Rajanna
-
లక్ష్మీపూర్లో మున్నాభాయ్ ఎంబీబీఎస్!
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో మున్నాభాయ్ ఎంబీబీఎస్ లాగా నకిలీ వైద్యుడి లీలలు బుధవారం వెలుగు చూశాయి. గ్రామంలో వంగరి గోవర్దన్ అనే వ్యక్తి ఒక ఇంటిని అద్ధెకు తీసుకుని మెడికల్ ప్రాక్టీషనర్ పేరుతో క్లినిక్ను ప్రారంభించాడు. అంతటితో ఆగకుండా తన కొడుకు పేరుతో ఎంబీబీఎస్ లెటర్ హెడ్తో వైద్యం ప్రారంభించాడు. పేషంట్లకు ఇంజక్షన్లు, సైలెన్లు పెట్టడం, ఎంబీబీఎస్ లెటర్ హెడ్పై మందులు వ్రాయడం మొదలెట్టాడు. వస్తున్న కాసులు సరిపోవడం లేదని అనుకున్నాడో ఎమో తెలియదు కానీ ఏకంగా మహిళలకు సంతానం కలిగిస్తానంటూ కొత్త వైద్యం ప్రారంభించాడు. సాధారణంగా గైనకాలజీ డాక్టర్లు మహిళలకు సంతానోత్పత్తి కొరకు హెచ్సీజీ ఇంజక్షన్లను అన్ని వైద్య పరీక్షల అనంతరం అవసమైతేనే ఇస్తుంటారు. ప్రథమ చికిత్సలకు పరిమితం కావాల్సిన మెడికల్ ప్రాక్టీషనర్లు ఏకంగా అర్హతగల డాక్టర్ల మాదిరిగా చికిత్సలు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. నకిలీ వైద్యుడి వైద్యంపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజితను ‘సాక్షి’ వివరణ కోరగా వారం రోజుల క్రితమే అతడికి నోటీసులు ఇచ్చామని, ధ్రువీకరణ పత్రాలు పరిశీలించి దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొడుకు పేరుతో తండ్రి వైద్యం అద్దె ఇంటిలోనే పేషంట్లకు సైలెన్లు, ఇంజక్షన్లు ఇస్తున్న వైనం -
రైతుల కష్టం వరదపాలు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లతిమ్మాపూర్, వెంకటాపూర్ గ్రామాల్లో రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అధికారుల నిర్లక్ష్యం మూలంగా వరదపాలైంది. అకాల వర్షాలు దండికొట్టడంతో 45రోజులుగా తూకం వేయకుండా కేంద్రాల్లోనే ఉన్న ధాన్యం వర్షానికి తడిసి మొలకెత్తింది. దీంతో అన్నదాతలకు అపార నష్టం వాటిల్లింది. ఐకేపీ అధికారులు, నిర్వహకుల నిర్లక్ష్యం వల్ల మాయిచ్చర్ వచ్చి 45 అయినప్పటికీ రైతులు కేంద్రాలకు తెచ్చిన వడ్లను తూకం వేయలేదు. కేంద్రాల్లో హమాలీలు లేక, నిర్వహకులు పట్టించుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు. తడిసి మొలకెత్తిన ధాన్యం -
సింగరేణి స్టేడియానికి ఆధునిక హంగులు
● రూ.2కోట్లు ప్రకటించిన సీఎండీ బలరామ్ ● ప్రత్యేక సంస్థతో ప్రతిపాదనల రూపకల్పన ● త్వరలో తుదిరూపం వచ్చే అవకాశం ● సింథటిక్ ట్రాక్తోపాటు స్టేడియం విస్తరణకు చర్యలు ● కొన్ని సంగరేణి క్వార్టర్లను కూడా తొలగించే అవకాశంగోదావరిఖని: క్రీడాకారులకు అనుగుణంగా సింగరేణి స్టేడియాన్ని ఆధునిక హంగులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని యాజమాన్యం నిర్ణయించింది. సింథటిక్ వాకింగ్ట్రాక్తో పాటు క్రికెట్ ప్లే గ్రౌండ్, వాలీబాల్ కోర్టు, ట్రాక్ విస్తరణ కోసం మైదాన్ని విస్తరించాలని కూడా నిర్ణయించింది. ఇందుకోసం సీఎండీ బలరాం ఇటీవల రూ.2కోట్లు ప్రకటించారు. దీంతో రాబోయే తరానికి ఉపయోగపడేలా సింగరేణి జవహర్లాల్ నెహ్రూ స్టేడియాన్ని ఆధునిక హంగులతో తీర్చిదిద్దాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం స్టేడియంలోని కట్టడాలు, రాబోయే రోజుల్లో విస్తరిస్తే ఎలా మార్చాల్సి ఉంటుందనే అంశంపై నివేదిక సిద్ధం చేస్తున్నారు. ఈమేరకు స్పోర్ట్స్ అథారిటీ కంపెనీ ప్రతినిధులు మంగళవారం స్టేడియాన్ని పరిశీలించారు. సింథటిక్ ట్రాక్పైనే దృష్టి.. ప్రధానంగా సింథటిక్ వాకింగ్ ట్రాక్పై యాజమాన్యం దృష్టి సారించింది. 400 మీటర్ల వాకింగ్ ట్రాక్ లేదా 800మీటర్ల వాకింగ్ట్రాక్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. మైదానం చుట్టూ సింథటిక్ వాకింగ్ట్రాక్, మధ్యలో క్రికెట్ గ్రౌండ్, ఫుట్బాల్ కోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. క్వార్టర్ల తొలగింపుపై ఆలోచన జవహర్లాల్ నెహ్రూ స్టేడియం విస్తరణలో భాగంగా మైదానాన్ని ఆనుకుని ఉన్న సీఈఆర్క్లబ్ ఎదుట గల సింగరేణి క్వార్టర్లను తొలగించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగే స్టేడియం వెనకాల ఉన్న కొన్ని క్వార్టర్లను కూడా తొలగించే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికి స్పోర్ట్స్ అథారిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం జవహర్లాల్ నెహ్రూ స్టేడియం అభివృద్ధి కోసం రూ.2కోట్లు కేటాయిస్తారు. ఈప్రాంత క్రీడాకారులతోపాటు సింగరేణి ఉద్యోగులకు అనుకూలంగా స్టేడియంలో అన్నిఏర్పాట్లు చేస్తాం. సింథటిక్ వాకింగ్ట్రాక్ ఏర్పాటు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాం. ఎమ్మెల్యే సూచనల మేరకు ఈప్రాంత క్రీడాకారుల కోసం స్టేడియం విస్తరణ పనులు శరవేగంగా సాగుతాయి. – లలిత్కుమార్, ఆర్జీ–1 జీఎం -
సంఘం స్థలం స్వాహాకు యత్నం?
వేములవాడ: పట్టణంలోని ఆర్యవైశ్య సంఘ స్థలం విషయంలో వివాదం ఏర్పడి పంచాయితీ ఎస్పీ వద్దకు చేరింది. వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సుమారు 1800 సభ్యుల సంకల్పంతో 2011లో సర్వే నం.977లో 968 గజాల స్థలం కొనుగోలు చేశారు. సంఘం అధ్యక్షుడు, కార్యవర్గం పేరుపై ఉండాల్సిన భూమిని 12 మంది ప్రముఖులు ఓ ట్రస్టుగా ఏర్పడి తమ పేరుతో రిజిస్త్రేషన్ చేయించుకోవడంతో వివాదం చెలరేగింది. సంఘ సభ్యుల హితాన్ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్లో సేవా కార్యక్రమాల కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కొన్న ఈ స్థలంలో 12 మంది ప్రముఖులు తామే యజమానులమని గత డిసెంబర్లో తమ పేతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు వెలుగు చూసింది. దీంతో సంఘ సభ్యులంతా తీవ్ర ఆగ్రహానికి లోనై ఇది కేవలం ఆస్తిపై మాత్రమే కాదు మన ఆర్యవైశ్యుల ఆత్మగౌరవంపై దాడి అంటూ పట్టణానికి చెందిన 1800 మంది సభ్యుల నమ్మకాన్ని, ఆశలను తాకట్టు పెడుతున్నారని మండిపడుతున్నారు. ఈ అంశంతో ఆర్యవైశ్య ప్రముఖులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న అక్రమ రిజిస్ట్రేషన్దారులు కాంప్రమైజ్ అవుతామనీ, తమపై ఉన్న రిజిస్ట్రేషన్ రద్దు చేసుకుని తిరిగి సంఘానికి చేస్తామని చెప్పినట్లు తెలిసింది. ఈ వివాదం బుధవారం వేములవాడలో సామాజికంగా కీలకమైన అంశంగా మారింది. వైశ్య సంఘం న్యాయబద్ధంగా తమ హక్కులను తిరిగి పొందుతుందా? లేక ఈ ప్రయత్నం వ్యర్థమవుతుందా? అన్న చర్చ కొనసాగింది. వేములవాడలో ఆర్య వైశ్య సంఘ భూవివాదం ఎస్పీ వద్దకు చేరిన పంచాయితీ -
కోర్టు ఆవరణలో ఆటో దొంగిలించిన వ్యక్తి అరెస్ట్
జగిత్యాలక్రైం: జిల్లా కోర్టు ఆవరణలో పార్కింగ్ చేసిన ఆటోను దొంగిలించిన నిజామాబాద్ జిల్లాకేంద్రంలోని గౌతమినగర్కు చెందిన జిలకర ప్రసాద్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పట్టణ సీఐ వేణుగోపాల్ తెలిపారు. నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం బుట్టపూర్కు చెందిన మగ్గిడి కృష్ణ ఈనెల 26న జగిత్యాల కోర్టు ఆవరణలో ఆటోను పార్కింగ్ చేశాడు. దానిని ప్రసాద్ చాకచక్యంగా దొంగిలించాడు. బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో ఈనెల 27న పట్టణ ఎస్సై గీత జిల్లాకేంద్రంలోని గాంధీనగర్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా ప్రసాద్ ఆటోలో వస్తూ అనుమానాస్పదంగా కనిపించాడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. అతడిన ఉంచి ఆటోను స్వాధీనం చేసుకుని నిందితుడిని బుధవారం రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఎస్సై గీత, కానిస్టేబుళ్లు జీవన్, అనిల్, వంశీ పాల్గొన్నారు. ఉద్యమకారులను ఆదుకోవాలి పెద్దపల్లిరూరల్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం పోరాడిన ఉద్యమకారులను గుర్తించి అన్నివిధాలా ఆదుకోవాలని ఉద్యమకారుల ఫోరం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు ఐలయ్య కోరారు. స్థానిక అమరవీరుల స్తూపం వద్ద బుధవారం ఉద్యమకారులతో కలిసి నివాళి అర్పించారు. స్వరాష్ట్రం సాధించిన తర్వాత తమకు ప్రాధాన్యత దక్కుతుందని ఆశపడితే అప్పటి సీఎం ఉద్యమకారులను విస్మరించారని విమర్శించారు. కేవలం తమ కుటుంబానికే ప్రాధాన్యత ఇచ్చుకున్నారని దుయ్యబట్టారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా తమకు మేలు కలిగేలా చూడాలని కోరారు. ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు సారయ్య, నల్ల మనోహర్రెడ్డి, రాజేశం, జ్యోతి, చంద్రకళ, సురేందర్రెడ్డి, భాస్కర్, సదాశివ, రాజిరెడ్డి, రాజు, కృష్ణ, సదయ్య తదితరులు ఉన్నారు. ఫాజుల్నగర్ ప్రాంతంలో పులి ఆనవాళ్లువేములవాడరూరల్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలోని ఫాజుల్నగర్ ప్రాంతంలో పులి తిరుగుతున్నట్లు ఆనవాళ్లు బయటపడ్డాయి. ఈవిషయంపై వేములవాడ ఎఫ్ఆర్వో కలీలొద్దీన్ను వివరణ కోరగా వేములవాడ, కొడిమ్యాల, చందుర్తి ఫారెస్ట్ ప్రాంతంలో పులి తిరుగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోజుకు పులి 35 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని, అది ఫారెస్టు ప్రాంతంలో అనుకూలమైన ప్రాంతానికి వెళ్తుందని తెలిపారు. -
రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు
సిరిసిల్ల: జిల్లాలో యాసంగి(రబీ) సీజన్లో రికార్డుస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు చేసినట్లు కలెక్టర్ సందీప్కుమార్ ఝా బుధవారం తెలిపారు. 242 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇప్పటివరకు 37,223 మంది రైతుల వద్ద రూ.578 కోట్ల విలువైన 2,49,372మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని వెల్లడించారు. వీటిలో 2,16,258 మెట్రిక్ టన్నుల ధాన్యం వివరాలు ఆన్లైన్ చేశామని, 34,479 మంది రైతుల బ్యాంకు ఖాతాలో రూ.447 కోట్లు జమ అయ్యాయని వివరించారు. మిగతా రైతులకు త్వరలో డబ్బులు జమ అవుతాయని ప్రకటించారు. జిల్లాలో ధాన్యం సేకరణ తుది దశకు వచ్చిందని, ఇప్పటికే 133 కొనుగోలు కేంద్రాలను మూసివేశామన్నారు. ఇంకా 109 కేంద్రాల్లో కొద్దిగా ధాన్యం ఉందన్నారు. జిల్లాలో చివరి గింజ వరకు దాన్యం సేకరిస్తామని తెలిపారు. తడిసిన ధాన్యం సైతం సేకరిస్తామని రైతులెవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. మూడేళ్లలో ధాన్యం సేకరణ తీరిదీ జిల్లాలో రబీ(యాసంగి) సీజన్లో మూడేళ్ల ధాన్యం సేకరణ తీరును కలెక్టర్ గణాంకాలతో వెల్లడించారు. 2022–2023లో మే 28వ తేదీ నాటికి 1,64,044 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, అదే 2023–2024 రబీ సీజన్లో ఇదే రోజు నాటికి 2,49,514 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది మే 28వ తేదీ నాటికి 2,49,372 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని అన్నారు. జిల్లాలో కొనుగోళ్లు పూర్తి అయ్యేనాటికి రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు నమోదు అవుతాయని స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇప్పటికే 2,49,372 మెట్రిక్ టన్నుల సేకరణ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
దళిత యువకుడిని చితకబాదిన పోలీసులు
సైదాపూర్: డ్రంకెన్డ్రైవ్లో సహకరించడం లేదని ఓ దళిత యువకుడిని 20 రోజుల క్రితం చితకబాదిన ఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో చోటుచేసుకుంది. జరిగిన ఘటనపై దళిత సంఘాలు వివిధ రూపాల్లో బాధితుడికి న్యాయం చేయాలని ఆందోళనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. బాధితుడు కరీంనగర్ సీపీ, మానవ హక్కుల కమిషన్, నేషనల్ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేశాడు. ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కమిషన్ కోరినట్లు తెలిసింది. వివరాల్లోకి వెళ్తే.. సైదాపూర్లో ట్రైనీ ఎస్ఐగా బాధ్యతలు నిర్వహిస్తున్న అగస్త్య భార్గవ్గౌడ్ తోటి సిబ్బందితో కలిసి మండలంలోని లస్మన్నపల్లి శివారులో డ్రంకెన్డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. గొల్లగూడెం గ్రామానికి చెందిన బత్తుల మహేందర్ మొలంగూర్ నుంచి సైదాపూర్ వస్తున్నాడు. పోలీసులు ఆపారు. టెస్టు చేసి చలాను వేసిన తర్వాత అతడి వివరాలు రాసుకున్నారు. ఇంతలో మహేందర్కు ఇంటి వద్ద నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ మాట్లాడుతున్న బాధితున్ని సహకరించడం లేదని ఫోన్ తీసుకొని ఎస్ఐ అగస్త్య భార్గవ్గౌడ్తోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడే చితకబాదారు. చెవి కర్ణభేరి దెబ్బతిని చెవి నుంచి రక్తం కారుతున్నా వదల్లేదని, తర్వాత పోలీస్ స్టేషన్కు పిలిచి తనతో క్షమాపణ పత్రం రాయించుకున్నారని మహేందర్ కమిషన్లకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఘటనపై విచారించాలని కరీంనగర్ సీపీ హుజూరాబాద్ ఏసీపీ శ్రీనివాస్ను ఆదేశించారు. బాధితుడి వాగ్మూలం తీసుకున్న మర్నాడే ఏసీపీ శ్రీనివాస్ బదిలీ కావడంతో పోలీసుల విచారణలో జాప్యం జరుగుతోందని బాధితుడు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. హెచ్ఆర్సీ, నేషనల్ ఎస్సీ కమిషన్ మాత్రం అడిషనల్ డీజీపీ, కరీంనగర్ సీపీకి విచారణ నివేదికను 20 రోజుల్లో అందజేయాలని నోటీసులు జారీ చేసింది. తాను పీజీ బీఈడీ చేసి, నిరుద్యోగిగా కూల్డ్రింకులు సరఫరా చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నానని, అకారణంగా చితకబాదడంతో అవమానంతో మానసికంగా భరించలేకపోతున్నాని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మహేందర్ అప్పటికే వేరే సంఘటనలో ఇతరులతో తగాదా పడి దెబ్బలు తిని వస్తున్నాడని, డ్రంకెన్డ్రైవ్ టెస్టులో సహకరించకుండా పోలీసులలో దుర్భాషలాడారని, అందుకు క్షమాపణ పత్రం రాసి ఇచ్చాడని పోలీసులు పేర్కొంటున్నారు. వాస్తవాలు ఉన్నతాధికారుల విచారణలో తేలాల్సి ఉంది. దెబ్బతిన్న బాధితుడి చెవి కర్ణభేరి హెచ్ఆర్సీ, నేషనల్ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు విచారించి నివేదిక ఇవ్వాలని అడిషనల్ డీజీపీ, సీపీకి నోటీసులు -
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
రాయికల్: మండలంలోని అల్లీపూర్కు చెందిన సిరిపురం శ్రీహరి (47) అప్పుల బాధతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై సుధీర్రావు కథనం ప్రకారం.. శ్రీహరి బీడీ ప్యాకర్గా పనిచేస్తున్నాడు. కుటుంబపోషణకు కొంత అప్పు చేశాడు. ఇటీవలే కూతురు పెళ్లి చేశాడు. మొత్తం రూ.8లక్షల వరకు అప్పు ఉందని, దానిని ఎలా తీర్చలోనని నిత్యం మనస్తాపం చెందుతున్నాడు. జీవితంపై విరక్తిచెంది ఇంట్లోనే ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యులు అతడిని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి కుమారుడు, కూతురు ఉన్నారు. శ్రీహరి భార్య అంజలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. పరారైన ఖైదీ కోసం లుక్ ఆఫ్ నోటీస్జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా కోర్టు నుంచి మంగళవారం సాయంత్రం పరారైన జున్ను ప్రసాద్ కోసం పోలీసులు ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు. పెగడపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన ప్రసాద్ను పట్టుకునేందుకు పోలీసు శాఖ ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఈ ఆరు బృందాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గాలింపు చర్యలు చేపట్టాయి. నిందితుడు విదేశాలకు పారిపోకుండా బుధవారం ఉదయమే దేశంలోని అన్ని ఎయిర్పోర్టులకు లుక్ ఆఫ్ నోటీసు జారీ చేశారు. సిరిసిల్లలో కోవిడ్ పాజిటివ్ కేసులు?● ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్ధారించని వైద్యులు సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. జ్వరంతో బాధపడుతున్న ఓ దంపతులు బుధవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి వెళ్లారు. కోవిడ్ పరీక్షలు చేయడం లేదని ల్యాబ్ నిర్వాహకులు వెనక్కి పంపించినట్లు సమాచారం. సదరు దంపతులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. నోరు రుచి, ముక్కు వాసన పోవడంతో మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆ దంపతులు కోవిడ్గా అనుమానించి ప్రభుత్వ ఆస్పత్రికి రాగా.. పరీక్షలు చేయకపోవడం గమనార్హం. -
హ్యాకర్ల చేతికి ఓదెల ఆధార్ కేంద్రం
పెద్దపల్లిరూరల్: ఆన్మోసాలు ఆగడంలేదు. సైబర్ నేరగాళ్లు, ఆన్లైన్ మోసగాళ్లు రోజుకో రూట్ మార్చుతూ ప్రజలకు ఎరవేస్తున్నారు. తాజాగా ఓదెల మండల కేంద్రంలోని మీసేవ ఆపరేటర్ తన ఆధార్ కేంద్రానికి సంబంధించి అప్డేట్ చేస్తామంటూ సైబర్ మోసగాళ్లు (సెల్ నంబరు 07427069687) నుంచి చేసిన ఫోన్కాల్కు స్పందించడంతో ఆధార్ సెంటర్ను హ్యాక్ చేశారు. కొద్ది నిమిషాల్లోనే ఆ ఐడీ ద్వారా నాలుగు ఆధార్కార్డులు డౌన్లోడ్ చేసినట్లు ఆపరేటర్కు సమాచారం రావడంతో అవాక్కయ్యాడు. ఆ వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లాడు. స్పందించిన అధికారులు యూఐడీఏఐ అధికారులను అప్రమత్తం చేశారు. వారు ఆధార్సెంటర్ హ్యాకర్ల చేతికి చిక్కినట్లు నిర్ధారించారు. ఇలాంటి ఘటన ఇదివరకు నాగర్కర్నూల్ జిల్లాలోనూ జరిగినట్లు సమాచారం. జిల్లాలోని పలు ఆధార్కేంద్రాల నిర్వాహకులకు సైతం ఇలాంటి ఫోన్కాల్స్ వచ్చినట్లు ఆపరేటర్లు తెలిపారు. కొంతకాలంగా ఓదెల మీసేవ కేంద్రంలో గల ఆధార్ సెంటర్ ద్వారా సేవలు నిలిపి వేశారు. కొద్ది రోజుల క్రితమే అధికారులు అనుమతినివ్వడంతో సేవలు పునరుద్ధరించారు. ఈ క్రమంలో హ్యాకర్ల నుంచి ఫోన్కాల్ రావడంతో ఆధార్ కేంద్రం అనుమతులిచ్చే కార్యాలయ అధికారుల నుంచే ఫోన్కాల్ వచ్చిందని భావించి ఎనీడెస్క్ను హ్యాకర్లకు అప్పగించి మోసపోయినట్లు తెలిసింది. పీఈసీ కిట్లను అప్పగించొద్దు.. ఆధార్ కేంద్రాలను నిర్వహించే ఆపరేటర్లు అనధికారిక అపరిచిత వ్యక్తులు చేసే ఫోన్కాల్స్కు స్పందించొద్దని యూఐడీఏఐ అధికారులు బుధవారం రాష్ట్రంలోని ఆధార్ ఆపరేటర్లకు దిశానిర్దేశం చేశారు. ఆధార్కేంద్ర నిర్వాహకులు తమ సెంటర్లలో వినియోగించే కంప్యూటర్ నుంచి ఎనీడెస్క్, లేదా ఇతర రిమోట్యాక్సెస్ ఇచ్చి మోసపోతున్నారని, ఇది ఆధార్ డేటా భద్రతకు ముప్పు తెస్తుందని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎనీడెస్క్, టీంవ్యూయర్ ఇతర రిమోట్ యాక్సెస్ సమాచారాన్ని అనధికార వ్యక్తులతో పంచుకోవద్దని సూచించారు. యూఐడీఏఐ భద్రతా విధానాలకు అనుగుణంగా అవసరం లేని రిమోట్ యాక్సెస్ టూల్స్ని అన్ఇన్స్టాల్ చేయాలన్నారు. అపరిచితుల ఫోన్కాల్స్కు స్పందించొద్దు యూఐడీఏఐ కార్యాలయ అధికారుల ఆదేశం -
ఆపదలో ఉన్నాం.. ఆదుకోండి
రామగిరి(మంథని): భర్త అనారోగ్యం.. ఆర్థికలేమి.. ముగ్గురు పిల్లలు పోషణ.. కూలీ పనులతో కుటుంబాన్ని నెట్టుకు రావడం ఆ గృహిణికి తలకుమించిన భారంగా మారింది. దాతలు సాయం చేస్తే భర్తకు మంచి వైద్యచికిత్స అందిస్తామని, పిల్లల పోషణ చూసుకుంటానని అంటోంది ఆ గృహిణి. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట గ్రామానికి చెందిన దుబ్బాక కుమార్ – విజయ దంపతులు. వీరికి ముగ్గురు సంతానం కిరణ్, మహేందర్, చెర్రీ ఉన్నారు. అనారోగ్యానికి గురైన కుమార్.. పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందాడు. అయినా నయం కాలేదు. తనకున్న స్థోమత వరకు ఖర్చుచేశాడు. చేతిలో ఉన్న సొమ్మంతా ఖర్చు కావడంతో మళ్లీ ఆస్పత్రికి వెళ్లడానికి చిల్లిగవ్వకూడా లేకుండాపోయింది. కనీసం ప్రయాణానికి కూడా డబ్బులు లేని దీనస్థితిలో ఆ కుటుంబం ఉంది. విజయ కూలీ పనులకు వెళ్లి అంతోఇంతో సంపాదిస్తున్నా కుటుంబ పోషణకు కూడా సరిపోవడం లేదు. దాతలు ముందుకు వచ్చి తన భర్తను కాపాడాలని విజయ కోరుతోంది. రెండు కిడ్నీలు పనిచేయక యువకుడి నరకయాతన -
సీపీఐని ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లండి
కరీంనగర్: జిల్లాలో సీపీఐకి పూర్వవైభవాన్ని తెచ్చేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా మహాసభలు రెండోరోజు కొనసాగాయి. నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్రెడ్డి, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేశ్, భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు కిన్నెర మల్లవ్వ అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి మూడేళ్లలో జిల్లాలో నిర్వహించిన పార్టీ కార్యక్రమాల నివేదికను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ సీపీఐకి జిల్లాలో ఘనమైన చరిత్ర ఉందన్నారు. తెలంగాణ దశాదిశా నిర్దేశించేలా క్రియాశీలక పాత్ర పోషించిందని తెలిపారు. ఆర్ఎన్ఎన్ శక్తుల విజృంభన కొనసాగిస్తూ బీజేపీ ప్రమాదకరంగా మారిందన్నారు. రాష్ట్రంలో పెన్షన్, రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మఇళ్లు పథకాలు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్, మర్రి వెంకటస్వామి, పొనగంటి కేదారి, బోయిని అశోక్, కొయ్యడ సృజన్కుమార్, అందె స్వామి, బత్తుల బాబు, గూడెం లక్ష్మి పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, చాడ వెంకటరెడ్డి -
గర్భస్థ శిశువును రక్షించడం అందరి బాధ్యత
సిరిసిల్ల: గర్భస్థ శిశువును రక్షించాల్సిన బాధ్య త ప్రతీ ఒక్కరిపై ఉందని జిల్లా వైద్య, ఆరో గ్యశాఖ అధికారి ఎస్.రజిత అన్నారు. కలెక్టరేట్లోని వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన పీసీపీఎన్డీటీ సలహా కమిటీ సమావేశంలో మాట్లాడారు. గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమన్నారు. ఎవరైన భ్రూణహత్యలకు పాల్ప డితే టోల్ఫ్రీ నంబర్ 94400 54641కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రోగ్రాం ఆఫీసర్ అంజలి ఆల్ఫ్రెడ్, అనిత, రామకృష్ణ, మానేరు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు చింతోజు భాస్కర్, లీగల్ అడ్వైజర్ శాంతి ప్రకాశ్ శుక్లా, ఝాన్సీలక్ష్మి శుక్లా, డిప్యూటీ డెమో రాజకుమార్, హెచ్ఈ బాలయ్య, డీఈవో మహేశ్ పాల్గొన్నారు. బద్దెనపల్లి గురుకులానికి క్యాష్ అవార్డుతంగళ్లపల్లి: మండలంలోని బద్దెనపల్లి సాంఘిక సంక్షేమ బాలికల గురుకల పాఠశాలకు అరుదైన గౌరవం దక్కింది. సీఎం రేవంత్ రెడ్డి బుధవారం హైదరాబాద్లో పాఠశాల ప్రిన్సిపాల్ దర్శనాల పద్మకు అవార్డుతోపా టు రూ.5 లక్షల రివార్డు అందజేశారు. పీఎంశ్రీ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2024–25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్, పదో తరగతి ఫలితాల్లో రా ష్ట్రస్థాయి ఉత్తమ ఫలితాలు సాధించినందుకు ఈ అవార్డు అందజేశారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఎంపీసీలో రాష్ట్రస్థాయి రెండో ర్యా ంకు సాధించిన విద్యార్థిని నందినికి రూ. 10వేలు నగదు పారితోషకం అందించారు. హామీలు నెరవేర్చండిసిరిసిల్లటౌన్: ప్రొటోకాల్ అమలుపై కాంగ్రెసోళ్ల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించిన చందంగా ఉన్నాయని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. బుధవారం సిరిసిల్ల ప్రెస్క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ విప్ ప్రొటోకాల్ విషయంపై చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీ సులో దేశ నేతల ఫొటోలు పెట్టుకోవడం స హజమని, కాంగ్రెసోళ్లు ప్రభుత్వ బంగ్లాకు చొ చ్చుకుపోయి సీఎం రేవంత్రెడ్డి ఫొటో పెట్టేందుకు ఒడిగట్టడం అప్రజాస్వామికమన్నారు. అడ్డుకోబోయిన పోలీసులను నెట్టేస్తూ బీఆర్ఎస్ నేతలపై దాడి చేయడం సరికాదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాక అనవసర రాద్దాంతం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడం కాంగ్రెస్కు వెన్నెతో పెట్టిన విద్య అన్నారు. ఈ సమావేశంలో సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపా ణి, రాష్ట్ర నాయకులు ప్రవీణ్, రాజు, శ్రీనివా స్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఇళ్ల పరిహారంపై నేడు మరోసారి విచారణ బోయినపల్లి(చొప్పదండి): మిడ్మానేరు ప్రా జెక్టులో ముంపునకు గురైన బోయినపల్లి మండలం వరదవెల్లి అనుబంధ రాజన్నపేట గ్రా మంలోని 9 ఇళ్ల పరిహారం చెల్లింపులపై వచ్చిన ఆరోపణలతో గురువారం మరోసారి విచారణ జరుగనుంది. కలెక్టర్ సందీప్కుమా ర్ ఝా ఆదేశాలతో డీఎల్పీవో నరేశ్ ఈనెల 19న వరదవెల్లి జీపీ కార్యాలయంలో విచారణ జరిపారు. ఆ రోజు విచారణకు ఎవరూ హాజరు కాకపోవడంతో ఫిర్యాదుదారులకు, ఇళ్ల యజమానులకు ముందుగా నోటీసులు అందించి మరోసారి 29న విచారణ నిర్వహి ంచనున్నారు. ఈసారి విచారణలో ఏం జరుగుతుందో? అని ఎదురుచూస్తున్నారు. యూరియా వాడకం తగ్గించుకోవాలి కోనరావుపేట: రైతులు సాగులో యూరియా వాడకం తగ్గించుకోవాలని జిల్లా ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ కె.మదన్మోహన్రెడ్డి అన్నారు. బుధవారం మామిడిపల్లిలోని ఆదర్శ సొసైటీలో నిర్వహించిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో మాట్లాడారు. పంట మార్పిడి పాటిస్తూ అధిక దిగుబడులు పొందాలని సూచించారు. -
ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో జిల్లా ప్రథమ స్థానం
సిరిసిల్లకల్చరల్: ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో రాష్ట్రంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని కలెక్టర్ సందీప్కుమార్ ఝా అన్నారు.కలెక్టరేట్లో బుధవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిపై అధికారులతో సమీక్షించారు, జిల్లాకు 7,862 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా వేములవాడ నియోజకవర్గంలో రెండు దశల్లో 2,575, సిరిసిల్ల నియోజకవర్గంలో 3,608. చొప్పదండి నియోజకవర్గంలోని బోయిన్పల్లిలో 820 ఇళ్లు మంజూరు చేశామని వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ విషయంలో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేసిన అధికారులను అభినందించారు. అదే స్ఫూర్తితో నిర్మాణాలను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సిమెంట్, స్టీల్ ధరల విషయంలో ఆయా కంపెనీలతో ప్రభుత్వం చర్చలు జరిపి తగ్గించే ప్రయత్నం చేస్తుందన్నారు. నిర్మాణం పూర్తయిన ఇళ్ల ఫొటోలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు , హౌసింగ్ పీడీ శంకర్, ఆయా మండలాల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు. ‘రాజీవ్ యువ వికాసం’లో లాభసాటి యూనిట్లు సిరిసిల్ల: రాజీవ్ యువ వికాసం పథకంలో లాభసాటి వ్యాపార యూనిట్లను ఏర్పాటు చేయిస్తామని కలెక్టర్ సందీప్కుమార్ ఝా అన్నారు. హైదరాబాద్ సచివాలయం నుంచి బుధవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సిరిసిల్ల జిల్లాలో రాజీవ్ యువ వికాసం అమలు తీరుపై కలెక్టర్ వివరించారు. -
డీఈవో వ్యాఖ్యలు..ఆరని మంటలు!
● మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసిన కరీంనగర్వాసి ● చర్యలు తీసుకోవాలని మరిన్ని ఫిర్యాదులు ● క్రమంగా వెలుగులోకి జనార్దన్రావు వ్యవహారాలు ● ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఐదేళ్లుగా కరీంనగర్లో విధులు ● కలెక్టర్ కార్యాలయం తీరుపైనా విమర్శలు సాక్షిప్రతినిధి,కరీంనగర్: కరీంనగర్ జిల్లా విద్యాశాఖాధికారి జనార్దన్రావు వ్యవహారం మరింత ముదిరింది. ‘భర్తలకు వంట రాకపోతే.. భార్యలు లేచిపోతారు.. తాను రెండు సంసారాలు ఈదుతున్నాను’ అంటూ తలతిక్క వ్యాఖ్యలతో శిక్షణ శిబిరాల్లో టీచర్లను బెంబేలెత్తించిన డీఈవో జనార్దన్రావుపై విమర్శలు, ఆరోపణలు ఆగడం లేదు. ఆయన్ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ.. కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం రాత్రి ఆదేశాలిచ్చినా.. టీచర్లు శాంతించడం లేదు. ఆయన వ్యాఖ్యలు మహిళా లోకాన్ని కించపరిచేలా ఉన్నాయని మండిపడుతుండగా.. సామాజిక ఉద్యమకారుడు షాబుద్దీన్ మహిళా కమిషన్కు ఎక్స్ వేదికగా ఫిర్యాదు చేశారు. డెమొక్రాటిక్ టీచర్ ఫెడరేషన్ (డీటీఎఫ్) నాయకులు జనార్దన్రావుపై హైదరాబాద్లో విద్యాశాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూ) కూడా అతనిపై చర్యలకు డిమాండ్ చేసింది. బుధవారం కూడా సోషల్ మీడియాలో, మెయిన్స్ట్రీమ్ మీడియాలో విషయం ప్రాధాన్యం సంతరించుకోవడంపై చర్చ నడుస్తోంది. డీఈవో జనార్దన్ సిరిసిల్లకు కూడా డీఈవోగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో కామారెడ్డి డీఈవో ఎస్. రాజుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. కరీంనగర్ డైట్ ప్రిన్సిపాల్ మొండయ్య నూతన డీఈవోగా బుధవారం అదనపు బాధ్యతలు చేపట్టారు. దండిగా పెద్దల దన్ను.. జనార్దన్రావుకు ప్రభుత్వ పెద్దల నుంచి దండిగా సహకారాలు ఉన్నాయని సమాచారం. కరోనా నుంచి డీఈవోగా కొనసాగుతున్న ఈయనపై ఎన్ని విమర్శలు వచ్చినా చర్యలు తీసుకోవడంలో గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ● జిల్లాలో టీచర్లకు అకారణంగా, అత్యధికంగా మె మోలు ఇచ్చిన డీఈవో అన్న ఆరోపణలు ఉన్నాయి. యూనియన్ నాయకులకు ఇంక్రిమెంట్లలో కోత విధించారన్న విమర్శలు తెలిసిందే. ● వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు జిల్లాలో పనిచేసిన ప్రతీ ఉన్నతాధికారి ఎన్నికల నియమావళి ప్రకారం.. బదిలీపై వెళ్లారు. కానీ, ఈయనను కదపలేదు. ● హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, అనంతరం అసెంబ్లీ, పార్లమెంట్, ఇటీవల టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. అయినా ఇతని బదిలీ జరగకపోవడం అతని పలుకుబడికి నిదర్శనం. ● ఇవన్నీ తెలిసీ.. కలెక్టర్ కార్యాలయం కూడా ఆయన బదిలీ విషయంలో అలసత్వం వహించి విమర్శలను మూటగట్టుకుంది. ● 317 జీవో సమయంలోనూ పలువురు టీచర్లు ప్రొడ్యూస్ చేసిన మెడికల్ సర్టిఫికెట్ల విషయంలో అనేక ఆరోపణలు వచ్చాయి. ● హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయలో అప్పటి సీఎం సభను విజయవంతం చేయాలని ఆదేశాలివ్వడం, రూటు బాధ్యతలను టీచర్లకు అప్పగించడం తీవ్ర దుమారం రేపింది. ● ఇప్పుడూ తన స్వయంకృతాపరాధంతో వేటు పడిందే.. ఆయన్ను ఇక్కడ నుంచి ఎవరూ కదపలేకపోవడం గమనార్హం. -
ఒక్క ఏడాదిలోనే 818 ఇళ్లు
బోయినపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోగా బోయినపల్లి మండలానికి 818 ఇళ్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. బుధవారం హైస్కూల్ మైదానంలో కలెక్టర్ సందీప్కుమార్ ఝాతో కలిసి 709 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, 98 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేశారు. అత్తగారి మండలానికి అల్లుడిగా మాజీ సీఎం కేసీఆర్, మనవళ్లుగా కేటీఆర్, సంతోశ్కుమార్లు ఇచ్చింది పెద్ద గుండుసున్న అని అన్నారు. సీఎం రేవంత్రెడ్డి సహకారంతో మిడ్మానేరు ముంపు గ్రామాలకు త్వరలో మరో వెయ్యి ఇళ్లు మంజూరు కానున్నాయని తెలిపారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝా మా ట్లాడుతూ మంజూరు పత్రాలు పొందిన వారు ఇళ్లు నిర్మించి వచ్చే దసరా, దీపావళి పర్వదినాలను సొంత ఇళ్లలో జరుపుకోవాలని అన్నారు. లబ్ధిదారులకు ఇసుక అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. 90 రోజుల్లో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించకుంటే రద్దు చేస్తామన్నారు. జెడ్పీ సీఈవో వినోద్, ఎంపీడీవో జయశీల, తహసీల్దార్ నారాయణరెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు రవీందర్, ఏఎంసీ చైర్మన్ ఎల్లేశ్యాదవ్ పాల్గొన్నారు. -
చేపా చేపా ఎక్కడికెళ్లావు
ముస్తాబాద్(సిరిసిల్ల): మత్స్యకార్మికులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఉచిత చేపపిల్లలు పంపిణీ చేసేది. జిల్లా వ్యాప్తంగా ఉన్న రిజర్వాయర్లు, చెరువుల్లో ఉచిత చేపపిల్లలు పంపిణీ చేయడం ద్వారా గ్రామాల్లో మత్స్యకారులు చేపలు పట్టుకొని ఉపాధి పొందేవారు. అయితే గతేడాదిగా ప్రభుత్వం చెరువుల్లో చేపపిల్లలు పంపిణీ చేయడం లేదు. జిల్లాలో నీటివనరుల్లో నీరు పుష్కలంగా ఉన్నా మత్స్యకారులకు ఉపాధి కరువైంది. చేపపిల్లల పంపిణీపై ఇప్పటికీ స్పష్టత రాకపోవడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.మత్స్యశాఖలో ప్రణాళిక కరువుజిల్లాలో 48 మత్స్యకార సొసైటీల్లో 8,421 మంది కార్మికులు ఉన్నారు. వీరికి ఉపాధి కల్పించేందుకు మత్స్యశాఖ ఫిబ్రవరి, మార్చిలోనే టెండర్ల ప్రక్రియను మొదలుపెట్టాలి. జిల్లాలో 1.42కోట్ల చేపపిల్లలు అవసరం కాగా.. అందుకు అనుగుణంగా కాంట్రాక్టర్ను ఎంపిక చేసి, సైజు, నాణ్యతను బట్టి టెండర్ అప్పగించాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. గతేడాది సెప్టెంబర్లో మధ్యమానేరు, ఎగువమానేరు ప్రాజెక్టులలో కొంతమేరకు చేపపిల్లలను వదిలారు. కానీ, 440 చెరువులకు పిల్లలను సరఫరా చేయలేదు. మత్స్య సహకార సొసైటీలు, ఆ శాఖ అధికారులకు మధ్య సమన్వయలోపం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి ఏటా జిల్లాకు అవసరమైన రూ.1.60 కోట్ల బడ్జెట్పై ముందస్తుగా ప్రతిపాదనలు చేయాల్సి ఉంది. కానీ, ఇప్పటి వరకు అలాంటి ప్రతిపాదనలు చేయలేదని సమాచారం.చేపల పెంపకం.. సొసైటీలపై భారంగతేడాది ప్రభుత్వం నుంచి చేపపిల్లలు రాకపోవడంతో జిల్లాలో మత్స్యకార్మికులే సొంతంగా డబ్బులు వెచ్చించి చేపపిల్లలను కొనుగోలు చేశారు. ముస్తాబాద్, గంభీరావుపేట, బోయినపల్లి, ఎల్లారెడ్డిపేట, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాల్లోని మత్స్యకార్మికులు తమ సొసైటీల ద్వారా డబ్బులు ఖర్చు చేసుకుని చేపపిల్లల పెంపకాన్ని చేపట్టారు. దీంతో ఆయా సొసైటీలపై ఆర్థిక భారం పడుతోందని కార్మికులు పేర్కొంటున్నారు. ఒక్క ముస్తాబాద్ సొసైటీ పరిధిలోని ఐదు చెరువుల్లో గతేడాది రూ.4లక్షలు వెచ్చించి చేపపిల్లలను వదిలారు. వాటినే ఏడాది పొడవునా పట్టుకుని ఉపాధి పొందుతున్నారు. ఇదిలా ఉండగా ఏటా వచ్చే భారీ వరదలతో చెరువులు మత్తళ్లు దూకి చేపపిల్లలు కొట్టుకుపోతున్నాయని, చేప పిల్లల రక్షణకు అవసరమైన జాలీలు, వలలు ఇవ్వాలని మత్స్యకార్మికులు కోరుతున్నారు.నాణ్యతే అసలు సమస్యప్రభుత్వం చేపపిల్లల సరఫరాకు ఏటా టెండర్ ని ర్వహిస్తుండగా.. కాంట్రాక్టు దక్కించుకున్న వారు ఆంధ్రప్రదేశ్ నుంచి చేపవిత్తనాలు సరఫరా చే స్తారు. అయితే ఇక్కడ చేప పిల్ల సైజు, దాని రకం, నాణ్యతపై కార్మికులకు అవగాహన ఉండదు. చెరువులో వదిలే సమయంలో చేపపిల్లల సంఖ్యను కూడా ఎవరూ లెక్కించే పరిస్థితి ఉండదు. దీంతో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా పిల్లల సంఖ్యను పెద్ద ఎత్తున తగ్గించి సరఫరా చేస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు.జిల్లాలో పరిస్థితి ఇలా..చేపపిల్లల డిమాండ్ 1.42 కోట్లురొయ్యపిల్లల డిమాండ్ 48 లక్షలుచెరువులు 440ప్రాజెక్టులు: ఎగువ మానేరు, మధ్యమానేరు, అన్నపూర్ణమత్స్యకార సొసైటీలు 48మత్స్యకార్మికులు 8,421 -
ఉరుములు..మెరుపులు..వర్షం
సిరిసిల్ల: జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం ఉరుములు.. మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పిడుగుపడి ఇల్లంతకుంట మండలం గొల్లపెల్లికి చెందిన గొర్రెలకాపరి దాసరి లక్ష్మణ్(21) మృతిచెందాడు. పక్కనే ఉన్న మరో గొర్రెల కాపరికి తీవ్రగాయాలయ్యాయి. సిరిసిల్లలోని లోతట్టు ప్రాంతాలు వెంకంపేట, పాతబస్టాండు, సంజీవయ్యనగర్, ఆసిఫ్పుర, ఆటోనగర్, శాంతినగర్ ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రగతినగర్లో వేపచెట్టు విరిగి విద్యుత్తీగలపై పడడంతో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. పొంగిపొర్లిన వాగులు వేములవాడ మండలం హన్మాజిపేట వద్ద నక్కవాగు నిండుగా పారింది. చందుర్తి మండలంలో భారీగా కురిసిన వర్షాలతో నక్కవాగు పొంగిపొర్లింది. తంగళ్లపల్లి మండలం సండ్రవాగు, ఇల్లంతకుంటలోని బిక్కవాగుల్లో వరద పారింది. మానేరువాగు, మూలవాగులకు వరదనీరు మోసుకొచ్చే ఒర్రెలు పారాయి. కోనరావుపేట, రుద్రంగి మండలాల్లో వర్షాలతో వడ్లు తడిసి మొలకొచ్చాయి. తూకం వేసిన ధాన్యాన్ని తరలించకపోవడంతో బస్తాల్లోనే మొలక వచ్చింది. వర్షపాతం ఇలా.. వేములవాడ మండలం నాంపల్లి వద్ద అత్యధికంగా 102.5 మిల్లీమీటర్ల వర్షం నమోదుకాగా.. అత్యల్పంగా గంభీరావుపేటలో 3.3 మిల్లీమీటర్లు న మోదైంది. చందుర్తి మండలం మర్రిగడ్డ వద్ద 81.5, కోనరావుపేట మండలం నిజామాబాద్లో 72.0, బోయినపల్లిలో 63.0, ముస్తాబాద్ మండలం ఆవునూర్లో 56.3, కోనరావుపేట మండలం మర్తనపేటలో 53.5, వేములవాడ మండలం మల్లారంలో 52.8, వీర్నపల్లిలో 52.3, కలెక్టరేట్ వద్ద 52.0, పెద్దూరులో 43.5, నామాపూర్లో 31.0, కందికట్కూర్లో 30.5, ఎల్లారెడ్డిపేటలో 22.0, నేరెళ్లలో 21.5, రుద్రంగిలో 21.5, వట్టెంలలో 20.0, ఇల్లంతకుంటలో 20.0, పెద్దలింగాపూర్లో 16.0, మానాలలో 16.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా అంతటా వర్షం వేములవాడ: పట్టణంలోని రోడ్లపై వరదనీరు ప్రవహించింది. రాజన్న గుడి ముందు పెద్ద ఎత్తున వరదనీరు చేరిపోవడంతో మోకాళ్లలోతు వరదనీటిలో భక్తులు ఇబ్బందులు పడ్డారు. కోనరావుపేట: మండలంలో 74 మీల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వీర్నపల్లి: మండలంలోని వన్పల్లిలోని రామలక్ష్మణ్ చెరువులోకి నీరు చేరుతుంది. రుద్రంగి: మండలంలో కూరగాయల తోటలు నేలవాలి తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇల్లంతకుంట: మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. వెల్జీపూర్లోని కొనుగోలు కేంద్రంలో లోతట్టు ప్రాంతంలో ఉన్న ధాన్యం కుప్పల చుట్టూ వర్షపు నీరు చేరింది. మండలంలో తూకం వేసిన దాదాపు 30వేల బస్తాలు తడిసిపోయాయి. వల్లంపట్లలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ ప్రహరీ కూలింది. ఎల్లారెడ్డిపేట: మండలంలోని వెంకటాపూర్ శివారులోని ప్రధాన రహదారిపై భారీ వృక్షాలు నేలకూలాయి. అక్కపల్లి శివారులోని లేతమామిండ్లవాగు వరదనీటితో పొంగిపొర్లింది. ఇల్లంతకుంటలో పిడుగుపాటుకు గొర్రెలకాపరి మృతి సిరిసిల్లలో విరిగిపడిన చెట్లు.. నిలిచిన విద్యుత్ సరఫరా లోతట్టు ప్రాంతాలు జలమయం పొంగిపొర్లిన నక్కవాగు, లేతమామిండ్లవాగు -
వరద వచ్చినా సిద్ధం
● ముందస్తు రుతుపవనాలతో ఇరిగేషన్శాఖ అప్రమత్తం ● ఎల్లంపల్లి, మిడ్మానేరు, ఎల్లంపల్లి గేట్ల నిర్వహణ షురూ ● పనుల కోసం టెండర్లు పిలిచిన అధికారులు ● ఎల్ఎండీలో మొదలైన పనులు, ఎంఎండీ, ఎల్లంపల్లివి జూన్లో ● వరదకు ముందే అప్రమత్తంగా ఉండేలా చర్యలుసాక్షిప్రతినిధి, కరీంనగర్: ఈ ఏడాది రుతుపవనాలు ముందుగానే వచ్చాయి. సాధారణంగా జూన్ మొదటి వారంలో రాష్ట్రంలో తొలకరి పలకరిస్తుంది. వాతావరణ మార్పుల కారణంగా ఈసారి అసాధారణరీతిలో దాదాపు రెండువారాల ముందే వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో నీటిపారుదలశాఖ వానాకాలానికి ముందస్తుగానే గేట్ల నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేసుకుంది. రుతుపవనాలు ముందుగా రావడంతో ఈ పనుల్లో వేగం పెంచింది. ఇప్పటికే లోయర్ మానేరు డ్యాం అధికారులు గేట్ల నిర్వహణ పనులు చేపట్టారు. ప్రస్తుతం పనులు శరవేగంగా సాగుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్ల నిర్వహణకు టెండర్లు ఖరారవగా.. రాజన్నసిరిసిల్ల జిల్లాలోని మిడ్మానేరు ప్రాజెక్టు గేట్ల నిర్వహణ కోసం అధికారులు టెండర్లు పిలిచారు. ప్రీ మాన్సూన్, పోస్ట్ మాన్సూన్ల కాలంలో గేట్ల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏటా ఏం చేస్తారు? సాధారణంగా ఏటా వర్షాకాలానికి ముందే.. నీటిపారుదలశాఖ అధికారులు గేట్ల నిర్వహణకు పూనుకుంటారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిబంధనల ప్రకారం ప్రతీ డ్యాం వద్ద వర్షాకాలానికి ముందు(ప్రీ మాన్సూన్), వర్షాకాలానికి తరువాత (పోస్ట్ మాన్సూన్) గేట్ల లూబ్రికేషన్ ప్రక్రియను చేపడతారు. వరద సమయంలో గేట్లు సులువుగా పైకి లేచేందుకు లూబ్రికేషన్ దోహదపడుతుంది. ఇందులో భాగంగా వాల్వ్ గేర్బాక్స్లకు కూడా గ్రీస్ పూయాల్సి ఉంటుంది. ఇవే కాకుండా అత్యవసర సమయాల్లో వినియోగించేందుకు వీలుగా జనరేటర్ల పనితీరును సమీక్షిస్తారు. వీటిని ప్రతీ ఐదు రోజులకు ఒకసారి దాదాపు 5 నిమిషాలపాటు అనివార్యంగా పనిచేయిస్తారు. ఇలాంటి భారీ జనరేటర్ల్లు ప్రతీ ప్రాజెక్టు వద్ద రెండు వరకు ఉంటాయి. వీటితోపాటు లిఫ్ట్లు, మెకానిక్ టూల్స్, ఇతర ఎలక్ట్రిక్ వస్తువులను కూడా నిర్వహణ చేయాల్సి ఉంటుంది. ఎల్ఎండీ అధికారులు రూ.13లక్షల నుంచి రూ.15లక్షల వరకు టెండరు పిలవగా.. ప్రస్తుతం పనులు వేగంగా నడుస్తున్నాయి. ఇక పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లికి సంబంధించి రూ.38లక్షలకు టెండరు ఇచ్చారు. రాజన్నసిరిసిల్ల జిల్లా మిడ్మానేరుకు సంబంధించి దాదాపు రూ.26 లక్షలతో తాజాగా టెండరు పిలిచారు. ఈ రెండు ప్రాజెక్టుల పనులు జూన్లో మొదలు కానున్నాయి. వరద అవకాశాలు అంతంతే.. సాధారణంగా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలు ఉన్న సమయంలో ప్రాజెక్టుల్లో నీరు చెప్పుకోదగ్గస్థాయిలో ఉండేది. వీటికి వర్షాలు తోడైనపుడు ప్రాజెక్టులు వేగంగా నిండి గేట్లు తెరవాల్సిన పరిస్థితి ఉత్పన్నమయ్యేది. దాదాపుగా ఏడాదిన్నరగా ఎత్తిపోతలు నిలిచిపోయిన దరిమిలా మునపటి తరహాలో ప్రాజెక్టులలో నీటిమట్టాలు లేవనే చెప్పాలి. ఒకవేళ భారీగా కుండపోత వర్షాలు కురిసి, ఎగువనున్న మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున వరదలు వస్తేనే మన ప్రాజెక్టులు నిండి, గేట్లు తెరవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని నీటిపారుదల శాఖ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం గేట్లు ఎల్ఎండీ 24 టీఎంసీ 20 ఎంఎండీ 27.5 టీఎంసీ 25 ఎల్లంపల్లి 20 టీఎంసీ 62 -
వైద్యారోగ్య శాఖలో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు
సిరిసిల్ల: జిల్లాలో వైద్యారోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిన భర్తీ చేసేందుకు మంగళవారం ఇంటర్వ్యూలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధ్యక్షతన నిర్వహించారు. ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించగా, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన నాలుగు మెడికల్ ఆఫీసర్ పోస్టులకు ఒక్క అభ్యర్థి, కాంట్రాక్టు ప్రాతిపదికన ఒక్క ల్యాబ్ మేనేజర్ పోస్టుకు ఆరుగురు, ఐదు ఎంఎల్హెచ్పీ పోస్టులకు 11 మంది హాజరయ్యారు. ఈ ఇంటర్వ్యూలలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి ఎస్.రజిత, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పర్యవేక్షకులు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.నేతకార్మికుల ఉపాధికి ఆర్డర్లు● చేనేత, జౌళిశాఖ ఏడీ రాఘవరావుసిరిసిల్ల: నేతకార్మికులకు నిరంతరం ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం వస్త్రోత్పత్తి ఆర్డర్లు ఇస్తుందని సిరిసిల్ల చేనేత, జౌళిశాఖ సహాయ సంచాలకుడు జి.రాఘవరావు పేర్కొన్నారు. సిరిసిల్ల శివారులోని చంద్రంపేటలో మైండ్కేర్, కౌన్సెలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన మనోవికాస సదస్సులో మాట్లాడారు. సిరిసిల్ల పవర్లూమ్ పరిశ్రమకు మహిళాశక్తి చీరల ఆర్డర్లు ఇచ్చామని, నేతన్నలకు చేతినిండా పని కల్పించే సంక్షేమశాఖల వస్త్రోత్పత్తి ఆర్డర్లు అందించామన్నారు. ప్రభుత్వం సర్వశిక్ష అభియాన్ స్కూల్ యూనిఫామ్స్, మరికొన్ని ప్రైవేట్ ఆర్డర్లను ఇవ్వడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. సెకాలజిస్ట్ కె.పున్నంచందర్ మాట్లాడుతూ ఆత్మహత్య ఆలోచనలు, మానసిక సమస్యలు ఎదురైనప్పుడు జిల్లా ఆస్పత్రిలోని మైండ్కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్లో సంప్రదించాలని కోరారు. కమ్యూనిటీ ఫెసిలిటేటర్ వేముల మార్కండేయలు పాల్గొన్నారు.యోగా శిక్షణ షురూ..వేములవాడ: అంతర్జాతీయ యోగా దశాబ్ది వేడుకల సందర్భంగా ‘యోగా ఫర్ వన్ ఎర్త్.. వన్ హెల్త్’ అనే నినాదంతో హరితయోగా, యోగావాక్, యోగా సంగమం, యోగా ప్రభావ అనే నాలుగు కార్యక్రమాలు మంగళవారం ప్రారంభించినట్లు ఆయుష్ జిల్లా నోడల్ అధికారి శశిప్రభ తెలిపారు. జూన్ 21 వరకు గ్రామ, మండలస్థాయిలో శిక్షణ కొనసాగుతుందని తెలిపారు. ఓల్డ్ అర్బన్కాలనీలోని కమ్యూనిటీహాల్లో 30 మంది హాజరయ్యా రు. డీపీఎం తిరుపతి, ఫార్మసిస్ట్ పుష్పలత, శిక్షకులు ఎలిగేటి కృష్ణ, ఆశవర్కర్లు లత, హేమలత, ఉమ, జయ, విజయ, రమ్య ఉన్నారు.వందేళ్ల చరిత్ర ఉన్న పార్టీ సీపీఐకరీంనగర్: దేశంలో వందేళ్ల చరిత్ర కలిగిన పార్టీ ఏదైనా ఉందంటే సీపీఐ ఒక్కటేనని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. సీపీఐ కరీంనగర్ జిల్లా 23వ మహాసభలు నగరంలో మంగళవారం ప్రారంభమయ్యాయి. పార్టీ పతాకాన్ని సీనియర్ నాయకుడు వేముల వెంకట్రాజం, అమరవీరుల స్మారకస్తూపం చిహ్నాన్ని శ్రీరాముల రామచంద్రం ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా హాజరైన కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కమ్యూనిస్టులను దూరం చేసుకుని అధికారాన్ని పోగొట్టుకున్నామనే బాధలో బీఆర్ఎస్ ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సీపీఐ ఎంత కృషి చేసిందో ప్రజలకు తెలుసన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ను నమ్మే పరిస్థితి లేదన్నారు. స్థానికసంస్థల ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని పిలుపునిచ్చారు. జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ కార్మికులు లేబర్కోడ్లను వ్యతిరేకిస్తూ పోరాటం చేయాలన్నారు. నాయకులు మర్రి వెంకటస్వామి, సభ్యుడు కలవేన శంకర్, పొనగంటి కేదారి, కొయ్యడ సృజన్కుమార్, బో యిని అశోక్, అందెస్వామి, టేకుమల్ల సమ్మ య్య, కసిరెడ్డి సురేందర్రెడ్డి పాల్గొన్నారు. -
దళారులను నమ్మొద్దు
వేములవాఅర్బన్/వేములవాడరూరల్: ఇంది రమ్మ ఇళ్ల బిల్లుల మంజూరులో దళారులను నమ్మొద్దని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. విడతల వారీగా బిల్లులు మంజూరవుతాయని తెలిపారు. వేములవాడ అర్బన్ మండలానికి 370 లబ్ధిదారులకు, వేములవాడరూరల్ మండలం చెక్కపల్లిలో మంగళవారం 333 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపత్రాలను కలెక్టర్ సందీప్కుమార్ ఝాతో కలిసి అందించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల హామీ మేరకు ఇళ్లు మంజూరు చేశామన్నారు. వేములవాడరూరల్ మండలం వెంకటాంపల్లిలో పైలట్ ప్రాజెక్టుగా ఇళ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. అధికారులు నిర్మాణాలను పరిశీలించిన తర్వాతే బిల్లులు మంజూరు చేస్తారని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇంటి కోసం ఉచితంగా ఇసుకా అందిస్తామన్నారు. ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, హౌసింగ్పీడీ శంకర్, మండల ప్రత్యేకాధికారి లక్ష్మీరాజం, ఎంపీడీవో శ్రీనివాస్, తహసీల్దార్ అబూబాకర్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు వకుళాభరణం శ్రీనివాస్, మాజీ ఎంపీపీ రంగు వెంకటేశంగౌడ్, జైపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రూ.200కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ వేములవాడ: నియోజకవర్గానికి రూ.200కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరైనట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం విలేకరులతో మాట్లాడారు. సుమారు 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలో అద్భుతమైన క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడంతోపాటు, ఉపాధ్యాయులకూ వసతి కల్పించడానికి గృహ సముదాయాన్ని నిర్మిస్తామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన డిజిటల్ విద్యాబోధన ఉంటుందని తెలిపారు. ఎన్నికల హామీ నెరవేరుస్తున్నాం ప్రభుత్వ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ -
రహదారికి అనుమతులు నిలిపివేయాలి
బోయినపల్లి(చొప్పదండి): మండలంలోని కొదురుపాక వైకుంఠధామం నుంచి నీలోజిపల్లికి చెందిన ఓ రైతుకు ఇచ్చిన రహదారి అనుమతులు నిలిపివేయాలని కొదురుపాక గ్రామస్తులు పలువురు తహసీల్దార్ కాలె నారాయణరెడ్డిని మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రత్యేకాధికారి, పంచాయతీ కార్యదర్శి అనుమతులు లేకుండానే దారి కోసం రైతు వైకుంఠధామంలో సుమారు 56 పచ్చని చెట్లు నరికేశాడని ఆరోపించారు. సదరు రైతుకు వేరే చోటు నుంచి రహదారి ఉన్నప్పటికీ మళ్లీ దారి కావాలని అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక్కడ బాలమల్లు, వెంకటేశ్, దీక్షిత్, కత్తెరపాక రవీందర్ తదిరతరులు పాల్గొన్నారు. -
అమ్మా.. లేమ్మా.. ఇంటికెళ్దాం..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చపేట గ్రామ శివారులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంతో ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటలో విషాదం అలుముకుంది. కళ్ల ముందే కన్న తల్లి ప్రాణాలు పోతుంటే లోకం పోకడ తెలియని చిన్నారుల ఆర్తనాదాలు అందరినీ కదిలించాయి. తల్లి రోడ్డు ప్రమాదంలో మరణించడం.. తండ్రి బతుకుదెరువు రీత్యా గల్ఫ్లో ఉండడంతో చిన్నారులు అనాథలయ్యారు. రాజన్నపేటకు చెందిన చొట్టి కీర్తన, మహేందర్ దంపతులకు ఇద్దరు కుమారులు అన్వేశ్(6), శివాన్‡్ష(3) ఉన్నారు. మహేందర్ ప్రస్తుతం గల్ఫ్లో ఉండగా.. కీర్తన తన ఇద్దరు కుమారులతో కలిసి పుట్టింటికి బయలుదేరింది. మాచారెడ్డిలో బస్సు దిగి తన తండ్రికి ఫోన్ చేసి తమను తీసుకుపోవడానికి ద్విచక్ర వాహనంపై రమ్మంది. మాచారెడ్డికి వచి్చన తండ్రి కూతురు కీర్తనతోపాటు ఇద్దరు మనుమళ్లను వాహనంపై ఎక్కించుకొని స్వగ్రామమైన లచ్చపేటకు వెళ్తుండగా.. లచ్చపేట మలుపు వద్ద ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కీర్తన తీవ్ర గాయాలకు గురై మరణించింది. ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చిన తాతతోపాటు ఇద్దరు చిన్నారులు గాయాలకు గురయ్యారు. అమ్మా.. లేమ్మా.. గాయపడ్డ చిన్నారులు తల్లి వద్దకు వెళ్లి అమ్మా.. లేమ్మా.. అంటూ తట్టి లేపడం అక్కడున్న వారందరినీ కదిలించింది. వారి రోదనలు కట్టతడి పెట్టించాయి. కీర్తన మృతదేహాన్ని కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. గ్రామస్తులు గల్ఫ్లో ఉన్న మహేందర్కు సమాచారమందించారు. సంఘటనా స్థలానికి రాజన్నపేట మాజీ ఎంపీటీసీ నమిలికొండ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ ముక్క శంకర్ వెళ్లి క్షతగాత్రులను కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
