వాస్రెడ్డి, గంభీరావుపేటలో హమీద్, ముస్తాబాద్లో యెల్ల బాల్రెడ్డి, తలారి రాణి ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. -
60 మందిపై పిచ్చికుక్క దాడి
● పది మంది పిల్లలు.. నలభై మందికి పైగా పెద్దలు ● సిరిసిల్ల ఆస్పత్రికి క్యూకట్టిన బాధితులుసిరిసిల్లటౌన్: రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో గురువారం పిచ్చికుక్క వీరంగం చేసింది. సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రజలను కరుస్తూ భయాందోళన సృష్టించింది. ఒకే కుక్క సుమారు 60 మందికి పైగా కరిచింది. స్థానికులు తెలిపిన వివరాలు. సిరిసిల్లలో గురువారం సాయంత్రం ఓ పిచ్చికుక్క ఇందిరానగర్, తారకరామానగర్, బీవైనగర్, గణేశ్నగర్, మార్కెట్పల్లి, సాయినగర్, మార్కెట్ కమిటీ తదితర ప్రాంతాల్లో హల్చల్ చేసింది. ఇంటిబయట తిరుగుతూ కనిపించిన వారిని కరిచింది. మనుషులు కనిపిస్తే చాలు ఉక్రోషంతో ఊగిపోతూ దాడి చేసింది. సుమారు 60 మందికి పైగా దాడి చేయగా.. ఏడాదిన్నర వయస్సున్న పాప, మరో ఇద్దరు మూడేళ్లలోపు చిన్నారులు, పదమూడేళ్లలోపు ఏడుగురు ఉన్నారు. బాధితులు వరుసగా జిల్లా ఆస్పత్రికి క్యూ కట్టారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 50 మందికి పైగా చికిత్స అందించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్కుమార్ తెలిపారు. బాధితులకు టీటీ, ఏఆర్వీ, ఇమ్యూనోగ్లోబిలెన్స్ ఇంజక్షన్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఒక్కొక్కరికి మూడేసి ఇంజక్షన్లు వేయడమే కాకుండా యాంటిబయాటిక్స్, నొప్పి తదితర మందులను అందించినట్లు పేర్కొన్నారు. క్షతగాత్రులు ఎంతమంది ఉన్నా..చికిత్స అందించేందుకు ఆస్పత్రి సిబ్బందిని 24గంటల పాటు అందుబాటులో ఉంచారు. పరిస్థితిని తెలుసుకున్న ప్రభుత్వ విప్ సిరిసిల్లలో పిచ్చికుక్క దాడిలో పెద్దసంఖ్యలో బాధితులు ఉండడంతో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆస్పత్రి వైద్యులతో ఫోన్లో మాట్లాడారు. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు పూర్తిస్థాయిలో చికిత్స అందించాలని సూచించారు. కుక్కను పట్టుకునే పనిలో బల్దియా కనిపించిన వారిపైన దాడి చేసిన కుక్కను పట్టుకోవడానికి సిరిసిల్ల మున్సిపల్ సిబ్బంది చర్యలకు దిగారు. కమిషనర్ ఎం.ఏ.ఖదీర్పాషా ఆదేశాలతో క్షతగాత్రులు ఉన్న ఏరియాల్లో సిబ్బందిని పంపి కుక్క కోసం గాలింపు చేపట్టారు. -
సీబీఐ ఇక బిజీబిజీ!
హైకోర్టు న్యాయవాద దంపతులు వామన్రావు– నాగమణి దంపతుల జంటహత్య కేసు విచారణకు గురువారం సీబీఐ రంగప్రవేశం చేసింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు గ్రీన్సిగ్నల్ ఇచ్చిన విషయం తెల్సిందే. ఫోన్ట్యాపింగ్ కేసును కూడా సీబీఐకు అప్పగిస్తే ఉమ్మడి జిల్లాలోనే మూడు కేసుల విచారణ కొనసాగనుంది. ఈ మూడు కేసులతో ఉమ్మడి జిల్లాకు లింక్ ఉండటంతో రాజకీయం హీటెక్కుతోంది. –సాక్షిప్రతినిధి, కరీంనగర్ఫోన్ట్యాపింగ్ కేసుతో లింకులుఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అన్ని పార్టీలకు చెందిన ముఖ్యనేతలుండగా వారి కదలికలను పసిగట్టేందకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ట్యాపింగ్ చేసినట్లు బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ సందర్భంగా కేంద్రసహాయ మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్, కరీంనగర్ గ్రంఽథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశ్తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు తమ ఫోన్లు ట్యాపింగ్ అయినట్లు సిట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆరోపణ ఎదుర్కొంటున్న డీఎస్పీ ప్రణీత్రావును 2024 మార్చిలో సిరిసిల్లలో అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ట్యాపింగ్ కేసును కూడా సీబీఐకి అప్పగిస్తే రాష్ట్రంలో సంచలం సృష్టించిన ఈ మూడు కేసులు ఉమ్మడి జిల్లాతో ఉన్న లింకులు బయటపడనున్నాయి.జంట హత్యల కేసు2021 ఫిబ్రవరి 17న హైకోర్టు న్యాయవాదులు వామన్రావు, నాగమణి దంపతులు రామగిరి పోలీస్స్టేషన్ పరిధిలోని కల్వచర్ల సమీపంలో హత్యకు గురయ్యారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఏడుగురిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ప్రస్తుతం సీబీఐ పునర్విచారణతో వామన్రావు తండ్రి ఆరోపిస్తున్నట్లు బీఆర్ఎస్ నేత ప్రమేయంపై ఏం తేల్చస్తుందోనని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తల్లో జోరుగా చర్చ నడుస్తోంది.'కాళేశ్వరం'పైమంథని నియోజకవర్గం పరిధిలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ వైఫల్యానికి ప్రణాళిక, డిజైన్, నాణ్యత లోపాలు, నిర్మాణం కారణమని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సీబీఐ విచారణ చేపట్టాలని అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ప్రభుత్వం లేఖ రాసింది. పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా విచారణ చేపట్టొద్దని హైకోర్టు బ్రేకులు వేసింది. రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఇచ్చిన నివేదిక ఆధారంగా విచారణ చేపడుతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇస్తే సీబీఐ అధికారులు విచారణ చేపట్టే అవకాశాలున్నాయి.