breaking news
Rajanna
-
మహిళలు వ్యాపారంలో ముందుకెళ్లాలి
● కలెక్టర్ సందీప్కుమార్ ఝాసిరిసిల్లఅర్బన్/తంగళ్లపల్లి/ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మహిళలు వ్యాపారంలో స్వయం సమృద్ధి సాధించాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా కోరారు. సిరిసిల్ల పట్టణ పరిధిలోని పెద్దూరులో మహాలక్ష్మి గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎరువులు, విత్తనాల దుకాణాన్ని కాంగ్రెస్ సిరిసిల్ల ఇన్చార్జి కె.కె.మహేందర్రెడ్డితో కలిసి శుక్రవారం ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి కింద జిల్లాలోని మహిళా సంఘాలకు ఇప్పటికే క్యాంటీన్లు, డెయిరీ యూనిట్, కోడిపిల్లల పెంపకం, ఆర్టీసీ బస్సులు, ఇతర స్వయం ఉపాధి యూనిట్లను అందజేశామన్నారు. ఇటీవల పెట్రోల్బంక్ను సైతం ప్రారంభించుకున్నట్లు తెలిపారు. సిరిసిల్ల మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు స్వరూపారెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అఫ్జల్బేగం తదితరులు పాల్గొన్నారు. ఇసుక కొరత లేదు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఇసుక కొరత లేదని కలెక్టర్ సందీప్కుమార్ ఝా స్పష్టం చేశారు. సిరిసిల్ల పట్టణ పరిధిలోని పెద్దూరులో కాంగ్రెస్ సిరిసిల్ల ఇన్చార్జి కె.కె.మహేందర్రెడ్డితో కలిసి ఇందిరమ్మ ఇండ్ల పనులను పరిశీలించారు. ఇసుకకు ఇబ్బంది అయితే పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. ట్రాక్టర్ యజమానులు లేబర్, వాహన చార్జీలు కలిపి ట్రిప్పునకు రూ.1500 మాత్రమే తీసుకోవాలని స్పష్టం చేశారు. అంగన్వాడీ భవనాలు ప్రారంభం తంగళ్లపల్లిమండల కేంద్రంలోని వివేకనందకాలనీ, పాతవాడలోని రెండు అంగన్వాడీ భవనాలు, ఎల్లారెడ్డిపేట మండలం కిషన్దాస్పేట ప్రాథమిక పాఠశాల ఆవరణలో అంగన్వాడీ భవనాలను ప్రారంభించారు. కాంగ్రెస్ తంగళ్లపల్లి మండలాధ్యక్షుడు ప్రవీణ్ జే టోని, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం పాల్గొన్నారు. పోటీపరీక్షల్లో రాణించేందుకు మంచి అవకాశం అన్ అకాడమీ ద్వారా అందించే ఉచిత శిక్షణను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని పోటీపరీక్షల్లో రాణించాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా సూచించారు. ఎల్లారెడ్డిపేటలోని మహాత్మా జ్యోతిబాపూలే ఇంటర్, డిగ్రీ కళాశాలలో అన్ అకాడమీ ఆన్లైన్ తరగతులను ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రతీ రోజు కనీసం 2 గంటలపాటు ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలని సూచించారు. విద్యార్థి జీవితంలో 10, 11, 12వ తరగతులు కీలకమని.. దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సాబేరా బేగం, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, కళాశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్లకు మట్టి కొరత లేకుండా చూడాలి
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చందుర్తి(వేములవాడ): ఇందిరమ్మ ఇళ్లకు ఎలాంటి కొర్రీలు లేకుండా మట్టి అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. చందుర్తిలోని రైతువేదికలో శుక్రవారం మండలంలోని పలు గ్రామాలకు చెందిన 21 మంది లబ్ధిదారులకు రూ.7.35 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శుక్రవారం పంపిణీ చేశారు. ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లను శరవేగంగా పూర్తి చేసుకోవాలన్నారు. బేషిమెంటు లెవల్ నిర్మాణం పూర్తయినా లబ్ధిదారులకు త్వరలో బిల్లుల చెల్లింపు జరుగుతోందన్నారు. తహసీల్దార్ శ్రీనివాస్, పార్టీ మండలాధ్యక్షుడు చింతపంటి రామస్వామి, రుద్రంగి మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు బొజ్జ మల్లేశం, మాజీ జెడ్పీటీసీ సభ్యులు నాగం కుమార్, సనుగుల సింగిల్విండో మాజీ చైర్మన్ ముస్కు ముకుందరెడ్డి, మాజీ ఉపాధ్యక్షుడు ఏగోళపు శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
నేరాల విచారణలో శాసీ్త్రయ ఆధారాలు కీలకం
● ఎస్పీ మహేశ్ బీ గీతేసిరిసిల్లక్రైం: ఆధునిక ఫోరెన్సిక్, శాసీ్త్రయ ఆధారాలతో నేరాలను సమర్థంగా పరిష్కరించవచ్చని ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. సంఘటన స్థలంలో ఆధారాల సేకరణ, భద్రతలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా కేసుల దర్యాప్తులో కచ్చితమైన ఫలితాలు సాధించవచ్చన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మెడికల్ కళాశాల వైద్యనిపుణుల ఆధ్వర్యంలో జిల్లాలోని ఇన్వెస్టిగేషన్ అధికారులకు, స్టేషన్ రైటర్లకు శుక్రవారం శిక్షణ ఇచ్చారు. హత్యలు, ఆత్మహత్యలు, దొంగతనాల ఘటనల్లో ఏయే ఆధారాలు ఎలా సేకరించాలి అనేదానిపై అవగాహన కల్పించారు. అదనపు ఎస్పీ చంద్రయ్య, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరీ, వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ, వైద్యులు నిర్వీశ, వినయ్, సీఐలు కృష్ణ, మొగిలి, శ్రీనివాస్, వీరప్రసాద్, శ్రీనివాస్, ఆర్ఐలు యాదగిరి, మధుకర్, ఎస్ఐలు పాల్గొన్నారు. -
ఎఫ్ఆర్ఎస్కు సర్వర్ ప్రాబ్లమ్
● టీచర్ల అటెండెన్స్కు మొదటి రోజు కష్టాలు ● మొబైల్ సిగ్నల్ లేక తిప్పలుఇల్లంతకుంట(సిరిసిల్ల): ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయుల అటెండెన్స్ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎఫ్ఆర్ఎస్(ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్)లో మొదటి రోజులు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. మారుమూల పల్లెల్లో మొబైల్ సిగ్నల్స్ సరిగా లేకపోవడం, మరికొన్ని గ్రామాల్లో సర్వర్ ప్రాబ్లమ్స్తో అటెండెన్స్ నమోదుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఉపాధ్యాయులు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎఫ్ఆర్ఎస్ యాప్ను తమ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు, యూపీఎస్, హైస్కూల్ టీచర్లకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 4.15 వరకు పనివేళలు. శుక్రవారం మొదటి రోజు కావడంతో యాప్ డౌన్లోడ్, రిజిస్ట్రేషన్ చేసుకొని అటెండెన్స్ నమోదు చేసుకున్నారు. ఉదయం స్కూల్ లోకేషన్లో ఉండి తమ మొబైల్ ఫోన్ నుంచి యాప్కు లాగిన్ కావాలి. పాఠశాల పనివేళలు ముగిసిన తర్వాత మొబైల్లోనే లాగౌట్ కావాలి. మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలల్లో సిగ్నల్, సర్వర్ ప్రాబ్లమ్స్తో రిజిస్ట్రేషన్, అటెండెన్స్ ప్రక్రియలో జాప్యమైనట్లు తెలిసింది. ఇల్లంతకుంట మండలంలో గురుకుల, మోడల్స్కూల్, కేజీబీవీలతో కలిపి 37 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. గతేడాది నుంచి విద్యార్థులకు ఎఫ్ఆర్ఎస్ అమలులో ఉండగా.. ఇప్పుడు ఉపాధ్యాయులకూ అమలు చేస్తున్నారు. -
విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు శుక్రవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, మండల అధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్రావు ఆధ్వర్యంలో సైకిళ్లు పంపిణీ చేశారు. నేరెళ్ల, జిల్లెల్ల, మండెపల్లి గ్రామాల ప్రభుత్వ పాఠశాలల్లో సైకిళ్లు అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి, బీజేపీ సీనియర్ నాయకుడు తుపాకుల సత్తయ్య, మండల ప్రధాన కార్యదర్శులు ఇటికల రాజు, కోస్నీ వినయ్ యాదవ్, ఉపాధ్యక్షుడు రెడ్డిమల్ల ఆశీర్వాద్, కాసుగంటి రాజు, బూత్ అధ్యక్షుడు రేగుల రాజు, నాగుల శ్రీనివాస్, కట్కం మధుసూదన్, కట్ట తిరుపతి, ఆసాని లక్ష్మారెడ్డి, బక్కశెట్టి రాజు, ముత్యం యాదవ్, బోయినీ రాజు, సందీప్, దూడం నవీన్, ఇంద్రనగర్ సంతోష్, గంధం రాజు, పొన్నం అనిల్, దాసరి రమేశ్ పాల్గొన్నారు. -
‘గీతకార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం’
బోయినపల్లి(చొప్పదండి): గీతకార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. మండలంలోని మల్కాపూర్లో ఈజీఎస్, ఎకై ్సజ్, గౌడసంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన వన మహోత్సవంలో ఈతమొక్కలు నాటారు. అనంతరం తడగొండ ప్రైమరీ పాఠశాలను తనిఖీ చేశారు. తహసీల్దార్ నారాయణరెడ్డి, ఎంపీడీవో జయశీల, ఏపీవో సబిత, ఎంఏవో ప్రణిత, సిరిసిల్ల ఎకై ్సజ్ ఇన్చార్జి సీఐ శ్రీనివాస్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కూస రవీందర్, సెస్ డైరెక్టర్ సుధాకర్, ఏఎంసీ చైర్మన్ ఎల్లేశ్యాదవ్ ఉన్నారు. ప్రతీరోజు పర్మిషన్లు ఇవ్వాలి తంగళ్లపల్లి(సిరిసిల్ల): ఇందిరమ్మ ఇండ్లు, ప్రైవేటు నిర్మాణాల కోసం ప్రతీ రోజు ఇసుక, మట్టికి అనుమతులు ఇవ్వాలని భవన నిర్మాణ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు కోరారు. మండలంలోని బద్దెనపల్లిలో శుక్రవారం మాట్లాడారు. వారానికి రెండుసార్లు మాత్రమే అనుమతులు ఇవ్వడంతో భవన నిర్మాణాలకు ఇసుక, మట్టి సరిపోవడం లేదన్నారు. నాయకులు బద్దెనపల్లి సుదర్శన్, సారుగు ప్రమోద్, గడ్డం ఆంజనేయులు, షేర్ల సుధీర్, విక్రమ్, రవి, అరవింద్, వెంకటేశ్, బాలయ్య, సత్తయ్య పాల్గొన్నారు. ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలి సిరిసిల్లటౌన్: జిల్లా ఉద్యమకారులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని ఉద్యమకారులు కోరారు. కరీంనగర్ జిల్లా కోర్టుకు శుక్రవారం హాజరై మాట్లాడారు. తమపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డిలను కోరినట్లు తెలిపారు. రెండేళ్లుగా జిల్లాలో ఉన్న కేసులను కరీంనగర్ జిల్లాకు ట్రాన్స్ఫర్ చేశారన్నారు. తమపై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని ఉద్యమకారులు చొక్కాల రాము, కంసాల మల్లేశం, వీరవేణి మల్లేశం, మైలారం తిరుపతి తదితరులు కోరారు. రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు ఎంపిక సిరిసిల్లఅర్బన్: జిల్లా యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక సాయికృష్ణ ఫంక్షన్హాల్లో జిల్లాస్థాయి సీనియర్ విభాగంలో యోగా పోటీలు నిర్వహించినట్లు యోగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎలిగేటి కృష్ణ తెలిపారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన భానోతు రశ్మిత, జి.చందన, బి.అంగురి, బి.బిందు, ఎన్.స్వాతి, ఎం.సుమలత, బి.బేల, జి.శ్రావణి, సీహెచ్.హారతిసాగర్, ఎస్.సౌమ్య, బి.పద్మ, ఎల్.శ్రీనివాస్, ఎస్.అఖిల్సాగర్, రామకృష్ణ, ఎన్.కనకయ్య ఎంపికై నట్లు తెలిపారు. డీఎస్పీ చంద్రశేఖర్రెడ్డి చేతుల మీదుగా సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు. వీరు ఈనెల 7, 8వ తేదీల్లో ఆదిలాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. గౌరవ సలహాదారు కరుణాల భద్రాచలం, కార్యవర్గ సభ్యులు రాజయ్య, రామకృష్ణ, కనకయ్య, శ్రీనివాస్, రవి పాల్గొన్నారు. ముగిసిన ఆపరేషన్ ముస్కాన్● 97 మంది బాలబాలికల సంరక్షణ ● ఎస్పీ మహేశ్ బి గీతే సిరిసిల్లక్రైం: బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం సంవత్సరంలో రెండు సార్లు ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ ముగిసిందని ఎస్పీ మహేశ్ బి గీతే శుక్రవారం తెలిపారు. 18 ఏళ్లలోపు పిల్లలతో పనిచేయిస్తున్న వారిపై 14 కేసులు నమోదు చేశామన్నారు. సీడబ్ల్యూసీ ఎదుట హాజరుపర్చి 97 మంది బాలబాలికల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి అప్పగించినట్లు పేర్కొన్నారు. వీధి బాలలను కనిపిస్తే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
మిద్దైపె సూర్యోదయం
● ఇంటి మేడపై సోలార్ విద్యుత్ ఉత్పత్తి ● ప్యానెళ్ల ఏర్పాటుకు సబ్సిడీ ● ఆసక్తి చూపుతున్న ప్రజలు ● విస్తరిస్తున్న యూనిట్లు‘అది 1998.. సిరిసిల్ల ప్రాంతంలో జర్మనీకి చెందిన జీఎస్ఈ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పర్యటించారు. ఈ ప్రాంతంలో సేవ్స్ ద్వారా తాగునీటి ట్యాంకులు నిర్మిస్తూ, బోర్లు వేశారు. ఆ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు జర్మనీకి చెందిన పలువురు ఇంజినీర్లు ఇక్కడికొచ్చారు. సిరిసిల్ల ప్రాంతంలో పర్యటిస్తూ.. ఇక్కడ ఎండలను, వేడిని చూసి ఆశ్చర్యపోయారు. ఈ ఎండలు.. ఇక్కడి సూర్యరశ్మిని మాకు జర్మనీలో ఉంటే అద్భుతాలు సృష్టించేవారిమని చెప్పారు..’ అంటే.. 27 ఏళ్ల కిందట జర్మనీ ఇంజినీర్లు అన్న మాటలను ఇప్పుడు జిల్లాలో ప్రజలు సోలార్ ప్యానెల్స్ ద్వారా సౌర విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. జిల్లాలో మిద్దైపె సూర్యోదయాన్ని ఆవిష్కరిస్తున్నారు. ‘జిల్లా కేంద్రంలోని విద్యానగర్కు చెందిన కాముని నళినీకాంత్ తన ఇంటిపై రూ.7.50లక్షలు వెచ్చించి ఏడాది కిందట 10 కిలోవాట్స్ సామర్థ్యంతో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సబ్సిడీ ఆశించలేదు. పొద్దంతా ఎండతో ఉత్పత్తి అయ్యే విద్యుత్ బ్యాటరీల్లో స్టోర్ అయి రాత్రి వేళల్లో ఏసీలు, ఫ్యాన్లు, బల్బులు, లిఫ్ట్తో సహా అన్నింటికీ వినియోగమవుతుంది. ప్రతీ నెల వచ్చే రూ.15వేల విద్యుత్ బిల్లు ఆదా అవుతుంది. ఎండాకాలంలో విద్యుత్ వినియోగానికి అనుగుణంగా ఎండలు కూడా తీవ్రంగా కొడుతుండడంతో అదే స్థాయిలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఇలా సిరిసిల్లలో పెట్రోల్బంక్, ప్రాసెసింగ్, వస్త్రోత్పత్తి యూనిట్తోపాటు పలువురు ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకున్నారు. సిరిసిల్ల: సౌరశక్తిని సద్వినియోగం చేసుకుంటూ జిల్లా ప్రజలు సోలార్ విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. తమ అవసరాలకు సౌరశక్తిని సద్వినియోగం చేసుకుంటున్నారు. సూర్యకాంతిని వినియోగించడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయించాలని ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్ బిజిలీ యోజన పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. ఇందులో ఇంటి మేడపై ఒక్కో యూనిట్ ఏర్పాటుకు రూ.78వేలు సబ్సిడీ ఇస్తోంది. ఇతర పరికరాలకు 7 శాతం వడ్డీతో 90 శాతం మేరకు బ్యాంకు రుణం ఇస్తున్నారు. పదేళ్లపాటు సులభ వాయిదాల పద్ధతిలో అప్పు చెల్లించే వసతి కల్పించారు. 25 ఏళ్ల పాటు విద్యుత్ ఉత్పత్తికి గ్యారంటీ ఇస్తున్నారు. ప్రభుత్వ సబ్సిడీ పథకంతో జిల్లాలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు విస్తరిస్తున్నాయి. నాలుగు సౌరశక్తి విద్యుత్ ప్లాంట్లు జిల్లాలోని విద్యుత్ వినియోగదారుల అవసరాలను సౌరవిద్యుత్ తీర్చుతోంది. ఇంటిపైనే కాదు.. వ్యవసాయ యోగ్యం కాని భూముల్లో సహజ సిద్ధమైన సౌరవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు జిల్లాలో నాలుగు ఉన్నాయి. ఇక్కడ నిత్యం ఉత్పత్తి అవుతున్న విద్యుత్ను నేరుగా సబ్స్టేషన్లకు అనుసంధానం చేశారు. ఇల్లంతకుంట మండలం రామాజిపేటలో 150 ఎకరాల్లో, పెద్దలింగాపూర్లో 120 ఎకరాలు, వేములవాడ మండలం నూకలమర్రిలో 100 ఎకరాలు, ముస్తాబాద్ మండలం నామాపూర్లో 200 ఎకరాలలో సూర్యరశ్మి ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేశారు. జిల్లాలో 55 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఒక్క మెగావాట్ వెయ్యి కిలోవాట్స్తో సమానం. జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సబ్ స్టేషన్లతో అనుసంధానం చేసి గ్రిడ్కు సౌరవిద్యుత్ సరఫరా అవుతోంది. టెక్స్టైల్ పార్క్లోని యూనిట్లపైనా.. తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారులోని టెక్స్టైల్ పార్క్లోని వస్త్రోత్పత్తి యూనిట్లపైన సబ్సిడీతో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. 10 యూనిట్లపై సోలార్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. మండెపల్లి శివారులోని ప్రాసెసింగ్ యూనిట్లోనూ 440 కేవీ సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. -
పేరుకే పట్టాదారులు!
● లావణీ పట్టా ఉన్నా.. లేనట్టే ! ● వ్యవసాయానికి అనుకూలించని భూములు ● వాణిజ్య నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని విన్నపం ● 1971–72లో 11,138 ఎకరాలకు పట్టాల పంపిణీ ● అనుమతులు లేకుండానే ఇంటి నిర్మాణాలుఈ ఫొటోలోని వ్యక్తి గుగులోతు మోహన్నాయక్. రుద్రంగి మండలం సర్పంచ్తండా గ్రామస్తుడు. ప్రభుత్వం పంపిణీ చేసిన లావణీ పట్టా(ప్రభుత్వ) భూమిలో మినీ రైస్మిల్ ఏర్పాటుకు అనుమతుల కోసం అధికారుల వద్దకు వెళ్లాడు. లావణీ పట్టాగా ఉండడడంతో అనుమతులు ఇచ్చేందుకు అధికారులు నిరాకరించారు. దీంతో చేసేదేమీ లేక మినీ రైస్మిల్ ఏర్పాటు చేసుకోలేకపోయాడు. ఇలా ఇతను ఒక్కడే కాదు వ్యవసాయానికి సాగునీరు లేక, పంటలు పండని భూమి పట్టాలు పొందిన వేలాది మంది గిరిజనులు వాణిజ్య నిర్మాణాలు చేపట్టాలనే ప్రయత్నాలు విస్మరించుకున్నారు. అనుమతులు లభించక ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నారు.రుద్రంగి(వేములవాడ): దశాబ్దాల క్రితం ప్రభుత్వం ఇచ్చిన భూమిలో నేడు పంటలు పండే పరిస్థితులు లేక గిరిజనుల వాణిజ్య నిర్మాణాల కోసం పెట్టుకున్న అనుమతులను అధికారులు రద్దు చేస్తున్నారు. లావణీ పట్టాగా ఉండడంతో వాణిజ్య నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం లేదు. దీంతో రైతుల వద్ద భూమి ఉన్నా పంటలు పండించుకోలేక.. వాణిజ్య నిర్మాణాలు చేపట్టుకోలేక ఖాళీగా ఉంటున్నారు. 1971–72లో పట్టాలు మెట్టప్రాంతం మానాల, గిరిజనతండాల్లోని గిరిజనులు పోడు వ్యవసాయంపైనే ఆధారపడి జీవించేవారు. 1971–72 ప్రాంతంలో అప్పటి ప్రభుత్వం నిరుపేద గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు పంపిణీ చేసింది. సాగునీటి వసతి లేక వర్షాధార వంటలు సాగుచేసుకుంటున్నారు. పంటలు సరిగ్గా పండకపోవడంతో పలు వురు గిరిజనులు వాణిజ్య నిర్మాణాలు చేపట్టి వ్యా పారం చేసి ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తామని అనుమతుల కోసం అధికారుల వద్దకు వెళ్తే స్పందించ డం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోతున్న జీపీలు, ప్రభుత్వం మానాల, గిరిజన తండా గ్రామాల్లో నిర్మాణాలు చేపట్టే వారు అనుమతుల కోసం గ్రామపంచాయతీ కార్యాలయాలకు వెళ్తే లావణీ పట్టా భూములు కావడంతో అధికారులు అనుమతులకు నిరాకరిస్తున్నారు. దీంతో పలువురు గిరిజనులు అనుమతులు లేకుండానే ఇండ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో గ్రామపంచాయతీలు ఇంటిపన్ను రూపంలో వచ్చే ఆదాయం కోల్పోతున్నాయి. వాణిజ్య నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకపోవడంతో ప్రభుత్వంకు వచ్చే రెవెన్యూ పన్నులు కోల్పోతుంది. గిరిజనులకు వాణిజ్య నిర్మాణాలకు అనుమతుల సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలి ఉపాధి లేని నిరుపేద గిరిజనులకు వారు సాగుచేసుకుంటున్న భూములకు పట్టాలు పంపిణీ చేసింది. కానీ మెట్టప్రాంతం మానాల, గిరిజనతండా గ్రామాల్లో సాగునీటి వసతి లేక వర్షాధార పంటలపైనే ఆధారపడాల్సి వస్తోంది. దీంతో వారు పేదరికంలోనే ఉంటున్నారు. ప్రభుత్వం గిరిజనులు ఆర్థికంగా ఎదిగేందుకు వాణిజ్య నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలి. – నరహరి నాయక్, రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, సర్పంచ్తండా గ్రామస్తుడువ్యవసాయానికే పట్టాలు ఉపాఽధి లేని నిరుపేదలు వ్యవసాయం చేసుకొని ఉపాధి పొందుతారని లావణీ పట్టాలను ప్రభత్వం పంపిణీ చేసింది. లావణీ పట్టా భూమిలో ఇళ్లు, వాణిజ్య నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వ నుంచి ఎలాంటి ఆదేశాలు లేవు. – పుష్పలత, తహసీల్దార్, రుద్రంగి -
ప్రజెంట్ సార్... అర్ధనగ్నంగా సెల్ఫీ దిగి..
తంగళ్లపల్లి(సిరిసిల్ల): పంచాయతీ కార్యదర్శులు నిత్యం డీఎస్ఆర్ యాప్లో సెల్ఫీ దిగి తమ హాజరును నమోదు చేయాలి. అనంతరం గ్రామంలో చేపట్టే పనుల ఫొటోలు పోస్టు చేయాలి. కానీ తంగళ్లపల్లి, సారంపల్లి గ్రామాల కార్యదర్శి మహ్మద్ సమీర్ జూలై 29, 30 తేదీలలో ఒంటిపై బట్టలు లేకుండా.. తన ఇంటిలోనే సెల్ఫీ దిగి హాజరు పూర్తిచేసినట్లు గుర్తించారు. దీనిపై తంగళ్లపల్లి ఎంపీడీవో లక్ష్మీనారాయణను ‘సాక్షి’వివరణ కోరగా.. పంచాయతీ కార్యదర్శుల డీఎస్ఆర్ పరిశీలిస్తున్నామని తెలిపారు. ఇలాంటివి జరిగినట్లు గుర్తిస్తే ఉన్నతాధికారులకు నివేదిస్తామని పేర్కొన్నారు. సీఎం ఫొటోతో హాజరుపంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేసిన జగిత్యాల కలెక్టర్బుగ్గారం: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫొటోతో ఆన్లైన్లో హాజరు నమోదు చేసుకున్న జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చంద్రయ్యపల్లి పంచాయతీ కార్యదర్శిపై వేటు పడింది. కలెక్టర్ సత్యప్రసాద్ కార్యదర్శిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కొంతకాలంగా పంచాయతీ కార్యదర్శుల హాజరు నమోదుపై అనుమానం వచ్చిన ఉన్నతాధికారులు.. ఇటీవల ప్రత్యేక పరిశీలన జరిపారు. పలువురు పంచాయతీ కార్యదర్శులు తమ హాజరు నమోదు విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తేలింది. చంద్రయ్యపల్లె గ్రామ పంచాయతీ కార్యదర్శి టి.రాజన్న ఏకంగా ముఖ్యమంత్రి ఫొటోనే వాడి డీఎస్ఆర్ (డైలీ శానిటేషన్ రిపోర్ట్)యాప్లో హాజరు నమోదు చేసుకున్నాడు. ఉన్నతాధికారుల పరిశీలనలో విషయం బయటపడడంతో.. కలెక్టర్ సత్యప్రసాద్ కార్యదర్శి రాజన్నను సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయమై బుగ్గారం ఎంపీడీవో అఫ్జల్మియాను వివరణ కోరగా.. హాజరు నమోదుకు సంబంధించి కారోబార్ చేసిన పొరపాటుతో ఈ పరిస్థితి తలెత్తిందని తెలిపారు. -
కొత్త కోర్సులు.. కాలేజీలు.. హాస్టళ్లు
● శాతవాహన యూనివర్సిటీ పరిధిలో అభివృద్ధి పనులు షురూ ● హుస్నాబాద్లో ఇంజినీరింగ్, క్యాంపస్లో లా కళాశాల ● ఎల్ఎండీ, క్యాంపస్లో ఎంసీఏ కోర్సు మంజూరు ● మూడు ఆడిటోరియంల ఆధునీకరణ ● ఫార్మసీ కాలేజీ, గోదావరిఖని క్యాంపస్ భూముల రక్షణకు ప్రహరీ ● మరో రెండు హాస్టళ్ల నిర్మాణానికి ఈ నెల 4న శంకుస్థాపనసాక్షిప్రతినిధి,కరీంనగర్: గత వైస్ చాన్స్లర్ హయాంలో అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన శాతవాహన యూనివర్సిటీ.. ఇప్పుడు అభివృద్ధి పథంలో అడుగులు వేస్తోంది. కొత్త కళాశాలలు, కోర్సులతో మరింత విస్తరిస్తోంది. శాతవాహన యూనివర్సిటీ వైస్ చాన్స్లర్గా ప్రొఫెసర్ ఉమేశ్ కుమార్ బాధ్యతలు చేపట్టిన 9 నెలల్లోనే కొత్త కళాశాలలు, కోర్సులకు అనుమతులు పొందడంతోపాటు అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. జిల్లాకు చెందిన మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, కేంద్ర మంత్రి బండి సంజయ్ సహకారంతో హుస్నాబాద్లో ఇంజినీరింగ్ కాలేజీ, క్యాంపస్లో లా కాలేజీతోపాటు ఫార్మసీ కాలేజీలో ఎంఫార్మసీ కోర్సు, క్యాంపస్లో ఎంసీఏ కోర్సు, అకడమిక్ బ్లాక్, రెండు కొత్త హాస్టళ్లు మంజూరయ్యాయి. ఇంజినీరింగ్, లా కాలేజీ నిర్వహణకు 120 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ‘బండి’ సహకారంతో లా కాలేజీకి గుర్తింపు ఎస్యూ క్యాంపస్లో మూడేళ్ల ఎల్ఎల్బీ, రెండేళ్ల ఎల్ఎల్ఎం కోర్సులతో లా కాలేజీ ప్రారంభం కాబోతోంది. మూడేళ్ల లా కోర్సులో ఒక్కో సెక్షన్లో 60 అడ్మిషన్ల చొప్పున 120 సీట్లు(2 సెక్షన్లు), ఎల్ఎల్ఎం(ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ లా)లో 20 సీట్లు మంజూరు చేశారు. లా కాలేజీలో బోధనకు 14 టీచింగ్, 19 నాన్ టీచింగ్ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. లా కాలేజీకి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) గుర్తింపు తప్పనిసరి కావడంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సహకారంతో అతి తక్కువ కాలంలో అనుమతులు లభించాయి. ఫార్మసీ కళాశాలకు మహర్దశ ఎల్ఎండీ సమీపంలోని ఫార్మసీ కళాశాలలో ఇ న్నాళ్లు బీఫార్మసీ కోర్సు మాత్రమే ఉండేది. తాజాగా ఎంఫార్మసీ ప్రారంభించేందుకు ఫార్మసీ కౌన్సిల్ ఆ ఫ్ ఇండియా అనుమతిచ్చింది. ఫార్మసీ కళాశాలలో పీఎం ఉష నిధులు రూ.7.28 కోట్లతో చేపట్టిన అకడమిక్ బ్లాక్ నిర్మాణ పనులకు గత నెల 22న మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్రావు శంకుస్థాపన చేశారు. ఫార్మసీ కళాశాల భూములు ఆక్రమణకు గురికాకుండా రూ.2.85 కోట్ల వర్సిటీ నిధులతో ప్రహరీ పనులు ప్రారంభించారు. సదుపాయాలకు పెద్దపీట వర్సిటీలో సదుపాయాలకు పెద్దపీట వేస్తున్నాం. కొత్తకాలేజీలు, హాస్టళ్లు, ఆడిటోరియాలు నిర్మిస్తున్నాం. క్యాంపస్లో శాతవాహన విగ్రహం ప్రతిష్టించనున్నాం. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు యూనివర్సిటీ విషయంలో సానుకూలంగా అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. త్వరలో వర్సిటీకి న్యాక్ గుర్తింపు కోసం దరఖాస్తు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. – ఉమేశ్ కుమార్, వీసీ, శాతవాహన యూనివర్సిటీహుస్నాబాద్లో ఇంజినీరింగ్ కాలేజీ శాతవాహన యూనివర్సిటీ పరిధిలో ఈ విద్యాసంవత్సరంలో హుస్నాబాద్లో ఇంజినీరింగ్ కళాశాల ప్రారంభం కాబోతోంది. ఇందులో సీఎస్ఈ, ఈసీఈ, ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు మంజూరు చేశారు. ఇందుకోసం 54 టీచింగ్ పోస్టులు, 33 నాన్ టీచింగ్ పోస్టులు మంజూరు చేశారు. బీటెక్లో ఒక్కోబ్రాంచ్లో 60అడ్మిషన్ల చొప్పున 240 సీట్లకు ప్రవేశాలు కల్పించనున్నారు. ఎప్సెట్ కౌన్సెలింగ్లో ఇప్పటికే 110మంది విద్యార్థులు రిపోర్ట్ చేశారు.మరెన్నో పనులు గోదావరిఖని పీజీ కాలేజీలో అకడమిక్ బ్లాక్, ప్రహరీ, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ నుంచి ఎంబీఏ బ్లాక్ వరకు అప్రోచ్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ కళాశాలలో గతంలో ఉన్న పాత సెమినార్ హాల్ను సరికొత్త సీటింగ్, సౌండ్ సిస్టంతో ఆధునీకరించి మంత్రి పొన్నం చేతుల మీదుగా ప్రారంభించారు. కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కాలేజీ, ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ కాలేజీలో కొత్త కంప్యూటర్ ల్యాబ్, అన్ని డిపార్ట్మెంట్లు, ఫార్మసీ కాలేజీ, గోదావరిఖని పీజీ కాలేజీలో డిజిటల్ స్మార్ట్ క్లాస్రూమ్స్ ఏర్పాటు చేశారు.మరో రెండు కొత్త హాస్టళ్లు శాతవాహన యూనివర్సిటీ విద్యార్థులకు మరో రెండు కొత్త హాస్టళ్లు అందుబాటులోకి రాబోతున్నాయి. యూనివర్సిటీలో అడ్మిషన్లు పెరుగుతున్న నేపథ్యంలో క్యాంపస్లో ఒకటి, ఫార్మసీ కాలేజీలో మరొకటి గర్ల్స్ హాస్టల్ నిర్మించాలని నిర్ణయించారు. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మంజూరు చేసిన రూ.20 కోట్ల నిధులతో ఈ హాస్టళ్ల పనులకు ఈ నెల 4న శంకుస్థాపన చేసేందుకు జిల్లా ఇన్చార్జీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను ఆహ్వానించినట్లు వీసీ ఉమేశ్ కుమార్ వెల్లడించారు. త్వరలో రూ.18 కోట్లతో లా కాలేజీతో పాటు, సెంట్రల్ లైబ్రరీలో సెమినార్ హాల్ ఆధునీకరణ, పరిపాలన భవనంలోని మొదటి అంతస్తులో ఉన్న నూతన సెమినార్ హాల్ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. -
రోడ్డు ఎప్పుడు వేస్తారో..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): సీసీ రోడ్డు నిర్మాణానికి నాలుగు నెలల క్రితం శంకుస్థాపన చేసి మరిచిపోయారంటూ ఎల్లారెడ్డిపేట మండలం బుగ్గరాజేశ్వరతండావాసులు గురువారం నిరసన తెలిపారు. తండాపరిధిలోని టీక్యాకాలనీలో 11 కుటుంబాలు నివసిస్తున్నాయి. తండాకు వెళ్లడానికి సరైన రోడ్డు లేదు. దీనికితోడు ఈమార్గంలోనే ఒర్రె ఉండడంతో వారి తిప్పలు చెప్పుకోలేనివిగా ఉన్నాయి. ఇటీవల రూ.5లక్షలతో 100 మీటర్ల రోడ్డు వేయడానికి శంకుస్థాపన చేసినా నాయకులు పనులు మాత్రం చే యడం లేదు. దీంతో తండావాసులు నిరసనకు దిగారు. ఇప్పటికైనా రోడ్డు వేయాలని కోరుతున్నారు. -
రేషన్కార్డులొచ్చాయ్..
● ఎదురుచూపులకు తెర ● 14వేలకు పైగా కొత్త కార్డులు ● కొత్త కోడళ్లు.. పిల్లలకు కార్డుల్లో చోటు ● సెప్టెంబర్ నుంచి బియ్యం పంపిణీబోయినపల్లి(చొప్పదండి): ఎదురుచూపులకు తెరపడింది. పెళ్లయి, సంతానం కలిగినా రేషన్కార్డులు రాకపోవడంతో ఆందోళన చెందిన వారి మనసులు ఉప్పొంగుతున్నాయి. కొత్త రేషన్కార్డులను ప్రభుత్వం మంజూరు చేయడంతో పేదల ఎదురుచూపులు ఫలించాయి. జిల్లాకు కొత్తగా 14,075 రేషన్కార్డులు మంజూరయ్యాయి. మరో 30,376 మందిని రేషన్కార్డుల్లో కొత్తగా నమోదు చేశారు. సెప్టెంబర్ నుంచి లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కొత్తగా 14వేల రేషన్కార్డులు జిల్లాలోని 13 మండలాల్లో ఇప్పటి వరకు 1,74,304 రేషన్కార్డులు ఉన్నాయి. వీటి కింద ప్రతీ నెల సుమారు 3,300 టన్నుల బియ్యం సరఫరా అవుతుంది. జిల్లాలో కొత్తగా 14,075 రేషన్కార్డులు మంజూరయ్యాయి. మరో 30,376 మంది పేర్ల ను ఇప్పటికే ఉన్న కార్డుల్లో నమోదు చేశారు. కొత్తకార్డులు మంజూరుకావడంతో జిల్లాలో అదనంగా 200 టన్నుల బియ్యం సరఫరా కానున్నాయి. కొత్త కోడళ్లకు.. పిల్లలకు చాన్స్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2021లో ఒకసారి రేషన్కార్డులు మంజూరు చేశారు. నాలుగేళ్ల తర్వాత మళ్లీ కొత్తకార్డులు వచ్చాయి. ఇటీవల చాలా గ్రామాల్లో ఎంతో మంది కొత్తగా వివాహం చేసుకున్నారు. కొత్త కోడళ్ల పేర్లు రేషన్కార్డుల్లో లేక బియ్యం, సరుకులు రావడం లేదు. అలాగే కొత్తగా జన్మించిన పిల్లల పేర్లు నమోదు కావడం లేదు. ఇప్పుడు కొత్తకార్డులు మెజార్టీగా కొత్త కోడళ్లకే మంజూరయ్యాయి. రేషన్కార్డుల వివరాలు మండలం పాతకార్డులు కొత్తకార్డులు బోయినపల్లి 11,911 1,070 చందుర్తి 10,932 818 ఇల్లంతకుంట 15,628 887 గంభీరావుపేట 14,472 947 కోనరావుపేట 13,814 889 ముస్తాబాద్ 14,518 1,499 రుద్రంగి 4,845 88 సిరిసిల్ల 26,784 2,610 తంగళ్లపల్లి 14,346 1,407 వీర్నపల్లి 4,229 329 వేములవాడ 19,393 1,405 వేములవాడరూరల్ 7,509 632 ఎల్లారెడ్డిపేట 15,823 1,494రేషన్కార్డుల సమాచారం ఇప్పటి వరకు ఉన్న కార్డులు 1,74,304 పాతకార్డుల్లో ఉన్న సభ్యులు 5,22,967 పాతకార్డుల ద్వారా వచ్చే బియ్యం 3,300 టన్నులు కొత్తగా మంజూరైన రేషన్కార్డులు 14,075 కొత్తగా రానున్న బియ్యం 200 టన్నులు -
మహిళలు ఆర్థికంగా ఎదగాలి
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ● లింగన్నపేటలో పెట్రోల్బంక్ ప్రారంభంగంభీరావుపేట(సిరిసిల్ల): మహిళలు ఆర్థికంగా ఎదిగి ఆత్మగౌరవంతో జీవించాలనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. గంభీరావుపేట మండలం లింగన్నపేటలో శ్రీషిర్డీ సాయిబాబా గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్బంక్ను గురువారం కలెక్టర్ సందీప్కుమార్ ఝా, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళా సంఘాల ద్వారా మూడు పెట్రోల్ బంక్లు నడుస్తున్నాయన్నారు. పేదల సంక్షేమం ఎజెండాగా ఇందిరమ్మ పాలన కొనసాగుతోందన్నారు. గత పాలకులు ప్రజల ప్రయోజనాలు పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన శ్రీరాంసాగర్, మానేరు, నాగార్జునసాగర్, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులు నేటికి ప్రజలకు సేవలందిస్తున్నాయన్నారు. మహిళలకు వడ్డీలేని రుణాల పథకం ప్రారంభించి ఇప్పటికే రెండుసార్లు చెల్లించినట్లు గుర్తు చేశారు. మహిళల ఆదాయం పెంచేందుకు స్వయం సహాయక సంఘాల ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, పాడిపశువుల పెంపకం, ఇందిరాశక్తి క్యాంటీన్, ఆర్టీసీకి అద్దె బస్సులు, పాఠశాలలకు ఏకరూప దుస్తులు కుట్టడం వంటి అనేక మార్గాలను అన్వేషిస్తున్నామన్నారు. జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, ఏఎంసీ చైర్పర్సన్ కొమిరిశెట్టి విజయ, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు హమీద్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మండ్లు, తహసీల్దార్ మారుతిరెడ్డి, ఎంపీడీవో రాజేందర్, ఐకేపీ ఏపీఎం సుదర్శన్, సీసీ దోమకొండ సురేందర్ పాల్గొన్నారు. విద్యతోనే ఉన్నత లక్ష్యాలు సాధ్యం గంభీరావుపేట/తంగళ్లపల్లి(సిరిసిల్ల): విద్య ద్వారానే ఉన్నత లక్ష్యాలు సాధ్యమని కలెక్టర్ సందీప్కుమార్ ఝా పేర్కొన్నారు. దమ్మన్నపేట, మండెపల్లి మోడల్స్కూళ్లలో ఆన్ అకాడమీ ద్వారా ఆన్లైన్ తరగతులను కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఢిల్లీ విద్యార్థులకు అందే శిక్షణ నేడు సాంకేతికతను వినియోగించుకొని రాజన్నసిరిసిల్ల జిల్లా విద్యార్థులకు అందిస్తున్నామన్నారు. జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, తహసీల్దార్లు మారుతిరెడ్డి, జయంత్కుమార్, ప్రిన్సిపాల్స్ శ్రీలత, విఠల్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హమీద్ పాల్గొన్నారు. -
రాజన్న సేవలో ఎస్పీ
వేములవాడ: రాజన్నను ఎస్పీ మహేశ్ బి గీతే గురువారం దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు, వేద పండితులు ఎస్పీకి వేదమంత్రాలతో స్వాగతం పలికారు. కళ్యాణ మండపంలో వేదోక్త ఆశీర్వచనాలు, పర్యవేక్షకులు శ్రీనివాస్శర్మ లడ్డూ ప్రసాదం అందజేశారు. టౌన్ సీఐ వీరప్రసాద్ ఉన్నారు.రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు బోయినపల్లి(చొప్పదండి): జిల్లాలోని ప్రధాన రహదారుల్లోని జంక్షన్ల వద్ద రోడ్డు ప్రమాదాలు జరుగకుండా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా రవాణాశాఖ అధికారి లక్ష్మణ్ తెలిపారు. సిరిసిల్ల నుంచి కరీంనగర్ వెళ్లే దారిలో వేములవాడ మండలం నాంపల్లి, రుద్రవరం, ఆరెపల్లి, బోయినపల్లి మండలం కొదురుపాక, వెంకట్రావుపల్లి వరకు ప్రమాదాలు జరిగే స్పాట్లను గురువారం పరిశీలించారు. ప్రమాదాలు జరిగే రోడ్డు పరిసరాల్లో రంబుల్ స్ట్రిప్, స్టడ్స్లైట్స్, సోలార్ లైట్లు, అజార్డ్ మార్కర్స్ అమర్చేందుకు స్థలాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. మోటార్ వాహన తనిఖీ అధికారి వంశీధర్, జిల్లా రవాణాశాఖ సభ్యుడు సంగీతం శ్రీనాథ్, ట్రాఫిక్ ఎస్సై రాజు, ఆర్అండ్బీ డీఈలు శాంతయ్య, వరప్రసాద్, ఏఈఈ నవ్య తదితరులు ఉన్నారు. రేపు జావలిన్ డే పోటీలు సిరిసిల్లటౌన్: నీరజ్ చోప్రా ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించిన సందర్భంగా ఆగస్టు 2న జావెలిన్ డే నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కర్యాదర్శి బొజ్జ చంద్రశేఖర్ తెలిపారు. అండర్ 8, 10, 12, 14, 16, 18, 20 మెన్ అండ్ ఉమెన్స్కు జావెలిన్, పరుగుపందేల ఎంపిక పోటీలు శనివారం సిరిసిల్ల జూనియర్ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతిభ కనబరిచిన వారిని ఆగస్టు 7న జనగాంలో జరిగే రాష్ట్ర పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు తహసీల్దార్ జారిచేసిన డేట్ ఆఫ్ బర్త్, పదో తరగతి సర్టిఫికెట్లు ఒరిజినల్, జిరాక్స్లతో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని సూచించారు. వివరాలకు 79014 64456, 94414 56385, 93928 80231లలో సంప్రదించాలని కోరారు. ఉద్యోగుల సేవలు గుర్తుండిపోతాయి వేములవాడ: ఉద్యోగులు చేసిన సేవలు గుర్తిండిపోతాయని ఈవో రాధాభాయి పేర్కొన్నా రు. రాజన్న ఆలయంలో సహాయక ఇంజినీర్(సివిల్)గా పనిచేసిన ఆర్.లక్ష్మణ్రావు, ఇటీవల బదిలీపై వచ్చిన జి.లక్ష్మణ్ గురువారం ఉద్యోగ విరమణ పొందారు. వారిని ఉద్యోగుల సంఘం నాయకులతో కలిసి ఈవో రాధాభాయి సన్మానించారు. యూనియన్ అధ్యక్షుడు కూరగాయల శ్రీనివాస్ పాల్గొన్నారు. చక్కగా చదివి.. గొప్పగా ఎదగాలి ● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి తంగళ్లపల్లి(సిరిసిల్ల): ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చక్కగా చదివి గొప్పగా ఎదగాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆకాంక్షించారు. మండలంలోని ఓబు లాపూర్ ప్రభుత్వ పాఠశాలలోని పదోతరగతి విద్యార్థులు 24 మందికి మోదీ గిఫ్ట్ పేరుతో గురువారం సైకిళ్లు పంపిణీ చేశారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి, హెచ్ఎం బండి ఉపేందర్, నాయకులు సందెవేని రాజు, రాగుల లక్ష్మణ్రెడ్డి, ఆసాని రాంలింగారెడ్డి, సిరిసిల్ల వంశీ, కాసుగంటి రాజు, పంచాయతీ కార్యదర్శి రఘువీరారెడ్డి పాల్గొన్నారు. -
ఏసీబీకి చిక్కిన పీఆర్ ఏఈ
జగిత్యాలక్రైం: ప్రభుత్వ పనులు చేపట్టిన సివిల్ కాంట్రాక్టర్కు క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు డబ్బులు డిమాండ్ చేసిన జగిత్యాల పంచాయతీ రాజ్ శాఖలో విజిలెన్స్ క్వాలిటీకంట్రోల్ విభాగం ఏఈ అనిల్ బుధవారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. కోరుట్ల మండలం చిన్నమెట్పల్లికి చెందిన పంచరి వెంకటేశ్ సవిల్ కాంట్రాక్టర్. ఐదేళ్ల క్రితం కోరుట్లలో రూ.13.80 లక్షలతో ఎల్లమ్మ (గౌడ) కమ్యునిటీ హాల్ నిర్మించాడు. ఎంబీ రికార్డు కూడా పూర్తయింది. అలాగే రెండేళ్ల క్రితం రూ.4.50 లక్షలతో చిన్నమెట్పల్లిలో హనుమాన్ కమ్యునిటీ హాల్ నిర్మించాడు. కోరుట్లలోని ఆర్డీవో కార్యాలయం ప్రహరీని రూ.5లక్షలతో పూర్తి చేసి ఎంబీ రికార్డు పూర్తి చేయించాడు. మొత్తం మూడు పనులను రూ.23.30లక్షలతో పూర్తి చేశాడు. వాటికి సంబంధించిన బిల్లుల కోసం ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని ఏఈ అనిల్కుమార్ను కొన్నాళ్లుగా కోరుతున్నాడు. రేపుమాపు అంటూ కాలం వెళ్లదీస్తూ వచ్చిన అనిల్.. గత శనివారం రూ.18 వేలు డిమాండ్ చేశాడు. దీనికి వెంకటేశ్ రూ.10 వేలు ఇచ్చేందుకు ఒప్పుకుని అదేరోజు రూ.3వేలు అడ్వాన్స్గా ఇచ్చాడు. అనంతరం ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఏసీబీ అధికారులు బుధవారం సాయంత్రం కరీంనగర్రోడ్లో ఉన్న పంచాయతీరాజ్ శాఖ విజిలెన్స్ క్వాలిటీ కంట్రోల్ కార్యాలయం వద్ద కాపుకాశారు. వెంకటేశ్ నుంచి అనిల్ రూ.7వేలు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ విజయ్కుమార్ రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం అతడిపై కేసు నమోదు చేశారు. అనిల్ను కరీంనగర్ ఏసీబీ కోర్టుకు తరలించారు. ప్రభుత్వ ఉద్యోగులెవరైనా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ఫ్రీ నంబరు 1064లో సంప్రదించాలని డీఎస్పీ వివరించారు. దాడుల్లో ఏసీబీ సీఐలు పున్నం చందర్, కృష్ణకుమార్, తిరుపతి, సిబ్బంది శ్రీకాంత్, విష్ణు, బాలు, మొగిలయ్య పాల్గొన్నారు. రూ.7వేలు లంచం తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టివేత క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్తో డబ్బుల డిమాండ్ ఏసీడీ డీఎస్పీ విజయ్కుమార్ వెల్లడి -
కొడుకు, కోడలు మధ్య మనస్పర్థలు
జూలపల్లి(పెద్దపల్లి): తన కొ డుకు, కోడలు మధ్య మనస్పర్థలు తలెత్తాయనే మనస్తాప ంతో జెన్కో ఉద్యోగి మేడుదుల రాజన్న (49) బుధవారం తను పనిచేస్తున్న జలవిద్యుత్ కేంద్ర ం లోనే ఉరివేసుకుని ఆత్మ హ త్య చేసుకున్నాడు. ఎస్సై సనత్కుమార్ కథనం ప్రకారం.. పెద్దపల్లికి చెందిన రా జన్న జూలపల్లి మండలం కాచాపూర్ 14వ మైలురా యి వద్ద గల జెన్కో జలవిద్యుత్ కేంద్రంలో జూనియర్ ప్లాంట్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. ఆయనకు కుమారుడు సాయికుమార్, ఒక కూతురు ఉన్నారు. సాయికుమార్ 2020లో మేకల కావ్యను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వారికి కుమారుడు(3) ఉన్నాడు. అయితే, ఎంబీఏ చదువుకునేందు కు సాయికుమార్ 2022లో యూకేకు వెళ్లాడు. ఆ త ర్వాత ఆయన భార్య కావ్య తనతల్లిదండ్రుల వద్దకు వెళ్లి అక్కడే ఉంటోంది. 2024లో ఇండియాకు తిరిగి వచ్చిన సాయికుమార్.. తన భార్యను కాపురానికి రమ్మని అనేకసార్లు కోరినా ఆమె తిరస్కరించింది. దీంతో వారి మధ్య మనస్పర్థలు ఏర్పడి పంచాయితీలు జరుగుతున్నాయి. ఈక్రమంలోనే తన కుమారుడి సంసారం సాఫీగా సాగడం లేదనే మనస్తాపానికి గురైన తండ్రి రాజన్న.. తను పనిచేస్తున్న జలవిద్యుత్ కేంద్రంలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య కవిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసు కేసు నమోదు చేశారు. మనస్తాపంతో తండ్రి ఆత్మహత్య జలవిద్యుత్ కేంద్రంలో బలవన్మరణం -
సైబర్ నేరగాళ్ల ముఠా అరెస్ట్