గ్రీవెన్స్డేతో సమస్యలు పరిష్కారం
సిరిసిల్లక్రైం: ప్రజల సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్డే నిర్వహిస్తున్నట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో 18 ఫిర్యాదులు స్వీకరించారు. వాటిని ఆయా పోలీస్స్టేషన్ల అధికారులకు పరిష్కరించాల్సిందిగా సూచించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ఠాణాకు వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని సూచించారు.మూడు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి● డీఆర్డీవో శేషాద్రిసిరిసిల్ల: జిల్లాలో మరో మూడు రోజుల్లో ధా న్యం కొనుగోళ్లను పూర్తి చేస్తామని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి శేషాద్రి సోమవారం తెలిపారు. జిల్లాలో 242 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి 35,902 మంది రైతుల వద్ద ఇప్పటికే 2,40,695 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. జిల్లాలో సేకరించిన ధాన్యం విలువ రూ.558 కోట్లని, యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా.. సజా వుగా కొనసాగిస్తున్నామన్నారు. జిల్లాలో పూ ర్తి స్థాయిలో మూడు రోజుల్లో వడ్లను కొనుగోలు చేస్తామని శేషాద్రి స్పష్టం చేశారు.నేడు పెద్దింటి కథా కార్యశాలసిరిసిల్లకల్చరల్: తెలంగాణ సాహిత్య అకాడమీ సారథ్యంలో మంగళవారం కథా రచయిత పెద్దింటి అశోక్కుమార్ నిర్వహణలో కార్యశాల(వర్క్షాప్) నిర్వహించనున్నారు. హైదరాబాద్ మినీరవీంద్రభారతిలో జరిగే కార్యశాలలో ఔత్సాహిక కథారచయితలకు అవగాహన కల్పిస్తారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపెల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ అతిథులుగా హాజరవుతారని, సకాలంలో హాజరుకావాలని అకాడమీ కార్యదర్శి నామోజు బాలాచారి కోరారు.తూనికలు, కొలతలశాఖ అధికారుల తనిఖీలుసిరిసిల్ల: జిల్లా కేంద్రంలో తూనికలు, కొలతలశాఖ అధికారులు సోమవారం తనిఖీ చేశారు. స్థానిక పాతబస్టాండు, గాంధీచౌక్ ప్రాంతాల్లోని బేకరీలు, స్వీట్షాపులు, కిరాణ దుకాణాల్లో సోదాలు చేశారు. ప్యాకేజీ వస్తువులపై అధిక ధరలు వసూలు చేస్తున్నారని గుర్తించి ఐదు దుకాణాల యజమానులపై కేసులు నమోదు చేశారు. అధిక ధరలకు విక్రయిస్తే 94925 34843లో ఫిర్యాదు చేయాలని కోరారు. తూనికలు, కొలతల శాఖ కరీంనగర్ జోనల్ అసిస్టెంట్ కమిషనర్ విజయసారథి, జిల్లా అధికారి ఆర్.రూపేశ్కుమార్, సిబ్బంది గంగరాములు, శ్రీనివాస్, మల్లికార్జున్ పాల్గొన్నారు.ప్రభుత్వ భూమి కబ్జాపై విచారణఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని సింగారం శివారులోని దర్శావళిగుట్ట వద్ద ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. ఈక్రమంలోనే రెవెన్యూ అధికారులు సోమవారం విచారణ జరిపి కబ్జాదారుడికి నోటీసులు జారీ చేశారు. కబ్జా చేసిన ఎకరం బంచరాయి భూమి వ్యవహారంలో కబ్జాచేసిన వ్య క్తితో ఓ రాజకీయపార్టీ నాయకులు రహస్యంగా మంతనాలు జరిపినట్లు సమాచారం. కబ్జాచేసిన భూమిని రికవరీ చేసుకునే విషయంలో రెవెన్యూ అధికారులు చర్యలకు దిగుతున్నట్లు తెలిసింది. -
ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వండి
మాది బుడిగజంగాల కులం. మాకు ఎస్సీ కుల సర్టిఫికెట్లు మొన్నటి వరకు ఇచ్చారు. ఇప్పుడు ముస్తాబాద్ తహసీల్దార్ ఇవ్వడం లేదు. ఎవరో ఫిర్యాదు చేశారని ఆపారట. మాకు ఎస్సీ కుల ధ్రువీకరణపత్రాలను జారీ చేయాలి. – బుడిగజంగాల ప్రతినిధులు, ముస్తాబాద్ కిలో కోత విధిస్తామంటున్నారు వడ్లు బస్తాకు 42 కిలోలు తూకం వేశాం. అయినా మళ్లీ బస్తాకు కిలో వడ్లు తగ్గిస్తేనే లారీ నుంచి దించుకుంటామని రైస్మిల్లర్ అంటున్నాడు. నాలుగు రోజులుగా లారీని అన్లోడ్ చేయడం లేదు. ప్రతీ బస్తాకు ఇప్పటికే అదనపు వడ్లను జోకాం. అయినా.. ఇంకా కోత విధించి రైతులను ముంచాలని చూస్తున్నారు. – గెంటె మహేశ్, వెంకటాపూర్ -
రోజుకు ఉమ్మడి జిల్లా నుంచి 50 నుంచి 60 వేల ఆర్డర్లు ● రూ.కోట్లలో వ్యాపారం
షాపింగ్.. ఒకప్పుడు ఒకరిద్దరిని తోడుగా తీసుకొని వెళ్లి.. నచ్చింది చూసి.. ధర ఆరా తీసి.. బేరం చేసి తెచ్చుకునేవాళ్లం. నేడు అంతా మారిపోయింది. ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే నిమిషాల్లో గుమ్మంలోకి వచ్చి చేరుతోంది. జీవితం ఉరుకుల..పరుగులమయం కావడంతో ఆన్లైన్ షాపింగ్ బెస్ట్ ఆప్షన్గా మారింది. ఉమ్మడి జిల్లా నుంచి రోజుకు 50 నుంచి 60 వేల ఆర్డర్లు వెళ్తుండగా, కోట్లలో వ్యాపారం సాగుతున్నట్లు సమాచారం. డెలివరీ బాయ్స్కు ఉపాధినిస్తుండగా.. ప్రజలకు బయట అడుగుపెట్టే శ్రమ లేకుండా పోతోంది. ఫలితంగా ఆరోగ్య సమస్యలు వెంటా డుతున్నాయి. చిన్న వయసులోనే మధుమేహం.. బీపీ.. గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయి. జీవితమే టైమ్ మెషిన్లా మారిన నేటి కాలంలో ఆన్లైన్ షాపింగ్.. పరిణామాలపై మార్కెటింగ్ దినోత్సవం సందర్భంగా స్పెషల్ స్టోరీ.. – సిరిసిల్ల– వివరాలు 8లోu -
ఆలకించి.. ఆదుకోండి
● ప్రజావాణిలో వినతుల వెల్లువ ● అర్జీలు వెంటనే పరిష్కరించాలి ● కలెక్టర్ సందీప్కుమార్ ఝా ● వివిధ సమస్యలపై 182 దరఖాస్తులుసిరిసిల్ల: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి భారీగా బాధితులు తరలివచ్చారు. తమ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝాకు వినతిపత్రాలు అందించారు. జిల్లాలోని నలువైపుల నుంచి తరలివచ్చిన బాధితులు దాదాపు 182 మంది అర్జీలు అందించారు. రెవెన్యూశాఖకు 75, హౌసింగ్కు 36, ప్రత్యేక ఉపకలెక్టర్కు 12, డీఆర్డీవో, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్లకు 9 చొప్పున, ఎస్పీ ఆఫీస్కు 6, జిల్లా ఉపాధి కల్పన అధికారి, నీటిపారుదల శాఖలకు 5 చొప్పున, జిల్లా సంక్షేమాధికారికి 4, వ్యవసాయశాఖ, జిల్లా విద్యాశాఖ అధికారి, చేనేత, జౌళిశాఖ, సబ్ రిజిస్ట్రార్, ఏడీ భూసర్వే శాఖలకు రెండు చొప్పున దరఖాస్తులు వచ్చాయి. ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును వెంటనే పరిష్కరించాలని, లేదా.. బాధితులకు సమాధానం ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. డీఆర్డీవో శేషాద్రి, డీఎంహెచ్వో రజిత పాల్గొన్నారు. -
ప్రొటోకాల్ ‘వార్’
● కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల ఘర్షణ ● పోలీసుల లాఠీచార్జీ ● ఇరువర్గాలపై కేసులుసిరిసిల్ల: సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రొటోకాల్ వార్ ఉద్రిక్తతలకు దారితీసింది. సోమవారం కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్యాంప్ ఆఫీస్ ఎదుట బాహాబాహీకి దిగారు. ఇరువర్గాలను కట్టడి చేయడం సాధ్యం కాకపోవడంతో పోలీసులు లాఠీచార్జీ చేశారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి ఎడమ చేయి విరుగగా, పార్టీ యూత్ నాయకులు సబ్బని హరీశ్, చంటీలకు గాయాలయ్యాయి. కాంగ్రెస్ శ్రేణులను అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. కాంగ్రెస్ నాయకులు జాలగం ప్రవీణ్(టోనీ), మునిగెల రాజు, బైరినేని రాము, కోడం అమర్ తదితరులు పాల్గొన్నారు. రోడ్డుపై బైటాయించిన బీఆర్ఎస్ నాయకులనూ తంగళ్లపల్లి పోలీస్స్టేషన్కు తరలించారు. పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు. పొలిటికల్ వార్ సిరిసిల్ల నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదా రులకు మంజూరుపత్రాల పంపిణీ కార్యక్రమాల్లో సీఎం రేవంత్రెడ్డి, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఫొటోలు పెడుతున్న అధికారులు స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఫొటో పెట్టడం లేదు. ఈ విషయమై సర్పంచ్ల ఫోరమ్ జిల్లా మాజీ అధ్యక్షుడు మాట్ల మధు ఆధ్వర్యంలో ఎస్పీ మహేశ్ బీ గీతేకు ఫిర్యాదు చేశారు. కేటీఆర్ ఫొటో పెట్టకపోతే కార్యక్రమాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. అయితే సిరిసిల్లలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో సీఎం రేవంత్రెడ్డి ఫొటో లేదని.. పెడతామని అక్కడికి రాగా తోపులాట జరిగింది. ‘కాంగ్రెస్ గిచ్చి కయ్యం పెట్టుకుంటోంది’ కాంగ్రెస్ పార్టీ గిచ్చి కయ్యం పెట్టుకుంటోందని మాజీ ఎంపీ, ప్రణాళిక సంఘం రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్పై కాంగ్రెస్ నాయకులు దాడిని ఖండించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే నివాసంలో సీఎం ఫొటోలు ఎలా పెడతారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులపై పోలీసుల లాఠీచార్జీ ఖండించారు. దాడి దారుణం కేటీఆర్ క్యాంపు ఆఫీస్పై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేయడం దారుణమని వేములవాడ బీఆర్ఎస్ ఇన్చార్జి చలిమెడ లక్ష్మీనర్సింహారావు పేర్కొన్నారు. పోలీసులు పక్షపాత ధోరణి వీడాలని, అధికారులు రాజ్యాంగ బద్ధంగా ఉండాలన్నారు. గుండాల రాజ్యం – బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య సిరిసిల్ల/తంగళ్లపల్లి: తంగళ్లపల్లి పోలీస్స్టేషన్లో ఉన్న బీఆర్ఎస్ నాయకులను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య.. నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, సెస్ చైర్మన్ చిక్కాల రామారావుతో కలిసి పరామర్శించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో గుండా రాజ్యం సాగుతోందన్నారు. పోలీసులు పక్షపాత వైఖరితో వ్యవహరించడంతోనే కేటీఆర్ క్యాంపు ఆఫీస్పై కాంగ్రెసోళ్లు దాడి చేశారని ఆరోపించారు. ముందుస్తు సమాచారం ఉన్నా కట్టడి చేయకుండా.. దాడులకు ఉసిగొల్పారని విమర్శించారు. కలెక్టర్ కాంగ్రెస్ కార్యకర్తలా పని చేస్తున్నారని మరోసారి రుజువైందన్నారు. ప్రజలు ఎన్నికల్లో ఐదుసార్లు తిరస్కరించినా కేకే మహేందర్రెడ్డిని కలెక్టర్ వెంటబెట్టుకొని ప్రభుత్వ కార్యక్రమాల్లో పా ల్గొనడం సరికాదన్నారు. కనీసం వార్డు మెంబర్గా కూడా గెలువలేని ఆయనకు ప్రొటోకాల్ ఏంటని? ప్రశ్నించారు. ప్రొటోకాల్ వివాదం శాంతిభద్రతల సమస్య అవుతుందని ముందే ఎస్పీకి ఫిర్యాదు చేశామని చక్రపాణి గుర్తు చేశారు. విలేకరుల సమావేశంలో ‘సెస్’ వైస్చైర్మన్ దేవరకొండ తిరుపతి, బీఆర్ఎస్ నాయకులు చీటి నర్సింగరావు, బొల్లి రామ్మోహన్, రాఘవరెడ్డి, సిద్ధం వేణు, మాట్ల మధు, సబ్బని హరీశ్, చంటి, కృష్ణారెడ్డి, చంద్రయ్యగౌడ్, బండ నర్సయ్యయాదవ్, గజభీంకార్ రాజన్న, బాలయ్య, మల్యాల దేవయ్య, దిడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు. -
సిరిసిల్లలో హైటెన్షన్.. కేటీఆర్ క్యాంపు కార్యాలయం ముట్టడి
రాజన్న సిరిసిల్ల జిల్లా: జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే కేటీఆర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రోటోకాల్ పాటించాలంటూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని కాంగ్రెస్ నేతలు ముట్టడించారు. ఎమ్మెల్యే కేటీఆర్ కార్యాలయంలో ప్రోటోకాల్ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టలేదంటూ కాంగ్రెస్ నాయకులు నిరసనకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణా తల్లి ఫోటోలతో కాంగ్రెస్ నాయకులు రాగా.. పోలీసులు అడ్డుకున్నారు.దీంతో పోలీసులకు, కాంగ్రెస్ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పగిలిపోవడంతో కాంగ్రెస్ నాయకులు కోపోద్రిక్తులయ్యారు. తెలంగాణా తల్లి, సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలు తీసుకొని క్యాంపు కార్యాలయాన్ని ముట్టడికి కాంగ్రెస్ నాయకులు యత్నించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.లాఠీఛార్జ్లో బీఆర్ఎస్ నాయకులకు గాయాలయ్యాయి. తోపులాటలో టౌన్ సిఐ కృష్ణ వేలికి గాయమైంది. ప్రోటోకాల్ విషయంలో ఇరువర్గాల పరస్పరం వాగ్వాదంతో రచ్చ రచ్చగా మారింది. క్యాంపు కార్యాలయంలో కొత్త సీఎం ఫోటో ఉండాలని.. కానీ పాత సీఎం కేసీఆర్ ఫోటో ఉందని సోషల్ మీడియాలో వైరల్ కాగా, ఈ విషయంపై వివాదం నెలకొంది. -
కుట్టేస్తున్నారు
● విద్యార్థుల యూనిఫాంలు సిద్ధం చేస్తున్న మహిళలు ● విద్యాసంవత్సరం ఆరంభంలోగా అందించాలని లక్ష్యం ● వేగంగా సిద్ధమవుతున్న దుస్తులుగంభీరావుపేట(సిరిసిల్ల): విద్యాసంవత్సరం ఆరంభంలోనే విద్యార్థులకు యూనిఫాంలు అందించాలనే లక్ష్యంతో అధికారులు ముందుకెళ్తున్నారు. ఈమేరకు యూనిఫాంల కుట్టే బాధ్యతను మహిళా సంఘాలకు అప్పజెప్పారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో వస్త్రాలను కొనుగోలు చేసి యూనిఫాం కుట్టే పనులను మహిళా సంఘాలకు అప్పగించారు. గత ఫిబ్రవరిలోనే వీవోఏలు, ప్రధానోనాపాధ్యాయుల చొరవతో విద్యార్థుల కొలతలను సేకరించారు. ప్రస్తుతం తరగతులవారీగా రూపొందించిన డిజైన్లు, కొలతల ప్రకారం దుస్తులను కుడుతున్నారు. మరోవైపు కుట్టుమిషన్ పని వచ్చే మహిళా సంఘాల సభ్యులు ఉపాధి పొందుతున్నారు. వీరికి ఒక్కో జత కుట్టినందుకు రూ.75 చొప్పున చెల్లించనున్నారు. ముందుగా ఒక్కో జత జిల్లా వ్యాప్తంగా 32,269 మందికి యూనిఫామ్స్ అందించాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఇప్పటి వరకు 20వేలకు పైగా యూనిఫామ్స్ దుస్తులు సిద్ధమయ్యాయి. మిగతావి కూడా జూన్ 12లోపు సిద్ధం చేస్తామని స్వయం సహాయక సంఘాల సభ్యులు చెబుతున్నారు. ముందుగా ఒక్కొక్కరికి ఒక్కో జత ఇవ్వనున్నారు. ఆర్థికాభివృద్ధికి దోహదం విద్యార్థుల యూనిఫాంలు కుట్టే పనులను మహిళలకు అప్పగించడం ద్వారా మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధికి దోహదం కానుంది. ఏటా ఇదే విధంగా మహిళలకు పనులు అప్పగిస్తే బాగుంటుందని భావిస్తున్నాం. యూనిఫాంలు కుట్టే పనితో మహిళలకు ఉపాధి లభిస్తుంది. – భాగ్య, మండల సమాఖ్య అధ్యక్షురాలు, గంభీరావుపేటగడువులోగా అందిస్తాం అధికారులు చెప్పినట్లుగా విద్యాసంవత్సరం ఆరంభంలోగా పాఠశాలల్లో విద్యార్థులకు యూనిఫాంలు అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. మహిళలు యూనిఫాంలు కుట్టే పనిని వేగంగా చేస్తున్నారు. – సుదర్శన్, ఐకేపీ ఏపీఎం, గంభీరావుపేట -
నయా పైసా ఎవరికీ ఇవ్వొద్దు
సిరిసిల్ల/ముస్తాబాద్(సిరిసిల్ల): నయా పైసా ఎవరికీ ఇవ్వొద్దు.. ఇసుక ఫ్రీగా ఇస్తాం.. నిరుపేదలకు మెప్మా ద్వారా రూ.లక్ష వరకు బ్యాంకు రుణం ఇప్పిస్తాం.. నిబంధనల మేరకు 600 చదరపు అడుగుల్లో ఇల్లు కట్టుకోండి అని... కలెక్టర్ సందీప్కుమార్ ఝా కోరారు. సిరిసిల్లలో 764 మందికి, ముస్తాబాద్లో 491 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపత్రాలను ఆదివారం పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పుడు ఇల్లు రాని వారికి రెండో విడతలో ఇస్తామని తెలిపారు. నాలుగు నెలల్లో ఇల్లు నిర్మాణం పూర్తి చేసి, దసరా, దీపావళి నాటికి గృహప్రవేశాలు చేయాలని కలెక్టర్ కోరారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి మాట్లాడుతూ రేవంత్రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందన్నారు. దివంగత నేత డాక్టర్ వైఎస్సార్ పాలనలో సిరిసిల్ల నేతన్నలకు 12వేల అంత్యోదయ కార్డులు ఇస్తే.. బీఆర్ఎస్ ప్రభుత్వం 7 వేల కార్డులను రద్దు చేసిందన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సిరిసిల్లలో ఇసుకను, గుట్టలను దోచుకున్నారని, రూ.100 కోట్లతో నిర్మించిన చెక్డ్యామ్లు ముక్కలయ్యాయని మహేందర్రెడ్డి ఆరోపించారు. ‘సెస్’ చైర్మన్ చిక్కాల రామారావు, ఏఎంసీ చైర్మన్ వెల్ముల స్వరూపారెడ్డి, డీఆర్డీవో శేషాద్రి, హౌసింగ్ పీడీ శంకర్, మున్సిపల్ కమిషనర్ పి.వాణి, ముస్తాబాద్ ఏఎంసీ చైర్పర్సన్ తలారి రాణి, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు చొప్పదండి ప్రకాశ్, ఆకునూరి బాలరాజు, సూర దేవరాజు, యెల్ల బాల్రెడ్డి, కనమేని చక్రధర్రెడ్డి, గజ్జెల రాజు, శ్రీనివాస్గౌడ్, మిర్యాల్కార్ శ్రీనివాస్, కొండల్రెడ్డి, దీటి నర్సింలు, యాదగిరిగౌడ్, అంజన్రావు, తహసీల్దార్ సురేశ్, ఎంపీడీవో బీరయ్య తదితరులు పాల్గొన్నారు. ఇసుక ఫ్రీగా ఇస్తాం.. దశలవారీగా బిల్లు చెల్లిస్తాం నిరుపేదలకు మెప్మా ద్వారా రూ.లక్ష రుణం కలెక్టర్ సందీప్కుమార్ ఝా సిరిసిల్ల, ముస్తాబాద్లలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ -
‘ఉపాధి’పై నిఘా
● పనుల పర్యవేక్షణకు మానిటరింగ్ కమిటీలు ● ఐదుగురు సభ్యులతో ఏర్పాటుకు నిర్ణయం ● అక్రమాలకు తావులేకుండా పనులు చందుర్తి(వేములవాడ): ఉపాధిహామీ పథకం పారదర్శకంగా అమలు జరిగేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఉపాధిహామీ పథకం పనులపై నిఘా పెట్టేందుకు గ్రామాల్లో విలేజీ మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేయనుంది. పనుల పర్యవేక్షణతోపాటు అవకతవకలు జరిగిన వెంటనే చర్యలు చేపట్టేందుకు విలేజీ మానిటరింగ్ కమిటీ(వీఎంసీ)కి పూర్తిస్థాయిలో అధికారాలను కట్టబెట్టింది. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేలా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. మానిటరింగ్ సభ్యుల నియామకానికి నిబంధనలు ● జిల్లాలోని 255 గ్రామపంచాయతీల్లో విలేజీ మానిటరింగ్ కమిటీలను ఐదుగురు సభ్యులతో ఏర్పాటు చేయాలని ప్రతీ గ్రామపంచాయతీకి ఆదేశాలు జారీచేశారు. ● ఈ కమిటీల్లో అంగన్వాడీ టీచర్, యూత్ సభ్యులు, స్కూల్టీచర్, గ్రామైక్య సంఘం సభ్యురాలు, ఈజీఎస్ సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ● పంచాయతీల ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులు కమిటీలను ప్రతిపాదిస్తూ ఇప్పటికే జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులకు నివేదికలు పంపించారు. ఈ కమిటీలు దాదాపు ఆరు నెలలపాటు పనిచేసేలా ప్రతిపాదనలు రూపొందించినట్లు సమాచారం. 98 వేల కుటుంబాలకు జాబ్కార్డులు జిల్లాలోని 255 గ్రామపంచాయతీల పరిధిలో 98వేలకుపైగా జాబ్కార్డులు ఉన్నాయి. 1,98,564 మంది కూలీలు ఉన్నారు. ఇందులో 64వేల జాబ్కార్డులు యాక్టివేట్ కాగా ఒక లక్ష మంది వరకు పనులకు హాజరవుతున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. కమిటీ విధులు ఇవీ.. ఉపాధిహామీ పనులను వారంలో ఒక్కసారైనా పర్యవేక్షించే బాధ్యత విలేజీ కమిటీలపై ఉంది. పనుల నిర్వహణపై కూలీలతో చర్చించాలి. ఉపాధిహామీ పనుల నిర్వహణ, సౌకర్యాలు పరిశీలించడంతోపాటు పనుల్లో నాణ్యత, వ్యయాన్ని అంచనా వేయడం, చేపట్టిన పనులపై నివేదికలు అందజేయడం కమిటీల బాధ్యత. కమిటీలు ఏర్పాటు చేశాం జిల్లాలోని 255 గ్రామపంచాయతీల్లో విలేజీ మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేశాం. ఉపాధిహామీ పథకం పనుల్లో అవతకవకలకు తావు లేకుండా పర్యవేక్షించేందుకు ఈ కమిటీల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే బాధ్యతలను కమిటీ సభ్యులకు అప్పగించాం. పనులు పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ కమిటీలు దోహదపడనున్నాయి. – శేషాద్రి, డీఆర్డీవో -
దేశ రక్షణలో సైనికులదే కీలకపాత్ర
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు గోపి ముస్తాబాద్(సిరిసిల్ల): దేశ రక్షణలో సైనికులదే కీలకపాత్ర అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలం బందనకల్కు చెందిన సైనికులు ధర్మపురి, శరత్లు ఆపరేషన్ సిందూర్లో పాల్గొని ఇటీవల స్వగ్రామానికి చేరుకోగా వారిని ఆదివారం సన్మానించారు. గోపి మాట్లాడుతూ సైనికులు ప్రాణాలకు తెగించి దేశ ప్రజలందరిని సురక్షితంగా కాపాడుతున్నారని కొనియాడారు. దేశం కోసం జీవితాలను త్యాగం చేస్తున్న సైనికుల రుణం తీర్చుకోలేమన్నారు. పార్టీ మండలాధ్యక్షుడు సౌల్ల క్రాంతికుమార్, సంతోష్రెడ్డి, మహేశ్వరి, మహేశ్, కార్తీక్రెడ్డి, రమేశ్, సుధాకర్, రాజేందర్, రాజు, వంశీ, శ్రీకర్, గాలిరెడ్డి పాల్గొన్నారు. విద్యార్థుల సంఖ్య పెంచాలి బోయినపల్లి(చొప్పదండి): ఉపాధ్యాయులు కాలానుగుణంగా బోధన చేసి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని జిల్లా విద్యాధికారి సీహెచ్ జనార్దన్రావు కోరారు. మండలకేంద్రంలో జరుగుతున్న ఉపాధ్యాయుల వృత్త్యంతర శిక్షణ తరగతులను ఆదివారం పరిశీలించారు. బడిబాటను విజయవంతం చేయాలని కోరారు. ఎంఈవో శ్రవణ్కుమార్, హెడ్మాస్టర్ బొలగం శ్రీనివాస్, కరీంనగర్ డైట్ ప్రిన్సిపాల్ ఎస్.మొండయ్య, రిసోర్సుపర్సన్లు కనకయ్య, జగన్మోహన్, కుమారస్వామి, బి.శ్రీనివాస్, చంద్రశేఖర్, సురేంద్రస్వామి, టెక్నికల్ పర్సన్ శ్రీపతి చంద్రమౌళి ఉన్నారు. మహాసభలు విజయవంతం చేయండి సిరిసిల్లటౌన్: సీపీఐ జిల్లా నాలుగో మహాసభలు విజయవంతం చేయాలని పార్టీ పట్టణ కార్యదర్శి పంతం రవి కోరారు. జూన్ 12, 13 తేదీల్లో సిరిసిల్లలో జరిగే జిల్లా మహాసభలు విజయవంతం చేయాలని కోరుతూ ఆదివారం ర్యాలీ నిర్వహించారు. ప్రపంచ విప్లవ పోరాటాలకు దిక్సూచిగా నిలిచిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాలకు జిల్లా కేంద్రంగా ఉండేదన్నారు. సోమ నాగరాజు, గాజుల లింగం, రాయమల్లు, నల్ల మార్కండేయులు, మోర తిరుపతి, సుంకనపెళ్లి శాంతక్క, కోడం ప్రమీల పాల్గొన్నారు. కార్పొరేట్ జ్యువెలరీ దుకాణాలను నిషేధించాలి ● హైకోర్టు అడ్వకేట్ రఘునాథ్ ముస్తాబాద్(సిరిసిల్ల): కార్పొరేట్ జ్యువెలరీ దుకాణాలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వవద్దని, స్వర్ణకారుల చేతివృత్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని హైకోర్టు న్యాయవాది రఘునాథ్ డిమాండ్ చేశారు. ముస్తాబాద్లో రైతుఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన స్వర్ణకారుల సమావేశంలో మాట్లాడారు. కులవృత్తులను నమ్ముకుని జీవిస్తున్న స్వర్ణకారులు రాజస్థాన్ నుంచి వస్తున్న కార్పొరేట్ జ్యువెలరీ దుకాణాలతో రోడ్డున పడుతున్నారన్నారు. పుస్తె, మెట్టెలను విక్రయించే హక్కులను స్వర్ణకారులకు ఇవ్వాలని కోరారు. సంఘం మండలాధ్యక్షుడు చింతోజు బాలయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, డీఎల్ఎఫ్ అధ్యక్షుడు మార్వాడి సుదర్శన్, అడ్వకేట్ సుజాత తదితరులు పాల్గొన్నారు. -
మార్కులు తక్కువొచ్చాయని..
ముస్తాబాద్(సిరిసిల్ల): పాలిసెట్లో ర్యాంక్ రాలేదని మనస్తాపం చెందిన ఒక విద్యార్థిని ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఎస్ఐ గణేశ్ తెలిపిన వివరాలివి. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్కు చెందిన గూడ స్నేహిత (16) పదో తరగతి ఉత్తీర్ణురాలైంది. శనివారం విడుదలైన పాలిటెక్నిక్ ఎంట్రన్స్ (పాలిసెట్) ఫలితాల్లో ర్యాంక్ రాలేదని మనోవేదనకు గురైంది. శనివారం ఉదయం స్నేహిత తల్లిదండ్రులు.. బంధువుల ఇంట్లో జరిగిన పెళ్లికి వెళ్లారు. తమ్ముడు, తాతతో కలిసి ఇంట్లోనే ఉన్న స్నేహిత.. సాయంత్రం గదిలోకి వెళ్లి చీరతో ఉరి వేసుకుంది. గమనించిన తాత, తమ్ముడు గది తలుపులు బద్దలుకొట్టి చూడగా.. అప్పటికే మృతి చెందింది. మృతురాలి తల్లి స్రవంతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
700 శ్లోకాల ‘విజయ’లక్ష్మిలు!
