Rajanna
-
సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలి
● ఎస్పీ మహేశ్ బి గితే సిరిసిల్ల: జిల్లాలో బహిరంగంగా మద్యం సేవించడంపై నిత్యం తనిఖీలు నిర్వహించాలని, నేరాల నియంత్రణ, నిందితులకు శిక్ష పడేలా చర్యలు చేపట్టి బాధితులకు న్యాయం అందించేలా పనిచేయాలని ఎస్పీ మహేశ్ బి గితే ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీస్ ఆఫీస్లో సిరిసిల్ల సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, మారిన పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి నేరాల దర్యాప్తు, నేరస్తుల గుర్తింపు, కేసుల నిర్వహణలో వేగం, పారదర్శకత పెంచాలని సూచించారు. గంజాయి, ఇసుక, పీడీఎస్ రైస్ అక్రమ రవాణా, గ్యాంబ్లింగ్పై ఆకస్మిక తనిఖీలు చేపడుతూ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో రోజూ సాయంత్రం డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలన్నారు. రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నియంత్రణ, మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమీక్షలో డీఎస్పీ కె.నాగేంద్రచారి, సీఐలు శ్రీనివాస్, నాగేశ్వరరావు, వెంకటేశ్, మొగిలి, ఎస్సైలు, ఐటీ కోర్, డీసీఆర్బీ సిబ్బంది పాల్గొన్నారు. నిత్యం డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా నిత్యం డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలని ఎస్పీ మహేశ్ బి గితే ఆదేశించారు. మంగళవారం రాత్రి జిల్లా కేంద్రంలోని విద్యానగర్ వద్ద పోలీస్ తనిఖీలను పరిశీలించారు. నంబరు ప్లేట్లు, సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేయాలని సూచించారు. మైనర్ల డ్రైవింగ్ను పట్టుకోవాలని, అసాంఘిక శక్తులను నిషితంగా పరిశీలించాలన్నారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఆర్ఎస్ఐ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. -
బడి.. సమస్యలు రెడీ!
‘ఇది వీర్నపల్లి మండలం భావుసింగ్నాయక్ తండాలోని ప్రభుత్వ బడి. ఇటీవల కురిసిన జల్లులకు పాఠశాల ప్రాంగణం వర్షం నీటితో ఇలా నిండింది. వానాకాలం ఆరంభమైతే పిల్లలు మోకాల్లోతు నీళ్లలో నడుచుకుంటూ వెళ్లాల్సిందే’.జిల్లాలో..అంబేడ్కర్నగర్ జెడ్పీ స్కూల్ ఆవరణలో విరిగిన చెట్టు‘చెట్ల కింద చదువులు సాగిస్తున్న ఈ విద్యార్థుల ఫొటో ఎక్కడో మారుమూల ప్రాంతం అనుకుంటే పొరపడినట్లే. జిల్లా కేంద్రంలోని గీతానగర్ ప్రాథమిక పాఠశాలలోనిది. ఇందులో గత విద్యా సంవత్సరం 108 మంది విద్యార్థులు చదివారు. 1 నుంచి 5వ తరగతి వరకు రెండే గదులు ఉండడంతో సరిపోక ఇలా చెట్ల కింద చదువులు సాగించారు’.ప్రైమరీ స్కూళ్లు 333యూపీఎస్ 39హైస్కూల్స్ 111విద్యార్థులు 31,426 -
అన్లోడింగ్ వేగవంతం చేయండి
సిరిసిల్లఅర్బన్: ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. మంగళవారం సిరిసిల్ల మున్సిపల్ పరిధి సర్ధాపూర్లోని వ్యవసాయ మార్కెట్ యార్డు గోదాముల్లో ధాన్యం ఆన్లోడింగ్ తీరును అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్తో కలిసి పరిశీలించారు. హమాలీల సంఖ్యను మరింత పెంచి అన్లోడింగ్ వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని, అన్లోడింగ్ అయిన వాహనాలను ధాన్యం లోడింగ్ కోసం ఇతర కేంద్రాలకు తరలించాలని సూచించారు. గోదాముల్లో ధాన్యం నిల్వ చేస్తున్న తీరు, వాటి సామర్థ్యం వివరాలపై ఆరా తీశారు. వెనువెంటనే కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం లోడ్ చేసి తరలించేలా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. పౌర సరఫరాలశాఖ అధికారి బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, సిరిసిల్ల, వేములవాడ తహసీల్దార్లు మహేశ్, జయంత్ తదితరులు పాల్గొన్నారు. -
స్వచ్ఛ సిరిసిల్లకు ప్రాధాన్యం
సిరిసిల్లటౌన్: స్వచ్ఛ సిరిసిల్లకు తమ పాలకవర్గం ప్రాధాన్యత ఇస్తుందని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ అన్నారు. మంగళవారం 6వ వార్డులోని ప్రధాన మురికికాలువలో పూడిక తీత పనులను ప్రారంభించి మాట్లాడారు. వచ్చే వర్షాకాలం దృష్ట్యా ప్రధాన మురికికాలువలలో పూడిక తీయుటకు ప్రత్యేకంగా రూ.5లక్షల నిధులు కేటాయించడం జరిగిందన్నారు. ఈక్రమంలోనే నెహ్రునగర్ నుంచి గాంధీనగర్, అంబేద్కర్నగర్ మీదుగా శాంతినగర్ వరకు ప్రవహిస్తున్న ప్రధాన కాలువలో పూడికతీత పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. కొంతమంది నిర్లక్ష్యంగా కాలువల్లో చెత్త పడవేయడంతో నీటి ప్రవాహనాకి అడ్డు ఏర్పడి దోమలు, క్రిమి కీటకాలతో వృవొకశచెంది ప్రజలు వ్యాధుల బారిన పడే అవకాశం ఉందన్నారు. మున్సిపల్ కమిషనర్ ఎండీ ఖాదీర్పాషా, కౌన్సిలర్ దూడం రజిని శ్రీనివాస్, ఏఈ నరసింహస్వామి తదితరులు పాల్గొన్నారు. పాఠ్య పుస్తకాలు వచ్చేశాయ్ ముస్తాబాద్: మండల వనరుల కేంద్రంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులకు పాఠ్య పుస్తకాలను మంగళవారం పంపిణీ చేశారు. పాఠశాలలు పునఃప్రారంభం వరకు పుస్తకాలు, నోట్ బుక్స్ సరఫరా పూర్తి చేస్తామని ఎంఈవో నిమ్మ రాజిరెడ్డి తెలిపారు. ఇప్పటికే బడిబాట కార్యక్రమం జరుగుతుందని, విద్యార్థుల చేరికలు జరుగుతున్నాయన్నారు. హెచ్ఎంలు, సిబ్బంది పాల్గొన్నారు. -
తూకం వేసిన ధాన్యం వెంటనే తరలించాలి
వేములవాడరూరల్: ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేసేలా చూడాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ అన్నారు. వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి, నమిలిగొండపల్లి గ్రామాల్లో మంగళవారం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోళ్ల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. వర్షాల నేపథ్యంలో అందుబాటులో ఉన్న టార్ఫాలిన్ల వివరాలపై ఆరా తీశారు. తూకం వేసిన ధాన్యం మిల్లులకు తరలించేందుకు వాహనాలను సమకూర్చాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. రైతులు పంట మార్పిడిపై దృష్టి సారించి లాభదాయకమైన పంటలను సాగు చేయాలని తెలిపారు. గర్భిణులకు మెరుగైన వైద్యసేవలే లక్ష్యంతంగళ్లపల్లి(సిరిసిల్ల): ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం తంగళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓఎంసీహెచ్, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ నాగేంద్ర బాబు, వైద్యాధికారి డాక్టర్ స్నేహ మాట్లాడుతూ, గర్భిణులకు అందుతున్న సేవలపై అవగాహన కల్పించారు. గర్భిణులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం, అధిక ప్రమాదం ఉన్నవారిని ముందుగానే గుర్తించి తల్లి, శిశు మరణాలను తగ్గించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రతి గర్భిణి కనీసం ఒక్కసారైనా నిపుణులైన వైద్యులతో పరీక్షలు చేయించుకోవాలని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు అయ్యేలా చూసుకోవాలని కోరారు. అలాగే గర్భధారణ సమయంలో నాణ్యమైన పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. ప్రతి నెల 9న ఈ కార్యక్రమాన్ని పీహెచ్సీతో పాటు అన్ని సబ్ సెంటర్లలో నిర్వహిస్తామని పేర్కొన్నారు. హెల్త్ సూపర్వైజర్లు అరవింద్, ప్రమీల, సతీశ్కుమార్, ప్రమీల, సుల్తానమ్మ, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ గురుకులం సమస్యలు పరిష్కరించాలిసిరిసిల్లటౌన్: ఎస్సీ గురుకులాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని టీజీఎస్డబ్ల్యూఆర్ఈటీఎల్ఏ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఏనుగుల సంతోష్ కోరారు. మంగళవారం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఓఎస్డీ విజయ్కుమార్కు వినతిపత్రం అందజేసి మాట్లాడారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, అధ్యాపకుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న పదోన్నతులు, డిగ్రీ కళాశాల టైం టేబుల్ మార్పు, పీజీటీ ఫిజికల్ సైన్స్, బయోసైన్స్, హిందీ పోస్టులు మంజూరు చేయాలన్నారు. ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్, వ్యాయామ ఉపాధ్యాయులకు క్రాస్ ప్రమోషన్స్ చేపట్టాలని, మూడేళ్లుగా పెండింగ్లో ఉన్న డీఏ విడుదల చేయాలని కోరారు. రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆవుల సైదులు, కంది సంపత్ తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్వో రజిత బదిలీసిరిసిల్లటౌన్: జిల్లా ఇన్చార్జి డీఎంహెచ్వో డాక్టర్ రజిత బదిలీ అయ్యారు. మంగళవారం వైద్యారోగ్య శాఖ రాష్ట్రంలోని డెప్యూటీ డీఎంహెచ్వోలను బదిలీలను చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు జిల్లాలో డెప్యూటీ డీఎంహెచ్వో(ఇన్చార్జి డీఎంహెచ్వో)గా పనిచేస్తున్న రజితను హనుమకొండ జిల్లాకు బదిలీ చేశారు. ఆమె స్థానంలో వికారాబాద్ జిల్లా డెప్యూటీ డీఎంహెచ్వోగా పనిచేస్తున్న డాక్టర్ పవిత్రను నియమించారు. రెండు రోజుల్లో ఆమె సిరిసిల్లలో పదవీ బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. -
న్యాయం చేయండి
తంగళ్లపల్లి మండలం గోపాల్రావుపల్లికి చెందిన 30 మందికి గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేసింది. అందులో పది మంది మాత్రమే ఇండ్లు నిర్మించుకున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకున్న వారికి రూ.5 లక్షలు ఇస్తామని ప్రకటించింది. ఇందులో ఇండ్లు కట్టని వారి పేర్లను గ్రామపంచాయతీ తీర్మానించింది. వారితో ఇండ్లు కట్టుకున్నవారికి అన్యాయం జరిగే అవకాశం ఉంది. ఇండ్లు కట్టుకున్నవారికి న్యాయం చేయండి. – గోపాల్రావుపల్లి గ్రామస్తులు -
పైసలు ఉన్నా పరేషానే!
● ఖాతాల్లోనే యాసంగి వడ్ల డబ్బులు ● రోజుకు రూ.10వేలు ఇస్తున్న బ్యాంక్ అధికారులు ● మొదలైన వానాకాలం సాగు పనులు ● పెట్టుబడి కోసం రైతుల తిప్పలు ● ఆన్లైన్ చెల్లింపులు తెలియక అయోమయండబ్బులు లెక్కపెట్టుకుంటున్న ఇతను ముస్తాబాద్ మండలం మద్దికుంటకు చెందిన రైతు కొరివి చంద్రయ్య. ఇతనికి ఐదెకరాల భూమి ఉంది. యాసంగిలో వచ్చిన ధాన్యం డబ్బులు ఖాతాలో జమకాగా.. ఐదు రోజులుగా రోజూ వస్తూ రూ.10వేల చొప్పున తీసుకుంటున్నాడు. ఈ డబ్బులతో గత పంట హార్వెస్టింగ్, హమాలీ ఖర్చులు పోను ఇప్పుడు విత్తనాలు, ఎరువులు, దున్నకాలకు సరిపోతాయంటున్నాడు. ముస్తాబాద్(సిరిసిల్ల): వానాకాలం సాగుకు రైతులకు నగదు కష్టాలు మొదలయ్యాయి. యాసంగి ధాన్యం డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమకాగా.. చేతిలో నగదు లేక వానాకాలం పెట్టుబడి కోసం తిప్పలు పడుతున్నారు. బ్యాంకులో రోజుకు రూ.10వేలకు మించి ఇవ్వకపోవడంతో నిత్యం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడం, దుక్కి దున్నించడం వంటి వాటికి ఇప్పుడు డబ్బులు అవసరం. కానీ బ్యాంకులో సరైన నగదు లేక రైతులకు మొత్తం ఇవ్వడం లేదు. ఆన్లైన్ చెల్లింపులు తెలియక పలువురు రైతులు రోజూ బ్యాంక్కు వచ్చి గంటల తరబడి క్యూలైన్లో నిల్చొని రోజుకు రూ.10వేల చొప్పున తీసుకెళ్తున్నారు. బ్యాంక్లకు చేరని నగదు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి ఆర్బీఐ ఆదేశాలతో ‘చెస్ట్’ కరెన్సీ నుంచి అన్ని బ్యాంక్లకు నగదు సరఫరా చేస్తారు. ఆర్బీఐ నుంచి నగదు సరఫరా లేకపోవడంతో బ్యాంక్లకూ రావడం లేదు. స్థానికంగా జరిగిన లావాదేవీలతోనే పక్షం రోజులుగా నెట్టుకొస్తున్నామని బ్యాంక్ అధికారి ఒ కరు తెలిపారు. ఇరువై అయిదు రోజులుగా కరీంనగర్ నుంచి నగదు సరఫరా కాలేదని సమాచారం. వైన్స్, పెట్రోల్బంకులు, గ్యాస్ కంపెనీలు జమచేస్తున్న నగదుతోనే ఖాతాదారులకు బ్యాంకర్లు సర్దుబాటు చేస్తున్నారు. జిల్లాలోని చాలా బ్యాంక్ల్లో నగదు లేదని బోర్డులు ఏర్పాటు చేశారు. -
సమస్యల పరిష్కారమే లక్ష్యం
● ఎస్పీ మహేశ్ బీ గీతే సిరిసిల్ల: ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, పరిష్కరించడమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. ఎస్పీ ఆఫీస్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేకు 26 ఫిర్యాదులు రాగా.. ఆయా పోలీస్స్టేషన్ల ఎస్హెచ్వోలకు ఎస్పీ నేరుగా ఫోన్లో మాట్లాడి పరిష్కరించాలని సూచించారు. ఎస్పీ మాట్లాడుతూ పోలీసుల సేవలను ప్రజలకు మరింత దరి చేర్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి చట్టప్రకారం బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. బోయినపల్లి(వేములవాడ): గ్రామసభలతో సమస్యలు పరిష్కారమవుతాయని వేములవాడ ఆర్డీవో కేఎస్బీ కుమారి పేర్కొన్నారు. మండలంలోని నీలోజిపల్లి, రామన్నపేట, కొదురుపాక, వరదవెల్లి, జగ్గారావుపల్లిల్లో సోమవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభలు నిర్వహించారు. తహసీల్దార్ చిందం శ్రీనివాస్, ఎంపీడీవో జయశీల, ఎంపీవో శ్రీధర్, ఎంఏవో ప్రణిత పాల్గొన్నారు. సిరిసిల్ల: జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న 15 మంది సిబ్బందికి ఉద్యోగ విరమణ కల్పిస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం తెలిపారు. జిల్లాలోని వివిధ అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తూ 65 ఏళ్లు నిండిన వారికి ఉద్యోగ విరమణ కల్పిస్తున్నట్లు వివరించారు. వేములవాడ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధి నుంచి ఇద్దరు, సిరిసిల్ల పరిధిలో 13 మందికి ఉద్యోగ విరమణ కల్పించామన్నారు. ఎనిమిది మంది అంగన్వాడీ టీచర్లు, ఏడుగురు ఆయాలు ఉన్నారని తెలిపారు. ఎవరికై నా అభ్యంతరాలు ఉంటే ఆధారాలతో జిల్లా సంక్షేమాధికారి ఆఫీస్లో సంప్రదించాలన్నారు. ఉద్యోగ విరమణ పొందే వారు వయసు నిర్ధారణ పత్రాలతో జూన్ 10వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు రావాలని సూచించారు. సిరిసిల్ల: మృగశిరకార్తె ప్రవేశించిన తొలిరోజు సోమవారం జిల్లాలో వర్షం కురిసింది. ఇన్నాళ్లు వేసవి ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన జనం చిరుజల్లులతో ఊపిరిపీల్చుకున్నారు. చిరుజల్లులకే జిల్లా కేంద్రం చిత్తడయింది. పాతబస్టాండులోని నేతన్నచౌక్ వద్ద రోడ్డుపైకి వరదతో కలిసిన మురికినీరు చేరింది. కరీంనగర్–కామారెడ్డి ప్రధాన రహదారి మురికినీటితో నిండింది. వేములవాడ రూరల్ మండలం మల్లారం వద్ద అత్యధికంగా 32.0 మిల్లీమీటర్లు, అత్యల్పంగా తంగళ్లపల్లి మండలం నేరెళ్ల వద్ద 0.8 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. ఇల్లంతకుంటలో అత్యధికంగా 36.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా... అత్యల్పంగా ముస్తాబాద్ మండలం ఆవునూర్ వద్ద 33.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తడిసిన ధాన్యం ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలో ఆదివారం రాత్రి నుంచి కురిసిన వర్షానికి తిమ్మాపూర్ కేంద్రంలోని వడ్లు తడిసిపోయాయి. దాదాపు 60 నుంచి 70 వడ్ల కుప్పలు నీటిలోనే మునిగిపోయాయి. వారం క్రితం రైతులు రోడ్డెక్కినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. రోడ్లపై చెత్త వేయొద్దువేములవాడ: వేములవాడలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా 5, 6, 7, 8, 9, 10, 20 వార్డుల్లో సోమవారం సభలు నిర్వహించారు. ప్రభుత్వం 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఆడపడుచుకు ఇందిరమ్మ చీరలను అందిస్తోందని మున్సిపల్ చైర్మన్ రాజు తెలిపారు. ఇళ్ల నుంచి వచ్చే చెత్తను ఇష్టానుసారంగా రోడ్లు, ఖాళీ స్థలాలు, మురుగు కాలువల్లో వేయొద్దన్నారు. వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు, కౌన్సిలర్లు, మేనేజర్ సంపత్రెడ్డి, మున్సిపల్ అధికారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, మెప్మా ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. -
విన్నపాలు వినవలె..
● కలెక్టరేట్ బాట పట్టిన అర్జీదారులు ● దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్ గరీమా అగ్రవాల్ ● పెండింగ్ పెట్టొద్దని ఆదేశాలుసిరిసిల్ల అర్బన్: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పలువురు బాధితులు జిల్లా నలుమూలల నుంచి కలెక్టరేట్కు సోమవారం తరలివచ్చారు. ప్రజావాణిలో తమ సమస్యలను వినతిపత్రాల రూపంలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దాదాపు 154 మంది నుంచి అర్జీలను కలెక్టర్ గరీమా అగ్రవాల్ స్వీకరించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా ఉండొద్దని సూచించారు. దరఖాస్తులు పెండింగ్లో పెట్టవద్దని, ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. -
మంగళవారం శ్రీ 9 శ్రీ జూన్ శ్రీ 2026
ఆర్టీసీ బస్సు ఎదుట ఆందోళన తెలుపుతున్న దేవునితండా వాసులుమృగశిర వచ్చింది.. మీనం మెరిసింది !మృగశిర కార్తె సోమవారం ప్రవేశించింది. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్లో ముదిరాజ్ కులస్తులు 230 కుటుంబాలు గ్రామచెరువులో చేపలు పట్టాయి. కులస్తులతోపాటు చేపలు కొనేందుకు వచ్చిన గ్రామస్తులతో చెరువు పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఉబ్బసం వ్యాధి నివారణకు సంప్రదాయంగా వస్తున్న చేపమందును సిరిసిల్ల మార్కెట్లో చంద్రంపేటకు చెందిన రామచంద్రం పంపిణీ చేశారు. కిలో రవు చేపలు రూ.200, బొమ్మెలు రూ.400, రొయ్యలు రూ.400 ధర పలికాయి. – సిరిసిల్లటౌన్/సాక్షి ఫొటోగ్రాఫర్ -
నక్ష ప్రకారం సర్వే పూర్తి చేయండి
● కలెక్టర్ గరీమా అగ్రవాల్సిరిసిల్ల: నక్ష(నేషనల్ జియో స్పాషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హాబిటేషన్స్) ప్రకారం సర్వే ప్రణాళిక పూర్తి చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. కలెక్టరేట్ అధికారులతో సోమవారం సమీక్షించారు. వేములవాడ మున్సిపల్ పరిధిలో నక్ష కింద ఐదు విలీన గ్రామాల్లో కలిపి మొత్తం 307 బ్లాక్స్ ఉన్నాయని, ఇప్పటి వరకు 49 పూర్తి చేశామన్నారు. 14,984 ఇండ్లు ఉండగా.. 6,707 ఇండ్ల సర్వే పూర్తయిందని వివరించారు. ప్రతీ ఇంటి సరిహద్దులు, ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు, ఇతర ఖాళీ స్థలాల విస్తీర్ణం వివరాలు పకడ్బందీగా సర్వే చేయాలని ఆదేశించారు. ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే శ్రీనివాస్, వేములవాడ మున్సిపల్ కమిషనర్ లోకేశ్, టీపీవో అన్సార్ పాల్గొన్నారు. అంతకుముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు హైదరాబాద్ నుంచి ఇదే అంశంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దివ్యాంగులకు ట్రై సైకిల్, వీల్చైర్ అందజేత దివ్యాంగులైన ముస్తాబాద్ మండలం గూడెంకు చెందిన చింతకింది లస్మయ్య, ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లికి చెందిన ముద్రకోల దీనలకు ట్రై సైకిళ్లు అందించారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, డీడబ్ల్యూవో లక్ష్మీరాజం, హౌసింగ్ పీడీ వెంకటమాధవరావు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లపై టెలీకాన్ఫరెన్స్ ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లను వేగంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. -
నీరుంటే నారు పోసుకోవచ్చు
● పత్తిని ఇప్పుడే విత్తుకోవద్దు ● భూమిలో తేమ ఉంటేనే విత్తుకోవాలి ● యాజమాన్య పద్ధతులు పాటిస్తే సన్నాల్లోనూ దిగుబడి ● విత్తనాలు, ఎరువుల రశీదులు దాచుకోవాలి ● ‘సాక్షి’ ఫోన్ఇన్లో జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్బేగంసిరిసిల్ల: జిల్లాలో మంచి వర్షాలు ఇంకా పడలేదు.. భూమి బాగా నానాలి.. వేడి తగ్గాలి.. భూమిలో తేమ ఉంటేనే ఏ విత్తనమైనా మొలకెత్తుతుంది.. నీరుంటే నారు పోసుకోవచ్చని జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్బేగం తెలిపారు. జిల్లా వ్యవసాయశాఖ ఆఫీస్లో సోమవారం మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు ‘సాక్షి’ నిర్వహించిన ‘ఫోన్ఇన్’లో రైతుల సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. ఎప్పుడూ ఒకే పంటను వేయొద్దని, పంట మార్పిడితో భూసారం పెరుగుతుందన్నారు. దొడ్డు వడ్లకు బదులు సన్నవడ్లు వేసుకుంటే మంచిదన్నారు. జిల్లాలోని నలుమూలల నుంచి అనేక మంది రైతులు ఫోన్ చేసి సాగులో సందేహాలకు సమాధానాలు పొందారు. ఆ విశేషాలు ఇవీ..ప్రశ్న: డీఏపీ దొరకడం లేదు. ఎరువుల కోసం షాపులకు వెళ్తే ఆన్లైన్ అంటున్నారు.. ఎలా? – శ్రీనివాస్–వేములవాడ, కట్ట తిరుపతి–తడగొండ, వినయ్–రుద్రంగి, బాలరాజు–ముస్తాబాద్.డీఏవో: ఇప్పుడే వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. డీఏపీ అవసరం ఇప్పుడే ఉండదు. అయినా ముందుచూపుతో రైతులు ఆలోచించడం మంచిదే. యూరియా, డీఏపీ ఎరువుల వాడకాన్ని తగ్గించాలి. గాలిలో భాస్వరం ఉంటుంది. సహజంగా నేలలో లభించే పోషకాలతోనే పంటలు పండాలి. రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. పొలంలో పెంటతోపాటు బయో ఫెర్టిలైజర్ వేసుకుంటే భూమిని గుల్ల చేస్తుంది. రైతులు ఎరువుల వాడకంపై జాగ్రత్తలు తీసుకోవాలి. జిల్లాలో ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చూస్తున్నాం.ప్రశ్న: సన్న వరి విత్తనాలు, కంది విత్తనాలు ఏమైనా వ్యవసాయశాఖ సబ్సిడీపై సరఫరా చేస్తుందా? – ఎగుమామిడి వెంకటరమణారెడ్డి–తంగళ్లపల్లి, దేవేందర్–బావుసాయిపేట, వామన్రెడ్డి–వంతడ్పుల, యాదగిరిరెడ్డి–ఆవునూర్, నరేందర్రెడ్డి–వేములవాడ అర్బన్. డీఏవో: వ్యవసాయశాఖ ద్వారా సబ్సిడీపై ఏ విత్తనాలు సరఫరా కావడం లేదు. కంది వేసుకుంటే మంచి దిగుబడి వస్తుంది. మార్కెట్లో విక్రయించుకోవచ్చు. మార్కెట్లో చాలా రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. ఏది వేసుకున్నా మంచి దిగుబడి వస్తుంది. దొడ్డు వడ్ల కంటే సన్నాలు వేసుకుంటేనే డిమాండ్ ఉంటుంది. ప్రశ్న: ఆరుతడిగా కంది, మొక్కజొన్న వేసుకోవచ్చా? – రవి–తంగళ్లపల్లి, తిరుపతిరెడ్డి–బండపల్లి, యామ తిరుపతి–వేములవాడడీఏవో: ఆరుతడిగా మొక్కజొన్న, కంది వేసుకోవచ్చు. మార్కెట్లో మంచి దిగుబడిని ఇచ్చే రకాలు ఉన్నాయి. ఎక్కువ రైతులు సాగు చేస్తే పంటకు కోతుల బెడద కూడా ఉండదు. పెసర్లు, బబ్బర, అలసంద వంటివి సాగు చేయవచ్చు.ప్రశ్న: మా మండలంలో వ్యవసాయాధికారులు లేరు. రైతులకు సలహాలు సూచనలు ఇచ్చే వారు కరువయ్యారు? – బోయిని రవి–వీర్నపల్లి.డీఏవో: నిజమే వ్యవసాయాధికారి లీవులో వెళ్లారు. ఏఈవోను కేటాయించాం కానీ విధుల్లో చేరలేదు. జిల్లాలో వ్యవసాయాధికారుల కొరత ఉంది. రెండు రోజుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం.ప్రశ్న: ఈ సీజన్లో సన్నవడ్లు వేసుకోవాలా.. దొడ్డు వడ్లు వేసుకోవాలా? – రాజవీర్–గంభీరావుపేట, దొంతరవేణి శ్రీనివాస్గౌడ్–నిమ్మపల్లి, మహేశ్–బోయినపల్లి, ఎ.రవి–రుద్రంగి, గాంతుల మహేశ్–ముస్తాబాద్, వెంకటేశ్–లింగంపల్లి, నర్సింహారెడ్డి–ఆవునూర్, లక్ష్మారెడ్డి–పదిర, పర్శరాంరెడ్డి–నారాయణపూర్, భూపతిరెడ్డి–వంతడ్పుల, ఎం.రాజు–చందుర్తి, సత్యంరెడ్డి–ఆవునూర్డీఏవో: ఈ వర్షాకాలంలో ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా పడి డ్రై స్పెల్ మూలంగా నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉంది. 120 రోజుల్లో కోతకు వచ్చే స్వల్పకాలిక రకాలు వేసుకుంటే మంచిది. సన్నవడ్లు వేసుకోవాలని చెబుతున్నాం. రైతులు తమకున్న పొలంలో 75 శాతం సన్నాలు, 25 శాతం దొడ్డు వడ్లు పెట్టుకున్నా ఫరవాలేదు. నీరు ఉంటే నారు పోసుకోవచ్చు. సన్నరకాలైన కేఎన్ఎం 1836, జేజీఎల్, జైశ్రీరాం వేసుకుంటే ప్రభుత్వం బోనస్ ఇస్తుంది. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో బిల్లు తీసుకొని, పంట పూర్తయ్యే వరకు భద్రపరచుకోవాలి.ప్రశ్న: ఈ వర్షాలకు పత్తిని విత్తుకోవచ్చా? పత్తిలో స్వల్పకాలిక రకాలేమిటి? – కట్ట తిరుపతిరెడ్డి–తడగొండ, మోతె మధుసూదన్రెడ్డి–నారాయణపూర్, పోగుల రాజిరెడ్డి–కనగర్తి.డీఏవో: పత్తిని ఇప్పుడే విత్తుకోవద్దు. పూర్తి స్థాయిలో వర్షాలు పడలేదు. భూమి ఇంకా నానలేదు. భూమిలో వేడి ఉంటే విత్తనాలు వట్టిపోతాయి. 50 నుంచి 60 శాతం భూమి తడిసిన తరువాత, తేమ ఉన్నప్పుడే పత్తిని విత్తుకోవాలి. బీటీ కాటన్ విత్తుకోవాలి. పత్తిలో స్వల్పకాలిక రకాలు లేవు. ఎప్పుడూ ఒకే రకం పంట కాకుండా, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి.ప్రశ్న: వరిలో దోమపోటును తట్టుకునే రకాలేమైనా ఉన్నాయా? మేలైన యాజమాన్య పద్ధతులు ఏమిటి? – బండారి శ్రీనివాస్–ఇల్లంతకుంట, రమేశ్–గంభీరావుపేట, గంగాధర్–రుద్రంగి, వంతడ్పుల రమేశ్–ఇల్లంతకుంట, మల్లేశం–మరిమడ్ల.డీఏవో: వరి పంటలో దోమపోటు రాకుండా వంగడాలు లేవు. కానీ ముందుగా థైరం, కార్బడిజంతో విత్తనశుద్ధి చేసుకోవాలి. నారు కొసలను కత్తిరించి వేరే చోట పూడ్చిపెట్టాలి. నాట్లు వేసే సమయంలో కాలిబాటలు వదిలిపెట్టాలి. ఎండ బాగా సోకి, గాలి బాగా ఆడి వరి పంటకు దోమపోటు రాకుండా ఉంటుంది.ప్రశ్న: కలుపుమందులు షాపుల్లో ఇవ్వడం లేదు. రైతులు ఇబ్బంది పడుతున్నారు? – గంగారెడ్డి–కనగర్తిడీఏవో: కలుపు మందులను కొన్నింటిని ప్రభుత్వం నిషేధించింది. ఒక్కో పంటకు ఒక్కో కలుపు నివారణ మందు అవసరం ఉంటుంది. అవసరమైన వాటిని ఇవ్వాలని చెప్పాం. ఎక్కడైనా సమస్య ఉంటే మా దృష్టికి తేవాలి. -
జాడలేని నూలు!
అందిన ఆర్డర్లు..సిరిసిల్ల: రాష్ట్రంలోని కోటి మంది మహిళలకు చిలుకపచ్చ రంగు, ఎర్రని డిజైన్ బార్డర్తో ఇందిరా మహిళాశక్తి చీరలను కానుకగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు రాష్ట్రంలోని పవర్లూమ్స్(మరమగ్గాల)పై చీరల బట్టను ఉత్పత్తి చేసేందుకు ఆర్డర్లు ఇచ్చింది. చీరల డిజైన్లను రాజన్నసిరిసిల్ల కలెక్టరేట్లో వస్త్రోత్పత్తిదారుల సమక్షంలో మే 6న చేనేత, జౌళిశాఖ కమిషనర్ శైలజారామయ్యర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరీమా అగ్రవాల్ ప్రదర్శించారు. సిరిసిల్లలో 10,056 పవర్లూమ్స్కు(130 మ్యాక్స్ సంఘాలకు) ఉత్పత్తి ఆర్డర్లను చేనేత, జౌళిశాఖ అధికారులు ఇచ్చారు. జూలై 31లోగా చీరల బట్ట ఉత్పత్తి చేసి ఇవ్వాలని గడువు విధించారు. కానీ నూలు డిపో ద్వారా ఇప్పటికీ నూలు(ధారం)ను సరఫరా చేయలేదు. కొందరు వస్త్రోత్పత్తిదారులు కొనుగోలు చేసేందుకు ముందుకొస్తే మార్కెట్లో ధరలు అమాంతం పెరిగిపోయాయి. కానీ ఆ మేరకు ప్రభుత్వం మీటరు బట్టకు చెల్లించే ధరను పెంచకుండా.. పాత ధర మీటరుకు రూ.34 చెల్లిస్తామని చెప్పడంతో చీరల ఉత్పత్తి సాగడం లేదు. స్కూల్ యూనిఫామ్స్ బట్ట కొనుగోలులో జాప్యం స్కూల్ విద్యార్థులకు యూనిఫామ్స్ దుస్తుల కోసం సిరిసిల్ల వస్త్రోత్పత్తిదారులకు 60 లక్షల మీటర్ల ఆర్డర్లు ఇచ్చారు. 20 లక్షల మీటర్ల బట్ట మే 31 నాటికి సిద్ధమైనా ఆ బట్టను అధికారులు కొనుగోలు చేయడం లేదు. జూన్ రెండో వారంలో పాఠశాలలు తెరిచే నాటిని పిల్లలకు యూనిఫామ్స్ అందించాలనే ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతుంది. ఆర్వీఎం(రాజీవ్ విద్యా మిషన్), ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు సంబంధించిన స్కూల్ యూనిఫామ్స్ వస్త్రాల సేకరణ సాగడం లేదు. సిరిసిల్లలోని 25 వేల మరమగ్గాలు(పవర్లూమ్స్)పై షూటింగ్, షర్టింగ్, ఓనీ వస్త్రాలు ఉత్పత్తి చేయాల్సి ఉండగా నూలు(దారం) అందించడంలో జాప్యమవుతుంది.చీరల బట్టకు సంబంధించిన వెప్ట్ నూలు(అడ్డం పోగులు) వచ్చింది. వార్పు(నిలువు పోగులు) ఇంకా రావాలి. జరీ నూలు కూడా రావాలి. నూలు రాగానే డీడీలు చెల్లించిన మ్యాక్స్లకు సరఫరా అవుతుంది. ఇప్పటికే డీడీలు చెల్లించిన 16 మ్యాక్స్ సంఘాలకు వెప్ట్ నూలును సరఫరా చేశారు. ఇందిరా మహిళా శక్తి చీరల బట్టకు ధరల నిర్ణయం, వస్త్రోత్పత్తిదారులకు రావాల్సిన బకాయిల విడుదల అంశం మా పరిధిలో లేదు. – ఎస్.సంతోష్కుమార్, చేనేత, జౌళిశాఖ ఏడీ, సిరిసిల్లసిరిసిల్ల వస్త్రోత్పత్తిదారులకు ప్రభుత్వం నుంచి రూ.200 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. ఇందులో వెల్ఫేర్ డిపార్టుమెంట్, ఆర్వీఎం, బతుకమ్మ చీరలు, పోచంపల్లిలో నిల్వ చేసి వినియోగించిన వస్త్రాలకు సంబంధించి రూ.200కోట్ల మేరకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. పోచంపల్లిలో నిల్వ చేసిన బట్టకు సంబంధించి వంద శాతం పేమెంట్లు రావాలి. కొన్ని వస్త్రాలకు 10 శాతం, కొన్నింటికి 30 శాతం, మరికొన్నింటికి 40 శాతం పేమెంట్లు పెండింగ్లో ఉన్నాయి. ఒక్క సిరిసిల్ల వస్త్రోత్పత్తిదారులకు రూ.200 కోట్లు పెండింగ్లో ఉండడంతో మళ్లీ బట్ట ఉత్పత్తికి పెట్టుబడి లేక దిక్కులు చూస్తున్నారు. -
సొంత ఖర్చులతో రోడ్డు పనులు
ఇల్లంతకుంట(మానకొండూర్): సొంత నిధులతో గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు సర్పంచ్, ఉపసర్పంచులు. ఇల్లంతకుంట మండలం చిక్కుడువానిపల్లికి రోడ్డు లేకపోవడంతో సర్పంచ్ చింతమడక కళ్యాణ్, ఉపసర్పంచ్ చిక్కుడు సత్యం తమ సొంత ఖర్చులతో గ్రామం నుంచి రామాజీపేట బీటీ రోడ్డు వరకు రోడ్డు పనులు శనివారం ప్రారంభించారు. రెండు కిలోమీటర్లు, 25 ఫీట్లతో మట్టి రోడ్డు నిర్మించనున్నట్లు సర్పంచ్, ఉపసర్పంచులు తెలిపారు. రోడ్డు నిర్మాణానికి రూ.2లక్షల వరకు అవుతున్నాయి. సిరిసిల్లటౌన్: చెత్తను తడి, పొడిగా వేరు చేసి పారిశుధ్య సిబ్బందికి అందజేయాలని సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ఎం.ఎ.ఖదీర్పాషా కోరారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భా గంగా శనివారం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి(టీజీపీసీబీ) ఆధ్వర్యంలో స్థాని క పాత బస్టాండ్ ప్రాంతంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగించొద్దని ప్రజలకు వివరించారు. ఇల్లంతకుంట(మానకొండూర్): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు టీచర్లు సోషల్మీడియాను వినియోగించుకుంటున్నారు. ఏఐ టెక్నాలజీ సహాయంతో ఆడియో క్లిప్పింగ్ను గ్రామ సోషల్ మీడియా గ్రూపుల్లో ప్రచారం చేస్తున్నారు. ‘గ్రామంలోని విద్యార్థుల తల్లిదండ్రులకు విన్నపం. మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించండి. ఒత్తిడి లేని విద్య. మీ డబ్బులు మీ దగ్గరే.. పిల్లల భవిష్యత్ మా వద్ద. ప్రతీ విద్యార్థికి రెండు జతల యూనిఫామ్. ఉచితంగా పాఠ్యపుస్తకాలు. క్రీడల్లో జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణింపు. అడ్మిషన్ ఫీజు లేదు. అమ్మలు పిల్లలకు క్యారేజ్ పెట్టనవసరం లేదు. మధ్యాహ్న భోజన వసతి..’ అంటూ ఏఐతో చెప్పిస్తూ ప్రచారం చేస్తున్నారు. దోపిడీ ఉన్నంతకాలం పోరాటాలుంటాయివేములవాడఅర్బన్: సమాజంలో దోపిడీ ఉ న్నంత కాలం కమ్యూనిస్టు పోరాటాలు ఉంటాయని జనగాం మాజీ ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజారెడ్డి అన్నారు. వేములవాడలో సీపీఐ శిక్షణ శిబిరం రెండో రోజు శనివారం కొనసాగింది. కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తుందన్నారు. చెన్న విశ్వనాథం, గోషిక మోహన్, జమ్ముల జితేందర్రెడ్డి, ఉమా మహేశ్, పంజాల శ్రీనివాస్, సదానందం, మంద సుదర్శన్, కడారి రాములు ఉన్నారు. విద్యార్థులు క్రీడల్లో రాణించాలిసిరిసిల్లటౌన్: విద్యార్థులు చదువుతోపాటు ఆటపాటల్లో రాణించాలని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ కోరారు. స్థానిక బతుకమ్మ ఘాట్లో స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం సమ్మర్ క్యాంపు ముగింపు కార్యక్రమంలో మాట్లాడారు. క్రీడలను ప్రోత్సహించేలా, క్రీడాకారులలో నైపుణ్యాన్ని పెంపొందించేలా బతుకమ్మ ఘాట్ స్పోర్ట్స్ క్లబ్ నిర్వాహకులు కృషి చేశారన్నారు. బీఆర్ఎస్ నాయకులు బొల్లి రామ్మోహన్, గోక శ్రీనివాస్, బండారి శివ, సుష్మ తదితరులు పాల్గొన్నారు. -
రాజన్నపై లడ్డూ భారం
తేదీ: జూన్ 8 (సోమవారం) సమయం : మధ్యాహ్నం 3 నుంచి 4 గంటలు ఫోన్ నంబరు : 89777 55264సిరిసిల్ల: వర్షాకాలం ప్రవేశించింది. రోహిణీ కార్తె ముగింపు దశకు చేరింది. మృగశిర కార్తె సోమవారం ప్రవేశిస్తుంది. వానాకాలం ప్రారంభంలో కొద్దిపాటి తొలకరి జల్లులు పలకరించాయి. జిల్లాలో వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. మరోసారి మంచి వానలు పడితే విత్తనాలు వేసుకునేందుకు, నారు పోసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. రైతులు ఇప్పటికే పచ్చిరొట్ట ఎరువుగా జీలుగ విత్తనాలు వేసుకున్నారు. రేగడి భూముల్లో పత్తి విత్తుకునేందుకు సిద్ధమయ్యారు.ఈ వానాకాలం సీజన్లో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి విత్తనాలను ఎంచుకోవాలి. వర్షాలు ఆలస్యమైతే.. ఏయే పంటలు వేసుకోవాలి. సకాలంలో వర్షాలు పడితే ఎలాంటి పద్ధతులు పాటించాలి.. సాగులో ఉన్న సందేహాలు? జిల్లాలో ఎరువులు, విత్తనాల సరఫరా ఎలా ఉంది? అనే అంశాలతోపాటు రైతులకు వచ్చే అన్ని రకాల సందేహాలకు సమాధానం ఇచ్చేందుకు జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్బేగంతో ఈనెల 8న ‘సాక్షి’ ఫోన్ ఇన్ నిర్వహిస్తుంది. రైతుల సందేహాలకు జిల్లా వ్యవసాయాధికారి సమాధానాలు ఇస్తారు. రైతులు సద్వినియోగం చేసుకుని అనుమానాలను నివృత్తి చేసుకోవాలి. అఫ్జల్ బేగం, జిల్లా వ్యవసాయాధికారివేములవాడ: శ్రీరాజరాజేశ్వరస్వామి భక్తులు పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదం పెరిగిన ముడిసరుల ధరలతో తయారీ వ్యయం పెరిగిందని ఆలయ అధికారులు లెక్కలు వేస్తున్నారు. 2016లో నిర్ణయించిన రూ.20లకే ఒక లడ్డూ చొప్పున ఇప్పటికీ విక్రయిస్తున్నారు. గత కొన్నేళ్లుగా నెయ్యి, పంచదార, శనగపిండి, డ్రైఫ్రూట్స్ ధరలు పెరిగిపోయాయి. దీంతో లడ్డూ తయారీ వ్యయం పెరిగిందని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో లడ్డూ ధర పెంచాలని ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. యుద్ధ ప్రభావంతో దేశవ్యాప్తంగా పెరుగుతున్న ధరల ప్రభావం రాజన్న ప్రసాదాలపై పడింది. ప్రస్తుతం భద్రాచలం, బాసర, ధర్మపురి, కొండగట్టు ఆలయాల్లో ఒక్కో లడ్డూ ధర రూ.25గా ఉండగా, యాదాద్రి ఆలయంలో రూ.30కు విక్రయిస్తున్నారు. వేములవాడలో మాత్రం రూ.20కే విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేవస్థానం ఈవో రమాదేవి ఆలయ అధికారులతోపాటు అర్చకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి లడ్డూ తయారీ ఖర్చు, నాణ్యత ప్రమాణాలు, ప్రస్తుత ధరల పరిస్థితులపై సమీక్షించనున్నారు. భక్తులకు నాణ్యమైన ప్రసాదం అందించడంతోపాటు దేవస్థానానికి నష్టం లేకుండా ఉండేందుకు లడ్డూ ధర పెంపు అవసరమనే యోచనకు వచ్చినట్లు సమాచారం. త్వరలో ఉన్నతాధికారుల ఆమోదంతో లడ్డూ ధర పెంపుపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని స్వల్పంగా ధర పెంచే ప్రతిపాదనపై అధికారులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. లడ్డూతోపాటు పులిహోర ధర సైతం పెంచాలని ఆలోచనలో అధికారులు ఉన్నట్లు తెలిసింది. -
చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు!
