breaking news
Rajanna
-
అర్హులకు ‘చేయూత’నందించాలి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సిరిసిల్ల: అర్హులకు చేయూత పెన్షన్లు అందించాలని, క్షేత్రస్థాయిలో అర్హులను గుర్తించాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా కోరారు. కలెక్టరేట్లో గురువారం చేయూత పెన్షన్లపై పీపీటీ ద్వారా సెర్ప్ డైరెక్టర్ గోపాల్ మార్గదర్శకాలు వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ వృద్ధులు పింఛన్ తీసుకుంటున్న వారు మరణిస్తే వారి స్థానంలో జీవిత భాగస్వామికి పెన్షన్ మంజూరు చేయాలని, హెచ్ఐవీ, డయాలసిస్ పింఛన్ పోర్టల్ ఓపెన్ ఉందన్నారు. ప్రతీ గ్రామంలో పంచాయతీ కార్యదర్శులు పెన్షన్ సంబంధించి రెండు రిజిస్టర్లు మెయింటెన్ చేయాలని సూచించారు. ఒక రిజిస్టర్లో పింఛన్దారుల వివరాలు, మరో రిజిస్టర్లో అర్హత ఉన్న వారి వివరాలు రాయాలని తెలిపారు. బర్త్, డెత్ సర్టిఫికెట్లు ఆరు నెలల్లోపు మాత్రమే పంచాయతీ కార్యదర్శులు జారీ చేయాలని, ఆరు నెలల తర్వాత రెవెన్యూ డివిజన్ అధికారికి మాత్రమే ఆ హక్కు ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్ఎఫ్బీఎస్ను అర్హులకు అందించాలి నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీం(ఎన్ఎఫ్బీఎస్) అర్హులైన పేదలకు అందించాలని సూచించారు. ఈ పథకం కింద 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు గల వారు నిరుపేద కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణిస్తే ఒకేసారి రూ.20వేల సహాయం అందుతుందని తెలిపారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు, నేతన్న కుటుంబాలలో ఈ పథకానికి అర్హులుంటే ప్రతిపాదనలు పంపాలని సూచించారు. డైరెక్టర్ సెర్ప్ గోపాల్, డీఆర్డీవో శేషాద్రి, డీపీవో షరీఫొద్దీన్, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్పాషా, అన్వేశ్, డీఎల్పీవో నరేశ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు ఏఐ టూల్స్పై శిక్షణ ఇవ్వాలి వేములవాడఅర్బన్: విద్యార్థులకు ఏఐ టూల్స్పై శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా సూచించారు. వేములవాడలోని కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)లో గురువారం కలెక్టర్ తనిఖీ చేశారు. వంటగది, స్టోర్రూమ్, విద్యార్థులకు వడ్డించేందుకు సిద్ధంగా ఉంచిన భోజనాన్ని పరిశీలించారు. విద్యాలయం ఆవరణను శుభ్రంగా చేయాలని వేములవాడ మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. ఇంటర్ విద్యార్థులకు కంప్యూటర్లను వెంటనే ఏర్పాటు చేయాలని ప్రిన్సిపాల్కు సూచించారు. -
బీడీకార్మికుల నిరసన గళం
ధైర్యంగా ముందుకు సాగాలి వీర్నపల్లి: విద్యార్థులు ధైర్యంగా ముందుకుసాగాలని శిశు సంక్షేమశాఖ అధికారి కవిత కోరారు. స్థానిక కేజీబీవీలో గురువారం అవగాహన కల్పించారు. సిరిసిల్లఅర్బన్: బీడీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.4వేల పెన్షన్ ఇవ్వాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.స్కైలాబ్బాబు, జిల్లా కార్యదర్శి మూషం రమేశ్, నాయకులు ఎగమంటి ఎల్లారెడ్డి, జవ్వాజి విమల, కోడం రమణ, వరుణ్కుమార్, నర్సయ్య, నాగరాజు, పద్మ పాల్గొన్నారు. -
ఆగని అమృత్ భారత్ రైలు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: దేశంలోని వలస కూలీలను మాతృభూమికి చేర్చేందుకు ప్రవేశపెట్టిన రైలు అమత్ భారత్ ఎక్స్ప్రెస్. దేశంలో నలుమూలలా పనిచేస్తున్న కూలీలను తక్కువ ఖర్చుతో స్వస్థలాకు చేరుస్తుంది. ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లా మీదుగా నడిపించే ఈరోడ్– జోగ్భనీ 16601/02 అమృత్ భారత్ రైలుకు స్థానికంగా ఎక్కడా స్టాప్ దక్కలేదు. ముందున్న వరంగల్, పొరుగున ఉన్న మంచిర్యాలలో ఈ రైలుకు హాల్టింగ్ ఇవ్వడం గమనార్హం. రైల్వేశాఖ తీసుకున్న ఈ నిర్ణయం పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్లోని పలు పరిశ్రమల్లో పనిచేస్తున్న ఉత్తరాధి కూలీలను తీవ్రంగా నిరాశపరిచింది. త్వరలో సేవలు ప్రారంభం ప్రస్తుతం బిహార్లో ఎన్నికల దష్ట్యా ఆ రాష్ట్రానికి రైల్వేశాఖ ఇప్పటి వరకు ఆరు అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్రైళ్లను ప్రవేశ పెట్టింది. అందులో అతి త్వరలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మీదుగా బిహార్లోని జోగ్భనీ నుంచి తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ వరకు 16601/02 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించనున్నారు. మన రాష్ట్రం మీదుగా ప్రవేశ పెట్టబోయే తొలి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ఇదే. ఇటీవల వెలువడిన రైలు షెడ్యూల్లో ఉమ్మడి జిల్లాలోని ఏ ఒక్క రైల్వేస్టేషన్లో స్టాప్ లేకపోవడం స్థానిక, వలస కార్మికులను ఎంతో నిరాశ పరిచింది. హాల్టింగ్ ఇవ్వాలి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు వరంగల్ నుంచి బల్లార్షా మధ్య కేవలం మంచిర్యాల రైల్వేస్టేషన్లోనే హాల్టింగ్ ఇచ్చారు. జోగ్భని నుంచి నేపాల్ సరిహద్దు కేవలం 10 కిలోమీటర్ల దూరమే. ఈ రైలుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట, పెద్దపల్లి జంక్షన్, రామగుండం రైల్వే స్టేషన్లో స్టాప్ కల్పించాలని ఇక్కడి ప్రయాణికులు కోరుతున్నారు. నాలుగు నెలల్లో పెద్దపల్లి జంక్షన్ మీదుగా ప్రారంభించిన మూడు రైళ్లకు స్టాప్ కల్పించలేదు. – ఫణి, నార్త్ తెలంగాణ రైల్వే ఫోరం -
యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు
ఎల్లారెడ్డిపేట/ముస్తాబాద్(సిరిసిల్ల): పంట పొలాల్లో పనులు చేసుకోవాల్సిన అన్నదాతలు యూరియా కోసం రోడ్డెక్కుతున్నారు. సొసైటీలు, గ్రోమోర్ కేంద్రాల వద్ద పొద్దంతా క్యూలైన్లో ఉంటే ఒక్క బస్తాకు మించి ఇవ్వడం లేదని వాపోతున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లతిమ్మాపూర్, రాచర్లగుండారం, బాకూర్పల్లితండా, పోచమ్మతండాలకు చెందిన రైతులు రాచర్లతిమ్మాపూర్ బస్టాండ్ దగ్గర సిరిసిల్ల–కామారెడ్డి ప్రధాన రహదారిపై గురువారం బైటాయించారు. రైతుల ఆందోళనకు బీఆర్ఎస్ నాయకులు అందె సుభాష్, మాజీ సర్పంచ్ భూక్య శంకర్నాయక్, గట్ల అనిల్, సీత్యానాయక్ సంఘీభావం తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని రైతులను, నాయకులను అదుపులోకి తీసుకున్నారు. చెప్పుల వరుస ముస్తాబాద్ మండలం పోతుగల్లోని యూరియా పంపిణీ కేంద్రం వద్ద రైతులు చెప్పులను వరస క్ర మంలో పెట్టారు. పోతుగల్ రైతులకు మాత్రమే 440 బస్తాలు వచ్చాయని గ్రామస్తులు తెలపగా.. ఇ తర గ్రామాల రైతులు తమకు కూడా ఇవ్వాలని కో రారు. దీంతో ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు అ య్యాయి. సమాచారం అందుకున్న ఏవో దుర్గరాజు, ఎస్సై గణేశ్ అక్కడికి చేరుకుని రైతులను శాంతింపజేశారు. ఏవో హామీతో ముస్తాబాద్ రైతులు వెళ్లిపోయారు. మిగతా వారికి ఒక్కో బస్తాను అందజేశారు. -
విద్యార్థుల ఆగ్రహం
నమూనా ఇందిరమ్మ ఇల్లు తంగళ్లపల్లి: మండల పరిషత్ ఆవరణలో గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన నమూనా ఇందిరమ్మ ఇల్లు పూర్తయింది,. త్వరలోనే ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆకాశం మేఘావృతమవుతుంది. జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. రాత్రి ఈదురుగాలులు వీస్తాయి. సిరిసిల్లఅర్బన్ : కళాశాల విద్యార్థుల పెండింగ్ స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ముట్టడికి తరలివచ్చారు. ఏబీవీపీ జిల్లా కన్వీనర్ లోపల్లి రాజురావు మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కాక పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారన్నారు. వెంటనే విడుదల చేయాలని కోరారు. -
బద్దం ఎల్లారెడ్డి పోరాటం స్ఫూర్తిదాయకం
ఇల్లంతకుంట(మానకొండూర్): బద్దం ఎల్లారెడ్డి పోరాటం స్ఫూర్తిదాయకమని, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి నిరంతరం పోరాడారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి కొనియాడారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల్లో భాగంగా గాలిపల్లి లోని బద్దం ఎల్లారెడ్డి స్తూపం వద్ద గురువారం పార్టీ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. ప్రభుత్వాలు సాయుధ పోరాట విలీన దినోత్సవాన్ని అధికారికంగా ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. మంద సుదర్శన్, మంద అనిల్కుమార్, గుంటి వేణు, మీసం లక్ష్మణ్, తీపిరెడ్డి తిరుపతిరెడ్డి, మల్లేశం, భూమిరెడ్డి, బండారి చందు ఉన్నారు. -
పత్రికా స్వేచ్ఛకు ప్రాధాన్యమివ్వాలి
ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛకు ప్రాధాన్యమివ్వాలి. సాక్షి ఎడిటర్ ధనంజయ్రెడ్డిపై అక్రమ కేసులు నమోదు చేయ డం అన్యాయం. ఎవరో అన్నది రాస్తే.. దాన్ని పత్రికకు ఆపాదించి ఎడిటర్పై కేసు పెట్టడం సరికాదు.ఏపీలో మీడియాను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. – రాజ్ఠాకూర్, ఎమ్మెల్యే, రామగుండం ఏపీలో పత్రికా స్వేచ్ఛపై దాడిచేసి రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నారు. సాక్షి ఎడిటర్ను లక్ష్యంగా చేసుకుని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం అన్యాయం. పత్రికల్లో వచ్చిన వార్తల్లో ఏదైన తప్పు ఉంటే వివరణ కోరాలే తప్ప ఇలా అక్రమ కేసులు పెట్టి బెదిరించడం సరికాదు. – కోరుకంటి చందర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, పెద్దపల్లి నిరంకుశత్వమే..సాక్షి పత్రికలో వచ్చిన వార్తల విషయంలో ఎడిటర్పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలు ఏపీ ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనం. రాజకీయ నాయకుల విమర్శలను ప్రచురిస్తే కేసులు పెట్టడం పత్రికా స్వేచ్ఛను హరించడమే. – కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, సుడా చైర్మన్ ముమ్మాటికీ కక్ష సాధింపేఅన్ని పత్రికలమాదిరిగానే సాక్షిలో అమరావతి పేరిట పొన్నూరును ముంచేశారనే వార్త వచ్చింది. దీనిపై పోలీసులు సాక్షి ఎడిటర్పై కేసు పెట్టడం ఏంటి?కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులు పెడుతోంది. ఇది ముమ్మాటికీ పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించడమే. ప్రచురించిన వార్తలపై అభ్యంతరాలుంటే.. ప్రభుత్వాలు ఖండించడం, రిజాయిండర్లు జారీ చేసే వీలుంది. – పంజాల శ్రీనివాస్, సీపీఐ జిల్లా కార్యదర్శి, కరీంనగర్ప్రజాస్వామ్యానికి మచ్చసాక్షిపై ఏపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలను ప్రజలు గమనిస్తున్నారు. కేవలం వ్యతిరేఖ వార్తలు రాసారన్న కారణంతో ఎడిటర్, పాత్రికేయులపై కేసులు నమోదు చేయడం సిగ్గుచేటు. రాజ్యాంగ విలువలు కాపాడాల్సిన ప్రభుత్వమే పత్రికల గొంతు నొక్కడం అన్యాయం. ప్రెస్ మీట్ వార్త ప్రచురించిన సాక్షి పత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డిపై అక్రమ కేసులు పెట్టడం సిగ్గు చేటు. – మణికంఠరెడ్డి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడుఏపీలో కూటమి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆయా రాజకీయ పార్టీల నాయకులు మండిపడ్డారు. ప్రతికా స్వేచ్ఛకు విఘాతం కలిగేలా ప్రజాస్వామ్య విలువలకు భంగం వాటిల్లేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుచుకుంటోందన్నారు. ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డితో పాటు విలేకరులపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. -
మెటా నిందితుల అరెస్టు
సాక్షిప్రతినిధి,కరీంనగర్: క్రిప్టో కరెన్సీ పేరిట పాత జిల్లావాసులకు రూ.100 కోట్లు కుచ్చుటోపీ పెట్టిన మెటా ఫండ్ యాప్ కథ కొలిక్కి వచ్చింది. రోజుకు రూ.లక్షలు సంపాదించవచ్చని ఆశచూపి రూ.కోట్లు వసూలు చేసిన సూత్రధారుల్లో నలుగురుని కరీంనగర్ సీసీఎస్ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. జూలైలో కశ్మీర్గడ్డకు చెందిన పుప్పాల శ్రీకర్ తనను మెటా ఫండ్ పేరిట రూ.54 లక్షల మేర మోసం చేశారని దాసరి రమేశ్, దాసరి రాజులపై ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పరారీలో ఉన్న దాసరి రమేశ్, దాసరి రాజులతోపాటు బూర శ్రీధర్, తులసీ ప్రకాశ్ను పోలీసులు అరెస్టు చేశారు. వీరితోపాటు లోకేశ్, సతీశ్ను అరెస్టు చేయాల్సి ఉంది. లోకేశ్ థాయ్లాండ్లో తలదాచుకుంటుండగా, సతీశ్ దుబాయ్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ కేసులో జాతీయ నిఘా సంస్థలు, రాష్ట్ర నిఘా సంస్థలు నిందితుల పాత్రపై ఎప్పుడో పూర్తిగా సమాచారం సేకరించాయి. ఈ విషయంలో జూన్ నుంచి ‘సాక్షి’ రాస్తున్న కథనాలు వాస్తవరూపం దాలుస్తుండటం గమనార్హం. దుబాయ్లో ఆస్తులు మెటా ఫండ్ నిర్వాహకులు ఎంతమంది అన్నది ఇప్పటికీ స్పష్టత లేదు. నిందితులు ఇక్కడ వసూలు చేసిన డబ్బును హవాలా మార్గంలో విదేశాలకు పంపారు. దుబాయ్లో దాదాపు రూ.40 కోట్లు ఖర్చు చేసి వరల్డ్ ట్రేడ్ సెంటర్, షేక్ జాహిద్ రోడ్లో ఈ ఏడాది జనవరిలో పబ్ ప్రారంభించారు. వీరి బినామీల పేర్లతో అక్కడ పలు వ్యాపారాలు కూడా మొదలు పెట్టారని, లక్కీ భాస్కర్ సినిమాలో మాదిరిగా పరిస్థితులు అనుకూలించకపోతే ఉన్నపలంగా వీసా తీసుకుని దేశం వదిలి పారిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. వీరు ఏడాదిన్నరగా పలువురి వద్ద నుంచి రూ.కోట్లు వసూలు చేశారు. వీరిలో సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, పెద్దపల్లి జిల్లాలకు చెందిన టీచర్లు, లెక్చరర్లు, పోలీసులు, రెవెన్యూ ఉద్యోగులు ఉన్నారు. వీరు ఇంతకాలం మౌనంగా ఉన్నా.. ఇప్పుడిప్పుడే ముందుకొస్తున్నారు. -
గదులను వినియోగంలోకి తేవాలి
● సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని నారా యణపూర్ ప్రాథమిక పాఠశాలలో తరగతి గదుల పనులు వేగంగా పూర్తి చేసి, వెంటనే వినియోగంలోకి తేవాలని సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు ఆదేశించారు. ఇటీవల కలెక్టర్ సందీప్కుమార్ ఝా గ్రామంలో పర్యటించిన సమయంలో పాఠశాలను పరిశీలించారు. తరగతి గదులు అసంపూర్తిగా ఉండడంపై ఆరా తీసి వెంటనే కావాల్సిన సామగ్రిని సమాకూర్చారు. ఆర్డీవో వెంకటేశ్వర్లు గురువారం పరిశీలించారు. ఇటుకలు, సిమెంట్, ఇసుకను పాఠశాలకు తరలించామన్నారు. తహసీల్దార్ సుజాత, ఏఎంసీ చైర్మన్ సాబేరా బేగం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, మాజీ ఉపసర్పంచ్ మహేందర్, హెచ్ఎం దేవరాజు ఉన్నారు. సిరిసిల్లటౌన్: ప్రభుత్వ ఆర్డర్ల చీరల చెకింగ్ పేరుతో చేనేత, జౌళిశాఖ అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారని సీపీఐ పట్టణ కార్యదర్శి పంతం రవి ఆరోపించారు. సిరిసిల్లలోని కార్మిక భవనంలో గురువారం ప్రెస్మీట్లో మాట్లాడారు. ఉత్పత్తి అయిన గుడ్డ నాణ్యత ప్రమాణాలు పరిశీలించేందుకు నియమించిన అధికారులు ఒక్కో మ్యాక్స్ సంఘానికి రూ.15వేల చొప్పున అక్రమంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. డబ్బులు తీసుకొని నాణ్యతలేని గుడ్డను కూడా సెలెక్ట్ చేస్తున్నారన్నారు. కడారి రాములు, అజ్జ వేణు, ఎలిగేటి రాజు, సోమ నాగరాజు పాల్గొన్నారు. బోయినపల్లి(చొప్పదండి): విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని జిల్లా ఫుడ్సేఫ్టీ అధికారి విజయలక్ష్మి సూచించారు. బోయినపల్లి కేజీబీవీలో ఏసీబీ తనిఖీల నేప థ్యంలో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి గురువారం జీసీడీవో పద్మజ, ఎంఈవో శ్రవణ్కుమార్తో కలిసి సందర్శించారు. విజయలక్ష్మి మాట్లాడుతూ కుక్ ఉదయం ఆరు గంటలకు హాజరుకావాలని ఆదేశించారు. కుళ్లిపోయిన కూరగాయలు ఉంచవద్దని సూచించారు. కాంప్లెక్స్ హెచ్ఎం భూమయ్య, ఇన్చార్జి ఎస్వో అనిత తదితరులు ఉన్నారు. సిరిసిల్ల: జిల్లా వ్యాప్తంగా బుధ, గురువారాల్లో వానలు దంచికొట్టాయి. కోనరావుపేట మండలంలో అత్యధికంగా 37.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. రుద్రంగిలో 18.9 మిల్లీమీటర్లు, చందుర్తిలో 8.0, వేములవాడ రూరల్లో 9.4, వేములవాడలో 8.7, సిరిసిల్లలో 16.2, వీర్నపల్లిలో 17.0, ఎల్లారెడ్డిపేటలో 30.1, గంభీరావుపేటలో 10.6, ముస్తాబాద్లో 34.0, తంగళ్లపల్లిలో 17.5, ఇల్లంతకుంటలో 7.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. బోయినపల్లి మండలంలో వర్షం పడలేదు. ఉద్యోగ విరమణ బెనిఫిట్స్ ఇప్పించండి ముస్తాబాద్(సిరిసిల్ల): సౌదీ అరేబియాలోని అభా పట్టణ సమీపంలోని అల్–హరాజ మున్సిపాలిటీలో పదేళ్లపాటు చేసిన పనికి వచ్చిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పించాలని ముస్తాబాద్ మండలం తెర్లుమద్దికి చెందిన రాగం రాజమల్లు కోరారు. ఈమేరకు హైదరాబాద్లోని ప్రవాసీ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రాజమల్లు మాట్లాడుతూ 2014 నుంచి 2025 వరకు అల్–హరాజ మున్సిపల్లో క్లీనర్గా పనిచేశాడు. పదేళ్ల తర్వాత ఉద్యోగ విరమణ చేసి స్వదేశానికి తిరిగి వచ్చాడు. రాజమల్లు ఉద్యోగ విరమణ ప్రయోజనాలు రూ.5లక్షల(21,500 సౌదీ రియాళ్ల)ను అక్కడి రాజమల్లుకు చెందిన బ్యాంక్ ఖాతాలో జమచేసింది. ఈక్రమంలోనే గత ఫిబ్రవరి 12న స్వదేశానికి వచ్చాడు. సౌదీ నేషనల్ బ్యాంక్లో రాజమల్లు ఖాతాలో ఉన్న సొమ్మును ఇక్కడి బ్యాంక్లోని తన ఖాతాలో జమచేయాలని ప్రవాసీ ప్రజావాణిలో విన్నవించాడు. ఈమేరకు ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్చైర్మన్ మంద భీంరెడ్డి, గల్ఫ్ జేఏసీ నాయకుడు తోట ధర్మేందర్ ఈ విషయమై జెడ్డాలోని భారత దౌత్యకార్యాలయం దృష్టికి తీసుకెళ్లిన ట్లు తెలిపారు. రాజమల్లు పనిచేసిన కంపెనీ పీఆర్వో బిలాల్కు విషయం తెలిపామన్నారు. -
హాస్టళ్లలో సీట్ల భర్తీకి సహకరించాలి
సిరిసిల్ల: సిరిసిల్ల రెవెన్యూ డివిజన్ పరిధిలో సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో సీట్ల భర్తీకి అధికారులు సహకరించాలని ఆర్డీవో సీహెచ్.వెంకటేశ్వర్లు కోరారు. సిరిసిల్ల ఆర్డీవో ఆఫీస్లో తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్, డీఎస్సీడీవో అధికారులతో డివిజన్ సలహా సంఘం సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. 2025–2026 విద్యాసంవత్సరానికి కొత్త అడ్మిషన్లు 119 ఉండగా.. ఇంకా డివిజన్లో 254 సీట్లు ఖాళీగా ఉన్నాయని అధికారులు వివరించారు. క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులు ఆయా ప్రాంతాల్లో పేద విద్యార్థులు ప్రభుత్వ హాస్టళ్లలో చేరేలా ప్రోత్సహించాలని కోరారు. జిల్లా ఎస్సీడీవో డాక్టర్ రవీందర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఖదీర్పాషా పాల్గొన్నారు. -
రాజీయే రాజమార్గం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీరజ సిరిసిల్లకల్చరల్: తగాదాల పరిష్కారానికి రాజీయే రాజమార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ పేర్కొన్నారు. జిల్లా న్యాయస్థాన ప్రాంగణంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈనెల 13న జరిగే జాతీయ లోక్అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చర్చల ద్వారా అవకాశం ఉన్న కేసులను పరిష్కరించుకొని ప్రశాంతంగా జీవించాలని సూచించారు. ప్రస్తుతం జిల్లా కోర్టు సముదాయంలో 6,714 కేసులు పెండింగ్లో ఉన్నాయని, వీటిలో 883 కేసుల్లో సంప్రదింపుల ద్వారా పరిష్కారానికి ముందుకొచ్చే అవకాశం ఉందన్నారు. అదాలత్లో తీర్పు వస్తే పై కోర్టులో అప్పీల్కు అవకాశం ఉండదని స్పష్టం చేశారు. సైబర్ నేరాలు, కుటుంబ తగాదాలు, భార్యాభర్తల విభేదాలు, బీమా సంబంధ కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధికా జైస్వాల్, లోక్ అదాలత్ సభ్యుడు చింతోజు భాస్కర్ పాల్గొన్నారు. ‘మినీ స్టేడియం మంజూరు చేయండి’ బోయినపల్లి(చొప్పదండి): బోయినపల్లి మండల కేంద్రంలో మినీస్టేడియం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డికి లేఖ రాశారు. ఈమేరకు ఎమ్మెల్యే సత్యం రాసిన లేఖను కాంగ్రెస్ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కూస రవీందర్ బుధవారం శివసేనారెడ్డికి అందించారు. బోయినపల్లిలోని సర్వేనంబర్ 139లో 4 ఎకరాల భూమి ఉన్నట్లు లేఖలో పేర్కొన్నారు. శ్రీవారి ప్రసాద వేలం రూ.1.93 లక్షలు సిరిసిల్లటౌన్: శ్రీశాల క్షేత్రం శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో ఈనెల 29 నుంచి జరిగే బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ప్రసాద విక్రయాలకు బుధవారం టెండర్లు నిర్వహించారు. ఆలయ ఈవో మారుతిరావు వివరాలు వెల్లడించారు. లడ్డు, పులిహోర, కొబ్బరి ముక్కలు పోగుచేసుకునేందుకు బహిరంగ వేళలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. లడ్డు, పులిహోర ప్రసాదం రూ.1.48లక్షలు, కొబ్బరిముక్కలు పోగు చేసుకోవడానికి రూ.45,666 టెండర్లు ఖరారు చేసినట్లు తెలిపారు. ఏఈవోలు రవీందర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. గతేడాది కన్నా రూ.25,550 అధిక ఆదాయం సమకూరిందన్నారు. చిటికెన కిరణ్కు వడ్డేపల్లి కృష్ణ పురస్కారంసిరిసిల్లకల్చరల్: జిల్లా కేంద్రానికి చెందిన లలిత గీతాల కవి డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ స్మారకార్థం అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ స్థాయిలో సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేసేందుకు నిర్ణయించింది. తొలి పురస్కారాన్ని పట్టణానికి చెందిన వ్యాసకర్త చిటికెన కిరణ్కుమార్కు అందజేయాలని నిర్ణయించినట్లు సంఘం అధ్యక్షుడు తుమ్మ సత్యనారాయణ తెలిపారు. త్వరలోనే పురస్కారాన్ని అందజేయనున్నట్లు వెల్లడించారు. -
నిర్భయంగా ఫిర్యాదు చేయండి
సిరిసిల్లక్రైం: మహిళలు, విద్యార్థుల రక్షణకు పోలీస్శాఖ షీటీం పేరిట రక్షణ చర్యలు అందిస్తుందని ఎస్పీ మహేశ్ బి గీతే పేర్కొన్నారు. వేధింపులపై మహిళలు, విద్యార్థినులు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. గత నెలలో వేధింపులకు పాల్పడిన పోకిరీలపై 3 కేసులు, 5 పెట్టి కేసులు నమోదు చేసినట్లు వివరించారు. షీటీమ్ అందించే సేవలపై విద్యాలయాలు, బస్టాండ్లు, జనరద్దీ ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఏదేని సమస్య ఉంటే 87126 56425లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. -
ఎవరికీ ‘చెప్పు’కోవాలి
ఇల్లంతకుంటలో బారులుతీరిన రైతులుముస్తాబాద్ గ్రోమోర్ కేంద్రం వద్ద క్యూలో చెప్పులుముస్తాబాద్/ఇల్లంతకుంట/కోనరావుపేట: ముస్తాబాద్ మన గ్రోమోర్ కేంద్రం వద్ద రైతులు బుధవారం చెప్పులు వరుసలో పెట్టి నిరసన తెలిపారు. అనంతరం చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద రాస్తారోకో చేపట్టారు. కోనరావుపేట మండలం మరిమడ్ల సింగిల్విండో గోదాం వద్దకు 340 యూరియా బస్తాలు రావడంతో ఒక్కోటి పంపిణీ చేశారు. ఇల్లంతకుంట గ్రోమోర్లో రెండు యూరియా బస్తాలతోపాటు ఒక పొటాషియం బస్తా ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. -
ప్రముఖ విద్యాలయంగా శాతవాహనకు గుర్తింపు
● వీసీ ఉమేశ్కుమార్ సప్తగిరికాలనీ(కరీంనగర్): శాతవాహన యూనివర్సిటీ 2008లో స్థాపించబడి ఉత్తర తెలంగాణలోనే ప్రముఖ విద్యాలయంగా గుర్తించబడుతుందని వీసీ ఉమేశ్కుమార్ అన్నారు. యూనివర్సిటీ గురించి ప్రపంచానికి తెలిసేలా తన పర్యటన కొనసాగిందని వివరించారు. ఆగస్టు 17 నుంచి 31 వరకు వీసీ అమెరికా పర్యటన వివరాలు బుధవారం వెల్లడించారు. భిన్న కోర్సులతో నాలుగు పీజీ సెంటర్లతో కొనసాగుతున్న యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ, పరిశోధన, విద్యారంగంలో మెరుగైన అవకాశాలకు ఎన్ఆర్ఐ సాయం కోసం అమెరికాలోని 7 ప్రముఖ నగరాలు సందర్శించి విరాళాలు సేకరించినట్లు తెలిపారు. 8 బంగారు పతకాలతోపాటు రూ.అర కోటికి పైగా విరాళాలు సేకరించినట్లు వివరించారు. సాంకేతిక అభివృద్ధి కోసం కంప్యూటర్లు, డిజిటల్ పరికరాలు అందజేసేందుకు ఎన్ఆర్ఐలు ముందుకొచ్చినట్లు తెలిపారు. నవంబర్ రెండో వారంలో విశ్వవిద్యాలయంలో 2వ స్నాతకోత్సవాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు. కొనసాగుతున్న పోలీస్ పికెట్ ముస్తాబాద్(సిరిసిల్ల): మండలంలోని వెంకట్రావుపల్లిలో పోలీస్ పికెట్ బుధవారం సైతం కొనసాగిందని ఎస్సై గణేశ్ తెలిపారు. అసైన్డ్ భూములు ఐకేపీ కొనుగోలు కేంద్రానికి కేటాయించాలని గ్రా మస్తులు ఆందోళన చేపట్టారన్నారు. దీంతో ఇరువర్గాలకు చెందిన 13 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఆత్మహత్యలు వద్దు.. ఆత్మస్థైర్యంతో ఉండాలి
● సైకాలజిస్టు పున్నంచందర్ ● నర్సింగ్ కళాశాలలో వర్క్షాప్సిరిసిల్లటౌన్: యువత మానసిక ఒత్తిడిలో ఆత్మహత్యలకు పాల్పడొద్దని పలువురు వక్తలు కోరారు. ప్రపంచ ఆత్మహత్యల నిరోధక దినోత్సవం సందర్భంగా బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, మెండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో నర్సింగ్ కళాశాల విద్యార్థులకు వర్క్షాప్ నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మెంటల్ హెల్త్ కో–ఆర్డినేటర్ డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ బి.ప్రవీణ్కుమార్, సైకాలజిస్ట్ కనుకుంట్ల పున్నంచందర్ మాట్లాడారు. కుటుంబ సభ్యులు, స్నేహితులలో కలిగే ప్రవర్తన మార్పులు, ఉద్వేగ మార్పులను గమనించి సాంత్వన కలిగించే మాటలతో ధైర్యం చెప్పాలన్నారు. అవసరమైతే సైకాలజిస్ట్లను, సైకియాట్రిస్ట్లను కలిసి కౌన్సెలింగ్ ఇస్తే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన నుంచి బయటపడతారన్నారు. నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సి.అనురాధ, లెక్చరర్స్ సుజాత, స్వప్న, అరుణ, అరుణకుమారి, గ్లోరి, సంధ్యారాణి, హెల్పింగ్హార్ట్స్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు అల్వాల ఈశ్వర్ పాల్గొన్నారు. -
రెండేళ్లుగా వాడుతున్న
రెండేళ్లుగా ముస్తాబాద్ సొసైటీ ద్వారా నానో యూరియా వాడుతున్నాను. డ్రోన్తో సులభంగా పిచికారీ చేస్తారు. తక్కువ ఖర్చు, రైతులకు శ్రమలేకుండా డ్రోన్తో చల్లవచ్చు. నానో లిక్విడ్తో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. – అరుట్ల తిరుపతిరెడ్డి, రైతు, ముస్తాబాద్ భూసార పరిరక్షణ నానో యూరియా వాడడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చు. భూసారాన్ని కాపాడుకోవచ్చు. గుళికల యూరియాతో నేల పాడవుతుంది. నానో యూరియా ఇతర పంటలకు వాడవచ్చు. డ్రోన్ ద్వారా పిచికారీ చేయడం వల్ల సమయం ఆదా అవుతుంది. – దుర్గరాజు, ఏవో, ముస్తాబాద్ -
బీఆర్ఎస్ అవినీతి బట్టబయలైతుంది
సిరిసిల్లటౌన్: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోని రూ.లక్ష కోట్లకు పైగా ప్రజాధనం అక్రమాలపై సీబీసీఐడీ విచారణ జరగాల్సిందేనని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, మైనింగ్ శాఖల మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు రాగుల రాములు అధ్యక్షతన సిరిసిల్లలో బుధవారం నిర్వహించిన సకలజనుల ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి హాజరైన సందర్భంగా మాట్లాడారు. కేసీఆర్ కుటుంబం అవినీతిని కల్వకుంట్ల కవితే బహిర్గతం చేస్తోందన్నారు. కాంగ్రెస్ హయాంలోనే గోదావరి నీటి వినియోగానికి ప్రాణహిత, ఎల్లంపల్లి ప్రాజెక్టులను తీర్చిదిద్దిందన్నారు. అప్పటికే రూ.11వేలు కోట్లు ఖర్చు చేయగా మరో రూ.24వేల కోట్లు పెడితే సరిపోయేదానికి.. రీడిజైనింగ్ అంటూ రూ.లక్ష కోట్లు స్వాహా చేశారని ఆరోపించారు. కేటీఆర్, కేసీఆర్ ఫామ్హౌస్లకు నీళ్లు తీసుకుపోవడానికే మల్లన్నసాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టులు కట్టారన్నారు. నాన్న చూపిన బాటలో.. నాన్న చూపిన బాటలో నడిచి, ప్రజాసేవకు పాటుపడతానని మంత్రి వివేక్ పేర్కొన్నారు. కార్మికశాఖ మంత్రిగా సిరిసిల్ల నేతకార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో సిరిసిల్లలో సాండ్ మాఫియా రాజ్యమేలిందన్నారు. ఇసుక మాఫియా చేతిలో దళితులు ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రిని అన్నివర్గాలు, వివిధ పార్టీల నాయకులు సన్మానించారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, ఏఎంసీ చైర్మన్ వెల్ముల స్వరూపరెడ్డి, ఆకునూరి బాలరాజు, గడ్డం నర్సయ్య, కత్తెర దేవదాసు, రాగుల జగన్, కాముని వనిత పాల్గొన్నారు. అంతకుముందు జిల్లాకు తొలిసారి విచ్చేసిన మంత్రి వివేక్కు కలెక్టర్ సందీప్కుమార్ ఝా, ఎస్పీ మహేశ్ బి గీతే పూలబొకేలు అందించి స్వాగతం పలికారు. డీసీఎల్ ఆఫీస్ ఏర్పాటు చేయండి సిరిసిల్లలో డీసీఎల్ ఆఫీస్ ఏర్పాటు చేయాలని కోరుతూ సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్ మంత్రికి వినతిపత్రం అందించారు. ఇసుక ధర ట్రాక్టర్ ఒక్కంటికి రూ.7వేలు పెంచారని, ఇక్కడి ఇసుక సమస్యను పరిష్కరించాలని కోరారు. -
నా‘నో’ అనకండి
ముస్తాబాద్(సిరిసిల్ల): యూరియా కొరత వేధిస్తున్న వేళ రైతులు నిత్యం ఎరువుల దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. అయినా వారికి యూరియా బస్తాలు దొరకడం లేదు. అదృష్టముంటే ఒక్క బస్తా.. లేదంటే నిరాశే. యూరియా బస్తాల కోసం క్యూలో గంటలకొద్దీ నిల్చుంటున్న రైతులు అదే దుకాణంలో ఉన్న నానో యూరియా బాటిళ్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. యూరియా బస్తాల స్థానంలో నానో యూరియా వాడవచ్చని అధికారులు చేస్తున్న ప్రచారం, అవగాహన కార్యక్రమాలకు రైతులకు చేరకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. అసలు నానో యూరియా అనేది ఉన్నట్లు రైతులకు తెలవకపోవడం చర్చించుకోవాల్సిన విషయం. ఖర్చు తక్కువే.. నానో యూరియా ద్రవ రూపంలో ఉంటుంది. డ్రోన్తో పిచికారీ చేయవచ్చు. వరి, పత్తి, మొక్కజొన్న పంటలపై నానో యూరియాతో పురుగుల మందు, పొటాష్ను కలిపి పిచికారీ చేస్తే అధిక దిగుబడి సాధించవచ్చు. వరికి మొదటి డోస్గా గుళికల యూరియా, రెండో డోస్గా నానో యూరియా వేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. నానో యూరియా బాటిల్ రూ.225కు లభిస్తుండగా, పిచికారీ చేసేందుకు ఎకరానికి డ్రోన్కు అద్దె రూ.350 తీసుకుంటున్నారు. అయితే గుళికల యూరియా చల్లితే రైతుకు డ్రోన్ ఖర్చు కలిసొస్తుంది. గుళికల యూరియా కోసం గోదామ్ల వద్ద గంటల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి. అదే నానో యూరియాకు అవసరం లేదు. నానో యూరియాతో పంట దిగుబడి పెరగడంతోపాటు నీరు, గాలి, నేల కాలుష్యం కాదు. అందుబాటులో నానో యూరియా ముస్తాబాద్, పోతుగల్, గంభీరావుపేట, కోనరావుపేట, చందుర్తి, రుద్రంగి, బోయినపల్లి, ఇల్లంతకుంట, సిరిసిల్ల మండలాల్లోని ప్రాథమిక వ్యవసాయ సంఘాలలో నానో యూరియా బాటిళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇఫ్కో ద్వారా వాహనాలు, డ్రోన్లు సిద్ధంగా ఉన్నాయి. ఎకరానికి రూ.350 అద్దెతో డ్రోన్లు అందిస్తారు. -
ప్రాజెక్టులు జలకళ..
