breaking news
Rajanna
-
మెరుగైన వైద్యసేవలు అందించాలి
● కలెక్టర్ గరీమా అగ్రవాల్ గంభీరావుపేట(సిరిసిల్ల): రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు రోగులతో మాట్లాడి వై ద్యసేవలపై ఆరా తీశారు. ఇన్పేషెంట్ వార్డులు, మందులు ఇచ్చే గది, స్టోర్రూమ్, వ్యాక్సినేషన్, యునాని హాస్పిటల్, ఆస్పత్రి ఆవరణ పరిశీలించారు. హాస్పిటల్ ఆవరణ శుభ్రంగా ఉండాలని ఎంపీడీవోకు సూచించారు. అవసరమైన మరమ్మతులు చేయించాలని అ ధికారులను ఆదేశించారు. వైద్యులు, సి బ్బంది అందుబాటులో ఉండాలని, మె రుగైన వైద్యసేవలు అందించాలన్నారు. ప్రభుత్వ వైద్యసేవలపై అవగాహన కల్పించాలని సూచించారు. టీజీఈడబ్ల్యూఐడీసీ ఈఈ అశోక్కుమార్, జిల్లా వైద్యాధికారి రజిత, డీసీహెచ్ఎస్ రవీందర్, సర్పంచ్ మల్లుగారి పద్మ, ఉపసర్పంచ్ కమలాకర్రెడ్డి, తహసీల్దార్ మారుతిరెడ్డి, ఎంపీడీవో రాజేందర్, వైద్యాధికారి సృజన్ ఉన్నారు. బాధితుల వద్దకే పోలీసులుసిరిసిల్ల క్రైం: వేగవంతమైన, సౌకర్యవంతమైన పోలీస్ సేవలు అందించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బాధితులు పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా, సంఘటన స్థలంలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసే ‘ఆన్సైట్ ఎఫ్ఐఆర్’ విధానాన్ని జిల్లా వ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. నేరం జరిగిన తర్వాత శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు పడుతున్న బాధితులకు స్టేషన్కు వెళ్లడం భారంగా మారకుండా ఉండేందుకు ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుల నుంచే ఫిర్యాదు స్వీకరించి, ట్యాబ్ల సహాయంతో ఆన్లైన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు. డయల్ 100కు కాల్ చేసినా, నేరుగా సమాచారం ఇచ్చినా తక్షణమే స్పందిస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే ఈ విధానం ద్వారా జిల్లాలో 12 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. -
శ్రీపరాభవ నామం.. షడ్రుచుల మేళం
నేడు ఉగాది పర్వదినంసిరిసిల్ల: వనాలన్నీ చిగురించే వేళ.. పూల పరిమళాలు వెదజల్లే సమయాన.. లేలేత చివుళ్లు వేసి... కోయిలమ్మల కుహు కుహూ రాగాలు .. హాయినిచ్చే వెచ్చని గాలులు.. వచ్చేది వసంతం.. ఆరు రుతువుల్లో ఇది ప్రత్యేకం. తెలుగు సంవత్సర ఉగాదిని ప్రతి ఏడాది చైత్ర శుద్ధ పాడ్యమి రోజున జరుపుకోవడం ఆనవాయితీ. నేటి నుంచి శ్రీపరాభవ నామ సంవత్సరం ఆరంభం కానుంది. ‘పరాభవ నామ సంవత్సరం’ ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, సామాజిక, జీవన మార్గదర్శక భావనలను అందిస్తుంది. ‘పరాభవ’ అనే పదానికి సాధారణంగా ‘పరాజయం’ అనే అర్థం ఉన్నప్పటికీ, ఇది మన లోపాలను గుర్తించి, వాటిని జయించి, విజయానికి పునాది వేయాలని సూచిస్తుంది. నేడు ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణానికి ఏర్పాట్లు చేశారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరపనున్నారు. -
మానేరును తోడేస్తున్రు!
‘ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్నగర్, పదిర శివారులోని చిట్టివాగు నుంచి ఈనెల 11వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత కొందరు ట్రాక్టర్లలో ఇసుకను తరలించేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న సమీప పొలాల రైతులు ట్రాక్టర్లను అడ్డుకొని పోలీసులకు సమాచారం అందించారు. అయితే పోలీసులు వచ్చేలోపే ఇసుక స్మగ్లర్లు ట్రాక్టర్లతో సహ పరారయ్యారు.’ ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఇసుక వ్యాపారుల అక్రమార్జనకు భూగర్భజలాలు పడిపోతున్నాయి. పంటలు చేతికొచ్చే దశలో బోరుబావుల్లో నీళ్లు అడుగంటుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని మానేరువాగులో నుంచి ఇసుకను ఇష్టారీతిగా తరలిస్తుండడంతోనే సాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని గుర్తించిన రైతులు అక్రమంగా ఇసుక తరలింపును అడ్డుకుంటున్నారు. పగటిపూట అనుమతులతో ఇసుక తరలిస్తున్నా ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో పలువురు అర్ధరాత్రి దాటిన తర్వాత ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. వీరు ఇష్టారీతిగా మానేరువాగులో తవ్వుతుండడంతో సమీప బావులు, బోరుబావులు అడుగంటుతున్నాయి. పంటను కాపాడుకునేందుకు సాధారణంగా రైతులు పొలాల వద్ద కాపలా కాస్తుంటారు. కానీ జిల్లాలోని మానేరువాగు, చిట్టివాగు, నక్కవాగులను ఆనుకుని పొలాలు ఉన్న రైతులు మాత్రం రాత్రి పూట ఇసుక తీసుకెళ్లకుండా కాపలాగా ఉంటున్నారు. ఎండుతున్న పంటలు జిల్లా రైతుల వరప్రదాయని మానేరువాగు గంభీరావుపేట మండలం నర్మాల నుంచి బోయినపల్లి మండలం మిడ్మానేరు వరకు ప్రవహిస్తుంటుంది. మానేరువాగును ఆనుకుని 97వేల ఎకరాలలో వరి పంట సాగవుతుంది. ఇసుక వ్యాపారులు పైసాచికానికి పోయి అనుమతులు లేకుండా అర్ధరాత్రి కూడా వాగును తోడుతున్నారు. ఇలా ఇసుకను తీసుకెళ్తుండడంతో మానేరువాగులోని సమీప వ్యవసాయ బావులు, బోరుబావులు ఎండిపోతున్నాయి. ఫలితంగా మానేరువాగు, నక్కవాగులను ఆనుకుని ఉన్న సమీప పొలాల్లోని పంటలు ఎండిపోతున్నాయి. ఆరుగాలం కష్టపడి కాపాడుకుంటున్న పంటలు ఇసుక దొంగల కారణంగా ఎండిపోతుండడంతో కడుపుమండిన రైతులు అర్ధరాత్రి కాపలా ఉండి ఇసుక ట్రాక్టర్లను అడ్డుకుంటున్నారు. పంటల సమాచారం జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం : 1,11,234 ఎకరాలు మానేరువాగు ప్రాంతం : 79వేల ఎకరాలు అర్ధరాత్రి అక్రమంగా ఇసుక తరలింపు ఇసుకాసురులపై రైతుల తిరుగుబాటు జలవనరుల సంరక్షణకు అన్నదాతల తిప్పలు రాత్రిపూట రెచ్చిపోతున్న స్మగ్లర్లు పగటిపూట అనుమతులు.. చీకట్లో అక్రమాలు -
ప్రతి మహిళ 20 మందికి అండగా నిలవాలి
సిరిసిల్ల: మహిళలు అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్స్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో మంగళవారం వేడుకలు నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కలెక్టర్ మాట్లాడారు. మహిళలు ఆరోగ్యంపై దృష్టి సారించాలన్నారు. ప్రతీ మహిళ కనీసం 20 మంది మహిళలకు మద్దతుగా నిలవాలని ఆకాంక్షించారు. తాము విధులు నిర్వర్తించే చోట, పరిసర ప్రాంతాల వారికి ఆపద సమయంలో భరోసా ఇవ్వాలన్నారు. వందశాతం పన్ను వసూలు చేయాలి సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ పరిధిలో ఇంటి, భవనాల పన్ను వంద శాతం వసూలు చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. సిరిసిల్లలో పన్ను వసూలు లక్ష్యం రూ.6.99కోట్లు కాగా, ఇప్పటి వరకు రూ.5.66కోట్లు, వేములవాడలో రూ.4.54 కోట్లు లక్ష్యం కాగా, రూ.3.18 కోట్లు వసూలు చేసినట్లు అధికారులు వివరించారు. అలాగే జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై కలెక్టర్ సమీక్షించారు. గ్రామ సమాఖ్య, అంగన్వాడీ భవనాల పనులను పూర్తి చేయాలన్నారు. లబ్ధిదారుల ఎంపిక మైనార్టీ కార్పొరేషన్ ద్వారా శ్రీరేవంతన్నా కా సహారా– మిస్కీన్లశ్రీ పథకం ద్వారా ఫకీర్, దూదేకుల ముస్లిం కమ్యూనిటీ అభ్యున్నతికి జిల్లాకు కేటాయించిన ఈ–బైక్ల ఎంపిక కోసం కలెక్టర్ లక్కీ డీప్ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబాయ్, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, డీఆర్డీవో గీత, డీఏవో అఫ్జల్ బేగం, మత్స్య శాఖ అధికారి సౌజన్య, డీఎంహెచ్వో రజిత, మైనార్టీ అధికారి భారతి, ఎస్సీ సంక్షేమ అధికారి స్వప్న, జిల్లా ఆడిట్ అధికారి శ్రీనివాస్, హౌసింగ్ పీడీ వెంకటమాధవరావు, డీవీహెచ్వో రవీందర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్పాషా, సంపత్కుమార్, ఐఎంఏ డాక్టర్లు శోభారాణి, శిరీష తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ గరీమా అగ్రవాల్ -
సాహితీవేత్తలు మార్గదర్శకులుగా నిలవాలి
సిరిసిల్లటౌన్: సమాజహితమే లక్ష్యంగా సాహిత్యం స్వచ్ఛమైన గంగా ప్రవాహమై నిరంతరం కొనసాగాలని డీఎస్పీ నాగేంద్రచారి ఆకాంక్షించారు. సిరిసిల్ల సాహితీ సమితి, మానేరు స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా మంగళవారం ఉగాది కవి సమ్మేళనం నిర్వహించారు. స్థానిక గాంధీనగర్లోని భక్త విఠలేశ్వర హనుమాన్ ఆలయంలో జరిగిన కవి సమ్మేళనానికి డీఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సమాజ హితమే లక్ష్యంగా కవితలు, రచనలతో భవిష్యత్ తరాలకు మార్గదర్శకులుగా నిలవాలని పిలుపునిచ్చారు. సమాజానికి దిశానిర్దేశం చూపేది కవులు, రచయితలేనని పేర్కొన్నారు. సమ్మేళనంలో డీఎస్పీతో పాటు కవులను సన్మానించారు. కార్యక్రమంలో మానేరు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు డాక్టర్ చింతోజు భాస్కర్, సిరిసిల్ల సాహితీ సమితి గౌరవ అధ్యక్షుడు పోరండ్ల మురళీధర్, వెంగళ లక్ష్మణ్, నేరోజు రమేశ్, ఆడెపు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ సాంస్కృతిక ఉత్సవాలకు స్వరూపరాణి
తంగళ్లపల్లి(సిరిసిల్ల): జిల్లాకు చెందిన ప్రముఖ గాయకురాలు, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కత్తి స్వరూపరాణి జాతీయస్థాయి గుర్తింపు పొందారు. ఈ నెల 20 నుంచి 25 వరకు ఢిల్లీలో నిర్వహించే జాతీయ సాంస్కృతిక ఉత్సవాలకు ఆమె ఎంపికై నట్లు ఫ్రెండ్స్ కల్చరల్ అసోసియేషన్ (వరంగల్) అధ్యక్షుడు శ్రీధరస్వామి తెలిపారు. ఇటీవల శ్రీఅఖిల భారత సివిల్ సర్వీసెస్ సంగీతం, నృత్యం, నాటక పోటీల్లో ప్రతిభ చాటారు. జానపద బృంద గానం విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు ఆమెను జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. స్వరూపరాణి ప్రస్తుతం తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్ టీచర్గా పనిచేస్తున్నారు. ఢిల్లీ వేదికపై కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రముఖ రేడియో, టీవీ గాయకుడు కాసు మహేందర్రాజ్ బృందంతో కలిసి ఆమె తన గానాన్ని వినిపించనున్నారు. ఈసందర్భంగా స్వరూపరాణి, ఆమె బృందాన్ని ఎంఈవో రాజునాయక్, ఉపాధ్యాయులు అభినందించారు. -
లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి
సిరిసిల్ల: కక్షిదారులు ఈ నెల 28న జరిగే లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు బి.పుష్పలత కోరారు. మంగళవారం జిల్లా కోర్టు సముదాయంలో న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, పోలీసు అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో మాట్లాడారు. సాధ్యమైనంతవరకు ఎక్కువ కేసులు పరిష్కరించాలని సూచించారు. పోలీసు అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. సిరిసిల్ల సీనియర్ సివిల్ జడ్జి లక్ష్మణాచారి, వేములవాడ సీనియర్ సివిల్ జడ్జి అజయ్కుమార్ జాదవ్, మెజిస్ట్రేట్లు ప్రవీణ్, సృజన, జ్యోతిర్మయి, కుమారి మేఘన, ఏఎస్పీ డి.చంద్రయ్య, సిరిసిల్ల, వేములవాడ డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు, పోలీసు అధికారులు, కోర్టు మానిటరింగ్ పోలీసులు పాల్గొన్నారు. రాజన్న సేవలో మంత్రి అడ్లూరివేములవాడ: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి అనుబంధ భీమేశ్వరస్వామిని మంగళవారం రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారికి మంత్రి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు ఆశీర్వచనం గావించగా, ఆలయ ఏఈవో శ్రావణ్కుమార్ స్వామివారి శేషవస్త్రం, ప్రసాదం అందజేశారు. సిరిసిల్ల ఏఎస్పీ చంద్రయ్య, వేములవాడ డీఎస్పీ శ్రీనివాస్, తహసీల్దార్ జయంత్కుమార్, ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్శర్మ, ఎడ్ల శివసాయి, జూనియర్ అసిస్టెంట్లు సింహాచారి, నరాల రాజు తదితరులు పాల్గొన్నారు. ముస్తాబాద్కు మల్లన్నసాగర్ జలాలుముస్తాబాద్(సిరిసిల్ల): మండు వేసవిలో రైతులకు ఉపశమనం కలిగించేలా మల్లన్నసాగర్ జలాలు ముస్తాబాద్ మండలానికి సోమవారం చేరుకున్నాయి. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను 12వ ప్యాకేజీ ద్వారా మోహినికుంట, మద్దికుంట, చీకొడు చెరువులకు వదిలారు. సిద్దిపేట జిల్లా రాజక్కపేటలో చెరువు నిండి.. మద్దికుంట చెరువుకు వారం రోజులుగా గోదావరి జలాలు వస్తున్నాయి. ఈమేరకు మద్దికుంట చెరువు కూడా నిండి మత్తడి పోస్తోంది. దీంతో మోహినికుంట, మద్దికుంట రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటి, బోరుబావులు ఎండుతున్నాయని రైతులు పేర్కొన్నారు. వరిపంటలు పండుతాయో లేదోననే ఆందోళనలో ఉన్న రైతులకు మల్లన్నసాగర్ జలాలు ఉపశమనం కలిగించాయి. ఏఈ నవీన్కుమార్ మద్దికుంట చెరువును పరిశీలించారు. వారం రోజుల్లో ముస్తాబాద్ లింగంకుంట చెరువుకు నీళ్లు చేరుతాయని తెలిపారు. -
పల్లె మారింది
● గల్ఫ్ వలసల నుంచి సాఫ్ట్వేర్ వరకు.. నాలుగు దశాబ్దాల కిందట నెలకొన్ని కల్లోల పరిస్థితుల్లో వ్యవసాయం జూదంలా ఉండేది. పొట్ట చేతపట్టుకుని ముంబయి, దుబాయ్ వలసపోయే రోజులు. అరకొర ఆదాయం.. గల్ఫ్ వలసలు పల్లె జీవనంపై తీవ్ర ప్రభావం చూపాయి. కారణాలు ఏమైనా పల్లె ముఖచిత్రం వేగంగా మారిపోయింది. చదువుకుంటూ ఉద్యోగాలు చేసే యువకులు.. పుట్టిపెరిగిన ఊరిలో అందమైన భవనాన్ని నిర్మించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. వ్యవసాయంలోనూ ఆధునిక విధానాలు రావడం, వాణిజ్యంగా కోళ్లఫారాలు వెలువడం, పసిడి పంటలతో పల్లె ఆర్థిక వ్యవస్థ బలపడింది. పల్లె ముంగిట్లోకి సూపర్మార్కెట్, బట్టల షోరూంలు రావడంతో ఊరు తీరు మారిపోయింది. ● భూముల ధరలకు రెక్కలు రాష్ట్రం వచ్చిన తర్వాత పల్లెల్లో భూములకు ధరలు పెరిగాయి. గతంలో భూములు కొనాలన్నా, అమ్మాలన్నా నక్సలైట్ల ఆంక్షలు ఉండేవి. ఇప్పుడు అవేమీ లేకపోవడంతో స్వేచ్ఛా విఫణిలో భూముల రేట్ల పెరిగాయి. జిల్లాలోని ఏ పల్లెకు వెళ్లినా భూమి ఎకరం రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షలకు చేరింది. తారు రోడ్డును ఆనుకుని ఉంటే రూ.కోట్లలోకి చేరింది. రైతుబంధు, రైతుభరోసా వంటి పథకాలతో భూముల ధరలు పెరిగాయి. ప్రభుత్వం సైతం భూముల విలువను 2020 నుంచి మూడుసార్లు పెంచింది. పల్లెల్లోనూ ఇళ్ల స్థలాల ధర రూ.లక్షలకు చేరింది. తెలంగాణ జిల్లాల్లో తలసరి ఆదాయం రూ.3.56లక్షలకు చేరడంతో పల్లె జీవన శైలి మారింది. సెల్ఫోన్ ప్రభావం పెరిగింది. సామాజిక మాధ్యమాలు పెరగడంతో మంచి, చెడును తెలుసుకుంటూ సోషల్ మీడియా వేదికగా సాంకేతిక విప్లవం పల్లెను చేరింది. పల్లె మారింది. పల్లె జనం శైలి మారింది. అందమైన భవనాలు.. అంతకుమించి ఆదాయ వనరులు.. మారిన జీవన శైలి.. ఆన్లైన్లో ఆర్డర్లు.. సాంకేతికత ఆలంబనగా పల్లె ప్రజలు పట్టణాలతో పోటీ పడుతున్నాయి. డూప్లెక్స్ ఇళ్లు, సీసీ కెమెరాల నిఘా, ఖరీదైన కార్లు.. సెల్ఫోన్లు, నిరంతరం ఇంటర్నెట్. పల్లె ముగింట్లో ఆధునిక సౌరభాల సందడి. జిల్లాలోని కోనరావుపేట మండలం బావుసాయిపేటలో రెండు దశాబ్దాల్లో వచ్చిన మార్పులు ఆ పల్లె రూపురేఖలను మార్చివేసింది. కల్లోల పల్లె.. కనువిందు చేస్తుంది ఊరు మారింది.. తీరు జోరుంది వన్నెలద్దుకుంటున్న పల్లెలు ఆధునికీకరణ దిశగా గ్రామీణ జీవనంసిరిసిల్ల: రెండు దశాబ్దాల కింద భూమి కోసం.. భుక్తి కోసం నక్సలైట్ల సాయుధ పోరు.. వారిని కట్టడి చేసేందుకు పోలీసుల గాలింపులతో ఆ ప్రాంతం ఉద్రిక్తంగా ఉండేది. గోధూలి వేళ.. విప్లవ నినాదాలు.. ఆవేశపూరిత ప్రసంగాలు.. ప్రజాకోర్టులు.. అక్కడికక్కడే తీర్పులు.. వీపులు విమానపు మోతలు. తెల్లవారితే.. బూట్లచప్పుళ్లు.. పోలీసుల దిగ్బంధం.. ఊరంతా కట్టడి.. పోలీసుల ప్రజాదర్భార్.. అన్నలకు అన్నం పెట్టారంటూ.. నక్సలైట్ల సానుభూతిపరులపై పోలీసుల లాఠీల మోతలు.. అత్తగారు ముచ్చటపడి పెళ్లికి కట్నంగా బైక్ పెడతామంటే కూడా వద్దని వారించే కాలమది. పూరిళ్లు, రేకులషెడ్లు, తాటికమ్మల గుడిసెలు.. పెంకుటిండ్లు.. కొట్టాలు.. మిద్దె.. ఇవన్నీ నాటి నివాసాలు. చిన్న పల్లె.. పెద్ద మార్పు కోనరావుపేట మండలం బావుసాయిపేట చిన్నపల్లె. 2,289 మంది ఓటర్లతో ఉండే ఆ పల్లెజనాభా 4వేలలోపే. కానీ, శివారులోని రామన్నపల్లె కలిపి ఊరు విస్తరించింది. ఊరుకు మామిడిపల్లి, బండపల్లి, వట్టిమల్ల, వెంకట్రావుపేట నాలుగు వైపులా తారురోడ్లు, రెండు పెట్రోల్బంక్లు, మినీ రైస్మిల్లులు. బుధవారం వారపు సంత, ఇంటర్నెట్ సెంటర్, కల్యాణ మండపం, బైక్మెకానిక్ షాప్లు.. ఇలా పట్టణాల్లో కనిపించే ఆధునిక హంగులన్నీ బావుసాయిపేటలో చేరిపోయాయి. ఒకప్పటి కల్లోల పల్లె ఆధునిక పోకడలతో కనువిందు చేస్తుంది. ఒక్క ఈ ఊరే కాదు.. జిల్లాలో ఏ ఊరును చూసినా సమూల మార్పులు కళ్లముందు మెరుస్తున్నాయి. ఆధునికీకరణ దిశగా గ్రామీణ జీవనం సాగుతుంది. పల్లె తీరు మారింది.. ఊరు మారింది. -
నువ్వు చనిపోయావ్.. పింఛనివ్వం
కోనరావుపేట(వేములవాడ): ఓ వృద్ధురాలు బతికుండగానే మృతిచెందినట్లు అధికారులు రికార్డుల్లో నమోదు చేయగా.. ఆసరా పింఛన్కు దూరమైంది. వివరాలు.. కోనరావుపేట మండలం నిజామాబాద్కు చెందిన వృద్ధుడు మాదాసు నర్సయ్య 8 ఏళ్ల క్రితం మృతిచెందాడు. అతనికి వృద్ధాప్య పింఛన్ వచ్చేది. భర్త పింఛన్ను తన పేరిట మార్చాలని నర్సవ్వ అధికారులకు దరఖాస్తు చేసుకుంది. నెలలు గడుస్తున్నా పింఛన్ మంజూరు కాకపోవడంతో కలెక్టర్ కార్యాలయానికి వెళ్లింది. అక్కడ అధికారులు చెప్పిన విషయం విని షాక్కు గురైంది. నర్సవ్వ మృతి చెందినట్లు రికార్డులో నమోదై ఉంది. దీంతో 8 ఏళ్లుగా అధికారులు, కార్యాలయాల చుట్టూ పింఛన్ కోసం తిరుగుతూనే ఉంది. చనిపోయింది తన భర్త అయితే తాను మృతి చెందినట్లు అధికారులు రికార్డు నమోదు చేశారని, వారి తప్పిదం వల్ల తనకు పింఛన్ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికై నా అధికారులు తనకు వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని వేడుకుంటోంది. 8 ఏళ్లుగా పింఛన్ కోసం తిరుగుతున్న వృద్ధురాలు బతికుండగానే మృతిచెందినట్లు నమోదు చేసిన అధికారులు -
ప్రజా ప్రభుత్వంలో రైతులకు భద్రత
● అసెంబ్లీలో విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా విప్ ఆది శ్రీనివాస్ మంగళవారం మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో వరి వేస్తే ఉరి అన్నారని, ప్రజా ప్రభుత్వంలో రైతులకు భద్రత కల్పిస్తున్నామని పేర్కొన్నారు. రైతు భరోసా, పనిముట్లు, సన్నాలకు బోనస్ ఇస్తున్నామని వివరించారు. గత ప్రభుత్వం ఇచ్చిన రేషన్ బియ్యాన్ని పశువులకు దాణాగా వేసేవారని, ప్రస్తుతం ఇస్తున్న సన్నబియ్యాన్ని ప్రతీ ఒక్కరూ తింటున్నారని అన్నారు. నాడు డబుల్బెడ్ రూమ్ పేరు చెప్పి ప్రజలను మభ్యపెట్టారని, ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదన్నారు. తమ ప్రభుత్వం మహిళా సంఘాలకు పెద్దపీట వేస్తోందని, ఇందులో భాగంగా 600 బస్సులను సంఘాలకు కేటాయించామన్నారు. గల్ఫ్ కార్మికుల కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని, ప్రజాభవన్లో ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేశామన్నారు. -
అనుమతులు లేకుంటే జైలుకే..
మానేరువాగు, ఇతర ప్రాంతాల నుంచి ఇసుక తరలింపునకు అనుమతులు తప్పనిసరి. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే వారిని పట్టుకుని రిమాండ్కు తరలించి జైలుకు పంపిస్తున్నాం. ఈ నెల 11న హరిదాస్నగర్లోని చిట్టివాగు నుంచి అర్ధరాత్రి ఇసుకను తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసి రెవెన్యూ అధికారులకు అప్పగించాం. ఇసుక తరలించిన నిందితుడిని పట్టుకుని రిమాండ్ చేశాం. రాత్రి పూట ఇసుక తరలింపుపై నిఘా పెట్టాం. – రాహుల్రెడ్డి, ఎస్సై, ఎల్లారెడ్డిపేట -
కర్రంట్ పొయ్యి
చిరు వ్యాపారులు ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా పలురకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. పశ్చిమాసియా యుద్ధంతో వంట గ్యాస్ కొరత ఏర్పడడంతో హోటళ్లు, హాస్టళ్లలో కట్టెల పొయ్యిపై వంటలు చేస్తున్నారు. ముస్తాబాద్లోని పలు హోటళ్లలో కట్టెలపొయ్యి మిషన్కు కరెంట్ కనెక్షన్ ఇచ్చి అల్పాహారం, టీ తయారు చేస్తున్నారు. కట్టెల పొయ్యికి గాలి వచ్చేలా కరెంట్ కనెక్షన్ ఇస్తున్నారు. దీంతో సులభంగా కావాల్సినంత మంట వస్తుందని నిర్వాహకులు తెలిపారు. తక్కువ ధరకే కట్టెలు, మిషన్ లభిస్తున్నాయని పేర్కొన్నారు. – ముస్తాబాద్(సిరిసిల్ల) -
ప్రజావాణి వినండి
● వివిధ సమస్యలపై 142 దరఖాస్తులు ● పెండింగ్లో పెట్టొద్దు ● కలెక్టర్ గరీమా అగ్రవాల్సిరిసిల్ల అర్బన్: క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడంతో పలువురు బాధితులు కలెక్టరేట్కు తరలివస్తున్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజవాణికి భారీగా బాధితులు తరలివచ్చారు. ప్రజావాణిలో ప్రజల నుంచి అర్జీలను అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్తో కలిసి కలెక్టర్ స్వీకరించారు. వివిధ సమస్యలపై 142 దరఖాస్తులు వచ్చాయి. కలెక్టర్ గరీమా అగ్రవాల్ మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులు పెండింగ్లో పెట్టొద్దని సూచించారు. ఎప్పటికప్పుడు సకాలంలో పరిష్కరించాలన్నారు.వేములవాడ మండలం ఫాజుల్నగర్లో మెయిన్రోడ్డులో నిర్మించిన శివాలయానికి తాటిచెట్లతో నష్టం జరుగుతుందని కలెక్టర్కు రజక సంఘం తప్పుడు ఫిర్యాదు చేశారు. గీతాకార్మికుల జీవనోపాధికి మూలమైన తాటిచెట్లను తొలగించకుండా చర్యలు తీసుకోవాలి. – గౌడ సంఘం, ఫాజుల్నగర్ -
వదులుతోంది..
చమురుసిరిసిల్లటౌన్: అమెరికా, ఇజ్రాయేల్ సంయుక్తంగా ఇరాన్పై చేస్తున్న యుద్ధం ప్రభావం మన ప్రాంతంపై తీవ్రంగా పడుతుంది. పక్షం రోజులుగా సాగుతున్న యుద్ధంతో ప్రధానంగా వంట గ్యాస్ కొరత ఏర్పడింది. గ్యాస్ కొరతతో టిఫిన్స్, బిర్యానితోపాటు నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. గ్యాస్ కొరత లేదని అధికారులు చెబుతున్నా బుకింగ్ చేసుకునేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. యుద్ధం ప్రభావంతో జిల్లాలో మారిన పరిస్థితులపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్టు. ఎగబాకుతున్న ధరలు నాలుగైదు రోజులుగా గ్యాస్ కొరతతో ట్రాన్స్పోర్టు చార్జీలు పెరిగి నిత్యావసరాల ధరలపై ప్రభావం చూపుతున్నాయి. గ్యాస్ సిలిండర్ల కొరతతో పలు హోటళ్లలో కట్టెల పొయ్యిలపై వంట చేస్తున్నారు. వంట తయారీకి పెరిగిన ఖర్చును వినియోగదారులపై వేస్తున్నారు. రాష్ట్రం నుంచి ఎగుమతి అయ్యే కోడిగుడ్ల ధరలు పడిపోతున్నాయి. ఎక్స్పోర్టు లేక పౌల్ట్రీలలో కోడిగుడ్ల నిల్వలు పెరిగి ధరలు తగ్గుతున్నాయి.క్లోజ్.. గ్యాస్ లేక మూతపడ్డ కర్రీ పాయింట్నో స్టాక్.. సిరిసిల్లలో మూసి ఉన్న గ్యాస్ ఏజెన్సీ -
ఆధ్యాత్మికత ఉట్టిపడేలా..
వేములవాడ: రాజన్న అనుబంధ భీమన్న ఆలయంలో వేసవిలో భక్తులు ఇబ్బంది పడొద్దని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. చలువపందిళ్లు.. నీటి వసతి కల్పిస్తున్నారు. ఏర్పాట్లు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సాగుతున్నాయి. ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగించేలా భారీ ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. భక్తులకు సమాచారం సులభంగా అందించేందుకు వాట్సాప్ సేవలు ప్రారంభించారు. స్కానర్ను స్కాన్ చేయడం ద్వారా లేదా 87369 36969కు ఏజీ అని మెసేజ్ పంపితే ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాలు అందుతాయి. భక్తుల దాహార్తిని తీర్చేందుకు రాజన్న జలప్రసాదం పేరుతో రెండు తాగునీటి కేంద్రాలను ప్రారంభించారు. క్యూలైన్ల వద్ద నల్లాలు ఏర్పాటు చేశారు. శ్రీసీతారాముల కల్యాణానికి ఏర్పాట్లు హరిహర క్షేత్రంగా వెలుగొందుతున్న వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో ఈనెల 27న నిర్వహించే శ్రీసీతారామ కల్యాణ మహోత్సవానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో రమాదేవి తెలిపారు. ఈమేరకు పోస్టర్, ఆహ్వానపత్రికను ఆవిష్కరించారు. ఆలయ విస్తరణ పనులు కొనసాగుతుండడంతో రాజరాజేశ్వరస్వామికి ఏకాంత సేవలు నిర్వహిస్తూనే సీతారాముల కల్యాణోత్సవాన్ని శివార్చన వేదికపై జరుపనున్నారు. లడ్డూ ప్రసాద కేంద్రంలో ఈవో తనిఖీలు రాజన్న ప్రసాదం లడ్డూ తయారీ గోదాంలో ఆలయ ఈవో రమాదేవి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. లడ్డూ తయారీ, బరువు, నాణ్యత ప్రమాణాలు పరిశీలించారు. వంటశాలలోని నిబంధనలు పాటిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. భద్రత ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఏఈవో శ్రవణ్, ఇతర అధికారులు ఉన్నారు. -
పారిశుధ్య పనులపై నజర్
● మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు వేములవాడ: పారిశుధ్యం నిర్వహణపై ప్రత్యేక నజర్ పెడుతున్నామని మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు పేర్కొన్నారు. రూ.21.50 లక్షలతో రెండు ట్రాక్టర్లు, వాటర్ ట్యాంకర్ను కొనుగోలు చేసినట్లు తెలిపారు. మున్సిపల్ ఆవరణలో సోమవారం కమిషనర్ సంపత్కుమార్, వైస్చైర్మన్ నరాల శేఖర్, కౌన్సిలర్లతో కలిసి పూజలు చేశారు. చెత్త రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. కౌన్సి లర్లు తూం మధు, కొండ రాజశేఖర్, టైలర్ శ్రీనివాస్, తోట రాజు, కొక్కుల బాలకృష్ణ, అన్నారం శ్రీనివాస్, సిరిగిరి శ్రీకాంత్, తిరుపతిరెడ్డి, శ్రీకాంత్గౌడ్, సానిటరీ ఇన్స్పెక్టర్ సుకుమార్ పాల్గొన్నారు. సిరిసిల్లటౌన్: గీతానగర్ జెడ్పీహెచ్ఎస్లో స్కౌట్ అండ్ గైడ్స్ దీక్షా దినోత్సవం సోమవారం నిర్వహించారు. 16 మంది స్కౌట్, 16 మంది గైడ్స్ దీక్ష స్వీకారం చేశారు. పీఎంశ్రీ కార్యక్రమంలో భాగంగా వారికి స్కౌట్స్ అండ్ గైడ్స్ దుస్తులను పంపిణీ చేసినట్లు హెచ్ఎం శారద తెలిపారు. అనురాధ, తిరుపతి, గైడ్టీచర్ కొండికొప్పుల మంజుల, స్కౌట్ మాస్టర్ తడుకల సురేష్ పాల్గొన్నారు. ఇల్లంతకుంట(మానకొండూర్): అసంపూర్తి కాలువను పూర్తి చేయాలని కోరుతూ మండలంలోని పెద్దలింగాపూర్లో 35 రోజులుగా రైతులు చేస్తున్న రిలే నిరాహార దీక్ష సోమవారం ముగిసింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు దండు వినోద్కుమార్ రైతులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఎల్ఎం 6 కాలువ పనులు పూర్తి చేసేందుకు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ రూ.3.19 కోట్లు మంజూరు చేయించారని, రైతులు దీక్ష విరమిస్తున్నట్లు తెలిపారు. సిరిసిల్ల: రేడియాలజిస్ట్ రెండు ఆస్పత్రులకు మించి స్కాన్ పరీక్షలు చేయొద్దని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రైవేటు స్కానింగ్ సెంటర్లను సోమవారం డిప్యూటీ డీఎంహెచ్వో నాగేంద్రబాబుతో కలిసి తనిఖీ చేశారు. జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధమన్నారు. డిప్యూటీ డెమో రాజకుమార్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. ఎస్సీ యాక్షన్ప్లాన్కు దరఖాస్తుల ఆహ్వానంసిరిసిల్ల: తెలంగాణ షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంఘం ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025–2026ను విడుదల చేశారు. బ్యాంకు అనుసంధానంతో రవాణారంగంలో వాహనాలు, వ్యవసాయ అనుబంధ వాహనాలు, సోలార్ యూనివర్సల్ పంపు కంట్రోల్ అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానించింది. 21 నుంచి 50 ఏళ్లలోపు వారు లబ్ధి పొందేందుకు మార్చి 24లోపు దరఖాస్తులు చేసుకోవచ్చని ఎస్సీడీవో అధికారులు కోరారు. జిల్లాలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీ పరిధిలోని షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులు, వ్యవసాయేతర పథకాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని కోరారు. వివరాలకు ఎస్సీడీవో ఆఫీస్లో సంప్రదించాలన్నారు. -
రాజన్న సిరిసిల్ల
మంగళవారం శ్రీ 17 శ్రీ మార్చి శ్రీ 2026Iసిరిసిల్ల అర్బన్: కేజీబీవీ, ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమ్మె కాలానికి వేతనం చెల్లించాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మహేందర్రావు కోరారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. సిరిసిల్ల: అగ్రహారం డిగ్రీ కాలేజీలో బీఎస్సీ, బీకామ్, బీఏ కోర్సులు అమలు చేస్తున్నట్లు కలెక్టర్ గరీమా అగ్రవాల్ తెలిపారు. సోమవారం పోస్టర్ ఆవిష్కరించారు.ఆకాశం మేఘావృతమవుతుంది. గాలిలో తేమ స్వల్పంగా ఉంటుంది. ఈదురుగాలులు వీస్తాయి. -
‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ లక్ష్యం సాధించాలి
సిరిసిల్ల: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఈనెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజులపాటు ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికను పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం సమీక్షించారు. జిల్లా అధికారులు తమకు కేటాయించిన లక్ష్యం మేరకు ముందుకు వెళ్లాలన్నారు. మహిళా సంఘాల భవనాలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని, ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని సూచించారు. ఆర్డీవోలు సీ.హెచ్.వెంకటేశ్వర్లు, రాధాభాయ్, హౌసింగ్ పీడీ వెంకటమాధవరావు పాల్గొన్నారు. గాలికుంటు నివారణ టీకాలు వేయించాలి పశువుల సంరక్షణకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని కలెక్టర్ సూచించారు. జాతీయ పశువ్యాధుల నివారణలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ జీవాల ఆరోగ్య సంరక్షణకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ప్రభుత్వం ఉచితంగా వేయిస్తుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 26 బృందాలు ఏప్రిల్ 9వ తేదీ వరకు టీకాలు వేస్తారని వివరించారు. జిల్లా పశువైద్యాధికారి రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గ్యాస్ సిలిండర్లు దొరకడం లేదు
మార్కెట్లో గ్యాస్ సిలిండర్లు గతంలో మాదిరిగా విరివిగా దొరకడం లేదు. ఏజెన్సీ నిర్వాహకులు గ్యాస్ బ్లాక్ చేసి కొరత సృష్టిస్తున్నారు. గ్యాస్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు పెరిగి నిర్వహణ భారమైంది. గతంలో కమర్షియల్ సిలిండర్ రూ.1,780 ఉండగా.. ఇప్పుడు రూ.2400కు చేరింది. ఏజెన్సీలో స్టాక్ లేదని చెబుతున్నారు. నెలకు 70 సిలిండర్లు వాడే మేము గత్యంతరం లేక కట్టెలపొయ్యిపై వంట చేస్తున్నాం. ధరలు పెంచడంతో కస్టమర్లతో ఇబ్బంది కలుగుతుంది. – శ్రీగాథ శ్రీనివాస్, రెస్టారెంట్ నిర్వాహకుడు -
రాయినిచెరువును నీటితో నింపాలి
వీర్నపల్లి(సిరిసిల్ల): కాళేశ్వరం తొమ్మిదో ప్యాకేజీ కింద చేపట్టిన రాయిని చెరువు పైప్లైన్ పనులు పూర్తి చేసి చెరువును గోదావరి జలాలతో నింపాలని మండలం మద్దిమల్ల గ్రామ సర్పంచ్, రైతులు డిమాండ్ చేశారు. వీర్నపల్లి మండలం ఉమ్మడి మద్దిమల్ల గ్రామంలోని రాయినిచెరువు వద్ద ఆదివారం వివిధ గ్రామాల రైతులు, ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. మద్దిమల్ల సర్పంచ్ ప్యాట్ల రవి, మద్దిమల్లతండా సర్పంచ్ కొడావత్ శిరీష, బంజార సర్పంచ్ బట్టు కృష్ణ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో అల్మాస్పూర్ నుంచి రాయినిచెరువు వరకు పైప్లైన్ పనులు చేసినట్లు తెలిపారు. రెండు కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతంలో అనుమతులు లేవనే సాకుతో పనులు నిలిచిపోయాయన్నారు. మూడేళ్లుగా పనులు ఆగిపోవడంతో చెరువులోకి చుక్క నీరు రాక వేసవిలో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాయినిచెరువు నిండితే మద్దిమల్ల, రంగంపేట, కంచర్ల, అల్మాస్పూర్, వీర్నపల్లి, అడవిపదిరతోపాటు కోనరావుపేట మండలంలోని పలు గ్రామాల్లో 2,435 ఎకరాల ఆయకట్టుకు లబ్ధి చేకూరుతుందన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. సెస్ డైరెక్టర్ మాడుగుల మల్లేశం, సర్పంచులు సామల్ల దేవరాజు, గుగులోత్ రమేశ్, చాంద్ పాషా, గుగులోత్ సురేష్, మాజీ ఉపసర్పంచ్ బోయిని రవి, మాజీ ఎంపీటీసీ అరుణ్కుమార్, గుగులోత్ రవిలాల్నాయక్, తెలంగాణ రాష్ట్ర గోర్ సేన మీడియా, వివిధ గ్రామాల రైతులు గడ్డం దేవయ్య, ప్యాట్ల మల్లయ్య పాల్గొన్నారు. -
వంతెనపై ఇంత నిర్లక్ష్యమా?