● ఏడు చేనేత, నాలుగు పవర్లూమ్ సహకార సంఘాలు ● సంఘాల్లో 321 మంది సభ్యులు ● ఓటర్ల జాబితా సిద్ధం ● ఎన్నికల నోటిఫికేషన్పై సందిగ్ధంసిరిసిల్ల: రాష్ట్రంలోని చేనేత సహకార సంఘాల పాలకవర్గాల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. జిల్లాలో ఏడు చేనేత, నాలుగు పవర్లూమ్ సహకార సంఘాలు ఉన్నాయి. 2013లో ఫిబ్రవరిలో చివరిగా చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు జరగ్గా.. 2018లో ఆ పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. 2018 నుంచి ఆరు నెలలకోసారి పాలకవర్గాల పదవీకాలాన్ని ప్రభుత్వం పొడగిస్తూ వచ్చింది. జిల్లాలోని 11 సహకార సంఘాల ఫొటో గుర్తింపుకార్డులతో కూడిన ఓటర్ల జాబితాను చేనేత, జౌళిశాఖ అధికారులు సిద్ధం చేసి రాష్ట్ర సహకార శాఖ అధికారులకు పంపించారు. తొలి విడతగా 50 మంది కంటే తక్కువ సభ్యులు ఉన్న సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని సహకార సంఘాల్లోనూ 50 మందిలోపే సభ్యులు ఉండడంతో తొలి విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 12న ఎన్నికలు నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్ జారీ అయినట్లు సమాచారం ఉన్నా సందిగ్ధత నెలకొంది. 1964 సహకార చట్టంలో రిజిస్ట్రేషన్ అయిన సంఘాలకే.. సహకార చట్టం 1964 ప్రకారం రిజిస్ట్రేషన్ అయిన చేనేత సహకార సంఘాలను ప్రభుత్వం గుర్తించింది. జిల్లాలో 7 సంఘాలు ఆ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ కాగా.. నాలుగు పవర్లూమ్ సంఘాలు 1964 సహకారచట్టం పరిధిలో ఉన్నాయి. దీంతో జిల్లాలో 11 సంఘాల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. చేనేత సహకార సంఘాల్లో 234 మంది సభ్యులు, పవర్లూమ్ సహకార సంఘాల్లో 87 మంది సభ్యులు ఉన్నారు. ఒకప్పుడు ఈ సంఘాల్లో వందలాది మంది సభ్యులు ఉండడంతో ఒక్క వెలుగు వెలిగిన ఆ చేనేత సహకార సంఘాలు ఇప్పుడు పెద్దగా సభ్యులు లేక ఉన్నాయి. చేనేత వృత్తిని ఎవరూ చేయకపోవడంతో అంతా పవర్లూమ్కు మారడంతో చేనేత సంఘాలు, మగ్గాలు మూలనపడ్డాయి. ప్రస్తుతం ఉన్న సంఘాల్లోని సభ్యులు సైతం వృద్ధాప్యంలో ఉన్నారు. -
పట్టుదలతో చదివి.. ఉన్నత శిఖరాలు చేరాలి
● ఎస్పీ మహేశ్ బీ గీతే ● టెన్త్, ఇంటర్ టాపర్లకు ప్రశంసలుసిరిసిల్ల: పట్టుదల, క్రమశిక్షణ, కృషి ఉంటే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. జిల్లా పోలీస్ ఆఫీస్(డీపీవో)లో టెన్త్, ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ చూపిన పోలీస్ సిబ్బంది పిల్లలకు శనివారం కాలేజీ బ్యాగ్, మెమోంటో అందించారు. ఎస్పీ మాట్లాడుతూ తాను ప్రభుత్వ పాఠశాలలోనే చదివానని, తన తల్లిదండ్రులు ఇప్పటికీ వ్యవసాయం చేస్తున్నారన్నారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేవని నిరాశ చెందకుండా, కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చన్నారు. పోలీస్శాఖలో అహర్నిశలు ప్రజలకు సేవలందిస్తూ తమ పిల్లల భవిష్యత్ కోసం తాపత్రయ పడుతున్న తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించాలని పిల్లలకు సూచించారు. ప్రతి రోజు ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలన్నారు. మంచి స్నేహితులను ఏర్పాటు చేసుకోవాలన్నారు. జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీలు కె.నాగేంద్రచారి, శ్రీనివాసులు, జి.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
చెత్తశుద్ధిపై చిత్తశుద్ధి ఉండాలి
● చెత్తను నాలుగు రకాలుగా వేరుచేయాలి ● కలెక్టర్ గరీమా అగ్రవాల్సిరిసిల్ల/తంగళ్లపల్లి(సిరిసిల్ల): ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమని కలెక్టర్ గరీమా అగ్రవాల్ పేర్కొన్నారు. ’ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భా గంగా శనివారం తంగళ్లపల్లి మండలం రామన్నపల్లి లోని ప్రగతి ప్రాంగణంలో ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మా ట్లాడుతూ వర్షాకాల సన్నద్ధత, ఘన వ్యర్థాల నిర్వహణ, బడిబాట, పంటల మార్పిడి, ఓటరు జాబి తా సవరణ తదితర అంశాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. చెత్తను ఇంట్లోనే నాలుగు రకాలుగా తడి, పొడి, శానిటరీ, ప్రత్యేక చెత్తగా వేరుచేసి అందించాలన్నారు. జీపీ ఆధ్వర్యంలో ప్రతీ ఇంటికి నాలుగు చెత్త బుట్టలు, బట్ట సంచులు పంపిణీ చేయాలని ప్రతిపాదించారు. ‘బడిబాట’ ద్వారా ప్ర భుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచాలని సూచించారు. ఎల్నినో ప్రభావం దృష్ట్యా రైతులు వ్యవసాయాధికారుల సలహాలతో సాగుచేయాలని తెలిపారు. ఆయిల్పామ్, సన్నవడ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలు సాగుచేయాలని వివరించారు. వర్షపు నీటిని నిల్వ ఉంచి భూ గర్భ జలాల పెంపునకు ఇంకుడుగుంతలు, చెరువులు, పామ్పాండ్లను సిద్ధం చేసుకోవాలన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఇంటికి వచ్చే బీఎల్వోలకు గుర్తింపుకార్డులు చూపించి మ్యాపింగ్ ప్రక్రియకు సహకరించాలని కోరారు. డీఆర్డీవో లక్ష్మీనారాయణ, జిల్లా విద్యాధికారి జగన్మోహన్రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి షరీఫొద్దీన్, జిల్లా రవాణాశాఖ అధికారి శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్బేగం, ఉద్యానవన శాఖ అధికారి శరత్, నయాబ్ తహసీల్దార్ మురళీకృష్ణ, సర్పంచ్ ఆత్మకూరి జ్యోతి పాల్గొన్నారు. వడ్ల కొనుగోళ్లను పూర్తి చేయండి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. కొనుగోలు చేసిన ధాన్యం రైస్మిల్లులు, గోదాములు, అపెరల్ పార్క్కు తరలించాలని ఆదేశించారు. ఈనెల 9న మహిళా సంఘాల మండల సమాఖ్యలకు బస్సుల పంపిణీని హైదరాబాద్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డీఆర్డీవో లక్ష్మీనారాయణ, డీసీఎస్వో బుచ్చిబాబు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ నరసింహ, డీసీవో రామకృష్ణ, డీఏవో అఫ్జల్బేగం, డీటీవో శ్రీనివాస్, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్, కార్మికశాఖ అధికారి నజీర్ అహ్మద్, తహసీల్దార్ మహేశ్ పాల్గొన్నారు. ఇదే అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. -
ఆధునికీకరణతో మెరుగైన విద్యుత్ సేవలు
● టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డిసిరిసిల్ల/తంగళ్లపల్లి(సిరిసిల్ల): వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయమైన సేవలు అందించడంతోపాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడమే టీజీఎన్పీడీసీఎల్ ప్ర ధాన లక్ష్యమని సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి పే ర్కొన్నారు. పెద్దూరు బైపాస్రోడ్డులోని విద్యుత్ సంస్థ స్టోర్స్, తంగళ్లపల్లి మండలం రామచంద్రాపూర్లోని సబ్స్టేషన్లను శుక్రవారం తనిఖీ చేశారు. స్టోర్స్లో వర్షాకాలంలో సామగ్రి పాడవకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరం మేరకు ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంచాలన్నారు. సిరిసిల్ల విద్యుత్ సంస్థ ఆఫీస్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యుత్ సరఫరా, నిర్వహణ, వినియోగదారుల సేవలు, భద్రతా ప్రమాణాల అమలుపై సమీక్షించారు. కాలిపోయిన, పనిచేయని మీటర్లను మార్చాలన్నారు. వ్యవసాయ సర్వీసులు, టీజీఐ–పాస్లో సర్వీసులు యుద్ధప్రాతిపదికన రిలీజ్ చేయాలన్నారు. డిజిటల్ సేవలను విస్తరించేందుకు రూపొందించిన ఎల్టీఎంటీ యాప్ను ప్రారంభించారు. వేములవాడ మండలం రుద్రవరం 33/11 కేవీ ఉపకేంద్రంలో ఏర్పాటు చేసిన రియల్ టైమ్ ఫీడర్ మానిటరింగ్ సిస్టమ్ను ప్రారంభించారు. అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్ సేవల పునరుద్ధరణను వేగవంతం చేసేందుకు ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(ఈఆర్టీ) వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ టి.వేణుమాధవ్, డీఈఈలు అంజయ్య, వెంకటరమణ, ఏడీఈలు, ఇంజినీర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆలయ ఆస్తులను కాపాడాలి
ముస్తాబాద్(సిరిసిల్ల): మండలంలోని పోతుగల్లో శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ ఆస్తులను పరిరక్షించాలని కోరుతూ కాంగ్రెస్ నాయకుడు తోట ధర్మేందర్ శువ్రారం ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. ధర్మేందర్ మాట్లాడుతూ ఆలయానికి సంబంధించిన భూములను సర్వే చేసి హద్దులను నిర్ణయించాలని కోరారు. దేవుడి బంగారు ఆభరణాల వివరాలు, ఆదాయ, వ్యయాలను ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ఎస్సై జ్యోతి మాట్లాడుతూ దీక్షలు చేయవద్దని, అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించేలా చూస్తామన్నారు. దీక్ష చేపట్టిన ధర్మేందర్ను అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. ఎస్సై హామీ మేరకు దీక్షను విరమించినట్లు ధర్మేందర్ తెలిపారు. -
సీసీ కెమెరాలకు మరమ్మతు
సిరిసిల్ల అర్బన్: ‘నిద్రపోతున్న నిఘా’ శీర్షికన ఆర్టీసీ బస్సుల్లో పనిచేయని సీసీ కెమెరాలపై ఈనెల 4న సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. సిరిసిల్ల ఆర్టీసీ డీపో మేనేజర్ ప్రకాశ్రావు మాట్లాడుతూ బస్సుల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పోలీసుశాఖ ఆధీనంలో ఉన్నాయని, వాటి పరిశీలనకు పోలీసు అధికారులను సంప్రదించినట్లు తెలిపారు. టెక్నీషియన్ను పంపించి మరమ్మతు చేయించేందుకు పోలీస్ అధికారులు హామీ ఇచ్చినట్లు తెలిపారు. అన్ని బస్సుల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషిచేస్తామని డీఎం హామీ ఇచ్చారు. -
మొక్కలు నాటాలి.. పర్యావరణాన్ని రక్షించాలి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యతగా భావించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లి అర్బన్ ఫారెస్ట్ పార్క్లో ‘ఏక్ పేడ్ మా కే నామ్’ పేరుతో మొక్కలు నాటే కార్యక్రమానికి కలెక్టర్ శుక్రవారం ప్రారంభించారు. మొక్కలు నాటిన అనంతరం గ్రామంలోని మహిళలు, విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించేందుకు సహకరించాలని కోరారు. మండలంలోని అన్ని గ్రామాల్లో స్టీల్బ్యాంకులు ఏర్పాటు చేయాలని.. ఇందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని కోరారు. హరిదాస్నగర్లో స్టీల్బ్యాంకు ఏర్పాటుకు ముందుకొచ్చిన సర్పంచ్ను కలెక్టర్ అభినందించారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పేపర్ ప్లేటు, గ్లాసుల వినియోగంపై ఏర్పాటు చేసిన స్టాల్ను సందర్శించారు. అర్బన్ ఫారెస్ట్ పార్క్లో పచ్చదనం, సందర్శకుల సౌకర్యార్థం కల్పించిన మౌలిక సదుపాయాలు, అటవీ సంపదపై ప్రచారం కల్పించాలని సూచించారు. సోషల్ మీడియా వేదికగా రీల్స్ పోటీలు నిర్వహించి విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు. అత్యుత్తమంగా రీల్స్ రూపొందించిన వారికి నగదు ప్రోత్సాహకాలను అందజేస్తామని కలెక్టర్ తెలిపారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సాబేరా బేగం, డీఎస్పీ నాగేంద్రచారి, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, డీఏవో అఫ్జల్బేగం, హార్టికల్చర్ అధికారి శరత్, డీవైఎస్వో రాందాస్, ఏడీ మైన్స్ క్రాంతి, ఎఫ్ఆర్వో నాగేశ్వర్రావు, హరిదాస్నగర్, పదిర సర్పంచులు నాగరాజు, మణెమ్మ, తహసీల్దార్ సుజాత, ఎంపీడీవో సత్తయ్య పాల్గొన్నారు. విద్యార్థుల నమోదు పెంపునకు కృషి చేయాలి సిరిసిల్ల: జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల నమోదు శాతం పెంపునకు కృషి చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ సూచించారు. ప్రభుత్వ విద్యాలయాల్లో కల్పిస్తున్న వసతులు, సదుపాయాలపై ప్రచారం చేయాలన్నారు. కలెక్టరేట్ శుక్రవారం విద్యాశాఖ, వివిధ సంక్షేమ శాఖ అధికారులు, కో–ఆర్డినేటర్లు, ప్రిన్సిపాల్స్తో సమీక్షించారు. జనగణన–2027లో భాగంగా తొలి దశ ప్రక్రియను నిర్ధేశిత గడువులోగా విజయవంతంగా పూర్తి చేయడంలో జిల్లా ముందంజలో నిలిపిన ఉపాధ్యాయులను అభినందించారు. జిల్లా విద్యాధికారి జగన్మోహన్రెడ్డి, ఎస్సీ సంక్షేమాధికారి రవీందర్రెడ్డి, మైనారిటీ అధికారి ఆయేషా తలత్ పాల్గొన్నారు.– కలెక్టర్ గరీమా అగ్రవాల్ -
అనుమతులు గోరంతా... తవ్వకాలు చెరువంతా!
● ఇష్టారాజ్యంగా చెరువు మట్టి తరలింపు ● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సరఫరా‘వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజుపల్లికి చెందిన రైతు మ్యాకల కరుణాకర్ తన ఇంటి కోసం మట్టి తరలిస్తుంటే అనుమతులు లేవంటూ రూ.60వేలు జరిమానా విధించారు అధికారులు. సొంత పొలం నుంచి మట్టిని తరలిస్తే జరిమానా విధించిన అధికారులే.. చెరువు నుంచి అనుమతికి మించి టిప్పర్లలో మట్టిని తరలిస్తుంటే పట్టించుకోవడం లేదు. దీనిపై ఆ ప్రాంత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.’వేములవాడరూరల్: చెరువు నుంచి మట్టిని తరలించేందుకు వెయ్యి క్యూబిక్ మీటర్లకు అనుమతి తీసుకున్నా కాంట్రాక్టర్ ఇష్టారీతిగా తవ్వుతున్నా పట్టించుకోవడం లేదు. టిప్పర్లు, జేసీబీలు పెట్టి ఇతర ప్రాంతాలకు ట్రిప్పులకొద్దీ తీసుకెళ్తున్నా ‘మామూలు’గా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజుపల్లి ఊర చెరువు నుంచి మట్టి తరలించేందుకు కొందరు కాంట్రాక్టర్లు వెయ్యి క్యూబిక్ మీటర్లు తవ్వుకునేందుకు అనుమతి తీసుకున్నారు. అనుమతికి మించి భారీ స్థాయిలో మట్టిని తరలించారని గ్రామస్తులు, రైతులు కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. అయినా వారి ఆగడాలు ఆగకపోవడంతో రైతులు అందరూ ఏకమై శుక్రవారం తవ్వకాలను అడ్డుకున్నారు. వేములవాడ మండలంతోపాటు బోయినపల్లి మండలంలోని కొంతమంది బడా కాంట్రాక్టర్లు ఈ ప్రాంతంపై దృష్టి పెట్టారు. ఇక్కడి మట్టిని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నెత్తి చూడని అధికారులు అనుమతులు ఇస్తున్న ఇరిగేషన్ శాఖ అధికారులు అటు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. నిబంధనల ప్రకారం మట్టిని తరలించకుండా ఇష్టారాజ్యంగా తరలిస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. కొంత మంది ప్రజాప్రతినిధు ల అండతోనే కాంట్రాక్టర్లు ఇష్టారీతిగా తవ్వకాలు చేపడుతున్నారని రైతులు మండిపడుతున్నారు.మొదట వెయ్యి క్యూబిక్ మీటర్లకు చలాన్ చెల్లించారు. అదనంగా మరో రెండు వేల క్యూబిక్ మీటర్లకు చలాన్ కట్టారు. మరో 2 వేల క్యూబిక్ మీటర్లకు మట్టి తీశారని మా దృష్టికొచ్చింది. ఆ మేరకు చలాన్ కట్టించుకుంటాం. – అరవింద్, ఇరిగేషన్ ఏఈ -
రాజకీయ అవగాహన కోసమే శిబిరాలు
● సీపీఐ రాష్ట్ర నాయకుడు చాడ వెంకట్రెడ్డి వేములవాడఅర్బన్: సీపీఐ శిక్షణ శిబిరాలు రాజకీయ అవగాహన, సామాజిక న్యాయం కోసం నిర్వహిస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర నాయకుడు చాడ వెంకట్రెడ్డి పేర్కొన్నారు. వేములవాడలోని మహాలింగేశ్వర ఫంక్షన్హాల్లో శుక్రవారం సీపీఐ శిబిరాలను ప్రారంభించారు. చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ నరేంద్రమోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాజిక న్యాయం కొరవడిందన్నారు. ధరల పెరుగుదలకు హద్దులు లేవన్నారు. దేశ సంపద పది మంది కుబేరుల చేతుల్లోనే ఉందన్నారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల జాగిరే తెలంగాణ రాష్ట్రమని పవన్ కళ్యాన్ తెలుసుకోవాలని స్పష్టం చేశారు. ఆవేశానికి కేరాఫ్గా నిలిచిన పవన్ కళ్యాన్ ప్రొఫెసర్ నాగేశ్వరావు లాంటి మేధావులపై కేసులు నమోదు చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల కార్యదర్శులు సుదర్శన్, శ్రీనివాస్, సదానందం, విశ్వనాథం, శ్రీనివాస్, శంకర్ తదితరులు ఉన్నారు.నంబర్ ప్లేట్లు సరిగ్గా ఉంచుకోవాలిసిరిసిల్ల: వాహనదారులు నంబర్ ప్లేట్లు సరిగ్గా ఉండేలా చూసుకోవాలని సిరిసిల్ల టౌన్ సీఐ శ్రీనివాస్ సూచించారు. ఇటీవల చేపట్టిన స్పెషల్ డ్రైవ్ తనిఖీలలో 20 వాహనాలు నంబరు ప్లేట్లు సరిగ్గా లేకుండా పట్టుబడ్డాయి. ఆ వాహనాలకు శుక్రవారం నంబరు ప్లేట్లు వేయించి వాహనదారులతో మాట్లాడారు. నంబర్ ప్లేట్ తొలగించినా, నంబర్లు స్పష్టంగా కనిపించకుండా మార్ఫింగ్ చేసినా చట్టవిరుద్ధమన్నారు. నంబర్ ప్లేట్ స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ ఆర్ఎస్సై శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. వర్షాకాల వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలిసిరిసిల్ల: వర్షాకాలంలో వచ్చే వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత కోరారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్లో శుక్రవారం జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు. రజిత మాట్లాడుతూ వర్షాకాల ముందు జాగ్రత్తల చర్యల్లో భాగంగా ఇంటింటి సర్వే నిర్వహించాలన్నారు. గ్రామపంచాయతీ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ప్రతీ మంగళ, శుక్రవారాలలో డ్రైడే పాటించాలని ఆదేశించారు. ఇంట్లోకి దోమలు రాకుండా జాలీలు, మెష్డోర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. డ్రెయినేజీల్లో ఆంటీ లార్వా మందులను పంచాయతీ సిబ్బందితో స్ప్రే చేయించాలన్నారు. ఆశకార్యకర్తలు, ఏఎన్ఎంలు ఇంటింటీ సర్వే ద్వారా గుర్తించిన జ్వరబాధితులను పీహెచ్సీలకు తరలించి, చికిత్స అందేలా చూడాలన్నారు. మాతా శిశు సంరక్షణ ప్రోగ్రాం అధికారి డాక్టర్ నాగేంద్రబాబు, వ్యాధి నిరోధక టీకాల ప్రోగ్రాం అధికారి డాక్టర్ సంపత్కుమార్, డీడీఎం కార్తీక్ పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలిఇల్లంతకుంట(మానకొండూర్): ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలని అడిషనల్ డీఆర్డీవో శ్రీనివాస్ ఆదేశించారు. మండలంలోని కందికట్కూర్, వంతడుపుల కొనుగోలు కేంద్రాలను శుక్రవారం పరిశీలించారు. వేగంగా లోడింగ్, అన్లోడింగ్ చేయాలని సూచించారు. ఐకేపీ ఏపీఎం కుమారస్వామి, సీసీలు వెంకటేశం, రామచంద్రారెడ్డి, రామచంద్రం, విఠల్రెడ్డి పాల్గొన్నారు. -
సేవకులు కావలెను!
శనివారం శ్రీ 6 శ్రీ జూన్ శ్రీ 2026‘రాజన్న’కుసాక్షి ప్రతినిధి, కరీంనగర్: దక్షిణ కాశీగా పేరొందిన ఎములాడ రాజన్నను సేవకు ఉద్యోగుల కొరత వేధిస్తోంది. కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా పేరొందిన శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధానంలో సిబ్బంది కొర త పనిభారానికి కారణమవుతోంది. కనీసం వారాంతంలో సెలవు దొరికే అవకాశం కూడా కొన్నిసార్లు దక్కకపోవడం ప్రస్తుత పరిస్థితికి నిదర్శనం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయంలో క్యాడర్ స్ట్రెంత్ ప్రకారం మొత్తం 320 రెగ్యులర్ పోస్టులు ఉండగా, ప్రస్తుతం కేవలం 185 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. దాదాపు 135 పోస్టులు ఖాళీగా ఉండటంతో ఉన్న సిబ్బందిపైనే అదనపు భారం పడుతున్నట్లు తెలుస్తోంది. అర్చకుల విభాగంలోనే సుమారు 35 పోస్టులు ఖాళీగా ఉండగా, లాస్ట్ గ్రేడ్ సర్వీస్ (ఎల్జీఎస్) విభాగంలో దాదాపు 60 పోస్టులు భర్తీ కాలేదు. జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ విభాగాల్లో 10 పోస్టులు, డ్రైవర్ విభాగంలో 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. ఔట్ సోర్సింగ్లోనూ ఇదేతీరు ఇక ఔట్సోర్సింగ్ సిబ్బంది పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదని అంటున్నారు. మొత్తం 290 ఔట్సోర్సింగ్ పోస్టులకు గాను ప్రస్తుతం 250 మంది మాత్రమే పనిచేస్తుండగా, మరో 40 పోస్టులు ఖాళీగా ఉన్నాయని సమాచారం. ఈ పరిస్థితుల్లో భక్తులకు సేవలు అందించడమే కాకుండా, నిత్య కై ంకర్యాలు, పరిపాలనా కార్యక్రమాలను నిర్వహించడం ఉద్యోగులకు సవాలుగా మారిందని సిబ్బంది వాపోతున్నారు. మరోవైపు పదవీ విరమణ పొందిన ఒక ఏఈవోను అకౌంట్స్ అధికారిగా కొనసాగిస్తుండగా, సంవత్సరాలుగా ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రం రెగ్యులరైజేషన్ లేదా పదోన్నతుల విషయంలో స్పష్టత లేకపోవడంతో ఉద్యోగ సంఘాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. సిబ్బంది కొరత కారణంగా ఉద్యోగులు వారానికి ఒక రోజు సెలవు కూడా తీసుకోలేని పరిస్థితి నెలకొన్నదని, అనేక మంది నిరంతర విధుల వల్ల మానసిక, శారీరక ఒత్తిడికి గురవుతున్నారని ఉద్యోగ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెలవులు మంజూరు చేయడంలో ఇబ్బందులు తలెత్తడంతో కుటుంబ జీవితం కూడా ప్రభావితమవుతోందని వారు పేర్కొంటున్నారు. భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఖాళీ పోస్టులను తక్షణమే భర్తీ చేయకపోతే భవిష్యత్తులో ఆలయ సేవల నిర్వహణపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ప్రభుత్వం, దేవాదాయశాఖ అధికారులు వెంటనే స్పందించి ఖాళీల భర్తీపై చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
కనిపించని గాయం
మనసులో మిగిలిన మాటలే కనిపించని గాయాలవుతాయి నవ్వుల వెనుక దాగిన బాధ నిశ్శబ్దంగా కన్నీరు కారుస్తుంది ఎవరూ చూడని ఆ వేదన హృదయంలో అలలై ఎగసిపడుతుంది ఒక మాట గుచ్చినప్పుడు గుండె లోతుల్లో ముద్రపడుతుంది కాలం గడిచినా కొన్ని జ్ఞాపకాలు గాయాన్ని మళ్లీ మేల్కొలుపుతాయి బయటకు బలంగా కనిపించినా లోపల మనసు విరిగిపోతుంది ఆత్మీయుల నిర్లక్ష్యం ఆ గాయానికి మరింత నొప్పి ఇస్తుంది ఆశలు చినిగిన ప్రతిసారి మనసు మౌనంగా రోదిస్తుంది కన్నీటి చుక్కలకే తెలుసు ఆ బాధ ఎంత లోతైనదో చెప్పలేని క్షణాలన్నీ గుండెలో గుహలై నిలిచిపోతాయి అయినా జీవితం ముందుకు నడుస్తుంది కొత్త వెలుగులను వెతుకుతూ కనిపించని గాయాలకూ ఒక రోజు మాన్పు అనే ఉదయం వస్తుంది ఆశ అనే చిన్న దీపమే మనసుకు మళ్లీ బలం ఇస్తుంది – నక్క శ్రీకర్ ఊరు: ఊటూరు మానకొండూర్ కరీంనగర్ -
ఆరోగ్య ప్రదాయిని
యోగాకరీంనగర్స్పోర్ట్స్: సంస్కృత పదం యుజ్ నుంచి పుట్టిన యోగా గురించిన ప్రస్తావనలు ఋగ్వేదంలోనే ఉన్నాయి. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో పతంజలి మహర్షి 196 సూత్రాలతో యోగా సూత్రాలు గ్రంథాన్ని అందించి యోగాను ఒక క్రమ పద్ధతిలోకి తెచ్చారు. అందుకే ఆయన్ను యోగా పితామహుడు అంటారు. ఆ తర్వాత స్వామి వివేకానంద చికాగో ప్రసంగం ద్వారా దీనిని ప్రపంచానికి పరిచయం చేయగా.. నేడు ఐక్యరాజ్యసమితి ప్రకటించిన జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం ద్వారా మన యోగా విశ్వవ్యాప్తమైంది. ప్రయోజనాలు.. నిత్యం క్రమం తప్పకుండా యోగా సాధన చేస్తే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఉదయాన్నే కనీసం అరగంటపాటు ఆసనాలు, ప్రాణాయామం చేస్తే శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగవుతుంది. రక్తపోటు అదుపులోకి వచ్చి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కండరాలు, ఎముకలను దృఢంగా మార్చి శరీరానికి మంచి ఫ్లెక్సిబిలిటీని అందిస్తుంది, దీర్ఘకాలిక నడుము నొప్పి, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మానసిక కోణంలో చూస్తే నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఎదురయ్యే తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనలను దూరం చేసి మనస్సుకు ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా నిద్రలేమి సమస్యను నివారిస్తుంది. విద్యార్థులు, యువతలో మెదడు పనితీరును చురుగ్గా మార్చి మానసిక ఏకాగ్రత, మేధస్సు, జ్ఞాపకశక్తిని విపరీతంగా పెంచుతుంది. శ్వాస క్రియల(ప్రాణాయామం) ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యం పెరిగి శరీరంలో రోగ నిరోధకశక్తి పెంపొంది సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. కరీంనగర్లో యోగా ప్రస్థానం ప్రస్తుతం మన కరీంనగర్ జిల్లాలో కూడా యోగా ప్రస్థానం అద్భుతంగా సాగుతోంది. యోగా రాష్ట్ర పోటీల్లో దశాబ్దకాలానికి పైగా జరుగుతున్న రాష్ట్ర పోటీల్లో జిల్లా జట్టే చాంపియన్. నగరంలోని ఉద్యానవనాలు, సామాజిక కేంద్రాల్లో వయసుతో నిమిత్తం లేకుండా వందలాది మంది ఉదయాన్నే యోగాసనాలతో తమ రోజును ప్రారంభిస్తుండడం విశేషం. ఉమ్మడి కరీంనగర్ ప్రజలు ఆరోగ్యకరమైన జీవనశైలి వైపు అడుగులు వేస్తూ.. యోగాను ఒక ప్రజాఉద్యమంగా మారుస్తుండడం శుభపరిణామం కరీంనగర్ జనజీవనంలో నూతన చైతన్యం విశ్వ వేదికపై మన యోగా ఏకాగ్రత.. మేధస్సు.. సంపూర్ణ ఆరోగ్యం భారతీయ సంస్కృతి ప్రపంచానికి అందించిన అమూల్యమైన కానుక యోగా సాధన. నేడు శారీరక, మానసిక ఆరోగ్యానికి ఒక దివ్య ఔషధంగా మారి గ్లోబల్ వేదికపై జగద్గురువుగా నిలిచింది. నిత్యం యోగా చేస్తే మానసిక ఏకాగ్రత పెరగడమే కాకుండా.. మేధస్సు వికసించి ఒత్తిడి లేని ప్రశాంత జీవనం సాధ్యమవుతుంది. కేవలం శారీరక దృఢత్వానికే కాకుండా అంతర్గత ప్రశాంతతకు యోగా ఎంతగానో తోడ్పడుతుంది. -
బన్నీ వేసవి యాత్ర–25
‘చిప్స్ వద్దు – నువ్వుల ముద్ద, బెల్లం లడ్డు ముద్దు’ ఇంటి బయట బండి: బన్నీ, రామ్ చిప్స్ ప్యాకెట్ కోసం గొడవ. తాతయ్య వాళ్లని దగ్గరకు పిలిచాడు. చుక్క, స్వప్న కూడా వచ్చారు. ‘రోజూ చిప్స్ తింటే పొట్ట నొప్పి, దగ్గు వస్తుంది. బలం ఉండదు’ అన్నాడు తాతయ్య. జేబులో నుంచి నువ్వుల ముద్ద, బెల్లం లడ్డు తీసి అందరికీ ఒక్కొక్కటి ఇచ్చాడు. స్వప్న కొరికింది: ‘అబ్బా తాతయ్య , ఇది చాలా తియ్యగా ఉంది.’ తాతయ్య చెప్పాడు: ‘నువ్వులు ఎముకలకు బలం. బెల్లం రక్తానికి మంచిది. జలుబు రాదు.’ చుక్క అడిగింది: ‘మరి చిప్స్లో ఏముంది?’ తాతయ్య నవ్వాడు: ‘ఉప్పు, నూనె, జబ్బు.’ రామ్ అన్నాడు: ‘ఇక చిప్స్ వద్దు. నానమ్మతో లడ్డు చేయించుకుంటాను.’ తాతయ్య: ‘మన పాత తిండే మనకు మెడిసిన్. ప్యాకెట్ ఫుడ్ కాదు.’ బన్నీ అరిచాడు: ‘చిప్స్ బై బై, నువ్వుల ముద్ద హాయ్ హాయ్!’ పిల్లలకి మాట : ప్యాకెట్ తిండి రుచి కొద్దిసేపు. నానమ్మ చేతి లడ్డు జీవితాంతం ఆరోగ్యం. డాక్టర్ కోట లక్ష్మణ్ ప్రభుత్వ ఉపాధ్యాయులు గ్రామం: కాకర్లపల్లి, మంథని జిల్లా: పెద్దపల్లి -
గాలి ఓ మా చిరుగాలి
గాలి గాలి ఓ చిరుగాలి పవనాలుగా నీవిక తేలి నీవస్తావులే మా ఇంటికి నచ్చావులే మా కంటికి ! నీ వల్లే మాకు ఊపిరి ఉంది నీవు లేకుంటే కలుగు ఇబ్బంది మమ్ము అంటిపెట్టుకొని ఉంటావు అవునా కాదా ఇక ఏమంటావు ? నీ సమాధానం ఇక ఏదైనా నీవు లేకుండా పోదు పొద్దైనా ఓ గాలితల్లి మా చిరుగాలి మళ్లీ నీవు లేక ప్రాణం ఉండదులే మళ్లీ చెట్లు ఊగితే నీ ఉనికి తెలుసు అట్లనే చేయకు నీవిక అలుసు బొగ్గు పులుసు గాలి నీలో ఉంది దానితో మాకు కలుగు ఇబ్బంది ! గాలి తల్లి మా చిరుగాలి మల్లి మమ్ము విడిచి ఉండకు నీ వెళ్లి నీవు లేకుండా ఉండదు ఏ గల్లి నీవు వస్తేనే బాగుంటుంది మళ్లీ! గాలి తల్లి ఓ చిరుగాలి మల్లి హోరుగాలితో చేయకు లొల్లి చల్లగా తగిలితే కలుగు హాయి మెల్లెగ మది ఉప్పొంగు నోయి ! – గుర్రాల లక్ష్మారెడ్డి కవి రచయిత కల్వకుర్తి, నాగర్ కర్నూల్ -
వ్యాయామ వృత్తి విద్య కోర్సులకు తగ్గుతున్న క్రేజ్
కరీంనగర్స్పోర్ట్స్: కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో నాలుగు రోజుల పాటు జరిగిన రాష్ట్ర వ్యాయామ విద్యా ప్రవేశ శారీరక దారుఢ్య (టీజీపీఈసెట్ 2026) పరీక్షలు ముగిశాయి. ఈ పరీక్షల హాజరుశాతం, సీట్ల లభ్యతను పరిశీలిస్తే వ్యాయామ ఉపాధ్యాయ కోర్సులకు క్రేజ్ పడిపోతోందని స్పష్టమవుతోంది. తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తున్నట్లే ఖాళీగా ఉన్న పీఈటీ పోస్టుల భర్తీతో పాటు ప్రతి పాఠశాలలో పీఈటీ ఉండేలా చేయాలని పలువురు క్రీడా విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గైర్హాజరుల పరంపర ఈ ఏడాది బీపీఈడీ, డీపీఈడీ కోర్సులకు 3,362 మంది దరఖాస్తు చేసుకోగా 2,435మంది (72.42 శాతం) పరీక్షలకు హాజరయ్యారు. 927 మంది అభ్యర్థులు శారీరక దారుఢ్య పరీక్షలకు రాకపోవడం గమనార్హం. బీపీఈడీ కోర్సుకు మొత్తం 2,386 మంది దరఖాస్తు చేయగా 1,788 మంది హాజరయ్యారు. 598 మంది గైర్హాజరయ్యారు. డీపీఈడీ కోర్సుకు 976 మంది దరఖాస్తు చేయగా 647 మంది హాజరయ్యారు. 329 మంది గైర్హాజరయ్యారు. బీపీఈడీ సీటుకు 1.15 మంది, డీపీఈడీ సీటుకు 2.16 మంది పోటీ ప్రతివంద మందిలో 87 మందికి బీపీఈడీ సీటు ఖాయం కావడం విశేషం. బీపీఈడీ పరీక్షకు హాజరైన అభ్యర్థులు 1,788 మంది కాగా, సీట్లు 1,560 ఉన్నాయి. ప్రతి సీటుకు కేవలం 1.15 మంది మాత్రమే పోటీ పడుతున్నారు. శారీరక దారుఢ్య పరీక్షల్లో క్వాలిఫై అయితే చాలు సీటు ఖాయమనే పరిస్థితి కనిపిస్తోంది. డీపీఈడీ పరీక్షకు హాజరైన అభ్యర్థులు 647 మంది కాగా, సీట్లు 300 ఉన్నాయి. అందుబాటులో ఉన్న సీట్లు హాజరైన అభ్యర్థులలో 46.37 శాతం మందికి సరిపోతాయి. ప్రతి సీటుకు 2.16 మంది పోటీ పడుతున్నారు. వ్యాయామ విద్యపై క్రేజ్ తగ్గడానికి అభ్యర్థుల లోపం కాదు, రాష్ట్రంలో నెలకొన్న విద్యా, క్రీడా విధానాలే కారణమని నిపుణులు తేల్చి చెబుతున్నారు స్కూళ్లలో పీఈటీ పోస్టుల కొరత తెలంగాణలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పీఈటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల సుమారు 1,800 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పినా యువతలో నమ్మకం కలగక పోవడం విశేషం. తెలంగాణలో ఒ కవైపు యూత్ అండ్ స్పోర్ట్స్ పాలసీ, స్పోర్ట్స్ యూని వర్సిటీ ఏర్పాటు వంటి చర్చలు జరుగుతున్నా పీఈ టీ కోర్సులకు ప్రాధాన్యత లేకపోవడం విడ్డూరం.కోర్సు అభ్యర్థులు హాజరైనవారు గైర్హాజరు బీపీఈడీ 2,386 1,788 598 డీపీఈడీ 976 647 329 కోర్సు కళాశాలలు అందుబాటులో ఉన్న సీట్లు బీపీఈడీ 15 1,560 డీపీఈడీ 03 300 బీపీఈడీలో హాజరైన 87 శాతం మందికి సీటు వచ్చే అవకాశం -
తెలుగు అంకెల దండ
1=1 ఒకటి 10¹ = 10 పది 10² = 100 వంద 10³ = 1000 వేయి 104 = 10000 పదివేలు 105 = 100000 లక్ష 106 = 1000000 పది లక్షలు 107 = 10000000 కోటి 108 = 100000000 పది కోట్లు 109 = 1000000000 వంద కోట్లు 1010 = 10000000000 అర్భుదం 10¹¹ = 100000000000 న్యర్భుదం 10¹² = 1000000000000 ఖర్వం 10¹³ = 10000000000000 మహా ఖర్వం 1014 = 100000000000000 పద్మం 1015 = 1000000000000000 మహాపద్మం 1016 = 10000000000000000 క్షోని 1017 = 100000000000000000 మహాక్షోనీ 1018 = 1000000000000000000 శంఖం 1019 = 10000000000000000000 మహా శంఖం 1020 = 100000000000000000000 క్షితి 10²¹ = 1000000000000000000000 మహా క్షితి 10²² = 10000000000000000000000 క్షోభం 10²³ = 100000000000000000000000 మహాక్షోభం ఇలా సున్నాలు చేర్చుతూ పోతే 1024 = నిధి 1025 = మహానిధి 1026 = పరకం 1027 = పరార్థం 1028 = అనంతం 1029 = సాగరం 1030 = అవ్యయం 10³¹ = అమృతం 10³² = ఆచింత్యం 10³³ = అమేయం 1034 = భూరి 1035 = మహాభూరి 10366 = పద్మం 1037 = మహాపద్మం 1038 = ఖర్వం 1039 = మహాఖర్వం 1040= శంఖంఇలా పేర్లు ఉన్నాయి.ఒక సారి రాసి గుర్తుంచుకోండి పిల్లలు.గడప రఘుపతిరావు. ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు. గ్రా: మర్రిగడ్డ, మండలం: చందుర్తి, జిల్లా: రాజన్న సిరిసిల్ల, 9963499282 -
ఇద్దరు పిల్లలతో తల్లి అదృశ్యం
వీర్నపల్లి(సిరిసిల్ల): మండలంలోని జవహర్లాల్నాయక్ తండాకు చెందిన భూక్య లలిత తన ఇద్దరు పిల్లలతో కలిసి అదృశ్యమైనట్లు ఎస్సై లక్ష్మణ్ గురువారం తెలిపారు. వివరాలు.. జవహర్లాల్నాయక్ తండాకు చెందిన భూక్య రమేశ్, తన భార్య లలిత మధ్య బుధవారం సాయంత్రం స్వల్పంగా గొడవ జరిగింది. మనస్తాపానికి గురైన లలిత, తన ఇద్దరు పిల్లలు వర్షిత్, నిహాన్ను వెంటబెట్టుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఎంత వెతికినా వారి ఆచూకీ లభించకపోవడంతో రమేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గాలింపు చర్యలు ముమ్మరం చేశామని, ఎవరికై నా వీరి ఆచూకీ తెలిస్తే వెంటనే వీర్నపల్లి పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. రుద్రంగి(వేములవాడ): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు.. మల్లేశం అనే వ్యక్తి రుద్రంగి నుంచి కోనరావుపేట మండలం వట్టిమల్లకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా రుద్రంగి–లింగంపేట అటవీ ప్రాంతంలో అదుపుతప్పి కిందపడ్డాడు. స్థానికులు 108 అంబులెన్స్లో వేములవాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బైక్ అదుపుతప్పి యువకుడికి.. ముస్తాబాద్: మండలంలోని ఆవునూర్ మానేరు వంతెనపై బైక్ అదుపుతప్పి యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు.. ముస్తాబాద్కు చెందిన డొక్క ప్రవీణ్ గురువారం రాత్రి సిరిసిల్ల నుంచి ముస్తాబాద్కు బైక్పై వస్తున్నాడు. ఆవునూర్ మానేరు వంతెనపైకి రాగానే బైక్ అదుపుతప్పి కింద పడిపోయాడు. తలకు తీవ్ర గాయాలు కాగా, 108 అంబులెన్స్లో సిరిసిల్ల జిల్లా ఆసుపత్రికి తరలించారు. -
తేలు బుద్ధి
అడవిలో ఒకతేలు ఆకలితో పడుకున్నది కదలలేక మెదలలేక కన్నీరును ఒలుకుతుండే అది చూసిన ఓ కోడి ఆహారం దొరికిందని పరుగు పరుగున అచటి కొచ్చి ముక్కుతోని పొడవ చూసే ప్రాణ భయంతో తేలు కోడి బావ కోడి బావ ఒక్కమాట చెబుతాను ఆలకించుమని కోరే నాకు ఆరోగ్యం బాగులేదు ఆహారం అసలు దొరకలేదు నాతో స్నేహంగా ఉండి చూడు హాని చేయబోను ఎవరికెపుడు తేలు మాట నమ్మి కోడి తన ఇంటికి తీసుకెళ్లి ఆహారం తెచ్చి ఇచ్చి ఆతిథ్యం మంచి గిచ్చి చెలిమి తోడ వుండమంటూ సలహాలను మెండు గిచ్చే తనకు దోస్తు దొరికాడని సంబరపడి పోయే కోడి పొద్దు పొద్దు గాలనే కొక్కోర కో అంటూ లేచి తన పిల్లలను చూడ మంటూ బయటకు పోయే తల్లి కోడి బలం పుంజుకున్న తేలు కపట బుద్ధి దాచుకుంటూ కత్తెర చేతులు చాచి కస్సు బుస్సుమని లేచే అమ్మదోస్తు ఈ తేలని ప్రేమగ దరి చేరినాయి పిల్ల కోళ్లు తన తోక కొండి లేపి మరీ చిటుకు చిటుకున కుట్టే తేలు లబో దిబోమంటూ బుజ్జి బుజ్జి పిల్ల కోళ్లు తల్లి చెంతకు పరుగు తీసి బోరుమంటూ ఏడ్వసాగే తేలు బుద్ధి తెలుసుకున్న తల్లికోడి కోపంతో రయ్యిన ఉరుకురికి వచ్చి తెలుపైన ఎగిరి దూకే తన ముక్కుతో తేలును ముక్కలు ముక్కలుగ చీల్చి స్నేహ ద్రోహి దేహాన్ని కసితీరా ఆరగించే... ఎప్పుడైనా ఈ జగాన బుద్ధిలేని ప్రబుద్ధులతో జాగ్రత్తగా మెదలమంటూ తల్లికోడి హితము చెప్పే..! డా.కటుకోఝ్వల రమేశ్ కవి, రచయిత ఖమ్మం జిల్లా -
బాలల కథ : అక్షర సేద్యం
రామాపురంలో సోమయ్య అనే మధ్య తరగతి రైతు ఉన్నాడు. అతని కుమారుడు రాజు అదే ఊరిలో ఏడోతరగతి చదువుచున్నాడు. రాజుకు చదువు అంటే చాలా ఇష్టం. శ్రద్ధగా చదువుకుని, ఏదైనా ఉద్యోగం సాధించాలని ఆశ. సోమయ్య కు మూడు ఎకరాల పొలం ఉంది. రాజుని తనతో పాటు పొలం పనులకు తీసుకెళ్లి, ఇద్దరం పనిచేస్తూ మరో మూడు ఎకరాల పొలం కొనుగోలు చేసి ఊరిలో మంచి రైతు గా పేరు సంపాదించి, పెద్ద ఇల్లు నిర్మించుకోవాలని సోమయ్య ఆలోచన. చదువుపై ఉన్న మమకారంతో రాజు పొలం పనులు చేయడానికి ఇష్టపడలేదు. అతన్ని ఎలాగైనా చదువు మాన్పించాలని సోమయ్య ప్రయత్నాలు చేసాడు. చదువుకోవాలనే పట్టుదలను రాజు వదిలిపెట్టలేదు.సోమయ్య కూడా పంతం వీడలేదు. తోటి విద్యార్థులు బడికి వెళ్తుంటే రాజు మనసు గాయపడింది.అమ్మానాన్నలను ఒప్పించడానికి అన్నాహారాలు మాని నిరాహారదీక్ష చేసాడు . తల్లి దండ్రుల మనసు కరిగింది కాని ఒక షరతు పెట్టారు. శ్రీప్రతి రోజూ ఉదయం రెండు గంటలు పొలం పనులు చేయాలి. సాయంత్రం ఇంటి పనులు చేయాలి.సెలవు రోజుల్లో సేద్యపు పనులు చేయాలిశ్రీ. ఇదే మంచి అవకాశమనుకుని రాజు పొలం పనులు చేసుకుంటూ, కష్ట పడి చదవడం మొదలెట్టాడు.పరీక్షల సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా,చదువు పై ఉన్న మక్కువతో సంతోషంగా స్వీకరించాడు. తన తోటి పిల్లలు సెలవు రోజుల్లో సరదా ఆటలు ఆడుతున్నా,తను బాధపడలేదు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. రాజు చదువు పూర్తి చేసి, ఉద్యోగం సాధించాడు. నీతి: సాధించాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమే.. – దుర్గమ్ భైతి రామునిపట్ల, సిద్దిపేట జిల్లా -
మేము గీసిన బొమ్మలు
పేరు: చిందం విహాన్ తరగతి: యూకేజీ గ్రామం: అలుగునూర్, కరీంనగర్ పేరు: బెల్లంకొండ సహస్త్ర రెడ్డి తరగతి: 7వ తరగతి గ్రామం: నాగారం, మంథని జిల్లా: పెద్దపల్లి -
పునాది లేని చోట శిఖరాలు ఎలా సాధ్యం?
