Rajanna
-
అసాంఘిక శక్తులపై నిరంతర నిఘా
● ఎస్పీ మహేశ్ బి గితే సిరిసిల్ల: జిల్లాలో అసాంఘిక శక్తులపై నిరంతరం నిఘా ఉంచాలని, కేసు ఏదైనా నిందితులకు శిక్ష పడేలా సమగ్ర విచారణ చేపట్టాలని ఎస్పీ మహేశ్ బి గితే అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ ఆఫీస్లో జరిగిన నేర సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ప్రజలు, వ్యాపారస్తులను భాగస్వామ్యంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. పెట్రోలింగ్ సమయాల్లో రౌడీ, హిస్టరీ షీట్స్ ఉన్నవారిని తనిఖీ చేయాలని ఆదేశించారు. గంజాయి రవాణా చేసే వ్యక్తులతో పాటు సేవించే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలని సూచించారు. నాన్ బెయిలబుల్ వారెంట్లను తప్పించుకుని తిరుగుతున్న నిందితులను పట్టుకోవాలన్నారు. పోలీస్స్టేషన్ల వారీగా నమోదైన కేసులు, పెండింగ్ అంశాలను సమీక్షించారు. ఏఎస్పీ చంద్రయ్య, డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. నేరాల నియంత్రణలో వాహనాల పాత్ర కీలకం జిల్లాలో ఏ ప్రాంతంలోనైనా నేర సమాచారం అందిన వెంటనే బ్లూకోల్ట్, పెట్రోకార్ సిబ్బంది ఘటన స్థలానికి వేగంగా చేరుకోవడం ఎంతో కీలకమని ఎస్పీ మహేశ్ బి గితే అన్నారు. జిల్లా పోలీస్ ఆఫీస్ ఆవరణలో పోలీస్ వాహనాల కోసం నూతనంగా నిర్మించిన షెడ్ను ప్రారంభించి మాట్లాడారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రజలకు రక్షణ కల్పించడంలో వాహనాలు ఎంతో అవసరమన్నారు. పోలీసులు క్షేత్రస్థాయిలో తక్షణమే స్పందించించేందుకు పెట్రోకార్, బ్లూ కోల్ట్ వాహనాల కండిషన్ బాగుండాలన్నారు. పోలీసు అధికారులతో కలిసి షెడ్ ఆవరణలో మొక్కలు నాటారు. పోలీస్ స్టేషన్లకు కేటాయించిన పెట్రోకార్ వాహనాలను తనిఖీ చేసి వాటి నిర్వహణపై ఆరా తీశారు. -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
● కలెక్టర్ గరీమా అగ్రవాల్ సిరిసిల్ల: జిల్లాలో ఎక్కడైనా నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ గరీమా అగ్రవాల్ హెచ్చరించారు. ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో నకిలీ విత్తనాల నియంత్రణ, సన్న వడ్లు, ఆయిల్పాం సాగు విస్తీర్ణం పెంపు, ఫార్మర్స్ రిజిస్ట్రీ అంశాలపై కలెక్టరేట్లో మంగళవారం అధికారులతో సమీక్షించారు. వ్యవసాయ, ఉద్యాన శాఖలు రూపొందించిన కరపత్రాలను కలెక్టర్, అధికారులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో నకిలీ విత్తనాల విక్రయాలు జరగకుండా వ్యవసాయ, పోలీస్ శాఖ సంయుక్తంగా దాడులు చేయాలని, ఏమైనా విక్రయాలు ఉంటే వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. నేరుగా వచ్చి విత్తనాలు విక్రయించే వారి వద్ద రైతులు తీసుకోవద్దని కలెక్టర్ సూచించారు. ఫార్మర్స్ రిజిస్ట్రీ పూర్తి చేయండి జిల్లాలో ఫార్మర్స్ రిజిస్ట్రీ ఇప్పటిదాకా 73 శాతం పూర్తి చేశారని కలెక్టర్ వెల్లడించారు. వ్యవసాయ అధికారులు తమ పరిధిలోని కొనుగోలు కేంద్రాలు, రైతులను నేరుగా కలిసి ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో సన్న వడ్లు సాగు విస్తీర్ణం పెంచాలన్నారు. ఆయిల్పాం సాగు ద్వారా అధిక దిగుబడి, దీర్ఘకాలంపాటు అధిక ఆదాయాన్ని పొందవచ్చన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్బాబు, జిల్లా సహకార అధికారి రామకృష్ణ పాల్గొన్నారు. -
చిన్నారులు, గర్భిణులకు పౌష్టికాహారం అందించాలి
ఎల్లారెడ్డిపేట/ముస్తాబాద్: అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులకు పౌష్టికాహారం పంపిణీ చేయాలని జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. కోడిగుడ్ల పరిమాణం, నాణ్యతను పరిశీలించారు. హబ్ కోఆర్డినేటర్ రోజా, తహసీల్దార్ సుజాత, ఎంపీడీవో సత్తయ్య, ఈవో వనిత, సర్పంచ్ ఎలగందుల నర్సింలు తదితరులు పాల్గొన్నారు. కిశోర బాలికల సంరక్షణ అందరి బాధ్యత కిశోర బాలికల సంరక్షణ అందరి బాధ్యత అని జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం అన్నారు. ముస్తాబాద్ మండలం పోతుగల్లో బాలల భద్రత, డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాలను నిర్వహించగా, ఆయన పాల్గొని మాట్లాడారు. ఒకటి నుంచి 18 ఏళ్ల లోపు బాలికల తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలన్నారు. తల్లిదండ్రుల సత్ప్రవర్తన, క్రమశిక్షణపైనే బాలికల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు. సర్పంచ్ పెద్దిగారి యాదమ్మ, తహసీల్దార్ ఫారూక్, ఎంపీడీవో లచ్చాలు, ఏఎస్సై ఘనీ, సీడీపీవో ఉమారాణి, షీటీం ఇన్చార్జి ప్రమీల, సఖీ ఇన్చార్జి రోజా, సూపర్వైజర్ అనూష, ఉపసర్పంచ్ కృష్ణ, కాంగ్రెస్ ఎన్ఆర్ఐ సెల్ జిల్లా అధ్యక్షుడు ధర్మేందర్, శ్రీనివాస్, రాజు, వెంకట్రావు పాల్గొన్నారు. -
భీమన్న ఆలయంలో కమిషనర్ పూజలు
వేములవాడఅర్బన్: వేములవాడ రాజన్న అనుబంధ భీమేశ్వరస్వామి ఆలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా భీమేశ్వర సదన్ అతిథి గృహానికి చేరుకున్న కమిషనర్కు ఆలయ ఈవో రమాదేవి పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఆలయానికి చేరుకోగా, అర్చకులు, వేద పండితులు స్వస్తివాచకంతో స్వాగతం పలికారు. తర్వాత స్వామివారికి కోడె మొక్కులు చెల్లించుకుని, ఆలయ మండపంలో తీర్థప్రసాదం, ఆశీర్వచనం స్వీకరించారు. ఆలయ ఈవో స్వామివారి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదం అందజేశారు. ఈసందర్భంగా ఆలయ అభివృద్ధి పనులపై కమిషనర్ ఆరా తీశారు. క్యూలైన్లు, శానిటేషన్ ఏర్పాట్లు పరిశీలించి, ఎండాకాలంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేపట్టిన చర్యలను సమీక్షించారు. లడ్డూ తయారీ కేంద్రం, ఆలయంలో నిర్వహిస్తున్న ఈ–టికెటింగ్ సేవలను పరిశీలించారు. గోశాలను సందర్శించి అక్కడి ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు. పశుగ్రాసాన్ని స్వయంగా కోడెలకు అందించి, అవి తింటున్నాయా లేదా, ఆహార నాణ్యత ఎలా ఉందో ప్రత్యక్షంగా పరిశీలించారు. కోడెలకు అందించే ఆహారంలో ఎలాంటి లోపాలు ఉండకూడదని, వాటి సంరక్షణలో నిర్లక్ష్యం చోటు చేసుకోకూడదని అధికారులకు, సిబ్బందికి సూచనలు చేశారు. గోశాలలోని షెడ్లు, ఇతర సౌకర్యాలు పరిశీలించారు. ఎండోమెంట్ అడ్వైజర్ గోవిందహరి, క్షేత్ర ఆర్కిటెక్ట్ సూర్యనారాయణమూర్తి, ఆలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్ బోర్డు నిఘా పెట్టాలి
ప్రైవేట్ విద్యాసంస్థల్లో అడ్మిషన్ల పేరుతో టీచర్లు, అధ్యాపకులను మానసికంగా వేధించడం మానుకోవాలి. సెలవు దినాల్లోనూ పనులు చేయించుకునే పద్ధతికి స్వస్తి చెప్పాలి. టీచర్లు, అధ్యాపకులను బోధనేతర పనులకు ఉపయోగించుకోవడం సరికాదు. వర్క్షాపుల పేరుతో మానసిక ఇబ్బందులకు గురి చేస్తే స హించేదిలేదు. ఇన్ని చేస్తున్నా చాలా విద్యాసంస్థల్లో జీతాలు కూడా సరిగా ఇవ్వ డం లేదు. ఇలాంటి యాజమాన్యాలపై ఇంటర్బోర్డు కఠిన చర్యలు తీసుకోవాలి. – కె.రాణాప్రతాప్, పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి -
డబ్బు ఇప్పించాలి
hÌêÏ-ÌZ 2024&-25ÌZ ÐólçÜÑ, Ðé¯éM>ÌS… ïÜf¯ŒS-ÌSMýS$ çÜ…º…«¨…_ 189 IMóSï³ «§é¯]lÅ… Mö¯]l$-VøË$ MóS…{§é-ÌS¯]l$ HÆ>µr$ ^ólÔ>Æý‡$. hÌêÏ A«¨M>Ç ¯]lÐ]l$Ã-M>°² Ð]lÐ]l¬Ã ^ólĶæ$-MýS$…yé Ð]l$íßæ-âýæ-Ë$ A…™ól _™èl¢-Ô¶æ$-¨®™ø «§é¯éÅ-°² ò³§ýlª G™èl$¢¯]l õÜMýS-Ç…_ ÇM>Æý‡$z çÜ–íÙt…^éÆý‡$. MìSÓ…sêÌŒæMýS$ {糿¶æ$-™èlÓ… Æý‡*.32 MýSÒ$çÙ¯ŒS CçÜ$¢…¨. Æð‡…yýl$ ïÜf¯ŒS-ÌSMýS$ çÜ…º…«¨…_ 24,54,196 MìSÓ…sêâýæÏ «§é¯]lÅ… õÜMýS-Ç…-^éÆý‡$. C…§ýl$MýS$ V>¯]l$ Ððl¬™èl¢… MýSÒ$çÙ¯ŒS Æý‡*.7,85,34,186 ò³…yìl…-VŠæ-ÌZ E…¨. వేసవి సీజన్ కమీషన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు మహిళా సంఘాలకు ఇవ్వాల్సిన కమీషన్ బకాయిలపై అధికారులను ‘సాక్షి’ సంప్రదించగా.. 2024–25 వేసవి సీజన్ మొత్తాన్ని విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే ఆయా మండలాల్లోని గ్రామైక్య సంఘాలకు నిధులు జమ చేశామని స్పష్టం చేశారు. కేవలం ఖరీఫ్ సీజన్ కమీషన్ మాత్రమే బకాయి ఉంటుందని వివరించారు. ఇప్పటికే సర్క్యులర్ జారీ చేశామని స్పష్టం చేశారు. సివిల్ సప్లై నుంచి వచ్చిన కమీషన్ రూ.6.22కోట్లు త్వరలోనే గ్రామైక్య సంఘాలకు బదిలీ చేస్తామన్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు డీపీఎంకు చేరినట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు స్పష్టం చేశారు. భారంగా నిర్వహణ ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ అంతా ఆషామాషీ కాదు. కేంద్రంలో చలువ పందిళ్లు, తాగునీటి ఏర్పాటు, ట్యాబ్, రోజువారీగా ఏడుగురు మహిళలకు వేతనాలు, మాయిశ్చర్ యంత్రాలు, కేంద్రంలో భూమి చదును వంటి పనులు నిర్వాహకులే చూసుకోవాలి. ఏఎంసీలు టార్పాలిన్లు, వేయింగ్ మిషన్లు అందిస్తారు. ఒక్కో కేంద్రం నిర్వహణకు ఖర్చు రెండునెలల్లో రూ.2.50 లక్షల నుంచి రూ.3లక్షల వరకు వస్తుంది. ఇదంతా ముందుగా మహిళా సంఘాలే భరించాలి. ప్రభుత్వం ఇచ్చే కమీషన్ ఆలస్యం కావడంతో అది వారికి భారంగా మారింది. అధికారులు ఇచ్చినప్పుడే కమీషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండడంతో గ్రామైక్య సంఘాలు నిర్వాహణ భారం మోయాల్సి వస్తోంది.పోతుగల్లో గత సీజన్లో మేము ఏడుగురు మహిళలం ధాన్యం సేకరణ కేంద్రం నిర్వహించాం. 23వేల క్వింటాళ్ల ధాన్యం సేకరించి ఇచ్చాం. దానికి సంబంధించిన కమీషన్లు ఇంకా అందలేదు. ప్రభుత్వం కమీషన్ డబ్బులు ఇచ్చి వీవోలను ఆదుకోవాలి. నిర్వహణకు ఇబ్బంది పడుతున్నాం. – సరిత, గ్రామైక్య సంఘం, పోతుగల్ -
బతుకు పోరాటం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘మీ ఇంట్లో పిల్లలు ఎంత మంది. ఏం చదువుతున్నారు. ఎక్కడ చదువుతున్నారు.. మా పాఠశాల/కళాశాలలో చేర్పించండి. నాణ్యమైన బోధన ఉంటుంది. ఫలితాలు చూడండంటూ’ పేపర్లు చూపుతున్నారు. సీటు ఇప్పుడు కన్ఫార్మ్ చేసుకుంటే ఫీజులో రాయితీ ఇప్పిస్తామంటూ చెబుతున్నారు. తల్లిదండ్రుల నంబర్లు తీసుకుని రోజూ నాలుగైదు సార్లు ఫోన్లు చేస్తున్నారు. తమకు టార్గెట్లు ఉన్నాయంటూ వేడుకుంటున్నారు. ఉన్నత చదువులు చదివి, ఉద్యోగాలు లేక 45 డిగ్రీల సెల్సియస్ ఎండల్లో ఉదయం, సాయంత్రం యాజమాన్యాలు ఇచ్చిన టార్గెట్ల కోసం కష్టపడుతున్నారు. మండే ఎండలు ఒకవైపు, వీధి కుక్కలు మరోవైపు, పిల్లల కోసం తలుపులు తడితే ఛీత్కరించుకునే ఇంటి యజమానుల మాట లను భరించుకుంటూ బతుకు బండి లాగేందుకు ప్రయాసపడుతున్నారు ఉమ్మడి జిల్లాలోని ప్రైవేటు టీచర్లు. సెలవులు లేని కొలువు పనిచేసేది పాఠశాలలోనైనా సెలవనే మాట ఉండదు. ఆదివారమైనా.. వేసవి సెలవులైనా, పండుగలైనా.. పాఠశాల కోసం పని చేయాల్సిందే. ఇక కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందంటే గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. యాజమాన్యం ఇచ్చి న టార్గెట్ చేయించకపోతే ఉద్యోగం ఉంటుందో.. ఊడుతుందో తెలియదు. అందుకే వేసవి సెలవుల్లోనూ ఇంటింటికి తిరుగుతూ ‘మీ పిల్లలను మా విద్యాసంస్థల్లో చేర్పించండి.. ఫీజులో రాయితీ కూడా ఇప్పిస్తాం’ అంటూ తల్లిదండ్రులను బతిమాలుకుంటున్నారు. మెడపై అడ్మిషన్ల కత్తి ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల్లో పని చేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది మెడపై అడ్మిషన్ల కత్తి వేలాడుతోంది. 2026–27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు భారీగా చేయాలంటూ యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. ఆ సంఖ్యను బట్టే జీతా ల చెల్లింపు.. ఇంక్రిమెంట్లు, ఉద్యోగభద్రత ఉంటుందని చెప్పడంతో కంటి మీద కునుకు లేకుండా పోతోంది. యాజమాన్యాలు టార్గెట్లు పెట్టి మానసిక క్షోభకు గురి చేస్తున్నాయని, ఉదయం, సాయంత్రం సమావేశాలు నిర్వహించి దురుసుగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు, కళాశాలల్లో 15 వేల మందికిపైగా బోధన, బోధనేతర సిబ్బంది పనిచేస్తుండగా అందరిదీ అదే పరిస్థితి.ఉద్యోగులతో వెట్టిచాకిరీ... అడ్మిషన్ల టార్గెట్లే కాకుండా.. యాజమాన్యాలు వెట్టిచాకిరీ చేయించుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ 10 నుంచి 12గంటలు పని చేయాలని, శని, ఆదివారం, జాతీయ సెలవు దినాలు, పండుగ రోజుల్లోనూ స్కూళ్లు, కళాశాలలకు వెళ్లాల్సిందేనని వాపోతున్నారు. పనికి తగ్గ వేతనాలు ఇవ్వడం లేదంటున్నారు. టీటీసీ, బీఈడీ, ఎంఈడీ, పీజీ, ఎంబీఏ తదితర కోర్సులు చేసి ఉపాధి కోసం పని చేస్తున్నామని, ఇక్కడ ఉద్యోగ భద్రత లేకపోగా పని ఒత్తిడి చేస్తూ తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఉమ్మడి జిల్లా వివరాలు జిల్లా ప్రైవేటు పాఠశాలలు ఉపాధ్యాయులు కరీంనగర్ 298 6,254 రాజన్న సిరిసిల్ల 132 1,555 పెద్దపల్లి 192 4,224 జగిత్యాల 292 3,480 -
డ్రగ్స్ దుష్ప్రభావాలపై ప్రచారం చేయాలి
సిరిసిల్ల: డ్రగ్స్, మాదకద్రవ్యాల వినియోగంతో దుష్ప్రభావాలపై జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ కోరారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. మాదక ద్రవ్యాలకు బానిసైన వారిని గుర్తించి అవసరమైన చికిత్స, కౌన్సెలింగ్ అందించేలా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో డీ అడిక్షన్ కౌన్సెలింగ్ కేంద్రం ప్రారంభించామని, డ్రగ్స్ బాధితులకు చికిత్స, కౌన్సెలింగ్ అందిస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఏఎస్పీ చంద్రయ్య మాట్లాడుతూ, డ్రగ్స్, గంజాయి వల్ల కలిగే నష్టాలపై పోలీస్, ఎకై ్సజ్, విద్య, వైద్యశాఖ ఆధ్వర్యంలో ప్రచారం చేస్తున్నామన్నారు. వివిధ షాపులలో నిరంతరం ఆకస్మిక తనిఖీలు చేస్తున్నామని ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష పేర్కొన్నారు. సిరిసిల్ల ఆర్డీవో సీహెచ్ వెంకటేశ్వర్లు, ఎకై ్సజ్ అధికారి శ్రీనివాసరావు, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమిషనర్లు ఖదీర్పాషా, సంపత్కుమార్, జిల్లా వైద్యాధికారి రజిత, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, కార్మికశాఖ అధికారి నజీర్అహ్మద్, కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రవీణ్ పాల్గొన్నారు. -
డీపీఆర్వోకు అభినందనలు
సిరిసిల్ల: జిల్లా పౌర సంబంధాల అధికారిగా ఏడుకొండలు ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. డీపీఆర్వో ఆఫీస్లో మంగళవారం రాష్ట్ర గవర్నర్ ప్రెస్ సెక్రటరీ మామిండ్ల దశరథం అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా డీపీఆర్వోకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. నిరంతరంగా నాణ్యమైన విద్యుత్తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని లక్ష్మీపూర్ గ్రామ విద్యుత్ ఉపకేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఫీడర్ బ్రేకర్ పనులను టీజీఎన్పీడీసీఎల్ చీఫ్ ఇంజనీర్ అన్నపూర్ణ మంగళవారం పరిశీలించారు. ‘విద్యుత్ ప్రజా బాట’లో భాగంగా గ్రామ సర్పంచ్, రైతులు కోరిన మేరకు పరిశ్రమలకు, గ్రామానికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేందుకు కొత్త ఫీడర్ బ్రేకర్ మంజూరు చేసినట్లు ఆమె తెలిపారు. రైతులకు, పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్ఈ గోపికృష్ణ, డీఈలు చంద్రమౌళి, అంజయ్య, ఏడీఈలు ప్రశాంతి, గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలిసిరిసిల్లటౌన్: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉపాధి అవకాశాలను ట్రాన్స్జెండర్స్ సద్వి నియోగం చేసుకోవాలని జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ హన్మంతు అన్నారు. మంగళవారం సిరిసిల్ల కోర్టు ఆవరణలో జిల్లా పరిశ్రమల శాఖ, ఇన్ఫోసెమ్ సంస్థ ఆధ్వర్యంలో ట్రాన్స్జెండర్స్కు నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. ఉపాధి అవకాశాలు కనిపించని స్థితిలో చాలామంది ట్రాన్స్జెండర్స్ భిక్షాటన వంటి పరిస్థితుల్లో గడుపుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల(పీఎంఎఫ్ఎంఈ)తో ఉపాధి పొందాలన్నారు. ఇందుకు ప్రభుత్వం ఆర్థిక సాయంతో పాటు మార్కెటింగ్ మద్దతు కలిగిస్తుందన్నారు. చిన్న, సూక్ష్మ పరిశ్రమలు దేశాభివృద్ధిలో ప్రధాన భూమిక పోషిస్తున్నాయని, వాటికి కూడా ప్రభుత్వం రుణాలు, సబ్సిడీ అందిస్తుందని, యువత, ట్రాన్స్జెండర్స్ ప్రభుత్వ చేయూతను అందిపుచ్చుకోవాలని కోరారు. సదస్సులో అసిస్టెంట్ మేనేజర్ శివసాయికృష్ణ, ఇన్ఫోసెమ్ అధ్యక్షులు మహేశ్, దినేశ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎన్ఎఫ్డీపీతో మత్స్యకారులకు మేలురుద్రంగి: ఎన్ఎఫ్డీపీతో మత్స్యకారులకు ఎంతో మేలు జరుగుతుందని జిల్లా ఫిషరిష్ ఆఫీసర్ సౌజన్య పేర్కొన్నారు. మంగళవారం నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ ఫామ్ (ఎన్ఎఫ్డీపీ)పై మండలకేంద్రంలోని సంఘ భవనంలో గంగపుత్రులకు అవగాహన కల్పించారు. 18 ఏళ్లు నిండిన గంగపుత్ర ఆడ, మగ సభ్యులు ఎన్ఎఫ్డీపీ పోర్టల్లో నమోదు చేసుకోవాలని సూచించారు. లేకుంటే మత్స్యకార సంక్షేమ పథకాలు, ప్రమాద బీమా అందయని వివరించారు. ఈ నెల 30 వరకు పోర్టల్లో నమోదుకు అవకాశం ఉందన్నారు. ఫిషరీస్ ఫీల్డ్ ఆఫీసర్ కిరణ్, అసిస్టెంట్ ఫిషరీస్ ఇన్స్పెక్టర్ కిరణ్, గంగపుత్ర సంఘం అధ్యక్షుడు ధర్మేందర్, సభ్యులు పాల్గొన్నారు. -
చార్ధామ్ యాత్రికులు వైద్యపరీక్షలు చేయించుకోవాలి
సిరిసిల్ల: జిల్లా నుంచి ఉత్తరాఖంఢ్లోని చార్ధామ్కు వెళ్లే యాత్రికులు వైద్యపరీక్షలు చేయించుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఎస్.రజిత కోరారు. ఉత్తరాఖంఢ్ పర్వత ప్రాంతాలు కావడంతో విపరీతమైన చలి ఉంటుందని, ఆక్సిజన్ పూర్తి స్థాయిలో అందక శ్వాసక్రియలో ఇబ్బంది ఏర్పడుతుందని తెలిపారు. విపరీతమైన చలిగాలి, మంచు వర్షాలతో అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంటుందన్నారు. శ్వాసక్రియలో భాగంగా గాలి బాగా పీల్చి, వదలడం కనీసం నిత్యం 5–10 నిమిషాలు వ్యాయామం చేయాలని, కనీసం 30 నిముషాలు నడవాలని, రెండు లీటర్ల తాగునీటిని వెంట ఉంచుకోవాలని సూచించారు. 60 ఏళ్లు పైబడిన వారు, బీపీ, షుగర్, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు డాక్టర్ సలహా మేరకే చార్ధామ్యాత్రకు వెళ్లాలని స్పష్టం చేశారు. కోనరావుపేట(వేములవాడ): తెలంగాణ రాష్ట్ర ఫర్టిలైజర్ అసోసియేషన్ పిలుపు మేరకు సోమవారం మండల వ్యాప్తంగా ఎరువుల దుకాణా లు పూర్తిగా మూసివేశారు. ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్, సీడ్స్ డీలర్ల సమస్యల పరిష్కారం కోసం ఈ బంద్ నిర్వహించినట్లు కోనరావుపే ట మండల ఫర్టిలైజర్ అసోసియేషన్ అధ్యక్షు డు శ్రీనివాస్రెడ్డి తెలిపారు. మండలంలో డీలర్లతో కలిసి బైక్ ర్యాలీ తీశారు. సిరిసిల్ల అర్బన్: గ్రామీణ ప్రాంతాల్లోని 10 కేంద్రాలు, రాజీవ్నగర్ మినీస్టేడియంలో నిర్వహించే ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా యువజన క్రీడలశాఖ అధికారి ఎ.రాందాస్ కోరారు. ఈనెల 28 నుంచి జూన్ 7 వరకు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 14 ఏళ్లలోపు బాలబాలికలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు 72071 91123, 76809 51259లో సంప్రదించాలని తెలిపారు. కోనరావుపేట(వేములవాడ): మండలంలోని కనగర్తిలో పంచాయతీ పాలకవర్గం, మహిళా సంఘాల ఆధ్వర్యంలో మద్యపాన నిషేధం అమలు చేయాలని తీర్మానించారు. గ్రామపంచాయతీలో సర్పంచ్ మల్యాల స్వామిదాసు ఆధ్వర్యంలో సోమవారం సమావేశమైన పాలకవర్గం సభ్యులు, మహిళా సంఘాల ప్రతినిధులు తీర్మానించారు. ఈమేరకు గ్రామంలోని బెల్ట్షాపుల నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. మే 10 నుంచి గ్రామంలో పూర్తిస్థాయి మద్యపాన నిషేధం అమలులోకి వస్తుందని తెలిపారు. మద్యం విక్రయిస్తే రూ.10వేలు జరిమానా, సమాచారం ఇస్తే రూ.5 వేలు నజరానా అందించనున్నట్లు తెలిపారు. ఉపసర్పంచ్ వంగపెల్లి శేఖర్, కార్యదర్శి కవితారెడ్డి, వీవో అధ్యక్షురాళ్లు బెంద్రపు జ్యోతి, పుట్ట సంపూర్ణ, సీఏ శోభ, సంఘాల ప్రతినిధులు వసంత, లావణ్య పాల్గొన్నారు. 108లో ఈఎంఈ ఉద్యోగాలుసిరిసిల్లటౌన్: జీవీకే ఈఎంఆర్ఐ గ్రీన్హెల్త్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 108 అత్యవసర అంబులెన్స్ సర్వీసుల్లో ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటీవ్ పోస్టులకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈమేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా 108 ప్రోగ్రాం మేనేజర్ భూమా నాగేందర్ సోమవారం ప్రకటనలో తెలిపారు. బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి, సంబంధిత పోస్టులో కనీసం మూడేళ్ల అనుభవంతోపాటు ఆటోమొబైల్ రంగంలో పనిచేసిన అనుభవం గల అభ్యర్థులు అర్హులని తెలిపారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక సెట్ జిరాక్స్ కాపీతోపాటు, అనుభవ ధ్రువీకరణ పత్రాలతో ఇంటర్వ్యూకు హాజరుకావాలని కోరారు. మే 2వ తేదీ కరీంనగర్ గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు వివరించారు. పూర్తి వివరాలకు 91007 99699లో సంప్రదించాలని కోరారు. -
ప్రజావాణి అర్జీలు పెండింగ్లో పెట్టవద్దు
సిరిసిల్ల అర్బన్: ప్రజావాణికి వచ్చిన అర్జీలను పెండింగ్లో పెట్టవద్దని, సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. మొత్తం 225 దరఖాస్తులు వచ్చాయి. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. వేములవాడ మండలం సంకెపల్లిలో పెండింగ్లో ఉన్న 45 ఇండ్లకు నష్టపరిహారంతోపాటు 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు ప్యాకేజీ ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కలెక్టర్ స్పందించి నష్టపరిహారంతోపాటు ప్యాకేజీ ఇప్పించాలి. – సంకెపల్లి గ్రామస్తులు -
స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలి
● కలెక్టర్ గరీమా అగ్రవాల్ సిరిసిల్ల/తంగళ్లపల్లి(సిరిసిల్ల): జూకీ కుట్టుమిషన్లతో స్వయం ఉపాధి పొంది మహిళలు ఆర్థికంగా ఎ దగాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ఆరుగురికి జూకీ కుట్టు మిషన్లను సోమవారం కలెక్టరేట్లో పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ మరిన్ని మెలకువలు నేర్చుకుంటూ యూనిఫాంలు, ఆధునిక డిజైన్లతో డ్రెస్సులు కుట్టాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి కలెక్టర్ గరీమా అగ్రవాల్ తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి టెక్స్టైల్ పార్కులో మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కొనసాగుతుండగా గతంలో పరిశీలించారు. కుట్టు శిక్షణ పొందుతున్న మహిళలతో మాట్లాడారు. ఆ సమయంలోనే నిరుపేదలకు కుట్టుమిషన్లు ఇస్తామని కలెక్టర్ భరోసా ఇచ్చారు. ఈమేరకు రామిడి లక్ష్మి, బత్తిని అశ్విని, పోతూరి లావణ్య, దొరగొల్ల ప్రేమలత, పోతూరి నిర్మల, మంద సుమలతకు జూకీ కుట్టుమిషన్లు అందించారు. చేనేత, జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్.సంతోష్, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్ పాల్గొన్నారు. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి పిల్లలు చదువుతోపాటు ఆటల్లోనూ రాణించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని, సోషల్మీడియాకు దూరంగా ఉండాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ సూచించారు. తంగళ్లపల్లి మండలం మండెపల్లి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో సోమవారం బాలల భద్రత – డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాలు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు వేసవి సెలవుల్లో తల్లిదండ్రులకు పనుల్లో సాయం చేస్తూనే, నచ్చిన క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. అత్యవసర సమయాల్లో సంప్రదించాల్సిన హెల్ప్ లైన్ నంబర్లపై అవగాహన కల్పించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి, విద్యార్థులతో ముచ్చటించారు. సిరిసిల్ల డీఎస్పీ కె.నాగేంద్రచారి, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, జిల్లా వైద్యాధికారి రజిత, తహసీల్దార్ విజయ ప్రకాశ్రావు, ఎంపీడీవో కె.లక్ష్మీనారాయణ, సర్పంచ్ గాధగోని సాగర్, సీడీపీవో ఉమారాణి ఉన్నారు. -
భద్రాచలం బస్సు ప్రారంభం
● జెండా ఊపిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడఅర్బన్/వేములవాడరూరల్: వేములవాడ నుంచి భద్రాచలం వరకు ఆర్టీసీ బస్సు సర్వీసును సోమవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేతులమీదుగా ప్రారంభించారు. విప్ మాట్లాడు తూ త్వరలోనే బాసరకు బస్సు ప్రారంభించుకోనున్నట్లు తెలిపారు. డిపో మేనేజర్ శ్రీనివాస్, మున్సి పల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్చైర్మన్ నరాల శేఖర్, కౌన్సిలర్ ఎలా శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు మారుపాకలోని రైతువేదికలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు, రైతులకు అవగాహన కార్యక్రమం విప్ ప్రా రంభించి మాట్లాడారు. భూసార పరీక్షలు చేసుకు ని, పంటలు వేసుకోవాలని సూచించారు. డాక్టర్ వేణుగోపాల్రెడ్డి, సాయికుమార్, సునీతాదేవి, మధుకర్రావు, సాయికిరణ్ ఉన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవా డ రూరల్ మండలం పోచెట్టిపల్లిలో ఇందిరమ్మ గృహప్రవేశానికి హాజరై మాట్లాడారు. ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, సర్పంచ్ చింతపంటి మల్లేశం, రూరల్ కాంగ్రెస్ అధ్యక్షుడు వకుళాభరణం శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కూలీ పెంచే వరకు పోరాడుతాం
● యజమానులు వెంటనే కూలీ ఒప్పందం చేపట్టాలి ● పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూశం రమేశ్ సిరిసిల్లటౌన్: పాలిస్టర్ వస్త్రోత్పత్తిరంగంలోని కార్మికులు, వైపని, వార్పిన్, అనుబంధ రంగాలు, ఆసాములు కూలీ పెంచే వరకు పోరాడుతామని పలువురు స్పష్టం చేశారు. డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ స్థానిక బీవైనగర్లో సోమవారం నిరవధిక సమ్మె శిబిరం ప్రారంభించారు. పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూశం రమేశ్ మాట్లాడుతూ పవర్లూమ్ కార్మికుల కూలి చర్చలు మాత్రమే జరిగినాయని అగ్రిమెంటు జరగలేదన్నారు. వార్పిన్, వైపని కూలీ చర్చలు జరగాల్సి ఉందన్నారు. కార్మికులు, ఆసాములు అందరి కూలి అగ్రిమెంట్ జరిగే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. పవర్లూమ్ కార్మికులకు 10 పిక్కులకు రూ. 0.28 పైసలు ఇస్తామని యజమానులు ఒప్పుకొని అగ్రిమెంట్ చేయలేదన్నారు. నాయకులు కోడం రమణ, సిరిమల్ల సత్యం, కుమ్మరికుంట కిషన్, కుడిక్యాల కనకయ్య, ఉడుత రవి, ఎలిగేటి శ్రీనివాస్, సబ్బని చంద్రకాంత్, బాస శ్రీధర్, గడ్డం రాజశేఖర్, బెజిగం సురేష్, సర్గం శేఖర్, గోవిందు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు
సిరిసిల్లటౌన్: భారతీయ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఆవిర్భావ వేడుకలను సోమవారం సిరిసిల్లలో పండుగ వాతావరణంలో నిర్వహించారు. తెలంగాణ భవన్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పార్టీ జెండాను ఆవిష్కరించారు. పలువురు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష బంగారు తెలంగాణ సాధించే వరకు పార్టీ కృషి చేస్తుందన్నారు. ప్రత్యేక తెలంగాణ సాధకుడు కేసీఆర్ నాయకత్వంలో ప్రజల పక్షాన ఉంటూ.. సమస్యల సాధనకు పోరాడుతుందని స్పష్టం చేశారు. అనంతరం కొత్త బస్టాండులోని తెలంగాణ తల్లికి పూలమాలలు వేశారు. తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి చేతుల మీదుగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, వైస్చైర్మన్ దార్ల సందీప్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, టీఎస్పీటీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్ పాల్గొన్నారు. వాడవాడల్లో గులాబీ పండుగ బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్ని వార్డుల్లో కౌన్సిలర్లు, పార్టీ వార్డు కమిటీల ఆధ్వర్యంలో సంబరాలు జరిపారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న 3వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ చేతుల మీదుగా జెండాను ఆవిష్కరించారు. -
ట్రాన్స్ఫార్మర్ల రవాణాకు సొంత వాహనాలు
సిరిసిల్ల: జిల్లా పరిధిలోని రైతులకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా ఎన్పీడీసీఎల్ డిపార్టుమెంట్ ట్రాన్స్ఫార్మర్ వాహనాలను అందుబాటులో ఉంచినట్లు సిరిసిల్ల సర్కిల్ ఎస్ఈ టి.వేణుమాధవ్ సోమవారం తెలిపారు. జిల్లా పరిధిలో ఏడు వాహనాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతీ వాహనానికి జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులకు సత్వర సహాయం అందించేందుకు ఉపయోగపడతాయన్నారు. ప్రతీ డివిజన్, సబ్డివిజన్ పరిధిలో డిపార్టుమెంట్ ట్రాన్స్ఫార్మర్ వాహనాలు అందుబాటులో ఉంచామన్నారు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిన వెంటనే సంబంధిత అధికారికి తెలియజేస్తే డిపార్టుమెంట్ వాహనం ద్వారానే ట్రాన్స్ఫార్మర్ను వంద శాతం తరలిస్తామని తెలిపారు. వ్యవసాయ సీజన్లలో రైతులకు ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా కొనసాగించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ స్వయంగా ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ పరికరాలను తాకరాదని సూచించారు. ఎలాంటి సమస్యలు వచ్చిన వెంటనే 1912కు ఫోన్చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు. అకాల వర్షం.. తడిసిన ధాన్యంబోయినపల్లి(చొప్పదండి): బోయినపల్లి మండలం దేశాయిపల్లిలో సోమవారం మధ్యాహ్నం ఈదురుగాలులతో కురిసిన వర్షంతో ధాన్యం తడిసింది. కొనుగోలు కేంద్రంలో ధాన్యం ఆరబోసిన సమయంలో ఒక్కసారిగా ఈదురుగాలులతో వర్షం కురవడంతో పలువురు రైతులు ధాన్యం తడిసిందని తెలిపారు. ధాన్యంపై పరదాలు కప్పినా గాలికి లేచిపోయాయి. -
ఫిర్యాదుల పరిష్కారంతోనే పోలీస్శాఖపై నమ్మకం
● ఎస్పీ మహేశ్ బీ గీతే ● గ్రీవెన్స్ డేకు 36 ఫిర్యాదులు సిరిసిల్ల: ప్రజల నుంచి వచ్చే ప్రతీ ఫిర్యాదును సానుకూలంగా స్వీకరించి ఆ సమస్యను పరిష్కరించాలని, అప్పుడే పోలీస్శాఖపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. జిల్లా పోలీస్ ఆఫీస్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్డేకు 36 మంది బాధితులు వచ్చారు. తమ సమస్యలపై వినతిపత్రాలు అందించారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఠాణాకు వచ్చిన ఫిర్యాదుదారులతో మార్యదగా ప్రవర్తించాలని సూచించారు. సమస్య పరిష్కారమైతే పోలీస్శాఖపై భరోసా, నమ్మకం కలుగుతుందన్నారు. గ్రీవెన్స్ డేలో వచ్చిన ప్రతి ఫిర్యాదును డీపీవో ఆఫీస్లో ఆన్లైన్లో పొందుపరుస్తూ ఏ మేరకు సమస్యలు పరిష్కారం అయ్యాయో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ఎస్పీ వివరించారు. ఫిర్యాదులపై ఆయా పోలీస్స్టేషన్ల ఎస్హెచ్వోలతో ఫోన్లో మాట్లాడి, చట్టపరంగా పరిష్కరించాలని ఆదేశించారు. -
నో స్టాక్ బోర్డు
ఊరెళ్లేందుకు సిద్ధమయ్యాం. కారులో డీజిల్ పోయించేందుకు బంకుకు వస్తే నో స్టాక్ బోర్డు ఉంది. ఎప్పుడూ పద్మనగర్లోనే డీజిల్ పోయిస్తాం. కానీ ఈసారి నో స్టాక్ బోర్డు ఉండడంతో మరో బంకులో డీజిల్ పోయించేందుకు వెళ్తున్నాం. నమ్మకంతో ఇంత దూరం వస్తే బంక్లో డీజిల్, పెట్రోల్ లేదని తెలిసి నిరాశతో వెళ్తున్నాం. మేం ఒక్కరిమే కాదు.. చాలా మంది ట్రాక్టర్లు, బైక్ల యజమానులు వాపస్ పోతున్నారు. – పిల్లి కిశోర్, సారంపల్లి పెట్రోల్ కోసం వచ్చాను బండిలో పెట్రోల్ పోయించేందుకు వస్తే నో స్టాక్ బోర్డు ఉంది. బంకులోకి వాహనాలు రాకుండా అడ్డంగా తాడు కట్టారు. మూడు రోజులుగా ఇదే పరిస్థితి. బంకు ఉందనే నమ్మకంతో వస్తే ఇలా లేకుంటే ఎలా. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. వాహనదారులు పెట్రోల్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. – పయ్యావుల లక్ష్మణ్, తంగళ్లపల్లి -
నీడలేని ఉపాధి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): భానుడు భగభగ మండిపోతున్నాడు. ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. బయటకు వెళ్లాలంటే జంకే పరిస్థితులు ఉన్నాయి. ఉపాధిహామీ కూలీలు మాత్రం ఎండలోనే పనులు చేస్తున్నారు. అధికారులు నిబంధనలు పాటించడం లేదు. దీంతో జిల్లాలో ఇటీవల ఒక ఉపాధిహామీ కూలీ మరణించగా, ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొంది ప్రాణాలతో బయటపడ్డారు. పనిచేసే చోట నీడ లేక.. నీళ్లు లేక.. కూలీలు అల్లాడుతున్నారు. ఉపాధిహామీ కూలీల ఇక్కట్లపై సాక్షి ‘ఫోకస్’. కనీస సౌకర్యాలు కరువు ఉపాధిహామీ పని ప్రదేశాల్లో కనీస వసతులు కల్పించాలనే నిబంధనలను అధికారులు పట్టించుకోవడం లేదు. కూలీలకు నీడ కోసం టెంట్లు, చలువ పందిర్లు వేయాలి. మెడికల్ కిట్లు, తాగునీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలి. కొన్ని గ్రామాల్లో మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచుతున్నా చాలా గ్రామాల్లో కనిపించడం లేదు. నీడ సౌకర్యం లేకపోవడంతో కూలీలు చెట్ల కిందనే సేద తీరుతున్నారు. ఎండ తీవ్రతకు డీహైడ్రేషన్ సమస్యలు తలెత్తుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అనేక మంది కూలీలు పని చేసే చోటనే చర్మ సమస్యలు, అలసట, తలనొప్పి వంటి ఇబ్బందులకు గురవుతున్నారు. కూలీల దాహం తీర్చేందుకు నీటి వసతి కల్పించడం లేదు. కూలీలే ఇంటి నుంచి బాటిళ్లలో తాగునీటిని తెచ్చుకుంటున్నారు. కానీ వారు తెచ్చుకుంటున్న నీరు సరిపోక ఇబ్బంది పడుతున్నారు. ఓఆర్ఎస్ ప్యా కెట్లు అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్నారు. రెండు నెలలుగా అందని వేతనాలు ఉపాధిహామీ కూలీలు మండుటెండల్లో పనులు చేస్తున్నప్పటికీ రెండు నెలలుగా వేతనాలు అందడం లేదు. గత ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు వేతనాలు రాలేవని కూలీలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా ఉపాధిహామీ పథకంలో పనులు చేసే కూలీలకు పని ప్రదేశంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం సౌకర్యాలు కల్పించాలని కూలీలు డిమాండ్ చేస్తున్నారు. -
స్వీయ గణనను విజయవంతం చేయాలి