● జన్నారం కేంద్రంగా కార్యకలాపాలు ● కాంబోడియా దేశం నుంచి సూచనలు ● వివరాలు వెల్లడించిన డీసీపీ భాస్కర్ జన్నారం: జన్నారం కేంద్రంగా సైబర్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి సైబర్ నేరాలకు వినియోగించే సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వివరాలను మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఆయన కార్యాలయంలో బుధవారం వెల్లడించారు. జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్(వీ) గ్రామానికి చెందిన భావు బాపయ్య 2024 జూలైలో కాంబోడియా దేశానికి వెళ్లి రెస్టారెంట్లో పనికి కుదిరాడు. బాపయ్యకు కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం వేదాంతపురం గ్రామానికి చెందిన పాలవల్సుల సాయికృష్ణ ఉరఫ్ జాక్ ఉరఫ్ రాజు విదేశాలకు వెళ్లేందుకు వీసా కోసం ప్రయత్నిస్తుండగా 2023లోనే ఛండీఘర్లో పరిచయమయ్యాడు. 2024లో రాజు కాంబోడియా వెళ్లి బాపయ్యను రెస్టారెంట్లో కలిశాడు. ఈ ఏడాది ఏప్రిల్లో బాపయ్య ఇండియాకు తిరిగి వచ్చాడు. ఓ రోజు వాట్సాప్లో బాపయ్యను సాయికృష్ణ సంప్రదించి.. జన్నారం ప్రాంతంలో తనకు ఒక అద్దె ఇల్లు కావాలని కోరాడు. దీనికి బాపయ్య తన చెల్లెలి భర్త, జన్నారం మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన గొట్ల రాజేశ్తో కలిసి కలమడుగు గ్రామంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఈ ఏడాది మేలో సాయికృష్ణ వాట్సాప్లో బాపయ్యను సంప్రదించి.. ఓ వ్యక్తి ద్వారా సామగ్రి పంపిస్తున్నానని, దానిని జగిత్యాల బస్టాండ్కు వెళ్లి తీసుకుని అద్దె గదిలో ఉంచాలని సూచించాడు. ఆ సమయంలో బాపయ్య అందుబాటులో లేకపోవడంతో అతడి తమ్ముడు మధుకర్ సామగ్రిని తీసుకెళ్లి కలమడుగులోని అద్దె గదిలో ఉంచారు. తర్వాత నెట్ కనెక్షన్, ఇన్వర్టర్, ల్యాప్టాప్ సమకూర్చుకున్నారు. తాను చెప్పినట్లు చేయాలని, ఇందుకు నెలకు రూ.30వేల చొప్పున ఇస్తానని, పైగా వచ్చిన సొమ్ములో వాటా కూడా ఇస్తానని బాపయ్య, మధుకర్, గొట్ల రాజేశ్ను సాయికృష్ణ పనికి కుదుర్చుకున్నాడు. వీరితోపాటు అప్పటికే ఆన్లైన్ గేమ్స్ ఆడి రూ.లక్షలు పోగొట్టుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన్యం జిల్లా పార్వతీపురానికి చెందిన యాండ్రాపు కామేశ్ను నెలకు రూ.70వేల జీతం, వాటా ఇస్తానని ఉద్యోగానికి కుదుర్చుకున్నాడు. కామేశ్కు ఢిల్లీలోని ఓ వీల్స్ కంపెనీలో డీజిల్ సేల్స్లో అకౌంట్ కీ మేనేజర్గా పనిచేసిన అనుభవం ఉంది. ఈ క్రమంలో బాపయ్య, మధుకర్, గొట్ల రాజేశ్, కామేశ్ కలిసి అద్దె గదిలో డీలింక్ రూటర్లు, ల్యాప్టాప్, సిమ్ ప్యానల్ ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు ప్రారంభించారు. ఆధారాలు లేని సిమ్కార్డులు 350 కొనుగోలు చేశారు. సాయికృష్ణ టెలిగ్రాం యాప్ ద్వారా చెప్పినట్లు ఈ నలుగురు ప్యానెల్లో సిమ్లు అమర్చి, కొంత సమయం తర్వాత తీయడం, కొత్త సిమ్లు పెట్టడం చేస్తూ ఉండేవారు. సిమ్బాక్స్ పరికరాలు ఏర్పాటు చేసి వివిధ రకాలైన ఐఎంఈఐ నంబర్లు, లింకులు తయారు చేసి సైబర్ నేరాలు పాల్పడుతూ అమాయక ప్రజలను మోసం చేసేందుకు యత్నిస్తున్నారు. పట్టుబడింది ఇలా.. ఢిల్లీకి చెందిన టెలి కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ సాంకేతిక పరిజ్ఞానంతో వీరి బండారాన్ని గుర్తించింది. రామగుండం సైబర్ క్రైం, పోలీసులు టెక్నికల్ సహాయంతో బుధవారం కలమడుగు చేరుకుని సోదాలు నిర్వహించారు. సోదాల్లో కామేశ్, భావు బాపయ్య, మధుకర్, గొట్ల రాజేశ్ పట్టుబడ్డారు. వారిని అరెస్ట్ చేసి సైబర్ నేరాలకు వినియోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. జాతీయ, అంతర్జాతీయ కాల్స్ లింక్స్ ఉన్నందున లోతైన విచారణ చేస్తున్నామని డీసీపీ వివరించారు. నిందితులను పట్టుకున్న మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, సైబర్ క్రైం డీసీపీ వెంకటరమణరెడ్డి, లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి, టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ అలెన్, అనురాగ్, సైబర్ క్రైమ్ సీఐలు కృష్ణమూర్తి, శ్రీనివాస్, ఎస్సైలు గొల్లపెల్లి అనూష, సురేశ్, తహసీనోద్దీన్ను రామగుండం సీపీ, మంచిర్యాల డీసీపీ అభినందించారు. -
ట్రాక్టర్ యజమానుల బైండోవర్
కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం నగునూరు వాగునుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న మహేశ్, అశోక్ను బుధవారం తహసీల్దార్ రాజేశ్ ఎదుట బైండోవర్ చేసినట్లు కరీంనగర్రూరల్ సీఐ నిరంజన్రెడ్డి తెలిపారు. మరోసారి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడినట్లయితే రూ.లక్ష జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష విధించేలా సొంత పూచీకత్తుపై బైండోవర్ చేసినట్లు వివరించారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. సెల్ఫోన్ అప్పగింత కరీంనగర్ గోదాంగడ్డకు చెందిన బోయిని రాజేశ్ పోగోట్టుకున్న సెల్ఫోన్ను సీఈఐఆర్ టెక్నాలజీ ద్వారా పట్టుకుని బుధవారం బాధితుడికి అప్పగించినట్లు సీఐ నిరంజన్రెడ్డి తెలిపారు. జనవరి 6న మొగ్ధుంపూర్లో రాజేశ్ సెల్ఫోన్ పోగొట్టుకోగా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సీఈఐఆర్ టెక్నాలజీతో నిజామాబాద్లో గుర్తించి పట్టుకున్నట్లు వివరించారు. -
డాబాపై కూరగాయల సాగు
జగిత్యాలఅగ్రికల్చర్: రసాయనాల నుంచి తప్పించుకునేందుకు చాలామంది పట్టణవాసులు ఇంటిపై.. ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ ప్రదేశాల్లో కూరగాయలు పండించుకుంటున్నారు. తద్వారా ఆరోగ్యమైన ఆహారం పొందడంతోపాటు మనస్సుకు ఆనందం, ఆహ్లాదం అందించుకుంటున్నారు. గృహిణులు ఒకప్పుడు ఖాళీ ప్రదేశాల్లో పువ్వులు, అలంకరణ మొక్కలకు ప్రాధాన్యమిస్తే.. ఇప్పుడు రోజువారీ ఆహారంలో ఉపయోగించే ఆకుకూరలు, కూరగాయలు పండిస్తున్నారు. ● ఆహ్లాదకర వాతావరణంలో.. కూరగాయలు పండిస్తున్న రైతులు ఎక్కువగా క్రిమిసంహారక మందులు వినియోగిస్తుండటంతో ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. కొందరు వ్యాధుల బారిన పడి ఆస్పత్రుల పాలవుతున్నారు. ఈ క్రమంలో ఎలాంటి రసాయనాలు లేకుండా.. ఇంటికి అవసరమైన కూరగాయలను ఇంటి డాబాపై, ఖాళీ ప్రదేశాల్లో పండించుకునేందుకు గృహిణులు ముందుకొస్తున్నారు. ఇంటి వాతావరణం మారిపోవడంతోపాటు చల్లని గాలి, పచ్చని మొక్కల మధ్య సేద తీరుతున్నారు. ● తేలికపాటి కుండీల ఎంపిక డాబాపై కూరగాయల పెంపకానికి తేలికపాటి కుండీలను ఎంపిక చేసుకుంటున్నారు. ప్లాస్టిక్ కుండీలు, పైబర్తో తయారు చేసిన గ్రోబ్యాగ్స్ ఉపయోగిస్తున్నారు. ప్లాస్టిక్ బకెట్లు, వాటర్ క్యాన్లు, సింక్ తొట్టీలు, పాత టైర్లు.. ఇలా అన్నింటిని కూరగాయల పెంపకానికి ఎంపిక చేసుకుంటున్నారు. నిటారుగా ఉండే అంతస్తుల కుండీలు, వేలాడేదీసే కుండీలను కూడా వాడుకోవచ్చు. ఇనుపకుండీలైతే మొక్క వేరు వ్యవస్థ దెబ్బతింటుంది. లోతు వేరు వ్యవస్థ గల మొక్కలకు ఎక్కువ లోతు కుండీలు.. తక్కువ వేరు వ్యవస్థ గల మొక్కలకు తక్కువ లోతు కుండీలను ఎంచుకోవాలి. బొప్పాయి, అరటి వంటి పెద్ద మొక్కలకు పెద్ద పరిమాణం గల ప్లాస్టిక్ డ్రమ్ములను ఉపయోగించవచ్చు. ● గ్రోబ్యాగ్స్ అనుకూలం గ్రో బ్యాగ్స్.. తక్కువ బరువు ఉండి, డాబాపై కూరగాయల పెంపకానికి అనుకూలంగా ఉంటాయి. ఎంచుకున్న మొక్కలకు అనుగుణంగా గ్రోబ్యాగ్స్ వినియోగించాలి. మార్కెట్లో వివిధ పరిమాణాలు, ఆకారాల్లో దొరుకుతాయి. వీటిలో మట్టి పరిమాణం తక్కువ బరువు ఉండేలా చూసుకోవాలి. మట్టి మిశ్రమం అధికంగా ఉంటే డాబాపై బరువు పెరుగుతుంది. ఎర్రమట్టి, కోకోపీట్, పశువుల ఎరువు లేదా వర్మి కంపోస్టు వంటి తేలికపాటి మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకుని కుండీల్లో నింపాలి. మార్కెట్లో రెడీమేడ్ కుండీ మిశ్రమం కూడా దొరకుతోంది. మట్టి మిశ్రమాన్ని నింపేటప్పుడు పైభాగంలో కొంత ఖాళీ వదలాలి, ● మొక్కల ఎంపిక ప్రధానం డాబాపై మొక్కల పెంపకానికి కూరగాయల ఎంపిక ప్రధానం. కాలానుగుణంగా పండే కూరగాయలను ఎంపిక చేసుకోవాలి. శీతాకాలంలో దాదాపుగా అన్ని రకాల కూరగాయలను పండించవచ్చు. వేసవిలో క్యాబేజీ, కాలీప్లవర్, క్యారెట్, ఆలుగడ్డ మినహాయించి మిగతా కూరగాయలు పండించవచ్చు. తీగజాతి వాటికి పందిరి వేసుకోవాలి. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోవడానికి షేడ్నెట్ వేసుకోవాలి. ఈ పద్ధతిలో కుటుంబ అవసరాలకు అనుగుణంగా నాలుగు రకాల కూరగాయలు, రెండు లేదా మూడు రకాల ఆకుకూరలు పండించవచ్చు. ● నీటి యాజమాన్యం కీలకం దాబా తోటల్లో నీటిని క్యాన్ ద్వారా అందించవచ్చు. స్వయంగా మొక్క వయస్సు, ఎదుగుదలను బట్టి ఎంత నీరు అవసరముంటే అంత నీరు ఇవ్వవచ్చు. ఇంట్లోని వ్యర్థాల నుంచి కంపోస్టు తయారు చేసి మొక్కలకు పోషకాలు అందించవచ్చు. మొక్కల సంఖ్య తక్కువగా ఉంటుంది కాబట్టి చీడపీడలు వస్తే చేతి ద్వారా తీసివేయవచ్చు. తీగజాతి కూరగాయల్లో పండు ఈగ వస్తే లింగాకర్షక బుట్టలు వాడి నివారించవచ్చు. ఎక్కువ చీడపీడలు వస్తే వేప నూనెను లీటర్ నీటికి 5 మి.లీ పిచికారీ చేస్తే సరిపోతుంది. రసాయనాలు లేని ఆకుకూరలు, కూరగాయలు అవగాహనతో ఆరోగ్యం కాపాడుకుంటున్న జనం కొన్నేళ్లుగా సాగు చేస్తున్న కొన్నేళ్లుగా ఇంటి పరిసరాలతోపాటు డాబాపై కూరగాయలు సాగు చేస్తున్నాను. మార్కెట్కు వెళ్లే అవసరం లేకుండాపోయింది. పూత నుంచి పిందె, కాత వరకు జరిగే చర్యలు కూడా ఆసక్తికరంగా ఉంటుండటంతో ప్రతిరోజు ప్రతి మొక్కనూ పరిశీలిస్తాను. – సముద్రాల జ్యోతి, గృహిణి, జగిత్యాల చాలా కూరగాయలు పెంచొచ్చు ఇంటి ఖాళీ ప్రదేశాలు, డాబాలపై కూరగాయలు పెంచుకోవచ్చు. ఆసక్తి గల గృహిణులు గ్రూపుగా ముందుకొస్తే ఉద్యానశాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తాం. కొత్తిమీర, పాలకూర వంటి ఆకుకూరలతోపాటు చిన్నపాటి సంచుల్లో టమాట, మిర్చి వంటి కూరగాయలు సాగు చేయవచ్చు. మా శాఖ తరఫున అవగాహన కల్పిస్తున్నాం. – స్వాతి, ఉద్యానశాఖాధికారి, జగిత్యాల -
సౌదీలో భూషణరావుపేట యువకుడు ఆత్మహత్య
కథలాపూర్(వేములవాడ): కథలాపూర్ మండలం భూ షణరావుపేటకు చెందిన స ంగెం వినోద్ (30) సౌదీ అరేబియా దేశంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రా మస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన సంగెం గంగరా జం– సరోజన దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. వినోద్ పెద్ద కుమారుడు. ఆయన కొంతకాలంగా గల్ఫ్ దేశం వెళ్లి వస్తున్నా డు. ఏడాదిన్నర క్రితం సౌదీ వెళ్లాడు. ఈనెల 22న వినోద్ తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అక్కడి వారు కుటుంబసభ్యులకు బుధవారం ఫోన్లో సమాచారం ఇచ్చారు. వినోద్కు ఇంకా పెళ్లి కాలేదు. అతడి ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందని బంధువులు పేర్కొన్నారు. మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి పంపించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని మృతుడి బంధువులు కోరుతున్నారు. భార్యను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదుజగిత్యాలక్రైం: భార్యను హత్య చేసిన భర్తకు జీ విత ఖైదుతోపాటు, రూ.2 వేల జరిమానా విధి స్తూ మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి నారా యణ బుధవారం తీర్పునిచ్చారు. కోరుట్ల మండలం యెకిన్పూర్కు చెందిన ఎర్ర చంద్రయ్య, భార్య గంగరాజు కూలీలు. చంద్రయ్య మద్యాని కి బానిసై గంగరాజుతోపాటు కొడుకును వేధించేవాడు. 2022 అక్టోబర్ 29న ఇంట్లో ఎవరూ లేని సమయంలో మద్యం మత్తులో భార్యతో ఘర్షణ పడి ఆమెను హత్య చేసి.. ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని తీసుకుని మృతదేహాన్ని మూ టకట్టి యెకిన్పూర్ శివారులో పడేశాడు. మృతురాలి కుమారుడు సుధీర్ ఫిర్యాదు మేరకు కోరుట్ల పోలీసులు కేసు నమోదు చేసి చంద్రయ్యను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు కోర్టులో సాక్షులను హాజరుపర్చారు. దీంతో చంద్రయ్యకు జడ్జి శిక్ష ఖరారు చేశారు. హాస్టల్ నుంచి పారిపోయిన విద్యార్థులు● స్థానికులు పట్టుకుని తిరిగి అప్పగింత ● ఘటన ఆలస్యంగా వెలుగులోకి.. మల్యాల: మండలకేంద్రం శివారులోని జగిత్యా ల అర్బన్ గురుకులం విద్యార్థులు హాస్టల్ గోడ దూకి పారిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురుకులాన్ని గతేడాది జగిత్యాల నుంచి మండలకేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్కు తరలించారు. ప్రస్తుతం ఇక్కడ 6, 7, 8 తరగతుల విద్యార్థులు 40మంది ఉన్నారు. ఈ ఏడా ది అడ్మిషన్ తీసుకున్న ఇద్దరు ఆరు, ఎనిమిదో తరగతి విద్యార్థులు సోమవారం రాత్రి హాస్టల్ గోడ దూకి పారిపోయారు. వారిని మండలకేంద్రంలో గుర్తించి తిరిగి వార్డెన్కు అప్పగించారు. హాస్టల్ వార్డెన్ విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి బుధవారం తల్లిదండ్రులకు అప్పగించారు. ఇరువర్గాలపై కేసు సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): భూ సమస్యపై గొడవపడగా ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రావణ్కుమార్ బుధవారం తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. సుల్తానాబాద్ మండలం అల్లిపూర్ గ్రామానికి చెందిన ఏరుకొండ సరోజన, భర్త తిరుపతి, కరీంనగర్ జిల్లా చర్లబూత్కూర్కు చెందిన బుర్ర రేణుక, భర్త రాములు, అల్లిపూర్కు చెందిన బండ రాణి, భర్త భూమయ్య, రేగడిమద్దికుంటకు చెందిన ముంజాల అశోక్, ఏరుకొండ వినోద్తోపాటు మరోవర్గం ముంజల శ్యామల, భర్త సతీశ్ భూసమస్యపై మంగళవారం గొడవ పడ్డారు. ఇదేసమయంలో పెట్రోలింగ్కు వెళ్లిన బ్లూకోల్ట్స్ సిబ్బంది వారిని సముదాయించినా వినకుండా పోలీస్స్టేషన్లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. బుధవారం ఇరువర్గాలను సీఐ సుబ్బారెడ్డి ఠాణాకు పిలిపించి నోటీసులు అందించారు. గొడవ పడొద్దని కౌన్సెలింగ్ ఇస్తుండగా, ఏరుకొండ వినోద్ పోలీసులపై దురుసుగా ప్రవర్తించి, అసభ్యపదజాలంతో దూషించాడు. దీంతో వినోద్పై కేసు నమోదు చేశా రు. ఈ విషయమై సీఐని సంప్రదించగా భూ సమస్యపై ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యా దుతో ఏడుగురిపై కేసు నమోదు చేశామన్నారు. చికిత్స పొందుతూ విద్యార్థి మృతిగొల్లపల్లి: చదువు ఇష్టం లేక మనస్తాపంతో ఈనెల 25న క్రిమి సంహారక మందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మండలంలోని గోవిందుపల్లికి చెందిన బోనగిరి సూర్య బుధవారం మృతిచెందినట్లు ఎస్సై కృష్ణసాగర్రెడ్డి తెలిపారు. సూర్యను ఇంటర్ చదువు నిమిత్తం తల్లిదండ్రులు కరీంనగర్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో చేర్పించారు. అక్కడ చదువుకోవడం ఇష్టం లేక ఇంటికి వచ్చాడు. దీంతో తల్లిదండ్రులు మందలించడంతో ఈనెల 25న ఇంట్లోనే క్రిమిసంహారక మందు తాగాడు. వెంటనే తల్లిదండ్రులు అతడిని చికిత్స నిమిత్తం కరీంనగర్కు తరలించారు. వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. సూర్య తండ్రి రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. -
మతోన్మాదం రేపడమే బీజేపీ లక్ష్యం
సిరిసిల్లటౌన్: దేశంలో మతోన్మాదం రేపుతూ, ఓట్లు దండుకోవడమే బీజేపీ లక్ష్యమని కాంగ్రెస్ ఓబీసీ జాతీయ కన్వీనర్ వి.హన్మంతరావు అన్నారు. బీసీల కులగణన చేయాలని ఉద్యమిస్తున్న రాహుల్గాంధీ ఆకాంక్షను హర్షిస్తూ బుధవారం సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన అనంతరం మాట్లాడారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు కులగణన జరగలేదని, బీసీలకు అనేక బాధలు ఉన్నాయని, ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని తాము ప్రధాని మోదీని కోరినా పట్టించుకోలేదన్నారు. అన్నివర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే బీసీ కులగణన జరగాలని రాహుల్గాంధీ ప్రగాఢంగా నమ్మి ఆ దిశగా ఉద్యమిస్తున్నారని, ఇందుకు అన్నివర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. దేశంలో యాభైశాతం రిజర్వేషన్ల సీలింగ్ ఎత్తివేస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తారని ఇది కేవలం కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. రాహుల్గాంధీ ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్రెడ్డి బీసీ డిక్లరేషన్కు తగ్గట్టుగా అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించారన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీలు ముస్లిం రిజర్వేషన్ను వ్యతిరేకిస్తూ హిందూదేశంగా మార్చాలని కుట్రపూరితంగా ఉన్నాయన్నారు. బీసీ కులగణన కోసం ఆగస్టులో జంతర్మంతర్ వద్ద జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, పీసీసీ కార్యవర్గ సభ్యుడు సంగీతం శ్రీనివాస్, గడ్డం నరసయ్య, ఆకునూరి బాలరాజు, సూర్య దేవరాజు, వెలుముల స్వరూపరెడ్డి, బొప్ప దేవయ్య, రాపల్లి కళ్యాణ్, గుండ్లపెళ్లి గౌతమ్, ఆడెపు చంద్రకళ, మడుపు శ్రీదేవి, కల్లూరి చందన తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఓబీసీ జాతీయ కన్వీనర్ హనుమంతరావు -
సదస్సును విజయవంతం చేయాలి
సిరిసిల్లకల్చరల్: రాజ్యాంగం సవాళ్లు.. దృక్పథాలు, పరిష్కారాలు అనే అంశంపై ఆగస్టు 2న సదస్సు నిర్వహించనున్నట్లు జిల్లా లీగల్ సెల్ వైస్ చైర్మన్ వెంకట్రెడ్డి తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు పొన్నం అశోక్గౌడ్ మార్గదర్శకాల మేరకు బుధవారం సంబంధిత పోస్టర్ను జిల్లా కోర్టు ఆవరణలో ఆవిష్కరించారు. ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో శనివారం ఉదయం 9గంటలకు ప్రారంభమయ్యే సదస్సుకు జిల్లా లీగల్ సెల్ న్యాయవాదులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ బుర్ర రవితేజగౌడ్, అధికార ప్రతినిధి వంగల కర్ణ, బొద్దుల రాజేశ్, శేఖర్, అన్సార్ అలీ, జ్యోతి, సుహాసిని తదితరులు పాల్గొన్నారు. -
ఎదురుచూపులకు తెర
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మహిళల ఆర్థిక స్వాలంబన కోసం ప్రభుత్వం సీ్త్రనిధి ద్వారా రుణాలు అందించింది. రుణాలు సక్రమంగా చెల్లించిన స్వయం సహాయక సంఘాల సభ్యుల ఖాతాల్లో తిరిగి వడ్డీని ఏడాదికోసారి ప్రభుత్వమే జమ చేస్తుంది. ప్రభుత్వం నుంచి వచ్చిన వడ్డీతో వారికి ఆర్థికభారం తగ్గుతోంది. మూడేళ్లుగా రుణాలు తీసుకుని అసలు, వడ్డీ సక్రమంగా చెల్లించిన సంఘాలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన వడ్డీ బకాయిలను విడుదల చేసింది. జిల్లాలో 8,552 స్వయం సహాయక సంఘాలకు ఆరునెలల బకాయి డబ్బులు రూ.11,77,51,865 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశారు. చెల్లింపులో జాప్యం మహిళా సంఘాలు చెల్లించిన రుణాల వడ్డీని తిరిగి చెల్లించనున్నట్లు ప్రభుత్వం ఆరేళ్ల క్రితం తెలిపింది. ఆ మాట ప్రకారం సంఘాల సభ్యులు క్రమం తప్పకుండా తీసుకున్న రుణాలపై డబ్బును బ్యాంకుల్లో చెల్లించారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2018 మార్చి వరకు సక్రమంగానే వడ్డీ వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడంతో సంఘాల సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. కాగా, ప్రస్తుతం జాప్యం జరగడంతో సభ్యులు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. ఈ ఆర్థిక సంవత్సరంలో గత వడ్డీ డబ్బు కోసం ఎదురుచూపులే మిగిలాయని, ఎట్టకేలకు వడ్డీ రావడంతో అందరూ సంతోషంగా ఉన్నారు. రుణాలతో ఆర్థికాభివృద్ధి జిల్లా వ్యాప్తంగా 8,552 స్వయం సహాయక సంఘాలున్నాయి. సభ్యులంతా సీ్త్రనిధి రుణాలతో ఆర్థికాభివృద్ధి పొందుతున్నారు. పలువురు సభ్యులు వ్యాపారం చేస్తూ కుటుంబాలను పోషించుకుంటుండగా, మరికొంత మంది రుణాలను సక్రమంగా చెల్లించి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రోత్సాహక వడ్డీని పొందుతున్నారు. అప్పుడప్పుడు వడ్డీ సకాలంలో జమకాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం అందిస్తున్న వడ్డీతో ఆర్థిక పరిపుష్టి సాధిస్తున్నారు. మహిళా సంఘాల ఖాతాల్లో వడ్డీ జమ రూ.11.77 కోట్ల బకాయిలు చెల్లింపు జిల్లాలో 8,552 స్వయం సహాయక సంఘాలు -
మున్సిపలా.. పంచాయతా..?
సిరిసిల్లఅర్బన్: గ్రామాలను పురపాలికల్లో విలీనం చేస్తే అభివృద్ధి చెందుతాయని ప్రజలు ఆశించారు. అప్పట్లో అధికారులు, ప్రజాప్రతినిధులు అదే విషయమై ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, గ్రామస్తులను ఒప్పించేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. అయినా కొందరు నాయకులు, ప్రజలు పట్టణంలో విలీనం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. వారి అభిప్రాయాన్ని పక్కన పెట్టి అప్పటి నాయకులు ఆయా గ్రామాల ప్రజలను ఒప్పించి 2019లో సిరిసిల్ల మండలంలోని 7 గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు విలీన గ్రామాల్లో అభివృద్ధి అనేది అంతంత మాత్రమే ఉందని, విలీన గ్రామాల ప్రజలకు ఉపాధి కరువైందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.7 గ్రామాలు చేరిక... పాత సిరిసిల్ల మండలం గ్రామాలైన పెద్దూరు, సర్ధాపూర్, చిన్నబోనాల, పెద్దబోనాల, ముష్టిపల్లి, చంద్రంపేట, రగుడు గ్రామాలను సిరిసిల్ల మున్సిపల్లో విలీనం చేశారు. అయితే ఎన్నికల ముందు మాత్రం తాము అధికారంలోకి రాగానే విలీన గ్రామాలను తిరిగి పంచాయతీలుగా ఏర్పాటు చేస్తామని బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులు హామీ ఇచ్చారు. కానీ, వారి మాటలు హామీలుగానే మిగిలిపోయాయి. తాజాగా హైకోర్టు 90 రోజుల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించడంతో విలీన గ్రామాల ప్రజలు పంచాయతీలుగా ఏర్పాటు చేస్తారా..? లేక మున్సిపల్లోనే కొనసాగిస్తారా..? అనే అయోమయంలో ఉన్నారు.● విలీన గ్రామాల్లో అయోమయం ● రానున్న స్థానిక ఎన్నికలపై ఉత్కంఠ ● హామీలుగానే మిగిలిన నాయకుల మాటలు ● గ్రామాల్లో కానరాని అభివృద్ధి ● ఉపాధి పనులకు దూరమైన ప్రజలుపంచాయతీలుగా ప్రకటించాలి మాది చంద్రంపేట. 2006 నుంచి 2011 వరకు గ్రామ సర్పంచ్గా బాధ్యతలు నిర్వహించా. అప్పుడు గ్రామాలకు ప్రత్యేక నిధులు ఉండేవి. వాటితో పాటు ప్రభుత్వం మంజూరు చేసే నిధులతో ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులు జరిగేవి. మున్సిపల్లో విలీనం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అభివృద్ధి అనే పదానికే దూరంగా ఉంది. గ్రామంలో నెలకొన్న సమస్యలపై మున్సిపల్ వాళ్లకు చెబితే పట్టించుకునే నాథ/డే కరువయ్యాడు. తిరిగి గ్రామ పంచాయతీ చేస్తేనే బాగుంటుంది.– అన్నవేని బాలయ్య, మాజీ సర్పంచ్, చంద్రంపేటప్రత్యేక మండలం ఏర్పాటు చేయాలి పాత సిరిసిల్ల మండలంలోని 7 గ్రామాలతోపాటు పక్కనే ఉన్న కొలనూరు, వెంకటాపూర్, పోతిరెడ్డిపల్లె గ్రామాలను కలుపుకొని ప్రత్యేక మండలం చేస్తే ప్రజలకు పరిపాలన పరంగా, అన్ని విధాల దగ్గరవుతుంది. పంచాయతీలుగా ఉన్నప్పుడే గ్రామాల్లో అభివృద్ధి జరిగింది. అప్పటి కల్టెకర్ నీతూకుమారి ప్రసాద్ ముష్టిపల్లిని దత్తత తీసుకొని గ్రామాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్లారు. సంపూర్ణ అక్షరాస్యత గల గ్రామంగా పేరు తీసుకొచ్చారు. జాతీయ అవార్డులు సైతం వచ్చాయి. అలాంటిది అభివృద్ధికి ఆమెడ దూరంలో ఉంది. – వంతడుపుల రాము, మాజీ సర్పంచ్, ముష్టిపల్లి సౌలభ్యంగా ఉంటది గ్రామ పంచాయతీలుగా ఉన్నప్పుడు గ్రామాలు చాలా అభివృద్ధి పథంలో ఉన్నాయి. ఎప్పుడైయితే సిరిసిల్ల మున్సిపల్లో విలీనం చేశారో గ్రామస్తులకు ఉపాధి కరువైయింది. పాలనాపరంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తిరిగి గ్రామ పంచాయతీలు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలి.– నవీన్యాదవ్, పెద్దూరు సిరిసిల్ల పట్టణ ప్రొఫైల్ పట్టణ జనాభా 1,17,000విలీనమైనవి 7 గ్రామాలు విలీన గ్రామాల జనాభా 16,0007 గ్రామాల్లో వార్డులు 727 గ్రామాల్లో ఎంపీటీసీ స్థానాలు 4(29 ఎస్ఆర్ఎల్55) (29 ఎస్ఆర్ఎల్56) -
పరిసరాలు శుభ్రంగా ఉంచాలి
● కలెక్టర్ సందీప్కుమార్ ఝా ముస్తాబాద్(సిరిసిల్ల): ప్రభుత్వ పాఠశాలల్లో పరి సరాల పరిశుభ్రత చాలా ముఖ్య మని కలెక్టర్ సందీప్కుమార్ ఝా అన్నారు. బుధవారం ముస్తాబాద్ జిల్లా పరిషత్ ఉ న్నత, ప్రాథమిక పాఠశాలతో పాటు అంగన్వాడీ కేంద్రాల ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలకు వచ్చిన విద్యార్థుల హాజరును స్వయంగా తీసుకున్నారు. జెడ్పీ స్కూల్ ఆవరణ అపరిశుభ్రంగా ఉండడంపై అ సంతృప్తి వ్యక్తం చేశారు. చెత్త, గడ్డిని తొలగించాలని ఆదేశించారు. తరగతి గదులు, మధ్యా హ్న భోజనం తయారీని పరిశీలించారు. పాఠశాలకు ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవాలని, డైనింగ్ హాల్లో బెంచీలు ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాల మైదానంలో సీసీ వేయాలని, డ్రైనేజీ నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపిస్తే నిధులు మంజూరు చేస్తామన్నారు. అంగన్వాడీ కేంద్రాలను ఒకే చోటికి తీసుకురావాలని సూచించారు. మ ధ్యాహ్న భోజనం కట్టెల పొయ్యిలపై వండరాద ని, అవసరమైన గ్యాస్ కనెక్షన్లు ఇప్పించాలని ఎంఈవోను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఎంఈవో నిమ్మ రాజిరెడ్డి, హెచ్ఎం రవీందర్రెడ్డి, నాయకులు విజయ్రెడ్డి, భాను, తదితరులున్నారు. -
ఆత్మవిశ్వాసానికి ప్రేరణ ‘ఇందిరా మహిళా శక్తి’
కోనరావుపేట/వేములవాడరూరల్: ఇందిరా మహిళా శక్తి పథకం మహిళల ఆత్మవిశ్వాసానికి ప్రేరణ అని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బుధవారం కోనరావుపేట మండలం నిమ్మపల్లిలో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా విజయ భారతీ గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎరువులు, విత్తనాల దుకాణాన్ని ప్రారంభించి మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే సంకల్పంతో ముందుకు పోతున్నారని, అందులో భాగంగా ఇందిరా మహిళా శక్తి పథకాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి పావలా వడ్డీకే రుణాలు మంజూరు చేశారని, ఐకేపీ కేంద్రాలను ప్రారంభం చేసి మహిళలకు ఆర్థిక స్వావలంబన దిశగా ప్రోత్సాహం అందించారని అన్నారు. గత ప్రభుత్వం మహిళా సంఘాలను పట్టించుకోలేదని చివరికి మూడేళ్ల వడ్డీని ఎగ్గొట్టినట్లు తెలిపారు. రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అండగా ఉంటూ చర్యలు తీసుకుంటుందని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన ఎరువుల గోదాం, ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా విఘ్నేశ్వర గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎరువుల గోదాం, ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించారు. కార్యక్రమాల్లో ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, పాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డి, డీఏవో అఫ్జల్బేగం, నాయకులు షేక్ ఫిరోజ్పాషా, వకుళాభరణం శ్రీనివాస్, తహసీల్దార్ వరలక్ష్మి, ఎంపీడీవో శంకర్రెడ్డి, ఏవో సందీప్, ఏపీఎం రాకేశ్ తదితరులు పాల్గొన్నారు. ● విప్ ఆది శ్రీనివాస్ -
వడ్డీ రావడం సంతోషం
సీ్త్రనిధి ద్వారా తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించగా, ఆరునెలల వడ్డీ డబ్బులు బ్యాంక్ ఖాతాలో జమయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరునెలల డబ్బుల కోసం కొంత జాప్యం జరిగింది. మొత్తానికి డబ్బులు రావడంతో అందరు సంతోషంగా ఉన్నారు. – వెన్నెల, వీవో, రాజన్నపేట సకాలంలో చెల్లించాం ప్రభుత్వం నుంచి సీ్త్రనిధి ద్వారా రుణం తీసుకున్నం. వడ్డీ వస్తుందనే సభ్యులు స క్రమంగా సకాలంలో రుణాలు చెల్లించారు. ప్రభుత్వం నుంచి క్రమం తప్పకుండా వడ్డీ డబ్బులు వస్తే అందరూ ఆర్థికంగా బలపడుతారు. – కొల బాలలక్ష్మి, సింగారం ఖాతాల్లో జమచేశాం ప్రభుత్వం నుంచి డబ్బులు విడుదల కాగానే సభ్యుల ఖాతాల్లో జమ చేశాం. సభ్యులు వడ్డీ డబ్బుల కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అర్హులైన మహిళా సంఘాలకు క్రమం తప్పకుండా ప్రతి ఆరునెలలకు ఒకసారి డబ్బులు చెల్లించడం జరుగుతుంది. సభ్యులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి వడ్డీ తీసుకోవడం అభినందనీయం. – మల్లేశం, ఏపీఎం, ఎల్లారెడ్డిపేట -
కలెక్టర్ ఆర్థిక చేయూత
సిరిసిల్లకల్చరల్/కోనరావుపేట: ఆపన్నులకు కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆర్థిక చేయూత అందించారు. కోనరావుపేట మండలం నాగారం గ్రామానికి చెందిన దుంపెట దక్షిత మధ్యప్రదేశ్లోని కత్నిలో సైనిక పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. ఇందుకోసం రూ.2.5లక్షల ఫీజు చెల్లించాల్సి ఉంది. పేద కుటుంబం కావడంతో ఆర్థికంగా ఆదుకోవాలని దక్షిత తండ్రి నాగరాజు అభ్యర్థన మేరకు కలెక్టర్ రూ.లక్ష చెక్కును బుధవారం కలెక్టరేట్లో అందజేశారు. అలాగే ముస్తాబాద్ మండలం ఆవునూర్కు చెందిన తస్లీమా అనారోగ్యంతో, చిన్నలింగాపూర్కు చెందిన అనంతలక్ష్మి కంటి సమస్యతో బాధపడుతుండగా, తస్లీమాకు రూ.20వేలు, అనంతలక్ష్మికి రూ.10 వేలు అందజేశారు. ఈసందర్భంగా కలెక్టర్కు వారు కృతజ్ఞతలు తెలిపారు. లింగ నిర్ధారణ చేస్తే చర్యలుసిరిసిల్లకల్చరల్: గర్భస్థ పిండ ఆరోగ్య స్థితి తెలుసుకునే స్కానింగ్ పరీక్షలను జిల్లాలో కొంత మంది దుర్వినియోగం చేస్తున్నారని, లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజిత హెచ్చరించారు. బుధవారం నిర్వహించిన జిల్లా అడ్వయిజరీ కమిటీ సమావేశంలో మాట్లాడారు. ఆడపిల్ల అని తెలిసి గర్భవిచ్ఛిత్తికి పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో లింగనిర్ధారణ పరీక్షలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. నిరూపణ అయిన స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.50వేల జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. రేడియాలజిస్టు, డాక్టర్ పట్టా రద్దు కోసం సిఫారస్ చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డాక్టర్ అంజలి ఆల్ఫ్రెడ్, డాక్టర్ సంతోష్, చింతోజు భాస్కర్, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. కోనరావుపేటలో విషజ్వరాలు కోనరావుపేట(వేములవాడ): మండలకేంద్రంలో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. కొద్దిరోజు లుగా వడ్డెరకాలనీలో సుమారు 20 మంది జ్వరాలతో బాధపడుతున్నారు. వీరిలో ఇద్దరికి డెంగీ నిర్ధారణ అయినట్లు తెలిసింది. కాగా, వడ్డెరకాలనీలో పారిశుధ్య పనులు సక్రమంగా లేకపోవడం సమస్యగా మారింది. రహదారులపై, ఇళ్ల సమీపంలో మురుగునీరు నిల్వ ఉండడంతో దోమలు పెరిగి కాలనీవాసులు జ్వరాల బారిన పడుతున్నారు. పారిశుధ్య పనులు సక్రమంగా చేపట్టకపోవడంతో స్థానికులు జ్వరాలబారిన పడుతున్నట్లు భావిస్తున్నారు. -
ట్యాపింగ్!
నీడలా వెంటాడారు.. డ్రైవర్ ఫోనూ ట్యాప్ చేశారు..● సిట్ ముందు గ్రంథాలయ జిల్లా చైర్మన్ మల్లేశ్ వాంగ్మూలం ● ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చిన ఈటల రాజేందర్ ● బండి సంజయ్, ఆయన పీఆర్వో విచారణ వాయిదా ● త్వరలో చొప్పదండి ఎమ్మెల్యే సత్యంకూ నోటీసులునాలుగున్నరేళ్లపాటుసాక్షిప్రతినిధి,కరీంనగర్●: ‘ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగున్నరేళ్లపాటు నా ఫోన్ ట్యాప్ అయింది. నాదే కాదు.. నా డ్రైవర్ ఫోన్ కూడా ట్యాప్ చేశారు. అనుక్షణం నీడలా వెంటాడారు.. పలుమార్లు మమ్మల్ని అడ్డగించారు.. మా వ్యక్తిగత సమాచారం తస్కరించారు. ప్రతీక్షణం మా మాటలు విన్నారు..’ ఇవీ.. కరీంనగర్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశ్ ఫోన్ట్యాపింగ్ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎదుట చెప్పిన మాటలు. ఏడాదిన్నరగా సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కరీంనగర్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశ్ మంగళవారం హైదరాబాద్లోని సిట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. 3.30 గంటల నుంచి ఆరు గంటల వరకు ఇద్దరు అధికారులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తనకు ఫోన్ట్యాపింగ్ ద్వారా ఎదురైన చేదు అనుభవాలు, ఇబ్బందులను పోలీసులకు సత్తు మల్లేశ్ వివరించారు. ఉమ్మడి జిల్లాతో లింకు.. రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు కరీంనగర్కు విడదీయరాని అనుబంధం ఉంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు బంధువులు కరీంనగర్కు చెందిన వారు కావడం, ఈ కేసులో అరెస్టయిన మాజీ డీసీపీ రాధాకిషన్రావు పలుమార్లు కరీంనగర్కు వచ్చినట్లు సిట్ దర్యాప్తులో తేలడం, అలాగే ఈకేసులో సిరిసిల్ల ఎస్సీఆర్బీ డీఎస్పీగా దుగ్యాల ప్రవీణ్రావును సిరిసిల్లలోనే అరెస్టు చేయడం తెలిసిందే. అసలు అతని అరెస్టుతో సిట్ బృందం దర్యాప్తు వేగం పెంచింది. వాస్తవానికి 2021లోనే అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్రెడ్డి ఫోన్ ట్యాపింగ్పై కరీంనగర్లోని మైత్రీ హోటల్లో విలేకరుల సమావేశంలో సంచలన ఆరోపణలు చేశారు. ఆ సమయంలోనే ఎస్ఐబీ చీఫ్గా ఉన్న ప్రభాకర్రావు, వేణుగోపాల్రావు, దుగ్యాల ప్రవీణ్రావు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారన్న విషయాన్ని వెల్లడించడం గమనార్హం. ‘బండి’ నుంచి మల్లేశ్ వరకు.. ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ అయ్యాయంటూ సిట్ బృందం ఇటీవల నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎంపీగా ఉన్న సమయంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కు హాజరు కావాలని సిట్ అధికా రులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కు రెండుసార్లు నోటీసులు ఇచ్చారు. అయితే.. పార్లమెంటు సమావేశాలు, ఆపరేషన్ సిందూర్పై చర్చల కారణంగా బండి సంజయ్ విచారణకు రాలేనని సమాధానమిచ్చారు. బండి సంజయ్ తోపాటు ఆయన ఆంతరంగికుడు ప్రవీణ్రావు, ఆయన పీఆర్వో పసూనూరి మధుల ఫోన్లు కూడా ట్యాపయ్యాయని, వారు కూడా విచారణకు రా వాలని సిట్ కోరిన సంగతి తెలిసిందే. త్వరలోనే బండి సంజయ్ ఆయన అనుచరులు కూడా సిట్ ముందు హాజరై.. వాంగ్మూలం ఇవ్వనున్నారు. ● ఇక కరీంనగర్కు చెందిన మాజీ మంత్రి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కూడా గత నెలలో సిట్ ఎదుట విచారణకు హాజరై తన అనుభవాలను వివరించారు. ● సీఎంకు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన.. జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తుమల్లేశ్ ఫోన్ కూడా ట్యాప్ అయిందని.. పోలీసులు స్వాధీ నం చేసుకున్న పలు డివైజ్ల ద్వారా అప్పట్లోనే వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ● ఇక ప్రస్తుతం చొప్పదండి ఎమ్మెల్యేగా ఉన్న మేడిపల్లి సత్యం ఫోన్లు కూడా ట్యాపయ్యాయని సమాచారం. త్వరలోనే ఆయనకు కూడా విచారణ కోసం సిట్ నుంచి పిలుపు రావొచ్చని తెలిసింది. -
భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి
బుధవారం శ్రీ 30 శ్రీ జూలై శ్రీ 2025సిరిసిల్లటౌన్: నాగుల పంచమి పూజలు మహిళలు మంగళవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయమే ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి, పుట్టల్లో పాలు పోశారు. సిరిసిల్లలోని శివసాయిబాబ, అయ్యప్ప ఆలయం, మడేలేశ్వరస్వామి, శ్రీరాజరాజేశ్వరస్వామి, రేణుక ఎల్లమ్మ, అంబికానగర్, సంతోషిమాత ఆలయాల వద్ద పుట్టల వద్ద నాగదేవతకు పూజలు చేశారు. నాగదేవతకు మొక్కులు తీర్చుకున్న ముత్తైదువలు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. జిల్లా కేంద్రంలోని హరిహరపుత్ర అయ్యప్ప ఆలయంలో వారం రోజులుగా చేపడుతున్న ముక్కోటి కుంకుమ పూజోత్సవం ముగిసింది. శ్రీచక్ర మహాచండీ యాగం నిర్వహించారు. కుంకుమ పూజల్లో 1,600 మంది సుహాసినులు పాల్గొన్నారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు రాచ విద్యాసాగర్, ప్రయాకరావు మధు, దుబ్బ విశ్వనాథం, కూన సురేష్ తదితరులు పాల్గొన్నారు. న్యూస్రీల్ -
కేంద్రీయ విద్యాలయం ప్రారంభం
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని పద్మనగర్లో నూతనంగా నిర్మించిన కేంద్రీయ విద్యాలయాన్ని మంగళవారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ప్రారంభోత్సవానికి వస్తారని ఎదురుచూసిన విద్యార్థులు, తల్లిదండ్రులకు నిరాశే మిగిలింది. బీజేపీ మండల అధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్రావు, ప్రధాన కార్యదర్శి ఇటికల రాజు, వినయ్యాదవ్, ఆశీర్వాద్, ప్రశాంత్, భవిత, మహేందర్, సురేష్, శ్రీనివాస్, మధుసూదన్, తిరుపతి, బాలమల్లేశం, కేవీ ప్రిన్సిపాల్ శేషప్రసాద్ పాల్గొన్నారు. -
సాహిత్య ధృవతార సినారె
సిరిసిల్లటౌన్: సాహిత్య ప్రపంచంలో సాటిలేని ధృవతారగా డాక్టర్ సి.నారాయణరెడ్డి ప్రస్తానం సాగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారాకరామారావు కొనియాడారు. సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో మంగళవారం సినారె జయంతి వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. అంతకుముందు సినారె సాహితీ సేవలను స్మరించుకుంటూ సామాజిక మాధ్యమంలో ఓ పోస్ట్ చేశారు. కవితలు, పద్యకావ్యాలు, గేయకావ్యాలు, గజల్స్, వ్యాసాలు, సినిమా పాటలు... రూపం ఏదైనా సినారె కలానికి తిరుగులేదన్నారు. కవి, సాహితీవేత్త, పరిశోధకుడు, అధ్యాపకుడు, సినీగేయ రచయిత పాత్ర ఏదైనా సినారె ప్రతిభకు సాటిలేదన్నారు. ప్రపంచ సాహితీ లోకానికి తెలంగాణ గడ్డ అందించిన ఆణిముత్యంగా సినారెను కొనియాడారు. ఈ సందర్భంగా సినారె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాలి అర్పించారు. నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మాజీ జెడ్పీ చైర్పర్సన్లు తుల ఉమ, న్యాలకొండ అరుణ, నాయకులు గూడూరి ప్రవీణ్, ఏనుగు మనోహర్రెడ్డి, కుంభాల మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ● బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ -
మెరుగైన విద్య అందించడమే లక్ష్యం
● అగ్రహారం డిగ్రీ కళాశాలలో మహిళా వసతిగృహ నిర్మాణానికి శంకుస్థాపన ● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్వేములవాడఅర్బన్: పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ మండలం అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం పీఎం ఉషా పథకం కింద రూ.9.20కోట్లతో మహిళా వసతి గృహ భవనం నిర్మాణానికి కలెక్టర్ సందీప్కుమార్ ఝాతో కలిసి శంకుస్థాపన చేసి మాట్లాడారు. ప్రభుత్వం హాస్టల్ నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. 2005లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సహకారంతో అగ్రహారం డిగ్రీ కళాశాలలో సైన్స్ వింగ్ ఏర్పాటు చేసుకున్నామని గుర్తు చేశారు. హాస్టల్ వసతి అందుబాటులోకి వస్తే ఎక్కువ మంది బాలికలు ఉన్నత చదువులు చదువుకుంటారన్నారు. పేదపిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలన్న లక్ష్యంతో కామన్ డైట్ మెనూ ప్రవేశ పెట్టామన్నారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝా మాట్లాడుతూ 18 నెలల్లో హాస్టల్ భవనం పూర్తి చేసి, విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి సరఫరాపై నిఘా
● ప్రతిభ చూపిన సిబ్బందికి ప్రోత్సాహకాలు ● ఎస్పీ మహేశ్ బి గీతేసిరిసిల్లక్రైం: గంజాయి రవాణా, వినియోగంపై నిఘా పెట్టినట్లు ఎస్పీ మహేశ్ బి గీతే పేర్కొన్నారు. ఆరు నెలల్లో 37 కేసుల్లో 95 మందిని అరెస్ట్ చేసి 3.5 కిలోల గంజాయి, 12 గంజాయి చెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసుల ఛేదనలో కృషిచేసిన సిబ్బందికి మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రశంసాపత్రాలతోపాటు ప్రోత్సాహకాలు అందించారు. గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేయాలన్నారు. నిర్మూలనలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం కావాలని కోరారు. గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి స్పెషల్ డ్రైవ్లు, నార్కోటిక్ జాగిలాలతో తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. -
రేషన్కార్డు కీలకమైన డాక్యుమెంట్
● చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంబోయినపల్లి(చొప్పదండి): రేషన్కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, పేదల జీవితాల్లో రేషన్కార్డు కీలకమైన డాక్యుమెంట్ అని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝాతో కలిసి మండల కేంద్రంలోని రైతువేదికలో మంగళవారం లబ్ధిదారులకు నూతన రేషన్కార్డులు, పలువురికి సీఎమ్మార్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ కరెంట్ కనెక్షన్, ఇందిరమ్మ ఇండ్లు, ప్రభుత్వ పథకాల అమలు వంటి అనేక కార్యక్రమాలకు రేషన్కార్డు ఉపయోగపడుతుందని తెలిపారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝా మాట్లాడుతూ మండలంలో 1,070 పేద కుటుంబాలకు నూతన రేషన్కార్డులు పంపిణీ చేస్తున్నామని, 1971 మందిని రేషన్ కార్డులలో కొత్త సభ్యులుగా జమ చేస్తున్నామన్నారు. డీఎస్వో రజిత, తహసీల్దార్ నారాయణరెడ్డి, ఎంపీడీవో జయశీల, ప్యాక్స్ చైర్మన్ సురేందర్రెడ్డి, సెస్ డైరెక్టర్ సుధాకర్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కూస రవీందర్, ఏఎంసీ చైర్మన్ ఎల్లేశ్యాదవ్, మండల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమణారెడ్డి, మహేశ్రెడ్డి, వీసీ వినోద్రెడ్డి, పులి లక్ష్మీపతి, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
కంపుకొడుతున్నాయ్..
