Rajanna
-
● స్కానింగ్ కేంద్రాలు తనిఖీ చేపట్టాలి ● వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్
లింగ నిర్ధారణపై కఠిన చర్యలుసిరిసిల్లటౌన్: జిల్లాలో లింగ నిర్ధారణ చేసే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని స్కానింగ్ కేంద్రాల పనితీరును పర్యవేక్షించాలన్నారను. భ్రూణ హత్యలు జరుగకుండా పకడ్బందీ చర్యలు తీసుకో వాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యధికంగా ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు. జిల్లాలో నూతన ఆస్పత్రుల ఏర్పాటుకు రిజిస్ట్రేషన్ ప్ర క్రియ కలెక్టర్ ఆధ్వర్యంలోనే జరగాలని సూచించా రు. స్కానింగ్ సెంటర్ల ఏర్పాటుకు కమిషనర్ అనుమతి తప్పనిసరి అని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద అందుబాటులో ఉన్న డ్రగ్స్ వివరాలపై వైద్యసిబ్బందికి అవగాహన కలిగి ఉండాలన్నారు. తెలంగాణ డయాగ్నస్టిక్స్ సేవల వివరాలు తెలుసుకున్నారు. రేడియాలజీ పరీక్షల నివేదికలు ఎప్పటికప్పుడు అందజేయాలన్నారు. ల్యాబ్ టెక్నీషియన్ లు అందుబాటులో ఉంటూ అవసరమైన సేవలు సమర్థంగా అందించేలా చూడాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజిత, డాక్టర్ లక్ష్మీనారాయణ, డాక్టర్ పెంచలయ్య పాల్గొన్నారు. -
వంతెన పూర్తి చేయండి
● స్తంభంపల్లి నుంచి సిరిసిల్లకు పాదయాత్ర సిరిసిల్లటౌన్/బోయినపల్లి(చొప్పదండి): అర్ధంతరంగా నిలిచిన స్తంభంపల్లి హైలెవెల్ వంతెన పనులు వెంటనే పూర్తి చేయాలని గ్రామస్తులు కోరారు. ఈమేరకు బుధవారం స్తంభంపల్లిలోని సుగ్రీవ టెంపుల్ నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్రగా వచ్చారు. మధ్యలో వేములవాడలో రాజన్న, అగ్రహారం ఆంజనేయస్వామి దేవాలయాల్లో దర్శనం చేసుకుని తమ సమస్య పరిష్కారం కావాలని పూజలు చేశారు. అనంతరం పాదయాత్రగా కలెక్టరేట్కు రాగా పోలీసులు అడ్డుకోగా వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న కలెక్టరేట్ కార్యాలయం ఏవో రామ్రెడ్డి వచ్చి వినతిపత్రం తీసుకున్నారు. స్తంభంపల్లి మాజీ సర్పంచ్ అక్కెనపల్లి జ్యోతి, మాజీ ఉపసర్పంచ్లు బొంగాని అశోక్, బీరవెల్లి వెంకటేశ్వరరావు, ముచ్చె లింగారెడ్డి, తునికి తిరుమలేశ్, రాచర్ల రాజేశ్, అక్కెనపల్లి గణేష్, అక్కెనపల్లి రమేశ్, గొర్రె విజయ్ పాల్గొన్నారు. -
నీడ లేదు.. నీరూ లేదు..!
కూర్చునేందుకు కుర్చీ ఉండదు.. నిలబడదామంటే నీడ ఉండదు.. కనీసం తాగునీరు దొరకదు.. అత్యవసర పరిస్థితుల్లో మరుగుదొడ్లను వినియోగించుకుందామంటే ముక్కుపుటాలు అదిరే కంపు.. ఇవీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్టాండ్లలో కనిపించే పరిస్థితులు. నియోజకవర్గ కేంద్రాల్లో బస్టాండ్లు ఉన్నా సౌకర్యాలు లేకపోగా.. మండల కేంద్రాల్లో కనీసం బస్టాండ్లు కూడా కరువయ్యాయి. మరికొన్ని ప్రధాన గ్రామాల్లో ప్రయాణప్రాంగణాలు లేక ప్రయాణికులు ఎండలోనే బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మీ పథకాన్ని అమలు చేయడంతో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. వీరంతా ఎండలోనే నిల్చొని బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం.. అంటూ ప్రచారం చేసుకునే అధికారులు ప్రయాణ ప్రాంగణాలలో కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. ఉమ్మడి జిల్లాలో ప్రయాణ ప్రాంగణాలు లేక.. ఉన్నా సౌకర్యాలు కరువై ప్రయాణికులు పడుతున్న కష్టాలపై ‘సాక్షి’ ఫోకస్. – వివరాలు 8లో.. -
● ఎస్పీ మహేశ్ బీ గీతే
ఇల్లంతకుంట(మానకొండూర్): గంజాయి సేవించడం, అక్రమ రవాణా చేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై నిఘా పెట్టి కట్టడి చేయాలని ఎస్పీ మహేశ్ బీ గీతే సూచించారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ఠాణాను బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని సూచించారు. పెట్రోలింగ్ సమయంలో అనుమానితులు కనిపిస్తే వెంటనే తనిఖీ చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్లలో నమోదవుతున్న కేసుల వివరాలు తెలుసుకున్నారు. ఠాణాలోని గ్రౌండ్లో నాటిన పండ్లతోటకు బిందు సేద్యం ప్రారంభించారు. డీఎస్పీ చంద్రశేఖర్రెడ్డి, రూరల్ సీఐ మొగిలి, ఇల్లంతకుంట ఎస్సై శ్రీకాంత్గౌడ్ ఉన్నారు. సీనియర్ సిటిజెన్ పోస్టర్ ఆవిష్కరణ సిరిసిల్లకల్చరల్: వృద్ధుల సంరక్షణ చట్టంలోని కీలక సెక్షన్లతో కూడిన పోస్టర్ను ఎస్పీ మహేశ్ బీ గీతే బుధవారం ఆవిష్కరించారు. ఎస్పీ ఆఫీస్లో పోస్టర్ ఆవిష్కరణలో సీనియర్ సిటీజన్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు చేపూరి బుచ్చయ్య, డాక్టర్ జనపాల శంకరయ్య, సంఘం బాధ్యులు శ్రీగాద మైసయ్య, దొంత దేవదాస్, అంకారపు జ్ఞానోభ, శ్రీకాంత్ పాల్గొన్నారు. -
చార్జిషీట్ దాఖలుపై నిరసన
సిరిసిల్లటౌన్: కాంగ్రెస్ పార్టీ అధినేతలు రాహుల్గాంధీ, సోనియాగాంధీలపై ఈడీ పెట్టిన అక్రమకేసులు వెంటనే ఎత్తివేయాలని కోరుతూ ఆ పార్టీ నాయకులు బుధవారం స్థానిక బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఎదుట ధర్నా చేశారు. ఏఐసీసీ కోఆర్డినేటర్ అవీజ్ మాట్లాడుతూ ప్రజల్లో కాంగ్రెస్కు పెరుగుతున్న ఆదరణ చూసి బీజేపీ సర్కారు తట్టుకోలేక పోతుందన్నారు. కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, మహిళ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, నాయకులు ఆకునూరి బాలరాజు, కల్లూరి చందన, కోడం అమర్, కుడిక్యాల రవికుమార్, అన్నల్దాస్ భాను తదితరులు పాల్గొన్నారు. -
కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీఆర్డీవో శేషాద్రిఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రైతులు తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా కోరారు. మండలంలోని రాచర్లబొప్పాపూర్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని బుధవారం అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్తో కలిసి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతులు తాము పండించిన ధాన్యాన్ని సమీపంలోని కొనుగోలు కేంద్రాలకు తరలించాలని సూచించారు. ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయాలని సిబ్బందికి సూచించారు. జిల్లాలో ఐకెపి ఆధ్వర్యంలో 191 కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మిల్లర్లు ధాన్యం సేకరించకపోతే సమీపంలోని ప్రభుత్వ గోదాముల్లో నిల్వ చేస్తామని తెలిపారు. వ్యవసాయాధికారి, మండల ప్రత్యేకాధికారి అఫ్జల్బేగం, డీఆర్డీవో శేషాద్రి, తహసీల్దార్ సుజాత పాల్గొన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో.. ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి, నారాయణపూర్, సింగారం, రాచర్లబొప్పాపూర్, గుండారం గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను డీఆర్డీవో శేషాద్రి ప్రారంభించారు. ఏఎంసీ చైర్పర్సన్ సాబేరబేగం, వైస్చైర్మన్ గుండాడి రాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు షేక్ గౌస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, మండలాధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, బండారి బాల్రెడ్డి, సిరిపురం మహేందర్ ఉన్నారు. -
దరఖాస్తుల యువ‘వికాసం’!
● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనూహ్య స్పందన ● వరుస సెలవులు, సర్వర్ సమస్యలతో దరఖాస్తులకు ఇబ్బందులు ● చాలా మందికి ఇంకా అందని కులం, ఆదాయం, రేషన్ కార్డులు ● గడువు పెంచాలని దరఖాస్తుదారుల వినతులుసాక్షిప్రతినిధి, కరీంనగర్: యువత స్వయం ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువవికాస పథకానికి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అనూహ్య స్పందన వచ్చింది. దరఖాస్తు ప్రక్రియలో తీవ్ర సమస్యలు ఎదురైన దరఖాస్తులు వెల్లువెత్తాయి. సర్వర్ లోపాలతో పాటు సాంకేతిక సమస్యలతో దరఖాస్తుల ప్రక్రియ మందకొడిగా సాగడంతో వేల మంది పథకం కోసం దరఖాస్తు చేసుకోకముందే గడువు ముగియటంతో నిరాశచెందుతున్నారు. ప్రభుత్వం మెరుగైన రాయితీతో రూ.4 లక్షల వరకు విలువైన యూనిట్లు మంజూరు చేయనుండటంతో యువత ఈ పథకానికి భారీగా దరఖాస్తు చేసుకోవాడానికి ఆసక్తి చూపారు. గడువు ముగిసేనాటికి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1,31,075 మందికి ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. సర్వర్ సమస్యలతో కేంద్రాల వద్ద బారులు రాజీవ్ యువ వికాసం దరఖాస్తు చేయడానికి రూపొందించినటువంటి ఓబీఎంఎంఎస్ పోర్టల్లో సర్వర్ సమస్యలు నెలకొన్నాయి. దీంతో మీ సేవ కేంద్రాల వద్ద పడిగాపులు కాసారు. కొన్నిసార్లు అప్లికేషన్ చివరిదశకు వెళ్లిన సమయంలో సర్వర్ మొరాయించగా, దరఖాస్తు సమర్పించిన తర్వాత అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ కాకపోవడంలాంటి సమస్యలు ఎదురయ్యాయి. ఒకవేళ మళ్లీ దరఖాస్తు చేస్తే అల్రెడీ అప్లైడ్ అని రావడం, దరఖాస్తు సమయంలో తరచూ సర్వర్ ఎర్రర్ మెసేజ్ రావడమనేది పరిపాటిగా మారింది. దీంతో ఒక్కో దరఖాస్తు చేయడానికి కనీసం అరగంటకు పైగా ఎదురుచూడాల్సి వచ్చింది. సెలవులతో అర్జీలు పెండింగ్లో రేషన్కార్డు లేకుంటే ఆదాయ ధ్రువీకరణ ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేయడంతో ఆ సర్టిఫికేట్స్ కోసం మీసేవ కేంద్రాలకు పరుగులు తీశారు. ఐతే రాజీవ్ యువవికాసం పథకం దరఖాస్తులు స్వీకరించినప్పటి నుంచి వరుస సెలువులు సైతం దరఖాస్తుదారులను ఇబ్బందులకు గురిచేశాయి. రంజాన్, ఉగాది, జగ్జీవన్రామ్ జయంతి, తాజాగా రెండో శనివారం, ఆదివారం, సోమవారం అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వ ఆఫీసులు పనిచేయలేదు. దీంతో ఆదాయం, కుల సర్టిఫికేట్స్ పెండింగ్ దరఖాస్తులు ఎలా పరిష్కారమవుతాయని దరఖాస్తుదారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు మీసేవ కేంద్రాల ద్వారా రెవెన్యూ కార్యాలయాలకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా లక్షల్లో క్యాస్ట్, ఇన్కం ధ్రువీకరణ పత్రాలకు అర్జీలు వచ్చాయి. వీటిలో వేలల్లోనే దరఖాస్తులను మాత్రమే అధికారులు ఆమోదించారు. దీంతో ధ్రువీకరణ పత్రాలు అందని చాలామంది చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరు ఏండ్ల తరువాత 6 ఏళ్ల తరువాత నిరుద్యోగుల కోసం స్వయం ఉపాధి పథకాన్ని అమలు చేస్తుండటంతో యువత దీనిపైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ పథకం దరఖాస్తుల స్వీకరణ మార్చి 15వ తేదీన ప్రారంభించినప్పటికీ అప్పటికీ రుణాల పరిమితి, కేటగిరీలు, రాయితీ నిధులకు సంబంధించి స్పష్టత రాలేదు. మార్చి 25న ఈ పథకం విధివిధానాలపై సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. ఆ తరువాత ఈబీసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరణ చేపట్టింది. గడవు పెంచుతూ 14 వరకు సమయం ఇచ్చింది. తాజాగా మరోసారి గడువు పెంపుపై ఆశలు పెట్టుకున్నారు.పెద్దపల్లి 47,470జగిత్యాల 31,128రాజన్నసిరిసిల్ల 23,477కరీంనగర్ 29,000కుల ధ్రువీకరణ పత్రం లేక దరఖాస్తు తిరస్కరణ కుల ధ్రువీకరణ పత్రం కోసం వారం రోజుల క్రితం దరఖాస్తు చేసుకున్నా. తహసీల్దార్ కార్యాలయంలో సైట్ ఓపెన్ కావడం లేదని వారు దానిని అప్లోడ్ చేయలేదు. దీంతో నాకు కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ రాలేదు. దీంతో నేను దరఖాస్తు చేసుకోలేకపోయాను. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసే నంబరు వేసినప్పటికీ యువ వికాస్ పథకంలో తీసుకోవడం లేదు. దీంతో ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు వీలు లేకుండా పోయింది. –ఏదుల కిరణ్కుమార్, జగిత్యాల -
మత్తులో పేట్రేగిపోతున్నారు
● గంజాయి మత్తులో హత్యలు ● వేములవాడ ప్రాంతంలో భయాందోళన ● మైకంలోనే అఘాయిత్యాలు ● తప్పుదారి పడుతున్న యువత ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి చెట్టిపల్లి పర్శరాములు. కొన్నేళ్లుగా వేములవాడలోనే ఉంటున్నాడు. ఇతనికి గంజాయి సరఫరా దారులతో సంబంధాలు ఉన్నట్లు ఇతని హత్య ద్వారా బయటకు వచ్చింది. గంజాయి సరఫరాలో ఏర్పడిన తగాదాలతో చివరికి ప్రాణం పోయింది. ఈ చిత్రంలో కనిపిస్తున్న మృతదేహం వేములవాడ పట్టణానికి చెందిన శ్రీధర్ది. గతేడాది ఫిబ్రవరి 12న బైపాస్రోడ్డులోని సేవ్స్ పక్కన హత్యకు గురయ్యాడు. మిత్రులతో కలసి మద్యం సేవించి చిన్న చిన్న గొడవలు చివరికి హత్యకు దారితీశారు. వేములవాడ: యువత మత్తులో చిత్తవుతున్నారు. గంజాయి సేవిస్తూ.. మద్యం తాగుతూ ప్రాణాలు తీస్తున్నారు. వేములవాడ పట్టణంలో ఈనెల 13న జరిగిన హత్యనే ఇందుకు సాక్ష్యం. గంజాయికి అలవాటుపడ్డ యువత క్రమంగా రవాణాదారులుగా మారుతున్నట్లు సమాచారం. చదువుకొని ఉన్నత విద్యావంతులుగా ఎదగాల్సిన వారు ఇలా మత్తులో చిత్తవుతుండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పెరుగుతున్న డ్రగ్స్ వినియోగం యువకులు, విద్యార్థులలో గంజాయి, మద్యం వినియోగం పెరుగుతోంది. ముఖ్యంగా పాన్టేలాలు, బస్టాండు ప్రాంతాలు, కాలేజీల పరిసరాల్లో డ్రగ్స్ లభిస్తున్నట్లు సమాచారం. గ్రామాల శివారు ప్రాంతాలు, వేములవాడలో బైపాస్రోడ్లు, జగిత్యాల జిల్లా సరిహద్దు గ్రామాల నుంచి ఎక్కువగా సరఫరా జరుగుతున్నట్లు సమాచారం. తొలుత గంజాయికి అలవాటు పడేలా స్మగ్లర్లు యువతను ప్రోత్సహిస్తున్నట్లు తెలిసింది. పూర్తిగా మత్తుకు అలవాటు పడ్డ తర్వాత వారినే కొరియర్లుగా, విక్రేతలుగా మార్చి పెద్ద ఎత్తున దందా చేస్తున్నట్లు సమాచారం. మత్తులోనే తరచూ జరుగుతున్న హత్యలు స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. గొడ్డళ్లు, కత్తులతో హత్యలకు దిగుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయపడుతున్నారు. ఇటీవల స్థానిక ఫంక్షన్హాల్ వద్ద హత్యకు పాల్పడ్డ గ్యాంగ్లోని యువకులు వారం రోజుల క్రితం రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 3 గంటల వరకు కోనాయపల్లిలో హల్చల్ చేసినట్లు గ్రామస్తుల ద్వారా తెలిసింది. గస్తీ పోలీసులు చేరుకున్నప్పటికీ వారిని కట్టడి చేయలేకపోయారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సవాల్ విసురుతోన్న వీడియో వేములవాడను వణికిస్తున్న హత్యల వెనుక అసలు కథ క్రమంగా వెలుగులోకి వస్తోంది. బైపాస్రోడ్డులో జరిగిన హత్య అనంతరం హంతకుడు గొడ్డలి పట్టుకొని ఇంకా కొంతమంది బాకీ ఉన్నారని. త్వరలోనే వాళ్ల అంతు చూస్తానంటూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో సవాల్గా విసురుతోందన్న చర్చ సాగుతోంది. ఈ హత్యల వెనుక వ్యక్తిగత కక్షలేనా? ఇంకేమైనా కుట్రలు దాగి ఉన్నాయా.. అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఆరు నెలల్లో నమోదైన కేసులు గంజాయి కేసులు 22 పట్టుబడ్డ యువత 55 స్వాధీనం చేసుకున్న గంజాయి 1.800 కిలోలు స్వీయ నియంత్రణ అవసరం గంజాయి నియంత్రణపై ప్రభుత్వం సీరియస్గా ఉంది. పోలీసుశాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు చేస్తూ కేసులు నమోదు చేశాం. చాలా మందిని జైలుకు పంపాం. గంజాయిపై అవగాహన పెంచుతూ సమాజంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైనా గంజాయి వినియోగించడం, విక్రయించడం వంటివి కనిపిస్తే 100కు డయల్ చేసి సమాచారం అందించాలి. – శేషాద్రినిరెడ్డి, వేములవాడ ఏఎస్పీ -
అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
సిరిసిల్ల: అగ్నిప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సిరిసిల్ల ఫైర్ ఆఫీసర్ నరేందర్ కోరారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలికల హైస్కూల్, సిద్ధార్థ ఇంగ్లిష్ మీడియం, రేడియంట్, శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్, భారతి విద్యా నిలయం, శ్రీచైతన్య స్కూల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్ మాట్లాడుతూ, అగ్ని ప్రమాదాలతో ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుందన్నారు. అగ్ని ప్రమాదాలపై ఉపాధ్యాయులు అవగాహన పెంచుకుని విద్యార్థులకు వివరించాలని సూచించారు. అనంతరం అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరించారు. అగ్నిమాపక సిబ్బంది, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం
● ఎస్పీ మహేశ్ బి.గీతే ముస్తాబాద్(సిరిసిల్ల): అసాంఘిక కార్యకలాపాలపై పోలీస్ అధికారులు, సిబ్బంది ఉక్కుపాదం మోపాలని ఎస్పీ మహేశ్ బి.గీతే అన్నారు. మంగళవారం ముస్తాబాద్ పోలీస్స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పల్లెల్లో సమాచారం వ్యవస్థను బలోపేతం చేసుకోవాలన్నారు. తరచూ గ్రామాలను సందర్శించి, ప్రజల బాగోగులు అడిగి తెలుసుకోవాలన్నారు. 100 డయల్ కాల్స్పై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బ్లూకోల్ట్, పెట్రోకార్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. రౌడీ షీటర్లపై నిఘా పెట్టి, వారి చర్యలను గమనించాలని సూచించారు. ఇసుక, రేషన్ బియ్యం, గంజాయి వంటివాటిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎస్పీ వెంట డీఎస్పీ చంద్రశేఖర్రెడ్డి, సీఐ మొగిలి, ఎస్సై గణేశ్, సిబ్బంది ఉన్నారు. -
కలెక్టరేట్లో ఫైల్స్ పెండింగ్లో లేవు
సిరిసిల్ల: కలెక్టరేట్లో ఎటువంటి ఫైల్స్ పెండింగ్లో లేవని, సకాలంలో అన్నీ పరిష్కరిస్తున్నట్లు కలెక్టర్ సందీప్కుమార్ ఝా తెలిపారు. ‘కలెక్టర్.. అన్నీ అదనపు బాధ్యతలు’ శీర్షికన ‘సాక్షి’లో మంగళవారం ప్రచురితమైన కథనంపై స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో అదనపు బాధ్యతలు స్వీకరించానని ఆయన వివరించారు. జిల్లాలోని అన్ని శాఖల ఫైల్స్ ఎప్పటికప్పుడు క్లియర్ అవుతున్నాయని, ప్రస్తుతం ‘ఈ–ఆఫీస్’లో ఎటువంటి ఫైల్స్ పెండింగ్లో లేవని కలెక్టర్ స్పష్టం చేశారు. సిరిసిల్ల ఇన్చార్జి ఆర్డీవో బదిలీ..?సిరిసిల్ల: జిల్లాలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా పని చేస్తూ, సిరిసిల్ల ఇన్చార్జి ఆర్డీవోగా ఉన్న రాధాబాయి హైదరాబాద్ టీఎస్ఐసీసీకి బదిలీ అయినట్లు సమాచారం. ఈ మేరకు ప్రభుత్వ ఆదేశాలు రాగా, ఆమెను రిలీవ్ చేయకుండా ఆపివేసినట్లు తెలిసింది. ఇప్పటికే వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్ దీర్ఘకాలిక సెలవులో వెళ్లగా, ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు. సిరిసిల్ల ఆర్డీవోగా సైదులును ప్రభుత్వం బదిలీ చేయగా ఆయన విధుల్లో చేరలేదు. సిరిసిల్ల ఇన్చార్జి ఆర్డీవోగా విధులు నిర్వహిస్తున్న ఎస్డీసీ రాధాబాయి బదిలీ అంశం రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పటికే జిల్లాలో కీలకమైన పోస్టులన్నీ ఇన్చార్జి అధికారులతో కొనసాగుతుండగా, ఇన్చార్జి ఆర్డీవో బదిలీ కావడంపై ఆసక్తికరమైన చర్చ సాగుతుంది. బదిలీ విషయమై రాధాబాయిని వివరణ కోరగా.. తనకు బదిలీ కాలేదని సమాధానమిచ్చారు. జిల్లాలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఆమె అలా సమాధానమిచ్చి ఉంటారని కలెక్టరేట్ వర్గాలు భావిస్తున్నాయి. సమయపాలన పాటించాలిబోయినపల్లి(చొప్పదండి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేసే వైద్యసిబ్బంది సమయపాలన పాటించాలని డీఎంహెచ్వో రజిత ఆదేశించారు. మండలంలోని కొదురుపాక పీహెచ్సీని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి రికార్డులు, సిబ్బంది హాజరు రిజిష్టరు, మందులను పరిశీలించారు. వైద్యాధికారి రేణు ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానంసిరిసిల్లకల్చరల్: క్రీడా శిక్షణ శిబిరాలను నిర్వహించేందుకు ఆసక్తి, అర్హత గల క్రీడాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా క్రీడల శాఖ అధికారి అజ్మీరరాందాస్ తెలి పారు. జిల్లాలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చే యనున్న 10 శిబిరాల్లో మే 1 నుంచి నెల రోజు లపాటు 14 ఏళ్ల లోపు బాలబాలికలకు వివిధ క్రీడాంశాల్లో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఉత్సాహవంతులైన సీనియర్ క్రీడాకారులు, జాతీయస్థాయి క్రీడాకారులు వ్యాయామ ఉపాధ్యాయులు అర్హులుగా పేర్కొన్నారు. కలెక్టరేట్లోని క్రీడల శాఖ కార్యాలయంలో ఈ నెల 22 లోపు తమ ప్రతిపాదనలు అందజేయాలన్నారు. ఎంపికై న శిక్షకులకు గౌరవ వేతనం, క్రీడా సామగ్రి అందజేస్తామని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 94402 39783 నంబర్లో సంప్రదించాలని సూచించారు. అగ్నివీర్ ఎంపికకు..సిరిసిల్లకల్చరల్: భారత సైనికాదళంలో వివిధ కేటగిరీల వారీగా అగ్నివీర్ జనరల్, టెక్నికల్, నాన్ టెక్నికల్, ట్రేడ్స్మెన్ తదితర పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదలైనట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి నీల రాఘవేందర్ తెలిపారు. అభ్యర్థుల అర్హత ఆధారంగా ఏవైనా రెండు కేటగిరీల పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని ఐటీఐ, డిప్లొమా, ఎన్సీసీ సర్టిఫికెట్లు ఉన్నవారికి బోనస్ మార్కులు ఇస్తారని పేర్కొన్నారు. 13 భాషల్లో నిర్వహించే ఉమ్మడి రాత పరీక్ష ఆన్లైన్ విధానంలో నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తారని వివరించారు. అర్హతగల యువత ww. joinindianarmy. nic ద్వారా ఆన్లైన్లో ఈ నెల 25లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. జూన్లో సంబంధిత సైట్ నుంచి అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకుని పరీక్షకు హాజరు కావచ్చని పేర్కొన్నారు. ప్రతిభ ఆధారితంగా జరిగే ఎంపిక ప్రక్రియలో సందేహాలున్న వారు సికింద్రాబాద్ లోని రిక్రూటింగ్ కార్యాలయం ఫోన్ నంబర్లో (040–27740205)సంప్రదించాలని సూచించారు. -
అత్యంత పేదలకు ఇందిరమ్మ ఇళ్లు
సిరిసిల్ల: జిల్లాలో అత్యంత పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, నిబంధనల ప్రకారం లబ్ధిదారుల ఎంపికకు కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. కలెక్టరేట్లో మంగళవారం జిల్లా అధికారులతో సమీక్షించారు. జిల్లాలో మొదటి విడతలో 7,000 ఇళ్లు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ఇందిరమ్మ కమిటీలతో సమన్వయం చేసుకుని లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. ఆర్డీవో రాధాభాయి, హౌసింగ్ పీడీ శంకర్, డీఆర్డీవో శేషాద్రి, జెడ్పీ సీఈవో వినోద్కుమార్ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్టమైన కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా కోరారు. కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో మాట్లాడారు. ప్రధాన కూడళ్లు, అప్రోచ్ రోడ్డుల వద్ద స్పీడ్ బ్రేకర్లు లేనందున అధిక సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయని, అలాంటి ప్రదేశాల్లో రబ్బర్ స్ట్రిప్స్, స్పీడ్ బ్రేకర్లు, పార్కింగ్ స్థలాల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఇవ్వాలన్నారు. ఏఎస్పీ చంద్రయ్య మాట్లాడుతూ, జిల్లా పరిధిలో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే 13 బ్లాక్ స్పాట్లకు గుర్తించామన్నారు. ఆర్అండ్బీ ఈఈ వెంకటరమణయ్య, డీటీవో లక్షణ్, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, పీఆర్ ఈఈ సుదర్శన్రెడ్డి, జిల్లా వైద్యాధికారి రజిత పాల్గొన్నారు. కొనుగోళ్లు వేగవంతం చేయాలి జిల్లాలో యాసంగి పంట ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా కోరారు. కలెక్టరేట్లో కొనుగోళ్లపై సమీక్షించారు. జిల్లాలో 148 కేంద్రాలు ప్రారంభించారని, రెండుమూడు రోజులో పూర్తి స్థాయిలో ప్రారంభించాలన్నారు. అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, డీఏవో అబ్జల్బేగం, డీసీవో రామకృష్ణ, డీఎస్వో వసంతలక్ష్మీ, పౌరసఫరాల డీఎం రజిత పాల్గొన్నారు. గ్రౌండింగ్కు సహకరించాలి రాజీవ్ యువ వికాసం పథకంలో యూనిట్ల గ్రౌండింగ్కు బ్యాంకర్లు సహకరించాలని కలెక్టర్ కోరారు. కలెక్టరేట్ నుంచి ఎంపీడీవోలు, మండల ప్రత్యేక అధికారులు, బ్యాంకర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఈనెల 29లోగా అర్హుల జాబితాను సిద్ధం చేయాలన్నారు. ఎల్డీఎం మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. ● కలెక్టర్ సందీప్కుమార్ ఝా -
ఉద్యోగ భద్రత కల్పించాలి
సిరిసిల్లటౌన్: వెట్టిచాకిరితో సతమతమవుతూ పాఠశాలల్లో పనిచేసే స్కావెంజర్ల ఉద్యోగాలు రెగ్యులరై జ్ చేసి భద్రత కల్పించాలని ప్రభుత్వ పాఠశాల స్వీ పర్స్, స్కావెంజర్స్ యూనియన్(ఏఐటీయూసీ) జి ల్లా కన్వీనర్ మీసం లక్ష్మణ్యాదవ్ డిమాండ్ చేశా రు. మంగళవారం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో మాట్లాడారు. పెండింగ్లో ఉంటున్న స్కా వెంజర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కో రారు. ఏడాదికి రెండుజతల యూనిఫామ్స్ ఇవ్వాల ని, ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పీఎఫ్, ఈ ఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. స్కావెంజర్ల ఖాతాల్లోనే జీతాలు ప్రతినెల 5లోపు జ మ చేయాలని, ఏడాదిలో పదినెలలు కాకుండా ప న్నెండు నెలలు జీతాలివ్వాలని కోరారు. వారి సమస్యలను వివరిస్తూ కలెక్టరేట్లో వినతిపత్రాన్ని అందించారు. నర్సవ్వ, పి.పర్శరాములు, లత, కొమురవ్వ, ఇందిర, రాజీవ, లక్ష్మీనర్సయ్య పాల్గొన్నారు. -
తలనొప్పిగా మారిన తలనీలాల సేకరణ
● ఈనెల 24న ఐదోసారి టెండర్ వేములవాడ: రాజన్నకు భక్తులు సమర్పించుకునే తలనీలాలను సేకరించుకునే హక్కు రెండేళ్ల కోసం నిర్వహించిన టెండర్ ఈనెల 11తో ముగిసింది. ఇంతకుముందే ఆలయ అధికారులు నాలుగు దఫాలుగా టెండర్లకు ఆహ్వానించారు. టెండర్ సమయంలోగా పూర్తి కాకపోవడంతో వాయిదా పడుతూ వచ్చింది. దీంతో ఆలయ అధికారులకు తలనీలాల సేకరణ తలనొప్పిగా మారింది. టెండర్ నిర్వహణ పూర్తయ్యే వరకు ఆలయ అధికారులకు తలనీలాల సేకరణ ఓ టాస్క్గా మారిందని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఐదోసారి టెండర్కు.. భక్తుల తలనీలాలను పోగు చేసుకునే హక్కు కోసం ఈనెల 24న ఉదయం 11 గంటలకు ఈ–టెండర్ కం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో కొప్పుల వినోద్రెడ్డి మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. రెండేళ్ల కోసం తలనీలాలు పోగుచేసి భద్రపరచుకునే లైసెన్స్, హక్కు కల్పించనున్నట్లు తెలిపారు. వివరాలకు 94910 00743, 99482 88354, 83339 97623 నంబర్లలో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఇప్పటికే నాలుగుసార్లు టెండర్లు నిర్వహించగా, ఆన్లైన్ టెండర్లో రూ.13.67 కోట్ల హెచ్చు పాటదారుడిగా ఓ వ్యక్తి ఎంపికయ్యారు. ఈ అంశాన్ని దేవాదాయశాఖ కమిషనర్కు నివేదిక సమర్పించగా, తిరిగి టెండర్ నిర్వహించాలని ఆదేశించడంతో ఐదోసారి టెండర్ నిర్వహించాల్సి వచ్చింది. -
కాంట పెడ్తలేరు
● కేంద్రాల ప్రారంభానికే పరిమితం ● ఖరారు కాని రైస్మిల్లులు ● వారం రోజులుగా ధాన్యం ఆరబోస్తున్న రైతులు ● కేంద్రాల వద్ద పేరుకుపోతున్న వైనం ● పట్టించుకోని అధికారులు ‘ఇతను ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటకు చెందిన రైతు గోగూరి చంద్రారెడ్డి. వారం క్రితం వరి పంటను కోసి గ్రామంలో ఐదు రోజుల క్రితం ప్రారంభించిన కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాడు. అయితే మాయిశ్చర్ వచ్చినా ధాన్యం తూకం ప్రారంభంకాకపోవడంతో ఎండల్లోనూ కుప్ప వద్దే కాపలా ఉంటున్నాడు. ఎప్పుడు తూకం వేస్తారో తెలియక అయోమయానికి గురవుతున్నాడు’. ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): జిల్లాలో వారంరోజుల క్రితం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన అధికారులు, నాయకులు ధాన్యం తూకం గురించి పట్టించుకోవడం లేదు. వాతావరణంలో మారుతున్న పరిస్థితులతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కేంద్రాల్లో ధాన్యం రాసులు పేరుకుపోయాయి. తేమ శాతం రావడానికి నిత్యం ఉదయమే కుప్పలుగా ఉన్న ధాన్యాన్ని ఆరబోసి, సాయంత్రం మళ్లీ కుప్పలుగా చేస్తున్నారు. తేమ శాతం వచ్చినా తూకం మొదలుకాకపోవడంతో కుప్పల వద్దే కాపలా ఉండాల్సి వస్తోంది. మరికొందరు రైతులు కేంద్రాలకు ధాన్యం తేకుండానే తక్కువ ధరకు రైస్మిల్లర్లు, ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు. రోడ్లపైనే కుప్పలు జిల్లాలోని చాలా మండలాల్లో కొనుగోలు కేంద్రాలకు సరిపోయేలా ప్రత్యేక స్థలాలు లేకపోవడంతో పలువురు రైతులు తమ ధాన్యాన్ని రోడ్లపైనే ఆరబోస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ శివారులో సిరిసిల్ల–కామారెడ్డి ప్రధాన రహదారిపైనే ధాన్యం ఆరబోస్తున్నారు. రోడ్డుపైనే ధాన్యం కుప్పలు ఉండడంతో వాహనదారులు రాత్రి వేళ ఇబ్బందులు పడుతున్నారు. గతంలోనూ ఇదే గ్రామంలో వడ్లకుప్పలు కారణంగా ఓ ద్విచక్రవాహనదారుడు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. రోడ్లపైన ధాన్యం కుప్పలు పోయొద్దని, ఒకవేళ పోస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. కానీ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలకు స్థలాలు లేక రైతులు రోడ్లపైనే ధాన్యం ఆరబోస్తున్నారు. ఖరారుకాని మిల్లులు జిల్లా వ్యాప్తంగా ఏ కొనుగోలు కేంద్రానికి కూడా రైస్మిల్లులు ఖరారు కాలేదు. ప్రభుత్వం కొత్తగా నగదు డిపాజిట్ చేయాలనే నిబంధన పెట్టడంతో మిల్లర్లు ముందుకురావడం లేదని తెలిసింది. దీంతో ధాన్యం తూకం వేస్తే ఏ మిల్లుకు తరలించాలో తెలియక అధికారులు, నిర్వాహకులు తల పట్టుకుంటున్నారు. 240 కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా 255 గ్రామాలు ఉండగా.. ఐకేపీ, మెప్మా, మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో 240 కేంద్రాలు ప్రారంభించాల్సి ఉంది. ఇప్పటి వరకు 148 కేంద్రాలు ప్రారంభించారు. ఇంకా 92 కేంద్రాలను ప్రారంభించాల్సి ఉంది. ఒక వైపు పూర్తిస్థాయిలో కేంద్రాలు ప్రారంభంకాకపోవడం, ప్రారంభించిన కేంద్రాల్లో ధాన్యం తూకం మొదలుకాకపోవడంతోఅన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో మొత్తం కేంద్రాలు 240 ప్రారంభించిన కేంద్రాలు 148 ప్రారంభం కావాల్సినవి 92 -
కలెక్టర్.. అన్నీ అదనపు బాధ్యతలు
వీరు సిరిసిల్ల మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ పారిశుధ్య కార్మికులు. వీరు పారిశుధ్యం, డంపుయార్డు, నల్లాల నిర్వహణ, చెత్తట్రాక్టర్ల నిర్వహణ పనులు చేస్తుంటారు. గతంలో పాలకవర్గాలు ఉన్న సమయంలో ప్రతీ నెల వేతనాలు వచ్చేవి. అయితే గత రెండు నెలలుగా వీరికి వేతనాలు రావడం లేదు. వచ్చే రూ.14వేలు సైతం రెండు నెలలుగా రాక ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయమై మున్సిపల్ అధికారులను అడిగితే కలెక్టర్ వద్ద ఫైల్ పెండింగ్ ఉందంటున్నారు. ఇలాంటి పరిస్థితులు జిల్లాలోని చాలా శాఖల్లోనూ ఉంది. ఆయా శాఖల అధికారులు ఎవరికీ చెప్పుకోలేకపోతున్నారు. సామన్యులు ఇబ్బందులు పడుతున్నారు.● జిల్లా పాలనాధికారిగా 55 శాఖలపై ఆజమాయిషీ ● మరో ఏడు శాఖల అదనపు బాధ్యతలు ● పెండింగ్లో అనేక ఫైళ్లు ● సామన్యులు ఇబ్బందిసిరిసిల్ల: కలెక్టర్.. జిల్లా బాస్. పాలనాధికారిగా ఎన్నో బాధ్యతలు. ప్రత్యక్షంగా ప్రభుత్వంలోని 55 శాఖలపై ఆజమాయిషి. వీటికి అదనంగా మరో ఏడు శాఖల అదనపు బాధ్యతలు కలెక్టర్ వద్దనే ఉన్నాయి. దీంతో కొన్ని ఫైళ్లకు నెలలుగా మోక్షం కలగడం లేదు. ఫలితంగా ఆయా శాఖల్లోని కింది స్థాయి ఉద్యోగులు, వేతన జీవులు ఇబ్బందులు పడుతున్నారు. 2024 జూన్ 16న కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సందీప్కుమార్ ఝా.. పది నెలల కాలంలో అనేక వివా దాలు చుట్టుముట్టాయి. అదనపు ఏడు శాఖల బాధ్యతలతో ఆయా శాఖల ఫైళ్లు వేగంగా పరిష్కారానికి నోచుకోవడం లేదని తెలుస్తోంది. కలెక్టర్ వద్ద ఉన్న అదనపు శాఖలు ఇవీ.. ● జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా పనిచేసిన పూజారి గౌతమి బదిలీ కావడంతో ఆమె స్థానంలో ప్రభుత్వం ఎవరినీ నియమించలేదు. దీంతో ఆ శాఖ బాధ్యతలు సైతం కలెక్టర్ నిర్వహిస్తున్నారు. ● జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ పదవీకాలం 2024 జూలై మొదటివారంలో ముగిసింది. అప్పటి నుంచి జిల్లా పరిషత్ ప్రత్యేకాధికారిగా కలెక్టర్ వ్యవహరిస్తున్నారు. ● జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో)గా అదనపు బాధ్యతలు నిర్వహించిన జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) ఖీమ్యానాయక్ దీర్ఘకాలిక సెలవులో వెళ్లడంతో ఆ బాధ్యతలను సైతం కలెక్టరే చూస్తున్నారు. సెలవులు ముగిసి.. ఇటీవల జిల్లా అదనపు కలెక్టర్గా ఖీమ్యానాయక్ విధుల్లో చేరినా ఆ బాధ్యతలను ఆయనకు అప్పగించకుండా కలెక్టర్ పర్యవేక్షించడం గమనార్హం. ● సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల చైర్పర్సన్ల పదవీకాలం 2025 జనవరితో ముగిసింది. ఆయా మున్సిపాలిటీల ప్రత్యేకాధికారిగా కలెక్టర్ ఉన్నారు. ● వేములవాడ ఆర్డీవో రమేశ్ ఇటీవల సెలవుపై వెళ్లగా.. ఆ అదనపు బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. ● వేములవాడ ఏరియా టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ సెక్రెటరీగా కలెక్టర్కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. కానీ... ఇప్పటికే వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ(వీటీడీఏ)కి చైర్మన్గా ముఖ్యమంత్రి, వైస్చైర్మన్గా కలెక్టర్ కొనసాగుతున్నా.. అదనంగా సెక్రెటరీగా బాధ్యతలు అప్పగించిది. ఫైళ్ల కదలికలో జాప్యం జిల్లా స్థాయిలో ఒక్కో శాఖకు ఒక్కో అధికారి పూర్తిస్థాయి బాధ్యతలు నిర్వహిస్తారు. ఏదైనా ఫైల్ కలెక్టర్ ఆమోదం కోసం వెళ్లాలంటే.. అన్ని రికార్డులను సరిగా చూసి జిల్లా స్థాయి అధికారి సంతకం చేసి ఈ–ఆఫీస్(ఆన్లైన్)లో ఉంచితే.. కలెక్టర్ ఆ ఫైల్కు ఆమోదం తెలుపుతారు. ఏదైనా అనుమానం ఉంటే ఆ ఫైల్ను ఫిజికల్గా తెప్పించుకుని పరిశీలిస్తారు. ఇలా ప్రభుత్వ పరిపాలన కొంత నిర్ధిష్ట గడువుతో సాగుతోంది. కానీ అనేక శాఖలకు అదనపు బాధ్యతలు జిల్లా కలెక్టర్ చూడడంతో ఆయా శాఖల ఫైళ్లు నెలల తరబడి పెండింగ్లో ఉంటున్నాయి. క్షేత్రస్థాయిలో ఆ ఫైల్ తాలూకు బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. ఇన్చార్జీలతోనే పాలన ! జిల్లాలో అనేక శాఖలకు పూర్తిస్థాయి అధికారులు లేక ఇన్చార్జీ అధికారులతో కొనసాగుతున్నాయి. సిరిసిల్ల ఆర్డీవోగా సమ్మయ్య నియమితులు కాగా.. ఇక్కడి ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఆయన విధుల్లో చేరకుండానే బదిలీ చేయించున్నట్లు సమాచారం. సిరిసిల్ల ఆర్డీవోగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాధాబాయికి అదనపు బాధ్యతలు అప్పగించారు. అనేక కీలకమైన ప్రభుత్వ శాఖలకు పూర్తిస్థాయి అధికారులు లేరు. ఇన్చార్జీలతో పాలన సాగుతోంది. నాకు ఇంకా పని తక్కువగానే ఉంది జిల్లాలో నాకు ఇంకా పని తక్కువగానే ఉంది. నేను చేయాల్సింది ఇంకా ఎక్కువగా ఉంది. వీటీడీఏ సెక్రెటరీగా సోమవారం బాధ్యతలు స్వీకరించాను. సిరిసిల్ల మున్సిపాలిటీ బిల్స్ క్లియర్ చేశాను. కలెక్టర్గా నేను అన్ని బాధ్యతలు నిర్వర్తించాల్సిందే. – సందీప్కుమార్ ఝా, కలెక్టర్ -
పర్యాటకంపై పట్టింపు కరువు
● ఎగువమా‘నీరు’లో బోటింగ్ కోసం ఎదిరిచూపులు ● గతంలోనే గెస్ట్హౌస్ వద్ద పార్క్, ఫౌంటేయిన్ ● నేడు కనిపించని గ్రీనరీనర్మాల ఎగువమానేరు ప్రాజెక్టుగంభీరావుపేట(సిరిసిల్ల): ఎగువమానేరు పర్యాటకంపై అధికారులకు పట్టింపు కరువైంది. బోటింగ్ సౌకర్యం కల్పిస్తామన్న హామీలు నీటిమూటలుగానే మిగిలిపోయాయి. ఏళ్లు గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా పరిస్థితి ఉంది. మండు వేసవిలోనూ జలాశయం నిండుకుండలానే ఉన్నా బోటింగ్పై అధికారులు శ్రద్ధ చూపడం లేదు. పురాతన అతిథిగృహం ప్రాజెక్టు సమీపంలో ఏళ్లనాటి అతిథి గృహం ఉంది. ఇటీవల దానికి పాక్షిక మరమ్మతులు చేశారు. అక్కడి పరిసరాల్లో గార్డెన్ ఏర్పాటుకు విశాలమైన స్థలం ఉంది. కానీ ఆ ప్రదేశంలో హరితహారం కింద మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. గతంలో గార్డెన్, వాటర్ఫౌంటేయిన్ ఉండేది. ప్రస్తుతం అవి లేవు. ప్రాజెక్టు కట్టపై ‘అప్పర్ మానేరు’ అనే అక్షరాలు సిమెంటుతో చేసి ఉన్నాయి. వాటిని పట్టించుకునే వారు లేరు. ప్రాజెక్టులో బోటింగ్ కోసం రెండేళ్ల క్రితం బోట్లు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఎవరూ పట్టించుకోకపోవడంతో అవి ఎక్కడ ఉన్నాయో తెలియని దుస్థితి. ప్రజాప్రతినిధులు, అధికారులు.. కొంతకాలంగా బోటింగ్ మాటే ఎత్తడం లేదు. పర్యాటకంగా అభివృద్ధి చేస్తే ప్రయోజనం నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తే స్థానికులకు ఉపాధి అవకాశాలు ఉంటాయి. అప్పట్లో బోట్లు తెప్పించారు. కానీ అవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియడం లేదు. ఏళ్లు గడిచినా జలాశయంలో బోటింగ్ మాత్రం కనిపించడం లేదు. – మల్లేశ్యాదవ్, నర్మాల -
మహిళలకు రైస్మిల్ ఏర్పాటుకు సహకరిస్తాం
వేములవాడరూరల్: మహిళలు ముందుకొస్తే రైస్మిల్లు ఏర్పాటుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి, వట్టెంల, ఫాజుల్నగర్ గ్రామాల్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదివారం ప్రారంభించి మాట్లాడారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ఇస్తూ కొనుగోలు చేస్తున్నామన్నారు. సీఎం రేవంత్రెడ్డి మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా 50 శాతం కొనుగోలు కేంద్రాలను కేటాయించినట్లు తెలిపారు. రైతులకు నాణ్యమైన విద్యుత్, ఎరువులు, మేలైన వంగడాలను ప్రభుత్వం తరఫున అందిస్తున్నట్లు తెలిపారు. సన్నవడ్లు పండించే రైతులను ప్రోత్సహించాలని ప్రభుత్వం ప్రతీ క్వింటాల్పై అదనంగా రూ.500 బోనస్ ఇస్తున్నట్లు తెలిపారు. ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, పార్టీ మండల అధ్యక్షుడు వకుళాభరణం శ్రీనివాస్, ఏఎంసీ డైరెక్టర్ పర్శరాములు, బొడ్డు రాములు, ఏపీఎం చంద్రయ్య పాల్గొన్నారు. ● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ -
రమణీయం రాములోరి రథోత్సవం
బిల్లులు చెల్లించి.. సహకరించాలివేములవాడఅర్బన్: వేములవాడ అర్బన్ మండలం మారుపాకలో సహకార విద్యుత్ సరఫరా సంఘం సిరిసిల్ల ఆధ్వర్యంలో రైతు పొలంబాటపై అవగాహన సదస్సు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఏవో జగదీశ్, ఏఈ శ్రీనివాస్రెడ్డి మాట్లాడారు. ఇప్పటి వరకు బావి, బోర్ల మోటార్లకు విద్యుత్ సాంక్షన్ లేకుంటే వెంటనే సెస్ కార్యాలయంలో తీసుకోవాలని సూచించారు. విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించి సంస్థకు సహకరించాలని కోరారు. విద్యుత్ సమస్యలుంటే సెస్ సిబ్బందికి తెలిపాలన్నారు. కార్యక్రమంలో గ్రామ రైతులు, విద్యుత్ సిబ్బంది తదితరులు ఉన్నారు.కోనరావుపేట(వేములవాడ): మామిడిపల్లిలోని శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రథోత్సవం ఘనంగా నిర్వహించారు. మాలధారుల భక్తిగీతాలు ఆలపించగా.. స్వామి వారి రథం ముందుకు కదిలింది. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. -
