breaking news
Rajanna
-
‘ఇందిరమ్మ’ ముందుకు..
చిత్రంలో స్లాబ్ పూర్తయి గృహప్రవేశానికి సిద్ధమైన ఇల్లు పెద్దపల్లి జిల్లా మంథని పరిధిలోని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన అడవిసోమన్పల్లి గ్రామంలోనిది. గ్రామంలో 348 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారు. 192 నివాసాలు బెసెమ్మెంట్ లెవల్, 85 గోడలు, 51స్లాబ్, 20 ఇళ్లు నిర్మాణాలు పూర్తిచేసుకుని గృహప్రవేశాలకు సిద్ధం అయ్యాయి. మంచిరోజు చూసి మంత్రి శ్రీధర్బాబు చేతుల మీదుగా గృహప్రవేశాలు చేయించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.సాక్షి, పెద్దపల్లి: పేదల సొంతింటి కల నెరవేరుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతోంది. అర్హుల ఎంపికతోపాటు పనులు ప్రారంభమైన నాటి నుంచి ఇటు ప్రజాప్రతి నిధులు, అటు అధికారులు పర్యవేక్షిస్తూ ఇళ్ల పూర్తికి చర్యలు తీసుకుంటున్నారు. ఆర్థికంగా ఇబ్బందులున్నవారికి మహిళా సంఘాల ద్వారా రుణాలు ఇప్పిస్తున్నారు. బేస్మెంట్ పూర్తయితే రూ.లక్ష, గోడల నిర్మాణానికి రూ.లక్ష, స్లాబ్కు రూ.2లక్షలు గృహప్రవేశ సమయంలో రూ.లక్షను మంజూరు చేస్తూ, లబ్ధిదారులను ప్రోత్సహిస్తున్నారు. మండలానికో మోడల్ ఇందిరమ్మ ఇంటిని నిర్మించగా, హౌసింగ్ ఆఫీసులుగా వినియోగించనున్నారు. ఇళ్లు మంజూరై ఆర్థిక ఇబ్బందులతో నిర్మించుకోలేక పోతున్న పేదలకు స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు ఇప్పిస్తున్నారు. దీంతో ఇళ్ల నిర్మాణాలు ఊపందుకోగా, త్వరితగతిన బిల్లులు మంజూరు అవుతున్నాయి. ఒక్క పెద్దపల్లి జిల్లాలోనే 470 మంది లబ్ధిదారులకు సుమారు రూ.4.7కోట్ల రుణాలు అందించారు. ఇందిరమ్మ ఇల్లును 400 చదరపు గజాల నుంచి 600 చదరపు గజాల లోపు మాత్రమే నిర్మించుకోవాలి. లేకుంటే జీపీఎస్ యాప్లో నమోదు కాదు. బిల్లుల చెల్లింపు జరగదు. ప్రతివారం ఇంటి నిర్మాణ పనులను జీపీఎస్ ద్వారా చిత్రీకరించి, ప్రగతిని బట్టి ఏదేనీ సోమవారం చెల్లింపులు చేస్తున్నారు. లబ్ధిదారుల అకౌంట్లో నాలుగు విడతలుగా బిల్లులు చెల్లిస్తున్నారు. బేస్మెంట్తో పాటు ఇతర దశల వారీగా పనులు పూర్తి కాగానే సంబంధిత అధికారులు వాటి ఫొటోలు తీసి ప్రత్యేక యాప్లో అప్లోడ్ చేస్తున్నారు. బేస్మెంట్స్థాయిలో రూ.లక్ష, గోడల నిర్మాణానికి రూ.లక్ష, స్లాబ్ వేసిన తర్వాత రూ.2 లక్షలు, మిగతా పనులు పూర్తి చేసిన తర్వాత రూ.లక్ష చెల్లిస్తున్నారు. నిర్మాణాలకు ఇబ్బందులు లేకుండా వారంలో రెండు రోజులు ఇసుక, మట్టి కోసం అనుమతులు మంజూరు చేస్తున్నారు. బ్యాంకుల విలీనం, వేరువేరు ఖాతాలు, ఇతరత్రా సాంకేతిక సమస్యలతో బిల్లుల మంజూరులో తలెత్తుతున్న సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందులో భాగంగా లబ్ధిదారుడి ఆధార్ అనుసంధానం కలిగిన బ్యాంక్ ఖాతాలో బిల్లు జమచేస్తోంది. ఈ విధానంతో క్షేత్రస్థాయిలో తీసిన లబ్ధిదారుల ఫొటోలను యాప్లో అప్లోడ్ చేసిన వివరాల ఆధారంగా బిల్లు మంజూరు చేస్తున్నారు.ఈ చిత్రంలో నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ ఇంటి రెదుట కనిపిస్తున్న మహిళ సీహెచ్ స్వరూప. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కోనరావుపేట. స్వరూప ఇంటి నిర్మాణానికి మార్చిలో ఎమ్మెల్యే విజయరమణరావు చేతుల మీదుగా ముగ్గు పోశారు. గ్రామంలో ఈమెతో పాటు మరో ఇద్దరు నిర్మాణాలు పూర్తిచేసుకుని, గృహప్రవేశానికి సిద్ధమవ్వగా, ఒక్కొక్కరి ఖాతాలో ఇప్పటికే రూ.4లక్షల చొప్పున బిల్లు జమైంది. గృహప్రవేశం సందర్భంగా మరో రూ.లక్ష పడనుంది. రెండు మూడు రోజుల్లో ఎమ్మెల్యే చేతుల మీదుగా గృహప్రవేశం చేయనున్నారు. -
ఖాళీ స్థలం.. రోగాల నిలయం
● దోమలు పెరిగి.. పందులు తిరిగి ● కంపుకొడుతున్న కాలనీలు ● పల్లెల్లో పడకేసిన పారిశుధ్య నిర్వహణ ● పట్టించుకోని అధికారులుసిరిసిల్లఅర్బన్/వీర్నపల్లి(సిరిసిల్ల): ఖాళీ స్థలాలు రోగాలకు నిలయాలుగా మారాయి. మురుగునీరు నిలిచి.. పిచ్చిమొక్కలు పెరిగి దోమలు, పందులు, కుక్కలకు ఆవాసాలుగా మారాయి. దీంతో చుట్టుపక్కల నివాసాల్లోని ప్రజలు వ్యాధులు బారిన పడుతున్నారు. సిరిసిల్ల పట్టణంతోపాటు, శివారుకాలనీలు చంద్రంపేట, జ్యోతినగర్, కొత్తబస్టాండ్, శాంతినగర్, రాజీవ్నగర్, ముష్టిపల్లి, బోనాల, పెద్దూరు, మారుమూల పల్లెల్లోనూ పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. దోమలు విపరీతంగా పెరిగిపోవడంతో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. కంపుకొడుతున్న పల్లె, పట్టణం సిరిసిల్ల పట్టణంలో చాలా వార్డుల్లో ఖాళీ ప్లాట్లలో ముళ్లపొదలు, పిచ్చిమొక్కలు పెరిగి అపరిశుభ్రతకు నిలయాలుగా మారాయి. ఖాళీ స్థలాల్లోకి మురుగునీరు చేరి దుర్వాసన వస్తోంది. ప్రధానంగా పట్టణంలోని శివారు గ్రామాల్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. వీర్నపల్లి మండల కేంద్రంలోని పలు ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు మురుగునీటి నిలయాలుగా మారాయి. ఆ స్థలాలను కొనుగోలు చేసిన వ్యక్తులు అలాగే వదిలేయడంతో మురుగునీరు నిలిచి, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రంలోని ముస్లింకాలనీని ఆనుకొని ఉన్న ఖాళీ స్థలంలో ఎప్పుడూ మురికినీరు నిలిచి ఉంటుంది. ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులు జారీ చేసి మొరం పోయించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. వీర్నపల్లి మండల కేంద్రంలోని పాత గ్రామపంచాయతీ కార్యాలయం, నూతన బస్స్టాండ్ ప్రాంతంలోని ఖాళీ స్థలాల్లో మురికినీరు నిలిచి దుర్వాసన వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది వీర్నపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం, జెడ్పీ హైస్కూల్ ప్రాంతం. ప్రతీ ఆదివారం నిర్వహించే వారసంత సమీపంలోని ఖాళీ స్థలం. ఇక్కడ వాటర్ట్యాంకర్ వద్ద నీళ్లు నిలిచి, పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగిపోయాయి. బడికి వచ్చే విద్యార్థులు, వారసంతకు వచ్చే వ్యాపారులు, ప్రజలు దుర్వాసన భరించ లేకపోతున్నారు. ఇది వీర్నపల్లి మండల కేంద్రంలోని ప్రధాన డ్రెయినేజీ మురికినీరు. పాత గ్రామపంచాయతీ వెనకాల ఖాళీ స్థలంలో నిలువ ఉన్న మురుగునీరు వెళ్లే మార్గం లేక దోమలకు నిలయంగా మారింది. దీంతో కాలనీవాసులు ఇబ్బంది పడుతున్నారు. -
లోడు దించాల్సిందే..
● రాచర్లబొప్పాపూర్లో లారీని అడ్డుకున్న రైతులు ఎల్లారెడ్డిపేట/గంభీరావుపేట(సిరిసిల్ల): నాట్లు వేసి నెల రోజులు దాటుతున్నా యూరియా వేయకపోవడంతో పొలాలు ఎర్రబడుతున్నాయని మండలంలోని రాచర్లబొప్పాపూర్ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాచర్లబొప్పాపూర్కు గురువారం లారీ లోడ్ యూరియా బస్తాలు రాగా.. అందులో కొన్నింటిని వేరే గ్రామానికి తీసుకెళ్లేందుకు అధికారులు ప్రయత్నించగా రైతులు అడ్డుకున్నారు. 500 మంది క్యూలైన్లో ఉండగా.. 460 బస్తాలు మాత్రమే వచ్చాయి. అందులోనూ 240 దింపి మిగతా వాటిని గంభీ రావుపేటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా రైతులు అడ్డుకున్నారు. ఏవో రాజశేఖర్ అక్కడికి చేరుకొని మరో లోడ్ వస్తుందని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. సీఐ శ్రీనివాస్గౌడ్ అక్కడికి చేరుకున్నారు. ఏవో హామీతో యూరియా లోడుతో ఉన్న లారీని అక్కడ నుంచి వెళ్లనిచ్చారు. ఉదయమే చెప్పుల క్యూలైన్ గంభీరావుపేట మండలం కొత్తపల్లి సింగిల్విండో గోదాం వద్ద గురువారం ఉదయమే రైతులు చెప్పులు, బండరాళ్లను క్యూలైన్లో పెట్టారు. అధికారులు స్పందించి సరిపడా యూరియా బస్తాలు ఇప్పించాలని రైతులు కోరుతున్నారు. గంటల కొద్దీ నిరీక్షించినా సరిపడా యూరియా ఇవ్వడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పిచ్చి మొక్కలు తొలగించాలి
ఖాళీ స్థలాల్లో పిచ్చిమొక్కలు పెరిగి దోమలు, పాములకు ఆవాసాలుగా మారుతున్నాయి. 12వ వార్డు చంద్రంపేట జ్యోతినగర్లో ఇళ్ల మధ్యలోనే పిచ్చిమొక్కలు పెరిగాయి. అఽధికారులు చర్యలు తీసుకోవాలి. – సుల్తాన్ బాల్రాజు, చంద్రంపేటమా కాలనీకి సమీపంలోని మురికినీరు నిలిచి ఉంటుంది. అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకుంటలేరు. మాకు ఎప్పు డు ఏ వ్యాధి వస్తుందోనని ఆందోళన చెందుతున్నాం. రాత్రి అయితే చాలు దోమలను భరించలేకపోతున్నాం. – సయ్యద్ హుస్సేన్, వీర్నపల్లిపారిశుధ్య నిర్వహణపై చర్యలు తీసుకుంటున్నాం. ఖాళీ ప్లాట్లలో పిచ్చిమొక్కలు ఎక్కువగా పెరుగుతున్నాయి. ఆ స్థలాల యజమానులకు నోటీసులు అందజేస్తున్నాం. ఎవరి ప్లాట్లల్లో పెరిగిన పిచ్చిమొక్కులు వారే తొలగించాలని నోటీసు ద్వారా ఆదేశిస్తున్నాం. స్పందించని వారిపై చర్యలు తీసుకుంటాం. – కిరణ్, శానిటరీ ఇన్స్పెక్టర్, సిరిసిల్ల -
అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలు
సిరిసిల్లటౌన్: అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ ఎంపిక పోటీలను బతుకమ్మ ఘాట్లో నిర్వహించారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొజ్జ చంద్రశేఖర్ పోటీలను ప్రారంభించారు. అండర్ 14, 16, 18, 20 విభాగాల్లో క్రీడాకారులు పోటీపడ్డారు. విజేతలకు మెడల్స్ను డాక్టర్ కోడూరు రవీందర్శాసీ్త్ర చేతులమీదుగా అందజేశారు. ఎంపికైన క్రీడాకారులు వచ్చే నెల 30, 31 తేదీల్లో మహబూబ్నగర్లో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. జిల్లా అథ్లెటిక్స్ ఉపాధ్యక్షుడు రామచంద్రన్, గొట్టె రామచంద్రం, కనకం శ్రీనివాస్, పీఈటీలు రాజు, సాయికృష్ణ, శైలజ, సంధ్య పాల్గొన్నారు. -
గణేశ్ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో
వేములవాడ: ప్రశాంత వాతావరణంలో గణేశ్ ఉత్సవాల నిర్వహణకు అధికారులు చర్యలు తీసుకో వాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించారు. రాజన్న ఆలయ చైర్మన్ చాంబర్లో గురువారం గణేశ్ ఉత్సవాల నిర్వహణ, నిమజ్జన ఏర్పాట్లపై కలెక్టర్ సందీప్కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బీ గీతేతో కలిసి సమీక్షించారు. ఈనెల 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు నవరాత్రి ఉత్సవాలు కొనసాగనున్నట్లు తెలిపారు. నిమజ్జన సమయంలో ఇబ్బందులు రాకుండా అవసరమైన పెద్ద క్రేన్లు ముందుగానే ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అదనపు ఏర్పాట్లు చేయాలన్నారు. నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనం సందర్భంగా డీజే, క్రాకర్స్కు అనుమతి ఇవ్వవద్దన్నారు. నిమజ్జనం పాయింట్ వద్ద అవసరమైన మేర గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలన్నారు. ప్రతీ పాయింట్ వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. నిమజ్జనాన్ని పర్యవేక్షించేందుకు అన్ని శాఖల అధికారులతో కంట్రోల్రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. రోడ్డు మరమ్మతు చేపట్టాలి : కలెక్టర్ నిమజ్జనం రూట్లో అవసరమైన మేరకు రోడ్డు మరమ్మతు పనులు వెంటనే చేపట్టాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా సూచించారు. నిమజ్జనం పాయింట్ల వద్ద పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాటు చేయాలని తెలిపారు. లైటింగ్, బారీకేడ్లు, మెడికల్ క్యాంపు, సాంస్కృతిక కార్యక్రమాలు, మొబైల్ టాయిలెట్ సదుపాయాలను కల్పించాలన్నారు. నిమజ్జనం రోజున వైన్స్, బెల్టుషాపులు మూసివేయాలని ఆదేశించారు. ప్రతీ వినాయక విగ్రహానికి టోకెన్ అందించాలని తెలిపారు. భారీ బందోబస్తు : ఎస్పీ నిమజ్జనం సజావుగా జరిగేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. పెద్ద విగ్రహాల తరలింపు రూట్లను ముందుగా పరిశీలించి, ఆ మార్గంలో ఎలాంటి కేబుల్స్ అడ్డురాకుండా చర్యలు చేపడతామని తెలిపారు. అనంతరం విప్తో కలిసి అధికారుల బృందం గుడి చెరువును పరిశీలించారు. ఆలయ ఈవో రాధాబాయి, జిల్లా మత్స్యశాఖ అధికారి సౌజన్య, జిల్లా ఫైర్ సర్వీసెస్ అధికారి శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అన్వేశ్, ఆర్అండ్బీ, సెస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
దేహదానం మహోన్నతం
సిరిసిల్ల: దేహదానం మహోన్నతమైందని మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ జాటోత్ రాజేశ్వరీ అభినందించారు. సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు, సామాజిక కార్యకర్త దేహదానానికి ముందుకురాగా.. వారికి గురువారం అంగీకారపత్రాలను అందించి మాట్లాడారు. చనిపోయిన తర్వాత కాల్చడమో, పూడ్చడమో చేస్తారని, మెడికల్ కళాశాలకు దేహదానం చేయడం ద్వారా వైద్య విద్యార్థుల పరిశోధనకు ఉపయోగపడుతుందన్నారు. సిరిసిల్ల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కనకశ్రీ విజయరఘునందన్ కుటుంబం స్ఫూర్తితో అధ్యాపకులు వాసరవేణి పర్శరాములు, చెన్నోజ్వల శశిధర్, గుమ్మడి మురళి, గుమ్మడి స్వప్న, సామాజిక కార్యకర్త దుంపెన రమేశ్ దేహదానానికి ముందుకొచ్చారు. అనాటమీ డిపార్టుమెంట్ హెడ్ అన్వర్ ఉన్నీస, డాక్టర్ అర్పిత, డాక్టర్ దివ్య తదితరులు ఉన్నారు. -
రాజీమార్గం కోసం ప్రోత్సహించాలి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజసిరిసిల్లకల్చరల్/సిరిసిల్లటౌన్: పరస్పర చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కారమయ్యే కేసులను గుర్తించి రాజీమార్గాన్ని ప్రోత్సహించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ కోరారు. జిల్లా న్యాయస్థానంలో న్యాయవాదులు, అధికారులతో గురువారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో మాట్లాడారు. బీమా, రోడ్డు ప్రమాదాలు, గృహహింస, అదనపు వరకట్న వేధింపులు, విడాకులు, భరణం, గార్డియన్షిప్, ఇతర సివిల్, క్రిమినల్ కేసుల్లో మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారమయ్యే ప్రయత్నాలను ముమ్మరం చేయాలని సూచించారు. అదనపు జిల్లా సెషన్స్ జడ్జి వి.పుష్పలత, సీనియర్ సివిల్ జడ్జి పి.లక్ష్మణాచారి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధికా జైస్వాల్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎ.ప్రవీణ్, జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జూపెల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. అదాలత్లో కేసులు సత్వర పరిష్కారం లోక్ అదాలత్లో కేసులు సత్వర పరిష్కారమవుతాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్జడ్జి రాధికా జైశ్వాల్ పేర్కొన్నారు. సిరిసిల్ల డిపోలో మేనేజర్ ప్రకాశ్రావు ఆధ్వర్యంలో న్యాయ అవగాహన శిబిరం నిర్వహించారు. సెప్టెంబర్ 13న జిల్లా కోర్ట్లో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లోక్ అదాలత్ సభ్యుడు చింతోజు భాస్కర్, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. -
ఓపెన్జిమ్స్పై నిర్లక్ష్యం
ఇది సిరిసిల్లలోని మెహెర్నగర్లో స్మార్ట్ ఓపెన్జిమ్. ఆరోగ్య సిరిసిల్ల లక్ష్యంతో బల్దియా ఆధ్వర్యంలో రూ.15లక్షలతో ఏడున్నరేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. పొద్దున, సాయంత్రం ప్రజలు నిత్యం ఇక్కడకు వచ్చి ఆరోగ్యం కోసం ఓపెన్జిమ్లో పరికరాలతో కసరత్తు చేస్తుంటారు. ఏడాదిన్నర కాలంగా ఈ పరికరాల నిర్వహణను మున్సిపల్ పట్టించుకోవడం లేదు. పరికరాల విడిభాగాలు పాడై పనికిరాకుండా పోయాయి. సర్ధాపూర్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల ఎదుట పిచ్చి మొక్కల్లో జిమ్నెహ్రూపార్క్ ఎదుట పాడయిన ఓపెన్జిమ్ సిరిసిల్లటౌన్: ఆరోగ్య సిరిసిల్లపై బల్దియా అశ్రద్ధ వహిస్తుంది. గతంలో పట్టణం చుట్టుముట్టూ పార్కుల్లో పరుచుకున్న ఆహ్లాదంతోపాటు ప్రజారోగ్య రీత్య ఓపెన్జిమ్స్ను ఏర్పాటు చేశారు. కొద్దికాలంగా ఈ ఓపెన్జిమ్స్ నిర్వహణ లోపంతో పరికరాలు తుప్పుబట్టి.. పనికిరాకుండా పోతున్నాయి. ఇప్పటికే పరికరాల మరమ్మతు కోసం స్థానికులు ఆరు నెలలుగా అధికారులకు విన్నవిస్తున్నా పట్టింపు కరువైంది. ప్రజా ఆరోగ్యంపై అశ్రద్ధ ఆరోగ్య సిరిసిల్లలో భాగంగా పట్టణంలో ఏర్పాటు చేసిన ఓపెన్జిమ్స్ అలంకారప్రాయంగా మారాయి. సుమారు ఏడున్నరేళ్ల క్రితం డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్(సీడీఎంఏ) ఆధ్వర్యంలో ‘వరల్డ్బ్యాంకు’ ప్రాజెక్టు ద్వారా స్మార్ట్ ఓపెన్జిమ్స్ ఏర్పాటు చేశారు. స్థానిక ఇందిరాపార్కు, శాంతినగర్, గణేశ్నగర్లో ఒక్కోటి రూ.15లక్షలు వెచ్చించి రూ.45లక్షలతో మూడు చోట్ల ఏర్పాటు చేశారు. పట్టణ ప్రజలకు ఆరోగ్యాన్ని అందించే లక్ష్యంగా మున్సిపల్ ఆధ్వర్యంలో విలీన గ్రామాలను కూడా కలుపుకుని మొత్తంగా 23 చోట్ల ఔట్డోర్ జిమ్స్ ఏర్పాటు చేశారు. ప్రతీ రోజు వందలాది సంఖ్యలో పెద్దలు, చిన్నలు, మహిళలు వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకునేవారు. పరికరాలు తుప్పుబట్టి పోవడం, మరమ్మతుకు నోచుకోకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సామాజిక బాధ్యతపై నిర్లిప్తత ఆరోగ్య సిరిసిల్ల లక్ష్యం అందని ద్రాక్షగా మారుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అభివృద్ధిలో ముందున్న సిరిసిల్ల బల్దియా అప్పట్లో స్మార్ట్ సిటీలో భాగంగా సామాజిక బాధ్యతగా ఓపెన్జిమ్స్, అన్నపూర్ణ క్యాంటీన్, క్లాత్బ్యాంకు, చారిటీవాల్ ఏర్పాటు చేసింది. సీడీఎంఏ, మున్సిపల్ ఆధ్వర్యంలో జూనియర్ కళాశాల మైదానం, రగుడు, శాంతినగర్, నెహ్రూనగర్, కార్గిల్లేక్, పెద్దూరు, చిన్నబోనాల, రాజీవ్నగర్, పెద్దబోనాల, జేపీ నగర్ పార్క్, పద్మనగర్, బీవై నగర్, సుందరయ్యనగర్, వెంకంపేట, నర్సింగ్కాలేజీ ప్రాంతం, నెహ్రూపార్కు, డబుల్బెడ్రూం కాంప్లెక్సు, వెంకట్రావునగర్ పార్కు, సాయినగర్ ప్రాంతాల్లో ఓపెన్జిమ్స్ ఉన్నాయి. రూ.కోట్లు.. నిర్లక్ష్యంతో పాట్లు ఓపెన్ జిమ్స్పై బల్దియా నిర్లక్ష్యం వహించడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్మార్ట్ సిరిసిల్లలో ప్రజా ఆరోగ్యం కోసం రూ.1.75కోట్లు ఖర్చు చేయగా బల్దియా వాటి నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. పరికరాలు విరిగిపోవడం, ఫ్లోరింగ్ పెచ్చులూడిపోతున్నాయి. నిత్యం వాకర్స్, వ్యాయామానికి వచ్చేవారు ఓపెన్జిమ్స్ పనికిరాకుండా ఉండటాన్ని అధికారులు, పాలకుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని చెబుతున్నారు. -
యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు
ఎల్లారెడ్డిపేట/గంభీరావుపేట(సిరిసిల్ల): యూరియా కోసం రైతులు బుధవారం రోడ్డెక్కారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్ మా ర్కెట్ కమిటీ ఆవరణ, గంభీరావుపేటలో రైతులు బైఠాయించారు. వారు మాట్లాడుతూ గంటల కొద్దీ క్యూలైన్లో నిల్చున్నా సరిపడేంత యూరియా బస్తాలు ఇవ్వడం లేదన్నారు. తహసీల్దార్ మారుతిరెడ్డి రైతులతో మాట్లాడి శాంతింపజేశారు. రాచర్లబొప్పాపూర్లో కాంగ్రెస్ నాయకులతో రైతులు వాగ్వాదానికి దిగారు. 440 బస్తాల యూరియా రాగా.. 220 బస్తాలను రాచర్లబొప్పాపూర్లో దింపి మిగతావి వేరే చోటుకు తరలిస్తుండగా రైతులు అడ్డుకున్నారు. సీఐ శ్రీనివాస్గౌడ్ అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడి.. రేపు మరో లారీలోడ్ యూరియాను తెప్పిస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. అనంతరం ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున యూరియా అందించారు. -
రాజీవ్గాంధీతోనే సాంకేతిక విప్లవం
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చందుర్తి(వేములవాడ): దేశాన్ని శాస్త్ర, సాంకేతికరంగాల్లో అభివృద్ధి సాధ్యమైందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పే ర్కొన్నారు. మర్రిగడ్డలో బుధవారం రాజీవ్గాంధీ జయంతి వేడుకలో పాల్గొన్నారు. మత్స్యకారులకు ప్రభుత్వం అండ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కేజీ కల్చర్ విధానంలో చేపల పెంపకానికి ముందుకొస్తే ప్రభుత్వం సబ్సిడీని అందిస్తోందని తెలి పారు. మర్రిగడ్డలో మత్స్యకార్మికుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పచ్చళ్ల దుకాణాన్ని ప్రారంభించారు. పార్టీ మండలాధ్యక్షుడు చింతపంటి రామస్వామి, మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్, తుపాకుల రవి, గుండేవేని తిరుపతి, గుండేవేని శ్రీనివాస్ పాల్గొన్నారు. ముస్తాబాద్(సిరిసిల్ల): వెంకట్రావుపల్లెలో అసైన్డ్ భూములపై వివాదం తలెత్తింది. వెంకట్రావుపల్లె గ్రామస్తులు ప్రధాన రహదా రి వద్ద ఉన్న అసైన్డ్ భూముల వద్ద బుధవారం ఆందోళన చేపట్టారు. వారు మాట్లాడుతూ వెంకట్రావుపల్లెలోని సర్వేనంబర్ 798లో 84 ఎకరాల అసైన్డ్ భూమి ఉండగా.. పలువురికి 60 ఎకరాల వరకు ప్రభుత్వం పట్టాలిచ్చిందని తెలిపారు. ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న 20 ఎకరాలలో కొందరు అక్రమంగా ప్రవేశించి దున్నుతున్నారన్నారు. సీఐ మొగిలి, ఎస్సై గణేశ్ ప్రత్యేక బలగాలతో వెంకట్రావుపల్లెకు చేరుకుని గ్రామస్తులను శాంతింపజేశారు. తహసీల్దార్ సురేశ్ అక్కడికి చేరుకొని.. అసైన్డ్ భూముల్లోకి ఎవరు వెళ్లవద్దని, ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంటుందని స్పష్టం చేశారు. తంగళ్లపల్లి(సిరిసిల్ల): కూలి పెంచాలంటూ బద్దెనపల్లి–సారంపల్లి టెక్స్టైల్ పార్క్ పవర్లూమ్ కార్మికులు చేస్తున్న సమ్మె బుధవారం రెండో రోజుకు చేరింది. తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్ మాట్లాడుతూ కూలి పెంచే వరకు సమ్మె కొనసాగుతోందని స్పష్టం చేశారు. కూచన శంకర్, వేణు, సంపత్, కనకయ్య, వరప్రసాద్, శ్రీనివాస్, రాజు, శ్రీకాంత్, కిషన్ పాల్గొన్నారు. వీర్నపల్లి(సిరిసిల్ల): బడి సమయానికి అనుగుణంగా బస్సులు నడపాలని కోరుతూ మండల కేంద్రంలోని మర్రిమడ్ల–ఎల్లారెడ్డిపేట రోడ్డుపై బుధవారం విద్యార్థులు ధర్నాకు దిగారు. ఎల్లారెడ్డిపేట ఎస్సై రాహుల్రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని విద్యార్థులను డిపోమేనేజర్తో మాట్లాడించారు. గురువారం నుంచి బస్సులు సమయానికి పంపిస్తామని, మోడల్స్కూల్కు ప్రత్యేక బస్సు నడుపుతామని డిపోమేనేజర్ హామీతో ధర్నా విరమించారు. శబరిమలకు మహా పాదయాత్రముస్తాబాద్(సిరిసిల్ల): శబరిమలకు 36 మంది మాలధారులు రాజుగురుస్వామి ఆధ్వర్యంలో బుధవారం మహాపాదయాత్రగా బయలు దేరారు. 1250 కిలోమీటర్లు రెండు నెలలపాటు మహా పాదయాత్ర చేయనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ చీటి జితేందర్రావు తెలిపారు. బృందంలో మాజీ ఎంపీపీ జనగామ శరత్రావు, నాగరాజు, అంజాగౌడ్, పండరి, ఎల్లం, నారాయణ, మహేశ్, బాలాజీ, వెంకటేశ్వర్రావు, కృష్ణమూర్తి, స్వామి, తిరుపతి, నర్సింగరావు తదితరులున్నారు. -
ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ప్రణాళికాబద్ధంగా జిల్లా ను అన్నిరంగాల్లో అభివృద్ధి పర్చాలని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని బుధవారం హైదరాబాద్లోని తాజ్కృష్ణ హోటల్లో నిర్వహించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన తుమ్మల మాట్లాడుతూ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యం, ఉపాధి రంగాల పు రోగతికి చర్యలు చేపట్టామన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వాలన్నారు. రైతుబజార్లను విస్తరించాలని, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటుకు కృషి చేయాలని సూచించారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, రైతు రుణమాఫీ, పంటల నష్ట పరిహారం, విద్యార్థులకు స్కాలర్షిప్లు, మైనార్టీ, మహిళల అభివృద్ధికి పథకాలను పకడ్బందీగా అమలయ్యేలా చూడాలన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మాజీమంత్రి టి.జీవన్రెడ్డి, ఎమ్మెల్యేలు చింతకుంట విజయరమణారావు, మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్, మేడిపల్లి సత్యం, సంజయ్, ఎమ్మెల్సీ టి.భానుప్రసాద్రావు, నియోజక వర్గ ఇన్చార్జిలు వొడితెల ప్రణవ్, కేకే.మహేందర్రెడ్డి, జువ్వాడి నర్సింగరావు, నాయకులు వెలిచాల రాజేందర్రావు, వూట్కూరి నరేందర్రెడ్డి ఉన్నారు. -
మానేరు జలాలకు కలెక్టర్, ఎస్పీ పూజలు
గంభీరావుపేట/ముస్తాబాద్(సిరిసిల్ల): మండలంలోని నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టు పూర్తిస్థాయిలో పొంగిపొర్లుతుండడంతో బుధవారం కలెక్టర్ సందీప్కుమార్ ఝా, ఎస్పీ మహేశ్ బి గీతే కలిసి మానేరు జలాలకు పూజలు చేశారు. అనంతరం కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు. ఇరిగేషన్, పోలీస్, రెవెన్యూశాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. పాడి పశువులతో ఆర్థికంగా వృద్ధి చెందాలి పాడిపశువులను సద్వినియోగం చేసుకొని పేద కుటుంబాలు ఆర్థికంగా వృద్ధి చెందాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా కోరారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దేశాయిపేటలో 17 మంది లబ్ధిదారులకు మంజూరైన పాడిపశువులను పంపిణీ చేశారు. కేసుల దర్యాప్తులో అలసత్వం వద్దు కేసుల దర్యాప్తులో పోలీస్ అధికారులు అలసత్వం వహించొద్దని ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. ముస్తాబాద్ పోలీస్స్టేషన్ను బుధవారం తనిఖీ చేశారు. రికార్డులను, కేసుల విచారణ తీసుకున్న చర్యలను పరిశీలించారు. పెట్రోలింగ్ సమయంలో రౌడీషీటర్ల కదలికలను గమనించాలన్నారు. -
24న ‘జనహిత’ యాత్ర
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ చేపట్టిన జనహిత పాదయాత్రకు జిల్లాలో ఏర్పాట్లు మొదలయ్యాయి. ఈనెల 24న చొప్పదండిలో ఆమె పాదయాత్ర చేయనున్నారు. చొప్పదండి నియోజకవర్గంలోని ఉప్పరమల్యాల నుంచి మధురానగర్ వరకు యాత్ర సాగనుంది. దాదాపు 5 నుంచి 6 కిలోమీటర్ల మేర సాగనున్న ఈ పాదయాత్రలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్కుమార్, ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉమ్మడి జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఉమ్మడి జిల్లాకు తొలిసారిగా రానున్న నేపథ్యంలో ఆమె పాదయాత్రను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ నాయకులు పట్టుదలతో ఉన్నారు. గంగాధరలో బహిరంగ సభ.. ఉప్పర మల్యాల నుంచి గంగాధరలోని మధురానగర్ చౌరస్తా వద్ద బహిరంగ సభకు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో ఏర్పాట్లు మొదలయ్యాయి. దాదాపు 6 కిలోమీటర్ల వరకు సాగే పాదయాత్రలో మీనాక్షి పలువురు ప్రజలతో మాట్లాడతారు. అదే సమయంలో అవసరమైన చోట శ్రమదానం, స్థానిక నేతలతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సభకు ఉమ్మడి జిల్లా నుంచి భారీగా కాంగ్రెస్ శ్రేణులు తరలనున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల పార్టీ అధ్యక్షులు ఇప్పటికే ఈ సభ నిర్వహణ, ఏర్పాట్లపై ఫోన్లో మంతనాలు సాగిస్తున్నారు. 24న పాదయాత్ర అనంతరం మీనాక్షి జిల్లాలోనే బస చేయనున్నా రు. ఆమె కరీంనగర్ జిల్లా కేంద్రంలో బస చేస్తారా..? లేక గంగాధర మండలంలోనే ఆగుతారా..? అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. మరునాడు 25న ఉదయం గంగాధర మండలంలోని వెంకటాయపల్లిలోని ఎల్కే గార్డెన్స్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నేతల సమావేశానికి ఆమె నేతృత్వం వహిస్తారు. నామినేటెడ్ పదవులపై ఉత్కంఠ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భర్తీ కాని నామినేటెడ్ పదవుల విషయంలో కేడర్ తీవ్ర అసంతృప్తిగా ఉంది. పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రతీ అసెంబ్లీకి ఇద్దరు నేతల పేర్లు సూచించాలని అధిష్టానం ఆదేశించింది. అయితే కరీంనగర్ అసెంబ్లీకి మాత్రం కనీసం ఐదుగురు నేతలకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని ఇక్కడి నేతలు డిమాండ్ చేస్తున్నారు. పార్టీలు మారి వచ్చిన వారికి కాకుండా.. పార్టీ పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్నపుడు వెన్నంటి ఉన్న నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. డీసీసీ, పట్టణ, మండల, గ్రామ, బ్లాక్ అధ్యక్షుల భర్తీకి దరఖాస్తులు తీసుకున్నా.. ఇప్పటివరకూ ఎలాంటి పదవుల కేటాయింపు జరగలేదు. 25న మీనాక్షి నటరాజన్ నేతృత్వరంలో జరిగే సమావేశంలో ప్రతీ కార్యకర్తతో ఆమె మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలో మెజారిటీ సీనియర్ నేతలు తమకు పదవుల్లో ప్రాధాన్యమివ్వాలని కోరనున్నారు. మరికొందరు ఉమ్మడి జిల్లా నేతలు పార్టీ పరిస్థితిని వివరిస్తూ.. పలువురు నటరాజన్కు ఇప్పటికే సమాచారం చేరవేసినట్లు తెల్సింది. ముఖ్యంగా కరీంనగర్ విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని పలువురు ఆమెకు విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. -
ఆరోగ్య సేవలపై ఆరా
గంభీరావుపేట(సిరిసిల్ల): మండల కేంద్రంలోని ఆయూష్మాన్ ఆరోగ్య కేంద్రం–2ను జిల్లా వైద్యాధికారి రజిత బుధవారం తనిఖీ చేశారు. గర్భిణీల నమోదు, టీకాల రికార్డులను పరిశీలించారు. వ్యాధి నిరోధక టీకాల ఆవశ్యకతపై పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. పీవోఎంహెచ్ అంజలి, జిల్లా వ్యాధినిరోధక అధికారి సంపత్కుమార్, ఇన్సిడీ ప్రోగ్రాం ఆఫీసర్ రామకృష్ణ, వైద్యాధికారి వేణుగోపాల్రెడ్డి పాల్గొన్నారు. బోయినపల్లి(చొప్పదండి): కరీంనగర్–సిరిసిల్ల ప్రధాన రహదారిలో మండలంలోని వెంకట్రావుపల్లి వద్ద పోలీసులు బుధవారం వాహనాల తనిఖీ నిర్వహించారు. ఎస్పీ మహేశ్ బి గీతే, కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆదేశాలతో యూరియా అక్రమ రవాణా జరగకుండా వాహనాల తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నారు. -
మరమ్మతు చేయించాలి
సర్దాపూర్లో ఏర్పాటు చేసిన ఓపెన్జిమ్ చుట్టూ పిచ్చిమొక్కలు మొలిచాయి. పరికరాలు కూడా సరిగా పనిచేయడం లేదు. చాలా రోజులుగా వాటిని రిపేరు చేయడం లేదు. ప్రజలకు ఆరోగ్యాన్ని పంచుతున్న ఓపెన్ జిమ్స్కు ప్రత్యేక నిధులు కేటాయించి పరికరాలు మంచిగా పనిచేసేలా చూడాలి. – తాళ్లపెల్లి శ్రీకాంత్, పెద్దూరు ఉరుకుల పరుగుల జీవితంలో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఇతర పట్టణాల్లో లేని విధంగా సిరిసిల్లలో ప్రజా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చి స్మార్ట్ ఓపెన్జిమ్స్ ఏర్పాటు చేశారు. లక్ష్యసాధనలో గతంలో మాదిరిగా అధికారులు ఓపెన్జిమ్స్ నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. – ఎలిగేటి వీణ, సాయినగర్ నెల రోజుల్లో ఓపెన్జిమ్స్ మరమ్మతుకు టెండర్లు పూర్తి చేస్తాం. రిపేరు చేయించి విని యోగంలోకి తీసుకొస్తాం. ఎక్కడెక్కడ పరికరాలు పాడయ్యాయో సిబ్బంది పరిశీలించి మరమ్మతులు చేపడతాం. అన్ని ఏరియాల్లో ఓపెన్ జిమ్స్లో ప్రజలు వ్యాయామం చేసుకునేలా చూస్తాం. – ఎంఏ ఖదీర్పాషా, మున్సిపల్ కమిషనర్ -
పుట్టినరోజునే నూరేళ్లు
సిరిసిల్లటౌన్: పుట్టినరోజున ఇంట్లో అమ్మ ఆశీస్సులు పొంది, దోస్తులతో ఆనందంగా గడుపొచ్చన్న యువకుడిని విద్యుత్ తీగల రూపంలో మృత్యువు కబళిచింది. స్థానికులు తెలిపిన వివరాలు..తంగళ్లపల్లి మండలం ఓబులాపూర్కు చెందిన కొమ్ము మైసయ్య–నవీన దంపతులు సిరిసిల్ల నెహ్రూనగర్లో నివాసం ఉంటున్నారు. మైసయ్య ఉపాధి కోసం గల్ఫ్లో ఉండగా..భార్య నవీన ఏఎన్ఎంగా విధులు నిర్వర్తిస్తోంది. వీరికి లక్ష్మీనారాయణ ఉరఫ్ లక్కీ(20), నిఖిల్, శ్వేత సంతానం. కొద్దిరోజులు హైదరాబాద్లో పనిచేసిన లక్ష్మీనారాయణ ఇటీవలే సిరిసిల్లకు వచ్చి ప్రైవేటుగా ఉద్యోగం చేస్తున్నాడు. వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు గణేశ్ ప్రతిమను తీసుకురావడానికి లక్ష్మీనారాయణ సోమవారం ఫ్రెండ్స్తో ఆర్మూర్ వెళ్లాడు.పుట్టినరోజే కానరాని లోకాలకు..మంగళవారం తన పుట్టినరోజు కావడంతో దోస్తులతో కలిసి అప్పటికే ఆర్డర్ ఇచ్చిన 15 అడుగుల వినాయక ప్రతిమను తీసుకొచ్చి వేడుకలు జరుపుకోవాలని లక్కీ, ఫ్రెండ్స్ నిశ్చయించుకున్నారు. సోమవారం రాత్రి వర్షంలో ఇబ్బందులు ఎందుకని ఫ్రెండ్స్ అందరూ ఆర్మూర్లోనే పడుకున్నారు. మంగళవారం ఉదయం సిరిసిల్లకు వినాయక విగ్రహంతో ప్రయాణమయ్యారు. కామారెడ్డి జిల్లా ఆరెపల్లి గ్రామ స్టేజీ వద్ద హైటెన్షన్ కరెంటు తీగలకు గణపతి విగ్రహానికి అమర్చిన ఇనుప పైపులు తగిలి లక్ష్మీనారాయణ, సాయి అనే ఇద్దరు స్నేహితులు అక్కడికక్కడే షాక్తో పడిపోయారు. స్నేహితులు, స్థానికులు వెంటనే వారికి సీపీఆర్ చేయగా, సాయి మెలకువలోకి రాగా, లక్ష్మీనారాయణ అలానే పడిపోయాడు. వెంటనే కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతిచెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. మరో గంట సమయం గడిస్తే సిరిసిల్లకు చేరేవారు. కాగా, లక్కీ, సాయిలకు కాళ్లకు చెప్పులు లేకపోవడంతో షాకు తగిలినట్లు ఫ్రెండ్స్ చర్చించుకుంటున్నారు. పుట్టినరోజునే లక్కి జీవితం విషాదాంతంగా ముగియడం సిరిసిల్లలో తీరని విషాదం నింపింది. -
మహిళా సమాఖ్య సేవలు ఆదర్శం
● ఆదర్శ మహిళా సమాఖ్య ప్రతినిధులను అభినందించిన కలెక్టర్ సందీప్కుమార్ ఝా సిరిసిల్ల: జాతీయస్థాయిలో అవార్డు సాధించిన ఇల్లంతకుంట మండల ఆదర్శ మహిళా సమాఖ్య సేవలు ఆదర్శనీయమని కలెక్టర్ సందీప్కుమార్ ఝా అన్నారు. ఆదర్శ మహిళా సమాఖ్య కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆత్మ నిర్భర్ సంఘాతన్ అవార్డును ఈ నెల 14న కేంద్ర మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్, సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రెటరీ చేతుల మీదుగా స్వీకరించారు. ఈ సందర్భంగా మహిళా సమాఖ్య ప్రతినిధులు కలెక్టర్ను మంగళవారం కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ఇల్లంతకుంట ఆదర్శ మహిళా సమాఖ్య బ్యాంకు రుణాల అందజేత, రికవరీ, క్రమం తప్పకుండా మీటింగ్ల నిర్వహణ, సామాజిక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుండడంపై అభినందించారు. వీరిని ఆదర్శంగా తీసుకుని మిగతా సంఘాలు సేవలు అందించాలని సూచించారు. డీఆర్డీఓ శేషాద్రి, అదనపు డీఆర్డీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రైతులు ఆందోళన చెందవద్దు జిల్లాలో రైతులు ఆందోళన చెందవద్దని, సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని కలెక్టర్ సందీప్కుమార్ ఝా వెల్లడించారు. వ్యవసాయాధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో పంటల సాగుకు అణుగుణంగా ఎప్పటికప్పుడు యూరియా స్టాక్ తెప్పిస్తున్నామన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు అప్రమంతంగా ఉండాలని, మండలాలకు వచ్చే ఎరువులను రైతుల పంటల సాగు విస్తీర్ణానికి అనుగుణంగా సరఫరా చేయాలని ఆదేశించారు. ఎరువులు పక్కదారి పట్టకుండా, ఇతర అవసరాలకు వాడకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలోని అన్ని సొసైటీలు, ప్రైవేట్ డీలర్ల వద్ద యూరియా అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. కాన్ఫరెన్స్లో డీఏవో అఫ్జల్ బేగం తదితరులు పాల్గొన్నారు. -
సాంకేతికతను వినియోగించుకోవాలి
సిరిసిల్లకల్చరల్: నేర విచారణలో ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ సూచించారు. మంగళవారం ప్రోబ్ ఫోరెన్సిక్ లాబొరేటరీ ఆధ్వర్యంలో న్యాయవాదులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు జడ్జి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా న్యాయవాదులు అధునాతన విధానాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. అనంతరం అర్హులైన న్యాయవాదులకు ఆరోగ్య బీమా కార్డులు అందజేశారు. ప్రోబ్ లేబొరేటరీ ప్రతినిధి మోహన్ ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోజనాలను వివరించారు. నేరం జరిగిన స్థలం నుంచి సేకరించిన ఏ రకమైన జీవ సంబంధ ఆధారాన్ని అయినా సమూలంగా విశ్లేషించే సామర్థ్యం ఫోరెన్సిక్ సైన్స్ వల్ల సాధ్యపడుతోందన్నారు. రక్తం, వీర్యం, వెంట్రుకలు తదితర జీవ సంబంధ ఆనవాళ్లను శాసీ్త్రయంగా విశ్లేషించి నేరస్తులను నిర్ధారించడంలో దోహదపడుతోందన్నారు. సీనియర్ న్యాయవాదులు ఎస్.వసంతం, గోవిందు భాస్కర్, బార్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
మరమ్మతు చేయిస్తాం
వర్షాలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుకు ప్రణాళికలు రూపొందించాలని ఏఈని ఆదేశించాం. అవసరం ఉన్న చోట మట్టి పోయించి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తాం. – ఖదీర్పాషా, మున్సిపల్ కమిషనర్జగ్గారావుపల్లి రోడ్డు దారుణంగా ఉండడంతో ప్రైమరీ స్కూల్కు వెళ్లే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. చిన్నపాటి వర్షానికే నడవడానికి వీలు లేకుండా మారుతుంది. బురదలో పిల్లలు ఎక్కడ జారి పడతారోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. – వెంకటేశ్, జగ్గారావుపల్లిడబుల్ బెడ్రూమ్ ఇళ్లు రగుడు శివారులోని వ్యవసాయ క్షేత్రాల వద్ద ఉండడంతో కాలనీకి వెళ్లడానికి సరైన రోడ్డు లేదు. వర్షం పడితే మట్టి రోడ్డు బురదమయంగా మారుతోంది. – బూర విష్ణు, రగుడు -
విలీనంలో దారిద్య్రం
సిరిసిల్లఅర్బన్: విలీన గ్రామాల్లో రహదారులు అధ్వానంగా మారాయి. పట్టించుకునే వారు లేక అంతర్గత రోడ్లు దారుణంగా మారిపోయాయి. అడుగడుగునా గుంతలతో అవస్థలు పడుతున్నారు. ధ్వంసమైన రోడ్లకు మరమ్మతు చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నా స్పందించే వారు కరువయ్యారు. సిరిసిల్ల మున్సిపాలిటీలోని విలీన గ్రామాల్లో అంతర్గత రహదారుల పరిస్థితిపై కథనం.. మోకాలు లోతు గుంతలు సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు, జగ్గారావుపల్లి, సర్ధాపూర్, చంద్రంపేట, రగుడు, ముష్టిపల్లి, బోనాల గ్రామాల్లోని అంతర్గత రహదారులు అధ్వానంగా మారిపోయాయి. ప్రధానంగా చంద్రంపేట పరిధిలోని జ్యోతినగర్ పెట్రోల్బంక్ పక్కనున్న రోడ్డు గుంతలమయంగా మారింది. ఆ గుంతల్లో నీరు నిలుస్తుండడంతో లోతు గుర్తించలేక ద్విచక్రవాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. సిరిసిల్ల–కామారెడ్డి వెళ్లే ప్రధాన రోడ్డు పక్కన ఇప్పలపల్లికి వెళ్లే రోడ్డుపై మురుగునీరు నిలిచి ఉండడంతో అటుగా వెళ్లే గ్రామస్తులకు, వాహనదారులకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. రగుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి వెళ్లే ప్రధాన రోడ్డు మట్టిది కావడంతో వర్షం పడితే బురదలో నుంచి కాలనీకి వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దూరులోని మున్సిపల్ కార్యాలయం వెనుక కాలనీలో సీసీ రోడ్డు లేకపోవడంతో మట్టిరోడ్డుపై గుంతలు పడ్డాయి. జగ్గారావుపల్లి, మాలపల్లి గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి ఇటీవల కురిసిన వర్షానికి పాడయిపోయింది. స్కూల్కు వెళ్లాలంటే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రంపేట జ్యోతినగర్లో వర్షానికి బురదమయమైన రోడ్డు వెంట వెళ్లాలంటే ఇటు విద్యార్థులు, అటు సాంచల సామగ్రి తీసుకుపోయే ఆటోలు రోడ్డుపై దిగబడి రాకపోకలకు ఇబ్బందిగా మారుతోందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికై నా సిరిసిల్ల పట్టణ పరిధిలోని విలీన గ్రామాల్లో రోడ్లతోపాటు అంతర్గత రహదారులు మరమ్మతు చేయాలని కోరుతున్నారు. -