మనం 2036 ఒలింపిక్స్లో పతకాలు సాధించాలని కలలు కంటున్నాం. కానీ ఒలింపియన్లను తయారు చేసే ప్రాథమిక కేంద్రాలైన పాఠశాలల్లోనే పీఈటీలు లేకపోవడం దారుణం. పాఠశాల స్థాయిలోనే ప్రతిభను గుర్తించకపోతే అంతర్జాతీయ స్థాయి అథ్లెట్లు ఎలా వస్తారు. బీపీఈడీ, డీపీఈడీ కోర్సులకు పూర్వ వైభవం రావాలంటే పీఈటీ పోస్టులను భర్తీ చేయాలి. – దూడం రమేశ్, రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ తెలంగాణ ఏర్పడిన తర్వాత క్రీడలకు పెద్దపీట వేస్తామన్నారు. క్షేత్రస్థాయిలో స్కూళ్లలో పీఈటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెగ్యులర్ డీఎస్సీ ద్వారా నోటిఫికేషన్లు రాకపోవడం వల్లే విద్యార్థులు బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల వైపు రావడానికి భయపడుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, మోడల్, గురుకుల పాఠశాలల్లో ఉన్న వ్యాయామ ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలి. – కంకటి అనూప్ కుమార్, కరీంనగర్ జిల్లా ప్రైవేట్ పీఈటీల సంఘం ప్రతినిధి -
ప్రతీ ఇంటికి యోగా
ఈ రోజుల్లో వయసుతో నిమిత్తం లేకుండా ప్రతీ ఒక్కరు ఒత్తిడి, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కరీంనగర్ జిల్లా యోగా అసోసియేషన్ ద్వారా మేము ప్రతీ ఇంటికి యోగాను తీసుకెళ్లాలని సంకల్పించాం. ప్రతీ ఒక్కరు తమ దినచర్యలో యోగాను భాగం చేసుకోవాలి. కరీంనగర్ యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో 20 ఏళ్లుగా ఎందరో జాతీయ, అంతర్జాతీయస్థాయి క్రీడాకారులను తయారు చేయడం మాకు గర్వకారణం. – నాగిరెడ్డి సిద్దారెడ్డి, యోగా సంఘం జిల్లా అధ్యక్షులు యోగా అనేది అంతర్గత శక్తిని మేల్కొలిపే సాధనం. శరీరానికే కాదు.. మనస్సుకు కూడా వ్యాయామం. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకు యోగా ఎంతో అవసరం. వారిలో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, మానసిక ప్రశాంతత పెరుగుతాయి. సరైన పద్ధతిలో నిత్యం ప్రాణాయామం, ధ్యానం చేస్తే ఒత్తిడి దూరమై సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. – మల్లిక, యోగా కోచ్ -
దోహా ఖతర్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
సిరిసిల్ల: తెలంగాణ ఆవిర్భావ వేడుకలను దోహా ఖతర్లో బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వైభవాన్ని చాటిచెబుతూ.. తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో భారతీయ సాంస్కృతిక కేంద్రం(ఐసీసీ) వేదికగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు వైభవంగా జరిపారు. దోహా ఖతర్లోని తెలుగు ప్రజలకు ఎన్నో ఏళ్లుగా తెలంగాణ గల్ఫ్ సమితి స్వచ్చంద సేవలు అందిస్తుంది. ఆపదలో ఉన్న కార్మికులకు అండగా నిలుస్తూ, అత్యవసర పరిస్థితుల్లో సహాయ సహకారాలు అందిస్తూ, సామాజిక సేవా కార్యక్రమాలతో భారత రాయబార(ఎంబసీ) కార్యాలయం, ఖతర్ కార్మిక మంత్రిత్వ శాఖ, అంతర్జాతీయ కార్మిక సంస్థ, కార్మిక సంక్షేమ సంస్థలతో సమన్వయంగా పని చేస్తూ సమాజ సేవలో ముందుంది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా అమరవీరుల స్తూపాన్ని ఏర్పాటు చేసి నివాళి అర్పించారు. రాష్ట్ర గీతంతో పాటు, ఇతర ఆటా, పాటలతో కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకుంది. తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదా మధు, ప్రధాన కార్యదర్శి సంధ్య వినయ్, కార్యవర్గ ప్రతినిధులు భవానిసాగర్, దుర్గం రాజేశ్వర్, గడ్డి రాజు, శంకర్గౌడ్, ఎల్లయ్య తాళ్లపల్లి, యువజన విభాగ సభ్యులు ముకుందం, రాజేశ్, ప్రవీణ్, అరుణ్, ప్రసాద్, సుధాకర్, బొల్లె రాజ, గంగారం, దీపక్, మధు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమ నిర్వహణకు దాతలుగా సహకరించిన హరీశ్రెడ్డి, సాగర్, రాథోడ్లకు తెలంగాణ గల్ఫ్ సమితి కృతజ్ఞతలు తెలిపింది. -
● మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ
సిరిసిల్ల స్వచ్ఛ కీర్తిని కాపాడాలి సిరిసిల్లటౌన్: స్వచ్ఛ పట్టణ సిరిసిల్ల కీర్తిని కాపాడుకోవడానికి పౌరులు సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ కోరారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం 3,16,27వ వార్డుల్లో నిర్వహించిన వార్డు సభలో మాట్లాడారు. ముందుగా ఇటీవల 27వ వార్డు కౌన్సిలర్ కాసర్ల పద్మ మృతిచెందగా, సంతాపాన్ని తెలియజేస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈసందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజలకు బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అర్హులందరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటారో పట్టణాన్ని కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎండీ ఖాదిర్ ఫాషా, డీఈ వాణి, ఏఈ నరసింహస్వామి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు భద్రత.. అందరి బాధ్యత
● ఎస్పీ మహేశ్ బి గితే తంగళ్లపల్లి: ప్రజల భాగస్వామ్యంతోనే సురక్షిత, శాంతియుత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఎస్పీ మహేశ్ బి గితే అన్నారు. ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా గురువారం మండలంలోని తాడూర్ గ్రామంలో నిర్వహించిన సభలో మాట్లాడారు. రోడ్డు భద్రత అందరి బాధ్యత అని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. గ్రామాల్లో ప్రమాదాలు జరిగే ప్రాంతాలను రోడ్డు సేఫ్టీ కమిటీలు గుర్తించి సంబంధిత అధికారుల సమన్వయంతో సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలలు, పనిచేసే ప్రదేశాల్లో మహిళలు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా షీటీమ్ నం. 87126 56425లో సంప్రదించాలని సూచించారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజలు పోలీస్శాఖకు సహకరించాలని పిలుపునిచ్చారు. సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి, రూరల్ సీఐ నాగేశ్వరరావు, ఎస్సై ఉపేంద్రచారి, ఇన్చార్జి ఎంపీడీవో రమేశ్, ఏవో సంజీవ్, ఎంపీవో మీర్జాఅఫ్జల్అహ్మద్బేగ్, ఎంఈవో రాజు తదితరులు పాల్గొన్నారు.వార్డులను తీర్చిదిద్దేందుకు ప్రత్యేక డ్రైవ్లువేములవాడ: పట్టణ అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలని మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం మున్సిపల్లోని 14,15,25వ వార్డుల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో పట్టణంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజల భాగస్వామ్యం కీలకమన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడపడుచుకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. వార్డులను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు త్వరలోనే ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్లు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల ఆవరణలో ఇంకుడుగుంతలు నిర్మించుకోవాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ లోకేశ్, మేనేజర్ సంపత్రెడ్డి, ఎస్సై రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలుసిరిసిల్ల: మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ మహేశ్ బి గితే గురువారం తెలిపారు. బుధవారం అర్ధరాత్రి వరకు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక డ్రంకెన్ డ్రైవ తనిఖీలు చేపట్టామని, మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 55 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. నంబరు ప్లేట్లు కనిపించకుండా మార్ఫింగ్ చేసిన 24 వాహనాలను గుర్తించామని వివరించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా నిత్యం విస్తృతంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరోధిలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. నంబర్ ప్లేట్ ఏర్పడకుండా ఏదైనా అడ్డుపెట్టిన, సగం నంబర్లు తొలగించి వాహనం నడిపితే చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. స్కూల్ బస్సులకు ఫిట్నెస్ తప్పనిసరిసిరిసిల్ల: నిబంధనల మేరకు కండిషన్ లేని బస్సులు రోడ్డు ఎక్కడానికి వీలు లేదని, స్కూల్ బస్సులకు విధిగా ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాలని జిల్లా రవాణా శాఖ అధికారి డి.శ్రీనివాస్ కోరారు. జిల్లాలోని వివిధ ప్రైవేటు స్కూళ్లకు చెందిన బస్సులను గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 160 స్కూల్ బస్సులు ఉన్నాయని, యజమానులు తప్పనిసరిగా ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాలన్నారు. ఎవరైనా ఫిట్నెస్ లేకుండా అక్రమంగా రోడ్డుపై నడిపితే నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎంవీఐ వంశీధర్, ఏఎంవీఐ పృథ్వీధర్వర్మ, సిబ్బంది ఉన్నారు. -
మూడేళ్లుగా మూత‘బడి’
ఇల్లంతకుంట(మానకొండూర్): ఒకప్పుడు 150 మందితో కళకళలాడిన సర్కారు బడి.. మూతపడి మూడేళ్లైనా ప్రారంభానికి నోచుకోవడం లేదు. అధికారులు, నాయకులు పట్టించుకోకపోవడంతో గ్రామంలోని బడుగు, బలహీన వర్గాల ప్రజలు వ్యయప్రయాసాలకోర్చి తమ పిల్లలను మండలకేంద్రంలోని ప్రైవేట్ స్కూళ్లకు పంపిస్తున్నారు. విద్యార్థులు రావడం లేదని.. మండలంలోని రహీంఖాన్పేట పెద్ద గ్రామపంచాయతీ. 2,300 జనాభా ఉంటారు. విద్యార్థులు రావడం లేదనే నెపంతో పాఠశాలను మూసివేసి, ఉపాధ్యాయులను డిప్యూటేషన్పై ఇతర స్కూళ్లకు కేటాయించారు. కాగా, రహీంఖాన్పేట అనుబంధ గ్రామం ఎర్రనర్సుపల్లె ప్రాథమిక పాఠశాల మూతపడగా, గతేడాది తిరిగి ప్రారంభించి 20 మంది విద్యార్థులతో పాఠశాల కొనసాగుతుంది. కానీ, మేజర్ గ్రామమైన రహీంఖాన్పేట బడిని మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఆయా గ్రామాల్లో కూడా.. ఇల్లంతకుంట మండలంలో విద్యార్థులు రావడంలేదని నారెడ్డిపల్లి, చిక్కుడువానిపల్లి, కిష్టారావుపల్లి, గూడెపుపల్లి, కేశన్నపల్లి, తెనుగువాండ్లపల్లి, తెనుగువారిపల్లి గ్రామాల్లో ప్రభుత్వ బడులను మూసివేశారు. మూతపడిన ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల భవనాలు నిరుపయోగంగా మారాయి. దీంతో ఆయా గ్రామాల విద్యార్థులు మండలకేంద్రంలోని ప్రైవేటు స్కూళ్లకు వెళ్తున్నారు. మేజర్ గ్రామాల్లో మూతపడిన సర్కార్ బడులను తిరిగి ప్రారంభించేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
సొంతింటి కల.. నెరవేర్చేలా..
అర్హులైన లబ్ధిదారుల ఎంపికతోపాటు పనులు ప్రారంభమైన నాటినుంచి ఇటు ప్రజాప్రతినిధులు, అటు అధికారులు స్వీయ పర్యవేక్షణ చేస్తూ ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇంటి నిర్మాణం మొదలైన స్వల్పవ్యవధిలోనే నిధులు మంజూరై, గృహ ప్రవేశాలు చేస్తుండడం విశేషం. దీనికితోడు ఇప్పటికే నిర్మాణాలు పూర్తయి, పంపిణీకి సిద్ధంగా ఉన్న డబుల్బెడ్రూమ్ ఇళ్లను సైతం పంపిణీ చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. అసంపూర్తిగా ఉన్న డబుల్బెడ్రూమ్ ఇళ్లను పూర్తిచేసి, విద్యుత్, మంచినీటి, డ్రైనేజీ, రోడ్లు వంటి వసతులు కల్పించాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. గతంలో కేటాయించిన వాటిల్లో అనర్హులు ఉంటే తొలగించి, అర్హులకు కేటాయించేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో అనేకఏళ్లుగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల కల ఫలించనుంది.సాక్షి పెద్దపల్లి: పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసమే ఇందిరమ్మ ఇళ్ల పథకం తీసుకొచ్చింది. తొలివిడతలో నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లు కేటాయించింది. వివిధ కారణాలతో అప్పుడు పదుల సంఖ్యలో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి ఆసక్తి చూపలేదు. వాటిని రద్దు చేసేందుకు అధికారులు ప్రభుత్వానికి సిఫారసు చేశారు. రద్దుచేసిన వాటిని మిగతా పేదలకు కేటాయించేందుకు సర్కారు నిర్ణయం తీసుకుంది. దీనికితోడు తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా ప్రతీ నియోజకవర్గానికి మరోరెండు వేల చొప్పున ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తూ నిర్ణయించింది.జిల్లా కరీంనగర్ పెద్దపల్లి జగిత్యాల సిరిసిల్ల మంజూరైనవి 10,779 6,452 10,860 7,826 నిర్మాణదశలోనివి 9,320 2,066 7,740 5,585 పూర్తయినవి 1,459 1,012 1,247 2,241 జిల్లా కరీంనగర్ పెద్దపల్లి జగిత్యాల సిరిసిల్ల మంజూరైనవి 9,021 3,394 8,360 6,886 పంపిణీ చేసినవి 4,129 1,630 5,292 3,610 పంపిణీకి సిద్ధంగా ఉన్నవి 4,892 245 2,449 250 -
ప్రజల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధి
● కలెక్టర్ గరీమా అగ్రవాల్కోనరావుపేట(వేములవాడ): ప్రజల భాగస్వామ్యంతో గ్రామ అభివృద్ధికి కార్యాచరణ రూపొందించవచ్చని కలెక్టర్ గరీమా అగ్రవాల్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం మండలంలోని మరిమడ్లలో నిర్వహించిన గ్రామసభకు హాజరై మాట్లాడారు. వర్షాకాల సన్నద్ధతపై అధికారులు సూచించిన విషయాలను ప్రజలు పాటించాలన్నారు. డ్రైనేజీల్లో ప్లాస్టిక్, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయొద్దని కోరారు. గ్రామాల్లో నీటి సరఫరా సక్రమంగా లేకుంటే అధికారులకు సమాచారం అందించాలన్నారు. ఆయిల్పాం, కూరగాయలు తదితర లాభదాయక పంటల సాగుకు రైతులు ముందుకు రావాలని సూచించారు. ద్విచక్రవాహనం నడిపే ప్రతీ ఒక్కరు హెల్మెట్ ధరించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని, మద్యం తాగి వాహనాలు నడపవద్దన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వచ్చి వివరాలు సేకరించే బీఎల్వోలకు ప్రజలు సహకరించాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు పంపించాలని కోరారు. వేములవాడ ఆర్డీవో కేఎస్బీ కుమారి, గ్రామీణాభివృద్ధి అధికారి లక్ష్మీనారాయణ, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, పంచాయతీ అధికారి షర్ఫుద్దీన్, మిషన్ భగీరథ గ్రిడ్ ఈఈ అన్వర్, ఇంట్రా ఈఈ సుమలత, తహసీల్దార్ వరలక్ష్మి, ఎంపీడీవో స్నిగ్ధ, సర్పంచ్ స్వాతి తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లు, తరలింపుపై దృష్టి పెట్టాలిసిరిసిల్ల: జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు, తరలింపుపై దృష్టి పెట్టి ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి టెలీకాన్ఫరెన్స్లో అధికారులతో ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ, హమాలీల సంఖ్య, గన్ని సంచులు, ఇప్పటివరకు ఎన్ని కొనుగోలు కేంద్రాలు మూసి వేశారు అని అడిగి తెలుసుకున్నారు. కొనుగోళ్లు తుది దశకు చేరిన కేంద్రాల నుంచి హమాలీలు, వాహనాలను ఇతర కేంద్రాలకు తరలించాలని సూచించారు. ప్రణాళిక ప్రకారం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతంగా చేయాలని, అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. -
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేస్తాం
చందుర్తి(వేములవాడ): ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేస్తామని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ అన్నారు. గురువారం మండలంలోని మల్యాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోళ్లు ముగింపు దశకు చేరుకున్నాయని, కొన్ని కేంద్రాల్లో పూర్తి కావడంతో లారీల కొరత తీరుతుందన్నారు. గన్నీ సంచులు పంపించి కొనుగోళ్లు మరింత వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ధాన్యం తడవకుండా రైతులు జాగ్రత్త పడాలని సూచించారు. ఆయన వెంట ఐకేపీ ఏపీఎం కళ్యాణి, ఆర్ఐ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. సన్నవడ్ల సాగుపై దృష్టిపెట్టాలి వేములవాడరూరల్: రైతులు ఆయిల్పాం, సన్నవడ్ల సాగుపై దృష్టి పెట్టాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ కోరారు. గురువారం వేములవాడ పరిధిలోని బాలనగర్, వేములవాడ రూరల్ మండలం వట్టెంల, ఫాజుల్నగర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. లాభదాయక పంటల సాగుకు ప్రోత్సాహం తదితర అంశాలపై రైతులతో చర్చించారు. సాధ్యమైనంత త్వరగా కొనుగోళ్లు పూర్తి చేసేలా చూడాలని నిర్వాహకులను ఆదేశించారు. -
పల్లెల్లో చెత్త బాధ
● పాలకులకు భారంగా చెత్త సేకరణ ● ఆదాయ వనరులు కరువు ● ప్రభుత్వం నుంచి రాని నిధులు ● పెరిగిన డీజిల్ ధరలుఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పల్లెల్లో పాలకవర్గాలను కదిలిస్తే కష్టాల ముచ్చట్లే వినిపిస్తున్నాయి. ఆదాయ వనరులు లేక.. ప్రభుత్వం నుంచి నిధులు రాక నిర్వహణ భారంగా మారింది. పల్లె పాలనపగ్గాలు చేపట్టామన్న సంతోషం కూడా వారిలో కనిపించడం లేదు. చెత్త సేకరణ నుంచి మల్టీపర్పస్ కార్మికుల వేతనాల వరకు ఎలా చెల్లించేది అని ప్రతీ నెల మదనపడుతున్నారు. చిన్న పల్లెలకు 15వ ఆర్థిక సంఘం నిధులు ఏటా రూ.40వేలు చెల్లిస్తున్నా అవి ఎటూ సరిపోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా మంజూరు చేయకపోవడంతో పల్లెపాలనతో సర్పంచులు ఆర్థికబాధలు అన్నీ..ఇన్నీ కావు. చిన్న పల్లెలకు చిక్కులే.. జిల్లా వ్యాప్తంగా 260 గ్రామపంచాయతీలు ఉన్నాయి. 13 మండల కేంద్రాలతోపాటు మరో 20 వరకు మేజర్ గ్రామపంచాయతీలు ఉంటాయి. మిగతావి చిన్న పల్లెలు, తండా గ్రామపంచాయతీలు ఉన్నాయి. చిన్నపల్లెల నిర్వహణకు ప్రతీ నెల రూ.50వేల వరకు ఖర్చు అవుతున్నాయి. కేంద్రం నిధులు రూ.40వేలు ఇస్తుండడంతో అవి ఎటూ సరిపోవడం లేదు. వీటితోపాటు వీధిదీపాల నిర్వహణ, చెత్తసేకరణ, మల్టీపర్పస్ వర్కర్ల వేతనాలు, ఇతరత్ర ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఈ ఫొటోలో చెత్త ట్రాక్టర్ నడుపుతున్నది బుగ్గరాజేశ్వరతండా సర్పంచ్ అజ్మీర తిరుపతినాయక్. గ్రామపంచాయతీలో ఇంటింటికీ వెళ్లి చెత్తసేకరించేందుకు గతంలో ట్రాక్టర్ కొనుగోలు చేశారు. ట్రాక్టర్ డ్రైవర్ వ్యక్తిగత కారణాలతో విధులకు హాజరుకాలేదు. తానే డ్రైవర్గా అవతారం ఎత్తి గ్రామంలో ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించాడు. చిన్న పల్లెటూరు కావడంతో ఆదాయం అంతంతే వస్తుందని.. మల్టీపర్పస్ వర్కర్ల జీతాలు, చెత్తట్రాక్టర్ నిర్వహణ, డీజిల్ ఖర్చు తడిసి మోపెడవుతుందని తెలిపారు. ప్రతి నెలా రూ.70 వేల వరకు ఖర్చు అవుతుందని, ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరం నిధులు రాలేవని తెలిపారు. తండా పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు పెంచాలని కోరారు.పంచాయతీలకు 2025–26 ఆర్థిక సంవత్సరం నిధులు మంజూరు కాలేదు. త్వరలోనే నిధులు వస్తాయి. నిధులు రాగానే పంచాయతీల ఖాతాల్లో జమ చేస్తాం. – సత్తయ్య, ఎంపీడీవో, ఎల్లారెడ్డిపేట గ్రామ సర్పంచులుగా గెలుపొంది ఆరు నెలలు గడుస్తుంది. ఇప్పటి వరకు నిధులు రాలేదు. ఇన్నాళ్లు గ్రామ నిర్వహణ ఖర్చు మా సొంత డబ్బులు వెచ్చించాం. గ్రామంలో కూడా ఆదాయం అంతంతే ఉంది. ప్రతీ నెల రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఎటూ సరిపోవడం లేదు. నిధులు మంజూరు చేయాలి. అంతేకాకుండా మల్టీపర్పస్ వర్కర్ల కొరత ఉంది. – బోనాల మణెమ్మ, పదిర సర్పంచ్ -
80 ఫీట్ల రోడ్డుకు మోక్షం
నాడు ఇరుగ్గా ఉన్న వేములవాడ రాజన్న గుడి నుంచి బ్రిడ్జి వరకున్న ప్రధాన రహదారి(ఫైల్), రూ.6కోట్ల నిధులతో ప్రారంభమైన డబుల్ రోడ్డు పనులువేములవాడ: రాజన్న ఆలయం నుంచి బ్రిడ్జి వరకు చేపట్టిన 80 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. సుమారు రూ.6కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనులు నిధుల కొరత కారణంగా కొంతకాలంగా నిలిచిపోయాయి. దీంతో స్థానిక ప్రజలు, వ్యాపారులు, భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటీవల ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. సైడ్ డ్రైనేజీలు, విద్యుత్ లైన్, రోడ్డు వెడల్పు పనులు, మట్టి తొలగింపు, నిర్మాణానికి సంబంధించిన యంత్రాల పనులు ప్రస్తుతం వేగంగా సాగుతున్నాయి. రోడ్డు విస్తరణ పూర్తయితే రాజన్న ఆలయానికి వచ్చే భక్తులకు రాకపోకలు సులభతరం కావడంతోపాటు పట్టణ ట్రాఫిక్ సమస్యలకు కూడా కొంతమేర పరిష్కారం లభించనుంది. ప్రస్తుతం రోడ్డు పనుల కారణంగా దుమ్ము, ట్రాఫిక్ ఇబ్బందులున్నా.. పనులు పూర్తయిన తర్వాత వేములవాడ ప్రధాన రహదారికి కొత్త రూపు రానుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ అభివృద్ధి, పట్టణ సుందరీకరణలో భాగంగా ఈ రోడ్డు కీలకంగా మారనుంది. 60 ఏళ్ల కల సాకారం గతంలో ఎన్నో చర్చలు జరిగినా.. కార్యరూపం దాల్చకపోవడంతో ప్రజల్లో నిరాశానిస్పృహలు నెలకొన్నాయి. సీఎం రేవంత్, ఎమ్మెల్యే ఆది పట్టుదలతో చేపట్టిన కార్యాచరణ ఇప్పుడు ఆ కలకు ఆకారాన్నిచ్చాయి. ఇప్పటికే పాత భవనాల కూల్చివేత పూర్తయ్యింది. చుట్టుపక్కల గోడలు, నిర్మాణాలు ధ్వంసమవుతున్నా.. ప్రజల మనస్సుల్లో ఆశల పునాది పడింది. కోర్టు స్టేలు, ఇంటి యజమానుల ఆవేదనలు ఇలా అన్నింటిని అధిగమించుకొని పనులు మొదలయ్యాయి. 60 ఏళ్ల కల సాకారం కానుందని జనం సంబరపడిపోతున్నారు.నిర్వాసితులు: 254 మంది నిర్మాణాలు: 322 కావాల్సిన భూసేకరణ: 750 మీటర్లు చేపట్టాల్సిన వెడల్పు: 80 ఫీట్లు -
ఏమో.. తెలియదు సార్!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పీఎంజే జువెల్లరీస్ దోపిడీ కేసు మాస్టర్మైండ్ సుబోధ్ సింగ్ కస్టడీలో నోరు మెదపడం లేదు. మే 3వ తేదీన కరీంనగర్లోని పీఎంజే జువెల్లరీస్లో దోపిడీకి పాల్పడిన సుబోధ్ గ్యాంగ్.. అడ్డువచ్చిన సిబ్బందిపై కాల్పులు జరిపి పరారైన విషయం తెలిసిందే. రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసులో సూత్రధారి సుబోధ్సింగ్గా తేల్చారు. దేశవ్యాప్తంగా బంగారం దుకాణాల్లో ఆరితేరిన సుబోధ్ ముఠాసభ్యులు ఇప్పటివరకు బిహార్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, జార్ఖండ్లో దోపిడీ చేశారు. ఈ గ్యాంగ్కు దక్షిణాదిన ఇదే తొలినేరం కావడం గమనార్హం. మే 28న బిహార్ నుంచి సుబోధ్ను తెలంగాణకు తీసుకొచ్చిన పోలీసులు అదే రోజురాత్రి కరీంనగర్కు తరలించారు. బుధవారం ఉదయం కరీంనగర్ జైలు నుంచి కస్టడీకి తరలించిన పోలీసులు వేసిన పలు పశ్నలకు సుబోధ్ మౌనం వహించినట్లు సమాచారం. అదే సమయంలో తన పాత కేసులకు సంబంధించి విషయాలను మాత్రం వెల్లడించినట్లు తెలిసింది. పోలీసు కస్టడీలో సుబోధ్సింగ్ ఏమాత్రం బెరుకు లేకుండా నవ్వుతూ సమాధానాలు చెప్పినట్లు సమాచారం. పోలీసులు మాత్రం పలు సాంకేతిక వివరాలు అతని ముందుంచి ప్రశ్నించినట్లు తెలిసింది. సుబోద్తో పాటు రఘునాథ్ కర్మాకర్, రావేశ్కుమార్లను కలిపి విచారించారు. ఇప్పటికే పోలీసులు పట్టుకున్న మరో నిందితుడు మేహతాబ్(సిమ్ కార్డులు సరఫరా చేసిన వ్యక్తి)ని కస్టడీకి దూరంగా ఉంచారు. పోలీసులకు సవాల్.. వాస్తవానికి దోపిడీ జరిగిన విధానం పోలీసులకు సవాల్గా మారింది. అయినప్పటికీ కరీంనగర్ పోలీసులు కేసును తక్కువ వ్యవధిలో ఛేదించారు. ఇప్పటికే బంగారం దేశందాటి నేపాల్కు వెళ్లినా సరే దోపిడీలో పాల్గొన్న దాదాపు అందరి వివరాలు సేకరించగలిగారు. ఇటీవల పోలీసులు పట్టుకొచ్చిన రఘునాథ్ కర్మాకర్, రావిశ్కుమార్, మెహతాబ్ఖాన్ను అరెస్టు చేయగలిగారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా సుబోధ్ సింగ్ను మాస్టర్మైండ్గా తేల్చిన పోలీసులు అతని కోసం ఇటీవల బిహార్ వెళ్లారు. అక్కడ సుబోధ్ కోసం న్యాయపోరాటమే చేయాల్సి వచ్చింది. ఆరు కోర్టులు.. అనేక సవాళ్లు.. సుబోధ్సింగ్ నెట్వర్క్లో లాయర్లు కూడా ఉన్నారు. అతడిని రాష్ట్రానికి తరలించాలని కరీంనగర్ పోలీసులు వేసిన ప్రిజనర్ ట్రాన్సిట్ (పీటీ) వారంట్ను సవాలు చేస్తూ సుబోద్ లాయర్లు అడుగడుగునా అడ్డుపడ్డారు. మొత్త ఆరు కోర్టుల్లో అతడిని లాయర్లు తమ వాదనలతో పోలీసులకు చుక్కలు చూపించారు. అయినప్పటికీ పోలీసులు చూపిన ఆధారాలకు న్యాయస్థానాలు సమ్మతించి సుబోధ్సింగ్ను అప్పగించడం అనివార్యంగా మారింది. సుబోధ్ను తరలించడంలో సీపీ గౌస్ ఆలం అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. న్యాయనిపుణులు, బిహార్కు చెందిన పలువురు ఐపీఎస్ ఆఫీసర్లను సంప్రదిస్తూ.. పోలీసులకు ఎప్పటికపుడు సూచనలు చేశారు. బిహార్లో గడ్డాలు పెంచుకుని.. మాసినబట్టలతో పోలీసులు పూర్తిగా ఆహార్యం మార్చుకుని సంచరించారు. పలువురు అధికారులు సుబోధ్ తరలింపునకు అనేక అడ్డుపుల్లలు వేశారు. బేడీలు తీసి విమానంలోకి.. సుబోధ్ తరలింపునకు మార్గం సుగమం అయిన తరువాత అతడిని విమానాశ్రయానికి తరలించడం పోలీసులకు సవాలుగా మారింది. దారి వెంట అతడి అనుచరులు దాడిచేస్తారన్న సమాచారంతో కట్టుదిట్టమైన భద్రత మధ్య తీసుకురావాల్సి వచ్చింది. అతడికి బేడీలు వేయకుండా విమానం ఎక్కించడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. మే 28న సుబోధ్ని తరలిస్తున్నారన్న సమాచారం ముందుగా ఏవియేషన్ అధికారులకు తెలిపి వారి సాయం తీసుకున్నారు. అందులో భాగంగా ప్రయాణికులకంటే ముందే సుబోధ్కు బేడీలు తీసివేసి విమానం ఎక్కించారు. అతడికి ఎస్క్రా్ట్గా సీఐ తిరుమల్, ఎస్సై రాజన్న కూర్చున్నారు. విమానం శంషాబాద్లో దిగాక సీపీ గౌస్ ఆలంతో సహా అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
పేదల కల నిజం చేయడమే లక్ష్యం
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోనరావుపేట(వేములవాడ): పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మర్తనపేట గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు నూతన వస్త్రాలను అందజేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతీ కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎంపీడీవో స్నిగ్ధ, కిసాన్సెల్ జిల్లా అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్రెడ్డి, సర్పంచులు బోయిని దేవరాజు, దీపిక, ఉప సర్పంచ్ బోనాల పునీత్, ఏఎంసీ చైర్మన్ ఎల్లయ్య, వైస్ చైర్మన్ ప్రభాకర్, డీసీసీ కార్యదర్శి షేక్ ఫిరోజ్పాషా, మండలాధ్యక్షుడు సత్యం, సింగిల్విండో చైర్మన్ బండ నర్సయ్య, నాయకులు ఐదరి శ్రీనివాస్, రామచంద్రం, తదితరులు పాల్గొన్నారు. గంభీరావుపేట(సిరిసిల్ల): లింగన్నపేట పీహెచ్సీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి రజిత తనిఖీ చేశారు. వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని పరిశీలించారు. రికార్డులను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. వ్యాధి నిరోధక టీకాల మందులను పరిశీలించి సరైన మోతా దు, నిర్దేశిత కాలంలో వేయడంతోపాటు టీకా తీసుకున్న తర్వాత స్వల్పంగా జ్వరం రావడం, తీసుకున్న ప్రాంతంలో చర్మం ఎర్రబడడం, వాపు లాంటివి సంభవిస్తాయని, తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. జిల్లా వ్యాధి నిరోధక టీకాల ఆధికారి సంపత్కుమార్, డిప్యూటీ డీఎంహెచ్వో రాజ్కుమార్, వైద్యాధికారి వినయ్కుమార్, సీహెచ్వో రమేశ్ తదితరులున్నారు.చిన్నారులకు సకాలంలో టీకాలు వేయించాలి ముస్తాబాద్: చీకొడు, గూడెం, ఆవునూర్ ఆరోగ్య ఉప కేంద్రాలను జిల్లా ఇమ్యూనైజేషన్ ఆఫీసర్ డాక్టర్ సంపత్కుమార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వ్యాధి నిరోధక టీకాల రికార్డులను పరిశీలించారు. 0 నుంచి 5 సంవత్సరాల చిన్నారులకు సకాలంలో టీకాలు వేయాలని సూచించారు. టీకా తీసుకున్నాక చిన్నారుల్లో వచ్చే సమస్యలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. సమయపాలన పాటించి ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు. ప్రభుత్వ వైద్య పథకాలను ప్రజలకు చేరవేయాలన్నారు. ఆయన వెంట డిప్యూటీ ఇమ్యూనైజేషన్ ఆఫీసర్ రాజ్కుమార్, ఎంఎల్హెచ్పీలు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలున్నారు. ప్రజా సంక్షేమమే బీజేపీ లక్ష్యంసిరిసిల్లటౌన్: ప్రజా సంక్షేమ పాలనే భారతీయ జనతా పార్టీ ప్రధాన లక్ష్యమని జాతీయ నాయకుడు మురళీధర్రావు పేర్కొన్నారు. బుధవారం సిరిసిల్లలోని వాసవి కల్యాణ మంటపంలో పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ వేదికపై విశిష్ట స్థానాన్ని సంపాదించిందన్నారు. 2 రోజుల శిక్షణ శిబిరం సిరిసిల్లలో ప్రశిక్షణ శిబిరం 2 రోజులపాటు నిర్వహిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి తెలిపారు. పార్టీ సిద్ధాంతం, పార్టీ చరిత్ర, వికాసం, భారత రాజకీయ పరిస్థితులు, సంస్థాగత నిర్మాణం, కార్యకర్తల బాధ్యతలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సోషల్ మీడియా వినియోగం, సమర్థవంతమైన ప్రజా సంబంధాలు, ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై వివిధ రంగాల నిపుణులు, పార్టీ సీనియర్ నాయకులు శిక్షణ అందిస్తారన్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చెన్నమనేని వికాస్రావు, కరీంనగర్ పార్లమెంటు కోకన్వీనర్ ఆడెపు రవీందర్, జిల్లా మాజీ అధ్యక్షుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాప రామకృష్ణ, జిల్లా ఇన్చార్జి గంగాడి మోహన్రెడ్డి పాల్గొన్నారు. -
నిద్రపోతున్న నిఘా!