వాతావరణం
ఆకాశం నిర్మలంగా ఉంటుంది. మధ్యాహ్నం ఉక్కపోతగా ఉంటుంది. వడగాలులు వీస్తాయి. రాత్రి వేళ ఈదురుగాలులు వీస్తాయి.వీటీడీఏ వైస్చైర్మన్, సెక్రటరీగా కలెక్టర్వేములవాడ: వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ వైస్చైర్మన్, సెక్రటరీగా జిల్లా కలెక్టర్ సందీప్కుమార్ ఝాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. వెంటనే ఉత్తర్వులు అమల్లోకి తీసుకునిరావాలని ఆదేశించారు. గరుడసేవపై శ్రీసీతారాములు గంభీరావుపేట(సిరిసిల్ల): మండల కేంద్రంలోని శ్రీసీతారామస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. రోజుకో వాహనసేవపై సీతారాములు దర్శనమిస్తున్నారు. ఆదివారం గరుడ సేవోత్సవం జరిగింది. గరుడసేవను భక్తులు రామనామస్మరణతో ముందుకు లాగారు. ఉత్సవాల్లో భాగంగా హోమం, బలిహరణం, గరుడ ప్రతిష్ట నిర్వహించారు. -
గుట్టపై గంగమ్మ
● ఒకప్పటి నేరెళ్ల .. నేటి రైతుల జీవనేల ● ప్రకృతికి అనుగుణంగా పంటల సాగు ● వీరునితండా గిరిజనుల ఆదర్శ సాగుసిరిసిల్ల: ఎత్తయిన గుట్టలు.. కాకులు దూరని కారడవి.. మధ్యలో ఉంటుంది వీరునితండా. ఏంటో ఈ తండా ప్రత్యేకత అనుకుంటే.. అంతకుమించి విజయగాథ ఉంది. వీరునితండా రైతులు ఒక్క బోరు కూడా వేయించకుండానే వ్యవసాయం చేస్తున్నారు. 196 ఎకరాల్లో 36 బావుల ఆధారంగా పంటలు పండిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వందల ఫీట్ల లోతులో బోర్లు వేయిస్తూ అప్పులపాలవుతున్న రైతులను చూశాం. కానీ వీరునితండా రైతులు ప్రకృతి ఇచ్చిన కానుకను అందిపుచ్చుకొని వ్యవసాయబావులు.. వర్షాధారంగా పంటలు పండిస్తున్నారు. వీరునితండా రైతుల విజయగాథ.. – పూర్తి వివరాలు 8లో...u -
కల్తీ ఆహారం.. తనిఖీలు శూన్యం
ఇది సిరిసిల్లలోని ఓ ప్రముఖ సూపర్మార్ట్లోనిది. ఎలాంటి గుర్తింపు, అనుమతి లేకుండా తినుబండారాలను ఇలా పెట్టెలకొద్దీ విక్రయిస్తున్నారు. ఫుడ్సేఫ్టీ అనుమతులతోపాటు ప్యాకెట్స్పై తయారీదారుల పేరు, గడువు తేదీ, బరువు, ధర ఇలా.. ఏది ముద్రించిలేదు. కానీ సిరిసిల్ల మార్కెట్లో ఇలాంటి జీరో దందాలు సర్వసాధారణం.మీరు చూస్తున్న ఈ ఫొటో సిరిసిల్ల మటన్ మార్కెట్లో విక్రయిస్తున్న మాంసం. దీనిపై మున్సిపల్ అధికారులు వెటర్నరీ వైద్యుడిచే పరీక్షించి నాణ్యమైనదిగా గుర్తించి సీల్ వేయాల్సి ఉంటుంది. కానీ సిరిసిల్లలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. దశాబ్దాల తరబడిగా ఇక్కడ స్లాటర్హౌస్ లేక, మున్సిపల్ అధికారులు మాంసం విక్రయాలను గాలికి వదిలేశారు.సిరిసిల్లటౌన్: జిల్లాలోని హోటళ్లు.. రెస్టారెంట్లు..ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో కల్తీ ఆహారం విక్రయాలతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. కల్తీ ఆహార విక్రయాలను నియంత్రించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో వ్యాపారులు రెచ్చిపోతున్నారు. సూపర్మార్ట్లలో కంపెనీ పేరు లేకుండా, తయారీ తేదీ, గడువు తేదీలు లేకుండానే ఆహారపదార్థాలను విక్రయిస్తున్నారు. జిల్లాలో నాసిరకం ఆహార వ్యాపారంపై ‘సాక్షి’ ఫోకస్. హోటల్ ఫుడ్.. హెల్త్ బ్యాడ్ జిల్లాలో రెస్టారెంట్లు, హోటల్స్, ఫాస్ట్ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు నిబంధనలు బేఖాతర్ చేస్తున్నారు. ఫలితంగా అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. హోటళ్ల నిర్వాహకులు నాణ్యమైన ఆహార పదార్థాలు, నూనెలు వినియోగించాల్సి ఉండగా.. అత్యధిక వాటిల్లో నాసిరకం వాడుతున్నట్లు సమాచారం. నాణ్యమైనవి, బ్రాండెడ్ వాడాలంటే ఖరీదు కాబట్టి..తక్కువ ధరకు దొరికే పదార్థాలు, నూనెలు వాడుతున్నారు. రుచి కోసం ఆహారంలో నిషేధిత రంగులు, రసాయనాలు కలుపుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే నాణ్యమైనవి వాడుతున్నామని ఫాస్ట్సెంటర్ నిర్వాహకులు చెబుతున్నా ఏళ్ల తరబడిగా అధికారుల పర్యవేక్షణ లేకుండా ఉండటం విమర్శలకు తావిస్తోంది. గతంలో పలు హోటళ్లలో అధికారులు తనిఖీలు చేపట్టిన నేపథ్యంలో కలుషితనీరు, పాడయిన ఆహార పదార్థాలు, నిలువ ఉంచిన సూప్స్, కాలం తీరిన సాస్లు దొరికిన సంఘటనలు ఉన్నాయి. హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్ల నిర్వహణపై తనిఖీలు చేపట్టే అధికారం ఉన్న శాఖలు మామూళ్లుగా వదిలేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 200లకు పైగా ఫాస్ట్ఫుడ్ సెంటర్లు నడుస్తున్నాయి. వీటిలో రోజుకు రూ.15లక్షలు, నెలకు రూ.4.50కోట్లలో ఫాస్ట్ఫుడ్ దందా సాగుతోందని వ్యాపారవర్గాల అంచనా. నాసిరకం నూనెలు.. స్టోర్డ్ఫుడ్ వినియోగం రంగులు, రసాయనాలతో ఆరోగ్యం చిత్తు పుట్టగొడుగుల్లా సెంటర్లు జిల్లాలో 200 ఫాస్ట్ఫుడ్ సెంటర్లు రోజూ రూ.లక్షల్లో వ్యాపారం నియంత్రించలేని అధికారులుకొన్ని సంఘటనలు ఇటీవల సిరిసిల్లలోని ఓ ప్రముఖ హోటల్కు మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలకు వెళ్లారు. అక్కడ మురిగిపోయిన ఉల్లిగడ్డలు, కూరగాయలు చూసి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వేములవాడలోని ఓ ప్రముఖ బేకరీకి సిరిసిల్ల నుంచి నలుగురు యాత్రికులు వెళ్లారు. కూల్కేక్ తీసుకుని నోట్లో పెట్టుకోగానే కుళ్లిపోయినట్లు తేలింది. విషయం గమనించిన హోటల్ యజ మాని వెంటనే కేక్ను బయట పారేయించారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన ఇద్దరు స్నేహితులు ఫాస్ట్ఫుడ్కు వెళ్లి ఇష్టమైన ఫుడ్ను తినేశారు. ఇంటికి వెళ్లాక రాత్రి వేళలో వాంతులు, విరేచనాలు కావడంతో ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్నట్లు సమాచారం.ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నాం సిరిసిల్లలోని రెస్టారెంట్లు, ఇతర ఫుడ్స్టాల్స్పై ఆకస్మిక తనిఖీలు చేస్తున్నాం. ఇప్పటి వరకు ఎలాంటి కేసులు నమోదుకాలేదు. ఆహార విషయంలో నాణ్యత పాటించని స్టాల్స్, హోటల్స్పై మాకు నేరుగా ఫిర్యాదు చేయొచ్చు. వంటశాలలు, హోటల్స్ పరిశుభ్రంగా ఉంచాలి. మాంసాహారం, సూప్లు నిలువ ఉంచినవి వాడొద్దు. నిబంధనలు పాటించాలి. లేకుంటే కేసులు నమోదు చేస్తాం. – ఎస్.సమ్మయ్య, మున్సిపల్ కమిషనర్ -
సంప్రదాయమే సనాతన ధర్మానికి ఊపిరి
● విజయశంకర స్వామీజీ సిరిసిల్లటౌన్: సంకీర్తన సంప్రదాయమే సనాతన ధర్మానికి ఊపిరి అని అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి విజయశంకరస్వామీ పేర్కొన్నారు. సిరిసిల్ల శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఆదివారం సందర్శించగా అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. భక్తులనుద్దేశించి విజయశంకరస్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు. మే 7న హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించే హైందవ భక్తి కళా సమ్మేళనం జయప్రదం చేయాలని కోరారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు. సామాజిక సమరసత వేదిక జిల్లా కన్వీనర్ మోర శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కోడం రవి, రంగనాయకుల సంతోషుబాబు, హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ అధికార ప్రతినిధి ఖదిజ్ఞాసి మల్లికావళ్లభ, వైద్యనిపుణులు సురసుర రాధాకృష్ణ, వికాస తరంగిణి భక్త బృందం సభ్యులు పెద్ది శ్రీనివాస్, పత్తిపాక శ్రీనివాస్, రాపెల్లి రాజేందర్, లవంతిక, రాజ్యలక్ష్మి, గురుకుల ఆశ్రమ హనుమాన్ భక్తులు వొడ్నాల సత్యం, ఏనుగుల శ్రీనివాస్, కల్లిపెల్లి భాస్కర్, భజరంగ్దళ్ కార్యకర్తలు గౌతమ్, శివాజీ తదితరులు పాల్గొన్నారు. 15 నుంచి పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణ తంగళ్లపల్లి(సిరిసిల్ల): జిల్లెల్ల శివారులోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ కళాశాలలో ఈనెల 15 నుంచి పుట్టగొడుగుల తయారీపై శిక్షణ ఇవ్వనున్నట్లు ఏఈఎల్పీ డైరెక్టర్ డాక్టర్ జె.రాజేందర్ తెలిపారు. ఏఈఎల్పీ డైరెక్టర్ డాక్టర్ జె.రాజేందర్ మాట్లాడుతూ ముత్యపుచిప్ప పాలపుట్ట గొడుగులు సాగుచేయడంపై ఔత్సాహికులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వారికి స్పాన్, బెడ్ తయారీపై శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ అందజేస్తామని తెలిపారు. వివరాలకు 90140 99365, 93811 04250లో సంప్రదించాలని కోరారు. వేములవాడ ఆస్పత్రిలో మోకీలు మార్పిడీ ఆపరేషన్లు వేములవాడఅర్బన్: స్థానిక ఏరియా ఆస్పత్రిలో ఆదివారం ఇద్దరికి మోకీలు మార్పిడీ ఆపరేషన్లు చేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలయ్య తెలిపారు. పెంచలయ్య మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రాంతీయ ఆస్పత్రుల్లో మోకీలు మార్పిడీ ఆపరేషన్లకు వేములవాడ ఏరియా ఆస్పత్రి ప్రసిద్ధి చెందిందన్నారు. ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 42 మోకీలు మార్పిడీ ఆపరేషన్లు చేసినట్లు తెలిపారు. వైద్యులు అనిల్కుమార్, శశికాంత్, మత్తు వైద్యులు తిరుపతిలను అభినందించారు. కార్మికులకు పని కల్పించాలి ● ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రాములు సిరిసిల్లటౌన్: జిల్లాలో భవన కార్మికులకు పనుల్లేక పస్తులుంటున్నారని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కడారి రాములు ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐటీయూసీ కార్మిక భవన్లో ఆదివారం నిర్వహించిన ప్రెస్మీట్లో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు ఇసుక, మొరం పర్మిషన్లు ఇవ్వాలని కోరారు. కార్మికులకు పనులు దొరక్క తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు అజ్జ వేణు, సదానందం పాల్గొన్నారు. -
అంబేడ్కర్ ఆశయాలు ఆదర్శం
● బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మ జయశ్రీ సిరిసిల్లటౌన్: రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ఆశయాలు ప్రపంచానికి ఆదర్శమని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మ జయశ్రీ పేర్కొన్నారు. ఆదివారం పార్టీ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. సిరిసిల్లలోని అంబేడ్కర్విగ్రహాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో శుద్ధి చేసి దీపాలతో అలంకరించారు. ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమ్మరి శంకర్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మ్యాన రాంప్రసాద్, ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దేవేందర్యాదవ్, కరీంనగర్ పార్లమెంటు కో–కన్వీనర్ ఆడెపు రవీందర్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు, అంబేడ్కర్ జయంతి కన్వీనర్ చంటి మహేశ్, కో కన్వీనర్ కొంపల్లి రాజేందర్, యాదగిరి శ్రీమతి, పల్లం అన్నపూర్ణ పాల్గొన్నారు. -
అనువంశిక అర్చకులకు ప్రాతినిధ్యం కల్పించాలి
● ట్రస్టు అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ వేములవాడ: రాజన్న గుడి విస్తరణ కార్యక్రమాల్లో అనువంశిక అర్చకులకు ప్రాతినిధ్యం కల్పించడానికి శృంగేరి పీఠాధిపతుల వద్దకు ప్రతినిధి వర్గంగా వెళ్లి చర్చించాలని అనువంశిక అర్చక బ్రాహ్మణ ట్రస్టు అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ పేర్కొన్నారు. పట్టణంలోని శంకరమఠంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రాజన్న ఆలయ విస్తరణకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చొరవ అభినందనీయమన్నారు. జూన్ 15 నుంచి విస్తరణ పనులు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో తమను భాగస్వామ్యం చేయాలని కోరారు. 1970–74లో జరిగిన తొలి విస్తరణ పనుల్లో అనువంశిక అర్చకులకు అప్పటి అధికారులు తగిన ప్రాతినిధ్యం కల్పించారని గుర్తు చేశారు. ఈసారి శృంగేరి పీఠాధిపతులను మాత్రమే సంప్రదిస్తూ.. తమ అభిప్రాయాలకు చోటు కల్పించకపోవడం విచారకరమన్నారు. ఆలయంలో ఖాళీలుగా ఉన్న 22 పరిచారక పోస్టులను అనువంశిక పురోహితులతో భర్తీ చేయాలని కోరారు. అనువంశిక నాయకులు ఉపాధ్యాయుల సాంబశివుడు, వజ్జల సతీశ్, సంకేపల్లి నాగేంద్రశర్మ, ఎం.కె.మూర్తి పాల్గొన్నారు. -
మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం
చందుర్తి(వేములవాడ): స్వశక్తి సంఘాల మహిళల ఆర్థికాభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. చందుర్తి మండలం కిష్టంపేట, చందుర్తి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శనివారం ప్రారంభించారు. కిష్టంపేటలో నిర్వహించిన లక్ష్మీనరసింహస్వామి కల్యాణంలో పాల్గొన్నారు. విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతోనే కొనుగోలు కేంద్రాల బాధ్యతను స్వశక్తి సంఘాలకు ప్రభుత్వం అప్పగించిందన్నారు. ఈ ప్రాంతంలో కాలువలు, రిజర్వాయర్ పనులు చేయించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ చలువతోనే సాగునీటి తిప్పలు తప్పాయన్నారు. చందుర్తి 176 సర్వేనంబర్లోని ప్రభుత్వ భూమిని కొనుగోలు కేంద్రానికి కావా ల్సిన అనుమతులు ఇప్పిస్తామని తెలిపారు. చందుర్తి మండల సమాఖ్యకు బస్సు మంజూరైందని, మహిళా సంఘాల సభ్యులు ముందుకొస్తే రైస్మిల్లు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయాన్ని అందజేస్తామన్నారు. పార్టీ మండలాధ్యక్షుడు చింతపంటి రామస్వామి, మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్, ఐకేపీ ఏపీఎం రజిత, నాయకులు ముస్కు ముకుందరెడ్డి, బానాల లక్ష్మారెడ్డి, పోతుగంటి రఘుపతి, మోకనపల్లి దేవరాజు, బానాల గంగారెడ్డి, గొట్టె ప్రభా కర్, పులి సత్తయ్య, దారం చంద్రం పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం -
రవాణాశాఖ ఆదాయం రూ.39.25కోట్లు
● జిల్లా రవాణాశాఖ అధికారి వి.లక్ష్మణ్ సిరిసిల్ల: జిల్లాలో రవాణాశాఖ 2024–2025 ఆర్థిక సంవత్సరంలో రూ.39.25కోట్ల మేరకు ఆదాయాన్ని సమకూర్చిందని జిల్లా రవాణాశాఖ అధికారి వి.లక్ష్మణ్ శనివారం తెలిపా రు. 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31 నాటికి రవాణాశాఖ ద్వారా రూ.39.25కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. ట్రాన్స్పోర్టు వాహనాల ద్వారా మూడు నెలలకో సారి చెల్లించే పన్నులు రూ.6.78కోట్లు, లైఫ్ ట్యాక్స్ రూపంలో రూ.22.57కోట్లు, సర్వీస్ చార్జీల ఫీజు లుగా రూ.1.40కోట్లు, వివిధ రకాల ఫీజులుగా రూ.4.68కోట్లు, గ్రీన్ట్యాక్స్లుగా రూ.53 లక్షలు, డిటెక్షన్ రూపంలో మరో రూ.1.43 కోట్లు, జరిమానాలు, ఎన్ఫోర్స్మెంట్ కాంపౌండింగ్ ఫైన్లు రూ.1.84కోట్లు వచ్చాయని వివరించారు. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి సిరిసిల్లటౌన్: ఫీజు రీయంబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులు విడుదల చేయలలాని బీఆర్ఎస్వై రాష్ట్ర నాయకుడు కంచర్ల రవిగౌడ్ కోరారు. స్థానిక తెలంగాణ భవన్లో శనివారం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడుస్తున్నా విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం దారుణమన్నారు. గురుకుల భవనాలకు కనీసం అద్దె చెల్లించకుండా తాళాలు వేసే దుస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. మట్టె శ్రీనివాస్, సామల శ్రీకాంత్, ఆదిచెర్ల సాయి, కాసర్ల వినయ్, మ్యాన కృష్ణ, కొండి నవీన్, రాపెల్లి భాను, కస్తూరి అజ్జు, సాయి, గణేష్ పాల్గొన్నారు. -
రైతుల సంక్షేమమే ధ్యేయం
● ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బోయినపల్లి(చొప్పదండి): రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. మండలంలోని అనంతపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సందీప్కుమార ఝాతో కలిసి శనివారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సన్న బియ్యానికి ప్రభుత్వం బోనస్ ఇస్తోందని రైతులు సద్వినియోగం చేసుకోవా లని కోరారు. అనంతరం గ్రామంలోని ఇందిర మ్మ ఇళ్ల పనులను పరిశీలించారు. తహసీల్దార్ నారాయణరెడ్డి, ఎంఏవో ప్రణిత, సెస్ డైరెక్టర్ కొట్టెపెల్లి సుధాకర్, ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేశ్, పార్టీ మండలాధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి, జంగం అంజయ్య, వంగపల్లి సత్యనారాయణరెడ్డి, జంగ సత్యం, సంబ లక్ష్మి రాజం, ఏనుగుల కనుకయ్య పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకుందాం ● కాంగ్రెస్ సిరిసిల్ల ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డిముస్తాబాద్(సిరిసిల్ల): ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని కాంగ్రెస్ సిరిసిల్ల ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి కోరారు. మండలంలోని రాంరెడ్డిపల్లి, కొండాపూర్, రామలక్ష్మ ణపల్లి, ఆవునూర్, తుర్కపల్లి గ్రామాల్లో జైబాపు, జైభీమ్, జైసంవిధాన్ పాదయాత్రను శనివారం చేపట్టారు. మహేందర్రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణకు చేపట్టిన పాదయాత్ర విజయవంతం చేశారన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేల కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్కు గత ఎన్నికల్లో బుద్ది చెప్పారన్నారు. ఉచిత బస్సు, ఉచిత విద్యుత్తోపాటు అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు యెల్ల బాల్రెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ తలారి రాణి, పాదయాత్ర ఇన్చార్జి నాగం కుమార్, సింగిల్విండో చైర్మన్ రాజేందర్రెడ్డి, వైస్చైర్మన్ వెల్ముల రాంరెడ్డి, బొందుగుల దేవిరెడ్డి, రాజు, సిద్దారెడ్డి, శ్రీనివాస్, మోహన్రెడ్డి, కరుణాకర్ పాల్గొన్నారు. తహసీల్దార్ ఆఫీస్లో బదిలీ ఉద్యోగిబోయినపల్లి(చొప్పదండి): స్థానిక తహసీల్దార్ ఆఫీస్లో ఇటీవల బదిలీపై వెళ్లిన ఓ ఉద్యోగి సెలవు రోజైన శనివారం ప్రత్యక్షమవడం చర్చకు దారితీసింది. సదరు ఉద్యోగిని బదిలీ చేయాలని పలువురు నాయకులు ఇటీవల కలెక్టర్ సందీప్కుమార్ ఝా బోయినపల్లిలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి వచ్చిన సందర్భంలో ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ మరుసటి రోజే ఆ ఉద్యోగిని బదిలీ చేశారు. సదరు ఉద్యోగి స్థానంలో మరొకరు చార్జీ తీసుకున్నారు. అయితే శనివారం ఆఫీస్కు ఎందుకు వచ్చాడనే చర్చ మండల కేంద్రంలో హాట్టాపిక్గా మారింది. ఈ విషయంపై తహసీల్దార్ నారాయణరెడ్డిని వివరణ కోరగా బీరువా తాళాలు ఇచ్చి వెళ్లినట్లు తెలిపారు. విద్యార్థిని చితకబాదిన టీచర్పై ఫిర్యాదుగంభీరావుపేట(సిరిసిల్ల): తన కొడుకును టీచర్ కొట్టాడని ఓ తల్లి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె తెలిపిన వివరాలు. గంభీరావుపేటలోని కేజీ టు పీజీ విద్యాసంస్థలోని ప్రైమరీ స్కూల్ టీచర్ అదే స్కూల్లో చదివే ఓ విద్యార్థిని చితకబాదాడు. ఒకటో తరగతి చదువుతున్న లవన్సాయిని టీచర్ దేవరాజు కొట్టాడని విద్యార్థిని తల్లి జ్యోతి స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. -
కాళేశ్వరం కాల్వ పనుల్లో కదలిక
సిరిసిల్ల: కాళేశ్వరం ప్రాజెక్టు 9వ ప్యాకేజీ పనుల్లో కదలిక వచ్చింది. ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు ప్రధానంగా భూసేకరణ అడ్డంకిగా ఉండడంతో తాత్కాళికంగా నీటి సరఫరాకు అడ్డుగా ఉన్న కాల్వల్లోని పూడిక తొలగింపు, అర్ధంతరంగా నిలిచిన పైపులైన్ పనులను మొదలుపెట్టారు. ‘సాక్షి’లో ‘కొసముట్టని కాళేశ్వరం’ శీర్షికన గురువారం ప్రచురితమైన కథనానికి నీటిపారుదలశాఖ అధికారులు స్పందించారు. కోనరావుపేట మండలం కనగర్తి–సుద్దాల మధ్య కాల్వలో పేరుకుపోయిన మట్టిని తొలగించే పనులతోపాటు సుద్దాల వద్ద మల్కపేట రిజర్వాయర్ నీరు మా రుపాకకు వెళ్లేలా పైపులైన్ పనులు చేస్తున్నా రు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా క్షేత్రస్థాయిలో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలని వే ములవాడ అర్బన్ మండలం మారుపాక వరకు గోదావరి జలాలు చేర్చాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదేశాలతో నీటిపారుల శాఖ ఈఈ కిశోర్ పనులు ప్రారంభించారు. మధ్యమానేరు నుంచి మల్కపేట వరకు 12.035 కిలోమీటర్ల సొరంగం పనులు పూర్తయ్యాయని, కాంక్రీట్ లైనింగ్, సర్జిపూల్, పంప్హౌస్, డెలివరీ పైపులైన్ పూర్తి చేసి మల్కపేట రిజర్వాయర్లో ఒక్క టీఎంసీ నీటిని నింపామని కిశోర్ వివరించారు. మల్కపేట నుంచి కెనాల్ ద్వారా మైసమ్మ చెరు వు వరకు నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. భూసేకరణ అడ్డంకి మల్కపేట శివారులోని ఊర చెరువు శిఖం భూ ముల రైతులు తమ పొలాలు మునుగుతా యని భూసేకరణను అడ్డుకుంటున్నారని ఈఈ విశోర్ వివరించారు. ఎన్నిసార్లు అవగాహన కల్పించినా సహకరించడం లేదన్నారు. ఈ సమ స్య పరిష్కారమైతే.. మల్కపేట రిజర్వాయర్ నుంచి నీటి విడుదల సాధ్యమవుతుందని తెలిపారు. రూ.138కోట్లతో అదనపు ఎత్తిపోతలు కోనరావుపేట, వీర్నపల్లి మండలాల్లో 10వేల ఎకరాలకు సాగునీరు అందించే అదనపు ఎత్తిపోతల పథకానికి రూ.138కోట్లతో మెగా కంపెనీతో ఒప్పందం జరిగిందని ఈఈ కిశోర్ తెలిపారు. ఈ ఎత్తిపోతలకు 212 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 26.30 ఎకరాలు పూర్తయిందని తెలిపారు. భూసేకరణ పూర్తయితే అదనపు ఎత్తిపోతల పథకాలతో 10వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని కిశోర్ వివరించారు. మల్కపేట రిజర్వాయర్ నుంచి కుడి, ఎడమ కాల్వల ద్వారా నీరు అందిస్తామని స్పష్టం చేశారు. పూడికతీత, పైపులైన్ పనులు ప్రారంభం నీటిపారుదల విభాగం–8 ఈఈ కిశోర్ -
మిగిలింది రెండు రోజులే !
● రాజీవ్ యువ వికాసానికి వెల్లువలా దరఖాస్తులు ● 14తో ముగియనున్న గడువుగంభీరావుపేట(సిరిసిల్ల)/కోనరావుపేట(వేములవాడ): నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువవికాసం పథకం దరఖాస్తులకు రెండు రోజులే మిగిలి ఉంది. ఆన్లైన్తోపాటు ఆఫ్లైన్లోనూ దరఖాస్తులను తీసుకుంటున్నారు. ఆఫ్లైన్లో వచ్చిన దరఖాస్తులను పంచాయతీ కార్యదర్శులు, ఇతర అధికారులు ఆన్లైన్ చేయనున్నారు. ఆన్లైన్ సేవలకు ఇబ్బందులు దరఖాస్తుదారులు కుల ధ్రువీకరణ, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం మీసేవల్లో దరఖాస్తు చేసుకుంటున్నారు. కానీ గత రెండు రోజులుగా వెబ్సైట్ మొరాయిస్తోంది. గత నెలాఖరులో ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈనెల 4న ముగిసిపోవాల్సి ఉండగా 14 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు నిరుద్యోగులు, ఔత్సాహికులు ఆన్లైన్, మీసేవ సెంటర్ల వద్ద క్యూ కడుతున్నారు. యూనిట్లు ఇలా.. రాజీవ్ యువ వికాసంలో నాలుగు రకాలుగా యూనిట్లు మంజూరు చేయనున్నారు. వంద శాతం సబ్సిడీతో రూ.50వేలు, 90 శాతం సబ్సిడీతో రూ.లక్ష, 80 శాతం సబ్సిడీతో రూ.2లక్షలు, 70 శాతం సబ్సిడీతో రూ.4లక్షల వరకు మంజూరు చేస్తారు. సబ్సిడీపోను మిగతాది బ్యాంక్ లోన్. సద్వినియోగం చేసుకోవాలి రాజీవ్ యువ వికాసం పథకాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి. దరఖాస్తుల సమర్పణకు ఈనెల 14వరకు గడువు ఉంది. దరఖాస్తులను ఆన్లైన్లోగాని, ఆఫ్లైన్లోగాని సమర్పించేందుకు వీలుంది. మండల పరిషత్లో హెల్ప్డెస్క్ ఏర్పాటు చేసి అధికారులను అందుబాటులో ఉంచడం జరిగింది. – రాజేందర్, ఎంపీడీవో, గంభీరావుపేటసర్టిఫికెట్లకు దరఖాస్తు కావడం లేదు రాజీవ్ యువశక్తి పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే కుల, ఆదాయం సర్టిఫికెట్లు కావాలి. వాటి కోసం దరఖాస్తు చేద్దామంటే సర్వర్ పనిచేయడం లేదు. దరఖాస్తు చేసుకున్న వారికి సర్టిఫికెట్లు కూడా రావడం లేదు. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. – నాగరాజు, కనగర్తి -
తల్లడిల్లుతున్నారు
● ప్రమాదాల్లో పోతున్న ప్రమాదాలు ● మృతుల్లో అత్యధికులు యువకులే ● తల్లిదండ్రులకు కడుపుకోత ● నెల రోజుల్లో 35 ప్రమాదాలు.. 8 మంది మృతి ● వరుస ప్రమాదాలతో వణుకుతున్న వాహనదారులు ● నివారణ చర్యలు పట్టించుకోని అధికారులుఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): త్వరగా గమ్యం చేరుకోవాలన్న ఆతృతలో ప్రమాదాలు జరుగుతున్నాయి. చిన్నపాటి ఏమరపాటుతో ప్రాణాలు పోతున్నాయి. మరికొందరైతే శాశ్వతంగా అవిటితనంతో ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల రాజన్నసిరిసిల్ల జిల్లాలో వరుసగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఎంతో భవిష్యత్ ఉన్న యువకులు ప్రాణాలు కోల్పోతుండడం తల్లిదండ్రులకు కడుపుకోత మిగుల్చుతోంది. జిల్లాలో నెల రోజుల వ్యవధిలో 35 రోడ్డు ప్రమాదాలు జరుగగా.. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబాలకు గుండెకోత మిగులుతోంది. వరుస ప్రమాదాలు.. పోతున్న ప్రాణాలపై శ్రీసాక్షిశ్రీ ప్రత్యేక కథనం. ఇరువై ఏళ్లకే నూరేళ్లు తెలిసీతెలియని వయసు.. స్నేహితుల ప్రభావం.. స్పీడ్బైక్లు.. వెరసి యువకుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ప్రమాదాలు జరుగుతున్న సమయంలో వాహనాల వేగం సాధారణం కంటే ఎక్కువగా ఉంటుండడమే ఇందుకు సాక్ష్యం. ఉన్నత విద్య చదువుకొని జీవితంలో స్థిరపడతారని అప్పుసప్పు చేసి చదివించిన తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుతోంది. నిబంధనలు గాలికి.. జిల్లాలో వాహనదారులు వేగంగా వెళ్తూ ప్రమాదాలకు గురవుతున్నా పోలీసులు, ఆర్టీఏ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. గతంలో హెల్మెట్ నిబంధనను పక్కాగా అమలు చేసిన పోలీసులు, ఆర్టీఏ అధికారులు ప్రస్తుతం గాలికొదిలేశారు. చలాన్లు విధించే దానిపై పెట్టిన శ్రద్ధ హెల్మెట్ ధరించని వారిని ఆపి ఒక్క మంచి మాట చెప్పే ఓపిక అధికారులకు లేకుండాపోయింది. ఇటీవల జరిగిన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారందరూ హెల్మెట్ ధరించకపోవడం ఇందుకు నిదర్శనం. పోలీసులు, ఆర్టీఏ అధికారులు జరిమానాలు విధించడంపైన పెట్టే శ్రద్ధలో కనీసం పదోవంతు శ్రద్ధ అవగాహన కల్పించడంపై పెడితే ప్రాణాలను కాపాడిన వారు అవుతారని స్థానికులు చర్చించుకుంటున్నారు.నెల రోజుల్లో 8 మంది జిల్లాలో నెల రోజుల్లో జరిగిన ప్రమాదాల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ముగ్గురు ఇరువై ఏళ్ల లోపు యువకులే. ఒకే ప్రమాదంలో గాయపడ్డ ముగ్గురిలో నారాయణపూర్కు చెందిన షేక్ అవీజ్, షేక్ అఫ్రోజ్ అనే యువకులు చికిత్స పొందుతూ మూడు రోజుల వ్యవధిలోనే మృతిచెందారు. ఇదే ప్రమాదంలో గాయపడ్డ ఆటోడ్రైవర్ దుర్గయ్య చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. కిష్టునాయక్తండాకు చెందిన శివరాత్రి సాయికృష్ణ తన తల్లిదండ్రులతో కలిసి కొండగట్టుకు దైవదర్శనానికి వెళ్లగా అక్కడ జరిగిన ఆటో ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. నెల రోజుల్లో 35 ప్రమాదాలలో 8 మంది ప్రాణాలు గాలిలో కలిశాయి.అతివేగంతోనే ప్రమాదాలు ప్రమాదాల నివారణలో భాగంగా బ్లాక్స్పాట్స్ గుర్తిస్తున్నాం. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో హెచ్చరికబోర్డులు ఏర్పాటు చేస్తున్నాం. హెల్మెట్ ధరించాలనే దానిపై వాహనదారులకు అవగాహన కల్పించాం. మళ్లీ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. వాహనాల వేగం తగ్గించడానికి ఆర్అండ్బీ అధికారులతో మాట్లాడుతున్నాం. రోడ్లపై వాహనాల వేగం పరిమితిపై చర్యలు తీసుకుంటున్నాం. – శ్రీనివాస్గౌడ్, ఎల్లారెడ్డిపేట సీఐ -
డామిట్ కథ అడ్డం తిరిగింది..
సిరిసిల్ల క్రైం: డామిట్ కథ అడ్డం తిరిగింది.. అవును రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిజంగా కథ అడ్డం తిరిగింది. ఇంటి రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరా యజమాని దొంగతనం చేయగా పట్టించింది. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చంద్రంపేటలో రాజవ్వ అనే వృద్ధురాలు గురువారం రాత్రి తన కూతురుతో ఇంట్లో నిద్రిస్తోంది. అదే గ్రామానికి చెందిన శేఖర్ వృద్ధురాలి మెడలో నుంచి రెండు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లాడు.మేల్కొన్న వృద్ధురాలు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి దొంగ కోసం గాలించారు. ఇంతలోనే దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి జనంతో కలిసిపో యి వెతికినట్లు నటించి బంగారు గొలుసు దొరికిందని అందరినీ నమ్మించాడు. అసలు దొంగను పట్టుకోవాలని బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు శేఖర్ ఇంటికి ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ (CCTV Footage) పరిశీలించి అవాక్కయ్యారు. దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి గొలుసు దొరికినట్లుగా నాటకమాడాడని గుర్తించారు. తండ్రి మందలించాడని..ఎల్లారెడ్డిపేట (సిరిసిల్ల): ఎలాంటి పని చేయకుండా జులాయిగా తిరుగుతుండటంతోపాటు తమ కుటుంబంతో సత్సంబంధాలు లేని వ్యక్తులతో మాట్లాడటం నచ్చని తండ్రి మందలించగా.. కోపోద్రిక్తుడైన కొడుకు కర్రతో దాడి చేశాడు. ఈ ఘటనలో తండ్రి ప్రాణాలు కోల్పోగా.. కొడుకు పరారీలో ఉన్నాడు. సీఐ శ్రీనివాస్గౌడ్, ఎస్సై రమాకాంత్ వివరాలు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఒడ్డెరకాలనీకి చెందిన కుంచెపు కనకయ్య (50)కు కుమారుడు కుంచెపు పర్శరాములు ఉన్నాడు. వీరి ఇంటి సమీపంలోనే ఓ శుభకార్యం జరిగింది. ఆ శుభకార్యం జరిగిన కుటుంబంతో కనకయ్య కుటుంబానికి మాటలు లేకపోయినా.. పర్శరాములు వెళ్లాడు. దీంతో వారికి మనకు మాటల్లేవని, ఎందుకు వెళ్లావని తండ్రి కోపోద్రిక్తుడయ్యాడు. పనిపాటా లేకుండా తిరుగుతున్నావని మందలించాడు.ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న కొడుకు కర్రతో తండ్రి కనకయ్యపై దాడి చేశాడు. బలమైన దెబ్బ తగలడంతో మెడ నరాలు చిట్లిపోయి, అక్కడే కుప్పకూలిన కనకయ్యను కుటుంబ సభ్యులు వెంటనే సిరిసిల్ల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. కాగా, నిందితుడు పర్శరాములు గతంలో కరెంట్షాక్లు పెడుతూ చేపలు పడుతూ దొరకడంతో పోలీసులు రెండుసార్లు కేసులు నమోదు చేశారు. కొంతకాలం జైలులో ఉండి బయటకొచ్చాడు. పర్శరాములుపై హత్య కేసు నమోదు చేసి గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.చదవండి: వార్నీ.. ఎయిర్పోర్టును కూడా వదలరా? -
వర్కర్లను ఓనర్లు చేస్తాం
● నేతన్నలు, రైతన్నల సంక్షేమమే లక్ష్యం ● నేతన్నలకు రూ.900కోట్ల వస్త్రోత్పత్తి ఆర్డర్లు ఇచ్చాం ● రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ● అపెరల్ పార్క్లో టెక్స్పోర్టు యూనిట్ ప్రారంభం ● 1,600 మంది మహిళలకు ఉపాధి ● పాల్గొన్న మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్సిరిసిల్ల: వస్త్రపరిశ్రమలోని వర్కర్లను త్వరలోనే ఓనర్లుగా చేస్తామని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. నేతన్నలు, రైతన్నల సంక్షేమమే ప్రాధాన్యతగా రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. సిరిసిల్ల శివారులోని పెద్దూరు అపెరల్పార్క్లో 7.6 ఎకరాల విస్తీర్ణంలో రూ.62కోట్లతో 1.73 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైన టెక్స్పోర్టు యూనిట్ను శుక్రవారం మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా రూ.34కోట్లు నేతన్నల రూ.లక్షలోపు రుణాలను మాఫీ చేశామని, రూ.914 కోట్ల బకాయిలు విడుదల చేశామని తెలిపారు. చేనేత బీమా, చేనేత భరోసా వంటి పథకాలకు రూ.290కోట్లు జమచేశామని చెప్పారు. ఇక నుంచి రాష్ట్రంలోని అన్ని శాఖలకు అవసరమైన వస్త్రాలను చేనేత కార్మికుల ద్వారానే కొంటామని తెలిపారు. ఇప్పటికే కార్మికులకు రూ.900కోట్ల వస్త్రాల ఆర్డర్లు ఇచ్చినట్లు వివరించారు. సిరిసిల్ల, వరంగల్ ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామని, దేశంలోని వివిధ ప్రాంతాల్లోని చేనేతకార్మికులు, పారిశ్రామికవేత్తలు తిరిగి ఈ ప్రాంతాలకు వచ్చి పెట్టుబడులు పెట్టేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చైతన్యవంతమైన ప్రాంతం రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ సిరిసిల్ల చైతన్యవంతమైన ప్రాంతమని, దక్షిణకాశీగా పేరున్న వేములవాడ రాజన్న వెలసిన ధార్మిక క్షేత్రమన్నారు. నేతన్నలకు గతంలో అంత్యోదయకార్డులను కాంగ్రెస్ ప్రభుత్వం అందించిందని తెలిపారు. టెక్స్పోర్టు సంస్థ ప్రతినిధులతో చర్చించి యూనిట్ ప్రారంభించేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. వేములవాడ ఆలయ అభివృద్ధికి బడ్జెట్లో నిధులు కేటాయించినట్లు తెలిపారు. కరీంనగర్లో శాతవాహన యూనివర్సిటీని తమ ప్రభుత్వం స్థాపించిందని, అందులో ఇంజినీరింగ్, లా కళాశాలలను మళ్లీ తమ ప్రభుత్వమే మంజూరు చేసిందన్నారు. నేతన్నల ఉపాధికి జీవో నంబరు వన్ తెచ్చాం రాష్ట బీసీ సంక్షేమం, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ నేతన్నలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో జీవో నంబరు 1 తెచ్చినట్లు తెలిపారు. టెక్స్పోర్టు యూనిట్ ద్వారా స్థానిక మహిళలకు ఉపాధి అవకాశాలు లభించడం సంతోషంగా ఉందన్నారు. సిరిసిల్లలో కరెంట్ సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని, బిల్లుల వసూళ్ల అంశాన్ని పక్కన పెట్టాలని చెప్పామన్నారు. ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి ఆగిపోదని, మహిళా సంఘాల్లోని 65 లక్షల మందికి రెండు చీరల చొప్పున ఇచ్చే ఆర్డర్లు సిరిసిల్లకు వచ్చాయన్నారు. ఇక్కడ ప్రాసెసింగ్ యూనిట్ను ఏర్పాటు చేయాలని కోరారు. రూ.50కోట్లతో నూలుబ్యాంకు ఏర్పాటు చేశామని, చేనేతకార్మికులకు ఉపాధి కల్ప న దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. పాలిస్టర్తోపాటు కాటన్ పరిశ్రమను, అనుబంధ రంగాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా టెక్స్పోర్టు యూనిట్లో శిక్షణ పొందిన మహిళలకు మంత్రుల చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యార్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేశ్ బీ గీతే, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి కె.కె.మహేందర్రెడ్డి, కంపెనీ సీఈవో చంద్రశేఖర్, ‘సెస్’ చైర్మన్ చిక్కాల రామారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, సిరిసిల్ల ఏఎంసీ చైర్పర్సన్ వెల్ముల స్వరూప, అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, సిరిసిల్ల ఆర్డీవో రాధాబాయి, మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయం, వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రశేఖర్రెడ్డి, జౌళిశాఖ అధికారులు వెంకటేశ్వర్రావు, రాఘవరావు పాల్గొన్నారు. -
21లోపు ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకోవాలి
● కలెక్టర్ సందీప్కుమార్ ఝా సిరిసిల్ల: మధ్యమానేరు, అనంతగిరి ప్రాజెక్టులలో ముంపునకు గురైన నిర్వాసితులు ఈనెల 21లోపు ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా శుక్రవారం కోరారు. జిల్లాలో ముంపు గ్రామాలైన గుర్రంవానిపల్లి, చీర్లవంంచ, చింతలఠాణా, కొదురుపాక, రుద్రవరం, సంకెపల్లి, ఆరెపల్లి, అనుపురం, కొడిముంజ, వరదవెల్లి, శాభాష్పల్లి నిర్వాసితులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఊడిపడ్డ బస్సు అద్దం.. తప్పిన ప్రమాదం ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని రాచర్లతిమ్మాపూర్ బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సు అద్దం ఊడిపోవడంతో శుక్రవారం పెను ప్రమాదం తప్పింది. బస్సులోని ప్రయాణికులకు, వెనకాల వస్తున్న వాహనదారులకు ప్రమాదం జరుగకపోవడంతో అందరూ ఊపీరిపీల్చుకున్నారు. సిరిసిల్ల నుంచి కామారెడ్డికి వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు వెనకాల ఉన్న అద్దం ఊడిపోయి బస్సు నడుస్తున్న సమయంలోనే కిందపడింది. ఆ సమయంలో బస్సు వెనకాల ఇతర వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సుల ప్రమాదాలు వరుసగా జరుగుతుండడంతో ప్రయాణీకులు ఆందోళనకు గురవుతున్నారు. అధికారుల మెయింటనెన్స్ సరిగ్గా చేయకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. కేసీఆర్, కేటీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం సిరిసిల్లటౌన్: సిరిసిల్లలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు శుక్రవారం బీఆర్ఎస్ నేతలు క్షీరాభిషేకం చేశారు. బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి మాట్లాడుతూ సిరిసిల్లలో వస్త్రపరిశ్రమను ఆదుకోవాలని, నేతన్నలకు ఉపాధి కల్పించాలని సంక్షేమ కార్యక్రమాలను కేసీఆర్ అమలు చేశారన్నారు. ఇందులో భాగంగా మహిళలకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో టెక్స్టైల్ పరిశ్రమలను స్థాపించాలన్న ముందుచూపుతోనే అపెరల్ పార్కు ఏర్పాటైందన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలోనే టెక్స్పోర్టు కంపెనీతో ఒప్పందం జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. అర్బన్బ్యాంకు చైర్మన్ రాపెల్లి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఉచిత పాలిసెట్ శిక్షణ ప్రారంభం సిరిసిల్లటౌన్: పాలిసెట్ ప్రవేశపరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులకు సిరిసిల్ల పోపా ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత శిక్షణను ప్రారంభించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఈ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ శిక్షణకు 130 మంది విద్యార్థులు పేర్లు నమోదు చేసుకున్నారు. సిరిసిల్ల పోపా ఉపాధ్యక్షుడు మామిడాల భూపతి, జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి ఎర్రం శ్రీని వాస్, సిరిసిల్ల ఎంఈవో దూస రఘుపతి, రిటైర్డ్ ప్రిన్సిపాల్ గాజుల ప్రతాప్, సభ్యులు మచ్చ ఆనంద్, అంకారపు జ్ఞానోబా, రవీందర్, ఆడెపు వేణు, ప్రభాకర్ పాల్గొన్నారు. రక్తదాత హాఫ్ సెంచరీఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50 సార్లు రక్తం దానం చేశాడు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన వంగ గిరిధర్రెడ్డి. సిరిసిల్లలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఒకరికి బ్లడ్ అత్యవసరమని ఫోన్కాల్ రావడంతో వెంటనే జిల్లా బ్లడ్బ్యాంక్కు వెళ్లి 50వ సారి రక్తదానం చేశాడు. గతంలో చిరంజీవి బ్లడ్బ్యాంక్లో 40 సార్లు డొనేట్ చేసినట్లు తెలిపా రు. పలువురు అభినందించారు. -
నేరెళ్ల ఘటనపై ఎస్సీ కమిషన్ను తప్పుపడతారా?