వాగు ఉధృతి.. తెగిన రోడ్డు
గంభీరావుపేట(సిరిసిల్ల): ‘మళ్లీ వానాకాలం వచ్చింది.. మన రోడ్డు కొట్టుకుపోవడం ఖాయం.. బ్రిడ్జి కట్టరు.. మన కష్టాలు తీర్చరు’.. అంటూ కొద్దిరోజులుగా గంభీరావుపేట మండలంలోని ఏ గ్రామంలో విన్న ఇవే మాటలు. అన్నట్లుగానే గంభీరావుపేట మండలం నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టు మంగళవారం మత్తడి పోస్తోంది. దీంతో వాగు ఉధృతి పెరిగింది. కాగా, గంభీరావుపేట మండలకేంద్రంలో మానేరు వాగుపై తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మట్టి రోడ్డు తెగిపోయింది. ఈక్రమంలో మండలకేంద్రానికి రాకపోకలు ఈ మార్గం గుండా నిలిచిపోయాయి. హైలెవల్ బ్రిడ్జి నిర్మాణ పనుల సందర్భంగా పాత బ్రిడ్జి కూల్చివేసి తాత్కాలిక మట్టి రోడ్డు ఏర్పాటు చేశారు. పనుల్లో జాప్యం జరుగుతోంది. అంతలోనే వానాకాలం వచ్చి వరద ఉధృతికి మట్టిరోడ్డు తెగిపోయింది. మండలంలోని సగానికిపైగా గ్రామాల ప్రజలు లింగన్నపేట, మల్లారెడ్డిపేట గ్రామాల మీదుగా కిలోమీటర్ల దూరం తిరిగి మండలకేంద్రానికి రావాల్సి వస్తోంది. ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడనున్నారు. -
ఎరువుల కొరత లేదు
సిరిసిల్ల: ‘వర్షాలు కాస్త ఆలస్యంగా రావడంతో రైతులందరూ ఒకేసారి యూరియా కావాలని ముందుకు వస్తున్నారు.. జిల్లాలో వానాకాలం పంట కాలానికి సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయి. అపెరల్ పార్క్ గోదాములో వంద మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ ఉంది.. రైతులు పంటకు రెండో దఫాగా నానో యూరియా పిచికారీ చేసుకుంటే మేలు’.. అని జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్ బేగం అన్నారు. కలెక్టరేట్లోని తన కార్యాలయంలో మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడారు. జిల్లాలో పంటల సాగు, ఎరువుల వినియోగం, ఆధునిక పద్ధతులను వివరించారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.. నిజంగా ఎవరైన రైతులకు జిల్లాలో యూరియా, ఇతర ఎరువులు అవసరమైతే ఆందోళన చెందకుండా.. నేరుగా ఆయా మండలాల వ్యవసాయాధికారులను సంప్రదించాలి. మండల వ్యవసాయాధికారులు వారి పరిధిలో ఎరువులు ఎక్కడ అందుబాటులో ఉన్నాయో రైతులకు చెబుతారు. ఈ మేరకు రైతులు నేరుగా ఎరువులు పొందవచ్చు. -
రోడ్డు పనులు పరిశీలన
వేములవాడ: వేములవాడలో రాజన్న ఆలయ ప్రధాన రహదారి విస్తరణలో భాగంగా కూల్చివేసిన ఇళ్ల వ్యర్థాలను తొలగించే ప్రక్రియను మంగళవారం విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు. రాజన్న ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు రహదారి విస్తరణకు రూ.47 కోట్లతో పనులు ప్రారంభించినట్లు చెప్పారు. నష్టపరిహారం ఇప్పించండి వేములవాడఅర్బన్: వేములవాడ మండలం సంకెపల్లి గ్రామం మిడ్మానేరు ప్రాజెక్ట్టు ముంపునకు గురికాగా, 45 ఇళ్లకు నష్టపరిహారం ఇంకా రాలేదని, ఇప్పించాలని మంగళవారం విప్ ఆది శ్రీనివాస్ను నిర్వాసితులు కోరారు. తమకు పూర్తిస్థాయిలో పరిహారం అందించేలా చూడాలని కోరారు. చింతపల్లి శ్రీనివాస్రావు, రగుడు పర్శరాములు, మారవేణి రాజు తదితరులు ఉన్నారు. డీఎంహెచ్వో సందర్శనతంగళ్లపల్లి(సిరిసిల్ల): కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆదేశాల మేరకు మంగళవారం డీఎంహెచ్వో ఎస్.రజిత మండలంలోని ఇందిరమ్మకాలనీని సందర్శించారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను గుర్తించారు. నివాసాల చుట్టూ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. డెంగీ నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలని, వైద్య సిబ్బంది ఇంటింటా సర్వే నిర్వహించి జ్వర బాధితులకు చికిత్స అందించాలని ఆదేశించారు. మలేరియా ప్రోగ్రాం అధికారి అనిత తదితరులు పాల్గొన్నారు. జిల్లా అంతటా తుంపర్లుసిరిసిల్ల: జిల్లాలో మంగళవారం తుంపర వర్షం కురిసింది. వీర్నపల్లి మండలంలో అత్యధికంగా 6.9 మి.మీటర్ల వర్షం పడగా.. రుద్రంగి 4.8, చందుర్తి 4.1, వేములవాడరూరల్ 6.4, బోయినపల్లి 5.0, వేములవాడ 4.4, సిరిసిల్ల 4.8, కోనరావుపేట 3.3, ఎల్లారెడ్డిపేట 3.1, గంభీరావుపేట 2.7, ముస్తాబాద్ 4.3, తంగళ్లపల్లి 3.9, ఇల్లంతకుంటలో 3.5 మి.మీ వర్షం కురిసింది. యూరియా అక్రమ రవాణాపై నిఘాసిరిసిల్లక్రైం: జిల్లాలో యూరియా అక్రమ రవాణాపై నిఘా కఠినతరం చేసినట్లు ఎస్పీ మహేశ్ బీ గితే మంగళవారం పేర్కొన్నారు. జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ల వద్ద విస్తృతంగా వాహన తనిఖీలు చేస్తున్నట్టు తెలిపారు. యూరియా పంపిణీ కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. యూరియా అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చెక్ పోస్ట్ల్లో సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. -
చిత్రం.. జ్ఞాపకాల పత్రం
● ఫొటోగ్రఫీ డే గురించి ఫ్రెంచ్ దేశస్తుడైన డాగురే 1839లో మొదటిసారి ఫొటోగ్రాఫీక్ ప్రాసెస్ కనిపెట్టి అదే సంవత్సరం ఆగష్టు 19న ప్రపంచానికి పరిచయం చేశాడు. సిల్వర్ అయొడైడ్ రసాయనంతో చిత్రానికి శాశ్వతత్వం కల్పించవచ్చని ప్రతిపాదించాడు. 1842 నుంచి 1880 మధ్య కాలంలో ఇండియలో ఫొటోగ్రఫీ పరిశ్రమ విస్తరించింది. ఆంధ్రప్రదేశ్లో మొదటి పోర్ట్రయిట్ స్టూడియోను దీన్ దయాళ్ కెన్నడీ అనే మహిళ స్థాపించింది. 1960 నాటికి స్టూడియో ఫొటోగ్రఫీ, 1980 నాటికి కంప్యూటర్తో కలర్ ఫొటోగ్రఫీ విస్తరించింది. రాజా త్రయంబక్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మొదటి సారి 1957లో ఫొటోగ్రఫీ సొసైటీ ప్రారంభమైంది. ● ఉమ్మడి జిల్లా ప్రస్థానం 1940లో ఉమ్మడి జిల్లా కేంద్రం కరీంనగర్లో మొదటి ఫొటోస్టూడియో నెలకొల్పారు. ప్రతిష్టాత్మక ఫెలోషిఫ్ ఆఫ్ రాయల్ ఫొటోగ్రఫీ సొసైటీ(ఇంగ్లాండ్) సాధించిన ఉమ్మడి రాష్ట్రంలోనే ఏకై క వ్యక్తి కోరుట్లకు చెందిన ఫొటోగ్రాఫర్ బండి రాజన్బాబు. 1987లో నగ్న చిత్రాలపై థీసిస్ సమర్పించి రాయల్ ఫొటోగ్రఫీ సొసైటీ ఫెలోషిప్ పొందారు. జగిత్యాలకు చెందిన అల్లె శ్రీకాంత్, కోరుట్లకు చెందిన బండి వెంకటరమణ, కరీంనగర్కు చెందిన బాబురెడ్డి, వేణు, రాజు, సంపత్కుమార్, వాసు, గంగాధర్, సదానందం, ఆత్మారాం, వేములవాడకు చెందిన రాజయ్య, జగిత్యాలకు చెందిన రామ్మోహన్, సతీష్, సిరిసిల్లలో ఎం.సి. శేఖర్, బోడ రవీందర్, కోడం దేవేందర్, వంకాయల శ్రీకాంత్, కోరుట్లకు చెందిన నాగరాజు, రాజేశం, శేఖర్, మహేందర్, మారుతి, మెట్పల్లి రాము, మల్యాల శ్రీనులు, ఎల్లారెడ్డిపేటకు చెందిన ప్రభాకర్రెడ్డి, సిరిసిల్లకు చెందిన శంకర్ మరెందరో ఫొటోగ్రఫీలో సృజనాత్మకతను జోడించి రాష్ట్ర స్థాయి అవార్డులు పొందారు. ● ప్రీ వెడ్డింగ్ ఫొటోగ్రఫీ ఏ ఫంక్షన్ జరిగిన, ఎక్కడికి వెళ్లిన సెల్ఫోన్లతోనే ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రీ వెడ్డింగ్ ఫొటోగ్రఫీపై కొత్తగా జంటలు ఉత్సాహం చూపిస్తున్నారు. దేశవ్యాప్తంగా తమకు అనువైన ప్రాంతాలను ఎంపిక చేసుకుని ప్రీ వెడ్డింగ్ ఫొటోలతోపాటు పెళ్లి వేడుకలను ఫొటోగ్రాఫర్లతో తీయించుకుంటున్నారు. చరితకు చెరిగిపోని సాక్ష్యం నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం విద్యానగర్(కరీంనగర్)/సిరిసిల్ల: ఫొటో.. చెదిరిపోని జ్ఞాపకం. గతించిన కాలాన్ని కళ్ల ముందుంచే సాక్ష్యం. మదిలే మెదిలే భావాలను కళ్ల ముందు నిలిపే ఛాయాచిత్రం. ఫొటోగ్రఫీకి సృజనాత్మకత తోడైతే అద్భుత చిత్రాలు కళ్లముందుంటాయి. మదిని పులకింపజేసి.. మనుసును తట్టిలేపి.. మధురమైన అనుభూతులను పదిలం చేసేది ఫొటో. నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ డే సందర్భంగా ఫొటోగ్రఫీలో వస్తున్న మార్పులు.. జిల్లా వాసుల ప్రతిభపై ప్రత్యేక కథనం. 1961 ప్రాంతంలో కరీంనగర్లో ఫొటో స్టూడియోలు ఏర్పాటయ్యాయి. కరీంనగర్లోని క్లాక్టవర్ వద్ద ఏవీఎం ఫొటో స్టూడియో, తిలక్రోడ్లో అజంతా ఫొటో స్టూడియోను ప్రారంభించారు. కరీంనగర్కు చెందిన ఏలేటి వేణుమాధర్రెడ్డి 1961 జనవరి 1న ఆయన పేరుతో ఏవీఎం స్టూడియో ప్రారంభించారు. మూడేళ్ల తర్వాత గురుదత్త నిర్మాత సారథ్యంలో ముంబైలో రూపొందిన మొదటి స్కొప్ సినిమాకు అసిస్టెంట్ కెమెరామెన్గా పనిచేశారు. బ్లాక్ అండ్ వైట్ మాన్యువల్ నుంచి 35 ఎంఎం మినియేచర్ ఫిలిం, కలర్ ప్రాసెసింగ్ కంప్యూటర్ వరకు కొనసాగారు. ఆయన వాడిన 1945 నాటి రోలిఫ్లెక్స్, ఎగ్జాక్ట, మన్య, కేబినేట్, ఫుల్సైజ్ల నెగెటివ్ల బాడీ కెమెరాలు ఇప్పటికి వాళ్ల ఇంట్లో భద్రంగా ఉన్నాయి. ఆయన నలుగురు కొడుకులు ఈ రంగంలోనే రాణిస్తున్నారు. నాడు రీళ్లతో ఫొటోలు తీసేవాళ్లం, సాంకేతిక ప్రగతిలో నేడు డిజిటల్ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. సెల్ఫోన్ కెమెరాలు, ఇంటింటికీ కెమెరాలు వచ్చినప్పటికీ ఫొటో స్టూడియోలకు ఆదరణ తగ్గలేదు. రీళ్ల పద్ధతి పోయి, డిజిటల్ కెమెరాలు, ప్రింటింగ్ యంత్రాలు ప్రవేశించడంతో ఈ ప్రక్రియ పూర్తిగా సులభతరమైంది. – ఆవుల నరేశ్, ఫొటోగ్రాఫర్, జ్యోతినగర్, కరీంనగర్ మా చిన్నప్పుడు ఫొటో అంటే ఓ క్రేజ్. ఏదైనా ఫంక్షన్ జరిగితే ఫొటోగ్రాఫర్ వచ్చి ఫొటోలు తీయడం, స్టూడియోకి వెళ్లి ఫొటోలు దిగడం చాలా కొత్తగా అనిపించేది. ఇప్పుడు సెల్ఫోన్లో అన్ని ఫంక్షన్లు, అన్ని సందర్భాల్లో ఫొటోలు తీసుకోవడం, మెమొరీ కార్డుల్లో భద్రపరచుకుంటున్నాం. – పల్లెర్ల శ్రీనివాస్, అశోక్నగర్, కరీంనగర్ సిరిసిల్లకు చెందిన ఫొటోగ్రాఫర్ మేర్గు చంద్రశేఖర్(ఎంసీ శేఖర్)కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దక్షిణాఫ్రికా పర్యాటక గిరిజనశాఖ, ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిలా ఆర్ట్ ఆఫ్ ఫొటోగ్రఫీలు సంయుక్తంగా నిర్వహించిన ప్రపంచస్థాయి పోటీల్లో శేఖర్ తీసిన ‘హార్టీస్మైల్’ బంగారు పతకం సాధించింది. అంతకుముందే శేఖర్ దశాబ్దకాలంగా గిరిజన జీవనశైలిపై, సామాజిక అంశాలపై ఫొటోలు తీసి పురస్కారాలు అందుకున్నారు. హైదరాబాద్ కేంద్రంగా సిగ్మా ఫొటోగ్రఫీ అకాడమీ స్థాపించారు. ఔత్సాహికులైన ఫొటోగ్రాఫర్లకు శిక్షణ ఇస్తున్నారు. ఇటీవల సాలర్జంగ్ మ్యూజియంలో రాష్ట్రస్థాయి ఫొటో వర్క్షాప్ నిర్వహించారు. ఎం.సీ.శేఖర్ తీసిన ఫొటోలకు 98 జాతీయ, అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. విద్యానగర్(కరీంనగర్): కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్కు చెందిన దాసరి మల్లేశ్ కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. చిన్నప్పటి నుంచి ఫొటోగ్రఫీపై మక్కువ పెంచుకున్న మల్లేశ్ ఫొటోగ్రఫీలోని మెలకువలను నేర్చుకొని.. తీరక సమయంలో తన కళాభిరుచిని తీర్చుకుంటున్నారు. ఫొటో వర్క్షాప్లలో పాల్గొని అద్భుత ఫొటోలు తీసి బహుమతులు అందుకున్నారు. పల్లె ప్రజల జీవన విధానం, సంస్కృతి సంప్రదాయాలపై తీసిన ఫొటోలకు ప్రశంసలు అందుకున్నారు. ఇటీవల జరిగిన జోనల్స్థాయి పోలీస్ డ్యూటీ మీట్లో ఫొటోగ్రఫీ విభాగంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం చేతుల మీదుగా మూడో బహుమతి అందుకున్నారు. -
ఇంట్లో జారిపడి వ్యక్తి మృతి
జగిత్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని గంజ్రోడ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ అతిక్ (38) తన ఇంట్లో ప్రమాదవశాత్తు కాలుజారి పడి మృతిచెందాడు. అతిక్ ఆదివారం సాయంత్రం తన ఇంట్లో కాలుజారి పడగా తలకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేకుండాపోయింది. చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చిగురుమామిడి: మండలంలోని గాగిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో పని చేస్తు న్న జుట్టు స్వామి విషజ్వ రంతో సోమవారం మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. స్వామి వారంరోజులు కరీంనగర్లోని ఓ ఆసుపత్రిలో చికిత్సపొందాడు. అయినా జ్వరం తగ్గలేదని తెలిపారు. జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తి గ్రామానికి చెందిన బందెల రాజశేఖర్ (35) అనే వ్యక్తి ఒంటరితనం భరించలేక మనస్తాపానికి గురై ఆదివారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెల్దుర్తి గ్రామానికి చెందిన బందెల రాజశేఖర్ భార్య మూడు నెలల క్రితం అనారోగ్యంతో మరణించింది. అప్పటి నుంచి రాజశేఖర్ ఒంటరితనంతో బాధపడుతూ తీవ్ర ఆందోళనలో ఉన్నాడు. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తల్లి బందెల గంగు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై సదాకర్ తెలిపారు. రెండు ఆలయాల్లో చోరీవీణవంక: మండలంలోని కోర్కల్ గ్రామంలో ఆదివారం రాత్రి రెండు ఆలయాల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. గ్రామ శివారులోని రేణుక ఎల్లమ్మ ,పెద్దమ్మ తల్లి ఆలయాల్లో రెండున్నర తులాల బంగారం, 59తులాల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. క్లూస్ టీం రంగంలోకి దిగి ఆధారాలు సేకరించారు. గ్రామస్తుడు పూదరి కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. జగిత్యాలజోన్: సెల్ఫోన్లో మాట్లాడుకుంటూ.. వాహనాన్ని అజాగ్రత్తగా.. నిర్లక్ష్యంగా నడిపి ఒకరి మృతికి కారణమైన ట్యాక్సీ డ్రైవర్కు రెండేళ్ల జైలు శిక్షతోపాటు రూ.3వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్నపద్మావతి సోమవారం తీర్పు చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ జంగిలి మల్లికార్జున్ కథనం ప్రకారం.. జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్కు చెందిన 12 మంది మహిళలు రాయికల్ మండలం కుమ్మరిపల్లిలో జరిగిన ఓ శుభకార్యానికి ఓ మినీటాక్సీలో వెళ్లారు. మోరపల్లి శివారులో డ్రైవర్ పరాంకుశంవంశీకృష్ణ సెల్ఫోన్ మాట్లాడుతూ.. వాహనాన్ని అజాగ్రత్తగా నడిపి రోడ్డుపక్కనున్న కల్వర్టును ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఆటోలో ఉన్న తోట్ల గంగవ్వ అక్కడికక్కడే చనిపోయింది. మిగతావారు గాయపడ్డారు. దీనిపై బాధితురాలు రాధ ఫిర్యాదు మేరకు అప్పటి జగిత్యాల రూరల్ ఎస్సై చిరంజీవి కేసు నమోదు చేశారు. సీఐ కృష్ణకుమార్ దర్యాప్తు చేసి కోర్టులో చార్జీషీట్ దాఖలు చేసారు. కోర్టు మానిటరింగ్ అధికారులు ఎం.కిరణ్కుమార్, కె. నరేశ్ సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టడంతో వంశీకృష్ణకు రెండేళ్ల జైలు, జరిమానా విధించారు. -
చెరుకు రైతుకు రవాణా భారం
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో ఏకై క ముత్యంపేట చెరుకు ఫ్యాక్టరీని ప్రారంభించాలని రైతులు ఏళ్ల తరబడి కోరుతున్నా.. పాలకులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఐదేళ్లకోసారి ప్రభుత్వాలు మారుతున్నా.. చక్కెర ఫ్యాక్టరీ మాత్రం ప్రారంభం కావడం లేదన్నది ఇక్కడి రైతుల వేదన. దీంతో చెరుకు పంటపై మమకారం చంపుకోలేక.. రైతులు ఇతర జిల్లాలో ఉన్న ప్రైవేట్ చెరుకు ఫ్యాక్టరీతో ఒప్పందాలు చేసుకొని చెరుకును సాగు చేస్తున్నారు. ఇదే అదునుగా భావించిన ప్రైవేట్ చక్కెర ఫ్యాక్టరీ సైతం చెరుకు రైతులకు అవసరమైన సదుపాయాలను కల్పించలేక నిర్లక్ష్యం చూపుతోంది. ఈ నేపథ్యంలో ముత్యంపేట చెరుకు ఫ్యాక్టరీని ప్రారంభించాలని, అప్పటివరకు చెరుకు రైతులపై పడే రవాణా భారాన్ని ప్రభుత్వం భరించాలని చెరుకు రైతులు ఇటీవల జగిత్యాలకు వచ్చిన మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మన్కుమార్, వివేక్ వెంకటస్వామికి వినతిపత్రం అందించారు. 1,500 ఎకరాల్లో సాగు జిల్లాలో సాగునీటి వనరులు పుష్కలంగా ఉండడంతో.. ప్రస్తుతం చెరుకు పంటను దాదాపు 1,500 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఒకప్పుడు 10వేల ఎకరాలకు పైగా చెరుకు పంట ఉన్నా.. ఫ్యాక్టరీ మూసేయడంతో విస్తీర్ణం తగ్గిపోయింది. గతంలో జిల్లాలో ఉన్న చెరుకు ఫ్యాక్టరీ ప్రభుత్వానిది కావడంతో.. పంట సాగు చేసే రైతులకు ఎరువులు, విత్తనం, కటింగ్, రవాణా వంటి వాటిపై ప్రోత్సాహకాలు అందించేది. ఇప్పుడు జిల్లాలో చెరుకు సాగు చేసే రైతులు కామారెడ్డి జిల్లాలో ఉన్న ప్రైవేట్ షుగర్ ప్యాక్టరీకి చెరుకును పంపిస్తుండడంతో.. రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వకపోగా, లేనిపోని నిబంధనలు పెట్టి జిల్లా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రవాణా భారం.. ప్రైవేట్ ఫ్యాక్టరీ ఎలాంటి సబ్సిడీలు ఇవ్వకపోయినా.. చెరుకు పంటపై ఆసక్తితో చెరుకును సాగు చేసిన రైతులకు రవాణా భారం పెద్ద సమస్యగా మారింది. జిల్లా నుంచి కామారెడ్డి చక్కెర ఫ్యాక్టరీ కనీసం 150 కి.మీ. వరకు ఉంటుంది. గతంలో ముత్యంపేట ఫ్యాక్టరీ వారు 15 కి.మీ. వ్యాసార్థంలో రవాణా భారం వేసేవారు కాదు. 15 కి.మీ. తర్వాత ఉన్న రైతులు ఎంతో కొంత మొత్తం చెల్లించేవారు. ఇప్పుడు జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో చెరుకు సాగు చేసేవారు కామారెడ్డికి లారీల్లో చెరుకు తరలించడం పెద్ద సమస్యగా మారింది. ప్రస్తుతం రైతులు చెరుకును కామారెడ్డి ప్రైవేట్ ఫ్యాక్టరీకి తరలించేందుకు టన్నుకు దాదాపు రూ.700 వరకు అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఇలా దాదాపు జిల్లా చెరుకు రైతులు రవాణా పేరిట రూ.4.50కోట్ల వరకు నష్టపోతున్నారు. దిగుబడులు ఘనం.. వచ్చేది స్వల్పం ఇక్కడి చెరుకు రైతులు అన్ని రకాల యాజమాన్య పద్ధతులు పాటించడంతో ఎకరాకు 40 టన్నుల వరకు దిగుబడి సాధిస్తున్నారు. ప్రస్తుతం చెరుకు టన్ను ధర రూ.3,470 వరకు ఉండగా, అందులో చెరుకు కటింగ్ కోసం కూలీలకు టన్నుకు రూ.860, రవాణా కోసం టన్నుకు రూ.700 వరకు ఖర్చు చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. పంటకు అవసరమైన రసాయన ఎరువులు, కలుపు వంటి వాటి కోసం మరింత ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో ఇతర ప్రాంతాలకు చెరుకు తరలించడం వల్ల రైతులకు పెద్దగా మిగిలింది ఏమీ లేదు. చెరుకు రైతులపై పడే రవాణా భారాన్ని ప్రభుత్వం భరించాలి. చెరుకు పండిస్తే మాకు ఆదాయం కాకుండా ఖర్చులు మిగులుతున్నాయి. త్వరగా ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభించి చెరుకు రైతులకు అండగా ఉండాలి. – మామిడి మహేందర్రెడ్డి, తొంబరావుపేట, మేడిపల్లి చెరుకు పంటపై మమకారం చంపుకోలేక సాగు చేస్తున్నాం. ఇక్కడ ఫ్యాక్టరీ ప్రారంభం కాకపోవడంతో కామారెడ్డికి తరలించాల్సి వస్తోంది. రవాణా భారం, కటింగ్ వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాం. – పీసు రాజేందర్రెడ్డి, మూడుబొమ్మల మేడిపల్లి, మెట్పల్లి ఫ్యాక్టరీ ప్రారంభం కాక అదనపు ఖర్చులు టన్నుకు రూ.700 వరకు భారం ఆదుకోవాలని రాష్ట్ర మంత్రులకు విన్నపాలు -
రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
● వేగంగా దూసుకొచ్చి బస్సును ఢీకొట్టిన కారు ● నుజ్జునుజ్జయిన వాహనం.. వేలాడిన మృతదేహం తిమ్మాపూర్: తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ స్టేజీ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరో నలుగురు గాయపడ్డారు. స్థానికుల కథనం.. కరీంనగర్ నుంచి కొంగారి మృత్యుంజయ్ (32) భార్య, కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ వెళ్తున్నారు. ముందున్న మరో వాహనాన్ని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో రోడ్డుపై కారు అదుపుతప్పింది. డివైడర్ అవతలివైను ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు సగం బస్సు కిందికి చొచ్చుకుపోయింది. డ్రైవర్ పక్కసీట్లో కూర్చున్న మృత్యుంజయ్ అక్కడిక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న ఎల్ఎండీ ఎస్ఐ శ్రీకాంత్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని, స్థానికుల సహాయంతో మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ట్రాఫిక్ను పోలీసులు క్లియర్ చేశారు. క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించారు. మృతుడు మత్యుంజయ్ హైదరాబాద్కు చెందిన వాడు. ఈయన ఇటీవల కులాంతర వివాహం చేసుకున్నట్లు సమాచారం. బహిరంగ ప్రదేశంలో కోడె టికెట్లు ?● ఉద్యోగుల తీరుపై అనుమానాలు వేములవాడ: రాజన్న ఆలయంలో ప్రధాన మొక్కు అయిన కోడె టికెట్లు ఆలయం బయట ప్రదేశంలోకి రావడం కలకలం రేపాయి. కోడెమొక్కు చెల్లించే భక్తులు రూ.200 పెట్టి టికెట్ కొని కోడెతో ప్రదక్షిణ చేసి ప్రధాన ద్వారానికి ఎదురుగా కట్టేస్తారు. ఈక్రమంలో కోడె టికెట్లు పరిశీలించేందుకు రెండు చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. అక్కడ విధులు నిర్వర్తించే సిబ్బంది కోడె టికెట్లు తీసుకుని చించివేస్తారు. అయితే ఆ చించివేసిన టికెట్లు సోమవారం ఆలయంలోని స్వామి వారి ఓపెన్స్లాబ్పై దర్శనమిచ్చాయి. ఇక్కడి ఎలా వచ్చాయని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఆలయ ఉద్యోగులే రీసైక్లింగ్ చేస్తూ డబ్బులు దండుకునేందుకు ఇలా తెచ్చి ఉంటారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఈవో రాధాభాయి మాట్లాడుతూ గతంలో ఈ టికెట్లను ఓపెన్స్లాబ్పై వేసి ఉంటారని, ఇక్కడ విధులు నిర్వహించే సిబ్బందిని విచారించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇసుక వివాదం..మెట్పల్లి రూరల్: ఇసుక విషయమై జరిగిన వివాదంపై మెట్పల్లి పోలీసులు నలుగురిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ గోదాంలో ఈనెల 10న అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెల్సిందే. ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగగా.. అగ్నిమాపక శాఖ అధికారులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా రెండు రోజులైనా అదుపులోకి రాలేదు. యార్డులో గన్నీసంచులు కాలుతుండగా వాటిపై ఇసుక పోసి మంటలు ఆర్పాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆత్మకూర్ పెద్దవాగు నుంచి ఈనెల 12న ట్రాక్టర్లలో ఇసుక తరలించారు. ఆ సమయంలో పలువురు ట్రాక్టర్లను అడ్డుకుని వివాదం చేశారు. అక్కడే ఉన్న తనను కులం పేరుతో దూషిస్తూ దుర్భషలాడారని వీడీసీ చైర్మన్ రమేశ్ మెట్పల్లి పోలీస్ స్టేషన్లో నలుగురిపై ఫిర్యాదు చేశాడు. దీంతో గ్రామానికి చెందిన తాటిపెల్లి సురేశ్రెడ్డి, తిప్పిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, కేశిరెడ్డి నవీన్రెడ్డి, శోభపై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ మేరకు మెట్పల్లి డీఎస్పీ రాములు సోమవారం ఆత్మకూర్కు వెళ్లి విచారణ జరిపారు. ఆయన వెంట మెట్పల్లి ఎస్సై కిరణ్కుమార్ ఉన్నారు. సంఘటన స్థలంలో మృత్యుంజయ్ మృతదేహం ఎలక్ట్రికల్ బస్సును ఢీకొన్న కారు -
రాజన్న సిరిసిల్ల
మంగళవారం శ్రీ 19 శ్రీ ఆగస్టు శ్రీ 20257బోయినపల్లి(చొప్పదండి): మిడ్మానేరులో సోమవారం నాటికి 12.591 టీఎంసీలకు చేరింది. ఎస్సారెస్పీ నుంచి 8వేలు, గాయత్రీ పంప్హౌస్ నుంచి 9,450 క్యూసెక్కుల వరద వస్తోంది. ఆకాశం మేఘావృతమవుతుంది. జిల్లాలో స్వల్పంగా వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. ఈదురుగాలులు వీస్తాయి.సిరిసిల్లటౌన్: కార్మికక్షేత్రం ఆధ్యాత్మికతతో వెల్లివెరిసింది. శ్రావణమాసం చివరి సోమవారం కావడంతో జిల్లా కేంద్రాల్లోని ఆలయాలకు భారీగా తరలివచ్చి పూజలు చేశారు. -
భూకబ్జాల బాగోతం బహిర్గతం చేయాలి
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపిసిరిసిల్లటౌన్: జిల్లాలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూముల కబ్జా బాగోతాన్ని బహిర్గతం చేసి ఇప్పటి వరకు ఎన్ని రికవరీ చేశారో ప్రజలకు వివరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి కలెక్టర్ను కోరారు. ఈమేరకు సిరిసిల్లలోని తన నివాసంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, సిరిసిల్ల నియోజకవర్గంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుచరులు సుమారు 2 వేల నుంచి 3వేలు ఎకరాల వరకు కబ్జా చేసుకున్నారని ఆరోపించారు. వారిలో కొందరిపై కేసులు పెట్టారని, కొంత మేరకు భూమి రికవరీ చేశారన్నారు. అయితే ఈ వ్యవహారంలో చిన్నా చితక వ్యక్తులపైనే చర్యలు తీసుకుంటూ, బడా నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ముస్తాబాద్ మండలంలోని సర్వేనంబర్లు 410, 608లో సుమారు 150 ఎకరాలు కబ్జాకు గురయ్యాయన్నారు. వీటిలో 50 ఎకరాల్లో స్ట్రోన్క్రషర్ నడుస్తోందని పేర్కొన్నారు. సిరిసిల్ల కొత్తచెరువు డీసీఎంహెచ్వో పరిధిలో ఎంత భూమి కబ్జాకు గురైందో కలెక్టర్ విచారణ చేపట్టి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ స్పెషలాఫీసర్గా కలెక్టర్ ఉన్నా పట్టణంలో అనేక అక్రమ లేఅవుట్లు జరుగుతున్నాయన్నారు. ప్రజలకు వివరణ ఇవ్వకుంటే కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. పార్టీ పార్లమెంటు కోకన్వీనర్ ఆడెపు రవీందర్, పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్, గజభీంకార్ చందు, తిరుపతిరెడ్డి, శ్రీహరి, శ్రీధర్, శ్రీనివాస్, దేవరాజు, శేఖర్, సుధాకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
రాజీ పడే కేసులను గుర్తించండి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ సిరిసిల్లకల్చరల్: రాజీ పడే కేసులను గుర్తించి లోక్ అదాలత్లో పరిష్కరించుకునేలా కృషి చే యాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ సూచించారు. జిల్లా న్యాయస్థానంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో జిల్లా జడ్జీ నీరజ మాట్లాడారు. రాజీ కుదుర్చుకోగలిగే కక్షిదారులను సమన్వయం చేసి కేసుల పరిష్కారానికి దోహదం చేయాలన్నారు. న్యాయవాదులు, పోలీసు అధికారులు సమన్వయంతో లోక్ అదాలత్లో వీలైనన్ని కేసులు పరిష్కారమయ్యేలా చూడాలని ఆదేశించారు. జిల్లా అదనపు న్యాయమూర్తి వి.పుష్పలత, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధికా జైస్వాల్, సీనియర్ సివిల్ జడ్జ్జి పి.లక్ష్మణాచారి, ప్రధాన జూనియర్ సివిల్ జడ్జ్జి ఎ.ప్రవీణ్, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్జ్జి గడ్డం మేఘన, అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, లోక్ అదాలత్ సభ్యుడు చింతోజు భాస్కర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంట శ్రీనివాస్, అడిషనల్ పీపీ చెలుమల సందీప్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు. అడిషనల్ ఎస్పీకి అభినందనలు సిరిసిల్లక్రైం: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతులమీదుగా ప్రెసిడెంట్ మెడల్ అందుకున్న అడిషనల్ ఎస్పీ చంద్రయ్యను జిల్లా జడ్జ్జ్జి నీరజ అభినందించారు. కోర్టు ఆవరణలో సోమవారం పుష్పగుచ్ఛంతో అభినందనలు తెలిపారు. అడిషనల్ ఎస్పీ చంద్రయ్య విధుల్లో చూపిన తెగువ, దీర్ఘకాలికంగా ప్రజలకు అందించిన సేవలను గు ర్తించిన ప్రభుత్వం మెడల్కు ఎంపిక చేసింది. యూరియా సరఫరాపై నిఘాసిరిసిల్ల: వానాకాలం పంటల సాగుకు అవసరమైన యూరియా మాత్రమే రైతులు కొనుగోలు చేయాలని, వచ్చే సీజన్ కోసం నిల్వ చేయొద్దని ఎస్పీ మహేశ్ బి గీతే కోరారు. కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సోమవారం సమీక్షించారు. యూరియాను పరిశ్రమలకు, పొరుగు జిల్లాలకు తరలించకుండా నిఘా ఉంచాలని సూచించారు. మోతాదుకు మించి వినియోగించొద్దని కోరారు. అంతకు ముందు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు, వ్యవసాయ కార్యదర్శి రఘునందన్రావులతో కలిసి యూరియా, ఎరువుల లభ్యతపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్ బేగం, జిల్లా సహకార అధికారి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. హోంగార్డుకు ఆర్థిక సాయం సిరిసిల్లక్రైం: జిల్లాలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో బాధపడుతున్న శివకుమార్కు జిల్లా పోలీస్ యంత్రాంగం బాసటగా నిలిచింది. రూ.55వేలు జమచేసి ఆయన కుటుంబ సభ్యులకు సోమవారం ఎస్పీ మహేశ్ బీ గీతే చేతులమీదుగా అందించారు. తోటి సిబ్బంది ఆపదలో ఉన్నప్పుడు ముందుకొచ్చి ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమన్నారు. ఆర్ఐలు యాదగిరి, రమేశ్, శివకుమార్ పాల్గొన్నారు. బాధితులకు భరోసాగా గ్రీవెన్స్ డే సమస్యల పరిష్కారం లక్ష్యంగా, బాధితులకు భరోసాగా ఉండేందుకు ప్రతీ సోమవారం గ్రీవె న్స్ డే నిర్వహిస్తున్నట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 23 ఫిర్యాదులు స్వీకరించినట్లు వివరించారు. ఆయా పో లీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్చేసి సమస్యలను చట్టపరంగా పరిష్కరించాలని ఆదేశించారు. సిరిసిల్లటౌన్: పర్యావరణ పరిరక్షణలో అంద రూ భాగస్వాములు కావాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య కోరారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ ఆధ్వర్యంలో సోమవారం తె లంగాణ భవన్లో విత్తన గణపతి విగ్రహాల పంపిణీ చేపట్టారు. ఆగయ్య మాట్లాడుతూ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా విత్తన గణపతి విగ్రహాలను పార్టీ నాయకులకు అందజేశారు. చీటి నర్సింగరావు, గూడూరి ప్ర వీణ్కుమార్, ఆకునూరి శంకరయ్య, కుంబాల మల్లరెడ్డి, కోడి అంతయ్య, కమల్గౌడ్ పాల్గొన్నారు. -
సొంతింటి కల సాకారం
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ: ప్రజాప్రభుత్వ పాలనలో పేదలకు సొంతింటి కల సాకారం చేస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో సోమవారం నిర్వహించిన కడప పూజల్లో పాల్గొని మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ప్రభుత్వం యజ్ఞంలా నిర్వహిస్తోందన్నారు. పట్టణంతోపాటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తామన్నారు. పాపన్న సేవలు చిరస్మరణీయం సర్వాయి పాపన్న సేవలు చిరస్మరణీయమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. సర్వాయి పాపన్న జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని పాపన్నచౌక్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సిరిసిల్లఅర్బన్: త్రిఫ్ట్ నేతన్న పొదుపు పథకానికి సంబంధించిన డబ్బులను వెంటనే కార్మికుల ఖాతాల్లో జమచేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ కోరారు. కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిరిసిల్ల, టెక్స్టైల్ పార్క్లోని పవర్లూమ్, అనుబంధ రంగాల కార్మికులకు రావాల్సిన త్రిఫ్ట్ డబ్బులు వెంటనే కార్మికుల ఖాతాల్లో జమచేయాలని కోరారు. మూషం రమేశ్, నక్క దేవదాస్, కూచన శంకర్, సత్యం, బెజగం సురేష్ పాల్గొన్నారు. -
చెరువు నిండదు
చినుకు ఆగదు..ఇది గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు. కామారెడ్డి, సిద్దిపేట జిల్లాలో కురుస్తున్న వర్షాలకు పాల్వంచ, కూడెల్లివాగులు పారడంతో ఎగువ మానేరులోకి నీరు వచ్చి చేరింది. 33 అడుగుల సామర్థ్యం ఉన్న ఎగువ మానేరులో 31 అడుగుల మేరకు నీరు చేరింది. మరో రెండు అడుగుల నీరు చేరితే మత్తడి దూకుతుంది. మూడు నెలలపాటు మానేరు పారితేనే జిల్లాలో రెండో పంటకు సాగునీరు లభిస్తుంది. 10 వేల ఎకరాలకు సాగునీరు అందించే ఎగువ మానేరు మత్తడి ఎప్పుడు దూకుతుందోనని ఆయకట్టు రైతులు ఎదురుచూస్తున్నారు.ఇది ముస్తాబాద్లోని లింగంకుంట. భారీ వర్షాలు పడితేనే ఈ కుంట నిండే పరిస్థితులు ఉన్నాయి. కొద్దిపాటి నీళ్లతో లింగంకుంట బోసిపోయి కనిపిస్తోంది. ఒక్క లింగంకుంటనే కాదు జిల్లా వ్యాప్తంగా 656 చెరువులు, కుంటలు ఉండగా 37 చెరువుల్లోనే నీరు నిండి మత్తడి పారుతున్నాయి. మిగతా 619 చెరువులు, కుంటలు వెలవెలబోతున్నాయి. -
పాపన్నగౌడ్ మార్గం ఆచరణీయం
సిరిసిల్ల/సిరిసిల్లటౌన్: నిరంకుశ పాలనపై దండయాత్ర చేసి బీసీల్లో రాజకీయ చైతన్యాన్ని రగిలించిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ మార్గం ఆచరణీయమని గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నేరెళ్ల శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. సిరిసిల్లలో సోమవారం నిర్వహించిన పాపన్నగౌడ్ జయంతికి హాజరై మా ట్లాడారు. కులమతాలకతీతంగా అందరినీ ఏకం చేసి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరా టం చేశారన్నారు. గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు చి దుర గోవర్ధన్గౌడ్, ప్రధాన కార్యదర్శి బుర్ర నారా యణగౌడ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగ య్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మాజీ కౌన్సిలర్ బొల్గం నాగరాజుగౌడ్ పాల్గొన్నారు. కలెక్టరేట్లో నివాళి.. కలెక్టరేట్లో నిర్వహించిన వేడుకల్లో అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్ ఆధ్వర్యంలో పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి బీసీ సంక్షేమాధికారి, జిల్లా మత్స్య శాఖ అధికారి సౌజన్య, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, కార్మిక శాఖ అధికారి నజీర్ అహ్మద్, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి అజ్మీరా రాందాస్, లీడ్ బ్యాంక్ మేనేజర్ మల్లికార్జునరావు, గౌడ సంఘం ప్రతినిధులు గోవర్ధన్గౌడ్, బుర్ర నారాయణగౌడ్, పులి లక్ష్మీపతిగౌడ్, బొల్గం నాగరాజుగౌడ్, అమరేందర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ముసురువాన
సిరిసిల్ల: జిల్లాలో ఆదివారం ముసురు వర్షం కురిసింది. రుద్రంగిలో అత్యధికంగా 20.7 మిల్లీమీటర్ల వర్షం పడగా.. చందుర్తిలో 19.7, వేములవాడ రూరల్లో 12.1, బోయినపల్లిలో 20.6, వేములవాడలో 18.5, సిరిసిల్లలో 11.3, కోనరావుపేటలో 15.2, వీర్నపల్లిలో 14.6, ఎల్లారెడ్డిపేటలో 10.9, గంభీరావుపేటలో 6.7, ముస్తాబాద్లో 6.8, తంగళ్లపల్లిలో 9.6, ఇల్లంతకుంటలో 10.4 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. పొరుగునే ఉన్న కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న వర్షాలతో పాల్వంచ వాగులో వరదనీరు ప్రవహిస్తోంది. గంభీరావుపేట మండలం నర్మాల ఎగువమానేరులోని పాల్వంచవాగు ద్వారా వరద చేరుతోంది. -
అప్పుడే ఎండ.. అప్పుడే వాన
పొద్దుగాల చూస్తే ఎండ వస్తుందని అనిపించి రంగులు అద్ది బట్టను ఆరబెడితే అప్పుడే మొగులు అవుతుంది. వర్షం పడుతుంది. ఆరినబట్ట తడిసిపోతుంది. మళ్లీ ఆరేంత వరకు అక్కడే ఉండాలే. ఇలా చేసిన రెక్కల కష్టం ముసురు వర్షంతో పాడవుతుంది. సరైన పని లేక.. కై కిలి రాక.. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. – నల్ల లక్ష్మీనారాయణ, డయింగ్ కార్మికుడు ముసురు వర్షంతో అద్దకం ఆగిపోయింది. సిరిసిల్లలో అద్దకం పరిశ్రమ ఒకప్పుడు వెలుగు వెలిగింది. ఇప్పుడు ప్రభుత్వ సహకారం లేక డయింగ్ యూనిట్లు మూతబడిపోయి ఆఖరి దశకు చేరాయి. పాలిస్టర్ పరిశ్రమకు ఇచ్చినట్లు కాటన్ పరిశ్రమకు ప్రభుత్వ ఆర్డర్లు వస్తే బాగుంటుంది. – కోడం ఆనంద్బాబు, డయింగ్ యజమాని -
ఎస్సీల అభివృద్ధికి పెద్దపీట
● రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం సిరిసిల్లటౌన్: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టినప్పటి నుంచి ఎస్సీ అభివృద్ధికి సర్కారు పెద్దపీట వేసిందని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరిగారి ప్రీతం పేర్కొన్నారు. గాంధీభవన్లో స్టేట్ ఎగ్జిక్యూటీవ్ ఎస్సీ డిపార్ట్మెంట్ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ రాజేందర్పాల్ గౌతమ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు నాలుక సత్యం పాల్గొన్నారు. ‘డీజేలు ఏర్పాటు చేస్తే చర్యలు’ వేములవాడ: నిబంధలకు లోబడి వినాయక మండపాల వద్ద స్పీకర్లు ఏర్పాటు చేసుకోవాలే తప్ప డీజేలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవని టౌన్ సీఐ వీరప్రసాద్ హెచ్చరించారు. టౌన్ పరిధిలోని డీజే నిర్వాహకులతో ఆదివారం స్టేషన్ ఆవరణలో సమావేశమయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా డీజేలు పెట్టినా, యాంప్లిఫైయర్తో బాక్స్లు ఏర్పాటు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని, గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో మండపాల వద్ద కానీ, శోభయత్రలో కానీ డీజేలు కానీ యాంప్లిఫయర్తో బాక్స్లు ఏర్పాటు చేసినా కఠిన చర్యలు తప్పవన్నారు. పోలీసుల అనుమతితో చిన్న స్పీకర్లు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సంక్షేమ పథకాలు వివరించాలి సిరిసిల్లటౌన్: కాంగ్రెస్ సర్కారు చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని రాజీవ్గాంఽధీ పంచాయతీరాజ్ సంఘటన జిల్లా అధ్యక్షుడు గుండెల్లి శ్రీనివాస్గౌడ్ కోరారు. డీసీసీ ఆఫీస్లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఆర్జీపీఆర్ఎస్ నేషనల్ కో–ఆర్డినేటర్ ఇనామ్ హసన్, స్టేట్ జోనల్ ఇన్చార్జి మోతుకూరి నవీన్గౌడ్ పాల్గొన్నారు. యాదవుల శౌర్యం దేశభక్తికి నిదర్శనం సిరిసిల్లటౌన్/తంగళ్లపల్లి(సిరిసిల్ల): దేశరక్షణలో యాదవుల శౌర్యం ఎనలేనిదని యాదవ మహాసభ రాష్ట్ర నాయకుడు వీరవేని మల్లేశ్యాదవ్ పేర్కొన్నారు. అఖిల భారత యాదవ మహాసభ చేపట్టిన రెజాంగ్ల రాజ్ కలశయాత్ర ఆదివారం సిరిసిల్లకు చేరిన సందర్భంగా వారికి స్వాగతం పలికి మాట్లాడారు. 1962 భారత–చైనా యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన 114 మంది యాదవ వీరయోధుల స్మరణార్థంగా, అహిర్(యాదవ్) రెజిమెంట్ స్థాపన కోసం బిహార్ నుంచి ప్రారంభమైన 120 రోజుల కలశ యాత్ర ఆదివారం సిరిసిల్ల వచ్చిందని తెలిపారు. యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు ఏటీ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆసరి బాలరాజు, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జగ్గాన్ని మల్లేశ్యాదవ్, కార్యదర్శి మిరాల శ్రీనివాస్, మండలాధ్యక్షుడు మాసం భాస్కర్, ప్రధాన కార్యదర్శి గంధం సంపత్ పాల్గొన్నారు. నేడు ప్రజావాణి రద్దు సిరిసిల్ల/సిరిసిల్లఅర్బన్: కలెక్టరేట్లో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ సందీప్కుమార్ ఝా తెలిపారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లా ప్రజలు వినతులు ఇవ్వడానికి కలెక్టరేట్కు రావద్దని కోరారు. -
ఇక.. లెక్క పక్కా!