● పని చేయని బస్సుల్లోని సీసీ కెమెరాలు ● అలంకారప్రాయమే.. ● ఫలితాలు ఇచ్చినా నిర్లక్ష్యం ● పట్టించుకోని అధికారులుసిరిసిల్ల అర్బన్: బస్సుల్లో యువతులు, మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులకు చెక్ పెట్టడం.. దొంగతనాల నివారణకు ఆర్టీసీ, పోలీస్శాఖలు సంయుక్తంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాయి. అయితే నిర్వహణను పట్టించుకోకపోవడంతో పని చేయడం లేదు. నాలుగేళ్ల క్రితం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలో నేడు ఒక్కటి కూడా పని చేయడం లేదు. ప్రస్తుతం అలంకారప్రాయంగానే దర్శనమిస్తున్నాయి. సీసీ కెమెరాల ఏర్పాటు ఇలా.. వేములవాడ, సిరిసిల్ల పట్టణాల్లో రెండు ఆర్టీసీ బస్సు డిపోలు ఉన్నాయి. ఈ రెండు డిపోల్లో నాలు గేళ్ల క్రితం వేములవాడ డీపోకు చెందిన 40 బస్సులు, సిరిసిల్ల డిపోకు చెందిన 40 బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. డిపో నుంచి బస్సు బయలుదేరినప్పటి నుంచి తిరిగి డిపోకు వచ్చే వరకు సీసీ కెమెరాలు పనిచేస్తుండేవి. దాని పుటేజీని ఎప్పటికప్పుడు ఆర్టీసీ అధికారులతో పాటు, జిల్లా పోలీసు కార్యాలయ అధికారులు పరిశీలించేవారు. ప్రస్తుతం కెమెరాలు పనిచేయకపోవడంతో వాటిని పట్టించుకునే వారు కరువయ్యారు.ఆర్టీసీ బస్సులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాబస్సులో కిందికి చూస్తున్న సీసీ కెమెరా -
‘రాజన్న’ పనుల్లో వేగం పెంచాలి
వేములవాడ: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు. వీటీఏడీఏ(వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) ఆధ్వర్యంలో రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు, నిత్యాన్నదాన సత్రం, బద్ది పోచమ్మ ఆలయం అభివృద్ధి పనులు, రాజన్న గుడి నుంచి బ్రిడ్జి వరకు ప్రధాన రోడ్డు విస్తరణ పనులను బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిని ఆర్అండ్బీ అధికారులనడిగి తెలుసుకున్నారు. రాజన్న ప్రధాన ఆలయ విస్తరణ, ప్రతీ అభివృద్ధి పనికి సంబంధించి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలని సూచించారు. రాజన్న ఆలయం నుంచి మూల వాగు బ్రిడ్జి వరకు కొనసాగుతున్న ప్రధాన రోడ్డు విస్తరణ పనులను పరిశీలించి.. పురోగతి, పూర్తి చేయడంపై మున్సిపల్ అధికారులను ఆరా తీశారు. ఆర్అండ్బీ ఈఈ నరసింహాచారి, వేములవాడ ఆర్డీవో కేఎస్బీ కుమారి, ఆలయ డిప్యూటీ ఈవో భాస్కర్శర్మ, ఆర్అండ్బీ డీఈ శాంతయ్య, వేములవాడ మున్సిపల్ కమిషనర్ లోకేశ్, తహసీల్దార్ జయంత్, టీపీవో అన్సార్ పాల్గొన్నారు. వార్డు సభలు నిర్వహించాలిసిరిసిల్ల: గ్రామాల్లో వార్డు సభలను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ గరిమా అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈనెల 4, 6, 8, 10ల్లో నిర్వహించనున్న ప్రత్యేక గ్రామ, వార్డు సభలపై తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, మండల వ్యవసాయ అధికారులు, ఎంపీవోలతో బుధవారం అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్తో కలిసి సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ప్రతీ గ్రామం, వార్డులో సభలు నిర్వహించి ప్రజలతో ప్రత్యక్షంగా చర్చించాలని సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో చేపట్టాల్సిన పనులను ముందుగానే గుర్తించి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రచారం చేయాలి గ్రామ, వార్డు సభల్లో బడిబాట కార్యక్రమంపై విస్తత ప్రచారం నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. మండల, ఇంటర్ విద్యాధికారులు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సదుపాయాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈనెల 15 నుంచి ప్రారంభమయ్యే షెడ్యూల్ ప్రకారం శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వేములవాడ ఆర్డీవో కె.ఎస్.బి.కుమారి, వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి లక్ష్మీనారాయణ, పంచాయతీ అధికారి షర్ఫుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. అన్ లోడింగ్ వేగం పెంచాలి జిల్లాలో ధాన్యం అన్ లోడింగ్లో వేగం పెంచాలని కలెక్టర్ ఆదేశించారు. అపరెల్ పార్క్, రైస్ మిల్లులు, గోదాముల్లో ధాన్యం అన్లోడింగ్, జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణపై జిల్లాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. అపరెల్ పార్క్, రైస్ మిల్లులు, గోదాముల్లో అన్లోడింగ్ వేగవంతం చేయడం.. ఇప్పటివరకు ఎన్ని కొనుగోలు కేంద్రాలు మూసేశారు.. తదితర అంశాలపై ఆమె ఆరా తీశారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ తదితర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. సర్కారు బడుల్లో ప్రవేశాలు పెంచాలి సిరిసిల్లటౌన్: జిల్లాలో ప్రభుత్వ బడిబాట కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి ప్రతీ పాఠశాలలో కనీసం 10 శాతం మేర విద్యార్థుల నమోదును పెంచాలని విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి యోగితా రాణా సూచించారు. బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లాల విద్యాశాఖ పనితీరును సమీక్షించి మాట్లాడారు. బడిబాట కార్యక్రమాన్ని గ్రామాలు, వార్డుల స్థాయిలో విస్త్తతంగా నిర్వహించి ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల నమోదును పెంచాలని సూచించారు. కలెక్టర్ గరిమా అగ్రవాల్, జిల్లా విద్యాధికారి జగన్మోహన్రెడ్డి, ఇంటర్మీడియట్ అధికారి శరత్, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకరచారి, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ పాల్గొన్నారు. -
పిల్లల మేధస్సుకు పునాది.. అబాకస్
కరీంనగర్కల్చరల్: కాలిక్యులేటర్లు, కంప్యూటర్లు లేని యుగంలో ప్రపంచానికి లెక్కల దారి చూపిన అద్భుత పరికరం అబాకస్. చిన్నచిన్న గుళికలను కదిలిస్తూ పెద్దపెద్ద గణిత సమస్యలను క్షణాల్లో పరిష్కరించే ఈ పురాతన సాధనం నేటికీ తన ప్రాధాన్యం కోల్పోలేదు. ముఖ్యంగా పిల్లల్లో గణిత నైపుణ్యాలను పెంపొందించడంతోపాటు జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, వేగవంతమైన ఆలోచనాశక్తిని అభివృద్ధి చేయడంలో అబాకస్ కీలక పాత్ర పోషిస్తోంది. వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ లెక్కల పరికరం ఆధునిక విద్యాప్రపంచంలోనూ విశేష ఆదరణ పొందుతోంది. బాలభవన్లో చిన్నారులు అబాకస్లో శిక్షణ తీసుకుంటూ.. సులువుగా లెక్కులు చేస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నారు. అబాకస్ నిర్మాణం అబాకస్ సాధారణంగా ఒక చట్రంలో(ఫ్రేమ్) ఉండే కడ్డీలు, వాటిపై కదిలే ముత్యాల్లాంటి గుళికలతో తయారవుతుంది. ప్రతీ కడ్డీ ఒక స్థాన విలువను సూచిస్తుంది. ఒకట్లు, పదులు, వందలు, వేలు గుళికలను కదిలించడం ద్వారా లెక్కలు చేస్తారు. అబాకస్ సుమారు 2000 సంవత్సరాల కంటే పాతది. చైనా, జపాన్, రోమ్ ప్రాంతాల్లో ఉపయోగించారు. జపాన్లో ఉపయోగించే అబాకస్ను సోరోబన్ అంటారు. అబాకస్ విశిష్టత వేగంగా లెక్కలు చేయగలగడం, కాలిక్యులేటర్ లేకుండా పెద్ద లెక్కల్ని కూడా త్వరగా చేయొచ్చు. పిల్లల మెదడు అభివృద్ధి, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. ఏకాగ్రత మెరుగవుతుంది. గణితంపై భయం తగ్గుతుంది. వేగంగా ఆలోచించే సామర్థ్యం పెరుగుతుంది. మానసిక లెక్కలు కొంతకాలం సాధన తర్వాత పిల్లలు అబాకస్ను ఊహలో చూసుకుంటూ మెంటల్ మ్యాథ్స్ చేయగలుగుతారు. చేతి, మెదడు సమన్వయంతో గుళికలను కదిలించడం వల్ల చేతి కదలికలు మెదడు పని కలిసి మెరుగుపడతాయి. ● సులభంగా లెక్కల సాధన ● మెదుడుకు చురుకుదనం.. జ్ఞాపకశక్తి పెరుగుదల బాలభవన్లో ఆరేళ్లుగా క్లాసికల్ డాన్స్, మ్యూజిక్ నేర్చుకుంటున్నా. గతేడాది నుంచి అబాకస్ నేర్చుకుంటున్నా. ముందుకన్నా ఫాస్ట్గా లెక్కలు చేయగలుగుతున్నా. దీనివల్ల మైండ్ షార్ప్ అవుతుంది. – వనజాక్షి, రాంనగర్ గణితంలో మెళకువలతో ప్రాబ్లమ్స్ తొందరగా సాల్వ్ చేస్తున్నా. అబాకస్తో ఏకాగ్రత కూడా పెరిగింది. ఇంతకుముందు ఎంతో కష్టమనిపించేది. అబాకస్ శిక్షణతో సులువైంది. – నిర్వాణ, హనుమాన్నగర్ -
పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషించాలి
సిరిసిల్ల అర్బన్: పర్యావరణ పరిరక్షణలో యువత కీలక పాత్ర పోషించాలని జేఎన్టీయూ–యూసీఈఆర్ ప్రిన్సిపాల్ అన్నారు. బుధవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిరిసిల్లలో విద్యార్థులకు పర్యావరణ అంశాలపై అవగాహన కల్పించేందుకు పర్యావరణ క్విజ్ పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రశంస పత్రాలు అందజేశారు. నోడల్ అధికారి, ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు. పర్యావరణంపై అవగాహనవేములవాడఅర్బన్: అగ్రహారంలోని జేఎన్టీయూ యూనివర్సిటీ కళాశాల ఆఫ్ ఇంజినీరింగ్ విద్యార్థులకు పర్యావరణ అంశాలపై అవగాహన కల్పించేందుకు పర్యావరణ క్విజ్ పోటీ నిర్వహించి ప్రశంస పత్రాలు అందజేసినట్లు ప్రిన్సిపాల్ వేణుగోపాల్ తెలిపారు. అధ్యాపకులు తదితరులున్నారు. ఇంధన డిపో సందర్శనరామగుండం: కుందనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్పీసీఎల్) ఇంధన డిపోను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. అగ్ని ప్రమాదాల నివారణ, భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. డిపో మేనేజర్ మనీశ్ తదితరులు ఉన్నారు. -
నాన్న కోరిక
అనగనగా ఒక ఊరిలో కనకయ్య మల్లమ్మ అనే దంపతులు ఉండేవారు. వారికి ఒక కొడుకు ఆ కొడుకు పేరు నారాయణ. అతడు పదవ తరగతి చదువుతున్నాడు. కానీ చదువును ఆశ్రద్ద చేసేవాడు. కానీ వాళ్ళ నాన్నకు మాత్రం నారాయణను బాగా చదివించాలనే కోరిక ఉండేది. ఒకరోజు కనకయ్యకు గుండెపోటు వచ్చింది. అప్పుడు నారాయణ కనకయ్యను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. డాక్టర్లు పరీక్షించి ఏమీ కాదు అని చెప్పి కొన్ని మందులు ఇచ్చి పంపారు. కానీ.. కొద్ది రోజుల తర్వాత మళ్లీ కనకయ్యకు గుండెపోటు వచ్చింది. అప్పుడు డాక్టర్లు ఆపరేషన్ చేయాలి అని చెప్పారు. దానికి రూ. 30 లక్షలు ఖర్చు అవుతాయని చెప్పడం జరిగింది. కానీ.. వాళ్ల దగ్గర అంత డబ్బు లేకపోవడంతో డబ్బు ఏర్పాటుకు చాలా మందిని అడిగారు. కానీ.. ఈలోగ కనకయ్యకు మళ్లీ గుండెపోటు వచ్చి మరణించాడు. అప్పుడు నారాయణ చాలా బాధపడ్డాడు తన వద్ద డబ్బు ఉంటే తన తండ్రిని బతికించుకునే వాడిని అని చాలా ఏడ్చాడు. నాలాంటి పరిస్థితి మళ్లీ ఎవరికీ రాకూడదు అని అనుకున్నాడు. అప్పటి నుండి వాళ్ల అమ్మ చెప్పినట్టు విని బాగా చదివాడు. పదవ తరగతి లో జిల్లా మొదటి స్థానం సాధించాడు. అతని ప్రతిభను చూసి ఒక మంచి కాలేజ్ వాళ్లు నారాయణకు ఉచితంగా విద్యను అందించడానికి ముందుకు వచ్చారు. ఆ తరువాత నారాయణ బాగా చదివి డాక్టర్ అయ్యాడు. నారాయణ వాళ్ల నాన్న కోరుకున్నది జరిగినందుకు వాళ్ల అమ్మ ఎంతో సంతోషపడింది. నారాయణ ఒక ఆసుపత్రిని నిర్మించి అందరికీ ఉచితంగా వైద్యం చేశాడు. – హాసిని తరగతి: 7వ తరగతి పాఠశాల: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల గ్రామం: చింతకుంట, కరీంనగర్ దుర్గం భైతి, ప్రభుత్వ ఉపాధ్యాయులు, రామునిపట్ల, సిద్దిపేట జిల్లాగాలి గాలి ఓ చిరుగాలి పవనాలుగా నీవిక తేలి నీవస్తావులే మా ఇంటికి నచ్చావులే మా కంటికి ! నీ వల్లే మాకు ఊపిరి ఉంది నీవు లేకుంటే కలుగు ఇబ్బంది మమ్ము అంటిపెట్టుకొని ఉంటావు అవునా కాదా ఇక ఏమంటావు ? నీ సమాధానం ఇక ఏదైనా నీవు లేకుండా పోదు పొద్దైనా ఓ గాలితల్లి మా చిరుగాలి మల్లి నీవు లేక ప్రాణం ఉండదులే మళ్ళి చెట్లు ఊగితే నీ ఉనికి తెలుసు అట్లనే చేయకు నీవిక అలుసు బొగ్గు పులుసు గాలి నీలో ఉంది దానితో మాకు కలుగు ఇబ్బంది ! గాలి తల్లి మా చిరుగాలి మల్లి మమ్ము విడిచి ఉండకు నీ వెళ్లి నీవు లేకుండా ఉండదు ఏ గల్లి నీవు వస్తేనే బాగుంటుంది మళ్ళీ ! గాలి తల్లి ఓ చిరుగాలి మల్లి హోరుగాలితో చేయకు లొల్లి చల్లగా తగిలితే కలుగు హాయి మెల్లెగ మది ఉప్పొంగు నోయి ! – గుర్రాల లక్ష్మారెడ్డి కవి రచయిత గ్రామం: కల్వకుర్తి, నాగర్ కర్నూల్ జిల్లా గాలి ఓ మా చిరుగాలిమన ఊరు మన బడి మనదే ఈ జీవితం అక్షర జ్ఞానం పొంది అవుదాం ఉన్నతం ఒకే మాట ఓకే పాట ఒకటే మన బడిబాట అమ్మ నాన్న కలలు కన్న అక్షరాల పూల తోట చక్కని క్రమశిక్షణతో చదువుకుని ఎదుగుదాము ఆచార్యుల మాట విని అవనికి వెలుగవుదాము ఆట పాటలు కంప్యూటర్ అవలీలగా నేర్చుకుని అన్ని రంగాల్లో మనమే ముందడుగులు వేద్దాము విలువైన విషయాలతో విజ్ఞాన విద్యనందుకుని విశ్వసేవ పథాన మనం వీరత్వం చూపుదాము వేసవి సెలవుల్లో మీ కలానికి పదునుపెట్టి బొమ్మలు గీస్తున్నారా? చిట్టి కథలు రాస్తున్నారా? ఏదైనా పర్యాటక ప్రదేశం సందర్శించారా? ఆటపాటల్లో విజయం సాధించి పతకాలు అందుకున్నారా? ఈ విషయాలను మీ స్నేహితులు, పాఠకులతో పంచుకోవాలనుకుంటే వాట్సప్ నెం: 8500786474 ద్వారా మాకు పంపండి. మేము ప్రచురిస్తాం. మీ ఫొటో కూడా జతచేయండి. ఊరు..పేరు.. జిల్లా రాయడం మరువొద్దు సుమా... -
బాబా ముసుగులో భారీ మోసం
వేములవాడ: మంత్రాలు కాదు.. మోసాలే! అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న కపట బాబాలు వశీకరణ పేరుతో వల వేస్తున్నారు. భక్తి, ఆధ్యాత్మికత పేరుతో అమాయక ప్రజలను మోసం చేసే కపట బాబాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మరోసారి వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ బొంబాయిలో ఉంటూ కొద్ది సంవత్సరాల క్రితం తన మకాంను వేములవాడకు మార్చుకుంది. తనను తాను ఆధ్యాత్మిక శక్తులు కలిగిన వ్యక్తిగా ప్రచారం చేసుకుంటూ బాబా అవతారమెత్తింది. ఓ కుటుంబాన్ని వలలో వేసి రూ.కోట్లు కాజేసిన ఘటన వేములవాడలో కలకలం రేపుతోంది. బాధితుడు చిమ్మల మల్లేశం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భార్య శ్రావణిని ఆ మహిళ మానసికంగా ప్రభావితం చేసి కుటుంబ సభ్యుల నుంచి దూరం చేసే ప్రయత్నం చేసిందన్నారు. భవిష్యత్ కష్టాలు తొలగిస్తానని, ప్రత్యేక పూజలు, హోమాలు చేస్తానని నమ్మించి దశలవారీగా భారీ మొత్తంలో నగదు, బంగారం, ఆస్తులను తీసుకుందని ఆరోపించారు. మొత్తం రూ.2.14కోట్ల వరకు తమ కుటుంబం నష్టపోయినట్లు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
శరీర అవయవాల పేర్లతో పొడుపు కథలు
1. పొద్దస్తమానం పనిచేస్తూనే ఉండే బానిస నోరు అనే భూస్వామి వద్ద వెట్టి చేస్తోంది ఆయన ఇంట్లోకి ఎన్నెన్ని తెచ్చి పడేసినా నోరు మెదపక దంచి, మెత్తగా నూరుతుంది. 2. మనిషి జాతకమే నాదగ్గరుందని పోసుకోలు కబుర్లు చెప్తుంది ప్రమాణ సాక్షిగా నిజమే చెప్తున్నానంటూ మాటిమాటికీ ఓట్లు వేస్తుంది. 3. పిడికెడంత చిన్న ఇల్లు దాన్లో నాలుగు గదులు క్షణం తీరిక లేదు దమ్మిడి ఆదాయం లేదు. 4. పటిష్టమైన భద్రత మధ్య ప్రధానమైన అవయవం అందరితో పని చేయిస్తూ అన్నీ చూసుకునే పెద్దబాస్ ముడతల శరీరమే గానీ మహా తెలివిమంతురాలు 5. ఎంతసేపూ మనం మాట్లాడితే వినటమే గానీ తాను నోరిప్పి ఒక్కమాటా మాట్లాడదుఅంతేగాదు ఒట్టి నగల పిచ్చిది కూడా లోలాకులు, రింగులు, జూకాలు, కమ్మలు అంటూ రకరకాలు సింగారించుకుంటుంది. 6. ప్రాణవాయువును పీల్చుకుంటుంది కార్బన్ డైయాకై ్సడ్ను వదుల్తుంది వాసనలను చక్కగా చెపుతుంది దుమ్ము ధూళిని అడ్డుకుంటుంది. 7. మాటలైతే మాట్లాడుతుంది గానీ తిండి మాత్రం తనంత తాను తినదు కలిపి ముద్దలు పెడితేనే తింటుంది. ఇంత గారాబమైతే ఎలాగమ్మా! 8. శరీరం రాజులా మీద ఎక్కి కూర్చుంటే సేవకుల్లా ఇవి మోసుకుంటూ తిరుగుతాయి. ముల్లు గుచ్చుకున్నా, ఎదుర్రాయి కొట్టుకున్నా బాధలు, నొప్పులు, కన్నీళ్లు, రక్తాలు వీటికే– కందేపి రాణీప్రసాద్ రచయిత్రి, సిరిసిల్ల జిల్లా: రాజన్నసిరిసిల్ల జవాబులు: 1.జీర్ణాశయం, 2.అరచేయి, 3.గుండె, 4.మెదడు, 5.చెవి, 6.ముక్కు, 7.నోరు, 8.కాళ్ళు -
పిల్లల విద్య
పుస్తకం చేతిలో ఉంటే భవిష్యత్తు వెలుగులో ఉంటుంది. అక్షరం నేర్చిన చిన్నారి ఆకాశాన్ని తాకే విజేత అవుతాడు. విద్య అనే అమూల్య ధనం ఎవ్వరూ దోచుకోలేరు ఎన్నడూ. గురువు చూపిన మార్గంలో, జ్ఞాన దీపం వెలిగించాలి. నేటి చదువు రేపటి బలం దేశానికి అది గొప్ప సంపద. ప్రతి బిడ్డ చదువుకోవాలి ప్రతీ కల నిజం కావాలి. విద్యతో ఎదిగి ఉన్నత శిఖరాలు చేరి భారత మాతకు కీర్తి తేవాలి. – పిల్లల విద్యే ప్రకాశవంతమైన భవిష్యత్తుకు పునాది – దూపాటి హరిప్రసాద్ షాపూర్ నగర్, హైదరాబాద్. -
బన్నీ వేసవి యాత్ర –24
‘టీవీ వద్దు.. ఫోన్ వద్దు.. కథల పుస్తకాలు చదువుదాం’ఆదివారం పొద్దున్నే బన్నీ టీవీ ఆన్ చేశాడు.రామ్ ఫోన్లో గేమ్ పెట్టాడు. చుక్క, స్వప్న కూడా వాళ్ళ పక్కన కూర్చుని స్క్రీన్కే చూస్తున్నారు. తాతయ్య వచ్చి కరెంట్ స్విచ్ ఆఫ్ చేశాడు. ‘ఇవాళ కరెంట్ కట్’ అని నవ్వాడు. ‘బోర్ కొడుతుంది తాతయ్య’ అని చుక్క ముఖం చిట్లించింది. తాతయ్య అలమారలో నుంచి ఒక పాత సంచి తీశాడు. నిండా కథల పుస్తకాలు. ‘తెనాలి రామ, పంచతంత్రం, చందమామ – ఇవి చదివితే బుర్రకు బూస్ట్ఙ్ అన్నాడు. స్వప్న ఒక పుస్తకం తీసి చదివింది. ‘అరె, ఇది బాగుంది’ అని నవ్వింది. రామ్, బన్నీ కూడా ఒక్కో పుస్తకం తీసుకున్నారు. గది అంతా నిశ్శబ్దం అయింది. తాతయ్య చెప్పాడు: ‘టీవీ, ఫోన్ కళ్ళకు నొప్పి. పుస్తకం మెదడుకు పదును.’ చుక్క లేచి అంది: ‘ తాతయ్యా ... రోజూ అరగంట కథలు చదువుతాం.’ పిల్లలకి మాట: స్క్రీన్ చూస్తే సమయం పోతుంది. పుస్తకం చదివితే జ్ఞానం పెరుగుతుంది.డాక్టర్ కోట లక్ష్మణ్ ప్రభుత్వ ఉపాధ్యాయులు గ్రామం: కాకర్లపల్లి, మంథని జిల్లా: పెద్దపల్లి -
‘గుండు’ను గుర్తించని యాప్
వీర్నపల్లి(సిరిసిల్ల): సాంకేతికత పెరిగే కొద్దీ ఉపాధి కూలీలకు తిప్పలు తప్పడం లేదు. ఫేస్ను గుర్తుపట్టాల్సిన యాప్.. గుండు గీయించుకున్నారనే కారణంతో ముఖం చాటే సింది. వివరాలు.. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్న పల్లి మండలం రంగంపేటలో ఉపాధి పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎర్రగడ్డ తండాకు చెందిన కూలీలు బానోతు శ్రీను, తులసిరామ్, తిరుపతి, హంస, ప్రకాశ్ ఇటీ వల వేములవాడ రాజన్న సన్నిధిలో తల వెంట్రుకల మొక్కు చెల్లించుకున్నారు. మంగళవారం ఉపాధి పనులకు హాజరయ్యారు. వీరి హాజరును యాప్లో నమోదు చేసేందుకు మేట్ ఫొటో తీయగా అది గుర్తించలేదు. గతంలో జుట్టుతో ఉన్న ఫొటోలు సిస్టమ్లో ఉండగా, ప్రస్తుతం గుండుతో ఉన్న వీరి ముఖా లను గుర్తుపట్టలేదు. బైక్ కవర్లను వారి గుండుపై కప్పి ఫొటో తీయగా యాప్లో హాజరు నమోదైంది. దీంతో సదరు కూలీలు హమ్మయ్య అంటూ పనుల్లో నిమగ్నమయ్యారు. -
జెండా ఆవిష్కరించిన కలెక్టర్
సిరిసిల్ల: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో మంగళవారం కలెక్టర్ గరీమా అగ్రవాల్ జాతీయజెండా ఆవిష్కరించారు. ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అంతకు ముందు క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ జెండా ఆవిష్కరించారు. విద్యార్థులకు నోట్బుక్లు అందజేశారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, కలెక్టరేట్ ఏవో రాంరెడ్డి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే ఎస్పీ ఆఫీస్లో ఎస్పీ మహేశ్ బి గితే జెండా ఆవిష్కరించారు. శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నప్పుడే సమాజ అభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు. ఏఎస్పీ చంద్రయ్య, డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు, జి.వెంకటేశ్వర్లు, ఏవో పద్మ, సీఐలు శ్రీనివాస్, నాగేశ్వరరావు, వెంకటేశ్, రవీందర్, మొగిలి, రవి, ఆర్ఐలు మధుకర్, సురేశ్, సిబ్బంది పాల్గొన్నారు. బెటాలియన్లో.. సిరిసిల్ల అర్బన్: తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను సిరిసిల్ల పట్టణంతోపాటు, విలీన గ్రామాల్లో ప్రజాప్రతినిధులు ఘనంగా జరుపుకున్నారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధి సర్థాపూర్లో గల 17వ బెటాలియన్లో కమాండెంట్ సురేశ్ జెండా ఎగరేశారు. 10వ వార్డు బోనాలలో బొల్గం వైష్ణవి, 8వ వార్డు పెద్దూరులో లింగంపల్లి భాగ్యలక్ష్మి, 9వ వార్డులో దొంతినేని కళ్యాణి, 22వ వార్డులో లింగంపల్లి గంగరాజు, 24వ వార్డులో బుర్ర మల్లికార్జున్, 11వ వార్డులో మామిండ్ల మహేశ్, 12వ వార్డులో నాగరాజు, 1వ వార్డులో బూర బాలు జెండా ఆవిష్కరించారు. జెండావందనం చేస్తున్న కమాండెంట్, సిబ్బంది జెండా ఆవిష్కరిస్తున్న ఎస్పీ మహేశ్ బి గితే తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పూలు వేస్తున్న కలెక్టర్ గరీమా అగ్రవాల్ -
ప్రజాపాలన
బుధవారం శ్రీ 3 శ్రీ జూన్ శ్రీ 2026పారదర్శకంగాపోలీస్ ఓపెన్ హౌజ్లో ఏకే 47 గన్ను ఎక్కుపెట్టి పరిశీలిస్తున్న విప్ పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తున్న విప్ ఆది శ్రీనివాస్ సిరిసిల్ల: ప్రజాపాలన పారదర్శకంగా.. జవాబుదారీతనంతో సాగుతుందని, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బి గితేతో కలిసి పోలీస్ గౌరవవందనం స్వీకరించిన విప్ జాతీయ జెండా ఆవిష్కరించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన మాటల్లోనే.. -
విద్యార్థుల సంఖ్య పెంచాలి
గంభీరావుపేట(సిరిసిల్ల): నూతనంగా మంజూరైన ప్రీ ప్రైమరీ స్కూళ్లలో విద్యార్థుల నమోదు పెంచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈవో జగన్మోహన్రెడ్డి అన్నారు. మంగళవారం గంభీరావుపేట మండలం లింగన్నపేట ప్రీ ప్రైమరీ స్కూల్ను సందర్శించారు. గదులు, ఆటవస్తువులను పరిశీలించారు. క్వాలిటీ కో ఆర్డినేటర్ అశోక్, ఎంఈవో గంగారాం, హెచ్ఎం శ్రీమతి తదితరులు ఉన్నారు. పేదల అభ్యున్నతికే పథకాలుఇల్లంతకుంట: పేదల అభ్యున్నతికే ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మంగళవారం మండలకేంద్రంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేసి మాట్లాడారు. గత ప్రభుత్వం డబుల్బెడ్రూంలు నిర్మించినా ప్రజలకు అందజేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు రూ.5లక్షలు ఆర్థికసాయం చేస్తుందన్నారు. అనంతరం సిరికొండ గ్రామంలో ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. తహసీల్దార్ సురేశ్, మండల ప్రత్యేక అధికారి డీసీవో రామకృష్ణ, ఎంపీడీవో శశికళ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భాస్కర్రెడ్డి, సర్పంచులు మామిడి రాజు, గొడుగు విట్టల్, నేరెళ్ల విజయ్గౌడ్, కాత మల్లేశం, నాగరాజు, వోల్లాల రజిత, పండుగ సునీత, నాయిని నవీన్కుమార్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తీగల పుష్పలత, హౌసింగ్ ఏఈఈ ముజాఫర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికబోయినపల్లి: హైదరాబాద్లో ఈ నెల 12న జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు మండలంలోని విలాసాగర్ హైస్కూల్ వి ద్యార్థి గోల్కొండ సృజన్కుమా ర్ ఎంపికై నట్లు పీడీ ప్రభాకర్ మంగళవారం తెలిపారు. ఈ నెల 1న సిరిసిల్ల జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ 100 మీటర్ల పరుగుపందెం అండర్–16 విభాగంలో సృజన్ ప్రతిభచాటి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు పేర్కొన్నారు. రామాలయాన్ని సందర్శించిన సినీ నటుడుగంభీరావుపేట(సిరిసిల్ల): మండలకేంద్రంలోని శ్రీసీతారామస్వామి ఆలయం, 700 ఏళ్లుగా ఆ రిపోని అఖండ జ్యోతిని సినీ నటుడు సీవీఎల్ నర్సింహారావు మంగళవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ ప్రాశస్త్యం గురించి కమిటీ చైర్మన్ మల్లుగారి నర్సాగౌడ్ను అడిగి తెలుసుకున్నారు. ఆలయ గాలిగోపురం నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు. నియామకంసిరిసిల్లఅర్బన్: స్కౌట్, గైడ్స్ అర్గనైజేషన్(ఎస్జీవో) జిల్లా కమిషనర్గా మోతుకూరి అశోక్గౌడ్ను నియమిస్తున్నట్లు నేషనల్ కమిషనర్ ఆఫ్ ఇండియా (న్యూఢిల్లీ) ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్ర కమిషనర్ అశోక్రాజ్ తెలిపారు. జిల్లాలో స్కౌట్, గైడ్స్ విభాగాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని అశోక్ తెలిపారు. వరద కాలువ నిర్మించాలిసిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రంలో కొత్తచెరువు వరదకాల్వను వెంటనే నిర్మించాలని ఏఐఎఫ్టీయూ న్యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సోమిశెట్టి దశరథం డిమాండ్ చేశారు. మంగళవారం ప్రెస్క్లబ్లో మాట్లాడారు. కొత్తచెరువు మత్తడి నీరు పోయేందుకు శ్రీనగర్కాలనీ నుంచి కచ్చా కాలువ తీసి నాలుగేళ్లుగా వరదను మళ్లించడం జరుగుతుందన్నారు. పట్టణంలో కాల్వలు కబ్జా చేసి చేపట్టిన నిర్మాణాలను తొలగించాలని కోరారు. మచ్చ అనసూర్య, గుజ్జ దేవదాస్, ఆకిన సత్తయ్య, పంతం సుజాత, గడదాసు లత పాల్గొన్నారు. -
ఇంతకు నాలుగింతలు అభివృద్ధి చేస్తాం
సిరిసిల్ల: ‘మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయ్యాను.. మంత్రిగా ఉండగా.. కొంత మేరకు అభివృద్ధి చేశాను.. 2028లో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే.. కేసీఆర్ నాయకత్వంలో ఇంతకు నాలుగింత అభివృద్ధిని చేస్తా’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కె.తారక రామారావు అన్నారు. సిరిసిల్ల తెలంగాణ భవన్లో వీర్నపల్లి మండల కేంద్రం సర్పంచ్ మల్లారం జోత్స్న–అరుణ్కుమార్ మంగళవారం బీఆర్ఎస్లో చేరగా, పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ, సిరిసిల్ల ప్రజలు నన్ను ఆశీర్వదిస్తే నేను గెలిచాను. కానీ, వేములవాడ, ఇతర ప్రాంతాల్లో కాంగ్రెస్కు ఓట్లు వేసి ఇప్పుడు గోస అనుభవిస్తున్నారని అన్నారు. కేసీఆర్ పాలనలో ఆటోకు డబ్బులిస్తే యూరియా బస్తాలు ఇంటికి వచ్చి పడేవని, వ్యవసాయంతో పాటు అన్ని రంగాల ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకున్నామన్నారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే, జిల్లాలో ఎవరూ ఊహించని అభివృద్ధి పనులు చేస్తామన్నారు. గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాలకు చెందిన పలువురు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ చేరారు. ఉమ్మడి జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, నాయకులు గూడూరి ప్రవీణ్, బొల్లి రామ్మోహన్, మాడుగుల మల్లేశంయాదవ్, గుగులోత్ రేణుక, కళావతి, కుంబాల మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతా జిల్లాలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటానని కేటీఆర్ అన్నారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ స్కూళ్లలో పదో తరగతిలో టాప్ మార్కులు సాధించిన 30 మంది విద్యార్థులకు మంగళవారం సిరిసిల్ల బాలికల హైస్కూల్లో గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా ట్యాబ్లు పంపిణీ చేసి మాట్లాడారు. తల్లిదండ్రులు గర్వపడేలా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరాలన్నారు. గిఫ్ట్ ఏ స్మైల్ ఇన్చార్జి కొండూరి సాంకేత్రావు, స్కూల్ హెచ్ఎం శారద, ఉపాధ్యాయుడు భూపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేడు కేటీఆర్ రాక
సిరిసిల్ల: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు మంగళవారం సిరిసిల్లకు వస్తున్నారని ఆయన వ్యక్తిగత సహాయకుడు కుంభాల మహేందర్రెడ్డి సోమవారం తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో జరిగే కార్యక్రమంలో వీర్నపల్లి మండల కేంద్ర సర్పంచ్ మల్లారపు జ్యోత్స్న, అరుణ్తోపాటు వివిధ మండలాలకు చెందిన ఇతర పార్టీల నాయకులు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరతారని వివరించారు. జేఈఈ అడ్వాన్స్డ్లో 1,235వ ర్యాంక్సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రానికి చెందిన గాజుల వివేక్ జేఈఈ అడ్వాన్సుడ్లో ప్రతిభ చాటాడు. ఓపెన్ కేటగిరీలో 1,235వ ర్యాంకు, ఓబీసీలో 211వ ర్యాంక్ సాధించారు. ఇప్పటికే జేఈఈ మెయిన్లో 99.84 పర్సంటేజ్ సాధించారు. వివేక్ తల్లిదండ్రులు గాజుల శ్రీనివాస్–లావణ్య. శ్రీనివాస్ ప్రస్తుతం హైదరాబాద్ రైల్వేశాఖలో చీఫ్ విజిలెన్స్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి లావణ్య గృహిణి. పదో తరగతిలో 97.5 శాతం మార్కులు, ఇంటర్మీడియట్లో 99 శాతం మార్కులు సాధించిన వివేక్ రాష్ట్ర స్థాయి ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష ఎప్సెట్లో 138వ ర్యాంక్ సాధించారు. ఇల్లంతకుంట: కొనుగోలు కేంద్రాల్లో లోడింగ్ను వేగవంతం చేయాలని అడిషనల్ డీఆర్డీవో శ్రీనివాస్ సూచించారు. మండలంలోని దాచారం, సిరికొండ, తెనుగువానిపల్లి, ఐకేపీ కొనుగోలు కేంద్రాలను సోమవారం పరిశీలించారు. కొనుగోలు పూర్తయిన సెంటర్ల నుంచి వాహనాలను అధిక సంఖ్యలో పంపిస్తామన్నారు. రామచంద్రం, కొనుగోలు సెంటర్ల నిర్వాహకులు, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యాన్ని తూకం వేయడం లేదంటూ అన్నదాతలు రోడ్డెక్కారు. మండలంలోని రాచర్ల తిమ్మాపూర్ బస్టాండ్ వద్ద సిరిసిల్ల–కామారెడ్డి ప్రధాన రోడ్డుపై సోమవారం ధర్నా చేశారు. రైతులు మాట్లాడుతూ రాచర్ల తిమ్మాపూర్లో ఇంకా 150 వడ్ల కుప్పలు మిగిలి ఉన్నాయన్నారు. అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్నా ధాన్యం సేకరించడంలో జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ మండలాధ్యక్షుడు రేపాక రామచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి దాసరి గణేశ్, నంది నరేశ్, కిరణ్నాయక్ పాల్గొన్నారు. పోలీస్ సేవా పతకాలకు ఎంపికసిరిసిల్ల: జిల్లా పోలీస్శాఖలో పనిచేస్తున్న పలువురికి సేవా పతకాలను సోమవారం ప్రకటించారు. బోయినపల్లిలో పనిచేస్తున్న పోలీస్ కానిస్టేబుల్ బి.శ్రీనివాస్ పోలీస్ సేవా పతకానికి ఎంపికయ్యారు. సిరిసిల్ల శివారులోని సర్ధాపూర్ 17వ పోలీస్ బెటాలియన్కు చెందిన ఆర్ఐ కొంకటి శ్రీనివాస్, ఆర్ఎస్సై ఎం.రాజేశ్, ఏఆర్ఎస్సైలు ఎం.కనకరాజు, ఎం.ఆంజనేయులు, ఎస్.భరత్కుమార్ పోలీస్ సేవా పతకాలకు ఎంపికై నట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ శిఖాగోయల్ ప్రకటించారు. ఈమేరకు జూన్ 2న పోలీస్ సేవా పతకాలు అందుకోనున్నారు. డీటీవోగా శ్రీనివాస్సిరిసిల్లటౌన్: జిల్లా రవాణా శాఖ అధికారిగా దేవునూరి శ్రీనివాస్ నియమితులయ్యారు. రవాణాశాఖలో అధికారుల బదిలీలు చేస్తూ రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్ ఇళంబరితి ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం సిరిసిల్లలో డీటీవో, సిద్దిపేట ఇన్చార్జి డీటీవోగా పనిచేస్తున్న లక్ష్మణ్ను మంచిర్యాల జిల్లా మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్గా బదిలీ చేశారు. బోధన్లో విధులు నిర్వహిస్తున్న దేవునూరి శ్రీనివాస్ సిరిసిల్లకు బదిలీ అయ్యారు. ఆయనకు గతంలో సిరిసిల్ల ఎంవీఐగా పనిచేసిన అనుభవం ఉంది. -
పెరిగిన సాగు విస్తీర్ణం
జిల్లాలో 2014లో సాగువిస్తీర్ణం 1,44,260 ఎకరాలు ఉండగా.. ఇప్పు డు 2.46 లక్షల ఎకరా లకు పెరిగింది. మధ్యమానేరు జలాశయం నిర్మాణంతో భూగర్భ జలా లు పెరిగాయి. సిద్దిపేట జిల్లా కూడవెల్లి వాగు ద్వారా గంభీరావుపేట మండలం నర్మాల జలాశయంలోకి గోదావరి జలాలు చేరి, ఎండాకాలంలో ఎగువమానేరు మత్తడి దూకింది. వ్యవసాయాభి వృద్ధికి 10 గోదాములు నిర్మించారు. చెరువులు, కుంటల అభివృద్ధికి రూ.96.09 కోట్లు కేటాయించారు. మిషన్భగీరథలో రూ.1,220కోట్లతో ఇంటింటికీ తాగునీరు అందించే పనులు చేపట్టారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్యాకేజీ–9లో భాగంగా రూ.1,280కోట్లతో ఎగువ మానేరుకు టన్నెల్ పనులు పూర్తయ్యాయి. కోనరావుపేట మండలం మ ల్కపేట రిజర్వాయర్లో రెండు టీఎంసీల నీటిని నిల్వచేసి ఆయకట్టుకు విడుదల చేశారు. వేములవాడ ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. గుడి చెరువు అభివృద్ధి పనులు సాగుతున్నాయి. -
‘పుష్కర’మైన అభివృద్ధి జాడలు
సర్ధాపూర్లో వ్యవసాయ మార్కెట్ యార్డునర్సింగ్ కాలేజీకలెక్టరేట్ ముఖద్వారంసిరిసిల్ల: స్వరాష్ట్ర సాధనకు ముక్కోటి గొంతుకలు.. సబ్బండవర్ణాలు ఏకమై నినదించిన వేళ.. సరిగ్గా పుష్కరకాలం క్రితం.. దశాబ్దాల పోరాటం.. ప్రజల ఆరాటం ఫలించింది. భాష..యాస.. పాటలు.. మాటలతో సాగిన ఉద్యమం విజయతీరాలకు చేరింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించి నేటికి సరిగ్గా పన్నెండు ఏళ్లు అవుతుంది. పుష్కరకాలంగా స్వరాష్ట్రంలో ఆత్మగౌరవ పతాక రెపరెపలాడింది. రాష్ట్ర ఆవిర్భావంతో తలసరి ఆదాయం, సాగు విస్తీర్ణం పెరిగింది. పరిపాలన సౌలభ్యం కోసం 2016లో రాజన్న సిరిసిల్ల జిల్లా ఆవిర్భవించింది. దశాబ్దాల కాలంగా అభివృద్ధికి దూరంగా ఉన్న పల్లెలు ప్రగతి పథంలో పయణిస్తున్నాయి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా అభివృద్ధిపై కథనం.మండెపల్లిలో రాష్ట్రంలోనే తొలి డ్రైవింగ్ శిక్షణ, పరిశోధన కేంద్రంవాటర్ జెట్ లూమ్స్సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా, గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్నారు. వేములవాడ ఎమ్మెల్యే, ప్రభు త్వ విప్ ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలకంగా మారారు. పన్నెండేళ్లుగా జిల్లా అభివృద్ధికి ఇద్దరూ బాటలు వేస్తున్నారు. కలెక్టరేట్, జిల్లా పో లీస్ అధికారి ఆఫీస్ భవనాలు పూర్తయ్యాయి. సిరి సిల్ల నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు తారు రోడ్లు వేశారు. కొత్తగా 56 జీపీలు ఆవిర్భవించా యి. స్వచ్ఛ భారత్లో జిల్లా ఆదర్శం. వంద శాతం పన్నుల వసూలు, మరుగుదొడ్ల నిర్మాణం వంటి సామాజికాంశాల్లోనూ జిల్లా అగ్రపథం. భూగర్భ జలాల అభివృద్ధి శిక్షణ ఐఏఎస్లకు పాఠ్యాంశం. ఎగువ మానేరుకు మధ్యమానేరు నీరు చేరాలి. జిల్లాలోని 625 చెరువుల్లోకి గోదావరి జలాల మళ్లింపు. వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనులు. సిరిసిల్ల, వేములవాడల్లో ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలల ఏర్పాటు. టెక్స్టైల్ రంగంపై యువతకు శిక్షణ కేంద్రం ఏర్పాటు. వేములవాడ పట్టణంలో రోడ్ల విస్తరణ. బీడీ కార్మికుల ఈఎస్ఐ ఆస్పత్రి భవనం నిర్మాణం. మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వేలైన్ నిర్మాణం. ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలి. వేములవాడ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న రోడ్లు పూర్తి. వేములవాడ పట్టణంలో రోడ్ల విస్తరణ. మూలవాగుపై పలు ప్రాంతాల్లో వంతెనల నిర్మాణం. వేములవాడ, సిరిసిల్ల పట్టణాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలి. జిల్లాలో మట్టి రోడ్లను తారు రోడ్లుగా మార్చాలి. గల్ఫ్ వలస జీవులకు నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలి. మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీలు మంజూరు కావడంతో వైద్యరంగంలో గణనీయమైన ప్రగతిని సాధించింది. ఎంబీబీఎస్ రెండో ఏడాది విద్యను వంద మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. నర్సింగ్ కాలేజీ విద్యార్థులు ప్రభుత్వ వైద్యశాలల్లో శిక్షణ పొందుతూ పేదలకు సేవలు అందిస్తున్నారు. జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ మంజూరు కావడంతో అగ్రహారంలో కొనసాగుతోంది. సిరిసిల్ల శివారులోని సర్ధాపూర్లో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల, తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల వద్ద వ్యవసాయ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోనే తొలి కేజీ టు పీజీ విద్యాలయం గంభీరావుపేటలో ఉంది. వేములవాడ రెవెన్యూ డివిజన్ ఏర్పాటైంది. జిల్లాలో పంచాయతీరాజ్ పరిధి(పీఆర్)లో రూ.525.61 కోట్లతో 825.22 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వివిధ గ్రామాల్లో వేశారు. ఆర్అండ్బీ శాఖ పరిధిలో రూ.391.04 కోట్లతో 28 రోడ్లను, మరో నాలుగు వంతెనలను నిర్మించారు. సిరిసిల్ల పట్టణంలో రూ.79 కోట్లతో రోడ్ల విస్తరణ చేశారు. రెండో బైపాస్ రోడ్డు రగుడు నుంచి వెంకటాపూర్ వరకు రూ.90 కోట్లతో పూర్తయింది. వస్త్రపరిశ్రమలో ఎన్నడూ లేని మార్పులు వచ్చాయి. 2017 నుంచి ప్రభుత్వం ఆర్వీఎం, బతుకమ్మ చీరలు, క్రిస్మస్, రంజాన్ వస్త్రోత్పత్తి ఆర్డర్లతో నేతన్నలకు చేతినిండా పని దొరికింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ఇందిరా మహిళా శక్తి చీరల ఆర్డర్లు ఇస్తుంది. గతేడాది రూ.350 కోట్ల ప్రభుత్వ ఆర్డర్లు స్థానిక వస్త్రపరిశ్రమకు లభించాయి. 1,104 మంది కార్మికులను యజమానులుగా మార్చేందుకు రూ.202.30 కోట్లతో 80 ఎకరాల్లో సామూహిక వర్క్షెడ్లు పూర్తయ్యాయి. కానీ ఆ షెడ్లను ధాన్యం నిల్వ చేసేందుకు వినియోగిస్తున్నారు. -
బాధితుల కళ్లలో ఆనందం చూడాలి
● ఎస్పీ మహేశ్ బీ గీతే సిరిసిల్ల: పోలీస్స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసే బాధితుల కళ్లల్లో ఆనందాన్ని చూసేలా సమస్యలను పరిష్కరించాలని ఎస్పీ మహేశ్ బీ గీతే అన్నారు. జిల్లా ఎస్పీ ఆఫీస్లో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించగా.. 33 మంది ఫిర్యాదులు అందించారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రతీ ఫిర్యాదును లోతుగా పరిశీలించాలన్నారు. క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి చట్టపరిధిలో న్యాయం చేయాలని సూచించారు. జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్ల ఎస్హెచ్వోలతో నేరుగా ఎస్పీ మాట్లాడి, ఫిర్యాదులపై సత్వరం స్పందించాలని ఆదేశించారు. -
ఆనందోత్సాహాలతో గృహప్రవేశాలు
నూతన వస్త్రాలు అందిస్తున్న కలెక్టర్ గరీమా అగ్రవాల్, విప్ ఆది శ్రీనివాస్, తడగొండలో ఎమ్మెల్యే సత్యంసిరిసిల్ల/రుద్రంగి/బోయినపల్లి: జిల్లా వ్యాప్తంగా సోమవారం సామూహిక ఇందిరమ్మ ఇళ్లలో గృహప్రవేశాలు సంతోషాల మధ్య జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 1,720 ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు జరిగాయి. జిల్లా కేంద్రంలోని పలు ఇళ్లను కలెక్టర్ గరీమా అగ్రవాల్, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి కలిసి ప్రారంభించారు. రుద్రంగి మండల కేంద్రంలో కలెక్టర్ గరీమా అగర్వాల్తో కలిసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసి, ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. బోయినపల్లి మండల కేంద్రంలోని ఇందిరమ్మ మోడల్హౌస్తోపాటు తడగొండ, బోయినపల్లి, గుండన్నపల్లి గ్రామాల్లో గృహప్రవేశాలకు కలెక్టర్తో కలిసి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరయ్యారు. హౌసింగ్ పీడీ వెంకటమాధవరావు, మున్సిపల్ కమిషనర్ ఖదీర్పాషా, ఏఎంసీ చైర్మన్ ఎల్లేశ్యాదవ్, తహసీల్దార్ చిందం శ్రీనివాస్, ఎంపీడీవో జయశీల పాల్గొన్నారు. -
భీమన్నా శరణు శరణు
వేములవాడ: భీమేశ్వరస్వామిని ఆదివారం వి విధ ప్రాంతాలకు చెందిన 30 వేల మంది భ క్తులు దర్శించుకున్నారు. బద్దిపోచమ్మకు బో నం మొక్కు చెల్లించుకున్నారు. కోడెమొక్కులు, అభిషేకాలు, అన్నపూజలు, సత్యనారాయణ వ్రతాలు, కుంకుమ పూజలు చేశారు. ధాన్యం సేకరణ వేగంగా చేయాలివీర్నపల్లి(సిరిసిల్ల): ధాన్యం సేకరణ, లోడింగ్, మిల్లుల వద్ద అన్లోడింగ్ వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ ఆదేశించారు. మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ ఆదివారం తనిఖీ చేశారు. సరిపడా వాహనాలు అందుబాటులో ఉంచేలా పర్యవేక్షిస్తున్నామన్నారు. హమాలీల సంఖ్య పెంచుకొని ధాన్యం కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తయ్యేలా చూడాలన్నారు. తహసీల్దార్ నారాయణరెడ్డి ఉన్నారు. పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి తంగళ్లపల్లి(సిరిసిల్ల): పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత సూచించారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం మండల పరిధిలోని నేరళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. డీఎంహెచ్వో రజిత మాట్లాడుతూ పొగాకు వినియోగంతో ఊపిరితిత్తులు, నోరు, గొంతు క్యాన్సర్లు, గుండె జబ్బులు, పక్షవాతం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. నేరళ్ల పీహెచ్సీ వైద్యాధికారి చంద్రికారెడ్డి, జిల్లా ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి రామకృష్ణ, డాక్టర్ నయీమా, సీహెచ్వో సత్యనారాయణ, సర్పంచ్ పొన్నం లక్ష్మణ్గౌడ్ పాల్గొన్నారు. రాజన్న కోడెలకు పశుగ్రాసం తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని కస్బేకట్కూర్ గ్రామం చింతలకుంటకు చెందిన యువ రైతులు చీమల ప్రశాంత్యాదవ్, జడల శ్రీనివాస్ రాజన్న కోడెలకు పశుగ్రాసం అందజేశారు. ఆదివారం కస్బేకట్కూర్ నుంచి ట్రాక్టర్ లోడు పశుగ్రాసాన్ని వేములవాడ రాజన్న గోశాలకు తీసుకెళ్లారు. -
ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
సిరిసిల్లటౌన్: తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని టీజీఎస్ఆర్టీసీ సిరిసిల్ల డిపో జేఏసీ చైర్మన్ సీహెచ్ బాణయ్య కోరారు. రాష్ట్రశాఖ పిలుపుమేరకు ఆదివారం ఎర్రబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. బాణయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన మాట మార్చకుండా జూన్ 2న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ అపాయింట్మెంట్ డేట్ ప్రకటించాలని కోరారు. ఆదివారం తెల్లవారుజాము 3 గంటలకు మొదటి బస్సు నుంచి డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది ‘డిమాండ్స్ డే’లో పాల్గొన్నారు. సిరిసిల్ల డిపో ఉపాధ్యక్షుడు బి.శ్రీనివాస్, బీ.ఎస్.ఎన్. రావు, ఉద్యోగులు పాల్గొన్నారు. అపాయింట్మెంట్ తేదీ ప్రకటించాలి వేములవాడఅర్బన్: వేములవాడ ఆర్టీసీ డిపో కార్మికులు ఎర్రబ్యాడ్జీలతో ఆదివారం డిపో ఎదుట నిరసన తెలిపారు. జూన్ 2న టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ అపాయింట్మెంట్ తేదీ ప్రకటించాలని కోరారు. ఈ నిరసనలో శ్రీకాంత్, కాళిదాస్, జీపీ సింగ్ తదితరులు ఉన్నారు. -
కూరలు కుతకుత
కూరగాయల ధరలు సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. గత పదిహేను రోజులతో పోల్చితే ధరలు రెట్టింపయ్యాయి. జిల్లాలో సాగు అంతంతే ఉండడం.. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవడమే ప్రధాన సమస్యగా అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో కూరగాయల సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు అవగాహన కల్పిస్తున్నా రైతులు పంటమార్పిడికి సహకరించడం లేదంటున్నారు. జిల్లాలో కూరగాయల సాగు, పెరిగిన ధరల నేపథ్యంలో ప్రత్యేక కథనం. ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): జిల్లా వ్యాప్తంగా 2.45లక్షల ఎకరాలకు పైగా సాగుభూమి ఉంది. ఇందులో అత్యధికంగా వరి, పత్తి సాగు చేస్తున్నారు. జిల్లాలోని 13 మండలాల వ్యాప్తంగా 500 ఎకరాల్లోనే రైతులు కూరగాయలు సాగుచేస్తున్నట్లు అధికారుల లెక్కలు తెలుపుతున్నాయి. స్థానికంగా దొరక్కపోవడంతో మహారాష్ట్ర, మదనపల్లి, అనంతపూర్ నుంచి దిగుమతి అవుతున్నాయి. ఇటీవల పెరిగిన ఇంధన ధరల భారం వినియోగదారులపై పడుతుంది. ఫలితంగా గత పదిహేను రోజులతో పోల్చితే కూరగాయల ధరలు రెట్టింపయ్యాయి. గతంలో కిలో టమాట రూ.50 ఉండగా నేడు రూ.100లకు చేరింది. వంకాయ, క్యాప్సికం, గోడుచిక్కుడు సైతం డబుల్ అయ్యాయి. -
కొనుగోళ్లలో వేగం పెంచాలి
● గోదాముల్లో హమాలీల సంఖ్య పెంచాలి ● కలెక్టర్ గరీమా అగ్రవాల్సిరిసిల్ల: ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. కొనుగోళ్లు, అన్లోడింగ్, వాహనాలు, ఇతర అంశాలపై సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని అపరెల్పార్క్లో పౌర సరఫ రాలు, జిల్లా గ్రామీణ అభివృద్ధి, సహకార, మెప్మా, రవాణా, కార్మిక శాఖ అధికారులు, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్తో కలిసి ఆదివారం సమీక్షించారు. అపెరల్ పార్క్లో ధాన్యం అన్లోడింగ్ను పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ, హమాలీల సంఖ్య, గన్నీసంచుల వివరాలు తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు కావాల్సిన గన్నీసంచులు ముందస్తుగా తెప్పించాలని సూచించారు. కొనుగోళ్లు తుది దశకు చేరిన కేంద్రాల నుంచి హమాలీలు, వాహనాలను ఇతర కేంద్రాలకు తరలించాలని సూచించారు. ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు వాహనాలు సమకూర్చాలని ఆదేశించారు. డీఆర్డీవో లక్ష్మీనారాయణ, సహకారశాఖ అధికారి రామకృష్ణ, జిల్లా రవాణాశాఖ అధికారి లక్ష్మణ్కుమార్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్, కార్మిక శాఖ అధికారి నజీర్ అహ్మద్, తహసీల్దార్ మహేశ్ పాల్గొన్నారు. -
సొంతింటి కల సాకారం
సిరిసిల్ల: పేదల ఆత్మగౌరవ ప్రతీక సొంతింటి కలను నెరవేర్చే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జిల్లా రాష్ట్రస్థాయిలో రెండో స్థానంలో నిలిచింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.5లక్షలను నాలుగు విడతల్లో ఇవ్వగా.. లబ్ధిదారులు కొంత దానికి జమ చేసి నిర్మాణాలు పూర్తి చేసుకున్నారు. 400 చదరపు అడుగుల నుంచి 600 చదరపు అడుగులలోపు ఇంటిని నిర్మించుకున్నారు. నాలుగు దశల్లో.. బేస్మెంట్ పూర్తయితే రూ.లక్ష, గోడలు నిర్మి స్తే మరో రూ.లక్ష, ఇంటి స్లాబ్ వేసిన రూ.2 లక్షలు, నిర్మాణం పూర్తి చేసిన తరువాత మరో రూ.లక్ష మొత్తం రూ.5 లక్షలు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమవుతున్నాయి. మహిళా సంఘాల్లో సభ్యులకు అదనపు ఆర్థిక సాయంగా బ్యాంకు రుణాలు అందించారు. దీంతో జిల్లావ్యాప్తంగా 40 శాతం ఇళ్ల నిర్మాణంతో రెండో స్థానంలో నిలిచింది. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో.. జిల్లాలోని 11 మండలాల్లో గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో మోడల్ హౌస్లను నూతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించారు. ప్రతీ మోడల్ హౌస్ లో హాల్, బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూం, కిచెన్ సదుపాయాలతో పూర్తి చేశారు. ఎండాకాలంలో చల్లగా, చలికాలంలో వెచ్చగా ఉండేలా సాంకేతికతను ఉపయోగించారు. స్లాబు నిర్మాణంలో పిల్లర్ రూఫింగ్ విధానాన్ని వినియోగించారు. ఇందులో సాధారణ ఇళ్లతో పోలిస్తే స్లాబ్ నిర్మాణంలో 40 శాతం ఖర్చు ఆదా అవుతుంది. నాణ్యతలో లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా పూర్తి చేశారు. నిరంతర పర్యవేక్షణ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరీమా అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. హౌసింగ్ పీడీ వెంకట మాధవరావు, హౌసింగ్ క్షేత్రస్థాయి సిబ్బంది లబ్ధిదారులను కలుస్తూ నిర్మాణాలు వేగంగా జరిగేలా ప్రోత్సహిస్తున్నారు. నేడు సామూహిక గృహప్రవేశాలు జిల్లా వ్యాప్తంగా సోమవారం సామూహిక ఇందిరమ్మ గృహప్రవేశాలకు ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ గరీమా అగ్రవాల్ అన్ని మండలాల ప్రత్యేక అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పండుగ వాతావరణంలో గృహప్రవేశాలు చేయాలని ఆదేశించారు. ఈమేరకు ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఇందిరమ్మ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని అనేక మంది పేదలు నేడు సొంతింటిలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. -
అన్నదమ్ములు..