పందులు సంచరిస్తున్న ఈ ప్రాంతం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ కాలనీ. స్థానికంగా పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించకపోవడంతో పందులు, కుక్కలు సంచరిస్తున్నాయి. పందులను ఊరుదాటించాలని ప్రజలు చేసిన విన్నపాలను ఎవరూ పట్టించుకోవడం లేదు.ఇది ముస్తాబాద్ మండల కేంద్రం శివారులోని డంపింగ్యార్డు. మండల కేంద్రం నుంచి సిద్దిపేట దారిలో పెద్దచెరువు కింద ఉంది. దీనికి సమీపంలోనే ఒడ్డెరకాలనీ, ఎస్సీ కాలనీలు ఉంటాయి. దీని నుంచి వస్తున్న దుర్వాసనతో వారు ఇబ్బందిపడుతున్నారు. గతంలోనూ ఆ కాలనీవాసులు డంపింగ్యార్డు ఎత్తివేయాలని నిరసనకు దిగారు.● చెత్తాచెదారం.. పందుల విహారం ● ఇబ్బంది పడుతున్న ప్రజలు ● పట్టించుకోని అధికారులుఇది ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్లో పేరుకుపోయిన డ్రైనేజీ. గ్రామంలో మురికినీటి కాల్వలను పంచాయతీ సిబ్బంది శుభ్రం చేయడం లేదనడానికి ఇది నిదర్శనం. పేరుకుపోయిన మురుగునీటి కాలువల నుంచి వచ్చే దుర్వాసనతో ప్రజలు రోగాలపాలవుతున్నారు. ఇలాంటి పరిస్థితి జిల్లా వ్యాప్తంగా ఉంది. -
హామీలు నెరవేర్చి ఎన్నికల్లోకి రావాలి
● స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేస్తాం ● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య సిరిసిల్లఅర్బన్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాతనే ఎన్నికల్లోకి రావాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య డిమాండ్ చేశారు. సిరిసిల్ల ప్రెస్క్లబ్లో సోమవారం ప్రెస్మీట్లో మాట్లాడారు. రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆంధ్రవాళ్లకు తాకట్టు పెడుతున్నారన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు దిమ్మతిరిగే ఫలితాలు బీఆర్ఎస్ సాధిస్తుందని సవాల్ విసిరారు. ఆంధ్రకు చెందిన సీఎం రమేశ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో కుమ్మకై కేటీఆర్ను విమర్శించినంత మాత్రాన నాయకుడు కాలేడన్నారు. అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా ప్రజలకు మెరుగైన సేవలు అందించకుండా బీఆర్ఎస్పై తప్పుడు ఆరోపనలు చేస్తూ పబ్బం గడుపుతోందని విమర్శించారు. మేడిగడ్డను రిపేరు చేసి ఉంటే రైతులకు సాగునీటికి ఇబ్బంది ఉండేది కాదన్నారు. గజభీంకార్ రాజన్న, న్యాలకొండ రాఘవరెడ్డి, దార్ల సందీప్, కృష్ణారెడ్డి, మనోజ్కుమార్, రవిగౌడ్, అమర్రావు, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు కేంద్రీయ విద్యాలయం ప్రారంభం
సిరిసిల్లఅర్బన్/తంగళ్లపల్లి: తంగళ్లపల్లి మండలం పద్మనగర్ గ్రామపంచాయతీ పరిధిలో నూతనంగా నిర్మించిన కేంద్రీయ విద్యాలయాన్ని మంగళవారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వర్చువల్గా ప్రారంభించనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని సిరిసిల్లకు అప్పటి కరీంనగర్ ఎంపీ, ప్రస్తుత రాష్ట్ర బీసీ రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 2013లో కేంద్రీయ విద్యాలయం కోసం ప్రతిపాదించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2015లో కేంద్రీయ విద్యాలయం మంజూరైంది. అప్పటి నుంచి సిరిసిల్లలో కొనసాగింది. ఒకటి నుంచి 10వ తరగతి వరకు ఒక్కో తరగతిలో 50 సీట్లను కేటాయించింది. దీనికి సంబంఽధించిన ఉపాధ్యాయులు, సిబ్బంది అవసరమైన వసతులు కల్పించారు. ప్రస్తుతం తంగళ్లపల్లి మండలం పద్మనగర్ గ్రామపంచాయతీ పరిధిలో అధునాతన అంగులతో నిర్మించిన నూతన భవనం 2025, ఏప్రిల్ నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ భవనం నేడు ప్రారంభంకానుంది. విద్యాలయం ప్రారంభోత్సవానికి కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి డాక్టర్ సుకంతా మజుందర్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్కుమార్, కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి (స్వతంత్ర ఇన్చార్జి) జయంత్ చౌదరీలు హాజరుకానున్నారు. -
‘నానో’య్ వచ్చేసింది
● మార్కెట్లోకి ద్రవరూప ఎరువులు ● ఖర్చు తక్కువ.. దిగుబడి ఎక్కువచందుర్తి(వేములవాడ): తక్కువ పెట్టుబడి.. ఎక్కువ దిగుబడి లక్ష్యంగా పలు కంపెనీలో నానో(ద్రవరూప) ఎరువులను మార్కెట్లో తీసుకొచ్చాయి. రెండేళ్ల క్రితమే ఇఫ్కో నానో యూరియాను తీసుకురాగా.. మిగతా కంపెనీలు సైతం అదే బాటలో నడిచాయి. తాజాగా నానో డీఎపీ సైతం అందుబాటులోకి వచ్చింది. వీటితో ఎరువుల వినియోగం మరింత సులభంకానుంది. ప్రస్తుతం 50 కిలోల డీఏపీ బస్తా ధర రూ.1,350 ఉండగా, నానో డీఏపీ ధర అర లీటరుకు రూ.600లకు విక్రయించనున్నారు. యూరియా బస్తా ధర రూ.266 ఉండగా నానో యూరియా ధర అర లీటరు రూ.240 ఉంది. ఇప్ప టి వరకు బస్తాలో ఉండే డీఏపీ ఎరువును వరినాటు వేసే సమయంలో పొలం మొత్తం చల్లేవారు. కానీ నానో డీఏపీతో ఈ సమస్య ఉండదు. అందుకే రైతులు వీటి వినియోగంపై దృష్టి పెడుతున్నారు. రవాణా, కూలీల ఖర్చులు ఆదా యూరియా బస్తాపై అంతర్జాతీయ ధర రూ.2,450 ఉండగా కేంద్ర ప్రభుత్వం రూ.2,183.50 రాయితీ ఇస్తోంది. రాయితీ పోను రైతుకు బస్తా రూ.266లకే లభిస్తుంది. ఇప్పుడు రూ.240లకే 500మి.లీ నానో యూరియా సీసా మార్కెట్లో లభిస్తోంది. దీంతో రైతుకు ఒక్క బాటిల్పై రూ.26 ఆదా అవుతుంది. డీఏపీ ధర అంతర్జాతీయ మార్కెట్లో రూ.4,073 ఉండగా కేంద్రం రూ.2,501 రాయితీ భరిస్తుండడంతో రైతుకు రూ.1350లకు లభిస్తుంది. నానో డీఏపీ అర లీటరు రూ.600. ఒక్క డీఏపీ బస్తా ఎంత విస్తీర్ణానికి వినియోగిస్తామో.. అర లీటరు నానో డీఏపీ అంతే విస్తీర్ణానికి సరిపోతుండడంతో రైతుకు ఒక్క బాటిల్పై రూ.750 భారంతోపాటు రవాణా ఖర్చులు కలిసొస్తున్నాయి. ద్రవరూప ఎరువులను నిల్వ చేసుకోవడం కూడా చాలా సులవు. దీన్ని పర్యావరణానికి కూడా ఎలాంటి హానీ కలుగకుండా ఉత్పత్తి చేయవచ్చు. నానో ఎరువుల ప్రయోజనం ద్రవరూప ఎరువులు చిన్న పరిమాణంలో కలిగి ఉండడం ద్వారా పంటకు 80 శాతం కన్నా ఎక్కువగా ఉంటుంది. ఇది మొక్కల నత్రజని అవసరాన్ని సమర్థంగా తీరుస్తూ ఆకుల్లో కిరణజన్య సంయోగ క్రియను పెంచుతుంది. వేళ్లలో కణజాలాన్ని వృద్ధి చేస్తుంది. ఉపయోగకరమైన పిలుకలను, శాఖలను పెంచుతుంది. మొక్కల్లో నత్రజని, ఇతర పోషకాలను తీసుకునేందుకు సమీకరించటానికి మార్గాలను ప్రేరేపిస్తుంది. ఉపయోగించే విధానం నీటి సమరూపంలో కలిపిన 4 శాతం నత్రజని కలిగి ఉంటుంది. నానో యూరియాలో ఉన్న నత్రజని మొక్కల లోపలి నీటిలో కలిసిన తురవాత అమ్మోనికల్, నైట్రేట్ ద్రవరూపంలోకి మారుతుంది. లీటరు నీటికి 2 మిల్లీలీటర్లు లేదా 4 మిల్లీలీటర్లు చొప్పున కలుపుకుని పంట పెరుగుదల దశలో ఆకులపై పిచికారీ చేయాలి. ఉత్తమ ఫలితాలు కోసం మొదటి పిచికారీ పిలకదశ, పెరుగుదల దశలో, తర్వాత 20–25 రోజులకు అంటే పూతదశలో రెండో పిచికారీ చేయాలి. -
మాన్వాడలో గ్రామసభ
బోయినపల్లి(చొప్పదండి): మిడ్మానేరు నిర్మాణ గ్రామం మండలంలోని మాన్వాడలో నిర్వాసితుల సమస్యలపై తహసీల్దార్ కాలె నారాయణరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం గ్రామసభ నిర్వహించి దరఖాస్తులు స్వీకరించారు. అర్హులై ఉండి గెజిట్ కాని పలువురు గెజిట్ పబ్లికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. పలువురు యువతీ, యువకుల పరిహారం, ప్యాకేజీ కోసం దరఖాస్తులు అందించారు. వివిధ సమస్యలపై 401 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఎంపీడీవో భీమ జయశీల, పంచాయతీ కార్యదర్శి రాజశ్రీ, మాజీ సర్పంచు రామిడి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ప్రకృతి పరిరక్షణతోనే మానవ మనుగడసిరిసిల్లకల్చరల్: ప్రకృతి పరిరక్షణతోనే మాన వ మనుగడ ఆధారపడి ఉందనే విషయాన్ని విద్యార్థులు విస్మరించరాదని జిల్లా ఇంటర్మీ డియట్ విద్యాధికారి శ్రీనివాస్ పేర్కొన్నారు. విధిగా మొక్కలు నాటి, సంరక్షించాలని కో రారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూని యర్ కళాశాల ఆవరణలో సోమవారం మొక్కలు నాటారు. ప్రిన్సిపాల్ కనకశ్రీ విజయ రఘునందన్ తదితరులు ఉన్నారు. -
బాధితులకు భరోసాగా గ్రీవెన్స్ డే
● ఎస్పీ మహేశ్ బి గీతే సిరిసిల్లక్రైం: సమస్యల పరిష్కార లక్ష్యంగా, బాధితులకు భరోసాగా ఉండేందుకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతీ సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు ఎస్పీ మహేశ్ బి గీతే పేర్కొన్నారు. వివిధ సమస్యలపై 25 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ఫిర్యాదులను పరిష్కరించాల్సిందిగా ఆయా పోలీస్స్టేషన్ల అధికారులను ఆదేశించారు. అవసరమైతే క్షేత్ర స్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. గల్ఫ్ కార్మిక కుటుంబాలను ఆదుకోవాలి ముస్తాబాద్(సిరిసిల్ల): గల్ఫ్కార్మిక కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని గల్ఫ్ కార్మిక సంఘం జేఏసీ నాయకులు పర్ష తిరుపతి, జనగామ శ్రీనివాస్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపికి సోమవారం విన్నవించారు. జిల్లా నుంచి వేలాది మంది దుబాయ్, షార్జా, బహ్రెయిన్, ఒమన్ దేశాలకు వలస వెళ్లి ఇబ్బందులు పడుతున్నారన్నారు. గల్ఫ్లో మోసాలకు గురైన వారిని ఆదుకోవాలని కోరారు. గల్ఫ్ వెళ్లే వారికి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ప్రత్యేక శిక్షణ ఇచ్చేలా చొరవ చూపాలని కోరారు. అన్నదానానికి రూ.లక్ష విరాళం వేములవాడ: నిజామాబాద్ పట్టణానికి చెందిన మమత–రాజేందర్ దంపతులు తమ కుమార్తె జి.రష్మిక పేరిట రాజన్న నిత్యాన్నదాన ట్రస్ట్కు రూ.లక్ష విరాళంగా ఆలయ ఏఈవో శ్రవణ్కుమార్కు సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా వారికి స్వామి వారి ప్రత్యేక దర్శనం అవకాశం కల్పించి, ప్రసాదాలు అందజేశారు. నేడు గోశాలలో వనమహోత్సవం రాజన్న గోశాలలో ఆలయ ఉద్యోగులు మంగళవారం వనమహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఈవో రాధాభాయి తెలిపారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్కుమార్ ఝా హాజరవుతారని చెప్పారు. అన్నపూర్ణలో 1.27 టీఎంసీలు ఇల్లంతకుంట: అనంతగిరి అన్నపూర్ణ జలాశయంలో 1.27 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు సోమవారం తెలిపారు. ప్రాజెక్టులోకి 100 క్యూసెక్కుల వర్షపు నీరు వచ్చి చేరుతోందని 20 క్యూసెక్కుల నీరు అవుట్ ఫ్లో వెళ్తోందని పేర్కొన్నారు. కాంట్రాక్ట్ డాక్టర్ల నియామకంసిరిసిల్లకల్చరల్: కాంట్రాక్ట్ ప్రాతిపదికన వైద్యుల నియామక ప్రక్రియను సోమవారం చేపట్టారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝా అధ్యక్షతన మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ జె.రాజేశ్వరీ సమక్షంలో మౌఖిక పరీక్షలు నిర్వహించారు. ప్రొఫెసర్ 1, అసోసియేట్ ప్రొఫెసర్ 2, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 6 పోస్టులతోపాటు మరో ఆరుగురిని రెసిడెంట్ డాక్టర్లుగా నియమించారు. మొత్తం 15 మంది వైద్యులతోపాటు ఒక సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టును భర్తీ చేశారు. ఉమెన్స్ కిక్ బాక్సింగ్లో ప్రతిభ సిరిసిల్లటౌన్: ఉమెన్స్ కిక్ బాక్సింగ్ లీగ్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ చూపారు. ఈనెల 26, 27 తేదీల్లో హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఖేలో ఇండియా కిక్ బాక్సింగ్ ఉమెన్స్ లీగ్లో జిల్లా స్పోర్ట్స్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ బాక్సర్లు మాస్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాల్గొన్నారు. 6 బంగారు పతకాలు, 4 వెండి, 5 కాంస్య పతకాలు సాధించారని జిల్లా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వొడ్నాల శ్రీనివాస్ తెలిపారు. -
కోడెలను మంచిగా చూసుకోవాలి
వేములవాడఅర్బన్: రాజన్న గోశాల నుంచి తీసుకున్న కోడెల సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వాటిని మంచిగా చూసుకోవాలని రైతులకు కలెక్టర్ సందీప్కుమార్ ఝా సూచించారు. వేములవాడ మున్సిపల్ పరిధి తిప్పాపూర్ రాజన్న గోశాలలోని 85 జతల కోడెలు మొత్తం 170 కోడెలను అర్హులైన రైతులకు ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గోశాల నుంచి తీసుకున్న కోడెలను కేవలం వ్యవసాయ అవసరాలకు మాత్రమే ఉపయోగించాలన్నారు. వాటిని పక్కదారి పట్టిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కోడెల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ కోడెల స్థితిగతులపై ఆరా తీస్తారని పేర్కొన్నారు. కోడెలను పొందిన రైతులు వాటి సంరక్షణ బాధ్యతను పక్కాగా చూడాలన్నారు. అనంతరం వనమహోత్సవంలో భాగంగా గోశాల ఆవరణలో కలెక్టర్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రాజన్న ఆలయ ఈవో రాధాబాయి, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి రవీందర్రెడ్డి, వ్యవసాయశాఖ అధికారి అఫ్జల్ బేగం తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝా రైతులకు 85 జతల రాజన్న కోడెల అందజేత -
ప్రశాంతంగా సర్వేయర్ల పరీక్ష
సిరిసిల్లటౌన్: గ్రామపాలన అధికారులు (జీపీవో), లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకం కోసం జిల్లా కేంద్రంలోని గీతానగర్ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించిన పరీక్షా కేంద్రాలను కలెక్టర్ సందీప్కుమార్ ఝా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. అభ్యర్థుల హాజరు గురించి ఆరా తీశారు. నిబంధనలకు అనుగుణంగా, పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగిన గ్రామ పాలన అధికారి పరీక్షకు 39 మంది అభ్యర్థులకు 35 మంది హాజరైనట్లు కలెక్టర్ తెలిపారు. లైసెన్స్్డ్ సర్వేయర్ల పరీక్షకు ఉదయం సెషన్లో 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన థియరీ పరీక్షకు 156 మంది అభ్యర్థులకు 141, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెకండ్ సెషన్ ప్లాటింగ్ పరీక్షకు 156 మందికి 139 మంది హాజరయ్యారని వివరించారు. సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ ఏవో రాంరెడ్డి, సీపీవో శ్రీనివాసాచారి, సిరిసిల్ల తహసీల్దార్ మహేశ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ సమ్మేళనంలో కవులకు సత్కారంసిరిసిల్లటౌన్: హైదరాబాద్లో జరిగిన జాతీయ కవి సమ్మేళనంలో జిల్లా కవులకు సన్మానం చేశారు. పోలీసులు– సామాజిక బాధ్యతపై జాతీయ తెలుగు సారస్వత పరిషత్, తెలంగాణ పోలీస్ శాఖ, ఓ జాతీయ తెలుగు దినపత్రిక ఆధ్వర్యంలో ఆదివారం కవి సమ్మేళనం జరిగింది. జిల్లా సాహితి సమితి అధ్యక్షుడు డాక్టర్ జనపాల శంకరయ్య సర్వజన సంరక్షకుడు రక్షక భటుడు అనే అంశంపై తన కవితను ధారాళంగా ఆలపించారు. బాలసాహితీవేత్త డాక్టర్ వాసరవేణి పరుశురాం శ్రీరక్షకభటుల్ఙు కవిత చదివారు. సాహితీ సమితి కార్యదర్శి ముడారి సాయిమహేశ్ రక్షణ విలువ అనే అంశంపై తన కవితను వినిపించారు. బాల సాహితీవేత్తలు.. పుస్తకావిష్కరణలుసిరిసిల్లకల్చరల్: జిల్లాకు చెందిన ఇద్దరు బాలసాహిత్యకారుల పుస్తకాల ఆవిష్కరణ సభ హైదరాబాద్ రవీంద్రభారతి వేదికపై ఆదివారం నిర్వహించారు. మారసం వ్యవస్థాపకుడు డాక్టర్ పత్తిపాక మోహన్, గరిపెల్లి అశోక్ వెలువరించిన ‘ఆకుపచ్చ పాట’కు షేక్ అబ్దుల్ ఘనీ చేసిన అనువాదం హరేభరే గీత్ పుస్తకంతో పాటు అశోక్ వెలువరించిన ‘గోటీలాట’ పుస్తకాలను ముఖ్య అతిథిగా హాజరైన ఉస్మానియా వర్సిటీ తెలుగుశాఖ పూర్వాధ్యక్షుడు డాక్టర్ కసిరెడ్డి వెంకట్రెడ్డి ఆవిష్కరించారు. మాడభూషి లలితాదేవి, డాక్టర్ అమరవాది నీరజ, డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు, శీలా సుభద్రాదేవి, డాక్టర్ చెరుకుపల్లి హారిక అతిథులుగా హాజరయ్యారు. ఆవిష్కర్త మాట్లాడుతూ, బాలసాహిత్య వికాసానికి కృషి చేస్తున్న కవులను ప్రశంసించారు. ఈ సందర్భంగా మోహన్, అశోక్ను మానేరు కవులు అభినందించారు. ఊరు బాగుండాలని.. ● జనగామ నుంచి వేములవాడకు పాదయాత్రవేములవాడ: తమ ఊరు బాగుండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో తులతూగాలని, వర్షాలు సకాలంలో కురిసి పాడిపంటలు బాగుండాలని జనగామ జిల్లా పాలకుర్తి మండలం ముత్తారం గ్రామానికి చెందిన దరావత్ రాజు ముత్తారం నుంచి వేములవాడ రాజన్న చెంతకు పాదయాత్రగా ఆదివారం రాత్రి చేరుకున్నాడు. ఈనెల 25న ఉదయం 6 గంటలకు పాదయాత్ర ప్రారంభించి జనగామ, బచ్చన్నపేట, చేర్యాల, సిద్దిపేట, సిరిసిల్ల మీదుగా వేములవాడకు చేరుకున్నట్లు రాజు తెలిపాడు. రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నాడు. -
భరోసా లేదు..
పథకాలకు దూరంసిరిసిల్ల అర్బన్: జీవనోపాధి కోసం ఉన్న ఊరిలోనే ఇతరుల భూమిని కౌలుకు తీసుకొని సాగుచేస్తున్న కౌలురైతులను పట్టించుకునే వారు కరువయ్యారు. బ్యాంకులు ఎలాగు గుర్తించకపోగా.. కనీసం ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. పెట్టుబడికి డబ్బులు లేక, పంట నష్టపోతే పరిహారం రాక, బీమా భరోసా లేక కౌలురైతులు ఆవేదన చెందుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకునేందుకు పలు పథకాలు అమలు చేస్తున్నా కౌలురైతులకు మాత్రం అందడం లేదు. ఫలితంగా వారు ఆర్థికంగా కుంగిపోతున్నారు. అప్పుల్లోకి నెట్టివేయబడుతున్నారు. జిల్లాలో 30వేల మంది కౌలురైతులు జిల్లాలో సుమారు 30 వేల మంది వరకు ఉంటారని వ్యవసాయశాఖ అధికారుల అంచనా. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కౌలు రైతులకు గుర్తింపుకార్డులను అందజేసింది. అప్పటి నిబంధనల ప్రకారం కౌలురైతులను గుర్తించి వారికి రుణ అర్హత కార్డులు అందజేసి బ్యాంకుల ద్వారా రుణాలు అందించాలనేది లక్ష్యం. కానీ ప్రభుత్వం, అధికారులు ఈ విషయంలో దృష్టి సారించకపోవడంతో వారు ఎలాంటి సహకారానికి నోచుకోవడం లేదు. జిల్లాలో ఒక ఎకరానికి సుమారు రూ.9వేల నుంచి రూ.12వేల వరకు కౌలు చెల్లిస్తున్నారు. పంట దిగుబడితో సంబంధం లేకుండా భూమి యజమానికి కౌలు చెల్లించాల్సిన పరిస్థితి. మరో వైపు మద్దతు ధర లేకపోవడం వంటి ఇబ్బందులతో కౌలుదారులు నష్టపోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో పెట్టుబడి సైతం రాక అప్పులపాలవుతున్నారు. అందని ప్రభుత్వ పథకాలు రుణాల కోసం తిప్పలు ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు ఈ ఫొటోలోని కౌలు రైతు పేరు పోచవేని శేఖర్యాదవ్. ఊరు రగుడు. ఐదేళ్లుగా ఆరెకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. మొదట్లో ఎకరాకు రూ.7వేలు కౌలు చెల్లించాడు. ఇప్పుడు రూ.10వేలకు పెరిగింది. ఎరువుల ధరలు కూడా పెరిగాయి. అయితే కౌలుకు చేస్తే లాభమేమోగాని పెట్టుబడి డబ్బులు కూడా రావడం లేదని, కౌలు రైతులను ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలని కోరుతున్నాడు. రైతు భరోసా, రైతు బీమా తదితర పథకా లు వర్తింపజేయాలని వేడుకుంటున్నారు.కౌలురైతులకు అధికారికంగా గుర్తింపు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే ఏ సంక్షేమ పథకాలు వర్తించడం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కౌలు రైతులకు సైతం రైతుభరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ అమలులో మాత్రం పెట్టడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరికి బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి నిండా మునుగుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించి బ్యాంకు రుణాలతోపాటు, ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు అందేలా చూడాలని కోరుతున్నారు. -
బీడీ పరిశ్రమపై ఆంక్షలు ఎత్తివేయాలి
సిరిసిల్లటౌన్: బీడీ పరిశ్రమపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని తెలంగాణ బీడీ, సిగార్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ రమ కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని చేనేత వస్త్ర వ్యాపార సంఘ భవనంలో తెలంగాణ బీడీ, సిగార్ వర్కర్స్ యూనియన్ జిల్లా 3వ మహాసభలు జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి అధ్యక్షతన జరిగాయి. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7 లక్షల మంది కార్మికులు బీడీ పరిశ్రమపై ఆధారపడి పనిచేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం బీడీ పరిశ్రమపై అనేక ఆంక్షలు విధిస్తూ కార్మికులకు ఉపాధి లేకుండా చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా బీడీ కార్మికులందరికీ రూ.4,000 పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు అమలు చేయడం లేదన్నారు. యూని యన్ రాష్ట్ర అధ్యక్షుడు గోపాలస్వామి మాట్లాడుతూ, బీడీ కార్మికులను కంపెనీ యాజమాన్యాలు అనేక రకాల దోపిడీలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. జిల్లాలోని బీడీ కార్మికులందరూ సమస్యలపై ఐక్యంగా పోరాటానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ, ఉపాధ్యక్షుడు మూషం రమేశ్, సహాయ కార్యదర్శులు సూరం పద్మ, గురజాల శ్రీధర్, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు అరుణ్కుమార్, ఐద్వా జిల్లా కార్యదర్శి జవ్వాజి విమల, నాయకులు శ్రీరాముల రమేశ్చంద్ర, నక్క దేవదాస్, జిందం కమలాకర్, దాసరి రూప, బెజుగం సురేశ్, బోనాల లక్ష్మి, లింగంపల్లి జ్యోతి, గురజాల మమత పాల్గొన్నారు. -
ఏరు పారలె.. ప్రాజెక్టు నిండలె
● మిడ్మానేరు కుడికాల్వ నీటి కోసం రైతుల ఎదురుచూపులు ● నారుమడులు ఎండిపోతున్నాయని ఆవేదనబోయినపల్లి(చొప్పదండి): వానాకాలం ఆరంభంలోనే సాగు నీటికోసం రైతులు ఆందోళనలు చేస్తున్నారు. మిడ్మానేరు ప్రాజెక్టు నీటి విడుదల కోసం కుడికాల్వ కింద సేద్యం చేసే రైతులు ఎదురుచూస్తున్నారు. కుడికాల్వ నీటి ద్వారా ఇల్లంతకుంట మండ ల రైతులు పంటలను సాగు చేస్తారు. ప్రస్తుతం వా నాకాలం సీజన్లో ఇల్లంతకుంట మండలం వంతడుపుల, నారెడ్డిపల్లి, రంగంపేట, నర్సక్కపేట, జవహర్పేట, గాలిపెల్లి తదితర గ్రామాలకు చెందిన రైతులు సుమారు 1,200 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. నీరు విడుదల చేస్తారనే ఆశతో.. మిడ్మానేరు కుడి కాల్వ ద్వారా నీరు అందుతుందనే ఆశతో ఇల్లంతకుంట మండలంలోని రైతులు పెద్ద మొత్తంలో వరి నారు పోసుకున్నారు. కాగా, ప్రస్తుతం నారుమడులు ఎండిపోయే దశలో ఉన్నాయని ఆందోళన బాట పట్టారు. కుడికాల్వ ద్వారా మిడ్మానేరు నీటిని విడుదల చేయాలని ఇటీవల పొత్తూర్ బ్రిడ్జి వద్ద ధర్నా చేపట్టారు. అయితే, మిడ్మానేరు నుంచి కుడికాల్వకు నీరు విడుదల చేస్తే ప్రస్తుతం డిస్ట్రిబ్యూటరీ కాల్వలకు నీరు చేరేంత ఫ్లో లేదని అధికారులు పేర్కొంటున్నారు. ప్రాజెక్టులో నీటిమట్టం పెరిగితే కుడికాల్వకు నీరు విడుదల చేసే అవకాశం ఉందని తెలిపారు. కాగా, గతేడాది ఆగస్టు 14 నుంచి 21వ తేదీ వరకు కుడికాల్వకు నీరు విడుదల చేసినట్లు అధికారులు వివరించారు. మానేరులోకి చేరని వరద మిడ్మానేరు ప్రాజెక్టు కుడి, ఎడమకాల్వల ద్వారా రైతుల పొలాలకు, ప్రాజెక్టు గేట్ల ద్వారా కరీంనగర్ ఎల్ఎండీకి నీటిని విడుదల చేస్తారు. కుడికాల్వ ద్వారా ఇల్లంతకుంట మండల రైతులకు, ఎడమకాలువ ద్వారా బోయినపల్లి, కొత్తపల్లి మండల రైతులకు సాగునీరు అందిస్తారు. ఎడమకాలువ సరిగా లేకపోవడంతో నీటిని విడుదల చేయడం లేదు. మిడ్మానేరు అప్రోచ్ కెనాల్ ద్వారా అన్నపూర్ణ ప్రాజెక్టుకు గతంలో నీరు విడుదల చేసేవారు. కొద్దినెలలుగా మిడ్మానేరులో ఆశించిన నీరు లేక ప్రాజెక్టు నుంచి కుడికాల్వకు, ఇతరత్రా ఎక్కడికి నీరు విడుదల చేయడం లేదు. ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ ఆధారం మిడ్మానేరులో ప్రస్తుతం 7 టీఎంసీల నీ రు నిల్వ ఉంది. నీటిమట్టం తక్కువగా ఉన్న క్రమంలో ప్రా జెక్టు నుంచి నీరు విడుదల చేసే వీలు లేదు. ప్రాజెక్టులో సుమారు 10 టీఎంసీలకు పైగా నీరు చేరితేనే విడుదల చేసే అవకాశముందని అధికారులు అంటున్నారు. గతేడాది జూలై 28 నుంచి ఎల్లంపల్లి నీరు మిడ్మానేరుకు విడుదల చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో ప్రస్తుతం 9.967 టీఎంసీల మేర మా త్రమే నీరు నిల్వ ఉంది. దీంతో అక్కడి నుంచి నీరు విడుదల చేసే వీలు లేదు. ఎస్సారెస్పీలో సైతం కేవలం 22.734 టీఎంసీలు మాత్రమే నీరు ఉండడంతో అక్కడి నుంచి కూడా విడుదల చే యడం కుదరదని అధికారులు అంటున్నారు. జిల్లాలోని మానే రు, మూలవాగు, నక్కవాగు, ఆవునూర్వాగుల నుంచి మిడ్మానేరుకు వరద రావాల్సి ఉంది. -
పెన్షన్ ఇస్తావా.. రాజీనామా చేస్తావా
సిరిసిల్ల అర్బన్: ‘పెన్షన్ ఇస్తావా.. రాజీనామా చేస్తావా’ అని సీఎం రేవంత్రెడ్డిని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బైపాస్రోడ్డులో గల ఫంక్షన్హాల్లో పెన్షన్ పెంపుపై ఏర్పాటు చేసిన మహాగర్జన సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వికలాంగులు, వృద్ధులపట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందన్నారు. ఎన్నికల ముందు వికలాంగులు, వృద్ధులకు పెంచుతానన్న పెన్షన్ 20నెలలు గడుస్తున్నా ఎందుకు పెంచడం లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అన్ని రకాల పెన్షన్లు పెంచుతామని సీఎం హామినిచ్చి ఇప్పటి వరకు అమలు చేయడం లేదన్నారు. పేదల డబ్బును ప్రభుత్వం రుణమాఫీకోసం వినియోగించిందని ఆరోపించారు. రేవంత్రెడ్డి, కేసీఆర్ ఇద్దరూ కూడా భూస్వాములకే కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. 2007 నుంచి వికలాంగులకు అండగా ఉండేది ఎమ్మార్పీఎస్ పార్టీయే అని వివరించారు. ఇప్పటికై నా వికాలాంగులకు రూ.6 వేలు, ఆసరా పెన్షన్ రూ.4 వేలు పెంచాలన్నారు. అలాగే ఆగస్టు 13న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే వికలాంగులు, పెన్షన్దారుల మహాగర్జన సభను విజయంతం చేయడానికి జిల్లాలోని అన్ని మండలాల నుంచి భారీ సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఈ సమావేశంలో వికలాంగుల చేయూత హక్కుల పోరా ట సమితి సభ్యుడు గోపాల్రావు, వైస్చైర్మన్లు రాంబాబు, నాగేశ్వర్రావు, వికలాంగుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత, జిల్లా ఇన్చార్జి పుట్ట రవి, జిల్లా కన్వీనర్ శోభారాణి, నాయకులు లక్ష్మణ్, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు. ● ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ -
బ్యాంకు రుణాలు ఇవ్వాలి
నాలుగేళ్లుగా 4 ఎకరాలను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నా. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో వడ్డీ వ్యాపారుల వ ద్ద అప్పు తీసుకొచ్చి సాగు చేస్తున్నాను. వర్షాభావ పరిస్థితులతో పెట్టుబడి కూడా రావడం లేదు. కౌలు చెల్లించలేక, అప్పులపాలవుతున్నాం. ప్రభుత్వం ఆదుకోవాలి. – బైకని ఎల్లయ్య, రగుడు ప్రభుత్వం ఆదుకోవాలి రెండెకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నా. వర్షాభావ పరిస్థితులతో గతేడాది పెట్టుబడి కూడా రాలేదు. కౌలు డబ్బులు కట్టేందుకు అప్పు తీసుకొచ్చిన. ఈ సారైనా పంట వస్తుందనుకుంటే మొదట్లోనే వర్షాలు పడడం లేదు. ప్రభుత్వమే ఆదుకోవాలి. – గందం రవి, పెద్దూరు రైతుభరోసా వర్తింపజేయాలి మూడెకరాలు కౌలుకు తీసుకున్న. యాసంగి పంట ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. దానికితోడు మద్దతు ధర లేక ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ప్రస్తుతం అప్పు తీసుకొచ్చి సాగుచేస్తున్నా. కౌలురైతులకు ప్రభుత్వ పథకాలు వర్తించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. – మేడుదుల మల్లేశం, ఇప్పలపల్లి -
‘ముసురు’కుంది
సిరిసిల్లటౌన్: జిల్లాలో శుక్రవారం ఉదయం నుంచే వాన ముసురుకుంది. అన్ని మండలాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఆవునూరులో 41.5మి.మీ, నేరెళ్ల 38, ఎల్లారెడ్డిపేటలో 35.8, పెద్దలింగాపూర్ 34.8, నామాపూర్ 33.3, గంభీరావుపే ట 26, పెద్దూరు 24.8, గజసింగవరం 23.5, వీర్నపల్లి 19.5, ఇల్లంతకుంట 16, మర్తనపేట 14.8, సి రిసిల్ల 13.5, నిజామాబాద్ 11, కందికట్కూర్ 10.5, మల్లారం 9.8, నాంపల్లి 9, మర్రిగడ్డ 7, రు ద్రంగి 6.8, వట్టెంల 6.3, బోయినపల్లి 5.3, మానా లలో 4 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. మత్తుకు దూరంగా ఉండాలిసిరిసిల్లటౌన్: విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సిరిసిల్ల సబ్ ఇన్స్పెక్టర్ వినీతరెడ్డి కోరారు. సెస్ ప్రభుత్వ బాలికల కళాశాలలో డ్రగ్స్ నిరోధంపై శుక్రవారం అవగాహన కల్పించారు. ఎస్సై వినీతరెడ్డి మాట్లాడుతూ విద్యార్థినులు తమ చుట్టూ పరిసరాల్లో ఎవరైనా డ్రగ్స్ వినియోగించినట్లు, సరఫరా చేసినట్లు గమనిస్తే పోలీసులకు లేదా టోల్ ఫ్రీ నంబర్ 1908లో సమాచారం అందించాలని కోరారు. ప్రిన్సిపాల్ వనజకుమారి, కానిస్టేబుల్ వెంకటరమణ, లెక్చరర్స్ మురళీ, సీతారాము, సునీత, శ్రీనివాస్, అప్రోజ్ సుల్తానా, ప్రవీణ్కుమార్, నవీన్కుమార్ ఉన్నారు. -
పొగచూరుతున్నాయ్..
● మధ్యాహ్నం వంటకు కట్టెల పొయ్యే దిక్కు ● 30 శాతం స్కూళ్లకు గ్యాస్ సరఫరా ● రుద్రంగికి సిరిసిల్ల ఏజెన్సీ ● సిరిసిల్లకు వేములవాడ ఏజెన్సీ ● గందరగోళంగా ఏజెన్సీల కేటాయింపు ● నెలలుగా బిల్లులు పెండింగ్ ● ఇబ్బందుల్లో వంటకార్మికులుసిరిసిల్ల ఎడ్యుకేషన్: మధ్యాహ్న భోజనం నిర్వాహకులు ఇప్పటికీ కట్టెల పొయ్యి మీదనే వంట చేస్తున్నారు. ప్రభుత్వం ద్వారా సిలిండర్లు సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో అందలేదు. ఫలితంగా జిల్లాలోని సగానికి పైగా పాఠశాలల్లో మధ్యాహ్నం వంటను కట్టెలపొయ్యి మీదనే తయారు చేస్తున్నారు. అసలే వర్షాకాలం.. వంట గదులు ఉరుస్తుండడంతో కట్టెలపొయ్యి మీదనే పొగచూరుతున్న గదుల్లోనే కళ్లు మండుతుండగా వంట చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 30 శాతం స్కూళ్లకు మాత్రమే సిలిండర్లు సరఫరా జరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే గ్యాస్ ఏజెన్సీల కేటాయింపు సైతం గందరగోళంగా మారడంతో సిలిండర్లు పూర్తి స్థాయిలో అందడం లేదని తెలిసింది. అంతేకాకుండా మధ్యాహ్న భోజనం నిర్వాహకులు వేతనాలు నెలల తరబడిగా పెండింగ్లో సాక్షి శుక్రవారం చేపట్టిన గ్రౌండ్ రిపోర్టులో తేలింది. గ్యాస్ ఏజెన్సీల గందరగోళం సిరిసిల్లలోని ప్రభుత్వ పాఠశాలలకు వేములవాడ గ్యాస్ ఏజెన్సీలు, జిల్లా సరిహద్దు మండలాలైన గంభీరావుపేట, రుద్రంగి మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు సిరిసిల్ల గ్యాస్ ఏజెన్సీలతో సిలిండర్లు సరఫరా చేయాలని ఉత్తర్వులు ఉన్నట్లు పలు వురు ప్రధానోపాధ్యాయులు పేర్కొన్నారు. దూరప్రాంతాలు కావడంతో గ్యాస్ సరఫరా ఇబ్బందికరంగా ఉంటుందని కేటాయింపులను సరిచేయాలంటూ ఏజెన్సీల నిర్వాహకులు కోరుతున్నారు. వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లోని ఏజెన్సీలకు ఆయా ప్రాంతాల్లోని పాఠశాలలు కేటాయిస్తే గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయడం ఇబ్బందిగా ఉండబోదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో మధ్యాహ్న భోజనం అమలవుతున్న 458 ప్రభుత్వ పాఠశాలలో ఇప్పటి వరకు జిల్లాలో 134 స్కూళ్ల మాత్రమే గ్యాస్ సిలిండర్లు సరఫరా జరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. బిల్లుల బకాయి విద్యార్థులకు తరగతులవారీగా మధ్యాహ్న భోజన పారితోషకాన్ని కార్మికులకు చెల్లించాల్సి ఉంటుంది. నెలలు గడుస్తున్నా బిల్లులు రావడం లేదని మధ్యాహ్న భోజన కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకటి నుంచి 5వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ప్రతీ విద్యార్థికి మధ్యాహ్న భోజనానికి రూ.6.19, 6 నుంచి 8వ తరగతి వరకు రూ.9.29 చెల్లిస్తుండగా గత ఫిబ్రవరి వరకు బిల్లులు వచ్చాయి. 9 నుంచి 10వ తరగతి వరకు రూ.10.67 చెల్లిస్తుండగా ఈ విభాగంలో గత అక్టోబర్ వరకు నాలుగు నెలల బిల్లులు రావాల్సి ఉంది. కానీ జిల్లా విద్యాశాఖ అధికారులు మాత్రం మార్చి వరకు బిల్లులు చెల్లించినట్లు చెబుతున్నారు. త్వరలోనే పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని అధికారులు స్పష్టం చేశారు.ఈ ఫొటో.. రుద్రంగి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండుతున్న నిర్వాహకులు. ఈ ప్రాంత పాఠశాలలకు సిరిసిల్ల గ్యాస్ ఏజెన్సీల ద్వారా సిలిండర్లు ఇవ్వాలని ఉత్తర్వులు ఉన్నాయి. అయితే శుక్రవారం నాటికి కూడా గ్యాస్ సిలిండర్లు సరఫరా కాలేదు. దీంతో కట్టెల పొయ్యిపైనే మధ్యాహ్నం వంటను సిద్ధం చేస్తున్నారు.ఇక్కడ కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్న వారు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గీతానగర్ ప్రాథమిక పాఠశాలలోని నిర్వాహకులు. ఇక్కడికి వేములవాడ గ్యాస్ ఏజెన్సీ నుంచి సిలిండర్ రావాలి. కానీ శుక్రవారం నాటికి కూడా సిలిండర్ అందలేదు. చేసేదేమీ లేక ఇలా కట్టెల పొయ్యి మీదనే వంట చేస్తున్నారు. -
మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ● వన్పల్లిలో ఎరువులు, విత్తన దుకాణం ప్రారంభం ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి(సిరిసిల్ల): మహిళా సంఘాల సభ్యులు స్వయం ఉపాధి యూనిట్లతో ఆర్థికాభివృద్ధి సాధించాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆకాంక్షించారు. వీర్నపల్లి మండలం వన్పల్లిలో ఎరువులు, విత్తనాలు, పురుగులమందుల దుకాణాన్ని శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలోని మహిళా సంఘాలకు ఇప్పటికే క్యాంటీన్లు, డెయిరీ యూనిట్, కోడిపిల్లల పెంపకం, ఆర్టీసీ బస్సుల యూనిట్లు మంజూరు చేసినట్లు వివరించారు. అనంతరం వన్పల్లిలోని అంగన్వాడీ కేంద్రం, ప్రైమరీ స్కూల్ను తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలోని వంటిగదిలో వర్షం నీరు ఉరుస్తుండడంతో పాఠశాలలోని అదనపు గదిలోకి మార్చాలని సూచించారు. ప్రైమరీ స్కూల్లో 30 మంది విద్యార్థులు మాత్రమే ఉండడంపై ఉపాధ్యాయులను నిలదీశారు. ప్రవేశాలు పెంచాలని సూచించారు. దివ్యాంగురాలికి బాసటగా.. పాఠశాల ఎదురుగా నివసిస్తున్న దివ్యాంగులు లింగంపల్లి సుజాత తన ఇంటికి వెళ్లేందుకు నాలా అడ్డుగా ఉందని, పాత పెంకుటిల్లుతో ఇబ్బంది పడుతున్నానని కలెక్టర్కు మొరపెట్టుకోగా.. వెంటనే స్పందించి నాలాపై సిమెంట్ దిమ్మెను ఏర్పాటు చేయాలని, నల్లా కనెక్షన్ ఇవ్వలాని అధికారులను అదేశించారు. ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని సూచించారు. ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. లబ్ధిదారులకు ఇసుక, మట్టి కోసం ఇబ్బంది పడకుండా పంచాయతీ అధికారులు చూడాలన్నారు. అనంతరం మండల కేంద్రంలోని పీహెచ్సీని పరిశీలించి రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని సూచించారు. శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోవాలి ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో అన్ అకాడమీ పేరుతో జేఈఈ, నీట్ పరీక్షలకు ఆన్లైన్ శిక్షణ తరగతులను కలెక్టర్ ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు నిత్యం రెండు గంటలపాటు ఆన్లైన్ శిక్షణ ఉంటుందని తెలిపారు. గురుకులాల్లోని 8 నుంచి 12వ తరగతులు విద్యార్థుల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డీఆర్డీవో శేషాద్రి, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్బేగం, డీడబ్ల్యూవో లక్ష్మీరాజం, మండల వ్యవసాయాధికారి జయ, ఆర్ఐ శివకుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాములు, వైస్చైర్మన్ లక్ష్మణ్ పాల్గొన్నారు. -
ఆర్టీసీలో ఆధ్యాత్మిక ప్రయాణం
సద్వినియోగం చేసుకోవాలి ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన పుణ్యక్షేత్రాల ప్రత్యేక టూర్ ప్యాకేజీ బస్సు సర్వీసులను భక్తులు సద్వినియోగం చేసుకోవాలి. ఆర్టీసీ బస్సులో సురక్షితంగా వెళ్లి రాత్రి వరకు ఇంటికి చేరుకోవచ్చు. వివరాలకు ఆర్టీసీ అధికారులను, సిబ్బందిని సంప్రదించండి. – ప్రకాశ్రావు, ఆర్టీసీ డిపో మేనేజర్, సిరిసిల్లగంభీరావుపేట(సిరిసిల్ల): భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం.. ఆర్టీసీకి కలిసొస్తుంది. పుణ్యక్షేత్రాలకు నేరుగా బస్సులు లేక రెండు, మూడు ప్రాంతాల్లో దిగడం, ఎక్కడం ఇబ్బందిగా భావిస్తున్నారు. ఇలాంటి వారికి ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీలను ప్రవేశపెట్టింది. ఇటీవల అరుణాచలం గిరిప్రదక్షిణ, యాదాద్రి దర్శనాలకు భక్తులకు తీసుకెళ్లి వచ్చారు. గత నెల 27 నుంచి.. రాష్ట్ర వ్యాప్తంగా గత నెల 27న ఆర్టీసీ అధికారులు ఈ ప్రత్యేక టూర్ ప్యాకేజీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సిరిసిల్ల డిపో నుంచి పుణ్యక్షేత్రాల దర్శనానికి ఏర్పాటు చేసిన సర్వీసులకు స్పందన బా గుంది. ఇప్పటి వరకు మానసాదేవి, కొమురవెళ్లి, వర్గల్, యాదాద్రి, స్వర్ణగిరి దర్శనానికి ఒకటి, అరుణాచలంకు మరో బస్సు చొప్పున ఇప్పటి వరకు ఐదుసార్లు వెళ్లి వచ్చాయి. డిపో నుంచి మొదలయ్యే బస్సు నిర్ధేశిత ప్రాంతాలకు వెళ్తూ ఆలయాల సందర్శనకు సమయం ఇచ్చి తిరిగి బయలుదేరి వస్తున్నా యి. భక్తులు బృందంగా ఏర్పడి ముందుకొస్తే అద్దెకిస్తామని అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. యాదాద్రికి రూ.750 యాదాద్రికి పెద్దలకు టికెట్ రూ.750, పిల్లలకు రూ.420 చొప్పున నిర్ణయించారు. మానసాదేవి టెంపుల్, కొమురవెల్లి, వర్గల్, యాదాద్రి, స్వర్ణగిరి ఆలయాలను సందర్శించుకునే అవకాశం ఉంది. ఈ యాత్ర ఒక్క రోజులోనే ముగుస్తుంది. -
ఎరువులు అందుబాటులో ఉంచాలి
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచాలని జాయింట్ రిజిష్ట్రార్ ఆఫ్ కోఆపరేటీవ్ సొసైటీస్ ప్రసాద్ సూచించా రు. మండలంలోని నేరెళ్ల పీఏసీఎస్ గోదాంను సిరిసిల్ల జిల్లా సహకార అధికారి టి.రామకృష్ణతో కలిసి తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి పలు సూచనలు చేశారు. సింగిల్విండో చైర్మన్ కోడూరి భాస్కర్గౌడ్, అసిస్టెంట్ రిజిష్ట్రార్ బి.రమాదేవి, సీఈవో అజయ్కుమార్, సిబ్బంది అంజయ్య, రాజయ్య, సాయి పాల్గొన్నారు. ‘యాచించే స్థాయికి చేర్చవద్దు’ గంభీరావుపేట(సిరిసిల్ల): ఆలయాల్లో పూజ లు చేసే అర్చకులు నిత్యం వేలాది మంది భక్తులను దీవిస్తారని.. అలాంటి వారిని యాచించే స్థాయికి పాలకులు తీసుకురావద్దని అర్చక సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రాచర్ల పార్థసారథి కోరారు. గంభీరావుపేటలో దూపదీప నైవేద్య సంఘం కార్యవర్గం సమావేశం శుక్రవారం జరిగింది. జిల్లా అధ్యక్షుడు పార్థసారథి మాట్లాడుతూ ఎందరో అర్చకులు దుర్భర జీవితాలు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు పెంచి, ఉద్యోగ భద్రత కల్పించి, ఆరోగ్యకార్డులు అందించాలని కోరా రు. గౌరవ అధ్యక్షుడు కొండమాచారి, ఉపాధ్యక్షుడు బిట్కూరి గోపాలాచార్యులు, వర్కింగ్ ప్రెసిడెంట్ గొంగళ్ల రవి, ప్రధాన కార్యదర్శి ప రాంకుశం, రమేశ్, కోశాధికారి కందాలై వెంకటరమణాచార్యులు, సంతోష్శాస్త్రీ ఉన్నారు. 30న మాదిగల ఆత్మీయ సన్మాన సభ సిరిసిల్లఅర్బన్: జిల్లా కేంద్రంలో ఈనెల 30న నిర్వహించే మాదిగల ఆత్మీయ సన్మానసభను విజయవంతం చేయాలని అంబేడ్కర్ సంఘాల జిల్లా అధ్యక్షుడు కత్తెర దేవదాస్ కోరారు. స్థానిక ప్రెస్క్లబ్లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. మాదిగల ఆత్మీయ సన్మానసభకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్తోపాటు 8 మంది ఎమ్మెల్యేలు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి హాజరవుతున్నట్లు తెలిపారు. అంకని భాను, నేదురు లక్ష్మణ్, కొట్టెపల్లి సుధాకర్, నక్క నర్సయ్య, నారాయణ, పర్శరాములు, రాము, దేవయ్య, బాలకిషన్, కిరణ్ పాల్గొన్నారు. పద్మశాలీ సంఘం ఎన్నికలు నిలిపివేత సిరిసిల్లకల్చరల్: సిరిసిల్ల పట్టణ పద్మశాలీ సంఘం ఎన్నికలకు బ్రేక్ పడింది. ఏకపక్షంగా నిర్వహించతలపెట్టిన ఎన్నికల ప్రక్రియపై న్యాయస్థానాన్ని పలువురు ఆశ్రయించడంతో యథాతధ స్థితి కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 4వ తేదీ నాటికి విచారణను వాయిదా వేసింది. పట్టణ పద్మశాలి సంఘానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని భావించిన సంఘం బాధ్యులు అడ్హాక్ కమిటీ వేశారు. దాదాపు 9600 నూతన సభ్యత్వాలను సేకరించారు. పోటీ చేసే అభ్యర్థులకు నామినేషన్ ఫీజును భారీగా నిర్ణయించారని చిమ్మని ప్రకాశ్, కోడం రవి కోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న న్యాయస్థానం యథాతథస్థితి కొనసాగించాలంటూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. శుభకార్యాలకు ఆర్టీసీ బస్సులువేములవాడఅర్బన్: శుభకార్యాలు, తీర్థయాత్రలకు వెళ్లడానికి భారీ తగ్గింపు ధరలకు బస్సులను పంపించనున్నట్లు వేములవాడ ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. పల్లెవెలుగు గతంలో కిలోమీటర్కు రూ.68 ఉండగా ఇప్పుడు రూ.52, ఎక్స్ప్రెస్ గతంలో రూ.69 ఉంటే రూ.62, డీలక్స్కు రూ.65 ఉంటే రూ.57, సూపర్ లగ్జరీ కిలోమీటర్కు గతంలో రూ.65 ఉంటే ప్రస్తుతం రూ.59లకు ఇవ్వనున్నట్లు వివరించారు. పల్లెవెలుగు బస్సు 100 కిలోమీటర్లకు గతంలో రూ.12వేలు ఉంటే ప్రస్తుతం రూ.9,350లకే ఇవ్వనున్నట్లు వివరించారు. వివరాలకు 99592 25926, 73828 51826, 94405 21412లలో సంప్రదించాలని డీఎం కోరారు. -
నేటి నుంచి ఎల్హెచ్బీ బోగీలు
● తిరుపతి– కరీంనగర్ ఎక్స్ప్రెస్కు మారనున్న బోగీలు ● ఒకప్పుడు నీలి, ప్రస్తుతం పసుపు, రేపటి నుంచి ఎరుపు బోగీలు ● ప్రమాద తీవ్రత తగ్గించేందుకు ఈ బోగీలుసాక్షి ప్రతినిధి, కరీంనగర్: నేటి నుంచి తిరుపతి– కరీంనగర్ బైవీక్లీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అత్యాధునిక ఎల్హెచ్బీ బోగీలతో నడవనుంది. శనివారం రాత్రి తిరుపతిలో ఎగువ మార్గంలో ఈ రైలు 12761 ఎల్హెచ్బీ బోగీలతో మొదటిసారిగా కరీంనగర్ వైపు పరుగులు తీయనుంది. ఆదివారం రాత్రి ఇదే రైలు కరీంనగర్ నుంచి తిరుపతికి 12762 ఇదే బోగీలతో దిగువమార్గంలో నడవనుంది. ఈ అధునాతన ఎల్హెచ్బీ రైలు బోగీల సంఖ్య మొత్తం 19. ఇందులో ఆరు స్లీపర్ బోగీలు, ఐదు తృతీయ శ్రేణి శీతల బోగీలు, రెండు ద్వితీయ శ్రేణి శీతల బోగీలు, నాలుగు సాధారణ (జనరల్ ) బోగీలు, ఒక వికలాంగుల బోగీలతో నడవనుంది. ఈ రైలుకు 12769/70 తిరుపతి– సికింద్రాబాద్– తిరుపతి సెవెన్ హిల్స్ బై వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్తో రేక్ షేరింగ్ ఉంది. కాగా.. తిరుపత్తి– కరీంనగర్ రైలు ఇప్పటి వరకు పసుపు రంగులో ఉండే 22 బోగీలతో నడిచింది. ఇదే రైలు ప్రారంభించిన కొత్తలో నీలి రంగు బోగీలతో నడిచింది. ఎల్హెచ్బీ బోగీలు అంటే? ఎల్హెచ్బీ అంటే లింక్మన్ హాఫ్మన్ బుష్ బోగీలు. ఇవి తేలికపాటి స్టీల్తో తయారు చేస్తారు. జర్మన్ దేశ సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసినవి. మొట్టమొదటి సారి వీటిని మన దేశంలో తీసుకురావాలని అప్పటి దేశ ప్రధాని పీవీ.నరసింహారావు నిర్ణయించారు. ప్రమాదాలు జరిగినపుడు తక్కువ నష్టం జరిగేలా ఈ కోచ్లను రూపొందించారు. తొలుత ఈ ఎల్హెచ్బీ బోగీలను అప్పటి యూపీఏ ప్రభుత్వం కేవలం రాజధాని లాంటి ప్రీమియర్ రైళ్లకు మాత్రమే ఉపయోగించింది. -
నేరస్తులను గుర్తించడంలో జాగిలాలు కీలకం
● ఎస్పీ మహేశ్ బీ గీతేసిరిసిల్లక్రైం: నేరస్తులను గుర్తించడంలో పోలీసు జాగిలాల పాత్ర కీలకమని ఎస్పీ మహేశ్ బి గీతే పేర్కొన్నారు. జాగిలాల కోసం నూతనంగా నిర్మించిన గదులను శుక్రవారం ప్రారంభించారు. నేరపరిశోధన, భద్రతచర్యలు, మాధకద్రవ్యాల నియంత్రణ, విపత్తు పరిస్థితుల్లో పోలీస్ జాగిలాలు కీలకపాత్ర పోషిస్తున్నాయన్నారు. శిక్షణ సామర్థ్యంతో విభిన్న ఆపరేషన్లలో వీటిని వినియోగిస్తున్నామని తెలిపారు. విశ్వాసానికి మారుపేరుగా నిలిచే జాగిలాలు పోలీస్శాఖకు నేరపరిశోధనలో కీలకంగా మారుతున్నాయన్నారు. హత్యలు, దోపిడీలు, దొంగతనాలు జగిన సమయంలో నేరస్తులను పట్టించడంలో కీలకపాత్ర పోషిస్తాయని తెలిపారు. పోలీస్ జగిలాలకు అధునాతన శిక్షణ, వైద్యం, వసతి కల్పించనున్నట్లు చెప్పారు. వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్రెడ్డి, సీఐలు కృష్ణ, మొగిలి, నటేశ్, ఆర్ఐలు రమేశ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధిహామీ పనులు పారదర్శకంగా చేపట్టాలి
● డీఆర్డీవో శేషాద్రిముస్తాబాద్(సిరిసిల్ల): కూలీలకు పనులు కల్పించేందుకు చేపట్టిన ఉపాధిహమీ పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదేనని డీఆర్డీవో శేషాద్రి సూచించారు. ముస్తాబాద్ మండల పరిషత్లో 2024–25లో చేపట్టిన రూ.5.35కోట్ల పనుల సామాజిక తనిఖీ ప్రజావేదికను శుక్రవారం నిర్వహించారు. తెర్లుమద్దిలో 29 రోజుల వేతనాలను కూలీలు పొందలేకపోయారని డీఆర్పీలు వెల్లడించారు. ముగ్గురికి రూ.514 అదనంగా చెల్లించారన్నారు. ఇలా మొత్తంగా రూ.17,500 రికవరీకి ఆదేశించారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు రూ.3వేల జరిమానా విధించారు. ఎంపీడీవో లచ్చాలు, ఎస్ఆర్పీ బాలు, ఎస్టీఎం సాయిజ్ఞానేశ్వర్, విజిలెన్స్ ఆఫీసర్ రామారావు, అరుణ్రాకేశ్, ఎంపీవో బీరయ్య పాల్గొన్నారు. -
మిడ్మానేరు కుడికాలువ నీరు వదలండి
ఇల్లంతకుంట(మానకొండూర్): నారుమళ్లు ముదిరిపోతున్నాయని వెంటనే మిడ్మానేరు కుడికాలువ ద్వారా నీటిని విడుదల చేయాలని కోరుతూ మండలంలోని వంతడుపుల, నారెడ్డిపల్లి, గాలిపల్లి, నర్సక్కపేట గ్రామాల రైతులు శుక్రవారం డీఈ రాజును కోరారు. ఈమేరకు వినతిపత్రం అందించి మాట్లాడారు. గతేడాది ఈ సమయానికి కుడికాలువ ద్వారా నీరు విడిచారని రైతులు చెప్పారు. నారుమడులు ముదిరిపోతే నష్టపోవాల్సి వస్తుందన్నారు. డీఈ మాట్లాడుతూ డ్యాంలో నీరు అంతగా లేదని వరదనీరు రాగానే మొదటిసారిగా కుడికాలువ ద్వారానే నీటిని వదులుతామని హామీ ఇచ్చారు. రైతులు భాస్కర్రెడ్డి, పాశం రవీందర్రెడ్డి, చిమ్మనగొట్టు శ్రీనివాస్, మడకడి రవి, మధుసూదన్రెడ్డి, రామ్రెడ్డి, మిట్టపల్లి మధు పాల్గొన్నారు. -
తుప్పు పడుతున్నాయ్..