కేంద్ర దర్యాప్తు సంస్థల పర్యటనల పరంపర● ఉమ్మడి జిల్లాలో కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ ఇదేం కొత్త కాదు. గత ప్రభుత్వ హయాంలోనూ పలుమార్లు ఉమ్మడి కరీంనగర్ కేంద్రంగా అనేక కేసుల్లో విచారణ చేపట్టాయి. కొన్ని దాడులతో సరిపెట్టగా.. మరికొన్నిట్లో నోటీసుల వరకు వెళ్లాయి. ఇంకొన్నిట్లో విచారణ నేటికీ సాగుతోంది.● ఈ ఏడాది మార్చిలో మయన్మార్ కేంద్రంగా సైబర్ కేఫ్ల వద్ద బంధీలుగా మారిన భారతీయులను కేంద్రం విడిపించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులు, బాధితులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారు కావడం గమనార్హం. ఈ కేసుపై ఎన్ఐఏ, సీబీఐ, ఇమిగ్రేషన్ సంస్థలు సంయుక్తంగా విచారణ చేపడుతున్నాయి.● 2022 సెప్టెంబరులో పీఎఫ్ఐ సానుభూతిపరులను ఎన్ఐఏ అరెస్టు చేసింది. దేశ్యాప్తంగా పీఎఫ్ఐ సానుభూతిపరులను ఏకకాలంలో బెంబేలెత్తించింది. కరీంనగర్లోనూ ఇద్దరిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది.● సీబీఐ ఆఫీసర్ అంటూ ఓ వ్యక్తి పలువురు వీఐపీలను మోసం చేసిన కేసులో అతని గురించి సమాచారం ఇవ్వాలంటూ 2022 డిసెంబరులో అప్పటి మంత్రి గంగుల కమలాకర్కు సీబీఐ అధికారులు నోటీసులు జారీచేశారు. ఈ ఘటన తరువాత ఉమ్మడి జిల్లాలో సీబీఐ అడుగుపెట్టడం ఇదే తొలిసారి.● లిక్కర్స్కాంలో విచారణలో భాగంగా కరీంనగర్ చెందిన అనేక మంది ప్రముఖుల ఇళ్లపై హైదరాబాద్లో 2022 సెప్టెంబరులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించింది. వీరి స్వస్థలమైన కరీంనగర్ నుంచి కూడా రహస్యంగా పలు ఫైళ్లు, ఇతర సమాచారం సేకరించింది.● 2022 నవంబరులో గ్రానైట్ మైనింగ్లో అక్రమాలు జరిగాయని, ప్రభుత్వానికి భారీగా పన్ను ఎగవేశారని ఈడీ, ఇన్కం ట్యాక్స్ (ఐటీ) పలువురు వ్యాపారుల ఇళ్లలో సోదాలు నిర్వహించాయి. -
ఇంటర్లో ఉత్తీర్ణత పెరగాలి
సిరిసిల్ల: జిల్లాలోని అన్ని ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణత మరింత పెరగాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆదేశించారు. ఇంటర్మీడియట్ విద్య, రానున్న పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయడం, వివిధ అంశాలపై ప్రభుత్వ జూనియర్, సోషల్, బీసీ, ట్రైబల్, మైనార్టీ సంక్షేమ కళాశాలలు, టీజీ రెసిడెన్షియల్, మోడల్స్కూల్, కేజీబీవీ కళాశాలల ప్రిన్సిపాల్స్తో గురువారం సమీక్షించారు. జిల్లాలో మొత్తం 42 ప్రభుత్వ, 6 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉన్నాయని, ఫస్టియర్లో 4,302, సెకండియర్లో 3,874 మంది చదువుతున్నారని డీఐఈవో శ్రీనివాస్ తెలిపారు. గతేడాది ఉత్తీర్ణత తక్కువ ఉన్న కళాశాలల ప్రిన్సిపాల్స్ నుంచి వివరాలు తెలుసుకున్నారు. యూడైస్, ఎఫ్ఆర్ఎస్ వారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అటవీ జంతువులు, కోతులతో ఇబ్బందులు ఎదురవుతున్న విద్యాలయాల బాధ్యులు సోలార్ ఫెన్సింగ్ కోసం డీఐఈవో దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. -
కేంద్ర దర్యాప్తు సంస్థల పర్యటనల పరంపర
● ఉమ్మడి జిల్లాలో కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ ఇదేం కొత్త కాదు. గత ప్రభుత్వ హయాంలోనూ పలుమార్లు ఉమ్మడి కరీంనగర్ కేంద్రంగా అనేక కేసుల్లో విచారణ చేపట్టాయి. కొన్ని దాడులతో సరిపెట్టగా.. మరికొన్నిట్లో నోటీసుల వరకు వెళ్లాయి. ఇంకొన్నిట్లో విచారణ నేటికీ సాగుతోంది.● ఈ ఏడాది మార్చిలో మయన్మార్ కేంద్రంగా సైబర్ కేఫ్ల వద్ద బంధీలుగా మారిన భారతీయులను కేంద్రం విడిపించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులు, బాధితులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారు కావడం గమనార్హం. ఈ కేసుపై ఎన్ఐఏ, సీబీఐ, ఇమిగ్రేషన్ సంస్థలు సంయుక్తంగా విచారణ చేపడుతున్నాయి.● 2022 సెప్టెంబరులో పీఎఫ్ఐ సానుభూతిపరులను ఎన్ఐఏ అరెస్టు చేసింది. దేశ్యాప్తంగా పీఎఫ్ఐ సానుభూతిపరులను ఏకకాలంలో బెంబేలెత్తించింది. కరీంనగర్లోనూ ఇద్దరిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది.● సీబీఐ ఆఫీసర్ అంటూ ఓ వ్యక్తి పలువురు వీఐపీలను మోసం చేసిన కేసులో అతని గురించి సమాచారం ఇవ్వాలంటూ 2022 డిసెంబరులో అప్పటి మంత్రి గంగుల కమలాకర్కు సీబీఐ అధికారులు నోటీసులు జారీచేశారు. ఈ ఘటన తరువాత ఉమ్మడి జిల్లాలో సీబీఐ అడుగుపెట్టడం ఇదే తొలిసారి.● లిక్కర్స్కాంలో విచారణలో భాగంగా కరీంనగర్ చెందిన అనేక మంది ప్రముఖుల ఇళ్లపై హైదరాబాద్లో 2022 సెప్టెంబరులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించింది. వీరి స్వస్థలమైన కరీంనగర్ నుంచి కూడా రహస్యంగా పలు ఫైళ్లు, ఇతర సమాచారం సేకరించింది.● 2022 నవంబరులో గ్రానైట్ మైనింగ్లో అక్రమాలు జరిగాయని, ప్రభుత్వానికి భారీగా పన్ను ఎగవేశారని ఈడీ, ఇన్కం ట్యాక్స్ (ఐటీ) పలువురు వ్యాపారుల ఇళ్లలో సోదాలు నిర్వహించాయి. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
జమ్మికుంట: బంధువు అంత్యక్రియలకు వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఈ ఘటన జమ్మికుంట మండలం మడిపల్లి పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. వీణవంక మండలం కొండపాక గ్రామానికి చెందిన కొలుగూరి మధునమ్మ,బాలయ్య దంపతుల కొడుకు నవీన్(23) మండలంలోని మడిపల్లి గ్రామంలో గురువారం బంధువు మృతి చెందగా అంత్యక్రియలకు హాజరయ్యాడు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో జమ్మికుంట వైపుకు బైక్పై వస్తుండగా.. మడిపల్లి శివారు శాంతినగర్లో ఎదురుగా వస్తున్న టాటాఏస్ ఢీకొట్టింది. తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని జమ్మికుంట టౌన్ సీఐ రామకృష్ణ పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