ఇల్లంతకుంట(మానకొండూర్): బట్టలు కుడుతూ జీవనోపాధి వెల్లదీస్తున్న కుటుంబంలో నుంచి ఒకేసారి ఇద్దరు అన్నదమ్ములు ఆర్మీకి ఎంపికవడంతో వారి ఆనందానికి అవధులు లేవు. మండల కేంద్రానికి చెందిన ఓదెల లక్ష్మణ్–అనిత దంపతులకు ఇద్దరు కొడుకులు ఆనంద్, శివ. లక్ష్మణ్ దర్జీ పనిచేస్తూ పిల్లలను చదివిపించాడు. ఆనంద్, శివ ఇద్దరూ డిగ్రీ వరకు చదివారు. మొదటిసారి గత జూన్లో గోదావరిఖనిలో నిర్వహించిన ఆర్మీ సెలక్షన్స్కు హాజరై పరీక్ష రాశారు. హనుమకొండలో ఫిజికల్ టెస్టులో పాల్గొన్నారు. శనివారం అర్ధరాత్రి వెలువడిన ఫలితాల్లో ఆర్మీ జీడీ పోస్టులకు ఎంపికయ్యారు. -
ప్రణాళికతో వేములవాడ అభివృద్ధి
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ● రోడ్డు వెడల్పు పనులు పరిశీలనవేములవాడ: పట్టణ అభివృద్ధికి ప్రణాళికతో ముందుకెళ్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజన్న ఆలయం వద్ద కొనసాగుతున్న రోడ్డు విస్తరణ పనులను ఆదివారం పరిశీలించారు. విప్ మాట్లాడుతూ ఆలయంతోపాటు పట్టణ అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. రాజన్న ఆలయంలో రూ.150కోట్లతో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. అందులో భాగంగా ఆలయం ముందు నుంచి బ్రిడ్జి వరకు 80 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులు చేపట్టినట్లు చెప్పారు. పట్టణ సుందరీకరణ పనులకు రూ.2.60 కోట్లతో చేపడుతున్నట్లు తెలిపారు. అన్నదానసత్రం పనులు రూ.35కోట్లతో కొనసాగుతున్నాయన్నారు. బద్దిపోచమ్మ ఆలయం వద్ద పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్చైర్మన్ నరాల శేఖర్, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ కనికరపు రాకేశ్, కౌన్సిలర్లు కొండా శేఖర్, అన్నారపు శ్రీనివాస్, కొక్కుల బాలకృష్ణ, తోట రాజు పాల్గొన్నారు. -
ప్రతిభ చూపు!
మార్గం వెతుకు..సిరిసిల్ల/కరీంనగర్ స్పోర్ట్స్ : బహుళ నైపుణ్యాలు ఎప్పుడైనా పనికొస్తాయి. బంగారు బాటవేస్తాయి. సాధన చేస్తే ఏదైనా సులభమే. అభ్యాసమే ఏదో ఒకనైపుణ్య సాధనకు మందు. ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తయిన విద్యార్థులు ప్రతిభ.. ఆలోచన.. ఆచరణతో ముందుకెళ్తే భవిష్యత్తు బంగారంలా ఉంటుంది. దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ నైపుణ్యాలపై పట్టు పెంచుకుంటే భవిష్యత్ బాగుంటుంది. దూసుకెళ్తున్న ఐటీ.. తోటి వారితో పోటీ.. వీటన్నింటిని నెగ్గుకు రావాలంటే పట్టుదల ముఖ్యం.ఉమ్మడి జిల్లాలో ఇటీవల ఇంటర్ పూర్తిచేసిన వారుభావ వ్యక్తీకరణతో విజయం విద్యార్హత, మార్కులకు తోడు ఉద్యోగ ఇంటర్వ్యూల్లో భావవ్యక్తీకరణ అంశాన్ని ప్రత్యేకంగా పరిగణిస్తున్నారు. తెలిసిన అంశాన్ని, చేసిన ప్రయోగాన్ని స్పష్టంగా చెప్పగలగడం.. భాష నైపుణ్యంతో వివరించగలగడం.. అవతలి వ్యక్తులను ఆకట్టుకుంటాయి. వీటిని నేర్పడానికి శిక్షణ కేంద్రాలూ ఉంటాయి. వాటిలో చేరి సాధన చేయవచ్చు. ట్రైనింగ్తో ముందుకు.. సమయం విలువను గుర్తిస్తే ఇంజినీరింగ్, మెడిసిన్ దేనిలోనైనా సీటు తెచ్చుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇంటర్లో చేరిన విద్యార్థులు, ఇప్పటికే ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైవారు ఆ దిశగా కసరత్తు చేయాలి. లక్ష్యం.. గుర్తుంచుకోవాలి.. మెహందీ డిజైన్, వంటలతో వ్యాపారం, అల్లికలు, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వంటి కోర్సులు ఇంట్లోనే ఉండి ఆన్లైన్ ద్వారా నేర్చుకోవచ్చు. లక్ష్యంతో నేర్చుకుంటే ఆర్థికంగా ఎదిగేందుకు వీలుంటుంది. భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు వచ్చినా గట్టెక్కవచ్చు. ఈ కోర్సులకు ప్రభుత్వ పరంగా శిక్షణ కేంద్రాలు గురుకులాల్లో, సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో పేద విద్యార్థులకు వెసులుబాటు ఉంటుంది. ఎలాంటి శిక్షణ లేకుండా సొంతంగా చదివి ర్యాంకుతో సీటు పొందిన వారి స్పూర్తిని అంది పుచ్చుకోవాలి. సమయం వృథా.. జీవితాంతం వ్యథ పుస్తకాలతో పనేమీ లేదని ఫోన్లు, టీవీలతో ఎంజాయ్ చేద్దామనుకుంటే మాత్రం భవితను ముంచి వేసుకున్నట్లే. వేళాపాళా లేకుండా కాలక్షేపం చేస్తే శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు వస్తాయి. కొత్త విద్యాసంవత్సరంలో ఏ కోర్సులో చేరితే భవిష్యత్ బాగుంటుందో ఇంటర్నెట్లో పరిశీలించవచ్చు. ప్రణాళికతో ఉండాలి. విద్యాసంబంధ అంశాలు ఉచిత పుస్తకాలు, పాఠాలు అందుబాటులో ఉంటాయి. సద్వినియోగం చేసుకోవాలి.నైపుణ్యాలు పెంచుకునేందుకు పట్టుదల పెంచుకోవాలి. ప్రాధాన్యం ఇవ్వాలి. సమయం దొరికినప్పుడల్లా ఆయా సమావేశాలు, నైపుణ్య కేంద్రాలు, లైబ్రరీలను సందర్శించాలి. అకడమిక్ చదువులే కాకుండా నృత్యం, సంగీతం, చిత్రలేఖనం లాంటివాటిపై పట్టుసాధించాలి. ఎంఎస్ ఆఫీస్, జావా, పైథాన్, సీప్లస్ వంటి కంప్యూటర్ ఆధారిత కోర్సులు నేటితరానికి ఎంతో ఉపయోగం. వీటిలో రాణిస్తే ఉపాధికి కొదువ ఉండదు. ఎప్పుడు సమయం దొరికినా వాటిపై పట్టుసాధించాలి. భవిష్యత్తుపై భరోసా పెంచుకోవాలి. నిర్మాణరంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఎలక్ట్రికల్ పనుల వృత్తికి డిమాండ్ ఉంటోంది. ఇవి నేర్చుకుంటే కొత్తగా నిర్మిస్తున్న భవనాలకు వైరింగ్, స్విచ్ బోర్డులు, ఎలక్ట్రిక్ ఉపకరణాల బిగింపు పనులు తెలిసిన వారికి చేతినిండా పని, కడుపు నిండా తిండి అన్నట్టుగా సంపాదించుకోవచ్చు 1,968పరీక్ష రాసినవారుఉత్తీర్ణత సాధించిన వారు3,35311,96114,9432,5625,7963,7624,338జగిత్యాలరాజన్న సిరిసిల్లకరీంనగర్పెద్దపల్లి -
సమాజాన్ని చదవాలి
● ఎస్పీ మహేశ్ బీ గీతేసిరిసిల్ల: విద్యార్థులు చదువుతోపాటు సమాజాన్ని చదవాలని, ఏం జరుగుతుందో అవగాహన పెంచుకోవాలని ఎస్పీ మహేశ్ బీ గీతే కోరారు. జిల్లా పోలీస్ కార్యాలయాన్ని పలువురు విద్యార్థినులు శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్స్టేషన్ అంటే ఏమిటి, శాంతి భద్రతల పరిరక్షణలో ఎలా పనిచేస్తుంది.. అనే వివరాలు తెలుసుకోవాలన్నారు. ఎస్పీ చాంబర్, స్పెషల్ బ్రాంచ్, రిసెప్షన్, డీసీఆర్బీ, పరిపాలన విభాగం, ఆర్ముడ్ రిజర్వ్ విభాగం, ఐటీ కోర్, సైబర్ క్రైం, షీటీమ్, భరోసా, జాగిలాల విభాగం, పోలీస్ శాఖ వినియోగిస్తున్న ఆధునిక ఆయుధాలు, వాహనాల విభాగంతోపాటు ఇతర శాఖలను సందర్శించారు. ఎస్బీ డీఎస్పీ జి.వెంకటేశ్వర్లు, సీఐ రవి, ఆర్ఐ సురేశ్, ఆర్ఎస్సై దిలీప్, ఐకేపీ ఏపీఎం చంద్రయ్య పాల్గొన్నారు. -
ఫంక్షన్హాళ్లలో ప్లాస్టిక్ ప్లేట్లపై నిషేధం
● చైర్మన్ పుల్కం రాజు ● వేములవాడ మున్సిపల్ కౌన్సిల్ కీలక నిర్ణయాలువేములవాడ: పట్టణంలోని ఫంక్షన్హాళ్లలో ప్లాస్టిక్ప్లేట్ల వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు తెలిపారు. శనివారం నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో 52 ఎజెండా అంశాలపై చర్చించారు. చైర్మన్ రాజు మాట్లాడుతూ 203 మంది పారిశుధ్య కార్మికులకు రూ.5 లక్షల ప్రమాద బీమా, బహిరంగ ప్రదేశాల్లో చెత్తవేయకుండా 500 బోర్డుల ఏర్పాటు, రోడ్లపై కోనో కార్పస్ చెట్ల తొలగింపుపై చర్చించినట్లు వివరించారు. మున్సిపల్కు జేసీబీ కొనుగోలు రద్దు చేసి చెత్త సేకరణకు 4 కొత్త ట్రాలీ ఆటోల కొనుగోలు చేయాలని నిర్ణయించామన్నారు. విలీన గ్రామాల్లో గుంతల రోడ్లకు మోక్షం కల్పించి మట్టితో పూడ్చివేత పనులు ప్రారంభించాలని ఆదేశించారు. మున్సిపల్ వైస్చైర్మన్ నరాల శేఖర్, కమిషనర్ లోకేశ్ పాల్గొన్నారు. -
వడదెబ్బతో ముగ్గురు మృతి
కాల్వశ్రీరాంపూర్/పెద్దపల్లిరూరల్/కోనరావుపేట: పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో శనివారం వడదెబ్బకు గురై ముగ్గురు చనిపోయారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామానికి చెందన తూముల శ్రావణ్ కుమార్(37)ఉదయం పొలం వద్దకు వెళ్లి అస్వస్థతకు గురయ్యాడు. ఇంటికి వచ్చి, మంచంలో పడుకుని నిద్రలోనే చనిపోయాడు. పెద్దపల్లిలో లారీ క్లీనర్గా పనిచేసేందుకు వచ్చిన మహమ్మద్ ఇక్రం(48) ఎండదెబ్బతో మూడు రోజులుగా చికిత్సపొందుతూ శనివారం మరణించాడు. ఉత్తరప్రదేశ్లోని జగ్దల్పూర్కు చెందిన ఇక్రం నాలుగు నెలలుగా లారీ క్లీనర్గా పనిచేస్తున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట మండలం మామిడిపల్లికి చెందిన షేక్ హైదర్(57) ఉపాధి పనులకు వెళ్లి అస్వస్థతకు గురై, వడదెబ్బతో చనిపోయాడు.శ్రావణ్ కుమార్(ఫైల్)షేక్హైదర్ (ఫైల్) -
ఎస్సైల బదిలీ
● ఏడుగురికి స్థాన చలనం సిరిసిల్ల: జిల్లాలో ఏడుగురు ఎస్సైలను బదిలీ చేస్తూ ఎస్పీ మహేశ్ బీ గీతే శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కేంద్రంలో వీఆర్(డీఎస్బీ)లో ఉన్న ఎం.నాగరాజును సిరిసిల్ల టౌన్కు, ముస్తాబాద్ ఎస్సై సీహెచ్.గణేశ్ను సిరిసిల్ల టౌన్కు బదిలీ చేశారు. సిరిసిల్ల టౌన్లో పని చేస్తున్న సీ.హెచ్.శ్రీకాంత్ను గంభీరావుపేటకు, అక్కడ పనిచేస్తున్న పి.అనిల్కుమార్ను జిల్లా కేంద్రంలోని సీసీఎస్కు బదిలీ చేశారు. జిల్లా కేంద్రంలోని సీసీఎస్(డీసీఆర్బీ)లో పనిచేస్తున్న జి.జ్యోతిని ముస్తాబాద్కు, సీసీఎస్లో పనిచేస్తున్న పాక గణేశ్ను వేములవాడ టౌన్ ఎస్సైగా బదిలీ చేశారు. వీఆర్లో ఉన్న ఎ.మురళీధర్గౌడ్ను ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. సిరిసిల్లటౌన్: పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాల ఆధ్వర్యంలో శనివారం మెగా జాబ్మేళా నిర్వహించారు. ఎంఎన్సీ సంస్థ లాలాటాక్ష కంపెనీ ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. కళాశాలలో డిగ్రీ ఫస్టియర్ పూర్తిచేసి రెండో సంవత్సరం చదువుతున్న 23 మందిని యూఎస్ ఐటీ బెంచ్ సేల్స్ రిక్రూటర్ పోస్టులకు ఎంపిక చేశారు. ఉద్యోగాలు పొందిన విద్యార్థులకు కంపెనీ ఆఫర్ లెటర్లను సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి చేతుల మీదుగా అందజేశారు. ఎంపికై న వారికి వార్షిక వేతన ప్యాకేజీ రూ.1.50 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఉంటుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. వేములవాడ: కార్మికుల డిమాండ్లు ప్రభుత్వం నెరవేర్చాలని మున్సిపల్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి గుర్రం అశోక్ కోరారు. మున్సిపల్ ఆఫీస్ ఎదుట సీఐటీయూ 57వ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా శనివారం జెండా ఆవిష్కరించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు దాటుతున్నా కార్మికులను పట్టించుకోవడం లేదన్నారు. కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని కోరారు. యూనియన్ అధ్యక్షుడు సరిపెల్లి నరేశ్, నాయకులు కీసర్ శ్రీనివాస్, కావాలా సత్తయ్య, బొట్టు శీను, పిట్టల శంకర్, బొడ్డు శ్రీనివాస్, సుంకపాక పరశురాములు, వావిలాల మమత, మనీష, తోట శంకరవ్వ, ఎల్లవ్వ పాల్గొన్నారు. సిరిసిల్ల: జిల్లా ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు అల్లాడి శ్రీనివాస్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర సెక్రటరీగా శనివారం నియమితులయ్యారు. ఈమేరకు ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ నియామకపత్రాన్ని అందించారు. అమరవాది లక్ష్మీనారాయణ నాయకత్వంతో అంకితభావం, సేవా దృక్పథంతో సంస్థను అభివృద్ధి పథంలో కొనసాగిస్తామని శ్రీనివాస్ స్పష్టంచేశారు. శ్రీనివాస్ను జిల్లా ఆర్యవైశ్య మహాసభ సెక్రటరీ కొత్తపల్లి శ్రీనివాస్, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు కటుకం సత్తయ్య అభినందించారు. సిరిసిల్లటౌన్: పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలిన ఏఐఎఫ్టీయూ న్యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సోమిశెట్టి దశరథం కోరారు. ఈమేరకు పార్టీ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ ఎదుట శనివారం నిరసన చేపట్టి మాట్లాడారు. సంజీవయ్యనగర్లో ఒకరు జీ+2 రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకుని జీ+4 బిల్డింగ్ నిర్మించి కమర్షియల్గా వినియోగిస్తున్నారని ఆరోపించారు. నిబంధలకు విరుద్ధంగా వెలసిన భవంతులపై చర్యలు తీసుకోవాలని కోరారు. సలేంద్రి ఎల్లయ్య, గుజ్జ దేవదాస్, ప్రసాద్, లచ్చన్న, సత్తయ్య పాల్గొన్నారు. -
ప్రజాభద్రత పోలీస్ బాధ్యత
● ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రణ ● ఎస్పీ మహేశ్ బీ గీతేముస్తాబాద్(సిరిసిల్ల): ప్రజాభద్రతే పోలీస్ పరమావధి అని ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. ముస్తాబాద్లో 101 సీసీ కెమెరాలను శనివారం ప్రారంభించి మాట్లాడారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమన్నారు. నేరాలు, దొంగతనాలను అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. నేరస్తులకు శిక్షలు పడేలా డిజిటల్ వ్యవస్థ ఉపయోగపడుతుందన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే నేరాల నియంత్రణ సాధ్యమన్నారు. అన్ని గ్రామాల్లో స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ కోరారు. గూడెంలో గ్రామస్తులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను డీఎస్పీ నాగేంద్రచారి ప్రారంభించారు. సీఐ నాగేశ్వర్రావు, ఎస్సై గణేశ్, ఏఎంసీ చైర్పర్సన్ తలారి రాణి, ఆత్మ డివిజన్ కమిటీ చైర్మన్ కొండం రాజిరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు యెల్ల బాల్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సురేందర్రావు, సర్పంచులు మట్ట వెంకటేశ్వర్రెడ్డి, శంకర్, చిగురు నరేశ్, శ్రీనివాస్, ఆంజనేయులు, ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడు విజయ్రెడ్డి, నాయకులు సందుపట్ల అంజిరెడ్డి, వైద్యులు రాజారాం, శంకర్, చంద్రశేఖర్రావు పాల్గొన్నారు. -
శ్రమకు తగ్గ వేతనం అందించాలి
● వీవోఏలకు విమలక్క సంఘీభావం వేములవాడఅర్బన్: ఐకేపీ వీవోఏలకు శ్రమకు తగ్గ వేతనం అందించాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య చైర్పర్సన్ విమలక్క కోరారు. వేములవాడ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఐకేపీ వీవోఏలు చేపట్టిన నిరవధిక సమ్మెకు శనివారం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వీవోఏలకు గౌరవ వేతనం కాదు జీతాలు కావాలని కోరుతున్నారన్నారు. గతంలో మంత్రి సీతక్కను కూడా కలిసి తమ గోడు విన్నవించారని గుర్తు చేశారు. ఇప్పటికై నా మంత్రి సీతక్క స్పందించి వీరికి న్యాయం చేయాలని కోరారు. దుండ్రపల్లిలో డీఎస్పీ విచారణబోయినపల్లి(చొప్పదండి): మండలంలోని దుండ్రపల్లికి చెందిన సందీప్రెడ్డిపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసీటి కేసు విషయంలో శని వారం రాత్రి వేములవాడ డీఎస్పీ శ్రీనివాస్ విచారణ చేపట్టారు. సందీప్రెడ్డి తనను కులం పేరుతో దూశించాడని అదే గ్రామానికి చెందిన జంగం అంజయ్య ఫిర్యాదుతో పోలీ సులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. కేసు విషయంలో డీఎస్పీ శ్రీనివాస్ విచారణ నిర్వహించారు. వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్సై ఎన్.రమాకాంత్ ఉన్నారు. -
అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి
మార్కుల కాగితాలు ఇంటర్వ్యూ గేటు వరకే నడిపిస్తాయి, మీలోని ప్రాక్టికల్ నైపుణ్యాలు మాత్రమే ఉద్యోగాన్ని సాధించి పెడతాయి. నేటి ఆధునిక పరిశ్రమలకు పుస్తకాల పురుగులు కాదు, సమస్యలను ధైర్యంగా పరిష్కరించే సృజనాత్మక ఆలోచనలు ఉన్నవారే అత్యవసరం. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ను, ని రంతర అభ్యాసన తత్వాన్ని ఆయుధాలుగా మార్చుకుని ఏ రంగంలోనైనా అగ్రస్థానానికి దూసుకుపోవచ్చు. ర్యాంకులు రాలేదని నిరాశ పడకుండా, మీలోని విశిష్ట ప్రతిభకు పదును పెడితే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. – వై.తిరుపతిరావు, ఉపాధి కల్పనాధికారి, కరీంనగర్ -
కాలువలు కబ్జా
● కూడుకుపోతున్న ఒర్రెలు ● పెరిగిన భూముల ధరలు ● ఆక్రమణలో నిమ్మొర్రె ● పట్టించుకోని అధికారులువేములవాడఅర్బన్: ఆధ్యాత్మిక పట్టణం.. దక్షిణకాశీగా పేరొందిన వేములవాడలో ఖాళీ జాగ కనిపిస్తే చాలు కబ్జా చేసేస్తున్నారు. ఇటీవల భూముల ధరలకు రెక్కలు రావడంతో కాలువలు, ఒర్రెలను సైతం ఆక్రమణదారులు వదలడం లేదు. కాదేదు కబ్జాకు అనర్హం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో వర్షాలు కురిసినప్పుడు వరద నీరు ఒర్రెలు, కాలువల్లోకి చేరకుండా కాలనీల్లో పారుతోంది. కబ్జాలో నిమ్మొర్రెలు మారుపాక చెరువు అలుగు నుంచి నాంపల్లి చెరువు అక్కడి నుంచి మూలవాగులోకి నిమ్మొర్రె ఉంది. వర్షాలు కురిసినప్పుడు ఒక చెరువు నుంచి మరో చెరువుకు నీరు నిమ్మొర్రె ద్వారా వెళ్తోంది. పంట భూముల నుంచి వరదనీరు ఒర్రెలోకి చేరగానే అవి చెరువులోకి, చెరువు నుంచి మూలవాగులోకి చేరుతుంటాయి. కానీ ఆ పెద్ద ఒర్రెలు చిన్నగా మారి కనుమరుగవుతున్నాయి. కూడుకుపోతున్నాయి నిమ్మొర్రెలు కూడుకుపోతున్నాయి. వ్యవసాయ భూముల నుంచి రియల్ భూములుగా మారిన చోట ఒర్రెలను కూడుపుకుంటూ ప్లాట్ చేసినట్లు కొందరు ఆరోపిస్తున్నారు. దీంతో వర్షాలు కురిసినప్పుడు ఒర్రెల్లోకి నీరు వెళ్లకుండా పంట భూముల్లో ఉండి రైతులకు ఇబ్బందిగా మారింది. తిప్పాపూర్–నాంపల్లి శివారులో నిమ్మొర్రె కూడుకుపోవడంతో వర్షం నీరు ఇళ్లలోకి వస్తోంది. ప్రతీ సంవత్సరం తిప్పాపూర్లోని బుడగజంగాలకాలనీ, సౌరలకాలనీల్లోని ఇళ్లలోకి వరదనీరు వస్తోంది. ఈ నిమ్మొర్రె పూర్తిస్థాయిలో హద్దులు ఏర్పాటు చేసి ముళ్లపొదలను తొలగిస్తే వరదనీరు ఇళ్లలోకి రాకుండా ఉంటుందని స్థానికులు కోరుతున్నారు. హద్దులు ఏర్పాటు చేయాలి మారుపాక చెరువు అలుగు నుంచి నాంపల్లి చెరువు అక్కడి నుంచి మూలవాగు వరకు నిమ్మొర్రె దాదాపు ఐదు కిలోమీటర్ల పైన ఉంది. ఈ ఒర్రె ఒడ్డును పట్టుకుని అటు, ఇటు రెండు వైపులా తొమ్మిది మీటర్లు వదిలిపెట్టాలి. ఆ తర్వాత భూములను సాగు, లేదా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. కాని ఇక్కడ మాత్రం ఒర్రెలను కూడుపుకుంటూ భూములు చదును చేసి అమ్ముతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు నిమ్మొర్రె కాలువకు హద్దులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
మెరుగైన వైద్యసేవలు అందించాలి
● కలెక్టర్ గరీమా అగ్రవాల్ ● ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆకస్మిక తనిఖీసిరిసిల్ల: ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ వైద్యులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని శనివారం తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని ఐఎంయూ, ఐసీయూ, ఎస్ఎన్సీయూ, మెటర్నిటీ వార్డుల్లో పరిశీలించి.. రోగులతో మాట్లాడారు. వైద్య సేవలపై ఆరా తీశారు. రోజు ఎంత మంది పేషెంట్లు వస్తున్నారో తెలుసుకున్నారు. వైద్యసేవలు ఎలా ఉన్నాయి? ఆస్పత్రిలో వైద్య సేవలు ఎలా అందుతున్నాయని కలెక్టర్ ఆరా తీశారు. చికిత్స పొందుతున్న చిన్నారితో ఉన్న మహిళతో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రవీణ్కుమార్, ఆర్ఎంవో సుమన్మోహన్రావు, వైద్యులు సంతోష్, తహసీల్దార్ మహేశ్కుమార్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్పాషా ఉన్నారు. 1న ఇందిరమ్మ ఇళ్ల సామూహిక గృహప్రవేశాలు జిల్లా వ్యాప్తంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల సా మూహిక గృహ ప్రవేశాలు జూన్ 1న నిర్వహించాల ని కలెక్టర్ ఆదేశించారు. మండలాల ప్రత్యేకాధి కారులు, ఎంపీడీవోలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. గృహప్రవేశాలకు ఏర్పాట్లు చేయాలన్నారు. పర్యావరణంపైనా... పర్యావరణంపైనా జూన్ 1 నుంచి 12 వరకు ప్రణాళిక ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. అటవీ, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ, ఉద్యానవనశాఖల అధికారులు సమన్వయంతో కార్యక్రమాలు చేపట్టి విజయవంతం చేయాలన్నారు. జిల్లా అటవీశాఖ అధికారి సత్యనారాయణ, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, డీఏవో అఫ్జల్బేగం, ఉద్యానవన అధికారి శరత్ పాల్గొన్నారు. -
వేగంగా ధాన్యం సేకరించాలి
● అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్కోనరావుపేట(వేములవాడ): ధాన్యం సేకరణ, లోడింగ్తోపాటు రైస్మిల్లుల వద్ద అన్లోడింగ్ వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ ఆదేశించారు. మండలంలోని కొలనూర్, మర్తనపేట, నాగారం, ధర్మారం, కనగర్తి, నిజామాబాద్, వెంకట్రావుపేటల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను, కనగర్తిలోని కనకదుర్గ, మారుతి రైస్మిల్లులు, కొలనూర్లోని సరస్వతి, వినాయక రైస్మిల్లులను తనిఖీ చేశారు. ధాన్యానికి సంబంధించి ఆన్లైన్ ట్యాబ్ ఎంట్రీలో జాప్యం చేయొద్దన్నారు. తహసీల్దార్ వరలక్ష్మి, సర్పంచ్ జలగం అరవింద్రావు తదితరులు ఉన్నారు. -
నైపుణ్యం ఉంటే తిరుగుండదు
ఈ రోజుల్లో విద్యకు తోడుగా నైపుణ్యం ఉంటే యువత భవితకు తిరుగులేదు. సొంత ఆలోచన, వినూత్న ప్రయత్నాలు, మార్కెట్ అధ్యయనం చాలా ముఖ్యం. ఆధునిక సాంకేతికతను వాడుకొని ముందుకు వెళ్లే వాళ్లకు ఓటమి ఉండదు . ముఖ్యంగా ఆన్లైన్ అవకాశాల ద్వారా స్వతంత్రంగా ఎదిగే అవకాశాలున్నాయి. పుస్తకాలకే పరిమితం కాకుండా నాయకత్వ లక్షణాలు, సమగ్ర వికాసాన్ని పెంపొందించుకుని మీ రంగంలో సగర్వంగా నిలబడండి. – బూర్ల వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ప్రొఫెసర్, ఎస్సారార్ కళాశాల, కరీంనగర్ -
వైఎస్సార్ స్ఫూర్తితో ఉచిత కరెంట్
● కాంగ్రెస్తోనే సంక్షేమం సాధ్యం ● మహిళలు ఆర్థికంగా ఎదగాలి ● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్సిరిసిల్ల: రాష్ట్రంలో దివంగత నేత వైఎస్సార్ స్ఫూర్తితో ఉచిత కరెంట్ అమలవుతుందని, కాంగ్రెస్ పార్టీతోనే సంక్షేమం సాధ్యమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక ఎస్ఆర్కే ఫంక్షన్హాల్లో శుక్రవారం మహిళా సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా స్వయం సహాయ సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు అందించారు. విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతీ మహిళను కోటీశ్వరులుగా చేసేందుకు ప్రజా ప్రభుత్వం వివిధ పథకాలు, రుణాలను మంజూరు చేస్తుందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 60 శాతం మహిళల సంఘాలకే ఇచ్చామని తెలిపారు. కోటి మంది మహిళలకు ఇందిరా మహిళాశక్తి చీరలు పంపిణీ చేశామని, సిరిసిల్లలో 37వేల మందికి ఇస్తున్నామని వెల్లడించారు. రెండో దశలో కోటి చీరలకు ఆర్డర్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. మహిళా సంఘాలకు మంజూరు చేసిన బస్సులతో ప్రతి నెలా రూ.68వేల ఆదాయం వస్తుందన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఎరువుల షాపు లు ఇవ్వాలని, మహిళా సంఘాలకు ప్రతీ మండలానికి ఒకటి రైస్మిల్లు ఇవ్వాలని సూచించారు. పథకాలు సద్వినియోగం చేసుకోవాలి కలెక్టర్ గరీమా అగ్రవాల్ మాట్లాడుతూ.. బాల్య వి వాహాల నిర్మూలన, మహిళలపై లైంగిక వేధింపుల నివారణ నిషేధం–పరిష్కారాల చట్టం 2013 వివిధ అంశాలపై అవగాహన కల్పించామన్నారు. జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులు రుణాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇంకా ప్రభుత్వ సబ్సిడీ పథకాలు ఉన్నాయని, వాటి వివరాలు సంబంధిత శాఖల వద్ద పొందాలన్నారు. రూ.కోట్ల రుణాలు పంపిణీ జిల్లాలోని 337 సంఘాలకు బ్యాంక్ లింకేజీ కింద రూ.40 కోట్లు, ఎఫ్పీసీ, ఎఫ్పీజీ సీఐఎఫ్ కింద 42 సంఘాలకు రూ.1.05కోట్లు, శ్రీనిధి రూరల్లో 278 సంఘాలకు రూ.7.13కోట్లు, బ్యాంక్ లింకేజీ మెప్మా రుణాలు 55 సంఘాలకు రూ.6.33 కోట్లు, శ్రీనిధి మెప్మాలో 61 సంఘాలకు రూ.1.50 కోట్ల విలువైన చెక్కులను, ధాన్యం కొనుగోలు కమీషన్ రూ.11.36 లక్షలను మహిళా సంఘాల బాధ్యులకు పంపిణీ చేశారు. వేములవాడ మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వీర్నపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ రాములునాయక్, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్, లీడ్ బ్యాంక్ మేనేజర్ మల్లికార్జునరావు, తహసీల్దార్ మహేశ్, ఏపీఎం పద్మయ్య, కౌన్సిలర్ ఆడెపు చంద్రకళ పాల్గొన్నారు. -
ప్రకృతి ప్రకోపానికి రూ.10లక్షలు నష్టం
● రెండు ట్రాన్స్ఫార్మర్లు.. 60 పోల్స్ పునరుద్ధరణ ● 20 గంటలపాటు శ్రమించిన విద్యుత్ సిబ్బంది ● ఎన్పీడీసీఎల్ ఎస్ఈ టి.వేణుగోపాల్సిరిసిల్లటౌన్/తంగళ్లపల్లి(సిరిసిల్ల): ప్రకృతి ప్రకోపానికి విద్యుత్శాఖకు రూ.10లక్షలు నష్టం వాటిల్లిందని ఎన్పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజినీర్ టి.వేణుగోపాల్ తెలిపారు. గురువారం రాత్రి అకస్మాత్తుగా గాలి, వాన బీభత్సంతో సిరిసిల్లలోనే అత్యధికంగా విద్యుత్లైన్లు దెబ్బతిన్నాయన్నారు. రెండు ట్రాన్స్ఫార్మర్లతోపాటు సుమారు 40కి పైగా పోల్స్ను పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు. తంగళ్లపల్లి, వేములవాడ సబ్డివిజన్లతో కలిసి మొత్తంగా 60 చోట్ల విద్యుత్లైన్లు దెబ్బతినగా 60 పోల్స్ను పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి దాదాపు 20 గంటలపాటు ఎన్పీడీసీఎల్ సిబ్బంది శ్రమించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారని తెలిపారు. ఆయా పనులను డీఈ అంజయ్యతో కలిసి పర్యవేక్షించారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ తంగళ్లపల్లి మండలంలో గురువారం రాత్రి వీచిన గాలి దుమారంతో తాడూర్, గోపాలరావుపల్లి గ్రామాల్లో విద్యుత్ వ్యవస్థ ధ్వంసమైంది. 11 కేవీ లైన్తోపాటు ఎల్టీ లైన్కు సంబంధించిన దాదాపు 12 స్తంభాలు, ఒక ట్రాన్స్ఫార్మర్ నేలకొరిగాయి. వెంటనే విద్యుత్ సిబ్బంది క్షేత్రస్థాయిలోకి వచ్చారు. ఎన్పీడీసీఎల్ ఎస్ఈ వేణుగోపాల్, డీఈ అంజయ్య, ఏడీఈ గోపీనాథ్ పర్యవేక్షణలో పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఏఈ మధుకర్ ఆధ్వర్యంలో సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. తెల్లవారుజామున 3 గంటల వరకు దెబ్బతిన్న స్తంభాలను తొలగించి, కొత్తలైన్లు వేసి, ట్రాన్స్ఫార్మర్ను పునరుద్ధరించారు. -
వేస్ట్ డీకంపోజర్ చల్లి దున్నితే మేలు
వేస్ట్ డీకంపోజర్ మార్కెట్లో చౌకగా లభిస్తుంది. దాన్ని పొలంలో చల్లి దున్నితే సులభంగా గడ్డి కుళ్లిపోయి భూసారం పెంపొందుతుంది. ఆ దిశగా రైతులు ముందుకెళ్లాలి. కానీ క్షేత్రస్థాయిలో మేమూ, మా వ్యవసాయాధికారులు రైతులకు చెబుతున్నాం. రైతులు వినకుండా పొలంలోని కొయ్యకాలును కాలబెడుతూనే ఉన్నారు. ఇది తప్పుడు పద్ధతి అని చెప్పినా వినడం లేదు. పొలంలో కొయ్యకాలును కలియదున్నితే పంట అవశేషాలు కుళ్లిపోయి కావాల్సిన పోషకాలు అందుతాయి. రసాయనిక ఎరువుల వినియోగం తగ్గుతుంది. పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవచ్చు. బహుముఖ ప్రయోజనాలను గుర్తించి కొయ్యకాలు, పంట అవశేషాలను కాల్చ కుండా కలియ దున్నితే మేలు జరుగుతుందని గుర్తించాలి. ఇకపై ఎవరైనా కొయ్యకాలు కాల్చితే చట్టపరంగా కేసులు నమోదు చేస్తాం. – అఫ్జల్ బేగం, జిల్లా వ్యవసాయాధికారి -
లోడింగ్, అన్లోడింగ్ వేగవంతం చేయాలి
● అదనపు కలెక్టర్ నగేశ్ ఇల్లంతకుంట(మానకొండూర్): ధాన్యం లోడింగ్, అన్లోడింగ్ వేగవంతంగా జరగాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ సూచించారు. మండలంలోని దాచారం, పెద్దలింగాపూర్, చిక్కుడువానిపల్లి కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. వర్షానికి ధాన్యం తడిసిందా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. టార్పాలిన్ కప్పడంతో ధాన్యం తడవలేదని రైతులు చెప్పారు. లోడింగ్ చేసిన వాహనాల వెంట హమాలీలు వెళ్లి అన్లోడింగ్ చేస్తే త్వరగా కొనుగోళ్ల ప్రక్రియ పూర్తవుతుందన్నారు. తహసీల్దార్ సురేశ్, సీసీ రామచంద్రం, ఉపసర్పంచ్ చిక్కుడు సత్యం, వీవోఏ కరుణ, ఎండీ ఆఫీఝా పాల్గొన్నారు. చందుర్తి/గంభీరావుపేట/ఇల్లంతకుంట: తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ వీవోఏలు చేపట్టిన సమ్మె 11 రోజులకు చేరింది. చందుర్తిలో శుక్రవారం ఒంటికాలిపై నిరసన తెలి పారు. గంభీరావుపేటలో వీవోఏల సమ్మెకు తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) నాయకులు సుధాకర్శర్మ, సుమలతశర్మ, కూర సురేష్, సతీష్ మద్దతు ప్రకటించారు. ఇల్లంతకుంటలో మోకాళ్లపై నిల్చొని నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ కనీస వేతన చట్టం కింద రూ.20వేలు చెల్లించాలని కోరారు. వీవోఏలు స్వరూప, నక్క కవిత, సువర్ణ, శేషాద్రి, రజిత, అంజలి, వీణ, మమత, విజయలక్ష్మి, వినోద, కల్పన, స్వప్న, లావణ్య, గంగ, గొడుగు బాలలక్ష్మి, మహంకాళి ఉమారాణి, బంగారు అంజలి, కాసుపాక రాణి పాల్గొన్నారు. వేములవాడరూరల్: బోగస్ ఓట్లను తొలగించేలా ప్రతి ఒక్కరు పని చేయాలని బీజేపీ జిల్లా కార్యదర్శి గోపాడి సురేందర్రావు కోరారు. వేములవాడ రూరల్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ‘సర్’పై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. సురేందర్రావు మాట్లాడుతూ బోగస్ ఓట్లను గుర్తించి, తొలగించేలా బూత్ అధ్యక్షులు, బీఎల్ఏ–2లు, పార్టీ కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. అనంతరం ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ తహసీల్దార్ ఆఫీస్ ముట్టడించారు. తహసీల్దార్కు వినతిపత్రం ఇచ్చారు. పార్టీ మండల అధ్యక్షుడు బూరుగుపల్లి పరమేశ్, సర్పంచ్ జంకె మధు, సాండేసారి మల్లికార్జున్, మండల ప్రధాన కార్యదర్శి వనపర్తి పరశురాములు, మండల ఉపాధ్యక్షులు లింగంపల్లి కుంటయ్య, నల్ల వెంకటరెడ్డి, లింగంపల్లి కిషోర్, జంగం వంశీ తదితరులు పాల్గొన్నారు. రుద్రంగి(వేములవాడ): మండల కేంద్రంలో శుక్రవారం డాగ్స్క్వాడ్తో తనిఖీలు చేపట్టారు. ఎస్సై మోతీరాంనాయక్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని కోరారు. పోలీస్ సిబ్బంది పద్మారావు పాల్గొన్నారు. సిరిసిల్ల అర్బన్: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూన్ 1న 12వ మెన్ అండ్ ఉమెన్ సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొజ్జ చంద్రశేఖర్ తెలిపారు. అండర్ 16, 18, 20 వయసు బాల,బాలికలు, మెన్ అండ్ ఉమెన్ క్రీడాకారుల ఎంపిక పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. జూన్ 1న పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానంలో ఎంపిక పోటీలు నిర్వహించి, విజేతలకు మెడల్స్, సర్టిఫికెట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. రాష్ట్రస్థాయికి ఎంపికై న వారు జూన్ 11, 12 తేదీల్లో హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. -
పొగాకు వాడకాన్ని నివారిద్దాం
● కలెక్టర్ గరీమా అగ్రవాల్సిరిసిల్ల: జిల్లాలో పొగాకు వాడకాన్ని నివారిద్దామని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. ఈనెల 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో శుక్రవారం ఎస్పీ మహేశ్ బీ గీతేతో కలిసి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో పొగాకు వాడకంతో కలిగే నష్టాలను వివరిస్తూ బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత, జిల్లా విద్యాధికారి జగన్మోహన్రెడ్డి, లేబర్ ఆఫీసర్ నజీర్ అహ్మద్, ఫుడ్ సేఫ్టీ అధికారి అనూష, మానేరు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు చింతోజు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అవతరణ వేడుకలకు ఏర్పాట్లు జిల్లాలో జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకలకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎస్పీ మహేశ్ బీ గీతేతో కలిసి సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ పరేడ్గ్రౌండ్లో జరిగే వేడుకలకు ప్రతీ శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది హాజరుకావాలని సూచించారు. ప్రొటోకాల్ ప్రకారం సీటింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, కలెక్టరేట్ ఏవో రామ్రెడ్డి పాల్గొన్నారు. తుది దశకు ధాన్యం కొనుగోళ్లు జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు తుది దశకు చేరాయని, ఇప్పటికే 2,33,758 టన్నులు కొనుగోలు చేశామని కలెక్టర్ తెలిపారు. ధాన్యం సేకరణ, లోడింగ్, అన్లోడింగ్, వాహనాల సమీకరణపై అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, పౌరసరఫరాల, సహకార, గ్రామీణాభివృద్ధి, మెప్మా అధికారులతో కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామనే భరోసా రైతులకు కల్పించాలని సూచించారు. బడిబాటలో విద్యార్థుల నమోదు పెంచాలి బడిబాటలో విద్యార్థుల నమోదు పెంచాలని కలెక్టర్ సూచించారు. బడిబాటపై కలెక్టరేట్లో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ బడిబాటను జూన్ 14 నుంచి 19 వరకు నిర్వహించాలని, 3 నుంచి ఉపాధ్యాయులు ఇంటింటి సర్వే చేసి బడీడు పిల్లలను స్కూళ్లలో చేర్పించాలని సూచించారు. జిల్లా సంక్షేమాధికారి అంగన్వాడీ టీచర్ల సాయంతో ప్రతీ విద్యార్థిని ప్రైమరీ స్కూల్కు పంపించేలా చూడాలన్నారు. జిల్లా విద్యాధికారి డాక్టర్ జగన్మోహన్రెడ్డి, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం పాల్గొన్నారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ చేయాలి ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి ఆదేశించారు. ఎస్ఐఆర్–2026పై హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ గరీమా అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ హాజరయ్యారు. -
రిజిస్ట్రేషన్ల స్లాట్లు పెంపు