ముస్తాబాద్ పోలీస్స్టేషన్లో ఉన్న ఐకేపీ అద్దె ట్రాక్టర్ముస్తాబాద్(సిరిసిల్ల): సాగులో యాంత్రీకరణ ప్రవేశంతో పనులు సులభమయ్యాయి. ట్రాక్టర్లు, కల్టీవేటర్లతో పొలం పనులు వేగంగా పూర్తవుతున్నాయి. వీటిని కొనుగోలు చేసేంత ఆర్థిక స్థోమత లేని సన్న, చిన్నకారు రైతుల కోసం అద్దె ప్రాతిపదికన యంత్రాలను ఇచ్చేందుకు నాలుగేళ్ల క్రితం జిల్లాలోని ఏడు మండలాల్లో అందుబాటులోకి తెచ్చారు. మండల కేంద్రాల్లోని ఐకేపీ కార్యాలయాల్లో ఉంచారు. వీటిపై అవగాహన లేని రైతులు వినియోగించుకోవడం లేదు. ఫలితంగా ఆ యంత్రాలు తుప్పు పట్టిపోతున్నాయి. అద్దెకు మిషిన్లు మండల సమాఖ్యల ద్వారా కొనుగోలు చేసిన ట్రాక్టర్లు, కేజీవీల్స్, కల్టీవేటర్లు, నాగళ్లను రైతులకు అద్దెకు ఇచ్చేందుకు మండల కేంద్రాల్లోని ఐకేపీ కార్యాలయాల్లో ఉంచారు. ట్రాక్టర్కు రైతు నుంచి గంటకు రూ.వెయ్యి నుంచి రూ.1200 తీసుకోవాలి. కల్టీవేటర్కు రూ.200 నుంచి రూ.500 తీసుకుంటున్నారు. ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, బోయినపల్లి, ఇల్లంతకుంట, చందుర్తి, కోనరావుపేట మండల సమాఖ్యల్లో అద్దె వ్యవసాయ పనిముట్లను ఏర్పాటు చేశారు. అధికారులు రైతులకు అవగాహన కల్పించలేదనే విమర్శలు ఉన్నాయి. గడ్డి యంత్రాన్ని మాత్రం చాలా మంది రైతులు అద్దెకు తీసుకెళ్తున్నారు. చోరీకి గురవుతున్న యంత్రాలు మండల సమాఖ్య కేంద్రాల్లోని షెడ్లు, చెట్ల కింద ఉన్న ట్రాక్టర్లు, కల్టీవేటర్లు తుప్పుపడుతున్నాయి. గంభీరావుపేటలో చెట్టు కింద ఉన్న ట్రాక్టర్కు నిర్వహణ లేకుండా పోయింది. ముస్తాబాద్లో షెడ్డులో ఉన్న యంత్రాలు నాలుగు నెలల క్రితం చోరీకి గురయ్యాయి. ట్రాక్టర్ను ఎత్తుకెళ్లిన నెల రోజుల వరకు అధికారులకు తెలియలేదంటే అద్దె యంత్రాల నిర్వహణపై ఎంత శ్రద్ధ ఉందో తెలిసిపోతుంది. తర్వాత పోలీసులు కేసును ఛేదించినప్పటికీ ట్రాక్టర్ ఠాణాలోనే తుప్పు పడుతుంది. చాలా మండలాల్లో ఇదే పరిస్థితి ఉందని రైతులు పేర్కొంటున్నారు. తుప్పు పట్టి పనికిరాకుండా పోకముందే యంత్రాలను ఇతరులకు విక్రయిస్తేనైనా ఐకేపీకి నష్టాలు రావని పలువురు పేర్కొంటున్నారు. అక్కరకు ఉపయోగపడని అద్దె యంత్రాలు అన్నదాతలకు అవగాహన కరువు వినియోగించుకోని రైతులుకౌలురైతులకు ఉచితంగా ఇవ్వాలి అద్దెకు యంత్రాలు ఇస్తారనే విషయమే తెలియదు. రైతులకు అవగాహన కల్పిస్తే వినియోగించుకుంటారు. కౌలురైతులకు ఉచితంగా ఇస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అధికారులు ఆలోచించాలి. – మెరుగు అంజాగౌడ్, నామాపూర్అవగాహన కల్పించాలి ఐకేపీకి ప్రతీ గ్రామంలో నెట్వర్క్ ఉంది. ప్రతీ ఇంటి నుంచి మహిళలు ఐకేపీలో సభ్యులే. వారి ద్వారా రైతులకు అద్దె యంత్రాలపై అవగాహన కల్పిస్తే బాగుంటుంది. వృథాగా ఉండి, యంత్రాలు తుప్పు పడితే మండల సమాఖ్యలకే నష్టం. – శాడ శ్రీనివాస్, గూడెంరైతులకు సమాచారం ఇస్తున్నాం మండల సమాఖ్యలో ఉన్న అద్దె పనిముట్లపై రైతులకు గతంలోనే అవగాహన కల్పించాం. కొంతమంది ఉపయోగించుకున్నారు. ఎస్హెచ్జీలతో సమన్వయం చేసుకుని ట్రాక్టర్లకు అద్దెకు ఇస్తాం. రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ముస్తాబాద్ ట్రాక్టర్ ప్రస్తుతం ఠాణాలో ఉంది. త్వరలో దానిని విడిపించి రైతులకు ఇస్తాం. – దేవరాజు, ఏపీఎం, ముస్తాబాద్ -
మహిళా సంఘాలు వ్యాపారంలో రాణించాలి
● ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కలెక్టర్ సందీప్కుమార్ ఝా ● ఎరువులు, విత్తనాల దుకాణాలు ప్రారంభంబోయినపల్లి(చొప్పదండి): ఇందిరా మహిళాశక్తి కింద ఎరువులు, ఫర్టిలైజర్ దుకాణాలు ఏర్పాటు చేసిన మహిళలు వ్యాపారంలో రాణించాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కలెక్టర్ సందీప్కుమార్ ఝా పేర్కొన్నారు. మండల కేంద్రంలో ధరిత్రి మహిళా సమాఖ్య, విలాసాగర్ గ్రామైఖ్య సంఘాల ద్వారా ఏర్పాటు చేసిన ఎరువులు–విత్తనాల దుకాణాలను గురువారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యం మేరకు ఇందిరా మహిళాశక్తి కింద మహిళా సంఘాలకు క్యాంటీన్లు, డెయిరీ యూనిట్, కోడిపిల్లల పెంపకం, ఆర్టీసీ బస్సుల యూనిట్లు అందజేస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝా మాట్లాడుతూ త్వరలో జిల్లాలో 23 దుకాణాలు మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డీఆర్డీవో శేషాద్రి, డీఏవో అఫ్జల్బేగం, తహసీల్దార్ నారాయణరెడ్డి, ఎంపీడీవో జయశీల, ఎంఏవో ప్రణిత, ఏపీఎం జయసుధ, సెస్ డైరెక్టర్ సుధాకర్, ఏఎంసీ చైర్మన్ ఎల్లేశ్యాదవ్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి, మాజీ ఎంపీపీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. గుడ్ల సరఫరా పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ సిరిసిల్లకల్చరల్: వసతిగృహాల్లో కోడిగుడ్ల టెండర్ల పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ సందీప్కుమార్ ఝా ప్రకటించారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో గురువారం సమీక్షించారు. కలెక్టర్ చైర్మన్గా, జిల్లా విద్యాధికారి, ఆయా రెసిడెన్షియల్ విద్యాలయాల బాధ్యులు, పశుసంవర్ధకశాఖ అధికారులు సభ్యులుగా కమిటీని రూపొందిస్తామని తెలిపారు. గతేడాది అడ్మిషన్లకు అదనంగా మరో 10 శాతం విద్యార్థుల సంఖ్యను పెంచి ఇండెంట్ తయారు చేయాలని ఆదేశించారు. కోడిగుడ్డు బరువు 45 నుంచి 52 గ్రాములు ఉండాలని, నెలలో రెండుసార్లు సరఫరా చేయాలని పేర్కొన్నారు. డీఈవో వినోద్కుమార్, సంక్షేమాధికారి లక్ష్మీరాజం, పశుసంవర్ధకశాఖ అధికారి రవీందర్రెడ్డి, బీసీడీవో రాజమనోహర్రావు పాల్గొన్నారు. -
యువత వ్యసనాలకు దూరంగా ఉండాలి
● సీనియర్ సివిల్ జడ్జి రాధికా జైస్వాల్ సిరిసిల్లకల్చరల్: యువత వ్యసనాలకు దూరంగా ఉంటూ.. బంగారు భవిష్యత్ కోసం విశ్రమించకుండా శ్రమించాలని సీనియర్ సివిల్ జడ్జి రాధికా జైస్వాల్ సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం సంజీవయ్యనగర్లోని సహస్ర జూనియర్ కళాశాలలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు టీజింగ్, ర్యాగింగ్ వంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. న్యాయవాదులు ఆడెపు వేణు, గెంట్యాల భూమేశ్, లోక్ అదాలత్ సభ్యుడు చింతోజు భాస్కర్, కళాశాల నిర్వాహకుడు సిద్దిరాల శ్రీనివాస్ పాల్గొన్నారు. సోషల్ మీడియాపై నిఘా ● ఎస్పీ మహేశ్ బి గీతే సిరిసిల్లక్రైం: అనుచిత వ్యాఖ్యలు చేస్తూ శాంతి భద్రతలకు భంగం వాటిల్లేలా సోషల్మీడియాలో ప్రచారం చేసే మెసేజ్లపై నిఘా ఉంటుందని ఎస్పీ మహేశ్ బి గీతే పేర్కొన్నారు. వాస్తవాలు గ్రహించకుండా అసత్య ప్రచారాలు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో ఒక వర్గాన్ని, పార్టీని, మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై సోషల్ మీడియా ట్రాకింగ్ విభాగం నిరంతరం నిఘా కొనసాగిస్తుందని పేర్కొన్నారు. అవాస్తవాలను ప్రచారం చేసే వారి వివరాలను 87125 37826 నంబర్కు మెసేజ్ చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. శ్రావణంలో ప్రత్యేక ఏర్పాట్లు ● ఈవో రాధాభాయి వేములవాడ: శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 25 నుంచి ఆగస్టు 22 వరకు శ్రావణమాసం సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఈవో రాధాభాయి గురువారం తెలిపారు. భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యే ఈనెల రోజులపాటు ప్రత్యేక సిబ్బంది, ప్రత్యేక క్యూలైన్లు, పూజారులకు విధులు కేటాయించినట్లు చెప్పారు. భక్తుల రద్దీకి అనుగుణంగా శానిటేషన్ పనులు, తాగునీరు, విద్యుత్ సరఫరా, కౌంటర్లు, ప్రసాదాలు అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. ముసురుకున్న వర్షం సిరిసిల్లటౌన్: జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో గురువారం ‘ముసురు’కుంది. వర్షపాత వివరాలు మిల్లీమీటర్లలో..చందుర్తి 50.6, రుద్రంగి 44.1, వేములవాడ రూరల్ 34.7, బోయినపల్లి 34.2, ముస్తాబాద్ 34.2, గంభీరావుపేట 32.9, ఇల్లంతకుంట 27.2, వేములవాడ 27, వీర్నపల్లి 22.8, తంగళ్లపల్లి 22.6, కోనరావుపేట 22.5, ఎల్లారెడ్డిపేట 20.8, సిరిసిల్ల 17.7 నమోదైంది. అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి దరఖాస్తు గడువు పెంపు సిరిసిల్లకల్చరల్: అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకానికి దరఖాస్తు చేసుకునే గడువు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించినట్లు జిల్లా ఇన్చార్జి ఎస్సీడీవో రాజమనోహర్రావు ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో అమెరికా, కెనడా, సౌత్కొరియా, జర్మ నీల్లో ఉన్నత చదువులు చదవాలనుకునే ఎస్సీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈనెల 19 నుంచి ఆగస్టు 31 వరకు విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దివ్యాంగులకు పునరావాసం సిరిసిల్లకల్చరల్: దివ్యాంగులకు పునరావాస పథకం కింద దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం తెలిపారు. జిల్లాకు 17 యునిట్లు మంజూరైనట్లు పేర్కొన్నారు. రూ.50వేల చొప్పున 14 యూనిట్లు, రూ.లక్ష యూనిట్ 80శాతం రాయితీ, రూ.2లక్షల యూనిట్ 70శాతం, రూ.3లక్షల యూనిట్ 60శాతం రాయితీతో ఒక్కొక్కటి మంజూరైందని వివరించారు. అర్హులైన దివ్యాంగులు tgobmms.cgg.gov.in లింక్ ద్వారా ఆన్లైన్లో ఈనెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
సిరిసిల్లటౌన్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు పుట్టినరోజు వేడుకలు పట్టణంలో గురువారం పండుగలా జరిగాయి. గాంధీచౌక్, ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్, తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఽఆధ్వర్యంలో కేక్లు కోసి స్వీట్లు పంచారు. స్థానిక జిల్లా ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ‘గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా బాలింతలకు కేసీఆర్ కిట్లను అందించారు. అనంతరం తెలంగాణ భవన్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించి, మెగా ప్లాంటేషన్ చేపట్టారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అఽధ్యక్షుడు జిందం చక్రపాణి, చీటి నర్సింగరావు, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, జెడ్పీ మాజీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జిందం కళ, మాజీ వైస్చైర్మన్ మంచె శ్రీనివాస్, అర్బన్ బ్యాంకు చైర్మన్ రాపెల్లి లక్ష్మీనారాయణ, సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ, బొల్లి రామ్మోహన్, కుంభాల మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆదర్శం అచ్చన్నపల్లి
● ప్రైవేట్ స్కూళ్ల బస్సులు రాని ఊరు ● ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాల ● పదేళ్లుగా ఏకతాటిపైన గ్రామస్తులు ● నాణ్యమైన భోజనం, విద్యాబోధనవేములవాడరూరల్: ఉదయం జావ.. మధ్యాహ్నం నాణ్యమైన భోజనం.. సాయంత్రం స్నా క్స్.. స్వచ్ఛమైన తాగునీరు.. నాణ్యమైన విద్యాబోధన.. ఇదంతా ప్రభుత్వ బడిలోనే. అవును గ్రామస్తులు ఏకమై తమ పిల్లలు ఊరు దాటి వెళ్లవద్దనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా డబ్బులు జమచేస్తూ ప్రైవేట్ టీచర్లను పెట్టి మరీ ప్రభుత్వ బడిని బతికించుకుంటున్నారు. వారే వేములవాడరూరల్ మండలం అచ్చన్నపల్లి గ్రామస్తులు. 57 మంది విద్యార్థులు వేములవాడ రూరల్ మండలం అచ్చన్నపల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 57 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ పాఠశాలలో ఇద్దరు మాత్రమే ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉండగా.. గ్రామస్తులు ముందుకొచ్చి మరో నలుగురు ప్రైవేట్ టీచర్లను నియమించుకున్నారు. ఇందుకు పదేళ్ల క్రితం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ వేసుకున్నారు. ఆ కమిటీ ఆధ్వర్యంలో పాఠశాలను నిర్వహిస్తున్నారు. అందరూ రైతులే.. అచ్చన్నపల్లిలో గ్రామంలో 175 గృహాలు, 744 మంది జనాభా ఉన్నారు. ఈ గ్రామంలో అందరూ వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తారు. ఉదయం పొలం పనులకు వెళ్తే సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రారు. ఈక్రమంలో స్కూల్కు వెళ్లిన పిల్లలకు నాణ్యమైన ఇంటి భోజనం అందించాలనే ఉద్దేశంతో కమిటీ ఆధ్వర్యంలో ఏడాదికి ఒక్కో విద్యార్థికి రూ.8వేలు చొప్పున జమచేసుకుంటున్నారు. ప్రత్యేకంగా వంట మనుషులను ఏర్పాటు చేసి ఉదయం జావ, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ అందజేస్తున్నారు. ఇలా ప్రతీ నెల రూ.40వేల వరకు వెచ్చిస్తున్నారు. ఈ ఖర్చంతా పిల్లల తల్లిదండ్రులే భరిస్తున్నారు. ఎల్కేజీ, యూకేజీ పిల్లలకు సైతం విద్యాబోధన చేస్తున్నారు. పిల్లలకు స్వచ్ఛమైన వాటర్ అందించాలని స్కూల్ పక్కనే మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. పిల్లలతోపాటు గ్రామస్తులు కూడా ఇక్కడి నుంచే ఉచితంగా శుద్ధనీటిని తీసుకెళ్తున్నారు. ఏటా నవోదయకు ఎంపిక ఈ పాఠశాలలో చదివే పిల్లలు ఏటా 5వ తరగతి పూర్తికాగానే నవోదయ పాఠశాలకు ఎంపికవుతున్నార. గత కొన్నేళ్లుగా ప్రతీ సంవత్సరం నలుగురు నుంచి ఐదుగురు విద్యార్థులు ఎంపికవుతున్నారు. అన్ని ఏర్పాటు చేసుకున్నప్పటికీ ప్రభుత్వం అదనపు గదులు, టీచర్లను ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.గ్రామస్తుల సహకారంతో... ఈ పాఠశాలలో చదివే ప్రతీ విద్యార్థిపై గ్రామస్తులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. మా స్కూల్కు ఎలాంటి లోటు రాకుండా ఎంతో సహకరిస్తున్నారు. ఈ గ్రామం నుంచి ప్రైవేటు బడులకు ఎవరూ పోరు. – శ్రీనివాస్, హెచ్ఎం, అచ్చన్నపల్లిపదేళ్లుగా ప్రైవేటుకు బంద్ మా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోకే మా పిల్లలను పంపిస్తా ము. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఇక్కడ చదువుకుంటారు. భోజనంతోపాటు అన్ని సౌకర్యాలను గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేస్తాం. గత పదేళ్లుగా మా గ్రామానికి ప్రైవేటు పాఠశాల వాహనాలు రావు. – దానె కొమురయ్య, మాజీ సర్పంచ్, అచ్చన్నపల్లి -
వరద..బురద
● చిన్న వర్షానికే తీరని వ్యథ ● పొంగిన డ్రైనేజీలు.. చిత్తడైన రోడ్లు ● విలీన గ్రామాలు అస్తవ్యస్తంసిరిసిల్లటౌన్/సిరిసిల్లఅర్బన్/వేములవాడ: వానాకాలం వచ్చిందంటేనే ఇటు సిరిసిల్ల ప్రజలు.. అటు వేములవాడ మున్సిపల్ విలీన గ్రామాలవాసులు వణికిపోతున్నారు. చిరుజల్లులకే వరద ముంచెత్తుతుండడంతో భయాందోళన చెందుతున్నారు. డ్రెయినేజీలు పొంగిపొర్లుతుండడంతో వరదనీరు కాలనీలను ముంచెత్తుతోంది. వరద తగ్గిందని ఊపిరిపీల్చుకునేలోపు బురద వెంటాడుతోంది. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలలోని వానాకాలం కష్టాలపై ఫోకస్. సిరిసిల్లలో ఇలా.. ఒకప్పుడు ఊరి శివారులో ఉండే రాయించెరువు, తుమ్మలకుంట స్థలాల్లో పట్టణం విస్తరించింది. పై ప్రాంతం నుంచి వచ్చే వరద ఆయా ప్రాంతాల్లో నిలువకుండా వరదకాల్వలు లేకపోవడంతో వర్షాకాలంలో ముంపునకు గురువుతున్నాయి. చెరువుకట్టలను ఆనుకుని ఎన్నో నిర్మాణాలు జరిగాయి. ఈదులచెరువు, అర్జునకుంట, దేవునికుంట, మైసమ్మకుంట, దామరకుంటల స్థలాలు రక్షించడంలో అధికారులు విఫలమవుతున్నారు. కొత్తచెరువు, కార్గిల్లేక్ కాల్వలు, బఫర్జోన్, ఎఫ్టీఎల్ లెవెల్ స్థలా లు కబ్జాకు గురవడంతోనే వరద ముంచెత్తుతోందని స్థానికులు పేర్కొంటున్నారు. విలీన గ్రామాల్లో.. సిరిసిల్ల పట్టణ శివారుకాలనీలతోపాటు విలీన గ్రామాల్లో డ్రెయినేజీలు లేక ఇళ్లలో వాడుకున్న నీరంతా రోడ్లపైకి వస్తోంది. వర్షం నీరు ఇళ్ల మధ్య నిలవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మురుగునీటి నిల్వలతో దోమలు పెరిగి జ్వరాలు ప్రబలుతున్నాయి. చంద్రంపేట, జ్యోతినగర్, కొత్తబస్టాండ్, రాజీవ్నగర్, ముష్టిపల్లి, పెద్దూరు, మాలపల్లి, బోనాల కాలనీల్లో పరిస్థితి అధ్వానంగా ఉంది. మరోవైపు రోడ్లు లేకపోవడంతో మట్టిరోడ్లు బురదమయంగా మారుతున్నాయి. ● వేములవాడ శివారు కాలనీల్లో వర్షపునీరు పేరుకుపోతుంది. డ్రెయినేజీ సిస్టమ్ సక్రమంగా లేకపోవడంతో వర్షం నీటితో వీధులు బురదమయంగా మారుతున్నాయి.ఇది వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని సాయినగర్. వర్షం పడితే స్థానికులు ఇళ్ల నుంచి బయటకు రావడమే కష్టంగా మారింది. వాహనాలు వెళ్లలేని దుస్థితి నెలకొంది. డ్రెయినేజీ సరిగ్గా లేకపోవడంతో వర్షపు నీరంతా ఇండ్ల మధ్యలోనే నిలుస్తుంది.ప్రణాళికలు రూపొందించాం మౌలిక వసతుల కోసం ప్రణాళికలు రూపొందించాం. కాలనీల్లో మురుగునీటి పారుదల కోసం కొత్త డ్రెయినేజీలను నిర్మించబోతున్నాం. ఖాళీ స్థలాల్లో నీటి నిల్వ నివారణకు ఎలివేషన్ ప్లానింగ్ చేస్తున్నాం. వీధుల్లో పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక బృందాలతో పనులు చేయిస్తున్నాం. – అన్వేశ్, మున్సిపల్ కమిషనర్, వేములవాడఇది వేములవాడ శివారులోని మల్లారంరోడ్డులోని ఓ రెసిడెన్షియల్ కాలనీ. డ్రెయినేజీ లేకపోవడంతో మురికినీరు, వరదనీరు రోడ్డుపైన పారుతుంది. స్థానికులు ఇంట్లో నుంచి బయటకు రావాలంటే బురదలో నుంచి రావాల్సిందే. -
రైతులకు సరిపడా యూరియా
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): జిల్లాలో యూరియా కొరత లేదని, అన్ని సహకార సంఘాల గోదాముల్లో రైతులకు సరిపడేంత అందుబాటులో ఉందని జిల్లా సహకార సంఘం అధికారి రామకృష్ణ పేర్కొన్నారు. మండలంలోని రాచర్లతిమ్మాపూర్, అల్మాస్పూర్, ఎల్లారెడ్డిపేటలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల గోదాముల్లో నిల్వచేసిన యూరి యాను బుధవారం పరిశీలించారు. రామకృష్ణ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రతీ సంఘానికి ఇప్పటి వరకు 445 మెట్రిక్ టన్నుల సరఫరా జరిగిందన్నారు. ఎల్లారెడ్డిపేట పీఏసీఎస్ రెండు గోదాముల్లో 1524 యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నాయన్నారు. మండల వ్యవసాయాధికారి రాజశేఖర్ ఉన్నారు. మత్స్య కార్మికులు ఆర్థికంగా ఎదగాలి ● జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు రామచంద్రం ఇల్లంతకుంట(మానకొండూర్): ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ మత్స్య కార్మికులు ఆర్థికంగా ఎదగాలని జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం చైర్మన్ చొప్పరి రామచంద్రం కోరారు. ఇల్లంతకుంటలోని రైతువేదికలో బుధవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. 50 ఏళ్లు దాటిన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులకు ప్రభుత్వం పింఛన్ మంజూరు చేయాలని కోరారు. మండల ముదిరాజ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎలవేని రమేశ్, డైరెక్టర్ కూనవేణి పరశురాములు, మత్స్యశాఖ ఫీల్డ్ ఆఫీసర్ కిరణ్కుమార్, కోఆర్డినేటర్ దిలీప్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ బంద్ సక్సెస్ సిరిసిల్లటౌన్: భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైనట్లు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుండెల్లి కళ్యాణ్, మల్లారపు ప్రశాంత్ తెలిపారు. వారు మాట్లాడుతూ విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇప్పటి వరకు విద్యాశాఖమంత్రిని కేటాయించకపోవడం సిగ్గుచేటన్నారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. జశ్వంత్, ఉస్మాన్, షాహిద్, యశ్వంత్, సిద్దు, సాయి, భార్గవ్ పాల్గొన్నారు. ప్రభుత్వ ఐటీఐలో రెండో విడత ప్రవేశాలు సిరిసిల్లకల్చరల్: తంగళ్లపల్లిలోని ప్రభుత్వ ఐటీఐలో వివిధ ట్రేడ్లలో రెండో విడత ప్రవేశాలు ప్రారంభమైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ కవిత ప్రకటనలో తెలిపారు. ఈనెల 31లోపు ఆసక్తి గల విద్యార్థులు https://iti.tela ngana.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెకానిక్ మోటర్వెహికల్, డీజిల్ మెకానిక్, కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, ఫ్యాషన్ టెక్నాలజీతోపాటు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లో సీఎన్సీ ఇంజినీరింగ్ డిజైనింగ్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్ రొబోటిక్స్, డిజిటల్ మాన్యుఫ్యాక్చర్, మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్ ఇన్ ఆటోమేషన్, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్, వర్చువల్ అనాలసిస్ డిజైనర్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. పిల్లలను జాగ్రత్తగా చూడాలి ● సీఎంవో సెక్రటరీ సతీశ్ వేములవాడరూరల్: భవిత కేంద్రాల్లోని ప్రత్యేక అవసరాలు గల పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని సీఎంవో సెక్రటరీ సతీశ్ పేర్కొన్నారు. వేములవాడ అర్బన్ మండలంలోని భవిత కేంద్రాన్ని బుధవారం సందర్శించారు. పిల్లలకు శిక్షణ ఇచ్చే మెటీరియల్ను పరిశీలించారు. పిల్లలకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలను, విద్యాప్రమాణాలను టీచర్ జయలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలోని రికార్డులను పరిశీలించారు. ఎంఈవో, సీసీవో రాంప్రసాద్, ఎంఐఎస్ మంగ, చైతన్య, నగేశ్ తదితరులు ఉన్నారు. -
మహిళలను కోటీశ్వరులను చేస్తాం
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ● ఫర్టిలైజర్షాపులు ప్రారంభం చందుర్తి/వేములవాడఅర్బన్: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. చందుర్తి మండలం నర్సింగపూర్, వేములవాడ పట్ట ణంలో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా ఫర్టిలైజర్షాపులు, విత్తనాల దుకాణాలను బుధవారం ప్రారంభించి మాట్లాడారు. సోలార్ విద్యు త్ ఉత్పత్తి ప్లాంట్లు, రైసుమిల్లులు, పెట్రోల్పంపులు, ధాన్యం కొనుగోలు కేంద్రాలతో అనేక వ్యాపారాలు ఏర్పాటు చేసుకునేందుకు సహకా రాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. డీఆర్డీఏ శేషా ద్రి, పార్టీ మండలాధ్యక్షుడు చింతపంటి రామస్వామి, రుద్రంగి మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు బొజ్జ మల్లేశం, మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్, నర్సింగపూర్ మాజీ ఉపసర్పంంచ్ కాసారపు శ్రీనివాస్రెడ్డి, ఐకేపీ ఏపీఎం రజిత పాల్గొన్నారు. ఆర్టీసీలో సంబరాలు వేములవాడలోని ఆర్టీసీ డిపో ఆవరణలో నిర్వహించిన సంబరాల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. బస్సుల్లో ప్రయాణించిన మహిళలను, విద్యార్థులను సన్మానించారు. -
‘మహాలక్ష్మీ’తో మహిళల్లో ఆనందం
● రూ.110కోట్లు ఆదా చేశారు ● కలెక్టర్ సందీప్కుమార్ ఝాసిరిసిల్లటౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మీ పథకాన్ని అతివలు సద్వినియోగం చేసుకున్నారని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. బస్సుల్లో మహిళలు 200 కోట్ల టికెట్లపై ఉచిత ప్రయాణాలు పూర్తయిన సందర్భంగా జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ఆవరణలో బుధవారం సంబరా లు నిర్వహించారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝా మాట్లాడుతూ జిల్లాలోని మహిళలు 3 కోట్ల ఉచిత టికెట్లపై ప్రయాణం చేసి, రూ.110కోట్లు ఆదా చేశారని తెలిపారు. ఉచిత ప్రయాణంతో ఆదా అవుతున్న డబ్బును పిల్లల ఆరోగ్యం, ఉన్నత చదువులు, పొదుపు చేయాలని సూచించారు. డిపో మేనేజర్ ప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు. డ్రగ్స్కు దూరంగా..లక్ష్యానికి చేరువగా.. సిరిసిల్లకల్చరల్: మత్తుపదార్థాలకు దూరంగా ఉంటూ లక్ష్యానికి చేరువ కావాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా సూచించారు. మాదక ద్రవ్యాల నియంత్రణ చర్యలపై కలెక్టరేట్లో నార్కోటిక్ నియంత్రణాధికారులతో సమీక్షించారు. మాదక ద్రవ్యాలు వినియోగిస్తే కలిగే అనర్థాల గురించి విద్యాసంస్థల్లో అవగాహన కల్పించాలని సూచించారు. అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎంహెచ్వో రజిత, డీఏవో అఫ్జల్బేగం, కార్మికశాఖ అధికారి నజీర్ అహ్మద్, డీఐఈవో శ్రీనివాస్ పాల్గొన్నారు. విద్యతోనే ఉన్నత స్థానాలువేములవాడరూరల్: విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదిగేందుకు చదువే ఆయుధమని కలెక్టర్ సందీప్కుమార్ ఝా పేర్కొన్నారు. వేములవాడరూరల్ మండలం లింగంపల్లి ప్రైమరీ, హన్మాజీపేటలోని ప్రైమరీ, హైస్కూ ల్, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. లింగంపల్లిలో నిరుపయోగంలో ఉన్న గదులను వినియోగంలోకి తీసుకురావాలని సూ చించారు. హన్మాజీపేటలోని హైస్కూల్ పదోతరగతి విద్యార్థులకు గణితంలో పలు ప్రశ్నలు బోర్డు మీద రాసి సమాధానాలు రాయించారు. కంప్యూటర్లు, గ్రంథాలయాన్ని వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. ఎక్కువ ఉన్న డెస్క్లను అవసరమైన ఇతర పాఠశాలలకు పంపించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. -
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
వేములవాడ: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నా రు. పట్టణంలోని మంజునాథ ఫంక్షన్ హాల్లో మహిళా బ్యూటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మేకప్ అండ్ హెయిర్ పే సెమినార్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మహిళలు ఎంచుకున్న రంగాల్లో రాణిస్తూ మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన పద్ధతులను అప్గ్రేడ్ చేసుకుంటూ ముందుకెళ్లాలన్నారు. ప్రజా ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోందన్నారు. రాధిక, కవిత, స్రవంతి, మాధవి, స్వప్న, మంజుల, జ్యోతి, మేకప్ ఆర్టిస్టు లక్ష్మీ బంధకవి పాల్గొన్నారు.● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ -
మధ్యవర్తిత్వంతో కేసుల పరిష్కారం
సిరిసిల్లకల్చరల్: మధ్యవర్తిత్వం ద్వారా కేసులు సులువుగా పరిష్కరించవచ్చని సీనియర్ సివిల్ జడ్జి, డీఎల్ఎస్ఏ కార్యదర్శి రాధికా జైస్వాల్ పేర్కొన్నారు. జిల్లాన్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో మంగళవారం మాట్లాడారు. పౌర సమస్యలు, కుటుంబ సంబంధ వివా దాలను శాంతియుతంగా పరిష్కరించే లక్ష్యంగా జాతీయస్థాయిలో మధ్యవర్తిత్వాలను ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ, హైదరాబాద్ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లాలో మధ్యవర్తిత్వంపై ప్రత్యేక శిక్షణ కోసం అర్హత, ఆసక్తి గల న్యాయవాదుల ప్రతిపాదిత జాబితాను ఇప్పటికే పంపించినట్లు తెలిపారు. సుమారు 40 గంటల పాటు మధ్యవర్తిత్వ ప్రక్రియపై శిక్షణ పొందిన వారిని అధికారిక మధ్యవర్తులుగా గుర్తిస్తారన్నారు. జిల్లాలో ఈ ప్రక్రియను జయప్రదం చేయాలని న్యాయవాదులను కోరారు. -
ముక్కోటి మొక్కులు
సిరిసిల్లటౌన్: సిరిసిల్లలో మంగళవారం భక్తి పారవశ్యం వెల్లివిరిసింది. స్థానిక హరిహరపుత్ర అయ్యప్ప ఆలయంలో శ్రీ రాజశ్యామల వారాహి సహిత లలితా త్రిపుర సుందరి ఆలయ 4వ వార్షికోత్సవం వేడుకలు నేత్రపర్వంగా నిర్వహించారు. సుమారు 550మంది సుహాసినులు శ్రీ చక్రాలతో ముక్కోటి కుంకుమార్చనలు నిర్వహించారు. మూడో రోజు కార్యక్రమంలో అర్ధనారీశ్వరీ రూపంలో శ్రీ లలితా త్రిపుర సుందరిమాత దర్శనమిచ్చారు. అమ్మవారిని నిమ్మకాయల మాలతో అలంకరణ చేశారు. హరిహర పుత్ర అయ్యప్ప ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షుడు రాచ విద్యాసాగర్స్వామి, ప్రయాకర్రావు మధు, కూన సురేశ్, గడ్డం భగవాన్ పాల్గొన్నారు. -
చిరుతను చూశా
పొలానికి నీళ్లు పెట్టేందుకు మోటార్ వద్దకు వెళ్తుండగా దూరం నుంచి చిరుత కన్పించింది. పరుగెత్తుకెళ్లి ఊరిలో చెప్పాను. అటవీ అధికారులకు సమాచారం ఇచ్చాం. వారు వచ్చి చిరుత పాదముద్రలు సేకరించారు. అప్పటి నుంచి పొలం వద్దకు వెళ్దాంటే భయమేస్తోంది. – సురేశ్, రైతు, రాగట్లపల్లి అప్రమత్తంగా ఉండాలి ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి, పదిర, హరిదాస్నగర్ గ్రామాల్లో చిరుత సంచరించినట్లు గుర్తించాం. రాత్రి పూట రైతులు పొలాల వద్దకు వెళ్లొద్దు. పగటి పూట గుంపులుగా వెళ్లాలి. చిరుత సంచరించినట్లు అనుమానం ఉంటే సమాచారం ఇవ్వాలి. – సకారాం, ఫారెస్ట్ సెక్షన్ అధికారి, గొల్లపల్లి రేంజ్ -
ఇంటర్ ‘లాకింగ్’ స్టార్ట్!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఎట్టకేలకు పెద్దపల్లి–జగిత్యాల సెక్షన్, కాజీపేట–బల్లార్షా సెక్షన్ ఇంటర్లాకింగ్ పనులు మొదలు కానున్నాయి. ఉమ్మడి జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రయాణికుల కలనెరవేరనుంది. పెద్దపల్లి రైల్వే జంక్షన్కి సమీపంలో బైపాస్ రైల్వే మార్గాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి ఈ నెల 24 నుంచి 27 వరకు ఇంటర్ లాకింగ్ పనులను దక్షిణమధ్య రైల్వే చేపట్టనుంది. కాజీపేట–బల్లార్షా సెక్షన్, పెద్దపల్లి–జగిత్యాల మార్గాలను అనుసంధా నం పూర్తికానుంది. ఈ కారణంగా కాజీపేట నుంచి బల్లార్షా మార్గంలో నడిచే పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు, పలు రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. రద్దైన రైళ్లు.. ● 67771/72 కరీంనగర్–సిర్పూర్ టౌన్ నుంచి కరీంనగర్ మెము ఎక్స్ ప్రెస్ ( 25 నుంచి 27 వ తేదీలో ) ● 17003/04 రామగిరి మెము ఎక్స్ ప్రెస్ ( 25 నుంచి 27 వ తేదీల్లో) ● 17035/36 బల్లార్షా నుంచి కాజీపేట నుంచి బల్లార్షా ఎక్స్ ప్రెస్ ( 24 నుంచి 26 తేదీల్లో ఎగువ మార్గంలో బల్లార్షా వైపు , 25 నుంచి 27 తేదీల్లో దిగువ మార్గంలో కాజీపేట వైపు ) ● 12757/58 సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ఈ నెల 25 నుంచి 27 తేదీల్లో పూర్తిగా రద్దుచేశారు. పాక్షికంగా రద్దు చేసిన రైళ్లు ● కాజీపేట/వరంగల్ నుంచి సిర్పూర్ కాగజ్ నగర్ మార్గంలో, ఇవి కాజీపేట నుంచి సికింద్రాబాద్ మధ్య మాత్రం యథాతథంగా నడుస్తాయి. ● 17011/12 ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ రైలు హైదరాబాదు నుంచి సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి బీదర్ ( 25 నుంచి 27 వ తేదీల్లో) ● 17033/34 భద్రాచలం రోడ్డు నుంచి బల్లార్షా నుంచి సిర్పూర్ టౌన్ నుంచి భద్రాచలం రోడ్డు సింగరేణి మెము ఎక్స్ ప్రెస్ ( 25 నుంచి 27 వ తేదీల్లో) ● భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ 17233 ఎగువ మార్గంలో 24 నుంచి 26 వ తేదీల్లో మరియు భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ 17234 దిగువ మార్గంలో 25 నుంచి 27 వ తేదీల్లో పాక్షికంగా రద్దు చేశారు. ● పెద్దపల్లి జంక్షన్ దగ్గర రైల్వే బైపాస్ను అందుబాటులోకి తీసుకురావడానికి కొన్ని రైళ్లను ప్రారంభ స్టేషన్ నుంచి నిర్దేశించిన సమయం కంటే 2 గంటల 30 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరుతుంది. ● తిరుపతి నుంచి కరీంనగర్ 12761 బై వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు 26 వ తేదీ రోజున తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి రాత్రి 8:05 నిమిషాలకు బయలుదేరాల్సి ఉండగా 2 గంటల 30 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభం అవుతుంది. అంటే రాత్రి 10:35 నిమిషాలకు బయలుదేరుతుంది ● జూలై 24 వ తేదీ రోజున కొత్త ఢిల్లీ నుంచి నాంపల్లి హైదరాబాదు వెళ్లే తెలంగాణ 12724 సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలును దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో 1 గంట 15 నిమిషాల పాటు నియంత్రించారు. ● నిజాముద్దీన్ ఢిల్లీ నుంచి కే.ఎస్.ఆర్ బెంగళూరు సిటీ మధ్య నడుస్తున్న 22692 రాజధాని సూప ర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలును దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో 20 నిమిషాలు నియంత్రించారు. ● చైన్నె సెంట్రల్ నుంచి కొత్త ఢిల్లీ తమిళనాడు 12621 సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలును దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో గంట సేపు నియంత్రించారు. ● విశాఖపట్నం నుంచి కొత్త ఢిల్లీ ఆంధ్రప్రదేశ్ 20806 సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలును 45 నిమిషాల పాటు దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో నియంత్రించారు. పెద్దపల్లి–కరీంనగర్ లైన్ల అనుసంధానం షురూ 24 నుంచి 27 వరకు పనులు చేపట్టనున్న దక్షిణ మధ్య రైల్వే కాజీపేట బల్లార్షా మార్గంలో పలు రైళ్ల మళ్లింపు కొన్ని పూర్తిగా రద్దు, మరి కొన్ని ఆలస్యం బైపాస్ స్టేషన్ నిర్మించే వరకు పెద్దపల్లిలోనే రైళ్ల హాల్టింగ్బైపాస్ స్టేషన్ నిర్మించే వరకు రైలు పెద్దపల్లిలోనే.. పెద్దపల్లి బైపాస్ రైల్వేస్టేషన్ ఇంటర్లాకింగ్ పనులు పూర్తయినప్పటికీ.. తిరుపతి–కరీంనగర్ ఎక్స్ప్రెస్ పెద్దపల్లిలోనే ఆగనుంది. వాస్తవానికి బైపాస్ లైన్పూర్తయితే పెద్దపల్లిలో ఆగకుండా నేరుగా జమ్మికుంట వైపు వెళ్తుందని ప్రచారం జరిగింది. దీనిని సమర్థిస్తూ ..జూన్ నుంచి తిరుపతి–కరీంనగర్ రైలును ఐఆర్సీటీసీ రిజర్వేషన్ నుంచి తొలగించడంతో అప్పట్లో కలకలం రేపింది. దీనిపై ఉమ్మడి జిల్లాతోపాటు పెద్దపల్లిలోనూ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కానీ.. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పెద్దపల్లి బైపాస్ లైన్ వద్ద స్టేషన్ నిర్మించేంత వరకు పెద్దపల్లి స్టేషన్లో కరీంనగర్– తిరుపతి రైలు ఆగుతుంది. పెద్దపల్లి బైపాస్ స్టేషన్ వద్ద ప్రస్తుతం చిన్న క్యాబిన్ మాత్రమే ఉంది. ఇక్కడ ఒక స్టేషన్తోపాటు, ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మించాల్సి ఉంటుంది. ఈ నిర్మాణాలు పూర్తయితే తప్ప..పెద్దపల్లి బైపాస్ స్టేషన్లో రైళ్ల హాల్టింగ్ ఉండదని స్పష్టమైంది. -
కరీంనగర్ రోడ్డులో సంజీవయ్య విగ్రహం
సిరిసిల్ల: జిల్లాకేంద్రంలోని మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య విగ్రహాన్ని కరీంనగర్ ప్రధాన రోడ్డు మధ్యలో ఏర్పాటు చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు దిమ్మె నిర్మాణ పనులు చేపట్టారు. పట్టణంలోని సంజీవయ్యనగర్కు వెళ్లే దారిలో 2006లో విగ్రహ ఆవిష్కరణ కమిటీ చైర్మన్ రాగుల రాములు ఆధ్వర్యంలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి చేతు ల మీదుగా సంజీవయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రతి వర్షాకాలంలో చిన్నపాటి వర్షం పడినా సంజీవయ్య విగ్రహం వెనకాల దారిలో భారీ గా వరద వచ్చి చేరుతుంది. దీంతో రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. సంజీవయ్య విగ్రహాన్ని రోడ్డు మీద ఏర్పాటు చేసి ఆ దారిలో వర్షం నీరు నిల్వ ఉండకుండా.. కల్వర్టును నిర్మించి రోడ్డు ఎత్తును పెంచేందుకు మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగానే సంజీవయ్యవిగ్రహాన్ని రోడ్డుపైకి మార్చుతున్నారు. కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారా..? అదే విగ్రహాన్ని షిఫ్ట్ చేస్తారా.? ఇంకా స్పష్టత లేకపోయినా.. మున్సిపల్ నిధులు రూ.లక్షతో రహదారి మధ్యలో దిమ్మె నిర్మాణ పనులు సాగుతున్నాయి. -
అక్రమ మైనింగ్పై కఠిన చర్యలు
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝాసిరిసిల్ల: జిల్లాలో అక్రమ మైనింగ్పై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం జిల్లాలోని రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. భూ భారతి దరఖాస్తులను పరిష్కరించాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఇసుక ఉచితంగా అందిస్తున్నామని, గ్రామ కార్యదర్శి, మున్సిపాలిటీల్లో వార్డ్ ఆఫీసర్లు ఏమైనా సమస్యలు ఉంటే తహసీల్దార్ల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఎక్కడైనా అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో విపత్తుల నివారణకు హెల్ప్లైన్ నంబర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భారీ వర్షాలు, వరదలు, ఆపద సమయాల్లో 93986 84240 నంబర్కు కాల్ చేయాలన్నారు. సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు సీ.హెచ్.వెంకటేశ్వర్లు, రాధాభాయ్ పాల్గొన్నారు. భూ సమస్యలను పరిష్కరించాలి భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను పరి ష్కరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝా కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు. భూసమస్యలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో భోజనాలు, వసతులపై ఆరా తీశారు. చదవడం, రాయడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి వేములవాడ: పాఠశాలలోని ప్రతి విద్యార్థి చదవడం, రాయడంపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధపెట్టాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. వేములవాడ అర్బన్ మండలం చీర్లవంచ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను తనిఖీ చేశారు. ప్రతీ తరగతి గదిలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారు? ఎవరైనా దీర్ఘకాలికంగా పాఠశాలకు గైర్హాజరు అవుతున్నారా అని ఆరా తీశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్యాస్ సిలిండర్ ఇంకా రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. -
చిరుత.. జాగ్రత్త!