● కాలేజీల్లో అమ్మ ఆదర్శ కమిటీలు ● సదుపాయాల కల్పనకు నిధులు ● 10 కళాశాలలకు రూ.1.80కోట్లు ● కమిటీల ఆధ్వర్యంలో నిధుల ఖర్చు చందుర్తి(వేములవాడ): ప్రభుత్వ జూనియర్ కాలేజీలో వసతుల కల్పన.. నిధుల ఖర్చు.. విద్యాబోధన పర్యవేక్షణకు ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. నిధుల కేటాయింపు.. నిర్వహణకు పాఠశాలల మాదిరిగా అమ్మ ఆదర్శ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. అంతేకాకుండా జిల్లాలో పది ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో వసతుల కల్పనకు రూ.1.80కోట్లు కేటాయించింది. ఈ నిధుల నిర్వహణ, కమిటీలు చేసుకునే బాధ్యతను వారికి అప్పగించనున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ కమిటీ చైర్మన్గా, కన్వీనర్గా స్వశక్తి సంఘం సభ్యురాలు, కళాశాలలో విద్యను అభ్యసించే ఆరుగురు విద్యార్థుల తల్లులు, కళాశాలలోని మరో ముగ్గురు సీనియర్ అధ్యాపకులతో కమిటీ ఏర్పాటు చేస్తారు. వసతుల కల్పనపై దృష్టి కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, మూత్రశాలల పునరుద్ధరణ, నిర్మాణాలు, నిర్వహణ, తరగతి గదుల్లో విద్యుత్ సదుపాయం, పారిశుధ్య నిర్వహణ, భవనాలకు రంగులు తదితర పనులపై ఇంజినీరింగ్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. 10 కళాశాలలకు రూ.1.80 కోట్లు జిల్లాలోని పది ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు రూ.1.80కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. వీటి ద్వారా వసతులు కల్పించనుంది. -
అద్దకానికి ‘ముసురు’దెబ్బ
● ఆగిన రంగుల అద్దకం ● కష్టాల్లో కాటన్ వస్త్ర పరిశ్రమ ● కార్మికుల ఉపాధికి విఘాతం సిరిసిల్ల: వస్త్ర పరిశ్రమలో కాటన్ బట్టది ప్రత్యేక స్థానం. ఒకప్పుడు 20 వేల మగ్గాలపై కాటన్ బట్ట ఉత్పత్తి అయ్యేది. పాలిస్టర్ వస్త్రాల రాకతో క్రమంగా కాటన్ వస్త్రాలను ఉత్పత్తి చేసే సాంచాల సంఖ్య తగ్గిపోయింది. ప్రస్తుతం సిరిసిల్లలో మూడు వేల మగ్గాలపై కాటన్ వస్త్రాలు ఉత్పత్తి అవుతున్నాయి. సిరిసిల్లలో ఉత్పత్తి అవుతున్న కాటన్ వస్త్రాన్ని ఇక్కడే 42 రకాల రంగుల్లో డయింగ్ చేస్తారు. రంగుల బట్టను పట్టణ శివారుల్లో ఎండలో ఆరబెడతారు. కానీ ఇప్పుడు ముసురుకున్న వర్షాలతో ఎండలు లేక అద్దకం ఆగిపోయింది. సిరిసిల్లలో ఒకప్పుడు 150 అద్దకం యూనిట్లు ఉండగా ప్రస్తుతం 30కి తగ్గిపోయాయి. కాటన్ పరిశ్రమపై ఆధార పడి వెయ్యి కుటుంబాలు బతుకుతున్నాయి. కాటన్ వస్త్రాన్ని పెటీకోట్స్(లంగాలు)గా వినియోగిస్తున్నారు. సిరిసిల్లలో ఉత్పత్తి అవుతున్న కాటన్ వస్త్రాలు ఒకప్పుడు ఐదు రాష్ట్రాలకు ఎగుమతి చేసే వారు. ఇప్పుడు పోటీని తట్టుకోలేక పోతున్నారు. ఇటీవల ప్రతికూల పరిస్థితుల్లో కాటన్ వస్త్రం కష్టాలను ఎదుర్కొంటోంది. ● ఆగిన అద్దకం సిరిసిల్లలో నిత్యం మూడు లక్షల మీటర్ల కాటన్ వస్త్రం ఉత్పత్తి అవుతుంది. రోజూ 30 అద్దకం యూనిట్లలో ఏ రోజుకు ఆ రోజూ తెల్లవారుజామున 4 గంటలకే డయింగ్ కార్మికులు చేరుకొని రంగులు అద్దుతారు. డయింగ్ అయిన బట్టను పట్టణ శివారుకు ఆటోల్లో తరలించి ఆరబెడతారు. మధ్యాహ్నం ఒంటి గంట కల్లా పని పూర్తవుతుంది. ముసురు వర్షాలతో అద్దకం ఆగిపోయి వైట్క్లాత్ నిల్వలు పేరుకుపోయాయి. ● పాలిస్టర్కు ఆర్డర్లు.. కాటన్కు కష్టాలు రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులకు ‘ఇందిరా మహిళా శక్తి’ పేరిట ఏటా రెండు చీరలు అందించాలని భావిస్తోంది. ఈమేరకు సిరిసిల్ల వస్త్రపరిశ్రమకు 4.50 కోట్ల మీటర్ల వస్త్రోత్పత్తి ఆర్డర్లు టెస్కో అధికారులు ఇచ్చారు. కాటన్ పరిశ్రమకు ప్రభుత్వపరంగా ఎలాంటి చేయూత లేక ఇబ్బందుల్లో ఉంది. ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి చీరలతోపాటు లంగాలు (పెట్టీకోట్స్) బట్ట ఉత్పత్తి ఆర్డర్లు ఇస్తే కాటన్ పరిశ్రమకు ఉపాధి లభిస్తుందని కాటన్ పరిశ్రమల యజమానులు ఆశిస్తున్నారు. -
ఆత్మహత్యల నివారణ సామాజిక బాధ్యత
● సైకాలజిస్టు పున్నం చందర్సిరిసిల్లటౌన్: ఆత్మహత్యల నివారణ సామాజిక బాధ్యతగా గుర్తించాలని సైకాలజిస్టు పున్నంచందర్ పేర్కొన్నారు. జాతీయ సామాజిక వారోత్సవం 2025లో భాగంగా ఆదివారం కాకతీయ యూనివర్సిటీ సామాజికశాస్త్రం, సామాజిక సేవా విభాగం ఆధ్వర్యంలో ఆదివారం ఒక ప్రత్యేక వెబినార్ నిర్వహించి మాట్లాడారు. సోషల్వర్క్ విద్యార్థులకు ‘ఆత్మహత్య నివారణ పద్ధతులు’ అనే అంశంపై ఆన్లైన్లో మార్గదర్శనం చేస్తూ మాట్లాడారు. ప్రస్తుతం సమాజంలో యువతలో ఆత్మహత్య ప్రవర్తన పెరుగుతోందన్నారు. కుటుంబం, స్నేహితులు, అధ్యాపకులు ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే అనేక ప్రాణాలను రక్షించవచ్చని సూచించారు. సామాజిక సంబంధాల నుంచి దూరమవడం, ఒంటరిగా ఉండడాన్ని ఇష్టపడటం అనే లక్షణాలు కనిపిస్తాయన్నారు. విభాగాధిపతి ప్రొఫెసర్ ఎం.స్వర్ణలత మాట్లాడుతూ సమాజంలో రోజురోజుకు సమస్యలతోపాటు సోషల్వర్క్ ప్రాధాన్యత పెరుగుతుందన్నారు. సామాజికశాస్త్రం, సంఘ సంక్షేమశాస్త్రం బోర్డు ఆఫ్ స్టడీస్ ప్రొఫెసర్ ఎం.ఐలయ్య, అధ్యాపకులు డాక్టర్ కె.సుభాష్, డాక్టర్ ఎస్.సాహితి పాల్గొన్నారు. -
మీ గెలుపు కోసం పనిచేస్తా
● ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో విజయం మనదే ● బీఆర్ఎస్ శ్రేణులతో కేటీఆర్సిరిసిల్ల: మీ గెలుపు కోసం నేను పనిచేస్తా.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే విజయం మనదేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు పేర్కొన్నారు. సిరిసిల్లలోని పద్మనాయక కల్యాణ మండపంలో ఆదివారం బీఆర్ఎస్ శ్రేణులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. కేటీఆర్ మాట్లాడుతూ గత పదేళ్లలో మండటెండల్లోనూ సిరిసిల్ల మానేరు నిండుగా పారేదని, కాంగ్రెస్ వచ్చాక ఎడారిలా మారిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పోలీసు కేసులు పెట్టడం, జైలుకు పంపడం అన్నట్లుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా.. అని కేసీఆర్కు ఓటు వేసేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. 20 నెలల్లోనే కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయడం లేదన్నారు . ప్రజాసమస్యలపై పోరాటం బీఆర్ఎస్ నాయకులు ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని, తమ పరిధిలోని సమస్యలపై ఉద్యమించాలని కేటీఆర్ దిశనిర్దేశం చేశారు. యూరియా కొరతతో కాంగ్రెస్ నాయకులకు గ్రామాల్లో తిరిగే ముఖం లేకుండా పోయిందన్నారు. విద్యుత్ బిల్లులు సబ్సిడీ ద్వారా చెల్లించాలని వస్త్రవ్యాపారులు ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీలతోపాటు మున్సిపల్ ఎన్నికల్లో విజయం బీఆర్ఎస్దేనని స్పష్టం చేశారు. నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ‘సెస్’ చైర్మన్ చిక్కాల రామారావు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చీటీ నర్సింగరావు, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, ‘సెస్’ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ, గ్రంథాలయసంస్థ మాజీ అధ్యక్షుడు ఆకునూరి శంకరయ్య, అర్బన్ బ్యాంక్ చైర్మన్ రాపల్లి లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుడు అడ్డగడ్ల మురళి, మున్సిపల్ మాజీ వైస్చైర్మన్ మంచె శ్రీనివాస్, పార్టీ పట్టణ కార్యదర్శి మ్యాన రవి, ఉపాధ్యక్షుడు ఎండీ సత్తార్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రేమను పంచడమే దైవత్వం
సిరిసిల్లటౌన్: స్వార్థంతో కోరికలు తీరాలని కోరుకో వడం కన్నా..సకల చరాచర జాతులపై ప్రేమను పంచడం దైవత్వమని సైకాలజిస్టు అన్నమైన మల్లేశం పేర్కొన్నారు. భగవాన్ శ్రీసత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సిరిసిల్ల సత్యసాయి సేవా మందిరంలో బాలవికాస్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. సమ్మేళనంలో గత ముప్పై ఏళ్లుగా సంస్థకు అనుబంధంగా పూర్వ బాలవికాస్ విద్యార్థిని, విద్యార్థులు హాజరై ఆనందాన్ని వ్యక్తం చేశారు. సనాతన అనాలైటిక్స్ స్పీకర్ రంగనాథరాజు, సమితి జిల్లా అధ్యక్షుడు బూర రవీందర్ పాల్గొన్నారు. -
సిరిసిల్ల నుంచే పోటీ చేస్తా
సాక్షి, హైదరాబాద్/గంభీరావుపేట/సిరిసిల్ల: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను సిరిసిల్ల నుంచే పోటీ చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ రామారావు తెలిపారు. తాను హైదరాబాద్ శివార్లలోని ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్టు దుష్ప్రచారం జరుగుతోందని, దానిని ఎవరూ నమ్మవద్దని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కేటీఆర్ సమావేశమై మాట్లాడారు. ‘మీ ఆశీర్వాదంతోనే రాజకీయంగా ఎదిగాను. మీరు వద్దనుకునే వరకు ఇక్కడే పోటీ చేస్తాను. వచ్చే ఎన్నికల్లో నేను సిరిసిల్లలో పోటీ చేయనని, హైదరాబాద్ శివారుల్లో పోటీ చేస్తానని కొన్ని పార్టీల నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారాన్ని నమ్మవద్దు’అని కోరారు. మిమ్మల్ని దగ్గరుండి గెలిపించుకుంటా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను దగ్గరుండి గెలిపించుకుంటానని కేటీఆర్ తెలిపారు. ‘నా గెలుపు కోసం మీరంతా కష్టపడ్డారు. మీ గెలుపు కోసం మున్సిపల్ ఎన్నికల్లో నేను కష్టపడుతాను. ఇంటింటికీ వెళ్తాను. అభ్యర్థులకు బీఆర్ఎస్ టిక్కెట్ల నేనే ఇస్తాను. మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత నాదే. సిరిసిల్ల వస్త్రవ్యాపారులు కొందరు రాజకీయాలు చేస్తున్నారు. వారు వ్యాపారం చేసుకోవాలే తప్ప, వాళ్లకు రాజకీయాలు ఎందుకు?’అని ప్రశ్నించారు. యూరియా కొరతతో కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, ‘సెస్’చైర్మన్ చిక్కాల రామారావు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్– ఎస్ఐఆర్)తో పాటు ఎన్నికల సంఘానికే సమగ్ర ప్రక్షాళన అవసరమని కేటీఆర్ అన్నారు. ఎన్నికల సంఘం ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంపై ఆయన ‘ఎక్స్’ లో స్పందించారు. ‘ఎన్నికల సంఘం నిర్వహించిన మీడియా సమావేశంలో సమాధానాల కన్నా ప్రశ్నలే ఎక్కువగా మిగిలాయి. దీనిపై ఎన్నికల ప్రధాన కమిషనర్ ఇచ్చిన వివరణలో, సమస్యల పరిష్కారాల కన్నా సాకులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రజాస్వామ్య ప్రక్రియను కాపాడాల్సిన ఎన్నికల సంఘం, ఎన్డీయే ప్రభుత్వానికి అనుబంధ విభాగంలా పనిచేస్తోంది. ఓటర్ల జాబితాలో లోపాలను అంగీకరించినప్పుడు, తమ విధులను నిర్లక్ష్యం చేసినట్లు కూడా ఒప్పుకోవాల్సిన అవసరం లేదా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. ఫ్యూచర్ సిటీకి ఫ్యూచరే లేదు సీఎం రేవంత్రెడ్డి పదేపదే ప్రచారం చేస్తున్న ఊహాజనిత ఫ్యూచర్ సిటీకి భవిష్యత్తు లేదని కేటీఆర్ అన్నారు. కేవలం తన కుటుంబ సభ్యుల ప్రయోజనాల కోసం హైదరాబాద్ ఫార్మాసిటీ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్న సీఎం ఆకాంక్ష నెరవేరదని ఆదివారం ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. ‘సీఎం రేవంత్రెడ్డి విజన్ లేని నాయకుడు. ఆయన నిర్ణయాల వల్ల ప్రజాధనం వృధా అవుతోంది. ఫార్మా సిటీ కోసం భూములిచ్చిన రైతులు మోసపోయారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మా సిటీ ప్రాజెక్టును రద్దు చేసి, దాని స్థానంలో ఫ్యూచర్ సిటీ అనే అవాస్తవ, ఊహాజనిత ప్రాజెక్టును ప్రవేశపెట్టారు. నిర్లక్ష్య నాయకుడు రాష్ట్రాన్ని పాలిస్తే ఏమవుతుందనే దానికి ఫ్యూచర్ సిటీ ప్రచారం ఒక ఉదాహరణ’అని మండిపడ్డారు. ఫార్మాసిటీ భూములపై ప్రభుత్వం వెంటనే ప్రజలకు, రైతులకు స్పష్టత ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాడుతుందని స్పష్టం చేశారు.కుంటయ్య కూతురు పెళ్లి చేసిన కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు కరికవేణి కుంటయ్య ఇటీవల ఆత్మహత్యకు పాల్పడగా.. ఆయన కూతురు లక్షిత (భార్గవి) పెళ్లి బాధ్యతలను కేటీఆర్ నిర్వహించారు. సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో పెళ్లి వేడుకలకు ఆదివారం హాజరయ్యారు. పెళ్లి ఖర్చులను పార్టీ పరంగా కేటీఆర్ భరించారు. కుంటయ్య చిన్న కూతురుకు కొంత డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్గా అందించారు.ఆ ఆహ్వానం నాకెంతో ప్రత్యేకం రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామానికి చెందిన ధ్యానబోయిన నవిత వివాహానికి కూడా కేటీఆర్ ఆదివారం హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ‘అన్నా.. నాకు నాన్న, అన్న లేరు. మీరు అన్నయ్యగా పెళ్లికి వచ్చి మా దంపతులను ఆశీర్వదించాలి’ నవిత వాట్సాప్లో పంపిన ఆహ్వానం తన మనస్సును కదిలించిందని కేటీఆర్ ఎక్స్లో పేర్కొన్నారు. ‘ఈ రోజు ఒక ప్రత్యేకమైన ఆహ్వానం అందింది. నాకు ఇదొక ప్రత్యేకమైన అనుభూతి. ప్రతి అమ్మాయి తన వివాహానికి నాన్న ఆశీర్వాదం, అన్నయ్య అండ కావాలని కోరుకుంటుంది. కానీ నా చెల్లి తన నాన్న, అన్నయ్యను కోల్పోయిన తర్వాత ఆ లోటును తీర్చాలని నన్ను పిలిచింది. ఆమె ఆహ్వానం నాకు కేవలం ఆహ్వానం కాదు.. అది నా మీద ఉంచిన నమ్మకం. ఒక అన్నయ్యపై ఉంచిన ఆశ. ఆ ఆడబిడ్డ ఆహ్వానం నా మనసును కదిలించింది. ఆమె కోరికను గౌరవించడం నా బాధ్యతగా, కర్తవ్యంగా భావించాను’అని పేర్కొన్నారు. -
ఆవు, దూడకు బారసాల
బోయినపల్లి(చొప్పదండి): కృష్ణాష్టమిని పురస్కరించుకొని బోయినపల్లి మండల కేంద్రంలో ఆవుదూడకు బారసాల నిర్వహించారు. మండల కేంద్రానికి చెందిన సుంకపాక తార నర్సయ్య దంపతులకు చెందిన ఆవు 21 రోజుల క్రితం దూడకు జన్మనిచ్చింది. ఈక్రమంలో శనివారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి బారసాల నిర్వహించారు. ఆవుకు, దూడకు పూలదండ వేసి అలంకరించారు. కోనరావుపేట(వేములవాడ): మండల కేంద్రం శివారులో జరుగుతున్న కల్వర్టు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని గ్రామస్తులు శనివారం ఆందోళనకు దిగారు. గ్రామస్తులు మాట్లాడుతూ కల్వర్టులో వినియోగించే పైపుల మధ్య సిమెంట్, కాంక్రీట్తో నింపాల్సి ఉండగా రాళ్లు, బురదమట్టితో నింపుతున్నారన్నారు. వర్షాలకు వచ్చే వరదలకు బురదమట్టి కొట్టుకుపోయి కల్వర్టుకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందన్నారు. పైపుల మధ్య జాయింట్లు కూడా సరిగా చేయడం లేదన్నారు. ఆర్అండ్బీ అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించి పనులు నాణ్యతతో జరిగేలా చూడాలన్నారు. జింక వెంకటి, కస్తూరి మధుకర్రెడ్డి, యాస రాజం, శివతేజరావు, మోహన్, జీవన్ తదితరులు ఉన్నారు. కోనరావుపేట(వేములవాడ): వరుసగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు జలకళను సంతరించుకుంటున్నాయి. మండలంలోని వెంకట్రావుపేటలోని కేశవరావు చెరువు పూర్తిస్థాయిలో నిండింది. శనివారం మత్తడి దూకుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బోయినపల్లి(చొప్పదండి): శ్రీరాజరాజశ్వేర(మిడ్మానేరు) ప్రాజెక్టులో నీటిమట్టం శనివారం రాత్రి 7 గంటల వరకు 9.989 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టులోకి రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రీ పంపుహౌస్ నుంచి వరదకాలువ మీదుగా 12,600 క్యూసెక్కుల మేర ఎల్లంపల్లి జలాలు వచ్చి చేరుతున్నాయి., అలాగే మూల వాగు, మానేరు వాగుల నుంచి మరో 380 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి తరలుతోంది. ఆదివారం ఉదయం వరకు ప్రాజెక్టులో నీటి నిల్వ 10 టీఎంసీలకు చేరనుంది. బోయినపల్లి(వేములవాడ): జిల్లా సింగిల్విండో ఫోరం అధ్యక్షులు, కోరెం ప్యాక్స్ చైర్మన్ తీపిరెడ్డి కిషన్రెడ్డి, బోయినపల్లి ప్యాక్స్ చైర్మన్ జోగినిపల్లి వెంకట రామారావు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను శనివారం కలిశారు. సింగిల్విండోల పదవీకాలం పొడగించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందించారు. సింగిల్విండో డైరెక్టర్లు అనుపట్ల తిరుపతిరెడ్డి, ఎర్రగడ్డం స్వామిరెడ్డి, డబ్బు రాధా వెంకటరెడ్డి, లక్ష్మారెడ్డి, కిష్టారెడ్డి, రవి ఉన్నారు. -
సైకిల్పై తిరిగొద్దాం
ఇంటి నుంచి అడుగు బయటపెట్టడమే ఆలస్యం.. వాహనం ఎక్కి దూసుకెళ్తున్నాం. ప్రమాదానికి ఆస్కారం ఉందని తెలిసినా రహదారి నిబంధనలు పట్టించుకోం. మనస్థాయికి తగ్గ వాహనాలు ఉన్నా.. వాటికి అప్పుడప్పుడు విరామమిద్దాం. వారంలో కనీసం ఒక్కరోజు ఆఫీసుకే కాదు... చిన్నచిన్న అవసరాలకు సైకిల్పై వెళ్లొద్దాం. ఆరోగ్యంగా ఉందాం. ఫిట్నెస్ కోసం ప్రత్యేకంగా జిమ్లకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. సైకిల్ తొక్కడంతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాం. సెలవు దొరికితే సినిమా లేదా ఎగ్జిబిషన్కు వెళ్దామా అని చాలామంది ఆలోచిస్తుంటారు. ఈ ఆదివారం పిల్లలతో కలిసి సమీపంలోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లొద్దాం. రైతు పడుతున్న కష్టాన్ని తెలుసుకుందాం. పిల్లలకు సాగు పద్ధతులు తెలియచేద్దాం. చుట్టుపక్కల ఉన్న పచ్చదనంతో ఆహ్లాదంతో గడుపుదాం. ప్రకృతి విలువ అర్థమయ్యేలా వివరిద్దాం. ఇలా చేయడంతో గ్రూప్డిస్కషన్ జరుగుతుంది. పరిశీలించే గుణం పెరుగుతుంది. వాతావరణం, పంటలపై అవగాహన కలుగుతుంది. క్షేత్రస్థాయి అనుభవం వస్తుంది. -
దివ్యాంగులకు అండగా నిలవాలి
● పెట్రోల్బంక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి ● కలెక్టర్ సందీప్కుమార్ ఝా సిరిసిల్ల: సమాజంలో ప్రతి ఒక్కరూ దివ్యాంగులకు అండగా నిలవాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా కోరారు. రెండో బైపాస్ రోడ్డులోని పెద్దూరు మెడికల్ కాలేజీ–అపెరల్ పార్క్ వద్ద జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఏర్పాటు చేసిన దివ్యాంగుల పెట్రోల్ బంక్ను శనివారం తనిఖీ చేశారు. అక్కడ పనిచేస్తున్న దివ్యాంగులతో మాట్లాడారు. వారికి అందుతున్న జీతభత్యాలు, పనిగంటలు.. సాధక బాధకాలు తెలుసుకున్నారు. పెట్రోల్బంక్ టర్నోవర్ పెంచేందుకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల వాహనాలకు ఇక్కడే డీజిల్, పెట్రోల్ పోయించుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజంకు సూచించారు. అంగన్వాడీ కేంద్రం తనిఖీ ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్లోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో లబ్ధిదారులకు అందుతున్న సేవల గురించి ఆరా తీశారు. మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి గంభీరావుపేట(సిరిసిల్ల): మహిళలు ప్రణాళిక ప్రకారం ఎరువుల వ్యాపారం చేసి ఆర్థికాభివృద్ధి సాధించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. మండల కేంద్రంలో విజయలక్ష్మీ గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎరువులు, విత్తనాల దుకాణాన్ని శనివారం ప్రారంభించారు. ఏఎంసీ చైర్పర్సన్ కొమిరిశెట్టి విజయ, డీఆర్డీవో శేషాద్రి, తహసీల్దార్ మారుతిరెడ్డి, ఏవో సలావుద్దీన్, ఐకేపీ ఏపీఎం దేవయ్య, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు హమీద్, ఐకేపీ సీసీ లావణ్య పాల్గొన్నారు. -
ముసురుకుంది
● ఎగువ మానేరు, నిమ్మపల్లి మూలవాగుల్లోకి చేరుతున్న వరద ● వేములవాడలో అత్యధికంగా 33.3 మిల్లీమీటర్లు సిరిసిల్ల: జిల్లాలో ముసురువర్షం కురిసింది. సిద్దిపేట జిల్లాలో కురుస్తున్న వర్షాలతో కూడెల్లివాగులో కొద్దిగా వరద సాగుతోంది. ఆ వరదనీరు గంభీరావుపేట మండలం నర్మాల ఎగువమానేరులోకి చేరుతోంది. మరోవైపు కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న వర్షాలతో పాల్వంచవాగులోనూ వరద వస్తోంది. నిజామాబాద్ జిల్లా సిరికొండ సరిహద్దు అడవుల్లో కురుస్తున్న వర్షాలతో కోనరావుపేట మండలం నిమ్మపల్లి మూలవాగులోకి వరద నీరు చేరుతోంది. చలిగాలితో కూడిన వర్షం జల్లులు మాత్రమే కురుస్తున్నాయి. ముసురు వర్షంతో వ్యవసాయ పనులకు ఆటంకం ఏర్పడింది. నల్లరేగడి నేలల్లో కొద్దిగా నీరు నిలిచి పత్తి మొక్కలు ఎర్రబడే ప్రమాదం ఉంది. ఇంకా వరినాట్లు వేయని రైతులు ఈ వర్షాలతో వానాకాలం పంట సాగును వర్షంలోనూ పూర్తి చేస్తున్నారు. వేములవాడలో అత్యధికంగా 33.3 మిల్లీమీటర్లు జిల్లా వ్యాప్తంగా శనివారం వర్షం కురిసింది. అత్యధికంగా వేములవాడలో 33.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ముస్తాబాద్లో 30.2, చందుర్తిలో 23.6, రుద్రంగిలో 10.8, వేములవాడ రూరల్లో 13.6, బోయినపల్లిలో 6.7, సిరిసిల్లలో 12.4, కోనరావుపేటలో 11.8, వీర్నపల్లిలో 9.4, ఎల్లారెడ్డిపేటలో 9.8, గంభీరావుపేటలో 22.7, తంగళ్లపల్లిలో 12.6, ఇల్లంతకుంటలో 11.6 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. జిల్లాలోని 13 మండలాల్లో సగటు వర్షపాతం 16.0 మిల్లీ మీటర్లుగా నమోదైంది. -
మహిళలు వ్యాపారంలో రాణించాలి
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడరూరల్: మహిళలు వ్యాపారంలో రాణించాలని, మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ రూరల్ మండలం బొల్లారంలో శనివారం ఇందిరా మహిళాశక్తి కింద శ్రీశివరామ గ్రామ సమాఖ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎరువులు, విత్తనాలు దుకాణాలను కలెక్టర్ సందీప్కుమార్ ఝాతో కలిసి శనివారం ప్రారంభించారు. విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ త్వరలో మహిళా సంఘాలకు రైస్మిల్లులు, సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డీఆర్డీవో శేషాద్రి, మండల వ్యవసాయాధికారి వినీత తదితరులు పాల్గొన్నారు. చందుర్తి(వేములవాడ): స్వశక్తి సంఘాల మహిళలు వ్యాపారాలతో ఆర్థిక స్వావలంబన సాధించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. చందుర్తిలోని స్వశక్తి మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన ఎరువులు, విత్తనాల దుకాణాన్ని కలెక్టర్ సందీప్కుమార్ ఝాతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో యూరియా కొరత లేదన్నారు. రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదారి పట్టించేందుకు విమర్శలు చేయొద్దని సూచించారు. ఆగ్రోస్ కేంద్రాలు, సింగిల్విండోలు ఉన్నా.. రైతులకు మరింత చేరువ చేయాలని స్వశక్తి సంఘాల మహిళలతో ఎరువుల దుకాణాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పార్టీ మండలాధ్యక్షుడు చింతపంటి రామస్వామి, రుద్రంగి మార్కెట్ కమిటీ అధ్యక్షుడు చెలుకల తిరుపతి, ఉపాధ్యక్షుడు బొజ్జ మల్లేశం, సనుగుల సింగిల్విండో మాజీ అధ్యక్షుడు ముస్కు ముకుందరెడ్డి, డీఆర్డీఏ శేషాద్రి, వ్యవసాయాధికారి దుర్గారాజు, ఏపీఎం ప్రకాశ్ పాల్గొన్నారు. -
ఆధ్యాత్మిక క్షేత్రాలకు వెళ్దాం
పోటీ ప్రపంచంలో దొరికే కొద్దివిరామ సమయాన్ని పబ్బులు, రెస్టారెంట్లు, పార్కులకు కేటాయిస్తున్నారు. వీటితో కలిగే ప్రయోజనం కన్నా ఇబ్బందులే ఎక్కువ. అలా కాకుండా ఆధ్యాత్మికతను అందిపుచ్చుకుందాం. ఇష్టదైవారాధన కోసం ప్రార్థనా మందిరాలకు వెళ్దాం. అక్కడ ఓ పూట ఆనందంగా గడుపుదాం. పెద్దల సందేశాలను మన జీవితాలకు అన్వయించుకుందాం. తోటి భక్తుల్లోని మంచిని స్వీకరిద్దాం. ఒక అధ్యయనం ప్రకారం.. ప్రతీ ముగ్గురిలో ఇద్దరు అదే పనిగా ఫోన్ వినియోగిస్తుండగా వారిలో 11శాతం మంది సెల్కు బానిసలవుతున్నారు. ఇది అనేక సమస్యలకు కారణమవుతోంది. ఆదివారం ఫోన్ను పక్కన పెడదాం. పుస్తక పఠనం లేదా దినపత్రికను పూర్తిగా చదువుదాం. ఒక రోజులో 30 పేజీలకు తక్కువ కాకుండా చదివితే జ్ఞానంతోపాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. దినపత్రికలు చదవడంతో నిత్యనూతనంగా.. హుషారుగా పనిచేస్తాం. -
కలెక్టర్ క్యాంపు ఆఫీస్లో
సిరిసిల్ల: కలెక్టర్ క్యాంపు ఆఫీస్లో కలెక్టర్ సందీప్కుమార్ ఝా జాతీయజెండాను ఎగురవేశారు. జాతీయ గీతాన్ని ఆలపించిన చిన్నారులకు బహుమతులు అందించారు. అదనపు కలెక్టర్ నగేశ్, ఆర్డీవో సీహెచ్ వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ సెక్షన్ ఇన్చార్జీలు పాల్గొన్నారు. ఎస్పీ కార్యాలయంలో సిరిసిల్ల క్రైం: జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో ఎస్పీ మహేష్ బి గితే జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసు అధికారులు జాతి సమగ్రత, సమాజంలో శాంతిస్థాపనకు కృషి చేయాలన్నారు. డీఎస్పీ చంద్రశేఖర్రెడ్డి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. 17వ బెటాలియన్లో సిరిసిల్ల అర్బన్: సిరిసిల్ల పట్టణ పరిధిలోని సర్దాపూర్ 17వ బెటాలియన్లో కమాండెంట్ ఎం.ఐ సురేశ్ జాతీయ జెండాను ఎగురవేశారు. సిరిసిల్ల మార్కెట్ కమిటీ సర్దాపూర్లో, రైతు బజారులో మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు వెలుముల స్వరూప జాతీయజెండాను ఎగురవేశారు. మధ్య మానేరులోవేములవాడఅర్బన్: వేములవాడ మండలం చీర్లవంచకు చెందిన మత్స్యకారులు మిడ్ మానేరు ప్రాజెక్ట్ నీటిలోని పాత చీర్లవంచలోకి తెప్పలతో వెళ్లి జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చా టుకున్నారు. గంగు ఎల్లయ్య, శ్రీకాంత్, అనంద్, అకాశ్, అజయ్, సంజయ్, ప్రవీణ్ ఉన్నారు. డ్రోన్పై మువ్వన్నెలుబోయినపల్లి: బోయినపల్లి మండలం తడగొండలో స్వాతంత్య్ర దినోత్సవం వేళ డ్రోన్పై జాతీయజెండాతో వినూత్న పద్ధతిలో చేనుకు మందు పిచికారీ చేశారు. గ్రామానికి చెందిన చిందం శ్రీనివాస్, కొడారి శివ డ్రోన్పై జాతీయ జెండాతో వరిచేనులో స్ప్రే చేశారు. -
యూరియా కోసం బారులు
రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. వీర్నపల్లి మండలకేంద్రానికి 660 బస్తాల యూరియా వచ్చిన విషయం తెలుసుకుని కంచర్ల, మద్దిమల్ల, రంగంపేట గ్రామాల నుంచి పెద్దఎత్తున రైతులు తరలివచ్చారు. అధికారులు వారిని క్యూలో నిల్చోబెట్టి, పోలీసుల బందోబస్తు మధ్య ఒక్కో ఆధార్కార్డుకు రెండు బస్తాలు ఇవ్వడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. గంభీరావుపేట మండలం కొత్తపల్లి సింగిల్విండో కార్యాలయం ఎదుట రైతులు యూరియా బస్తాల కోసం బారులు తీరారు. కొంత మంది రైతులు చెప్పులు, బండరాళ్లను సైతం క్యూలో పెట్టారు. – వీర్నపల్లి/గంభీరావుపేట(సిరిసిల్ల) -
స్వాతంత్రోద్యమం నుంచి కాంగ్రెస్ ప్రజాపక్షమే
సిరిసిల్లటౌన్: రాష్ట్రప్రభుత్వం అందజేస్తున్న పథకాలను ప్రతి కార్యకర్త ప్రజలకు చేరవేయాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సూచించారు. సిరిసిల్లలోని డీసీసీ కార్యాలయంలో శుక్రవారం జాతీయ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ అనేక పోరాటాలు చేసి స్వతంత్య్రాన్ని సాధించారన్నారు. తెలంగాణ రాష్ట్ర కళను ఇప్పుడు సోనియాగాంధీ నెరవేర్చారన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, సంగీతం శ్రీనివాస్, చొప్పదండి ప్రకాశ్, ఆకునూరి బాలరాజు, గడ్డం నర్సయ్య, వెల్ముల స్వరూపరెడ్డి, కాముని వనిత, ఆడెపు చంద్రకళ, కల్లూరి చందన పాల్గొన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలి ఇల్లంతకుంట: మహిళలు అన్ని రంగాలలో ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఇల్లంతకుంట మండలం కందికట్కూరులో ఆవని గ్రామైక్య మహిళా సంఘం ఏర్పాటుచేసిన ఫర్టిలైజర్ షాపును శుక్రవారం ప్రారంభించారు. షాపులో 450 యూరి యా బస్తాలు అందుబాటులో ఉన్నాయన్నారు. కందికట్కూర్ గ్రామ మహిళా సంఘాల వారు తమకు నూతన భవనం కావాలని ఎమ్మెల్యేను కోరగా మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఇల్లంతకుంటలోని 50పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణం పనులు పరిశీలించారు. డీఆర్డీవో శేషాద్రి, డీఏవో అఫ్జల్బేగం, ఐకేపీ ఏపీఎం లతా మంగేశ్వరి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కే.భాస్కర్ రెడ్డి, గుడిసె ఐలయ్య, తీగల పుష్పలత, చిట్టి ఆనందరెడ్డి పాల్గొన్నారు. ప్రెసిడెంట్ మెడల్ అందుకున్న ఏఎస్పీ చంద్రయ్య సిరిసిల్ల క్రైం: సిరిసిల్ల అడిషనల్ ఎస్పీ చంద్రయ్య ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ అందుకున్నారు. ఆయన్ను ఎస్పీ మహేష్ బీ గితే అభినందించారు. 1991 లో ఎస్సైగా పోలీస్శాఖలో చేరిన డి.చంద్రయ్య వివిధ పోలీసుస్టేషన్లలో పనిచేశారు. 2007లో సీఐగా, 2017లో డీఎస్పీగా పదోన్నతి పొందా రు. 2021 లో అదనపు ఎస్పీగా పదో న్నతి పొంది సిరిసిల్ల జిల్లా అదనపు ఎస్పీగా కొనసాగుతున్నారు. సేవ పతకం, ఉత్తమసేవ పతకాలతో మహోన్నత సేవాపతకం అందుకున్నారు. 34 ఏళ్ల సుదీర్ఘ సేవలను గుర్తించి భారత ప్రభుత్వం ప్రెసిడెంట్ సర్వీస్ మెడల్కి ఎంపిక చేసింది. జిల్లాలో చిరు జల్లులు సిరిసిల్ల: జిల్లాలో శుక్రవారం చిరు జల్లులు కురి శాయి. ఎల్లారెడ్డిపేటలో 4.5 మిల్లీ మీటర్ల వర్షం పడగా.. ఇల్లంతకుంటలో 4.0, గంభీరావుపేటలో 2.5, సిరిసిల్లలో 2.3, కోనరావుపేటలో 2.3, రుద్రంగిలో 1.5, ముస్తాబాద్లో 1.3, తంగళ్లపల్లిలో 1.3, వేములవాడలో 1.3 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. మిగితా మండలాల్లో పెద్దగా వర్షం పడలేదు. -
హరేరామ.. హరేకృష్ణ
జగద్గురువు శ్రీ కృష్ణుడి జన్మాష్టమి సంబరాలను అంబరాన్ని తాకేలా ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం జిల్లాశాఖ సారథ్యంలో స్థానిక కల్యాణ లక్ష్మి గార్డెన్లో శుక్రవారం జరిగిన వేడుకలకు వేల సంఖ్యలో భక్తులు హాజరై తరించారు. శ్రీమాన్ ప్రాణనాథ్ అచ్యుతదాస్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. సుందరంగా అలంకరించిన రాధాకృష్ణుల ప్రతిమలకు ఊయలసేవ, నైవేద్యాలతో రాజభోగ సమర్పణ, రాజభోగ హారతి తదితర కార్యక్రమాలు జరిపారు. సాయంత్రం ధూప హారతి, మహాఅభిషేకం జరిపించారు. రాజమండ్రికి చెందిన రాయి కిషోరి కూచిపూడి నృత్య కళాక్షేత్రం ఆధ్వర్యంలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు అలరించింది. మహా మంగళహారతి, ప్రసాద వితరణతో జన్మాష్టమి వేడుకలు ముగిశాయి. నరోత్తమదాస్, హరిహరదాస్, మధుసూదన్దాస్, భక్తులు పాల్గొన్నారు. – సిరిసిల్లకల్చరల్/సిరిసిల్లటౌన్ -
అభివృద్ధి.. సంక్షేమం
సిరిసిల్ల: అభివృద్ధి.. సంక్షేమం.. సుపరిపాలన లక్ష్యంగా.. ప్రజాపాలన సాగుతోందని, పేదరికం, అసమానతలు, అంటరానితనంపై పోరాటం సాగి స్తున్నామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ సందీప్కుమార్ ఝా, ఎస్పీ మహేశ్ బి గితేలతో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీస్ గౌరవ వందనం స్వీకరించి ప్రసంగించారు. జిల్లాలో ఇందిరా మహిళా శక్తిలో భాగంగా 23 ఫర్టిలైజర్ షాపులు ఏర్పాటు చేశామన్నారు. ప్రతిష్టాత్మక ‘ఆత్మనిర్భర్ సంఘతన్’ జాతీయ అవార్డుకు ఇల్లంతకుంట ఆదర్శ మండల సమాఖ్య ఎంపికై ందన్నారు. యాసంగి సీజన్లో 189 కొనుగోలుకేంద్రాల్లో 33,972 రైతుల నుంచి రూ.469.98కోట్ల విలువైన 20,25,800 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయగా.. మహిళా సంఘాలకు రూ.6.48కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. స్కూల్ యూనిఫాంలు కుట్టించడం ద్వారా రూ.24.20 లక్షల ఆదాయం సమకూరిందన్నారు. గ్రామ మహిళా సంఘాలకు 8 ఎకరాల భూమి గుర్తించి, రూ.7.25 కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. వన మహోత్సవంలో 5.50 లక్షలు మొక్కలు నాటామన్నారు. మెప్మా ద్వారా 248 స్వయం సహాయక సంఘాలకు రూ.34.49 కోట్ల విలువైన బ్యాంక్ రుణాలు అందించామన్నారు. 784 మంది సభ్యులకు సీ్త్రనిధి రుణాలను రూ.7.55 కోట్లు ఇచ్చామన్నారు. జిల్లాలో మొత్తం రూ.4.48 కోట్లతో 283 వ్యక్తిగత యూనిట్లు, రూ.35 లక్షలతో ఐదు గ్రూప్ యూనిట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు జిల్లాలో 12,623 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించిన లబ్ధి దారుల బ్యాంకు ఖాతాల్లో రూ.27కోట్లు జమ చేశామన్నారు. 14,075 రేషన్ కార్డులను జారీ చేయడంతో పాటు, 30,376 మంది పేర్లు నమోదు చేశామన్నారు. 5,35,920 మందికి సన్నబియ్యం అందిస్తున్నామని, గృహజ్యోతి పథకంలో 16.51 లక్షల జీరో బిల్లులు జారీ అయ్యాయన్నారు. టీఎస్ఐ– పాస్ ద్వారా రూ.19కోట్లతో 27 పరిశ్రమలను ఏర్పాటు చేసి 249 మందికి ఉపాధి కల్పించామని తెలిపారు. వ్యవసాయానుబంధంగా రూ.1,821 కోట్ల రుణా లు అందించామని, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రూ.331 కోట్లు పంపిణీ చేశామని అన్నారు. వేములవాడ ఆలయ అభివృద్ధికి బాటలు వేములవాడ ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులకు రూ.213 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలి పారు. రూ.35.25 కోట్లతో అన్నదాన సత్రం, రూ.10కోట్లతో బద్దిపోచమ్మ ఆలయ విస్తరణ, రూ.12 కోట్లతో గుడి చెరువు అభివృద్ధి పనులు సాగుతున్నాయని తెలిపారు. షాపింగ్ కాంప్లెక్స్ ని ర్మాణానికి రూ.25 కోట్లు మంజూరయ్యాయన్నారు. భీమేశ్వర ఆలయంలో రూ.3.44కోట్లతో కల్యాణ మండపం, సీసీ ఫ్లోరింగ్ పనులు చేస్తున్నామన్నా రు. తిప్పాపూర్ బస్స్టాండ్ నుంచి ఆలయం వరకు రహదారి విస్తరణ పనులకు రూ.47కోట్ల మంజూరై, పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. నేతన్నలకు అండగా సిరిసిల్ల నేతన్నలకు రూ.4.30 కోట్ల విలువైన 64,7000 ఇందిరా మహిళా శక్తి చీరల ఆర్డర్లు ఇచ్చామన్నారు. స్కూల్ యూనిఫామ్స్ కోటి 12 లక్షల మీటర్ల వస్త్రాల ఉత్పత్తి ఆర్డర్లు అందించామన్నారు. 5,137 మంది నేతన్నలకు బీమా కల్పించామని, వివిధ కారణాలతో మరణించిన 77మంది కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున బీమా సొమ్ము అందించామని అన్నారు. ఆరు చేనేత సహకార సంఘాలకు క్యాష్ క్రెడిట్ పథకం కింద ఏటా రూ.45 లక్షలు మంజూరు చేస్తున్నామని, త్రిఫ్ట్ పథకంలో 4,963 మంది నేతన్నలకు ఏటా రూ.12.40 కోట్లు ప్రభుత్వ వాటాగా చెల్లిస్తోందన్నారు. సీ్త్ర, శిశు, దివ్యాంగుల సంక్షేమానికి.. జిల్లాలో 150 అంగన్వాడీ కేంద్రాల భవనాలకు శ్రీకారం చుట్టామని, 39 రెసిడెన్షియల్ విద్యాలయాల్లో అన్ అకాడమీ సంస్థ ద్వారా రూ.25 లక్షలతో ఐఐటీ ఫౌండేషన్, ఐఐటీ–జేఈఈ, నీట్–యూజీ మెడికల్ ఆన్లైన్ కోచింగ్ నిర్వహిస్తున్నామన్నారు. దీని ద్వారా 13,564 మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. బాలికల సంరక్షణకు మండెపల్లిలో రూ.1.38 కోట్లతో బాలసదనం నిర్మాణానికి అనుమతి లభించిందన్నారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసి 24 మందికి ఉపాధి కల్పిస్తున్నామన్నారు. వ్యవసాయ అభివృద్ధికి జిల్లాలో రైతు భరోసాలో 1,26,278 మందికి రూ.149.27 కోట్లు అందించామన్నారు. 393 మంది రైతుల కుటుంబాలకు రూ.18 కోట్ల బీమా పంపిణీ చేశామని, 47,977 మంది రైతులకు రూ.381. 45 కోట్ల పంట రుణాలు మాఫీ చేశామన్నారు. కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్ 9వ ప్యాకేజీ పనులు పూర్తి చేసి నీరు విడుదల చేశామన్నారు. రుద్రంగి, మర్రిపల్లి చెరువు పనులు, శ్రీపా ద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ స్టేజీ–2 ఫేస్–1లోని రుద్రంగి చెరువు పనులు సాగతున్నాయని తెలిపారు. కోనరావుపేట మండలం లచ్చపేట రిజర్వాయర్కు వచ్చే కాలువ పనులు పూర్తయితే జిల్లాలో 40,285 ఎకరాలు సాగులోకి వస్తుందన్నారు. వేములవాడలో ఇంటర్నేషనల్ స్కూల్ వేములవాడలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ కాంప్లెక్స్ మంజూరైందన్నారు. రుద్రంగిలో రూ.42కోట్లతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ) మంజూరైందన్నారు. అగ్రహారం డిగ్రీ కళాశాలలో రూ.10 కోట్లతో మహిళా హాస్టల్ పనులు మొదలయ్యాయని తెలిపారు. రోడ్ల నిర్మాణాలు జిల్లాలోని గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణానికి ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.50.29 కోట్లు 730 పనులకు మంజూరయ్యాయని, ఇందులో 443 పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. జాతీయ ఆరోగ్య మిషన్లో మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనులకు రూ.4.45కోట్లు మంజూరయ్యాయని, 16 ఉప కేంద్రాలకు రూ.3.20కోట్లు మంజూరు కాగా, రెండు పూర్తి కాగా, ఒకటి పురోగతిలో ఉందన్నారు. మానాల– మర్రిమడ్ల రోడ్డు పనులు రూ.10కోట్లతో సాగుతున్నాయని, వేములవాడ– సిరికొండ రహదారిపై రూ.10కోట్లతో వంతెన, జవారిపేట– నర్సక్కపేట రహదారిపై రూ.75 లక్షలతో వంతెన, మర్రిపల్లి వద్ద రూ. 2 కోట్లతో వంతెన నిర్మాణం పూర్తయ్యిందని తెలిపారు. సిరిసిల్లలో కోర్టు భవన కాంప్లెక్స్ రూ.81 కోట్లతో చేపట్టనున్నామని తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాల, వసతి హాస్టల్ నిర్మాణానికి రూ.166 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. వేములవాడ, సిరిసిల్ల పట్టణాల అభివృద్ధికి.. వేములవాడ పట్టణంలో రూ.4.20 కోట్లు సీసీ రోడ్లు, మురికి కాల్వల నిర్మాణాలకు మంజూరయ్యాయని, రూ.3 కోట్ల నిధులతో పైప్ లైన్ నిర్మాణం, వీధి వ్యాపారులరూ.56 లక్షలతోషెడ్ల నిర్మాణం, మురికి నీరు గుడి చెరువు, మూలవాగులో కలవకుండా రూ. 6 కోట్లతో పనులు చేపడుతున్నామని తెలిపారు. సిరిసిల్ల పట్టణంలో రూ.3.10 కోట్లతో రగుడు కూడలి అభివృద్ధి, రూ.50లక్షలలో సీసీ రోడ్లు, మురికి కాల్వ నిర్మాణాలు రూ.15కోట్లతో కొత్త చెరువు నీటి మళ్లింపు, రూ.2.50 కోట్లతో సంజీవయ్య కమాన్ అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. సిరిసిల్ల మానేరువాగు తీరంలో ఐదెకరాల్లో క్రికెట్ స్టేడియం, చందుర్తి మండలం మూడపల్లి వద్ద మరో స్టేడియం, సిరిసిల్ల, వేములవాడ పట్టణాల మధ్య చంద్రగిరిలో స్విమ్మింగ్ పూల్ ఏర్పాటుకు రెండుకరాల స్థలం కేటాయించామని తెలిపారు. అదనపు కలెక్టర్ నగేశ్, డీఎస్పీ చంద్రశేఖర్రెడ్డి, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబాయి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న విద్యార్థుల నృత్యాలు సిరిసిల్ల అర్బన్: వేడుకల్లో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరింపజేశాయి. విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గీతే స్టాళ్లను పరిశీలించారు. 495మందికి కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. పదోతరగతి, ఇంటర్లో ఉత్తమ ప్రతిభ కనపర్చిన విద్యార్థులకు పోత్సాహక చెక్కులు అందజేశారు. -
పంద్రాగస్టుకు ముస్తాబు