చెరువులు వెలవెల !సిరిసిల్ల: జిల్లాలో సాధారణ వర్షపాతమే నమోదైంది. పొరుగు జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎగువమానేరు పొంగింది. అక్కడి నుంచి నీరు మిడ్మానేరుకు చేరడంతో గేట్లు ఎత్తి కరీంనగర్ ఎల్ఎండీకి తరలించారు. అంతేకాకుండా అన్నపూర్ణ రిజర్వాయర్లోకి, మల్కపేట రిజర్వాయర్లోకి నీటిని ఎత్తిపోస్తున్నారు. దీంతో జిల్లాలోని ప్రాజెక్టులు నిండుగా జలకళ సంతరించుకోగా.. చెరువులు, కుంటలు వెలవెలబోతున్నాయి. జిల్లాలో వర్షాధారిత, గొలుసు చెరువులు కావడంతో సాధారణ వర్షపాత పరిస్థితులతో చాలా చెరువుల్లోకి సగం కూడా నీరు రాలేదు. జిల్లాలోని చిన్ననీటి వనరులు చిన్నబోయి కనిపిస్తున్నాయి. వేములవాడ ప్రాంతంలో నిండని చెరువులు ఇల్లంతకుంట, బోయినపల్లి మండలాల్లోని చెరువుల్లో కొంతమేరకు నీరు వచ్చింది. సిరిసిల్ల ప్రాంత చెరువులు మాత్రం పూర్తిగా నిండి మత్తళ్లు దూకుతున్నాయి. వేములవాడ ప్రాంతంలో వర్షం సాధారణం కంటే తక్కువగా కురవడంతో చెరువులు, కుంటలు ఇంకా నిండలేవు. ఇల్లంతకుంట మండలంలో ఎక్కువ వర్షాలు పడ్డాయి. రుద్రంగి, వేములవాడరూరల్, సిరిసిల్ల పట్టణ ప్రాంతాల్లో పెద్దగా వర్షాలు లేవు. జిల్లాలో ఈ ఏడాది వర్షాలు భిన్నంగా ఉన్నాయి. మానేరు, మూలవాగులు పారని ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెద్దగా అభివృద్ధి చెందలేదు.ఇది బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద మానేరునదిపై నిర్మించిన మధ్యమానేరు ప్రాజెక్టు. 26.55 టీఎంసీల నీటి నిల్వతో నిండుగా ఉంది. ఇక్కడి నుంచి ఇల్లంతకుంట మండలం అనంతగిరి అన్నపూర్ణ రిజర్వాయర్లోకి, కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్లోకి నీటిని ఎత్తిపోస్తున్నారు. ఇటీవల భారీ వర్షాలతో ఎగువమానేరు పొంగడంతో 18 గేట్లు ఎత్తి దిగువ మానేరు(ఎల్ఎండీ)లోకి నీటిని వదిలారు.ఇది గంభీరావుపేట మండలం నర్మాల వద్ద ఉన్న ఎగువమానేరు జలాశయం. 2 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిజాం కాలంలో నిర్మించారు. ఇటీవల కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో కురిసిన వర్షాలతో పాల్వంచ, కూడెల్లివాగుల ద్వారా నీరు వచ్చి చేరడంతో పూర్తిస్థాయిలో నిండి మత్తళ్లు పోస్తున్నాయి. ఇది తంగళ్లపల్లి మండలంలోని తాడూరు పెద్దచెరువు. వర్షాలు బాగా పడితేనే ఈ చెరువు నిండుతుంది. కానీ జిల్లా వ్యాప్తంగా పెద్దగా వర్షాలు లేవు. సాధారణ వర్షపాతమే నమోదు కావడంతో తాడూరు పెద్దచెరువు సగమైనా నిండలేదు. ఒక్క తాడూరు చెరువే కాదు.. జిల్లా వ్యాప్తంగా చిన్ననీటి వనరులైన చెరువులు, కుంటల్లో నీరు పూర్తిగా చేరకపోవడంతో చెరువులు వెలవెలబోతున్నాయి. వర్షాకాలం ముగింపు దశకు చేరగా.. రువులు, కుంటలు నిండకపోవడంతో జిల్లాలో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. -
ప్రతిష్టాత్మకంగా ‘సేవాపక్షం’
సిరిసిల్లటౌన్: ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు బీజేపీ ఆధ్వర్యంలో ‘సేవాపక్షం’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పేర్కొన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో జిల్లా కన్వీనర్ సిరికొండ శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. స్వచ్ఛ భారత్, రక్తదాన శిబిరం, పేదలకు, వికలాంగులకు సహకరించడం వంటి తదితర సేవా కార్యక్రమాలు చేపట్టి శ్రీసేవాపక్షం్ఙ విజయవంతం చేసేందుకు చేపట్టవలసిన కార్యాచరణ గురించి కార్యకర్తలకు వివరించారు. వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ చెన్నమనేని వికాస్రావు, ఎర్రం మహేశ్, అల్లాడి రమేశ్, రాష్ట్ర నాయకుడు లింగంపల్లి శంకర్, దేవేందర్యాదవ్, ఆడెపు రవీందర్, పొన్నాల తిరుపతిరెడ్డి, బండ మల్లేశం, శీలం రాజు, బర్కం లక్ష్మి, మల్లారెడ్డి, దుమాల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
పాడి పరిశ్రమతో ఆర్థికాభివృద్ధి
బోయినపల్లి(చొప్పదండి): పాడి పరిశ్రమతో గ్రా మాల్లోని పేదలు ఆర్థికంగా ఎదిగేలా ప్రభుత్వం తో డ్పాటు అందిస్తుందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కలెక్టర్ సందీప్కుమార్ ఝా అన్నారు. మంగళవా రం మండలంలోని కొదురుపాకలో మినీ డెయిరీ (పైలెట్ ప్రాజెక్టు) కింద పాడి గేదెలు పంపిణీ చేశా రు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 19 మంది లబ్ధిదారులకు 38 గేదెలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. మండలంలో దరఖాస్తు పెట్టుకున్న ప్రతి ఒక్కరికి పాడి గే దెలు అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. కొదురుపాకలోని పశు వైద్యశాల ఉపకేంద్రాన్ని పరిశీలించి అవసరమైన మరమ్మతు చేయుటకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే మండలకేంద్రంలోని మోడల్ స్కూల్లో ఆన్ అకాడమీ ద్వారా ఆన్లైన్ తరగతులను ప్రారంభించారు. విద్యార్థులు పోటీ పరీక్షలు రాసేందుకు ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే ఆన్లైన్ తరగతుల ద్వారా మంచి శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్కూల్కు 50 ఫ్యాన్లు మంజూరు చేయాలని అధికా రులను ఆదేశించారు. కార్యక్రమాల్లో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, ఎంపీడీవో జయశీల, ప్యాక్స్ చైర్మన్లు వెంకట్రామారావు, సురేందర్రెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు రవీందర్, ఏఎంసీ చైర్మన్ ఎల్లేశ్యాదవ్ ఉన్నారు. -
ఒక్క బస్తాకోసం బారులు
కోనరావుపేటలో నిరీక్షిస్తున్న రైతులు ఎల్లారెడ్డిపేటలో బారులు తీరిన అన్నదాతలు ఎల్లారెడ్డిపేట/కోనరావుపేట: యూరియా కష్టాలు రైతులను వెంటాడుతున్నాయి. ఉదయం నుంచే సొసైటీలు, గ్రోమోర్ కేంద్రం వద్ద క్యూ కడుతున్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గ్రోమోర్ కేంద్రానికి మంగళవారం 300 బస్తాల యూరియా రాగా, ఒక బస్తా చొప్పున ఇస్తామని నిర్వాహకులు ప్రకటించడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసు బందోబస్తు మధ్య కేవలం 150 బస్తాలు మాత్రమే రైతులకు అందించారు. 300 బస్తాలు వచ్చినా పూర్తిస్థాయిలో పంపిణీ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు అసహనం వ్యక్తం చేశారు. అలాగే కోనరావుపేటలోని గ్రోమోర్ సెంటర్ వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూ కట్టినా బస్తాలు రాకపోవడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. -
అల్లుకున్న ప్రమాదం
మనుషుల మరణాలు:18 పశువుల మరణాలు: 36 జిల్లాలో విద్యుత్ ప్రమాదాలు రెండేళ్లలో.. నేతన్న విగ్రహం ముందు.. భావనారుషినగర్లో.. వెంకంపేట రోడ్డులో.. ‘ఇది సిరిసిల్ల పట్టణంలోని భావనారుషినగర్–విద్యానగర్ మధ్య విద్యుత్ స్తంభం. ఈ స్తంభానికి చుట్టూ కేబుల్ వైర్లు, బాక్స్లు, సీసీ కెమెరాలు ఉన్నాయి. స్తంభంపై ఏదైనా విద్యుత్ సరఫరాలో లోపం ఏర్పడితే.. పైకి ఎక్కి రిపేరు చేసేందుకు ‘సెస్’ సిబ్బంది కాలుపెట్ట సందులేదు. అలాగే పాత బస్టాండులోని నేతన్న విగ్రహం ముందు, వెంకంపేట దారిలోనూ ఇదే పరిస్థితి. జిల్లావ్యాప్తంగా ఇలా ఐదువేల స్తంభాల చుట్టూ కేబుల్, ఇంటర్నెట్ వైర్లు అల్లుకున్నాయి. ‘సెస్’ సిబ్బంది వాటిని దాటుకుంటూ వెళ్లి విద్యుత్ సమస్యలను పరిష్కరించడం కష్టంగా మారింది.’ -
వాతావరణం
ఆకాశం మేఘావృతమవుతుంది. జిల్లాలో వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. రాత్రి వేళ ఈదురుగాలులు వీస్తాయి. హైకోర్టు న్యాయమూర్తులకు ఆహ్వానంసిరిసిల్లటౌన్: జిల్లా న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం హైకోర్టు న్యాయమూర్తులు తుకారాంజి, ఓ. శ్రీనివాస్ను హైదరాబాద్లో కలిశారు. త్వరలో జిల్లా కేంద్రంలో నిర్వహించే జిల్లా కోర్టు భవనముల సముదాయం భూమి పూజలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. సీనియర్ న్యాయవాదులు జి.భాస్కర్రెడ్డి, సురేశ్, ఆవునూరి రమాకాంత్రావు, సీహెచ్.మహేశ్గౌడ్, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జూపల్లి శ్రీనివాసరావు, కార్యదర్శి టి.వెంకటి, ఉపాధ్యక్షుడు ఎస్.అనిల్కుమార్, కోశాధికారి వేముల నరేశ్ ఉన్నారు. ఆగమశాస్త్రం ప్రకారమే ఆలయ అభివృద్ధి వేములవాడ: ఆగమశాస్త్రం ప్రకారమే రాజన్న ఆలయ అభివృద్ధి పనులు చేపడుతున్నామని విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. పనుల పురోగతిపై మంగళవారం ఆలయ చైర్మన్ చాంబర్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం దేవాదాయశాఖ కమిషనర్తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో విప్, కలెక్టర్ సందీప్కుమార్ఝా, ఆలయ ఈవో రమాదేవి పాల్గొన్నారు. అనంతరం విప్ మాట్లాడుతూ, శృంగేరి పీఠాధిపతుల సూచనలతో ఆలయ విస్తరణ చేపడుతున్నట్లు తెలిపారు. పనులకు టెండర్లు పిలిచామని, 2024–25 ఆర్థిక సంవత్సరంలో మొదటి విడత కింద రూ.76 కోట్లు పనులు ముమ్మరంగా సాగుతున్నాయని వివరించారు. పనులు జరిగే సమయంలో భీమేశ్వ ర ఆలయంలో భక్తులకు దర్శనం ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భీ మేశ్వర ఆలయంలో ఇప్పటికే పనులు చివరి ద శలో ఉన్నాయని త్వరలోనే పూర్తి చేస్తామన్నా రు. ఆలయ అభివృద్ధి పనులకు భక్తులు, స్థాని కులు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. -
కోర్టు సముదాయం పనులకు మోక్షం
● రూ.86 కోట్లతో ఐదు అంతస్తుల భవనం ● కొత్త భవనం పూర్తయ్యే వరకు అద్దె భవనాల్లో కోర్టులుసిరిసిల్లకల్చరల్: జిల్లా కేంద్రంలో నూతన న్యాయస్థాన సముదాయ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న ప్రాంతంలోనే సుమారు 5 ఎకరాల స్థలంలో ఐదు అంతస్తుల్లో నూతన భవన నిర్మాణ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ మేరకు పాత స్థానంలో ఉన్న పలు న్యాయస్థానాలు అద్దె భవనాల్లోకి మారిపోనున్నాయి. ఈ నెల 13న లోక్ అదాలత్ కార్యక్రమం ఉన్న నేపథ్యంలో 15నుంచి అద్దె భవనాల్లో కొనసాగనున్నాయి. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం సూచనల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సంబంధిత ఆదేశాలు జారీ చేశారు. అనంతరం త్వరితగతిన ప్రస్తుతం ఉన్న న్యాయస్థాన సముదాయం నిర్మాణ సంస్థకు అప్పగించబడుతుంది. కోర్టు కాంప్లెక్స్లో ఉన్న ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు, ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు, పోక్సో కోర్టులు, పాలన పరమైన కార్యాలయాలు పూర్వ స్థలంలోనే కొనసాగుతాయి. సీనియర్ సివిల్ జడ్జి కోర్టు కొత్త బస్టాండ్ సమీపంలో మున్సిపల్ కమిషనర్ రెసిడెన్షియల్ క్వార్టర్లో నిర్వహించబడుతుంది. సర్దార్ నగర్లో మూడు కోర్టులు న్యాయస్థాన భవన నిర్మాణ పనుల ప్రారంభం కానున్న నేపథ్యంలో కోర్టు కాంప్లెక్స్లో ఉన్న మూడు కోర్టుల నిర్వహణకు సర్దార్నగర్లో (ప్రసాద్రావు పిల్లల హాస్పిటల్ వెనుక) నాలుగు అంతస్తుల భవనాన్ని ఎంపిక చేశారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, సెకండ్ అడిషనర్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ప్రతిపాదిత భవనంలో వరుసగా మొదటి, రెండో, మూడో అంతస్తుల్లో కొనసాగనున్నాయి. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు, ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ జడ్జి (పోక్సో) కోర్టు యథాతథంగా కొనసాగనున్నాయి. అలాగే కోర్టు ప్రాంగణంలో ఇప్పటి వరకు కొనసాగిన క్యాంటీన్, జిరాక్స్ సెంటర్లను ఈ నెలాఖరు వరకు ఖాళీ చేసి నిర్మాణ సంస్థకు అప్పగించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ ఆదేశాలు జారీ చేశారు. -
పాఠశాల సందర్శన
ఇల్లంతకుంట(మానకొండూర్): మండలకేంద్రంలోని హైస్కూల్ను మంగళవారం అదనపు కలెక్టర్ జి.నాగేశ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజ నం, మౌలిక వసతులను పరిశీలించారు. అనంతరం మండలంలోని గాలిపెల్లి బీసీ హాస్టల్ను సందర్శించారు. వంట గదిలో విద్యార్థులకు అందిస్తున్న పదార్థాలను పరిశీలించారు. మెనూ ప్రకారం మ ధ్యాహ్న భోజనం అందించాలని సూచించారు. హెచ్ఎం ప్రేమలత తదితరులు పాల్గొన్నారు. జ్వరపీడితులకు డెంగీ పరీక్షలు చేయించాలిరుద్రంగి(వేములవాడ): విష జ్వరాలు ప్రబ లుతున్న నేపథ్యంలో ప్రజలు, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్వో రజిత పేర్కొన్నారు. మంగళవారం డీఐవో సంపత్కుమార్తో కలిసి రుద్రంగి మండల కేంద్రంలోని పల్లె దవాఖానా, మానాల, గైదిగుట్ట తండాల్లో డ్రై డే కార్యక్రయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశా రు. పరిసరాల శుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. జ్వర పీడితులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెంగీ నిర్ధారణ పరీక్షలు చేయించాలన్నారు. అందుబాటులో ఉంటూ సేవలందించాలని ఆదేశించారు. ఐకేపీ కేంద్రానికి స్థలం కేటాయించాలిముస్తాబాద్(సిరిసిల్ల): అసైన్డ్ భూమిలో రైతులందరికీ ఉపయోగపడేలా ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రానికి స్థలం కేటాయించాలని మంగళవారం వెంకట్రావుపల్లె గ్రామస్తులు ముస్తాబాద్–సిద్దిపేట రహదారిపై బైఠాయించారు. అసైన్డ్ భూమిలో 40 ఎకరాలకు పైగా ఉందని పేర్కొన్నారు. గ్రామస్తులను తహసీల్దార్ సురేశ్, ఎస్సై గణేశ్ వెంకట్రావుపల్లెకు చేరుకుని గ్రామస్తులను శాంతింపజేశారు. మరోచోట ప్రత్యామ్నాయంగా స్థలం కేటాయిస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు. కాగా వెంకట్రావుపల్లెలో శాంతిభద్రతల పరిరక్షణకు బీఎన్ఎస్ సెక్షన్ 163(144) వర్తింపజేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటనలో తెలిపారు. ఈమేరకు గ్రామంలో అదనపు బలగాలను మోహరించారు. లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలిసిరిసిల్లక్రైం: ఇరువర్గాల వారు రాజీపడుతూ న్యాయం పొందేలా ఈ నెల 13న నిర్వహించే జాతీయ మెగా లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ మహేశ్ బీ గితే అన్నారు. చిన్నచిన్న కేసులతో కక్షలు పెంచుకుని సమయాన్ని, డబ్బును వృథా చేసుకోవద్దన్నారు. పోలీస్ అధికారులు, కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుళ్లు రాజీ పడదగిన కేసులను గుర్తించి ఇరువర్గాలకు కౌన్సెలింగ్ నిర్వహించి రాజీపడేలా అవగాహన కల్పించాలని సూచించారు. మల్కపేట రిజర్వాయర్కు మిడ్మా‘నీరు’కోనరావుపేట/ఎల్లారెడ్డిపేట: మిడ్మానేరు నుంచి కోనరావుపేట మండలం మల్కాపేట రిజర్వాయర్లోకి మంగళవారం నీటి విడుదల ప్రారంభమైంది. సుమారు 1.5 టీఎంసీల నీరు విడుదల చేయాలని విప్ ఆది శ్రీనివాస్ అధికారులతో మాట్లాడారు. నీటి విడుదల కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. విప్ ఆది తీవ్రంగా ప్రయత్నించి మల్కపేట రిజార్వాయర్లోకి నీటిని తెచ్చేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య తెలిపారు. నీటి విడుదలకు కృషి చేసిన విప్, నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. నీటి విడుదలను ఈఈ కిశోర్, డీఈ శ్రీనివాస్ పర్యవేక్షిస్తున్నారన్నారు. -
ప్రజా కవి కాళోజీ సేవలు మరువలేనివి
సిరిసిల్ల/సిరిసిల్లక్రైం: ప్రజాకవి కాళోజీ నారాయణరావు సేవలు మరువలేనివని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. కలెక్టరేట్లో మంగళవా రం కాళోజీ జయంతిని నిర్వహించారు. కాళోజీ చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, జిల్లా ఉద్యానశాఖ అధికారి లత, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ నజీర్ ఆహ్మద్, డీవైఎస్వో రాందాస్, ఎల్డీఎం మల్లికార్జునరావు, కలెక్టరేట ఏవో రాంరెడ్డి, డీపీఆర్వో వి.శ్రీధర్, డీటీసీపీ అధికారి అన్సర్, అధికారులు శ్రీకాంత్, రామచందర్, సిబ్బంది పాల్గొన్నారు. మహనీయుడు కాళోజీ తెలంగాణ భాష పరిరక్షణకు, ప్రజల్లో ఉద్యమ చైతన్యం నింపిన మహనీయుడు కాళోజీ అని ఎస్పీ మహేశ్ బీ గితే అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఏఎస్పీ చంద్రయ్య, ఆర్ఐలు మధుకర్, యాదగిరి, సీఐ మధుకర్, సిబ్బంది పాల్గొన్నారు. -
అర్హులను గుర్తించాలి
సిరిసిల్లటౌన్: ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన నిరుపేదలను గుర్తించి ఇంటిస్థలంతోపాటు రూ.5లక్షలు మంజూరు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్ కోరారు. స్థానిక పార్టీ ఆఫీస్లో సోమవారం ప్రెస్మీట్లో మాట్లాడారు. గత ప్రభుత్వం అర్హులుగా గుర్తించినా డబుల్ బెడ్రూమ్ అందని వారిని మొదటి ప్రాధాన్యతగా గుర్తించాలని కోరారు. ఈనెల 11న కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాలో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారులు పాల్గొనాలని కోరారు. కోడం రమణ, ఎర్రవెల్లి నాగరాజు, సూరం పద్మ, నక్క దేవదాస్, ఎలిగేటి శీను, నాగుల సత్యనారాయణ పాల్గొన్నారు. -
గ్రీవెన్స్ డేకు 23 ఫిర్యాదులు
● ఎస్పీ మహేశ్ బి గీతే సిరిసిల్ల క్రైం: బాధితులు తమ సమస్యలను నేరుగా వివరించేందుకు గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు ఎస్పీ మహేశ్ బి గీతే పేర్కొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్డేలో ప్రజల నుంచి 23 ఫిర్యాదులు స్వీకరించినట్లు తెలిపారు. ఫిర్యాదులను పరిశీ లించి ఆయా పోలీస్స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.ఇప్పుడే కొరత ఎందుకొచ్చింది? బీఆర్ఎస్ వేములవాడ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు వేములవాడ: పదేళ్లుగా రాని యూరియా కొరత ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఎందుకు ఏర్పడుతుందని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు ప్రశ్నించారు. వేములవాడలోని తన నివాసంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. వేములవాడలో కోపరేటీవ్ సొసైటీలోని రైతులకు తమ పార్టీ నాయకులు అండగా నిలిస్తే 8 మందిపై కేసు పెట్టడంపై నిలదీశారు. దసరా తర్వాత గుడి అభివృద్ధి చేస్తామంటున్నారని, సమ్మక్క–సారలమ్మ జాతర వరకు రాజన్న దర్శనాలు కొనసాగించాలని కోరారు. కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టుపై అవగాహన పెంచుకొని మాట్లాడాలని హి తవు పలికారు. నాయకులు ఆకుల దేవరాజం, తీగల రవీందర్గౌడ్, ఏనుగు మనోహర్రెడ్డి, రాజు, విజయ్, క్రాంతి, కుమార్ పాల్గొన్నారు.గుడ్ టచ్.. బ్యాడ్ టచ్పై వివరించాలి బోయినపల్లి(చొప్పదండి): గుడ్ టచ్.. బ్యాడ్ టచ్.. పోక్సో చట్టంపై బాలికలకు అవగాహన ఉండాలని జిల్లా శిశు పరిరక్షణ అధికారి(డీసీపీవో) కవిత కోరారు. స్థానిక మోడల్స్కూల్, కళాశాల విద్యార్థులకు సోమవారం అవగాహన కల్పించారు. డీసీపీవో కవిత బాల్య వివాహాలు, బాలకార్మికులు, భిక్షాటనలో ఉన్న పిల్లలు, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ గురించి తెలియజేశారు. ఎల్సీపీవో అంజయ్య, ప్రిన్సిపాల్ ఉన్నారు.కొత్త బస్టాండుకు బస్సులు రావాలిసిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రం నుంచి వెళ్లే ప్రతీ ఆర్టీసీ బస్సు కొత్త బస్టాండ్కు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కొత్తబస్టాండు అభివృద్ధి కమిటీ ప్రతినిధులు కోరారు. ఈమేరకు సోమవారం స్థానిక డిపో ఎదుట నిరసన చేపట్టి మాట్లాడారు. హైదరాబాద్, సిద్దిపేటకు వెళ్లే బస్సులు కొత్తబస్టాండ్కు రావాలని కోరారు. అనంతరం డిపో డీఎం ప్రకాశ్రావుకు వినతిపత్రం అందజేశారు. నంది శంకర్, పంతం రవి, మూశం రమేశ్, మోర రవి, మోతిలాల్నాయక్, జగ్గాని మల్లేశం, కూరపాటి శ్రీశైలం పాల్గొన్నారు.ముగిసిన రాష్ట్రస్థాయి క్రీడాపోటీలుకోనరావుపేట(వేములవాడ): మండలంలోని మరిమడ్ల ఏకలవ్య గురుకుల పాఠశాలలో మూడు రోజులుగా కొనసాగుతున్న బాలికల రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు సోమవారం ముగిశాయి. హోరాహోరీగా జరిగిన కబడ్డీ పోటీల్లో పాల్వంచ (ప్రథమ), కొత్తగూడెం(ద్వితీయ) స్థానాల్లో నిలిచాయి. ఖోఖోలో ఎల్లారెడ్డిపేట(ప్రథమ), ఇందల్వాయి(ద్వితీయ), వాలీబాల్లో ఇందల్వాయి(ప్రథమ), దుమ్ముగూడెం (ద్వితీయ), హ్యాండ్బాల్లో కురివి(ప్రథమ), కల్వకుర్తి(ద్వితీయ) స్థానాలు సాధించాయి. ఫుట్బాల్లో గందుగులపల్లి(ప్రథమ), ఎల్లారెడ్డిపేట(ద్వితీయ), బేస్బాల్లో గాంధారి(ప్రథమ), బాలానగర్(ద్వితీయ), హాకీలో గందుగులపల్లి(ప్రథమ), ఎల్లారెడ్డిపేట(ద్వితీయ) స్థానాలు సాధించినట్లు ప్రిన్సిపాల్ రామ్సూరత్యాదవ్ వివరించారు. విజేతలుగా నిలిచిన జట్లను రాష్ట్రస్థాయికి ఎంపిక చేసినట్లు తెలిపారు. అక్టోబర్లో ఒడిశాలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో ఆయా జట్లు పాల్గొంటాయని వివరించారు. -
అందుబాటులో ఉంటాం
జీపీవోలుగా నియామకమైన వారిలో అధిక శాతం గతంలో రెవెన్యూ శాఖలో పనిచేసిన వారే. ప్రభుత్వం కల్పించిన వెసులుబాటుతో తిరిగి జీపీవోలుగా నియమితులయ్యాం. ప్రభుత్వ లక్ష్యం మేరకు ప్రజలకు సత్వర రెవెన్యూ, భూ సేవలను అందిస్తాం. క్షేత్రస్థాయిలో నిబంధనల మేరకు పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటాం. – రాజేందర్, జీపీవో, ముస్తాబాద్ ప్రజలకు సత్వర రెవెన్యూ సేవలను జీపీవోలు అందిస్తారు. ధ్రువీకరణపత్రాల విచారణ, రెవెన్యూ భూరికార్డులు, ప్రజల ఆస్తుల పరిరక్షణ వంటి వాటిపై కీలకంగా పనిచేస్తారు. జీపీవోలతో మండల, జిల్లా స్థాయి అధికారులకు తక్షణ సమాచారం అందుబాటులో ఉంటుంది. పని భారం తగ్గుతుంది. – సురేశ్, తహసీల్దార్, ముస్తాబాద్ -
ఆలయ అభివృద్ధికి సహకరిస్తాం
● దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ ఇల్లంతకుంట(మానకొండూర్): ముత్యాల పోచమ్మ ఆలయ అభివృద్ధికి సహకరిస్తామని దేవా దాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ పేర్కొన్నారు. మండలంలోని అనంతగిరి ముత్యాల పోచమ్మ ఆలయ 6వ వార్షికోత్సవానికి సోమవారం హాజరై మాట్లాడారు. కమిటీ సభ్యులు భక్తులకు సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఆలయాన్ని ఎలా అభివృద్ధి చేయాలో గ్రామస్తులు చర్చించుకొని.. ఒక నిర్ణయానికి రావాలని తెలిపారు. ఆల య కమిటీ చైర్మన్ కొలిపురి అంతగిరి, ఈవో మారుతీరావు, ఐరెడ్డి మహేందర్రెడ్డి, కమిటీ సభ్యులు ముత్తయ్య, పోచవ్వ, శంకరయ్య, మల్లయ్య, తిరుపతిరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ రజనీకాంత్, జూనియర్ అసిస్టెంట్ ప్రభాకర్, గ్రామస్తులు పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించండి
మాది మున్సిపల్ పరిధిలోని 1వ వార్డు రగుడు. వారం రోజులుగా గ్రామంలోని పలు వార్డుల్లో విద్యుత్ దీపాలు వెలగడం లేదు. ఈ విషయమై మున్సిపల్ అధికారులు, సెస్ సిబ్బందికి చాలా సార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి వీధిలైట్లు వెలిగేలా చర్యలు తీసుకోవాలి. – దొంతుల చంద్రం, రగుడు మాది ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల. 2008లోనే అమ్మనాన్నా చనిపోయారు. ప్రస్తుతం నేను అనాథను. 2015లో కురి సిన వర్షానికి శిథిలావస్థలో ఉన్న ఇల్లు కూలిపోయింది. ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నాను. నాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. నా పేరు మీద ప్రొసీడింగ్ ఇస్తే ఇల్లు కట్టుకుంటాను. – పండుగ ఆంజనేయులు, వల్లంపట్ల సిరిసిల్ల అర్బన్: క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడంతో జిల్లా నలుమూలల నుంచి బాధితులు కలెక్టరేట్కు తరలివస్తున్నారు. స్థానిక అధికారులు స్పందించడం లేదని.. భూమి కబ్జా చేశారని.. పింఛన్ రావడం లేదంటూ కలెక్టర్కు విన్నవిస్తున్నారు. వివిధ సమస్యలపై సోమవారం 154 అర్జీలు వచ్చాయి. దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్ సందీప్కుమార్ ఝా మాట్లాడుతూ అధికారులు సమస్యలను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సూచించారు. ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్లో ఉంచవద్దని సూచించారు. రెవెన్యూ అధికారి గడ్డం నగేశ్, వేములవాడ ఆర్డీవో రాధాభాయి, జెడ్పీ సీఈవో వినోద్కుమార్, డీఆర్డీవో శేషాద్రి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మార్కెట్ కమిటీల ద్వారానే రైతులకు అవసరమయ్యే విత్తనాలు, పురుగు మందులు సరఫరా చేయాలి. ఫర్టిలైజర్ షాపుల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వమే నాణ్యమైన విత్తనాలు, పురుగుమందులు సరఫరా చేయాలి. – ఆలూరి మల్లారెడ్డి, వేములవాడ అర్బన్ -
బారులు తీరినా బస్తానే!
సిరిసిల్ల: జిల్లా రైతులకు యూరియా కొరత తీరడం లేదు. గంటల తరబడి క్యూలైన్లలో నిల్చుంటే ఒక్క బస్తా అందుతుంది. అది కూడా ప్రైవేట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. వరిపంటకు నెల రోజుల్లోపే యూరియా అందాల్సి ఉంటుంది. జిల్లాలో వరినాట్లు పూర్తయి నెల రోజులు దాటుతోంది. ఈక్రమంలోనే అన్నదాతలు తమ పంటను కాపాడుకునేందుకు యూరియా కోసం దుకాణాల వద్ద బారులుతీరుతున్నారు. జిల్లాలో ఇటీవల ఒక్కో యూరియా బస్తాను రూ.300లకు విక్రయిస్తే ఆ ఎరువుల దుకాణదారుడి లైసెన్స్ను వ్యవసాయశాఖ అధికారులు రద్దు చేశారు. కానీ ఏ జిల్లా కేంద్రంలోని ఓ వ్యాపారి అదే రూ.300కు ఒక్కో బస్తాను విక్రయిస్తున్నాడు. అధికారులు మాత్రం ఆ దుకాణం వైపు చూడడం లేదు. దీంతో ఆ వ్యాపారి ఆడింది ఆటగా.. పాడింది పాటగా సాగుతోంది. క్యూలైన్లో రెండు గంటలు.. రైతుకు ఒకే బస్తా సిరిసిల్ల పెద్ద బజారులో రెండు గంటలపాటు బారులు తీరితే ఒక్క బస్తా యూరియా ఇస్తున్నారు. అన్నదాతలు ఉదయం 6.30 గంటలకు క్యూలో నిల్చంటే 8.30 గంటలకు వారి వంతు వస్తుంది. అయితే 9 గంటల వరకు యూరియా అయిపోయిందంటూ వ్యాపారులు చేతులు ఎత్తేశారు. జిల్లా వ్యాప్తంగా 24 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(సింగిల్ విండో), లైసెన్స్ గల 253 ఎరువుల దుకాణాలు ఉన్నాయి. జిల్లాలో ఈ సీజన్లో 1,85,560 ఎకరాల్లో వరి, 46,205 ఎకరాల్లో పత్తి, 3,748 ఎకరాల్లో మొక్కజొన్న, 660 ఎకరాల్లో కందిపంట వేశారు. ఈమేరకు వ్యవసాయశాఖ యూరియాను జిల్లాకు తెప్పించగా రైతుల అవసరాలకు సరిపోలేదు. దీంతో రైతులు సహకార సంఘాల వద్ద బారులు తీరడం, చెప్పులు లైనులో పెట్టడం, యూరియా లారీ వస్తే మొత్తం బస్తాలు మాకే ఇవ్వాలంటూ ముట్టడించడం వంటివి జరుగుతున్నాయి. రైతుకు ఒక్క బస్తానే ఇస్తుండడంతో యూరియా సరిపోక మరుసటి రోజు కూడా ఆ రైతు దుకాణం వద్ద క్యూలో నిల్చోవాల్సిన దుస్థితి. పెద్ద రైతులు మాత్రం ప్రైవేటు వ్యాపారుల వద్ద కాస్త ధర ఎక్కువ చెల్లించి యూరియాను దక్కించుకుంటున్నారు. చిన్న, సన్నకారులు రైతులు ఇబ్బందిపడుతున్నారు. బఫర్ నిల్వలు పదిలం జిల్లాలో రైతులకు అత్యవసరమైన పరిస్థితుల్లో అందించేందుకు పెద్దూరు శివారులోని అపెరల్ పార్క్ గోదాములో 140 మెట్రిక్ టన్నుల యూరియాను నిల్వ చేశారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝా చొరవతో ఈ బఫర్ నిల్వలను ఉంచారు. ఇటీవల రైతుల అవసరాల మేరకు 40 మెట్రిక్ టన్నులను సరఫరా చేశారు. ప్రస్తుతం వంద మెట్రిక్ టన్నుల యూరియా ఉంది. జిల్లాకు ఇప్పటి వరకు 15వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా కాగా.. మరో 10వేల మెట్రిక్ టన్నులు రావాల్సి ఉంది. సింగిల్విండోల ద్వారా 60 శాతం, ప్రైవేటు వ్యాపారులు 40 శాతం యూరియాను సరఫరా చేస్తున్నారు. సమయం : సోమవారం ఉదయం 6.30 గంటలు స్థలం : సిరిసిల్ల పెద్ద బజారు, ఎరువుల దుకాణం సందర్భం : యూరియా బస్తాల కోసం రైతుల నిరీక్షణ విశేషం : ఆధార్కార్డులతో వచ్చిన రైతులకు ఒక్క బస్తా ఇవ్వడం ప్రత్యేకత : 45 కిలోల యూరియా బస్తా ధర రూ.267 ఉండగా రూ.300లకు విక్రయాలు కొసమెరుపు : రవాణా, హమాలీ ఖర్చులు అని బుకాయింపు -
ఇక.. రెవె‘న్యూ’ పాలన
● 118 రెవెన్యూ గ్రామాలకు జీపీవోలు ● విధుల్లో చేరిన గ్రామపాలనాధికారులు ముస్తాబాద్(సిరిసిల్ల): కాలానుగుణంగా రెవెన్యూ శాఖలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో పటేల్ పట్వారీ వ్యవస్థ ఉండగా.. దాని స్థానంలో వీఆర్వోలు వచ్చారు. వీఆర్వోల స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పాలనాధికారులను నియమించింది. ఐదేళ్లుగా గ్రామాల్లో రెవెన్యూ ప్రతినిధి లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో గ్రామపాలనాధికారులు రావడం రెవెన్యూశాఖలో ఉన్నతాధికారులకు పనిభారం తగ్గించనుంది. క్షేత్రస్థాయిలో గ్రామస్తుల సమస్యలు పరిష్కారానికి నోచుకుంటా యనే ఆశాభావం వ్యక్తమవుతుంది. జిల్లాలో 118 రెవెన్యూ గ్రామాలుండగా.. ఒక్కో గ్రామానికి ఒక్కో రెవెన్యూ అధికారిని ప్రభుత్వం నియమించింది. పటేల్ పట్వారీ నుంచి జీపీవో.. నిజాం పాలన నుంచి వచ్చిన పటేల్ పట్వారీ వ్యవస్థతో తెలంగాణ పల్లెల్లో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. 1983లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దుచేశారు. అప్పటి నుంచి 2003 వరకు గ్రామ కార్యదర్శియే రెవెన్యూ, పంచాయతీ వ్యవస్థలను చూసుకునేవారు. 2004లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వీఆర్వో వ్యవస్థను ప్రవేశపెట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థలో అవినీతి ఉందంటూ రద్దు చేసింది. మండల స్థాయిలో రెవెన్యూ ఇన్స్పెక్టర్, తహసీల్దార్ మాత్రమే ఉన్నారు.ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వీఆర్వో స్థానంలో జీపీవోలను తీసుకొచ్చింది. పథకాల అమలు, భూముల వ్యవహారాలు చూసుకోవడం. ఆదాయం, కులం, నివాసం సర్టిఫికెట్ల జారీపై విచారణ. అనుమతులు. ప్రభుత్వ ఆస్తుల రక్షణ. ప్రైవేటు భూముల నక్ష, పాస్బుక్కుల జారీపై విచారణ. ప్రకృతి వైపరీత్యాలపై ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడం. బాధితులను ఆదుకునే చర్యలు చేపట్టడం. వాల్టా చట్టం అమలుచేయడం. -
వసతులు లేక ఇబ్బంది పడుతున్నాం
వేములవాడఅర్బన్: మౌలిక వసతులు లేవని, తమకు ప్రత్యేకంగా క్యాంపస్ ఏర్పాటు చేయాలని జేఎన్టీయూ విద్యార్థులు సోమవారం సిరిసిల్ల–కరీంనగర్ రోడ్డుపై బైటాయించారు. వారు మాట్లాడుతూ వేములవాడ మండలం అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నాలుగేళ్ల క్రితం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన అధికారులు వసతుల కల్పనపై పట్టించుకోవడం లేదన్నారు. రెండేళ్లలో క్యాంపస్ ఏర్పాటు చేసి వసతులు కల్పిస్తామని మాట తప్పారన్నారు. ఎనిమిది తరగతి గదులు మాత్రమే ఉన్నాయని, ల్యాబ్లు లేక వేరే చోటుకు తీసుకెళ్తున్నారన్నారు. కళాశాలలోని మెస్లో రద్దీ ఉంటుండడం ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అద్దె భవనంలోని హాస్టల్ సైతం కిలోమీటర్కు పైగా దూరంలో ఉందన్నారు. గెస్ట్ ఫ్యాకల్టీతో బోధన చేయిస్తున్నారన్నారు. కాలేజీ ప్రారంభమైనప్పటి నుంచి ఒక బ్యాచ్ వెళ్లిపోయిందని.. అయినా వసతులు కల్పించడం లేదన్నారు. ఈ విషయం తెలుసుకున్న అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఎనిమిది మంది విద్యార్థులను పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి వదిలేశారు. వీరికి మద్దతుగా ధర్నాలో పాల్గొన్న ఏబీవీపీ, బీఆర్ఎస్ నాయకులను పోలీస్స్టేషన్కు తరలించారు. ఎండ తీవ్రంగా ఉండడంతో ఓ విద్యార్థిని సొమ్మసిల్లి పడిపోయింది. ఠాణాలో విద్యార్థులకు సంఘీభావం ఇంజినీరింగ్ విద్యార్థులను వేములవాడటౌన్ పోలీసులు ఠాణాకు తీసుకెళ్లడంతో చల్మెడ లక్ష్మీనర్సింహారావు వారికి సంఘీభావం ప్రకటించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇంజినీరింగ్ కాలేజీకి స్థలం కేటాయించినట్లు తమ నాయకుడు కేటీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు. సౌకర్యాలు కల్పించని ప్రభుత్వం విద్యార్థులను ఠాణాకు తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిపడా తరగతి గదులు కేటాయించాలి సిరిసిల్లఅర్బన్: అగ్రహారం డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు సరిపడా తరగతి గదులు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారని వెంటనే సరిపడా తరగతి గదులు కేటాయించాలని ఎస్ఎప్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ కోరారు. ఈమేరకు ప్రజావాణిలో కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు. ఒకే భవనంలో డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీలు ఉండడంతో విద్యార్థులకు గదులు సరిపోవడం లేదన్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు చొరవ తీసుకొని జేఎన్టీయూకు సొంత భవనం నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్ఎఫ్ఐ జిల్లా గర్ల్స్ కన్వీనర్ సంజన, జిల్లా కమిటీ సభ్యులు శివ, విద్యార్థులు శ్రీనివాస్, కార్తీక్, మహేశ్, రమ్య తదితరులు పాల్గొన్నారు. -
గల్ఫ్ ఆశలు.. ఏజెంట్ల మోసాలు
సిరిసిల్ల క్రైం: సొంతూరులో ఉపాధి కరువై గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్న పలువురు నకిలీ ఏజెంట్ల చేతుల్లో మోసపోతూనే ఉన్నారు. అమాయకుల అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్న గల్ఫ్ ఏజెంట్లు డబ్బుల సంపాదనే లక్ష్యంగా విజిట్ వీసాలు కట్టబెడుతున్నారు. డబ్బులు సంపాదించుకొని ఆర్థికంగా స్థిరపడదామని ఆశతో వెళ్తున్న పలువురు మోసపోయి అప్పుల కుప్పల్లో చిక్కుకుపోతున్నారు. మోసపోయామని తెలుసుకొని ఎలాగోలా స్వదేశానికి వచ్చిన వారికి ఏజెంట్లు డబ్బులు తిరిగివ్వడం లేదు. ఇలా అక్కడికి పోలేక.. ఇక్కడ ఉన్న పని కోల్పోయి అప్పులపాలవుతున్నారు. ఆకర్షణీయమైన జీతం పేరిట గల్ఫ్ దేశాల్లో మంచి వేతనాలు వస్తాయని.. తక్కువ పని, ఎక్కువ వేతనం అంటూ ఆశచూపుతున్న ఏజెంట్లు అక్కడికి వెళ్లాక పని చూపించడం లేదు. ముందుగానే వీసా ప్రాసెసింగ్, మెడికల్ పరీక్షలు అంటూ రూ.10వేలు తీసుకుంటున్న ఏజెంట్లు, వీసా వచ్చిన తర్వాత పనిని బట్టి రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు వసూలు చేస్తున్నారు. తెలిసిన వారి వద్ద అప్పులు చేసి నకిలీ ఏజెంట్ల చేతుల్లో డబ్బులు కుమ్మరిస్తున్న యువకులు తీర అక్కడికి వెళ్లాక మోసపోయామని తెలుసుకుని లబోదిబోమంటున్నారు. కొందరు పరువుపోతుందని అంతర్గతంగా చర్చలకు పోతుండగా, కొందరు మాత్రమే పోలీస్స్టేషన్లకు వచ్చి కేసులు పెడుతున్నారు. ఉండలేక.. వెనక్కి రాలేక గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారిలో ఇబ్బందులు పడుతున్న వాళ్లు చదువుకున్న వారే అధికంగా ఉండడం గమనార్హం. ఉద్యోగాల వేటలో నలిగిన యువత ఏదో ఒక పనిచేసి డబ్బులు సంపాదించుకునేందుకు గల్ఫ్ దేశాలకు పోతున్నారు. అక్కడికి వెళ్లాక పనిచేయడం ఒకటైతే.. ఒకే గదిలో కనీసం 10 మందితో కలిసి ఉండడం మరొక ఎత్తు. అక్షరాస్యత లేని వారు రెండేళ్లపాటు ఏదో విధంగా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. చదువుకున్న యువకులు అక్కడి పరిస్థితులకు అలవాటు పడలేక వీసా కోసం చేసిన అప్పులు తీరగానే స్వదేశానికి వచ్చేస్తున్నట్లు చర్చ సాగుతుంది. కేసులు.. మారని తీరు విదేశాలకు వెళ్లేందుకు వీసాలు అందించే 6 అధికారిక ఏజెన్సీలు జిల్లాలో ఉన్నట్లుగా పోలీస్శాఖ వెల్లడించింది. ఈ ఏజెన్సీల ద్వారా వీసా తీసుకొని వెళ్లిన వారికి ముందుగా చెప్పినట్లు పని కల్పించకపోయిన, వేతన వ్యత్యాసాలు ఉన్న సదరు ఏజెన్సీలపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ మన జిల్లాలో గ్రామాల్లో సంచరించే గల్ఫ్ ఏజెంట్లను నమ్మి లక్షలు కుమ్మరించి నిలువునా మునుగుతున్నారు. వీసా వచ్చిన వెంటనే దాని పూర్తి వివరాలు తెలుసుకునేందుకు జిల్లాలోని స్పెషల్ బ్రాంచ్ పోలీస్ సీఐ అధికారిని కలవాలని అధికారులు చెబుతున్నారు. కానీ మన జిల్లాలో ఏర్పాటు చేసిన సహాయక కేంద్రాన్ని వినియోగించుకోవడం లేదు. మోసపోకుండా ఉండాలంటే సహాయ కేంద్రం గురించి, పోలీసులు అందిస్తున్న సేవల గురించి గ్రామాల్లో ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. సంవత్సరం కేసులు అరెస్ట్ అయిన ఏజెంట్లు 2023 35 33 2024 63 60 2025 23 23 మోసాలకు పాల్పడుతున్న నకిలీ ఏజెంట్ల ఆగడాలను ఆదిలోనే అడ్డుకోవాలి. గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు వీసా విషయంలో సందేహా లుంటే స్పెషల్ బ్రాంచ్లో కలవాలి. ఇబ్బంది ఉంటే 87126 56411కు కాల్ చేసి రక్షణ చర్యలు అడగవచ్చు. గల్ఫ్ ఏజెంట్లు మోసం చేస్తే జైలుకు పంపిస్తాం. – మహేశ్ బి గీతే, ఎస్పీ -
రైతులపై తగ్గనున్న భారం
● జీఎస్టీ స్లాబ్లలో మార్పు ● వ్యవసాయ ఉపకరణాలపై 5 శాతం పన్ను చందుర్తి(వేములవాడ): కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతులపై ఆర్థికభారం తగ్గనుంది. వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ స్లాబ్ను మార్చడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు వర్తిస్తున్న 12, 18 శాతం స్లాబ్ను 5 శాతానికి కుదించడంతో ధరలు తగ్గనున్నాయి. నిత్యావసర వస్తువులపై 5శాతం, అత్యవసరం కాని వస్తువులపై 18 శాతం నిర్ణయం తీసుకున్నారు. ఈ స్లాబ్ సిస్టమ్ ఈనెల 22 నుంచి అమలుకానుంది. దీంతో వస్తువుల ధరలు భారీగా తగ్గనున్నాయి. రెండింటికే పరిమితం వస్తు సేవల పన్ను జీఎస్టీ(గూడ్స్ సర్వీసు టాక్స్)ను కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నాలుగు అంచెల పద్ధతిలో స్లాబ్ అమలు చేసింది. ఇప్పటి వరకు 5, 12, 18, 28 శాతంలో స్లాబ్ రేట్లు ఉండేవి. ఈనెల 22 నుంచి 5, 18 శాతం స్లాబ్రేట్లు మాత్రమే అమలుకానున్నాయి. జీఎస్టీ పరిధిలోకి వచ్చే వస్తువులన్నీ ఈ రెండు స్లాబ్ల్లోకి రానున్నాయి. గృహ నిర్మాణాదారులకు ఊరట పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలలు నిజం చేసుకునేందుకు తగ్గించి జీఎస్టీ స్లాబ్ ఉపయోగపడనుంది. స్లాబ్ కుదింపుతో సిమెంటు బస్తాలపై అమలులో ఉన్న జీఎస్టీ 28 శాతాన్ని 18 శాతం కుదిస్తున్నట్లు జీఎస్టీ కౌన్సిల్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 10 శాతం తగ్గింపుతో నిర్మాణ వ్యయం తగ్గనుంది. అన్నదాతలకు వరం ఇప్పటికే రైతులు వ్యవసాయంలో వస్తున్న నష్టాలతో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ ఉపకరణాలపై అమలులో ఉన్న 12, 18 శాతం స్లాబ్ను 5 శాతానికి కుదింపుతో వ్యవసాయానికి కొంత ఊరట లభించినట్లు అయ్యింది. రైతులు వినియోగించే పనిముట్ల, యంత్ర పరికరాలు, ట్రాక్టర్ల విడి భాగాల ధరలు భారీగా తగ్గనున్నాయి. పంటలకు పిచికారీ చేసే పురుగుల మందులు ఈ స్లాబ్లోకి రానుండడంతో వాటి ధరలు కూడా భారీగా తగ్గనున్నాయి. నిత్యావసరాలపై జీఎస్టీ తొలగింపు పేద, మధ్యతరగతి ప్రజలు వినియోగించే వస్తువుల ధరలు తగ్గనున్నాయి. టీవీలు, బైక్లు, చిన్న, మధ్యశ్రేణి కార్లు, వైద్యపరికరాలు, బీమాతోపాటు విద్య సంబంధిత పుక్తకాలపై జీఎస్టీని పూర్తిగా తొలగించారు. పేదలపై జీఎస్టీ భారా న్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై గ్రామాల్లో హర్షం వ్యక్తమవుతుంది. ఈ నిర్ణయంతో పేద, మధ్యతరగతి ప్రజలతోపాటు రైతులకు ప్రయోజనం కలుగనుంది. – మార్త సత్తయ్య, బీజేపీ వేములవాడ నియోజకవర్గ కన్వీనర్ ఏటా ప్రతికూల వాతావరణ పరిస్థితులతో ఆశించిన స్థాయిలో దిగుబడులు రావడం లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతులకు ఊరటను కలిగించింది. అయితే ట్రాక్టర్, పనిముట్లతోపాటు ఎరువులు, పురుగుల మందులపై ఉన్న జీఎస్టీని 18 నుంచి 5 శాతానికి తగ్గించడం హర్షనీయమే. కానీ పూర్తిగా తొలగిస్తే బాగుండు. – కాసారపు శ్రీనివాస్రెడ్డి, రైతు, నర్సింగపూర్ -
యూరియా కోసం..