● జిల్లాలో చిరుత పులుల సంచారం ● భయాందోళనలో రైతులు ● అవగాహన కల్పిస్తున్న ఫారెస్ట్ అధికారులు ● ఒంటరిగా వెళ్లొద్దని హెచ్చరికలుఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): వ్యవసాయ పనులు జోరందుకున్న వేళ పొలాలకు వెళ్తున్న రైతుల గుండెల్లో గుబులు. పచ్చికబైళ్లలో పశువులను మేపుతున్న కా పరుల కళ్లలో భయం. పొద్దున వెళ్లినప్పటి నుంచి ఇంటికి చేరేవరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పనులు చేస్తున్నారు. ఇందుకు కారణం.. జిల్లాను చిరుతపులుల భయం వణికిస్తోంది. ఇన్నాళ్లు అటవీ ప్రాంతాలకే పరిమితం అయిన చిరుతలు పొలాలు, ఆవాసాల వైపు వస్తున్నాయి. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, తంగళ్లపల్లి, బోయినపల్లి, చందుర్తి, రుద్రంగి మండలాల్లో కొన్నాళ్లుగా చిరుతలు సంచరిస్తున్నాయనే సమాచారం ఆయా ప్రాంతాల ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఫారెస్ట్ అధికారులు అవగాహన కల్పిస్తున్నా గుబులు పోవడం లేదు. మైదాన ప్రాంతాల్లో సంచారం చిరుతలు గతంలో ఎప్పుడూ ఎల్లారెడ్డిపేట మండలంలోని సిరిసిల్ల– కామారెడ్డి ప్రధాన రహదారిని దాటి దక్షిణం వైపునకు రాలేదు. వీర్నపల్లి మండలం వైపు గల ప్రాంతంలోని సంచరించేవి. ఇటీవల ఎల్లారెడ్డిపేట పరిధిలోని రాగట్లపల్లి, హరిదాస్నగర్, పదిర శివారులో సంచరించాయి. పాదముద్రలను సేకరించిన అటవీ అధికారులు రైతులను ఒంటరిగా పొలాల వద్దకు వెళ్లవద్దని, గుంపులుగా వెళ్లాలని సూచిస్తున్నారు. ఈ ప్రాంతంలో రెండు చిరుతలు సంచరిస్తున్నట్లు గుర్తించారు. ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాల్లోనూ చిరుతలు పశువులపై దాడి చేశాయి. తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేటలో ఓ గేదైపె దాడిచేసింది. కొండగట్టు అటవీ ప్రాంతం నుంచి చందుర్తిలో ప్రవేశించినట్లు గతంలోనే ఫారెస్ట్ అధికారులు ప్రకటించారు. వేములవాడరూరల్ మండలం నుంచి బోయినపల్లి, వట్టెంల వెళ్లే మార్గాల్లో చిరుతలు సంచరించాయి. కోనరావుపేట మండలం శివంగాలపల్లిని ఆనుకుని ఉన్న ఫారెస్ట్ ఏరియాలో పశువులపై దాడి చేశాయి. బాబోయ్ పులి? కామారెడ్డి జిల్లాలోకి కవ్వాల్ నుంచి పులి వచ్చిందన్న అటవీ అధికారుల హెచ్చరికలతో రాజన్నసిరిసిల్ల జిల్లాలోని పెద్దమ్మ జంగల్ శివారును ఆనుకుని ఉన్న గ్రామాలు, వీర్నపల్లి మండలంలోని గ్రామాల ప్రజలు అప్రమత్తమయ్యారు. పులి జిల్లాలోకి వచ్చి, వెళ్లినట్లు ఆనవాళ్లు లేవని ఫారెస్ట్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయినా వీర్నపల్లి మండలంలోని రైతులు పొలాల వద్దకు ఒంటరిగా వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు. -
సమస్యలు పరిష్కరించాలి
తంగళ్లపల్లి(సిరిసిల్ల): టెక్స్టైల్ పార్కులో పనిచేస్తున్న పవర్లూం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ పవర్లూం వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ డిమాండ్ చేశారు. మంగళవారం బద్దెనపల్లి, సారంపల్లి టెక్స్టైల్ పార్క్ ఒకరోజు బంద్ నిర్వహించి, ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ టెక్స్టైల్ అధి కారులు, యజమానులు అనుసరిస్తున్న విధానాలతో కార్మికులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం స్పందించి కార్మికులకు నష్టం జరగకుండా 10శాతం యారన్ సబ్సి డీని తగ్గించకుండా మీటర్కు రూ. 1.42 చొప్పున అందించాలని, త్రిఫ్ట్ డబ్బులు కార్మి కుల ఖాతాలో జమ చేయాలన్నారు. ఏడీ ఇచ్చిన హామీ ప్రకారం వారంరో జుల్లో సమస్యలు పరిష్కరించాలన్నారు. యూనియన్ అధ్యక్షుడు కూచన శంకర్, జెల్ల సదానందం, ఆడెపు రవి, సంపత్, రాజ మ ల్లు, శ్రీకాంత్, ఆంజనేయులు పాల్గొన్నారు. మద్యపానంతో సమస్యలు సిరిసిల్ల: మద్యపాన వ్యసనం మానసిక సమస్యలను సృష్టించి మనిషి జీవితాన్ని గందరగోళానికి గురి చేస్తుందని ప్రముఖ సైకాలజిస్ట్ కె.పున్నంచందర్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని పద్మనగర్లో మంగళవారం నేతన్నలకు సామూహిక కౌన్సెలింగ్ నిర్వహించారు. మద్యపానం దీర్ఘకాలిక మానసిక ఒత్తిడికి గురి చేసి మెదడు, నరాల బలహీనతలకు కారణ మవుతుందన్నారు. మద్యం ఒక్కసారిగా మా ని వేస్తే నిద్ర సమస్యలు, కాళ్లు, చేతులు వనకడం, శరీరం అదుపు తప్పడం, మానసికంగా భ్రమలు, భయబ్రాంతులకు లోనవుతారని వివరించారు. మద్యం మానుకునేందుకు జి ల్లా జనరల్ ఆస్పత్రిలోని మైండ్కేర్ సెంటర్ ను సంప్రదించాలన్నారు. అత్యవసర సమయంలో 88018 88805 నంబర్కు ఫోన్చేసి కౌన్సెలింగ్ పొందవచ్చని పేర్కొన్నారు. మనో వికాస కేంద్రం సిబ్బంది రాపెల్లి లత, బూర శ్రీమతి, కొండ ఉమ, వస్త్రోత్పత్తి దారుడు ఏనుగుల మనోజ్ పాల్గొన్నారు. నేడు విద్యాసంస్థల బంద్ సిరిసిల్లటౌన్: విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఎస్ఎఫ్ఐ నిరంతర పోరాటాలు చేస్తోందని సంఘం జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ అన్నారు. మంగళవారం సిరిసిల్లలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగా సమస్యలను పరిష్కరించాలని ఈ నెల 23వ తేదీన తలపెట్టిన పాఠశాలలు, జూని యర్ కళాశాలల బంద్ను విజయవంతం చే యాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షులు జాలపల్లి మనోజ్ కుమార్, జిల్లా కమిటీ సభ్యులు కడారి శివ, నాయకులు జశ్వంత్, సుశాంత్, సాయిశివ, శ్రేయాన్, సాజిద్, ఉస్మాన్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ అవినీతికి ఆనవాలు చెక్డ్యాం సిరిసిల్లటౌన్: మానేరువాగుపై నిర్మించిన చెక్డ్యాంలు గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతికి ఆనవాళ్లుగా నిలిచాయని సీపీఐ జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్ అన్నారు. సిరిసిల్ల– తంగళ్ళపల్లి మధ్యలో మానేరువాగుపై నిర్మించిన చెక్డ్యాంను సీపీఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం సందర్శించారు. రూ.110 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి మానేరు నదిపై తొ మ్మిది చెక్ డ్యాములు నిర్మించగా, కాంట్రాక్ట ర్లు నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో ఇప్పటికే ఏడు చెక్డ్యాంలు తెగిపోయాయని విమర్శించారు. మానేరుపై నిర్మించిన చెక్డ్యాంల్లో జరిగిన అవినీతిని ప్రజలకు వివరించేందుకు త్వరలోనే సీపీఐ జిల్లా కమిటీ ఆ ధ్వర్యంలో ఎగువ మానేరు నుంచి మధ్యమానేరు వరకు పాదయాత్ర చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పంతం రవి, కడారి రాములు, సోమ నాగరాజు, జంగం అంజయ్య, మీసం లక్ష్మణ్ పాల్గొన్నారు. -
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
● విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రుద్రంగి(వేములవాడ): పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రుద్రంగిలోని గ్రామపంచాయతీ ఆవరణలో అర్హులైన 11 మంది లబ్ధిదారులకు రూ.4లక్షల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిఽధి చెక్కులను సోమవారం పంపిణీ చేశారు. విప్ శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విద్యుత్, ఎరువులు, మేలైన వంగడాలను ప్రభుత్వం తరఫున అందిస్తున్నామన్నారు. మన ప్రాంతంలో వివిధ ఆరోగ్య సమస్యలతో చికిత్స తీసుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా, ఎల్ఓసీల ద్వారా ఇప్పటి వరకు రూ.20కోట్లపై చిలుకు మంజూరు చేయించినట్లు తెలిపారు. రుద్రంగి ఏఎంసీ చైర్మన్ చెలుకల తిరుపతి, మాజీ జెడ్పీటీసి గట్ల మీనయ్య, మాజీ సర్పంచ్ తర్రె ప్రభలత, మాజీ ఉపసర్పంచ్ బైరి గంగమల్లయ్య, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తర్రె మనోహర్, డీసీసీ కార్యదర్శులు గడ్డం శ్రీనివాస్రెడ్డి, తర్రె లింగం పాల్గొన్నారు. -
ప్రాజెక్టులు నింపేదెప్పుడో?
● బీఆర్ఎస్ నాయకుల నిరసన గంభీరావుపేట/ముస్తాబాద్(సిరిసిల్ల): జిల్లాలోని చెరువులు ఎండిపోతున్నాయని.. కాళేశ్వరం నీటితో నింపాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు సోమవారం నిరసనలు తెలిపారు. ఇందులో భాగంగా గంభీరావుపేట నాయకులు నర్మాల ఎగువమానేరులో క్రికెట్ ఆడారు. ముస్తాబాద్ మండలం ఆవునూర్, రామలక్ష్మణపల్లి, తుర్కపల్లి గ్రామాల నాయకులు పెద్దచెరువు వద్ద నిరసన తెలిపారు. ఒన్నాల వెంకటేశ్, ఆకునూరి రాజేందర్, ఎడబోయిన రాజు, రాజబోయిన ఆంజనేయులు, గొర్రె కిషోర్, సుదర్శన్, సత్యం, రాజు, సతీశ్చందర్, మల్లారెడ్డి, పద్మారెడ్డి, రవీందర్రెడ్డి, రవి, జక్కుల యాదగిరి, విశ్వనాథం పాల్గొన్నారు.నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టులో క్రికెట్ ఆడుతున్న బీఆర్ఎస్ నాయకులు -
కల్యాణ వైభోగమే
● తలంబ్రాలకు వేళాయె ● 25 నుంచి పెళ్లి సందడి ● ఉమ్మడి జిల్లాలో సుమారు 5 వేల జంటల పెళ్లిల్లు ● ఫంక్షన్ హాళ్లు, ఫొటోగ్రాఫర్లు బిజీ బిజీ ● పెరిగిన వస్త్రాలు, బంగారం కొనుగోళ్లుపెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈనెల 25 శ్రావణమాసం మొదలు నవంబర్ చివరి వరకు ఊరువాడ పెళ్లి సందడి నెలకొననుంది. బంగారు నగల దుకాణాలు, పెళ్లివస్త్రాలయాలు కొనుగోలుదారులతో సందడిగా మారుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్తో పాటు సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి వంటి జిల్లాల్లో సుమారు 5వేలకు పైగా పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉందని ముహూర్తాలు నిర్ణయించే పురోహితులు చెప్తున్నారు. కాగా, మారిన కాలానికి అనుగుణంగా సంగీత్, మెహెందీ, ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ షూటింగ్ వంటి అదనపు కార్యాలు చోటు చేసుకుంటూ వివాహ వ్యయాన్ని భారీగా పెంచేశాయి. జీవితంలో ఒకేసారి జరిగే వేడుకనే కారణంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు కూడా వివాహాలకు భారీగా ఖర్చు చేస్తున్నారు. సగటున ఒక్కో పెళ్లికి రూ.10 లక్షలకు తగ్గకుండా ఖర్చు పెడుతుండడం ఇప్పుడు సర్వసాధారణమైంది. – సిరిసిల్లకల్చరల్/విద్యానగర్(కరీంనగర్) -
ఓ మనిషి ఒత్తిడికి చిక్కకు!
● పెరుగుతున్న బ్రెయిన్ సంబంధ వ్యాధులు ● జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదం లేదంటున్న వైద్యులు ● నేడు ప్రపంచ మెదడు దినోత్సవం‘గతం గురించి ఆలోచించను. భవిష్యత్తుపై బెంగపెట్టుకోను. వర్తమానంలోనే జీవిస్తా. అందుకు తగ్గట్టు ప్రణాళికలు రచిస్తా. ఫలితం కంటే ప్రక్రియపై దృష్టిసారిస్తా. ప్రక్రియ ఉప ఉత్పత్తే ఫలితం’ అని అంటాడు మహేంద్రసింగ్ ధోని. మనిషి శరీరంలో మెదడు అద్భుత శక్తివంతమైన భాగం. ప్రశాంతతకు, మన భవితను నిర్ణయించే నిర్ణయాలు తీసుకోవడంలో మెదడుపాత్ర అత్యంత కీలకం. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందినకొద్దీ మెదడుపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ తరుణంలో మనిషి మెదడుకు మరింత పదును పెట్టాల్సిన పరిస్థితి. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసేవారు రోజుకు 12 గంటలు కంప్యూటర్లకే అతుక్కుని పోతుండగా.. ఏ పనీపాట లేనివారు రోజుకు 18 గంటలు సెల్ఫోన్లో గడుపుతున్నారు. మెదడు ఒత్తిడికి గురై న్యూరో సమస్యలు పెరుగుతున్నాయి. బ్రెయిన్ స్ట్రోక్, డిమెన్షియా, అల్జీమర్స్, బ్రెయిన్ ట్యూమర్ వంటి మెదడు వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఏటా జూలై 22న జాతీయ మెదడు దినోత్సవం నిర్వహిస్తున్న సందర్భంగా కథనం.. –కరీంనగర్టౌన్ -
రేషన్కార్డుల కల.. నెరవేరిన వేళ
● 14వేల నూతన రేషన్కార్డుల పంపిణీ ● కలెక్టర్ సందీప్కుమార్ ఝాసిరిసిల్లఅర్బన్: రేషన్కార్డుల కోసం పేదల ఎదురుచూపులు ఫలించాయి. సిరిసిల్ల పట్టణ పరిధి లోని చంద్రంపేట రైతువేదికలో మున్సిపల్ పరి ధిలోని లబ్ధిదారులకు సోమవారం నూతన రేషన్కార్డులను కలెక్టర్ సందీప్కుమార్ ఝా పంపిణీ చేశారు. ప్రతీ లబ్ధిదారుడికి నెలకు 6 కిలోల సన్నబియ్యం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. నూతన రేషన్కార్డుల ద్వారా ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్ వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులు అవుతారన్నారు. రేషన్కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. పట్టణంలో అర్హులైన 2,610 మంది లబ్ధిదారులకు నూతన రేషన్కార్డులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఉన్న కార్డుల్లో 4,527 మందిని అదనంగా చేర్చామని వివరించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో 21 వేల రేషన్కార్డుల లబ్ధిదారులకు బియ్యం పంపిణీ అవుతున్నట్లు వివరించారు. సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు స్వరూపరెడ్డి, గడ్డం నర్సయ్య, ఆర్డీవో వెంకటేశ్వర్లు, సివిల్ సప్లయ్ డీఎం రజిత పాల్గొన్నారు. వీర్నపల్లి(సిరిసిల్ల): వీర్నపల్లి మండలంలోని 17 గ్రామాల లబ్ధిదారులకు నూతన రేషన్కార్డులను కలెక్టర్ సందీప్కుమార్ ఝా, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి పంపిణీ చేశారు. అర్హులైన 329 మందికి రేషన్ కార్డులు జారీ చేయగా, ఇప్పటికే ఉన్న కార్డుల్లో 975 మందిని అదనంగా చేర్చామని కలెక్టర్ వివరించారు. ఆధార్కార్డు, కరెంట్ కనెక్షన్, ప్రభుత్వ పథకాల అమలుకు రేషన్కార్డు కీలకమన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ రాములునాయక్, డీఎం సివిల్ సప్లయ్ రజిత, తహసీల్దార్ ముక్తార్ పాషా, ఎంపీడీవో బీరయ్య, ఆర్ఐ శివకుమార్, మండల వ్యవసాయాధికారి జయ పాల్గొన్నారు. -
‘ఇందిరమ్మ’ నిర్మాణ ధరలు నియంత్రించాలి
సిరిసిల్లటౌన్: ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన మెటీరియల్ ధరలను జిల్లా కలెక్టర్, ఆర్డీవోలు నియంత్రించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు కోరారు. స్థానిక కార్మిక భవన్లో సోమవారం విలేకరులతో మాట్లాడారు. మారుమూల గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి మొరం, ఇసుకకు ప్రతీ రోజు పర్మిషన్ ఇవ్వాలన్నారు. కట్రౌతు, కంకర, ఇసుక, మొరం తీసుకొస్తున్న ట్రాక్టర్లను మైనింగ్ అధికారులు పట్టుకోవడంతో ధరలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అజ్జు, వేణు, కోరెపు క్రాంతి పాల్గొన్నారు. ‘ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టాలి’ చందుర్తి(వేములవాడ): విద్యార్థుల సంఖ్య ప్రకారం ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టాలని కోరుతూ ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు డీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో సోమవారం విన్నవించారు. డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆవురం సుధాకర్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వంగ తిరుపతి ఆధ్వర్యంలో కలిసి ఈమేరకు వినతిపత్రాన్ని అందజేశారు. వారు మాట్లాడుతూ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. స్కావెంజర్లకు పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని కోరారు. డీటీఎఫ్ స్టేట్ కౌన్సిలర్లు దొంతుల శ్రీహరి, జిల్లా కౌన్సిలర్లు గడప రఘుపతిరావు, గుండబోయిన శ్రీనివాస్, నిజానపు పర్శరాములు, మేడిశెలిమిల దశరథం, వివిధ మండల బాధ్యులు మెట్ట మహేశ్, వెంగలి శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, బానోతు రాజు తదితరులు పాల్గొన్నారు. వరదవెల్లి దత్తాలయంలో గిరి ప్రదక్షిణ బోయినపల్లి(చొప్పదండి): మండలంలోని వరదవెల్లిగుట్టపై స్వయంభూగా వెలసిన గురు దత్తాత్రేయస్వామి ఆలయంలో సోమవారం భక్తులు గిరిప్రదక్షిణ నిర్వహించారు. దత్త నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. గిరిప్రదక్షిణ చేసిన అనంతరం భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ భక్త బృందం తెలిపారు. ధర్మప్రవచనాల కర్త, వరదవెల్లి గిరిప్రదక్షిణ రూపకర్త గురువు శ్రీనివాస్ హాజరైనట్లు తెలిపారు. -
గండ్లు.. కోతలు
● అధ్వానంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు కాలువలు ● ఐదేళు్ాల్గ మరమ్మతు కరువు ● పూడుకుపోయిన గ్రావిటీ కెనాల్స్ ● దారుణంగా పిల్లకాల్వలు ● నీరు పారడం అనుమానమే..చందుర్తి (వేములవాడ): అడుగుకో గండి.. గజానికో కోత.. నిండా పిచ్చిమొక్కలు.. నీరు పారే పరిస్థితి కనపించని వైనం. ఇదీ ఎల్లంపల్లి కాల్వల దుస్థితి. మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యంతో నిర్మించిన కాలువలు ఎక్కడికక్కడ కోతలకు గురయ్యాయి. ఐదేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు తెగిపోయిన కాలువలను మరమ్మతు చేయించేవారు కరువయ్యారు. గండ్లు పడ్డ చోట నుంచి వరదనీరు ప్రవహించడంతో పంట చేలు దెబ్బతింటున్నాయని ఆ ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు కాల్వల దుస్థితిపై ‘సాక్షి’ ఫోకస్. కూలిన కాల్వలు ● వేములవాడరూరల్ మండలం ఫాజుల్నగర్ నుంచి చందుర్తి మండలం నర్సింగపూర్ నుంచి మల్యాల పంపుహౌజ్కు, అక్కడి నుంచి బండపల్లి రిజర్వాయర్ వరకు నిర్మించిన గ్రావిటీ కెనాల్తోపాటు కొన్ని గ్రామాల్లో పిల్లకాలువలు కూలి పోయాయి. మరమ్మతు చేపట్టకపోవడంతో వర్షాలకు గండ్లు పడిన చోట నుంచి పొలాల నుంచి వరదనీరు ప్రవహిస్తుండడంతో పంటలు దెబ్బతింటున్నాయని రైతులు వాపోతున్నారు. ● పిల్ల కాలువల్లో దట్టంగా చెట్లు పెరిగి నీటి ప్రవాహానికి అడ్డుగా మారుతున్నాయి. చందుర్తి మండలం తిమ్మాపూర్, రామన్నపల్లి, ఆశిరెడ్డిపల్లి, నర్సింగపూర్, మర్రిగడ్డ, జోగాపూర్, ఎన్గల్ మధ్య నిర్మించిన కాలువల్లో నీరు పొలాల నుంచి ప్రవహిస్తుండడంతో పంటలు దెబ్బతింటున్నాయి. పలు గ్రామాల మద్య నిర్మించిన పిల్ల కాలువలు సగానికి పైగా కూలిపోయాయి. చందుర్తి మండలంలో ప్రధాన కాలువ 27 కిలోమీటర్ల పొడవు ఉండగా.. పిల్ల కాలువలు 170 కిలోమీటర్ల పొడవు ప్రవహిస్తున్నాయి. మరమ్మతు చేపడితేనే.. చందుర్తి మండలం మల్యాల పంపుహౌస్ నుంచి బండపల్లి రిజర్వాయర్కు వచ్చే గ్రావిటీ కెనాల్లో వరద కొట్టుకు రావడంతో కూలి మట్టితో నిండిపోయింది. ఆ మట్టిని తొలగిస్తేనే నీళ్లు బండపల్లి రిజర్వాయర్కు చేరే పరిస్థితి ఉంది. నర్సింగపూర్ నుంచి చందుర్తి వరకు గ్రావిటి కెనాల్లో పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. చందుర్తి 450 ట్యాంక్ నుంచి నిర్మించిన కాల్వలకు భారీగా గండిపడి ఐదేళ్లు గడుస్తున్నా తాత్కాళిక మరమ్మతులు చేపట్టి చేతులు దులుపుకున్నారని ఆ ప్రాంత రైతులు ఆరోపిస్తున్నారు. తిమ్మాపూర్ గ్రామం నుంచి నిర్మించిన కాలువలకు గండిపడి సుమారు 50 ఎకరాలకు పైగా పంట దెబ్బతింటుందని రైతులే బ్లేడ్ ట్రాక్టర్తో తాత్కాళిక మరమ్మతులు చేయించుకున్నారు.పిచ్చిమొక్కలు తొలగించాలి పిల్ల కాలువలల్లో పిచ్చిమొక్కలు పెరగడంతో నీరు ప్రవహించక కాల్వలకు గండ్లు పడ్డాయి. గండ్లుపడ్డ కాల్వలను మరమ్మతు చేయించాలి. కాల్వలో పిచ్చిమొక్కలను తొలగిస్తేనే పంట పొలాలకు నీరందే అవకాశం ఉంటుంది. – జగిత్యాల రాజు, నర్సింగపూర్ప్రతిపాదనలు పంపాం భారీ వర్షాలతో అక్కడక్కడ కాలువలు కూలిపోయాయి. పనులు చేయించేందుకు ప్రతిపాదనలు పంపించాం. వాటికి నిధులు మంంజూరైతే పనులు చేయించేందుకు సిద్ధంగా ఉన్నాం. గత నాలుగేళ్లుగా ప్రతిపాదనలు ఏటా పంపుతున్నాం. – సంతు ప్రకాశ్, ఎల్లంపల్లి ప్రాజెక్టు, ఈఈ -
దరి చేరనున్న ‘డబుల్’ ఇళ్లు
● నేడు ప్రారంభించనున్న ఎమ్మెల్యే ● ‘డబుల్’ ఇళ్లపై సాక్షి వరుస కథనాలు ● పీహెచ్సీ సమస్యపై ఫోకస్ ● స్పందించిన అధికారులుఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలో కొన్నేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు చర్యలకు దిగుతున్నారు. డబుల్బెడ్రూమ్ ఇళ్లను, పీహెచ్సీ భవనం, బిక్కవాగుపై వంతెన మిగులు పనులను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చేతుల మీదుగా మంగళవారం ప్రారంభించనున్నారు. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మండల కేంద్రంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమస్య నాలుగేళ్లుగా ఉండగా.. దీనిపై సాక్షి వరుస కథనాలు ప్రచురించింది. ఏళ్లుగా లబ్ధిదారులు ఎదురుచూస్తున్న వైనాన్ని వెలుగులోకి తెచ్చింది. గతంలోనే సాక్షి కథనంతో స్పందించిన అధికారులు డబుల్ బెడ్రూమ్ కాలనీకి రోడ్డు వేయించారు. అదేవిధంగా మండల కేంద్రంలో 50 పడకల ఆస్పత్రి నిర్మాణానికి 2023 అక్టోబర్ 6న అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావు శిలాఫలకం వేయగా పనులు ప్రారంభించలేదు. ఈ సమస్యను సాక్షి వెలుగులోకి తెచ్చింది. ఈ సమస్యల పరిష్కారానికి అధికారులు స్పందించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను, ఆస్పత్రి భవన నిర్మాణ పనులను సోమవారం మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చేతుల మీదుగా మంగళవారం ప్రారంభించనున్నారు. అంతేకాకుండా గత ఆరేళ్లుగా అనంతారం–ఇల్లంతకుంట మధ్య గల బిక్కవాగుపై బ్రిడ్జి నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉండడంతో వాహనదారులు బిక్కుబిక్కుగా ప్రయాణం చేస్తున్నారు. బ్రిడ్జి మిగులు పనులు పూర్తి చేసేందుకు రూ.44 లక్షలు మంజూరుకాగా.. ఎమ్మెల్యే ప్రారంభించనున్నారు. మండలంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ‘సాక్షి’ దినపత్రికకు మండల ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. -
జిల్లా అంతటా తుంపర వర్షం
సిరిసిల్ల: జిల్లావ్యాప్తంగా ఆదివారం తుంపర వర్షం పడింది. అత్యధికంగా కోనరావుపేటలో 33.0 మిల్లీమీటర్ల వర్షం పడగా.. రుద్రంగి 1.0, చందుర్తి 1.9, వేములవాడరూరల్ 0.8, బోయినపల్లి 5.8, వేములవాడ 14.4, సిరిసిల్ల 1.0, వీర్నపల్లి 20.3, ఎల్లారెడ్డిపేట 1.2, గంభీరావుపేట 1.4, ముస్తాబాద్ 2.0, తంగళ్లపల్లి 12.3, ఇల్లంతకుంట 7.1 మిల్లీ మీటర్ల వర్షం పడింది. జిల్లా వ్యాప్తంగా సగటున 7.9 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. పేదవాడి ఆత్మగౌరవం రేషన్ కార్డుగంభీరావుపేట(సిరిసిల్ల): పేదవాడి ఆత్మగౌరవం రేషన్ కార్డు అని, రాష్ట్ర ప్రభుత్వం పేదలను దృష్టిలో పెట్టుకొని రేషన్కార్డుల జారీని నిరంతర ప్రక్రియగా చేపట్టిందని కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి అన్నారు. ఆదివారం మండలకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో లబ్ధిదారులకు రేషన్కార్డుల పంపిణీ ప్రక్రియ తహసీల్దార్ మారుతిరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా మహేందర్రెడ్డి మాట్లాడుతూ, పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోందన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మండ్లు, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు కొమిరిశెట్టి తిరుపతి, మండల అధ్యక్షుడు హమీద్, నాయకులు రాఘవేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాకపోకలకు అంతరాయంకోనరావుపేట(వేములవాడ): మూలవాగు ప్రవాహంతో మండలంలోని మామిడిపల్లి–నిజామాబాద్ గ్రామాల మధ్య రవాణా వ్యవస్థ దెబ్బతింది. రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు మూలవాగు ప్రవహిస్తోంది. దీంతో మామిడిపల్లి–నిజామాబాద్, బావుసాయిపేట– వెంకట్రావుపేట, వట్టిమల్ల–నిమ్మపల్లి గ్రామాల మధ్య మూలవాగు ప్రవాహంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఈ ప్రాంతాల్లో శాశ్వత ప్రాతిపదికన వంతెనలు నిర్మించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. కాంగ్రెస్ పాలనలో ఎడారిగా మానేరుసిరిసిల్ల అర్బన్: బీఆర్ఎస్ హయాంలో కళకళలాడే మానేరు వాగు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎడారిలా మారిందని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీశ్ అన్నారు. ఆదివారం మానేరు వాగులో క్రికెట్ ఆడుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ ప్రభుత్వంలో పదేళ్ల పాటు మానేరు నిండుకుండలా ఉందన్నారు. వర్షాకాలంలో రైతులకు సాగునీటికి ఇబ్బంది లేకుండా ఉండే మానేరువాగు ప్రస్తుతం క్రికెట్ ఆడుకోవడానికి అనువుగా ఉందన్నారు. సిరిసిల్ల ప్రజల మీద కక్షతో మిడ్మానేరు నింపకపోవడంతో మానేరువాగు పూర్తిగా ఎండిపోయిందన్నారు. ఓ వైపు భూగర్భజలాలు అడుగంటుకుపోతున్నాయని, బోర్లు వేసినా చుక్క నీరు రావడం లేదన్నారు. ఇలాగే ఉంటే ప్రజలకు సాగు, తాగునీటి కష్టాలు తప్పవన్నారు. నాయకులు మానాల అరుణ్, సాయిదీపక్, వెంకటరమణ, రమణాచారి తదితరులు పాల్గొన్నారు. -
స్థానిక ఎన్నికల్లో సత్తాచాటుదాం
● బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ సిరిసిల్ల/సిరిసిల్లఅర్బన్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని గెలిపించి సత్తాచాటుదామని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో స్థానిక సంస్థల కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాల్లో అభివృద్ధి పనులకే కాకుండా, గ్రామీణ ప్రాంతవాసులకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రధాని మోదీ నాయకత్వాన్ని బలపరచాలన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీ చేసేందుకు బీజేపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. ప్రధాని మోదీ సర్కార్ మూడునెలల రేషన్ బియ్యం ముందే ఇచ్చిందని వివరించారు. రైతులకు బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ మోసం చేసిందని, దేశంలో మతం పేరుమీద ఓట్లు అడిగే పార్టీ కాంగ్రెస్సేనని విమర్శించారు. వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చెన్నమనేని వికాస్రావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, మ్యాన రాంప్రసాద్, దశరథరెడ్డి, ఆడెపు రవీందర్, బర్కం నవీన్యాదవ్, రేగుల మల్లికార్జున్, సత్తయ్య, పొన్నాల తిరుపతిరెడ్డి, దుమాల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
పద్మశాలీ సంఘం అధ్యక్షుడిగా శంకర్
● ఉపాధ్యక్షులు, డైరెక్టర్ స్థానాలు ఏకగ్రీవం ● కార్యదర్శి, కోశాధికారికి ఎన్నికలు సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణ పద్మశాలీ సంఘం అధ్యక్షుడిగా దూడం శంకర్ ఒక్కరే ఆదివారం నామినేషన్ వేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా మోర రవి, డాక్టర్ గాజుల బాలయ్య ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, ప్రధాన కార్యదర్శి పదవికి ఇద్దరు, కోశాధికారి పదవికి ముగ్గురు పోటీలో ఉన్నారు. పట్టణంలోని 39 వార్డులకు డైరెక్టర్లుగా పలువురు ఏకగ్రీవం కాగా.. కొన్ని డైరెక్టర్ స్థానాల్లో పోటీ ఉంది. మొత్తంగా పట్టణ పద్మశాలి ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. వచ్చే ఆదివారం ఎన్నికలు జరుగుతుండగా, సోమవారం నామినేషన్ల పరిశీలన, విత్ డ్రా ఉంది. సంఘం ఎన్నికలు ఏకగ్రీవంగా నిర్వహించేందుకు నాయకులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఒక దశలో నామినేషన్ వేయకుండా అడ్డుకుంటున్నారని పద్మశాలీ సంఘం నాయకులు ఆరోపించారు. నామినేషన్ల చివరిరోజు పరస్పర తోపులాట మధ్య ముగిసింది. ఎన్నికల సందర్భంగా సంఘం నాయకులు రెండు గ్రూపులుగా విడిపోయి తోపులాటకు దిగడంతో పోలీసులు వారిని కట్టడి చేశారు. ఎన్నికల నిర్వహణపై అభ్యంతరాలు పద్మశాలీ ఎన్నికల నిర్వహణలో బైలాకు వ్యతిరేకంగా నామినేషన్ ఫీజులు నిర్ణయించారని, సామాన్య సభ్యులు పోటీ చేయకుండా నామినేషన్ ఫీజును రూ.50 వేలు నిర్ణయించారని అడ్హక్ కమిటీ కన్వీనర్ కుసుమ విష్ణుప్రసాద్ పేర్కొన్నారు. ఎన్నికలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, సిరిసిల్లలో మరో పద్మశాలీ సంఘం ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు ప్రకటించారు. సామాన్యులను కించపరిచేలా అన్ని పార్టీల్లోని ధనికులు ఏకమై ఎన్నికలపై ఆంక్షలు విధించారని పేర్కొన్నారు. ఏది ఏమైనా పద్మశాలీ ఎన్నికల నిర్వహణపై ఆసక్తికర చర్చ సాగుతోంది. -
చినుకు రాదు.. మానేరు నిండదు
● కురవని వర్షం ● మిడ్మానేరులోకి చేరని వరద ● ఆందోళనలో రైతాంగం ● ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లో అత్తెసరు నీరు ● భారీ వర్షాలపైనే ఆశలుమిడ్, అప్పర్, లోయర్మానేరు ప్రాజెక్టుల నీటి నిల్వ వివరాలు మిడ్మానేరు పూర్తి నీటి సామర్థ్యం : 27.50 టీఎంసీలు ప్రస్తుతం ఉన్న నీరు : 6.821 టీఎంసీలు ఎల్ఎండీ పూర్తి నీటిమట్టం : 24.034, టీఎంసీలు ప్రస్తుత నీటిమట్టం : 6,07 టీఎంసీలు ఎగువ మానేరు నీటిమట్టం : 2 టీఎంసీలు ప్రస్తుతం ఉన్న నీరు : 0.61 టీఎంసీలుబోయినపల్లి(చొప్పదండి): శ్రీరాజరాజేశ్వర (మిడ్మానేరు) ప్రాజెక్టు నీరు లేక వెలవెలబోతోంది. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడిచినా ప్రాజెక్టులో నీటి నిల్వలు అడుగంటే ఉన్నాయి. గంభీరావుపేట మండలం నర్మాల అప్పర్ మానేరు, కరీంనగర్ ఎల్ఎండీ ప్రాజెక్టుల్లో కూడా నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయి. రెండు నెలలుగా ముసురు తప్ప భారీ వర్షాలు కురవక ప్రాజెక్టుల్లో వరద చేరలేదు. ప్రాజెక్టులో ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు కేవలం 0.319 టీఎంసీల నీరు మాత్రమే చేరింది. కాగా ప్రాజెక్టులో 26 టీఎంసీల నీరు ఉంటే బ్యాక్వాటర్ 17 కి.మీ మేర ఉండగా, ప్రస్తుతం 6 కి.మీ మాత్రమే ఉంది.నీరు లేక అడుగంటిన మిడ్మానేరు ప్రాజెక్టు -
రూ.3.44 కోట్లతో భీమన్నగుడి అభివృద్ధి
వేములవాడ: వేములవాడ రాజన్న ఆలయ అనుబంధ భీమేశ్వరాలయంలో రూ.3.44 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు ఆదివారం విప్ ఆది శ్రీనివాస్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నెల రోజుల్లో పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. వేములవాడను టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే పట్టణంలో రోడ్ల వెడల్పు కార్యక్రమం చేపట్టామని, నిర్వాసితులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని వివరించారు. మౌలిక వసతుల కల్పనే ధ్యేయం వేములవాడరూరల్: మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ ధ్యేయమని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట నక్కవాగుపై రూ.11.55 కోట్లతో నూతనంగా నిర్మించిన హై లెవల్ బ్రిడ్జి, కోరుట్ల–వేములవాడ ప్రధాన రహదారిపై నిర్మించిన మర్రిపల్లి బ్రిడ్జిని ఆదివారం ప్రారంభించారు. నక్కవాగుపై, మర్రిపల్లిలో బ్రిడ్జిల నిర్మాణం, వేములవాడ రాజన్న ఆలయ పట్టణ అభివృద్ధి, కలికోట సూరమ్మ చెరువు రిజర్వాయర్ నిర్మాణం కోసం ఇలా పదేళ్లుగా పడావుపడ్డ పనులను నేడు ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నామని వివరించారు. గత పాలకులు ఎమ్మెల్యే పదవిని హోదాకు చిహ్నంగా వాడుకుంటే, తాము ప్రజాసేవలో అభివృద్ధికి చిహ్నంగా వాడుకుంటున్నామని వెల్లడించారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం అమలు చేసే ప్రతిష్టాత్మక పథకాల్లో ప్రతీ గ్రామానికి పెద్దపీట వేస్తామని స్పష్టం చేశారు. ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, వకుళాభరణం శ్రీనివాస్, చెన్నాడి గోవర్ధన్, సోయినేని కరుణాకర్, మల్లేశం తదితరులు ఉన్నారు. ● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ -
అందరికీ ఉపయోగం
ముస్తాబాద్ మండలంలోని ప్రజలందరికీ ఉపయోగపడేలా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించాలి. గతంలో నిర్మించిన షెడ్డు, చేపల మార్కెట్ నిరుపయోగంగా ఉంది. ఆ స్థలంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి ప్రతిపాదనలు చేయాలి. – కామిటికార్ పద్మ, మాజీ ఎంపీటీసీ అధికారులు చర్యలు చేపట్టాలి ముస్తాబాద్లో మూడేళ్ల క్రితం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించేందుకు అప్పటి మంత్రి కేటీఆర్ సర్వే చేయించా రు. ప్రస్తుతం ఉన్న అధికారయంత్రాంగం ఈ విషయంలో చర్యలు తీసుకోవాలి. ప్రజలు, రైతులు, వ్యాపారులకు అనుగుణంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించాలి. – గూడూరి భరత్, ముస్తాబాద్ అధికారులకు నివేదిస్తాం ముస్తాబాద్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి అధికారులకు నివేదిస్తాం. మండల ప్రజలకు ఉపయోగపడే మార్కెట్ కోసం అడుగుతున్నారు. ప్రస్తుతం ఉన్న షెడ్డు, చేపల మార్కెట్ వినియోగంలోకి వచ్చేలా చర్యలు తీసుకుంటాం. – రమేశ్, పంచాయతీ కార్యదర్శి -
ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కలేనా?