జెండాను ఆవిష్కరించిన విప్ శ్రీనివాస్
సిరిసిల్ల: అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అందరికీ అందించడమే లక్ష్యంగా ప్రజాపాలన సాగుతోందని, ధార్మిక, కార్మిక క్షేత్రంగా జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లా పోలీస్ పరేడ్గ్రౌండ్లో బుధవారం ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయజెండాను ఎగురవేశారు. పోలీస్ గౌరవ వందనం స్వీకరించి ప్రసంగించారు. ఆనాటి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఐక్యమై 77 ఏళ్లు పూర్తి చేసుకుని 78వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ ప్రజాపాలన వేడుకలు నిర్వహించుకుంటున్నామన్నారు. 60 ఏళ్లు స్వీయ అస్తిత్వం కోసం ఉద్యమించి స్వరాష్ట్రంగా అవతరించిన తెలంగాణ నేడు అభివృద్ధి పథంలో ముందంజలో ఉందన్నారు.రైజింగ్ తెలంగాణ లక్ష్యంగా..2047 నాటికి దేశ ముఖచిత్రాన్ని మార్చే గేమ్చేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్న సంకల్పం తమదన్నారు. ఈ సంకల్పానికి దార్శనికపత్రమే ‘తెలంగాణ రైజింగ్ 2047’ అని వివరించారు. జిల్లాలోని ఎస్హెచ్జీల ద్వారా 23 ఫర్టిలైజర్ షాపులు ప్రారంభించినట్లు తెలిపారు. శ్రీనిధి ద్వారా రూ.25కోట్ల రుణాలు అందించామని, 5,691 యూనిట్లకు 1,607 గ్రౌండింగ్ చేశామని, చేయూత పింఛన్లు 1,17,370 మందికి ప్రతి నెలా రూ.25.73కోట్లు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు.నేతన్నలకు ఉపాధిమహిళా సంఘాల సభ్యులకు ఏటా రెండు చీరలు అందించే లక్ష్యంతో ఇందిరా మహిళాశక్తి చీరల ఉ త్పత్తి ఆర్డర్లు సిరిసిల్ల నేతన్నలకు అందించామ న్నా రు. ఇప్పటికే 4.30కోట్ల మీటర్ల బట్ట ఉత్పత్తి ఆర్డర్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. 1,77,851 కుటుంబాలకు సన్నబియ్యం అందుతుందని, కొత్తగా 14,075 రేషన్కార్డులు అందించామని, 3,376 మంది పేర్లను ఇప్పటికే ఉన్న కార్డుల్లో చేర్పించామన్నారు.రైతు రుణమాఫీరాష్ట్రంలోని 25.35లక్షల రైతులకు రూ.20వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. ఇందిరమ్మ రైతు భ రోసా కింద ఎకరాకు రూ.12వేల పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు తెలిపారు. 393 రైతు కుటుంబాలకు రూ.18కోట్ల బీమాసాయం పంపిణీ చేసిన ట్లు, 47,977 మందికి రూ.381.45కోట్ల రుణాలు మాఫీ చేసినట్లు తెలిపారు. సన్నవడ్లకు క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తున్నామని తెలిపారు.పేదలకు ఇందిరమ్మ ఇళ్లుజిల్లాలో 12,623 ఇందిరమ్మ ఇళ్లు, అదనంగా మధ్యమానేరు నిర్వాసితులకు 4,696 ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు మహిళలు రూ.119.50 కోట్ల విలువైన జీరో టిక్కెట్లపై ప్రయాణం చేశారని తెలిపారు. జగ్గారావుపల్లి, పద్మనగర్, పాపయ్యపల్లి, గుండారం, తిప్పాపూర్(వేములవాడ)లో 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాల కోసం ప్రతిపాదనలు పంపామన్నారు.పేదలకు మెరుగైన వైద్యంసీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.16.85కోట్లు, ఎల్వోసీల ద్వారా రూ.5కోట్ల మేరకు మేలు జరిగిందన్నారు. 20 నెలల్లో 60వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు తెలి పారు. 39 రెసిడెన్షియల్ విద్యాలయాల్లో ఆన్లైన్ అకాడమీ సంస్థ ద్వారా ఐఐటీ ఫౌండేషన్, ఐఐటీ–జేఈఈ, నీట్–యూజీ మెడికల్ ఆన్లైన్ కోచింగ్ అందిస్తున్నామని తెలిపారు. చివరి ఆయకట్టుకు సా గునీరందేలా ప్రాజెక్టుల పనులు చేస్తున్నామన్నా రు. కలెక్టర్ సందీప్కుమార్ ఝా, ఎస్పీ మహేశ్ బి గీతే, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయి, ఏఎస్పీ చంద్రయ్య, జెడ్పీ సీ ఈవో వినోద్కుమార్, డీఆర్డీవో శేషాద్రి ఉన్నారు.రాజన్న ఆలయంలో వేడుకలువేములవాడ: రాజన్న ఆలయంలో ఈవో రమాదేవి జాతీయజెండాను ఆవిష్కరించారు. అర్చకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. వేములవాడ మున్సిపాలిటీలో మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ సంపత్రెడ్డి సిబ్బందితో ప్రమాణం చేయించారు.డీపీవోలో జెండా ఆవిష్కరణసిరిసిల్లక్రైం: ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సిరిసిల్లలోని జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో జాతీయ జెండాను ఎస్పీ మహేశ్ బీ గీతే ఆవిష్కరించారు. కార్యక్రమంలో వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
‘ఇందిరమ్మ’ నిర్మాణాల్లో వేగం పెంచాలి