గాలిపెల్లి మహిళా సంఘం ఎదుట యూరియా కోసం బారులు తీరిన రైతులు ఇల్లంతకుంట(మానకొండూర్): యూరియా కోసం రైతుల కష్టాలు అన్నీ..ఇన్నీ కావు. ఇల్లంతకుంట మండలం గాలిపెల్లిలోని ఆదర్శ మహిళా సంఘానికి 330 యూరియా బస్తాలు కేటాయించగా ఆదివారం భారీ సంఖ్యలో రైతులు క్యూ కట్టారు. యూరియా కోసం గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉన్నారు. గాలిపెల్లిలో మ్యాక్స్, ప్రైవేట్ ఫర్టిలైజర్షాపు, మహిళా సంఘాలలో కలిపి 770 బస్తాలు, కందికట్కూర్లో అవని మహిళా సంఘంలో 225 బస్తాలు పంపిణీ చేసినట్లు వ్యవసాయాధికారి సురేష్రెడ్డి తెలిపారు. -
హైకోర్టుకు మెటా నిందితులు
సాక్షిప్రతినిధి,కరీంనగర్: మెటా ఫండ్ క్రిప్టో కరెన్సీ పేరిట ఉమ్మడి జిల్లాలో రూ.కోట్లు వసూలు చేసిన నిందితుల విషయంలో కరీంనగర్ పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. అధిక లాభాలు ఆశచూపించి రూ.లక్షలు పెట్టుబడుల కింద తీసుకుని, బోర్డు తిప్పేసిన కంపెనీ విషయంలో పోలీసులు మెతక వైఖరి అవలంబిస్తున్నారని బాధితులు మండిపడుతున్నారు. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ముందస్తు బెయిల్కు హైకోర్టును ఆశ్రయించడమే ఇందుకు ఉదాహరణ అని ఆరోపిస్తున్నారు. లాభాల పేరిట పలువురు ప్ర భుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారుల నుంచి ఒక్క కరీంనగర్ జిల్లాలోనే రూ.30కోట్లు, సిరిసిల్ల, జ గిత్యాల, పెద్దపల్లి జిల్లాలు రాష్ట్రవ్యాప్తంగా రూ.100 కోట్ల వరకు వసూలు చేసిన మెటా ఫండ్ ప్రతినిధుల్లో ఒక్కరిని కూడా అరెస్టు చేయకపోవడం, నిందితులు యథేచ్ఛగా తిరుగుతుండటంపై బాధితులు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. రెండుసార్లు పిటిషన్, ఒకకేసు మెటా కుంభకోణం కొత్తదేం కాదు. మే, జూన్లో క రీంనగర్ కమిషనరేట్ పరిధిలోని రూరల్, టూ టౌన్, కొత్తపల్లి పీఎస్ పరిధిల్లో పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఆయా ఠాణా ల్లో ఎస్హెచ్వోలు ఈ కేసు గ్రావిటీ తెలిసినప్పటికీ నిందితులతో చేతులు కలిపారని బాధితులు ఆరోపిస్తున్నారు. రూ.కోట్లు మోసం చేసిన వారికి అనుకూలంగా వ్యవహరించి, పిటిషన్ వెనక్కు తీసుకునేలా చేయడంలో పోలీసులు సఫలీకృతమయ్యారని అంటున్నారు. జూలైలో ఇదే మెటా ఫండ్ కేసులో దాస రి రమేశ్, దాసరి రాజుపై పిటిషన్లు ఇచ్చినా.. ఈ రూ.కోట్ల కుంభకోణం గురించి వార్తాపత్రికల్లో కథనాలు వస్తున్నా.. నిందితులపై కేసు నమోదు చేయడంలో పోలీసులు తాత్సారం ప్రదర్శించారు. పిటిషనర్లు కేసు పెట్టేందుకు వెనకాడారు. తిరిగి అదే వ్య క్తులపై మూడోసారి పిటిషన్ రావడం, ఈసారి పిటిషనర్ బలంగా నిలబడటంతో విధిలేక కేసు నమో దు చేసి, దర్యాప్తుకు మీనమేషాలు లెక్కించారు. బా ధితులు ఉన్నతాధికారులను కలిసేందుకు సిద్ధపడ్డా రు. కేసు దర్యాప్తులో జాప్యాన్ని నివారించేందుకు కేసును సీసీఎస్కు అప్పగించారు. ఈ విషయం లీకవడంతో నిందితులు విజయవాడకు పరారై.. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. కరీంనగర్ పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఐదుగురిలో ముగ్గురు పరారీ.. ఈ కేసులో హైదరాబాద్కు చెందిన లోకేశ్, కరీంనగర్కు చెందిన దాసరి రమేశ్, దాసరి రాజు, ప్రకా శ్, సతీశ్ మాస్టర్మైండ్స్గా ఉన్నారు. వీరు కులా న్ని, లాభాలను ఎరగా వేసి రోజుకు రూ.6లక్షల చొ ప్పున ఆదాయాన్ని పొందవచ్చని పెట్టుబడులు పెట్టించారు. వసూలు చేసిన మొత్తంతో ఇప్పటికే లోకేశ్ థాయ్లాండ్కు, రమేశ్, రాజులు విజయవా డకు పారిపోయారు. ఇక మిగిలింది సతీశ్, ప్రకాశ్ లే. వీరిలో సతీశ్ దర్జాగా అధికార కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొంటుండటం విశేషం. పెట్టుబడి పెమ ట్టిన వారిలో అధికశాతం రెవెన్యూ, పోలీసు, ప్రభు త్వ టీచర్లు, రియల్టర్లు ఉన్నారు. ఇదే నిందితులకు అనుకూలంగా మారుతోంది. ఈ ప్రభుత్వ ఉద్యోగులను మెటా ప్రతినిధులు ప్రభుత్వ అనుమతి లేకుండా సింగపూర్, బ్యాంకాక్, మలేషియా దేశాలకు మసాజ్ల కోసం విహారయాత్రలకు తీసుకువెళ్లారు. తీరా ఇప్పుడు కేసులు పెడితే.. ఎక్కడ తమ ఉద్యోగాలు పోతాయో.. అన్న భయంతో కేసులకు వెనకాడుతున్నారు. అందులోనూ వీరు పెట్టిన డబ్బంతా అక్రమార్జన, నల్లడబ్బు కావడంతో తేలుకుట్టిన దొంగల్లా.. తెరవెనక నుంచి సెటిల్మెంట్ కోసం యత్నిస్తున్నారు. -
మెరుగైన వైద్యసేవలు అందించాలి
● కలెక్టర్ సందీప్కుమార్ ఝా ● జిల్లా ఆస్పత్రి తనిఖీ ● గండిలచ్చపేటలో జ్వరాల సర్వే చేయాలని ఆదేశాలు సిరిసిల్ల: ప్రభుత్వ ఆస్పత్రిలో చేరే పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వైద్యులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని జిల్లా జనరల్ ఆస్పత్రిని ఆదివారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమర్జెన్సీ, ఐసీయూ, మెటర్నిటీ, ఆర్థోపెడిక్ వార్డుల్లో అందిస్తున్న వైద్యసేవలు పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు రోగులతో మాట్లాడి వైద్యసేవలు అందుతున్న తీరును తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రతి రోగికి మెరుగైన వైద్యసేవలు అందించాలన్నారు. తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేటలో ఫీవర్ సర్వే చేయాలని జిల్లా వైద్యాధికారి రజితను ఆదేశించారు. -
నిర్వాసితులకు మేలు చేయడమే లక్ష్యం
● అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడఅర్బన్: మిడ్మానేరు నిర్వాసితులకు మేలు చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ మండలం అగ్రహరంలోని ఓ ఫంక్షన్హాల్లో ఆదివారం మిడ్మానేరు నిర్వాసితులు 1,550 మందికి ప్రత్యేక ప్యాకేజీ కింద ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ ఇతర మంత్రులు ఈ ప్రాంత అభివృద్ధికి మద్దతుగా నిలుస్తున్నారన్నారు. రూ.240 కోట్లతో ముంపు గ్రామాల ప్రజలకు 4,696 ఇళ్లు మంజూరు చేశామన్నారు. ప్రత్యేక ప్యాకేజీ కింద నిర్వాసితుల్లో ఇళ్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. 18 సంవత్సరాల వయస్సు దాటిన వారి సమస్యలు త్వరలో పరిష్కరిస్తామన్నారు. మిడ్మానేరు ప్రాజెక్ట్ నిర్మాణంలో నిర్వాసితులైన 9 గ్రామాల్లో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా 1,550 కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పత్రాలు పంపిణీ చేశామన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, రేగులపాటి కృష్ణదేవరాయలు, హౌసింగ్ పీడీ శంకర్, తహసీల్దార్ విజయప్రకాశ్, ఎంపీడీవో రాజీవ్మల్హోత్ర తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా క్రీడాపోటీలు
బాక్సింగ్లో తలపడుతున్న విద్యార్థినులు కోనరావుపేట(వేములవాడ): మరిమడ్లలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో ఐదో రాష్ట్రస్థాయి బాలికల క్రీడాపోటీలు రెండో రోజు ఆదివారం ఉత్సాహంగా కొనసాగాయి. రాష్ట్రంలోని 23 ఈఎంఆర్ఎస్ల నుంచి వచ్చిన 1130 మంది విద్యార్థినులు క్రీడాపోటీల్లో పాల్గొంటున్నారు. బాడ్మింటన్, రెజ్లింగ్, తైక్వాండో, జూడో, బాక్సింగ్, యోగా, అథ్లెటిక్స్, లాంగ్జంప్, హైజంప్, షాట్పుట్, ఆర్చరీ, బాస్కెట్బాల్, హ్యాండ్బాల్, వాలీబాల్, హాకీ పోటీల్లో విద్యార్థినులు పాల్గొంటున్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 300 మంది విద్యార్థినులను జాతీయస్థాయికి ఎంపిక చేయనున్నట్లు ప్రిన్సిపాల్ రామ్ సూరత్యాదవ్ తెలిపారు. వీరు అక్టోబర్లో ఒడిశాలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని వివరించారు. -
రైతు ఇంట.. కొత్త పంట
● జిల్లాలో తొలిసారి ఆయిల్పామ్ దిగుబడులు ● నాలుగేళ్ల కిందట సేద్యం.. 35 ఏళ్లపాటు ఆదాయం ● కోతుల బెడద లేదు.. చీడపీడలు రావు ● 2,300 ఎకరాల్లో ఆయిల్పామ్ సేద్యంసిరిసిల్ల: కొత్తది ఎప్పుడూ వింతే. మరీ వ్యవసాయంలోనైతే రైతులు ఒక్కసారి ఆచరిస్తే దాన్ని వదిలిపెట్టరు. ఈక్రమంలోనే ఐదు దశాబ్దాల క్రితం ఈ ప్రాంతానికి పత్తిపంట పరిచయమైంది. ఆ సమయంలో పత్తిపంట సాగును చూసిన మన ప్రాంత రైతులు ముక్కున వేలేసుకున్నారు. కానీ ఇప్పుడు పత్తిపంట లేని ఊరు లేదు. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితులు వచ్చాయి. కొత్తపంట ఆవిష్కృతమైంది. నాలుగేళ్ల క్రితం సాగుచేసిన ఆయిల్పామ్ నేడు దిగుబడి(గెలలు) వస్తుంది. రైతన్న ఇంట కొత్త పంట చేరింది. ఆయిల్ పామ్ గెలలు.. దాని ప్రాసెసింగ్ జిల్లా రైతులకు కొత్తే. కానీ ఆయిల్పామ్ సాగుతో బహుముఖ ప్రయోజనాలు ఉన్నాయి. కోతుల బెడద లేదు.. చీడపీడల సమస్య రాదు.. సాగునీటి ఇబ్బందులు ఉండవు. మేలైన యాజమాన్య పద్ధతులతో ఒక్కసారి మొక్కలు నాటితే 35 ఏళ్లపాటు దిగుబడి వస్తుంది. జిల్లా రైతులు సాగుచేస్తున్న కొత్తపంటపై ప్రత్యేక కథనం. నూనె గింజల పంట ఆయిల్పామ్.. ఇది పామాయిల్ నూనెలను ఉత్పత్తి చేసే పంట. ప్రపంచంలో అత్యధిక దిగుబడిని ఇచ్చే నూనె గింజల పంటలో ఆయిల్పామ్ ఒకటి. దేశంలో వంటల్లో ఉపయోగించే నూనెల్లో పామాయిల్ వినియోగం ఎక్కువ. ఇంతగా డిమాండ్ ఉన్నా మన దేశంలో పామాయిల్ సాగు చాలా తక్కువ. దీంతో మలేషియా, ఇండోనేషియా దేశాల నుంచి పామాయిల్ నూనెను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దేశం ముడిచమురు (పెట్రోల్, డీజిల్) తర్వాత ఎక్కువగా పామాయిల్ను దిగుమతి చేసుకుంటున్నాం. ఒక్కసారి నాటితే 35 ఏళ్లు దిగుబడి మార్కెటింగ్, కోతులు, కూలీల ఇబ్బందులు లేని ఆయిల్పామ్ పంట సాగు విస్తీర్ణం జిల్లాలో క్రమంగా పెరుగుతోంది. పంటసాగు చేసే రైతులకు ప్రభుత్వం సబ్సిడీలు, మద్దతు అందిస్తూ భరోసా ఇస్తుంది. అంతరపంటల సాగుతో రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుంది. ఒక్కసారి సాగుచేస్తే నాలుగో ఏడాది నుంచి ఆరేళ్ల వరకు ఎకరానికి ఐదు నుంచి ఏడు టన్నుల పంట దిగుబడి వస్తుంది. ఏడో సంవత్సరం నుంచి 10–15 టన్నులు దిగుబడి వస్తుంది. జిల్లాలో ఉత్పత్తి అయిన ఆయిల్పామ్ గె లలను ప్రీ–యూనిక్ కంపెనీ కొనుగోలు చేస్తుంది. సర్కారు చేయూత ఆయిల్పామ్ పంటను సాగుచేసిన రైతులకు ప్రభుత్వం చేయూతనిస్తుంది. పంటకు రాయితీపై డ్రిప్(బిందుసేద్యం) పరికరాలు సరఫరా చేస్తుంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు డ్రిప్ పరికరాలకు వంద శాతం సబ్సిడీ, చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం సబ్సిడీ, ఇతర రైతులకు 80 శాతం సబ్సిడీ అందజేయనున్నారు. ఎకరం విస్తీర్ణంలో 50 మొక్కలు నాటాలి. ఒక్కో మొక్క విలువ మార్కెట్లో రూ.200 ఉండగా, రైతులందరికీ 90 శాతం సబ్సిడీపై కేవలం రూ.20కే మొక్కలను ఉద్యానవనాల శాఖ అందిస్తుంది. మొక్కలు, డ్రిప్, ఇతర నిర్వహణకు ఏటా ప్రభుత్వం రూ.52వేలు నాలుగేళ్లపాటు పంట చేతికి అందే వరకు అందిస్తుంది. అంతరపంటలతో అదనపు ఆదాయం ఆయిల్పామ్ పంటలతోపాటు ఇతరపంటలను అంతరపంటగా సాగు చేసుకోవచ్చు. ఆయిల్పామ్ మొక్కలు దెబ్బతినకుండా కొన్ని జాగ్రత్తలతో అంతరపంటలతో ఆదాయం పొందవచ్చు. జిల్లాలో ఇప్పటి వరకు 2,300 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగుచేశారు. ఈ ఏడాది 2వేల ఎకరాల్లో సాగుచేయాలని లక్ష్యం కాగా.. ఇప్పటి వరకు 1,160 ఎకరాల్లో 331 మంది సాగు చేసేందుకు ముందుకొచ్చారు. ఇప్పటికే 120 ఎకరాల్లో ప్లాంటేషన పూర్తయింది. టన్ను ధర రూ.18,052 జిల్లాలో ఉత్పత్తి అయిన ఆయిల్పామ్ గెలల ధర టన్ను(10 క్వింటాళ్ల)కు రూ.18,052 ఉంది. బోయినపల్లి, ఇల్లంతకుంట, ముస్తాబాద్, వీర్నపల్లి, తంగళ్లపల్లి మండలాల్లో 292 మంది రైతులు 978 ఎకరాలలో ఈ ఏడాది 450 టన్నుల పంటను దిగుబడి రానుంది. ప్రస్తుతం తొలిపంట 16 టన్నుల వరకు వచ్చింది. కంపెనీ వారే వచ్చి ఉత్పత్తులు సేకరిస్తున్నారు. వారం రోజుల్లో రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమచేస్తున్నారు. నమ్మకమైన మార్కెట్ ఉండడంతో దళారుల సమస్య ఉండదు. ఆయిల్పామ్ సాగుపై ఆసక్తి ఉన్న రైతులు ఉద్యానవన శాఖ అధికారులు బి.గోవర్ధన్( సిరిసిల్ల డివిజన్) సెల్ నంబరు 89777 14049, సీ.హెచ్. లోకేశ్(వేములవాడ డివిజన్) సెల్ నంబరు 89777 14048 అను సంప్రదించాల్సి ఉంది. -
కలెక్టరేట్ వినాయకుడి నిమజ్జనం
సిరిసిల్ల: వినాయక నవరాత్రి వేడుకల్లో భాగంగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన గణనాథుడికి శుక్రవారం కలెక్టర్ సందీప్కుమార్ ఝా పూజలు నిర్వహించి ఆనందోత్సాహాల మధ్య శోభాయాత్రతో మానేరు తీరంలో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో వేములవాడ ఆర్డీవో రాధాభాయ్, జెడ్పీ సీఈవో వినోద్ కుమార్, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, ఎల్డీఎం మల్లికార్జునరావు, కలెక్టరేట్ ఏవో రాంరెడ్డి, కలెక్టరేట్ పర్యవేక్షకులు శ్రీకాంత్, రాంచందర్, ప్రవీణ్, డీటీసీపీవో అన్సార్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
అంకితభావంతో పనిచేస్తే ఉపాధ్యాయులకు గుర్తింపు
● విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం కృషి ● ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ● ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానంసిరిసిల్ల: అంకితభావంతో విధులు నిర్వహించే ఉపాధ్యాయులకు గుర్తింపు ఉంటుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మాట్లాడుతూ విద్యారంగ అభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నారన్నారు. రాష్ట్రంలో 11వేల టీచర్ పోస్టులు భర్తీ చేసిందని, ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించి, బదిలీలకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో రూ.200 కోట్లతో 25 ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మిస్తుందని వెల్లడించారు. ఏటీసీ సెంటర్ల మంజూరుతో యువతకు వివిధ రంగాల్లో నైపుణ్యం అంది పుచ్చుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా సాంకేతిక నైపుణ్యతను అందిపుచ్చుకొని విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు. కలెక్టర్ సందీప్కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని టీచర్లు జాతీయ, రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపిక కావాలని సూచించారు. ఉపాధ్యాయులు తాము బోధిస్తున్న పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాలన్నారు. పదో తరగతి ఫలితాల్లో జిల్లా ప్రథమస్థానంలో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల, వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్లు స్వరూపారెడ్డి, రాజు, డీఈవో వినోద్ కుమార్, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలకు సన్మానం జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికై న డాక్టర్ చకినాల శ్రీనివాస్, గుర్రం కృష్ణారెడ్డి, కై రి పద్మ, సీహెచ్ సత్తయ్య, గోలి రాధాకిషన్, అరుకాల బాల్ రెడ్డి, బోగారపు నవీన్, కట్ట రవీందర్, గోవులకొండ శ్రీనివాస్, ఎన్.దేవేందర్, నరహరి నాగమణి, జంగిటి రాజు, పీచు సుభాష్ రెడ్డి, గుండమనేని మహేందర్రావు, దిడిగం స్రవంతి, బద్దం రవీందర్ ఓరుగంటి పద్మకళలకు అవార్డులు అందజేసి, సన్మానించారు. -
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ ఆందోళన
చందుర్తి(వేములవాడ): మాలలను అణిచి వేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీవో నం.99ను అమలు చేస్తుందంటూ చందుర్తి బస్టాండ్లో మాల మహానాడు జిల్లా కన్వీనర్ నీరటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుక్రవారం నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ నీరటి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాల్లోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు ముట్టడి కార్యక్రమం చేపట్టామన్నారు. అందులో భాగంగానే ఈనెల 8న చేపట్టే వేములవాడ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు ముట్టడికి మండలంలోని అన్ని గ్రామాల్లో నుంచి మాలలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వాలు స్పందించే వరకు తమ పోరాటాలను కొనసాగిద్దామని తెలిపా రు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు మండల కన్వీనర్ ఆశినిపర్తి యేసుకుమార్,ఉపాధ్యక్షుడు ప్ర దీప్, నాయకులు బత్తుల శ్రీనివాస్, పాకనాటి నవీ న్, మాదాసు స్వామి, మాదాసు దేవయ్య, బండ శ్రీనివాస్, బండి ముత్తయ్య, బండి ప్రవీణ్, సంటి ఏలీయా, పురుగుల సతీశ్ తదితరులు పాల్గొన్నారు. -
గణేశ్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి
● నేడు జిల్లావ్యాప్తంగా వినాయకుల నిమజ్జనం ● సిరిసిల్లలో నిమజ్జన ఏర్పాట్లు పర్యవేక్షించిన కలెక్టర్, ఎస్పీసిరిసిల్ల: నవరాత్రులు పూజలందుకున్న గణనాథులు శనివారం గంగమ్మ ఒడికి చేరనున్నారు. జిల్లావ్యాప్తంగా 2,176 వినాయక మండలాలు ఏర్పాటు చేశారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాలు, గ్రామాల్లో శోభాయాత్రలతో వినాయకుల నిమజ్జన వేడుకలు జరగనున్నాయి. ఇప్పటికే వేములవాడలో నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా ముగియగా.. సిరిసిల్లతో పాటు ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, తంగళ్లపల్లి, వీర్నపల్లి ముస్తాబాద్, ఇల్లంతకుంట, కోనరావుపేట, బోయినపల్లి, చందుర్తి, రుద్రంగి మండల కేంద్రాల్లో వినాయకుల నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. సిరిసిల్లలో మానేరు వాగులో నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. భారీ క్రేన్లతో పాటు, గజఈతగాళ్లను సైతం సిద్ధం చేశారు. మిగతా మండలాల్లో ఆయా ప్రాంతాల్లోని వాగులు, చెరువుల్లో గణేశ్ విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో మండపాల్లో కొలువుదీరిన వినాయకులకు జియోట్యాగింగ్ చేశారు. హిందూ ఉత్సవ సమితి స్వాగత తోరణం సిరిసిల్లలోని గాంధీచౌక్ వద్ద హిందూ ఉత్సవ సమితి స్వాగత తోరణాన్ని ఏర్పాటు చేసింది. శోభాయాత్రగా నిమజ్జనానికి మానేరు తీరం వైపు వచ్చే గణనాథులకు స్వాగతం పలికేందుకు అన్ని సిద్దమయ్యాయి. జిల్లా కేంద్రంలో భారీ పోలీస్ భద్రతకు ప్రణాళిక సిద్ధం చేశారు. మరోవైపు జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో స్థానిక పోలీసులు ముందే గణేశ్ మండపాల నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించి ప్రశాంత వాతావరణంలో వేడుకగా నిమజ్జనం చేయాలని సూచించారు. వినాయకుల నిమజ్జన శోభాయాత్రలో వాహనాలు క్రమపద్ధతిలో వెళ్లాలి. శోభాయాత్రలో డీజే సౌండ్ సిస్టమ్ నిషేధం. ఎతైన విగ్రహాలు తీసుకెళ్లే మార్గంలో మధ్యలో విద్యుత్ తీగలను గమనిస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్లాలి. వాహనాల డ్రైవర్లు మంచి స్థితిలో ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్న వారు మాత్రమే నడపాలి. శోభాయాత్రలో టపాసులు కాల్చకూడదు. స్కూల్స్, ఆస్పత్రులు, ప్రార్థనా మందిరాల వద్ద పెద్ద శబ్దాలు చేయొద్దు. అత్యవసరమైన పరిస్థితుల్లో ‘సెస్’ అధికారులను విద్యుత్ తీగల కోసం, ఇతర అవసరాలకు 100కు ఫోన్ చేసి పోలీసుల సహాయం పొందాలి. గ్రామీణ ప్రాంతాల్లో దూర ప్రాంతాలకు నిమజ్జనానికి వెళ్లకుండా అందుబాటులో ఉండే కుంటలు, చెరువులు, వాగుల్లో నిమజ్జనం చేయాలి. -
సమస్యలు పరిష్కరించాలి
వేములవాడఅర్బన్: వేములవాడ మండలం అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం విద్యార్థులు కలెక్టరేట్ బాట పట్టారు. కాలినడకన తరలివెళ/్ల సమస్యలు విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగేళ్ల క్రితం ఏర్పాటు చేసిన జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో అడ్మిషన్లు తీసుకునేటప్పుడు ఆరు నెలల తర్వాత అత్యాధునిక వసతులతో కూడిన కళాశాల భవనాన్ని నిర్మిస్తామని చెప్పారని అన్నారు. ఇప్పటివరకు ఎలాంటి నిర్మాణం చేపట్టకపోవడంతో అటు డిగ్రీ కళాశాల, ఇటు ఇంజినీరింగ్ కళాశాలలో గదులు సరిపోక ఇబ్బందిగా మారిందని తెలిపారు. అధ్యాపకులు ఇద్దరు మాత్రమే గవర్నమెంట్, మిగతా వారు కాంట్రాక్ట్, గెస్ట్ ప్యాకల్టీ వారు బోధన చేస్తున్నారన్నారు. ఇప్పటికై న కళాశాలో వసతి కల్పించాలని కోరారు. -
కార్మికులకు భారం తగ్గించాలి
సిరిసిల్లటౌన్: జిల్లా ఆస్పత్రిలో పడకల(బెడ్స్)కు అనుగుణంగా శానిటేషన్ కార్మికులతోపాటు ఇతర విభాగాల్లో సిబ్బందిని నియమించాలని సీఐటీ యూ జిల్లా కార్యదర్శి కోడం రమణ కోరారు. ఈమేరకు జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్కుమార్కు వినతిపత్రం ఇచ్చారు. ఆస్పత్రి ఎదుట గురువారం ధర్నా చేపట్టి మాట్లాడారు. హామీ ప్రకారం నాలుగు రోజుల్లోపు సిబ్బందిని నియమించి పనిభారం తగ్గించాలని, లేకుంటే సోమవారం నుంచి విధులు బహిష్కరిస్తామని హెచ్చరించారు. నిబంధనల ప్రకారం 100 పడకులకు 45 మంది చొప్పున 330 పడకలకు దాదాపు 150 మంది శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్ సిబ్బంది పనిచేయాలన్నారు. కానీ 77 మందితో నెట్టుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగమణి, భాగ్య, లత, సుజాత, జయ, తిరుపతి, రవి, లావణ్య, లలిత, మమత, స్నేహ, రంగయ్య, రమ, పుష్పలత తదితరులు పాల్గొన్నారు. -
గంగమ్మ ఒడికి గణపయ్య
వేములవాడ: నవరాత్రులు ఘనంగా పూజలందుకున్న గణనాఽథుడిని వేములవాడ ప్రజలు గురువారం భక్తిభావంతో నిమజ్జనం చేశారు. ఊరేగింపుగా తరలివెళ్లి రాజన్న గుడి చెరువులో వినాయకుల నిమజ్జనం పూర్తి చేశారు. నిత్యం పూజలు, అన్నదానాలు నిర్వహించిన భక్తులు గణనాథులను అందంగా అలంకరించిన వాహనాలపై ఉంచి ర్యాలీగా తీసుకెళ్లారు. ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, సీఐలు వీరప్రసాద్, శ్రీనివాస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మున్సిపల్ కమిషనర్ అన్వేశ్ తమ సిబ్బందితో సకల ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎస్పీ మహేశ్ బి గీతే, ఆర్డీవో రాధాభాయి ఏర్పాట్లను పరిశీలించారు.రాజన్న గుడి ఎదుట వినాయకుల ర్యాలీ డోలు వాయిస్తున్న విప్ శ్రీనివాస్, ప్రతాప రామకృష్ణబోట్పై నుంచి పర్యవేక్షిస్తున్న కలెక్టర్, ఎస్పీ, విప్ -
వినూత్నం.. విజ్ఞానం
సిరిసిల్ల ఎడ్యుకేషన్: పుస్తకాల్లో ఉన్న విజ్ఞానాన్ని విద్యార్థులకు బోధించడం పరిపాటి. కానీ మిషన్–100 లక్ష్యంగా విద్యార్థులతో నూతన ఆవిష్కరణలు చేయిస్తున్నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా దమ్మన్నపేట జిల్లా పరిషత్ హైస్కూల్ భౌతికశాస్త్రం ఉపాధ్యాయుడు తాడూరి సంపత్కుమార్. తన ఉద్యోగ విరమణలోపు కనీసం 100మంది గ్రామీణ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ఆవిష్కరణకర్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మిషన్–100 కార్యక్రమం నిర్వహిస్తున్నాడు. ఇప్పటివరకు 61మంది వివిధ ఆవిష్కరణలు ప్రదర్శించగా.. వీరిలో 8మంది అంతర్జాతీయస్థాయి, 16మంది జాతీయస్థాయి, 30మందికి పైగా రాష్ట్రస్థాయి బహుమతులు గెలుచుకున్నారు. 2021, 2023లో ఇద్దరు విద్యార్థుల ఆవిష్కరణలు హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నాయి. బోచ్, ఎన్ఐఎఫ్, టీజీఐసీ సంస్థలు పిల్లల ఆవిష్కరణలకు పేటెంట్ హక్కులు పొందేందుకు సహకారం అందిస్తున్నాయి. సంపత్ కుమార్ సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2024లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందించింది.● నూతనంగా ఆలోచిస్తున్న ఉపాధ్యాయులు ● విభిన్న బోధనలతో ఆకట్టుకుంటున్న వైనం ● ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఉత్తమ అవార్డులకు పలువురి ఎంపిక ● నేడు టీచర్స్ డేఅమ్మ జన్మనిస్తుంది.. నాన్న జీవితాన్ని ఇస్తాడు. ఆ జీవితాన్ని సక్రమ దారిలో నిలబెట్టే ఏకై క వ్యక్తి గురువు. బుడిబుడి అడుగులు వేస్తూ ఓనమాలు దిద్దే వయసు నుంచి డిగ్రీ, పీజీలు పూర్తిచేసి ఉద్యోగం, వ్యాపారంలో స్థిరపడే వరకు మార్గదర్శిగా నిలుస్తారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పాఠశాల, కళాశాల, యూనివర్సిటీల్లోని గురువురు వినూత్నంగా విద్యాబోధన అందిస్తున్నారు. పుస్తకాల్లోని పాఠాలను అర్థమయ్యే రీతిలో ప్రత్యక్షంగా వివరిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. ప్రపంచీకరణ వేగాన్ని అందుకునే విధంగా సలహాలు.. సూచనలు ఇస్తూ.. విద్యార్థులు వివిధ రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దుతున్నారు. వివిధ రకాల ప్రయోగాలు చేయిస్తూ.. జాతీయస్థాయిలో పేరుపొందేలా ప్రోత్సహిస్తున్నారు. ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని పలువురు పాఠశాల ఉపాధ్యాయులు, కళాశాల అధ్యాపకులు ఉత్తమ గురువులుగా ప్రశంసలు పొందుతున్నారు. నేడు దేశ తొలి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనాలు..కాల్వశ్రీరాంపూర్: విద్యార్థుల్లో ఒకరిగా ఫ్రెండ్లీ బోధనతో వినూత్నంగా ఆలోచిస్తున్నారు ఉపాధ్యాయురాలు కోయాల్కర్ స్వప్న. 13 ఏళ్లుగా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని వివిధ పాఠశాలల్లో విద్యాబోధన చేస్తున్నా రు. ప్రస్తుతం కాల్వశ్రీరాంపూర్ ఎస్సీకాలనీ ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎంగా కొనసాగుతున్నారు. 2008లో శంకరపట్నం మండలం రాజాపూర్లో విధులు ప్రారంభించారు. ముస్తాబాద్ మండలం కొండాపూర్, కాల్వ శ్రీరాంపూర్ మండలం మల్యాలలో పనిచేశారు. ఉత్తమ విద్యాబోధన, విద్యార్థులతో ఫ్రెండ్లీగా ఉంటూ ఆటపాటలతోపాటు కృత్యాధారణ బోధన (టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్) చేస్తూనే మండలస్థాయిలో నిర్వహించే ఎఫ్ఎల్ఎన్లో రిసోర్స్ పర్సన్గా ప్రశంసలు అందుకుంటున్నారు. కాల్వశ్రీరాంపూర్ ఎస్సీ కాలనీకి గతేడాది బదిలీపై వచ్చిన స్వప్న 50మంది నుంచి 60మందికి విద్యార్థుల సంఖ్యను పెంచారు. -
ఆడపిల్లను ఎదగనిద్దాం.. చదవనిద్దాం
● జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజంసిరిసిల్ల: ఆడపిల్లను ఎదగనిద్దాం.. చదవనిద్దామని జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం కోరారు. సిరిసిల్ల ప్రభుత్వ బాలిక జూనియర్ కళాశాలలో గురువారం సంకల్ప్ కార్యక్రమం నిర్వహించారు. సంక్షేమాధికారి లక్ష్మీరాజం మాట్లాడుతూ భేటీ పడావో..భేటీ బచావోపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఆడపిల్లను పుట్టనిద్దాం, బతకనిద్దాం, చదవనిద్దాం ఎదగనిద్దామనే నినాదాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. చైల్డ్ హెల్ప్లైన్ నంబర్ 1098కు కాల్ చేయాలన్నారు. జిల్లా ప్రోగ్రాం అధికారి అంజిలీన మాట్లాడుతూ తల్లిదండ్రులు, బంధువుల బలహీనతను ఆదారం చేసుకొని చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రోగ్రాం అధికారి నయీం జహ, డెమో రాజ్కుమార్ పాల్గొన్నారు. నర్సింగ్ కాలేజీలోనూ... సిరిసిల్ల నర్సింగ్ కాలేజీలో గురువారం మహిళా సాధికారిత సంకల్ప కార్యక్రమం నిర్వహించారు. లింగ వివక్ష, లింగనిర్ధారణ, గృహహింస, బాలలపై లైంగిక వేధింపులు, బాల్యవివాహాల నిషేధం, బాలకార్మిక చట్టాలపై అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో టోల్ ఫ్రీ నంబర్, మహిళా హెల్ప్లైన్ నంబర్ 181, 112, 1098 కాల్ చేయాలని సూచించారు. మహిళా సాధికారత సిబ్బంది రోజా తదితరులు పాల్గొన్నారు. -
యూరియా కోసం అన్నదాతల ఆందోళన
మరిమడ్లలో బైఠాయించిన రైతులువీర్నపల్లిలో ఆందోళన చేస్తున్న అన్నదాతలుకోనరావుపేట/వీర్నపల్లి: యూరియా కోసం రైతులు జిల్లా వ్యాప్తంగా గురువారం ఆందోళన చేపట్టారు. సరిపోయేంత బస్తాలు రావడం లేదని రోడ్డెక్కారు. కోనరావుపేట మండలం మరిమడ్ల రైతులు ధర్నాకు దిగగా వ్యవసాయాధికారి సందీప్ వచ్చి వారితో మాట్లాడారు. యూరియా వచ్చేలా చూస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మరిమడ్లలో మాజీ సర్పంచ్ మాట్ల అశోక్, లక్కం భాస్కర్, నారాయణ, రమేశ్, రాజు, శ్రీనివాస్, వేణు పాల్గొన్నారు. వీర్నపల్లి మండల కేంద్రానికి 300 బస్తాలు రావడంతో ఆగ్రహించిన రైతులు రోడ్డుపై బైఠాయించారు. ప్రజాసంఘాల నాయకుడు మల్లారపు అరుణ్కుమార్ మాట్లాడుతూ పది రోజులుగా పడిగాపులు కాస్తే లారీ సగం లోడ్ తీసుకొచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని తహసీల్దార్ ముక్తార్పాషా, ఏఎంసీ చైర్మన్ రాములు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
యుద్ధప్రాతిపదికన మరమ్మతు చేయాలి
సిరిసిల్ల/ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఇటీవల వర్షాలతో దెబ్బతిన్న వంతెన వద్ద యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులను కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆదేశించారు. ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి శివారులోని వంతెన వద్ద దెబ్బతిన్న అప్రోచ్ రోడ్డును కలెక్టర్ గురువారం పరిశీలించారు. పది రోజుల్లోగా మరమ్మతు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సాబేరా బేగం, ఆర్డీవో వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ ఈఈ సుదర్శన్రెడ్డి, తహసీల్దార్ సుజాత, ఎంపీడీవో సత్తయ్య, పీఆర్ డీఈ శ్రీనివాస్ పాల్గొన్నారు. పారిశుధ్య పనులు చేపట్టాలిఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో పారిశుధ్య పనులు చేపట్టాలన్న కలెక్టర్ ఆదేశాలతో పంచాయతీ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. గ్రామంలోని వీధుల్లో పారిశుధ్య నిర్వహణ పనులు పూర్తి చేశారు. చెత్తా చెదారం తొలగించారు. అంగన్వాడీ విద్యార్థుల సౌకర్యార్థం తాత్కాలికంగా గ్రామపంచాయతీ భవనంలోని ఒక గదిని కలెక్టర్ ఆదేశాలతో కేటాయించారు. దీంతో చిన్నారులకు సౌకర్యాలు ఉన్న గది అందుబాటులోకి వచ్చింది. అసంపూర్తి పనులు పూర్తి చేయాలి నారాయణపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న గదుల నిర్మాణాలను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నారాయణపూర్, రాగట్లపల్లిల్లోని ప్రైమరీ పాఠశాలలను తనిఖీ చేశారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. మధ్యాహ్న భోజనాన్ని గ్యాస్ సిలిండర్పై తయారుచేయాలని నిర్వాహకులకు సూచించారు. డ్రైనేజీ, నీటి సమస్యలకు పరిష్కారం చూపాలని గ్రామపంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. రాగట్లపల్లిలోని స్కూల్కు ప్రహరీ నిర్మించాలని ఆదేశించారు. కలెక్టరేట్లో వినాయకుడి వద్ద అన్నదానం గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కలెక్టరేట్లోని వినాయకుడి వద్ద గురువారం అన్నదానం చేశారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝా అన్నదానాన్ని ప్రారంభించారు. అధికారులు, సిబ్బందికి స్వయంగా వడ్డించి, వారితో కలిసి భోజనం చేశారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, జెడ్పీ సీఈవో వినోద్కుమార్, డీఆర్డీవో శేషాద్రి, డీడబ్ల్యూవో లక్ష్మీరాజం, డీఏవో అఫ్జల్ బేగం, జిల్లా ఉద్యానవన అధికారి లత, ఇరిగేషన్ డీఈఈ ప్రశాంత్, కలెక్టరేట్ పర్యవేక్షకులు రాంరెడ్డి, శ్రీకాంత్ పాల్గొన్నారు. -
రాజన్న సిరిసిల్ల
శుక్రవారం శ్రీ 5 శ్రీ సెప్టెంబర్ శ్రీ 20257బోయినపల్లి: మిడ్మానేరులోకి 15,300 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ఎస్సారెస్పీ నుంచి 14 వేలు, మానేరు, మూలవాగుల్లోంచి 1,300 క్యూసెక్కుల నీరు వస్తోంది.ఇల్లంతకుంట: మిడ్మానేరు నుంచి 12,800 క్యూసెక్కులు అన్నపూర్ణలోకి ఎత్తిపోస్తున్నారు. ఇక్కడి నుంచి రంగనాయక సాగర్లోకి 9,900 క్యూసెక్కుల నీరు వెళ్తోంది.ఆకాశం మేఘావృతమవుతుంది. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. ఈదురుగాలులు వీస్తాయి. -
విభిన్న ప్రయత్నం.. దక్కిన గౌరవం
వేములవాడఅర్బన్: పనితీరులో వినూత్నం కనిపించిన ఉపాధ్యాయులను ప్రభుత్వం గుర్తించింది. విధులకు హాజరుకావడమే కాదు విద్యార్థుల కోసం ఇంకేమి చేయవచ్చని ఆలోచించి విభిన్నంగా చేస్తూ వారి భవిష్యత్కు బంగారు బాటలు వేస్తున్నారు జిల్లాలోని కొందరు ఉపాధ్యాయులు. ఇలాంటి కోవలోకి అగ్రహారం పాలిటెక్నిక్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ రాజగోపాల్ వస్తారు. ఆలుమ్ని టాక్స్తో గుర్తింపు వేములవాడ మండలం అగ్రహారం పాలిటెక్నిక్ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపాల్ బి.రాజగోపాల్ తన హయాంలో అగ్రహారం పాలిటెక్నిక్ కాలేజీలో బాలికల వసతిగృహం ఏర్పాటుకు ఏఐసీటీఈ నుంచి నిధులు మంజూరుకు కృషి చేశారు. 2017–18లో సృజన్ టెక్ ఫెస్టు నిర్వహించారు. 2022లో ఆలుమ్నిటాక్స్ ప్రారంభించి పూర్వ విద్యార్థుల అనుభవాలను ప్రస్తుత విద్యార్థులతో పంచుకునే వేదికను ఏర్పాటు చేశారు. సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్ కార్యక్రమాలకు గరిష్ట మార్కులతో ఎన్బీఏ గుర్తింపు పొందారు. -
ఆధ్యాత్మిక సేవలు ఆత్మసంతృప్తినిస్తాయి
● ఎస్పీ మహేశ్ బి గీతే సిరిసిల్ల: ఆధ్యాత్మిక సేవలు ఆత్మసంతృప్తినిస్తాయని ఎస్పీ మహేశ్ బి గీతే పేర్కొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని పాతబస్టాండు ఆర్యవైశ్య భవన్లో గురువారం మహా అన్నదా నాన్ని ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రతి అమావాస్య రోజు వాసవీ మాత పేరిట అన్నదానం చేయడం అభినందనీయమన్నారు. ఎస్పీ మహేశ్ బి గీతే, సిరిసిల్ల టౌన్ సీఐ కృష్ణను ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు సన్మానించారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కటుకం సత్తయ్య, ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాస్, జిల్లా సంఘం మాజీ అధ్యక్షుడు అల్లాడి శ్రీనివాస్, ప్రతినిధులు గూడెల్లి మధు, రాజూరి వాసుదేవరాయలు, చేపూరి జమున, గాలయ్య తదితరులు పాల్గొన్నారు. నేడు రేషన్షాపులు బంద్సిరిసిల్ల: జిల్లాలో శుక్రవారం రేషన్షాపులను బంద్ చేస్తున్నామని జిల్లా రేషన్ డీలర్ల సంక్షే మ సంఘం అధ్యక్షుడు రెడ్డిమల్ల హన్మాండ్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన డీలర్లకు కనీస గౌరవ వేతనం రూ.5వేలు, కమీషన్ పెంపును అమలు చేయాలని కోరుతూ ఒక్క రోజు బంద్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి 21 నెలలు గడుస్తున్నా ఎన్నికల హామీని నెరవేర్చలేదన్నారు. మార్కెట్లో పెరుగుతున్న ధరలు, షాపుల అద్దెలు, గుమస్తా భత్యం, కరెంటు బిల్లులు, ఇంటర్నెట్ చార్జీలు, దిగుమతి హమాలీ చెల్లింపుల ఖర్చులను భరించలేని స్థితిలో ఉన్నామని వివరించారు. సిరిసిల్లకల్చరల్: అలుపెరగని శ్రమతోనే జీవితంలో విజయ శిఖరాలను చేరుకుంటారని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి శ్రీనివాస్ పేర్కొన్నారు. శివనగర్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను గురువారం తనిఖీ చేశారు. కళాశాల రికార్డులు, విద్యార్థుల హాజరును సమీక్షించారు. డీఐఈవో శ్రీనివాస్ మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా నవీన బోధన నైపుణ్యాలు అలవర్చుకోవాలని అధ్యాపకులకు సూచించారు. జేఈఈ పరీక్షల కోసం ఫిజిక్స్వాలా ఆన్లైన్ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కళాశాల ప్రిన్సిపాల్ కనకశ్రీ విజయరఘునందన్, అధ్యాపకులు పాల్గొన్నారు. ఇల్లంతకుంట/తంగళ్లపల్లి: ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని డీఎంహెచ్వో రజిత పేర్కొన్నారు. ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపురం, తంగళ్లపల్లి మండలం చీర్లవంచ పీహెచ్సీలను గురువారం తనిఖీ చేశారు. గ్రామంలోని ఎస్సీకాలనీలో పర్యటించారు. డ్రై డే పాటించాలని, ఇళ్లల్లో మురికినీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. ఇంట్లోకి దోమలు రాకుండా మెష్డోర్స్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. వైద్యులు సంపత్కుమార్, రామకృష్ణ, ప్రేమ్కుమార్, హెచ్ఈవో వెంకటరమణ, కార్యదర్శి తిరుపతి పాల్గొన్నారు. సిరిసిల్లటౌన్: బాల్య వివాహాలు శిక్షార్హమని జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కవిత పేర్కొన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐసీపీఎస్, చైల్డ్ హెల్ప్లైన్ సంయుక్తంగా సిరిసిల్ల కుసుమ రామయ్య బాయ్స్ హైస్కూల్లో గురువారం పోక్సో, బాలకార్మిక చట్టాలపై అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు, పోక్సో నేరాలు జరిగితే వెంటనే 1098కు సమాచారం ఇవ్వాలని కోరారు. చైల్డ్ హెల్ప్లైన్ కేసు వర్కర్ సాయిప్రసన్న, సాయిరాం పాల్గొన్నారు. -
చీర నేసేదెప్పుడు.. కట్టేదెప్పుడు?