ఎల్లారెడ్డిపేట మండలం పదిర బ్రిడ్జిపై భారీ గుంత పడి నెలలు గడుస్తున్నా మరమ్మతు చేయడంపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆదివారం సాయంత్రం బస్సు, ఓ కారు త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాయి. కామారెడ్డి నుంచి సిరిసిల్లకు వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు ఎదురుగా వస్తున్న కారు వెంట్రుకవాసిలో ప్రమాదం నుంచి బయటపడ్డాయి. ఈ సంఘటనతో బస్సులోని ప్రయాణికులు, కారులో ప్రయాణిస్తున్న వారు ఊపిరిపీల్చుకున్నారు. నిత్యం వందలాది వాహనాలు నడిచే ఈ వంతెనను ఇప్పటికై నా మరమ్మతు చేయాలని కోరుతున్నారు. – ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల) -
బహుజన రాజ్యం సాధిస్తాం
● బీఎస్పీ కేంద్రీయ రాష్ట్ర కో–ఆర్డినేటర్ చంద్రశేఖర్ సిరిసిల్లటౌన్: రాష్ట్రంలో బహుజనరాజ్యం సాధించినప్పుడే కాన్షీరామ్ నిజమైన నివాళి అర్పించినట్లుగా బీఎస్పీ కేంద్రీయ రాష్ట్ర కో–ఆర్డినేటర్ బోయిని చంద్రశేఖర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్చౌక్లో ఆదివారం నిర్వహించిన కాన్షీరామ్ 92వ జయంతి సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పూలే, సాహుమహారాజ్, అంబేడ్కర్ ప్రారంభించిన సామజిక పరివార్తన ఉద్యమానికి కాన్షీరామ్ సర్వస్వం ధారబోశారన్నారు. కాంగ్రెస్, బీజేపీలు బహుజనుల బతుకులను నాశనం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిషాని రామచంద్రం, ఎనగందుల వెంకన్న, మాతంగి అశోక్, నీరడి ఈశ్వర్, కల్లెపల్లి రాజేందర్, దొడ్డే సమ్మయ్య, పల్లె ప్రశాంత్గౌడ్, జిల్లా అధ్యక్షుడు కొమ్మట అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శి లింగంపల్లి మహేశ్, ఎడ్ల అరుణ్కుమార్, కొమ్మాట వేణు, కట్కూరి నాగరాజు పాల్గొన్నారు. వేతనాలు విడుదల చేయించండి సిరిసిల్ల ఎడ్యుకేషన్/సిరిసిల్లటౌన్: సమగ్ర ఆర్థిక నిర్వహణ సమాచార వ్యవస్థ(ఐఎఫ్ఎంఐఎస్) పోర్టల్లో ఆధార్ వివరాలు సరిపోలేదని నిలిపివేసిన ఉపాధ్యాయుల ఫిబ్రవరి వేతనాలు విడుదల చేయాలని టీఎస్యూటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కు వినతిపత్రం అందజేశారు. ఆధార్ వివరాలు సరిపోలేదని జిల్లాలో 30 మంది టీచర్ల వేతనాలు నిలిచిపోయాయన్నారు. వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు మహేందర్రావు, ప్రధాన కార్యదర్శి జంగిటి రాజు, నాయకులు అంబటి రమేశ్, గాలిపెల్లి సంతోష్, ఉపాధ్యాయులు రాంప్రసాద్, అనిల్కుమార్ పాల్గొన్నారు. -
పాతాళంలో గంగ
మండలం 2026 2025 ఫిబ్రవరి ఫిబ్రవరి బోయినపల్లి 6.30 7.21 చందుర్తి 6.14 5.23 గంభీరావుపేట 9.64 11.59 ఇల్లంతకుంట 5.76 5.90 కోనరావుపేట 8.59 9.72 ముస్తాబాద్ 10.38 9.79 రుద్రంగి 7.20 5.31 సిరిసిల్ల 13.09 11.65 తంగళ్లపల్లి 6.98 7.87 వీర్నపల్లి 15.74 13.45 వేములవాడరూరల్ 5.10 4.77 వేములవాడఅర్బన్ 14.41 13.18 ఎల్లారెడ్డిపేట 15.04 15.62 జిల్లా సగటు 9.08 9.28 ఇది కోనరావుపేట మండలం బావుసాయిపేట కొత్తకుంట. యాసంగి సీజన్ ఆరంభంలో నిండా నీటితో ఉన్న ఈ కుంట ఇప్పుడు ఇలా ఎండిపోయింది. సాగునీటి వనరులైన చెరువులు, కుంటలు, వాగులు, బోర్లు, బావులు ఎండిపోవడంతో వాటిని నమ్ముకుని యాసంగి సీజన్లో సాగుచేసిన పొలాలు చి‘వరి’కి బీటలు వారాయి. ఇలా జిల్లా వ్యాప్తంగా దాదాపు 20వేల ఎకరాల్లో వరి పొలాలు ఎండిపోయాయి. మరో పక్షం రోజుల్లో మరిన్ని పొలాలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
అడవికి ఆపద
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఆకురాలే కాలంలో అడవులకు ముప్పు పొంచి ఉంది. ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుంటే పచ్చని చెట్లు కాలిపోయే ప్రమాదం ఉంది. ఏటా ఫైర్లైన్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు కేటాయించడంతో కూలీలతో ఫారెస్ట్ అధికారులు ఆ పని చేయించేవారు. కానీ ఈ సంవత్సరం ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. దీంతో ఫైర్లైన్ల పనులు మొదలుకాలేవు. ఇప్పటికే జిల్లాలోని అటవీలో అక్కడక్కడ అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. జిల్లాలో 180 కిలోమీటర్ల మేర ఫైర్లైన్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు పనులు ముందుకుసాగలేవు. 27 హెక్టార్లలో అడవి విస్తీర్ణం జిల్లాలోని 27వేల హెక్టార్లలో అడవి విస్తరించి ఉంది. ఎల్లారెడ్డిపేట, కోనరావుపేట, గంభీరావుపేట, వీర్నపల్లి, చందుర్తి, రుద్రంగి, ఇల్లంతకుంట మండలాల్లో అత్యధికంగా అడవులు ఉన్నాయి. అడవుల్లో వన్యప్రాణులు ఆవాసాలుగా చేసుకుని జీవిస్తుంటాయి. ముఖ్యంగా దుప్పులు, చిరుతలు, అడవి పందులు, కుందేళ్లు, జింకలు, మనుబోతులు, ముళ్లపందులతోపాటు నెమళ్లు వంటి అరుదైన జీవజాతులు సంచరిస్తుంటాయి. ఈక్రమంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటే రోడ్ల వెంట ప్రయాణించే ఆకతాయిలతోపాటు అడవిలో పశువులు, గొర్రెల కాపరులు బీడీ తాగుతున్న క్రమంలో దాని నుంచి నిప్పురవ్వలు పడి అడవులు కాలిపోతున్న సందర్భాలు అనేకం. ఆకతాయిలైతే ఏకంగా నిప్పు పెడుతుండడంతో అడవి సంపదకు ఆపరా నష్టం కలుగుతోంది. ఈక్రమంలో అడవిలో ఊహించని నష్టం జరగకుండా అధికారులు ముందుగానే ఫైర్లైన్లు ఏర్పాటు చేస్తే మంటలు అడవి మొత్తానికి విస్తరించకుండా కట్టడి చేసే అవకాశాలున్నాయి. లక్ష్యం ఇదే.. సిరిసిల్ల, వేములవాడ రేంజ్ల పరిధిలో 12 సెక్షన్లు, 44 బీట్లలో కలిపి 27 హెక్టార్లలో అటవీ విస్తరించి ఉంది. జిల్లాకు చెందిన అడవులు జగిత్యాల, కామారెడ్డి, నిజామాబాద్, సిద్ధిపేట జిల్లాలకు చెందిన అడవితో కలిసి ఉంటాయి. ఇవన్నీ ప్రధానంగా ఆకురాల్చే అడవులు కావడంతో వేసవి కాలంలో మంటలు చెలరేగకుండా ఏటా ఫైర్లైన్లు ఏర్పాటు చేస్తుంటారు. ఒక మీటర్కు రూ.6 ఖర్చు చేస్తూ డబ్బా ఆకారంలో 100 మీటర్ల చొప్పున ఫైర్లైన్లు వేస్తారు. ఒక వేళ మంటలు అంటుకున్న అక్కడికే పరిమితమై అడవికి వ్యాపించవు. గ్రామాల్లో హెచ్చరికబోర్డులు అవగాహనతో అడవిని కాపాడుకోవడానికి చర్యలు తీసుకుంటున్నారు. వనాలు దగ్ధం కాకుండా వేసవిలో బీడీల తయారీకి ఉపయోగించే ఆకు, ఇప్పపూలు సేకరించేందుకు, నేలపై పడిన ఆకులను ఏరివేసేందుకు కూలీలను నియమించి చర్యలు తీసుకుంటున్నారు. ఒక్కోసారి తమకు తెలియకుండా పడేసిన బీడీలు, సిగరేట్లు ప్రమాదాలకు కారణం అవుతుండగా దానిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. దీంతోపాటు అడవిలోని రాళ్లు రాపడి జరుగుతున్న క్రమంలో మంటలు ఎగసిపడే ప్రమాదాలు ఉన్నాయి. దానిని శాటిలైట్, గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకుని అధికారులు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే వారు వెళ్లేలోపే ఫైర్లైన్లు లేకపోవడంతో మంటలు వ్యాప్తి చెందుతున్నాయి. ఈ చిత్రం ఎల్లారెడ్డిపేట మండలం గుంటపల్లిచెరువుతండా శివారులో అడవికి మంటలు వ్యాపించి విలువైన కలప కాలిపోతోంది. అధికారులు ఫైర్లైన్లు ఏర్పాటు చేయకపోవడంతోనే ఫారెస్ట్లో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు. గతంలో ఫైర్లైన్లతో రక్షణ ఉండేదని.. ఇప్పుడు ఎండలు ముదిరినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. అడవుల రక్షణపై అవగాహన సమావేశాలు మాత్రమే పెట్టి అధికారులు చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. -
సిరిసిల్లలో పందుల సంచారంపై నిషేధం
● పెద్దూరులో కేటాయించిన స్థలంలో పెంచుకోవాలి ● మున్సిపల్ కమిషనర్ ఖదీర్పాషా సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రంలో పందుల సంచారం నిషేధించినట్లు మున్సిపల్ కమిషనర్ ఎం.ఎ.ఖదీర్పాషా తెలిపారు. మున్సిపల్ ఆధ్వర్యంలో పెద్దూరులో ప్రత్యేకంగా కేటాయి ంచిన స్థలంలో పెంచుకోవాలని సూచించారు. పందులను రోడ్లపై వదిలేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయని, జనావాస ప్రాంతాల్లో వదిలేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. లబ్ధిదారుల ముఖాల్లో ఇందిరమ్మ వెలుగులు వేములవాడ రూరల్: పేదల సొంతింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడరూరల్ మండలం బొల్లారం, బాలరాజ్పల్లి గ్రామాల్లో ఆదివారం ఇందిరమ్మ గృహ ప్రవేశాలకు హాజరయ్యారు. లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేశారు. చందుర్తి(వేములవాడ): మండలంలోని మూడపల్లిలో ఇందిరమ్మ గృహప్రవేశానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరై, లబ్ధిదారులు వట్టిమల్ల భాగమ్మ– బాలయ్య దంపతులకు నూత న వస్త్రాలను అందజేశారు. విప్ శ్రీనివాస్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో నిరుపేదకు ఇళ్లు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. జాతీయ పోటీలకు ఎంపికజాతీయ పోటీలకు ఎంపికై న వాలీబాల్ క్రీడాకారులు సిరిసిల్లటౌన్: జాతీయ వాలీబాల్ పోటీలకు ఎంపికై న క్రీడాకారులకు అభినందనలు వెల్లువెత్తాయి. ఇటీవల వేములవాడలో జరిగిన 8వ తెలంగాణ యూత్ వాలీబాల్ రాష్ట్ర స్థాయి పోటీల్లో వివిధ జిల్లాల నుంచి పాల్గొని ప్రతిభ కనబరిచారు. ఈనెల 16 నుంచి భువనేశ్వర్లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న ఉమ్మడి కరీంనగర్ జిల్లా జట్టు సభ్యులు టి.శ్రునిక్, ఎస్.వేణు, డి.మమతతోపాటు జాతీయ జట్టుకి మెన్ హెడ్ కోచ్గా జి.సంపత్గౌడ్, అసిస్టెంట్ కోచ్గా రాజశేఖర్, విమెన్ హెడ్ కోచ్ ప్రభాకర్, అసిస్టెంట్ కోచ్ అఖిల ఎంపికయ్యారు. వీరిని ఉమ్మడి జిల్లా క్రీడాకారుల సంక్షేమ సంఘం కార్యదర్శి గిన్నె లక్ష్మణ్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీకుమార్, రాందాస్ అభినందించారు. ఐక్యతతోనే సమస్యలు పరిష్కారంసిరిసిల్లటౌన్: ఐక్యంగా ఉండి సమస్యలు పరిష్కరించుకుంటామని సెస్ అసిస్టెంట్ హెల్పర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు కర్నాల అనిల్కుమార్ పేర్కొన్నారు. సిరిసిల్ల ప్రెస్క్లబ్లో ఆదివారం ప్రెస్మీట్లో మాట్లాడారు. ఇటీవల చేపట్టిన 72 గంటల దీక్షకు మద్దతు తెలిపిన సీఐటీయూ నేతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. చాలీచాలని వేతనాలతో ప్రాణాలను ఫణంగా పెట్టి సెస్లో విధులు నిర్వహిస్తున్నామన్నారు. 72 గంటల విధుల బహిష్కరణ సందర్భంగా 10 డిమాండ్లకు ఆరింటికి ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. తమకు మద్దతుగా నిలిసిన వారందరికి కృతజ్ఞతలు అని పేర్కొన్నారు. నర్ర శ్రీనివాస్రెడ్డి, ఎర్ర మల్లేశం, అనిల్కుమార్, ఎర్ర శ్రీనివాస్, పిట్టల మల్లేశ్, కిషన్, దోర్నాల అంజిరెడ్డి పాల్గొన్నారు. -
ఎల్లంపల్లి నీటితో భూములు సస్యశ్యామలం
● తెగిన, గండ్లు పడిన కాలువల మరమ్మతుకు నిధులు ● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చందుర్తి(వేములవాడ): ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటితో వేములవాడ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తానని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. మండలంలోని రామన్నపేట శివారులో గతంలో కురిసిన భారీ వర్షాలకు గండిపడి తెగిన కాలువను, చందుర్తిలో 450 ట్యాంకును, మల్యాల హంపుహౌస్ను శనివారం పరిశీలించారు. విప్ మాట్లాడుతూ యాసంగి పంటలకు సాగునీరు అందించేలా ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిపారు. సనుగుల ఎర్ర, పటేల్చెరువులతోపాటు జోగాపూర్, ఎన్గల్, బండపల్లి చెరువులలో నీరు ఉంటే మండలం సస్యశామలంగా ఉంటుందన్నారు. రామన్నపేట శివారులో గండి పడ్డ 4 డీ కాలువ మరమ్మతుకు రూ.21లక్షలు మంజూరు చేయించి నట్లు తెలిపారు. ఎల్లంపల్లి నీటితో ఆశిరెడ్డిపల్లె కొత్తచెరువును నింపుతామన్నారు. కొత్త చెరువు నిర్మాణానికి రూ.43లక్షలు మంజూరు చేయించినట్లు గుర్తుచేశారు. మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు బొజ్జ మల్లేశం, డైరెక్టర్లు ఈసరి శ్రీనివాస్, ఏనుగు లచ్చిరెడ్డి, నాయకులు మల్లారపు రాజయ్య, దొంగరి భూమయ్య, లక్ష్మణ్రావు, ఆవారి మనోహర్ పాల్గొన్నారు. గోదావరి జలాలకు పూజలు రుద్రంగి(వేములవాడ): రైతులకు యాసంగి సాగు నీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎండిపోతున్న పంటలకు మూడు రోజులుగా గోదావరి జలాలను విడుదల చేశారు. ఎల్లంపల్లి కాలువల ద్వారా శనివారం రుద్రంగిలోని గండి వేంకటేశ్వర్ల వద్ద ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పూజలు చేశారు. నాగారం చెరువు కాలువలను పరిశీలించారు. సూరమ్మ ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. తహసీల్దార్ పుష్పలత, సర్పంచ్ గండి లక్ష్మీనారాయణ, ఏఎంసీ చైర్మన్ చెలుకల తిరుపతి, డీసీసీ కార్యదర్శులు గడ్డం శ్రీనివాస్రెడ్డి, నాయకులు పల్లి గంగాధర్, గంధం మనోజ్, ఎర్రం గంగనర్సయ్య పాల్గొన్నారు. -
కొండకు కాషాయ దండు
● దిగ్విజయంగా అంజన్న ఆశీర్వాద యాత్ర ● కరీంనగర్ నుంచి కొండగట్టు వరకు కాషాయమయం ● రాత్రి 10 గంటలకు కొండకు చేరుకుని మొక్కులు చెల్లించిన కేంద్రమంత్రి సంజయ్సాక్షి ప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్/కొత్తపల్లి/రామడుగు/కొడిమ్యాల/మల్యాల: ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’ పేరుతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ శనివారం చేపట్టిన పాదయాత్ర దిగ్విజయంగా ముగిసింది. మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ మేయర్ పీఠాన్ని అప్పగిస్తే పార్లమెంట్ పరిధిలో ఎన్నికై న బీజేపీ ప్రజాప్రతినిధులతో కలిసి కొండగట్టుకు కాలినడకన వచ్చి మొక్కులు చెల్లించుకుంటానన్న మాటను నిలబెట్టుకున్నారు. దాదాపు 40 డిగ్రీల మండుటెండను లెక్క చేయకుండా వేలాదిమంది కార్యకర్తలతో కలిసి 40 కిలో మీటర్లు నడిచి రాత్రి 10 గంటలకు అంజన్న సన్నిధికి చేరుకున్నారు. బైంసా మున్సిపల్ చైర్మన్ తుమ్మల దత్తాత్రి తోపాటు కౌన్సిలర్లంతా పాదయాత్రలో కలిసి నడిచారు. యాత్ర ప్రారంభమైందిలా శనివారం ఉదయం 7 గంటలకు బండి సంజయ్ మహాశక్తి ఆలయంలో పూజలు చేసి యాత్రను ప్రారంభించారు. బీజేపీ సర్పంచులు 108 మంది, 450 వార్డుసభ్యులు, 54 మంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లతోపాటు వేలాది మంది కాషాయ శ్రేణులతో కలిసి కాలినడకన బయల్దేరారు. ఆధ్యాత్మిక యాత్ర కావడంతో సంజయ్ సాక్సులతోనే నడిచారు. ట్రాఫిక్ జాం కాకుండా యాత్ర ఉదయం 9.30 గంటలకే పదో తరగతి పరీక్ష ఆరంభం కా వడం... అదే సమయంలో సంజయ్ చేపట్టిన పాదయాత్ర కరీంనగర్ జగిత్యాల హైవేపైకి రావడంతో ట్రాఫిక్ జాం అవుతుందనే ఆందోళన కన్పించింది. పాదయాత్ర రక్షక దళం, ఇటు పోలీసుల సాయంతో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా పాదయాత్రను కొనసాగించారు. అడుగడుగునా నీరాజనం నగరంలోని 23వ డివిజన్ సీతారాంపూర్లో మహిళలు మంగళహారతులు ఇచ్చి పూలవర్షం కురిపించారు. 19వ డివిజన్ రేకుర్తి చౌరస్తాలో కార్పొరేటర్ సుదగోని మాధవికృష్ణగౌడ్ స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. కొత్తపల్లి రామాలయం వద్దకు చేరుకోగాలనే కమిటీ సభ్యులు గజ మాలతో సత్కరించారు. కొత్తపల్లి మార్కండేయ ఆలయం వద్ద 17, 18 డివిజన్ల కార్పొరేటర్లు వేముల కవితచంద్రశేఖర్, వాసాల రమేశ్ స్వాగతం పలికారు. రామడుగు మండలం వెదిర, గంగాధర మండలంలోని పలు గ్రామాలతో పాటు కొడిమ్యాల మండలం పూడూరులో మంగళహారతులతో నీరాజనం పలికారు. తుర్కాశీనగర్ చేరుకోగానే ముస్లింలు, యువకులు స్వాగతం పలికారు. పూడూర్లో గజమాలతో స్వాగతం పలికారు. తేనెటీగల కలకలం యాత్ర రామడుగు మండలం కోనరావుపేట వద్దకు రాగానే.. కొందరు కార్యకర్తలు డ్రోన్ ఎగరేయడంతో చెట్టుపైనున్న తెనేతుట్టె కదిలింది. తేనెటీగల దాడిలో ముగ్గురు కార్పొరేటర్లు, మరో ముగ్గురు బీజేపీ శ్రేణులు గాయపడ్డారు. వీరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స ఇప్పించారు. పాదయాత్రలో డాక్టర్లు బండి సంజయ్కు సాధారణ హెల్త్ చెకప్ చేశారు. గంగాధరలో లంచ్ బ్రేక్ గంగాధరలోని వీఏఎస్ ఫంక్షన్ హాలులో మధ్యాహ్నం 3.30 గంటలకు బీజేపీ శ్రేణులకు భోజన ఏర్పాట్లు చేశారు. బండి సంజయ్ సైతం అక్కడే ఓ కార్యకర్త ఇంట్లో భోజనం చేసి కాసేపు సేదదీరారు. సాయంత్రం 5.30 గంటలకు తిరిగి పాదయాత్రను ప్రారంభించారు. వెంకటాయపల్లి, పూడూరు, దొంగల మర్రి మీదుగా రాత్రి 10గంటల వరకు కొండగట్టు అంజన్న ఆలయం చేరుకుని ‘అంజన్న ఆశీ ర్వాద యాత్ర’ను దిగ్విజయంగా ముగించారు. సంజయ్ కొండకు చేరుకునే సమయానికి ఆలయం మూసివేయడంతో సింహద్వారం ఎదుట కొబ్బరికాయ కొట్టి, స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. -
వాలీబాల్ అసిస్టెంట్ కోచ్గా రాజశేఖర్
ఇల్లంతకుంట(మానకొండూర్): మండల కేంద్రానికి చెందిన చేరాల రాజశేఖర్ జాతీయస్థాయిలో తెలంగాణ యూత్ వాలీబాల్ టీం అసిస్టెంట్ కోచ్గా నియమితులయ్యారు. భువనేశ్వర్లో జరిగే యూత్ జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు రాష్ట్ర బాలుర జట్టుకు కోచ్గా వ్యవహరించనున్నారు. రాజశేఖర్ ప్రస్తుతం ముస్తాబాద్ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. తనను కోచ్గా ఎంపిక చేసినందుకు రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి గిన్నె లక్ష్మణ్, జిల్లా అధ్యక్షుడు చెన్నమనేని శ్రీకుమార్, డీవైస్వో రామదాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సానబాబులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎర్రబెల్లి స్వర్ణను సన్మానించిన సంగీతం సిరిసిల్లటౌన్: రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులైన ఎర్రబెల్లి స్వర్ణను డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ మర్యాదరపూర్వకంగా శనివారం కలిశారు. హైదరాబాద్లోని ఆమెను కలిసి శాలువా కప్పి అభినందనలు తెలిపారు. -
కాలువ పనులు పూర్తి చేయాలి
● ఇరిగేషన్ ఈఈతో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే సత్యంబోయినపల్లి(చొప్పదండి): మండలంలోని బూరుగుపల్లి రైతుల సాగునీటి అవసరాలు తీర్చే డీ–5 కాలువ పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యంను కోరారు. కాంగ్రెస్ నాయకులు కొలుపుల ప్రవీణ్, పార్టీ మండల అధ్యక్షుడు రమణారెడ్డితోపాటు ఎమ్మెల్యేను శనివారం కలిశారు. డీ–5 కాలువ పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో రెండు కుంటల కు నీరు చేరడం లేదన్నారు. స్పందించిన ఎమ్మె ల్యే సత్యం ఇరిగేషన్ ఈఈతో ఫోన్లో మాట్లా డి.. కాలువ పనులు చేయాలని సూచించారు. హోటళ్లపై అధికారుల దాడులు ఇల్లంతకుంట(మానకొండూర్): మండల కేంద్రంలోని పలు హోటళ్లలో జిల్లా డిప్యూటీ తహసీల్దార్, పౌరసరఫరాల అధికారులు శనివారం దాడులు చేశారు. డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేశారు. డిప్యూటీ తహసీల్దార్లు రజిత, సత్యనారాయణ స్థానిక భారత్ గ్యాస్ గోదాంలో తనిఖీలు చేపట్టారు. అనంతరం పలు హోటళ్లపై దాడి చేసి 13 డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేశారు. మద్దిమల అడవిలో హైనా కలకలం వీర్నపల్లి(సిరిసిల్ల): మండలంలోని బంజేరు పరిధిలో హైనా సంచారం కలకలం రేపుతోంది. గ్రామ శివారులోని తుమ్మలకుంట చెరువు సమీపంలో శుక్రవారం రాత్రి కుక్కపై హైనా దాడి చేసి చంపి తిన్నది. ప్రస్తుతం వరి కోతలు, వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న సమయంలో పొలాలకు సమీపంలో హైనా సంచరిస్తుండడంతో రైతులు భయాందోళన చెందుతున్నారు. రైతులు, పశువుల కాపరులు ఒంటరిగా వెళ్లవద్దని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రంజిత్కుమార్ హెచ్చరించారు. వైద్య శిబిరం పరిశీలన ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని పెద్దలింగాపురంలో శనివారం నిర్వహించిన మెగా వైద్యశిబిరాన్ని డీఎంహెచ్వో రజిత పరిశీలించారు. 296 మందిని పరీక్షించి మందులు అందజేశారు. టీబీ వ్యాధి గురించి, పొగాకు వినియోగం తగ్గించాలని పేషంట్లకు అవగాహన కల్పించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ప్రేమ్కుమార్, జీవనజ్యోతి, సూపర్వైజర్ జవహర్, హెచ్ఈవో వెంకటరమణ పాల్గొన్నారు. మహిళలకు భద్రత కరువు సిరిసిల్లటౌన్: దేశంలో మహిళలకు భద్రత లేకుండా పోతోందని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి పేర్కొన్నారు. స్థానిక నెహ్రూనగర్ ఏరియాలో ఐద్వా సభ్యత్వ నమోదును శనివారం నిర్వహించి మాట్లాడారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశాల్లో భద్రత లేదని, సమాన పనికి సమాన వేతనం అమలు కావడం లేదన్నారు. కార్యదర్శి జవ్వాజి విమల, సూరం పద్మ, ఆడెపు రజిత, గడప మాధవి, న్యాలపెల్లి శ్యామల, గురజాల మమత, మల్లారపు నర్సవ్వ, రూప పాల్గొన్నారు. -
నర్సరీల్లో పండ్ల మొక్కలు పెంచాలి
● కలెక్టర్ గరీమా అగ్రవాల్ సిరిసిల్ల: నర్సరీల్లో పండ్ల మొక్కలను పెంచాలని మున్సిపల్ అధికారులను కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా సాయినగర్, జేపీనగర్లోని నర్సరీలను కలెక్టర్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరీమా అగ్రవాల్ మాట్లాడుతూ సిరిసిల్ల మున్సిపల్ ఆధ్వర్యంలోని నర్సరీలో రోడ్ల వెంట, అలాగే ఇతర చోట్ల నాటే మొక్కలతో పాటుగా పండ్ల మొక్కలు సైతం పెంచాలని సూచించారు. మునగ, ఇతర రకాల మొక్కలను నర్సరీల్లో సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి, మున్సిపల్ కమిషనర్ ఖదీర్పాషా, స్థానిక కౌన్సిలర్ ఆడెపు చంద్రకళ పాల్గొన్నారు. -
మల్లన్నసాగర్ నీటిని విడుదల చేయాలి
ముస్తాబాద్(సిరిసిల్ల): పంటలు ఎండుతున్నా ప్రభుత్వానికి పట్టన్నట్లు వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాల్రావు అన్నారు. యాసంగికి అవసరమైన నీటిని మల్లన్నసాగర్ ప్రాజెక్టు నుంచి విడుదల చేయాలని మోహినికుంట రైతులు ప్రాజెక్టు ఎస్ఈకి శనివారం విజ్ఞప్తి చేశారు. గోపాల్రావు మాట్లాడుతూ మల్లన్నసాగర్ ద్వారా దుబ్బాక చెరువు, చెల్లాపూర్, రాజక్కపేట చెరువులకు నీటిని విడుదల చేయాలన్నారు. మోహిని కుంట, మద్దికుంట, బందనకల్, సేవాలాల్తండా, తెర్లుమద్ది, వెంకట్రావుపల్లె గ్రామాల్లో పంటలు ఎండుతున్నాయన్నారు. సర్పంచ్ బిల్లం మురళీ, శ్రీని వాస్రావు, మల్లేశ్, వేణుగోపాల్రావు, బాబు, రాజేశం, రాజం, శేఖర్ ఉన్నారు. -
ఆదివారం శ్రీ 15 శ్రీ మార్చి శ్రీ 2026
ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలుసిరిసిల్ల: జిల్లాలో పదో తరగతి పరీక్షలు తొలిరోజు శనివారం ప్రశాంతంగా జరిగాయి. 34 పరీక్ష కేంద్రాలు ఉండగా.. 7,307 మందికి ఎనిమిది మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లాలో 99.89 శాతం విద్యార్థుల హాజరు నమోదైంది. కలెక్టర్ గరీమా అగ్రవాల్ బాలుర జెడ్పీ హైస్కూల్, నెహ్రూ నగర్ హైస్కూల్ను తనిఖీ చేశారు. ఎస్పీ మహేశ్ బీ గీతే గీతానగర్ బాలికల జెడ్పీ హైస్కూల్ కేంద్రాన్ని డీఎస్పీ నాగేంద్రచారితో కలిసి పరిశీలించారు. రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 10 పరీక్ష కేంద్రాలను సందర్శించినట్లు జిల్లా విద్యాధికారి డాక్టర్ బి.జగన్మోహన్రెడ్డి తెలిపారు. -
మామిడి చెట్ల పెళ్లి.. గ్రామంలో సంబరాలు
రాజన్న సిరిసిల్ల జిల్లా: కథలాపూర్ మండలం ఇప్పపెల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెంచిన మామిడిచెట్లకు శుక్రవారం పెళ్లి జరిపించారు. గ్రామశివారులో ముదిరాజ్ సంఘం తరఫున 5 ఎకరాల మామిడితోట నిర్వహిస్తున్నారు. మామిడిచెట్లకు పెళ్లి జరిపిస్తే కాయలు బాగా కాస్తాయనేది వారి నమ్మకం. దీంతో సంఘం సభ్యులు అల్లనేరేడు, మామిడిచెట్లకు సంప్రదాయబద్ధంగా పెళ్లి జరిపించారు. అనంతరం సంఘం సభ్యులు సామూహిక భోజనాలు చేశారు. అర్చకులు పులికాంత ప్రమోద్, సంఘం సభ్యులు పాల్గొన్నారు. -
కాళ్లు మొక్కుతాం సార్.. జీతాలివ్వండి
సిరిసిల్లటౌన్: ‘కాళ్లు మొక్కుతాం.. ఎన్ని రోజులు జీతాలు ఇవ్వకుండా ఉంటారు’ అంటూ కొందరు దివ్యాంగులు రాజన్న సిరిసిల్ల జిల్లా సంక్షేమాధికారి (డీడబ్ల్యూవో) లక్ష్మీరాజం కాళ్లపై పడిన సంఘటన చర్చనీయాంశమైంది. శుక్రవారం డీడబ్ల్యూవో లక్ష్మీరాజం సిరిసిల్ల మున్సిపల్ ఆఫీస్కు రాగా, ఈ విషయం తెలుసుకున్న జిల్లా సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని పెట్రోల్బంక్లో పనిచేసే దివ్యాంగ కార్మికులు తిరుపతి, లింగప్రసాద్, మన్మోహన్ తదితరులు అక్కడకు చేరుకుని జీతాలు ఇవ్వాలంటూ ఆయన కాళ్లపై పడ్డారు. అనంతరం దివ్యాంగులు మీడియాతో మాట్లాడుతూ, 2024లో ప్రభుత్వ ఆధ్వర్యంలోని పెట్రోల్ బంక్లో మొత్తం 24 మంది దివ్యాంగులను అప్పటి కలెక్టర్ సందీప్కుమార్ ఝా నియమించారని తెలిపారు. అయితే సంక్షేమ శాఖ అధికారి పర్యవేక్షణలో నడిచే బంక్లో ఆకస్మికంగా కొందరు దివ్యాంగులైన వర్కర్లను తొలగించి, పది మంది మాత్రమే ఉండాలని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ జీతాలు లెక్కచేసి ఇవ్వాలని కోరగా.. ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జీతాలు లేక తమ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని చెప్పినా కనికరించడం లేదని వాపోయారు. దివ్యాంగులపై డీడబ్ల్యూవో నిర్దయగా ప్రవర్తించడం సరికాదన్నారు. పది నెలలుగా జీతాలు లేవని, సీఎం రేవంత్రెడ్డి తమపై కరుణ చూపి న్యాయం చేయాలని, లేనిపక్షంలో కుటుంబ సభ్యులతో సహా ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. -
వేగం.. పారదర్శకత
ముస్తాబాద్/వీర్నపల్లి(సిరిసిల్ల): సర్టిఫికెట్ల జారీలో పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం డిజిటల్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో మాన్యువల్గా జరిగే విచారణతో కలిగే జాప్యాన్ని నివారిస్తూ, డిజిటల్ యాప్ ద్వారా సేవలను వేగవంతం చేస్తోంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు, విద్యార్థులకు ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. మారుతున్న విధానం గతంలో కులం, ఆదాయం, నివాసం సర్టిఫికెట్ల కోసం మీసేవలో దరఖాస్తు చేస్తే అది నేరుగా నాయబ్ తహసీల్దార్ లాగిన్కు వెళ్లేది. అక్కడి నుంచి మండల రెవెన్యూ అధికారి(ఆర్ఐ)కి, ఆపై క్షేత్రస్థాయి పరిశీలనకు పంపేవారు. కానీ కొత్త విధానంలో అభ్యర్థి మీసేవలో దరఖాస్తు చేసుకోగానే అది నేరుగా గ్రామపంచాయతీ అధికారి(జీపీవో) లాగిన్లోకి వెళ్తుంది. అక్కడి నుంచి మండల రెవెన్యూ అధికారి(ఆర్ఐ)కి, ఆపై నాయబ్ తహసీల్దార్కు డిజిటల్ రూపంలో ఫార్వర్డ్ అవుతుంది. దీంతో మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. ముందుగా ఆదాయం సర్టిఫికెట్లతో శ్రీకారం ధ్రువీకరణపత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే రోజులకు కాలం చెల్లింది. సామాన్యులకు ఊరటనిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదాయ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు చేపట్టింది. పూర్తి డిజిటల్ పద్ధతి, పారదర్శకతకు పెద్దపీట వేస్తూ కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. గతంలో ఆదాయం సర్టిఫికెట్ పొందాలంటే దరఖాస్తుదారుడు తహసీల్ ఆఫీస్లో దరఖాస్తు నింపి, దానిపై గ్రామ పంచాయతీ అధికారి(జీపీవో), మండల రెవెన్యూ అధికారి(ఆర్ఐ)కి సంతకాలు తీసుకోవాల్సి వచ్చేది. అనంతరం మీసేవలో ఆన్లైన్ చేసి, మళ్లీ మాన్యువల్ కాపీలను సమర్పించిన తర్వాతే తహసీల్దార్ లాగిన్కు వెళ్లేది. దరఖాస్తుదారుడు నేరుగా మీసేవ కేంద్రానికి వెళ్లి ఆన్లైన్ చేసుకోవచ్చు. ఆన్లైన్ చేయగానే దరఖాస్తుకు సంబంధించిన ఐడీ నంబర్ గ్రామపంచాయతీ అధికారి లాగిన్లో కనిపిస్తుంది. సదరు అధికారి క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆర్ఐకి ఫార్వర్డ్ చేస్తారు. ఆర్ఐ తన లాగిన్ ద్వారా వివరాలను తనిఖీ చేసి తహసీల్దార్కు పంపిస్తారు. తహసీల్దార్ డిజిటల్ సంతకంతో ఆమోదం తెలపగానే, అభ్యర్థి మొబైల్ ఫోన్కు సర్టిఫికెట్ సిద్ధమైనట్లు మెసేజ్ వస్తుంది. ఈ విధానం విజయవంతమైతే.. రానున్న రోజుల్లో కులం, నివాస ధ్రువీకరణపత్రాలను కూడా ఇదే పద్ధతిలో అందించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది.ఒకప్పుడు ఆదాయం సర్టిఫికెట్ కావాలంటే అధికారుల సంతకాల కోసం రోజుల తరబడి ఆఫీస్ల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు ఆన్లైన్లో అప్లయ్ చేస్తే అధికారులే పరిశీలించి డిజిటల్ సంతకంతో పంపిస్తున్నారు. ఇది చాలా సులభంగా ఉంది. మీసేవ కేంద్రానికి వెళ్లే పని లేకుండా, ఇంట్లోనే కంప్యూటర్ లేదా మొబైల్ ద్వారా ప్రభుత్వ సేవలను పొందవచ్చు. – పిట్ల ఖాజీబాబు, వీర్నపల్లిగతంలో ఆదాయ ధ్రువీకరణపత్రాలకు జీపీవోల వద్దకు దరఖాస్తుదారులు వెళ్లేవారు. మీసేవకు వెళ్లి కావాల్సిన డాక్యుమెంట్స్తో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. ప్రత్యేక యాప్ ద్వారా జీపీవో లాగిన్లోకి వస్తుంది. ఆయన విచారణ చేసి వాటిని ఆర్ఐకి పంపిస్తారు. ఆర్ఐ పరిశీలన తర్వాత తహసీల్దార్ డిజిటల్ సంతకంతో సర్టిఫికెట్ వస్తుంది. – బి.రామ్చందర్, తహసీల్దార్, ముస్తాబాద్ -
గ్యాస్ సిలిండర్లకు కొరత లేదు
● వదంతులు, అసత్య ప్రచారాలు నమ్మొద్దు ● కలెక్టర్ గరీమా అగ్రవాల్సిరిసిల్ల: జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరత లేదని కలెక్టర్ గరీమా అగ్రవాల్ స్పష్టం చేశారు. కలెక్టరేట్లో శుక్రవారం ఎస్పీ మహేశ్ బీ గీతేతో కలిసి ఎనర్జీ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా జిల్లాలో సిలిండర్ల నిల్వలు ఉన్నాయన్నారు. ప్రజలు ఎలాంటి అపోహలు పడొద్దని, వదంతులు నమ్మొద్దన్నారు. గృహ వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా గ్యాస్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం సూచించిన ధరలకు మాత్రమే సిలిండర్లను విక్రయించాలన్నారు. ప్రభుత్వ హాస్టళ్లు, స్కూళ్లు, అనాథ శ్రమాలు, ఆస్పత్రులకు ఇబ్బంది లేకుండా సిలిండర్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. బ్లాక్ దందా చేయొద్దు : ఎస్పీ గ్యాస్ సిలిండర్లను పక్కదారి పట్టించొద్దని, బ్లాక్ దందా చేయొద్దని ఎస్పీ మహేశ్ బీ గీతే హెచ్చరించారు. సిలిండర్ పక్కదారి పట్టినా.. బ్లాక్ దందా చేసినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, జిల్లా పౌ ర సరఫరాల అధికారి రాధాభాయ్, సిరిసిల్ల ఆర్డీవో సీ.హెచ్.వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యులు రవీందర్రెడ్డి, అఫ్జల్బేగం, సౌజన్య, రూపేష్, లక్ష్మీరాజం, రజిత, గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు పాల్గొన్నారు. పిల్లలపై శ్రద్ధ పెట్టాలి అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని అశోక్నగర్లో అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో పిల్లల హాజరు రిజిస్టర్ తనిఖీ చేసి, మొత్తం ఎందరు పిల్లలు ఉన్నారు? రోజూ ఎందరు వస్తున్నారో ఆరా తీశారు. పలువురు పిల్లల తల్లులతో మాట్లాడి.. గుడ్డు, పోషకాహారం ఇస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. -
రోడ్డున పడేయొద్దు
● సెస్ కార్మికులు, ఉద్యోగులు ● మూడో రోజు మిన్నంటిన నిరసనసిరిసిల్లటౌన్: దశాబ్దాలుగా సెస్ సంస్థకు సేవలు అందిస్తున్నామని తమ కుటుంబాలను రోడ్డున పడేయొద్దని విద్యుత్ కార్మికులు, ఉద్యోగులు కోరారు. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ 72 గంటల నిరవధిక సమ్మెలో భాగంగా శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి సెస్ ఆఫీస్ ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా టీజీయూఈఈయూ రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్రావు మాట్లాడుతూ దశాబ్దాలుగా సంస్థలో పనిచేస్తూ కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత లేకుండా అసిస్టెంట్ హెల్పర్లు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంకట్రావుపల్లికి చెందిన శ్రీకాంత్, వెంకటేశ్వర ఐ హాస్పిటల్ భానుచందర్ పులిహార, మజ్జిక ప్యాకెట్లు అందించారు. ముస్తాబాద్ మండలం చీకోడ్ సర్పంచ్ అంజయ్య, చిప్పలపల్లి సర్పంచ్ లక్ష్మణ్, సెస్ సిరిసిల్ల పట్టణ ప్రతినిధి సుదర్శన్ వెంకటేశ్, ఐద్వా రాష్ట్ర నాయకురాలు మల్లు లక్ష్మి, జిల్లా నాయకురాలు జువ్వాజి విమల, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎల్లారెడ్డి రాజశేఖర్, మూశం రమేశ్, గ్రామపంచాయతీ కార్మికులు బూర శ్రీనివాస్, మల్యాల నర్సయ్య సంఘీభావం తెలిపారు. టీజీయూఈఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నలువాల స్వామి, సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు కర్నాల అనిల్ కుమార్, జిల్లా కార్యదర్శి నర్ర శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా పరీక్షలు రాయండి
సిరిసిల్ల: జిల్లాలో పదోతరగతి పరీక్షలను ప్రశాంతంగా రాయాలని, పరీక్ష కేంద్రానికి అరగంట ముందే విద్యార్థులు చేరుకోవాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. శనివారం నుంచి పదో తరగతి పరీక్షలు మొదలవుతున్న సందర్భంగా జిల్లాలో పరీక్షలకు చేసిన ఏర్పాట్లను శుక్రవారం వివరించారు. జిల్లాలో 34 కేంద్రాలు ఏర్పాటు చేశారని, నిర్ణీత పరీక్ష సమయం తరువాత ఐదు నిమిషాలు వరకు కేంద్రంలోకి అనుమతిస్తారని పేర్కొన్నారు. 7,317 మంది విద్యార్థులు జిల్లాలో పదో తరగతి పరీక్షలకు మొత్తం 7,317 మంది విద్యార్థులు హాజరుకానుండగా, బాలురు 3,511, బాలికలు 3,806 మంది పరీక్షలు రాయనున్నారు. పరీక్షా కేంద్రాల్లో డెస్క్లు, తాగునీరు, టాయిలెట్స్, ట్యూబ్లైట్స్ సౌకర్యాలు కల్పించారు. 144 సెక్షన్ అమలు పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేయనున్నారు. అలాగే పరీక్ష కేంద్రాల సమీపంలో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ జిరాక్స్ దుకాణాలు మూసివేయాలని, పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావద్దని అధికారులు సూచించారు. పర్యవేక్షణకు బృందాలు పరీక్షల పర్యవేక్షణకు వివిధ శాఖల అధికారులతో బృందాలు ఏర్పాటు చేశారు. చీఫ్ సూపరింటెండెంట్లు 34, డిపార్ట్మెంటల్ అధికారులు 34, సిట్టింగ్ స్క్వాడ్ 34, ఫ్లయింగ్ స్క్వాడ్ రెండు టీంలు, అడిషనల్ డిపార్టుమెంటు ఆఫీసర్స్, స్టేట్ లెవెల్ అబ్జ ర్వర్స్, కస్టోడియన్ అధికారులను నియమించారు. -
అటెండెన్స్ పెరిగింది
నీటి గంట అమలు చేయడం ద్వారా మా పాఠశాల విద్యార్థులు మరింత చురుగ్గా మారుతున్నారు. తరగతుల్లో ఎక్కువ ఏకాగ్రత చూపుతున్నారు. వారి అనారోగ్య కారణాలతో పాఠశాలకు రాకుండా ఉండే రోజులు కూడా తగ్గిపోయాయి. – జె.అనురాధ, హెచ్ఎం, జిల్లెల్ల నీరు తాగడం ఆరోగ్యదాయకం పాఠశాల వేళల్లో తగినంత నీరు తాగడం ద్వారా పిల్లల కిడ్నీలు, రక్త ప్రసరణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. రోగ నిరోధకశక్తి పెరగడం ద్వారా విద్యార్థులు అనేక అనారోగ్యాల నుంచి సురక్షితంగా ఉంటారు. – డాక్టర్ రజిత, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, సిరిసిల్ల -
కనీస వేతనాలివ్వాలి
సిరిసిల్లటౌన్: జిల్లా ఆస్పత్రిలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మూశం రమేశ్ కోరా రు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ఈనెల 17న చలో హైదరాబాద్కు వెళ్తున్న నేపథ్యంలో శుక్రవా రం ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్కుమార్ను కలిసి మాట్లాడారు. కార్మికులపై పనిభారం తగ్గించాలని కోరారు. వైద్యారోగ్య శాఖ కమిషనర్ ఆఫీస్ ఎదుట ధర్నాకు వెళ్తున్న నేపథ్యంలో ముందస్తుగా లేఖను అందజేసినట్లు పేర్కొన్నారు. ఎగమంటి ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కార్మికులు మంచి అలవాట్లు అలవరచుకోవాలి
సిరిసిల్ల: నేత, ఇతర రంగాల్లోని కార్మికులు మంచి అలవాట్లను అలవరచుకోవాలని సైకాలజిస్ట్ కె.పున్నంచందర్ సూచించారు. స్థానిక వెంకట్రావునగర్లో శుక్రవారం మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో సామూహిక మనోవికాస సదస్సు నిర్వహించారు. పున్నంచందర్ మాట్లాడుతూ కార్మికులు పొగ తాగడం, మద్యం సేవించడం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. మైండ్ కేర్ సెంటర్ సిబ్బంది కొండ ఉమా, బూర శ్రీమతి, రాపెల్లి లత పాల్గొన్నారు. భూసార పరీక్షలు చేయించాలి చందుర్తి(వేములవాడ): భూసార పరీక్షల ఆధారంగా సరైన మోతాదులో ఎరువులు వాడితే సాగు ఖర్చులు తగ్గుతాయని బాబు జగ్జీవన్రామ్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ మధుకర్ పేర్కొన్నారు. మూడపల్లి రైతువేదికలో పంటల సాగులో యాజమాన్య పద్ధతులపై శుక్రవారం అవగాహన సదస్సును సర్పంచ్ చిలుక మల్లేశ్వరీ ఆధ్వర్యంలో నిర్వహించారు. రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, మార్కెట్ డైరెక్టర్ లావణ్య, చందుర్తి మండల వ్యవసాయాధికారి దుర్గారాజు, ఏఈవో ప్రవీణ్ హాజరయ్యారు. అవగాహన కల్పించాలి తంగళ్లపల్లి(సిరిసిల్ల): ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ప్రత్యేక అధికారి ఎం.శ్రీనివాస్ సూచించారు. మండలంలోని జిల్లెల్ల, నేరెళ్ల గ్రామాల్లో శుక్రవారం పర్యటించి మాట్లాడారు. తడిచెత్త, పొడిచెత్తపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఎంపీవో మీర్జా అఫ్జల్ అహ్మద్బేగ్, ఏపీవో రాపోల నాగరాజు, కార్యదర్శి రాజు, టీఏ లక్ష్మణ్ పాల్గొన్నారు. అల్మాస్పూర్లో టవర్ నిర్మించొద్దని నిరాహార దీక్ష ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని అల్మాస్పూర్లో జనావాసాల మధ్య ఎయిర్టెల్ సెల్టవర్ ఏర్పాటు చేయొద్దని కోరుతూ గ్రామస్తులు మూడో రోజు శుక్రవారం నిరాహార దీక్ష కొనసాగించారు. సర్పంచ్ నాగెల్లి వెంకటరెడ్డి మాట్లాడుతూ గ్రామానికి దూరం సెల్టవర్ ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఉపసర్పంచ్ కొర్రి అనిల్, మాజీ ఎంపీపీ పిల్లి రేణుక, నాయకులు పిల్లి కిషన్, పుణ్యానాయక్, రాజయ్య పాల్గొన్నారు. గోల్డెన్ అవర్లో జాగ్రత్తగా ఉండాలిసిరిసిల్లటౌన్: రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులను గోల్డెర్ అవర్లోనే సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి చేర్చాలని 108 ఉమ్మడి జిల్లా పీవో భూమా నాగేందర్ కోరారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో నిలిపి ఉంచిన 108 అత్యవసర అంబులెన్స్, 102 అమ్మఒడి, 1962 సంచార పశువైద్యశాల వాహనాలను జిల్లా మేనేజర్ అరుణ్కుమార్తో కలిసి శుక్రవారం తనిఖీలు చేపట్టారు. -