ముస్తాబాద్ (సిరిసిల్ల): మామ ఆలపించే భక్తిగీతాలు వారికి ప్రేరణనిచ్చాయి. భజనలు వారిలో స్ఫూర్తినింపాయి. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఏడాదిలోనే భగవద్గీతలోని 18 అధ్యాయాల్లో 700 శ్లోకాలను కంఠస్థం చేయడమే కాకుండా మైసూరులోని శ్రీదత్త పీఠం ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన భగవద్గీత పారాయణ పోటీల్లో ఏకంగా 20 వేల మందితో పోటీపడి బంగారు పతకాలు సాధించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూర్ గ్రామానికి చెందిన తోటి కోడళ్లు కట్కం లక్ష్మి, కట్కం విజయలక్ష్మిల స్ఫూర్తిదాయక ఆధ్యాత్మిక ప్రయాణం ఇది. భజన మండలి, మామయ్య స్ఫూర్తి కట్కం లక్ష్మి, కట్కం విజయలక్ష్మి 30 మంది స్నేహితులతో కలిసి 20 ఏళ్ల క్రితం శ్రీ వేంకటేశ్వర భజన మండలిని ఏర్పాటు చేసుకున్నారు. ఆవునూర్ గ్రామంలోని రామాలయంతోపాటు ఇళ్లలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భజనలు చేసేవారు. లక్ష్మి, విజయలక్ష్మిల మామయ్య కట్కం రాజేశం నిత్యం భక్తిగీతాలు ఆలపించేవారు. ఈ క్రమంలో హైదరాబాద్కు చెందిన కొట్ర అనురాధతో ఏర్పడిన పరిచయం ఆన్లైన్లో శిక్షణ తీసుకొనేలా చేసింది.ఇటీవల మైసూరులోని శ్రీదత్తపీఠం ఆధ్వర్యంలో ఆన్లైన్ ద్వారా 20 వేల మందితో నిర్వహించిన భగవద్గీత శ్లోకాల పారాయణం పోటీల్లో పాల్గొన్న లక్ష్మి, విజయలక్ష్మి తమ ప్రతిభను చాటి ఫైనల్కు చేరుకున్నారు. ఈ నెల 19న 2 వేల మందికి జరిగిన ఆన్లైన్ ఫైనల్ పోటీల్లో విజేతలుగా ఎంపికైన 500 మందిలో వారిద్దరూ నిలిచారు. దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానందస్వామి చేతుల మీదుగా లక్ష్మి, విజయలక్ష్మి బంగారు పతకాలు, ప్రశంసా పత్రాలు అందుకున్నారు. శ్లోకాలకు తాత్పర్యం చెబుతాం భగవద్గీత పారాయణాన్ని జీవిత లక్ష్యంగా పెట్టుకున్నా. భర్త, పిల్లల సహకారంతో ఏడాదిపాటు సాధన చేశా. అనురాధ మేడం మమ్మల్ని గుర్తించి మా బృందంలోని 10 మందికి శిక్షణ ఇచ్చారు. భవిష్యత్లో శ్లోకాలకు అర్థాలు చెప్పి, భగవద్గీత మహత్మ్యాన్ని పంచుతాం. – కట్కం లక్ష్మి భజన మండలితో అంకురార్పణ మా భజన మండలి సభ్యులు, ఆన్లైన్లో శిక్షణ ఇచి్చన అనురాధ మేడం ప్రోత్సాహంతోనే పతకాలు సాధించాం. భవిష్యత్లో మరింత మందికి శ్లోకాలను నేర్పి భగవద్గీత గొప్పదనాన్ని పంచుతాం. – కట్కం విజయలక్ష్మి -
అప్రమత్తతే ఆయుధం
● జిల్లాలో కరోనా కేసుల్లేవు ● డెంగీ జ్వరానికి సర్కారు వైద్యమే బెస్ట్ ● వ్యాధులపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి ● ‘సాక్షి’ ఫోన్ఇన్లో జిల్లా వైద్యాధికారి రజితసిరిసిల్లటౌన్: జిల్లాలో ఇప్పటి వరకు కరోనా కేసులు నమోదు కాలేదు.. కరోనా, డెంగీ వ్యాధులకు భయపడకుండా అప్రమత్తత.. బాధ్యతతో ఉంటే నివారించవచ్చని డీఎంహెచ్వో రజిత పేర్కొన్నారు. జిల్లాలో వైరల్ జ్వరాలు విజృంభిస్తుండడంతో ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు తొలగించేందుకు శుక్రవారం ‘సాక్షి’ జిల్లా వైద్యాధికారితో ఫోన్ఇన్ నిర్వహించింది. ఈ సందర్భంగా పలువురు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. జ్వరాలు వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అప్రమత్తం చేశారు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యసేవలు అందుతున్నాయని, ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బందులు పడొద్దని సూచించారు. జూలైలో వచ్చే సీజనల్ వ్యాధులు ఇప్పుడే విస్తరిస్తున్నాయని.. అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామీణ యువత సహకరిస్తే.. వైద్యారోగ్యశాఖ తరఫున ప్రజల్లో సీజనల్ వ్యాధులపై చైతన్యం కల్పిస్తామని తెలిపారు. -
అకాల వర్షం.. తడిసిన ధాన్యం
సిరిసిల్ల/రుద్రంగి(వేములవాడ): వరుసగా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రుద్రంగి మండలంలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసిపోయింది. తేమశాతం వచ్చినా ధాన్యాన్ని సైతం తూకం వేయకపోవడంతో బుధ, గురువారాల్లో కురిసిన వర్షానికి ధాన్యం కుప్పల్లోకి వరదనీరు వచ్చి చేరింది. తడిసిన ధాన్యాన్ని చూసి రైతులు కంటతడి పెడుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తూకం వేసిన ధాన్యం బస్తాలను సైతం మిల్లులకు తరలించకపోవడంతో తడిసి ముద్దయ్యాయి. జిల్లా అంతటా వర్షాలు రుద్రంగిలో అత్యధికంగా 47.1 మిల్లీమీటర్లు, చందుర్తిలో 31.8, వేములవాడరూరల్లో 19.6, బోయినపల్లిలో 22.8, వేములవాడలో 35.9, సిరిసిల్లలో 23.4, కోనరావుపేటలో 27.8, వీర్నపల్లిలో 30.5, ఎల్లారెడ్డిపేటలో 42.7, గంభీరావుపేటలో 29.6, ముస్తాబాద్లో 27.2, తంగళ్లపల్లిలో 33.5, ఇల్లంతకుంటలో 19.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా సగటు 30.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. -
పదోన్నతులతో బాధ్యత పెంపు
● ఎస్పీ మహేశ్ బీ గీతే ● ఏఎస్ఐలకు ఎస్ఐలుగా పదోన్నతిసిరిసిల్లక్రైం: ప్రభుత్వ ఉద్యోగంలో పదోన్నతులు బాధ్యతను పెంచుతాయని ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. జిల్లాలో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న శంకర్(సిరిసిల్లటౌన్), లక్పతి(వేములవాడరూరల్), మోతీరాం(బోయినపల్లి)లకు ఎస్సైలుగా పదోన్నతి పొందారు. వీరికి ఎస్పీ అభినందనలు తెలిపారు. పదోన్నతులు పొందిన పోలీసులు రెట్టింపు ఉత్సాహంతో సేవలందించాలని సూచించారు. క్రమశిక్షణతో విధులు నిర్వహించే వారికి గుర్తింపు లభిస్తుందన్నారు. నకిలీ విత్తనాల విక్రయాలపై నిఘా రైతులు నకిలీ విత్తనాల బారిన పడి మోసపోకుండా ఉండేందుకు గట్టి నిఘా పెట్టామని ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. నకిలీ విత్తనాల ఉత్పత్తి, సరఫరా, విక్రయాలను అరికట్టేందుకు వ్యవసాయశాఖ, జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీయాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. ఘనంగా సంతు సేవాలాల్ విగ్రహ ప్రతిష్ఠ రుద్రంగి(వేములవాడ): గిరిజనుల ఆరాధ్యదైవం శ్రీజగదాంబమాత, శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ మహోత్సవానికి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ మానాల ఉద్యమ కాలం నుంచి తన వెంట నడిచిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో మానాల, గిరిజన తండా గ్రామాల్లో అనేక అభివృద్ధి పనులు చేసినట్లు గుర్తు చేసుకున్నారు. మాజీ ఎంపీపీ గంగం స్వరూపారాణి, నాయకులు గంగం మహేశ్ తదితరులు ఉన్నారు. కంచర్లలో వైద్యశిబిరం తనిఖీ వీర్నపల్లి(సిరిసిల్ల): మండలంలోని కంచర్లలో కొనసాగుతున్న ఉచిత వైద్యశిబిరంను జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అనిత శుక్రవారం సందర్శించారు. పీహెచ్సీ వైద్యాధికారి సారి యా అంజుమ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. అనుమానిత జ్వరపీడితులకు పరీక్షలు చేశారు. ఈ వైద్యశిబిరంలో శుక్రవారం 10 మందికి వైద్యపరీక్షలు నిర్వహించి ముగ్గురిక రక్తనమూనాలు సేకరించి ఆర్డీటీ పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేశారు. సూపర్వైజర్ లింగం, మోహన్ పాల్గొన్నారు. కూలిన గుడి పరిశీలన ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని రేపాకలో గురువారం వర్షాలకు శ్రీనరసింహస్వామి ఆలయం గోపురం కూలిపోగా శుక్రవారం జిల్లా దేవాదాయశాఖ అధికారులు, మండల రెవెన్యూ అధికారులు పరిశీలించారు. జిల్లా దేవాదాయశాఖ కార్యనిర్వాహకవర్గ అధికారి మారుతీరావు గుడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రూ.40లక్షలు మంజూరు చేస్తే గుడి అభివృద్ధి చేస్తామని గ్రామ కాంగ్రెస్ నాయకుడు మల్లేశం పేర్కొన్నారు. దేవాదాయశాఖ అధికారి మారుతీరావు, జూనియర్ అసిస్టెంట్ ప్రభాకర్, మండల మండల రెవెన్యూ కార్యాలయం ఆర్ఐ సంతోష్ పాల్గొన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనాలి సిరిసిల్లటౌన్: మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొనుగోలు కేంద్రాల వద్ద తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్ కోరారు. సిరిసిల్లలోని పార్టీ ఆఫీసులో శుక్రవారం ప్రెస్మీట్లో మాట్లాడారు. తడిసిన ధాన్యాన్ని చూసి రైతులు కన్నీరుపెడుతున్నారన్నారు. ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా కొనుగోలు కేంద్రాల్లో మొత్తం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఎగమంటి ఎల్లారెడ్డి, కోడం రమణ పాల్గొన్నారు. -
విజిలెన్స్ స్లో!
● శాతవాహన సిబ్బందికి మరోసారి నోటీసులు ● ఖర్చు బాధ్యులకు తాజాగా తాఖీదులు ఇవ్వనున్న విజిలెన్స్ ● గతంలో నోటీసులకు పెద్దగా స్పందించని వర్సిటీ అధికారులు ● వీసీ, సిబ్బంది మారడంతో తొలి నుంచి విచారణ ● విచారణకు ఆటంకంగా మారిన విజిలెన్స్లో సిబ్బంది కొరతసాక్షి ప్రతినిధి, కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీలో జరిగిన అభివృద్ధి పనుల్లో అవకతవకలు జరిగాయంటూ గతేడాది మొదలైన విజిలెన్స్ విచారణ నత్తనడకన సా గుతోంది. ఇటీవల యూనివర్సిటీ వీసీ మారడం, కొందరు సిబ్బంది బదిలీ కావడం, పదవీ విరమణ పొందడం అదే సమయంలో విజిలెన్స్కు కూడా కొత్త ఎస్పీ రావడంతో విచారణ తిరిగి మొదటి నుంచి ప్రారంభించనున్నారని సమాచారం. వాస్తవానికి శాతవాహన యూనివర్సిటీలో జరిగిన అభివృద్ధి పనులపై అనేక విమర్శలు వచ్చాయి. ప్రభుత్వ నిధులను మంచినీళ్లలా ఖర్చు చేశారని పలువురు ఫ్రొఫెసర్లు బహిరంగంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో గతేడాది జూన్ 18వ తేదీన హైదరాబాద్లోని విజిలెన్స్ ప్రధాన కార్యాలయంలో కొందరు ఫిర్యాదు చేశారు. సరిగ్గా నెలరోజుల తరువాత ఈ ఫిర్యాదు కరీంనగర్ విజిలెన్స్ కార్యాలయానికి చేరింది. దాదాపు 160 పేజీలు ఉన్న ఆ ఫిర్యాదును అధ్యయనం చేసిన జిల్లా విజిలెన్స్ అధికారులు విచారణ ప్రారంభించినా అనుకున్న మేరకు అది సాగలేదు. వర్సిటీ అధికారులు సహకరించకపోవడం ప్రధాన కారణం అయితే, విజిలెన్స్లో స్టాఫ్ కొరత మరో ముఖ్య కారణంగా తెలుస్తోంది. మళ్లీ నోటీసులు దాదాపుగా ఏడాది కావొస్తున్నా.. విచారణలో పెద్దగా పురోగతి లేకపోవడంతో దీనిపై మరోసారి విజిలెన్స్ దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలోనే గతంలో వర్సిటీలో జరిగిన అధిక ఖర్చులపై విజిలెన్స్ చిట్టా రూపొందించింది. ముఖ్యంగా వర్సిటీ భవనాల్లో భారీగా (రూ.50 కోట్లకుపైగా) అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆ సమయంలో ఎవరు ఆ నిర్మాణాలకు బాధ్యలుగా ఉన్నారో గుర్తించారు. ఈ నిర్మాణాల్లోనే చాలా మట్టుకు టెండర్లలో గోల్మాల్ జరిగిందన్న విమర్శలున్నాయి. వారికి తిరిగి కొత్తగా నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. కొత్తగా వచ్చిన వీసీకి కూడా జరిగిన విషయాన్ని విజిలెన్స్ అధికారులు వివరించి విచారణకు సహకరించాలని కోరారు. అదే సమయంలో విజిలెన్స్ ఎస్పీగా ఎం.శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టడంతో ఆయనకూ వివరించినట్లు తెలిసింది. త్వరలోనే ఈ కేసు విచారణ వేగవంతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.వేధిస్తున్న సిబ్బంది కొరతవాస్తవానికి విజిలెన్స్ విభాగాన్ని సిబ్బంది కొరత వేధిస్తోంది. డాక్యుమెంటేషన్ ప్రక్రియ కోసం డీటీపీ ఆపరేటర్లనూ రిక్రూట్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. దీంతో ఇన్స్పెక్టర్ ర్యాంకుల్లో ఉన్న అధికారులే విచారణతోపాటు కేసు వివరాలను స్వయంగా డీటీపీ చేసుకోవాల్సి వస్తోంది. వాస్తవానికి కరీంనగర్లో గతంలో గొర్రెల స్కాం, పత్తి స్కాం, ఆసరా పింఛన్ల స్కాం, సదరం సర్టిఫికెట్ల స్కాం, బల్దియాలో పనులతో పాటు ఉమ్మడి జిల్లాలో అనేక కేసులు పరిమితి సిబ్బందితో విచారణ చేయాలంటే వీరికి తలకుమించిన భారంగా మారింది. పైగా పని ఒత్తిడితో సిబ్బంది సతమతమవుతున్నారు. ఈ క్రమంలో శాతవాహన వర్సిటీ అధికారులు ఎదుర్కొంటున్న అవినీతి ఆరోపణలపై విజిలెన్స్ విచారణ సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. -
మెడికల్ కాలేజీకి భౌతికకాయం
సిరిసిల్ల: జిల్లా మెడికల్ కాలేజీలో అంతర్నిర్మాణ శాస్త్ర బోధనకు అవసరమైన మానవ శవాన్ని వేములవాడ పోలీసులు శుక్రవారం అందించారు. వేములవాడ గుడి చెరువులో లభించిన గుర్తుతెలియని శవాన్ని పట్టణ సీఐ వీరప్రసాద్ సిరిసిల్ల మెడికల్ కాలేజీకి అందించారు. వివిధ విభాగాధిపతులు డాక్టర్ నిర్విశా, డాక్టర్ అన్వర్ ఉన్నీసా, డాక్టర్ అర్పిత ఉన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ భవిష్యత్లో అనాథ భౌతికదేహాలు ఎక్కడ దొరికినా మెడికల్ కాలేజీకి అందించాలని కోరారు. వివరాలకు 80086 21371లో సంప్రదించాలని తెలిపారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు● జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్ బేగం సిరిసిల్ల: జిల్లాలో నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్ బేగం హెచ్చరించారు. కలెక్టరేట్లో శుక్రవారం విత్తన, ఎరువుల వ్యాపారులకు, వ్యవసాయశాఖ అధికారులతో సంయుక్త సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యవసాయాధికారి మాట్లాడుతూ విత్తన విక్రయాలకు సంబంధించిన లైసెన్స్ కాలపరిమితి, గోదాం, దుకాణం ఇంటి నంబర్లు సరిగ్గా ఉన్నాయా.. లేదా.. పరిశీలించాలన్నారు. ప్రతీ విత్తనానికి ఇన్వాయిస్ కాపీ, ప్రిన్సిపల్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. బిల్లులో రైతు పేరు, లాట్ నంబర్, డీలర్ సంతకం, రైతు సంతకాలు ఉండాలని సూచించారు. కాలం చెల్లిన విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు విక్రయించొద్దని వ్యాపారులకు సూచించారు. -
ఆశీర్వచనాలు.. పరామర్శలు
ముస్తాబాద్(సిరిసిల్ల): బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ముస్తాబాద్ మండలంలో శుక్రవారం సుడిగాలి పర్యటన చేశారు. బందనకల్లో పెద్దమ్మ–పెద్దిరాజుల కల్యాణ ఉత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. నామాపూర్లో శ్రీవరాల మల్లికార్జునస్వామి ఆలయ వార్షికోత్సవానికి హాజరయ్యారు. ఆవునూర్ మడేలేశ్వరస్వామి వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ముస్తాబాద్, గూడెం, ఆవునూర్లో నూతన వధూవరులను ఆశీర్వదించారు. బందనకల్లో మాజీ ఎంపీటీసీ రామచంద్రారెడ్డిని, చిగురు నరేశ్ను పరామర్శించారు. ముస్తాబాద్లో తిరుమల నర్సింగ్హోంను సందర్శించి, ఇటీవల ప్రారంభించిన ఐసీయూ యూనిట్ను పరిశీలించారు. కేటీఆర్ వెంట నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, కల్వకుంట్ల గోపాల్రావు, మండలాధ్యక్షుడు బొంపెల్లి సురేందర్రావు, డాక్టర్ చంద్రశేఖర్రావు, సర్వర్, సంతోష్రావు, మనోహర్, జహంగీర్, స్వామి, వెంకటస్వామి పాల్గొన్నారు. ● జిల్లాలో కేటీఆర్ సుడిగాలి పర్యటన -
సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం
వీర్నపల్లి(సిరిసిల్ల): పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ సందీప్కుమార్ ఝా పేర్కొన్నారు. వీర్నపల్లి మండలంలో శుక్రవారం రెండో విడతలో మంజూరైన 259 మందికి ఇందిరమ్మ పత్రాలను కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝా మాట్లాడుతూ 400 నుంచి 600 చదరపు అడుగులలోపు ఇంటి నిర్మాణం జరిగితే 4 దశల్లో బిల్లులు మంజూరవుతాయని తెలిపారు. బిల్లులు మంజూరు చేయిస్తామని ఎవరైనా డబ్బులు అడిగితే తనకు ఫోన్లో తెలపాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని తెలిపారు. నెల రోజుల్లోగా ఇళ్ల పనులు మొదలుపెట్టాలని సూచించారు. పీడీ హౌసింగ్ శంకర్, మండల ప్రత్యేకాధికారి రామదాసు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రాములు, ఎంపీడీవో అబ్దుల్ వాజిద్, తహసీల్దార్ మక్తర్ పాషా, ఆర్ఐ శివకుమార్ పాల్గొన్నారు. గంభీరావుపేట(సిరిసిల్ల): వచ్చే దసరా, దీపావళి పండుగలను ఇందిరమ్మ ఇళ్లల్లో చేసుకోవాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా కోరారు. గంభీరావుపేట మండలంలో రెండో విడత కింద 507 మందికి మంజూరైన ఇళ్ల ఉత్తర్వులను శుక్రవారం కేకే మహేందర్రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక ఉచితంగా సరఫరా చేస్తామని తెలిపారు. హౌసింగ్ పీడీ శంకర్, మండల ప్రత్యేకాధికారి హన్మంతు, ఏఎంసీ చైర్పర్సన్ విజయ, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు హమీద్, జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాంచంద్రారెడ్డి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మండ్లు, ఎంపీడీవో రాజేందర్, తహసీల్దార్ మారుతిరెడ్డి పాల్గొన్నారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝా బిల్లుల కోసం ఎవరైనా డబ్బులు అడిగితే నాకు ఫోన్ చేయండి వీర్నపల్లి, గంభీరావుపేటల్లో ఇళ్ల మంజూరుపత్రాలు పంపిణీ -
ప్రజల దృష్టి మళ్లించేందుకే కేసీఆర్కు నోటీసులు
● నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు సిరిసిల్ల: అనేక హామీలు ఇచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజల దృష్టిని మళ్లించేందుకే కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ పేరుతో కేసీఆర్కు నోటీసులు ఇచ్చారని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు పే ర్కొన్నారు. సిరిసిల్లలోని ప్రెస్క్లబ్లో బుధవారం బీఆర్ఎస్ నేతలతో కలిసి ప్రెస్మీట్లో మాట్లాడారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక, పాలన చేతకాక దయనీయ స్థితిలో డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, దేశానికి రోల్మోడల్గా నిలిపిన కేసీఆర్ను దోషిగా చూపించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు పీసీ ఘోష్ కమిషన్తో నోటీసులు ఇప్పించారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే.. రిజర్వాయర్లు, సొరంగాలు, కాల్వలు, పంప్హౌజ్లని రెండు, మూడు ఫిల్లర్లు కుంగిపోతే వెంటనే రిపేరు చేయకుండా.. కేసీఆర్పై కోపంతో రైతులకు నీళ్లు ఇవ్వకుండా పొలాలు ఎండబెట్టారని ఆరోపించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మాట్లాడుతూ ప్రజాపాలన పేరిట సీఎం రేవంత్రెడ్డి తన నేర ప్రవృత్తిని చాటి చెప్పుకుంటున్నారని ఆరో పించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు రైతుబంధు రూ.15వేలు, కల్యాణలక్ష్మీలో తులం బంగారం, పెన్షన్లు డబుల్ ఇస్తామని చెప్పి ఒక్కటి అమలు చేయడం లేదన్నారు. బీఆర్ఎస్ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, తంగళ్లపల్లి మండల అధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, నాయకులు కుంబాల మల్లారెడ్డి, గుండ్లపల్లి పూర్ణచందర్, ప్రేమ్కుమార్ పాల్గొన్నారు. -
గాలివాన.. తడిసిన ధాన్యం
● చిత్తడిగా మారిన సిరిసిల్ల ● రోడ్లపై పారిన డ్రెయినేజీలు ● కోనరావుపేటలో అత్యధికంగా 40.6 మిల్లీమీటర్ల వర్షంసిరిసిల్ల: జిల్లాలో బుధవారం కురిసిన గాలివానతో సిరిసిల్ల పట్టణం చిత్తడిగా మారగా.. మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు టార్పాలిన్ కవర్లు కప్పేందుకు నానా తిప్పలు పడ్డారు. సిరిసిల్లలోని సంజీవయ్య విగ్రహం వెనకాల మురికినీరు రోడ్డుపైన పారింది. ఆటోనగర్, కుమ్మరిగల్లీ, ఆసిఫ్పుర, శాంతినగర్ ప్రాంతాలకు వెళ్లే రోడ్లు చిత్తడిగా మారాయి. పట్టణంలోని పైభాగంలో ఉన్న ప్రాంతాల మురికినీరు లోతట్టు ప్రాంతాలకు చేరి రోడ్డు ఎక్కడంతో పట్టణంలోని పలు రోడ్లు అడుగువేయలేని స్థితికి చేరుతున్నాయి. ఏటా వర్షాకాలంలో ఈ మురికి కష్టాలు సిరిసిల్ల పట్టణ ప్రజలకు తప్పడం లేదు. లక్ష జనాభాతో 39 వార్డులతో విస్తరించి ఉన్న సిరిసిల్లలో ప్రజల అవసరాల మేరకు మురికి కాల్వల విస్తరణ చేయకపోవడంతో ఈ అగచాట్లు తప్పడం లేదు. ముందే పలకరించిన తొలకరి జిల్లాను తొలకరి జల్లులు ముందే పలకరించాయి. ఏటా మే 25న రోహిణీ కార్తె ప్రవేశంతో వానాకాలం మొదలవుతుంది. కానీ ఈ ఏడాది నాలుగు రోజుల ముందుగానే వర్షం కురవడం విశేషం. ఇన్నాళ్లు ఉక్కపోతతో ఇబ్బందిపడ్డ జిల్లా జనం బుధవారం కురిసిన భారీ వర్షంతో చల్లబడ్డారు. ధాన్యం కుప్పల్లోకి నీరు వేములవాడ/ఇల్లంతకుంట/కోనరావుపేట/ ఎల్లారెడ్డిపేట/రుద్రంగి/వేములవాడరూరల్/ చందుర్తి/బోయినపల్లి: వేములవాడ పట్టణంలో కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. ● ఇల్లంతకుంట మండల కేంద్రంతోపాటు పెద్దలింగాపూర్, కందికట్కూర్, రేపాక, గాలిపల్లి, వంతడుపుల గ్రామాల్లో వర్షం కురిసింది. మండల కేంద్రంలోని ఎస్సీకాలనీ వద్ద బీటీ రోడ్డుపై లోతట్టుగా వర్షం నీరు నిలిచింది. అనంతారం కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన బస్తాలు తడిసిపోయాయి. నెల రోజుల క్రితం ధాన్యం తీసుకొచ్చామని, మిల్లుకు తరలించడం లేదని రైతులు బైరి అనిల్, జలాలుద్దీన్ తెలిపారు. ● కోనరావుపేట, రుద్రంగి, వేములవాడరూరల్ మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం నిల్వలు తడిసిపోయాయి. ● ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం శివారులోని కేసీఆర్ కాలనీ వద్ద సిరిసిల్ల–కామారెడ్డి ప్రధాన రహదారిపై విద్యుత్ మెయిన్ లైన్ వైర్లు తెగిపడ్డాయి. ఆ సమయంలో ఎవరూ అక్కడ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సెస్ అధికారులు పునరుద్ధరణ పనులు చేస్తున్నారు. ● చందుర్తి మండలం బండపల్లి–ఎన్గల్ గ్రామాల మధ్య ఆర్అండ్బీ రోడ్డుపై చెట్టు కూలిపోతే స్థానికుల సహాయంతో తొలగించారు. కోరుట్ల–వేములవాడ ప్రధాన రహదారి చందుర్తి శివారులో చెట్లు కూలిపోయాయి. ● బోయినపల్లి మండలం దుండ్రపల్లి, గుండన్నపల్లి గ్రామాల్లోని రైతుల ధాన్యం తడిసిపోయింది. గుండన్నపల్లి, దుండ్రపల్లిల్లోని ధాన్యం కుప్పల చుట్టూ పెద్ద మొత్తంలో వర్షపు నీరు నిలిచింది. వర్షం ఇలా..(మి.మీ..)రుద్రంగి : 25.3 చందుర్తి : 35.9 వేములవాడ రూరల్ : 9.0 బోయినపల్లి : 12.9 వేములవాడ : 23.1 సిరిసిల్ల : 16.3 కోనరావుపేట : 40.6 వీర్నపల్లి : 35.3 ఎల్లారెడ్డిపేట : 15.3 గంభీరావుపేట : 22.3 ముస్తాబాద్ : 4.9 తంగళ్లపల్లి : 14.6 ఇల్లంతకుంట : 12.1 -
గురువారం శ్రీ 22 శ్రీ మే శ్రీ 2025
‘కొత్తపల్లికి చెందిన ఓ విద్యార్థికి ఆర్ట్స్ గ్రూపు అంటే ఇష్టం. చిన్నతనం నుంచే సోషల్ సంబంధిత సబ్జెక్టులపై పట్టు సాధించాడు. గ్రూప్స్ రాయాలనేది అతని కోరిక. పది పూర్తయ్యాక ఆర్ట్స్ గ్రూపులో చేరాలనుకున్నాడు. ఇంట్లో పెద్దల బలవంతంతో ఎంపీసీలో చేరాడు. అతను చదువలేక ఫెయిలయ్యాడు.’ ‘లింగన్నపేటకు చెందిన మరో విద్యార్థికి సీఏ చేయాలన్నది కోరిక. పది పూర్తయ్యాక ఎంఈసీలో చేరాలనుకున్నాడు. తల్లిదండ్రులేమో కొడుకును ఇంజినీర్గా చూడాలనుకున్నారు. బలవంతంగా ఎంపీసీలో చేర్పించారు. అయిష్టంతో చదివిన అతను పాస్మార్కులతో గట్టెక్కాడు. ఇంజినీరింగ్లో సీటు రాకపోవడంతో డిగ్రీలో ఆర్ట్స్ చదువుతున్నాడు.గంభీరావుపేట(సిరిసిల్ల): నా కొడుకును ఇంజినీర్గా చూడాలి.. డాక్టర్ను చేయాలి.. సీఏ చదివించి బాగా సంపాదించాలి... ఇలా తల్లిదండ్రులు తమ ఇష్టాలను పిల్లలపై రుద్దుతున్నారే తప్ప.. పిల్లల ఇష్టాలు.. అభీష్టాలు ఏంటి.. అని ఆలోచించే వారు కరువయ్యారు. సాఫ్ట్వేర్గా.. డాక్టర్గా బోలెడంతా డబ్బు సంపాదించాలనే ధ్యాసతోనే పదోతరగతి పాసైన తమ పిల్లలను ఎంపీసీ, బైపీసీలో చేర్పిస్తున్న తల్లిదండ్రులే ఎక్కువ ఉన్నారు. అసలు వారికి ఏ సబ్జెక్టుపై మక్కువ ఉందో తెలుసుకోవడం లేదు. తల్లిదండ్రులు చెప్పిన కోర్సులో చేరి.. సబ్జెక్టులు అర్థంకాక.. కార్పొరేట్ కాలేజీల్లో ఒత్తిడి భరించలేక చాలా మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మరికొందరు ఇంటర్ ఫెయిల్ అయి ఇంటి వద్దే ఖాళీగా ఉంటున్నారు. ప్రస్తుతం పదో తరగతి ఫలితాలు వెలువడడంతో ఇంటర్లో ప్రవేశాలు తీసుకుంటున్నారు. అసలు పిల్లలకు ఏ సబ్జెక్టులు అంటే ఇష్టమో తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. ఏ గ్రూప్లో చేరాలో నిర్ణయం తీసుకోవాల్సిన స్వేచ్ఛ ఇస్తేనే వారు ఎంచుకున్న సబ్జెక్టులో ఉత్తమ మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులకు ఇష్టమైన సబ్జెక్టులను బలవంతంగా రుద్దడం కాకుండా.. వారికి ఇష్టమున్న సబ్జెక్టులను చదివేలా చూడాలని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. – వివరాలు 8లోuన్యూస్రీల్ -