ఇతను కందుకూరి రమేశ్. సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్లో పవర్లూమ్స్ (మరమగ్గాల)పై ఇందిరా మహిళాశక్తి చీరల బట్టను ఉత్పత్తి చేస్తున్నాడు. పది సాంచాలపై పది గంటలపాటు పనిచేస్తే.. ఒక్కో మగ్గంపై నిత్యం 50 మీటర్ల చీరల బట్ట ఉత్పత్తి అవుతుంది. నెలంతా పనిచేస్తే రమేశ్కు రూ.20 వేల వరకు కూలీ వస్తుంది. అదే పాలిస్టర్ బట్టను ఉత్పత్తి చేస్తే నెలకు రూ.10 వేలు వస్తాయి. ఇందిరా మహిళాశక్తి చీరల బట్టను ప్రభుత్వం ఆర్డర్ చేయడంతో కూలీ డబ్బులు ఎక్కువగా వస్తాయి. ఇలా సిరిసిల్లలో 9,600 పవర్లూమ్స్పై చీరల బట్ట ఉత్పత్తి అవుతుంది. అంటే రోజుకు 4.80 లక్షల మీటర్ల బట్ట ఉత్పత్తి అవుతుంది. ఆరు నెలల కిందట చీరల ఉత్పత్తి ఆర్డర్లు ఇస్తే ఇప్పుడిప్పుడే గాడిలో పడింది. కానీ సెపె్టంబరు నెలాఖరులోగా చీరల ఉత్పత్తి లక్ష్యం నెరవేరే అవకాశం లేదు.సిరిసిల్ల: ఇందిరా మహిళాశక్తి చీరల ఉత్పత్తి లక్ష్యం చేరడం లేదు. ఉత్పత్తి నెమ్మదిగా సాగుతుండటంతో ఇప్పటికే అధికారులు రెండు సార్లు గడువు పొడిగించారు. ప్రస్తుతం పవర్లూమ్స్ సంఖ్య పెరగడంతో చీరలబట్ట ఉత్పత్తి వేగం పుంజుకుంది. సిరిసిల్లలోని 131 మ్యాక్స్ సంఘాలకు వస్త్రోత్పత్తి ఆర్డర్లు ఇచ్చారు. సిరిసిల్లతోపాటు కరీంనగర్, హనుమకొండ జిల్లాల్లోనూ చీరల ఉత్పత్తి ఆర్డర్లను అందించారు. కానీ సిరిసిల్లలో మెజార్టీ పవర్లూమ్స్ ఉండటంతో ఇక్కడే ఎక్కువగా ఆర్డర్లు ఇచ్చారు. ఫిబ్రవరిలో మొదటిసారి 2.12 కోట్ల మీటర్ల ఆర్డర్లు ఇవ్వగా.. రెండో విడతగా ఏప్రిల్లోనూ మరో 2.12 కోట్ల మీటర్ల ఆర్డర్లు ఇచ్చారు. ఈ బట్ట ఉత్పత్తికి వేములవాడలో ప్రభుత్వమే యారన్(నూలు) డిపో ఏర్పాటు చేసింది. నూలును నేరుగా కొనుగోలు చేసి బఫర్ స్టాక్గా ఉంచడానికి రూ.50 కోట్ల కార్పస్ నిధిని మంజూరు చేసింది.సిరిసిల్ల వస్త్రోత్పత్తిదారులకు నూలును 90 శాతం అరువుపై సరఫరా చేసింది. ఇప్పటి వరకు మ్యాక్స్ సంఘాలకు 2,253 మెట్రిక్ టన్నుల నూలును సరఫరా చేశారు. ఆ నూలుతో చీరల బట్ట ఉత్పత్తి అవుతుంది. అన్ని ప్రాంతాల్లోనూ బట్ట ఉత్పత్తి అవుతున్నా.. సిరిసిల్లలో స్లోగా సాగడంతో అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదు. నాణ్యత.. నవ్యత సమస్యలు సిరిసిల్లలో ఉత్పత్తి అయిన బట్ట నాణ్యతను పరిశీలించి గోదాములో సేకరిస్తున్నారు. కానీ చీరల బట్టకు బార్డర్ డిజైన్ ఉండటంతో జోట వేసిన తరువాత కినారె దగ్గర మిగిలిన పోగులను, తెగిన పోగులు చీరల ప్రింటింగ్ దగ్గర ఇబ్బందిగా మారింది. ఇటీవల సూరత్ ప్రాసెసింగ్ మిల్లులకు చీరల బట్టను పంపించగా నాణ్యత లోపాలు వెలుగు చూశాయి. తెగిన పోగులు వెంటనే మగ్గంపైనే ఎదురు పోగు కట్టి ఎక్కించాలి. ఈ సమయంలో నేతన్నలు తమ చేతులను శుభ్రంగా ఉంచుకోకపోవడంతో పోగు ఎక్కించినప్పుడు ఆ చుట్టు పక్కన పోగులు నల్లగా అవుతున్నాయి. పోగులు ఎక్కించిన తరువాతనే సాంచాలను స్టార్ట్ చేయాలి. పోగులు తెగిపోయినా సాంచాను ఆపకుండా ఉత్పతి చేయడంతో చీరల బట్ట నాణ్యత దెబ్బతింటుంది. బట్టపై చాక్పీస్, బాల్పెన్ను గుర్తులు లేకుండా చూడాలని, ప్రతి బట్ట ముక్క 30 మీటర్లకుపైగా ఉండాలని లేకుంటే రిజెక్టు చేస్తామని స్పష్టం చేశారు. చీరల బట్ట నాణ్యతపై అనేక అంశాలను సూచించారు. ఇలాంటి సమస్యలు ఉండడంతో ఇందిరా మహిళాశక్తి చీరల బట్ట ఉత్పత్తి నిదానంగా సాగుతోంది. సిరిసిల్లలో ఇందిరా మహిళా శక్తి చీర ప్రదర్శన రాష్ట్రంలోని 65 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులకు ఏకరూప చీరలను అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. గత ఏడాది ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి ఏటా మహిళా సంఘాల సభ్యులకు రెండు చీరలను ఇస్తామని ప్రకటించారు. గతంలో బతుకమ్మ చీర ఖరీదు రూ.350 ఉండగా.. ఈ ఏడాది ఇందిరా మహిళా శక్తి చీర ఖరీదు రూ.480గా నిర్ధారించారు. ఈమేరకు నాణ్యమైన నూలును ప్రభుత్వమే సరఫరా చేస్తూ చీరల బట్టను ఉత్పత్తి చేయిస్తోంది. ఈమేరకు ఆగస్టు 26న రాష్ట్ర చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చేనేత, జౌళిశాఖ కమిషనర్ శైలజారామయ్యర్ ఇందిరా మహిళాశక్తి తొలి చీరను ప్రదర్శించారు. పాలపిట్ట కలర్లో చీరను డిజైన్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి చీరల పంపిణీకి శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే రెండు గడువులు విధించినా చీరల ఉత్పత్తి లక్ష్యాన్ని వ్రస్తోత్పత్తిదారులు సాధించలేకపోతున్నారు. ఇప్పటికే సరఫరా చేసిన చీరల బట్టకు సంబంధించిన బిల్లులు పెండింగ్లో ఉండడం స్లో కావడానికి మరో కారణంగా భావిస్తున్నారు.సిరిసిల్లలో పవర్లూమ్ పరిశ్రమ స్వరూపం పవర్లూమ్స్: 26,302 మ్యాక్స్ సంఘాలు: 131నూలు డిపో ద్వారాసరఫరా అయిన నూలు: 2,253 మెట్రిక్ టన్నులుప్రస్తుతం మహిళా శక్తి చీరల బట్టను నడుపుతున్న సాంచాలు: 9,600 ఇప్పటి వరకు పొందిన చీరల బట్ట ఆర్డర్లు: 4.24 కోట్ల మీటర్లు ఇప్పటి వరకు సేకరించిన చీరల బట్ట: 1,85,28,754 మీటర్లు పవర్లూమ్స్పై ఉత్పత్తి అవుతున్న బట్ట: 69,66,656 మీటర్లు చీరల బట్ట ఇవ్వాల్సిన గడువు: సెప్టెంబర్ 30 ప్రభుత్వ ఆర్డర్లతో నేతన్నలకు పని లభించే కాలం: 6 నుంచి 8 నెలలుఇటీవల సాంచాల సంఖ్య పెరిగింది ఇటీవల చీరల బట్టను ఉత్పత్తి చేసే సాంచాల సంఖ్య పెరిగింది. మొన్నటి వరకు తక్కువ సాంచాలపై చీరల బట్ట ఉత్పత్తి అయ్యేది. బట్ట ఉత్పత్తిలో నాణ్యత సమస్యలు ఎదురయ్యాయి. కానీ ఇప్పుడు క్వాలిటీతో బట్ట ఉత్పత్తి అవుతుంది. మరిన్ని సాంచాలపై చీరల బట్టను ఉత్పత్తి చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే బట్ట ఉత్పత్తి లక్ష్యం సాధించిన మ్యాక్స్ సంఘాలకు మరిన్ని ఆర్డర్లు ఇచ్చి గడువులోగా లక్ష్యం సాధిస్తాం. – రాఘవరావు, చేనేత, జౌళిశాఖ ఏడీ, సిరిసిల్ల -
ప్రబలుతున్న జ్వరాలు
● జిల్లా ప్రభుత్వాస్పత్రికి పోటెత్తుతున్న జ్వర బాధితులు ● రోజులకొద్దీ ఆస్పత్రిలోనే చికిత్స ● ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆర్థిక దోపిడీసిరిసిల్లటౌన్/వేములవాడరూరల్: జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇటీవల వరుసగా కురిసిన వర్షాలకు దోమలు పెరగడం, నీరు కలుషితం కావడంతో డెంగీ, వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇంటికొకరు బాధితుల చొప్పున జ్వరాలతో బాధపడుతున్న వారు ఉన్నారు. జ్వరాలతో బాధపడుతూ ఆస్పత్రులకు వెళ్తున్న వారికి వారం, పది రోజులపాటు చికిత్స తీసుకుంటే కాని ఆరోగ్యం మెరుగవడం లేదు. ఇన్ని రోజులు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ ఆర్థికంగా కుదేలవుతున్నారు. చాలా మంది ప్రైవేట్ ఆస్పత్రుల్లో అంత మొత్తం బిల్లులు చెల్లించే పరిస్థితి లేక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి వస్తున్నారు. ఇలా వస్తున్న వారితో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి జ్వరపీడితులతో కిటకిటలాడుతోంది. ప్రస్తుతం జిల్లాలో మలేరియా, టైఫాయిడ్, వైరల్, డెంగీ జ్వరాలు విజృంభిస్తున్నాయి. జిల్లా ఆస్పత్రకి వస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. జిల్లాలో జ్వరాలపై గ్రౌండ్ రిపోర్టు విజృంభిస్తున్న విషజ్వరాలు జిల్లా వ్యాప్తంగా విషజ్వరాలు వ్యాపిస్తున్నాయి. వాతావరణంలో తీవ్రమార్పులతో దోమ కాటుకు గురైన జనాలు విషజ్వరాలతో అల్లాడుతున్నారు. నీరు, ఆహారం కలుషితం, వాతావరణంలో మార్పులతో విరేచనాలు, మలేరియా, డెంగీ వంటి సీజనల్ వ్యాధులు ముంచుకొస్తున్నాయి. సీజనల్ వ్యాధులతో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. సిరిసిల్లలోని జిల్లా ప్రభుత్వాస్పత్రికే రోజుకు సుమారు 700 వరకు రోగులు ఓపీ సేవల కోసం పోటెత్తుతున్నారు. వారిలో విషజ్వరాలతో వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. వేములవాడలో నిత్యం 400 మంది ఓపీవేములవాడ ఏరియా ఆస్పత్రిలో వారం రోజులుగా జ్వరబాధితుల సంఖ్య పెరిగిపోతుంది. రోజుకు 400 నుంచి 500 మంది వరకు ఆస్పత్రికి వైద్యం కోసం వస్తున్నారు. ఇందులో వంద మంది వరకు జ్వరాలతో బాధపడుతున్న వారే. జ్వరాలతో ఎలాంటి ప్రమాదం లేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య బృందం చెబుతున్నారు. బుధవారం వేములవాడ ఏరియా ఆసుపత్రికి జ్వర పీడితులు భారీగా రావడంతో హాస్పిటల్ ఆవరణ కిక్కిరిసిపోయింది. జ్వరాలు రోజుల తరబడి తగ్గకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. తీవ్ర లక్షణాలతో ఆస్పత్రికి.. సాధారణం నుంచి తీవ్రమైన జ్వరం, తలనొప్పి, ఒంటినొప్పులు, వాంతులు, విరేచనాలు, కండ్లు లాగడం వంటి లక్షణాలతో జ్వరాలు వ్యాపిస్తున్నాయి. మూత్రంలో రక్తం రావడం, నాలుక నల్లబారడం, జ్వరం తగ్గకుండా ఉంటుంది. ఎన్ఎస్ఐ ఏజీ టెస్టు పాజిటివ్ వస్తే..డెంగీ మొదటి దశలో ఉందని అర్థం. ఈదశలో రెండు, మూడురోజులు జ్వరం ఉంటుంది. ఐజీహెచ్ టెస్టు పాజిటివ్ వస్తే మోడరేట్ టు సివియర్గా పరిగణించి చికిత్స అందిస్తున్నారు. ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే డెంగీ వచ్చిందని ఆందోళన చెంది ప్రైవేట్కు వెళ్లి ఆర్థికంగా ఇబ్బంది పడొద్దని వైద్యులు సూచిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని రకాల వైద్యసేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. చికిత్సపై కలెక్టర్ నజర్ జిల్లాలో జ్వరాల తీవ్రత దృష్ట్యా కలెక్టర్ సందీప్కుమార్ ఝ వైద్యశాఖను అప్రమత్తం చేశారు. జ్వరాలు తీవ్రత అధికమైతే జిల్లా ఆస్పత్రిలో మూడు షిఫ్టుల్లో 24 గంటలపాటు సిబ్బంది వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. -
బతుకమ్మను ఘనంగా నిర్వహించుకుందాం
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రుద్రంగి(వేములవాడ): తెలంగాణ సాంస్కృతిక వారసత్వం బతుకమ్మ పండుగ అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో రూ.20లక్షలతో బతుకమ్మ తెప్పల నిర్మాణానికి బుధవారం భూమిపూజ చేశారు. విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రామకృష్టపూర్పల్లి వద్ద రూ.5లక్షలు, అచ్చయ్యకుంట వద్ద రూ.5లక్షలు, ఎల్లయ్యకుంట వద్ద రూ.10లక్షలతో బతుకమ్మ తెప్పలు నిర్మిస్తున్నట్లు వివరించారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు రూ.47కోట్లతో 132/33 కేవీ సబ్స్టేషన్ మంజూరు చేసినట్లు తెలిపారు. ఎల్లయ్యకుంట నుంచి వచ్చే ఫీడర్ ఛానల్ మరమ్మతులకు రూ.16 లక్షలు మంజూరయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. రుద్రంగి ఏఎంసీ చైర్మన్ చెలుకల తిరుపతి, గడ్డం శ్రీనివాస్రెడ్డి, ఎర్రం గంగనర్సయ్య, పల్లి గంగాధర్, గండి నారాయణ, తర్రె లింగం, గంధం మనోజ్ పాల్గొన్నారు. తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని సారంపల్లి–బద్దెనపల్లి టెక్స్టైల్ పార్క్లో గత 15 రోజులుగా చేపట్టిన పవర్లూమ్ కార్మికులు తమ సమ్మెను విరమిస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. వారు మాట్లాడుతూ చేనేత, జౌళిశాఖ అధికారులు పవర్లూమ్ కార్మికులు, యజమానులకు మధ్య జరిగిన చర్చల్లో ప్రభుత్వ వస్త్రానికి మీటర్కు 65 పైసలు పెంచినట్లు తెలిపారు. ఈమేరకు సమ్మె విరమించి విధుల్లోకి వెళ్తున్నట్లు కార్మికులు ప్రకటించారు. చర్చల్లో చేనేత, జౌళిశాఖ ఏడీ రాఘవరావు, యజమానుల సంఘం అధ్యక్షుడు అన్నల్దాస్ అనిల్కుమార్, పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్, జిల్లా అధ్యక్షుడు కోడం రమణ, పార్కు యూనియన్ అధ్యక్షుడు కూచన శంకర్, కార్మిక నాయకులు శ్రీరాముల రమేశ్చంద్ర, సంపత్, శ్రీకాంత్, ఆంజనేయులు, శ్రీనివాస్, అంబదాస్, రమేశ్, నర్సయ్య పాల్గొన్నారు. -
ట్రెండ్ మారింది
గతంలో తక్కువ సంఖ్యలోనే మండపాలు ఉండేవి. ప్రస్తుతం వందల్లో మండపాలు ఏర్పా టు చేస్తున్నారు. వేడుకల్లో ట్రెండ్ మారింది. నేటి యువత ఆర్థికంగా స్థిరపడడంతో పెద్ద ఎత్తున విరాళాలు వేసుకుంటున్నారు. – ప్రతాప రామకృష్ణ, అనువంశిక అర్చక సంఘం అధ్యక్షుడు మా అప్పుడు నవరాత్రులు అంటనే గణేశ్ మండపాల వద్ద భజనలు ఉండేవి. ఊరంతా కలిసి వచ్చేవారు. విగ్రహాలు మూడు ఫీట్ల ఎత్తు మించేవి కావు. మండపాల వద్ద ఎక్కువగా పిల్లలే కనిపించేవారు. – కట్కం భూమయ్య, సీనియర్ సిటిజన్ వినాయక నవరా త్రుల సందడి మారి పోయింది. మా చిన్నప్పటికి, ఇప్పటికీ చాలా తేడా ఉంది. మా అప్పుడు భక్తి మాత్రమే ఉండేది. ఇప్పుడు ఆర్భాటాలు పెరిగిపోయాయి. భజన చేసేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో వెళ్లేవాళ్లం. – ఉప్పుల జయలక్ష్మి, వేములవాడ -
నిరంతరం వైద్యం అందిస్తున్నాం
ఆస్పత్రిలో ఫ్లూయిడ్స్, ఇంజక్షన్లు, ఓఆర్ఎస్లు, యాంటి బయాటిక్స్ అందుబాటులో ఉన్నాయి. వెంటిలేటర్, ఆక్సిజన్ సౌకర్యం ఉంది. ఐసీయూలో పది పడకలు కేటాయించాం. ప్రె వేటు కన్నా మెరుగ్గా వైద్యం అందిస్తున్నాం. చాలా మంది ఇతర జ్వరాలతో కూడా వస్తున్నారు. డెంగీ, వైరల్ ఫీవర్స్ అయినా సరే ఉచితంగా టెస్టులు, వైద్యం అందిస్తున్నాం. నెల రోజుల నుంచి 70 మంది రోగులు జ్వరాలతో ఇన్పేషెంట్లుగా అడ్మిట్ అయ్యారు. వీరిలో 20 మందికి డెంగీ పాజిటివ్ వచ్చింది. చికిత్స అందించగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. – డాక్టర్ బి.ప్రవీణ్ కుమార్, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ ఈఏడాదిలో ఇప్పటి వరకు వరకు 15,408 వైరల్, ఇతర ఫీవర్స్ నమోదయ్యాయి. మొత్తంగా 8,796 డెంగీ టెస్టులు చేయగా జిల్లా వ్యాప్తంగా 30 పాజిటివ్ వచ్చాయి. వారంతా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు. డెంగీ, సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నాం. ర్యాపిడ్ టెస్టుల్లో డెంగీ పాజిటివ్ వస్తే టీహబ్లో ఎలీజా ఎన్ఎస్–1 టెస్టు చేసి నిర్ధారిస్తాం. – డాక్టర్ రజిత, డీఎంహెచ్వో -
‘చెప్పు’కున్నా తీరని బాధ
చందుర్తి(వేములవాడ): రైతుల బాధ చెప్పుకోలేని విధంగా మారింది. వరి పంట వేసి నెల రోజులు గడుస్తున్నా కొందరి రైతులకు ఇప్పటికీ యూరియా దొరక్కపోవడంతో ఆందోళన చెందుతున్నారు. తెల్లవారుజామునే సొసైటీ వద్దకు చేరుకుంటున్నారు. అయినా వారికి యూరియా దొరకడం లేదు. చందుర్తి సింగిల్విండో పరిధిలోని రైతులకు గత నెల 12, 13, 14 తేదీల్లో యూరియా కోసం టోకెన్లు ఇచ్చారు. ఇప్పటి వరకు యూరియా బస్తాలు మాత్రం ఇవ్వలేదు. మంగళవారం 250 బస్తాలు రావడంతో 12, 13 తేదీల టోకెన్లు ఉన్న రైతులకే ఇవ్వలేకపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇంటిదారి పట్టారు. సనుగులలోనూ ఇదే పరిస్థితి ఉంది. -
బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే నజరానా
కరీంనగర్టౌన్: కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కమలం గుర్తుపై పోటీ చేసే అభ్యర్థులను గెలిపించుకుంటే నజరానాలు అందిస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ పేర్కొ న్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు తొలిసారి కరీంనగర్కు విచ్చేసిన సందర్భంగా బుధవారం పార్టీ శ్రేణులు రేణిగుంట టోల్గేట్, అల్గునూ రు చౌరస్తా వద్ద ఘన స్వాగతం పలికారు. కరీంనగర్లోని కొండా సత్యలక్ష్మీ గార్డెన్లో ఏర్పాటు చేసిన పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ బూత్ అధ్యక్ష, కార్యదర్శుల సమావేశానికి రామచందర్రావుతో కలిసి హాజరైన బండి సంజయ్ మాట్లాడారు. ఏ గ్రా మంలోనైతే బీజేపీ అభ్యర్థిని ఎంపీటీసీగా గెలిపించుకుంటారో, ఆ గ్రామానికి రూ.5లక్షలు, ఏ మండలంలోనైతే జెడ్పీటీసీని గెలిపించుకుంటారో ఆ మండలానికి రూ.10లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారు. 9వ తరగతి విద్యార్థులకు సైకిళ్లు ఇస్తానన్నారు. వచ్చే ఏడాది విద్యాసంవత్సరం ఆరంభంలోనే 1 నుంచి 6వ తరగతి చదివే విద్యార్థులకు మోదీ కిట్లు అందిస్తానని తెలిపారు. 20 నెలల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధికి ఒక్కపైసా ఇవ్వలేదన్నారు. కేంద్ర నిధుల కోసమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నారన్నారు. బీఆర్ఎస్ చేసిన అవినీతి స్కాముల్లో బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడానికి ప్రధాన కారణం కేసీఆర్తో కాంగ్రెస్ పెద్దలు లాలూచీ పడటమేనని ఆరోపించారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. పనిచేసే కార్యకర్తలు గెలిచే అవకాశం లేకపోతే నామినేటెడ్ పదవులిచ్చి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీలు చిన్నమైల్ అంజిరెడ్డి, మల్క కొమురయ్య, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, మాజీ మేయర్లు సునీల్రావు, శంకర్, మాజీ డిప్యూటీ మేయర్ రమేశ్ పాల్గొన్నారు. -
ఆధ్యాత్మికం.. అంగరంగ వైభవం
● భక్తిప్రపత్తులతో నవరాత్రులు ● వేములవాడలో నేడు నిమజ్జనోత్సవం వేములవాడ: వినాయక నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఏ మండపంలో చూసిన కుంకుమ పూజలు.. అన్నదానాలతో కోలాటంగా కనిపిస్తున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లోగణేశ్ పూజ చేసేందుకు తరలివస్తున్న భక్తులు ముఖ్యంగా మహిళలు, చిన్నారులతో మండపాలు కళకళలాడుతున్నాయి. తొమ్మిది రోజులపాటు పూజలందుకున్న వినాయకులను వేములవాడలో గురువారం నిమజ్జనం చేయనున్నారు. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మండపాల ముస్తాబు నుంచి నిమజ్జనానికి తరలివెళ్లే సమయంలో నిర్వాహకులు ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు. ఆధ్యాత్మిక భావనల మధ్య అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. వినాయకుడిని మండపానికి తీసుకొచ్చే క్షణం నుంచే అంగరంగ వైభవంగా శోభయాత్రలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక విద్యుత్కాంతుల్లో మండపాలు మెరిసిపోతున్నాయి. మహిళలు కోలాటాలు, కుంకుమపూజల్లో ఆసక్తిగా పాల్గొంటున్నారు. నిమజ్జన శోభాయాత్రల్లో ఎక్కువగా మహిళలు కోలాటాలతో ఉత్సాహం నింపుతున్నారు. -
క్రిస్టియన్ల సమస్యల పరిష్కారానికి చర్యలు
● రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ సిరిసిల్ల: క్రైస్తవ, మైనార్టీల సమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ కోరారు. రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్లో బుధవారం కలెక్టర్ సందీప్కుమార్ ఝా, జిల్లా అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ క్రైస్తవులకు భూ సమస్యలు ఉంటే సంబంధిత లింకు డాక్యుమెంట్స్ సమర్పిస్తే పరి ష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. నిబంధనల ప్రకారం చర్చీల నిర్మాణానికి అవసరమైన అ నుమతులు 15 రోజుల్లోగా జారీ చేస్తామని తెలిపా రు. ప్రభుత్వ సంక్షేమ పథకాల రుణాలకు క్రిస్టియన్ మతం తీసుకున్న వారు అందరూ అర్హులవుతారన్నారు. పాస్టర్స్ మాట్లాడుతూ జిల్లాలో క్రైస్తవుల కోసం శ్మశానవాటిక, కమ్యూనిటీహాల్స్, చర్చీల నిర్మాణానికి అనువైన స్థలాలు కేటాయించాలని కో రారు. ఆర్టీవో రాధాభాయి, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి ఎంఏ భారతి పాల్గొన్నారు. మహిళా రక్షణ చట్టాలపై అవగాహన మహిళా రక్షణ చట్టాలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ కోరారు. మహిళల అభ్యున్నతిపై సంకల్ప్ పేరిట 10 రోజుల ప్రత్యేక కార్యక్రమాలపై ఎస్పీ మహేశ్ బి గీతేతో కలిసి సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 2 నుంచి 12 వరకు బేటి బచావో–బేటి పడావో, పీసీపీఎన్డీటీ యాక్టు, ఇందిరా మహిళాశక్తి, పనిచేసే చోట లైంగిక వేధింపులు, మహిళలకు అమలులో ఉన్న రక్షణ చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. విద్యాసంస్థలు, ప్రైవేట్ సంస్థల్లో జెండర్ సెన్సిటైజేషన్ నిర్వహించాలన్నారు. డీఆర్డీవో శేషాద్రి, డీడబ్ల్యూవో లక్ష్మీరాజం, డీఈవో వినోద్కుమార్, డీపీవో షరీఫొద్దీన్, జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత పాల్గొన్నారు. 5న జీపీవోలకు నియామకపత్రాలు జీపీవోలుగా అర్హత సాధించిన 66 మందికి నియామకపత్రాలను హైదరాబాద్లో అందిస్తారని కలెక్టర్ తెలిపారు. హైదరాబాద్కు బస్సులో తరలిస్తారని నోడల్ అధికారిగా అదనపు కలెక్టర్ నగేశ్ను నియమించినట్లు చెప్పారు. సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ ఏవో రాంరెడ్డి పాల్గొన్నారు. -
200 మందితో బందోబస్తు
● ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి వేములవాడ: పట్టణంలో గురువారం సాయంత్రం నుంచి జరిగే వినాయక నిమజ్జనోత్సవానికి 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి బుధవారం తెలిపారు. ప్రజలు శాంతియుత వాతావరణంలో నిమజ్జనం నిర్వహించుకోవాలని, పోలీసులకు సహకరించాలని కోరారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టరీత్య చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీఐ వీరప్రసాద్, ఎస్సైలు ఉన్నారు. సిరిసిల్ల: జిల్లాలోని ఏడు మండలాల్లో బుధవారం చిరుజల్లులు కురిశాయి. ఇల్లంతకుంటలో అత్యధికంగా 2.1 మిల్లీమీటర్లు, రుద్రంగిలో 0.4, వేములవాడ రూరల్లో 0.1, బోయినపల్లి లో 1.3, సిరిసిల్లలో 0.3, వీర్నపల్లిలో 1.8, గంభీ రావుపేటలో 1.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇల్లంతకుంట(మానకొండూర్): సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత శుభ్రత పాటించాలని జిల్లా ఇమ్యూనైజేషన్ వైద్యాధికారి సంపత్కుమార్ కోరారు. మండలంలోని రహీంఖాన్పేట, కందికట్కూర్ పల్లె దవాఖానాలను బుధవారం తనిఖీ చేశారు. అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్కు ప్రజలు సహకరించాలని కోరారు. వైద్యాధికారులు రామకృష్ణ, స్వరూప, రాజవ్వ పాల్గొన్నారు. సిరిసిల్ల: జిల్లాలో జ్వరాల నివారణకు ఇంటింటి సర్వే చేసి మందులు పంపిణీ చేయాలని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత కోరారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్లో బుధవారం జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాల డాక్టర్లతో సమావేశమయ్యారు. జిల్లా వైద్యాధికారి రజిత మాట్లాడుతూ ముసురు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నీరు కలుషితమవుతుందని, ఆ నీటిని తాగితే రోగాలు వస్తాయన్నారు. తప్పనిసరిగా కాచి చల్లార్చిన నీటిని తాగాలని ప్రజలకు వివరించాలన్నారు. నీరు నిల్వ ఉంటే లార్వా పెరుగుతుందన్నారు. డ్రై డేలో భాగంగా క్షేత్రస్థాయిలో పరిసరాల పరిశుభ్రతకు తీసుకోవాల్సిన చర్యలను సూచించాలన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ అంజలి ఆల్ఫ్రెడ్, అనిత, సంపత్, రామకృష్ణ, డీడీఎం కార్తీక్, అన్ని పీహెచ్సీల వైద్యాధికారులు పాల్గొన్నారు. ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి వేములవాడరూరల్: ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత సూచించారు. వేములవాడ మండలం శాత్రాజుపల్లి, నూకలమర్రిల్లో బుధవారం వైద్యబృందం పరిశీలించారు. సీహెచ్.బాలచందర్, గంగరాజు తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్లఅర్బన్: చైన్నెలో జరిగిన జాతీయస్థాయి కిక్ బాక్సింగ్లో జిల్లాకు చెందిన ఐదుగురు క్రీడాకారులు పతకాలు సాధించినట్లు మాస్టర్ వొడ్నాల శ్రీనివాస్ తెలిపారు. క్రియేటివ్ ఫామ్ వెపన్ ఓల్డర్ కెడెట్ బాలికల విభాగంలో గజ్జెల శ్వేదిక ద్వితీయస్థానంలో నిలిచింది. యంగర్ కేడెట్ బాలురలో సాయింట్ ఫైట్, లైట్ కాంటాక్ట్ ఫైట్లో గౌతమ్ ఆనంద్ రెండు కాంస్య పతకాలు సాధించాడు. ఐదో స్థానంలో నిలిచిన కర్నె యుతిక, చోడిబోయిన శివష్, షేక్ అజహస్ మోహిద్దీన్ కింది వరుసలో నిలిచారు. విద్యార్థులను వాకో ఇండి యా కిక్ బాక్సింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ సంతో ష్కుమార్ అగర్వాల్, బాక్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు అభినందించారు. -
ఇష్టారాజ్యం!
ఇంజినీరింగ్సాక్షిప్రతినిధి,కరీంనగర్: కరీంనగర్ జిల్లాలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్ల వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అడ్మిషన్ల షెడ్యూల్ వెలువడక ముందే కొన్ని కళాశాలలు సీట్లు అమ్ముకుంటున్న విషయం వెలుగుచూసింది. ఈ వ్యవహారంపై ఉన్నత విద్యామండలికి వరుస ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో సదరు కళాశాలలు అనుసరిస్తున్న అక్రమ విధానాలపై ఉన్నత విద్యామండలి అధికారులు ఫోకస్ పెట్టారని సమాచారం. ముందస్తు అడ్మిషన్ల విషయంలో కొన్ని కళాశాలలు అనుసరిస్తున్న అక్రమ వ్యవహారాలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. అసలేం జరిగింది? ఉన్నత విద్యకు కరీంనగర్ కేంద్రబిందువు. తిమ్మాపూర్ శివారులో మూడు ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. రెండు కళాశాలల నిర్వాహకులు తెలంగాణ ఇంజినీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్టు (టీజీఈఏపీసీఈటీ) నుంచి షెడ్యూలు వెలువడకముందే సీట్లను విక్రయించుకున్నారు. ఈ వ్యవహారం సాఫీగా నడిచేందుకు ప్రత్యేకంగా కొందరు పీఆర్వోలను కమీషన్ పద్ధతిన నియమించుకున్నారు. వీరు జూన్కు ముందే విద్యార్థులను వెతికి పట్టుకువచ్చారు. తెలంగాణ ఇంజినీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్టు (టీజీఈఏపీసీఈటీ) షెడ్యూల్ ప్రకారం.. జూన్ 28 నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కావాలి. శివారులోని రెండు కళాశాలలు జూన్28కి ముందు.. అంటే జూన్ 23నే ఇంజినీరింగ్ (ఈఈఈ) మేనేజ్మెంట్ కోటా సీటు కోసం రూ.10వేలు వసూలు చేశాయి. ఆ కళాశాల సమీపంలోనే మరో కళాశాల అదే ఇంజినీరింగ్ (ఈఈఈ) సీటు కోసం ఏకంగా జూన్ 23వ తేదీన రూ.45,000కు అలాట్ చేసింది. ఇప్పుడు సదరు విద్యార్థులు చెల్లించిన ఫీజు రిసిప్టులు ఆన్లైన్లో ప్రత్యక్షమయ్యాయి. సోషల్మీడియాలోనూ వైరల్గా మారాయి. వాస్తవానికి ఈ తరహాలో పీఆర్వోలు అనేక ఇంజినీరింగ్ సీట్లను నిబంధనలకు విరుద్ధంగా కమీషన్ పద్ధతిన అప్పగించారని విమర్శలు వెల్లువెత్తతున్నాయి. ఇష్టానుసారంగా ఇంజినీరింగ్ సీట్లు అమ్ముకోవడంపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.తిమ్మాపూర్ పరిధిలోని రెండు ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలలపై ఉన్నత విద్యామండలికి ఫిర్యాదులు వెళ్లాయి. నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్ షెడ్యూల్కు ముందే సీట్ల విక్రయాలు జరిగాయంటూ పలువురు ఉన్నత విద్యామండలిని ఆశ్రయించారు. వాస్తవానికి తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) ప్రతీ కళాశాలకు ఫీజు నిర్ణయిస్తుంది. ఇక్క డ రెండు కళాశాలలు ఆ నిబంధనలను తుంగలోకి తొక్కడం గమనార్హం. ఈ రెండు కళాశాలల్లో ఒకటి మేనేజ్మెంట్ కోటాలో సీటుకు రూ. 63,000గా నిర్ణయించింది. సదరు కళాశాల అదనంగా రూ.7000 జోడించి రూ.70,000గా ఫీజు అని చెప్పింది. ఈ విషయంలో కాలేజీకి, విద్యార్థికి మధ్య విభేదాలు తలెత్తాయి. తన వద్ద అదనపు ఫీజు వసూలు చేయడంపై సదరు విద్యార్థి ఉన్నత విద్యామండలికి రిసిప్టులతో కలిపి ఫిర్యాదు చేశాడు. పొరుగున మరో కళాశాల అయితే ఏకంగా రూ.20,000 అదనంగా కలిపి వసూలు చేస్తోంది. వాస్తవానికి డెవలప్మెంట్ ఫీజు, అడ్మిషన్ ఫీజులో అదనపు వసూళ్లు కళాశాలలే నిర్ణయిస్తాయి. కానీ, బోధన ఫీజులోనూ కాలేజీలో మార్పులు చేయడంపై విద్యార్థులు మండిపడుతున్నారు. త్వరలోనే ఈ వ్యవహారంపై ఉన్నత విద్యామండలి సదరు కాలేజీలకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది. -
ఆలయ విస్తరణ పనులు ప్రారంభం
వేములవాడ: రాజన్న ఆలయ విస్తరణ పనుల్లో భాగంగా మంగళవారం నుంచి గుడి చెరువులోని భవనాల కూల్చివేతలు ప్రారంభించారు. ఇందులో జరిగే నిత్యకల్యాణాలు, సత్యనారాయణవ్రతాలు, హోమాలను ఓపెన్స్లాబ్లోకి మార్చారు. భక్తులు తలనీలాలు సమర్పించుకునే కల్యాణకట్టను త్వరలో కూల్చేయనున్నారు. భీమేశ్వరాలయంలో దర్శనాలకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. వేములవాడ: రాజన్న ఆలయంలోని పలు విభాగాలను ఈవో రమాదేవి మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. సెంట్రల్ గోదాం, లడ్డు ప్రసాదం కౌంటర్, ప్రధాన బుకింగ్ కౌంటర్తోపాటు కల్యాణకట్ట, నూతనంగా ఏర్పాటు చేసిన స్వామివారి నిత్యకల్యాణం, చండీహోమం, సత్యనారాయణవ్రతం నిర్వహించే ప్రదేశాలను పరిశీలించారు. ఆయా విభాగాల ఇన్చార్జీలు, ఇంజినీరింగ్ అధికారులతో సమావేశమయ్యారు. భక్తులతో మర్యాదపూర్వకంగా మెదలాలని ఆలయ సిబ్బందికి సూచించారు. అనంతరం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాజన్న క్షేత్రం భక్తులు లేక బోసిపోయింది. ఇల్లంతకుంట(మానకొండూర్): ఉపాధిహామీ లో చేపట్టిన పనుల్లో అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని డీఆర్డీవో శేషాద్రి హెచ్చరించారు. మండల పరిషత్లో మంగళవారం నిర్వహించిన 15వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదికలో మాట్లాడారు. 2024–25లో ఇల్లంతకుంటలోని 33 గ్రామపంచాయతీల్లో ఈజీఎస్ కింద రూ.5.69 కోట్ల పనులు, పంచాయతీరాజ్ కింద రూ.2.78కోట్ల పనులు చేపట్టినట్టు తెలిపారు. ఎంపీడీవో శశికళ, ఏవీ వో రామారావు, ఏఎన్వీ అరుణ్కుమార్, ఏఈ ఈ రాజేశ్, ఏపీవో చంద్రయ్య పాల్గొన్నారు. వేములవాడరూరల్: అంగన్వాడీ సెంటర్కు వచ్చే చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని డీడబ్ల్యూవో లక్ష్మీరాజం సూచించారు. వేములవాడ రూరల్ మండలంలోని హన్మాజిపేట, జయవరం, మల్లారం, లింగంపల్లి, బొల్లారం గ్రామాల్లోని అంగన్వాడీ సెంటర్లను మంగళవారం తనిఖీ చేశారు. సిరిసిల్ల: జిల్లా వ్యాప్తంగా మంగళవారం ముసురు వర్షాలు కురిశాయి. ఎల్లారెడ్డిపేటలో అత్యధికంగా 26.9 మిల్లీమీటర్లు, ఇల్లంతకుంటలో 18.9, రుద్రంగిలో 10.3, చందుర్తిలో 11.8, వేములవాడ రూరల్లో 12.9, బోయినపల్లిలో 12.3, వేములవాడలో 15.9, సిరిసిల్లలో 12.1, కోనరావుపేటలో 5.2, వీర్నపల్లిలో 7.6, గంభీరావుపేటలో 6.1, ముస్తాబాద్లో 12.3, తంగళ్లపల్లిలో 10.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. గిరిజన యువతకు శిక్షణసిరిసిల్ల కల్చరల్: సెంటర్ ఫర్ నానో సైన్స్, ఇంజినీరింగ్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు ఆధ్వర్యంలో గిరిజన పరిశోధన సమాచారం, విద్య, కమ్యూనికేషన్, ఈవెంట్స్పై ‘సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ – క్యారెక్టరైజేషన్ శిక్షణ్ఙ అనే ప్రాజెక్ట్ నందు గిరిజన యువతకు శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి సంగీత తెలిపారు. https:// www.cense.IIsc.ac.in. వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. -
ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి
సిరిసిల్లఅర్బన్: ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందన్నారు. అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడం సరికాదన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గుండెల్లి కల్యాణ్కుమార్, ఉపాధ్యక్షుడు జూపల్లి మనోజ్కుమార్, గర్ల్స్ కన్వీనర్ సంజన, జిల్లా కమిటీ సభ్యులు సాయిభరత్, శివ పాల్గొన్నారు. -
యూరియా ప్రైవేటు దోపిడీ
● అధిక ధరలకు యూరియా ● అవసరాన్ని క్యాష్ చేసుకుంటున్న వ్యాపారులు ● ఆందోళనలో అన్నదాతలు ‘వేములవాడ మండలంలోని ఓ గ్రామానికి చెందిన రైతు మంగళవారం యూరియా బస్తాలు కొనుగోలు చేసేందుకు వేములవాడ పట్టణానికి వచ్చాడు. ప్రైవేట్ వ్యాపారి వద్దకు వెళ్లగా రూ.300లకు ఒక్కో బస్తా చొప్పున విక్రయించాడు. ప్రభుత్వం రూ.266.50 విక్రయిస్తుండగా అక్కడ సరిపోయేంత దొరక్కపోవడంతో ప్రైవేట్ వ్యాపారిని ఆశ్రయించాడు. రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకున్న వ్యాపారి ధరలు పెంచడంతో చేసేదేమి లేక వ్యాపారి చెప్పినంత ఇచ్చి యూరియా బస్తాలు తీసుకెళ్లాడు.’ వేములవాడరూరల్: యూరియా కొరత.. రైతుల అవసరాన్ని ప్రైవేట్ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. అవకాశం ఉన్నప్పుడు దండుకోవాలన్న దుర్బుద్ధితో యూరియా అధిక ధరలకు విక్రయిస్తున్నారు. సొసైటీలు, ఐకేపీ సెంటర్లలో యూరియా కొరత ఉండడంతో వ్యాపారి చెప్పినంత చెల్లించి యూరియా బస్తాలు తీసుకెళ్తున్నారు. ఓ వైపు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా అధికారులు హెచ్చరిస్తున్నా వ్యాపారులు మాత్రం ధనార్జనే ధ్యేయంగా ముందుకెళ్తున్నారు. యూరియా బస్తాను రూ.266.50లకు విక్రయించాల్సి ఉండగా రూ.300 తీసుకుంటుండడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. తప్పని పరిస్థితుల్లో ప్రైవేటు డీలర్ల కొంటున్నామని పలువురు వాపోయారు. రశీదులు ఉండవు ప్రైవేటు డీలర్లు యూరియా బస్తాలను అధిక ధరలకు విక్రయిస్తుండడంతోపాటు రైతులకు రశీదులు ఇవ్వడం లేదు. రశీదుల గురించి అడిగితే రశీదులు ఇవ్వమంటున్నట్లు తెలిసింది. ఒక యూరియా బస్తా కావాలంటే రూ.225 పెట్టి నానో యూరియా బాటిల్ కొనాల్సిందే. లేకుంటే యూరియా బస్తా ఇవ్వడం లేదని పలువురు రైతులు తెలిపారు. మహిళా సంఘాల ద్వారా సరఫరా జిల్లాలో 26 కేంద్రాలకు ప్రభుత్వం ఆధ్వర్యంలో యూరియా సరఫరా చేస్తున్నారు. సిరిసిల్లలో 1, తంగళ్లపల్లి 2, ఇల్లంతకుంట 2, గంభీరావుపేట 2, ముస్తాబాద్ 2, ఎల్లారెడ్డిపేట 2, వీర్నపల్లి 2, వేములవాడ 1, వేములవాడరూరల్ 2, కోనరావుపేట 3, చందుర్తి 2, రుద్రంగి 2, బోయినపల్లిలో 2 కేంద్రాల్లో యూరియా బస్తాలను ప్రభుత్వం ద్వారా సరఫరా చేస్తున్నట్లు వ్యవసాయాధికారులు తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే యూరియాను విక్రయించాలి. ఎవరైనా అధిక ధరలకు విక్రయిస్తే ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. యూరియా బస్తాతోపాటు నానో యూరియా కొనుగోలు చేయాలని నిబంధనలు లేవు. రైతులు ఇష్టం మీదనే ఆధారపడి ఉంటుంది. ఇప్పటి వరకు జిల్లాకు 14,700 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. – అప్జల్ బేగం, జిల్లా వ్యవసాయాధికారి -
సులభ పద్ధతిలో బోధించాలి
● కలెక్టర్ సందీప్కుమార్ ఝా గంభీరావుపేట(సిరిసిల్ల): విద్యార్థులకు సులభమైన పద్ధతిలో పాఠ్యాంశాలు బోధించాలని అప్పుడే పట్టు సాధిస్తారని కలెక్టర్ సందీప్కుమార్ ఝా పేర్కొన్నారు. గంభీరావుపేట మండలం నర్మాల సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయాన్ని మంగళవారం తనిఖీ చేశారు. పాఠశాలలోని అన్ని తరగతి గదులు, వంటగదిని పరిశీలించారు. విద్యార్థులకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్, హిందీ పాఠాలను బోధించారు. గదుల్లోకి దోమలు, పురుగులు, పాములు రాకుండా కిటికీలకు మెష్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లి, వెంకటాపూర్ ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేశారు. పోతిరెడ్డిపల్లిలో 25 మంది విద్యార్థులుండగా.. మరో విద్యావలంటీర్ను నియమించాలని ఆదేశించారు. కిచెన్షెడ్ నిర్మించాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు. గ్రామంలో వెంటనే పారిశుధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు. కంప్యూటర్ ల్యాబ్ అందుబాటులోకి తేవాలని, గ్రీన్బోర్డులు ఏర్పాటు చేయాలని త ఎలిపారు. పాఠశాల ప్రిన్సిపాల్ సృజన, ఏఎంసీ చైర్పర్సన్లు కొమిరిశెట్టి విజయ, సాబేర బేగం, ఆర్డీవో వెంకటేశ్వర్లు, తహసీల్దార్ మారుతిరెడ్డి, ఎంపీడీవో రాజేందర్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు హమీద్ పాల్గొన్నారు. రోడ్ల మరమ్మతుకు ప్రతిపాదనలు భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న రహదారుల మరమ్మతులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మండలంలో దెబ్బతిన్న రోడ్లు, మిషన్ భగీరథ పైపులైన్లు, విద్యుత్ పరికరాలను పరిశీలించారు. వర్షాలు తగ్గే వరకు రైతులు, మత్స్యకారులు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆర్థికసాయం అందజేత గంభీరావుపేట: మండలంలోని నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టు వద్ద నీటి ప్రవాహంలో గల్లంతైన నాగయ్య కుటుంబానికి సీఎం రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వం తరఫున రూ.5లక్షల ఆర్థికసాయాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మంగళవారం అందించారు. నాగయ్య ఆచూకీ కోసం అధికారులు మానేరు పరివాహక ప్రాంతంలో గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వరదలో చనిపోయిన పశువుల యజమానులకు పరిహారం చెక్కులు పంపిణీ చేశారు. లింగన్నపేటకు చెందిన గడ్డమీది మణేమ్మకు రూ.లక్ష, ప్రవీణ్గౌడ్కు రూ. 50వేల చొప్పున చెక్కులను అందించారు. ఏఎంసీ చైర్పర్సన్ కొమిరిశెట్టి విజయ, ఆర్డీవో వెంకటేశ్వర్లు, పశుసంవర్ధకశాఖ అధికారి రవీందర్రెడ్డి, తహసీల్దార్ మారుతిరెడ్డి, ఎంపీడీవో రాజేందర్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మండ్లు, మండలశాఖ కాంగ్రెస్ అధ్యక్షుడు హమీద్, నాయకులు అంజిరెడ్డి, తిరుపతి, రాజనర్సు తదితరులు పాల్గొన్నారు. -
కాచి చల్లార్చిన నీటిని తాగాలి
సిరిసిల్ల: వర్షాల నేపథ్యంలో కాచి చల్లార్చిన నీటినే తాగాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఎస్.రజిత కోరారు. పెద్దూరు, ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్, గొల్లపల్లి ఆరోగ్య కేంద్రాల పరిధిలో మంగళవారం డ్రై డే నిర్వహించారు. డీఎంహెచ్వో మాట్లాడుతూ జ్వరపీడితులను గుర్తించి చికిత్స అందించాలన్నారు. ఇళ్లలోని డ్రమ్ములు, కుండీలు, తొట్లల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని సూచించారు. పరిసరాలలో చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. రెండు డాక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం జిల్లాలో రెండు డాక్టర్ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆదేశాలు జారీ చేశారని జిల్లా వైద్యధికారి ఎస్.రజిత మంగళవారం తెలిపారు. నేషనల్ హెల్త్ మిషన్ స్కీం(ఎన్హెచ్ఎంఎస్)లో గైనకాలజిస్ట్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 5లోగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్లో దరఖాస్తు చేయాలని కోరారు. గైనకాలజిస్ట్కు రూ.లక్ష, సివిల్ అసిస్టెంట్ సర్జన్కు రూ.50వేలు జీతం ఉంటుందని తెలిపారు. -
జోహార్ వైఎస్సార్
వేములవాడఅర్బన్: వేములవాడ మున్సిపల్ పరిధి తిప్పాపూర్ తెలంగాణ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి వర్ధంతి నిర్వహించారు. వైఎస్సార్ చిత్రపటానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పూలమాల వేసి నివాళి అర్పించారు. విప్ మాట్లాడుతూ వైఎస్సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చేసిన సేవలు మరవలేనివన్నారు. పార్టీ పట్టణాధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ కనికరపు రాకేశ్, సాగరం వెంకటస్వామి, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు. -
అన్నపూర్ణలో 2 టీఎంసీలు
ఇల్లంతకుంట: అన్నపూర్ణ జలాశయంలో ప్రస్తుతం నీటి మట్టం రెండు టీఎంసీలకు చేరింది. 12,800 క్యూసెక్కులు వస్తుండగా, 6,600 క్యూసెక్కులు రంగనాయక సాగర్లోకి వెళ్తున్నాయి. ఆకాశం మేఘావృతమవుతుంది. జిల్లాలో స్వల్పంగా వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. జై కేసీఆర్వేములవాడఅర్బన్: మాజీ సీఎం కేసీఆర్పై బురదజల్లే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని వేములవాడ మాజీ జెడ్పీటీసీ మ్యాకల రవి పేర్కొన్నారు. వేములవాడ మండలం నందికమాన్ నుంచి మంగళవారం బీఆర్ఎస్ నాయకులు బైకు ర్యాలీ తీశారు. మండలంలోని ఆరెపల్లి శివారులోని మిడ్మానేరు ప్రాజెక్ట్ బ్యాక్వాటర్లో కేసీఆర్ చిత్రపటానికి కాళేశ్వరం నీటితో అభిషేకం చేశారు. సెస్ డైరెక్టర్ రేగులపాటి హరిచరణ్రావు, ఆర్సీ రావు, తదితరులు పాల్గొన్నారు. -
రైల్వేలైన్ మట్టికి అనుమతులు పొందాలి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝాసిరిసిల్ల: రైల్వేలైన్ నిర్మాణానికి మట్టి తరలింపునకు అనుమతులు పొందాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా సూచించారు. కలెక్టరేట్లో సోమవారం రైల్వే ఇంజినీర్లతో సమీక్షించారు. తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్ శివారులోని చండ్రవాగు చెరువు నుంచి లక్ష క్యూబిక్ మీటర్ల మట్టిని కేటాయించగా ఇప్పటి వరకు 90,672 క్యూబిక్ మీటర్ల మట్టి తరలించారన్నారు. సిరిసిల్లలో రైల్వేస్టేషన్ నిర్మాణం, రైల్వేలైన్ నిర్మాణం కోసం సమీపంలో గల పాయింట్ నుంచి అవసరమైన మట్టి తరలింపు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ప్రతీ విద్యార్థిపై శ్రద్ధ పెట్టాలని, నిత్యం రాయించ డం, చదివించడం చేయాలని ఉపాధ్యాయులకు కలెక్టర్ సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ఇందిరమ్మ ఇళ్లు వేగంగా పూర్తి చేయాలి ఇందిరమ్మ ఇళ్లు వేగంగా పూర్తి చేయించాలని అధి కారులకు సూచించారు. మండలాలవారీగా మంజూరు చేసిన ఇళ్లు, నిర్మాణంలో ఉన్న ఇళ్లపై సమీక్షించారు. ఇసుక ట్రాక్టర్కు రూ.1500 కంటే ఎక్కువ వసూలు చేస్తే అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. ఎస్పీ మహేశ్ బి గీతే, అదనపు కలెక్టర్ నగేశ్, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబాయి, రైల్వే ఇంజినీర్ మూర్తి, కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రవీణ్, హౌసింగ్ పీడీ శంకర్రెడ్డి పాల్గొన్నారు. -
యూరియా ఇప్పించండి సార్లూ..