సిరిసిల్ల: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు పోలీసు ఆఫీస్ (డీపీవో) ఆవరణలోని పరేడ్ గ్రౌండ్ ముస్తాబైంది. శుక్రవారం జరిగే వేడుకల ఏర్పాట్లను గురువారం సాయంత్రం సిరిసిల్ల ఆర్డీవో సీహెచ్. వెంకటేశ్వర్లు, తహసీల్దార్ సురభి మహేశ్కుమార్లు పర్యవేక్షించారు. వేడుకలకు ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొంటుండగా కలెక్టర్ సందీప్కుమార్ ఝా, ఎస్పీ మహేశ్ బి గితే, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు హాజరవుతారు. ఉదయం 9.30 గంటలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. 9.32 గంటలకు పోలీస్ గౌరవ వందనం, 9.40లకు ముఖ్యఅతిథి సందేశం, 9.55లకు సాంస్కృతిక కార్యక్రమాలు, 10.25 గంటలకు వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి ప్రశంసా పత్రాల ప్రధానం, 11.02 గంటలకు కార్యక్రమం ముగుస్తుంది. శిథిలాల తొలగింపునకు ముహూర్తం ఖరారువేములవాడ: వేములవాడ మేన్రోడ్డు 80 ఫిట్ల విస్తరణ చేసే క్రమంలో రోడ్డుకు ఇరువైపులా దాదాపు 254 నిర్మాణాలను అధికారులు కూల్చేశారు. జూన్ 15న ప్రారంభమైన ఈ ప్రక్రియ కోర్టు స్టేలతో కాస్త నిలిచినా చివరికి పూర్తిస్థాయిలో పూర్తయ్యాయి. కూల్చివేసిన శిథిలాలు అలాగే ఉండిపోయాయి. అధికారులు శిథిలాలల నుంచి వచ్చిన వ్యర్థాలను దూర ప్రాంతాలకు తరలించేందుకు రూ.22 లక్షలతో ఆన్లైన్ టెండర్లను పిలిచారు. 45.5 లెస్కు టెండర్ పైనల్ రూ. 22 లక్షలతో టెండర్లకు ఆహ్వానించిన మున్సిపల్ అఽధికారులకు ఆన్లైన్లో 12 మంది టెండర్లు దాఖలు చేశారు. ఈనెల 11తో గడువు ముగియడంతో గురువారం టెండర్ల ప్రక్రియను క్లియర్ చేసినట్లు మున్సిపల్ కమిషనర్ అన్వేష్ తెలిపారు. 45.5 శాతం లెస్కు హైదరాబాద్కు చెందిన విజయ ఎర్త్ మూవర్స్ సంస్థకు టెండర్ను అప్పగించామని అన్నారు. శుక్రవారం నుంచి స్క్రాప్ను తొలగించే పనులు ప్రారంభించి నెల రోజుల్లోగా పూర్తిగా క్లీన్ చేసి ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు. భవనాల శిథిలాలను ఎస్పీ కార్యాలయం ప్రాంతంలో డంప్ చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. కాగా పట్టణ శివారులోని కాలనీల్లో చాలా వరకు వర్షపు నీరు నిలుస్తూ కాలనీవాసులు నానాఅవస్థలు పడుతున్నారు. ఈక్రమంలో ఈవ్యర్థాలను శివారు కాలనీల్లోని రోడ్లలో వేయాలని స్థానికులు కోరుతున్నారు. సింగిల్విండోల పదవీకాలం పొడిగింపుసిరిసిల్ల అర్బన్: జిల్లాలోని 24 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాల పదవీ కాలం మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 14వ తేదీతో పాలకవర్గాల గడువు ముగియనున్న నేపథ్యంలో మరో ఆరునెలల గడువు పొడిగింపుతో సింగిల్విండోల అధ్యక్షులు హర్షం వ్యక్తం చేశారు. ఆగస్టు 15న జెండాను ఎగుర వేసే అవకాశం లభించిందని పేర్కొంటున్నారు. యూరియా కోసం ఆందోళనవీర్నపల్లి(సిరిసిల్ల): మండల కేంద్రం వీర్నపల్లిలో యూరియా కోసం రైతులు ఆందోళన చేశారు. సింధూర మండల సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ షాపును గురువారం ప్రారంభించిన జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, ఏఎంసీ చై ర్మన్ రాములుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి అ ఫ్జల్ బేగం మాట్లాడుతూ షాపులో 225 యూ రియా బస్తాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని మిగతా స్టాకు త్వరలో ఏర్పాటు చేస్తామని తెలపడంతో యూరియా సరఫరా చేయకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. నాలుగైదు రోజుల్లో యూరి యాను అందుబాటులోకి తీసుకొస్తామని అ ధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ముక్తర్ పాషా, మండల అభివృద్ది అధికారి బీరయ్య, నాయకులు పాల్గొన్నారు. -
అభివృద్ధి చెందిన దేశంగా చూడాలి
● సామాజిక సమస్యలు ఇంకా నిర్మూలన కాలేదు ● మానవ వనరులను మరింత మెరుగుపర్చాలి ● స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ టాక్ షోలో విద్యార్థుల మనోగతంసిరిసిల్లకల్చరల్: ఏడున్నర దశాబ్ధాల స్వాతంత్య్ర భారతదేశంలో ఇప్పటికీ మానిపోని రుగ్మతలు ఎన్నో.. బంధుప్రీతి, అవినీతి, అశ్రిత పక్షపాతం తదితర సామాజిక సమస్యలు ఇంకా నిర్మూలన కాలేదు.. అనేక రంగాల్లో పురోగతి సాధించినా జరగాల్సినంతగా జరగలేదన్నది సుస్పష్టం.. అభివృద్ధి చెందిన భారతదేశంగా చూడాలని యువతరం కలలు గంటోంది.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈతరం యువత దేశం పురోగతిపై ఎలా ఆలోచిస్తుందనే అంశంపై సిరిసిల్లలోని వికాస్ డిగ్రీ కళాశాలలో ‘సాక్షి’ నిర్వహించిన టాక్ షోలో పాల్గొన్న విద్యార్థులు తమ మనోభావాలను వెల్లడించారు.ఎన్నో ఏళ్లుగా అభివృద్ధి చెందుతున్న దేశంగానే కీర్తించబడుతోంది. అన్ని రంగాల్లో అవినీతిని నిర్మూలించి సమూలంగా ప్రక్షాళన చేయాలి. అభివృద్ధి చెందిన భారతదేశంగా అవతరిస్తే చూడాలని యువత ఆరాటపడుతోంది. అందుకు అనుగుణమైన పరిపాలన వ్యవస్థ రావాలి. – పోచవేని ఆర్తి, బీఎస్సీ ఫైనల్ దేశంలో నేర ప్రవృత్తి క్రమంగా పెరుగుతుండటం ప్రమాదకరం. కేసుల విచారణ త్వరితగతిన జరిగి నేరస్తులకు శిక్షలు పడే సమయం కుదించబడాలి. వేల సంఖ్యలో కేసులు కోర్టుల్లో పెండింగ్లో ఉంటున్నాయి. సత్వర విచారణ, కఠిన శిక్షలను అమలు చేయడం ద్వారా నేర ప్రవృత్తిని సమాజంలో నిర్మూలించాలి. – గజభీంకార్ రాంప్రసాద్, బీకాం దేశంలో అమలవుతున్న రిజర్వేషన్ల ప్రక్రియ స్వాతంత్య్రం వచ్చిన పదేశళ్ల వరకు మాత్రమే అనే నిబంధన ఉంది. వివిధ కారణాలతో ఇన్నేళ్లు కొనసాగిస్తున్నారు. మతం ఆధారంగా కాకుండా తెలివితేటల ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేసే ప్రయత్నాలు జరగాలి. – ఎండీ షానవాజ్, బీబీఏ దేశ రక్షణ విషయంలో రాజీ పడే పరిస్థితి ఉండొద్దు, దాయాది దేశాల కవ్వింపు చర్యల వల్ల అస్థిరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇండియా వైపు కన్నెత్తి చూడాలంటేనే వణికిపోయేలా అత్యాధునిక రక్షణ పరికరాలు మరిన్ని తయారు కావాలి. దేశ రక్షణ యంత్రాంగం ఎంత పటిష్టంగా ఉంటే అంతగా అభివృద్ధికి మార్గం సులువవుతుంది. – గొడుగు నీరజ, బీఎస్సీ డేటా సైన్స్ దేశంలో అవినీతి పేరుకుపోయింది. సంబంధిత శాఖ తనిఖీలు జరుపుతున్నా నేరస్తుల జాబితా పెరుగుతూనే ఉంది. పేదవర్గాలు పుష్కలంగా ఉన్న దేశంలో ఆరోగ్యం అందని ద్రాక్షగా ఉంటోంది. నేర చరిత గల నేతలను ఎన్నికల్లో పాల్గొనకుండా నిరోధించాలి. – సింగారం చందు, బీకాం ఫైనల్ దేశంలో టెక్నాలజీ పెరుగుతున్నప్పటికీ సామాన్యుల జీవితాల్లో పెద్దగా మార్పులేవీ లేవు. కనీసం నిత్యావసర సరుకుల ధరలు అందుబాటులో ఉండడం లేదు. మంచినీళ్లు కొనుక్కొని తాగే దుస్థితి కనిపిస్తోంది. నాణ్యమైన విద్య అందించడం ద్వారా మానవ వనరులను సమర్థంగా వినియోగించుకునే వ్యవస్థ రావాలి. – కొట్టె శివభవాని, బీఎస్సీ ఫైనల్ నియంత్రిత సాంకేతికత అందుబాటులోకి రావాలి. మరిన్ని కొత్త ఆవిష్కరణలు జరగాలి. సాధారణ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు చోటు చేసుకునేలా సాంకేతిక విజ్ఞానం అదుపులో ఉండాలి. సామాజిక మాధ్యమాల వినియోగంపై నియంత్రణ ఉండాలి. – గంగు మహేశ్, బీకాం పేద వర్గాలకు విద్య, వైద్యం ఉచితంగా అందేలా చూడాలి. ఉచిత పథకాలు అట్టడుగు వర్గాల వారికే పరిమితం చేయాలి. యువతకు నాణ్యమైన ఉచిత విద్య అందించడం ద్వారా స్వయం సమృద్ధి సాధించే దిశగా ప్రణాళికలు రచించాలి. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉచిత రవాణ సౌకర్యం కల్పించాలి. – వేముల నిరోషా, బీఎస్సీ డేటా సైన్స్ -
పొలిటికల్ బ్రాండ్.. మెట్పల్లి ఖాదీ ప్రతిష్టాన్
కోరుట్ల/మెట్పల్లి: ఇక్కడి నేతలకు ఖాదీ బట్టలే స్ఫూర్తి. చాలా మందికి ఖాదీ రాజకీయంగా ఊపిరి పోసిందంటే అతిశయోక్తి కాదు. స్వాతంత్య్ర పోరా టకాలంలో ఖాదీ ఉద్యమానికి వేదికగా నిలిచింది జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి. గాంధీ శిశ్యుడు అన్నాసాహెబ్ ఆధ్వర్యంలో మెట్పల్లిలో వెలిసిన ఖాదీ ప్రతిష్టాన్ ఖద్దరు ఆ కాలంలో ఖ్యాతి పొందింది. అప్పటి ఆనవాయితీని పుణికిపుచ్చుకుని మెట్పల్లి ప్రాంత రాజకీయ నాయకులు ఖాదీ వస్త్రాలు ధరించడం ఇప్పటికీ దూరం కాలేదు. కడక్ ఖాదీ బట్టలతో ఎవరైనా కనిపిస్తే చాలు ఈయన మెట్పల్లి లీడరని చెప్పొచ్చు. 1983లో ఎన్టీఆర్ ప్రభుత్వ హయంలో కార్మికశాఖ మంత్రిగా పనిచేసిన వర్ధినేని వెంకటేశ్వర్రావు, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్రావు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా జెడ్పీ మాజీ చైర్మన్ కేవీ.రాజేశ్వర్రావు, జనతా పార్టీ నుంచి ఏకై క ఎమ్మెల్యేగా ఎన్నికై న కొమొరెడ్డి రామ్లు, జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ ఖాదీ ప్రతిష్టాన్ వస్త్రాలు ధరించి రాజకీయాల్లో కీలకంగా ఎదిగినవారే. 2009 అసెంబ్లీ పునర్విభజనలో కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంగా మారినప్పటికీ.. మెట్పల్లి ఖాదీ కార్ఖానా స్ఫూర్తిగా రాజకీయాల్లోకి వచ్చిన నేతలు కల్వకుంట్ల విద్యాసాగర్రావు, సంజయ్ ఇక్కడి ఎమ్మెల్యేలుగా కొనసాగడం గమనార్హం. -
నేడు సిరిసిల్లలో కృష్ణాష్టమి వేడుకలు
సిరిసిల్లటౌన్: శ్రీకృష్ణాష్టమి సందర్భంగా జిల్లా కేంద్రం సిరిసిల్లలో శుక్రవారం కన్నులపండువగా వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ ఇన్చార్జి ప్రాణనాథ అచ్యుతదాస్ అన్నారు. గురువారం సిరిసిల్ల ప్రెస్క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కళ్యాణలక్ష్మి గార్డెన్లో నిర్వహించే వేడుకల్లో గురుపూజ, హరేకృష్ణ మంత్ర జపాలు, రాధాకృష్ణులకు ఉయ్యాల సేవ, మహా నైవేద్యాలు, హారతి, కుంభహారతి, మహాభిషేకం, పుష్పాభిషేకం, సాంస్కృతిక కార్యక్రమాలు, సంకీర్తనలు జరుగుతాయన్నారు. ఇస్కాన్ ప్రతినిధులు నరుత్తమదాస్, హరిహరదాసు, మధుసూధన్దాస్, రసానంద ప్రియదాస్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ గద్దె దిగాలి
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్సిరిసిల్లటౌన్: దొంగ ఓట్లతో అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ గద్దె దిగాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నా రు. గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్ల లోని పాత బస్టాండ్ నుంచి అంబేడ్కర్ చౌరస్తా మీదుగా గాంధీ చౌక్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున కా ర్గే, సోనియా గాంధీ ఆధ్వర్యంలో బీజేపీ ప్రజల ఓట్లను కొల్లగొడుతూ గెలుస్తున్న స్థితిగతులను కండ్లకు గట్టినట్లు వీడియో రూపంలో చూపించారని అన్నారు. బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్, టీపీసీసీ పిలుపుమేరకు ఓటు చోర్ గద్దె చోడ్ నినాదంతో క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, ఏఎంసీ చైర్మన్ స్వరూపరెడ్డి, టీపీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
భగీరథ.. ఇదేం వ్యథ
సిరిసిల్ల పెద్దూరు డబుల్బెడ్రూం ఇళ్లలో ఐదు రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు. 43 బ్లాకుల్లో నివసిస్తున్న 516 కుటుంబాలకు సరిపడా నీళ్లు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదంటున్నారు. నీటి కోసం మున్సిపల్ కమిషనర్కు ఫోన్ చేయడంతో ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారు. వచ్చిన ట్యాంకర్ల నీటి సామర్థ్యం సరిపోవడం లేదు. దీంతో నీటి కోసం ఎగబడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి నీటి సమస్య తీర్చాలని కోరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, రాజన్న సిరిసిల్ల జిల్లా -
సూక్ష్మకళ.. భళా
ఓదెల(పెద్దపల్లి): మడక గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆడెపు రజనీకాంత్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పెన్సిల్ మొనపై 4 మి.మీ. పొడవు, 2 మి.మీ. వెడల్పుతో అతిచిన్న జాతీయ జెండా రూపొందించారు. ఇందుకోసం సుమారు గంట సమయం తీసుకున్నారు. చాక్పీస్పై 7 మి.మీ. పొడవు, 5 మి.మీ. వెడల్పుతో గంట పది నిమిషాలపాటు శ్రమించి చెక్కారు. చాక్పీస్పై హ్యాపీ ఇండిపెండెన్స్డే ఆంగ్ల అక్షరాలు చెక్కి శుభాకాంక్షలు చెక్కారు. వీటిని వివిధ బుక్ ఆఫ్ రికార్డులకు ప్రతిపాదించినట్లు రజనీకాంత్ తెలిపారు. -
సమన్వయంతో పనిచేయాలి
● భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి ● నర్మాల ఎగువమానేరును పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ గంభీరావుపేట(సిరిసిల్ల): భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. నీటి పారుదల, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. గంభీరావుపేట మండలం నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టును గురువారం ఎస్పీ మహేష్ బి గీతేతో కలిసి సందర్శించారు. ప్రాజెక్టులో నీటి నిల్వ, ఇన్ఫ్లో గురించి ఇరిగేషన్ అధికారుల నుంచి ఆరా తీశారు. పూర్తిస్థాయి నీటి మట్టం 2టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 1.3టీఎంసీల నీటి నిల్వ ఉందని అధికారులు వివరించారు. ప్రస్తుతం ఎగువ నుంచి 400 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోందని తెలిపారు. ఇన్ఫ్లో ఇలాగే కొనసాగితే పది రోజుల్లో ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండుతుందని ఇరిగేషన్ అధికారులు అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డ్యాం గేట్లను పరిశీలించి వాటి నిర్వహణను పర్యవేక్షించారు. డ్యాం పూర్తిస్థాయిలో నిండితే ఎక్కువైతే నీటిని సాగునీటి కాలువల ద్వారా విడుదల చేయాలని కలెక్టర్ ఇరిగేషన్ అధికారులకు సూచించారు. వీరి వెంట ఇరిగేషన్ జిల్లా అధికారి కిశోర్ కుమార్, ఈఈ ప్రశాంత్కుమార్, డీఈ నర్సింగ్, పోలీస్ అధికారులు ఉన్నారు. ఆక్రమించిన భూములు స్వచ్ఛందంగా అప్పగించాలి సిరిసిల్ల: జిల్లాలో ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా అప్పగించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కోరారు. కలెక్టరేట్లో గురువారం ప్రభుత్వ భూమిని ఆక్రమించిన బీఆర్ఎస్ నాయకులు ఒజ్జెల అగ్గి రాములు 4.02 ఎకరాల భూమిని కలెక్టర్, ఎస్పీ మహేశ్ బి గితే సమక్షంలో ప్రభుత్వానికి సరేండర్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్దాపూర్కి చెందిన అగ్గి రాములు సర్వే నం.61/47లోని ప్రభుత్వ భూమి కబ్జా చేసుకుని సాగు చేస్తున్న 4 ఎకరాల 2 గుంటలను తిరిగి అప్పగించాడని తెలిపారు. ఇంకా ఎవరైన ఉంటే స్వచ్ఛందంగా అప్పగించాలని, లేకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. బీడీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు జిల్లాలోని బీడీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు అందేవిదంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. కలెక్టరేట్లో గురువారం నేషనల్ స్కాలర్ షిప్ స్కీమ్లో బీడీ కార్మికుల పిల్లలకు అందించే ఉపకార వేతనాలపై అధికారులతో సమీక్షించారు. కేంద్ర కార్మిక శాఖ ద్వారా బీడీ కార్మికులు, లైమ్ స్టోన్ డోలో మైట్ ఖనిజాల కార్మికులు, మైకా మైనింగ్ కార్మికులు, ఐరన్ ఓర్ , క్రోమ్ ఓర్ మైనింగ్ కార్మికులు, సినీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు చెల్లించడం జరుగుతుందని తెలిపారు. ఆరు నెలల పాటు బీడీ కార్మికులుగా పని చేసి వార్షిక ఆదాయం రూ.1.20లక్షల లోపు ఉన్న వారంతా ఈ పథకానికి అర్హులని అన్నారు. ఆగస్ట్ 31లోగా పదో తరగతి లోపు చదివే పిల్లలు, అక్టోబరు 31వ తేదీలోగా ఇంటర్కు పైగా చదివే వారు దరఖాస్తులు సమర్పించాలని కోరారు. ఈ సమావేశంలో కేంద్ర ఉప సంక్షేమ కమిషనర్ సాగర్ ప్రధాన్, సీనియర్ మెడికల్ ఆఫీసర్లు మహేందేర్, మధూకర్, వెంకటేశ్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ నజీర్ అహ్మద్, జిల్లా పంచాయతీ అధికారి షరీఫొద్దీన్, అదనపు డీఆర్డీవో శ్రీనివాస్, వివిధ మండలాల ఎంపీడీవోలు, తదితరులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో అధికారులు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ సందీప్కుమార్ ఝా, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబాయి గురువారం వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. భారీ వర్షాలు, వరదలపై రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీఎస్ రామకృష్ణారావులు వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. జిల్లాలో పరిస్థితిని కలెక్టర్కు వివరించారు. -
గుండుసూదిపై జాతీయ జెండాతో పరుగెడుతున్న యువతి
జగిత్యాలటౌన్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ గుండుసూది మొనపై జాతీయ జెండాతో పరుగెడుతున్న యువతి చిత్రాన్ని రూపొందించి ఔరా అనిపించాడు. పండుగలు, పబ్బాలు, జాతీయ పండుగలు వంటి ప్రత్యేక సందర్భంలో ఏదో సూక్ష్మరూప చిత్రం ద్వారా సమాజానికి సందేశం పంపించే దయాకర్.. ఈ స్వాతంత్య్ర వేడుకకు జాతీయ జెండాతో పరుగులు పెడుతున్న యువతి సూక్ష్మకళాకండాన్ని రూపొందించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ముందు వరుసలో నిలుస్తున్నారన్న సందేశాన్ని సమాజానికి అందించడమే ఈ చిత్ర ఉద్దేశమని దయాకర్ తెలిపారు. ఈ సూక్ష్మ కళారూపాన్ని తయారు చేసేందుకు మైనం పెన్సిల్ కలర్స్ ఉపయోగించానని, పది గంటల సమయం పట్టినట్టు తెలిపారు. చిత్ర రూపకర్త గుర్రం దయాకర్ గుండు సూది మొనపై జాతీయ జెండాతో యువతి సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ అద్భుత సృష్టి -
ఏడాది అనంతరం మిడ్మానేరుకు ఎల్లంపల్లి నీరు
బోయినపల్లి(చొప్పదండి): ఏడాది అనంతరం శ్రీపాద ఎల్లంపల్లి నీరు ఎత్తిపోతల ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ మిడ్మానేరు ప్రాజెక్టులోకి తరలుతోంది. నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ ఇన్ఫ్లో వస్తున్న నేపథ్యంలో ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరుకు గోదావరి జలాలు తరలిస్తున్నారు. గురువారం ప్రాజెక్టులో 8.084 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. గతేడాది జూలైలో 14టీఎంసీల ఎత్తిపోతలు గతేడాది వర్షాకాలం ఆరంభంలో సరైన వర్షాలు కురువక మిడ్మానేరులో నీటి నిల్వలు అడుగంటాయి. 2024 జూలై 28నుంచి ఎల్లంపల్లి నుంచి ప్రాజెక్టు నుంచి వయా నందిమేడారం, లక్ష్మీపూర్ల నుంచి ఎత్తిపోతల ద్వారా వరద కాలువకు నీరు ఎత్తి పోశారు. సుమారు 14 టీఎంసీల మేర నీటిని వరదకాలువ మీదుగా మిడ్మానేరు ప్రాజెక్టుకు తరలించారు. ఫలించిన రైతన్నల ఆశలు ఆశించిన మేర వర్షాలు కరవకపోవడంతో ఎల్లంపల్లి నీరు విడుదల చేయాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మంత్రి ఉత్తమమ్కుమార్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఎల్లంపల్లి జలాలు వరదకాలువ మీదుగా మిడ్మానేరు ప్రాజెక్టులోకి చేరుతుండడంతో ఈప్రాంత రైతులు హర్శం వ్యక్తం చేస్తున్నారు. -
ఆరోగ్య తెలంగాణే లక్ష్యం
వేములవాడ: ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. గురువారం వేములవాడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అర్హులైన 40 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు రూ.12.96లక్షల విలువ గల చెక్కులు అందజేశారు. వైద్య రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా మారిందని అన్నారు. పేదలకు వైద్య పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గత ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా పదేళ్లలో రూ. 400 కోట్లు పంపిణీ చేస్తే ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు రూ.800 కోట్ల మేర లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ -
రూ.1,947కే ఆరోగ్య పరీక్షలు
కరీంనగర్టౌన్: స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నగరంలోని మెడికవర్ ఆస్పత్రి యాజమాన్యం ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీ ప్రవేశ పెట్టిందని ఆస్పత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ తెలిపారు. స్థానిక ఆస్పత్రిలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వందేమాతరం హెల్త్ చెకప్ ప్యాకేజీ పేరిట అందుబాటులోకి తీసుకొచ్చిన పూర్తిస్థాయి ఆరోగ్య పరీక్షలను రూ.1,947 చెల్లించి పొందవచ్చన్నారు. కార్డియాలజీ, జనరల్ ఫిజీషియన్, డైటీషియన్ కన్సల్టేషన్తోపాటు కంప్లీట్ బ్లడ్ పిక్చర్ (సీబీపీ), కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్(సీయూఈ), పాస్టింగ్ బ్లడ్ షుగర్, లిపిడ్ ప్రొఫైల్, లివర్ ఫంక్షన్ టెస్ట్(ఎల్ఎఫ్టీ), ఎక్స్రే చెస్ట్ (విత్అవుట్ ఫిలిం), ఈసీజీ, 2డీ ఎకో, హెపటైటిస్బీఏ1సి, సీరం యూరియా, అల్ట్రాసౌండ్ స్కానింగ్ (అబ్డొమెన్– పెల్విస్), సీరం క్రియాటినిన్ పరీక్షలు ఈ ప్యాకేజీ ద్వారా నిర్వహిస్తామని వివరించారు. ఈ ప్యాకేజీ సెప్టెంబర్ 15వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. విషజ్వరంతో ఒకరి మృతిసారంగాపూర్: మండల కేంద్రానికి చెందిన మోతుకు గంగమల్లు (55) విషజ్వరంతో బాధపడుతూ గురువారం మృతిచెందాడు. గంగమల్లు రెండురోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. బంధువులు జిల్లాకేంద్రంలోని ఓప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న క్రమంలో గుండెపోటు రావడంతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
సేవలకు దక్కిన గౌరవం
జగిత్యాలక్రైం/మల్యాల: విధి నిర్వహణలో వారు ఎప్పుడూ ముందున్నారు. తమ సర్వీసులో ఏనాడూ మచ్చ కూడా ఎరగరు. వారి సేవలను గుర్తించిన కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అనేక పతకాలు అందించింది. తాజాగా ప్రతిషాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్కు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. జగిత్యాల స్పెషల్ బ్రాంచ్ ఏఎస్సై రాజేశుని శ్రీనివాస్, మల్యాల పోలీస్స్టేషన్ ఏఎస్సై రుద్ర కృష్ణకుమార్కు మెడల్ ప్రకటించింది. రాజేశుని శ్రీనివాస్ 1989లో కానిస్టేబుల్గా పోలీసుశాఖలో చేరారు. 2012లో హెడ్ కానిస్టేబుల్గా, 2019లో ఏఎస్సైగా పదోన్నతి పొందారు. 2012లో రాష్ట్ర పోలీసు సేవా పథకం, 2019లో ఉత్తమ సేవా పథకం అందుకున్నారు. 36ఏళ్లుగా పోలీస్ పోలీసు శాఖకు చేస్తున్న సేవలను గుర్తించి కేంద్రప్రభుత్వం ఇండియన్ పోలీస్ మెడల్కు ఎంపిక చేసింది. అలాగే రుద్ర కృష్ణ కుమార్ 1989లో కానిస్టేబుల్గా పోలీసుశాఖలో చేరారు. 2017లో హెడ్కానిస్టేబుల్గా.. 2021లో ఏఎస్సైగా పదోన్నతి పొందారు. 2022లో రాష్ట్ర పోలీసు సేవా పథకానికి ఎంపికయ్యారు. 36 ఏళ్లుగా చేస్తున్న సేవలను గుర్తించి ఇండియన్ పోలీస్ మెడల్కు ఎంపిక చేశారు. ఇద్దరిని జగిత్యాల ఎస్పీ అశోక్కుమార్ అభినందించారు. కష్టపడి పనిచేసే పోలీస్ అధికారులకు గుర్తింపు వస్తుందని తెలిపారు. గురువారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాజేశుని శ్రీనివాస్ రుద్ర కృష్ణకుమార్ ఇండియన్ పోలీస్ మెడల్కు ఇద్దరు ఏఎస్సైలు -
లీడింగ్ ఫైర్ ఆఫీసర్ వహిదుల్లాఖాన్కు రాష్ట్రపతి పతకం
మెట్పల్లి: జగిత్యాల జిల్లా మెట్పల్లి ఫైర్ స్టేషన్లో లీడింగ్ ఫైర్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్న వహిదుల్లాఖాన్ అత్యున్నత పురస్కారమైన రాష్ట్రపతి పతకానికి ఎంపికయ్యారు. 1986లో ఫైర్మెన్గా అగ్ని మాపక శాఖలో చేరిన ఆయన.. ఆసిఫాబాద్, ఇచ్చోడ, ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్లో పని చేసి.. రెండేళ్ల క్రితం మెట్పల్లికి బదిలీపై వచ్చారు. 2015లో లీడింగ్ ఫైర్మెన్గా పదోన్నతి పొందారు. మొదటి నుంచి అంకితభావంతో పనిచేసే ఆయన విపత్తుల సమయాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తారనే పేరు సంపాదించారు. అత ని సేవలకు గుర్తింపుగా ఇప్పటివరకు ఆరు ప్రశంసపత్రాలు, ఒక సేవాపతకం ప్రదానం చేశారు. ప్రస్తుతం రాష్ట్రపతి పతకానికి ఎంపిక కావడంపై ఆయనను ఉన్నతాధికారులు అభినందించారు. లీడింగ్ ఫైర్మెన్ గోపాల్రెడ్డికి.. జమ్మికుంట: జమ్మికుంట పట్టణ అగ్నిమాపక కేంద్రంలో లీడింగ్ ఫైర్మెన్గా విధులు నిర్వహిస్తున్న బీరెడ్డి గోపాల్రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. ఫైర్మెన్గా విధుల్లో అత్యంత ఉత్తమ సేవలు అందించినందుకు రాష్ట్రపతి అవార్డుకు ఎంపికయ్యారు. ఫైర్ ఆఫీసర్గా విధుల్లో క్రమ శిక్షణ, నిబద్ధతతో పని చేసినందుకు అవార్డుకు ఎంపికై నట్లు గోపాల్రెడ్డి తెలిపారు. -
పోరాటాల ‘గాలిపల్లి’
ఇల్లంతకుంట: పోరాటాల గ్రామంగా చరిత్రలో నిలిచిపోయింది రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపల్లి. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా.. నిజాంపాలిత ప్రాంతం హైదరాబాద్ రాష్ట్రానికి ఇంకా విముక్తి లభించలేదు. బద్ధం ఎల్లారెడ్డి ప్రాంతమైన గాలిపల్లి ప్రజలు నైజాం పాలనపై తిరగబడ్డారు. 1948 సెప్టెంబర్ మొదటి వారంలో రజాకార్లు గాలిపల్లికి వచ్చారు. తిరుగుబాటుదారులు వారిసైన్యంపై రాళ్లు విసిరారు. రజాకార్ల కాల్పుల్లో తిరుగుబాటుదారుల్లో ముందువరుసలో ఉన్న 11మంది చనిపోయారు. వీరిలో గాలిపల్లికి చెందిన వారు ఏడుగురు, బేగంపేట, సోమారంపేట, తాళ్లపల్లి, నర్సక్కపేట గ్రామాలకు చెందినవారు నలుగురు ఉన్నారు. రజాకార్ల పాలన నుంచి విముక్తి కలిగిన తరువాత గాలిపల్లిలో దాదాపు 20మందికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఫ్రీడంఫైటర్ పింఛన్లు మంజూరు చేశాయి. -
మొదటి జెండా ఎగిరింది ధర్మపురిలోనే..
ధర్మపురి: నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి, స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తింపు పొందిన జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన కేవీ.కేశవులు, మాణిక్యశాస్త్రి ప్రాణస్నేహితులు. కేశవులు ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగల్రావు హయాంలో చేనేత జౌళిశాఖ మంత్రిగా కొనసాగారు. 1947లో ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజు ధర్మపురిలోని గోదావరి ఒడ్డునున్న కర్నెఅక్కెపెల్లి భవనంపై తన మిత్రుడైన మాణిక్యశాస్త్రితో కలిసి మొట్టమొదటి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెండా ఎగురవేయడం నిషేధమని అప్పటి నిజాం ప్రభుత్వం కేశవులను బంధించడానికి ప్రయత్నించగా.. నిండుగా ప్రవహిస్తున్న గోదావరిలోంచి వెళ్లి తప్పించుకున్నారు. ఏడాదిపాటు ముంబయిలో తలదాచుకున్నారు. 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినం రోజు తిరిగి ధర్మపురికి చేరుకున్నారు. 2019 జనవరి 30న అనారోగ్యంతో మృతి చెందారు. -
యూరియా కొరత అబద్ధం
సిరిసిల్లటౌన్: జిల్లాలో లేని యూరియా కొరతను కొంతమంది అదేపనిగా అసత్య ప్రచారం చేస్తున్నారని సిరిసిల్ల కాంగ్రెస్ ఇన్చార్జి కేకే.మహేందర్రెడ్డి అన్నారు. గురువారం సిరిసిల్ల ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రా ష్ట్రానికి సరిపడా యూరియా నిల్వలున్నాయని రైతు లు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జిల్లాకు ఈనెలాఖరు వరకు 22వేల మెట్రిక్ టన్నులు అవసరం ఉండగా.. ఇప్పటికే 13,500 మెట్రిక్ టన్నుల యూరియాను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చై ర్మన్ సత్యనారాయణగౌడ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షు డు చొప్పదండి ప్రకాశ్, నాయకులు పాల్గొన్నారు. -
ఆదర్శ మండల సమాఖ్యకు అవార్డు ప్రదానం
ఇల్లంతకుంట: ఇల్లంతకుంట ఆదర్శ మండల సమాఖ్య అధ్యక్షురాలు కట్ట సౌమ్య, మాజీ అధ్యక్షురాలు బొడిగ వనజలు గురువారం రాత్రి ఢిల్లీలోని కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రులతో అవార్డు స్వీకరించారు. ఢిల్లీలోని భారతరత్న సుబ్రహ్మణ్యం ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహన్, చంద్రశేఖర్, కమలేష్ పాస్వాన్, ఆధ్వర్యంలో అవార్డు అందజేశారు. ఆదర్శ మండల సమాఖ్య కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ నిర్భర్ సంగతన్ అవార్డుకు జాతీయస్థాయిలో ఎంపికై ంది. అవార్డు స్వీకరించేందుకు మండలి సమాఖ్య అధ్యక్షులు రెండు రోజుల క్రితం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. వారితో పాటు డీఆర్డీవో శేషాద్రి కూడా వెళ్లారు. రుణాలు అందించడంలో, సకాలంలో రుణాలు రికవరీ చేయడంలో మీటింగులు సక్రమంగా నిర్వహించడంలో ఆదర్శ మండలి సమాఖ్య ఆదర్శంగా నిలిచింది. అవార్డు స్వీకరించడం పట్ల మండలి సమాఖ్య సభ్యులు ఇల్లంతకుంట మండల ప్రజలు ఆనందం వ్యక్తపర్చారు. -
ఆస్తి కోసం తల్లిని చంపిన కొడుకు
రాయికల్: సోదరికి ఆస్తి ఇస్తుందన్న కారణంతో తల్లిని హత్య చేశాడో కొడుకు. ఈ సంఘటన రాయికల్ మండలం కుమ్మరిపల్లిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బొల్లె గంగరాజు(65)కు ఇద్దరు కుమారులు, కూతు రు సంతానం. అందరికీ పెళ్లిళ్లయ్యాయి. భాగ్యను రామాజీపేటకు చెందిన ఓ వ్యక్తికిచ్చి పెళ్లి చేశారు. మొదటి కుమారుడు లక్ష్మణ్, రెండో కుమారుడు గంగారెడ్డి అదే గ్రామంలో వేర్వేరు కాపురాలు పెట్టారు. గంగరాజు భర్త ఎర్ర య్య ఐదేళ్ల క్రితం మృతిచెందాడు. దీంతో గంగరాజు తన పేరిట ఉన్న ఎకరం భూమితోపాటు రైతుభరోసా, పింఛన్ సొమ్మును కూతురు భాగ్యకు ఇస్తోంది. ఈ విషయమై గంగారెడ్డి తల్లిని పలుమార్లు మందలించాడు. అయినా ఆమె వినకపోవడంతో కక్ష పెంచుకున్నాడు. అప్పటినుంచి తల్లిని వేధింపులకు పాల్పడుతున్నాడు. బుధవారం కూడా ఆమెను తీవ్రంగా కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయింది. స్థానికులు ఆమెను జగిత్యాల ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గంమధ్యలో మృతిచెందింది. -
పిచికారీతో ప్రాణాలమీదకు..
● మోతాదు మించి రసాయన ఎరువుల వాడకం ● తప్పనిసరైతేనే పిచికారీ చేయాలంటున్న శాస్త్రవేత్తలు ● జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు జగిత్యాలఅగ్రికల్చర్: ఓ వైపు వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు అధిక దిగుబడినిచ్చే విత్తనాలను రూపొందిస్తుండగా, మరో వైపు ఆ పంటలపై ఆశించే చీడపీడల నుంచి పంటను కాపాడేందుకు రైతులు క్రిమిసంహారక మందులు వాడడం పరిపాటిగా మారింది. ఆయా పంటలకు జరిగే నష్టంలో దాదాపు 20–25 శాతం చీడపీడల వల్లే కలుగుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం వరిలో కాండంతొలుచు పురుగు నివారణకు రైతులు ఒక్కటికి రెండుసార్లు పురుగుమందులు పిచికారీ చేస్తున్నారు. కాగా, ఇటీవల ఖమ్మం జిల్లాలో పత్తి పంటపై పురుగుమందులు పిచికారీ చేయడంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఇద్దరు రైతులు మృత్యువాతపడ్డారు. ఇలాంటి ఘటనలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సైతం జరిగి కొందరు మృత్యువాత పడుతుండగా, మరికొందరు ఆస్పత్రుల పాలవుతున్నారు. ● అవసరమైతేనే.. పురుగుమందుల వాడకంపై రైతులకు పెద్దగా అవగాహన ఉండడం లేదు. గ్రామాల్లోని ఫెర్టిలైజర్ డీలర్లు, పురుగుమందుల వ్యాపారులు చెప్పే మందులనే పిచికారీ చేస్తున్నారు. ఒక్కో కంపెనీ తయారు చేసే మందు ప్రభావం ఒక్కో రకంగా ఉండి పిచికారీ చేసే వ్యక్తిపై తీవ్ర ప్రభావం చూపుతుంటుంది. ఏ పురుగుకు, యే మోతాదులో, ఏ మందు వాడాలో రైతులకు తెలియని పరిస్థితి. కొన్ని రసాయన మందులు ఘాటైన వాసన కలిగి ఉంటే, మరికొన్ని తేలికగా ఉంటాయి. రైతులు ఇవేమి పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు మందులను పిచికారీ చేస్తూ ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. ● పెడచెవిన పెడుతూ.. చాలా మంది రసాయన మందులు పిచికారీ చేసేటప్పుడు బీడీలు, సిగరెట్లు తాగడం, గుట్కా నమలడం, తంబాకు నోట్లో వేసుకోవడం చేస్తుంటారు. అలాగే, మధ్యాహ్న సమయంలో భోజనం చేసే ముందు చేతులను సబ్బుతో కాకుండా కేవలం నీళ్లతో మీదమీద కడిగి భోజనం చేస్తుంటారు. దీంతో మందు ప్రభావం తమకు తెలియకుండానే వివిధ రూపాల్లో మనిషి శరీరంలోకి ప్రవేశిస్తుంది. మనిషి నాడీ వ్యవస్థ, శ్వాస వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అలాగే గాలి ఏ వైపు నుంచి వీస్తుందో గమనించక ఇష్టమొచ్చినట్లు పిచికారీ చేస్తుంటారు. దీంతో రసాయన మందు గాలిలో కలిసి శ్వాస తీసుకుంటున్నప్పుడు ముక్కు ద్వారా శరీరంలోకి వెళ్లి, వాంతులు కావడం, తలతిప్పడం, శరీరమంతా చెమటలు పట్టడం, సరైన శ్వాస అందకపోవడం వంటివి జరుగుతుంటాయి. ● జాగ్రత్తలు పాటించాలి రైతులు, రైతు కూలీలు పిచికారీ సమయంలో తప్పనిసరిగా చేతులకు గ్లౌజ్లు వేసుకోవాలి. స్ప్రేయర్లకు లీకేజీలు లేకుండా చూసుకోవాలి. మందు నీళ్లు శరీరంపై పడకుండా లూజూ దుస్తులు ధరించాలి. కళ్లకు అద్దాలు ధరించడం మంచిది. పిచికారీ పూర్తయిన తర్వాత తలభాగం నుంచి సబ్బుతో స్నానం చేయాలి. పిచికారీ చేసే వ్యక్తికి ఏవైనా గాయాలుంటే, అవి కనబడకుండా ప్లాస్టర్ వేసుకోవాలి. పిచికారీ సమయంలో ఏమైనా అనారోగ్యానికి గురైతే వెంటనే సమీపంలోని వైద్యుడి వద్దకు తీసుకెళ్లాలి. మందు ప్రభావం ఎంత గాఢతదో తెలుసుకునేందుకు డబ్బాను వైద్యుడికి చూపించాలి. ● ఎప్పుడు వాడాలంటే.. పురుగుమందులు ఏ సమయంలో వాడాలో చాలా మంది రైతులకు తెలియడం లేదు. ముందుగా సాగు చేసిన పంటను రెండుమూడు రోజులకోసారి పరిశీలించి, ఏ పురుగు వల్ల ఎలాంటి నష్టం జరుగుతుందనే దానిపై అవగాహనకు వచ్చిన తర్వాత మందులు వాడాలి. అవసరమైతే వ్యవసాయాధికారి లేదా వ్యవసాయ శాస్త్రవేత్తలు పంటను పరిశీలించిన తర్వాత వారి సిఫారసు మేరకు మందులు పిచికారీ చేయడం మంచిది. సిఫారసు మేరకు వాడాలి పురుగుమందులు ఎందుకు వాడుతున్నారో చాలా మంది రైతులకు తెలియడం లేదు. దీంతో ఖర్చు పెరుగుతుందే కానీ పంటల్లో పురుగులు చావడం లేదు. పంటలో ఏదైనా సమస్య వస్తే శాస్త్రవేత్తలు లేదా వ్యవసాయాధికారుల సూచనల మేరకు నాణ్యమైన సంస్థల పురుగుమందులు పిచికారీ చేయాలి. – డాక్టర్ హరీశ్కుమార్శర్మ, పరిశోధన స్థానం డైరెక్టర్, పొలాస జాగ్రత్తలు తీసుకోవడం లేదు పురుగు మందులు పిచి కారీ చేసేటప్పుడు రైతులు కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. మందు గాలిలో కలిసి రైతు శ్వాస తీసుకున్నప్పుడు శరీరంలోకి ప్రవేశిస్తుంది. పిచికారీ చేసేటప్పుడు కనీసం మాస్క్ అయినా వాడాలి. ఏదైనా ఇబ్బంది అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. – డాక్టర్ మల్లారెడ్డి, ఎండీ, ఫిజిషియన్, జగిత్యాల -
ఉపాధికి భరోసా ‘టీగేట్’
● ఏటీసీలు, పరిశ్రమలకు వారధిగా.. ● జగిత్యాలలో అందుబాటులోకి జగిత్యాలటౌన్: పారిశ్రామిక శిక్షణ సంస్థల్లో (ఐటీఐ) చదువురు పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశం కల్పించేందుకు.. వారిలో నైపుణ్య శిక్షణ (స్కిల్ ట్రైనింగ్) అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టాటా టెక్నాలజీస్ సంయుక్త భాగస్వామ్యంతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఐటీఐలు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల (ఏటీసీ)లకు స్థానిక పరిశ్రమలతో ఒప్పందం (ఎంఓయూ) కుదిర్చి.. తెలంగాణ గేట్ ఫర్ ఆడాప్టింగ్ అండ్ ట్రైనింగ్ ఎంప్లాయ్మెంట్ (టీగేట్) జిల్లా కమిటీలను నియమించింది. కమిటీ వైస్ చైర్మన్గా జిల్లా పరిశ్రమల శాఖ అధికారి, కన్వీనర్గా ఐటీఐ ప్రిన్సిపాల్, సభ్యులుగా జిల్లా ఉపాధి కల్పన అధికారి, ఒక ఎన్జీవో ఉంటారు. సీఎస్ఆర్ ఫండ్స్తో కళాశాలల్లో అదనపు తరగతి గదులు, ప్రయోగ పరికరాలు తదితర వసతులు కల్పిస్తారు. టీగేట్ ద్వారా స్థానిక పరిశ్రమల్లో అప్రెంటిషిప్ పూర్తి చేసేలా ఒప్పందం కుదుర్చుకుంటారు. శిక్షణలో మెలుకువలు నేర్పించి మంచి పనితీరు కనబరిచిన వారికి ఉద్యోగం పొందడంలో ముఖ్య భూమిక పోషించనుంది. పారిశ్రామిక ప్రగతి దిశగా.. పారిశ్రామిక ప్రగతి పెంపు.. యువతకు వంద శాతం ఉపాధి, ఉద్యోగ అవకాశాల పెంపు లక్ష్యంగా ఇండస్ట్రీస్ 4.0 ప్రాజెక్టు కింద టాటా టెక్నాలజీస్ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఏటీసీలను ఏర్పాటు చేసి మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధి లభించే కోర్సులను ప్రారంభించింది. భోదన, శిక్షణకు అవసరమైన భవనాల నిర్మాణం, యంత్ర పరికరాలు, ఇన్స్ట్రక్టర్ల నియామకం, ఆధునిక శిక్షణ, సామగ్రికి టాటా టెక్నాలజీస్ నిధులు సమకూర్చింది. రూ.5కోట్లతో జగిత్యాలరూరల్ మండలం నర్సింగాపూర్ శివారులో ఏటీసీ భవనం నిర్మించారు. రెండేళ్ల వ్యవధితో కొత్త కోర్సులు ప్రారంభించారు. ఉపాధి అవకాశాలు ఐటీఐలు, ఏటీసీల్లో ప్రవేశపెట్టిన కొత్త కోర్సులు అభ్యసించిన విద్యార్థులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో టీగేట్ కీలకపాత్ర పోషించనుంది. మెరుగైన శిక్షణ పొంది ఉద్యోగాలు సాధించాలి. సమాజ నిర్మాణంలో పాలుపంచుకోవాలన్నదే లక్ష్యం. – ఎం.సురేందర్, వైస్ చైర్మన్ టీగేట్ అవకాశాల్ని అందిపుచ్చుకోవాలి మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వం అందిస్తున్న నూతన కోర్సులను అందిపుచ్చుకుని యు వత తమ లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలి. కొత్త కోర్సుల్లో చేరిన వారు కొత్త విషయాలు తెలుసుకోవాలి. సమాజానికి ఉపయోగపడేలా పనిచేయాలి. గంట్యాల రవీందర్, కన్వీనర్ టీగేట్ కొత్త కోర్సులివే.. బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వెరిఫైర్(మెకానికల్) అడ్వాన్స్డ్ సీఎన్సి మిషనింగ్ టెక్నీషియన్ మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికిల్ ఏడాది కోర్సులు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్ ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఆర్టీసన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్స్ ఈ కోర్సుల్లో ఏటా 172మంది విద్యార్థులు శిక్షణ పొందే వీలుంది. -
అంతర్ జిల్లా దొంగల అరెస్ట్
కరీంనగర్క్రైం: కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో రెండు చోరీ కేసుల్లో ఐదుగురు నిందితులను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ కమిషనరేట్ కేంద్రంలో సీపీ గౌస్ఆలం వివరాలు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా గడ్డి అన్నారంకు చెందిన దినేశ్ రాజ్పురోహిత్ ప్రస్తుతం ఆశోక్నగర్లో నివాసం ఉంటున్నాడు. హైదరాబాద్ జవహర్నగర్కు చెందిన కొత్తోజు సందీప్చారితో పీడీయాక్టులో చర్లపల్లి జైలులో పరిచయం ఏర్పడింది. కరీంనగర్ త్రీటౌన్ పరిధిలో ఈనెల ఆరోతేదీన వివేకానందపురికాలనీలోని భార్గవి ఎంక్లేవ్ అపార్ట్మెంట్లో, వెంకటేశ్వర రెసిడెన్సిలో 32 తులాల బంగారం చోరీ చేశారు. కొంత సొత్తును ఎల్లారెడ్డిగూడలోని ఓ ఫైనాన్స్లో తాకట్టు పెట్టారు. పోలీసులు టెక్నాలజీ ఉపయోగించి నిందితులను బుధవారం అరెస్టు చేశారు. 265.69 గ్రాముల బంగారం రికవరీ చేసి, కోర్టుకు తరలించారు. దినేశ్ రాజ్ పురోహిత్ 40 కేసుల్లో నిందితుడు. ఖమ్మం, సూర్యాపేట, కోదాడ, విశాఖపట్నం, నిజామాబాద్, కామారెడ్డి, రంగారెడ్డి, సైబరాబాద్, కరీంనగర్, సిద్దిపేట స్టేషన్లలో కేసులున్నాయి. మానకొండూర్ కేసులో ముగ్గురు.. మానకొండూర్, లలితాపూర్లో జరిగిన చోరీలో నలుగురు నిందితులు ఉండగా, ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం డీకంపల్లి గ్రామానికి చెందిన టేకు గంగసాయిలు(55), టేకు భూమయ్య(45) అన్నదమ్ములు. తాళం వేసి ఉన్న ఇళ్లల్లో చోరీ చేస్తున్నారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని రామడుగు, గంగాధర, లక్ష్మీదేవిపల్లి, మానకొండూర్, లలితాపూర్, రాజాపూర్లో దొంగతనాలు చేశారు. సొత్తును ఉప్పుల వేణు, భార్త ఎక్నాత్ శేల్కేకు విక్రయించారు. పోలీసులు బుధవారం ముగ్గురిని అరెస్టు చేశారు. 59.3 గ్రాముల బంగారం, 940 గ్రాముల వెండి, రూ.1.40 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఉప్పుల వేణు త్వరలోనే అరెస్టు చేస్తామని సీపీ తెలిపారు. కేసులను ఛేదించిన టౌన్ ఏసీపీ వెంకటస్వామి, సీససీఎస్ ఏసీపీ నరసింహులు, త్రీటౌన్ సీఐ జాన్రెడ్డి, ఎస్సై చేరాలు, మానకొండూర్ సీఐ సంజీవ్, సీసీఎస్ సీఐ ప్రకాశ్, ఎస్సై స్వాతి, సిబ్బందిని సీపీ ప్రత్యేకంగా అభినందించారు. వేర్వేరు కేసుల్లో ఐదుగురి పట్టివేత 325 గ్రాముల బంగారం, 940 గ్రాముల వెండి రికవరీ వివరాలు వెల్లడించిన సీపీ గౌస్ ఆలం -
వివాహానికి వెళ్లి వస్తూ అనంతలోకాలకు..