● కలెక్టర్ సందీప్కుమార్ ఝా సిరిసిల్ల/తంగళ్లపల్లి/ఇల్లంతకుంట: ఇంది రమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా సూచించారు. తంగళ్లపల్లి మండలం రాళ్లపేటలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను బుధవారం పరిశీలించారు. ఎంపీడీవో లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాళ్లపేటలో 57 ఇళ్లు మార్క్చేయగా 10 బేస్మెంట్ లెవెల్, 10 గోడలు, 20 స్లాబ్, 17 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. రానున్న పండగ రోజుల్లో గృహప్రవేశాలు చేయాలని సూచించారు. ఇసుక కొరత ఉంటే తహసీల్దార్లను సంప్రదించండి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక కొరత ఉంటే తహసీల్దార్లను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కలెక్టరేట్లో సమీక్షించారు. జిల్లాలో 10,234 ఇళ్లు మంజూరుచేయగా ఇప్పటికే 5,308 మంది పనులు ప్రారంభించారని, 2,549 మంది బేసిమెంట్ వరకు, 618 మంది గోడల వరకు, 285 మంది రూప్లెవల్ వరకు పూర్తి చేసినట్లు తెలిపారు. ఇసుక కొరత లేకుండా, నిర్మాణ సామగ్రికి అధిక ధరల సమస్య లేకుండా అధికారులు పర్యవేక్షించాలన్నారు. హౌసింగ్ పీడీ శంకర్రెడ్డి పాల్గొన్నారు. మౌలిక వసతులు కల్పించండి ఇల్లంతకుంట మండలం కందికట్కూర్లోని ఇందిరమ్మకాలనీలో మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. కాలనీలోని సమస్యలను స్థానికులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పరిస్థితిని చూసిన కలెక్టర్ కాలనీలో అన్ని వసతులపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఎంపీడీవో శశికళ, డిప్యూటీ తహసీల్దార్ సత్యనారాయణ, మండల కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు వెలిశాల జ్యోతి, కార్యదర్శి రంజిత్ కుమార్ ఉన్నారు. అనంతరం రహీంఖాన్పేటలోని మోడల్సూ్క్ల్ను తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. పాఠశాల ప్రిన్సిపాల్ గంగాధర్, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. -
పౌష్టికాహారం అందేలా చూడాలి
వేములవాడ: పిల్లలకు పౌష్టికాహారం అందేలా చూడాలని జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం సూచించారు. ‘పోషణ్భీ... పడాయీభీ’ కార్యక్రమంపై చందుర్తి, బోయినపల్లి, ధర్మారం, రుద్రంగి, కోనరావుపేట, చెక్కపల్లి, కొదురుపాక, వేములవాడఅర్బన్ సెక్టార్ పరిధిలోని అంగన్వాడీ టీచర్లకు బుధవారం శిక్షణ ఇచ్చారు. లక్ష్మీరాజం మా ట్లాడుతూ అంగన్వాడీలలో పూర్వప్రాథమిక విద్య, పోషణ, ఆరోగ్యంపై అవగాహన కల్పించాలన్నారు. తక్కువ బరువు పిల్లలను గుర్తించాలని సూచించారు. సీడీపీవో సౌందర్య, సూపర్వైజర్లు సరిత, అంజమ్మ, తార, కమల, మమత, లక్ష్మి, నిర్మల, పోషన్ అభియాన్ ఇన్చార్జి రాజకుమార్ పాల్గొన్నారు. -
ఆరోగ్యవంతమైన సమాజమే లక్ష్యం
సిరిసిల్ల: ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించే మహిళల ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సిరిసిల్ల అంబేడ్కర్నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో బుధవారం ‘స్వస్థ్ నారి, సశక్త్ పరివార్ అభియాన్’ను కలెక్టర్ సందీప్కుమార్ ఝాతో కలిసి ప్రారంభించారు. గురుకులాల్లో బాలికలకు స్పెషల్క్యాంప్ ఏర్పాటు చేసి అవసరమైన వైద్యపరీక్షలు చేయనున్నట్లు తెలి పారు. అనంతరం పది మంది టీబీ బాధితులకు పోషకాహార కిట్లు, కోడిగుడ్లు పంపిణీ చేశారు. జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారా యణగౌడ్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూపారెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత, ఐఎంఏ వైద్యులు లీలాశిరీష, పద్మలత, గీతావాణి, కాంగ్రెస్ పార్టీ నాయకులు చొప్పదండి ప్రకాశ్, సంగీతం శ్రీనివాస్, ఆకునూరి బాలరాజు, సూర దేవరాజు, గడ్డం నర్సయ్య, బండ నర్సయ్యయాదవ్, జగన్మోహన్రెడ్డి, కచ్చకాయల ఎల్లయ్య, ఫిరోజ్పాషా ఉన్నారు. చిరుజల్లులుసిరిసిల్ల: జిల్లా వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. బోయినపల్లిలో అత్యధికంగా 55.1 మిల్లీమీటర్లు కురి సింది. గంభీరావుపేటలో 32.0, ముస్తాబాద్లో 20.8, రుద్రంగిలో 1.5, చందుర్తిలో 3.2, వేములవాడరూరల్లో 4.3, వేములవాడలో 12.4, సిరిసిల్లలో 5.9, కోనరావుపేటలో 10.8, వీర్నపల్లిలో 20.1, ఎల్లారెడ్డిపేటలో 3.8, తంగళ్లపల్లిలో 7.9, ఇ ల్లంతకుంటలో 10.9 మిల్లీమీటర్లు వర్షం కురిసింది. -
మహిళలపై వేధింపులు నివారించాలి
● జిల్లా న్యాయసేవాధికార సమితి సెక్రటరీ రాఽధికా జైశ్వాల్ సిరిసిల్లటౌన్/సిరిసిల్లకల్చరల్: మహిళలపై వేధింపుల నివారణలో పౌరులు బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా లీగల్సెల్ అథారిటీ కార్యదర్శి రాధిక జైశ్వాల్ కోరారు. సిరిసిల్లలోని యూనియన్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్లో బుధవారం పనిప్రదేశంలో లైంగిక వేధింపుల నివారణపై అవగాహన కల్పించారు. బ్యాంక్ చీఫ్ మేనేజర్ సూరజ్, లోక్ అదాలత్ సభ్యుడు చింతోజు భాస్కర్, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ కళ్యాణ్ చక్రవర్తి, టి.వెంకటి తదితరులు పాల్గొన్నారు. పరిశుభ్ర పట్టణమే లక్ష్యంసిరిసిల్లటౌన్: సిరిసిల్లను పరిశుభ్రతలో ఆదర్శ నగరంగా మార్చడమే తమ లక్ష్యమని మున్సిపల్ కమిషనర్ ఖదీర్పాషా పేర్కొన్నారు. ‘స్వచ్ఛతా హీ సేవ’లో భాగంగా బుధవారం పట్టణంలో బల్దియా ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. కమిషనర్ ఎంఏ ఖదీర్పాషా మాట్లాడుతూ పట్టణ ప్రజలకు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ‘స్వచ్ఛతా హీ సేవ’ ప్రచారం రానున్న రెండు వారాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ ర్యాలీ అంబేడ్కర్ జంక్షన్ నుంచి బతుకమ్మఘాట్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా అందరూ స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు. సిరిసిల్లటౌన్: కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన వీరోచిత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో సంబంధం లేని బీజేపీకి ఎందుకు ఆర్భాటమని సీపీఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి టి.