● రోజుకు 80 స్లాట్లు ● సిరిసిల్ల సబ్ రిజిస్ట్రార్ ఆర్వీవీ స్వామి సిరిసిల్లటౌన్: భూముల మార్కెట్ విలువల పెంపు నేపథ్యంలో పెరిగిన రిజిస్ట్రేషన్ల కారణంగా రోజువారి స్లాట్ల సంఖ్యను పెంచినట్లు సిరిసిల్ల సబ్ రిజిస్ట్రార్ ఆర్వీవీ స్వామి తెలిపారు. ఈమేరకు శనివారం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రిజిస్ట్రేషన్లకు రోజువారీ స్లాట్లు 40 నుంచి 80కి పెంచినట్లు పేర్కొన్నారు. కార్యాలయం సేవలను కూడా ఉదయం 9 నుంచి రాత్రి 7.30 గంటల వరకు పెంచినట్లు తెలిపారు. భూముల మార్కెట్ వాల్యూ పెరిగితే ఆ భారం తమపై పడుతుందన్న ఆందోళనతో విక్రేతలు, కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్లకు అఽధిక సంఖ్యలో వస్తున్నారన్నారు. శుక్రవారం 79 స్లాట్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు పూర్తి చేశామని వివరించారు. రద్దీకి అనుగుణంగా డాక్యుమెంట్లు పెండింగ్ పడకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. క్రయ, విక్రేతల ఆందోళన చెందకుండా ఉండాలని, సందేహాల నివృత్తి, అవసరమైన సేవలు తమ కార్యాలయం సిబ్బంది అందజేస్తారని వివరించారు. -
నిప్పు.. ముప్పు
సిరిసిల్ల: వరికోతలు పూర్తయ్యాయి. వడ్ల కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. మరో వైపు వానాకాలం(ఖరీఫ్) సీజన్కు రైతులు పొలాలు దున్నుతూ తుకం(నారుమడి) పోస్తున్నారు. వరికోతలు పూర్తికావడంతో పొలాల్లోని వరి కొయ్యకాలును కాలబెడుతున్నారు. ఇలా కొయ్యకాలు, పంట అవశేషాలకు నిప్పు పెడితే సారవంతమైన భూముల్లో పోషకాలు నశించి, భూసారం క్షీణిస్తుందని వ్యవసాయాధికా రులు చెబుతున్నా రైతులు పట్టించుకోవడం లేదు. ఎన్నో అనర్థాలు పంట చేతికి వచ్చాక కొయ్యకాలును, పంట అవశేషాలను కాల్చితే అనేక అనర్థాలు తలెత్తుతాయని వ్యవసాయాధికారులు చెబుతున్నా రు. కొయ్యకాలు మంటలతో వచ్చే పొగతో ప ర్యావరణానికి ముప్పు ఏర్పడుతుందంటున్నా రైతులు పట్టించుకోవడం లేదు. కొందరు రైతులు పొలాలను తడిపి జీలుగు విత్తనాలు విత్తుకుంటూ భూసారాన్ని పెంచుకునే పనిలో ఉన్నారు. మరికొందరు పెండను తరలించి, చెరువు మట్టిని పోస్తూ పంటకు లఘును అందిస్తున్నారు. కానీ చాలా మంది రైతులు భూమికి మేలు చేయకుండా మరింత కీడు చేసేలా వరికొయ్యలు కాల్చేస్తున్నారు. మంటల్లో చిక్కి రైతు బలి కొయ్యకాలు మంటల్లో చిక్కి ఓ రైతు బలైన ఘటన జిల్లాలో గురువారం విషాదం నింపింది. ఇల్లంతకుంట మండలం తాళ్లపల్లికి చెందిన రైతు ఎలుక నర్సయ్య(65) వరిపొలం కొయ్యకాలు కాల్చుతూ గడ్డి మంటల్లో చిక్కుకుని చని పోయారు. మంటలు ఆర్పేందుకు వెళ్లి నర్స య్య బలికావడం ఆ ఊరిలో విషాదం నింపింది. మంటలు అదుపులోకి రాకపోగా.. కోళ్ల ఫా రాలు, గుడిసెలు, పైపులు, వ్యవసాయ పంపు సెట్లు దగ్ధమైన ఘటనలు ఉన్నాయి. కొయ్యకాలు కాల్చొద్దని తెలిసినా మారడం లేదు. నేలలో సూక్ష్మజీవులు నశిస్తాయి భూమిలో అనేక సూక్ష్మజీవులు పంటకు మేలు చేస్తాయి. వానపాములు(ఎర్రలు) లాంటి జీవులు అగ్నికి ఆహుతి అయిపోతాయి. భూసారాన్ని పెంచే వానపాములు క్షీణిస్తే సహజంగా పంటలకు సేంద్రీయ ఎరువును అందించే జీవులు లేకుండా పోతాయి. ఫలితంగా పంటకు సహజ సిద్ధమైన సేంద్రీయ ఎరువు కరువు అవుతుంది. భూసారం యథాస్థితికి చేరాలంటే.. మళ్లీ చాలా సమయం పడుతుంది. కలియదున్నితే మేలు నిజానికి కొయ్యకాలును తడిపి పొలంలోనే కలియదున్నితే కుళ్లిపోయి సేంద్రియ ఎరువు తయారవుతుంది. కాల్చడం ద్వారా భవిష్యత్లో పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. భూసారంలో లోపాలు తలెత్తి భూములు నిస్సారంగా మారుతాయి. ఎరువులు వాడుతూ.. పంటల దిగుబడి సాధిస్తున్నా.. ఇది భవిష్యత్ తరాలకు మంచి కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రైతులు పంటను కాల్చ కుండా కలియదున్నాలని, సేంద్రియ ఎరువులతో భూమికి, పంటకు ఎంతో మేలు కలుగుతుందని అవగాహన కల్పిస్తున్నారు. -
ఆదర్శిని పేరు కాదు.. ప్రతీక
సిరిసిల్ల టౌన్: గత ఏప్రిల్ 23న రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్ టాయిలెట్స్లో ఓ కఠిన దృశ్యం ఆవిష్కృతమైంది. పుట్టి రెండు గంటలు కూడా గడవకముందే, ఏ తప్పు ఎరుగని ఒక పసిగుడ్డును కన్నతల్లే వదిలించుకుని వెళ్లిపోయింది. పేగుబంధాన్ని తెంచుకుని విసిరేసిన ఆ పసిప్రాణాన్ని స్థానికులు గుర్తించి, పోలీస్, జిల్లా సంక్షేమ శాఖాధికారులకు సమాచారం అందించారు. ఆ క్షణం నుంచే ఆ బిడ్డకు మానవత్వం రక్షగా నిలిచింది. వెంటనే చిన్నారిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రుల వేట కోసం పోలీసు కేసు నమోదైనా ఎలాంటి ఆధారాలు లభించలేదు. కానీ, ఆస్పత్రి సిబ్బంది, సఖీ టీం సభ్యులు ఆ చిన్నారిని కంటికి రెప్పలా కాపాడుకున్నారు. వారి సంరక్షణలో... నాడు కేవలం 1500 గ్రాముల అత్యల్ప బరువుతో చావుబతుకుల మధ్య ఉన్న ఆ పాప, నేడు 2700 గ్రాముల బరువుతో సంపూర్ణ ఆరోగ్య వంతురాలైంది. డీడబ్ల్యూవో లక్ష్మీరాజం ఆదేశాలతో శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వేళ.. సీడబ్ల్యూసీ, మిషన్ వాత్సల్య, హాస్పిటల్ సిబ్బంది అంతా కలిసి ఆ చిన్నారిని తమ బిడ్డగా భావించి ఘనంగా బారసాల చేశారు. ఊయల ఊపి, ఆ పసిదానికి ‘ఆదర్శిని’అని నామకరణం చేసి, శిశుగృహకు తరలించారు. ఆదర్శిని ఇది పేరు మాత్రమే కాదు..మనలో మిగిలున్న మానవత్వానికి ప్రతీక కూడా.. -
అన్ని వర్గాలకు పెద్దపీట
ఎల్లారెడ్డిపేట/సిరిసిల్లఅర్బన్(సిరిసిల్ల): అన్ని సా మాజిక వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వే స్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్లోని ఏఎంసీ చైర్మన్ సాబేరా బేగం నివాసంలో గురువారం రాత్రి నిర్వహించిన బక్రీద్ వేడుకలకు హాజరయ్యారు. కేక్ కట్ చేసి ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, ఏఎంసీ వైస్చైర్మన్ రామ్రెడ్డి, ఉపసర్పంచ్ మధుసూదన్రెడ్డి ఉన్నారు. గిన్నిస్ రికార్డ్కు ఆది మద్దతు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సిరిసిల్లలో నిర్వహించే కోటి సూర్యనమస్కారాలు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మద్దతు ప్రకటించినట్లు తపోవన యోగా సొసైటీ చీఫ్ కోఆర్డినేటర్, యోగా శిక్షకులు ఎలిగేటి కృష్ణ తెలిపారు. వేములవాడలోని తన నివాసంలో కలిసి మద్దతు కోరారు. యోగా సొసైటీ అధ్యక్షుడు మండల సత్యం, పతంజలి చందుర్తి మండల అధ్యక్షుడు గొట్టె ప్రభాకర్ పాల్గొన్నారు. -
తవ్వి వదిలేశారు
కొత్తచెరువు నుంచి వచ్చే వరదను తరలించేందుకు ఐదేళ్ల క్రితం శ్రీనగర్ ఏరియా నుంచి తాత్కాలికంగా కచ్చా నాలా తవ్వి వదిలేశారు. ఏటా వరదలు మా ప్రాంతాన్ని ముంచేస్తున్నాయి. శ్రీనగర్ వైపు వరదలు రాకుండా చంద్రంపేట ఎక్స్రోడ్ నుంచి మళ్లించాలి. కబ్జాకు గురైన కొత్తచెరువు మత్తడి కాల్వలను పునర్ నిర్మించాలి. – కందాల నవీన్కుమార్, శ్రీనగర్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు ప్రమాదాలు జరగకుండా చూడాలి శ్రీనగర్ కచ్చా నాలా వద్ద ప్రమాదాలు జరగకుండా డ్రెయినేజీని నిర్మించాలి. కచ్చా కాల్వ తవ్వి వదిలేశారు. అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు. అనుకోని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు. గతంలో రూ.15 కోట్లు మంజూరైనా పనులు ఇంకా ప్రారంభం కాలేదు. – అన్నారం శ్రీనివాస్, స్థానిక రైతు కచ్చా నాలాను పొడగిస్తున్నాం శ్రీనగర్ ప్రాంతంలోని కచ్చా నాలాను తుమ్మలకుంట వరకు పొడగిస్తాం. రానున్న వానాకాలంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తాం. పక్కా డ్రెయినేజీకి సాంకేతిక అనుమతులు రాగానే పనులు మొదలుపెడతాం. కచ్చానాలాలో సిల్ట్, పిచ్చిమొక్కలు తొలగిస్తున్నాం. – ఎంఏ ఖదీర్పాషా, మున్సిపల్ కమిషనర్ -
రైతులు ఆందోళన చెందొద్దు
● ధాన్యం తడిసినా కొనుగోలు చేస్తున్నాం ● టెలీకాన్ఫరెన్స్లో కలెక్టర్ గరీమా అగ్రవాల్సిరిసిల్ల: జిల్లాలో కల్లాల్లో తడిసిన ధాన్యం ఉన్న రైతులు ఆందోళన చెందొద్దని, తడిసినా ధాన్యాన్ని వెంటనే రైస్మిల్లులకు తరలిస్తున్నామని కలెక్టర్ గరీమా అగ్రవాల్ భరోసా ఇచ్చారు. ముస్తాబాద్ మండలం పోత్గల్ ఐకేపీ కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని కలెక్టర్ ఆదేశాలతో ఐకేపీ, పౌర సరఫరాలశాఖ అధికారులు కొనుగోలు కేంద్రాన్ని గురువారం సందర్శించారు. దాదాపు 10 టన్నుల తడిసిన ధాన్యాన్ని నామాపూర్లోని బాలాజీ రైస్ ఇండస్ట్రీస్కు తరలించారు. జిల్లాలో బుధవారం నాటికి 2,23,709 టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని అధికారులు తెలిపారు. వారం రోజుల్లో పూర్తి : కలెక్టర్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వారం రోజుల్లో పూర్తి అయ్యేలా పనిచేయాలని కలెక్టర్ కోరారు. జిల్లాలోని అధికారులతో గురువారం టెలీకాన్ఫరెన్స్లో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాలు, మిల్లుల వారీగా ధాన్యం సేకరణ, అన్లోడింగ్పై ఆరా తీశారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఆన్లైన్ ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. వాహనాల కొరత లేకుండా చూడాలని ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లకు సూచించారు. -
వరదముప్పు తప్పేనా !
సిరిసిల్లటౌన్: కార్మికక్షేత్రాన్ని వరదల భయం వీడ డం లేదు. వర్షాకాలం వస్తుందంటే చాలు సిరిసిల్ల లోని లోతట్టు ప్రాంత ప్రజలు భయాందోళనగా రో జులు గడపాల్సిన దుస్థితి. ఎగువ ప్రాంతాల నుంచి పట్టణంలోకి వచ్చే వరదను సరైన మార్గంలో మళ్లించే ప్రణాళిక లేక ఏళ్లుగా వరదలతో వెల్లదీస్తున్నారు. పనుల్లో నిర్లక్ష్యం పట్టణంలో వరదల నివారణకు కోట్లాది రూపాయలతో చేపడుతున్న పనులు పూర్తికాకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వం నుంచి పలు దఫాలుగా మంజూరైన నిధులతో వెంకంపేట వద్ద దోభీఘాట్, కలెక్టరేట్ సమీపంలో ప్రహరీ, వరదల తాకిడికి దెబ్బతిన్న రోడ్లు, మురుగుకాల్వలు, ఫుట్పాత్లు, కల్వర్టుల మరమ్మతు పనులు చేపట్టారు. వీటిలో శాంతినగర్ నుంచి శ్రీనగర్ గుండా వరదకాల్వ పనులు పూర్తికాలేదు. నాలాలు, డ్రెయినేజీలు పూర్తికాలేదు. సమస్యలు.. పరిష్కారాలు ఇది గతేడాది వానాకాలంలో సంజీవయ్యనగర్లోని దుస్థితి. చిన్నపాటి వర్షానికే ఇక్కడి కాలనీలు, ప్రధాన రహదారిపై వరద ఏరులై పారుతుంటుంది. డ్రెయినేజీ వ్యవస్థ లోపభూయిష్టంగా ఉండడమే ప్రధాన సమస్య. గతంలో రూ.50 లక్షలకు పైగా వెచ్చించి నిర్మించిన డ్రెయినేజీ కాల్వ నిర్మించినా సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పటికీ చిరుజల్లులకే ఈ ప్రాంతంలో వరద వస్తుంటుంది. గతేడాది వర్షాకాలంలో సిరిసిల్లలో కురిసిన భారీ వర్షానికి శ్రీనగర్, చుట్టుపక్కల కాలనీలు జలమయ్యాయి. ఏళ్లుగా వరదను కచ్చా కాల్వా ద్వారా తరలిస్తుండడంతో తలెత్తుతున్న వరదల పరిస్థితికి నిలువుటద్దం. ఏటా శాశ్వత పరిష్కారం చూపుతామంటున్న పాలకులు, అధికారులు మాట దాటవేయడం పరిపాటిగా మారింది. మరి కొద్ది రోజుల్లో వర్షాకాలం ప్రారంభం కానుంది. ఈ ప్రాంత ప్రజల్లో ఇప్పటికీ వరదల భయం వెంటాడుతుంది. -
గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
ఇల్లంతకుంట(మానకొండూర్): గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. మండలంలోని కందికట్కూర్ రేణుక ఎల్లమ్మ జాతరలో గురువారం పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మండల కేంద్రంలోని మార్కెట్యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రెండు రోజుల్లో పొద్దుతిరుగుడు కొనుగోళ్లు మొదలవుతాయని రైతులకు భరోసా ఇచ్చారు. వెల్జీపూర్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు గొల్లకోమటి శంకర్ తల్లి మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదే గ్రామంలోని కాంగ్రెస్ సోషల్ మీడియా గ్రామాధ్యక్షుడు సుధగోని రవీందర్ తండ్రి మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. మాజీ ఎంపీపీలు వెంకటరమణారెడ్డి, గుడిసె ఐలయ్య, ఐరెడ్డి మహేందర్రెడ్డి, తిరుపతి, విజయ్, రజనీకాంత్, మహేశ్, సర్పంచ్ అరుకాల నవీన్కుమార్, మల్లేశం పాల్గొన్నారు. సిరిసిల్ల అర్బన్: జిల్లా నుంచి జాతీయస్థాయి కిక్ బాక్సింగ్ జూనియర్ పోటీలకు ఇద్దరు విద్యార్థులు ఎంపికైనట్లు కోచ్లు ఎనగందుల శ్రీనివాస్, వొడ్నాల శ్రీనివాస్ తెలిపారు. జిల్లా స్పోర్ట్స్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చోడిబోయిన లోకేశ్, ఎర్నాల రాజశేఖర్ ఎంపికయ్యారు. వీరు ఒడిశా రాష్ట్రంలోని కుర్దలో ఈనెల 30 నుంచి జూన్ 3 వరకు జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు గురువారం వెళ్లారు. సిరిసిల్ల అర్బన్: టెక్స్టైల్ కోర్సు చదవడం ద్వారా వచ్చే ఉపాధి అవకాశాలపై చేనేత, జౌళిశాఖ కోఆర్డినేటర్ మార్కండేయులు అవగాహన కల్పిస్తున్నారు. గురువారం చంద్రంపేటలో చేనేతకార్మికుల ఇళ్లకు వెళ్లి వివరించారు. పలువురు విద్యార్థులకు అప్లికేషన్ పత్రాలు అందజేశారు. రాష్ట్రస్థాయిలో 60 సీట్లు మాత్రమే ఉన్నాయని ఇప్పటి వరకు సిరిసిల్ల నుంచి 31 మంది మాత్రమే పేర్లు నమోదు చేసుకున్నారన్నారు. విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2500, కేంద్రం రూ.5వేల ఉపకారవేతనాలతోపాటు ఉద్యోగం కల్పించే అవకాశం ఉందన్నారు. వివరాలకు 99483 94061లో సంప్రదించాలని కోరారు. ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): తడిసిన ధాన్యాన్ని మిల్లుకు తరలించాలని కోరుతూ మండలంలోని కిష్టునాయక్తండాలో రైతులు గురువారం ఆందోళన చేపట్టారు. తూకం వేసిన బస్తాలను సకాలంలో మిల్లుకు తరలించకపోవడంతో అకాల వర్షానికి తడిసిపోయాయన్నారు. తడిసిన ధాన్యం బస్తాలను మిల్లుకు తరలించే అవకాశం లేదని నిర్వాహకులు చెప్పడంతో రైతులు ఆందోళనకు దిగారు. సంబంధిత అధికారులు సంఘటన స్థలానికి వెళ్లి తడిసిన ధాన్యాన్ని మిల్లుకు తరలిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. మాజీ సర్పంచ్ ప్రభునాయక్ తదితరులు ఉన్నారు. పాడి రైతు కుటుంబాలకు ఆర్థిక సాయంవీర్నపల్లి(సిరిసిల్ల): మరణించిన పాడి రైతు కుటుంబాలకు కరీంనగర్ డెయిరీ అండగా ఉంటుందని డెయిరీ చైర్మన్ చెలిమెడ రాజేశ్వరరావు పేర్కొన్నారు. డెయిరీ పాడి రైతు భరోసా పథకంలో నమోదై, ఇటీవల మరణించిన అగ్రహారం పరిధిలోని 29 మంది పాడి రైతు కుటుంబాలకు రూ.50వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని గురువారం అందజేశారు. వీర్నపల్లికి చెందిన పాడిరైతు ఇసుకెళ్ల నారాయణ, మద్దిమల్లకు చెందిన పాలకేంద్రం సభ్యుడు జజ్జరి రామచంద్రం భార్య జజ్జరి లక్ష్మి ఇటీవల మరణించారు. వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేశారు. -
ధాన్యం వెంటనే తరలించాలి
● అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్వేములవాడరూరల్/బోయినపల్లి: రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులు, గోదాములకు తరలించాలని, సరిపడా వాహనాలు సమకూర్చాలని అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేశ్ సంబంధిత ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లకు సూచించారు. వేములవాడ రూరల్ మండలం వట్టెంల, ఫాజుల్నగర్, శాత్రాజుపల్లి, బోయినపల్లిలోని మార్కెట్యార్డుతోపాటు కోరెం, బూర్గుపల్లి కొనుగోలు కేంద్రాలను గురువారం పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు తెచ్చిన ధాన్యాన్ని త్వరగా తూకం వేసి తరలించాలని నిర్వాహకులకు సూచించారు. హమాలీల సంఖ్య పెంచుకుని కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలి. -
వైభవంగా ధర్మరాజు పట్టాభిషేకం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండల కేంద్రంలోని సత్సంగ సదనం సరస్వతీ గోవిందారాజుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం ధర్మరాజు పట్టాభిషేకం కనులపండువగా నిర్వహించారు. వేములవాడ పురోహితులు ఆదిత్యశర్మ, శరత్శర్మ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈనెల 20న ఆరంభమైన మహాభారత జ్ఞానయజ్ఞంలో భాగంగా గురువారం శృంగేరి శారద పీఠ ఆస్థాన పౌరాణికులు బ్రహ్మశ్రీ గర్రెపల్లి మహేశ్వరశర్మ మహాభారతాన్ని ప్రవచించారు. ధర్మరాజు పట్టాభిషేకం ఘట్టాన్ని కనులకు కట్టినట్లు వివరించారు. సత్సంగ సదనం అధ్యక్షుడు బ్రహ్మచారి లక్ష్మారెడ్డి, కార్యదర్శి నగుబోత్ శ్రీనివాస్ దంపతులు మహేశ్వరశర్మను సన్మానించారు. కార్యక్రమంలో లక్ష్మీనారాయణ, పద్మక్క, అంజమ్మ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
కాసులిస్తేనే కాంటా పెడుతున్నారు
చందుర్తి/ముస్తాబాద్: కాసులిస్తేనే కాంటాలు పెడుతున్నారంటూ చందుర్తి మండలం మల్యాలలో రైతులు బుధవారం ఆందోళనకు దిగారు. వారు మాట్లాడుతూ గ్రామంలోని లీడర్ల ధాన్యం కంటాలు వేస్తూ సామన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ధాన్యం తెచ్చి 70 రోజులు గడుస్తున్నా కాంటాలు పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సై రమేశ్, ఐకేపీ ఏపీఎం కల్యాణి అక్కడికి చేరుకొని ఉన్నతాధికారులతో మాట్లాడి, కొనుగోళ్లు వేగవంతం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. సర్పంచ్ మందాల శారదఅబ్రహం, రైతులు పాల్గొన్నారు. పలుకుబడి ఉన్నోళ్లవే కొంటున్నరు పలుకుబడి ఉన్నోళ్లవే కొంటున్నారంటూ ముస్తాబాద్లో రైతులు ఆగ్రహం ధర్నా చేశారు. ముస్తాబాద్, సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ముస్తాబాద్ ప్యాక్స్ కేంద్రంలో నెల రోజుల క్రితం తీసుకొచ్చిన ధాన్యాన్ని ఇప్పటి వరకు తూకం వేయలేదన్నారు. ఎస్సై గణేశ్ రైతులతో మాట్లాడి శాంతింపజేశారు. -
మహిళలు నిర్భయంగా పనిచేయాలి
● కలెక్టర్ గరీమా అగ్రవాల్ సిరిసిల్ల: మహిళలు నిర్భయంగా, ధైర్యంగా పనిచేయాలని, ఎలాంటి వేధింపులు ఎదురైనా నేరుగా ఫిర్యాదు చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ సూచించారు. కలెక్టరేట్లో మహిళా సంక్షేమ వారోత్సవాలను బుధవారం నిర్వహించారు. జిల్లాలో 278 ఇంటర్నల్ కమిటీ సభ్యులను ఆహ్వానించి వారికి అంతర్గత ఫిర్యాదుల కమిటీ గురించి వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ పనిప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ నిషేధం, పరిష్కారాల చట్టం–2013పై అవగాహన ఉండాలన్నారు. కలెక్టరేట్లోనూ ఒక పిజికల్ షి బాక్స్ను ఏర్పాటు చేయాలని జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజంకు సూచించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణ కేంద్రం శిక్షకులు ప్రభాకర్, జిల్లా లోకల్ లెవెల్ కమిటీ సభ్యులు అఫ్జల్ బేగం, జ్యోతి, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి, సీడీపీవోలు సౌందర్య, ఉమారాణి, సుచరిత, డీ హబ్ కోఆర్డినేటర్ రోజా, డీసీపీవో కవిత, సఖీ అడ్మిన్ మమత, షీటీం ఇన్చార్జి ప్రమీల, బీసీ సంక్షేమాధికారి సౌజన్య, పరిశ్రమలశాఖ జీఎం హనుమంతు పాల్గొన్నారు. ఐఎంఎస్ భవన పనుల్లో వేగం పెంచాలి జిల్లా ఇందిరా మహిళాశక్తి (ఐఎంఎస్) భవన పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని మెడికల్ కళాశాల సమీపంలో నిర్మిస్తున్న ఇందిరా మహిళాశక్తి భవన పనులను పరిశీలించారు. జూన్ 10లోగా పనులు పూర్తి చేయాలని సూచించారు. జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, తహసీల్దార్ మహేశ్కుమార్, పీఆర్ డీఈఈ శ్రీనివాస్, ఏఈ సతీశ్ ఉన్నారు. ధాన్యం కొనుగోళ్లపై టెలీకాన్ఫరెన్స్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. టెలీకాన్ఫరెన్స్లో జిల్లాలోని అధికారులతో మాట్లాడారు. వర్షాలతో తడిసిన ధాన్యంపై ఆరా తీశారు. ధాన్యం కొనుగోళ్లు, రవాణా, లోడింగ్, అన్లోడింగ్లో వేగం పెంచాలని ఆదేశించారు. మహిళలు స్వయం ఉపాధిపై దృష్టి పెట్టాలి గంభీరావుపేట(సిరిసిల్ల): మహిళా సంఘాల సభ్యులు ఇందిరా మహిళాశక్తి భవనాలను సద్వినియోగం చేసుకోవాలని, స్వయం ఉపాధిపై దృష్టి పెట్టాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ సూచించారు. మహిళా సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా గంభీరావుపేట మండలం రాజేశ్వర్రావునగర్లో నిర్మించిన ఇందిరా మహిళాశక్తి భవనాన్ని బుధవారం ప్రారంభించారు. ఇందిరా మహిళాశక్తి భవనాల నిర్మాణంలో రాష్ట్రస్థాయిలో జిల్లా మొదటిస్థానంలో ఉందన్నారు. అనంతరం సముద్రలింగాపూర్లో ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసి, గంభీరావుపేటలో గృహ నిర్మాణశాఖ ఆధ్వర్యంలో నిర్మించిన ఇందిరమ్మ ఇంటి నమూనాను ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పూర్తయిన 2,700 ఇందిరమ్మ గృహ ప్రవేశాలను జూన్ 1న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మండల కేంద్రానికి వచ్చిన కలెక్టర్ వీవోఏలు కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందించారు. సర్పంచులు పిట్ల బాబు, కమ్మరి గంగసాయ వ్వ, మల్లుగారి పద్మ, ఏఎంసీ చైర్పర్సన్ కొమిరిశెట్టి విజయ, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, తహసీల్దార్ మారుతిరెడ్డి, ఎంపీడీవో రాజేందర్, ఐకేపీ ఏపీఎం జయసుధ, సీసీలు సురేందర్, లావణ్య పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి వేములవాడరూరల్: ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ నిర్వాహకులకు సూచించారు. వేములవాడ మండలం చెక్కపల్లి, బాలనగర్ ప్రాంతాల్లోని కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే తరలించాలన్నారు. జిల్లా పౌరసరఫరాల అధికారి బుచ్చిబాబు, జిల్లా వ్యవసాయ అధికారి అబ్జల్ బేగం, సహకార శాఖ అధికారి రామకృష్ణ, తహసీల్దార్ జయంత్, ఏవో సాయికిరణ్, సింగిల్విండో సొసైటీ సీఈవో లక్ష్మణ్ ఉన్నారు. -
కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యం
● ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బోయినపల్లి(చొప్పదండి): కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కోరారు. మండలంలోని వెంకట్రావుపల్లికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు బుధవారం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సువీన్యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరారు. సర్పంచ్ ఇరువాల సంధ్య, నాయకులు మానాల నారాయణ, ఇంద్రారెడ్డి, దూస రాజశేఖర్, సాయికృష్ణ, శ్రీకాంత్, దయ్యాల రాజశేఖర్, ఎం.రజనీకాంత్ పాల్గొన్నారు. అన్ లోడింగ్ వేగవంతం చేయాలి ఇల్లంతకుంట(మానకొండూర్): కొనుగోలు కేంద్రం నుంచి లోడింగ్తో వెళ్లిన ధాన్యం వాహనాలను రైస్మిల్లుల వద్ద త్వరగా అన్లోడింగ్ చేసుకోవాలని అడిషనల్ డీఆర్డీవో శ్రీనివాస్ సూచించారు. మండలంలోని కిష్టారావుపల్లి రైస్మిల్లును బుధవారం తనిఖీ చేశారు. రైస్మిల్లు వద్ద దాదాపు 80 ట్రాక్టర్ల వరకు బారులు తీరాయి. వరుస ప్రకారం వెళ్లి అన్లోడింగ్ చేసుకోవాలని ట్రాక్టర్ యజమానులకు సూచించారు. ఐకేపీ ఏపీఎం కుమారస్వామి, వల్లంపట్ల సర్పంచ్ నేరెళ్ల విజయ్గౌడ్, కిష్టారావుపల్లి సర్పంచ్ జక్కుల మల్లవ్వ, మహిళ సమాఖ్య మండల అధ్యక్షురాలు కట్ట సౌమ్య, సీసీ రాజేశ్వరీ పాల్గొన్నారు. మోదీ వచ్చాక రూ.160 లక్షల కోట్లు అప్పు పెరిగింది వేములవాడ: మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు రూ.50 లక్షల కోట్లు అప్పుండేదని.. ఇప్పుడు రూ.160 లక్షల కోట్లకు చేశాడని సీపీఐ రాష్ట్ర నాయకుడు చాడ వెంకట్రెడ్డి ఆరోపించారు. వేములవాడలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. కార్పోరేట్ సంస్థల అధిపతులు అంబానీ, అదానీలకు దేశాన్ని దారాదత్తం చేస్తున్నారన్నారు. రైతులను పట్టించుకున్న పాపాన పోవడం లేదన్నారు. రైతులను జాగృతం చేసేందుకు జూన్ 5, 6, 7 తేదీల్లో వేములవాడలో సీపీఐ ఉమ్మడి కరీంనగర్ జిల్లా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పెరుక రాజుకు సాహిత్య శిరోమణి పురస్కారంసిరిసిల్లటౌన్: ప్రముఖ కవి, రచయిత, బహుభాషావేత్త డాక్టర్ పెరుక రాజు ‘విశ్వవిఖ్యాత సాహిత్య శిరోమణి పురస్కారం– 2026’కు ఎంపికయ్యారు. బుధవారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో పురస్కారం అందుకున్నారు. సామాజిక చైతన్య రచనల ద్వారా సాహిత్యరంగంలో రాజు సేవలకు ఈ గౌరవం దక్కింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో హైదరాబాద్లోని తెలుగు విశ్వవిద్యాలయంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. కాగా ఏడాదిలోనే రాజు తొమ్మిది పురస్కారాలు అందుకున్నారు. జిల్లా ఎస్డీసీగా కుమారస్వామిసిరిసిల్ల: జిల్లా భూసేకరణ విభాగం ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్గా జి.కుమారస్వామిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని 12 మంది అధికారులను బదిలీ చేశారు. పెద్దపల్లి జిల్లాలో పనిచేస్తున్న జి.కుమారస్వామిని రాజన్న సిరిసిల్ల ఎస్డీసీగా నియమించారు. గతంలో జిల్లాలో ఎస్డీసీగా పనిచేసిన రాధాబాయి బదిలీ అయ్యారు. -
గింత పాపం ఎన్నడూ కాలే
వడ్లు జోకుడు గింత ఆలస్యం ఎన్నడూ కాలేదు. పొలం కోసి గిన్ని రోజులైంది. లారీలు లేవని, జోరసంచులు లేవని, హమాలీ కూలీలు లేరని చెబుతూ ఆలస్యం చేసిండ్రు. ఇప్పుడు వానాకాలం వచ్చే. నారు పోసేటోళ్లు పొలం సాగి తుకాలు పోస్తుండ్రు. వడ్లు మాత్రం పోకపాయే. గింత పాపం ఎన్నడూ కాలేదు. – పంగ మల్లయ్య, పెద్దబోనాల కొనుగోళ్లకు నష్టం లేదు జిల్లాలో కురిసిన వర్షాలతో ధాన్యం కొనుగోళ్లకు నష్టం లేదు. లోతట్టు ప్రాంతాల్లో వడ్ల రాశులు పోసిన చోట కొద్దిగా నీరు చేరింది. పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నాం. అధికారులు క్షేత్రస్థాయిలో కొనుగోళ్లను పర్యవేక్షిస్తున్నారు. రైతులు ఆందోళన చెందవద్దు. – గడ్డం నగేశ్, అదనపు కలెక్టర్ -
సోషల్ మీడియా వదంతులు నమ్మొద్దు
● ఎస్పీ మహేశ్ బీ గీతేవేములవాడ: సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మొద్దని ఎస్పీ మహేశ్ బీ గీతే కోరారు. బక్రీద్ సందర్భంగా పట్టణంలోని బైపాస్రోడ్డులోని ఈద్గాను బుధవారం పరిశీలించి మాట్లాడారు. శాంతియుత వాతావరణంలో కలిసిమెలిసి పండుగలు నిర్వహించుకోవాలని సూచించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పశువుల అక్రమ రవాణా జరగకుండా చెక్పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలకు అందుబాటులో ఉండాలని పోలీస్ సిబ్బందికి ఎస్పీ సూచించారు. పట్టణ ఠాణాను పరిశీలించారు. కేసుల వివరాలు, పెండింగ్ కేసుల పురోగతి, స్టేషన్ రికార్డుల నిర్వహణ, రౌడీషీటర్లు, నేరస్తులపై నిఘా అంశాలను సమీక్షించారు. టౌన్ సీఐ వీరప్రసాద్, ఎస్సైలు ఎల్లాగౌడ్, శ్రీనివాస్, ప్రేమనందం తదితరులు ఉన్నారు. -
డేంజర్ హోర్డింగ్స్
గురువారం శ్రీ 28 శ్రీ మే శ్రీ 2026జిల్లా కేంద్రంలో ప్రకటనల హోర్డింగ్స్ ప్రమాదకరంగా ఉన్నాయి. పాతబస్టాండ్, అంబేడ్కర్ చౌరస్తా, గాంధీసర్కిల్ వద్ద ఈ హోర్డింగ్స్ డేంజర్గా మారాయి. జనసమ్మర్థం ఉన్న ప్రాంతాల్లో పలు షాపింగ్మాల్స్, విద్యాసంస్థలు తమ బ్రాండ్ను మార్కెటింగ్ చేసుకునేందుకు భారీ హోర్డింగ్స్ను ఏర్పాటు చేసుకున్నాయి. అయితే ఈదురుగాలులకు హోర్డింగ్స్ ఊగుతున్నాయి. ఫ్లెక్సీలు గాలికి చినిగి వేలాడుతున్నాయి. వాహనాలపై వెళ్లే వారిపై పడి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మున్సిపల్ అధికారులు పట్టించుకొని క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రమాదకరంగా ఉన్న హోర్డింగ్స్, ఫ్లెక్సీలను తొలగించాల్సిన అవసరం ఉంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, రాజన్నసిరిసిల్ల -
వ్యాధి నిరోధక టీకాలు విజయవంతం
● రాష్ట్ర పరిశీలకుడు పీటర్ ఎల్లారెడ్డిపేట/తంగళ్లపల్లి(సిరిసిల్ల): జిల్లాలో 14 నుంచి 15 ఏళ్ల లోపు బాలికలకు క్యాన్సర్ నిరోధక టీకాల పంపిణీలో రాష్ట్రస్థాయిలోనే మొదటి స్థానంలో ఉందని, వైద్యసిబ్బందిని రాష్ట్ర పరిశీలకులు, జా యింట్ డైరెక్టర్, వ్యాధి నిరోధక టీకాల అధికారులు ఫీటర్, డేవిడ్ అభినందించారు. ఎల్లారెడ్డిపేట, తంగళ్లపల్లిల్లోని పీహెచ్సీలను బుధవారం పరిశీలించా రు. గ్రామీణ ప్రాంతాల్లో టీకాలపై అవగాహన కల్పించి, ముందంజలో ఉండడంపై అభినందించారు. టీకాల నిల్వలు, ముందస్తు ప్రణాళికలను పరిశీలించిన అధికారులు సిబ్బంది పనితీరును కొనియాడారు. జిల్లా వైద్యాధికారి రజిత, మండల వైద్యాధికారి సరియా అంజుమ్ పాల్గొన్నారు. -
లింగనిర్ధారణ నేరం
సిరిసిల్ల: లింగ నిర్ధారణ తీవ్ర నేరమని, స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఎస్.రజిత హెచ్చరించారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్లో జిల్లా స్థాయి పీసీపీఎన్డీటీ సలహా సంఘం సమావేశం బుధవారం జరిగింది. జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ ప్రతీ మూడు నెలలకోసారి చేస్తున్న తనిఖీల్లో స్కానింగ్ సెంటర్ల రికార్డులను పరిశీలిస్తున్నామన్నారు. లింగ నిర్ధారణ చేసినట్లు మా దృష్టికి వస్తే స్కానింగ్ సెంటర్లను సీజ్ చేసి, క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు. జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ రజనీకాంత్, పెంట శ్రీనివాస్, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి గైనకాలజిస్ట్ సుచేతన లక్ష్మి, పీడియాట్రిషియన్ పరమేశ్, మానేరు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు చింతోజు భాస్కర్ పాల్గొన్నారు. -
అకాల వర్షం.. రైతులు ఆగమాగం
సిరిసిల్లటౌన్/సిరిసిల్లఅర్బన్/తంగళ్లపల్లి/ఇల్లంతకుంట/ఎల్లారెడ్డిపేట/ముస్తాబాద్/బోయినపల్లి: జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు కురిసిన ఈదురుగాలులు.. వర్షానికి కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయ్యింది. ఈదురుగాలులకు ఇంటి పైకుప్పులు లేచిపోగా, విద్యుత్స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి. ఇల్లంతకుంట మండలం గాలిపెల్లిలోని హైస్కూల్ ఆవరణలో ఉన్న కొబ్బరిచెట్టుపై పిడుగుపడింది. తంగళ్లపల్లి మండలంలో తూకానికి సిద్ధంగా ఉన్న ధాన్యం తడిసి ముద్దయింది. బోయినపల్లి మండలం దుండ్రపల్లి ఇంటి పైకప్పు రేకులు లేచిపోయాయి. మూడు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ముస్తాబాద్ మండలం పోతుగల్, ముస్తాబాద్, నామాపూర్, ఆవునూర్, తెర్లుమద్ది గ్రామాల్లోని కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. ఎల్లారెడ్డిపేట మండలంలో వర్షానికి తడిసిన ధాన్యాన్ని సింగిల్విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, మాజీ జెడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కృష్ణహరి పరిశీలించారు. బోయినపల్లి: దుండ్రపల్లిలో లేచిపోయిన పై కప్పుఎల్లారెడ్డిపేటలో తడిసిన ధాన్యం -
ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడరూరల్: ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ రూరల్ మండలం ఫాజుల్నగర్లో నూతనంగా నిర్మించే పెద్దమ్మతల్లి ఆలయానికి బుధవారం భూమిపూజ చేశారు. విప్ మాట్లాడుతూ గ్రామ దేవతలను పూజించడం ద్వారా గ్రామాల్లో ప్రశాంతత నెలకొంటుందన్నారు. పెద్దమ్మ ఆలయానికి ప్రభుత్వం తరఫున రూ.46 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, సర్పంచులు గడ్డం లిఖిత, రంగు వెంకటేశ్గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సోయినేని కరుణాకర్, ఆత్మ కమిటీ సభ్యుడు బండ శ్రీనివాస్, కులపెద్దలు గండి స్వామి, పోగుల సత్తయ్య, ఉప్పరి పెద్దులు, గంగుల ప్రసాద్, సిలివేరి లచ్చయ్య, రేగుల శంకర్, పిట్టల లక్ష్మీనర్సు, ఉప్పరి అంజయ్య పాల్గొన్నారు. -
కర్షకుల క‘న్నీరు’
● అకాల వర్షంతో తడిసిన ధాన్యం ● వారాల కొద్దీ కేంద్రాల్లో పడిగాపులు ● కొనసాగుతున్న కొనుగోళ్లు ● తూకం వేయాలని రైతుల డిమాండ్సిరిసిల్ల: జిల్లాలో అకాల వర్షాలతో అన్నదాతలు అరిగోస పడ్డారు. ధాన్యాన్ని తడవకుండా కాపాడుకునేందుకు నానా కష్టాలు పడ్డారు. తూకం వేసిన బస్తాలు సైతం తడిసిపోయాయి. ఇదే సమయంలో వేములవాడ మండలం మల్లారం వద్ద 43.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం విశేషం. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోడానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. గన్నీ సంచుల కొరత, హమాలీల సమస్య, లారీల కొరత, రైస్మిల్లులు, గోదాముల్లో అన్లోడింగ్ సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నెల రోజులుగా ధాన్యం కొనుగోళ్లు కొనుసా గుతూనే ఉన్నాయి. జిల్లా అంతటా వర్షం జిల్లా అంతటా బుధవారం వర్షం కురిసింది. అత్యధికంగా ముస్తాబాద్ మండలం ఆవునూర్లో 32.5 మిల్లీమీటర్లు, నామాపూర్లో 29.8, వీర్నపల్లిలో 27.3, గంభీరావుపేటలో 24.0, సిరిసిల్ల శివారులోని పెద్దూరు వద్ద 21.8, ఎల్లారెడ్డిపేటలో 18.8, వేములవాడ అర్బన్ మండలం నాంపల్లి వద్ద 18.5, చందుర్తి మండలం మర్రిగడ్డ వద్ద 14.0, కోనరావుపేట మండలం నిజామాబాద్లో 14.0, రుద్రంగిలో 13.0, వేములవాడ రూరల్ మండలం మల్లారంలో 12.3, వట్టెంల వద్ద 8.3, బోయినపల్లిలో 12.0, తంగళ్లపల్లి మండలం నేరెళ్ల వద్ద 12.0, కలెక్టరేట్ వద్ద 10.3, ఇల్లంతకుంటలో 7.5, కందికట్కూర్లో 5.3, రుద్రంగి మండలం మానాల వద్ద అత్యల్పంగా 2.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ప్రత్యేకాధికారుల పరుగులు వర్షం కురవడంతో మండలాల ప్రత్యేకాధికారులు, ఐకేపీ సిబ్బంది, సహకారశాఖ అధికారులు, మెప్మా సిబ్బంది ధాన్యం పరిస్థితిని తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించారు. వడ్లను తూకం వేయించారు. కలెక్టర్ గరీమా అగ్రవాల్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కొనుగోళ్లు ఇలా..కేంద్రాలు: 236పూర్తయిన కేంద్రాలు: 9ధాన్యం దిగుబడి అంచనా: 3 లక్షల టన్నులు కొనుగోలు చేసిన ధాన్యం : 2,13,938.380 టన్నులు ఇంకా కొనాల్సిన ధాన్యం: 86,162 టన్నులు మిల్లులకు, గోదాములకు తరలించిన ధాన్యం: 2,03,793.340 టన్నులు వడ్లు అమ్మిన రైతులు : 26,054ధాన్యం విలువ: రూ.511.06 కోట్లు ఇప్పటికే రైతులు ఖాతాల్లో జమయిన డబ్బులు: రూ.362.82 కోట్లు డబ్బులు పొందిన రైతులు : 22,293ఇది సిరిసిల్ల పట్టణ శివారులోని పెద్దబోనాలలో రైతు రాయనర్సు పరిస్థితి. తన ఐదెకరాల్లో వరి పంటను వేసి, పక్షం రోజుల కిందటే కోసి ఆరబెట్టి తూకం వేసేందుకు సిద్ధంగా రాశిపోశాడు. బుధవారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రావడంతో వడ్లకుప్ప చుట్టూరా వరద చేరింది. దాదాపు 200 క్వింటాళ్ల వడ్లు చుట్టూ నీరు చేరడంతో ఆ నీటిని తొలగించేందుకు రాయనర్సు కుప్ప చుట్టూ ఇలా కాల్వ తీశాడు. -
మరిన్ని సేవలు అందించేందుకే..