వెల్గటూర్: అప్పటివరకూ స్నేహితుడి వివాహ వేడుకలో అందరితో కలిసి ఆనందంగా గడిపిన ఆ యువకులు.. వేడుక ముగించుకొని బుధవారం రాత్రి ఇంటికి తిరిగి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. ఈ సంఘటన ఇరు కుటుంబాల్లో విషాదం నింపింది. పోలీసులు, స్థానికుల కథనం వివరాల ప్రకారం మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం ఇటిక్యాలకు చెందిన ముచ్చకుర్తి అనిల్ (26), మేడి గణేశ్ (26) ఇద్దరు స్నేహితులు. ద్విచక్రవాహనంపై ఎండపల్లి మండలకేంద్రంలో జరిగిన స్నేహితుడి వివాహానికి హాజరయ్యారు. రాత్రిపూట స్వగ్రామమైన ఇటిక్యాలకు ద్విచక్రవాహనంపై బయల్దేరారు. వెల్గటూర్ మండలం పాశిగామ స్టేజీ వద్ద లక్సెట్టిపేట నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా వస్తోంది. అదే సమయంలో రోడ్డుపైకి ఓ గేదె రావడంతో బస్సు గేదెను ఢీకొంది. బస్సు డ్రైవర్ గేదెను తప్పించేక్రమంలో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. అనిల్ ఇటీవలే కానిస్టేబుల్గా ఎంపికయ్యాడు. రామగుండం కమిషనరేట్ పరిధిలో ఉద్యోగం చేస్తున్నాడు. గణేశ్ హైదరాబాద్లో వండర్ లాలో పనిచేస్తున్నట్లు సమాచారం. గణేశ్కు సోదరి ఉంది. తల్లిదండ్రులు గ్రామంలో కూలీ పని చేసుకుని జీవిస్తున్నారు. సోదరికి వివాహమైంది. అనిల్ తల్లిదండ్రులు బతుకుదెరువు కోసం ముంబయి వలస వెళారు. అనిల్కు సోదరుడు ఉన్నాడు. ప్రభుత్వ ఉద్యోగం రావడంతో వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటాడనుకున్న కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇద్దరు స్నేహితులు రోడ్డు ప్రమాదంలో ఒకేసారి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బైక్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి మృతుల్లో ఒకరు కానిస్టేబుల్ -
పెరిగిన గోదావరి ప్రవాహం
● భక్తులను కాపాడిన పోలీసులు ధర్మపురి: కడెం ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేయడంతో ధర్మపురి వద్ద నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. అప్పటికే స్నానాలు చేసేందుకు గోదావరిలోకి దిగిన భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. అక్కడే ఉన్న పోలీసులు నీటి ప్రవాహం నుంచి భక్తులను ఒడ్డుకు చేర్చారు. ఎస్సై ఉదయ్కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రావు భక్తులను బయటకు రప్పించేందుకు కృషి చేశారు. చూస్తుండగానే గోదావరి ఉధృతి పెరగడం.. ఐదుగురు చిన్నారులు, ఏడుగురు పెద్దలు నదిలోనే ఉండిపోవడం.. పోలీసులు సకాలంలో చేరుకుని వారిని బయటకు తీసుకురావడం క్షణాల్లో జరిగిపోయాయి. దీంతో భక్తులు ఊపిరిపీల్చుకున్నారు. -
అదుపులోకి వచ్చిన మంటలు
మెట్పల్లి: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ గోదాంలో మంటలు బుధవారం సాయంత్రం అదుపులోకి వచ్చాయి. ఆదివారం ఉదయం పది గంటల ప్రాంతంలో గోదాంలో మంటలు చెలరేగగా.. గమనించిన అక్కడి సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం అదించారు. వెంటనే ఆ శాఖ సిబ్బంది రెండు ఫైరింజిన్లతో హుటాహుటిన చేరుకొని మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించారు. కానీ క్రమంగా అవి గోదామంతా వ్యాపించడంతో అదుపు చేయడం కష్టమైంది. దీంతో అధికారులు మరికొన్ని ఫైర్ ఇంజిన్లను రప్పించారు. నిరంతరాయంగా సుమారు 80గంటల పాటు అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్కుమార్ ఆదేశాలతో పోలీస్, మున్సిపల్, సివిల్ సప్లయ్, మార్కెటింగ్, రెవెన్యూ అధికారులు, మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్దన్ అక్కడే ఉండి వారికి అన్ని విధాలుగా సహకారం అందించారు. అగ్నిప్రమాదంతో రూ.1.67లక్షల నష్టం వాటిల్లిందని మార్కెటింగ్, సివిల్ సప్లయ్ శాఖలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరో ఉద్దేశపూర్వకంగానే నిప్పు పెట్టడంతో ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పోలీస్, అగ్నిమాపక శాఖల విచారణలో ఏం తేలుతుందనేది ఆసక్తిగా మారింది. -
జల్సాలకు అలవాటుపడి.. చోరీలు ఎంచుకుని..
పాలకుర్తి: జల్సాలకు అలవాటుపడి చోరీలు చేస్తూ కటకటాలపాలయ్యడు ఓ యువకుడు. పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ బసంత్నగర్ ఠాణాలో బుధవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అంతర్గాం మండలం పెద్దంపేటకు చెందిన పరకాల అశోక్ తన అమ్మమ్మ ఊరు పాలకుర్తి మండలం ఈసాలతక్కళ్లికి మే 18న ఓ వివాహ వేడుకకు హాజరయ్యాడు. అదేరోజు రాత్రి దాడి నాగరాజు ఇంటితాళం పగులగొట్టి 2 తులాల పుస్తెలతాడు చోరీ చేశాడు. గతనెల 20 ఇదే గ్రామానికి చెందిన పెసరి మల్లేశ్.. పెద్దంపేటలోని తన అత్తగారింటికి కుటుంబసభ్యులతో కలిసి వెళ్లాడు. ఆ ఇంటి పక్కనే అశోక్ ఇల్లు ఉంది. దీంతో మల్లేశ్ తన గ్రామంలోనే ఉన్నాడని తెలుసుకుని అదేరోజు రాత్రి ఈసాలతక్కళ్లపల్లికి వెళ్లి మల్లేశ్ ఇంటితాళం పగులగొట్టి బీరువాలోని 3 తులాల బంగారుహారం దొంగిలించాడు. జూలై 26న సుల్తానాబాద్ శాసీ్త్రనగర్లో తాళం వేసి ఉన్న ఇంట్లోకి దూరి బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లాడు. మద్యం మత్తులో ఉన్న అశోక్ అభరణాలు ఎక్కడో పోగొట్టుకున్నాడు. అయితే, చోరీ చేసిన బంగారం, వెండి విక్రయించేందుకు వెళ్తున్న అశోక్ను బసంత్నగర్ బస్టాండ్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 3 తులాల బంగారం, 35 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నారు. మిగతా బంగారాన్ని ఓ ఫైనాన్స్లో తనాఖా పెట్టాడని పోలీసులు గుర్తించారు. పెద్దపల్లి ఏసీపీ కృష్ణ, సీఐ ప్రవీణ్కుమార్, ఎస్సై స్వామి పాల్గొన్నారు. నిందితుడిని చాకచక్యంగా పట్టుకోవడంలో ప్రతిభ చూసిన సీఐ ప్రవీణ్కుమార్, ఎస్సై స్వామి, హెడ్కానిస్టేబుల్ నరేందర్, కానిస్టేబుళ్లు శరత్, అనిల్కుమార్, శివకుమార్, శ్రీనివాస్, రవీందర్, అనిల్ను డీసీపీ, ఏసీపీలు అభినందించారు. కానిస్టేబుళ్లకు నగదు రివార్డు అందజేశారు. కటకటాలపాలైన యువకుడు 3 తులాల బంగారం, 35 తులాల వెండి స్వాధీనం పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ వెల్లడి -
ముగింపా.. పొడిగింపా..?
● నేటితో ముగియనున్న సహకార సంఘాల పదవీకాలంసిరిసిల్లఅర్బన్/ముస్తాబాద్(సిరిసిల్ల): ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్) ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ నెల 14తో ప్రస్తుత పాలకవర్గాల పదవీ కాలం ముగుస్తుంది. వీరిని కొనసాగించుడా లేదా ఎన్నికల్లోకి వెళ్లుడా.. అనే విషయమై ఇంత వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సంకేతాలు వెలువడలేదు. దీంతో ప్రస్తుతం జిల్లాలోని 24 సంఘాల పాలకవర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఫిబ్రవరి 2019లో సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించారు. ఐదేళ్ల తర్వాత వీటికి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత ఆరునెలల పాటు పదవీకాలం పొడిగించారు. అదికూడా గురువారం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆగస్టు 15న సంఘాలు, డీసీసీబీ, డీసీఎంఎస్ల ఎదుట జాతీయజెండాను ఎగురవేయాల్సి ఉంటుంది. ఈ అవకాశం తమకు దక్కుతుందా లేదా అనే దానిపై అధ్యక్షుల్లో ఆసక్తి నెలకొంది. ఈ విషయమై డీసీవో రామకృష్ణను వివరణ కోరగా, ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని, ఏమైనా నిర్ణయం తీసుకుంటే అమలు చేస్తామన్నారు. నామినేటెడ్ విధానంలో..? వ్యవసాయ మార్కెట్ కమిటీలకు ప్రస్తుతం నామినేటెడ్ విధానంలో పదవులు భర్తీ చేస్తున్నారు. అయితే సహకార సంస్థల్లో కూడా ఇదే పద్ధతిని ప్రభుత్వం అనుసరించే యోచనలో ఉన్నట్లు జిల్లాలో కొంత ప్రచారం జరుగుతోంది. ఎన్నికల వ్యయాన్ని తగ్గించుకోవడంతోపాటు, ప్రభుత్వ అనుకూల వర్గాలకు చెందినవారికి పదవులు కట్టబెట్టుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇది ఎంతవరకు సాధ్యమన్నదానిపై ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా పరిధిలోని సహకార సంఘాలు జిల్లా పరిధిలో మొత్తం 24 వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. అందులో సిరిసిల్ల, పెద్దూరు, నేరెల్ల, కోనరావుపేట, కొలనూర్, వేములవాడ, నాంపల్లి, రుద్రవరం, చందుర్తి, సనుగుల, మానాల, బోయినపల్లి, కోరెం, మాన్వాడ, నర్సింగపూర్, ఇల్లంతకుంట, గాలిపల్లి, ముస్తాబాద్, పోత్గల్, గంభీరావుపేట, కొత్తపల్లి, ఎల్లారెడ్డిపేట, అల్మాస్పూర్, తిమ్మాపూర్ గ్రామాల్లో సంఘాలు ఉన్నాయి. -
మహిళలు ఆర్థికంగా ఎదగాలి
● కలెక్టర్ సందీప్కుమార్ ఝా గంభీరావుపేట(సిరిసిల్ల): మహిళలు ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా అన్నారు. గంభీరావుపేట మండలం లింగన్నపేటలో శ్రీమణికంఠ గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎరువులు, విత్తనాల దుకాణాన్ని బుధవారం ప్రారంభించారు. దాదాపు 2 గంటలు అక్కడే ఉండి ఎరువుల పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఎరువులు, ఫర్టిలైజర్ దుకాణాలు పొందిన మహిళలు వ్యాపారాల్లో రాణించాలన్నారు. త్వరలో మహిళా సంఘాల సభ్యులకు రైసుమిల్లులు, సోలార్ ప్లాంట్లు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మహిళలు ఏర్పాటు చేసిన దుకాణాల్లో రైతులు ఎరువులు, పురుగుమందులు కొని వారి ఆర్థికాభివృద్ధికి మద్దతునివ్వాలన్నారు. జిల్లాలో ఎరువుల కొరత లేదని, అనవసర ప్రచారాన్ని రైతులు నమ్మవద్దన్నారు. జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్ బేగం, ఏఎంసీ చైర్పర్సన్ కొమిరిశెట్టి విజయ, ఏవో సలావుద్దీన్, ఏఈవో ప్రవీణ్, వైస్ చైర్మన్ అంజిరెడ్డి, తహసీల్దార్ మారుతిరెడ్డి, ఐకేపీ ఏపీఎం దేవయ్య పాల్గొన్నారు. భూపత్రాలు అందజేత ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని సిరికొండ గ్రామంలో 3.28 ఎకరాల ప్రభుత్వ భూమి పత్రాలను రెవెన్యూ అధికారులు బుధవారం జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రకాశ్కు అందజేశారు. గ్రామంలో వరిధాన్యం కొనుగోలుకు సదరు భూమిని ఉపయోగించనున్నట్టు మార్కెటింగ్ అధికారి తెలిపారు. సదరు స్థలంలో గ్రామస్తులు ఎలాంటి పనులు చేయకూడదని సూచించారు. ఆర్ఐ సంతోష్ కుమార్, ఏఎంసీ కార్యదర్శి హరినాథ్, గ్రామస్తులు పాల్గొన్నారు -
ప్రభుత్వ సాయంతో ఇళ్లు పూర్తి చేసుకోవాలి
● విప్ ఆది శ్రీనివాస్ కోనరావుపేట(వేములవాడ): పేద ప్రజల కలల సౌధమైన ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వ సాయంతో పూర్తి చేసుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. మండలంలోని కొలనూరు పరిధి గొల్లపల్లి గ్రామంలో కలకుంట్ల లక్ష్మణ్రావు, రమణ దంపతులు పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విప్ ముఖ్య అతిథిగా హాజరై రమణకు చీర సారే అందించారు. మండలంలోని గొల్లపల్లిని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామని, ఉమ్మడి జిల్లాలోనే మొట్టమొదటి ఇందిరమ్మ ఇల్లును ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులందరూ నిర్మాణాలు పూర్తి చేసుకొని రానున్న దసరా పండుగకు గృహప్రవేశాలు చేసుకోవాలని ఆకాంక్షించారు. ఎంపీడీవో శంకర్రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు షేక్ ఫిరోజ్ పాషా, కిసాన్సెల్ జిల్లా అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. మరో 7 మీ సేవ కేంద్రాలు సిరిసిల్ల/సిరిసిల్లకల్చరల్: ప్రజా ప్రయోజనార్థం జిల్లాకు మరో 7 మీ సేవ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ సందీప్కుమార్ ఝా ప్రకటనలో తెలిపారు. చందుర్తి మండలం మూడపల్లి, గంభీరావుపేట మండల కేంద్రం, తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల, వేములవాడ అర్బన్ మండలం తెట్టెకుంట (అగ్రహారం), ముస్తాబాద్ మండలం చీకోడు, రుద్రంగి మండలం మానాల, జిల్లా కేంద్రంలోని సుభాష్నగర్లో ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 19లోపు కలెక్టర్ కార్యాలయంలో సమర్పించాలన్నారు. అర్హతలు, ఇతర నిబంధనల కోసం https://rajannasiricilla. telangana.gov.in వెబ్సైట్లో సందర్శించాలని సూచించారు. -
దేశ సమగ్రతే బీజేపీ లక్ష్యం
సిరిసిల్లటౌన్: దేశ సమగ్రతే బీజేపీ లక్ష్యమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు. ప్రధాని మోదీ పిలుపుమేరకు హర్ ఘర్ తిరంగా అభియాన్లో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలో నేతన్న విగ్రహం నుంచి గాంధీ వరకు ర్యాలీ నిర్వహించి మాట్లాడారు. మన సైనికుల పరాక్రమంపై గర్వంతో జాతి సమైక్యతకు ప్రతీకగా అందరం మన ఇళ్లపై జాతీయ పతాకాన్ని ఎగురేద్దామని పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్ర మహేశ్, అల్లాడి రమేశ్, లింగంపల్లి శంకర్, మ్యాన రాంప్రసాద్, ఆడెపు రవీందర్, మల్లారెడ్డి, మార్త సత్తయ్య, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి, నంద్యాడపు వెంకటేశ్, సిరికొండ శ్రీనివాస్, గూడూరి భాస్కర్, నవీన్యాదవ్, గజబింకర్ చందు, సురేందర్రావు, నాగుల శ్రీనివాస్, మహిళా మోర్చా అధ్యక్షురాలు అన్నపూర్ణ, సిరిసిల్ల, వేములవాడ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్, రాపల్లి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
పంద్రాగస్ట్ వేడుకలకు ముఖ్య అతిథిగా విప్ ఆది
సిరిసిల్ల: జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగే 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొననున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జీవో జారీ చేసింది. కలెక్టరేట్ సముదాయంలో పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో జాతీయ జెండా ఆవిష్కరించి జెండా వందనం చేస్తారు. పంద్రాగస్ట్ వేడుకలకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎగువ మానేరుకు ఇన్ఫ్లోగంభీరావుపేట(సిరిసిల్ల): మండలంలోని నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టులో క్రమంగా నీటి మట్టం పెరుగుతోంది. పరవళ్లు తొక్కడానికి మరో ఆరు అడుగుల నీరు చేరాల్సి ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 2 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 1.27టీఎంసీల నీరుంది. 116 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. మిడ్మానేరుకు ఎల్లంపల్లి జలాలుబోయినపల్లి(చొప్పదండి): మిడ్మానేరు ప్రాజెక్టులోకి వరదకాలువ ద్వారా ఎల్లంపల్లి జలా లు చేరుతున్నాయి. రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంప్హౌస్ నుంచి ఎత్తిపోతల ద్వారా సుమారు 9,450 క్యూసెక్కుల నీరు మిడ్మానేరుకు తరలిస్తున్నారు. అలాగే మూలవాగు, మానేరు వాగుల్లోంచి ప్రాజెక్టులోకి 944 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్టులో 7.60 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పాత ఇళ్లలో నిద్రించవద్దుసిరిసిల్ల: భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా బుధవారం కోరారు. వర్షాల నేపథ్యంలో పాత ఇళ్లలో నివాసం ఉండవద్దన్నారు. జిల్లాలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రాణనష్టం లేకుండా చూడాలన్నారు. అత్యవసర సేవలకు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1800 233 1495, వాట్సాప్ సెల్ నంబర్ 93986 84240 సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దన్నారు. జిల్లాలో నమోదైన వర్షపాతం జిల్లా వ్యాప్తంగా బుధవారం వర్షం కురిసింది. అత్యధికంగా ఇల్లంతకుంటలో 60.6 మి.మీ వర్షం పడగా.. రుద్రంగి 27.2, చందుర్తి 24.8, వేములవాడరూరల్ 34.4, బోయినపల్లి 38.1, వేములవాడ 46.1, సిరిసిల్ల 24.3, కోనరావుపేట 23.4, వీర్నపల్లి 18.4, ఎల్లారెడ్డిపేట 19.7, గంభీరావుపేట 13.5, ముస్తాబాద్ 36.6, తంగళ్లపల్లిలో 36.7 మి.మీ వర్షం కురిసింది. 13 మండలాల్లో సగటు వర్షపాతం 31.0 మి.మీటర్లుగా నమోదైంది. యూరియా కోసం బారులు సిరిసిల్లఅర్బన్: సిరిసిల్ల మున్సిపల్ పరిధి పెద్దూరు సింగిల్విండో కేంద్రం వద్ద రైతులు యూరియ కోసం బారులు తీరారు. రైతులకు సరిపడా యూరియ అందుబాటులో ఉందని సీఈవో గౌరీశంకర్ తెలిపారు. ఎల్లారెడ్డిపేటలో ఉద్రిక్తత ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండల కేంద్రంలోని గ్రోమోర్ కేంద్రం వద్ద బుధవారం యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఉదయం 4.30 గంటలకే కేంద్రం వద్దకు చేరుకొని క్యూలైన్లో నిల్చున్నారు. 220 యూరియా బస్తాలు మాత్రమే వచ్చాయని తెలియడంతో అన్నదాతలు అసహనానికి గురయ్యారు. అలాగే ఐకేపీ గోదాంకు 440 బ్యాగులు మాత్రమే రాగా 500 వరకు రైతులు చేరుకున్నారు. యూరియా అందరికీ సరిపోయేలా లేకపోవడంతో రైతులు ఎగబడ్డారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు సర్దిచెప్పడంతో రైతులు శాంతించారు. -
రోగాల కూడు
● నిల్వ మాంసం.. కుళ్లిన కూరగాయలు ● నాసిరకం నూనెలు.. స్టోర్డ్ ఫుడ్ వినియోగం ● రంగులు, రసాయనాలతో ఆరోగ్యం చిత్తు ● ఫుడ్సేఫ్టీ ఉన్నతాధికారుల తనిఖీల్లో బహిర్గతం ● హోటళ్ల నిర్వాకం నియంత్రించలేని స్థానిక అధికారులు‘పద్మనగర్కు చెందిన ఓ పదిహేనేళ్ల విద్యార్థిని వారంలో రెండ్రోజులు చాట్, పానీపూరీలు తినేది. రెండునెలల క్రితం హఠాత్తుగా ఆకలి మందగించి ఆహారం తీసుకోవడం మానేసింది. శరీరంలో నిస్సత్తువ పెరగడంతో తల్లిదండ్రులు జిల్లా కేంద్రంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులకు అనుమానం వచ్చి హైదరాబాద్ ఆస్పత్రికి రెఫర్ చేయగా, అక్కడి వైద్యులు పరీక్షలు చేయడంతో హెపటైటీస్–ఏ నిర్ధారణ అయ్యింది. కారణాలు వెతికితే శుభ్రత కొరవడిన ఆహారం తీసుకోవడమేనని తేలింది’.ఇటీవల తనిఖీల్లో దొరికిన కుళ్లిన మాంసం నిల్వలు, ఇతర ఆహారపదార్థాలుహానికర రసాయనాలు జిల్లాలోని పలు రెస్టారెంట్లు, హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు నాసిరకం ఆహారపదార్థాలు వాడుతున్నారు. రుచికోసం ఆహారంలో నిషేధిత రంగులు, రసాయనాలు కలుపుతున్నారు. గతంలో పలు హోటళ్లలో అధికారుల తనిఖీల్లో కలుషితనీరు, పాడైన ఆహార పదార్థాలు దొరికాయి. అప్పుడు నామమాత్రపు చర్యలు తీసుకోవడంతో నిర్వాహకులకు భయం లేకుండా పోయింది. స్థానిక అధికారులు శ్రీమామూళ్లుశ్రీగా వదిలేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.సిరిసిల్లటౌన్: జిల్లాలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో ఆహార ఉత్పత్తుల్లో నాణ్యత లేమి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వీధిసైడ్ బండిపై దొరికే ఆహారం నుంచి త్రీస్టార్ హంగులతో ఉండే హోటళ్లలో ఆహార భద్రత, నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. కుళ్లిన మాంసం, అపరిశుభ్ర పదార్థాలతో చేస్తున్న వంటలు పిల్లలు, పెద్దలు అన్నివర్గాల వారికి ప్రాణ సంకటంగా మారుతున్నాయి. నిర్వాహకులు నిబంధనలు బేఖాతర్ చేస్తున్నారు. -
రాఖీ కట్నం
15.48కోట్లువిద్యానగర్(కరీంనగర్): రాఖీ పండుగ కరీంనగర్ రీజియన్కు కాసుల పంట పండించింది. ఈనెల 7వ తేదీ నుంచి 12వ తేదీ వరకు రూ.15.48 కోట్ల ఆదా యం సమకూరింది. పండుగ సందర్భంగా ఈనెల 7వ తేదీనుంచి 11వ తేదీ వరకు రీజియన్ పరిధి లోని 11డిపోల్లో ఉన్న బస్సులు 21.50 లక్షల కిలో మీటర్లు తిరగగా.. 29,10,435 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. వీరిలో 73శాతంపైగా (21,21,668) మహిళలు ఉండగా మహాలక్ష్మి పథ కం ద్వారా రూ.9.08 కోట్లు ఆదాయం వచ్చింది. రాఖీ పౌర్ణమి రోజున ఈనెల 9న రికార్డుస్థాయిలో 7.02 లక్షల మంది రాకపోకలు సాగించగా రూ.3.94 కోట్ల ఆదాయం వచ్చింది. అత్యధికంగా గోదావరిఖని డిపో నుంచి 4,28,432 మంది ప్రయాణించారు. వీరిలో 3,21,821మంది మహిళలు ఉన్నారు. మొత్తం రూ.223.79 లక్షల ఆదాయం రాగా.. మహాలక్ష్మీ స్కీంకింద రూ.130.09 లక్షల ఆదాయం వచ్చింది. జగిత్యాల డిపో 3,67,855 మందిని చేరవేసి రెండోస్థానంలో నిలిచింది. వీరిలో 2,71,103 మంది మహిళలున్నారు. మొత్తం ఆదాయం రూ.178.57 లక్షలు రాగా.. జీరో టికెట్లు ద్వారా 104.38లక్షల ఆదాయం వచ్చింది. ఆర్టీసీకి కరీంనగర్ రీజియన్లో లాభాల పంట గోదావరిఖని డిపోకు మొదటిస్థానంఅందరి సహకారంతోనే కరీంనగర్ రీజియన్ పరిధిలోని 11 డిపోలకు చెందిన సిబ్బంది, డైవర్లు, కండక్టర్లులు, అధికారుల సహకారంతోనే ఇది సాధ్యమైంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా స్పేర్ బస్సులతో పాటు జేబీఎస్ నుంచి సిటీ బస్సులు నడిచేలా చూశాం. 29 లక్షలకు పైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేశాం. – బి.రాజు, కరీంనగర్ రీజినల్ మేనేజర్ -
వదిలేశారు
బుధవారం శ్రీ 13 శ్రీ ఆగస్టు శ్రీ 2025వార్నింగ్తో● ‘ఫేక్ అటెండెన్స్’ ఇచ్చిన వారికి సర్క్యులర్ జారీ ● మరోసారి చెయొద్దని స్పష్టం ● ఊపిరి పీల్చుకున్న 33 మంది కార్యదర్శులుసిరిసిల్ల: గ్రామపంచాయతీల్లో విధులు నిర్వహించకుండానే నిర్వహించినట్లుగా, క్షేత్రస్థాయిలో ఉండకుండానే.. ఉన్నట్లుగా ఫేక్ అటెంటెన్స్ ఇచ్చిన గ్రామపంచాయతీ కార్యదర్శులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 33 మంది పంచాయతీ కార్యదర్శులపై జిల్లా పంచాయతీ అధికారులు నివేదిక సిద్ధం చేసి కలెక్టర్ సందీప్కుమార్ ఝాకు పంపించగా.. వార్నింగ్తో వారిని వదిలేశారు. మరోసారి తప్పు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పొరుగు జిల్లాలో ఫేక్ అటెండెన్స్ నమోదు చేసిన వ్యవహారంలో సదరు గ్రామపంచాయతీ కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని 33 మంది పంచాయతీ కార్యదర్శులు ఆందోళనకు గురయ్యారు. కలెక్టర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారని భయంతో వణికిపోయారు. పంచాయతీ కార్యదర్శుల ఫేక్ అటెండెన్స్ నమోదులో యాప్ లోపాలు వెల్లడి కావడంతో కలెక్టర్ లోతుగా విశ్లేషించారు. ఈమేరకు మొదటి తప్పిదంగా భావించి వార్నింగ్ ఇవ్వాలని సూచించారు. మరోవైపు మరోసారి ఈ తప్పు చేయకుండా కట్టడి చేయాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. సాంకేతిక లోపమే కారణమైంది క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ.. సమయపాలన పాటిస్తూ.. విధులు నిర్వహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేసే చోటి నుంచి నిత్యం గ్రామపంచాయతీ కార్యదర్శులు డీఎస్ఆర్ (డైలీ శానిటేషన్ రిపోర్టు) యాప్లో సెల్ఫీ దిగి తమ హాజరు నమోదు చేయాలని నిర్దేశించింది. యాప్లో సాంకేతిక లోపాలను అలుసుగా తీసుకున్న కొందరు గ్రామపంచాయతీ కార్యదర్శులు ఫేక్ అటెండెన్స్ నమోదు చేస్తూ ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించారు. రాజన్నసిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 32 మంది పంచాయతీ కార్యదర్శులు ఫేక్ అటెండెన్స్ నమోదు చేస్తున్నట్లు అధికారుల విచారణలో తేలింది. గ్రామపంచాయతీలకు పాలకవర్గాలు లేని రోజుల్లో అన్నీ తామై నడిపించాల్సిన పంచాయతీ కార్యదర్శులు ఇలా ఫేస్ రికగ్నిషన్ యాప్లో ఫేక్ వ్యక్తులతో అటెండెన్స్ నమోదు చేయడం జిల్లాలో చర్చనీయాంశమైంది. పంచాయతీరాజ్ డైరెక్టర్ సీరియస్ క్షేత్రస్థాయిలో ఫేక్ అటెంటెన్స్పై పంచాయతీరాజ్ డైరెక్టర్ సృజన సీరియస్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ముఖ గుర్తింపు యాప్లో నమోదైన పంచాయతీ కార్యదర్శులు ఫొటోలను పరిశీలించాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా యాప్లను తనిఖీ చేసి నివేదికలు ఇవ్వాలని మండల పంచాయతీ అధికారులు(ఎంపీవో)లకు స్పష్టం చేశారు. నకిలీ హాజరు నమోదు చేసే పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేయాలని పంచాయతీరాజ్ డైరెక్టర్ సృజన ఆదేశించారు. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ డీఎస్ఆర్ యాప్ను అధికారులు పరిశీలించి నివేదించగా కలెక్టర్ సూచనతో వార్నింగ్తో వదిలేశారు. అదే పొరుగు జిల్లాల్లో కఠిన చర్యలు తీసుకున్నారు. రాజన్న సిరిసిల్లలో గ్రామపంచాయతీ కార్యదర్శుల పనితీరుపై నమ్మకంతో కలెక్టర్ సానుకూలమైన నిర్ణయంతో వార్నింగ్తో వదిలేయడం విశేషం.న్యూస్రీల్ -
సేవలకు పురస్కారం
ఇల్లంతకుంట(మానకొండూర్): మహిళా సంఘంలోని సభ్యుల ఆర్థికాభివృద్ధి.. రుణాల చెల్లింపుల్లో ఆదర్శం.. ఉపాధి కల్పనలో ముందుచూపు.. ఇవన్నీ తోడవడంతో ఇల్లంతకుంట ఆదర్శ మండలి సమాఖ్య ఆత్మనిర్భర్ సంఘతన్ పురస్కారానికి ఎంపికై ంది. ఇప్పటికే ప్రకటించిన ఈ అవార్డును స్వాతంత్య్ర వేడుకల్లో ఢిల్లీ అందజేయనున్నారు. ఈ పురస్కారాన్ని అందుకునేందుకు మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, మాజీ అధ్యక్షురాలు, డీఆర్డీవో అధికారి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఆదర్శం మహిళా మండలి సమాఖ్య ఇల్లంతకుంట మండల ఆదర్శ మహిళా మండలి సమాఖ్య 2004లో ఏర్పాటైంది. 12,420 మంది సభ్యులు, 1,103 స్వశక్తి సంఘాలు, 46 గ్రామైక్య సంఘాలతో కొనసాగుతోంది. రుణాల పంపిణీ, రికవరీలో ఉత్తమ సేవలు, స్వయం ఉపాధి కల్పించడంలో విశేష కృషి, క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేయడంతో ఈ సమాఖ్య కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రకటించిన ఆత్మనిర్భర్ సంఘతన్ అవార్డుకు ఎంపికై ంది. ఇప్పటి వరకు ఈ సమాఖ్య రూ.59కోట్ల రుణాలు పంపిణీ చేసి, 99 శాతం రికవరీ చేసింది. ఇందిరా మహిళా శక్తి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరా మహిళాశక్తి కింద మండలంలోని ఆయా గ్రామైక్య సంఘాలకు రూ.1.30కోట్లు స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేసింది. ఇందులో క్యాంటీన్లు, కుట్టుమిషన్లు, కోడిపిల్లల పెంపకం వంటివి కొనసాగుతున్నాయి. సభ్యులకు లోన్ బీమా సౌకర్యం కల్పించి 20 మందికి రూ.14.80 లక్షలు అందజేశారు. మండలి సమాఖ్య కేంద్రంలో వ్యవసాయ పరికరాలు వరిగడ్డి చుట్టే యంత్రం, రొటోవేటర్, విత్తనాలు చల్లే యంత్రములు కావలసిన రైతులకు అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయం పొందుతున్నారు. రబీ సీజన్లో గ్రామైక్య సంఘాలకు వడ్ల కొనుగోలు కేంద్రాల బాధ్యత అప్పగించడం ద్వారా సంఘాలకు రూ.కోటి కమీషన్ వచ్చింది. గ్యాస్ ఏజెన్సీ, బస్సు ఇల్లంతకుంట మండల ఆదర్శ మహిళా సమాఖ్యకు నిరంతరం ఆదాయం వచ్చేలా గ్యాస్ ఏజెన్సీ మంజూరు చేస్తానని కలెక్టర్ సందీప్కుమార్ ఝా హామీ ఇచ్చారు. రూ.36లక్షలతో బస్సు కొనుగోలు చేసి ఆర్టీసీలో అద్దెకు ఇవ్వగా నెలకు రూ.59వేలు ఆదాయం వస్తోంది. ఆత్మ నిర్భర్ పురస్కారానికి ఎంపిక ఆర్థిక క్రమశిక్షణతో గుర్తింపు ఢిల్లీకి వెళ్ల్లిన ఇల్లంతకుంట ఆదర్శ మండలి సమాఖ్య అధ్యక్షురాలు స్వాతంత్య్ర వేడుకల్లో అవార్డు ప్రదానం ఇందిరా మహిళా శక్తితో ఆదాయం నేను ఆదర్శ మండలి సమాఖ్యలో సభ్యురాలిని. నా భర్త గీతా కార్మికుడు. ఆయన చనిపోవడంతో ఇద్దరూ పిల్లలతో సంసారం ఎల్లుడు కష్టమైంది. ఇందిరా మహిళాశక్తి కింద రూ.3లక్షలు రుణం తీసుకొని క్యాంటీన్ పెట్టుకున్నాను. మంచి ఆదాయం వస్తోంది. రుణ వాయిదాలు చెల్లిస్తూ పిల్లలను చదివిస్తున్నాను. – బండారి స్వాతి, ఇల్లంతకుంట -
రోడ్డెక్కిన అన్నదాతలు
● మద్దతు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు ● పొద్దంతా క్యూలైన్లోనే.. ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): యూరియా కోసం రైతులు పొద్దంతా క్యూలైన్లోనే ఎదురుచూడాల్సిన పరిస్థితులు. తెల్లవారుజామునే గోదాంల వద్దకు వెళ్తున్న అన్నదాతలు క్యూలైన్లో తమ చెప్పులు, పాసుపుస్తకాలు పెట్టి అధికారుల రాక కోసం ఎదురుచూస్తున్నారు. అధికారులు వచ్చినా సకాలంలో పంపిణీ చేయడం లేదు. జిల్లాలో మంగళవారం ప్రతీ మండలంలో యూరియా కోసం రైతులు బారులు తీరడం కనిపించింది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు రైతులతో కలిసి రోడ్డుపై బైటాయించారు. ● ఇల్లంతకుంట: మండల కేంద్రంలో జెడ్పీ మాజీ వైస్చైర్మన్ సిద్దం వేణు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. ● కోనరావుపేట: స్థానిక క్రాసింగ్ వద్ద రైతులు, బీఆర్ఎస్ నాయకులు ధర్నాకు దిగారు. ● ముస్తాబాద్: స్థానిక గ్రోమోర్ దుకాణం వద్ద యూరియా ఇవ్వాలని రైతులు కోరగా.. అధికా రుల నుంచి ఆదేశాలు రావని సిబ్బంది తెలపడంతో ఆగ్రహించి రోడ్డెక్కారు. కొత్తబస్టాండ్లోని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద బీఆర్ఎస్, బీజేపీ నాయకులు నిరసనకు దిగారు. ● వీర్నపల్లి: మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గుజ్జుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో రైతులతో కలిసి నాయకులు ధర్నాకు దిగారు. ● రుద్రంగి: మండల కేంద్రంలో పోలీస్ బందోబస్తు మధ్య ఒక్కో రైతుకు ఒకటే యూరియా బస్తా పంపిణీ చేశారు. అడ్డుకున్న పోలీసులు ● చందుర్తి: యూరియా కొరతను నిరసిస్తూ ధర్నా, రాస్తారోకాకు సిద్ధమైన చందుర్తి బీఆర్ఎస్ నాయకులను పోలీసులు రోడ్డెక్కకుండా అడ్డుకున్నారు. తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి డిప్యూటీ తహసీల్దార్ శ్రీలతకు వినతిపత్రం ఇచ్చారు. చందుర్తి గోదాంకు సరఫరా చేసిన 888 బస్తాల్లో 638 పంపిణీ చేశారు. గోదాంలో 250 బస్తాలుంటే బుధవారం కోసం 350 మందికి టోకెన్లు ఇచ్చారు. సనుగుల సింగిల్ విండోకు 900 బస్తాలను సరఫరా చేస్తామని ప్రకటించిన వ్యవసాయాధికారులు ఒక్క బస్తాను సరఫరా చేయలేదని అక్కడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ● వేములవాడరూరల్: మండలంలోని చెక్కపల్లిలో రైతులకు యూరియా అందడం లేదంటూ బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించారు. అనంతరం మండల వ్యవసాయ అధికారి వినీతకు వినతిపత్రం అందజేశారు. -
సైకిళ్లను సద్వినియోగం చేసుకోవాలి
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు గోపిఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి విద్యార్థులు సైకిళ్లను సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పేర్కొన్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ఉపయోగపడతాయన్నారు. ఎల్లారెడ్డిపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్కుమార్ జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ కానుకగా 100 సైకిళ్లను మండలంలోని 9 పాఠశాలల్లోని విద్యార్థులకు అందజేశారు. ఎంఈవో కృష్ణహరి, హెచ్ఎం మనోహరాచారి, బీజేపీ మండల అధ్యక్షుడు రేపాక రామచంద్రారెడ్డి, నాయకులు పొన్నాల తిరుపతిరెడ్డి, మద్దుల బుగ్గారెడ్డి, చందుపట్ల లక్ష్మారెడ్డి, గంట బాలకృష్ణాగౌడ్, దాసరి గణేష్, నంది నరేశ్, రాజిరెడ్డి, సంజీవరెడ్డి, ఆంజనేయులు, దాసరి పూర్ణిమ, బాలాగౌడ్, కిరణ్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
నిధులు విడుదల చేయండి
● సీఎం రేవంత్రెడ్డికి ప్రభుత్వ విప్ విన్నపం వేములవాడ: నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని సీఎం రేవంత్రెడ్డికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విన్నవించారు. హైదరాబాద్లోని సీఎం నివాసంలో మంగళవారం కలిసి ఈమేరకు వినతిపత్రం అందజేశారు. కలికోట సూరమ్మ చెరువు కుడి, ఎడమ కాలువల నిర్మాణానికి భూసేకరణకు నిధులు, చందుర్తి–మోత్కురావుపేట రోడ్డు నిర్మాణానికి, మూలవాగుపై వంతెనల నిర్మాణాలకు నిధులు కేటాయించాలని కోరినట్లు తెలిపారు. అత్యవసర సేవల్లో నిర్లక్ష్యం వద్దు సిరిసిల్లటౌన్: అత్యవసర వేళల్లో క్షతగాత్రులకు వైద్యసేవలు అందించే 108 సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారిణి రజిత సూచించారు. జిల్లాలోని 108 అత్యవసర సర్వీసుల సేవలను మంగళవారం పరిశీలించి మాట్లాడారు. వాహనంలోని అత్యవసర వైద్య పరికరాలను పరిశీలించారు. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నయీమ్ జహ, 108 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ జనార్దన్, జిల్లా మేనేజర్ అరుణ్కుమార్, 108 వాహన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.5 లక్షల విరాళం వేములవాడ: రాజన్న నిత్యాన్నదాన ట్రస్టుకు జగిత్యాల జిల్లాకు చెందిన ముస్కు కార్తీక్రెడ్డి–సుష్మ దంపతులు వారి పిల్లలు ఆరుష్, కియాన్ల పేరిట రూ.5లక్షలు విరాళం ఆలయ ఈవో రాధాభాయికి మంగళవారం అందజేశారు. ప్రొటోకాల్ ఏఈవో అశోక్కుమార్, పర్యవేక్షకులు శ్రీనివాస్శర్మ, ప్రొటోకాల్ విభాగం సీనియర్ అసిస్టెంట్ బొడుసు మహేశ్ పాల్గొన్నారు. గ్రంథాలయాల్లో వసతులు కల్పిస్తాం ● జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ సత్యనారాయణ ముస్తాబాద్(సిరిసిల్ల): జిల్లాలో గ్రంథాలయాలలో వసతులు కల్పిస్తామని గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ పేర్కొన్నారు. ముస్తాబాద్ గ్రంథాలయాన్ని మంగళవారం సందర్శించిన సందర్భంగా మాట్లాడారు. జిల్లాలోని లైబ్రరీలలో మరుగుదొడ్లు, నీరు, కరెంట్ సదుపాయాల కల్పనకు రూ.10లక్షలతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వివరించారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు యెల్ల బాల్రెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ తలారి రాణి, జిల్లా కార్యదర్శి కొండం రాజిరెడ్డి, గజ్జెల రాజు, అనిత పాల్గొన్నారు. భూసార పరీక్షలు చేయించుకోవాలి గంభీరావుపేట(సిరిసిల్ల): భూసార పరీక్షల ఆధారంగా పంటలు సాగు చేసుకోవాలని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు కోరారు. గంభీరావుపేట సింగిల్విండో కార్యాలయంలో క్రిభ్కో భారతి ఆధ్వర్యంలో మంగళవారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. రవీందర్రావు మాట్లాడుతూ.. రైతులు మోతాదుకు మించి యూరియా వాడొద్దన్నారు. సభ్యుల సంక్షేమమే లక్ష్యంగా సంస్థ ద్వారా 13 జిల్లాలో వ్యవసాయ ఉత్సవం నిర్వహిస్తున్నామని సంస్థ రాష్ట్ర ఎండీ నితిన్ తెలిపారు. కేడీసీసీబీ డైరెక్టర్ భూపతి సురేందర్, క్రిభ్కో సంస్థ జిల్లా మేనేజర్ ప్రేమ్ తేజ, పెట్రోలియం సంస్థ ప్రతినిధులు దాన్విందర్ సింగ్, శ్రావణ్కుమార్, సెస్ మండల డైరెక్టర్ నారాయణరావు పాల్గొన్నారు. -
వర్షాలతో అప్రమత్తం
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ● టోల్ఫ్రీ నంబర్ 93986 84240 ● ఉద్యోగుల సెలవులు రద్దుసిరిసిల్ల/వేములవాడఅర్బన్: కుంభవృష్టి వర్షాలు కురిసే అవకాశం ఉన్నందునా అధికారులు, ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తున్నామని కలెక్టర్ సందీప్కుమార్ ఝా ప్రకటించారు. కలెక్టరేట్లో మంగళవారం సమీక్షించారు. జిల్లాలో లోతట్టు ప్రాంతాలలో వరదలు వచ్చే అవకాశం ఉందని.. ప్రజలను అప్రమత్తం చేసి, సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండాలని సూచించారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్నంబర్ 93986 84240 ఏర్పాటు చేసి పోలీస్, రెవెన్యూ అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్డీవో వెంకటేశ్వర్లు, రాధాబాయి, సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్రెడ్డి, డీఏవో అఫ్జల్బేగం, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, అన్వేషన్, డీపీవో షరీఫొద్దీన్, ఇరిగేషన్ ఈఈ ప్రశాంత్, మిషన్ భగీరథ ఈఈ జానకీ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు కలెక్టరేట్లో స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సంబంధిత అధికారులతో రాత్రి సమీక్షించారు. ఆగస్టు 15న శుక్రవారం నిర్వహించే స్వాతంత్య్ర వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి విద్యార్థులకు నాణ్య మైన భోజనం అందించాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా పేర్కొన్నారు. వేములవాడలోని మహా త్మా జ్యోతిబాపూలే బాలికల రెసిడెన్షియల్ విద్యాసంస్థను మంగళవారం తనిఖీ చేశారు. కిచెన్, స్టోర్ రూమ్లను పరిశీలించారు. నాణ్యమైన భోజనం పెడుతున్నారా? లేదా?, వసతి ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కొందరు టీచర్లు సక్రమంగా పాఠాలు బోధించలేకపోవడం గమనించి, పలు సూచనలు చేశారు. పాఠశాలకు అవసరమైన 30 బెంచీలను ఇతర విద్యాలయాల నుంచి తెప్పించాలని సూచించారు. ప్రిన్సిపాల్ శ్యామల, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. -
ప్రతీ కూలీకి ‘ఉపాధి’ కల్పించాలి
● డీఆర్డీవో శేషాద్రిబోయినపల్లి(చొప్పదండి): జాబ్కార్డు ఉన్న ప్రతీ కూలీకి ఉపాధిహామీ పని కల్పించాలని డీఆర్డీవో శేషాద్రి పేర్కొన్నారు. మండల పరిషత్లో మంగళవారం మండలస్థాయి ఉపాధిహామీ 16వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. డీఆర్డీవో శేషాద్రి మాట్లాడుతూ ఏడాదిలో రూ.6.28 కోట్ల పనులు జరిగినట్లు తెలిపారు. వేతనాలు రూ.2.94 కోట్లుగా, మెటీరియల్ కాంపోనెంట్ రూ.4.37 కోట్లుగా పేర్కొన్నారు. సామాజిక తనిఖీలో ఉపాధిహామీ కూలీ మస్టర్పై సరైన సంతకం ఉందా లేదా అనే అంశం.. అలాగే మెజర్మెంట్ను డీఆర్పీలు తనిఖీ చేసి నివేదిక అందజేశారన్నారు. జరిమానాలు రూ.4 వేలు, రికవరీ రూ.12,162గా గుర్తించినట్లు తెలిపారు. జెడ్పీ సీఈవో వినోద్, ఎంపీడీవో జయశీల, డీవీవో రామారావు, అంబుడ్స్పర్సన్ రాకేశ్, ఎస్సార్పీ దేవేందర్, ఏపీవో సబిత తదితరులు పాల్గొన్నారు. -
యూరియా కొరత లేదు
● మోతాదుకు మించి వాడొద్దు ● జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్ బేగంసిరిసిల్ల: జిల్లాలో యూరియా కొరత లేదని, ఒక్క రోజు అటూ.. ఇటుగా రైతులకు అందుతోందని జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్ బేగం మంగళవారం తెలిపారు. జిల్లాలో సాగు అవసరాలకు సమృద్ధిగా యూరియా నిల్వలు ఉన్నాయన్నారు. లారీల్లో సొసైటీలకు చేరేందుకు కొద్దిగా సమయం పడుతుందని వివరించారు. ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండలాల్లో కొంతమంది రాజకీయాల కోసం రైతులను రెచ్చగొడుతూ ధర్నాలు చేయిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సీజన్ మొత్తానికి 22వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా.. ఇప్పటికే జిల్లాకు 12,500 టన్నుల యూరియా వచ్చిందని స్పష్టం చేశారు. ఇంకా కావాల్సిన 11,500 టన్నుల యూరియా విడతల వారీగా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని కోరారు. యూరియా గ్రాన్యూల్స్కి బదులుగా, నానో యూరియా వాడాలని కోరారు. -
పుస్తెలమ్మినా సరిపోతలేవు
మాది తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మకాలనీ. మొదటి సంతానం నార్మల్ డెలివరీ అయింది. రెండో సంతానం కోసం కరీంనగర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తే పెద్ద ఆపరేషన్ చేశారు. తర్వాత కడుపు మధ్యలో కుట్లు ఊడిపోయి, రంద్రం పడిందని ఆసుపత్రికి వెళ్తే వారు నిర్లక్ష్యం చేశారు. దీంతో ప్రైవేట్ ఆస్పత్రిలో సంప్రదించగా ఐదు సార్లు ఆపరేషన్ చేశారు. అయినా నొప్పి తగ్గకపోవడంతో హైదరాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకున్న. అక్కడ ఆపరేషన్కు రూ.5 లక్షల వరకు ఖర్చు అవుతుందన్నారు. ఇప్పటికే ఆస్తులు అమ్మి ఆపరేషన్లకు పెట్టిన. మళ్లీ ఆపరేషన్ చేయించుకునే ఆర్థిక స్థోమత లేదు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించి ఆదుకోండి. – కొండ భవాని, ఇందిరమ్మకాలనీ -
యూరియా లేదయా!