● తక్షణమే దుష్ప్రచారం నిలిపేయండి ● లేనిపక్షంలో చర్యలు తప్పవు ● జాతీయ ఎస్సీ కమిషన్ హెచ్చరికసిరిసిల్ల/కరీంనగర్టౌన్: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్లలో 2017లో జరిగిన ఘటనపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు వడ్డెపల్లి రామచందర్ స్పందించారు. నేరెళ్ల ఘటనపై కొందరు సోషల్ మీడియా వేదికగా జాతీయ ఎస్సీ కమిషన్ను బద్నాం చేస్తున్నట్లు తెలుసుకున్న కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్ శుక్రవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. దళితుల పక్షాన పనిచేసే ఎస్సీ కమిషన్ను దుష్ప్రచారం చేయడాన్ని నిలిపివేయాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నేరెళ్ల ఘటనలో ఎస్సీ కమిషన్ చేపట్టిన విచారణతోపాటు ప్రభుత్వానికి పంపిన మధ్యంతర నివేదికను విడుదల చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా, బాధ్యులపై చర్యలు తీసుకునేలా నివేదిక రూపొందించిన విషయాన్ని గుర్తుచేశారు. నేరేళ్ల గ్రామంలో విచారణ చేపట్టడంతోపాటు కరీంనగర్ జైలుకు వెళ్లి బాధితులను కలిసి స్టేట్మెంట్ రికార్డు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పటి కలెక్టర్, పోలీసు అధికారుల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినట్లు స్పష్టం చేశారు. 2017 ఆగస్టు 7న అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మధ్యంతర నివేదికలోని ఐదు ప్రధాన అంశాలను సైతం బహిర్గతం చేశారు. ఈ ఘటనపై హైలెవల్ కమిటీ ఏర్పాటు చేయాలని, అప్పటి ఎస్పీని బదిలీ చేయాలని, సంబంధిత డీఎస్పీ, సీఐ, ఎస్ఐలను విచారణ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేయాలని, బాధితులకు పూర్తి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలని, ఒక్కో బాధితుడికి రూ.5లక్షల పరిహారం అందించాలని నివేదికలో స్పష్టం చేసినట్లు రామచందర్ వివరించారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ బాధ్యతాయుతంగా పనిచేస్తుంటే.. తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. -
మహనీయులను స్మరించుకోవాలి
కరీంనగర్సిటీ: మహత్ములను నిత్యం స్మరించుకుంటూ వారి సూచించిన బాటలో నడవాలని శాతవాహన యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఉమేశ్కుమార్ తెలిపారు. శాతవాహన విశ్వవిద్యాలయంలో మహనీయుల జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని గీతాభవన్ వద్ద మహాత్మా జ్యోతిబాపూలే పార్కు నుంచి యూనివర్సిటీ వరకు నిర్వహించిన ర్యాలీని శుక్రవారం ప్రారంభించారు. మహనీయుల త్యాగాలను గుర్తుచేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రార్ ఆచార్య జాస్తి రవికుమార్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ పూలే, అంబేడ్కర్ గొప్ప దార్శనికులన్నారు. ర్యాలీలో విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ, పీజీ కళాశాలల విద్యార్థులు, జాతీయ సేవా పథకం వలంటీర్లు, ఆల్ఫోర్స్, వాగేశ్వరీ, ఎస్సారార్, ఉమెన్స్ డిగ్రీ కళాశాల, సోషల్ వెల్ఫేర్, శ్రీ చైతన్య వివేకానంద, అక్షయ కళాశాల నుంచి అధ్యాపకులు ప్రోగ్రాం అధికారులు పాల్గొన్నారు. విశ్వవిద్యాలయం అధ్యాపకులు, ఓఎస్డీ టు వీసీ హరికాంత్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సుజాత, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ డా.జయంతి, డా. పద్మావతి, శ్రీవాణి, రంగప్రసాద్, అబ్రరూల్ బాఖీ వివిధ విభాగాల అధిపతులు అధ్యాపకులు పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా యూనివర్సిటీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తాగునీటికి విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతికథలాపూర్(వేములవాడ): కథలాపూర్కు చెందిన పల్లికొండ అజయ్(18) శుక్రవారం రాత్రి బైక్పై వెళ్తూ అదుపుతప్పి రోడ్డు పక్కన పడిపోవడంతో మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. అజయ్ తన స్నేహితుడితో కలిసి కథలాపూర్ గ్రామం నుంచి గుండు పెరమాండ్ల ఆలయం వైపు బైక్పై వెళ్తున్నారు. గ్రామశివారులో రోడ్డు పక్కన బైక్తోపాటు పడిపోయాడు. తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మరో యువకుడికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం కోరుట్ల పట్టణంలోని ఆసుపత్రిలో చేర్పించారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. అజయ్ బైక్ను ఏదైనా వాహనం ఢీకొట్టడంతో ప్రమాదానికి గురయ్యారా? లేక అదుపు తప్పి పడిపోయారా అనే విషయాలపై పోలీసులు, గ్రామస్తులు ఆరా తీస్తున్నారు. సీసీ పుటేజీలను పరిశీలించి కారణాలు తెలుసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. భ్రూణహత్యలో నలుగురిపై కేసుచందుర్తి(వేములవాడ): భ్రూణహత్యల ఘటనలో ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యం, ఆర్ఎంపీ,సదరు దంపతులపై శుక్రవారం కేసు నమోదైంది. డీఎంహెచ్వో రజిత తెలిపిన వివరాలు.. చందుర్తి మండలంలో విధులు నిర్వర్తిస్తున్న రేగుల రాజు భార్య నవ్యకు అబార్షన్ చేయించారు. ఇందుకు సహకరించిన మూడపల్లికి చెందిన ఆర్ఎంపీ అల్లె రాజు, అబార్షన్ చేసిన వేములవాడకు చెందిన నందిని ఆస్పత్రి యాజమాన్యంపై డీఎంహెచ్వో వేములవాడ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మాతృమూర్తి మనోవేదన కట్టుకున్న భర్త మాటలు నమ్మి ఆ ఇల్లాలు ఐదు నెలల గర్భాన్ని తీయించుకుంది. భార్య కడుపులో పెరుగుతున్న శిశువుకు అవయవాలు పూర్తిగా రాలేదని, అంగవైకల్యంతో జన్మింఏ అవకాశం ఉందని నమ్మించిన భర్త ఆమెను అబార్షన్కు ఒప్పించాడు. భర్త మాటలు నమ్మి అబార్షన్ చేయించుకుంది. ఇప్పుడు ఆ మాతృమూర్తికి గర్భశోకంతోపాటు కేసు నమోదుకావడంతో ఆ తల్లి మనోవేదనకు అంతులేకుండా పోయింది. భార్యను వేధించిన భర్తకు ఏడాది జైలుఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అదనపు వరకట్నం కోసం భార్యను వేధించిన భర్తకు ఏడాది జైలుశిక్ష విధిస్తూ సిరిసిల్ల మొదటి అదనపు ప్రథమశ్రేణి న్యాయమూర్తి కె.సృజన శుక్రవారం తీర్పు వెల్లడించినట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు. మండలంలోని పోతిరెడ్డిపల్లికి చెందిన అడిగే మాధవికి చిన్నబోనాలకు చెందిన పడిగే తిరుపతితో 2007లో వివాహమైంది. ఆ సమయంలోనే రూ.4లక్షలు నగదు, ఐదు తులాల బంగారం, 30 తులాల వెండి, ఇతర సామగ్రి వరకట్నంగా ముట్టజెప్పారు. తర్వాత కొద్ది రోజులకు అదనపు వరకట్నం కోసం తిరుపతితోపాటు అత్తమామలు వేధించారు. వేధింపులు భరించలేక తల్లి గారింటికి రాగా.. భర్త తిరుపతి మరొకరిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో మాధవి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన జడ్జి.. నిందితుడు తిరుపతికి ఏడాది జైలు, రూ.వేయి జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు ఎస్సై వివరించారు. -
నేడు బీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా ముఖ్యనేతల సమావేశం
కొత్తపల్లి(కరీంనగర్): చింతకుంటలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావుతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వెల్లడించారు. చింతకుంటలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని శుక్రవారం మాజీ ఎంపీ బి.వినోద్కుమార్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మాజీ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు తదితరులతో కలిసి సందర్శించారు. పార్టీ సమావేశానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులకు సూచించారు.సింగిల్ విండో చైర్మన్ వీర్ల వేంకటేశ్వర్రావు, కొత్తపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ రుద్ర రాజు, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్లు పొన్నం అనిల్ కుమార్ గౌడ్, ఏనుగు రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ వైస్ ఎంపీపీ తిరుపతి నాయక్, మాజీ కార్పొరేటర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
‘సుస్థిరం’.. గండ్రపల్లి గ్రామం
జమ్మికుంట: రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనలో జిల్లాలోని జమ్మికుంట మండలం గండ్రపల్లి గ్రామపంచాయతీ పని తీరు సుస్థిరంగా నిలిచింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల బృందాలు సందర్శించి నివేదికలు అందజేశాయి. ఫలితంగా సుస్థిర గ్రామ అభివృద్ధి లక్ష్య సాధనలో అత్యంత ప్రతిభ కనబరిచిన గండ్రపల్లి జిల్లాలో రెండవదిగా నిలి చింది. రాష్ట్రంలో 11వ స్థానంలో 80.19 శాతం మార్కులు దక్కించుకుంది. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ గణాంకాల్లో రాష్ట్రంలోని 25 పంచాయతీల్లో ప్రత్యేక స్థానం సాధించింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు పేదరికం లేని వ్యవస్థ నిర్మాణం, ఆహార భద్రత్ర, పరిశుభ్రమైన నీరు, పారిశుధ్యం, ఆరోగ్యం, నాణ్యమైన విద్య, లింగ సమానత్వం, ఆర్థిక అభివృద్ధి, అసమానతలు తగ్గించడం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి కృషి చేశారు. 2022–23, 2023–24 సంవత్సరంలో విధులు నిర్వహించిన పంచాయతీ కార్యదర్శి ఝాన్సి జిల్లా అధికారుల అభినందనలు, శుభాకాంక్షలు పొందారు. నిధుల సద్వినియోగం గండ్రపల్లిలో 2022–23, 2023–24 సంవత్సరంలో సుస్థిరమైన అభివృద్ధికి గ్రామ పంచాయతీ అధికారి, సర్పంచ్, పాలక వర్గంతోపాటు గ్రామస్తుల సహకారం ఎంతో కీలకంగా పని చేశాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను సమర్థవంతంగా ప్రజలకు చేరేలా కృషి చేశారు. గండ్రపల్లి వివరాలు..గ్రామ జనాభా 1,566 గృహాలు 476 పురుషులు 796 మహిళలు 770 తాగునీటి కనెక్షన్లు 469 రేషన్కార్డులు 476 పెన్షన్దారులు 219 ఉపాధి జాబ్కార్డులు 501 ఎస్హెచ్జీ గృహాలు 26 బ్యాంక్ లోన్ తీసుకున్న సంఘాలు 14 గ్యాస్ కనెక్షన్లు 459 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు సద్వినియోగం అత్యుత్తమ ప్రతిభతో 80.19శాతం మార్కులు కేంద్ర, రాష్ట్ర బృందాల సందర్శన, నివేదికలులక్ష్యం దిశగా కృషి ప్రభుత్వ నిధులు, సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకొని, ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తాం. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల సహాయ సహకారాలతో వంద శాతం సుస్థిర అభివృద్ధి లక్ష్యం దిశగా కృషి చేస్తూ ముందుకు సాగుతాం. – వెంగల రాములు, పంచాయతీ కార్యదర్శి, గండ్రపల్లి నిధులు సద్వినియోగం ప్రభుత్వ నిధులు సద్వినియోగం చేసుకొని గ్రామ అభివృద్ధికి కృషి చేశాం. రానున్న రోజుల్లో వందశాతం మెరుగైన అభివృద్ధికి సహకారం అందిస్తాం. – బల్మూరి పద్మసమ్మారావు, మాజీ సర్పంచ్, గండ్రపల్లి -
కూరగాయల సాగు..ఉపాధి బాగు
● తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి ● ఉపాధి పొందుతున్న పలు కుటుంబాలుఇల్లంతకుంట(మానకొండూర్): మెట్టప్రాంత రైతులు కూరగాయల సాగుతో ఆర్థికంగా బలోపేతమవుతున్నారు. తక్కువ నీటితో చేతికొచ్చే కూరగాయలు సాగుచేస్తూ ఆర్థిక కష్టాల నుంచి బయటపడుతున్నారు. ఇల్లంతకుంట మండలంలోని రామాజీపేట, ముస్కానిపేట, రహీంఖాన్పేట, వల్లంపట్ల, గాలిపల్లి గ్రామాలు కూరగాయల సాగుకు కేరాఫ్ అడ్రస్గా మారాయి. ఆయా గ్రామాల్లో కూరగాయలు సాగుచేస్తూ పిల్లలను ఉన్నతంగా చదివించిన కుటుంబాలు, ఆర్థిక ఇబ్బందులను అధిగమించిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కూరగాయల సాగుపై స్పెషల్ స్టోరీ. సంప్రదాయ పంటలకు భిన్నంగా.. ఇల్లంతకుంట మండలంలోని అత్యధిక మంది రైతులు సంప్రదాయ పంటలైన వరి, పత్తి కాకుండా కూరగాయలు, మొక్కజొన్న పంటలు సాగుచేస్తున్నారు. మండలంలోని నీటి ఎద్దడిని తట్టుకునేందుకు కూరగాయలు సాగుచేస్తున్నారు. మండల వ్యాప్తంగా ఈ వేసవిలోనూ దాదాపు 200 ఎకరాలలో దాదాపు 60 కుటుంబాలు కూరగాయలు సాగు చేస్తున్నాయి. తమ తోటలో వస్తున్న కూరగాయలను సిరిసిల్ల, సిద్దిపేట పట్టణాలకు వెళ్లి రైతుబజార్లలో విక్రయిస్తున్నారు. మరికొందరు రైతులు మండలంలోని పలు గ్రామాలకు ద్విచక్రవాహనాలపై వెళ్లి విక్రయిస్తున్నారు. ఇలా తమ కుటుంబాలను ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కిస్తున్నారు. ఇతను ఇల్లంతకుంట మండలం రామాజీపేటకు చెందిన చొప్పరి కరుణాకర్. ఏటా మూడెకరాలలో బీర, సోరకాయ, టమాట, కాకరకాయలు సాగు చేస్తుంటాడు. సంవత్సరం పొడవునా కూరగాయలు పండేలా ప్రణాళిక చేసుకుంటాడు. దీంతో సంవత్సరం పొడగునా కూరగాయలు అమ్ముతూ ఆదాయం పొందుతున్నాడు. తోట వద్ద సంపు నిర్మించుకొని.. బోరునీటిని నింపి తోటను పారిస్తుంటాడు. ఇలా ఏడాది పొడవునా కూరగాయల సాగుతో రూ.3లక్షల వరకు ఆదాయం పొందుతున్నాడు. కూరగాయల వ్యాపారమే అండ మా అమ్మ కూరగాయలు అమ్మింది. అమ్మ స్ఫూర్తితోనే నేను కూడా కూరగాయలు అమ్ముతున్నాను. ఓమ్ని వాహనంలో సిరిసిల్ల మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చి ఇల్లంతకుంట మార్కెట్లో విక్రయిస్తున్నాం. మా జీవనం గడుస్తుంది. ఇల్లు కూడా కట్టుకున్నాను. పిల్లలను చదివించాను. మా కూతురు ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. అబ్బాయి హైదరాబాద్లో డిగ్రీ చదువుతున్నాడు. – సింగిరెడ్డి రాజిరెడ్డి దంపతులు తోపుడు బండిపైనే విక్రయిస్తాను తోపుడు బండిపై ఇల్లంతకుంటలోని వీధుల్లో నిత్యం తిరుగుతూ కూరగాయలు అమ్ముతాను. మండలవ్యాప్తంగా జరిగే వారసంతల్లోనూ మధ్యాహ్నం కూరగాయలు విక్రయిస్తాను. కొన్ని సమయాల్లో కూరగాయలు మురిగిపోయి నష్టం కూడా జరుగుతుంది. మా కుటుంబానికి ఇదే జీవనోపాధి. – తడిక రాజయ్య, వ్యాపారి -
ఏసీబీకి చిక్కిన ట్రెజరీ ఉద్యోగి● రూ.7వేలు తీసుకుంటూ పట్టుపడిన సీనియర్ అకౌంటెంట్ రఘు
జగిత్యాల: కలెక్టరేట్ సముదాయంలోని ట్రెజరీ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ దాడులు జరిగాయి. రూ.7వేల లంచం తీసుకుంటూ ట్రెజరీ సీనియర్ అకౌంటెంట్ అరిగె రఘుకుమార్ పట్టుపడ్డాడు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి వివరాల ప్రకారం.. ఓ ప్రభుత్వశాఖలో పనిచేసే ఉద్యోగి లోను కోసం కంట్రిబ్యూటరీ పెన్షన్స్కీంలో దరఖాస్తు చేసుకున్నాడు. రూ.1.04 లక్షలు మంజూరు కాగా.. చెల్లించడం సైతం జరిగింది. అయితే ట్రెజరీలో సీనియర్ అకౌంటెంట్గా పనిచేస్తున్న అరిగె రఘుకుమార్ ఆ వ్యక్తికి తరుచూ ఫోన్ చేసి రూ.7 వేలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సూచన మేరకు శుక్రవారం 11గంటలకు డబ్బులు ఇస్తానని రఘుతో చెప్పాడు. ఉదయం 10 గంటల సమయంలో ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో బృందం కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్నారు. సదరు ఉద్యోగి నుంచి రఘుకుమార్ తన కార్యాలయంలో రూ.7వేలు తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి కరీంనగర్ తరలించారు. యువకుడిపై పోక్సో కేసు ఎలిగేడు(పెద్దపల్లి): మండలంలోని ఓ గ్రామంలో బాలికపై అత్యాచార యత్నం కేసులో నిందితుడు నవదీప్పై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై సనత్కుమార్ తెలిపారు. గ్రామాని కి చెందిన దంపతులు తమ చిన్నారిని ఇంటి వ ద్ద వదిలి పనులకు వెళ్లారు. ఒంటరిగా ఉన్న బాలికకు మాయమాటలు చెప్పిన యువకుడు.. అత్యాచారానికి యత్నించగా భయపడి ఇంటికి పరుగులు తీసింది. తల్లిదండ్రులు వ చ్చాక విషయం చెప్పింది. దీంతో తల్లిదండ్రు లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఎస్సై గ్రామంలో శుక్రవారం విచారణ జరిపా రు. నిందితుడి సెల్ఫోన్ స్వాధీనం చేసుకుని, పోక్సో కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితుడిని రిమాండ్కు తరలించారు. -
మహనీయుల స్ఫూర్తితో ముందుకుసాగాలి
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్కుమార్ ఝాసిరిసిల్ల/చందుర్తి(వేములవాడ): మహనీయుల స్ఫూర్తితో యువత ముందుకుసాగాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. చందుర్తిలో శుక్రవారం నిర్వహించిన మహాత్మా జ్యోతిబాపూలే జయంతి వే డుకల్లో పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిబాపూలేకు కలెక్టర్ సందీప్కుమార్ ఝా నివాళి అర్పించారు. క లెక్టరేట్లో కలెక్టర్తోపాటు అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజమనోహర్రావు, జెడ్పీ సీఈవో వినోద్, డీసీవో రామకృష్ణ, అసిస్టెంట్ లేబర్ అధికారి నజీర్ హైమద్, డీఏవో అఫ్జల్బేగం, డీపీఆర్వో శ్రీధర్ పాల్గొన్నారు. -
సన్నద్ధం.. సందిగ్ధం
● గ్రామాల్లో సమ్మర్ క్యాంపులకు సై ● క్రీడాశాఖ ఆధ్వర్యంలో నిర్వహణకు శ్రీకారం ● పట్టణాల్లో నగరపాలక, మున్సిపల్ ఆధ్వర్యంలో సందిగ్ధంకరీంనగర్ స్పోర్ట్స్: పాఠశాల విద్యా సంవత్సరం ముగుస్తోంది. త్వరలో సెలవులు ప్రకటించనున్నారు. వేసవి సెలవుల్లో తల్లిదండ్రులతో పాటు పిల్లలు సైతం ఏదేని క్రీడలో తర్ఫీదు పొందాలని ఆసక్తి చూపుతుంటారు. ఇలాంటి వారికి సమ్మర్ క్యాంపులు ఉపయుక్తంగా ఉంటున్నాయి. 2025 ఏడాదిలో సమ్మర్ క్యాంపు నిర్వహణకు ఉమ్మడి జిల్లా క్రీడాశాఖ శ్రీకారం చుట్టింది. అయితే కరీంనగర్, రామగుండం నగరపాలకతో పాటు జగిత్యాల, సిరిసిల్ల మున్సిపాలిటీల్లో ఆ ఊసే లేకపోవడం గమనార్హం. మే 1 నుంచి క్రీడాశాఖల ఆధ్వర్యంలో.. జిల్లా యువజన, క్రీడాశాఖల ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్లు నిర్వహించడానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఉత్తర్వులు జారీ చేసింది. మే 1 నుంచి 31వరకు వేసవి శిబిరాలు నిర్వహించాలని ఆదేశించింది. ఆయా జిల్లాల్లోని పాపులారిటీ ఉన్న క్రీడాంశాల్లో ఎంపిక చేసిన 10 గ్రామీణ ప్రాంతాల్లో శిక్షణనివ్వాలని సూచించింది. పీఈటీలకు నెల రోజుల శిక్షణ కాలానికి గౌరవ వేతనం కింద రూ.4వేలు ఇవ్వనున్నారు. పట్టణాల్లో ఊసేలేదు! క్రీడాశాఖ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో శిక్షణ శిబిరాలు నిర్వహిస్తుండగా.. అర్బన్ ప్రాంతాల్లో ఊసే లేకుండా పోయింది. వారం రోజుల్లో పాఠశాల విద్యా సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో కరీంనగర్ నగరపాలక సంస్థ, రామగుండం నగరపాలక సంస్థ, సిరిసిల్లలో ఎలాంటి సన్నాహాలు ప్రారంభించడం లేదు. జగిత్యాలలో ఈసారైనా సమ్మర్ క్యాంపు నిర్వహించాలని పలువురు తల్లిదండ్రులు, క్రీడా విశ్లేషకులు కోరుతున్నారు. ఆయా బల్దియాల్లో పాలకవర్గం పదవీకాలం ముగియగా.. ప్రత్యేకాధికారులు ఈ విషయమై చొరవ తీసుకోవాలని సూచిస్తున్నారు.క్రీడాశాఖ ఆధ్వర్యంలో దరఖాస్తులు ఇలా..జిల్లా చివరి తేదీ రాజన్న సిరిసిల్ల ఈ నెల 18 జగిత్యాల ఈ నెల 19 కరీంనగర్ ఈ నెల 20 పెద్దపల్లి ఈ నెల 22 -
పవనసుత హనుమాన్కీ..
వేములవాడఅర్బన్: పవనసుత హనుమాన్ కీ.. జై.. భజరంగ్ భళీకి జై.. అనే నామస్మరణలతో అగ్రహారం ఆలయ పరిసరాలు మారుమోగుతున్నాయి. శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మాలధారులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. వేములవాడ మండలం అగ్రహారం జోడాంజనేయస్వామి సన్నిధిలో జయంతి ఉత్సవాలకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని రంగు..రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఎండ నుంచి భక్తులకు ఉపశమనం కల్గించేందుకు చలువపందిళ్లు వేశారు. దీక్షలకు ప్రత్యేకం వేములవాడ మండలం అగ్రహారం జోడాంజనేయస్వామి ఆలయంలో మూడు దఫాలుగా మాలలు ధరిస్తారు. మండల దీక్ష 41 రోజులు, అర్ధ మండల దీక్ష 21 రోజులు, ఏకాదశ దీక్ష 11 రోజులు ధరిస్తారు. ప్రతీరోజు హనుమాన్ ఆలయం దీక్షాపరుల భజనలతో సందడిగా ఉంటుంది. ఏర్పాట్లు పూర్తి ఆలయాన్ని విద్యుత్ దీపాలు అలంకరించారు. భక్తులకు తాగునీటి వసతి ఏర్పాటు చేశారు. 10 క్వింటాళ్ల అన్నదానం చేయనున్నారు. 14 వేల లడ్డూ ప్రసాదాలు, 3 క్వింటాళ్ల పులిహోర తయారు చేయనున్నట్లు తెలిపారు. సాయంత్రం రథోత్సవం స్వామివారి రథోత్సవం సాయంత్రం నిర్వహిస్తారు. స్వామివారి ఉత్సవమూర్తిని రథంపై ఆసీనులను చేసి ఊరేగిస్తారు. దాదాపు 40వేల మంది భక్తులు హాజరుకానున్నట్లు ఆలయ అధికారులు అంచనా వేశారు. నేడు హనుమాన్ జయంతి ఏర్పాట్లు సిద్ధం చేసిన అధికారులు ఆలయానికి చేరుకున్న మాలధారులుఏర్పాట్లు చేస్తున్నాం అగ్రహారం హనుమాన్ ఆలయంలో జరిగే జయంతి, రథోత్సవాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. అన్నదానం, తాగునీటి వసతి కల్పిస్తున్నాం. లడ్డూ ప్రసాదాలు తయారు చేయిస్తున్నాం. – నాగారపు శ్రీనివాస్, హనుమాన్ ఆలయ ఈవో -
రూ.13.67కోట్లకు తలనీలాల టెండర్
● రూ.5.34 కోట్లకు తగ్గిన రాజన్న ఆదాయం ● గత టెండర్ రూ.19.01 కోట్లు ● కమిషనర్కు నివేదిక సమర్పించిన ఆలయ అధికారులు ● టెండర్లో 33వ నిబంధనతో కాంట్రాక్టర్కు మేలువేములవాడ: రాజన్నకు భక్తులు సమర్పించుకునే తలనీలాలు సేకరించుకునేందుకు రెండేళ్ల కాలపరిమితితో శుక్రవారం నాలుగోసారి టెండర్ నిర్వహించినట్లు ఆలయ ఈవో వినోద్రెడ్డి తెలిపారు. ఆన్లైన్లో ఇద్దరు, బహిరంగ వేలం పాటలో ఇద్దరు పాల్గొన్నారు. ఇందులో బహిరంగ వేలంపాటకు హాజరైన కళావతి ఎంటర్ ప్రైజేస్, నాగకుమారి ఎంటర్ప్రైజేస్ పాట పాడలేకపోయారు. తమిళనాడు కు చెందిన దొరై ఎంటర్ ప్రైజేస్, కేఎం ఎంటర్ప్రైజేస్లు ఆన్లైన్లో వేలంలో పాల్గొన్నారు. ఇందులో రూ.13.67 కోట్లకు దొరై ఎంటర్ప్రైజేస్ హెచ్చుపాటదారుడిగా నిలిచారు. దీనిపై ఆలయ అధికారులు రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్కు నివేదిక సమర్పిస్తున్నట్లు ఈవో తెలిపారు. కమిషనర్ ఆదేశాలతో సదరు టెండర్ ఫైనల్ చేస్తామని స్పష్టం చేశారు. గతంలో కంటే తక్కువ.. ఏప్రిల్ 11తో ముగిసే కాంట్రాక్ట్ వేలం గతంలో రూ.19.01కోట్లకు నిలిచిన విషయం తెలిసిందే. ఈసారి వచ్చిన వేలంలో రూ.13.67కోట్లు హెచ్చుపాట వద్ద నిలిచిపోవడంతో రాజన్న ఆదాయానికి రూ.5.34 కోట్లు ఎసరు పడనున్నట్లు తెలుస్తోంది. అయితే గత కాంట్రాక్టర్ డబ్బులు చెల్లించుకుండా కాలయాపన చేయడం, ఆలయ అధికారులే తలనీలాలు పోగుచేయడం కొనసాగింది. ఈ నేపథ్యంలో స్పెషల్ పర్మిషన్ ఇచ్చేసి సదరు కాంట్రాక్టర్కు జూన్ వరకు చెల్లింపులకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఇక శుక్రవారం జరిగిన తలనీలాల టెండర్పై కమిషనర్ ఏ మేరకు స్పందిస్తారో వేచి చూడాల్సింది. ఒకవేళ రూ.13.67కోట్లు హెచ్చుపాటను ఒప్పుకుంటే రాజన్నకు రూ.5.34కోట్ల ఆదాయం తగ్గింది. టెండర్లో 33వ నిబంధన ఇదీ.. ఈసారి టెండర్ నిర్వహించే క్రమంలో 33వ నిబంధనలో భాగంగా అధికారులు కాంట్రాక్టర్కు పలు సూచనలిచ్చారు. ఆలయ విస్తరణ పనులు చేపట్టనున్న క్రమంలో ఎప్పుడైనా భీమేశ్వరాలయంలోకి దర్శనాలు కొనసాగించే అవకాశాలు ఉంటాయని.. ఈక్రమంలో రూ.13.67కోట్ల టెండర్ ప్రకారం ఏరోజు వరకు రాజన్న గుడి వద్ద తలనీలాల సేకరించారో అదే రోజు వరకు లెక్కలేసుకునే సౌలభ్యం కల్పించారు. ఒకవేళ భీమేశ్వరాలయంలో కల్యాణకట్ట ఏర్పాటు చేసి అవకాశం కల్పిస్తే సదరు కాంట్రాక్టర్కు ఇష్టమైతే ఉండొచ్చు లేదా తప్పుకోవచ్చనే నిబంధన పెట్టారు. దీంతో తలనీలాల టెండర్కు ఆదాయం తగ్గినట్లు కనిపిస్తోంది. ఈ సౌలభ్యాన్ని కాంట్రాక్టర్ తెలివిగా వినియోగించుకుని రాజన్న ఆదాయానికి గండికొట్టే ప్రమాదం లేకపోలేదని స్థానిక నాయీబ్రాహ్మణులు చర్చించుకుంటున్నారు. -
నేడు టెక్స్పోర్ట్ యూనిట్ ప్రారంభం
సిరిసిల్ల: పెద్దూరు అపెరల్ పార్క్లో పంక్చుయేట్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్(టెక్స్పోర్ట్) యూనిట్ను శుక్రవారం రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ ప్రారంభిస్తారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. ఈమేరకు ఏర్పాట్లను కలెక్టర్ సందీప్కుమార్ ఝా, ఎస్పీ మహేశ్ బీ.గీతేతో కలిసి గురువారం పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కె.కె.మహేందర్రెడ్డి, ఆర్డీవో రాధాబాయి, టెక్స్టైల్ శాఖ జేడీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. మంత్రుల పర్యటన షెడ్యూల్ ఇలా.. మంత్రులు శుక్రవారం ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరుతారు. 11.30 గంటలకు అపెరల్ పార్క్కు చేరుకుని టెక్స్పోర్టు యూనిట్ను ప్రారంభిస్తారు. మహిళా ఉద్యోగులకు నియామకపత్రాలు అందజేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు తిరుగు ప్రయాణమవుతారు. పటిష్ట బందోబస్తు సిరిసిల్లక్రైం: అపెరల్పార్క్లో టెక్స్పోర్ట్ యూనిట్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రుల పర్యటనకు పటిష్ట భద్రత చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ మహేశ్ బీ.గీతే తెలి పారు. పోలీస్ అధికారులతో సమావేశమయ్యారు. 300 మందితో బందోబస్తు చేపడుతున్నట్లు తెలిపారు. ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, డీఎస్పీ చంద్రశేఖర్రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ మురళీకృష్ణ, సీఐలు కృష్ణ, మొగిలి, శ్రీనివాస్, వీరప్రసాద్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, సదన్కుమార్, మధుకర్, నాగేశ్వరరావు, ఆర్ఐలు రమేశ్, యాదగిరి ఉన్నారు. చిన్నారులకు టీకాలు వేయించాలి బోయినపల్లి(చొప్పదండి): ఐదేళ్లలోపు వయస్సు గల చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని జెడ్పీ సీఈవో ఎస్.వినోద్ కోరారు. మండలకేంద్రంలోని పీహెచ్సీలో స్పెషల్ ఇమ్యూనైజేషన్ క్యాంపుపై గురువారం సమీక్షించారు. బోయినపల్లి పీహెచ్సీ వైద్యాధికారి కార్తీక్ మాట్లాడుతూ ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇటుకబట్టీలలో పనిచేస్తున్న వారి పిల్లల్లో టీకాలు వేయించుకోని వారిని గుర్తించి టీకాలు వేస్తామని తెలిపారు. తహసీల్దార్ నారాయణరెడ్డి, ఎంపీడీవో జయశీల, ఎంఈవో శ్రవణ్కుమార్, వైద్యులు వినూత్న, శిరీష ఉన్నారు. మున్సిపల్ కార్మికులపై చిన్నచూపు వీడాలి సిరిసిల్లటౌన్: మున్సిపల్ కార్మికుల వేతనాల పెంపు కోసం అనేక పోరాటాలు చేస్తుంటే సర్కారు చిన్నచూపు చూడడం సరికాదని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం మున్సిపల్ ఆఫీస్ ఎదుట ధర్నా చేపట్టారు. గత ప్రభుత్వం 2021 జూన్లో 11వ పీఆర్సీ కింద మున్సిపల్ కార్మికుల వేతనాలు రూ.12వేలు నుంచి రూ.15,600 పెంచారని, సిరిసిల్లలోని కార్మికులకు 5 నెలల పీఆర్సీ బకాయిలు రావాల్సి ఉన్నాయన్నారు. గురువారం ఉదయం 5 గంటలకు విధులు బహిష్కరించగా.. 6 గంటల వరకు కమిషనర్ ఎస్.సమ్మయ్య వచ్చి చర్చలు జరిపి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి నాలుగు రోజుల వరకు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు విధుల్లోకి వెళ్లారు. ‘ఆర్ఎంపీలు పరిమితి దాటి వైద్యం చేయొద్దు’చందుర్తి(వేములవాడ): ఆర్ఎంపీ, పీఎంపీలు పరిమితికి మించి వైద్యం చేసి కష్టాలు తెచ్చుకోవద్దని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్రెడ్డి కోరారు. లింగనిర్ధారణ చేయించి భ్రూణహత్యలకు పాల్పడ్డారన్న వార్తల నేపథ్యంలో జిల్లా ఆర్ఎంపీ, పీఎంపీల సంఘం ఆధ్వర్యంలో గురువారం చందుర్తిలో సమావేశమయ్యారు. ప్రవీణ్రెడ్డి మాట్లాడుతూ నిబంధనలకు లోబడి వైద్యం చేయాలన్నారు. ఒక్కరూ తప్పు చేసినా అందరికి వస్తుందన్నారు. డబ్బుల కోసం ఆశించి ఇష్టం వచ్చినట్లు చేస్తే వారిని గుర్తించి సంఘంలో నుంచి తొలగింస్తామని హెచ్చరించారు. నాయకులు మిట్టపల్లి రాజమల్లు, సిరిగిరి కాంతారావు, ఎండీ ఇస్మాయిల్, మద్దిరాల సత్యనారాయణ, రాజలింగం, జగన్, వాసం నారాయణ, బొప్ప శంకర్ పాల్గొన్నారు. -
కడుపులు ఖాళీ
తేలని కూలి..● మహిళాశక్తి చీరల బట్టకు ఖరారు కాని కూలిరేట్లు ● ఊసే లేని 10 శాతం యారన్ సబ్సిడీ ● వస్త్రోత్పత్తిదారులకు అందని దారం ● ‘వర్కర్ టు ఓనర్’కు మార్గదర్శకాలు కరువు ● మంత్రులపైనే నేతన్నల ఆశలు ● నేడు సిరిసిల్లకు మంత్రుల రాకఇతను కోడం బాలకృష్ణ. సిరిసిల్లలోని బీవైనగర్లో ఇందిర మహిళా శక్తి చీరల బట్టను ఉత్పత్తి చేస్తున్నాడు. మీటర్ బట్టకు ఎంత కూలి ఇస్తారో అధికారులు నిర్ధారించలేదు. నెల తిరిగే సరికి ఎన్ని డబ్బులు వస్తాయో అంచనా లేకుండానే పనిచేస్తున్నాడు. ఇతను పెంటి తిరుపతి. మొన్నటి వరకు పాలిస్టర్ బట్ట నేసి నెలకు రూ.8వేల వరకు కూలి పొందాడు. ఇప్పుడు ప్రభుత్వ ఆర్డర్లు అయిన ఇందిర మహిళా శక్తి చీరల బట్ట నేస్తున్నాడు. ఎంత కూలి వస్తుందో తెలియకుండానే పనిచేస్తున్నాడు. సిరిసిల్ల: నెలకు ఎంత కూలి వస్తుందో తెలియకుండానే సిరిసిల్ల నేతన్నలు పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఆర్డర్ ఇందిర మహిళాశక్తి చీరల బట్టకు కూలి ఖరా రు కాకపోవడంతో నేతన్నలు అయోమయానికి గురవుతున్నారు. నిజానికి అడ్డాపై పనికోసం నిరీ క్షించే కూలీ కూడా తనకు ఎంత కై కిలి కావాలో ముందే మాట్లాడుకుంటాడు. కానీ సిరిసిల్లలో వస్త్రోత్పత్తి చేస్తున్న నేతన్నలకు ఎంత కూలి ఇస్తారో అటు అధికారులు, ఇటు ఆసాములు స్పష్టం చేయడం లేదు. ఫలితంగా నేతన్నలు ఆందోళనకు గురవుతున్నారు. వంద సాంచాలపై చీరల ఉత్పత్తి 2024 ఆగస్టు 8న ఇందిర మహిళాశక్తి పేరిట.. మహిళా సంఘాల్లోని సభ్యులకు ఏటా రెండు చీరలు ఇస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. ఈమేరకు సిరిసిల్ల వస్త్రోత్పత్తిదారులకు మొదటి విడతగా 2.12 కోట్ల మీటర్ల చీరల బట్ట ఉత్పత్తి ఆర్డర్లు ఇచ్చారు. దీని విలువ రూ.71.75కోట్లు. కానీ పూర్తి స్థాయిలో నూలు(దారం) సరఫరా చేయలేదు. రెండో విడతగా మరో 2.12 కోట్ల మీటర్ల వస్త్రోత్పత్తి ఆర్డర్లు సిద్ధంగా ఉన్నాయి. మొదటి విడత బట్టకే నూలు అందక వస్త్రోత్పత్తి సాగడం లేదు. సిరిసిల్లలో 26వేల మరమగ్గాలు ఉండగా.. వంద సాంచాలపై మొక్కుబడిగా మహిళాశక్తి చీరల బట్ట ఉత్పత్తి అవుతోంది. మరోవైపు నూలు డిపోలో వార్పు (భీముల నిలువు పోగులు), వెప్ట్(అడ్డం కోముల పోగులు) నూలు అందుబాటులో లేదు. వార్పు, వెప్ట్ రెండు ఉంటేనే బట్టను నేసే అవకాశం ఉంది. ఒక్కటి ఉంటే.. ఒక్కటి లేక.. వస్త్రోత్పత్తికి ప్రతిబంధకంగా మారింది. ప్రస్తుతం స్కూల్ యూనిఫామ్స్ వస్త్రాల తయారీ సాగుతోంది. ఇందిర మహిళాశక్తి చీరల ఉత్పత్తికి అందని నూలుతో మరింత జాప్యం కానుంది. జౌళిశాఖ అధికారులు కూలిరేట్లను నిర్ధారించి గతంలో లాగే ప్రతీ మీటరుకు రూ.1.42, 10 శాతం యారన్ సబ్సిడీని వస్త్రపరిశ్రమలో శ్రమించే అన్ని రంగాల కార్మికులకు వర్తించేలా చర్యలు తీసుకుంటే చీరల వస్త్రోత్పత్తి వేగంగా సాగనుంది. పది శాతం యారన్ సబ్సిడీ జాడేదీ.. నేతకార్మికులకు మెరుగైన ఉపాధి కల్పించే లక్ష్యంతో 2019 నుంచి పది శాతం యారన్ సబ్సిడీ అందిస్తున్నారు. నేతకార్మికుడు ఉత్పత్తి చేసిన చీరల బట్ట ఆధారంగా ఒక్కో మీటరుకు అదనంగా రూ.1.42 కూలిని లెక్కించి చెల్లిస్తారు. ఇలా 2023లో నేసిన బతుకమ్మ చీరల బట్టకు సంబంధించిన యారన్ సబ్సిడీ డబ్బులు 6వేల మంది కార్మికులకు రూ.5కోట్ల మేరకు రావాల్సి ఉంది. ఈ డబ్బులు చెల్లించాలని నేతకార్మికులు ఆందోళన చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ సబ్సిడీ సొమ్ము కోసం రెండేళ్లుగా నేతన్నలు నిరీక్షిస్తున్నారు. రూ.374 కోట్లతో వర్కర్ టు ఓనర్ సిరిసిల్లలో శ్రమించే నేతకార్మికులను ఓనర్లుగా మార్చేందుకు ‘వర్కర్ టు ఓనర్’ పథకానికి శ్రీకారం చుట్టారు. 2017 అక్టోబర్ 11న అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకానికి శంకుస్థాపన చేశారు. రూ.374 కోట్ల భారీ బడ్జెట్తో శ్రీకారం చుట్టారు. సిరిసిల్ల శివారులోని పెద్దూరు వద్ద 88.03 ఎకరాల్లో ఇప్పటికే రూ.210 కోట్లు ఖర్చు చేసి రోడ్లు, 48 షెడ్లను నిర్మించారు. తొలివిడతగా 1104 మంది కార్మికులను యజమానులుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఒక్కరికి కూడా సాంచాలు ఇవ్వలేదు. ఈ పథకానికి మార్గదర్శకాలు రాకపోవడంతో వర్కర్ టు ఓనర్ పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇది అమలైతే.. వర్కర్లు ఓనర్లుగా మారి ప్రభుత్వ వస్త్రోత్పత్తి ఆర్డర్లతో ఆర్థికంగా స్థిరపడనున్నారు. మంత్రులపైనే నేతన్నల ఆశలు సిరిసిల్లకు శుక్రవారం రాష్ట్ర మంత్రులు శ్రీధర్బాబు, తుమ్మల నాగేశ్వర్రావు, పొన్నం ప్రభాకర్ వస్తున్నారు. అపెరల్ పార్క్లో టెక్స్పోర్ట్ యూనిట్ ప్రారంభోత్సవానికి మంత్రులు హాజరుకానున్నారు. రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి హోదాలో తుమ్మల నాగేశ్వర్రావు తొలిసారి సిరిసిల్లకు వస్తున్నారు. స్థానిక నేతన్నల ఆశలన్నీ మంత్రులపైనే ఉన్నాయి. వర్కర్ టు ఓనర్, 10 శాతం యారన్ సబ్సిడీ, మహిళాశక్తి చీరల బట్టకు కూలి రేట్ల నిర్ధారణ, వస్త్రోత్పత్తిదారులకు రావాల్సిన బకాయిలు, పెండింగ్లో ఉన్న ‘సెస్’ కరెంట్ బిల్లుల సమస్య, బ్యాక్ బిల్లింగ్ ఇబ్బందులను పరిష్కరిస్తే.. సిరిసిల్ల నేతన్నలకు ఊరట లభిస్తుంది. మంత్రుల పర్యటన నేపథ్యంలో నేతన్నల ఆశలన్నీ పాలకులపైనే ఉన్నాయి. -
బువ్వ బాగుంది
● అప్పుడు విముఖత.. ఇప్పుడు సుముఖత ● రేషన్షాపుల ఎదుట కార్డుదారుల బారులు ● వారంలోనే 90 శాతం పూర్తయిన పంపిణీ ● వండుకోవడానికే ఆసక్తిచూపుతున్న పేదలు ● నూకలు వస్తున్నా, గంజి వార్చితే అన్నం బాగుంటుందంటున్న మహిళలుసాక్షి, పెద్దపల్లి: ‘అన్నా.. వేలిముద్ర వేసిపో.. కిలోకు రూ.10 చొప్పున నీ అమౌంట్ ఇస్తా’ అని రేషన్ డీలర్లు గతంలో లబ్ధిదారులతో బేరసారాలకు దిగేవారు. ప్రస్తుతం ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేయడంతో సీన్ రివర్స్ అయ్యింది. దుకాణం తెరిచావా.. బియ్యం తీసుకోవడానికి వస్తున్నామంటూ లబ్ధిదారులే రేషన్ డీలర్లను సంప్రదిస్తున్నారు. ఉ మ్మడి కరీంనగర్ జిల్లాలో రేషన్ షాపుల ఎదుట బా రులు తీరుతున్నారు. ‘పైసలు వద్దు.. సన్నబియ్యం కావాలి’ అంటున్నారు. ఉగాది నుంచి పంపిణీ చేస్తున్న సన్నబియ్యానికి కార్డుదారుల నుంచి మంచి స్పందనే వస్తోంది. గతంలో దొడ్డుబియ్యం తీసుకోవడానికి ఆసక్తి చూపనివారు.. ఇప్పుడు సన్నంబియ్యం తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. నమ్మకం కలిగిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు.. ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, కలెక్టర్లు తదితర అధికారులు సన్నబియ్యం తీసుకునే వారి ఇళ్లలో భోజనం చేస్తున్నారు. బియ్యం నాణ్యత, మన్నికపై నమ్మకం కల్పిస్తున్నారు. ఇప్పటికే అన్నిరేషన్ షాపులకు అధికారులు నెలవారీ బియ్యం కోటా సరఫరా చేయగా, దాదాపు అన్నిదుకాణాల్లో బియ్యం పంపిణీ 90శాతానికిపైగా పంపిణీ చేశారు. నూకలు వస్తున్నా... ముద్ద అవుతున్నా సన్న బియ్యంలో నూకలు ఎక్కువగా వస్తున్నాయని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఒకేరకంగా అనేక రకాలు ఉంటున్నాయని, కొన్నిదొడ్డుగా, మరికొన్ని పొట్టిగా ఉన్నాయని రేషన్కార్డుదారులు చెబుతున్నారు. వండితే ముద్ద అవుతుందని కొందరు, గంజి వార్చితే బాగుంటోందని మరికొందరు చెబుతున్నారు. రేషన్ దందాకు అడ్డుకట్ట ప్రతీనెల ఒకటి నుంచి 15 వరకు రేషన్ దుకాణాల్లో బియ్యం పంపిణీ చేసేవారు. లబ్ధిదారుల వేలిముద్రని/ఐరిస్ స్కాన్ ద్వారా కుటుంబసభ్యుల సంఖ్య ఆధారంగా ఒక్కో వ్యక్తి పేరిట 6కిలోల బియ్యం ఇచ్చేవారు. చాలామంది అనర్హులు ఉండటం, మరోవైపు బీపీఎల్ కుటుంబాలు సైతం రేషన్ బియ్యం తినడానికి ఆసక్తి చూపేవారు కాదు. దీంతో రేషన్ డీలర్లు కిలోకు రూ.10చొప్పున చెల్లించి, దొడ్డుబియ్యాన్ని దారి మళ్లించేవారు. అయినా కొందరు బియ్యం తీసుకునేందుకు వచ్చేవారు కాదు. మిగిలిన బియ్యం నిల్వ చూపించేవారు. తర్వాత నెలలో మిగిలిన బియ్యాన్ని కలిపి దుకాణానికి కేటాయింపులు చేసేవారు. కానీ, ఈనెలలో ఆ పరిస్థితి కనిపించడం లేదని, సన్నబియ్యం తీసుకునేందుకు కార్డుదారులు ఆసక్తి చూపటమే కారణమని డీలర్లు వివరిస్తున్నారు. డీలర్లపై తరుగుభారం కార్డుదారులందరూ సన్నంబియ్యం తీసుకుంటున్నా.. చాలా తరుగు వస్తుందని రేషన్డీలర్లు వాపోతున్నారు. బియ్యం బస్తా 50.650 కేజీలకు 49– 48 కేజీల వరకే బరువు ఉంటోందని, తద్వారా ఒక్కోషాపులో తరుగు పేరిట క్వింటాలు నుంచి 2 క్వింటాళ్ల వరకు బియ్యం తక్కువ వస్తున్నాయని డీలర్లు వాపోతున్నారు.సన్నంబియ్యం పంపిణీ సమాచారం జిల్లా రేషన్కార్డులు లబ్ధిదారులు రేషన్షాపులు ప్రతీనెల సరఫరా చేసే బియ్యం(మెట్రిక్ టన్నుల్లో..) కరీంనగర్ 2,75,320 8,45,761 566 5,074 పెద్దపల్లి 2,19,952 6,21,836 413 4,013 జగిత్యాల 3,07,000 8,91,000 592 5,500 సిరిసిల్ల 1,73,745 4,97,103 345 3,250 -
దారులన్నీ కొండగట్టుకే..