● కలెక్టర్ గరీమా అగ్రవాల్ సిరిసిల్ల: జనగణనలో భాగంగా స్వీయ గణన ప్రక్రియను విజయవంతం చేయాలని కలెక్టర్, డిస్ట్రిక్ట్ అండ్ ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ గరీమా అగ్రవాల్ కోరారు. ఈనెల 26 నుంచి వచ్చే నెల 10 వరకు నిర్వహించే స్వీయ గణన(సెల్ఫ్ ఎన్యూమరేషన్) ప్రక్రియను ఆదివారం కలెక్టర్ స్వీయ గణన చేసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వెబ్సైట్ ద్వారా లాగిన్ కావాలని, వెబ్ సైట్ పూర్తి స్థాయిలో సురక్షితమని స్పష్టం చేశారు. ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు గుర్తింపు కార్డులు, ఇతర వివరాలు ఇచ్చామని తెలిపారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది జిల్లాలోని ప్రజాప్రతినిధులు స్వీయ గణన చేసుకోవాలని పేర్కొన్నారు. జనాభా గణనకు సంబంధించి 1,025 మంది ఎన్యూమరేటర్లు, 173 మంది సూపర్వైజర్లకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి జనగణన అని, డిజిటల్ విధానంలో చేయనున్నారని వెల్లడించారు. ఇప్పటి వరకు 1117 హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ గుర్తించామని తెలిపారు. సీపీవో శ్రీనివాసాచారి, ఈడీఎం శ్రీనివాస్, ఎస్వో సంపత్కుమార్ పాల్గొన్నారు. -
అంతిమ సంస్కారాలకు వాగే దిక్కు
వేములవాడరూరల్: ఆధ్యాత్మిక పట్టణం వేములవాడ మున్సిపాలిటీలో విలీన గ్రామాల్లో అంతిమసంస్కారాలకు అవస్థలు తప్పడం లేదు. శ్మశానవాటికలు అందుబాటులో లేక మూలవాగు, గంజివాగులు దిక్కవుతున్నాయి. మున్సిపాలిటీలో ఏడేళ్ల క్రితం నాంపల్లి, తిప్పాపూర్, కోనాయపల్లి, శాత్రాజుపల్లి, అయ్యోరుపల్లి ఐదు గ్రామాలను కలిపారు. అప్పటి నుంచి ఆయా గ్రామాల్లో శ్మశానవాటికల పనులు పూర్తి చేయలేదు. స్థలాలు కరువు మరణిస్తే అవస్థలే.. మా గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేయొద్దని ఆందోళనలు చేపట్టాం. అయినా విలీనం చేశా రు. 3వ వార్డుగా ఏర్పాటు చేసినప్పటికీ కనీసం శ్మశానవాటిక ఏర్పాటు చేయలేదు. ఎవరైనా మరణిస్తే సొంత స్థలాలు లేదా గంజివాగులోనే దహన సంస్కారాలు నిర్వహిస్తున్నాం. – ఉల్లెందుల అంజయ్య, అయ్యోరుపల్లి మాజీ సర్పంచ్వేములవాడ పట్టణంలోని మూడోవార్డులో విలీనమైన లక్ష్మీపురంలో చిట్యాల చంద్రయ్య శనివారం అనారోగ్యంతో మృతి చెందాడు. అంతిమ సంస్కారాల కోసం మృతదేహాన్ని ఆ ప్రాంతంలో ఉన్న శ్మశానవాటిక వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ఎలాంటి పనులు ప్రారంభించలేదు. స్థలాన్ని గుర్తించి ప్రహరీ మాత్రమే ఏర్పాటు చేశారు. అందులో పిచ్చిమొక్కలు పెరిగి వెళ్లడానికి వీలు లేకుండా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబసభ్యులు బయట ప్రాంతంలోనే దహన సంస్కారాలు పూర్తిచేశారు. -
డీడీలు చెల్లించినా రావడం లేదు
మేము మూడు రోజుల కిందటే డీజిల్, పెట్రోల్ కోసం బ్యాంకు ద్వారా డీడీలు తీసి పంపించాం. కంపెనీ ఆఫీసర్లతో మాట్లాడుతున్నాం. వస్తుందంటూనే పంపడం లేదు. మా బంకును ఎప్పుడూ మూసివేయకుండా సమర్థంగా నడపాలని భావిస్తాం. వాహనదారులకు మా పెట్రోల్ బంకుపై ఉన్న నమ్మకాన్ని కోల్పోతున్నాం. – పుల్లూరి కృష్ణమూర్తి, పెట్రోల్ బంకు యజమాని, సిరిసిల్ల కంపెనీల ప్రతినిధులతో మాట్లాడుతాం జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఇంధన కొరత ఉన్నట్లు మాకు సమాచారం లేదు. ఎక్కడైనా సమస్య ఉంటే.. సకాలంలో ఇంధన కంపెనీలకు డబ్బులు చెల్లించకపోతేనే ఈ సమస్య వస్తుంది. అయినా ఇంధన కంపెనీల సేల్స్ ఆఫీసర్లతో మాట్లాడుతాం. జిల్లాలోని పెట్రోల్, డీజిల్ బంకుల్లో కొరత లేకుండా చర్యలు తీసుకుంటాం. – ఎల్.బుచ్చిబాబు, డీసీఎస్వో -
ఘనంగా వాసవీమాత జయంతి
సిరిసిల్ల: వాసవీ కన్యకా పరమేశ్వరీ మాతా జయంతిని ఆదివారం కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల్లో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతే ముందుగా పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి రాందాస్, సీపీవో శ్రీనివాసాచారి, ఎస్సీ కార్పొరేషన్ అధికారి స్వప్న, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు బుస్స దశరథం, మాజీ అధ్యక్షుడు కటుకం సత్తయ్య, వైశ్య సంఘం ప్రతినిధులు సిద్ధంశెట్టి వేణు, అల్లాడి శ్రీనివాస్, కటుకం శ్రీనివాస్, పబ్బ నాగరాజు, రంగ రాజేందర్, రాజూరి వాసుదేవరాయలు, ఆర్ఐ యాదగిరి, ఎస్ఐ కిరణ్కుమార్, ఆర్ఎస్ఐ సాయికిరణ్ పాల్గొన్నారు. -
నీళ్లు తెచ్చుకుంటున్నాం
ఎండలో పనులు చేయాలి. కనీసం టెంట్ సౌకర్యం లేదు. నీళ్లు కూడా లేవు. ఇంటి నుంచే నీళ్లు తెచ్చుకుంటున్నాం. ఆ నీళ్లు పని పూర్తయ్యే వరకు సరిపోవడం లేదు. దప్పికతోనే పని చేస్తున్నాం. అధికారులు స్పందించి పనిప్రదేశాల్లో చలువ పందిర్లు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాలి. – దాదే ప్రమీల, ఉపాధిహామీ కూలి సౌకర్యాలు కల్పిస్తున్నాం ప్రస్తుత వేసవిలో ఉపాధిహామీ పనులు చేసే కూలీలకు పని ప్రదేశంలో సౌకర్యాలు కల్పిస్తున్నాం. కొన్ని గ్రామాల్లో తప్ప అంతటా చలువపందిర్లు వేశాం. అందుబాటులో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లను ఉంచుతున్నాం. నీటిబాటిళ్లను కూలీలు ఇంటి నుంచి తెచ్చుకోవాలని సూచిస్తున్నాం. ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని కూడా పరిష్కరిస్తాం. – కొమురయ్య, ఏపీవో, ఎల్లారెడ్డిపేట -
నేటి నుంచి పాలిస్టర్ పరిశ్రమలో సమ్మె
సిరిసిల్లటౌన్: పాలిస్టర్ వస్త్ర పరిశ్రమలో సమ్మైసెరన్ మోగింది. సోమవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూశం రమేశ్ ఆదివారం ప్రకటించారు. కార్మికులు, ఆసాము ల కూలీ పెంపు ఒప్పందం రెండేళ్లకు పైగా జరగడం లేదన్నారు. ఈమేరకు వస్త్రోత్పత్తిదారులకు, అధికారులకు అనేకసార్లు వినతిపత్రాలు అందించినట్లు తెలిపారు. శని వారం డిస్ట్రిక్ట్ లేబర్ కమిషనర్, చేనేత జౌళి శాఖ ఏడీ సమక్షంలో నిర్వహించిన చర్చలు ఫలించకపోవడంతో కూలీపోరు తథ్యమని స్పష్టం చేశారు. కోడం రమణ తదితరులున్నారు. స్వీయ జనగణనలో భాగస్వామ్యం కావాలి సిరిసిల్లటౌన్: జనగణనలో పౌరులు విధిగా పాల్గొనాలని ఎస్పీ మహేశ్ బీ గీతే, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ కోరారు. మున్సిపల్ ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టిన కార్యక్రమంలో పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ ఖదీర్పాషా మాట్లాడుతూ ఆదివారం నుంచి మే 10 వరకు వెబ్సైట్ https://se.census.gov.in లో ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఆర్డీవో వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ దార్ల సందీప్ తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకున్నారు. ధాన్యం కొనుగోళ్లు షురూ సిరిసిల్ల: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు సాగుతున్నాయని జిల్లా పౌరసరఫరాల అధికారి ఎల్.బుచ్చిబాబు ఆదివారం తెలిపారు. జిల్లాలో 236 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, 48 కేంద్రాల వద్ద ఆదివారం నాటికి 456 మంది రైతుల నుంచి 2,440.300 మెట్రిక్ టన్నుల వడ్లను కొనుగోలు చేసినట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో ఈసారి కొత్తగా ఆన్లైన్ సిస్టం ద్వారా రియల్ టైండేటా ఎంట్రి అమలు చేస్తున్నామని బుచ్చిబాబు వివరించారు. తూకం వేసి ధాన్యం బస్తాలను రైస్మిల్లులకు తరలిస్తున్నామని వివరించారు. మిల్లుల్లోనూ ఇబ్బందులు లేకుండా ధాన్యం దిగుమతులు జరుగుతున్నాయని బుచ్చిబాబు తెలిపారు. రహదారిపై స్పీడ్ బ్రేకర్లు ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండల కేంద్రంలోని హెచ్పీ పెట్రోల్బంక్ వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని గత ఆదివారం స్థానికులు కలెక్టర్ గరీమా అగ్రవాల్కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ వెంటనే ఆర్అండ్బీ అధికారులతో మాట్లాడి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్అండ్బీ ఏఈ అనూజ ఆధ్వర్యంలో సిరిసిల్ల– కామారెడ్డి ప్రధాన రహదారిపై జీబ్రా లైన్స్ వేశారు. ఆలయ అభివృద్ధికి విరాళం వేములవాడ: వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధి, విస్తరణ పనుల కోసం హైదరాబాద్కు చెందిన శంకర్రావు–ప్రసూన దంపతులు రూ.10లక్షల విరాళం ఆదివారం అందజేశారు. స్వామివారి ఆశీర్వాదాలు అందజేశారు. -
మాజీ మంత్రికి రైతులపై కపట ప్రేమ
● ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మొసలి కన్నీరు ● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చందుర్తి(వేములవాడ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ రైతుల పట్ల కపట ప్రేమ ఒలకబోస్తే వారు నమ్మే పరిస్థితిలో లేరని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. చందుర్తి మండలం బండపల్లిలో ఇందిరమ్మ గృహ ప్రవేశ కార్యక్రమానికి ఆదివారం హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వరి వేస్తే ఉరి అని ప్రచారం చేసిన విషయాన్ని మరిచి.. కేటీఆర్ శనివారం తంగళ్లపల్లి మండలం బద్దనపల్లి కొనుగోలు కేంద్రంలో రైతులకు వద్దకు వెళ్లి మొసలి కన్నీరు కార్చడాన్ని విశ్వసించడం లేదన్నారు. పదేళ్ల అధికారంలో కొనుగోలు కేంద్రాలను ఏప్రిల్ 25 వరకు ప్రారంభించిన దాఖలాలు కూడా లేవని విమర్శించారు. రైతుల మనోధైర్యం దెబ్బతీయడానికి ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయన్న సంగతి కేటీఆర్ వైఖరితో బహిర్గతమవుతోందని పేర్కొన్నారు. రైస్మిల్లుల్లో స్థలాభావం ఉందని 24 మిల్లుల్లో 1.42 లక్షల టన్నుల, మిగులు ధాన్యం నిలువకు గోదాంలు, అపెరల్ పార్క్ గోదాంలను వినియోగించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బండపల్లి, కిష్టంపేట సర్పంచులు కటకం మల్లేశం, మోకనపల్లి దేవరాజం, పార్టీ మండల అధ్యక్షుడు చింతపంటి రామస్వామి, జిల్లా ప్రదాన కార్యదర్శి గొట్టే ప్రభాకర్, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు బొజ్జ మల్లేశం, డైరెక్టర్లు ఏనుగు లచ్చి రెడ్డి, ఖరీం, నాయకులు ముస్కు మల్లారెడ్డి, డాక్టర్ అజీమ్, ఎండీ అన్వర్, తీపిరెడ్డి కరుణాకర్, పురంశెట్టి శేఖర్, ఉపసర్పంచ్ పల్లపు ఇసాక్ పాల్గొన్నారు. -
అద్దె భవనంలో పల్లె దవాఖానా
ఇల్లంతకుంట: మండలంలోని జవారిపేట పల్లె దవాఖానా అద్దె భవనంలో కొనసాగుతోంది. భవనంలోని గోడలు కూలిపోవడంతో అందులోని సా మగ్రి రెడ్డి సంఘం భవనంలోని గదిలో, పాల ఉత్పత్తిదారుల సంఘం భవనంలోకి ఫర్నిచర్, ఇతర సామగ్రిని సిబ్బంది తరలించారు. ఇరుకు గదుల్లోనే వైద్యసేవలు అందిస్తున్నారు. సిబ్బంది సౌకర్యాలు కల్పించకపోవడంతో విధులు నిర్వర్తించేందుకు ఇ బ్బంది పడుతున్నారు. జవారిపేటపల్లె దవాఖాన కేంద్రం పరిధిలో పొత్తూరు, నర్సక్కపేట, గ్రామాలున్నాయి. పల్లె దవాఖానాలో ఎంఎల్హెచ్పీ డాక్టర్, ఇద్దరు ఏఎన్ఎంలు, నలుగురు ఆశా కార్యకర్తలున్నారు. నిరుపయోగంగా భవనం జవారిపేట గ్రామంలో నూతనంగా పల్లె దవాఖాన భవనాన్ని నిర్మించి రెండేళ్లు గడుస్తున్నా విద్యుత్, నీటి సౌకర్యం, లేకపోవడంతో నిరుపయోగంగా మారింది. నూతన భవనంలో అసంపూర్తి పనులు పూర్తిచేసి పల్లె దవాఖానను నూతన భవనంలోకి మార్చాలని ప్రజలు కోరుతున్నారు. -
ఈతకు వెళ్లి నీటమునిగిన యువకుడు
రామగుండం: పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామ శివారులోని చెరువుకట్ట సమీపంలో నివాసముండే బుడిగజంగాల కుటుంబానికి చెందిన పస్తం పవన్(18) శనివారం ఈతకొడుతుండగా పిట్స్ రావడంతో నీటమునిగి చనిపోయాడు. మరోఇద్దరు యువకులతో కలిసి చెరువులో ఈదుతుండగా పిట్స్ వచ్చినట్లు స్థానికులు తెలిపారు. యువకుడు కొన్నేళ్లుగా పిట్స్తో బాధపడుతూ చికిత్స పొందుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కాగా పస్తం రాంచందర్కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు పవన్ ఉన్నాడు. రాంచందర్కు ఉన్న ఏకై క కుమారుడు పవన్ మృత్యువాత పడడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు ఎస్సై వెంకటస్వామి తెలిపారు. జగిత్యాలక్రైం: బీర్పూర్ మండలకేంద్రంలో ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో అదేగ్రామానికి చెందిన చీర్నేని బుచ్చన్నకు తీవ్రగాయాలయ్యాయి. బుచ్చన్న తన ద్విచక్ర వాహనంపై పొలం పనులకు వెళ్తుండగా.. జన్నారం నుంచి జగిత్యాలకు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో బుచ్చన్న తలకు తీవ్రగాయాలుకాగా.. స్థానికులు 108 ద్వారా జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బీర్పూర్ ఎస్సై రాజు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. బాలికపై లైంగిక దాడి చేసిన వ్యక్తి అరెస్ట్జగిత్యాలక్రైం: జగిత్యాలకు చెందిన బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై పోక్సో, కిడ్నాప్, అత్యాచారం కేసులు నమోదు చేసి నింది తుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ కరుణాకర్ తెలిపారు. హౌసింగ్బోర్డు కాలనీలో ని వాసముంటున్న మనువాడ విష్ణువర్దన్ కొద్దిరోజు ల క్రితం పట్టణానికి చెందిన ఓ బాలికను కిడ్నాప్ చే సి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తండ్రి ఫిర్యా దు మేరకు నిందితుడిని రిమాండ్కు పంపించినట్లు సీఐ తెలిపారు. దాడి చేసిన వ్యక్తి రిమాండ్చందుర్తి(వేములవాడ): పాతకక్షలను దృష్టిలో పెట్టుకుని దాడిచేసిన చందుర్తి మండలం జోగాపూర్కు చెందిన ఓ వ్యక్తిని శనివారం అరెస్టు చేసినట్లు ఎస్సై జిల్లెల్ల రమేశ్ తెలిపారు. ఎస్సై రమేశ్ తెలిపిన వివరాలు. చందుర్తి మండలం జోగాపూర్కు చెందిన గొంటి లక్ష్మణ్ రోడ్డుపై వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన నామాల ఉరఫ్ మ్యాదరి నర్సయ్య ఈనెల 5న గొడ్డలి కామతో దాడి చేశాడు. బాధితుడు లక్ష్మణ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించారు. దొంగతనం కేసులో వ్యక్తి అరెస్టుగంభీరావుపేట(సిరిసిల్ల): గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట మండలాల పరిధిలోని పలు ఆలయాలు, ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎల్లారెడ్డిపేట సీఐ వెంకటేశ్ తెలిపారు. గంభీరావుపేట మండలకేంద్రానికి చెందిన అక్కపల్లి సంతోష్ను రిమాండ్కు తరలించినట్లు వివరించారు. రోడ్డుపై కందకాలు..ఇల్లంతకుంట: మండలకేంద్రం నుంచి కరీంనగర్ వెళ్లే ప్రధాన రహదారి పొత్తూరు సమీపంలోని రోడ్డుకు అడ్డంగా కందకాలు ఉండడంతో ప్రయాణికులు ప్రమాదాలబారిన పడుతున్నారు. కందకం దగ్గరకు వచ్చేంతవరకు తెలియకపోవడంతో ప్రమాదాలబారిన పడుతున్నామని వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. పొత్తూ రు రోడ్డుపై రెండు మూడుచోట్ల కందకాలు న్నాయి. ఆర్అండ్బీ అధికారులు మరమ్మతులు చేపట్టి ప్రమాదాలబారిన పడకుండా చూడాలని వాహనదారులు కోరుతున్నారు. -
వెనకడుగు వేయొద్దు
పట్టుదలగా చదువాలి. చదువును నిర్లక్ష్యం చేయొద్దు. వెనకడుగు వేయొద్దు. నిజా నికి బీట్ ఆఫీసర్గా ఉండగా మళ్లీ చదువు ఎందుకు అని చాలా మంది సలహా ఇచ్చా రు. ఉన్న ఉద్యోగం పోతుందన్నారు. అప్పటికే పోటీపరీక్షల పేపర్లు లీక్ కావడం, రాసిన పరీక్షలు రద్దు కావడం జరిగింది. దీంతో చాలా మంది ఉన్న ఉద్యోగంలోనే చేరమన్నారు. కానీ మనపై మనకు నమ్మకం ఉంటే.. ఇది పోతే ఇంకోటి వస్తుందిలే అనే ధీమాతో రెండేళ్లు ఇంటి ముఖం చూడకుండా హైదరాబాద్లోనే ఉండి చదువుకున్న. కృషికి తోడుగా.. పట్టుదల ఉంటే.. ఏదైనా సాధిస్తామనే ధైర్యం వస్తుంది. ఆ ధైర్యంతోనే మూడు ఉద్యోగాలు సాధించాను. అన్ని ఖాకీ యూనిపామ్ సర్వీసులే కావడం ఆనందం అనిపించింది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా.. చదువును మరువద్దు. – పృథ్వీరాజ్వర్మ, ఏఎంవీఐ, రాజన్న సిరిసిల్ల -
మిషన్ భగీరథ ఉన్నా బోరు నీరే
వీర్నపల్లి(సిరిసిల్ల): గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీమిషన్ భగీరథశ్రీ పథకం లక్ష్యం పక్కదారి పడుతోంది. ఇంటింటికీ స్వచ్ఛమైన సురక్షిత జలాలు అందించేందుకు ఈ పథకాన్ని ప్రారంభించారు. అయితే ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి పైప్లైన్లు వేసినప్పటికీ అనేక గ్రామాల్లో మిషన్ భగీరథ నీరు అందడం లేదు. కలుషిత నీరే దిక్కు గ్రామాల్లో మిషన్ భగీరథ నీరు సకాలంలో రాకపోవడంతో స్థానిక ప్రజాప్రతినిధులు మళ్లీ పాత పద్ధతులనే ఆశ్రయిస్తున్నారు. పాతబోర్ల ద్వారా వచ్చే నీటిని, మిషన్ భగీరథ నీటిని కలిపి వాటర్ ట్యాంకులకు ఎక్కించి సరఫరా చేస్తున్నారు. దీంతో పైప్లైన్ ద్వారా వచ్చే నీరు పూర్తిగా కలుషితమవుతోంది. ఇంటింటికీ శుద్ధి చేసిన నీరు అందిస్తామన్న హామీ నీటిమూటగానే మిగిలిపోయింది. రక్షిత తాగునీరు రాకపోవడంతో ప్రజలు గత్యంతరం లేక ఈ శ్రీమిక్సింగ్శ్రీ నీటినే వాడుకోవాల్సి వస్తోంది. జేబుకు చిల్లు.. ఆరోగ్యానికి ముప్పు ప్రభుత్వ నీటిపై నమ్మకం లేక గ్రామస్తులు అదనపు భారమైనా సరే ప్రైవేటు ఆర్వో ప్లాంట్లను ఆశ్రయిస్తున్నారు. రూ.10 వెచ్చించి 20 లీటర్ల నీటిని కొనుగోలు చేస్తున్నారు. మళ్లీ ట్యాంకర్ల కాలం వేసవి సమీపిస్తున్న తరుణంలో నీటి ఎద్దడి తలెత్తకుండా చూడాల్సిన అధికారులు మిషన్ భగీరథ నిర్వహణను గాలికి వదిలేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో సర్పంచులు కొత్తగా బోర్లు వేయించడం, ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. పైప్లైన్ల లీకేజీలు, మోటార్ల మరమ్మతులపై పర్యవేక్షణ కరువైందని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, మిక్సింగ్ నీటి సరఫరాను అరికట్టి, స్వచ్ఛమైన భగీరథ జలాలను అందించాలని పల్లె ప్రజలు కోరుతున్నారు. -
ముచ్చటగా మూడు కొలువులు
● చదువు.. పట్టుదల.. విజయం● అన్నీ ‘యూనిఫామ్’ సర్వీసులే● ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ టు ఏఎంవీఐసిరిసిల్ల: ప్రభుత్వ ఉద్యోగం ఒకటి సాధించడమే కష్టంగా ఉన్న నేటి పోటీ ప్రపంచంలో పట్టుదలకు ప్రయత్నం తోడైతే విజయాలు క్యూ కడతాయని నిరూపిస్తున్నారు సిరిసిల్ల అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్(ఏఎంవీఐ) బేర పృథ్వీరాజ్వర్మ. ఒక్కటి కాదు...రెండు కాదు.. ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. చదువు ఒక్కటే మనల్ని ముందుకు నడిపిస్తుందని.. సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెడుతుందంటున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఏఎంవీఐగా పనిచేస్తున్న పృథ్వీరాజ్వర్మ గ్రామీణ నేపథ్యంలో ఎదిగి వచ్చి శ్రీఖాకీశ్రీ యూనిఫామ్పై ఉన్న మక్కువతో మూడు ఉద్యోగాలు సాధించారు. ప్రజలకు నేరుగా సేవచేసే అవకాశం ఖాకీ దుస్తులకే ఉందని నమ్మారు. ఉద్యోగ అన్వేషణలో పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న నేటితరం యువతకు స్ఫూర్తినిస్తున్న పృథ్వీరాజ్వర్మ విజయగాథపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ● మధ్యతరగతి కుటుంబంమంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కన్నెపల్లికి చెందిన బేర శ్రావణి, రాజమౌళి దంపతులకు ఇద్దరు కొడుకులు పృథ్వీరాజ్వర్మ, భరద్వాజ్. లక్షెట్టిపేటలో ఎస్ఎస్సీ వరకు చదివిన పృథ్వీరాజ్వర్మ పదోతరగతిలో 526 మార్కులు సాధించారు. హైదరాబాద్లో ఇంటర్, వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో బీటెక్ (మెకానికల్) పూర్తి చేశారు. 2017లో బీటెక్ పట్టాతో బయటకు వచ్చిన పృథ్వీరాజ్వర్మ హోండా కంపెనీలో సర్వీసు ఇంజినీరుగా రెండేళ్లపాటు పనిచేశారు. అనంతరం మరో సిమెంట్ కంపెనీలో పనిచేశారు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆయన ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే పట్టుదలగా ఖాళీ సమయంలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు.● బీట్ ఆఫీసర్గా ప్రస్తానం2019లో పోటీపరీక్షలు రాసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా తొలి ఉద్యోగం సాధించారు. శిక్షణ అనంతరం జన్నారం కవ్వాల్ టైగర్ రిజర్వు ఫారెస్ట్లో ఉద్యోగం. అడవిని, వన్యప్రాణులను రక్షించే ఉద్యోగం. బీట్ ఆఫీసర్గా పనిచేస్తూ పోటీ పరీక్షలకు సిద్దమయ్యారు. 2023లో తెలంగాణ ప్రభుత్వం నేరుగా అసిస్టెంట్ మోటార్ వాహన తనిఖీ అధికారి(ఏఎంవీఐ) ఉద్యోగాలకు పరీక్షలను నిర్వహించింది. ఆ పరీక్షలకు పట్టుదలగా ప్రిపేర్ అయ్యారు. ఆ పరీక్షల ఫలితాలు రాక ముందే 2024లో పోలీస్ కానిస్టేబుల్(సివిల్) ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యారు. కానిస్టేబుల్ ఉద్యోగం చేరకుండా.. ఏఎంవీఐ ఉద్యోగ ఫలితాల కోసం నిరీక్షించారు. ఉద్యోగం పోతుందని, వెంటనే చేరాలని అనేక మంది సలహా ఇచ్చినా అప్పటికే ఓ ఉద్యోగం ఉంది, మరో ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాను అనే ధీమాతో ఉండగా.. ఏఎంవీఐగా ఎంపికయ్యారు. మూడు ఖాకీ డ్రెస్ వేసుకునే ఉద్యోగాలు రావడంతో చివరగా.. ఏఎంవీఐగా ఉద్యోగంలో చేరారు.● తమ్ముడూ.. భార్యా ఇంజినీర్లేపృథ్వీరాజ్వర్మ తమ్ముడు భరద్వాజ ఆర్అండ్బీలో ఏఈఈగా పనిచేస్తున్నారు. ఆయన భార్య కీర్తి ఇరిగేషన్ శాఖలో ఏఈఈగా మంచిర్యాల జిల్లాలో పనిచేస్తున్నారు. ఇంట్లో ఇద్దరు అబ్బాయిలు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడడంతో తల్లిదండ్రులు శ్రావణి, రాజమౌళి దంపతుల ఆనందానికి అవధుల్లేవు. చిన్నప్పటి నుంచి చదువు ఒక్కటే దారి చూపుతుందని నమ్మిన ఆ తల్లిదండ్రులు పిల్లలను ప్రయోజకులను చేశామని ఆత్మసంతృప్తితో ఉన్నారు. -
కొడుకు హత్యకు తల్లి ప్లాన్
మంథనిరూరల్: కన్న కొడుకునే మరో కొడుకుతో అంతం చేయాలని చూసిందో తల్లి.. అర్ధరాత్రి నిద్రిస్తున్న అన్నపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసేందుకు యత్నించిన ఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలం లక్కేపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. మంథని మండలం లక్కేపూర్ గ్రామానికి చెందిన కొత్త రఘుపై అతడి తమ్ముడు అనిల్ పెట్రోల్ పోసి నిప్పంటించగా తీవ్రగాయాలు కావడంతో ఎంజీఎంకు తరలించారు. బాధితుడి సోదరి పాలడుగు సౌజన్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం ప్రకారం.. రఘు తండ్రి 15 ఏళ్ల క్రితం చనిపోయాడు. తల్లి జ్యోతి తన తమ్ముళ్లతో కలిసి గ్రామంలోనే ఉంటున్నారు. తల్లి ప్రవర్తన బాగా లేకపోవడంతో తరచూ పెద్ద తమ్ముడు గొడవ పడుతుండేవాడు. శుక్రవారం రాత్రి సైతం గొడవ జరగడంతో తనకు అడ్డుగా వస్తున్నాడని భావించిన తల్లి.. తన చిన్న కొడుకుతో పెద్ద కొడుకును చంపాలని పథకం వేసింది. ఈక్రమంలో అంతకుముందే తెచ్చుకున్న పెట్రోల్ను నిద్రిస్తున్న రఘుపై పోసి నిప్పంటించాడు. మంటల తీవ్రతకు అరవడంతో స్థానికులు గమనించి వెంటనే కరీంనగర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. విచారణ జరిపి తన పెద్ద తమ్ముడిపై హత్యాయత్నం చేసిన చిన్నతమ్ముడు అనిల్, తల్లి జ్యోతిపై తగిన చర్యలు తీసుకోవాలని సౌజన్య తన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్నట్లు మంథని పోలీసులు తెలిపారు. ● చిన్న కొడుకును ప్రేరేపించిన తల్లి ● పెట్రోల్పోసి నిప్పంటించిన వైనం ● చావుబతుకుల్లో పెద్దకుమారుడు ● లక్కేపూర్ గ్రామంలో ఘటన -
జడ్జి పోస్టు ముళ్ల కిరీటం
వేములవాడ: జడ్జి పోస్టు ముళ్ల కిరీటంలాంటిదని, ఒక్కో రోజు కేసులు పూర్తిస్థాయి పరిష్కరించేందుకు రాత్రి అవుతుందని, కేసుల్లో బ్యాలెన్స్ చేయడంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి వస్తుందని సీనియర్ సివిల్ జడ్జి అజయ్కుమార్ జాదవ్ పేర్కొన్నారు. వేములవాడ జూనియర్ సివిల్ జడ్జిగా మూడేళ్లపాటు విధులు నిర్వహించి ఖమ్మంకు బదిలీపై వెళ్తున్న జ్యోతిర్మయిని బార్ అసోసియేషన్ హాలులో శనివారం సత్కరించారు. ఈ సందర్భంగా అజయ్కుమార్ జాదవ్ మాట్లాడుతూ ఎంతో మంది అభాగ్యులు న్యాయం కోసం కోర్టులను ఆశ్రయిస్తారని, ఈక్రమంలో తమపై ఎంతో బాధ్యత ఉంటుందన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పిట్టల మనోహర్ మాట్లాడుతూ జడ్జిగా విధులు నిర్వహించిన సమయంలో జూనియర్లకు ఎంతో అవకాశం కల్పించారని, బార్ అండ్ బెంచ్ సత్సంబంధాలతో కొనసాగాయన్నారు. మహిళలకు ఆదర్శం వేములవాడ జూనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్న క్రమంలోనే ఆగస్టు 16న వేములవాడ ప్రభుత్వాస్పత్రిలో నార్మల్ డెలివరీతో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చి సర్కార్ ఆస్పత్రులపై నమ్మకం పెంచారన్నారు. ఇలా మహిళలకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఏ ఆడపిల్లకై నా మొదటి డెలివరీ తల్లిగారింట్లో జరుగుతుందని.. అందుకే జడ్జి జ్యోతిర్మయికి వేములవాడ పుట్టినిల్లులాంటిదన్నారు. ఈక్రమంలో తమ సోదరికి వీడ్కోలు పలుకుతున్నట్లు భావిస్తున్నట్లు పేర్కొన్నారు. సీనియర్ సివిల్ జడ్జి అజయ్కుమార్ జాదవ్ జూనియర్ సివిల్ జడ్జికి వీడ్కోలు కంటతడి పెట్టిన జడ్జి జ్యోతిర్మయి కంటతడి పెట్టిన జడ్జి జ్యోతిర్మయి అనేక ఒడిదొడుకులు ఎదుర్కొని వేములవాడ జూనియర్ సివిల్ జడ్జిగా నియమితులైన జ్యోతిర్మయి వేములవాడను తన పుట్టినిల్లుగా మార్చుకున్నారంటూ పలువురు అడ్వకేట్లు కొనియాడడంతో భావోద్వేగానికిలోనయ్యారు. జడ్జి జ్యోతిర్మయి మాట్లాడుతుండగా కంటతడి పెట్టుకున్నారు. బార్ అసోసియేషన్ హాలులో శనివారం జరిగిన వీడ్కోలు సమావేశంలో ఆమె తన అనుభవాలను వివరిస్తూ వేములవాడను మరచిపోలేనని, తనను ఇంతగా ఆదరించిన వేములవాడ అడ్వేకేట్ల సేవలు గుర్తుండిపోతాయన్నారు. ఈక్రమంలో పలువురు అడ్వకేట్లు, కోర్టు సిబ్బంది సైతం భావోద్వేగానికి లోనయ్యారు. -
నీళ్ల కోసం పశువుల విలవిల
సిరిసిల్ల: మండుతున్న ఎండల్లో పశువులు, పక్షులు తాగునీటి కోసం అలమటిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పొలాల్లో పశువులకు, పక్షులకు తాగునీరు లభిస్తుంది. కానీ పట్టణ ప్రాంతాల్లో విలవిల్లాడుతున్నాయి. సిరిసిల్లలోని శ్రీసెస్శ్రీ ఆఫీస్ పక్కన చికెన్ సెంటర్ నిర్వాహకుడు బైరగోని వెంకన్నగౌడ్ తన షాపు ముందుకు వచ్చే ఆవులు, ఎద్దులకు ఇలా నీళ్లు పెడుతుంటాడు. ఓ గిన్నెతో ఐదారు సార్లు వాటి దాహం తీరే వరకు నీళ్లు పట్టి పెట్టడం విశేషం. ఎండాకాలంలో పశువుల తాగునీటి ఇబ్బందులకు ఈ దృశ్యం అద్దం పడుతుంది. ఇప్పటికై నా మున్సిపల్ అధికారులు పశువులకు తాగునీటి తొట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. -
‘దేవి పుత్రిక’ అభినందనీయం
కరీంనగర్: ఆడపిల్ల పుడితే భారమనే వివక్షను వీడి, లక్ష్మిదేవిలా భావించినప్పుడే సమాజంలో లింగనిష్పత్తి తేడాలు తొలగుతాయని జిల్లా అదనపు, సెషన్స్ జడ్జి నీరజ అన్నారు. కరీంనగర్లో రోహన్ ఆసుపత్రి ప్రారంభించి 25వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా ‘దేవిపుత్రిక’ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద ఆడపిల్ల పుడితే నార్మల్ డెలివరీ అయినా, సిజేరియన్ అయినా సంవత్సరం పాటు పూర్తిగా ఉచిత వైద్య సేవలు అందించేందుకు డాక్టర్లు ఎనమల్ల శ్రీదేవి, ఎనమల్ల నరేశ్ ముందుకొచ్చారు. శనివారం ఆసుపత్రి ప్రాంగణంలో జరిగిన ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బీఎన్ రావుతో కలిసి ‘దేవిపుత్రిక’ పోస్టర్ ఆవిష్కరించి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమాజంలో ఆడపిల్లల విషయంలో ఉన్న వివక్షను తొలగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని నిర్వాహకులు తెలిపారు. జిల్లా అదనపు, సెషన్స్ జడ్జి నీరజ -
‘రాష్ట్రవ్యాప్తంగా వీరందరి పరిస్థితి దారుణంగా ఉంది’
రాజన్న సిరిసిల్ల జిల్లా: కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులందరి పరిస్థితి దారుణంగా ఉందని చెప్పారు. తంగళ్లపల్లి మండలం రామనపల్లిలో శనివారం అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆ మహానుభావుడి విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టమని తెలిపారు. 100 ఏళ్ల క్రితమే లండన్లో చదువుకున్న విశ్వ మేధావి అంబేద్కర్ అని చెప్పారు.‘అంబేద్కర్ చూపిన బాటలో 14 ఏళ్లుగా లక్షలాదిమందితో పోరాడి తెలంగాణ సాధించుకున్నాం. కాంగ్రెస్ పార్టీ 1952-54లో అంబేద్కర్ పార్లమెంటుకు రాకుండా ఓడించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి కాకుండా ఇతర పార్టీ నుంచే భారతరత్న వచ్చింది. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి కులానికి, మతానికి అండగా నిలిచాం. దురదృష్టవశాత్తు మనం ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నాం.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధును నెలకు ఒకసారి ఎకరానికి కిస్తుల ద్వారా ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి కోటి మందిని కోటీశ్వరులను చేస్తానన్నారు.. ఇప్పటికీ పింఛన్లు కూడా సరిగా ఇవ్వడం లేదు. అంబేద్కర్ రాజ్యాంగంలో అందరికీ ఓటు హక్కు కల్పించారు. ఆ ఓటు హక్కు వినిగించుకునేటప్పుడు ఆలోచించి వేయాలి.కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి. నెల రోజుల క్రితం వడ్లు తీసుకువచ్చి సెంటర్లలో వేసినా ఇప్పటివరకు ఒక గింజ కొన్న పాపాన పోలేదు. ప్రభుత్వం వడ్లు కొనాల్సి వస్తే మద్దతు ధరతో పాటు, బోనస్ ఇవ్వాల్సి వస్తుందని కొనుగోలులో జాప్యం చేస్తోంది. రైతులే వడ్లను దళారులకు అమ్ముకునే పరిస్థితిని వస్తోంది.రైతు ప్రభుత్వం అని చెప్పుకునే వీరు రైతుబంధు వేయడం లేదు.. కరెంట్ సరిగా ఇవ్వడం లేదు. వడ్లను కొనుగోలు చేయకపోవడంతో వర్షం కురుస్తుందనే భయంతో రైతులు పంటను కవర్లతో కాపాడుకోవాల్సి వస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా రైతులందరి పరిస్థితి దారుణంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఇంతటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఎన్నడూ చూడలేదు. వెంటనే వడ్ల కొనుగోలు ప్రక్రియ మొదలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నా’ అని అన్నారు. -
మోసం చేసిన ఉద్యోగిపై కేసు
వేములవాడరూరల్: కాంట్రాక్టు పద్ధతిన ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన ఓ ప్రభుత్వ ఉద్యోగిపై బాధితులు వేములవాడ పోలీస్స్టేషన్లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల కలెక్టరేట్ ఆఫీస్లో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్శాఖలో ఎస్–31లో పనిచేస్తున్న రాజుకుమార్ అనే అధికారి ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మబలికారు. అతని మాటలు విశ్వసించి వేములవాడకు చెందిన రాగుల నాగమణి కొడుకు రుమేందర్కు మండల పరిషత్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టు ఇప్పిస్తాననడంతో రూ.1.10లక్షలు ముట్టజెప్పారు. ఈ డబ్బులను 2025 మార్చి 22 నుంచి 2025 జూలై 17 వరకు విడతల వారీగా పంపారు. మరో బాధితుడు ఇల్లంతకుంట మండలం వల్లంపట్లకు చెందిన మొగ్గం పద్మ కుమారుడు ప్రశాంత్కు కూడా ఇలాగే ఉద్యోగం ఇప్పిస్తానంటూ వారి నుంచి డబ్బులు తీసుకున్నాడు. ఉద్యోగం ఇప్పించకపోవడంతోపాటు తిరిగి డబ్బులు ఇవ్వలేదు. ఇలా కొన్ని నెలలుగా తప్పించుకుని తిరుగుతున్నాడు. కూలీ పని చేసుకుని బతుకుతున్న తమను మోసం చేసిన ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. జిల్లాలో వీరే కాకుండా మరికొందరు బాధితులు ఉన్నట్లు సమాచారం. వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ మాట్లాడుతూ బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
ఆర్టీసీ డ్రైవర్ది ప్రభుత్వ హత్యే
సిరిసిల్లలో ఆర్టీసీ డ్రైవర్కు నివాళి అర్పిస్తున్న బీజేపీ, ఏఐటీయూసీ నాయకులు శంకర్గౌడ్ సంతాపసభలో బీఆర్ఎస్ నేతలు ఆగయ్య, చక్రపాణిఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రమాదేవిసిరిసిల్లటౌన్/వేములవాడఅర్బన్: డ్రైవర్ శంకర్గౌడ్ది కాంగ్రెస్ ప్రభుత్వ హత్యగా బీఆర్ఎస్, బీజేపీ, కార్మిక సంఘాల పార్టీల నాయకులు విమర్శించారు. సిరిసిల్ల కొత్తబస్టాండులో శుక్రవారం నిర్వహించిన శంకర్గౌడ్ సంతాపసభకు హాజరై మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ వైస్చైర్మన్ దార్ల సందీప్ పాల్గొన్నారు. శంకర్గౌడ్కు నివాళి ఆర్టీసీ కార్మికుడు శంకర్గౌడ్ ఆత్మహత్యకు పాల్పడటం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి విమర్శించారు. ఆర్టీసీ కార్మికులతోపాటు జిల్లా కేంద్రంలో సంఘీభావ ర్యాలీలో మాట్లాడారు. శంకర్గౌడ్ చిత్రపటానికి నివాళి అర్పించారు. మూడో రోజు మిన్నంటిన నిరసనలు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు మూడో రోజు నిరసనలు హోరెత్తించారు. కార్మిక సంఘాలు సిరిసిల్ల డిపోతోపాటు కొత్తబస్టాండ్, పాత బ స్టాండ్ ప్రాంతాల్లో ఆందోళనలు చేపట్టాయి. ఆర్టీసీ ఉద్యోగులపై ప్రభు త్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీఎస్ ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర నాయకులు కాళిదాసు, రీజినల్ వైస్చైర్మన్ కొమురయ్య, డిపో అధ్యక్షుడు సీహెచ్.బాణయ్య, ఉపాధ్యక్షులు జే.ఎస్.ఎన్.రావు, శ్రీనివాస్నాయక్, ప్రశాంత్, సుమలత, రాంప్రసాద్ పాల్గొన్నారు. సొమ్మసిల్లి పడిపోయిన కార్మికురాలు తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ వేములవాడ ఆర్టీసీ కార్మికులు డిపో ఎదుట శుక్రవారం మౌ న దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఇచ్చి న హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. ఆర్టీసీ కార్మికులపై కక్ష సాధింపు చర్యలు చేపడుతుందన్నారు. మౌన దీక్షలో కండక్టర్ రమాదేవి అస్వస్తతకు గురై కిందపడిపోయారు. వెంటనే వేములవాడ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆమెను బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. -
రైస్మిల్లులో అగ్నిప్రమాదం
ఇల్లంతకుంట(మానకొండూర్): షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం ఏర్పడి రూ.20 లక్షల విలువైన గన్నీ బ్యాగులు అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికులు, మిల్లు ఆపరేటర్ రజినీష్ తెలిపిన వివరాలు. మండలంలోని రహీంఖాన్పేటలోని వరలక్ష్మి రైస్మిల్లులో శుక్రవారం మధ్యాహ్నం కరెంటు సరఫరా లేదు. సాయంత్రం ట్రాన్స్ఫార్మర్ ఫీజు వేయగానే లైట్లు వచ్చాయి. ఆ సమయంలోనే రైసుమిల్లులోని కిటికీల ద్వారా మంటలు కనిపించాయి. వెంటనే షట్టర్ తెరిచి చూడగా అప్పటికే గన్నీ బ్యాగులు మంటల్లో కాలిపోతున్నాయి. మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా అదుపులోకి రాలేవు. దీంతో ఫైర్స్టేషన్కు సమాచారం ఇవ్వగా రాత్రి 9:30 గంటలకు మిల్లు వద్దకు చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే 30 వేల గన్నీ బ్యాగులు కాలిపోయాయి. వీటిని రెండు రోజుల క్రితమే తెప్పించారు. ఫైర్స్టేషన్ ఆఫీసర్ నరేందర్, లీడింగ్ ఫైర్ ఫైటర్ నరసింహచారి, ఫైర్ సిబ్బంది గడ్డమీది సాయి, గణేశ్ మంటలను ఆర్పివేశారు. ప్యాడీ కూడా స్వల్పంగా కాలిపోయింది. సకాలంలో ఫైరింజన్ చేరుకొని మంటలను ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పిందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. సంఘటన స్థలానికి ఇల్లంతకుంట పోలీసులు వచ్చి సమాచారం సేకరించారు. -
పార్టీ మారగానే జీవన్రెడ్డి కొత్త పల్లవి