చెప్పుల క్యూలైన్లురాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో రైతులు ఉదయం 6 గంటల నుంచి క్యూలో ఉన్నారు. తమ చెప్పులను వరుసగా పెట్టి యూరియా కోసం గంటల తరబడి ఎదురుచూశారు. ఇల్లంతకుంట, ఎల్లారెడ్డిపేట, బోయినపల్లి మండలాల్లోనూ ఎరువుల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లోనూ ఎరువుల కోసం రైతులు అనేక పాట్లు పడుతుంటే అధికారులు మాత్రం ఎరువుల కొరతే లేదని చెప్పడం విడ్డూరంగా ఉంది.ముందస్తు ప్రణాళిక కరువుకరీంనగర్, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో సాగు అయ్యే పంటల విస్తీర్ణానికి అనుగుణంగా ఎరువుల నిల్వలను ముందుగానే అందుబాటులో ఉంచుకోవాల్సిన అధికారులు విఫలమైనట్లుగా భావిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వానాకాలంలో సాగయ్యే 1,84,860 ఎకరాల పంటలకు యూరియా 3,460 టన్నులు, డీఏపీ 22,390 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అవసరం ఉండగా ముందుస్తు ప్రణాళిక లేకనే ఇప్పుడు ఈ పరిస్థితి ఎదురైందనే అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది.● కరీంనగర్ జిల్లాలో 3,34,127 ఎకరాల పంటలకు యూరియా 28,493 టన్నులు యూరియా అవసరం ఉండగా 13,732 టన్నులు మాత్రమే జిల్లాకు చేరుకుంది. పెద్దపల్లి జిల్లాలో 1.90,850 ఎకరాలలో పంటలు సాగు కాగా 32,447 టన్నులు ఎరువులు అవసరం. కానీ జిల్లాకు ఇప్పటి వరకు 17,036 టన్నులు మాత్రమే వచ్చింది. జగిత్యాల జిల్లాలో 4,22,725 ఎకరాలలో పంటలు సాగవగా 34,679 టన్నులు ఎరువులు కావాలి. కానీ ఇప్పటి వరకు చేరింది 20,729 టన్నులు మాత్రమే. అంటే ఎక్కడ కూడా అవసరంలో సగం మాత్రమే ఎరువులు జిల్లాలకు చేరాయి.రైతులు తొందరపడొద్దురైతులు తొందరపడొద్దు. అవసరాల మేరకు యూరియా ఉంది. ఇప్పుడు మార్కెట్లో 500 మెట్రిక్ టన్నుల మేరకు యూరియా సిద్ధంగా ఉంది. మొత్తం సీజన్కు అవసరమైన మేరకు తెప్పిస్తున్నాం. సిరిసిల్ల అపెరల్ పార్క్లో కలెక్టర్ చొరవతో కొత్తగా గోదాము ఏర్పాటు చేసి ఎరువులను నిల్వ చేస్తున్నాం. రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటాం. – అఫ్జల్బేగం, జిల్లా వ్యవసాయాధికారి -
కిక్కిరిసిన బస్టాండ్
వేములవాడ బస్టాండ్లో ప్రయాణికులు వేములవాడఅర్బన్: ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులు సోమవారం కిక్కిరిసిపోయారు. రాఖీపౌర్ణమి, ఆదివారం వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో పట్టణంలోని ప్రజలు పల్లెలకు చేరుకున్నారు. సోమవారం తిరుగు ప్రయాణంలో వేములవాడ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. టీఎస్ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీర్స్ అసోసియేషన్సిరిసిల్ల సర్కిల్ ఇంజినీర్ల అసోయేషన్ ప్రతినిధులు సిరిసిల్ల: టీఎస్ఆర్డబ్ల్యూఎస్ జిల్లా సర్కిల్ మిషన్ భగీరథ విభాగం ఇంజినీర్ల అసోసియేషన్ ఎన్నికలు సోమవారం జరిగాయి. అధ్యక్షుడిగా సి.విశ్వన్, ఉపాధ్యక్షుడిగా బి.అభిషేక్, ప్రధాన కార్యదర్శిగా ఎ.రామారావు, సంయుక్త కార్యదర్శిగా పి.హరిప్రియ, టెక్నికల్ కార్యదర్శిగా బి.శ్రీమాన్, మహిళా కార్యదర్శిగా ఎం.శ్రావ్యపటేల్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఈ.మధు, కోశాధికారిగా ఎన్.సాయికిరణ్ ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా పి.హారిక వ్యవహరించారు. హెచ్హెచ్ఆర్పీ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానంసిరిసిల్ల: ఆర్డీవో ఆఫీస్లో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ సందీప్కుమార్ ఝా సోమవారం ప్రకటనలో తెలిపారు. హ్యాండ్ హోల్డింగ్ రిసోర్స్ పర్సన్(హెచ్హెచ్ఆర్పీ) ఒక్క పోస్టు ఉందని పేర్కొన్నారు. జిల్లా అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు ఫారమ్ పొంది ఆన్లైన్లో ఈనెల 18లోగా దరఖాస్తు చేయాలని పేర్కొన్నారు. జిల్లాకు చెందిన బీటెక్(సీఎస్సీ), బీటెక్(ఐటీ), ఎంసీఏ చదివిన అభ్యర్థులు అర్హులని వివరించారు. కనీసం రెండేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేయాలన్నారు. ఇసుక అక్రమ రవాణా అడ్డుకోవాలి కలెక్టర్కు ఫిర్యాదు చేయడానికి వచ్చిన రామలక్ష్మణపల్లి గ్రామస్తులు సిరిసిల్లఅర్బన్: అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలని కోరుతూ ముస్తాబాద్ మండలం రామలక్ష్మణపల్లి గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్కు తరలివచ్చారు. గ్రామ శివారు నుంచి చంద్రమౌళి అనే వ్యక్తి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నాడని, జేసీబీ సహాయంతో టిప్పర్లు, ట్రాక్టర్, పికాక్లు నింపుతూ అడ్డువచ్చిన వారిని బెదిస్తున్నాడని వారు ఆరోపించారు. ఇసుక రవాణా కోసం పాక అంజయ్య పొలం నుంచి ప్రత్యేకంగా రోడ్డు నిర్మించుకున్నారన్నారు. రవీందర్, ఎల్లయ్య, రాజు, రాజశేఖర్, రాములు, మాఽ దవి, పద్మ, మౌనిక తదితరులు పాల్గొన్నారు. -
ఆస్తి అమ్ముకొనుటకు అనుమతివ్వండి
నాకు ఐదుగురు ఆడపిల్లలు, ఒక్క కొడుకు కొండూరి శ్రీనివాస్. 20 ఏళ్ల క్రితం పెండ్లి చేశాను. కొద్ది రోజులకే వేరు పడ్డారు. నాకున్న కిరాణ దుకాణం, వేములవాడలో మూడున్నర గుంటల స్థలం, రూ.50వేల డిపాజిట్, రూ.16 లక్షల ఎల్ఐసీ ఇన్సూరెన్స్లు ఇచ్చాను. అప్పటి నుంచి నన్ను, నా భార్య పోషణ చూడడం లేదు. నా పేరిట ఉన్న భూములను మా జీవనోపాధి కోసం అమ్ముకోవాలని చూస్తే నా కొడుకు అడ్డు పడుతున్నాడు. కాబట్టి వయోవృద్ధుల పోషణ చట్టం కింద అమ్ముకొనుటకు అనుమతి ఇవ్వండి. – కొండూరి రాజమౌళి, వేములవాడ -
కాజీపేట – బల్హార్ష రైలుకు ఆదరణ కరువు
రామగుండం: కాజీపేట – బల్హర్ష మధ్య నడిచే బల్హర్ష ఎక్స్ప్రెస్ రైలు అర్ధరాత్రి ప్రారంభమవుతోంది. వేకువజామున గమ్యస్థానం చేరుకుంటోంది. దీంతో ప్రయాణికులు లేక బోగీలు బోసిపోయి కనినిపస్తున్నాయి. కాజీపేటలో రాత్రి 10.50 గంలకు ప్రారంభమైతే.. ఉప్పల్కు రాత్రి 11.09 గంటలకు, జమ్మికుంటకు రాత్రి 11.18 గంటలకు, ఓదెలకు రాత్రి గం.11.32 గంటలకు, పెద్దపల్లికి రాత్రి 11.41గంటలకు, రాఘవాపురానికి రాత్రి 11.47 గంటలకు, రామగుండానికి రాత్రి 11.54గంటలకు, బల్హర్షకు వేకువజామున 3.10గంటలకు చేరుకుంటోంది. తిరుగు ప్రయాణంలో బల్హార్షలో వేకువజామున 3.50గంటలకు ప్రారంభమై రామగుండానికి ఉదయం 5.47గంటలకు, పెద్దపల్లికి ఉదయం 6.15 గంటలకు, ఓదెలకు ఉదయం 6.34లకు, జమ్మికుంటకు ఉదయం 7.20గంటలకు కాజీపేటకు ఉదయం 8.50 గంటలకు చేరుకుంటోంది. దీనికి అర్ధగంట ముందే భాగ్యనగర్ నడవడంతో హైదరాబాద్ మార్గంలో ప్రయాణించేవారంతా అందులోనే వెళ్తున్నారు. దీంతో బల్హర్ష రైలుకు ప్రయాణికుల నుంచి ఆదరణ ఉండడంలేదు. మరోవైపు.. అర్ధరాత్రివేళ రాకపోకలు సాగించే ఈ రైలులో ప్రయాణించే కొద్దిమంది మహిళా ప్రయాణికులకు కూడా భద్రత కరువైంది. వారిరక్షణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్ వస్తోంది. రాత్రివేళలోనే ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభం వేకువజామున గమ్యస్థానం చేరిక పదిమంది కూడా ప్రయాణించని వైనం తిరుగు ప్రయాణంలోనూ స్పందన కరువు రాకపోకల సమయాలు మార్చాలని డిమాండ్ సికింద్రాబాద్ వరకు పొడిగించాలని విన్నపాలు -
వాగుల్లో జలధారలు
సిరిసిల్ల: వర్షాకాలం సీజన్లో సమృద్ధిగా వానలు కురువలేదు. జిల్లాలోని చెరువులు, కుంటల్లోకి పెద్దగా నీరు చేరలేదు. రెండు, మూడు రోజులుగా జిల్లాలో అడపాదడపా కురిసిన వానలకు సిరిసిల్ల మానేరు, వేములవాడ మూలవాగుల్లో నీటిపాయలు సాగుతున్నాయి. నర్మాల ఎగువ మానేరు, నిమ్మపల్లి మూలవాగు జలాశయాలు అలుగు పారలేదు.. కానీ పడువాటు నీళ్లతో మానేరు, మూలవాగుల్లో సోమవారం నీటి ధారలు సాగాయి. వాగుల్లో నీరు పారితే భూగర్భ జలాలు అభివృద్ధి చెందుతాయి. మరో రెండు, మూడు గట్టి వానలు పడితే జలాశయాలు నిండి వాగులు పారేందుకు ఈ నీటిధారలు సూచిక. పడువాటు నీటితోనే వాగుల్లో జలసిరులు పరుగు తీయడం రైతుల్లో ఆనందాన్ని నింపింది. జిల్లాలోని ప్రధానమైన వాగుల్లో సోమవారం కనిపించిన దృశ్యాలు ఇవీ.. -
ఆలకించి.. ఆదేశించి
ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయండి తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్కు చెందిన నాకు గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూం మంజూరైంది. అప్పులు చేసి స్లాబ్ లెవల్ వరకు నిర్మించిన. అప్పటి నుంచి అద్దె ఇంట్లో ఉంటూ బిల్లు కోసం తిరిగాను. బిల్లు రాలేదు. ప్రభుత్వం మారిపోయింది. కనీసం ప్రస్తుత ప్రభుత్వమైన ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తే అసంపూర్తిగా ఉన్న ఇంటిని పూర్తి చేసుకుంటాను. – బాలసాని లచ్చవ్వ, అంకుసాపూర్ నా కూతురిని ఆదుకోండి మాది ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్. నా కూతురు మిడిదొడ్డి సాత్విక పదోతరగతి చదువుతుంది. కొద్ది రోజు లుగా వెన్ను పూస వ్యాధితో బాధపడుతోంది. ఆపరేషన్కు రూ.3లక్షలు అవుతాయని వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వం ద్వారా నా కూతురు వైద్యం కోసం ఆర్థిక సహాయం చేసి ఆదుకోండి. – మిరుదొడ్డి భాగ్య, రాచర్ల బొప్పాపూర్ -
సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష
వేములవాడ: నియోజకవర్గంలోని ప్రాజెక్టుల పురోగతిపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సోమవారం హైదరాబాద్లో నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షించారు. కలికోట సూరమ్మ చెరువు రిజర్వాయర్ కలికోట నుంచి కుడి, ఎడమ కాల్వల నిర్మాణ పనులు, కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్ ఎడమ కాలువ కోసం భూసేకరణ, వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి ప్రాజెక్టు పనులు, కోనరావుపేట మండల పరిధి లోని లచ్చాపేటతండా రిజర్వాయర్ కాలువ పనులు, చందుర్తి మండల పరిధిలోని ఆశిరెడ్డిపల్లి కొచ్చెరువు, సనుగుల ఎర్ర చెరువు పటేల్ చెరువులోకి నీటిని నింపే ఏర్పాట్లపై చర్చించారు. ప్రాధాన్యత ను దృష్టిలో పెట్టుకుని, రైతులకు సాగునీరు సకా లంలో అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాజెక్టుల పనుల పురోగతిని సమీక్షిస్తూ, ఎలాంటి జాప్యం లేకుండా నాణ్యతతో పూర్తి చేయాలన్నారు. రైతుల అవసరాలను దృష్టిలో పె ట్టుకుని మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సీఈ సుధాకర్రెడ్డి, ఈఈ సంతు ప్రకాశ్, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్లో చర్చించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరైన నీటిపారుదల శాఖ అధికారులు -
పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి
● కలెక్టర్ సందీప్కుమార్ ఝా తంగళ్లపల్లి(సిరిసిల్ల): పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా సూచించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు సోమవారం నులిపురుగుల నివారణ కోసం ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ చేతులు పరిశుభ్రంగా కడుక్కోకపోవడం, పాదరక్షలు లేకుండా మట్టిలో ఆడుకోవడం, బహిరంగ మలవిసర్జన చేయడం వంటి వాటితో నులిపురుగులు సంక్రమిస్తాయన్నారు. నులి పురుగులు కడుపులో చేరడంతో కడుపునొప్పి, వికారం, వాంతులు, విరోచనాలు, ఆకలి లేకపోవడం, బలహీనత, రక్తహీనత, పోషకాహార లోపం ఏర్పడి శారీరక మానసిక అభివృద్ధి మందగిస్తుందన్నారు. పిల్లలకు తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు వేయాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎస్.రజిత, హెచ్ఎం సిలుముల శంకర్, తంగళ్లపల్లి పీహెచ్సీ వైద్యురాలు దీప్తి, ఏఎన్ఎంలు ప్రమీల, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. లక్ష్యానికి మించి ట్యాక్స్ వసూలు● జిల్లా రవాణాశాఖ అధికారి లక్ష్మణ్ సిరిసిల్ల: జిల్లాలో రవాణాశాఖ లక్ష్యానికి మించి ట్యాక్స్ వసూలు చేసిందని జిల్లా రవాణాశాఖ అధికారి లక్ష్మణ్ సోమవారం తెలిపారు. జిల్లాలో ఈ ఏడాది 293 కేసులు నమోదు చేసి రూ.96.96 లక్షలు వసూలు చేశామని వివరించారు. జిల్లాకు రవాణాశాఖ రూ.64 లక్షల లక్ష్యం నిర్ణయించగా.. 151 శాతం మేరకు ట్యాక్స్ వసూలు చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఇంకా ట్యాక్స్ చెల్లించని సరుకు రవాణా వాహనాలు, ట్రాక్టర్ ట్రైలర్లు, ఇతర వాహనాలు 5,088 ఉన్నట్లు వివరించారు. వాహన యజమానులు స్వచ్ఛందంగా చెల్లిస్తే ఎలాంటి జరిమానా ఉండదని, రవాణా శాఖ అధికారులు పట్టుకుంటే 200 శాతం జరి మానా చెల్లించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. మోటార్ వాహన తనిఖీ అధికారి వంశీధర్, ఆఫీస్ నిర్వాహకురాలు కల్పన, సాంకేతిక సహా యకులు కరుణాకర్, ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి
కరీంనగర్రూరల్: బొమ్మకల్లోని ట్రినిటి ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం ఎడ్యూనెట్ ఫౌండేషన్ ద్వారా సాప్ కార్యక్రమాన్ని ఎడ్యునెట్ ప్రాజెక్టు మేనేజరు అఫ్సర్ పాషా, ప్రోగ్రాం మేనేజర్ దేవీసేన్ ప్రారంభించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ట్రినిటి విద్యాసంస్థల వ్యవస్థాపకులు దాసరి మనోహర్రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఎడ్యునెట్ ఫౌండేషన్ ద్వారా అందించే సాప్ కోర్స్ను ఎంబీఏ విద్యార్థులు సద్వి నియో గం చేసుకోవాలన్నారు. చైర్మన్ దాసరి ప్ర శాంత్రెడ్డి, ప్రిన్సిపాల్ నాగేంద్రసింగ్, వైస్ ప్రిన్సిపాల్ కిశోర్, ఏవో రాజశేఖర్రెడ్డి, హెచ్వోడీ ప్రవీణ్కుమార్, సంతోషి, రజితరెడ్డి, ఇలియాస్అలీ, అజారుద్దీన్, సుప్రియ పాల్గొన్నారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతిముస్తాబాద్(సిరిసిల్ల): ముస్తాబాద్ మండలం గూడెంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఎస్సై గణేశ్ తెలిపిన వివరాలు. గూడెంకు చెందిన పిట్ల దేవయ్య(60) సోమవారం ఉదయం ఇంట్లో మృతిచెంది ఉన్నాడు. దేవయ్య ముఖం, శరీరంపై గాయాలు ఉన్నాయి. మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సోదరుడు లస్మయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు సీఐ మొగిలి, ఎస్సై గణేశ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఎస్సై తెలిపారు. దేవయ్య ఆయన కుమారుడు చందు తరచూ గొడవ పడేవారని, అర ఎకరం భూమి విషయంలో తండ్రీకొడుకుల మధ్య వివాదం తలెత్తిందని తెలిపారు. ఆ కోణంలో చందును ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. జ్వరంతో యువకుడు..ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని రాచర్లగుండారం గ్రామానికి చెందిన లకావత్ శివ(23) జ్వరంతో బాధపడుతూ సోమవారం మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు. రాచర్లగుండారం గ్రామానికి చెందిన లకావత్ జయరాం–సోబి దంపతుల కుమారుడు శివ చిన్నతనం నుంచి మూర్ఛవ్యాధితో బాధపడుతుండే వాడు. గత నాలుగు రోజు లుగా జ్వరంతో బాధపడుతున్న శివకు ఆర్ఎంపీల వద్ద వైద్యం అందించారు. జ్వరం తగ్గకపోగా.. పరిస్థితి విషమించి మండల కేంద్రంలోని ప్రైవే ట్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. డిష్ రిపేర్ చేస్తూ ఒకరు.. సారంగాపూర్: మండలంలోని పెంబట్ల గ్రామంలో ఓ ఇంటిపై డిష్ రిపేర్ చేస్తూ.. కిందపడి పల్లికొండ మహేశ్ (40) మృతిచెందిన సంఘటన చోటుచేసుకుంది. ఎస్సై గీత కథనం ప్రకారం.. జగిత్యాలలోని పోచమ్మవాడకు చెందిన మహేశ్ పెంబట్లలోని చొప్పరి రాజేందర్ ఇంట్లో డిష్ రాకపోవడంతో మహేశ్ వైర్ను సరిచేసేందుకు ఇంటిపైకి ఎక్కాడు. మహే్శ నిలబడి ఉన్న సజ్జ విరిగి కింద పడిపోయాడు. మహే్శ తల బండరాయిపై పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య సంధ్యారాణి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మత్తుకు అలవాటై.. ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి(సిరిసిల్ల): జల్సాలకు అలవాటుపడ్డ యువకులు క్రమంగా గంజాయి మత్తుకు అలవాటు పడ్డారు. డబ్బుల కోసం గంజాయి విక్రయిస్తుండగా పోలీసులకు చిక్కారు. ఎల్లారెడ్డిపేట సీఐ శ్రీనివాస్గౌడ్ తెలిపిన వివరాలు.. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పందిమడుగుకు చెందిన మలావత్ రామ్కుమార్, వీర్నపల్లి మండలం సీతారాంనాయక్ తండాకు చెందిన బానోత్ అజయ్కుమార్, అజ్మీరా సాయివిశాల్ జల్సాలకు అలవాటుపడ్డారు. ఈక్రమంలోనే గంజాయికి అలవాటుపడ్డారు. డబ్బు సంపాదించేందుకు గంజాయిని తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు విక్రయించాలనుకున్నారు. వీర్నపల్లి మండలం రంగంపేటలోని జంపన్న చెరువు వద్ద గంజాయి విక్రయించేందుకు రాగా పోలీసులు చాకచక్యంగా పట్టుకుని కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. వారి నుంచి 50 గ్రాముల గంజాయి, పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నారు. వీరిని పట్టుకోవడం చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై లక్ష్మణ్, పోలీస్ సిబ్బందిని సీఐ అభినందించారు. ద్విచక్ర వాహనం నుంచి పడిపోయిన బంగారం బ్యాగుజగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం హన్మాజీపేట–పొరండ్ల శివారులో ద్విచక్రవాహనంపై వెళ్తున్న భార్యాభర్తల వద్దనున్న బంగారం బ్యాగు పడిపోయిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. రాయికల్ మండలం వీరాపూర్కు చెందిన స్వామిరెడ్డి తన భార్యతో కలిసి సోమవారం జగిత్యాల మార్కెట్లో కూరగాయలు కొనుక్కుని వెళ్తుండగా వారి వద్దనున్న బంగారం బ్యాగు హన్మాజీపేట–పొరండ్ల మధ్యలో పడిపోయింది. పొరండ్లకు వెళ్లేసరికి బంగారు బ్యాగుతోపాటు, సెల్ఫోన్ కన్పించకపోవడంతో రోడ్డు వెంట పరిశీలించుకుంటూ వచ్చినా బ్యాగు దొరకలేదు. బాధితులు రూరల్ పోలీస్ష్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో పరిశీలిస్తున్నారు. -
ఊరట...ఉపాధి
● స్థానికంగానే మిర్చినారు పెంపకం ● నాడు గుంటూరు.. నేడు ఉప్పట్ల ● వంద ఎకరాలకు సరిపడా సాగు ● అన్నదాతలకు తప్పిన రవాణా భారం ● పది మంది కూలీలకు ఉపాధి అవకాశం మంథనిరూరల్: ఒకరైతు ఆలోచన అనేకమంది అన్నదాతలకు ఊరటనిస్తోంది. ప్రధానంగా ఇతర ప్రాంతాల నుంచి నారు తీసుకొచ్చి పంట సాగు చేసేవారికి ఎంతోప్రయోజనం కలిగిస్తోంది. మరికొందరు కూలీలకూ ఊపాధి చూపిస్తోంది. ఒకప్పుడు గుంటూరు వెళ్లి మిర్చినారు తీసుకువచ్చే రైతులకు ఇప్పడు తమ స్వగ్రామంలోనే నారు పెంచుకునే అవకాశం కల్పించాడో రైతు. ఉప్పట్ల గ్రామానికి చెందిన రైతు పోగుల తిరుపతి ఆరేళ్లుగా మిర్చినారు సాగు చేస్తూ రైతులపై భారం తగ్గించేలా చేశాడు. గ్రామ శివారులోని కొంత భూమిని కౌలుకు తీసుకుని డ్రిప్ పద్ధతిన నారు సాగు చేస్తున్నాడు. ఒకప్పుడు గుంటూరు వెళ్లి.. ఉప్పట్ల గ్రామంలో అత్యధికంగా మిర్చి సాగు చేస్తుంటారు. ఇందుకోసం రైతులు ఏపీలోని గుంటూరుకు వెళ్లి ఆండ్రాడ్, ఎండ్పై లాంటి రకాల నారును తీసుకువచ్చి ఇక్కడ సాగు చేసేవారు. ప్రస్తుతం గ్రామంలోనే మిర్చినారు సాగు చేసుకునే అవకాశం లభించడంతో ఉప్పట్ల, గుంజపడుగు, విలోచవరం, పోతారంతోపాటు సమీప గ్రామాల మిర్చి రైతులకు ఊరట లభించింది. తగ్గిన భారం.. నాణ్యమైన రకం మిర్చిసాగు చేసే రైతులు గుంటూరు వెళ్లి నారు తీసుకురావడం తలకు మించిన భారమయ్యేది. ఉప్పట్లలోనే రైతులు కలిసి మిర్చినారు సాగు చేసుకోవడంతో అదనపు భారం తగ్గుతోంది. నాణ్యమైన రకాన్ని ఎంచుకునే అవకాశం లభించింది. గుంటూరు నుంచి తీసుకువచ్చే నారు ఎలాంటిదో తెలియక రైతులు అనేకసార్లు నష్టపోయిన సందర్భాలూ ఉన్నాయి. రైతుకు ఇష్టమైన విత్తనాలను.. మిర్చి సాగుచేసే రైతులు తమకు ఇష్టమైన విత్తనాలను తీసుకువచ్చి ఇస్తే వాటిని అలికి నారు అయ్యే వరకు పెంచుతాడు. ఇందుకు ప్యాకెట్కు రూ.300 నుంచి రూ.400 వరకు చార్జీ తీసుకుంటాడు. సుమారు 45 నుంచి 50రోజుల వరకు మిర్చినారు నాటే స్థాయికి చేరుతుంది. ఇలా విత్తనాలను అలికి నారును ఇస్తుండటంతో స్థానిక రైతులకు ఉపశమనం లభించినట్లయింది, ఆరేళ్లుగా నారు పెంచుతున్న రైతులకు ఇష్టమైన వంగడాలు లేకపోవడంతో వారే విత్తనాలు తీసుకవస్తే అలికి నారు రెడీ చేసి ఇస్తా. అందుకయ్యే కూలీల ఖర్చులు తీసుకుంటా. ఉప్పట్లతో పాటు ఇతర ప్రాంతాల రైతులు ఇక్కడికే వచ్చి విత్తనాలు ఇచ్చి వెళ్తుంటారు. నాతో పాటు మరో పది మంది కూలీలకు ఉపాధి లభిస్తుంది. – పోగుల తిరుపతి, రైతు, ఉప్పట్ల ట్రాన్స్పోర్టు ఖర్చులు తగ్గాయి మిర్చినారు కోసం ఏటా గుంటూరు వెళ్లే వాళ్లం. ఇందుకోసం మూడు, నాలుగు రోజుల సమయం పట్టేది. ఆ నారు నాణ్యత కూడా తెలిసేదికాదు. దిగుబడిపై ఆశలు ఉండేవికావు. తిరుపతి ఆలోచనతో ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, సమయం మిగులుతోంది. నాలుగు ఎకరాలకు సరిపడా మిర్చినారు సాగు చేయిస్తున్న. – ముచ్చకుర్తి శేఖర్, రైతు, గుంజపడుగు -
ఆ తండ్రికదే చివరి వేడుక
కరీంనగర్రూరల్: ఆ తండ్రికదే చివరి వేడుక అయింది.. కొడుకు పుట్టినరోజునే గుండెపోటుతో మృతిచెందడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. రాఖీపండుగ, కొడుకు పుట్టినరోజు, కుటుంబసభ్యుల వివాహం కోసం సింగాపూర్ నుంచి మూడు రోజులక్రితమే వచ్చి అనూహ్యరీతిలో మృత్యువాత పడడం గ్రామస్తులను కలచివేసింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. కరీంనగర్ మండలం చామనపల్లికి చెందిన దావు మధుకర్రెడ్డి(46) ఉపాధి నిమిత్తం సింగాపూర్ వెళ్లాడు. మూడురోజులక్రితం గ్రామానికి వచ్చిన ఆయన శనివారం కుటుంబసభ్యులతో కలిసి రాఖీపండుగ జరుపుకున్నాడు. ఆదివారం కొడుకు సాత్విక్రెడ్డి పుట్టినరోజు వేడుకల అనంతరం రాత్రి విందులో పాల్గొన్న మధుకర్రెడ్డికి ఆకస్మికంగా గుండెపోటురావడంతో కుటుంబసభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రాఖీ పండుగ, కొడుకు పుట్టినరోజు, కుటుంబసభ్యుల వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు సింగాపూర్ నుంచి వచ్చిన మధుకర్రెడ్డి మృతిచెందడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. సింగాపూర్ నుంచి రాకపోయినా బతికేవాడంటూ విలపించారు. మృతుడికి భార్య స్రవంతి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొడుకు పుట్టినరోజున గుండెపోటుతో మృతి మూడురోజుల క్రితం సింగాపూర్ నుంచి రాక -
అది చిరుత కాదు.. హైనా
ధర్మపురి: ధర్మపురిలో మూడు రోజులుగా చిరుత సంచరిస్తోందని వస్తున్న వార్తల్లో నిజం లేదని, అది చిరుత కాదని, హైనా అని ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ శ్రీనాథ్ తెలిపారు. పట్టణంలోని ఫారెస్టు రేంజ్ కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. ధర్మపురి పరిసర ప్రాంతంలో చిరుతపులి కనిపించిందని కొందరు జిల్లా అధికారులకు సమాచారం అందించారని, దీంతో ఫారెస్టు సిబ్బందితో సమీప పొలాలు, చెట్లపొదల మాటున గాలింపు చేపట్టామని, ఓ జంతువు పాదముద్ర లభించగా.. అది చిరుత పాదముద్రలని భావించి హైదరాబాద్ ఫోరెన్సికు పంపించామని తెలిపారు. అక్కడ చిరుత పా దముద్రలు కావని, హైనా అడుగులుగా గర్తించారని తెలిపారు. హైనాతో మనుషులకు ఎలాంటి ప్రాణనష్టమూ జరగదని, మేకలు, గొర్రెల కోసం వస్తుంటుందని తెలిపారు. ఆయన వెంట డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సదాశివుడు, సిబ్బంది తదితరులున్నారు. కాపర్వైర్ దొంగల అరెస్టు ఎల్కతుర్తి: పొలాల్లోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి అందులోని కాపర్ వైరును అపహరిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్రెడ్డి తెలిపారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ పోలీస్ స్టేషన్లో సోమవారం విలేకరుల సమావేశంలో ఏసీపీ వివరాలు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రానికి చెందిన బండి కుమారస్వామి, బండి సతీశ్ కొంతకాలంగా ఎల్కతుర్తి, వేలేరు, భీమదేవరపల్లి, సైదాపూర్, హుజూరాబాద్, శంకరపట్నం ప్రాంతాల్లో రాత్రివేళల్లో 27 ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి వాటిలోని కాపర్ వైర్ను అపహరించారు. దానిని అమ్మగా వచ్చిన సొమ్ముతో జల్సాలు చేస్తున్నారు. ఈక్రమంలో ముల్కనూర్ ఎస్సై సాయిబాబు తన సిబ్బందితో సోమవారం భీమదేవరపల్లి క్రాస్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు అనుమానాస్పదంగా ద్విచక్రవాహనంపై వెళ్తుండగా అడ్డుకున్నారు. వారి వద్ద కాపర్వైరు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టేందుకు ఉపయోగించే వస్తువులు ఉండడాన్ని గమనించి అదుపులోకి తీసుకున్నారు. విచారించగా సులువుగా డబ్బులు సంపాదించేందుకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలోని కాపర్ వైర్ను దొంగిలిస్తున్నట్లు ఒప్పుకున్నారు. దొంగిలించిన కాపర్ వైర్ను ముల్కనూర్ గ్రామానికి చెందిన రుద్రాక్ష తిరుపతికి అమ్మినట్లు విచారణలో తేలింది. వెంటనే తిరుపతిని కూడా అదుపులోకి తీసుకున్నారు. గతంలో నిందితులపై 2012 నుంచి 53 కేసులు నమోదైనట్లు ఏసీపీ వెల్లడించారు. కాగా, నిందితుల నుంచి రూ.2.50లక్షల విలువ గల 250 కిలోల కాపర్ వైర్, మోటర్ సైకిల్ను స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. సీఐ పులి రమేష్, ఎస్సైలు సాయిబాబు, ప్రవీణ్కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
అగ్ని ప్రమాదంతో రూ.1.67కోట్ల నష్టం
మెట్పల్లి: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ గో దాంలో జరిగిన అగ్ని ప్రమాదంతో భారీ నష్టం సంభవించింది. ఈ గోదాంలో సివిల్ సప్లయ్ శాఖ గన్నీ సంచులను నిల్వ ఉంచిన సంగతి తెలిసిందే. ఆ శాఖకు చెందిన రూ.97లక్షల విలువైన 9,07, 527 పాత గన్నీ సంచులు దగ్ధమయ్యాయి. అలాగే మంటల ధాటికి 2వేల టన్నుల గోదాం ధ్వంసమైంది. దీనివల్ల రూ.70వేల నష్టం వాటిల్లినట్లు మార్కె ట్ అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంపై ఇరు శాఖలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఆదివారం ఉదయం పది గంటలకు చెలరేగిన మంటలు.. సోమవారం రాత్రి వరకు కూడా అదుపులోకి రాకపోవడం గమనార్హం. టెండర్లో జాప్యం..భారీ నష్టం ● సివిల్ సప్లయ్ శాఖ గన్నీ సంచులను 2018లో ఈ గోదాంలో నిల్వ చేసింది. ఇందుకు గాను మార్కెటింగ్ శాఖకు ప్రతినెలా రూ.38వేలు చెల్లిస్తున్నట్లు తెలిసింది. ● ఆ సంచులను ఎక్కువ కాలం నిల్వ ఉంచకుండా టెండర్ ద్వారా విక్రయించాలి. ఈ విషయంలో ఆ శాఖ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. ● తద్వారా అద్దె బకాయిలు పేరుకుపోయాయి. ప్రమాదంలో సంచులన్నీ కాలి బూడిదై భారీ నష్టానికి దారి తీసింది. భద్రతపై మార్కెటింగ్ శాఖ నిర్లక్ష్యం ● గోదాంల భద్రత విషయంలో మార్కెటింగ్ శాఖ నిర్లక్ష్యం చూపుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ● మార్కెట్ కార్యాలయానికి దూరంగా ఉన్న ఈ గోదాంల ఆవరణలో సీసీ కెమెరాలు లేకపోవడంతో పాటు సిబ్బంది పర్యవేక్షణ కొరవడడంతో ప్రతిరోజు వాటి వద్ద బయటి వ్యక్తులు పేకా ట ఆడడం, మద్యం సేవించడం చేస్తున్నారు. ● గోదాంలో విద్యుత్ సదుపాయం లేకపోవడంతో షార్ట్ సర్క్యూట్కు అవకాశముండదు. ● అక్కడ పేకాట, మద్యం సేవించే వ్యక్తుల్లో ఎవరైనా ఈ ప్రమాదం చోటు చేసుకునే చర్యలకు పాల్పడ్డారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రమిస్తున్న ఐదు శాఖల అధికారులు ● గోదాంలో చెలరేగిన మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురావడానికి పోలీస్, రెవెన్యూ, సివిల్, మార్కెటింగ్, అగ్నిమాపక శాఖల అధికారులు సోమవారం ఉదయం నుంచి అక్కడే ఉండి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ● ఆ గోదాం పక్కనే మరో మూడు గోదాంలు ఉండడమే కాకుండా నివాస గృహాలు ఉన్నాయి. ● మంటలు ఎగిసిపడినా.. వాటికి వ్యాపించకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారు. ● గోదాంకు మూడు వైపులా ఉన్న గోడకు పలు చోట్ల పెద్ద రంధ్రాలు చేశారు. అందులో నుంచి పెద్ద సంఖ్యలో సంచులను బయటవేసి మంటల ఉధృతిని కొంతమేర తగ్గించారు. ● రాత్రివేళలో కూడా మంటలను ఆర్పేందుకు అక్కడ తగిన ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం వరకు పూర్తిగా ఆదుపులోకి వచ్చే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. రెండోరోజూ అదుపులోకి రాని మంటలు పరిశీలించిన కలెక్టర్ సత్యప్రసాద్పరిశీలించిన కలెక్టర్ అగ్ని ప్రమాదం జరిగిన గోదాంను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్బంగా అక్కడ చేపట్టిన చర్యల గురించి తెలుసుకున్నా రు. సాధ్యమైనంత తొందరంగా మంటలను అదుపులోకి తీసుకరావడానికి ప్రయత్నించాలని అధికా రులకు సూచించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్దన్, డీఎస్పీ రాములు, అర్డీఓ శ్రీనివా స్, సివిల్ సప్లయ్ శాఖ డీఎం జితేంద్రప్రసాద్, అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి సైదులు, సీఐ అనిల్కుమార్, ఆయా శాఖల సిబ్బంది ఉన్నారు. -
రెండు ఆటోలు ఢీకొని విద్యార్థులకు గాయాలు
జగిత్యాలక్రైం/సారంగాపూర్: జగిత్యాల రూరల్ మండలం గుల్లపేట, సారంగాపూర్ మండలం అర్పపల్లి శివారుల్లో ఓ ప్రైవేటు పాఠశాలకు విద్యార్థులను తీసుకెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న మరో ఆటో ఢీకొనడంతో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మరో నలుగురు స్పల్పంగా గాయపడ్డారు. సారంగాపూర్ మండలం రేచపల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాలకు నిత్యం జగిత్యాల రూరల్ మండలం గుల్లపేటకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఆటోలో వెళ్లి వస్తుంటారు. ఎప్పటిలాగే పాఠశాలకు వెళ్తుండగా గుల్లపేట, అర్పపల్లి శివారులో ఎదురుగా వస్తున్న మరో ఆటో ఢీకొంది. ఈ ఘటనలో గుల్లపేటకు చెందిన గంగాధర సిద్దార్థ, పాలెపు శివానీ చేతులు విరిగాయి. వీరితోపాటు గాయపడిన విద్యార్థులను జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులతో వెళ్తున్న ఆటోను ఢీకొన్న ఆటో డ్రైవర్ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. రూరల్ సీఐ సుధాకర్, సారంగాపూర్ ఎస్సై గీత చికిత్స పొందుతున్న విద్యార్థుల వద్దకు వెళ్లి సంఘటనపై ఆరా తీశారు. -
No Headline
మాది తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మకాలనీ. మొదటి సంతానం నార్మల్ డెలివరీ అయింది. రెండో సంతానం కోసం కరీంనగర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తే పెద్ద ఆపరేషన్ చేశారు. తర్వాత కడుపు మధ్యలో కుట్లు ఊడిపోయి, రంద్రం పడిందని ఆసుపత్రికి వెళ్తే వారు నిర్లక్ష్యం చేశారు. దీంతో ప్రైవేట్ ఆస్పత్రిలో సంప్రదించగా ఐదు సార్లు ఆపరేషన్ చేశారు. అయినా నొప్పి తగ్గకపోవడంతో హైదరాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకున్న. అక్కడ ఆపరేషన్కు రూ.5 లక్షల వరకు ఖర్చు అవుతుందన్నారు. ఇప్పటికే ఆస్తులు అమ్మి ఆపరేషన్లకు పెట్టిన. మళ్లీ ఆపరేషన్ చేయించుకునే ఆర్థిక స్థోమత లేదు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించి ఆదుకోండి. – కొండ భవాని, ఇందిరమ్మకాలనీ -
రండి ‘నులి’పేద్దాం
● నేడు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ సిరిసిల్ల: కంటికి కనిపించని నులిపురుగులు పిల్లలను బలహీనపరుస్తాయి. ఇది పిల్లల రక్తహీనతకు, అజీర్తి, వాంతులు, విరోచనాలకు కారణమవుతుంటాయి. ఏడాది వయసు పిల్లల నుంచి 19 ఏళ్ల యువకుల వరకు కడుపులో పెరిగే నులిపురుగులు పీల్చి పిప్పి చేస్తుంటాయి. బడికెళ్లేందుకు సిద్ధమైన పిల్లలు అప్పుడే కడుపునొప్పి అంటూ తల్లడిల్లిపోతుంటారు. నులిపురుగుల నివారణకు ప్రభుత్వం ఏటా రెండు సార్లు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేస్తుంది. జిల్లా వ్యాప్తంగా సోమవారం నులి పురుగుల నిర్మూలనకు మాత్రలు వేస్తున్నారు. నులిపురుగుల్లో రకాలు కడుపులో పెరిగే నులిపురుగుల్లో అనేక రకాలు ఉన్నాయి. వాటిలో బద్దె, నట్టలు, కొంకి, కొరడా, ఏలిక పాములు, దారపు, నీరుగడ్డ వంటి రకాలు ఉంటాయి. ఇవి ఎక్కువగా చిన్నారుల పొట్టల్లో స్థావరం ఏర్పరచుకుంటాయి. బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయడం, కలుషిత ఆహారం తినడం, ఈగలు వాలుతూ దుమ్ముధూళి పడిన పదార్థాలు తినడం, పిల్లలు మట్టిలో పాదరక్షలు లేకుండా ఆడుకున్నప్పుడు, చేతులు కడుక్కోవడం మరిచిపోయినప్పుడు, ఆకుకూరలు, కూరగాయలను శుభ్రమైన నీటితో కడుగకపోవడం, తినే ముందు, తిన్న తరువాత చేతులను శుభ్రంగా కడుగకపోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడంతో వంటి కారణాలతో నులిపురుగుల లార్వాలు జీర్ణకోశంలోకి ప్రవేశిస్తాయి. పేగు పురుగులు గుడ్లు శరీరంలో పెరిగి అనారోగ్యం కలిగిస్తాయి. ఏం జరుగుతుంది నులిపురుగులు కడుపులో చేరడంతో కడుపునొప్పి, వాంతులు, విరోచనాలు, ఆకలి లేకపోవడం, రక్తహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎక్కువ సార్లు మూత్ర విసర్జన సమస్య, బరువు తగ్గడం, చదువు పై ఏకాగ్రత లేకపోవడం, ఎదుగుదల తగ్గడం, మలంలో రక్తం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నివారణ చర్యలు భోజనానికి ముందు, ఆటలు ఆడిన తరువాత, మలవిసర్జన తరువాత కాళ్లు, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. పరిశుభ్రతను పాటించడంతోపాటు కాచి చల్లార్చిన నీటిని తాగాలి. తీపి పదార్ధాలు పిల్లలకు దూరంగా ఉంచాలి. మలబద్ధకం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పీచుపదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. మాత్రలు వాడే విధానం మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు వేయాలి. అనారోగ్యంగా ఉన్న వారు పూర్తిగా కోలుకున్న తరువాతే మాత్రలు వేసుకోవాలి. పుట్టుకతో గుండె సంబంధ వ్యాధులు ఉన్నవారికి, ఉదర సంబంధ కేన్సర్ ఉన్న వారికి, కాలేయ వ్యాధిగ్రస్తులకు ఈ మాత్రలు వేయవద్దు. ఒకటి నుంచి రెండేళ్లలోపు పిల్లలకు సగం గోళీ, రెండు నుంచి మూడేళ్ల పిల్లలకు ఒక్క మాత్రను పొడి చేసి నీటిలో కలిపి తాగించాలి. 3 నుంచి 19 ఏళ్లలోపు వారికి గోలిని నమిలిమింగేలా చూడాలి. జిల్లాలో మాత్రల పంపిణీ గ్రామాలు : 260 మున్సిపాలిటీలు : సిరిసిల్ల, వేములవాడ అంగన్వాడీ కేంద్రాలు : 587 పిల్లలు : 30,475 పాఠశాలలు : 626 పిల్లలు : 77,921 జూనియర్ కాలేజీలు : 47 పిల్లలు : 7,664 మాత్రలు వేసే సిబ్బంది : 168 సహాయక ఆశవర్కర్లు : 456తప్పనిసరిగా వేసుకోవాలి నులిపురుగు నివారణకు ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా వేసుకోవాలి. కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆదేశాలతో జిల్లాలో మాత్రల పంపిణీకి ఏర్పాట్లు చేశాం. సోమవారం జిల్లా అంతటా వైద్యసిబ్బంది మాత్రలు వేస్తారు. ఎవరైనా మిగిలిపోతే ఈనెల 18న(సోమవారం) మ్యాప్ డే నాడు మాత్రలు ఇస్తాం. అపోహలకు పోకుండా తల్లిదండ్రులు తమ పిల్లలకు నులి పురుగు నివారణ మాత్రలు వేయించాలి. – డాక్టర్ ఎస్.రజిత, జిల్లా వైద్యాధికారి -
రియల్ ఢమాల్
సిరిసిల్ల: రెండేళ్లలోనే రియల్ ఎస్టేట్ తారుమారైంది. రాజన్నసిరిసిల్ల ఆవిర్భావంతో ఒక్కసారిగా భూముల ధరలకు రెక్కలొచ్చాయి. గత రెండేళ్ల వరకు జిల్లాలో ఎటూ చూసిన నూతన వెంచర్ల వెలుస్తూ కనిపించేవి. కానీ రెండేళ్లుగా ఉన్న వెంచర్లకే దిక్కులేదు. కొత్త వాటి ఊసే లేదు. ఇప్పటికే వెలసిన వెంచర్లలో ప్లాట్లు అమ్ముడు పోకపోవడంతో పెట్టుబడిదారులు అప్పులపాలవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. పెరిగి..పడిన ధరలు సిరిసిల్ల పట్టణానికి రెండు వైపులా బైపాస్రోడ్లు రావడంతో ఆ ప్రాంతాల్లోని భూముల ధరలకు రెక్కలొచ్చాయి. వేములవాడ పట్టణం టెంపుల్ సిటీ కావడంతో చుట్టూరా రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. ఇటీవల సిరిసిల్ల, వేములవాడ పట్టణాల చుట్టూ రియల్ ఎస్టేట్ దందాలు వెనక్కి తగ్గాయి. ఇప్పటికే కొనుగోలు చేసిన భూముల విక్రయ ఒప్పందాలు రద్దవుతున్నాయి. ప్లాటు కోసం అడ్వాన్స్గా ఇచ్చిన డబ్బులు వాపస్ ఇవ్వాలని కొన్నవారు, ఇచ్చిన డబ్బులు వాపస్ ఇచ్చేది లేదు.. జరిమానా కింద అడ్వాన్స్గా డబ్బులు రద్దుగా భావించాలని అమ్మిన వారు గొడవకు దిగుతున్నారు. ఈ పంచాయితీలు అటు పోలీస్స్టేషన్కు, పెద్ద మనుషుల వద్దకు చేరుతున్నాయి. అమ్మకాలు లేక.. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో భూముల ధరలు ఆకాశాన్ని అంటాయి. 200 గజాల ప్లాటు కొనా లన్నా కనీసం రూ.15 లక్షల నుంచి రూ.కోటి వరకు ప్రాంతాన్ని బట్టి ధరలు ఉన్నాయి. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లి, బొప్పాపూర్ సర్కిల్ వద్ద గజం స్థలం రూ.లక్షల్లో ఉండడం విశేషం. అన్ని ప్రాంతాల్లో నివాస స్థలాల ధరలు ఎక్కువగా ఉండడంతో రీసేల్ ఆగిపోయింది. నిజానికి రియల్ ఎస్టేట్ బ్రోకర్ల సంఖ్య ఎక్కువై.. వాళ్లే.. కమీషన్ల కో సం ధరలను పెంచుతూ వెళ్లారు. వాస్తవిక మార్కెట్ ధరలను దాటి లాభాల కోసం అమాంతం పెంచడంతో రియల్ ఎస్టేట్ దందా కుప్పకూలింది. ప్లాట్ల క్రయ, విక్రయాలు పెద్దగా జరగకపోవడంతో ఇప్పుడు స్థబ్తత నెలకొంది. జిల్లా వ్యాప్తంగా అనుమతి పొందిన వెంచర్లు పది లోపే ఉండగా.. లే– అవుట్ అనుమతి లేని వెంచర్లు వందల్లో ఉన్నాయి. స్థల వివాదాలు సిరిసిల్ల పట్టణ శివారు గ్రామాలు పెద్దూరు, రగుడు, చంద్రంపేట, ముష్టిపల్లి గ్రామాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా సాగింది. ఒకప్పుడు తక్కువ ధరకే భూములు దొరకడంతో క్రయ, విక్రయాలు సాగాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గడంతో విక్రయాలు లేక.. ఆయా గ్రామాల్లో స్థల వివాదాలు తెరపైకి వచ్చాయి. ఆ గ్రామాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో స్థబ్తత నెలకొంది. వేములవాడలో విలీనమైన తిప్పాపూర్, నాంపల్లి, కోనాయపల్లి, అయ్యోరుపల్లి, శాత్రాజ్పల్లిలోనూ ఇదే పరిస్థితి ఉంది. స్థల వివాదాలతో ప్లాట్ల క్రయ, విక్రయాలపై ప్రభావం ఉంది. రెండేళ్ల కిందట ఉన్న భూముల అమ్మకాలు, కొనుగోళ్ల సందడి ఇప్పుడు కనిపించడంలేదు. ఇది సిరిసిల్ల పట్టణ శివారులోని పెద్దబోనాల బైపాస్రోడ్డుకు వెళ్లే దారిలోని ప్లాట్లు. రెండేళ్ల కిందట ఇక్కడ గజం ధర రూ.15వేలు ఉండేది. ఎకరం భూమి విలువ రూ.కోట్లలో ఉండేది. కానీ ఇప్పుడు కొనేవారు లేక.. ప్లాట్లు అమ్మకపోవడంతో ముందుగానే పెట్టుబడి పెట్టినవారు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుపోయారు. సిరిసిల్ల మున్సిపల్లో విలీనమైన గ్రామాలను మళ్లీ గ్రామపంచాయతీలు చేస్తారనే ప్రకటనతో ఒక్కసారిగా భూముల ధరలు పడిపోయాయి. విలీన గ్రామాల్లో రియల్ ఎస్టేట్ దందా వెనక్కి తగ్గింది.ఇది సిరిసిల్ల శివారులోని శాంతినగర్లో మూడేళ్ల క్రితం వెలసిన రియల్ ఎస్టేట్ వెంచర్. దీన్ని డీటీసీపీ అఫ్రూవల్తో రోడ్డు వేసి, మౌలిక వసతులు కల్పించారు. భూపట్టాదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారి సంయుక్త భాగస్వామ్యంతో వెంచర్ వెలసింది. ఇక్కడ ప్లాట్లు అమ్మకపోవడంతో సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారి పెట్టిన పెట్టుబడి మీద పడి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. ప్లాటు కొనేందుకు ఏడాదిన్నరగా ఎవరూ ముందుకు రాకపోవడంతో ఈ పరిస్థితి ఎదురైంది.ఇది వేములవాడ అర్బన్ మండల శివారులోని తిప్పాపూర్– జయవరం రోడ్డు పక్కన వ్యవసాయ భూమి. ఇక్కడ రెండేళ్ల కిందట ఎకరం వ్యవసాయ భూమి రూ.కోటి నుంచి రూ.రెండు కోట్ల వరకు పలికింది. కానీ ఇప్పుడు కొనేవారు లేక.. వ్యవసాయ భూములు మూలనపడ్డాయి. నిజానికి వ్యవసాయ భూములకు ఎప్పుడూ ధర ఉంటుంది. కానీ ఈ ఏడాదిన్నరగా వ్యవసాయ భూముల ధరల పెరగకపోవగా తగ్గుతూ వస్తున్నాయి. దీంతో అమ్మే వారే తప్ప కొనేవారు లేక వ్యవసాయ భూముల విక్రయాలు పడిపోయాయి. -
ఇందిరమ్మ ఇల్లు పేదల ఆత్మగౌరవం
వేములవాడరూరల్: ఇందిరమ్మ ఇల్లు పేదల ఆత్మ గౌరవానికి ప్రతీక అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లిలో ఇందిరమ్మ ఇల్లును ఆదివారం పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇప్పటికే బేస్మెంట్ పూర్తి చేసుకొని పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. రాష్ట్రంలోని నిరుపేదలు, గూడు లేనివారు ఆత్మగౌరవంతో బతకాలనే ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని నిర్ణయించిందని తెలిపారు. గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా నిర్మించి ఇవ్వలేదన్నారు. ప్రతీ నియోజకవర్గానికి 3500 ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, నాయకులు అడ్డిక జైపాల్రెడ్డి, సోమినేని బాలు, కరుణాకర్, సందీప్, శ్రీనివాస్, వెంకటేష్, ప్రవీణ్ తదితరులు ఉన్నారు. ● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ -
ప్రజా సమస్యల సాధనకు పోరాటం
● బీజేపీ పట్టణాధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ సిరిసిల్లటౌన్: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై బీజేపీ పోరాటం చేస్తోందని ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ పేర్కొన్నారు. సిరిసిల్లలోని 23వ వార్డులో ఆదివారం పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. ‘ఇందిరమ్మ పథకం’ పేరుతో ఇల్లు ఇస్తున్నామని చెబుతున్నారు కానీ ఇసుక లేకుండా నిర్మాణాలు ఆగిపోయాయన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని రానున్న రోజుల్లో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ రెండేళ్లలో ఎన్నిసార్లు ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్నాడని ప్రశ్నించారు. జనాలకు అందుబాటులో లేకుండా, ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే వస్తున్నాడని విమర్శించారు. హర్ ఘర్ తిరంగాతో జాతీయభావం పెంపు ● బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్ చందుర్తి(వేములవాడ): ప్రజల్లో జాతీయభావం పెంపొందించుటకే బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున పేర్కొన్నారు. చందుర్తిలో భగత్సింగ్ చిత్రపటానికి ఆదివారం పూలమాలలు వేసి, జాతీయ జెండా ఎగురవేశారు. పార్టీ నియోజకవర్గ కన్వీనర్ మార్త సత్తయ్య, పార్టీ మండలాధ్యక్షుడు మోకిలే విజేందర్, జిల్లా కౌన్సిల్ మెంబర్ పోంశెట్టి రాకేశ్, మండల ప్రధాన కార్యదర్శులు మర్రి మల్లేశం, పెరుక గంగరాం, సేరుక గంగరాజు, మొత్కపల్లి రాజశేఖర్, మట్కం మల్లేశం, చింతకుంట సాగర్ పాల్గొన్నారు. పాలిటెక్నిక్లో స్పాట్ అడ్మిషన్లు వేములవాడఅర్బన్: అగ్రహారం శ్రీరాజరాజేశ్వరస్వామి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్ల ప్రవేశం పొందుటకు చివరి అవకాశం ఈనెల 11 వరకు ఉందని కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకరాచారి తెలిపారు. డిప్లామా మెకానికల్ ఇంజినీరింగ్, డిప్లామా టెక్స్టైల్ టెక్నాలజీ, ఫ్యాషన్ టెక్నాలజీ స్పెషలైజేషన్లో సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ అవకశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, రూ.6 వేలు ఫీజు తీసుకుని కళాశాలకు రావాలని సూచించారు. రాజన్నకు రూ.2లక్షల విరాళం వేములవాడ: రాజన్నకు భక్తుల నుంచి రూ.2 లక్షల విరాళం ఆదివారం ఆలయ ఏఈవో అశోక్, ప్రొటోకాల్ పర్యవేక్షకులు శ్రీకాంత్చారీలకు అందజేశారు. గోశాల సంరక్షణ ట్రస్ట్కు సిద్దిపేట జిల్లాకు చెందిన వంగ రాజేశ్వర్రెడ్డి తన కుమార్తె ఆర్తిరెడ్డి పేరిట రూ.లక్ష అందించారు. నిత్యాన్నదాన సత్రానికి రూ.లక్షను హైదరాబాద్కు చెందిన ఐటీ ఉద్యోగి కట్టంగూర్ రాజవంశీధర్రెడ్డి కుటుంబ సభ్యులు విరాళంగా అందజేశారు. -
దంచికొట్టిన వాన
సిరిసిల్ల: జిల్లాలో ఆదివారం వర్షం దంచికొట్టింది. తెల్లవారుజాము నుంచే ముసురు మొదలై.. క్రమంగా పెరిగింది. సిరిసిల్లలోని పాతబస్టాండు నేతన్నచౌక్ వద్ద వరద నీరు చేరి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. సంజీవయ్యనగర్ రోడ్డు వరదతో నిండిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లాలో అత్యధికంగా ఇల్లంతకుంటలో 61.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రుద్రంగిలో 23.4, చందుర్తిలో 24.0, వేములవాడ రూరల్లో 1.9, బోయినపల్లిలో 5.5, వేములవాడలో 9.8, సిరిసిల్లలో 29.4, కోనరావుపేటలో 3.2, వీర్నపల్లిలో 4.4, ఎల్లారెడ్డిపేటలో 15.7, గంభీరావుపేటలో 58.3, ముస్తాబాద్లో 50.5, తంగళ్లపల్లిలో 27.6 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. పొంగిపొర్లుతున్న అంపు ఒర్రె ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని తాళ్లపల్లి, బెజ్జంకి మండలం గూడెం గ్రామాల మధ్య ఉన్న అంపు ఒర్రె పొంగి ప్రవహిస్తోంది. దీంతో రెండు మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రెండు రోజులుగా వర్షాలు బెజ్జంకి మండలం ప్రాంతంలో కురువడంతో ఇల్లంతకుంట మండలం పత్తికుంటపల్లి చెరువు నిండి మత్తడి దుంకుతోంది. చెరువు నీటితోపాటు తాళ్లపల్లి గ్రామ పొలాల నీరు ఈ ఒర్రె గుండా ప్రవహిస్తోంది. ఇల్లంతకుంట నుంచి బెజ్జంకి మండలం గూడెం, బేగంపేట, కాసీంపేట, గుండ్లపల్లి, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లాలంటే దగ్గర దారి ఇది. తాళ్లపల్లి, గాలిపల్లి రైతులు తమ పొలాల వద్దకు ఈ ఒర్రె దాటి వెళ్లాల్సిందే. ఒర్రైపె బ్రిడ్జి నిర్మించకపోవడంతో రెండు మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఆదివారం వరద పారడంతో కాసీంపేట మానసదేవీ ఆలయానికి వెళ్లే భక్తులు వెనుదిరిగారు. ఇళ్ల చుట్టూ చేరిన వర్షపు నీరు తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని గండిలచ్చపేట పరిధిలో ప్రభుత్వ పాఠశాల సమీపంలోని లోతట్టు ప్రాంతంలోని నివాసాలను వరదనీరు చుట్టుముట్టింది. ఏళ్లుగా ఈ సమస్య ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తంగళ్లపల్లి ఎంపీడీవో లక్ష్మీనారాయణను శ్రీసాక్షిశ్రీ వివరణ కోరగా లోతట్టు ప్రాంతంలో ఉండడంతో వర్షపు నీరు వచ్చిందన్నారు. బాధిత కుటుంబానికి గ్రామంలోని మహిళా సంఘం భవనంలో తాత్కాళిక వసతి ఏర్పాటు చేసేందుకు పంచాయతీ కార్యదర్శిని ఆదేశించినట్లు తెలిపారు. పొంగిపొర్లిన వాగులు, వంకలు ఇల్లంతకుంటలో అత్యధికంగా 61.1 మిల్లీమీటర్లు -
● పడిపోయిన వ్యవసాయ భూముల అమ్మకాలు ● భూ విక్రయ ఒప్పందాలు రద్దు ● సిరిసిల్ల, వేములవాడల్లో తగ్గిన ప్లాట్ల విక్రయాలు ● జిల్లాలో రిజిస్ట్రేషన్లు అంతంతే..