స్కైలాబ్బాబు విమర్శించారు. బుధవారం వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాల ముగింపు సందర్భంగా సిరిసిల్ల ఆర్డీవో ఆఫీసు నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ తీశారు. అంబేడ్కర్చౌరస్తాలో జరిగిన సభలో బద్దం ఎల్లారెడ్డి, అమృత్లాల్ శుక్లా, కర్రోళ్ల నర్సయ్య, గడ్డం తిరుపతిరెడ్డి, సింగిరెడ్డి భూపతిరెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. 1946 సెప్టెంబర్ 11 నుంచి 1951 సెప్టెంబర్ 17 వరకు జరిగిన వీరతెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో బీజేపీ నాయకులు ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని విద్యార్థులు యువతరం అధ్యయనం చేయాలని కోరారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేష్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి, జవ్వాజి విమల, కోడం రమణ, మల్లారపు అరుణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్లటౌన్: జిల్లాలో కొ న్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఫిట్నెస్ లేని బస్సులు నడుపుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అంగూరి రంజిత్ పేర్కొన్నారు. ఈమేరకు బుధవారం డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ లక్ష్మణ్కు ఫిర్యాదు చేసి మాట్లాడారు. పాఠశాలల బస్సులకు సరైన ఫిట్నెస్ లేకపోవడం, ఫైర్ ఎగ్జాస్టింగ్ కిట్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ లేకుండా, సీట్ల సంఖ్యకు మించి ఎక్కువ మంది విద్యార్థులను కూర్చోబెడుతున్నారన్నారు. నిబంధనలు పాటించకుండా వ్యవహరిస్తున్న పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
కాంగ్రెస్ పార్టీతోనే అట్టడుగువర్గాల అభివృద్ధి
● మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ సిరిసిల్ల అర్బన్: అట్టడుగు వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. మంగళవారం సిరిసిల్లలోని కేకన్వెన్షన్ హాల్లో అంబేడ్కర్ సంఘాల జిల్లా అధ్యక్షుడు కత్తెర దేవదాస్ అధ్యక్షతన జరిగిన మాదిగల ఆత్మీయ సమ్మేళనానికి చీఫ్గెస్ట్గా మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రిని అంబేడ్కర్ సంఘాల నాయకుల, దళిత సంఘాల నాయకులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. వేములవాడ రాజన్న ఆశీర్వాదంతో విప్ ఆది శ్రీనివాస్, ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి ఆశీర్వాదంతో మంత్రిగా కొనసాగుతున్నాన్నారు. గత ప్రభత్వం హయాంలో కేటీఆర్, సంతోష్రావు నేరెళ్ల దళితుల మీద దాడులు చేయించారన్నారు. అప్పటి పార్లమెంట్ స్పీకర్ మీరాకుమారి నేరెళ్లను సందర్శించారని.. దళితులపై జరిగిన దాడులను చూసి చలించిపోయారన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజనవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటుచేసి పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో మాదిగ బిడ్డగా నాకు, మాల బిడ్డగా వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి దక్కడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, సెస్ డైరెక్టర్ సుధాకర్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు స్వరూప, కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, సంగీతం శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, అంబేడ్కర్ సంఘాల నాయకులు వెంకటమల్లయ్య, దర్మెందర్, అక్కని భాను తదితరులు పాల్గొన్నారు. -
పోరాట యోధుడు అమృత్లాల్
నిజాంను ఎదిరించిన వారి లో సిరిసిల్ల ప్రాంతానికి చెందిన అమృత్లాల్ శుక్లా ప్ర ముఖుడు. 1950లో సిరిసిల్ల పోలీస్స్టేషన్పై దాడి చేసి సంచలనం సృష్టించిన వీరుడు. సాయుధ దళాలను వ్యూహాత్మకంగా నడిపిస్తూ మూడు రంగుల జాతీయ జెండాలను ప్రాబల్య గ్రామాల్లో ఎగుర వేసి దేశభక్తిని చాటుకున్నారు. శుక్లాను నిజాం పోలీసులు నిర్బంధించి 13 ఏళ్ల జైలు శిక్ష విధించగా.. చంచల్గూడ జైలు నుంచి తరలిస్తుండగా పోలీసుల కళ్లుగప్పి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో తప్పించుకున్నాడు. 1957లో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 85 ఏళ్ల వయస్సులో 1991 నవంబర్ 14న అస్తమించారు. -
తలవంచిన నిరంకుశత్వం