పీహెచ్సీ ఆకస్మిక తనిఖీ
తంగళ్లపల్లి(సిరిసిల్ల): తంగళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, ఓబులాపూర్ ఆరోగ్య ఉప కేంద్రాన్ని బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రజిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. వ్యాధి నిరోధక టీకాల రికార్డులు, వ్యాక్సిన్ కోల్డ్ చైన్ను పరిశీలించారు. సకాలంలో గర్భిణీలకు, ఐదేళ్లలోపు చిన్నపిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేయాలని సూచించారు. జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి సంపత్కుమార్, పీహెచ్సీ మెడికల్ అధికారి అఫీసా, సిబ్బంది జ్యోతి పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయండి ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): జిల్లాలో వారం రోజుల్లోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని పౌరసరఫరాల టాస్క్ ఫోర్స్ టీం అధికా రి లక్ష్మారెడ్డి, జంగయ్య సూచించారు. వెంకటాపూర్లోని ఐకేపీ కొనుగోలు కేంద్రాలను బుధవారం పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో రికార్డులు, రైతుల నుంచి సేకరించిన ధాన్యం, రైస్మిల్లులకు తరలించిన ధాన్యం వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైస్మిల్లులను విజిట్ చేసి ధాన్యం దిగుమతి గురించి తెలుసుకున్నారు. డీటీసీఎస్ అశోక్, ఇన్చార్జి డీపీఎం శ్రీనివాస్, ఏపీఎం మల్లేశం, సీసీ పద్మ పాల్గొన్నారు. మాంసం విక్రయాలపై నియంత్రణ ఉంచాలి సిరిసిల్లటౌన్: సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో వెటర్నరీ డాక్టర్ గుర్తించకుండా సాగుతున్న మాంసం విక్రయాలను నియంత్రించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు కోరారు. ఈమేరకు బుధవారం సిరిసిల్ల మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ పోసు వాణికి వినతిపత్రం అందజేసి మాట్లాడారు. పట్టణంలో నిబంధనల విరుద్ధంగా పశువైద్యులు ధ్రువీకరించకుండా మేక, గొర్రె మాంసాన్ని విక్రయిస్తున్నారని దీంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు చనిపోయిన జీవాలను కోసి అమ్ముతున్నారని, ఆడగొర్రెలను కోసి పొట్టేలుగా చెబుతూ మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్లాటర్హౌస్ నిర్మించినా అక్కడ గొర్రెలను కోయడం లేదన్నారు. ఎలిగేటి రాజశేఖర్, బూర్ల సందీప్ పాల్గొన్నారు. 27న కథారచనపై వర్క్షాప్ సిరిసిల్లకల్చరల్: కథలు ఎలా రాయాలి అనే అంశంపై ఈనెల 27న తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో కథా కార్యశాల(వర్క్షాప్) నిర్వహిస్తున్నట్లు సమన్వయకర్త బుధవారం ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్లోని రవీంద్రభారతి మినీ కాన్ఫరెన్స్హాల్లో జరిగే ఈ వర్క్షాప్లో జిల్లాకు చెందిన కథారచయిత పెద్దింటి అశోక్కుమార్ కీలకోపన్యాసం చేస్తారని పేర్కొన్నారు. ఈ వర్క్షాప్నకు మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయేశ్ రంజన్, సాహిత్య అకాడమీ కార్యదర్శి నామోజు బాలాచారి, రచయితలు కాలువ మల్లయ్య, వెల్దండి శ్రీధర్ హాజరవుతారని తెలిపారు. పంట మార్పిడితో సుస్థిర ఆదాయం బోయినపల్లి(చొప్పదండి): రైతులు పంట మార్పిడితో సుస్థిర ఆదాయం పొందవచ్చని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. బోయినపల్లి రైతువేదికలో బుధవారం రైతుముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. వానాకాలం సాగుకు రైతులను సమాయత్తం చేసేందకు వీలుగా పలు అంశాలపై వారికి అవగాహన కల్పించారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగుచేయాలని సూచించారు. ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్ మదన్మోహన్రెడ్డి, ఏడీఏ రామారావు, శాస్త్రవేత్త రాజేంద్రప్రసాద్, ఎంఏవో ప్రణిత, మండల పశువైద్యాధికారి సతీశ్, ఏఈవోలు శ్రీదేవి, లక్ష్మణ్, రావెప్ విద్యార్థులు ఉన్నారు. -
దీపావళి సొంతింటిలో జరుపుకోవాలి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ● ఇందిరమ్మ లబ్ధిదారులకు మంజూరుపత్రాలు పంపిణీ తంగళ్లపల్లి/ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు వచ్చే దీపావళి తమ సొంతిళ్లలో జరుపుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకాంక్షించారు. తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రాల్లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డితో కలిసి మంజూరుపత్రాలు పంపిణీ చేశారు. తంగళ్లపల్లి మండలంలో 500, ఎల్లారెడ్డిపేట మండలంలో 643 మంది లబ్ధిదారులకు మంజూరుపత్రాలు అందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ నాలుగు దశలలో రూ.5లక్షలు అందజేస్తామని తెలిపారు. బేస్మెంట్ పూర్తయితే రూ.లక్ష, గోడలు నిర్మిస్తే రూ.లక్ష, స్లాబ్ తరువాత రూ.2 లక్షలు, ఇంటి నిర్మాణం పూర్తయిన తరువాత చివరి రూ.లక్ష నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని వివరించారు. బిల్లుల విషయంలో దళారులను నమ్మొద్దని సూచించారు. ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని తెలిపారు. 30 రోజుల్లోగా ఇంటి పనులు ప్రారంభించాలని, లేకుంటే అనుమతులు రద్దవుతాయన్నారు. ఇళ్లు నిర్మించుకోలేని నిరుపేద మహిళలకు స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా రూ.లక్ష రుణం అందిస్తామన్నారు. పీడీ హౌసింగ్ శంకర్, మండలాల ప్రత్యేకాధికారులు షరీఫుద్ధీన్, అఫ్జల్బేగం, ఏఎంసీ చైర్పర్సన్ వెల్ముల స్వరూప, సాబేర బేగం, వైస్చైర్మన్ నేరెళ్ల నర్సింగం, ఎల్లారెడ్డిపేట పీఏసీఎస్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, ఎంపీడీవో కె.లక్ష్మీనారాయణ, తహసీల్దార్లు జయంత్కుమార్, సుజాత, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ప్రవీణ్ జే టోని, ఎల్లారెడ్డిపేట ఎంపీడీవో సత్తయ్య, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
విద్యార్థుల భవిష్యత్కు పునాదులు వేయాలి
● కలెక్టర్ సందీప్కుమార్ ఝా సిరిసిల్ల: ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విద్యార్థుల భవిష్యత్కు పునాదులు వేయాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా కోరారు. జిల్లా కేంద్రంలోని గీతానగర్ స్కూల్లో ఉపాధ్యాయులకు ఐదు రోజుల వేసవి శిక్షణ శిబిరాన్ని మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గణితం, ఏఐ టూల్స్లో పిల్లలు వెనుకపడకుండా వినూత్న పద్ధతుల్లో వారికి అర్థమయ్యేలా బోధన సాగించాలన్నారు. విద్యార్థులు రెగ్యులర్గా పాఠశాలకు హాజరయ్యేలా ఫాలో అప్ చేయాలని పేర్కొన్నారు. పదో తరగతిలో మెరుగైన ఫలితాలున్నా, ఇంటర్లో ఫెయిల్ అవుతున్నారని, విషయ పరిజ్ఞానంలో ముందస్తు నుంచి విద్యార్థులను బలోపేతం చేస్తే వైఫల్యాలను నిరోధించవచ్చని తెలిపారు. విద్యాశాఖలో ఒకే రోజు మార్పు సాధ్యం కాదని, నిర్వీరామంగా ప్రయత్నం చేస్తూ ఉండాలన్నారు. మంచి విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యతల్లో ఉన్న ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. డీఈవో జనార్దన్రావు తదితరులు పాల్గొన్నారు. -
కొనుగోళ్లలో జాప్యం.. రోడ్డెక్కిన రైతన్న
ఇల్లంతకుంట(మానకొండూర్): ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై మంగళవారం మండలంలోని పొత్తూరులో రైతన్నలు రోడ్డుపై బైఠాయించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ, గత నెల 11న గ్రామంలో కేంద్రం ప్రారంభించినా ఇప్పటివరకు కొనుగోళ్లు పూర్తి కాలేదని ఆరోపించారు. ఆది, సోమవారాల్లో తూకం వేసిన 4 వేల బస్తాల ధాన్యం లారీలు రాక కేంద్రంలోనే ఉండిపోయిందని, వర్షం పడితే ధాన్యం తడుస్తుందని పేర్కొన్నారు. ఈక్రమంలో మాజీ జెడ్పీటీసీ సిద్ధం వేణు రైతులకు సంఘీభావం తెలిపి ఐకేపీ ఏపీఎం వాణిశ్రీతో మాట్లాడారు. రెండురోజుల్లో కొనుగోళ్లు పూర్తి చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. రెండురోజులు లారీలు రాకపోవడంతో తూకం వేసిన ధాన్యం ఆగిందని, మంగళవారం లారీల్లో మిల్లులకు పంపించినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో శ్రీనివాస్, పట్నం శ్రీనివాస్, కుదురు శేఖర్, చెరుకు రాజు, నారాయణరెడ్డి, రాజయ్య, గౌరయ్య, రాజ మల్ల య్య తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలి
● రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్రెడ్డి సిరిసిల్ల: రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్రెడ్డి అన్నారు. కలెక్టరేట్లో మంగళవారం వ్యవసాయ అధికారులు, విత్తన డీలర్లు, డీఆర్డీఏ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. వానాకాలం సీజన్ కోసం విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా 97,200 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలను అన్ని జిల్లాలకు అందిస్తున్నామని, వీటిని రైతులకు చేరవేయాలన్నారు. నాణ్యమైన వరి విత్తనాలు 1.20 లక్షల క్వింటాళ్లు, కంది 150 క్వింటాళ్లు, పెసర 200 క్వింటాళ్లు, మినుము 400 క్వింటాళ్లు, వేరుశనగ 1,775 క్వింటాళ్లు విత్తనాభివృద్ధి సంస్థ అందిస్తుందని వివరించారు. కొంతమంది రైతులు నాణ్యత లేని ప్రైవేట్ విత్తనాల పట్ల ఆకర్షితులై నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డీలర్ల వద్ద విత్తనాలు, ఎరువులు కొనేటప్పుడు రసీదు పొంది పంటకాలం పూర్తయ్యే వరకు భద్రపరుచుకోవాలని సూచించారు. జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్ బేగం మాట్లాడుతూ, నకిలీ విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను కోరారు. జిల్లాలో 18 ఐకేపీల ద్వారా విత్తన లైసెన్సులు జారీ చేయించి 50 శాతం సబ్సిడీతో పచ్చిరొట్ట విత్తనాల అమ్మకాలు జరిపిస్తామన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రాంతీయ మేనేజర్ విష్ణువర్ధన్రెడ్డి, విత్తన అధికారి మౌనిక, ఏపీడీ గొట్టె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం
సిరిసిల్లటౌన్: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలాపై పోరాటం తప్పదని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ అన్నారు. యూనియన్ పిలుపులో భాగంగా మంగళవారం స్థానిక బీౖవైనగర్లోని పార్టీ ఆఫీసులో ఫ్లకార్డులతో నిరసన చేపట్టి మాట్లాడారు. కార్మికులకు కనీస వేతనం రూ.26,000 అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికవర్గం పోరాడి సాధించుకున్న చట్టాలు, హక్కులను మోదీ ప్రభుత్వం తొలగించి పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తుందన్నారు. ఇప్పటికై నా నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని లేకుంటే కార్మికవర్గ ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అన్నల్దాస్ గణేశ్, సూరం పద్మ, నక్క దేవదాస్, బెజుగం సురేశ్, జిందం కమలాకర్, బింగి సంపత్, సందుపట్ల పోచమల్లు తదితరులు పాల్గొన్నారు. -
నిధులు మంజూరు చేయాలని వినతి
గంభీరావుపేట(సిరిసిల్ల): మండలంలోని కొత్తపల్లి శ్రీవేణుగోపాలస్వామి ఆలయానికి సంబంధించి ఫంక్షన్ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కమిటీ సభ్యులు మంగళవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్కు వినతిపత్రం అందజేశారు. మంత్రి సానుకూలంగా స్పందించి రానున్న బడ్జెట్లో నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చినట్లు సభ్యులు తెలిపారు. అలాగే కొత్తపల్లి నుంచి అయోధ్యకు వెళ్లిన కరసేవకుడు పాతూరి బాల్రెడ్డిని సత్కరించారు. ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, నాయకులు పెద్దూరి పర్షాగౌడ్, బీనవేని శ్రావణ్యాదవ్, నవీన్ యాదవ్, మన్మోహన్రెడ్డి, అఖిలేశ్యాదవ్, పవన్గౌడ్, మహేశ్గౌడ్, కమిటీ సభ్యులు ●తదితరులు పాల్గొన్నారు. 23న అథ్లెటిక్స్ ఎంపిక పోటీలుసిరిసిల్లకల్చరల్/సిరిసిల్లటౌన్: జిల్లాస్థాయి అథ్లెటిక్స్ చాంపియన్షిప్ ఎంపిక పోటీలు ఈ నెల 23న నిర్వహించనున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి చంద్రశేఖర్ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో బ్రాడ్ జంప్, టెన్నిస్ బాల్ త్రో, లాంగ్ జంప్, జావెలిన్ త్రో స్టాండింగ్ షాట్పుట్ అంశాల్లో పోటీలు జరుగుతాయన్నారు. ప్రతిభ చూపిన బాలబాలికలను జూన్ 1న సికింద్రాబాద్ జింఖానా మైదానంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. ఆసక్తి గల వ్యాయామ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు 12 ఏళ్ల లోపు పిల్లలను పోటీలకు పంపించాలని కోరారు. వైద్య శిబిరం సందర్శనవీర్నపల్లి(సిరిసిల్ల): కలెక్టర్ ఆదేశాలతో వీర్నపల్లి మండలం కంచర్ల గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామని డీఎంహెచ్వో డాక్టర్ రజిత పేర్కొన్నారు. మంగళవారం శిబిరాన్ని సందర్శించారు. గ్రామంలో సర్వే వివరాలు, జ్వర బాధితుల ఇళ్లకు వెళ్లి వారి ఆరోగ్య విషయాలు తెలుసుకున్నారు. గ్రామంలో జ్వరాలు తగ్గుముఖం పట్టినట్లు తెలిపారు. అనంతరం వీర్నపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. రిజిస్టర్, మందుల నిల్వలను పరిశీలించారు. అన్ని మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. డీఎంహెచ్వో వెంట ఎల్లారెడ్డిపేట సీహెచ్సీ డాక్టర్ సరియా అంజూమ్ తదితరులు ఉన్నారు. రాజన్నపేట ఇళ్ల విచారణ వాయిదాబోయినపల్లి(చొప్పదండి): పరిహారం చెల్లింపులపై మంగళవారం వరదవెల్లి గ్రామపంచాయతీలో చేపట్టిన విచారణ వాయిదా పడినట్లు డీఎల్పీవో నరేశ్ తెలిపారు. మిడ్మానేరులో ముంపునకు గురైన వరదవెల్లి అనుబంధ రాజన్నపేటలో 9 ఇళ్లకు పరిహారం రావాలని కొందరు దరఖాస్తు చేసుకోగా, సుమారు రూ.1.80 కోట్లు పరిహారం పంపిణీకి అధికారులు చెక్కులు సిద్ధం చేశారు. కాగా గతంలో తీసుకున్న ఇళ్లకే బై నంబర్లు వేసి పరిహారం తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఫిర్యాదులు వెళ్లడంతో చెక్కుల పంపిణీ ఆగింది. ఈక్రమంలో కలెక్టర్ ఆదేశాలతో డీఎల్పీవో, సిరిసిల్ల తహసీల్దార్ మహేశ్కుమార్ విచారణకు వచ్చారు. గతంలో పని చేసిన పంచాయతీ కార్యదర్శులు శేఖర్, భాగ్యలక్ష్మి, గంగాతిలక్, రాజశేఖర్, ప్రస్తుత ఎంపీవో శ్రీధర్, కార్యదర్శి శ్రీహిత తదితరులు హాజరయ్యారు. ఫిర్యాదుదారులు రాకపోవడంతో మరోసారి విచారణ చేయాలని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా విచారణలో అధికారులు పలు రికార్డులు పరిశీలించినట్లు తెలిపారు. కొన్ని ముఖ్యమైన రికార్డులు లేవని తెలిసింది. -
రెక్కలు?
భూముల ధరలకుసాక్షిప్రతినిధి,కరీంనగర్: భూముల మార్కెట్ విలువ పెంపునకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. భూముల ధరలు ఎంత మేరకు పెంచవచ్చో అధ్యయనం చేయాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖను ఆదేశించింది. అన్ని జిల్లాల రిజిస్ట్రార్లకు ఆదేశాలు పంపింది. ప్రస్తుతం ఉన్న భూముల వివరాలు, మార్కెట్ విలువ? దాన్ని ఎంత మేరకు పెంచవచ్చో అధ్యయనం చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పలువురుశాఖల అధికారులతో కూడిన కమిటీలను కూడా సిద్ధం చేసింది. వీరు భూముల విలువపై అంచనాకు వచ్చి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. నివేదికలోని సూచనలు అమలైతే దాదాపు 50 నుంచి 100 శాతం వరకు మార్కెట్ ధరలు పెంచే అవకాశాలు ఉన్నాయి. దీంతో రిజిస్ట్రేషన్ చార్జీలతో పాటు, భూముల ధరలు పెరిగే అవకాశాలు లేకపోలేదు. కమిటీలు ఇలా.. భూముల పెంపులో ప్రభుత్వం అర్బన్, రూరల్ రెండు ప్రాంతాలుగా విభజించింది. పట్టణ ప్రాంతాల్లో అయితే.. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు అందులో ఇటీవల విలీనమైన గ్రామాలకు కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అందులో అడిషనల్ కలెక్టర్ (లోకల్బాడీస్) చైర్మన్గా ఉంటారు. సభ్యులుగా మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్చైర్మన్, జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారు. కన్వీనర్గా సబ్రిజిస్ట్రార్ వ్యవహరిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే చైర్మన్గా ఆర్డీవో వ్యవహరిస్తారు. సభ్యులుగా తహసీల్దార్, ఎంపీడీవో ఉంటారు. కన్వీనర్ బాధ్యతలను సబ్రిజిస్ట్రార్ నిర్వహిస్తారు. భవన నిర్మాణాల ధరల నిర్ధారణకు జాయింట్ ఇన్స్పెక్టర్ జనరల్ చైర్మన్గా ఉండగా.. ఆర్అండ్బీ సూపరింటెండెంట్ ఇంజినీర్ సభ్యుడిగా ఉంటారు. అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ కన్వీనర్గా వ్యవహరిస్తారు. ఈ కమిటీలన్నీ వ్యవసాయ, రియల్ ఎస్టేట్, భూములతోపాటు అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు, బహుళ అంతస్తుల భవనాల మార్కెట్ విలువను నిర్ధారిస్తారు. మే నెలాఖరుకు నివేదిక ప్రభుత్వ ఆదేశాల మేరకు రూపుదిద్దుకున్న కమిటీలు వారి పరిధిలో ఉన్న భూముల మార్కెట్ విలువపై సర్వే ప్రారంభించాయి. దాదాపుగా ఈ సర్వే కూడా కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఈ నెల 28న నివేదికను ప్రభుత్వానికి అంజేయనున్నారు. ఈ నివేదిక ప్రకారం.. 50 నుంచి 100శాతం వరకు మార్కెట్ విలువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా మొత్తం శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా), సిరిసిల్ల జిల్లా మొత్తం వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వీటీడీఏ)లుగా అవతరించడంతో ఈ ప్రాంతాల్లో భూముల ధరలకు ముఖ్యంగా రెక్కలు రానున్నాయి.ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు, ఆదాయ వివరాలు (రూ.కోట్లలో)ఏడాది డాక్యుమెంట్లు ఆదాయం 2024 88,762 231.98 2025 32,383 86.25 మరోసారి మార్కెట్ విలువ పెంపు 50 నుంచి 100శాతం పెంచేలా కసరత్తు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు ప్రభుత్వ ఆదేశం మున్సిపాలిటీ, గ్రామీణ ప్రాంతాల్లో అధ్యయనానికి కమిటీలు నివేదికకు మే నెలాఖరు సమయం భూ విలువలపై అధ్యయనం ప్రారంభించిన అధికారులు -
పేదల ఆత్మగౌరవానికి ప్రతీక ఇందిరమ్మ ఇళ్లు
● విప్ ఆది శ్రీనివాస్ చందుర్తి(వేములవాడ): నిరుపేదల ఆత్మగౌరవానికి ఇందిరమ్మ ఇళ్లు ప్రతీక అని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. చందుర్తి మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంగళవారం కలెక్టర్ సందీప్కుమార్ఝాతో కలిసి మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామని చెప్పి మాట తప్పారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేస్తుందని చెప్పడానికి చందుర్తి మండలంలోని 19 గ్రామాలకు 520 ఇళ్లు మంజూరు చేశామని, పైలట్ ప్రాజెక్టు గ్రామం కొత్తపేటలో 17 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయన్నారు. 400 నుంచి 600 చదరపు అడుగుల లోపే ఇళ్లు నిర్మించుకోవాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ, లబ్ధిదారులు నాలుగునెలల లోపు ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకోవాలని కోరారు. మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు బొజ్జ మల్లేశం, పార్టీ మండల అధ్యక్షుడు చింతపంటి రామస్వామి, విండో అధ్యక్షుడు తిప్పని శ్రీనివాస్, మండల ప్రత్యేకాధికారి రవీందర్రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ శంకర్ తదితరులు పాల్గొన్నారు. కాగా మండలంలోని రామన్నపేటలో లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని గ్రామస్తులు ఆరోపించారు. వేములవాడ పట్టణంలో బిల్డింగ్ ఉన్న వ్యక్తిని లబ్ధిదారుగా ఎంపిక చేశారని, ఇప్పటికై నా అనర్హులను గుర్తించి, అర్హులకు అండగా నిలవాలని కోరారు. ఈదురుగాలుల వర్షం.. విరిగిన స్తంభంగంభీరావుపేట(సిరిసిల్ల): మండలకేంద్రంలో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. మండలకేంద్రంలో ఎమ్మార్సీ ఏరి యాలో ఓ విద్యుత్ స్తంభం విరిగి ఇంటిపై పడింది. దీంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. -
ప్రజల అభీష్టం మేరకు వేములవాడ– ముంబయి బస్
వేములవాడ: ప్రజల అభీష్టం మేరకు వేములవాడ– ముంబయికి లహరి ఏసీ స్లీపర్ బస్సు సర్వీసు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంగళవారం వేములవాడ ఆలయ పార్కింగ్ స్థలంలో రెండు ఏసీ బస్సులను విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్కుమార్ఝాతో కలిసి అర్చకుల మంత్రోచ్ఛరణల మధ్య పూజ అనంతరం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముంబయిలోని తెలుగు ప్రజల కోరిక మేరకు బస్సులను ప్రారంభిస్తున్నామని, రోజూ మధ్యాహ్నం 12.30 గంటలకు వేములవాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.45 గంటలకు ముంబయి చేరుకుంటుందని, తిరిగి అదే రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ముంబయి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు వేములవాడ చేరుకుంటుందని తెలిపారు. పెద్దలకు స్లీపర్ బెర్త్ రూ.2 వేలు, సీటుకు రూ.1,500, పిల్లలకు బెర్త్ రూ.1,600, సీట్ రూ.1,230 టికెట్ ఉంటుందని, ఈ ప్రాంతవాసులు వినియోగించుకోవాలని కోరారు. ఆలయ ప్రాంగణం నుంచి తిప్పాపూర్ బస్టాండ్ వరకు బస్సులో ప్రయాణించి ముంబయి వెళ్లే ప్రయాణికులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. ఎస్పీ మహేశ్ బీ గీతే, గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, ఆర్టీసీ రీజనల్ మేనేజర్లు, డిపో మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు సౌకర్యాలు కల్పించడమే లక్ష్యం రుద్రంగి(వేములవాడ): ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ నుంచి ముంబయికి మంగళవారం ప్రారంభమైన ఏసీ బస్సుకు రుద్రంగిలో విప్, స్థానిక నాయకులు స్వాగతం పలికి పూజలు చేశారు. ఏఎంసీ చైర్మన్ చెలుకల తిరుపతి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తూము జలపతి తదితరులు ఉన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ -
ఐఐహెచ్టీ కోర్సుతో నమ్మకమైన ఉపాధి
● టెస్కో జీఎం అశోక్రావు సిరిసిల్ల: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్టీ) మూడేళ్ల కోర్సును విజయవంతంగా పూర్తి చేస్తే నమ్మకమైన ఉపాధి లభిస్తుందని టెస్కో జనరల్ మేనేజర్ వి.అశోక్రావు అన్నారు. సిరిసిల్ల నేత బజారులో మంగళవారం ఐఐహెచ్టీ కోర్సులపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఒక్క వెంకటగిరిలో ఈ కోర్సు చదువు ఉండేదని, తెలంగాణలో గతేడాది కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుతో ఐఐహెచ్టీ కోర్సును ప్రవేశ పెట్టి 60 సీట్లను కేటాయించారన్నారు. ఇందులో చేరిన అభ్యర్థులు చిత్తశుద్ధితో కోర్సు పూర్తి చేసి నైపుణ్యం పెంచుకుంటే చేనేత, జౌళిశాఖ ఉద్యోగాల్లో చేరవచ్చని, ప్రైవేటుగా స్పిన్నింగ్, గార్మెంట్, టెక్స్టైల్ పరిశ్రమల్లో మంచి వేతనాలతో ఉద్యోగాలు లభిస్తాయని వివరించారు. ఫీజుల భారం లేకుండా పదో తరగతి, ఇంటర్ పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రభుత్వం ఈ కోర్సుల్లో అవకాశం కల్పిస్తుందన్నారు. సిరిసిల్ల ప్రాంతంలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఐఐహెచ్టీలో చేరాలన్నారు. అనంతరం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సందేహాలను నివృతి చేశారు. సమావేశంలో జౌళిశాఖ డీడీ విద్యాసాగర్, ఏడీ విజయ్, డీవో రవీందర్రెడ్డి, సంతోష్, కార్మిక నాయకులు మూషం రమేశ్, కోడం రమణ తదితరులు పాల్గొన్నారు. -
వస్త్ర పరిశ్రమను ప్రక్షాళన చేయాలి