రిజిస్ట్రేషన్లు నిలకడగా సాగుతున్నాయి రిజిస్ట్రేషన్లు నిలకడగా సాగుతున్నాయి. సిరిసిల్ల సబ్ రిజిస్ట్రేషన్ పరిధిలో 48 స్లాట్లు ఉండగా.. సగటున నిత్యం 30 నుంచి 40 వరకు సాగుతున్నాయి. గతంలో ఎక్కువ సంఖ్యలో డాక్యుమెంట్లు వచ్చేవి. ఇప్పుడు పెద్దగా రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరగడం లేదు. మార్టిగేజ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఏడాది కాలంగా ఇదే పరిస్థితి ఉంది. – ఆర్.వీ.వీ స్వామి, సబ్ రిజిస్ట్రార్, రాజన్నసిరిసిల్ల ● -
సర్కారు భూమి హస్తగతం
● రూ.60కోట్ల విలువైన స్థలం రికవరీ సాక్షిప్రతినిధి, కరీంనగర్: పరాధీనంలో ఉంటున్న రూ.కోట్లాది విలువైన భూమిని కలెక్టర్ చొరవతో అధికారులు తిరిగి హస్తగతం చేసుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాలు. జిల్లా కేంద్రం శివారులోని చంద్రగిరి సమీపంలో సర్వేనంబరు 25, 26లోని ప్రభుత్వ భూమిలో చాలా ఏళ్లు ఇటుకబట్టీలను తిప్పాపూర్కు చెందిన ఓ వ్యక్తి నడిపించాడు. జిల్లా కలెక్టర్గా సందీప్కుమార్ ఝా వచ్చినప్పటి నుంచి పరాధీనంలో ఉంటున్న ప్రభుత్వ భూములను రికవరీ చేస్తున్నారు. గతంలో కొంతమందిపై కేసులు కూడా నమోదయ్యాయి. అయితే చంద్రగిరి శివారులో ఉన్న భూమి ప్రస్తుతం రూ.60కోట్ల వరకు పలుకుతోంది. ఇటుక బట్టీలు నడిపించిన వ్యక్తి ఇతరుల వద్ద కొనుగోలు చేసినట్లు సమాచారం. కాగా ప్రభుత్వ భూమి కావడంతో సదరు భూమిలో ఇటుకబట్టీలు నడిచి పరాధీనంలో ఉంటున్నాయన్న విషయం కలెక్టర్ దృష్టికి రావడంతో రెవెన్యూ అధికారులతో విచారణ చేపట్టారు. ప్రభుత్వ భూములుగా తేలడంతో వెంటనే రికవరీకి ఆదేశించినట్లు సమాచారం. అధికారులు ఆదివారం సదరు భూమిలో ఉన్న కట్టడాలను జేసీబీ సహాయంతో కూల్చేశారు. రూ.60కోట్ల విలువైన భూమి ప్రభుత్వపరం కావడం స్థానికుల్లో చర్చనీయాంశమైంది. -
రేషన్కార్డు.. అన్నింటికీ ఆధారం
● అర్హులందరికీ అందజేస్తాం ● కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఎల్లారెడ్దిపేట(సిరిసిల్ల): రేషన్కార్డు పేదల ఆత్మగౌరవ ప్రతీక అని కలెక్టర్ సందీప్కుమార్ ఝా పేర్కొన్నారు. మండల కేంద్రంలోని మణికంఠ గార్డెన్స్లో ఆదివారం నూతన రేషన్కార్డులు పంపిణీ చేపట్టారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట మండలంలోని అర్హులైన లబ్ధిదారులకు నూతన రేషన్కార్డులు జారీ చేస్తున్నామని తెలిపారు. వీటి ద్వారా పేదలకు ప్రతీ నెల రేషన్ అందుతుందన్నారు. మండలంలో నూతనంగా 1,494 కొత్త కార్డులు, ఇప్పటికే ఉన్న కార్డుల్లో 2,999 మంది కుటుంబ సభ్యుల పేర్లను అదనంగా నమోదు చేసినట్లు వివరించారు. ప్రభుత్వ పథకాలు అన్నింటికీ రేషన్కార్డు కీలక డాక్యుమెంట్ అని పేర్కొన్నారు. నూతన రేషన్కార్డు ద్వారా ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్ వంటి అనేక సంక్షేమ పథకాలకు అర్హత వస్తుందని స్పష్టం చేశారు. సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ చైర్ర్సన్ సావేరా బేగం, డిప్యూటీ తహసీల్దార్ మురళీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, ఏఎంసీ వైస్చైర్మన్ గుండాడి రామ్రెడ్డి, నాయకులు మహేందర్, రామచంద్రం, చిన్ని బాబు, పందిర్ల లింగంగౌడ్, గిరిధర్రెడ్డి, గంట బుచ్చగౌడ్, రాములు పాల్గొన్నారు. -
బీసీ రిజర్వేషన్ల చట్టం చేయాలి
● ముస్లింల పేరు చెప్పి బీజేపీ అడ్డుకోవద్దు ● సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్ సిరిసిల్లటౌన్: రాష్ట్రంలో బీసీల విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల బిల్లుకు కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్ డిమాండ్ చేశారు. బీసీల రిజర్వేషన్లపై బీజేపీ మోకాలు అడ్డుతోందని ఆరోపిస్తూ ఆదివారం సిరిసిల్ల లోని అంబేడ్కర్చౌరస్తాలో ధర్నా చేపట్టారు. 42 శాతం బిల్లులు ఆమోదించి కేంద్రం బీసీలపై చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కోడం రమణ, జిల్లా నాయకులు మిట్టపల్లి రాజమౌళి, రాపల్లి రమేశ్, నక్క దేవదాస్, సిరిసిల్ల సత్యం, ఒగ్గు గణేశ్, ఉడుత రవి, దాసరి రూప, బెజిగం సురేష్, బండి శ్రీనివాస్, సందుపట్ల పోచమల్లు పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో నూలుపౌర్ణమి
సిరిసిల్లకల్చరల్: పద్మశాలీయుల ఆరాధ్య దైవం మార్కండేయుని శోభాయాత్ర జిల్లా కేంద్రంలో శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఏటా నూలు పౌర్ణమి పర్వదినంగా జరుపుకోవడం ఆనవాయితీ. రాష్ట్రంలో సిరిసిల్లలో మాత్రమే నూలుపౌర్ణమి వేడుక నిర్వహిస్తారు. కదిలే వాహనంపై మగ్గం ఉంచి వస్త్రం నేసి ఇలవేల్పు మార్కండేయునికి సమర్పించడం ఇక్కడి ప్రత్యేకత. మార్కండేయ మందిరంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. అదే ప్రాంగణంలో సామూహిక యజ్ఞోపవీత ధారణ, రక్షాబంధన్ నిర్వహించారు. అనంతరం స్వామి వారి శోభాయాత్ర పట్టణ ప్రధాన వీధుల గుండా నిర్వహించారు. పాతబస్టాండ్లోని చేనేతన్న విగ్రహానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పూలమాలలు వేశారు. గ్రంథాలయసంస్థ జిల్లా చైర్మన్ నాగుల సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు సంగీతం శ్రీనివాస్, చొప్పదండి ప్రకాశ్, యెల్లె లక్ష్మీనారాయణ, తాటిపాముల దామోదర్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఆడెపు రవీందర్, గూడూరి ప్రవీణ్, పద్మశాలీ నేతలు మోర రవి, మండల సత్యం, గాజుల బాలయ్య, కాముని వనిత, ఆడెపు చంద్రకళ, గుజ్జె తార, పిస్క మధు, పలువురు వస్త్రోత్పత్తిదారులు పాల్గొన్నారు. -
వైభవంగా యజ్ఞోపవీతధారణ
నాగిరెడ్డి మండపంలో యజ్ఞోపవీత ధారణలో యజుర్వేద బ్రాహ్మణులు వేములవాడ: శ్రావణమాసం.. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని రాజన్న ఆలయంలో రుగ్వేద, యజుర్వేద బ్రాహ్మణులు శనివారం యజ్ఞోపవీతధారణ నిర్వహించారు. ప్రత్యేక హోమం జరిపిన తర్వాత శ్రావణ నక్షత్రం సందర్భంగా రుగ్వేదులు అద్దాల మంటపంలో, పౌర్ణమి తిథి అనుసారం నాగిరెడ్డి మంటపంలో యజుర్వేదులు ఉపాకర్మ నిర్వహించి సామూహికంగా నూతన యజ్ఞోపవితధారణ గావించారు. అయితే ఈసారి రుగ్వేదులు, యజుర్వేదులకు ఒకే రోజు కలిసి రావడంతో ఆలయం బ్రాహ్మణులతో సందడిగా మారింది. మార్కండేయనగర్లో స్థానిక పద్మశాలీ కులస్తులు నూతన జంధ్యాలు ధరించారు. -
వెన్ను కదులుతోంది..
● అడుగుకో గుంతతో అధ్వానంగా రోడ్లు ● పట్టించుకోని అధికారులు ● వర్షం నీటితో కనిపించని గుంతలు ● తెలియక వెళ్లి ప్రమాదాలు ● జిల్లాలో దారుణంగా 52 రోడ్లు ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అడుగుకో గుంత.. కళ్లు మూసి తెరిచేలోపే మలుపులతో జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లు ప్రమాదకరంగా మారాయి. అసలే వర్షాకాలం.. చిన్నపాటి జల్లులకే రోడ్లు చిత్తడిగా మారిపోతున్నాయి. ఈ రోడ్లపై నీళ్లు నిలిచి ఎక్కడ గుంత ఉందో తెలియక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ రోడ్లపై ప్రయాణిస్తున్న వాహనదారులకు బ్యాక్ పేన్(నడుమునొప్పులు) పక్కాగా వస్తున్నాయి. ఇటీవల నడుము నొప్పులతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, ఇల్లంతకుంట, వీర్నపల్లి, కోనరావుపేట, చందుర్తి, రుద్రంగి, గంభీరావుపేట మండలాల్లోని గ్రామీణ రోడ్లు గుంతలతో అధ్వానంగా మారాయి. జిల్లాలోని వివిధ రూట్లలో సుమారు 52 రోడ్లు భారీ గుంతలతో భయంకరంగా కనిపిస్తున్నాయి. గుంతల రోడ్ల దుస్థితిపై అధికారులకు ఎలాంటి పట్టింపులు లేకుండా పోయాయి. కనీసం మరమ్మతులు కూడా చేయడం లేదు. నడుం నొప్పులతో ఆస్పత్రులకు.. గుంతల రోడ్లపై ప్రయాణాలు చేసే వారిలో 75 శాతం మంది వివిధ రకాల నడుం నొప్పులతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఆటో డ్రైవర్లతోపాటు ప్రయాణికులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. వెన్నుపూస కదలడం, డిస్క్, పక్కటెముకలు, మోకాళ్లు, మెడలు పట్టుకోవడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఎమ్మారై, సీటీస్కాన్, ఎక్స్రే ఇతరత్ర పరీక్షలతో కలిసి ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. నడవలేక, కదలలేక, నిలబడలేక, కూర్చుండలేక ఇబ్బందులు పడుతున్నారు. పట్టించుకోని అధికారులు ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖల పరిధిలోని రోడ్లు అధ్వానంగా మారినా పట్టించుకునే వారు కరువయ్యారు. వర్షాకాలంలో దెబ్బతిన్న రోడ్లను సైతం పరిశీలించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. తాత్కాళికంగా మరమ్మతులు చేసే అవకాశాలున్నా పట్టించుకోవడం లేదు. డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి తరచూ ప్రయాణించే వారిలో ఎక్కువగా డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ప్రాబ్లమ్ గుర్తించేందుకు ఎమ్మారై వంటి పరీక్షలకు కరీంనగర్ తరలిస్తున్నాం. తరచూ ప్రయాణించే వారు మెడ, నడుం బెల్టులను పెట్టుకోవాలి. దీని ద్వారా దీర్ఘకాలిక సమస్యలు రాకుండా నిరోధించవచ్చు. నొప్పుల ఉపశమనానికి ఫిజియోథెరపీకి పంపిస్తున్నాం. అలా కూడా నయం కాకపోతే వెన్నుపూస ఆపరేషన్లు చేయాల్సి ఉంటుంది. ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. – సునీల్, ఆర్థోపెడిక్ వైద్యుడు, ఎల్లారెడ్డిపేట ఇది ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం శివారులోని రాపెల్లివాగు వంతెన వద్ద గల గుంతలరోడ్డు. ఈ రోడ్డు వర్షం నీటితో గుంతలుగా తయారైంది. గుంతలరోడ్డుపై ప్రయాణం నరకాన్ని తలపిస్తోంది. వాహనాలు పాడవుతున్నాయి. ఆటోడ్రైవర్లు, ప్రయాణికులు నొప్పులతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. వాహనాలు మరమ్మతులు చేసుకోవడానికి అప్పులు చేయాల్సి వస్తోందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క రాపెల్లివాగు వంతెన వద్దనే కాకుండా జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 52 రోడ్ల పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. -
ప్రభుత్వ ఆఫీస్లపై సోలార్ ప్యానెల్స్
● కలెక్టర్ సందీప్కుమార్ ఝా సిరిసిల్ల: జిల్లాలోని ప్రభుత్వ ఆఫీస్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా కోరారు. కలెక్టరేట్ నుంచి శనివారం మాట్లాడారు. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ విద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలన్నారు. గ్రామపంచాయతీ నుంచి కలెక్టరేట్ వరకు అన్ని ఆఫీస్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలన్నారు. డీఆర్డీవో శేషాద్రి పాల్గొన్నారు. అంతకు ముందు హైదరాబాద్ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు వీడియో కాన్ఫరెన్స్లో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుపై సమీక్షించారు. జిల్లాలో ఎరువులకు కొరత లేదు జిల్లాలో ఎరువుల కొరత లేదని కలెక్టర్ సందీప్కుమార్ ఝా తెలిపారు. రుద్రంగి మండల కేంద్రంలో ఎరువుల కొరత ఉందని గంటల తరబడి రైతులు వేచి చూసి ఇబ్బంది పడుతున్నారని జరిగిన ప్రచారాన్ని ఖండించారు. కొందరు కావాలనే రైతులతో మాట్లాడించి తప్పుడు ప్రచారం చేశారని పేర్కొన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సిరిసిల్ల శివారులోని అపెరల్ పార్క్లో గోదాము ఏర్పాటు చేశామని వివరించారు. -
రేపు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ
● జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత సిరిసిల్ల: జిల్లాలో నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఆగస్టు 11న నులి పురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేస్తామని జిల్లా వైద్యధికారి ఎస్.రజిత శనివారం తెలిపారు. ఏడాది వయసున్న పిల్లల నుంచి 19 ఏళ్ల వరకు మాత్రలు అందిస్తామన్నారు. పిల్లలు ఆల్బెండజోల్ మాత్రను నమిలి మింగేలా చూసుకోవాలని తల్లిదండ్రులను కోరారు. మానవ పేగులలో జీవించే పేగు పురుగులతో కడుపునొప్పి, వాంతులు, విరోచనాలు, ఆకలి మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తాయని వివరించారు. ఆగస్టు 11న మాత్రలు అందని పిల్లలకు 18వ తేదీన అందజేస్తారని తెలిపారు. సాహిత్యోత్సవంలో జిల్లా కవులు సిరిసిల్లకల్చరల్: బుక్ బ్రహ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్నాటక రాష్ట్రం బెంగళూర్లో ఈనెల 8 నుంచి మూడు రోజులపాటు దక్షిణ భారత స్వరాలు శీర్షికన సాహిత్యోత్సవం నిర్వహిస్తున్నారు. రెండో రోజు శనివారం 35 మంది పాల్గొన్నారు. ఇందులో మన జిల్లా నుంచి కథారచయిత పెద్దింటి అశోక్కుమార్, బాలసాహిత్యవేత్త డాక్టర్ పత్తిపాక మోహన్ పాల్గొన్నారు. ప్రాంతీయ అస్తిత్వం సదస్సులో ప్రాంతీయ భాష అస్తిత్వ చేతన అంశంపై పెద్దింటి, బాలసాహిత్యం, రచన కళ సదస్సులో తెలుగు బాల సాహిత్యం, భాష, నాడు–నేడు అనే అంశంపై పత్తిపాక మోహన్ చర్చించారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులపై ఆరా వేములవాడ: రాజన్న ఆలయంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకంలో అవకతవకలు జరిగి, భారీ ఎత్తున ముడుపులు తీసుకున్నట్లు ఆడియో టేప్ వైరల్ కావడంతో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి, కమిషనర్ సీరియస్గా వ్యవహరించారు. రాష్ట్ర స్థాయి అధికారులు వేములవాడలో విచారణ చేపట్టి బాధ్యుడైన లక్ష్మీనారాయణ అనే ప్రైవేట్ సూపర్వైజర్పై కేసు నమోదు చేశారు. దీంతో ఈవో రాధాభాయి ఆలయంలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, వారి పనితీరు, నియామకంపై ఆరా తీస్తున్నారు. ఆలయంలో పనిచేస్తున్న ఏఈవో, పర్యవేక్షకుడి స్థాయి ఉన్న అధికారులు ముడుపులు తీసుకుని ఔట్సోర్సింగ్ ఉద్యోగులను నియమించినట్లు సమాచారం అందడంతో విచారణ తీవ్రతరం చేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న, గతంలో ఇక్కడ పనిచేసి ఇతర దేవాలయాలకు బదిలీపై వెళ్లిన అధికారుల గుండెల్లో గుబులు మొదలైందని సమాచారం. రాశిగుట్ట తండాలో ఇంటింటా జ్వర సర్వే వీర్నపల్లి(సిరిసిల్ల): మండలంలోని భూక్యతండా గ్రామపంచాయతీ పరిధిలోని రాశిగుట్టతండాలో పీహెచ్సీ వైద్యుడు బాలకృష్ణ ఆధ్వర్యంలో శనివారం ఇంటింటా జ్వరసర్వే చేపట్టారు. వైద్యసిబ్బంది ఇంటింటికీ వెళ్లి పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. అవసరమైన వారికి మందులు అందజేశారు. ఘనంగా క్విట్ ఇండియా ఉద్యమ వేడుకలు సిరిసిల్లటౌన్: క్విట్ ఇండియా ఉద్యమ వేడుకలను శనివారం సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ పట్ట ణాధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, గడ్డం నర్సయ్య, సూర దేవరాజు పాల్గొన్నారు. -
రావమ్మా మహాలక్ష్మీ
శనివారం శ్రీ 9 శ్రీ ఆగస్టు శ్రీ 2025శ్రావణ శుక్రవారం జిల్లాలోని మహిళలు వరలక్ష్మీ వ్రతాలను భక్తిశ్రద్ధలతో నోముకున్నారు. వేములవాడలోని మహాలక్ష్మీ ఆలయంలో జరిగిన వ్రతాల్లో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. స్థానాచార్యులు ఉమేశ్శర్మ నేతృత్వంలో అర్చకుల బృందం రాజన్న గుడి నుంచి బైపాస్రోడ్డులోని మహాలక్ష్మీ ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించుకున్నారు. ఈవో రాధాభాయి, ఏఈవోలు అశోక్, శ్రవణ్, జయకుమారి, సెస్ డైరెక్టర్ నామాల ఉమ తదితరులు పాల్గొన్నారు. – వేములవాడ/ సాక్షి ఫొటోగ్రాఫర్, రాజన్నసిరిసిల్లన్యూస్రీల్ -
రైతుల అవసరాలకే గోదాం
● జిల్లాలో అందుబాటులో సరిపడా ఎరువులు ● ఆయిల్పామ్ సాగుతో లాభాలు ● సలహాలు, సూచనలకు టోల్ ఫ్రీ 93986 84240 ● కలెక్టర్ సందీప్కుమార్ ఝాసిరిసిల్ల/సిరిసిల్లఅర్బన్: జిల్లాలో అత్యవసర సమయంలో రైతులు వినియోగించేందుకు ఎరువుల గోదాంను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సందీప్కుమార్ ఝా తెలిపారు. పెద్దూరు గ్రామ శివారులోని అపెరల్ పార్కులో 100 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఎరువుల గోదాంను సిరిసిల్ల మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు వెలుముల స్వరూపారెడ్డితో కలిసి శుక్రవారం ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎప్పడైనా ఎక్కడైనా అత్యవసర పరిస్థితిలో ఎరువుల కొరత ఏర్పడినప్పుడు అందజేసేందుకు ముందస్తుగా గోదాంను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, ఎంఏవో, ఏఈవోలు పాల్గొన్నారు. ఆయిల్పామ్ సాగుతో రైతుకు మేలు ఆయిల్పామ్ సాగుతో రైతులకు, దేశానికి మేలు జరుగుతుందని కలెక్టర్ సందీప్కుమార్ ఝా పేర్కొన్నారు. ఆయిల్పామ్ సాగుపై కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ దేశ అవసరాలకు సరిపడా వంట నూనె మన దగ్గర లేదని, విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామన్నారు. ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం పెరిగితే రైతులకు లాభం జరగడంతోపాటు దేశానికి మేలు జరుగుతుందన్నారు. ప్రభుత్వం సబ్సిడీలు సైతం ఇస్తుందని తెలిపారు. ఈ ఏడాది జిల్లాలో 2వేల ఎకరాలలో సాగు విస్తీర్ణం లక్ష్యం కాగా 1,135 ఎకరాల్లో 322 రైతులు సాగుకు ఆసక్తి చూపుతున్నారని వివరించారు. ఇప్పటికే 99 ఎకరాలలో ప్లాంటేషన్ పూర్తయిందని తెలిపారు. ఆయిల్పామ్ సాగులో సలహాలు, సూచనల కోసం టోల్ఫ్రీ 93986 84240 ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
‘ప్రజల మద్దతు కాంగ్రెస్ వైపే’
ఇల్లంతకుంట(మానకొండూర్): రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజల మద్దతు కాంగ్రెస్ పార్టీ వైపే ఉండాలని ప్రభుత్వానికి ప్రజల అండదండలు అవసరమని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు. స్థానిక మండల పరిషత్లో శుక్రవారం 125 మంది లబ్ధిదారులకు సీఎమ్మార్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఎంపీడీవో శశికళ, డిప్యూటీ తహసీల్దార్ సత్యనారాయణ, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు భాస్కర్రెడ్డి, ఏఎంసీ వైస్చైర్మన్ ఎలగందుల ప్రసాద్, మహిళా కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షురాలు పుష్పలత తదితరులు పాల్గొన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి సిరిసిల్లటౌన్: ప్రజలు తమ ఇల్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ఖధీర్పాషా కోరారు. స్థానిక 17వ వార్డు గాంధీనగర్లో శుక్రవారం డ్రై డేలో పాల్గొని మాట్లాడారు. వర్షాకాలం దృష్ట్యా ఇంట్లో దోమల నివారణ తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటి పరిసరాల్లో నీటి నిలువలు లేకుండా చూడాలని కోరారు. అధికారులు ఎడ్ల శేఖర్, మేఘన, మమత, ఏఎన్ఎం అన్నపూర్ణ, ఆశవర్కర్లు శ్రీవాణి, మమత, వార్డు జవాన్ దేవయ్య పాల్గొన్నారు. స్థానిక ఎన్నికల్లో విజయం సాధించాలి ● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలపర్చిన అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని, అందుకోసం ఇప్పటి నుంచి ప్రణాళికలు రూపొందించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య కోరారు. మండలంలోని అల్మాస్పూర్, దుమాల గ్రామాల్లో శుక్రవారం పార్టీ ముఖ్యనాయకులతో సమావేశమయ్యారు. మండలంలో అత్యధిక స్థానాలు గెలుపొంది కేటీఆర్కు కానుకగా ఇవ్వాలన్నారు. ప్రభుత్వం నెరవేర్చని హామీలను ప్రజల్లో ప్రచారం చేయాలని సూచించారు. పార్టీ మండల అధ్యక్షుడు వరుస కృష్ణహరి, సింగిల్విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, మాజీ జెడ్పీటీసీ చీటి లక్ష్మ ణ్రావు, మాజీ ఏఎంసీ చైర్మన్ గుల్లపల్లి నర్సింహరెడ్డి, నాయకులు నర్సాగౌడ్, నమిలికొండ శ్రీనివాస్, శరవింద్ పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి చొరవ చూపండి బోయినపల్లి(చొప్పదండి): మిడ్మానేరు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని మండలంలోని నీలోజిపల్లికి చెందిన పలువురు నిర్వాసితులు శుక్రవారం మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ను కలిసి వినతిపత్రం అందించారు. గత బీ ఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్వాసితుల సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కొండం శ్రీని వాసరెడ్డి, చెంచు నాగరాజు, ఆవుల లక్ష్మణ్, రాజేంద్రప్రసాద్, ఎర్ర శ్రీకాంత్, మోహన్ ఉన్నారు. చిరుజల్లులుసిరిసిల్ల: జిల్లా వ్యాప్తంగా గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం వరకు చిరుజల్లులు కురిశాయి. అత్యధికంగా వీర్నపల్లి మండలంలో 34.6 మిల్లీమీటర్ల వర్షం పడింది. రుద్రంగిలో 24.4, చందుర్తిలో 3.4, వేములవాడ రూరల్లో 0.1, వేములవాడలో 0.4, సిరిసిల్లలో 12.5, కోనరావుపేటలో 4.7, ఎల్లారెడ్డిపేటలో 32.1, గంభీరావుపేటలో 18.0, ముస్తాబాద్లో 19.4, తంగళ్లపల్లిలో 31.0, ఇల్లంతకుంటలో 18.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. బోయినపల్లిలో పెద్దగా వర్షం పడలేదు. -
నాకు నీడగా.. నీకు తోడుగా..
● ఆత్మీయతకు ప్రతీక రక్షాబంధన్ ● ఎక్కడున్నా రాఖీని మరువని రక్త సంబంధాలు ● మార్కెట్లో పండుగ సందడికలెక్టర్కు పోషణ బంధం రాఖీ63 ఏళ్లుగా పండుగ సంతోషం..సోదరి కోసం సౌదీ నుంచి..అన్నంటే ధైర్యం.. తమ్ముడంటే ప్రేమ.. అమ్మగర్భాన్ని పంచుకుని.. నాన్న చూపిన బాటలో నడుచుకుని.. ఏళ్లకాలం తోడునీడగా నిలిచేది సోదర, సోదరీమణుల బంధం. రక్తం పంచుకుని పుట్టి.. చివరి అంకం వరకు ప్రేమ, ఆప్యాయతలు పంచుకునే ప్రేమబంధం. ఇలాంటి బంధానికి ప్రతీకగా నిలుస్తోంది రాఖీ పండుగ. నేను నీకు రక్షా.. నీవు నాకు రక్షా అంటూ.. అన్నా.. తమ్ముళ్లకు అక్కాచెల్లెల్లు కట్టేది రక్షాబంధన్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలువురు విదేశాల్లో ఉన్న సోదరులకు రాఖీలు బట్వాడా చేస్తుండగా.. మరికొందరు పండక్కి స్వదేశానికి వచ్చేశారు. కొందరు వృద్ధులు శుక్రవారం నుంచే సోదరుల ఇళ్లకు పయనమయ్యారు. ఆర్టీసీ బస్సుల్లో పండుగ రద్దీ కనిపిస్తుండగా.. మార్కెట్లలో వివిధ డిజైన్లలతో రాఖీలు మెరుస్తున్నాయి. స్వీట్ల దుకాణాల్లో వివిధ రకాల ఘుమఘుమలు నోరూరిస్తున్నాయి. నేడు రాఖీ పండుగ సందర్భంగా కథనం..– మరిన్ని కథనాలు 8లోu పెద్దపల్లిరూరల్: కలెక్టర్ కోయ శ్రీహర్షకు శుక్రవారం పెద్దపల్లి సీడీపీవో కవిత పోషణ బంధం రాఖీ కట్టారు. రాఖీపౌర్ణమిని పురస్కరించుకుని ప్రత్యేకంగా పోషణ రాఖీలు తయారు చేయించి జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేశామని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. అంగన్వాడీ టీచర్లు విధిగా గర్భిణులు, బాలింతలు, పిల్లల ఇళ్లకు వెళ్లి రాఖీ కట్టి పోషకాహార ప్రాధాన్యత గురించి వివరించాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా 15 వేల ఇళ్లకు వెళ్లి ఇలా అవగాహన కల్పిస్తారని వివరించారు.ఇల్లంతకుంట: చిత్రంలో కనిపిస్తున్న వీరు సార మల్లేశం, అంతటి లక్ష్మి. అక్కా తమ్ముళ్లు. సొంతూరు ఇల్లంతకుంట మండలం ముస్కానిపేట. తల్లిదండ్రులకు ఇద్దరు ఆడపిల్లలు. ముగ్గురు మగపిల్లలు. అంతటి లక్ష్మి అన్న నర్సయ్య ఐదేళ్లక్రితం చనిపోయాడు. ప్రతీ రాఖీ పండక్కి అక్క లక్ష్మినర్సవ్వతో కలిసి అంతటి లక్ష్మి ముస్కానిపేటకు నడుచుకుంటూ వెళ్లి అన్నాతమ్ముళ్లకు రాఖీ కట్టేవారు. ప్రస్తుతం ముగ్గురూ ఇల్లంతకుంటలోనే వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. ‘మా తమ్ముడు మల్లేశానికి నేను మా అక్క ప్రతీ ఏటా రాఖీ కడతాం. తమ్ముడికి రాఖీ కడితే ఎంతో సంతోషంగా ఉంటుంది. 63ఏళ్లుగా రాఖీ కడుతున్నా. ఆరోజు మా ఇళ్లంతా పండుగ వాతావరణం ఉంటుంది. గత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటాం’ అని అంతటి లక్ష్మి తెలిపింది.16 ఏళ్లుగా స్పీడ్ పోస్ట్లో..జమ్మికుంట: చిన్నతనం నుంచి తన చేతులతో రాఖీ కట్టించుకున్న సోదరుడు ఇప్పుడు సప్తసముద్రాల అవతల ఉన్నా రాఖీ పంపించడం మరవడం లేదు ఆ సోదరి. అమెరికాలో స్థిరపడిన సోదరుడికి 16ఏళ్లుగా ఇంటర్నేషనల్ స్పీడ్పోస్టు ద్వారా రాఖీ పంపుతోంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మోత్కులగూడెం గ్రామానికి చెందిన సుజాతకు ఇద్దరు సోదరులు పొనగంటి సంపత్, రమేశ్ ఉన్నారు. సంపత్ స్థానికంగా నివాసం ఉంటున్నాడు. రమేశ్ అమెరికాలోని కాలిఫోర్నియాలో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా జీవనం సాగిస్తున్నాడు. సుజాత ఏటా రాఖీ పండుగ సందర్భంగా 15రోజుల ముందుగానే రమేశ్కు ఇంటర్ నేషనల్ స్పీడ్పోస్ట్ ద్వారా రాఖీ పంపిస్తోంది. పండుగ రోజున రమేశ్ రాఖీ కట్టుకొని ఫోన్ ద్వారా సుజాతతో మాట్లాడి తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటారు.కథలాపూర్: జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రానికి చెందిన బీమనాతి శ్రీధర్ ఉపాధి నిమిత్తం రెండేళ్ల క్రితం సౌదీ అరేబియా వెళ్లాడు. అక్కడ ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. రెండేళ్లుగా స్వదేశానికి రాలేదు. రాఖీ పండుగ సందర్భంగా తన సోదరి మౌనికతో రాఖీ కట్టించుకోవాలని అనిపించింది. గల్ఫ్ దేశంలో కంపెనీ యజమానితో విషయం చెప్పాడు. వారు ఒప్పుకోవడంతో బుధవారం స్వగ్రామానికి వచ్చాడు. సోదరితో రాఖీ కట్టించుకుంటే ఆ సంతోషం వర్ణించలేనిదని శ్రీధర్ అంటున్నాడు. -
అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
సిరిసిల్ల: అగ్ని ప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సిరిసిల్ల అగ్నిమాపక అధికారి ఎన్.నరేందర్ సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రిలో అగ్నిప్రమాదాలు–నివారణ చర్యలపై శుక్రవారం అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒక్క అగ్గి రవ్వ అపారమైన ఆస్థి, ప్రాణ నష్టానికి కారణమవుతుందన్నారు. ముందుజాగ్రత్తలతో అగ్ని ప్రమాదాలు జరగవని స్పష్టం చేశారు. అగ్ని ప్రమాదాలు సంభవిస్తే 101, 87126 99258 నంబర్లలో సమాచారం ఇవ్వాలని సూచించారు. ఆస్పత్రి డాక్టర్ వంశీగౌడ్, అగ్నిమాపక, ప్రైవేటు ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్పై విచారణఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని సిరికొండ ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్పై వచ్చిన ఆ రోపణలపై జిల్లా అధికారులు శుక్రవారం గ్రామంలో విచారణ చేపట్టారు. ఫీల్డ్ అసిస్టెంట్ తడిసిన సత్తయ్య ఐదెకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశాడని గత నెల 28న ప్రజావాణిలో గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. డీఆర్డీఏ అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ నరసింహులు, ఇల్లంతకుంట ఎంపీడీవో శశికళ, ఆర్ఐ సంతోష్కుమార్ గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించారు. -
క్రిప్టోకు రెక్కలు!