మోగని నీటి గంట
తంగళ్లపల్లి(సిరిసిల్ల): వాటర్బెల్.. అవును నిజమే పాఠశాలలో అమలు చేయాల్సిన అత్యంత ప్రాధాన్యమున్న బెల్ ఇది. ఈ బెల్ మోగగానే విద్యార్థులందరూ తగినంత నీరు తాగేలా చూడడం అత్యంత అవసరం. గతంలో జిల్లాలోని చాలా ప్రభుత్వ పాఠశాలల్లో వినిపించిన ‘వాటర్ బెల్’ ఇప్పుడు మోగటం లేదు. ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో విద్యార్థులు డీహైడ్రేషన్కు గురయ్యే ప్రమాదం ఉంది. తప్పనిసరిగా ‘వాటర్ బెల్’ అమలు చేయాల్సిన అవసరం ఉంది. నీళ్లు తాగకపోవడంతో చిన్న వయసులోనే అనారోగ్యం బారిన పడుతున్నారు. చాలామంది ఇంటి నుంచి నీటిసీసాలు తీసుకెళ్తున్నప్పటికీ మధ్యాహ్నం సమయంలోనే అన్నం తినేటప్పుడే ఆ నీటిని తాగుతున్నారు. ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తుందని భయంతో విద్యార్థులు నీటిని సరిగా తీసుకోవడం లేదని తెలి సింది. సరిపడా నీటిని తాగకపోవడంతో మూత్రకోశ వ్యాధులతోపాటు డీహైడ్రేషన్కు గురయ్యే ప్రమాదం ఉంది. గతంలో అమలు చేసినా... సాధారణ రోజుల్లో ఇంటర్వెల్, లంచ్ బ్రేకులతోపాటు ఉదయం 10.30గంటలకు, మధ్యాహ్నం 2.30కు వాటర్ బెల్ మోగించాలి. ఒంటి పూట బడుల సమయంలో ఉదయం 9.30కు, మళ్లీ 11గంటలకు మోగించాలి. తద్వారా విద్యార్థులు ఎక్కువ నీరు తాగేలా ప్రోత్సహించి, అనారోగ్యం బారిన పడకుండా చూడవచ్చు. జిల్లాలో చాలా పాఠశాలల్లో ప్రభుత్వంతో పాటు, పలు స్వచ్ఛంద సంస్థలు వాటర్ ప్లాంట్స్ను ఏర్పాటు చేశారు. ఐతే అనేక పాఠశాలల్లో ఇవి పనిచేయకపోవడంతో నిరుపయోగంగా ఉన్నాయి. దీంతో విద్యార్థులు ఇళ్ల నుంచి నీటి సీసాలు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. నీరు ఎంత తాగాలి జిల్లెల్ల బడిలోనే నీటి గంట సవ్వడి తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొలిసారిగా వాటర్ బెల్ను అమలు చేస్తున్నారు. బడి ప్రారంభమైన తర్వాత ప్రతీ రెండు పీరియడ్లకు ఒకసారి నీటి గంట మోగిస్తారు. ఈ సమయంలో ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థిని నీరు తాగమని ప్రోత్సహిస్తారు. తద్వారా విద్యార్థులు డీహైడ్రేషన్ సమస్యను జయిస్తూ రోజంతా ఉల్లాసంగా గడుపుతున్నారు.సమాచారం ఇలా..పాఠశాలలు సంఖ్య విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు 511 38,629రెసిడెన్షియల్ పాఠశాలలు 21 7,762 ప్రైవేటు పాఠశాలలు 131 31,026 -
ప్రజాపాలనలో భాగస్వాములు కావాలి
● కలెక్టర్ గరీమా అగ్రవాల్ ● సర్పంచులు, కౌన్సిలర్లకు అవగాహన సదస్సుతంగళ్లపల్లి(సిరిసిల్ల): ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో సర్పంచులు, మున్సిపల్ చైర్మన్లు, వార్డు సభ్యులు భాగస్వాములు కావాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని బాబు జగ్జీవన్రామ్ వ్యవసాయ కళాశాలలో గురు వారం నిర్వహించిన అవగాహన సదస్సును కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతే, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్తో కలిసి ప్రారంభించారు. కలెక్టర్ గరీమా అగ్రవాల్ మాట్లాడుతూ.. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక ఐదు దశల్లో కార్యక్రమాలు ఉన్నాయని వెల్లడించారు. ఏప్రిల్ 2న మొదటి దశలో భాగంగా గ్రామసభలు నిర్వహిస్తారని, రెండో దశలో ఏప్రిల్ 16న మండల స్థాయిలో కార్యక్రమాలు, మూడో దశలో మే 2న నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాలు, నాలుగో దశలో మే 22న జిల్లా స్థాయిలో విస్తృత కార్యక్రమాలు, ఐదో దశలో జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించనున్నారని వివరించారు. జిల్లాలో 46,492 మందికి రూ.370.75 కోట్ల రుణ మాఫీ, 1.26 లక్షల రైతులకు రైతుభరోసా అందించామని, 22,554 రేషన్కార్డులు జారీ చేశామని తెలిపారు. జూన్ 2లోగా ఇందిరమ్మ ఇళ్లు, మహిళా సంఘాల భవనాలను ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రమాదాల నివారణకు సహకరించాలి ఎస్పీ మహేశ్ బీ గీతే మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలు సహకరించాలని కోరారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, సెల్ఫోన్ మాట్లాడుతూ, మద్యం తాగి వాహనాలు నడపొద్దని సూచించారు. డీఆర్డీవో గీత, జెడ్పీ సీఈవో వినోద్కుమార్, రవాణాశాఖ అధికారి లక్ష్మణ్, జిల్లా వైద్యాధికారి రజిత, సిరిసిల్ల, వేములవాడ మున్సి పల్ చైర్మన్లు జిందం కళ, రాజు, కమిషనర్లు ఖదీర్పాషా, సంపత్కుమార్, డీపీవో షర్ఫొద్దీన్, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, వ్యవసాయ కళాశాల డీన్ సునీతాదేవి, వ్యవసాయ అధికారి అఫ్జల్బేగం, సర్పంచ్ దుబ్బాక రజిత పాల్గొన్నారు. పనికి సర్పంచ్ కావాలి.. నిధులకు వద్దా? పద్మనగర్ సర్పంచ్ మోర నిర్మల అధికారుల తీరును ఎండగట్టారు. ఉద్యోగస్తులు నాలుగు గంటలు పనిచేసినా, ఎనిమిది గంటలు పనిచేసినా జీతం వస్తుంది. కానీ సర్పంచులు 24 గంటలు గ్రామం కోసం పనిచేస్తుంటే సీఎం రేవంత్రెడ్డి, పీఎం మోదీ పది పైసలు కూడా పంప డం లేదన్నారు. పందులు చనిపోయినా సర్పంచ్, ఎలుకలు చనిపోయినా సర్పంచ్.. కానీ పనిచేసేందుకు సర్పంచులు వద్దా? గ్రామపంచాయతీలకు నిధులు లేకుండా పనులు ఎలా చేయాలి? అని అధికారులను నిలదీశారు. -
పాలిస్టర్ కార్మికుల కూలీ చర్చలు విఫలం
సిరిసిల్ల: పాలిస్టర్, వైపణి, వార్పిన్ కార్మికులు కూలీ పెంపు చర్చలు విఫలమయ్యాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలో కార్మికశాఖ డిప్యూటీ లేబర్ కమిషనర్ ప్రసాద్ సమక్షంలో గురువారం జరిగిన సుదీర్ఘచర్చలు అర్ధంతరంగా ముగిశాయి. కూలీరేట్లను పెంచేందుకు పాలిస్టర్ యజమానులు అంగీకరించలేదు. ఇప్పటికే తొలిదశ చర్చలు విఫలం కాగా.. మలిదశ చర్చలు గురువారం జరిగాయి. యజమానులకు, కార్మికులకు జరిగిన చర్చలు అర్ధంతరంగా ముగిశాయి. పాలిస్టర్ అసోసియేషన్, కార్మిక నేతల మధ్య జరిగిన కూలీ ఒప్పందం గడువు 2022లో ముగిసింది. చిన్న పన్న పది పిక్కులకు(పోగులు) ప్రస్తుత కూలీ 25పైసలు ఉండగా.. 30 పైసలు, పెద్ద పన్నకు 26 పైసలు ఉండగా.. 35 పైసలు ఇవ్వాలని కోరుతున్నారు. వార్పిన్ కార్మికులకు 1000 పోగులకు 1250 మీటర్ల వరకు రూ.40 కూలీ ఇవ్వాలని, వైపణి కార్మికులకు 1000 పోగులకు రూ.110 చెల్లించాలని, టెక్స్టైల్ పార్క్లో పది పిక్కులకు 50 పైసలు చెల్లించాలని కార్మిక నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం వస్త్రపరిశ్రమ ఉన్న పరిస్థితుల్లో కూలీ పెంపు సాధ్యం కాదని, ప్రస్తుతం ఉన్న రేట్లను అమలు చేస్తామని యజమానుల సంఘం ప్రతినిధులు స్పష్టం చేశారు. దీంతో కూలీచర్చలు కొలిక్కి రాలేదు. పక్షం రోజుల గడువు మరో పక్షం రోజుల్లో కూలీ పెంపు ఒప్పందం చేసుకోవాలని, మరో దఫా చర్చలు సిరిసిల్లలోనే నిర్వహిస్తామని డీసీఎల్ ప్రసాద్ స్పష్టం చేశారు. మళ్లీ చర్చలు జరిగే వరకు కార్మికులు సమ్మెకు వెళ్లకుండా ఆగాలని కోరారు. సాధ్యమైనంత త్వరగా యజమానులతో మాట్లాడి కూలీ రేట్లు పెంచే ప్రయత్నం చేస్తామని లేబర్ అధికారులు స్పష్టం చేశారు. చర్చల్లో అసిస్టెంట్ లేబర్ అధికారి రఫీ, పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆడెపు భాస్కర్, కార్యదర్శి రవి, కార్మిక నాయకులు మూషం రమేశ్, కోడం రమణ, సిరిమల్ల సత్యం తదితరులు పాల్గొన్నారు. -
రాజన్న సిరిసిల్ల
శుక్రవారం శ్రీ 13 శ్రీ మార్చి శ్రీ 20267వేములవాడఅర్బన్: పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి కోరారు. ఈమేరకు ఎమ్మెల్యే పీఏకు వినతిపత్రం అందజేశారు.డగ్స్ను నివారిద్దాంసిరిసిల్లక్రైం: డ్రగ్స్ను నివారించేందుకు ముందుకురావాలని టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ నటేశ్ కోరారు.గీతానగర్ ప్రభుత్వ పాఠశాలలో గురువారం అవగాహన కల్పించారు. మధ్యాహ్నం ఎండ తీవ్రంగా ఉంటుంది. ఉక్కపోతగా ఉంటుంది. గాలిలో తేమ స్వల్పంగా ఉంటుంది. రాత్రి చలిగాలులు వీస్తాయి. -
కాగుతున్న వంటనూనె
● పెరుగుతున్న ధరలు ● జనం జేబులకు తూట్లు ● తగ్గిన కోడిగుడ్ల రేట్లుముస్తాబాద్(సిరిసిల్ల): గల్ఫ్ దేశాల్లో యుద్ధం జరుగుతుంటే మన దగ్గర నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నాయి. పద్నాలుగు రోజులుగా సాగుతున్న అమెరికా, ఇజ్రాయేల్, ఇరాన్ యుద్ధంతో మన ప్రాంతంలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. విదేశాల నుంచి పామాయిల్, చమురు ఉత్పత్తుల దిగుమతి నిలిచిపోయాయి. దీంతో వాటి ధరలకు రెక్కలు వచ్చాయి. హర్మూజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించడంతో మన దేశానికి వచ్చే నౌకలు నిలిచిపోయాయి. అందులో వస్తున్న చమురు, పామాయిల్ తదితర వస్తువులు దేశానికి చేరే పరిస్థితి లేదు. దీంతో వాటికి అనుసంధానమైన వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. కాగుతున్న వంటనూనెలు వంటనూనెల ధరలు 25 శాతం పెరిగాయి. పద్నాలుగు రోజుల క్రితం సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ ధర రూ.152 ఉండగా.. ప్రస్తుతం రూ.175కు చేరింది. పది రోజుల వ్యవధిలో రూ.23 పెరగడంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. డిస్పోజల్ గ్లాసుల ధరలైతే వందశాతం పెరిగాయి. 50 గ్లాసుల ధర పది రోజుల క్రితం రూ.20 ఉండగా.. ప్రస్తుతం రూ.40కి విక్రయిస్తున్నారు. గోధుమపిండి, ఖర్జురాతోపాటు ఆయిల్తో సంబంధమున్న వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతానికై తే పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వం పెంచలేదు. విశ్వ విపణిలో చమురు బ్యారెల్ ధరలు పెరిగినా ఆ ప్రభావం ప్రభుత్వం సామాన్యులపై పడనివ్వడం లేదు. తగ్గుతున్న కోడిగుడ్ల ధరలు పశ్చిమాసియాలో యుద్ధంతో కొడిగుడ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. రోజుకు లక్షలాది గుడ్లు గల్ఫ్ దేశాలకు ఎగుమతి అయ్యేవి. యుద్ధ ప్రభావంతో ఎగుమతులు నిలిచిపోవడంతో ధరలు తగ్గుతున్నాయి. పది రోజుల క్రితం కోడిగుడ్డు రిటైల్ ధర రూ.7 ఉండేది. ప్రస్తుతం రూ.4.20 విక్రయిస్తున్నారు. అధిక మొత్తంలో గుడ్లు కొన్న వారికి రూ.4కు కూడా విక్రయిస్తున్నారు. ఇక వంట గ్యాస్ ఇప్పటికై తే కొత్త బుకింగ్లను స్వీకరించడం లేదు. హోటళ్లు, గృహాలకు పరిమిత సంఖ్యలో వంట గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నారు. -
అక్కడ వార్.. ఇక్కడ బేజార్
సాక్షిప్రతినిధి, కరీంనగర్: పశ్చిమాసియాలోని యుద్ధం వెతలు ఇన్నిన్ని కాదయా.. ఇంటింటా వంటింటా తిప్పలేనయా! అన్నట్లుగా ఉంది పరిస్థితి. యుద్ధం కారణంగా సముద్ర మార్గాల్లో రవాణాకు ఇబ్బందులు ఏర్పడి ఎల్పీజీ సరఫరాలో తలెత్తిన అంతరాయం ఉమ్మడి జిల్లాపై భారీగానే పడింది. గృహాలతోపాటు వాహనాలు, హోటళ్లు, మెస్లు, హాస్టళ్లు, హాస్పిటళ్లను సైతం ఎల్పీజీ కొరత ముప్పు వెంటాడుతోంది. యుద్ధం ప్రభావంతో ఇప్పటికే గృహ(రూ.60), కమర్షియల్ సిలిండర్ (రూ.115) ధరలు పెరిగిన విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లాకు కావాల్సిన ఎల్పీజీ సరఫరా మునుపటిస్థాయిలో ఉండటం లేదని డీలర్లు అంటున్నారు. కొరతతో అనివార్యంగా ధరలు పెరుగుతున్నాయని వాపోతున్నారు. ముఖ్యంగా వాహనాలకు విక్రయించే ఎల్పీజీ గ్యాస్ కేవలం వారం రోజుల్లోనే లీటరుకు రూ.30కిపైగా పెరగడం పరిస్థితికి నిదర్శనం. నిండుకుంటున్న గ్యాస్ ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాలలో 50కిపైగా ఎల్పీజీ స్టేషన్లు ఉన్నాయి. ప్రతీరోజూ ఆటోలు, కార్లు తదితర వాహనాలు 50వేల లీటర్ల వరకు ఎల్పీజీ నింపుకొంటున్నాయి. యుద్ధం ప్రారంభానికి ముందు లీటరుకు రూ.55గా ఉన్న ఎల్పీజీ తాజాగా గురువారం లీటరు రూ.86కు పెరిగింది. ఈ లెక్కన ప్రతీరోజూ ఉమ్మడి జిల్లా ఎల్పీజీ వాహనాలపై రూ.కోటిన్నర వరకు భారం పడుతోంది. యుద్ధం మరింత ముదిరితే ఎల్పీజీ ధర లీటరుకు రూ.100 పెరిగినా ఆశ్చర్య పోనవసరం లేదని గ్యాస్ స్టేషన్ నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. పెట్రోలుతో పోలిస్తే.. గ్యాస్ ధర చవక, అధిక మైలేజీ ఇవ్వడం, పర్యావరణ హితంగా ఉండటంతో కొన్నాళ్లుగా ఎల్పీజీ వాహనాలకు డిమాండ్ పెరిగింది. హోటళ్లు, హాస్పిటళ్ల జాగ్రత్తలు యుద్ధం నేపథ్యంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరా తగ్గిపోతుండటంతో ఉమ్మడి జిల్లాలోని ప్రముఖ హోటళ్లు, హాస్పిటళ్లు, రెసిడెన్షియల్ హాస్టళ్లు ముందు జాగ్రత్తగా వంటచెరుకు, చార్కోల్ తదితర ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. శుక్రవారంతో ఇంటర్ పరీక్షలు ముగియడంతో రెసిడెన్షియల్ హాస్టళ్ల నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. పదోతరగతితో పాటు పాఠశాల విద్యార్థులకు మరికొన్ని రోజులు ఇబ్బందులు తప్పేలా లేవు. ఇక సాధారణ ప్రజలు ముందు జాగ్రత్తగా ఎలక్ట్రిక్ కుక్కర్లకు డిమాండ్ పెరిగింది. మూలన పడిన పాత స్టవ్ను రిపేర్లకు బయటికి తీస్తున్నారు. ఒకవేళ ఎల్పీజీ కొరత ముదిరి సంక్షోభంలా మారితే.. హోటళ్లు మూతబడితే.. అందులో పనిచేసే వారు ఉపాధి కోల్పోయే ప్రమాదముంది. గ్రానైట్ పరిశ్రమపై దెబ్బ రాష్ట్రంలో గ్రానైట్ పరిశ్రమకు కేంద్రంగా ఉన్న కరీంనగర్ జిల్లాపై యుద్ధం ప్రభావం తీవ్రంగా పడింది. కరీంనగర్ నుంచి ఆంధ్రా మీదుగా చైనా, ఇటలీకి వెళ్లే కరీంనగర్ గ్రానైట్కు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల కారణంగా షిప్పింగ్ ఛార్జీలు పెరగడం ఎగుమతులపై ప్రభావం చూపుతోంది. ఫలితంగా కంటైనర్కు 21 డాలర్లుగా ఉన్న ధర ప్రస్తుతం 28 డాలర్లకు పెరిగింది. రవాణా ఖర్చులు పెరగడమే కాకుండా, క్వారీల్లో వాడే యంత్ర పరికరాల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. గతంలో 250 రూపాయలు ఉన్న డ్రిల్లింగ్ బిట్టు ధర ఇప్పుడు ఏకంగా 1200 రూపాయలకు చేరడం పరిశ్రమ దీనస్థితికి అద్ధం పడుతోంది. మరోవైపు, క్వారీలను నడపడానికి అత్యంత కీలకమైన డీజిల్ సరఫరాపై కూడా ఆందోళన నెలకొంది. ప్రతి క్వారీకి రోజుకు సగటున 1000 లీటర్ల డీజిల్ అవసరం కాగా, పెట్రో ఉత్పత్తుల ధరలు కూడా పెరిగితే.. అందులో పనిచేసే వేలాది మంది ఉత్తరాది కూలీలు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది.ఉమ్మడి జిల్లాలో గ్యాస్ కనెక్షన్ల వివరాలు -
8 గంటలు.. 40 కిలోమీటర్లు
● అంజన్న ఆశీర్వాద యాత్రకు కేంద్రమంత్రి ‘బండి’ ప్రణాళిక ● 14న ఉదయం 7గంటలకు మహాశక్తి ఆలయం నుంచి ప్రారంభంసాక్షిప్రతినిధి,కరీంనగర్: కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’ పేరిట ఈనెల 14న నిర్వహించ తలపెట్టిన మహా పాదయాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలో శనివారం 38 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ మేర వేడి ఉండబోతున్నట్లు వాతావరణశాఖ చెబుతున్నప్పటికీ 8గంటల్లో 40కిలోమీటర్లు నడిచి కొండగట్టుకు చేరేందుకు సిద్ధమయ్యారు. పాదయాత్ర పొడవునా మంచి నీళ్లు, మజ్జిగ, పులిహోర సహా అన్ని ఏర్పాట్లు చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు, భక్త మండళ్లు ముందుకొచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు కరీంనగర్ బాట పడుతున్నారు. యాత్ర సజావుగా సాగేందుకు గురువారం సాయంత్రం బీజేపీ శ్రేణులు నగరంలో సమావేశమయ్యారు. పార్టీ సీనియర్ నేత డాక్టర్ గంగిడి మనోహర్రెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల ఇన్చార్జి బండారి శాంతికుమార్, మోహన్రెడ్డి, జిల్లాల అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, రెడ్డబోయిన గోపి, పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ కుమార్ పాదయాత్ర జరిగే ప్రాంతాల్లో, కొండగట్టు వద్ద ఏర్పాట్లు పరిశీలించారు. పది పరీక్షలకు ఇబ్బంది లేకుండా శనివారం 10వ తరగతి పరీక్షలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో పాదయాత్ర సందర్భంగా విద్యార్థులకు ఇబ్బంది ఏర్పడకుండా, రోడ్డుపై ట్రాఫిక్ జాం కాకుండా యాత్రను సాగించాలని బండి సంజయ్ కాషాయ శ్రేణులను కోరారు. పాదయాత్రలో పాల్గొనే వారంతా ఈనెల 14న ఉదయం 6 గంటలకే మహాశక్తి ఆలయానికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. పాదయాత్ర సాగుతుందిలా.. 14న ఉదయం 6 గంటలకు కరీంనగర్లోని మహాశక్తి ఆలయానికి బండి సంజయ్ చేరుకుంటారు. కార్యకర్తలతో కలిసి కొండగట్టుకు బయల్దేరుతారు. రామడుగు, వెదిర, కురిక్యాల మీదుగా గంగాధర చేరుకుంటారు. అక్కడి వీఏఎస్ ఫంక్షన్ హాలులో భోజనం చేస్తారు. వెంకటాయపల్లి, పూడూరు, దొంగలమర్రి, మీదుగా కొండగట్టు ఘాట్ రోడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా అంజన్న ఆలయం వద్దకు వెళ్లి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకుంటారు. -
పరీక్షలు ఇష్టంతో రాయాలి
● మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ సిరిసిల్లటౌన్: ఎస్సెస్సీ విద్యార్థులు పరీక్షలు భయంతో కాకుండా ఇష్టంతో రాయాలని.. అప్పుడే ఉన్నతంగా రాణిస్తారని సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని నెహ్రూనగర్ జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి విద్యార్థులు వీడ్కోలు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కౌన్సిలర్ సభ్యులు ఎర్ర వెంకటరాజం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొప్ప దేవయ్య తదితరులు పాల్గొన్నారు. ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని పెద్దలింగాపూర్లో రైతులు గత 31 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా రంగనాయకసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రారంభమైన కాలువ పనులు పూర్తి చేయాలని రైతులు రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. పనులు మొదలుపెడితేనే దీక్ష విరమిస్తామని స్పష్టం చేశారు. కరికె నవీన్కుమార్, దుమాల శ్రీను, రేగుల భిక్షపతి, దొమ్మాటి మల్లయ్య, గాదె రవి, రౌతు నారాయణ, కొమ్ముల మోహన్, కీర్తి రాజు, మహేశ్, రవి, ఆనంద్ పాల్గొన్నారు రూ.3.19కోట్లు విడుదల కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అసంపూర్తి కాలువ పనుల కోసం రూ.3.19 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. హైదరాబాదు నుంచి గురువారం ఫోన్లో మాట్లాడారు. త్వరలోనే కాలువ పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. సిరిసిల్లటౌన్: సెస్ విద్యుత్ కార్మికులు చేపట్టిన 72 గంటల విధులు బహిష్కరణ గురువారం రెండో రోజుకు చేరింది. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్రావు మాట్లాడుతూ శుక్రవారం సెస్ కార్మికులు, కుటుంబ సభ్యులతో సహా పాల్గొంటారని తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లికి చెందిన సెస్ విలేజ్ ప్రతినిధి రామచంద్రారెడ్డి, పద్మారెడ్డి సంఘీభావం తెలిపారు. శ్రీవేంకటేశ్వర ఐ హాస్పిటల్ భానుచందర్ మజ్జిక ప్యాకెట్లు అందించారు. ఆర్ఎంపీ డాక్టర్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ మెంబర్ రాజమల్లు సంఘీభావం తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నలువాల స్వామి, జిల్లా అధ్యక్షుడు కర్నాల అనిల్కుమార్, జిల్లా కార్యదర్శి నర్ర శ్రీనివాస్రెడ్డి, రవీంద్రప్రసాద్, విష్ణు, కరుణాకర్, భాస్కర్, సంతోష్నాయక్, రాచకొండ శ్రీనివాస్, తిరుపతినాయక్, నౌసిలాల్ పాల్గొన్నారు. ఆశీర్వాద పాదయాత్రను విజయవంతం చేయండిఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): కొండగట్టు అంజన్న ఆ శీర్వాద పాదయాత్రను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి కోరారు. ఎల్లారెడ్డిపేటలో గురువారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాట్లాడా రు. కేంద్రమంత్రి బండి సంజయ్కుమార్ ఈ నెల 14న చేపట్టిన కొండగట్టు అంజన్న ఆశీ ర్వాదయాత్రకు తరలిరావాలని కోరారు. పార్టీ మండలాధ్యక్షుడు రేపాక రామచంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతిరెడ్డి, జిల్లా కార్యదర్శి మద్దుల బుగ్గారెడ్డి, ప్రధాన కా ర్యదర్శులు గణేశ్, నరేశ్, బాలాగౌడ్ ఉన్నారు. -
చి‘వరి’ ఆశలు!
మునుగోడు/ముస్తాబాద్/వీర్నపల్లి(సిరిసిల్ల): యాసంగి సీజన్ ఆరంభంలో పుష్కలంగా నీరు పోసిన బోర్లు.. ఇప్పుడు పంట చేతికి వచ్చే సమయంలో భూగర్భ జలాలు పడిపోవడంతో రైతులు వేల రూపాయలు ఖర్చు చేసి.. ట్యాంకర్ల ద్వారా నీరు తెప్పించి పొలాలకు పెడుతున్నారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కల్వలపల్లి గ్రామంలో భూగర్భ జలాలు తగ్గిపోవడంతో బోర్లు వట్టిపోతున్నాయి. గ్రామంలో దాదాపు 50 మందికి పైగా రైతులు ట్యాంకర్లతో నీటిని తెప్పించి పొలాలకు పెడుతున్నారు. ఒక్కొక్క ట్యాంకర్ నీటికి రూ.వెయ్యి నుంచి రూ.1500 తీసుకుంటున్నారు. ట్యాంకర్ల ద్వారా నీరు తెప్పించుకునే స్థోమత లేని రైతులు వరి పంటను అలాగే వదిలేస్తున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఎండుతున్న వరిపంటను పలువురు రైతులు పశువులకు మేతగా వదిలి పెడుతున్నారు.ముస్తాబాద్ మండలం సేవాలాల్తండాలో నక్కవాగు పరీవాహక ప్రాంతంలో బోరుబావుల కింద వెయ్యి ఎకరాలలో వరి పంట సాగు చేస్తున్నారు. ఎండలతో నక్కవాగు ప్రవాహం అడుగంటగా సమీపంలోని పొలాలు ఎండిపోయాయి. సేవాలాల్తండాకు చెందిన లకావత్ రవినాయక్ అతని సోదరులు కలిసి నాలుగు ఎకరాలలో వరిపంట సాగు చేయగా.. నీళ్లు లేక ఎండిపోయాయి. దీంతో వారు రూ.1.20 లక్షల వరకు నష్టపోయారు. -
యూరియా తీసుకెళ్లనివ్వం
ముస్తాబాద్(సిరిసిల్ల): ఆన్లైన్లో యూరియా కోసం స్లాట్ బుక్ చేసుకున్న రైతులకు చుక్కెదురైంది. ఇతర మండలాల రైతులకు ఇక్కడ ఎలా యూరియా ఇస్తారంటూ మండలంలోని గూడెం రైతులు నిలదీశారు. ఈ సంఘటన బుధవారం చర్చనీయాంశమైంది. మండలంలోని గూడెంలో సహకార సంఘానికి చెందిన గోదాంలో యూరియా పంపిణీ చేస్తున్నారు. గూడెం గోదాముకు ఆన్లైన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకున్న గంభీరావుపేట మండలానికి చెందిన రైతులు పలువురు బుధవారం వచ్చి యూరియా బస్తాలు తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న గూడెం రైతులు అభ్యంతర తెలిపారు. ఇతర మండలాలకు చెందిన రైతులకు ఇక్కడ ఎలా యూరియా ఇస్తారంటూ ఆందోళనకు చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. యూరియా తీసుకెళ్లకుండా పెట్రోల్ పోసి నిప్పంటిస్తామని బెదిరింపులకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు గోదాం వద్దకు చేరుకొని ఇరువర్గాలను శాంతింపజేశారు. ఆన్లైన్లో యూరియా నిల్వలు చూసుకుని ఎక్కడి నుంచైనా స్లాట్ బుక్ చేసుకోవచ్చని స్పష్టం చేయడంతో వివాదం సద్దుమణిగింది. గంభీరావుపేట రైతులతో గూడెం రైతుల వాగ్వాదం ఇతర మండల రైతులకు ఎలా ఇస్తారంటూ నిలదీత పోలీసుల రంగప్రవేశంతో సద్దుమణిగిన వివాదం -
సెల్టవర్ ఏర్పాటుపై నిరసన
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): నివాసాల మధ్య సెల్ టవర్ వేయొద్దని కోరుతూ మండలంలోని అల్మాస్పూర్లో బుధవారం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గ్రామపంచాయతీ కార్యాలయం వద్దకు తరలివచ్చి ధర్నా చేశారు. సెల్టవర్ ఏర్పాటు విషయంలో పది రోజులుగా గ్రామస్తులు, నిర్వాహకులకు మధ్య వాగ్వాదం జరుగుతోంది. ఈనేపథ్యంలో సెల్టవర్ నిర్వాహకుల ఫిర్యాదుతో గ్రామస్తులు పోలీస్స్టేషన్ మెట్లు ఎక్కారు. అంతేకాకుండా నివాసాల మధ్య సెల్టవర్ వద్దని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు ఈ విషయంలో తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. టీడీపీ ఎంపీల దిష్టిబొమ్మలు దహనం సిరిసిల్లటౌన్: పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన చారిత్రాత్మక రోజును బ్లాక్ డేగా పేర్కొంటూ టీడీపీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవిగౌడ్ ఖండించారు. ఈమేరకు సిరిసిల్లలోని చేనేతచౌక్ వద్ద టీడీపీ ఎంపీల దిష్టిబొమ్మలను దహనం చేసి మాట్లాడారు. అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించేలా టీడీపీ ఎంపీలు మాట్లాడడం శోచనీయమన్నారు. మట్టి శ్రీనివాస్, అఫ్రోజ్, వడ్లూరి వేణు, అజ్జు, విష్ణు, రాము, నవీన్, శ్రీనివాస్, రాజేశ్ పాల్గొన్నారు. మార్కెట్ యార్డులో రిజిస్ట్రేషన్ కార్యాలయం వేములవాడరూరల్: స్థానిక మార్కెట్యార్డులో ఖాళీగా ఉన్న భవనాన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి ఇచ్చేందుకు మార్కెట్ పాలకవర్గం తీర్మానించింది. మార్కెట్ చైర్మన్ రొండి రాజు ఆధ్వర్యంలో బుధవారం జరిగిన సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. సమావేశానికి హాజరైన మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజును మార్కెట్ పాలకవర్గం సన్మానించింది. మార్కెట్ కమిటీ కార్యదర్శి సత్యనారాయణ, ఏఎంసీ వైస్చైర్మన్ కనికరపు రాకేశ్, డైరెక్టర్లు రాగిరి నాగరాజు, ఖమ్మం గణేశ్, పాలకుర్తి పర్శరాములు, వస్తాద్ కృష్ణ, మానుపాటి పర్శరాం, ఎస్.కె.సాబీర్, మ్యాక స్రవంతి, కత్తి కనకయ్య, చెరుకు శంకర్, గుర్రం విద్యాసాగర్, చీకోటి నాగరాజు పాల్గొన్నారు. మహిళా సంక్షేమం ప్రభుత్వ ధ్యేయం బోయినపల్లి(చొప్పదండి): ప్రజాప్రభుత్వంలో మహిళా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. మండల కేంద్రంలో ధరిత్రి, శ్రీలక్ష్మీ తులసి మహిళా సంఘం భవన నిర్మాణాలకు, బూర్గుపల్లిలో సీసీ రోడ్డు పనులకు బుధవారం భూమిపూజ చేశారు. రూ.45 కోట్ల మేర వడ్డీలేని రుణాలు, ఈజీఎస్ క్యాటిల్షెడ్, పౌల్ట్రీఫామ్ లబ్ధిదారులకు చెక్కులు, దివ్యాంగుడు దేవరాజుకు స్కూటీ పంపిణీ చేశారు. డీఆర్డీవో మచ్చ గీత, ఏఎంసీ చైర్మన్ ఎల్లేశ్యాదవ్, పీఆర్ ఈఈ సుదర్శన్రెడ్డి, ఎంపీడీవో జయశీల, డీఈ విష్ణువర్ధన్, ఏవో ప్రణిత, వీసీ వినోద్రెడ్డి, మండల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమణారెడ్డి, మహేశ్రెడ్డి, సర్పంచులు నల్ల మోహన్, ఏనుగుల కనకయ్య, పెంచాల సౌమ్య, జంగం అంజయ్య, సుద్దాల మధు, కౌడగాని వెంకటేశ్ పాల్గొన్నారు. -
కాలువ పనులకు త్వరలో నిధులు
● డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇల్లంతకుంట(మానకొండూర్): కాళేశ్వరం ప్రాజెక్టు 11/6 అసంపూర్తి కాలువ పనులకు రూ.3.19 కోట్లు త్వరలో మంజూరు చేస్తానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. రైతుల నిరవధిక నిరాహార దీక్ష నేపథ్యంలో మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి బుధవారం డిప్యూటీ సీఎంను కలిసి సమస్యను వివరించారు. పార్టీ మండలాధ్యక్షుడు కె.భాస్కర్రెడ్డి, నాయకులు ఐరెడ్డి మహేందర్రెడ్డి, గుడిసె ఐలయ్య, పాశం రాజేందర్రెడ్డి, నవీన్రెడ్డి, వెంకట్రెడ్డి, పసుల వెంకటి, రైతులు గాదె మధు, కమటం రవి, అశోక్యాదవ్ పాల్గొన్నారు. 17న రైల్వే భూ నిర్వాసితుల సమావేశం వేములవాడ: రైల్వేలైన్ భూనిర్వాసితులతో ఈనెల 17న సమావేశం నిర్వహిస్తున్నట్లు వేములవాడ అర్బన్ తహసీల్దార్ జయంత్కుమార్ బుధవారం తెలిపారు. 12న నిర్వహించాల్సిన సమావేశం ఉన్నతాధికారుల సూచనతో 17కు వాయిదా వేసినట్లు తెలిపారు. వేములవాడ పట్టణంతోపాటు నాంపల్లి, శాత్రాజుపల్లి ప్రాంతాలకు చెందిన నిర్వాసితులు గమనించి నోటీసులు అందుకున్న వారు అభ్యంతరాలుంటే సమావేశంలో తెలపాలన్నారు. నీరా కేఫ్ నిర్వహణకు టెండర్లు ఆహ్వానంసిరిసిల్లటౌన్: హైదరాబాద్లో నీరా కేఫ్ నిర్వహణకు టెండర్లు ఆహ్వానిస్తునట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సౌజన్య బుధవారం ప్రకటనలో తెలిపారు. గీతా కార్మిక సంఘాల నుంచి టెండర్ ఆహ్వానిస్తునట్లు పేర్కొన్నారు. వివరాలకు www.tgtcfc.com వెబ్సైట్ లేదా సమీపంలోని ఎకై ్సజ్ డిపార్టుమెంటులో సంప్రదించాలని సూచించారు. -
దాహం..దాహం
● సిరిసిల్ల బస్టాండులో వసతుల లేమి ● ప్రయాణికులకు తప్పని తాగునీటి తిప్పలు ● ప్లాట్ఫాంలపై నిల్చోలేని స్థితి ● ఇష్టానుసారంగా ప్రైవేటు వాహనాల పార్కింగ్ సిరిసిల్ల పాత బస్టాండ్లో నిరుపయోగంగా ఉన్న తాగునీటి మిషన్సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్లో ఎటూ చూసిన సమస్యలే. తాగేందుకు నీరు దొరకదు. నిల్చునేందుకు నీడ లేదు. దుకాణదారులు దౌర్జన్యంగా ప్లాట్ఫామ్స్ను ఆక్రమిస్తుండడంతో అక్కడ సైతం ప్రయాణికులు నిల్చునే పరిస్థితులు లేవు. ఇక వాహనదారులు బస్టాండ్ ప్రాంగణంలో దుకాణాల ఎదుటే ఇష్టారీతిగా నిలుపుతున్నారు. దీంతో ప్లాట్ఫామ్స్పై నిల్చోలేక.. కిందికి వద్దామంటే వాహనాలు నిలిపి ఉండడంతో బస్సులు ఎక్కేందుకు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్లో సమస్యలపై ఫోకస్. ● ఇరవై వేలకు పైగా రాకపోకలు సిరిసిల్ల జిల్లా కేంద్రంగా ఏర్పడి పుష్కరకాలమైంది. కలెక్టర్, ఎస్పీలతోపాటు అన్నిశాఖల జిల్లా అధికారులు స్థానికంగా ఉండడంతో ప్రభుత్వ, ప్రైవేటు పనుల కోసం జిల్లా కేంద్రానికి వచ్చిపోయే ప్రయాణికుల సంఖ్య నిత్యం ఇరవైవేలకు మించుతుంది. జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్టాండులో వసతులు లేవు. ● చెట్ల నీడే దిక్కు పాతబస్టాండ్లో ఓపెన్ ప్లాట్ఫామ్స్ కావడంతో నీడ లేక ప్రయాణికులు ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ బస్సుల కోసం నిరీక్షిస్తుంటారు. ప్రయాణికులు కూర్చునేందుక షెల్టర్ సరిపోవడం లేదు. పదుల సంఖ్యలోనే కుర్చీ లు ఉన్నాయి. హైదరాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, ముస్తాబాద్, గంభీరావుపేట తదితర ప్రాంతాలకు వెళ్లే ప్లాట్ఫామ్స్ స్థానంలో షెడ్లు నిర్మిస్తామన్న అధికారుల హామీ అమలుకు నోచుకోవడం లేదు. ఆయా ప్లాట్ఫామ్స్ వద్ద ఉండే వ్యాపారులు తమ సామగ్రిని దుకాణాల బయట పెడుతుండడంతో ప్రయాణికులకు నిల్చునే అవకాశం కూడా ఉండడం లేదు. అంతేకాకుండా ఇక్కడ వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలం లేక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఈ ప్లాట్ఫామ్స్ వద్ద మున్సిపల్ అధికారులు గ్రీన్నెట్స్ వేయించే వారు. ఇప్పుడు ఎవరూ పట్టించుకోకపోవడంతో ఎండలో ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్యూరిఫైడ్ తాగునీటి కేంద్రం మూతబడింది. మండుటెండలో నిల్చున్న ఈ ప్రాంతం సిరిసిల్లలోని పాతబస్టాండ్. నిత్యం వేలాది సంఖ్యలో ప్రయాణికులు ఇక్కడి నుంచి ప్రయాణాలు చేస్తుంటారు. కొత్తబస్టాండు దూరంగా ఉండడంతో చాలా మంది పాతబస్డాండు నుంచే రాకపోకలు సాగిస్తుంటారు. బస్టాండు ప్రాంగణం చిన్నదిగా ఉండటంతో కొద్దిమందికి మాత్రమే నీడ లభిస్తుంది. అక్కరకురాని కొత్తబస్టాండ్ పట్టణ శివారులోని ఆర్టీసీ డిపో వద్ద నిర్మించిన కొత్తబస్టాండు ప్రజలకు అక్కరకు రాకుండా పోతుంది. శివారులో ఉండడంతో అంతదూరం వెళ్లలేక అందరూ పాతబస్టాండ్కు వస్తండడంతో ఇక్కడ రద్దీ పెరుగుతుంది. -
డిజిటల్ విధానంలో జనగణన
సిరిసిల్ల: జిల్లాలో జనగణన–2027ను డిజిటల్ విధానంలో పూర్తి చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ అఽఽధికారులను ఆదేశించారు. జనగణన–2027పై సెన్సస్ ఫర్ వెల్ఫేర్ పేరిట ఈనెల 11 నుంచి 13 వరకు కలెక్టరేట్లో చార్జ్ ఆఫీసర్లు, అదనపు చార్జ్ ఆఫీసర్లకు శిక్షణను బుధవారం ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ సెన్సస్ చట్టం 1948 ప్రకారం ప్రభుత్వం జనగణన చేపడుతుందన్నారు. చార్జ్ ఆఫీసర్లుగా మున్సిపాలిటీలో కమిషనర్లు, మండలాల్లో తహసీల్దార్లు, అదనపు చార్జ్ ఆఫీసర్లుగా ఎంపీడీవోలు, మున్సిపాలిటీల్లో టౌన్ప్లానింగ్ అధికారులు వ్యవహరిస్తారని తెలిపారు. ఎన్యూమరేటర్, సూపర్వైజర్లుగా ఉపాధ్యాయులను నియమించాలని సూచించారు. ఐదుగురు ఎన్యూమరేటర్లకు ఒక సూపర్ వైజర్, ప్రతీ మండలానికి ఒక టెక్నికల్ సహాయకులు ఉండాలన్నారు. ఈ విధానంలో ప్రజలే తమ వివరాలు పోర్టల్ ద్వారా నమోదు చేసుకునే సదుపాయం ఉందన్నారు. మొదటి దశలో మే 11 నుంచి జూన్ 9 వరకు గృహాల గణన చేపడతారని, రెండోదశ ఫిబ్రవరి–2027లో వ్యక్తుల వారీగా సమాచారం సేకరిస్తారని తెలిపారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, జిల్లా ప్రణాళిక అధికారి శ్రీనివాసాచారి, జెడ్పీ సీఈవో వినోద్కుమార్, జిల్లా పంచాయతీ అధికారి షర్ఫొద్దీన్, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించాలి
సిరిసిల్లటౌన్: సెస్ పరిధిలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు వెంటనే ప్రమోషన్ ఇవ్వాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.ఈశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఎన్.స్వామి డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం నుంచి 72 గంటలు విధులు బహిష్కరించి, నిరవధిక దీక్ష చేపట్టారు. వారు మాట్లాడుతూ స్వయం ప్రతిపత్తి గల సెస్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులకు ప్రమోషన్ ఇవ్వాలని కోరారు. విధి నిర్వహణలో మరణించిన హెల్పర్ల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. మానిటరీ బెనిఫిట్స్, లీవ్ ఎన్క్యాష్మెంట్ అమలు చేయాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు కర్నాల అనిల్కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి నర్రా శ్రీనివాస్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర మల్లేశం, కోశాధికారి రాంబాబు, అనిల్కుమార్, శ్రీనివాస్, సత్యం, కిషన్, సతీశ్, మల్లేశ్, వెంకటి, ఎల్లయ్య, శివప్రసాద్, అంజిరెడ్డి, ప్రశాంత్, సంజీవరెడ్డి, శ్రీహరి, పూల్సింగ్ పాల్గొన్నారు. -
టెన్షన్ పడొద్దు
● ఐదు నిమిషాల వరకు అనుమతి ● వెబ్సైట్ నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్కు అవకాశం ● జిల్లా విద్యాధికారి జగన్మోహన్రెడ్డి సిరిసిల్ల ఎడ్యుకేషన్: పదో తరగతి విద్యార్థులు పరీక్షలపై టెన్షన్ పడొద్దని.. ఆందోళన చెందకుండా పరీక్షలు రాయాలని జిల్లా విద్యాధికారి జగన్మోహన్రెడ్డి సూచించారు. పరీక్ష కేంద్రాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించామని.. తాగునీరు.. నిరంతర విద్యుత్ సరఫరా.. మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. పదో తరగతి పరీక్షలు ఈనెల 14 నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణ తదితర వివరాలపై ‘సాక్షి’తో మాట్లాడారు. ఆయన మాటల్లోనే.. 34 కేంద్రాలు.. 7,317 మంది విద్యార్థులు జిల్లాలో 7,317 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. వీరి కోసం 34 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశాం. పరీక్షల నిర్వహణకు 530 మంది ఇన్విజిలేటర్లు, పర్యవేక్షణ కోసం 2 ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలు, 34 సిట్టింగ్ స్క్వాడ్స్ను ఏర్పాటు చేశాం. పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయి. ఐదు నిమిషాల వరకు అనుమతి పరీక్ష ప్రారంభమైన ఐదు నిమిషాల వరకు విద్యార్థులను సెంటర్లోకి అనుమతిస్తారు. అంతకుమించి ఆలస్యమైతే లోనికి అనుమతించరు. ప్రైవేట్ పాఠశాలలు ట్యూషన్ ఫీజుతో హాల్టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందికి గురిచేస్తాయని ఉద్దేశంతో ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించాం. విద్యార్థులు బీఎస్ఈ తెలంగాణ అధికారిక వెబ్సైట్లో హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం కల్పించాం. నిఘా నేత్రాల మధ్య ప్రశ్నాపత్రాలు పరీక్షా ప్రశ్నాపత్రాలు ముందుగా బహిర్గతం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. పరీక్షా కేంద్రాల్లో చీఫ్ సూపరింటెండెంట్ సమక్షంలో సీసీ కెమెరాల నిఘాలో నిర్ణీత సమయానికి ప్రశ్నాపత్రాలను ఓపెన్ చేస్తాం. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నాం. విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దు. ఎలాంటి బెరుకు లేకుండా పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలి. -
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా సునీల్రావు, వికాస్రావు
కరీంనగర్: బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులను నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజన్నసిరిసిల్ల నుంచి చెన్నమనేని వికాస్రావుకు అవకాశం దక్కింది. వికాస్రావు గత అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బరిలో నిలిచారు. వైద్యుడిగా నియోజకవర్గ ప్రజలకు మెడికల్ క్యాంపుల ద్వారా సేవలందిస్తున్నారు. కరీంనగర్ జిల్లా నుంచి యాదగిరి సునీల్రావుకు అవకాశం దక్కింది. సునీల్రావు గతంలో మేయర్గా, ప్రస్తుతం డిప్యూటీ మేయర్గా సేవలందిస్తున్నారు. సునీల్రావు మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావుతోపాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. అన్నపూర్ణమ్మ ఫౌండేషన్కు అవార్డు ముస్తాబాద్(సిరిసిల్ల): మండలంలోని గూడెం అన్నపూర్ణమ్మ ఫౌండేషన్ సభ్యులకు హెలెన్ కెల్లర్ సీ్త్రశక్తి అవార్డును హైదరాబాద్ రవీంద్రభారతిలో బుధవారం ప్రదానం చేశారు. గత జనవరి 1 నుంచి గూడెంలో యాభై మందికి పైగా వృద్ధులకు నిత్యం రెండు పూటల భోజనం అందిస్తున్నారు. అన్నపూర్ణమ్మ ఫౌండేషన్ను స్థాపించి మూడు నెలలుగా వారి బాగోగులు చూసుకోవడం గొప్ప విషయమని ప్రశంసించారు. ఫౌండేషన్ సభ్యులు కుర్ర సావిత్రి, సత్తవ్వ, బొప్ప విజయలక్ష్మి, పద్మలత, విజయ, శోభారాణిని దివ్యాంగ మహిళా సాధికారత అధ్యక్షురాలు కోల రాజ్యలక్ష్మి అభినందించారు. -
నైపుణ్యాలు పెంచుకోవాలి