సిరిసిల్లకల్చరల్: గత ప్రభుత్వ హయాంలో వస్త్ర పరిశ్రమకు వివిధ కారణాలతో విద్యుత్ సబ్సిడీ నిలిపేశారని కాంగ్రెస్ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి అన్నారు. పరిశ్రమలో సంక్షోభాన్ని నివారించాలని, సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిరిసిల వస్త్ర, వ్యాపార ప్రముఖులు హైదరాబాద్లో కేకే క్యాంప్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మహేందర్రెడ్డి మాట్లాడుతూ, పరిశ్రమ సంక్షోభాన్ని నివారించేందుకు వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రవేశపెట్టిన 50 శాతం విద్యుత్సబ్సిడీని గత బీఆర్ఎస్ తొలగించే ప్రయత్నం చేసిందన్నారు. అప్పటికే సెస్కు బకాయిపడిన రూ.32 కోట్లను ఇవ్వలేదన్నారు. పరిశ్రమను కాపాడాల్సిన బాధ్యత ఉన్నందున కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్సమస్యను త్వరలోనే పరిష్కరిస్తుందన్నారు. పరిశ్రమ బాగుపడాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూ.300 కోట్లు చెల్లించిన విషయాన్ని గుర్తు చేశారు. సీపీఐ పట్టణ కార్యదర్శి పంతం రవి, చేనేత సెల్ అధ్యక్షుడు బండారి అశోక్, బూట్ల నవీన్, వెల్దండి దేవదాస్, గుండ్లపెల్లి గౌతమ్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు. -
లే అవుట్ స్థలం మాయం చేశారు
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని లే అవుట్ స్థలాన్ని గత ప్రభుత్వ హయాంలో పెద్దల అనుయాయులు మాయం చేశారు. సర్వేనంబరు 525, 530/సీలో ఫైల్ నంబరు 1828/80లో 121 గజాల స్థలం ప్లాట్ నంబరు 13ను మున్సిపల్కు చెందిందిగా పేర్కొన్నారు. దాని విలువ రూ.40లక్షలు ఉంటుంది. కబ్జాకు గురైన మున్సిపల్ లే అవుట్ స్థలాన్ని గుర్తించి మున్సిపల్కు అప్పగించేలా చర్యలు తీసుకోవాలి. – నాగుల శ్రీనివాస్, సిరిసిల్ల ధాన్యం తరుగు అరికట్టాలి మా గ్రామంలో ధాన్యం కొనుగోళ్లలో తరుగు తీస్తున్నారు. ఎందుకు తీయాల్సి వస్తుందో కూడా వివరణ ఇవ్వడం లేదు. నాతోపాటు గ్రామానికి చెందిన రైతులు ఓన్సులాల్, సజన్లాల్కు చెందిన 710 బస్తాలను లారీలో మిల్లుకు తరలించగా వాటిలోంచి 21 బస్తాలు తరుగు తీసినట్లు చెబుతున్నారు. ధాన్యం కొనుగోళ్లలో తరుగుపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. – భూక్య గజన్లాల్, వీర్నపల్లి -
రాజన్నపేట ఇళ్ల పరిహారంపై నేడు విచారణ
● బై నంబర్లతో రూ.1.80 కోట్లు చెల్లింపులపై ఫిర్యాదులుబోయినపల్లి(చొప్పదండి): మిడ్మానేరులో ముంపునకు గురైన బోయినపల్లి మండలం వరదవెల్లి అనుబంధ గ్రామం రాజన్నపేటలోని 9 ఇళ్ల పరిహారం చెల్లింపులపై కలెక్టర్ సందీప్కుమార్ ఝా విచారణకు ఆదేశించారు. ఈమేరకు డీఎల్పీవో నరేశ్ మంగళవారం వరదవెల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో విచారణ చేపట్టనున్నారు. పరిహారం పొందిన 9 పాత ఇళ్ల ఇంటి నంబర్లకు బై నంబర్లతో దాదాపు రూ.1.80 కోట్ల మేర పరిహారం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గతంలో ఆరోపణలు వచ్చాయి. పరిహారం చెల్లింపులు నిలిచిపోయాయి. ఫిర్యాదులతో నిలిచిన చెల్లింపులు వరదవెల్లి ఆర్అండ్ఆర్ కాలనీలో సుమారు 482 వరకు ఇంటి నంబర్లు ఉన్నాయి. 2006 నుంచి ఇళ్లు, భూముల ముంపు గుర్తింపు జరిగింది. 2014లో ఎంఎంఆర్ నంబర్లు వేసి నోటీసులు ఇచ్చారు. మళ్లీ నిర్మాణాలు చేస్తే పరిహారం వర్తించదని స్పష్టం చేశారు. కాగా తప్పిపోయిన ఇళ్లకు పరిహారం ఇవ్వాలని 2021లో గత ప్రభుత్వం జీవో ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో 9 ఇళ్లకు సంబంధించిన వారు పరిహారం కావాలని జిల్లా అధికారులకు వినతిపత్రాలు ఇచ్చారు. ఈక్రమంలో కలెక్టరేట్ నుంచి ఎస్డీసీ అకౌంట్లోకి డబ్బులు జమ చేశారు. రూ.1.80 కోట్ల మేర పరిహారం చెల్లించేందుకు అధికారులు చెక్కులు సిద్ధం చేశారు. పరిహారం పొందిన ఇళ్లకు బై నంబర్లతో మళ్లీ పరిహారం పొందుతున్నారని ఫిర్యాదులు వెళ్లడంతో చెల్లింపులు నిలిచిపోయాయి. మంగళవారం నాటి విచారణకు గ్రామంలో 2015 నుంచి 2019 వకు వరదవెల్లి గ్రామపంచాయతీ కార్యర్శులుగా పనిచేసిన వారు హాజరుకావాలని కలెక్టర్ ఆదేశించారు. విచారణ నేపథ్యంలో కొందరి అధికారుల్లో భయం నెలకొన్నట్లు సమాచారం. -
వారసత్వ పనిని ఇప్పించాలి
మాది తిప్పాపురం. వేములవాడ బద్దిపోచమ్మ ఆలయంలో 60 ఏళ్లుగా మా వంశానికి చెందిన వారు 8 పాళ్లుగా పట్నాలు వేస్తున్నాం. అయితే మూడేళ్లుగా మా కులస్తులు ఎనిమిది పాళ్లు కాదని కొడుకులున్నోళ్లు మొత్తంగా 26 పాళ్లు చేశారు. నా కొడు కు అనారోగ్యంతో ఉంటున్నాడు. నాకు పాలు క ల్పించాలని కోరితే వారు ఒప్పుకోవడం లేదు. ఈ విషయమై వేములవాడ ఆలయ ఈవో సైతం వారికి చెప్పారు. అయినా వినడం లేదు. – పి.అంజలి, వేములవాడ ఉపాధి కల్పించాలి మాది రగుడు గ్రామం. నిరుపేద దళిత కుటుంబానికి చెందిన దివ్యాంగుడిని. మా నాన్న చాలా ఏళ్ల క్రితమే చనిపోయాడు. అమ్మే నన్ను ఐటీఐ వరకు చదివించింది. ప్రస్తుతం లైసెన్స్డ్ సర్వేయర్కు దరఖాస్తు తీసుకున్నారు. నాకు లైసెన్స్డ్ సర్వేయర్గా ఉద్యోగం కల్పించి ఆదుకోవాలి. – బూర మధు, రగుడు చెరువుకట్టలు పునర్ నిర్మించాలి గ్రామ శివారులోని పెద్దచెరువు, కొత్తచెరువులో పూడిక తీయాలి. పూడిక తీయగా చెరువు లోతు పెరుగుతుంది. పూడిక తీయకపోవడంతో చిన్నవర్షాలకే నిండి మత్తడి దూకుతున్నాయి. వెంటనే వాటిలో పూడిక తీసి కట్టలను పునర్ నిర్మించాలి. ఫలితంగా చెరువులోంచి నీరు వృథాపోకుండా అరికట్టవచ్చు. – రవీందర్, చిన్నబోనాల -
అక్రమంగా పట్టా చేసుకుండ్రు
ఊరిలో మా మామ పేరిట 9 ఎకరాల స్థలం ఉంది. ఆయనకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు. వారిలో చిన్నకూతురు మినహా ఎవరూ బతికిలేరు. వారసత్వంగా మాకు సంక్రమించాల్సిన భూమిని కొందరు నా ప్రమేయం లేకుండానే వారి పేరిట పట్టా చేయించుకున్నారు. నా పోషణ గురించి పట్టించుకోవడం లేదు. నాకు న్యాయం చేయాలి. – జూలూరి మల్లవ్వ, సముద్రలింగాపూర్ ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలి జిల్లాలోని చాలా ప్రైవేటు ఆస్పత్రులు నిబంధనలు పాటించడం లేదు. వైద్యుల అర్హతల వివరాలు ప్రదర్శించడం లేదు. ధనార్జనే ధ్యేయంగా ఆస్పత్రులు నిర్వహిస్తున్నారు. డబ్బుల కోసం రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలి. – అంగూరి రంజిత్, సిరిసిల్ల నా స్థలాన్ని కబ్జా కానీయొద్దు మాకు జిల్లాకేంద్రం విద్యానగర్ బైపాస్ రోడ్డులో సర్వేనంబర్ 517లో స్థలం ఉంది. నేను ఉపాధి నిమిత్తం మా స్థలంలో హోటల్ పెట్టుకోవాలని చూస్తుంటే ఓ బీఆర్ఎస్ నాయకుడు బెదిరిస్తున్నాడు. అదే సర్వేనంబర్లో వారికి ఉన్న భూమి బైపాస్రోడ్డులో పోయింది. అప్పుడు పరిహారం కూడా పొందారు. ఇప్పుడు నిరుపేద అయిన నా స్థలాన్ని కాజేయాలని చూస్తుండ్రు. కలెక్టర్ న్యాయం చేయాలి. – షేక్ జలీల్, విద్యానగర్ -
ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లాలి
● డెంగీ ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి ● ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు ● మహిళా సంఘాలకు ఎరువులు, విత్తనాల దుకాణాలు ● కలెక్టర్ సందీప్కుమార్ ఝాసిరిసిల్ల: జిల్లాలో ఆరోగ్య సిబ్బంది ఇంటింటికెళ్లాలని, డెంగీ ప్రబలకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే వానాకాలంలో డెంగీ రాకుండా ముందుజాగ్రత్త చర్యలకు సన్నద్ధం కావాలన్నారు. నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి, నియంత్రణకు చ ర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతీ మంగ ళ, శుక్రవారాలలో డ్రైడే నిర్వహించాలన్నారు. డీఎంహెచ్వో రజిత, మున్సిపల్ కమిషనర్లు అన్వేశ్, వాణి పాల్గొన్నారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు జిల్లాలో ఇంటర్మీడియెట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ఈనెల 22 నుంచి 29 ఇంటర్ పరీక్షలు, జూన్ 3 నుంచి 12 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. జిల్లాలో 13 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, జిరాక్స్ సెంటర్లు మూసివేయాలన్నారు. అదనపు ఎస్పీ చంద్రయ్య, ఆర్డీవోలు రాధాబాయి, వెంకటేశ్వరావు, జిల్లా ఇంటర్మీడియెట్ నోడల్ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మహిళా సంఘాలకు ఎరువుల దుకాణం జిల్లాలోని ఐదు మహిళా సంఘాలకు ఎరువుల దుకాణాలకు ఈ–పాస్ మిషన్లను కలెక్టర్ పంపిణీ చేశారు. మహాలక్ష్మీ గ్రామైక్య సంఘం ఫెర్టిలైజర్స్ అండ్ విత్తనాలు(పెద్దూర్), శ్రీధనలక్ష్మీ మండల సమాఖ్య ఫెర్టిలైజర్స్ అండ్ విత్తనాలు వేములవాడ, శివరామ్ గ్రామైక్య సంఘం ఫెర్టిలైజర్స్ అండ్ విత్తనాలు వేములవాడ మండలం బొల్లారం, విలాసాగర్ గ్రామైక్య సంఘం ఫెర్టిలైజర్స్ అండ్ విత్తనాలు బోయినపల్లి, వెన్నెల గ్రామ సమాఖ్య సంఘం రుద్రంగి వారికి ఈ–పాస్ యంత్రాలు అందజేశారు. జెడ్పీ సీఈవో వినోద్కుమార్, జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్ బేగం తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారమే లక్ష్యం
● ఎస్పీ మహేశ్ బీ గీతే సిరిసిల్లక్రైం: ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటి పరిష్కారమే లక్ష్యంగా ప్రతీ సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి 33 ఫిర్యాదులు స్వీకరించి, ఆయా పోలీస్స్టేషన్ల అధికారులకు ఫోన్చేసి త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి నిజానిజాలు తెలుసుకోవాలని సూచించారు. నేడు వేములవాడ–ముంబయి ఏసీ బస్సు ప్రారంభం వేములవాడ: వేములవాడ నుంచి ముంబయికి వెళ్లేందుకు ఏసీ స్లీపర్ కోచ్ బస్సును రాష్ట్ర బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సోమవారం తెలిపారు. వేములవాడ నుంచి కోరుట్ల, మెట్పల్లి, ఆర్మూర్, నిజామాబాద్, పుణె మీదుగా ముంబయి చేరుకుంటుందని తెలిపారు. సిట్టింగ్ రూ.1,500, స్లీపర్ రూ.2వేలు చార్జీలు ఉన్నట్లు చెప్పారు. అనంతరం స్థానిక మహాలింగేశ్వర ఫంక్షన్హాల్లో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ను బలోపేతం చేయడమే లక్ష్యం ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో గ్రామ, మండల శాఖ నూతన కార్యవర్గాలను ఎన్నుకుంటున్నట్లు పీసీసీ పరిశీలకులు ఫక్రుద్దీన్, చైతన్య కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేటలోని పార్టీ కార్యాలయంలో సోమవారం కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలను గుర్తిస్తామన్నారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, పార్టీ మండలాధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ సాబేరా బేగం, వైస్చైర్మన్ గుండాడి రాంరెడ్డి, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు సాహెబ్ పాల్గొన్నారు. నేడు ఐఐహెచ్టీ కోర్సుపై అవగాహన సదస్సు సిరిసిల్ల: కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ(ఐఐహెచ్టీ) కోర్సుపై అవగాహన కల్పించేందుకు మంగళవారం సిరిసిల్లలో సదస్సు నిర్వహిస్తున్నామని చేనేత, జౌళిశాఖ సహాయ సంచాలకులు రాఘవరావు తెలిపారు. 2025–2026 విద్యాసంవత్సరంలో 60 సీట్లు చేనేత, టెక్స్టైల్స్ టెక్నాలజీ డిప్లొమా కోర్సులో ఉన్నట్లు వివరించారు. ఆ కోర్సు ప్రాధాన్యతను వివరించేందుకు బీవై నగర్లోని పాత ఏడీ ఆఫీస్లో మంగళవారం ఉదయం 11 గంటలకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భగవద్గీత పఠనంలో గోల్డ్మెడల్స్ముస్తాబాద్(సిరిసిల్ల): భగవద్గీతలోని 700 శ్లోకాలను కంఠస్థం చేసిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు గోల్డ్మెడల్స్ సాధించారు. ముస్తాబాద్ మండలం ఆవునూర్కు చెందిన కటకం లక్ష్మి, కటకం విజయలక్ష్మి మైసూర్లో జరిగిన భగవద్గీత శ్లోకాల పోటీల్లో సత్తా చాటారు. 700 శ్లోకాలను అలవోకగా ఆలపించిన అక్కాచెల్లెళ్లకు గణపతి సచ్చిదానంద స్వామి చేతుల మీదుగా బంగారు పతకాలను అందించారు. కంచర్ల పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్వీర్నపల్లి(సిరిసిల్ల): విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కంచర్ల పంచాయతీ కార్యదర్శి ముక్తార్ అహ్మద్ను కలెక్టర్ సందీప్కుమార్ ఝా సోమవారం సస్పెండ్ చేశారు. గ్రామంలో డెంగీ కేసులు నమోదైనప్పటికీ పారిశుధ్య చర్యలు చేపట్టకపోవడంతో కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు. సోమవారం గ్రామంలో పర్యటించిన కలెక్టర్.. పంచాయతీ కార్యదర్శి లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యదర్శి అందుబాటులో లేకపోవడంతో సస్పెండ్ చేశారు. -
రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, బాబు జగ్జీవన్రామ్ వ్యవసాయ కళాశాల జిల్లెల్ల ఆధ్వర్యంలో చీర్లవంచలో సోమవారం రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు మాట్లాడుతూ రైతులు పంటలకు సిఫారసు చేసిన మోతాదులోనే యూరియాను వినియోగించాలన్నారు. పచ్చిరొట్ట ఎరువులు, వర్మీకంపోస్టు, పేడ ఎరువులను వినియోగించాలన్నారు. చీడపీడల ఉధృతిని బట్టి సరైన మోతాదులో రసాయనిక మందుల వాడడంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బాబు జగ్జీవన్రామ్ వ్యవసాయ కళాశాల వ్యవసాయ శాస్త్రవేత్తలు డా.రజియా సుల్తానా, కె.భవ్యశ్రీ, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, మండల వ్యవసాయ అధికారి కె.సంజీవ్, ఏఈవో కరుణాకర్, మౌనిక, విత్తన అధికారి మౌనిక, విద్యార్థులు మణికంఠ, శాలిని, రైతులు పాల్గొన్నారు. -
జ్వరం..ఒళ్లునొప్పులు
సిరిసిల్లటౌన్: జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. పల్లె..పట్నం తేడా లేకుండా జనాలు మంచం పడుతున్నారు. మండుటెండలు ఒక వైపు.. కురుస్తున్న వర్షాలు మరో వైపుతో వాతావరణంలో తీవ్రమార్పులు చోటుచేసుకున్నాయి. ఫలితంగా దోమలు పెరిగి జ్వరాలు వస్తున్నాయి. నీరు, ఆహారం కలుషితమై విరోచనాలు, మలేరియా, డెంగీ వ్యాధులు వస్తున్నాయి. జ్వర బాధితులతో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. జిల్లా ఆస్పత్రికే నిత్యం 700 వరకు రోగులు ఓపీ సేవలు పొందుతున్నారు. వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాల్లో డెంగీ కేసులు బయటపడుతుండడం జనాలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. లక్షణాలు..చికిత్స సాధారణం నుంచి తీవ్రమైన జ్వరం, తలనొప్పి, ఒంటినొప్పులు, వాంతులు, విరోచనాలు, కండ్లు లాగడం వంటి లక్షణాలతో జ్వరాలు వ్యాపిస్తున్నాయి. మూత్రంలో రక్తం రావడం, నాలుక నల్లబారడం, జ్వరం తగ్గకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇలాంటి సమయంలో వెంటనే ఆస్పత్రిలో వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. ఎన్ఎస్ఐ ఏజీ టెస్టు పాజిటివ్ వస్తే డెంగీ మొదటి దశలో ఉందని అర్థం. ఈ దశలో రెండు, మూడు రోజులు ఉంటుంది. ఐజీహెచ్ టెస్టు పాజిటివ్ వస్తే మోడరేట్ టు సివియర్గా పరిగణించి చికిత్స అందిస్తారు. ఈసమయంలో జాగ్రత్తలు తీసుకో వాల్సి ఉంటుంది. అన్ని రకాల జ్వరాలకు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స అందుబాటులో ఉంది. ప్రైవేటుకు వెళ్లాల్సిన అవసరం లేదు. జ్వరాల తీవ్రత పెరిగితే జిల్లా ఆస్పత్రిలో కార్పొరేట్ వైద్యానికి దీటుగా మూడు షిఫ్టుల్లో 24 గంటలపాటు సిబ్బంది వైద్యసేవలు అందిస్తున్నారు. జిల్లాలో జ్వరాల తీవ్రత దృష్ట్యా కలెక్టర్ సందీప్కుమార్ ఝా వైద్యశాఖను అప్రమత్తం చేశారు. వణికిస్తున్న వైరల్, డెంగీ కేసులు జిల్లా ఆస్పత్రికి పోటెత్తుతున్న రోగులు నిత్యం 700 మందికి పైగా ఔట్పేషంట్లు ప్లేట్లెట్స్ తగ్గడంతో జనాలు బెంబేలు ఈమె వీర్నపల్లి మండలం కంచర్లకు చెందిన దండుగుల లక్ష్మి. నాలుగు రోజుల క్రితం చాతి, తలనొప్పి తో పాటు పక్కబొక్కలు నొప్పిలేశాయి. విపరీతమైన జ్వరం వచ్చింది. ఊరిలోకి వైద్యశాఖ నుంచి వచ్చినోళ్లు గోలీలు ఇచ్చినా తగ్గలేదు. ఇంట్లో వాళ్లు వెంటనే సిరిసిల్లలోని జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చి పరీక్షలు చేశారు. ర్యాపిడ్ టెస్టులో డెంగీ పాజిటివ్ వచ్చింది. ఇన్పేషెంటుగా చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు. డెంగీ నుంచి కోలుకుంటున్న ఎనిమిది రోజుల క్రితం తలనొప్పి, కండ్లు గుంజుడం.. నడుం నొప్పి వచ్చింది. జ్వరం ఎక్కువైంది. జిల్లా ఆస్పత్రికి వచ్చినం. ఇక్కడ ఎలీసా టెస్టు చేస్తే పాజిటివ్ రావడంతో వైద్యం అందించారు.ఎలాంటి ఖర్చు లేకుండానే డెంగీ జ్వరం నుంచి కోలుకుంటున్న. – మిర్యాల మంజుల, కంచర్ల మెరుగైన చికిత్స అందిస్తున్నాం ఇటీవల రెండు డెంగీ పాజిటివ్ కేసులు వచ్చాయి. ఇతర విషజ్వరాలతో కూడా రోగులు వస్తున్నారు. ఆస్పత్రిలో అన్ని రకాల మందులు ఉన్నాయి. ఫ్లూయిడ్స్, ఇంజక్షన్లు, ఓఆర్ఎస్లు, యాంటిబయాటిక్స్ ఉన్నాయి. వెంటిలేటర్, ఆక్సిజన్ సౌకర్యం ఉంది. ఐసీయూలో పది పడకలు కేటాయించాం. జిల్లా ఆస్పత్రిలో అన్ని విభాగాల వైద్యులతో చికిత్స అందిస్తున్నాం. ప్రైవేటు కన్నా మెరుగ్గా వైద్యం అందిస్తున్నాం. – డాక్టర్ లక్ష్మీనారాయణ, సూపరింటెండెంట్ జిల్లా ఆస్పత్రి, సిరిసిల్ల ఈమె వీర్నపల్లి మండల కేంద్రానికి చెందిన శశికళ. ఈనెల 16న తీవ్ర జ్వరం, వాంతులు, ఒళ్లు నొప్పులతో సిరిసిల్ల జిల్లా ఆస్పత్రికి వచ్చింది. ర్యాపిడ్ టెస్టు చేయగా డెంగీ పాజిటివ్గా తేలింది. వైద్యులు వెంటనే ట్రీట్మెంట్ ప్రారంభించారు. ప్లేట్లెట్స్ సంఖ్య పడిపోకుండా 24 గంటలు సిబ్బంది పర్యవేక్షణలో చికిత్స అందుతోంది. -
విన్నపాలు వినవలే..
● ప్రజావాణిలో వెల్లువెత్తిన వినతులు ● అర్జీలు స్వీకరించిన కలెక్టర్ సందీప్కుమార్ ఝా ● వివిధ సమస్యలపై 120 విన్నపాలుసిరిసిల్లటౌన్: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పలువురు బాధితులు కలెక్టరేట్ బాట పడుతున్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కాక కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి భారీ సంఖ్యలో బాధితులు తరలివచ్చారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝా వినతిపత్రాలు స్వీకరించి పరిష్కరించాల్సిందిగా ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో జాప్యం చేయొద్దని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ 54, మున్సిపల్ 11, డీఆర్డీవో 7, ఉపాఽధికల్పన 6, హౌసింగ్ 5, ఎస్డీసీ 4, డీడబ్ల్యూవో 3, ఎస్సీ కార్పొరేషన్, ఏడీఎస్ అండ్ ఆర్డీఎస్వో, హ్యాండ్లూమ్, టెక్స్టైల్, డీఎంహెచ్వోకు రెండు చొప్పున మొత్తంగా 120 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, వేములవాడ ఇన్చార్జి ఆర్డీవో రాధాబాయి, జెడ్పీ సీఈవో వినోద్కుమార్, వ్యవసాయాధికారి అఫ్జల్బేగం తదితరులు పాల్గొన్నారు. -
నేడు సిరిసిల్లకు కేటీఆర్
సిరిసిల్ల: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక ఎమ్మెల్యే కె.తారకరామారావు ఆదివారం సిరిసిల్ల లో పర్యటించనున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు గంభీరావుపేట మండలం కోళ్లమద్దిలో మల్లికార్జునస్వామి ప్రతిష్ఠ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం కొత్తపల్లి, లింగన్నపేట, మల్లారెడ్డిపేట, జగదాంబతండా, రాచర్లగొల్లపల్లి, ఎల్లారెడ్డిపేట, సిరిసిల్లలో జరిగే శుభకార్యాలకు హాజరుకానున్నారు. హిందూ ఏక్తాయాత్రను విజయవంతం చేయండి ● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి సిరిసిల్ల: కరీంనగర్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ ఈనెల 22న నిర్వహించే హిందూ ఏక్తాయాత్రను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డిబోయిన గోపి కోరారు. సిరిసిల్లలోని బీజేపీ ఆఫీస్లో శనివారం సన్నాహక సమావేశంలో మాట్లాడారు. సిరిసిల్ల పట్టణాధ్యక్షుడు దుమాల శ్రీకాంత్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి, కరీంనగర్ పార్లమెంట్ కో–కన్వీనర్ ఆడెపు రవీందర్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మ్యాన రాంప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షుడు గూడూరు భాస్కర్, జిల్లా అధికార ప్రతినిధి బర్కం నవీన్యాదవ్, మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు వైశాలి ఉన్నారు. వయోవృద్ధుల సమస్యలు పరిష్కరించాలి సిరిసిల్ల: వయోవృద్ధుల సమస్యలను పరిష్కరించాలని జిల్లా సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ ప్రతినిధులు సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లును కోరారు. ఆర్డీవో ఆఫీస్లో శనివారం కలిసి విన్నవించారు. వయోవృద్ధులను వారి కొడుకులు పోషించకుండా.. ఆకలి బాధతో మాడ్చుతున్నారన్నారు. ఇటీవల ఆర్డీవోగా విధుల్లో చేరిన వెంకటేశ్వర్లును సీనియర్ సిటిజెన్స్ సత్కరించారు. అసోసియేషన్ అధ్యక్షుడు చేపూరి బుచ్చయ్య, ప్రధాన కార్యదర్శి జనపాల శంకరయ్య, ఉపాధ్యక్షుడు ఏనుగుల ఎల్లయ్య, రాష్ట్ర ఈసీ మెంబర్ శ్రీగాథ మైసయ్య, కోశాధికారి దొంత దేవదాసు, శ్రీకాంత్ పాల్గొన్నారు. వేములవాడ సబ్కోర్టు ఇన్చార్జి పీపీగా రాజిరెడ్డి వేములవాడ: వేములవాడ సబ్కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా గౌరు రాజి రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ శని వారం ఉత్తర్వులు జారీ చేశా రు. ఆమేరకు ఆయన బాధ్యతలు చేపట్టారు. ఏడాదిపాటు పదవిలో కొనసాగనున్నారు. కరీంనగర్ ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కోర్టు అడిషనల్ పీపీగా విధులు నిర్వహిస్తున్న రాజిరెడ్డిని వేములవాడ ఇన్చార్జీగా నియమించారు. ఇక్కడ గురు, శుక్రవారాల్లో సేవలందిస్తారు. ఉగ్రవాదులను అంతం చేయాలివేములవాడ: మన ఆడబిడ్డల సింధూరాలను తుడిచిన ఉగ్రవాదులను అంతం చేయాలని ఫోజీ ఉమ్మడి కరీంనగర్ అధ్యక్షులు పద్మలత, జిల్లా ఐఎంఏ అధ్యక్షుడు నాగమల్ల శ్రీనివాస్ కోరారు. వేములవాడలో శనివారం తిరంగ్యాత్ర నిర్వహించారు. వైద్యులు స్రవంతి, స్వప్న, చీకోటి సంతోష్, అభినయ్, కోటగిరి మనోహర్, అనిల్కుమార్, తిరుపతి, ఆనందరెడ్డి, మహేందర్, సింధు, నాగేందర్, సుమన్, లహరి, సంతోష్చారి, సంధ్యారాణి, రాజేందర్, లీలాశిరీష, గీతావాణి. త్రిసంధ్య పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రం పరిశీలనఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని అక్కపల్లి ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని డీఆర్డీవో శేషాద్రి శనివారం తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు వివరాలు, ట్యాబ్లో ఎంత వరకు ఎంట్రీ చేశారని ఆరా తీశారు. ఇన్చార్జి డీపీఎం శ్రీనివాస్, ఏపీఎం మల్లేశం, సీసీ రమణ, వీవోఏ రమ తదితరులు ఉన్నారు. -
5 బస్తాలు కోత విధించారు
నేను 8 ఎకరాల్లో వరి సాగు చేసిన. దాదాపు 326 బస్తాల ధాన్యం వచ్చింది. తూకం వేసి రైస్మిల్లుకు పంపిన తర్వాత 5 బస్తాలను కట్ చేశారు. ఇదేమిటని ప్రశ్నిస్తే వెయిట్ లాస్ వచ్చిందని కట్ చేశారని బదులిచ్చారు. నాకు రూ.5వేలు నష్టం వచ్చింది. – మర్రి శంకర్, చందుర్తి వెయిట్ లాస్ వస్తోందని.. తూకం వేసిన తర్వాత రెండు రోజులు లారీలు ఆలస్యంగా వస్తే మిల్లర్లు తూకంలో వెయిట్ లాస్ వస్తోందని కోతలు విధిస్తున్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. రైతులు మాత్రం మేమే ధాన్యం కట్ చేస్తున్నామని దూషిస్తున్నారు. కేంద్రాల నిర్వాహకులకు ధాన్యం కటింగ్కు సంబంధం లేదని చెప్పినా వినిపించుకోవడం లేదు. – రజిత, ఐకేపీ ఏపీఎం, చందుర్తి ● -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
● ముందు జాగ్రత్తలు మేలు ● మంగళ, శుక్రవారాల్లో డ్రైడే నిర్వహించాలి ● కలెక్టర్ సందీప్కుమార్ ఝాసిరిసిల్ల: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా కోరారు. కలెక్టరేట్లో శనివారం అధికారులతో సమీక్షించారు. రా నున్న వానాకాలంలో ప్రతీ గ్రామంలో, ప్రతీ ము న్సిపల్ వార్డుల్లోనూ నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి, నీటి నిల్వను తొలగించాలన్నారు. ప్రతీ మంగళ, శుక్రవారం డ్రై డే నిర్వహించాలని సూచించారు. డ్రెయినేజీల్లో ఆయిల్బాల్స్ వేయించాలన్నారు. లోతట్టు ప్రాంతాలపై శ్రద్ధ జిల్లాలో లోతట్టు ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపాలని, అధికంగా నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరిశుభ్రత, దోమల నివారణకు ప్రజలు తీసుకోవాల్సిన చర్యలపై గ్రామసభలు పెట్టి అవగాహన కల్పించాలన్నారు. అన్ని పీహెచ్సీలలో డెంగీ రాపిడ్ టెస్ట్లు, అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. జిల్లాలో కూలిపోయే స్థితిలో ఉన్న భవనాలను తొలగించాలని ఆదేశించారు. డీఎంహెచ్వో ఎస్.రజిత, డీపీవో షరీఫొద్దీన్, ఎంపీవోలు, పంచాయతీ సెక్రటరీలు, వైద్యాధికారులు పాల్గొన్నారు. -
నిండా ముంచుతున్నారు !