రక్తసిందూరం గాలిపెల్లిసిరిసిల్ల/ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జి ల్లా ఇల్లంతకుంట మండలం గాలిపెల్లి తెలంగాణ సాయుధ పోరా టంలో వీరోచిత పోరా ట చరిత్రకు చిహ్నమైంది. నిజాం రాజ్యహింసకు ఒకేరోజు 11 మంది ప్రాణాలర్పించి న ఆ నేల రక్త సిందూరమైంది. గాలిపెల్లికి చెందిన కమ్యూనిస్టు యోఽ దుడు బద్దం ఎల్లారెడ్డి నిజాం వ్యతిరేక పోరాటాన్ని సాగించారు. ఈ నేపథ్యంతో ఉద్యమకారులు గాలిపెల్లిలో జాతీయ జెండా ఎగురవేశారు. స్వాతంత్య్ర పోరాటాన్ని ఉధృతం చేస్తూ ఉద్యమించారు. ఇది జీర్ణించుకోలేని నిజాం పోలీసులు ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపారు. రజాకార్లకు వ్యతిరేకంగా పల్లెలు తిరగబడ్డాయి. పోలీసులు, రజాకార్లపై తిరగబడిన గాలిపెల్లిలో భీకర పోరు సాగింది. ఆ పోరులో గాలిపెల్లికి చెందిన పీసు బక్కయ్య, బద్దం నారాయణ, బుర్రయ్య, పుల్లుగారి ఎల్లయ్య, అల్లెం వెంకయ్య, తాళ్లపల్లికి చెందిన సింగిరెడ్డి రాజిరెడ్డి, నర్సక్కపేటకు చెందిన ఎలేటి రాజిరెడ్డి, సోమారంపేటకు చెందిన ఐరెడ్డి భూంరెడ్డి, బెజ్జంకి మండలం బేగంపేటకు చెందిన తుమ్మోజి నారాయణ అసువులు బాశారు. ఉద్యమంతో సంబంధం లేని గాలిపెల్లికి చెందిన పెరంబుదూరి అనంతయ్య, రంగమ్మ వృద్ధ దంపతులు బలయ్యారు. గ్రామ సమీపంలోని మొక్కజొన్న చేనులో భయంతో తలదాచుకున్న వీరిని రజాకార్లు నిర్ధాక్షిణ్యంగా కాల్చిచంపారు. రజాకార్ల దాడిలో బద్దం ఎల్లారెడ్డి, రాజలింగం, అమృత్లాల్ శుక్లా చాకచక్యంగా తప్పించుకున్నారు. వీరు తప్పించుకున్నారని తెలిసి ఆగ్రహంతో రజాకార్లు గాలిపెల్లి ఊరును తగులబెట్టారు. స్ఫూర్తి ప్రదాత బద్దం ఎల్లారెడ్డి గాలిపెల్లికి చెందిన బద్దం హన్మంతరెడ్డి–లచ్చవ్వ రెండో సంతానంగా 1906లో జన్మించిన బద్దం ఎల్లారెడ్డి యుక్త వయసులోనే కమ్యూనిజం భావజాలాన్ని ఒంటబట్టించుకున్నారు. గెరిల్లా దళాలకు మానాల క్యాంపులో శిక్షణ ఇస్తూ.. పోరాటానికి బాటలు వేశారు. 1948 మార్చి 12న ఇల్లంతకుంట పోలీసు క్యాంపుపై సాయుధ ఉద్యమకారులు దాడి చేసి ఎస్సైతో సహా ఆరుగురు పోలీసులను హతమార్చారు. గాలిపెల్లిలో తన సొంత భూములను పేదలకు పంచడంతో పాటు సిరిసిల్ల ప్రాంతాల్లో దున్నేవాడిదే భూమి అంటూ ఉద్యమాన్ని రగిలించారు. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా మద్రాసులో అరెస్ట్ అయి 3 నెలల జైలుశిక్ష అనుభవించారు. జైలు నుంచి వచ్చి కరీంనగర్ జిల్లాలో సాయుధ పోరాటాన్ని సాగించారు. 1951లో జరిగిన తొలి ఎన్నికల్లోనే పీడీఎఫ్ అభ్యర్థిగా కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి ప్రత్యర్థి పీవీ నర్సింహరావుపై విజయం సాధించారు. 1956లో భారత కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా పని చేశారు. 1958లో బుగ్గారం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. రెండోసారి 1972లో ఇందుర్తి నుంచి ఎమ్మెల్యేగా ఎంపికై నిజాయితీ గల నేతగా ప్రజల్లో పేరు తెచ్చుకున్నారు. బస్సులోనే ప్రయాణిస్తూ సామాన్యులతో కలిసిపోయేవారు. బద్దం ఎల్లారెడ్డి స్ఫూర్తిగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీవై నగర్ పేరుతో కార్మిక క్షేత్రం, కరీంనగర్లో ఎల్లారెడ్డి భవన్ ఉంది. 1979లో తుది శ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు కొడుకులు రాంరెడ్డి, లక్ష్మారెడ్డి, కూతురు విజయ ఉన్నారు. పోలీసులు, దొరలు, భూస్వాములు, రజాకార్ల దౌర్జన్యాలను సహించలేని అణగారిన, పీడిత ప్రజలు ఉద్యమించిన రోజు.. గ్రామాల్లోని ప్రజలు ఎక్కడికక్కడ పలుగు, పార, కారం, రోకలి బండలు, వరిసెలు, బరిసెలు.. ఇలా అందిదల్లా ఆడ, మగ తేడా లేకుండా అందరికీ ఆయుధాలుగా మారాయి. అనేకమంది యోధుల త్యాగాల ఫలితమే సెప్టెంబర్ 17..మానాల క్యాంపులో సాయుధులు (ఫైల్) నిజాం సంస్థాన పరిధి సిరిసిల్ల: తెలంగాణ విముక్తి ఉద్యమం చురుగ్గా సాగుతున్న దశలో 1935 డిసెంబర్లో సిరిసిల్లలో నాల్గో ఆంధ్ర మహాసభ మాడపాటి హన్మంతరావు అధ్యక్షతన జరిగింది. ఈ సభలో తీసుకున్న కీలక నిర్ణయాలతో విముక్తి పోరాటం ఉవ్వెత్తున ఎగిసింది. సురవరం ప్రతాపరెడ్డి, రావి నారాయణరెడ్డి, బూరుగుల రామకృష్ణారావు, పీవీ నర్సింహరావు, బద్దం ఎల్లారెడ్డి, కె.వి.రంగారెడ్డి లాంటి వారితో జిల్లాలోని పలువురు నాయకులు ఈ సభలో పాల్గొన్నారు. గాలిపెల్లికి చెందిన బద్దం ఎల్లారెడ్డి తెలంగాణ విముక్తి ఉద్యమంలో ప్రధానంగా ముందున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎందరో త్యాగమూర్తులు ని జాం వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. చందుర్తి మండలం బండపల్లికి చెందిన గడ్డం తిరుపతిరెడ్డి, వేములవాడకు చెందిన గుమ్మి పుల్లయ్య, కోనరావుపేటకు చెందిన రాజలింగం, నిమ్మపల్లికి చెందిన అనుముల నర్సయ్య, మల్కపేటకు చెందిన కర్రోళ్ల నర్సయ్య, సిరిసిల్లకు చెందిన గర్ధాస్ గంగారాం వీరోచిత పోరాటాన్ని సాగించి విజయాన్ని సాధించారు. సాహసోపేత ఉద్యమంలో సిరి సిల్ల మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వర్రావు పోరాట కెరటమయ్యారు. కోనరావుపేట మండలం నాగారంకు చెందిన రాజేశ్వర్రావు 1948 నుంచి 1951 వరకు భార్య లలితతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లి ప్రజా ఉద్యమాన్ని నిర్మించారు. నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించి జైలుశిక్ష అనుభవించారు. 957, 1967, 1978, 1985, 1994, 2004లో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. -
కెప్టెన్ సాబ్ త్యాగానికి సలాం