రైతు విజ్ఞాన కేంద్రం ద్వారా అన్నదాతలకు మరిన్ని సేవలు అందనున్నాయి. మర్రిపల్లిలో నిర్మించే కేంద్రంలో పంటల నమూనా, సాగు పద్ధతులు, భూ పరీక్షలు, అన్ని రకాల విత్తనాలు అందుబాటులోకి వస్తాయి. – డా.ఆర్.సాయికుమార్, రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ రైతులకు ఎంతో మేలు మర్రిపల్లి గ్రామంలో రైతు విజ్ఞాన కేంద్రం ఏర్పాటుతో జిల్లా రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రైతును రాజు చేస్తానని చెప్పినట్లే ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పెద్ద మేలు చేశారు. – బండ శ్రీనివాస్, ఆత్మ కమిటీ సభ్యుడు, వెంకటాంపల్లి -
చకచకా చేయూత
సిరిసిల్ల: చేయూత పెన్షన్లలో అక్రమాలు అరికట్టేందుకు ప్రభుత్వం లబ్ధిదారుల లైవ్ అథెంటికేషన్(జీవన ధ్రువీకరణ) ప్రక్రియకు శ్రీకారం చుట్టగా చకచకా సాగుతోంది. రాష్ట్రంలో పెన్షన్ పొందే ప్రతీ ఒక్కరి ముఖ గుర్తింపును సెర్ఫ్ అధికారులు రూపొందించిన ప్రత్యేక యాప్లో నమోదు చేయాలని ఆదేశించారు. ఈమేరకు జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో మున్సిపల్ వార్డు అధికారులు, 260 గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు తమ సెల్ఫోన్లలో లబ్ధిదారుల లైవ్ అథెంటికేషన్ చేస్తున్నారు. పలుచోట్ల యాప్ ఓపెన్ కాకపోవడం, లబ్ధిదారుల ముఖం నమోదు కాకపోవడం వంటి సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నా రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానం ఉంది. కొన్ని గ్రామాల్లో సెల్ఫోన్ నెట్వర్క్ ప్రతిబంధంకంగా మారింది. సెర్ఫ్ అధికారులు మాత్రం ఈనెలాఖరులోగా లైవ్ అథెంటికేషన్ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 81 శాతం నమోదుతో మొదటి స్థానం జిల్లాలో చేయూత పెన్షన్లు పొందేవారు 1,09,307 మంది ఉండగా.. ఇప్పటికే 85,139 మంది పెన్షనర్ల లైవ్ అథెంటికేషన్ పూర్తయింది. 81 శాతం జీవన ధ్రువీకరణ నమోదుతో రాష్ట్రంలోనే జిల్లా అగ్రస్థానంలో ఉండడం విశేషం. టెక్నికల్ ప్రాబ్లమ్స్ జిల్లా వ్యాప్తంగా పెన్షన్ పొందే వారిలో 196 మంది మరణించినట్లు తేలింది. 177 మంది పెన్షనర్ల వేలిముద్రలు, ముఖచిత్ర నమోదుకు సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. 14 మంది మానసిక దివ్యాంగులు నమోదుకు దూరంగా ఉన్నారు. 38 మంది ఎక్కడ ఉన్నారో తెలియడం(నాట్ ట్రేస్) లేదని, ఆధార్ నంబరుతో పోల్చితే తప్పులు రావడంతో 8 మంది లైవ్ అథెంటికేషన్ నమోదు కావడం లేదు. ఆధార్నంబరు పరమైన సమస్యలు 1,054 మంది పెన్షనర్లకు ఉత్పన్నమయ్యాయి. అర్హుల నిరీక్షణ చేయూత పెన్షన్ల కోసం అర్హులు నిరీక్షిస్తున్నారు. దివ్యాంగులు, వృద్ధాప్య పెన్షన్లు, బీడీకార్మిక, ఒంటరి మహిళలు కొత్త పెన్షన్ల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. వృద్ధాప్య పెన్షన్ పొందుతున్న భర్త చనిపోతే.. భార్యకు, భార్య చనిపోతే.. భర్తకు పెన్షన్ను బదిలీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ మార్పు చేయలేదు. ఫలితంగా జిల్లాలో అర్హతలు ఉన్నా చేయూత పెన్షన్ రావడం లేదు. ప్రభుత్వం జూన్ 2వ తేదీ తరువాత కొత్త పెన్షన్లు ఇస్తామని ప్రకటించడంతో అర్హుల్లో ఆశలు చిగురించాయి. ప్రజాపాలన గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా చేయూత పెన్షన్ల మంజూరు ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న వారి అర్హతలను పరిశీలించి చనిపోయిన వారి స్థానాల్లో కొత్త వారికి పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. లైవ్ అథెంటికేషన్ పూర్తయితేనే చేయూతపై క్లారిటీ వస్తుందని అధికారులు పేర్కొన్నారు. సాంకేతిక సమస్యలు లేకుండా చూడాలని క్షేత్రస్థాయిలో పని చేస్తున్న అధికారులు, పెన్షనర్లు కోరుతున్నారు. చేయూత పెన్షన్ల స్వరూపం వృద్ధాప్య పెన్షన్లు : 29,337 దివ్యాంగులు : 9,884 వితంతువులు : 20,758 చేనేత కార్మికులు : 3.138 కల్లుగీత కార్మికులు : 2,123 ఒంటరి మహిళలు : 1,740 బీడీ కార్మికులు : 41,463 ఫైలేరియా బాధితులు : 805 డయాలసిస్ బాధితులు : 59 మొత్తం పెన్షనర్లు : 1,09,307 -
రైతులకు అధునిక ‘విజ్ఞానం’
● వేములవాడలో జిల్లా కార్యాలయం ● మర్రిపల్లిలో 40 ఎకరాల్లో పరిశోధన కేంద్రం ● విప్ ఆది శ్రీనివాస్వేములవాడ/వేములవాడరూరల్: రైతాంగ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని సినారె కళామందిరంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. రైతులకు నూతన పరిజ్ఞానంతో కూడిన వ్యవసాయం, నాణ్యమైన విత్తనాలు, పంట పొలాల్లో సలహాలు, సూచనలు ఇస్తూ శాస్త్రవేత్తలు నిరంతరం అందుబాటులో ఉండాలని కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లిలో 40 ఎకరాల ప్రభుత్వ స్థలంలో జిల్లా విజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభించి అక్కడ రైతులకు, శాస్త్రవేత్తలకు, విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం నిర్మాణం జరిగే ప్రాంతంలో వివిధ అవసరాలకు రూ.25 లక్షల నిధులు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. వ్యవసాయ విశ్వ విద్యాలయం ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య మాట్లాడుతూ, విజ్ఞాన కేంద్రంతో ఈ ప్రాంత రైతులకు లాభం చేకూరుతుందన్నారు. కేంద్రం కోఆర్డినేటర్గా డా.సాయికుమార్కు బాధ్యతలు అప్పగించారు. అనంతరం రాజశ్రీ గార్డెన్స్లో వేములవాడ, సిరిసిల్ల డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్లుగా ముస్కు ముకుందరెడ్డి, రాజిరెడ్డి, కమిటీ సభ్యులు పులి లక్ష్మీపతిగౌడ్, మహేందర్రెడ్డి, వేణుగోపాల్, రవీందర్రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. డీఏవో అఫ్జల్ బేగం, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేశ్ తదితరులు పాల్గొన్నారు. -
పెట్రో ధరలతో సామాన్యుల బతుకు దుర్భరం
ముస్తాబాద్(సిరిసిల్ల): సామాన్యుల బతుకులను దుర్భరం చేసేలా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతోందని కాంగ్రెస్ సిరిసిల్ల ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి అన్నారు. మంగళవారం ముస్తాబాద్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజీవ్చౌక్ నుంచి తెలంగాణచౌక్ వరకు ఆటోను తాళ్లతో లాగి నిరసన తెలిపారు. ఈసందర్భంగా మహేందర్రెడ్డి మాట్లాడుతూ, కేంద్రం పశ్చిమాసియాలో యుద్ధాన్ని సాకుగా చూపి, పొదుపు చేయాలంటూ ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిందన్నారు. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటి ప్రజలు బతికే పరిస్థితి లేదన్నారు. ఎరువుల ధరలను పెంచి, నల్లచట్టాలను తీసుకువచ్చిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదన్నారు. రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీకి రైతులు, ప్రజలు బుద్ధి చెప్పే రోజులు వచ్చాయన్నారు. ఏఎంసీ చైర్పర్సన్ తలారి రాణి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు యెల్ల బాల్రెడ్డి, పట్టణాధ్యక్షుడు గజ్జెల రాజు, ఆత్మ కమిటీ నియోజకవర్గ చైర్మన్ కొండం రాజిరెడ్డి, డైరెక్టర్ కరెడ్ల కొండల్రెడ్డి, వెల్ముల రాంరెడ్డి, మిర్యాల్కార్ శ్రీను, గుండెల్లి శ్రీను, భాను, నరేశ్, రమణారెడ్డి, ప్రశాంత్, వుచ్చిడి బాల్రెడ్డి, కాంపెల్లి శ్రీను, దేవేందర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
పారదర్శకంగా ఉద్యోగుల బదిలీలు
● కలెక్టర్ గరీమా అగ్రవాల్సిరిసిల్ల: ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం కలెక్టరేట్లో ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియను నిబంధనలు అనుగుణంగా కలెక్టర్ గరీమా అగ్రవాల్ అధ్యక్షతన నిర్వహించారు. ఆయా శాఖల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వివరాలను సంబంధిత జిల్లా అధికారులు కలెక్టర్కు అందించారు. ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న స్థానం నుంచి ఇతర స్థానాలకు పారదర్శకంగా సిబ్బందిని బదిలీ చేశామని కలెక్టర్ తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి హమాలీల సంఖ్యను పెంచి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ, గోదాంలకు తరలింపు తదితర అంశాలపై అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, పౌరసరఫరాల అధికారులతో మంగళవారం ఉదయం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మిల్లుల వారీగా ఎంతవరకు ధాన్యం అన్ లోడింగ్ చేశారో వివరాలు అడిగి, హమాలీల సంఖ్య పెంచుకునేలా యజమానులకు ఆదేశాలు జారీ చేయాలన్నారు. వర్షాలు పడే అవకాశం ఉన్నందున కేంద్రాల్లో ఉన్న బస్తాలను వెంటనే మిల్లులు, గోదాములకు తరలించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. టార్ఫాలిన్లు అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు. కొనుగోళ్లు పూర్తయిన కేంద్రాల నుంచి హమాలీలను అపరెల్ పార్క్ కు పంపించి, అన్ లోడింగ్ వేగవంతం చేయడంపై దృష్టి సారించాలని సూచించారు. రోజూ వారీగా కొనుగోళ్ల శాతం పెంచి, సాధ్యమైనంత త్వరగా సజావుగా పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. -
బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత
గంభీరావుపేట(సిరిసిల్ల): బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం అన్నారు. మహిళా సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం మండలకేంద్రంలో బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని మాట్లాడారు. బాల్య వివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని, అలాంటివి జరిగినప్పుడు అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. బాల్య వివాహాలకు కారణాలు, అనర్థాల గురించి కిషోర బాలికలకు, మహిళలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రచారి, సీడీపీవో ఉమారాణి, జిల్లా సమాక్య అధ్యక్షురాలు భాగ్య, తహసీల్దార్ మారుతిరెడ్డి, ఎంపీడీవో రాజేందర్, ఏఎంసీ చైర్పర్సన్ కొమిరిశెట్టి విజయలక్ష్మి, సర్పంచులు మల్లుగారి పద్మ, అర్చన, విజయలక్ష్మి, మహేశ్యాదవ్, రమేశ్, విమల, సుకన్య, ఐసీడీఎస్ సూపర్వైజర్ రేణుక, ఏపీఎం జయసుధ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్థికాభివృద్ధిలో మహిళా సంఘాల ముందంజ
సిరిసిల్లటౌన్: మహిళలు ఆర్థిక పురోభివృద్ధి సాధించడానికి సమాఖ్య సంఘాల పాత్ర ఎనలేనిదని సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ అన్నారు. మంగళవారం మూడో వార్డులో మహిళ సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసి మాట్లాడారు. మహిళా సంఘాల సాధికారతకు పురపాలక సంఘం ద్వారా పూర్తి సహకారాన్ని అందిస్తామన్నారు. ఇందిరమ్మ చీరలను ఈ రోజు నుంచి అన్ని వార్డుల్లో పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆర్పీలు, మహిళా సంఘాల అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు. ఘనంగా 108 పైలెట్స్ డేసిరిసిల్లటౌన్: జాతీయ 108 అంబులెన్స్ పైలెట్స్ డే సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా మేనేజర్ సావనపెల్లి అరుణ్కుమార్ ఆధ్వర్యంలో 108 అంబులెన్స్ పైలెట్లు కేక్ కట్ సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడేందుకు 108 పైలెట్లు రాత్రింబవళ్లు అంకితభావంతో సేవలు అందిస్తున్నారని కొనియాడారు. ప్రజలకు సమయానికి వైద్య సేవలు అందించడంలో పైలెట్ల పాత్ర ఎంతో కీలకమన్నారు. పెద్ది శ్రీనివాస్, బరిగె లక్ష్మణ్, మామిడాల ఆంజనేయులు, పోచంపల్లి పరశురాములు, వనపర్తి అనిల్, పంతగాని మహేశ్, మొగిలి సుధాకర్, బరిగెల మనోజ్, నలికె నవీన్, నాగసముద్రం రాజశేఖర్, బండారి ప్రణయ్, చల్ల మధుసూదన్, జలగం సత్యసాగర్, మంత్రి కిషోర్, వడ్నాల అనిల్, చల్ల సత్తయ్య, నునావత్ మధన్, పంతం సాయికృష్ణ, మినుప స్వామి పాల్గొన్నారు. 29న పాలిసెట్ ధ్రువపత్రాల పరిశీలన వేములవాడఅర్బన్: ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు ఈనెల 29 నుంచి వేములవాడ మండలం అగ్రహారం శ్రీ రాజరాజేశ్వరస్వామి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో టీజీ పాలిసెట్– 2026లో ర్యాంకులు సాధించిన విద్యార్థుల ధ్రువపత్రాలు పరిశీలించనున్నట్లు ప్రిన్సిపాల్ ప్రభాకరచారి తెలిపారు. ఈ నెల 27 నుంచి 31 వరకు విద్యార్థులు https://tgpolycet. inc.in వెబ్సైట్లో స్లాట్ బుక్ చేసుకోవాలని పేర్కొన్నారు. 29 నుంచి జూన్ 3 వరకు ధ్రువపత్రాల పరిశీలన తర్వాత కళాశాలలు, కోర్సులు ఎంచుకోవడానికి ఆప్షన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. జూన్ 3 నుంచి 6 వరకు ఆప్షన్ ఇచ్చుకున్న వారికి సీట్ల కేటాయింపు, 6 నుంచి 9 వరకు వెబ్సైట్ ద్వారా ఫీజు చెల్లింపు, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్, 8 నుంచి 9 వరకు సీటు కేటాయించిన కళాశాలలో రిపోర్టింగ్ చేయాలని పేర్కొన్నారు. విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలు పాలిసెట్ ర్యాంకు కార్డు, ఆధార్, పదో తరగతి మెమో, టీసీ, 6 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్స్, 2026–27 సంవత్సరం ఆదాయం ధ్రువీకరణపత్రం, కుల ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని సూచించారు. నర్మాల ప్రాజెక్టుకు మరమ్మతు చేపట్టాలిసిరిసిల్లఅర్బన్: గంభీరావుపేట మండలం నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టుకు సంబంధించి పలు మరమ్మతు పనులను వెంటనే చేపట్టాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో ఏవో రాంరెడ్డికి వినతిపత్రం అందజేసి మాట్లాడారు. ప్రాజెక్టు కింది భాగంలో ఉన్న ఆఫ్రాన్ పూర్తిగా కొట్టుకుపోయిందని, దీంతో ప్రాజెక్టు పునాదులకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందన్నారు. అలాగే నీటి తొట్లు శాసీ్త్రయంగా నిర్మించి, తుప్పు పట్టిన షటర్లు, గొలుసుకట్టు కాలువల మరమ్మతు పనులకు నిధులు మంజూరు చేయాలన్నారు. 2.2 టీఎంసీల నీరు నిల్వ ఉండే ప్రాజెక్టు ప్రస్తుతం 1 టీఎంసీ మాత్రమే పరిమితమైందన్నారు. అధికారులు స్పందించి పూడిక తీత పనులు చేపట్టాలన్నారు. లేకుంటే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామన్నారు. నాయకులు నాగరాజు పాల్గొన్నారు. -
వడ్డీ వ్యాపారులపై పోలీసుల ఉక్కుపాదం
సిరిసిల్ల: జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా వడ్డీ వ్యాపారం, ఫైనాన్స్లు నిర్వహిస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. మంగళవారం ఉదయం 15 బృందాలతో ఏకకాలంలో జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక దాడులు చేశారు. అధిక వడ్డీలతో ప్రజలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ మహేశ్ బి గితే హెచ్చరించారు. సిరిసిల్ల పట్టణంతో పాటు వేములవాడ, రుద్రంగి, కోనరావుపేట ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి ఆరు కేసులు నమోదు చేశారు. రూ.1.39 కోట్ల విలువైన డాక్యుమెంట్లు, రూ.1.77లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ప్రజల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకొని అధిక వడ్డీలు వసూలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ప్రభుత్వ అనుమతితో చట్టపరమైన పద్ధతులలో ఫైనాన్స్ నిర్వహించే వారిని మాత్రమే ప్రజలు నమ్మాలన్నారు. ఎటువంటి ప్రభుత్వ అనుమతి లేకపోయినా, అక్రమ ఫైనాన్స్ వ్యాపారం నడిపే వారి వివరాలు జిల్లా పోలీస్ కార్యాలయంలో తనకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. -
మంగళవారం
● అత్యధికంగా బోయినపల్లిలో 45.6 డిగ్రీలు ● అత్యల్పంగా ఆవునూర్లో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రతలుబోసిపోయిన సిరిసిల్లలోని గాంధీచౌక్ సిరిసిల్ల: ఎండలు భగభగ మండిపోతున్నాయి. మంగళవారం వడగాలులతో జనం అల్లాడిపోయారు. పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. రోహిణీ కార్తె ప్రవేశించడంతో చల్లని వర్షం కబురు వస్తుందని జిల్లా రైతులు ఆశించారు. గాలిదుమారం తప్ప వర్షం చినుకు పడలేదు. జిల్లాలోని బోయినపల్లి మండలంలో అత్యధికంగా 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. రుద్రంగిలో 45.4, వేములవాడ అర్బన్ మండలం నాంపల్లి వద్ద 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చందుర్తి మండలం మర్రిగడ్డ 44.8, ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ 44.7, కలెక్టరేట్, ఇల్లంతకుంటలో 44.6, రుద్రంగి మండలం మానాల, వేములవాడ రూరల్ మండలం మల్లారం వద్ద 43.9, కోనరావుపేట మండలం మర్తనపేట 43.7, ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ వద్ద 43.4, కోనరావుపేట మండలం నిజామబాద్ 43.3, వేములవాడ రూరల్ మండలం వట్టెంల వద్ద 43.1, ముస్తాబాద్ మండలం నామాపూర్ వద్ద 43, సిరిసిల్ల శివారు పెద్దూరులో 42.9, తంగళ్లపల్లి మండలం నేరెళ్ల వద్ద 42.8, వీర్నపల్లి 42.7, గంభీరావుపేట మండలం గజసింగారం వద్ద 42.5, గంభీరావుపేట 42.4, ఎల్లారెడ్డిపేట 42.3, ముస్తాబాద్ మండలం ఆవునూరు వద్ద 42.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బోసిపోయిన వీధులు ఎండల ధాటికి పగటి పూట సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లోని వీధులు బోసిపోయాయి. ఎండలు.. వడగాలులతో జనం ఇబ్బంది పడ్డారు. అత్యవసర పనుల కోసం రోడ్డుపైకి వచ్చిన వారు నెత్తిన టవల్స్తో కనిపించారు. ఎప్పుడూ రద్దీగా ఉండే సిరిసిల్ల పట్టణ గాంధీచౌక్ కూడలి జనసంచారం లేక వెలవెలబోయింది. ఎండల వేడి తగ్గించే చల్లని వర్షాల కోసం జనం నిరీక్షిస్తున్నారు. -
అప్రమత్తంగా ఉండాలి
వీర్నపల్లి(సిరిసిల్ల): వీర్నపల్లి సెక్షన్ పరిధిలోని అటవీ ప్రాంతాలను మంగళవారం రాజన్న సిరిసిల్ల– కరీంనగర్ జిల్లా అటవీ అధికారి ఎస్.సత్యనారాయణ క్షేత్రస్థాయిలో సందర్శించారు. అటవీ రక్షణ, వన్యప్రాణుల సంరక్షణ కార్యక్రమాల అమలు తీరును పరిశీలించారు. అనంతరం అటవీ ప్రాంతాల్లో ఉపాధి పథకం ఆధ్వర్యంలో చేపడుతున్న భూసార, తేమ సంరక్షణ పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎఫ్వో మాట్లాడుతూ, అటవీ ప్రాంతాల్లో చేపడుతున్న ప్రతీ పనిలో నాణ్యత లోపించకుండా, నిర్దేశిత ప్రమాణాల ప్రకారం సమర్థవంతంగా పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. అటవీ ప్రాంతాల్లో ఎలాంటి అ క్రమ కార్యకలాపాలు జరగకుండా సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించా లని సూచించారు. సిరిసిల్ల రేంజ్ అధికారి జి.నాగేశ్వరరావు, డిప్యూటీ రేంజ్ అధికారి మోహన్లాల్, సెక్షన్ అధికారులు సకారాం, శ్రావణ్కుమార్, బీట్ అధికారులు కిరణ్, రజిత, సతీశ్, తిరుపతినాయక్, శ్రీకాంత్, అనూష తదితరులు పాల్గొన్నారు. సదరం శిబిరాల తేదీలుసిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో జూన్లో నిర్వహించే సదరం శిబిరాల తేదీలు ఖరారు అయినట్లు ఆస్పత్రి పర్యవేక్షకులు డాక్టర్ ప్రవీణ్కుమార్ మంగళవారం తెలిపారు. జూన్ 1న ఆర్థో(ఎముకల) శిబిరం ఉంటుందని, 4న వినికిడి, మానసిక వైకల్య పరీక్షలు, 5న ఆర్థో(ఎముకలు), వినికిడి, 8న ఆర్థో(ఎముకల), కంటిచూపు పరీక్షలు నిర్వహిస్తారని వివరించారు. 9న ఆర్థో(ఎముకల), 15న కంటిచూపు, 16న ఆర్థో(ఎముకల), 18న సాదారణ (జనరల్) పరీక్షలు జరుగుతాయని వివరించారు. సదరం శిబిరాలకు దివ్యాంగులు సంబంధిత మెడికల్ డాక్యుమెంట్లు, ఎక్స్ రే, యూడీఐడీ అప్లికేషన్ ఫాం, ఆధార్, పాస్పోర్టు సైజు ఫొటోలు, ఫోన్ నంబరు వెంట తీసుకుని ఉదయం 9 గంటలకు జిల్లా ఆస్పత్రికి రావాలని ప్రవీణ్కుమార్ కోరారు. -
మాదక ద్రవ్యాలపై నిరంతర నిఘా
● అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్సిరిసిల్ల: మాదక ద్రవ్యాలపై నిరంతరం నిఘా ఉంచాలని, వాటి వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ కోరారు. జిల్లాలో డ్రగ్స్, మాదక ద్రవ్యాల వినియోగం, రవాణా నియంత్రణకు చేపడుతున్న చర్యలపై మంగళవారం కలెక్టరేట్లో అదనపు ఎస్పీ చంద్రయ్యతో కలిసి జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో నమోదైన ఎన్డీపీఎస్ కేసులు, మాదక ద్రవ్యాల సాగు నివారణ చర్యలు, విద్యార్థులు, యువత డ్రగ్స్ వినియోగించకుండా నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, మాదక ద్రవ్యాలపై నిరంతర నిఘా కొనసాగించాలని, గ్రామస్థాయి నుంచి పట్టణాల వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. డ్రగ్స్కు అలవాటు పడిన వ్యక్తులను గుర్తించి వారికి వైద్య సేవలు, కౌన్సెలింగ్ అందించేలా చర్యలు చేపట్టాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డీ–అడిక్షన్ కౌన్సెలింగ్ కేంద్రం ద్వారా బాధితులకు చికిత్స, మానసిక పరమైన మార్గదర్శకత్వం అందిస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఏఎస్పీ మాట్లాడుతూ, జిల్లాలో గంజాయి రవాణా, విక్రయాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని వివరించారు. అనుమానాస్పద ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తూ, విద్యాసంస్థలు, పబ్లిక్ ప్రదేశాల్లో డ్రగ్స్ వల్ల కలిగే ప్రమాదాలపై పోలీస్, ఎకై ్సజ్, విద్యాశాఖల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. సమావేశంలో ఎకై ్సజ్ అధికారి శ్రీనివాసరావు, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి శరత్, కార్మిక శాఖ అధికారి నజీర్ అహ్మద్, కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలున్నా.. సమన్వయంతో సేకరిస్తున్నాం
సిరిసిల్ల: జిల్లా యంత్రాంగం ధాన్యం కొనుగోళ్లకు అత్యంత ప్రాధాన్యమిస్తోంది. ఆదివారం సెలవు రోజు అయినా అధికారులు ధాన్యం సేకరణ, రవాణాపై ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారు. కలెక్టర్ గరీమా అగ్రవాల్ ప్రత్యేక చొరవతో అన్ని మండలాలకు ప్రత్యేకాధికారులను నియమించి, నిత్యం టెలీకాన్ఫరెన్స్లో సమీక్షిస్తున్నారు. హమాలీల కొరత, లారీల సమస్యలు, లోడింగ్, అన్లోడింగ్ సమస్యలు ఎదురైనా.. సమన్వయంతో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లను కొనసాగిస్తున్నామని అదనపు కలెక్టర్(రెవెన్యూ) గడ్డం నగేశ్ అన్నారు. ఇప్పటికే 2 లక్షల టన్నుల ధాన్యం సేకరణ పూర్తయిందని తెలిపారు. సోమవారం ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు వివరాలు వెల్లడించారు. ఆ విశేషాలివీ..● హమాలీలు, లారీల కొరతను ఎలా అధిగమించారు? అదనపు కలెక్టర్: హమాలీల సమస్య మొదట్లో ఉంది. ఎండలతో స్థానికంగా తూకం వేసే హమాలీలు సైతం ఇబ్బందులు పడ్డారు. కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల జరగడంతో వలస కార్మికులు రైస్ మిల్లులకు వస్తామని చెప్పిన సమయానికి రాలేదు. ఇప్పుడు ఆ సమస్య లేదు. లారీల సమస్య ఉన్నా ట్రాక్టర్లలోనూ వడ్లను తరలించే అవకాశాన్ని కలెక్టర్ కల్పించారు. దీంతో లారీల సమస్య కొంత మేరకు తీరింది. లారీల కాంట్రాక్టర్లతో నిత్యం మాట్లాడుతూ ధాన్యం రవాణాకు ఏర్పాట్లు చేస్తున్నాం. వడ్లను తూకం వేసి 24 గంటల్లోనూ మిల్లులకు, గోడౌన్లకు తరలిస్తున్నాం. ఇప్పటికే ఏడు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తవవడంతో, మూసి వేశారు. అక్కడి హామాలీలను, లారీలను ఇతర ప్రాంతాలకు తరలించాం. ● జిల్లాలో ఎన్ని మిల్లులకు ధాన్యం కేటాయించారు? అదనపు కలెక్టర్: జిల్లాలో 38 పారాబాయిల్డ్ మిల్లులకు ప్రభుత్వ నిబంధనల మేరకు ధాన్యం కేటాయించాం. మరో నాలుగు రా రైస్మిల్లులకూ కేటాయించాం. వ్యవసాయ మార్కెట్ కమిటీలకు చెందిన ఆరు గోదాములు, అపెరల్పార్క్లోని మరో గోదాములోనూ ధాన్యం నిల్వ చేస్తున్నాం. జిల్లాలో ధాన్యం నిల్వ చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ● ధాన్యం అమ్మిన రైతులకు చెల్లింపులు ఎలా చేస్తున్నారు? అదనపు కలెక్టర్: ధాన్యం కొనుగోలు చేసి, ట్యాబ్ ఎంట్రీ చేయిస్తున్నాం. ఆదివారం సెలవు రోజు సైతం ఆన్లైన్ ట్యాబ్ ఎంట్రీ చేయించాం. ఇప్పటికే జిల్లాలో 19,990 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా రూ.323.97 కోట్లు జమయింది. రైతులు వడ్లను అమ్ముకున్న వారం రోజుల్లో వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమచేస్తున్నాం. పేమెంట్ ఇబ్బందులు లేవు. ● మొక్కజొన్న కొనుగోళ్లు ఎలా సాగుతున్నాయి? అదనపు కలెక్టర్: జిల్లాలో రుద్రంగి, ఇల్లంతకుంట మండల కేంద్రాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఇప్పటి వరకు రుద్రంగిలో 534 మంది వద్ద 45,900 బస్తాల మొక్కజొన్నలను కొనుగోలు చేశాం. ఇల్లంతకుంటలో 273 మంది వద్ద 32,281 బస్తాలను కొనుగోలు చేశాం. జిల్లాలో మొత్తం 807 మంది రైతుల వద్ద 3,909.050 టన్నుల మొక్కజొన్నలు కొనుగోలు చేశాం. ● ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు ఉంటే ఎవరికి ఫిర్యాదు చేయాలి? అదనపు కలెక్టర్: ఎక్కడ కూడా రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. తాగునీటి వసతి, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ప్రాథమిక చికిత్స కిట్లు, టెంటు సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించాం. కొనుగోళ్లలో ఇబ్బందులు నివారించేందుకు కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఫోన్ నంబరు: 63039 28692 ఏర్పాటు చేశాం. టోల్ ఫ్రీ నంబర్లు 1800 4250 0333, 1967 ఉన్నాయి. రైతులకు ఏమైనా ఇబ్బంది ఎదురైతే ఈ ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు. ధాన్యం సేకరణ లక్ష్యమెంత? ఇప్పటికీ కొనుగోలు చేసిందెంత? అదనపు కలెక్టర్: జిల్లాలో యాసంగి సీజన్లో 1,87,189 ఎకరాల్లో వరిపంటను సాగుచేశారు. ఇందులో దొడ్డు రకం 1,79,650 ఎకరాలు, 7,539 ఎకరాల్లో సన్నరకం సాగుచేశారు. మొత్తంగా 3.50 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశాం. ఇందులో 3 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లాలో 236 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి 2 లక్షల టన్నుల ధాన్యం సేకరించాం. సగటున నిత్యం 8 వేల నుంచి 10 వేల టన్నులు కొనుగోలు చేస్తున్నాం. -
కష్టపడితే ఉన్నత శిఖరాలు
ఎల్లారెడ్డిపేట: అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం అనే మూల సిద్ధాంతాలకు కట్టుబడి.. ప్రతీ ఒక్కరు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని స్వెరోస్ నెట్వర్క్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ మారుపాక రాజు కోరారు. స్వెరోస్ నెట్వర్క్ విక్టరీ డే సందర్భంగా సోమవారం రాచర్ల బొప్పాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 500కు పైగా మార్కులు సాధించిన పదో తరగతి విద్యార్థులు 20 మందిని సన్మానించారు. ఎంఈవో కృష్ణహరి, సర్పంచ్ ఇల్లందుల గీతాంజలి, స్వెరోస్ నెట్వర్క్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల మహేశ్, జిల్లా ఉపాధ్యక్షుడు తెడ్డు నరేశ్, మండల అధ్యక్షుడు గుర్రాల రాజశేఖర్రెడ్డి, హెచ్ఎం కృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
సిరిసిల్లలో హిమాన్షు సందడి
సిరిసిల్లటౌన్/గంభీరావుపేట/వేములవాడ: మాజీ సీఎం కేసీఆర్ మనవడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు సోమవారం రాజన్నసిరిసిల్ల జిల్లాలో సందడి చేశారు. తన స్నేహితులతో కలిసి పట్టణానికి వచ్చిన హిమాన్షు షాపింగ్ చేశారు. చేనేత శిల్పి వెల్ది హరిప్రసాద్ ఇంటికెళ్లి చేనేత చీరలను ఖరీదు చేశారు. కేటీఆర్ ఫొటోతో నేసిన ఉత్పత్తులను తిలకించారు. అనంతరం తన తండ్రి వీరాభిమాని గాంధీచౌక్లో నెలకొల్పిన కేటీఆర్ టీస్టాల్ను సందర్శించి, స్నేహితులతో కలిసి చాయ్ తాగారు. అంతకుముందు వేములవాడ భీమేశ్వరస్వామి దర్శించుకున్నారు. అక్కడి నుంచి గంభీరావుపేటలోని కేజీ టు పీజీ ప్రాంగణాన్ని పరిశీలించారు. ఆయన వెంట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, టీఎస్పీటీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, పార్టీ రాష్ట్ర నాయకుడు బొల్లి రామ్మోహన్, ఏఎంసీ మాజీ చైర్మన్ ఏనుగు మనోహర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సేవలకు సలాం
సిరిసిల్లటౌన్: కడుపునొప్పి..గుండెనొప్పి..యాక్సిడెంట్.. డెలివరీ.. సమస్య ఏదైనా మొదట గుర్తొచ్చేది 108. ఒక్క ఫోన్కాల్తో మన వద్దకు వచ్చి ఆస్పత్రిలో చేర్పిస్తుంటారు. రాత్రి, పగలు తేడా లేకుండా నిమిషాల్లోనే సంఘటన స్థలానికి చేరుకుంటున్న వీరి సేవలకు సలామ్ కొట్టాల్సిందే. నేడు 108 అంబులెన్స్ పైలెట్ల దినోత్సవం సందర్భంగా వారి నిస్వార్థ సేవలపై ప్రత్యేక కథనం.ఈ చిత్రం తంగళ్లపల్లి మండలం ఓబులాపూర్. ఈ గ్రామంలోని వృద్ధాశ్రమంలో ఉంటున్న ఓ అవ్వ జనవరి 10న అస్వస్థతకు గురైంది. ఫోన్కాల్ రావడంతో 108 సిబ్బంది అక్కడికి వెళ్లారు. ఆశ్రమానికి వెళ్లే దారి బురదమయం కావడంతో పైలెట్లు అవ్వను ఇలా స్ట్రెచ్చర్పై మోసుకొచ్చి జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. -
భీమన్నకు భక్త జనహారతి
వేములవాడ: భీమన్నను సోమవారం 40 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. వేసవి సెలవులు చివరి దశకు చేరుకోవడంతో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు భారీగా తరలివస్తున్నారు. భీమన్నకు అభిషేకాలు, అన్నపూజలు, కోడె మొక్కులు, కల్యాణాలు, సత్యనారాయణ వ్రతాలు, అమ్మవారికి కుంకుమ పూజ మొక్కులు చెల్లించుకున్నారు. వీఐపీల రద్దీ పెరిగిపోవడంతో ప్రొటోకాల్ కార్యాలయం కిటకిటలాడింది. బ్రేక్ దర్శనాలు, వీఐపీ కోడె టికెట్ తీసుకున్న భక్తులకు రూ.100కు స్వామి వారి క్యాలెండర్ అందజేశారు. వీఐపీల పేరున ఇతరులు భక్తులకు దర్శనాలు చేయిస్తున్నారన్న సమాచారం అందుకున్న అధికారులు శంకరమఠం ప్రధాన గేటును మూసివేసి ప్రత్యేక సిబ్బందిని నియమించారు. టికెట్ లేకుండా ఎవరినీ అనుమతించలేదు. ఈవో రమాదేవి, ఏఈవో అశోక్, పర్యవేక్షకులు భక్తుల ఏర్పాట్లను పరిశీలించారు. -
పాలిటెక్నిక్తో ఉజ్వల భవిష్యత్తు
సప్తగిరికాలనీ(కరీంనగర్): నేటి వేగవంతమైన ప్రపంచంలో కేవలం డిగ్రీలు ఉండడం కంటే చేతిలో నైపుణ్యం ఉండడమే అసలైన విజయం. పదోతరగతి పూర్తి కాగానే విద్యార్థుల ముందున్న అత్యుత్తమ మార్గం పాలిటెక్నిక్ అని పలువురు విద్యావిశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ఒక కోర్సు మాత్రమే కాదు.. తక్కువ కాలంలోనే ఒక ఇంజనీర్గా విద్యార్థులను తీర్చిదిద్దే అద్భుతమైన వేదిక. డిగ్రీలు దాహాన్ని తీర్చవు.. నైపుణ్యం మాత్రమే ఆకలిని తీరుస్తుంది అనే నినాదంతో సాంకేతిక విద్య వైపు అడుగులు వేయడం విద్యార్థుల తక్షణ అవసరమంటున్నారు. రేపటి నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో అర్హత సాధించిన అభ్యర్థులు కౌన్సెలింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ముఖ్యంగా ఆన్లైన్ స్లాట్ బుకింగ్ తదితర వాటిపై కూడా అవగాహన కలిగి ఉండాలి. ఈ నేపథ్యంలో విద్యార్థుల కోసం సాక్షి ప్రత్యేక కథనం. ● తక్కువ వయసులోనే స్థిరత్వం 18–19 ఏళ్లకే టెక్నికల్ డిప్లొమా పూర్తి చేసి ఉద్యోగంలో చేరే అవకాశం పాలిటెక్నిక్ కల్పిస్తుంది. ● ప్రాక్టికల్ నాలెడ్జ్పుస్తకాల్లోని పాఠాల కంటే ల్యాబుల్లో ప్రయోగాత్మక విద్యకు ఇక్కడ పెద్దపీట వేస్తారు. ● ఇంజనీరింగ్ సులభంపాలిటెక్నిక్ పూర్తి చేసిన వారు నేరుగా బీటెక్ రెండో సంవత్సరంలో చేరొచ్చు. ● ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు రైల్వేలు, పీఎస్యూ, రక్షణ రంగాల్లో డిప్లొమా ట్రెయినీ హోదాలో అత్యుత్తమ జీతంతో కొలువులు సాధించొచ్చు. ● స్లాట్ బుకింగ్.. కౌన్సెలింగ్లో పాల్గొనడానికి తొలుత స్లాట్ బుకింగ్ వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. హాల్ టికెట్ నంబర్, ర్యాంక్, పుట్టిన తేదీ నమోదు చేయాలి. మీకు దగ్గరలోని హెల్ప్లైన్ సెంటర్ తేదీ, సమయాన్ని ఎంచుకొని బుక్ చేసుకోవాలి. బుకింగ్ పూర్తయ్యాక వచ్చే రసీదును తప్పనిసరిగా ప్రింట్ తీసుకోవాలి. ● ఫీజు వివరాలు.. ప్రాసెసింగ్ ఫీజును ఆన్లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలి. ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.600, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.300 చెల్లించాలి. ● సర్టిఫికెట్లు.. సర్టిఫికెట్ వెరిఫికేషన్కు ఒరిజినల్ పత్రాలతోపాటు 2 సెట్ల జిరాక్స్ కాపీలు తీసుకెళ్లాలి. పాలిసెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్, ఎస్సెస్సీ మార్కుల మెమో, టీసీ, 4వతరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం(బీసీ, ఎస్సీ, ఎస్టీ), ఆదాయ ధ్రువీకరణ పత్రం(01.01.2026 తర్వాత పొంది ఉండాలి). ● వెబ్ ఆప్షన్.. విద్యార్థులు కోరుకున్న సీటు రావాలంటే ఆప్షన్లు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ఆప్షన్లు పరిమితంగా కాకుండా ఎక్కువ సంఖ్యలో కాలేజీలను ఎంచుకోవాలి. నచ్చిన బ్రాంచి, కాలేజీని మొదటి వరుసలో ఉంచాలి. ఆప్షన్లు సేవ్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు సరి చూసుకోవాలి. ● ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు ● డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రభుత్వ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్, కరీంనగర్. ● ఎస్ఆర్ఆర్ఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, అగ్రహారం, రాజన్న సిరిసిల్ల. ● ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, కోరుట్ల. ● ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, హుస్నాబాద్. ● జ్యోతిష్మతి పాలిటెక్నిక్ కళాశాల, కరీంనగర్ ● వాగేశ్వరి పాలిటెక్నిక్ కళాశాల, కరీంనగర్ ● ట్రినిటీ పాలిటెక్నిక్ కళాశాల, పెద్దపల్లి ● మదర్ థెరిసా పాలిటెక్నిక్ కళాశాల, పెద్దపల్లి ● ఉమ్మడి జిల్లాలో హెల్ప్లైన్ కేంద్రాలు ● డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రభుత్వ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్, కరీంనగర్. ● ఎస్ఆర్ఆర్ఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, అగ్రహారం, రాజన్న సిరిసిల్ల. ● ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, కోరుట్ల. ● ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, హుస్నాబాద్. ● ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, రాజగోపాల్పేట్, సిద్దిపేట. ● ప్రభుత్వ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్, చిన్నకోడూరు, సిద్దిపేట. ● పాలిసెట్ 2026 మొదటి దశ కౌన్సెలింగ్ షెడ్యూల్ ● స్లాట్ బుకింగ్ సర్టిఫికెట్ల ధ్రువీకరణ మే 27 నుంచి మే 31 వరకు. ● స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్ పరిశీలన మే 29 నుంచి జూన్ 1 వరకు. ● సర్టిఫికెట్ ధ్రువీకరణ అనంతరం ఎంపికలను వినియోగించుకోవడం మే 29 నుంచి జూన్ 3 వరకు. ● ఎంపికలను స్తంభింపజేయడం జూన్ 3. ● సీట్ల కేటాయింపు జూన్ 6 లేదా అంతకుముందు. ● వెబ్సైట్ ద్వారా ఫీజు చెల్లింపు, స్వీయ నివేదన జూన్ 6 నుంచి జూన్ 9 వరకు. ● కేటాయించిన కళాశాలలో రిపోర్టింగ్ జూన్ 8 నుంచి జూన్ 9 వరకు. ● విద్యాసంవత్సరం ప్రారంభం జూన్ 9 నుంచి. ● ఓరియంటేషన్ జూన్ 8 నుంచి జూన్ 10 వరకు. రేపటి నుంచి కౌన్సెలింగ్ ఉమ్మడి జిల్లాలో 6 హెల్ప్లైన్ కేంద్రాలు -
గాలివాన బీభత్సం
ఇల్లంతకుంట/ఎల్లారెడ్డిపేట: జిల్లాలో సోమవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. రోడ్లపై చెట్లు విరిగిపడగా.. విద్యుత్స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు వంగిపోయాయి. ఇల్లంతకుంట మండల వ్యాప్తంగా 45 విద్యుత్తు స్తంభాలు నేలకొ రిగాయి. ఐదు డీటీఆర్ 25 కేటీ విద్యుత్ ట్రాన్స్ఫా ర్మర్లు విరిగిపోయాయి. పత్తికుంటపల్లెలో మూడు ఇళ్లపైన రేకులు లేచిపోయాయి. అదే గ్రామానికి చెందిన చింతలపల్లి సత్యారెడ్డి ట్రాక్టర్పై వస్తుండగా చెట్టు విరిగి తలపై పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. రోడ్లపై పడిన చెట్లను ఆయా గ్రామాల స ర్పంచులు జుట్టు శేఖర్, బద్దం శేఖర్రెడ్డి, నాగరాజు జేసీబీలతో తొలగింపజేశారు. పత్తికుంటపల్లెలో పొద్దుతిరుగుడు, వడ్ల కుప్పలు తడిసిపోయాయి. పిడుగుపాటుతో ఎద్దు మృతి ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్లో కారుపై చెట్టు విరిగిపడడంతో ధ్వంసమైంది. గుంటపల్లి చెరువుతండాలో కిషన్నాయక్ చెందిన ఎద్దు పిడుగుపాటుతో చనిపోయింది. రాజన్నపేటలోని శ్మశానవాటికలో రేకులషెడ్డు లేచిపోయింది. ఈదురుగాలులతో రైతులకు అపారనష్టం వాటిల్లింది. ఎన్పీడీసీఎల్ అధికారుల పరిశీలనఇల్లంతకుంట మండలంలో ఈదురుగాలుల బీభత్సానికి స్తంభాలు విరిగి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో త్వరగా పునరుద్ధరిస్తామని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ వేణమాధవ్ పేర్కొన్నా రు. కేసన్నపల్లిలో విరిగిన స్తంభాలను డీఈ అంజయ్య, ఏడీ గోపీనాథ్లతో కలిసి పరిశీలించారు. ఏఈ నగేశ్కుమార్, సర్పంచ్ పోతరాజు చంటి, లైన్ ఇన్స్పెక్టర్ తిరుపతి ఉన్నారు. -