● అభివృద్ధి.. సంక్షేమం కనిపించడం లేదా ● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్సిరిసిల్ల: కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ అనుభవం గల వ్యక్తి పార్టీ మారగానే కొత్త పల్లవి అందుకున్నారని, రాష్ట్రంలో అభివృద్ధి.. సంక్షేమం కనిపించకపోవడం విడ్డూరంగా ఉందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని డీసీసీ ఆఫీస్లో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోతే.. బీఆర్ఎస్ ప్రభుత్వ తీరును మీరే తప్పుపడుతూ.. ఇచ్చిన స్టేట్మెంట్లు మరిచిపోయారా? అని ప్రశ్నించారు. వైఎస్సార్ అధికారంలో ఉండగా రూ.36వేల కోట్లతో పూర్తి అయ్యే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు పేరు, ఊరు, అంచనాలు మార్చి అప్పులు చేసిన బీఆర్ఎస్ పదేళ్ల పాపాల చరిత్రను వదిలిపెట్టి ప్రజాపాలన సాగిస్తున్న రేవంత్రెడ్డిని నిందించడానికి నోరెలా వస్తుందన్నారు. ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలు అమలవుతున్నాయని వివరించారు. ప్రజాపాలన పోవాలని కోరుకుంటున్న కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు జాబితాలో కొత్తగా జీవన్రెడ్డి చేరారని ఎద్దేవా చేశారు. అప్పుల కుప్పను చేశారు 2014 మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని రూ.8లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టి నెలకు రూ.6వేల కోట్ల వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితికి తెచ్చిన కేసీఆర్ పా పాల పాలన మళ్లీ రాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐతో విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఎన్డీఎస్సీ నివేదిక ఆధారంగా మేడిగడ్డ వద్ద కుంగిన పిల్లర్లకు మరమ్మతులు చేసేందుకు ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. అసెంబ్లీకి రాని పెద్దమనిషి గురించి మాట్లాడటం అనవసరమన్నారు. డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, ప ట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, ఏఎంసీ చైర్మన్ వెల్ముల స్వరూపారెడ్డి, పార్టీ నాయకులు ఆడెపు చంద్రకళ, గడ్డం నర్సయ్య, కాముని వనిత, బొప్ప దేవయ్య, కల్లూరి చందన, యెల్లె లక్ష్మీనారాయణ, సూర దేవరాజు, వేముల దామోదర్, బూట్ల నవీన్కుమార్, యెల్దండి దేవదాస్ పాల్గొన్నారు. -
ఉమ్మడి జిల్లాలో జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ల బదిలీ
జగిత్యాలజోన్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు కోర్టుల్లో పనిచేస్తున్న జ్యుడీషియల్ మెజి స్ట్రేట్లను బదిలీ చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్లో పనిచేస్తున్న షీరీనాను రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్, జగిత్యాలలో పనిచేస్తున్న శ్రీనిజ కోహిర్కర్ను పెద్దపల్లి జిల్లా గోదావరిఖని, మెట్పల్లిలో పనిచేస్తున్న ఎన్.అరుణ్కుమార్ను రంగారెడ్డి జిల్లా అమన్గల్, వేములవాడలో పనిచేస్తున్న కె.జ్యోతిర్మయిని ఖమ్మం, సిరి సిల్లలో పనిచేస్తున్న ఎ.ప్రవీణ్ను ఖమ్మం, గో దావరిఖనిలో పనిచేస్తున్న డి.వెంకటేశ్ను గ ద్వాలకు బదిలీ చేశారు. ఖమ్మంలో పనిచేస్తు న్న మాధవిని మెట్పల్లి, రంగారెడ్డి జిల్లా ఇ బ్రహీంపట్నంలోని యశ్వంత్సింగ్ను కరీంనగర్, రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో పనిచేస్తున్న అపర్ణను పెద్దపల్లి జిల్లా మంథనికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నేడు కేటీఆర్ పర్యటన తంగళ్లపల్లి(సిరిసిల్ల): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ శనివారం సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. తంగళ్లపల్లి మండలంలోని రామన్నపల్లెలో మధ్యాహ్నం 3:30 గంటలకు, తంగళ్లపల్లి పెద్దమ్మ పెద్దిరాజుల కల్యాణానికి 4:30, సాయంత్రం 5:30 గంటలకు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కేసీఆర్ కప్ విజేతలకు బహుమతులు అందజేస్తారు. సీఎం ఇంటికి పాదయాత్ర సిరిసిల్లటౌన్: విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్, ఫీజు బకాయిలు విడుదల చేయాలని కోరుతూ సీఎం ఇంటికి పాదయాత్ర చేస్తున్నట్లు ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కుర్ర రాకేశ్, మంద అనిల్కుమార్ పేర్కొన్నారు. సిరిసిల్లలోని కార్మిక భవనంలో ఈనెల 28న చేపడుతున్న కార్యక్రమ పోస్టర్లను శుక్రవారం ఆవిష్కరించారు. ఫీజులపై హైకోర్టు తీర్పును పునర్ సమీక్షించాలని కోరారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తివేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. నాయకులు బర్రెంకల శ్రీహరిక, పెండెల ఆదిత్య, శశికుమార్, వంశీ పాల్గొన్నారు. సహకార బ్యాంక్ ఉద్యోగుల ధర్నా ముస్తాబాద్(సిరిసిల్ల): ముస్తాబాద్లో కేంద్ర సహకార బ్యాంక్ ఎదుట భోజన విరామ సమయంలో ఉద్యోగులు శుక్రవారం ధర్నా చేపట్టారు. బ్యాంక్ మేనేజర్ సురభి ప్రవీణ్రావు మాట్లాడుతూ సహకార బ్యాంక్ ఉద్యోగులకు ఇచ్చిన ఇన్సెంటీవ్స్ను ప్రభుత్వం రికవరీ చేసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం సరికాదన్నారు. గత రెండేళ్లలో ఎంతో మంది ఉద్యోగులు ఉద్యోగ విరమణ చెందారని గుర్తు చేశారు. ప్రభుత్వం, సహకారశాఖ, నాబార్డు తీసుకున్న నిర్ణయాలతో ఉద్యోగులు, సిబ్బంది ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రభుత్వం పునారలోచన చేయాలని కోరారు. కూలీ పెంచేలా చర్యలు తీసుకోండి సిరిసిల్లటౌన్/సిరిసిల్లఅర్బన్: పాలిస్టర్ వస్త్రానికి సంబంధించి పవర్లూమ్ కార్మికులకు, ఆసాములకు, వార్పిన్, వైపని కార్మికులకు కూలీ పెంచేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరినట్లు జిల్లా పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కోడం రమణ తెలి పారు. కలెక్టరేట్లో శుక్రవారం కలెక్టర్ గరీమా అగ్రవాల్ను కలిసి వినతిపత్రం అందించారు. కూలీ ఒప్పందం ముగిసి రెండేళ్లు గడిచినా కొత్త కూలీ ఒప్పందం చేయడం లేదన్నారు. ఈమేరకు యజమానుల సంఘానికి పలు మార్లు వినతిపత్రాలు అందించినా స్పందించడం లేదన్నారు. ఈనేపథ్యంలో ఈనెల 27 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. మూశం రమేశ్ తదితరులున్నారు. -
బీఆర్ఎస్వీ నిరసన
సిరిసిల్ల అర్బన్: బీఆర్ఎస్ మాజీ మంత్రుల అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్వీ నాయకులు సిరిసిల్ల నేతన్నచౌక్ వద్ద శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవిగౌడ్ మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్గౌడ్, మాజీ ఎంపీ వినోద్కుమార్లను పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పడానికి వెళ్లిన ప్రజాప్రతినిధులపై ఇలాంటి చర్యలు తీసుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. వినయ్కుమార్, కిరణ్, ప్రవీణ్, శేఖర్, హైదర్, శశి, రాజు పాల్గొన్నారు. రైస్మిల్లర్లు ధాన్యం త్వరగా దించుకోవాలి వేములవాడఅర్బన్/బోయినపల్లి: ధాన్యం లోడ్తో వచ్చిన వాహనాలను ఆలస్యం చేయకుండా దింపుకోవాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ రైస్మిల్లర్లకు సూచించారు. వేములవాడ మండలం అనుపురం, బోయినపల్లి మండలం విలాసాగర్, జగ్గారావుపల్లి, కొదురుపాకలోని కొనుగోలు కేంద్రాలు పరిశీలించారు. విలాసాగర్లోని రైస్మిల్లులను తనిఖీ చేశారు. రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. తహసీల్దార్ ఎండీ.షరీఫ్ మొయినొద్దీన్ ఉన్నారు. -
హుందాతనం ప్రదర్శించాలి
● సిరిసిల్ల ఏఎంసీ చైర్పర్సన్ వెల్ముల స్వరూపారెడ్డి సిరిసిల్లటౌన్: రైతుల పండుగలో హుందాగా ప్రవర్తించాల్సింది పోయి రాజకీయకక్షతో అనవసరపు రాద్దాంతం చేయడం సరికాదని బీఆర్ఎస్ నేతలపై ఏఎంసీ చైర్పర్సన్ వెల్ముల స్వరూపారెడ్డి పేర్కొన్నారు. సిరిసిల్ల ప్రెస్క్లబ్లో శుక్రవారం ప్రెస్మీట్లో మాట్లాడారు. రెండు రోజుల క్రితం వడ్ల కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య జరిగిన గొడవకు బీఆర్ఎస్ నేతలే కారణమన్నారు. మున్సిపల్ చైర్పర్సన్కు తాము గౌరవం ఇచ్చామని కానీ వారు రాజకీయ దురుద్దేశ్యంతోనే తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూసుకోవాలని హితవు పలికారు. మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ నేరెళ్ల నర్సింగంగౌడ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత, కూరపాటి శ్రీశైలం, ఎలుక తిరుపతి, దుబాల వెంకటేశం, మార్గం లక్ష్మణ్, బూర దశరథం, పిస్క మధు, ఆడెపు జగన్, ఖాజా, కోడం అరుణ తదితరులు పాల్గొన్నారు. -
నడుం నొప్పి.. కంటి సమస్య
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్– ఎస్ఐఆర్) ప్రక్రియ నమోదు సిబ్బందికి కొత్త సమస్యలు తీసుకొస్తోంది. సర్ దరఖాస్తు పత్రంలో 2003నాటి ఎస్ఐఆర్ ప త్రంలో ప్రచురితమైన ఓటరు వ్యక్తిగత వివరాలను అతడు లేదా ఆమె, తాతతండ్రుల పేర్లను కాని ఇవ్వాలి. ఈ మేరకు 2003 నాటి ఓటరు జాబి తాలను ఎన్నికల సంఘం వెబ్సైట్లో ఉంచారు. ఏ ఓటరుకై నా 2003జాబితాలోని తన అసెంబ్లీ నియోజకవర్గం కానీ, పోలింగ్ బూత్ కానీ స్పష్టంగా తెలియకపోతే పెద్ద చిక్కే వస్తుంది. దీంతో ఆ ఓట రు వివరాల కోసం ఆ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ బూత్ల్లో వెతకాల్సిన పరిస్థితి నెలకొంది. ఓటరు దీర్ఘకాలంగా ఒకేచోట నివసిస్తున్నా, నియోజకవర్గం, పోలింగ్ కేంద్రం మారిపోయిన వారి వివరాలను వెతకడం సిబ్బందికి తలనొప్పిగా మారింది. ఆయా ఓటర్ల వివరాలను 2003 జాబితా ఆధారంగా సేకరించలేక బీఎల్వోలకు కొత్తగా కంటి స మస్యలు, నడుం నొప్పి వస్తోందని వాపోతున్నారు.సర్ అంటే -
మహిళల అభివృద్ధికి పెద్దపీట
వేములవాడ: మహిళల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వేములవాడ మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు పేర్కొన్నారు. పట్టణంలోని 7, 8 వార్డులలో అసంపూర్తిగా ఉన్న భవనాలను శుక్రవారం పరిశీలించారు. గతంలో ఈ భవనాల పనులు ప్రారంభమైనప్పటికీ వివిధ కారణాలతో మధ్యలోనే నిలిచిపోయాయన్నారు. కౌన్సిలర్లు ఎల్ల శ్రీనివాస్, మైలారం శ్రీనివాస్లతో కలిసి భవన నిర్మాణ పురోగతిని, మిగిలి ఉన్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. భవన నిర్మాణం పనులకు అవసరమైన నిధులను త్వరలోనే మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఏఈ అనన్య తదితరులు పాల్గొన్నారు. -
అమ్మానాన్న.. ఇద్దరు ఉంటేనే పిల్లలకు తోడునీడ. కుటుంబానికి భరోసా. స్కూల్ నుంచి వస్తుండగా అమ్మ ఎదురుగా రాకపోతే ఆ చిన్నారుల ఆందోళనకు అంతుండదు. అదే శాశ్వతంగా కనిపించకుండా పోతే ఆ గుండె లయతప్పుతుంది. సాయంత్రానికి నాన్న కనిపించకపోతే పిల్లల ఆతృత పెరిగిపోతుంది. అద
నాన్న.. నీవే నా ధైర్యం అనుకున్న నాన్న.. నేను స్కూల్ నుంచి రాగానే ప్రతి రోజూ నా కోసం ఎదురుచూసే వాడివి. ఇప్పుడు నువ్వు కనిపించడం లేదు. నువ్వు ఉన్నావనే ధైర్యంతో అందరితో నవ్వుతూ తిరిగేవాడిని. ఇప్పుడు నా వెనుక నువ్వు లేవని తెలిసి కన్నీళ్లు ఆగడం లేదు. మా నాన్న లాగా క్షణికావేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి. పిల్లలను అనాథలుగా చేయకండి. మమ్మల్ని వదిలి వెళ్లిపోకండి. దయచేసి ప్రాణాలు తీసుకోవద్దు. – జంగునాయక్, శాంతినగర్(గుగులోత్ గోపాల్ కొడుకు)వీరు రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం శాంతినగర్కు చెందిన గుగులోతు గోపాల్ కుటుంబ సభ్యులు. అప్పుల బాధ భరించలేక గత మార్చి 21న తన పొలం వద్ద చెట్టుకు ఉరేసుకొని మరణించాడు. ఇప్పుడు వారి కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. ఇద్దరు బిడ్డలు, కొడుకు, భార్య నిర్మల ఏం చేయాలో తెలియడం లేదు. ఆ ఇల్లాలికి పిల్లలను ఎట్ల పెంచుకోవాలో తెలియక భర్త జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తీవ్ర మనోవేదనకు గురవుతోంది.నేలవాలిన వరి.. రాలిన మామిడి -
● గాలివాన బీభత్సం ● రైతులకు తీవ్ర నష్టం
సిరిసిల్లటౌన్: జిల్లా వ్యాప్తంగా గురువారం మధ్యాహ్నం కురిసిన అకాల వర్షానికి రైతులకు తీవ్ర నష్టం జరిగింది. పంట పొలాల్లోనే ఉన్న వరిధాన్యం నేలవాలగా.. మామిడికాయలు రాలిపోయాయి. గాలితో కూడిన వర్షం రావడంతో విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. జిల్లా కేంద్రంలోని పాతబస్టాండు, లోతట్టు ప్రాంతాలైన కార్మికవాడల్లో వరద నీరు పారింది. గాంధీనగర్లో గాలివానకు పెంకుటిల్లు పైకప్పు కూలింది. బైపాస్రోడ్డు ప్రాంతంలో భారీ వృక్షాలు నేలకూలాయి. కొట్టుకుపోయిన వడ్లు తంగళ్లపల్లి: మండల కేంద్రానికి చెందిన దీకొండ అశోక్ పవర్లూమ్ కార్ఖాన షెడ్డు గోడ కూలడంతో మిషనరీ ధ్వంసమైంది. దీంతో రూ.6 లక్షల నష్టం వాటిల్లింది. అంకుసాపూర్లో ఆరబోసిన వడ్లు కొట్టుకుపోయాయి. తంగళ్లపల్లిలో మామిడితోటలకు తీవ్రనష్టం జరిగింది. రైతు ఎడమల బాల్రెడ్డి తోటలో మామిడికాయలు రాలిపోయాయి. నేలకొరిగిన వరి పంట ఇల్లంతకుంట: మండలంలోని రామాజీపేట, ఇల్లంతకుంట గ్రామాల్లో వరిచేనులు నేలకొరిగాయి. ఇల్లంతకుంట, జంగారెడ్డిపల్లె, ముస్కానిపేట, పెద్దలింగాపురం, రామాజీపేట, చిక్కుడువానిపల్లె, రహీంఖాన్పేటల్లో వర్షం కురిసింది. రామాజీపేటలోని పెండల కనకయ్య ఇంటిపై చెట్టు విరిగిపడడంతో పెంకుటిల్లు స్వల్పంగా ధ్వంసమైంది. అనంతారం కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోసి 23 రోజులవుతున్నా కొనుగోలు చేయలేదని వెలమల మల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షం.. తడిసిన ధాన్యం ఎల్లారెడ్డిపేట: మండల కేంద్రంతోపాటు రాచర్లబొప్పాపూర్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో రైతులు ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. ధాన్యాన్ని కాపాడుకోవడానికి అధికారులు టార్ఫాలిన్ కవర్లను కూడా అందించలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. రెండు గ్రామాల్లో కురిసిన వర్షం గంభీరావుపేట: మండలంలోని గజసింగవరం, సముద్రలింగాపూర్ గ్రామాల్లో గురువారం ఈదురుగాలులతో వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడవకుండా రైతులు టార్ఫాలిన్లతో రక్షించుకున్నారు. తంగళ్లపల్లిలో కూలిన పవర్లూమ్ గోడరామాజీపేటలో నేలకొరిగిన వరి చేను -
బాలల హక్కులను రక్షిస్తేనే భవిష్యత్
చందుర్తి(వేములవాడ): బాలల హక్కులను రక్షిస్తేనే వారి భవిష్యత్ను బలంగా నిర్మించవచ్చునని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు మర్రిపల్లి చందన అభిప్రాయపడ్డారు. మండలంలోని సనుగుల గంగిరెద్దులకాలనీని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యులు, సంకల్ప ఫౌండేషన్ డైరెక్టర్ రోజి గురువారం సందర్శించారు. దత్తత తీసుకున్న గంగిరెద్దుకాలనీలో పలు అభివృద్ధి, బాలల సంక్షేమానికి పలు కార్యక్రమాలు చేపట్టారు. కాలనీలోని పిల్లలకు 50 రోజులపాటు విద్యాబోధనకు టీచర్ను, పిల్లల వ్యక్తిగత పరిశుభ్రతకు బార్బర్ను ఏర్పాటు చేశారు. మహిళల ఉపాధి కోసం కుట్టుశిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో గంగిరెద్దులకాలనీలోని సుమారు 100 మంది పిల్లలకు బట్టలు, చెప్పులు, టూత్పేస్టులు, సబ్బులు తదితర వస్తువులు అందజేశారు. సర్పంచ్ బొడిగే లావణ్య–అనిల్గౌడ్, జిల్లా శిశు మహిళ సంక్షేమాధికారి లక్ష్మీరాజం, వెల్ఫేర్ కమిటీ సభ్యులు అంజయ్య, డీసీపీవో కవిత, ఏసీడీపీవో సుచరిత, ఐసీడీఎస్ సూపర్వైజర్ శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు. క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానంసిరిసిల్ల అర్బన్: జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామీణ ప్రాంతాల్లోని 10 కేంద్రాల్లో ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు అనుభవం గల వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ కోచ్లు, జాతీయ క్రీడాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి రాందాస్ తెలిపారు. అథ్లెటిక్స్, కరాటే, యోగా, వాలీబాల్, హ్యాండ్బాల్, నెట్బాల్, షటిల్ బ్యాడ్మింటన్, ఆర్చరీ, కబడ్డీ, ఖోఖో, పట్టణ స్థాయి మినీస్టేడియంలో అథ్లెటిక్స్, కరాటే, యోగా, వాలీబాల్, క్రికెట్, టేబుల్ టెన్నిస్, షటిల్ బ్యాడ్మింటన్, ఆర్చరీ, కబడ్డి, ఖోఖో, బాస్కెట్బాల్, క్యారం, చెస్ క్రీడలలో శిక్షణకు ఈనెల 25వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా అందజేయాలని సూచించారు. వివరాల కోసం 94402 39783, 75692 07411లో సంప్రదించవచ్చని తెలిపారు. -
కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర
● కలెక్టర్ గరీమా అగ్రవాల్ తంగళ్లపల్లి(సిరిసిల్ల): ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే పంటకు మద్దతు ధర లభిస్తుందని కలెక్టర్ గరీమా అగ్రవాల్ పేర్కొన్నారు. మండలంలోని గోపాలరావుపల్లెలో ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని గురువారం తనిఖీ చేశారు. కేంద్రంలో రైతులకు కల్పించిన వసతులను పరిశీలించారు. నిర్వాహకులతో మాట్లాడి ధాన్యం సేకరణ, గన్నీ బ్యాగుల నిల్వ తదితర వివరాలు ఆరా తీశారు. కొనుగోలు కేంద్రం వద్ద పూర్తి వివరాలతో కూడిన ఫ్లెక్సీలను ప్రదర్శించాలి. జిల్లా పౌరసరఫరాల అధికారి బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, తహసీల్దార్ విజయప్రకాశ్రావు, ఏపీఎం చంద్రయ్య, ఏవో సంజీవ్ పాల్గొన్నారు. -
ముందుకొస్తున్న బాధితులు
వేములవాడరూరల్: కలెక్టరేట్ కార్యాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురు వద్ద ఓ ఉద్యోగి డబ్బులు వసూలు చేసిన వైనంపై గురువారం శ్రీసాక్షిశ్రీలో కథనం ప్రచురితం కావడంతో తీవ్ర చర్చకు దారితీసింది. పంచాయతీరాజ్శాఖలో ఉన్నత స్థానంలో పనిచేసే ఓ అధికారి ‘ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా’ అనే కథనం ప్రచురితమైంది. అధికారికి డబ్బులు ఇచ్చి మోసపోయిన బాధితులు పలువురు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకొస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న సదరు ఉద్యోగి వారితో రాజీ కుదుర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. గురువారం కార్యాలయానికి బాధితులు వస్తున్నట్లు తెలుసుకున్న ఉద్యోగి రెండు రోజులపాటు సెలవు పెట్టినట్లు తెలిసింది. సదరు ఉద్యోగి బాధితులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. ఈ ఉద్యోగి గతంలో మరొక ప్రాంతంలో విధులు నిర్వహించినప్పుడు కూడా ఇలాంటి మోసానికి పాల్పడ్డట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి సదరు ఉద్యోగిపై పూర్తి విచారణ చేపట్టి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. -
పార్టీ పటిష్టతకు కార్యకర్తలు కృషి చేయాలి
● ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఇల్లంతకుంట(మానకొండూర్): కాంగ్రెస్ పటిష్టతకు కృషి చేయాలని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు. మండలంలోని వల్లంపట్లకు చెందిన వార్డుమెంబర్లు మందాల నరేందర్, కర్ల సులోచన, ఎర్రవెల్లి వెన్నెల, మరొకరు కర్ల అరుణ్ కాంగ్రెస్లో చేరారు. పార్టీ మండల అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్రెడ్డి, వల్లంపట్ల సర్పంచ్ నేరెళ్ల విజయ్గౌడ్, ఏఎంసీ వైస్చైర్మన్ ఎలగందుల ప్రసాద్ పాల్గొన్నారు. స్థల దాతకు సన్మానం వల్లంపట్లలో అంగన్వాడీ భవన నిర్మాణానికి, మహిళా స్వశక్తి భవన నిర్మాణానికి 3 గుంటల స్థలం అందజేసిన మండల గ్రామైక్య సంఘాల అధ్యక్షురాలు కట్ట సౌమ్య శ్రీకాంత్రెడ్డిని ఎమ్మెల్యే సన్మానించారు. ఆన్లైన్లో నమోదు చేయాలి వేములవాడరూరల్: కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ ఆదేశించారు. వేములవాడరూరల్ మండలం మర్రిపల్లి, మల్లారం, వేములవాడలోని బాలానగర్లో ప్రాథమిక వ్యవసాయ సహకా రం సంఘం కొనుగోలు కేంద్రాలను పరిశీ లించారు. మర్రిపల్లిలోని మణికంఠ, మారుతి ఇండస్ట్రీస్, వేములవాడలోని శ్రీరామలింగేశ్వర రైస్మిల్లులను తనిఖీ చేశారు. నేడు ఠాణా భవన పనులకు భూమి పూజరుద్రంగి(వేములవాడ): రుద్రంగి మండల కేంద్రంలో ఠాణా భవన నిర్మాణానికి శుక్రవా రం చేసే భూమి పూజ ఏర్పాట్లను ఎస్పీ మహే శ్ బీ గీతే గురువారం పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర డీజీపీ శివధర్రెడ్డి, ప్రభు త్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేతులమీదుగా పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ శ్రీనివాసులు, చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, ఆర్ఐ రమేశ్, ఎస్సైలు మోతీరాం, రమేశ్, యాదగిరి, పోలీస్ హౌసింగ్ బోర్డు ఏఈ రాజశేఖర్ పాల్గొన్నారు. జేఈఈ మెయిన్స్లో 1,206 ర్యాంక్ ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండల కేంద్రానికి సాన రాజు– రజిత దంపతుల కొడుకు రోహిత్ జేఈఈ మెయిన్స్లో 1,206 ర్యాంకు సాధించాడు. ఈ సందర్భంగా మిత్ర యూత్ సభ్యులు స్వామిగౌడ్, నేవూరి వెంకట నరసింహారెడ్డి, నాగుల ప్రదీప్గౌడ్, నంది నరేశ్, జవ్వాజి సంజీవ్, రాఘవేందర్, బాధ రమేష్, శేషు సన్మానించారు. డీపీఆర్వోగా ఏడుకొండలుసిరిసిల్ల: జిల్లా సమాచార, ప్రజాసంబంధాలశాఖ అధికారిగా ఏడుకొండలు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం జిల్లా ఇన్చార్జి డీపీఆర్వోగా పనిచేస్తున్న లక్ష్మణ్ కరీంనగర్ డీపీఆర్వోగా కొనసాగనున్నారు. సంగారెడ్డి డీపీఆర్వోగా పనిచేస్తున్న ఏడుకొండలు జిల్లా డీపీఆర్వోగా విధుల్లో చేరారు. ఆయనకు డీపీఆర్వో ఆఫీస్ సిబ్బంది కవిత, రవి, వెంకటేశ్లు స్వాగతం పలికారు. ఎన్యుమరేటర్లకు జీతభత్యాలు ఇవ్వాలిసిరిసిల్ల: ప్రభుత్వం 2024లో సమగ్ర కుటుంబ సర్వే చేపట్టిందని, ఆ సర్వే చేసిన ఎన్యుమరేటర్లకు ఇప్పటి వరకు జీతభత్యాలు ఇవ్వలేదని ఓయూ విద్యార్థి నాయకుడు, అడ్వకేట్ రజనీకాంత్ గురువారం తెలిపారు. జిల్లాలో రూ.1.50కోట్లు, రాష్ట్ర వ్యాప్తంగా రూ.150 కోట్లు పెండింగ్ ఉన్నాయన్నారు. ఒక్కొక్కరికి రూ.10వేలు రావాల్సి ఉందని తెలిపారు. -
ఎన్నికల హామీని అమలు చేస్తాం
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడరూరల్: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడరూరల్ మండలం ఎదురుగట్ల, లింగంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల ప్రవేశ కార్యక్రమానికి గురువారం హాజరయ్యారు. విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని, ఉచిత విద్యుత్, ఉచిత బస్, సన్నబియ్యం, నూతన రేషన్కార్డు, ఆరోగ్యశ్రీ రూ.10 లక్షలకు పెంపు వంటి ఎన్నో పథకాలను అందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా విప్ను గృహ యజమానులు శాలువాతో సత్కరించారు. సర్పంచులు తిరుపతిరెడ్డి, రంగు వెంకటేశంగౌడ్, నాయకులు సోయినేని కరుణాకర్, రాంరెడ్డి, పొన్నం మల్లేశం, బండ శ్రీనివాస్, పాలకుర్తి పర్శరాం, సోయినేని లహరి, కడారి తిరుపతి పాల్గొన్నారు. -
అభివృద్ధి.. సంక్షేమంలో కాంగ్రెస్ విఫలం
● బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.జీవన్రెడ్డి సిరిసిల్ల: ఎన్నికల్లో అడ్డగోలు హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఎన్నికల హా మీలు అమలు చేయడంతో విఫలమైందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి టి.జీవన్రెడ్డి విమర్శించారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో గురువారం బీఆర్ఎస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడా రు. కల్యాణలక్ష్మీకి తులం బంగారం రాలేదని, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదని, సగం మంది రైతులకు రుణమాఫీ కాలేదని, రైతు భరోసా ఇవ్వడం లే దని, పింఛన్లు పెంచలేదన్నారు. అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో రేవంత్రెడ్డి ప్రభుత్వం విఫలమైందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రిపేరుకు సంబంధించి భూసారపరీక్షలు కూడా రేవంత్రెడ్డి చేయించలేద ని ఆరోపించారు. కొండూరి రవీందర్రావు, జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పార్టీ నాయకులు గూడూరి ప్రవీణ్, జిందం కళాచక్రపాణి, న్యాలకొండ అరుణ, సిద్ధం వేణు, దార్ల సందీప్, కుంబాల మల్లారెడ్డి, ఏనుగు తిరుపతిరెడ్డి, అంజిరెడ్డి, రాఘవరెడ్డి, గజభీంకార్ రాజన్న పాల్గొన్నారు. -
ఆలయ అభివృద్ధికి రూ.లక్ష విరాళం
వేములవాడ: రాజన్న ఆలయ అభివృద్ధికి హైదరాబాద్కు చెందిన నీలారపు పద్మజ–శివకుమార్ దంపతులు రూ.లక్ష విరాళంగా అందజేశారు. ఆలయ అధికారులు వారికి ప్రత్యేక దర్శనం అవకాశం కల్పించారు. చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి సిరిసిల్ల అర్బన్: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్ కోరారు. జిల్లా గ్రంథాలయంలో గురువారం ఏర్పాటు చేసిన ఇండోర్ క్రీడా పోటీలను డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్తో కలిసి ప్రారంభించారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, గడ్డం నర్సయ్య, సూర దేవరాజు పాల్గొన్నారు. -
రెండో రోజు.. నిరసనల జోరు
సిరిసిల్లటౌన్/వేములవాడఅర్బన్: సమస్యలు పరి ష్కరించాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు చేపట్టిన సమ్మె రెండో రోజు గురువారం కొనసాగింది. తెల్లవారుజామునే కార్మిక సంఘాలు సిరిసిల్లడిపోతోపాటు కొత్తబస్టాండ్, పాత బస్టాండ్, వేములవాడ బస్టాండ్ ప్రాంతాల్లో ఆందోళనలు చేపట్టారు. టీఎస్ఆర్టీసీ జేఏసీ అధ్యక్షుడు సీహెచ్.బాణయ్య, ఉపాధ్యక్షులు జే.ఎస్.ఎన్.రావు, శ్రీనివాస్నాయక్, ప్రశాంత్, సుమలత, రాంప్రసాద్ పాల్గొన్నారు. రాజకీయ పార్టీల సంఘీభావం సిరిసిల్ల కొత్త బస్టాండులో ఆర్టీసీ జేఏసీ కార్మికుల నిరసన దీక్ష శిబిరంలో మద్దతు ప్రకటించారు. బీఎస్పీ రాష్ట్ర నాయకుడు ఎనగందుల వెంకన్న, సీపీఎం నేతలు కోడం రమణ, అన్నల్దాస్ గణేశ్, సీపీఐ నాయకులు గుంటి వేణు, కడారి రాములు, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకుడు కంచర్ల రవిగౌడ్ సంఘీభావం పలికారు. ప్రజల ఇబ్బందులు గమనించండి ఆర్టీసి జేఏసీ చేపడుతున్న నిరవధిక సమ్మెతో ప్రజలు పడుతున్న కష్టాలను కార్మికులు గమనించాలని డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ కోరారు. జేఏసీ దీక్షా శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. కార్మికుల 32 డిమాండ్లలో 29 నెరవేర్చడానికి ప్రభుత్వం సుముఖంగా ఉందన్నారు. కార్మికులు సమ్మె విరమిస్తే.. కాంగ్రెస్ సర్కారు కడుపులో పెట్టుకుని చూసుకుంటుందన్నారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు తదితరులున్నారు. డిమాండ్లు నెరవేర్చాలి గౌరవ అధ్యక్షుడు పిప్పరి రాజయ్య, జేఏసీ చైర్మన్ జీపీ సింగ్ మాట్లాడుతూ ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. డిపోలోని కంట్రోలర్లు కూడా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతూ తెలిపారు. శ్రీనివాస్, శ్రీకాంత్, లక్ష్మన్, ప్రవీన్, తదితరులు ఉన్నారు. బస్సుల కోసం ప్రయాణికుల పడిగాపులు భీమన్నను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు తిరుగు ప్రయణంలో బస్సులు లేకపోవడంతో బస్టాండ్లో పడిగాపులు కాశారు. ఆలస్యంగా ప్రవేటు అద్దె బస్సులు రావడంతో సీట్ల కోసం పరుగులు తీశారు. వేములవాడ డిపో నుంచి గురువారం 23 ప్రైవేటు అద్దె బస్సులు, 8 ఆర్టీసీ బస్సులు నడిచినట్లు డిపో మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ బస్టాండ్లో కిక్కిరిసిన ప్రయాణికులు సిరిసిల్ల డిపో ఎదుట ఆర్టీసీ నేతల గేట్ ధర్నా -
నీటి ఇబ్బందులు రానీయొద్దు
● నిత్యం పరిశీలించాలి ● కలెక్టర్ గరీమా అగ్రవాల్సిరిసిల్ల: రెండు మున్సిపాలిటీలతోపాటు అన్ని గ్రామాల్లోనూ వేసవిలో నీటి ఇబ్బందులు రానీయొద్దని, నిత్యం నీటి సరఫరాను పరిశీలించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం నీటి సరఫరాపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీ, గ్రామాల్లో తాగునీటి సరఫరా, పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. రానున్న 45 రోజులు చాలా కీలకమని స్పష్టం చేశారు. మిషన్ భగీరథ ద్వారా లక్ష్యం మేరకు నీటి సరఫరా చేయాలని ఆదేశించారు. మున్సిపాలిటీలోని ప్రతీ వార్డు, విలీన ప్రాంతాలు, అన్ని మండలాల్లోని చివరి ప్రాంతాలకు నీటి సరఫరాలో ఇబ్బంది రాకుండా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ఆదేశించారు. నీటిని రోజూ క్లోరినేషన్ చేయించాలని, ప్రతీ పది రోజులకోసారి నీటిటాంక్లు శుభ్రం చేయించాలని ఆదేశించారు. అమృత్ పథకంలో నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. అంతకుముందు సిరిసిల్ల, వేములవాడ పట్టణాలు, మండలాలవారీగా మిషన్ భగీరథ ద్వారా తాగునీరు సరఫరా లక్ష్యం.. ఎంత సరఫరా అవుతుందని కలెక్టర్ ఆరా తీశారు. మిషన్ భగీరథ ఎస్ఈ అమరేందర్, మిషన్ భగీరథ ఈఈలు అన్వర్, సుమలత, పబ్లిక్ హెల్త్ ఈఈ సంపత్, డీఆర్డీవో మచ్చ గీత, సీపీవో పీ.బీ.శ్రీనివాసాచారి, జెడ్పీ సీఈవో వినోద్కుమార్, డీపీవో షరీఫొద్దీన్ పాల్గొన్నారు. రైల్వేలైన్ పనులు పూర్తి చేయాలి జిల్లా పరిధిలో కొనసాగుతున్న కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వేలైన్ పనులను త్వరగా పూర్తి చేయాలని క్యాబినెట్ సెక్రటరీ(కోఆర్డినేషన్) సెంట్రల్ సెక్రటేరియట్ ఆదేశించారు. రైల్వేలైన్ పనులు, భూసేకరణ, ఇతర అంశాలపై క్యాబినెట్ సెక్రటరీ(కోఆర్డినేషన్) సెంట్రల్ సెక్రటేరియట్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ గరీమా అగ్రవాల్, అటవీ శాఖ, పరిశ్రమల శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు. పరిశ్రమలశాఖ హనుమంతు, కలెక్టరేట్ పర్యవేక్షకులు శ్రీకాంత్, ఫారెస్ట్ రేంజ్ అధికారులు కల్పనాదేవి, ఖలీమొద్దీన్ తదితరులు పాల్గొన్నారు. నిర్ధేశిత సమయంలో అనుమతులు జారీ చేయాలి జిల్లాలో పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి కల్పించేందుకు టీజీఐ–పాస్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి నిర్ధేశిత సమయంలో అనుమతులు జారీ చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో వచ్చిన దరఖాస్తులపై ఆరా తీశారు. టీ–ప్రైడ్లో 27 వచ్చిన దరఖాస్తులకు అనుమతులు జారీ అయ్యాయని, టీజీ ఐ–పాస్లో 49 దరఖాస్తులు రాగా.. 31 అనుమతులు జారీ చేసినట్లు వివరించారు. పరిశ్రమలశాఖ జీఎం హనుమంతు, జిల్లా రవాణాశాఖ అధికారి వి.లక్ష్మణ్కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి సంగీత, కార్మికశాఖ అధికారి నజీర్ అహ్మద్ పాల్గొన్నారు. -
ఈత సరదా విషాదంగా మారొద్దు
● మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు ● వేసవి సెలవుల్లో జాగ్రత్తగా ఉండాలి ● ఎస్పీ మహేశ్ బీ గీతేసిరిసిల్ల: వేసవి సెలవుల్లో ఈత నేర్చుకోవడానికి చెరువులు, కాలువల వద్దకు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుందని, జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ మహేశ్ బీ గీతే కోరారు. ఈత నేర్చుకోవాలన్న సరదా విషాదం కాకుండా చూసుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఈత రాని వారు బావులు, చెరువులు, కాలువల వద్దకు ఒంటరిగా వెళ్ల వద్దని, తల్లిదండ్రుల సమక్షంలోనే నేర్చుకోవాలని సూచించారు. పిల్లల కదలికలపై తల్లిదండ్రులు సైతం నిఘా పెట్టాలన్నారు. ఈత సరదాపై పోలీస్ శాఖ రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకండి తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని ఎస్పీ సూచించారు. ఒక వేళ వాహనం ఇస్తే, తెలిసీ, తెలియని డ్రైవింగ్తో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. మైనర్ డ్రైవింగ్ చేస్తూ వాహనంతో పట్టుబడితే వాహన యజమానిపై కేసు నమోదు చేస్తారని హెచ్చరించారు. -
రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
● చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బోయినపల్లి(చొప్పదండి): రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటోందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. బోయినపల్లి, తడగొండల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందన్నారు. తహసీల్దార్ షరీఫ్ మొయినొద్దీన్, ఎంఏవో ప్రణిత, డీసీఎమ్మెస్ మాజీ చైర్మన్ ముదుగంటి సురేందర్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేశ్, మండల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, భీంరెడ్డి మహేశ్రెడ్డి ఉన్నారు. దళారులకు ధాన్యం అమ్ముకోవద్దు ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): వడ్ల కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని, దళారులకు తక్కువ ధరకు అమ్ముకోవద్దని జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి బుచ్చి బాబు, ఏఎంసీ చైర్మన్ షేక్ సాబేర బేగం, సర్పంచ్ దొమ్మాటి నర్సయ్య కోరారు. ఎల్లారెడ్డిపేట సింగిల్విండో ఆధ్వర్యంలో నారాయణపూర్, వెంకటాపూర్ రైతుల సౌకర్యార్థం వరి కొనుగోలు కేంద్రాలను బుధవారం ప్రారంభించారు. డీఎంఎస్ నరసింహ, ఏఎంసీ వైస్చైర్మన్ గుండాడి రాంరెడ్డి, స్పెషల్ ఆఫీసర్ షఫీయొద్దీన్, ఉపసర్పంచ్లు మోతె మధుసూదన్రెడ్డి, గొట్టె శ్రీకాంత్, సెక్రెటరీ అజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. వాంటెడ్ డ్రైవర్స్..కండక్టర్స్ సిరిసిల్లటౌన్/వేములవాడ అర్బన్: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో సిరిసిల్ల, వేములవాడ డిపోలలో తాత్కాలిక పద్ధతిలో డ్రైవర్, కండక్టర్గా పనిచేయుటకు ఆసక్తి గల యువత నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎం ప్రకాశ్రావు తెలిపారు. డ్రైవర్కు హెవీ లైసెన్స్తో 18 నెలల అనుభవం ఉండాలని, ఒరిజినల్ లైసెన్స్, ఆధార్కార్డు, 2 ఫొటోలు, కండక్టర్కు ఎస్సెస్సీ ఉత్తీర్ణులై, ఒరిజినల్ మెమో, ఆధార్కార్డు, 2 ఫొటోలతో సిరిసిల్ల బస్సు డిపోలో సంప్రదించాలని కోరారు. డ్రైవర్కు రోజుకు రూ.1000, కండక్టర్కు రోజుకు రూ.800 వేతనం చెల్లించనున్నట్లు తెలిపారు. వివరాలకు 99592 25929, 86868 69005, 81783 71273 నంబర్లలో సంప్రదించాలని కోరారు. స్వీయ జనగణనలో పాల్గొనాలి సిరిసిల్లటౌన్: జనగణన–2027 స్వీయ ఎన్యూమరేషన్లో సిరిసిల్ల పట్టణ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని మున్సిపల్ కమిషనర్ ఎం.ఏ.ఖదీర్పాషా కోరారు. ఈమేరకు బుధవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు స్వీయ జనగణన అందుబాటులో ఉంటుందన్నారు. ఈ సౌకర్యం ద్వారా ప్రతీ కుటుంబం తమ గృహానికి సంబంధించిన వివరాలను స్వయంగా ఆన్లైన్లో నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, యువత, మహిళా సంఘాలు, స్వయం సహాయక సంఘాలు, బ్యాంకింగ్, ఐటీరంగ ఉద్యోగులు, కాలనీ సంక్షేమ సంఘాలు పాల్గొనాలని కోరారు. htt ps://se.census.gov.in వెబ్ పోర్టల్ను సందర్శించి కుటుంబ వివరాలు నమోదు చేసుకోవచ్చన్నారు. మేలో సదరం శిబిరాలు సిరిసిల్ల: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మే నెలలో నిర్వహించే సదరం శిబిరాల తేదీలను ఖరారు చేసినట్లు ఆస్పత్రి పర్యవేక్షకులు డాక్టర్ ప్రవీణ్ బుధవారం తెలిపారు. మే 2, 4, 5 ఆర్థోపెడిక్, 5, 6 వినికిడి(చెవుడు), 6న మానసిక దివ్యాంగులకు, 7, 12న కంటిచూపు పరీక్షలు నిర్వహిస్తారని వివరించారు. మే 13న జనరల్ వైద్యపరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. జిల్లా ఆస్పత్రిలో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని సూచించారు. -
ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా !
● లక్షలు వసూలు చేసినట్లు సమాచారం ● ఎవరినీ నమ్మొద్దంటూ ప్రభుత్వ విప్ కరపత్రం విడుదలవేములవాడ/వేములవాడరూరల్: కలెక్టరేట్లో పనిచేసే ఓ అధికారి కొంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేసుకొని, కాలయాపన చేస్తున్నట్లు తెలిసింది. ఉద్యోగాల విషయమై సదరు ఉద్యోగిని నిరుద్యోగులు నిలదీస్తే రేపు, మాపు అంటూ కాలం వెల్లదీస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఏడాదికాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులు సదరు ఉద్యోగిపై ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన వివరాలు ఇలా ఉన్నాయి. కలెక్టర్ కార్యాలయంలో పంచాయతీరాజ్శాఖ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఓ అధికారి కలెక్టరేట్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష వరకు వసూలు చేశాడు. అతని బాధితులు వేములవాడతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. అయితే ఏడాదికాలంగా ఉద్యోగాలు ఇప్పించకపోగా తప్పించుకు తిరుగుతుండడంతో సదరు ఉద్యోగిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడుతున్నారు. డబ్బులు అడిగితే ఫిర్యాదు చేయండి నియోజకవర్గంలో కొందరు నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని తన పేరు చెప్పి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలు తమ దృష్టికి వస్తున్నాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈమేరకు బుధవారం ఓ కరపత్రాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. రాజన్నగుడి, కలెక్టర్ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాల పేరుతో మోసాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే నమ్మొద్దని, పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. -
ఆర్టీసీ సమ్మె.. బస్సులు సగమే
సాక్షిప్రతినిధి,కరీంనగర్/కరీంనగర్టౌన్: డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు బుధవారం ఉదయం నుంచి మెరుపు సమ్మెకు దిగడం ఉమ్మడి జిల్లా రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్–1, కరీంనగర్–2, హుజూరాబాద్, సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, పెద్దపల్లి, మంథని, గోదావరిఖని మొత్తం 11 డిపోల్లోని ఉద్యోగులు సమ్మెకు దిగారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 3,057 మంది ఆర్టీసీ సిబ్బంది పనిచేస్తున్నారు. బుధవారం ఉదయం 99 శాతం మంది ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు సమ్మెలో పాల్గొన్నారు. కేవలం 40 మంది డ్రైవర్లు, కండక్టర్లు మాత్రం విధులకు హాజరు కాగా, మిగతా వారంతా సమ్మెలో పాల్గొన్నారు. అన్ని డిపోల వద్ద కార్మికులు నిరసనలకు దిగగా.. ముందు జాగ్రత్త చర్యగా తెల్లవారుజాముకు ముందే పోలీసు బలగాలు మోహరించారు. కరీంనగర్ రీజియన్లో దాదాపు 1,000 బస్సులు అందుబాటులో ఉండగా.. బుధవారం 401 బస్సులను హైదరాబాద్, వరంగల్, వేములవాడ, గోదావరిఖని, మెట్పల్లి, తదితర అన్ని రూట్లలో నడిపారు. 330 అద్దెబస్సులు, వాటి డ్రైవర్లు విధుల్లో పాల్గొన్నారు. ప్రయాణికుల ఇక్కట్లు జిల్లాలో రైల్వే మార్గాలు అంతగా అభివృద్ధి చెందకపోవడంతో సింహభాగం ప్రజారవాణాకు ఆర్టీసీ మీదే ఆధారపడాలి. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజారవాణా దాదాపుగా స్తంభించింది. ముఖ్యంగా మహిళా ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం డిగ్రీ, ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులపై ఆర్టీసీ సమ్మె ప్రభావం పడింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఆటోడ్రైవర్లు, ట్యాక్సీలు ఽచార్జీలు అమాంతంగా పెంచారు. హైదరాబాద్, వరంగల్ రూట్లలోనూ ట్యాక్సీ డ్రైవర్లు చార్జీలు రూ.500 నుంచి రూ.800 వరకు ముక్కుపిండి మరీ వసూలు చేశారు. మరోవైపు కార్పూలింగ్, కార్ షేరింగ్ యాప్లకు డిమాండ్ పెరిగింది. వరంగల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు కరీంనగర్ బైపాస్ వద్ద ప్రమాదం జరగడంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. అనుభవం లేని ప్రైవేటు డ్రైవర్కు బస్సులు ఇవ్వడం వల్లే ప్రమాదం జరిగింది ఆర్టీసీ ఐకాస నాయకులు ఆరోపించారు.కరీంనగర్ రీజియన్ పరిధిలో.. డిపోలు 11ఆర్టీసీ బస్సులు 550అద్దె బస్సులు 330ఎలక్ట్రికల్ బస్సులు 100ఆర్టీసీ డ్రైవర్లు 984ఆర్టీసీ కండక్టర్లు 1,354ఇతర సిబ్బంది 719 (ఆఫీసు, డిపో,వర్క్షాపులు కలిపి) -
తెరుచుకున్న మూత్రశాలలు
ఇల్లంతకుంట(మానకొండూర్): మండల కేంద్రంలోని మూత్రశాలల తాళం తీశారు. ‘సాక్షి’లో బుధవారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ప్రయాణికుల అవసరాల దృష్ట్యా ఇల్లంతకుంట గ్రామపంచాయతీ సిబ్బంది మూత్రశాలల తాళాలు బుధవారం తీశారు. బాటసారులు ప్రయాణికులు గ్రామపంచాయతీ సిబ్బందికి, ‘సాక్షి’ దినపత్రికకు ధన్యవాదాలు తెలియజేశారు. వరదలతో ఎగువ మానేరు ఎఫ్రాన్కు నష్టంముస్తాబాద్(సిరిసిల్ల): భారీ వరదలతో ఎగువ మానేరు ప్రాజెక్టు ఎఫ్రాన్ దెబ్బతిందని ప్రాజెక్టు ఈఈ ప్రశాంత్కుమార్ బుధవారం ప్రకటనలో తెలిపారు. ‘సాక్షి’లో ‘ఎగువ మానేరుకు ముప్పు’ శీర్షికన కథనానికి ఈఈ స్పందించారు. ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలో భారీ వర్షాలు కురిశాయని, భారీ వరదలతో ప్రాజెక్టుకు ఫ్లాష్ఫ్లడ్ వచ్చిందన్నారు. డౌన్స్ట్రీమ్తో ఎఫ్రాన్ దెబ్బతిందన్నారు. నిపుణుల కమిటీ సర్వే కోసం తాము ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. నిపుణుల కమిటీ సిఫారసుతో తక్షణ, దీర్ఘకాలిక చర్యలను చేపట్టామన్నారు. చీఫ్ ఇంజినీర్ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ సూచనలు అందిన తర్వాత నష్ట నివారణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
రేషన్ పక్కదారి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పేదల కోసం పంపిణీ చేస్తున్న రేషన్బియ్యం పక్కదారి పడుతున్నాయి. చౌకధరల దుకాణంలోని సన్నబియ్యం ప్రైవేట్మార్కెట్కు చేరుతున్నాయి. డీలర్లే దుకాణాల్లో ధర కడుతున్నారు. ఇలా పేదలకు అందాల్సిన పౌష్టికాహారం ప్రైవేట్ వ్యాపారుల చేతుల్లో పడి అధిక ధరలకు విక్రయాలు జరిగిపోతున్నాయి. చౌకధరల దుకాణాల్లో జరుగుతున్న అక్రమాలపై ‘సాక్షి’ ఫోకస్ కథనం. దుకాణాల్లోనే కట్టబెడుతున్నారు రాజన్నసిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 345 రేషన్ దుకాణాలు ఉన్నాయి. జిల్లాలో ప్రతీ నెల 3,700 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. అయితే చాలా మంది రేషన్కార్డు లబ్ధిదారులు రేషన్బియ్యాన్ని తినడం లేదు. దీంతో అత్యధికులు డీలర్లతోనే మాట్లాడుకుని కిలోకు రూ.15 వరకు తీసుకుంటున్నారు. ఇలా తీసుకున్న బియ్యాన్ని డీల ర్లు గ్రామాల్లోని ప్రైవేట్ వ్యక్తులకు కిలోకు రూ.20 చొప్పున విక్రయిస్తూ లాభాలు పొందుతున్నారు. అర్ధరాత్రి తరలింపు జిల్లాలోని మేజర్ గ్రామపంచాయతీల్లోని రేషన్డీలర్లు సన్నబియ్యాన్ని అత్యధిక మొత్తంలో పక్కదారి పట్టిస్తున్నారు. పొద్దంతా వినియోగదారులకు బియ్యం పంపిణీ చేస్తున్న డీలర్లు అర్ధరాత్రి వరకు దుకాణాల్లోనే ఉంటున్నారు. అక్కడే అర్ధరాత్రి దాటే వరకు స్నేహితులతో కలిసి మందుపార్టీలు చేసుకుంటున్నారు. డీలర్లు అర్ధరాత్రి పూట గ్రామాల్లో చక్కర్లు కొట్టడం అనేక అనుమానాలకు తావిస్తోంది. జనం గాఢ నిద్రలోకి జారుకున్న తర్వాత గుట్టుచప్పుడు కాకుండా ట్రాలీ ఆటోలలో బియ్యం బస్తాలను తరలిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ముఖ్యంగా మేజర్ గ్రామపంచాయతీల్లో రేషన్డీలర్లకు కోటా ఎక్కువగా వస్తుండడం.. కొంత ఆర్థికంగా ఉన్న వారు రేషన్బియ్యాన్ని తినేందుకు ఇష్టపడకపోవడం వీరికి కలిసి వస్తుంది. ఎంతో కొంత నగదును సదరు లబ్ధిదారులకు ముట్టజెప్పి ఆ బియ్యాన్ని తెల్లవారుజామున ఇతర ప్రాంతాలకు తరలిస్తూ క్యాష్ చేసుకుంటున్నారు. సమయపాలన కరువు జిల్లాలోని చాలా చౌకధరల దుకాణాల వద్ద కనీసం బోర్డులు కూడా కనిపించడం లేదు. అంతేకాకుండా సమయపాలన లేకుండా దుకాణాలు మూసివేస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. డీలర్లకు కుదిరినప్పుడు దుకాణాలు తీస్తూ బియ్యం పంపిణీ చేస్తుండడం వినియోగదారులకు ఇబ్బందిగా మారింది. ఊరికో బ్రోకర్రేషన్దందా పెద్ద మాఫియాగా ఏర్పడింది. ఊరికో బ్రోకర్ను ఏర్పాటు చేసుకొని బియ్యాన్ని సేకరిస్తున్నారు. ఇలా సేకరించిన బియ్యం కామారెడ్డి, సిరిసిల్ల పట్టణాల్లోని రైస్మిల్లులకు చేరుతున్నాయి. ఇక్కడ ప్రాసెస్ చేసి సరికొత్త బ్రాండెడ్ ప్యాకెట్లలో నింపి ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. ఇలా పేదల బియ్యం ప్రైవేట్ మార్కెట్లో వ్యాపారవస్తువుగా మారుతుంది. పల్లెల్లో వినియోగదారుల నుంచి రేషన్బియ్యాన్ని సేకరిస్తున్న బ్రోకర్లు ఇటీవల కామారెడ్డి, సిరిసిల్ల పట్టణాలకు తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఎల్లారెడ్డిపేట మండలంలో ఊరికి ఐదారుగురు బ్రోకర్లు రేషన్బియ్యాన్ని సేకరించి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల వారం రోజుల్లో రేషన్ బియ్యం తరలిస్తున్న మూడు వాహనాలను, బ్రోకర్లను పోలీసులు పట్టుకున్నారు. -
‘సాయ్’ పిలుస్తోంది
కరీంనగర్స్పోర్ట్స్: క్రీడా రంగానికి భారత క్రీడాప్రాధికారిక సంస్థ మార్గదర్శకంగా నిలుస్తుంది. పంజాబ్ రాష్ట్రం పటియాలలోని నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ యువ క్రీడాకారులకు సువర్ణావకాశాన్ని అందించింది. 2026–27 సంవత్సరంలో పలు కోర్సుల్లో శిక్షణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. క్రీడలను వృత్తిగా తీసుకోవాలనుకునే యువతకు గొప్ప అవకాశం. కోర్సులు కేవలం శిక్షణకు మాత్రమే కాకుండా, శాసీ్త్రయ ధృక్పథంతో ప్రొఫెషనల్గా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడనున్నాయి. కోర్సులు పూర్తి చేసిన క్రీడాకారులు దేశవ్యాప్తంగా కోచ్లుగా, ఫిట్నెస్ ట్రైనర్లు, అనలిస్ట్, క్రీడా సంస్థల్లో ఉన్నత స్థానాల్లో అవకాశాలు పొందవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అంతర్జాతీయ స్థాయిలో కూడా అవకాశాలు దొరుకుతాయి. క్రీడలపై ఆసక్తి ఉన్న యువత https:// www. dipsc. nsnis. in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సందర్భంగా పలు కోర్సుల వివరాలతో కథనం. కోర్సుల వివరాలు 42వ ఎంఎస్సీ స్పోర్ట్స్ కోచింగ్ (2 ఏళ్లు), 64వ డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ కోచింగ్, 5వ పీజీ డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్ అనాలిసిస్, 4వ పీజీ డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ సైకాలజీ, 4వ పీజీ డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ న్యూట్రిషన్, 4వ పీజీ డిప్లొమా ఇన్ స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ (ఒక సంవత్సరం). కాగా 64వ డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ కోచింగ్కు దరఖాస్తులు ఈ నెల 23 లోపు, మిగిలిన కోర్సులకు ఈ నెల 30 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. సీట్లు ఇలా.. 64వ డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ కోచింగ్ ఒక ఏడాది నిర్వహిస్తారు. 26 క్రీడాంశాల్లో 785 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆర్చరీ 30, అథ్లెటిక్స్ 75, బ్యాడ్మింటన్ 20, బ్యాడ్మింటన్ 20, బాస్కెట్బాల్ 30, బాక్సింగ్ 50, కానోయింగ్ కయాకింగ్ 15, సైక్లింగ్ 30, ఫెన్సింగ్ 30, ఫుట్బాల్ 50, జిమ్నాస్టిక్స్ 20, హ్యాండ్బాల్ 20, హాకీ 50, జూడో 30, కబడ్డీ 30, ఖోఖో 20, రోయింగ్ 10, షూటింగ్ 20, స్విమ్మింగ్ 20, టేబుల్ టెన్నిస్ 40, తైక్వాండో 20, టెన్నిస్ 20, వాలీబాల్ 30, వెయిట్లిఫ్టింగ్ 30, రెజ్లింగ్ 50, వుషూ 25, యోగాసన 20 సీట్లు ఉన్నాయి. క్రీడల కోర్సుకు దరఖాస్తులు ప్రొఫెషనల్ ట్రైనింగ్తో భరోసా క్రీడలపై ఆసక్తి ఉన్నవారికి చాన్స్ 42వ ఎంఎస్సీ స్పోర్ట్స్ కోచింగ్ క్రీడలివే.. అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, ఫుట్బాల్, జిమ్నాస్టిక్స్, హాకీ, స్విమ్మింగ్, వాలీబాల్, వెయిట్ లిప్టింగ్, రెజ్లింగ్. ఆధునిక క్రీడల్లో డేటా విశ్లేషణ కీలకం. పెర్ఫార్మెన్స్ అనాలిసిస్ వంటి కోర్సులు చేయడం ద్వారా ప్రత్యర్థుల బలహీనతలను పసిగట్టే నైపుణ్యం లభిస్తుంది. ఇది క్లిష్ట సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకునేందుకు తోడ్పడుతుంది. కోర్సులు పూర్తి చేసినవారు పాఠశాలలు, కళాశాలలు, ప్రొఫెషనల్ క్లబ్లలో ఫిట్నెస్ నిపుణులుగా స్థిరపడి, ఆరోగ్యవంతమైన క్రీడా సమాజాన్ని నిర్మించగలరు. – నాగిరెడ్డి సిధారెడ్డి, శాట్స్ అసిస్టెంట్ రిటైర్డ్ డైరెక్టర్ -
కులసంఘాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు
● ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ వేములవాడ: కులసంఘాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వేములవాడలో అన్ని కులసంఘాలకు నిధులు కేటాయించినట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. పట్టణంలోని రెండో బైపాస్రోడ్డులో మున్నూరుకాపు కల్యాణ మండపాన్ని బుధవారం మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్చైర్మన్ నరాల శేఖర్, మున్నూరుకాపు సంఘం నాయకులు కొండ దేవయ్య, కోయినేని బాలయ్యలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. సంక్షేమం, అభివృద్ధిని రెండు సమానంగా చేస్తున్నట్లు వివరించారు. -
వడదెబ్బతో వలస కూలీ మృతి
ధర్మపురి: జీవనోపాధి కోసం వలస వచ్చిన కూలీ వడదెబ్బ తగిలిమృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా చీరాల ప్రాంతానికి చెందిన యోహన్ అలియాస్ మహేష్ (28) కూలీ పనుల కోసం ధర్మపురి వచ్చాడు. మండలంలోని కమలాపూర్లో బుధవారం అతిగా మద్యం సేవించాడు. వడదెబ్బకు గురై మృతి చెందాడు. సీఐ రాంనర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై మహేష్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతుడి వివరాలు సేకరించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. గంజాయి విక్రేత అరెస్ట్ధర్మపురి:గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసి రిమాండుకు పంపినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటకు చెందిన ప్రణీత్కుమార్ గంజాయికి అలవాటు పడ్డాడు. పైగా విక్రయించేందుకు సిద్ధమయ్యారు. పట్టణంలోని పెట్రోల్ పంప్ వద్ద అనుమానాస్పదంగా వెళ్తుండడంతో పోలీసులు సోదా చేయగా అతని వద్ద 60 గ్రాముల గంజాయి లభించింది. గంజాయిని సీజ్ చేసి యువకుడిని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు ఎస్సై తెలిపారు. ముగ్గురికి జైలుకరీంనగర్క్రైం: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన ముగ్గురికి కరీంనగర్ కోర్టు 4 రోజుల జైలు శిక్ష విధించినట్లు పోలీసులు తెలిపారు. మొగ్గ ప్రశాంత్, బోయిని గంగరాజు, భానోతు జయరాంకు సాధారణ జైలు శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. మహిళ ఆత్మహత్యాయత్నంకరీంనగర్క్రైం: కరీంనగర్కు చెందిన ఓ మహిళ కుటుంబ గొడవలతో విసిగిపోయి ఆత్మహత్య చేసుకుంటానని పద్మనగర్లోని వాటర్ ట్యాంక్ ఎక్కింది. అక్కడే ఉన్న స్థానికులు వెంటనే పోలీస్, అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారమందించారు. వెంటనే స్పందించిన టూటౌన్ సీఐ సృజన్రెడ్డి, డివిజన్ ఫైర్ అధికారి శ్రీనివాస్రెడ్డి సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి మహిళకు నచ్చజెప్పి కిందకు తీసుకొచ్చారు. భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. గుడుంబా విక్రేతలపై కేసువీర్నపల్లి: మండలంలోని భావుసింగ్నాయక్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని గొన్యనాయక్తండాలో గుడుంబా స్థావరాలపై పోలీ సులు బుధవారం దాడి చేశారు. గుడుంబా విక్రయిస్తున్న ఇద్దరు పట్టుబడ్డట్లు ఎస్సై లక్ష్మణ్ తెలిపారు. గుడుంబా తయారీ కోసం నిల్వ ఉంచిన సుమారు 100 లీటర్ల బెల్లం, సారాయికి ఉపయోగించే ముడి పదార్థాలను ధ్వంసం చేశారు. -
గుండెపోటుతో వైద్యుడి హఠాన్మరణం
భైంసాటౌన్/ఎల్లారెడ్డిపేట: నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి చెందిన వైద్యుడు, నర్సాపూర్(జి) ఆస్పత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ జీడి సురేందర్(50) బుధవారం గుండెపోటుతో మృతిచెందారు. బైంసాలోని తన ప్రైవేట్ ఆస్పత్రిలో బుధవారం ఓ రోగికి వైద్యసేవలు అందిస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది నిర్మల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయారు. పేద కుటుంబం నుంచి.. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కిషన్దాస్పేటకు చెందిన జీడి సాయిలు, పోశవ్వ దంపతుల కుమారుడు జీడి సురేందర్. పదో తరగతి వరకు స్థానిక జెడ్పీ పాఠశాల, ఇంటర్ సిరిసిల్లలో, కామారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. డిగ్రీ చదువుతుండగానే వెటర్నరీ శాఖలో ఉద్యోగం పొందారు. అనంతరం వరంగల్లోని కాకతీయ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదివారు. 2011లో భైంసాలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్గా విధుల్లో చేరారు. అప్పటి నుంచి ఎంతో మంది పేదలకు వైద్యసేవలందించారు. సాధారణ రైతు కుటుంబం నుంచి కష్టపడి చదివిన సురేందర్ ఎల్లారెడ్డిపేట నుంచి మొట్టమొదటి డాక్టర్గా పట్టా అందుకున్నారు. బైంసా ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తూ ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచిపోయారు. ఎంతోమంది పేదలకు ఉచితంగా వైద్యం అందించే పేదల డాక్టర్గా పేరు గడించారు. సురేందర్కు భార్య జ్యోతి, ఇద్దరు కూతుళ్లు ప్రీతి, అవంతిక. ఒకరు హైదరాబాద్లో మెడిసిన్ చదువుతుండగా, చిన్న కూతురు పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. డాక్టర్ హఠాన్మరణంపై పట్టణ ప్రముఖులతోపాటు వైద్యులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవం రసాభాస
● మున్సిపల్ చైర్పర్సన్ వర్సెస్ ఏఎంసీ చైర్పర్సన్సిరిసిల్ల అర్బన్: మున్సిపల్ పరిధిలోని పెద్దూరు, రగుడు, సర్ధాపూర్ గ్రామాల్లో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు ఇద్దరు చైర్పర్సన్ల మధ్య బుధవారం ఘర్షణ వాతావరనం చోటుచేసుకుంది. పెద్దూరులో స్థానిక కౌన్సిలర్ లింగంపల్లి భాగ్యలక్ష్మి రాక ముందే కేంద్రాన్ని ప్రారంభించారు. మున్సిపల్ పరిధిలోని మెప్మా ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు ఇటు మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, అటు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వెలుముల స్వరూపరెడ్డి చేరుకున్నారు. పెద్దూరు, సర్ధాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఇద్దరి మధ్య రసాభాస చోటుచేసుకుంది. చివరికి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూపరెడ్డి ప్రారంభించారు. ఈ విషయం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు స్థానిక బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. మెప్మా ఆధ్వర్యంలో మున్సిపల్ వారికే బాధ్యత ఉంటుందని అధికారులు పేర్కొనడం విశేషం. మెప్మా ఏవో ఫసహత్ అలీ బేగ్, నాయకులు తిరుపతిరెడ్డి, అశోక్రావు, రెడ్డినాయక్, నక్క నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యమకారుల ఎంపిక విధానం సరిగా లేదు
అధ్యక్షుడు ఓరుగంటి ఆనంద్ కరీంనగర్ టౌన్: తెలంగాణ ఉద్యమకారుల ఎంపిక విధివిధానం సరిగా లేదని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఓరుగంటి ఆనంద్ అన్నారు. బుధవారం కరీంనగర్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర సాధనలో అమరులైన వారి కుటుంబాలను, దివ్యాంగులైన ఉద్యమకారులను, జైలుకెళ్లిన ఉద్యమకారులను ఆదుకోవాలన్నారు. ప్రభుత్వం కమిటీని ప్రకటిస్తే.. ఆ కమిటీకి సంబంధించిన జీవో కాలపరిమితి విధివిధానాలు బహిర్గతం చేయాలని అన్నారు. వివిధ సంఘాలకు నాయకత్వం వహిస్తూ ఉద్యమంలో పాల్గొన్న వారి పత్రిక వార్తలు, వీడియోల ఆధారంగా గుర్తించాలన్నారు. ఉద్యమకారుల మనోభావాలను గుర్తించి కమిటీ విధివిధానాలు రూపొందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారుల కరీంనగర్ జిల్లా చైర్మన్ కనకం కుమారస్వామి, చొప్పరి సుధాకర్, గరిగే కోటేశ్వర్, మేకల మాధవి, కారుపాకల మున్న, గర్షకుర్తి ఉమారాణి, మహాదేవుని భార్గవి, బాలామణి, వనజ, పద్మ, కనకలక్ష్మి, సంధ్య, కోమల, శారద, సుజాత, దేవేంద్ర, గాలి రమేశ్, బూడిద వినోద్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కోర్సులపై దృష్టి పెట్టాలి
ప్రభుత్వం అందిస్తున్న కోర్సులు యువతకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. క్రీడారంగంలో నైపుణ్యాలు పెంపొందించేందుకు ఇవి కీలకం. గ్రామీణ ప్రాంతాల యువతకు కూడా మంచి అవకాశాలు అందిస్తున్నాయి. ఉద్యోగ అవకాశాలను పెంచే దిశగా ఇవి చాలా సహాయపడతాయి. ప్రతీ క్రీడాకారుడు కోర్సులపై దృష్టి పెట్టాలి. – బుర్ర మల్లేశ్గౌడ్, కబడ్డీ సంఘం కార్యదర్శి శిక్షణ ద్వారా క్రీడాకారులు ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నతస్థాయి వరకు శిక్షణ ఇచ్చే మెలకువలు నేర్చుకుంటారు. శాసీ్త్రయ శిక్షణ పద్ధతులు నేర్పుతారు. ట్రైనింగ్ తీసుకున్నవారు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కోచ్గా ఎదిగి, దేశానికి పతకాలు తెచ్చే క్రీడాకారులను తయారు చేయొచ్చు. – బసరవేణి లక్ష్మణ్, హ్యాండ్బాల్ సంఘం కార్యదర్శి ఈ కోర్సులు క్రీడాకారులకు కొత్త దిశను చూపుతాయి. శిక్షణతో పాటు శాసీ్త్రయ పరిజ్ఞానం అందించడం గొప్ప విషయం. ప్రస్తుతం ప్రొఫెషనల్ కోచ్లకు డిమాండ్ పెరుగుతోంది. కోర్సులు పూర్తి చేసినవారు దేశానికి మంచి సేవ చేయగలరు. – గెల్లు మధుకర్యాదవ్, ఖేలో ఇండియా ఖోఖో సెంటర్ కోచ్ -
అంగన్వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్
● ఎన్పీడీసీఎల్ ఎస్ఈ వేణుమాధవ్ గంభీరావుపేట/ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం కల్పించడంలో ఎన్పీడీసీఎల్ కీలకపాత్ర పోషిస్తోందని ఎస్ఈ వేణుమాధవ్ పేర్కొన్నారు. జిల్లా సర్కిల్ పరిధిలో 1,427 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని రెండు అంగన్వాడీ కేంద్రాలకు బుధవారం విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేశారు. డీఈ వెంకటరమణ, చంద్రమౌళి, ఏడీఈ శ్రీనివాస్, ఏఈ శ్రీనివాస్, ఆనంద్ పాల్గొన్నారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలి ఎండాకాలం దృష్ట్యా వ్యవసాయానికి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేయాలని జిల్లా సూపరింటెండింగ్ ఇంజినీర్ టి.వేణు మాధవ్ కోరారు. ఎల్లారెడ్డిపేటలోని 132 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ను తనిఖీ చేశారు. ఆయిల్ లెవల్స్, కూలింగ్ సిస్టమ్ను ఎస్ఈ పరిశీలించారు. లైన్మెన్లు ఫీల్డ్లోకి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. డివిజినల్ ఇంజినీర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి
సిరిసిల్లటౌన్: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో అధ్యక్షుడు గుండమనేని మహేందర్రావు అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. 2024 మార్చి నుంచి రిటైర్డ్ అయిన 12 వేలమంది ఉద్యోగులు, ఉపాధ్యాయులకు చెల్లించాల్సి న బకాయిలు వెంటనే విడుదల చేయాలని, ఏక మొత్తంగా రూ.10,000 కోట్లు కేటాయించి పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని కోరారు. సీపీఎస్ రద్దు చేసి, కేజీబీవీ, సమగ్ర శిక్షా ఉద్యోగులకు బేసిక్ పే ఇవ్వాలన్నారు. సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మే 2న యుటీఎఫ్ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ దాచూరి రామిరెడ్డి 10వ వర్ధంతి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రధాన కార్యదర్శి ఎ.వెంకట్, కార్యదర్శి గోల్కొండ శ్రీధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి జంగిటి రాజు, కోశాధికారి అంబటి రమేశ్, జిల్లా కార్యదర్శులు కొత్వాల్ ప్రవీణ్, పాముల స్వామి, ఆడెపు శివకుమార్, తిరుపతి జాదవ్, అరవింద్ పాల్గొన్నారు. -
పెండింగ్ కేసులపై అలసత్వం వద్దు
బోయినపల్లి(చొప్పదండి): సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ మహేశ్ బీ గితే ఆదేశించారు. మంగళవారం బోయినపల్లి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీఎస్ పరిధిలో నమోదవుతున్న కేసుల వివరాలు, రికార్డులను పరిశీలించారు. కేసుల దర్యాప్తులో అలసత్వం వద్దని, పెండింగ్ కేసులను వేగంగా పూర్తి చేసి, చట్టపరంగా నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలన్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మద్యం తాగి వాహనం నడపడం, మెనర్ డ్రైవింగ్ వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు వివరించాలన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటులో ప్రజలు, వ్యాపారస్తులు, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని కోరారు. డీఎస్పీ శ్రీనివాసులు, రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్సై రమాకాంత్, సిబ్బంది ఉన్నారు. -
వైభవంగా శంకర జయంతి
వేములవాడ: రాజన్న సన్నిధిలో శంకర జయంతి మహోత్సవాలు మంగళవారం భక్తిశ్రద్ధలతో ముగిశాయి. వైశాఖ శుద్ధ పాఢ్యమి నుంచి పంచమి వరకు జరిగిన మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు మూలమూర్తులైన లక్ష్మీగణపతి స్వామివారికి అధర్వశీర్ష పఠనంతో అభిషేకాలు చేశారు. స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. రాజరాజేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం వేద సదస్సు నిర్వహించారు. నాలుగురోజులుగా జరుగుతున్న శంకర జయంతి ఉత్సవాలు ముగిసినట్లు ఆలయ స్థానాచార్యులు ఉమేశ్శర్మ తెలిపారు. ఈవో రమాదేవి, అర్చకులు పాల్గొన్నారు. -
వాణిజ్య పంటలు సాగు చేయాలి
కోనరావుపేట/వేములవాడఅర్బన్: రైతులు వాణిజ్య పంటలు సాగు చేయాలని, పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. కోనరావుపేట మండలం ధర్మారం, వేములవాడ మండలం అనుపురం గ్రామంలో నాంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ప్రారంభించారు. కోనరావుపేట మండలకేంద్రంలో జరిగిన ఎల్లమ్మ సిద్ధోగంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సీఎం రేవంత్రెడ్డి రైతులకు పెద్దపీట వేస్తూ నాణ్యమైన విద్యుత్, ఎరువులు, మెరుగైన విత్తనాలు అందిస్తున్నారని వివరించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని కోరారు. మిల్లర్లు కూడా ప్రభుత్వానికి సహకరించాలన్నారు. రైతులు పంట మార్పిడి విధానాన్ని అవలంబించాలని, ఆయిల్పాం సాగు చేయాలని సూచించారు. కార్యక్రమాల్లో తహసీల్దార్ వరలక్ష్మి, ఏఎంసీ చైర్మన్ ఎల్లయ్య, కౌన్సిలర్ కాశ శ్రీనివాస్, సర్పంచులు బోయిని దేవరాజు, శేర్ల రాజేశ్వరి, కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ ఫిరోజ్పాషా, నందూగౌడ్, కర్రోళ్ల భాస్కర్, బాలరాజు, కార్తీక్, మల్లేశం, ఎర్రం రాజు, సత్తయ్య, ఆగయ్య, ప్రదీప్, సల్మాన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వానికి రెండు కళ్లు చందుర్తి(వేములవాడ): అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వానికి రెండు కళ్లలాంటివని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం చందుర్తి రైతు వేదికలో 90 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. మండలంలో సాగు నీటి కోసం ఆశిరెడ్డిపల్లె కొత్త చెరువులోకి ఎల్లంపల్లి నీటిని మళ్లించేందుకు రూ.23లక్షలతో కాలువ పనులు కొనసాగుతున్నాయన్నారు. కలికోట సూరమ్మ చెరువు పనులకు రూ.320 కోట్లు అవసరం ఉండగా, ప్రస్తుతం పనులు ప్రారంభించేందుకు రూ.250 కోట్లు మంజూరయ్యాయని, పనులు ప్రారంభిస్తామని తెలిపారు. రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, ఉపాధ్యక్షుడు బొజ్జ మల్లేశం, సర్పంచ్ పులి సత్తయ్య, తహసీల్దార్ గొట్టే భూపతి, ఎంపీడీవో లెంకల రాధ, పార్టీ అధ్యక్షుడు చింతపంటి రామస్వామి, నాయకులు పాల్గొన్నారు. -
కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రైతులకు మద్దతు ధర కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్, రాచర్ల గొల్లపల్లి బుగ్గరాయేశ్వర తండాలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దన్నారు. ధాన్యం అమ్మిన రైతులకు డబ్బులు నేరుగా వారి ఖాతాలోనే వారం రోజుల్లో జమ చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సుజాత, ఏఎంసీ చైర్మన్ సబేరాబేగం, ప్రత్యేక అధికారి షఫీ, ఏఎంసీ వైస్ చైర్మన్ గుండాడి రామ్రెడ్డి, సర్పంచులు ఇల్లందుల గీతాంజలి, అజ్మీరా తిరుపతినాయక్, అందే సుభాష్, కొండ రమేశ్గౌడ్, నాయకులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారమే లక్ష్యం తంగళ్లపల్లి(సిరిసిల్ల): విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారమే లక్ష్యమని ఎస్ఈ టి.వేణుమాధవ్ అన్నారు. మంగళవారం మండలంలోని అంకిరెడ్డిపల్లిలో నిర్వహించిన ‘ప్రజా బాట’ కార్యక్రమంలో వినియోగదారుల సమస్యలు తెలుసుకున్నారు. గ్రామంలో వోల్టేజీ సమస్య తలెత్తకుండా కొత్త ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, ప్రమాదకరంగా వేలాడుతున్న లూజ్ లైన్లు సరిదిద్దడం, స్తంభాల ఏర్పాటుపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. యూనిఫాం సర్వీస్ లైన్ వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. విద్యుత్ వినియోగంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు స్వయంగా ప్రయత్నించకుండా వెంటనే సిబ్బందికి సమాచారం అందించాలని కోరారు. ఆపరేషన్ డీఈ అంజయ్య, ఏడీఈ గోపీనాథ్, ఏఈ మధుకర్, సర్పంచ్ రాగుల రాజిరెడ్డి, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రభుత్వంలో విలీనం చేయాలిసిరిసిల్లటౌన్: ఆర్టీసీ సిబ్బందికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని జేఏసీ చైర్మన్ బాణయ్య కోరారు. రాష్ట్ర కమిటీ సమ్మె సన్నాహక పిలుపులో భాగంగా మంగళవారం సిరిసిల్ల డిపో ఎదుట ధర్నా నిర్వహించి మాట్లాడారు. ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగుల బెనిఫిట్స్ అందించాలని కోరారు. జేఏసీ వైస్ చైర్మన్లు జేఎస్ఎన్ రావు, బి. శ్రీనివాస్, కన్వీనర్ రమేశ్, గ్యారేజ్ కో కన్వీనర్ మల్లేశం, నాగసాగర్, భూమయ్య, మల్లయ్య, సత్తయ్య, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగులు స్వయం ఉపాధి సాధించాలిసిరిసిల్ల: జిల్లాలో నిరుద్యోగులు స్వయం ఉపాధి సాధించి, ఆర్థికంగా నిలదొక్కుకోవాలని జిల్లా పరిశ్రమలశాఖ జనరల్ మేనేజర్ టి.హనుమంతు కోరారు. కలెక్టరేట్లోని జిల్లా పరిశ్రమల కేంద్రంలో మంగళవారం నిరుద్యోగ యువకులు, మహిళా సంఘాలకు, ఆసక్తి గల వ్యాపారులకు స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించారు. ప్రధాన మంత్రి ఎంప్లాయిమెంట్ జననేషన్ (పీఎంఈజీపీ) పథకంలో తయారీ రంగానికి రూ.50 లక్షలు, సేవల రంగానికి రూ.20 లక్షలు, రూ.10లక్షల వరకు ఎలాంటి ష్యూరిటీ లేకుండా రుణవసతి ఉందన్నారు. ఇందులో 15 నుంచి 35 శాతం మేరకు సబ్సిడీ ఉందన్నారు. పీఎంఎఫ్ఎంఈ (ఫుడ్ ప్రాసెసింగ్) యూనిట్లకు వ్యక్తిగతంగా రూ.10లక్షలు, ఎస్హెచ్జీ గ్రూపులకు రూ.3కోట్ల వరకు రుణ వసతి ఉందని, ఇందులో 35 శాతం సబ్సిడీ వస్తుందన్నారు. ఆసక్తి గల వారు జిల్లా పరిశ్రమల కేంద్రాన్ని సంప్రదించాలని కోరారు. -
ప్రణాళికతో పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి
● కలెక్టర్ గరీమా అగ్రవాల్ సిరిసిల్ల: పోటీ పరీక్షలకు ప్రణాళికతో సిద్ధం కావాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ సూచించారు. జిల్లా కేంద్రంలోని సినారె జిల్లా గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులతో కలెక్టర్ మంగళవారం మాట్లాడారు. విద్యార్హతలు, ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారు? ఏయే పుస్తకాలు చదువుతున్నారని ఆరా తీశారు. అన్ని సబ్జెక్టులు ప్రణాళిక ప్రకారం ప్రతీ అంశం క్షుణ్ణంగా చదవాలన్నారు. కరెంట్ అఫైర్స్, ఇతర అన్ని అంశాలపై అవగాహనతో ముందుకెళ్లాలని పేర్కొన్నారు. ఎన్సీఆర్టీ పుస్తకాలు కూడా రిఫరెన్స్గా తీసుకోవాలని సూచించారు. జనగణన పూర్తి చేయాలి సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లు జనగణన– 2027ను బాధ్యతాయుతంగా పూర్తి చేయాలని కలెక్టర్, డిస్ట్రిక్ట్ అండ్ ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. జనగణన హౌస్ లిస్టింగ్ బ్లాక్స్, సెన్సస్ మానిటరింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ డిజిటల్ విధానం, స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యూమరేషన్)పై సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లకు శిక్షణ కొనసాగుతుండగా చివరి రోజు మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. జనగణనకు సంబంధించిన కిట్లను పంపిణీ చేశారు. మొదటి దశలో మే 11 నుంచి జూన్ 9 వరకు ఇళ్ల గణన నిర్వహిస్తారని, రెండో దశ ఫిబ్రవరి 2027లో వ్యక్తుల వారీగా సమాచారం సేకరిస్తారన్నారు. ప్రతీ కుటుంబం వివరాలు పక్కాగా నమోదు చేయాలని ఆదేశించారు. సీపీవో శ్రీనివాసాచారి, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, తహసీల్దార్ మహేశ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కో ‘ఆప్షన్’కు నాలుగు నామినేషన్లు
● వేములవాడ కో ఆప్షన్ ఎన్నికలకు నేడు చివరి గడువు వేములవాడ: వేములవాడ మున్సిపాలిటీలో కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక నామినేషన్లకు గడువు 22వ తేదీతో ముగియనుండగా, ఇప్పటి వరకు కేవలం నాలుగు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన చీకోటి శ్రీహరి, తోట లహరి, అబ్దుల్ రజాక్, నామాల వరలక్ష్మి నామినేషన్లు దాఖలు చేసినట్లు మేనేజర్ సంపత్ తెలిపారు. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు వేసే అవకాశం ఉంది. నలుగురికి ఆప్షన్ వేములవాడ మున్సిపాలిటీలో మొత్తం నాలుగు కో ఆప్షన్ పోస్టుల్లో రెండు మైనార్టీలకు, రెండు స్పెషల్ నాలెడ్జ్ పర్సన్స్కు కేటాయించిన విషయం తెలిసిందే. ఆశావహులు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ ఎవరి పేరును ఫైనల్ చేయాలన్న దానిపై అధికార పార్టీ ఇంకా స్పష్టతకు రాలేదు. అయితే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎవరికి ఆప్షన్ ఇస్తారనే అంశంపై సందిగ్ధం నెలకొంది. విప్ బిజీ.. నిర్ణయం పెండింగ్ ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో తుది నిర్ణయం పార్టీ నేతల చేతుల్లోనే ఉంది. ముఖ్యంగా విప్ ఆది శ్రీనివాస్ బిజీ షెడ్యూల్ కారణంగా అభ్యర్థుల ఎంపికపై ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని సమాచారం. దీంతో ఆశావహులు ‘చివరి నిమిషం’ వరకు వేచి చూసే పరిస్థితి ఏర్పడింది. మంగళ, బుధవారాల్లో వీటిని ఫైనల్ చేసే అవకాశాలున్నాయని పాలకవర్గ సభ్యులు అంటున్నారు. లాబీయింగ్ జోరు ఇప్పటికే ఆశావహులు పార్టీ ముఖ్య నేతలతో సంప్రదింపులు ముమ్మరం చేశారు. మున్సిపల్ కౌన్సిలర్లు, స్థానిక నాయకుల ద్వారా తమ పేర్లు ముందుకు తెచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. చివరి రోజునే నామినేషన్ల వర్షం కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయన్న చర్చ సాగుతోంది. శీనన్న ఆశీస్సులు ఎవరికి ఉంటాయోనని చర్చించుకుంటున్నారు. తలనొప్పిగా ఎంపిక ప్రక్రియ మైనార్టీ కోటాలో వర్గాల మధ్య సమతుల్యత, స్పెషల్ నాలెడ్జ్ కేటగిరీలో అర్హతల ఎంపిక వంటి అంశాలు పార్టీకి తలనొప్పిగా మారాయి. ఒకరికి అవకాశం ఇస్తే, మరో వర్గం అసంతృప్తి చెందే పరిస్థితి ఉండడంతో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. నామినేషన్ల గడువు సమయం దగ్గర పడుతున్న కొద్ది ఆశావహుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. కాగా, కో ఆప్షన్ పదవులు ఎవరిని వరిస్తాయోనని ఆసక్తి నెలకొంది. -
ఆర్టీసీలో సమ్మె సైరన్
సిరిసిల్లటౌన్: ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. నిర్విరామంగా పరుగులు తీస్తున్న బస్సు చక్రాలకు బ్రేక్ పడనుంది. జిల్లాలోని రెండు డిపోలలో బుధవారం నుంచి బస్సులు నిలిచిపోనున్నాయి. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు జిల్లా జేఏసీ సమ్మెకు సిద్ధమైంది. ఫలితంగా ఏడేళ్ల క్రితం ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రయాణీకులు ఎదుర్కొన్న కష్టాలు మళ్లీ మొదలుకానున్నాయి. డిమాండ్లు ఇవీ.. మేనిఫెస్టోలోని అంశాన్ని అడుగుతున్నాం ఉమ్మడి రాష్ట్రం నుంచి ఆర్టీసీ రెండు విభాగాలుగా విభజించారు. ఆంధ్రప్రదేశ్లో అక్కడి ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం ప్రభుత్వంలో విలీనం చేశారు. ఇదే విషయాన్ని గత ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది. కానీ అమలు చేయడం లేదు. ఆంధ్రప్రదేశ్లో మాదిరిగానే ఇక్కడి ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. విద్య, వైద్యంతోపాటు రవాణా సంస్థను సైతం లాభనష్టాలతో పరిగణించొద్దు. – బాణయ్య, జేఏసీ చైర్మన్ -
అంబేడ్కర్ సంస్కరణలకు కాంగ్రెస్ తిలోదకాలు
సిరిసిల్లటౌన్: అంబేడ్కర్ సంస్కరణలకు కాంగ్రెస్ తిలోదకాలిచ్చిందని బీజేపీ జిల్లా ఇన్చార్జి గంగాడి మోహన్రెడ్డి పేర్కొన్నారు. సిరిసిల్లలోని బీ జేపీ జిల్లా ఆఫీస్లో సోమవారం నిర్వహించిన అంబేడ్కర్ జయంతి వారోత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. ప్రధాని మోదీ అంబేడ్కర్ జ్ఞాపకార్థం దేశవ్యాప్తంగా స్మారక స్థలాలు అభివృద్ధి చేశారన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, నాయకులు లింగంపల్లి శంకర్, అల్లాడి రమేశ్, ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీ నివాస్, ఉపాధ్యక్షుడు మల్లారపు సంతోష్రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి రాజాసింగ్, మహిళా మోర్చా అధ్యక్షురాలు అన్నపూర్ణ పాల్గొన్నారు. ‘డబుల్’ ఇళ్లు పరిశీలన వేములవాడ/వేములవాడఅర్బన్: వేములవాడ మున్సిపల్ పరిధి తిప్పాపూర్లో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పనులను మున్సి పల్ చైర్మన్ పుల్కం రాజు సోమవారం పరిశీలించారు. అనంతరం పట్టణంలోని బాలానగర్లో పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజుతో కలిసి ప్రారంభించారు. మున్సిపల్ కమిషనర్ సంపత్కుమార్, వైస్ చైర్మన్ నరాల శేఖర్, వైస్చైర్మన్ కనికరపు రాకేశ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ పాల్గొన్నారు. విద్యా సదస్సును విజయవంతం చేయండి వేములవాడఅర్బన్: తెలంగాణ ప్రోగెసిస్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 30న హైదరాబాద్లో నిర్వహించే రాష్ట్ర విద్యాసదస్సును విజయవంతం చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చకినాల అనిల్కుమార్ కోరా రు. వేములవాడ మున్సిపల్ పరిధి తిప్పాపూర్లోని జెడ్పీ హైస్కూల్లో టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో వాల్పోస్టర్ను సోమవారం ఆవిష్కరించా రు. జిల్లా అధ్యక్షుడు రమానాథ్, దేవేందర్, కిష న్, రజనీరాణి, తిరుపతి, బొజ్జ కృష్ణ ఉన్నారు. -
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో..
తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ‘బస్ కా పయ్యా నహి ఛలేగా’ అనే నినాదంతో సమ్మెకు వెళ్తున్నాం. ప్రభుత్వం హామీ ఇచ్చి రెండున్నర ఏళ్లు పూర్తయినా ఇప్పటి వరకు ఎలాంటి న్యా యం చేయలేదు. అన్ని డిపోలలో అధికారుల వేధింపులు, అధిక పనిభారం, అధిక కిలోమీటర్లతో ఇబ్బందులు పెడుతున్నారు. – జేఎస్ఎన్.రావు, జేఏసీ వైస్చైర్మన్ పనిభారం తగ్గించాలి ఆర్టీసీ డిపోల్లో ఉద్యోగులకు పనిభారం ఎక్కువైంది. కార్మికుల పని గంటలు పెంచుతుండ్రు. యూనియన్లు లేవని ఇబ్బందులు పెడుతుండ్రు. వేధింపులు తట్టుకోలేకనే సమ్మెకు వెళ్లాల్సి వచ్చింది. రెండు పీఆర్సీలు ఇవ్వడం లేదు. బతుకుపోరాటంగా పరిగణించి హక్కులు సాధించుకుంటాం. – శ్రీనివాస్నాయక్, వైస్చైర్మన్ -
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం
ముస్తాబాద్(సిరిసిల్ల): పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. మండలంలోని నామాపూర్లో ఎస్డీఎఫ్ నిధులు రూ.31లక్షలతో నిర్మించిన ఇరిగేషన్ భవనాన్ని కలెక్టర్ గరీమా అగ్రవాల్తో కలిసి సోమవారం ప్రారంభించి మాట్లాడారు. రైతును రాజు చేయడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రైతులకు ఉత్తమ సేవలు అందించేందుకు నీటిపారుదలశాఖ భవనాలను నిర్మిస్తున్నామన్నారు. అనంతరం ముస్తాబాద్లోని కస్తూర్భా బాలికల విద్యాలయంలో నిర్వహించిన సంక్షేమ వారోత్సవాల్లో పాల్గొన్నారు. డైట్ చార్జీలు 40 శాతం, కాస్మోటిక్ చార్జీలు 200 శాతం పెంచామని గుర్తు చేశారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించారన్నారు. వేణుగోపాలస్వామి ఆలయంలో పూజలు మండడల కేంద్రంలోని పురాతన శ్రీవేణుగోపాలస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న ధ్వజస్తంభ ప్రతి ష్ఠాపనోత్సవాల్లో విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని ప్రత్యే క పూజలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో కాంగ్రెస్ సిరిసిల్ల ఇన్చార్జి మహేందర్రెడ్డి, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ సత్యనారాయణ, ఏఎంసీ చైర్పర్స న్ తలారి రాణి, ఎస్ఈ కిశోర్, ప్రత్యేకాధికారి రాఘవేందర్, సర్పంచ్లు మాదాస్ అనిల్, మట్ట వెంకటేశ్వర్రెడ్డి, తహసీల్దార్ ఫరూక్, ఎంపీడీవో లచ్చాలు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు యెల్ల బాల్రెడ్డి, చక్రధర్రెడ్డి, రాజిరెడ్డి, విజయ్రెడ్డి, గజ్జెల రాజు, మాజీ ఎంపీపీ జనగామ శరత్రావు, సెస్ మాజీ డైరెక్టర్ విజయరామారావు, గజ్జెల రాజు పాల్గొన్నారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు చందుర్తి/వేములవాడరూరల్: ఇళ్లు లేని నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. చందుర్తి మండలం రామన్నపేట, వేములవాడ రూరల్ మండలం వెంకటాంపల్లి, మర్రిపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ గృహ ప్రవేశాలకు హాజరయ్యారు. పార్టీ మండలా అధ్యక్షులు చింతపంటి రామస్వామి, వకుళాభరణం శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్, సనుగుల సింగిల్విండో మాజీ అధ్యక్షుడు ముష్కు ముకుందరెడ్డి, సర్పంచులు ఆవునూరి లక్ష్మి, ఇల్లందుల లాస్య పాల్గొన్నారు. -
ప్రజావాణి సమస్యలు పరిష్కరించండి
● కలెక్టర్ గరీమా అగ్రవాల్ ● 218 దరఖాస్తులు స్వీకరణసిరిసిల్ల అర్బన్: ప్రజావాణిలో అర్జీలను పెండింగ్ పెట్టకుండా సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి అర్జీలను అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్తో కలిసి స్వీకరించారు. మొత్తం 218 దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులు ఎప్పటికప్పుడు సకాలంలో పరిష్కరించాలని సూచించారు. పింఛన్ ఇప్పించండి మాది ఇల్లంతకుంట మండలం సిరికొండ. నా భర్త మల్లయ్య నాలుగేళ్ల క్రితం చనిపోయాడు. నా వ యసు 85 ఏళ్లు. నాకు ఇప్పటి వరకు పింఛన్ రా వడం లేదు. పింఛన్ ఇప్పించి, న్యాయం చేయండి. – దనుల బుచ్చవ్వ, సిరికొండ పశువైద్య భవనం నిర్మించండి వేములవాడ మండలం చింతల్ఠాణా ఆర్అండ్ఆర్ కాలనీలో నిర్మించిన పశువైద్యశాల భవనాన్ని అంగన్వాడీ కేంద్రానికి వాడుతున్నారు. పశువైద్యశాల భవనం నిర్మించి, గ్రామంలో గాలికుంటూ వ్యాధి టీకా కార్యక్రమం ఏర్పాటు చేసి, పశువులకు నీటికుండీలు నిర్మించాలని కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. – చింతల్ఠాణా, ఆర్అండ్ఆర్ కాలనీ న్యాయం చేయండి మాది సిరిసిల్ల పట్టణంలోని ఇందిరానగర్. నేను ఐకేఎఫ్ ప్రైవేట్ బ్యాంకు నుంచి రూ.9లక్షలు లోన్ తీసుకున్నాను. నా ఆరోగ్యం బాగా లేకపోవడంతో నాలుగు ఈఎంఐలు కట్టలేకపోయాను. షుగర్తో కాలు తీసివేశారు. కొంచెం సమయం ఇవ్వండి కడుతామని చెప్పినా వినకుండా మమ్మల్ని ఇంటి నుంచి బయటకు గెంటివేశారు. ఇంటికి వేసిన తాళం ఇప్పించి న్యాయం చేయండి. – బాగం గోపాల్, సిరిసిల్ల ‘డబుల్’ ఇళ్లు ఇప్పించండి సిరిసిల్ల పట్టణంలోని 29వ వార్డుకు చెందిన మాకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల డ్రాలో 18 మంది పేర్లు వచ్చినవి. రెండేళ్లుగా ఇస్తామంటున్నారు. కానీ ఇప్పటి వరకు ఇవ్వడం లేదు. అద్దె ఇండ్లలో ఉంటూ ఇబ్బంది పడుతున్నాం. ఎలాగైనా మాకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పించండి. – డ్రాలో పేర్లు వచ్చిన లబ్ధిదారులు -
మద్దతు ధర అందించడమే లక్ష్యం
సిరిసిల్ల/తంగళ్లపల్లి(సిరిసిల్ల): రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర అందించేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ గరీమా అగ్రవాల్ తెలిపారు. తంగళ్లపల్లి మండలం తాడూర్లో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కేంద్రాల వద్ద నీడ కోసం టెంట్లు, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, ఆర్డీవో వెంకటేశ్వర్లు, డీఆర్డీవో గీత, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వెలుముల స్వరూప, వైస్చైర్మన్ నేరెళ్ల నర్సింగంగౌడ్, సర్పంచ్ రెడ్డిమల్ల సదానందం, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ప్రవీణ్ టోని పాల్గొన్నారు. ప్రజలకు పారదర్శక సేవలు అందించాలి ప్రభుత్వ కార్యాలయాల ద్వారా ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించాలని కలెక్టర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. నూతన భవనంలోకి మార్చిన తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించారు. సర్పంచ్ మోర లక్ష్మీరాజం, ఆర్డీవో వెంకటేశ్వర్లు, తహసీల్దార్ విజయ ప్రకాశ్రావు, ఎంపీడీవో కె.లక్ష్మీనారాయణ, ఏఎంసీ వైస్చైర్మన్ నేరెళ్ల నర్సింగంగౌడ్ పాల్గొన్నారు. విద్యుత్ సబ్స్టేషన్లకు స్థలం కేటాయించండి జిల్లాలో విద్యుత్ లోడ్కు అనుగుణంగా కొత్తగా ఐ దు సబ్స్టేషన్లకు స్థలం కేటాయించాలని కలెక్టర్ గరీ మా అగ్రవాల్ను ఎన్పీడీసీఎల్ ఎస్ఈ వేణుమాధవ్ కోరారు. ఇటీవల జిల్లా ఎన్పీడీసీఎల్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీర్గా విధుల్లో చేరిన వేణుమాధవ్ మర్యాద పూర్వకంగా కలెక్టర్ను కలిశారు. -
కురిసిన వాన.. తడిసిన ధాన్యం
వీర్నపల్లి/తంగళ్లపల్లి/సిరిసిల్లఅర్బన్/చందుర్తి: జిల్లాలో ఆదివారం కురిసిన అకాల వర్షానికి పంటలకు తీవ్ర నష్టం కలిగింది. ఐకేపీ సెంటర్లలో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. ఈదురుగాలులకు పొలంలోనే పంట నేలవా లింది. ధాన్యం కుప్పలపై కప్పిన టార్పాలిన్లు కొట్టుకుపోయాయి. వీర్నపల్లి మండలం శాంతి నగర్లో నేలకొరిగిన విద్యుత్ స్తంభాలను లైన్మన్ వెంకటి ఆధ్వర్యంలో పునరుద్ధరించారు. కూలిన వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేశారు. సిరిసిల్ల శివారులో.. పెద్దూరు, రగుడు, చంద్రంపేట, బోనాల గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసింది. పెద్దూరు కేంద్రంలో సుమారు వెయ్యి క్వింటాళ్ల వరకు ధాన్యం తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలను నాయకులు లింగంపల్లి సత్యనారాయణ, అశోక్రావు పరిశీలించారు. చెట్ల కొమ్మలు తొలగించిన గ్రామస్తులు, పోలీసులు చందుర్తి మండలం మూడపల్లిలోని రోడ్డుపై కూలిన చెట్లతో శనివారం అర్ధరాత్రి వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. పోలీసులు చెట్లకొమ్మలు తొలగించేందుకు ప్రయత్నించగా సాధ్యం కాలేదు. సమాచారం తెలుసుకున్న సర్పంచ్ భర్త చిలుక అంజిబాబు, కొందరు గ్రామస్తులను తీసుకెళ్లి కొమ్మలను గొడ్డలితో నరికి తొలగించారు. -
రైతును రాజు చేయడమే లక్ష్యం
రుద్రంగి(వేములవాడ): రైతును రాజు చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తోందని విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఆదివారం అడిషనల్ కలెక్టర్ నగేశ్తో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ముందుగా సూరమ్మ ప్రాజెక్టును సందర్శించి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. యాసంగిలో పంట లు ఎండిపోకుండా ఉండేందుకు ఇప్పటికే మూడుసార్లు ఎల్లంపెల్లి నీటిని నాగారం చెరువులోకి విడుదల చేసినట్లు తెలిపారు. వేసవిలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు రుద్రంగి అచ్చయ్యకుంట, నాగారం చెరువులను నింపినట్లు పేర్కొన్నారు. రుద్రంగి సర్పంచ్ గండి లక్ష్మీనారాయణ, ఏఎంసీ చైర్మన్ చెలుకల తిరుపతి, ఉపసర్పంచ్ మాడిశెట్టి అభిలాశ్, మోహన్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, గంగనర్స య్య, మీనయ్య, శంకర్ పాల్గొన్నారు. కాంగ్రెస్లో చేరికలు వేములవాడ: కోనరావుపేట మండలం నిమ్మపల్లి, గొల్లపల్లి, మరిమడ్ల సర్పంచులు కమ్మరి స్వప్న–నాగరాజు, మాడుగుల ఆమని–శ్రీకాంత్, కోల స్వాతి–శ్రీనివాస్లు విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిమ్మపల్లి వార్డుసభ్యులు మ్యాదరి రాఘవేందర్, దేవయ్య, పూజారి లావణ్య లింబయ్య కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. -
ఆదివారం.. అక్రమ దందా
సిరిసిల్ల: జిల్లాలో ఆదివారం వస్తే చాలు అక్రమ మైనింగ్ జోరందుకుంటుంది. అధికారులు ఎవరూ ఉండబోరని యథేచ్ఛగా మట్టి, మొరం తరలిస్తూ క్యాష్ చేసుకుంటున్నారు. జిల్లాలో మొరం తవ్వకానికి అనుమతులు లేవు. సెలవు రోజుల్లో పొద్దంతా అక్రమంగా తవ్వకాలు చేస్తుండగా, సాధారణ రోజుల్లో చీకటిపూట టిప్పర్లలో తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈక్రమంలో అధికారులు రాకపోకలను గమనించేందుకు ఓ టీమ్ను రోడ్డు వెంట నిఘా కోసం ఏర్పాటు చేసుకుంటున్నారు. అధికారుల రాకను గమనిస్తే వీరు వెంటనే సమాచారం అందిస్తున్నారు. ఇలా అధికారులకు చిక్కకుండా.. మొరం, మట్టిని హిటాచీలతో తవ్వుతూ టిప్పర్లలో తరలిస్తున్నారు. అక్రమం.. అధికంగా వసూలు ఇళ్ల నిర్మాణంలో బరంతికి అవసరమైన మట్టిని, ఇతర అవసరాలకు మొరాన్ని ఈ మాఫియా చేరవేస్తుంది. ఒక్కో టిప్పర్కు రూ.4వేల నుంచి రూ.5వేలు వరకు వసూలు చేస్తున్నారు. ట్రాక్టర్ ట్రిప్పునకు రూ.1000 నుంచి రూ.1500 వసూలు చేస్తున్నారు. రాత్రీ, పగలు తేడా లేకుండా గుట్టలను గుల్ల చేస్తున్నారు. వీరి ఆగడాలతో వన్యప్రాణుల నివాసాలకు విఘాతం కలుగుతుంది. గుట్టలే కనుమరుగవుతున్నాయి. పట్టుకుంటే రాజకీయ ఒత్తిళ్లు మైనింగ్ అధికారులు ఈ అక్రమదందాను గుర్తించి అప్పుడప్పుడు టిప్పర్లను సీజ్ చేస్తూ, కేసులు నమోదు చేస్తున్నారు. పట్టుకున్న ప్రతీసారి మైనింగ్ అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు వస్తుండడంతో చేసేదేమీ లేక జరిమానాలతో వాహనాలను వదిలేస్తున్నారు. మైనింగ్ మాఫియాతో కొందరు అధికారులకు సంబంధాలు ఉండడంతో అక్రమదందా యథేచ్ఛగా సాగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. వెంకటాపూర్, పెద్దబోనాల, చిన్నబోనాల ప్రాంతలతోపాటు ఇంకా కొత్త ప్రాంతాల్లో మొరం తవ్వేందుకు దారులు చేస్తూ గుట్టల్లో చీకటి వ్యాపారం సాగుతోంది. ‘ఇది ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ శివారులోని గుట్ట వెనకాల ప్రాంతం. ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో జేసీబీ ఏర్పాటు చేసి మట్టిని ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. సెలవు రోజు కావడంతో అడిగేవారు లేరని జేసీబీతో మట్టిని, మొరం పది ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. ఇలా రోజంతా మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.’ -
గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యం
● చొప్పదండి ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యంబోయినపల్లి(చొప్పదండి): గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. మండలంలోని కోరెం కొండపోచమ్మ ఆలయం వద్దకు రూ.50 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, ఆలయం వరకు 21 స్తంభాలు అమర్చిన సింగిల్ఫేజ్ విద్యుత్ పనులను, కొదురుపాకలో పలు అభివృద్ధి పనులను ఆదివారం ప్రారంభించారు. కొండపోచమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అంగన్వాడీలకు సెల్ఫోన్లు పంపిణీ చేశారు. పీఆర్ డీఈ విష్ణువర్ధన్, ఎంపీడీవో జయశీల, సెస్ ఏఈ ప్రశాంత్, పీఆర్ ఏఈ సాయితేజ, జోగినపల్లి వెంకట్రామారావు, ముదుగంటి సురేందర్రెడ్డి, బీసీ సెల్ అధ్యక్షుడు కూస రవీందర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టెపెల్లి సుధాకర్, ఏఎంసీ చైర్మన్ ఎల్లేశ్యాదవ్ పాల్గొన్నారు. -
పకడ్బందీగా జనగణన చేయాలి
● జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి పీబీ శ్రీనివాసాచారి సిరిసిల్ల: పకడ్బందీగా జనగణన పూర్తి చేయాలని జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి పి.బి.శ్రీనివాసాచారి కోరారు. హౌస్లిస్టింగ్ బ్లాక్స్, సెన్సస్ మానిటరింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ డిజిటల్ విధానం, స్వీయగణనపై సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లకు సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలు, గంభీరావుపేట, తంగళ్లపల్లి, కోనరావుపేట, వేములవాడరూరల్ మండలాల్లో ఆదివారం శిక్షణ ఇచ్చారు. వేసవి నేపథ్యంలో ఇన్చార్జ్ అధికారులు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్ల ఆధ్వర్యంలో శిక్షణకు హాజరయ్యే వారికి భోజనం, ఇతర వసతులు సరైన విధంగా కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. మొదటి దశలో మే 11 నుంచి జూన్ 9 వరకు ఇండ్ల గణన నిర్వహిస్తారని, రెండో దశ ఫిబ్రవరి 2027లో వ్యక్తుల వారీగా సమాచారం సేకరిస్తారని తెలిపారు. శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని బాధ్యతల నిర్వహణ ఎంతో కీలకమని శ్రీనివాసాచారి స్పష్టం చేశారు. జనగణన జిల్లా ఇన్చార్జి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
హిందూ ధర్మ రక్షణకు నడుం బిగిద్దాం
● విష్ణు సేవ నందగిరిస్వామీజీ ఇల్లంతకుంట(మానకొండూర్): హిందూ ధర్మ రక్షణకు హిందువులు నడుం బిగించాలని నందగిరి స్వామీజీ కోరారు. మండలంలోని గాలిపెల్లి వేణుగోపాలస్వామి ఆలయ ఆవరణలో ఆదివారం నిర్వహించిన హిందూ సమ్మేళనంలో మాట్లాడారు. హిందుత్వం మానవాళి హితం కోరే ధర్మమన్నారు. మతం వేరు ధర్మం వేరు అని పేర్కొన్నార. హిందువులు సమైక్యంగా కలిసి జీవించాలని సూచించారు. ఆర్ఎస్ఎస్ విభాగ్ బౌద్ధిక్ ప్రముఖ సామల కిరణ్ మాట్లాడుతూ హిందువులు స్వాభిమానం దేశభక్తి, సేవాభావం పెంపొందించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. హిందూ సమ్మేళన నిర్వహణ సమితి అధ్యక్షుడు మల్లుగారి దేవేందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్, కోశాధికారి అయ్యన్నగారి హరికృష్ణరెడ్డి, సర్పంచులు బద్దం శేఖర్రెడ్డి, శంకరమ్మ, సింగిరెడ్డి రచన, సభ్యులు బాలనాగాచారి, వంశీ, బత్తిని ఆంజనేయులు, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘మహిళాబిల్లుకు డీలిమిటేషన్ ముసుగు ఎందుకు? ’ సిరిసిల్లటౌన్: మహిళా బిల్లు ముసుగులో కేంద్రం ప్రభుత్వం డీలిమిటేషన్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో ప్రజలకు వివరించాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సిరిసిల్లలోని డీసీసీ ఆఫీసులో ఆదివారం ప్రెస్మీట్లో మాట్లాడారు. 2023లో పాసైన మహిళా బిల్లును యథాతథంగా ఎందుకు ప్రవేశపెట్టలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఫ్లోర్లీడర్ ఆడెపు చంద్రకళ, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు, కౌన్సిలర్లు వెంగల లీల, లాయక్ సుల్తాన, బొద్దుల శ్రీనివాస్, కూరపాటి శ్రీశైలం, నాయకులు చొక్కాల రాము, రాగుల జగన్, వెంగల లక్ష్మినర్సయ్య, కంసాల మల్లేశం, ఆడెపు భాను పాల్గొన్నారు. సీఎం సభను విజయవంతం చేయండి ఇల్లంతకుంట(మానకొండూర్): మంథని నియోజకవర్గంలోని కాటారంలో సోమవారం నిర్వహించే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సభను విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ కోరారు. మండలంలోని ముస్కానిపేటలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూజలు చేసి మాట్లాడారు. సీఎం సభకు జిల్లా నుంచి అధిక సంఖ్యలో తరలిరా వాలని కోరారు. పార్టీ మండల అధ్యక్షుడు భా స్కర్రెడ్డి, నాయకులు అంతగిరి వినయ్కుమార్, జుట్టు శేఖర్, సూర దేవరాజు, చింతలపల్లి ర వీందర్రెడ్డి, కాసుపాక రమేశ్, భూపతిరెడ్డి, మల్లారెడ్డి, వంశీ, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. హామీలు నెరవేర్చాలి సిరిసిల్లటౌన్: ఎన్నికల మేనిఫెస్టో ద్వారా ఆర్టీసీ సిబ్బందికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని జేఏసీ చైర్మన్ బానయ్య కోరారు. రాష్ట్ర కమిటీ సమ్మెమ సన్నాహక పిలుపులో భాగంగా ఆదివారం సిరిసిల్ల డిపో ఎదుట గేట్ ధర్నా నిర్వహించి మాట్లాడారు. ఆర్టీసిని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. జేఏసీ వైస్చైర్మన్లు జె.ఎస్.ఎన్.రావు, బి.శ్రీనివాస్, కన్వీనర్ రమేశ్, గ్యారేజ్ కో–కన్వీనర్ మల్లేశం, నాగసాగర్, భూమయ్య, మల్లయ్య, సత్తయ్య, భిక్షపతి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఘనంగా గైడ్స్ దీక్షా స్వీకారోత్సవం తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని నేరెళ్లలోని తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకుల బాలికల విద్యాలయంలో ఆదివారం స్కౌట్స్ అండ్ గైడ్స్ దీక్షా స్వీకారోత్సవం నిర్వహించారు. పాఠశాలకు చెందిన 32 మంది గైడ్స్ విద్యార్థినులకు అధికారికంగా గైడ్స్ దుస్తులను(యూనిఫాం) పంపిణీ చేశారు. అనంతరం గైడ్స్ ప్రమాణ స్వీకారం చేసి దీక్షను స్వీకరించారు. జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ సెక్రటరీ రాజా భానుప్రకాశ్, మండల విద్యాధికారి భూక్య రాజు, పాఠశాల ప్రిన్సిపాల్ జి.రాధ, సర్పంచ్ పొన్నం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ
● గులాబీమయంగా మారిన జగిత్యాల జగిత్యాలటౌన్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి హాజరుకానున్న ప్రజా ఆశీర్వాద సభకు జగిత్యాలలోని వివేకానంద మినీ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు, హోర్డింగులతో పట్టణం గులాబీమయంగా మారింది. సభావేదికపై కేసీఆర్ సమక్షంలో మాజీ మంత్రి జీవన్రెడ్డి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. కేసీఆర్ హాజరుకానున్న నేపథ్యంలో సభను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేశారు. మాజీ మంత్రులు హరీశ్రావు, కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, సభ ఇన్చార్జి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ రమణ, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు, దావ వసంత తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. జీవన్రెడ్డి ఫ్లెక్సీ చించివేత.. అనుచరుల నిరసన మరికొన్ని గంటల్లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ జరగనున్న నేపథ్యంలో కేసీఆర్, జీవన్రెడ్డి కలిసి ఉన్న ఫ్లెక్సీలో జీవన్రెడ్డి ఫొటోను గుర్తు తెలియని వ్యక్తులు చించివేయడం కలకలం రేపింది. సభ విజయవంతం కోసం బీఆర్ఎస్ నాయకులు, జీవన్రెడ్డి అనుచరులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నా రు. ఇందులో భాగంగా పాత బస్టాండ్ చౌరస్తాలో కేసీఆర్, జీవన్రెడ్డి ఉన్న ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం జీవన్రెడ్డి ఫొటోను మాత్రమే చించివేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జీవన్రెడ్డి అనుచరులు, బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. మరోవైపు ప్రజాఆశీర్వాద సభ కోసం మినీస్టేడియం గోడలు కూల్చివేయడం చర్చనీయాంశమైంది. -
మహిళలే బుద్ధి చెప్తారు
సిరిసిల్లటౌన్: పార్లమెంటులో రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన విపక్షాలకు మహిళలే బుద్ధి చెబుతారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పేర్కొన్నారు. సిరిసిల్లలోని తన నివాసంలో ఆదివారం ప్రెస్మీట్లో మాట్లాడారు. దేశవ్యాప్తంగా మహిళలు 33 శాతం రిజర్వేషన్ల కోసం ఎదురుచూస్తుంటే, పార్లమెంటులో ఈ బిల్లు ప్రవేశపెట్టిన తరుణంలో కాంగ్రెస్, బీఆర్ఎస్లు వ్యవహరించిన తీరు శోచనీయమన్నారు. కాంగ్రెస్ పార్టీకి మహిళా సాధికారతపై చిత్తశుద్ధి లేదన్నారు. అటు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, ఇటు కాంగ్రెస్ ప్రతినిధి ఆది శ్రీనివాస్ ఇద్దరూ మహిళా బిల్లు విషయంలో తమ స్వార్థ రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా భారతీయ జనతా పార్టీ మహిళా బిల్లును విడిచిపెట్టబోదని, 33 శాతం రిజర్వేషన్ల ప్రక్రియను ఖచ్చితంగా పూర్తి చేస్తుందని స్పష్టం చేశారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షురాలు బర్కం లక్ష్మీనవీన్యాదవ్, మున్సిపల్ కౌన్సిలర్లు కొండ వర్షిని, మేర్గు మంజుల, ఊరగొండ లక్ష్మి, వేమనపల్లి శోభ, గుర్రం అనసూర్య, వేముల వైశాలి, రామలింగారెడ్డి, భాగయ్య, వంతడుపుల సుధాకర్ పాల్గొన్నారు. -
కొనుగోళ్లు ప్రారంభించేదెప్పుడో?
వేములవాడ/వేములవాడరూరల్/ఇల్లంతకుంట: జిల్లాలో వరికోతలు మొదలయ్యాయి. కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యాన్ని తీసుకొచ్చి ఆరబోస్తున్నారు. పది రోజుల క్రితమే వరికోతలు మొదలుకావడంతో కేంద్రాల్లో కుప్పలుగా పేరుకుపోతున్నాయి. తేమశాతం వచ్చిన రైతులు నిత్యం ధాన్యం కుప్పల వద్దనే కాపలా ఉంటున్నారు. వేములవాడరూరల్ మండలం బాలానగర్ కొనుగోలు కేంద్రంలో భారీగా వడ్లకుప్పలు పేరుకుపోయాయి. ఇల్లంతకుంట మండలంలోని పెద్దలింగాపూర్లో దళారులు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం స్పందించడం లేదు. భయపెట్టిస్తున్న మొగులుఇప్పటికే పంట కోసిన రైతులు, పొలంలోనే ఉన్న రైతులు ఆకాశాన్ని చూసి భయాందోళన చెందుతున్నారు. ధాన్యం కుప్పలు తడువకుండా ఎలా కాపాడుకోవాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. పొలంలోని పంట వడగండ్ల వానకు నేలరాలిపోతుందనే ఆందోళన మరికొందరిలో ఉంది. దళారుల ప్రవేశం ఇల్లంతకుంట మండలంలోని చాలా గ్రామాల్లో దళారులు పొలాల వద్దకే వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ప్రధానంగా పెద్దలింగాపూర్లో రైతువేదిక వద్ద ఉన్న కొనుగోలు కేంద్రంలో తగినంత స్థలం లేకపోవడంతో రైతులు దళారులకు అమ్ముకుంటున్నారు. రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్న ప్రైవేట్ వ్యాపారులు క్వింటాలుకు రూ.1,750 మాత్రమే చెల్లిస్తున్నారు. -
రామాజిపేటలో డీఎస్పీ విచారణ
ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని రామాజీపేటలో డీఎస్పీ నాగేంద్రచారి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా శనివారం విచారణ చేపట్టారు. గ్రామానికి చెందిన దళితుడు శ్రావణపల్లి నాంపల్లి భూమిని ఆక్రమించి కొనుగోలు కేంద్రంగా ఉపయోగిస్తున్నారని బాధితుడు ఫిర్యాదు చేసి నట్లు ఎస్సై అశోక్ తెలిపారు. ఈమేరకు సర్పంచ్ చొప్పరి భూమయ్యతోపాటు ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైనట్లు వివరించారు. జిల్లా స్థాయి కేసీఆర్ కప్ క్రికెట్ పోటీలు ప్రారంభంసిరిసిల్ల అర్బన్: జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న కేసీఆర్ కప్ జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. ఇల్లంతకుంట సూపర్ కింగ్స్(ముస్కానిపేట), రుద్రంగి రెబల్స్(మానాల) మధ్య జరిగిన మొదటి మ్యాచ్ను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి ప్రారంభించారు. గూడూరి ప్రవీణ్, కొండూరి సాకేత్రావు, మ్యాన రవి, కుంభాల మల్లారెడ్డి, బాలమల్లు, శ్రీనివాస్ పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించండిసిరిసిల్ల ఎడ్యుకేషన్: జిల్లాలోని ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా విద్యాధికారి జగన్మోహన్రెడ్డిని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం కోరారు. ప్రధానంగా గతేడాది వేసవిలో ఎఫ్ఎల్ఎన్ శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, ఆర్పీలకు ఈఎల్స్ మంజూరు, ప్రమోషన్ పొందిన ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయాలని కోరారు. రెండేళ్లుగా సర్దుబాటు చేసిన ఉపాధ్యాయులను ఈనెల 23న పాత పాఠశాలలకు పంపించాలన్న అంశాలను డీఈవో దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాలపై స్పందించిన డీఈవో త్వరలోనే కలెక్టర్ను కలిసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సంఘం నాయకులు తెలిపారు. -
శనివారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీని వివాదాలు ఇప్పట్లో వీడేలా లేవు. తాజాగా వెలువడిన కొత్త పాలకమండలి సభ్యుల విషయం యూనివర్సిటీలో చర్చనీయాంశంగా మారింది. అర్హతలు లేని వారికి పాలకమండలిలో చోటు కల్పించారని, అర్హత ఉన్నవారిని పక్కన బెట్టారన్న వాదనలు వర్సిటీలోని ప్రతీ విభాగంలో మార్మోగుతున్నాయి. తాజాగా వెలువడిన పాలకమండలిలో సీనియర్ ప్రొఫెసర్ స్థానంలో అసోసియేట్ ప్రొఫెసర్కు చోటు కల్పించారు. యూనివర్సిటీలో ప్రస్తుతం ఇద్దరే ప్రొఫెసర్లు ఉన్నారు. అందులో ఒకరు వరప్రసాద్, మరొకరు సూరేపల్లి సుజాత. ఇటీవల సుజాతకు ఇప్పటికే నాలుగు పదవుల్లో కోతపెట్టిన వీసీ ఉమేశ్ కుమార్ ఈసారి పాలకమండలిలో చోటు ఇవ్వకపోగా వారి కన్నా జూనియర్, అసోసియేట్ ప్రొఫెసర్ అయిన జాఫర్ జారీకి చోటు కల్పించడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఆయనకు ఇంకా ప్రొఫెసర్ హోదా రాలేదు. అయినా ఉన్నత విద్యామండలికి ఆయన్ను సీనియర్ ప్రొఫెసర్గా చూపించడం విడ్డూరంగా ఉందని వర్సిటీ సిబ్బందే వాపోతున్నారు. ఇప్పటికీ శాతవాహన యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్లోనూ మహమ్మద్ జాఫర్ అసోసియేట్ ప్రొఫెసర్ అనే పేర్కొనడం గమనార్హం. ఎస్ఆర్ఆర్ కాలేజీకి దక్కని ప్రాధాన్యం ఉమ్మడి జిల్లాలోనే కాదు.. ఉత్తర తెలంగాణలోనే శ్రీ రాజరాజేశ్వర కాలేజీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్రస్తుతం హాస్టల్ సదుపాయంతో అటామనస్ హోదా కలిగి ఉంది. అలాంటి ఈ కళాశాలకు ఈసారి పాలకమండలిలో సభ్యత్వం దక్కకపోవడం హాట్ టాపిక్గామారింది. గత వీసీ మల్లేశం ఉన్న సమయంలో 2024 మార్చిలో పాలకమండలిని ప్రతిపాదించినా అది అమలులోకి రాలేదు. ఆ జాబితాలో ఎస్ఆర్ఆర్ కాలేజీతోపాటు, ప్రొఫెసర్ సూరేపల్లి సుజాతకు చోటు దక్కడం విశేషం. అదే జాబితాలో తాజా ఈసీ జాబితాలో ప్రొఫెసర్గా చూపించిన మహమ్మద్ జాఫర్ని అసోసియేట్ ప్రొఫెసర్గా పేర్కొనడం గమనార్హం. మొత్తానికి తాజా జాబితాలో సభ్యుల ఎంపిక, చూపించిన సమాచారంలో లోపాలపై ఇటు విద్యార్థులు, అటు వర్సిటీ సిబ్బంది మండిపడుతున్నారు. బెయిల్ రద్దుకు న్యాయపోరాటం ఇటీవల తమ వర్సిటీలో దళిత ప్రొఫెసర్లు, విద్యార్థులను అర్బన్ నక్సలైట్లంటూ ప్రచారం చేస్తున్న ఓ పార్ట్టైం ఫ్యాకల్టీ బెయిల్ రద్దుకు న్యాయపోరాటానికి దిగుతున్నామని శాతవాహన విద్యార్థి సంఘాల జేఏసీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. గతంలో శాతవాహన వైస్ చాన్స్లర్గా పనిచేసిన ప్రొఫెసర్ మల్లేశంను కూడా ఇదే తరహాలో సోషల్ మీడియాలో కించపరిచిన కేసులో ఆ ఫాకల్టీపై అట్రాసిటీ కేసు నమోదైందని గుర్తుచేశారు. ఇదేకాకుండ పలు కేసుల్లో రిమాండ్ ఖైదీగా జైలు జీవితం గడిపి.. ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నాడని పేర్కొన్నారు. వర్సిటీలో అశాంతి.. ఆందోళనలకు కారణం అవుతున్న సదరు ఫాకల్టీ బెయిల్ రద్దుకు తాము కోర్టును ఆశ్రయిస్తామని వెల్లడించారు. బ్యాంకులను మోసం చేసిన వ్యక్తికి మా వర్సిటీలో స్థానం లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో విద్యార్థులు కరికె మహేశ్, శివాజీ, లక్ష్మణ్, సాయి, ప్రవీణ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ‘కవర్లు’ సిద్ధం చేసుకోండి!కొత్త మండలిపై దుమారంవీసీతో ఎమ్మార్పీఎస్ నేతల సమావేశం జిల్లా ఎమ్మార్పీఎస్ నేతలు వీసీ ఉమేశ్కుమార్ను ఆయన ఛాంబర్లో శుక్రవారం కలిశారు. యూనివర్సిటీలో ప్రొఫెసర్ సూరేపల్లి సుజా తను అర్బన్ నక్సలైట్గా చిత్రీకరించడం, ఆమెకు ఉన్న పదవులను వరుసగా తొలగించడంపై వీసీతో ఆరా తీశారు. సుజాత విషయంలో ఎ లాంటి కక్షసాధింపు చర్యలు లేవని, వీసీ వారికి వివరణ ఇచ్చినట్లు తెలిసింది. అనంతరం ఎమ్మార్పీఎస్ నేతలు ప్రొఫెసర్ సుజాతను కలిసి సంఘీభావం తెలిపారు. దళితులపై అకారణంగా దు ష్ప్రచారానికి దిగితే.. ఉద్యమిస్తామని స్పష్టంచేశారు. జిల్లా అధ్యక్షులు అనిల్, రేణుకుంట్ల సాగర్, తునికి వసంత్, చెంచాల నవీన్ పాల్గొన్నారు. -
ఊరూ.. వాడ.. క్రికెట్ ఫీవర్
సిరిసిల్ల: ఫోర్..సిక్సర్..వికెట్..ఔట్.. అనే మాటలతో జిల్లా మారుమోగుతోంది. పొద్దంతా మైదానాల్లో కేసీఆర్ క్రికెట్ పోటీలు.. రాత్రయితే టీవీల్లో ఐపీఎల్ వీక్షణతో జిల్లా యువకుల్లో క్రికెట్ జోష్ నిండింది. దేశవ్యాప్తంగా ఐపీఎల్ సీజన్ ప్రారంభంకావడం.. పది, ఇంటర్ పరీక్షలు ముగియడం.. ఎండాకాలం షురూ కావడం.. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మాజీ సీఎం కేసీఆర్ పేరుతో ఈనెల 10న క్రికెట్ పోటీలు ప్రారంభించారు. ఎండలను సైతం లెక్కచేయకుండా యువకులు కేసీఆర్ క్రికెట్ పోటీల్లో పాల్గొంటున్నారు. యువతను క్రీడల వైపు మళ్లించడమే లక్ష్యంగా ఈ పోటీలు సాగుతున్నాయి. ఈనెల 25 వరకు సాగే క్రికెట్ పోటీలను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు పర్యవేక్షిస్తున్నారు. -
రాత్రంతా కరెంట్ కట్!
● నిద్ర లేక ప్రజల ఇబ్బందులు ● తెగిన లైన్ కోసం చీకట్లో వెతుకులాటబోయినపల్లి(చొప్పదండి): మండల కేంద్రంలో గురువారం రాత్రి విద్యుత్తీగలు తెగిపోయి కరెంట్ సరఫరా నిలిచిపోయింది. అర్ధరాత్రి 12:30 గంటల ప్రాంతంలో కరెంట్ పోయింది. సరిగ్గా నిద్రలోకి జారుకునే సమయంలో విద్యుత్ పోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. తెగిన విద్యుత్లైన్ కోసం గ్రామ యువకులు, విద్యుత్ సిబ్బంది రాత్రంతా వెతికారు. కరెంట్ లేక ఉక్కపోత, దోమలబెడత భరించలేక ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. వాట్సాప్ గ్రూప్ల్లో కరెంట్ ఎప్పుడు వస్తుంది.. ఎండాకాలంలో ఇలా అయితే చినుకులు పడితే కరెంట్ ఉంటుందా? అని వాపోయారు. కొద్ది రోజులుగా బోయినపల్లిలో కరెంట్పోవడం కామన్గా మారింది. గ్రామ యువకులు, విద్యుత్ సిబ్బంది రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు తెగిన విద్యుత్లైన్ కోసం వెతకగా ఉదయం 4:50 గంటల సమయంలో లైన్ ఎక్కడ తెగిందో తెలిసింది. లైన్ తెగిన చోటులో గుర్తించి సరిచేయడంతో శుక్రవారం తెల్లవారుజామున కరెంట్ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
ఉద్యోగుల నిరసన ప్రదర్శన
● పెండింగ్ బిల్లుల కోసం జేఏసీ నిరసన సిరిసిల్ల: జిల్లా ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో శుక్రవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. జిల్లా ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఎలుసాని ప్రవీణ్, కో చైర్మన్ సమరసేన్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. ఉద్యోగులకు రావలసిన పెండింగ్ బిల్లులు, పీఆర్సీ, ఈహెచ్ఎస్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. జిల్లా పరిశీలకులుగా వచ్చిన రాష్ట్ర లెక్చరర్ల ఫోరం అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులకు ఇవ్వాల్సిన రెండో పీఆర్సీని వెంటనే అమలు చేయాలని కోరారు. రిటైర్డ్ ఉద్యోగులకు రావలసిన అన్ని రకాల బెనిఫిట్స్ను మంజూరు చేయాలన్నారు. ఉద్యోగుల హెల్త్కార్డులను వెంటనే పూర్తి చేయాలని, సీపీఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసీ, ఓపీఎస్ విధానం అమలు చేయాలన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను నెరవేర్చాలని కోరారు. టీఎన్జీవో జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల సుదర్శన్, జిల్లా టీజీవో కార్యదర్శి సయ్యద్ జబి, శ్రీకాంత్, రియాజ్పాషా, సాగర్ పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్కు ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు వినతిపత్రం అందించారు. -
వేసవి జాగ్రత్తలు తెలపాలి
● కలెక్టర్ గరీమా అగ్రవాల్ సిరిసిల్ల: ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆస్పత్రికి వచ్చే రోగులకు, ప్రజలకు వివరించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్నగర్ అర్బన్ ఆరోగ్య వైద్యకేంద్రాన్ని కలెక్టర్ శుక్రవారం తనిఖీ చేశారు. ముందుగా ల్యాబ్, ఇన్పేషెంట్ వార్డ్, వ్యాక్సిన్లు, ఓపీ రిజిస్టర్ పరి శీలించారు. సిబ్బంది హాజరు రిజిస్టర్ తనిఖీ చేశారు. పలువురు పేషెంట్లతో కలెక్టర్ నేరుగా మాట్లాడారు. ఆస్పత్రి వచ్చే వారికి అవసరమైన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆరోగ్య కేంద్రం డాక్టర్ రేణుక, వైద్య సిబ్బంది ఉన్నారు. తరచూ రక్తస్రావమైతే పరీక్షలు చేయించుకోవాలిసిరిసిల్ల: తరచూ రక్తస్రావమైతే వెంటనే డాక్టర్ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వద్ద శుక్రవారం ప్రపంచ హీమోపిలియా దినోత్సవం సందర్భంగా వైద్యాధికారులు, సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. రజిత మాట్లాడుతూ హీమోపిలియా అనే వ్యాధితో రక్తం గడ్డకట్టే అవకాశం లేకపోవడంతో రక్తస్రావమవుతుందన్నారు. గర్భధారణ సమయంలో సరైన పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా ఆస్పత్రి నుంచి గాంధీచౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. వైద్యాధికారులు రేఖ, సాహితీ, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. పోటీలతో క్రీడా నైపుణ్యాలు వెలికితీత సిరిసిల్ల అర్బన్: యువతలో క్రీడా నైపుణ్యాలు వెలికితీసేందుకు క్రికెట్ పోటీలు దోహదపడతాయని సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి పేర్కొన్నారు. కేసీఆర్ కప్ క్రికెట్ పోటీల ముగింపు సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. గ్రామీణ, పట్టణ స్థాయి నుంచి జాతీయస్థాయి క్రికెట్ పోటీల్లో యువత పాల్గొనేలా ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ కప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో విన్నర్గా నిలిచిన సిరిసిల్ల డాల్ఫిన్స్కు కేసీఆర్ కప్తోపాటు రూ.50వేలు నగదు, రన్నరప్గా నిలిచిన సిరిసిల్ల విక్టర్ టీమ్కు కప్తోపాటు, రూ.20వేలు నగదు అందజేశారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, రాష్ట్ర నాయకులు గూడూరి ప్రవీణ్, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, 29వ వార్డు కౌన్సిలర్ గెంట్యాల శ్యామలశ్రీనివాస్ పాల్గొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి సిరిసిల్లటౌన్/వేములవాడఅర్బన్: టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. సమ్మె సన్నాహక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సిరిసిల్ల, వేములవాడ డిపోల ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో గ్యారేజ్ యూనిట్ ప్రతినిధులు నిరసన చేపట్టారు. ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ జాతీయం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర కార్యదర్శి జీపీసింగ్, సిరిసిల్ల డిపో జేఏసీ గ్యారేజ్ కమిటీ కన్వీనర్లు టీవీసీ రావు, శేఖర్రావు, కో–కన్వీనర్లు సంతోష్, రవి, జాహిద్ హుస్సేన్, కొమురయ్య, ఆంజనేయులు, వేములవాడలో జేఎసీ నాయకులు స్వర్ణలత, లక్ష్మన్, శ్రీకాంత్, కాళిదాసు పాల్గొన్నారు. -
రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలి
● ప్రమాదాల నివారణ అందరి బాధ్యత ● ఐజీపీ రమేశ్నాయుడుసిరిసిల్ల క్రైం: వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలు నివారించవచ్చని ఐజీపీ రమేశ్నాయుడు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ కన్వెన్షన్ హాల్లో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా పోలీస్, రవాణాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల సమయంలో ముందుగా స్పందించి ప్రాణాలు కాపాడేది డ్రైవర్లేనన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ఓవర్స్పీడ్, తప్పుగా ఓవర్టేకింగ్ చేయడం ప్రమాదకరమన్నారు. రాష్ట్రంలో రోజుకు 70 ప్రమాదాలు నమోదవుతున్నాయని, వాటిలో 20 వరకు మరణాలు సంభవిస్తున్నాయని వెల్లడించారు. హెల్మెట్, సీట్బెల్ట్ వినియోగించడం సురక్షితమని తెలిపారు. ‘రహావీర్’ పథకం కింద ప్రమాదం జరిగిన గంటలోపు బాధితులను ఆస్పత్రికి తరలిస్తే రూ.1.50 లక్షల వరకు చికిత్స సహాయం అందిస్తారని, సహాయం చేసిన వారికి రూ.25 వేల ప్రోత్సాహకం ఇస్తారని వివరించారు. కలెక్టర్ గరీమా అగ్రవాల్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలతో కుటుంబాలు నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో బ్లాక్స్పాట్ల గుర్తింపు, సైన్బోర్డుల ఏర్పాటు వంటి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్కూల్ వాహనాల్లో పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించవద్దని హెచ్చరించారు. ఎస్పీ మహేశ్ బీ గీతే మాట్లాడుతూ డ్రంకెన్డ్రైవ్ ప్రమాదాలకు ప్రధాన కారణమన్నారు. మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అనంతరం డ్రైవర్లతో రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడంతోపాటు సీపీఆర్ (ప్రథమ చికిత్స)పై అవగాహన కల్పించారు. అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు, రవాణాశాఖ అధికారి లక్ష్మణ్, డీఎంహెచ్వో రజిత తదితరులు పాల్గొన్నారు. -
క్రీడాస్ఫూర్తిని నింపేందుకు..
యువకుల్లో క్రీడాస్ఫూర్తిని నింపేందుకు తెలంగాణ సాధకులు, రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ పేరిట క్రికెట్ పోటీలను ఏర్పాటు చేశాం. అన్ని మండలాల్లోనూ ఉత్సాహంగా పోటీలు సాగుతున్నాయి. అన్ని స్థాయిల్లోనూ యువకులు తమ క్రీడా నైపుణ్యాన్ని చాటుతున్నారు. అన్ని ప్రాంతాల నుంచి క్రికెట్ పోటీలకు మంచి స్పందన వస్తుంది. యువతలో క్రీడాసక్తి పెరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆలోచనకు అనుగుణంగా క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. – తోట ఆగయ్య, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు -
ఎండలోనూ ఉత్సాహంగా..