● జిల్లా వ్యాప్తంగా రైతుల రాస్తారోకో ● వేకువజాము నుంచే క్యూలైన్లు ● అయినా దొరకని బస్తాలురెండ బస్తాల కోసం గంటల తరబడి.. వీర్నపల్లి మండలం గర్జనపల్లికి 400 బస్తాల యూరియా వచ్చిందని తెలుసుకున్న రైతులు 300 మంది తరలివచ్చారు. పోలీసులు క్యూలైన్లో నిల్చోబెట్టి ఒక్కో రైతుకు రెండు బస్తాలు ఇప్పించారు. అయినా గంటల తరబడి క్యూలైన్లో ఎదురుచూసేందుకు ఇబ్బంది పడ్డారు. కూపన్లతోనే సరి ఇల్లంతకుంట మండలంలోని వివిధ గ్రామాల రైతులకు సోమవారం ఇల్లంతకుంట రైతువేదికలో యూరియా కూపన్లను వ్యవసాయాధికారులు అందజేశారు. అనంతారం, రహీంఖాన్పేట, రేపాక, సిరికొండ, వంతడుపుల, ఇల్లంతకుంట గ్రామాల రైతులకు సాగు విస్తీర్ణాన్ని బట్టి 750 వరకు కూపన్లు అందజేసినట్లు ఏవో సురేశ్రెడ్డి తెలిపారు. ఏఈవోలు రవళి, అర్చన, లలిత, అభిషేక్, గంగ, తదితరులు పాల్గొన్నారు. ఎదురుచూపులే.. యూరియా కోసం తెల్లవారుజామున 3 గంటలకు వచ్చిన రైతులకు మధ్యాహ్నం దాటిన బస్తాలు దొరక్కపోవడంతో అలసిపోయారు. చేసేదేమి లేక తమ వంతు వచ్చే వరకు ఎదురుగా ఉన్న షెట్టర్ల వద్ద పడుకున్నారు. మండల కేంద్రంలోని సాయిజ్యోతి గ్రామైక్య సంఘానికి 225 బస్తాలు వచ్చాయి. మిషన్ పనిచేయకపోవడంతో మంగళవారం ఇస్తామని అధికారులు చెప్పడంతో చేసేదేమి లేక వెనుదిరిగి వెళ్లిపోయారు. యూరియా ఇదేం‘దయా’ ! వేములవాడలోని ప్రైవేట్ ఫర్టిలైజర్స్ దుకాణాల ఎదుట యూరియా కోసం రైతులు సోమవారం బారులుతీరారు. పత్తి, వరిపంటలకు యూరియా అవసరం కావడంతో పెద్ద సంఖ్యలో రైతులు తరలివచ్చారు. ఒక్కో రైతుకు ఒక యూరియా బస్తా, అర లీటర్ నానో యూరియా డబ్బాను ఇస్తున్నారు. వీటి కోసం రైతులు గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉండి తీసుకెళ్తున్నారు. వేములవాడలో 8 మందిపై కేసు -
అర్జీలు పరిష్కరించాలి
● కలెక్టర్ సందీప్కుమార్ ఝా ● ప్రజావాణిలో 126 దరఖాస్తుల స్వీకరణసిరిసిల్ల అర్బన్: ప్రజావాణి అర్జీలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి రెవెన్యూ అధికారి గడ్డం నగేశ్, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబాయి, జెడ్పీ సీఈవో వినోద్కుమార్, డీఆర్డీవో శేషాద్రిలతో కలిసి అర్జీలు స్వీకరించారు. మొత్తం 126 దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులు పెండింగ్లో పెట్టవద్దని, ఎప్పటికప్పుడు సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. -
ఎన్నికల హామీలు అమలు చేయడం లేదు
వేములవాడ: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్ ఎందుకు పెంచడం లేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిక ప్రశ్నించారు. మహాగర్జన సన్నాహక సదస్సును స్థానిక భీమేశ్వర గార్డెన్లో సోమవారం నిర్వహించారు. మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా పెన్షన్లు పెంచకుండా మోసం చేస్తుందన్నారు. సడిమెల శోభారాణి, పుట్ట రవి, లక్ష్మణ్, గుండ థామస్, ఆవునూరి ప్రభాకర్, భిక్షపతి, శ్రీధర్, ప్రతాప్, సాహిత్య, దేవరాములు, నారాయణ పాల్గొన్నారు. -
ముసురుకున్న వాన
సిరిసిల్ల: జిల్లా వ్యాప్తంగా సోమవారం మళ్లీ ముసురు వర్షం కురిసింది. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వానలు ఆదివారం గెరువచ్చి సోమవారం మళ్లీ కురిశాయి. వీర్నపల్లి మండలంలో అత్యధికంగా 27.1 మిల్లీ మీటర్లు, రుద్రంగిలో 14.6, చందుర్తిలో 8.9, వేములవాడ రూరల్లో 10.9, బోయినపల్లిలో 14.8, వేములవాడలో 7.8, సిరిసిల్లలో 6.0, కోనరావుపేటలో 10.4, ఎల్లారెడ్డిపేటలో 7.4, గంభీరావుపేటలో 4.2, ముస్తాబాద్లో 2.5, తంగళ్లపల్లిలో 9.9, ఇల్లంతకుంటలో 9.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మూడు రోజులు వైన్స్ బంద్సిరిసిల్ల: మూడు రోజులపాటు వైన్స్(మద్యం) షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు, కల్లు విక్రయాలు నిలిపివేయాలని కలెక్టర్ సందీప్కుమా ర్ ఝా సోమవారం ఆదేశాలు జారీ చేశారు. వినాయక నిమజ్జనం నేపథ్యంలో గురువారం నుంచి ఆదివారం ఉదయం వరకు బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సిరిసిల్లటౌన్: అర్బన్బ్యాంకులో పాలకవర్గం, అధికారుల చర్యలపై విచారణ చేపట్టాలని బ్యాంకు ప్రాథమిక సభ్యులు సోమవారం జిల్లా సహకార అధికారికి ఫిర్యాదు చేశారు. సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి అధ్యక్షుడు బియ్యంకార్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన బ్యాంకు వార్షిక మహాసభలో ప్రాథమిక సభ్యులపై బ్యాంకు చైర్మన్ అవమానకరంగా ప్రవర్తించారని ఆరోపించారు. మహాసభ అనుమతి లేకుండా పాలకవర్గం సిట్టింగు ఫీజులు అధికంగా తీసుకుంటున్నారని, ఆరేళ్లుగా సీఈవో పోస్టును రిటైర్డ్ ఉద్యోగితో రూ.70వేల వేతనం ఇస్తూ నడిపించడం బ్యాంకు అభివృద్ధికి కంటకమన్నారు. చిప్ప దేవదాసు, కుసుమ గణేష్, వేముల పోశెట్టి, బోడ శ్రీనివాస్ ఉన్నారు. సిరిసిల్లటౌన్: యూరియా కష్టాలకు బీజేపీ ఎంపీల చేతగానితనమేనని సీపీఐ పట్టణ కార్యదర్శి పంతం రవి విమర్శించారు. సిరిసిల్లలోని కార్మిక భవనంలో సోమవారం నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. బీసీల బిల్లు విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ గోడమీద పిల్లిల్లా వ్యవహరిస్తున్నాయన్నారు. కడారి రాములు, సోమ నాగరాజు, కేవీ అనసూర్య, ఎనగంటి రాజు, గాజుల లింగం పాల్గొన్నారు. సిరిసిల్ల అర్బన్: టెక్స్టైల్ పార్కు కార్మికుల కూలి పెంచేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూషం రమేశ్ కోరారు. కలెక్టరేట్ ఎదుట సోమవారం కార్మికులతో కలిసి ధర్నా చేసిన సందర్భంగా మాట్లాడారు. టెక్స్టైల్ పార్క్ కార్మికుల కూలి పెంచాలని 14 రోజులుగా సమ్మె చేస్తున్నా యజమానులు పట్టించుకోవడం లేదన్నారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం ఇవ్వగా.. స్పందించిన ఆయన చేనేత జౌళిశాఖ ఏడీకి విషయం చెప్పి కూలీ పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నాయకులు కూచన శంకర్, కోడం రమణ, జెల్ల సదానందం, సంపత్, శ్రీకాంత్, రవి పాల్గొన్నారు. సిరిసిల్లటౌన్: పట్టణంలో సంచార పశువులను యజమానులు వెంటనే రోడ్లపై నుంచి తీసుకెళ్లాలని మున్సిపల్ కమిషనర్ ఖదీర్పాషా సూచించారు. రోడ్లపై పశువులు సంచరిస్తుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజా వాణిలో వచ్చిన ఫిర్యాదు మేరకు ప్రకటన వి డుదల చేశారు. ట్రాఫిక్ అంతరాయంతో వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయని పేర్కొన్నారు. మూడు రోజుల్లోగా పశువులను తరలించకుంటే రాజన్న ఆలయ గోశాలకు తరలిస్తామని హెచ్చరించారు. -
ముందుంది ముప్పు
ఈ ఫొటోలు సిరిసిల్ల కొత్తచెరువు మత్తడికాల్వకు పురాతన, ప్రస్తుతానికి సంబంధించినవి. ఒకప్పుడు ఇక్కడ నాలా ఆనవాళ్లు కనిపిస్తుండగా.. దాని ద్వారా నీళ్లు కిందికి వెళ్లేందుకు రూ.50లక్షలతో కల్వర్టును దశాబ్దం క్రితం నిర్మించారు. ప్రస్తుతం ఇది కబ్జాకు గురైంది. ఇక్కడి స్థలాలు కోట్ల విలువ పలుకుతుండడంతో మాజీ ప్రజాప్రతినిధులు, రియల్టర్లు కలిసి కాలువ భూమిని కబ్జా చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. కొత్తచెరువు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే మానేరునదిలో కలిసే మత్తడినీటి కాలువ ఇప్పుడు ఆనవాళ్లు కోల్పోయింది.మీరు చూస్తున్నది రాయించెరువు పురాతన మత్తడి కాలువకు సంబంధించిన పురాతన, ప్రస్తుత చిత్రాలు. ఇప్పుడు చెరువు లేదు. సర్కారు పట్టాలు చేసి కార్మికులకు అందించింది. లోతట్టు ప్రాంతం కాబట్టి వరదనీరు పోవడానికి కాలువను అలాగే వదిలేయగా.. ఇప్పుడు ఇలా కబ్జాకు గురైంది. ఇది చెరువు నుంచి గోపాల్నగర్ మీదుగా రెండు కిలోమీటర్ల దూరం వరకు ప్రవహించి మానేరువాగులో కలిసేది. కాల్వ ఆనవాళ్లు లేకుండా చేసి ఇక్కడ నిర్మాణాలు జరిగాయి. సంబంధిత శాఖల అధికారులకు తెలిసి కూడా కాల్వస్థలాన్ని ఆధీనంలోకి తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.సిరిసిల్లటౌన్: నాలాల కబ్జాలు.. కాల్వల మాయంతో ఇటీవల కామారెడ్డి పట్టణం వరదలతో ముంచెత్తింది. కబ్జాలపర్వాన్ని అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరించడంతోనే ఇలా జరిగిందనే విమర్శలు వచ్చాయి. గతంలోనూ సిరిసిల్ల పట్టణాన్ని వరదలు ముంచెత్తాయి. ఆ సమయంలో కాల్వల కబ్జాలను తొలగిస్తామన్న అధికారులు అనంతరం చూసీచూడనట్లుగానే ఉంటున్నారు. ఇప్పటికై నా కబ్జాలను కన్నెర్ర చేస్తేనే రానున్న కాలంలో ఎంతటి వరదనైనా తట్టుకునే శక్తి సిరిసిల్లకు ఉంటుంది. లేకుంటే వరదల్లో చిక్కుకునే ప్రమాదాలు ఉన్నాయి. సిరిసిల్ల పట్టణంలోని చెరువుల కాల్వలు ఏళ్లుగా దురాక్రమణకు గురైన తీరుపై గ్రౌండ్ రిపోర్ట్. పట్టణ విస్తరణతో.. సిరిసిల్ల పట్టణం విస్తరించడంతో శివారులోని చెరువులు పట్టణంలో అంతర్భాగమయ్యాయి. ఒకప్పుడు ఊరి శివారులో ఉండే రాయించెరువు, తుమ్మలకుంట స్థలాల్లో పట్టణం ఏర్పడింది. అవి లోతట్టు ప్రాంతాలు కావడంతో సాధారణ వర్షాలకు సైతం వరదనీరు పోటెత్తుతుంది. ఎగువప్రాంతం నుంచి వచ్చే వరదనీరు కిందికి వెళ్లేందుకు కాల్వలు లేక ముంపునకు గురువుతున్నాయి. ఈదులచెరువు, అర్జునకుంట, దేవునికుంట, మైసమ్మకుంట, దామెరకుంట స్థలాలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. పట్టణంలోని కొత్తచెరువు, కార్గిల్లేక్ కాల్వలు, బఫర్జోన్, ఎఫ్టీఎల్ లెవెల్ స్థలాలు కబ్జాకు గురయ్యాయి. ఇటీవల చెరువులు, కాల్వ లకు ముప్పై ఫీట్ల దూరంలోపే నిర్మాణాలు జరుగుతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెరువు సర్వేనంబర్ విస్తీర్ణం(ఎకరాల్లో) కాలువ(కి.మీ) కొత్తచెరువు 1471 85.05 4 రాయించెరువు 703 152.10 3 ఈదులచెరువు 991 77.29 1.5 అర్జునకుంట 757 22.36 1 దేవునికుంట 1121 9.28 1.5 మైసమ్మకుంట 1294 11.02 1 దామెరకుంట 232,233 7.38 2 తుమ్మలకుంట 142,143 29.23 2 వర్ధనికుంట – – – చినుకొస్తే మునకేనా.. పూర్వీకులు వ్యవసాయం, తాగునీటి అవసరాల కోసం సిరిసిల్ల చుట్టూ తొమ్మిది చెరువులను గొలుసుకట్టు పద్ధతిలో నిర్మించారు. ఇందులో రాయించెరువు, తుమ్మలకుంటలు నివాస స్థలాలుగా మారడంతో వాటి ఆనవాళ్లు కనుమరుగయ్యాయి. కొత్తచెరువు, కార్గిల్లేక్లు పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చెందాయి. ఇవి నీటిపారుదల శాఖ, మున్సిపల్ శాఖల ఆధీనంలో ఉన్నాయి. అర్జునకుంట, ఈదులచెరువు, దేవునికుంట, మైసమ్మకుంట, దామెరకుంట రెవెన్యూశాఖ ఆధీనంలో ఉన్నాయి. కొత్తచెరువు, కార్గిల్లేక్ స్థలాలు, మత్తడి కాల్వలు కబ్జాకు గురైనట్లు ఇరిగేషన్ అధికారులే చెబుతున్నా చర్యలు చేపట్టడం లేదు. సిరిసిల్ల ఎగువ ప్రాంతంలోని బోనాల తదితర చెరువుల కట్టలు భారీ వర్షాలకు తెగిపోయి నీరు పట్టణంలోకి వస్తుంది. ఈ సమయంలోనే అన్ని చెరువుకట్టలను పటిష్ట పర్చడంపై అధికారులు దృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు.నాడునేడు -
వర్షం పడితే వరదలే..
కొన్నాళ్ల నుంచి వర్షం పడితే చాలు ఆటోనగర్ ప్రధాన రోడ్డు వెంట వరదనీరు వస్తుంది. గతంలో ఇలాంటి పరిస్థితి లేదు. కొత్తచెరువు తదితర చెరువుల నాలాలు కబ్జాకావడంతో వాటి గుండా వాగులోకి చేరాల్సిన నీరు మా ప్రాంతాన్ని ముంపునకు గురిచేస్తుంది. శాశ్వత వరదకాల్వ నిర్మిస్తేనే సమస్య పరిష్కారమవుతుంది. – వేముల శ్రీనివాస్, ఆటోనగర్ పాతబస్టాండు ప్రాంతంలో ఇటీవల కురిసిన వర్షం నీరు నిలువడలేదు. ఇప్పటికే ఆ ప్రాంతంలో డ్రైనేజీలో చెత్త నిలువకుండా చేశాం. వర్షాకాలంలో సిబ్బందిని నిరంతరం పర్యవేక్షణలో ఉంచుతున్నాం. కొత్తచెరువు నాలా, సంజీవయ్యనగర్ కమాన్ వద్ద డ్రైనేజీల నిర్మాణానికి ప్రణాళికలు పూర్తయ్యాయి. అనుమతులు రాగానే పూర్తి చేస్తాం. నాలాలు, ప్రధాన డ్రైనేజీల వద్ద హెచ్చరికబోర్డులు ఏర్పాటు చేశాం. – ఎంఏ ఖదీర్పాషా, మున్సిపల్ కమిషనర్, సిరిసిల్ల -
రాహుల్గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ నిరసన
సిరిసిల్లటౌన్: ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. జిల్లా కేంద్రంలో ఆదివారం రాహుల్గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తల్లిని అవమానించేలా చేసిన అసభ్యకర వ్యాఖ్యలను ఖండించారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అసభ్య రాజకీయాలు చేస్తోందన్నారు. భవిష్యత్లో ఇలాంటి వ్యాఖ్యలు కొనసాగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. నాయకులు పల్లం అన్నపూర్ణ, పండుగ మాధవి, నర్సయ్య కొండ నరేశ్, మోర శ్రీహరి, మెరుగు శ్రీనివాస్, దేవరాజ్, మ్యాన రాంప్రసాద్, శ్రీనివాస్ పాల్గొన్నారు. అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం బీజేపీ పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఖండించారు. రాహుల్గాంధీ వ్యాఖ్యలపై నిరసన తెలపకుండ ముందస్తుగా నిర్బంధించడాన్ని వ్యతిరేకించారు. పౌరుల హక్కులను హరించేలా కాంగ్రెస్ పార్టీ చర్యలున్నాయన్నారు.ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవంసిరిసిల్ల అర్బన్: మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురష్కరించుకొని ఆదివారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి రాందాస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సైకిల్ర్యాలీ నిర్వహించారు. సిరిసిల్లలోని మినీస్టేడియం నుంచి రాజీవ్నగర్ బైపాస్రోడ్డు వరకు సైకిల్ ర్యాలీ చేపట్టారు. అనంతరం జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. సిరిసిల్ల: రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట నిరసన చేపడుతున్నట్లు టీజీఈజేఏసీ ప్రకటించింది. కలెక్టరేట్ వద్దకు ఉద్యోగులు ఉదయం 10 గంటలకు రావాలని కోరారు. కలెక్టరేట్ గేట్ ఎదుట ఒక గంట నిరసన తర్వాత భారీ ఎత్తున నిర్వహిస్తున్న హైదరాబాద్ సభకు తరలివెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు. -
టోకెన్లు ఇచ్చి.. యూరియా మరిచారు
చందుర్తి(వేములవాడ): సింగిల్విండో సిబ్బంది టోకెన్లు ఇచ్చి 20 రోజులు గడుస్తున్నా యూరియా బస్తాలు ఇవ్వడం లేదని మండల కేంద్రంలో ఆదివారం రైతులు నిరసన తెలిపారు. రైతు సంక్షేమసంఘం మండలాధ్యక్షుడు చిలుక పెంటయ్య మాట్లాడుతూ ఈనెల 12న యూరియా బస్తాలు ఇస్తామని జిల్లా వ్యవసాయాధికారి ఆధ్వర్యంలోనే సింగిల్విండో సిబ్బంది టోకెన్లు ఇచ్చారని.. 20 రోజులు గడుస్తున్నా యూరియా ఇవ్వడం లేదన్నారు. రామన్నపేట మాజీ సర్పంచ్ దుమ్ము అంజయ్య, రైతులు ఏరెడ్డి రాజిరెడ్డి, లక్కర్సు మహేశ్, దుద్దిళ్ల లచ్చిరెడ్డి, నల్మాస్ రవీందర్రెడ్డి, లింగాల నారాయణ, మర్రి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. యూరియా కోసం రైతుల ఆందోళన కోనరావుపేట(వేములవాడ): మండలంలోని నిజామాబాద్లో రైతులు యూరియా కోసం ఆందోళనకు దిగారు. రైతుల అవసరాలకు సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని మండల వ్యవసాయాధికారి సందీప్తో ఫోన్లో మాట్లాడించడంతో రైతులు ఆందోళన విరమించారు. -
బడిపిల్లల మామిడిపండ్ల గంప
● 23 మంది విద్యార్థుల కథలపుస్తకం ● ఆలోచింపజేస్తున్న బందనకల్ బడిపిల్లల కథలు ● సృజనాత్మకతను చాటిన చిన్నారులుముస్తాబాద్(సిరిసిల్ల): కథలు చదివే వయసులో పుస్తకాలు రాస్తున్నారు. చుట్టూ జరిగే సంఘటనల ఆధారంగా కథను చెబుతున్నారు. అందరూ ఇంగ్లిష్ మీడియం.. ఐఐటీ, నీట్ ఫౌండేషన్ కోర్సులంటూ పరుగులు పెడుతున్న కాలంలో పుస్తకాల పఠనమే తగ్గిపోతోందని పలు సర్వేలు చెబుతున్నాయి. ఈ సమయంలోనే ముస్తాబాద్ మండలం బందనకల్ ప్రభుత్వ బడిపిల్లలు ఏకంగా కథల పుస్తకాన్ని ప్రచురించారు. తమకు వచ్చిన ఆలోచనకు చూసిన సంఘటనను ఇతివృత్తంగా తీసుకొని 23 మంది కథలు రాశారు. వీరి కథలను ‘మామిడిపండ్ల గంప’ సంపుటి పుస్తకాన్ని ఇటీవల ఆవిష్కరించారు. దశాబ్దకాలంగా సాహిత్యబాటలో.. బందనకల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పదేళ్ల క్రితమే ‘బందనకల్ బాల కవిత్వం’ పేరుతో పద్య కవిత్వం తీసుకొచ్చారు. చక్కని తెలుగు పదాలతో రాసిన కవితలు ఆకట్టుకున్నాయి. అప్పటి ప్రధానోపాధ్యాయుడు విఠల్నాయక్, తెలుగు భాష ఉపాధ్యాయుడు రమణారెడ్డి విద్యార్థులను ప్రోత్సహించి కవితలు రాయించారు. అదే సాహిత్య వారసత్వాన్ని కొనసాగిస్తూ ఈసారి కథల సంపుటిని తీసుకొచ్చారు. మామిడి రసాల మాదిరిగా వీరి కథలు చదివిన కొద్దీ మళ్లీ మళ్లీ చదవాలనిపిస్తోంది. ఇప్పుడు ప్రధానోపాధ్యాయుడు రాజ్కుమార్, తెలుగు పండితులు రాములు, వెంకటగోపాలాచారి విద్యార్థులు కథలు రాసేలా ప్రోత్సహించారు. చుట్టూ జరిగే సంఘటనలే ఆధారంగా కథలు రాశారు. పదిహేనేళ్ల క్రితం ముస్తాబాద్ జెడ్పీ విద్యార్థులు ‘జాంపండ్లు’ పేరుతో తీసుకొచ్చిన కథల సంపుటి వీరికి ప్రేరణగా నిలిచింది. బాలసాహితీ వేత్త గరిపెల్లి అశోక్ మార్గదర్శకంలో వచ్చిన ‘జాంపండ్లు’ కథలు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు ముందుచూపుగా నిలిచింది. నేషనల్ బుక్ట్రస్టు జిల్లాలో నిర్వహించిన వర్క్షాపులు భవిష్యత్ కవులు, రచయితలను తయారు చేసింది. మామిడిపండ్ల ఘుమఘుమలు బందనకల్ బడిపిల్లల కథలలోకి వెళ్తే నిత్యం చూస్తున్న సంఘటనలను ఇతివృత్తాలుగా తీసుకున్నారు. నీతి, నిజాయితీ, నమ్మకం, స్నేహం, బాధ్యత, కనువిప్పు, ప్రకృతి, మార్పు మంచిదే.. వంటి సందేశం ఇచ్చే కథలను రాశారు. చిన్నారుల కలం నుంచి జాలువారిన కథలు అందరిని ఆలోచింపజేస్తున్నాయి. అమ్మమాట, మల్లమ్మ, చెట్టంత ఆలోచన వంటి 23 కథలు పుస్తకంలో ఉన్నాయి. ఒక్కో కథను ఒక్కో విద్యార్థి రాయడం విశేషం. మరిన్ని పుస్తకాలు తెస్తామని విద్యార్థులు, ఉపాధ్యాయులు తెలిపారు. -
అన్నపూర్ణలోకి 4 పంపులతో ఎత్తిపోతలు
● ప్రాజెక్టు చరిత్రలో తొలిసారి ● ప్రస్తుత నీటి నిల్వ 1.41 టీఎంసీలుఇల్లంతకుంట(మానకొండూర్): అన్నపూర్ణ ప్రాజెక్టు నిర్మాణం తర్వాత తొలిసారి శనివారం నాలుగు పంపులతో నీటిని ఎత్తిపోస్తున్నారు. మల్లన్నసాగర్ పనులు పూర్తి కావడంతోనే నాలుగు పంపులతో నీటిని ఎత్తిపోస్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. కాళేశ్వరం ప్యాకేజీ–10లో భాగంగా ఇల్లంతకుంట మండలం అనంతగిరి వద్ద అన్నపూర్ణ ప్రాజెక్టును 3.5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. రిజర్వాయర్ నిర్మాణంలో అనంతగిరి, కొసగుట్టపల్లి గ్రామాలు పూర్తిగా మునిగిపోయాయి. సోమారంపేట, అల్లీపూర్, ఎల్లయ్యపల్లి గ్రామాల్లోని భూములు పాక్షికంగా ముంపునకు గురయ్యాయి. ప్రాజెక్టు కింద 30వేల ఎకరాల ఆయకట్టు ఇల్లంతకుంట, బెజ్జంకి, గన్నేరువరం మండలాల్లో ఉంది. ప్రాజెక్టుకు ఉన్న మెయిన్ కెనాల్కు ఏడు మైనర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ ఉన్నాయి. 12,800 క్యూసెక్కులు మిడ్మానేరు నుంచి నాలుగు పంపులతో 12,800 క్యూసెక్కుల నీటిని అన్నపూర్ణలోకి ఎత్తిపోస్తున్నారు. ఇక్కడి న ఉంచి రంగనాయకసాగర్లోకి 9,900 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఒక్క రోజు నాలుగు పంపుల ద్వారా ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అన్నపూర్ణ ప్రాజెక్టులో 1.41 టీఎంసీల నీటి నిల్వ ఉంది. పంపుల ప్రారంభోత్సవంలో ఇరిగేషన్ ఎస్ఈడీ రవీందర్రెడ్డి, డీఈఈ ప్రతాపరెడ్డి, ఏఈఈలు నాగేందర్, సమరసేన, వంశీ, నాగేశ్వరరావు, విజయ్కుమార్ పాల్గొన్నారు. -
సీపీఎస్ రద్దు చేయాలి
సిరిసిల్లఎడ్యుకేషన్: కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దుచేసి పాత పెన్షన్ అమలు చేయాలని కోరుతూ పీఆర్టీయూ ఆధ్వర్యంలో సిరిసిల్లలో శనివారం బైక్ ర్యాలీ నిర్వహించారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు గన్నమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ 2004, సెప్టెంబర్ 1వ తేదీ తర్వాత నియామకమైన ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని కోరారు. ప్రధాన కార్యదర్శి ఎడ్ల కిషన్, జిల్లా గౌరవ అధ్యక్షుడు నీలి శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు చిప్ప యాదగిరి, గుర్రం మల్లారెడ్డి, రాజు, అనిల్, మధు తదితరులు పాల్గొన్నారు. -
సాహిత్యంతో చిన్నారుల్లో సృజనాత్మకత
● ‘మామిడిపండ్ల గంప’ కథ సంపుటి ఆవిష్కరణ ● బందనకల్ బడిపిల్లల కథలుముస్తాబాద్(సిరిసిల్ల): సాహిత్యంతో చిన్నారుల్లో సృజనాత్మకత పెంపొంది భవిష్యత్లో అనేక రంగాల్లో రాణిస్తారని ఎంపీడీవో లచ్చాలు పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలం బందనకల్ జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాసిన ‘మామిడిపండ్ల గంప’ కథ సంపుటిని శనివారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ నేడు విద్యార్థులు కంప్యూటర్, డిజిటల్ ప్రపంచంలో మునిగి గ్రామాలు, పల్లెలను మరచిపోతున్నారన్నారు. వారిలో కృత్రిమత్వం పెరిగి ఆవిష్కరణలకు దూరంగా ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో బందనకల్ విద్యార్థులు 23 కథలను రాయడం అభినందనీయమని పేర్కొన్నారు. సాహిత్యం, గేయం, కథలు బతికి ఉన్నప్పుడే మానవ మనుగడ సాధ్యమన్నారు. విద్యార్థులను ప్రోత్సహించిన హెచ్ఎం రాజ్కుమార్, ఉపాధ్యాయుడు చారిని అభినందించారు. ఎంఈవో రాజిరెడ్డి, క్లస్టర్ హెచ్ఎం రాధాకిషన్రావు, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ వెంకటస్వామి, హెచ్ఎం రాజ్కుమార్, సాహితీవేత్త గరిపెల్లి అశోక్, నాయకులు శ్రీనివాస్రెడ్డి, వెంకట్రెడ్డి, తుపాకుల రవి పాల్గొన్నారు. -
విద్యార్థుల భవిష్యత్కు దిశ చార్ట్ : ఎస్పీ
సిరిసిల్ల: విద్యార్థుల భవిష్యత్కు దిశను చూపించేందుకు కెరీర్ చార్ట్ ఉపయోగపడుతుందని ఎస్పీ మహేశ్ బి గీతే పేర్కొన్నారు. వేములవాడకు చెందిన వీడీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు దండు వినోద్, కార్యదర్శి అమరగొండ అజయ్ రూపొందించిన కెరీర్చార్ట్ను శనివారం ఆవిష్కరించారు. ఎస్పీ మాట్లాడుతూ పదోతరగతి తరువాత ఏయే కోర్సులు చేయవచ్చు, డిగ్రీ, మాస్టర్స్లోనూ ఏ కోర్సులు ఎంచుకుంటే.. ఎలాంటి అవకా శాలుంటాయని చార్ట్ను తయారు చేయడం అభినందనీయమన్నారు. డీఈవో వినోద్కుమార్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి శ్రీనివాస్లకు కెరీర్చార్ట్ను అందించారు. సిరిసిల్లకల్చరల్: స్వామి రామానంద్ తీర్థ రూరల్ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ గిరిజ న యువతకు స్వయం ఉపాధినిచ్చే పలు కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా గి రిజనాభివృద్ధి అధికారి సంగీత శనివారం తెలిపారు. అకౌంట్స్ ఆఫీసర్(ట్యాలీ), కంప్యూటర్ హార్డ్వేర్ అసిస్టెంట్, ఆటోమొబైల్, టూ వీలర్ సర్వీసింగ్, సోలార్ సిస్టమ్ ఇన్స్టలేషన్, సర్వీస్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులని పేర్కొన్నారు. యాదాద్రి జిల్లా పోచంపల్లి మండలం జలాల్పూర్లోని రామానంద తీర్థ గ్రామీణ సంస్థ కార్యాలయంలో సెప్టెంబర్ 1వ తేదీలోపు దరఖాస్తులు అందజేయాలని సూచించారు. -
వరద దండిగా.. ప్రాజెక్టులు నిండుగా..
సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఇటీవల కురిసిన వర్షాలకు ప్రాజెక్టులు గరిష్ట నీటిమట్టానికి చేరుకున్నాయి. ఉమ్మడి జిల్లాలో గోదావరిపై నిర్మించిన ఎల్లంపల్లి, మానేరు మీద నిర్మించిన ఎగువ, మధ్య, దిగువమానేరు ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటితో కళకళలాడుతున్నాయి. కామారెడ్డి ఎగువ ప్రాంతాలు, ఎస్సారెస్పీ, వరద కాలువ నుంచి వస్తున్న వరద క్రమంగా తగ్గుముఖం పట్టింది. దీంతో మానేరు ప్రాజెక్టుల నుంచి దిగువనకు నీటి విడుదల నిలిపివేశారు. ఎగువమానేరు పూర్తిస్థాయి నీటి మట్టం 2టీఎంసీలు కాగా, ప్రస్తుతం అదేస్థాయిలో నీటిమట్టం ఉంది. ప్రాజెక్టులోకి 5,798 క్యూసెక్కుల నీరు వస్తుండగా.. 5,798 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. మిడ్మానేరు ప్రాజెక్టు నుంచి నీటి విడుదల నిలిపివేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 27 టీఎంసీలు కాగా ప్రస్తుతం 25 టీఎంసీల నీరు ఉంది. ప్రాజెక్టుకు కీలకమైన మూలవాగు, వరద కాలువ, మానేరు నదుల నుంచి ఇప్పటికీ 20వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. మొన్న వర్షాల సమయంలో ఇన్ఫ్లో 60 వేల క్యూసెక్కుల వరకు వెళ్లిన విషయం తెలిసిందే. 12,930 క్యూసెక్కుల ఔట్ఫ్లోను దిగువకు వదులుతున్నారు. లోయర్మానేరు డ్యాంకు ఇన్ఫ్లో దాదాపుగా నిలిచిపోయింది. నిన్న మొన్నటి వరకు 50వేల క్యూసెక్కులుగా ఉన్న ఇన్ఫ్లో మిడ్మానేరు నీటిని నిలిపేయగానే 293 క్యూసెక్కులకు పడిపోయింది. మోయతుమ్మెద, మానేరు నది నుంచి వరద నిలిచిపోయింది. ప్రస్తుతం ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండిన నేపథ్యంలో వానాకాలం, యాసంగి వరకు వ్యవసాయానికి ఇబ్బంది లేదని నీటిపారుదల శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎల్లంపల్లికి పొటెత్తిన వరద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద అనూహ్యంగా పెరిగింది. మహారాష్ట్రలో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా ఎగువ నుంచి గోదావరికి వరదపోటు పెరగడమే ఇందుకు కారణం. బుధవారం వరకు 5 లక్షల క్యూసెక్కుల వరకు వచ్చిన వరద.. అనూహ్యంగా ప్రస్తుతం 7,60,652 క్యూసెక్కులకు పెరిగింది. కాగా 7,35,847 క్యూసెక్కుల ఔట్ఫ్లో కిందికి వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 20 టీఎంసీలుకాగా, ప్రస్తుతం 13.33 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంచుతున్నారు. రెండేళ్ల క్రితం ప్రాజెక్టులో పూర్తిస్థాయి నిల్వ ఉన్న సమయంలో ఎగువ నుంచి ఆకస్మికంగా భారీస్థాయిలో వచ్చిన వరదతో గోదావరిఖని పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి. అందుకే, 13 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంచి 62 గేట్లకుగాను 37 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి ప్రస్తుతం ఎగువమానేరు 2 2 మధ్యమానేరు 27 25 లోయర్మానేరు 24 21 ఎల్లంపల్లి 20 13 -
‘కార్మికులు పస్తులు ఉంటున్నారు’
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ప్రజాపాలనలో పవర్లూమ్ కార్మికులు పస్తులు ఉండాల్సి వస్తోందని యాజమాన్యం ఆధిపత్యం కోసం కార్మికులు అవస్థలు పడుతున్నారని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు శ్రీరాముల రమేశ్చంద్ర ఆరోపించారు. కార్మికులు చేపట్టిన సమ్మె శనివారం 12వ రోజుకు చేరుకోగా వారికి సంఘీబావం తెలిపి మాట్లాడారు. ప్రభుత్వ ఆర్డర్ వస్త్రానికి కార్మికుడికి రోజుకు రూ.వెయ్యి కూలి అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సోషల్ వెల్ఫేర్ వస్త్రానికి మీటర్కు రూ.20 లాభం యజ మానులు తీసుకుంటూ కార్మికులకు కూలి పెంచకపోవడం దుర్మార్గమన్నారు. కూలి పెంచే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. టెక్స్టైల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కూచన శంకర్, జెల్ల సదానందం, మహేశ్, కనకయ్య, కిషన్, శ్రీకాంత్, సంపత్, శ్రీనివాస్, వెంకటేశ్, ఆంజనేయులు, భాస్కర్, సత్యనారాయణ, రమేశ్, అంబదాస్, రాజేశ్, శంకర్, వేణు, రాజశేఖర్, రవి పాల్గొన్నారు. -
కేటీఆర్ చొరవతో సాగునీటి కాలువ శుభ్రం
గంభీరావుపేట(సిరిసిల్ల): మండల కేంద్రంలోని చెరువులకు నీరు రావడం లేదని, కాలువలు శుభ్రం చేస్తే చెరువుల్లోకి నీరు వస్తుందని బీఆర్ఎస్ నాయకులు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్కు విన్నవించారు. సానుకూలంగా స్పందించిన కేటీఆర్ వెంటనే హిటాచి వాహనాన్ని సమకూర్చారు. శనివారం నుంచి ఫీడర్ చానల్ శుభ్రం చేసే పనులు ప్రారంభమయ్యాయి. కాలువల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, చెట్లపొదలను తొలగిస్తున్నారు. పనులను నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు పరిశీలించారు. బీఆర్ఎస్ నాయకులు వెంకటస్వామిగౌడ్, వెంకటియాదవ్, కమలాకర్రెడ్డి, బండ రమేశ్, రత్నాకర్, కిశోర్, నర్సింగారావు, ఎగదండి స్వామి, గంధ్యాడపు రాజు, దయాకర్రావు తదితరులు ఉన్నారు. -
పంట నష్టం.. రైతు కష్టం
● అన్నదాతల శ్రమ వరదపాలు ● 561 ఎకరాల్లో పంటనష్టం ● ‘సెస్’కు రూ.50లక్షల మేరకు నష్టం ● ప్రాథమిక అంచనాల్లోనే అధికారులుకొట్టుకుపోయిన వరి చేనును చూస్తున్న ఇతను ఉప్పలాయ చిన్ననర్సయ్య. గంభీరావుపేట మండలం నర్మాలకు చెందిన చిన్ననర్సయ్య వరిపొలం ముదురు కలుపునకు వ చ్చింది. కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో ఎగువమానేరు నిండి మత్తడి పోయడంతో ఎకరంన్నర పొలం కొట్టుకుపోయింది. సిరిసిల్ల: ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు వచ్చిన వరదలతో జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ముదురు కలుపునకు వచ్చిన వరిపంట కొట్టుకుపోయింది. వ్యవసాయాధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం జిల్లాలో 341 మంది రైతులు 561 ఎకరాల్లో వరిపంట నష్టపోయినట్లు లెక్క కట్టారు. వ్యవసాయాధికారుల అంచనాల్లో పత్తి పంట లెక్కలోకి రాలేదు. పత్తి పంటను లెక్కలోకి తీసుకుంటే పంట నష్టం మరింత పెరిగే అవకాశం ఉంది. వరద తెచ్చిన నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలో తెలియక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఏడు మండలాల్లో తీవ్ర నష్టం గంభీరావుపేట, కోనరావుపేట, బోయినపల్లి, ము స్తాబాద్, ఎల్లారెడ్డిపేట, ఇల్లంతకుంట, వేములవా డరూరల్ మండలాల్లో వరి, పత్తి పంటలకు నష్టం వాటిల్లింది. వరి కోతకు గురికాగా.. పత్తి నీట ముని గింది. మానేరు, మూలవాగుల వెంట ఉన్న గ్రామాల్లో పంటభూములు కోతకు గురయ్యాయి. రైతులకు పరిహారం ఇప్పించాలని కోరుతున్నారు. కూలిన ఇళ్లు.. రాలిన కన్నీళ్లు పాత ఇళ్లు కూలిపోయాయి. నిలువ నీడ లేక నిర్వాసితులు దిక్కులు చూస్తున్నారు. మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలోనూ సిమెంట్, సలాక పిల్లర్ గొయ్యిల్లో మునిగిపోయాయి. ఇలా జిల్లా వ్యాప్తంగా పంటలే కాకుండా భారీ వర్షాలతో ఆస్తి నష్టాలు జరిగాయి. క్షేత్రస్థాయిలో సర్వేలు చేసి నిర్వాసితులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది.ఇది గంభీరావుపేట మండలం నర్మాల–కోళ్లమద్ది మధ్య లోలెవల్ వంతెన వద్ద విద్యుత్ స్తంభాలు వంగిపోయిన ప్రదేశాన్ని ‘సెస్’ చైర్మన్ చిక్కాల రామారావు, గంభీరావుపేట ‘సెస్’ డైరెక్టర్ నారాయణరావు, ఏడీఈ శ్రీనివాస్ శనివారం పరిశీలించారు. వంగిన స్తంభాలను, నేలపై పడిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను, విద్యుత్ తీగలను బాగు చేసేందుకు రూ.50లక్షల మేరకు ఖర్చు అవుతుందని ‘సెస్’ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. తంగళ్లపల్లి మండలంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కూలిపోయింది.ఇది రోడ్డు అనుకుంటున్నారా.. వరదలకు కొట్టుకుపోయింది అనుకుంటున్నారా.. అసలే కాదు. ఎగువమానేరు మత్తడిపోయడంతో నర్మాల వద్ద కొట్టుకుపోయిన పంట పొలం. -
ఠాణాకు చేరిన చేపల చెరువు పంచాయితీ
చందుర్తి(వేములవాడ): రెండు జిల్లాల సరిహద్దు మండలాల మధ్య ఉన్న చేపల చెరువు పంచాయితీ చందుర్తి ఠాణాకు చేరింది. చందుర్తి మండలం కొత్తపేట, జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తుర్తికి చెందిన గ్రామస్తులకు కొద్ది రోజులుగా రెండు గ్రామాల మధ్య గల అటవీ ప్రాంతంలోని తీగలకుంట చెరువు వివాదాస్పదంగా మారింది. కొత్తపేటకు చెందిన ముదిరాజ్లు ఈ చెరువుపై ఏళ్లుగా తమకే హక్కు ఉందంటూ చందుర్తి పోలీసులను ఆశ్రయించారు. దీంతో కథలాపూర్ మండలం తుర్తికి చెందిన ముదిరాజ్లను పోలీసులు శనివారం పిలిపించగా తాము కూడా ఈ చెరువులోనే చేపలు పట్టుకుంటున్నామని తెలిపారు. ఇరు వర్గాలు కలిసి సరిహద్దు సర్వే చేయించుకోవాలని ఎస్సై రమేశ్ సూచించారు. హద్దులు తేలే వరకు చెరువులోకి వెళ్లవద్దని స్పష్టం చేశారు. ఈమేరకు ఇరు గ్రామాల వారు అంగీకరించారు. -
పెద్దపల్లి–నిజామాబాద్ లైన్లో ‘వందేభారత్’
● కామారెడ్డి ట్రాక్ రిపేర్ నేపథ్యంలో మళ్లింపుసాక్షిప్రతినిధి,కరీంనగర్: పెద్దపల్లి–నిజామాబాద్ లైన్లో వందేభారత్ ఎక్స్ప్రెస్ పరుగులు తీస్తోంది. రాత్రి 11 గంటలకు ఎగువన ఉదయం 4 గంటలకు దిగువన ఇదే మార్గంలో పెద్దపల్లి బైపాస్ మీదుగా నడుస్తోంది. ఇటీవలే ముంబయి నుంచి జాల్నా వరకు నడుస్తున్న 20706 వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును నాందేడ్ వరకు పొడిగించారు. కానీ.. ఈ రైలు ప్రాథమిక నిర్వహణ చర్లపల్లిలో చేస్తున్నారు. ఇది నాందేడ్ నుంచి చర్లపల్లి వరకు వయా నిజామాబాద్– కామారెడ్డి మార్గంలో ఖాళీ రైలుతో దిగువ వైపు, మళ్లీ వచ్చేటప్పుడు కూడా చర్లపల్లి నుంచి నాందేడ్ వరకు ఖాళీ రైలుతో నడుస్తుంది. రెండు రోజుల క్రితం కామారెడ్డి రైల్వే స్టేషన్కు సమీపంలో పట్టాలు వరద నీటిలో కొట్టుకుపోవడంతో నిజామాబాద్ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లే రైళ్ల రాకపోకలు స్తంభించాయి. ఫలితంగా ఈ మార్గంలో నడుస్తున్న పలు రైళ్లను నిజామాబాద్– పెద్దపల్లి బైపాస్–కాజీపేట మార్గంలో దారి మళ్లించి నడుపుతున్నారు. భవిష్యత్తులో ఈ మార్గం గుండా వందే భారత్, నమో భారత్ ర్యాపిడ్, అమృత్ భారత్ లాంటి రైళ్లు ప్రవేశ పెడితే ఈ ప్రాంత ప్రయాణికులకు మరింత సౌకర్యం కలిగే అవకాశం ఉంటుందని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. -
అపారనష్టం
గంభీరావుపేట(సిరిసిల్ల): అన్నదాతలకు కష్టమొచ్చింది.. ఆపై నష్టమొచ్చింది. విపరీత వరదలతో పంటపొలాలు నీట మునిగాయి. కొన్ని పొలాల్లో ఇసుకమేటలు వేసింది. ఎన్నడూ లేని విధంగా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టు పరవళ్లు తొక్కడంతో పరివాహక వాగు కనివినీ ఎరుగని రీతిలో పొలాల్లో నుంచి ప్రవహించింది. పంటనష్టాన్ని అంచనా వేయడంలో వ్యవసాయాధికారులు నిమగ్నమయ్యారు. గంభీరావుపేట మండల కేంద్రంతోపాటు మల్లారెడ్డిపేట, నర్మాల, కోళ్లమద్ది, లింగన్నపేటల్లో దాదాపు 315 ఎకరాల్లో పంటనష్టం వాటిల్లినట్లు వ్యవసాయాధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. 295 మంది రైతులకు సంబంధించిన 210 ఎకరాల్లో ఇసుక మేటలు వేసింది. అదేవిధంగా 120 మంది రైతులకు చెందిన 105 ఎకరాల పంట పొలాలు దెబ్బతిన్నట్లు అంచనా. వర్షాలకు నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. -
ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు తెలపండి
సిరిసిల్ల: జిల్లాలో ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలుంటే చెప్పాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా కోరారు. కలెక్టరేట్లో శుక్రవారం రాజకీయపార్టీ నాయకులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 2న గ్రామపంచాయతీ తుది ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితా ప్రచురిస్తామని తెలిపారు. 12 మండలాల పరిధిలో 260 గ్రామపంచాయతీల్లోని 2,268 వార్డుల్లో 3,52,134 ఓటర్లతో డ్రాఫ్ట్ ఓటర్ జాబితా ఈనెల 28న విడుదల చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలోని గ్రామపంచాయతీల వారీగా డ్రాఫ్ట్ ఓటర్ జాబితా తయారు చేశామని, రాజకీయపార్టీల ప్రతినిధులు, ప్రజలు ఈ జాబితా పరిశీలించి అభ్యంతరాలుంటే ఈనెల 30లోపు తెలియజేయాలని కోరారు. 2,268 డ్రాఫ్ట్ పోలింగ్ కేంద్రాల జాబితాపై అభ్యంతరాలుంటే ఈనెల 30వ తేదీలోపు మండల పరిషత్లో అందించాలన్నారు. జిల్లా పంచాయతీ అధికారి షరీఫొద్దీన్, డివిజనల్ పంచాయతీ అధికారి నరేశ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, టీడీపీ అధ్యక్షుడు తీగల శేఖర్గౌడ్, బీఆర్ఎస్ నాయకులు గజభీంకార్ రాజన్న పాల్గొన్నారు. 53 మంది సెర్ఫ్ సిబ్బందికి బదిలీలు జిల్లాలో పనిచేసే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ఫ్) సిబ్బందికి బదిలీలు జరిగాయి. సెర్ఫ్ సీఈవో ఆదేశాలతో కలెక్టర్ సందీప్కుమార్ ఝా కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎల్–2, ఎల్–1, ఎంఎస్సీసీఎస్ 53 మంది ఉద్యోగులకు బదిలీలు చేశారు. డీఆర్డీవో శేషాద్రి, అడిషనల్ డీఆర్డీవో శ్రీనివాస్ పాల్గొన్నారు. తంగళ్లపల్లి(సిరిసిల్ల): ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో సెస్ సంస్థకు జిల్లా వ్యాప్తంగా రూ.50లక్షలు నష్టం వాటిల్లిందని ఆ సంస్థ చైర్మన్ చిక్కాల రామారావు తెలిపా రు. తంగళ్లపల్లి సెస్ ఆఫీస్లో శుక్రవారం మాట్లాడారు. నీటి ప్రవాహంతో సిబ్బంది చేరుకోలేక గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట, రామంజపురంలో మూడు రోజు లుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయిందన్నా రు. తంగళ్లపల్లిలో సుమారు రూ.8లక్షల మేర నష్టం జరిగినట్లు తెలిపారు. సెస్ ఏడీఈ శ్రీధర్, ఏఈ మధుకర్ పాల్గొన్నారు. ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలో బుధవారం కురిసిన భారీ వర్షాలకు కూలిన ఇళ్లను సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు శుక్రవారం పరిశీలించారు. తహసీల్దార్ ఫారుక్తో కలిసి మండలంలోని వర్ష ప్రభావ పరిస్థితుల గురించి మాట్లాడారు. రేపాక, అనంతారం గ్రామాల్లో కూలిన ఇళ్లను పరిశీలించారు. ఆర్ఐ సంతోష్కుమార్, కార్యదర్శులు ప్రవీణ్కుమార్, విజయలక్ష్మి పాల్గొన్నారు. టీకాలను జాగ్రత్తగా భద్రపరచాలిసిరిసిల్ల: జిల్లాలో వ్యాధి నిరోధక టీకాలను జాగ్రత్తగా భద్రపరచాలని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత సూచించారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్నగర్ ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం తనిఖీ చేశారు. రోగులకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. డ్రై డే పాటించేలా ప్రజలను చైతన్యవంతులను చేయాలని తెలిపారు. అంబేడ్కర్నగర్లోని కొన్ని ఇళ్లకు వెళ్లి డ్రై డే గురించి స్థానికులకు వివరించారు. డాక్టర్ అభినయ్, సిబ్బంది సోని, మణి ఉన్నారు. -