సిరిసిల్ల: దేశసరిహద్దుల్లో వీరోచితంగా పోరాడిన కెప్టెన్ రఘునందన్రావు 1965 సెప్టెంబరు 17న ఇండో–పాక్ యుద్ధంలో వీరమరణం పొందారు. సిరిసిల్ల పట్టణం చిన్నబోనాలకు చెందిన విజయ రఘునందన్రావు 60వ వర్ధంతి బుధవారం. కెప్టెన్ సాబ్ యాదిలో కథమిదీ. ఏం జరిగిందంటే.. అది 1965 ఆగస్టు 28 శ్రీనగర్లో పాకిస్తాన్ స్థావరాలపై మాఫింగ్ ఆపరేషన్ చేస్తున్న క్రమం. పుణెలో ఉన్న కెప్టెన్ విజయరఘునందన్రావుకు పిలుపొచ్చింది. వెంటనే కశ్మీర్లోని చాంబ్జారిన సెక్షన్లో చేరిపోయారు. అక్కడ పాకిస్తాన్ సైనికులతో జరిగిన భీకరపోరులో రఘునందన్రావు వీరోచితంగా పోరాటం సాగించాడు. కెప్టెన్గా సైనికులకు మార్గదర్శకంగా ఉంటూ యుద్ధంలో ముందుకు సాగాడు. ఈ క్రమంలో రఘునందన్రావు మెడకు బుల్లెట్ గాయమైంది. వెంటనే అతన్ని ఢిల్లీలోని కంటోన్మెంట్కు విమానంలో తరలించారు. ఢిల్లీ చేరేలోగానే 1965 సెప్టెంబరు 17న వీర మరణం పొందారు. దేశం యావత్తు ఆ వేళ ఆయన వీరమరణానికి నివాళి అర్పించింది. భారత ప్రభుత్వం వీరచక్ర అవార్డుతో సత్కరించింది. ఆయన స్మారకార్థం కరీంనగర్ జిల్లా కేంద్రంలో కెప్టెన్ రఘునందన్రావు రోడ్డు ఉంది. సిరిసిల్ల పాత బస్టాండులో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆయన జీవిత చరిత్రను 7వ తరగతి తెలుగు వాచకంలో ‘చదవండి–తెలుసుకోండి’ శీర్షికతో పాఠ్యాంశమైంది. ఆయన పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం. -
సమాచారం తెలుసుకునే హక్కు అందరికీ ఉంది
● రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి సిరిసిల్ల: జిల్లాలో సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ)–2005ను అధికారులు కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జి.చంద్రశేఖర్రెడ్డి కోరారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. రెండేళ్లుగా ఆర్టీ కమిషనర్ నియామకం కాకపోవడంతో 17 వేల కేసులు పెండింగ్ ఉన్నాయని, కేసులను పరిష్కరించడంలో ఆర్టీఐపై నెలకొన్న నిర్లక్ష్యాన్ని తొలగించేందుకు జిల్లాల్లో పర్యటిస్తున్నామని వివరించారు. కలెక్టర్ సందీప్కుమార్ఝా మాట్లాడుతూ, 2005లో వచ్చిన సమాచార హక్కు చట్టంతో ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారితనం పెరిగిందన్నారు. ప్రతి అధికారి తన హక్కులు, బాధ్యతలు చట్టపరంగా పాటించాల్సిన మార్గదర్శకాలను తెలుసుకొని సమాచార హక్కు చట్టం పకడ్బందీగా అమలు చేయాలన్నారు. తప్పుడు సమాచారం అందించినా, ఆలస్యం చేసినా ఆర్టీఐ చట్టం సెక్షన్ 21, 22 ప్రకారం కమిషన్ చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం సంబంధించి జిల్లాలో పెండింగ్ ఉన్న 134 కేసులను కమిషన్ సభ్యులు ప్రస్తావించారు. వీటిని వెంటనే పరిష్కరించాలని కమిషనర్లు దేశాల భూపాల్, పీవీ శ్రీనివాసరావు, బోరెడ్డి అయోధ్యరెడ్డి, మెహసిన పర్వీన్లు కోరారు. సిరిసిల్ల, వేములవాడ ఏఎస్పీలు చంద్రయ్య, శేషాద్రినిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు కలెక్టరేట్లో సమాచార చీఫ్ కమిషనర్, బృందం పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. -
పల్లెల్లో వానరదండు
కోనరావుపేట(వేములవాడ): తలుపు తెరిచి ఉంటే చాలు క్షణాల్లో ఇళ్లలోకి చొరబడి దొరికింది ఎత్తుకెళ్తున్నాయి. పెంకుటిళ్లపైకి ఎక్కి గూనపెంకులు పీకిపారేస్తున్నాయి. కూరగాయల తోటలు, పత్తిచేనులు చేతికిరాకుండా పోతున్నాయి. ఇవన్నీ కోతులమంద దాడితో పల్లెప్రజలు పడుతున్న కష్టాలు. కొన్నాళ్లుగా జిల్లాలోని పల్లెల్లో వందల కొద్ది కోతులు తిష్టవేసి ఉన్నాయి. పంటలను పాడు చేయడమే కాకుండా మనుషులపై దాడి చేసి గాయపరుస్తున్నాయి. కిష్కిందకాండతో పల్లెప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీ..ఇన్నీ కావు. ఇల్లు పీకి పందిరేస్తున్నాయి గ్రామాల్లోకి చొరబడ్డ కోతులు ఇళ్లలోకి వచ్చి తినుబండారాలను ఎత్తుకెళ్తున్నాయి. అడ్డుకోబోయిన వారిపై దాడి చేస్తున్నాయి. పెంకుటిళ్ల పరిస్థితి మరీ దారుణంగా మారింది. తినుబండారాలను ఎత్తుకెళ్తున్న కోతులు ప్యాకెట్ల నుంచి రాలిన గింజల కోసం గూనపెంకులను పీకి పడేస్తున్నాయి. పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేస్తున్న విద్యార్థులపై దాడి చేస్తుండడంతో కోనరావుపేట మండలం కనగర్తిలో టీచర్లు కర్రలతో కాపలాగా ఉంటున్నారు. పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులపై దాడికి దిగుతుండడంతో కర్రలు పట్టుకుని వెళ్తున్నారు. ● పంటలు నేలపాలు గ్రామాల్లోని పంటలపై దాడి చేసి ధ్వంసం చేస్తున్నాయి. పత్తి, మొక్కజొన్న పంటలు నేలపాలవుతున్నాయి. రైతులు పంటలను కాపాడుకునేందుకు కర్రలతో కాపలా కాస్తున్నారు. ● నివారణ చర్యలు శూన్యం గ్రామాల్లో పెరుగుతున్న కోతుల నియంత్రణ చర్యలు శూన్యంగానే ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో కొండెంగను తీసుకొచ్చి తిప్పారు. తర్వాత వదిలేయడంతో కోతుల బెడద మళ్లీ మొదలైంది. కోతుల బెడద నివారించాలని కనగర్తి గ్రామస్తులు ఇటీవల జిల్లా కలెక్టర్ సందీప్కుమార్ ఝాను కలిసి విన్నవించారు. -
తలవంచిన నిరంకుశత్వం
బాంచెన్ కాల్మొక్త అన్న సామాన్యులే.. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం బందుకూతో గడి పునాదులను పెకిలించారు.. నిజాం నిరంకుశ పాలనలో మగ్గిపోతున్న తెలంగాణ ప్రజల విముక్తి కోసం కదంతొక్కారు.. జాగిరీదారులు, మక్తేదారులు, ఇనాందారులు, వతన్దారుల దుర్మార్గాలు, దౌర్జన్యాలపై పోరాటం సాగించారు..ఎందరో రజకార్లను తరిమికొట్టారు.. తెలంగాణ సాయుధ పోరాటంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కీలక పాత్ర పోషించింది. అందులో ఇప్పటి రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రాంతం మడమతిప్పని పోరాటం సాగించింది.. బానిస సంకెళ్ల విముక్తి కోసం ఎందరో తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలారు. నేడు సెప్టెంబర్ 17 సందర్భంగా పలువురు యోధుల కథనాలు. – కరీంనగర్/సిరిసిల్ల/ఇల్లంతకుంట /పెద్దపల్లి రూరల్/బోయినపల్లి/మంథని రూరల్ -