జగిత్యాల: జై శ్రీరాం.. జై హనుమాన్ అంటూ తమ ఇష్టదైవమైన కొండగట్టు అంజన్నను దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. శుక్రవారం అంజన్న చిన్న జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లాలోని కొండగట్టులోగల శ్రీఆంజనేయస్వామి ఆలయం ముస్తాబైంది. మూడురోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్కుమార్ ఆధ్వర్యంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అడుగడుగునా సీసీ కెమెరాల ఏర్పాటుతోపాటు, మూడు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం లైటింగ్స్ సిద్ధం చేశారు. ఆలయ ఆవరణలో చలువ పందిళ్లు వేశారు. కల్యాణకట్ట వద్ద నాయీబ్రాహ్మణులను అధిక సంఖ్యలో నియమించారు. జయంతి సందర్భంగా ఇప్పటికే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. దీక్షాపరులు మాలవిరమణ చేసి అంజన్నకు ముడుపు కట్టనున్నారు. రెండు లక్షల మంది అంచనా.. అంజన్న సన్నిధైన కొండమీదకు కాలినడకన, వాహనాల్లో అనేక ప్రాంతాల నుంచి సుమారు రెండు లక్షల మంది రానున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం వరకు భక్తులందరూ కొండగట్టుకు చేరుకుని అంజన్న సన్నిధిలో అర్ధరాత్రి వరకు సేదతీరి క్యూలైన్లలో నిలబడి మాల విరమణ చేయనున్నారు. జై హనుమాన్, జై శ్రీరాం అంటూ కొండ ప్రాంగణమంతా మారుమోగనుంది. భక్తుల దర్శనం ఇలా.. ● కొండ దిగువ నుంచి ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం, దారి వెంట భక్తులకు ఆటోల ద్వారా నీరు అందించనున్నారు. ●● ఘాట్రోడ్ మీదుగా వాహనాలపై.. మెట్లదారిలో కాలినడకన గుట్టపైకి చేరుకోవాలి. ● నాచుపల్లి జేఎన్టీయూ వైపు నుంచి వచ్చే భక్తుల కోసం బొజ్జ పోతన్న సమీపంలో పార్కింగ్ స్థలం సిద్ధం చేశారు. ● కొండపైకి చేరుకున్నాక పాత కోనేరు ఎదురుగా ఉన్న మెట్లదారి వెంట వెళ్లి అక్కడి కల్యాణకట్టలో మాల విరమణ చేసుకోవాలి. ● నూతన కోనేరు పక్కనున్న చలువ పందిళ్ల దిగువ, శ్రీరామ కోటి స్తూపం వెనకాల షెడ్డులో తలనీలాలు సమర్పించాలి. ● నూతన కోనేరులో స్నానాలు ఆచరించాలి. ● ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన క్యూలైన్ ద్వారా వెళ్లి స్వామి వారిని దర్శించుకోవాలి. ● ఆలయం వెనక వైపు నుంచి తిరుగు పయనం కావాలి. కాషాయమయమైన అంజన్న సన్నిధి నేటి నుంచి చిన్న జయంతి తరలిరానున్న రెండు లక్షల మంది ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న కలెక్టర్, ఎస్పీ అడుగడుగునా సీసీ కెమెరాల నిఘా -
రైతుల సంక్షేమమే ధ్యేయం
● ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్రుద్రంగి(వేములవాడ): రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రుద్రంగిలో డీసీఎంఎస్, పాక్స్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ప్రారంభించి మాట్లాడారు. పంటలకు మద్దతు ధర ఇస్తూ కొనుగోలు చేస్తున్నామన్నారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్, ఎరువులు, మేలైన వంగడాలను ప్రభుత్వం తరఫున అందిస్తున్నట్లు తెలిపారు. సన్నబియ్యం పంపిణీపై బీజేపీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. సన్నబియ్యాన్ని బీజేపీ ఇస్తే ఆ పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు పంపినీ చేయడం లేదని ప్రశ్నించారు. రుద్రంగి తహసీల్దార్ శ్రీలత, ఏఎంసీ చైర్మన్ చెలుకల తిరుపతి, డీసీసీ కార్యదర్శులు గడ్డం శ్రీనివాస్రెడ్డి, తర్రె లింగం పాల్గొన్నారు. -
వేములవాడలో మరోసారి కొలతలు
వేములవాడ: పట్టణంలోని ప్రధాన రహదారి విస్తరణలో భాగంగా అధికారులు గురువారం మరోసారి కొలతలు తీసుకున్నారు. నిర్వాసితుల తుది జాబితాను ఖరారు ఏచసేందుకు మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్, రోడ్లు భవనాల శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా విభాగం, అటవీశాఖ అధికారులతో కూడిన నాలుగు బృందాలు 24 మంది అధికారులు అంచనాలు వేశారు. గతంలో మూడుసార్లు కొలతలు వేసిన విషయం తెలిసిందే. అయితే మూలవాగు బ్రిడ్రి నుంచి రాజన్న ఆలయం వరకు మొదటి దఫాలో 80 ఫీట్ల విస్తరణ పనులు చేపట్టనున్నారు. ఇందుకు రూ.47కోట్లు మంజూరైన విషయం తెలిసిందే. అంతా సజావుగా సాగితే ఏళ్లుగా ఎదురుగా చూస్తున్న రోడ్డు విస్తరణకు మోక్షం లభించనుంది. -
భీమన్న గుడిలో రాజన్న దర్శనాలు
వేములవాడ: శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే శ్రీకారం చుట్టనుంది. జూన్ 15న ప్రారంభం కానున్నాయి. ప్రధాన ఆలయం మినహా మిగతా పనులు చేపట్టనున్నారు. ఈ పనులతో భక్తులకు స్వామివారి దర్శనాల్లో అంతరాయం కలగకుండా ఉండేందుకు తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారు. భీమన్నగుడిలో రాజన్నను దర్శించుకునేలా ఏర్పాట్లు చేయనున్నారు. శృంగేరి పీఠాధిపతుల సూచన మేరకు ఆలయ ప్రాంగణ విస్తరణ, దర్శన మార్గాల అభివృద్ధి, అదనపు మండపాలు, పార్కింగ్ సదుపాయం, లైటింగ్ వ్యవస్థలతోపాటు పౌరాణికతకు హాని కలగకుండా ఆధునికీకరణ పనులు చేపట్టనున్నట్లు ప్రణాళికలు రూపొందించారు. ఈ పనులు వేగవంతంగా పూర్తిచేసేందుకు ప్రభుత్వవిప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చొరవ తీసుకుంటున్నారు. సీఎం పర్యటనతో పనుల్లో కదలిక గత నవంబర్ 20న సీఎం రేవంత్రెడ్డి రాజన్న గుడికి చేరుకుని రూ.47 కోట్లతో విస్తరణ పనులు చేపట్టేందుకు భూమిపూజ నిర్వహించిన విషయం తెలిసిందే. బడ్జెట్లో రూ.100కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ధర్మగుండాన్ని తాత్కాళికంగా మూసివేసి పార్కింగ్ స్థలంలో షవర్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. భీమన్న ఆలయంలోనే కోడెమొక్కులు చెల్లించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భీమన్నగుడికి ప్రస్తుతం ఉన్న ప్రధాన ద్వారంతోపాటు మరో ద్వారాన్ని శృంగేరి పీఠాధిపతుల అనుమతులతో చేపట్టనున్నారు. ఈనెల 15న దేవాదాయ ధర్మాదాయశాఖ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆర్అండ్బీ శాఖల అధికారులు వేములవాడలో పర్యటించి పూర్తి ప్రణాళిక తయారు చేయనున్నారు. దీనిపై 16 దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖతో సమావేశమవుతారు. తుది ప్రణాళికపై సూచనలు, సలహాల కోసం ఈనెల 17న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, అధికారులు శృంగేరిపీఠానికి వెళ్తారు. అయితే ఇప్పటికే భీమన్నగుడిలో వివిధ ఏర్పాట్లు చేసేందుకు శృంగేరిపీఠాధిపతుల నుంచి రాజన్న ఆలయ అధికారులకు అనుమతిపత్రాలు వచ్చాయని ఆలయ అధికారులు తెలిపారు. జూన్ 15 నుంచి ఆలయ విస్తరణ పనులు ఉన్నతాధికారులతో ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక సమావేశం శృంగేరిమఠంలో కల్యాణాలు -
చమురు ధరలు తగ్గించాలి
● కేంద్ర ప్రభుత్వ తీరుపై సీపీఐ నిరసన సిరిసిల్లటౌన్: పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు కోరారు. కేంద్ర ప్రభుత్వం తీరుపై బుధవారం అంబేడ్కర్ చౌరస్తాలో నిరసన తెలిపారు. పట్టణ కార్యదర్శి పంతం రవి, జిల్లా కార్యవర్గ సభ్యులు మంద సుదర్శన్, కడారి రాములు, అజ్జ వేణు, లక్ష్మన్, రామస్వామి, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. వంటగ్యాస్ ధరలు తగ్గించాలి పెంచిన వంట గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించాలని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత కోరారు. సిరిసిల్లలో బుధవారం మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ అందజేస్తే.. ప్రధాని మోదీ ధరలు పెంచుకుంటూ పోతున్నారని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం మహిళలను ఎప్పుడూ చిన్న చూపే చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అతివలకు రెడీమేడ్ ఉపాధి
● రేపు అపెరల్ పార్క్లో టెక్స్ఫోర్ట్ యూనిట్ ప్రారంభం ● హాజరవుతున్న నలుగురు మంత్రులు ● ఏర్పాట్లు పర్యవేక్షించిన కలెక్టర్ సందీప్కుమార్ ఝాసిరిసిల్ల: సిరిసిల్ల ప్రాంతంలోని మహిళలకు శాశ్వత ఉపాధిని అందించేందుకు ఆధునిక వస్త్రాల తయారీ యూనిట్ సిద్ధమైంది. జిల్లా కేంద్రం సమీపంలోని పెద్దూరు అపెరల్ పార్క్లో రెడీమేడ్ వస్త్రాల తయారీసంస్థ టెక్స్ఫోర్ట్ కంపెనీ యూనిట్ను శుక్రవారం రాష్ట్ర మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, శ్రీధర్బాబు, తుమ్మల నాగేశ్వర్రావు, పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో కలెక్టర్ సందీప్కుమార్ ఝా, చేనేత, జౌళిశాఖ జేడీ ఎన్.వెంకటేశ్వర్రావు, సిరిసిల్ల ఆర్డీవో రాధాబాయి, డీఎస్పీ చంద్రశేఖర్రెడ్డి, జౌళిశాఖ ఏడీ రాఘవరావు, టెక్స్ఫోర్ట్ కంపెనీ ప్రతినిధులతో బుధవారం సమీక్షించారు. రెండు వేల మందికి ఉపాధి రాజన్నసిరిసిల్ల జిల్లాలోని రెండు వేల మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో టెక్స్ఫోర్ట్ కంపెనీ ముందుకొచ్చింది. రెండు ఎకరాల్లో టెక్స్ఫోర్ట్ గార్మెంట్ యూనిట్ను నిర్మించారు. అపెరల్ పార్క్లో ఇప్పటికే గోకుల్దాస్ ఇమేజెస్ గార్మెంట్ సంస్థ యూనిట్ను మూడేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. ఇక్కడ 500 మంది మహిళలకు ఉపాధి లభిస్తుంది. మరో వెయ్యి మందికి ఉపాధి కల్పించే దిశగా ఆ కంపెనీ యూనిట్ను విస్తరిస్తోంది. గోకుల్దాస్ సంస్థలో లోదుస్తులను తయారీచేస్తూ విదేశాలకు ఎగుమతి చేస్తోంది. సిరిసిల్ల నుంచి నేరుగా అమెరికాకు వస్త్రాలు వెళ్తున్నాయి. ఇప్పుడు టెక్స్ఫోర్ట్ అనే మరో అంతర్జాతీయ సంస్థ సిరిసిల్లలో పరిశ్రమను స్థాపించేందుకు ముందుకు రావడంతో 1600 మంది మహిళలు, మరో 400 మంది స్టాఫ్కు ఉపాధి లభించనుంది. శుక్రవారం టెక్స్ఫోర్ట్ యూనిట్ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆధునిక జీన్స్, టీషర్ట్, అండర్వేర్స్ కుట్టుపై మహిళలకు ఇప్పటికే శిక్షణ ఇస్తున్నారు. -
చందుర్తి సింగిల్విండోలో భారీ కుంభకోణం
● విచారణలో బయటపడ్డ రూ.1.68కోట్ల అవినీతిపర్వం ● సీఈవో స్వాహా చేసిన సొమ్ము రూ.1.03లక్షలు ● పాలకవర్గం రికవరీ చేయాల్సిన సొమ్ము రూ.65లక్షలుచందుర్తి(వేములవాడ): చందుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో భారీ కుంభకోణం బయటపడింది. ఇప్పటికే రైతుల పేరిట పంట రుణాలను తీసుకుని స్వాహా చేసిన సీఈవో గంగారెడ్డిని ఐదు నెలల క్రితమే సస్పెన్షన్ చేయగా.. పోలీసులు రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే. తాజాగా సింగిల్విండో సొసైటీలో జరుగుతున్న 51 విచారణలో మరిన్ని విషయాలు బయటపడ్డాయి. సొసైటీలో రూ.1.68కోట్లు పక్కదారి పట్టినట్లు విచారణలో తేలింది. ఇందులో రూ.1.03కోట్లు సస్పెన్షన్కు గురైన సీఈవో గంగారెడ్డి స్వాహా చేశాడని తేలింది. అంతేకాకుండా మరో రూ.65లక్షలను సొసైటీలో వ్యక్తిగత రుణాలతోపాటు దీర్ఘకాలిక రుణాలు అందించారు. ఈ బకాయిలను 2013 నుంచి ఇప్పటి వరకు పాలకవర్గం సభ్యులు వసూలు చేయించకపోవడంతో బకాయి పడ్డాయని, వీటి వసూలుకు గత పాలకవర్గం సభ్యులు, ప్రస్తుత పాలకవర్గం సభ్యులతోపాటు సీఈవోలను బాధ్యులను చేస్తూ ఆ సొమ్ము వసూలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా సహకార సంఘం అధికారులు విచారణ నివేదికను చందుర్తి సీఐ వెంకటేశ్వర్లతోపాటు స్థానిక సొసైటీ ఇన్చార్జి సీఈవో శ్రీవర్ధన్లకు అందజేసినట్లు సమాచారం. కాగా ఈ విషయమై చందుర్తి ఇన్చార్జి సీఈవో శ్రీవర్ధన్ వివరణ కోరగా నెల రోజుల్లోపు పాలకవర్గం సమావేశం ఏర్పాటు చేసి.. బహిర్గతం చేయాలన్న నింబంధనలు ఉన్నాయని విషయాన్ని దాట వేశారు. చందుర్తి సొసైటీపై కలెక్టర్ ఆరా? చందుర్తిలోని కొందరు రైతులు స్థానిక సొసైటీలో జరిగిన అవినీతి, అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతోపాటు కేంద్రమంత్రి బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. కాగా ఇదే విషయమై జిల్లా కలెక్టర్ చందుర్తి సొసైటీ సిబ్బందిని, సహకార సంఘం అధికారులను విచారణ నివేదికతో కలెక్టర్ కార్యాలయానికి రావాలని ఆదేశించినట్లు స్థానికంగా ప్రచారం ఉంది. -
మూడు రోజుల్లో ఇద్దరు స్నేహితులు మృతి
● రంజాన్కు ముందు రోజు రోడ్డు ప్రమాదం ● హైదరాబాద్లోని ఆస్పత్రిలో చికిత్స ● మూడు రోజుల క్రితం ఒకరు.. నేడు మరొకరు ● నారాయణపూర్లో విషాదంఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): వారిద్దరు చిన్ననాటి నుంచి కలిసి తిరిగారు. ఒకరిని విడిచి మరొకరు ఉండ లేకపోయారు. మరణంలోనూ వీడలేమంటూ కలిసి వెళ్లిపోయారు. ఇటు కన్నవాళ్లకు కడుపుకోతను మిగిల్చారు. స్నేహితులకు జ్ఞాపకంగా మిగిలిపోయారు. మూడు రోజుల వ్యవధిలోనే ఇద్దరు స్నేహితులు మృతిచెందడంతో ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్లో విషాదం అలుముకుంది. గత నెల 30వ తేదీన రంజాన్ పండుగ కోసం దుస్తులు తెచ్చుకునేందుకు మండలంలోని నారాయణపూర్కు చెందిన అవీజ్, అఫ్రోజ్ ద్విచక్రవాహనంపై బయలుదేరారు. వీరు మండలంలోని హరిదాస్నగర్ శివారుకు చేరుకోవడంతోనే ఎదురుగా ఆటో రావడంతో ద్విచక్రవాహనం, ఆటో ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అవీజ్, అఫ్రోజ్లను మండల కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం అవీజ్ను హైదరాబాద్ తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మూడు రోజుల క్రితం ప్రాణాలు కోల్పోయాడు. బుధవారం అఫ్రోజ్ మృతిచెందాడు. మూడు రోజుల వ్యవధిలోనే ఇద్దరు యువకులు మృతిచెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. -
ట్రాక్టర్ కింద పడి డ్రైవర్ మృతి
కోనరావుపేట(వేములవాడ): ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి ట్రాక్టర్ డ్రైవర్ మృతిచెందిన సంఘటన కోనరావుపేట మండలం ధర్మారంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు. ధర్మారం గ్రామానికి చెందిన మల్యాల దేవయ్య(48) స్థానికంగా డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బుధవారం సాయంత్రం వరికోత మిషన్ ద్వారా కోసిన వడ్లను కొనుగోలు కేంద్రానికి తరలిస్తున్నాడు. ఈక్రమంలోనే ఓ రైతు పొలం వద్ద ట్రాక్టర్ ఇంజిన్ను ఆన్లోనే ఉంచి కిందికి దిగాడు. హఠాత్తుగా ట్రాక్టర్ ముందుకు కదలడంతో ఆపే క్రమంలో కాలు జారి టైర్ కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ దేవయ్యను సిరిసిల్ల జిల్లా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తీసుకెళ్లి చికిత్స అందిస్తుండగా మృతిచెందాడు. మృతునికి భార్య దేవవ్వ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మల్కపేటలో వృద్ధుని అదృశ్యం కోనరావుపేట (వేములవాడ): మల్కపేటకు చెందిన కట్లె పర్శయ్య(65) ఆచూకీ రెండు నెలలుగా లభించడం లేదు. పర్శయ్య గత ఫిభ్రవరి 7న పింఛన్ డబ్బుల కోసం ఆటోలో సిరిసిల్లకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఎంత గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎంపీడీవో కార్యాలయం తనిఖీ తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండల పరిషత్ కార్యాలయాన్ని బుధవారం డీపీవో, మండల ప్రత్యేకాధికారి ఎండీ.షరీఫుద్దీన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఏర్పాటుచేసిన రాజీవ్ యువవికాసం హెల్ప్ డెస్క్ను పరిశీలించారు. అనంతరం రికార్డులు పరిశీలించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో కె.లక్ష్మీనారయణ, ఎంపీవో మీర్జా బేగ్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఘనంగా హనుమాన్ శోభాయాత్ర ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): బండలింగంపల్లిలో హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠ వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. ఇందులో భాగంగా బుధవారం స్వామివారి విగ్రహా లను రథంపై ఏర్పాటు చేసి శోభాయాత్ర నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. మురుగునీటి సరఫరా ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అంబేడ్కర్నగర్కాలనీలో బుధవారం సైతం నల్లా ద్వారా మురుగునీరు సరఫరా అయింది. దీంతో కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే కాలనీలో గత పది రోజుల క్రితం మురుగునీరు సరఫరా కావడంతో చాలా మంది చర్మవ్యాధులతో ఇబ్బంది పడ్డారన్నారు. మళ్లీ బుధవారం సైతం మురికినీరు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
హార్వెస్టర్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
తిమ్మాపూర్: మండలంలోని ఇందిరానగర్ గ్రామంలోని సాయిబాబా ఆలయం సమీపంలో రాజీవ్ రహదారిపై బుధవారం అర్ధరాత్రి ఆర్టీసీ బస్సు హార్వెస్టర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సులోని పలువురితోపాటు, హార్వెస్టర్పై ఉన్న ఇద్దరు గాయపడ్డారు. డ్రైవర్ వాహనంలోనే ఇరుక్కుపోవడంతో పోలీసుల రెండు గంటలు శ్రమించి బయటకు తీశారు. ఎల్ఎండీ పోలీసుల కథనం ప్రకారం.. బుధవారం రాత్రి 12:40 గంటల సమయంలో ఇందిరానగర్ గ్రామ సాయిబాబా గుడివద్ద కరీంనగర్ వైపు వెళుతున్న హార్వెస్టర్ను హైదరాబాద్ నుంచి కరీంనగర్వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొట్టింది. దీంతో హార్వెస్టర్ రోడ్డు అవతలివైపుదూసుకెళ్లి బోల్తాపడింది. బ్లేడ్లు మాత్రం బస్సులు ఇరుక్కుపోయాయి. ఈ ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో బస్సులోని పలువురితోపాటు హార్వెస్టర్పై ఉన్న ఇద్దరు గాయపడ్డారు. హార్వెస్టర్ డ్రైవర్ వాహనంలో ఇరుక్కుపోయాడు. స్థానికులు వెంటనే 108, ఎల్ఎండీ పోలీసులు సమాచారం అందించారు. దాదాపు 2 గంటలకు పైగా పోలీసులు, గ్రామస్తులు, హైవే పెట్రోల్ సిబ్బంది, మూడు 108 అంబులెన్స్ సిబ్బంది శ్రమించి బయటకు తీయగా.. మోకాలు విరిగి తీవ్ర గాయాలు అయ్యాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివేక్ తెలిపారు. -
చేయి..చేయి కలిపారు.. అభివృద్ధి సాధించారు
● సుస్థిరాభివృద్ధిలో రాష్ట్రంలో పదో స్థానం ● బండపల్లిలో పుష్కలంగా తాగు, సాగునీరు ● ఆరోగ్యం, ఆర్థికాభివృద్ధిలో ప్రగతి చందుర్తి(వేములవాడ): వారంతా గ్రామీణులు.. ఐకమత్యంలో ఆదర్శప్రాయులు.. గ్రామంలో అమలయ్యే ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకుసాగుతున్నారు. సామూహిక ఇంకుడుగుంతలు.. పారిశుధ్య నిర్వహణ.. ఆదర్శమైన తాగు, సాగునీటి నిర్వహణతో చందుర్తి మండలం బండపల్లి గ్రామం రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచింది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ విడుదల చేసిన సుస్థిరాభివృద్ధి 2022–23 జాబితాలో రాష్ట్రంలోనే పదోస్థానంలో నిలిచింది. ఆ గ్రామం సాధించిన ప్రగతిపై ప్రత్యేక కథనం. పల్లెసిగలో ప్రగతి విరులు బండపల్లిలో వలసలు అరికట్టేందుకు ఉపాధిహామీ కూలీలకు ప్రణాళికాబద్ధంగా పనులు కల్పించారు. గ్రామపంచాయతీ పరిధిలోని మహిళలు, యువత జీవనోపాధికి చేపట్టిన కార్యక్రమాలను పరిగణలోకి తీసుకున్నారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, పీహెచ్సీలో వసతులు కల్పించారు. తాగునీరు, సాగునీటి అవసరాలు, పారిశుధ్య నిర్వహణ, పచ్చదనం, సుపరిపాలన, సామాజిక భద్రతపై అధికారులు ఫోకస్ చేశారు. ఆయా అంశాల్లో గ్రామం సాధించిన ప్రగతిని కేంద్ర పంచాయతీరాజ్శాఖ గుర్తించింది. రాష్ట్రంలోని టాప్ 25 గ్రామాల్లో బండపల్లికి పదో స్థానం దక్కింది. -
సర్ధాపూర్లో ఆయుధాగారం ప్రారంభం
● వర్చువల్గా ప్రారంభించిన అడిషనల్ డీజీపీ సంజయ్కుమార్ జైన్ సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని సర్ధాపూర్ 17వ పోలీస్ బెటాలియన్లో కొత్తగా నిర్మించిన ఆయుధగారం (బెల్ ఆఫ్ ఆర్మ్స్)ను వర్చువల్గా టీజీఎస్పీ బెటాలియన్స్ అడిషనల్ డీజీపీ సంజయ్కుమార్ జైన్ బుధవారం ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్లో సంజయ్కుమార్ జైన్ మాట్లాడుతూ బెటాలియన్ పోలీసులు అంకితభావంతో విధులు నిర్వహించాలన్నారు. తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ క్రమశిక్షణ గల ఆర్గనైజేషన్ అని వివరించారు. బెటాలియన్ అభివృద్ధిలో అధికారులు, సిబ్బంది పాత్ర అభినందనీయమన్నారు. సర్ధాపూర్ బెటాలియన్కు వచ్చిన డీఐజీ సన్నీకి కమాండెంట్ సురేష్ పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. బెటాలియన్లో నూతనంగా నిర్మించిన దోభీ, బార్బర్ రూమ్లను డీఐజీ సన్నీ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. -
పూజలు.. దర్శనాలు
● ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కేటీఆర్ సిరిసిల్ల/కోనరావుపేట/గంభీరావుపేట: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు బుధవారం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సిరిసిల్ల తెలంగాణ భవన్లో హనుమాన్మాలధారులతో కలిసి భజనలు చేసి, సహపంక్తి బిక్షలో పాల్గొన్నారు. హనుమాన్మాలధారులు కేటీఆర్కు సీతారాముల చిత్రపటాన్ని అందించారు. జిల్లా పర్యటనలో కేటీఆర్ ఎక్కడా రాజకీయాల గురించి మాట్లాడలేదు. కోనరావుపేట మండలం మల్కపేట సీతారామచంద్రస్వామి ఆలయం, గంభీరావుపేట మండలకేంద్రంలోని పెద్దమ్మ ఆలయ 50వ వార్షికోత్సవంలో పాల్గొని పూజలు చేశారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ అరుణ, వైస్చైర్మన్ సిద్ధం వేణు, వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు, నాయకులు ఏనుగు మనోహర్రెడ్డి, మల్యాల దేవయ్య, చంద్రయ్య, బండ నర్సయ్య, సెస్ వైస్చైర్మన్ తిరుపతి పాల్గొన్నారు. -
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడరూరల్: మహిళలను కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 50 శాతం మహిళా సంఘాల ద్వారానే కొనుగోలు చేసేందుకు ఆదేశాలు ఇచ్చిందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడలోని బాలానగర్, రూరల్ మండలం చెక్కపల్లి, మల్లారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పీఏసీఎస్ ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభించారు. విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో 248 సెంటర్లను ఏర్పాటు చేశామని, ఇప్పటి వరకు 35 సెంటర్లను ప్రారంభించినట్లు తెలిపారు. అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు వసంతలక్ష్మి, మార్కెట్ డీఎం రజిత, డీసీవో రామకృష్ణ, పీఏసీఎస్ చైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డి, వేములవాడ, రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్లు రొండి రాజు, చెల్కల తిరుపతి, వైస్చైర్మన్ కనికరపు రాకేశ్, రూరల్ కాంగ్రెస్ అధ్యక్షుడు వకుళాభరణం శ్రీనివాస్, ఏఎంసీ పాలకవర్గ సభ్యులు దైత కుమార్, రాజయ్య పాల్గొన్నారు. చివరి గింజ వరకు కొంటాం కోనరావుపేట(వేములవాడ): రైతులు పండించిన చివరి గింజ వరకు కొంటామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. కోనరావుపేట, నిజామాబాద్లో సింగిల్విండో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. సన్న వడ్లు పండించే రైతులను ప్రోత్సహించాలని ఉద్దేశంతో క్వింటాల్కు అదనంగా రూ.500 ఇస్తున్నట్లు తెలిపారు. తహసీల్దార్ వరలక్ష్మి, ఏవో సందీప్, సింగిల్విండో చైర్మన్ బండ నర్సయ్య, కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ ఫిరోజ్ పాషా, ఏఎంసీ చైర్మన్ ఎల్లయ్య, వైస్చైర్మన్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో మహిళా సంఘాలు -
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
కోనరావుపేట: మండలకేంద్రంలోని పీఎం శ్రీ పాఠశాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కనులపండువగా రథోత్సవం● ఏకాంత సేవతో ముగిసిన బ్రహ్మోత్సవాలు ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని నారాయణపూర్లోని వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దత్తత సీతారామచంద్రస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రథోత్సవం కనులపండువగా సాగింది. మహిళలు మంగళహారతులతో వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. రాత్రి 7 గంటలకు ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగిసినట్లు ఆలయ అర్చకుడు వేణుగోపాలచారి ప్రకటించారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు ఎలుసాని ప్రవీణ్కుమార్, మాజీ సర్పంచ్లు నిమ్మ లక్ష్మి, దొమ్మాటి నర్సయ్య, మాజీ ఉపసర్పంచ్ మహేందర్, మాజీ ఎంపీటీసీ అపెరా సుల్తాన, అర్చకులు నవీన్చారి, ఆలయ కమిటీ చైర్మన్ మోతె లక్ష్మారెడ్డి, నాయకులు ఎలుసాని మోహన్కుమార్, నిమ్మ మల్లారెడ్డి, లింగాల అంజాగౌడ్, లద్దునూరి హన్మండ్లు, సుధాకర్రెడ్డి పాల్గొన్నారు. -
భ్రూణహత్యల విచారణలో పురోగతి
చందుర్తి (వేములవాడ): భ్రూణహత్యల విచారణలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు బుధవారం పురోగతి సాధించారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి రజిత తెలిపిన వివరాలు. చందుర్తి మండలంలో జరిగిన భ్రూతహత్యలపై రెండు రోజులుగా కొనసాగుతున్న విచారణలో బాధితురాలు ఇచ్చిన సమాచారంతో వేములవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తనిఖీ చేసినట్లు తెలిపారు. ఆ ఆస్పత్రి యాజమాన్యానికి నోటీసులు జారీ చేయనున్నట్లు డీఎంహెచ్వో రజిత తెలిపారు. సానుకూల దృక్పథంతో సమస్యలు పరిష్కారం ● ప్రముఖ సైకాలజిస్ట్ పున్నంచందర్ సిరిసిల్ల: సానుకూల దృక్పథంతో సమస్యలు పరిష్కారమవుతాయని ప్రముఖ సైకాలజిస్ట్ కె.పున్నంచందర్ పేర్కొన్నారు. స్థానిక నెహ్రూనగర్లో బుధవారం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని మైండ్కేర్ సెంటర్, కౌన్సిలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో సామూహిక కౌన్సెలింగ్ నిర్వహించారు. పున్నంచందర్ మాట్లాడు భార్యాభర్తల మధ్య వివాదాల పరిష్కారం కోసం మైండ్కేర్ సెంటర్లో ఫ్యామిలీ కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటే వివాదాలకు తావే ఉండదన్నారు. మైండ్ కేర్ సెంటర్ సిబ్బంది కొండ ఉమ, వేముల అన్నపూర్ణ, రాపెల్లి లత, బూర శ్రీమతి, కిమ్స్ కళాశాల విద్యార్థులు జి.పద్మ, జి.పూజిత, వి.సుస్మిత, నాగుల వందన, జె.అనుపమ అంజనీ, డి.మానస పాల్గొన్నారు. జ్యువెల్లరీ షాపులకు అనుమతులు ఇవ్వొద్దు ముస్తాబాద్(సిరిసిల్ల): ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ముస్తాబాద్లో జ్యువెల్లరీ దుకాణాల ఏర్పాటుపై స్వర్ణకారుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఈమేరకు తహసీల్దార్ కార్యాలయం, పోలీస్స్టేషన్ ఎదుట బుధవారం ఆందోళన చేశారు. స్వర్ణకారుల సంఘం మండలాధ్యక్షుడు చింతోజు బాలయ్య మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు దుకాణాలు పెడుతుండడంతో స్థానికులకు ఉపాధి పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల బంగారం దుకాణాల ఏర్పాటకు ముస్తాబాద్ మండలంలో అనుమతులు ఇవ్వరాదని తహసీల్దార్ సురేశ్, ఎస్సై గణేశ్, ఈవో రమేశ్లకు ఫిర్యాదు చేశారు. స్వర్ణకారులు సంఘం నాయకులు విశ్వనాథం, ఈశ్వరయ్య, అనిల్, సతీశ్, చేపూరి రవి, శ్రీనివాస్, సాయిలక్ష్మణ్, సంతోష్, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. -
కొసముట్టని కాళేశ్వరం
● ‘ఎత్తిపోతలు’ పూర్తయ్యేది ఎన్నటికో ? ● వట్టిపోతున్న పంప్హౌస్లు ● నిలిచిన భూసేకరణ.. ముందుకుసాగని కాల్వలు ● రెండేళ్లుగా ఎక్కడి పనులు అక్కడే.. ● అన్నదాతల ఆశలు ఆది శ్రీనివాస్పైనే... ఇది కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్. మూడు టీఎంసీల సామర్థ్యంతో కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ–9లో భాగంగా నిర్మించారు. మధ్యమానేరు జలాశయం నుంచి నీటిని సొరంగం ద్వారా మళ్లించి దీనిని నింపుతారు. ఇటీవల మధ్యమానేరు నీటిని మల్కపేట చెరువులోకి పంపింగ్ చేయడంతో ఒక్క టీఎంసీ చేరింది. ఈ నీటిని ఎడమకాల్వ ద్వారా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, వీర్నపల్లి మండలాలకు అందించాల్సి ఉంది. కుడికాల్వ ద్వారా కోనరావుపేట, వేములవాడఅర్బన్ మండలాలకు సాగునీరు అందించాలి. కానీ మల్కపేట వరకు మాత్రమే గోదావరి జలాలు చేరాయి. ● ఇది కోనరావుపేట మండలం మల్కపేట–కనగర్తి మధ్య నిర్మించిన కుడికాల్వ. భూసేకరణ పూర్తికాకపోవడంతో పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. మల్కపేట జలాశయంలో నీరున్నా ఈ కాల్వకు విడుదల చేయలేని దుస్థితి. కాల్వ పూర్తయితే మల్కపేట, కనగర్తి, ధర్మారం, సుద్దాల, మంగళ్లపల్లి, లింగంపల్లి, మారుపాక వరకు గోదావరి జలాలు చేరేవి. కానీ భూసేకరణకు నిధులు లేక పనులు మధ్యలోనే ఆగిపోయాయి. -
మానేరువాగులో చెక్డ్యాం మళ్లీ నిర్మించాలి
సిరిసిల్ల: మానేరువాగులో గతంలో కొట్టుకుపోయిన చెక్ డ్యాంను పునర్ నిర్మించాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆదేశించారు. నెహ్రూనగర్ వద్ద దెబ్బతిన్న చెక్డ్యాంను ఈఎన్సీ శంకర్తో కలిసి బుధవారం పరిశీలించారు. విద్యానగర్ మానేరు వంతెన నుంచి సాయిబాబా ఆలయం వరకు మూడు కిలోమీటర్ల పొడవు కరకట్ట పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈఈలు అమరేందర్రెడ్డి, కిశోర్ పాల్గొన్నారు. రైతులకు ఉత్తమ సేవలు అందించాలి సిరిసిల్లకల్చరల్: వ్యవసాయశాఖ అధికారులు రైతులకు నాణ్యమైన సేవలందించాలని కలెక్టర్ సూచించారు. ఏవోలు, ఏఈవోలతో బుధవారం సమీక్షించారు. పంటకోతలు పూర్తయిన రైతులకు టోకెన్లు జారీ చేయాలన్నారు. -
మహిళలు ఆర్థికంగా ఎదగాలి
ఇల్లంతకుంట(మానకొండూర్): ప్రభుత్వ ప్రోత్సాహంతో మహిళలు ఆర్థికంగా ఎదగాలని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు. మండల కేంద్రంలో ఐకేపీ సంఘాలకు అప్పగించిన వరిధాన్యం, పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాలను బుధవారం కలెక్టర్ సందీప్కుమార్ ఝాతో కలిసి ప్రారంభించారు. మండలంలోని సిరికొండలో లబ్ధిదారు సత్యనారాయణ ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. గ్రామంలో 42 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారులు ముగ్గులు పోసుకున్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే, కలెక్టర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ రిజిష్టర్ను పరిశీలించారు. రక్తపరీక్షలు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. పల్లె దవాఖానాలో పీహెచ్సీ నిర్వహణ సౌలభ్యంగా లేకపోవడంతో అదనంగా పక్కనున్న మహిళా సంఘాల ఏవో భవనం అప్పగించేలా చర్యలు తీసుకోవాలని డీఆర్డీవో శేషాద్రిని ఆదేశించారు. మండలకేంద్రంలోని ఎస్సీకాలనీలో రూ.50 లక్షలతో చేపట్టనున్న సీసీరోడ్డు పనులను ప్రారంభించారు. మండల పరిషత్ 67 మందికి సీఎమ్మార్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మండల కేంద్రంలోని సన్నబియ్యం లబ్ధిదారు గణేశ్ ఇంట్లో ఎమ్మెల్యే, కలెక్టర్, జిల్లా అధికారులు భోజనం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకోసం ఈనెల 14లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ఐరెడ్డి చైతన్య, డీఆర్డీవో శేషాద్రి, తహసీల్దార్ ఎంఏ ఫరూక్, ఎంపీడీవో శశికళ, ఎంపీవో శ్రీనివాస్, ఐకేపీ ఏపీఎం వాణిశ్రీ, హౌసింగ్ ఏఈ హకీం, ఏఎంసీ వైస్చైర్మన్ ఎలగందుల ప్రసాద్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు భాస్కర్రెడ్డి, వి.వెంకటరమణారెడ్డి, గుడిసె ఐలయ్య పాల్గొన్నారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సన్నబియ్యం లబ్ధిదారు ఇంట్లో భోజనం -
పక్షం రోజుల్లో కూలీ నిర్ణయం
● 24 గంటల నిరాహార దీక్ష విరమణ ● చేనేతజౌళి అధికారుల హామీపై హర్షం సిరిసిల్లటౌన్: ప్రభుత్వ ఆర్డర్ల చీరల కూలీని పక్షం రోజుల్లో నిర్ణయిస్తామని చేనేత జౌళిశాఖ అధికారులు వెల్లడించారు. సిరిసిల్లలోని పవర్లూమ్ పరిశ్రమలోని కార్మికులకు పది శాతం యారన్ సబ్సిడీ విడుదల, కూలీ పెంపుపై మంగళవారం కార్మికనేతలతో అధికారులు చర్చలు జరిపారు. చేనేతజౌళీశాఖ జేడీ ఎన్.వీ.రావు హామీతో తాత్కాలికంగా సమ్మె విరమిస్తున్నట్లు కార్మికనాయకులు ప్రకటించారు. హామీలు నెరవేర్చకపోతే పదిహేను రోజుల్లో మళ్లీ సమ్మెబాట పడతామని హెచ్చరించారు. కార్మిక నాయకులు మూశం రమేశ్, అన్నల్దాస్ గణేశ్, కోడం రమణ, సిరిమల్ల సత్యం, కుమ్మరికుంట కిషన్, ఉడుత రవి, మచ్చ వేణు, నక్క దేవదాస్, గుండు రమేశ్, బాస శ్రీధర్, వెలిగేటి శ్రీనివాస్, వెజిగం సురేష్, బచ్చు సదానందం, అల్వాల భాస్కర్ పాల్గొన్నారు. -
జర్నలిజం సర్టిఫికెట్ కోర్సు ప్రారంభం
గంభీరావుపేట(సిరిసిల్ల): ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో జర్నలిజం సర్టిఫికెట్ కోర్సును మంగళవారం ప్రారంభిస్తున్నట్లు ప్రిన్సిపాల్ విజయలక్ష్మి తెలిపారు.● ఉమ్మడి జిల్లాలో యథేచ్ఛగా లింగనిర్ధారణ పరీక్షలు ● గుట్టుచప్పుడు కాకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లో దందా ● ఆడపిల్ల అని తెలిస్తే ‘కాలగర్భంలో’ కలిపేస్తున్నారు ● దందాలో ఆర్ఎంపీ, పీఎంపీలదే కీలకపాత్ర ● స్కానింగ్ సెంటర్ నిర్వాహకుల ఇష్టారాజ్యంఅంజన్నకు అభిషేకం బోయినపల్లి(చొప్పదండి): విలాసాగర్ హనుమాన్ ఆలయంలో 141 మంది మాలధారులు మంగళవారం అంజన్నకు అభిషేకం చేశారు. పూలు, పళ్లతో పూజలు చేశారు. కరీంనగర్ 142ఉమ్మడి జిల్లాలో స్కానింగ్ కేంద్రాలుపెద్దపల్లి 31జగిత్యాల 78సిరిసిల్ల 35లింగ నిష్పత్తి (2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి 1,000 మందికి) -
మూలవాగును ముంచుతుండ్రు
● జేసీబీ, టిప్పర్లతో ఇసుక అక్రమ తవ్వకాలు ● బావుసాయిపేట శివారులో అడ్డుకున్న రైతులు ● కలెక్టర్కు ఫిర్యాదు చేసిన రైతులు సిరిసిల్ల: కాంట్రాక్టర్లు, అధికారులు కలిసి మూలవాగును ముంచుతున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కోనరావుపేట మండలం బావుసాయిపేట శివారులోని మూలవాగులో టిప్పర్లు, జేసీబీలతో ఇసుక తరలింపును స్థానిక రైతులు మంగళవారం అడ్డుకున్నారు. వేములవాడ మండలం మర్రిపల్లి రిజర్వాయర్ కోసం ఇసుకను బావుసాయిపేట నుంచి తరలించడాన్ని అడ్డుకున్నారు. అధికారికంగా ప్రభుత్వం గుర్తించిన ఇసుక రీచ్ల నుంచి రిజర్వాయర్కు ఇసుకను తరలించాల్సి ఉండగా.. పొలాల మధ్య నుంచి తీసుకెళ్లడాన్ని రైతులు తప్పుపబడుతున్నారు. స్థానిక అవసరాలకు ట్రాక్టర్లతో, లేబర్లతో తీసుకెళ్లే ఇసుకను ఒకేసారి జేసీబీతో టిప్పర్ల ద్వారా తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మర్రిపల్లి రిజర్వాయర్ కాంట్రాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి రైతులను వారించారు. దీనిపై బావుసాయిపేట రైతులు కలెక్టర్ సందీప్కుమార్ ఝాకు ఫిర్యాదు చేశారు. భూగర్భ జలాలపై ప్రభావం చూపే ఇసుక తరలింపును నిలిపివేయాలని వారు కోరుతున్నారు. కోనరావుపేట(వేములవాడ): మండలంలోని బావుసాయిపేట మూలవాగు నుంచి ఇసుక తరలించడంపై రైతులు మంగళవారం నిరసన తెలిపారు. రెవెన్యూ అధికారులు బావుసాయిపేట మూలవాగులో ఇసుకరీచ్ను ఏర్పాటు చేశారు. పరిసర గ్రామాలకు ఇక్కడి నుంచే అనుమతులు ఇస్తున్నారు. ఇసుక తరలింపుతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయంటూ రైతులు అడ్డుకున్నారు. తహసీల్దార్ వరలక్ష్మి, ఎస్సై ప్రశాంత్రెడ్డి అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. -
● మహిళా సంఘాలకు 191 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ● కలెక్టర్ సందీప్కుమార్ ఝా
సిరిసిల్ల/ముస్తాబాద్(సిరిసిల్ల): జిల్లాలో యాసంగిలో 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు లక్ష్యంగా 240 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ సందీప్కుమార్ ఝా పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలం గూడెం, నామాపూర్, పోతుగల్ గ్రామాల్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్తో కలిసి మంగళవారం ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు మహిళా సంఘాలకు 191 కొనుగోలు కేంద్రాలను అప్పగించినట్లు తెలిపారు. సహకార సంఘాలకు 42 కేంద్రాలు, మెప్మా ద్వారా 6, డీసీఎంఎస్కు ఒకటి మొత్తం 240 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. వేసవి దృష్ట్యా చల్లని నీరు, చలువపందిళ్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో పెట్టామన్నారు. ఏఎంసీ చైర్పర్సన్ తలారి రాణి, డీఆర్డీవో శేషాద్రి, డీఎస్వో వసంతలక్ష్మి, మార్కెటింగ్ డీఎం రజిత, తహసీల్దార్ సురేశ్, ఎంపీడీవో బీరయ్య, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు యెల్ల బాల్రెడ్డి, ఎస్సీ ఎస్టీ కమిషన్ విజిలెన్స్ కమిటీ సభ్యులు కొమ్ము బాలయ్య, వైస్చైర్మన్ వెల్ముల రాంరెడ్డి పాల్గొన్నారు. మహిళా సంఘాలకు ఎరువులు, విత్తనాల షాపులు జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులకు ఎరువులు–విత్తనాల షాప్ల ఏర్పాటుకు లైసెన్స్లు ఇవ్వాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆదేశించారు. కలెక్టరేట్లో వ్యవసాయశాఖ, డీఆర్డీవో అధికారులతో మంగళవారం సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని మహిళా సంఘాలలో అర్హులైన వారిని గుర్తించాలన్నారు. బీఎస్సీ అగ్రికల్చర్ డిగ్రీ, డిప్లొమా చేసిన వారిని ఎంపిక చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సొంత గోడౌన్ ఉన్నా వారిని, అద్దెకు తీసుకున్న వారికి గోడౌన్, ఎరువులు, విత్తనాల లైసెన్స్ సర్టిఫికెట్ అందించాలని సూచించారు. డీఆర్డీఏ అధికారులు జిల్లాలోని అర్హులైన మహిళలను గుర్తించి ఆ వివరాలను వ్యవసాయశాఖ అధికారులకు అందించాలన్నారు. ప్రతీ మండలానికి రెండు చొప్పున మహిళా సంఘాల సభ్యులకు కేటాయించాలని, వచ్చే పంట కాలం కంటే ముందే లైసెన్స్లు జారీ చేయాలన్నారు. అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, డీఆర్డీవో శేషాద్రి, డీఏవో అఫ్జల్బేగం, అడిషనల్ డీఆర్డీవో గొట్టె శ్రీనివాస్, డీపీఎంలు సుధారాణి, పద్మయ్య పాల్గొన్నారు. పోషకాహార లోపం లేకుండా చూడాలి పిల్లల్లో పోషకాహార లోపం లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. ఐసీడీఎస్ అధికారులతో సమీక్షించారు. అంగన్వాడీ సిబ్బంది పిల్లల మానసిక, శారీరక ఎదుగుదల పరిశీలించాలని సూచించారు. బాలామృతం, కోడిగుడ్ల పంపిణీలో నిర్లక్ష్యం చేయొద్దన్నారు. 50 నూతన అంగన్వాడీ కేంద్రాల భవన నిర్మాణ పనులు పూర్తి చేయిస్తామన్నారు. జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, పీఆర్ ఈఈ సుదర్శన్రెడ్డి పాల్గొన్నారు. మూడు లక్షల మెట్రిక్ టన్నులు కొంటాం -
భ్రూణహత్యలపై కొనసాగుతున్న విచారణ
చందుర్తి(వేములవాడ): చందుర్తి మండలంలో జరిగిన భ్రూణహత్యలపై మంగళవారం డీఎంహెచ్వో రజిత ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. మండలంలోని మూడపల్లిలోని ఆర్ఎఎంపీ వైద్యుడిని విచారించారు. కాగా వారి దృష్టికొచ్చిన మరికొన్ని సంఘటనలపై విచారణ కొనసాగినట్లు తెలిసింది. కాగా విషయం బయటకు చెప్పొద్దని బాధితుడిని మూడపల్లికి చెందిన ఇద్దరు వ్యక్తులు బెదిరిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తమదైన శైలిలో విచారణ కొనసాగిస్తున్నారు. విచారణలో జిల్లా వైద్య సిబ్బంది సంపత్, చందుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి వేదాచారి, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. న్యాయవాదులపై దాడులు అరికట్టాలి సిరిసిల్లకల్చరల్: న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు పటిష్టమైన చట్టాన్ని రూపొందించాలని న్యాయవాదుల సంఘం జిల్లా అధ్యక్షుడు జూపల్లి శ్రీనివాసరావు కోరారు. హైదరాబాద్లో ముజీతాబ్ అలీ అనే న్యాయవాదిపై జరిగిన దాడిని ఖండిస్తూ మంగళవారం స్థానిక న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ న్యాయవాదుల రక్షణచట్టం తెస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. సీనియర్ న్యాయవాదులు కోడి లక్ష్మణ్, అనిల్కుమార్, ప్రభాకర్, శశాంక్ పాల్గొన్నారు. 15న వాటర్షెడ్ యాత్ర సిరిసిల్ల: జిల్లాలోని ఎల్లారెడ్డిపేట, గంభీ రావుపేట మండలా ల్లో ఈనెల 15న వాట ర్షెడ్ యాత్ర నిర్వహిస్తున్నామని డీఆర్డీవో శేషాద్రి తెలిపారు. ప్రధానమంత్రి కృషి సమాన్ యోజన–2.0లో భాగంగా వాటర్షెడ్ ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 15న ఉదయం ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్టతండా, మధ్యాహ్నం గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేటలో వాటర్షెడ్ యాత్ర ఉంటుందని వివరించారు. ‘బీడీకార్మికులకు రూ.4వేల పెన్షన్ ఇవ్వాలి’ తంగళ్లపల్లి(సిరిసిల్ల): బీడీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు వెంగల శ్రీనివాస్ కోరారు. పద్మనగర్లో మంగళవారం నిరసన తెలిపి మాట్లాడారు. కార్మికులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా రూ.4వేలు జీవనభృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నెలలో 26 రోజులు నడవాల్సిన బీడీ పరిశ్రమ 10 రోజులు మాత్రమే నడుస్తోందన్నారు. కొక్కుల ప్రసాద్, నాంపల్లి, రామస్వామి, కొమురయ్య, జిందం రమేశ్, మల్లేశం, బీడీ కార్మికులు పాల్గొన్నారు. సీనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్గంభీరావుపేట(సిరిసిల్ల): గంభీరావుపేట తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తించి ఇటీవల కలెక్టరేట్కు బదిలీపై వెళ్లిన నాగరాజును సస్పెండ్ చేస్తూ కలెక్టర్ సందీప్కుమార్ ఝా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గంభీరావుపేటలో వచ్చిన పలు ఫిర్యాదుల నేపథ్యంలో సస్పెండ్ చేసినట్లు తెలిసింది. -
ఆడనే అంతం!
బుధవారం శ్రీ 9 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025‘ఈ చిత్రంలో వైద్యాధికారులు సీజ్ చేస్తున్న ఆస్పత్రి పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోనిది. నిబంధనల ప్రకారం స్కానింగ్ చేసినవారి వివరాలను రెండేళ్ల పాటు భద్రంగా ఉంచటంతో పాటు, ప్రతినెలా తమ ఆస్పత్రిలో జరిగే స్కానింగ్, తదితర వివరాలు జిల్లావైద్యారోగ్యశాఖకు సమర్పించాలి. కానీ, ఈ ఆస్పత్రిని డీఎంహెచ్వో తనిఖీ చేయగా స్కానింగ్ యంత్రంలోని హార్డ్డిస్క్ను మాయం చేయడంతో పాటు, రికార్డులు లేకపోవడంతో సీజ్ చేశారు’. జిల్లా లింగనిష్పత్తి (0–6 వయసు చిన్నారుల్లో) జగిత్యాల 992 947 పెద్దపల్లి 992 922 కరీంనగర్ 993 931 సిరిసిల్ల 1,014 942‘ఇటీవల వైద్యారోగ్యశాఖ అధికారులు కరీంనగర్లో తనిఖీలు చేపట్టగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 19 స్కానింగ్ సెంటర్లకు నోటీసులు జారీ చేశారు. ఒక సెంటర్లో మొబైల్ స్కానింగ్ మిషన్ను సీజ్ చేశారు. అయినా తెరవెనుక దందా దర్జాగా నడుస్తోంది’.‘జగిత్యాల జిల్లాకేంద్రంలోని ఓ నర్సింగ్హోమ్లో అనుమతి లేని స్కానింగ్ యంత్రాలు మూడు ఉండగా నాలుగునెలల క్రితం వాటిని వైద్యశాఖ ఆధ్వర్యంలో అధికారులు గుర్తించి సీజ్ చేశారు’.సాక్షి,పెద్దపల్లి/కరీంనగర్టౌన్/జగిత్యాల: కాసులకు కక్కుర్తిపడుతున్న కొందరు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు, వారికి సహకరిస్తున్న ఆర్ఎంపీ, పీఎంపీలు నిబంధనలకు విరుద్ధంగా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఆడపిల్ల అని తేలితే కడుపులోనే బిడ్డను కరిగించేస్తున్నారు. లింగనిర్ధారణ నేరమని చెప్పాల్సిన వైద్యులే ఆర్ఎంపీలతో కలిసి ముఠాలుగా ఏర్పడి అక్రమ దందాకు పాల్పడుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో గుట్టుచప్పుడు కాకుండా భ్రూణహత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఉమ్మడి జిల్లాలో నిరాటంకంగా కొనసాగుతున్నాయి. దీంతో లింగనిష్పత్తిలో అంతరం పెరుగుతోంది. ముఖ్యంగా 0–6 వయస్సు చిన్నారుల్లో పెరుగుతున్న అంతరం ఆందోళన కలిగిస్తుంది. ఆర్ఎంపీ, పీఎంపీలదే కీలకపాత్ర పల్లెలు, పట్టణాల్లోని ఆర్ఎంపీలు, పీఎంపీల సహకారంతో ఉమ్మడి జిల్లాలో లింగనిర్ధారణ దందా సాగుతోంది. కొంత మంది ఆర్ఎంపీ, పీఎంపీలు ధనార్జనే ధ్యేయంగా ముఠాగా ఏర్పడుతున్నారు. స్కానింగ్ సెంటర్లలో మాట్లాడుకుని వ్యవహారం నడిపిస్తున్నారు. పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిస్తే ముందస్తుగా ఒప్పందం కుదర్చుకున్న ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్లకు మహిళలను పంపించి గర్భవిచ్ఛిత్తికి పాల్పడుతున్నారు. ఇదంతా మూడో కంటికి తెలియకుండా జరిగిపోతోంది. రెండు, మూడో కాన్పుపై దృష్టి సారిస్తే.. మొదటి కాన్పులో ఆడపిల్లలు పుట్టినవారికి రెండు, మూడోసారి గర్భం దాల్చిన మహిళలపై నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. 12 వారాల గర్భం కలిగిన మహిళలు తమ వివరాలను వైద్య పరీక్షల కోసం ఏఎన్ఎం వద్ద నమోదు చేసుకుంటారు. తర్వాత 16 నుంచి 20 వారాల్లో మరోసారి వారు వైద్యపరీక్షలకు వచ్చినప్పుడు రికార్డు చేస్తారు. అలాంటి సమయంలో వారు రాకుంటే నిఘా పెట్టి గర్భంతో ఉన్నారా.. లేక అబార్షన్ చేయించుకున్నారనేది తెలుసుకుని విచారణ చేపడితే ఈ దందాకు చెక్ పెట్టవచ్చు.ఆడపిల్లలను బతకనిద్దాం మూఢనమ్మకాలు, నిరక్షరాస్యత, పేదరికంతో గర్భంలో ఉన్న పిండం ఆడపిల్ల అని తేలితే విచ్ఛి త్తి చేస్తున్నారు. బేటి బచావో బేటి పడావో మోడీ నినాదంతో ముందుకెళ్లాలి. భ్రూణహత్యలు మహా పాపం. చైల్డ్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నాం. – నీలగిరి విజయలక్ష్మి, చైల్డ్ వెల్ఫేర్ సభ్యురాలు, జగిత్యాలకలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీస్కానింగ్ సెంటర్లు, మెటర్నిటీహోంలలో తనిఖీలు నిర్వహించేందుకు కలెక్టర్ చైర్మన్గా, జిల్లా వైద్యాధికారి కన్వీనర్గా కమిటీ రూపొందించారు. కమిటీలో గైనకాలజిస్టు, మహిళా తహసీల్దార్, మహిళా పోలీస్ అధికారి, సఖి కన్సల్టెంట్, డాటా ఎంట్రీ ఆపరేటర్ను బాధ్యులుగా నియమించారు. వీరంతా జిల్లాలోని అన్ని స్కానింగ్ సెంటర్లలో ఎప్పటికప్పుడు తనిఖీ చేపట్టాలి. లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్న వారిని గుర్తించి చర్యలు చేపడతారు. ఈ కమిటీ ఇప్పటికే 19 సెంటర్లకు నోటీసులు జారీ చేసింది. – డాక్టర్ వెంకటరమణ, డీఎంహెచ్వో, కరీంనగర్పకడ్బందీగా చట్టం అమలు లింగ నిర్ధారణ ప్రక్రియ నిషేధ చట్టాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తున్నాం. పోలీసు, ఇతర శాఖల సమన్వయంతో స్కానింగ్ సెంటర్లు, ఆర్ఎంపీలపై నిఘా ఉంచుతున్నాం, దాడులు చేస్తున్నాం. – అన్న ప్రసన్న కుమారి, డీఎంహెచ్వో, పెద్దపల్లిఆధునిక సమాజంలో అమానవీయం ఆధునికి సమాజంలో అమానవీయ ఘటనలు దురదృష్టకరం. లింగభేదం సామాజిక సమస్యగా మారడం సిగ్గుచేటు. లింగ నిర్ధారణ పరీక్షలు ప్రోత్సహించేవారిని కఠినంగా శిక్షించాలి. ఆడపిల్లల ఉనికికి ప్రమాదం కలిగించే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అధికారులు కఠినంగా వ్యవహరించాలి. – పద్మావతి, అసోసియేట్ ప్రొఫెసర్, సోషియాలజీ డిపార్ట్మెంట్, శాతవాహన వర్సిటీన్యూస్రీల్చట్టం ఏం చెబుతుందంటే.. లింగ నిర్ధారణ నిషేధ చట్టాన్ని ప్రభుత్వాలు 1994లో తీసుకొచ్చాయి. కడపులోని పిండం ఎదుగుదలను తెలుసుకునేందుకు అల్ట్రాసౌండ్ కేంద్రాలను నిబంధనల మేరకు ఏర్పాటు చేసుకోవాలి. చట్టాన్ని ఉల్లంఘిస్తే మొదటిసారి మూడేళ్లు జైలుశిక్ష, రూ.10వేల జరిమానా, రెండోసారి ఐదేళ్ల జైలు, రూ.50వేల జరి మానా చెల్లించాలి. నేరం నిర్ధారణ అయితే వైద్యవృత్తి నిర్వహణ అర్హత కోల్పోతారు.ఆపరేషన్ డెకాయ్ ఎక్కడ? గతంలో ఆస్పత్రుల్లోని స్కానింగ్ కేంద్రాల వద్ద వైద్యాధికారులు డెకాయ్ ఆపరేషన్ల పేరిట తనిఖీలు చేపట్టేవారు. ప్రస్తుతం అవి అమలు కావడం లేదు. డెకాయ్ ఆపరేషన్లో మహిళ తహసీల్దార్, మహిళా ఎస్సై, సఖీ సెంటర్ నిర్వాహకులు ఉంటారు. వైద్యాధికారులే ఈ బృందాన్ని స్కానింగ్ సెంటర్లకు గర్భిణుల వలే పంపిస్తారు. లింగనిర్ధారణ చేసేందుకు డబ్బు ఎర వేస్తారు. ఎవరైనా పరీక్షలకు పాల్పడితే వారిపై కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ, ఉమ్మడి జిల్లాలో డెకాయ్ ఆపరేషన్లు ఎక్కడా కన్పించడం లేదు.కోడ్ భాషలోనే.. కొన్ని స్కానింగ్ కేంద్రాల్లో లింగ నిర్ధారణ చట్టవిరుద్ధమని పెద్దపెద్ద బోర్డులు ఏర్పాటు చేస్తారు. కానీ తెరవెనుక వేరే ఉంటుంది. లింగనిర్ధారణ చేసి పుట్టబోయేది ఎవరనేది కోడ్భాషలో చెబుతారు. కేషీట్లపై కోడ్ భాషలో మైనస్, ప్లస్ గుర్తులు పెడుతున్నట్లు సమాచారం. -
గరుడ వాహనంపై రాములోరి విహారం
● నేడు పెద్ద రథం ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): నారాయణపూర్ శ్రీసీతా రామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారు మంగళవారం గరుడవాహనంపై విహరించారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. మహిళల భక్తి పాటలు.. హన్మాన్ మాలధారుల కీర్తనల మధ్య స్వామివారు పురవీధుల్లో విహరించారు. బుధవారం రథోత్సవం నిర్వహించనున్నారు. ఈమేరకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. రాత్రి ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నట్లు అర్చకులు వేణుగోపాలచారి తెలిపారు. ఆలయ కమిటీ చైర్మన్ మోతె లక్ష్మారెడ్డి, మాజీ సర్పంచులు నిమ్మ లక్ష్మి, దొమ్మాటి నర్సయ్య, మాజీ ఉపసర్పంచ్ మహేందర్, మాజీ ఎంపీటీసీ అపెరా సుల్తాన, అర్చకులు నవీన్చారి భక్తులు పాల్గొన్నారు. -
వాతావరణం
వాతావరణం తేటగా ఉంటుంది. ఆకాశం ప్రకాశవంతంగా ఉంటుంది. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. ఈదురుగాలులు వీస్తాయి. నేడు జిల్లాకు కేటీఆర్సిరిసిల్ల: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు బుధవారం జిల్లాకు వస్తున్నారని ఆ పార్టీ వర్గాలు మంగళవారం వెల్లడించాయి. ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.30 గంటలకు తెలంగాణ భవన్కు చేరుకుని హనుమాన్ పూజ, భిక్షలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.30 గంటలకు గంభీరావుపేటలో పెద్దమ్మతల్లి ఆలయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం 5 గంటలకు కోనరావుపేట మండలం మల్కపేటలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో మొదటి వార్షికోత్సవంలో పాల్గొంటారు. రజతోత్సవ సభను విజయవంతం చేయండిగంభీరావుపేట: వరంగల్లో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు కోరారు. గంభీరావుపేటలో మంగళవారం ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. నాయకులు వెంకటస్వామిగౌడ్, వెంకటియాదవ్, గంధ్యాడపు రాజు, నగేశ్గౌడ్, మల్లేశం, బండ రమేశ్, రామానుజాగౌడ్, కిశోర్, దోసల శంకర్, లింగంయాదవ్, వహీద్ పాల్గొన్నారు. 10 నుంచి సమ్మెలోకి మున్సిపల్ కార్మికులు ● సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ సిరిసిల్లటౌన్: మున్సిపల్ కార్మికులకు రావాల్సిన ఐదు నెలల పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ కోరారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 10 నుంచి సమ్మె చేపడుతున్నట్లు సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ఎస్.సమ్మయ్యకు మంగళ వారం సమ్మె నోటీస్ అందించి మాట్లాడారు. మున్సిపాలిటీ కార్మికులకు రావాల్సిన 5 నెలల పీఆర్సీ బకాయిలను వెంటనే అందించాలని కోరారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు సుల్తాన్ నర్సయ్య, కార్యదర్శి కాసారపు శంకర్, బాబా కిషన్, వేణు, మల్లేశం, శ్రీనివాస్, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. -
మిడ్మానేరు అడుగంటుతోంది..