ప్రభుత్వ విప్ పూజలు
వేములవాడ: మూలవాగులో జలప్రవాహం రావడంతో శుక్రవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలు బాగుండాలని గంగమ్మతల్లిని వేడుకున్నట్లు తెలిపారు. పదేళ్లు మంత్రిగా పనిచేసిన కేటీఆర్ జిల్లాలో కనీసం బ్రిడ్జీలు కట్టలేదన్నారు. నర్మాల వద్ద పలువురు వరదలో చిక్కుకుంటే కేటీఆర్ వచ్చి రాజకీయాల గురించి మాట్లాడారని విమర్శించారు. కేటీఆర్ అక్కడికి చేరుకునేలోపే హెలికాప్టర్లు వచ్చి బాధితులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చాయన్నారు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి కాళేశ్వరంపై చర్చలో పాల్గొనాలని సవాల్ విసిరారు. -
ఓటరూ.. ఒక్క నిమిషం
● పల్లె ఓటరు జాబితా సిద్ధం ● అభ్యంతరాలకు నేడు ఆఖరు గడువు ● సెప్టెంబరు 2న తుది జాబితాసిరిసిల్ల: పల్లెల్లో ఎన్నికల సందడి మొదలైంది. అధికారికంగా ఓటర్ల జాబితా వెల్లడించడంతో ఒక్కో అడుగు పడుతోంది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే తడవుగా అధికారులు అన్ని సిద్ధం చేసుకుంటున్నారు. అవసరం మేరకు గుజరాత్ నుంచి బ్యాలెట్ బ్యాక్స్లు తెప్పించుకున్నారు. బ్యాలెట్ పత్రాలను ముద్రించి సిద్ధం చేశారు. సెప్టెంబరు 30వ తేదీలోగా స్థానికసంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో జిల్లా అధికారులు రంగం సిద్ధం చేసుకున్నారు. గ్రామం యూనిట్గా ఏర్పాట్లు పంచాయతీ ఎన్నికలకు గ్రామం యూనిట్గా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామంలోని వార్డుల వారీగా ఓటర్ల విభజన జరిగింది. ఒక్క కుటుంబంలోని ఓటర్లు ఒకే వార్డులో ఉండేలా విభజన చేశారు. 200 ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలు 1,734 ఉండగా.. 400 ఓటర్లు ఉన్నవి 468, 650 ఓటర్లు ఉన్నవి 66, 650 ఓటర్ల కంటే ఎక్కువ ఉంటే.. రెండో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకు అనుగుణంగా పోలింగ్ సిబ్బందిని ఎంపిక చేసి మొదటి విడత శిక్షణ ఇచ్చారు. రిజర్వేషన్లపైనే ఆసక్తి గ్రామపంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లపై ఆసక్తి నెలకొంది. గత ఎన్నికల రిజర్వేషన్లు వర్తిస్తాయా? ఈసారి మారుతుందా? అనే దానిపై చర్చ సాగుతోంది. రిజర్వేషన్లు అనుకూలిస్తే బరిలో నిలిచేందుకు అనేక మంది ఆశావహులు సిద్ధంగా ఉన్నారు. సామాజికవర్గాల వారీగా ఓటర్లను సమీకరించుకుంటూ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల ఎన్నికల్లోనూ రిజర్వేషన్లు అనుకూలిస్తే పోటీ చేయాలని భావిస్తున్నారు. మండలాలు : 12 గ్రామపంచాయతీలు : 260 వార్డులు : 2,268, ఓటర్లు : 3,52,134 సర్పంచ్లకు గుర్తులు : 30 (పింక్ కలర్) వార్డు సభ్యుల గుర్తులు : 20 (వైట్ కలర్)ఓటరు జాబితాలో పేరు ఉందో.. లేదో.. మొదట చూసుకోండి. లేకుంటే వెంటనే తగిన ఆధారాలతో పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తు చేసుకోండి. అప్పుడు ఓటుహక్కు లభిస్తుంది. లేకుంటే మీరు ఓటుహక్కు కోల్పోయినట్లే. ఇప్పుడు చూసుకోక తీర ఎన్నికల రోజు వచ్చి పేరు లేకుంటే కావాలనే తీసేశారు అని గగ్గోలు పెడితే వచ్చేదేముండదు. -
కరెంటు బిల్లులు కట్టలేం
● సిరిసిల్లలో రోడ్డెక్కిన నేతన్నలు ● వాడుకున్న విద్యుత్కు బిల్లులు చెల్లించాలి : సెస్ చైర్మన్సిరిసిల్లటౌన్: కక్షపూరితంగా తమపై బాదుతున్న కరెంటు బిల్లులు కట్టలేమని.. కరెంట్ కనెక్షన్లు కట్ చేయడాన్ని నిరసిస్తూ నేతన్నలు శుక్రవారం సిరిసిల్లలో రోడ్డెక్కారు. సెస్ ఆఫీస్ ఎదుట రాస్తారోకో చేపట్టారు. వారు మాట్లాడుతూ పవర్లూమ్ వస్త్రపరిశ్రమకు సంబంధించి బ్యాక్ బిల్లింగ్ పేరుతో సెస్ అధికారులు విద్యుత్ కనెక్షన్ కట్ చేయడాన్ని తప్పుబట్టారు. బ్యాక్ బిల్లింగ్ రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. వస్త్రపరిశ్రమ నాయకుడు మండల సత్యం మాట్లాడుతూ ఇప్పుడే దారిలో పడుతున్న వస్త్ర పరిశ్రమపై సెస్ అధికారులు 2016 నుంచి బ్యాక్ బిల్లింగ్ చెల్లించాలంటూ విద్యుత్ సరఫరాను నిలిపివేయడం సరికాదన్నారు. తమ పవర్లూమ్స్ కార్ఖానాలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కోరుతూ సెస్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని నేతన్నల ఆందోళనను విరమింపజేశారు. బిల్లులు చెల్లించాలి సిరిసిల్లలోని పవర్లూమ్స్ వస్త్రపరిశ్రమకు సంబంధించిన బ్యాక్బిల్లింగ్తో సంబంధం లేకుండా వినియోగించిన విద్యుత్కు మాత్రమే బిల్లులు చెల్లించాలని సెస్ చైర్మన్ చిక్కాల రామారావు స్పష్టం చేశారు. స్థానిక ప్రెస్క్లబ్లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. కొంతమంది కోర్టును ఆశ్రయించడంతోనే బ్యాక్ బిల్లింగ్ వసూళ్లకు ముందుకొచ్చినట్లు తెలిపారు. ఇటీవల కలెక్టర్ సందీప్కుమార్ ఝా అధ్యక్షతన యజమానులతో నిర్వహించిన సమావేశంలో బ్యాక్ బిల్లింగ్కు సంబంధం లేకుండా ప్రస్తుతం వస్తున్న కరెంటు బిల్లును ఒక్కో యూనిట్కు రూ.2 చొప్పున చెల్లించాలని నిర్ణయించిన విషయాన్ని గుర్తు చేశారు. సెస్కు ఇప్పటికే ప్రభుత్వం నుంచి రూ.100కోట్లకు పైగా సబ్సిడీ రావాల్సి ఉందన్నారు. సంస్థ మనుగడ సాగాలంటే బిల్లులు చెల్లించాలని కోరారు. డైరెక్టర్లు దార్నం లక్ష్మీనారాయణ, నారాయణరావు పాల్గొన్నారు. -
వాగుదాటని పల్లెలు
ఇది కోనరావుపేట మండలం బావుసాయిపేట–వెంకట్రావుపేట రోడ్డు. ఇక్కడ మూలవాగుపై తాత్కాలిక మట్టి రోడ్డు ఉండగా.. వరదలో కొట్టుకుపోయింది. గతంలో లోలెవల్ వంతెన నిర్మించగా రెండుసార్లు కోతకు గురైంది. హైలెవల్ వంతెన నిర్మాణానికి నిధులు మంజూరైనా టెండర్ల దశలో ఉంది. రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇదే మండలంలోని వట్టిమల్ల–నిమ్మపల్లి మధ్య మూలవాగుపై తాత్కాలిక రోడ్డు వరద పాలైంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి.సిరిసిల్ల/ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): వర్షాలు..వరదలతో జిల్లాలోని కొన్ని పల్లెలు వాగులు దాటడం లేదు. వరద ఉధృతి కొనసాగుతుండగా రాకపోకలు లేక బిక్కుబిక్కుమంటున్నాయి. కనుచూపు మేరలో ఊరు కనిపిస్తున్నా వెళ్లేందుకు దారి లేకుండా పోయింది. జిల్లాలో వర్షాలు.. వరదలతో పల్లెల్లోని రోడ్డు రవాణా వ్యవస్థ అస్థవ్యస్తమైంది. వరద ఉప్పొంగుతుండడంతో రోడ్లు తెగిపోయాయి. ప్రజాజీవనం స్తంభించింది. మండల కేంద్రాల నుంచి పల్లెలకు వెళ్లే రహదారులు కోతలకు గురయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 1,636 రోడ్లు ఉండగా 28 రహదారులు వరద ప్రవాహంతో తెగిపోయాయి. చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట, వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట, ఇల్లంతకుంట, ముస్తాబాద్ మండలాల్లో ఎక్కువగా పంచాయతీరాజ్ రోడ్లు తెగిపోయాయి. ప్రయాణం నరకం ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి, సింగారం మధ్య మానేరువాగుపై వంతెన వద్ద రోడ్డు రోడ్డు కోతకు గురైంది. పదిర, ముస్తాబాద్ మండలం రామలక్ష్మణుపల్లి మధ్య మానేరు పొంగి పొర్లుతుండడంతో సిద్దిపేట, ముస్తాబాద్, దుబ్బాక ప్రాంతాలకు రవాణా నిలిచిపోయింది. కోరుట్లపేట, అక్కపల్లి శివారులో రోడ్డుపై వరదనీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలు రద్దు చేశారు. ఎల్లారెడ్డిపేట ఉమ్మడి మండలంలో నాలుగు మార్గాలలో దాదాపు ఐదు రోడ్లు వరదకు కొట్టుకుపోవడంతో 28 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పట్టించుకోని అధికారులు జిల్లాలో 28 రోడ్లు తెగిపోయినా ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ అధికారులు రోడ్ల పరిస్థితిపై క్షేత్రస్థాయిలో పరిశీలించడం లేదు. తండాలు, పల్లెల మధ్య తెగిపోయిన రోడ్లను గ్రామపంచాయతీ నిధులతో తాత్కాలిక మరమ్మతులు చేసుకోవాలని అధికారులు ఆదేశాలు ఇవ్వడం విశేషం. పంచాయతీరాజ్ రోడ్లు 1,041 ఆర్అండ్బీ రోడ్లు 595 తెగిన ఆర్అండ్బీ రోడ్లు 06 తెగిన పీఆర్ రోడ్లు 22బండలింగంపల్లి మానేరువాగుపై ఉన్న వంతెన దగ్గర రోడ్డు కోతకు గురికావడంతో మా ఊరికి పోవడం కష్టంగా మారింది. వివిధ పనులరీత్య మండల కేంద్రానికి వచ్చి తిరిగి ఇంటికెళ్లడం ఇబ్బందిగా ఉంది. అధికారులు, నాయకులు స్పందించి తెగిన రోడ్డును మరమ్మతు చేయాలి. – గొరిటిపల్లి జితేందర్, బండలింగంపల్లిఎల్లారెడ్డిపేట మండలం పదిర– రామలక్ష్మణులపల్లి గ్రామాల మధ్య వాగుపై వంతెన తెగిపోవడంతో వెంకటాపూర్ నుంచి ముస్తాబాద్ మండలానికి వెళ్లాల్సి వస్తోంది. ఏటా ఈ తాత్కలిక వంతెన తెగిపోవడం పరిపాటిగా మారింది. అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలి. – చల్ల సత్యంరెడ్డి, పదిర -
లావాదేవీల్లో సైబర్ సెక్యూరిటీ
● డిజిటల్ ప్లాట్ఫామ్కు అర్బన్బ్యాంకు ● బ్యాంకు చైర్మన్ రాపెల్లి లక్ష్మీనారాయణసిరిసిల్లటౌన్: డిజిటల్ ప్లాట్ఫామ్కి సిరిసిల్ల సహకార అర్బన్బ్యాంకును తీసుకొస్తున్నామని, లావదేవీల్లో సైబర్ సెక్యూరిటీ కల్పించామని బ్యాంకు చైర్మన్ రాపెల్లి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. సిరిసిల్ల పద్మశాలి కల్యాణ మండపంలో శుక్రవారం బ్యాంకు 39వ వార్షిక మహాసభలో మాట్లాడారు. బ్యాంకు లావాదేవీలను సభ్యులు, డిపాజిట్దారులకు పటిష్టంగా అందించడానికి సైబర్ సెక్యూరిటీ కల్పించామన్నారు. త్వరలోనే మరిన్ని బ్రాంచులను ప్రారంభిస్తామన్నారు. సహకార స్ఫూర్తితో కస్టమర్లకు పారదర్శక సేవలు, సభ్యులకు డివిడెండ్ను అందిస్తున్నట్లు తెలిపారు. బ్యాంకు వైస్చైర్మన్ అడ్డగట్ట మురళి, డైరెక్టర్లు గుడ్ల సత్యానందం, చొప్పదండి ప్రమోద్, పాటి కుమార్రాజు, బుర్ర రాజు, వేముల సుక్కమ్మ, అడ్డగట్ల దేవదాసు, ఎనగందుల శంకర్, వలుస హరిణి, పత్తిపాక సురేష్, కోడం సంజీవ్, ముఖ్య కార్యనిర్వహణ అధికారి పత్తిపాక శ్రీనివాస్ పాల్గొన్నారు. పాలకవర్గం తీరుపై రభస పాలకవర్గం తీరుపై బ్యాంకు సభ్యులు నిరసన తెలిపారు. మహాసభలో వేదిక ముందు బైఠాయించి నినాదాలు చేశారు. బియ్యంకార్ శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు. బ్యాంక్ పాలకవర్గం సెట్టింగ్ ఫీజు గతంలో రూ.3.51 లక్షలు ఉండగా ఈ సంవత్సరం రూ.6.83 లక్షలు తీసుకున్నారని, మహాసభ ఖర్చులు గతంలో రూ.1.70లక్షలు చేయగా ఈ సంవత్సరం రూ.2.51లక్షలు ఖర్చు చేశారన్నారు. బ్యాంకులో రూ.3.05కోట్లు రుణాలు ఇవ్వకుండా బ్యాంక్లో నిల్వ ఉంచడం సరికాదన్నారు. -
కొలువుదీరిన ఏకదంతుడు
పండుగ సందర్భంగా కిక్కిరిసిన సిరిసిల్ల మార్కెట్కలెక్టరేట్లో పూజలు చేస్తున్న కలెక్టర్ సందీప్కుమార్ ఝాఎస్పీ కార్యాలయంలో పూజలు చేస్తున్న ఎస్పీ మహేశ్ బీ గీతేవినాయక చవితి సందర్భంగా బుధవారం నుంచి సిరిసిల్ల భక్తి పారవశ్యంలో తేలియాడుతోంది. వాడవాడల్లో గణేశ్ నవరాత్రి వేడుకులు ఘనంగా జరుపుకుంటున్నారు. పట్టణంలో సుమారు 900వరకు మండపాలు వెలిశాయి. విభిన్నరూపాల్లో గణనాథులు కొలువుదీరారు. కలెక్టరేట్లో మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పూజలు చేశారు. వేములవాడ ఆర్డీవో రాధాభాయ్, జెడ్పీ సీఈవో వినోద్ కుమార్, ఏవో రాంరెడ్డి, కలెక్టరేట్ పర్యవేక్షకులు రాంచందర్, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గణేశుడికి ఎస్పీ మహేశ్ బీ గీతే ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోని గాంధీనగర్లో రాంభగీచా మంటప్లో 28 అడుగుల మట్టి గణపతిని ప్రతిష్టించారు. బీవైనగర్ ఛత్రసేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అడవిలో వినాయకుడు తప్పిపోతే కొడుకు వద్దకు పార్వతి దేవి వెతుక్కుంటూ వచ్చే దృశ్య రూప ప్రతిమ ఆకట్టుకుంటోంది. వెంకంపేట రాంలాల్ మంటపంలో స్పటిక లింగాలతో తయారు చేసిన మహాగణపతిని ప్రతిష్టించారు. శాంతినగర్లో అకూరచ మంటప్లో ప్రముఖ శిల్పి ప్రేమ్చా సృష్టించిన 25 అడుగుల ఏకైక విష్ణుసహిత వినాయక ప్రతిమను ప్రతిష్టించారు. – సిరిసిల్ల/సిరిసిల్లటౌన్/సిరిసిల్ల క్రైం -
వాన.. వరద
ఉధృతంగా ప్రవహిస్తున్న ఎగువమానేరు మత్తడిముస్తాబాద్: రామలక్ష్మణపల్లెలో మానేరు వరద నీటిలో రామాలయంసిరిసిల్ల/గంభీరావుపేట(సిరిసిల్ల): జిల్లాలో బుధ, గురువారాల్లో జోరువాన కురిసింది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ఇల్లంతకుంట, గంభీరావుపేట మండలాల్లో కుంభవృష్టిని తలపించాయి. కామారెడ్డి జిల్లాలో కురిసిన వర్షం నీరు ఎగువ మానేరులోకి రావడంతో డ్యాం నిండి, రెండు మత్తళ్ల గుండా వరద ఉగ్రరూపం దాల్చింది. వరదలను ఊహించని పశువులు కాపారులు, ఇటుకబట్టీల కార్మికులు ఏడుగురు వరదల్లో చిక్కుకోగా.. ఒక్కరు గల్లంతయ్యారు. ఏడుగురు హెలీకాప్టర్ సాయంతో క్షేమంగా ఒడ్డుకు చేరారు. కోనరావుపేట మండలం నిమ్మపల్లి మూలవాగు మత్తడి దూకుతోంది. సిరిసిల్లలో చాలాకాలం తరువాత మానేరు పారడంతో పట్టణ వాసులు తిలకించారు. బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద మధ్యమానేరు (శ్రీరాజరాజేశ్వర) జలాయానికి ఎగువ మానేరు, మూలవాగుల నుంచి వరద పోటెత్తడంతో 18 గేట్లను ఎత్తి నీటిని దిగు వ మానేరుకు వదిలారు. కోనరావుపేట మండలం నిమ్మపల్లి మూలవాగు ప్రాజెక్టులోకి భారీగా వరద చేరుతోంది. హన్మాజీపేట నక్కవాగు, లక్ష్మీపూర్ సండ్రవాగు, బోయినపల్లి గంజివాగు, ఇల్లంతకుంట మండలంలోని బిక్క వాగుల్లో వరదనీరు పారుతోంది. గంభీరావుపేట మండలం ఎగువ మానేరు ఉధృతంగా ప్రవహించడంతో సిద్దిపేట– కామారెడ్డి మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. నర్మాల– కోళ్లమద్ది మధ్య రోడ్డు మార్గం లేకుండా పోయింది. వీర్నపల్లి మండలంలోని గిరిజన తండాల మధ్య ఒర్రెలు పొంగడంతో రాకపోకలు స్తంభించాయి. అత్యధికంగా ఇల్లంతకుంటలో 140.3 మిల్లీ మీటర్ల వర్షం పడగా.. గంభీరావుపేటలో 128.5 మిల్లీ మీటర్లు, ఎల్లారెడ్డిపేటలో 44.5, తంగళ్లపల్లిలో 33.8, వీర్నపల్లిలో 32.3, రుద్రంగిలో 25.0, ముస్తాబాద్, బోయినపల్లిల్లో 24.8, సిరిసిల్లలో 24.0, వేములవాడ రూరల్లో 22.5, కోనరావుపేటలో 18.0, వేములవాడలో 18.0, చందర్తిలో 14.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఎగువమానేరు వద్ద రెండు రోజుల ఉత్కంఠ గంభీరావుపేట మండలం నర్మాల ఎగువమానేరు తీరాన రెండు రోజులు ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. కామారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలో కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టు చరిత్రలో ఎన్నడూ లేనంతగా 85వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. బుధవారం ఉదయం 9 గంటల వరకు నిశ్శబ్దంగా ఉన్న ప్రాజెక్టు ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. గేదెల కోసం వెళ్లిన నర్మాలకు చెందిన జంగం స్వామి, పిట్ల స్వామి, పిట్ల మహేశ్, పిట్ల నర్సింలు, ధ్యానబోయిన స్వామి వాగుఒడ్డుపై చిక్కుకుపోయారు. పంపుకాడి నాగయ్య బ్రిడ్జిపై నుంచి నడుచుకుంటూ వస్తుండగా.. వరద ఎక్కువై కొట్టుకుపోయాడు. విషయం తెలిసిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బీ గీతేలతో పాటు అధికారులు అక్కడికి చేరుకున్నారు. వరదలో చిక్కుకున్న వారికి డ్రోన్ ద్వారా భోజనాలు అందించారు. గురువారం హైదరాబాద్ నుంచి రెండు హెలీకాప్టర్లను తెప్పించి వరదలో చిక్కిన ఏడుగురిని ఒడ్డు చేర్చారు. సంఘటన స్థలానికి కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ చేరుకుని బాధితులను ఓదార్చారు. వరదల్లో గల్లంతైన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించారు. గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన ప్రవీణ్గౌడ్ పశువులకు మేత వేయడానికి వెళ్లి మానేరువాగులో చిక్కుకుపోయాడు. వాగు మధ్యలో ఓ బండ రా యిపై గంటల తరబడి నిల్చున్నాడు. నెమ్మదిగా ఓ చెట్టుపైకి చేరాడు. అర్ధరాత్రి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రవీణ్గౌడ్ను ఒడ్డుకు చేర్చారు. వాగులో చిక్కుకుపోయిన రైతులు, కూలీలను క్షేమంగా ఇంటికి చేర్చడంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేశ్బీ గీతే కీలక పాత్ర పోషించారంటూ ది గ్రేట్ ఆఫీసర్స్ అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. నిరంతర పర్యవేక్షణతో విధులు నిర్వర్తించిన వారికి అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రకృతి విపత్తు సమయాల్లో ముందస్తు ప్రణాళికల్లేవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. మంత్రులకు ఇతర రాష్ట్రాల్లో తిరుగడానికి హెలికాప్టర్లు ఉంటాయని, ప్రజలు ఆపదలో ఉంటే అందుబాటులో ఉండవన్నారు. అండగా ఉంటాం ఆధైర్యపడకండి.. ఎల్లారెడ్డిపేట: నర్మాలలో వరదల్లో చిక్కుకుని ప్రా ణాలతో బయటపడి ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు అండగా ఉంటామని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఆర్మీ హెలికాప్టర్ ద్వారా ప్రాణాలతో బయటపడ ఐదుగురిని అధికారులు చికిత్స కోసం ఎల్లారెడ్డిపేటకు తరలించారు. ఆస్పత్రిలో ప్రభుత్వ విప్ వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మంచి వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.చాపర్ సాయంతో ఒడ్డుకు చేరుకున్న అనంతరం బాధిత రైతులతో కేంద్ర మంత్రి బండి సంజయ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్వరదలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో మాట్లాడుతున్న కలెక్టర్ సందీప్కుమార్ ఝా, ఎస్పీ మహేశ్ బీ గీతేజలాశయం కెపాసిటీ ప్రస్తుతనిల్వ మధ్యమానేరు 27.55 21.37 అన్నపూర్ణ 3.50 1.35 మల్కపేట 3.00 0.70 ఎగువ మానేరు 2.00 2.0 -
‘ప్రత్యామ్నాయ’మే పనికొచ్చింది
సాక్షిప్రతినిధి, కరీంనగర్: భారీ వర్షాల నేపథ్యంలో.. కామారెడ్డిలో రైల్వేట్రాక్ కొట్టుకుపోయిన క్రమంలో ప్రత్యామ్నాయంగా వేసిన పెద్దపల్లి – నిజామాబాద్ రైల్వేమార్గమే కీలకంగా మారింది. కామారెడ్డి మీదుగా వెళ్లాల్సిన పలు రైళ్లను అధికారులు ఈ మార్గం మీదుగా మళ్లించారు. గతేడాది నవంబర్లో పెద్దపల్లి సమీపంలోని రాఘవాపూర్ వద్ద రైలు పట్టాలు తప్పిన సమయంలోనూ పెద్దపల్లి– నిజామాబాద్ రైల్వేమార్గం కీలకంగా మారింది. తాజాగా కామారెడ్డిలో భారీ వర్షాల నేపథ్యంలో ఈ ప్రత్యామ్నాయ మార్గం తన ప్రాధాన్యాన్ని చాటుకుంది. పెద్దపల్లి వెళ్లకుండా బైపాస్ మీదుగానే.. గతంలో బల్లార్షా–కాజీపేట మార్గం నుంచి పెద్దపల్లి–నిజామాబాద్ మార్గంలో మళ్లించాల్సి వస్తే.. ప్రతీ రైలు ముందుగా పెద్దపల్లి వెళ్లాల్సి వచ్చేది. అక్కడ రైలు ఇంజిన్ రివర్స్ తీసుకోవాలి. తిరిగి పెద్దపల్లి–నిజామాబాద్ వైపు సిద్ధమైన తరువాత సిగ్నల్ దొరకాలంటే కనీసం 40 నిమిషాల సమయం పట్టేది. ఇటీవల పెద్దపల్లి బైపాస్ అందుబాటులోకొచ్చాక.. నేరుగా బైపాస్ మీదుగా పెద్దపల్లి – నిజామాబాద్ సెక్షన్లోకి సులువుగా రైళ్లు మళ్లుతున్నాయి. మళ్లించిన రైళ్లు ఇవే.. కాజీపేట నుంచి బల్లార్షా, పెద్దపల్లి నుంచి నిజామాబాద్ మార్గాల్లో నడిచే మెమూ, పలు ఎక్స్ప్రెస్ రైళ్లను రైల్వే అధికారులు పాక్షికంగా రద్దు చేశారు. పెద్దపల్లి–నిజామాబాద్ సెక్షన్ మీదుగా పలు రైళ్లను మళ్లించడంతో ఈ మార్గంలో ట్రాఫిక్ భారం పడింది. ఫలితంగా అధికారులు కొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. ● రైలు నంబర్ 17033/17034 భద్రాచలం–బల్హ ర్షా– సిర్పూర్ టౌన్–భద్రాచలం సింగరేణి మెమూ ఎక్స్ప్రెస్ రైలు 29న భద్రాచలం రోడ్డు నుంచి వరంగల్ మధ్య మాత్రమే నడుస్తుంది. ● 17035 కాజీపేట నుంచి బల్లార్షా ఎక్స్ప్రెస్ గురు, శుక్రవారం కాజీపేట నుంచి బయలుదేరేది పూర్తిగా రద్దయ్యింది. బల్లార్షా– కాజీపేట 17036 ఎక్స్ప్రెస్ శుక్ర, శనివారం రద్దయ్యింది. ● 67771/72 , 67773/74 కరీంనగర్– సిర్పూర్ టౌన్, కరీంనగర్ – బోధన్ పుష్పుల్ ప్యాసింజర్ శుక్రవారం ఇరువైపులా రద్దు చేశారు. ● కాగజ్నగర్ వైపు శుక్రవారం నడిచే 17233 భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ నుంచి కాజీ పేట మధ్యనే నడుస్తుంది. ఇదే ఎక్స్ప్రెస్ 17234 కాజీపేట, సికింద్రాబాద్ మధ్య నడుస్తుంది. ● 16031 అండమాన్ ట్రైవీక్లీ ఎక్స్ప్రెస్.. 16032 శ్రీమాతా వైష్ణోదేవి కాట్రా నుంచి చైన్నె సెంట్రల్ అండమాన్ ట్రై వీక్లీ ఎక్స్ప్రెస్ను రద్దు చేశారు. -
బ్రాండెడ్ సైకిళ్లు ఇస్తున్నా
● కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్వేములవాడ: బతుకమ్మ చీరల్లా కాదు.. బ్రాండెడ్ సైకిళ్లు అందజేస్తున్నానని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. వేములవాడ ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో మంగళవారం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన సందర్భంగా మాట్లాడారు. తనకు ఓట్లు వేసింది పెద్దవాళ్లే అయినప్పటికీ వేయించింది చిన్నారులేనన్నారు. రాష్ట్రంలో 150 రోజులు 1600 కిలోమీటర్లు చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రలో రైతులు, విద్యార్థులు, మహిళలు పడుతున్న కష్టాలు చూశానన్నారు. గత ప్రభుత్వం విద్య కోసం రూ.68 వేల కోట్లు ఖర్చు చేస్తే నరేంద్రమోదీ ప్రభుత్వం రూ.లక్ష కోట్లు కేటాయించిందని తెలిపారు. ఎంపీగా గెలవడం కాదు, నియోజకవర్గంలో గొప్ప కార్యక్రమం చేయాలన్న ప్రధాని మోదీ సూచనతో సైకిళ్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు తలదించుకొని చదివితే భవిష్యత్లో తల ఎత్తుకొని బతుకుతారన్నారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, ఆర్డీవో రాధాభాయి, రెడ్డబోయిన గోపి, వికాస్రావు, ప్రతాప రామకృష్ణ పాల్గొన్నారు. -
శాంతియుతంగా నవరాత్రులు
● విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు ● ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి ● పక్కా ప్రణాళికతో నిమజ్జనం ● గణేశ్ నవరాత్రి ఉత్సవాలపై ఎస్పీ మహేశ్ బి గీతేసిరిసిల్లక్రైం: గణేశ్ నవరాత్రి ఉత్సవాలు శాంతియుతంగా ముగిసేలా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నామని ఎస్పీ మహేశ్ బి గీతే పేర్కొన్నారు. మండప నిర్వాహకులు వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని, భక్తిభావంతో ఉత్సవాలు సాగేలా సహకరించాలని కోరారు. మండపాల నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని, అన్ని వర్గాల సమన్వయంతో ఉంటే ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకుంటామన్నారు. నేటి నుంచి గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఎస్పీ మహేశ్ బిగీతేతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ.వెయ్యికి పైగానే మండపాలు జిల్లాలో ఇప్పటి వరకు 800 వరకు గణేశ్ మండపాల వివరాలు ఆన్లైన్లో నమోదైంది. మరో 300 వరకు మండపాల నమోదయ్యే అవకాశం ఉంది. ఇవే కాకుండా గల్లీలు, పల్లెల్లో ఉండే వినాయకులు అదనం. విలేజ్ పోలీస్ ఆఫీసర్ సమక్షంలో వివరాలు పొందుపరిచేలా చర్యలు తీసుకుంటున్నాం. ఆన్లైన్ నమోదుతో నిమజ్జనం వరకు అవాంఛనీయ ఘటనలు జరుగకుండా బందోబస్తు చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. రక్షణ చర్యలు పాటించండి వినాయక మండపాల నిర్వహణ తీరుపై ఇప్పటికే సమన్వయ కమిటీ సమీక్ష నిర్వహించాం. మండపంలో విద్యుత్ కోసం సెస్ అధికారులను సంప్రదించాలి. అగ్ని ప్రమాదాలు జరగకుండా నీళ్లు, ఇసుకబకెట్స్ ఏర్పాటు చేసుకోవాలి. ప్రతీ మండపంలో జరుగుతున్న అంశాలను పరిశీలించేందుకు సీసీ కెమెరాలు విధిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించాం. డీజేలు నిషేధం అధిక శబ్దం ఇచ్చే స్పీకర్లు, డీజేలు నిషేధం. ఇప్పటికే అన్ని ఠాణాల పరిధిలో అవగాహన కల్పించాం. ఉత్సవాలు సంప్రదాయ పద్ధతిలో చేసుకోవాలి. అధిక శబ్దం వచ్చే స్పీకర్లతో ఆయా ప్రాంతాల్లోని వృద్ధులు ఇబ్బంది పడుతున్నట్లు ఫిర్యాదులు వస్తాయి. ఈ విషయాన్ని కూడా మండపాల నిర్వాహకులకు తెలియజేశాం. మండపాల వద్ద రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి స్పీకర్లు వినియోగించొద్దని స్పష్టం చేశాం. నిమజ్జనంపై ప్రణాళికతో.. నవరాత్రులపాటు పూజలు అందుకున్న గణేశ్ విగ్రహాల నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా ప్రణాళికలతో ముందుకెళ్తున్నాం. సిరిసిల్ల బ్రిడ్జి, వేములవాడ గుడి చెరువు నిమజ్జన స్థలాలుగా గుర్తించాం. అవసరమైన మేరకు క్రేన్లు అందుబాటులో ఉంచుతాం. అన్ని శాఖల సమన్వయంతో వినాయక నవరాత్రులను విజయవంతంగా ముగించేందుకు కృషి చేస్తాం. సామాజిక మాధ్యమాలపై నిఘా మతం, ప్రాంతాలవారీగా ఏదైనా శాంతిని భంగం కలిగించేలా సామాజిక మాధ్యమాల్లో మెసేజెస్ ఫార్వర్డ్ చేసే వారిపై నిఘా ఉంటుంది. సామాజిక మాధ్యమాల్లో వచ్చే సమాచారాన్ని సరైన క్రమంలో అర్థం చేసుకోకుండా ఇష్టారీతిగా పంపితే కఠిన చర్యలు తీసుకుంటాం. బందోబస్తులో పోలీస్ బలగం వినాయక నవరాత్రులను జిల్లా ప్రజలు ఆనందాల మధ్య జరుపుకునేందుకు పోలీస్శాఖ కృషి చేస్తుంది. 150 మంది పోలీస్ అధికారులతోపాటు మరో 450 మంది సిబ్బంది విధుల్లో ఉంటారు. డయల్ 100, సంబంధిత పోలీస్ స్టేషన్ నంబర్తో అత్యవసర సేవలు పొందవచ్చు. -
వినాయక.. రాకపోక కష్టమే!
మీరు చూస్తున్న ఈ రోడ్డు ఇందిరానగర్. జిల్లా కేంద్రంలోని సాయినగర్ ప్రధాన రహదారి నుంచి మార్కెట్పల్లితోపాటు కార్మికవాడలకు వెళ్లే రోడ్డు. ఇక్కడ సీసీ రోడ్డు పూర్తిగా పాడయింది. సుమారు 100 గజాల దూరం వరకు పెద్ద ఎత్తున గుంతలు ఏర్పడ్డాయి. రోడ్డు వేయాలని ఏళ్లుగా స్థానికులు విన్నవిస్తున్నా పట్టించుకునే వారు లేరు.ఇది జిల్లా కేంద్రంలోని కార్మికవాడ పద్మనగర్. ఈ ఏరియాలో అధిక సంఖ్యలో భారీ వినాయకులు ఏర్పాటు చేస్తుంటారు. తాగునీటి పైపులైన్ కోసం రోడ్డును తవ్వగా ఇలా ధ్వంసమైంది. చాలా రోజులుగా ఇలాగే ఉంటన్న రోడ్డుపై ప్రయాణించే వారికి ఇబ్బందిగా మారింది. వినాయక నిమజ్జనం సమయానికై నా రిపేరు చేయాలని స్థానికులు కోరుతున్నారు.సిరిసిల్లటౌన్: మోకాలు లోతు గుంతలు.. శిథిల రహదారులు వినాయకులకు స్వాగతం పలుకుతున్నాయి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్న ప్రమాదాలు జరిగేలా రోడ్లు ధ్వంసమయ్యాయి. పట్టణ ప్రజలు గణేశ్ నవరాత్రోత్సవాలకు ఏర్పాట్లు చేసుకున్నారు. దాదాపు 20 అడుగుల భారీ విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. పట్టణంలోని రహదారులు శిథిలమై.. వినాయకుల రాకపోకలకు కష్టంగా మారాయి. అంత భారీ విగ్రహాలను అధ్వానంగా మారిన రోడ్లపై ఎలా తీసుకురావాలో తెలియక నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. రోడ్ల మరమ్మతుకు ఏటా నిధులు మంజూరు చేస్తున్నా మళ్లీ అవే తిప్పలు ఎదురవుతున్నాయి. విలీనంలోనూ ఇబ్బందులే.. సిరిసిల్ల పట్టణంతోపాటు పెద్దూరు, సర్దాపూర్, చిన్నబోనాల, పెద్దబోనాల, రాజీవ్నగర్, చంద్రంపేట, రగుడు విలీన గ్రామాల్లోనూ రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పట్టణంలోని కార్మికవాడలు, శివారు ప్రాంతాలు మరీ అధ్వానంగా ఉన్నాయి. ఇప్పటికై నా రోడ్లను మరమ్మతు చేయాలని స్థానికులు కోరుతున్నారు. కొన్ని ఏరియాల్లో లూజువైర్లు, తక్కువ ఎత్తులో ఉన్న కరెంటు తీగలను సరిచేయాలని సెస్ అధికారులు చొరవ చూపాలని కోరుతున్నారు. అంతర్గత రోడ్లు మరమ్మతు చేయిస్తాం సిరిసిల్ల పట్టణంలోని అన్ని ప్రధాన రోడ్లు బాగానే ఉన్నాయి. వినాయక నిమజ్జన పనల్లో భాగంగా అంతర్గత రోడ్లు మరమ్మతు చేయిస్తాం. అన్ని కాలనీల నుంచి వినాయకులను సజావుగా నిమజ్జన పాయింట్కు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం. నిమజ్జన ఖర్చులను ఎస్టిమేషన్ పూర్తిచేసి నిధులను కేటాయిస్తాం. – ఎంఏ ఖదీర్ పాషా, మున్సిపల్ కమిషనర్ -
కపాస్ కిసాన్.. కర్శకుని నిషాన్
కరీంనగర్ అర్బన్: నిలకడలేని పత్తి ధరలతో నష్టపోయే రైతన్నకు ఉపయుక్తమైన యాప్ అందుబాటులోకి వచ్చింది. పత్తి రైతులందరూ 2025–26 సంవత్సరానికి సంబంధించి కనీస మద్దతు ధర పొందేందుకు వీలుగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) దేశంలోనే తొలిసారిగా శ్రీకపాస్ కిసాన్శ్రీ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. పంట పండించే రైతులు తమ పేర్లను సెప్టెంబరు 1నుంచి 30 వరకు యాప్లో నమోదు చేసుకోవాలి. వివరాలు నమోదు చేసుకున్న వారే సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో తమ సరకు విక్రయించుకునే అవకాశం ఉంటుంది. నూతన కార్యక్రమంపై రైతుల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని మార్కెటింగ్ శాఖ సిబ్బందిని సీసీఐ అధికారులు ఆదేశించారు. విక్రయ సమయంలో ఇదే ఆధారం ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం పత్తి క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ.8,110గా ప్రకటించింది. కనీస ధర పొందాలంటే యాప్లో రిజిస్టర్ అయిన రైతులు పత్తి విక్రయ సమయంలో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ రోజు సీసీఐ కేంద్రంలో వారు విక్రయించాలో వివరాలు తెలుపుతూ యాప్ సమాచారం ఇస్తుంది. ఇలా చేయడం వల్ల రోజుల తరబడి నిరీక్షించాల్సిన బాధ తప్పుతుంది. స్లాట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుంది. అక్రమ విక్రయాలకు ముకుతాడు పత్తి విక్రయ సమయంలో ధరల దోబూచూలాడుతూ రైతులను పీల్చిపిప్పి చేయడం వ్యాపారులకే చెల్లు. అంతిమంగా వారు చెప్పిన రేటుకే అమ్మేలా సఫలీకృతులవుతుంటారు. విక్రయాలు పూర్తయ్యాక రైతుల పేరుతో సదరు వ్యాపారులే సీసీఐకి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అసలైన రైతుకు మద్దతు ధక్కకపోగా వ్యాపారులే రెండురకాలుగా లాభాలు గడిస్తున్నారు. కరీంనగర్, జమ్మికుంట, గంగాధర, చొప్పదండి మార్కెట్లతో పాటు జిన్నింగ్ మిల్లుల్లో అక్రమాలు షరామామూలేనన్న ఆరోపణలున్నాయి. యాప్తో సదరు అక్రమాలకు చెక్ పడినట్లేనని విఽశ్లేషకులు భావిస్తున్నారు. పత్తి పంట వేస్తేనే వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. తగ్గుతున్న పత్తి సాగు గతేడాది కంటే ఈఏడాది జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం తగ్గింది. గతంలో 70–90వేల ఎకరాల్లో సాగయ్యేది. చీడపీడలతో పాటు దళారుల దోపిడీతో సాగు విస్తీర్ణం క్రమేణా తగ్గుతోంది. 2020లో 90వేల ఎకరాల్లో పత్తి సాగవగా ప్రస్తుతం 50వేలకు చేరింది. కాగా వచ్చే నెల రెండో వారం నుంచి పంట చేతికొస్తుంది. కొద్ది రోజుల నుంచి విస్తారంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఈసారి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు. కాగా పత్తి రైతులు ‘కిసాన్ కపాస్’ యాప్ను తమ మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలని, తర్వాత పేర్లు నమోదు చేసుకోవాలని వ్యవసాయ మార్కెటింగ్ అధికారులు వివరించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా మద్దతు ధర దక్కేలా చేయడమే ప్రభుత్వ ఉద్దేశం. కార్యక్రమంపై జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని వ్యవసాయ మార్కెటింగ్ అధికారులు పేర్కొన్నారు. పత్తి రైతులకు ప్రత్యేక యాప్ అందుబాటులోకి తెచ్చిన సీసీఐ అక్రమ విక్రయాలకు ముకుతాడు రైతుల సంఖ్య: 2,18,012 సాగు విస్తీర్ణం: 3.33 లక్షల ఎకరాలు పత్తి సాగుచేసే రైతులు 32,019 పత్తి సాగు విస్తీర్ణం: 50,000 ఎకరాలు దిగుబడి అంచనా: 6 లక్షల క్వింటాళ్లు యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సిందే తొలుత ‘కపాస్ కిసాన్’ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. సదరు రైతుకు సంబంధించి భూమి రికార్డులు, రెవెన్యూ శాఖ అధికారుల ద్వారా ధ్రువీకరించిన పత్తి పంట రికార్డు, ఆధార్ కార్డు వివరాలు అందులో నమోదు చేయాలి. ఫలితంగా దేశంలో పత్తి రైతులు, పంట విస్తీర్ణం, సాంద్రత తదితర వివరాలన్నీ సీసీఐకి చేరుతాయి. వచ్చే నెలాఖరుకు రైతులు యాప్లో రిజిస్టర్ చేసుకోవాలి. -
ఎదురెదురుగా ఢీకొన్న కార్లు
మల్యాల: మండలంలోని ముత్యంపేట శివారు దిగువ కొండగట్టు వద్ద జగిత్యాల–కరీంనగర్ రహదారిపై మంగళవారం రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ సంఘటనలో రెండుకార్లలో ఉన్న నలుగురు గాయపడ్డారు. కొండగట్టుకు చెందిన రంగు నర్సింహులు, విజయ హైదరాబాద్ నుంచి కొండగట్టుకు వస్తున్నారు. జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్పర్సన్ భర్త అడువాల లక్ష్మణ్ కరీంనగర్ వైపు వెళ్తున్నాడు. దిగువ కొండగట్టు వద్ద రెండు కార్లు ఎదురెదురుగా వేగంగా ఢీకొన్నాయి. కార్ల ముందుభాగం నుజ్జునుజ్జయ్యింది. కార్ల బెలూన్లు తెరుచుకోవడంతో నర్సింహులు, విజయ, అడువాల లక్ష్మణ్, మరో వ్యక్తి స్వల్పంగా గాయపడ్డారు. ట్రాఫిక్ అంతరాయం కలగడంతో ఎస్సై నరేశ్కుమార్, కానిస్టేబుల్ మధుసూదన్ రెడ్డి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. బాధితులను 108లో జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. నర్సింహులు అతివేగంగా, అజాగ్రత్తగా కారు నడిపి లక్ష్మణ్ కారును ఢీకొన్నారని, లక్ష్మణ్ బావమరిది మిట్టపల్లి సాయిప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై నరేశ్ కుమార్ తెలిపారు. -
జైలు నుంచి విడిపించండి
ప్రవాసీ ప్రజావాణిలో బాధిత కుటుంబాల ఫిర్యాదు జగిత్యాలక్రైం/సిరిసిల్ల: బహ్రెయిన్లో రెండేళ్ల జైలు శిక్ష పడిన ఐదుగురిని విడిపించాలని కోరుతూ.. బాధితుల కుటుంబ సభ్యులు మంగళవారం హైదరాబాద్లోని సీఎం ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించారు. తమ కుటుంబ సభ్యులను విడిపించాలని నలుగురి తల్లులు, ఒకరి చెల్లెలు సహాయం కోసం ప్రజావాణిని ఆశ్రయించారు. సీఎంకు వినతిపత్రం సమర్పించారు. గడువు తీరిన ఆహార ఉత్పత్తుల తేదీలను ఫోర్జరీ చేసి మార్చడం.. నిల్వ పదార్థాల మార్కెటింగ్ చేసిన కేసులో అక్కడి న్యాయస్థానం ముగ్గురికి మూడేళ్లు, 19మందికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. నిజామాబాద్కు చెందిన నకిడి లింబాద్రి (డిచ్పల్లి), కర్రోల్ల లక్ష్మీనర్సింహ (మల్లారం), తిమ్మజడ సంతోష్ (తిర్మన్పల్లి), జగిత్యాలకు చెందిన గోవిందు రాకేశ్ (రత్నాపూర్), రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన బంటుబాబు (కొండాపూర్)కు చెందిన ఐదుగురు వ్యక్తులు ఉన్నారు. వీరిని విడిపించాలని ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ చైర్మన్, అంబాసిడర్ వినోద్కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, గల్ఫ్ కుటుంబాలను సీఎం ప్రజావాణి నోడల్ అధికారి దివ్య దేవరాజన్ వద్దకు తీసుకెళ్లి వివరించారు. సీఎంవోలో కీలక అధికారి ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి దృష్టికి తీసుకెళ్లారు. -
కాపీ రాయుళ్లా.. మజాకా?