ఎండలు మండుతున్నా యువకులు ఉత్సాహంగా క్రికెట్ పోటీల్లో పాల్గొంటున్నారు. ఉదయం, సాయంత్రం ఎండ తక్కువగా ఉన్నప్పుడే పోటీలు నిర్వహిస్తున్నాం. సిరిసిల్లలో క్రికెట్ పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉంది. ఆటగాళ్లు తమ క్రీడానైపుణ్యాన్ని అద్భుతంగా ప్రదర్శిస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ పేరిట క్రికెట్ పోటీల నిర్వహణతో యువకులతో మేం మమేకమయ్యాం. ఇది మంచి పరిణామం. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో అన్ని వార్డుల్లోనూ క్రికెట్ పోటీల్లో పాల్గొంటున్నారు. – జిందం చక్రపాణి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు -
పోలీసులకు కూలింగ్ గ్లాసెస్
సిరిసిల్ల క్రైం: పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని పోలీస్ సిబ్బంది ఆరోగ్య రక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందికి గురువారం కూలింగ్ గ్లాసెస్ అందజేశారు. తీవ్ర ఎండల సమయంలో విధులు నిర్వహించే సిబ్బంది తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ట్రాఫిక్ సిబ్బంది, బ్లూ కోల్ట్స్్, పెట్రోకార్ సిబ్బంది, బందోబస్తు విధుల్లో పాల్గొనే వారు తరచూ నీరు, గ్లూకోజ్ తీసుకోవాలని సూచించారు. హెల్మెట్, సీట్బెల్ట్ వినియోగం, ర్యాష్డ్రైవింగ్, మద్యం సేవించి వాహనం నడపడం, మైనర్ డ్రైవింగ్ వంటి అంశాలపై ప్రజల్లో చైతన్యం కల్పించాలని ఆదేశించారు. ట్రాఫిక్ ఆర్ఐ సురేశ్, ఆర్ఎస్సైలు రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాసంక్షేమమే ధ్యేయం
● అదనపు కలెక్టర్ నగేశ్ చందుర్తి(వేములవాడ): ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మండల సభలు నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ నగేశ్ పేర్కొన్నారు. చందుర్తిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో భాగంగా గురువారం నిర్వహించిన మండల సభకు అదనపు కలెక్టర్ నగేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నగేశ్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ, అర్హులకు చేరువ చేయడమే ఈ సభల ముఖ్య ఉద్దేశ్యమన్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం అందజేస్తున్న ప్యూరిఫయర్ వాటర్ ఫిల్టర్స్ను పంపిణీ చేశారు. మండల ప్రత్యేకాధికారి, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి రవీందర్రెడ్డి, ఎంపీడీవో రాధ, తహసీల్దార్ భూపతి, ఎంపీవో ప్రదీప్, వ్యవసాయాధికారి దుర్గారాజు, స్థానిక సర్పంచ్ పులి సత్తయ్య, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు బొజ్జ మల్లేశం, ఐసీడీఎస్ సూపర్వైజర్ శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం సేకరణకు సిద్ధం
ముస్తాబాద్(సిరిసిల్ల): వరికోతలు మొదలయ్యాయి. అన్నదాతలు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం.. కొనుగోలు కేంద్రాలకు చేరుతోంది. ప్రభుత్వం సైతం ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేస్తోంది. రైతులు ఇబ్బంది పడకుండా ధాన్యం సేకరణ సాఫీగా సాగేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 231 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే సిబ్బందికి శిక్షణ పూర్తయింది. 3 లక్షల టన్నులు లక్ష్యం జిల్లాలో లక్షన్నర ఎకరాలలో ఈ యాసంగిలో వరిపంటను సాగుచేశారు. అందుకు అనుగుణంగా 3లక్షల టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఇందులో 133 ఐకేపీ కొనుగోలు కేంద్రాలు, పీఏసీఎస్ 96, మెప్మా 1, డీసీఎంఎస్ 1 కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. కలెక్టర్ గరీమా అగ్రవాల్, జిల్లా పౌరసరఫరా అధికారులు ధాన్యం సేకరించే సిబ్బందికి ఒక రోజు శిక్షణ ఇచ్చారు. కేంద్రాల్లో ఏర్పాట్లు ఐకేపీ, ప్యాక్స్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు కల్పిస్తున్నామని అధికారులు ప్రకటించారు. ముఖ్యంగా మండుటెండల నుంచి రక్షణకు తాగునీరు. టెంట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నారు. తూకం వేసే యంత్రాలు, తేమశాతం పరీక్షించే యంత్రాలను సరఫరా చేశారు. టార్పాలిన్లు, గన్నీబ్యాగులను సిద్ధం చేశారు. ఏఈవో ధ్రువీకరించిన అనంతరం సిబ్బంది ధాన్యం తూకం వేస్తారు. ఎప్పటికప్పుడు రైతుల ధాన్యాన్ని ఆన్లైన్లో నమోదు చేస్తారు. రైస్మిల్లర్లు, ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్ల ఫోన్ నంబర్లను కేంద్రాలలో అందుబాటులో ఉంచుతున్నారు. హమాలీల కొరత లేకుండా సమన్వయం చేస్తున్నారు. రైతులకు క్వింటాలు ఏ–గ్రేడు రకం ధాన్యానికి రూ.2,389, బీ–గ్రేడు రకానికి రూ.2,369 ఇస్తున్నారు. ఆవునూర్లో వరికోతలు జిల్లాలో తొలుత ధాన్యం కోతలు ఆవునూర్లో మొదలు పెడతారు. ఇక్కడి రైతులు నెలరోజుల ముందుగానే పంటలు సాగుచేస్తారు. దీంతో అధికారులు జిల్లాలో మొదట ఆవునూర్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నారు. ఏ సీజన్లోనైనా ఆవునూర్తోపాటు గూడెంలో వరికోతలు ముందుగా మొదలు పెడతున్నారు. జిల్లాలో ధాన్యం సేకరణ కు అన్ని ఏర్పాట్లు చేశాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతులు కల్పిస్తున్నాం. వారం రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాం. మిల్లర్లు, ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్లు ప్రణాళిక మేరకు సేకరణలో భాగాస్వాములు కావాలి. తాగునీటి వసతి, ఓఆర్ఎస్, టెంట్లు ఏర్పాటు చేస్తాం. – బుచ్చిబాబు, డీఎస్వో -
వాహనదారులు సీటు బెల్ట్ ధరించాలి
సిరిసిల్ల అర్బన్: వాహనదారులు సీటుబెల్ట్ ధరించాలని జిల్లా రవాణాశాఖ అధికారి లక్ష్మణ్ కోరారు. ‘అరైవ్–అలైవ్’లో భాగంగా కలెక్టరేట్ చౌరస్తాలో సీటుబెల్ట్ వినియోగంపై గురువారం అవగాహన కల్పించారు. డ్రైవర్తోపాటు వాహనంలో ప్రయాణిస్తున్న వారు కూడా తప్పనిసరిగా సీటుబెల్టు ధరించాలని సూచించారు. సీఐ శ్రీనివాస్, మోటారు వాహనాల తనిఖీ అధికారి పృథ్వీరాజ్వర్మ తదితరులు పాల్గొన్నారు. ముస్తాబాద్(సిరిసిల్ల): మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక ప్రత్యేక సమీక్ష సమావేశం రసాభాసగా మారింది. ప్రభుత్వ పథకాల్లో ప్రజల భాగస్వామ్యం పెంపు, పథకాలపై చర్చ సాగుతుండగా ముస్తాబాద్ సర్పంచ్ మట్ట వెంకటేశ్వర్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాల్రెడ్డి మాట్లాడుతుండగా అప్పుడే సభలోకి వచ్చిన సర్పంచ్ వెంకట్రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై బాల్రెడ్డి పథకాలను ప్రజలకు వివరిస్తున్నానని కూర్చోవాలని స్పష్టం చేశారు. అనంతరం జరిగిన సమీక్షలో వెంకటేశ్వర్రెడ్డి మాట్లాడుతూ కొందరు ఎన్నికల్లో లక్షలు ఖర్చు చేసిన గెలవలేదని, ఏమి ఖర్చు చేయని తనను గెలిపించి ఇక్కడ కూర్చోబెట్టారన్నారు. దీంతో కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వేదిక వద్దకు చేరుకొని సముదాయించారు. వాదోపవాదాల మధ్య సమావేశాన్ని ముగిస్తున్నట్లు ప్రత్యేక అధికారి ప్రకటించారు. సర్పంచుల హక్కులు కాలరాయొద్దు ప్రజల చేత ఎన్నికైన సర్పంచుల హక్కులను కాలరాయొద్దని తెర్లుమద్ది సర్పంచ్ బైతి దుర్గవ్వ కోరారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశాన్ని బహిష్కరించారు. దుర్గవ్వ మాట్లాడుతూ ఇంది రమ్మ కమిటీల పేరుతో సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. వేములవాడ: జిల్లాలో యువతను ప్రోత్సహించడానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎల్లప్పుడూ ముందుంటారని బీఆర్ఎస్ ని యోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారా వు అన్నారు. మున్సిపల్ పరిధి కేసీఆర్ కప్ టోర్నీ ఫైనల్లో వేములవాడ కమాండర్స్ విజేతగా, వేములవాడ రాయల్స్ జట్టు రన్నరప్గా నిలిచాయి. విజేతకు రూ.50వేల నగదు, రన్నరప్ జట్టుకు రూ.20వేలు నగదు అందజేశారు. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా టోర్నీ నిర్వహిస్తున్నట్లు లక్ష్మీనరసింహారావు తెలిపారు. వేములవాడ: పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) మున్సిపల్ ఆఫీస్లో ఈనెల 18న మైనారిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో తుర్కాష్పల్లి లబ్ధిదారుల ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ సంపత్కుమార్ గురువారం ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు ఫారంతోపాటు సంబంధిత ఽసర్టిఫికెట్లతో సమయానికి చేరుకువాలని సూచించారు. సిరిసిల్ల అర్బన్: తెలంగాణ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని టీజీఆర్ఎస్ఏ జిల్లా అధ్యక్షుడు మురళీకృష్ణ కోరారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద గురువారం భోజన విరామ సమయంలో ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. సంఘం నాయకులు మాట్లాడుతూ శుక్రవారం జిల్లాలోని తహసీల్దార్, ఆర్డీవో ఆఫీస్ల వద్ద నిరసన తెలిపి వినతిపత్రాల అందజేయాలని కోరారు. దినేశ్ప్రసాద్, జీపీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లారం అర్జున్, రమేశ్, శ్రీనివాస్, వేణు, రాజు, సాయి తేజ, లావణ్య, అంజలి, భరత్ పాల్గొన్నారు. -
‘డబుల్’లో ‘పానీపట్టు’
సిరిసిల్లటౌన్: ప్రభుత్వం కరుణించి సొంతింటి కల సాకారం చేస్తే.. అధికారుల పట్టింపు లేక నీటి కోసం తండ్లాడుతున్నారు. సిరిసిల్ల శివారులోని పెద్దూరు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కాలనీలో 400 కుటుంబాలు నివసిస్తున్నాయి. మొదటి నుంచి ఇక్కడ తాగునీటికి ఇబ్బందులే ఉన్నాయి. అధికారులు మాత్రం వీరి నీటి కష్టాలను పట్టించుకో వ డం లేదు. మిషన్ భగీరథ సరఫరాలో తరచూ అంతరాయం కలగడంతో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. కాలనీల్లో పై పోర్షన్లలో ఉండే వారు బిందెలతో రెండేసి ఫ్లోర్లు ఎక్కుకుంటూ అరిగోస పడుతున్నారు. -
మహిళ అభ్యుదయమే లక్ష్యం
● బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటీవ్ మెంబర్ కీర్తిరెడ్డి సిరిసిల్లటౌన్: మహిళాభ్యుదయమే బీజేపీ లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటీవ్ మెంబర్ కీర్తిరెడ్డి పేర్కొన్నారు. సిరిసిల్లలో గురువారం పార్టీ జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో నారీ శక్తివందన్ నిర్వహించారు. అంబేడ్కర్ చౌరస్తా నుంచి గాంఽధీచౌక్ మీదుగా బతుకమ్మఘాట్ వరకు చేపట్టిన పాదయాత్రలో వందలాది మహిళలు పాల్గొన్నారు. మహిళా సాధికారతకు ప్రధాన మంత్రి నరేంద్రమోడి బంగారు బాటలు వేస్తున్నారన్నారు. నలభై ఏళ్లుగా పెండింగ్లో ఉంటున్న మహిళా బిల్లును మోదీ ఆధ్వర్యంలో పార్లమెంటు ఆమోదం లభిస్తుందన్నారు. దేశం వెనుకబాటుకు కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలను ప్రధాని నరేంద్రమోదీ సరిదిద్దుతున్నారన్నారు. డాక్టర్ దీపా వికాస్రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, మహిళా మోర్చా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. -
బాహుబలులు
బహుజనులే...సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జనాభాపరంగా బీసీలు, ఎస్సీలే అధికంగా ఉన్నారు. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కులగణన (ఎస్ఈఈఈ పీసీ–2024) సర్వేలో వెల్లడించింది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ కులాల గణన వారి సామాజిక ఆర్థిక స్థితిగతులను తెలుసుకునేందుకు ప్రభుత్వం గతేడాది కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్లలో చేసిన ఎస్ఈఈఈపీసీ సర్వే ఉమ్మడి జిల్లా గణాంకాలు పలు ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నాయి. జనాభాపరంగా బీసీలు, ఎస్సీలు అగ్రభాగాన నిలిచారు. ఎస్టీ, బీసీ జనాభాలో అగ్రభాగంలో జగిత్యాల ఉంది. ఎస్సీ, ఓసీ పాపులేషన్లో అగ్రభాగాన కరీంనగర్ నిలిచింది. -
అగ్నిప్రమాదాలకు ముందు చూపే మందు
● సిరిసిల్ల స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నరేందర్ సిరిసిల్ల: అగ్నిప్రమాదాల నివారణకు ముందు చూపే ముఖ్యమని సిరిసిల్ల స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నరేందర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని విద్యానగర్లోని సురభి సుకృతి అపార్టుమెంట్ వద్ద గురువారం అగ్నిమాపకవారోత్సవాల్లో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. సిరిసిల్ల ఎస్ఎఫ్వో నరేందర్ మాట్లాడుతూ అగ్నిప్రమాదాలు జరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలన్నారు. నిప్పుతో చెలగాటమాడొద్దని హెచ్చరించారు. అపార్టుమెంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సిలిండర్ వినియోగం, అప్రమత్తత కోసం తీసుకోవాల్సిన చర్యలు స్పష్టం చేశారు. లీడింగ్ ఫైర్ ఫైటర్ టి.నర్సింహాచారి, టెక్నికల్ ఫైటర్స్ గణేశ్, అనిల్, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. -
వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
● జిల్లా వైద్యాధికారి రజిత సిరిసిల్ల: ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత కోరారు. కలెక్టరేట్లోని వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్లో గురువారం జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో సమీక్షించారు. రజిత మాట్లాడుతూ రాబోయే రోజులలో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని ఉదయం 10 గంటల్లోపు, సాయంత్రం 4 గంటల తర్వాతే పనులు చేసుకోవాలని సూచించారు. వడదెబ్బ తగలకుండా అధికంగా ద్రవ పదార్థాలు సేవించాలన్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. సాధారణ ప్రసవాలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరిగేలా ప్రోత్సహించాలన్నారు. ఐదేళ్లలోపు చిన్నారులకు టీకాలు సకాలంలో వేయించాలన్నారు. సమావేశంలో ఉపవైద్యాధికారి నాగేంద్రబాబు, ప్రోగ్రాం ఆఫీసర్లు సంపత్కుమార్, డాక్టర్ రామకృష్ణ పాల్గొన్నారు. -
వాహనాలు జాగ్రత్తగా నడపాలి
ఇల్లంతకుంట(మానకొండూర్): రోడ్డు ప్రమాదాలతోనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని, వాహనాలు జాగ్రత్తగా నడపాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ సూచించారు. మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో మాట్లాడారు. మద్యం సేవించి, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపరాదని సూచించారు. మండలంలోని రైతులు ఆయిల్పామ్, సన్నరకాల ధాన్యం సాగు చేయాలని కోరారు. 23,131 రేషన్కార్డులు, 1,648 ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేసి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉన్నామన్నారు. గ్రామాల్లో నో హెల్మెట్ నో ఎంట్రీ కార్యక్రమాన్ని అమలు చేయాలని కోరారు. స్టాళ్ల పరిశీలన వ్యవసాయ, ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో ఆయిల్పామ్, పురుగుమందులు పిచికారీ చేసే డ్రోన్, నానో యూరియా విశేషాలు వెల్లడిస్తూ ప్రదర్శనకు పెట్టిన స్టాళ్లను, సీ్త్ర శిశు సంక్షేమశాఖ పోషకపదార్థాలతో ఉపయోగాలు తెలియజేస్తూ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాలకు ఆక్వాగార్డ్ల పంపిణీ రేపాక, నర్సక్కపేట, సోమారంపేట గ్రామాల అంగన్వాడీ కేంద్రాలకు మంజూరైన ఆక్వాగార్డ్ యంత్రాలను పంపిణీ చేశారు. రహీంఖాన్పేటకు చెందిన దివ్యాంగులు పల్లె రాజయ్యకు వీల్చైర్ అందజేశారు. జెడ్పీ సీఈవో వినోద్కుమార్, మండల ప్రత్యేకాధికారి రామకృష్ణ, తహసీల్దార్ సురేష్, ఎంపీడీవో శశికళ, ఇల్లంతకుంట సర్పంచ్ మామిడి రాజు, సీడీపీవో ఉమారాణి, ఎస్సై అశోక్, డాక్టర్ జీవనజ్యోతి, మండల వ్యవసాయాధికారి ప్రదీప్, మండల విద్యాధికారి శ్రీనివాస్గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భాస్కర్రెడ్డి, సర్పంచులు కాత మల్లేశం, నేరెళ్ల విజయ్గౌడ్ పాల్గొన్నారు. -
పథకాలకు అర్హులను ఎంపిక చేయాలి
● కలెక్టర్ గరీమా అగ్రవాల్సిరిసిల్ల: ప్రభుత్వ పథకాలకు నిబంధనలకు అనుగుణంగా అర్హులను ఎంపిక చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం జిల్లా ఎస్సీ కులాల సహకార సంఘం(ఎస్సీ కార్పొరేషన్) యాక్షన్ప్లాన్పై అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ లబ్ధిదారులు, మండల స్థాయిలో లక్ష్యాల కేటాయింపులను నిర్ణీత సమయంలో చేయాలని సూచించారు. ఎస్సీ కార్పొరేషన్ కింద వ్యవసాయ రంగం(సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్), పశుపోషణ రంగం( రెండు మిల్క్ యానిమల్స్), రవాణా ఈవీ త్రీ వీలర్స్(గూడ్స్), ఈవీ త్రీ వీలర్స్(ప్యాసింజర్స్), ఈవీ టూ వీలర్స్ పరికరాలు సబ్సిడీపై అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. నిబంధనల మేరకు అర్హులను ఎంపిక చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న, పరిశ్రమలశాఖ జీఎం హనుమంతు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్రెడ్డి, జిల్లా రవాణా అధికారి వి.లక్ష్మణ్కుమార్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఎన్.మల్లికార్జునరావు పాల్గొన్నారు. -
కెనాల్పై చెట్ల నరికివేతపై విచారణ
ముస్తాబాద్(సిరిసిల్ల): మానేరు ప్రాజెక్టు కెనాల్పై చెట్ల నరికివేత ఫారెస్టు, నీటిపారుదలశాఖ అధికారులు సంయుక్తంగా విచారణ చేపట్టారు. మండలంలోని తెర్లుమద్దిలో ఎగువమానేరు ప్రాజెక్టు కెనాల్పై చెట్లు నరికివేశారనే ఫిర్యాదుతో బుధవారం విచారణ చేపట్టినట్లు డిప్యూటీ ఫారెస్టు రేంజర్ అంజలి తెలిపారు. మానేరు కెనాల్ వెంట చెట్లను నరికివేయడం నేరమన్నారు. రైతులు సైతం కెనాల్ను ధ్వంసం చేయడంతోపాటు చెట్లను నరికివేసినట్లు గుర్తించామన్నారు. చెట్లు నరికిన వారికి జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. ఒక చెట్టు నరికితే రూ.500 జరిమానాతోపాటు మరో రెండు చెట్లు నాటాలని సూచించారు. నీటిపారుదలశాఖ డీఈఈ రవికుమార్తో కలిసి పరిశీలించారు. సర్పంచ్ బైతి దుర్గవ్వ, డీఈ రవికుమార్, ఏఈ నవీన్, బీట్ ఆఫీసర్ రమేశ్, కార్యదర్శి సౌజన్య, మాజీ సర్పంచ్ మల్లేశ్ ఉన్నారు. -
కో–ఆప్షన్ ఎవరికో?
● ‘నాలుగు’ సీట్లపై ‘అందరి’ ఆశలు ● వేములవాడలో నేటి నుంచి నామినేషన్లు ● విప్ ‘ఆది’ మద్దతే కీలకంవేములవాడ: వేములవాడ మున్సిపాలిటీలో కో–ఆప్షన్ సందడి మొదలైంది. ఇన్నాళ్లు పార్టీని పట్టుకొని ఉన్న నాయకులు తమకే ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతూ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే విప్ ఆది శ్రీనివాస్ మద్దతుతోనే కో–ఆప్షన్లో కొలువు దీరనున్నారు. నాలుగు స్థానాలపై పోటాపోటీ వేములవాడ మున్సిపాలిటీలో మొత్తం నాలుగు కో–ఆప్షన్ పోస్టులున్నాయి. ఇందులో 2 స్థానాలు మైనారిటీలకు, 2 స్థానాలు స్పెషల్ నాలెడ్జ్ పర్సన్స్కు కేటాయించారు. ఇందులో ఒక మహిళకు ప్రాధాన్యమివ్వాల్సి ఉంటుంది. మైనారిటీ కోటాలో తీవ్ర పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. సామాజికంగా, రాజకీయంగా యాక్టివ్గా ఉన్న నాయకులు ఈసారి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నా రు. మరోవైపు స్పెషల్ నాలెడ్జ్ కేటగిరీలో విద్యావేత్తలు, సామాజిక సేవకులు, రిటైర్డ్ అధికారులు మా త్రమే కాకుండా మాజీ కౌన్సిలర్లు, మాజీ వార్డుమెంబర్లు రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పైరవీలు షురూ.. ఇప్పటికే దాదాపు ప్రతీ వర్గం నుంచి 8 నుంచి 10 మంది వరకు ఆశావహులు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఆశావహులు పార్టీ పెద్దల చుట్టూ తిరుగుతున్నారు. మైనార్టీల నుంచి సయ్యద్ సాబీర్, మహమ్మద్ రజాక్, పీర్ మహమ్మద్, అక్రమ్పాషా, బాబూన్లు ఉండగా, సాయిని విజయ, కట్కూరి శ్రీనివాస్, చీకోటి శ్రీహరి, కూర దేవయ్య, తోట లహరి, నామాల ఉమాలక్ష్మీరాజం, ముప్పిడి సునందశ్రీనివాస్, కూరగాయల శ్రీశైలం, సగ్గు పద్మదేవరాజు, ముద్రకోల వెంకటేశ్, జి.ప్రకాశ్, ఇన్నారెడ్డి, ఆరోగ్యమ్మ పేర్లు వినిపిస్తున్నాయి. నేటి నుంచి నామినేషన్లు వేములవాడ మున్సిపల్ కో–ఆప్షన్ సభ్యుల ఎన్నికకు అధికారులు ఈనెల 15న నోటిఫికేషన్ వెలువరించారు. గురువారం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. నోటిఫికేషన్ వెలువడిన నుంచి ఏడు రోజులలో దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అనంతరం మూడు రోజుల్లో స్క్రుటినీ నిర్వహిస్తారు. ఆ తర్వాత 14 రోజుల వ్యవధిలో కౌన్సిల్ సమావేశం నిర్వహించి చేతులెత్తే విధానంతో ఓటింగ్ నిర్వహించి సభ్యులను ఎన్నుకుంటారని కమిషనర్ సంపత్కుమార్ బుధవారం తెలిపారు. విప్ ఆశీస్సులు ఉంటేనే.. వేములవాడ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేసిన విషయం తెలసిందే. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కోఆప్షన్పై ఆశలు చిగురించాయి. అయితే ఎవరికీ అవకాశం ఇస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఆశావహులు తమ ప్రతిపాదనలతో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. విప్ ఆది శ్రీనివాస్ దీవెనలు ఉంటేనే కోఆప్షన్ పదవి వరించే అవకాశం ఉంది. ఆశావహులు విప్ దీవెనల కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు. -
వడగాలులు.. ఉక్కపోత
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్/గోదావరిఖని: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోనూ ఈనెల 16 నుంచి 22వరకు హీట్వేవ్స్ (వడగాలులు) కొనసాగుతాయని వాతా వరణశాఖ (ఐఎండీ) తెలిపింది. మొన్నటిదాకా 30 డిగ్రీలకుపైగా నమోదైన ఉష్ణోగ్రతలు 12వ తేదీ నుంచి 35 డిగ్రీలపైగా నమోదవడం మొదలైంది. వేసవి మొదలయ్యాక ఈ స్థాయిలో ఎండలు ముదరడం ఇదే తొలిసారి. 40 డిగ్రీలకుపైగా ఎండలు దంచుతున్న నేపథ్యంలో వడదెబ్బ తగిలే ప్రమాదముందని ఐఎండీ హెచ్చరించింది. 16 నుంచి 22 తేదీ వరకు రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో 41 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు చేరుకుంటాయని వెల్లడించింది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయట సంచారాన్ని వీలైనంత తగ్గించుకోవాలని సూచించింది. శిశువులు, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారు మధ్యాహ్నం తరువాత అసలు బయటికి రాకూడదు. బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కూలీలు, వ్యవసాయం చేసేవారు, ట్రాఫిక్ పోలీసులు, సింగరేణి ఓపెన్కాస్టు ఉద్యోగులు అంతా అప్రమత్తంగా ఉండాలి.మండుతున్న కోల్బెల్ట్ రామగుండంలో సింగరేణి ఓసీపీలు భగ్గుమంటున్నాయి. ఎండల తీవ్రతకు కార్మికులు ఆగమాగమవుతున్నారు. రెండోషిఫ్టు కార్మికులు విధులకు గైర్హాజర్ క్రమంగా పెరుగుతోంది. ఒకరోజు డ్యూటీకి వస్తే రెండోరోజు జంకుతున్నారు. గతంలో మే నెలలో ఎండవేడి అధికంగా ఉండేది. ఈసారి ఏప్రి ల్ రెండోవారం నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. మిగతా ప్రాంతాలతో పోల్చితే క్వారీల్లో కనీసం 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. ప్రస్తుతం క్వారీల్లో సుమారు 45డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మేలో ఓసీపీల్లో డ్యూటీలు చేయడం, భూగర్భగనుల్లోకి వెళ్లడం, మండుటెండలో ఇళ్లకు రావడం కష్టంగా ఉంటుందని కార్మికులు పేర్కొంటున్నారు. ఎండల తీవ్రత నేపథ్యంలో ఉదయం షిఫ్టు మధ్యాహ్నం 1గంట వరకు, రెండో షిఫ్టు సాయత్రం 4 గంటల నుంచి రాత్రి 11గంటల వరకు కొనసాగించాలనే డిమాండ్ ఓసీపీ కార్మికుల నుంచి వస్తోంది. ఎండవేడిలో పనిచేసే కార్మికులకు చలవపందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. రెస్ట్హాళ్లు, క్యాంటీన్లు, ఆఫీస్ కార్యాలయాల్లో కూలర్లు ఏర్పాటు చేస్తున్నారు. రంజన్ల ద్వారా చల్లటినీటిని అందిస్తున్నారు. షిఫ్టు కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లను యాజమాన్యం అందిస్తోంది. -
14 నుంచి అగ్నిమాపక వారోత్సవాలు
● ఎస్పీ మహేశ్ బీ గీతేసిరిసిల్ల క్రైం: అగ్ని ప్రమాదాల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈనెల 14 నుంచి అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించనున్నట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్లను జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం ఆవిష్కరించారు. అగ్నిమాపక సిబ్బంది స్మారకార్థం ఏటా ఈనెల 14 నుంచి 20 వరకు దేశవ్యాప్తంగా అగ్నిమాపక దళ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వారం రోజులపాటు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, అపార్ట్మెంట్స్, పెట్రోల్బంకుల్లో అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. అదనపు ఎస్పీ చంద్రయ్య, ఆర్ఐలు యాదగిరి, రమేశ్, సురేష్, స్టేషన్ ఫైరాఫీసర్ నరేందర్ పాల్గొన్నారు. -
కేసీఆర్ కప్ విజేత పోతుగల్
ముస్తాబాద్(సిరిసిల్ల): కేసీఆర్ కప్ క్రికెట్ మండల స్థాయి విజేతగా పోతుగల్ జట్టు నిలిచింది. ముస్తాబాద్ పులిచేరుకుంట మైదానంలో బుధవారం ముస్తాబాద్, పోతుగల్ మధ్య ఫైనల్మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ముస్తాబాద్ జట్టుపై పోతుగల్ జట్టు విజయం సా ధించింది. విజేత పోతుగల్ జట్టుకు రూ.50వేలు నగదు, రన్నరప్ జట్టుకు రూ.20వేలు నగ దును నాఫ్స్కాబ్ చైర్మన్ రవీందర్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య చేతుల మీదుగా అందజేశారు. సెస్ డైరెక్టర్ అంజి రెడ్డి, మండల అధ్యక్షుడు బోంపెల్లి సురేందర్రావు, పట్టణాధ్యక్షుడు ఎద్దండి నర్సింహారెడ్డి, మాజీ ఎంపీపీ అక్కరాజు శ్రీనివాస్, సర్వర్, కొండ శ్రీను, సంతోష్రావు, భరత్, నందు, చెవుల మల్లేశ్, కోడె శ్రీను పాల్గొన్నారు. ఇసుక ట్రాక్టర్ల అడ్డగింత గంభీరావుపేట(సిరిసిల్ల): ‘మన ఇసుక వాహనాలు’ బుధవారం గంభీరావుపేటలో ఆగిపోయాయి. అనుమతుల(మన ఇసుక వాహనాలు)తో వెళ్తున్నప్పటికీ ఆ ఇసుక ట్రాక్టర్లను గంభీరావుపేట ట్రాక్టర్ యజమానులు అడ్డుకున్నారు. గతంలో మల్లుపల్లి ఇసుక రీచ్కు వెళ్లినప్పుడు తమ ట్రాక్టర్లను ఆ గ్రామ ట్రాక్టర్ యజమానులు అడ్డుకున్నారని, ఇప్పుడు మల్లుపల్లి ఇసుక రీచ్ నుంచి గంభీ రావుపేట మీదుగా ముచ్చర్ల వెళ్తున్న మల్లుపల్లికి ట్రాక్టర్లను గంభీరావుపేట ట్రాక్టర్ య జమానులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ, పోలీస్ అధికారులు ఇరు గ్రామాల ట్రాక్టర్ యజమానులను సముదాయించడంతో సమస్య సద్దుమణిగింది. ‘పాలిస్టర్’ కూలి పెంచాలి సిరిసిల్లటౌన్: పాలిస్టర్ వస్త్రోత్పత్తి, అనుబంధ రంగాల కార్మికులు, ఆసాముల కూలీలు పెంచాలని పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూశం రమేశ్ కోరారు. బుధవారం సిరిసిల్లలోని అమృత్లాల్ శుక్లా కార్మిక భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అగ్రిమెంట్ పూర్తయి రెండేళ్లు గడుస్తున్నా కూలి పెంచడం లేదన్నారు. పాలిస్టర్ కూలి పెంచాలని ఈనెల 20న వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో జరిగే ఒక రోజు సమ్మెను విజయవంతం చే యాలని కోరారు. నాయకులు కోడం రమణ, సిరిమల్లె సత్యం, ఒగ్గు గణేశ్, ఉడుత రవి, దూస అశోక్, ఆడెపు మోహన్, బెజిగం సురే శ్, స్వర్గం శేఖర్, బింగి సంపత్ పాల్గొన్నారు. మూడపల్లి బిడ్డకు దళితరత్న అవార్డుచందుర్తి(వేములవాడ): మాల మహనాడు జిల్లా అధ్యక్షుడు, మండలంలోని మూడపల్లికి చెందిన నీరటి శ్రీనివాస్ దళితరత్న అవార్డు అందుకున్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ 135వ జయంతి సందర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో బుధవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఉత్సవ కమిటీ కోకన్వీనర్ డాక్టర్ అల్లిబిల్లి మహేందర్ చేతుల మీదగా అందుకున్నారు. గత పదహారేళ్లుగా శ్రీనివాస్ చేస్తున్న దళిత, బహుజన, తెలంగాణ ప్రజా ఉద్యమాలు, సమాజ సేవను గుర్తించి అవార్డు అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అగ్ని ప్రమాదాలు లేని సమాజం నిర్మిద్దాంసిరిసిల్ల: అగ్ని ప్రమాదాలు లేని సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలని సిరిసిల్ల అగ్నిమాపక అధికారి నరేందర్ కోరారు. సిరిసిల్ల పాతబస్టాండులోని నేతన్నచౌక్లో బుధవారం అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా అగ్నిమాపక విన్యాసాలు చేశారు. నరేందర్ మాట్లాడుతూ అతిచిన్న నిప్పు రవ్వ అపారమైన ఆస్తి నష్టానికి, ప్రాణనష్టానికి కారణమవుతుందన్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా సంపద బూడిదవుతుందన్నారు. నిప్పు విషయంలో నిర్లక్ష్యం పనికి రాదని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అగ్నిమాపక సిబ్బంది విన్యాసాలు ఆకట్టుకున్నాయి. లీడింగ్ ఫైర్ ఫైటర్ టి.నర్సింహాచారి, టెక్నికల్ ఫైర్ ఫైటర్స్ గణేశ్, అనిల్ పాల్గొన్నారు. -
రోడ్డు భద్రత సామాజిక బాధ్యత
● డీఎస్పీ నాగేంద్రచారి ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రోడ్డు భద్రతను సామాజిక బాధ్యతగా గుర్తించాలని డీఎస్పీ నాగేంద్రచారి కోరారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని రాగట్లపల్లి శివారులో సిరిసిల్ల–కామారెడ్డి ప్రధాన రహదారిపై ట్రాఫిక్ సూచికబోర్డులను బుధవారం పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ప్రమాద సూచికల ఏర్పాటును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డీఎస్పీ నాగేంద్రచారి మాట్లాడుతూ పోలీసులు ఏర్పాటు చేసిన సూచికలు డ్రైవర్లు జాగ్రత్తగా వాహనాలు నడపడానికి సహాయపడతాయన్నారు. వాహనదారులు హెల్మెట్, సీటుబెల్టు ధరించాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే జైలుకెళ్లడం ఖాయమని హెచ్చరించారు. సీఐ వెంకటేశ్, ఎస్సై రాహుల్రెడ్డి పాల్గొన్నారు. -
బరితెగించిన ఇసుకాసురులు
సిరిసిల్ల క్రైం: సిరిసిల్లలో ఇసుకాసురులు బరితెగించారు. తహసీల్దార్ వాహనం మీదకే ట్రాక్టర్ ఎక్కించేందుకు ప్రయతి్నంచారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. సిరిసిల్లలోని సాయినగర్ రీచ్ నుంచి అధికారికంగా ఆన్లైన్ విధానంలో ఇసుక రవాణాకు అనుమతులు ఉన్నాయి. అయితే ఇలా ట్రాక్టర్లు నడవడంతో దుమ్ము వస్తోందని, నీటిని చల్లాలని స్థానికులు సిరిసిల్ల తహసీల్దార్ మహేశ్కుమార్కు ఫిర్యాదు చేశారు. స్పందించిన తహసీల్దార్ వెంటనే సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్కు విషయాన్ని తెలిపి నీటిని చల్లించేందుకు చర్యలు తీసుకున్నారు. ఇదే క్రమంలో ఇసుక రవాణా తీరును పర్యవేక్షించేందుకు బుధవారం సాయినగర్ ఏరియాకు వెళ్లే క్రమంలో ఓ ట్రాక్టర్ ఇసుక లోడ్తో రాంగ్రూట్లో అధిక వేగంతో వెళ్లడం గమనించారు. అనధికారికంగా ఇసుకను తరలించే ట్రాక్టర్లు ఇక్కడ ఇలా రాంగ్ రూట్లో వెళ్తుంటాయి. కాగా ట్రాక్టర్ను ఆపేందుకు తహసీల్దార్ ప్రయత్నించారు. దీన్ని గమనించిన ట్రాక్టర్ డ్రైవర్ ఇంకాస్త స్పీడ్ పెంచాడు. అయితే తహసీల్దార్ ముందుకెళ్లి ట్రాక్టర్ను నిలువరించగా..డ్రైవర్ ట్రాక్టర్ను ఆపకుండా అధికారి వాహనంపైకి ఎక్కించే ప్రయత్నం చేశాడు. అప్రమత్తంగా వ్యవహరించిన తహసీల్దార్ తన వాహనాన్ని పక్కన నిలుపగానే ట్రాక్టర్ డ్రైవర్ దిగి పరారయ్యాడు. తహసీల్దార్ సిరిసిల్ల టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ట్రాక్టర్ డ్రైవర్ శివరాత్రి శివాజీపై కేసు నమోదు చేశారు. ‘ఇసుక రవాణాకు అధికారిక అనుమతి ఉంటే ఓవర్స్పీడ్ ఎందుకు? పైగా అతివేగం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది..’అని తహసీల్దార్ మహేశ్కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. -
ఉంటుందా.. పోతుందా..
సిరిసిల్ల: జిల్లాలో విద్యుత్ పంపిణీ సేవలు అందిస్తున్న సహకార విద్యుత్ సరఫరా సంఘం లిమిటెడ్ (సెస్) ఉంటుందా.. రద్దు అయినట్లేనా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐదేళ్లకోసారి ‘సెస్’ వ్యాపార లైసెన్స్ను రెన్యువల్ చేయాల్సిన రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ) లైసెన్స్ ఇవ్వకుండా ఎన్పీడీసీఎల్ పరిధిలోకి మార్చారు. శ్రీసెస్శ్రీను రద్దు చేస్తున్నట్లు టీజీఈఆర్సీ నిర్ణయం తీసుకుంది. గత మార్చి 31తో లైసెన్స్ గడువు ముగియడంతో సిరిసిల్ల ప్రాంతంలో విద్యుత్ పంపిణీ సేవలను ఉత్తర డిస్కంలో విలీనం చేశారు. ‘సెస్’ను పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకుని వ్యాపార కార్యక్రమాల నిర్వహణకు వీలుగా ఎన్పీడీసీఎల్కు టీజీఈఆర్సీ అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు ఏప్రిల్ 1న ‘సెస్’ను ఎన్పీడీసీఎల్ అధికారులు ఆధీనంలోకి తీసుకుని విద్యుత్ పంపిణీ సేవలు అందిస్తున్నారు. కోర్టుకెక్కిన పాలకవర్గం జిల్లాలో విద్యుత్ పంపిణీ సేవలను అందించే ‘సెస్’ పాలకవర్గం పదవీకాలం మరో 20 నెలలు ఉండగా, నోటీసు కూడా ఇవ్వకుండా, లైసెన్స్ రెన్యూవల్ చేయకుండా 56 ఏళ్ల సంస్థను రద్దు చేయడాన్ని నిరసిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని, ‘సెస్’ వినియోగదారులు ఓట్లు వేసి ఎన్నుకున్న పాలకవర్గ పదవీకాలం ఉండగానే అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ సంస్థ ఉసురు తీస్తున్నారని పేర్కొంటూ కోర్టులో కేసు వేశారు. జస్టిస్ వై.రేణుక ఈ కేసు విచారణను స్వీకరించారు. ప్రభుత్వ తరఫున న్యాయవాది తమ వద్ద పూర్తి సమాచారం లేదని, పక్షం రోజులు గడువు కోరారు. వారం రోజుల్లోనే సమగ్ర వివరాలు కోర్టు ముందుంచుతూ, విచారణకు హాజరు కావాలని జస్టిస్ రేణుక స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం (ఈనెల 15న) మరోసారి ‘సెస్’ అంశం హైకోర్టులో విచారణకు రానుంది. సంస్థ ఉంటుందా.. పోతుందా అనే అంశం కోర్టు పరిధిలో ఉంది. మళ్లీ వాయిదాలు కోరుతారా, విచారణ సాగుతుందా లేదా అనే అంశం జిల్లాలో చర్చనీయాంశమైంది. మహాజనసభ తీర్మానం సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాల్లో 56 ఏళ్లుగా సేవలు అందిస్తున్న ‘సెస్’ లైసెన్స్ రెన్యూవల్ చేయాలని, సంస్థను రక్షించాలని ఈ నెల 4న సిరిసిల్లలో జరిగిన మహాజనసభలో విలేజీ ప్రతినిధులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ప్రాణాలు పోయినా సంస్థను రక్షించి తీరుతామని చైర్మన్ చిక్కాల రామారావు వేదికపై ప్రకటించారు. మహాజనసభ తీర్మానంతో ‘సెస్’ పాలకవర్గం కోర్టును ఆశ్రయించింది. నిబంధనల మేరకు సంస్థ లైసెన్స్ను రెన్యూవల్ చేయాలని కోరుతూ 90 రోజుల ముందే రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి ప్రతిపాదనలు పంపించినా ప్రభుత్వం ఆ ప్రతిపాదనలను కావాలనే తొక్కి పెట్టి ఎన్పీడీసీఎల్కు ‘సెస్’ను అప్పగించిందని పాలకవర్గం పేర్కొంటుంది. న్యాయపోరాటం గెలుస్తుందనే అంచనాల్లో పాలకవర్గం ఉంది. ఉద్యోగుల్లో బదిలీ భయం ‘సెస్’ పాలకవర్గం వర్సెస్ ప్రభుత్వ పోరులో 355 మంది ఉద్యోగులు చిక్కారు. సంస్థ విలీనం అయితే ఉద్యోగులను బదిలీ భయం వెంటాడుతుంది. జిల్లా పరిధిలోనే బదిలీ అవుతూ ఏళ్లకు ఏళ్లుగా ఉద్యోగా లు చేసిన సిబ్బంది ఇప్పుడు ఎన్పీడీసీఎల్ పరిధి లోకి వెళ్లడంతో జీతభత్యాలు ఏమీ పెరగకపోగా, బదిలీలు తప్పవనే భయం ఉంది. ‘సెస్’ పరిధిలో కీలక పోస్టుల్లో ఎన్పీడీసీఎల్ ఇంజినీర్లు ఉండగా, అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది, క్షేత్రస్థాయి సిబ్బంది, ఫీల్డ్ ఏఈఈలు ‘సెస్’ వాళ్లు ఉన్నారు. సంస్థ ఉంటే బదిలీ అయినా జిల్లా పరిధిలోనే ఉంటారు. రద్దయితే బదిలీ పరిధి కొత్తగా ఏర్పడిన 17 జిల్లాల పరిధిలోకి మారనుంది. ‘సెస్’ను ఎన్పీడీసీఎల్లో విలీనం చేసుకుంటే ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. 3 లక్షల మందికిపైగా వినియోగదారులున్న సంస్థను టేకోవర్ చేస్తే అవాంఛనీయ ఘటనలు ఏమైనా చోటు చేసుకుంటాయా అని అంచనా వేశారు. ఈ మేరకు ఏప్రిల్ 1న సంస్థను ఆధీనంలోకి తీసుకున్న సందర్భంగా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. ఎంతో బిజీగా ఉండు ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి ‘సెస్’లో సమీక్షలు నిర్వహించి విద్యుత్ పంపిణీలో వినియోగదారులకు ఇబ్బందులు రానీయొద్దని అన్ని స్థాయిల అధికారులకు స్పష్టం చేశారు. పక్షం రోజుల్లో సిరిసిల్ల ప్రాంతాన్ని రెండు సార్లు సందర్శించి ‘సెస్’ పరిధిలో విద్యుత్ పంపిణీ సేవలపై ఫోకస్ పెట్టారు. ఎన్పీడీసీఎల్ చీఫ్ ఇంజినీర్లు, ఎస్ఈలు, ఇతర ఉన్నతాధికారులు వేములవాడ, సిరిసిల్ల ప్రాంతాల్లోనే పర్యటిస్తూ ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ను అమలు చేస్తున్నారు. కొత్త విద్యుత్ సబ్స్టేషన్లకు భూసేకరణలో నిమగ్నమయ్యారు. సిరిసిల్ల వస్త్రపరిశ్రమలోని పవర్లూమ్స్ కేటగిరిని మార్చుతూ, రూ.10 కోట్ల విలువైన ట్రాన్స్ఫార్మర్లను స్టోర్స్కు తరలించారు. వినియోగదారుల నుంచి ఎలాంటి వ్యతిరేకత రాకుండా ముందుచూపుతో జిల్లాపై ఫోకస్ చేస్తూ వారి మనసు దోచుకుంటున్నారు. జిల్లాలో కొత్త తరహా విద్యుత్ పంపిణీ సేవలు అందుబాటులోకి రావడంతో ఒక వర్గం విద్యుత్ వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ పెద్దలకు క్షీరాభిషేకాలు చేస్తున్నారు. మరో వైపు 56 ఏళ్ల చరిత్ర కలిగిన సంస్థ ఉసురు తీయొద్దని మరో వర్గం కోరుతున్నారు. ఏది ఏమైనా ‘సెస్’ భవితవ్యం ‘కోర్టు’కు చేరింది. నేడు జరిగే విచారణతో సంస్థ ఉంటుందా..? పోతుందా.. అనేది తేలనుంది. -
అప్రమత్తతతో అగ్నిప్రమాదాల నివారణ
సిరిసిల్ల: అప్రమత్తంగా ఉంటేనే అగ్నిప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. కలెక్టరేట్లో మంగళవారం అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. అగ్నిమాపక దళ సిబ్బంది స్మారకార్థం ఏటా ఏప్రిల్ 14 నుంచి 20 వరకు దేశవ్యాప్తంగా అగ్నిమాపక దళ వారోత్సవాలు నిర్వహిస్తారని తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రచారం చేస్తూ చైతన్యవంతులను చేయడం వారోత్సవాల ముఖ్య ఉద్దేశమని వివరించారు. వారం పాటు జిల్లాలోని అన్ని స్కూల్స్, హాస్పిటల్స్, అపార్టుమెంట్లు, గ్యాస్ గోడౌన్స్, పెట్రోల్ బంక్స్, సినిమా హాళ్లు, పరిశ్రమలకు వెళ్లి అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. అగ్నిమాపక పరికరాల వినియోగం, మంటలు ఆర్పడం, భవనాల నుంచి ఎలా బయటికి రావడం, పొగ నిండిన గదుల నుంచి బయట పడడం తదితర అంశాలపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిరిసిల్ల ఫైర్ ఆఫీసర్ నరేందర్, సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యుత్ శాఖ ఎస్ఈగా వేణుమాధవ్
సిరిసిల్ల: జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజినీర్గా టి.వేణుమాధవ్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఎస్ఈగా, ‘సెస్’ ఎండీగా పనిచేసిన బి.భిక్షపతిని ములుగు జిల్లా ఎస్ఈగా బదిలీ అయ్యారు. వేణుమాధవ్ కార్పొరేట్ ఆఫీసులో జనరల్ మేనేజర్ పని చేశారు. గతంలో కరీంనగర్ డీఈఈగా, జగిత్యాల, జనగామ జిల్లాలో ఎస్ఈగా పని చేశారు. విధుల్లో చేరిన ఎస్ఈకి ఎన్పీడీసీఎల్ ఎస్ఈ బి.భిక్షపతి, డీఈఈలు అంజయ్య, వెంకటరమణ, ఏడీఈలు శ్రీనివాస్, రఘునాథ్, గోపి, అనిల్కుమార్, గంగాధర్, రాజు, రఘు, ప్రదీప్, రాజలింగం, ఏవోలు అరవింద్, రవి, ఏఈఈలు, సిబ్బంది శుభాకాంక్షలు తెలుపు తూ సన్మానించారు. జిల్లాలో నాణ్యమైన విద్యుత్ సరఫరా, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని వేణుమాధవ్ తెలిపారు. సమ్మెకు ఆర్టీసీ కార్మికులు సిద్ధంసిరిసిల్లటౌన్: ఆర్టీసీ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు నిరవధిక సమ్మెకు సిద్ధమైనట్లు సిరిసిల్ల డిపోలోని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. ఈమేరకు మంగళవారం డిపో ఎదుట నిరసన తెలుపగా వక్తలు మాట్లాడారు. గత ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన తీర్మానం ప్రకారం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలని, యూనియన్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. 2021, 2025 వేతన సవరణలను తక్షణమే అమలు చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నిలబెట్టాలని, లేకుంటే రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు సమ్మెకు సిద్ధమైనట్లు హెచ్చరించారు. అనంతరం నూతన జేఏసీ కమిటీ చైర్మన్గా బాణయ్య(కండక్టర్), వైస్ చైర్మన్గా జీఎన్ రావు (డ్రైవర్), వైస్ చైర్మన్గా బి. శ్రీనివాస్(డ్రైవర్), కన్వీనర్గా వి.రాజేందర్, ఎం.ముత్యం, ఆర్.రాంచంద్రం, తిరుపతి, మహిళా కన్వీనర్లుగా కవిత, సునీత, సుమలతను ఎన్నుకున్నారు. ‘చిటికెన’కు అంబేడ్కర్ సేవా స్ఫూర్తి అవార్డుసిరిసిల్ల: సిరిసిల్లకు చెందిన సాహిత్యకారుడు చిటికెన కిరణ్కుమార్కు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సేవా స్ఫూర్తి అవార్డు– 2026 లభించింది. ఆంధ్రప్రదేశ్లోని వైఎస్సార్ కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన ‘మనం’ ఫౌండేషన్ కిరణ్కుమార్ సాహిత్య సేవలను గుర్తిస్తూ అవార్డు అందించింది. కిరణ్కుమార్ కవిత్వం, కథలు, వ్యాసాలు, సమీక్షలు చేస్తూ ప్రశంసలు అందుకున్నారు. ఆయన రాసిన ‘ఓ తండ్రి తీర్పు’ వంటి రచనల ద్వారా సమాజానికి స్ఫూ ర్తినిచ్చే సందేశాలను అందించారు. ఆయ న సాహిత్య సృజనకు గుర్తింపునిస్తూ అంబేడ్కర్ జయంతి సందర్భంగా అవార్డును అందుకున్నారు. సిరిసిల్లలోని సాహిత్య మిత్రులు మంగళవారం కిరణ్కుమార్కు అభినందనలు తెలిపారు. క్రీడలతో స్నేహభావంఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే క్రీడలతో క్రీడాకారుల మధ్య స్నేహభావం పెంపొందుతుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. మండలకేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కేసీఆర్ క్రికెట్ కప్ ఫైనల్లో మ్యాచ్లో ధూమాల, రాచర్ల తిమ్మాపూర్ జట్లు తలపడగా దుమాల జట్టు విజేతగా నిలిచింది. విజేత జట్టుకు రూ.50వేల నగదు, షీల్డ్, రెండోస్థానంలో నిలిచిన రాచర్లతిమ్మాపూర్ జట్టుకు రూ.20వేల నగదు, షీల్డ్ అందజేశారు. రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు వరస కృష్ణహరి, మాజీ జెడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు, మాజీ ఎంపీపీ పిల్లి రేణుక, సెస్ మాజీ డైరెక్టర్ కుంబాల మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నివేదికలతోనే సరి !