● 7.80 టీఎంసీలకు పడిపోయిన నీటిమట్టం ● రెండేళ్లుగా రాని కాళేశ్వరం నీరు ● జూలై వరకు 4 టీఎంసీలు ఉండేలా ప్లాన్మిడ్మానేరు ప్రాజెక్టు స్వరూపం నీటి సామర్థ్యం : 27.55 టీఎంసీలు ప్రస్తుత నీటిమట్టం : 7.80 టీఎంసీలు 2024 ఏప్రిల్ 9న ఉన్న నీరు : 7.13 టీఎంసీలు బోయినపల్లి(చొప్పదండి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ మిడ్మానేరు ప్రాజెక్టులో నీటిమట్టం అడుగంటుతోంది. కొద్ది నెలలుగా శ్రీపాద ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ నుంచి నీటి విడుదల లేకపోవడంతో ప్రాజెక్టులోని నీరు ఎల్ఎండీ ప్రాజెక్టులోకి తరలిపోయింది. ప్రాజెక్టులోకి గతేడాది జూన్ 24 నుంచి ఇప్పటి వరకు 70 టీఎంసీల ఇన్ఫ్లో రాగా, 67 టీఎంసీలు ఔట్ఫ్లోగా వెళ్లిపోయింది. ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 27.55 టీఎంసీలు కాగా.. గురువారం నాటికి 7.80 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. గేట్ల ద్వారా విడుదల చేసే అంత నీటిమట్టం ప్రాజెక్టులో లేక పోవడంతో ఎల్ఎండీకి రెండు రివర్ స్లూయిస్ల ద్వారా 2,500 క్యూసెక్కులు, కుడికాల్వకు 300 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 5 క్యూసెక్కుల మేర నీరు విడుదల చేస్తున్నారు. మరో ఐదు రోజులు ఆయకట్టుకు నీరు మిడ్మానేరు ప్రాజెక్టు మూడు డివిజన్ల కింద సుమారు 50వేల ఎకరాల ఆయకట్టుకు నీరు విడుదల చేస్తున్నారు. కుడి కాల్వ ద్వారా మార్చి 31 వరకే నీటి విడుదల నిలిపి వేయాల్సి ఉండగా.. రైతుల కోరిక మేరకు మరో ఐదు రోజులు పొడగించినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. కుడి కాల్వ ద్వారా ఇల్లంతకుంట, గన్నేరువరం, మానకొండూర్, హుస్నాబాద్ మండలాలకు నీరు అందుతోంది. కరీంనగర్ అవసరాలకు ఎల్ఎండీకి నీటి తరలింపు ఏటా ఎల్ఎండీ ఆయకట్టుకు, కరీంనగర్ పట్టణ తాగునీటి అవసరాలకు మిడ్మానేరు నీరే పెద్ద దిక్కుగా నిలుస్తోంది. ప్రస్తుతం రెండు రివర్ స్లూ యిస్ గేట్ల ద్వారా కొద్ది రోజులుగా ఎల్ఎండీలోకి 2,500 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. రెండేళ్లుగా కాళేశ్వరం నీళ్లు బంద్ 2023 జనవరి నుంచి 2023 మార్చి వరకు కాళేశ్వరం నుంచి వరద కాల్వ మీదుగా మిడ్మానేరులోకి 26.70 టీఎంసీల మేర నీరు వచ్చి చేరింది. గత రెండేళ్లుగా కాళేశ్వరం నీళ్లు రాకపోవడంతో మిడ్మానేరు ప్రాజెక్టు ఖాళీ అవుతూ 7.80 టీఎంసీలకు చేరింది. వీటిలో నుంచే ప్రస్తుతం సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల్లోని గ్రామాలకు మిషన్ భగీరథ నీటి పథకానికి రోజుకు 45 క్యూసెక్కుల మేర నీరు విడుదల చేస్తున్నారు. జూలై 31 వరకు 4 టీఎంసీలు ఉండేలా.. మిడ్మానేరు నుంచి ఎల్ఎండీకి, కుడి, ఎడమ కాల్వల ద్వారా నీరు విడుదల చేసినా జూలై 31 వరకు 4 టీఎంసీల మేర ఉండేలా చూసుకుంటామని ఇంజినీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు. ఎల్ఎండీకి మరో 2 టీఎంసీల నీటిని విడుదల చేస్తామన్నారు. ఎల్ఎండీకి, కుడికాల్వకు నీరు ఇచ్చాక 5.08 టీఎంసీల మేర నీరు ప్రాజెక్టులో ఉండేలా చూస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎండకు, ఇతరత్రా సుమారు టీఎంసీన్నర మేర ఆవిరి కానుందని అధికారులు వివరించారు. -
బ్రాస్బ్యాండ్ కళాకారుల సంక్షేమానికి కృషి
● పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ● సుల్తానాబాద్లో వర్కర్స్ యూనియన్ రెండోమహాసభలు సుల్తానాబాద్(పెద్దపల్లి): బ్రాస్బ్యాండ్ కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చొరవ తీసుకుంటామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. స్థానిక సాయిరాం గార్డెన్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా బ్రాస్ బ్యాండ్ వర్కర్స్ యూనియన్ రెండో మహాసభ మంగళవారం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, పెళ్లిళ్లు, పేరంటాలు, శుభ, అశుభకార్యాలకు బ్రాస్బ్యాంక్కు మరింత ఆదరణ పెరుగుతోందని అన్నారు. ఈఎస్ఐ సౌకర్యం కల్పించేలా, బ్రాస్ బ్యాండ్ పరికరాలను రాయితీపై అందించేలా, 50ఏళ్ల వయసు దాటిన వారికి పింఛన్ మంజూరు చేసేలా, బ్రాస్బ్యాండ్ కళ అంతరించిపోకుండా సీఎం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. అంతకుముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి తరలివచ్చిన కళాకారులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. బ్రాస్బ్యాండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు పారుపల్లి గుణపతి, నాయకులు అంతటి అన్నయ్యగౌడ్, మినుపాల ప్రకాశ్రావు, సాయిరీ మహేందర్, కల్లేపల్లి జానీ, సూర శ్యామ్, మహ్మద్ రఫీక్, రామన్న, సాహెబ్ హుస్సేన్, విజయ్ కుమార్, శ్రీకాంత్గౌడ్, జహంగీర్ గోపాల్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనల ప్రకారం కేసుల పరిష్కారం
జ్యోతినగర్(రామగుండం): బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేయాలని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను నిబంధనల ప్రకారం పరిష్కరించాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డెపల్లి రాంచందర్ సూచించారు. ఎన్టీపీసీ టెంపరరీ టౌన్షిప్లో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల కలెక్టర్లు కోయ శ్రీహర్ష, కుమార్ దీపక్, పెద్దపల్లి అదనపు కలెక్టర్ అరుణశ్రీ, పెద్దపల్లి, మంచిర్యాల డీసీపీలు కరుణాకర్, భాస్కర్, జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ సునీల్ బాబు, రీసెర్చ్ అధికారి డి.వరప్రసాద్తో కలిసి మంగళవారం ఆయన కేసుల పురోగతిపై సమీక్షించారు. గతంలో జరిగిన సమావేశంలో జారీచేసిన సూచనలు, పనుల పురోగతి, తమ శాఖ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలను పలువురు అధికారులు వివరించారు. ఈ సందర్బంగా వడ్డెపల్లి రాంచందర్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను పకడ్బందీగా నమోదు చేసి, నిందితులకు చట్టం ప్రకారం శిక్ష పడేలా సాక్ష్యాలను ప్రవేశ పెట్టాలన్నారు. నిమ్నవర్గాల యువత పరిశ్రమలు స్థాపించేలా ప్రభుత్వాలు అందించే రాయితీలపై విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. రామగుండం, బెల్లంపల్లిలోని ఇండస్ట్రియల్ పార్క్ల్లో ఎస్సీ ఔత్సాహికవేత్తలకు భూ కేటాయింపుల్లో ప్రాధాన్యత కల్పించాలన్నారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన, స్టాండప్ ఇండియా, ముద్ర రుణాలను వ్యాపారవేత్తలకు అందించాలన్నారు. అంబేడ్కర్ విదేశీ విద్యా పథకం, కులాంతర వివాహాలకు సకాలంలో సాయం అందేలా చూడాలన్నారు. దళితుల భూములు ఆక్రమించే వారిపై కేసులు నమోదు చేయాలని పోలీసులకు సూచించారు. ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసుల్లో పోలీసులు అరెస్ట్ చేయడం లేదనే మాట వినపడుతోందని, తప్పుడు కేసు కాకుంటే నిందితులను అరెస్టు చేయాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతీ ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు కావాలని ఆయన అన్నారు. ప్రభుత్వ నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలని ఆదేశించారు. శాఖల వారీగా బ్యాక్లాగ్ పోస్టులు, కారుణ్య నియామకాలు, పదోన్నతుల పెండింగ్ వివరాలను అందించాలని కోరారు. ఎన్టీపీసీ, సింగరేణి తదితర ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం చేపట్టే భూసేకరణలో దళితులకు న్యాయమైన పరిహారం అందజేయాలని అన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు పరిహారం అందించామని, రేషన్ డీలర్లుగా వారికి ఉపాధి కల్పించామని, వారి పిల్లలకు గురుకులాలు, కేజీబీవీల్లో చేర్పించి నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు. అంబేడ్కర్ విదేశీ విద్యా పథకం కింద 2024–25లో ఐదుగురు దరఖాస్తు చేసుకోగా ముగ్గురిని ఎంపిక చేసి రూ.47 లక్షలు చెల్లించామని తెలిపారు. కులాంతర వివాహాల కింద ఈ ఏడాది 16 జంటలకు రూ.40 లక్షలు పంపిణీ చేశామని వివరించారు. ఆర్డీవోలు గంగయ్య, సురేశ్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై ప్రత్యేక దృష్టి జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డెపల్లి రాంచందర్ -
గుర్తు తెలియని వ్యక్తి మృతి
ఇబ్రహీంపట్నం: మండలకేంద్రంలోని హనుమన్ ఆలయం వద్ద మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి అపసార్మరక స్థితిలో పడి ఉండగా అక్కడే కొందరు 108కు ఫోన్ చేసి మెట్పల్లి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై అనిల్ తెలిపారు. మృతుడిని గుర్తిస్తే మెట్పల్లి డీఎస్పీ 8712656803, సీఐ 8712656819, ఇబ్రహీంపట్నం ఎస్సై 8712656795కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. తేనెటీగల దాడిలో 11 మంది కూలీలకు గాయాలు మంథని: గాజులపల్లి సమీపంలోని కాలువ వద్ద మంగళవారం ముళ్లపొదలను తొలగిస్తున్న ఉపాధిహామీ కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. గ్రామానికి చెందిన పలువురు కూలీలు ఉపాధిహామీ పనుల్లో భాగంగా కాలువ వద్ద పనిచేస్తున్న క్రమంలో తేనెటీగలు దాడి చేయగా 11 మంది గాయపడ్డారు. వారిని మంథని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న కూలీలను నాయకులు బూడిద గణేశ్, ఆర్ల సందీప్, సురేశ్, లింగయ్య, బావు రవి కోరారు. ఆత్మహత్యకు కారకులైన ముగ్గురికి జీవిత ఖైదు కరీంనగర్క్రైం: తమ ఇంటి అమ్మాయిని పెళ్లిపేరుతో వంచించి మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడని ఓ యువకుడిని తీవ్రంగా బెదిరించగా అవమానంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో నిందితులు ముగ్గురికి జీవిత ఖైదు, రూ.2వేల చొప్పున జరిమానా విధిస్తూ కరీంనగర్ ఎస్సీ,ఎస్టీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నీరజ మంగళవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. రామగుండం మండలం మర్రిపల్లికి చెందిన గూండా శంకరయ్య తన కూతుర్ని ప్రేమపేరుతో నమ్మించి మోసం చేశాడని అదే గ్రామానికి చెందిన దొబ్బల పవన్(21)పై క్రిమినల్ కేసు పెట్టాడు. పవన్ జైలుకు వెళ్లి వచ్చాడు. కొన్నాళ్లకు పవన్కు వేరే అమ్మాయితో పెళ్లి సంబంధం కుదిరింది. విషయం తెలిసిన గూండా శంకరయ్య, అకినపల్లికి చెందిన మండే శ్రీనివాస్, ఎగ్లాస్పూర్కు చెందిన క్యాతం రవీందర్ 2016 ఆగస్టు 21న పవన్ను అడ్డగించి నానా బూతులు తిట్టి చనిపో అని అవమానపరిచారు. ఇంటికి వచ్చిన పవన్ జరిగిన విషయాన్ని తన తమ్ముడికి చెప్పి రూంలోకి వెళ్లి పురుగుల మందు తాగాడు. అతన్ని ఆసుపత్రికి తరలించగా చనిపోయారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామగుండం పోలీసులు గుండా శంకరయ్య, మెండె శ్రీనివాస్, క్యాతం రవీందర్పై కేసు నమోదు చేశారు. అప్పటి ట్రైనీ ఐపీఎస్ అపూర్వరావు కేసు దర్యాప్తు జరిపారు. ఈ కేసులో సాక్షులను అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆరెల్లి రాములు కోర్టులో ప్రవేశపెట్టి విచారించారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన న్యాయమూర్తి ముగ్గురికి జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. దళిత మహిళను వేధించిన వ్యక్తికి ఏడాది జైలు గోదావరిఖని: స్థానిక అడ్డగుంటపల్లెకు చెందిన దళిత మహిళను వేధించిన కేసులో రాజీవ్కాలనీకి చెందిన ఆవుల మల్లయ్యకు ఏడాది జైలు శిక్ష, రూ.3వేలు జరిమానా విధించినట్లు వన్టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. అడ్డగుంటపల్లెలో ఒకదళిత మహిళను కులం పేరిట దూషిస్తూ వేధించాడు. దీంతో ఆవుల మల్లయ్యపై 2017లో కేసు నమోదు చేశారు. కరీంనగర్ ఎస్సీ, ఎస్టీ కోర్టులో విచారణ జరిగింది. జడ్జి నీలిమ పూర్వపరాలు పరిశీలించారు. నేరం రుజు కావడంతో మల్లయ్యకు జైలు, జరిమానా విధించారు. సాక్ష్యాధారాలు కోర్టుకు సమర్పించిన పోలీస్ కానిస్టేబుల్ మహేందర్, ఏఎస్ఐ తిరుపతిరావు, ప్రభుత్వ న్యాయవాది రాములును పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ఝా, డీసీపీ కరుణాకర్, ఏసీపీ రమేశ్ అభినందించారు. ముగ్గురికి జీవితఖైదు రామగుండం: అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లి, ఎగ్లాస్పూర్ గ్రామాలకు చెందిన ముగ్గురికి జీవితఖైదు విధిస్తూ కరీంనగర్ మూడోఅదనపు జిల్లా న్యాయమూర్తి నీరజ మంగళవారం తీర్పు వెలువరించారు. ఎస్సై వెంకటస్వామి కథనం ప్రకారం.. బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన దొబ్బల పవన్ను 2016వ సంవత్సరంలో పాతకక్షలను దృష్టిలో పెట్టుకొని బెదిరించి, చనిపోవడానికి ముగ్గురు వ్యక్తులు కారకులయ్యారు. ఈ మేరకు మృతుడి తండ్రి దొబ్బల పోచయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటి గోదావరిఖని ఏఎస్పీ విష్ణు ఎస్.వారియర్ విచారణ జరిపిన అనంతరం చార్జిషీట్ దాఖలు చేశారు. కేసు పూర్వపరాలను పరిశీలించిన న్యాయమూర్తి శంకరయ్య(మర్రిపల్లి), శ్రీనివాస్(ఆకెనపల్లి), రవీందర్(ఎగ్లాస్పూర్)పై నేరం రుజువైందని నిర్ధారించారు. వారికి జీవిత ఖైదు, ఒక్కొక్కరికి రూ.వేయి జరిమానా విధించారు. -
జీతం ఇమ్మంటే లంచం అడిగాడు
● జమ్మికుంటలో ఏసీబీకి చిక్కిన సెర్ప్ ఉద్యోగి ● రూ.10 వేలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులుజమ్మికుంట: సెర్ప్లో వీఏవోగా పనిచేస్తున్న మహిళ తనకు రావాల్సిన ఏడాది గౌరవ వేతనం మంజూరు చేయాలని అడిగితే లంచం డిమాండ్ చేశాడో సెర్ప్ ఉద్యోగి. దీంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. సదరు అధికారి మహిళ నుంచి రూ.10వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ వివి.రమణమూర్తి వివరాల ప్రకారం.. జమ్మికుంట మండలంలోని పెద్దంపల్లి గ్రామానికి చెందిన దొడ్డె స్వప్న సెర్ప్లో వీఏవోగా పనిచేస్తోంది. ఏడాదికి సంబంధించిన రూ.60వేల గౌరవ వేతనం రావాల్సి ఉంది. ఇందుకోసం జమ్మికుంట సెర్ప్ కమ్యూనిటీ కో– ఆర్డినేటర్ పసరకొండ సురేశ్ను సంప్రదించింది. గౌరవ వేతనం ఇవ్వాలంటే రూ.20వేలు డిమాండ్ చేశాడు. మొదట రూ.4 వేలు ఇచ్చింది. మిగితా రూ.16వేలు ఇవ్వాలని వేధించడంతో ఏసీబీని ఆశ్రయించింది. వీఏవో నుంచి మంగళవారం రూ.10వేల లంచం తీసుకుంటుండగా సీసీ సురేశ్ను ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో పట్టుకున్నారు. కేసు నమోదు చేసి, కరీంనగర్ కోర్టుకు తరలించారు. తనకు రావాల్సిన గౌవర వేతనం ఏడాదికాలంగా పెండింగ్లో ఉందని, మంజూరు కోసం సీసీ సురేశ్ డబ్బులు డిమాండ్ చేశాడని స్వప్న వెల్లడించింది. ఏసీబీ దాడుల్లో సీఐలు కృష్ణకుమార్, పున్నం చందర్ పాల్గొన్నారు. -
కేడీసీసీబీ దేశానికే రోడ్ మోడల్
● రైతుల పిల్లల విద్యకు ట్రంప్ ఎఫెక్ట్ ● కేంద్రం చేయూతనిస్తే రాష్ట్రం రిక్తహస్తం ● కేడీసీసీబీ చైర్మన్ రవీందర్రావుకరీంనగర్ అర్బన్: కరీంనగర్ డీసీసీబీ దేశానికే రోడ్ మోడల్గా నిలుస్తోందని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ కొండూరు రవీందర్ రావు అన్నారు. మూతబడిన సహకార పెట్రోల్ బంకులను కేంద్రం తెరిపించి చేయూతనిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వ విధానాలు సహకార రంగానికి నష్టాన్ని తేనున్నాయని పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కేడీసీసీబీ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ప్రగతి, 2025–26 లక్ష్యాలను వెల్లడించారు. ఐదేళ్ల కాలంలో రైతుల సంక్షేమార్థం ఎన్నో పనులు చేపట్టామని, రానున్న కాలంలో మరింత పురోగతి సాధిస్తామని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దెబ్బతో రైతుల పిల్లలకు ఉన్నత విద్య అందించలేకపోతున్నామన్న బాధ ఉందని అన్నారు. 2005లో రూ.70 కోట్ల మేర నష్టాల్లో నడుస్తున్న డీసీసీబీ 2011లో డిజిటలైజేషన్, సుపరిపాలన, వ్యాపార కార్యకలాపాల వైవిధ్యం వంటి సంస్కరణల కారణంగా స్థూలంగా రూ. 2024–25 సంవత్సరంలో రూ.119కోట్లు లాభం సాధించిందని వివరించారు. కరీంనగర్ డీసీసీబీ దేశంలోని అనేక సహకార బ్యాంకులకు స్టడీ సెంటర్గా మారిందని, ఇతర బ్యాంకులు, పీఏసీఎస్లను సందర్శించి, పనితీరును అధ్యయనం చేసి, మంచి పద్ధతులను అవలంబించడానికి, కరీంనగర్ను దత్తత తీసుకోవాలని నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని గుర్తు చేశారు. డిజిటలైజేషన్ నమూనా, సుపరిపాలన, వ్యాపార కార్యకలాపాల్లో అన్ని సహకార సంఘాలు మెరుగ్గా వ్యవహరించాయని అన్నారు. సిబ్బంది అందరిలో జవాబుదారీతనం ఉండేలా పనిని అప్పగించాలని బ్రాంచ్ మేనేజర్లకు తెలిపారు. నిరంతరం లాభాలు ఆర్జించేందుకు ప్రొత్సాహకాలు అందించాలని, ఉద్యోగులు చేసిన అభ్యర్థనపై డైరెక్టర్ల బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఉద్యోగులు అసాధారణంగా పనిచేసి మంచి ఫలితాలు సాధించారని అభినందించారు. కేడీసీసీబీ వైస్ చైర్మన్ పి.రమేశ్, డైరెక్టర్లు మోహన్రెడ్డి, తిరుపతిరెడ్డి, సీఈవో ఎన్.సత్యనారాయణరావు, ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు హనుమంతరావు పాల్గొన్నారు. -
మానవత్వం చాటుకున్న గ్రామస్తులు
చొప్పదండి: నిరుపేద అర్చకుని భార్య మృతి చెందడంతో అంత్యక్రియలకు తమవంతు సాయం చేసి, అంత్యక్రియల్లో పాల్గొని మానవత్వం చాటుకున్నారు మండలంలోని ఆర్నకొండ గ్రామస్తులు. ఆర్నకొండలోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో పదేళ్లుగా నమిలికొండ మురళీకృష్ణ అర్చకుడిగా పని చేస్తున్నాడు. మంగళవారం అర్చకుడి భార్య ఆకస్మిక మృతి చెందగా, పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న అర్చకుడి కుటుంబానికి గ్రామస్తులు అండగా నిలిచారు. గంట సమయంలోనే సుమారు రూ.50వేల వరకు పోగు చేసి, దగ్గరుండి అంత్యక్రియలు పూర్తి చేశారు. అర్చక కుటుంబానికి అండగా నిలిచిన గ్రామస్తులకు అర్చక పురోహితుల సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
ప్రాణం తీసిన క్రికెట్ బాల్
● చికిత్స పొందుతూ బాలుడి మృతి ● విషాదంలో కుటుంబం వేములవాడ: వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ ప్రాంతానికి చెందిన దారం అశ్విత్రెడ్డి(10) హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందారు. గంగాధర మండలం రంగారావుపల్లికి చెందిన దారం శ్రీనివాస్రెడ్డి వేములవాడలోని కోరుట్లబస్టాండ్ ప్రాంతంలో కొన్నేళ్లుగా మెడికల్ షాప్ నిర్వహిస్తున్నాడు. శ్రీనివాస్రెడ్డికి పదేళ్ల కొడుకు అశ్విత్రెడ్డి, కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం ఒంటిపూట బడులు నడుస్తుండడంతో ఈనెల 3న స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అశ్విత్రెడ్డి స్నేహితులతో క్రికెట్ ఆడడానికి వెళ్లాడు .ఇంటికి తిరిగి వచ్చి యథావిధిగా మరుసటి రోజు పాఠశాలకు వెళ్లాడు. అయితే పాఠశాలలో తనకు తలనొప్పిగా ఉందని చెప్పడంతో వెంటనే శ్రీనివాస్రెడ్డి వెళ్లి వైద్యుడు దగ్గరికి తీసుకెళ్లాడు. తనకు తలపై క్రికెట్బాల్ తలిగిందని బాలుడు తెలపడంతో పరీక్షించిన వైద్యులు తలలో రక్తస్రావమవుతున్నట్లుగా వైద్యులు గుర్తించారు. వెంటనే మెరుగైన చికిత్స కోసం కరీంనగర్, అక్కడి నుంచి హైదరాబాద్కు తీసుకెళ్లారు. వెంటనే అక్కడి వైద్యులు ఆపరేషన్ చేశారు. మళ్లీ ఈనెల 7న రెండోసారి కూడా తలకు శస్త్రచికిత్స చేయగా.. మంగళవారం బ్రెయిన్డెడ్ అయ్యాడు. నకిలీ వైద్య సర్టిఫికెట్లు సృష్టించిన వ్యక్తి రిమాండ్ఇల్లంతకుంట(మానకొండూర్): మెడికల్ ఇన్వాలిడేషన్ కోసం నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి ఇచ్చిన వ్యక్తిని మంగళవారం రిమాండ్కు తరలించినట్లు ఎస్సై శ్రీకాంత్గౌడ్ తెలిపారు. ఇల్లంతకుంట మండలం గాలిపల్లి పశువైద్యశాలలో ఆఫీసు సబార్డినేటుగా విధులు నిర్వహిస్తున్న కత్తి దేవమ్మ మెడికల్ ఇన్వాలిడేషన్ కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంది. జిల్లా అధికారులు వాటిని పరిశీలించగా నకిలీవని తేలింది. దీంతో నకిలీ మెడికల్ సర్టిఫికెట్ల తయారీలో సంబంధం ఉన్న కరీంనగర్కు చెందిన ల్యాబ్ టెక్నీషియన్ యూసుఫ్ను మంగళవారం రిమాండ్కు తరలించారు. ఈ కేసులో ఇప్పటికే కత్తి దేవమ్మ, జేరిపోతుల సంజీవ్లను రిమాండ్కు తరలించారు. కేసు విచారణ కొనసాగుతుందని ఎస్సై తెలిపారు. పుస్తెలతాడు అపహరణవీణవంక: మామిడాలపల్లి గ్రామానికి చెందిన అవరకొండ సరమ్మ ఆరుబయట నిద్రించగా గుర్తు తెలియని పుస్తెలతాడును ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉక్కపోత భరించలేక సోమవారం రాత్రి ఆరుబయట నిద్రించగా తెల్లవారుజామున చూసే సరికి మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు పుస్తెలతాడు కనిపించలేదు. దీంతో కుటుంబీకులకు చెప్పుకోగా మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తోట తిరుపతి తెలిపారు. -
ఒకే పాడైపె తల్లీకొడుకుల మృతదేహాలు
రుద్రంగి(వేములవాడ): ఫుడ్ పాయిజన్తో ఆదివారం మృతిచెందిన తల్లీకొడుకులు కాదాసు పుష్పలత, నిహాల్ అంత్యక్రియలను మంగళవారం నిర్వహించారు. ఒకే పాడైపె తల్లీకొడుకుల మృతదేహాలను అంత్యక్రియలకు తరలించడంతో రుద్రంగి ఘొల్లుమంది. రాజన్నసిరిసిల్ల జిల్లా రుద్రంగికి చెందిన తల్లీకొడుకులు పుష్పలత, నిహాల్ శుక్రవారం రాత్రి రొట్టెలు తిని పడుకోగా.. వాంతులు, విరోచనాలతో ఆస్పత్రిలో చేరి చనిపోయిన విషయం తెలిసిందే. అయితే వీరి మృతిపై అనుమానాలు ఉన్నాయని మృతురాలి సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పుష్పలత భర్త రాజు దుబాయిలో ఉండడంతో అంత్యక్రియలు నిర్వహించలేదు. దుబాయి నుంచి రాజు మంగళవారం మధ్యాహ్నం చేరుకుని భార్య, కొడుకుల మృతదేహాలను చూసి కన్నీటిపర్యంతమయ్యాడు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, రుద్రంగి ఎస్సై అశోక్ ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు. -
● దరఖాస్తులకు నిరీక్షణ.. మీసేవ కేంద్రాల్లో పడిగాపులు ● గడువు పెంచడంతో వెల్లువలా దరఖాస్తులు ● అందరూ ఒకేసారి లాగిన్ కావడంతో సైట్ స్లో ● దరఖాస్తుదారులకు తప్పని తిప్పలు
ఇతను సిరిసిల్ల శాంతినగర్కు చెందిన వెంగల శ్రీకాంత్(36). బీఎస్సీ చదువుకున్నాడు. అమ్మ బీడీ కార్మికురాలు, నాన్న పవర్లూమ్వర్కర్. రాజీవ్ యువవికాసంలో కిరాణషాపు పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. రూ.4లక్షల రాయితీ పథకానికి దరఖాస్తు చేసేందుకు కులం, ఆదాయం, నివాసం సర్టిఫికెట్ల కోసం సిరిసిల్ల తహసీల్దార్ ఆఫీస్కు వస్తే.. సైట్ స్లో ఉండడంతో సర్టిఫికెట్ల జారీ జాప్యమవుతోంది. ఇది సిరిసిల్ల తహసీల్దార్ ఆఫీస్లోని గిర్దావర్(రెవెన్యూ ఇన్స్పెక్టర్) చాంబర్. వివిధ సర్టిఫికెట్లపై ఆర్ఐ సంతకాల కోసం సిరిసిల్ల పట్టణ వాసులు నిరీక్షించాల్సి వస్తోంది. దరఖాస్తుదారుల వివరాలు, రేషన్కార్డు, గతంలో జారీ అయిన సర్టిఫికెట్లను పరిశీలించి అన్నీ సవ్యంగా ఉంటే ధ్రువీకరిస్తున్నారు. కానీ ఒకేసారి అందరూ రావడంతో ఇలా ఇరుకుగదిలో దరఖాస్తుదారులు నిరీక్షించాల్సి వస్తోంది.సిరిసిల్ల: నిరుద్యోగ యువతీ, యువకులకు స్థానికంగానే స్వయం ఉపాధి అందించే లక్ష్యంతో ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టింది. గ్రామీణ ప్రాంతాల వారు స్థానిక ఎంపీడీవో ఆఫీస్లో, పట్టణాల్లోని వారు మున్సిపల్ ఆఫీస్ల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, బౌద్ధ, జైన్, పార్సీ సామాజిక వర్గాలకు చెందిన వారు అర్హులు. ఏప్రిల్ 14వ తేదీలోగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. గడువులోగా వచ్చిన దరఖాస్తులను మండల స్థాయి కమిటీ పరిశీలించి, అర్హుల జాబితాను జిల్లా కమిటీకి పంపిస్తుంది. జిల్లాస్థాయిలో ఎంపికై న వారికి శిక్షణ ఇచ్చి బ్యాంకుల సహకారంతో రుణాలు అందిస్తారు. దరఖాస్తుల వెంట ఆధార్కా ర్డు, రేషన్కార్డు, ఆదాయ, కులధ్రువీకరణ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, వ్యవసాయ పథకాలకు పట్టాదార్ పాస్బుక్కు, దివ్యాంగులు సదరం సర్టిఫికెట్, పాస్పోర్టు సైజు ఫొటో జతచేయాల్సి ఉంటుంది. వ్యవసాయేతర యూనిట్లకు 21–55 ఏళ్ల వారు, వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు 21–60 ఏళ్లు (2024, జూలై 1 నాటికి) ఉండాలి. ఇవీ రాయితీ వివరాలు రూ.50వేలలోపు యూనిట్కు వందశాతం రాయితీ ఉండగా, రూ.లక్షలోపు యూనిట్కు 90 శాతం రాయితీ.. 10 శాతం బ్యాంకు లోను, రూ.2లక్షలలోపు యూనిట్కు 80 శాతం రాయితీ.. 20 శాతం బ్యాంకు లోను, రూ.4లక్షల యూనిట్కు 70 శాతం రాయితీ.. 30 శాతం బ్యాంకు లోను ఉంటుంది. బలహీనవర్గాల సమూహానికి యూనిట్లకు రూ.లక్ష వరకు వంద శాతం రాయితీ, చిన్ననీటిపారుదల యూనిట్కు వంద శాతం రాయితీ వర్తిస్తుంది. ఇల్లంతకుంటలో అత్యధికం.. రుద్రంగిలో అత్యల్పం రాజీవ్ యువవికాసం పథకానికి 5,391 దరఖాస్తులు రాగా.. అత్యధికంగా ఇల్లంతకుంటలో 684, అత్యల్పంగా రుద్రంగిలో 56 దరఖాస్తులు వచ్చాయి. బోయినపల్లిలో 373, చందుర్తిలో 272, గంభీరావుపేటలో 525, కోనరావుపేటలో 496, ముస్తాబాద్లో 680, సిరిసిల్ల పట్టణంలో 303, తంగళ్లపల్లిలో 423, వీర్నపల్లిలో 177, వేములవాడ రూరల్లో 280, వేములవాడ అర్బన్లో 251, వేములవాడ మున్సిపల్లో 365, ఎల్లారెడ్డిపేటలో 506 దరఖాస్తులు వచ్చాయి. ఇది సిరిసిల్ల పట్టణంలోని ఆర్డీవో ఆఫీస్ పక్కనే ఉన్న మీసేవ కేంద్రం. ఏప్రిల్ 14 వరకు రాజీవ్ యువవికాసం పథకానికి దరఖాస్తు చేయడానికి గడువు పొడగించడంతో అవసరమైన సర్టిఫికెట్ల కోసం ఇలా మీసేవ కేంద్రంలో క్యూ కట్టారు. కులం, ఆదాయం, నివాసం సర్టిఫికెట్లకు దరఖాస్తు ఫారాలు నింపి ఆన్లైన్ చేయడానికి వస్తే రెవెన్యూశాఖ సర్వర్ స్లోగా పనిచేస్తుంది. ఫలితంగా దరఖాస్తుదారులు గంటల తరబడి మీసేవ కేంద్రాల్లోనే నిరీక్షించాల్సి వస్తోంది.జిల్లాలో రాజీవ్ యువవికాసం ఇలా.. గ్రామాలు: 260, పట్టణాలు: 02 ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులు : 5,391 (07.04.2025 నాటికి) ఆఫ్లైన్లో వచ్చిన దరఖాస్తులు : 664 -
రాత్రి ఒంటి గంట వరకు పనిచేస్తున్నారు
మా వద్ద పెండింగ్ ఉంచుకోవడం లేదు. మా లాగిన్కు వచ్చిన వాటిని వెంటనే క్లియర్ చేస్తున్నాం. అర్థరాత్రి ఒంటి గంట వరకు మా సిబ్బంది పని చేస్తున్నారు. రోజుకు సగటున 300 నుంచి 500 దరఖాస్తులు వస్తున్నాయి. అన్నీ క్లియర్ చేస్తున్నా. ఇంకా మా వద్ద 800 దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి. అందరికీ ఆదాయం సర్టిఫికెట్ అవసరం లేదు. రేషన్కార్డు ఉంటే సరిపోతుంది. మీసేవ కేంద్రాల నిర్వాహకులు అందరూ ఒకేసారి లాగిన్ కావడంతో సర్వర్ స్లో అవుతుంది. – సురభి మహేశ్కుమార్, తహసీల్దార్, సిరిసిల్ల -
మానేరులో ఆరు ఇసుక రీచ్లు
● కలెక్టర్ సందీప్కుమార్ ఝాసిరిసిల్ల: జిల్లాలో కొత్తగా ఆరు ఇసుక రీచ్లను గుర్తించామని, స్థానిక అవసరాలకు, అభివృద్ధి పనులకు ఇసుక కొరత లేకుండా చూడాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా కోరారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి సాండ్ కమిటీ సమావేశంలో మాట్లాడారు. పదిర, కొండాపూర్లో ఇసుక రీచ్లను మంగళవారం ప్రారంభించాలని ఆదేశించారు. ఇసుక రవాణాకు అనుమతులు ఇవ్వాలని సూచించారు. పదిర ఇసుక రీచ్ ప్రారంభించిన తర్వాత వెంకటాపూర్ రీచ్ను నిలిపివేయాలని తెలిపారు. వట్టిమల్ల అప్రోచ్రోడ్ సమస్యపై తహసీల్దార్ నివేదిక అందించాలని కోరారు. జిల్లాలో నిర్మించే ప్రభుత్వ ప్రాజెక్టులు, ఇందిరమ్మ ఇళ్లు, పెండింగ్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి ఇసుక కొరత రాకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, సిరిసిల్ల ఆర్డీవో రాధాభాయి, జిల్లా మైనింగ్ అధికారి క్రాంతికుమార్, జిల్లా పంచాయతీ అధికారి షరీఫొద్దీన్, ప్రోగ్రాం అధికారి టీజీఎండీసీ పీవో జైపాల్రెడ్డి, నీటిపారుదల శాఖ అధికారి అమరేందర్రెడ్డి పాల్గొన్నారు. -
రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి
● బీజేపీ, బీఆర్ఎస్లు చీకటి దోస్తులు ● కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కె.కె.మహేందర్రెడ్డిసిరిసిల్ల: రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి పేర్కొన్నారు. సిరిసిల్లలో సోమవారం నిర్వహించిన ‘జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్’లో మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది కాంగ్రెస్ అని, రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేడ్కర్ ద్వారా అందించింది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ, బీఆర్ఎస్లు నియంతృత్వ, నిరంకుశపోకడలతో పాలన సాగించాయని విమర్శించారు. ఆ రెండు పార్టీలు చీకటి దోస్తులని ఆరోపించారు. రాష్ట్రంలో బీసీ కుల గణన చేపట్టి 42 శాతం రిజర్వేషన్లను కాంగ్రెస్ పార్టీ కల్పించిందన్నారు. 30 ఏళ్లుగా సమస్యగా ఉన్న ఎస్సీ వర్గీకరణ చేశారన్నారు. బీజేపీ కుట్రలను తిప్పికొడుతూ రాహుల్గాంధీ దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర చేశారని గుర్తు చేశారు. రాజ్యాంగ స్ఫూర్తిని రక్షించేందుకు అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ శ్రేణులు ప్రజలను చైతన్యవంతులను చేయాలని కోరారు. ఏఐసీసీ కోఆర్డినేటర్ అవీజ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, ఏఎంసీ చైర్మన్ వెల్ముల స్వరూపారెడ్డి, పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కాముని వనిత, నాయకులు సంగీతం శ్రీనివాస్, ఆకునూరి బాలరాజు, సూర దేవరాజు, ఆడెపు చంద్రకళ, కల్లూరి చందన, వైద్య శివప్రసాద్, రాగుల జగన్, గోలి వెంకటరమణ, నేరెళ్ల శ్రీకాంత్గౌడ్, భీమవరం శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కాంగ్రెస్తోనే సంక్షేమ పథకాలు
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కోనరావుపేట(వేములవాడ): పేదలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రారంభించినవేనని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. మండలంలోని నిమ్మపల్లిలో సోమవారం చేపట్టిన ‘జైబాపు..జైభీమ్.. జైసంవిధాన్’లో మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలోనే ఉపాధిహామీ, గరీభీ హటావో, ఇందిరమ్మ ఇళ్లు, భూములేని నిరుపేదలకు పోడు భూములు, బ్యాంకుల జాతీయకరణ వంటి పథకాలు ప్రారంభించిందని గుర్తు చేశారు. వైఎస్సార్ హయాంలో వ్యవసాయానికి ఉచిత కరెంట్ను అమలు చేశామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ రూ.10లక్షలకు పెంపు, ఇందిరమ్మ ఇల్లు, రైతు రుణమాఫీ, రూ.500 సిలిండర్, గల్ఫ్లో మరణించిన కార్మికులకు రూ.5 లక్షల పరిహారం ఇస్తున్నామని వివరించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అనంతరం జైసేవాలాల్ ఊరుతండాలో సన్నబియ్యం లబ్ధిదారు ఇస్లావత్ మధుకర్ ఇంటిలో భోజనం చేశారు. మండల కన్వీనర్ గడ్డం నర్సయ్య, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు షేక్ ఫిరోజ్పాషా, కిసాన్సెల్ జిల్లా అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ఎల్లయ్య, మానుక సత్యం, బైరగోని నందూగౌడ్, చేపూరి గంగాధర్, శ్రీనివాస్, బండి ప్రభాకర్, మాజీ సర్పంచ్ బండ సత్తయ్య, సదానందం, దేవరాజు పాల్గొన్నారు. -
సమస్యలకు సత్వర పరిష్కారం
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ● ప్రజావాణిలో 155 అర్జీల స్వీకరణసిరిసిల్లటౌన్: ప్రజావాణిలో వచ్చే సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్నామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్తో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తులు పెండింగ్ పెట్టవద్దని సూచించారు. మొత్తం 155 దరఖాస్తులు వచ్చాయి. రెవెన్యూ 51, సిరిసిల్ల మున్సిపల్ 9, డీఆర్డీఏకు 36, వేములవాడ మున్సిపల్ కమిషనర్కు 4, హౌసింగ్శాఖకు 14, ఉపాధి కల్పన శాఖకు 8, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్కు 1, పంచాయతీరాజ్ శాఖకు 15, విద్యాశాఖకు 12, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్, ఎస్పీ ఆఫీస్, ఎస్డీసీకి ఒకటి చొప్పున, జిల్లా వైద్యాధికారికి 2 అర్జీలు వచ్చాయి. డీఆర్డీవో శేషాద్రి పాల్గొన్నారు. -
యోగాతో మానసిక ప్రశాంతత
● ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ సిరిసిల్ల: యోగా ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎన్.శ్రీనివాస్ కోరారు. సిరిసిల్లలో సోమవారం ఐఎంఏ ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నిర్వహించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ నిత్యం ఒత్తిడితో కూడిన జీవనంలో ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత లభించడంతోపాటు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందన్నారు. మెడిటేషన్ దినచర్యలో భాగం కావాలని, విధిగా అలవాటు చేసుకోవాలన్నారు. ఐఎంఏ జిల్లా మహిళా అధ్యక్షురాలు డాక్టర్ లీలాశిరీష, వైద్యులు పద్మావతి, శోభారాణి, గీతావాణి, రజని, మెడిటేషన్ జిల్లా కోఆర్డినేటర్ కోడం సతీశ్ పాల్గొన్నారు. -
బీజేపీతోనే సంక్షేమం
● పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి సిరిసిల్లటౌన్: ప్రజాసంక్షేమ పాలన బీజేపీతోనే సాధ్యమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పేర్కొన్నారు. పార్టీ 45వ స్థాపన దివస్ సందర్భంగా సిరిసిల్లలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం జెండాను ఆవిష్కరించారు. నాయకులు ఆడెపు రవీందర్, నాగుల శ్రీనివాస్, తవటం రాజలింగం, మొగిలి రాజు, ఎర్రం మహేశ్, అల్లాడి రమేశ్, కుమ్మరి శంకర్, మ్యాన రాంప్రసాద్, రాగుల రాజిరెడ్డి, చంటి మహేశ్, కర్నె హరీష, బర్కం వెంకటలక్ష్మీ పాల్గొన్నారు. -
రోడ్లు ధ్వంసం..వాగులు చెర
● అటవీ ప్రాంతంలో జోరుగా ఇసుక అక్రమ రావాణా ● అడుగంటుతున్న భూగర్భ జలాలు ● ధ్వంసమవుతున్న ఒర్రెలు, రహదారులు ● ఇబ్బందులు పడుతున్న అన్నదాతలురుద్రంగి(వేములవాడ): అటవీ ప్రాంతం, వాగులు, ఒర్రెలను ఆనుకుని ఉన్న గ్రామాల్లో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. స్థానిక ట్రాక్టర్ల యజమానులు ఎలాంటి అనుమతులు లేకుండానే ఇసుకను యథేచ్ఛగా తోడుతున్నారు. ఇసుక లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ల వేగానికి రోడ్లు ధ్వంసమవుతున్నాయి. వాగులు, ఒర్రెల్లో ఇసుక తోడుతుండడంతో భారీగా గుంతలు ఏర్పడుతున్నాయి. ట్రాక్టర్లు అతివేగంగా వెళ్తుండడంతో ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి. అయినా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగానే ఉంటున్నారు. ఒర్రెలు ఖాళీ.. మండలంలోని వాగులు, ఒర్రెల్లో ఇసుక ఖాళీ అవుతోంది. అదే సమయంలో ఇసుక ట్రాక్టర్ల వేగానికి రోడ్లు సైతం ధ్వంసమవుతున్నాయి. మండుతున్న ఎండలకుతోడు ఒర్రెలలోని ఇసుకను తోడేస్తుండడంతో భూగర్భ జలాలు అడుగంటి బావులు, బోరుబావుల్లో నీరు ఇంకిపోతోంది. పర్యావరణానికి కూడా ముప్పు వాటిల్లుతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఇసుక అక్రమ రావాణాను అరికట్టాలని కోరుతున్నారు. మైనర్, ర్యాష్ డ్రైవింగ్తో బెంబేలు ఇసుక ట్రాక్టర్ల డ్రైవర్లలో దాదాపు మైనర్లే ఎక్కువగా ఉంటున్నారు. అంతేకాకుండా వారిలో చాలా మందికి కనీసం డ్రైవింగ్ లైసెన్స్లు కూడా ఉండడం లేదు. ట్రాక్టర్లను అతివేగంగా నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు.ఈ ఫొటోలో పేద్ద కాల్వ ఇసుక తవ్వకాలు చేపట్టడంతోనే ఏర్పడింది. ఇది రుద్రంగి మండల కేంద్రం శివారులోని దుర్గమ్మఒర్రె. ఇష్టానుసారంగా ఇసుక తీయడంతో భారీ గోతులు ఏర్పడి వర్షాకాలంలో ఒర్రె కోసుకుపోయింది. దీంతో పక్కనున్న పంటపొలాలకు వరదనీరు వస్తోందని స్థానిక అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక తోడకుండా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.ఇది రుద్రంగి మండలంలోని అచ్చయ్యకుంట నుంచి కలికోటసూరమ్మ చెరువులోకి వెళ్లే దారి. ఇసుక అక్రమ రవాణా చేసే ట్రాక్టర్ల రాకపోకలతో ఈ రోడ్డు ధ్వంసమైంది. అటు వైపు పొలాల వద్దకు వెళ్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు పాడవుతుందని ఆ ప్రాంతంలోని రైతులు ప్రశ్నిస్తే ఎవరికీ చెప్పుకుంటావో.. చెప్పుకోమంటూ బెదిరింపులకు దిగుతున్నట్లు వారు వాపోయారు.ఇక నుంచి అనుమతులు ఇవ్వం రుద్రంగిలో ఇసుక రవాణాకు ఇక నుంచి ఎలాంటి అనుమతులు ఇవ్వం. అక్రమంగా రవాణా చేస్తే చర్యలు తీసుకుంటాం. – శ్రీలత, తహసీల్దార్, రుద్రంగికేసులు నమోదు చేస్తాం అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే కేసులు నమోదు చేస్తాం. రెవెన్యూ, మైనింగ్ అధికారుల అనుమతులు తీసుకోకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే వాహనాలు సీజ్ చేస్తాం. – సిరిసిల్ల అశోక్, ఎస్సై, రుద్రంగి -
సమస్యలు పరిష్కరిస్తాం
సుర్రుమన్న ‘సన్’డేసిరిసిల్ల: జిల్లా కేంద్రంలో ఆదివారం భానుడు భగ్గుమన్నాడు. శ్రీరామనవమి సందర్భంగా ఉదయం పూటనే వీధులు పండుగ శోభతో కళకళలాడాయి. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు సూర్యుడు సుర్రుమన్నాడు. ఎండలు మండిపోవడంతో జనం రోడ్లపైకి వచ్చేందుకు భయపడ్డారు. సిరిసిల్ల పట్టణంలోని ప్రధాన వీధులు బోసిపోయాయి.● మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణఇల్లంతకుంట(మానకొండూర్): రామాజీపేట రామాలయం వద్ద ఉన్న సమస్యలు పరిష్కరిస్తామని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. రామాలయంలో ఆదివారం నిర్వహించిన సీతారాముల కల్యాణోత్సవానికి కలెక్టర్ సందీప్కుమార్ ఝాతో కలిసి హాజరయ్యారు. విద్యుత్ దీపాలు, తాగునీటి బోర్, ట్యాంకు, మాలధారులకు హాల్ కావాలని భక్తులు కోరగా.. త్వరలోనే ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే, కలెక్టర్ హామీ ఇచ్చారు. సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి, ఇల్లంతకుంట ఎస్సై శ్రీకాంత్గౌడ్ ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు రాఘవరెడ్డి, టీపీసీసీ కోఆర్డినేటర్ పాశం రాజేందర్రెడ్డి, సీనియర్ నాయకులు పసుల వెంకటి, ఐరెడ్డి మహేందర్రెడ్డి, కరివేద కరుణాకర్రెడ్డి, చిట్టి ఆనందరెడ్డి, కె.భాస్కర్రెడ్డి పాల్గొన్నారు. -
వృద్ధాశ్రమంలో ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూ
సిరిసిల్ల: తంగళ్లపల్లి మండలం మండెపల్లి వృద్ధాశ్రమంలో 4 ఖాళీ పోస్టుల భర్తీకి ఆదివారం కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఇంటర్వ్యూలు నిర్వహించారు. మండెపల్లిలో ప్రకృతి స్వచ్ఛంద సంస్థ, ప్రభుత్వ సంయుక్త నిర్వహణలో వృద్ధాశ్రమం కొనసాగుతోంది. 23 మంది దరఖాస్తు చేసుకోగా.. దరఖాస్తుదారులను కలెక్టర్ ముఖాముఖీ ఇంటర్వ్యూ చేశారు. ఎంపికై న వారి వివరాలు ఆన్లైన్లో ఉంచుతామని జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం తెలిపారు. బీసీ రిజర్వేషన్లు 42 శాతం సాధిస్తాం సిరిసిల్ల: బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానికసంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లను సాధించే వరకు విశ్రమించేది లేదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు పేర్కొన్నారు. సిరిసిల్ల బీసీ భవన్లో ఆదివారం ముఖ్యప్రతినిధుల సమావేశం జరిగింది. పర్శ హన్మాండ్లు మాట్లాడుతూ పెంచిన 42 శాతం రిజర్వేషన్లను కేంద్రం ఆమోదించాలని, నాన్చివేత ధోరణి వీడాలన్నారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని, బడ్జెట్లో నిధులు పెంచాలని, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వీరవేని మల్లేశ్యాదవ్, పట్టణాధ్యక్షుడు తడక కమలాకర్, ఎల్లారెడ్డిపేట మండలాధ్యక్షుడు కంచర్ల రాజు, నాయకులు నల్ల శ్రీకాంత్, బో యిన శ్రీనివాస్, బచ్చు ప్రసాద్, చొక్కి కై లాస్, సబ్బని వేణు, కోడం రవీందర్, దుబాల కొండయ్య, చిందం శ్రీధర్ పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్లపై సర్కార్కు చిత్తశుద్ధి ఏది? ముస్తాబాద్(సిరిసిల్ల): రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి శీలం స్వామి విమర్శించారు. ము స్తాబాద్లో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు చేసిన ప్రభుత్వం గవర్నర్ ఆమో దం ఇంత వరకు ఎందుకు పొందలేదో చెప్పాలన్నారు. గవర్నర్ ఆమోదం పొందకుండా ఢిల్లీలో ధర్నాలు చేయడం ప్రజలను మోసం చేయడమేనన్నారు. తమిళనాడులో మాదిరిగా ఇక్కడ అమలు చేయాలని కోరారు. నాయకులు కంచం నర్సింలు, విశ్వనాథం, అనిల్, సాయికృష్ణ, నర్సింలు ఉన్నారు. సంఘం అభివృద్ధికి కృషి చేస్తా ● వీరశైవ లింగాయత్ లింగ బలిజ జిల్లా అధ్యక్షుడు సోమ్కుమార్ ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): బలిజ సంఘం అభివృద్ధికి కృషిచేస్తానని వీరశైవ లింగాయత్ లింగ బలిజ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై న సోమ్కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంకటాల సోమేశ్వర్ ఆధ్వర్యంలో కమి టీని ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సోమ్కుమార్, ప్రధాన కార్యదర్శిగా పత్తి స్వా మి, ఉపాధ్యక్షుడిగా డాకూరి భూపతి, కోశాధికారి కొల్లేటి చంద్రమౌళిని ఎన్నుకున్నారు. కార్మికులపై వివక్ష వీడాలిసిరిసిల్లటౌన్: పవర్లూమ్ కార్మికులపై ప్రభుత్వం వివక్ష వీడాలని సీఐటీయూ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూశం రమేశ్ కోరారు. ఆరు రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదననారు. స్థానిక పార్టీ ఆఫీస్లో ఆదివారం పవర్లూమ్స్, వైపని, వార్పిన్ కార్మికులతో సమావేశమయ్యారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా సోమవారం 24 గంటలు నేతన్నల దీక్ష చేపడుతున్నట్లు ప్రకటించారు. కోడం రమణ, సిరిమల్ల సత్యం, కుమ్మరికుంట కిషన్, సబ్బని చంద్రకాంత్, ఎలిగేటి శ్రీనివాస్, మచ్చ వేణు, ఎక్కల్దేవి జగదీశ్, బొట్ల వెంకటేశం, ప్రవీణ్ పాల్గొన్నారు. -
రాజన్నతో ముడి.. హిజ్రాల సందడి
వేములవాడ: రాజన్నను వరుడిగా భావించి వివాహమాడటం.. వేములవాడలో ఏళ్లుగా కొనసాగుతున్న ఆనవాయితీ. ఏటా శ్రీరామనవమి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ కల్యాణోత్సవానికి సామాన్య భక్తులతోపాటు అధిక సంఖ్యలో హిజ్రాలు, జోగినులు హాజరవుతుంటారు. కానీ కల్యాణోత్సవానికి హాజరైన హిజ్రాలు, జోగినులు శివుడినే వరుడిగా భావించి వివాహమాడుతుంటారు. మంగళసూత్రం ధరించి, తలంబ్రాలు పోసుకుంటూ సంతోషంగా గడుపుతారు. రాష్ట్రంలో వేములవాడ రాజన్న సన్నిధిలో మాత్రమే శ్రీరామనవమి సందర్భంగా ఆవిష్కృతమయ్యే ఈ ఆచార, వ్యవహారాలపై ప్రత్యేక కథనమిది. నవమి రోజే ఏడడుగులు ఏటా శ్రీరామ నవమి రోజు జరిగే శ్రీసీతారాముల కల్యాణంలో శివపార్వతులు, జోగినులు, హిజ్రాలు పాల్గొంటారు. వీరంతా సంప్రదాయబద్ధంగా పట్టుచీరలు, ఆభరణాలు ధరించి అందంగా ముస్తాబై కల్యాణానికి హాజరవుతారు. తమను తాము.. రాజరాజేశ్వరస్వామికి భార్యలుగా భావించి.. వివాహ బంధంలోకి ప్రవేశిస్తారు. నెత్తిన జీలకర్ర బెల్లం, చేతిలో త్రిశూలం, మెడలో మంగళసూత్రం ధరించి పెళ్లి వేడుకలు జరుపుకోవడం విశేషం. ఆలయ ఆవరణలో జరిగే ఈ ప్రక్రియను.. ఆత్మవివాహం(స్వయంపరిత్యాగం)గా పరిగణిస్తుంటారు. వేడుక వెనుక భక్తి భావన ఈ వేడుక ద్వారా శివపార్వతులు, జోగినులు, హిజ్రా సమాజం భగవంతుని ఆశీస్సులను కోరుకుంటారు. హిజ్రాలను సమాజంలో ఒంటరిగా కాకుండా సమానంగా చూడాలనే ఆలోచన ఈ ఉత్సవానికి ప్రధాన సంకేతంగా నిలుస్తోందని భావిస్తుంటారు. వారి ఆత్మాభిమానం పెంచేందుకు, భగవంతుని కటాక్షానికి హిజ్రాలు కూడా పాత్రులనే భావనను చాటి చెప్పేలా ఈ ఉత్సవం సాగుతోంది. భక్తికి లింగ భేదం లేదని, దేవునికి ప్రతి ఒక్కరూ సమానమేనని ఈ వేడుకలు నిరూపిస్తున్నాయి. వారం రోజులపాటు వేములవాడలో వేడుకగా జరిగే ఈ తంతును చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు. సమాజంలో మార్పుకిది సంకేతం హిజ్రాలను అనాదిగా సమాజం అంగీకరించక, వారిని అటకెక్కించిన తీరు తెలిసిందే. కానీ వేములవాడ రాజన్న ఆలయంలో హిజ్రాలకు ప్రత్యేక గౌరవం కల్పించడం విశేషంగా భావిస్తారు. ఇక్కడ హిజ్రాలు దేవునితో ఆత్మీయబంధం కలిగి, ఆధ్యాత్మికంగా ప్రాధాన్యం పొందుతున్నారు. హిజ్రాలకు దేవతల మన్నింపు, ఆశీస్సులు లభిస్తున్నాయని భావించడంతో.. భక్తుల మధ్య వారికి గుర్తింపు పెరుగుతోంది. సామాజికంగా హిజ్రాలు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటారు. కానీ ఈ కల్యాణోత్సవం ద్వారా వారికి భక్తిపూర్వకమైన గుర్తింపు లభిస్తోంది. తాము సమాజంలో ఒంటరి కామని, గుర్తింపు ఉందని హిజ్రాలు స్వయంగా అర్థం చేసుకునేలా చేస్తుంది. ఇటీవల హిజ్రాలకు ప్రభుత్వం కొన్ని హక్కులు, వసతులు కల్పించినా, సాధారణ ప్రజానీకంలో ఇప్పటికీ వారిపై వ్యతిరేక అభిప్రాయాలు ఉన్నాయి. -
క్రీడలతో మానసికోల్లాసం
వేములవాడ: క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారం రోజులుగా నిర్వహిస్తున్న జిల్లా ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు శనివారం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి హాజరైన ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని కోరారు. మాదకద్రవ్యాలకు బానిస కాకుండా ఉన్నత చదువులతో ఎదగాలని ఆకాంక్షించారు. నిత్యం బిజీగా ఉండే డాక్టర్లు, లాయర్లు, ఉపాధ్యాయులు, పోలీసులు, పాత్రికేయులు, లయన్స్ క్లబ్ సభ్యులు అంతా ఒక చోట చేరి క్రీడాపోటీలు నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. పోలీస్ జట్టు విజేతగా, లాయర్ల టీమ్ రన్నరప్గా నిలిచాయి. మహిళా జట్టులో వేములవాడ జట్టు ఫస్ట్ప్లేస్లో నిలిచింది. వీరికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎస్పీ మహేశ్ బీ.గీతే, ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు నాగమల్ల శ్రీనివాస్ బహుమతులు అందించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విన్నర్స్ పోలీస్.. రన్నరప్ అడ్వకేట్స్ -
సన్నబియ్యం ఇస్తోంది కేంద్రం ప్రభుత్వమే..
● బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్ రుద్రంగి(వేములవాడ): కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం తమవిగా చెప్పుకోవడం సిగ్గుచేటు బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు నంద్యాడపు వెంకటేశ్ విమర్శించారు. రుద్రంగి మండల కేంద్రంలోని రేషన్షాపులో శనివారం పీఎం మోదీ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి రేషన్బియ్యాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేశారు. వెంకటేశ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి ప్రతీ నెల ఆరు కిలోల బియ్యం ఇస్తున్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా హామీలను విస్మరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకులు పడాల గణేశ్, బోయిని రాజు, మీసాల రవీందర్, పెద్ది శ్రావణ్, అల్లూరి రవీందర్రెడ్డి, పడాల గజానంద్, అక్కెనపెల్లి నర్సింగరావు, తాళ్లపల్లి బాలకిషన్రావు, మంచె వసంత్, బొబ్బిలి గణేశ్, బలగం శ్రీధర్ పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఆరోగ్య పరీక్షలు ● జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత సిరిసిల్ల: అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఆరోగ్య పరీక్షలు, కంటి పరీక్షలు నిర్వహిస్తామని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆఫీస్లో శనివారం వైద్యాధికారులతో సమీక్షించారు. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాలతో ఈనెల 7 నుంచి ఆరేళ్లలోపు పిల్లలకు ఆప్తాలమిక్ ద్వారా కంటి పరీక్షలు చేస్తామని వివరించారు. స్మార్ట్చెక్– 42 ద్వారా పిల్లల్లో పెరుగుదల లోపాలను గుర్తించి, వైద్యం చేయించాలని సూచించారు. డీఐవో డాక్టర్ సంపత్కుమార్, ఆర్బీఎస్కే కో ఆర్డినేటర్ డాక్టర్ నయీమ్ జహా, వైద్యులు, ఫార్మసిస్టులు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. బీజేపీది ప్రజా వ్యతిరేక విధానం ● సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు సిరిసిల్లటౌన్: దేశంలో బీజేపీ సర్కారు ప్రజావ్యతిరేక పాలన సాగిస్తోందని సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు విమర్శించారు. సిరిసిల్లలోని కార్మికభవన్లో శనివారం నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడారు. సీపీఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా ఈనెల 9, 10వ తేదీల్లో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ కుట్రలకు వ్యతిరేకంగా, దేశవ్యాప్తంగా ఆదివాసీలు దళితులపైన దాడులకు నిరసనగా, దేశ ప్రజల యొక్క వనరులను కార్పొరేట్ శక్తులకు అప్పనంగా కట్టపెట్టే విధానాలను ఎండగడుతామన్నారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మంద సుదర్శన్, మీసం లక్ష్మణ్, లక్ష్మారెడ్డి, చంద్రం, బాలరాజు పాల్గొన్నారు. ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలి ● బీజేపీ ఆవిర్భావ దినోత్సవ కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ చందుర్తి(వేములవాడ): ఆవిర్భావ వేడుకలను ఆదివారం అన్ని గ్రామాల్లో నిర్వహించాలని బీజేపీ ఆవిర్భావ దినోత్సవ కమిటీ కన్వీనర్ సిరికొండ శ్రీనివాస్ కోరారు. మండల కేంద్రంలో శనివారం కార్యకర్తలు, నాయకులకు పార్టీ జెండాలను పంపిణీ చేసి మాట్లాడారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతీ కార్యకర్త తమ ఇంటిపై పార్టీ జెండాను ఎగురవేయాలని కోరారు. పార్టీ మండలాధ్యక్షుడు మొకిలే విజేందర్, నాయకులు సిర్రం తిరుపతి, అంబాల శ్రీకాంత్, పెరుక గంగరాజు, పత్తిపాక శ్రీనివాస్ పాల్గొన్నారు. -
జగ్జీవన్రామ్ ఆశయ సాధనకు కృషి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝాసిరిసిల్ల: బాబు జగ్జీవన్రామ్ ఆశయ సాధనకు కృషి చేస్తున్నామని కలెక్టర్ సందీప్కుమార్ ఝా పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద శనివారం జగ్జీవన్రామ్ జయంతిని జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. జగ్జీవన్రామ్ చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి ఎస్పీ మహేశ్ బీ.గీతేతో కలిసి పూలమాలలు వేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూప, జెడ్పీ సీఈవో వినోద్కుమార్, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, ఎస్సీ అభివృద్ధి అధికారి రాజమనోహర్రావు, సీపీవో శ్రీనివాసరావు, ఎల్డీఎం మల్లికార్జున్, మైనింగ్ ఏడీ క్రాంతి, డీపీవో షరీఫొద్దీన్, డీఎంహెచ్వో రజిత పాల్గొన్నారు. జగ్జీవన్రామ్ సేవలు చిరస్మరణీయం – ఎస్పీ మహేశ్ బీ.గీతే సిరిసిల్లక్రైం: జగ్జీవన్రామ్ గొప్ప సంఘసంస్కర్త అని ఎస్పీ మహేశ్ బీ.గీతే కొనియాడారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన జయంతి వేడుకల్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సర్దాపూర్లోని 17వ బెటాలియన్లో జగ్జీవన్రామ్ జయంతి నిర్వహించారు. ఆర్ఐ అడ్మిన్ రమేశ్, ఆర్ఎస్సై సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు రాములోరి పెళ్లి
● రాజన్న సన్నిధిలో ఏర్పాట్లు పూర్తి ● భారీగా తరలివస్తున్న శివపార్వతులు ● మున్సిపల్ తరఫున పట్టువస్త్రాలువేములవాడ: శ్రీరామ నవమి వేడుకలకు శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం ముస్తాబైంది. రాజన్న ఆలయంలో రాములోరి కల్యాణానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే చైర్మన్ చాంబర్ ఎదుట కల్యాణ వేదిక పనులు దాదాపు పూర్తయ్యాయి. ఎండలు ముదరడంతో భక్తుల కోసం చలువ పందిళ్లు వేయించారు. తాగునీటి వసతి ఏర్పాటు చేస్తున్నారు. ఆది వారం ఉదయం 11.55 గంటలకు శ్రీసీతా రాముల కల్యాణోత్సవం నిర్వహణకు ఆలయ అధికారులు సర్వం సిద్ధం చేశారు. శనివారం సాయంత్రం వరకే లక్షకు పైగా భక్తులు వేములవాడకు చేరుకున్నట్లు సమాచారం. భక్తులతో సందడి.. వేములవాడ పట్టణం శనివారం నుంచే భక్తులతో సందడిగా మారింది. ఆలయ ప్రాంగణం శివపార్వతులతో కిక్కిరిసిపోయింది. శివపార్వతుల పూనకాలు, జోగినులు, హిజ్రాల నృత్యాలతో హోరెత్తిపోతోంది. కల్యాణోత్సవాన్ని భక్తులు తిలకించేందుకు ఆలయం ముందు నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు షామియానాలు వేశారు. ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు చైర్మన్ చాంబర్ ఎదుట ఏర్పాటు చేసిన ప్రత్యేక కల్యాణ వేదికపై కనులపండువగా కల్యాణం నిర్వహించనున్నారు. మున్సిపల్ తరఫున పట్టువస్త్రాలు శ్రీసీతారాముల కల్యాణోత్సవానికి స్థానిక మున్సిపల్ తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను అధికారులు, సిబ్బంది ఆలయ అధికారులకు అందజేస్తారు. ఆదివారం ఉదయం 9 గంటలకు ఆలయానికి వచ్చి పురప్రముఖుల ఆధ్వర్యంలో అందజేయనున్నట్లు కమిషనర్ అన్వేశ్ తెలిపారు. శివపార్వతుల కోసం వసతులు రాజన్న ఆలయంలో శ్రీసీతారాముల కల్యాణోత్సవానికి భారీగా శివపార్వతులు, హిజ్రాలు తరలివస్తుంటారు. వీరి కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శివుడిని భర్తగా భావించి వివాహమాడడం ఇక్కడి ఆనవాయితీ. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను ఆలయం తరఫున పూర్తి చేశారు. శివపార్వతుల కోసం ఆలయ ప్రాంతం, జాతరాగ్రౌండ్లలో రాగి వస్తువులు, రుద్రాక్ష, త్రిశూలం, లింగాలు, గంటలు, బాసింగాలు అమ్మేందుకు సిద్ధం చేసి ఉంచారు.భారీగా ఏర్పాట్లు కల్యాణోత్సవానికి రూ.25లక్షలతో ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈఈ రాజేశ్ తెలిపారు. 2 లక్షల లీటర్ల తాగునీటిని అందుబాటులో ఉంచారు. 15 వేల లీటర్ల మజ్జిగను భక్తులకు అందజేయనున్నారు. 25వేల మందికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 11 చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆటోల ద్వారా తాగునీటిని సరఫరా చేయనున్నారు. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు చలువ పందిళ్ల కింద కూలర్లను ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం రథోత్సవం కనుల పండువగా జరగనుంది. ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి ఆధ్వర్యంలో 250 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. -
కార్మికులపై వివక్ష వీడాలి
● సమస్యలు పరిష్కరించకపోతే నిరాహార దీక్ష ● ఫ్లకార్డులతో నేతన్నల నిరసనసిరిసిల్లటౌన్: నేతకార్మికులపై ప్రభుత్వం వివక్ష వీడాలని సీఐటీయూ పవర్లూమ్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూశం రమేశ్ కోరారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే ఈనెల 7 నుంచి 24 గంటల నిరాహార దీక్ష చేపడతామని స్పష్టం చేశారు. సిరిసిల్లలో శనివారం నేతకార్మికులు ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. రమేశ్ మాట్లాడుతూ కార్మికులకు మెరుగైన వేతనం అందేలా కూలీ నిర్ణయించాలని కోరారు. నాయకులు కోడం రమణ, నక్క దేవదాస్, సిరిమల్ల సత్యం, కుమ్మరికుంట కిషన్, ఉడుత రవి, ఒగ్గు గణేశ్, ఎలిగేటి శ్రీనివాస్, సబ్బని చంద్రకాంత్, భాస శ్రీధర్, వేణు, తిరుపతి, రాజు, రాము, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
‘గ్రీన్’ గురుకులాలు
యంగ్ ఇండియా● మంథని, హుస్నాబాద్లో నిర్మాణానికి ప్రభుత్వం టెండర్లు ● సొంతంగా విద్యుత్తు ఉత్పత్తి చేసుకునేలా చర్యలు ● తొలుత ఒక్కో స్కూల్కు రూ.145 కోట్లు వెచ్చించనున్న సర్కారు ● త్వరలో పెద్దపల్లి, రామగుండంలోనూ అందుబాటులోకి ● మంథని మండలం సోమనపల్లిలో 25 ఎకరాలు కేటాయింపు ● డిజిటల్ బోధన, క్రీడా, ఇతర ఆధునిక సదుపాయాలు ● వచ్చే ఏడాది దసరాకు విద్యార్థులకు అందుబాటులోకిసాక్షి ప్రతినిధి, కరీంనగర్: నేటి ఆధునిక కాలానికి అనుగుణంగా బోధనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ (సమీకృత గురుకులాలు) నిర్మాణానికి అడుగులు వేస్తోంది. 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థుల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యనందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 55 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ స్కూళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు రూ.1,100 కోట్లకుపైగా ని ధులు విడుదల చేసింది. అందులో తొలిదశలో ఒక్కో పాఠశాలకు రూ.145కోట్లు చొప్పున వెచ్చించి అత్యాధునిక సదుపాయాలు కల్పించనున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం శనివారం తొలి అడుగు వేసింది. తొలిదశలో భాగంగా ఉమ్మడి జిల్లాలోని మంథని, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో ఈ సమీకృత గరుకులాలను నిర్మించేందుకు టెండర్లు పిలిచింది. త్వరలోనే టెండర్లు ఖరారు చేసి నిర్మా ణం వేగవంతం చేయనున్నారు. ఈ విద్యాలయాల్లో విద్యుత్తు ఉత్పత్తి చేసుకునేలా ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేయబోతుండటం విశేషం. సోలార్పలకల ద్వారా విద్యుత్తు ఉత్పత్తికి చర్యలు చేపడతారు. వచ్చే ఏడాది దసరాకు ప్రారంభం ఈ రెండు స్కూళ్లను రూ.145కోట్లతో నిర్మించాలని ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. టెండర్లు పూర్తి కాగానే మంథని, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో స్కూళ్ల నిర్మాణ ప్రక్రియ మొదలవనుంది. ఇప్పటికే మంథని నియోజకవర్గంలోని సోమనపల్లి వద్ద ప్ర భుత్వం 25 ఎకరాల చొప్పున కేటాయించగా.. మంత్రి శ్రీధర్బాబు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. త్వరలో నిర్మాణాలు ప్రారంభించి.. వచ్చే ఏడాది దసరాకు భవనాల నిర్మాణం పూర్తి చేసి, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి శ్రీధర్బాబు సంకల్పంతో ఉన్నారు. ప్రతీ స్కూల్ కోసం ప్రభుత్వం రూ.200 కోట్లకుపైగా నిధులతో మౌలిక సదుపాయాలు కల్పించనుండటం గమనార్హం.ప్రత్యేకతలు ఇవే! యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ విద్యాలయాలను 25 ఎకరాల సువిశాల స్థలంలో నిర్మిస్తారు. 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా బోధన తరగతి గదులలో డిజిటల్ స్మార్ట్ బోర్డ్, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్ బాల్, టెన్నిస్ క్రీడల కోసం మైదానం, సౌకర్యాలు ప్రతీ స్కూల్లో 2500 పైగా విద్యార్థులు, వీరికి 120 మంది టీచర్లతో బోధన సొంత సోలార్ విద్యుత్తుతో లిప్టులు, వీధిదీపాలు, క్లాస్రూమ్ ఉపకరాణల నిర్వహణనైపుణ్యాలు పెంచేందుకే నేటి పోటీ యుగానికి అనుగుణంగా విద్యార్థులు నైపుణ్యాలు పెంచాలన్న ఉద్దేశంతో సమీకృత గురుకులాలు ప్రారంభిస్తున్నాం. మార్కెట్లో నిలదొక్కుకునేలా నిపుణులైన మానవ వనరులను విద్యార్థి దశ నుంచే తీర్చిదిద్దుతాం. అందుకే, అత్యాధునిక సదుపాయాలతో 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు ఉంటాయి. త్వరలో రామగుండం, పెద్దపల్లి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణ పనులు కూడా మొదలవుతాయి. – మంత్రి శ్రీధర్బాబు -
ముంపు గ్రామాల ప్రజలకు ఉపాధిహామీ
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడఅర్బన్: రుద్రవరంలో ముంపు గ్రామాల ప్రజలకు ఉపాధి హామీ పథకం పనులను శనివారం వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఆ యన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఉపాధి లేక ఇబ్బందిపడుతున్న వారిని చూశానని, అందుకే పనులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. పేద, ధనిక తేడా లేకుండా అందరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలి పారు. జాబ్కార్డు అందించి పని కల్పిస్తామని తెలిపారు. సద్వినియో గం చేసుకోవాలని కోరారు. మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, పార్టీ మండలాధ్యక్షుడు పిల్లి కనకయ్య, ఎంపీడీవో రాజీవ్ మల్హోత్ర, నాయకులు చింతపల్లి శ్రీనివాస్రావు, ఎర్రం రాజు, గాలిపెల్లి స్వామి, ఇటుకల రాజు, పండుగ ప్రదీప్, కదిరె రాజు, పండుగ ప ర్శరాములు, వంగ పర్శరాములు, దే వరాజు, కత్తి కనకయ్య, సత్తయ్య, వంకాయల భూమయ్య పాల్గొన్నారు. -
రాజన్నా నీవే దిక్కు
వేములవాడ: వేములవాడ రాజన్న ఆలయంలో భద్రత కరువైంది. దేశవ్యాప్తంగా ఏ ఆలయంలోకి వెళ్లినా సెల్ఫోన్ల వినియోగం నిషేధమనే బోర్డు కనిపించడమే కాకుండా భద్రత సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేస్తుంటారు. అయితే రాజన్న ఆలయంలోనే ఇలాంటి తనిఖీలు కనిపించవు. సెల్ఫోన్లు వినియోగంచరాదనే బోర్డులు మాత్రమే కనిపిస్తాయి. ఈ బోర్డుల సాక్షిగానే భక్తులు తమ సెల్ఫోన్లలో సెల్ఫీలు దిగుతూ సోషల్మీడియాలో పోస్టు చేస్తుంటారు. ఇదంతా అధికారుల కళ్లముందే జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. అయితే ఆలయంలో విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది సైతం సెల్ఫోన్లు వినియోగిస్తూ కనిపించడం గమనార్హం. ● వేములవాడ ఆలయంలో భద్రత అంతంతే.. ● ఆలయంలో సెల్ఫోన్ల వినియోగం ● అడ్డుకోని ఆలయ అధికారులు ● పనిచేయని సీసీ కెమెరాలు ● అటకెక్కిన డోర్ మెటల్ డిటెక్టర్లుబోర్డులపైనే నిబంధనలు భక్తుల రద్దీ మధ్య నిషేధ బోర్డులు గోడలకే పరిమితమవుతున్నాయి. ఆలయంలోకి వచ్చే ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద ఎలాంటి తనిఖీలు చేపట్టకపోవడంతో ఆలయంలోకి సెల్ఫోన్లు యథేచ్ఛగా వస్తున్నాయి. రాజరాజేశ్వరస్వామి దేవస్థానం ప్రాంగణంలో ‘ఫోటోలు తీయరాదు’, ‘వీడియోలు నిషేధం’ అనే బోర్డులు ఏర్పాటు చేశారు. అయితే అధికారుల తనిఖీలు లేకపోవడంతో భక్తులు యథేచ్ఛగా ఆలయ ప్రాంగణంలోనే సెల్ఫీలు దిగుతూ కనిపిస్తుంటారు. ఈ దృశ్యాలు ఇక్కడ నిత్యకృత్యం. ఏడు దారుల్లో భద్రత ఏదీ ? రాజన్నను దర్శించుకునేందుకు ఆలయంలోకి వెళ్లేందుకు ఏడు దారులు ఉన్నాయి. తూర్పు దిశలో మూడు ద్వారాలు, దక్షిణభాగంలో రెండు, ఉత్తర–దక్షణి భాగాల్లో ఒక్కో దారి ఉంది. ఈ ఏడు దారుల్లోనూ ఎలాంటి భద్రత చర్యలు తీసుకోవడం లేదు. పేరుకు కొంత మంది ఎస్పీఎఫ్ సిబ్బంది, హోంగార్డులు విధులు నిర్వహిస్తూ సెల్ఫోన్లలో తలమునకలవుతున్నారు. కనిపించని మెటల్ డిటెక్టర్లు రాజన్న ఆలయ భద్రత కోసం ఏర్పాటు చేసిన డోర్ మెటల్ డిటెక్టర్లు కనిపించకుండా పోయాయి. కోడెలతో డోర్ మెటల్ డిటెక్టర్లు పాడవుతున్నాయనే సాకుతో వీటిని మూలనపడేశారు. కేవలం హ్యాండ్ మెటల్ డిటెక్టర్లు నామమాత్రంగా పట్టుకుని విధులు నిర్వహిస్తున్నారు. సీసీ కెమెరాలు ఉన్నా లేనట్టే.. రాజన్న ఆలయంలో 12కు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా ఏం ఫలితం లేకుండా పోతోంది. సీసీ కెమెరాల పనితీరును ఎవరూ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. సీసీ కెమెరాలున్నాయన్న ధ్యాస కూడా లేకుండా పోతోంది. ఇటీవల ఓ భక్తుడు తన డబ్బులు పోగొట్టుకుని సీసీ కెమెరాల్లో పరిశీలిస్తే ఏమాత్రం కనిపించలేదు. భద్రత చర్యలు తీసుకుంటాం రాజన్న ఆలయ భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాం. ఎస్పీ, లోకల్ పోలీసులతో చర్చలు జరిపి ఆలయ భద్రత మరింత పెంచేందుకు కృషి చేస్తాం. గతంలో ఏర్పాటు చేసిన మెటల్ డిటెక్టర్లను పునరుద్ధరిస్తాం. ఆలయ భద్రతపై రాజీపడేది లేదు. భక్తుల రక్షణే మా కర్తవ్యం. ఆలయ ఎస్పీఎఫ్ సిబ్బందిని సైతం అప్రమత్తం చేస్తాం. సెల్ఫోన్ల వినియోగంపై కఠినంగా వ్యవహరిస్తాం. – కొప్పుల వినోద్రెడ్డి, రాజన్న ఆలయ ఈవో -
ఇల్లందకుంట రాములోరికి నృసింహుని నుంచి పట్టువస్త్రాలు
ధర్మపురి: కరీంనగర్ జిల్లాలో అపర భద్రాదిగా ప్రసిద్ధి చెందిన ఇల్లందకుంటలో గల శ్రీసీతా రాముల వారి కల్యాణానికి ధర్మపురి శ్రీలక్ష్మి నృసింహస్వామి దేవస్థానం పక్షాన శనివారం పట్టువస్త్రాలు, తలంబ్రాలు పంపించారు. శ్రీరామనవమి వేడుకల సందర్భంగా ఇల్లందకుంటలో ఆదివారం నిర్వహించనున్న స్వామివారి కల్యాణ మహోత్సవానికి ఆలయ ఈవో శ్రీనివాస్, చైర్మన్ జక్కు రవీందర్ పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ముందుగా ఆలయ నుంచి మేళతాళాలతో తరలివెళ్లారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు తదితరులున్నారు. -
విదేశీ బంగారం వ్యవహారంలో ఇద్దరి అరెస్ట్
వేములవాడ: సౌదీ అరేబియా నుంచి బంగారం తీసుకొచ్చి సినీఫక్కీలో కాజేసిన వ్యవహారంలో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి తెలిపారు. స్థానిక పట్టణ పోలీస్స్టేషన్లో శనివారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన రుద్ర రాంప్రసాద్ సౌదీ అరేబియాలోని తన సమీప బంధువు రవీందర్ ద్వారా 400 గ్రాముల బంగారం తెప్పించుకునేందుకు అతనికి రూ.35లక్షలు పంపించాడు. ఈక్రమంలో రవీందర్ తన స్నేహితుడు సౌదీలో ఉంటున్న వేములవాడకు చెందిన కాల్వ వెంకటేశ్కు పరిచయస్తులైన చందుర్తి మండలం జోగాపూర్కు చెందిన తొంటి భీరయ్య, గడ్డం అనిల్తో పంపించాడు. ఈ మొత్తం బంగారంను కాజేయాలని కాల్వ వెంకటేశ్, భీరయ్య, అనిల్ పథకం పన్నారు. ఈ విషయాన్ని వీరు తమ సమీప బంధువు ఇండియాలో ఉన్న ఏనుగుల నాగరాజుకు తెలిపారు. విమానాశ్రయంలో దిగిన వెంటనే నాగరాజుకు బంగారం బిస్కెట్లు ఇవ్వడంతో అతను మొబైల్ఫోన్ స్విచాఫ్ చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. తనకు సంబంధించిన వ్యక్తులకు బంగారం ఇవ్వలేదని మల్లాపూర్కు చెందిన రాంప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈక్రమంలో ఏ1 కాల్వ వెంకటేశ్, ఏ4 నాగరాజు పరారీలో ఉన్నారని, వీరిని పట్టుకునేందుకు ఇద్దరు ఎస్సైలు, నలుగురు కానిస్టేబుళ్లతో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. బీరయ్య, అనిల్ను రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. సౌదీఅరేబియాలో ఉన్న కాల్వ వెంకటేశ్, పరారీలో ఉన్న ఏనుగుల నాగరాజులను కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కస్టమ్స్ అధికారుల కన్నుగప్పి పెద్ద మొత్తంలో బంగారం తీసుకురావడంలో ఇంకా ఏదైనా ముఠా హస్తం ఉందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మొత్తం బంగారం రికవరీ చేయడమే కాకుండా త్వరలోనే మిగిలిన నిందితులను కూడా పట్టుకుంటామని తెలిపారు. వేములవాడటౌన్ సీఐ వీరప్రసాద్, కానిస్టేబుళ్లు ఉన్నారు. పరారీలో మరో ఇద్దరు సినీఫక్కీలో చేతులు మారిన బంగారం వివరాలు వెల్లడించిన ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి -
రైతులు సేంద్రియ వ్యవసాయం చేయాలి
● కేంద్రమంత్రి జితేంద్రసింగ్ మల్లాపూర్: రైతులు సేంద్రియ వ్యవసాయం చేయాలని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలోని ఓ ఫంక్షన్హాల్లో ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సేంద్రియ రైతు సమ్మేళనంలో పాల్గొన్నారు. గ్రామీణ అవార్డులు ప్రదానం చేశారు. మల్లాపూర్ మండలం రాఘవపేటకు చెందిన మెండె శ్రీనివాస్ రూపొందించిన నీరటి రోబో ప్రదర్శనకు కేంద్రమంత్రి చేతులమీదుగా గ్రామీణ అవార్డు అందుకున్నారు. రసాయనాలు వాడితే మట్టిలోని సూక్ష్మజీవుల సంఖ్య తగ్గిపోతుందని, ఇది భవిష్యత్ తరాలకు ముప్పుగా మారుతుందని పేర్కొన్నారు. రెండు బైక్లు ఢీ.. ఇద్దరికి గాయాలుశంకరపట్నం: మండలంలోని తాడికల్ శివారులో శనివారం రెండు మోటర్సైకిళ్లు ఢీకొన్న సంఘటనలో ఇద్దరికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. మండలంలోని తాడికల్ గ్రామానికి చెందిన శ్రీనివాస్చారి కరీంనగర్ నుంచి స్వగ్రామం మోటర్సైకిల్పై వస్తుండగా డీబీఎల్ కంపెనీలో పని చేస్తున్న ఒడిశాకు చెందిన కృష్ణ మోటర్సైకిల్తో ఎదురెదురుగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా 108 సిబ్బంది ప్రథమ చికిత్స చేసి ఆస్పత్రికి తరలించారు. పంచాయతీ కార్యదర్శికి గాయాలు శంకరపట్నం: గుర్తు తెలియని వాహనం ఢీకొని మండలంలోని కన్నాపూర్ పంచాయతీ కార్యదర్శి రాజేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. కన్నాపూర్ గ్రామపంచాయతీలో శనివారం విధులకు హాజరై తిరిగి ఇంటికి బైక్పై వెళ్తుండగా ఆముదాలపల్లి శివారులో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గమనించి 108వాహనంలో హన్మకొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కత్తితో బెదిరించిన వ్యక్తి రిమాండ్సిరిసిల్లక్రైం: సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని ఇప్పలపల్లికి చెందిన సలేంద్రి రాకేశ్ అనే యువకుడు చేతిలో కత్తి పట్టుకొని పలువురిని బెదిరించిన ఘటనలో శనివారం రిమాండ్ చేసినట్లు సీఐ కృష్ణ తెలిపారు. నిందితుడు గతంలో వేములవాడలో ఓ చోరీ కేసులో జైలుకు వెళ్లివచ్చాడు. మళ్లీ కత్తితో శనివారం రాత్రి పలువురిని బెదిరించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలా నికి వెళ్లగా.. వారి విధులకు ఆటంకం కలిగించాడు. దీంతో రాకేశ్ను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. అతని నుంచి పోలీసులు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. -
ఎస్సారెస్పీ భూముల ఆక్రమణ
అధికారుల నిర్లక్ష్యంతోనే అధికారుల నిర్లక్ష్యంతోనే మండలంలో ప్రభుత్వ భూములు ఆక్రమణదారుల చేతుల్లోకి వెల్తున్నాయి. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయినట్లు సంబంధిత అధికారులకు తెలిసినా చర్యలు తీసుకోవడం లేదు. సర్వే చేయించి ఆక్రమదారుల చేతిలో ఉన్న ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలి. – పల్లె మోహన్రెడ్డి బీజేపీ మండల అధ్యక్షుడు నిరుపేదలకు పంచాలి భూమిలేని నిరుపేదలను గుర్తించి ప్రభు త్వ భూములను పంచాలి. ప్రభుత్వం భూపంపిణీ పథకం అమలు చేసి ఆక్రమణదారుల చేతుల్లో ఉన్న భూములను స్వాధీనం చేసుకుని దళితులకు పంచాలి. – బొమ్మెన స్వామి, పెగడపల్లి నోటీసులు జారీ చేస్తాం స్థలం ఆక్రమణకు చేసిన రైతులకు నోటీసులు జారీ చేస్తాం. కాల్వ భూములు ఆక్రమణకు గురయిన మాట వాస్తవమే. ఆక్రమణ చేసిన రైతుల వివరాలను ఉన్నతాధికారలకు నివేదిస్తాం. – స్వామి, ఎస్సారెస్పీ ఏఈ చర్యలు తీసుకుంటాం ప్రభుత్వ భూముల ఆక్రమించడం నేరం. మండలంలో ఉన్న ప్రభుత్వ భూములను పరిశీలిస్తున్నాం. గ్రామాల వారిగా వాటి వివరాలు ఆ యా గ్రామాల పంచాయతీల వద్ద ప్రజలకు తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేస్తాం. – రవీందర్, తహసీల్దార్ పెగడపల్లి: మండలంలోని పలు గ్రామాల్లో విలువైన మంచరాయి, పరంపోగు భూములతోపాటు ఎస్సారెస్పీ స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయి. మండలంలోని పలు గ్రామాల్లో 6,748.01 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అలాగే 1200 ఎకరాల అటవిభూమి ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. ఈ భూములను ఆనుకుని ఉన్న పంటపొలాల రైతులు వాటిని ఆక్రమించుకుని సాగు చేస్తున్నారు. కొందరు ఏకంగా మామిడి తోటలు పెంచుతున్నారు. అయినా సంబంధిత అధికారులు స్పందించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మండలంలోని నంచర్ల శివారులో గొరిగల బోరు సర్వే నంబర్లో 352 ఎకరాలు, దులాల బోరు సర్వే నంబర్ 379లో 272, వెంకటేశ్వర బోరు సర్వే నంబర్ 440లో 68 ఎకరాలు, దోమలకుంటలో టేకుల బోరులో 150 ఎకరాలు, చింతలలొద్దిలో 70 ఎకరాలు, పెగడపల్లి ఆడ్డగుట్ట, ఎల్లాపూర్ తదితర ప్రాంతాల్లో వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూముల్లో కొంతభాగాన్ని వాటిని ఆనుకుని ఉన్న పరిసర ప్రాంతాల రైతులు ఆక్రమించుకున్నారు. కొందరు మామిడి తోటలు పెంచుతుండగా.. మరికొందరు ఇతర పంటలను సాగు చేసుకుంటున్నారు. భూముల ఆక్రమణలను పరిశీలించి వాటిని స్వాధీనం చేసుకోవాల్సి ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఎస్సారెస్పీ భూముల పరిస్థితి కూడా ఇదే విధంగా తయారైంది. కొందరు రైతులు కాల్వ గట్టు అంచు వరకు సాగు చేస్తుండంతో వాటి ఉనికికే ప్రమాదం ఏర్పడింది. మండలంలోని 26 గ్రామాలకు 24 గ్రామాలు ఎస్సారెస్పీ ఆయకట్టు ప్రాంతం పరిధిలో ఉన్నాయి. వందలాది కిలోమీటర్ల పొడవు ఉన్న కాలువల పక్కన ప్రాజెక్టు భూమి ఉంది. కాలువల నిర్మాణ సమయంలో ఇరువైపులా వాహనాలు వెళ్లేందుకు వీలుగా భూమిని వదిలారు. ఎస్సారెస్పీ మేజర్, మైనర్ కాలువలు కొందరు రైతులు ఆక్రమణకు చేసి కాల్వ గట్ల అంచువరకూ సాగు చేస్తున్నారు. 20 ఏళ్ల క్రితం కాలువ లైనింగ్ పనులు చేసిన సమయంలో ఎస్సారెస్పీ భూములు ఆక్రమణకు గురైనట్లు గుర్తించిన అధికారులు ప్రతి 50 మీటర్ల చొప్పున కాలువకు ఇరువైపులా హద్దురాళ్లను కూడా నాటారు. ఇక్కడ భూములకు లక్షల విలువ ఉండటంతో పాటు ఆ ప్రాంతంలో విరివిగా పంటలు పండుతుండటంతో కొందరు రైతులు హద్దురాళ్లను తొలగించి సాగు చేసుకుంటున్నారు. డి–65 నుంచి డీ–83ఏ వరకు 10 వేల ఎకరాల ఆయకట్టు కలిగి ఉంది. వీటి కింద 65, 67, 68, 69, 70, 71, 74, 75, 79, 81 డిస్ట్రీబ్యూటరీ కాల్వలున్నాయి. వీటి కింద 1ఎల్, 2ఆర్, 3ఎల్, 4ఎల్, 5ఎల్, 6ఎల్, డి–83 ఏ కింద 1ఎల్, 2ఎల్, 3ఎల్, 4ఆర్ మైనర్ కాల్వలున్నాయి. మేజర్ కాలువతోపాటు మరికొందరు రైతులు మైనర్ కాల్వ గట్లను కూడా వదలకుండా ఆక్రమించి పంటలు పండిస్తున్నారు. కోట్ల విలువైన భూములు ఆక్రమణకు గురైనట్లు గుర్తించిన అధికారులు వారిపై ఎలాంటి చర్యలకు ఉపక్రమించకపోవడంతో భూ భూఆక్రమణలు యధేచ్ఛగా కొనసాగుతున్నాయి. దీంతో కాల్వల ఉనికికే ప్రమాదం ఏర్పడుతున్నా సంబంధిత అధికారులు చోద్యంచూస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కాల్వల పరిస్థితి ఇలా ఉంటే ప్రాజెక్టు ఆధీనంలో ఉన్నా మొరం గడ్డలు తరుగుతున్నాయి. నిబంధనల ప్రకారం మొరం అవసరమున్న వ్యక్తులు ముందుగానే ఎస్సారెస్పీ పేర కొంత రుసుం చెల్లించి మైనింగ్ శాఖ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. దీనికి విరుద్ధంగా ప్రధాన కాల్వ ఇరువైపులా ఉన్న మొరంగడ్డలను తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తుండటంతో ఎస్సారెస్పీ వేలాది రూపాయల ఆధాయం కోల్పోతోంది. సంబంధిత అధికారులు స్పందించి మొరం గడ్డల మట్టి తరలింపును అడ్డుకోవాలని, ఆక్రమణకు గురైనా ఎస్సారెస్పీ, ప్రభుత్వ భూములను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకోవాలని మండల రైతులు, ప్రజలు కోరుతున్నారు. పట్టించుకోని అధికారులు -
అందని సర్వే గౌరవ వేతనం
రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీవేములవాడ: రాజన్నను ఆదివారం 50 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీరామ నవరాత్రోత్సవాల్లో భాగంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో హోమాలు, పూజలు చేశారు. హైదరాబాద్కు చెందిన మదుకంటి సృజన్–స్వాతి దంపతులు గోశాల, అన్నదానం ట్రస్టులకు కలిపి రూ.3,13,683 చెక్కును ఈవో వినోద్రెడ్డికి అందజేశారు. వేములవాడ అర్బన్ మండలం చింతల్ఠాణాకు చెందిన నిమిశకవి శ్రీకాంత్–స్రవంతి దంపతులు అన్నదాన ట్రస్టుకు రూ.1,41,116 ఏఈవో జయకుమారికి అందజేశారు. ఏఈవోలు బ్రహ్మన్నగారి శ్రీనివాస్, జి.అశోక్కుమార్, పర్యవేక్షకులు శ్రీనివాస్శర్మ, శ్రీకాంతాచార్యులు, ఆలయ ఇన్స్పెక్టర్ రాజేందర్ ఉన్నారు.గంభీరావుపేట(సిరిసిల్ల): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల(సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే) సర్వే చేపట్టి నాలుగు నెలలు గడుస్తోంది. సర్వేలో పాల్గొన్న ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు మాత్రం గౌరవ వేతనం చెల్లించడం లేదు. జిల్లాలో గతేడాది నవంబర్ 9 నుంచి సర్వే కొనసాగింది. సర్వేలో 56 ప్రధానాంశాలతోపాటు ఇతర అనుబంధ అంశాలతో కూడిన సమాచారాన్ని సిబ్బంది ఇంటింటికి తిరిగి సేకరించారు. కాస్త ఇబ్బందులు తలెత్తిన ప్రభుత్వం నిర్ధేశించిన విధంగా సిబ్బంది సర్వేను విజయవంతం చేశారు. జిల్లాలో రూ.1.68 కోట్లు పెండింగ్ జిల్లాలోని 12 మండలాలు.. రెండు మున్సిపాలిటీలు.. 261 గ్రామాల్లో 1,90,626 ఇళ్లను గుర్తించి 1,468 బ్లాక్లుగా చేసి ప్రతీ 150 ఇళ్ల సర్వేకు ఒక ఎన్యూమరేటర్ను నియమించారు. జిల్లా వ్యాప్తంగా 1,488 మంది ఎన్యూమరేటర్లు, 160 మంది సూపర్వైజర్లు సర్వేలో భాగస్వాములయ్యారు. సర్వేలో ఉపాధ్యాయులు, ఆశకార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. ఒక్కో ఎన్యూమరేటర్కు రూ.10వేలు, సూపర్వైజర్లకు రూ.12వేల చొప్పున చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సర్వే పూర్తయి దాదాపు నాలుగు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు నిధులు మంజూరు కాలేదు. 1,488 మంది ఎన్యూమరేటర్లకు రూ.10వేల చొప్పున రూ.1,48,80,000, 160 మంది సూపర్వైజర్లకు రూ.12వేల చొప్పున రూ.19.20 లక్షలు రావాలి. గౌరవ వేతనం విషయంలో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినా నిధులు మంజూరు కాకపోవడంతో సిబ్బంది గౌరవ వేతనం పొందలేకపోతున్నారు. సర్వేలో పాల్గొన్న సిబ్బంది మాత్రం తాము ఎన్నో ఇబ్బందులు పడ్డామని, తమ కష్టాన్ని గుర్తించి ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం గౌరవ వేతనం చెల్లించాలని కోరుతున్నారు. కులగణన సర్వే పూర్తయి నాలుగు నెలలు ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు అందని డబ్బులు -
అలరించిన ‘అల్ఫోర్స్ ఆరేవోయిర్ 2025’
కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్ సూర్యనగర్లోని అల్ఫోర్స్ మహిళా డిగ్రీ కళాశాల ఫేర్వెల్ పార్టీ సంబరాలు ఉత్సాహంగా జరిగాయి. స్థానిక ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శనివారం అల్ఫోర్స్ ఆరేవోయిర్ 2025 పేరిట నిర్వహించిన ఈ వేడుకలను అల్ఫోర్స్ మహిళా డిగ్రీ, పిజి కళాశాల కరస్పాండెంట్ వి.రవీందర్ రెడ్డితో కలిసి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. విద్యార్థులు ఉద్యోగాల్లో రాణించాలంటే విషయ పరిజ్ఞానం ఒక్కటే సరిపోదని, నైపుణ్యాలను పెంపొందించుకోవల్సిన అవసరం ఉందన్నారు. డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులతో పాటు వివిధ బహుళజాతి కంపెనీల్లో ప్రాంగణ నియాకమాల్లో ఎంపికై న విద్యార్థులను జ్ఞాపికలతో సత్కరించారు. కళాశాల ప్రిన్పిల్ గోలి శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్స్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
కార్మికసంఘాలతో అధికారుల చర్చలు విఫలం
● శ్రీరామనవమి తరువాత సంయుక్త చర్చలుసిరిసిల్ల: పవర్లూమ్ కార్మికసంఘాల నాయకులతో చేనేత, జౌళిశాఖ, కార్మిక శాఖ అధికారులు శుక్రవారం చేపట్టిన చర్చలు విఫలమయ్యాయి. నాలుగు రోజులుగా సిరిసిల్లలో నేతకార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్మిక నాయకులతో అధికారులు కలెక్టరేట్లో చర్చలు నిర్వహించారు. పాలిస్టర్ వస్త్రోత్పత్తిలో 2018 నాటి పాతకూలీని ఇస్తున్నారని, కొత్త కూలీ ఒప్పందం చేసుకోకుండా శ్రమదోపిడీకి పాల్పడుతున్నారని కార్మికసంఘాల నాయకులు వివరించారు.పాతకూలీతో కార్మికులు నష్టపోతున్నారని, 2023 నాటి బతుకమ్మ చీరలకు సంబంధించిన కార్మికులకు రావాల్సిన 10 శాతం యారన్ సబ్సిడీ డబ్బులు ఇవ్వాలని కోరారు. వార్పిన్, వైపని కార్మికులకు కూలీ పెంచాలని, మహిళాశక్తి చీరల ఆర్డర్ల కూలీ రేట్లను ముందు ప్రకటించాలని కోరారు. చేనేత జౌళిశాఖ అభివృద్ధి అధికారి రవీందర్రెడ్డి వస్త్రోత్పత్తిదారులతో మాట్లాడి కూలీ సమస్యను పరిష్కరిస్తామని, మహిళాశక్తి చీరల కూలీ రేట్లు వారం, పది రోజుల్లో నిర్ణయిస్తామన్నారు. బతుకమ్మ చీరల 10 శాతం యారన్ సబ్సిడీ డబ్బులకు సంబంధించి తుది నివేదిక సిద్ధమైందని పనిచేసిన కార్మికుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమవుతాయని వివరించారు. ప్రస్తుతం 90 నుంచి 150 కార్ఖానాలు విద్యుత్ బిల్లుల సమస్యలతో బందున్నాయని.. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. సమ్మె విరమించి పనిలోకి వెళ్లాలని కోరారు. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ నజీర్ హైమద్ మాట్లాడుతూ పాలిస్టర్ కూలీ సమస్యపై కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్తో సమావేశం ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. చర్చలు విఫలం కావడంతో శ్రీరామనవమి తర్వాత సమావేశం నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. చర్చల్లో పవర్లూమ్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్, జిల్లా అధ్యక్షుడు కోడం రమణ, వార్పిన్, వైపని కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించే వరకు నిరవధిక సమ్మె కొనసాగిస్తామని కార్మిక సంఘాల నాయకులు ప్రకటించారు. -
5 లక్షల మందికి సన్నబియ్యం
● కలెక్టర్ సందీప్కుమార్ ఝాసిరిసిల్ల: జిల్లాలో ఐదు లక్షల మందికి సన్నబియ్యం అందిస్తున్నామని కలెక్టర్ సందీప్కుమార్ ఝా తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం సన్నబియ్యం పంపిణీపై పౌరసరఫరాల అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 345 దుకాణాల ద్వారా 1,73,578 రేషన్కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలి పారు. ప్రతి నెలా 3,275 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని స్పష్టం చేశారు. అంతకుముందు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, సీఎస్ శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానా యక్, జిల్లా పౌర సరఫరాల అధికారి పి.వసంతలక్ష్మి, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ పి.రజిత పాల్గొన్నారు. అర్హులకు రేషన్కార్డు జారీ చేయాలి ● అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ సిరిసిల్ల: జిల్లాలో అర్హులకు రేషన్కార్డు జారీ చేయాలని అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ కోరారు. కలెక్టరేట్ నుంచి శుక్రవారం పౌరసరఫరాల అధికారులతో కలిసి టెలీకాన్ఫరెన్స్లో రెవెన్యూ అధికారులతో మాట్లాడారు. జిల్లాలో ప్రజాపాలన, మీసేవ, ఇతర మార్గాల ద్వారా రేషన్కార్డులకు వచ్చిన 30,977 దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేశామని, వాటిపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని సూచించారు. దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారి జాబితాను రూపొందించాలని, వాటిపై గ్రామస్తుల నుంచి అభ్యంతరాలు తీసుకుని వాటిని తుది జాబితాను గ్రామసభల ద్వారా ఆమోదింపచేసుకుని రేషన్కార్డు జారీచేయాలన్నారు. సిరిసిల్ల ఆర్డీవో రాధాభాయి, డీిసీఎస్వో పి.వసంతలక్ష్మి పాల్గొన్నారు. -
● ‘బీసీ–ఏ’లోకి మార్చేలా ప్రభుత్వం కృషి ● త్వరలోనే పరేడ్గ్రౌండ్లో భారీ సభ ● కాంగ్రెస్ మెదక్ ఇన్చార్జి నీలం మధుముదిరాజ్ ● ముస్తాబాద్లో ఆత్మీయ సభ
● బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ఐక్యతతోనే ముదిరాజ్లకు రాజ్యాధికారంముస్తాబాద్(సిరిసిల్ల): రాష్ట్రంలోని బీసీ కులాలతోపాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సబ్బండ వర్గాలతో కలిసి ఐక్యంగా పనిచేసి ముదిరాజ్లు రాజ్యాధికారం సాధించుకోవాలని కాంగ్రెస్ మెదక్ ఇన్చార్జి, ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ కోరారు. ముస్తాబాద్ మాతృశ్రీ ఫంక్షన్హల్లో శుక్రవారం నిర్వహించిన ముదిరాజ్ల ఆత్మీయ సమావేశానికి హాజరై మాట్లాడారు. కొన్ని పార్టీలు ముదిరాజ్లను అవమానించాయని, అలాంటి వారికి ఎన్నికల్లో బుద్ది చెప్పామన్నారు. తెలంగాణలో అత్యధిక జనాభా ఉన్న ముదిరాజ్లకు ఇరవై మంది ఎమ్మెల్యేలను గెలిపించుకునే సత్తా ఉందన్నారు. ముదిరాజ్లను బీసీ–డీ నుంచి ‘ఏ’లోకి మార్చేందుకు సిద్దిపేట ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారన్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అని, ముదిరాజ్లను బీసీ–ఏలోకి మార్చేందుకు కృషి చేస్తామన్నారు. బీసీ–ఏలోకి మార్చాక సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్లో భారీ సభ పెడతామన్నారు. ముదిరాజ్ విద్యార్థులను ఉన్నత చదువులకు తీసుకెళ్లేందుకు సహకారం అందిస్తామని తెలిపారు. ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము, మత్స్యకార సొసైటీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రం, బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు పర్శ హన్మాండ్లు, డైరెక్టర్లు గాడిచర్ల దేవయ్య, ముచ్చర్ల శ్రీను, మండలాధ్యక్షుడు పిట్ల రాంగోపాల్, జెల్ల వెంకటస్వామి, గజ్జెల రాజు, మామిండ్ల భూపతి, విఠల్, పిట్టల రవీందర్, పాండు, గొడుగు శంకర్, గీస భిక్షపతి, జాల భిక్షపతి, జింక మల్లేశ్, రంజాన్ నరేశ్ తదితరులు పాల్గొన్నారు.అసమర్థ కాంగ్రెస్పై పోరాడుతాంసిరిసిల్లటౌన్: రాష్ట్రంలో అసమర్థపాలన సాగిస్తున్న కాంగ్రెస్పై పోరాటం చేపడతామని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ పేర్కొన్నారు. సిరిసిల్లలో శుక్రవారం నిర్వహించిన జిల్లా కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా ఉద్యమ కార్యాచరణ రూపొందించి ముందుకెళ్లాలని జిల్లా నేతలకు సూచించారు. ఏప్రిల్ 6న బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంస్థాగతంగా చేయాల్సిన కార్యక్రమాలపై వివరించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చెన్నమనేని వికాస్రావు, కార్యవర్గ సభ్యులు అల్లాడి రమేశ్, కుమ్మరి శంకర్, మ్యాన రాంప్రసాద్, రేగుల మల్లికార్జున్, రవీందర్, దశరథం, రాగుల రాజిరెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ, చంటి మహేశ్, కోనేటి సాయిల్, శీలం రాజు, నాగుల శ్రీనివాస్, బర్కం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
సబ్ప్లాన్ నిధులు పక్కదారి పట్టొద్దు
● ఆర్వోఎఫ్ఆర్ భూసమస్యలు పది రోజుల్లో పరిష్కరించాలి ● రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యసిరిసిల్ల: జిల్లాలో షెడ్యూల్ కులాలు, తెగల అభివృద్ధికి మంజూరయ్యే ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులు పక్కదారి పట్టకుండా చూడాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కోరారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాబునాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, కుశ్రము నీలాదేవి, రేణిగుంట్ల ప్రవీణ్, జిల్లా శంకర్లతో కలిసి కలెక్టరేట్లో శుక్రవారం సమీక్షించారు. కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ జిల్లాలో 4,313 ఎకరాల భూమికి సంబంధించి 6,029 మంది రైతులు పోడుపట్టాలకు దరఖాస్తు చేసుకోగా 1,614 మందికి 2,860 ఎకరాలు పంపిణీ చేశారన్నారు. పెండింగ్లో ఉన్న ఆర్వోఎఫ్ఆర్ భూసమస్యను పది రోజుల్లో పరిష్కరించాలని సూచించారు. జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాలకు రూ.1.08 కోట్లు సింగరేణి నుంచి రావాలని అధికారులు వివరించగా.. సీఎండీతో మాట్లాడుతామని స్పష్టం చేశారు. సబ్సిడీ రుణాలను మంజూరు చేసి యూనిట్లు గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. మరణాలు లేకుండా మాతా శిశు ఆసుపత్రిలో ప్రసవాలను విజయవంతంగా నిర్వహించడంపై చైర్మన్ జిల్లా అధికార యంత్రాంగాన్ని అభినందించారు. సోలార్ ప్యానల్ ఫెన్సింగ్లకు ప్రతిపాదించండి స్కూళ్లు, హాస్టళ్లలో పిల్లల రక్షణకు కుక్కలు, కోతుల సమస్య పరిష్కారానికి సోలార్ ప్యానల్ ఫెన్సింగ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు ఏడు రోజుల్లో సిద్ధం చేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో డైట్మెనూ అందించాలని, స్టడీసర్కిల్లో విద్యార్థులకు అవసరమైన వసతులు కల్పించాలన్నారు. స్వయం ఉపాధి కల్పనలో రాజీవ్ యువవికాసం ద్వారా ఎస్సీ, ఎస్టీ యువతకు రుణాలు అందించాల న్నారు. ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిల్ కోసం నిధుల మంజూరుకు కృషి చేస్తామని వివరించారు. అట్రాసిటీ కేసుల్లో.. మూడేళ్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీపై 233 ఫిర్యాదులు రాగా 233 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని, 136 చార్జిషీట్ దాఖలు చేశామని అధికారులు వివరించారు. జిల్లాలో పెండింగ్ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. అట్రాసిటీ కేసుల్లో చార్జిషీట్ దశలో 57 మందికి రూ.1.28 లక్షల పరిహారం చెల్లించామని, ఇంకా మిగిలిన 194 మంది బాధితులకు చెల్లించాల్సిన రూ.1.45 కోట్లు త్వరగా మంజూరు చేసేలా శ్రద్ధ చూపాలన్నారు. ఉపాధిహామీలో ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం పని కల్పించాలని కోరారు. అనంతరం జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలు చేసుతన్న ప్రభుత్వ కార్యక్రమాల వివరాలను కలెక్టర్ సందీప్కుమార్ ఝా వివరించారు. ఎస్సీ స్టడీ సర్కిల్ కోసం భూమి కేటాయించామని.. భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించాలని కోరారు. ఎస్పీ మహేశ్ బీ.గీతే, వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, సిరిసిల్ల ఆర్డీవో రాధాభాయి, డీఎస్పీ చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు. -
వైద్యసేవలపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
● డీఎంహెచ్వో రజిత చందుర్తి(వేములవాడ): నిరుపేదల వైద్యంపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్వో రజిత హెచ్చరించారు. స్థానిక పీహెచ్సీని శుక్రవారం డీఎంహెచ్వో రజిత, రాష్ట్ర ఎన్సీడీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ సత్యేంద్రనాథ్ తనిఖీ చేశారు. డాక్టర్ సత్యేంద్రనాథ్ మాట్లాడుతూ సంక్రమిత వ్యాధిగ్రస్తుల వివరాలను ఎన్సీడీ పోర్టల్లో నమోదు చేయాలని సూచించారు. ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ సంపత్కుమార్, సీహెచ్వోలు సత్యనారాయణ, బాలచంద్రం, చందుర్తి వైద్యాధికారి వేదాచారి పాల్గొన్నారు. కాంట్రాక్ట్ ఎస్జీటీలుగా నియామకంపై హర్షం సిరిసిల్ల: 2008 డీఎస్సీ మెరిట్ అభ్యర్థులను కాంట్రాక్ట్ ఎస్జీటీలుగా నియమించడంపై హర్షం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ గేట్ వద్ద శుక్రవారం సీఎం రేవంత్రెడ్డి, ప్రభుతవిప్ ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. సన్మార్గంలో పయణించాలి ● శ్రీతుకారాం మహారాజ్ ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ప్రతి ఒక్కరు భక్తిమార్గాన్ని ఎంచుకుని సన్మార్గంలో పయణించాలని శ్రీతుకారాం మహారాజ్ పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేటలోని సత్సంగ సదనంను బైరాపూర్లోని పాండురంగ ఆశ్రమం నుంచి శ్రీతుకారాం మహారాజ్, లక్ష్మణ్ మహారాజ్ బృందం శుక్రవారం సందర్శించారు. సత్సంగ సదనం తరఫున ద్యాప దేవయ్య బృందం సన్మానించారు. తుకారాం మహారాజ్ మాట్లాడుతూ భక్తిశ్రద్ధలతోపాటు పుణ్యక్షేత్రాలను సందర్శించి భగవంతుని కృపకు పాత్రులు కావాలన్నారు. సత్సంగ సదనం భక్త బృందం సభ్యులు పద్మక్క, శ్యామలక్క, బండారి బాల్రెడ్డి, గుర్రపు రాములు పాల్గొన్నారు. బాధిత కుటుంబానికి రూ.50వేల సాయం ● చెక్కు అందజేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బోయినపల్లి(చొప్పదండి): మండల కేంద్రానికి చెందిన టేకు పద్మ–శంకరయ్యల పూరి గుడిసె గురువారం షార్ట్సర్క్యూట్తో దగ్ధమైన విషయం తెలిసిందే. వీరికి ప్రభుత్వం తరఫున రూ.50వేల ఆర్థిక సాయాన్ని శుక్రవారం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చేతులమీదుగా అందజేశారు. తహసీల్దార్ కాలె నారాయణరెడ్డి, ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేశ్యాదవ్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి, భీంరెడ్డి మహేశ్రెడ్డి, కట్ట లచ్చయ్య ఉన్నారు. మెగా జాబ్మేళాకు స్పందన గంభీరావుపేట(సిరిసిల్ల): గంభీరావుపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో శుక్రవారం మెగా జాబ్మేళా నిర్వహించారు. 120 మంది ఇంటర్వ్యూకు హాజరుకాగా 45 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, ప్లేస్మెంట్ ఆఫీసర్ శ్రవణ్కుమార్, కంపెనీల ప్రతినిధుల చేతుల మీదుగా నియామకపత్రాలు అందించారు. -
ఆధ్యాత్మిక శోభితం
మానేరుతీరం..● 6న శ్రీసీతారాముల కల్యాణం ● ముస్తాబైన ఆలయాలు ● నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ● భారీగా తరలిరానున్న భక్తులురాజన్నసిరిసిల్ల జిల్లా ఆధ్యాత్మిక జరిలో ఓలలాడుతోంది. ఏ పల్లెకు పోయిన సీతారాముల కల్యాణోత్సవాలకు ముస్తాబవుతున్న ఆలయాలే కనిపిస్తున్నాయి. మానేరుతీరంలోని గ్రామాల్లో సందడి మరింత ఎక్కువగా ఉంది. ఇప్పటికే రాజన్న ఆలయంలో శ్రీసీతారాముల కల్యాణోత్సవాల్లో భాగంగా రోజుకో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్, కోనరావుపేట మండలం మామిడిపల్లి, ఇల్లంతకుంట మండలం రామాజీపేటల్లోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈనెల 6న కల్యాణోత్సవానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎనిమిది రోజులపాటు జిల్లా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మారుమోగనుంది.60 ఏళ్లుగా కల్యాణోత్సవంమామిడిపల్లి మహిమాన్వితం కోనరావుపేట(వేములవాడ): మండలంలోని మామిడిపల్లిలోని వేములవాడ రాజన్న దత్తత శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ఏటా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. శనివారం నుంచి బ్రహ్మోత్సవాలు మొదలవుతున్నాయి. ఇందుకోసం రాజన్న ఆలయ అధికారుల పర్యవేక్షణలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు కోనరావుపేట, సిరిసిల్ల, వేములవాడతోపాటు భీంగల్, సిరికొండ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. కల్యాణానికి హాజరైన భక్తులకు అన్నదానం ఏర్పాటు చేసినట్లు ఆలయ ఇన్చార్జి నరేందర్ తెలిపారు. మామిడిపల్లి ఆలయంలో ఈనెల 5న ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు 13వ తేదీతో ముగుస్తాయి. 6న శ్రీసీతారాముల కల్యాణం, 13న రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతాయి. -
వ్యవసాయ రంగానికి ఊతం
● సాగు సమస్యలపై బృందాలవారీగా చర్చలు ● ముగిసిన ఉత్తర తెలంగాణ వ్యవసాయ శాస్త్రవేత్తల సదస్సు జగిత్యాలఅగ్రికల్చర్: వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా శాస్త్రవేత్తల పరిశోధనలు కొనసాగుతాయని, పంట పెట్టుబడి ఖర్చులు తగ్గించి, రైతుల ఆదాయం పెంచేలా ప్రణాళికలుంటాయని ఉత్తర తెలంగాణ జోనల్స్థాయి వ్యవసాయ శాస్త్రవేత్తల సదస్సు అభిప్రాయపడింది. జగిత్యాల రూరల్ మండలంలోని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానంలో రెండు రోజులపాటు సాగిన ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజమాబాద్ జిల్లాల వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు, అభ్యుదయ రైతుల సదస్సు శుక్రవారం ముగిసింది. ఈ సదస్సుకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ డీన్ ఆఫ్ రిసెర్చ్ డాక్టర్ ఎన్.బలరాం, డీన్ ఆఫ్ ఎక్స్టెన్సన్ డాక్టర్ ఏకాద్రి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పంటలవారీగా 10 బృందాలు ఏర్పాటు చేసి.. ఆయా పంటల్లో సమస్యలేమిటి, వాటికి ఎలాంటి పరిష్కారాలను చూపాలనే దానిపై శాస్త్రవేత్తలు, రైతులు బృంద చర్చలు జరిపారు. వరిలో నూక శాతం ఎక్కువ లేని, తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి ఇచ్చే వరి రకాలతోపాటు చలి, ఆకుమచ్చ, ఎండాకు తెగులు, సుడి దోమను సమర్థవంతంగా తట్టుకునే వరి రకాలపై మరింతగా పరిశోధనలు చేయాలనే అభిప్రాయం వచ్చింది. పంటలపై వాతావరణ ప్రభావంపై యూనివర్సిటీ వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్ లీలారాణి వివరించారు. గళమెత్తిన రైతులు ఉత్తర తెలంగాణలోని పది జిల్లాల నుంచి హాజరైన రైతులు పలు సాగు సమస్యలను సదస్సు దృష్టికి తీసుకొచ్చారు. రసాయనాలు లేకుండా పంటలు పండించే పద్ధతులపై పరిశోధనలు చేయాలని కోరారు. కోతుల బెడదతో కష్టపడి సాగు చేసిన పంటలు దెబ్బతింటున్నాయని, వీటిపై ఆలోచనలు చేయాలని కోరారు. శాస్త్రవేత్తల సమాధానాలు రైతులు అడిగిన పలు ప్రశ్నలకు శాస్త్రవేత్తలు సమాధానమిచ్చారు. పత్తి పంటను ఎట్టి పరిస్థితుల్లోనూ నవంబర్ వరకు తీసేసి ఇతర పంటను వేసుకోవాలని, లేదంటే గులాబీ పురుగు విజృంభించి నష్టం చేస్తుందని సూచించారు. వరి పంటను అవసరానికి మించి సాగు చేస్తుండటంతో అనేక సమస్యలు వస్తున్నాయని, తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి వచ్చే ఇతర పంటల వైపు రైతులు ఆలోచన చేయాలని కోరారు. -
పిడుగు గుట్టు.. పసిగట్టు!