సాక్షిప్రతినిధి,కరీంనగర్: శాతవాహన వర్సిటీ పరిధిలో జరుగుతున్న న్యాయపరీక్షల్లో పట్టుబడుతున్న కాపీరాయుళ్ల వ్యవహారం కలకలం రేపుతోంది. ఇటీవల డిగ్రీ పరీక్షల్లో డీబార్ అయిన ఓ విద్యార్థికి మద్దతుగా ఉత్తరాదికి చెందిన ఓ సీనియర్ మంత్రి ఫోన్ చేసిన విషయం మరవకముందే.. అదే తరహా ఘటనలు పునరావృతమవుతున్నాయి. యథేచ్ఛగా చిట్టీలు పెట్టి రాస్తూ.. వర్సిటీ సిబ్బంది పట్టుకుంటే ఒత్తిళ్లు తెస్తూ.. బెదిరిస్తున్నారు. వినకపోతే ఆఖరి అస్త్రంగా రాజకీయ నాయకులను రంగంలోకి దించుతున్నా రు. వర్సిటీలో ఇటీల జరిగిన కొన్ని పరిణామాలు సిబ్బంది ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా ఉండటం చర్చానీయాంశంగా మారింది. ఓ ‘లా’ విద్యార్థి ఈనెల 18న కాపీ కొడుతూ వర్సిటీలో దొరికిపోయాడు. వదిలేయాలని కోరాడు. సిబ్బంది వినలేదు. దీంతో పలువురు రాజకీయ నాయకులతో ఫోన్ల మీద ఫోన్లు చేయించడం ప్రారంభించాడు. అప్పటికే అతన్ని డీబార్ చేసిన అధికారులు తామేం చేయలేమని చేతులెత్తేశారు. మరో ఘటనలో నగరానికి చెంది ఓ పార్టీ నాయకుడు నామినేటెడ్ పోస్టులో కొనసాగుతున్నాడు. అతను కూడా లా పరీక్షలో కాపీ కొడు తూ దొరికిపోయాడు. ఈయన సైతం సిబ్బందితో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. కాపీ కొడుతూ దొరికిన సంగతి మరిచి, తనను వదిలేయాలంటూ వాదించసాగాడు. యూనివర్సిటీ సిబ్బంది అవేమీ పట్టించుకోకుండా అతన్ని డీబార్ చేసేశారు. ఒక్క పరీక్షలో దొరికి డీబార్ అయినా నిబంధనల ప్రకారం.. మొత్తం సెమిస్టర్ పరీక్షలన్నీ వచ్చే ఏడాది రాసుకో వాలి. ఉదాహరణకు ఒక సెమిస్టర్లో ఐదు పేపర్లు ఉన్నాయనుకుంటే.. అందులో ఆఖరు పేపరు రోజు కాపీ కొట్టి దొరికితే.. మొత్తం పరీక్షల్లో డీబార్గా ప్రకటిస్తారు. దీంతో మొత్తం పేపర్లు మరో ఏడాది వరకు రాసుకోవాలి. వారం దాటినా ఆగని ఫోన్లు వాస్తవానికి ఆ ఒత్తిళ్ల వ్యవహారం ఆ ఒక్కరోజుతో ముగిసిపోలేదు. సదరు అధికారులకు వారం రోజులైనా ఆగలేదు. ‘మా వాడిని కొంచెం చూడండి.. డీబార్ రద్దు చేయండి’ అంటూ ఒత్తిళ్లు తెస్తున్నారు. అర్ధరాత్రి, అపరాత్రి, సెలవు దినం తేడా లేకుండా ఫోన్లు చేస్తున్నారని సిబ్బంది వాపోతున్నా రు. వాస్తవానికి నిబంధనల ప్రకారం.. ఒకసారి డీబార్ చేసిన తరువాత దాన్ని ఎత్తేయడం అంటూ ఉండదు. ఇదే విషయాన్ని ఫోన్ చేసే వారికి వివరించినా అర్థం కావడం లేదంటూ వర్సిటీ సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు వీరి వ్యవహా రం తెలిసి కొన్ని విద్యార్థి సంఘాలు కూడా వర్సిటీ సిబ్బందికి ఫోన్లు చేయడం ప్రారంభించాయి. డీబార్ ఎత్తివేస్తే ఊరుకునేది లేదని, వర్సిటీ ఎదుటే ఆందోళనకు దిగుతామంటూ స్పష్టం చేశాయి. దీంతో సిబ్బంది ఇటు కాపీరాయుళ్లు, అటు విద్యార్థి సంఘాల మధ్య నలిగిపోతున్నారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా ఇంటెలిజెన్స్ దృష్టికి కూడా వెళ్లింది. దీంతో వారు రంగంలోకి దిగి.. అసలేం జరిగిందో తెలుసుకుని, ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఇది చాలా సాధారణ విషయం వాస్తవానికి వర్సిటీలో ఈ ఘటన ఈనెల 18న జరిగింది. చాలా సాధారణ విషయం. కొందరు దీన్ని పెద్దదిగా చేసి చూపిస్తున్నారు. సహజంగానే ఈ రోజుల్లో న్యాయపరీక్షలకు ఉన్నత స్థాయి ఉద్యోగులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, డాక్టర్లు, రెవెన్యూ తదితరులు హాజరవుతున్నారు. పరీక్షల్లో కొందరు కాపీ కొడుతూ దొరకడం, వారికి మద్దతుగా రాజకీయ నాయకులు, వీఐపీలు ఫోన్లు చేయడం మాకు షరా మామూలే. – సురేశ్, కంట్రోలర్, ఎస్యూ -
రైతులకు ఆధునిక టెక్నాలజీ
జగిత్యాలఅగ్రికల్చర్: రైతులకు ఆధునాతన టెక్నాలజీని పరిచయం చేయడంతోపాటు మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా కేంద్ర ప్రభుత్వం నమోడ్రోన్ దీదీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద మహిళాసంఘాలకు ఎరువులు, రసాయనాలు పిచికారీ చేసే డ్రోన్లను సబ్సిడీపై సరఫరా చేయనుంది. రానున్న రోజుల్లో కూలీల సమస్యతో వ్యవసాయ రంగంలో డ్రోన్ల వాడకం పెరగనుండటంతో.. డ్రోన్లను అద్దెకిచ్చి మహిళలు స్వయం ఉపాధి పొందవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని మహిళాసంఘాల నుంచి దరఖాస్తులు స్వీకరించి.. అర్హులైన సంఘాలను ఎంపిక చేయాలని బ్యాంకర్లకు ఆదేశాలు అందాయి. వ్యవసాయంలో ఆధునికత కోసం వ్యవసాయ రంగంలో పెరుగుతున్న సాగు ఖర్చులు, కూలీల సమస్యతో రైతులకు పెద్దగా గిట్టుబాటు కావడం లేదు. ఇటీవల పంటలపై పురుగులు, తెగుళ్ల బెడద పెరుగుతుండటంతో ప్రతి రైతు క్రిమిసంహారక, రసాయన మందులు పిచికారీ చేయాల్సి వస్తోంది. అయితే మందులు పిచికారీ చేసేందుకు కూలీలు దొరికే పరిస్థితి లేదు. సన్న, చిన్నకారు రైతుల సంఖ్యే ఎక్కువగా ఉండటం.. ఆర్థిక సమస్యలతో ఆధునిక పరికరాల వాడకం పెద్ద సమస్యగా మారింది. లక్షలు విలువ చేసే పరికరాలను కొనుగోలు చేయలేని రైతులకు అండదండగా ఉండేందుకు మహిళా సంఘాలకు డ్రోన్లు అందించి వాటిద్వారా రైతులకు అద్దెకు ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. దీనివల్ల రైతులు లబ్ధిపొందేలా.. మహిళలు ఆర్థికంగా ఎదిగేలా నమో డ్రోన్ దీదీ పథకానికి రూపకల్పన చేశారు. ఈ పథకం కింద డ్రోన్లను సబ్సిడీపై కొనుగోలు చేసి అద్దెకిస్తే.. నెలకు మహిళా సంఘాల సభ్యులు రూ.లక్ష వరకు సంపాదించే వెసులుబాటు ఉంటుందని బ్యాంకర్లు చెపుతున్నారు. డ్రోన్ కొనుగోలుకు రూ.8లక్షల సబ్సిడీ ఈ పథకం కింద దేశవ్యాప్తంగా రూ.1,261 కోట్లతో 14,500 మహిళా సంఘాలకు ఆధునాతన డ్రోన్లను అందించనున్నారు. ఏ మహిళా గ్రూపు ముందుగా దరఖాస్తు చేసుకుంటుందో.. ఆ సంఘం ఎంపికయ్యే అవకాశం ఉంది. ఎంపిక చేసిన మహిళాసంఘాలకు డ్రోన్ పరికరాలను సబ్సిడీపై అందిస్తారు. డ్రోన్ ఖర్చులో గరిష్టంగా రూ.8లక్షల వరకు (80 శాతం) సబ్సిడీ ఇస్తారు. ఉదాహరణకు.. డ్రోన్ కొనుగోలుకు రూ.10 లక్షలైతే.. అందులో రూ.8లక్షల సబ్సిడీ ఇస్తారు. మరో రూ.రెండులక్షల వరకు బ్యాంకులు రుణ సదుపాయం కల్పిస్తాయి. తీసుకున్న రుణానికి ఏడాదికి కేవలం 3శాతం వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది. వ్యవసాయంలో సాగు ఖర్చులు తగ్గించడం.. పంట దిగుబడి పెంచడంలో డ్రోన్ టెక్నాలజీని రైతులు విరివిగా వాడేలా చైతన్యం చేయాలని వ్యవసాయ శాఖ ద్వారా ప్రచారం చేస్తూనే.. డ్రోన్ల కొనుగోలుకు మహిళాసంఘాలు ముందుకొచ్చేలా గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా మహిళలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాల్లోకి ఇంకా డ్రోన్లు పెద్దగా రాలేవని, ఇప్పుడే డ్రోన్లు కొనుగోలు చేసి పాగా వేస్తే.. మహిళల ఉపాధికి డోకా ఉండదని అధికారులు భావిస్తున్నారు. డ్రోన్ టెక్నాలజీలో ప్రత్యేక శిక్షణ మహిళాసంఘాల గ్రూపులకు డ్రోన్లను సబ్సిడీపై అందించడమే కాకుండా డ్రోన్ టెక్నాలజీ.. ఉపయోగంపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ దాదాపు 15రోజులు ఉంటుంది. శిక్షణలో వ్యవసాయ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు పాలుపంచుకుంటారు. డ్రోన్లు ఆధునాతన జీపీఎస్, సెన్సార్ టెక్నాలజీతో రూపొందించబడి ఉంటాయి. ఏ మందును ఎంత ఎత్తులో పిచికారీ చేయాలనే దానిపై కూడా పూర్తిస్థాయిలో క్షేత్రస్థాయి శిక్షణ ఇస్తారు. పురుగుమందులు పిచికారీ చేయడమే కాకుండా.. పొలంలో కలుపుమొక్కలు ఎక్కడున్నాయి..? నీరు ఎక్కడ లేదు..? వంటి వాటిపై కూడా డ్రోన్ శిక్షణలో మహిళలకు వివరిస్తారు. అలాగే మరమ్మతు, ఫిట్టింగ్ వంటి వాటి కోసం మరో సహాయకుడిని నియమించుకుంటే వారికీ శిక్షణ ఇస్తారు. ఈ పథకంలో డ్రోన్ డిమాండ్ అధికంగా ఉండే మహిళా సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకోవచ్చు. మహిళలకు ఆర్థిక స్వావలంబన సబ్సిడీపై ‘నమో డ్రోన్ దీదీ’ జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులు ఈ పథకం కింద ధరఖాస్తు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 15వేల డ్రోన్లు ఇవ్వనున్నందున ఎవ్వరు ముందుగా దరఖాస్తు చేసే వారికి ఈ పథకం అందనుంది. అర్హత ఉండి, ఆసక్తి గల మహిళా సంఘాలు సమీపంలోని బ్యాంకులను సంప్రదించవచ్చు. – రాంకుమార్, లీడ్ బ్యాంకు మేనేజర్, జగిత్యాల -
ఆగమశాస్త్రం ప్రకారం ఆలయ అభివృద్ధి
వేములవాడ: ఆగమశాస్త్ర ప్రకారం ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు చేపడుతామని ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. గుడి ఓపెన్స్లాబ్లో మంగళవారం రాజన్న ఆలయ అభివృద్ధి, విస్తరణపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆర్కిటెక్చర్ (వాస్తు శిల్పి) సూర్యనారాయణ మూర్తి వివరించారు. విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో భక్తుల రద్దీ అనుగుణంగా ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. మహాశివరాత్రి, సమ్మక్క సారలమ్మ జాతర సమయాల్లో పార్కింగ్ సమస్య రాకుండా జగిత్యాల వైపు 20 ఎకరాలు గుర్తించినట్లు తెలిపారు. 4.6 ఎకరాల్లో ఆలయ విస్తరణ, 33 ఎకరాల వరకు మాస్టర్ప్లాన్ డెవలప్మెంట్ ఏరియా ఉంటుందని తెలిపారు. ఆలయ అభివృద్ధికి రూ.110కోట్లకు టెండర్లు పిలిచినట్లు తెలిపారు. రెండో విడతగా రూ.285కోట్లు కేటాయించనున్నట్లు చెప్పారు.ఆలయ విస్తరణ పనులు జరిగే సమయంలో భీమేశ్వర ఆలయంలో దర్శనం ఉండేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి మరో 36 గుంటల సేకరణకు చర్యలు చేపడతామన్నారు. దేవాదాయశాఖ కమిషనర్ వెంకటరావు, దేవాదాయశాఖ సలహాదారు గోవింద్హరి, ఆలయ ఈవో రాధాబాయి పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రాజన్న ఆలయ విస్తరణపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ -
నేతన్నలకు అండగా ఉంటాం
● చేనేత, జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ● త్రిఫ్ట్ పొదుపు డబ్బుల చెక్కులు పంపిణీసిరిసిల్ల: రైతన్నల్లాగే.. నేతన్నలకూ అండగా ఉంటామని, వస్త్రోత్పత్తి ఆర్డర్లు ఇస్తామని రాష్ట్ర చేనేత, జౌళి, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ‘కే’ కన్వెన్షన్లో 4,963 మంది పవర్లూమ్ కార్మికులకు రూ.12.41కోట్ల త్రిఫ్ట్ ఫండ్ పొదుపు డబ్బుల చెక్కులను మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి మంగళవారం పంపిణీ చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మాట్లాడుతూ నేతకార్మికుల రూ.లక్ష రుణమాఫీని రాబోయే కేబినెట్లో చర్చించి వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. ఇందిరా మహిళాశక్తి చీరల ఆర్డర్లను సకాలంలో పూర్తి చేయాలన్నారు. కార్మిక, ధార్మిక క్షేత్రంగా అభివృద్ధి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ధార్మిక, కార్మిక క్షేత్రంగా జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నేతకార్మికులకు రూ.352కోట్ల బకాయిలు విడుదల చేశామన్నారు. చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్, కాంగ్రెస్ నేత కె.కె. మహేందర్రెడి, కలెక్టర్ సందీప్కుమార్ ఝా, ఎస్పీ మహేశ్ బి గీతే, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, ఏఎంసీ చైర్పర్సన్ వెల్ముల స్వరూపారెడ్డి, కాంగ్రెస్ నాయకులు రాజేందర్రావు, సంగీతం శ్రీనివాస్, చొప్పదండి ప్రకాశ్, సూర దేవరాజు, కచ్చకాయల ఎల్లయ్య, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, జౌళిశాఖ జేడీ ఎన్.వెంకటేశ్వర్రావు, ఏడీ రాఘవరావు, వస్త్రోత్పత్తిదారులు, ఆసాములు, కార్మికులు పాల్గొన్నారు. జ్యోతిబాపూలే ఆశయాలు సాధిద్దాంవివక్షను, అసమానతలను ఎదిరించి, ఆనాటి సమాజానికి చదువును అందించిన మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలను సాధించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. సినారె జిల్లా గ్రంథాలయం ఎదుట పూలే దంపతుల విగ్రహాలను ఆవిష్కరించా రు. ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము, గడ్డం నర్సయ్య, పర్శ హన్మాండ్లు, ఆకునూరి బాలరాజు, వివిధ సంఘాల ప్రతినిధులు రాగుల రాములు, బొప్ప దేవయ్య,సూర దేవరాజు, సుధాకర్, కరుణాల భద్రాచలం, కార్తీక్ ఉన్నారు. -
రేషన్ డీలర్ల కమీషన్ ఇప్పించండి
కరీంనగర్ అర్బన్: ప్రజాపంపిణీ వ్యవస్థలో పారదర్శకంగా పనిచేసే రేషన్ డీలర్లు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారని, 5 నెలలుగా కమీషన్ లేక నానాపాట్లు పడుతున్నామని తెలంగాణ రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రమేశ్బాబు వాపోయారు. మంగళవారం నగరంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ను కలిసి వినతిపత్రం అందజేశారు. కేంద్ర కమీషన్ వేరు రాష్ట్ర కమీషన్ వేరంటూ డీలర్లకు కమీషన్ విడుదల చేయడం లేదని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు కమీషన్ రాలేదని వివరించారు. కేంద్ర ప్రభుత్వం డీలర్లకు చెల్లిస్తున్న క్వింటాకు రూ.90 కమీషన్కు తోడుగా కనీస గౌరవ వేతనాన్ని కూడా ప్రకటించే విధంగా చూడాలని కోరారు. తెలంగాణ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షులు రొడ్డ శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డిమల్ల హన్మాండ్లు, కరీంనగర్ కార్యవర్గం గాలి గట్టయ్య, ఎ.రవీందర్, రుద్రవేణి కనుకయ్య, విజయ్ పాల్గొన్నారు. కేంద్ర మంత్రి సంజయ్కి డీలర్ల వినతి -
రెండు షిఫ్టుల్లో చీరలు ఉత్పత్తి చేయండి
సిరిసిల్ల: వస్త్రోత్పత్తిదారులు రెండు షిఫ్టుల్లో ఉత్పత్తి చేసి సెప్టెంబర్ 15లోగా చీరలను అందించాలని చేనేత, జౌళిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్ కోరారు. కలెక్టరేట్లో మంగళవారం కలెక్టర్ సందీప్కుమార్ ఝాతో కలిసి వస్త్రోత్పత్తిదారులతో సమీక్షించారు. సిరిసిల్లకు రెండు విడతల్లో 4.30 కోట్ల మీటర్ల వస్త్రోత్పత్తి ఆర్డర్లు ఇవ్వగా.. 50 శాతం మేరకు పూర్తయిందన్నారు. చీరల ఉత్పత్తిలో వెనకబడిన వారి ఆర్డర్లను రద్దు చేసి పూర్తి చేసిన వారికి అందిస్తామని స్పష్టం చేశారు. జౌళిశాఖ జేడీ, టెస్కో సీజీఎం ఎన్.వెంకటేశ్వర్రావు, ఏడీ రాఘవరావు, వస్త్రోత్పత్తిదారుల అసోసియేషన్ ప్రతినిధులు ఆడెపు భాస్కర్, గోవిందు రవి, మంచె శ్రీనివాస్, వేముల దామోదర్, దూడం శంకర్, బూట్ల నవీన్, యెల్దండి దేవదాస్, మండల సత్యం, కట్టెకోల శివశంకర్ పాల్గొన్నారు.వర్కర్ టు ఓనర్ అమలు చేయండిస్థానిక కార్మికులకు ‘వర్కర్ టు ఓనర్’ పథకాన్ని అమలు చేయాలని పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్, జిల్లా అధ్యక్షుడు కోడం రమణ చేనేత, జౌళిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ను కోరారు. స్థానిక ‘కే’ కన్వెన్షన్లో మంగళవారం కలిసి నేతకార్మికుల సమస్యలు వివరించారు. ఇప్పటికే నిర్మించిన వర్క్షెడ్లలో సాంచాలను ఏర్పాటు చేసి ప్రభుత్వ వస్త్రోత్పత్తి ఆర్డర్లు ఇవ్వాలని కోరారు. పెండింగ్లో ఉన్న 10 శాతం యారన్ సబ్సిడీ డబ్బులు విడుదల చేయాలని విన్నవించారు.అక్టోబర్లోగా పనులు పూర్తి చేయండి: కలెక్టర్ సందీప్ కుమార్ ఝావేములవాడఅర్బన్: అంజన్న ఆలయ అభివృద్ధి పనులు అక్టోబర్లోగా పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆదేశించారు. వేములవాడ మండలం అగ్రహారంలోని హనుమాన్ ఆలయం వద్ద రూ.31లక్షలతో ఆర్చి, ప్రాకారం పనులను కలెక్టర్ పరిశీలించారు. పంచాయతీరాజ్శాఖ డీఈ విష్ణువర్ధన్, అంజన్న ఆలయ ఈవో శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.మెరుగైన వైద్యసేవలందించాలి: డీఎంహెచ్వో రజితతంగళ్లపల్లి(సిరిసిల్ల): జ్వరపీడితుల రక్త నమూనాలు సేకరించి మెరుగైన వైద్యసేవలందించాలని డీఎంహెచ్వో రజిత సూచించారు. స్థానిక పీహెచ్సీలో మందుల నిల్వలను మంగళవారం తనిఖీ చేశారు. సరిపడా నిల్వ ఉంచుకోవాలని మెడికల్ అధికారి అఫీజాకు సూచించారు. అనంతరం ఇందిరమ్మకాలనీలో డెంగీ నివారణ మెడికల్ క్యాంపును పరిశీలించారు. మలేరియా ప్రోగ్రాం అధికారి అనిత, ఏపి డిమియాలజిస్ట్ సోనిమణి, రాపిడ్ యాక్షన్ టీమ్ సూపర్వైజర్లుపాల్గొన్నారు.మల్టీపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్తోనే సహస్ర మృతితంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందని సర్గు సహస్ర(8) వైరల్ పైరాక్సియా (ఎన్సిఫెలిటీస్)తో బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అయిందని డీఎంహెచ్వో రజిత తెలిపారు. మల్టీపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్తోనే చనిపోయిందని పేర్కొన్నారు.ఐకేపీకి రైస్మిల్ మంజూరుముస్తాబాద్(సిరిసిల్ల): మహిళలు స్వయం సమృద్ధి సాధించే దిశగా మరో కీలక అడుగు ముందుకు పడింది. ముస్తాబాద్ శుభోదయ మండల మహిళా సమాఖ్యకు చేసిన రైస్మిల్లు ప్రతిపాదనలు పట్టాలు ఎక్కనుంది. ఇరవై రోజుల క్రితం కలెక్టర్ ముస్తాబాద్లోని ఐకేపీ పాత భవనాలను పరిశీలించారు. గతంలో ఇక్కడ రైస్మిల్లు నిర్వహించారని డీఆర్డీఏ అధికారులు తెలపడంతో రూ.5 కోట్లతో అధునాతన మిషనరీతో రైస్మిల్లు ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. రైస్మిల్లు త్వరలోనే ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. -
సీఏ చదువుతూ సైబర్రక్రైమ్స్
సిరిసిల్లక్రైం: చార్టెడ్ అకౌంటింగ్(సీఏ) చదువుతూ సైబర్ నేరాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర మొబైల్ ఫోన్ల దొంగను సిరిసిల్ల పోలీసులు ఢిల్లీలో పట్టుకున్నారు. ఆరోగ్యశ్రీ పేరుతో మోసం చేస్తున్న ఒకరిని రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ మహేశ్ బి గీతే తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం వివరాలు వెల్లడించారు. ఢిల్లీకి చెందిన సత్యం సీఏ చదువుతూ మొబైల్ఫోన్లు దొంగలించేవాడు. ఆ సెల్ఫోన్లు, సిమ్కార్డులను తనకు పరిచయమున్న ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా జమ్మలమడుగులోని భాగ్యనగర్కాలనీకి చెందిన ముల్లుంటి సలీంమాలిక్కు కొరియర్లో పంపేవాడు. ఈ ఫోన్లతో కాల్చేస్తూ ఆరోగ్యశాఖ నుంచి మాట్లాడుతున్నామని నమ్మబలికేవారు. వైద్య ఖర్చులను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రీఫండ్ చేస్తామని చెప్పి బాధితుల ఫోన్లకు లింక్లు పంపి, వారి ఖాతాల్లో నుంచి డబ్బులు కాజేసేవారు. ఇలా ముస్తాబాద్ మండలానికి చెందిన రాజిరెడ్డి ఖాతా నుంచి రూ.46వేలు, వేములవాడకు చెందిన ప్రేమ్కుమార్ ఖాతా నుంచి రూ.10వేలు కొల్లగొట్టారు. మోసపోయానని గుర్తించిన రాజిరెడ్డి ముస్తాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో భాగంగా నిందితుడు సలీంమాలిక్ను గతంలోనే రిమాండ్కు తరలించారు. మరో నిందితుడు సత్యంను ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. సత్యంపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్సీఆర్పీ పోర్టల్లో 118 ఫిర్యాదుల్లో దాదాపు రూ.90లక్షల వరకు మోసాలకు ప్పాలడినట్లు తెలిపారు. డీఎస్పీ చంద్రశేఖర్రెడ్డి, సీఐ మొగిలి, ముస్తాబాద్ ఎస్సై గణేశ్, సైబర్టీమ్ ఆర్ఎస్సై జునైద్ ఉన్నారు. ● ఆరోగ్యశ్రీ పేరిట మోసం ● ఢిల్లీలో పట్టుకున్న సిరిసిల్ల పోలీసులు -
నిమజ్జనానికి పకడ్బందీగా ఏర్పాట్లు
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేశ్ బీ గీతేసిరిసిల్ల: వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆదేశించారు. మానేరుతీరంలోని విద్యానగర్, ప్రేమ్నగర్, వంతెన వద్ద చేస్తున్న ఏర్పాట్లను ఎస్పీ మహేశ్ బీ గీతేతో కలిసి సోమవారం పరిశీలించారు. కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ వినాయక మంటపాల నిర్వాహకులు తమ విగ్రహాలను భక్తిశ్రద్ధల మధ్య వేడుకలు నిర్వహిస్తూ వైభవంగా తరలించాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, యువత ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వేడుకలను విజయవంతం చేయాలని సూచించారు. సిరిసిల్ల ఆర్డీవో సీహెచ్ వెంకటేశ్వర్లు, డీఎస్పీ చంద్రశేఖర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఖదీర్పాషా, సిరిసిల్ల టౌన్ సీఐ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్మ్యాప్ రెడీ
వేములవాడ: ఆధ్యాత్మిక పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు మొదలయ్యాయి. ఇప్పటికే తిప్పాపూర్ వంతెన నుంచి రాజన్న ఆలయం వరకు పలు గృహాలను కూల్చివేశారు. ఈక్రమంలోనే వేములవాడ మున్సిపల్ అధికారులు రోడ్మ్యాప్(నక్షా)ను సోమవారం విడుదల చేశారు. 80 ఫీట్ల వెడల్పుతో మూలవాగు నుంచి రాజన్న గుడి వరకు సెంట్రల్ లైటింగ్, ఫుట్పాత్, డ్రైనేజీల నిర్మాణాలను నక్షాలో వివరించారు. వీటీడీఏ ద్వారా నిధులు మంజూరైనట్లు అధికారులు తెలిపారు. నిత్యాన్నదాన సత్రం కోసం రూ.35.25కోట్లు, ఆలయ సముదాయ విస్తరణ, ఆధునిక సౌకర్యాల ఏర్పాటుకు రూ.76కోట్లు, శంకరమఠంలో సత్యనారాయణవ్రత మంటపం, నిత్య చండీహోమ మంటపం షెడ్లకు రూ.50లక్షలు, శంకరమఠంలో నిత్యకల్యాణ మంటపం షెడ్డుకు రూ.50లక్షలు, భీమేశ్వరాలయం పడమర దిశలో క్యూలైన్ల షెడ్ల నిర్మాణానికి రూ.42లక్షలు, భీమేశ్వరాలయంలో ఆగ్నేయ దిశలో షెడ్ నిర్మాణానికి రూ.41లక్షలు, నటరాజ విగ్రహం వద్ద క్యూలైన్ల షెడ్ నిర్మాణానికి రూ.49లక్షలు, భీమేశ్వరాలయం చుట్టూ షెడ్ నిర్మాణానికి రూ.50లక్షలు, భీమేశ్వరాలయం ప్రాకారం వెంట సీసీ ఫ్లోరింగ్కు రూ.27లక్షలు వెచ్చిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. -
మంత్రులూ..కనికరించరు!
ఇతను కోడం బాలకృష్ణ. జిల్లా కేంద్రంలోని బీవై నగర్లో ఇందిర మహిళాశక్తి చీరల బట్టను ఉత్పత్తి చేస్తున్నాడు. పది సాంచాలపై 12 గంటలు పనిచేస్తే వారానికి రూ.4వేల నుంచి రూ.5వేలు వస్తుంది. ఇది ప్రభుత్వ ఆర్డర్ కావడంతో మెరుగైన కూలీ వస్తుంది. అదే పాలిస్టర్ బట్టను అవే సాంచాలపై ఉత్పత్తి చేస్తే వారానికి రూ.2వేలు వస్తాయి. అదే సొంత సాంచాలుంటే నెలకు రూ.30 నుంచి రూ.40వేలు సంపాదిస్తాడు. బాలకృష్ణ వర్కర్ నుంచి ఓనర్గా మారితే ఆయన దశ మారిపోనుంది.ఇతను పెంటి తిరుపతి. మొన్నటి వరకు పాలిస్టర్ బట్ట నేస్తే నెలకు రూ.8వేల వరకు కూలి వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం ఇందిర మహిళా శక్తి చీరల ఆర్డర్లు ఇవ్వడంతో ఆ బట్ట నేస్తూ నెలకు రూ.16వేల నుంచి రూ.20వేల వరకు సంపాదిస్తున్నాడు. అదే సాంచాలకు యజమాని అయితే అతనికి వచ్చే వేతనం డబుల్ అవుతుంది. -
పాత కార్యకర్తలను పట్టించుకోండి!
సాక్షిప్రతినిధి,కరీంనగర్/గంగాధర(చొప్పదండి): ‘పదేళ్లు కాంగ్రెస్ పార్టీ జెండాలు మోసాం. ప్రజల కోసం ధర్నాలు, రాస్తారోకోలు చేశాం. పార్టీ కోసం కేసులు భరించాం. తీరా ఇప్పుడు ఇతర పార్టీల నుంచి నేతలు వలస రాగానే.. మాకు ప్రాధాన్యం తగ్గుతోంది. దయచేసి దశాబ్దకాలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మోసిన కష్టాలు, కేసులు, పడ్డ అవమానాలను దృష్టిలో ఉంచుకుని పాత కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాలి’ అని కాంగ్రెస్ నాయకులు ముక్తకంఠంతో అన్నారు. సోమవారం గంగాధర మండలంలోని ఎల్కే గార్డెన్స్లో నిర్వహించిన ఉ మ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ముఖ్యకార్యకర్తల స మావేశంలో పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థులు తమ మనసులోని భావాలను, ఆవేదనను టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్కు వెల్లబోసుకున్నారు. డిమాండ్లు.. విన్నపాలు.. హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రణవ్బాబు మాట్లాడుతూ.. జనహిత యాత్ర విజయవంతమైంది. సంక్షేమ పథకాలు అందిన లబ్ధిదారుల జాబితా తీసుకుని వారిని కలవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వెంటనే కార్యకర్తలకు పదవులిస్తే రాబోయే ఎన్నికల్లో ఉత్సాహంగా పనిచేస్తారని పేర్కొన్నారు. కోరుట్ల ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ.. కార్యకర్తలు నామినేట్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. జగిత్యాల జిల్లాలో ప్రొటోకాల్ సమస్య రాకుండా చేయాలని కోరారు. కేకే మహేందర్రెడ్డి మాట్లాడుతూ.. సిరిసిల్లలో ఒక్కో కార్యకర్తపై 40 నుంచి 50 కేసులు నమోదయ్యాయని, వీలైనంత త్వరగా వాటిని ఎత్తేయాలని కోరారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి మాట్లాడుతూ.. కష్టకాలంలో పార్టీ జెండా మోసినవారిని కడుపులో పెట్టుకోవాలని, అవకాశమిస్తే కరీంనగర్లో కూడా సత్తా చూపిస్తామని అన్నారు. విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. యూరియా విషయంలో బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ మాట్లాడుతూ.. మా పార్టీ నేతలు అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల్లో ఉండేందుకు పాదయాత్రలు చేస్తాం. బీజేపీని బొందపెడతాం. రాహుల్ని ప్రధాని చేసే లక్ష్యంతో పనిచేస్తామని వెల్లడించారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. వచ్చే ఐదేళ్లు కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఎస్సీల వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కృషి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. పార్టీని అధికారంలోకి తెచ్చిన కార్యకర్తలకు పదవుల్లో పెద్దపీట వేయాలని మాజీ మంత్రి జీవన్రెడ్డి కోరారు. అనంతరం రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ..80 శాతం పదవులు పాత కార్యకర్తలకే ఇస్తామని, కొత్తవారు తమను తాము నిరూపించుకోవాలని సూచించారు. వసతి గృహంలో శ్రమదానం గంగాధర మండల కేంద్రంలోని బాలుర వసతి గృహంలో గంటన్నర సేపు మీనాక్షి నటరాజన్ శ్రమదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. హాస్టల్ ఆవరణలో మట్టి పోయడంతోపాటు మొక్కలు నాటారు. గోడలకు రంగులు వేసి, బాత్రూంలు శుభ్రం చేశారు. పాటలతో నాయకులు, కార్యకర్తలను ఉల్లాసపరిచారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
అర్జీలు అందుకోండి.. పరిష్కారం చూపండి
● ప్రజావాణికి భారీగా తరలివచ్చిన బాధితులు ● వినతులు స్వీకరించిన కలెక్టర్ సందీప్కుమార్ ఝా ● వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలుసిరిసిల్లఅర్బన్: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి భారీగా బాధితులు తరలివచ్చారు. అర్జీలు అందజేసి.. సమస్యలు పరిష్కరించండని విన్నవించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 206 మంది నుంచి కలెక్టర్ సందీప్కుమార్ ఝా వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చిన సమస్యల పరిష్కారంలో శ్రద్ధ పెట్టాలని సూచించారు. పెండింగ్ పెట్టవద్దని, ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, జెడ్పీ సీఈవో వినోద్కుమార్, డీఆర్డీవో శేషాద్రి అర్జీలు స్వీకరించారు. -
డెంగీతో చిన్నారి మృతి
● ఎనిమిదేళ్లకే నూరేళ్లు ● తంగళ్లపల్లిలో విషాదంతంగళ్లపల్లి(సిరిసిల్ల): డెంగీతో ఎనిమిదేళ్ల చిన్నారి మృతి తంగళ్లపల్లి మండల కేంద్రంలో విషాదం నింపింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. మండల కేంద్రానికి చెందిన సర్గు బాలయ్య–సంధ్య దంపతులకు కొడుకు సుమంత్, కూతురు సహస్ర(8) సంతానం. సహస్ర సిరిసిల్లలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. మూడు రోజుల క్రితం చిన్నారికి తీవ్రజ్వరం రాగా.. స్థానిక ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా డెంగీగా గుర్తించి చికిత్స అందించారు. ఈక్రమంలోనే సోమవారం మృతిచెందింది. చిన్నారి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. సహస్ర ఇంటి పరిసరాల్లో పారిశుధ్యం నిర్వహణ సరిగా లేకనే డెంగీ రావడానికి కారణమైందని స్థానికులు తెలిపారు. మండల కేంద్రం శివారు ప్రాంతం కావడంతో డ్రెయినేజీలు సరిగా లేవు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో దోమలు విపరీతంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. -
వర్కర్ టు ఓనర్ అందించాలి
సిరిసిల్లటౌన్: వర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంటనే ప్రారంభించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూషం రమేశ్ కోరారు. బీవై నగర్లోని అమృత్లాల్ శుక్లా కార్మిక భవనంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. వర్కర్ టు ఓనర్ పథకం ప్రారంభించాలని కోరారు. పవర్లూమ్ పరిశ్రమపై అదనంగా విధిస్తున్న బ్యాక్ బిల్లింగ్ చార్జీలతో వస్త్ర పరిశ్రమ ఇబ్బందుల్లో పడుతుందన్నారు. ఈనెల 26న సిరిసిల్లకు వస్తున్న మంత్రులు వర్కర్ టు ఓనర్, బ్యాక్ బిల్లింగ్ సమస్యను పరిష్కరించాలని కోరారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కోడం రమణ, ఎగమంటి ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టీచర్లకు పదోన్నతులు
సిరిసిల్ల ఎడ్యుకేషన్: జిల్లాలోని సెకండరీ టీచర్లకు స్కూల్ అసిస్టెంట్ టీచర్లుగా, పలువురికి ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కల్పించేందుకు ఆదివారం కలెక్టరేట్లో సర్టిఫికెట్లు వెరిఫికేషన్ జరిగింది. కలెక్టర్ సందీప్కుమార్ ఝా, జిల్లా విద్యాధికారి వినోద్కుమార్ ఆధ్వర్యంలో ధ్రువీకరణపత్రాలను పరిశీలించి, పదోన్నతులు కల్పించారు. గణితం 8 మంది, ఫిజిక్స్ 4, బయాలజీ 8, సోషల్ స్టడీస్ 9, హిందీ పండిట్ 5, ఇంగ్లిష్ 6, ఫిజికల్ డైరెక్టర్ 2, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా ఒకరికి పదోన్నతి లభించినట్లుగా అధికారిక గణాంకాలు తెలుపుతున్నాయి. సిరిసిల్లఅర్బన్: జిల్లా కేంద్రం శివారులోని పెద్దూరులో గల మహాత్మాజ్యోతిబాపూలే గురుకుల హాస్టల్ను మార్చాలని కోరుతూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆదివారం నిరసన తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ హాస్టల్లో 379 మంది విద్యార్థులు ఉండగా కేవలం 8 గదులు మాత్రమే ఉన్నాయన్నారు. హాస్టల్లో వసతులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. పిల్లలను చూస్తామని ప్రిన్సిపాల్ను కోరితే కలెక్టర్ అనుమతి తీసుకొని రావాలంటున్నారన్నారు. గేటుకు తాళాలు వేసి పిల్లలను కలువనీయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి అన్ని వసతులు ఉన్న భవనంలోకి హాస్టల్ను మార్చాలని కోరారు. పోలీసులు అక్కడికి చేరుకొని విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి ఆందోళన విరమింపజేయించారు. -
కష్టాలను తెలుసుకునేందుకే జనహిత యాత్ర
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/గంగాధర: ప్రభుత్వ పథకాల అమలు తీరును తెలుసుకునేందుకు, ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకునేందుకు జనహిత పాదయాత్ర చేపట్టామని టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ అన్నారు. ఆదివారం చొప్పదండి నియోజకవర్గంలో చేపట్టిన జనహిత పాదయాత్రలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్తో కలిసి పాల్గొన్నారు. గంగాధర మండలం ఉప్పర మల్యాల నుంచి గంగాధర మధురానగర్ చౌరస్తా వరకు పాదయాత్ర సాగింది. మహిళలు బోనాలతో, ఒగ్గుడోలు కళాకా రులు, విద్యార్థులు, ప్రజలు ఘనస్వాగతం పలికా రు. మధురానగర్ చౌరస్తాలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్, అడ్లూరి లక్ష్మణ్కుమార్, విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, రాజ్ఠాకూర్, మాజీ ఎంపీ వీహెచ్, మాజీ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి తదితరులతో కలిసి మహేశ్కుమార్ గౌడ్ ప్రసంగించారు. బీజేపీ, బీఆర్ఎస్లపై దుమ్మెత్తి పోశారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి ఇదే గంగాధరలో విజయోత్సవాలు చేసుకుందామని ప్రకటించారు. రోల్మోడల్గా చొప్పదండి: ఎమ్మెల్యే సత్యం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రుల సహకారంతో చొప్పదండ నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా తీర్చి దిద్దుతానని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నా రు. పాదయాత్ర అనంతరం మధురానగర్ చౌరస్తాలో నిర్వహించిన సభలో ఎమ్మెల్యే సత్యం మాట్లాడారు. గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి శూన్యం అన్నారు. పదేళ్ల పాలనలో ఒక్క ఇళ్లు ఇవ్వలేదని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రతి గ్రా మానికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిందన్నారు. చురుగ్గా నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. తొమ్మిది రో జుల్లో తొమ్మిదివేల కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు విడుదల చేశామన్నారు. రూ.21వేల కోట్ల రుణమాఫీ చేశామని, 60వేల ఉద్యోగాలు, అర్హులందరికీ రేషన్కార్డులు, కార్డులున్న వారికి సన్న బియ్యం ఇస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గంలో అదనంగా చుక్కా నీరు ఇవ్వలేదన్నారు. ఎవరు అడ్డుపడినా నియోజకవర్గ అభివృద్ధి ఆగదన్నారు. నారాయణపూర్ రిజర్వాయర్ కట్ట ఎత్తు పెంచి, నిర్వాసితులకు పరిహారంతో పాటు వ్యవసాయానికి నీరు అందిస్తామన్నారు. త్వరలోనే గంగాధరలో డిగ్రీ కళాశాల మంజూరు చేస్తానన్నారు. కొండగట్టు అభివృద్ధికి నిధులు మంజూరు చేయిస్తానన్నారు. ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరు అయిందని తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం మండలంలోని కురిక్యాలలో ఇందిరమ్మ పథకంలో బాలగోని భాగ్య– గంగయ్య దంపతులు నిర్మించుకున్న ఇంటిని పాదయాత్రలో భాగంగా మీనాక్షి నటరాజన్తో పాటు మంత్రులు గృహ ప్రవేశం చేశారు. సొంత ఇల్లు కట్టుకున్నందుకు సంతోషంగా ఉందని, పదేళ్లుగా రేషన్ కార్డు రాలేదని, కాంగ్రెస్ వచ్చాక రేషన్ కార్డు వచ్చిందని భాగ్య దంపతులు భావోద్వేగంతో కంటతడి పెట్టారు. -
అబద్దాలతో పాలన సాగించలేరు
సిరిసిల్లటౌన్: అడ్డదారుల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అబద్ధాలతో పాలన సాగించలేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య విమర్శించారు. సిరిసిల్ల ప్రెస్క్లబ్లో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కేసీఆర్, కేటీఆర్లపై ఇష్టానుసారంగా మాట్లాడడం మానుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గోదావరినీళ్లను రైతులకు అందించారని, నాణ్యమైన ఉచిత కరెంటు, సకాలంలో ఎరువులు అందించారని గుర్తు చేశారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఎరువుల కొరతేనన్నారు. గురుకులాల్లో పిల్లలు చనిపోతున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. కల్యాణలక్ష్మి పథకంతోపాటు తులం బంగారం, యువతకు స్కూటీలు ఇస్తామని మోసం చేసిన కాంగ్రెస్కు ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, నాయకులు గజభీంకార్ రాజన్న, కుంభాల మల్లారెడ్డి, అందె సుభాష్, ఎండీ సత్తార్, మ్యాన రవి, గాజుల బాలయ్య, గడీల సురేష్, గడ్డం భాస్కర్ పాల్గొన్నారు. -
రోడ్డు విస్తరణకు మోక్షం
వేములవాడ: వేములవాడ పట్టణంలో రోడ్ల విస్తరణ పనులను రూ.6.45కోట్లతో చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. మూలవాగు బ్రిడ్జి నుంచి రాజన్న గుడి వరకు 80 ఫీట్లతో విస్తరణ పనులు చేస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ సందీప్కుమార్ఝా, ఎస్పీ మహేశ్ బీ గీతే, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్తో కలిసి రోడ్డు పనులకు ఆదివారం శంకుస్థాపన చేసి మాట్లాడారు. కోడెను కట్టే ఆనవాయితీ రాజన్న ఆలయంలోనే ఉందని.. గుడి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలలోనే వీటీడిఏ సమావేశం ఏర్పాటు చేసి వెనక్కివెళ్లిన రూ.20కోట్లు తెప్పించి బద్ది పోచమ్మ ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు తెలిపారు. భూ నిర్వాసితుల కోసం రూ.47కోట్ల పరిహారం చెల్లించామన్నారు. వేములవాడను టెంపుల్సిటీగా డెవలప్మెంట్ చేస్తున్నామన్నారు. రాజన్న ఆలయ అభివృద్ధికి బడ్జెట్లో రూ.150కోట్లు కేటాయించినట్లు తెలిపారు. గత నవంబర్ 20న సీఎం రేవంత్రెడ్డి రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. అధునాతన పద్ధతుల్లో పనులు ఆలయ అభివృద్ధికి శృంగేరి పీఠాధిపతులు, వేములవాడ పట్టణ ప్రజలు, వాస్తు పండితుల సలహాలు తీసుకున్నామని విప్ శ్రీనివాస్ వివరించారు. రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీతోపాటు అధునాతన లైటింగ్ సిస్టం ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలోనే రూ.76కోట్లతో రాజన్న ఆలయ మొదటి దశ పనులు ప్రారంభిస్తామని, రూ.35కోట్లతో అన్నదాన సత్రం నిర్మాణానికి టెండర్ పూర్తయిందని తెలిపారు. ఆలయ ఈవో రాధాభాయి, ఏఎంసీ చైర్మన్లు రొండి రాజు, చెలకల తిరుపతి, మున్సిపల్ కమిషనర్ అన్వేశ్, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ కనికరపు రాకేశ్ పాల్గొన్నారు. రేపు ఆలయ అభివృద్ధిపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ రాజన్న ఆలయ అభివృద్ధిపై మంగళవారం పవర్పాయింట్ ప్రజంటేషన్కు అధికారులు సిద్ధమవుతున్నారు. మంత్రులు శ్రీధర్బాబు, సీతక్క, సురేఖ, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ హాజరుకానున్నట్లు అధికారులు తెలిపారు. ఆలయంలో పనులు వేగంగా పూర్తి చేయాలి భీమేశ్వర ఆలయంలో అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆదేశించారు. చైర్మన్ చాంబర్లో ఆలయ అధికారులు, కాంట్రాక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. భీమేశ్వర ఆలయంలో కల్యాణ మండపం, హోమం, వ్రతమండపం, షెడ్ నిర్మాణం, క్యూలైన్లు, సీసీ ఫ్లోరింగ్ పనులపై సమీక్షించారు. సమ్మక్క సారక్క జాతర నేపథ్యంలో రాజన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. -
మీసేవ కేంద్రాల నిర్వహణకు ఇంటర్వ్యూ
సిరిసిల్ల అర్బన్: జిల్లాలో మీసేవ కేంద్రాల నిర్వహణకు ఆదివారం రాతపరీక్ష, జిల్లా ఈ గవర్నన్స్ కమిటీ సభ్యుల ద్వారా ఇంటర్వ్యూ నిర్వహించారు. చందుర్తి మండలం మూడపల్లి, గంభీరావుపేట, తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల, వేములవాడ అర్బన్ మండలం తెట్టెకుంట(అగ్రహారం), ముస్తాబాద్ మండలం చీకోడ్, రుద్రంగి మండలం మానాల, సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని సుభాష్నగర్లో నూతన మీసేవ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 72 దరఖాస్తులు రాగా.. ఆదివారం కలెక్టరేట్లో రాతపరీక్ష, ఇంఈటర్వ్యూ నిర్వహించారు. -
అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ: అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. వేములవాడలో రూ.6కోట్లతో చేపట్టే రోడ్డు విస్తరణ పనులకు ఆదివారం శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్లో శనివారం నిర్వహించిన కాంగ్రెస్ పట్టణ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రోడ్డు విస్తరణలో స్థలాలు కోల్పోయిన నిర్వాసితులను ఆదుకునేందుకు ఇప్పటికే నష్టపరిహారం చెల్లించినట్లు తెలిపారు. మూలవాగు, గుడిచెరువులో మురికినీరు కలవకుండా సుమారు రూ.9కోట్లతో ప్రత్యేక ప్రణాళిక రూపొందించామన్నారు. వేములవాడను టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తామని, రాజన్న భక్తులకు వేములవాడ చేరుకోగానే ఆహ్లాదకర వాతావరణం కనిపించేలా అభివృద్ధి చేస్తామన్నారు. వేములవాడలో అడుగు స్థలం లేని సుమారు 144 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. మల్కపేట రిజర్వాయర్ను నింపాలి ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మల్కపేట రిజర్వాయర్ను నింపి ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, వీర్నపల్లి మండలాలకు కాలువల ద్వారా సాగునీటిని అందించాలని మండల కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ను కోరారు. ఈ మేరకు శనివారం వినతిపత్రం అందించారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, ఏఎంసీ వైస్చైర్మన్ గుండాడి రాంరెడ్డి, నాయకులు కల్లూరి బాపురెడ్డి తదితరులున్నారు. -
స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితో..