● అన్నదాతలకు అందని పరిహారం ● ఏటా ప్రకృతి ప్రకోపంతో నష్టపోతున్న రైతులు ● సర్వే చేసి నివేదిక ఇస్తున్న అధికారులు ● పరిహారం కోసం పడిగాపులుఇతను ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన రైతు హన్మయ్య. గ్రామ శివారులో తనకున్న మూడు ఎకరాల్లో రెండేళ్ల క్రితం వరిపంటను సాగు చేశాడు. పంట చేతికొచ్చే సమయంలో వడగండ్ల వానతో వరిగింజలు పూర్తిగా రాలిపోయాయి. అధికారులు క్షేత్రస్థాయిలో పంటనష్టాన్ని పరిశీలించారు. పరిహారం కోసం నివేదికను పంపామని అధికారులు చెపుతుండగా, రెండేళ్లుగా హన్మయ్యకు పరిహారం అందలేదు.ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అన్నదాతలు ఆరుగాలం శ్రమించి పండిస్తున్న పంటలు ప్రకృతి ప్రకోపానికి చేతికి అందకుండా పోతున్నాయి. వడగండ్లు.. అకాల వర్షాలు.. భూగర్భ జలాలు అడుగంటి ఎండుతున్న పంటలతో అన్నదాతలు ఏటా నష్టపోతూనే ఉన్నారు. భూతల్లిని నమ్ముకొని పంటలు సాగుచేస్తున్న రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. వడగండ్లు పడ్డప్పుడు పంటనష్టంపై సర్వే చేస్తున్న అధికారులు ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. పంటలకు పెట్టుబడి పెట్టి నిండా మునిగిన రైతన్నలను ఆదుకునేవారు లేక అప్పులపాలవుతున్నారు. వడగండ్లు.. అకాల వర్షాలతో పంటనష్టంపై ప్రత్యేక కథనం. కడగండ్లు మిగిల్చిన వడగండ్లు వరిపంట పొట్టదశకు చేరుకోవడంతో రైతులు నీళ్లు పారిస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఈ సమయంలోనే ఇటీవల కురిసిన వడగండ్ల వానతో వరిపంటకు తీవ్ర నష్టం జరిగింది. చేతికొచ్చే దశలో వర్షం కురువడంతో వరిగొలుకలు రాలిపోయాయి. మామిడికాయలు నేలరాలాయి. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, కోనరావుపేట, గంభీరావుపేట మండలాల్లో వరిపంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. క్షేత్రస్థాయిలో సర్వే చేసిన వ్యవసాయాధికారులు జిల్లా వ్యాప్తంగా 850 ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లినట్లు నివేదికలు ఇచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో అంతకు రెండింతల విస్తీర్ణంలో వరిపంటకు నష్టం జరిగినట్లు రైతుల ద్వారా తెలుస్తోంది. అందని పరిహారం ఏటా వడగండ్లు, అకాల వర్షాలతో వరిపంటకు తీవ్ర నష్టం జరుగుతుంది. సర్వే చేస్తున్న అధికారులు నివేదికలకే పరిమితమవుతున్నారు. పంటనష్టం వివరాలు, రైతుల ఖాతాల వివరాలను పంపిస్తున్నారే తప్ప తర్వాత ఏం జరుగుతుందనేది పట్టించుకోవడం లేదు. అయితే గత కొన్నేళ్లుగా పరిహారం రావడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నివేదికలు పంపాం ఈ సీజన్లో అకాల వర్షాలతో జిల్లా వ్యాప్తంగా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, వీర్నపల్లి, కోనరావుపేట మండలాల్లో 850 ఎకరాల్లో వరి, మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వానికి నివేదికలు పంపాం. పరిహారం డబ్బులు రైతుల ఖాతాల్లోనే జమవుతాయి. – అఫ్జల్బేగం, జిల్లా వ్యవసాయాధికారి -
ప్రపంచ మేధావి అంబేడ్కర్
సిరిసిల్లటౌన్/సిరిసిల్లఅర్బన్: ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశయాలు అందరికీ ఆచరణీయమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఎస్సీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన సమావేశానికి విప్, కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేష్ బీ గితే హాజరై అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగం రచించిన అంబేడ్కర్ గొప్ప న్యాయవాది, మానవతా వాదిగా కీర్తి గడించారన్నారు. ఇతర వక్తలు మాట్లాడుతూ, ఆర్థికశాస్త్రంలో పీహెచ్డీ చేసిన మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించారని, లండన్లోని ప్రముఖ విశ్వవిద్యాలయం అంబేడ్కర్కు మాస్టర్ ఆఫ్ ఆల్సైన్సెస్ ప్రధానం చేయడం గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా కులాంతర వివాహం చేసుకున్న 8 మంది జంటలకు రూ.2 లక్షల 50 వేల ప్రోత్సాహక బాండ్లను అందజేశారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్లు స్వరూపరెడ్డి, రాజు, ఆర్డీవో వెంకటేశ్వర్లు, డీఎస్పీ నాగేంద్రచారి, ఎస్సీ సంక్షేమశాఖ అధికారి రవీందర్రెడ్డి, అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు కత్తెర దేవదాస్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. పార్టీలు, సబ్బండ వర్గాల ఆధ్వర్యంలో.. జిల్లా కేంద్రంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. బీఆర్ఎస్ ఆఫీసులో జరిగిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, గూడూరి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షుడు శ్రీనివాస్ నేతృత్వంలో జరిగిన వేడుకల్లో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, ఆకునూరి బాలరాజు, సూర దేవరాజు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో నాయకులు శీలం రాజు, ఊరగొండ రాజు, కొండ నరేశ్ తదితరులు పాల్గొన్నారు. సీపీఐ ఆఫీసులో జిల్లా కార్యదర్శి గుంటి వేణు, నాయకులు సోమ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో కోడం రమణ, సూరం పద్మ తదితరులున్నారు. అంబేద్కర్ సంఘాల అధ్యక్షుడు కత్తెర దేవదాసు ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఆకునూరి బాలరాజు, రాగుల జగన్, రాగుల రాములు తదితరులు పాల్గొన్నారు. -
హిందువుల సంఘటితమే దేశ అభ్యున్నతికి మార్గం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): హిందూ సమాజాన్ని సంఘటితంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాల్సిన అవసరం ఉందని కామారెడ్డి విరాట్ హిందూ పరివార్ అధ్యక్షుడు డాక్టర్ యజ్ఞం పవన్కుమార్ శర్మ, జాతీయ సాహిత్య పరిషత్ జిల్లా అధ్యక్షుడు గాజుల రవీందర్ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని రాచర్ల బొప్పాపూర్లో విరాట్ హిందూ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. స్వార్థాన్ని వదిలి ధర్మం కోసం పనిచేయడం ప్రతీ హిందువు ధర్మమని చెప్పారు. దేశంలో కొన్ని ప్రాంతాల్లో హిందువులపై హింసాత్మక చర్యలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హిందువుల జనాభా తగ్గుతున్న నేపథ్యంలో సమాజ రక్షణ కోసం భవిష్యత్ తరాలను బలపరిచే దిశగా ప్రతీ కుటుంబం బాధ్యత వహించాలని సూచించారు. వచ్చే 25 ఏళ్లలో భారత్ను విశ్వగురు స్థానంలో నిలపడం లక్ష్యంగా సంఘం పని చేస్తోందని, ప్రతి గ్రామంలో ఒక గంట శాఖ కార్యకలాపాలకు సమాయాన్ని కేటాయించాలని పేర్కొన్నారు. మహిళా వాక్త కొండ వాణి– నర్సయ్య, సర్పంచ్లు ఇల్లందుల గీతాంజలి, కొండ రమేశ్గౌడ్, నాగెల్లి వెంకటరెడ్డి, అందె సుభాష్, కల్లూరి బాపురెడ్డి, ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. -
రోడ్డుపై సామాజిక బాధ్యతగా వెళ్లాలి
కోనరావుపేట(వేములవాడ): రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ సామాజిక బాధ్యతగా ప్రయాణించాలని విప్ ఆది శ్రీనివాస్ కోరారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా పోలీస్, రవాణాశాఖ ఆధ్వర్యంలో ఈనెల 13 నుంచి 18 వరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. మండలంలోని నిజామాబాద్లో సోమవారం అరైవ్.. అలైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం, డీజీపీల సందేశం వినిపించారు. గ్రామ రోడ్డు సేఫ్టీ కమిటీని ఏర్పాటుచేసి, ప్ర తిజ్ఞ చేయించారు. విప్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కార్లలో సీట్బెల్ట్ పెట్టుకోవాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పూర్తిలో జిల్లా ప్రథమస్థానంలో ఉండడంపై కలెక్టర్ను అభినందించారు. జాగ్రత్తగా వెళ్లాలి.. కలెక్టర్ కుటుంబ బాధ్యతను గుర్తు పెట్టుకొని జాగ్రతగా వెళ్లాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ సూచించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య సహాయం అందించే వారికి ప్రభుత్వం రహవీర్ కింద రూ.25వేలు సహాయం అందిస్తుందని తెలిపారు. రోడ్ సేఫ్టీ.. లైఫ్ సేఫ్టీ. రోడ్ సేఫ్టీ.. లైఫ్ సేఫ్టీ అని ఎస్పీ మహేశ్ బీ గీతే తెలి పారు. ఎక్కువ ప్రమాదాలు డ్రంకెన్డ్రైవ్తోనే జరుగుతున్నాయన్నారు. గ్రామ రోడ్సేఫ్టీ కమిటీ గుంతలు, వీధిదీపాల సమస్య, రోడ్ల వెంట బావులపై నివేదిక ఇవ్వాలన్నారు. సర్పంచులు శ్రీహరి, దేవరాజు, ఏఎంసీ చైర్మన్ ఎల్లయ్య, వైస్చైర్మన్ ప్రభాకర్, డీఎస్పీ శ్రీనివాసులు, తహసీల్దార్ వరలక్ష్మి, ఎంపీడీవో నటరాజ్, ఎంఈవో మురళీనాయక్, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై ప్రశాంత్రెడ్డి పాల్గొన్నారు. -
నాందేడ్ ముఠా పనేనా!
● గత ఫిబ్రవరి 26న నాందేడ్లో ఘటన ● ఆ ఘటనలోనూ వాడింది ఇదే వాహనంగా అనుమానం ● ఏటీఎం మిషిన్ చోరీపై వేగంగా దర్యాప్తు ● కూపీ లాగుతున్న పోలీసులు ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఎస్బీఐ ఏటీఎం మిషిన్ అపహరణపై పో లీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీల ఆధారంగా డాటాను విశ్లేషిస్తున్నారు. బ్యాంకు నుంచి డాటా రావాల్సి ఉందని సమాచారం. సంఘటన జరిగిన రోజు ఏటీఎం మిషిన్ వద్ద గల సీసీ కెమెరాల డాటా కొంత మేరకు షార్ట్ సర్క్యూట్కు గురైంది. దీంతో డాటా కోసం పోలీసులు ముంబైలోని హెడ్క్వార్టర్ను సంప్రదించినట్లు తెలిసింది. వారి నుంచి పూర్తిస్థాయి డాటా రాగానే నిందితులను గుర్తించే అవకాశం ఉంది. ఆ దిశగా పోలీసులు అడుగులు వేస్తున్నారు. బ్యాంకు డాటా కోసం ఏటీఎం మిషిన్ వద్ద బ్యాంకు అధికారులు అమర్చిన సీసీ కెమెరాలతోపాటు ఇతర పరికరాలకు సంబంధించిన డాటా రావాల్సి ఉంది. బ్యాంకు ప్రధా న కార్యాలయం ముంబైలో ఉండడంతో అక్కడి నుంచి పూర్తిస్థాయి డాటాను తెప్పించేందుకు బ్యాంకు అధికారులు పోలీసులకు సహకరిస్తున్నారు. నాందేడ్లో ఇదే తరహా చోరీ మహారాష్ట్రలోని నాందేడ్లో ఇదే తరహా ఘటన గత ఫిబ్రవరి 26న జరిగింది. నాందేడ్లో ఇదే బొలేరో వాహనంతో ముగ్గురు వ్యక్తులు వెళ్లి అక్కడి ఏటీఎం మిషిన్ను అపహరించారు. అక్కడ, ఇక్కడ ఒకే వాహనం వాడడంతో దొంగలను గుర్తించడం పోలీ సులకు సులువుగా మారింది. మహారాష్ట్ర పోలీసులతో జిల్లా పోలీసులు ఎప్పటికప్పుడు టచ్లో ఉండి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. మహారాష్ట్రకు వెళ్లిన ప్రత్యేక బృందం నాందేడ్లో జరిగిన సంఘటన వివరాలు తెలుసుకునేందుకు 12 ప్రత్యేక బృందాల్లోని ఒక పోలీసు బృందం అక్కడికి వెళ్లినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అక్కడ జరిగిన సంఘటన తర్వాత పరిణామాలు సేకరించడానికి వెళ్లినట్లు సమాచారం. ఫేక్ నంబర్ప్లేట్తో బురిడీ ఏటీఎం మెషిన్ దొంగతనానికి ఉపయోగించిన బొలెరో వాహనానికి ఫేక్ నంబర్ ప్లేట్ అమర్చినట్లు పోలీసులు గుర్తించారు. ఏటీఎం మిషన్ అపహరణపై పోలీసుల దర్యాప్తు వేగంగా ముందుకెళ్తున్నట్లు సమాచారం. రెండు, మూడు రోజుల్లోగా దొంగలను గుర్తించే అవకాశం ఉన్నట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. -
గ్రీవెన్స్ డేలో 33 ఫిర్యాదులు
సిరిసిల్ల క్రైం: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో 33 ఫిర్యాదులను స్వీకరించినట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం అందించడమే లక్ష్యంగా ప్రతీ సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అర్జీదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులను సంబంధిత పోలీస్స్టేషన్ల అధికారులకు వెంటనే తెలియజేసి, చట్టపరంగా పరిష్కరించాలని ఆదేశించారు. ఇల్లంతకుంట(మానకొండూర్): రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రోడ్డు భద్రత వ్యవస్థలను బలోపేతం చేస్తున్నట్లు ఏఎస్పీ చంద్రయ్య పేర్కొన్నారు. ఇల్లంతకుంటలోని గ్రామపంచా యతీ ఆవరణలో సోమవారం నిర్వహించిన గ్రామసభలో మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణ, ట్రాఫిక్ నియమాలపై అవగాహ న పెంపు కోసం అరైవ్ అలైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అతి వేగం, మద్యం సేవించి వాహనం నడపడం, మొబైల్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. సర్పంచ్ మామిడి రాజు, ఎస్సై అశోక్, ఏఎస్సై రాజయ్య, ఉపసర్పంచ్ నాగరాజుశర్మ, కార్యదర్శి చంద్రశేఖర్ పాల్గొన్నారు. సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్కు పూర్వవైభవం తీసుకొస్తామని ము న్సిపల్ చైర్పర్సన్ జిందం కళ పేర్కొన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా సోమవా రం అధికారులతో కలిసి విగ్రహ ప్రాంగణం, కూడలి పరిశీలించారు. మంగళవారం నిర్వహించే జయంతి సందర్భంగా వాటర్ ఫౌంటేయిన్, ఇతరత్ర లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కౌన్సిలర్ దార్నం అరుణ, డీఈ వాణి, ఏఈ నరసింహస్వామి, అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు కత్తెర దేవదాస్ పాల్గొన్నారు. 19న హిందూ సమ్మేళనం వేములవాడ: ఈనెల 19న వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగే హిందూ సమ్మేళనానికి పెద్ద ఎత్తున హిందువులు తరలిరావాలని హిందూ సమ్మేళన సమితి నాయకులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాప రామకృష్ణ కోరారు. హిందూ సమ్మేళన సభ రాష్ట్రీయ స్వయం సేవక సంగ్ దశాబ్ది ఉత్సవం సందర్భంగా 19న సాయంత్రం 5 గంటలకు జరిగే సభ పోస్టర్ను సోమవారం ఆవిష్కరించారు. నాయకులు డాక్టర్ కే.మనోహర్, బుస్స శ్రీనివాస్, మోటూరి మధు, రేగుల మల్లికార్జున్, విశ్వహిందూ పరిషత్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. పోషకాహారంపై అవగాహనసిరిసిల్లటౌన్/గంభీరావుపేట/తంగళ్లపల్లి: పోషణ పక్వాడలో భాగంగా సోమవారం పలు మండలాల్లో వంటల పోటీలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని గణేశనగర్ అంగన్వాడీ కేంద్రంలో పోషకాహారం గురించి ఐసీడీఎస్ కార్యకర్తలు అవగాహన కల్పించారు. ఐసీడీఎస్ కార్యకర్త వింధ్యారాణి, ఏఎన్ఎం నందిని పాల్గొన్నారు. గంభీరావుపేట, లింగన్నపేట, తంగళ్లపల్లి మండలం వేణుగోపాల్పూర్ గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో చిన్నారుల తల్లిదండ్రులకు, గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్లు వనిత, రేణుక, సుశ్మిత, సర్పంచ్లు మల్లుగారి పద్మ, పిట్ల ఎల్లయ్య, జూపల్లి రమాదేవి, ఉపసర్పంచ్లు కమలాకర్రెడ్డి, నర్సింలు, అంగన్వాడీ టీచర్లు భాగ్య, రాధమ్మ, శ్రావణి, శోభ, ఉమారాణి, సునీత, వనజ, గీతబాల, రజని, పద్మ పాల్గొన్నారు. -
ప్రజావాణి వినండి
● వివిధ సమస్యలపై 270 దరఖాస్తుల రాక ● అర్జీలు పెండింగ్ పెట్టొద్దు ● కలెక్టర్ గరీమా అగ్రవాల్సిరిసిల్లఅర్బన్: క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి భారీగా బాధితులు కలెక్టరేట్ బాట పడుతున్నారు. ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణిలో తమ సమస్యను కలెక్టర్కు విన్నవించుకునేందుకు వస్తున్నారు. ఈ సోమవారం వివిధ సమస్యలపై 270 మంది దరఖాస్తులు అందజేశారు. ఈ అర్జీలను కలెక్టర్ గరీమా అగ్రవాల్ అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్తో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చిన అర్జీలను పెండింగ్ పెట్టకుండా సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు.పెద్దూరు శివారులోని సర్వేనంబర్ 408లోని 14 గుంటల భూమిని వివిధ అభివృద్ధి పనులకు తీసుకున్నారు. ఇందులో సుమారు ఆరుగురు రైతులు భూమి కోల్పోయాం. మాకు మరో ప్రాంతంలో భూమి లేదా పరిహారం ఇప్పించాలి. – పెద్దూరు భూ బాధితులుమాది చంద్రంపేట. నాకున్న రెండు బ్యాంకు ఖాతాల ద్వారా నెలకు రూ.2,500 చొప్పున సహార క్రెడిట్ కోఆపరేటీవ్ సొసైటీ లిమిటెడ్ బ్యాంకులో జమచేశాను. ఆ డబ్బుల కాలపరిమితి ముగిసింది. నా ఖాతాలో జమయిన డబ్బులు ఇప్పించండి. – సుద్దాల ఎల్లవ్వ, చంద్రంపేటతంగళ్లపల్లి మండలం చింతల్ఠాణా గ్రామ పంచాయతీకి సంబంధించిన నిధులు సరిపోవడం లేదు. గతంలో మంజూరు చేసిన ట్రాక్టర్ ఈఎంఐలు, విద్యుత్ బకాయిలు ఉన్నాయి. జీపీ ఉద్యోగుల జీతాలు పెండింగ్లో ఉన్నాయి. వీటన్నింటికీ గ్రామపంచాయతీ గ్రాంట్ సరిపోవడం లేదు. కలెక్టర్ ప్రత్యేక చొరవతో మా గ్రామపంచాయతీకి అదనపు గ్రాంట్ మంజూరు చేయాలి. – గుర్రం అనసూర్య, సర్పంచ్, చింతల్ఠాణా -
నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు
● ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డిగంభీరావుపేట/ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): వేసవి నేపథ్యంలో నిరంతరం, నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి సూచించారు. గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేటలోని విద్యుత్ సబ్స్టేషన్లను సోమవారం తనిఖీ చేశారు. సబ్స్టేషన్లోని యార్డు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. అనంతరం సీఎండీ మాట్లాడుతూ ఇప్పటి వరకు 431 కనెక్షన్లు ఇచ్చామని, మిగిలిన వాటిని నెలవారీ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు నిర్దేశించినట్లు తెలిపారు. గతంలో సెస్ హయాంలో ఒకే బ్రేకర్ ద్వారా 2–3 ఫీడర్లను అనుసంధానించడంతో విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలు కలిగేవన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు రూ.1.5 కోట్లతో అదనంగా 20 బ్రేకర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ భిక్షపతి, డీఈ అంజయ్య, ఏడీఈ శ్రీనివాస్, రాజలింగం, ఏఈ పృథ్వీధర్గౌడ్, ఏఈ ఆనందర్, రాజేందర్ ఉన్నారు. సబ్స్టేషన్ ఇట్లనే ఉంటుందా?ఎల్లారెడ్డిపేట 33/11 కేవీ సబ్స్టేషన్ను తనిఖీ చేసిన టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి సబ్స్టేషన్ పరిసరాలు పరిశీలించి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్స్టేషన్ పరిసరాల్లో పిచ్చిమొక్కలు పెరగడం, అపరిశుభ్రంగా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ నెల రోజుల్లో వస్తానని.. సబ్స్టేషన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. -
సీసీ కెమెరాల ప్రభావం పడింది
సీసీ కెమెరాల ప్రభావం విద్యార్థులపై పడింది. విద్యార్థులు ఒత్తిడికి లోనయ్యారు. కొంతమంది విద్యార్థులు తరగతులకు తరచూ గైర్హాజరయ్యారు. ఉత్తమ ఫలితాల కోసం నిరంతరం కృషి చేశాం. స్లిప్టెస్టులు, పరీక్షలు రాసే విధానం గురించి అవగాహన కల్పించాం. భవిష్యత్లో ఉత్తమ ఫలితాలు సాధించడానికి కృషి చేస్తాం. – గజానంద్, ఇన్చార్జి ప్రిన్సిపాల్, గంభీరావుపేటచాలా మంది విద్యార్థులు సక్రమంగా కాలేజీకి రాలే దు. ఎక్కువ మందికి హాజ రుశాతం జీరోగానే ఉంది. కళాశాలకు రాకపోవడంతో పాఠాలు వినలేకపోయారు. పరీక్షల్లో కూడా ఏమి రాయలేకపోయారు. ఈ కారణంగానే కళాశాల ఉత్తీర్ణత శాతం పడిపోయింది. – రాజయ్య, కోనరావుపేట కళాశాల ప్రిన్సిపాల్ -
ఫలితాల్లో చిట్టచివర
గంభీరావుపేట(సిరిసిల్ల): ఇంటర్ ఫలితాల్లో జిల్లా ర్యాంక్తో గంభీరావుపేట, కోనరావుపేట జూనియర్ కాలేజీలు పోటీపడ్డాయి. తెలంగాణ వ్యాప్తంగా చిట్టిచివరి స్థానంలో జిల్లా నిలిస్తే.. జిల్లా వ్యాప్తంగా అట్టడుగు ఫలితాలు గంభీరావుపేట, కోనరావుపేట జూనియర్ కళాశాలలు సాధించాయి. గంభీరావుపేట కాలేజీ ఫస్టియర్లో 14 శాతం, సెకండియర్లో 12 శాతం ఉత్తీర్ణత సాధించాయి. కోనరావుపేట కాలేజీ పది శాతం, మోడల్స్కూల్ 11 శాతం ఉత్తీర్ణత సాధించాయి. బోధన లోపమా.. నిర్లక్ష్యమా.. ఇంటర్ ఫలితాలపై తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధ్యాపకుల పనితీరుపై మండిపడుతున్నారు. సకల సౌకర్యాలు, పూర్తి స్థాయి అ ధ్యాపకులు ఉన్నప్పటికీ ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితాల వెనుకంజకు కారణాలేంటి ? బోధనలో నాణ్యత కంటే సిలబస్ పూర్తి చేయడంపైనే లెక్చరర్లు దృష్టి కేంద్రీకరించడంతో విద్యార్థుల్లో పునాది బలహీనమవుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధ్యాపకులపై పర్యవేక్షణ లేకపోవడం, పనితీరు ఆధారంగా సమీక్షలు చేయకపోవడం లోపంగా కనిపిస్తోంది. పాఠశాల స్థాయి నుంచే బేసిక్ కాన్సెప్ట్స్పై అవగాహన లేకపోవడం ఇంటర్ ఫలితాలపై ప్రభావం చూపుతోందనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికై నా తమ ఫెయిల్యూర్కు కారణాలపై సమీక్షించుకొని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.ఇయర్ విద్యార్థులు ఉత్తీర్ణత గంభీరావుపేట కాలేజీ.. ఫస్టియర్ 131 19 సెకండియర్ 114 14 కోనరావుపేట కాలేజీ.. ఫస్టియర్ 95 10 సెకండియర్ 105 19 మోడల్ స్కూల్.. ఫస్టియర్ 135 15 సెకండియర్ 108 39 -
యూనిక్ టోకరా!
సాక్షిప్రతినిధి,కరీంనగర్ ●: మొన్న సహారా, నిన్న మెటా ఫండ్, నేడు యూనిక్.. సంస్థల పేరు ఏదైనా అందరి లక్ష్యం ఒకటే.. ఏదో ఒకరకంగా ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించడం ఆపై మొహం చాటేయడం. తాజాగా యూనిక్ అనే ఉత్తారాదికి చెందిన సంస్థ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ స్కాంకు పాల్పడిందని ఖాతాదారులు, ఏజెంట్లు నెత్తీనోరు బాదుకుంటున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఒక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఏకంగా రూ.500 కోట్ల వరకు ఖాతాదారుల నుంచి డబ్బులు సేకరించి ఇప్పుడు వారిని రేపు..మాపు.. అంటూ తిప్పుకుంటుందని బాధితులు వాపోతున్నారు. ఆరేళ్లలో డబ్బులు రెట్టింపు చేస్తామంటూ తీయని మాటలు చెప్పిన సంస్థ తీరా గడువు ముగిసి నాలుగేళ్లు గడుస్తున్నా ఎలాంటి డబ్బు చెల్లించకపోవడంతో బాధితులంతా ఏజెంట్ల ఇళ్ల మీదకు వస్తున్నారు. దీంతో ఏజెంట్లంతా కంగారుపడి యూనిక్ సంస్థపై న్యాయపోరాటం చేయాలని తీర్మానించుకున్నారు. వీరంతా కలిసి ఇటీవల కరీంనగర్లో సమావేశం పెట్టుకుని డిపాజిటర్ల డబ్బులు వెనక్కి తీసుకురావాలని నిర్ణయించారు. అసలేం జరిగింది? వాస్తవానికి ఇది ఫైనాన్స్ సంస్థ కాదు. దీని వ్యవహారం చూస్తుంటే మల్టీలెవల్ మార్కెటింగ్ను తలపిస్తోంది. పదకొండేళ్ల క్రితం అంటే 2015 నుంచి ఇది తెలుగు రాష్ట్రాల్లో కార్యకలాపాలు ప్రారంభించింది. కేవలం ఆరేళ్లలో మీ డబ్బులు రెట్టింపు చేస్తామంటూ కస్టమర్లకు ఎరవేసింది. తెలంగాణలో ఉమ్మడి వరంగల్, కరీంనగర్తోపాటు, నల్లగొండ జిల్లాలో భారీగా డిపాజిట్లు సేకరించింది. సంస్థ కార్యకలాపాలు, హామీలకు ఆకర్షితులైన పలువురు ఈ సంస్థలో ఏజెంట్లుగా చేరారు. సంస్థ లక్ష్యాలు సామాన్యులకు వివరించి.. కేవలం ఆరేళ్లలో డబ్బులు రెట్టింపు అవుతాయని నమ్మించారు. 24 గంటలు అదే పనిలో ఉండి డిపాజిటర్ల నుంచి భారీగా డబ్బులు కట్టించారు. దీంతో ఉమ్మడి జిల్లాలో రూ.500 కోట్ల వరకు సేకరించినట్లు సమాచారం. కరోనా నాటికి డిపాజిటర్ల మెచ్యూరిటీ గడువు పూర్తయింది. అయినా యూనిక్ సంస్థ డబ్బులు చెల్లించకుండా రేపు మాపు అంటూ కాలయాపన చేస్తోంది. దీంతో బాధితులు, ఏజెంట్లు అంతా కలిసి పోరాటానికి సిద్ధమవుతున్నారు. మెటాను మించిన యూనిక్.. ఇంత భారీ మొత్తంలో డిపాజిట్లు సేకరించిన సంస్థ ఇటీవలి కాలంలో మరోటి లేదంటే అతిశయోక్తి కాదు.. గతంలో కరీంనగర్ కేంద్రంగా వెలుగుచూసిన జీబీఆర్ క్రిప్టో కరెన్సీ రూ.100 కోట్ల వరకు కరీంనగర్ నుంచి వసూలు చేసింది. అనంతరం ఇదే కరీంనగర్ కేంద్రంగా ఓ మాజీ కార్పొరేటర్ ఏకంగా మెటాఫండ్ పేరుతో రూ.300 కోట్ల వరకు ప్రజల నుంచి సేకరించారు. ఈ డబ్బులు ఏకంగా దేశం దాటి పోయాయి. ఈ కేసులో సూత్రధారులు, పాత్రధారులు అందరినీ పోలీసులు అరెస్టు చేసినా.. డబ్బుల రికవరీలో మాత్రం ఎలాంటి పురోగతి లేదు. తాజాగా ‘యూనిక్’ కేసులో రూ.500 కోట్ల వరకు డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతుండటం ఆసక్తి రేపుతోంది. ఈ విషయమై జిల్లాలో పలు స్టేషన్లలో ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. కేసులు పెడితే.. డబ్బులు వెనక్కి రావంటూ నేటికీ యూనిక్ సంస్థ ప్రతినిధులు డిపాజిటర్లను మభ్యపెడుతున్నారు. -
రెవెన్యూలో బదిలీల కుదుపు!
● ఏడుగురు తహసీల్దార్లు, ఇద్దరు డీటీలు బదిలీ ● వెయిటింగ్లో ఉన్న వారికి పోస్టింగ్ ● రెవెన్యూ పరిపాలన బలోపేతం కోసం బదిలీలుబోయినపల్లి(చొప్పదండి): జిల్లాలో పరిపాలన బలోపేతానికి రెవెన్యూశాఖలో తాత్కాలిక బదిలీలు చేపట్టారు. బదిలీలపై బ్యాన్ ఉండడంతో డిప్యూటేషన్పై బదిలీ చేసినట్లు భావిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఏడుగురు తహసీల్దార్లు, ఇద్దరు డిప్యూటీ తహసీల్దార్లను డిప్యూటేషన్ చేస్తూ కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఈనెల 10న ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీలు జరిగిన చోట్లలో తాత్కాలిక బదిలీలుగానే పేర్కొన్నారు. బదిలీలు వీరికే.. ప్రస్తుతం వెయిటింగ్లో ఉన్న ఎన్.శ్రీనివాస్ను గంభీరావుపేట తహసీల్దార్గా, సూపరింటెండెంట్–ఈ కలెక్టరేట్గా, వెయిటింగ్లో ఉన్న టి.వైశాలిని వీర్నపల్లి తహసీల్దార్గా, సూపరింటెండెంట్–డీ కలెక్టరేట్గా డిప్యూటేషన్ వేశారు. ఇల్లంతకుంట తహసీల్దార్ ఎం.ఏ.ఫారుక్ను ముస్తాబాద్ తహసీల్దార్, బోయినపల్లి తహసీల్దార్ కాలె నారాయణరెడ్డిని వీర్నపల్లి తహసీల్దార్గా డిప్యూటేషన్ వేశారు. కలెక్టరేట్ సూపరింటెండెంట్ హెచ్అండ్ఐగా ఉన్న ఎం.డి.షరీఫ్ మొయినొద్దీన్ను డిప్యూటేషన్పై బోయినపల్లి తహసీల్దార్గా, ముస్తాబాద్ తహసీల్దార్ బి.రాంచందర్ను సూపరింటెండెంట్ కలెక్టరేట్ హెచ్ అండ్ఐగా డిప్యూటేషన్ వేశారు. సూపరింటెండెంట్–డీ కలెక్టరేట్గా విధులు నిర్వహిస్తున్న ఆర్.సురేశ్ను ఇల్లంతకుంట తహసీల్దార్గా నియమించారు. కలెక్టరేట్ సూపరింటెండెంట్–ఈగా ఉన్న జి.వేణును ఎల్లారెడ్డిపేట డిప్యూటీ తహసీల్దార్గా డిప్యూటేషన్, ఎల్లారెడ్డిపేట డీటీ వి.మురళీకృష్ణను తంగళ్లపల్లి డిప్యూటీ తహసీల్దార్గా డిప్యూటేషన్ వేశారు. కాగా త్వరలో మరికొంతమంది ఆర్ఐలను, డీటీలకు బదిలీల తాకిడి ఉంటుందని అనుకుంటున్నారు. సతాయింపులకు చెక్పడేనా? కొంతమంది రెవెన్యూ ఉద్యోగులు వివిధ పనుల కోసం కార్యాలయాలకు వెళ్లే ప్రజలను సతాయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వివిధ ధ్రువీకరణ పత్రాలు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ల విషయంలో ఏదో వంకతో జాప్యం చేయాలని చూస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. రెవెన్యూ సేవలు పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
‘ఇందిరమ్మ’తో సంతోషం
కోనరావుపేట/రుద్రంగి/వేములవాడరూరల్: ఇందిరమ్మ ఇళ్లతో గ్రామాల్లోని నిరుపేదల కుటుంబాల్లో సంతోషం కలుగుతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కోనరావుపేట మండలం మల్కపేట, రుద్రంగి, వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామాల్లో ఇందిరమ్మ ఇంటి గృహాల ప్రవేశాలకు హాజరై లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేశారు. కిసాన్సెల్ జిల్లా అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు షేక్ ఫిరోజ్పాషా, సర్పంచులు బోయిని దేవరాజు, అప్పాల భూషణం, బానోత్ నరేశ్, గండి లక్ష్మీనారాయణ, సతీష్కుమార్, అడ్డిక లక్ష్మి, ఉపసర్పంచ్ మాడిశెట్టి అభిలాశ్, ఏఎంసీల చైర్మన్లు చెలుకల తిరుపతి, రొండి రాజు, రూరల్ పార్టీ అధ్యక్షుడు వకుళాభరణం శ్రీనివాస్, బొడ్డు రాములు పాల్గొన్నారు. బస్సు ప్రారంభం ఇల్లంతకుంట(మానకొండూర్): సిరిసిల్ల ఆర్టీసీ బస్టాండ్ నుంచి బోటుమీదపల్లె, సిరికొండ, దాచారం, పెద్దలింగాపురం మీదుగా ఇల్లంతకుంట వరకు ప్రయాణించే బస్సును ఆదివారం సర్పంచ్ గౌరవేణి శివాని ప్రారంభించారు. నెల రోజుల క్రితం ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రకాశ్రావు గ్రామాల సర్పంచుల ప్రతిపాదన మేరకు రూట్ సర్వే చేశారు. మండలంలోని బోటుమీదిపల్లెకు బస్సు చేరుకోగానే సర్పంచ్ గౌరవేని శివాని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. సిరికొండలో సర్పంచ్ గొడుగు విఠల్ ఆహ్వానం పలికారు. అక్కడి నుంచి దాచారం మీదుగా ఇల్లంతకుంటకు ఉదయం తొమ్మిది గంటలకు చేరుకుంది. ప్రతి రోజు రెండు ట్రిప్పులు నడుస్తుందని డ్రైవర్, కండక్టర్లు నర్సయ్య, గణేశ్ తెలిపారు. మేడే కరపత్రం ఆవిష్కరణ సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రంలోని ప్రెస్భవన్లో ఆదివారం 140వ మే డే కరపత్రాన్ని ఏఐఎఫ్టీయూ న్యూ రాష్ట్ర నాయకులు సోమిశెట్టి దశరథం ఆవిష్కరించారు. దశరథం మాట్లాడుతూ మేడే సంబరాల వెనుక అనేకమంది కార్మికుల ప్రాణత్యాగాలు దాగి ఉన్నాయన్నారు. సిరిసిల్లలోని జూనియర్ కాలేజీ మైదానం నుంచి పాతబస్టాండ్, పెద్దబజార్ల మీదుగా శాంతినగర్ చౌరస్తాలోని ఏఐఎఫ్టీయూ న్యూ జిల్లా కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. కిశోర్, భామండ్ల రవీందర్, కూరపాటి సతీశ్, గుజ్జ దేవదాస్, రవి, సత్తయ్య, రాంప్రసాద్, సునీల్ పాల్గొన్నారు. రైస్మిల్లులో రేషన్ బియ్యంవేములవాడఅర్బన్: వేములవాడ పట్టణం చెక్కపల్లిరోడ్డులోని హరిహర రైస్మిల్లులో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, సివిల్ సప్లయ్ అధికారులు ఆదివారం దాడులు చేశారు. దాదాపు 450 క్వింటాళ్ల రేషన్ సన్నబియ్యం ఉన్నట్లుగా గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. సుమారు 6 గంటల పాటు అధికారులు తనిఖీ నిర్వహించి కేసు నమోదు చేశారు. రైస్మిల్లులో పెద్ద ఎత్తున రేషన్ సన్న బియ్యం పట్టుబడగా క్వింటాళ్ల కొద్ది కొనుగోలు చేసి అక్రమ రవాణా ద్వారా తరలిపోయిన తీరుపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. దాడుల్లో విజిలెన్స్ సీఐ ప్రశాంతరావు, తహసీల్దార్ దినేశ్రెడ్డి, సివిల్ సప్లయ్ డీటీ సత్యనారాయణ పాల్గొన్నారు. -
అక్కాచెల్లెళ్లు.. సరస్వతీ పుత్రికలు
సిరిసిల్లటౌన్: ఇంటర్మీడియట్ ఫలితాల్లో సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న కొలనూర్కు చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు రాష్ట్రస్థాయి మార్కులు సాధించారు. కోనరావుపేట మండలం కొలనూరుకు చెందిన గోరింటాల జ్యోతి–రమేశ్ దంపతులకు ముగ్గురు కూతుళ్లు. రమేశ్ సిరిసిల్లలో పవర్లూం వర్కర్గా పనిచేస్తున్నాడు. ముగ్గురు కూతుళ్లు సిరిసిల్లలోని జూనియర్ కాలేజీలో చదువుకుంటున్నారు. ధరణి బైపీసీ(433), పూజ 492 (ఎంపీఎస్డబ్ల్యూ), పల్లవి 490(ఎంపీఎస్డబ్ల్యూ) సాధించారు. వీరిని కళాశాల ప్రిన్సిపాల్ విజయ రఘునందన్, అధ్యాపకులు ఇంటికెళ్లి సన్మానించారు. -
నిండు వేసవిలో నీటిధారలు !