ముస్తాబాద్(సిరిసిల్ల): ప్రజాధనంతో నిర్మించిన కూరగాయలు, చేపల మార్కెట్లు వృథాగా ఉంటుండగా.. వ్యాపారులు రోడ్డుపైనే విక్రయాలు జరుపుతున్నారు. ఆ భవనాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతుండగా.. ఇంటిగ్రేటెడ్ మార్కె ట్ నిర్మించాలనే డిమాండ్ వస్తోంది. ఐదేళ్ల క్రితం ముస్తాబాద్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ప్రభుత్వ స్థలం అందుబాటులో లేక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించాలన్న ఆలోచనకు ఫుల్స్టాప్ పడింది. నిర్మించారు.. వదిలేశారు ముస్తాబాద్లో కూరగాయల మార్కెట్ కోసం 2011లో జెడ్పీటీసీ మేర్గు యాదగిరిగౌడ్ బీఆర్జీ నిధుల ద్వారా షెడ్డును నిర్మించారు. నాటి నుంచి ఇప్పటి వరకు ఆ షెడ్డులో ఒక్క రోజు కూడా మార్కెట్ నిర్వహించలేదు. షెడ్డు సరిపోదని రైతులు, వ్యాపారులు పేర్కొంటున్నారు. దీంతో షెడ్డు వృథాగానే ఉండిపోయింది. అదే సంవత్సరంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో రూ.10లక్షలతో చేపల మార్కెట్ నిర్మించి ప్రారంభించారు. చేపల మార్కెట్ కూడా ఖాళీగా ఉంది. మత్స్యకారులు చేపలను రోడ్డుపైనే విక్రయిస్తున్నారు. దీంతో చేపల మార్కెట్ తెరుచుకోలేదు. పదిహేనేళ్లుగా చేపలమార్కెట్, కూరగాయల మార్కెట్లోకి ఎవరూ వెళ్లడం లేదు. మందుబాబులకు అడ్డాగా మారిపోయింది. చేపలమార్కెట్లో లైట్లు, పైపులను దొంగలు ఎత్తుకెళ్లారు. అసాంఘిక కార్యకలాపాలకు రేకులషెడ్డు నిలయంగా మారింది. ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు పరిష్కారం ఇదీ.. ముస్తాబాద్లో ప్రస్తు తం ఉన్న చేపల మార్కెట్, కూరగాయలషెడ్డును తొలగించి ఆ స్థలంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జీ ప్లస్ టు విధానంలో కూరగాయలకు, చేపలు, చికెన్, మాంసం విక్రయాలకు ఒక్కో ఫ్లోర్ నిర్మించాలన్న ప్రతిపాదనలు వస్తున్నాయి. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ సిరిసిల్ల ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి సహకరించాలని మండల ప్రజలు కోరుతున్నారు. వృథాగా కూరగాయల మార్కెట్ తెరుచుకోని చేపల మార్కెట్ ఆరుబయటే కూరగాయల విక్రయాలు -
చిల్లుపడిన పల్లె గుండె
సిరిసిల్ల: అది నూకలమర్రి పల్లె.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రూరల్ మండలంలోని ఓ ఊరు. 2000 జూలై 20వ తేదీన సాయంత్రం గోధూలి వేళ.. గొల్లొల్ల వాడలో తుపాకులు గర్జించాయి.. అధర్మ యుద్ధాన్ని సవాల్ చేస్తూ.. ముగ్గురు సాయుధులు సజీవ దహనమైతే.. నిరాయుధులైన నలుగురు కాల్చి చంపబడ్డారు. ఆ ఏడుగురి అమరత్వం ఏడు రంగుల సింగిడైంది. సిల్లుపడ్డ పల్లెగుండె కన్నీటి సంద్రమైంది. నూకలమర్రి ఎన్కౌంటర్కు సరిగ్గా నేటికి పాతికేళ్లు. ఆ ఎన్కౌంటర్ పర్యవసానంగా జనశక్తి ఉద్యమ ప్రస్థానం పతనమైంది. నూకలమర్రి.. ఎన్కౌంటర్కు 25 ఏళ్లు నిండిన సందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం.ఒక్కసారి వెనక్కిపాతికేళ్ల కిందట అప్పట్లో నక్సలైట్లు సమాంతర ప్ర భుత్వాన్ని నడిపేవారు. అడవిలో ఉండే అన్నలు ‘పెద్దరాయుడిగా’ తీర్పులు ఇచ్చే వారు. మళ్లీ అప్పీళ్లు లేకుండా సమస్యకు ముగింపు ఉండేది. 1989లో సిరిసిల్ల ఎమ్మెల్యేగా సీపీఐ(ఎంఎల్) జనశక్తి పార్టీ బలపరిచిన ఎన్.వీ.కృష్ణయ్య గెలిచారు. ఆ ఎన్నికల్లో సీనియర్ కమ్యూనిస్ట్ నేత చెన్నమనేని రాజేశ్వర్రావు డిపాజిట్ కోల్పోయారు. 1995 స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పటి సిరిసిల్ల ప్రాంతంలోని కొన్ని స్థానాల్లో జనశక్తి పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులుగా గెలిచారంటే ఆనాటి పరిస్థితులను అంచనా వేయవచ్చు.ఆ వేళ ఏం జరిగిందంటే..సీపీఐ(ఎంఎల్) జనశక్తి జిల్లా కమిటీ సభ్యుడు(డీసీఎం) రణధీర్ అలియాస్ సుంకెట సాయిలు, మరో డీసీఎం జగన్ ఆధ్వర్యంలో ఆరుగురు సాయుధ నక్సలైట్ల దళం జూలై 19న (ఎన్కౌంటర్కు ముందు రోజే) సాయంత్రం 5 గంటలకే నూకలమర్రి ఊరి చివర ఉండే పొట్ల దేవయ్య ఇంట్లో ఆశ్రయం పొందారు. నూకలమర్రికి చెందిన పలువురు జనశక్తి సానుభూతిపరులను పిలిపించుకుని పార్టీ బలోపేతం.. ఉద్యమ నిర్మాణంపై మాట్లాడుతున్నారు. ఈక్రమంలో నక్సలైట్ల దళం నూకలమర్రిలో ఆశ్రయం పొందినట్లు పోలీసులకు సమాచారం అందింది. జూ లై 20న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో సాయుధ పోలీసులు నూకలమర్రిలో నక్సలైట్లు ఆశ్రయం పొందిన ఇంటిని గుర్తించి చుట్టుముట్టారు. అప్పటికే నక్సలైట్ల దళం ఇంటి నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమైంది. పోలీ సులు రావడంతో నక్సలైట్లు అ ప్రమత్తమయ్యా రు. జనశక్తి దళనేతలు రణధీర్, జగన్లు కాల్పులు ప్రారంభించారు. అప్పటి సిరిసిల్ల డీఎస్పీ కె.ముళీధర్రావు(రిటైర్డు ఎస్పీ)కు నక్సలైట్లు కాల్చిన బు ల్లెట్ పొ ట్టలోంచి దూసుకెళ్లింది. డీఎస్పీకి తూటా గా యం కావడంతో పోలీ సులు హైరానా పడా రు. ఆఫీసర్ను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో జనశక్తి నేతలు రణధీర్, జగ న్ వెనుక వైపు దారి నుంచి మక్కచేనులో పడిత ప్పించుకున్నారు. ఆ ఇంటిలో నలుగురు సాయుధులు.. మరో ముగ్గురు నూకలమర్రి గ్రామస్తులు చిక్కుకున్నారు.గంటన్నరపాటు హోరాహోరీ కాల్పులునక్సలైట్ల కాల్పుల్లో అప్పటి సిరిసిల్ల డీఎస్పీ మురళీధర్రావు గాయపడడంతో పోలీసులు ఇంటిని చుట్టుముట్టి తుటాల వర్షం కురిపించారు. గంటన్నరపాటు ఇరువర్గాల మధ్య కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. అప్పటికే మీడియా అక్కడికి చేరింది. పోలీసులు వారిని దూరం నుంచే కట్టడి చేశారు. అప్పటి వేములవా డ సీఐ రామయ్య లోపల ఎంత మంది ఉన్నారు అంటూ న క్సలైట్లను ప్రశ్నించాడు. లక్ష మందిమి ఉన్నామంటూ సాయుధుడు అశోక్ ఇంట్లో నుంచి సవాల్ విసిరాడు. సమీపంలోనే ఉన్న మీ డియా ప్రతినిధులకు ఆ మా టలు వినిపించాయి. పోలీ సులు నక్సలైట్ల మధ్య మా టల తూటాలు పేలాయి.సజీవ దహనాలు.. కాల్చివేతలురాత్రి 7.30 గంటల ప్రాంతంలో తుంపర వానలోనే ఆ ఇంటి నుంచి ఓ ముగ్గురు(స్థానికులు) బయటకు రాగా.. పోలీసుల తూటాలకు బలయ్యారు. మరో నలుగురు నక్సలైట్లు ఇంటిలోనే ఉండి ప్రతిఘటిస్తుంటే.. పోలీసులు ఆ ఇంటి పైకప్పు నుంచి పెట్రో ల్ పోసి నిప్పు అంటించారు. నలుగురు నక్సలైట్లు అశోక్, చైతన్య, జ్యోతి, మల్లేశం సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో సాయుధులైన వీర్నపల్లి మండలం గర్జనపల్లికి చెందిన అశోక్, చందుర్తి మండలం సనుగులకు చెందిన చైతన్య, ముస్తాబాద్ మండలం ఆవునూర్కు చెందిన జ్యోతి, జగిత్యాల జిల్లా మే డిపల్లి మండలం మోత్కురావుపేటకు చెందిన మల్లేశం ప్రాణా లు కోల్పోయారు. నక్సలైట్లను కలి సేందు కు వెళ్లిన నూకలమర్రికి చెంది న గసికంటి పర్శరాములు(25), సముద్రాల ఎల్లేందర్(24), దొంతుల రమేశ్(26) పోలీసుల కాల్పుల్లో మరణించారు.‘జనశక్తి’ నిజనిర్ధారణతో వైరుద్యాలుఈ ఎన్కౌంటర్ ఘటనపై జనశక్తి రాష్ట్ర నాయకులు, పౌరహక్కుల నేతలు నిజనిర్ధారణకు సంఘటన స్థలికి వచ్చారు. కాల్పులు జరిగిన ఆ ఇంటిని పరి శీలించారు. ఇవి పోలీసుల ఏకపక్ష కాల్పులని, ప్ర భుత్వ హత్యలని జనశక్తి రాష్ట్ర నాయకులు, పౌరహక్కుల నేతలు ఖండించారు. ఈ వార్తలు పత్రికల్లో వ చ్చాయి. పత్రికల్లో వచ్చిన వార్తను అడవుల్లో ఉన్న అప్పటి పీపుల్వార్ (ఇప్పటి మావోయిస్టులు), జ నశక్తి నక్సలైట్ల చూశారు.ఈ అంశంపై వారి మధ్య వాదనలు జరిగాయి. ఆయు«ధాలు పట్టి ప్రాణాలకు తెగించి మీరు అడవుల్లో పోరాడుతుంటే.. మీ అధినాయకులు మాత్రం స్వేచ్ఛగా నూకలమర్రికి వచ్చి అమరుల మరణాలపై నిజనిర్ధారణ చేస్తున్నారా ! అంటూ పీపుల్స్వార్ నాయకురాలు పద్మక్క చ ర్చకు పెట్టారు. జనశక్తి సాయుధ దళంలో పీపుల్స్వార్ వాదన చర్చకు దారితీసింది. జనశక్తిలో వైరుధ్యాలకు కారణమైంది. ఆ తరువాత 2002లో 46 మంది సాయుధ జనశక్తి పార్టీ నక్సలైట్ల లొంగుబాటుకు కారణమైంది. ఈ కాలక్రమంలో జనశక్తి పార్టీ ఉనికి కోల్పోయింది.ఇల్లు విడిచిన దేవయ్య.. పక్షంలో ఇన్ఫార్మర్ హత్యఎన్కౌంటర్ జరిగిన ఇంటి యజమాని పొట్ల దేవయ్య ఆ ఇల్లు విడిచిపెట్టి కొడిమ్యాలకు వలస వెళ్లాడు. ఆ ఇల్లు శిథిలమైంది. ఈ ఎన్కౌంటర్కు బాధ్యుడిని చేస్తూ అదే వాడకట్టుకు చెందిన మేడుదుల రాజయ్యను నెల రోజుల తర్వాత ఎన్కౌంటర్ మృతుల సమాధి వద్దకు తీసుకెళ్లి విచారించి బస్టాండు వద్దకు తెచ్చి హతమార్చారు. -
బనకచర్లతో తెలంగాణకు తీవ్ర నష్టం
సిరిసిల్లటౌన్: ఆంధ్రప్రదేశ్లోని బనకచర్ల ప్రాజెక్ట్తో గోదావరినదిలో తెలంగాణ రాష్ట్రం 200 టీఎంసీల నీటి వాటా కోల్పోయే పరిస్థితి ఉందని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీశ్ పేర్కొన్నారు. గోదావరిలో నీటి వాటా తేల్చే వరకు ఆంధ్రప్రదేశ్లోని బనకచర్లను అడ్డుకుంటాం.. అనే నినాదంతో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల్లో శనివారం నుంచి ఐదు రోజులపాటు చైతన్య కార్యక్రమానికి శ్రీకా రం చుట్టారు. ఇందులో భాగంగా సిరిసిల్లలోని ఇంటర్ జూనియర్ కాలేజీలో నిర్వహించిన చైతన్య కార్యక్రమంలో హరీశ్ మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నుంచి 200 టీఎంసీల గోదావరి జలాలను రాయలసీమకు తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ నిర్మించతలపెట్టిందే పోలవరం–బనకచర్ల లింక్ ప్రాజెక్టు అన్నారు. తెలంగాణ నీటిహక్కులు కాపాడాల్సిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబుకు, బీజేపీకి లొంగిపోయి లోపాయికారీగా సహకరిస్తున్నారని విమర్శించా రు. ఇప్పటికై నా మేల్కోనకపోతే హైదరాబాద్కు తాగునీటి గోస, రాష్ట్ర రైతులకు ఎప్పటికీ బోర్లే దిక్కవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.● బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీష్ -
పండుగలా వన మహోత్సవం
● సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ఖదీర్పాషా సిరిసిల్లటౌన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వన మహోత్సవాన్ని సిరిసిల్ల మున్సిపల్ ఆధ్వర్యంలో పండుగలా నిర్వహించారు. శుక్రవారం పట్టణంలోని 13, 17, 18వ వార్డులలో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఖదీర్పాషా పాల్గొన్నారు. ప్రజలంతా పచ్చని మొక్కలను బాధ్యతగా పెంచాలని కోరారు. ఉచితంగా మొక్కలు పంపిణీ చేశారు. 13వ వార్డు మాజీ కౌన్సిలర్ జాగీరు శైలు, నేరెళ్ల శ్రీకాంత్గౌడ్, 17వ వార్డు మాజీ కౌన్సిలర్ గుండ్లపెల్లి నీరజ, కాంగ్రెస్ నాయకులు రాపెల్లి కళ్యాణ్, కోడం అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. -
మోస్తరు వర్షాలు
సిరిసిల్ల: జిల్లాలో శనివారం మోస్తరు వర్షాలు పడ్డాయి. వర్షాల కోసం రైతులు ఆకాశం వైపు ఆశగా చూస్తుండగా.. కొద్దిపాటి వర్షం కురిసింది. వేములవాడరూరల్లో 69.1 మిల్లీమీటర్ల అత్యధిక వర్షం నమోదైంది. రుద్రంగిలో 11.5, చందుర్తిలో 43.1, బోయినపల్లిలో 24.4, వేములవాడలో 56.5, సిరిసిల్లలో 11.3, కోనరావుపేటలో 48.7, వీర్నపల్లిలో 39.0, ఎల్లారెడ్డిపేటలో 35.9, గంభీరావుపేటలో 40.6, ముస్తాబాద్లో 16.1, తంగళ్లపల్లిలో 38.0, ఇల్లంతకుంటలో 3.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లా వాప్తంగా సగటున 33.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 252.1 మిల్లీమీటర్లు కాగా.. ఇప్పటి వరకు ఈ ఏడాది 194.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పటి వరకు జిల్లాలో 23 శాతం లోటు వర్షం ఉంది. గతేడాది శనివారం వరకు 294.9 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. నిరుటితో పోలిస్తే.. 100 మిల్లీ మీటర్ల తక్కువ వర్షం పడింది. -
రేషన్కార్డుల జారీ నిరంతర ప్రక్రియ
కోనరావుపేట/చందుర్తి/రుద్రంగి(వేములవాడ): రేషన్కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కోనరావుపేట మండలం ధర్మారంలోని శ్రీనివాస గార్డెన్స్లో శనివారం లబ్ధిదారులకు రేషన్కార్డులు పంపిణీ చేశారు. ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ పేదలకు రేషన్కార్డు ఒక గుర్తింపుకార్డుగా మారిందన్నారు. మండలంలో 889 నూతన రేషన్ కార్డులు జారీ చేస్తున్నామని, 1,806 మంది పేర్లను కొత్తగా నమోదుచేశామని, వీటి ద్వారా దాదాపు 2,696 మంది పేదలకు అదనంగా రేషన్ అందుతుందని తెలిపారు. గల్ఫ్లో ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షల పరిహారాన్ని రాష్ట్రంలోనే తొలిసారిగా కోనరావుపేట మండలంలో అమలు చేశామని గుర్తు చేశారు. జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ సత్యనారాయణగౌడ్, ఏఎంసీ చైర్మన్ ఎల్ల య్య, వైస్చైర్మన్ తాళ్లపల్లి ప్రభాకర్, సివిల్ సప్లయ్ డీఎం రజిత, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఫి రోజ్పాషా, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి, తహసీల్దార్ వరలక్ష్మి పాల్గొన్నారు. అర్హులకు సంక్షేమ పథకాలు పేదల ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు అండగా నిలవాలని ప్రభుత్వ విప్ శ్రీనివాస్ కోరారు. చందుర్తిలోని పురగిరి క్షత్రియ కమ్యూనిటీహాల్లో మండలంలోని పలు గ్రామాల్లోని లబ్ధిదారులకు మంజూరైన 254 రేషన్కార్డులను పంపిణీ చేశారు. తహసీల్దార్ శ్రీనివాస్, జిల్లా సివిల్ సప్లయ్ అధికారి రజిత, ఎంపీడీవో రాధ, రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, ఉపాధ్యక్షుడు బొజ్జ మల్లేశం, పార్టీ మండలాధ్యక్షుడు చింతపటి రామస్వామి, సింగిల్విండో ఉపాధ్యక్షుడు పుల్కం మోహన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఏనుగు లచ్చిరెడ్డి పాల్గొన్నారు. రుద్రంగి అభివృద్ధికి కృషి రుద్రంగి మండల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇప్పటికే రుద్రంగి మండల కేంద్రంలో 30 పడకల ఆస్పత్రి నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. రేషన్కార్డులు పంపిణీ చేసినట్లు సందర్భంగా మాట్లాడారు. రుద్రంగి మండల కేంద్రంలో ఏటీసీ కళాశాల మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. రూ.1.50కోట్లతో సీసీ రోడ్లు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. రుద్రంగి తహసీల్దార్ పుష్పలత, ఎంపీడీవో నటరాజ్, ఏఎంసీ చైర్మన్ చెలుకల తిరుపతి, డీసీసీ కార్యదర్శులు గడ్డం శ్రీనివాస్రెడ్డి, తర్రె లింగం పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ -
ప్రైవేట్స్కూల్ బస్సులు సీజ్
ఇల్లంతకుంట(మానకొండూర్): మండల కేంద్రంలో ఇటీవల ప్రారంభమైన ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన రెండు బస్సులను శనివారం జిల్లా మోటర్ వాహనాల తనిఖీ అధికారి వంశీధర్ సీజ్ చేశారు. సరైన పత్రాలు లేవన్న కారణంగా సీజ్ చేశారు. టాక్స్ సరిగా చెల్లించని ఒక టిప్పర్, మరో ట్రాక్టర్ను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించినట్టు తెలిపారు. తనిఖీలో కానిస్టేబుల్ ప్రశాంత్, హోమ్గార్డ్ ఎల్లయ్య పాల్గొన్నారు. బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు వేములవాడరూరల్: ఇటీవల విద్యుత్ ప్రమాదంలో ఇల్లు దగ్ధమైన బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ప్రొసీడింగ్ కాపీని శనివారం కాంగ్రెస్ నాయకులు అందజేశారు. వేములవాడరూరల్ మండలం హన్మాజీపేటకు చెందిన గొర్రె మైసయ్య–రాజవ్వ దంపతుల ఇల్లు షార్ట్ సర్క్యూట్తో దగ్ధంకాగా.. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించారు. కాంగ్రెస్ గ్రామాధ్యక్షుడు తీగల ఎల్లాగౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మ్యాక స్రవంతి, హరినందన్రెడ్డి, సోషల్మీడియా కన్వీనర్ చిలుక ప్రభాకర్, జంకె జలంధర్, చిలుక భూమేశ్ తదితరులు పాల్గొన్నారు. ఆర్చరీలో ఎన్ఐఎస్కు ఎంపిక సిరిసిల్లకల్చరల్: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్కు జిల్లాలోని నాగారం గ్రామానికి చెందిన బుర్రవేణి హరీశ్ ఎంపికయ్యాడు. దేశవ్యాప్తంగా ఎన్ఐఎస్కు 200 మంది మౌఖిక పరీక్షలకు హాజరుకాగా 63వ విభాగంలో 30 మందిని ఎంపిక చేశారు. ఆర్చరీ నుంచి హరీశ్ ఎంపికవడం గర్వంగా ఉందని జిల్లా క్రీడలశాఖ అధికారి అజ్మీర రాందాస్ పేర్కొన్నారు. వాలీబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శ్రీకుమార్రావు, శిక్షకులు గుర్రం సంపత్గౌడ్, జగన్మోహన్, ప్రశాంత్, కేర్టేకర్ శ్రీనివాస్ అభినందించారు. ఆయిల్పామ్ సాగుకు మొగ్గు చూపాలి ● చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బోయినపల్లి(చొప్పదండి): రైతులు ఆయిల్పామ్ పంటల సాగుకు మొగ్గుచూపాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కోరారు. మండలంలోని మర్లపేటలో శనివారం ఆయిల్పామ్ మొదటి గెలల కోత, కొనుగోలును ప్రారంభించారు. ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ ప్రభుత్వం ఆయిల్పామ్ సాగుకు ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. కొనుగోలు ఒప్పంద పత్రాలను రైతులకు అందజేశారు. ఉద్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్ శేఖర్, జిల్లా ఉద్యాన అధికారి లత, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, తహసీల్దార్ నారాయణరెడ్డి, ఎంపీడీవో జయశీల, ఎంఏవో ప్రణీత, ప్రియునిక్ కంపెనీ జనరల్ మేనేజర్ మల్లేశ్వరరావు, జోనల్ మేనేజర్ రోహిత్, జిల్లా మేనేజర్ ప్రేమ్సాయి, ఫీల్డ్ ఆఫీసర్ శ్రీకాంత్ తులు తదితరులు పాల్గొన్నారు. రైతుబీమా ప్రొసీడింగ్స్ పంపిణీ మండలంలోని జగ్గారావుపల్లికి చెందిన చాడ జైపాల్రెడ్డి ఇటీవల ప్రమాదవశాత్తు మరణించారు. ఆయన భార్యకు రైతుబీమా కింద మంజూరైన రూ.5లక్షల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే సత్యం అందించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ముదుగంటి సురేందర్రెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టెపెల్లి సుధాకర్, ఏఎంసీ చైర్మన్ ఎల్లేశ్యాదవ్, వీసీ వినోద్రెడ్డి, మండల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమణారెడ్డి, మహేశ్రెడ్డి పాల్గొన్నారు. -
● నేటి తరానికి పరిచయం లేకుండా పోతున్న కట్టుబొట్టు
ఈవెంట్లలోనే.. నాటి తరం కట్టు బొట్టు ఇప్పడు ఫ్యాషన్ ట్రెండ్ అయింది. ప్రత్యేక సందర్భాల్లో నాటి చీరకట్టులో ప్రత్యేకత చాటుకుంటున్నారు. నాటి వస్త్రధారణ నేటి ఈవెంట్స్లో సరికొత్త సందర్భ సంప్రదాయ అలంకరణ అయింది. – పడకంటి ఇందు, చామ కృష్ణవేణి, కరీంనగర్ ‘పంచె కట్టుటలోన ప్రపంచాన మొనగాడు కండువా లేనిదే గడపదాటని వాడు పంచ భక్ష్యాలు తన కంచాన వడ్డించ గోంగూర కోసమై గుటకలేసేవాడు ఎవడయ్య ఎవడు వాడు ఇంకెవడు తెలుగువాడు సినారె.. రాసిన ఈ నాలుగు పంక్తుల్లో తెలుగువాడి పంచెకట్టు వైభవాన్ని చాటి చెప్పాయి. ధోతి ఒక అంచును పైనున్న లాల్చీ కుడి జేబులో పెట్టుకుని కనిపించిన నందమూరి తారకరామారావు తన తెలుగుదనపు ఠీవీని ప్రదర్శించారు. అలాగే వైఎస్ రాజశేఖరరెడ్డి సైతం తనదైన శైలి పంచెకట్టుతో మూర్తీభవించిన తెలుగుదనానికి ప్రతిరూపంగా కనిపించేవారు. తెలుగు వారు ఠీవీగా చాటుకునే మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సైతం విదేశీ పర్యటనలు మినహా ఎప్పుడూ పంచె కట్టును వీడింది లేదు’. – సిరిసిల్లకల్చరల్/విద్యానగర్(కరీంనగర్)ఎనభై ఏళ్లుగా.. మా పుట్టిల్లు మర్తనపేట. అత్తగారి ఊరు ఇప్పలపెల్లి. పెళ్లయిన నాటి నుంచి ఇదే తరహా గోచీ చీరలే ధరిస్తున్న. 80 ఏళ్లు దాటుతున్నా మరో ఆలోచన లేదు. 18 మూరల చీరను కూడా సులువుగా కట్టుకుంటాం. కష్టం చేసుకుని బతికెటోళ్లకు ఇదే సౌకర్యం. – గొడుగు లచ్చవ్వ, ఇప్పలపల్లి ●– వివరాలు 8లోu -
మాటల ఈటెలు!
● సొంత పార్టీ నేతలపై ఘాటైన విమర్శలు ● ఈటలతో సమావేశమైన 132 మందికి బీజేపీలో పదవులు ● సంజయ్ అవకాశమివ్వడంటూ మల్కాజ్గిరి ఎంపీకి ఫిర్యాదులు ● ప్రతీ ఒక్కరిని గెలిపించుకుంటానని రాజేందర్ అభయం ● తమనేతపై యుద్ధం ప్రకటించాడంటున్న సంజయ్ అనుచరులు ● రాజేందర్ క్రమశిక్షణ ఉల్లంఘించారని ఆగ్రహంసాక్షిప్రతినిధి,కరీంనగర్: మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ సొంత పార్టీ నేతలపై యుద్ధం ప్రకటించాడా? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్తో ప్రత్యక్ష వైరానికి దిగాడా? అంటే...? అవుననే అంటున్నారు బీజేపీ నేతలు. కరీంనగర్ జిల్లాలో నాలుగైదు రోజులుగా బండి వర్సెస్ ఈటల వర్గాల మధ్య కొనసాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధానికి శనివారం తెరపడింది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు బండి సంజయ్ వర్గం అవకాశం ఇవ్వరంటూ ఈటల రాజేందర్ వర్గీయులు పలుమార్లు నియోజకవర్గంలో రహస్య సమావేశాలు నిర్వహించారు. శనివారం శామీర్పేటలో ఈటల రాజేందర్తో సమావేశమయ్యారు. అక్కడ ఎంపీ రాజేందర్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర కలకలానికి దారితీశాయి. ఆయన ప్రసంగంలో ఎక్కడా బండి సంజయ్ పేరు ఉచ్ఛరించకున్నా.. ప్రత్యక్షంగానే హెచ్చరికలు చేసినట్లు స్పష్టమవుతుందని సంజయ్ వర్గం అగ్గిమీద గుగ్గిలమవుతోంది. ఈ మాటలతో ఇంతకాలం అంతర్గతంగా కొనసాగుతున్న రాజేందర్– బండి వర్గాల మధ్య ఆధిపత్య పోరు రచ్చకెక్కినట్లయిందని కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు. రాజేందర్ వ్యాఖ్యలపైనే చర్చ రాజేందర్ ప్రసంగం ఆసాంతం ఆయన బీఆర్ఎస్లో మంత్రిగా ఉన్నప్పుడు బడుగులకు చేసిన సేవలు, తాను 2002లో రాజకీయాలకు వచ్చానని, ఉమ్మడి జిల్లాలో తాను అడుగుపెట్టని గ్రామం లేదని, వైఎస్ నుంచి కేసీఆర్ దాకా తాను ఎదిరించని సీఎం లేడని చెప్పుకొస్తూ సంజయ్ తనకన్నా జూనియర్ అని చెప్పకనే చెప్పారు. తన మౌనాన్ని బలహీనతగా భావించవద్దని, తుఫాను ముందు సముద్రం ప్రశాంతంగా ఉంటుందని, కానీ.. ప్రళ యం వస్తుంది కొడకా! అంటూ హెచ్చరించారు. అనుచరులు ఎవరూ అధైర్య పడొద్దని, అందరినీ గెలిపించుకుంటానని అభయమిచ్చారు. నాయకుడికి క్రెడిబిలిటీ లేకపోతే పార్టీ ఉండదని, అతనిలా తాను డ్రామా ఆర్టిస్టును కాదని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. తనకు ప్రజలమద్దతు ఉందని చెప్పుకొచ్చారు. ఎంపీ ఎన్నికల్లో తనకు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినన్ని ఓట్లు వేయించానని, తాను బీఆర్ఎస్లో ఉన్నప్పుడు బీజేపీకి అన్ని ఓట్లు రాలేదని గుర్తు చేశారు. సమావేశానికి హాజరైన 132 మంది బీజేపీ లీడర్లందరికీ పార్టీలో పదవులు ఉన్నాయని, ఎవరిని తక్కువ చేయలేదని, వారు పొందిన పదవుల జాబితాను సోషల్మీడియాలో పోస్టు చేశారు. ఈటలపై అధిష్టానానికి ఫిర్యాదు? ఆర్ఎస్ఎస్ నుంచి పార్టీలో కొనసాగుతూ.. నేడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఎదిగిన సంజయ్పై ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై ఆయనవర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. తమది రాజకీయ ప్రయోజనాల కోసం చేరే పార్టీ కాదని, క్రమశిక్షణకు కట్టుబడి ఉంటే పార్టీ అని గుర్తుచేస్తున్నారు. పార్టీని కాదని.. వ్యక్తులు తమను తాము అధికంగా భావిస్తే పార్టీ పక్కనబెడుతుందన్న విషయం మర్చిపోవద్దంటున్నారు. దేనికై నా ఓపిక ఉండాలని, పార్టీ ప్రయోజనాలకు తప్ప వ్యక్తిగత ఎజెండాలకు ఇక్కడ ప్రాధాన్యం ఉండదని స్పష్టం చేస్తున్నారు. పార్టీ విధానాలను ధిక్కరించిన యడ్యూరప్ప, జశ్వంత్సింగ్, రాజాసింగ్లను పక్కనబెట్టిన విషయాన్ని మర్చిపోవద్దంటున్నారు. ఓపికగా ఉంటే పదవులు వరిస్తాయనేందుకు గవర్నర్లు దత్తాత్రేయ, ఇంద్రసేనారెడ్డి, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఉదాహరణలన్న విషయాన్ని గుర్తుచేశారు. బీజేపీ ఎంపీలు ఎవరి నియోజకవర్గాలకు వారు పరిమితమవ్వాలి తప్ప, ఇతరుల నియోజకవర్గాల్లో గ్రూపులను ప్రోత్సహించడం, పార్టీకి సంబంధం లేకుండా గెలిపిస్తానని హామీలు ఇవ్వడంపై కమలనాథులు ఆశ్చర్యపోతున్నారు. పార్టీలో మొలకెత్తిన కొత్త పోకడను ఆదిలోనే అంతం చేయాలంటున్నారు. రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు ‘బండి’ వర్గంవారు సిద్ధం అవుతున్నారు. -
నిందితులకు శిక్ష పడాలి
● ఎస్పీ మహేశ్ బీ గీతే సిరిసిల్లక్రైం: ప్రతీ కేసులో సమగ్ర దర్యాప్తు చేపట్టి శిక్ష పడేలా అధికారులు కృషి చేయాలని ఎస్పీ మహేష్ బీ గీతే సూచించారు. జిల్లా పోలీసు ఆఫీస్లో అధికారులకు నిర్వహించి నేరసమీక్షలో ఎస్పీ పలు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో నేరాల నియంత్రణకు తీసుకుంటున్న భద్రత చర్యలు, పోలీస్స్టేషన్ల వారీగా పెండింగ్ కేసులు, వాటి వివరాలు తెలుసుకున్నారు. నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సిన పద్ధతులు వివరించారు. విజిబుల్ పోలీసింగ్లో భాగంగా పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్ అధికారులు, సిబ్బంది ఎల్లప్పుడూ రద్దీ గల ప్రాంతాలు, ప్రధాన కూడళ్ల వద్ద గస్తీ నిర్వహించాలన్నారు. ఏఎస్పీ చంద్రయ్య, సీఐలు మొగిలి, శ్రీనివాస్, వీరప్రసాద్, వెంకటేశ్వర్లు, మధుకర్, నాగేశ్వరరావు, నటేశ్, ఆర్ఐలు మధుకర్, రమేశ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
ఆదివారం శ్రీ 20 శ్రీ జూలై శ్రీ 2025
● నాటి తరానికి గౌరవం తెచ్చిన వస్త్రధారణసాగు పనులకు అనుకూలం నా చిన్నప్పటి నుంచి గోచీ గుడ్డ ధరించేది. కొంత పెద్దయ్యాక మొదలైన ధోతికట్టు ఇప్పటి వరకూ కొనసాగిస్తున్న. ధోతితో ఉండే సౌకర్యం మరే వస్త్రంతో ఉండదు. వ్యవసాయం చేసుకునే మాలాంటి కుటుంబాల్లో మగవాళ్లందరికీ ధోతికట్టే అలవాటైంది. సాగు పనులకు సౌకర్యంగా ఉండడం ధోతికట్టులో ఉన్నంతగా మరి దేనిలోనూ ఉండదు. – సలేంద్రి దేవయ్య, పెద్దూరు న్యూస్రీల్ -
ఆనందంగా ఉంది
మాలాంటి భూమి లేని పేదలకు ప్రభుత్వం ఇచ్చే ఆత్మీయ భరోసా కుటుంబ అవసరాల కు ఉపయోగపడుతుంది. రైతుల మాదిరి గానే మాకు కూడ ప్రభుత్వం ఆర్థిక సహాయ ం చేయడం ఆనందంగా ఉంది. – బొడావత్ ఛక్రీ, మహిళ ఉపాధిహామీ కూలీ, గుండారంఅర్హులకు అమలు చేస్తున్నాం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆత్మీయ భరోసా పథకాన్ని అర్హులకు అమలు చేస్తున్నాం. భూమి లేని నిరుపేదలు, ఉపాధి పనికి ఏడాదిలో 20 రోజులకు తగ్గకుండా పనిచేసి ఉండాలి. ఇలాంటి వారిని ఎంపిక చేస్తున్నాం. ఎంపికై న వారికి నేరుగా వారి ఖాతాల్లోనే ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం డబ్బులు జమవుతాయి. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుంది. – కొమురయ్య, ఏపీవో, ఎల్లారెడ్డిపేట -
రెండో విడత కూల్చివేతలు షురూ
● కోర్టు గ్రీన్ సిగ్నల్తో 80 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం ● ఫలించని కొంత మంది యజమానుల న్యాయ పోరాటం ● హర్షం వ్యక్తం చేస్తున్న భక్తులు, స్థానికులు వేములవాడ: వేములవాడ పట్టణానికి ఇదొక చారిత్రక ఘట్టంగా జనం చెప్పుకుంటున్నారు. కొన్నితరాలుగా ఎదురుచూసిన కల ఇప్పుడు నిజమవుతోంది. దశాబ్దాలుగా ట్రాఫిక్ సమస్య, ఆలయాలకు వచ్చే భక్తులకయ్యే ఇబ్బందులు కనుమరుగు కానున్నాయి. 60 ఏళ్ల కల సాకారం కానుందని జనం సంబరపడిపోతున్నారు. గతంలో ఎన్నో చర్చలు జరిగినా, కార్యరూపం దాల్చకపోవడంతో ప్రజల్లో నిరాశా నిస్పృహలు నెలకొన్నాయి. సీఎం రేవంత్రెడ్డి, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ల పట్టుదలతో చేపట్టిన కార్యాచరణ ఇప్పుడు ఆ కలకు ఆకారాన్నిచ్చాయి. ఇప్పటికే పాత భవనాల కూల్చివేత పూర్తయ్యింది. చుట్టుపక్కల గోడలు, నిర్మాణాలు ధ్వంసమవుతున్నా, ప్రజల మనస్సుల్లో ఆశల పునాది పడింది. కోర్టు స్టేతో నిలిచిన 88 నిర్మాణాలు శుక్రవారం కూల్చివేతలు మొదలయ్యాయి. ఐదుగురు తహసీల్దార్లు ఐదు బృందాలుగా ఏర్పడి మొత్తంగా 80 ఫీట్ల విస్తరణతో భవనాలను కూల్చి వేస్తున్నారు. గతనెల 16న ప్రారంభమైన రోడ్ల విస్తరణ ప్రక్రియ కోర్టు స్టేతో ఆగింది. కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో శుక్రవారం పూర్తిస్థాయి కూల్చివేతలకు అధికార యంత్రాంగం శ్రీకారం చుట్టింది. దీంతో ఇక వేములవాడ రోడ్ల విస్తరణ పరిపూర్ణం కానుంది. విస్తరణ పనులు పరిశీలించిన కలెక్టర్ రహదారి విస్తరణ పనులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శుక్రవారం పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు చేశారు. కలెక్టర్ వెంట వేములవాడ ఆర్డీవో రాధాబాయి, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, తహసీల్దార్లు, సిబ్బంది ఉన్నారు. -
ఇందిరా మహిళాశక్తితో ఆర్థిక ప్రగతి
● డీఆర్డీవో శేషాద్రి ● కలెక్టరేట్లో ఇందిరా మహిళాశక్తి సంబురాలుసిరిసిల్లటౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి పథకంతో మహిళలు ఆర్థికంగా ప్రగతి సాధిస్తున్నారని డీఆర్డీవో శేషాద్రి అన్నారు. శుక్రవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో మాట్లాడారు. వివిధ మహిళా సంఘాల వీవోల విజయాలను, తమ సంఘం ప్రగతిని వివరించారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ఆర్టీసీ బస్సులు, సోలార్ ప్లాంట్లు, క్యాంటీన్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, పెరటి కోళ్ల పెంపకం, డెయిరీ యూనిట్, పిండి గిర్నీ, మూడు సీహెచ్సీలు, స్కూల్ యూనిఫామ్ ఇతర స్వయం ఉపాధి పథకాలకు ఆర్థికంగా భరోసా అందిస్తుందని వెల్లడించారు. రుణాలు చెల్లించడంలో జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచిందని తెలిపారు. ఇల్లంతకుంట మండల ఆదర్శ మహిళా సమాఖ్య ఉత్తమ సేవలతో జాతీయ పతకానికి ఎంపికై ందని అన్నారు. వివిధ మార్కెట్ కమిటీ చైర్పపర్సన్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమమే లక్ష్యంగా పథకాలు అమలు చేస్తుందన్నారు. ఉచిత బస్సు, విద్యుత్, సబ్సిడీపై గ్యాస్ సిలిండర్ అందజేస్తున్నదని తెలిపారు. తాము ఉపాధి పొందుతూ మిగతా వారికి పని కల్పించే స్థాయికి ఎదుగుతున్నారని వివరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్లు స్వరూపారెడ్డి, సబేరా బేగం, కొమిరిశెట్టి విజయ, రాణి, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, అడిషనల్ డీఆర్డీఓ సీ హెచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
సెస్లో సిటిజన్ చార్ట్ అమలు చేయాలి
● సంస్థను ఎన్పీడీసీఎల్లో విలీనం చేయాలి ● సీజీఆర్ఎఫ్ చైర్మన్కు వినతులు సిరిసిల్లటౌన్: సహకార విద్యుత్ సరఫరా సంస్థ(సెస్)లో సిటిజన్ చార్టర్ అమలు చేయాలని సిరిసిల్ల పట్టణ వినియోగదారులు డిమాండ్ చేశారు. సిరిసిల్ల పద్మనాయక ఏసీ ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో వినియోగదారులు ప లు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి మాట్లాడారు. విద్యుత్ మీటర్ రీడింగ్స్లో పారదర్శకత లోపించిందని, అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సెస్ను ఎన్పీడీసీఎల్లో విలీనం చేయాలని సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి అధ్యక్షుడు బియ్యంకార్ శ్రీనివాస్, ప్రతినిధులు చీకోటి అనీల్కుమార్ తదితరులు కోరారు. పలవురు వినియోగదారులు వేదికపైకి వచ్చి తమకు వచ్చిన అధిక కరెంటు బిల్లులు, తాము ఎదుర్కొంటున్న సంస్థాపరమైన సమస్యలను నేరుగా ఫిర్యాదు చేయగా అన్నింటినీ పరిష్కరిస్తామని వేదిక ప్రతినిధులు పేర్కొన్నారు. సకాలంలో బిల్లులు చెల్లించాలి సెస్ వినియోగదారులు సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించి సంస్థ మనుగడకు సహకరించాలని విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేది క చైర్మన్ ఎరికల నారాయణ అన్నారు. ఏ సమస్య ఉన్న అధికారులు వెంటనే స్పందిస్తారని తెలిపారు. మంచి లాభాల బాటలో పనిచేస్తున్న సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ వినియోగదారుడిపై అ న్నారు. విద్యుత్ వినియోదారుల సమస్యల పరి ష్కారవేదిక సభ్యులు రామకృష్ణ, మరిపల్లి రాజాగౌడ్, సెస్ ఎండీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ట్రాన్స్జెండర్లూ న్యాయ సహాయానికి అర్హులే
సిరిసిల్లకల్చరల్: సమాజంలో వివక్షను ఎదుర్కొంటున్న ట్రాన్స్జెండర్లకు కూడా సమాన అవకాశాలు కల్పించే దిశగా ప్రయత్నాలు జరగడం ప్రశంసనీయం అని సీనియర్ సివిల్ జడ్జి, డీఎల్ఎస్ఏ కార్యదర్శి రాధికా జైస్వాల్ అన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలు, జిల్లా శాఖ చైర్మన్, ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ మార్గదర్శకాల మేరకు శుక్రవారం న్యాయస్థానం ఆవరణలో ట్రాన్స్జెండర్లు, సెక్స్వర్కర్లకు గుర్తింపు కార్డులు అందజేశారు. సాంఘిక వివక్షకు గురవుతున్న ట్రాన్స్ జెండర్ల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం న్యాయ సేవాధికార సంస్థ సేవలు అందుకునే వీలున్నప్పటికీ గుర్తింపు కార్డులు లేకపోవడం వల్ల అవకాశాలు కోల్పోయారన్నారు. ఈవిషయాన్ని గుర్తించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రత్యేక చొరవ తీసుకుని ప్రభుత్వ యంత్రాంగం సాయంతో గుర్తింపు కార్డులు జారీ చేయించారని తెలిపారు. ఈ గుర్తింపు వల్ల న్యాయసాయం పొందేందుకు అర్హత లభిస్తుందన్నారు. న్యాయవాదులు ఆడెపు వేణు, కడగండ్ల తిరుపతి, కొండ సత్యనారాయణ, వేంకటేశ్వర్లు, తిరుమల, ఇన్ఫోసెమ్ ప్రాజెక్టు డైరెక్టర్ మహేశ్ తదితరులు పాల్గొన్నారు. పట్టు పురుగుల పెంపకంపై సర్వేవేములవాడరూరల్: మేరా రేషమ్ మేరా అభియాన్–2024 కింద వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి, వెంకటాంపల్లి, అచ్చన్నపల్లి, ఫాజుల్నగర్ గ్రామాల్లో శుక్రవారం పట్టుపురుగుల పెంపకంపై శాస్త్రవేత్తలు, అధికారులు సర్వే నిర్వహించినట్లు జిల్లా సెరికల్చర్ అధికారి జగన్రావు తెలిపారు. సెరికల్చర్పై రైతులకు అవగాహన కల్పించారని అన్నారు. -
మహిళలు ఆర్థికంగా బలపడాలి
● కలెక్టర్ సందీప్కుమార్ ఝాఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతోందని కలెక్టర్ సందీప్కుమార్ ఝా అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం కో రుట్లపేట, ఎల్లారెడ్డిపేట గ్రామాల్లో మహిళా సంఘాలు నిర్వహిస్తున్న పురుగుల మందు దుకా ణాలను శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో మహిళా సంఘాలు ధాన్యం కొనుగోళ్లను విజయవంతం చేశాయని అన్నారు. మ హిళలకు పెట్రోల్బంక్లను కూడా కేటాయించ డం జరుగుతుందని తెలిపారు. మహిళా సంఘాలు నడపగలిగే శక్తి ఉండే మండలానికి ఒకటి చొ ప్పున రైస్ మిల్లులను కేటాయిస్తామని అన్నారు. గల్ఫ్ బాధితుడికి ఆర్థిక సాయం ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేటకు చెందిన మోకినిపల్లి నర్సవ్వ–నర్సయ్య దంపతులు గ్రామానికి వచ్చిన కలెక్టర్ను కలిసి తమ ఒక్కగానొక్క కొడుకు సుమన్ గల్ఫ్లో మరణించాడని మొరపెట్టుకున్నారు. స్పందించిన కలెక్టర్ వెంటనే తక్షణ సాయం కింద రూ.2లక్షలతో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్బేగం, డీఆర్డీఏ శేషాద్రి, డీపీఎం వరుణ్రెడ్డి, ఎంపీడీవో సత్తయ్య, ఏపీఎం మల్లేశం, ఏఎంసీ చైర్మన్ సాబేర బేగం, వైస్చైర్మన్ రాంరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. యూరియా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి ముస్తాబాద్: ప్రభుత్వం ఏర్పాటు చేసిన యూరియా కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా అన్నారు. ముస్తాబాద్ మండలం ఆవునూర్లో ఏర్పాటు చేసిన యూరియా, ఎరువుల కేంద్రాన్ని ప్రారంభించారు. మహిళా శక్తి ద్వారా అందరికీ ప్రయోజనాలు దక్కుతాయన్నారు. ఏఎంసీ చైర్పర్సన్ తలారి రాణి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాల్రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి ఆఫ్జల్బేగం, మండల వ్యవసాయాధికారి దుర్గరాజు, ఏపీవో దేవరాజు తదితరులు పాల్గొన్నారు. -
దందా!
అబార్షన్ కిట్ల● ప్రిస్క్రిప్షన్ లేకుండా యథేచ్ఛగా విక్రయాలు ● ఆడపిల్లలను కడుపులోనే చంపే మాత్రల అమ్మకాలు ● మెడికల్ షాపులపై డ్రగ్ కంట్రోల్ అథారిటీ దాడులు ● జగిత్యాలలో 5, పెద్దపల్లిలో 6 షాపులకు షోకాజ్ నోటీసులు ● సిరిసిల్లలో ఒక షాపు మూసివేతసాక్షిప్రతినిధి,కరీంనగర్: ఆడపిల్లలను అమ్మ కడుపులోనే చిదిమేసే అబార్షన్ కిట్లపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) కొరడా ఝుళిపిస్తోంది. ఎలాంటి వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా యథేచ్ఛగా అబార్షన్ మాత్రలు విక్రయిస్తున్న పలు మెడికల్షాపులపై డీసీఏ అధికారులు వరుస దాడులతో హడలెత్తిస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టి.. అన్ని మెడికల్ షాపులలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోనూ డ్రగ్ ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సిరిసిల్లలో ఒక షాపు అధికారులు మూసివేశారు. జగిత్యాలలో ఐదు, పెద్దపల్లిలో 6 షాపులకు షోకాజ్ నోటీసులు జారీచేశారు. వైద్యుల సలహాలు లేకుండా మాత్రలు విక్రయిస్తే.. వాడిన వారికి అంతర్గత స్రావంతో పాటు ప్రాణాలు పోయే ప్రమాదముందని స్పష్టంచేస్తున్నారు. రోగుల ప్రాణాల మీద వస్తుందని తెలిసీ.. ఇష్టానుసారంగా జరుగుతున్న ఇలాంటి విక్రయాలపై డీసీఏ కొరడా ఝళిపించడాన్ని పలువురు స్వాగతిస్తున్నారు. -
అన్నదానం చేయడం అభినందనీయం
వేములవాడ: కక్షిదారులకు అన్నదానం చేయ డం అభినందనీయమని సీనియర్ సివిల్ జడ్జి అజయ్కుమార్ జాదవ్, ఇన్చార్జి జూనియర్ సివిల్ జడ్జి ప్రవీణ్కుమార్ అన్నారు. ఆషాఢమాసం సందర్భంగా శుక్రవారం వేములవాడ కోర్టు ప్రాంగణంలో న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదానంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ న్యాయవాది గణేశ్, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గడ్డం సత్యనారాయణరెడ్డి, ఉపాధ్యక్షులు కట్కం జనార్దన్, ఏజీపీ బొడ్డు ప్రశాంత్, సిరిసిల్ల బార్ అసోసియేషన్ కార్యదర్శి వెంకటి, మాజీ అధ్యక్షులు నేరెళ్ల తిరుమల్ గౌడ్, పొత్తూరి అనిల్ కుమార్, గుడిసె సదానందం, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కక్షిదారులు పాల్గొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే చర్యలుతంగళ్లపల్లి(సిరిసిల్ల): ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ) వంశీధర్ అన్నారు. శుక్రవారం తంగళ్లపల్లి మండల కేంద్రంలో వాహనాల తనిఖీ నిర్వహించారు. డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలు, ఫిట్నెస్, ఇన్సూరెన్స్ పరిశీ లించారు. వాహనాలు నడిపేటప్పుడు అన్ని ధ్రువపత్రాలు వెంట ఉంచుకోవాలని అన్నారు. ఆర్టీఏ సిబ్బంది పాల్గొన్నారు. గురుకులాల్లో సమస్యలు తీర్చాలిసిరిసిల్లటౌన్: గురుకులాల్లో సమస్యలు తీర్చాలని కోరుతూ శుక్రవారం సిరిసిల్ల పాతబస్టాండ్లో బీఆర్ఎస్ యూత్, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ యూత్, విద్యార్థి విభాగాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాలు పాయిజన్కు నిలయాలుగా మారాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లో 90 మంది విద్యార్థులు చనిపోయారని అన్నారు. ఏడాదిలోనే వెయ్యి మందికి పైగా విషాహారం తిని ఆస్పత్రి పాలయ్యారని తెలిపారు. జిల్లా నాయకులు మట్టె శ్రీనివాస్, నాయకులు వడ్లూరి సాయి, సూర్య, అనిల్ గౌడ్, రాజు నరేష్, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.బైలాకి వ్యతిరేకంగా పద్మశాలీ ఎన్నికలుసిరిసిల్ల అర్బన్: సిరిసిల్ల పద్మశాలీ సంఘం ఎన్నికల్లో సభ్యుల మనోభావాలకు, సంఘం బైలాకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్నారని అడ్హక్ కమిటీ కన్వీనర్ కుసుమ విష్ణుప్రసాద్ అ న్నారు. శుక్రవారం సిరిసిల్లలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ పద్మశాలీ సంఘం పెద్దల కోసం సామాన్య సభ్యులు ఎన్నికల్లో నిలబడకుండా చేయాలనే ఉద్దేశంతో నామినేషన్ల ఫీజు పెంచినట్లు తెలిపారు. దీనికి వ్యతిరేకంగా పద్మశాలీలంతా ఐకమత్యంగా మరో సంఘం నిర్మితం కావాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగా నూతన అడ్హక్ కమిటీని వేసినట్లు తెలిపారు. ప్రజాబలం కాంగ్రెస్కేసిరిసిల్లటౌన్: శాసనసభ, పార్లమెంట్ ఎన్ని కల మాదిరిగానే జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాబలం మళ్లీ కాంగ్రెస్కే ఉందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్ అన్నారు. శుక్రవారం సిరిసిల్ల ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేటీఆర్ సిరిసిల్లలో మాట్లాడిన మాటల్ని తీవ్రంగా ఖండించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ కోసం ఎదురుచూస్తుందని, ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తుందన్నారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఉపాధి’ కూలీలకు భరోసా
జిల్లా సమాచారం మండలాలు 13 గ్రామపంచాయతీలు 255 జాబ్కార్డులు 1,02,309 మహిళా కూలీలు 66,508 పురుష కూలీలు 35,801 పని చేసే కూలీలు 83,159ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): జాతీయ గ్రామీణ ఉపాధిహామీ కూలీలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పథకాన్ని అమలు చేస్తోంది. భూమిలేని నిరుపేదలకు రైతులకు రైతు భరోసా ఇచ్చినట్లుగా ఆత్మీయ భరోసా పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రబీ, ఖరీఫ్ సీజన్లలో రూ.6వేల చొప్పున ఏడాదికి రూ.12వేలు అందించాలని నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా 11,267 కుటుంబాలను గత జనవరిలో గ్రామసభల ద్వారా అధికారులు ఎంపిక చేశారు. ఈమేరకు ఇప్పటికే జిల్లాలోని ప్రతీ మండలంలోని ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి అర్హులకు మొదటి విడతగా రూ.6వేలు వారి ఖాతాల్లో జమచేసింది. ఇలా తమకు ఆర్థికసహాయం అందడంతో నిరుపేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 11,267 అర్హులు జిల్లాలోని 255 గ్రామాల్లోని అర్హులను ఎంపిక చేయనున్నారు. భూమిలేని నిరుపేదలు, ఉపాధిహామీ పనులకు హాజరై ఉంటేనే ఈ పథకానికి అర్హులు. కనీసం ఏడాదికి జాబ్కార్డులో 20 రోజులు పనిచేసి ఉండాలి, వారి కుటుంబానికి ఎలాంటి భూమి ఉండొద్దు. ఇలా జిల్లా వ్యాప్తంగా 11,267 మందిని అర్హులుగా ఎంపిక చేశారు. కాగా పైలట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేసిన గ్రామాల్లోని లబ్ధిదారులకు ప్రభుత్వం మొదటి విడతగా రూ.6వేల చొప్పున వారి ఖాతాల్లో జమచేసింది. ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయగా.. ఆ గ్రామంలో మొదటి విడతగా 94 మందికి రూ.6వేల చొప్పున ఖాతాల్లో జమచేశారు. ఇలా జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన 13 పైలట్ గ్రామాల వ్యాప్తంగా 384 మందికి రూ.6వేల చొప్పున వారి ఖాతాల్లో జమచేసింది. మిగతా జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన అర్హులకు త్వరలోనే అందనున్నట్లు అధికారులు చెబుతున్నారు. భూమిలేని నిరుపేదలకు ఆర్థిక సాయం జిల్లాలో 11,267 మంది ఎంపిక ఏడాదికి రూ.12వేలు ఆత్మీయ భరోసా పేరుతో అందించనున్న ప్రభుత్వం హర్షం వ్యక్తం చేస్తున్న పేదలు -
సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ
చందుర్తి (వేములవాడ): సీసీ కెమెరాలు నేరాల నియంత్రణకు దోహదపడుతాయని ఎస్పీ మహే శ్ గితే అన్నారు. చందుర్తి మండలం కిష్టంపేటలో ఏర్పాటు చేసిన 9 సీసీ కెమెరాలను శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. ప్రజల సహకారంతో అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఏదైన సంఘటన జరిగితే గుర్తించేందుకు ఉపయోగపడుతాయని తెలిపారు. ఇటీవల జరిగిన సంఘటనలన్నీ వీటి ద్వారానే ఛేదించామన్నారు. అనంతరం చందుర్తి సర్కిల్ కార్యాలయం, పోలీస్స్టేషన్ను తనిఖీ చేశారు. పరేడ్, కిట్ ఆర్టికల్స్, రిసెప్షన్, సీసీటీఎన్ఎస్ విభాగాల పనితీరు, పలు రికార్డులను పరిశీలించారు. దర్యాప్తులో ఉన్న కేసులపై రివ్యూ చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై క ఠినంగా వ్యవహరించాలన్నారు. ఎస్పీ వెంట చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రమేశ్లు ఉన్నారు. గోవిందరాజుల సన్నిధిలో ఎస్పీ పూజలు చందుర్తి మండలం సనుగుల గ్రామశివారులోని గోవిందరాజుల స్వామి ఆలయంలో ఎస్పీ మహేశ్ గితే పూజలు చేశారు. మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్, సనుగుల సింగిల్విండో మాజీ ఉపాధ్యక్షులు శ్రీనివాస్గౌడ్ తదితరులు ఉన్నారు. -
అసలేంటి ఈ అబార్షన్ కిట్లు
అబార్షన్ కిట్లను అబార్టిఫేసియంట్ డ్రగ్స్గా పిలుస్తారు. మెఫిప్రిస్టోన్, మీసోప్రోస్టాల్ తదితర టాబ్లెట్లు ఈ కిట్లో ఉంటాయి. వీటిని అవాంఛిత గర్భస్రావాలకు వైద్యుల ప్రిస్క్రిప్షన్ మేరకు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఎలాంటి వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. దీనిపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తడంతో రాష్ట్రవ్యాప్తంగా మెడికల్షాపులపై డీసీఏ దాడులు నిర్వహిస్తోంది. ముఖ్యంగా హుజూరాబాద్, జమ్మికుంట, సుల్తానాబాద్, సిరిసిల్ల, జగిత్యాల షాపులపై డీసీఏ దాడులు చేశారు. ఈ సందర్భంగా సిరిసిల్లలో ఓ మెడికల్ షాపును ఏకంగా మూసివేశారు. జగిత్యాల జిల్లాలో ఐదు షాపులు, పెద్దపల్లి జిల్లాలో మరో ఆరుషాపులకు అబార్షన్ కిట్లు విక్రయిస్తున్నందుకు డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ యాక్ట్ 1940 ప్రకారం.. షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గతంలో జమ్మికుంట, హుజూరాబాద్లో స్కానింగ్ సెంటర్లలో లింగనిర్ధరణ పరీక్షలు చేయడం, అబార్షన్ కిట్లు వాడి గర్భంలోనే చిదిమేయడం అలవాటుగా మారింది. వాస్తవానికి వైద్యుల సమక్షంలో ఆసుపత్రుల్లోనే ఈ ప్రక్రియ జరగాలి. కానీ, వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఎవరికి వారు, ఆసుపత్రుల బయట ఈ తతంగాన్ని నడపడం ఆందోళనకరంగా మారింది. -
మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
వేములవాడ: మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. డీఆర్డీఏ, సెర్ఫ్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఇందిరా మహిళాశక్తి సంబరాల్లో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళా సమాఖ్య సంఘాలకు వడ్డీ లేని రుణాలు, బ్యాంక్ లింకేజీ, ఇటీవల మరణించిన మహిళా సంఘం సభ్యుల కుటుంబాలకు ప్రమాద బీమా చెక్కులను అందజేశారు. విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పావలా వడ్డీ రుణాలు మంజూరు చేశారని, ఐకేపీ కేంద్రాలను ప్రారంభించి మహిళలకు ఆర్థిక స్వావలంబన దిశగా ప్రోత్సాహించారని గుర్తు చేశారు. ప్రజాప్రభుత్వంలో మహిళలకు రూ.20వేల కోట్ల పైచిలుకు నిధులు కేటాయించారన్నారు. గత ప్రభుత్వం మహిళా సంఘాలను ఏమాత్రం పట్టించుకోలేదనీ, చివరికి మూడేళ్ల వడ్డీని ఎగ్గొట్టారన్నారు. మహిళా సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ప్లాంట్, ఆర్టీసీ సంస్థకు అద్దె బస్సులు, పెట్రోల్ పంపు, ధాన్యం కొనుగోలు, రైస్మిల్ వంటి అనేక వ్యాపారాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. డీఆర్డీఏ పీడీ శేషాద్రి, ఏఎంసీ చైర్మన్లు రొండి రాజు, చెలకల తిరుపతి, కచ్చకాయల ఎల్లయ్య, అన్ని మండలాల ఏపీఎంలు, మహిళా సమాఖ్య సంఘం అధ్యక్షులు, మహిళ సంఘాల సభ్యులు పాల్గొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని హర్షిస్తూ విప్ ఆది శ్రీనివాస్ను తన క్యాంపు కార్యాలయంలో గురువారం బీసీ సంఘాల నాయకులు సన్మానించారు. అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు వేములవాడ: అర్హులైన పేదలకు ప్రజాప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు చేస్తుందని.. ఇందులో భాగంగా నూతన రేషన్కార్డులు పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝాతో కలిసి పట్టణంలోని మహాలింగేశ్వర గార్డెన్స్లో వేములవాడ రూరల్, అర్బన్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు కొత్త రేషన్కార్డులను గురువారం పంపిణీ చేశారు. ప్రభుత్వ విప్ మాట్లాడుతూ పేదలకు రేషన్కార్డు గుర్తింపుకార్డుగా మారిందన్నారు. సన్నబియ్యం పంపిణీతో రేషన్కార్డు ప్రాముఖ్యత పెరిగిందన్నారు. సివిల్ సప్లయ్ డీఎం రజిత తదితరులు పాల్గొన్నారు.● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ -
మిమ్మల్ని గెలిపించుకుంటా...