● ఇప్పటికే 530కి పైగా బస్తాల కోత ● రూ.5లక్షలకు పైగా రైతుల సొమ్ము స్వాహా ● ఒక్కో రైతు నుంచి 2 నుంచి 10 బస్తాల వరకు కటింగ్ ● అధికారులే న్యాయం చేయాలంటున్న రైతులుచందుర్తి(వేములవాడ): రైతులను ప్రకృతి ప్రకోపాలు నిండా ముంచడం చూశాం. కానీ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులకు తెలియకుండానే ని లువు దోపిడీ చేస్తున్నారు. అధికారులు, పాలకులు ఒక్కటై అన్నదాతలను ఆగం చేస్తున్నారు. చందుర్తి మండల పరిధిలో ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం నుంచి దాదాపు 530కి పైగానే బస్తాలను కోత పెట్టారు. ఎవరికీ చెప్పుకోవాలో తెలియక అన్నదాతలు లోలోపల కుమిలిపోతున్నారు. రైతులను నిండా ముంచుతున్న వైనంపై ‘సాక్షి’ ఫోకస్. 20 కేంద్రాలు.. రూ.4.95 లక్షలు స్వాహా చందుర్తి మండలంలో ఐకేపీ ఆధ్వర్యంలో 13, సనుగుల సింగిల్విండో ఆధ్వర్యంలో 7 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఐకేపీ ఆధ్వర్యంలోని 13 కేంద్రాల్లో ఇప్పటి వరకు 1.20 లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. అధికారిక లెక్కల ప్రకారం 314 బస్తాలు కోత పెట్టారు. ఐదు రోజుల లెక్కలు అందుబాటులో లేవు. వీటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే మరో 70 బస్తాల వరకు కోత విధించి ఉంటారన్న అంచనా. సనుగుల సింగిల్విండో పరిధిలో 56 వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయగా.. రైతుల నుంచి 225 బస్తాల వరకు కటింగ్ చేశారు. ఐకేపీ, సింగిల్విండోల ద్వారా మొత్తానికి 539 బస్తాలు కోత విధించగా.. వీటి విలువ దాదాపు రూ.4.95 లక్షల వరకు ఉంటుంది. రైతుల ఖాతాల్లో జమకావాల్సిన సొమ్మును రైస్మిల్లర్లు దోచుకోవడంపై అన్నదాతల నుంచి విమర్శలు వె ల్లువెత్తుతున్నాయి. కొనుగోలు కేంద్రాల మూసివేసే వరకు రైతులకు చెందాల్సిన సుమారు రూ.20లక్షల సొమ్ము వరకు రైస్మిల్లర్ల జేబుల్లో చేరుతాయనే ఆరోపణలు రైతులు చేస్తున్నారు. గతంలో తూకంలో బస్తాకు కిలో అదనంగా వేయడంతో ఇలా కోత విధించలేదని.. ఈసారి అదనపు కిలో తూకం లేకపోవడంతో మిల్లర్లు తమ దోపిడీకి ఈ మార్గాన్ని ఎంచుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. మిల్లర్లు చెప్పిందే వేదం రైతుల ధాన్యంలో కోతలు విధిస్తే చట్టరీత్య చర్యలు తీసుకుంటామని అధికారుల హెచ్చరికలు తప్ప చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దీంతో మిల్లర్ల దోపిడీ ఆగడం లేదు. కొనుగోలు కేంద్రాలకు గన్నీసంచులు పంపించగా.. వాటిని రైస్మిల్లర్లు దించుకోకపోవడంతో చాలా కేంద్రాల్లో కొత్త వాటిని పక్కకు పెట్టి పాత గన్నీసంచుల్లో తూకం వేస్తున్నట్లు తెలిసింది. ఇలా పాత గన్నీసంచుల్లోనే తూకం వేస్తేనే మిల్లర్లు ధాన్యాన్ని అన్లోడ్ చేసుకుంటున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. పాత గన్నీ సంచుల్లోనే తూకం వేసుకోవాలన్న మిల్లర్ల ఆలోచన వెనుక వెనుక ఏం ఆంతర్యం తెలియడం లేదు. ఇతను చందుర్తికి చెందిన పోతురాజు మోహన్. 10 ఎకరాల్లో వరి సాగు చేశాడు. చందుర్తిలోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో 904 ధాన్యం బస్తాలను విక్రయించాడు. లారీలో తరలించిన 904 బస్తాల నుంచి 10 బస్తాలను కట్ చేస్తున్నామని నిర్వాహకులు చెప్పగా.. తమ ధాన్యం బస్తాలను వాపస్ తెప్పించి ఇవ్వాలని రైతు మొండికేశాడు. ఎవరికై నా చెప్పుకోమనడంతో చేసేదేమి లేక సైలెంట్ అయ్యాడు. 10 బస్తాల కటింగ్తో 4 క్వింటాళ్ల ధాన్యం డబ్బులు రూ. 10వేల వరకు నష్టం వచ్చిందని వాపోయాడు. చందుర్తి మండలం మర్రిగడ్డకు చెందిన రైతు ఏరెడ్డి శ్రీనివాస్రెడ్డి 626 బస్తాలను 20 రోజుల క్రితం తూకం వేసి అపెరల్ పార్క్కు తరలించారు. అక్కడ వేబ్రిడ్జి కాంటా వేసి అధికారులు 5 బస్తాలను కోత పెట్టారు. ఎవరికీ చెప్పుకున్నా ఎలాంటి లాభం లేకపోవడంతో ఈనెల 14వ తేదీ రాత్రి వివరాలు ఇచ్చి, ఓటీపీ చెప్పాడు. -
ఆమ్చూర్ ఆశలు ఆవిరి
సిరిసిల్ల: మామిడి టంకర(ఆమ్చూర్) వ్యాపారం ఢీలా పడిపోయింది. అకాల వర్షాలు.. ఈదురుగాలులతో ఇప్పటికే చెట్టుపై ఉన్న కాయల్లో పావువంత రాలిపోయాయి. ప్రస్తుతం మార్కెట్లో ఆమ్చూర్కు సరైన ధర లేక మామిడిరైతులు, కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది క్వింటాలుకు రూ.35వేలు ఉండగా.. ప్రస్తుతం రూ.19వేల నుంచి రూ.25వేలు పలుకుతుంది. ఆమ్చూర్ వినియోగం ఇలా మామిడికాయల పొట్టు తీసి, ముక్కలుముక్కలుగా కోసి ఎండలో ఎండబెడతారు. ఇలా ఎండిన ముక్కలను మామిడి టంకర అంటారు. అన్సీజన్లో వంటకాలలో వాడుకుంటారు. జిల్లాలోని పల్లెల్లో ఆమ్చూర్ను తయారుచేసి నిజామాబాద్, హైదరాబాద్, వరంగల్ ప్రాంతాల్లో విక్రయిస్తుంటారు. ఏడాదికో పంట కావడంతో మామిడికాయలను నిల్వ చేసేందుకు శీతల గిడ్డంగులు లేక.. ఆమ్చూర్ చేసి అమ్ముకుంటున్నారు. ఆమ్చూర్కు ఢిల్లీతోపాటు ఉత్తరాది రాష్ట్రాలు, విదేశాల్లో డిమాండ్ ఉంది. మహారాష్ట్ర వ్యాపారులతో స్థానిక వ్యాపారులు ఒప్పందం చేసుకొని ఎగుమతి చేస్తుంటారు. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం సగం ధరనే ఉండడంతో మామిడి రైతులు, కాంట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షాలు.. రాలిన కాయలు జిల్లాలోని ఇల్లంతకుంట, ముస్తాబాద్, కోనరావుపేట, తంగళ్లపల్లి, చందుర్తి, వేములవాడ, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, బోయినపల్లి మండలాల్లో మామిడితోటలు ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి. తోటలను స్థానికులు కాంట్రాక్ట్ తీసుకుని చెట్లకు కాపలా ఉండి కాయలను కాపాడుకున్నారు. మరో పక్షం రోజుల్లో కాయలు చేతికొస్తాయని భావించగా.. అంతలోనే ఈదురుగాలులతో కాయలే రాలిపోయాయి. దీంతో మార్కెట్లో నాణ్యమైన మామిడికాయలకు కొరత ఏర్పడింది. ఈ సీజన్లో ఊరగాయల(తొక్కు)కు మామిడికాయలు పెద్దగా రావడం లేదు. ఉన్న కొద్దిపాట కాయలకు ధర మంచిగానే ఉన్నా మార్కెట్లో ఆమ్చూర్కు ధర లేక మామిడి రైతులు దిగాలు పడుతున్నారు. మామిడి దిగుబడి లేదు.. టంకరకు ధర లేదు అకాల వర్షాలు.. ఈదురుగాలులతో నష్టాలు మామిడి టంకర వ్యాపారం ఢీలాధర నిర్ణయించేది దళారీ ఆమ్చూర్ విక్రయాలకు కరీంనగర్ జిల్లాలో పెద్దగా మార్కెట్ లేదు. పొరుగునే ఉన్న నిజామాబాద్, లేదా హైదరాబాద్లో మార్కెట్ ఉండగా.. మహారాష్ట్ర వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయిస్తున్నారు. గతేడాది క్వింటాల్ ఆమ్చూర్కు రూ.35వేలు పలికింది. ఈ–నామ్ మార్కెట్ ఆధారంగా ఆమ్చూర్కు ధర నిర్ణయించాల్సి ఉండగా.. దళారులు సిండికేట్గా మారి ధర తగ్గించారని రైతులు వాపోతున్నారు. ఆమ్చూర్ ధర కనీసం క్వింటాలుకు రూ.30వేలు ఉంటే గిట్టుబాటవుతుందని మామిడి రైతులు అభిప్రాయపడుతున్నారు. అటు మామిడికాయల దిగుబడి లేక.. ఇటు అకాల వర్షాలతో కాయలు రాలిపోయి.. మరోవైపు మామిడి ఒరుగులకు ధర లేక ఈ ఏడాది తోటలను నమ్ముకున్న రైతులు, కాంట్రాక్టర్ల ఆశలు ఆవిరయ్యాయి. -
కొత్త చట్టాల ప్రకారమే కేసులు
సిరిసిల్లకల్చరల్: నూతన చట్టాల ప్రకారమే కేసులు నమోదు చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ తెలిపారు. డీఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో శనివారం ద్వైమాిషిక పర్యవేక్షణ సమీక్ష నిర్వహించారు. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్, మానిటరింగ్, మెంటరింగ్ కమిటీ సభ్యులు, ప్యా నెల్ న్యాయవాదులతో సమావేశమయ్యారు. కొత్త చట్టాలతో నవీకరించే ప్రక్రియ చేపట్టాలని సూచించారు. అగ్రి లీగల్, ఎయిడ్, పారలీగల్ వలంటీర్లు, లా విద్యార్థుల పనితీ రును ప్రశంసించారు. డీఎల్ఎస్ఏ కార్యదర్శి రాధికా జైస్వాల్, మానిటరింగ్ సభ్యుడు జి.అంజయ్య, లోక్అదాలత్ సభ్యులు చింతోజు భాస్కర్, ఆడెపు వేణు, జి.అంజనేయులు పాల్గొన్నారు. -
సార్..పని ఇవ్వండి
● శ్రమజీవులకు ఉపాధి వెతలు ● భవన నిర్మాణ కూలీలకు పని కరువు ● పెరిగిన ముడిసరుకు ధరలతో ఆగిన నిర్మాణాలు ● లేబర్ అడ్డాపై ఎదురుచూపులే దిక్కు ● పల్లెల్లో ‘ఉపాధి’ లేదు.. పట్నంలో పని కరువు సిరిసిల్లటౌన్: ఒకప్పుడు భవన కార్మికుల ఉపాధికి కల్పతరువైన సిరిసిల్లలో ప్రస్తుతం పనులు దొరకడం లేదు. కార్మికులకు పనులు కల్పించడంలో ప్రభుత్వ విధానాలు, అధికారుల నిర్లక్ష్యంతో శ్రమజీవులకు పనిలేకుండా పస్తులుండే పరిస్థితులు వచ్చాయి. కొందరు దళారులు స్వార్థానికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలకు తక్కువ కూలీ ఇస్తూ పనుల్లోకి తీసుకెళ్తున్నారు. శ్రమకు తగిన ఫలితం దక్కకుండా నిత్యం పనులు దొరక్క భవన నిర్మాణ కార్మికులు ప్రతిరోజు లేబర్అడ్డాపై పని ఇవ్వండి సారూ..అంటూ వచ్చిపోయే వారిని అర్థిస్తున్నారు. పనుల్లేకుండా అవస్థలు ఎదుర్కొంటున్న అడ్డా కూలీల వ్యథపై ప్రత్యేక కథనం. పని కోసం పడిగాపులు శ్రమించే చేతులకు పని లేకుండా పోయింది. పల్లెల్లో వ్యవసాయ పనులు ముగియడం.. ఉపాధి పనిలేకపోవడంతో పల్లెల నుంచి నిత్యం వందలాది సంఖ్యలో కూలీలు పొద్దున్నే సిరిసిల్లకు చేరుకుంటున్నారు. తెల్లవారుజామునే లేచి అన్నం వండుకొని సద్దిమూటలతో ఆటోలు ఎక్కి వచ్చేవారు కొందరైతే.. సైకిళ్లపై మరికొందరు వస్తున్నారు. జిల్లాలోని పదమూడు మండలాల పరిఽధిలోంచి కాకుండా.. కామారెడ్డి, సిద్దిపేట, నిజామాబాద్ జిల్లాల నుంచి కూడా ప్రతిరోజు చాలా మంది కూలీలు వస్తున్నారు. అయితే పల్లెల్లో వ్యవసాయ పనులు ముగియడంతోపాటు ఇటీవల సిమెంటు, సలాక రేట్లు పెరిగిపోయాయి. భవన నిర్మాణాలు చాలా వరకు తగ్గిపోయాయి. ప్రతిరోజు సిరిసిల్ల పట్టణంలోనే సుమారు 3వేల మంది భవన నిర్మాణ పనుల్లో చేరి ఉపాధి పొందేవారు. ఇప్పుడు మందగించిన పనులతో అడ్టాపై కార్మికులకు నాలుగు రోజులకోసాసారి పనులు దొరుకుతున్నాయి. నిత్యం వందలాది మంది కూలీలు పని దొరక్క నిరాశతో ఇంటిదారి పడుతున్నారు. ఉపాధికి ధరాఘాతం గతంలో క్వింటాలు సలాక రూ.5వేలు ఉండగా.. ఇప్పుడు రూ. 6వేలు, సిమెంటు రూ.300 ఉండగా.. ప్రస్తుతం రూ.360, ఇటుక లోడ్ రూ.17 వేలు ఉండేది కాగా ప్రస్తుతం రూ.21వేలకు చేరినట్లు కార్మికులు, భవన నిర్మాణదారులు చెబుతున్నారు. స్థానిక అవసరాలకు ఇసుకను తోడేందుకు అధికారులు నిత్యం అనుమతులు ఇవ్వడం లేదు. ఫలితంగా భవన నిర్మాణ పనులు సరిగ్గా జరగడం లేదు. ఇతర రాష్ట్రాల కూలీలు కూడా రావడంతో సిరిసిల్లలో స్థానికులకు పని దొరకడం లేదు. అడ్డా కూలీల అవస్థలు ఇవీ ● సిరిసిల్ల లేబర్ అడ్డాకు షెడ్డు లేదు. ఫలితంగా కార్మికులు ఎండకు, వానకు ఇబ్బందులు పడుతున్నారు. ● అడ్డాపై కనీసం మరుగుదొడ్డి వసతి లేదు. పనులు దొరకని అవస్థకు తోడుగా ఒంటికి, రెంటికి పోవాలన్నా.. గుక్కెడు నీళ్లు తాగాలన్నా డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది. ● అపార్టుమెంట్లలో పనిచేసే కార్మికులకు సేఫ్టిథింగ్స్ హెల్మెట్స్, గ్లౌజులు ఇవ్వడం లేదు. ● పనికి వచ్చే కార్మికులకు గుర్తింపుకార్డులు అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు కార్మికులు ఆరోపిస్తున్నారు. ● అడ్డాపైన వైద్య, ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం లేదు.పని లేకుంటే ఇబ్బందే.. నేను, నా భార్య లక్ష్మీనర్స వ్వ, కొడుకు అజయ్.. కూలీ పనిచేసుకుని బతుకుతాం. ఊరిలో బయట నుంచి వ చ్చిన కూలీలతో మాకు పనులు దొరుకుతలేవు. నేను ఇంట్లో నుంచి 6 గంటలకు బయలుదేరి సిరిసిల్లకు 7 గంటల వ రకు వస్తా. వారంలో రెండు రోజులే పని దొరుకుతుంది. మిగతా రోజుల్లో ప్రతిరోజు రూ.80 బస్సు కిరాయిలు మీద పడుతున్నాయి. – అల్లెపు సురేష్, గజసింగవరంఇరవై ఏళ్లుగా సిరిసిల్లకు వస్తున్న నేను ఇరవై ఏళ్లుగా సిరిసిల్ల లేబర్ అడ్డాపైకి వస్తున్న. ఏడాది సంది పనులు సరిగా దొరుకుతలేవు. రాను పోను రూ.30 ఖర్చు అవుతాయి. ఇద్దరు ఆడపిల్లలను సాకాలి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కూలీలు తక్కువ పైసలు తీసుకుంటుండ్రని మాకు పనులు ఇస్తలేరు. కమీషన్ ఏజెంట్లు వాళ్ల కోసం ప్రత్యేకంగా అడ్డా పెట్టిండ్రు. దళారుల స్వార్థానికి మాలాంటోళ్లకు పనులు దొరకనివ్వట్లేదు. – గోరిబీ, రాళ్లపేట గుర్రాలగొంది నుంచి వస్తున్న నేను సిద్దిపేట జిల్లా గుర్రాలగొంది నుంచి ఇరువై ఏళ్లుగా ఇక్కడికి వస్తున్న. రానుపోను బస్సు కిరాయిలు రూ.70 పోతయి. ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలతో పోటీ ఎక్కువైంది. మరో దిక్కు స్థానికంగా ఇసుక దొరక్క భవన నిర్మాణాలు తగ్గి మాకు పనులు దొరుకుతలేవు. ఉదయం 5గంటలకు ఇంటి నుంచి వెళ్లిన. పని దొరకకుంటే నిన్న వచ్చిన కూలీ డబ్బులోంచి బస్సు కిరాయి పెట్టుకోవాలి. – ఎ.శివారెడ్డి, గుర్రాలగొంది పనులు తగ్గి.. పోటీ ఎక్కువైంది సిరిసిల్లలో ఇతర రాష్ట్రాల కూలీలతో స్థానిక కూలీలకు పనులు తగ్గి కూలీలకు పోటీ ఎక్కువైంది. మాకు నిత్యం పనులు దొరుకుతలేవు. ఊర్లలో వ్యవసాయ పనుల్లేవు. ఇక భవన నిర్మాణ ముడిసరుకుల ధరలు ఎక్కువైనయి. ఇసుకను రోజు ఇవ్వడం లేదు. ఫలితంగా చాలామటుకు నిర్మాణాల పనులు సరిగ్గా నడవడం లేదు. స్థానిక అవసరాలకు మొరం, ఇసుక రోజు అనుమతించాలి. – కోల శ్రీనివాస్, అడ్డా కూలీల అధ్యక్షుడు సంక్షేమ పథకాలు అందడం లేదు భవన నిర్మాణరంగ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అధికారుల నిర్లక్ష్యంతో అందడం లేదు. లేబర్అడ్డాౖ పె కనీసం నీడ లేదు. ఎండలు, వానలకు నిలబడాలి. బా త్రూమ్కు వెళ్లాలంటే, నీళ్లు తాగాలంటే రూ.5 ఖర్చు చేసుకోవాల్సిన పరి స్థితి. ఇది ఉన్నతాధికారులకు చెప్పినా అడ్డాపై కనీస వసతులు కల్పించడం లేదు. బయట కూలీలు, స్థానిక కూలీలకు ఒకే దగ్గర అడ్డా ఉంచితే అందరికీ పనులు దొరికేలా చూడాలి. – ఎగమంటి ఎల్లారెడ్డి, సీఐటీయూ అధ్యక్షుడు సమాచారం భవన కార్మికులు : 70 వేలు నమోదైన కార్మికులు: 50వేలు సిమెంటు బ్యాగు ధర: రూ.360 సలాక(క్వింటాలుకు): రూ.6వేలు ఇటుక(2వేల పీసులు): రూ.18,500 ఇటుక(బ్రాండెడ్, 2వేల పీసులు): రూ.21వేలు -
రోడ్డు భద్రత నియమాలు పాటించాలి
సిరిసిల్లటౌన్: రోడ్డు భద్రత నియమాలు పాటించా లని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధికా జైస్వాల్ సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్ర భుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్లో శుక్రవారం ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. డ్రైవింగ్ లైసెన్స్, వాహనానికి ఇన్సూరెన్స్ గురించి వివరించారు. మద్యం తాగి డ్రైవింగ్ చేయడం నేరమని, సరైన పత్రాలు లేకుండా డ్రైవింగ్ చేసినా శిక్షార్హమేనన్నారు. లైసెన్సు లేని వారు వెంటనే తీసుకోవాలని సూచించారు. లోక్ అదాలత్ సభ్యులు చింతోజ్ భాస్కర్, ఆడెపు వేణు, గుర్రం ఆంజనేయులు, ఆటోడ్రైవర్ యూనియన్ ప్రెసిడెంట్ కనకం శ్రీనివాస్ పాల్గొన్నారు. లైసెన్సులు తప్పనిసరిగా పొందాలి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధికా జైస్వాల్ ఆటోడ్రైవర్లకు అవగాహన -
సర్వేయర్లతో భూ సమస్యలు పరిష్కారం
● రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చందుర్తి(వేములవాడ): భూభారతి చట్టంలో దరఖాస్తుదారుల సమస్యల పరిష్కారానికి జూన్ 2వ తేదీ తర్వాత మండలానికి ఐదారుగురు సర్వేయర్లు వస్తారని రెవెన్యూ, సమాచార, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. రుద్రంగి మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు హాజరయ్యారు. రుద్రంగిలో 243 ఇందిరమ్మ ఇళ్లు మంజూరుకాగా.. వాటి నిర్మాణానికి భూమిపూజ చేసి మాట్లాడారు. భూ భారతిలో భాగంగా మండలంలో 1,300 దరఖాస్తులు స్వీకరించారని, జూన్ 2 తర్వాత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. భూభారతిలో భూముల రిజిస్ట్రేషన్తోపాటు హద్దులు, సర్వేయర్లు సర్వేచేసిన మ్యాప్లను పాసుబుక్లో ముద్రిస్తారని వివరించారు. రెండు రెవెన్యూ భవనాలకు నిధులు వేములవాడ నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడిన రుద్రంగి, భీమారం మండలాల్లో రెవెన్యూ భ వన నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తామని మంత్రి శ్రీనివాస్రెడ్డి హామీ ఇచ్చారు. వేములవా డ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయ భవనానికి త్వరలో నిధులు మంజూరు చేస్తామన్నారు. ముంపు గ్రామాల బాధితులకు 4,696 ఇళ్లు మంజూరు చేస్తామని, అర్హులు మిగిలితే వారికి కూడా అందజేస్తామన్నారు. ఇందిరమ్మ పథకంలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇచ్చామని.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరిక మేరకు అదనంగా మరో 1,750 ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. ప్రజలు ప్రశంసించేలా అభివృద్ధి : పొన్నం ఈ ప్రాంత సమస్యలు పరిష్కరించి, జిల్లాను ప్రజ లు ప్రశంసించేలా అభివృద్ధి చేసి చూపిస్తామని బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ పేర్కొన్నారు. మహిళలను కోటీశ్వరులను చేయాలని ఆర్టీసీ బస్సులను అందజేస్తున్నట్లు తెలిపారు. వేములవాడ నుంచి మంబయికి త్వరలోనే ఏసీ బస్సును ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. అభివృద్ధి పనులకు నిధులు : సీతక్క ఈ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం నిధులు మంజూరు చేస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. నాగారం చెరువు నుంచి కుక్కలగుట్టతండా వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. మహిళలను కోటీశ్వరులను చేయాలని ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను అందజేస్తుందన్నారు. యూనిఫాంలు, పాఠశాలల బిల్డింగ్ నిర్మాణాలు, ఇందిరాశక్తి క్యాంటీన్లు, ముందుకొచ్చే మహిళా సంఘాలకు రైస్మిల్లలను ఏర్పాటు చేస్తామని వివరించారు. రూ.150కోట్లతో ఆలయాభివృద్ధి : విప్ ఆది నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు శాయశక్తుల కృషి చేస్తున్నానని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజన్న ఆలయ అభివృద్ధి పనులను రూ.150 కోట్లతో త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝా, ఎస్పీ మహేశ్ బీ గీతే, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్, రాష్ట్ర సహకార సంఘం చైర్మన్ తీపీరెడ్డి మోహన్రెడ్డి, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, ఆర్డీవో రాధాబాయి, తహసీల్దార్ శ్రీలత, ఎంపీడీవో నటరాజ్, రుద్రంగి, వేములవాడ, కోనరావుపేట మార్కెట్ కమిటీల చైర్మన్లు చెలుకల తిరుపతి, రొండి రాజు, కచ్చకాయల ఎల్లయ్య పాల్గొన్నారు. -
నిలిచిన మైనర్ వివాహం
● తల్లిదండ్రులకు అధికారుల కౌన్సిలింగ్ ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): గుట్టుచప్పుడు కాకుండా మైనర్ బాలిక వివాహం చేస్తున్నట్లు తె లుసుకున్న అధికారులు అక్కడికి వెళ్లి పెళ్లిని అ డ్డుకున్నారు. మైనర్ వివాహంపై తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అధికారులు తెలిపిన వివరాలు. మండలంలోని నారాయణపూర్లో శుక్రవారం మైనర్ బాలిక(17) వివాహం చేస్తుండగా.. సమాచారం అందడంతో ఐసీడీఎస్, సఖీ కేంద్రం, రెవెన్యూ, పోలీసు అధికారులు చేరుకొని అడ్డుకున్నారు. సీడీపీవో ఉమారాణి, తహసీల్దార్ సుజాత మాట్లాడుతూ.. మైనర్ వివాహాలు చట్టరీత్య నేరమన్నారు. మైనార్టీ తీరిన తర్వాతనే వారి ఇష్టానుసారంగా పెళ్లి చేయాలని తల్లిదండ్రులకు సూచించారు. చైల్డ్లైన్ అధికారులు విజయలక్ష్మి, సూపర్వైజర్ శ్రావణ్, ఆర్ఐ శ్రావణ్కుమార్, లీగల్ ప్రొటెక్షన్ అధికారులు, పోలీసులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి ముస్తాబాద్(సిరిసిల్ల): బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ శ్రేణులకు కరీంనగర్ పార్లమెంట్ కోకన్వీనర్ ఆడెపు రవీందర్ కోరారు. గంభీరావుపేట మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీపై ప్రజలు సానుకూలంగా ఉన్నారన్నారు. ప్రధాని మోదీ దేశ రక్షణ కోసం, ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. దేశంలో సుస్థిరపాలన బీజేపీతోనే సాధ్యమన్నారు. మండల అధ్యక్షుడు కోడె రమేశ్, నాయకులు పాల్గొన్నారు. -
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
● జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత వీర్నపల్లి(సిరిసిల్ల): పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతోనే డెంగీ వ్యాధిని నివారించగలమని జిల్లా వైద్యాధికారి రజిత పేర్కొన్నారు. వీర్నపల్లి మండలకేంద్రంలో శుక్రవారం డెంగీపై అవగాహన కల్పించారు. డీఎంహెచ్వో మాట్లాడుతూ ఇంటి పరిసరాల్లో నీటిని నిల్వ చేసుకోవద్దని సూచించారు. తీవ్రమైన తలనొప్పి, జ్వరం, శరీరంపై దద్దులు, ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు ఉంటే వెంటనే సమీపంలోని ఆస్పత్రిలో సంప్రదించాలని సూచించారు. పనికిరాని పాత్రలు, పాతటైర్లు, పగిలిపోయిన బకెట్లు ఉంటే బయట పడేయాలని సూచించారు. ప్రతీ మంగళ, శుక్రవారాలు డ్రై డేగా పాటించాలన్నారు. అనంతరం గ్రామంలో ర్యాలీ తీసి, గ్రామస్తులకు పలు సూచనలు చేశారు. వైద్యులు అంజలి, ఆల్ఫ్రెడ్, అనిత, రామకృష్ణ, సారియా అంజు, డిప్యూటీ డెమో రాజ్కుమార్, హెచ్ఈవో లింగం, ఎస్యూవో మోహన్, డీడీఎం కార్తీక్ పాల్గొన్నారు. రైతుబజార్లో వసతులు కల్పిస్తాం ● జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్బేగం సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రంలోని రైతుబజార్లో వసతులు కల్పిస్తామని జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్బేగం, ఏఎంసీ చైర్మన్ వెల్ముల స్వరూపరెడ్డి పేర్కొన్నారు. సిరిసిల్లలోని మోడల్ రైతుమార్కెట్ను శుక్రవారం సందర్శించారు. వ్యాపారులు, రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. రైతుబజార్ ఇన్ని రోజులు మున్సిపల్శాఖ నిర్వహణలో ఉండేదని, రెండు రోజుల క్రితమే వ్యవసాయశాఖ నిర్వహణ బాధ్యతలు తీసుకుందని తెలిపారు. రైతుబజార్లో టాయిలెట్స్, తాగునీటి సౌకర్యంపై ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. రైతులకు కేటాయించిన దుకాణాల్లోనే కూరగాయలు విక్రయించుకోవాలని, రోడ్డుపై విక్రయించొద్దని సూచించారు. ఏఎంసీ డైరెక్టర్లు దుబాల వెంకటేశం, ఖాజా, ఆడెపు జగన్ పాల్గొన్నారు. కార్మికులు బెనిఫిట్స్ కోల్పోతున్నారు సిరిసిల్లటౌన్: జిల్లా కార్మికశాఖ అధికారుల నిర్లక్ష్యంతో లేబర్కార్డులు లేక కార్మికులు ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ కోల్పోతున్నారని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కడారి రాములు ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్ల లోని కార్మికభవన్లో శుక్రవారం భవన నిర్మాణ కార్మిక సమస్యలపై మాట్లాడారు. కార్మికులకు ప్రమాదం జరిగితే రూ.10లక్షలు, సహజ మరణానికి రూ.5లక్షలు, డెలివరీకి రూ.50వేలు, పెండ్లికి రూ.లక్ష ఇవ్వాలని కోరారు. హెల్త్ చెకప్ పేరుతో జరుగుతున్న దోపిడీని ఆపాలని కోరారు. నాయకులు అజ్జ వేణు, సంజీవరెడ్డి పాల్గొన్నారు. వర్షానికి కూలిన ఇల్లుముస్తాబాద్(సిరిసిల్ల): మండలంలోని మోహినికుంటలో మూడు రోజులుగా పలుమార్లు కురిసిన వర్షానికి ఓ ఇల్లు కూలిపోయింది. గ్రామానికి చెందిన రైతు మంద అశోక్ పెంకుటిల్లు శుక్రవారం కూలింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని గ్రామస్తులు తెలిపారు. కొద్దిరోజులుగా కురుస్తున్న వానలతో ఇల్లు ఉరుస్తోందని, వాన నీటికి గోడలు తడిసి పడిపోయిందని బాధిత రైతు అశోక్ తెలిపారు. -
ఇల్లాలు.. కన్నీళ్లు
కరీంనగర్క్రైం: పెళ్లి చేసుకొని కోటి ఆశలతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన మహిళలకు మొదట్లో బాగానే ఉన్నప్పటికీ రోజులు గడుస్తున్న కొద్ది రకరకాల రూపాల్లో వేధింపులు ఎదురవుతున్నాయి. అదనపు కట్నం కోసం భర్తతో పాటు అత్త, మామ, ఆడబిడ్డల వేధింపులు పెరుగుతున్నాయి. పోలీసుస్టేషన్లలో పెద్ద ఎత్తున పిటిషన్లు ఈ కారణాలతోనే వస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఆర్థిక పరిస్థితుల పరంగా వెనకబడడంతో మగవారు మద్యం, గంజాయి ఇతర దురలవాట్లకు బానిసవుతున్నారు. దీంతో నిత్యం మద్యం తాగి ఇంట్లో గొడవ పెట్టడం, ఇల్లాలిని తిట్టడం, భౌతిక దాడులకు పాల్పడడం జరుగుతోంది. ఇలాంటి కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. హత్యలు, ఆత్మహత్యలు ● అనుమానం పెనుభూతంగా మారి ఇల్లాలిని హత్య చేయడం వంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. అలాగే, వివిధ రకాల వేధింపులు తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ● ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అనుమానం కారణంగానే హత్యలు, ఆత్మహత్యలకు దారితీస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు మహిళలు ఇంట్లో ఆర్థిక పరిస్థితి చితికిపోవడంతో భవిష్యత్తు జీవితాన్ని ముందుకు తీసుకెళ్లలేమని భయపడి ముందుగానే తనువు చాలిస్తున్నారు. ● బతుకుబండిని మోయలేక వ్యసనాలకు అలవాటుపడి భర్తలు.. ఇంట్లో పరిస్థితులు రోజురోజుకు దిగజారి కనీస అవసరాలను సైతం వివాహితలు పుట్టింటివారికి చెప్పుకోలేక బలవన్మరణానికి పాల్పడిన ఘటనలు అనేకం ఉంటున్నాయి. ● అలాగే మిస్సింగ్ కేసుల్లో కూడా ఎక్కువ శాతం వివాహితలు ఉంటున్నట్లు గణాంకాలను పరిశీలిస్తే అర్థమవుతోంది. ఇంట్లో సమస్యలు భరించలేక, వేధింపులు తట్టుకోలేక ఇళ్ల నుంచి వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది. వేధింపులు ఆగడంలేదు సమాజంలో మహిళలపై వేఽ దింపులు పెరుగుతున్నాయి. అదనపు కట్నం కోసం వివిధ విషయాల వల్ల ఆడవారిపై భర్త, వారి కుటుంబ సభ్యుల గృహహింస కేసులు పెరుగుతుండడం కనిపిస్తుంది. చిన్న విషయాలకే హత్యలు, ఆత్మహత్యల ఘటనలు జరుగుతున్నాయి. ఆడవారి భద్రతకు మరింత కఠిన చట్టాలు అవసరం. – కర్రె పావని, ఆదరణ సేవా సమితి, ఎన్జీవో నిర్వాహకురాలు కౌన్సెలింగ్ ఇస్తున్నాం గృహహింస కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. భర్త, భర్త కుటుంబ సభ్యులు వేధింపులకు గురిచేస్తున్నారని చాలా ఫిర్యాదులు వస్తుంటాయి. మేము సాధ్యమైనంత వరకు కౌన్సెలింగ్ ఇచ్చి జంటలను కలుపుతున్నాము. తీరుమార్చుకోకపోతే కేసులు నమోదు చేసి కోర్టుకు పంపిస్తున్నాం. – శ్రీలత, సీఐ, కరీంనగర్ మహిళా పోలీస్స్టేషన్ -
ప్రాణం తీసిన ఈతసరదా
● ఈతకు వెళ్లి యువకుడి మృతి ఎలిగేడు(పెద్దపల్లి): స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసేందుకు వచ్చిన యువకుడు ముష్కి రాజీవ్గాంధీ(36) ఈత కోసమని వెళ్లి నీటమునిగి చనిపోయాడు. ఈ ఘటన ముప్పిరితోట గ్రామంలో చోటుచేసుకుంది. జూలపల్లి ఎస్సై సనత్ కుమార్ కథనం ప్రకారం.. గోదావరిఖనిలోని జైభీమ్నగర్కు చెందిన ముష్కి రాజీవ్గాంధీ ఈనెల 14న ముప్పిరితోట గ్రామంలో జరిగిన శ్రీవేంకటేశ్వరస్వామి రథోత్సవం, జాతరకు వచ్చాడు. సాయంత్రం వేళ సరదాగా స్నేహితులతో కలిసి వ్యవసాయ బావిలో ఈత కొట్టడానికి వెళ్లాడు. ప్లాస్టిక్ డబ్బా కట్టుకుని బావిలో దిగాడు. ప్రమాదవశాత్తు బావిలో నీట మునిగి మృతి చెందాడు. గురువారం ఉదయం వ్యవసాయ బావి నుంచి మృతదేహాన్ని బయటకు తీసి సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పోస్టుమార్టం చేయించి బంధువులకు అప్పగించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. నీటి సంపులో పడి చిన్నారి మృతివేములవాడ అర్బన్: నీటి సంపులో పడి చిన్నారి మృతి చెందిన సంఘటన వేములవాడ మున్సిపల్ పరిధి తిప్పాపూర్లో గురువారం విషాదం నింపింది. స్థానికులు తెలిపిన వివరాలు. తిప్పాపూర్లో బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి హైదరాబాద్కు చెందిన ఓ కుటుంబం వచ్చింది. నాలుగేళ్ల చిన్నారి జిక్రా ఫాతిమా ప్రమాదవశాత్తు ఇంటి ముందు నీటిసంపులో పడిపోయింది. ఆలస్యంగా గమనించిన కుటుంబ సభ్యులు వేములవాడ ఏరియా ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలోనే మృతిచెందింది. ఈ సంఘటనపై పోలీసులను వివరణ కోరగా.. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. రైలు ఢీకొని యువకుడు..మల్యాల: కొడిమ్యాల మండలం రాంసాగర్కు చెందిన అనుముల శేఖర్ (37) కొండగట్టు సమీపంలో రైలు ఢీకొని మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. వార్డు సభ్యుడిగా పనిచేసిన శేఖర్ ఇటీవల దుబాయ్ వెళ్లి వచ్చాడు. బుధవారం కొండగట్టు సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కన మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మల్యాల సీఐ నీలం రవి, ఎస్సై నరేశ్కుమార్లు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. అయితే ప్రమాదవశాత్తు రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొందా? రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి జైలుజగిత్యాలక్రైం: అతిగా మద్యం సేవించి వాహనం నడిపి పట్టుబడిన వ్యక్తికి న్యాయమూర్తి ఒకరోజు జైలుశిక్ష విధించారు. రాయికల్ మండలం ఉప్పుమడుగు గ్రామానికి చెందిన అల్లెపు వెంకటనర్సయ్య ఇటీవల అతిగా మద్యం సేవించి వాహనం నడుపగా రాయికల్ ఎస్సై సుదీర్రావు పట్టుకుని అతడిపై కేసు నమోదు చేశారు. నిందితుడిని గురువారం స్పెషల్ జ్యూడిషియల్ మెజిస్టేట్ సెకెండ్ క్లాస్ న్యాయమూర్తి కరుణాకర్ ముందు హాజరు పర్చగా ఒకరోజు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. గొర్రె, మేకల దొంగల అరెస్టుమల్యాల: గొర్రెలు, మేకలు ఎత్తుకెళ్లి విక్రయిస్తూ జల్సాలు చేస్తున్న ముగ్గురు దొంగలను పట్టుకొని అరెస్టు చేసినట్లు మల్యాల సీఐ నీలరం రవి, ఎస్సై నరేశ్కుమార్ తెలిపారు. జగిత్యాలకు చెందిన ముద్దవేని అనిల్, మహ్మద్ మోసిన్, వెంకటేశ్లు రాత్రివేళ గ్రామాల్లో మోటారు సైకిల్, ఆటోల్లో తిరుగుతూ షెడ్లలోని గొర్రెలు, మేకలను దొంగిలించి కొన్నింటిని అమ్ముకోగా, మరికొన్నింటిని కోసి మాంసం విక్రయించే వారన్నారు. వచ్చిన డబ్బులను సమానంగా పంచుకొని జల్సాలు చేస్తున్నట్లు తెలిపారు. గురువారం మల్యాల ప్రాథమిక సహకార కేంద్రం వద్ద వాహనాల తనిఖీ చేపట్టగా బైక్, ఆటోలో రెండు మేకలు, రెండు గొర్రెలు తీసుకెళ్తున్న వీరిని అదుపులోకి తీసుకొని విచారించగా వివిధ ప్రాంతాల్లో గొర్రెలు, మేకలు దొంగిలించినట్లు అంగీకరించారన్నారు. బైక్, ఆటో, రెండు మేకలు, రెండు గొర్రెలు స్వాధీనం చేసుకొని ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. -
ప్రతీ జిల్లాలో రైతువిజ్ఞాన కేంద్రం
జగిత్యాలఅగ్రికల్చర్: కృషి విజ్ఞాన కేంద్రాలు, డాట్ సెంటర్లు లేని అన్నిజిల్లాల్లో రైతువిజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ డాక్టర్ జానయ్య తెలిపారు. జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామంలో గురువారం శ్రీరైతు ముంగిట్లో శాస్త్రవేత్తలుశ్రీ కార్యక్రమం నిర్వహించారు. జానయ్య ముఖ్యఅథితిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటికే 17 జిల్లాల్లో డాట్ సెంటర్లు, కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయన్నారు. మిగతా జిల్లాల్లో రైతువిజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఒక్కో కేంద్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రతీజిల్లాలో 50 ఎకరాలు అందుబాటులో ఉన్నచోట రైతువిజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో లేదని, వ్యవసాయాన్ని పండుగలా మార్చేందుకు వ్యవసాయ విశ్వవిద్యాలయం అనేక రైతు కార్యక్రమాలు నిర్వహిస్తోందని అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ మాట్లాడుతూ, వాతావరణ మార్పులతో పంటలపై అనేకరకాల పురుగులు, తెగుళ్లు దాడి చేస్తున్నాయన్నారు. వాటి నివారణకు శాస్త్రవేత్తలు లోతుగా పరిశోధనలు చేయాలని కోరారు. ఆర్ఎంపీల మాదిరిగా గ్రామాల్లో ఫార్మర్స్ క్లినిక్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం తెలంగాణ సీడ్ సంస్థ రూపొందించిన శ్రీమన సంస్థ– మన విత్తనంశ్రీ ప్రచార పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధన స్థానం డైరెక్టర్ శ్రీలత, వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ సైదానాయక్, జిల్లా వ్యవసాయ, ఉద్యానశాఖాధికారులు భాస్కర్, శ్యాంప్రసాద్, రైతు నాయకులు రవీందర్రెడ్డి, నారాయణరెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు. వ్యవసాయ వర్శిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ జానయ్య -
ముగ్గురు యువకులపై కత్తులతో దాడి
● ఒకరి పరిస్థితి విషమం జగిత్యాలక్రైం: పుట్టిన రోజు వేడుకలకు సిద్ధమవుతున్న యువకుడితో పాటు అతని ఇద్దరు స్నేహితులపై కత్తులతో దాడి చేయడంతో ముగ్గురికి తీవ్రగాయాలైన సంఘటన గురువారం లింగంపేట శివారులో చోటు చేసుకుంది. జగిత్యాలరూరల్ మండలం అంతర్గాంకు చెందిన ఏళ్ల అరవింద్ తన జన్మదిన వేడుకల కోసం అంతర్గాం, లింగంపేట శివారులోని గంగమ్మతల్లి ఆలయం వద్ద ఏర్పాట్లు చేసుకున్నాడు. అరవింద్ అతని స్నేహితులు తోపారపు గంగాధర్, ఉయ్యాల వంశీలు ఉండగా ఉండగా అదే గ్రామానికి చెందిన మహేశ్, రాకేశ్, చందు, దినేశ్తో పాటు మరికొంతమంది కత్తులతో దాడి చేసినట్లు బాధితులు తెలిపారు. గంగాధర్కు 23 చోట్ల గాయాలు కాగా, అరవింద్, వంశీలకు స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు వారిని ఆటోలో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా విషయం తెలుసుకున్న సీఐ వేణుగోపాల్, ఎస్సై గీత బాధితుల నుంచి వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు మహేశ్, రాకేశ్, దినేశ్, చందులతో పాటు మరికొంత మందిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై వేణుగోపాల్ తెలిపారు. -
దేశరక్షణలో పల్లె యువత
● సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న జిల్లా బిడ్డలు ● కశ్మీర్లో కాపలాగా ఉన్న యువకులు ● గర్వంగా భావిస్తున్న కుటుంబ సభ్యులు కోనరావుపేట(వేములవాడ)/ఇల్లంతకుంట(మానకొండూర్): దేశరక్షణలో జిల్లా యువత ముందుంటున్నారు. ఉగ్రవాద ముష్కరులను మట్టుబెట్టడంలో మేమున్నామంటూ దేశసరిహద్దుల్లో గస్తీ కాస్తున్నారు. ఇటీవల భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనగా జిల్లాలో ఉద్విగ్న పరిస్థితులు ఏర్పడ్డాయి. భారత సైన్యంలో పనిచేస్తున్న జిల్లాకు చెందిన యువతలో అత్యధికులు జమ్మూకశ్మీర్లోని దేశ సరిహద్దుల్లో పనిచేస్తున్నారు. సరిహద్దుల్లో గస్తీ కాస్తూ రక్షణగా నిలుస్తున్న వారిలో కోనరావుపేట మండలం మామిడిపల్లి నుంచి జవ్వాజి ప్రసాద్, బెదిరె వేణు, కోనరావుపేట నుంచి కస్తూరి ప్రశాంత్రెడ్డి, అజ్జు, ఎగ్లాస్పూర్ నుంచి తాళ్లపెల్లి శ్రీకాంత్, తాళ్లపెల్లి వినోద్, వేములవాడ మండలం చెక్కపల్లి నుంచి మెతుకు మధుకర్రెడ్డి, ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన అంతటి అనిల్ ఉన్నారు. గత కొన్నేళ్లుగా జమ్మూకశ్మీర్, లడక్లో దేశభద్రత విధుల్లో నిమగ్నమై ఉన్నారు. -
టికెట్ బుక్ చేసుకొని.. అక్కడే ఆగిపోయి
ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన ఆర్మీ జవాన్ అంతటి అనిల్ జమ్మూకశ్మీర్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఆ ప్రాంతంలోనే బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్నాడు. గత 8 నెలలుగా జమ్మూసెక్టార్లోనే ఉంటున్నాడు. ఈనెల 7న ఇంటికొచ్చేందుకు టికెట్ బుక్ చేసుకున్నాడు. కానీ 6వ తేదీ నుంచి యుద్ధ సన్నాహాలు మొదలుకావడంతో అక్కడే ఉండిపోయాడు. ఇల్లంతకుంట మండల కేంద్రం నుంచి 11 మంది యువకులు ఆర్మీలో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. అంతటి అనిల్ -
ఎనిమిదేళ్లుగా దేశ సేవలోనే..