● ఎస్పీ మహేశ్ బీ గీతే ● ప్రతిభ చూపిన సిబ్బందికి ప్రశంసపత్రాలు సిరిసిల్ల క్రైం: పోలీసులు విధి నిర్వహణలో భాగంగా నైపుణ్యాలు పెంచుకోవాలని ఎస్పీ మహేశ్ బీ గీతే సూచించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో సివిల్ పోలీసులతోపాటు ఆర్ముడ్ రిజర్వ్ విభాగం సైతం కీలకపాత్ర పోషిస్తుందని కొనియాడారు. సాయుధ దళాల వార్షిక పునశ్చరణ(మొబిలైజేషన్) ముగింపు కార్యక్రమంలో భాగంగా బుధవారం పరేడ్ మైదానంలో ఎస్పీ గౌరవ వందనం స్వీకరించి మాట్లాడారు. పోలీస్ ఉద్యోగం బాధ్యతాయుతమైందని, మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు తమ వృత్తి నైపుణ్యాలను ఎప్పటికప్పుడు పెంపొందించుకోవాలని సూచించారు. ఇందుకు మొబిలైజేషన్ శిక్షణ ఉపయోగపడుతుందన్నారు. జిల్లాలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందికి సర్దాపూర్లోని బెటాలియన్లోని ఫైరింగ్ రేంజ్లో ఇచ్చే శిక్షణను పర్యవేక్షించారు. ఫైరింగ్లో బి.శ్రీనివాస్(ప్రథమ), జి.వెంకటేశ్(ద్వితీయ), ఎ.ప్రియాంక(తృతీయ), రాత పరీక్షలో మనోజ్కుమార్(ప్రథమ), బి.శ్రీనివాస్(ద్వితీయ), డి.ప్రియాంక(తృతీయ) స్థానాల్లో నిలిచారు. అదనపు ఎస్పీ చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు. -
మెట్పల్లిలో 6 ఇళ్లలో చోరీ
శంకరపట్నం: శంకరపట్నం మండలం మెట్పల్లి గ్రామంలో 6 ఇళ్లలో చోరీ జరిగింది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. మెట్పల్లి గ్రామానికి చెందిన సూరం ప్రతాప్, కొండపాక దేవయ్య, ఓదెల సత్యనారాయణ, గుర్రం శ్రీహరి, తిరుపతితో పాటు మరొకరు ఇంటికి తాళం వేసి బంధువుల ఇళ్లకు వెళ్లారు. మంగళవారం అర్థరాత్రి వారి నివాసాల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. బుధవారం చుట్టుపక్కల వారు తలుపులు తెరిచి ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుజూరాబాద్ ఏసీపీ మాధవి, సీఐ వెంకట్, ఎస్సై శేఖర్రెడ్డి దొంగతనం జరిగిన ఇళ్లను పరిశీలించారు. క్లూస్టీంను రప్పించి వేలుముద్రలు సేకరించారు. నాలుగు ఇళ్లలో రూ.1.75 లక్షల విలువైన బంగారం, వెండి, నగదు చోరీకి గురైందని బాధితులు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
కనీస వేతనాలు చెల్లించాలి
జ్యోతినగర్(రామగుండం): ప్రభుత్వరంగ సంస్థల్లోని కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు చెల్లించడంలో ఆయా యాజమాన్యాలు విఫలమయ్యాయని, ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఎన్టీపీసీ ఎన్బీసీ సభ్యుడు, ఐఎన్టీయూసీ జాతీయ సీనియర్ కార్యదర్శి బాబర్ సలీంపాషా డిమాండ్ చేశారు. న్యూఢిల్లీలోని క్రౌన్ ప్లాజాలో ఐఎన్టీయూసీ–ఏషియా పసిఫిక్, ఇండస్ట్రియల్ గ్లోబల్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన రెండు రోజుల సదస్సులో ఆయన మాట్లాడారు. కాంట్రాక్టు కార్మికులు శ్రమ దోపిడికి గురువుతున్నారని అన్నారు. వారి స్థితిగతులు, సామాజిక భద్రత, పనిపరిస్థితులు, గౌరవప్రదమైన వేతనాలు చెల్లించే విషయాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వాలు ట్రేడ్ యూనియన్లతో చర్చలు జరపడానికి, కార్మికుల సమస్యలను వినడానికి ఆసక్తి చూపడం లేదని ధ్వజమెత్తారు. కార్మికుల హక్కుల సాధనకు కార్మిక సంఘాలు ఐక్యతను చాటాలని ఆయన కోరారు. ఐఎన్టీయూసీ జాతీయ సీనియర్ కార్యదర్శి బాబర్ సలీంపాషా -
ఆకట్టుకుంటున్న కళా ప్రదర్శన
కరీంనగర్ కల్చరల్: నగరంలోని శ్రీ రాజరాజేశ్వర కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కళాసిల్క్ ప్రదర్శన ఆకట్టుకుంటోంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు తయారు చేసిన సిల్క్, చేనేత వస్త్రాలు, హస్తకళా ఉత్పత్తులు ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. జిల్లా ప్రజలకు నాణ్యమైన చేనేత ఉత్పత్తులను అందించడంతో పాటు చేనేత కార్మికులకు ఆర్థికంగా చేయూతనివ్వాలనే ఉద్దేశంతో కళాసిల్క్ ప్రదర్శన ఏర్పాటు చేశామని నిర్వాహకుడు సంజయ్ జైన్ తెలిపారు. ఈ ప్రదర్శనలో తెలంగాణకు చెందిన గద్వాల్, నారాయణపేట, పోచంపల్లి, ధర్మవరం, వెంకటగిరి, మంగళగిరి, కలంకారి, ఉప్పాడ ప్రాంతాల చేనేత వస్త్రాలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. అసోం మూగా, ఎరి సిల్క్, బిహార్లోని బాగల్పూర్ సిల్క్, ఛత్తీస్గఢ్కు చెందిన ట్రైబల్ వర్క్స్, కోసా సిల్క్, గుజరాత్కు చెందిన బంధనీ, కచ్ ఎంబ్రాయిడరీ డ్రెస్ మెటీరియల్స్ వంటి అనేక రాష్ట్రాల చేనేత ఉత్పత్తులు ఆకట్టుకుంటున్నాయి. -
గొర్రెపల్లి చాకలికుంటలో మొసలి
మల్లాపూర్: మల్లాపూర్ మండలం గొర్రెపల్లి చాకలికుంటలో బుధవారం మొసలి కనిపించింది. రైతులు పంట పొలాలకు నీరు పెట్టేందుకు వెళ్లగా కుంటలో మొసలి కనిపించింది. వారు గ్రామస్తులకు తెలపడంతో సర్పంచ్ ఏలేటి వెంకట్రెడ్డి అటవీశాఖ అధికారులకు సమాచారం చేరవేశారు. మత్స్యకారులు, రైతుల రక్షణకు చర్యలు చేపట్టాలని కోరారు. దుబాయిలో కోరుట్ల యువకుడి మృతికోరుట్ల: పట్టణంలోని మోమిన్పురాకు చెందిన అబ్దుల్ రహమాన్ (21) దుబాయ్లో అనారోగ్యంతో మృతి చెందాడు. రహమాన్ ఏడాది క్రితం ఉపాఽధి కోసం దుబాయ్ వెళ్లాడు. ఊపిరితిత్తుల్లో సమస్య తలెత్తి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. పరిస్థితి విషమించి ఈనెల 7న మృతి చెందినట్లు రహమాన్ పనిచేస్తున్న కంపెనీ వారు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అక్కడే అంత్యక్రియలు నిర్వహించినట్లు కంపెనీ వారు తెలిపారని తల్లి షపాత్బేగం బోరున విలపిస్తూ తెలిపారు. నిరుపేద రహమాన్ కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. రైలు కిందపడి వ్యక్తి..గోదావరిఖని: ప్రమాదవశాత్తు బొగ్గు రైలు కిందపడి షేక్ మహబూబ్(45) అనే కూలీ బుధవారం మృతి చెందాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖణి బాపూజీనగర్లో నివాసముంటున్న మహబూబ్ నిద్రలోంచి లేచి వెళ్లిన క్రమంలో ప్రమాదవశాత్తు రైలుకింద పడి మృతి చెందినట్లు వన్టౌన్ పోలీసులు తెలిపారు. 22ఏళ్ల క్రితం పెళ్లికాగా కూతురుతో కలిసి 15ఏళ్లుగా జీవిస్తున్నాడు. నిద్రమత్తులో మూత్రవిసర్జనకు వెళ్లి మృతి చెందినట్లు మృతుడి తల్లి షేక్ ఫాతిమా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకున్నట్లు ఎస్సై మనోహర్ తెలిపారు. చికిత్స పొందుతూ..కరీంనగర్రూరల్: తీగలగుట్టపల్లి వద్ద గత నెలలో రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనగా తీవ్రంగా గాయపడిన ఓ వాహనదారుడు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో బుధవారం మృతిచెందాడు. కరీంనగర్రూరల్ సీఐ నిరంజన్రెడ్డి కథనం మేరకు తీగలగుట్టపల్లికి చెందిన మిట్టపల్లి వెంకటస్వామి(75) ద్విచక్రవాహనంపై గతనెల 26న ఉదయం 11.30గంటలకు కరీంనగర్కు వస్తుండగా చొప్పదండి మండలం రాగంపేటకు చెందిన సింగసాని రాజ్కుమార్ బైక్తో వెనుకనుంచి వచ్చి బలంగా ఢీకొట్టాడు. కిందపడిన వెంకటస్వామి తలతోపాటు ఇతర చోట్ల తీవ్రగాయలు కావడంతో స్థానికులు కరీంనగర్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతిచెందాడు. మృతుడి కుమారుడు ప్రశాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
పదిరలో కుల బహిష్కరణ
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామంలో ఓ వృద్ధుడిని కులపెద్దలు కులం నుంచి బహిష్కరించారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో కులపెద్దలతోపాటు తన కోడలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై రాహుల్రెడ్డి తెలిపిన వివరాలు. ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామానికి చెందిన కంచర్ల దేవయ్యకు ఇద్దరు కుమారులు. పెద్దకొడుకు శ్రీనివాస్ ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లాడు. పెద్ద కోడలు కంచర్ల లత వృద్ధుడికి భోజనం పెట్టకపోవడంతోపాటు ఇంటి ముందున్న రేకులషెడ్డును తొలగించాలనే విషయంలో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయంపై లత కులస్తులకు ఫిర్యాదు చేసింది. కులపెద్దలైన కంచర్ల రాజు, కంచర్ల శంకర్, కంచర్ల శరబిందు, కంచర్ల మల్లేశం, కంచర్ల నర్సయ్యలు లతకు మద్దతుగా నిలిచారు. వృద్ధుడు దేవయ్యపై దాడిచేయడంతోపాటు అతను ఉంటున్న రేకులషెడ్డును తొలగించారు. ఈక్రమంలోనే దేవయ్యను కులబహిష్కరణకు గురిచేశారు. దేవయ్యతో మాట్లాడిన వారిని కూడ కులబహిష్కరణ చేస్తామని హెచ్చరించారు. దీంతో ఆ వృద్ధుడు పోలీసులను ఆశ్రయించగా.. పెద్దమనుషులతోపాటు కోడలు కంచర్ల లతపై బుధవారం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. కోడలు, మామ మధ్య వివాదం వృద్ధుడి రేకులషెడ్డు తొలగింపు ఐదుగురిపై కేసు -
మల్లాపూర్లో మర్డర్?
● ఇటీవల దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన యువకుడు ● కెనాల్లో అనుమానాస్పద స్థితిలో మృతి తిమ్మాపూర్: మండలం మన్నెంపల్లి శివారులో ఓ యువకుడు బుధవారం అనుమానాస్పద సి ్థ తిలో మృతిచెందడం కలకలం రేపింది. మల్లాపూర్కు చెందిన బనక చందు(30) పొట్టకూటికోసం కొన్నేళ్లుగా దుబాయ్ వెళ్లొస్తున్నాడు. 20 రోజుల క్రితం ఇంటికి తిరిగి వచ్చి న ఆయన స్వగ్రామంలోనే స్థిరపడతానని చుట్టుపక్కలవారితో అన్నట్లు సమాచారం. అయితే చందుకు ఓ ఫోన్కాల్ వచ్చిన తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లి, తిరిగి రాలేదు. కొంత సమయం తర్వాత మల్లాపూర్–మన్నెంపల్లి శివారులోని డి–4 కెనాల్ వద్ద చందు శవం దొరికింది. శరీరంపై గాయాలు చందు శరీరంపై గాయాలు ఉండడంతో కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరో కొట్టి చంపి కెనాల్లో పడేసి ఉంటారంటూ తల్లిదండ్రులు విలపిస్తున్నారు. వారి ఫిర్యాదుతోకేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. సంఘటన స్థలాన్ని తిమ్మాపూర్ సీఐ సదన్కుమార్ పరిశీలించారు. ఉరేసుకుని ఆత్మహత్యఇల్లందకుంట: మండలంలోని గడ్డివానిపల్లికి చెందిన బోయిని వెంకటేశ్(26) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై క్రాంతికుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. వెంకటేశ్కు రెండేళ్ల క్రితం వివాహం కాగా.. భార్య లక్ష్మి, రెండు నెలల కొడుకు ఉన్నారు. వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. మానసిక వేదనతో ఇంట్లోని రేకులషెడ్డుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. పోక్సో కేసులో 13ఏళ్ల జైలు పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలంలోని ఓ గ్రా మానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన గుండు నరేశ్ అనే యువకుడికి 13 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ ఫాస్ట్ట్రాక్, పోక్సో కోర్టు జడ్జి స్వప్నరాణి బుధవారం తీర్పు ఇచ్చారని సీఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. ఈ విషయమై బసంత్నగర్ పోలీస్స్టేషన్లో 2017 జూన్ 29న కేసు నమోదు కాగా అప్పటి ఏసీపీ సింధూశర్మ విచారణ జరిపి నిందితుడు నరేశ్ను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. న్యాయస్థానంలో ఇరువర్గాల వాదనలు పూర్తయ్యాక నేరం రుజువు కావడంతో నరేశ్కు శిక్ష విధించినట్లు సీఐ వివరించారు. ఇందుకు సహకరించిన పోలీసు అధికారులు, సిబ్బందిని రామగుండం పోలీస్ కమిషనర్ అభినందించారు. మోసానికి పాల్పడ్డ ఇద్దరి రిమాండ్వేములవాడరూరల్: రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నూకలమర్రికి చెందిన గుగులోతు రవిని అల్మేరియాకు పంపిస్తానని మోసం చేసిన ఇద్దరు ఏజెంట్లను రిమాండ్కు తరలించినట్లు వేములవాడరూరల్ ఎస్సై వెంకట్రాజం బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు. మండలంలోని నూకలమర్రికి చెందిన రవిని అల్మేరియాకు పంపిస్తానని జగిత్యాల జిల్లా శ్రీకృష్ణ ట్రావెల్స్కు చెందిన దండుగుల మల్లేశం, పల్లపు నాంపెల్లి రూ.3లక్షలు తీసుకున్నారు. అల్మేనియాకు పంపించగా.. ముందుగా చెప్పిన పని కాకుండా వేరే పనిలో పెట్టారు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన రవి స్వగ్రామానికి తిరిగి వచ్చి ఫిర్యాదు చేశాడు. ఈమేరకు కేసు ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
సీపీఎస్ రద్దయ్యే వరకూ పోరాటం
సిరిసిల్ల: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్) విధానంతో ఉద్యోగులకు సామాజిక భద్రత కరువైందని, సీపీఎస్ రద్దయ్యే వరకు పోరాటం ఆగదని టీఎస్సీపీఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు జి.స్థితప్రజ్ఞ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఐఎంఏ భవన్లో మంగళవారం జరిగిన సీపీఎస్ ఉద్యమ సన్నాహక సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. సీపీఎస్ ఉద్యోగులంతా ఏకం కావాలని, సభ్యత్వ నమోదును ప్రారంభించామన్నారు. సీపీఎస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ మాట్లాడుతూ, సీపీఎస్ ఉద్యోగులకు ఉద్యోగ విరమణ తర్వాత సర్వీస్ పెన్షన్ లేకపోవడం, వైద్య సదుపాయం కోసం ఈహెచ్ఎస్(ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్) వర్తించకపోవడం అత్యంత విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా జిల్లా అధ్యక్షుడిగా సంజీవ్, ప్రధాన కార్యదర్శిగా రవీందర్, కోశాధికారి లక్ష్మీనారాయణను ఎన్నుకున్నారు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు డా.బాబు, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు నిసర్ ఆహ్మద్, సురేందర్రెడ్డి, రమేశ్, ఆర్వీవీ స్వామి తదితరులు పాల్గొన్నారు. -
వస్త్రోత్పత్తికి దూరం
యువ‘తరం’..సిరిసిల్ల: సిరిసిల్లలో యువతకు పవర్లూమ్స్పై శిక్షణ ఇచ్చేందుకు 2005లో పవర్లూమ్ శిక్షణ కేంద్రాన్ని బద్దెనపల్లి టెక్స్టైల్ పార్క్లో ప్రారంభించారు. పదో తరగతి చదువుకున్న యువకులకు నెలనెలా రూ.1,000 ఉపకార వేతనం ఇస్తూ ఆరునెలల పాటు శిక్షణ ఇచ్చేవారు. శిక్షణ పొందిన యువకులు స్థానికంగా టెక్స్టైల్ పార్క్లోని ఆధునిక ర్యాపియర్ లూమ్స్, సిరిసిల్లలోని పవర్లూమ్స్ నడిపేందుకు అవకాశం ఉంది. ఇలా నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి నమ్మకమైన ఉపాధి కల్పించాలని ప్రభుత్వ లక్ష్యం. ఏడేళ్ల పాటు ఓ వెయ్యి మందికి శిక్షణ ఇచ్చారు. 2015 నుంచి టెక్స్టైల్ పార్క్లోని పవర్లూమ్ శిక్షణ కేంద్రం మూతపడడంతో యువతకు శిక్షణ లేక, సాంచాలు నడిపే నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత ఏర్పడింది. ఉపకార వేతనం అసలు సమస్య ప్రభుత్వం ఇచ్చే రూ.1,000 ఖర్చులకు సరిపోక సిరిసిల్ల నుంచి టెక్స్టైల్ పార్క్ వరకు వెళ్లి రావడం ఇబ్బందిగా మారడంతో శిక్షణ పొందేందుకు అభ్యర్థులు ముందు రాలేదు. దీంతో శిక్షణ కేంద్రం మూతపడింది. చేనేత, జౌళిశాఖ అధికారులు 2017లో రూ.5వేల ఉపకార వేతనం శిక్షణ పొందే నిరుద్యోగులకు ఇవ్వాలని ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి పంపించారు. కానీ, ప్రభుత్వం ఆ ప్రతిపాదనలను బుట్టదాఖలు చేయడంతో పవర్లూమ్స్ శిక్షణ కేంద్రం మూతపడింది. ఇక్కడ శిక్షణ ఇచ్చేందుకు నియమితులైన సిబ్బందికి కూర్చోబెట్టి జీతాలు ఇస్తున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా రూ.8వేల ఉపకార వేతనం ఇస్తూ ఆరునెలల పాటు శిక్షణ ఇస్తే వస్త్రపరిశ్రమకు బాసటగా ఉండేది. పదేళ్లుగా శిక్షణ లేక, కొత్తతరం ఈ పనుల్లోకి రాక స్థానికంగా నేత కార్మికుల సమస్య ఎదురవుతోంది. ఇప్పటికై నా జౌళిశాఖ ఉన్నతాధికారులు పవర్లూమ్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తే యువకుల ఉపాధికి ఊతమిచ్చినట్లు అవుతుంది. శిక్షణ ఇస్తేనే ఉపాధి రక్షణ సిరిసిల్లలో కాలం చెల్లిన మగ్గాలను నడుపుతూ, మార్కెట్లో డిమాండ్ లేని పాలిస్టర్ బట్టను ఉత్పత్తి చేస్తూ వస్త్రపరిశ్రమ తరచూ సంక్షోభానికి గురవుతుంది. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన మహిళా శక్తి చీరలు నాణ్యతగా ఉండడంతో బహిరంగ మార్కెట్లోనూ డిమాండ్ ఉంది. సాంచాలు నడిపే కార్మికుల కొరతను తీర్చేందుకు ప్రభుత్వం పవర్లూమ్ శిక్షణ కేంద్రాన్ని మళ్లీ ప్రారంభించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉత్తరాది కార్మికులతో ఇప్పుడు వస్త్రపరిశ్రమ మనుగడ సాగిస్తున్నా.. భవిష్యత్లో ఇబ్బందులు తప్పవు. స్థానిక యువతకు శిక్షణ ఇస్తే.. ఉపాధికి రక్షణ లభిస్తుంది. వస్త్రోత్పత్తికి మెరుగైన కూలి ప్రభుత్వమే నిర్ణయించడం, అదనంగా 10 శాతం యారన్ సబ్సిడీ ఇవ్వడం, పొదుపు పథకాలు అమలు చేయడం వంటి ప్రోత్సాహకాలతో యువత ఉపాధికి మార్గం ఏర్పడుతుంది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ‘సిరిసిల్ల నెహ్రూనగర్కు చెందిన వస్త్రోత్పత్తిదారుడికి 20 జోడీల సాంచాలు ఉన్నాయి. కానీ, అతనికి నేత కార్మికులు లేక బిహార్కు చెందిన లేబర్లను తెప్పించి సాంచాలు నడుపుతున్నాడు. ఒక్కో బిహార్ లేబర్ నెలకు రూ.25వేలు సంపాదిస్తున్నారు. స్థానికంగా నేత కార్మికులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో పొరుగు రాష్ట్రాల కార్మికులపై ఆధారపడాల్సి వస్తుంది. ఏదైనా పనిపై వాళ్లు వెళ్లిపోతే.. సాంచాలు బందు పెట్టుకోవాల్సిందే. ఎక్కడ వెతికినా.. బట్టనడిపేందుకు కార్మికులు దొరకని పరిస్థితి సిరిసిల్లలో ఉంది. నేటి తరం యువకులు ఎవరూ సాంచాలు నడుపడం లేదు. ఇతర పనుల్లో అరకొర వేతనాలతో వెళ్లదీస్తున్నారు’. -
‘పది’ పరీక్షలకు ఏర్పాట్లు
‘ఇది జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. దీనిని ప్రస్తుతం పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సెంటర్గా కేటాయించారు. ఈ పాఠశాలకు రావడానికి సరైన రవాణా సౌకర్యం లేకపోగా గదులు కూడా వెలుతురు లేకుండా ఇరుకుగా ఉంటాయి. ఈ పాఠశాలలో సౌకర్యాలు సరిగా లేవని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘం నాయకులు విమర్శిస్తున్నా.’సిరిసిల్ల ఎడ్యుకేషన్: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులను ఈనెల 14 నుంచి వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను పటిష్టంగా చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ వెల్లడించింది. ప్రతి పరీక్ష కేంద్రం సీఎస్ గదిలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రశ్న పత్రాలు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. అలాగే విద్యార్థులకు అన్నీ సౌకర్యాలు ఉండేలా పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసినట్లు వివరించారు. ప్రైవేట్ స్కూళ్లలో చదివే విద్యార్థులు హాల్ టికెట్ల విషయంలో ఇబ్బందులు పడకుండా అధికారిక, పలు వెబ్సైట్లలో నేరుగా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించినట్లు జిల్లా విద్యాధికారి జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుల సంతకం లేకున్నా ఆన్లైన్లో హాల్ టికెట్లను అనుమతించాలని నిబంధనలు ఉన్నట్లు తెలిపారు.పదో తరగతి విద్యార్థులు 7,317 పరీక్ష కేంద్రాలు 34 ఇన్విజిలేటర్లు 530 ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలు 02 సిట్టింగ్ స్క్వాడ్స్ 34 -
ఇదేం చెత్త పని
సిరిసిల్ల మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది సేకరించిన చెత్తను డంపుయార్డుకు తరలించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. వీధి వీధికి, ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరిస్తున్న మున్సిపల్ సిబ్బంది రగుడు శివారులోని డంపుయార్డుకు తరలించడంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో సేకరించిన చెత్త అంతా.. రోడ్డుపై గాలికి జారిపోతోంది. దీంతో ప్రధాన రహదారుల్లో మున్సిపల్ చెత్త వెదజల్లినట్లు పడుతుంది. తిని పడేసిన ప్లేట్లు, ఇతర చెత్త కవర్లు ట్రాక్టర్ వెనక వైపు నుంచి గాలికి కొట్టుకుపోయి పడిపోతున్నాయి. ఇప్పటికై నా మున్సిపల్ అధికారులు ఈ అంశంపై శ్రద్ధ వహించి సేకరించిన చెత్తను జాగ్రత్తగా డంపుయార్డుకు చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – సిరిసిల్ల -
● కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: ప్రతీ ప్రభుత్వ ఆఫీస్లో నిరుపయోగ వస్తువులు, పరికరాలు తొలగించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్లో మంగళవారం స్వచ్ఛత.. పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించగా, కలెక్టర్ హాజరై తనిఖీ చేశారు. ఆయా కార్యాలయాల్లోని వివిధ గదుల్లో ఉన్న ఫర్నిచర్, ఫైల్స్, రికార్డులు, సామగ్రిని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్తో కలిసి పరిశీలించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతీ కార్యాలయం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టరేట్ ఏవో రాంరెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. శిక్షణకు ఏర్పాట్లు పూర్తి జిల్లాలో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికను పకడ్బందీగా అమలు చేస్తున్నామని కలెక్టర్ గరీమ అగ్రవాల్ తెలిపారు. జిల్లాలో ఎన్నికై న సర్పంచులు, మున్సిపల్ చైర్మన్, చైర్పర్సన్, వార్డ్ సభ్యులకు ఈ నెల 12న తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల వద్ద వ్యవసాయ కళాశాలలో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని వివరించారు. ఈ మేరకు పీపీటీ ప్రదర్శన, భోజనం, స్నాక్స్ ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. డీఆర్డీవో మచ్చ గీత, జెడ్పీ సీఈవో వినోద్కుమార్, డీఏవో అఫ్జల్ బేగం, రవాణా శాఖ అధికారి లక్ష్మణ్, పశు వైద్య, సంవర్థక అధికారి రవీందర్రెడ్డి, సీపీవో శ్రీనివాసాచారి, సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, యూత్ అండ్ స్పోర్ట్స్ అధికారి రాందాస్, పంచాయతీ అధికారి షరీఫొద్దీన్, ట్రెజరీ అధికారి నవీన్కుమార్, పరిశ్రమల అధికారి హనుమంతు, వైద్యాధికారి రజిత, మిషన్ భగీరథ అధికారి అన్వర్, సెస్ ఎండీ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. -
మల్యాల పంపుహౌజ్కు చేరిన ‘ఎల్లంపల్లి’ నీరు
చందుర్తి(వేములవాడ): మండలంలోని మల్యాల పంపుహౌజ్కు మంగళవారం ఎల్లంపల్లి ప్రాజెక్టు నీళ్లు చేరుకున్నాయి. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు నందిమేడారం పంప్హౌజ్లో శనివారం రెండో మోటారు ప్రారంభించడంతో ఎట్టకేళకు ఎల్లంపల్లి నీళ్లు చందుర్తి మండలానికి చేరుకున్నాయని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చింతపంటి రామస్వామి తెలిపారు. కాగా చందుర్తి శి వారులో గంగయ్య పొలం వద్ద గ్రావిటి కెనాల్ కాలువలో నీళ్లు అధికంగా రావడంతో కాలు వకు గండి పడే అవకాశం ఉందని వెంటనే టిప్పర్లతో మట్టి పోయించారు. పంప్హౌజ్ నుంచి రుద్రంగికి నీటి పంపింగ్ చేపట్టనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. రైల్వే నిర్వాసితులకు నోటీసులువేములవాడఅర్బన్: రైల్వే భూ సేకరణలో భాగంగా వేములవాడ పరిధిలోని నిర్వాసితులకు మంగళవారం రెవెన్యూ అధికారులు నోటీసులు అందజేశారు. వేములవాడ, నాంపల్లి, శాత్రాజుపల్లి గ్రామాల్లో మొత్తం 317 మంది భూ నిర్వాసితులు ఉండగా 218 మందికి అందజేశామని, మిగతావారికి కూడా అందజేస్తామని ఆర్ఐ శ్రీధర్ తెలిపారు. రైల్వే లైన్ నిర్మాణం కోసం ప్రాథమికంగా వేసిన ప్రకటన అనంతరం రెండో దఫా నోటీసులు అందజేస్తున్నామన్నారు. ఇందులో ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 12న తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించే సభకు హాజరై తెలుపాలని పేర్కొన్నారు. రెవెన్యూ సిబ్బంది సంజీవ్, గణేశ్, మారుతి, రాములు తదితరులు ఉన్నారు. -
12న మినీ జాబ్మేళా
సిరిసిల్ల: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఈ నెల 12న మినీ జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి నీలం రాఘవేందర్ మంగళవారం తెలిపారు. వీవీసీ మోటార్స్లో ఎలక్ట్రికల్ వాహనాల(ఈవీ) సర్వీసు టెక్నిషియన్ ఉద్యోగాలు కల్పించేందుకు కలెక్టరేట్లోని ఎంప్లాయీమెంట్ ఎక్చేంజి ఆఫీస్లో జాబ్మేళా నిర్వహిస్తామని వివరించారు. ఇంటర్మీడియట్, ఒకేషనల్ కోర్సులు పూర్తి చేసిన నిరుద్యోగ యువతీయువకులు జాబ్మేళాకు హాజరు కావాలన్నారు. ఎంపికై న అభ్యర్థులకు రూ.15వేల నుంచి రూ.18వేల వేతనం ఉంటుందన్నారు. 18 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య వయసు గలవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 40 మంది అభ్యర్థులకు ఉద్యోగ అవకాశం ఉందని, ఆసక్తిగల వారు విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్లు, బయోడేటాతో ఇంటర్వ్యూలకు హాజరు కావాలన్నారు. ఇతర వివరాలకు 77299 92061, 97003 02582, 98853 46768 నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అరికట్టాలి సిరిసిల్లటౌన్: తెలంగాణాలోని గురుకుల విద్యాసంస్థల్లో వరుసగా చోటుచేసుకుంటున్న ఫుడ్ పాయిజన్ ఘటనలను ప్రభుత్వం అరికట్టాలని ిబీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవిగౌడ్ కోరారు. మంగళవారం స్థానిక నేతన్న చౌక్లో నిరసన చేపట్టి మాట్లాడారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు గురుకుల బాలికల వసతి గృహంలో కలుషిత ఆహారం కారణంగా సుమారు 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవడం సర్కారు నిర్లక్ష్యానికి నిదర్శణమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని విమర్శించారు. గురుకులాల్లో ఆహార నాణ్యతపై ప్రభుత్వం వెంటనే సమీక్ష నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్కే అప్రోచ్, అరికెల వినయ్కుమార్, మార్గం కార్తికేయ, సాయినవీన్, ఎస్కే జుబేర్, లింగంపల్లి అబ్బి, అనురిత్ శివ తదితరులు పాల్గొన్నారు.మహిళలు అన్నిరంగాల్లో రాణించాలివేములవాడఅర్బన్: మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని బీసీ సాధికారత సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కొండ దేవయ్య అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం వేములవాడ పట్టణంలోని కార్యాలయంలో కేక్ కట్ చేసి మహిళలను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చట్టసభలలో 33 శాతం మహిళల రిజర్వేషన్ బిల్లు అమల్లోకి రావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు పొలాస నరేందర్, నాయకులు మారం కుమార్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు స్రవంతి, కళ్యాణి, శ్రీనిధి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నుంచి పలువురి సస్పెన్షన్సిరిసిల్ల అర్బన్: జిల్లాలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలను విభేదించి రెబల్స్గా పోటీ చేసిన అభ్యర్థులను, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్ప డిన నాయకులను పార్టీ సస్పెండ్ చేయడం జరిగిందని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ మున్సిపల్ పరిధిలో నాగుల రాముగౌడ్, హైమద్పాషా(అడ్డు), కుమ్మరి శేఖర్, ఇర్ఫాన్, సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో వెంగళ అశోక్, శ్రీరాముల వెంకటేశం, శరణ్య, బూర యాదగిరి పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారని, సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. -
అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకోండి
కోనరావుపేట మండలం కొలనూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు 12 ఎకరాల వ్యవసాయ భూమిలో అనుమతులు లేకుండా ప్లాట్లు ఏర్పాటు చేసి విక్రయించారు. దీనిపై చాలాసార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టి అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకోవాలి. – కొలనూరు గ్రామస్తులుమేము తెలంగాణ పంచాయతీరాజ్శాఖలో టెక్నికల్ విభాగంలో ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నాం. జిల్లాలోని 12 మండలాల్లో పనిచేస్తున్న ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లకు ఐదు నెలలుగా వేతనాలు రావడం లేదు. ఇప్పటికై నా ఆపరేటర్ల వేతనాలు ఇప్పించండి. – ఈ–పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లుజిల్లాలో ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయుల ప్రతిపాదనలు సమర్పించినా జీపీఎఫ్ ఫైనల్ పేమెంట్ మంజూరు చేయడం లేదు. మాకు రావాల్సిన జీపీఎఫ్ ఫైనల్ పేమెంట్స్ క్లియర్ చేయాలి. – జిల్లా విశ్రాంత ఉద్యోగులు -
మంటలార్పిన అధికారులు
వీర్నపల్లి(సిరిసిల్ల): మండలంలోని కంచర్ల–అల్మాస్పూర్ మధ్య గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో అటవీ సంపద కాలిపోతుందని సాక్షిలో సోమవారం ప్రచురితమైన కథనానికి ఫారెస్ట్ అధికారులు స్పందించారు. వీర్నపల్లి ఫారెస్ట్ సెక్షన్ అధికారి రంజిత్కుమార్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి మంటలను అదుపులోకి తెచ్చారు. అధికారులు మాట్లాడుతూ ఉద్దేశపూర్వకంగా అడవికి నిప్పు పెట్టవద్దని కోరారు. ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని పెద్దలింగాపూర్లో రైతులు చేస్తున్న రిలే నిరాహారదీక్ష సోమవారం నాటికి 28వ రోజుకు చేరింది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని 11/6 కాలువ పనులు పూర్తి చేయాలని 28 రోజులుగా రైతులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. కరికె నవీన్కుమార్, సేరు ఎల్లం, శ్రీనివాస్, వీర దేవరాజు, గాదె రవి, భారతి, అనిత, కమటం లావణ్య పాల్గొన్నారు. సిరిసిల్లటౌన్: మహిళల సాధికారతతోనే దేశం అభివృద్ధి సాధిస్తుందని సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అతిథిగా హాజరయ్యారు. చైర్పర్సన్తోపాటు కౌన్సిలర్లు దార్నం అరుణ, బొల్గం వైష్ణవి, కూర భాగ్యలక్ష్మి, నెల్లుట్ల లలిత, అడిచర్ల రూప, ఆకుల స్వప్న, గెంట్యాల శ్యామల, కొండ వర్షిణి, పాశికంటి రమ్య, రిక్కమల్ల రజితను సన్మానించారు. ఆర్యవైశ్య మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు దయిత శ్రీలత, పట్టణ అధ్యక్షురాలు ఎల్లంకి వాణి, డాక్టర్ మంజూష, సంఘ కార్యదర్శులు చేపూరి జమున, గౌరిశెట్టి ఇందిర, ఎల్లంకి ఉమ, రాణి తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్లటౌన్: సెస్ కార్మికుల సమస్యలపై పోరాడుతామని తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నలువాల స్వామి పేర్కొన్నారు. సిరిసిల్లలో సోమవారం ప్రెస్మీట్లో మాట్లాడారు. ఈనెల 11వ తేదీ ఉదయం 6 నుంచి 14వ తేదీ ఉదయం 6 గంటల వరకు విధులు బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. సెస్ కార్మికుల డిమాండ్లు నెరవేర్చడంలో యాజ మాన్యం, పాలకవర్గం మొండి వైఖరి ప్రదర్శి స్తుందన్నారు. నాయకులు సంతోష్నాయక్, రాచకొండ శ్రీనివాస్, శివ పాల్గొనారు. ముస్తాబాద్(సిరిసిల్ల): సర్వేయర్ల సమస్యలు ప రిష్కరించాలని కోరుతూ ఏడీ సర్వేకు సోమ వారం వినతిపత్రం అందించారు. సర్వేయర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కావటి మహిపాల్ మాట్లాడుతూ శిక్షణ అనంతరం 91 మందిని గుర్తించి లైసెన్స్లు జారీ చేశారన్నారు. ఇందులో 66 మంది సర్వేయర్లకు వివిధ మండలాల్లో పనిచేసే అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చారన్నారు. మరో 25 మందికి వివిధ మండలాలు కేటాయిస్తూ ఇచ్చే లైసెన్స్ల జారీలో పాతవారికి అవకాశం కల్పించాలని కోరారు. -
మహిళ సంక్షేమానికి పెద్ద పీట
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడఅర్బన్: మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ మండలం అనుపురం, మారుపాక, చీర్లవంచ, గుర్రంవానిపల్లి, కొడుముంజ గ్రామాల్లో రూ.50లక్షలతో ఐదు మహిళా సమాఖ్య సంఘం భవన నిర్మాణానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ భూమిపూజ చేశారు. విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతీ పేద కుటుంబానికి అండగా నిలుస్తున్నాయన్నారు.గ్యాస్ ధరలు తగ్గించాలిసిరిసిల్లటౌన్: కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్ డిమాండ్ చేశారు. ఈమేరకు పార్టీ ఆధ్వర్యంలో సోమవారం సిరిసిల్ల అంబేడ్కర్చౌరస్తాలో ధర్నా చేపట్టి మాట్లాడారు. కేంద్రం పెంచిన వంట గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలని కోరారు. సీపీఎం నాయకులు ఎగమంటి ఎల్లారెడ్డి, జవ్వాజి విమల, శ్రీరాముల రమేశ్చంద్ర, మిట్టపల్లి రాజమల్లు, ఎలిగేటి రాజశేఖర్ పాల్గొన్నారు. 3వ రిలే కార్నివాల్ పోటీల్లో ప్రతిభసిరిసిల్ల అర్బన్: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 3వ రిలే కార్నివాల్ పోటీలు సోమవారం జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన వారికి సర్టిఫికెట్స్, మెడల్స్ను జిల్లా ప్రధాన కార్యదర్శి బొజ్జ చంద్రశేఖర్ అందజేశారు. విజేతలు ఈనెల 15న హన్మకొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు హాజరవుతారని తెలిపారు. పీఈటీలు కడారి అశోక్కుమార్, రాజు, సాయికృష్ణ పాల్గొన్నారు. -
అభివృద్ధిని సీఎం అడ్డుకున్నారు
● బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ● సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిలర్లకు సన్మానం ● ముస్లింలకు ఇఫ్తార్ విందుసిరిసిల్లటౌన్: సిరిసిల్ల అభివృద్ధికి తమ ప్రభుత్వం రూ.44కోట్లు మంజూరు చేస్తే.. వాటిని ఇవ్వకుండా కాంగ్రెస్ సర్కారు మోకాలొడ్డిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఐదోవార్డులో మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని సోమవారం ప్రారంభించి మాట్లాడారు. తాను ప్రభుత్వంపై విమర్శలు చేయడం లేదన్నారు. ప్రజల మనసు దోచుకోవాలంటే అభివృద్ధికి తానిచ్చిన రూ.40 కోట్లకు రూ.80 కోట్లు ఇవ్వాల్సి ఉండేదన్నారు. అభివృద్ధిని అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని చూసి సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మాండంగా గెలిపించారన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, వైస్చైర్మన్ దార్ల సందీప్, కమిషనర్ ఎం.ఎ.ఖదీర్పాషా, స్థానిక కౌన్సిలర్ దార్నం అరుణ, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి పాల్గొన్నారు. సర్వేయర్ల వినతిపత్రం విద్యావంతులైన లైసెన్స్డ్ సర్వేయర్లను రాష్ట్ర ప్రభుత్వం అవమానించిందని, తమకు న్యాయం కావాలంటూ సర్వేయర్లు కేటీఆర్ను కలిసి వినతిపత్రం అందించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఇచ్చిన హామీలతో తాము ప్రైవేట్ ఉద్యోగాలను వదిలి వస్తే ప్రభుత్వం నట్టేట ముంచిందన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. కనీస వేతనం ఇవ్వకుండా ఎకరానికి రూ.10 కమీషన్ ఇస్తామనడం విద్యావంతులను అవమానించడమేనన్నారు. లైసెన్స్డ్ ల్యాండ్ సర్వేయర్ జిల్లా అధ్యక్షుడు కావటి మహిపాల్ పాల్గొన్నారు. ఇఫ్తార్విందులో కేటీఆర్ ముస్లింలకు ఇచ్చిన ఇఫ్తార్విందులో కేటీఆర్ పాల్గొన్నారు. బీవైనగర్లోని షాదిఖానాలో నిర్వహించిన విందులో ముస్లింలతో కలిసి హాజరయ్యారు. మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, ఎం.డి. సత్తార్, సోహైల్, యూసుఫ్ పాల్గొన్నారు. -
జరిమానా నుంచి మినహాయించండి
● కలెక్టరేట్ ఎదుట రైస్మిల్లర్ల ధర్నాసిరిసిల్ల: డిఫాల్ట్ మిల్లర్లకు విధించిన 25శాతం జరిమానాను తొలగించాలని, 12 శాతం వడ్డీ మాఫీ చేయాలని కోరుతూ రైస్మిల్లర్లు కలెక్టరేట్ ఎదుట సోమవారం ఆందోళనకు దిగారు. వారు మాట్లాడుతూ పెండింగ్ బియ్యం అందించేందుకు అవకాశం కల్పించాలని, ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను ఇప్పించాలని కోరారు. ఇటీవల కరీంనగర్లో ఓ రైస్మిల్లర్ భార్య స్వప్న ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రైస్మిల్లులు నష్టాల్లో ఉన్నాయని, ప్రభుత్వం చొరవచూపి జరిమానాలు లేకుండా.. బియ్యం అందించేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ ధర్నాలో జిల్లా రైస్మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు పబ్బ నాగరాజు, ప్రతినిధులు గర్రిపెల్లి ప్రభాకర్, బండ మల్లేశంయాదవ్, ఎస్.రాజిరెడ్డి, సీహెచ్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
రాజన్న సిరిసిల్ల
మంగళవారం శ్రీ 10 శ్రీ మార్చి శ్రీ 20267పట్టణాభివృద్ధిపైనే దృష్టి వేములవాడ: పట్టణ అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారిస్తామని మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు అన్నారు. మున్సిపల్ సాధారణ సమావేశం సోమవారం నిర్వహించారు. సిరిసిల్లటౌన్: టీఎస్యూటీఎఫ్ ఆధ్వర్యంలో విద్యాశాఖ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల సాధనకు సోమవారం భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.వాతావరణం ఎండగా ఉంటుంది. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. తెల్లవారుజామున ఈదురుగాలులు వీస్తాయి. -
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
● కలెక్టర్ గరీమా అగ్రవాల్సిరిసిల్ల/సిరిసిల్ల అర్బన్: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని అపెరల్ పార్క్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళల విజయాలను తెలుపుతూ వెల్ది రేఖ రూపొందించిన నారీశక్తి చీరను ఆవిష్కరించారు. అపెరల్ పార్క్లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం(టీడీఎఫ్) ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ పొందిన ముస్తాబాద్ మండలానికి చెందిన మహిళలకు సర్టిఫికెట్లు, కుట్టుమెషిన్లను అందజేశారు. డీఆర్డీవో గీత, చేనేత జౌళిశాఖ ఏడీ సంతోష్, టీడీఎఫ్ అధ్యక్షుడు మట్టా రాజేశ్వర్రెడ్డి, కాంగ్రెస్ సిరిసిల్ల ఇన్చార్జి కె.కె.మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆఫీస్లను పరిశుభ్రంగా ఉంచాలి ప్రభుత్వ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో 99 రోజుల కార్యక్రమాల అమలుపై కలెక్టరేట్లో సోమవారం సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా కలెక్టరేట్లోని ప్రతీ జిల్లా కార్యాలయం, సిరిసిల్ల, వేములవాడ, ఆయా ప్రాంతాల్లోని అన్ని ప్రభుత్వ ఆఫీస్లు, మున్సిపల్, తహసీల్దార్ ఆఫీస్లు, ఎంపీడీవో కార్యాలయాల్లో స్వచ్ఛత.. పరిశుభ్రత పనులు పక్కాగా చేయాలన్నారు. నిరుపయోగ వస్తువులు, చెత్తాచెదారం ఉండకూడదని స్పష్టం చేశారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, ఆర్డీవోలు సీహెచ్.వెంకటేశ్వర్లు, రాధాభాయి తదితరులు పాల్గొన్నారు. -
మహిళలకు చట్టాలపై అవగాహన ఉండాలి