● నన్ను మీరే గెలిపించారు ● గెలుపు గుర్రాలను మీరే గుర్తించండి ● బయటి వాళ్లు అక్కర్లేదు ● మీరు మీరు కొట్లాడుకోవద్దు ● స్థానిక సంస్థల ఎన్నికలంటే కాంగ్రెస్ భయపడుతుంది ● సిరిసిల్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావుసిరిసిల్ల: స్థానిక సంస్థల ఎన్నికల్లో మిమ్మల్ని నేను గెలిపించుకుంటా.. నన్ను మీరే గెలిపించారు.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. అన్నీ నేను చూసుకుంటానని సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో గురువారం ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, గంభీరావుపేట, ముస్తాబాద్ మండలాల బీఆర్ఎస్ నాయకులు, ముఖ్య కార్యకర్తలతో అంతర్గత సమావేశాన్ని నిర్వహించి దిశానిర్దేశనం చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ స్థానిక ఎన్నికలు పెట్టాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలో ఏ వర్గం కూడా సంతోషంగా లేరని, ఎన్నికలకు ముందు కాంగ్రెసోళ్లు కూడా గెలుస్తామని అనుకోలేదన్నారు. అనుకోకుండా వచ్చిన అధికారంతో ఆగమవుతున్నారన్నారు. ఎరువుల కోసం మళ్లీ గోస వచ్చింది రాష్ట్రంలో ఎరువుల కోసం చెప్పులతో క్యూ కట్టే రోజులు మళ్లీ వచ్చాయన్నారు. వ్యవసాయంపై మన నేత కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపారని, నారుమళ్ల సమయానికి ఎరువులు సిద్ధం ఉండేవని గుర్తు చేశారు. కేసీఆర్ హయాంలో వాగులో నిండుగా నీళ్లుంటే ఇప్పుడు ఎడారిని తలపిస్తుందన్నారు. గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 15 రిజర్వాయర్లు, మూడు బ్యారేజ్లు, 21 పంపులతో నీటిని ఎత్తిపోశారని కేటీఆర్ గుర్తు చేశారు. కొండపోచమ్మ సాగర్ వద్ద 618 మీటర్ల ఎత్తుకు నీళ్లు తెచ్చిండని, 139 మెగావాట్ల బాహుబలి మోటార్లతో ఎత్తిపోతల ద్వారా మనకు నీటి సరఫరా వ్యవస్థను కేసీఆర్ తయారు చేసిండన్నారు. 24 గంటల కరెంట్, రైతుబంధు, రైతుబీమాతో వ్యవసాయ భూముల ధరలు పెరిగాయన్నారు. సిరిసిల్లలో పైసా పంచకుండా గెలిచాను కల్యాణలక్ష్మి పథకంతో ఆడబిడ్డల వివాహానికి అండగా నిలిచామని, అధికారం ఎవరికి శాశ్వతం కాదన్నారు. నేను సిరిసిల్లకు వస్తే చాలా సంతోషపడతానని, ఒక్క రూపాయి పైసలు పంచకుండా, మందు చుక్క పోయకుండా గెలవడం నాకు గర్వంగా ఉందన్నారు. ఇది నేను, మీరు అందరం గర్వపడే విషయమని పేర్కొన్నారు. పరిపాలన పరంగా ఇక్కడ జరిగిన అభివృద్ధి చారిత్రాత్మకమన్నారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మన ఎంపీటీసీ కుంటయ్య మరణం నన్ను తీవ్రంగా బాధించిందని, వారికి కుటుంబ బాధ్యత నేను తీసుకున్నానని కేటీఆర్ అన్నారు. ప్రజలంతా కేసీఆర్ నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నారన్నారు. ఎవరికీ భయపడేది లేదని, మనల్ని ఇబ్బంది పెడుతున్న వారి పేర్లు రాసిపెట్టుకుంటున్నాని స్పష్టం చేశారు. అన్ని స్థానాలు మనవే.. ప్రతీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ.. అన్ని స్థానాల్లో మనమే గెలవాలని, రాష్ట్రంలోని 269 జెడ్పీటీసీ స్థానాల్లో గెలవబోతున్నామన్నారు. అధికార పార్టీకి ధీటుగా పనిచేద్దామన్నారు. మన గెలుపే వాళ్ల బలుపుకు సమాధానం కావాలన్నారు. గ్రామాల్లో యూరియా కొరత ఉంది, దీంతో పాటు అనేక సమస్యలు ఉన్నాయని, మీరు స్థానిక సమస్యలపై కొట్లాడాలని పిలుపునిచ్చారు. గతంలో గ్రామ పంచాయతీలకు అనేక అవార్డులు వస్తే.. ఇప్పడు ఒక్కటీ దిక్కులేదన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీసీ సోదరులను మళ్లీ కాంగ్రెస్ మోసం చేస్తుందని ఆరోపించారు. పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేస్తేనే సాధ్యమవుతుందన్నారు. ప్రజాక్షేత్రంలో ఉంటూ.. మన పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఒక్క తంగళ్లపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులతో సమావేశాన్ని వాయిదా వేశారు. మండలాల వారీగా జరిగిన ఈ సమావేశాల్లో బీఆర్ఎస్ నాయకులు చెలిమెడ లక్ష్మీనర్సింహారావు, కొండూరి రవీందర్రావు, తోట ఆగయ్య, చిక్కాల రామారావు, న్యాలకొండ అరుణ, అన్ని మండలాల మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు, సింగిల్ విండో చైర్మన్లు, సర్పంచ్లు పాల్గొన్నారు. -
ఉషోదయపు ‘ఉపాధి’
● చిన్న పెట్టుబడి.. నమ్మకమైన ఉపాధి ● నేతకార్మిక కుటుంబ బతుకుబాట ● ఆ యువకుడి ఐడియా అదిరిందిసిరిసిల్ల: డిగ్రీలు.. పీజీలు చేసినా.. ఉద్యోగాలు రావడం లేదని, ఉపాధి లేక, ఇల్లు గడవడం లేదని, ఏదైనా వ్యాపారం చేస్తామంటే.. పెట్టుబడి లేదని, బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని నేటి తరం యువతరం విసిగిపోతుంది. సెల్ఫోన్లు చూస్తూ.. రీల్స్ చేస్తూ.. కాలక్షేపంతో కాలం వెల్లబుచ్చుతున్నారు ఎందరో యువకులు. అందుకు భిన్నంగా ఉపాధి మార్గాన్ని ఎంచుకున్నారు సిరిసిల్ల కార్మిక క్షేత్రానికి చెందిన ఆంకారపు శివకృష్ణ(27). సిరిసిల్లలోనే డిగ్రీ చేసిన శివకృష్ణ ఒక్క ఐడియాతో తెల్లవారుజామునే శ్రమిస్తూ.. స్వయం ఉపాధికి బాటలు వేసుకున్నారు. చిన్న పెట్టుబడితో.. చిరు వ్యాపారాన్ని ప్రారంభించి.. ఉషోదయపు ఉపాధిని సొంతం చేసుకున్నారు. ఇంట్లో తయారీ.. వీధిలో విక్రయాలు నిత్యం ఉదయం పూట వాకింగ్, జాగింగ్ చేసే వారికి అవసరమైన జ్యూస్లను ఇంట్లో తయారీ చేసి.. స్థానిక కోర్టు ఎదురుగా టేబుల్పై పెట్టుకుని విక్రయిస్తున్నాడు. ఆరోగ్య ప్రదాయినిగా భావించే గుమ్మడికాయ, సొరకాయ, దోసకాయల జ్యూస్లను, మరోవైపు యాపిల్, బీట్రూట్, క్యారెట్(ఏబీసీ) జ్యూస్ల మిశ్రమాన్ని తయారు చేశాడు. పెసర్లు, బబ్బెర్ల, పచ్చిబఠానీలను నానబెట్టి మొలకలు వచ్చిన వాటితో క్యారెట్, బీట్రూట్ ముక్కల మిశ్రమాన్ని తయారు చేసి బాక్స్ల్లో విక్రయిస్తున్నారు. జ్యూస్లు రూ.20 గ్లాసు చొప్పున, మొలకల బాక్స్లను రూ.10 నుంచి రూ.20 వరకు విక్రయిస్తున్నాడు. ఇంట్లోనే అన్నీ సిద్ధం చేసుకొని వచ్చి కోర్టు వద్ద రోడ్డుపై ఉదయం 6.30 నుంచి 9.30 గంటల వరకు విక్రయిస్తుంటాడు. రూ.25వేల పెట్టుబడితో పక్కా ఉపాధి శివకృష్ణ నాన్న పోశెట్టి సాంచాలు నడిపిస్తాడు. అమ్మ సుజాత బీడీలు చేస్తుంది. అతని భార్య లాస్యశ్రీ చదువుకుంటుంది. వీరికి ఒక బాబు. నేతకార్మిక కుటుంబానికి చెందిన శివకృష్ణ రూ.25వేల పెట్టుబడితో నమ్మకమైన ఉపాధికి బాటలు వేసుకున్నాడు. జ్యూస్లు పట్టేందుకు ప్రత్యేకమైన మిక్సీ మిషన్, జ్యూస్లను నిల్వ చేసేందుకు అందమైన జాడీలను, జ్యూస్గ్లాసులు, మొలకలు విక్రయించే బ్యాక్స్లు, స్పూన్లు ఇలా అన్నింటికి రూ.25వేల వరకు పెట్టుబడి పెట్టాడు. జ్యూస్లను, మొలక మిశ్రమాన్ని విక్రయించడం ప్రారంభించాడు. నిత్యం రూ.1200 నుంచి రూ.1500 వరకు సంపాదిస్తున్నాడు. ఇందులో ముడిసరుకులకు పెట్టుబడి పోను రోజూ రూ.800 నుంచి రూ.1000 వరకు మిగులుతుంది. ఇలా నెలకు రూ.24వేల నుంచి రూ.30వేల వరకు సంపాదిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.నిత్యం 4 గంటలకే నిద్రలేస్తా.. నిత్యం 4 గంటలకే నిద్రలేసి కాయలను ముక్కలు చేసుకుని జ్యూస్లు పట్టుకుంటా. మొదట్లో అందరూ చూస్తూ వెళ్లిపోయారు. రెండు, మూడు రోజుల్లోనే జ్యూస్లకు అలవాటు పడ్డారు. అందరూ తాగుతున్నారు. ముందు రోజే మార్కెట్ నుంచి అన్నీ తెచ్చుకుని సిద్ధం చేసుకుంటాను. ఎప్పుడైనా తెల్లవారుజామున వర్షం పడిన రోజు నేను రాకుంటే ఫోన్లు చేసి మరీ వస్తున్నారు. జ్యూస్ల వ్యాపారం బాగుంది. ఇల్లు గడుస్తుంది. – ఆంకారపు శివకృష్ణ, చిరువ్యాపారి -
ఇందిరమ్మ ఇళ్లను త్వరగా నిర్మించుకోవాలి
● కలెక్టర్ సందీప్కుమార్ చందుర్తి(వేములవాడ): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తిచేసుకోవాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా సూచించారు. చందుర్తి మండలం రామరావుపల్లి గ్రామపచాయతీ కార్యాలయం ఎదురుగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇంటి పనులను గురువారం పరిశీలించారు. గ్రామంలో వీధికుక్కలను నియంత్రించాలని పంచాయతీ కార్యదర్శికి, మండల అధికారులకు సూచించారు. సనుగులలో రోడ్డుకు ఇరువైపులా పెరిగిన గడ్డిని వెంటనే తొలగించాలని ఆదేశించారు. సీసీరోడ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. మర్రిగడ్డలోని ఫర్టిలైజర్ దుకాణం, చందుర్తి, సనుగుల సింగిల్ విండో కార్యాలయం ఆవరణలో ఉన్న ఎరువుల గోదాంలను తనిఖీ చేశారు. ఎరువుల కొరత సృష్టిస్తే వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్బేగం తదితరులు ఉన్నారు. -
బ్యాంక్ ఖాతాలపై నజర్!
● మెటా సూత్రధారులు, నిర్వాహకుల అకౌంట్లపై ఆరా ● చొప్పదండిలో ఎన్ఆర్ఐల నుంచి భారీ వసూళ్లు ● ఇంకా ఫిర్యాదుకు వెనకాడుతున్న బాధితులు ● రాజకీయంగా ఒత్తిళ్లు తెస్తున్న నలుగురు సీఐలుసాక్షి ప్రతినిధి, కరీంనగర్: మెటా క్రిప్టో కరెన్సీ పేరిట జరిగిన కుంభకోణంపై కేంద్ర, రాష్ట్ర నిఘా సంస్థలు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నాయి. మెటా ఫండ్ పేరిట దాదాపు రూ.100 కోట్ల వరకు జనాల నుంచి వసూలు చేసిన ఉదంతంలో సూత్రధారులు, నిందితులు, అనుమానితులపై కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు నిఘా పెంచాయి. మెటా ఫండ్లో దాదాపు రూ.100 కోట్ల వరకు వసూలు చేసిన సూత్రధారి లోకేశ్ దేశం దాటి థాయ్లాండ్ వెళ్లిన ఘటనలో అతన్ని కరీంనగర్కు పరిచయం చేసిన మాజీ కార్పొరేటర్, ప్రకాశ్ అనే ప్రైవేటు ఉపాధ్యాయుడు, రమేశ్, రాజు వివరాలను నిఘాసంస్థలు సేకరించాయి. వీరిలో కొందరిపై క్రిమినల్ హిస్టరీ, చెక్బౌన్స్ కేసులు ఉన్నట్లు గుర్తించాయి. వీరి బ్యాంక్ ఖాతాల వివరాలు సేకరిస్తున్నారు. మెటా ఫండ్ ప్రారంభానికి ముందు.. తరువాత వీరి బ్యాంకులో లావాదేవీల వివరాలు సేకరిస్తున్నారు. వీరితోపాటు మాజీ కార్పొరేటర్కు సన్నిహితంగా ఉండే బీజేపీ బడా నేత బ్యాంక్ ఖాతాలపైనా కేంద్రం సంస్థలు నిఘా పెట్టాయి. అనుమానాస్పద లావాదేవీలు ఏమైనా ఉన్నాయా? అని ఆరా తీస్తున్నాయి. చొప్పదండిలో ఎన్ఆర్ఐల విలవిల చొప్పదండి నియోజకవర్గంలో పలువురు చోటా బడా లీడర్లు క్రిప్టో వ్యవహారంలో చక్రం తిప్పుతున్నారు. గ్రామస్థాయి ప్రజాప్రతినిధులుగా కొనసాగుతూ.. అమాయకుల నుంచి రూ.లక్షలు వసూలు చేశారు. అందులో ఓ మాజీ ప్రజాప్రతినిధి చాలా తెలివిగా.. కేవలం ఎన్ఆర్ఐలనే లక్ష్యంగా చేసుకున్నాడు. మూడు నెలల్లో భారీ లాభాలు ఉంటాయని నమ్మబలికి రూ.కోట్లు వసూలు చేశాడు. తీరా ఇప్పుడు మెటాఫండ్ మూతబడటంతో వారంతా గగ్గోలు పెడుతున్నారు. వారంతా ఇండియాకు రాలేరు, ఇక్కడికి వచ్చి కేసులు గట్రా అంటే పాస్పోర్టు, వీసాలకు ఇబ్బందిగా మారుతుందని అతన్ని నిగ్గదీయాల్సింది పోయి.. బ్రతిమాలుకుంటుండటం విశేషం. ఈ బలహీనతతోనే నిర్వాహకులు రూ.కోట్లు కొల్లగొట్టినా దర్జాగా తిరగగలుగుతున్నారు. అదే సమయంలో ఉమ్మడి జిల్లాలో లాఅండ్ఆర్డర్లో పనిచేస్తున్న నలుగురు సీఐలు తమ బినామీలతో భారీగా డబ్బులు పెట్టారు. వారంతా ఇప్పుడు లోకేశ్ అతని మిత్రగణంపై రాజకీయంగా తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. కొత్తపల్లి పీఎస్, టూటౌన్, రూరల్ పరిధిలో పిటిషన్లు వచ్చినా పోలీసులు పట్టించుకోకపోవడంతో లోకేశ్ రూ.100 కోట్లతో థాయ్లాండ్ పారిపోయాడని బాధితులు వాపోతున్నారు. అప్పుడే స్పందించి ఉంటే లోకేశ్ దేశం దాటకుండా ఉండేవాడని వాపోతున్నారు. ఆయా ఠాణాల్లో ఫిర్యాదులు చేసిన పిటిషనర్లను ఇప్పటికై నా విచారిస్తే.. పెద్ద కుంభకోణం వెలికి తీసిన వారవుతారని సీనియర్ పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు. గోవాకు తీసుకెళ్లి బెదిరింపులు వాస్తవానికి మెటా ఫండ్ నిర్వాహకుడిగా చెబుతున్న లోకేశ్ గతేడాది మాజీ కార్పొరేటర్తోపాటు రమేశ్, రాజు, ప్రకాశ్లను గోవా తీసుకెళ్లాడు. వీరందరినీ అక్కడ లోకేశ్ పదుల సంఖ్యలో బౌన్సర్లతో ప్రైవేటు గెస్ట్ హౌజ్లోకి తరలించాడు. అక్కడ వీరంతా మెటా కార్యకలాపాలు నిలిచిపోయాయి, లాభాలు రావడం లేదు, డబ్బులైనా వెనక్కి ఇవ్వాలని ఇన్వెస్టర్లు వేధిస్తున్నారని లోకేశ్ను నిలదీశారు. దానికి లోకేశ్ తీవ్రంగా స్పందించి.. నష్టాలకు మనమంతా బాధ్యులమేనని బాండ్ పేపర్లపై సంతకాలు పెడితే.. డబ్బులు ఇస్తానని బెదిరించే యత్నం చేశాడు. ఊరు కాని ఊరిలో పార్టీ అంటే వెళ్లిన వీరంతా అక్కడ లోకేశ్ బెదిరింపులకు దిగడంతో హతాశయులయ్యారు. తమను చంపినా తాము సంతకాలు పెట్టమని, పెడితే లీగల్గా ఇరుక్కున్న వారిమవుతామని అతనితో వాదించి ఎలాగోలా అక్కడ నుంచి బయటపడి కరీంనగర్కు చేరుకున్నారు. తీరా కరీంనగర్కు వచ్చాక.. తమకున్న పరిచయాలతో కేసులు కాకుండా అన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు. అదే సమయంలో బలహీనులను బెదిరింపులకు గురిచేస్తూ.. బలవంతులకు మాత్రం బాండ్ పేపర్లు, చెక్కులు రాసిస్తున్నారు. -
కాలువ నీరు విడుదల చేయాలి
● పొత్తూరు బ్రిడ్జిపై రైతుల ధర్నా ఇల్లంతకుంట(మానకొండూర్): వరినారు ముదిరిపోతోందని మిడ్మానేరు కుడి మెయిన్ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేయాలని రైతులు గురువారం ధర్నా చేపట్టారు. మండలంలోని పొత్తూరు మానేరు బ్రిడ్జిపై వల్లంపట్ల, గాలిపల్లి, వంతడుపుల, పొత్తూరు, నర్సక్కపేట గ్రామాల రైతులు ధర్నాలో పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు లేవన్నారు. ఎస్సై అశోక్ అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడి ధర్నా విరమింపజేయించారు. జెడ్పీ మాజీ వైస్చైర్మన్ సిద్ధం వేణు, నాయకులు వెంకట నరసింహారెడ్డి, చిమ్మనగొట్టు శ్రీనివాస్, రవీందర్రెడ్డి, సిద్ధం శ్రీనివాస్, పాశం రవీందర్రెడ్డి, మిట్టపెల్లి మధురెడ్డి పాల్గొన్నారు ప్రమాదాల నివారణకు చర్యలు ● జిల్లా రవాణాశాఖ అధికారి లక్ష్మణ్ ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని వెంకటాపూర్ నుంచి రాచర్లతిమ్మాపూర్ వరకు సిరిసిల్ల–కామారెడ్డి ప్రధాన రహదారిపై జరుగుతున్న ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా రవాణాశాఖ అధికారి లక్ష్మణ్ పేర్కొన్నారు. రహదారిపై స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటుకు స్థలాలను గురువారం పరిశీలించారు. లక్ష్మణ్ మాట్లాడుతూ వెంకటాపూర్ శివారులో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. రోడ్లపై ట్రాకర్లు ఏర్పాటు చేయడానికి ప్రణాళికను రూపొందిస్తున్నట్లు తెలిపారు. వెంకటాపూర్, హరిదాస్నగర్, పదిర, రాగట్లపల్లి, ఎల్లారెడ్డిపేట, రాచర్లగొల్లపల్లి, రాచర్లతిమ్మాపూర్ గ్రామాల మధ్య ఆర్అండ్బీ రోడ్డుపై ఆరు ప్రమాదక పాయింట్లను గుర్తించామన్నారు. వీటి కోసం బ్లాక్ ట్రాకర్లు, ఏరోమార్క్ సూచికలు, స్పీడ్బ్రెకర్లను వేయడానికి కలెక్టర్కు నివేదికను సమర్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్అండ్బీ డీఈఈ శాంతయ్య, ఆర్టీఏ మెంబర్ సంగీతం వింకు, ఎస్సై రాహుల్రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య, పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గౌస్ తదితరులున్నారు. స్వచ్ఛత పాటించాలి ● స్వచ్ఛ సర్వేక్షన్ జిల్లా ఇన్చార్జి సురేష్ ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): గ్రామాల్లో స్వచ్ఛత పాటించాలని స్వచ్ఛ సర్వేక్షన్ జిల్లా ఇన్చార్జి సురేష్, ఎంపీడీవో సత్తయ్య కోరారు. మండలంలోని రాజన్నపేటలో స్వచ్ఛ సర్వేక్షన్ బృందం సభ్యులు గురువారం పర్యటించారు. తడి, పొడి చెత్త సేకరణ, డ్రెయినేజీలను, పాఠశాలల్లో శుభ్రతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తడి, పొడి చెత్తను ట్రాక్టర్ల ద్వారా కంపోస్ట్ షెడ్లకు తరలించాలని సూచించారు. స్వచ్ఛ సర్వేక్షన్ సభ్యులు అనూష, శిరీష తదితరులు పాల్గొన్నారు. పులి కోసం గాలింపువీర్నపల్లి(సిరిసిల్ల): మండలంలోని మద్దిమల్ల, మద్దిమల్లతండా, భావుసింగ్నాయక్ తండా, భూక్యతండా, రాసిగుట్ట తండా ప్రాంతాల్లో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో పులిజాడ కోసం గాలిస్తున్నారు. గురువారం ముమ్మరంగా గాలింపు చర్యలు తీసుకున్నారు. ఆయన మాట్లాడుతూ పొలాల వద్దకు రైతులు జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు. పులి సంచరించినట్లు ఆనవాళ్లు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇప్పటి వరకు ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదని తెలిపారు. బీట్ అధికారి కిరణ్ ఉన్నారు. -
దగ్గు, తెమడతో బాధపడే వారికి పరీక్షలు చేయాలి
● జిల్లా వైద్యాధికారి ఎస్.రజితసిరిసిల్ల: రెండు వారాలకు మించి దగ్గు, తెమడతో బాధపడే వారికి క్షయవ్యాధి పరీక్షలు చేయాలని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత సూచించారు. కలెక్టరేట్లోని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్లో గురువారం జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఆశవర్కర్లు ఇంటింటి సర్వే ద్వారా రెండు వారాలకు మించి దగ్గు, తెమడతో బాధపడుతున్న వారిని గుర్తించి స్క్రీనింగ్ పరీక్షలకు పంపించాలని సూచించారు. ఆరోగ్య మహిళ స్క్రీనింగ్ పరీక్షలకు ఆశలు ఏఎన్ఎంలు ఆరోగ్య కేంద్ర పరిధిలో గల మహిళలను రొమ్ము క్యాన్సరు, గర్భాశయ క్యాన్సరు, నోటి క్యాన్సర్ల పరీక్షల కోసం ఆరోగ్య మహిళా క్లినిక్లలో పరీక్షలు చేయించాలన్నారు. డీఐవో డాక్టర్ సంపత్కుమార్, ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ అనిత, డాక్టర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఆయిల్పామ్ సాగుతో రైతులకు ఆదాయం
● ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ శేఖర్బోయినపల్లి(చొప్పదండి): ఆయిల్పామ్ సాగు ద్వారా రైతులు ఆదాయం పొందవచ్చని ఉద్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్ శేఖర్ తెలిపారు. మండలంలోని మర్లపేటలో ఆయిల్పామ్ తోటలను గురువారం సందర్శించి మాట్లాడారు. ప్రభుత్వం ఆయిల్పామ్ సాగుకు ప్రోత్సాహం అందిస్తుందన్నారు. సాగుతో రైతులు ఏడాదికి రూ.1.50లక్షల వరకు ఆదాయం పొందవచ్చన్నారు. రూ.20కే మొక్కలు అందుబాటులో ఉన్నాయని.. ఎకరాకు రూ.4,200 వరకు సబ్సిడీ మంజూరవుతుందని తెలిపారు. డ్రిప్ పరికరాలపై రాయితీలు అందుతున్నట్లు వివరించారు. వేములవాడ నియోజకవర్గ ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి లోకేశ్, గోవర్ధన్, ఎంఏవో ప్రణీత, ఫ్రీ యూనిక్ కంపెనీ జిల్లా మేనేజర్ ప్రేమ్సాయి, ఆయిల్పామ్ ఫీల్డ్ ఆఫీసర్ శ్రీకాంత్ పాల్గొన్నారు. -
అవి‘నీటి’ అంతస్తులు
● ఏసీబీ దాడుల్లో వెలుగుచూస్తున్న అంతులేని ఆస్తులు ● ఈఎన్సీ మురళీధర్రావు జిల్లా వాసే.. ● అందరూ జిల్లాలో పనిచేసిన వారే.. ● బయటికొస్తున్న రూ.వందల కోట్లుసిరిసిల్ల: అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) శాఖ రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న దాడుల్లో దొరుకుతున్న అధి కారులకు జిల్లాతో అనుబంధం ఉంది. కొందరు ఇక్కడ నిర్మించిన ప్రాజెక్టుల పనుల్లో పనిచేయగా.. ఈఎన్సీ మురళీధర్రావు జిల్లా వాసే. ఏసీబీ దాడుల్లో భారీగా ఆస్తులు వెలుగుచూస్తున్న ఉన్నతాధికా రులందరూ కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన వారే కావడం గమనార్హం. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్లు వెలుగుచూస్తోంది. వీరి భారీ అవినీతిపై జిల్లాలో ఆసక్తికర చర్చ సాగుతోంది. భారీ నిర్మాణాలు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద మధ్యమానేరు, ఇల్లంతకుంట మండలం అనంతగిరి వద్ద అన్నపూర్ణ జలాశయం, కోనరావుపేట మండలం మల్కపేట వద్ద రిజర్వాయర్ పనులు చేపట్టారు. సిరిసిల్ల నుంచి మల్కపేట జలాశయం వరకు సొరంగం పనులు, సర్జిపూల్స్, కెనాల్స్ నిర్మాణాలు చేపట్టారు. ఈ పనుల్లో అవినీతి జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఏసీబీ అధికారుల సోదాల్లో పట్టుబడుతున్న ఆస్తులను చూసి వారే నివ్వెరపోతున్నారు. మురళీధర్రావు మన జిల్లా వాసి నీటిపారుదలశాఖలో చీఫ్ ఇంజినీర్గా రిటైర్డు అయిన తరువాత.. కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీగా పనిచేసిన చీటి మురళీధర్రావు స్వస్థలం కోనరావుపేట మండలం కొండాపూర్. నీటిపారుదల శాఖలో ఇంజినీర్గా ఉద్యోగంలో చేరిన మురళీధర్రావు అంచెలంచెలుగా ఎదిగి సీఈగా రాష్ట్రస్థాయిలో పనిచేసి రిటైర్డు అయ్యారు. ఆయన తండ్రి గోవిందరావు డిప్యూటీ కలెక్టర్గా పనిచేసి రిటైర్డు అయ్యారు. జిల్లాలోని మెట్టప్రాంతాలను సస్యశ్యామం చేసే కాళేశ్వరం 9వ ప్యాకేజీ పనులను, 10, 11, 12వ ప్యాకేజీ పనులను పూర్తి చేయించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఎదుట పలుమార్లు హాజరయ్యారు. ప్రాజెక్టు డిజైన్లో లోపాలు, ఇతర అంశాలపై ‘తెలియదు.. గుర్తు లేదనే’ సమాధానాలు ఇచ్చినట్లు ప్రచారంలో ఉంది. అవినీతి నిరోధక శాఖ అధికారులు మురళీధర్రావు సోదరులు నివసిస్తున్న కరీంనగర్లోని వారి ఇళ్లలోనూ సోదాలు చేయడం గమనార్హం. ఒక్కొక్కరుగా జైలుకు.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో పనిచేసిన మరో ఈఎన్సీ హరిరాం ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అంతకుముందే ఈ ప్రాజెక్టులో ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్గా పనిచేసిన శ్రీధర్ ఇళ్లలోనూ సోదాలు చేసి భారీగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. మరో ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు పలుమార్లు కాళేశ్వరం ప్రాజెక్టుపై నియమించిన కమిషన్ ఎదుట హాజరై తన వాంగ్మూలం ఇచ్చారు. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కీలకంగా ఉన్న ఇంజినీర్లను జైలుకు పంపించగా... రిటైర్డు అయిన అధికారులపైనా నిఘా ఉంచినట్లు తెలిసింది. రూ.400కోట్లకు పైగానే.. ఏసీబీ దాడుల్లో దొరికిన ఇరిగేషన్ అధికారుల ఆస్తుల చిట్టా చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఖరీదైన విల్లాలు, బంగారు నగలు, నగదు అన్ని కలిపి రూ.400కోట్లకు పైగానే అక్రమంగా కూడబెట్టినట్లు తెలుస్తోంది. జలాశయాలు వెలవెల కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జిల్లాలో నిర్మించిన జలాశయాలు నేడు నీరు లేక వెలవెలబోతున్నాయి. 25 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన మధ్యమానేరులో ప్రస్తుతం 5 టీఎంసీల నీరుంది. ఇల్లంతకుంటలోని అనంతగిరి అన్నపూర్ణ ప్రాజెక్టు సామర్థ్యం 3 టీఎంసీలు కాగా ప్రస్తుతం అర టీఎంసీ మాత్రమే నీరు ఉంది. 3 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్లోనూ 0.5 టీఎంసీ మాత్రమే నీరు ఉంది. ఇలా గోదావరి జలాలు జిల్లాకు పంపింగ్ ద్వారా రాకపోవడంతో జలాశయాలు బోసిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. రైతుల సంగతి ఎలా ఉన్నా జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి అలుగుదుంకి పారినట్లు తాజాగా ఏసీబీ అధికారుల దాడుల్లో బయటపడుతున్న ఆస్తులే వెల్లడిస్తున్నాయి.సిరిసిల్ల వద్ద మధ్యమానేరు బ్యాక్ వాటర్(ఫైల్) -
పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి
● కలెక్టర్ సందీప్కుమార్ ఝా ● వెంటనే బెంచీలు పంపించిన వైనంవేములవాడరూరల్: పాఠశాలలోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా పంచాయతీ కార్యదర్శి, హెచ్ఎంలకు సూచించారు. వేములవాడరూరల్ మండలం మారుపాక ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ సెంటర్లను బుధవారం తనిఖీ చేశారు. విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంపై బడిబాటలో ఏం చేశారని ప్రశ్నించారు. విద్యార్థులకు సరిపడా బెంచీలు లేవని తెలుసుకొని.. వెంటనే పంపించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పాఠ్యాంశాలు చదివిపించారు. అనంతరం మెప్మా ఆధ్వర్యంలో పెట్రోల్బంక్ ఏర్పాటుకు మారుపాకలోని సర్వేనంబర్ 339లో పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ అన్వేశ్, డీటీసీపీవో అన్సర్, పంచాయతీరాజ్, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు. -
ఇలా వదిలేస్తే.. ఎలా వెళ్లేది?
సిరిసిల్ల: మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ట. పట్టణ శివారులోని చంద్రంపేట ఒకటో వార్డు పరిధిలో పోచమ్మవీధిలో మిషన్భగీరథ పైపులైన్ లీకేజీ ఉండగా.. గొయ్యి తవ్వి రిపేరు చేశారు. కానీ ఆ గొయ్యిని పూడ్చకుండా అలాగే వదిలేయడంతో మురికి నీరు, వర్షం నీరు చేరి రోడ్డు బుదరమయంగా మారింది. ఆ వీధి గుండా పాఠశాలలకు వెళ్లే పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. సిరిసిల్ల మున్సిపల్ అధికారులు తవ్విన నల్లాపైపు గొయ్యిని పూడ్చివేసి రోడ్డుపై బురదలేకుండా చేయాలని చంద్రంపేట వాసులు కోరుతున్నారు. -
సర్కార్ బడిలో 450 మంది
ముస్తాబాద్(సిరిసిల్ల): మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వందలాది మంది విద్యార్థులతో కళకళలాడుతోంది. ఇరవై ఏళ్ల క్రితం జెడ్పీ బాలుర పాఠశాల నుంచి ప్రత్యేకంగా బాలికల పాఠశాలగా ప్రభుత్వం మంజూరు చేసింది. బాలికల పాఠశాలను సక్సెస్ స్కూల్గా గుర్తించడంతో ప్రవేశాలు పెరిగాయి. అదే సమయంలో బాలుర పాఠశాలలో సంఖ్య తగ్గిపోయింది. ఒకే ఆవరణలో రెండు స్కూళ్లు ఉండడంతో తరచూ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఇబ్బందులు పడ్డారు. చాలా రోజు లుగా రెండు స్కూళ్లను కలపాలని స్థానికులు కోరుతూ వచ్చారు. బాలుర పాఠశాలలో పదేళ్లుగా విద్యార్థుల సంఖ్య తగ్గుతుండడంతో అధికారులు రెండు పాఠశాలలను కలుపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. బాలికల పాఠశాల హెచ్ఎం రవీందర్ను పెద్దూరుకు బదిలీ చేయగా, బాలుర పాఠశాల హెచ్ఎం, ఎంఈవో రాజిరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. మొదటి రోజు బుధవారం 450 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులతో సందడిగా మారింది. -
నేడు సిరిసిల్లకు కేటీఆర్ రాక
● పార్టీ నాయకులు, కార్యకర్తలతో ముఖాముఖీ సమావేశంసిరిసిల్ల: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక ఎమ్మెల్యే కె.తారక రామారావు గురువారం సిరిసిల్లకు వస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య బుధవారం తెలిపారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని అన్ని మండలాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో తెలంగాణ భవన్లో వేర్వేరుగా సమావేశమవుతారని పేర్కొన్నారు. హైద రాబాద్ నుంచి బయలుదేరి సిరిసిల్లలోని తెలంగాణ భవన్కు చేరుకుంటారని తెలిపారు. ఉదయం ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల నాయకులతో సమావేశమవుతారని మధ్యాహ్న భోజనం అనంతరం వీర్నపల్లి, ముస్తాబాద్, తంగళ్లపల్లి మండలాల నాయకులతో మాట్లాడుతారని వివరించారు. అన్ని మండలాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సమాయానికి చేరుకోవాలని కోరారు. -
కళాశాలల్లో ప్రవేశాలు పెంచండి
సిరిసిల్లకల్చరల్: ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాలు పెంచేందుకు లెక్చరర్లు కృషిచేయాలని ఇంటర్బోర్డు ప్రత్యేకా ధికారి రమణారావు సూచించారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను బుధవారం తనిఖీ చేశారు. ఫస్టియర్ అడ్మిషన్ల పెంపు విషయంలో ప్రత్యేకశ్రద్ధ చూపాలన్నారు. ఎప్సెట్, జేఈఈ, నీట్ పోటీపరీక్షల సన్నద్ధతకు ‘ఫిజిక్స్వాలా’ వంటి సాంకేతికతను వినియోగిస్తున్న విషయాన్ని ప్రచారం చేయాలని సూచించారు. డీఈవో శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపాల్ కనకశ్రీ విజయరఘునందన్, అధ్యాపకులు ఉన్నారు. ‘అధికంగా వసూలు చేయరాదు’ తంగళ్లపల్లి(సిరిసిల్ల): ట్రాక్టర్ యజమానులు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారలు నుంచి అధిక ధరలు వసూలు చేయరాదని తంగళ్లపల్లి తహసీ ల్దార్ జయంత్కుమార్ స్పష్టం చేశారు. స్థానిక మండల పరిషత్లో బుధవారం ఇందిరమ్మ కమిటీ, ట్రాక్టర్ యజమానులతో మండల అధికారులు సమావేశమయ్యారు. తహసీల్దార్ మాట్లాడుతూ.. వారంలో రెండు రోజులు ఇసుకను బుధ, శుక్రవారాలు, మట్టిని మంగళ, గురువారాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తీసుకోవాలని సూచించారు. డీఆర్డీవో శేషాద్రి, ఎంపీడీవో లక్ష్మీనారాయణ, ఎంపీవో మీర్జా అఫ్జల్బేగ్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు టోని, చెన్నమనేని ప్రశాంతత్, ట్రాక్టర్ యజమానులు పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి ● డీఎంహెచ్వో రజిత బోయినపల్లి(చొప్పదండి): సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు స్కూల్, హాస్టల్స్ తరచూ సందర్శించి విద్యార్థులకు ఆరోగ్య సూచనలు చేయాలని డీఎంహెచ్వో రజిత సూచించారు. మండలంలోని కోరెం, తడగొండ సబ్సెంటర్లను బుధవారం తనిఖీ చేశారు. సబ్సెంటర్లలోని రికార్డులను పరిశీలించారు. పిల్లలకు వ్యాక్సిన్ వేసిన తర్వాత అరగంట సేపు పరిశీలనలో ఉంచాలని సూచించారు. టీబీ, లెప్రసీ వ్యాధులపై అవగాహన కల్పించాలన్నారు. జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి సంపత్, జిల్లా టీబీ, లెప్రసీ ప్రోగ్రాం అధికారి అనిత, జిల్లా ఎన్సీడీ అధికారి రామకృష్ణ, సబ్సెంటర్ ఆరోగ్య కార్యకర్తలు వసంత తదితరులు పాల్గొన్నారు. రేపు విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక● ‘సెస్’ ఎండీ సుబ్బారెడ్డి సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు శుక్రవారం పద్మనాయక ఏసీ ఫంక్షన్హాల్లో సమావేశం నిర్వహిస్తున్నట్లు ‘సెస్’ ఇన్చార్జి మేనేజింగ్ డైరెక్టర్ సుబ్బారెడ్డి బుధవారం తెలిపారు. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక–2, (సీజీఆర్ఎఫ్–2) నిజామాబాద్ చైర్పర్సన్ నారాయణ అధ్యక్షతన నిర్వహించనున్నట్లు వివరించారు. పట్టణంలోని విద్యుత్ వినియోగదారులు హాజరై సమస్యలను వివరించాలని కోరారు. తరచూ మరమ్మతులుముస్తాబాద్(సిరిసిల్ల): ముస్తాబాద్లో తాగునీటి పైపులైన్లు తరచూ పగిలిపోతున్నాయి. మెయిన్ రోడ్డు కిందే పైపులైన్ ఉండడంతో భారీ వాహనాల రాకపోకలతో ధ్వంసమవుతున్నాయి. దీంతో నీటి సరఫరాలో తరచూ అవంతరాలు ఎదురవుతున్నాయి. సర్ధార్ పాపన్న విగ్రహం నుంచి అంబేద్కర్నగర్ ప్రాథమిక పాఠశాల వరకు ఇప్పటికే నాలుగుచోట్ల పైపులు పగిలిపోయాయి. పక్షం రోజులుగా పంచాయతీ అధికారులు మరమ్మతులు చేయిస్తున్నా నీరు లీకవుతుంది. దీనిపై కార్యదర్శి రమేశ్ మాట్లాడుతూ కొత్తగా పైపులైన్ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. -
పట్టణ, ఆలయాలను అభివృద్ధి చేస్తున్నాం
● గోశాలకు కేబినేట్ ఆమోదం ● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్వేములవాడ: రాజన్న ఆలయం, వేములవాడ పట్టణలను సమాంతరంగా అభివృద్ధి చేస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం విలేకరులతో మాట్లాడారు. రూ.వెయ్యి కోట్లతో పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలకు అంకురార్పణ చేశామన్నారు. ఆలయానికి రూ.150 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. గత ప్రభుత్వం రాజన్న ఆలయానికి ఏటా రూ.100కోట్లు ఇస్తానని మోసం చేసిందన్నారు. 50 ఎకరాల్లో గోశాలను నిర్మించేందుకు క్యాబినేట్ మీటింగ్లో నిధులు కేటాయించడం జరిగిందన్నారు. శృంగేరిపీఠం అనుమాతులతో భీమేశ్వర ఆలయంలో త్వరలోనే అభివృద్ధి పనులు ప్రారంభిన్నామన్నారు. -
జ్యోతిష్మతిలో ఎంపవరింగ్ ఇన్నోవేటర్స్
తిమ్మాపూర్: మండలంలోని జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థుల్లో ఆవిష్కరణ, వ్యవస్థాపకత, స్టార్టప్ అభివృద్ధిని పెంపొందించడానికి ఎంపవరింగ్ ఇన్నోవేటర్స్–ఏ గైడ్ టు ఎంటర్ ప్రైన్యూషిప్ అనే అంశంపై ఒక సెషన్ నిర్వహించినట్లు కళాశాల చైర్మన్ జవ్వాడి సాగర్రావు తెలిపారు. నిర్మాణాత్మక ఇంక్యుబేషన్ మద్దతు ద్వారా స్వయం సమద్ధి, ఆర్థిక సాధికారతను ప్రోత్సహించే లక్ష్యంతో భారత ప్రభుత్వ సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖతో అనుసంధానించబడిన సంస్థాగత చొరవలో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు సెక్రటరీ, కార్యదర్శి జె.సుమిత్సాయి తెలిపారు. భారత ప్రభుత్వ ఎంఎస్ఎంఈ మాజీ అసిస్టెంట్ డైరెక్టర్ కె.సి.చౌదరి మాట్లాడుతూ.. విద్యార్థులకు విలువైన సందేశాలు అందించారు. జేఎన్టీయూ ప్రొఫెసర్ జయలక్ష్మి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.అనిల్కుమార్, డీన్ అకాడమిక్స్ అండ్ ఆడిట్ డాక్టర్ పీకే వైశాలి, విభాగాధిపతి డాక్టర్ ఆర్.జగదీషన్, ప్రోగ్రాం కోఆర్డినేటర్లు డా.పి.ప్రణీత, జి.సింధుష తదితరులు పాల్గొన్నారు. -
స్పందిస్తున్న హృదయాలు
● అజయ్కి అండగా ఆరోగ్యశాఖ మంత్రి ● మెరుగైన చికిత్స కోసం నిమ్స్కు తరలింపు వీణవంక: వీణవంక మండలం బేతిగల్ గ్రామానికి చెందిన సుద్దాల అజయ్ వినాయక విగ్రహాల తయారీకేంద్రంలో గాయపడి అచేతనస్థితిలో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. ఆపరేషన్కు రూ.10లక్షలు ఖర్చవుతుండటంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడటంపై ‘సాక్షి’లో బుధవారం ‘నిరుపేదకు పెద్ద కష్టం’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ సంఘటనపై సీఎంవో కార్యాలయం, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కార్యాలయం నుంచి ఆరా తీశారు. అజయ్ కుటుంబసభ్యులకు ఫోన్ చేసి వాకాబు చేశారు. హైదరాబాద్లోని నిమ్స్లో మెరుగైన చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. అజయ్కి మెరుగైన వైద్యం అందించాలని వరంగల్ జిల్లా వైద్యాధికారికి ఆదేశాలు జారీ చేయడంతో హుటాహుటిన అజయ్ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి ఆరా తీశారు. దగ్గరుండి నిమ్స్కు తరలించారు. కాగా.. పలువురు దాతలు ఇప్పటి వరకు రూ.1.20 లక్షల సాయం అందించారు. ఎమ్మెస్సార్ సతీమణి సుగుణ మృతికరీంనగర్: దివంగత మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షుడు ఎం.సత్యనారాయణరావు సతీమణి మేనేని సుగుణ(85) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్లోని తన నివాసంలో మృతి చెందారు. వారి అంత్యక్రియలు హైదరాబాద్లోని మహాప్రస్థానంలో గురువారం మధ్యాహ్నం 12గంటలకు జరుగనున్నాయి. ఎమ్మెస్సార్ సతీమణి సుగుణదేవి మరణం బాధకరమని ఎంఐంఎ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ ఒక ప్రకటనలో నివాళి అర్పించారు. -
విద్యుత్ సమస్యలపై రైతుల ధర్నా
గంభీరావుపేట/గన్నేరువరం: అప్రకటిత కరెంటు కోతలు, లోవోల్టేజీ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో రైతులు బుధవారం ధర్నాకు దిగారు. రైతులు మాట్లాడుతూ వానాకాలం పంటల సాగు పనులు ముమ్మరంగా జరుగుతున్న సమయంలో కరెంటు కోతలు పెరిగాయన్నారు. లోవోల్టేజీతో విద్యుత్మోటార్లు, స్టార్టర్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గంభీరావుపేటలో సెస్ ఏఈ అనంద్కుమార్ రైతులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయండి గద్దె నిర్మించినా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం లేదని కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చాకలివానిపల్లిలో రైతులు రోడ్డెక్కారు. వర్షాలు లేక ఇబ్బందులు పడుతుంటే.. ట్రాన్స్ఫార్మర్ లేక పొలాలకు నీరు అందించలేని పరిస్థితి నెలకొందన్నారు. ట్రాన్స్ఫార్మర్ అమర్చి పంటలను కాపాడాలని కోరారు. -
వాహిని షాపింగ్మాల్ ప్రారంభం
కరీంనగర్కల్చరల్: కరీంనగర్లోని ఉస్మాన్పురలో నూతనంగా ఏర్పాటుచేసిన వాహిని షాపింగ్ మాల్ను బుధవారం ప్రముఖ సినీనటి అనుపమ పరమేశ్వరన్, జాజూ శారీస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకులు ఓం ప్రకాశ్జీ జాజు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. షాపింగ్మాల్లో వివిధ రకాల వస్త్రాల డిజైన్లు పరిశీలించి, బాగున్నాయన్నారు. ‘హాయ్ కరీంనగర్.. ఎలా ఉన్నారు’ అని సినీనటి అనుపమా పరమేశ్వరన్ అభిమానులను పలుకరించారు. షాషింగ్మాల్ యజమాని వేముల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తమ షాపింగ్మాల్ ప్రారంభానికి వచ్చిన కస్టమర్లకు, ప్రజలకు, శ్రేయోభిషులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వేణుభాయ్ జాజు, కమల్ భాయ్ జాజు, వేముల శ్రీనివాస్, విష్ణు, దేవరాజ్, నాగరాజ్, శ్రీకాంత్, మెండె అనిల్కుమార్, గడ్డం అభిషేక్, కొమురవెల్లి రవితేజ, గాజుల అరుణ్కుమార్, ప్రశాంత్, దీకొండ రాజు పాల్గొన్నారు. -
ఏపీకే ఫైల్ లింక్తో రూ.46వేలు మాయం
● పోలీసులను ఆశ్రయించిన బాధితుడు ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): తెలిసిన వ్యక్తి పంపిన మెసేజ్ కదా.. అని ఏపీకే ఫైల్ లింక్ క్లిక్ చేయగా బ్యాంక్ ఖాతా ఖాళీ కావడంతో బాధితుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడు రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాలకు చెందిన పెరుమాండ్ల అంజయ్య తెలిపిన వివరాలు. ఈనెల 13న సాయంత్రం తనకు పరిచయం ఉన్న వ్యక్తి మొబైల్ నుంచి తమ సంఘం గ్రూప్లో పీఎం కిసాన్ పేరిట ఏపీకే లింక్ రాగా.. ఓపెన్ చేశాడు. 14వ తేదీ రాత్రి 2 నుంచి 3.30 గంటల వరకు ఖాతాలో నుంచి దఫదఫాలుగా రూ.46వేలు కాజేశారు. వెంటనే 1930కి కాల్ చేశాడు. అంతేకాకుండా ఎల్లారెడ్డిపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదే గ్రామానికి చెందిన న్యాలకంటి సతీశ్ ఖాతా నుంచి గతేడాది డిసెంబర్ 9న సైబర్ నేరగాళ్లు రూ.96వేలు కాజేశారు. తిరుపతికి మరో ప్రత్యేక రైలు● నాందేడ్ వయా కరీంనగర్ మీదుగా ● ఆగస్టు 2 నుంచి ప్రారంభం కరీంనగర్రూరల్: కరీంనగర్ రైల్వేస్టేషన్ నుంచి తిరుపతికి మరో ప్రత్యేక రైలు నడిపించేందుకు దక్షిణమధ్య రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. ఆగస్టు2 నుంచి 31 వరకు ఈ ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే కరీంనగర్ నుంచి తిరుపతికి ఒక రెగ్యులర్ రైలుతోపాటు మరో ప్రత్యేక రైలు నడుస్తోంది. సోమ, గురు, ఆదివారం ఈ రైళ్లు కరీంనగర్ నుంచి తిరుపతికి నడుస్తుండగా కొత్త రైలు ప్రతి శనివారం నాందేడ్ నుంచి కరీంనగర్ మీదుగా వెళ్తుంది. ఆదివారం సాయంత్రం తిరుపతి నుంచి కరీంనగర్ మీదుగా నాందేడ్కు వెళ్తుంది. ప్రతి శనివారం నాందేడ్లో సాయంత్రం 4.50గంటలకు బయల్దేరి ఆదివారం ఉదయం 11.30గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. అదేరోజు రాత్రి 7.45గంటలకు తిరుపతి నుంచి బయల్దేరి సోమవారం ఉదయం 9.08గంటలకు కరీంనగర్కు చేరుకుంటుంది. ప్రత్యేక రైలును ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్ రైల్వేస్టేషన్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ భానుచందర్ కోరారు. -
అమ్ముడుపోతున్న ఆధునిక మగ్గాలు