పిల్లలం–బడి పిల్లలం
మేం పిల్లలం బడి పిల్లలం మా భరతమాత మల్లెలం రోజు వెళతాం మా బడికి జీవిత పాఠం నేర్పే గుడికి ! జాతీయ గీతం పఠిస్తం వందేమాతరం జపిస్తం ప్రతిజ్ఞ పాలన పాటిస్తం త్రికరణ శుధ్ధికి చోటిస్తం ఆటలు అంటే మాకెంతో ప్రేమ! ఆ ఆటలకై మేం పడతాం శ్రమ పాటలంటే మాకెంతో ప్రాణం వినిపిస్తాం మేం గంధర్వ గానం పాటలకు పల్లవియే ప్రాణం ఆటలకు చెల్లదు నిస్త్రాణం గురువు చెప్పిన ఈ మాట మరువం మేము ఏ పూట ! ఆటపాటల ఆయువును పట్టి తెలివితేటలతో మేం జతకట్టి మైదానంలో ఆడుతాం నిత్యం నిదానం పాటించుట సత్యం! పాటల పల్లకి వెంటనే ఎక్కి పాటల పల్లవికే ఉంటేనే చిక్కి పాట స్ఫూర్తిని పెంచుకుంటం గెలుపు బాటను ఎంచుకుంటం ! గుర్రాల లక్ష్మారెడ్డి, కవి రచయిత ఊరు: కల్వకుర్తి జిల్లా: నాగర్ కర్నూల్ -
ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా చేపట్టాలి
తంగళ్లపల్లి: మండలంలోని సారంపల్లిలో ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట–హైదరాబాద్ ప్రధాన రహదారిపై సోమవారం రైతులు బైఠాయించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి నెలలు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఐకేపీ కేంద్రాల్లో రైతులు కాంటా పెట్టి రో జులు గడుస్తున్నా ఒక్క లారీ కూడా రావడం లేద న్నారు. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారులు, కలెక్టర్ స్పందించి కొనుగోలు కేంద్రాలకు లారీలు పంపి ధాన్యం తరలించాలని డిమాండ్ చేశారు. -
బావిలో దూకి వృద్ధురాలి ఆత్మహత్య
చందుర్తి(వేములవాడ): అనారోగ్య సమస్యను భరించలేక ఓ వృద్ధురాలు వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన చందుర్తి మండలం మల్యాలలో విషాదం నింపింది. పోలీసులు తెలిపిన వివరాలు. మల్యాలకు చెందిన కట్కూరి లచ్చవ్వ(72) ఆరు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఇటీవల కిడ్నీ సమస్య తలెత్తడంతో డయాలసిస్ చేసుకుంటుంది. ఈ భాదను భరించలేక గ్రామ శివారులోని వ్యవసాయబావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చందుర్తి ఎస్సై రమేశ్ తెలిపారు. మోహినికుంటలో యువకుడు.. ముస్తాబాద్(సిరిసిల్ల): భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపం చెందిన యువకుడు బలవన్మరణానికి పాల్ప డ్డాడు. ఎస్సై గణేశ్ తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంటకు చెందిన మోతె పూర్ణచందర్(30)కు రెండేళ్ల క్రితం వివాహమైంది. ఆరు నెలల క్రితం భార్య ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లగా కూతురు జన్మించింది. అప్పటి నుంచి అతని భార్య తల్లిగారింటి వద్దనే ఉంటోంది. పూర్ణచందర్ మద్యానికి బానిసయ్యాడు. అత్తగారింట్లో ఎల్లమ్మ పండగ సోమవారం ఉండగా వెళ్లలేదు. మద్యం మత్తులో ఉన్న పూర్ణచందర్ భార్య కాపురానికి రావడం లేదని ఎలా వెళ్లేదంటూ మనస్తాపం చెంది తన గదిలో చీరతో ఉరివేసుకున్నాడు. గమనించిన తండ్రి కిషన్ వెంటనే తలుపులు బద్దలు కొట్టి కొడుకును కిందకు దింపి ముస్తాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించాడు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్ తెలిపారు. తండ్రి కిషన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. గుర్తు తెలియని మహిళ మృతి వేములవాడఅర్బన్: వేములవాడ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభించింది. మృతురాలి వయసు సుమారు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండవచ్చని వేములవాడటౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు. మృతురాలి వివరాలు తెలిస్తే టౌన్ ఠాణాలో 87126 56413లో సంప్రదించాలని కోరారు. -
13 అంగన్వాడీలు ప్రారంభం
సిరిసిల్ల: జిల్లాలోని 13 అంగన్వాడీ భవనాలను సీఎం రేవంత్రెడ్డి సోమవారం వర్చువల్గా ప్రారంభించారు. ‘మహిళా సంక్షేమ వారోత్సవాల’ సందర్భంగా జిల్లాలోని 103 ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణాలకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. కలెక్టర్ గరీమా అగ్రవాల్, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్, అదనపు డీఆర్డీవో శ్రీనివాస్ పాల్గొన్నారు. వారం రోజుల్లో కొనుగోళ్లు ముగించాలి ధాన్యం కొనుగోళ్లను వారం రోజుల్లో ముగించాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి టెలీకాన్ఫరెన్స్లో మాట్లాడారు. మండలాల వారీగా కొనుగోలు కేంద్రాల్లోని పరిస్థితులు, ధాన్యం నిల్వ సామర్థ్యం వివరాలు ఆరా తీశా రు. రైస్మిల్లులకు టార్గెట్ ఇవ్వాలని ఆదేశించారు. తూకం వేసిన ధాన్యం బస్తాలు తరలించేందుకు సరిపడా వాహనాలు సమకూర్చాలని సూచించారు. సిరిసిల్ల: బాధితులకు పోలీసులు అండగా నిలవాలని ఎస్పీ మహేశ్ బీ గీతే కోరారు. ఎస్పీ ఆఫీస్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో 41 మంది నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. దరఖాస్తులను ఆన్లైన్ చేసి బాధితులతో మాట్లాడారు. ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం న్యాయం జరిగే విధంగా చూడాలని సూచించారు. ముస్తాబాద్(సిరిసిల్ల): ఆరోగ్యవంతమైన సమాజం కోసం కలిసి కట్టుగా పనిచేయాలని జిల్లా ఇమ్యూనైజేషన్ ఆఫీసర్ డాక్టర్ సంపత్ కోరారు. ముస్తాబాద్ మండలం పోతుగల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ఇమ్యూనైజేషన్ ఆఫీసర్ సంపత్ సోమవారం తనిఖీ చేశారు. గర్భిణీలు, పిల్లలకు అందిస్తున్న టీకాలను పరిశీలించారు. వైద్యాధికారి అఫీజ, పీహెచ్ఎన్ జ్యోతి, హెచ్ఈవో భూమయ్య, సూపర్వైజర్ ప్రసాద్ ఉన్నారు. బోయినపల్లి(చొప్పదండి): కాంగ్రెస్ అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధిని చూసి పలువు రు పార్టీలో చేరుతున్నారని చొప్పదండి ఎమ్మె ల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. మండలంలోని కోరెంకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు ముడుపు మల్లారెడ్డి సోమవారం కాంగ్రెస్లో చేరారు. పార్టీ మండల అధ్యక్షుడు కొమ్మనబో యిన సువీన్, నాయకులు వన్నెల రమణా రెడ్డి, అజయ్, పులి హన్మాండ్లు పాల్గొన్నారు. పల్లె పరిపాలనలో కుదుపు సిరిసిల్ల: గ్రామపంచాయతీ పరిపాలనలో కీలకమైన పంచాయతీ కార్యదర్శులను బదిలీ చేస్తూ కలెక్టర్ గరీమా అగ్రవాల్ సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. 77 మంది పంచాయతీ కార్యదర్శులను బదిలీ చేయడంతో ఒక్కసారిగా పల్లెపరిపాలన భారీ కుదుపునకు గురైంది. ఒకే ప్రాంతంలో నాలుగేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న కార్యదర్శులను గుర్తించి కలెక్టర్ కౌన్సెలింగ్ చేశారు. సొంత మండలం కాకుండా.. చేసిన మండలాన్ని మళ్లీ కేటాయించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. జిల్లా పంచాయతీ అధికారి షరీఫొద్దీన్, డీఎల్పీవో నరేశ్ పాల్గొన్నారు. ఆలయ ఉద్యోగులకు బదిలీ వేములవాడ: రాజన్న ఆలయంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఉద్యోగులకు బదిలీ అయ్యింది. పర్యవేక్షకులు వెంకటప్రసాద్ యా దగిరిగుట్టకు, సంజీవ్రావు బాసర ఆలయాలకు బదిలీ అయ్యారు. కోరుకున్న చోటుకు వె ళ్లేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆలయ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. -
పెండింగ్ పెట్టొద్దు
● కలెక్టర్ గరీమా అగ్రవాల్ ● ప్రజావాణిలో 300 అర్జీలు స్వీకరణసిరిసిల్ల అర్బన్: ప్రజావాణి అర్జీలను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో బాధితులు నుంచి అర్జీలు స్వీకరించారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దాదాపు 300 దరఖాస్తులు వచ్చాయి. సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆర్డీవో రాజేందర్రెడ్డి 9 దరఖాస్తులు స్వీకరించారు. వేములవాడలో ఆర్డీవో కేఎస్బీ కుమారి 12 దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులు పెండింగ్లో పెట్టవద్దని, ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.సిరిసిల్ల పట్టణంలో రూ.50 లక్షలు ఖర్చు చేసి నాలుగు పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించారు. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు వినియోగంలో లేవు. వాటి నిర్వహణకు రూ.12,500 చొప్పున చెల్లించారు. ఆ డబ్బుల దుర్వినియోగంపై విచారణ చేపట్టండి. టాయిలెట్స్ను వినియోగంలోకి తీసుకురండి. – మేకల కమలాకర్, సంజీవయ్యనగర్, సిరిసిల్లగంభీరావుపేట మండలం నర్మాల, కోళ్లమద్ది, బరిగెలగూడెం గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పనులకు మూడేళ్ల క్రితం నీటి సరఫరా చేశాను. ఆ బిల్లులు అధికారులు ఇవ్వడం లేదు. బిల్లులు ఇప్పించండి. – ఎ.కేశవరావు, మాజీ సర్పంచ్, కోళ్లమద్దినేను గతంలో మవోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా పని చేసిన. 2023లో ప్రభుత్వ పిలుపు మేరకు కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎదుట జనజీవన స్రవంతిలో కలిసిన. నాకు ప్రభుత్వం ప్రకటించిన 3 గుంటల నివాస స్థలం, 5 ఎకరాల వ్యవసాయ భూమి ఇప్పించండి. ప్రస్తుతం నా ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం ఇస్తానన్న భూమిని ఇచ్చి న్యాయం చేయండి. – జ్యోతి అలియాస్ జ్యోతక్క, మాజీ మావోయిస్టు -
పొడుపు కథలు
01. ‘డెన్’లకు మార్కు లేసే దేశం ఏది? 02. ‘పాన్’లు వేసుకునే దేశం? 03. బీదదైన సింహం ఉండే దేశం? 04. బంగళాలు మాత్రమే ఉండే దేశం? 05. ‘జెర్మన్స్’ ఎక్కువగా ఉండే దేశం? 06. ఒక దీవిని మర్యాదగా పిలిచే దేశం? 07. ‘బాయ్’ మాత్రమే ఉండి ‘గర్ల్’ లేని దేశం? 08. ఈ దేశంలో ఏదైనా ‘ఈజీ’ నే? 09. ‘ఖ’కు మేనియా వచ్చిన దేశం? 10. ‘షియా’ తెగ మనుషులు ఎక్కువగా ఉండే దేశం? 11. మెరికల్లాంటి ప్రజలు ఉండే దేశం? 12. ఫిలిప్ ఉండే దేశం? 13. దారి లేని దేశమేది? 14. ‘రాక్’లున్న దేశమేది? 15. రమ్మని పిలిచి ‘బోడి’ అని ఎగతాళి చేసే దేశమేది? 16. ‘వి’ కోసం ప్రయత్నించే దేశమేది? 17. ‘టాన్’ కలిగిన దేశమేది? 18. త్వరగా రమ్మని పిలిచే దేశమేది? 19. తీగల్ని పందిరికి పాకిస్తా అనే దేశమేది? 20. పేరులో పాలున్న దేశమేది? పేరు: దూపాటి చేతన్ హర్షిత్ తరగతి: 7వ తరగతి పాఠశాల: ఇన్నోవేటివ్ హైస్కూల్, షాపూర్నగర్ స్వస్థలం: కరీంనగర్ డాక్టర్ కందేపి రాణిప్రసాద్ మేనేజింగ్ డైరెక్టర్, సృజన్ చిల్డ్రన్స్ హాస్పిటల్, సిరిసిల్ల పేరు: దేవరాజ్ ఆరాధ్య తరగతి: ఒకటో తరగతి పాఠశాల: బ్రిలియంట్ మోడల్ స్కూల్ గ్రామం: నస్పూర్ జిల్లా: మంచిర్యాల పేరు: పెరుక సిద్ధార్థ తరగతి: 9వ తరగతి పాఠశాల: జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల గ్రామం: కొత్తపల్లి జిల్లా: పెద్దపల్లి పేరు: తుమ్మనపల్లి శ్రీయాన్ తరగతి: 6వ తరగతి పాఠశాల: శ్రీచైతన్య స్కూల్ గ్రామం: జగిత్యాల పేరు: దండు అంజనాశ్రీ తరగతి: 8వ తరగతి పాఠశా: గర్రెపల్లి మోడల్ స్కూల్ గ్రామం: బొమ్మకల్ జిల్లా: కరీంనగర్ పేరు: జి.అక్షర తరగతి: 8వ తరగతి పాఠశాల: లెజెండ్ హైస్కూల్ ఊరు: భగత్ నగర్, కరీంన గర్ పేరు: జి.వర్షిత్ తరగతి: 8వ తరగతి పాఠశాల: శ్రీసాయిరాం హైస్కూల్, గ్రామం: ఇందిరా పార్క్, హైదరా బాద్ జవాబులు: 01. డెన్మార్క్, 02.జపాన్, 03.సింగపూర్, 04.బంగ్లాదేశ్, 05.జర్మనీ, 06.శ్రీలంక, 07.దుబాయ్, 08.ఈజిప్టు, 09.ఆర్మేనియా, 10.మలేషియా,11.అమెరికా, 12.ఫిలిప్పీన్, 13.నార్వే, 14.ఇరాక్, 15.కంబోడియా, 16.వియత్నాం, 17.భూటాన్,టాంజానియా, 18.అర్జెంటీనా, 19.పాకిస్తాన్, 20. నేపాల్, పాలస్తీనా వేసవి సెలవుల్లో మీ కలానికి పదునుపెట్టి బొమ్మలు గీస్తున్నారా? చిట్టి కథలు రాస్తున్నారా? ఏదైనా పర్యాటక ప్రదేశం సందర్శించారా? ఆటపాటల్లో విజయం సాధించి పతకాలు అందుకున్నారా? ఈ విషయాలను మీ స్నేహితులు, పాఠకులతో పంచుకోవాలనుకుంటే వాట్సప్ నెం: 8500786474 ద్వారా మాకు పంపండి. మేము ప్రచురిస్తాం. మీ ఫొటో కూడా జతచేయండి. ఊరు..పేరు.. జిల్లా రాయడం మరువొద్దు సుమా... -
బన్నీ వేసవి యాత్ర –17 Simple English Daily Uses
ఉదయం లేవగానే బన్నీ తాతయ్యతో “ Good morning, Tatayya” అన్నాడు. తాతయ్య నవ్వుతూ “ Good morning, Bunny. Have you brush your teeth?” అని అడిగాడు. బన్నీ “ Yes... I have Tatayya అని సమాధానం చెప్పాడు. టిఫిన్ టేబుల్ దగ్గర తాతయ్య “ Hand me a glass of water” అన్నాడు. బన్నీ వాటర్ బాటిల్ ఇస్తూ “ Here you are” అన్నాడు. తాతయ్య “ Thank you, Bunny” అనగానే, బన్నీ వెంటనే “ It’ s my pleasure “ అన్నాడు. Park కి వెళ్తూ బన్నీ “ I am going to park now” అని చెప్పాడు. తాతయ్య “ Come home quickly...” అని జాగ్రత్త చెప్పాడు. సాయంత్రం వచ్చాక బన్నీ “ I am tired, Tatayya. Can I have some milk?” అని అడిగాడు. తాతయ్య పాలు ఇస్తూ “ Certainly, you should take a bath after drinking milk అన్నాడు. పిల్లలకి మాట: ప్రతీరోజూ మాట్లాడితే ఇంగ్లిష్ తేలికగా వచ్చేస్తుంది. డాక్టర్ కోట లక్ష్మణ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు గ్రామం: కాకర్లపల్లి, మంథని, జిల్లా: పెద్దపల్లి -
యాదాద్రిలా ఎములాడ వెలిగేనా?
● రాజన్న ఆలయ అభివృద్ధిపై శీతకన్ను ● సిమెంటు వినియోగంపై సర్వత్రా విమర్శలు ● కోడెమొక్కులకు భక్తుల ఎదురుచూపులు ● వచ్చే ఏడాదికి సిద్ధం చేస్తామని అధికారుల ధీమాసాక్షిప్రతినిధి,కరీంనగర్: తెలంగాణలో ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచిన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పునర్నిర్మాణం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటుంటే, వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం అభివృద్ధి పనులపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. యాదాద్రిలో శాస్త్రబద్ధంగా, ప్రణాళికా బద్ధంగా నిర్మాణం సాగగా.. వేములవాడలో అస్పష్టత, సమన్వయలోపంతో విమర్శల పాలవుతోంది. ఈ మధ్య పనులు కాస్త ఊపందుకున్నప్పటికీ.. సిమెంట్ నిర్మాణాలపై భక్తులు పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా ఈ సిమెంటు నిర్మాణాలు ఎంతకాలం ఉంటాయి? కోడెమొక్కుల దర్శనాలు భక్తులకు తిరిగి ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి? అన్న అంశాలు నేటికీ ప్రశ్నలుగానే మిగులుతున్నాయి. వందల ఏళ్ల చరిత్ర ఉన్నప్పటికీ.. రూ.1200 కోట్లతో యదాద్రి, రూ.225 కోట్లతో బాసర ఆలయాలకు దక్కినస్థాయిలో గౌరవం దక్కకపోవడం, వేములవాడ ఆలయానికి కేవలం రూ.150 కోట్లే వెచ్చించడంతో రాజన్న భక్తులు చిన్నబుచ్చుకుంటున్నారు. మరోవైపు అధికారులు వచ్చే ఏడాది మార్చి నాటికి ఆలయ నిర్మాణం పూర్తి చేసే దిశగా వేగంగా పనులు సాగిస్తున్నారు. -
తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం
హైదరాబాద్: హైదరాబాద్తో సహా తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం పడింది. ఈరోజు(సోమవారం, మే 25వ తేదీ) మధ్యాహ్నం వరకూ ఎండతో అల్లాడిన ప్రజల్ని వర్షం పలకరించింది. హైదరాబాద్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కోఠి, ఎల్బీనగర్, వనస్థలిపురం, చింతల్, బాలానగర్, పెద్ద అంబర్పేట్, అబ్దుల్లాపూర్మెంట్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. కొన్ని చోట్ల మాదిరిగా వర్షం పడగా, అక్కడక్కడా భారీగానే వర్షం పడింది. ప్రధానంగా కోఠిలో భారీ వర్షం పడింది. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఎల్లారెడ్డి మండలం అల్మాస్పూర్లో గాలివాన బీభత్సానికి వర్షపు నీరు కల్లాల్లోకి చేరింది. దాంతో ధాన్యం తడిచిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాలి బీభత్సంతో చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఓ చెట్టు కారుపై పడటంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. గుంతపల్లి చెరువు తండాలో పిడుగుపడింది. మెదక్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. భారీ వర్షానికి మెదక్ మండలంలో ధాన్యం తడిసిపోయింది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం శానగొండ గ్రామంలో ఈదురు గాలికి పశువుల పాక కూలింది. లక్ష్మయ్య అనే గొర్లె కాపరి మృతి చెందాడు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. కామారెడ్డి జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. వరి కొనుగోలు కేంద్రాల దగ్గర ధాన్యం తడిచిపోయింది. దీనిపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆవేదన చెందుతున్నారు. -
హామీలు నెరవేర్చు ‘ఆది’
సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ను, రాష్ట్ర ప్రగతిని పరుగులు పెట్టించిన కేటీఆర్ను విమర్శించడం మానుకొని.. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య హితవు పలికారు. సిరిసిల్ల తెలంగాణ భవన్లో ఆదివారం బీఆర్ఎస్ నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంత్రివర్గ విస్తరణ అని ప్రకటన రాగానే ఆది శ్రీనివాస్ కేసీఆర్ను, కేటీఆర్ను విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని, మళ్లీ కేసీఆర్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్న సమయంలో మంత్రి పదవి కోసం ఉద్యమ నేతలను విమర్శించడం సరికాదన్నారు. రైతులు రెండు నెలలుగా ధాన్యం కొనుగోళ్లు లేక ఇబ్బందులు పడుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. నీ సొంతూరు రుద్రంగిలోనూ రైతులు వడ్లు కొనుగోలు చేయాలని ధర్నా చేస్తున్నారన్నారు. కేసీఆర్ను ఫామ్హౌజ్లో ఉన్నారని విమర్శించడం సరికాదని, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు ఉదంతంపై నోరు విప్పకపోవడం ఏంటని ప్రశ్నించారు. జిల్లాలో 90 శాతం పూర్తి అయిన మల్కపేట 9వ ప్యాకేజీని నిధులు సాధించాలని, సూరమ్మ చెరువు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై నా కేసీఆర్, కేటీఆర్లను విమర్శించడం మానుకొని హామీలను అమలు చేయాలని కోరారు. బీఆర్ఎస్ నాయకులు జిందం చక్రపాణి, గూడూరి ప్రవీణ్, న్యాలకొండ అరుణ, బుర్ర మల్లికార్జున్గౌడ్, కుంబాల మల్లారెడ్డి, రాఘవరెడ్డి, ఎదురుగట్ల చంద్రయ్యగౌడ్, మ్యాన రవి, ఆకుల కృష్ణ, అడిశెర్ల సాయి, నంది శంకర్, గెంట్యాల శ్రీనివాస్, సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం సేకరణలో వేగం పెంచాం
జిల్లాలో ధాన్యం సేకరణలో వేగం పెంచాం. క్షేత్రస్థాయిలో ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. కలెక్టర్, అదనపు కలెక్టర్ నిత్యం ధాన్యం కొనుగోళ్లపై పర్యవేక్షిస్తున్నారు. లారీల కొరతను అధిగమించేందుకు స్థానికంగా ట్రాక్టర్లతోనూ రవాణాకు అవకాశం కల్పించాం. అన్ని మండలాలకు ప్రత్యేకాధికారులను నియమించారు. కొనుగోళ్లను స్ట్రీమ్లైన్ చేశాం. ఇప్పటికే 50 శాతానికి పైగా ధాన్యం సేకరణ పూర్తయింది. రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. – ఎల్.బుచ్చిబాబు, జిల్లా పౌరసరఫరాల అధికారి -
చెప్పిందే సాగుచేయాలి!
చందుర్తి(వేములవాడ): వరి పంట అంటేనే దొడ్డురకాలు అని మన ప్రాంత రైతులకు తెలుసు. ఇటీవల సన్నరకాల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం క్వింటాల్కు రూ.500 బోనస్ ప్రకటించిన విష యం తెలిసిందే. అయితే సన్నాల సాగుకు ముందుకొచ్చే రైతులకు నిబంధనలు వర్తిస్తాయనడంతో చాలా మంది వెనకడుగు వేస్తున్నారు. ప్రభుత్వం సూచించిన 8 రకాలు సాగుచేసిన వారికే బోనస్ ఇ స్తామనడంతో అన్నదాతలు అయోమయానికి గు రవుతున్నారు. ప్రభుత్వం సూచించిన విత్తనాలు మా ర్కెట్లో దొరకడం ఒక ఎత్తయితే.. సాగు సమయంలో ఛీడపీడలు తట్టుకుంటాయా.. లేదా.. అనే అనుమానాలు కలుగుతున్నాయి. సన్నరకాలు సాగు చేస్తే లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా వస్తాయని రైతులు వాపోతున్నారు. ఈనేపథ్యంలో సన్నాలసాగు.. రైతుల అయోమయంపై ప్రత్యేక కథనం. 33 నుంచి 8 రకాలకు ! 33 రకాలలో ఏది సాగు చేసినా బోనస్ చెల్లిస్తామని ప్రభుత్వం రెండేళ్ల క్రితం ప్రకటించింది. అయితే ఈ సీజన్లో 8 రకాలు.. అవి కూడా తాము సూచించినవే సాగు చేయాలని ప్రచారం చేస్తుంది. 8 రకాల విత్తనాలకు మార్కెట్లో డిమాండ్ ఉందని, దానికితోడు అధిక దిగుబడులు వస్తాయన్న ప్రచారం చేస్తుంది. ప్రభుత్వం చెబుతున్నవి కాకుండా మారె్క్ట్లో నాణ్యమైనవి, అధిక దిగుబడి వచ్చే రకాలు అనేకం ఉన్నాయని రైతులు పేర్కొంటున్నారు. బో నస్ ఎగవేత కుట్రలో భాగంగానే 8 రకాల వంగడాలు సాగు చేయాలన్న సాకు చూపుతుందని రైతులు విమర్శిస్తున్నారు. దొడ్డు రకాలు సాగు చేస్తే ఎకరంలో 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని, అదే సన్నాలు సాగుచేస్తే అదే ఎకరం భూమిలో 18 క్వింటాళ్లు కూడా రావని రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ శాఖ ప్రచారం చేస్తున్న రకాలు జిల్లాలో 1.91 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారని వ్యవసాయాధికారుల అంచనా. వ్యవసాయ శాఖ ప్రచారం చేస్తున్న రకాల్లో బీపీటీ–5204(సాంబమసూరి), ఆర్ఎన్ఆర్–15048(తెలంగాణ సోనా), కేఎన్ఎం–1638 (కూనారం వరి–2), జేజీఎల్– 1798(జగిత్యాల సన్నాలు), జైశ్రీరామ్, హెఎంటీ, సోనా వరంగల్–44(సిద్ది), డబ్ల్యూజీఎల్–962 మాత్రమే ఉన్నాయి. -
లోడింగ్, అన్లోడింగ్లో వేగం పెంచాలి
● జనగణన పకడ్బందీగా నిర్వహించాలి ● కలెక్టర్ గరీమా అగ్రవాల్సిరిసిల్ల: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ, వాహనాల్లో లోడింగ్, రైస్మిల్లులు, గోదాముల్లో అన్లోడింగ్లో వేగం పెంచాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ఆదివారం అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్తో కలిసి టెలీకాన్ఫరెన్స్లో మాట్లాడారు. తహసీల్దార్లు అందుబాటులో ఉండి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిలువలు తనిఖీ చేయాలని సూచించారు. కొనుగోళ్లు పూర్తయిన కేంద్రాల్లోని వాహనాలు, హమాలీలను మరో కేంద్రానికి తరలించాలని సూచించారు. రైస్మిల్లుల్లో అన్లోడింగ్ను పరిశీలిస్తూ పూర్తయిన వాహనాలను కొనుగోలు కేంద్రాలకు పంపించాలని అధికారులకు సూచించారు. జనగణన పకడ్బందీగా చేపట్టాలి జనగణన పకడ్బందీగా చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జనగణనపై మండలాల వారీగా పురోగతిపై కలెక్టర్ ఆరా తీశారు. ఛార్జ్ అధికారులు తమ పరిధిలోని సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లతో సమావేశం నిర్వహించాలని సూచించారు. మహిళా వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలి ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈనెల 25 నుంచి 30 వరకు మహిళా వారోత్సవాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. మహిళా, శిశు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి, మెప్మా శాఖల అధికారులు సమన్వయంతో కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అంతకుముందు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్కుమార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. ఎస్పీ మహేశ్ బీ గీతే, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, సిరిసిల్ల ఆర్డీవో రాజేందర్రెడ్డి, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, సీపీవో శ్రీనివాసాచారి, డీటీవో లక్ష్మణ్కుమార్, డీసీఎస్వో బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, డీఏవో అఫ్జల్బేగం, డీసీవో రామకృష్ణ, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీబేగ్, కార్మిక శాఖ అధికారి నజీర్ అహ్మద్, మార్కెటింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
పొద్దున పోయేసరికి మాయం
రాత్రిపూట పొలానికి నీరు పెట్టి ఇంటికి వచ్చాను. పొ ద్దున పొలం కాడికి పోయేసరికి సర్వీస్ వైరు కనిపించలేదు. సమీప పొలాల వద్ద సర్వీస్ వైర్లు, మోటార్లను రాత్రికి రాత్రే ఎత్తుకెళ్లారు. పోలీసులకు ఫిర్యాదు చేశాం. – కోల సాయికృష్ణారెడ్డి, నారాయణపూర్ మోటార్లకు రక్షణ కల్పించాలి పొలాల వద్ద విద్యుత్ మోటార్లకు రక్షణ కల్పించాలి. అనుమానిత ప్రాంతాలలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తే దొంగతనాలు తగ్గుతాయి. విద్యుత్ మోటార్లు, వైర్లు ఎత్తుకెళ్తే నష్టపోతున్నాం. – మోస్కంటి సుభాష్, నారాయణపూర్ నిఘా పెట్టాం కొంతకాలంగా పొలాల వద్ద ఉన్న మోటార్లను ఎత్తుకెళ్తున్నారు. పాత నేరస్తులను విచారిస్తున్నాం. పొలాల వద్ద రైతులు బృందాలుగా కాపలా కాయాలి. అనుమానితులు సంచరిస్తే సమాచారం ఇవ్వాలి. – రాహుల్రెడ్డి, ఎస్సై -
‘కోడూరి’కి ఉత్తమ పురోహిత్ అవార్డు
సిరిసిల్లటౌన్: పట్టణానికి చెందిన కోడూరి రవీందర్శాసీ్త్రని ఉత్తమ పురోహితులు అవార్డు వరించింది. తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతికశాఖ సౌజన్యంతో జీసీఎస్ వల్లూరి ఫౌండేషన్ అంతర్జాతీయ మాతృదినోత్సవం, గౌతమ బుద్ధ జయంతి ప్రత్యేక అవార్డు సెలబ్రేషన్స్ హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఆదివారం నిర్వహించారు. రవీందర్శాసీ్త్రకి ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ వీఆర్.శ్రీనివాస్రాజ్ అవార్డు అందజేశారు. విద్యుత్ తీగలు సరిచేయాలిగంభీరావుపేట(సిరిసిల్ల): లూజ్ విద్యుత్ తీగలు సరిచేయాలని కోరుతూ మండలంలోని ముస్తఫానగర్లో రైతులు ఆదివారం ధర్నా చే శారు. వారు మాట్లాడుతూ ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోకపోవడంతో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. విద్యుత్ అధికారులు స్పందించి వదులుగా ఉన్న విద్యుత్ తీగల సరిచే యాలని కోరారు. పోస్టర్ ఆవిష్కరణ తంగళ్లపల్లి(సిరిసిల్ల): ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ముద్రించిన ‘ముదిరాజ్ సింహావలోకనం’ మహాసభ వాల్ పోస్టర్ను ఆదివారం ఆవిష్కరించారు. సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ ఈనెల 26న హైదరాబాద్, నెక్లెస్రోడ్లోని జలవిహార్ గ్రాండ్లాన్స్లో ముదిరాజ్ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ‘ముదిరాజ్ సింహావలోకనం’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మహాసభకు తంగళ్లపల్లి మండల కేంద్రంతోపాటు చుట్టుపక్కల గ్రామాల ముదిరాజ్ బంధువులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. సంఘం గౌరవ అధ్యక్షుడు, మాజీ జెడ్పీటీసీ కోడి అంతయ్య, అధ్యక్షుడు రంగు అంజయ్య, ప్రతినిధులు కొంగరి మల్లేశం, రంగు రాములు, కోడి వెంకటి, రంగు లక్ష్మీనర్సు, కోడి రాజలింగం, గడ్డమీద అంతయ్య, రంగు రాజు, మల్లేశం, నర్సయ్య, సంజీవ్, బుచ్చయ్య, దేవయ్య పాల్గొన్నారు. ‘సమస్యల పరిష్కారానికి కృషిచేస్తా’ సిరిసిల్ల అర్బన్: జిల్లాలోని ఉపసర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు లక్కిరెడ్డి కమలాకర్రెడ్డి పేర్కొన్నారు. సిరిసిల్ల ప్రెస్క్లబ్లో ఆదివారం జిల్లాలోని ఉపసర్పంచుల సమావేశం నిర్వహించారు. అన్ని మండలాల ఉపసర్పంచులు కలిసి జిల్లా ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా లక్కిరెడ్డి కమలాకర్రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమలాకర్రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో సర్పంచులతో సమన్వయంగా ఉంటూ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. -
లారీలు లేక తూకం వేయడం లేదు
నాకు రెండెకరాల పావు భూమి ఉంది. వరి కోసి నెల రోజుల కిందటే ఐకేపీ సెంటర్లో వడ్లు పోసిన. సీరియల్ నంబరు 146 వచ్చింది. వడ్లలో తేమ శాతం ఎప్పుడో వచ్చింది. కానీ లారీలు రావడం లేదని తూకం వేయడం లేదు. గన్నీ సంచులు లేవని ఆపుతుండ్రు. – సారగొండ వెంకట్రెడ్డి, ఆవునూరు జోకి ఐదు రోజులైంది నేను నాలుగు ఎకరాల్లో వరి పంట వేసిన. 290 బస్తాల వడ్లు వస్తే ఐదు రోజుల కిందటే జోకిండ్రు. లారీలు రావడం లేదు. తూకం వేసి వడ్లను వెంటనే తరలించకుంటే.. తరుగు వస్తుందని ఐకేపీ నిర్వాహకులు చెబుతున్నారు. లారీలను సకాలంలో పంపించాలి. – రావులపెల్లి రాజిరెడ్డి, కనగర్తి -
రోహిణీ ప్రవేశం
సిరిసిల్ల: రోహిణీ కార్తె నేడు(సోమవారం) ప్రవేశిస్తుంది. అన్నదాతలు వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్కు శ్రీకారం చుడుతున్నారు. మొన్నటి వరకు ఎండలు మండిపోవడంతో ధాన్యం అమ్ముకునే పనుల్లో నిమగ్నమైన రైతులు ఇప్పుడు వానాకాలం సాగుకు తుకం(నారు మడి) పోస్తున్నారు. రోహిణీ కార్తెలో తుకం పోస్తే బలమైన పంట పండుతుందనే నమ్మకంలో రైతులు సన్నరకం వడ్లను తుకాలు పోస్తున్నారు. జిల్లాలో 2,48,507 ఎకరాల్లో అన్ని పంటలను సాగు చేసేందుకు సిద్ధమయ్యారు. ఒక్క వరి పంటనే అత్యధికంగా రికార్డు స్థాయిలో 1,91,366 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. పత్తి పంటను 47,120 ఎకరాల్లో సాగు చేస్తుండగా.. ఇతర పంటలు 10,021 ఎకరాల్లో సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. జిల్లాలో వానాకాలం పంటల సాగుకు రైతులు పనులు ప్రారంభించారు. రోహిణీ, మృగశిర కార్తెల్లో వర్షాలు ప్రారంభమైతే.. అపరాల సాగు, జీలుగు సాగు పెరగనుంది. -
ఈత.. బీ కేర్ఫుల్
సిరిసిల్లటౌన్: దంచుతున్న ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు పలువురు ఈత కోసం వాగులు.. వంకలు.. వ్యవసాయబావుల బాట పడుతున్నారు. ఇన్నాళ్లు స్కూల్.. కాలేజీ అంటూ తిరిగిన విద్యార్థులకు వాగులు.. వ్యవసాయబావుల్లో పరిస్థితులు తెలియక ప్రమాదాలకు గురవుతున్నారు. అప్పటి వరకు కేరింతలు కొడుతూ ఈత నేర్చుకున్న చిన్నారులు విగతజీవులుగా మారుతున్నారు. కంటతడి పెట్టించిన సంఘటనలు ● జిల్లా కేంద్రం శివారులోని మిడ్మానేరు బ్యాక్వాటర్లో ఈనెల 22న అల్లం మణికంఠ(17), ఎదురుగట్ల హరిచరణ్గౌడ్(17)తోపాటు మరో నలుగురు స్నేహితులు ఈత కోసమని వెళ్లారు. మణికంఠ, హరిచరణ్గౌడ్ వాగులోకి దిగి గుంతల్లో ఇరుక్కుని చనిపోయారు. ● ఈనెల 18న చందుర్తి మండలం బండపల్లి ఊరచెరువులో సృజన్(15) ఈత నేర్చుకోవడానికి వెళ్లి విగతజీవిగా మారాడు. ● కోనరావుపేట మండలంలో మార్చి 30న ఇద్దరు గొర్లకాపరులు ముడికె లక్ష్మీరాజం(65), కుమ్మం మొండయ్య(55) గొర్రెలకు స్నానం చేయిస్తూ చెరువులోని బురదలో ఇరుక్కుపోయారు. ● ముస్తాబాద్ మండలం మొర్రాపూర్తండాలో 2025 ఫిబ్రవరిలో భూక్యా చరణ్(17) చెరువులో ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. ● ఆరేళ్ల క్రితం చందుర్తి మండలం మర్రిగడ్డ చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు చనిపోయారు. ● జిల్లా కేంద్రంలోని కొత్తచెరువు, కార్గిల్లేక్ చెరువుల్లో గత దశాబ్దకాలంగా పదుల సంఖ్యలో ప్రమాదవశాత్తు చనిపోయారు. ప్రమాదాల కారణాలు ఇవీ.. ● నీటి పై భాగం ప్రశాంతంగా కనిపించినా లోపల ఉన్న గుంతలు, బురద, లోతు గురించి తెలియక ప్రమాదాలు జరుగుతున్నాయి. ● ఈత రాకపోయినా దోస్తుల ముందు గొప్పలకు పోయి ప్రమాదాలకు గురవుతున్నారు. ● పట్టణాల్లో మున్సిపల్ శాఖ, పల్లెల్లో గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో హెచ్చరికబోర్డులు ఏర్పాటు చేయాలి. పోలీస్శాఖ సూచనలు ఇవీ.. ● అనుభవజ్ఞులైన శిక్షకుల సమక్షంలో స్విమ్మింగ్ పూల్స్లోనే ఈత నేర్చుకోవాలి. ● చెరువులు, నదుల వద్దకు వెళ్లినప్పుడు ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాలి. హెచ్చరికబోర్డులను గమనించాలి. ప్రమాదకరమైన ప్రాంతాలుగా ప్రకటించిన చోట నీటిలోకి దిగరాదు. ● చిన్న పిల్లలను నీటి వనరుల వద్దకు ఒంటరిగా పంపకూడదు. ● యువత అత్యుత్సాహంతో నీటి కొలనుల్లో పడి ప్రాణాలు కోల్పోతున్నారు. తల్లిదండ్రులు, తమ పిల్లలను కనిపెట్టుకుని ఉండాలి.అది 2021 నవంబర్ 15. జిల్లా కేంద్రంలోని రాజీవ్నగర్ నుంచి ఎనిమిది మంది విద్యార్థులు సమీపంలోని మానేరునదిలో ఈత కొట్టేందుకు మధ్యాహ్నం 2 గంటలకు వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటలకు మానేరులోని ఇసుక కయ్యల్లో చిక్కుకుని విలవిల్లాడుతూ మునిగిపోయారు. వీరిని చూసి ముగ్గురు భయంతో పరారయ్యారు. సరదా కన్నా ప్రాణం గొప్పదన్న విషయాన్ని గుర్తించాలి. విద్యార్థులు, యువకులు చేసే చిన్న తప్పిదం తల్లిదండ్రులకు జీవితకాలపు శోకాన్ని మిగల్చకూడదు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి, నీటి వద్ద జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే ఈతను శిక్షకుల సమక్షంలో నేర్చుకోవాలి. సెలవుల్లో ఇంటి వద్ద ఉంటూ సురక్షితంగా ఉండండి. – మహేశ్ బీ గీతే, ఎస్పీ -
మరో నాలుగు రోజులు వడగాలులే
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సూరీడు నిప్పులు కక్కుతున్నాడు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా రెడ్ జోన్లోకి చేరగా శనివారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎన్నడూ లేని విధంగా 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కరీంనగర్ జిల్లాలో రెండు మండలాలు, పెద్దపల్లి జిల్లాలో ఏడు మండలాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవగా వడగాలుల ప్రభావం అధికంగా ఉందని ప్రణాళిక విభాగం అధికారులు ప్రకటించారు. కాగా ఉదయం 8 గంటలకే వేడిగాలులు ఉక్కిరిబిక్కిరి చేయగా సాయంత్రం 6దాటినా దారులపై వడగా లులే. మరో నాలుగు రోజులపాటు వడగాలులుంటాయని వాతావరణ శాఖ ప్రకటించగా ప్రజలు జాగ్రత్త ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో ఆందోళనకరస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కరీంనగర్(గంగాధర) 46.4 పెద్దపల్లి (ఎలిగేడు) 46.4 జగిత్యాల (కోరుట్ల, అయిలాపూర్) 46.4 రాజన్న సిరిసిల్ల (పెద్దూరు) 46.4 -
యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సిరిసిల్ల: యువతకు ఉపాధి కల్పనే ప్రజాప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కే–కన్వెన్షన్ హాల్లో శనివారం ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిర్వహించిన మెగా జాబ్మేళాలో ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరీమా అగ్రవాల్ వేర్వేరుగా పాల్గొని మాట్లాడారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం జాబ్మేళాలు నిర్వహిస్తోందన్నారు. భవిష్యత్లోనూ మరిన్ని ఉద్యోగ నియామకాల ప్రక్రియ కొనసాగుతుందని ఆది శ్రీనివాస్ వివరించారు. 30 కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరై అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి నియామకపత్రాలను అందించారు. ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలి: కలెక్టర్ యువత ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ సూచించారు. పోటీ ప్రపంచంలో చదువు ఒక్కటే కాకుండా నైపుణ్యాన్ని పెంచుకుంటేనే రాణిస్తారన్నారు. ప్రభుత్వశాఖల శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎస్పీ మహేశ్ బీ గీతే మాట్లాడుతూ యువత లక్ష్యాన్ని నిర్ధేశించుకుని.. సాధించేందుకు శ్రమించాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ.. నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు. సిరిసిల్ల ఏఎంసీ చైర్పర్సన్ వెలుముల స్వరూపారెడ్డి, ఎల్డీఎం మల్లికార్జున్రావు, యువజన క్రీడల అధికారి రాందాస్, పరిశ్రమలశాఖ జీఎం హన్మంతు, డీడబ్ల్యూవో లక్ష్మీరాజం, ఉపాధి కల్పన అధికారి రాఘవేందర్, తహసీల్దార్ మహేశ్రావు, మైనార్టీ సంక్షేమాధికారి భారతి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న, మున్సిపల్ కమిషనర్ ఖదీర్పాషా, నాయకులు గడ్డం నర్సయ్య, చొప్పదండి ప్రకాశ్, బొప్ప దేవయ్య, బండ నర్సయ్యయాదవ్, ఆకునూరి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.