● సీనియర్ సివిల్ జడ్జి అజయ్కుమార్ జాదవ్వేములవాడ: మహిళలు తమ హక్కులు, చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని వేములవాడ సీనియర్ సివిల్ జడ్జి అజయ్కుమార్ జాదవ్ కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సోమవారం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జూనియర్ సివిల్ జడ్జి జ్యోతిర్మయి, మహిళా న్యాయవాదులు, కోర్టు సిబ్బందిని సన్మానించారు. మహిళలకు సమాజంలో సమాన హక్కులు కల్పించేందుకు రాజ్యాంగం ప్రత్యేక రక్షణ కల్పించిందన్నారు. మహిళల అభివృద్ధి సమాజ అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గడ్డం సత్యనారాయణరెడ్డి, ఉపాధ్యక్షుడు కటకం జనార్దన్, మాజీ అధ్యక్షుడు గుండ రవి, ఏజీపీలు బొడ్డు ప్రశాంత్, పుప్పాల భానుకృష్ణ, మహిళా న్యాయవాదులు కొడిమ్యాల సంగీత, జక్కుల పద్మ పాల్గొన్నారు. -
భానుడి భగభగ
సిరిసిల్లటౌన్: నిప్పులకొలిమిలా భానుడు భగభగ మండుతున్నాడు. గత వారం రోజులుగా ఎండలు ముదరడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. వివిధ పనులపై వచ్చే వారు మధ్యాహ్నం వరకు ఇంటికి చేరుకునేలా చూస్తున్నారు. మండుతున్న ఎండల నుంచి కాపాడుకునేందుకు గొడుగులు, తువ్వాలలను ఆశ్రయిస్తున్నారు. ఎండల నుంచి ఉపశమనానికి శీతల పానీయాలు. కొబ్బరిబొండాలు, చెరుకురసం తాగుతున్నారు. హమాలీ, డైయింగ్, భవన నిర్మాణ కార్మికులకు ఎండల్లో పనిచేయడం ఇబ్బందిగా మారింది. అన్నివేళల్లో సందడిగా ఉండే సిరిసిల్ల పట్టణం దంచికొడుతున్న ఎండలతో మార్కెట్లు మధ్యాహ్నం 12 గంటల వరకే బోసిపోతున్నాయి. కనిపించని గ్రీన్నెట్స్ ఏటా ఎండాకాలంలో మున్సిపల్ నుంచి ప్రజలకు నీడ కల్పించేలా ఏర్పాట్లు చేస్తారు. ఈ ఏడాది మార్చిలోనే తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతుండడాన్ని అధికారులు ఊహించలేదు. భగభగమండుతున్న ఎండలో ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు. ఎండల ఽనుంచి జనాలకు నీడ కల్పించే విషయంలో ఇప్పటికీ మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోలేదు. పాతబస్టాండులో ఓపెన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అక్కడ ప్రయాణికులు బస్సుల కోసం మండుటెండలోనే నిలబడుతున్నారు. పల్లెల నుంచి వచ్చే జనాలు ఎండలతో భేజారవుతున్నారు. ఓపెన్ స్థలాల్లో నీడకల్పించడంలో అధికారులు ఇప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం జనాలకు ఇబ్బందిగా మారింది. ఇక పాతబస్టాండులో ప్రయాణికులకు నిలువ నీడ, తాగడానికి నీరు లేకపోవడం వి మర్శలకు దారితీస్తోంది. పరీక్షల సమయం కావడంతో విద్యార్థులు ప్రయాణాలు చేయడం, రోడ్లపై కి పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఎండదెబ్బకు గురికాకుండా మున్సిపల్ అధికారులు ముందస్తు చ ర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పెద్దబజారు, కూరగాయల మార్కెట్, అంబేడ్కర్ చౌరస్తా, గాంధీచౌక్, సెస్ ఆఫీస్ రోడ్డు, కరీంనగర్ రోడ్డు, కలెక్టరేట్ చౌరస్తా, విద్యానగర్ చౌరస్తాల్లో గ్రీన్నెట్స్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.ఇది సిరిసిల్లలోని అంబేడ్కర్చౌరస్తా. నిత్యం వందలాది సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. ఎప్పుడూ ఈ రోడ్డు రద్దీగా ఉంటుంది. కానీ సోమవారం మధ్యాహ్నం ఇలా నిర్మానుష్యంగా మారింది. ప్రతీ సోమవారం జిల్లా కేంద్రానికి అన్ని మండలాల నుంచి సందర్శకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. అయితే ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో సందడి కనిపించలేదు. -
ఆలకించండి.. ఆదుకోండి
సిరిసిల్ల అర్బన్: క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడంతో పలువురు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సోమవారం కలెక్టరేట్కు తరలివచ్చారు. ప్రజావాణిలో తమ సమస్యలను కలెక్టర్కు విన్నవించి.. పరిష్కరించాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై 179 మంది తమ దరఖాస్తులను జిల్లా అధికారులకు అందజేశారు. అర్జీలు స్వీకరించిన కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలని అధి కారులను ఆదేశించారు. పెండింగ్లో పెట్టవద్దని, ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. అన్ని శాఖల అధికారులు విధిగా ప్రజావాణికి హాజరుకావాలని స్పష్టం చేశారు. -
మాతృమూర్తుల దీవెనలతో హాల్టికెట్లు
చందుర్తి(వేములవాడ): మాతృమూర్తుల చేతులమీదుగా హాల్టికెట్లు అందుకున్న పదో తరగతి విద్యార్థులు ఈ సందర్భంగా తల్లులకు పాదాభివందనం చేశారు. ఈ వినూత్న కార్యక్రమాన్ని చందుర్తి మండలం మర్రిగడ్డ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించారు. విద్యార్థులు బాగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని తల్లులు దీవించారు. ఎంఈవో, స్కూల్ హెచ్ఎం వినయ్కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు పరీక్ష సమయంలో ధైర్యంగా ఉండాలన్నారు. ఇప్పుడు కష్టపడితేనే భవిష్యత్ ప్రకాశవంతంగా ఉంటుందన్నారు. ఉపాధ్యాయులు గంగనర్సయ్య, వేణుగోపాల్, కనకయ్య, సావిత్రి, జ్యోతిరాణి, సరోజ, పద్మ పాల్గొన్నారు. మర్రిగడ్డ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులను దీవించిన తల్లులు -
బాలిక భవితకు బాసట
రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ 29వ డివిజన్ లింగాపూర్ గ్రామానికి చెందిన దంపతులు కందుల తిరుపతి–స్రవంతి గత జనవరిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. వారి కూతురు శివాణి ఒంటరిగా మారడం, ఆమె దీనగాథపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించడం దాతలను స్పందింపజేస్తోంది. గ్రామస్తులు ‘చిన్నారి తల్లి’ పేరిట వాట్సాప్ గ్రూప్ కూడా ఏర్పాటు చేశారు. అందులో వెయ్యి మంది సభ్యులుగా చేరారు. అంతేకాదు.. బాలికకు బాసటగా నిలిచేందుకు ఇప్పటివరకు రూ.8.52 లక్షలు సాయం చేశారు. ఈ మొత్తాన్ని సోమవారం బంధువులు శివాణి పేరిట స్థానిక పోస్టాఫీసులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఈ వివరాలను కూడా ‘చిన్నారి తల్లి’ వాట్సాప్ గ్రూపులో వైరల్ చేశారు. కందుల శివాని పేరిట చేసిన డిపాజిట్ ‘సాక్షి’ వరుస కథనాలతో స్పందిస్తున్న దాతలు ఒంటరైన బాలిక పేరిట మీద రూ.8.52 లక్షల డిపాజిట్ -
యువికా.. భవిష్యత్ మీదే ఇక
జ్యోతినగర్(రామగుండం): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)స్కూల్ విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించింది. యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాం యువ విజ్ఞాన కార్యక్రమ్(యువిక–2026) ద్వారా పిల్లల ఆలోచనలకు మెరుగులు దిద్దితే.. భావిశాస్త్రవేత్తలుగా మార్చుకోవచ్చనే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అంతరిక్ష సాంకేతిక, అంతరిక్షశాస్త్రం, అనువర్తనాలపై ప్రాథమిక జ్ఞానం అందించడమే దీని లక్ష్యం. ఈమేరకు విద్యార్థుల నుంచి ఈనెల 31వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. ఏప్రిల్ 13న తొలిజాబితా, 20న రెండోజాబితా ప్రకటిస్తారు. మే 11 నుంచి 22వ తేదీ వరకు శిక్షణ ఇస్తారు. ఎంపికైన విద్యార్థులకు ప్రయాణ రాయితీ కల్పించి, వసతి, బస ఏర్పాటు చేస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా తొమ్మిదో తరగతి చదువుతున్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఈ అవకాశం కల్పిస్తున్నారు. దరఖాస్తు ఇలా చేయాలి.. www.isro.gov.in వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత యువికా ఆప్షన్ క్లిక్ చేయాలి. అందులో విద్యార్థి వి వరాలు నమోదు చేయాలి. విద్యార్థులు 2026 జన వరి 1 నాటికి తొమ్మిదో తరగతి చదువుతుండాలి. ఎనిమిదో తరగతి మార్కుల ఆధారంగా 50 శాతం మందికి, ఆన్లైన్లో క్విజ్లో ప్రతిభకు 10 శాతం, సైన్స్ఫేర్లో పాల్గొన్న వారికి 10 శాతం, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వలంటీర్లకు 5 శాతం, గ్రామీణ విద్యార్థులకు 15 శాతం అనుమతి కల్పిస్తారు. యువికా ఉద్దేశం ఇదే.. ఇస్రో చేపట్టిన ‘యువికా’కు ఎంపికై న విద్యార్థులతోపాటు కుటుంబ సభ్యుల్లో ఒకరు అంతరిక్ష కేంద్రాలకు చేరుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఇస్రోకు చెందిన అహ్మదాబాద్, డెహ్రాడూన్, శ్రీహరికోట, హైదరాబాద్, బెంగళూరు, షిల్లాంగ్, తిరువనంతపురం తదితర కేంద్రాల్లో శిబిరాలు నిర్వహిస్తారు. ఇక్కడ విద్యార్థులకు ప్రముఖ శాస్త్రవేత్తలతో ముఖాముఖి, చర్చావేదికలు, ప్రయోగశాలల సందర్శన, ముఖ్యులతో సమావేశాల్లో పాల్గొనేందుకు అవకాశమిస్తారు. అంతరిక్షశాస్త్రం, రాకెట్ ప్రయోగ అంశాలపై ప్రాథమిక అవగాహన కల్పిస్తారు. భావిశాస్త్రవేత్తలకు ఇస్రో పిలుపు ఇస్రో నిర్వహించే యంగ్ సైంటిస్ట్ కార్యక్రమం విద్యార్థులకు చక్కని వేదిక. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆసక్తి గలవిద్యార్థులతో దరఖాస్తు చేసేలా ప్రోత్సహించాలి. – జింక మల్లేశం, డీఈవో, రామగుండం -
ఆస్ట్రేలియాలో గుండెపోటుతో మృతి
ఫెర్టిలైజర్సిటీ(రామగుండం): పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ 22వ డివిజన్ గౌతమినగర్కు చెందిన కొప్పుల రాజయ్య ఆస్ట్రేలియాలో ఈనెల 3న గుండెపోటుతో మృతి చెందారు. ఆస్ట్రేలియాలో నివాసం ఉంటున్న తన కుమారుడు కొప్పుల ప్రసాద్ దగ్గరికి మూడు నెలల క్రితం వెళ్లారు. హఠాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని సోమవారం గౌతమినగర్లోని ఆయన నివాసానికి తీసుకొచ్చారు. కొప్పుల రాజయ్య.. మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ పెద్దనాన్న కుమారుడు అవుతారు. దీంతో ఆయన అంత్యక్రియల్లో మాజీమంత్రి పాల్గొని పాడె మోశారు. గుర్తుతెలియని వ్యక్తి మృతిసిరిసిల్ల క్రైం: రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రెడీమిక్సర్ సమీపంలో సోమవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాలు. మృతుడి వయస్సు సుమారు 40–45 ఏళ్ల మధ్య ఉంటుందని, సుమారు 5 అడుగులు 4 అంగుళాల ఎత్తు ఉంటాడని తెలిపారు. ఆకుపచ్చ రంగు ప్యాంటు ధరించి ఉండగా, మెడలో ఎరుపు రంగు దండ ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాన్ని సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ గదిలో భద్రపరిచారు. వివరాల కోసం సీఐ ఎన్.శ్రీనివాస్ 87126 56366, సబ్ ఇన్స్పెక్టర్ ఎ.మురళీధర్గౌడ్ 99898 07854లో సంప్రదించాలని పోలీసులు తెలిపారు. ● గూడ్స్ వాహనాల్లో తరలింపు కరీంనగర్రూరల్: ఇసుక అక్రమార్కులు రోజుకో కొత్త తరహా మార్గాలను అనుసరిస్తున్నారు. గూడ్స్ వాహనాల్లో కరీంనగర్కు ఇసుక రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకోవడంతో నయా దందా వెలుగులోకి వచ్చింది. కరీంనగర్రూరల్ సీఐ నిరంజన్రెడ్డి కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టెపల్లి మానేరువాగు నుంచి సన్నపు ఇసుకను సంచుల్లో నింపుకుని అక్రమార్కులు గూడ్స్ వాహనాల్లో కరీంనగర్కు తరలిస్తు సొమ్ము చేసుకుంటున్నారు. ఆదివారం రాత్రి బొమ్మకల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన గూడ్స్ వాహనాన్ని పట్టుకున్నారు. వేములవాడకు చెందిన డ్రైవర్ ఎర్రెల్లి సురేశ్ను అదుపులోకి తీసుకుని విచారించగా యజమాని చొప్పరి శివప్రసాద్ ఆదేశాల మేరకు ఇసుక రవాణా చేస్తున్నట్లు అంగీకరించాడు. సోమవారం గొల్లపల్లి మానేరువాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న బేతి సునీల్రెడ్డి, బొమ్మకల్కు చెందిన దొమ్మాటి మల్లేశం, బండారి అరవింద్ ట్రాక్టర్లను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
బడ్జెట్లో రూ.5వేల కోట్లు కేటాయించాలి
కరీంనగర్టౌన్: మత్స్య పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారుల సంక్షేమానికి 2026–27 సంవత్సర బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.5వేల కోట్లు కేటాయించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ ఎదుట మత్స్యకారులు ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీఎంకేఎంకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ మాట్లాడుతూ దశాబ్ద కాలంగా చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణిస్తున్నప్పటికీ ప్రభుత్వం, అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నారన్నారు. మత్స్యకారులందరూ ఐక్యంగా ఉద్యమించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి, న్యాయమైన సమస్యలు పరిష్కారానికి ఈనెల 17న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎంకేఎంకేఎస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పిట్టల వెంకన్న, జనగరి గణేశ్, కోశాధికారి సదానందం, సహాయ కార్యదర్శి సంపత్, నూనె శేఖర్, మేకల ఆంజనేయులు, మేకల కిరణ్, కంటే సురేశ్, పి.హనుమంతు, పి కుమార్ గడప పరశురాం తదితరులు పాల్గొన్నారు. -
పెళ్లిరోజునే అవయవదానానికి ప్రతిజ్ఞ
ఫెర్టిలైజర్పిటీ(రామగుండం): పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ 23వ డివిజన్ ప్రగతినగర్కు చెందిన యువ దంపతులు కావలి ప్రియాంక–నరేశ్.. తమ వివాహ వార్షికోత్సవాన్ని సమాజహితంతో గుర్తుండిపోయేలా చేసుకున్నారు. సోమవారం తమ పెళ్లిరోజు సందర్భంగా తమ మరణానంతరం నేత్ర, అవయవదానం చేయాలని ప్రతిజ్ఞ చేసి ఆదర్శంగా నిలిచారు. ఫొటో స్టూడియో నిర్వాహకులైన ఈ దంపతులు అవయవదానం కోసం అంగీకార పత్రాలపై సంతకం చేశారు. దంపతుల నుంచి ఆ పత్రాలను లయన్స్ క్లబ్ 320జి రీజయన్–9, జోన్–2 విజన్ కో ఆర్డినేటర్ కోదాటి ప్రవీణ్, లయన్స్ క్లబ్ ఆఫ్ జ్యోతినగర్ ప్రగతి సెక్రటరీ దొండపాటి మహేందర్రెడ్డి స్వీకరించారు. సదాశయ ఫౌండేషన్ జాతీయ ప్రచార కార్యదర్శి కేఎస్ వాసుకు అందజేశారు. ప్రేమవివాహం చేసుకుని ఆదర్శవంతంగా జీవిస్తున్న ఈ జంట తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా సమాజానికి మేలు చేయాలనుకోవడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. ప్రతినిధులు నార్ల ప్రసాద్, టి.శ్రవణ్ కుమార్, లింగమూర్తి, చంద్రమౌళి, వాసు తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనలకు ఇటుకేస్తున్నారు..
పెద్దపల్లి: జిల్లాలోని కొన్ని ఇటుకబట్టీల నిర్వాహకులు నిబంధనలు అతిక్రమిస్తున్నారు. అందులో పనిచేసే కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించడంలేదు. తమకు అందిన ఫిర్యాదుల మేరకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న అధికారులు ఇలాంటి బట్టీలను గుర్తించి సీజ్ చేయడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇటీవల పెద్దపల్లి మండలం రాఘవాపూర్లోని రెండు ఇటుకబట్టీలను సీజ్ చేయడం గమనార్హం. జిల్లాలో సుమారు 150 నుంచి 200 వరకు చిన్న, మధ్య తరహా ఇటుకబట్టీలు ఉన్నాయని అంచనా. వలస కార్మికుల డాటా ఎక్కడ? జిల్లాలో పలు ప్రాంతాల్లో ఉన్న ఇటుకబట్టీల్లో పనిచేసే కార్మికులు, వారి కుటుంబాల డాటా ఎక్కడ నమోదు కావడం లేదని అంటున్నారు. వలస కార్మికులను గంపగుత్తగా ఏజెంట్తోనే మాట్లాడుకుంటున్న నిర్వాహకులు తమ ఇటుకబట్టీల్లోకి తీసుకొచ్చి పనులకు పురమాయిస్తునానరని అంటున్నారు. ఇటుకబట్టీలోకి వలసకార్మికులు వచ్చిన వెంటనే ఆధార్తో సహా ఇతర సమాచారాన్ని కార్మికశాఖ, పోలీస్ అధికారులకు ఇవ్వాల్సి ఉన్నా.. ఈ నిబంధనేదీ ఇవ్వకుండా దాటవేసే ధోరణి అవలంబిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇటుకబట్టీల వద్ద నివాసం ఉండే కార్మికులు, వారికుటుంబాలకు సురక్షితమైన తాగునీరు అందించాలనే నిబంధన ఎక్కడా అమలు కావడంలేదు ● వ్యవసాయ బావులు, బోరుబావుల నీళ్లే దిక్కవుతోంది ● తాత్కాలిక వసతి కూడా అంతంత మాత్రంగానే ఉంటోంది. ● రోజూ 8 గంటల వరకే పనిచేయాల్సి ఉన్నా.. అంతకుమించి పనులు చేయించుకుంటున్నారు ● కనీస వేతనాలు కూడా అమలు చేయడంలేదు ● కార్మికుల పిల్లలకోసం ట్యూటర్ను నియమించి పాఠశాల ప్రారంభించాల్సి ఉన్నా.. వర్క్సైడ్ స్కూల్ ఏర్పాటు చేసినా ప్రయోజనం లేకుండాపోతోంది ● అధికారులు తనిఖీకి వస్తున్నారని సమాచారం అందిన వెంటనే బడి తెరుస్తారని, లేకుంటే మూసివేసి ఉంచుతారనే ఆరోపణలు ఉన్నాయి. ● కార్మిక శాఖలో తగినమంది అధికారులు, సిబ్బంది లేకపోవడంతో ఇటుక బట్టీల్లో ఏం జరుగుతుంతో పర్యవేక్షించే అవకాశం లేకుండాపోతోంది. ఇటుకబట్టీల్లో కనీస సౌకర్యాలు కరువు కార్మిక శాఖ వద్ద నమోదు కాని వివరాలు -
తండ్రి నుంచి రక్షణ కల్పించండి
జగిత్యాలటౌన్: కన్నతండ్రి, సోదరుడు (అమ్మ సవతి కొడుకు)నుంచి తనకు రక్షణ కల్పించాలని ఓ యువతి సోమవారం జగిత్యాల కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ బీఎస్.లతకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం సంకెనపల్లికి చెందిన సామెల్ మొదటి భార్య మరణించడంతో మందమర్రికి చెందిన శకుంతలను సంప్రదాయ పద్ధతిలో పెద్ద మనుషుల సమక్షంలో రెండో వివాహం చేసుకున్నాడు. అప్పటికే మొదటి భార్యకు కుమారుడు రాజు ఉన్నాడు. శంకుతలతో పెళ్లి సమయంలో బంగారం, వెండి వస్తువులు ఇస్తానని నమ్మించాడు. ఇప్పుడు అమ్మ ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు లాక్కున్నాడు. పెళ్లి తర్వాత బంగారం గురించి అడగడంతో అమ్మను టార్చర్ పెడుతున్నాడు. శంకుతల గర్భిణిగా ఉన్నప్పటి నుంచే రాజు, సామేల్ కలిసి అమ్మను కొడుతూ ఉండేవారు. రోజూ శారీరకంగా, మానసికంగా వేధించి ఆఖరికి ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు. ప్రస్తుతం నేను పదవ తరగతి చదువుతున్నాను. నా చదువుకు.. ఇల్లు గడవడానికి కష్టంగా ఉంది. మానాన్న (సామెల్) పేరున ఉన్న 1.20 ఎకరాల భూమితో సంబంధం లేదంటున్నారు. భూమి గురించి అడిగితే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. నా కన్న తండ్రితోపాటు సోదరుడి నుంచి రక్షణ కల్పించి న్యాయం చేయాలి అంటూ మొర పెట్టుకుంది. ప్రజావాణిలో కూతురు ఫిర్యాదు -
ఘనంగా త్రిశూలయాత్ర
వేములవాడ: ఐదు రోజులుగా వైభవంగా కొనసాగుతున్న శివకల్యాణోత్సవాల్లో భాగంగా చివరి రోజు సోమవారం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేకంగా నిర్మించిన ధర్మగుండంలో త్రిశూలయాత్ర నిర్వహించారు. ఐదు రోజులుగా సాగుతున్న శివకల్యాణోత్సవాలు ముగిసినట్లు ఈవో రమాదేవి తెలిపారు. వేములవాడలోని శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానం, అనుబంధ భీమేశ్వరస్వామి ఆలయంలో 50 వేల మంది భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా సౌకర్యాలు కల్పించాలని ఆలయ ఈవో రమాదేవి అధికారులకు సూచించారు. -
నిజాయితీ చాటుకున్న భీమన్న ఆలయ స్వీపర్
● 4 తులాల బంగారు బ్రేస్లెట్ అప్పగింత వేములవాడ: భీమన్న ఆలయంలో సోమవారం వరంగల్ జిల్లా లింగాలఘనపురం మండలం కుందారం గ్రామానికి చెందిన రేసు సతీశ్ తన చేతికున్న 4 తులాల బంగారు బ్రేస్లెట్ను పోగొట్టుకున్నారు. అక్కడే స్వీపర్గా విధులు నిర్వహిస్తున్న డప్పు నాగమణికి ఇది దొరికింది. ఆమె నిజాయితీగా వచ్చి ఆలయ అధికారులకు అప్పగించారు. దీంతో ఆలయ అధికారులు మైక్ ద్వారా ప్రకటించడంతో దాని ఆనవాళ్లు చెప్పిన తర్వాత సతీశ్కు అప్పగించారు. ఔట్సోర్సింగ్లో స్వీపర్ ఉద్యోగం చేస్తున్న నాగమణి తనకు దొరికిన బంగారు బ్రేస్లెట్ను నిజాయితీగా అప్పగించడంతో ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్శర్మ, ఎస్పీఎఫ్ సిబ్బంది అభినందించారు. పోక్సో కేసులో 13ఏళ్ల జైలు, జరిమానా గోదావరిఖనిటౌన్: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన మంథని కిరణ్ ఉరఫ్ నిఖిల్కు 13ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.13వేల జరిమానా విధిస్తూ పెద్దపల్లి ఫాస్ట్ట్రాక్ స్పెషల్ జడ్జి స్వప్నరాణి మంగళవారం తీర్పు వెలువరించారు. వివరాలు.. కిరణ్ 2018లో తన అన్నకూతురును ప్రేమిస్తున్నానని వెంటపడి వేధించడంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని గోదావరిఖని వన్ టౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. అప్పటి స్టేషన్హౌస్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సీఐ రమేశ్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు.. నేరం రుజువుకావడంతో మంథని కిరణ్కు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. బాధితురాలు కుటుంబానికి రూ.2లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ డొంకేన రవీందర్ సాక్షులను ప్రవేశపెట్టారు. పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి, ఏసీపీ రమేశ్ పర్యవేక్షణలో సాక్షులను ప్రవేశ పెట్టడానికి సహకరించిన టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, కోర్టు కానిస్టేబుళ్ల సతీశ్, కోటేశ్వరరావును రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అభినందించారు. -
కొత్తగా రాహుల్ బంధు పథకం తెచ్చారు..: కేటీఆర్
సిరిసిల్ల: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొత్తగా రాహుల్ బంధు పథకం తెచ్చాడంటూ ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతుబంధు పథఖం బంద్ చేసి.. కొత్తగా రాహుల్ బంధు పథకం తెచ్చిండు అంటూ సెటైర్లు వేశారు. సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయిలు రాహుల్ గాంధీకి పంపించడమే రాహుల్ బంధు పథకం అంటూ విమర్శించారు. ఈరోజు(సోమవారం, మార్చి 9వ తేదీ) మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన కౌన్సిలర్లను సిరిసిల్లలో కేటీఆర్ ఘనంగా సన్మానించారు. దీనిలో భాగంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో నాట్లు వేసే టైమ్లోన రైతుబంధు పడుతూ ఉండేదని, ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదన్నారు. ఇప్పటివరకూ ఎవరికైనా రైతుబంధు పడిందా? అంటూ అక్కడున్నవారిని ఉద్దేశించి ప్రశ్నించారు. సంవత్సరానికి వేయి కోట్లు కట్టి పదవి కాపాడుకుంటుండు. ఖమ్మం వెలుగుమట్లలో వెయ్యి ఇళ్లు కూల్చిండు.మహబూబ్నగర్లో దివ్యాంగుల ఇళ్ళు కూల్చారు. సీఎం సొంత ఇల్లు కొడంగల్ కోస్గిలో రెడ్డికుంటలో కట్టుకున్నాడు. రేవంత్ అన్న తిరుపతి రెడ్డి ఇల్లు దుర్గం చెరువులో ఉంది. 6 గారంటీలు నూరు రోజుల్లో అమలు చేస్తా అన్నాడు.. వెయ్యి రోజులు కావస్తున్నా అమలు చేయలేదు. అనాడు మూడో పంటకు రైతుబంధు వేయాలన్నారు.. ఇవాళ మూడో నెల వచ్చినా రైతుబంధు వేయడంలేదు. ఆడపిల్ల పెళ్ళికి కళ్యాణ లక్ష్మీ కింద లక్ష రూపాయలతోపాటు తులం బంగారం ఇస్తా అన్నారు. పంట పంటకు బోనస్ ఇస్తా అన్నారు. అత్తలకు 4 వేలు కోడలు 2,500 ఇస్తా అన్నాడు ఇప్పటి వరకు ఇచ్చిండా..?’అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు కేటీఆర్. -
వివాహేతర సంబంధంతో యువకుడి హత్య
వేములవాడ: వేములవాడ పట్టణంలోని ఓ ప్రైవేట్ లాడ్జీలో ఈనెల 4న అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన యువకుడు మోహన్ కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో యువకుడు హత్యకు గురైనట్లు పోలీసుల విచారణలో తేలింది. వివరాలు డీఎస్పీ శ్రీనివాసులు ఆదివారం పట్టణ సీఐ కార్యాలయంలో వెల్లడించారు. జిల్లాలోని అడవిపదిర గ్రామానికి చెందిన భూక్య మోహన్కు వేములవాడకు చెందిన వివాహిత బైరి శారద ఉరఫ్ కళ్యాణితో వివాహేతర సంబంధం ఏర్పడింది. మోహన్ తరచూ డబ్బులు అడగడమే కాకుండా ఇద్దరు కలిసి దిగిన ఫొటోలు, వీడియోలు వైరల్ చేస్తానని బెదిరింపులకు దిగాడు. దీంతో శారద తన భర్త శేఖర్కు ఈ విషయం తెలిపింది. అనంతరం భార్యభర్తలు కలిసి మోహన్ను హత్య చేయాలని ప్రణాళిక వేశారు. వీరిద్దరూ గుండం రవి ఉరఫ్ రవీందర్ సహకారం తీసుకున్నారు. ఈనెల 4న మోహన్ను శారదతో వేములవాడలోని సిద్ధార్థ కాంప్లెక్స్కు పిలిపించారు. అప్పటికే అక్కడికి చేరుకున్న శేఖర్, రవి ఇద్దరు కలిసి నైలాన్తాడుతో మోహన్కు ఉరివేసి హత్య చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈక్రమంలో తిప్పాపూర్ ప్రధాన బస్స్టాండ్ వద్ద బైరి శారద, బైరి శేఖర్, గుండం రవిలను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఒక బైక్, నైలాన్తాడు, చాకు స్వాధీనం చేసుకున్నారు. కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. కేసును త్వరగా ఛేదించిన వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్, ఎస్సైలు రామ్మోహన్, ప్రేమానందం, కానిస్టేబుళ్లు ఇమ్రాన్, సల్మాన్, శ్రీనివాస్ను డీఎస్పీ అభినందించారు. భర్తతో కలిసి ప్రియుడి హత్య వీడిన వేములవాడ లాడ్జీలోని యువకుడి మృతి కేసు ముగ్గురి రిమాండ్ -
ఆన్లైన్ గేమ్స్.. యూత్ ఆగం
● క్యాసినో గేమ్స్కు బానిసైన పల్లెజనం ● ఇల్లంతకుంట మండలంలో విచ్చలవిడిగా ఆన్లైన్ బెట్టింగ్ ● నిత్యం కోట్లాది రూపాయల లావాదేవీలు ● పోలీసులు అవగాహన కల్పిస్తున్నా మారని వైనం ● లక్షల్లో నష్టపోతున్న పలు కుటుంబాలు ఇల్లంతకుంట(మానకొండూర్): ఈజీగా మనీ వస్తుందనే ఆశతో పలువురు పల్లె ప్రజలు ఆన్లైన్ గేమ్స్కు బానిసగా మారారు. ఒక్క రోజుల్లో లక్షాధికారి కావాలన్న దురాశతో క్యాసినో వంటి ఆన్లైన్గేమ్స్లలో డబ్బులు పెడుతూ నిండా మునుగుతున్నారు. ఈ వ్యవహారం జిల్లాలోని ఇల్లంతకుంట మండలంలో ఎక్కువగా జరుగుతుంది. దాదాపు నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్ వ్యవహారం ఆలస్యంగా వెలుగుచూసింది. నిత్యం కోట్లాది రూపాయల లావాదేవీలు జరుగుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. గోవాలోని నిర్వాహకులతో అనుబంధం ఇల్లంతకుంట మండలానికి చెందిన కొందరు గోవాలోని పలు క్యాసినో సెంటర్లలో ఐడీలు కలిగి ఉన్నారు. వీరు పల్లె యువతతో పరిచయం పెంచుకొని తక్కువ పెట్టుబడితో ఒక్క రోజులోనే లక్షల రూపాయలు సంపాదించవచ్చని ఆశ చూపుతూ క్యాసినో గేమ్స్లో డబ్బులు పెట్టేలా ప్రోత్సహిస్తున్నారు. గేమ్స్లో డబ్బులు పెట్టేందుకు ఆసక్తి చూపిని వారికి ఐడీలు ఉన్న వ్యక్తులు ఆన్లైన్ లింక్స్ పంపిస్తూ కొంత డబ్బు కమీషన్ పొందుతున్నారు. ఇలాంటి వారు మండల వ్యాప్తంగా పది మంది వరకు ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ వ్యవహారం గత నాలుగేళ్లుగా గుట్టుగా సాగుతున్నా ఇటీవల వెలుగుచూసింది. గత రెండేళ్లుగా ఈ గేమ్స్కు బానిసైన వారి సంఖ్య మండల వ్యాప్తంగా 2 వేల నుంచి 3వేల వరకు ఉంటారని సమాచారం. ఇలా ప్రతీ ఊరిలో దాదాపు వంద మందికి పైగానే ఉండడంతో బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఇలా ఒకరి ద్వారా మరొకరికి తెలియడంతో ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్న వ్యవహారం బయటకు పొక్కింది. జవారిపేటలో అవగాహన సదస్సు మండలంలోని జవారిపేటలో ఆరు నెలల క్రితం అప్పటి సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి ఆధ్వర్యంలో భారీగా పోలీసులు గ్రామానికి వచ్చి అవగాహన కార్యక్రమం పెట్టారు. ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారనే సమాచారంతో గ్రామంలో ఇంటింటికీ వెళ్లి తనిఖీలు చేశారు. యువకుల చేతుల్లోని ఫోన్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి ఆన్లైన్ గేమ్స్తో జరిగే అనర్థాల గురించి వివరించారు. ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల వింతపోకడలు కనిపిస్తున్నాయి. పలు పల్లెల్లో చాలా మంది యువత హఠాత్తుగా కుంగిపోయి కనిపిస్తున్నారు. ఎందుకా.. అని ఆరా తీస్తే ఆన్లైన్ గేమ్స్లో డబ్బులు పెట్టి నష్టపోతున్నట్లు తెలిసింది. ఇలాంటి వారు మండలంలో ప్రతీ గ్రామంలో ఇద్దరు.. ముగ్గురు కనిపిస్తారు. ఆన్లైన్ గేమ్స్లో డబ్బులు పెట్టి నష్టపోయామన్న విషయం బయటకు చెప్పకపోవడంతో మరింత మంది ఆకర్షితులై ఆర్థికంగా దివాళా తీస్తున్నారు. మరికొంతరు రాత్రికి రాత్రే కొత్త కొత్త కార్లు కొనుగోలు చేస్తూ తమ దర్పం కనిపించేలా తిరుగుతున్నారు. వీరు కూడా అలాంటి ఆన్లైన్ గేమ్స్లో డబ్బులు పెట్టి లాభాలు వచ్చి ఇలా కార్లు కొంటున్నారు. ఇలాంటి వారు మండలంలో ఒకరిద్దరు మాత్రమే కనిపిస్తున్నారు. ఇలా ఒకరిద్దరిని చూసి వేలాది మంది యువత క్యాసినో వంటి ఆన్లైన్ గేమ్స్లో డబ్బులు పెట్టి నిండా మునుగుతున్నారు. ఆన్లైన్ గేమ్ ఆడి డబ్బులు గెలుపొందిన వారి ఖాతాల్లో చేరిన నగదును విత్డ్రా చేసుకునే అవకాశం లేకుండా పోతున్నట్లు తెలిసింది. ఇలా వారి ఖాతాల నుంచి తీసుకోలేకుండా నిలిచిపోయిన డబ్బు కూడా లక్షల్లో ఉన్నట్లు సమాచారం. నిత్యం మండల వ్యాప్తంగా కోట్లాది రూపాయలు ట్రాంజాక్షన్ అవుతున్నట్లు తెలుస్తోంది. -
పొలం నుంచి తీసుకొస్తున్నా
నేను పెద్దూరులోని ముత్యాల పోచమ్మ ఆలయంలో పూజారి గా పనిచేస్తున్నాను. గుడి లోప ల, పరిసరాలు శుభ్రం చేయడానికి నీటి సౌకర్యం లేదు. అందుకోసం నేను గత పది హేను రోజులుగా పొలం నుంచి బిందెతో తీసుకొచ్చి పూజ చేస్తున్నాను. నీటి వసతి కల్పించాలి. – తిప్పవరం విజయ, పెద్దూరు మాది పెద్దూరు. ఎండాకాలం రాకముందే నీటి కోసం ఇబ్బ ంది పడుతున్నాము. ఇప్పటికీ ఇరువై రోజులు గడుస్తోంది. పొలం వద్దకు వెళ్లి తాగునీటిని తెచ్చుకుంటున్నాము. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి గ్రామంలో నీటి సౌకర్యం కల్పించాలి. – జవ్వాజి నర్సవ్వ, పెద్దూరు -
ఆన్లైన్ గేమ్స్ ఆడి మోసపోవద్దు
రాష్ట్రంలో ఆన్లైన్, ఆఫ్లైన్ గేమ్స్కు అనుమతి లేదు. యువకులు ఎవరూ ఆన్లైన్ గేమ్స్లో డబ్బులు పెట్టి మోసపోవద్దు. ప్రలోభాలకు గురై ఎలాంటి ఆన్లైన్ ఆటలు ఆడవద్దు. ఆన్లైన్ ఆటలు ఆడుతూ పట్టుపడితే చట్టరీత్య చర్యలు తీసుకుంటాం. – సిరిసిల్ల అశోక్, ఇల్లంతకుంట ఎస్సై యువకులు ఆన్లైన్ గేమ్స్ ఆడి నష్టపోవద్దు. ఎంతో భవిష్యత్ ఉన్న జీవితాలను నాశనం చేసుకోవద్దు. చక్కగా చదువుకొని ఉద్యోగాల కోసం ప్రయత్నించాలి. ఆన్లైన్ గేమ్స్తో కుటుంబాలు రోడ్డునపడతాయి. యువత సన్మార్గంలో నడవాలి. – రేగుల కార్తీక్, ఇల్లంతకుంట యువజన సంఘాల అధ్యక్షుడు -
భళా.. మెగా రైతుమేళా
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కోరమాండల్ కంపెనీ, తెలంగాణ వ్యవసాయశాఖ సంయుక్తంగా హైదరాబాద్లోని రాజేంద్రనగర్ వర్సిటీ ఆవరణలో ఆదివారం మెగా రైతుమేళా ప్రారంభమైంది. సిరిసిల్ల రైతు విజ్ఞాన కేంద్రం (కేవీకే), బాబు జగ్జీవన్రామ్ వ్యవసాయ కళాశాల ప్రతినిధుల ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన మహిళా రైతులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. సిరిసిల్ల రైతు విజ్ఞాన కేంద్రం నోడల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్.సాయికుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు మాధవి, సంపత్కుమార్ పలు అంశాలపై అవగాహన కల్పించారు. -
ప్రజా ప్రభుత్వంలో వైద్యరంగానికి పెద్దపీట
వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు అందిస్తున్న కలెక్టర్ గరీమా అగ్రవాల్వ్యాక్సినేషన్ను ప్రారంభిస్తున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడరూరల్: ప్రజా ప్రభుత్వంలో వైద్య రంగానికి పెద్దపీట వేశామని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ ఏరియా ఆస్పత్రిలో హెచ్పీవీ వాక్సినేషన్ను ఆదివారం ప్రారంభించారు. పాది శ్రీనివాస్ మాట్లాడుతూ 99 రోజుల ప్రణాళికలో భాగంగా రెండేళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ప్రజా ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రత, మహిళల సాధికారత వంటి పలు కార్యక్రమాల్ని చేపట్టడం జరుగుతుందన్నారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు సుమారు రూ.20లక్షల వరకు ఇవ్వనున్నట్లు తెలిపారు. మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు. 14 ఏళ్ల బాలికలకు ముందస్తుగా హెచ్పీవీ టీకాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. వేములవాడ ఏరియా హాస్పిటల్, సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి, ఎల్లారెడ్డిపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో టీకాలు వేస్తారని, జిల్లా పరిధిలో 3773 మందిని గుర్తించినట్లు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్లు కనికరపు రాకేశ్, నరాల శేఖర్, డీఎంహెచ్వో రజిత, డాక్టర్ దివ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు. హెచ్పీవీ వ్యాక్సిన్ వేయించాలి సిరిసిల్లటౌన్: జిల్లాలోని 14 నుంచి 15 ఏళ్ల లోపు వయసు ఉన్న బాలికలకు హెచ్పీవీ(హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సిన్ వేయించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ప్రజలకు కోరారు. జిల్లా ఆస్పత్రిలో ఆదివారం టీకా పంపిణీని ప్రారంభించారు. 2011 ఏప్రిల్ 1, 2012 మార్చి 31 మధ్య జన్మించిన బాలికలకు టీకాలు వేశారు. కలెక్టర్ మాట్లాడుతూ గర్భాశయ క్యాన్సర్ నివారణకు బాలికలకు తల్లిదండ్రులు బాధ్యతతో వ్యాక్సిన్ వేయించాలని కోరారు. జిల్లాలోని 3,773 మంది బాలికలను గుర్తించారని, తల్లిదండ్రులు గుర్తింపుకార్డుతో వచ్చి వ్యాక్సిన్ వేయించాలని సూచించారు. జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రి, వేములవాడ ప్రాంతీయ ఆస్పత్రి, ఎల్లారెడ్డిపేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్ పంపిణీ మొదలైందని వెల్లడించారు. ఘనంగా మహిళా దినోత్సవం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వహించారు. కలెక్టర్ గరీమా అగ్రవాల్ కేక్ కట్ చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, డీఎంహెచ్వో రజిత, జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రవీణ్కుమార్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్పాషా, జిల్లా వ్యాధినిరోధక టీకాల అధికారి డాక్టర్ సంపత్కుమార్ పాల్గొన్నారు. -
మహిళల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం
ఇల్లంతకుంట(మానకొండూర్): మహిళలు అన్ని రంగాల్లో అభ్యున్నతి చెందాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. మండలంలోని రేపాక, తాళ్లపల్లి గ్రామాల్లో ఆదివారం అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేశారు. మగపిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనించాలన్నారు. వారు బాగా చదువుకునేలా ప్రోత్సహించి ఉన్నతంగా తీర్చిదిద్దాలని కోరారు. సర్పంచ్ ఖాతా మల్లేశం, ఉప సర్పంచ్ కోదని మహేశ్, మాజీ ఎంపీపీ రమణారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భాస్కర్రెడ్డి, తాళ్లపల్లి సర్పంచ్ మీసాల కనకరాజు, ఎంపీడీవో శశికళ, ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్ పాల్గొన్నారు. ఘనంగా మహిళా దినోత్సవం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సతీమణి అనురాధ, ఎంపీడీవో శశికళ, రేపాక మహిళా సంఘాల సభ్యులను మహిళా దినోత్సవం సందర్భంగా శాలువాలతో సన్మానించారు. ముస్తాబాద్(సిరిసిల్ల): గ్రామస్థాయిలో బీజేపీ బలోపేతం కోసం కార్యకర్తలు కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి కోరారు. ముస్తాబాద్లో పండిత్ దీన్దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ రెండో రోజు శిబిరం ఆదివారం జరిగింది. బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు సౌల్ల క్రాంతి, బీజేపీ ఉపాధ్యక్షులు శీలం రాజు, సంతోష్రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మట్ట వెంకటేశ్వర్రెడ్డి, సర్పంచులు నక్కదాసరి రవి, మెంగని శ్రీనివాస్, దగ్గు నవీన్, మెంగని మహేందర్, గోపి, మహేశ్వరి, సత్యంరెడ్డి, ప్రశాంత్రెడ్డి, శ్రీనివాస్రావు, చిగురు వెంకన్న, మహేశ్, వేణుగోపాల్ పాల్గొన్నారు. సిరిసిల్లటౌన్: తెలంగాణ ఉద్యమకారుల హక్కులను సాధిస్తామని ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు వెంగల శ్రీనివాస్ పేర్కొన్నారు. సిరిసిల్ల ప్రెస్క్లబ్లో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల భూమి, రూ.20వేలు పెన్షన్, సంక్షేమ బోర్డు, గుర్తింపుకార్డు, హెల్త్ ఇన్సూరెన్స్ హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి 25 నెలలు గడుస్తున్నా నెరవేర్చకపోవడం బాధాకరమన్నారు. కొక్కుల ఆంజనేయులు, గుజ్జే దత్తాద్రి, కర్నె లక్ష్మి, చిలుక శారద, గోదావరి, మల్లేశ్వరీ, బల్ల చంద్రకళ, కొలిపాక విజయ, ఏనుగుల స్వప్న, గాజుల ఉమ పాల్గొన్నారు. కరాటేలో ప్రతిభ సిరిసిల్లటౌన్: రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో జిల్లాకు చెందిన స్పార్క్ కుంగ్ఫూ కరాటే విద్యార్థులు 20 మంది విద్యార్థులు ప్రతిభ చూపారు. ధర్మపురిలో జరిగిన పోటీల్లో గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సాధించారు. మాస్టర్ వొడ్నాల శ్రీనివాస్, గ్రాండ్ మాస్టర్ ఎం.ఎ. హమీద్, మాస్టర్ సయ్యద్ యాకుబ్, మాస్టర్ కోటేశ్వర్ అభినందించారు. -
విలీనంలో దాహం కేకలు
సిరిసిల్ల అర్బన్: విలీన గ్రామాల్లో తాగునీటి కోసం స్థానికులు పడుతున్న కష్టాలు అనేకం. రెండేళ్లుగా ప్రజాప్రతినిధులు లేకపోవడంతో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. పెద్దూరులో పారిశుధ్యం పనులపై పట్టింపు కరువవడంతో పలు కాలనీలు కంపు కొడుతున్నాయి. మిషన్ భగీరథ పైపులు పగిలిపోయి నీరు వృథాగా పోతుంది. పట్టించుకునే వారు లేక విలీన గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. అన్నీ సమస్యలే.. సిరిసిల్ల మున్సిపాలిటీ శివారులోని పెద్దూరులో ఓ వైపు నీరు సరఫరా అవుతున్నా ఇప్పలపల్లికి వెళ్లే దారిలోని పోచమ్మ ఆలయం నుంచి పైకి తాగునీరు లేక ఆ కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పలపల్లికి వెళ్లే ప్రధాన రహదారి పక్కనే మురుగునీరు నిలిచి దుర్వాస వస్తోందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని డ్రైనేజీలను శుభ్రం చేయకపోవడంతో చెత్తాచెదారం డ్రెయినేజీల్లో చేరి కంపు కొడుతున్నాయి. తాగునీటికి కటకట గ్రామంలోని పలు కాలనీల్లో తాగునీటికి స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రోజు విడిచి రోజు నీ టిని సరఫరా చేస్తున్నా నల్లాల ద్వారా పది బిందెలకు మించి రావడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్ల పైపులైన్ పగిలి పోయి మురుగునీరు అందులోకి చేరి తాగునీరు కలుషితం అవుతోందని స్థానికులు చెబుతున్నారు. ఓ వైపు వృథా.. మరోవైపు తిప్పలు విలీన గ్రామాల్లో లీకేజీలతో అపరిశుభ్రం ప్రజాసమస్యలపై పట్టింపు కరువు -
నారీశక్తి..