సిరిసిల్ల: రాష్ట్రంలోని తొలి టెక్స్టైల్ పార్క్లో ఆధునిక మరమగ్గాలు అమ్ముడుపోతున్నాయి. బహిరంగ వస్త్ర మార్కెట్తో పోటీపడలేక.. వస్త్రపరిశ్రమ యూనిట్లోని ఆధునిక ర్యాపియర్ లూమ్స్ను అగ్గువకే అమ్మేస్తున్నారు. ప్రభుత్వ వస్త్రోత్పత్తి ఆర్డర్లు లేక.. మహిళాశక్తి చీరల ఉత్పత్తి ఆర్డర్లు ఇవ్వకపోవడంతో వస్త్రోత్పత్తిదారులు ఆధునిక మగ్గాలను వడ్డికి పావుశేరు అమ్ముకుంటున్నారు. ఒక్కో లూమ్ ధర మార్కెట్లో రూ.5 లక్షలు ఉండగా.. ఇప్పుడు రూ.1.40 లక్షలకు అమ్ముకుంటున్నారు. చిన్నతరహా వస్త్రపరిశ్రమలకు తమిళనాడులో మంచి ప్రోత్సాహకాలు ఉండడంతో సిరిసిల్ల ర్యాపియర్ లూమ్స్ను తమిళనాడు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. సిరిసిల్ల వస్త్రశ్రమకు ఆధునిక మగ్గాలకు అందించి ఆధునీకరించాలనే లక్ష్యంతో ఉమ్మడి రాష్ట్రంలోనే సిరిసిల్లలో టెక్స్టైల్ పార్క్ను రెండు దశాబ్దాల కిందట ఏర్పాటు చేశారు. 220 యూనిట్లలో 7వేల మంది కార్మికులకు పని కల్పించాల్సి ఉండగా.. మొన్నటి వరకు 111 పరిశ్రమలు నడిచేవి. ప్రస్తుతం 52 యూనిట్లకు తగ్గిపోయి.. వెయ్యి మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో సర్కారు చేయూత లేక టెక్స్టైల్ పార్క్లోని యూనిట్లను తెగనమ్ముకుని ఇతర వ్యాపారాల్లోకి వస్త్రోత్పత్తిదారులు షిఫ్ట్ అవుతున్నారు. బొద్దుల వేణు అనే వ్యాపారి 20 ర్యాపియర్ లూమ్స్ను అమ్మేసి, మహబూబాబాద్లో ఓ ప్రైవేటు ఆస్పత్రిని నెలకొల్పినట్లు సమాచారం. ఆ లూమ్స్ను ట్రాక్టర్లో సిరిసిల్ల వరకు తరలించి అక్కడి నుంచి భారీ లారీల్లో తమిళనాడుకు తీసుకెళ్తున్నారు. సిరిసిల్లలో నేత కార్మికులకు ఉపాధి కల్పించాల్సిన ఆధునిక మగ్గాలను వస్త్రోత్పత్తిదారులు అమ్ముకోవడం ఇక్కడి పరిస్థితికి అద్దం పడుతుంది. మహిళాశక్తి చీరల ఆర్డర్లు లేక.. తమిళనాడుకు సిరిసిల్ల లూమ్స్ సర్కారు చేయూత కరువై విక్రయానికి ర్యాపియర్ లూమ్స్ -
రాజన్న హుండీ ఆదాయం రూ.1.59 కోట్లు
వేములవాడ: రాజన్నకు భక్తులు హుండీలలో సమర్పించుకున్న కట్నాలు, కానుకలను ఆలయ అధికారులు బుధవారం లెక్కించారు. రూ.1.59కోట్ల ఆదాయం సమకూరినట్లు ఈవో రాధాభాయి తెలిపారు. బంగారం 279 గ్రాములు, వెండి 14.700 కిలోలు సమకూరింది. ఆలయ అధికారులు సత్యనారాయణ, శ్రవణ్, శ్రీనివాస్, జయకుమారి, అశోక్ పర్యవేక్షించారు. గంజాయి విక్రేతల రిమాండ్● 250 గ్రాముల గంజాయి, రెండు మొబైల్ ఫోన్స్ స్వాధీనం బోయినపల్లి(చొప్పదండి): ఇద్దరు గంజాయి వికేత్రలను రిమాండ్కు తరలించడంతోపాటు వారి నుంచి 250 గ్రాముల గంజాయి, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వేములవాడరూరల్ సీఐ శ్రీనివాస్ బుధవారం తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్కు చెందిన వేముల శ్రీనివాస్, వేముల విజయలక్ష్మి మహారాష్ట్రలోని చంద్రపూర్ నుంచి గంజాయి కొనుగోలు చేసి రాజన్నసిరిసిల్ల జిల్లాలోని గ్రానైట్ కార్మికులకు విక్రయిస్తున్నారు. ఈ విషయం తెలియడంతో బుధవారం బోయినపల్లి మండలం కోరేం శివారులో అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిద్దరిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేశారు. వారి వద్ద 250 గ్రాముల గంజాయి, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. తడి, పొడి చెత్త వేరు చేయండి ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): తడి, పొడి చెత్తను వేరుచేసి పంచాయతీ సిబ్బందికి అప్పగించాలని, వారు ఆ చెత్తను కంపోస్ట్షెడ్లకు తరలిస్తారని స్వచ్ఛ సర్వేక్షన్ జిల్లా ఇన్చార్జి సురేష్, ఎంపీడీవో సత్తయ్య తెలిపారు. మండలంలోని సింగారం, నారాయణపూర్ గ్రామాల్లో స్వచ్ఛ సర్వేక్షన్ బృందం సభ్యులు బుధవారం సందర్శించారు. వారు మాట్లాడుతూ గ్రామాల్లో చెత్త సేకరణ నిత్యం చేపట్టాలని సూచించారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచితే రోగాలు దూరమవుతాయన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ సభ్యులు అనూష, శిరీష, కార్యదర్శులు పాల్గొన్నారు. -
కళ్ల ముందే ‘డబుల్’.. అద్దెకు ట్రబుల్
నిరుపేదల సొంతింటి కలను నిజం చేసేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏళ్లుగా నిరుపయోగంగానే ఉంటున్నాయి. నిర్మాణ పనులు పూర్తయినా లబ్ధిదారులకు ఇవ్వడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. కళ్ల ముందే వందలాది ఇండ్లు ఖాళీగా ఉంటుండగా.. పలువురు నిరుపేదలు కిరాయి ఇంట్లో ఉంటూ అద్దె చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్ బైపాస్ పక్కన 204 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఖాళీగా ఉంటున్నాయి. జనం లేకపోవడంతో ఇండ్ల మధ్య పిచ్చిమొక్కలు మొలుస్తున్నాయి. కొన్ని ఇండ్ల కిటికి అద్దాలు పగిలిపోయాయి. ఇప్పటికై నా అధికారులు వీలైనంత త్వరగా పంపిణీ చేయాలని పలువురు లబ్ధిదారులు కోరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, రాజన్నసిరిసిల్ల -
ఎన్నికలల్లో నేతలు
● బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆశలు ● ముందుగా గ్రామ‘పంచాయతా’.. మండల పరిషతా ? ● ఎన్నికలపై ఆసక్తికర చర్చ ● ఓటర్ల జాబితా విభజనకు కొత్త లాగిన్ ● గతంలోని విభజనతో గందరగోళంసిరిసిల్ల: స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. గ్రామపంచాయతీలు, మండల, జిల్లా ప్రజాపరిషత్లలో ప్రత్యేక అధికారుల పాలన సాగుతుండగా.. స్థానిక సంస్థలకు పాలకవర్గాలు లేక కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన నిధులు అందడం లేదు. ఎన్నికలు నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించడంతో రంగం సిద్ధమవుతోంది. జిల్లాలోని పల్లెల్లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. రిజర్వేషన్లు కలిసి వస్తే స్థానికసంస్థల ఎన్నికల బరిలో నిలిచి సత్తా చాటుకోవాలని అనేక మంది నాయకులు పోరుకు సై అంటున్నారు. ప్రభుత్వం ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తుందా? గ్రామపంచాయతీల్లో సర్పంచ్, వార్డుసభ్యుల ఎన్నికలు నిర్వహిస్తుందా? అనే దానిపై స్పష్టత రాలేదు. ఓటర్ల విభజనకు కొత్త లాగిన్ ఓటర్ల జాబితా విభజనకు కొత్త లాగిన్ను అందించారు. గ్రామం యూనిట్గా ఉండే ఓటర్ల జాబితాలో వార్డుల వారీగా విభజనకు కొత్త లాగిన్ ఇచ్చారు. ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి కొత్త లాగిన్లోనే ఓటర్ల జాబితాను విభజించాల్సి ఉంది. గతంలో ప్రభుత్వం ఇచ్చిన లాగిన్లో ఓటర్ల జాబితాను విభజించగా గందరగోళంగా తయారైంది. గ్రామాల్లో వార్డు హద్దులను తెలిపే కటాఫ్ ఇంటి నంబర్లు, ఓటరు జాబితాలోని నంబర్లు కలిసిపోయి గందరగోళం కావడంతో కొత్త లాగిన్లో పకడ్బందీగా మళ్లీ ప్రిపేర్ చేయాలని రాష్ట్ర స్థాయి అధికారులు అన్ని జిల్లాల జెడ్పీ సీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. పెరిగిన ఐదు పంచాయతీలు జిల్లాలో గతంలో 255 గ్రామాలు ఉండగా.. కొత్తగా ఐదు గ్రామపంచాయతీలు పెరిగాయి. ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ పరిధిలోని జైసేవాలాల్ తండా, రాచర్ల బాకురుపల్లి, గంభీరావుపేట మండలం ముచ్చర్ల శివారులోని హీరాలాల్తండా, ఇల్లంతకుంట మండలం రేపాక నుంచి విడిపోయిన తాళ్లపల్లి, దాచారం నుంచి విడిపోయిన బోటిమీదపల్లి కొత్తగా గ్రామపంచాయతీలుగా ఏర్పడ్డాయి. కొత్త వాటితో కలుపుకుని జిల్లాలో 260 గ్రామాలు ఉన్నాయి. వీటి పరిధిలో 2,908 వార్డు సభ్యుల స్థానాలు ఉన్నాయి. రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. 123 ఎంపీటీసీ స్థానాలు జిల్లాలో 123 మండల పరిషత్ ప్రాదేశిక సభ్యుల(ఎంపీటీసీ) స్థానాలు ఉండగా.. 12 జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యుల(జెడ్పీటీసీ) స్థానాలు ఉన్నాయి. ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాల్లో 14 చొప్పున ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేటల్లో 13 స్థానాల చొప్పున, కోనరావుపేటలో 12, బోయినపల్లిలో 11, చందుర్తిలో 10, వేములవాడరూరల్లో 7, వేములవాడలో 6 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. కొత్త మండలాలైన రుద్రంగి, వీర్నపల్లిల్లో 5 ఎంపీటీసీ స్థానాల చొప్పున ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ పరంగా అభ్యర్థులు బీ–ఫామ్లతో పోటీ చేస్తారు. మెజార్టీ స్థానాలు దక్కించుకున్న పార్టీలు జెడ్పీ చైర్పర్సన్గా, మండల పరిషత్ అధ్యక్షులుగా ఎన్నికవుతారు. ఈరకు అన్ని పార్టీల్లోని ముఖ్యనాయకులు స్థానిక సంస్థల్లో సత్తా చాటుకోవాలని భావిస్తున్నారు.రిజర్వేషన్లపైనే దృష్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కీలకంగా మారాయి. అన్ని స్థానాల్లో మహిళలకు రిజర్వేషన్ ఉండగా.. ఈసారి కొత్తగా 42 శాతం రిజర్వేషన్లను బీసీలకు అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లు ఎలా ఉంటాయో అనే ఆసక్తి నెలకొంది. రిజర్వేషన్ కలిసి వస్తే గ్రామపంచాయతీ నుంచి మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. పార్టీ పెద్దల అండతో జెడ్పీ చైర్పర్సన్, ఎంపీపీ పదవులు దక్కించుకునేందుకు పలువురు నేతలు సిద్ధంగా ఉన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో సత్తాచాటేందుకు జిల్లా వ్యాప్తంగా సిద్ధమవుతున్నారు. అంగబలం, అర్థబలం ఉన్న వారు రిజర్వేషన్లు కలిసి వస్తే బరిలో నిలిచేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు ఇప్పటి నుంచి కులసంఘాలను, యువజన సంఘాలను ఆకట్టుకునే పనిలో పడ్డారు. క్రికెట్ పోటీలను నిర్వహిస్తూ.. పోటీలకు స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ పెద్దల అండతో ‘స్థానిక’ పోరుకు సన్నద్ధమవుతున్నారు. -
కూల్చివేతలు.. నిరసనలు
● వంతెన కోసం తిప్పాపూర్లో స్థల సేకరణ పనులు ● జేసీబీలతో ఇళ్ల కూల్చివేత వేములవాడ అర్బన్: మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్లో ఇళ్ల నిర్మాణాల కూల్చివేతలు నిరసనల మధ్య కొనసాగాయి. మూలవాగుపై రెండో వంతెన పనుల కోసం తిప్పాపూర్ లోని నిర్మాణాల కూల్చివేతలను అధికారులు సోమవారం ఉదయం ప్రారంభించారు. తమ ఉపాధి పోతుందని, ఉండేందుకు నీడ కరువైందని పలువురు బాధితులు పనులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఓ మహిళా రోడ్డుపై అడ్డంగా పడుకోగా, ఇద్దరు యువకులు ఓ హోర్డింగ్పైకి ఎక్కి నిరసన తెలిపారు. నిర్వాసితులు రాజేశ్వరీ, బాబు కుటుంబంతో కలిసి అడ్డుకున్నారు. తమకు ఇళ్ల పరిహారం రాలేదని, ఇచ్చిన తర్వాతనే కూల్చివేయాలని కోరారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝా నిర్మాణాల కూల్చివేతలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అక్కడి నుంచి తిప్పాపూర్లోని గోశాలకు వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. గోశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఆర్డీవో రాధాబాయి, మున్సిపల్ కమిషనర్ అన్వేశ్, తహసీల్దార్లు ఉన్నారు. ఇళ్లను కూల్చివేస్తున్న జేసీబీ -
పోకిరీలపై నిఘా
● మహిళలు, యువతలకు భరోసా ● విద్యాసంస్థలు, పనిస్థలాల వద్ద మఫ్టీలో గస్తీ ● తక్షణ సహాయానికి 87126 56425● వేధిస్తే కటకటాలకేసిరిసిల్ల క్రైం: ఏం చేసినా చెల్లుతుందిలే.. ఆడవాళ్లే కదా ఎవరికీ చెప్పుకుంటారు.. బయటకు చెప్పుకుంటే వారి పరువు పోతుంది.. ఏదైనా కామెంట్ చేయొచ్చు.. వెకిలిగా ప్రవర్తించొచ్చు.. అనుకునే పోకిరీలకు షీటీమ్ సభ్యులు గట్టిగానే సమాధానం చెబుతున్నారు. స్కూళ్లు.. కాలేజీలు.. ఫ్యాక్టరీలు.. ప్రాంతం ఏదైనా ఆడవాళ్లే బాధితులుగా మిగులుతున్నారు. పోకిరీల చేష్టలను భరించొద్దని టోల్ఫ్రీ నంబర్లో ఫిర్యాదు చేస్తే నిమిషాల్లో వచ్చి రక్షణ కల్పిస్తామంటున్నారు జిల్లా షీటీమ్ మెంబర్స్. ఇటీవల పలువురు పోకిరీలకు కౌన్సెలింగ్ ఇవ్వగా.. మరికొందరిపై కేసులు నమోదు చేశారు. జిల్లాలో యువతులు.. మహిళలకు భరోసాగా నిలుస్తున్నా షీటీమ్పై స్పెషల్ స్టోరీ. బాధ్యతగా ఉంటూ... భరోసా కల్పిస్తూ.. జిల్లా షీటీంలో ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు, ఒక కానిస్టేబుల్ విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు ఇటీవల మహిళలు పని చేసే ప్రాంతాల్లోకి వెళ్లి వారికి అవగాహన కల్పించారు. ఫలితంగా సిరిసిల్ల శివారులోని ఓ కంపెనీలో తోటి ఉద్యోగి చేస్తున్న వెకిలిచేష్టలపై తిరుగుబాటు చేశారు. దీంతో అక్కడ వారికి వేధింపులు నిలిచిపోయాయి. జిల్లా కేంద్రంలోని ఓ విద్యాసంస్థలోనూ విద్యార్థినులు చాలా రోజులుగా భరిస్తున్న వెకిలిచేష్టలపై నోరు విప్పారు. ఫలితంగా అక్కడ పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడిపై కేసు నమోదైంది. ఇక అక్కడి విద్యార్థినులు భరోసాగా బడికి వస్తున్నారు. కౌన్సెలింగ్.. కేసు నమోదు వెకిలి చేష్టలకు పాల్పడితే వెంటనే షీటీమ్ సభ్యులు అదుపులోకి తీసుకుని కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తున్నారు. అదే పనిగా మళ్లీ వేధింపులకు పాల్పడితే కేసులు నమోదు చేస్తున్నారు. విద్యార్థినులు, మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేసేలా అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో నమోదైన కేసుల వివరాలు నెల ఎఫ్ఐఆర్ పెట్టీ ఏప్రిల్ 3 5మే 3 6జూన్ 2 4మహిళల రక్షణే తొలి ప్రాధాన్యం మహిళలు, విద్యార్థి నుల రక్షణే తొలి ప్రా ధాన్యం. జిల్లాలోని అన్ని స్టేషన్ల అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. ఏదేని సహాయం, కౌన్సెలింగ్ అవసరమైతే షీటీం బృందాలను పంపిస్తున్నాం. షీటీం పోలీసులతో నిఘా పెట్టి పోకిరీల ఆగడాలను మొదట్లోనే నియంత్రిస్తున్నాం. – మహేశ్ బీ గీతే, ఎస్పీ, రాజన్నసిరిసిల్ల -
కాంగ్రెస్ది అప్రజాస్వామ్య పాలన
సిరిసిల్లటౌన్: కాంగ్రెసోళ్లు చెప్పుకుంటున్నట్లు రాష్ట్రంలో ప్రజాపాలన లేదని.. అప్రజాస్వామిక పాలన కొనసాగుతుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య విమర్శించారు. సిరిసిల్ల ప్రెస్క్లబ్లో సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో కాంగ్రెసోళ్లు ఇష్టానుసారంగా వ్వవహరిస్తున్నారని ఆరో పించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లబ్ధిదారుల నుంచి రూపాయి తీసుకోకుండా అర్హులకు డ్రా ప ద్ధతిలో డబుల్బెడ్రూమ్ ఇచ్చిందన్నారు. 2014లో పేదలకు ఇవ్వాల్సిన గృహాల ఖర్చు రూ.5లక్షలైతే.. ఇప్పుడు కూడా అంతే ఎలా ఇస్తారన్నారు. ఇందిరమ్మ ఇల్లుకు రూ.10లక్షలు ఇవ్వా లని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఇసుకను అడ్డదారుల్లో అమ్ముకుంటుండ్రని ఆరోపించారు. అవసరాల దృష్ట్యా వారానికి మూడు రోజులు ఇసుక రవాణాకు అనుమతించాలని కోరారు. తమ ప్రభుత్వం పేదల కు ఇండ్లను డ్రా పద్దతిలో ఇస్తే.. ఈసర్కారు కాంగ్రెస్ నేతల అనుయాయులకు పంచుతున్నారని ఆరో పించారు. గత కలెక్టర్, పాలకవర్గం ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇచ్చిన తర్వాతే మిగతా వా రికి అందించాలన్నారు. బీఅర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, గూడూరి ప్రవీణ్, గుండ్లపల్లి పూర్ణచందర్, గుండారపు కృష్ణారెడ్డి, ఎండీ సత్తార్, సురేష్నాయక్ పాల్గొన్నారు. -
కులగణనతో ఆదర్శంగా నిలిచాం
సిరిసిల్ల: బీసీ కులగణనన చేపట్టి దేశానికి రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అందించే ఆర్డినెన్స్తో మరోసారి రాష్ట్ర ప్రభుత్వం బీసీలపై చిత్తశుద్ధి చాటుకుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు ఆర్డినెన్స్ తేవడంపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్లలో సోమవారం కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు. ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు తెచ్చారన్నారు. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఈ చట్టాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అందరిపై ఉందని పేర్కొన్నారు. రాహుల్గాంధీ, రేవంత్రెడ్డి దెబ్బకు కేంద్రం దిగి వచ్చి కులగణననకు అంగీకరించిందన్నారు. పేదల కోసం ఆలోచన చేసే కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో అండగా నిలువాలని కోరారు. సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కె.కె.మహేందర్రెడ్డి, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, ఏఎంసీ చైర్మన్ వెల్ముల స్వరూపారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు చొప్పదండి ప్రకాశ్, సూర దేవరాజు, ఆకునూరి బాలరాజు, గడ్డం నర్సయ్య, ఆడెపు చంద్రకళ, గోలి వెంకటరమణ, జాల్గం ప్రవీణ్, బొప్ప దేవయ్య, గోనె ఎల్లప్ప, కల్లూరి చందన, వేముల దామోదర్, కోడం అమర్నాథ్, గుండ్లపల్లి గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. పదేళ్లలో ఒక్క రేషన్కార్డు ఇవ్వలేదు వేములవాడరూరల్: గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రేషన్కార్డు మంజూరు చేయలేదని.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంక పేదలకు పెద్దపీఠ వేస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడలోని రూరల్ మండల ప్రజాపరిషత్లో సోమవారం 9 మందికి కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, 44 మందికి సీఎమ్మార్ఎఫ్ చెక్కులను అందించారు. ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పులకుప్పగా మార్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను కంటిన్యూ చేస్తూనే కొత్త పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, ఎంపీడీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కృతజ్ఞత ర్యాలీలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ -
రాగట్లపల్లిలో చిరుత సంచారం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న రాగట్లపల్లిలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన రైతు సురేశ్ సోమవారం ఉదయం తన పొలానికి వెళ్లిన సమయంలో చిరుతను చూశాడు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, రైతులు పంట పొలాల వద్దకు వెళ్లేందుకు వెనుకంజ వేస్తున్నారు. అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకొని చిరుత పాదముద్రలను గుర్తించారు. సెక్షన్ ఆఫీసర్ సఖారం మాట్లాడుతూ.. చిరుత కోసం ఎల్లారెడ్డిపేట శివారు నుంచి వెంకటాపూర్ శివారు వరకు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. -
ఆలకించి.. ఆదేశించి
● దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్ సందీప్కుమార్ ఝా ● వివిధ సమస్యలపై 244 అర్జీలు ● పరిష్కారానికి ఆదేశాలుసిరిసిల్లఅర్బన్: క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కా రం కాకపోవడంతో బాధితులు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి వచ్చారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్కు విన్నవించారు. సమస్యలు ఆలకించిన కలెక్టర్ సందీప్కుమార్ ఝా పరిష్కరించాలంటూ సంబంధిత అధికారులను ఆదేశించారు. వివిధ సమస్యలపై 244 దరఖాస్తులు వచ్చాయి. ఆయా దరఖాస్తులను పరిశీలించిన కలెక్టర్, డీఆర్డీవో శేషాద్రి పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. పట్టా పాసుబుక్కులు ఇప్పించండి నేను 1982లో కనగర్తికి చెందిన కాసర్ల రాజిరెడ్డి వద్ద 5.03 ఎకరాల భూమి కొనుగోలు చేశాను. గత 43 ఏళ్లుగా పట్టా చేయకుండా మభ్యపెడుతున్నాడు. పట్టా చేయమని అడిగితే బెదిరిస్తున్నాడు. రాజిరెడ్డి నుంచి కొనుగోలు చేసిన భూమికి పట్టా పాసుబుక్కు ఇప్పించాలి. – ఊరడి దేవయ్య, కనగర్తి(కోనరావుపేట) చర్యలు తీసుకోండి చింతల్ఠాణా పునరావాసకాలనీలో ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా భవనం నిర్మిస్తున్నారు. ఆరేళ్ల బాలుని మృతికి కారణమైన బాలకిషన్పై చర్యలు తీసుకోవాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. – లింగంపల్లి తిరుపతి(చింతల్ఠాణా), వేములవాడ అర్బన్ విచారణ చేపట్టండి మధ్యమానేరు ముంపు గ్రామాల్లో ప్రభుత్వం కేటాయించిన ప్లాట్ల తారుమారుపై చర్యలు తీసుకోవాలి. ముంపు గ్రామమాల్లో సుమారు 300 ప్లాట్ల వరకు లేఅవుట్ లేకుండా మార్చుకున్నారు. విచారణ చేసి అక్రమంగా మార్పులు చేసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి. – శేర్ల మురళి, చింతల్ఠాణా(వేములవాడ అర్బన్) చెరువులను ఆక్రమించారు సర్ధాపూర్లోని జనగలకుంట, తూముకుంట, గొలుసుకట్టు చెరువులను గ్రామానికి చెందిన కొందరు ఆక్రమించి, పంటల సాగు చేస్తున్నారు. మంలోని చెరువులను సర్వే చేయించి హద్దులు ఏర్పాటు చేయాలి. కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. – సర్ధాపూర్ ముదిరాజ్ కులస్తులు -
నేడు సిరిసిల్లకు కేంద్ర మంత్రి బండి సంజయ్ రాక
సిరిసిల్ల: జిల్లా కేంద్రానికి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్కుమార్ మంగళవారం వస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి తెలిపారు. స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో పదోతరగతి విద్యార్థులకు ప్రధాని మోదీ కానుకగా సైకిళ్లను పంపిణీ చేస్తారని వివరించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బులిటీ (సీఎస్ఆర్)లో భాగంగా 3,841 మంది విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేస్తారని తెలిపారు. బాధితులకు భరోసాగా గ్రీవెన్స్ డే ● ఎస్పీ మహేశ్ బీ గీతే సిరిసిల్లక్రైం: బాధితులకు భరోసాగా ఉండేందుకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతీ సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. 28 ఫిర్యాదులు స్వీకరించి, పరిష్కరించాల్సిందిగా ఆయా పోలీస్స్టేషన్ల అధికారులకు ఆదేశించారు. ఎస్పీ మాట్లాడుతూ వివిధ సమస్యలతో ఠాణాలకు వచ్చే బాధితులతో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. ఫిర్యాదులు స్వీకరించి, అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలించాలని తెలిపారు. విద్యార్థుల సంఖ్య పెంచాలి బోయినపల్లి(చొప్పదండి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఉపాధ్యాయులు కృషిచేయాలని వరంగల్ రీజి యన్ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి సూచించారు. మండలకేంద్రంలోని హైస్కూల్, ప్రాథమిక పాఠశాలలను సోమవారం తనిఖీ చేశారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ఎంఈవో శ్రవణ్కుమార్, హెచ్ఎంలు భూమయ్య, కనకయ్య పాల్గొన్నారు. మద్యపాన వ్యసనంతో అనర్థాలు సిరిసిల్ల: మద్యపాన వ్యసనంతో అనేక అనర్థాలు ఉంటాయని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సైక్రియాట్రిస్ట్ డాక్టర్ బి.ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. గణేశ్నగర్లో సోమవారం మైండ్కేర్, కౌన్సెలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో పవర్లూమ్ కార్మికులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. డాక్టర్ ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ మద్యపానంతో లివర్, గుండె సంబంధిత వ్యాధులు, మెదడుపై ప్రభావంతో మెమొరీ లాస్, డిప్రెషన్, ఆందోళన, నిద్ర లేమి సమస్యలు ఏర్పడుతాయన్నారు. మద్యపానాన్ని మానేస్తే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారన్నారు. సైకా లజిస్ట్ పున్నంచందర్ మాట్లాడుతూ కుటుంబ కలహాలు, విడాకులు, పిల్లలపై ప్రతికూల ప్ర భావంతో వ్యక్తి చేసే పనితీరు తగ్గిపోతుందన్నారు. వస్త్రోత్పత్తిదారులు మంచె మల్లయ్య, సిబ్బంది రాపెల్లి లత, బూర శ్రీమతి, కొండ ఉమ, నేత కార్మికులు పాల్గొన్నారు. చేతికొచ్చిన ఆయిల్పామ్ పంటఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని వల్లంపట్లలో ఆయిల్పామ్ సాగుచేయగా మొదటిసారిగా రైతుకు రెండు టన్నుల పంట చేతికొచ్చినట్లు జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ అధికారి లత తెలిపారు. వల్లంపట్ల గ్రామంలో కడుదల కిషన్ ఆయిల్పామ్ తోటను సోమవారం పరిశీలించారు. 2022లో సాగుచేసిన రైతులకు పంట చేతికొస్తుందని తెలిపారు. ఒక్కో ఎకరంలో 8 టన్నుల వరకు దిగుబడి వస్తుందని పేర్కొన్నారు. మండల వ్యాప్తంగా 270 ఎకరాలలో పంట సాగుచేస్తున్నట్లు వివరించారు. -
వంతెన పనులకు భూసేకరణ
వేములవాడ: వేములవాడ మూలవాగులో నిర్మాణంలో ఉన్న రెండో బ్రిడ్జి విస్తరణ పనుల్లో భాగంగా తిప్పాపూర్ ఆర్టీసీ బస్టాండ్కు ఎదురుగా ఉన్న నిర్మాణాలను తొలగించేందుకు రెవెన్యూ అధికా రులు ఆదివారం రాత్రి రెండు జేసీబీలను అందుబాటులో ఉంచారు. వారం రోజుల క్రితమే రెవెన్యూ అధికారులు భవన యజమానులకు నోటీస్లు ఇచ్చారు. రెండో వంతెన పనులు పూర్తి చే సేందుకు ఈ విస్తరణ పనులు చేపడుతున్నట్లు అ ధికారులు పేర్కొంటున్నారు. నెల రోజుల క్రితం మూలవాగు బ్రిడ్జి నుంచి రాజన్న ఆలయం వరకు రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా 150కి పైగా నిర్మాణాలను తొలగించిన విషయం తెలి సిందే. దీంతో రెండోసారి చేపడుతున్న విస్తరణ పనులతో వ్యాపారుల్లో ఆందోళన మొదలైంది. -
టెన్త్ విద్యార్థులకు రేపు సైకిళ్ల పంపిణీ
● హాజరుకానున్న కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్ సిరిసిల్ల: జిల్లాలోని పదోతరగతి విద్యార్థులకు ప్రధాని మోదీ కానుకగా మంగళవారం సైకిళ్లు పంపణీ చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్కుమార్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఇది ప్రభుత్వ అధికారిక కార్యక్రమం కాదని స్పష్టం చేశారు. తాను వివిధ సంస్థల నుంచి సేకరించిన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్సార్) నిధులతో సైకిళ్లు కొని పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. విద్యాశాఖ లెక్కల ప్రకారం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 3,841 మంది విద్యార్థులకు ముందుగా సైకిళ్లు ఇస్తామని తెలిపారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలతోపాటు అన్ని మండల కేంద్రాల్లోనూ 100 నుంచి 200 చొప్పున సైకిళ్లను అదనంగా పంపిణీ చేయాలని, గ్రామాల్లో 25 నుంచి 50 వరకు అదనంగా పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్, కలెక్టర్ సందీప్కుమార్ ఝా, ఎస్పీ మహేశ్ బీ గీతే, డీఈవో వినోద్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డిబోయిన గోపి హాజరుకానున్నారు. కరెంట్ కోసం రైతుల నిరసన ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఒక వర్షాలు లేక.. మరోవైపు మూడు రోజులుగా కరెంట్ సరఫరా లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని మండలంలోని అల్మాస్పూర్లో ఆదివారం రైతులు నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ గ్రామ శివారులోని ట్రాన్స్ఫార్మర్ మూడు రోజుల క్రితం పాడైందని, దానికి కింద 60 ఎకరాలు సాగుభూమి ఉందన్నారు. ఎకరానికి రూ.8వేలు పెట్టి దున్నించామని.. కరెంట్ లేకపోవడంతో పొలం ఎండిపోయిందని మళ్లీ దున్నుకోవాల్సిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్ను మరమ్మతు చేయాలని రైతులు ఉచ్చిడి శ్రీనివాస్రెడ్డి, సంతోష్రెడ్డి, నాగెల్లి రాజిరెడ్డి, పెద్దూరి శ్రీనివాస్, పెద్దూరి పర్శరాములు, మట్ట సత్తిరెడ్డి, దానవేణి పర్శరాములు, ఉచ్చిడి నారాయణరెడ్డి, చింతల్ఠాణ లచ్చయ్య కోరారు. దీనిపై సెస్ ఏఈ పృథ్వీధర్గౌడ్ను వివరణ కోరగా.. ఆదివారం సెలవు దినం కావడంతో ట్రాన్స్ఫార్మర్ను మరమ్మతు చేయలేకపోయామని, సోమవారం ట్రాన్స్ఫార్మర్ను రిపేర్ చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని తెలిపారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో దైవదర్శన టూర్ సిరిసిల్లటౌన్: స్థానిక డిపో నుంచి స్పెషల్ టూర్ ప్యాకేజీలో భాగంగా ఆదివారం ఐదో బస్సును డీఎం ప్రకాశ్రావు ప్రారంభించారు. డీఎం మాట్లాడుతూ దైవదర్శనాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. యాదగిరిగుట్ట–సురేంద్రపురి–బంగారు శివలింగం–స్వర్ణగిరి టెంపుల్ దర్శనానికి స్పెషల్ డీలక్స్ బస్సు నడుపుతున్నట్లు డీఎం వివరించారు. పెద్దలకు రూ.750, పిల్లలకు రూ.450 చార్జీ ఉంటుందని తెలిపారు. వివరాలకు 90634 03971, 99592 25929, 73828 50611, 63041 71291, 94946 37598లలో సంప్రదించాలని కోరారు. ఆలయాల్లో ఆకస్మిక తనిఖీ వేములవాడ: రాజన్న అనుబంధ బద్దిపోచమ్మ గుడి, భీమేశ్వర సదన్లను ఈవో రాధాభాయి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బద్దిపోచమ్మ ఆలయంలో వసతులు, కౌంటర్లు పరిశీలించారు. భీమేశ్వర సదన్లో ప్రైవేట్ వాహనాల పార్కింగ్, ప్రైవేట్ వ్యక్తుల అడ్డాపై ఆరా తీశారు. ప్రైవేట్ వ్యక్తుల వాహనాలు నిలిపితే ఉద్యోగులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. -
బోనమో పోచమ్మ
సిరిసిల్ల: కార్మిక క్షేత్రం ఆదివారం బోనమెత్తింది. సిరిసిల్లలో ఆషాఢమాసం బోనాల జాతర సాగింది. ఊరంతా పోచమ్మకు బోనాలు తీసి మొక్కులు చెల్లించుకున్నారు. పోచమ్మ, మహంకాలి ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. విద్యానగర్లో ఏఎంసీ చైర్పర్సన్ వెల్ముల స్వరూపా, తిరుపతిరెడ్డి దంపతులు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి దంపతులు స్థానికులతో కలిసి బోనాలు తీశారు. అభయాంజనేయ సొసైటీ, నెహ్రూనగర్లో మాజీ కౌన్సిలర్ అన్నారం శ్రీనివాస్ దంపతులు, గుండ్లపల్లి రామానుజం, చిలుక నారాయణ, గౌతమ్, చిమ్మని ప్రకాశ్, గాజుల భాస్కర్, దూడం శ్రీనివాస్, జక్కని సత్యనారాయణ, జగ్గాని మల్లేశంయాదవ్, తాటి వెంకన్న, ఇంజపురి మురళి స్థానికులతో పోచమ్మతల్లికి మొక్కులు చెల్లించారు. పాతబస్టాండులోని మైసమ్మతల్లికి, కొత్తచెరువు కట్ట వద్ద కట్టమైసమ్మకు యాట పోతులు, కోళ్లతో మొక్కులు చెల్లించారు. -
కనికరించని కాలం
సిరిసిల్ల: ముందు మురిపించిన కాలం.. తీర సమయానికి ముఖం చాటేసింది. ముందస్తుగా కురిసిన వర్షాలకు వరినారు తుకం పోసుకున్న రైతులు నేడు ఆందోళన చెందుతున్నారు. నారు వయసు నెలరోజులు దాటుతుండడంతో ఏం చేయాలో తోచడం లేదు. వర్షాలు సరిగా కురువక భూగర్భజలాలు సైతం అడుగంటుతున్నాయి. బావులు, బోర్లలో నీటి తడి రావడం లేదు. సాగునీటి వనరులు వెలవెల జిల్లాలోని సాగునీటి వనరుల్లో నీరు ఇంకిపోతుంది. మిడ్మానేరులో 6 టీఎంసీలు ఉండగా, ఎగువమానేరు, అనంతగిరి, మల్కపేట రిజర్వాయర్లలో అ ర టీఎంసీకి మించి నీరు లేదు. మూలవాగు ఎండిపోయింది. జిల్లా వ్యాప్తంగా వంద ఎకరాల ఆయక ట్టు కంటే ఎక్కువ ఉన్న చెరువులు 106 ఉండగా.. వంద ఎకరాల్లోపు ఆయకట్టు ఉన్న చెరువులు 560 ఉన్నాయి. మరో 23 ఊట చెరువులు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోయకపోవడంతో గో దావరి జలాలు జిల్లాకు చేరడం లేదు. ఎల్లంపల్లి ద్వారా నీరు వస్తే మధ్యమానేరు, అనంతారం, మ ల్కపేట రిజర్వాయర్లకు జలకళ రానుంది. ఇవి నిండితే సగం జిల్లాకు సాగునీటి ఇబ్బందులు తప్పుతాయి. ముసురు వర్షాలే దిక్కు ఈ సీజన్లో అప్పుడప్పుడు ముసురు వర్షాలు కురుస్తుండడంతో పత్తి పంటకు అనుకూలంగా ఉన్నాయి. నల్లరేగడి నేలల్లో కొద్దిగా నీరుండి ఇబ్బందిగా ఉన్నా.. చౌక నేలలకు ఇబ్బంది లేదు. జిల్లాలో అత్యధికంగా వరిపంట సాగవుతుండగా.. ఈ ఏడాది మంచి వర్షాలు లేక వానాకాలంలో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. మరో వారం రోజుల్లో భారీ వర్షాలు పడితేనే వరి పంటకు అనువైన పరిస్థితులు ఉంటాయి. పంటల సాగు విస్తీర్ణం వరి : 1,84,860 ఎకరాలు వరినాట్లు వేసింది: 55,458 ఎకరాలు పత్తి : 49,760 ఎకరాలు విత్తుకున్న పంట : 48,764 ఎకరాలు ఇతర పంటలు : 9,153 ఎకరాలు సాగుచేసిన ఇతర పంటలు : 1.830 ఎకరాలు మొత్తం పంటల సాగు : 2,43,773 ఎకరాలు జిల్లాలో లోటు వర్షపాతం రోహిణీకి ముందే తొలకరి నేడు ముఖం చాటేసిన వరణుడు పత్తికి అనుకూలం.. వరికి ప్రతికూలంరైతులు ఆందోళన చెందొద్దు ఎదిగిన వరినారు మడిని చూపుతున్న ఇతను ద్యావల శంకర్. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన శంకర్ రెండున్నర ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగుచేస్తున్నాడు. బోరు నీరు పోస్తుండడంతో నెల క్రితం తుకం చేసి, నారు పోసుకున్నాడు. ఇప్పుడు నారు ఎదిగింది. బోరులో నీరు రావడం లేదు. వర్షాలు సరిగా పడకపోవడంతో 35 రోజుల నారు ముదిరిపోతుందేమోనని శంకర్ ఆందోళన చెందుతున్నాడు. మరో పది రోజుల్లో వర్షాలు పడకుంటే నారు పనికి రాకుండా పోతుందని ఆందోళన చెందుతున్నాడు. లేత పత్తి చేనులో డౌర కొడుతున్న ఇతను కోనరావుపేట మండలం కనగర్తికి చెందిన మోకాళ్ల అంజిరెడ్డి. రోహిణీ కార్తెలో కురిసిన వర్షాలకు భూమి తడవడంతో ఏడు ఎకరాల్లో పత్తి వేశాడు. అప్పుడప్పుడు కురిసిన వర్షంతో పత్తి మొలకెత్తడంతో ఇప్పుడు కలుపు తీస్తూ డౌరా కొడుతున్నాడు. వాతావరణం పత్తికి అనుకూలంగా ఉండడంతో రైతులు పత్తి చేలల్లో పనులు చేస్తున్నారు. -
సాహిత్యం సమాజ శ్రేయస్సును కాంక్షించాలి
సిరిసిల్లకల్చరల్: సమాజ శ్రేయస్సును కాంక్షించే సాహిత్యమే ప్రజల్లో నిలుస్తుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. చక్రాల మల్లేశ్ రాసి, వెలువరించిన దర్పణం పుస్తకావిష్కరణ గాంధీనగర్ హనుమాన్ ఆలయంలో ఆదివారం సిరిసిల్ల సాహితి సమితి ఆధ్వర్యంలో జరిగింది. సమితి అధ్యక్షుడు డాక్టర్ జనపాల శంకరయ్య, కౌన్సిలర్ గుండ్లపెల్లి పూర్ణచందర్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఆడెపు రవీందర్, బాల సాహిత్యవేత్త వాసరవేణి పర్శరాములు అతిథులుగా హాజరయ్యారు. ఏనుగుల ఎల్లయ్య, బూర దేవానందం, గడ్డం పర్శరాములు, సుల్తానా మల్లేశ్, గోపాల్రెడ్డి, వెంగళ లక్ష్మణ్, అంకారపు రవి పాల్గొన్నారు. ● దర్పణం పుస్తకావిష్కరణలో వక్తలు -
‘డబుల్’ కల నెరవేరేదెప్పుడో?
● వసతులు లేవంటూ పంపిణీలో జాప్యం ● ఏళ్లుగా ఎదురుచూపులే.. ● అద్దె ఇళ్లలోనే లబ్ధిదారులుఇల్లంతకుంట(మానకొండూర్): నిరుపేదల సొంతింట కల నెరవేరడం లేదు. లబ్ధిదారులుగా ఎంపిక చేసినా.. అధికారులు ఇళ్ల పంపిణీలో తాత్సారంతో ఎదురుచూపులు తప్పడం లేదు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తయినా మౌలిక వసతులు లేవని అధికారులు పంపిణీ చేయడం లేదు. దీంతో నిరుపేదలకు అద్దె ఇళ్లే దిక్కయ్యాయి. 40 ఇళ్లు.. 32 మంది లబ్ధిదారులు ఇల్లంతకుంట మండల కేంద్రంలో ప్రభుత్వ భూ మిలో 40 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించారు. మూడేళ్ల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 32 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. అప్పటి నుంచి లబ్ధిదారులు డబుల్ బెడ్రూములు ఎప్పుడు పంపిణీ చేస్తారా ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డబుల్ బెడ్రూమ్ల పరిస్థితిని స్థానిక ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ సందీప్కుమార్ ఝా పరిశీలించారు. డ బుల్ బెడ్రూమ్ ఇళ్లకు వచ్చేందుకు దారి లేకపోవడంతో సమీప స్థలం యజమానితో మాట్లాడి రోడ్డు సమస్యను పరిష్కరించారు. అంతేకాకుండా రూ.20 లక్షలతో సీసీ రోడ్డు సైతం నిర్మించారు. కానీ ఇళ్లలో కరెంట్ వైరింగ్ పూర్తి కాలేదు. అంతేకాకుండా వి ద్యుత్ కనెక్షన్ కూడా ఇవ్వలేదు. నీటి సదుపాయం లేదు. డ్రెయినేజీలను నిర్మించలేదు. 163 సెక్షన్ అమలు డబుల్ బెడ్రూమ్లను పంపిణీ చేయడం లేదని మార్చి నెలలో పలువురు లబ్ధిదారులు గదుల తాళా లు పగులగొట్టి ఆక్రమించుకున్నారు. తహసీల్దార్ ఫరూక్, పోలీస్ అధికారులు వెళ్లి గదులలో ఉన్న వా రిని ఖాళీ చేయించి తాళాలు వేశారు. అంతేకాకుండా ఆ ప్రాంతంలో 163 సెక్షన్ అమలులో పెట్టారు. దీంతో అప్పటి నుంచి అటు వైపు ఎవరూ వెళ్లడం లేదు. డబుల్ బెడ్రూమ్ ఇప్పించండి నాలుగేళ్ల క్రితం డబుల్ బెడ్రూమ్ వచ్చిందని గది నంబర్తో కూడిన స్లిప్పు ఇచ్చారు. అప్పటి నుంచి డబుల్ బెడ్రూమ్ కోసం ఎదురుచూస్తున్నాం. వసతులు లేవని ఆలస్యం చేస్తుండ్రు. త్వరగా ఇండ్లు పంపిణీ చేయాలి. – గజభీంకార్ కిషన్ కిరాయి ఇంట్లో ఉంటున్న పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే నా భర్త చనిపోయాడు. కుటుంబ గడపడం కష్టంగా ఉంది. మాకు సొంతిల్లు లేదు. అద్దె ఇంట్లో ఉంటున్నాం. కూలి పని చేసుకుంటూ బతుకున్నం. ప్రతీ నెల కిరాయి చెల్లించడం ఇబ్బందిగా ఉంటుంది. – ఎర్రోజు స్వరూప నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నాం నాలుగేళ్లుగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కోసం ఎదురుచూస్తున్నాం. అధికారులు మాత్రం పంపిణీ చేయడం లేదు. అద్దె ఇంట్లో ఉంటున్నాం. కూలి పని చేసుకుంటూ బతికే మాకు త్వరగా ఇండ్లు కేటాయించాలి. – బండారి భాగ్య డబుల్ బెడ్రూమ్లలో వసతులు కల్పిస్తున్నాం గదులలో విద్యుత్, నీటి వసతి, డ్రెయినేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నాం. వసతులు పూర్తయిన వెంటనే పంపిణీ కార్యక్రమాన్ని చేపడతాం. డబుల్ బెడ్రూమ్ల వద్ద 163 సెక్షన్ అమలులో ఉంది. పెండింగ్ పనులను త్వరలోనే పూర్తి చేస్తాం. – ఎంఏ ఫరూక్, తహసీల్దార్ -
వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్
ముస్తాబాద్(సిరిసిల్ల): వ్యవసాయానికి నాణ్య మైన విద్యుత్ అందించేందుకు కృషి చేస్తున్నామని సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి పేర్కొన్నారు. ముస్తాబాద్లో లూజ్ విద్యుత్ తీగల మరమ్మతు పనులను డైరెక్టర్ అంజిరెడ్డి ఆదివారం ప్రారంభించారు. అంజిరెడ్డి మాట్లాడుతూ సెస్ పరిధిలో మెరుగైన విద్యుత్ను రైతులకు, గృహ వినియోగదారులకు అందిస్తున్నామన్నారు. వినియోగదారులు బకాయిలు సకాలంలో చెల్లించి సంస్థను కాపాడుకోవాలని కోరారు. ఏఈ విష్ణుతేజ, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఉన్నారు. ● సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి -
ప్రతిభావంతులకు పోపా చేయూత
సిరిసిల్లకల్చరల్: ప్రతిభావంతులైన విద్యార్థుల ఉన్నత విద్యకు (పోపా) పద్మశాలి అఫీషియల్స్, ప్రొఫెషనల్స్ అసోసియేషన్ చేదోడుగా నిలుస్తుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు పోపా ఆధ్వర్యంలో పురస్కారాల ప్రదానోత్సవం పట్టణంలోని పద్మశాలి కల్యాణభవనంలో శనివారం నిర్వహించారు. టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, ప్రముఖ వైద్యులు గూడూరి రవీందర్, గీతావాణి, ఎంఈవోలు దూస రఘుపతి, కృష్ణహరి, రిటైర్డ్ ప్రిన్సిపాల్ గాజుల ప్రతాప్, మచ్చ ఆనందం, న్యాయవాది గెంట్యాల భూమేశ్, మామిడాల భూపతి తదితరులు హాజరై మాట్లాడారు. ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్, ఎప్సెట్, ఇంజినీరింగ్ కోర్సుల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. పోపా ప్రతినిధులు దేవత ప్రభాకర్, చేరాల ప్రభాకర్, బైరి రవీందర్, ఆడెపు వేణు, మోర దామోదర్, అంకారపు జ్ఞానోభ, వాసాల హరిప్రసాద్, గడ్డం సత్యనారాయణ, శ్రీపతి భూమేశ్, గుండెల్లి రవి, ధ్యావనపెల్లి పరమేశ్వర్, బండారి శ్రీనివాస్ పాల్గొన్నారు.