హుజూరాబాద్: ప్రకృతి వైపరీత్యాలు.. ఈదురుగాలులు.. ఉరుములు మెరుపులతో కూడిన అకాల వర్షాలు. పిడుగుపాట్లు.. ప్రాణనష్టం.. ఆస్తినష్టం.. ఏడాదిలో ఎప్పుడైనా జరగొచ్చు. ముఖ్యంగా వర్షాకాలనికి ముందు అకాల వర్షాలు ఎక్కువగా పడుతాయి. రైతులు ఇబ్బంది పడుతారు. ఉమ్మడి జిల్లాలో పిడుగుపాటు ఘటనలు అనేకంగానే చోటుచేసుకుంటున్నాయి. ఏటా పిడుగుపాటు మరణాలు పదుల సంఖ్యలో నమోదవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో మూగజీవాలు కూడా పెద్ద సంఖ్యలో చనిపోతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అటవీ విస్తీర్ణం ఎక్కువ. ఎత్తైన కొండలు, గుట్టటూ ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో సహజంగానే పిడుగులు పడుతుంటాయి. సముద్ర తీరానికి దూరంగా ఉన్న ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. గాలిలో విచ్ఛిన్నత అధికమైన వాతావరణంలో పిడుగులు పడే అవకాశం ఎక్కువని పరిశోధకులు చెబుతున్నారు. అలర్ట్గా ఉంటే మేలు.. పిడుగుపాటును ముందే తెలుసుకోగలిగితే ప్రాణాలు కాపాడుకోవచ్చు. ప్రమాదాన్ని అరగంట ముందే గుర్తించగలిగే శ్రీదామినిశ్రీ మొబైల్ యాప్ ఉంది. పుణే కేంద్రంగా ఉన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాఫికల్ మెటరాలజీ (ఐఐటీఎం) నాలుగేళ్ల క్రితం దీనిని విడుదల చేసింది. పిడుగుపాటును గుర్తించేందుకు దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో 83 చోట్ల ప్రత్యేక సెన్సర్లు అమర్చారు. యాప్ను ఎలా యూజ్ చేయాలంటే..? ముందుగా ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్లోకి వెళ్లి..దామిని లైట్నింగ్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత పేరు, మొబైల్ నంబర్, అడ్రస్, పిన్కోడ్తో రిజిస్టర్ చేసుకోవాలి. జీపీఎస్ లోకేషన్ తెలుసుకోవడం కోసం యాప్కు పర్మిషన్ ఇవ్వాలి. మీ ప్రాంతంలో పిడుగు పడే అవకాశం ఉందో లేదో తెలుసుకోవడానికి మూడు రంగులను ఐడెంటిఫికేషన్ కలర్స్ కింద చూపిస్తుంది. వాటి ఆధారంగా మీరు ఉన్న చోట పిడుగు పడే ఛాన్స్ ఉంటే ముందే హెచ్చరిస్తుంది. రెడ్ కలర్: మీరు ఉన్న ప్రాంతంలో మరో 7 నిమిషాల్లో పిడుగు పడే అవకాశం ఉంటే ఆ సర్కిల్ ఎరుపు రంగులోకి మారుతుంది. ఎల్లో కలర్: మరో 10–15 నిమిషాల్లో పిడుగుపడే చాన్స్ ఉంటే యాప్లోని సర్కిల్ పసుపు కలర్లోకి చేంజ్ అవుతుంది. బ్లూ కలర్: 18–25 నిమిషాల్లో పిడుగు పడే చాన్స్ ఉంటే ఆ సర్కిల్ బ్లూ కలర్లోకి మారుతుంది. అకాల వర్షాలు.. పిడుగుపాట్లు కొన్ని సందర్భాల్లో పోతున్న ప్రాణాలు జాగ్రత్తలు తీసుకుంటే బటయపడొచ్చంటున్న నిపుణులు పిడుగులపై ‘దామిని’ ముందస్తు హెచ్చరికలు జాగ్రత్తలు పాటిస్తే మేలు వర్షం కురిసినప్పుడు చెట్ల కింద ఉండొద్దు. పిడుగులు పొడవైన చెట్ల మీద పడే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. విద్యుత్ సరఫరా అయ్యే పరికరాలకు (విద్యుత్ స్తంభాలు, సెల్ ఫోన్ టవర్లు, బోర్ పంప్ సెట్లు) దూరంగా ఉండాలి. వాటి నుంచి వచ్చే నీటిని కూడా ఆ సమయంలో ఉపయోగించకూడదు. బహిరంగ ప్రదేశాలలో పిడుగు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పంట పొలాలలో మొబైల్ వాడకూడదు. ఎందుకంటే మొబైల్ నుంచి వచ్చే సిగ్నల్ పిడుగు పడే అవకాశాన్ని ఎక్కువ చేస్తుంది. పాడి పశువులను మేతకు బయటికి తీసుకెళ్లకుండా పశువుల పాకలోనే ఉంచాలి. నల్లని మబ్బులు ఆకాశం అంతటా విస్తరించి భారీ వర్షం కురుస్తున్నప్పుడు రైతులు పంట పొలాలలో తిరగకుండా ఏవైనా భవనాల కిందే తలదాల్చుకునే లాగా చూసుకోవాలి. ఒకవేళ వారికి అందుబాటులో ఏదైనా భవనం లేకపోతే తాము ఉన్నస్థావరంలోనే మోకాళ్లపై కూర్చొని రెండు చెవులను తమ చేతులతో మూసుకోవాలి. ఈ చిత్రంలో శవమై కనిపిస్తున్న ఈయన పేరు రుద్రారపు చంద్రయ్య. ఊరు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం భరత్నగర్. గత ఏడాది మే 16న పొలం పనులకు వెళ్లాడు. ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం స్టార్ట్ అయ్యింది. అంతలోనే వ్యవసాయ పనులు చేస్తున్న చంద్రయ్యపై పిడుగు పడింది. ఆయన అక్కడిక్కడే మృతిచెందాడు. ఇంటిపెద్ద హఠాత్తుగా మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. భార్య, ముగ్గురు కూతుళ్లు ఒంటరివారయ్యారు. –తంగళ్లపల్లి(సిరిసిల్ల) అలెర్ట్గా ఉంటే ప్రమాదాలకు దూరం వాతావరణంలో మార్పులు జరిగి వర్షాలు పడుతాయన్న సమయంలో బయటికి వెళ్లకుండా పనులు ఆపుకుంటే మంచింది. అత్యవసర పనులు ఉండి బయటికి వెళ్లిన సమయంలో దామిని లైట్నింగ్ యాప్ను ఉపయోగించే పిడుగు ఎక్కడ పడుతుందో.. ఏ సమయంలో పడుతుందో పసికట్టవచ్చు. తద్వారా ప్రమాదానికి గురికాకుండా సురక్షితంగా ఉండవచ్చు. – కనకయ్య, తహసీల్దార్, హుజూరాబాద్సూచనలు పాటించాలి జగిత్యాల అగ్రికల్చర్: ఆకాశం మేఘావృతమై బలమైన ఈదురు గాలులతో వర్షం కురిసే సమయంలో పిడుగులు పడుతుంటాయి. వీటికి అయస్కాంత శక్తితో కూడిన విద్యుత్ శక్తి ఉంటుంది. ఇది విపరీతమైన గాలులు వీచినప్పుడు, మేఘాలలోని మంచు కణాల మధ్య రాపిడి జరిగి ఎలక్ట్రికల్ చార్జి విడుదల చేస్తుంది. రెండు మేఘాలు దగ్గరగా వచ్చినప్పుడు మేఘాలలో ఉండే పాజిటివ్ కణాలు బరువుగా ఉండే నెగెటివ్ కణాలను ఆకర్షించుకొని ఆకాశంలో మెరుపులకు దారితీస్తాయి. నెగెటివ్ కణా లు, భూమిలోని పాజిటివ్ కణా లను ఆకర్షిస్తాయి. ఫలితంగా మెరుపులతో పిడుగు పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ సెకండ్కు 100కిపైగా పిడుగులు పడుతున్నాయి. ఏటా పిడుగుపాటుకు గురై 24 వేల మంది చనిపోతున్నారు. రెండు లక్షల మందికి పైగా గాయపడుతున్నారు. – బి. శ్రీలక్ష్మి, వ్యవసాయ వాతావరణ శాస్త్రవేత్త -
మహనీయుల అడుగుజాడల్లో నడుస్తాం
వేములవాడఅర్బన్: మహాత్మాగాంధీ, అంబేడ్కర్ మహనీయుల అడుగుజాడల్లో నడుస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ మున్సిపల్ పరిధి తిప్పాపూర్లో జైబాపు.. జైభీమ్.. జై సంవిధాన్ పాదయాత్రను శుక్రవారం తిప్పాపూర్లో ప్రారంభించి మాట్లాడారు. దేశ ప్రజలను విడగొట్టాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను ఎండకట్టాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కులగణనను పూర్తి చేసి దేశంలో రోల్మోడల్గా నిలిచిందన్నారు. ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి బిల్లు ఆమోదింపజేసుకున్నామని గుర్తు చేశారు. ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద బీసీ సంఘం ఆధ్వర్యంలో బీసీ గర్జన నిర్వహించామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డులపై సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. పార్టీ పట్టణాధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్, సాగరం వెంకటస్వామి, బింగి మహేశ్, పుల్కం రాజు, నాగుల విష్ణు, ఎర్రం రాజు ఉన్నారు. -
రైతులకు అవసరమైన పరిశోధనలకు పెద్దపీట
రైతులకు ఓవైపు సాగులో అవసరమైన సలహాలు, సూచనలందిస్తూ.. మరోవైపు రైతులకు అవసరమైన పరిశోధనలకు పెద్దపీట వేస్తు న్నాం. సాగు నీటి సద్వినియోగం, అధిక దిగుబడినిచ్చే విత్త నాలు, పురుగులు, తెగుళ్ల సస్యరక్షణ చర్యలపై విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నాం. – డాక్టర్ ఎన్.బలరాం, వ్యవసాయ వర్సిటీ డీన్ ఆఫ్ రిసెర్చ్ విస్తరణ సేవలను విస్తృతం చేస్తాం వ్యవసాయంలో వస్తున్న నూతన టెక్నాలజీ, సాగులో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు రైతులకు తెలియజేస్తాం. శాస్త్రవేత్తలు, ఆ యా జిల్లాల వ్యవసాయాధికారులతో సమావేశాలు నిర్వహిస్తాం. శాస్త్రవేత్తలు క్షే త్రస్థాయి సందర్శన చేయడంతోపాటు అక్కడి రై తులు ఎదుర్కొంటున్న వాటిపై పరిశోధనలు చేసి అండగా ఉంటారు. – డాక్టర్ ఏకాద్రి, వ్యవసాయ వర్సిటీ డైరెక్టర్ ఆప్ ఎక్స్టెన్షన్ పెట్టుబడి పెరుగుతోంది వ్యవసాయంలో రోజు రోజుకు సాగు పెట్టుబడి పెరుగుతోంది. దీంతో రైతులకు వచ్చే ఆదాయం గిట్టుబాటు కావడం లేదు. తక్కు వ కాలంలో అధిక దిగుబడి, అధిక ఆదా యం వచ్చే పంటలపై పరిశోధనలు చేయా లని శాస్త్రవేత్తలకు చెప్పాం. – ఏలేశ్వరం శేఖర్, అల్లీపూర్, రాయికల్ మండలం -
ప్రభుత్వ బడిలో మేక బలికి యత్నం
సిరిసిల్ల ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని శివనగర్ కుసుమ రామయ్య హైస్కూల్లో శుక్రవారం తెల్లవారు జామున మేకను బలి ఇచ్చేందుకు ప్రయత్నించడం కలకలం సృష్టించింది. కొందరు వ్యక్తులు పాఠశాలకు మేకను తీసుకొచ్చిన విషయాన్ని గమనించిన స్థానికులు పలువురికి సమాచారం అందించారు. అక్కడికి స్థానికులతోపాటు మీడియా వెళ్లి చూడగా మేకపిల్లను బలి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న పలువురు కనిపించారు. అక్కడే ఉన్న వారిని ఆరా తీస్తే పొంతన లేని సమాధానాలు చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. నూతనంగా అదనపు గది నిర్మిస్తుండడంతో సంప్రదాయబద్ధంగా కార్యక్రమం చేశామంటూ ఒకరు, బోరులో నీళ్లు రాకపోవడంతో పూజ చేశామని మరొకరు.. అసలు మేక ఇక్కడికి రావడానికి తమకు సంబంధం లేదని మరొకరు చెప్పడం గమనార్హం. అయితే గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత వెంకన్న అనే ఉద్యోగి స్కూల్ గేట్ తెరవడంతో కొందరు వ్యక్తులు మేకను తీసుకురావడం పలువురు స్థానికులు గమనించి మీడియాకు తెలియజేశారు. అక్కడికి స్థానికులు, మీడియా చేరుకోవడంతో వెంకన్న అనే వ్యక్తి అక్కడి నుంచి జారుకున్నాడు. దీనిపై మండల విద్యాధికారి రఘుపతిని వివరణ కోరగా పాఠశాలలో మేకను బలివ్వలేదన్నారు .మేకను తీసుకొచ్చిన వ్యక్తులకు పాఠశాలకు సంబంధం లేదని తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ విషయమై జిల్లా విద్యాధికారి జనార్దన్రావు మాట్లాడుతూ పాఠశాలలో ఇలాంటివి జరగడం సరికాదన్నారు. మండల విద్యాధికారి దర్యాప్తు చేపడుతున్నారని.. నివేదిక తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు . స్థానికులు, మీడియా రావడంతో ఆగిన బలి ఉద్యోగుల నుంచి పొంతన లేని సమాధానం ఘటనపై ఎటూ తేల్చని విద్యాశాఖ -
డామిట్.. కథ అడ్డం తిరిగింది
● అక్రమ బంగారం అసలుకే మోసం ● బాధితుడి చిరునామాపై ఆసక్తి ● వేములవాడ ఠాణాలో కేసు నమోదుపై చర్చచందుర్తి(వేములవాడ): బంగారం వ్యాపారంతో డబ్బులు సంపాదించాలనే ఆశలు తలకిందులవుతున్నాయి. దుబాయి, సౌదీ అరేబియాల నుంచి బంగారం తీసుకొస్తే కమీషన్ ముట్టజెప్పే ముఠాలకు కొందరు సరఫరాదారులు బురిడీ కొట్టిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల జిల్లాలో జరిగాయి. తంగళ్లపల్లి మండలం మండపల్లికి చెందిన ఆసాని రాజు చందుర్తి మండలం సనుగులకు చెందిన పులి శ్రీకాంత్ ద్వారా 10 తులాల బంగారం పంపించాడు. ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు తీసుకున్నారని చెప్పి, 10 తులాల బంగారం ఇవ్వకుండా మోసం చేశారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో మూడు నెలల క్రితం శ్రీకాంత్పై తంగళ్లపల్లి ఠాణాలో కేసు నమోదైంది. తాజాగా చందుర్తి మండలం జోగాపూర్కు చెందిన బీరయ్య, అనిల్ కలిసి సౌదీ అరేబియా నుంచి హైదరాబాద్ వరకు బంగారం తీసుకొచ్చేందుకు చెరో రూ.లక్ష చొప్పున ఒప్పందం చేసుకున్నట్లు ప్రచారంలో ఉంది. ఎయిర్పోర్టు దాటిన తర్వాత మూడో వ్యక్తిగా భావిస్తున్న బీరయ్య బావమరిది మోసం చేసి ఎత్తుకెళ్లాడన్న కోణంలో విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం. ఈక్రమంలో ఎన్గల్కు చెందిన వ్యక్తి కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. బాధితుడి అడ్రస్పై ఆసక్తి సౌదీ అరేబియా నుంచి ఎంత బంగారం వచ్చింది.. ఎవరూ పంపారన్న విషయాలపై చర్చలు సాగుతున్నాయి. బంగారం బాధితులు ఎక్కడి వారనే విషయాలను పోలీసులు గుట్టువిప్పడం లేదు. వేములవాడకు చెందిన వ్యక్తి కావడంతోనే ఇక్కడి పట్టణ ఠాణాలో కేసు నమోదై ఉంటుందని స్థానికులు చర్చించుకుంటున్నారు. అయితే నిజాబామాద్ జిల్లా భీంగల్ అని, జగిత్యాల జిల్లా మెట్పల్లి, కోరుట్ల, మల్లాపూర్ ప్రాంతాలకు చెందిన వారు.. అనే ప్రచారం సైతం ఉంది. కేసు విచారణ చేస్తున్న పోలీస్ అధికారి మాత్రం విచారణ పూర్తయ్యే వరకు విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పదుల సంఖ్యలో వ్యాపారులు అక్రమ బంగారం వ్యాపారం చేసే వారు జిల్లాలో పదుల సంఖ్యలో ఉన్నట్లు ప్రచారంలో ఉంది. విదేశీ బంగారాన్ని కొనుగోలు చేయించి 10, 20 తులాల చొప్పున వ్యాపారం చేయించే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. కొందరు హైదరాబాద్ కేంద్రంగా ఈ వ్యాపారానికి తెరలేపగా, మరికొందరు మహారాష్ట్ర ప్రాంతం నుంచి దిగుమతి చేసుకుంటున్నారన్న ప్రచారంలో ఉంది. -
సన్న, దొడ్డు వడ్లను వేరుగా సేకరించాలి
● డీఆర్డీవో శేషాద్రి సిరిసిల్ల: జిల్లాలో ఇందిర క్రాంతి పథం(ఐకేపీ) ద్వారా కొనుగోలు చేసే ధాన్యాన్ని సన్న వడ్లు, దొడ్డు వడ్లను వేర్వేరుగా సేకరించాలని డీఆర్డీవో శేషాద్రి పేర్కొన్నారు. సిరిసిల్ల పద్మనాయక కల్యాణ మండపంలో శుక్రవారం మహిళా సంఘాల ప్రతినిధులు, ఐకేపీ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో 191 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నామన్నారు. సేకరించిన ధాన్యాన్ని వెంటనే రైస్మిల్లులకు తరలించాలన్నారు. మద్ద తు ధరతోపాటు సన్నవడ్లకు అదనంగా రూ.500 బోనస్ను ప్రతీ క్వింటాలుకు చెల్లిస్తార ని వివరించారు. అదనపు డీఆర్డీవో గొట్టె శ్రీని వాస్, డీపీఎం సుధారాణి, శ్రీనివాస్, పౌరసరఫరాల శాఖ అధికారి రాజశేఖర్ పాల్గొన్నారు. యువకుడి ఆత్మహత్యసిరిసిల్లక్రైం: జిల్లా కేంద్రంలోని అంబికానగర్కు చెందిన చింతకుంట దుర్గాప్రసాద్(25) శుక్రవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతిని తండ్రి శ్రీనివాస్ మాట్లాడుతూ.. తన కుమారుడికి ఎవరితోనూ గొడవలు లేవన్నారు. ఇటీవల డిగ్రీ పూర్తి చేసి పై చదువులు, గ్రూప్స్ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడని వివరించాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నాడని రోదించాడు. కుమారుడి మృతితో తల్లి లత కన్నీరుమున్నీరుగా విలపించింది. వృద్ధురాలు.. ముస్తాబాద్(సిరిసిల్ల): అనారోగ్య సమస్య భరించలేక ఓ వృద్ధురాలు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై గణేశ్ తెలిపిన వివరాలు. మండలంలోని బందనకల్కు చెందిన పాతూరి మల్లవ్వ(54) ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైంది. నెల రోజుల క్రితం సిద్దిపేటలోని ఓ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నా ఆరోగ్యం కుదుట పడలేదు. ఈక్రమంలోనే భర్త రాంరెడ్డితో కలిసి శుక్రవారం ఉదయం పొలం వద్దకు వెళ్లింది. భర్త పశువులకు మేత వేసేందుకు వెళ్లగా.. అదే సమయంలో మల్లవ్వ అక్కడే ఉన్న చెట్టుకు తాడుతో ఉరివేసుకుంది. భర్త తిరిగి వచ్చి చూసేసరికి మల్లవ్వ విగతజీవిగా చెట్టుకు వేలాడడంతో షాక్కు గురయ్యాడు. భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. నీట మునిగి వ్యక్తి మృతి జగిత్యాలక్రైం: వ్యవసాయబావిలో మునిగిన పంప్సెట్ను తీసుకువచ్చేందుకు వెళ్లిన వ్యక్తి మృతిచెందిన సంఘటన జగిత్యాల రూరల్ మండలం అంతర్గాంలో చోటుచేసుకుంది. చెన్నవేని గంగాధర్ వ్యవసాయబావిలో విద్యు త్ మోటారు పడిపోయింది. దీన్ని తీసేందుకు శుక్రవారం గ్రామానికే చెందిన బత్తిని వెంకటి (51)ని తీసుకెళ్లాడు. విద్యుత్ మోటారు తీసే క్రమంలో ఊపిరాడక వెంకటి మృతిచెందాడు. -
అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు
● ఎస్పీ మహేశ్ బీ.గీతేసిరిసిల్ల: జిల్లాలో అసాంఘిక శక్తులపై కఠిన చర్యలుండాలని, తీవ్రమైన నేరాల్లో శిక్షపడేలా విచారణ జరగాలని ఎస్పీ మహేశ్ బీ.గీతే పేర్కొన్నారు. జిల్లా పోలీస్ ఆఫీస్లో గురువారం పోలీసు అధికారులతో సమీక్షించారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రతీ కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉండాలన్నారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన విచారణ పూర్తి చేసి కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేయాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై నిఘా ఉంచాలన ఆదేశించారు. కోర్టు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ల నిందితులను, తప్పించుకుని తిరుగుతున్న నేరస్తులను కోర్టు ఎదుట హాజరుపరచాలన్నారు. గంజాయి, పేకాట, పీడీఎస్ రైస్ అక్రమ రవాణా, గుడుంబా వంటి చట్టవ్యతిరేకమైన నేరాలను కట్టడి చేయాలని సూచించారు. టెక్నాలజీని వినియోగించుకొని సైబర్ కేసులను చేధించాలని తెలిపారు. వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, సీఐలు వెంకటేశ్వర్లు, వీరప్రసాద్, శ్రీనివాస్, మధుకర్, నాగేశ్వరావు పాల్గొన్నారు. -
సన్నబియ్యం పంపిణీ దేశానికే ఆదర్శం
● చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంబోయినపల్లి(చొప్పదండి): ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝాతో కలిసి బోయినపల్లిలో సన్నబియ్యం పంపిణీని గురువారం ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో దొడ్డు బియ్యం తినలేక అమ్ముకునే వారని పేదల కడుపు నింపడానికి సీఎం రేవంత్రెడ్డి సన్నబియ్యం పంపిణీకి ముందుకొచ్చారన్నారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝా మాట్లాడుతూ సన్నబియ్యం పక్కదారి పట్టకుండా సివిల్ సప్లయ్, పోలీస్శాఖ చూడాలని ఆదేశించారు. మండలంలో 33,141 మంది లబ్ధిదారులు ఉన్నట్లు తెలి పారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన 40 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.10.44 లక్షల మేర సీఎమ్మార్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఆర్డీవో రాజేశ్వర్, డీఎస్వో అనంతలక్ష్మి, తహసీల్దార్ కాలె నారా యణరెడ్డి, ఎంపీడీవో భీమ జయశీల, సింగిల్విండో చైర్మన్లు జోగినిపల్లి వెంకట్రామారావు, ముదుగంటి సురేందర్రెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కూస రవీందర్, మండల అధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి, ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేశ్యాదవ్, సెస్ డైరెక్టర్ కొట్టెపెల్లి సుధాకర్, వీసీ నిమ్మ వినోద్రెడ్డి, భీంరెడ్డి మహేశ్రెడ్డి ఉన్నారు. డేరింగ్ కలెక్టర్ సిరిసిల్ల జిల్లాకు డేరింగ్ కలెక్టర్గా సందీప్కుమార్ ఝా పని చేస్తున్నారని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. ప్రజల సమస్యలు తీరుస్తూనే భూకబ్జాదారుల వెన్నులో వణుకు పుట్టిస్తూ ప్రభుత్వ భూములు కాపాడుతున్నారని అభినందించారు. రేషన్ డీలర్ల కమీషన్ పెంచండి తమ సమస్యలు పరిష్కరిండంతోపాటు కమీషన్ పెంచాలని కోరుతూ మండల రేషన్ డీలర్ల సంఘ నాయకులు ఎమ్మెల్యే, కలెక్టర్లకు వినతిపత్రం ఇచ్చారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కమీషన్ పెంచాలని కోరారు. డీలర్ సంఘ నాయకులు ఎర్ర నర్సయ్య, డబ్బు వెంకటరెడ్డి, తుంగపల్లి మదు, రాజయ్య, నిర్మల, భాస్కర్, అమ్మాయి ఉన్నారు. -
‘రాజీవ్ యువవికాసం’ రుణాలివ్వాలి
● బ్యాంకర్లతో కలెక్టర్ సందీప్కుమార్ ఝాసిరిసిల్ల: జిల్లాలో రాజీవ్ యువ వికాసం పథకం అమలుకు బ్యాంకర్లు లక్ష్యం మేరకు రుణాలు అందించాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా కోరారు. కలెక్టరేట్లో గురువారం బ్యాంకర్లతో సమీక్షించారు. సబ్సిడీ రుణాలు, బ్యాంకు లింకేజీని వేగంగా చేయాలన్నారు. అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, యూబీఐ రీజినల్ హెడ్ అపర్ణ, ఎస్బీఐ రీజినల్ మేనేజర్ వెంకటేశ్, ఎల్డీఎం మల్లికార్జున్ పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లపై.. జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపికై న గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లను వేగంగా గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్ కోరారు. కలెక్టరేట్లో ఇందిరమ్మ ఇళ్లపై సమీక్షించారు. సిరిసిల్ల మున్సిపాలిటీతోపాటు 12 మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి 1,023 ఇళ్లను మంజూరు చేశామన్నారు. లబ్ధిదారులు వేగంగా పనులు ప్రారంభించేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో పూర్తయి ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం అర్హులైన పేదలు ఆన్లైన్లో ఈనెల 13లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇన్చార్జి డీఆర్వో రాధాబాయి, హౌసింగ్ పీడీ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ధరణి దరఖాస్తులు పరిష్కరించాలి జిల్లాలో పెండింగ్లో ఉన్న 408 ధరణి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. 13 మండలాల్లో 331 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, ఆర్డీవోల వద్ద 61, అదనపు కలెక్టర్ వద్ద 16 దరఖాస్తులు ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. పోరాట స్ఫూర్తికి ప్రతీక దొడ్డి కొమురయ్య భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం పోరాడిన యోధుడు దొడ్డి కొమురయ్య అని కలెక్టర్ సందీప్కుమార్ ఝా పేర్కొన్నారు. తొలి తెలంగాణ అమరవీరుడు దొడ్డి కొమురయ్య జయంతిని కలెక్టరేట్లో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ భూమి కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన దొడ్డి కొమురయ్య పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకుసాగాల్సిన అవసరం ఉందన్నారు. అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రాజమనోహర్రావు, జెడ్పీ సీఈవో వినోద్కుమార్, సీపీవో శ్రీనివాసాచారి, గొల్ల, కురుమ సంఘాల నాయకులు ఏనుగుల కనకయ్య, సంబ లక్ష్మీరాజం పాల్గొన్నారు. రాజన్న సేవలో కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ వేములవాడ: రాజన్నను కలెక్టర్ సందీప్కుమార్ ఝా, అడిషనల్ కలెక్టర్ ఖీమ్యానాయక్ గురువారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం అవకాశం కల్పించారు. అనంతరం వేదోక్త ఆశీర్వచనం గావించారు. -
నేతన్నల డిమాండ్ల సాధనకు పోరాటం
● పవర్లూమ్స్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు రమేశ్ సిరిసిల్లటౌన్: పనికి తగిన కూలీ లేకుండా శ్రమదోపిడీకి గురవుతున్న నేతకార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతామని పవర్లూమ్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూశం రమేశ్ పేర్కొన్నారు. కార్మికుల కూలీ పెంపునకు చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం మూడో రోజుకు చేరింది. కార్మికులు ఆందోళన చేపడుతున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టు చేయగా ఠాణాలో నిరసనలు తెలిపారు. ప్రభుత్వం వద్ద చీరల ఉత్పత్తికి ఆర్డర్ తెచ్చుకున్న యాజమాన్యాలకు రేటు నిర్ణయించిన ప్రభుత్వం కార్మికుల కూలి నిర్ణయించలేదన్నారు. బతుకమ్మ చీరల కూలి కంటే తక్కువ ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎగమంటి ఎల్లారెడ్డి, అన్నల్దాస్ గణేశ్, సిరిమల్ల సత్యం, ఒగ్గు గణేశ్, నక్క దేవదాసు, గుండు రమేశ్, సబ్బని చంద్రకాంత్, ఎక్కల్దేవి జగదీశ్, ఉడుత రవి తదితరులున్నారు. -
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం
తంగళ్లపల్లి/ఇల్లంతకుంట: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట దళారుల పాలవుతోందని తెలుపుతూ గురువారం ‘ధాన్యం దళారులపాలు’ శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమవగా పౌరసఫరాల శాఖ అధికారులు స్పందించారు. జిల్లాలో 238 ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేటా యించామని, ఈనెల రెండోవారంలో ప్రారంభిస్తామని తెలిపారు. ధాన్యం ఆరబెట్టి తేమశాతం 17 అంతకంటే తక్కువగా ఉంటే కొనుగోళ్లు చేస్తామని తెలిపారు. ట్రేడ్ లైసెన్సుల పేరుతో అక్రమ వసూళ్లు : కమిషనర్ సిరిసిల్లటౌన్: పురపాలక సంఘం ఉద్యోగుల పేరుతో కొందరు కమర్షియల్ షాపుల నిర్వాహకులకు ఫోన్కాల్స్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఎవరూ కూడా అలాంటి ఫోన్కాల్స్కు స్పందించొద్దని మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య కోరారు. 63043 26727, 70916 01526 నంబర్ల నుంచి కాల్స్ వస్తున్నట్లు పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్లపై అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇలాంటి ఫోన్కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. -
వాళ్లు అనర్హులే!
● కోర్టు సబార్డినేట్ పోస్టుల్లో ఓవర్ క్వాలిఫై అభ్యర్థులు ● మొత్తం 25 మంది అనర్హులుగా గుర్తింపు ● వెలువరించిన కోర్టు.. స్వాగతిస్తున్న నిరుద్యోగులు ● ఫలించిన ‘సాక్షి’ వరుస కథనాల పోరాటంసాక్షిప్రతినిధి,కరీంనగర్: గతంలో జరిగిన కోర్టు సబార్డినేట్ పోస్టుల విషయంలో ‘సాక్షి’ వరుస కథనాలు నిజమయ్యా యి. అటెండర్ స్థాయి పోస్టులకు అధిక విద్యార్హ త (ఓవర్క్వాలిఫైడ్) ఉన్న వ్యక్తులు అక్రమంగా పరీక్షలు రాసి ఎంపికయ్యారంటూ రెండేళ్ల క్రితం ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించిన మాట విధి తమే. తమకు అన్యాయం జరిగిందని, అనర్హులు ఉద్యోగాలకు ఎంపికవడాన్ని సవాలు చేస్తూ పలు వురు ఈ కథనాల ఆధారంగా న్యాయస్థానాలను ఆశ్రయించారు. పోలీసు యంత్రాంగం విచారణ జరిపింది. పలువురు తాము అధిక విద్యార్హతలు కలిగి ఉన్నామని అంగీకరించి, స్వచ్ఛందంగా తప్పుకుని, ఉద్యోగానికి రాబోమని రాసి ఇచ్చారు. మరికొందరు తమకు ఏమవుతుందిలే అన్న ధీమాతో కొలువుల్లో చేరారన్న ఆరోపణలు ఉన్నాయి. తరువాత కాలంలోనూ అవి వెలుగుచూడటంతో వారిని కూడా తొలగించారు. సంచలనం రేపిన ‘సాక్షి’ కథనాలు.. 2019లో నిర్వహించిన కోర్టు సబార్డినేట్ పరీక్షకు అర్హత పదో తరగతి ఫెయిల్ ఉండాలని నిబంధ న ఉంచారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 96 పోస్టులకు ఈ పరీక్ష నిర్వహించారు. తొలుత 1:3 రేషియోలో మొత్తం 318 మందిని పిలిచిన అధికా రులు.. 93 మందితో తుదిజాబితా ప్రకటించా రు. ఈ అభ్యర్థుల్లో పలువురు ఓవర్ క్వాలిఫైడ్ అని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో చాలా మంది తమ అర్హతలను తగ్గించి చూపించారు. తాము 10వ తరగతి ఫెయిల్ అని కొందరు, అసలు తాము 9వ తరగతితోనే చదువు ఆపేశామని చెప్పుకుని మరికొందరు పరీక్ష రాశారు. అధికారులను నమ్మించేందుకు అప్పటికే మూతబడి ఉన్న చాలా స్కూళ్ల నుంచి బోనఫైడ్ సర్టిపికెట్లను దొడ్డిదారిలో తెచ్చుకుని మరీ సమర్పించారు. దీంతో అవే స్కూళ్లలో చదివి.. ఉద్యోగం రాని వారు.. తమతోపాటు వారు చదవలేదని ఆందోళనలకు దిగారు. ఈ విషయాన్ని పలుమార్లు ‘సాక్షి’వరుస కథనాల ద్వారా ఎత్తిచూపింది. అనంతర కాలంలో ఓ మహిళా ఉద్యోగి గ్రాడ్యుయేట్ అన్న విషయాన్ని గుర్తించిన అధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకుని, ఉద్యోగం నుంచి తప్పించడం గమనార్హం. రెండేళ్ల తరువాత విడుదలైన జాబితా.. వీరందరి రిక్రూట్మెంట్ ప్రక్రియ 2022లో మొదలైన దరిమిలా.. ఈ దుమారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. అనర్హులు (ఓవర్ క్వాలీ ఫైడ్) తమ పొట్ట కొడుతున్నారని ఉద్యోగాలు రాని, పది ఫెయిలై పరీక్ష రాసిన వారంతా ఆందోళనలకు దిగారు. తాము ఆందోళనలు చేసిన ఇన్నేళ్ల తరువాత 25 మందితో కరీంనగర్ కోర్టు నుంచి అనర్హుల జాబితా విడుదల కావడంపై 2019లో పరీక్ష రాసిన అభ్యర్థులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ 25 మందిలోనూ ము గ్గురు రిక్రూట్మెంట్కు గైర్హాజరయ్యారని, ఒకరు ఫామ్నింపలేదని, ఒకరు ఉద్యోగంలో చేరి రాజీ నామా చేశారని, మరో ముగ్గురు పోస్టులో చేరడానికి ఆసక్తి చూపలేదని పేర్కొన్నారు. మిగిలిన 17 మంది మాత్రం అధిక విద్యార్హతలు కలిగి ఉన్నారని విడుదల చేసిన జాబితాలో స్పష్టంచేశారు. దీంతో ఎట్టకేలకు తమ పోరాటం ఫలించిందని న్యాయాధికారుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ జాబితాకు సంబంధించిన కాపీ ప్రస్తుతం కరీంనగర్ కోర్టు వెబ్సైట్లో అందుబాటులో ఉంది. మాకు అవకాశం కల్పించాలి కరీంనగర్ కోర్టు ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. మేం తొలి నుంచి చెప్తున్న విషయం రెండేళ్ల తరువాత నిజమవడం సంతోషం. ఉద్యోగాల్లో చేరని, ఓవర్ క్వాలిఫైడ్ అభ్యర్థుల స్థానంలో తరువాత మెరిట్లో నిలిచిన నిజమైన అభ్యర్థులకు స్థానం కల్పించాలని ప్రార్థిస్తున్నాం. – రమేశ్, హుజూరాబాద్, నిరుద్యోగి -
క్రీడలు మానసికోల్లాసాన్నిస్తాయి
● సీనియర్ సివిల్ జడ్జి రాధికా జైస్వాల్ వేములవాడ: క్రీడలు మానసికోల్లాసాన్నిస్తాయని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి రాధికా జైస్వాల్ పేర్కొన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో వేములవాడలో నిర్వహిస్తున్న క్రికెట్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ పోటీలను గురువారం ప్రారంభించారు. మహిళా వైద్యులతో కలిసి కాసేపు క్రికెట్ ఆడారు. విజయం సాధించిన లయన్స్ లెజెంట్స్ టీమ్కు బహుమతులు అందజేశారు. కేసీఆర్కు రాజన్న ప్రసాదం వేములవాడ: మాజీ సీఎం కేసీఆర్కు బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు గురువారం ఎర్రవెల్లి ఫామ్హౌస్లో మర్యాదపూర్వకంగా కలిశారు. వేములవాడ రాజన్న ప్రసాదాన్ని అందజేశారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ నిర్వహణ నేపథ్యంలో పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో చల్మెడ పాల్గొన్నారు. ఆరోగ్య పథకాలపై అవగాహన కల్పించాలి ● డీఎంహెచ్వో రజిత తంగళ్లపల్లి(సిరిసిల్ల): జాతీయ ఆరోగ్య పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్వో రజిత సూచించారు. మండల కేంద్రంలోని పీహెచ్సీ సిబ్బందితో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యసిబ్బందికి పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ప్రోగ్రాం అధికారి సంపత్, రామకృష్ణ, పీహెచ్సీ మెడికల్ అధికారి అఫీజా, సిబ్బంది పాల్గొన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు కృషి వేములవాడఅర్బన్: రాజ్యాంగ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని జైభీమ్.. జైబాపు..జై సంవిధాన్ జిల్లా ఇన్చార్జి అవేజ్, మండల ఇన్చార్జి చంద్రకళ పేర్కొన్నారు. వేములవాడ మున్సిపల్ పరిధి నాంపల్లిలో గురువారం నిర్వహించిన పాదయాత్రలో మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రాజ్యంగాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది అని పేర్కొన్నారు. మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ కనికరపు రాకేశ్, పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్, కూరగాయల కొమురయ్య, చిలివేరి శ్రీనివాస్, బొజ్జ భారతి ఉన్నారు. లాఠీచార్జీపై వినూత్న నిరసన సిరిసిల్లటౌన్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులపై లాఠీచార్జీని నిరసిస్తూ గురువారం స్థానిక చేనేతచౌక్ వద్ద బీఆర్ఎస్వీ నాయకులు మోకాళ్లపై కూర్చున్నారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవిగౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు శాంతి యుతంగా నిరసన తెలిపితే లాఠీచార్జీ చే యడం సిగ్గుచేటన్నారు. విద్యార్థులతో పెట్టుకున్న ఏ సర్కారు నిలబడినట్లు చరిత్రలో లేదన్నారు. మట్ట శ్రీనివాస్, ముద్దం అనిల్, కాస ర్ల వినయ్, దేవరాజ్, ముజ్జు, నవీన్, గణేష్, రాజు, వినయ్, నరేశ్, వేణు, మోహన్, పరమేశ్, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. -
ఐరిస్ నమోదు చేస్తూ ధాన్యం కొనుగోళ్లు
● డీఆర్డీవో శేషాద్రిసిరిసిల్ల: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో రైతుల ఐరిస్(కంటిపాప)ను నమోదు చేయాలని డీఆర్డీవో శేషాద్రి సూచించారు. స్థానిక పద్మనాయక కల్యాణ మండపంలో గురువారం ధాన్యం కొనుగోళ్లపై మహిళా సంఘాల సభ్యులకు శిక్షణ ఇచ్చారు. డీఆర్డీవో మాట్లాడుతూ ధాన్యం సేకరణలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, ప్యాడీక్లీనర్తో శుద్ధిచేసిన వడ్లను వ్యవసాయ విస్తరణ అధికారి ధ్రువీకరించిన తర్వాతే సేకరించాలని సూచించారు. సన్న వడ్లను, దొడ్డు వడ్లను వేర్వేరుగా సేకరించాలన్నారు. సేకరించిన ధాన్యాన్ని కేటాయించిన రైస్మిల్లులకు వెంటనే తరలించాలన్నారు. అదనపు డీఆర్డీవో గొట్టె శ్రీనివాస్, డీపీఎంలు సుధారాణి, ఎం.శ్రీనివాస్, పౌరసరఫరాల ఆఫీస్ అధికారి రాజశేఖర్, జిల్లా సమాఖ్య ప్రతినిధులు, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, కోనరావుపేట, రుద్రంగి, చందుర్తి, గంభీరావుపేట ఏపీఎంలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్చార్జీలు, బుక్కీపర్లు పాల్గొన్నారు. -
సన్న బియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి
● అడిషనల్ కలెక్టర్ ఖీమ్యా నాయక్ కోనరావుపేట(వేములవాడ): పేద, మద్యతరగతి ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యం పథకాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అడిషనల్ కలెక్టర్ ఖీమ్యానాయక్ కోరారు. బుధవారం మండలకేంద్రంలోని రేషన్ దుకాణంలో సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించి మాట్లాడారు. గతంలో ఇచ్చిన బియ్యాన్ని కొందరు వినియోగదారులు దళారులకు అమ్ముకున్నారన్న ఆరోపణలు ఉన్నాయన్నారు. కానీ ఇప్పుడు ఇస్తున్న సన్న బియ్యాన్ని అమ్ముకోకుండా సద్వినియోగపర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్వో వసంతలక్ష్మి, తహసీల్దార్ వరలక్ష్మి, డెప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్కుమార్, ఏఎంసీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, వైస్ చైర్మన్ ప్రభాకర్, డైరెక్టర్లు నాయిని ప్రభాకర్రెడ్డి, లింభయ్య, కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ ఫిరోజ్పాషా, నాయకులు బొర్ర రవీందర్, గోపాల్, గొట్టె రుక్మిణి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. సర్టిఫికెట్లు త్వరగా జారీ చేయాలి వివిధద అసవసరాల నిమిత్తం సర్టిఫికెట్లు కోసం వస్తున్న విద్యార్థులు, నిరుద్యోగ యువకులకు జాప్యం చేయకుండా త్వరగా జారీ చేయాలని అడిషనల్ కలెక్టర్ ఖీమ్యా నాయక్ అన్నారు. కోనరావుపేట తహసీల్దార్ కార్యాలయాన్ని బుధవారం సందర్శించారు. కార్యాలయంలో రికార్డులు తనిఖీ చేసిన అనంతరం మాట్లాడారు. రాజీవ్ యువ వికాసం పథకానికి అనేక మంది నిరుద్యోగ యువతీయువకులు దరఖాస్తు చేసుకుంటున్నారని, ఈ నెల 14 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఆదాయం, కులధ్రువీకరణ పత్రాల కోసం కార్యాలయానికి, వారితో పాటు ఉన్నత విద్య కోసం విద్యార్థులు కూడా వస్తారని, జాప్యం చేయకుండా సర్టిఫికెట్లు జారీ చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ వెంట తహసీల్దార్ వరలక్ష్మి, డెప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్కుమార్, ఆర్ఐ రాజశేఖర్ ఉన్నారు. -
రూ.16వేల వరకు రావాలి
నేను జాపర్ పని చేసేవాడిని. అప్పట్లో పని లేక సాంచాలు నడిపి బతుకమ్మ చీరల బట్టనేశాను. రూ.16వేల వరకు యారన్ సబ్సిడీ డబ్బు రావాలి. నా భార్య కవిత బీడీలు చేస్తుంది. ఇప్పుడు పని చేద్దామంటే కార్ఖానాలు బంద్ ఉన్నాయి. చేతిలో డబ్బు లేక ఇబ్బంది అవుతుంది. జౌళిశాఖ అధికారులు సబ్సిడీ సొమ్ము అందించి ఆదుకోవాలి. – కొంక విజయ్కుమార్, రాజీవ్నగర్ బంగారం అమ్మి అప్పు కట్టిన నేను సిరిసిల్ల శాంతినగర్లో గంగుల శ్రీనివాస్ వద్ద బతుకమ్మ చీరల బట్టను నేశాను. రూ.23వేల వరకు సబ్సిడీ డబ్బులు రావాలి. ఆర్నేళ్లుగా పని లేక అప్పులపాలయ్యా. నా భార్య అంబవ్వ బంగారం అమ్మి అప్పులు కట్టిన. పని లేక, చేతిలో పైసలు లేక పొట్టకు వెళ్తలేదు. చాలా ఇబ్బందిగా ఉంది. సబ్సిడీ డబ్బులు వస్తే కొద్దిగానైనా మా బాధలు తీరుతాయి. – సిరిసిల్ల పోచయ్య, నేత కార్మికుడు నివేదిక సిద్ధంగా ఉంది 2023 నాటి బతుకమ్మ చీరలు నేసిన కార్మికుల వివరాలు, వారు నేసిన బట్ట సమాచారం సిద్ధంగా ఉంది. 4,500 మంది కార్మికులకు సుమారు రూ.5 నుంచి రూ.6 కోట్లు యారన్ సబ్సిడీ చెల్లించాల్సి ఉంటుంది. నివేదిక సిద్ధంగా ఉంది. ఉన్నతాధికారులు కోరగానే పంపిస్తాం. సబ్సిడీ చెల్లింపులు మా పరిధిలో లేదు. ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. – రాఘవరావు, చేనేత, జౌళిశాఖ ఏడీ, సిరిసిల్ల -
పన్ను వసూళ్లలో సిరిసిల్ల స్ఫూర్తి
● రాష్ట్రస్థాయిలో బల్దియాకు తృతీయస్థానం ప్రజల సహకారంతో.. 15వ ఆర్థికసంఘం నిధులు పొందేందకు అర్హత సాధించాం. పన్ను వసూళ్లలో ప్రజల సహకారం బాగుంది. ప్రత్యేక అధికారిగా కలెక్టర్ ఆదేశాలు, సూచనలతో వసూళ్లు చేపట్టాం. గతంలో కౌన్సిలర్లు సహకరించగా, ప్రస్తుతం వారి పదివికాలం ముగియడంతో కలెక్టర్ సూచనలతో ముందుకెళ్లాం. – సమ్మయ్య, మున్సిపల్ కమిషనర్, సిరిసిల్ల సిరిసిల్లటౌన్: ఆస్తిపన్ను వసూళ్లలో సిరిసిల్ల బల్దియా గత స్ఫూరిని కొనసాగించింది. ఆస్తి పన్ను వసూళ్లలో ఎనిమిదేళ్లుగా ఆదర్శంగా నిలుస్తుంది. ప్రస్తుతం రాష్ట్రస్థాయిలో తృతీయ స్థానాన్ని కై వసం చేసుకుంది. ప్రజలు బల్దియాకు పన్నుదన్నుగా నిలవడంతో ఈ కీర్తిని సాధించింది. సంస్థ ఆర్థిక వ్యవస్థ పటిష్టం చేయడంలో ప్రత్యేక అధికారి, కలెక్టర్ నేతృత్వంలో బల్దియా సిబ్బంది అమలు చేస్తున్న క్రియాశీలక విధానాలు ఇందుకు మూలకారణంగా నిలిచాయి. పటిష్ట ప్రణాళికతో.. ప్రత్యేక పాలనాధికారి కలెక్టర్ దిశానిర్దేశంలో ఆస్తి పన్ను విషయంలో మున్సిపల్ సిబ్బంది టార్గెట్ స్థాయిని చేరుకుంది. అధికారులు ఎప్పటిలాగే ప్రణాళిక బద్ధంగా వసూళ్లు చేపట్టారు. ప్రజలు ఈసారి కూడా బాధ్యతతో ఆస్తిపన్ను చెల్లించారు. గతేడాది 39 వార్డుల్లో కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది పక్కా ప్రణాళికతో ఇంటింటికీ తిరిగి నూరుశాతం వసూళ్లు చేయగా, ప్రస్తుతం పాలకవర్గం గడువు తీరడంతో అధికారులు పటిష్ట ప్రణాళికతో పన్ను వసూళ్లు చేశారు. గతేడాది 99.52 శాతం పన్ను వసూలు చేసి ప్రథమ స్థానంలో నిలవగా.. ఈసారి 96.99 శాతంతో తృతీయ స్థానంలో నిలవడం విశేషం. వసూళ్ల కోసం 39 వార్డుల్లో 14మంది బిల్కలెక్టర్లతో గ్రూపులు ఏర్పాటు చేశారు. రోజూ ఉదయం, సాయంత్రం వేళ పన్ను వసూలు చేశారు. బల్దియా పన్ను లక్ష్యం రూ.6.32 కోట్లు ఉండగా, కమిషనర్ సమ్మయ్య నేతృత్వంలో సిబ్బంది ఫిబ్రవరి ఆరంభం నుంచే వసూళ్ల పనిలో పడ్డారు. సిరిసిల్ల బల్దియా ట్యాక్సుల స్వరూపం ప్రైవేటు ఆస్తులు 22,989 ప్రభుత్వ ఆస్తులు 67 ట్రేడ్లైసెన్స్ ఫీజులు 1,587 వాటర్ ట్యాక్సులు 12,492 అడ్వర్టైజ్మెంట్, తైబాజర్ 281 బల్దియా దుకాణ గదులు 175 -
సర్దార్ పాపన్నకు కలెక్టర్ నివాళి
సిరిసిల్ల: సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్కు బుధవారం కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఘనంగా నివాళి అర్పించారు. పాపన్న వర్ధంతిని కలెక్టరేట్లో జిల్లా బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. పాపన్నగౌడ్ నాటి పాలకులపై తిరుగుబాటు చేసిన తీరును, ఆయన చేసిన సేవలను కలెక్టర్ కొనియాడారు. జెడ్పీ సీఈవో వినోద్కుమార్, బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజమనోహర్రావు, ఎల్డీఎం మల్లికార్జున్రావు, గౌడ సంఘం నాయకులు పులి లక్ష్మీపతి, బొల్గం నాగరాజు, రంగు రాములు, ముష్కం తిరుపతి, బీసీ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. అర్హులకు మంజూరు చేస్తున్నాంఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): గిరిజన భూములను సాగులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘గిరివికాసం’ పథకంపై జిల్లా అధికారులు అవగాహన కల్పించడం లేదని ‘సాక్షి’లో ‘భూములు బీళ్లుగానే’ శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. జిల్లా వ్యాప్తంగా 67 బ్లాకులకు అర్జీలు వస్తే.. 7 బ్లాకుల్లో బోర్లు వేయించినట్లు తెలిపారు. 2 బ్లాకులలో విద్యుత్ కనెక్షన్ మంజూరు చేశామని, 2 బ్లాకులలో మోటార్ సాంక్షన్ చేసినట్లు వివరించారు. 51 బ్లాకులకు వివిధ సాయిల్లో అనుమతులు పెండింగ్ ఉన్నాయని వివరించారు. 9 బ్లాకులు 5 ఎకరాలలోపు ఉండడం, ఇది వరకే నీటి వసతి ఉండడంతో ఆ దరఖాస్తులను తిరస్కరించినట్లు పేర్కొన్నారు. రుద్రంగి మండలం వీరునితండా గ్రామంలోని బ్లాకులలో వేసిన బోరుబావులకు సంబంధించి బిల్లులు రూ.1,45,345 హైదరా బాద్ స్థాయిలో పెండింగ్ ఉన్నట్లు వెల్లడించారు. ప్రణాళికతో చదవాలితంగళ్లపల్లి(సిరిసిల్ల): ప్రణాళికతో చదివి ఉత్తమ మార్కులు సాధించాలని జిల్లా విద్యాధికారి జ నార్దన్రావు అన్నారు. బుధవారం తంగళ్లపల్లి ప్ర భుత్వ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చే శారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనాన్ని ప రిశీలించారు. 9వ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ, భాషపై పట్టుసాధించి, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలని, జీవితంలో ఉన్నతంగా ఎదగాలని సలహాలు ఇచ్చారు. ఇప్పటి నుంచే పదో తరగతి పరీక్షలకు ప్రణాళికతో సంసిద్ధం కావాలన్నారు. అనంతరం ఎన్ఎంఎంఎస్ సాధించిన విద్యార్థి శివతేజ్ను అభినందించారు. ప్రశాంతంగా ‘పది’ పరీక్షలుసిరిసిల్లఎడ్యుకేషన్: జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు బుధవారంతో పూర్తయ్యాయి. చివరి రోజు సోషల్ పరీక్షకు 14 మంది గైర్హాజరు అయినట్లు జిల్లా విద్యాధికారి జనార్దన్రావు తెలిపారు. జిల్లాలో 35 పరీక్షా కేంద్రాల్లో 6,767 మంది విద్యార్థులకు 6,753 మంది హాజరైనట్లు, ప్రశాంతంగా జరిగినట్లు వివరించారు. విలాసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, వేములవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసినట్లు తెలిపారు. విస్తృతర పచారం చేయాలిసిరిసిల్లకల్చరల్: సీనియర్ సిటిజన్ల సంక్షేమ చట్టంపై విస్తృతంగా ప్రచారం చేయాలని సీనియర్ సిటిజన్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.నరసింహారావు సూచించారు. బుధవారం ఆన్లైన్ సమావేశంలో మాట్లాడారు. ప్రజల్లో ఈ చట్టంపై పూర్తి అవగాహన పెరిగేలా క్షేత్ర స్థాయిలో కార్యాచరణ రూపొందించాలని పేర్కొన్నారు. ఇప్పటికే సంబందిత చట్టంలోని అంశాలను కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తున్నామని, వృద్ధులకు సంబంధించిన కేసుల పరిష్కారంలో సహకరిస్తున్నామని జిల్లా శాఖ నుంచి సమావేశంలో పాల్గొన్న జనపాల శంకరయ్య పేర్కొన్నారు. -
రోడ్డెక్కిన నేతన్నలు.. రెండో రోజుకు సమ్మె
సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రంలో నేతన్నలు రోడ్డెక్కారు. వస్త్ర పరిశ్రమ, అనుబంధ రంగాల కార్మికుల కూలి పెంపు కోరుతూ చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం రెండోరోజుకు చేరింది. సీఐటీయూ ఆధ్వర్యంలో పట్టణంలో బైక్ర్యాలీ నిర్వహించగా వందలాది సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. ప్రధాన వీధుల గుండా ర్యాలీగా వచ్చి కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా వక్తలు మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ స్పందించి కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించి సమ్మె విరమింపజేయాలని కోరారు. కార్మికుల సమస్యలను వివరిస్తూ కలెక్టరేట్ ఏవోకు వినతిపత్రం అందజేశారు. పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూశం రమేశ్, నాయకులు కోడం రమణ, సిరిమల్ల సత్యం, ఒగ్గు గణేశ్ తదితరులు పాల్గొన్నారు. -
వస్త్ర పరిశ్రమపై సెస్ పాలకుల కక్ష
సిరిసిల్లటౌన్: వస్త్ర పరిశ్రమపై సెస్ పాలకులలు రాజకీయ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని అఖిల భారత పద్మశాలీ సంఘం జాతీయ అధ్యక్షుడు కందకట్ల స్వామి అన్నారు. బుధవారం సిరిసిల్లలోని చేనేత వస్త్ర వ్యాపార సంఘంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ సర్కారు నేత కార్మికులకు పనులు కల్పించాలన్న ఉద్దేశంతో ఎస్ఎస్హెచ్ సంఘాలకు 8కోట్ల మీటర్ల వస్త్రోత్పత్తి ఆర్డర్లు ఇస్తుంటే సెస్ పాలకవర్గం కోర్టు కేసు పేరుతో సిరిసిల్లలోని సుమారు 8వేల పవర్లూమ్స్కు విద్యుత్ కనెక్షన్లు తొలగించడం సరికాదన్నారు. విద్యుత్ సబ్సిడీ బకాయిలను ప్రభుత్వం చెల్లిస్తుందని, ఈమేరకు మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు విన్నవించడం జరిగిందన్నారు. నేతన్నలకు సెస్ అండగా నిలువాల్సింది పోయి గత బీఆర్ఎస్ ప్రభుత్వ ధోరణిలోనే కక్ష సాధింపు చర్యలకు దిగడం శోచనీయమన్నారు. వస్త్ర పరిశ్రమ వర్గాలు ఏలాంటి ఆందోళనకు గురికావొద్దని సూచించారు. సంఘం కార్యదర్శి గడ్డం జగన్నాథం, తెలంగాణ అధ్యక్షుడు మురళి, తాటిపాముల దామోదర్, ఆంకారపు రవి, ఆడెపు భాస్కర్, గౌడ రాజు తదితరులున్నారు. -
బీజేపీ వైపు రమేశ్బాబు..?