ఆదివారం శ్రీ 8 శ్రీ మార్చి శ్రీ 2026మామిడి కొనాల మీన..● ధైర్యంగా ఫిర్యాదు చేస్తే సత్వర న్యాయం ● పోలీసుశాఖలోకి యువతులు రావాలి ● కుటుంబం అండతో ఉద్యోగంలో రాణిస్తున్నా ● ‘సాక్షి’తో ఏసీపీ వాసంశెట్టి మాధవి● జానపదాలతో ట్రెండింగ్లో నాగవ్వ సాక్షి, కరీంనగర్ డెస్క్: యక్షగానంతో ఆమె ప్రస్థానం ప్రారంభించింది. నాన్న పాటలను కై కట్టి నేర్చుకుంది. చదువుకోకున్నా జానపదాన్ని ఒంట పట్టించుకుంది. పంటపొలాల సాక్షిగా తన పాటలను ప్రపంచానికి పరిచయం చేసింది. ‘తిరుపతి రెడ్డి’ అంటూ మొదలు పెట్టి ‘మోహన లా లి’ పాటతో పాపులర్ అ య్యింది. మంగ్లీతో జతకట్టి ‘బాయిలోనే బల్లి పలికే’ పాటతో వరల్డ్ ఫేమస్ కాగా.. ఇటీవల విడుదలైన ‘మామిడి కొనాల మీన’ పాటతో యూట్యూబ్లో ట్రెండింగ్ సృష్టిస్తోంది జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం గుల్లకోటకు చెందిన నాగవ్వ. యక్షగానంతో ప్రారంభమై.. తల్లిగారి ఊరైన అంబారిపేటలో యక్షగానంతో నాగవ్వ పాట ప్రారంభమైంది. తండ్రి యక్షగానం వింటూ పెరగడంతో పాటు తనూ బతుకమ్మ పాటలు, జానపదాలు, కాముని పాటలు పాడేది. పెళ్లి తరువాత అత్తగారిల్లు గుల్లకోటకు వచ్చాక కూడా పాటను మర్చిపోలేదు. తన భర్త భజన పాటలు పాడుతూ.. నాగవ్వను కూడా గొంతు బాగుంటుందని ప్రోత్సహించడంతో పాటు కొడుకులిద్దరూ కలిసి ‘సీఎంఎస్ చానెల్’ పెట్టి జానపదాలు పాడించారు. అలా తను తొలిపాట ‘తిరుపతి రెడ్డి’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ‘మోహనలాలి’ పాటతో మరింత దగ్గరైంది. ‘సారంగదరియా షో’లో మూడు ఎపిసోడ్లలో పాల్గొంది. మంగ్లీతో కలిసి ‘కొప్పులోని పువ్వమ్మ బాయికాడి బతుకమ్మ’ పాట పడింది. తరువాత ‘బాయిలోనే బల్లి పలికే’ పాట ప్రపంచాన్ని ఊర్రూతలూగించింది. లక్షల్లో వ్యూస్ సంపాదించింది. ఇటీవల విడుదలైన ‘మామిడి కొనాల మీన’ పాట సరికొత్త ట్రెండ్ సృష్టిస్తూ.. వ్యూస్లో లక్షల్లో దూసుకెళ్తుంది. తనకు గుర్తింపు రావడానికి తన కుటుంబ ప్రోత్సాహం ఎంతో ఉందని నాగవ్వ చెబుతోంది. ముఖ్యంగా కొడుకులిద్దరూ తాను పాడడాన్ని ఎంతో ప్రోత్సహిస్తారని వివరించింది. విశ్వఖ్యాతిఆమెకు భయం ఎక్కువే.. కానీ భూదేవికి ఉన్నంత ఓపిక ఉంటుంది. ఆమెకు బాధా ఎక్కువే.. కానీ.. అన్ని బాధ్యతలు మోస్తుంది. కుటుంబానికి చేదోడుగా ఉంటూ.. ఆర్థికంగా భరోసా కల్పిస్తోంది. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన అతివలు ప్రస్తుతం అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. విద్య, వ్యాపారం, ఉద్యోగం ఇలా.. ఏ రంగాన్ని ఎంచుకున్నా అగ్రపథాన నిలుస్తున్నారు. ఆనాడు అక్షరాలు అంటే తెలియని మహిళలు నేడు డిజిటల్ మార్కెటింగ్లో రికార్డు సృష్టిస్తున్నారు. కుటుంబ బాధ్యతలు భుజాన వేసుకుని, పిల్లలను ఉన్నతంగా చవిదించి, జీవితంలో స్థిరపడేలా చేస్తున్నారు. ఒకప్పుడు పోలీసు అంటేనే భయపడేవారు.. ఇప్పుడు ఆ రంగంలో ఉత్సాహంగా రాణిస్తున్నారు. ఐపీఎస్ నుంచి కానిస్టేబుల్ వరకు బాధితులకు అండగా నిలుస్తున్నారు. బీడీలు చుట్టిన చేతులు పిల్లలకు ఓనమాలు నేర్పిస్తున్నాయి. పల్లెల్లో వ్యవసాయ పనుల్లో వినిపించిన గొంతులు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రపంచ గుర్తింపు పొందుతున్నాయి. పలువురు మహిళలు ఉమ్మడిగా ఏర్పడి ప్రారంభించిన హోంఫుడ్స్ ఖండాంతరాల్లో రుచులు పంచుతున్నాయి. నేడు మహిళా దినోత్సవం సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని పలువురు ఆదర్శ మహిళలపై ప్రత్యేక కథనం..!! మహిళల భద్రతకు పెద్దపీటఅంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రస్తుత సమాజంలో వారికున్న స్వేచ్ఛ, సమానత్వం, నిర్ణయాలు.. తదితర అంశాలపై ‘సాక్షి’ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించగా.. 100మంది మహిళలు చెప్పిన సమాధానాలు ఇలా.. 25%కరీంనగర్క్రైం/హుజూరాబాద్: ‘అతివల భద్రతకు పోలీసుశాఖ పెద్దపీట వేస్తోంది. ఏ విషయంలోనైనా అన్యాయానికి గురైతే పోలీసుస్టేషన్కు వచ్చి ధైర్యంగా ఫిర్యాదు చేయండి. నిందితులపై చర్యలు తీసుకుని, సత్వర న్యాయం అందేలా చూస్తాం. యువతులు భద్రత లేని ప్రైవేటు ఉద్యోగాల కన్నా పోలీసు ఉద్యోగంలోకి రావాలి. శివంగుల్లా నేరస్తుల భరతం పట్టాలి’. అని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఏసీపీ వాసంశెట్టి మాధవి. కుటుంబం అండగా ఉండడంతో పోలీసు ఉద్యోగంలో రాణిస్తున్నాని వెల్లడించారు. ధైర్యంగా ముందడుగు వేస్తేనే విజయం సాధిస్తామని సూచిస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడారు.మహిళల భద్రతకు పోలీసింగ్లో మార్పులు పోలీసుశాఖలోని షీటీంలు మహిళల కోసం పని చేస్తాయి. సైబర్క్రైం యూనిట్ల ద్వారా నిందితులను త్వరగా పట్టుకుంటున్నాం. స్పెషల్ ఉమెన్ స్టాల్స్, మహిళా బ్లూకోల్ట్స్, హ్యాక్ఐ యాప్, సీసీ కెమెరాలు, భరోసా సెంటర్, షీ బాక్కులు, హెల్ప్లైన్ సెంటర్లు మహిళల కోసం ఏర్పాటు చేసినవే. మహిళలు రాత్రివేళలలో వెళ్లేప్పుడు సురక్షిత మార్గాలు ఎంచుకోవాలి. ఆటోలు, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణిస్తే వాహన నంబర్లు కుటుంబసభ్యులకు మెసేజ్ చేయాలి. లైవ్ లొకేషన్ షేర్ చేయాలి. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100, 112, 181, 8712670759 ఫోన్ నంబర్ను సంప్రదించాలి. నేరాలు పెరుగుతున్నాయి గృహహింస, సైబర్నేరాలు, స్టాకింగ్, లైంగికదాడి కేసులు, చిన్నపిల్లలపై అత్యాచారాలు, మైనర్లపై ప్రేమపేరుతో జరుగుతున్న మోసాలపై బాధితులు పోలీసుస్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు. సోషల్ మీడియా ద్వారా ఫొటో, వీడియో మార్ఫింగ్ కేసులు పెరుగుతున్నాయి. గృహహింస కేసుల్లో బాఽధితులు ఫిర్యాదు చేసిన తర్వాత కుటుంబ ఒత్తిడి, వారి పిల్లల భవిష్యత్తు, ఆర్థికపరమైన ఇబ్బందులు భరించలేక చాలామంది కేసుల్లో రాజీ పడుతున్నారు. దీంతో నిందితులకు శిక్ష పడే అవకాశం తక్కువగా ఉంటుంది. మహిళలకు స్వేచ్ఛగా వారి సమస్యను తోటి మహిళా అధికారికి చెప్పుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి బాధితులు స్వయంగా పోలీసుల సాయం తీసుకోవచ్చు. పోలీసు ఉద్యోగం సవాలే పోలీసుశాఖలో క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం, ధైర్యం, నిబద్ధత, పారదర్శకతతో పనిచేయడం ద్వారా ఎన్ని సవాళ్లైనా ఎదుర్కోవచ్చు. పోలీసు ఉద్యోగం ప్రతిరోజు సవాల్గానే ఉంటుంది. నేను వ్యక్తిగతంగా ఇప్పటి వరకు ఎలాంటి సవాళ్లు ఎదుర్కోలేదు. నా 30ఏళ్ల సర్వీసులో ఎస్సై, సీఐ, ప్రస్తుతం ఏసీపీగా కొనసాగుతున్నా పోస్టింగ్లో మహిళ అన్న వ్యత్యాసం ఎక్కడా చూడలేదు. కుటుంబ సభ్యుల తోడ్పాటుతో ఉద్యోగాన్ని బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నా. డిపార్డుమెంటులో చేరేందుకు యువతులు ఆసక్తి చూపుతున్నారు. డిగ్రీలు, పీజీలు చేసి రక్షణలేని కాల్సెంటర్లు, ప్రైవేట్ ఉద్యోగాలు చేయడం కన్నా ప్రజలకు రక్షణ కల్పించే పోలీసుశాఖలోకి రావాలి. ఈ ఉద్యోగంతో మానసికంగా, శారీరకంగా బలంగా ఉండొచ్చు. నన్ను కదిలించిన ఘటన అదే.. ప్రేమపేరుతో మోసపోయి, లైంగికదాడికి గురైన ఓ బాధితురాలు పిచ్చిదైపోయింది. ఆ ఘటన ఆమె జీవితాన్నే మార్చింది. మానసిక వైకల్యం కింద నెలనెలా పెన్షన్ తీసుకోవడం నాకు బాధనిపించింది. ఆ కేసులో నిందితుడికి శిక్షపడేలా చేశాను. బాధితురాలికి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కింద రూ.5 లక్షలు ఇప్పించేందుకు ముందుండి పనిచేశాను. తనుకు చేసిన తరువాత సాయం నాకు గర్వంగా అనిపించింది. ఎన్నికల విధుల్లో ఉన్నప్పుడు చిన్నపిల్లల తల్లులు ఓటువేసి వచ్చే వరకు, పిల్లలను లాలించడం ఆనందంగా అనిపించేది. ధైర్యంగా ముందుకు సాగాలి మహిళలు బాధితులుగా ఉన్న కేసుల్లో సామాజిక అవగాహన లోపం, లేట్ రిపోర్టింగ్తో నిందితులకు త్వరగా శిక్ష పడడం లేదు. కొన్ని కేసుల్లో సాక్ష్యులను కోర్టుకు రప్పించడంలో కష్టమైనా ముందుకు వెళ్తున్నాం. స్పీడ్ ట్రయల్ నడిపిస్తూ ముందుకు సాగుతున్నాం. మహిళలు ధైర్యంగా ఉండాలి. తమ హక్కుల గురించి అవగాహన కలిగి ఉండి, ఆపద సమయంలో పోలీసులసాయం పొందాలి. అందరికీ.. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.8 మంది100%50%40 మంది252 మందిస్నేహితుల సూచనతల్లిదండ్రుల నిర్ణయం8మీరు ప్రస్తుతం ఎంచుకున్న కోర్సును సొంత నిర్ణయంతో చేస్తున్నారా?సొంత నిర్ణయంలేదు90మీ నిర్ణయాలకు మీ ఇంట్లో ఎంతమేర మద్దతు లభిస్తుంది?సమాజంఒక సీ్త్ర స్వతంత్రంగా ముందుకు వెళ్లాలంటే ఎవరి సహకారం ఎక్కువ అవసరం?493వీర్నపల్లి(సిరిసిల్ల): ఆమె చదువుకోలేదు. కానీ చదువు విలువ తెలుసు. ఆమెకు ఆస్తులు లేకున్నా పిల్లలే తన ఆస్తి అనుకుంది. ఉప్పు తట్ట మోసింది. ఎడ్ల బండిపై ఊరూరా తిరుగుతూ ఉప్పు అమ్మింది. భర్త దూరదేశం వెళ్లినా అధైర్యపడలేదు. కూరగాయలు అమ్మి బిడ్డలు సమాజంలో ఉన్నతస్థానాల్లో నిలబెట్టింది రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోని భావుసింగ్నాయక్ తండాకు చెందిన బట్టు మంగవ్వ. నలుగురు సంతానం మంగవ్వ– హరిచంద్ దంపతులకు నలుగురు సంతానం. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధతో హరిచంద్ గల్ఫ్దేశాలకు వెళ్లాడు. కుటుంబ భారం మంగవ్వపైనే పడింది. తాను గంజినీళ్లు తాగినా పిల్లలకు మంచి చదువు చెప్పించింది. పెద్ద కొడుకు బట్టు విజయ్కుమార్ ఎంఏ, ఎంఫిల్, పీహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్ అందుకున్నాడు. నిర్మల్లోని మహాత్మా జ్యోతి బాపూలే గురుకుల డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా చేరి, ఆరు నెలల్లోనే అక్కడే ప్రిన్సిపాల్గా బాధ్యతలు నిర్వహించాడు. కూతురు సుజాత తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో మ్యూజిక్లో (ఎం.ఏ) పూర్తి చేసి, మణుగూరు ఏకలవ్య పాఠశాలలో సంగీత ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. మరో కొడుకు రాజేష్ ఎన్ఏసీలో ల్యాండ్ సర్వేయర్గా శిక్షణ పొంది, కరీంనగర్ కలెక్టరేట్లో సర్వేయర్గా సేవలందిస్తున్నారు. చిన్న కుమార్తె సరిత ఫ్యాషన్ డిజైనింగ్లో డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఒకప్పుడు ఉప్పు అమ్మితే కానీ పూట గడవని స్థితి నుంచి నేడు నలుగురు పిల్లలు ఉన్నత ఉద్యోగాల్లో ఉండటం చూసి తండావాసులు మంగవ్వను అభినందిస్తున్నారు.కుటుంబం3స్నేహితులు– సప్తగిరికాలనీ(కరీంనగర్)తన పిల్లలతో బట్టు మంగవ్వ4452 విద్య, వ్యాపారం, ఉద్యోగంలో అతివల ప్రతిభ కుటుంబ బాధ్యతలు మోస్తూ పిల్లలను తీర్చిదిద్దుతున్న వైనం ఖాకీ చొక్కా వేసుకుని బాధితులకు సత్వర న్యాయం పల్లెపాటల గొంతుకు ప్రపంచ గుర్తింపు అమ్మచేతి వంటకు విదేశాల్లో అభిమానులు ఆదర్శం.. ఉమ్మడి జిల్లాలోని పలువురు అబలలు నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవంమీరు తీసుకునే రోజూవారి నిర్ణయాల్లో ఎంత మేరకు స్వతంత్రంగా వ్యవహరించగలుగుతున్నారు? -
మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట
● దేశంలోనే తెలంగాణ రోల్ మోడల్ ● ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చందుర్తి/వేములవాడఅర్బన్: మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. చందుర్తి మండలం మూడపల్లి, కట్టలింగంపేటల్లో శనివారం మహిళా సంఘాల భవన నిర్మాణాలకు భూమిపూజ, తిమ్మాపూర్, రామన్నపేటల్లో సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. వేములవాడఅర్బన్ మండలం చీర్లవంచలో ఇందిరమ్మ గృహప్రవేశానికి ప్రభుత్వ విప్ హాజరై లబ్ధిదారులకు నూతన వస్త్రాలను కానుకగా అందజేశారు. విప్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి, సంక్షేమం నిరంతరం కొనసాగుతున్నాయన్నారు. ఎంపీడీవో రాధ, సర్పంచులు చిలుక మల్లేశ్వరీ, కాపిల్ల శంకర్, పోతురాజు భారతి, ఆవా రి రమేశ్, రుద్రంగి ఏఎంసీ చైర్మన్ చెలుకల తిరుపతి, ఉపాధ్యక్షుడు బొజ్జ మల్లేశం, పార్టీ మండల అధ్యక్షుడు చింతపంటి రామస్వామి పాల్గొన్నారు. -
ఆధునిక హంగులతో కోర్టు కాంప్లెక్సు
సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రంలో ఆధునిక హంగులు, సకల వసతులతో నూతన కోర్టు భవనాల సముదాయం నిర్మిస్తున్నట్లు హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరీశ్కుమార్ సింగ్ పేర్కొన్నారు. జిల్లా కోర్టు కాంప్లెక్సు నిర్మాణానికి శనివారం వర్చువల్గా శంకుస్థాపన చేసి మాట్లాడారు. జిల్లా న్యాయమూర్తులు, న్యాయవాదులు రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు. పారదర్శకంగా న్యాయసేవలు నూతన కోర్టు భవన నిర్మాణం ప్రజల్లో న్యాయవ్యవస్థపై విశ్వాసాన్ని బలోపేతం చేస్తూ కక్షిదారులకు పారదర్శకంగా న్యాయసేవలు అందించాలని హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా కోర్టు పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.తుకారాంజీ పేర్కొన్నారు. ప్రతీ పౌరుడికి సామాజిక న్యాయం అందేలా న్యాయవ్యవస్థ పని చేయాలన్నారు. టెక్స్టైల్తో ఉపాధి జిల్లాలో టెక్స్టైల్, పవర్లూమ్ పరిశ్రమతో వేలాది కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ పేర్కొన్నారు. వేలాది మంది నేత కార్మికులు రేయింబవళ్లు శ్రమించి దేశవ్యాప్తంగా పేరు పొందిన వస్త్రాలను తయారు చేస్తున్నారని కొనియాడారు. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం జిల్లాలోనే ఉందన్నారు. సన్మానాలు..సందర్శన..వితరణ వేదికపై హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా కోర్టు పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.తుకారాంజీ, జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ విజయసేన్రెడ్డి, జస్టిస్ నందికొండ నర్సింగరావు, జస్టిస్ ఈవీ వేణుగోపాల్, జస్టిస్ పుల్లా కార్తీక్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజలను కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతే ఘనంగా సన్మానించారు. అనంతరం జిల్లా కోర్టులు, బార్ అసోసియేషన్, అధికారుల ఆధ్వర్యంలో కలెక్టర్, ఎస్పీలను సన్మానించారు. జిల్లా సంక్షేమశాఖ ఆధ్వర్యంలో దివ్యాంగ డిగ్రీ, ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు ల్యాప్టాప్స్, బ్యాటరీ వీల్చైర్స్, ఎంపవర్కార్ట్స్ను పంపిణీ చేశారు. అనంతరం చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, అదనపు ఎస్పీ చంద్రయ్య, 1వ అదనపు జిల్లా జడ్జి బి.పుష్పలత, పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధిక జైస్వాల్, సీనియర్ సివిల్ జడ్జి, డీఎల్ఎస్ఏ పి.లక్ష్మణాచారి, వేములవాడ సీనియర్ సివిల్ జడ్జి, అజయ్ కుమార్ జాదవ్, ఆర్డీవో వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ప్రవీణ్, వేములవాడ జూనియర్ సివిల్ జడ్జి జ్యోతిర్మయి, సిరిసిల్ల అదనపు జూనియర్ సివిల్ జడ్జీలు కావేటి సృజన, గడ్డం మేఘన, సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జూపల్లి శ్రీనివాసరావు, వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడిసె సదానందం, డీఎస్పీ నాగేంద్రచారి, తహసీల్దార్ మహేశ్కుమార్, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, గవర్నమెంట్ ప్లీడర్స్, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు తదితరులు పాల్గొన్నారు. -
క్యాష్లెస్ లావాదేవీల్లో ‘నిర్మల’
యైటింక్లయిన్కాలనీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను సద్వినియోగం చేసుకోవడంతో పాటు డిజిటల్ చెల్లింపులపై రామగుండం కార్పొరేషన్ యైటింక్లయిన్కాలనీ అల్లూరు గ్రామానికి చెందిన చిరు కిరాణా వ్యాపారి బాలసాని నిర్మల శ్రద్ధపెట్టారు. నగదు రహిత లావాదేవీలు నిర్వహించి, అత్యధికంగా రూ.5,340 క్యాష్ బ్యాక్ పొంది ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె దృఢసంకల్పానికి అబ్బురపడిన కేంద్ర ప్రభుత్వం 2026 జనవరి 26 గణతంత్ర వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పించింది. నిర్మల తన భర్త బాలసాని రవికుమార్ గౌడ్తో కలిసి ఢిల్లీలోని గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిశారు. రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ అరుణశ్రీ చేతుల మీదుగా సత్కారం పొందారు. స్వనిధి రుణంతో నవచైతన్యం నిర్మల నవ చైతన్యం–2020లో సీఎం స్వనిధి పథకంలో తొలి విడతగా రూ.10వేలు రుణం పొంది ఇంట్లో కిరాణం ప్రారంభించారు. క్రమం తప్పకుండా రుణ వాయిదాలు డిజిటల్ రూపంలో చెల్లించడంతో ప్రభుత్వం రెండో విడతగా రూ.20 వేలు మంజూరు చేసింది. ఆ మొత్తంతో కిరాణంతో పాటు చీరల వ్యాపారం, కుట్టు మిషన్, మగ్గంవర్క్ ప్రారంభించి సక్సెస్ అయ్యారు. మూడోవిడత రూ.50వేలు రుణం పొంది ఆదర్శంగా నిలిచారు. -
‘నలిమెల’కు బూర్గుల పురస్కారం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): బహుభాషావేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నలిమెల భాస్కర్.. బూర్గుల రామకృష్ణారావు ప్రతిభ పురస్కారానికి ఎంపికయ్యారు. సాహిత్యంలో భాస్కర్ చేస్తున్న కృషిని గుర్తించి ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషానిలయం ఆధ్వర్యంలో ఈనెల 13న హైదరాబాద్లో నిర్వహించే కార్యక్రమంలో పురస్కారాన్ని అందజేయనున్నారు.ట్రాక్టర్ బోల్తా.. యువకుడి మృతిముస్తాబాద్(సిరిసిల్ల): ముస్తాబాద్ మండలం పోతుగల్లో ట్రాక్టర్ బోల్తా పడ్డ సంఘటనలో ఓ కార్మికుడు దుర్మరణం చెందగా, మరో కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఎస్సై గణేశ్ తెలిపిన వివరాలు. పోతుగల్లో ఇటుక బట్టీలలో పనిచేస్తున్న ఒడిశాకు చెందిన నందకుమార్(26), పూర్ణకుమార్(36) శనివారం రాత్రి ట్రాక్టర్పై వెళ్లారు. వీరు నడుపుతున్న ట్రాక్టర్ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఇంజిన్ భాగం బోల్తా పడడంతో నందకుమార్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. తీవ్రంగా గాయపడ్డ పూర్ణకుమార్ను 108 అంబులెన్స్లో సిద్దిపేట ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
‘సాక్షి’ చక్కటి అవకాశం కల్పించింది
డబుల్బెడ్రూమ్ కాలనీలో సమస్యలు తెలుసుకున్న. సాక్షి యాజమాన్యం నన్ను స్టార్ రిపోర్టర్గా ప్రజల మధ్యకు తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు. ఇక్కడి సమస్యలు తెలుసుకున్న. తాగునీరు, వైకుంఠధామాలు లేక ఇబ్బందులు పడుతుండ్రు. పార్కులు, డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం తదితర సమస్యలను ఎమ్మెల్యే కే.తారకరామారావు, కలెక్టర్ గరీమా అగ్రవాల్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తా. మున్సిపల్ నుంచి ప్రత్యేక దృష్టి సారిస్తాం. మౌలిక వసతుల కల్పనకు పాలకవర్గం కృషి చేస్తుంది. – జిందం కళ, మున్సిపల్ చైర్పర్సన్, సిరిసిల్ల -
కూతురుంటే గర్వపడాలి
కరీంనగర్ అర్బన్: మహిళలు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు మన ఆలోచనా ధోరణే కారణం. ఇందులో మొదటిది ఆడ, మగా అనే వివక్ష. కొడుకు, కూతురు మధ్య వివక్షత చూపొద్దు. చిన్నప్పటి నుంచే ఇద్దరూ సమానమేనని తెలిసేలా పెంచండి. పరిపాలనా పరంగా మహిళలకు అన్ని విషయాల్లో యంత్రాంగం తోడుంటుంది. మహిళలు, పిల్లల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తాం. సీ్త్ర, శిశుసంక్షేమ శాఖ ద్వారా చిన్నారుల శారీరక పటిష్టతకు, స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక చేయూత ద్వారా తోడ్పాటునిస్తాం. – చిత్రామిశ్రా, కలెక్టర్, కరీంనగర్ -
కార్యాలయాలు పరిశుభ్రంగా ఉంచాలి
బోయినపల్లి(చొప్పదండి): ప్రభుత్వం చేపడుతున్న 99 రోజుల ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళికలో ప్రతీశాఖ కార్యాలయం పరిశుభ్రంగా ఉంచాలని డీఆర్డీవో మచ్చ గీత, డీపీవో షర్ఫొద్దీన్ పేర్కొన్నారు. మండలంలోని వెంకట్రావుపల్లి హైస్కూల్, నీలోజిపల్లి జీపీ పరిసరాలను డీఆర్డీఓ గీత, కొదురుపాక, బోయినపల్లి పీహెచ్సీలను డీపీవో షర్ఫొద్దీన్ శనివారం పరిశీలించారు. ఎంపీడీవో జయశీల, ఎంపీవో శ్రీధర్ ఉన్నారు. 12న హుండీ లెక్కింపువేములవాడ: భీమన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న భక్తులు స్వామి వారి హుండీలలో వేసిన కట్నాలు, కానుకలను ఈనెల 12న లెక్కించనున్నట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. భీమేశ్వర సదన్లోని పార్కింగ్ స్థలంలో లెక్కిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆలయ అధికారులు, సిబ్బంది సకాలంలో హాజరుకావాలని సూచించారు. -
బో‘నమో’ పోచమ్మ
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని రాచర్లగొల్లపల్లి, రాచర్లతిమ్మాపూర్ గ్రామాల్లో శనివారం పోచమ్మ బోనాలు తీశారు. రాచర్లగొల్లపల్లిలో రెడ్డి సంఘం, రాచర్లతిమ్మాపూర్లో అంబేడ్కర్ సంఘం ఆధ్వర్యంలో బోనాలు తీశారు. పోచమ్మతల్లి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి, సెస్ డైరెక్టర్ వరుస కృష్ణహరి, సర్పంచ్ కొండ రమేశ్గౌడ్, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు మర్రి శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని పెద్దలింగాపూర్లో 26 రోజులుగా రైతులు చేపట్టిన రిలేనిరాహార దీక్షలు శనివారం కొనసాగాయి. అసంపూర్తిగా ఆగిపోయిన ఎల్ఎం 6 కాలువను పూర్తి చేయాలని వారు కోరారు. రైతులు కరికె నవీన్కుమార్, ఎద్దు విజయ, మహేందర్, నర్సయ్య, అనిత, దుమాల భారతి, అంబటి అనిత, పయ్యావుల ఎల్లవ్వ, గాదె రవి పాల్గొన్నారు. నేడు హెచ్పీవీ టీకాసిరిసిల్ల అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రి, వేములవాడ ప్రాంతీయ ఆస్పత్రి, ఎల్లారెడ్డిపేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం హెచ్పీవీ టీకా కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి రజిత తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ను నివారించేందుకు 2011, ఏప్రిల్ 1 నుంచి 2012, మార్చి 31 మధ్య జన్మించిన వారికి టీకాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. జిల్లాలో 3,773 మంది బాలికలను గుర్తించినట్లు పేర్కొన్నారు. శతశాతం వ్యాక్సిన్ వేయించి బాలికల బంగారు భవిష్యత్కు బాట వేయాలని తెలిపారు. జిల్లా వ్యాధినిరోధక టీకాల అధికారి సంపత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అంగన్వాడీ ఏర్పాటు చేయండి
వందలాది కుటుంబాలు ఉండే కాలనీ ఇది. అందరూ పేదలే. పిల్లల కోసం అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. డ్రైనేజీల్లో నీరు ప్రవాహం లేక మురుగురోడ్లపై పారుతుంది. పాడైన డ్రైనేజీ స్థానంలో కొత్తగా నిర్మించాలి. నిత్యం చెత్తను ఊడ్చేలా చూడాలి. తాగునీటి కొరతను తీర్చాలి. – గాలి లత బీజేపీతోనే దేశ కీర్తి విశ్వవ్యాప్తం ముస్తాబాద్(సిరిసిల్ల): బీజేపీతోనే దేశ కీర్తిని చాటే అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతాయని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పేర్కొన్నారు. ముస్తాబాద్లో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ శిబిరాన్ని శనివారం ప్రారంభించి మాట్లాడారు. పండిత్ దీన్ దయాళ్ స్ఫూర్తిగా కార్యకర్తలు పనిచేయాలన్నారు. అధికారం ఉన్నప్పుడే ప్రజలకు ఏదైనా చేయగలమన్నారు. పార్టీ సిరిసిల్ల ఇన్చార్జి మోహన్రెడ్డి, మండల అధ్యక్షుడు సౌల్ల క్రాంతి, సర్పంచ్ నక్కదాసరి రవి, జిల్లా ఉపాధ్యక్షుడు మల్లారపు సంతోష్రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యుడు మెరుగు అంజాగౌడ్, శీలం రాజు, గోపికృష్ణ, మహేందర్, శ్రీనివాస్రావు, రమేశ్, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు. లారీ, కారు ఢీ ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని రాచర్లగొల్లపల్లిలో శనివారం లారీ, కారు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. కామారెడ్డి నుంచి సిరిసిల్లకు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో కారు లారీ ముందు భాగంలో ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ధ్వంసమైంది. ఎవరికీ గాయాలు కాలేవు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
పట్టుచీరపై నారీశక్తి చిత్రాలు
సిరిసిల్ల: సిరిసిల్లకు చెందిన ప్రముఖ చేనేత శిల్పి వెల్ది హరిప్రసాద్–రేఖ దంపతులు భారత నారీశక్తి ప్రతిబింబించేలా అద్భుతమైన పట్టుచీరను నేశారు. మూడు నెలలపాటు శ్రమించి ప్రత్యేకంగా చేనేతమగ్గంపై పట్టుచీరను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నారీశక్తి స్ఫూర్తితో గతేడాది మన దేశ ఆడబిడ్డలు ఎన్నో ఘనవిజయాలు సాధించారన్నారు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్తో మనదేశం మహిళల సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. క్రీడారంగంలోనూ ఎన్నో గొప్ప విజయాలు సాధించారన్నారు. వారి విజయాలన్నింటిని ప్రతిబింబించేలా చేనేత చీరను నేసినట్లు తెలిపారు. ఆపరేషన్ సింధూర్తోపాటు షూటర్ సుజిత్సింగ్ ముఖచిత్రాలు, మహిళా క్రికెట్ వరల్డ్కప్, మహిళా కబడ్డీ వరల్డ్కప్, అంధుల మహిళా క్రికెట్ వరల్డ్ కప్, ఆర్చర్ సీతల్దేవి జ్యోతి చిత్రాలను ఒకే పట్టుచీరపై ఇమిడేలా నేసినట్లు వెల్లడించారు. మన దేశ మహిళల విజయాలను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరోసారి గుర్తుచేయాలని ఈ ప్రత్యేకమైన చీరను సిద్ధం చేసి వారికి అంకితం చేస్తున్నామన్నారు. చీర పొడవు 5.5 మీటర్లు, చీర బరువు 0.560 గ్రాములు, చీర నేసేందుకు రూ.లక్ష ఖర్చు చేసినట్లు వారు వివరించారు. -
మసాలా సు‘చరిత’
● 2019లో ప్రారంభించి.. 15 మందికి ఉపాధి ● ఆదర్శంగా నిలుస్తున్న సుచరిత జమ్మికుంట(హుజూరాబాద్): స్వయంకృషితో చిరుపరిశ్రమ ప్రారంభించి పలువురు మహిళలకు ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు జమ్మికుంట పట్టణానికి చెందిన సుచరిత. జమ్మికుంట మున్సిపల్ పరిధి కొత్తపల్లికి చెందిన వర్మని సుచరిత, రమేశ్ దంపతులు. రమేశ్ ఎలక్టీషియన్. జీవనం కష్టంగా ఉన్న రోజుల్లో చిన్న ఆలోచనతో పెద్ద విజయం సొంతమైంది. కీర్తన మసాల తయారీ, రిటైల్ అండ్ హోల్సేల్ పరిశ్రమను 2019లో ప్రారంభించారు. మొదట ముగ్గురు కుటుంబ సభ్యులు, రూ.3వేల పెట్టుబడితో మసాల ప్యాకెట్లు తయారు చేసి జమ్మికుంట, హుజూరాబాద్ పట్టణాల్లోని కిరాణం షాపుల్లో హోల్సేల్గా విక్రయించారు. మెప్మా, నెహ్రూ గ్రూపుల సాయంతో 2022లో రూ.లక్ష రుణంతో వ్యాన్ కొనుగోలు చేశారు. పీఎంజీ ద్వారా రూ.5లక్షలు రుణంతో మిషన్ కొని మసాలాలు ప్యాకింగ్ చేసి వరంగల్, కరీంనగర్, జనగాం, పెద్దపల్లి, గోదావరిఖని తదితర పట్టణాల్లో హోల్సేల్గా విక్రయిస్తున్నారు. ఏడాదిలో రూ.లక్షల్లో టర్నోవర్ చేస్తూ 15 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. నెలకు రూ.50 వేల ఆదాయం మసాలా తయారీ, అమ్మకంతో నెలకు ఖర్చులు పో నూ రూ.50వేల వరకు ఆ దాయం వస్తుంది. మసాలా తయారీ, ప్యాకింగ్ కో సం 15 మంది మహిళలకు నెలకు రూ.6 వేల నుంచి రూ.10వేల వరకు జీతం ఇస్తూ ఉపాధి కల్పిస్తున్నాం. స్వయంకృషితో తమ కుటుంబంతో పాటు పలువురికి ఉపాధి కల్పించడం సంతోషంగా ఉంది. – సుచరిత, కీర్తన మసాలా చిరు పరిశ్రమ, జమ్మికుంట -
దుబాయిలో హెల్ప్లైన్
● ఎవరూ ఆందోళన చెందొద్దు ● ఇండియన్ పీపుల్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్రెడ్డిఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): గల్ఫ్ దేశాలలో ప్రస్తుత యుద్ధం నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయుల క్షేమ సమాచారం కోసం భారత ప్రభుత్వం ఇండియన్ కౌన్సిలేట్ను దుబాయ్లో ఏర్పాటు చేసింది. భారతీయులు ఆందోళనకు గురికాకుండా సలహాలు, సహాయం, సమాచారం అందించడానికి ఈ హెల్ప్లైన్ దోహదం చేస్తున్నట్లు ఇండియన్ పీపుల్స్ ఫోరం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కుంబాల మహేందర్రెడ్డి శుక్రవారం తెలిపారు. యుద్ధం ముగిసే వరకు దుబాయిలో హెల్ప్లైన్ కార్యాలయం కొనసాగిస్తామని పేర్కొన్నారు. స్కూల్ వ్యాన్ ఢీకొని ఒకరికి తీవ్రగాయాలు జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని గొల్లపల్లి రోడ్లో ద్విచక్రవాహనాన్ని పాఠశాల వ్యాన్ ఢీకొనగా ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. గొల్లపల్లి మండలం శంకర్రావుపేట గ్రామానికి చెందిన బండారి ప్రణీత్ శుక్రవారం జగిత్యాలలో ఓపెన్ డిగ్రీ పరీక్షలు రాసేందుకు హాజరయ్యాడు. తిరిగి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గొల్లపల్లి రోడ్లో ఎడ్ల అంగడి చౌరస్తా వద్ద ప్రైవేటు స్కూల్ వ్యాన్ ఢీకొట్టింది. ప్రవీణ్ తలకు తీవ్రగాయాలై అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. స్థానికులు జగిత్యాలలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కోసం కరీంనగర్కు తరలించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని ప్రమాదానికి కారణమైన వ్యాన్ను పోలీస్స్టేషన్కు తరలించారు. -
● సకల వసతులతో భవన నిర్మాణం ● రూ.81.60 కోట్లతో ఐదెకరాల్లో పనులు ● నేడు శంకుస్థాపన
నాలుగు అంతస్తుల్లో కోర్టు సముదాయంసిరిసిల్ల: జిల్లా కేంద్రంలో సకల వసతులతో కోర్టు భవన నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. పాత కోర్టు స్థానంలోనే ఐదెకరాల్లో రూ.81.60కోట్లతో నాలుగు అంతస్తుల్లో నిర్మించనున్నారు. రానున్న 50 ఏళ్ల అవసరాలు తీర్చేలా అత్యాధునిక వసతులతో నిర్మించే భవనం పనులకు శనివారం శంకుస్థాపన జరగనుంది. ఈ భవనంలో 12 రకాల న్యాయస్థానాలు కొలువుదీరేలా తీర్చిదిద్దనున్నారు. ఒక్కో అంతస్తు 21వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండనుంది. విశాలమైన కోర్టు హాళ్లు, ప్రతీ అంతస్తులో ప్రత్యేకంగా వాష్రూమ్లు కక్షిదారులకు వెయిటింగ్ హాళ్లు, కనీసం 300 కార్లకు పార్కింగ్ సౌకర్యం కల్పిస్తూ నూతన భవనం నిర్మించబోతున్నారు. సెల్లార్తోపాటు 10+2 నిర్మాణ శైలితో రెండేళ్లలో భవనం పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ప్రతిష్టాత్మకంగా శంకుస్థాపన కార్యక్రమం న్యాయస్థాన భవన సముదాయానికి శనివారం శంకుస్థాపన కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం కోర్టు ప్రాంగణంలో విలేకరుల సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ మాట్లాడుతూ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరిశ్కుమార్సింగ్ వర్చువల్ విధానాల్లో శంకుస్థాపనలో పాల్గొంటున్నారని వెల్లడించారు. హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా కోర్టు పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.తుకారాంజీ, జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ విజయసేన్రెడ్డి, జస్టిస్ నందికొండ నర్సింగరావు, జస్టిస్ ఈ.వి.వేణుగోపాల్, జస్టిస్ పుల్లా కార్తీక్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని తెలిపారు. సమావేశంలో న్యాయమూర్తులు బి.పుష్పలత, రాధిక జైస్వాల్, పి.లక్ష్మణాచారి, ఎ.ప్రవీణ్కుమార్, సిరిసిల్ల, వేములవాడ న్యాయవాదుల సంఘాల అధ్యక్షులు జూపల్లి శ్రీనివాసరావు, సదానందం పాల్గొన్నారు. సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకంసిరిసిల్ల: సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ జ్యోతి పేర్కొన్నారు. పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం జిల్లా న్యాయ సేవాధికర సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. జ్యోతి మాట్లాడుతూ మహిళలు కుటుంబం, సమాజం, విద్య, వైద్యం, రాజకీయాలు, వ్యాపారం వంటి అన్ని రంగాలలో విశిష్టమైన సేవలను అందిస్తూ సమాజ పురోగతికి తోడ్పడుతున్నారన్నారు. లోక్ అదాలత్ సభ్యుడు చింతోజు భాస్కర్, ప్రధానోపాధ్యాయులు మాట్ల కుమార్ పాల్గొన్నారు. -
కారాగారంలో ఖైదీల సంక్షేమం
జగిత్యాలజోన్: తెలిసో తెలియకో పలువురు తప్పు చేసి జైలులో ఖైదీలుగా జీవితం వెల్లదీస్తున్నారు. ఈనేపథ్యంలో జైలులో ఖైదీలకు అందుతున్న వసతుల గురించి తెలుసుకునేందుకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ విశేష కృషి చేస్తుంది. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి వెంకటమల్లిక్ సుబ్రహ్మా ణ్యశర్మ, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులు జగిత్యాల స్పెషల్ సబ్ జైలును సందర్శిస్తున్నారు. జగిత్యాల జైలులో దాదాపు 50–60 మంది రిమాండ్ ఖైదీలు ఉంటారు. ఏడాదిలో 84 సార్లు సందర్శన జిల్లా కేంద్రంలోని సబ్ జైలును జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏడాదిలో 84 సార్లు సందర్శించారు. 2023లో 24 సార్లు, 2024లో 74 సార్లు, 2025లో 76 సార్లు, 2026లో 8 సార్లు జైలును సందర్శించారు. ప్రతి శనివారం జైలులో ఖైదీలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారితో చర్చావేదికలు కొనసాగిస్తున్నారు. నేరం ఎందుకు చేయాల్సి వచ్చింది, జైలుకు ఎలా వచ్చామనే విషయాల గురించి న్యాయమూర్తులు తెలుసుకుంటున్నారు. నేరాలకు పాల్పడం వల్ల జీవితంలో ఏమి కోల్పోతున్నారో, కుటుంబాలు ఏ విధంగా చిన్నాభిన్నం అవుతున్నాయో ఖైదీలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి తోడు ఖైదీల హక్కులు, విధుల గురించి వివరిస్తున్నారు. జైలు సిబ్బందికి ఎలా సహకారం అందించాలో కూడా సూచిస్తున్నారు. వసతుల పరిశీలన జైలులో వసతుల గురించి ఖైదీలు, సిబ్బందిని అడిగి తెలుసుకుంటారు. అలాగే, జైలుకు రాగానే జడ్జిలు ప్రధానంగా భోజనశాల, ఖైదీలకు అందించే భోజనాన్ని పరిశీలిస్తుంటారు. జైలును పరిశుభ్రంగా ఉంచాలని, ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే మార్చాలని చెబుతుంటారు. ఖైదీలకు రోజువారీగా ఇచ్చే మెనూ తెలుసుకుంటారు. ప్రధానంగా ఖైదీల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించడంతో పాటు ఏదైనా సమస్య వస్తే వెంటనే వైద్యుడిని పిలిచేలా, అవసరమైతే ఆసుపత్రికి తరలించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సిబ్బందికి అదేశాలు జారీ చేస్తుంటారు. ఉచిత న్యాయం కోసం దరఖాస్తులు కోర్టుల్లో కేసులు వాదించడానికి న్యాయవాదిని పెట్టుకునే స్థోమత లేని ఖైదీలకు ఉచిత న్యాయం అందిస్తున్నారు. ఉచిత న్యాయం కోసం ఖైదీల నుంచి జిల్లా న్యాయ సేవా సంస్థ దరఖాస్తులు స్వీకరిస్తుంది. పోలీసులతో సమన్వయం చేసుకుని, జిల్లా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులు ఆయా కోర్టుల్లోని ఖైదీల కేసులను వాదిస్తున్నారు. దీనికి తోడు, ఖైదీల్లో మానసిక ధృడసంకల్పం పెంపొందించేందుకు జైలులోపల ఆహ్లాదకరమైన కార్యక్రమాలు నిర్వహించేలా ప్రోత్సహిస్తారు. జైలు గోడల మధ్య ఖైదీల్లో మానసిక పరివర్తన తెచ్చి, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సమాజంలో ఉత్తములుగా ఉండేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సిబ్బందికి సూచిస్తుంటారు. -
చెన్నయ్ పోలీసుల అదుపులో ఏటీఎం చోరీ నిందితుడు?