సిరిసిల్లటౌన్: సిరిసిల్లలో అత్యధికశాతం ఉండే పద్మశాలి సామాజికవర్గం వారే తొలిసారిగా గణపతి ఉత్సవాలను నిర్వహించారు. స్థానిక గాంధీచౌక్లో అప్పటి పుర ప్రముఖులు రుద్ర శంకరయ్య, మడూరి అంబాజి, భీమనాఽథిని నారాయణ, కుడిక్యాల రాజారాం, ఎలగొండ నారాయణ సమాజ సేవా సంఘాన్ని ఏర్పాటు చేసి మొదటి గణపతిని ప్రతిష్ఠించారు. 1947 నుంచి ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం స్థానిక మార్కండేయ భవనంలో 79వ వినాయక చవితి ఉత్సవాలు జరిపేందుకు సిద్ధమయ్యారు. అధ్యక్షుడిగా గోలి వెంకటరమణ కొనసాగుతున్నారు. సిరిసిల్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో 1948 నుంచి వినాయక నవరాత్రులు నిర్వహిస్తున్నారు. తొలితరంలో గాండ్ల వీరయ్య నేతృత్వంలో సంఘాన్ని స్థాపించారు. ఈ ఏడాదితో 78వ వార్షికోత్సవం జరుపుతున్న వర్తక సంఘానికి ప్రస్తుతం పుల్లూరి వేణు అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. -
మత్తుపదార్థాలను కట్టడి చేయాలి
● మట్టి వినాయకులను పూజించాలి ● కలెక్టర్ సందీప్కుమార్ ఝా సిరిసిల్ల: మత్తు పదార్థాలను కట్టడి చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కోరారు. కలెక్టరేట్లో ఎస్పీ మహేశ్ బీ గీతేతో కలిసి శనివారం నార్కోటిక్ కంట్రోల్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యాసంస్థలకు 100 గజాల పరిధిలో తంబాకు, మద్యం విక్రయాలను నిషేధిస్తున్నట్లు తెలిపా రు. వినాయక నిమజ్జనం సందర్భంగా మద్యంషాపులు మూసివేయాలని ఆదేశించారు. గంజాయి సాగుచేసే రైతులకు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని రకాల సహాయాన్ని రద్దు చేయాలని తెలిపారు. ఆస్పత్రులు, మెడికల్షాపుల్లో స్టాక్ వివరాలను తనిఖీ చేయాలని డ్రగ్ ఇన్స్పెక్టర్కు సూచించారు. మట్టి గణపతులను పూజించాలి మట్టి గణపతి విగ్రహాలను పూజించాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా కోరారు. కలెక్టరేట్లో పొల్యూషన్ కంట్రోల్బోర్డ్ రూపొందించిన పోస్టర్ను ఆవి ష్కరించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రెండు వేల మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. నిమజ్జనానికి పకడ్బందీగా ఏర్పాట్లు వేములవాడలో సెప్టెంబర్ 4న, సిరిసిల్లలో 6న వినాయక నిమజ్జనానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆదేశించారు. నవరాత్రి ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఎస్పీ మహేశ్ బీ గీతేతో కలిసి పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నిమజ్జనం పాయింట్ల వద్ద పవర్జనరేటర్లను సిద్ధం చేయాలన్నారు. నిమజ్జనం మార్గంలో అవసరమైన రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలని సూచించారు. వెబ్సైట్లో నమోదు చేయాలి సిరిసిల్లక్రైం: వినాయక మండపాల వివరాలు పోలీస్శాఖ విడుదల చేసిన వెబ్సైట్లో నమోదు చేయాలని ఎస్పీ మహేశ్ బీ గీతే సూచించారు. మండపాల నిర్వాహకులతో శనివారం సమావేశమయ్యారు. అత్యధిక శబ్దాన్నిచ్చే డీజే బాక్సులు నిషేధమని స్పష్టం చేశారు. -
త్రిఫ్ట్ పథకం డబ్బులు వచ్చేశాయ్..
● 26న కార్మికులకు పంపిణీ ● చేనేత, జౌళిశాఖ ఏడీ రాఘవరావు సిరిసిల్లటౌన్: త్రిఫ్ట్ ఫండ్(నేతన్న పొదుపు) డబ్బులను కార్మికులకు ఈనెల 26న అందజేయనున్నట్లు సిరిసిల్ల చేనేత, జౌళిశాఖ సహాయ సంచాలకుడు జి.రాఘవరావు శనివారం తెలిపారు. పొదుపు పథకం ప్రవేశపెట్టి మూడేళ్లు పూర్తికావడంతో ఈ డబ్బులు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని 4,963 మంది కార్మికులు జమచేసుకున్న రూ.12.40కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం సమాన వాటా ధనం రూ.12.40కోట్లను రికరింగ్ ఖాతాల(ఆర్డీ2)లో జమ చేసినట్లు తెలిపారు. ఆ డబ్బులను ఈనెల 26న మంత్రుల చేతులమీదుగా పంపిణీ చేయనున్నట్లు వివరించారు. అంతేకాకుండా అకాల మరణం చెందిన 12 మంది నేతకార్మికుల కుటుంబ సభ్యులకు నేతన్న భద్రత పథకం ద్వారా రూ.5లక్షల చొప్పున అందజేయనున్నట్లు వివరించారు. ఎల్ఎండీకి నీటి విడుదలబోయినపల్లి(చొప్పదండి)/ఇల్లంతకుంట(మానకొండూర్): మిడ్మానేరు ప్రాజెక్టు నుంచి శనివారం ఎల్ఎండీకి 8,018 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ప్యాకేజీ–10 అన్నపూర్ణ ప్రాజెక్టులోకి 9,600 క్యూసెక్కుల నీరు వెళ్తోంది. మిడ్మానేరులోకి ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి నుంచి 21,368 క్యూసెక్కులు ఇన్ఫ్లోగా వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 17.936 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. మిడ్మానేరు గేట్లు ఎత్తడంతో ఇల్లంతకుంట మండలం కందికట్కూర్, పొత్తూరు గ్రామ శివారు నుంచి మానేరువాగు ప్రవహిస్తోంది. దీంతో ఈ ప్రాంతంలో భూగర్భజలాలు పెరిగే అవకాశం ఉంది. -
సింగసముద్రం కాలువకు మరమ్మతు
● ఖర్చు భరిస్తానన్న ఎమ్మెల్యే కేటీఆర్ ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మెట్టప్రాంత వరప్రదాయని సింగసముద్రం పూడికతీత పనులను శనివారం ఆయకట్టు రైతులు శ్రమదానంతో చేపట్టారు. ఎగువమానేరు మత్తడి దూకుతోంది. ఆ నీరు కాలువల ద్వారా సింగసముద్రంలోకి వస్తోంది. కాలువలు పూడిక, ముళ్లపొదలు, గడ్డితో నిండిపోవడంతో నీరు వృథాగా పోతోంది. సింగసముద్రం నిండితేనే జక్కులచెరువు, గాలంచెరువు, గిద్ద చెరువులు నిండుతాయి. రాచర్లబొప్పాపూర్ శివారులోని సింగసముద్రానికి వచ్చే కాలువ మరమ్మతు పనులు చేయాలని మూడు రోజులుగా రైతులు కోరినా అధికారులు స్పందించలేదు. దీంతో అన్నదాతలే శ్రమదానంతో కాలువ మరమ్మతు పనులు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ స్పందించారు. పూడికతీత, ముళ్లపొదలు, గడ్డి తొలగింపునకు అయ్యే ఖర్చును తానే భరిస్తానని రైతులకు హామీ ఇచ్చారు. స్థానిక బీఆర్ఎస్ నాయకులతో మాట్లాడి పనులు చేయించాలని సూచించారు. ఈ సందర్భంగా రైతులు కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. -
విక్రయాలకు కేరాఫ్
కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్, రేకుర్తి, కొత్తపల్లి, చింతకుంట పరిసర ప్రాంతాల్లో తయారవుతున్న వినాయక విగ్రహాలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తరలుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో సుమారు 40 దుకాణాల్లో గణేశుని విగ్రహాలను తయారు చేస్తున్నారు. సుమారు 300 మంది ప్రత్యక్షంగా, మరో 300 మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. రాజస్థాన్కు చెందిన కార్మికులు విగ్రహాల తయారీలో నిష్ణాతులు కాగా.. స్థానిక కార్మికులు కలరింగ్, అద్దకం పనుల్లో పాల్పంచుకుంటున్నారు. సుమారు రూ.20 వేల నుంచి రూ.లక్ష విలువ చేసే విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్ను బట్టి ప్రతిమలను కొనుగోలు చేస్తున్నారు. మరికొంతమంది నచ్చిన ప్రతిమలకు అడ్వాన్స్ రూపంలో చెల్లిస్తూ రిజర్వ్ చేసుకుంటున్నారు. మట్టి వినాయకులపై అవగాహన పెరగడంతో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ప్రతిమలకు గిరాకీ తగ్గిందని చెబుతున్నారు. -
నిత్యాన్నదాన సత్రానికి అడుగులు
● నేడు పనుల ప్రారంభోత్సవం ● హాజరుకానున్న మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు ● రాజన్న భక్తుల కోసం రూ.40 కోట్లతో ఏర్పాటు సాక్షిప్రతినిధి,కరీంనగర్: రాజన్న ఆలయ సమీపంలో ప్రభుత్వం తలపెట్టిన విస్తరణ, అభివృద్ధి పనులు ఊపందుకుంటున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) తరహాలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం సమీపంలో నిర్మించనున్న నిత్యాన్నదాన సత్రం పనులు ఆదివారం ప్రారంభం కానున్నాయి. మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్బాబు, అడ్లూరి లక్ష్మణ్కుమార్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పనులను ప్రారంభించనున్నారు. గంగాధరలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ‘జనహిత’ పాదయాత్రకు ముందే మంత్రులు వేములవాడలో నిత్యాన్నదానం పనులను ప్రారంభించి, ఇతర అభివృద్ధి పనులను పరిశీలిస్తారని అధికారులు తెలిపారు. దాదాపు రూ.40కోట్ల బడ్జెట్తో రూపొందించిన ప్లాన్, డిజైన్లను ఇప్పటికే వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వీటీడీఏ) ఖరారు చేసింది. ఈ పనులతోపాటు వేములవాడలో పలు రోడ్ల విస్తరణ పనులు ఆదివారం నుంచి పునఃప్రారంభం కానుండగా, తిప్పాపూర్ వద్ద అదనపు పనులు కూడా వేగం పంజుకోనున్నాయి. మాస్టర్ ప్లాన్ ప్రకారం రెండెకరాల సువిశాల స్థలంలో దాదాపు రూ.40 కోట్లతో పనులు చేపట్టనున్నారు. మొత్తం రెండంతస్తుల్లో నిర్మించనున్న ఈ భవనంలో తొలి అంతస్తులో ఒకేసారి 1500 మంది భక్తులు భోజనం చేసేలా సదుపాయాలు కల్పిస్తున్నారు. రోజుకు 15,000 మంది భోజనం చేసేలా ఏర్పాట్లు చేయనున్నారు. భవిష్యత్తులో భక్తుల రద్దీ పెరిగితే అందుకు అనుగుణంగా రెండో అంతస్తును కూడా వినియోగంలోకి తీసుకువస్తారు. అప్పుడు రోజుకు 30వేల మంది భోజనం చేసే వీలుంటుందని అధికారులు తెలిపారు. కిలోమీటరు వరకు విస్తరణ షురూ.. వేములవాడలోని తిప్పాపూర్ వంతెన నుంచి రాజరాజేశ్వర స్వామి దేవాలయం వద్దకు దాదాపు 1.1 కిమీ దూరం వరకు తలపెట్టిన రోడ్డు విస్తరణ పనులు పునః ప్రారంభం కానున్నాయి. గతంలో పలు న్యాయ వివాదాలు ఎదురైనప్పటికీ.. వాటిని విజయవంతంగా ఎదుర్కొన్న కలెక్టర్ సందీప్కుమార్ ఝా పనులకు ఎలాంటి అవాంతరాలు లేకుండా మాస్టర్ప్లాన్లో రాజీపడకుండా.. రోడ్డు విస్తరణ పనులను తిరిగి ప్రారంభించనున్నారు. తిప్పాపూర్ వద్ద రూ.15 కోట్లతో అదనపు వంతెన పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఇప్పటికే టెండర్లు పూర్తయిన ఈ పనులను కాంట్రాక్టర్ ప్రారంభించారు. ప్రస్తుతం మట్టి తవ్వకాలు నడుస్తున్నాయి. గతేడాది నవంబరులోనే వేములవాడ ఆలయానికి సంబంధించి పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. -
పెండింగ్ ఫీజు విడుదల చేయాలి
ిసరిసిల్లటౌన్: పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఫీజులు విడుదల చేయాలని స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో శనివారం నిర్వహించిన ఫీజు దీక్షలో మాట్లాడారు. ఉన్నత చదువుల కోసం వెళ్లాలనుకునే విద్యార్థులకు ప్రైవేటు యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. విద్యారంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచాలని కోరారు. ఫీజుదీక్షలో సుమారుగా 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. గాంతుల మహేశ్, ఎల్లారెడ్డి, కోడం రమణ, మల్లారపు అరుణ్కుమార్, ఎర్రవెల్లి నాగరాజు సంఘీభావం తెలిపారు. -
పాడిపరిశ్రమతో అదనపు ఆదాయం
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్వేములవాడ/చందుర్తి/కోనరావుపేట(వేములవాడ): రైతులు వ్యవసాయరంగానికి అనుబంధంగా పాడిపరిశ్రమను నెలకొల్పుకుంటే అదనపు ఆదాయం వస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా చందుర్తి మండలం సనుగుల, కోనరావుపేట మండలం ఎగ్లాస్పూర్ గ్రామాల్లోని లబ్ధిదారులకు పాడి గేదెలను శుక్రవారం అందజేశారు. విప్ శ్రీనివాస్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతీ మండలంలోని ఒక్కో గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి పాడిపరిశ్రమను అభివృద్ధి చేస్తామన్నారు. సనుగుల ఎర్ర, పటేల్ చెరువు, ఆశిరెడిపల్లె కొత్తచెరువులను ఎల్లంపల్లి నీటితో నింపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. మండల ప్రత్యేకాధికారి, జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి రవీందర్రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న, చందుర్తి తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవోలు రాధ, శంకర్రెడ్డి, ఏఎంసీ చైర్మన్లు చెలుకల తిరుపతి, కచ్చకాయల ఎల్లయ్య పాల్గొన్నారు. ఆరోగ్యంపై దృష్టి సారించాలి ఉరుకులు, పరుగుల జీవితంలో ప్రతీ ఒక్కరు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. వేములవాడ ప్రెస్క్లబ్, కరీంనగర్ మెడికవర్ ఆస్పత్రి సంయుక్తంగా శుక్రవారం నిర్వహించిన మెగా వైద్యశిబిరంలో పాల్గొన్నారు. గుండె వైద్యులు అనిష్ పబ్బ, జనరల్ ఫిజీషియన్ లోకేష్, ఆర్థోపెడిక్ సర్జన్ రాకేష్ వైద్యపరీక్షలు చేశారు. ఆస్పత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్, ప్రెస్క్లబ్ అధ్యక్షుడు ఎండీ రఫీక్, వర్కింగ్ ప్రెసిడెంట్ కొలిపాక నర్సయ్య, సెక్రటరీ జితేందర్, ఉపాధ్యక్షులు సయ్యద్ అలీ, శ్రీనివాస్, మెడికవర్ మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, లక్ష్మీరాజం, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధే ధ్యేయం
● ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బోయినపల్లి(చొప్పదండి): నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. పనుల జాతరలో భాగంగా రూ.25లక్షలతో చేపట్టిన బోయినపల్లి మోడల్స్కూల్ సీసీ రోడ్డు పనులను శుక్రవారం ప్రారంభించారు. రూ.15లక్షలతో నిర్మించే స్తంభంపల్లి అంగన్వాడీ భవనానికి భూమి పూజ చేశారు. రెండు గ్రామాల గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లను సత్కరించారు. డీఆర్డీవో శేషాద్రి, పీఆర్ ఈఈ సుదర్శన్రెడ్డి, ఎంపీడీవో జయశీల, ఏపీవో సబిత, ఇన్చార్జి తహసీల్దార్ భూపేశ్, పీఆర్ డీఈ విష్ణువర్ధన్, ఏఈ సాయితేజ, ఏఎంసీ చైర్మన్ ఎల్లేశ్యాదవ్, ప్యాక్స్ చైర్మన్లు సురేందర్రెడ్డి, వెంకట్రామారావు, దుర్గారెడ్డి, సెస్డైరెక్టర్ కొట్టెపెల్లి సుధాకర్, మండల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమణారెడ్డి, మహేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. -
‘నీరు’గారుతోంది !
ఇది సిరిసిల్ల శివారులోని చంద్రంపేట వద్ద సిరిసిల్ల–కరీంనగర్ ప్రధాన రహదారి డివైడర్పైన ఉన్న డ్రిప్ పైపు పగిలిపోయి నీరు పైకి ఎగచిమ్ముతోంది. సిరిసిల్లలోని డివైడర్పైనున్న మొక్కలకు, చెట్లకు అందాల్సిన నీరు ఇలా వృథాగా పోతుంది. ఫలితంగా రోడ్డు చివరణ డివైడర్పైనున్న మొక్కలకు నీరు అందక ఎండిపోయే ప్రమాదం ఉంది. ఇది సిరిసిల్ల పట్టణ శివారులోని జ్యోతినగర్ వద్ద సిరిసిల్ల–కరీంనగర్ ప్రధాన రహదారి. ఇక్కడ నివసించే స్థానికులు రోడ్డు డివైడర్పై ఉన్న వాటర్ డ్రిప్ పైపును కట్ చేసి నీళ్లు పట్టుకుంటున్నారు. మున్సిపల్ అధికారులు డివైడర్పై ఉన్న మొక్కలను నీరందించేందుకు మోటార్ను పెట్టి డ్రిప్ పైపు ద్వారా సరఫరా చేస్తే.. ఇలా మధ్యలోనే పక్కదారి పడుతున్నాయి. మిషన్ భగీరథ నల్లా పైపులు ఉన్నా ఇలా డ్రిప్ పైపు నీటిని పట్టుకుంటున్నారు. -
మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి
● కలెక్టర్ సందీప్కుమార్ ఝాసిరిసిల్ల/ముస్తాబాద్(సిరిసిల్ల): మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆకాంక్షించారు. ముస్తాబాద్ ఐకేపీలోని శుభోదయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన యూరియా కేంద్రాన్ని ఏఎంసీ చైర్పర్సన్ తలారి రాణి ప్రారంభించారు. స్థానిక కస్తూర్భా విద్యాలయాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఆవరణలో చెత్త, పిచ్చిమొక్కలను వెంటనే తొలగించాలని పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. అనంతరం ఆవునూర్లో పనుల జాతరలో పాల్గొన్నారు. క్రీడాపోటీల్లో ఉత్సాహంగా పాల్గొనాలి విద్యార్థులు క్రీడాపోటీల్లో ఉత్సాహంగా పాల్గొనా లని కలెక్టర్ సూచించారు. పోతుగల్లో ఎస్జీఎఫ్ క్రీడలను ప్రారంభించారు. విద్యార్థులకు షూస్ అందించాలని సూచించారు. పీఎంకేఎస్వై ప్రతిపాదనలు అందించాలి ప్రధానమంత్రి కృషి సించాయే యోజన 3.0 ప్రతిపాదనలు మూడు రోజుల్లో అందించాలని కలెక్టర్ కోరారు. కలెక్టరేట్లో శుక్రవారం పీఎంకేఎస్వైపై సమీక్షించారు. జిల్లాలోని 260 జీపీల పరిధిలో క్లస్టర్ వాటర్షెడ్ నిర్మాణానికి కేంద్రం నిర్ధేశించిన మార్గదర్శకాల ప్రకారం ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేయాలన్నారు. డీఆర్డీవో శేషాద్రి, ఇన్చార్జి సీపీవో మల్లేశం, జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్ బేగం, ఈఈ జానకీ, సుదర్శన్, జిల్లా హార్టికల్చర్ అధికారి లత, లేబర్ ఆఫీసర్ నజీర్ అహ్మద్, ముస్తాబాద్లో ఏఎంసీ చైర్పర్సన్ తలారి రాణి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు యెల్ల బాల్రెడ్డి, ఎంపీడీవో లచ్చాలు, ఏవో దుర్గరాజు, ఎంఈవో రాజిరెడ్డి, ఏపీఎం జయసుధ పాల్గొన్నారు. -
మధ్యవర్తిత్వంతోనే కేసులు పరిష్కారం
వేములవాడ: మధ్యవర్తిత్వం ద్వారానే కేసులకు పరిష్కారం లభిస్తుందని సీనియర్ సివిల్ జడ్జి అజయ్కుమార్ జాదవ్ పేర్కొన్నారు. సెప్టెంబర్ 13న నిర్వహించే మెగా లోక్ అదాలత్కు సంబంధించిన సమన్వయ సమావేశాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ న్యాయవాదులు, వేములవాడ న్యాయవాదులతో కోర్టు ఆవరణలో శుక్రవారం నిర్వహించారు. మధ్యవర్తిత్వం ద్వారా ఎక్కువ కేసులను పరిష్కరించేలా కృషి చేయాలని సూచించారు. -
‘త్రిఫ్ట్’లో బోగస్ ఏరివేత
సిరిసిల్ల: వస్త్రపరిశ్రమ, అనుబంధ రంగాల్లో బోగస్ కార్మికులను ఏరివేసి నిజమైన నేతన్నలకు అండగా నిలవాలనే దిశగా చేనేత, జౌళిశాఖ అధికారులు అడుగులు వేస్తున్నారు. నేతకార్మికులకు పొదుపును అలవాటు చేసి, వారికి భవిష్యత్పై నమ్మకం కలిగించే లక్ష్యంతో ప్రభుత్వం త్రిఫ్ట్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకంలో కార్మికులు ప్రతీ నెల వారి వేతనంలో 8శాతం మేరకు జమ చేసుకుంటే.. అంతేమొత్తంలో ప్రభుత్వం చెల్లిస్తుంది. 24 నెలల తర్వాత వడ్డీతో సహా పొదుపు డబ్బులు నేతకార్మికుల చేతికి అందుతాయి. ఈ పథకంలో గతంలో కొందరు పనిచేయని ఆసాములు, స్థానికేతరులు, మరమగ్గాల్లో శ్రమించని వారు చేరి ప్రజాధనాన్ని పక్కదారి పట్టించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సాంచాల మధ్య శ్రమించే కార్మికులు, అనుబంధ రంగాల్లో పనిచేసే నేతకార్మికులకే వర్తించేలా క్షేత్రస్థాయి సర్వే చేస్తున్నారు. ఐదు బృందాలతో సర్వే సిరిసిల్ల పట్టణంతోపాటు తంగళ్లపల్లి, చంద్రంపేట, జ్యోతినగర్, రాజీవ్నగర్ ప్రాంతాల్లో చేనేత జౌళిశాఖ అధికారులు ఐదు బృందాల ద్వారా సర్వే చేస్తున్నారు. త్రిఫ్ట్ పథకానికి దరఖాస్తు చేసుకున్న కార్మికులు నిజంగానే పని చేస్తున్నారా.. లేదా.. అనే అంశాలను పరిశీలిస్తున్నారు. ఆధార్, బ్యాంకు ఖాతా నంబరు సేకరిస్తున్నారు. చేనేత, జౌళిశాఖ అధికారులతోపాటు కమ్యూనిటీ కోఆర్డినేటర్లు సర్వేలో పాల్గొంటున్నారు. త్రిఫ్ట్ పొదుపు పథకంలో చేరిన నేతకార్మికులపై క్షేత్రస్థాయి సర్వే చేస్తున్నాం. అర్హులైన కార్మికులకు పొదుపు పథకంలో అవకాశం లభిస్తుంది. బోగస్ నేతకార్మికుల ను చేర్చుకునే అవకాశం లేదు. – రాఘవరావు, చేనేత, జౌళిశాఖ ఏడీ -
ఆధునిక విద్యకు అడుగులు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఆధునిక బోధనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల (సమీకృత గురుకులాలు) నిర్మాణానికి అడుగులు వేస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు రెండు స్కూళ్లకు శంకుస్థాపన జరగగా, మరో రెండు స్కూళ్లకు టెండర్లు పూర్తయ్యాయి. గతేడాది నవంబరులో మంథని, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల(సమీకృత గురుకులాలు)లకు మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ శంకుస్థాపనలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా పెద్దపల్లి జిల్లాలోనే రెండు సమీకృత పాఠశాలల నిర్మాణానికి టెండర్లు పూర్తవడం గమనార్హం. ప్రతీ పాఠశాలను అత్యాధునిక సదుపాయాలతో, పర్యావరణహితంగా సౌరవిద్యుత్తుతో నిర్వహించేలా నిర్మించాలనే ఆలోచనలో ప్రభుత్వం ముందుకెళ్తుండడం విశేషం. ఇప్పటికే టెండర్లు పూర్తి చేసుకున్న నాలుగు పాఠశాలలను 2026 దసరా నాటికి పాఠశాలను ప్రారంభించాలని కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో.. వాస్తవానికి 4 తరగతి నుంచి 12 తరగతి వరకు చదివే విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యనందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 55 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ స్కూళ్లను ప్రభుత్వం నిర్మించనుంది. ఈ మేరకు రూ.1,100 కోట్లకుపైగా నిధులు విడుదల చేసింది. తొలిదశలో ఒక్కో గురుకులానికి రూ.145 కోట్లు చొప్పున వెచ్చించి సదుపాయాలు కల్పించనున్నారు. ఇప్పటికే మంథని, హుస్నాబాద్ టెండర్లు పూర్తవగా.. తాజాగా పెద్దపల్లి, రామగుండంలోనూ టెండర్లు అయ్యాయి. రామగుండం నుంచి అంతర్గాంకు వెళ్లే దారిలో సోషల్ వెల్ఫేర్ పాఠశాల సమీపంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం ప్రభుత్వం 27ఎకరాల భూమి కేటా యించింది. పెద్దపల్లి నియోజవర్గంలో ఎలిగేడు మండలం ర్యాకల్దేవ్పల్లి గ్రామం వద్ద 25 ఎకరాల భూమిని కేటాయించారు. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోనూ మంత్రి పొన్నం గతేడాది నవంబరులోనే శంకుస్థాపన చేశారు. మంథని మండలం అడవిసోమన్పల్లి వద్ద 25 ఎకరాలల్లో సమీకృత పాఠశాలకు మంత్రి శ్రీధర్బాబు శంకుస్థాపన చేశారు. ఒక్కో పాఠశాలకు రూ.150కోట్ల చొప్పున ప్రభుత్వ విడుదల చేయనుంది. టెండర్లు ఖరారవగానే.. తొలివిడతగా రూ.30 కోట్ల చొప్పున పనుల కోసం విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. ప్రత్యేకతలు ఇవే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ విద్యాలయాలను 25 ఎకరాల్లో నిర్మిస్తారు. 4 నుంచి 12వ తరగతి వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా బోధన అందిస్తారు. తరగతి గదులలో డిజిటల్ స్మార్ట్బోర్డ్, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్ బాల్, టెన్నిస్ క్రీడల కోసం మైదానం ఏర్పాటు చేస్తారు. వచ్చే దసరా నాటికి ఇంటిగ్రేటెడ్ విద్యాసంస్థల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతీ స్కూల్లో 2500 పైగా విద్యార్థులు, వీరికి 120 మంది టీచర్లతో బోధించనున్నారు. భవనాలు, సదుపాయాలకు రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్లు వెచ్చించనున్నారు. సొంత సోలార్ విద్యుత్తుతో లిప్టులు, వీధిదీపాలు, క్లాస్రూమ్ ఉపకరణాల నిర్వహణ ఉంటుంది. బీసీ, ఎస్టీ, ఎస్టీ విద్యార్థులకు అడ్మిషన్లు కల్పిస్తారు. -
సాంకేతిక విద్యార్థులకు సత్వర ఉపాధి
సిరిసిల్లటౌన్: సాంకేతిక విద్యను అభ్యసించిన విద్యార్థులకు సత్వర ఉపాధి అవకాశాలు అందివస్తాయని టెక్నికల్ ఎడ్యుకేషన్ శాఖ వరంగల్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ సీతారాములు పేర్కొన్నారు. సిరిసిల్ల ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఏర్పాటు చేసిన ఏటీసీ కోర్సులపై కళాశాల ప్రిన్సిపాల్ కవిత ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో అవగాహన కల్పించారు. ఏడాది కోర్సులు ఇండస్ట్రియల్ రోబోటిక్స్ డిజిటల్ మాన్యుఫాక్చరింగ్ టెక్నీషియన్, మ్యానుఫాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్, ఇంజినీరింగ్ డిజైన్ టెక్నీషియన్, రెండేళ్ల వ్యవధి కోర్సులు అడ్వాన్స్డ్ సీఎన్సీ మెకానిక్ టెక్నీషియన్, వర్చువల్ అనాలసిస్ అండ్ డిజైనర్, మెకానిక్ ఎలక్ట్రికల్ వెహికల్ కోర్సులు ఉన్నట్లు తెలిపారు. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. డీటీవో రవి, ఏటీవో శ్రీనివాస్, జిల్లా ఉపాధి కల్పనాధికారి రాఘవేందర్ పాల్గొన్నారు. -
మిడ్మానేరులో 17 టీఎంసీలు
మా‘నీటి’లో పర్యాటకుల సందడిగంభీరావుపేట(సిరిసిల్ల): గంభీరావుపేట మండలం నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టు ఇటీవల కురిసిన వర్షాలకు మత్తడి పోస్తోంది. దీంతో మా‘నీటి’ అందాలను వీక్షించేందుకు జిల్లా నలుమూలల నుంచి పర్యాటకులు వస్తున్నారు. మానీటిలో కేరింతలు కొడుతున్నారు.బోయినపల్లి(చొప్పదండి): మిడ్మానేరులో నీటిమట్టం శుక్రవారం 17.079 టీఎంసీలకు చేరింది. ఎస్సారెస్పీ నుంచి 15,782, గాయత్రి పంప్హౌస్ నుంచి 3,150 క్యూసెక్కుల మేర నీరు తరలుతోంది. మిడ్మానేరు నుంచి ప్యాకేజీ–10 అనంతగరి ప్రాజెక్టులోకి 9,600 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. -
‘ఇందిరమ్మ’ ముందుకు..
చిత్రంలో స్లాబ్ పూర్తయి గృహప్రవేశానికి సిద్ధమైన ఇల్లు పెద్దపల్లి జిల్లా మంథని పరిధిలోని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన అడవిసోమన్పల్లి గ్రామంలోనిది. గ్రామంలో 348 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారు. 192 నివాసాలు బెసెమ్మెంట్ లెవల్, 85 గోడలు, 51స్లాబ్, 20 ఇళ్లు నిర్మాణాలు పూర్తిచేసుకుని గృహప్రవేశాలకు సిద్ధం అయ్యాయి. మంచిరోజు చూసి మంత్రి శ్రీధర్బాబు చేతుల మీదుగా గృహప్రవేశాలు చేయించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.సాక్షి, పెద్దపల్లి: పేదల సొంతింటి కల నెరవేరుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతోంది. అర్హుల ఎంపికతోపాటు పనులు ప్రారంభమైన నాటి నుంచి ఇటు ప్రజాప్రతి నిధులు, అటు అధికారులు పర్యవేక్షిస్తూ ఇళ్ల పూర్తికి చర్యలు తీసుకుంటున్నారు. ఆర్థికంగా ఇబ్బందులున్నవారికి మహిళా సంఘాల ద్వారా రుణాలు ఇప్పిస్తున్నారు. బేస్మెంట్ పూర్తయితే రూ.లక్ష, గోడల నిర్మాణానికి రూ.లక్ష, స్లాబ్కు రూ.2లక్షలు గృహప్రవేశ సమయంలో రూ.లక్షను మంజూరు చేస్తూ, లబ్ధిదారులను ప్రోత్సహిస్తున్నారు. మండలానికో మోడల్ ఇందిరమ్మ ఇంటిని నిర్మించగా, హౌసింగ్ ఆఫీసులుగా వినియోగించనున్నారు. ఇళ్లు మంజూరై ఆర్థిక ఇబ్బందులతో నిర్మించుకోలేక పోతున్న పేదలకు స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు ఇప్పిస్తున్నారు. దీంతో ఇళ్ల నిర్మాణాలు ఊపందుకోగా, త్వరితగతిన బిల్లులు మంజూరు అవుతున్నాయి. ఒక్క పెద్దపల్లి జిల్లాలోనే 470 మంది లబ్ధిదారులకు సుమారు రూ.4.7కోట్ల రుణాలు అందించారు. ఇందిరమ్మ ఇల్లును 400 చదరపు గజాల నుంచి 600 చదరపు గజాల లోపు మాత్రమే నిర్మించుకోవాలి. లేకుంటే జీపీఎస్ యాప్లో నమోదు కాదు. బిల్లుల చెల్లింపు జరగదు. ప్రతివారం ఇంటి నిర్మాణ పనులను జీపీఎస్ ద్వారా చిత్రీకరించి, ప్రగతిని బట్టి ఏదేనీ సోమవారం చెల్లింపులు చేస్తున్నారు. లబ్ధిదారుల అకౌంట్లో నాలుగు విడతలుగా బిల్లులు చెల్లిస్తున్నారు. బేస్మెంట్తో పాటు ఇతర దశల వారీగా పనులు పూర్తి కాగానే సంబంధిత అధికారులు వాటి ఫొటోలు తీసి ప్రత్యేక యాప్లో అప్లోడ్ చేస్తున్నారు. బేస్మెంట్స్థాయిలో రూ.లక్ష, గోడల నిర్మాణానికి రూ.లక్ష, స్లాబ్ వేసిన తర్వాత రూ.2 లక్షలు, మిగతా పనులు పూర్తి చేసిన తర్వాత రూ.లక్ష చెల్లిస్తున్నారు. నిర్మాణాలకు ఇబ్బందులు లేకుండా వారంలో రెండు రోజులు ఇసుక, మట్టి కోసం అనుమతులు మంజూరు చేస్తున్నారు. బ్యాంకుల విలీనం, వేరువేరు ఖాతాలు, ఇతరత్రా సాంకేతిక సమస్యలతో బిల్లుల మంజూరులో తలెత్తుతున్న సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందులో భాగంగా లబ్ధిదారుడి ఆధార్ అనుసంధానం కలిగిన బ్యాంక్ ఖాతాలో బిల్లు జమచేస్తోంది. ఈ విధానంతో క్షేత్రస్థాయిలో తీసిన లబ్ధిదారుల ఫొటోలను యాప్లో అప్లోడ్ చేసిన వివరాల ఆధారంగా బిల్లు మంజూరు చేస్తున్నారు.ఈ చిత్రంలో నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ ఇంటి రెదుట కనిపిస్తున్న మహిళ సీహెచ్ స్వరూప. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కోనరావుపేట. స్వరూప ఇంటి నిర్మాణానికి మార్చిలో ఎమ్మెల్యే విజయరమణరావు చేతుల మీదుగా ముగ్గు పోశారు. గ్రామంలో ఈమెతో పాటు మరో ఇద్దరు నిర్మాణాలు పూర్తిచేసుకుని, గృహప్రవేశానికి సిద్ధమవ్వగా, ఒక్కొక్కరి ఖాతాలో ఇప్పటికే రూ.4లక్షల చొప్పున బిల్లు జమైంది. గృహప్రవేశం సందర్భంగా మరో రూ.లక్ష పడనుంది. రెండు మూడు రోజుల్లో ఎమ్మెల్యే చేతుల మీదుగా గృహప్రవేశం చేయనున్నారు. -
ఖాళీ స్థలం.. రోగాల నిలయం
● దోమలు పెరిగి.. పందులు తిరిగి ● కంపుకొడుతున్న కాలనీలు ● పల్లెల్లో పడకేసిన పారిశుధ్య నిర్వహణ ● పట్టించుకోని అధికారులుసిరిసిల్లఅర్బన్/వీర్నపల్లి(సిరిసిల్ల): ఖాళీ స్థలాలు రోగాలకు నిలయాలుగా మారాయి. మురుగునీరు నిలిచి.. పిచ్చిమొక్కలు పెరిగి దోమలు, పందులు, కుక్కలకు ఆవాసాలుగా మారాయి. దీంతో చుట్టుపక్కల నివాసాల్లోని ప్రజలు వ్యాధులు బారిన పడుతున్నారు. సిరిసిల్ల పట్టణంతోపాటు, శివారుకాలనీలు చంద్రంపేట, జ్యోతినగర్, కొత్తబస్టాండ్, శాంతినగర్, రాజీవ్నగర్, ముష్టిపల్లి, బోనాల, పెద్దూరు, మారుమూల పల్లెల్లోనూ పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. దోమలు విపరీతంగా పెరిగిపోవడంతో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. కంపుకొడుతున్న పల్లె, పట్టణం సిరిసిల్ల పట్టణంలో చాలా వార్డుల్లో ఖాళీ ప్లాట్లలో ముళ్లపొదలు, పిచ్చిమొక్కలు పెరిగి అపరిశుభ్రతకు నిలయాలుగా మారాయి. ఖాళీ స్థలాల్లోకి మురుగునీరు చేరి దుర్వాసన వస్తోంది. ప్రధానంగా పట్టణంలోని శివారు గ్రామాల్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. వీర్నపల్లి మండల కేంద్రంలోని పలు ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు మురుగునీటి నిలయాలుగా మారాయి. ఆ స్థలాలను కొనుగోలు చేసిన వ్యక్తులు అలాగే వదిలేయడంతో మురుగునీరు నిలిచి, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రంలోని ముస్లింకాలనీని ఆనుకొని ఉన్న ఖాళీ స్థలంలో ఎప్పుడూ మురికినీరు నిలిచి ఉంటుంది. ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులు జారీ చేసి మొరం పోయించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. వీర్నపల్లి మండల కేంద్రంలోని పాత గ్రామపంచాయతీ కార్యాలయం, నూతన బస్స్టాండ్ ప్రాంతంలోని ఖాళీ స్థలాల్లో మురికినీరు నిలిచి దుర్వాసన వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది వీర్నపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం, జెడ్పీ హైస్కూల్ ప్రాంతం. ప్రతీ ఆదివారం నిర్వహించే వారసంత సమీపంలోని ఖాళీ స్థలం. ఇక్కడ వాటర్ట్యాంకర్ వద్ద నీళ్లు నిలిచి, పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగిపోయాయి. బడికి వచ్చే విద్యార్థులు, వారసంతకు వచ్చే వ్యాపారులు, ప్రజలు దుర్వాసన భరించ లేకపోతున్నారు. ఇది వీర్నపల్లి మండల కేంద్రంలోని ప్రధాన డ్రెయినేజీ మురికినీరు. పాత గ్రామపంచాయతీ వెనకాల ఖాళీ స్థలంలో నిలువ ఉన్న మురుగునీరు వెళ్లే మార్గం లేక దోమలకు నిలయంగా మారింది. దీంతో కాలనీవాసులు ఇబ్బంది పడుతున్నారు. -
పిచ్చి మొక్కలు తొలగించాలి
ఖాళీ స్థలాల్లో పిచ్చిమొక్కలు పెరిగి దోమలు, పాములకు ఆవాసాలుగా మారుతున్నాయి. 12వ వార్డు చంద్రంపేట జ్యోతినగర్లో ఇళ్ల మధ్యలోనే పిచ్చిమొక్కలు పెరిగాయి. అఽధికారులు చర్యలు తీసుకోవాలి. – సుల్తాన్ బాల్రాజు, చంద్రంపేటమా కాలనీకి సమీపంలోని మురికినీరు నిలిచి ఉంటుంది. అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకుంటలేరు. మాకు ఎప్పు డు ఏ వ్యాధి వస్తుందోనని ఆందోళన చెందుతున్నాం. రాత్రి అయితే చాలు దోమలను భరించలేకపోతున్నాం. – సయ్యద్ హుస్సేన్, వీర్నపల్లిపారిశుధ్య నిర్వహణపై చర్యలు తీసుకుంటున్నాం. ఖాళీ ప్లాట్లలో పిచ్చిమొక్కలు ఎక్కువగా పెరుగుతున్నాయి. ఆ స్థలాల యజమానులకు నోటీసులు అందజేస్తున్నాం. ఎవరి ప్లాట్లల్లో పెరిగిన పిచ్చిమొక్కులు వారే తొలగించాలని నోటీసు ద్వారా ఆదేశిస్తున్నాం. స్పందించని వారిపై చర్యలు తీసుకుంటాం. – కిరణ్, శానిటరీ ఇన్స్పెక్టర్, సిరిసిల్ల