దేశం దాటుతున్న రూ.వందల కోట్లు ● మూడేళ్ల క్రితమే కేంద్రం హెచ్చరికలు ● పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం ● తాజాగా నెక్ట్స్ బిట్ పేరుతో రూ.300 కోట్ల టోకరా? ● గతంలో రెక్సిట్, మెటా పేరుతో రూ.కోట్ల దందాలు ● ఉమ్మడి జిల్లాలో ఇంకా పెట్టుబడి పెడుతున్న అత్యాశపరులు ● క్రిప్టో వసూళ్లపై రాచకొండ పోలీసుల ఉక్కుపాదం ● కరీంనగర్లో రెవెన్యూ, పోలీసులవే అధిక పెట్టుబడులుసాక్షిప్రతినిధి,కరీంనగర్: ‘క్రిప్టోలో ఒక్కసారి పెట్టుబడి పెట్టండి. ప్రతీ రోజూ సాయంత్రానికి మీ ఖాతాల్లో రూ.వేలు చూసుకోండి. నెలకు రూ.లక్షల సంపాదన. రెండుమూడు నెలల్లో మీ జీవితం మారిపోతుంది, హోదా పెరుగుతుంది’ అంటూ కల్లిబొల్లి మాటలు చెప్పి.. అమాయకుల నుంచి రూ.లక్షలు పెట్టుబడులు పెట్టిస్తున్నారు. ఒకరిద్దరికి సరిగానే ఇచ్చి.. మిగిలిన వారికి టోకరా వేస్తున్నారు. అలా వసూలు చేసిన డబ్బులు రూ.వందల కోట్లు దేశం దాటుతున్నాయి. క్రిప్టో పేరిట తెలంగాణలో పలు నకిలీ యాప్లు పుట్టుకొస్తున్నాయని, అమాయకులు పెట్టుబడి పెట్టి డబ్బులు పోగొట్టుకుంటున్నారని మూడేళ్ల క్రితమే కేంద్ర నిఽఘా వర్గాలు రాష్ట్ర పోలీసులను హెచ్చరించాయి. ఈ తరహా యాప్లను రాష్ట్ర పోలీసులు నియంత్రించడంలో విఫలమయ్యారనే చెప్పాలి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాష్ట్రంలోనే అత్యధిక క్రిప్టో మోసాలకు వేదికవుతున్నా.. పోలీసులు చర్యలు చేపట్టిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. జిల్లాలో పలువురు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ యాప్లలో పెట్టుబడులు పెట్టడం శోచనీయం.దేశం దాటుతున్న రూ.వందల కోట్లు భారీగా లాభాలు ఆశ చూపి, వసూలు చేసిన మొత్తాన్ని జగిత్యాల కేంద్రంగా కొంచెం హవాలా మార్గంలో, క్రిప్టోలోకి కొంచెం మార్చి దేశం దాటిస్తున్నారు. విదేశాల్లో ఆస్తులు కొని, వ్యాపారాలు ప్రారంభించి అక్కడే స్థిరపడేలా ‘లక్కీ భాస్కర్’సినిమాను తలపించేలా భారీ స్కెచ్ వేస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో జీబీఆర్ క్రిప్టో కరెన్సీ పేరుతో రమేశ్గౌడ్ అనే వ్యక్తి ఒక్క కరీంనగర్ జిల్లాలోనే రూ.95 కోట్లు కొల్లగొట్టాడు. దీనిపై సీఐడీ విచారణ జరపుతోంది. ఇందులో లంచం తీసుకున్నాడన్న ఆరోపణలపై ఓ డీఎస్పీని అటాచ్ చేశారు. రమేశ్ గౌడ్ ఆ డబ్బును దుబాయ్లో పెట్టుబడులు పెట్టి, పదేళ్ల గోల్డెన్ వీసా సంపాదించినట్లు బాధితులు తెలిపారు. ఇటీవల మెటా ఫండ్ పేరిట రాష్ట్రవ్యాప్తంగా రూ.100 కోట్లకుపై వసూలు చేసిన లోకేశ్, కె.సతీశ్ ఆ డబ్బును దేశం దాటించారని, వీరికి ఓ బీజేపీ నాయకుడు సాయం చేశాడన్న ప్రచారం సాగుతోంది. వాస్తవానికి లోకేశ్ ఎప్పుడో థాయ్లాండ్ వెళ్లాడని బాధితులు చెబుతున్నారు. తాజాగా హిమాన్ష్ అనే యువకుడిని రాచకొండ పోలీసులు అరెస్టు చేయడం సంచలనం రేపుతోంది. ఇతను రాష్ట్రవ్యాప్తంగా 400 మంది వద్ద రూ.19 కోట్లు నెక్ట్స్బిట్ యాప్ పేరుతో వసూలు చేశాడని రాచకొండ పరిధిలోని మేడిపల్లి పీఎస్లో కేసు నమోదైంది. ఈ యాప్ బారిన పడ్డవారిలో అత్యధికులు ఉమ్మడి కరీంనగర్ జిల్లావారే. గతంలోనూ హిమాన్షు రిక్సో యాప్ను నిర్వహించి రూ.కోట్లలో వసూలు చేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ముఠా దాదాపు రూ.300 కోట్ల వరకు వసూలు చేసిందని సమాచారం.పట్టించుకోని కరీంనగర్ పోలీసులు నెక్ట్స్బిట్ యాప్పై రహస్య సమాచారం మేరకు రాచకొండ పోలీసులు ఆగస్టు 1వ తేదీన హిమాన్షును అరెస్టు చేశారు. ఈ కేసులో రికీఫామ్ (ఫారిన్ ఆపరేటర్), అశోక్ శర్మ (థాయ్లాండ్ ఆపరేటర్), డీజే సొహైల్ (రీజనల్ రిక్రూటర్), మోహన్ (సహాయకుడు), అశోక్కుమార్ సింగ్ (హిమాన్షుకు సహాయకుడు)ను నిందితులుగా చూపించారు. వీరంతా నెక్ట్స్ బిట్యాప్లో పెట్టుబడి పెట్టించి ప్రజలను మోసగించారని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఉమ్మడి కరీంనగర్ పరిధిలో రామగుండం, కరీంనగర్ కమిషనరేట్లు, జగిత్యాల, సిరిసిల్ల ఎస్పీ కార్యాలయాలు ఉన్నాయి. రాచకొండ పోలీసుల తరహాలో వీరూ చర్యలకు దిగితే రూ.వందల కోట్ల దందా బయటికి వస్తుందని బాధితులు అంటున్నారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని పోలీసుస్టేషన్లలో ఈ విషయమై ఫిర్యాదులు ఇస్తే సెటిల్మెంట్ చేసుకోండని తిప్పి పంపుతున్నారని, కేసులు నమోదు చేయకుండా నిందితుల వైపు ఉంటున్నారన్న విమర్శలు పెరిగిపోతున్నాయి. కేసులు ఎందుకు నమోదు చేయడం లేదంటే బాధితులు ముందుకు రావడం లేదని పోలీసులు సమాధానం ఇస్తున్నారు. -
విద్యార్థుల్లో సాధించాలనే తపన ఉండాలి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): విద్యార్థుల్లో సాధించాలనే తపనకు కృషి తోడైతే ఎంతటి లక్ష్యాన్నైనా అవలీలగా చేరుకుంటారని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నలిమెల భాస్కర్ పేర్కొన్నారు. నారాయణపురం సేవా సంస్థ ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రాథమిక, జిల్లా పరిషత్ పాఠశాలల్లోని ప్రతీ తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థులను, తల్లిదండ్రులను గురువారం సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో నలిమెల భాస్కర్ మాట్లాడుతూ ఊరు పేరును నిలబెట్టాల్సిన బాధ్యత విద్యార్థులపైనే ఉందన్నారు. రిటైర్ట్ ఐఏఎస్ ఆఫీసర్ రమణాచారి, తిరుమల శ్రీనివాసాచారీలను స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. పదో తరగతి విద్యార్థుల్లో ఎంత మంది అన్ని సబ్జెక్టుల్లో 90కి పైగా మార్కులతో మొత్తం 550 సాధిస్తే రూ.10వేల చొప్పున ప్రోత్సాహకంగా అందజేస్తానని ప్రకటించారు. అనంతరం సేవా సంస్థ తరఫున విద్యార్థులకు డైరీలు, నోట్బుక్స్ అందజేశారు. స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం మనోహరాచారి, హెచ్ఎంలు చంద్రశేఖర్, దేవరాజు, నారాయణపురం సేవా సంస్థ సలహాదారులు పాత లింగన్న, నారాయణరెడ్డి, కిషన్, సుధాకర్రావు, సభ్యులు దేవిరెడ్డి, సుదర్శన్, దేవారెడ్డి, రాజు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.నానో ఎరువులతో అధిక దిగుబడి● జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్బేగంసిరిసిల్లఅర్బన్: నానో ఎరువులతో పంటల్లో అఽధిక దిగుబడి సాధించవచ్చని జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్బేగం పేర్కొన్నారు. సిరిసిల్ల పట్టణ పరిధిలోని చంద్రంపేట రైతువేదికలో వ్యవసాయశాఖ, భారతీయ రైతాంగ సహకార సంస్థ (ఇఫ్కో) సంయుక్తంగా నానో యూరియా ప్లస్, నానో డీఏపీ ఎరువుల వాడకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఇఫ్కో సంస్థ అభివృద్ధి చేసిన నానో యూరియా ద్రవం వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పుకు నాంది అన్నారు. కరీంనగర్ జిల్లా ఇఫ్కో ఏరియా మేనేజర్ బాలాజీ, జిల్లా మేనేజర్ డి.నరేశ్, ఏవో సందీప్కుమార్ తదితరులు పాల్గొన్నారు.అవార్డు అందుకున్న రేఖ● తొలి మహిళా చేనేత కార్మికురాలుసిరిసిల్ల: జిల్లా కేంద్రానికి చెందిన వెల్ది రేఖ జాతీయ చేనేత దినో త్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయిలో కొండా లక్ష్మణ్ బాపూజీ అవా ర్డును గురువారం హైదరాబాద్లో అందుకున్నారు. చేనేత మగ్గంపై రాజన్న సిరిపట్టు పితాంబరం చీరను నేసి అవార్డుకు ఎంపికయ్యారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. అవార్డు పొందిన తొలి మహిళా చేనేత కార్మికురాలిగా రేఖకు గుర్తింపు లభించింది. రేఖ భర్త వెల్ది హరిప్రసాద్ సూక్ష్మమగ్గంతో గుర్తింపు పొంది చేనేత మగ్గంపై పలు ప్రయోగాలు చేశారు.గెస్ట్ టీచర్ల పోస్టుకు దరఖాస్తులుసిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రంలోని కేజీబీవీలో గెస్ట్ టీచర్ల నియామకానికి అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రత్యేకాధికారిణి పావని గురువారం ప్రకటనలో తెలిపారు. సీఆర్టీ, హిందీ సబ్జెక్టుల్లో బోధించడానికి అర్హత గల అభ్యర్థులు ఈనెల 8 నుంచి 11 వరకు పాఠశాలలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు.రద్దీ రోజుల్లో అభిషేకాలు రద్దువేములవాడ: శ్రావణమాసం, వరుస సెలవుల నేపథ్యంలో అభిషేకం పూజలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో రాధాభాయి గురువారం తెలిపారు. ఈనెల 8, 9, 15, 16 తేదీల్లో అభిషేకాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అన్నపూజలు సమయానికి అనుగుణంగా నిర్వహిస్తారని పేర్కొన్నారు. భక్తులు సహకరించాలని కోరారు. -
రోడ్లు మూసివేతలు కూల్చేశాం
శ్రీనగర్కాలనీ సమీపంలోని జీపీ లేఅవుట్ వెంచర్లో వ్యవసాయం చేయకుండా మా సిబ్బంది చర్యలు తీసుకున్నారు. త్వరలోనే వెంచర్లో రోడ్లను మార్కింగ్ చేయిస్తాం. వెంచర్లో రోడ్ల విక్రయాలపై విచారణ చేపట్టి నిజమైతే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. వెంచర్లో పొందుపరిచిన రోడ్లు మూసేసిన వాటిని కూల్చేయడం జరిగింది. జ్యోతినగర్లో ఓ వ్యక్తి తన ఇంటి మెట్లు రోడ్డుపై వచ్చాయన్న విషయంలో నోటీసులు ఇచ్చాం. రోడ్లు అన్యాక్రాంతమైతే ఫిర్యాదు అందిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – ఎంఏ. ఖదీర్పాషా, మున్సిపల్ కమిషనర్, సిరిసిల్ల -
గురుకులం విద్యార్థులకు జ్వరాలు
● రక్తనమూనాల సేకరణ ● వైరల్ ఫీవర్స్ : ఎంఈవోఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని దుమాల ఏకలవ్య గురుకులంలోని విద్యార్థులు జ్వరాల బారిన పడ్డారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు కలిసి గురువారం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో విద్యార్థుల రక్త నమూనాలు సేకరించి ల్యాబ్కు తరలించారు. ఇద్దరు విద్యార్థులు వాంతులు, విరోచనాలతో బాధపడుతుండగా, వారికి పరీక్షలు చేసి వైద్యం అందించారు. మిగతా విద్యార్థుల రక్త నమూనాలను సేకరించి వారిని హాస్టల్కు తరలించారు. కొందరికి వైరల్ ఫీవర్స్ వచ్చాయని, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎంఈవో కృష్ణహరి తెలిపారు. -
వేడుకగా జాతీయ చేనేత దినోత్సవం
సిరిసిల్ల: జాతీయ చేనేత దినోత్సవాన్ని సిరిసిల్లలో గురువారం వేడుకగా నిర్వహించారు. స్థానిక పాతబస్టాండ్లోని నేతన్నచౌక్ వద్ద గల నేతన్న విగ్రహానికి కలెక్టర్ సందీప్కుమార్ ఝా, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు కె.కె. మహేందర్రెడ్డి పూలమాలలు వేశారు. వస్త్రపరిశ్రమకు ప్రజా ప్రభుత్వం అందిస్తున్న ఆర్డర్లు, యార్న్ బ్యాంకు ద్వారా నూలు, స్కూల్ యూనిఫాం, విద్యుత్ సబ్సిడీ అంశాలను గుర్తు చేశారు. చేనేత, జౌళిశాఖ ఏడీ రాఘవరావు, వస్త్రోత్పత్తిదారులు దూడం శంకర్, తాటిపాముల దామోదర్, వేముల దామోదర్, యెల్దండి శంకర్, గుండ్లపల్లి గౌతమ్, మండల బాలరాజు, బూర కనకరాజేశం, బూట్ల నవీన్, బీజేపీ నాయకులు ఆడెపు రవీందర్, నాగుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో.. పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలోనూ జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించారు. నేతన్న విగ్రహానికి పూలమాలలు వేశారు. పద్మశాలి సంఘం నాయకులు మండల సత్యం, డాక్టర్ గాజుల బాలయ్య, మోర రవి, గోసిక అనిల్కుమార్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో... బీఆర్ఎస్ ఆధ్వర్యంలోనూ నేతన్న విగ్రహానికి, విద్యానగర్ చౌరస్తాలో కొండా లక్ష్మణ్బాపూజీ విగ్రహాలకు పూలమాలలు వేశారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, పార్టీ నాయకులు గూడూరి ప్రవీణ్, మంచె శ్రీనివాస్, ఆకునూరి శంకరయ్య, దార్నం అరుణ, అడ్డగట్ల మురళి, బత్తుల వనజ, మ్యాన రవి, సబ్బని హరీశ్, గెంట్యాల శ్రీనివాస్, దార్ల సందీప్, అన్నారం శ్రీనివాస్, కల్లూరి రాజు తదితరులు పాల్గొన్నారు.● నేతన్న విగ్రహానికి పూలమాలలు -
డెంగీకి సర్కార్ వైద్యమే బెస్ట్
సిరిసిల్లటౌన్: డెంగీ జ్వరం వచ్చిందని ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు పోగొట్టుకోవద్దని.. సర్కార్ వైద్యంతోనే నయం చేయవచ్చని జిల్లా వైద్యాధికా రిణి రజిత పేర్కొన్నారు. డెంగీ కేసులు నమోదైన గ్రామాల్లో వైద్యసిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి, జ్వరాలు విస్తరించకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. డెంగీ, వైరల్ ఫీవర్స్పై భయాందోళన చెందవద్దని సూచించారు. జిల్లాలో డెంగీ, వైరల్ జ్వరాలు వస్తున్న నేపథ్యంలో ‘సాక్షి’ గురువారం నిర్వహించిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు.● సీజనల్ వ్యాధులపై అప్రమత్తం ● యాంటిబయాటిక్స్, స్టెరాయిడ్స్ వాడొద్దు ● అకారణంగా ప్లేట్లెట్స్ ఎక్కించుకోవద్దు ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో జిల్లా వైద్యాధికారిణి రజితప్రశ్న: డెంగీ, వైరల్ ఫీవర్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?డీఎంహెచ్వో: జిల్లాలో డెంగీ, సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో అన్ని గ్రామాల్లో డ్రై డే కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ విషయంలో కలెక్టర్ కూడా గ్రామపంచాయతీ, మున్సిపల్, వైద్యారోగ్య, రెవెన్యూ శాఖలకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. ఫాగింగ్ చేయడం, నీటి నిలువ గుంతలలో రసాయనాలు చల్లిస్తున్నాం. సాయంత్రం 5 నుంచి 7 గంటల ప్రాంతంలో మెష్లు ఉన్నవాళ్లు వాడాలి. లేని వారు తలుపులు, కిటికీలు మూసి దోమలు ఇంట్లోకి రాకండా జాగ్రత్తపడాలి. ప్రశ్న: డెంగీ జ్వరం లక్షణాలు, నిర్ధారణ ఎలా? ఎలాంటి ఆహారం తీసుకోవాలి?డీఎంహెచ్వో: హఠాత్తుగా తలనొప్పి, తీవ్ర జ్వరం, కళ్ల నొప్పి, ఒంటినొప్పులు తదితర లక్షణాలు కనిపిస్తాయి. జ్వరపీడితులు సర్కారు ఆస్పత్రుల్లో రక్త పరీక్షలు చేయించుకుంటే ఏ జ్వరం అనేది తెలుస్తుంది. జ్వరం తగ్గినా పక్షం రోజుల వరకు అలసటగా ఉంటుంది. పండ్లు, రసాలు, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. ఓఆర్ఎస్, కొబ్బరినీళ్లు తీసుకోవడం మంచిది. నిలువ ఉన్న నీటి గుంతల్లో దోమల మందు స్ప్రే చేయిస్తున్నాం. ప్రైవేటు ఆస్పత్రుల్లో డెంగీ నిర్ధారణ చేయొద్దు. వారు కూడా లక్షణాలున్న రోగి రక్తనమూనాలు ప్రభుత్వ ఆస్పత్రి, టీ–హబ్లోనే పరీక్షలు చేయించాలి. ప్రశ్న: ప్లేట్లెట్స్ ఎక్కించడం ఎప్పుడు అవసరం? డీఎంహెచ్వో: రోగులకు రక్తస్రావం జరగకుండా ప్లేట్లెట్స్ 10వేల వరకు పడిపోయినా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది మే నెల నుంచి జిల్లాలో 28 డెంగీ కేసులు నమోదయ్యాయి. డెంగీ జ్వరం ఐదు రోజుల వరకు ఉంటుంది. వారం తర్వాత రోగికి రక్తస్రావమైతే పరిస్థితి సీరియస్గా ఉందని భావించొచ్చు. వెంటనే దగ్గరలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాలి. రోగికి ఫ్లూయిడ్స్ మాత్రమే ఇవ్వాలి. జిల్లాలో ఇప్పటి వరకు హైరిస్క్ కేసులు నమోదు కాలేదు. ఇప్పటి వరకు ఎన్ఎస్–1 టెస్టులు 1,758, ర్యాపిడ్ టెస్టులు 1,686, మలేరియా 1,880 టెస్టులు నిర్వహించాం. చికున్గున్యా కేసులు నమోదుకాలేవు. ప్రశ్న: జిల్లాలో జ్వరాల పరిస్థితి, నివారణ చర్యలు వివరించండి?డీఎంహెచ్వో: అన్ని మండలాల్లో వైద్య సిబ్బంది ఫీవర్ సర్వే చేపడుతున్నారు. డెంగీతో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణహాని కాలేదు. అత్యవసర చికిత్సను జిల్లా ఆస్పత్రిలో పలువురికి చేయించగా వారు కోలుకున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల కన్నా ప్రభుత్వాస్పత్రుల్లో ట్రీట్మెంట్ ప్రొటోకాల్ ప్రకారం జరుగుతుంది. ప్రజలు ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నీటి కుండీలు, టైర్లు, కూలర్లు తదితరాల్లో దోమలు ఆవాసం లేకుండా చూడాలి. ఇందుకు వారంలో రెండు రోజులు డ్రై డే పాటించాలి. వ్యాధులు ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రశ్న: డెంగీ, వైరల్ ఫీవర్స్కు చికిత్స వివరాలు?డీఎంహెచ్వో: డెంగీ, వైరల్ ఫీవర్స్ నిర్మూలనకు జిల్లా వైద్యశాఖ సన్నద్ధంగా ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 53 వైద్యశిబిరాలు నిర్వహించాం. జ్వర పీడితులు జిల్లాలోని సర్కారు ఆస్పత్రుల్లోనే చికిత్స పొందాలి. జిల్లాలో మెడికల్ కాలేజీ, జిల్లా జనరల్ ఆస్పత్రి, ఏరియా ఆస్పత్రి, సీహెచ్సీ–2, యూహెచ్సీ–2, పీహెచ్సీ–16, బస్తీ దవాఖానాలు–2 ఉన్నాయి. వీటిల్లో 24 గంటలపాటు నిరంతర వైద్యం అందుతుంది. అత్యవసర పరిస్థితులు ఉంటే ఏరియా ఆస్పత్రి, జిల్లా ఆస్పత్రికి రోగులను తీసుకొచ్చి మెరుగైన వైద్యం అందిస్తాం. డెంగీ, వైరల్ ఫీవర్స్కు అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా యాంటిబయాటిక్స్, స్టెరాయిడ్స్ వాడొద్దు. ప్రభుత్వ వైద్యుడి సంరక్షణలో చికిత్స పొందడం మంచిది. -
పారిశుధ్య నిర్వహణపై శ్రద్ధ పెట్టాలి
సిరిసిల్ల/ముస్తాబాద్/తంగళ్లపల్లి(సిరిసిల్ల): పల్లెల్లో పారిశుధ్య నిర్వహణపై పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా కోరారు. కలెక్టరేట్లో గురువారం సీజనల్ వ్యాధుల నియంత్రణపై ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు, వైద్యాధికారులు, వైద్యసిబ్బందితో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ డెంగీ కేసులు నమోదైన ప్రాంతంలో ప్రత్యేకంగా పారిశుధ్య చర్యలు చేపట్టాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శి బాధ్యతగా పనిచేయాలన్నారు. మంగళ, శుక్రవారా లలో డ్రై డే చేపట్టాలని సూచించారు. డెంగీ కేసులను తక్కువ చేసి చూపించొద్దని, ఎన్ని కేసులు గుర్తించి, చికిత్స అందిస్తే అంత బాగా పని చేసినట్లుగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. ఆస్తి పన్ను వసూలు చేయాలి ప్రతీ గ్రామంలో ఆస్తిపన్ను వసూలు లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో పని చేయాలన్నారు. అన్ అకాడమీ ఆన్లైన్ క్లాస్లు ప్రారంభం సిరిసిల్లలోని ఎంజేపీటీబీసీ బాలికల గురుకులం, ముస్తాబాద్ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల విద్యాలయం, తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి సోషల్ వెల్ఫేర్, సారంపల్లి ట్రైబల్ వెల్ఫేర్, నేరెళ్ల తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్, కళాశాలల్లో అన్ అకాడమీ ఆన్లైన్ క్లాసులను కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కేకే.మహేందర్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ముస్తాబాద్ ఇందిరమ్మకాలనీలో అంగన్వాడీ కేంద్రం నూతన భవనాన్ని ప్రారంభించారు. ఆన్లైన్లో సీనియర్ సిటిజన్ మెయింటనెన్స్ కేసులు జిల్లాలో సీనియర్ సిటిజన్స్(వయోవృద్ధులు) మెయింటనెన్స్ కేసులు ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా కోరారు. కేసులు ఆఫ్లైన్లో కాకుండా, ఆన్లైన్ పోర్టల్ https://tgseniorcitizens.cgg.gov.inలో నమోదు చేయాలని తెలిపారు. మీసేవ కేంద్రాల్లో సీనియర్ సిటిజన్ కేసుల ఆన్లైన్ ఫైలింగ్ చేపట్టాలన్నారు. కేసు పురోగతి వివరాలు ఎప్పటికప్పుడు తె లుస్తాయని స్పష్టం చేశారు. డీఎంహెచ్వో రజిత, డీ పీవో షరీఫొద్దీన్, డీడబ్ల్యూవో లక్ష్మీరాజం ఉన్నారు. -
బీసీలపై కాంగ్రెస్ కపట ప్రేమ
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి సిరిసిల్లటౌన్: రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు బీసీలపై కపట ప్రేమ ఒలకబోస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి విమర్శించారు. సిరిసిల్ల లోని పార్టీ ఆఫీస్లో బుధవారం ప్రెస్మీట్లో మాట్లాడారు. స్థానికసంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ఖరారు చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని, అయినప్పటికీ 42 శాతం బీసీ రిజర్వేషన్ కోసం కేంద్రంపై ఒత్తిడి తేవడం సిగ్గుచేటుగా పేర్కొన్నారు. మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వరాదని సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా బీసీ రిజర్వేషన్లు ముందుకు తెచ్చి బీజేపీని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 12 శాతం ఉన్న ముస్లింలకు 10 శాత రిజర్వేషన్ ఎందుకు కల్పించాలో వివరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వానికి బీసీలపై ప్రేమే ఉంటే బీసీ విద్యార్థులకు రావాల్సిన రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని కోరారు. ముస్లిం రిజర్వేషన్లు తీసేసి 42 శాతాన్ని బీసీలకే కేటాయిస్తూ కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేస్తే బీజేపీ ఆమోదిస్తుందని కేంద్రమంత్రి బండి సంజయ్ ఎప్పుడో చెప్పారని గుర్తు చేశారు. పార్టీ అసెంబ్లీ కన్వీనర్ కరెండ్ల మల్లారెడ్డి, పట్టణాధ్యక్షుడు దుమాల శ్రీకాంత్, జిల్లా ఉపాధ్యక్షుడు సిరికొండ శ్రీనివాస్, నంద్యాలపు వెంకటేశ్, రాగుల రాజిరెడ్డి పాల్గొన్నారు. -
యజమానుల దోపిడీపై పోరాడుతాం
● బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి సూరం పద్మసిరిసిల్లటౌన్: బీడీ కంపెనీ యాజమాన్యాలు శ్రామి క దోపిడీపై పోరాటం చేస్తామని బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సూరం పద్మ పేర్కొన్నారు. సిరిసిల్లలోని అమృత్లాల్ శుక్లా కార్మి క భవనంలో బుధవారం అధ్యక్షురాలు దాసరి రూప అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం జరిగింది. పద్మ మాట్లాడుతూ బీడీ కంపెనీ యాజమాన్యం కార్మికుల నుంచి నెలకు రెండు వెయ్యిల బీడీల కూలీని దోచుకుంటున్నాయని ఆరోపించారు. రేయింబవళ్లు పనిచేసిన కార్మికులకు నెలకు రూ. 3వేల వరకు కూలీ వస్తే అందులో నుంచి రూ. వెయ్యి వరకు యజమానులే దోచుకుంటున్నారన్నా రు. నగదు బీడీ కంపెనీలు పుట్టగొడుగుల పుట్టుకొ స్తున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకో వడం లేదన్నారు. యూనియన్ నాయకులు జిందం కమలాకర్, బెజ్గం సురేష్, బోనాల లక్ష్మి పాల్గొన్నారు. -
మహిళలకు బస్సు డ్రైవింగ్లో శిక్షణ
● నేడు జెడ్పీ ఆఫీస్లో ఇంటర్వ్యూలు సిరిసిల్ల: జిల్లాలోని ఆసక్తి గల మహిళలకు ఉచితంగా బస్సు డ్రైవింగ్ శిక్షణ ఇచ్చేందుకు డీఆర్డీఏ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. బస్సు డ్రైవింగ్ శిక్షణను సెర్ప్, ఎంవోడబ్ల్యూవో ఆధ్వర్యంలో మూడు నెలలు ఇవ్వనున్నారు. 21–40 ఏళ్ల మధ్య వయసు, పదో తరగతి ఉత్తీర్ణులు అర్హులని పేర్కొన్నారు. 160 సెంటిమీటర్ల ఎత్తు, ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు. ఆసక్తి గల మహిళలు జిల్లా సమాఖ్యలో గురువారం ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలకు హాజరుకావాలని అధికారులు కోరారు. జెడ్పీ ఆఫీస్లోని మహిళా సమాఖ్య భవనంలో ఇంటర్వ్యూలు ఉంటాయని పేర్కొన్నారు. -
అర్హులకు రేషన్కార్డులు
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతంగళ్లపల్లి(సిరిసిల్ల): అర్హులకు రేషన్కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతోందని కలెక్టర్ సందీప్కుమార్ ఝా పేర్కొన్నారు. మండలంలోని బద్దెనపల్లి ఎస్ఎస్ గార్డెన్స్లో బుధవారం నూతన రేషన్ కార్డులను కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కెకె.మహేందర్రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ మండలంలో నూతనంగా 1,397 కొత్త రేషన్కార్డులు, ఇప్పటికే ఉన్న కార్డుల్లో 2,224 మంది కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేసినట్లు తెలిపారు. నూతన రేషన్కార్డు ద్వారా ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్ వంటి అనేక సంక్షేమ పథకాలకు అర్హత వస్తుందని స్పష్టం చేశారు. అంతకముందు చీర్లవంచలో రెండు అంగన్వాడీ కేంద్రాలను ప్రారంభించారు. చీర్లవంచ జెడ్పీ హైస్కూల్, ప్రాథమిక పాఠశాలతోపాటు మండల కేంద్రంలోని ట్రైబల్డిగ్రీ కళాశాలను తనిఖీ చేశారు. అనంతరం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక్కొక్కరికి రెండు పశువుల చొప్పున 14 మందికి పంపిణీ చేశారు. సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వెలుముల స్వరూప, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, తహసీల్దార్ జయంత్కుమార్, ఎంపీడీవో లక్ష్మీనారాయణ, ఏఎంసీ వైస్చైర్మన్ నేరెళ్ల నర్సింగంగౌడ్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ప్రవీణ్ జె.టోని తదితరులు పాల్గొన్నారు. -
నడుమునొప్పి పక్కా..
ఇది వేములవాడలోని సుభాష్నగర్ రోడ్డు. ఈ రోడ్డు గుండా భక్తులు, స్థానికులు తిరుగుతూనే ఉంటారు. రద్దీగా ఉండే ఈ రోడ్డులో యాభైకి పైగా గుంతలు ఏర్పడి వాహనదారులు వెళ్లలేకుండా మారింది. ఇంతటి రద్దీగా ఉండే రోడ్డును అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఈ రోడ్డుపై బీటీరోడ్డు వేసి రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని జనం కోరుకుంటున్నారు. ఇది సెస్ ఆఫీస్ ఎదుట ఉన్న ప్రధాన రహదారి. ఈ రోడ్డుపై ఏర్పడిన ఓ గొయ్యిని మున్సిపల్ అధికారులు పూడ్చారు. కానీ ఇక్కడ వర్షం కురిసినప్పుడల్లా గుంతలుగా మారి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. వేములవాడ: ఆధ్యాత్మిక పట్టణంలోని రహదారులపై అడుగుకో గుంత పడింది. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రమాదం జరుగుడు ఖాయం. కండ్లు మూసి తెరిచేలోపే ద్విచక్రవాహనాలు గుంతల్లో పడిపోతున్నాయి. చాలా మంది పట్టణ ప్రజలు ఈ రోడ్లపై ప్రయాణిస్తూ నడుము నొప్పులతో బాధపడుతున్నారు. రద్దీ పట్టణం.. రోడ్లు అధ్వానం వేములవాడ పట్టణంలో ప్రసిద్ధ శ్రీరాజరాజేశ్వరస్వామి కొలువుదీరడంతో రాష్ట్రంతోపాటు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తుంటా రు. ఇలా నిత్యం 30 వేల వరకు భక్తులు వేములవాడకు వచ్చి పోతుంటారు. వీరితో పాటు స్థానికులు ఇవే రోడ్లపై తిరుగుతుంటారు. ఇంతటి రద్దీ ఉండే పట్టణంలో రోడ్లు చూస్తే దారుణంగా ఉన్నాయి. తిప్పాపూర్ వంతెన నుంచి రాజన్న ఆలయం వరకు రోడ్డు విస్తరణ చేపడుతుండడంతో శిథిలాలతో నడవలేకుండా మారింది. మిగతా రోడ్లు గుంతలుపడ్డాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి వేములవాడ పట్టణంలోకి వచ్చే ప్రధాన రహదారులతోపాటు అంతర్గత రోడ్లను బాగు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. వేములవాడలో అధ్వానంగా రోడ్లు అడుగుకో గుంతతో అవస్థలు మరమ్మతు చేయని అధికారులుఇది వేములవాడ పట్టణంలోని పాపన్నచౌక్. ఉదయం 3 నుంచి 8 గంటల వరకు కూరగాయల మార్కెట్ నిర్వహిస్తారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటలకు అనేక పల్లెలకు చెందిన వేలాది మంది జనం వస్తుంటారు. ఈ గుంతల రోడ్డుతో ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని జనం కోరుతున్నారు. రోడ్లు బాగుచేస్తాం వేములవాడలోని రోడ్లను బాగుచేస్తాం. ఇందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసి ఉంచాం. త్వరలోనే పనులు చేపట్టి ప్రజలకు సౌకర్యవంతంగా మార్చుతాం. తెలంగాణచౌక్ నుంచి పాపన్నచౌక్ వరకు బీటీ రోడ్డు వేస్తున్నాం. మూలవాగు నుంచి రాజన్న ఆలయం వరకు ఆర్అండ్బీ అధికారులు 80 ఫీట్లతో రోడ్డు పనులు చేపట్టబోతున్నారు. సుభాష్నగర్ రోడ్డును బాగు చేయిస్తాం. – అన్వేశ్, మున్సిపల్ కమిషనర్, వేములవాడ -
పట్టు పరిశ్రమతో రైతుల ఆర్థిక స్థితి మెరుగు
వేములవాడరూరల్: పట్టు పరిశ్రమతో రైతుల ఆర్థిక స్థితి మెరుగవుతుందని జిల్లా సెరీకల్చర్ ఆఫీసర్ జగన్రావు పేర్కొన్నారు. వేములవాడ మండలం వెంకటాంపల్లిలో మేరా రేషమ్ మేరా అభిమాన్–2025లో భాగంగా బుధవారం రైతులకు శిక్షణ ఇచ్చారు. మల్బరీ తోట నిర్వహణ, నాణ్యమైన ఆకు ఉత్పత్తికి కత్తిరింపు పద్ధతులు, ఎరువుల మోతాదు, నాణ్యమైన కాయ ఉత్పత్తికి క్రిమిసంహారక విధానం గురించి, మల్బరీ వ్యాధి, తెగులు నిర్వహణపై చర్చించారు. శాస్త్రవేత్త మల్లికార్జున, రాఘవేంద్ర, డీహెచ్ఎస్వో లత, పంచాయతీ కార్యదర్శులు మనీశ, రాము పాల్గొన్నారు.తల్లిపాలతో అనేక లాభాలువేములవాడ: తల్లిపాలే శ్రేష్టమని ఫాగ్సీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ నాగమల్ల పద్మలత పేర్కొన్నారు. కరీంనగర్ ఆబ్సే్ట్రటీక్స్ అండ్ గైనకాలజిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం బాలింతలకు అవగాహన సదస్సులో మాట్లాడారు. తల్లిపాలతో కలిగే లాభాల గురించి వివరించారు. బిడ్డలకు పాలివ్వడం వల్ల ప్రసూతి తర్వాత ఏర్పడే శారీరక మార్పులను క్రమబద్ధీకరిస్తుందన్నారు. వైద్యులు శోభారాణి, లీలావతి, ఉష, ఏఎన్ఎంలు ప్రభావతి, సత్యవేద పాల్గొన్నారు.సైబర్ నేరాలపై నాటక ప్రదర్శనవేములవాడరూరల్: ప్రతీ ఒక్కరికి సైబర్ నేరాలపై అవగాహన ఉన్నప్పుడే మోసాలకు గురికామని వేములవాడ రూరల్ ఎస్సై అంజయ్య పేర్కొన్నారు. వేములవాడ మండలం చెక్కపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో బుధవారం సైబర్ జాగరుక్తా దివస్లో భాగంగా నాటక ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించా రు. సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన ఉంటే వారి కుటుంబం మొత్తానికి తెలుస్తుందన్నారు. ఎంఈవో కిషన్, జిల్లా సైబర్ సెల్ కానిస్టేబుల్ శ్రీకాంత్, వేములవాడ రూరల్ సైబర్ వారియర్ రాజశేఖర్గౌడ్ పాల్గొన్నారు.సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలికోనరావుపేట/వీర్నపల్లి: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి రజిత సూచించారు. స్థానిక పీహెచ్సీని, వీర్నపల్లి మండలం రాసిగుట్టతండా, భూక్యతండాలలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాలను బుధవారం తనిఖీ చేసిన సందర్భంగా మాట్లాడారు. ఆరోగ్య సిబ్బంది క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఫీవర్ సర్వే చేయాలన్నారు. డెంగీ తదితర జ్వరాల నివారణపై దృష్టి సారించాలన్నారు. గ్రామీణులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. ప్రోగ్రాం అధికారి అనిత, వైద్యులు వేణుమాధవ్, బాలకృష్ణ, సీహెచ్వో కృష్ణమూర్తి, హెచ్ఈవో లింగం, సూపర్వైజర్లు రషీద్, ఇందిర, పద్మ తదితరులు పాల్గొన్నారు.భీమేశ్వరాలయంలో ఏర్పాట్లు షురూ..వేములవాడ: రాజన్న ఆలయ విస్తరణ పనులు ప్రారంభించే ముందు భీమన్న ఆలయంలో భక్తులకు స్వామి వారి దర్శనాలు కల్పించేందుకు వీలుగా ఆలయ అధికారులు ఏర్పాట్లు మొదలుపెట్టారు. షెడ్లు వేసేందుకు అడ్డుగా ఉన్న భారీ చెట్లను బుధవారం తొలగించారు. -
వినూత్నంగా.. ఉపాధి పక్కాగా..
సిరిసిల్లకల్చరల్: పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి.. అని పెద్దలు చెప్పిన మాటలను నమ్మి ముందుకెళ్లి విజయం సాధించాడు భైరి మధు. తన తప్పేమి లేకున్నా చేస్తున్న వ్యాపారంలో నష్టం రాగా.. అదే రంగంలో వినూత్నంగా ఆలోచించి ఉపాధి పక్కాగా చేసుకున్నాడు. మరో 40 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. చందుర్తి మండలం మర్రిగడ్డకు చెందిన మధు తల్లిదండ్రులు బతుకుదెరువు కోసం భీవండిలో స్థిరపడ్డారు. తప్పనిసరి పరిస్థితుల్లో తిరిగి సిరిసిల్ల సమీపంలోని చంద్రంపేటకు వచ్చాడు. తన రెక్కల కష్టంతో రెండు కార్ఖానాలు నిర్వహించే స్థాయికి ఎదిగాడు. అయితే కరోనా మహమ్మారి కారణంగా నష్టపోయాడు. పడిన చోటే తిరిగి లేవాలని భావించి.. చేనేత రంగంలోని వినూత్నంగా ఆలోచించాడు. ఇప్పుడు 40 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. కరోనాతో కొత్త జీవితం కరోనా నియంత్రణకు మాస్కులు ధరించడం తప్పనిసరైన నేపథ్యంలో మాస్కుల తయారీపై దృష్టి సారించిన మధు కరీంనగర్, వరంగల్ జిల్లాల వరకు సరఫరా చేశాడు. సంక్షోభం ముగిసి సమాజం సాధారణ స్థితికి చేరేసరికి మధుకు ప్రత్యామ్నాయ వ్యాపారం జాడ దొరికింది. జాతీయ జెండాల రూపకల్పన, బ్యానర్లతోపాటు పండుగల సందర్భంగా ప్రస్తుతం ఉపయోగిస్తున్న కండువాలు తయారు చేయడం ప్రారంభించాడు. గత ఐదేళ్లుగా వస్త్రం కొనుగోలు చేయడం, రంగులు అద్దించడంతోపాటు వాటిని ఆర్డర్ల మేరకు కండువాలు, తయారు చేయిస్తున్నాడు. కృష్ణాష్టమి, వినాయక చవితి వంటి సామూహిక ఉత్సవాల్లో ఉపయోగించే లాల్చీలు, కుర్తాలు కుట్టించి విక్రయిస్తున్నాడు. వివాహాది శుభకార్యాల సందర్భంగా ఆయా కార్యక్రమాల నిర్వాహకులు ఏకరీతిగా ఉండే కుర్తాలు ధరిస్తుంటారు. అదే అదనుగా హల్దీ, సంగీత్ వంటి ఉత్సవాలకు అవసరమైన కుర్తాలు తయారు చేయించి అమ్ముతున్నాడు. మరో 40 మందికి ఉపాధి మధు తాను ఉపాధి పొందడంతోపాటు మరో 40 మందికి కుర్తాలు కుట్టే పనిలో ఉపాధి ఇస్తున్నాడు. ఒక్కొక్కరు వారి పని తీరు ఆధారంగా రోజుకు కనీసం రూ.300 సంపాదిస్తున్నారు. మధు చేస్తున్న పనికి ఆయన సతీమణి శ్యామల సైతం తోడుగా నిలుస్తోంది. కుర్తాలు, లాల్చీల తయారీ మరో నలభై మందికి ఉపాధి స్వయంకృషితో రాణిస్తున్న మధు కరోనా నేర్పిన దారి కోవిడ్ మహమ్మారి కారణంగా చేస్తున్న వ్యాపారం నష్టపోయాను. మాస్కులు ధరించడం తప్పనిసరి అనే ప్రచారంతో మాస్కులు త యారు చేయించి ఊరూరూ తిరిగి అమ్మేవాన్ని. టీవీఎస్ ఎక్సెల్ బండిమీద పలు జిల్లాల్లో మాస్కులు విక్రయించాను. మెల్లగా కరోనా పీరియడ్ తరువాత ఈ కుర్తాలు, జెండాలు, కండువాలు తయారు చేయించి విక్రయిస్తున్నాను. – భైరి మధు, తయారీదారుడు కొన్నేళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నా కొంతకాలంగా కుర్తాలు, లాల్చీలు కుట్టడం కోసం ఇక్కడే పనిచేస్తున్నాను. రోజుకు 30 నుంచి 40 వరకు లాల్చీలు కుట్టగలుగుతున్నాను. రోజుకో రూ.400 చొప్పున నెలకు రూ.12వేలు వరకు ఆదాయం వస్తోంది. – సిరిపురం లక్షణ -
నెలలో నలుగురు కార్యదర్శులు
● ఇల్లంతకుంట గ్రామపంచాయతీలో వింత పరిస్థితి ● అంతుచిక్కని బదిలీల వ్యవహారం ● ఈ సమయంలో వెలుగులోకి ఫేక్ అటెండెన్స్ ● స్థానికంగా చర్చనీయంగా ట్రాన్స్ఫర్లు ఇల్లంతకుంట(మానకొండూర్): ఇల్లంతకుంట మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో నెల రోజుల్లో నలుగురు కార్యదర్శులు బదిలీ కావడం చర్చనీయాంశమైంది. విధుల్లో చేరుతున్న వారు పట్టుమని పది రోజులు కూడా ఇక్కడ పనిచేయడం లేదు. మళ్లీ బదిలీపై ఇతర గ్రామానికి వెళ్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతోందని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. వరుస బదిలీలు.. ఈనెల 2వ తేదీన రహీంఖాన్పేట గ్రామపంచాయతీ కార్యదర్శి పులి సంధ్య ఇల్లంతకుంట గ్రామపంచాయతీకి బదిలీపై వచ్చారు. విధుల్లో చేరి మూడు రోజులు గడవకముందే మంగళవారం తంగళ్లపల్లి మండలం నేరెళ్లకు బదిలీ అయ్యారు. గత నెల 28న ఇల్లంతకుంట గ్రామపంచాయతీ కార్యదర్శి ఎస్.వరుణ్కుమార్ బోయినపల్లి మండలం కొదురుపాకకు బదిలీ అయ్యారు. అప్పటి నుంచి నలుగురు పంచాయతీ కార్యదర్శులు విధుల్లో చేరడం, అంతలోనే బదిలీపై వెళ్లడం జరిగిపోతోంది. వరుణ్కుమార్ స్థానంలో మండలంలోని వెంకట్రావుపల్లి నుంచి చంద్రశేఖర్ను కేటాయించారు. అతను కూడా పదిహేను రోజులు గడువక ముందే జూలై 23న సోమారంపేటకు బదిలీ చేశారు. ఇల్లంతకుంటకు సంధ్యకు పోస్టింగ్ ఇవ్వగా ఆరు రోజులకే మరోచోటుకు స్థాన చలనం చేశారు. సోమారంపేట గ్రామపంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ను ఇల్లంతకుంట గ్రామపంచాయతీకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయినట్టు ఎంపీవో శ్రీనివాస్ తెలిపారు. ఇల్లంతకుంట జీపీ కార్యదర్శి ఎస్.వరుణ్ బదిలీ అయిన సమయంలో ఆయన స్థానంలో వచ్చిన వెంకట్రావుపల్లి కార్యదర్శి చంద్రశేఖర్ను తిరిగి రెండోసారి కార్యదర్శిగా నియమించడం గమనార్హం. స్థానికంగా చర్చ ఇల్లంతకుంట మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో నెల రోజుల్లోనే నలుగురు కార్యదర్శులు బదిలీ కావడం చర్చనీయాంశమైంది. అయితే ఈ సమయంలోనే రాష్ట్రంతోపాటు జిల్లాలోనూ పలువురు పంచాయతీ కార్యదర్శులు ఫేక్ అటెండెన్స్తో మోసం చేస్తున్నట్లు వెలుగుచూసింది. దీంతో స్థానికంగా పంచాయతీ కార్యదర్శుల బదిలీలు చర్చకు దారితీసింది. -
కొత్తబస్టాండ్లో గుర్తుతెలియని మృతదేహం
జగిత్యాలక్రైం: జగిత్యాల కొత్తబస్టాండ్లో గుర్తుతెలియని మృతదేహం కనిపించినట్లు పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు. వేములవాడ బస్ ప్లాట్ఫాం సమీపంలోని మరుగుదొడ్ల పక్కన వ్యక్తి మృతదేహం ఉందని, బూడిద రంగు టీషర్ట్, తెల్లపంచ కట్టుకుని ఉన్నాడని, మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో భద్రపర్చామని పేర్కొన్నారు. అతని సమాచారం తెలిసినవారు 87126 56815నంబర్లో సంప్రదించాలని కోరారు. ఉరేసుకుని వివాహిత ఆత్మహత్యశంకరపట్నం: మండలంలోని తాడికల్ గ్రామంలో వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శంకరపట్నం ఎస్సై శేఖర్రెడ్డి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శ్రావ్య(27)కు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లికి చెందిన అమ్మిగల్ల ధర్మతేజ్తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కొడుకు శ్రేయాన్స్నందన్ ఉన్నాడు. ధర్మతేజ్ రెండేళ్లక్రితం దుబాయ్ వెళ్లాడు. అప్పటినుంచి శ్రావ్య పుట్టింట్లో ఉంటోంది. సోమవారం రాత్రి దుబాయ్ నుంచి ధర్మతేజ్ శ్రావ్యతో వీడియోకాల్లో మాట్లాడాడు. ఇద్దరిమధ్య గొడవ జరగడంతో మంగళవారం వేకువజామున ఇంట్లో శ్రావ్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శ్రావ్య సోదరుడు గొట్టె శివకృష్ణ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. మానసికవేదనతో ఒకరు.. చిగురుమామిడి: చిగురుమామిడి మండలం ఇందుర్తికి చెందిన బల్ల బాలయ్య(50) మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. బాలయ్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గుండె సంబంధిత ఆపరేషన్ సైతం జరిగింది. కొద్దిరోజులుగా మానసిక వేదనకు గురవుతూ.. మంగళవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ‘కాళేశ్వరం’పై బూటకపు నివేదిక● కేడీసీసీబీ చైర్మన్ కొండూరి రవీందర్రావు గంభీరావుపేట(సిరిసిల్ల): కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతలను నిలిపివేసి ఆ ప్రాజెక్టుపై బూటకపు నివేదికలతో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని కేడీసీసీబీ చైర్మన్ కొండూరి రవీందర్రావు ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై హరీశ్రావు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ను గంభీరావుపేట బీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం ఎల్ఈడీలో వీక్షించారు. అనంతరం మండలస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గత 20 నెలలుగా ప్రజలు సాగు, తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారన్నారు. బీఆర్ఎస్ పాలనలో పదేళ్లలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. ప్రపంచంలోనే అద్భుత కట్టడంగా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, రాబోవు ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. పార్టీ మండలాధ్యక్షుడు పాపగారి వెంకటస్వామి, సెస్ డైరెక్టర్ నారాయణరావు, దయాకర్రావు తదితరులు పాల్గొన్నారు. -
గుండెపోటుతో ముగ్గురు మృతి
● మృతుల నేత్రాలు దానం ● ఆరుగురు అంధులకు చూపు కోల్సిటీ(రామగుండం): గోదావరిఖనిలో సోమవారం రాత్రి ముగ్గురు గుండెపోటుతో మృతి చెందారు. కుటుంబ పెద్దను కోల్పోయిన విషాదంలో కూడా ఆ మూడు కుటుంబాలు.. సదాశయ ఫౌండేషన్ జాతీయ ప్రచార కార్యదర్శి వాసు ఆధ్వర్యంలో ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ ప్రదీప్ నాయక్ సహకారంతో ముగ్గురి నేత్రాలను దానం చేశారు. ఆరుగురు అంధులకు కంటి వెలుగులు ప్రసాదించేలా సహకరించారు. ఈ ముగ్గురిలో సమీప బంధువు తాండూరి శ్రీనివాస్ పార్థివదేహాన్ని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం సందర్శించి నివాళి అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. ముగ్గురి చూపు.. ఆరుగురికి కంటి వెలుగులు.. జవహర్నగర్కు చెందిన తాండూరి శ్రీనివాస్(49) సింగరేణిలోని ఎస్ఎంఎస్ ప్లాంట్లో స్టేనోగా పనిచేస్తున్నాడు. ఛాతీలో నొప్పి ఉందంటూ కుప్పకూలిపోయాడు. వెంటనే గోదావరిఖని గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు నిర్ధారించారు. శ్రీనివాస్ నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మాజీ కార్పొరేటర్ ఎండీ ముస్తాఫా నివాళి అర్పించారు. అదేవిధంగా దుర్గానగర్కు చెందిన సీనియర్ వ్యాపారి అమృత్లాల్ చౌడ(78) హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన 55 ఏళ్లుగా హార్డ్వేర్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. మృతుడి నేత్రాలను కుమారుడు, కోడలు జయప్రకాశ్ చౌడ–కవిత, మనమలు కౌశల్, నివేద్ దానం చేశారు. మరోవైపు.. ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి వేల్పుల సాయిలు(70) సింగరేణి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన నేత్రాలను కుటుంబసభ్యులు దానం చేశారు. మృతుల కుటుంబాలను సదాశయ ఫౌండేషన్, రామగుండం లయన్స్, స్ఫూర్తి క్లబ్ ప్రతినిధులు అభినందించారు. -
ఘనత సాధించిన తండ్రీకొడుకులు
పెద్దపల్లిరూరల్: యూరప్ ఖండంలోనే అత్యంత ఎత్తయిన శిఖరం మౌంట్ ఎల్బ్రోస్ 5,642 మీ ఎత్తు (18,150 అడుగులు) పర్వతశిఖరాన్ని పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీకాలనీకి చెందిన వివేకానందరెడ్డి, ఆయన తండ్రి మహిపాల్రెడ్డి అధిరోహించారు. దీంతో కలెక్టరేట్లో మంగళవారం తండ్రీకొడుకులను కలెక్టర్ కోయ శ్రీహర్ష అభినందించారు. తండ్రిబాటలో తనయుడు.. మాజీ సైనికోద్యోగి అయిన లెంకల మహిపాల్రెడ్డి ఇప్పటికే పలు దేశాల్లోని 12 పర్వతాలను అధిరోహించి ఇంటర్నేషనల్ మౌంటనీర్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. తన బాటలోనే తనయుడు వివేకానందరెడ్డిని కూడా పర్వతారోహకుడిగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో గతేడాది శిక్షణ ఇచ్చారు. హిమాచల్ప్రదేశ్ రాష్ట్రంలోని పతాల్సు పర్వతాన్ని వివేకానందరెడ్డి అధిరోహించారు. తండ్రి ఇచ్చిన శిక్షణతోనే యూరప్లో అత్యంత ఎత్తయిన పర్వతాన్ని ఈనెల 3న అధిరోహించారు. సే నో టు డ్రగ్స్ బ్యానర్ ఆవిష్కరణ యూరప్లోని పర్వతాన్ని అధిరోహించిన వివేకానందరెడ్డి.. అక్కడ సే నో టు డ్రగ్స్ అనే బ్యానర్ ఆవిష్కరించారు. గతనెల 28న రష్యాకు చేరుకుని అక్కడే ఐదురోజుల పాటు శిక్షణ పొందినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతికూల వాతావరణంలోనూ మాస్టర్ వివేకానందరెడ్డి ధైర్యసాహసాలతో పర్వతాన్ని అధిరోహించడం అభినందనీయమని కలెక్టర్ అభినందించారు. భవిష్యత్లో మరెన్నో పర్వతాలను అధిరోహించి రికార్డు సృష్టించి తెలంగాణ రాష్ట్రానికి, భారతావనికి కీర్తిప్రతిష్టలు తేవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. యూరప్లో ఎత్తయిన శిఖరం అధిరోహణ అభినందించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీహర్ష -
ఎయిర్ రైఫిల్ షూటింగ్లో ప్రథమ బహుమతి
కరీంనగర్రూరల్: బొమ్మకల్లోని బిర్లా ఓపెన్మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్కు చెందిన 3వ తరగతి విద్యార్థి మరియం భాను ఉమ్మడి కరీంనగర్ జిల్లాస్థాయిలో ఎయిర్ రైఫిల్ షూటింగ్లో ప్రథమ బహుమతి సాధించినట్లు పీడీ సుంకరి మురళీధర్ తెలిపారు. ఈ నెల 3న స్వదేశ్ షూటింగ్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లాస్థాయి రైఫిల్ షూటింగ్ పోటీల్లో ప్రతిభను ప్రదర్శించి ప్రథమ బహుమతి, రూ.10వేల నగదు గెలుచుకున్నట్లు వివరించారు. మంగళవారం విద్యార్థిని పాఠశాల చైర్మన్ దాసరి ప్రశాంత్రెడ్డి, ప్రిన్సిపాల్ బబితా విశ్వనాథన్ అభినందించారు. -
మృతుడి కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలి
మానకొండూర్: ఇసుక లారీ ఢీకొని చనిపోయిన మానకొండూర్ మండలం మద్దికుంట గ్రామానికి చెందిన కెక్కర్ల సురేశ్ కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని, ప్రమాదానికి కారణమైన ఊటూరు ఇసుకక్వారీ యజమానులు, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై కేసు నమోదు చేయాలని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ డిమాండ్ చేశారు. మానకొండూర్లో మంగళవారం మాట్లాడుతూ.. కెక్కర్ల సురేశ్ కరీంనగర్లోని ఓ ట్రాక్టర్ షోరూంలో పనిచేస్తూ కుటుంబానికి పెద్దదిక్కుగా ఉండేవాడన్నాడు. పోచంపల్లి వద్ద ఇసుక లారీని ఢీకొని చనిపోయాడాని తెలిపారు. సురేశ్ను అంబులెన్సులో కరీంనగర్ తీసుకెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించారు. రహదారి వెంట ఇసుక లారీలు నిలిపేందుకు ఎవరు అనుమతి ఇచ్చారని మండిపడ్డారు. మృతుడి కుటుంబాన్ని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కనీసం పరామర్శించలేదన్నారు. మాజీ జెడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్గౌడ్, రవీందర్రెడ్డి, దేవేందర్రెడ్డి, శాతరాజు యాదగిరి, పిట్టల మధు, నెల్లి శంకర్, గుర్రం కిరణ్ గౌడ్, గడ్డం సంపత్, నెల్లి మురళి, అశోక్రెడ్డి పాల్గొన్నారు. క్వారీ యజమాని, ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలి మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్