● బందోబస్తు మధ్య గోదావరిఖని కోర్టులో హాజరు గోదావరిఖని: సంచలనం సృష్టించిన ఏటీఎం చోరీ నిందితుడిని చెన్నయ్ పోలీసులు శుక్రవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి తీసుకొచ్చారు. 2024 ఫిబ్రవరిలో స్థానిక గంగానగర్, గౌతమినగర్ ఏటీఎంలలో చోరీ జరిగింది. అదే సమయంలో పోలీస్ సైరన్ మోగడంతో గంగానగర్లో చోరీ విఫలమైంది. అయితే, గౌతమినగర్ ఏటీఎంలో సుమారు రూ.25లక్షలు చోరీకి గురయ్యాయి. ఎన్టీపీసీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దేశవ్యాప్తంగా అనేక ఏటీఎంలలో చోరీలకు పాల్పడిన వారికోసం విచారణ జరపగా.. నిందితుడు చెన్నయ్ పోలీసులకు చిక్కాడు. విచారణలో గౌతమినగర్ ఏటీఎంలో చోరీచేసినట్లు అంగీకరించడంతో కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చేందుకు ఇక్కడకు తీసుకొచ్చారు. ప్రత్యేక ఎస్కార్ట్ పోలీసుల మధ్య కోర్టులో హాజరు పర్చిన అనంతరం శుక్రవారం రాత్రి రైలులో మళ్లీ చెన్నయ్ తీసుకెళ్లారు. దేశవ్యాప్తంగా ఏటీఎం చోరీల్లో సుమారు రూ.5కోట్లకుపైగా నిందితుడు తస్కరించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈమేరకు పూర్తిస్థాయిలో విచారణ నిర్వహిస్తున్నారు. నిందితుడిని గోదావరిఖని వన్టౌన్ పోలీసుస్టేషన్కు తీసుకురాగా ‘సాక్షి’ కెమెరా ఆ దృశ్యాన్ని బంధించింది. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతితంగళ్లపల్లి(సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారు పెట్రోల్బంకు సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బొడ్డు సత్యనారాయణ(55) అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు. జిల్లా కేంద్రంలోని బీవై నగర్కు చెందిన సత్యనారాయణ తంగళ్లపల్లి మండలం కేసీఆర్ నగర్లోని డబుల్ బెడ్రూమ్లో నివాసం ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి తంగళ్లపల్లి నుంచి కేసీఆర్ నగర్ వైపు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బొలేరో పికప్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య శోభ, ఇద్దరు సంతానం ఉన్నారు. తంగళ్లపల్లి పోలీసులు మృతదేహాన్ని సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ‘పది’ ఇంటర్నల్ మార్కులలో ఇష్టారాజ్యం ! సిరిసిల్లఎడ్యుకేషన్: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాలయాల్లో విద్యనభ్యశిస్తున్న పదో తరగతి విద్యార్థులకు ఇంటర్నల్ మార్కులను కేటాయించే విధానం లోపభూయిష్టంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విధానం ప్రైవేట్ స్కూళ్లలోని విద్యార్థులకు అత్యధిక మార్కులు వచ్చేందుకు దోహదపడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో సబ్జెక్టుకు 20 మార్కులుండగా ప్రైవేట్ విద్యాసంస్థల్లో మాత్ర ఫుల్లుగా మార్కులు వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీన్ని అరికట్టేందుకు జిల్లా విద్యాశాఖ తనిఖీ బృందాలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం తనిఖీ బృందాల్లో స్కూళ్లలోకి వెళ్లి మార్కులను పరిశీలించాయి. ఈ విధానంతో కొన్ని విద్యాలయాలు విద్యార్థులు పాఠశాలకు హాజరుకాకున్నా పరిశీలన బృందాలు వచ్చే సమయానికి ఉండేలా చూస్తూ మార్కులను నమోదు చేస్తున్నట్లు తెలిసింది. 26 బృందాలు.. 74 పాఠశాలలు రాజన్నసిరిసిల్ల జిల్లాలో 74 పాఠశాలల్లో 7,317 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. వీరందరికీ ఆరు సబ్జెక్టులకు రాతపరీక్షలు జరుగునున్నాయి. రాతపరీక్షకు 80 మార్కులు ఉండగా, ఇంటర్నల్ 20 మార్కులు ఉంటాయి. ఇంటర్నల్ మార్కులకు ఇవ్వడానికి విద్యార్థులు రాసిన క్లాస్వర్క్, 4 ఫార్మటీవ్ అసెస్మెంట్ పరీక్షల్లో వచ్చిన మార్కులను సగటు వేసి మార్కులు ఇవ్వాలి. కానీ కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు పరీక్షలు రాయకున్న, క్లాస్వర్క్ చేయకున్న మార్కులు ఇస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. ప్రసన్నం చేసుకునే పనిలో ప్రైవేట్ యాజమాన్యాలు బడికి రాని విద్యార్థుల వివరాలు బయటకు పొక్కకుండా ఉండేందకు, విద్యార్థులకు పూర్తిస్థాయి మార్కులను అందించి ర్యాంకులు వక్రమార్గంలో అందించేందుకు పరీశీలనకు వచ్చే తనిఖీ బృందాలను ప్రసన్నం చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సులభ మార్గంలో వచ్చే 120 మార్కులను సాధించడానికి ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేటు పాఠశాలలు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ.. ఇన్నీ కావు. తనిఖీ బృందాలను పర్యవేక్షణ అనంతరం మరోసారి జిల్లా స్థాయి అధికారులు ఆకస్మికంగా స్కూళ్లను తనిఖీ చేస్తే మార్కుల వ్యవహారం వెలుగుచూసే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. -
పెద్దపులి కలకలం?
● రెండు జిల్లాల సరిహద్దుల్లో సంచారం ● ఆరా తీస్తున్న అటవీశాఖ అధికారులు చందుర్తి(వేములవాడ): రాజన్నసిరిసిల్ల, నిజామాబాద్ జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తుందన్న పుకార్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి రేంజ్ పరిధిలో గట్టుపొడిచినవాగు ప్రాజెక్టు ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తుందన్న ఆనవాళ్లను నిజామాబాద్ అటవీశాఖ అధికారులు గురువారం గుర్తించారు. కాగా అదే ప్రాంతంలో రెండు, మూడు రోజులుగా సంచరిస్తుండడం చర్చకు దారితీసింది. అధికారులు మాత్రం ఒక చోట రెండు, మూడు రోజుల కంటే ఎక్కువగా ఉండదంటున్నారు. కమ్మర్పల్లి రేంజ్ పరిధిలో నుంచి రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి–మల్యాల రేంజ్ పరిధిలోకి ప్రవేశిస్తుందన్న ప్రచారంతో ఈ ప్రాంత అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. రెండు రోజులుగా పెద్దపులి ఆనవాళ్లు గుర్తించేందుకు అటవీశాఖ అధికారులు ఫారెస్ట్లో శ్రమిస్తున్నారు. గట్టుపొడిచినవాగు ప్రాజెక్టు బ్యాక్వాటర్తోపాటు దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో అక్కడే రెండు, మూడు రోజులుగా ఉండడంతోపాటు అటవీ జంతువును హతమార్చి తిన్నట్లుగా ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలోనే రాజన్నసిరిసిల్ల జిల్లాలోని చందుర్తి–మల్యాల రేంజ్ పరిధిలోని అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. రుద్రంగి మండలం మానాల అటవీ ప్రాంతంలోకి శనివారం వెళ్లి పెద్దపులి ఆనవాళ్ల కోసం పరిశీలించనున్నట్లు ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. -
మలబార్లో బ్రైడల్ జ్యువెలరీ షో
కరీంనగర్: నగరంలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో ఈనెల 7 నుంచి 16 వరకు బ్రైడల్ జ్యువెలరీ షో నిర్వహించనున్నారు. ఈ జ్యువెలరీ షోను శుక్రవారం కరీంనగర్ జిల్లా ఐఎంఏ అధ్యక్షురాలు డాక్టర్ ఆకుల శైలజ ప్రారంభించారు. ఈ షోలో సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా నవవధువుల కోసం కళాత్మకంగా రూపొందించిన ఆభరణాలు ప్రదర్శించబడతాయని నిర్వాహకులు తెలిపారు. నాణ్యతతో తయారు చేయబడి జీవిత కాలం మన్నికతో ఉండే ఆభరణాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సేల్స్ మేనేజర్ సోహెల్ సిద్ధాంత్, మార్కెటింగ్ శ్రీనివాస్, విక్కీ తదితరులు పాల్గొన్నారు. పారాగేమ్స్లో గిరిజన బిడ్డ ప్రతిభవీర్నపల్లి(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం జవహర్లాల్తండాకు చెందిన దివ్యాంగురాలు భూక్య సక్కుబాయి పారా అథ్లెట్ జాతీయస్థాయిలో సత్తాచాటారు. ఇటీవల నిర్వహించిన సెకండ్ ఎడిషన్ చీఫ్ మినిస్టర్ కప్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో సక్కుబాయి ప్రతిభ కనబర్చి రెండు పతకాలు కై వసం చేసుకుంది. మార్చి 4, 5, 6 తేదీల్లో హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన క్రీడాపోటీల్లో సక్కుబాయి తన ప్రతిభను చాటారు. షార్ట్పుట్ విభాగంలో ఆమె రజతం సాధించగా, డిస్కస్ త్రోలో కాంస్యం గెలుసుకుంది. గంజాయి పట్టివేత వెల్గటూర్(ధర్మపురి): గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై ఉదయ్కుమార్ తెలినారు. వెల్గటూర్ మండలం జగదేవ్పేట శివారులో ఎస్సై, సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా కొండాపూర్కు చెందిన చెందిన బోరకుంట వెంకటేశ్, కనుకుంట్ల కళ్యాణ్ 60 గ్రాముల గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి వేములవాడఅర్బన్: వేములవాడ మండలం కొడుముంజ శివారులోని కరీంనగర్–సిరిసిల్ల ప్రధాన రహదారిపై శుక్రవారం జరిగిన ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. సదరు వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టినట్లు వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు. స్థానికులు వేములవాడ ఏరియా ఆస్పత్రికి తరలించారన్నారు. -
ఖైదీలతో నేరుగా మాట్లాడతాం
జైలు సందర్శనకు వెళ్లినప్పుడు ఖైదీలతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలులు తెలుసుకుంటాం. జైలులో అందే వసతులు, వారు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా అనే విషయాల గురించి ఆరా తీస్తాం. ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని వివరిస్తాం. జైలు సిబ్బందికి సూచనలు చేస్తాం. – సి.రత్నపద్మావతి, జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జగిత్యాల భోజనాన్ని పరిశీలిస్తాం జైలు సందర్శనకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా ఖైదీలకు అందుతున్న భోజనాన్ని పరిశీలిస్తాం. వారికి జైలులో అందాల్సిన వసతులు ఏమిటో చెబుతాం. నేరాలకు పాల్ప డితే జీవితాలు ఎలా చిన్నాభిన్నం అవుతాయో ఉదాహరణలతో చెప్పి, కనువిప్పు కలిగిస్తాం. – వెంకటమల్లిక్ సుబ్రహ్మాణ్యశర్మ, జిల్లా న్యాయవా సేవా సంస్థ కార్యదర్శి, సబ్ జడ్జి, జగిత్యాల -
రైతుల జలదీక్ష
ఇది ఇల్లంతకుంట మండలం దాచారం శివారులో అర్ధంతరంగా నిలిచిపోయిన కాల్వ. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ–11లో సిద్దిపేట జిల్లా రంగనాయక్సాగర్ నుంచి నిర్మించిన కాల్వ పొడవు 17.30 కిలోమీటర్లు. అయితే మధ్యలో అక్కడక్కడ భూసేకరణ పెండింగ్లో ఉంది. దీంతో 10.50 కిలోమీటర్లు మాత్రమే కాల్వ పూర్తయింది. దాచారం శివారులో ఎకరం ఒక్క గుంట భూమిని సేకరిస్తే ఈ యాసంగి సీజన్లో దాచారం, పెద్దలింగాపూర్, రామాజీపేట, చిక్కుడోనిపల్లె, తంగళ్లపల్లి మండలంలోని చిన్నలింగాపూర్, నర్సింహులపల్లె, బాలమల్లుపల్లె, బస్వాపూర్, అంకుసాపూర్, తాడూరు వరకు గోదావరి జలాలు అందేవి. భూసేకరణకు నిధులు లేక.. పది గ్రామాల పరిధిలోని 10 వేల ఎకరాలకు సాగునీరు అందడం లేదు.సిరిసిల్ల: పాలకులు మారినప్పుడల్లా.. అభివృద్ధి స్వరూపం మారిపోతుండడంతో కొన్ని ప్రాజెక్టులో అర్ధంతరంగా నిలిచిపోతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పనులను ప్రస్తుత కాంగ్రెస్ పాలకులు పట్టించుకోవడం లేదు. పాలకుల నిర్లక్ష్యానికి రైతులు బలవుతున్నారు. ఇల్లంతకుంట మండలం దాచారం వద్ద ఎకరం ఒక్క గుంట భూమిని సేకరించి తాత్కాలిక కాల్వను నిర్మిస్తే ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాల్లోని 10 వేల ఎకరాలకు గోదావరి జలాలు అందే అవకాశం ఉంది. కానీ పాలకుల నిర్లక్ష్యం.. అధికారుల పట్టింపులేని తనంతో పది గ్రామాల్లో రైతులు సాగునీటికి గోస పడుతున్నారు. గోదావరి జలాలను పొరుగు జిల్లాలకు అందించే మధ్యమానేరు, అన్నపూర్ణ రిజ ర్వాయర్లు రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఉన్నా రంగనాయకసాగర్ ద్వారా వచ్చేందుకు సాగునీటి కాల్వ లను నిర్మించలేదు. గతంలో అనామతుగా(అనధికారికంగా) భూసేకరణ జరగకపోయినా.. పట్టాదా రులను ఒప్పించి కాల్వ ద్వారా సాగునీటిని ఆయక ట్టు ప్రాంతానికి తరలించారు. ఈసారి అది సాధ్యం కాకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. -
కల్యాణం.. కమనీయం
శనివారం శ్రీ 7 శ్రీ మార్చి శ్రీ 2026వేములవాడ: శ్రీరాజరాజేశ్వరస్వామి కల్యాణోత్సవం శుక్రవారం కనులపండువగా సాగింది. రాజన్న ఆలయ విస్తరణ పనులు కొనసాగుతుండడంతో గుడి చెరువు ఖాళీ స్థలంలోని శివార్చన వేదికపై కల్యాణోత్సవం నిర్వహించారు. స్వామి వారికి మున్సిపల్ తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. శివపార్వతులు, జోగినులు, హిజ్రాలు రాజన్నను వివాహమాడి తలంబ్రాలు చల్లుకున్నారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్చైర్మన్ నరాల శేఖర్, కమిషనర్ సంపత్, మేనేజర్ సంపత్రెడ్డి, ఎస్పీ మహేశ్ బీ గీతే, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, బీజీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ తదితరులు హాజరయ్యారు. -
ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ప్రజాపాలన
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చందుర్తి/వేములవాడ అర్బన్(వేములవాడ): రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లలో చేసిన ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. చందుర్తి, వేములవాడలో శుక్రవారం 99 రోజుల కార్యక్రమాన్ని విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరీమా అగ్రవాల్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ స్థానికంగా వైద్య సేవలందించడం కష్టంగా మారితే రోగులను వేములవాడ, సిరిసిల్లకు తరలించి చికిత్స అందజేస్తామని వివరించారు. ఏప్రిల్ 2 నుంచి 15 వరకు గ్రామసభల్లో ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. నియోజకవర్గానికి మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ విషయంలో రాజకీయాలు చేయడం సరికాదన్నారు. స్థలం కోసం చూస్తున్నట్లు తెలిపారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, సర్పంచ్ పులి సత్తయ్య, ఉపసర్పంచ్ బత్తుల క్రాంతి, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్చైర్మన్ నరాల శేఖర్, నాయకులు చంద్రగిరి శ్రీనివాస్, చింతపంటి రామస్వామి, బొజ్జ మల్లేశం ఉన్నారు. -
వైద్యనిపుణుల సేవలు వినియోగించుకోవాలి
● జిల్లా వైద్యాధికారి రజిత సిరిసిల్ల: జిల్లాలో ‘ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల ఆరోగ్య కార్యక్రమంలో ప్రత్యేక వైద్య నిపుణుల సేవలు వినియోగించుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఎస్.రజిత కోరారు. అన్ని వయసుల వారికి ఆరోగ్య పరీక్షలు చేసేందుకు ప్రణాళిక రూపొందించామని వెల్లడించారు. నిర్ధేశిత రోజుల్లో నాలుగు దశల్లో నిర్వహిస్తామని వివరించారు. ఈనెల 6 నుంచి 31 వరకు గర్భిణీలు, వృద్ధులకు రక్తహీనత పరీక్షలు చేస్తారని తెలిపారు. పోషకాహారం, వ్యాధినిరోధక టీకాలపై అవగాహన కల్పిస్తారన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈనెల 8న గర్భాశయ క్యాన్సర్ రాకుండా సీ్త్రలకు హెచ్పీవీ వ్యాక్సిన్ ఇస్తామని తెలిపారు. వైద్యశిబిరాల షెడ్యూల్ ఇదీ.. మార్చి 7న హన్మాజీపేట, 9న కోనరావుపేట, 10న లింగన్నపేట, 11న పోతుగల్, 12న విలాసాగర్, 13న ఎల్లారెడ్డిపేట, 14న పెద్దలింగాపూర్, 16న నేరెళ్ల, 17న తంగళ్లపల్లిలో వైద్యశిబిరాలు నిర్వహిస్తామన్నారు. 18న కొదురుపాక, 20న సిరిసిల్లలోని సుందరయ్యనగర్ అర్బన్ హెల్త్ సెంటర్, 23న అంబేడ్కర్నగర్ అర్బన్ హెల్త్ సెంటర్, 24న చీర్లవంచ, 25న బోయినపల్లి, 26న కోనరావుపేట, 28న పోతుగల్, 30న విలాసాగర్, 31న సుందరయ్యనగర్లో వైద్యశిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా వైద్యాధికారి వెల్లడించారు. అన్నదాన ట్రస్టుకు రూ.2లక్షలు విరాళంవేములవాడ అర్బన్: శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ అన్నదాన ట్రస్టుకు ఓ భక్తుడు రూ.2లక్షలు విరాళం శుక్రవారం అందజేశారు. హైదరాబాద్లోని కోకాపేట్కు చెందిన బొమ్మవేణి సౌజన్య–రాజేశ్వర్రెడ్డి దంపతులు రూ.2లక్షలు విరాళం అందించగా, ఈ సందర్భంగా అన్నప్రసాదానికి రూ.1.82లక్షలు, శాశ్వత అభిషేకానికి రూ.18వేలు సమర్పించారు. ఈ మొత్తాన్ని ఆలయ ప్రొటోకాల్ పర్యవేక్షకులు శ్రీనివాస్శర్మకు అందజేశారు. -
సర్పంచులు వర్సెస్ కార్యదర్శులు
● జిల్లాకు రూ.19.73 కోట్ల మేర ఎఫ్ఎఫ్సీ నిధులు ● బిల్లులు చెల్లించాలంటున్న పాత సర్పంచులు ● తాము పనులు చేస్తామంటున్న కొత్త పాలకులు ● ప్రత్యేక పాలనతో అప్పులపాలైన సెక్రటరీలుబోయినపల్లి(చొప్పదండి): ఇటీవల విడుదలైన 15వ ఆర్థిక సంఘం నిధులు కార్యదర్శులు, కొత్త సర్పంచుల మధ్య లొల్లి పెట్టిస్తున్నాయి. మాజీ సర్పంచులు తాము పనులు చేసి అప్పులపాలయ్యామని బిల్లులు చెల్లించాలని కోరుతుండగా.. ఎన్నో హామీలు ఇచ్చి గెలిచామని తామే పనులు చేస్తామంటూ కొత్త పాలకులు పేర్కొంటున్నారు. రూ.19.73 కోట్ల ఎఫ్ఎఫ్సీ నిధులు 15వ ఆర్థిక సంఘం నుంచి 2023–24, 2024–25, 2025–26 సంవత్సరాలకు రూ.19,73,02,492 మంజూరయ్యాయి. ఇందులో బోయినపల్లి మండలంలోని 23 గ్రామాలకు రూ.1,83,93,126 మంజూరయ్యాయి. వచ్చిన నిధుల నుంచి శానిటేషన్, తాగునీటి పనులకు 60 శాతం నిధులు కేటాయించాలని, మిగతా 40 శాతం వివిధ అభివృద్ధి పనులకు వినియోగించాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్న ట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో 15వ ఆర్థిక సంఘం నిధులు ఎలాంటి అభివృద్ది పనులకు వినియోగించాలనే అంశంలో గ్రామపంచాయతీ నూతన పాలకవర్గాలు ప్రణాళికలు వేస్తున్నారు. సయోధ్య లేక ఇబ్బంది నూతనంగా ఎన్నికై న సర్పంచులతో జిల్లాలోని పలు గ్రామాల్లోని పంచాయతీ కార్యదర్శులకు సయోధ్య కరువైందని తెలుస్తోంది. ఓ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి లీడర్లా వ్యవహరిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఓ గ్రామపంచాయతీ కార్యాలయంలో ముగ్గురు మల్టీపర్పస్ సిబ్బంది ఉండగా, కార్యదర్శి ఇద్దరితోనే పనులు చేయిస్తున్నట్లు తెలిసింది. మరో సిబ్బందితో కార్యదర్శి సొంత పనులకు వినియోగిస్తున్నారని సర్పంచ్ వాపోతున్నారు. అందరిని సమానంగా చూడాలంటున్నారు. ఓ గ్రామంలో కార్యదర్శి సర్పంచ్కు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కాగా పలు గ్రామాల కొత్త సర్పంచులు తమ గ్రామాల పంచాయతీ కార్యదర్శుల నుంచి ఇబ్బంది ఉందని వారిని జంబ్లింగ్లా మార్చాలని ఇటీవల రత్నంపేటకు వచ్చిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.బోయినపల్లి మండలంలోని గ్రామాలకు రూ.1.83 కోట్ల ఎఫ్ఎఫ్సీ నిధులు మంజూరయ్యాయి. వీటిపై గతంలో అభివృద్ధి పనులు చేసి బిల్లులు రాని మాజీ సర్పంచులు గంపెడాశలు పెట్టుకున్నారు. కాగా సుమారు రూ.60 లక్షలకు పైగా పాత సర్పంచులకు పెండింగ్ బిల్లులు రావాల్సి ఉందని సమాచారం. కొన్నాళ్లుగా బిల్లుల మంజూరు కోసం వివిధ రూపాల్లో తమ నిరసనలు ప్రభుత్వానికి తెలిపారు. కాగా ఏడాదికి పైగా ప్రత్యేకాధికారుల పాలనలో వివిధ పనులు చేపట్టి పలువురు కార్యదర్శులు అప్పుల పాలైనట్లు సమాచారం. కొత్త సర్పంచులు ఎన్నికై న తర్వాత నిధులు రావడంతో తామే అభివృద్ధి పనులు చేస్తామంటున్నారు. ఇప్పుడు వచ్చిన నిధులతో పాతసర్పంచులు చేసిన పనులకు బిల్లులు ఇస్తే తామెలా అభివృద్ధి పనులు చేయాలని కొత్త సర్పంచులు వాపోతున్నారు. -
విధుల్లో చేరిన సీఐలు
సిరిసిల్ల క్రైం: జిల్లాకు బదిలీపై వచ్చిన సీఐలు శుక్రవారం విధుల్లో చేరారు. ఎస్పీ మహేశ్ బీ గీతేపాటు సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారిని మర్యాదపూర్వకంగా కలిశారు. సిరిసిల్ల టౌన్ సీఐగా నెమ్మని శ్రీనివాస్, ఎల్లారెడ్డిపేట సీఐగా వెంకటేశ్, సిరిసిల్ల రూరల్ సీఐగా కదిరే నాగేశ్వరరావు విధుల్లో చేరారు. తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని జిల్లెల్ల శివారులోని బాబు జగ్జీవన్రామ్ వ్యవసాయ కళాశాలలో శుక్రవారం పుట్టగొడుగుల పెంపకంపై ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు. యువత, మహిళలు, రైతులకు ఆర్థిక పరిపుష్టి కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగింది. పుట్టగొడుగుల పెంపకంతో అదనపు ఆదాయం పొందవచ్చని కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ కె.బి.సునీతదేవి తెలిపారు. ప్లాంట్ పాథాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి.అశ్విని పుట్టగొడుగుల తయారీలో మెలకువలు వివరించగా, మార్కెటింగ్పై అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సీహెచ్.యశస్విని వివరించారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి కళాశాల యాజమాన్యం సర్టిఫికెట్లను అందజేసింది. తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండల కేంద్రంలో సాగునీటి కాలువల నిర్మాణం పూర్తి చేయాలని కోరుతూ రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శుక్రవారంతో ఏడో రోజుకు చేరింది. కాళేశ్వరం 11వ ప్యాకేజీ పరిధిలోని ఆర్డీ3, ఎల్ఎం6, ఎల్ఎం4 కాలువ పనులు పదేళ్లు గడిచినా పూర్తికాకపోవడంతో ఆగ్రహించిన రైతులు, తమ నిరసనను ఉధృతం చేశారు. రైతులు ముఖేశ్, పవన్, నర్సింగం, భాస్కర్, రమేశ్, శ్రీధర్రావు, తిరుపతి, రాజిరెడ్డి, విజయ్రెడ్డి, బాలకృష్ణ, సురేష్, లక్ష్మణ్, మహేందర్, అంజయ్య, హరీశ్ పాల్గొన్నారు. ముస్తాబాద్(సిరిసిల్ల): మండల కేంద్రంలోని దుబ్బాక మార్గంలో జెడ్పీ ఉన్నత పాఠశాల ఎదుట విద్యుత్ తీగలు ప్రమాదకరంగా వేలాడుతుండడంతో స్థానికులు ఓ కర్రను ఊతంగా పెట్టారు. విద్యుత్ మెయిన్ లైన్తోపాటు సర్వీస్వైర్లు కిందకు రాకుండా కర్రను పెట్టారు. ప్రమాదం జరగక ముందే లూజ్ తీగలకు పోల్స్ వేయాలని కాలనీవాసులు కోరుతున్నారు. గతంలో లూజ్ విద్యుత్ తీగల కోసం పెద్ద ఎత్తున స్తంభాలు వేసి, మరి ఎందుకో ఇక్కడ స్తంభాలను ఏర్పాటు చేయలేదు. ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని వివిధ పాఠశాలల నుంచి 8 మంది విద్యార్థులు ఇన్స్పైర్ అవార్డులకు ఎంపికయ్యారు. సిరికొండ పాఠశాల నుంచి దాసరి కోటి, దాచారం నుంచి గజ్జెల సిద్దు, వల్లంపట్ల నుంచి గంగాధర సౌమ్య, ఇల్లంతకుంట నుంచి ఎనుగంటి శశివర్ధన్, కందికట్కూర్ నుంచి రాచకొండ అశ్విత, ఏగుర్ల రేష్మిత, గాలిపెల్లి నుంచి ఎండ్ర సంజన, వివేకానంద, పొత్తూరు హైస్కూల్ నుంచి బుర్ర మనస్విని ఎంకియ్యారు. ఎంపికై న విద్యార్థులు తమ కొత్త ఆవిష్కరణల కోసం ఖాతాలలో ప్రభుత్వం రూ.10వేలు జమచేయనుంది. -
సమన్వయంతో ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ అమలు
● కలెక్టర్ గరీమా అగ్రవాల్సిరిసిల్ల: జిల్లాలో ఈనెల 6 నుంచి జూన్ 12 వరకు ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ను అధికారులు సమన్వయంతో అమలు చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం జిల్లా అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని శాఖల అధికారులు నిర్ణీత కాలపరిమితిలో లక్ష్యాలను సాధించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి ఆయా కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులను ఆహ్వానించి విజయవంతం చేయాలన్నారు. ఈనెల 12న జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల సర్పంచులు, సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల వార్డుసభ్యులు, చైర్మన్లకు ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికపై శిక్షణ ఉంటుందని వె ల్లడించారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, డీఆర్డీవో ఎం.గీత, డీఈవో జగన్మోహన్రెడ్డి, డీడబ్ల్యూవో లక్ష్మీరాజం, డీపీవో షరీఫొద్దీన్, జిల్లా వైద్యాధికారి రజిత, హౌసింగ్ పీడీ సాజిద్, డీటీవో లక్ష్మణ్కుమార్, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్పాషా, సంపత్కుమార్, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి రాందాస్, తహసీల్దార్ మహేశ్కుమార్ పాల్గొన్నారు. గృహ ప్రవేశానికి సిద్ధం చేయాలి ఇందిరమ్మ ఇండ్లను పూర్తి చేసి గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని కలెక్టర్ కోరారు. సిరిసిల్ల నాలుగో వార్డులో ఎలిగేటి రూపిక, కొండబత్తిని పండరి, కొయ్యాడ మానస ఇళ్లను కలెక్టర్ పరిశీలించారు. ఆన్లైన్లో ఫొటోలతో అప్లోడ్ చేయాలని సూచించారు. పరీక్ష కేంద్రం తనిఖీ జిల్లా కేంద్రంలోని ఇంటర్మీడియెట్ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. వసతులపై ఆరా తీశారు. గురువారం మొత్తం 3,531 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 79 మంది గైర్హాజరయ్యారు. ప్రచార రథం ప్రారంభం పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ప్రచార రథాన్ని కలెక్టరేట్లో కలెక్టర్ గరీమా అగ్రవాల్ జెండా ఊపి ప్రారంభించారు. మూడు కిలోవాట్ల సోలార్ పలకలు ఏర్పాటు చేసుకుంటే కేంద్రం రూ.78వేలు సబ్సిడీ ఇస్తుందని తెలిపారు. ప్రతి నెలా రూ.2వేలు బిల్లు ఆదా అవుతుందని కలెక్టర్ వివరించారు. జిల్లాలో ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ‘సెస్’ ఎండీ భిక్షపతి, డీఈ అంజయ్య, డీవో మునీందర్రెడ్డి, ఏడీవో లక్ష్మీకాంత్ పాల్గొన్నారు. -
కాలువ పూర్తి చేయాలి
ఇల్లంతకుంట(వేములవాడ): మండలంలోని పెద్దలింగాపూర్లో రైతులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు గురువారం 24వ రోజుకు చేరా యి. అసంపూర్తి కాలువను పూర్తి చేయాలనే డి మాండ్తో రైతులు దీక్షలు చేస్తున్నారు. శిబిరంలో రైతులు కరికే నవీన్కుమార్, రౌతు నారా యణ, ఎల్లం శ్రీనివాస్, కమటం శ్రీధర్, అబ్దుల్లా, రాజయ్య, గాదె మహేశ్ పాల్గొన్నారు. తంగళ్లపల్లి(సిరిసిల్ల): సాగునీటి కాలువలు పూర్తిచేయాలని కోరుతూ తంగళ్లపల్లిలో రైతులు చేస్తున్న రిలే నిరాహార దీక్ష గురువారం ఆరో రోజుకు చేరింది. రైతులు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ఆర్డీ3, ఎల్ఎం6, 4 కాలువలు పూర్తి చేయాలని కోరారు. బీజేవైఎం మండ ల అధ్యక్షుడు, అంకిరెడ్డిపల్లె సర్పంచ్ రాగుల రాజిరెడ్డి, జిల్లా నాయకుడు ఆసాని రాంలింగా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే స్కావెంజర్స్, స్వీపర్లకు ప్రతీ నెల వేతనాలు మంజూరు చేయాలని, పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని ప్రభుత్వ పాఠశాల స్వీపర్స్, స్కావెంజర్స్ వర్కర్స్ యూనియన్ జిల్లా కన్వీనర్ మీసం లక్ష్మణ్యాదవ్ కోరారు. కలెక్టరేట్ వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గురువారం నిరసన తెలిపారు. 8 నెలలు గడుస్తున్నా వేతనాలు ఇవ్వలేదన్నారు. నాయకులు బొడ్డు నర్సవ్వ, వరలక్ష్మి, రమేశ్, అంజయ్య, మహేశ్, కనకయ్య తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పశువుల కాపరులు, రైతులు అడవుల సంరక్షణలో భాగస్వాములు కావాలని ఫారెస్ట్ రేంజ్ అధికారి కల్పనాదేవి, డిప్యూటీ రేంజ్ అధికారి మోహన్లాల్ కోరారు. మండలంలోని అక్కపల్లిలో ఉపాధిహామీ కూలీలు, పశువుల కాపరులు, రైతులకు వేసవిలో అడవిలో జరిగే అగ్ని ప్రమాదాల నివారణపై గురువారం అవగాహన కల్పించారు. మంటలను అదుపు చేయడానికి ఫైర్లైన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సర్పంచ్ బాబు, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. సీఐల బదిలీసిరిసిల్ల క్రైం: మల్టీజోన్–1 పరిధిలో పోలీస్ ఇన్స్పెక్టర్ల బదిలీలు, నియామకాలు చేపట్టినట్లు ఐజీపీ కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలన కారణాలతో సీఐల బదిలీలు జరిగినట్లు పేర్కొన్నారు. ఉత్తర్వుల ప్రకారం కామారెడ్డి సీసీఎస్లో పనిచేస్తున్న నెమ్మని శ్రీనివాస్ను సిరిసిల్ల టౌన్ పోలీస్స్టేషన్కు ఎస్హెచ్వోగా నియమించారు. ప్రస్తుతం సిరిసిల్ల టౌన్ ఎస్హెచ్వోగా ఉన్న కస్పరాజు కృష్ణను మల్టీ జోన్–1 ఐజీపీ కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. కరీంనగర్ పీసీఆర్లో పనిచేస్తున్న ఓడెల వెంకటేశ్ను ఎల్లారెడ్డిపేట సీఐగా నియమించారు. ఎల్లారెడ్డిపేట సర్కిల్లో ఉన్న బలుసాని శ్రీనివాస్ మల్టీజోన్–1 ఐజీపీ కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సిరిసిల్ల డీసీఆర్బీలో పనిచేస్తున్న కదిరా నాగేశ్వరరావును సిరిసిల్ల రూరల్ సర్కిల్కు బదిలీ చేశారు. సిరిసిల్ల రూరల్ సర్కిల్లో ఉన్న కొలాని మొగిలిను డీసీఆర్బీ సీఐగా నియమించారు. -
శతశాతం దిశగా..