మల్కపేట రిజర్వాయర్ ద్వారా ఆయకట్టుకు వెళ్తున్న నీరుకనగర్తి వద్ద కాల్వలో పారుతున్న గోదావరి జలాలుసిరిసిల్ల: సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాలు సముద్ర మట్టానికి 1,250 అడుగుల ఎత్తులో ఉన్న మెట్టప్రాంతాలు. ఇక్కడ భూములకు నీరు లేక.. బావులు తవ్వితే బండలు.. బోర్లు వేస్తే దుమ్ము లేసే దుస్థితి. వందలాది అడుగుల లోతుకు బోర్లు వేసినా చుక్కనీరు రాని వైనం. దశాబ్దాల కిందట ఇక్కడి యువతకు ఉపాధి లేక దుబాయి.. ముంబాయికి పొట్ట చేత పట్టుకుని వలస వెళ్లే పరిస్థితులు. ఇప్పుడు కాలం మారింది. ఉన్న ఊరిలోనే మెరుగైన ఉపాధికి బాటలు పడుతున్నాయి. ఎక్కడో వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరి జలాలు రాజన్నసిరిసిల్ల జిల్లాకు చేరాయి. నిండు వేసవిలో గోదావరి జలధారలు పారుతున్నాయి. శ్రీపాద ఎల్లంపల్లి, కాళేశ్వరం ప్రాజెక్టుల పుణ్యమా అని మధ్యమానేరు జలాశయానికి, వేములవాడ మండలం ఫాజుల్నగర్ రిజర్వాయర్కు, కూడెల్లి ద్వారా ఎగువమానేరుకు, రంగనాయకసాగర్ ద్వారా ముస్తాబాద్ ప్రాంతాలకు గోదావరి జలాలు చేరడంతో పసిడి పంటలకు ఊపిరి పోసినట్లు అయింది. ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, గంభీరావుపేట మండలాల్లో ఎగువ మానేరు కాల్వల నీరు సాగుతుంది. ఇల్లంతకుంటలో అన్నపూర్ణ రిజర్వాయర్ సాగు నీరు అందిస్తుంది. తంగళ్లపల్లి మండలంలోని గ్రామాలకు రంగనాయకసాగర్ చేరింది. ఇలా జలం మెట్ట భూములకు చేరడంతో జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా యాసంగి సీజన్లో సుమారు 2 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఒక్క వరి పంటనే 1,83,850 ఎకరాల్లో సాగైంది అంటే.. అది గోదావరి జలాల చలువే. మండే ఎండల్లో గోదావరి జలాలు జిల్లాలో పంటలకు ప్రాణం పోశాయి. -
బాలికలదే హవా
● చివరి స్థానంలో జిల్లా ● రాష్ట్రస్థాయిలో 35వ స్థానం ● సెకండియర్లో 58.69 శాతం ● ఫస్టియర్లో 49.05 శాతంసిరిసిల్ల: ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయిగా నిలిచింది. రాష్ట్ర స్థాయిలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను ఆదివారం వెల్లడించారు. జిల్లా ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో 49.05 ఉత్తీర్ణత శాతంతో అట్టడుగు స్థానంలో ఉండగా.. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లోనూ 58.69 శాతంతో ఆఖరు స్థానం దక్కింది. బాలుర కంటే.. బాలికలు కాస్త మెరుగైన ఉత్తీర్ణత శాతం సాధించారు. రాష్ట్ర స్థాయిలో ఆఖరు స్థానం జిల్లాకు రావడం విద్యారంగాన్ని ఆందోళనకు గురిచేస్తుంది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో చివరి స్థానం 35వ ర్యాంకు రాజన్న సిరిసిల్ల జిల్లాకు రావడం జిల్లాలోని విద్యారంగ పరిస్థితి అద్దం పడుతుంది. జిల్లాలోని కేజీబీవీ విద్యార్థినులు మెరుగైన మార్కులతో సత్తా చాటుకున్నారు. కేజీబీవీ వేములవాడలో ఏఐఎంఎల్ ఫస్టియర్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ సెకండియర్లో 328 మంది విదార్థులు పరీక్షలు రాయగా.. 278 మంది ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరంలో 478 మంది పరీక్షలు రాయగా.. 400 మంది ఉత్తీర్ణత సాధించారని జిల్లా విద్యాధికారి డాక్టర్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. జిల్లాలోని ఏడు సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు. ఇంటర్ ఫస్టియర్ 437 మంది పరీక్షలు రాయగా.. 327 మంది ఉత్తీర్ణులు అయ్యారు. సెకండియర్లో 417 మంది పరీక్షలు రాయగా.. 354 మంది పాస్ అయ్యారు. బద్దెనపల్లి సాంఘిక గురుకుల కశాశాల వంద శాతం ఉత్తీర్ణత సాధించిందని జిల్లా సమన్వయకర్త జె.జె.థెరిస్సా తెలిపారు. సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థి కె.శశికుమార్ ఎంపీసీలో 982/1000 మార్కులు సాధించారు. మొదటి సంవత్సవరంలో ఎస్.శ్రీహిత ఎంపీసీలో 463/470 మార్కులు సాధించారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ థియరీ పరీక్షలు మే 13 నుంచి 21 వరకు రోజూ రెండు పూటలా నిర్వహిస్తారు. ఫస్టియర్ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండియర్ పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు నిర్వహిస్తారు. ప్రాక్టికల్ పరీక్షలు మే 22 నుంచి 25 వరకు రెండు పూటలా నిర్వహించనున్నారు. ఏప్రిల్ 13 నుంచి 20 వరకు విద్యార్థి చదివిన కాలేజీల్లోనే పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థులు ఆన్లైన్లో చెల్లించరాదని డీఐఈవో తెలిపారు.జి.శ్యామల, కేజీబీవీ మర్రిపల్లి 984/1000, బైపీసీ మమత, కేజీబీవీ, మర్రిపల్లి 466/470కీర్తన, కేజీబీవీ, సిరిసిల్ల 436/440, బైపీసీగడిల మమత, కేజీబీవీ రుద్రంగి 466/470, ఎంపీసీఎం.శ్రీజ, కేజీబీవీ, సిరిసిల్ల 435/440సీ.హెచ్.దివ్యచైత్ర, కేజీబీవీ, తంగళ్లపల్లి 488/500ఎల్.శృతిక, కేజీబీవీ, తంగళ్లపల్లి 490/500జి.గాయత్రీ, కేజీబీవీ, బోయినపల్లి 482/500 -
అంతర్రాష్ట్ర దొంగల పనేనా !
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఏటీఎం సెంటర్లోని మిషన్ చోరీకి గురవడంతో మండల కేంద్రం ఉలిక్కిపడింది. కామారెడ్డి– సిరిసిల్ల ప్రధాన రహదారిపై పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఉన్న ఏటీఎం సెంటర్లోని మిషన్ను దొంగలు గొలుసులతో లాక్కెళ్లిన సంఘటనతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఎండాకాలంలో దొంగల బెడద సాధారణంగా ఉంటుంది. కానీ ఏకంగా ఏటీఎం మిషన్నే ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపుతోంది. ఇది అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యుల పనేనని చర్చ సాగుతోంది. ఈ సంఘటనను ఎస్పీ మహేశ్ బీ గీతే సీరియస్గా తీసుకున్నారు. దొంగలను పట్టుకోవడానికి 12 ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపారు. సీసీ పుటేజీల ఆధారంగా.. ఏటీఎం మిషన్ను ఎత్తుకెళ్లిన దొంగలు ఎటువైపు పారిపోయారనే దానిపై పోలీసులు సీసీ పుటేజీల ఆదారంగా ముందుకెళ్తున్నారు. పోలీస్ జాగిలాలు ఎల్లారెడ్డిపేట నుంచి రాగట్లపల్లి వరకు వెళ్లి ఆగిపోయాయి. దొంగలు మిషన్ డబ్బాలను పడేసిన అక్కపల్లి శివారులోని బుగ్గ రాజేశ్వరస్వామి ఆలయ సమీపం వరకూ వెళ్లాయి. అంతకంటే ముందుకు జాగిలాలు వెళ్లలేకపోతున్నాయి. రెండు సంఘటనలు వీరి పనేనా ? ఎల్లారెడ్డిపేటలో ఏటీఎంను మిషన్ను అపహరించుకెళ్లిన దొంగలు వెళ్తూ.. వెళ్తూ వీర్నపల్లి మండలం బంజరులో మహిళ మెడలో నుంచి పుస్తెలతాడును లాక్కెళ్లారు. ఈ రెండు సంఘటనలు ఒకేరోజు కొద్ది సమయంం తేడాలోనే జరగడంతో పోలీసులు కూడా ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. వచ్చింది ఎంత మంది? ఏటీఎం దొంగతనానికి వచ్చింది ఎంతమంది అనే సందేహలు వ్యక్తం అవుతున్నాయి. మిషన్ సుమారు క్వింటాల్ బరువు ఉంటుందంటున్నారు. నలుగురు దొంగల ముఠా ఈ ఘటనకు పాల్పడి ఉంటుందనే అనుమానాలున్నాయి. మిషన్లో ఒక రోజు ముందే అందులో రూ.6.06లక్షలు ఉంచినట్లు బ్యాంక్ అధికారులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. ముందుగానే దొంగలు రేక్కి నిర్వహించి పక్కా ప్రణాళికతో దొంగతనానికి పాల్పడినట్లు సమాచారం. పాత నేరస్తుల విచారణ పలు దొంగతనాలలో గతంలో పట్టుబడ్డ అంతర్రాష్ట్ర దొంగలను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. కొత్తగా దొంగల ముఠాలు ఏమైనా ఈ ప్రాంతాల్లో సంచరిస్తున్నాయా.. అసలు ఈ ఘటనకు పాల్పడింది.. అంతర్రాష్ట్ర లేక అంత జిల్లానా, లేక స్థానిక దొంగలా పనేనా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. స్వయంగా ఎస్పీ మహేశ్ బీ గీతే ఈ దొంగతనం సంఘటనపై విచారణ చేస్తున్నారు. సరిహద్దుల్లో అప్రమత్తం ఏటీఎం మిషన్ డబ్బాను అక్కపల్లి శివారులో వదిలేసి అక్కడి నుంచి ఎటువైపు వెళ్లి ఉంటారనే దానిపై పోలీసులు ప్రధాన దృష్టి సారించారు. వీర్నపల్లి–సిరికొండ మీదుగా నిజామాబాద్ వైపు వెళ్లి ఉంటారా.. కోనరావుపేట నుంచి జగిత్యాల వైపు వెళ్లి ఉంటారా.. కరీంనగర్, హైదరాబాద్, వరంగల్ వైపు పారిపోయి ఉంటారనే దానిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలోనే అన్ని జిల్లాల సరిహద్దుల్లోని చెక్ పోస్ట్ల వద్ద ప్రత్యేక పోలీసులను నియమించి వాహనాల తనిఖీతో పాటు అనుమానిత వ్యక్తులను పట్టుకొని విచారిస్తున్నారు. -
పూలే జీవితం ఆదర్శం
సిరిసిల్లటౌన్: మహాత్మ జ్యోతిబా పూలే జీవితం అన్ని తరాలకు ఆదర్శనీయమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో శనివారం నిర్వహించిన జ్యోతిబా పూలే జయంతి వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. ఆనాడు సమాజంలో జరుగుతున్న వివక్షకి వ్యతిరేకంగా పూలే పోరాడారన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అనేక పోరాటాలు చేశారని గుర్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రి తన వద్ద విద్యాశాఖను ఉంచుకొని పెను మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. జూన్ 2 నుంచి రాష్ట్రంలోని రేషన్కార్డుల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేస్తామని తెలిపారు. నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను విడుదల చేసిందన్నారు. ఇందిరమ్మ చీరల ఆర్డర్లను మన ప్రాంతంలో ఇవ్వడం జరిగిందన్నారు. సిరిసిల్ల జిల్లా సాధన కోసం ఉద్యమం చేసిన వారికి అండగ ఉంటామని హామీ ఇచ్చారు. సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కె.కె.మహేందర్రెడ్డి, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, డీసీసీ అధ్యక్షు డు సంగీతం శ్రీనివాస్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, ఏఎంసీ చైర్మన్ వెల్ముల స్వరూపారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు, గడ్డం నర్సయ్య, కాముని వనిత పాల్గొన్నారు. నివాళి అర్పించిన కలెక్టర్ సిరిసిల్ల: కలెక్టరేట్లో మహాత్మ జ్యోతిబా పూలే జయంతిని పురస్కరించుకొని బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో చిత్రపటానికి కలెక్టర్ గరీమా అగ్రవాల్ పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. సిరిసిల్ల ఆర్డీవో సీహెచ్.వెంకటేశ్వర్లు, బీసీ సంక్షేమ జిల్లా అధికారి సౌజన్య, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి రవీందర్రెడ్డి, ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాసాచారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న, సిరిసిల్ల తహసీల్దార్ మహేశ్కుమార్ పాల్గొన్నారు. -
ప్రజారోగ్య రక్షణలో కెమిస్ట్ల బాధ్యత గొప్పది
సిరిసిల్ల: ప్రజారోగ్య పరిరక్షణలో మెడికల్(కెమిస్ట్) దుకాణదారుల బాధ్యత గొప్పదని ఔషధ నియంత్రణశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జూకంటి రాజు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ భవనంలో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. అసిస్టెంట్ డైరెక్టర్, కార్యక్ర మ నోడల్ అధికారి రాజు మాట్లాడుతూ మందుల దుర్వినియోగం చేయొద్దని, ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్పై అప్రమత్తంగా ఉండాలన్నారు. యాంటీబయోటిక్స్ మందుల వాడకంపై అవగాహన కల్పించారు. జిల్లా వైద్యాధికారి రజిత మాట్లాడుతూ జిల్లాలో బాల, బాలికల నిష్పత్తిలో తేడా ఉందని, అబార్షన్కు సంబంధించిన మందుల విక్రయాలపై నిఘా ఉంచా మన్నారు. ఎవరూ తప్పు చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజా ఆరోగ్య రక్షణకు ప్రతి ఒక్క రూ బాధ్యతగా వ్యవహరించాలని కెమిస్ట్లతో ప్రతిజ్ఞ చేయించారు. కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్, ప్రో గ్రాం ఆఫీసర్ సంపత్కుమార్, ఈగల్ ఫోర్స్ టీం రా జమౌళి, నవీన్, మెడికల్ అసోసియేషన్ జిల్లా ప్రధా న కార్యదర్శి బోడ రవీందర్, గౌరవ అధ్యక్షుడు చేపూరి జనార్దన్, చేపూరి బుచ్చయ్య పాల్గొన్నారు. -
బతకాలి.. విజయాన్ని వెతకాలి..!
ఆదివారం శ్రీ 12 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026శంకరపట్నం: సక్సెస్కు మార్కులే కొలమానం కాదని నిరూపించారు ప్రస్తుత హైదరాబాద్ మెట్రోవాటర్బోర్డు ఎండీ కోరెం అశోక్రెడ్డి. ఇంటర్ ఫెయిలైన అశోక్రెడ్డి.. తర్వాత పట్టవదలని విక్రమార్కుడిలా పుస్తకాలతో కుస్తీ పట్టి గ్రూప్–1 సాధించారు. ప్రస్తుత కన్ఫార్మ్డ్ ఐఏఎస్ అధికారి హోదాలో సేవలందిస్తున్నారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టుకు చెందిన కోరెం అశోక్రెడ్డి మొలంగూర్ జెడ్పీ హైస్కూల్లో 10వ తరగతి వరకు చదువుకున్నారు. హుజూరాబాద్ జూనియర్ కాలేజీ ఇంటర్ చదివారు. సెకండియర్లో ఫెయిల్ అయినా సప్లిమెంటరీలో ఉత్తీర్ణులయ్యారు. జమ్మికుంటలో డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేసి గ్రూప్–1 ఉద్యోగానికి ఎంపికయ్యారు. సీ్త్రశిశుసంక్షేమశాఖ పీడీగా ఉద్యోగంలో చేరి, కన్ఫార్మ్డ్ ఐఏఎస్గా ఎంపికయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోవాటర్ బోర్డు ఎండీగా విధులు నిర్వర్తిస్తున్నారు. మార్కులు, ర్యాంకులు కొలమానం కాదని పట్టుదలతో చదివితే విజయం సాధించవచ్చని అశోక్రెడ్డి అంటున్నారు.మార్కులు..ర్యాంకులే చదువుకు కొలమానం అనుకుంటున్న నేటితరం విద్యార్థులు ఒక్కక్షణం ఆగండి.. వీరి విజయగాథలు చదవండి. పదో తరగతిలో ఫెయిలైన వారు.. ఇంటర్లో అత్తెసరు మార్కులతో పాసైన వారు.. డిగ్రీ కూడా చదవని వారు.. అద్భుతాలు సృష్టించారు. వారు వేసిన మార్గంలోనే నేడు డిగ్రీ.. బీటెక్.. ఎంటెక్ విద్యార్థులు ముందుకెళ్తున్నారు. డిగ్రీ పూర్తి చేయని బిల్గేట్స్.. బోర్డు ఎగ్జామ్ రాయని సచిన్ టెండూల్కర్.. ఆటోడ్రైవర్గా జీవితాన్ని ఆరంభించిన సత్యశంకర్ విజయాలే మనకు మార్గంకావాలి. అంతెందుకు మన జిల్లా వాసి.. కొత్తగట్టుకు చెందిన కోరెం అశోక్రెడ్డి ఇంటర్ ఫెయిలయ్యానని కుంగిపోయి ఉంటే ఈరోజు ఐఏఎస్ అయ్యేవారే కాదు.. అందుకే ఒక్క క్షణం ఆలోచించండి.. పదో తరగతిలో తక్కువ మార్కులు వచ్చాయని.. ఇంటర్ ఫెయిల్ అయ్యామని కుంగిపోకండి. దీని తర్వాత జీవితం చాలా ఉంది. ధైర్యంతో ముందుకెళ్తే మీలో నుంచే ఓ బిల్గేట్స్.. సత్యశంకర్.. మనోజ్కుమార్శర్మ.. కోరెం అశోక్రెడ్డి వారసులు రావచ్చు. ఇంటర్ ఫలితాలు ఎలా ఉన్నా.. ధైర్యంగా ముందుకెళ్దాం.. – సప్తగిరికాలనీ(కరీంనగర్) – వివరాలు 8లో...36,4269,0547,4248,1067,69918,2514,7484,3064,0604,04618,17515,123జగిత్యాలరాజన్నసిరిసిల్లపెద్దపల్లికరీంనగర్‘సత్యశంకర్.. ఓ పానీయం ఉత్పత్తి చేసే బిందు కంపెనీ యజమాని. ఆయన ఇంటర్ వరకు చదువుకుని ఆటో డ్రైవర్గా తన ప్రస్థానం మొదలుపెట్టారు. అవకాశాలు సద్వినియోగం చేసుకుని ఇప్పుడు రూ.800 కోట్ల వ్యాపారానికి యజమాని అయ్యారు. ఆయనే వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు.’‘మనోజ్కుమార్శర్మ.. మధ్యప్రదేశ్లోని ఒక పేద కుటుంబంలో జన్మించాడు. 12వ తరగతిలో ఫెయిల్ అయ్యాడు. కానీ నిరాశ చెందలేదు. ఐపీఎస్ అయ్యారు. ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర పోలీస్లో ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హోదాలో పనిచేస్తున్నారు.’‘మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. తొలుత ఓ కంపెనీని స్థాపించి తీవ్రంగా నష్టపోయారు. కంప్యూటర్ ప్రోగ్రామింగ్స్పై తనకున్న కోరిక, విషయ పరిజ్ఞానం మైక్రోసాఫ్ట్ పేరిట సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించేలా చేసింది. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ ఎదిగిన తీరు అందరికీ తెలిసిందే.’ ‘సచిన్ టెండూల్కర్ పదిలో ఉత్తీర్ణత సాధించలేకపోయినా తనకు ఇష్టమైన క్రికెట్ ఆటలో చరిత్ర సృష్టించారు. పదహారేళ్ల ప్రాయంలో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి క్రికెట్ ప్రపంచానికి దేవుడయ్యారు’ ‘విజయ్ వర్షన్..తుషార్ సుమెరా.. హరియాణాకు చెందిన ఐఏఎస్ అధికారి ఏకంగా 35సార్లు పరీక్షలు రాసి విఫలమైనా చివరికి 2021లో సివిల్స్ 70వ ర్యాంకుతో ఐఏఎస్ సాధించారు. గుజరాత్లోని ఐఏఎస్ అధికారి పదోతరగతి ఆంగ్లంలో 35, గణితంలో 36, సైన్సులో 38 మార్కులే సాధించారు. తర్వాత తన లక్ష్యం సివిల్స్పై పెట్టి అనుకున్నది సాధించారు.’ -
డ్రగ్స్తో కలిగే నష్టాలపై అవగాహన కల్పించండి
● కలెక్టర్ గరీమా అగ్రవాల్ ● డీ అడిక్షన్ సెంటర్ ప్రారంభంసిరిసిల్ల: డ్రగ్స్తో కలిగే నష్టాలపై యువతకు వైద్యులు, వైద్య విద్యార్థులు అవగాహన కల్పించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. ఆరోగ్య వారోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం సిరిసిల్ల శివారులోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డ్రగ్స్తో కలిగే నష్టాలపై వైద్య విద్యార్థులు ఫ్లాష్మాబ్ షో ద్వారా వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సమాజంలో వైద్యులకు ఎంతో గౌరవం ఉంటుందన్నారు. డ్రగ్స్తో కలిగే నష్టాలు, భవిష్యత్లో వచ్చే ఇబ్బందులపై వైద్యవిద్యార్థులు అవగాహన కల్పించాలని సూచించారు. పనులు గడువులోగా పూర్తి చేయాలి మెడికల్ కాలేజీ భవన నిర్మాణ పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వైద్యకళాశాల భవనం, బాలుర, బాలిక హాస్టళ్లు, మెస్ ఇతర పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆర్అండ్బీ సీఈ రాజేశ్వరరెడ్డి, ఈఈ నరసింహాచారి, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరీ, వైస్ప్రిన్సిపాల్ డాక్టర్ నాగార్జున చక్రవర్తి, జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రవీణ్కుమార్, ఆర్ఎంవో సంతోష్కుమార్, సిరిసిల్ల తహసీల్దార్ మహేశ్కుమార్ ఉన్నారు. డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రం ప్రారంభం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో శనివారం డీ–అడిక్షన్ కౌన్సెలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతేతో కలిసి ప్రారంభించారు. అనంతరం నూతన కోర్టు భవన పనులను పరిశీలించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్కుమార్, జిల్లా వైద్యాధికారి రజిత, ఆర్ఎంవో సంతోష్కుమార్, తహసీల్దార్ మహేశ్కుమార్ పాల్గొన్నారు. అన్నదానసత్రం పనుల్లో వేగం పెంచాలి వేములవాడఅర్బన్: వేములవాడ రాజన్న ఆలయ అన్నదానసత్రం నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఆర్అండ్బీ అధికారులను కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. నూతన అన్నదానసత్రం పనులను ఆర్అండ్బీ సీఈ రాజేశ్వరరెడ్డితో కలిసి పరిశీలించారు. ఆర్అండ్బీ ఈఈ నరసింహాచారి, డీఈ శాంతయ్య, ఆలయ ఇన్చార్జి ఈవో అంజనారెడ్డి, డీఈ రఘునందన్, తహసీల్దార్ జయంత్కుమార్ ఉన్నారు. -
శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణానికి రండి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని రాచర్లబొప్పాపూర్లో నూతనంగా నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవానికి హాజరుకావాలని కోరుతూ గ్రామస్తులు మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్కు శనివారం ఆహ్వానపత్రిక అందజేశారు. హైదరాబాద్లోని కేటీఆర్ నివాసంలో కలిసి ఈనెల 18, 19, 20 తేదీలలో జరిగే విగ్రహ ప్రతిష్ట, కల్యాణ వేడుకలకు రావాలని కోరారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వరుస కృష్ణహరి, నాయకులు ఇల్లందుల శ్రీనివాసరెడ్డి, దేవిరెడ్డి, కృష్ణ, శివ, సతీశ్రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. డ్రైవింగ్లో సర్టిఫైడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ తంగళ్లపల్లి(సిరిసిల్ల): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ ఆర్టీసీ)లో ఖాళీగా ఉన్న వెయ్యి డ్రైవర్ పోస్టుల భర్తీ కోసం ఈనెల 23న నిర్వహించే పరీక్షలకు అభ్యర్థులను సిద్ధం చేసేందుకు డ్రైవింగ్ శిక్షణ సంస్థ ఐటీడీఆర్, టైడ్స్ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు ప్రిన్సిపాల్ దురై మురగన్ తెలిపారు. ఈమేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. పది రోజుల సర్టిఫైడ్ రిఫ్రెషర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ను ప్రారంభించిట్లు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు సమాచారం కోసం 89854 31720లో, http://www.tidessircilla.com వెబ్సైట్లో సంప్రదించాలని సూచించారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు విద్యుత్ శాఖ ఎస్ఈఈ భిక్షపతి, డీఈఈ అంజయ్య పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలో ప్రజాబాటను శనివారం నిర్వహించారు. ఏడీఈ శ్రీనివాస్, ఏఈఈ పృథ్వీధర్గౌడ్, సర్పంచ్ సోమారపు శరవిందు పాల్గొన్నారు. సొంతింటి కలను నెరవేర్చుతున్నాం ఎల్లారెడ్డిపేట/తంగళ్లపల్లి(సిరిసిల్ల): నిరుపేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కె.కె.మహేందర్రెడ్డి పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట, తంగళ్లపల్లి మండలం ఓబులాపూర్లో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సాబేరబేగం, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, పార్టీ మండలాల అధ్యక్షులు సద్దిలక్ష్మారెడ్డి, ప్రవీణ్ టోనీ తదితరులు పాల్గొన్నారు. సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలివేములవాడరూరల్: హిందువులు ఏకమై సనాతన ధర్మాన్ని రక్షించుకుందామని బీజేపీ రూరల్ మండల అధ్యక్షుడు పరమేశ్ అన్నా రు. మండలంలోని లింగంపల్లిలో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ దేశాలు హిందూ ధర్మం వైపు చూస్తున్నాయన్నారు. సమావేశాన్ని బొల్లారం, హన్మాజిపేట, మల్లారం, జయవరం, లింగంపల్లి గ్రామస్తులు విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో మధు, మల్లిఖార్జున్, మల్లయ్య పాల్గొన్నారు. -
● మంత్రి అడ్లూరికి శాతవాహన విద్యార్థుల ఫిర్యాదు ● విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణాకు ఫోన్ ● మొత్తం వివాదంపై విచారణ చేపట్టాలని కోరిన మంత్రి ● ఘటనపై పోలీసులకు ప్రొఫెసర్ సుజాత ఫిర్యాదు ● అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కంప్లైంట్
సాక్షిప్రతినిధి,కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీ వివాదం రోజురోజుకు ముదిరి పతాకస్థాయికి చేరుకుంది. ఇంతకాలం కరీంనగర్కే పరిమితమైన ఈ వ్యవహారం తాజాగా రాజధానికి చేరుకుంది. తమను అర్బన్ నక్సలైట్లంటూ వేధిస్తున్నారంటూ ఎస్సీ సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్కి శాతవాహన విద్యార్థులు ఫిర్యాదు చేశారు. శుక్రవారం శాతవాహన యూనివర్సిటీ జాక్ విద్యార్థులు మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ను ధర్మారంలో కలిశారు. అక్కడ వీసీ ఉమేశ్ కుమార్, బాటనీ పార్ట్టైం అసిస్టెంట్ ప్రొఫెసర్ పెంచాల శ్రీనివాస్ తమను అర్బన్ నక్సలైట్లంటూ వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి లక్ష్మణ్ అక్కడ నుంచే విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణాకు ఫోన్ చేశారు. అసలు యూనివర్సిటీలో ఏం జరగుతుందో? తెలుసుకోవాలని కోరారు. వెంటనే ఈ వ్యవహారంలో నిజనిజాలు నిర్ధారించేందుకు విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు. దీనికి యోగితా రాణా సానుకూలంగా స్పందించడంతో విద్యార్థులు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.‘శాతవాహన యూనివర్సిటీలో దళిత ప్రొఫెసర్లు, విద్యార్థులను అర్బన్ నక్సలైట్లంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయంలో ప్రొఫెసర్ సుజాత, ఇతర దళిత విద్యార్థులకు ఎమ్మార్పీఎస్ అండగా నిలుస్తుంది. ఈ విషయంలో న్యాయం జరిగే వరకు త్వరలోనే ఎమ్మార్పీఎస్ పక్షాన ఉద్యమిస్తాం’ అని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు బెజ్జంకి అనిల్ మాదిగ, ఉపాధ్యక్షుడు కనకం అంజిబాబు, సీనియర్ నాయకుడు పొత్తూరి రాజన్న, ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు చెంచాల నవీన్ మాదిగ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. కరీంనగర్ పోలీసులు నిస్పక్షపాతంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. వీసీ ఉమేశ్కుమార్ తనను వ్యక్తిగతంగా వేధిస్తుండగా.. బాటనీ విభాగం పార్ట్టైం అసిస్టెంట్ ప్రొఫెసర్ పెంచాల శ్రీనివాస్ తనను అర్బన్ నక్సలైటంటూ ప్రచారం చేస్తున్నారంటూ తెలంగాణ విద్యా కమిషన్ అడ్వైజరీ మెంబర్, సోషియాలజీ విభాగాధిపతి డాక్టర్ సూరేపల్లి సుజాత కొత్తపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో వారిపై వేసిన విచారణ కమిటీ రిపోర్టు కాపీలను కూడా పోలీసులను అందజేశారు. దీంతోపాటు కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో చేసిన కామెంట్లు, రాష్ట్రవ్యాప్తంగా వివిధ వాట్సప్ గ్రూపుల్లో శాతవాహన వర్సిటీలో తనను అర్బన్ నక్సలైట్గా చిత్రీకరిస్తూ.. చేసిన పోస్టుల స్క్రీన్షాట్లు, వారి ఫోన్ నంబర్లు ఫిర్యాదుకు జతచేశారు. కొన్నిరోజులుగా దళిత మహిళా ప్రొఫెసర్నైన తనను అసభ్యపదజాలంతో సోషల్ మీడియాలో వేధిస్తోన్న వారిపైన కూడా అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆమె ఫిర్యాదులో కోరారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనను పోలీసులు గోప్యంగా ఉంచడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఈ వ్యవహారం జరుగుతున్న తీరు, సోషల్ మీడియాలో జరుగుతున్న యుద్ధంపై ఇంటెలిజెన్స్ పోలీసులు వివరాలు సేకరించి నివేదిక ఇచ్చారు. -
చౌడాలమ్మకు మొక్కులు
కోనరావుపేట: కొండాపూర్లో చౌడాలమ్మ జాతర ఉత్సవాలు శుక్రవారం నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పూజలు చేశారు. తాగునీటి కోసం రోడ్డెక్కిన గ్రామస్తులు గంభీరావుపేట(సిరిసిల్ల): తాగునీటి సమస్య పరిష్కరించాలని గంభీరావుపేట మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని దోసలగూడెం కాలనీవాసులు శుక్రవారం రోడ్డెక్కారు. బస్టాండ్ సమీపంలో ఖాళీ బిందెలతో బైఠాయించారు. వారు మాట్లాడుతూ వారం రోజులుగా తమ కాలనీలో నీరు రావడం లేదన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ మాలల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు దోసల చంద్రం, నాయకులు మద్దెల రాజనర్సు, పిట్ల రఘు, ప్రవీణ్కుమార్, చక్రధర్, వంశీ, కిషన్, అనంతరాములు పాల్గొన్నారు. కుష్ఠువ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించాలి సిరిసిల్ల: కుష్ఠు వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించాలని లెప్రసీ రాష్ట్ర పరిశీలకులు డాక్టర్ రాజు కోరారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్లో జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత ఆధ్వర్యంలో పీహెచ్సీల వైద్యులతో శుక్రవారం సమావేశమయ్యారు. రాజు మాట్లాడుతూ కుష్ఠువ్యాధిని ప్రాథమిక దశలో గుర్తిస్తే వైద్యసేవలు అందించే అవకాశం ఉంటుందన్నారు. లెప్రసీ లక్షణాలను ప్రచారం చేయాలన్నారు. అంతకుముందు సుందరయ్యనగర్, అంబేడ్కర్నగర్, తంగళ్లపల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో లెప్రసీపై అవగాహన కల్పించారు. రాష్ట్ర పరిశీలకుల బృందం సీనియర్ మెడికల్ ఆఫీసర్ వెంకటేశ్వరాచారి, సకలరెడ్డి, సురేందర్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అనిత, డాక్టర్ సంపత్, డాక్టర్ రామకృష్ణ, డీపీఎంవో దేవిసింగ్ పాల్గొన్నారు. ఆయుర్వేదిక్ వైద్యశిబిరం సిరిసిల్లటౌన్: ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రపంచ ఆయుష్ హోమియోపతి డే సందర్భంగా ఉచిత ఆయుర్వేదిక్ ఆరో గ్య శిబిరాన్ని సిరిసిల్లలోని యూహెచ్సీలో శుక్రవారం నిర్వహించారు. అంబేడ్కర్నగర్లో నిర్వహించిన ఆయుర్వేదిక్ వైద్యశిబిరాన్ని డీఎంహెచ్వో రజిత ప్రారంభించారు. వైద్యాధికారి రేఖ, డీడీఎం కార్తీక్ పాల్గొన్నారు. ‘మన ఇసుక మన వాహనం’ వినియోగించుకోవాలి బోయినపల్లి(చొప్పదండి): ఇసుక తరలింపులో పారదర్శకత కోసం అమలు చేస్తున్న ‘మన ఇసుక– మన వాహనం’ వినియోగించుకోవాలని జిల్లా మైనింగ్ ఏడీ క్రాంతికుమార్ కోరారు. మండల కేంద్రంలోని రైతువేదికలో శుక్రవారం ట్రాక్టర్ యజమానులతో అవగాహన సదస్సు నిర్వహించారు. నిర్ణీతపత్రాలు జత చేసి.. ఆన్లైన్ విధానం ద్వారా సులభంగా బుకింగ్ చేసుకునే వీలు ఉందన్నారు. తహసీల్దార్ కాలె నారాయణరెడ్డి, ఆర్ఐ మనోజ్కుమార్ ఉన్నారు. -
శనివారం శ్రీ 11 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
ఆరోగ్య‘యోగం’సిరిసిల్లటౌన్: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని కలెక్టర్ గరీమా అగ్రవాల్ పేర్కొన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. నిత్యం కనీసం అరగంట పాటు యోగా సాధన చేయాలని కోరారు. అనంతరం యోగాసనాలు వేశారు. సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూపారెడ్డి, ఆర్డీవో వెంకటేశ్వర్లు, జిల్లా వైద్యాధికారి రజిత, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్ బేగం, జిల్లా మత్స్యశాఖ అధికారి సౌజన్య, డీవైఎస్వో రాందాస్, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రాజేశ్వరీ, మున్సిపల్ కమిషనర్ ఖదీర్పాషా, డిప్యూటీ తహసీల్దార్ భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అప్రమత్తతే రక్ష
వడదెబ్బ నుంచి రక్షణకు బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలిగంభీరావుపేట(సిరిసిల్ల): మండల కేంద్రం గంభీరావుపేట, లింగన్నపేట మధ్య మానేరువాగుపై నిర్మించతలపెట్టిన హైలెవల్ వంతెన పనులను వేగవంతం చేయాలని కోరుతూ బీజేపీ నాయకులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. మానేరువాగు వద్ద రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. మళ్లీ వానాకాలంలో వాగు ఉప్పొంగి రోడ్డు తెగిపోయి రాకపోకలు నిలిచిపోయేలా ఉన్నాయన్నారు. బీజేపీ మండల అధ్యక్షుడు కోడె రమేశ్, జిల్లా అధికార ప్రతినిధి దేవసాని కృష్ణ, మల్లేశంయాదవ్, దేవేందర్యాదవ్, సత్యనారాయణ, వాజిద్ హుస్సేన్, ఎల్లం, శ్రీనివాస్, విగ్నేశ్గౌడ్, మోహన్, నర్సింలు, దుర్గేశ్, రవీందర్నాయక్, నరేశ్ పాల్గొన్నారు. సిరిసిల్లటౌన్: ఎండల నుంచి రక్షణకు అప్రమత్తంగా ఉంటూ.. శరీరంలో నీటిశాతం తగ్గకుండా చూసుకోవాలని జిల్లా వైద్యాధికారి(డీఎంహెచ్వో) రజిత సూచించారు. అధిక ఉష్ణోగ్రతలతో శరీరంలో నీటినిల్వలు తగ్గే ప్రమాదం ఉందని.. తరచూ నీటిని తాగాలని సూచించారు. ఎండలు దంచికొడుతుండడంతో రక్షణకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన ఆహార నియమాలపై జిల్లా వైద్యాధికారి ‘సాక్షి’కి వివరించారు. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు పడుతున్న ఇబ్బందుల నేపథ్యంతో ‘సాక్షి’కి శుక్రవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వివరించారు. శరీర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి మండుటెండలకు శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంటాయి. ఫలితంగా శరీరంలో నీటిశాతం పడిపోవడంతో డీహైడ్రేషన్తోపాటు జీర్ణకోశ సంబంధిత వ్యాధులు, విరోచనాలు, రక్తపోటు(బీపీ)లో హెచ్చుతగ్గులు, మూత్రపిండాల్లో రాళ్లు, మూత్రనాళ సమస్యలు, వేడిదద్దుర్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఎండదెబ్బకు గురయ్యే వారికి జిల్లాలోని అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన చికిత్స లభిస్తుంది. ఎండాకాలం జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. సరైన జాగ్రత్తలు తప్పనిసరి ఎండాకాలంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వేసవిలో వచ్చే అనేక ఆరోగ్య సమస్యలకు తలనొప్పి తొలి హెచ్చరికగా భావించా లి. వెంటనే తగ్గకుంటే డాక్టర్ను సంప్రదించా లి. ఈకాలంలో ఒత్తిడి, నిద్రలేమి, చికాకు, ఉత్సాహం తగ్గడం, నీరసించిపోవడం వంటి లక్షణాలు చాలా మందిలో కనిపిస్తాయి. షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే డాక్టర్ను సంప్రదించాలి. సరిపడా నీరు తాగాలి వేసవిలో చాలా మందిలో మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్రతిరోజు శరీరానికి సరిపడా నీరు తాగకపోవడం, గాలిలో తేమశాతం తక్కువగా ఉండటం వంటి కారణాలతో శరీరం నుంచి నీరు బయటకు ఎక్కువగా పోతుంటుంది. ఉష్ణోగ్రతల ప్రభావంతో శరీరంలో నీరు తగ్గినప్పుడు కండరాలు పట్టేస్తాయి. కండరాలకు శరీరం నుంచి తగిన ఆక్సిజన్ అందనప్పుడు ఇతరమార్గంలో అవసరాలు తీర్చుకునే క్రమంలో ల్యాక్టిక్ యాసిడ్ ఉత్పత్తి చేస్తాయి. దీంతో కిడ్నీలపై ప్రభావం చూపి ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంటుంది. నీళ్ల విరోచనాలు కూడా కిడ్నీలు పాడవడానికి కారణమవుతాయి. చల్లని పానీయాలు సేవించొద్దు ఎండాకాలంలో అతిచల్లని నీటిని, శీతల పానీయాలు అస్సలు సేవించొద్దు. ఎండ నుంచి వచ్చిన వారు సాధారణ నీరు తాగడం శ్రేయస్కరం. చల్లని నీరు, రసాలు తీసుకోవడం ద్వారా గొంతు నొప్పి, ఇతర సమస్యలు వస్తాయని గుర్తుంచుకోవాలి. అతిగా వ్యాయామం చేయడం సరికాదు. తగిన విరామంతో సరిపడినంత నీరు తీసుకుంటూ.. వ్యాయామం చేయాలి. ఎండలో తిరిగొచ్చిన వారు వెంటనే చల్లని నీటిని సేవించినా, స్నానం చేసినా రక్తనాలాలు కుంచించుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో గుండెపోటుకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి -
‘సహస్ర’కు తోటి విద్యార్థుల చేయూత
సిరిసిల్లటౌన్: చిన్నారి అంబటి సహస్ర అనా రోగ్యం బారిన పడగా తోటి విద్యార్థులు చేయూతనందించారు. సిరిసిల్లకు చెందిన నేతకార్మిక దంపతులు అంబటి వర్ష–వేణుకు ఇద్దరు కూతుళ్లు అమృత, సహస్ర, కొడుకు అన్విత్. పెద్దకూతురు అమృత ఐదేళ్ల క్రితం లివర్ పాడై చనిపోయింది. ఫిబ్రవరిలో చిన్న కూతురు సహస్ర లివర్ వ్యాధి బారిన పడటంతో హైదరాబాద్ తీసుకెళ్లారు. వైద్యులు రూ.20లక్షలు ఖర్చు అవుతాయని చెప్పడంతో అచేతనస్థితిలో ఉన్న వేణు దంపతుల దీనగాథను సాక్షిలో ‘అయ్యో పాపం సహస్ర’ శీర్షికను ప్రచురించింది. దీంతో పలువురు స్పందించి ఆర్థికసాయం అందించారు. సహస్ర చదువుకునే మహర్షి హైస్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి రూ.55వేలు జమచేసి అందజేశారు. సహస్ర తల్లి కూతురుకు లివర్ ఇవ్వడంతో ఇద్దరూ కోలుకుంటున్నారు. స్కూల్ కరెస్పాండెంట్ బూర శ్రీనివాస్ మాట్లాడుతూ సహస్రకు వచ్చే అకాడమీలో ఫీజు తీసుకోబోమన్నారు. ప్రిన్సిపాల్ శ్వేత తదితరులు పాల్గొన్నారు. -
వినియోగదారుల సమస్యలు పరిష్కరించాలి
బోయినపల్లి(చొప్పదండి): విద్యుత్ వినియోగదారుల సమస్యలు నెల రోజుల్లో పరిష్కరించాలని నిజామాబాద్ సీజీఆర్ఎఫ్ చైర్మన్–11, టీజీఎన్పీడీసీల్ ఎరుకల నారాయణ సూచించారు. బోయినపల్లిలోని రైతువేదికలో బోయినపల్లి, కోనరావుపేట, వేములవాడ అర్బన్ మండలాలకు సంబంధించి విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక శుక్రవారం నిర్వహించారు. మొదట సర్పంచులు ఏనుగుల కనకయ్య, కౌడగాని వెంకటేశ్, శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గ్రామపంచాయతీలకు ఉచిత కరెంట్ ఇవ్వాలని కోరారు. లూజ్వైర్లు ఉన్న చోట మిడిల్పోల్స్, రోడ్ల వెంట చిన్నపోల్స్ తీసి, పెద్దపోల్స్ వేయాలని కోరారు. ఇళ్ల పైనుంచి వెళ్తున్న హైటెన్షన్ వైర్లు తొలగించాలని విన్నవించారు. టీజీఎన్పీడీసీఎల్ టెక్నికల్ మెంబర్ సలంద్ర రామకృష్ణ, ఫైనాన్స్ మెంబర్ షేర్ల సత్యనారాయణ, సీజీఆర్ఎఫ్ మెంబర్ మర్రిపెల్లి రాజాగౌడ్, ఎస్ఈ భిక్షపతి, డీఈ వెంకటరమణ, ఏడీఈ అనిల్కుమార్, ఏఈ ప్రశాంత్, కిసాన్సంఘ్ నాయకులు సంపత్రావు పాల్గొన్నారు. సీజీఆర్ఎఫ్ చైర్మన్ ఎరుకల నారాయణను సిరిసిల్ల పౌరసంక్షేమ సంఘం అధ్యక్షుడు బియ్యంకార్ శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు చేకోట అనిల్కుమార్, టెక్స్టైల్స్ పార్క్ అసోసియేషన్ లక్ష్మీనారాయణ, బుజ్జ భూమేశ్ సత్కరించారు.