వంతెన నిర్మించాలని ఒర్రె నీటిలో నిరసన
చందుర్తి(వేములవాడ): ఒర్రె ప్రాంతాల్లో రెండు వంతెనలు నిర్మించాలని మండలంలోని ఎన్గల్ గ్రామ శివారు ఒర్రె నీటిలో ప్రజాగొంతుక చీఫ్ పుప్పాల మోహన్ మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్గల్ గ్రామానికి చెందిన గీత కార్మికుల రేణుక ఎల్లమ్మ ఆలయం, పెద్దమ్మ ఆలయాలతో పాటు రైతుల పొలాలు, వైకుంఠధామం, డంపింగ్ యార్డు ఒర్రె అవతలి వైపు ఉన్నాయని పేర్కొన్నారు. వర్షాకాలంలో గ్రామస్తులు ఒర్రె దాటేందుకు ఇబ్బంది పడుతున్నారని, వంతెన నిర్మించాలని గతంలో అప్పటి ఎమ్మెల్యే రమేశ్బాబు, ప్రస్తుత ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. సిరిసిల్ల: జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో బుధవారం ప్రజాపాలన దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరై జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. అంతకుముందు విప్, కలెక్టర్ సందీప్కుమార్ ఝా, ఎస్పీ మహేశ్ బి గితే పోలీస్ గౌరవ వందనం స్వీకరిస్తారు. ఉదయం 9.40 నుంచి 10.07 గంటల వరకు ప్రజా పాలన వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. వేములవాడ: వేములవాడ– సిరికొండ రోడ్డు నిర్మాణానికి రూ.23 కోట్ల నిధులు మంజూరైనట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. వేములవాడ నుంచి సిరికొండ రోడ్డు సుమారు 18 కిలోమీటర్లు ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన కేంద్ర మంత్రి నితిన్గడ్కరీ, ఇందుకు కృషి చేసిన సీఎం రేవంత్రెడ్డికి నియోజకవర్గ ప్రజల పక్షాన విప్ ఆది ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. టెక్నికల్ కోర్సులకు శిక్షణ సిరిసిల్ల/సిరిసిల్లకల్చరల్: జిల్లా కేంద్రంలోని తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్, నాలెడ్జ్ (టాస్క్) ప్రాంతీయ కేంద్రంలో పలు సాంకేతిక కోర్సులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి నీల రాఘవేందర్ ప్రకటనలో తెలిపారు. జిల్లా గ్రంథాలయ భవనంలోని ప్రాంతీయ కేంద్రంలో జావా వెబ్ డెవలప్మెంట్, పైతాన్ సి, సీ ప్లస్ 2, హెచ్టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్, ట్యాలీ విత్ జీఎస్టీ, అప్టిట్యూడ్ రీజనింగ్ సాఫ్ట్ స్కిల్స్ తదితర కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కనీసం డిగ్రీ ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతీయువకులు ఈ నెల 20లోపు టాస్క్ ప్రాంతీయ కేంద్రలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. శిక్షణ పూర్తి చేసుకున్న యువతకు మంచి ప్యాకేజీలతో ఉపాధి అవకాశాలుంటాయని, పూర్తి వివరాలకు 70755 22671, 95333 08928 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. సిరిసిల్ల: జిల్లాలో మంగళవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. అత్యధికంగా కోనరావుపేటలో 63.0 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. రుద్రంగిలో 10.7 మి.మీ, చందుర్తి 32.6, వేములవాడ రూరల్ 16.2, సిరిసిల్ల 27.6, వీర్నపల్లి 7.0. వేములవాడ 27.6, ఎల్లారెడ్డిపేట 38.4, గంభీరావుపేట 24.0, ముస్తాబాద్ 53.7, తంగళ్లపల్లి 16.8, ఇల్లంతకుంట 24.0, బోయినపల్లిలో అత్యల్పంగా 1.0 మిల్లీ మీటర్ల వర్షం నమోదైంది. జిల్లాలో సగటు వర్షపాతం 26.4 మిల్లీ మీటర్లు ఉంది. -
సిలిండర్పైనే భోజనం వండాలి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఇల్లంతకుంట(మానకొండూర్): సిలిండర్పైనే మధ్యాహ్న భోజనం వండాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా సూచించారు. మంగళవారం మండలంలోని పెద్దలింగాపురం హైస్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేసి మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. పాఠశాల గ్రౌండ్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఆస్పత్రి వార్డులు, ఫార్మసీలో అందుబాటులో ఉన్న మందులు, ఓపీ రిజిస్టర్లు పరిశీలించారు. ప్రసవాలు ఎక్కువ జరిగేలా చూడాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఆయా కార్యక్రమాల్లో డాక్టర్ ప్రేమ్కుమార్, స్కూల్ హెచ్ఎం తిరుపతి తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్లకల్చరల్: యూనియన్ బ్యాంక్ వారి గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి ప్రకటన జారీ అయింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన మూడేళ్ల కాలానికి భర్తీ చేసే ఉద్యోగాల కోసం అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ తెలిపారు. అధ్యాపకులు 2, ఆఫీస్ అసిస్టెంట్లు 2 పోస్టులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా, అటెండెంట్ 1, వాచ్మన్ 1 పోస్టులకు ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తారు. ఆసక్తి, అర్హత గల వారు ఈ నెల 17 సాయంత్రంలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అవసరమైన పత్రాలను జతచేసి పూర్తి చేసిన దరఖాస్తు పత్రాలను గోపాల్నగర్లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో సమర్పించాలని, మరిన్ని వివరాలకు 63018 90681 నంబర్ను సంప్రదించాలని సూచించారు.