సిరిసిల్లటౌన్: సిరిసిల్ల మున్సిపాలిటీ పన్ను వసూలులో దూసుకెళ్తోంది. ఈనెలాఖరులోగా శతశాతం సాధించేలా అడుగులు వేస్తోంది. ఇప్పటికే 76 శాతం పన్నులు వసూలు చేసి ప్రణాళికతో ముందుకెళ్తోంది. పట్టణ ప్రజలు సైతం మున్సిపల్ అధికారులకు సకాలంలో ట్యాక్స్లు చెల్లించి సహకరిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా నంబర్ వన్ ర్యాంక్ సాధనే ధ్యేయంగా బల్దియా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రూ.6.99 కోట్లు డిమాండ్ మున్సిపల్కు సంబంధించిన పన్నుల వసూళ్లపై కొత్తగా కొలువుదీరిన పాలకవర్గం, అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపారు. గత ఆర్థిక సంవత్సరాల్లో సాధించిన నూరుశాతం వసూళ్లకు ప్రాధాన్యతనిస్తున్నారు. లోటు బడ్జెట్ను అధిగమించడంతోపాటు గతకీర్తిని కొనసాగించమే లక్ష్యంగా ప్రైవేటు ఆస్తుల పన్నుల విషయంలో చర్యలు తీసుకుంటుంది. సిరిసిల్లలో మొత్తంగా 23,769 హౌజ్హోల్డ్స్ ఉన్నాయి. వీటికి సంబంధించిన ఆస్తిపన్నులను అధికారులు రెండు నెలలుగా వసూలు చేస్తున్నారు. రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్, ఇతర ఆస్తులకు సంబంధించిన పన్నులు రూ.6.99 కోట్లు ఉండగా ఇప్పటికే 76 శాతం వసూలయ్యాయి. 39 బృందాలు.. 117 మంది పన్నుల వసూళ్లకు సిరిసిల్లలోని 39 వార్డుల్లో 117 మంది శ్రమిస్తున్నారు. ఒక్కో టీమ్లో వార్డు ఆఫీసర్, బిల్ కలెక్టర్, జవాన్లతో కలిసి ముగ్గురు చొప్పున బృందాలు 39 వార్డుల్లో తిరుగుతున్నారు. 14 మంది బిల్కలెక్టర్లతో గ్రూపులను ఏర్పాటు చేశారు. నిత్యం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ఇంటింటా తిరుగుతూ పన్ను వసూలు చేస్తున్నారు. రెసిడెన్షియల్ 18,227, నాన్రెసిడెన్షియల్ 5,542, ఇతర మొత్తంగా 23,769 ఉన్నాయి. ఈ ఏడాదికి మున్సిపాలిటీకి రావాల్సిన పన్నులు రూ.6.99 కోట్లు డిమాండ్ ఉంది. వీటి వసూలుకు మున్సిపల్ కమిషనర్ ఎం.ఏ.ఖదీర్పాషా నేతృత్వంలో ఫిబ్రవరి ఆరంభం నుంచే పన్నుల వసూలు చేపట్టారు. దశాబ్దకాలంలో పట్టణంలో జరిగిన అభివృద్ధి ప్రజలకు కనిపిస్తుండడంతో పన్నుల వసూలుకు వెళ్తున్న సిబ్బందికి స్వచ్ఛందంగా సహకరిస్తున్నారు. రెసిడెన్షియల్ గృహాలు 18,113 కమర్షియల్ దుకాణాలు 2,569 ఇతరాలు 2,805 రాష్ట్రప్రభుత్వ ఆస్తులు 52 మెత్తం ఆస్తులు 23,532బల్దియా సంబంధిత పన్నుల వసూళ్లలో అధికారులు నూరుశాతం టార్గెట్తో ముందకు వెళ్తున్నారు. పట్టణంలోని 39 వార్డుల్లో స్థానిక కౌన్సిలర్ల సహాయాన్ని తీసుకుంటున్నారు. బల్దియాకు కొత్తగా ఆదాయ వనరులు పెంచడంపై దృష్టి సారించారు. పరిశుభ్ర పట్టణంగా కీర్తిపొందిన సిరిసిల్లలో వీధుల్లో చెత్తను వేయడం నిషేధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీగా జరిమానాలు వేస్తున్నారు. ప్లాస్టిక్ నిషేదాన్ని అమలుచేస్తూ ఉల్లంఘనులకు జరిమానాలు విధించడం, ప్రతీ దుకాణం నుంచి తడి, పొడి చెత్తను సేకరించేందుకు విధిగా ఒక్కో దుకాణదారుడి నుంచి రూ.300 వరకు యూజర్ చార్జీలు వసూలు చేస్తున్నారు. రోడ్డుపై టేలాలు వేయడం, వ్యాపారాలు చేయడం, ఫుట్పాత్ల ఆక్రమణలపై దాడులు చేసి ఆదాయం పెంచారు. గృహాల పన్నులతోపాటు ట్రేడ్ లైసెన్సులు, తాగునీరు తదితర పన్నులు వసూలు చేసేలా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.పన్నుల వసూళ్లలో కలెక్టర్ సూచనలతో ఆదర్శ విధానాలు అవలంబిస్తున్నాం. చైర్పర్సన్, వైస్చైర్మన్, కౌన్సిలర్ల సహకారంతో ముందుకెళ్తున్నాం. పన్నుల వసూళ్లలో ఇప్పటికే రాష్ట్రంలో మూడో స్థానంలో ఉన్నాం. నెలాఖరు వరకు వంద శాతం వసూలు చేసి నంబర్ 1 స్థానాన్ని సాధిస్తే ప్రభుత్వం నుంచి ప్రత్యేక ప్రోత్సాహం లభిస్తుంది. 39 బృందాలను ఆర్ఐ, ఆర్వో, ఎస్ఐ, ఏఈలు మరో ఎనిమిది టీమ్స్ నిత్యం పర్యవేక్షిస్తున్నారు. – ఎం.ఏ.ఖదీర్పాషా, మున్సిపల్ కమిషనర్, సిరిసిల్ల -
రేపు న్యాయస్థాన సముదాయానికి శంకుస్థాపన
● అతిథులుగా హైకోర్టు న్యాయమూర్తులు ● జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీరజసిరిసిల్ల: జిల్లా కేంద్రంలో నూతన న్యాయస్థాన భవన సముదాయానికి శనివారం శంకుస్థాపన చేస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ గురువారం తెలిపారు. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్సింగ్, హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా కోర్టు పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.తుకారాంజీ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని పేర్కొన్నారు. వీరితోపాటు జస్టిస్ పి.శ్యామ్కోసి, జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ విజయసేన్రెడ్డి, జస్టిస్ వేణుగోపాల్, జస్టిస్ పుల్లా కార్తీక్, జస్టిస్ జె.శ్రీనివాస్రావు, జస్టిస్ నందికొండ నర్సింగరావు హాజరవుతున్నట్లు సిరిసిల్ల న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జూపల్లి శ్రీనివాసరావు తెలిపారు. -
నరాల వ్యవస్థపై ప్రభావం
మత్తు పదార్థాలు తీసుకున్న వ్యక్తి నరాల వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒక్కసారి మత్తు పదార్థాలు తీసుకుంటే దాని ప్రభావం జీవితాంతం ఉంటుంది. మత్తు పదార్థాలకు అలవాటుపడిన వ్యక్తి ఉత్తేజాన్ని కోల్పోతాడు. సహజ మనస్తత్వాన్ని కోల్పోయి, ఉద్వేగభరితంగా వ్యవహరిస్తాడు. మైండ్ లోపల కార్టి సాల్ అనే హోర్మోన్స్ ప్రభావం, ఒత్తిడితో మత్తును మళ్లీ మళ్లీ తీసకోవాలనే ఆలోచనతోపాటు వింతగా ప్రవర్తిస్తాడు. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఇబ్బంది పడతారు. కౌన్సెలింగ్ సెంటర్కు వచ్చే వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం. – డాక్టర్ ప్రవీణ్కుమార్ ఎంబీబీఎస్, ఎండీ, మానసిక వైద్యనిపుణులు -
రాజన్న సిరిసిల్ల
శుక్రవారం శ్రీ 6 శ్రీ మార్చి శ్రీ 20269సిరిసిల్లఅర్బన్: క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల పోస్టర్లను కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆవిష్కరించారు. హకీంపేట్, కరీంనగర్, ఆదిలాబాద్ రీజినల్ స్పోర్ట్స్ స్కూల్స్లో ప్రవేశాలు ఉంటాయి. రాజన్న చెంతకు శివపార్వతులువేములవాడ: రాజన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం జరిగే శివకల్యాణోత్సవంలో పాల్గొనేందుకు గురువారం రాత్రికే శివపార్వతులు చేరుకున్నారు. జిల్లాలో ఎండగా ఉంటుంది. వర్షం కురిసే అవకాశం లేదు. గాలిలో తేమ స్వల్పంగా ఉంటుంది. రాత్రి వేళ చలిగాలులు వీస్తాయి. -
రాజ్యాధికారం సాఽధించాలి
సిరిసిల్లటౌన్: బహుజనులు రాజ్యాధికారం చేపట్టినప్పుడే దేశం సర్వతో ముఖాభివృద్ధి సాధిస్తుందని బీఎస్పీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎనగందుల వెంకన్న పేర్కొన్నారు. సిరిసిల్ల ప్రెస్క్లబ్లో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బహుజనల రాజ్యాధికారంపై ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కాన్షీరాం జయంతిని పురస్కరించుకొని ఈనెల 15న సిరిసిల్లలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కొమ్మాట అశోక్, నాయకులు లింగంపల్లి మహేశ్ పాల్గొన్నారు. -
ద్విగ్విజయంగా దక్షిణ దిగ్యాత్ర
ధర్మపురి పోలీస్స్టేషన్లో పూజలందుకుంటున్న స్వామివారుస్వామివారి శావ మోస్తున్న సీఐ రాంనర్సింహారెడ్డి, పోలీస్ అధికారులుధర్మపురి: శ్రీలక్ష్మీనృసింహుని దక్షిణ దిగ్యాత్ర గురువారం విజయవంతంగా సాగింది. అనాదిగా వస్తున్న సంప్రదాయం ప్రకారం.. దిగ్యాత్రలో భాగంగా స్వామివారు ధర్మపురి పోలీస్స్టేషన్ను సందర్శించారు. సీఐ రాంనర్సింహరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు స్వామివారికి స్వాగతం పలికారు. స్టేషన్లో రికార్డులు పరిశీలించిన అనంతరం వేద బ్రాహ్మణులు ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయం నుంచి పోలీస్ స్టేషన్వరకు అశ్వవాహనంపై స్వామివార్లను శోభయాత్రగా తీసుకెళ్లారు. ఆలయ ఈవో శ్రీనివాస్, చైర్మన్ రవీందర్, ఎస్సైలు మహేశ్, రమేశ్, ఉదయ్కుమార్, శ్రీధర్రెడ్డి పాల్గొన్నారు. -
నాలుగు దశల్లో వైద్యపరీక్షలు
● 99 రోజుల ఆరోగ్య ప్రణాళిక అమలు ● జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఎస్.రజితసిరిసిల్ల: జిల్లాలో నాలుగు దశల్లో వైద్యపరీక్షలు, వైద్యసేవలు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత తెలిపారు. ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా 99 రోజుల ఆరోగ్య కార్యక్రమాలను వెల్లడించారు. మొదటి దశలో మార్చి 6 నుంచి 31 వరకు గర్భిణీలకు, వృద్ధులకు రక్తహీనత పరీక్షలు, తెలంగాణ డయాగ్నోస్టిక్స్ సెంటర్ ద్వారా ఆరోగ్యసేవలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్యులు, ఆర్బీఎస్కే బృందాలు, ఇతర వైద్యసిబ్బందికి గర్భిణీలకు, తల్లులకు అందాల్సిన పోషకాహారం, వ్యాధి నిరోధక టీకాలపై అవగాహన కల్పిస్తామన్నారు. గర్భాశయం, రొమ్ము క్యాన్సర్లపై పరీక్షలు చేస్తారని తెలిపారు. పిల్లల వైద్యనిపుణులతో పరీక్షలు, నేత్ర, కీళ్ల ఎముకలు, దంత వైద్యనిపుణులతోపాటు జనరల్ మెడిసిన్ వైద్యులు పరీక్షలు చేస్తారని వెల్లడించారు. మహిళా దినోత్సవం రోజు మార్చి 8న గర్భాశయ క్యాన్సర్ రాకుండా సీ్త్రలకు హెచ్పీవీ వ్యాక్సిన్ ఇస్తామని కోరారు. రెండో దశ: ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 15 వరకు 30ఏళ్లకు పైబడిన వారికి మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్ సంబంధిత వ్యాధులు, చెవి, ముక్కు గొంతు, నేత్ర వైద్యనిపుణులు, ఇతర వ్యాధులకు పరీక్షలు చేసి మందులు పంపిణీ చేస్తారు. మూడో దశ: ఏప్రిల్ 16 నుంచి మే 15 వరకు సంక్రమణ వ్యాధులు.. క్షయ, ఎయిడ్స్ నిర్ధారణ పరీక్షలు, వడదెబ్బ నివారణకు అవగాహన కల్పించడంతోపాటు చికిత్స అందిస్తారు. నాలుగో దశ: మే 16 నుంచి జూన్ 12 వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పౌష్టికాహారం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, పరిసరాల పరిశుభద్రతపై అవగాహన కల్పిస్తారు. -
మత్తు వదిలిస్తారు
● జిల్లాలో ప్రత్యేక డ్రగ్ డీ అడిక్షన్ కేంద్రం ● అందుబాటులో వైద్యులు.. మానసిక నిపుణులుసిరిసిల్ల అర్బన్: మత్తులో జీవితాలు రోడ్డుపాలవుతున్నాయి. తెల్లవారకముందే బెల్టుషాపులో మద్యం తాగి మత్తులో తూగుతున్నారు. మత్తుతో చిత్తవుతున్న వారిని మార్చేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మద్యం, డ్రగ్స్, గంజాయి మత్తును వదిలించేందుకు జిల్లాలో డీ ఆడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేశారు. మత్తులో చిత్తవుతున్న వారిని బయటపడేలా చేసేందుకు డీ అడిక్షన్ సెంటర్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్నగర్ బస్తీ దవాఖానాఈ డీ అడిక్షన్ కేంద్రాన్ని జిల్లా పోలీసుశాఖ, లీగల్ హెడ్ క్లినిక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. వైద్యులు, మానసిక నిపుణుల పర్యవేక్షణలో.. సిరిసిల్ల పట్టణ పరిధిలోని రాజీవ్నగర్ బస్తీ దవాఖానాలో రెండేళ్ల క్రితం వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా ఈ సెంటర్ను ప్రారంభింపజేశారు. ప్రధానంగా మత్తు పదార్థాలకు, గంజాయికి బానిసై, తల్లిదండ్రులు చెప్పినా వినకుండా ఉండే యువతీ, యువకులను గుర్తించి వారికి ఈ డీ–అడిక్షన్ సెంటర్లో కౌన్సెలింగ్ ఇస్తారు. మత్తు పదార్థాలకు, డ్రగ్స్కు దూరం చేసేందుకు డీ–అడిక్షన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. యువత గంజాయి, మత్తు పదార్థాలకు అలవాటు పడి ఉన్మాదిగా మారితే ఆ కుటుంబం వీదిన పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారిని గుర్తించి సన్మార్గంలో నడిపించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు ఈ సెంటర్లో నలుగురికి వైద్యసేవలు అందించారు. గంజాయి, మత్తు పదార్థాలకు సంబంధించి టెలీ మానస్ 14416 టోల్ ఫ్రీ నంబర్లో సంప్రదించవచ్చని వైద్యనిపుణులు తెలిపారు. -
అమ్మో... పులి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల నుంచి నిజామాబాద్ జిల్లాలోకి వచ్చిన పెద్ద పులి ప్రస్తుతం కమ్మర్పల్లి రేంజ్ పరిధిలోని గట్టుపొడిచినవాగు ప్రాజెక్టు బ్యాక్వాటర్ ప్రాంతంలో సేదతీరుతోంది. గురువారం తెల్లవారుజామున అటవీ శాఖ అమర్చిన ట్రాప్ కెమెరాకు పెద్ద పులి కదలికలు చిక్కడంతో కచ్చితంగా నిర్ధారణ అయింది. మహారాష్ట్రలోని తడోబా అడవి నుంచి వచ్చిన ఈ పులి కొన్ని నెలలుగా ఆదిలాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి తదితర జిల్లాల్లో సంచరిస్తోంది.మూడు రోజుల క్రితం కమ్మర్పల్లి రేంజ్లోకి వచ్చిన ఈ పులి ఇదేచోట వన్యప్రాణిని చంపి తిని, ఇక్కడే దాహార్తిని తీర్చుకుని సేద తీరుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పెద్ద పులి కదలికలపై పూర్తి స్థాయి సమాచారం కోసం అటవీ అధికారులు డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. గట్టుపొడిచినవాగు బ్యాక్వాటర్ ప్రాంతంలో గురువారం అటవీ అధికారుల బృందం పెట్రోలింగ్ చేస్తున్న సందర్భంలో బీట్ అధికారి శ్రీదేవికి అలసట రావడంతో అక్కడే ఉన్న కల్వర్టు మీద కూర్చున్నారు.ఇది గమనించకుండా బృందంలోని మిగిలిన సభ్యులు కొంత ముందుకు వెళ్లారు. ఇదే సమయంలో వెనుక వైపు 30 మీటర్ల దూరంలో అలికిడి వినిపించడంతో శ్రీదేవి ఆవైపు చూడగా, పెద్ద పులి నడిచి వెళుతూ కనిపించింది. దీంతో ఆమె అక్కడికక్కడే మూర్ఛపోయారు. కల్వర్టుకు ఇవతలివైపు పడిపోయారు. అధికారుల బృందం తక్షణమే ఆమెను ఆస్పత్రికి తరలించారు. కల్వర్టుకు అవతలివైపు పడిపోయి ఉంటే పులికి ఆహారం అయ్యేదానినని శ్రీదేవి విలపిస్తుండటంతో అధికారులు సైతం భయాందోళనకు గురవుతున్నారు.ఏ బిడ్డా.. ఇది నా అడ్డామన్ననూర్: అమ్రాబాద్ పులుల రక్షిత అభయారణ్యంలో పెద్ద పులులు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. అటవీ శాఖ చేపట్టిన జంగిల్ సఫారీలో భాగంగా పర్యాటకులకు తరచూ పెద్ద పులులు కనిపిస్తూ సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి విధుల్లో భాగంగా సఫారీ వాహనంలో వెళ్తున్న అటవీ శాఖ అధికారులు, సిబ్బందికి.. గుండం వద్ద చెట్ల పొదల నుంచి వచ్చిన పెద్దపులి కనిపించింది. సఫారీ వాహనం దీపాలను ఏమాత్రం పట్టించుకోకుండా రోడ్డుపైనే ఠీవిగా నడుచుకుంటూ సాగిపోయింది. దీంతో అధికారులు తమ సెల్ఫోన్లలో పులి కదలికలను వీడియోలు తీశారు.కెమెరాకు చిక్కిన చిరుతపులిబోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం కరత్వాడ గ్రామ శివారులోని లక్కాయి లొద్ది వద్ద చిరుతపులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. రెండు రోజుల క్రితం కరత్వాడ గ్రామానికి చెందిన ద్యాగాల గంగయ్యకు చెందిన ఆవు.. లక్కాయి లొద్ది వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీనిని చిరుత దాడిగానే భావించిన అటవీ శాఖ అధికారులు అక్కడ ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం 5.29 గంటల ప్రాంతంలో ఆవు కళేబరాన్ని చిరుత తింటున్న దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో ఆవును చంపింది చిరుతేనని అటవీ అధికారులు ధ్రువీకరించారు. చిరుత సంచారం దృష్ట్యా అటవీ ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. పశువుల కాపరులు, వృద్ధులు అడవిలోకి వెళ్లవద్దని సూచించారు. -
తల్లి బంగారంతో ప్రియుడికి బైక్
ఎల్లారెడ్డిపేట/గంభీరావుపేట(సిరిసిల్ల): తల్లి బంగారాన్ని అమ్మి ప్రియుడికి బహుమతిగా బైక్ను కొనిచ్చింది ఓ యువతి. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జరిగిన ఈ సంఘటన వివరాలివి.గంభీరావుపేట మండలానికి చెందిన ఓ యువతితో ఎల్లారెడ్డిపేటకు చెందిన యువకుడికి ఇన్స్ట్రాగామ్లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో ఆ యువకుడు తనకు బైకు కొనివ్వాలని ప్రియురాలిని కోరాడు. ప్రియుడి కోరిక తీర్చేందుకు సదరు యువతి తల్లి బంగారాన్ని అమ్మేసి బైకు కొనిచ్చింది. తన బంగారం కనిపించడం లేదని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. -
ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారు
కొందరు ఆధారాలు లేకుండా ‘సెస్’ సంస్థపై ఆరోపణలు చేస్తున్నారు. ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ కంటే ‘సెస్’ పరిధిలో విద్యుత్ పంపిణీలో మెరుగైన సేవలు అందిస్తున్నాం. ఎన్పీడీసీఎల్ ఒక్కో యూనిట్కు రూ.4.77 చొప్పున బిల్లు జారీ చేస్తుంది. ఇందులో వ్యవసాయ వినియోగం సబ్సిడీని మినహాయించకుండా బిల్లు జారీ కావడంతో బకాయిలు పెరుగుతున్నాయి. మూడేళ్లుగా పాలకవర్గం తీసుకున్న నిర్ణయాలతో ఆదాయం పెరిగింది. – చిక్కాల రామారావు, ‘సెస్’ చైర్మన్ ‘సెస్’లో ఉద్యోగులకు జీతాలు ఎక్కువగా ఉన్నాయి. దుబారా ఖర్చులతో సంస్థకు నష్టం వాటిల్లుతోంది. విద్యుత్ పరికరాల కొనుగోలు నుంచి ఉద్యోగుల పదోన్నతుల వరకు అవినీతి ఉంది. ఏదైనా సమాచారం అడిగితే తప్పుడు వివరాలు అందిస్తున్నారు. ‘సెస్’ చైర్మన్ ప్రతీ నెల రూ.లక్ష జీతం, వాహన అద్దె రూ.60వేలు తీసుకుంటున్నారు. పాలకవర్గంపై అవినీతి ఆరోపణలున్నాయి. – బియ్యంకార్ శ్రీనివాస్, వినియోగదారుడు, సిరిసిల్ల -
హోలీ వేడుకల్లో జడ్జీలు
వేములవాడ: స్థానిక కోర్టు ఆవరణలో బుధవారం హోలీ వేడుకలు నిర్వహించారు. జూనియర్ సివిల్ జడ్జీలు ప్రవీణ్, జ్యోతిర్మయి న్యాయవాదులతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ఏజీపీ ప్రశాంత్కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడిసె సదానందం, ప్రధాన కార్యదర్శి గడ్డం సత్యనారాయణరెడ్డి, న్యాయవాదులు నేరెళ్ల తిరుమల్గౌడ్, పురుషోత్తం, పర్లపెల్లి అంజయ్య, గుండ రవి, కిశోర్రావు, నక్క దివాకర్, అనిల్కుమార్, జనార్దన్, జక్కుల పద్మ, బూర సరిత, మమత, అన్నపూర్ణ పాల్గొన్నారు. వీర్నపల్లి(సిరిసిల్ల): వందశాతం ఉత్తీర్ణత లక్ష్యంగా ‘సాక్షి’ తనవంతు సాయంగా మరో ముందడుగు వేసింది. సామాజిక బాధ్యతలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులకు పదో తరగతి స్టడీ మెటీరియల్ అందజేయడం అభినందనీయమని మండల విద్యాధికారి తుమ్మ శ్రీనివాస్ పేర్కొన్నారు. మండలంలోని 158 మంది పదో తరగతి విద్యార్థులకు సాక్షి స్టడీ మెటీరియల్ను బుధవారం పంపిణీ చేశారు. ప్రధానోపాధ్యాయుడు అశోక్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సిరిసిల్ల అర్బన్ : మై భారత్(మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఎఫైర్స్) ఆధ్వర్యంలో నిర్వహించే జిల్లా స్థాయి క్రీడాపోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులను ఆహ్వానిస్తున్నట్లు ఆర్గనైజర్ దొంతరవేణి హరీశ్ కోరారు. అగ్రహారంలోని జేఎన్టీయూ మైదానంలో ఈనెల 6, 7 తేదీల్లో జిల్లా స్థాయి వాలీబాల్, కబడ్డీ, రన్నింగ్, షార్ట్పుట్, బ్యాడ్మింటన్, చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రీడాకారులు 18 నుంచి 30 ఏళ్లలోపు వారు అర్హులని పేర్కొన్నారు. వివరాలకు 86882 95297, 93474 61020, 89785 83002లో సంప్రదించాలని కోరారు. సిరిసిల్లటౌన్: ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ఎక్కడ అమలవుతుందని సీపీఐ అనుబంధం వ్యవసాయ కార్మికసంఘం అధ్యక్షుడు గుంటి వేణు ప్రశ్నించారు. సిరిసిల్లలోని కార్మికభవన్లో బుధవారం మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేయడం లేదన్నారు. రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాల్లో కొందరికి మాత్రమే మొదటి విడతగా రూ.6వేలు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందిని విస్మరించారన్నారు. సోమ నాగరాజు, అంజిరెడ్డి, ప్రకాశ్ పాల్గొన్నారు. పన్నులు విధిగా చెల్లించాలిసిరిసిల్లటౌన్: పట్టణంలోని గృహ యజమానులు, వాణిజ్య గృహయజమానులు బల్దియాకు ఆస్తి, నీటి పన్నులు విధిగా చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ ఎం.ఏ.ఖదీర్పాషా బుధవారం ప్రకటనలో కోరారు. ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్, వివిధ ప్రకటనల ఫీజులు సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. పట్టణాభివృద్ధి, పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వీధిదీపాల నిర్వహణ, డ్రైనేజ్ వ్యవస్థ బలోపేతం వంటి కార్యక్రమాలు పన్నుల ద్వారా లభించే ఆదాయంతోనే నిర్వహిస్తామని పేర్కొన్నారు. మున్సిపల్ సిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరారు. -
శాస్త్రోక్తంగా నిర్వహిస్తాం
రాజన్న ఆలయ విస్తరణ పనులు జరుగుతున్నప్పటికీ స్వామి వారి ఉత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తున్నాం. ఆలయ ప్రధాన గోపురం ఎదుట యాగశాలలో ప్రత్యేక పూజలు చేస్తాం. ఈసారి శివార్చన వేదికపై స్వామి వారి కల్యాణోత్సవం నిర్వహించబోతున్నాం. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పార్వతీరాజరాజేశ్వరల కల్యాణోత్సవం వీక్షించవచ్చు. – చంద్రగిరి శరత్శర్మ, ఆలయ ప్రధాన అర్చకుడు రాజన్న కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం. ఈసారి శివార్చన వేదికపై కల్యాణోత్సవం నిర్వహిస్తున్నాం. ఇక్కడ భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నాం. తాగునీరు, శామియానాలు, మరుగుదొడ్లు, మజ్జిగ ప్యాకెట్లు, ఉచిత అన్నదానం, విద్యుత్ లైట్లు, పార్కింగ్, భక్తులు కూర్చునేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. భక్తులకు భద్రత కల్పించేందుకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. – రమాదేవి, ఆలయ ఈవో -
గ్రామప్రగతిలో భాగస్వాములు కావాలి
● జిల్లా పంచాయతీ అధికారి షరీఫొద్దీన్ ● వార్డు సభ్యులకు ఐదు రోజుల శిక్షణ ప్రారంభంతంగళ్లపల్లి(సిరిసిల్ల): గ్రామప్రగతిలో వార్డుసభ్యులు భాగస్వాములు కావాలని డీపీవో షరీఫొద్దీన్ సూచించారు. మండల కేంద్రంలోని మండల పరిషత్లో బుధవారం జీపీ వార్డు సభ్యుల శిక్షణ తరగతులను ప్రారంభించి మాట్లాడారు. మూడు విడతలగా మండలంలోని అన్ని గ్రామపంచాయతీల వార్డు సభ్యులకు శిక్షణ ఇస్తామన్నారు. తొలివిడతగా అంకిరెడ్డిపల్లె, అంకుసాపూర్, బద్దెనపల్లి, బాలమల్లుపల్లె, బస్వాపూర్, చీర్లవంచ, చిన్నలింగాపూర్, చింతలఠాణా, దేశాయిపల్లె, గండిలచ్చపేట గ్రామాల్లోని వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు ప్రారంభించారు. ఇన్చార్జి ఎంపీడీవో మీర్జా అఫ్జల్ అహ్మద్బేగ్, ఎంపీపీ సూపరింటెండెంట్ దొంతుల రమేశ్, జేఈ రాజనర్సు, ట్రైనర్లు వెన్నెల, అశోక్, రమేశ్, కార్యదర్శులు లావణ్య, మమత, వాణీ, సలీమ్, శ్రీనివాస్, సంతోష్ పాల్గొన్నారు. సుముఖత చూపని ఉపసర్పంచులు వార్డు సభ్యులకు ఐదు రోజులపాటు పంచాయతీరాజ్ ద్వారా అందిస్తున్న ప్రత్యేక శిక్షణకు మెజారిటీ ఉపసర్పంచులు గైర్హాజరయ్యారు. శిక్షణకు హాజరుకాని వార్డుసభ్యుల వివరాలను కలెక్టర్కు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు అధికారులు తెలిపారు. ఇంగ్లిష్లో పంచాయతీరాజ్ చట్టం వార్డు సభ్యులకు ఇస్తున్న శిక్షణలో పంచాయతీరాజ్ చట్టంపై ఇంగ్లిష్లో ప్రొజెక్టుర్ ద్వారా అవగాహన కల్పించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. వార్డు సభ్యులలో చాలా మందికి ఇంగ్లిష్లో చెప్పేది అర్థంకాకపోవడంతో ఇబ్బందిపడ్డారు. తెలుగులో అర్థమయ్యేలా చెప్పాలని, ఈ విషయంపై జిల్లా అధికారులు దృష్టిపెట్టాలని వార్డుసభ్యులు కోరారు. -
చేతులు తడిపితేనే సేవలు
సిరిసిల్ల: సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్)లో ఏ పని కావాలన్నా చేతులు తడపాల్సి వస్తోందని విద్యుత్ వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థ ఆస్తులకు రక్షణ లేదని, ఉన్న ఆస్తులను గత పాలకవర్గాలు పరాధీనం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్లో తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి(టీఈఆర్సీ) చైర్మన్ జస్టిస్ డాక్టర్ దేవరాజు నాగార్జున్ బుధవారం బహిరంగ విచారణ చేపట్టారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యుత్ వినియోగదారులు, ‘సెస్’ గ్రామీణ ప్రతినిధులు పాల్గొని, తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ● ఇంత నిర్లక్ష్యమా లూజ్ వైర్లతో రైతులు ట్రాక్టర్తో దున్నేపరిస్థితి లేదని, హార్వెస్టర్లతో వరికోతలు కోసేందుకు ఇబ్బందిగా మారిందని, లూజ్వైర్లను సరిచేయాల్సిన ‘సెస్’ అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు మండిపడ్డారు. విద్యుత్ చౌర్యం సిబ్బంది కనుసన్నల్లోనే జరుగుతోందన్నారు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోతూ మరో ట్రాన్స్ఫార్మర్ను వేయాలంటే రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. పవర్లూమ్స్కు విద్యుత్ సరఫరాలోనూ అక్రమాలు జరుగుతున్నాయన్నారు. టీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ డాక్టర్ నాగార్జున్ మాట్లాడుతూ ‘సెస్’ పరిధిలో వినియోగదారులకు వీలైనంత మేరకు వేగంగా సేవలు అందించాలన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు, సిబ్బందిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు జరుగుతాయని, కానీ స్థానిక పాలకవర్గాల స్థాయిలో చేయాల్సిన పనులు సవ్యంగా చేయాలని సూచించారు. టీఈఆర్సీ సభ్యులు రఘు కంచర్ల(టెక్నికల్), చెరుకూరి శ్రీనివాసరావు(ఫైనాన్స్) తదితరులు పాల్గొన్నారు. వార్షిక నివేదికను వివరించిన ‘సెస్’ ఎండీ ‘సెస్’ ఎండీ భిక్షపతి సంస్థ వార్షిక నివేదకను, విద్యుత్ కొనుగోలు, పంపిణీ లెక్కలు వివరించారు. సభలో సభ్యులు చెప్పిన అంశాలపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ‘సెస్’ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, ‘సెస్’ డైరెక్టర్లు దిడ్డి రమాదేవి, మల్లుగారి రవీందర్రెడ్డి, సందుపట్ల అంజిరెడ్డి, వరుస కృష్ణహరి, కొట్టెపల్లి సుధాకర్, ఆకుల గంగారాజం, ‘సెస్’ ఇంజినీర్లు పాల్గొన్నారు. -
కనులపండువగా గౌర పూర్ణిమ
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని నేరళ్ల ఇస్కాన్ఫామ్ నూతన జగన్నాథ మందిరంలో బుధవారం గౌరపూర్ణిమ(హోలీ) వేడుకలు కనుల పండువగా నిర్వహించారు. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇస్కాన్ ఇన్చార్జి శ్రీప్రాణనాథ అచ్యుతదాస్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహా అభిషేకం నిర్వహించారు. అనంతరం అత్తాపూర్ టెంపుల్ ప్రెసిడెంట్ సచినందన్ ప్రభూజీ ప్రసంగించారు. స్వామివారికి 56 రకాల పిండివంటలతో నైవేద్యం సమర్పించారు. సర్పంచులు పొన్నం లచ్చయ్య, పూర్మాని రాజశేఖర్రెడ్డి, సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, ఏఎంసీ చైర్పర్సన్ వెలుముల స్వరూప, అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం(ఇస్కాన్) ప్రతినిధులు చైతన్యత్ ప్రభుతోపాటు హైదరాబాద్ నుంచి సుమారు 150 మంది భక్తులు పాల్గొన్నారు. -
రూ.కోట్లలో అవినీతి జరుగుతోంది
‘సెస్’ సంస్థ రూ.కోట్ల అవినీతికి అడ్డాగా మారింది. పాలకవర్గాలు రూ.130 కోట్ల అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయి. 3 లక్షల మందికి సేవలందించే సంస్థ రైతుల వద్ద డబ్బులు వసూలు చేస్తూ మొక్కుబడిగా పనిచేస్తుంది. ఈ అవినీతికి ‘సెస్’ పాలకవర్గం సభ్యులు బాధ్యులు కాదా? విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలి. – బి.పెద్దన్న, వినియోగదారుడు దీపావళి పూట టపాసులు కాల్చి ‘సెస్’ ఆఫీస్ రికార్డులను కాల్చిన సిబ్బందిపై చర్యలు ఎందుకు తీసుకోలేదు. పోలీసు కేసు ఏమైంది. సీసీ కెమెరాలు ఎందుకు పనిచేయలేదు. ఏళ్లుగా కొందరు ఉద్యోగులు ఇక్కడే పాతుకుపోయారు. అవినీతి ఆరోపణలు వచ్చిన వారిని బదిలీ చేయండి. – దేవయ్య, వినియోగదారుడు విద్యుత్ అక్రమ వినియోగాన్ని కట్టడి చేయాలి. ‘సెస్’ పరిధి లో నూ ప్రజావాణిని ఏర్పాటు చేసి వినియోగదారుల సమస్యలు ప రిష్కరించాలి. సంస్థకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.1,221.16 కోట్ల బకాయిలను విడుదల చేయాలి. కరెంట్షాక్తో ఎవరైనా మరణిస్తే రూ. 10లక్షల పరిహారం ఇవ్వాలి. – జోగినిపల్లి సంపత్రావు, వినియోగదారుడు -
రాజన్నకు బ్రహ్మోత్సవ శోభ
వేములవాడ: వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో గురువారం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఐదు రోజులపాటు నిర్వహించే ఈ ఉత్సవాలకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 6న స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు. ఇందుకు గుడిచెరువు ఖాళీ స్థలంలోని శివార్చన వేదికను సిద్ధం చేస్తున్నారు. గుడి చెరువు ఖాళీ ప్రాంగణంలో వేలాది మంది భక్తులు కూర్చొని కల్యాణాన్ని ప్రత్యక్షంగా తిలకించే అవకాశం లభించనుంది. 8న రథోత్సవం ఈనెల 8న పట్టణంలోని ప్రధాన వీధిలో స్వామి వారి రథోత్సవం నిర్వహించనున్నారు. ఈ ఉత్సవానికి భక్తులు భారీగా హాజరయ్యే అవకాశం ఉంది. ఆలయ అధికారులు తాగునీరు, భక్తులు కూర్చునేందుకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణం పుష్పాలతో అలంకరించనున్నారు. -
బాధ్యతగా ప్రజాపాలన
● ఐదు దశల్లో కార్యక్రమాలు ● కలెక్టర్ గరీమా అగ్రవాల్ సిరిసిల్ల: జిల్లాలో 99 రోజులపాటు చేపట్టనున్న ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ను అధికారులు బాధ్యతగా విజయవంతం చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్లో ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’పై బుధవారం సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి పథకాలను పారదర్శకంగా అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి లక్ష్యాలను సాధించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈనెల 6 నుంచి జిల్లాలోని అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల్లో కార్యక్రమాలు అమలు చేయాలని సూచించారు. గ్రామసభలు, ప్రత్యేక శిబిరాలు, అవగాహన కార్యక్రమాల నిర్వహణపై దృష్టి పెట్టాలన్నారు. డీఆర్డీవో గీత, డీఈవో జగన్మోహన్రెడ్డి, డీడబ్ల్యూవో లక్ష్మీరాజం, డీపీవో షరీఫొద్దీన్, జిల్లా వైద్యాధికారి రజిత, హౌసింగ్ పీడీ సాజిద్, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, సంపత్కుమార్ పాల్గొన్నారు. ఐదు దశల్లో కార్యక్రమాలు ఏప్రిల్ 2 (మొదటి దశ).. గ్రామ స్థాయిలో గ్రామ సభల నిర్వహణ, ఏప్రిల్ 16 (రెండో దశ).. మండల స్థాయిలో కార్యక్రమాలు, మే 2 (మూడో దశ).. నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాలు, మే 22 (నాలుగో దశ).. జిల్లా స్థాయిలో విస్తృత కార్యక్రమాలు, జూన్ 2(ఐదో దశ).. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించనున్నారు. ఇసుక డీడీలపై కలెక్టర్ ఆరా బోయినపల్లి(చొప్పదండి): మండలంలో ఇటీవల జారీ చేసిన ఇసుక అనుమతులు, డీడీలపై కలెక్టర్ గరీమా అగ్రవాల్ బుధవారం ఆరా తీశారు. తహసీల్ ఆఫీస్ను తనిఖీ చేసిన సందర్భంగా ఇసుక అనుమతులకు సంబంధించిన పలు అంశాలపై ఆరా తీశారు. ఇసుక డీడీలు ఎలా ఇస్తున్నారు? ఎన్ని రోజులకోసారి ఇస్తున్నారు? అనే విషయాలను పరి శీలించారు. అనంతరం అధికారులు, సిబ్బంది హా జరు రిజిస్టర్, భూ భారతి రిజిస్ట్రేషన్ గది పరిశీలించారు. కాగా కార్యాలయానికి చెందిన ఓ అధికారి సెలవులో ఉండగా, లీవ్ లెటర్ ఇచ్చారా అనే అంశంపై పరిశీలించారు. తహసీల్దార్ నారాయణరెడ్డి, ఆర్ఐ మనోజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. కేజీబీవీలో కలెక్టర్ భోజనం బోయినపల్లి కేజీబీవీని కలెక్టర్ గరీమా అగ్రవాల్ తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన సమయం కావడంతో విద్యార్థులతో కలిసి కింద కూర్చొని భోజనం చేశారు. అంతకుముందు కిచెన్, వంటగది, బియ్యం, పప్పులు, గుడ్లు ఇతర ఆహార పదార్థాలను పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా.. అని ఆరా తీశారు. ఎస్వో లింగవ్వ ఉన్నారు. అనంతరం బోయినపల్లి పీహెచ్సీని తనిఖీ చేశారు. గర్భిణుల రిజిస్ట్రేషన్, టీకాలు, మందుల పంపిణీపై ఆరా తీశారు. వైద్యుడు కార్తీక్ ఉన్నారు. -
రంగోత్సవం
సిరిసిల్లటౌన్: రంగుల కేళీ హోలీ పండుగ సంబరాలు మంగళవారం జిల్లా వ్యాప్తంగా జరిగాయి. సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు అన్ని మండలాలు, గ్రామాల్లో ప్రజలు రంగుల పండుగను ఉత్సాహంతో జరుపుకున్నారు. చిన్న, పెద్ద తేడా లేకుండా డీజే, సౌండ్ సిస్టమ్తో ఆడుతూ పాడుతూ రంగులు చల్లుకున్నారు. ఎస్పీ మహేశ్ బి గితే సిబ్బందితో ఆటపాటలతో అలరించారు. చైర్పర్సన్ జిందం కళ మున్సిపల్ ఆఫీసు ప్రాంగణంలో కౌన్సిలర్లు, సిబ్బందితో వేడుకలు నిర్వహించారు. అధికారులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సంబరాల్లో కౌన్సిలర్ చంద్రకళ, మహిళలు -
నాలుగో రోజుకు రిలే దీక్షలు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): సాగునీటి కాలువల నిర్మాణం పూర్తిచేయాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం నాలుగో రోజుకు చేరాయి. కాళేశ్వరం ప్రాజెక్టు 11వ ప్యాకేజీ కింద ఆర్డీ3, ఎల్ఎం6, ఎల్ఎం4 కాలువ పనులు పదేళ్లు గడిచినా పూర్తికాకపోవడంతో రైతులు తీవ్ర అసహనం వ్యక్తంచేస్తున్నారు. దీక్షా శిబిరంలోని రైతులకు మద్దతు తెలిపిన బీజేపీ మండల అధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్రావు మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం హామీలకే పరిమితమైందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా సమస్యను పట్టించుకోవడం లేదన్నారు. ఎమ్మెల్యే కేటీఆర్ నియోజకవర్గ అభివృద్ధిపై గొప్పలు చెబుతున్నారే తప్ప, రైతుల గోసను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ముంపు గ్రామాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న ప్యాకేజీలను విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో మండలంలోని పలు గ్రామాల రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఏ ఆఫీస్ ఎక్కడో !
సిరిసిల్ల: కలెక్టరేట్లో ఏ ఆఫీస్ ఎక్కడ ఉందో పట్టుకోవడం ఓ పజిల్. ఒక్క ఆఫీస్కు కూడా బోర్డు లేకపోవడంతో అది ఎవరిదో తెలియక వివిధ పనులపై వచ్చే సామాన్యులు తికమక పడుతున్నారు. 2021 జూలై 4న కలెక్టరేట్ సముదాయాన్ని అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు, అప్పటి మంత్రులు కేటీఆర్, ప్రశాంత్రెడ్డి ప్రారంభించారు. కలెక్టరేట్ను ప్రారంభించి నాలుగేళ్ల ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఏ ఆఫీస్ ఏ అంతస్తులో.. ఏ నంబరు గదిలో ఉందో తెలిపే బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ● దరిచేరని అన్ని శాఖలు కలెక్టరేట్లో 45 ప్రభుత్వ శాఖలు ఉన్నాయి. జిల్లాలో ప్రధానమైన రెవెన్యూ, విద్య, వైద్యం, వ్యవసాయం, పంచాయతీరాజ్, పౌరసరఫరాలు, రోడ్లు భవనాలు, ఇరిగేషన్, మైనింగ్, మాతా శిశు సంక్షేమం వంటి ప్రభుత్వ శాఖలు కలెక్టరేట్ ప్రారంభించగానే వచ్చి తమకు కేటాయించిన చాంబర్లో ఆఫీస్లను ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఇంకా కొన్ని ప్రభుత్వ శాఖల ఆఫీస్లు కలెక్టరేట్లోకి రాలేదు. తూనికలు–కొలతలు, నీటిపారుదల శాఖల ఆఫీస్లు అద్దె భవనాల్లో ఉన్నాయి. డ్రగ్ కంట్రోల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ కోసం జిల్లా వైద్యాధికారి ఆఫీస్లో కొంత భాగం కేటాయించారు. కానీ సీజ్డ్ మెడిసన్, కోర్టు డిపాజిట్ మెడిసిన్ వాసనతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీని కోసం బయట ఖాళీగా ఉన్న మరో ప్రభుత్వ భవనం కేటాయించాల్సి ఉంది. జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్లో వ్యవసాయ మార్కెట్ యార్డు రైతు విశ్రాంతి భవనం ఖాళీగా ఉంది. అంతస్తుల వారీగా, బ్లాకుల వారీగా ఆఫీస్ వివరాలను ఎంట్రన్స్లో పెట్టాలని సామాన్యులు కోరుతున్నారు. ● పనిచేయని సీసీ కెమెరాలు కలెక్టరేట్లో గతంలో ఏర్పాటు చేసిన 44 సీసీ కెమెరాలు ఇప్పుడు సరిగా పనిచేయడం లేదు. సీసీ కెమెరాల నిఘాలో కలెక్టరేట్ కార్యకలాపాలు సాగుతున్నాయి. కొన్ని సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. వాటిని రిపేరు చేయాల్సిన టెక్నికల్ సిబ్బంది లేకపోవడం, కెమెరాలు ఏర్పాటు చేసిన ఏజెన్సీ పట్టించుకోకపోవడంతో చాలా కెమెరాలు పనిచేయడం లేదు. ● సమయపాలన పాటించని అధికారులు కలెక్టరేట్లోని కొన్ని శాఖల అధికారులు సమయపాలన పాటించడం లేదు. సమయానికి ఆఫీస్కు వచ్చి ఫేస్ గుర్తింపు పరికరం(ఎఫ్ఆర్ఎస్) వద్ద హాజరు నమోదు, బయోమెట్రిక్ హాజరు నమోదు ఉన్నా.. కొన్ని శాఖల సిబ్బంది, అధికారులు వేళకు ఆఫీస్కు రావడం లేదు. కలెక్టరేట్లో అంతర్గత తనిఖీలు పెద్దగా లేకపోవడంతో అధికారులు నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కలెక్టరేట్లో ఏ ఆఫీస్ ఏ బ్లాక్లో ఉందో వివరించే బోర్డులను ఏర్పాటు చేయాలని గతంలో కలెక్టర్గా పనిచేసిన అనురాగ్ జయంత్ ఆర్అండ్బీ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఈమేరకు బోర్డు సైజు అక్షరాల సైజును నమోదు చేశారు. కానీ వాటి ఏర్పాటుకు నిధులు లేకపోవడంతో ఆగిపోయింది. మరోసారి పీఆర్ అధికారులకు బోర్డు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కానీ అది మా పరిధి కాదని పెండింగ్లో పెట్టారు. అసలు భవనం నిర్మించిన కాంట్రాక్టరే ఆ బోర్డు ఏర్పాటు చేయాల్సి ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికై నా కలెక్టరేట్ పాలనా అధికారులు చొరవ చూపి ఏ ఆఫీస్ ఎక్కడ ఉందో తెలిపే బోర్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.