వేములవాడ: వేములవాడ ఎమ్మెల్యేగా నాలుగుసార్లు గెలుపొందిన చెన్నమనేని రమేశ్బాబుకు గత ఎన్నికల్లో పౌరసత్వం కేసు అంశంతో బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకుండా చల్మెడ లక్ష్మీనర్సింహారావుకు కేటాయించింది. దీంతో అసంతృప్తిలో ఉన్న రమేశ్బాబు అసెంబ్లీ ఎన్నికల అనంతరం జర్మనీ వెళ్లిపోయారు. ఇటీవల కుటుంబ సభ్యులతో వేములవాడకు వచ్చారు. ఈక్రమంలో మార్చి 8న రమేశ్బాబును ఆయన నివాసంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, పట్టణ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్ కలవడంతో నియోజకవర్గంలో చర్చ మొదలైంది. రమేశ్బాబు బీజేపీలో చేరుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. ఈ అంశంపై ‘సాక్షి’ రమేశ్బాబు వ్యక్తిగత సహాయకుడిని సంప్రదించగా కేవలం గాసిప్స్ అంటూ దాటవేశారు. ఇదే విషయాన్ని నేరుగా రమేశ్బాబును వ్యాట్సాప్ ద్వారా సంప్రదించగా అవునని సమాధానం చెబుతున్నారు. దీంతో ఆయన పార్టీ మారేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో.. రమేశ్బాబు ఇటీవల వేములవాడకు చేరుకోగా, తన అనుచరులతో భవిష్యత్ రాజకీయాలపై సుదీర్ఘ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అనంతరం ఫ్యామిలీతో ఢిల్లీ పర్యటనకు వెళ్లి అక్కడ బీజేపీ పెద్దలను కలిసినట్లు సమాచారం. అయితే రమేశ్బాబు బీజేపీలో చేరి తన చిన్నాన్న విద్యాసాగర్రావు కుమారుడు చెన్నమనేని వికాస్రావుకు మద్దతుగా నిలుస్తారా..లేక తనకే టికెట్ అడుగుతారా.. అన్న సందేహాలు స్థానికంగా ఊపందుకున్నాయి. ఇటీవల ఆపార్టీ నాయకులు తన నివాసంలో కలవడంతో జోరందుకున్న రాజకీయం బీజేపీలో పెరుగుతున్న పోటీ -
పని లేదు.. పైసల్లేవు
● పొట్టకూటి కోసం తిప్పలు ● ఇది సిరిసిల్ల నేతకార్మికుల దైన్యస్థితి ● శ్రమఫలం కోసం నేతన్నల నిరీక్షణ ● రెండేళ్లుగా ఎదురుచూపులు ● పది శాతం యారన్ సబ్సిడీ కోసం పడిగాపులు‘సాంచాలు నడుపుతూ వస్త్రోత్పత్తి చేస్తున్న ఇతడి పేరు కోడం బాలకిషన్. సిరిసిల్లలోని ఓ కార్ఖానాలో 12 సాంచాలపై పాలిస్టర్ వస్త్రాన్ని ఉత్పత్తి చేస్తూ నెలకు రూ.8వేలు సంపాదిస్తున్నాడు. నిత్యం సాంచాల మధ్య 10 గంటల పాటు పని చేస్తేనే ఈ మాత్రం కూలి లభిస్తుంది. అదే బతుకమ్మ చీరల బట్ట నడిపితే నెలకు రూ.16వేల వరకు వచ్చేది. ఇప్పుడు బతుకమ్మ చీరల ఆర్డర్లు లేవు. 2023లో బతుకమ్మ చీరలు నేసిన బాలకిషన్కు ప్రభుత్వం కూలి సర్దుబాటులో భాగంగా అందించే 10 శాతం యారన్ సబ్సిడీ సొమ్ము రావాల్సి ఉంది. రెండేళ్లుగా ఆ పైకం రాలేదు. సబ్సిడీ సొమ్ములు ఎప్పుడు వస్తాయోనని నిరీక్షిస్తున్నాడు.. ఇలా ఇతనొక్కడే కాదు.. సుమారు ఆరువేల మంది పవర్లూమ్ కార్మికులు యారన్ సబ్సిడీ కోసం పడిగాపులుగాస్తున్నారు’. -
హనుమాన్ జయంతి వాల్పోస్టర్ ఆవిష్కరణ
వేములవాడఅర్బన్: వేములవాడ మండలం అగ్రహారం శ్రీహనుమాన్ ఆలయంలో ఈనెల 12న నిర్వహించే జయంతి, రథోత్సవాల ఉత్సవాల వాల్ పోస్టర్ను మంగళవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఆలయ ఈవో నాగరపు శ్రీనివాస్, ఆలయ వ్యవస్థాపక వంశీయ ధర్మకర్త గౌరిశెట్టి మహేందర్, మాజీ ధర్మకర్త చేపూరి నాగరాజు, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు. వేధింపులకు గురైతే షీ టీంకు ఫిర్యాదు చేయండిసిరిసిల్ల క్రైం: మహిళలు వేధింపులకు గురైతే షీ టీంలకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ మహేశ్ బి గీతే అన్నారు. జిల్లాలోని విద్యాసంస్థలు, మహిళలు పనిచేసే ప్రదేశాల్లో విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తూ సేవలందిస్తున్నట్లు తెలిపారు. గడిచిన నెల రోజుల వ్యవధిలో మహిళలను వేధిస్తున్న వారిపై 2 కేసులు, 7 పెట్టి కేసులు నమోదు చేశామని అన్నారు. వేధింపులకు గురైతే వెంటనే 87126 56425 ఫిర్యాదు చేయాల సూచించారు. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభంసిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రం శివారులోని సర్దాపూర్ మార్కెట్ కమిటీ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఏఎంసీ చైర్పర్సన్ వెల్ముల స్వరూపరెడ్డి ప్రారంభించారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని కోరారు. ధాన్యం క్వింటాల్కు రూ.2,320తో పాటు రూ.500 బోనస్ ఇస్తున్నట్లు తెలిపారు. చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు దుబాల వెంకటేశం, ఆడెపు జగన్, వెల్ముల తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. హెచ్సీయూ భూముల రక్షణకు పోరాటంఇల్లంతకుంట: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల పరిరక్షణకు పోరాటం చేస్తామని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు గన్నారం నర్సయ్య, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మంద అనిల్ అన్నారు. మంగళవారం తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకొని వదిలి పెట్టిన అనంతరం వారు మాట్లాడారు. తమను అదుపులోకి తీసుకొని వదిలేయడం ఎందుకని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజాపోరాట నాయకులపై నిర్బంధం పెరిగిందన్నారు. ప్రభుత్వం డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనపై దృష్టి సారించాలని కోరారు. -
● ఇది దేశంలోనే ప్రథమం ● రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
సిరిసిల్ల: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, కానీ కొన్ని పథకాలు మానసికంగా ఎంతో సంతోషాన్ని ఇస్తాయని, పేదలకు సన్నబియ్యం ఇవ్వడం మానసికంగా సంతోషాన్ని ఇచ్చిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిరిసిల్ల కొత్త బస్టాండు సమీపంలోని ఇందిరానగర్ రేషన్ షాపులో సన్నబియ్యం పంపిణీకి మంగళవారం శ్రీకారం చుట్టారు. దేశంలోనే తొలి మనరాష్ట్రంలో పేదలకు సన్నబియ్యం ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలోని 17,263 రేషన్షాపుల్లో సన్నబియ్యం ఇవ్వ డం సంతోషంగా ఉందని తెలిపారు. మహిళామణులను కోటీశ్వరులుగా చేయాలని సదుద్దేశంతో ఇప్పటికే ఇందిరా మహిళా శక్తి కింద వివిధ యూ నిట్లు ప్రారంభించామని అన్నారు. అలాగే సోలార్ యూనిట్లు మహిళా సంఘాలకు బస్సులు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. సన్న వడ్లు పండించే రైతులకు ప్రతీ క్వింటాలుకు రూ.500 బోనస్ ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని వివరించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస మాట్లాడుతూ జిల్లాలోని 345 రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించామన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి, కలెక్టర్ సందీప్కుమార్ ఝా, ఎస్పీ మహేశ్ బి గితే, అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, ఆర్డీవో రాధాబాయి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూపారెడ్డి, డీఎస్ వో వసంతలక్ష్మీ, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రజిత, కాంగ్రెస్ నాయకులు చొప్పదండి ప్రకాశ్, సంగీతం శ్రీనివాస్, గడ్డం నర్సయ్య, సూర దేవరాజు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. మంత్రిని కలిసిన వస్త్రోత్పత్తిదారులు సిరిసిల్లకు వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ను వస్త్రోత్పత్తిదారులు కలిసి విద్యుత్ బిల్లుల సమస్యను వివరించారు. ‘సెస్’ అధికారులు బ్యాక్ బిల్లింగ్ పేరిట కరెంట్ బిల్లులు విధించారని, 126 కార్ఖానాలు మూతపడ్డాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆడెపు భాస్కర్, ప్రతినిధులు గోవిందు రవి, పద్మశాలీ సంఘం అధ్యక్షులు గోలి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటై అడ్డంకులు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటై రాష్ట్రంలో ప్రజాపాలనకు అడ్డంకులు సృష్టిస్తున్నాయని, ఆ రెండు పార్టీలు కవలపిల్లలని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ)కి సంబంధం లేని గోపనపల్లి, కంచ శివారుల్లోని 400 ఎకరాల ప్రభుత్వ భూములను అభివృద్ధి చేస్తుంటే.. విద్యార్థులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధిపొందాలని చూస్తున్నారని ఆరోపించారు. -
‘ఉపాధి’ భరోసా కరువు
● పనిచేసినా అందని వేతనాలు ● పనులు లేక దిక్కులు చూస్తున్న కూలీలు ● కొత్త జాబ్కార్డుల ఊసే లేదు ● పట్టించుకోని అధికారులు ‘ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్కు చెందిన మానస జాబ్కార్డు కోసం రెండేళ్ల క్రితం దరఖాస్తు చేసుకుంది. కొద్ది రోజుల తర్వాత జాబ్కార్డు వచ్చిందని పంచాయతీ అధికారి చెప్పడంతో గతేడాది వేసవిలో నాలుగు రోజులు ఉపాధిహామీలో చేపట్టిన కాల్వ పనులకు వెళ్లింది. కానీ ఆ డబ్బులు ఇప్పటి వరకు రాకపోగా.. అసలు జాబ్కార్డు మంజూరు కాలేదని అధికారులు చెబుతున్నారు. చేసిన శ్రమ వృథా కావడంతోపాటు జాబ్కార్డు మంజూరు కాలేదు.’ ‘ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్కు చెందిన పూదరి సతీశ్ గతేడాది వేసవిలో ఉపాధి హామీలో చేపట్టిన కాల్వ పూడికతీత పనులకు వెళ్లాడు. వారానికి పైగా కాల్వ పనులు చేశాడు. ఏడాది గడుస్తున్నా డబ్బులు తన ఖాతాలో జమకాలేదు. డబ్బుల కోసం పంచాయతీలోని ఉపాధిహామీ సిబ్బందిని అడిగినా డబ్బులు రావడం లేదు. ఉపాధికార్డుల వివరాలు మొత్తం జాబ్కార్డులు 98,130 జాబ్కార్డుల కోసం దరఖాస్తులు 56 పనిచేసిన కుటుంబాలు 51,088 పనిచేసిన కూలీలు 75,756 కల్పించిన పనిదినాలు 21,88,092 ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): గ్రామాల్లో వలసల నివారణ, పేదలకు ఉన్న ఊరిలోనే పని చూపెట్టి.. ఆర్థికంగా స్థిరత్వం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పథకం ఉద్దేశం అమలు కావడం లేదు. పనిచేసినా పైసలు రాకపోగా.. పనిచేద్దామని జాబ్కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటే మంజూరు కావడం లేదు. ఈ విషయమై ఉపాధిహామీ అధికారులను అడిగినా సమాధానం రావడం లేదు. దీంతో చేసేదేమి లేక జిల్లాలోని చాలా మంది కూలీలు ఇతర ప్రాంతాలకు వెళ్లి పనులు చేసుకుంటున్నారు. జిల్లాలో ఉపాధిహామీ పథకం అమలుపై ‘సాక్షి’ ఫోకస్. కార్డుల సంఖ్యను మించని కూలీలు రాజన్నసిరిసిల్ల జిల్లాలో 255 గ్రామాల్లో 98,130 జాబ్కార్డులు ఉన్నాయి. కొత్తగా జాబ్కార్డుల కోసం 56 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇంతకుమించి దరఖాస్తు చేసుకున్నా అధికారుల రికార్డుల్లో నమోదు కాలేవని క్షేత్రస్థాయిలో తెలుస్తోంది. జిల్లాలో గతేడాది కాలంగా జిల్లా వ్యాప్తంగా 51,088 కుటుంబాలకు ఉపాధిహామీ పనులు కల్పించారు. ఆయా కుటుంబాల్లోని 75,756 మంది కూలీలు 21,88,092 పని దినాలకు హాజరయ్యారు. అయితే ఉపాధి పనులకు హాజరైన కూలీల సంఖ్య జాబ్కార్డుల సంఖ్యను మించకపోవడం గమనార్హం. గ్రామాల్లో పని కావాలని కూలీలు ఎదురుచూస్తున్నా పనులు చూపెట్టడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. గ్రామాల్లో పని లేక అడ్డా కూలీలుగా.. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో సరైన ఉపాధి దొరక్క చాలా మంది కూలీలు సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లోని భవన నిర్మాణ పనులకు వెళ్తున్నారు. నిత్యం ఉదయం సిరిసిల్ల, వేములవాడల్లోని లేబర్ అడ్డాలను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తోంది. సిరిసిల్ల నుంచి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలోని గ్రామాల నుంచి కూడా కూలీలు ఉదయమే వెళ్తున్నారంటే గ్రామాల్లో పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తెల్లవారుజామునే సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లోని లేబర్ అడ్డాలకు చేరుకుంటున్న కూలీల్లో కొందరికి మాత్రమే పనులు దొరుకుతున్నాయి. పని దొరకని వారు ఉసూరుమంటూ ఇళ్లకు తిరిగివస్తున్నారు. ఇలా ఆ రోజు తమ రవాణా ఖర్చులు భరించాల్సిందే. పని దొరక్కపోగా.. ఆటో, బస్సు చార్జీలు భరించడం కూలీలకు భారంగా మారుతోంది. జాబ్కార్డుల కోసం దరఖాస్తులు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది కొత్తగా జాబ్కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే రెండేళ్ల క్రితం దరఖాస్తు చేసుకున్న వారికి కూడా జాబ్కార్డులు రాలేదని సమాచారం. దీంతో వారు ఉపాధిహామీ పనులకు వెళ్లలేకపోతున్నారు. అధికారుల లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా చాలా తక్కువ సంఖ్యలోనే దరఖాస్తులు వచ్చినట్లు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మూడు, నాలుగు రెట్లు అదనంగా దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. తక్కువకు తక్కువ గ్రామానికో దరఖాస్తు వచ్చినా 255 దరఖాస్తులు ఉంటాయి. కానీ అధికారులు మాత్రం చాలా తక్కువ చెబుతున్నారు. త్వరలోనే వస్తాయి జాబ్కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కొత్త ఆర్థిక సంవత్సరంలో మంజూరవుతాయి. మూడు, నాలుగు వారాల వేతనాలు మాత్రమే పెండింగ్ ఉన్నాయి. కొందరికి ఆధార్నంబర్ మ్యాచ్ కాకపోవడంతోనే దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉంటాయి. వారివి కూడా పరిష్కరిస్తాం. – కొమురయ్య, ఏపీవో, ఎల్లారెడ్డిపేట -
రూ.10వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం
సిరిసిల్ల: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో రూ.10వేల కోట్లతో రాజీవ్ యువవికాసం పథకానికి రూపకల్పన చేసిందని కలెక్టర్ సందీప్కుమార్ ఝా అన్నారు. కలెక్టరేట్లో మంగళవారం జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇచ్చిన శిక్షణలో మాట్లాడారు. జిల్లాలో అర్హులైన ప్రతీ ఒక్క యువకుడికి అవకాశం కల్పించాలన్నారు. మండలాల్లోని తహసీల్దార్లు కులం, ఆదాయం సర్టిఫికెట్ల జారీపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎంపీడీవో, మున్సిపల్ ఆఫీస్ల్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయాలన్నారు. గడువులోగా వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసి మండల్ లెవెల్ కమిటీకి పంపిస్తారని వివరించారు. ఆ కమిటీ పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాత జిల్లా కమిటీకి పంపిస్తారని వెల్లడించారు. అనంతరం అర్హులు ఎంపిక చేసుకున్న రుణాలకు సంబంధించిన శిక్షణను అందజేస్తారని తెలిపారు. ఈ పథకంపై ప్రచారం కల్పించి అర్హులకు అందేలా చూడాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈవో వినోద్కుమార్, ఆర్డీవో రాధాబాయి, డీఆర్డీవో శేషాద్రి, మున్సిపల్ కమి షనర్లు సమ్మయ్య, అన్వేష్, పరిశ్రమల శాఖ జీఎం హనుమంతు, మైనార్టీ వెల్ఫేర్ అధికారి భారతి, బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజమనోహన్రావు, జిల్లా పశువైద్యాధికారి రవీందర్రెడ్డి అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు. అర్హులందరికీ అవకాశం కల్పించాలి కలెక్టర్ సందీప్కుమార్ ఝా -
అర్చకుల సమస్యలు పరిష్కరించండి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధూపదీప నైవేద్య అర్చకుల సంఘం నాయకులు మంగళవారం హైదరాబాద్లో మంత్రి శ్రీధర్బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం తిమ్మాపూర్ పీఏసీఎస్ వైస్ చైర్మర్ బుగ్గ కృష్ణమూర్తిశర్మ మాట్లాడుతూ ఆలయాల్లో పూజలు చేసే ధూపదీప నైవేద్య అర్చకులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నార అన్నారు. తమ సమస్యల పరిష్కారంపై మంత్రి శ్రీధర్బాబు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో ధూపదీప నైవేద్య అర్చకుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాచర్ల పార్థసారధిశర్మ, ప్రధాన కార్యదర్శి పరాంకుశం రమేశ్, కోశాధికారి కేవీఆర్ వెంకటారమణాచార్యులు, వర్కింగ్ ప్రెసిడెంట్ గొంగళ్ల రవికుమార్, ప్రచార కార్యదర్శి చర్లపల్లి సీతారాములుశర్మ, గౌరవ సలహాదారు పారు నంది ఆంజనేయశర్మ తదితరులు ఉన్నారు. -
కూలీ రేట్లు నిర్ణయించాలని..
సిరిసిల్ల: జిల్లా కేంద్రంలో నేత కార్మికులు (పవర్లూమ్) వస్త్రోత్పత్తిని బంద్ చేసి మంగళవారం రోడ్డెక్కారు. ప్రభుత్వం ఇచ్చిన మహిళా శక్తి చీరల ఉత్పత్తి ఆర్డర్లకు నేత కార్మికులకు చెల్లించే కూలి నిర్ణయించాలని, 2023 నాటి బతుకమ్మ చీరలకు చెల్లించాల్సిన 10 శాతం యారన్ సబ్సిడీ సొమ్మును చెల్లించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో పవర్లూమ్ కార్మికులు ఆందోళనకు దిగారు. సిరిసిల్ల బీవై నగర్ నుంచి నేతన్న చౌక్ వరకు ప్రదర్శన నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిరిసిల్లలో పాలిస్టర్ వస్త్రాన్ని ఉత్పత్తి చేసే కార్మికులకు ఒప్పందం ప్రకారం కూలీ చెల్లించాలని, వర్కర్ టూ ఓనర్ పథకాన్ని వెంటనే పూర్తి చేసి కార్మికులను యజమానులను చేయాలని, ప్రభుత్వం ఉత్పత్తి చేయిస్తున్న మహిళా శక్తి చీరలకు సంబంధించిన పవర్లూమ్ వార్పిన్, వైపని కార్మికులకు 10 శాతం యారన్ సబ్సిడీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఐదు డిమాండ్లతో నేతకార్మికులు సాంచాలను బంద్ చేసి రోడ్డెక్కి నిరసన తెలిపారు. నేత కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చేదాకా.. వస్త్రోత్పత్తిని నిలిపివేస్తామని, సాంచాలు(పవర్లూమ్స్) నడుపమని స్పష్టం చేశారు. ఈ ఆందోళనలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేశ్, జిల్లా అధ్యక్షులు కోడం రమణ, కార్మికులు పాల్గొన్నారు. సిరిసిల్లలో రోడ్డెక్కిన నేతన్నలు వస్త్రోత్పత్తి బంద్ చేసి నేతన్నల ఆందోళన యారన్ సబ్సిడీ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ -
‘రాజీవ్ యువ వికాసం’కు దరఖాస్తు చేసుకోండి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సిరిసిల్ల: జిల్లాలోని అర్హులైన యువత రాజీవ్ యువవికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా సోమవారం కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ పథకం లక్ష్యమని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి గల నిరుద్యోగ యువత ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి డిప్యూ టీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఎల్డీఎం మల్లికార్జున్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ అక్రమాలపై నిగ్గుతేల్చాలి సిరిసిల్లటౌన్: మున్సిపల్ పాలకవర్గం పాలన పై రాజకీయ ఆరోపణలపై జిల్లా ఉన్నతాధికా రి పెదవి విప్పాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కోడం రమణ కోరారు. జిల్లా కేంద్రంలోని బీవైనగర్లోని పార్టీ ఆఫీసులో సోమ వారం ప్రెస్మీట్లో మాట్లాడారు. గత ఐదేళ్లు బీఆర్ఎస్ పాలకవర్గంపై కాంగ్రెస్ పార్టీ చేసిన అక్రమాల ఆరోపణలు, బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీ ఏడాదిన్నరగా నిధులు విడుదల చేయకపోవడం వంటి అంశాలపై జిల్లా ఉన్నతాధికారి విచారణ చేపట్టాలని కోరారు. గత ఐదేళ్లలో డబుల్బెడ్రూమ్ పంపిణీ తదితర అంశాలపై వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ కమిటీ వేసి నిజనిర్ధారణ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అదే సమయంలో జిల్లా కేంద్రం అభివృద్ధికి కూడా అధికార పార్టీ ప్రత్యేకంగా నిధులు వెచ్చించాలని కోరారు. జిందం కమలాకర్ పాల్గొన్నారు. -
విద్యార్థులపై దాడి అమానుషం
● హెచ్సీయూ భూముల విక్రయం విరమించుకోవాలి ● ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండించిన విద్యార్థి సంఘాలుిసరిసిల్లటౌన్/ముస్తాబాద్/చందుర్తి(వేములవాడ): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులపై పోలీసుల దాష్టీకం సరికాదని వివిధ విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొన్నారు. హెచ్సీయూ భూముల విక్రయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సిరిసిల్లలో బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవిగౌడ్ సోమవారం విలేకరులతో మాట్లాడారు. యూనివర్సిటీ భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పేందుకు చేస్తున్న సర్కారు కుట్రను ప్రశ్నించిన విద్యార్థులపై పోలీసులు దాడి చేయడం అప్రజాస్వామికమన్నారు. మట్టె శ్రీనివాస్, ముగ్దం అనీల్, వెంకటేష్, అడిచెర్ల సాయి, రాజు, మహేష్, నాగరాజు పాల్గొన్నారు. ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలి ముస్తాబాద్లో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కుర్ర రాకేశ్ మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణలో కార్పొరేట్ కంపెనీల కోసం సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మడం సరికాదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరారు. నిర్ణయం రద్దు చేసుకోవాలి బీఆర్ఎస్వై వేములవాడ నియోజవర్గ అధ్యక్షుడు ఈర్లపల్లి రాజు చందుర్తిలో మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని యూనివర్సిటీ భూముల వేలం నిర్ణయాన్ని రద్దు చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం కుట్రతోనే పండుగ పూట విద్యార్థులపై పోలీసులతో దాడి చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అగ్నివీర్కు తిమ్మాపూర్ యువకుడి ఎంపిక
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని రాచర్లతిమ్మాపూర్కు చెందిన పల్లె దినేశ్గౌడ్ అగ్నివీర్కు ఎంపికయ్యాడు. పల్లె మమత– నాంపల్లి దంపతుల కుమారుడు దినేశ్గౌడ్. నాంపల్లి ఆటో డ్రైవర్గా కుటుంబాన్ని పోషిస్తున్నాడు. డిగ్రీ చదివిన దినేశ్గౌడ్ మొదటి ప్రయత్నంలోనే ఆర్మీ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. యు వకుడిని ఏఎంసీ మాజీ చైర్మన్ కొండ రమేశ్గౌడ్, నాయకులు బుర్ర ఉపేందర్గౌడ్, గరుగుల శ్రీనివాస్గౌడ్, దాస్గౌడ్ సన్మానించారు. ‘నవోదయ’ విజేతలకు సన్మానంసిరిసిల్ల ఎడ్యుకేషన్: నవోదయ పాఠశాలల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించి పరీక్షలో ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం సిరిసిల్లలో సన్మానించారు. జ్ఞాపికతోపాటు నగదు ప్రోత్సాహకంగా అందజేశారు. ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు పర్కాల రవీందర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నవోదయలో సీటు సాధించడం హర్షణీయమన్నారు. వీర్నపల్లి మండలం గర్జనపల్లితండాకు చెందిన భూక్య శ్రీనితరాథోడ్, వేములవాడ మండలం హన్మాజీపేటకు చెందిన నగరం గాయత్రి నవోదయ సీట్లు సాధించడంతో అభినందించారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తిరుమల జగన్నాథాచారి, గుగులోత్ తిరుపతిజాదవ్లను సన్మానించారు. ఉపాధ్యాయులు జంగిటి రాజు, గుండమనేని మహేందర్రావు, పొలాస మల్లేశం, కోటగిరి లక్ష్మణ్, ఆడెపు శివకుమార్, గాలిపెల్లి సంతోష్ పాల్గొన్నారు. నియామకం బోయినపల్లి(మానకొండూర్): కొత్తపేటకు చెందిన మానాల నారాయణ మండల కాంగ్రెస్ సేవాదల్ విభాగం అధ్యక్షుడిగా నియమితు లయ్యారు. ఈమేరకు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సోమవారం నియామకపత్రం అందజేశారు. తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే సత్యం, కాంగ్రెస్ నాయకులకు నారాయణ కృతజ్ఞతలు తెలిపారు. -
తండాలో తాగునీటి తండ్లాట
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): గిరిజనుల గొంతెండుతోంది. తాగునీటి కోసం మైళ్లకొద్దీ దూరంలోని వ్యవసాయబావుల వద్దకు వెళ్తున్నారు. మిషన్ భగీరథ నీరు సరిగాసరఫరా కాకపోవడంతో గిరిజన తండాల్లో తాగునీటి తండ్లాట మొదలైంది. నీటి కోసం పనులు సైతం బంద్ చేసుకొని ఇంటి వద్దే ఉంటున్నారు. అధికారులకు ముందుచూపు లేక రాజన్నసిరిసిల్ల జిల్లాలోని అనేక తండాలు, గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగుండారం పరిధి పోచమ్మతండాలో తాగునీటి కోసం గిరిజన మహిళలు వరుసగా రెండో రోజు సోమవారం ఆందోళనకు దిగారు. అయినా అధికారులు తండా వైపు కన్నెత్తి చూడడం లేదు. మిషన్భగీరథ నీరు అందకపోవడంతో వ్యవసాయబావెల వద్దకు వెళ్లి తెచ్చుకుంటున్నారు. పైలట్ ప్రాజెక్ట్గా గుండారం రాష్ట్ర ప్రభుత్వం మండలంలోని గుండారం గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్గా గత ప్రజాపాలనలో ఎంపిక చేసింది. పైలట్ ప్రాజెక్ట్గా గుర్తించిన గ్రామంలోనే తాగునీటి కోసం తండావాసులు తండ్లాడుతున్నారు. తండాలో గత 15 రోజులుగా తాగునీరు రావడం లేదని అధికారులకు విన్నవించినా పట్టించుకునే వారు లేరు. తండాలో 20 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గత ప్రభుత్వం ఈ తండాలో తాగునీటి సమస్యను పరిష్కరించడానికి మిషన్ భగీరథ పథకాన్ని ఇక్కడ అమలు చేసింది. అయితే ప్రస్తుతం భగీరథ నీటి పైపులు పగిలిపోయి సరఫరా నిలిచిపోయింది. బావుల నుంచి నీటి తరలింపునకు అభ్యంతరాలు తాగునీటి కోసం తండ్లాడుతున్న గిరిజనులు వ్యవసాయబావుల నుంచి నీటిని తెచ్చుకుంటుండగా.. తాజాగా సోమవారం రైతులు మహిళలను అడ్డుకున్నారు. పంట పొలాలకు నీరు సరిపోవడం లేదని నీటిని తీసుకెళ్లేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. ఒక్క రోజుతోనే సరిపెట్టిన అధికారులు గిరిజనులు ఆందోళన చేస్తున్న సమయంలో ఒక్క రోజు మాత్రమే ట్యాంకర్ ద్వారా నీటిని అందించిన అధికారులు తర్వాత చేతులు దులుపుకున్నారు. డాలోని ఇండ్లల్లో నీటితొట్టీలు, కుండలు, బిందెలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. రెండో రోజు మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన తెలపడం తాగునీటి తిప్పలకు అద్దం పడుతోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి పగిలిన మిషన్భగీరథ పైపులను మరమ్మతు చేసి నీటిసమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ట్యాంకర్లతో నీటిని అందిస్తున్నాం తండాలో తాగునీటి సమస్యను పరిష్కరించడానికి ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ల ద్వారా నీటిని అంది స్తున్నాం. కొన్ని రోజులుగా తండాలో నీటి సమస్య ఉంది. మిషన్భగీరథకు బదులుగా ట్యాంకర్లను ఏ ర్పాటు చేశాం. పైపులను మరమ్మతు చేసి ఈ వేసవిలో ఇబ్బందులు లేకుండా నీటిని అందిస్తాం. – దేవరాజు, కార్యదర్శి, గుండారం -
వ్యాపారులకు సౌకర్యంగా ఉండేలా నిర్మాణాలు
వేములవాడ: ప్రజలు, చిరు వ్యాపారులకు సౌకర్యంగా ఉండేలా వేములవాడలో వీధివిక్రయ మార్కెట్ జోన్ నిర్మాణాలు చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడలో రూ.80లక్షలతో నిర్మించే వీధి విక్రయ మార్కెట్జోన్, రూ.56.50 లక్షలతో 11, 12వ వార్డుల్లో నిర్మించే సీసీరోడ్లు, డ్రెయినేజీ పనులకు సోమవారం కలెక్టర్ సందీప్కుమార్ ఝాతో కలిసి శంకుస్థాపన చేశారు. కూరగాయల మార్కెట్తో రైతులు, చిరువ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇటీవల సాక్షి ప్రచురించిన కథనానికి ప్రభుత్వ విప్, కలెక్టర్ స్పందించి రెండోబైపాస్ రోడ్డులోని గంగమ్మగుడి ప్రాంతంలో తాత్కాలిక మార్కెట్ వద్ద రూ.80 లక్షలతో ప్రత్యేక షెడ్లు నిర్మించేందుకు ముందుకొచ్చారు. జనాభాకు అనుగుణంగా పట్టణంలో సౌకర్యాలు కల్పిస్తామన్నారు. పట్టణంలోని 28 వార్డుల్లో రూ.10లక్షల చొప్పున వెచ్చించి సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. మూలవాగుపై మూడో బ్రిడ్జి పనులు త్వరలోనే పూర్తవుతాయని, భూసేకరణకు రూ.6కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రూ.47కోట్లతో రోడ్డు విస్తరణ చేయబోతున్నట్లు చెప్పారు. రూ.76కోట్లతో రాజన్న ఆలయ విస్తరణకు టెండర్లు పూర్తయ్యాయని, త్వరలోనే పనులు మొదలవుతాయని తెలిపారు. గతంలో మళ్లిపోయిన రూ.20కోట్లు వీటీడీఏ నిధులను తెప్పించి బద్దిపోచమ్మ ఆలయం వద్ద పనులు చేపట్టనున్నట్లు వివరించారు. అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని త్వరలోనే ఆవిష్కరించబోతున్నట్లు తెలిపారు. రూ.1.50కోట్లతో బస్తీ దవాఖానా నిర్మిస్తున్నామని, రూ.80లక్షలతో తిప్పాపూర్ వెళ్లే రోడ్డుకు ట్రాక్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్చైర్మన్ రాకేశ్, మున్సిపల్ కమిషనర్ అన్వేశ్ తదితరులు పాల్గొన్నారు. రాజన్న ఆలయ అభివృద్ధి పనులకు టెండర్ పూర్తి ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు -
మంత్రివర్యా ఆలకించండి..
● సిరిసిల్లలో నిలిచిన పనులు ● 15 నెలలుగా ఎక్కడి పనులు అక్కడే ● నేడు మంత్రి పొన్నం ప్రభాకర్ రాక ● మంత్రిపైనే ఆశలు పెట్టుకున్న ప్రజలు ● నిధులు విడుదల చేయాలని విన్నపంసిరిసిల్ల: ప్రభుత్వాలు మారితే అభివృద్ధి స్వరూపం మారుతుంటోంది. ప్రాధాన్యతాంశాలు మారిపోతుండడంతో గత ప్రభుత్వంలో మొదలైన పనులు నిలిచిపోతుంటాయి. ఇలాంటి పరిస్థితి ప్రస్తుతం సిరిసిల్లలో కనిపిస్తోంది. 15 నెలల క్రితం సిరిసిల్లకు రాష్ట్రస్థాయిలో ప్రాధాన్యత ఉండేది. నిధుల కేటా యింపు.. పనుల మంజూరులో అగ్రతాంబూలం దక్కేది. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. గత ప్రభుత్వ హయాంలో మొదలైన పనులకు నిధుల కేటాయింపులు నిలిచిపోయాయి. సిరిసిల్ల నియోజకవర్గంపై పాలకుల చిన్నచూపు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలకు ఉపయోగపడే పనులకు నిధులు మంజూరుకావడం లేదు. నిధులు రాక నిలిచిన అభివృద్ధి పనులపై ‘సాక్షి’ ఫోకస్ కథనం. మంత్రివర్యా అభివృద్ధికి బాటలు వేయండి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం సిరిసిల్లలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి హాజరుకానున్నారు. స్థానిక అంబేడ్కర్నగర్ రేషన్షాపులో మధ్యాహ్నం 12.30 గంటలకు సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. 15 నెలలుగా సిరిసిల్ల నియోజకవర్గంలో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. జిల్లా కేంద్రంలోని కళాశాల మైదానంలో ఓపెన్జిమ్ లేదు. మంజూరైన అనేక సిమెంట్ రోడ్డు పనులు సాగడం లేదు. ఇప్పటికే పూర్తయిన పనులకు బిల్లులు ఇవ్వడం లేదు. ఈ ప్రాంత సమస్యలను అధికారులతో సమీక్షించి అభివృద్ధికి బాటలు వేయాలని ఈ స్థానికులు కోరుతున్నారు. సిరిసిల్లపై చిన్నచూపు లేకుండా.. అభివృద్ధిలో ప్రజల ప్రాధాన్యతాంశాలను గుర్తించాలని కోరుతున్నారు.● సిరిసిల్ల నియోజకవర్గంలోని వీర్నపల్లి మండలం మద్దిమల్ల రాయినిచెరువును కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్ నుంచి వచ్చే గోదావరి జలాలతో నింపాల్సిన నీటి పంపింగ్ పథకం మూలనపడింది. ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ వద్ద నిర్మించిన పంప్హౌస్లో పనులు పూర్తికాలేదు. నీటి పంపింగ్ కోసం తెచ్చిన పైపులు రోడ్డు వెంబడి వేశారు. కానీ మద్దిమల్ల చెరువును నింపే పనులు సాగడం లేదు. ఇది పూర్తయితే వీర్నపల్లి మండలంలోని గిరిజన గ్రామాల్లోని పంట పొలాలకు శాశ్వతంగా సాగునీటి వసతి ఏర్పడుతుందది. ఇప్పటికే మంజూరైన ఈ పనులను పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయడం లేదు. ఫలితంగా మద్దిమల్ల చెరువుకు నీరు చేరడం లేదు.ఇది సిరిసిల్ల మానేరువాగుతీరంలో విద్యానగర్ నుంచి సాయినగర్ వరకు కొత్తగా డబుల్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదిత ప్రాంతం. ఈ రోడ్డు నిర్మాణానికి రూ.22 కోట్లు మంజూరయ్యాయి. ఆ నిధులతో వంద అడుగుల విస్తరణతో రోడ్డు.. డివైడర్లతో, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్తో వాకింగ్ ట్రాక్తో నిర్మించాల్సి ఉంది. విద్యానగర్ నుంచి సాయినగర్ వరకు మానేరువాగు వెంబడి మూడు కిలోమీటర్ల మట్టి రోడ్డు నిర్మాణం రెండేళ్ల కిందటే ఫార్మేషన్ పూర్తయింది. వాగు వెంట ఉన్న ఆక్రమణలు తొలగించి రోడ్డు వేశారు. అయితే ఇంతలోనే ఎన్నికల కోడ్ రావడంతో పనులు ఆగిపోయాయి. రూ.22కోట్ల పనులకు గ్రహణం పట్టింది. ఎన్నికలు పూర్తయి రాష్ట్రంలో నూతన ప్రభుత్వం కొలువుదీరి 15 నెలలు గడుస్తున్నా ఈ పనుల ఊసే లేదు. ● ముస్తాబాద్ మండల కేంద్రం నుంచి సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ కేంద్రానికి డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ.24 కోట్లు మంజూరయ్యాయి. ప్రస్తుతం సింగిల్రోడ్డు ఉండగా.. ఆ రోడ్డును డబుల్ రోడ్డుగా విస్తరించే పనులు జరగడం లేదు. సిరిసిల్ల నియోజకవర్గం పరిధిలోని మోహినికుంట వరకు ఐదు కిలోమీటర్ల రోడ్డు సింగిల్ రోడ్డు, మలుపులు ఉండడంతో ప్రమాదాలకు నిలయంగా ఉంది. ఈ అంతర్ జిల్లా రోడ్డుకు విస్తరించే పనులు చేయడం లేదు. గత ప్రభుత్వ హయాంలోనే ఆర్అండ్బీ శాఖ ద్వారా నిధులు మంజూరైనా పనులు చేయకపోవడంతో ఎంతో ప్రాధాన్యం ఉన్న ఈ రోడ్డుకు మోక్షం లభించడం లేదు. మరోవైపు దుబ్బాక పరిధిలోని సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా సిద్దిపేట జిల్లా అధికారులు మార్చారు. కానీ జిల్లా పరిధిలోని రోడ్డుకు గ్రహణం పట్టింది. ● గంభీరావుపేట మండల కేంద్రం నుంచి కొత్తపల్లి వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ.5కోట్లు మంజూరు చేశారు. రోడ్డు పనులకు మంత్రి హోదాలో కేటీఆర్ అప్పట్లో శంకుస్థాపన చేశారు. కానీ పనులు మొదలు కాకపోవడంతో నిధులు వెనక్కి వెళ్లాయి. గంభీరావుపేట నుంచి కొత్తపల్లి వరకు డబుల్ రోడ్డు నిర్మిస్తే.. వాహనదారులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రోడ్డు కోసం కొత్తపల్లి గ్రామస్తులు దీక్షలు చేశారు. ఆందోళన చేశారు. కానీ పాలకుల నిర్లక్ష్యంతో కొత్తపల్లి రోడ్డుకు అడుగులు పడడం లేదు. ఇలా సిరిసిల్ల నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేట, తంగళ్లపల్లి, సిరిసిల్ల పట్టణంలోనూ అనేక పనులు మంజూరై.. నిధులు విడుదల లేక పనులు సాగడం లేదు.