నేను గత ఎనిమిదేళ్లుగా దేశ సేవలోనే ఉంటున్నాను. మా నాన్న అంజయ్య మద్దిమల్లలో పనులు చేసుకుంటాడు. తల్లి లక్ష్మి ఇంటి వద్దే ఉంటుంది. నేను ప్రస్తుతం పంజాబ్ సమీపంలోని పటిండ వద్ద విధులు నిర్వర్తిస్తున్నాను. మాకు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో పాక్ బాంబు పడింది. – తాళ్లపల్లి వినోద్, ఎగ్లాస్పూర్ (కోనరావుపేట) దేశ సేవలో.. నా తల్లిదండ్రులు బెదిరె నాంపెల్లి–లక్ష్మి. అమ్మానాన్న గ్రామంలోనే ఉంటూ వ్యవసాయ పనులు చేసుకుంటారు. నేను 2019లో ఆర్మీలో చేరాను. గత ఐదేళ్లుగా ఆర్మీలో పనిచేస్తుండడం సంతోషంగా ఉంది. దేశం కోసం పనిచేయడం గర్వంగా ఉందని వేణు పేర్కొన్నాడు. – బెదిరె వేణు, మామిడిపల్లి (కోనరావుపేట) -
సరస్వతీ నమస్తుతే..
● విశేష పూజలతో పుష్కరాలు ప్రారంభం ● తొలిస్నానం ఆచరించిన శ్రీశ్రీ మాధవనంద సరస్వతిస్వామి ● మొదటిరోజు సుమారు 50 వేల మంది పుణ్యస్నానం కాళేశ్వరం: సరస్వతి నది పుష్కరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో గురువారం ఉదయం 5.44 గంటలకు వేద పండితుల మంత్రోచ్ఛరణలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి పుష్కరాలను ప్రారంభించారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి సరస్వతి ఘాట్లోని త్రివేణి సంగమం, అంతర్వాహిని సరస్వతి నదిలో పుష్కర స్నానాలు ఆచరించారు. కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో క్యూలైన్లో భక్తులు గంటల తరబడి నిల్చొని స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం వరకు భక్తుల రద్దీ నెలకొంది. మొదటి రోజు భక్తుల తాకిడి.. తొలిరోజు ఆర్టీసీ బస్సులతోపాటు ప్రైవేటు వాహనాల్లో వచ్చిన భక్తులు పుష్కర స్నానాలు ఆచరించి ముక్తీశ్వరుడిని దర్శించుకున్నారు. భక్తుల తాకిడితో ఆలయ పరిసరాలు, గోదావరి తీరం కిక్కిరిసింది. పార్కింగ్ స్థలాల్లో వాహనాల రద్దీ నెలకొంది. సుమారు 50 వేల మంది భక్తులు పుష్కర స్నానాలు చేసినట్లు అధికారులు అంచనా వేశారు. హారతి గద్దెలకు ఏడు జీవనదుల పేర్లు సరస్వతి నది పుష్కరాల సందర్బంగా కాశీ పండితులచే నవరత్నమాల హారతి కార్యక్రమం నిర్వహించడానికి చతుర్వేదసరస్వతి ఘాట్ వద్ద ఏడు గద్దెలు నిర్మించారు. దేవాదాయశాఖ అధికారులు ఆ గద్దెలకు ఏడు జీవనధుల పేర్లను ప్రకటించారు. వాటిలో గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, సింధూ, కావేరి పేర్లను శిలాఫలకం రూపంలో తయారు చేసి ప్రదర్శించారు. కాళేశ్వర శాశ్వత అభివృద్ధికి తోడ్పాటు కాళేశ్వర శాశ్వత అభివృద్ధికి తోడ్పాటును అందిస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. మాస్టర్ ప్లాన్ తయారు చేసి నివేదించాలని మంత్రి కొండా సురేఖ, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ను సీఎం కోరారు. పుష్కర ఏర్పాట్లపై సీఎం సంతృప్తి వ్యక్తం చేసి మంత్రి శ్రీధర్బాబు, అధికారులను అభినందించారు. మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ రాబోయే గోదావరి పుష్కరాల్లోగా కాళేశ్వర అభివృద్ధికి రూ.100 కోట్ల నిధుల మంజూరుతోపాటు పర్యాటక క్షేత్రంగా ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్రెడ్డిని కోరారు. ఇప్పటికే రూ.35కోట్లు మంజూరు చేశారని సీఎంకు కృత/్ఞతలు తెలిపారు. దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి సీఎం ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. రానున్న గోదావరి, కృష్ణ ఫుష్కరాలతో పాటు సమ్మక్క–సారలమ్మ జాతరను విజయవంతం చేస్తామని అన్నారు. రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్థిక లోటుపాట్లతో ఉన్నప్పటికి పుష్కర ఏర్పాట్లు ఘనంగా చేశామన్నారు. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పన్నెండేళ్లకు ఓసారి వచ్చే సరస్వతిమాత పుష్కరాలను భక్తులు ఆచరించాలని సూచించారు. -
పారిశుధ్య కార్మికుల భద్రత అందరి బాధ్యత
● డీఆర్డీవో శేషాద్రి సిరిసిల్ల: గ్రామాల్లో పరిశుభ్రత నెలకొల్పడానికి రేయింబవళ్లు శ్రమిస్తున్న పారిశుధ్య కార్మికుల రక్షణ, భద్రత, బాధ్యత అందరిపై ఉందని డీఆర్డీవో శేషాద్రి పేర్కొన్నారు. ‘యూనిసెఫ్ – స్వచ్ఛ భారత్’ సమన్వయంతో పారిశుధ్య కార్మికుల రక్షణ, భద్రత, గౌరవం అనే అంశంపై కలెక్టరేట్లో గురువారం ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ ఇచ్చారు. డీఆర్డీవో శేషాద్రి మాట్లాడుతూ గ్రామాల్లో చెత్త నిర్వహణ, సేంద్రీయ ఎరువుల తయారీ పనులు చేస్తున్న పారిశుధ్య కార్మికులకు పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన పని వాతావరణం ఏర్పాటు చేయాలని యూనిసెఫ్ శిక్షకుడు ఫణీంద్ర తెలిపారు. కార్మికులకు బీమా సౌకర్యం కల్పించాలని, తరచూ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, రక్షణ కవచాలు ఇచ్చి వాడేలా అవగాహన కల్పించాలని సూచించారు. యూనిసెఫ్ సమన్వయకర్త కిషన్ స్వామి, స్వచ్ఛభారత్ శిక్షకుడు రమేశ్, సిరిసిల్ల స్వచ్ఛ భారత్ కో ఆర్డినేటర్ సురేష్ పాల్గొన్నారు. అనంతరం ఉత్తమ సేవలు అందిస్తున్న పలువురు పారిశుధ్య కార్మికులను సన్మానించారు. డీఎల్పీవో నరేశ్, స్వచ్ఛభారత్ మిషన్ కన్సల్టెంట్ ప్రేమ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కులమతాలకు అతీతంగా అభివృద్ధి
ఎల్లారెడ్డిపేట/తంగళ్లపల్లి(సిరిసిల్ల): తమ హయాంలో కులమతాలకు అతీతంగా అభివృద్ధి చేశామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం సింగారం శివారులోని దర్శావలిగుట్టపై గురువారం నిర్వహించిన ఉర్సు ఉత్సవాలకు హాజరై మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో దర్శావలి గుట్టను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ను ఉర్సు ఉత్సవాల నిర్వాహకులు సన్మానించారు. ఉత్సవాల్లో రాష్ట్ర వక్ఫ్బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేని, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, మాజీ జెడ్పీటీసీ చీటి లక్ష్మణ్రావు, నాయకులు అందె సుభాష్ తదితరులు పాల్గొన్నారు. భీరప్పకామరాతి కల్యాణానికి హాజరు తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లిలో నిర్వహించిన భీరప్పకామరతి కల్యాణంలో కేటీఆర్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్తో సెల్ఫీలు దిగేందుకు జనం పోటీపడ్డారు. ● దర్శావలి ఉర్సు ఉత్సవాల్లో మాజీ మంత్రి కేటీఆర్ -
మంత్రుల పర్యటనకు పటిష్ట భద్రత : ఎస్పీ
సిరిసిల్ల ఎడ్యుకేషన్: రుద్రంగి మండలంలో శుక్రవా రం మంత్రుల పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రత చేపడుతున్నట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. తీసుకోవాల్సిన భద్రత చర్యలపై జిల్లా పోలీస్ ఆఫీస్లో గురువారం సమీక్షించారు. వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ మురళీకృష్ణ, డీసీ ఆర్బీ డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు మొగిలి, శ్రీనివాస్, వీరప్రసాద్, వెంకటేశ్వర్లు, మధుకర్, నాగేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ
● బోధనలో మార్పులు అవసరం ● జిల్లా విద్యాధికారి జనార్దన్రావు సిరిసిల్లఎడ్యుకేషన్: మార్పులకు అనుగుణంగా ఉపాధ్యాయులు నూతన విధానంలో బోధన చేయాలని జిల్లా విద్యాధికారి జనార్దన్రావు పేర్కొన్నారు. సిరిసిల్లలో కొనసాగుతున్న శిక్షణ శిబిరాన్ని జిల్లా విద్యాధికారి జనార్దన్రావు, కరీంనగర్ డైట్ కళాశాల బోధకులు, స్టేట్ రిసోర్సు పర్సన్లు సందర్శించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. బోధన మార్పులకనుగుణంగా ఉపాధ్యాయులు శిక్షణలో నేర్చుకున్న అంశాల ద్వారా బోధించాల్సి ఉంటుందన్నారు. శిక్షణలో భాగంగా సాంఘికశాస్త ఉపాధ్యాయులకు మోటివేషన్ తరగతులను శ్రీనివాస్, బోధించారు. కోర్సు కోఆర్డినేటర్ శైలజ, కోర్సు ఇన్చార్జీలు శారద, పద్మ, వెంకటేశ్వర్రావు, జిల్లా సైన్స్ అధికారి దేవయ్య, జిల్లా రిపోర్సు పర్సన్లు తదితరులు పాల్గొన్నారు. -
మౌలిక సదుపాయాలకు పెద్దపీట!
● అదనపు లైన్లు, స్టేషన్ల ఆధునీకరణకు నిధులు ● ఫైనల్ లొకేషన్ సర్వే కోసం నిధులు విడుదల ● కొత్తపల్లి–మనోహరాబాద్కు రూ.205 కోట్లు ● పెద్దపల్లి బైపాస్కు రూ.36 కోట్లు, నిజామాబాద్–పెద్దపల్లికి రూ.13 కోట్లు ● కొలనూరు ఆర్వోబీకి రూ.29 కోట్లు, రాఘవాపురం ఆర్వోబీకి రూ.36 కోట్లు ● ఉమ్మడి జిల్లాకు రూ.435 కోట్లకుపైగా నిధులు ● ఆలస్యంగా దక్షిణ మధ్య రైల్వే పింక్బుక్ సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఎట్టకేలకు దక్షిణమధ్య రైల్వే బడ్జెట్ 2025–26 వెలుగుచూసింది. వాస్తవానికి ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండు లేదా మూడు రోజుల తర్వాత స్థానిక రైల్వే విభాగాల కేటాయింపులను పింక్ బుక్ పేరిట విడుదల చేస్తారు. కానీ..దాదాపు నాలుగు నెలల తరువాత బడ్జెట్ వెలుగుచూడటం ఇదేతొలిసారి. ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల మార్గాల్లో నెలకొన్న ఈ బడ్జెట్లో రైల్వే పనుల కోసం దాదాపు రూ.435 కోట్లకుపైగా నిధులు కేటాయించింది. ఇవే కాకుండా పలు అభివృద్ధి పనులకు మిగిలిన జిల్లాల్లోని స్టేషన్లతోకలిపి మరికొన్ని రూ.కోట్లు కేటాయించడం గమనార్హం. ఈసారి స్టేషన్ల ఆధునీకరణ, స్టేషన్లలో లైప్లైన్ల ఏర్పాటు, గూడ్స్ షెడ్ల నిర్మాణం, స్టేషన్లలో అదనపు మెయిన్ లైన్ల ఏర్పాటుకు ఈ నిధులు కేటాయించింది. కొత్తపల్లి మనోహరాబాద్కు రూ.205 కోట్లు అత్యంత కీలకదశలో ఉన్న కొత్తపల్లి–మనోహరాబాద్ (151 కిమీ) మార్గానికి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.205 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం సిద్దిపేట (సుమారు 77 కిమీ) వరకు లైన్ పూర్తయి సర్వీసు కూడా నడుస్తోంది. సిరిసిల్ల–సిద్ధిపేట మధ్య లైన్పనులు నడుస్తున్నాయి. ఇప్పటికే కరీంనగర్, సిరిసిల్లలో భూసేకరణ వేగంగా సాగుతోంది. 2026 వరకు ట్రాక్ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. మిడ్మానేరులో బ్రిడ్జి పనులు సవాలుగా మారనున్నాయి. ఫలితంగా 2027లో పూర్తి అవుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సర్వేలకు.. ఉమ్మడి జిల్లా పరిధిలోని మూడు లైన్లకు ఫైనల్ లొకేషన్ సర్వేలకు నిధులు కేటాయించింది. కరీంనగర్–హసన్పర్తి రూ.1.55 కోట్లు, పెద్దపల్లి బైపాస్ లైన్ ఎఫ్ఎల్ఎస్ సర్వే రూ.2 లక్షలు, పెద్దపల్లి–నిజామాబాద్ డబ్లింగ్ లైన్ ఎఫ్ఎస్ఎల్ సర్వే కోసం రూ.3.56 కోట్లు ఇచ్చింది. స్టేషన్ల కోసం.. నూకపల్లి– మల్యాల నూకపల్లి మల్యాల హాల్ట్ స్టేషన్ను బ్లాక్ స్టేషన్గా మార్చేందుకు రూ.15.85 కోట్లు కరీంనగర్లో అదనంగా రెండు లూప్లైన్ల నిర్మాణం, రైల్వేస్టేషన్ కోసం రూ.27.50 కోట్లు నిజామాబాద్–పెద్దపల్లి సెక్షన్లో లింగపేట–జగిత్యాల స్టేషన్లోలూప్లైన్ కోసం రూ.19.89 కోట్లు మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి ప్లాట్ఫారాల అభివృద్ధికి రూ.4.54 కోట్లు పెద్దపల్లిలో గూడ్స్ షెడ్ అభివృద్ధి కోసం రూ.9.99 కోట్లు పెద్దపల్లి–నిజామాబాద్ మార్గంలో న్యూ క్రాసింగ్ స్టేషన్ పూడురు (నూకపల్లి మల్యాల–గంగాధర స్టేషన్ మధ్యలో) రూ.23.59 కోట్లు సుల్తానాబాద్–ఎస్టీబీడీ యార్డ్ విస్తరణ, అప్గ్రేడేషన్ కోసం రూ.రూ.36.80 కోట్లు మణుగూరు–రామగుండం (రాఘవాపురం) 200 కి.మీ లైన్కు ఈసారి నామమాత్రపు నిధులు కేటాయించారు. మెయిన్లైన్కు నిజామాబాద్– కరీంనగర్–పెద్దపల్లి లైన్ కోసం రూ.13.86 కోట్లు పెద్దపల్లి బైపాస్ లైన్ (2.169 కిమీ) ను బల్లార్షా కాజీపేట మెయిన్ లైన్కోసం రూ.36.99 కోట్లు రైలు వంతెనల కోసం.. కొలనూరు–పెద్దపల్లి ఆర్వోబీ కోసం రూ.29.33 కోట్లు పెద్దపల్లి–రాఘవాపురం ఆర్వోబీ కోసం రూ.36.83 కోట్లు కొలనూరు–పెద్దపల్లి స్టేషన్ల మధ్య ఆర్యూబీ రూ.7.41 కోట్లు -
వెల్జీపురం రూట్ పరిశీలన
ఇల్లంతకుంట: సిరిసిల్ల నుంచి మండలంలోని వెల్జీపూర్కు ఆర్టీసీ బస్సు నడిపేందుకు డీఎం శ్రీనివాసరావు గురువారం రూట్మ్యాప్ పరిశీలించారు. ఈనెల 7న మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వెల్జీపూర్ రాగా గ్రామస్తుల విన్నవించారు. ఎమ్మెల్యే వెంటనే డీఎంతో మాట్లాడి బస్సు నడిపించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈమేరకు డీఎం గ్రామంలో పర్యటించగా.. మానసాదేవి టెంపుల్ వరకు బస్సు నడపాలని గ్రామస్తులు వినతిపత్రం అందించారు. ఇక్కడి నుంచి దాచారం గ్రామానికి రూట్ పరిశీలనకు డీఎం వెళ్లారు. గుండ వెంకటేశం, ఏఎంసీ డైరెక్టర్ రాంప్రసాద్, బొజ్జ శ్రీనివాస్, బాల్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ పాల్గొన్నారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలి ● డీఎంహెచ్వో రజిత వేములవాడరూరల్: రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత సూచించారు. వేములవాడరూరల్ మండలం హన్మాజిపేట, చందుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కాయకల్ప అసెస్మెంట్ జిల్లా టీంతో కలిసి బుధవారం తనిఖీ చేశారు. ఆస్పత్రి పరిసరాల్లో పరిశుభ్రతతోపాటు రోగులకు అందించే తాగునీరు, మరుగుదొడ్లు, బిల్డింగ్ నాణ్యత ప్రమాణాలను జిల్లా క్వాలిటీ సిబ్బందితో తనిఖీ చేశారు. జిల్లా క్వాలిటీ టీం ఎన్హెచ్ఎం డీపీవో రాజేందర్, క్వాలిటీ మేనేజర్ సింధూజ, వైద్యాధికారులు సురేష్, దివ్యశ్రీ పాల్గొన్నారు. స్కానింగ్ వివరాలు నమోదు చేయాలిసిరిసిల్ల: స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు స్కానింగ్ వివరాలను రికార్డుల్లో నమోదు చేయాలని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత కోరారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్లో గురువారం పీసీపీఎన్డీటీ–యాక్టుపై వైద్యసిబ్బందితో సమీక్షించారు. స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు, రేడియాలజిస్టులు పీసీపీఎన్డీటీ రాష్ట్ర కమిటీ నిర్వహించే తనిఖీలలో ఫారం–ఎఫ్ ఆడిట్, రికార్డులు నిబంధనల మేరకు నిర్వహించాలన్నారు. నిబంధనలు పాటించని సెంట ర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లింగన్నపేట, ఎల్లారెడ్డిపేట, పోత్గల్ పీహెచ్సీల సిబ్బందికి టీకాల ఆన్లైన్ నమోదుపై శిక్షణ ఇచ్చారు. ఫ్యామిలీ ప్లానింగ్ లాజిస్టిక్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఫార్మాసిస్ట్ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చారు. ఎంహెచ్ఎన్ ప్రోగ్రాం ఆఫీసర్ అంజలి ఆల్ఫ్రెండ్, వైద్యులు సంపత్కుమార్, రామకృష్ణ, డిప్యూటీ డెమో రాజ్కుమార్, హెచ్ఈ బాలయ్య ఉన్నారు. అనుమతి లేని విద్యాసంస్థలు మూసేయాలి సిరిసిల్లటౌన్: జిల్లాలో అనుమతి లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని భారత రాష్ట్ర సమితి నాయకులు కంచర్ల రవిగౌడ్ కోరారు. ఈమేరకు గురువారం జిల్లా విద్యాధికారి ఆఫీస్లో వినతిపత్రం అందించి మాట్లాడారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లపై దృష్టి సారించాలని కోరారు. అనుమతులు లేని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరారు. మట్టె శ్రీనివాస్, జగన్, అనిల్, షేక్ అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు. మనం బుక్ ఆఫ్ రికార్డ్స్లో ‘చిటికెన’ సిరిసిల్లకల్చరల్: నిరంతర వ్యాసరచన, కవితలు, కథనాలతో సామాజిక చైతన్యానికి కారకుడయ్యారని జిల్లా కవి చిటికెన కిరణ్కుమార్కు ‘మనం’ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు కల్పించారు. ఈమేరకు మనం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ చక్రవర్తి సంబంధిత సర్టిఫికెట్ను అందజేశారు. -
మంత్రుల పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
రుద్రంగి(వేములవాడ): రుద్రంగిలో శుక్రవారం మంత్రులు పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝా, ఎస్పీ మహేశ్ బీ గీతేలతో ఏర్పాట్లపై స్థానిక గ్రామపంచాయతీలో గురువారం సమీక్షించారు. ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ భాభారతి చట్టం అమలులో భాగంగా జిల్లాలో రుద్రంగిని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినందునా శుక్రవారం నిర్వహించే రెవెన్యూ సదస్సుకు రుద్రంగిలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్గౌడ్ హాజరవుతున్నట్లు తెలిపారు. మండలంలో మంజూరైన 243 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఇళ్ల దరఖాస్తులు పెండింగ్ ఉంటే వెంటనే మంజూరు చేయాలని అధికారులకు ఆదేశించారు. మంత్రుల పర్యటనకు రైతులు, ఇందిరమ్మ లబ్ధిదారులు, మహిళా సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ భూభారతి రెవెన్యూ సదస్సుల నిర్వహణ, ఇందిరమ్మ ఇళ్ల శంకుస్థాపనలో మంత్రులు పాల్గొంటారని తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వి.రాధాబాయ్, రుద్రంగి తహసీల్దార్ శ్రీలత, ఎంపీడీవో నటరాజ్, ఈఈ ఆర్బీ వెంకట రమణయ్య, ప్రాజెక్టు డైరెక్టర్ హౌసింగ్ శంకర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నేడు రుద్రంగిలో పర్యటించనున్న మంత్రుల బృందం -
ఇల్లాలు.. కన్నీళ్లు
● వివాహితలపై వేధింపులు ● ఉమ్మడి జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న గృహహింస కేసులు ● అనుమానమే పెనుభూతమవుతున్న వైనం ● మహిళల హత్యలు, ఆత్మహత్యలు ఉమ్మడి జిల్లాలో 2024–25 ఏప్రిల్ వరకు కేసులు ఇలా..4225580515230073736820659గృహహింసఆత్మహత్యహత్యకరీంనగర్జగిత్యాలపెద్దపల్లిరాజన్న సిరిసిల్ల -
నిద్ర..
● భయపెడుతున్న గుర్గుర్ ● జనాభాలో 10 శాతం మంది బాధితులు ● హార్ట్, బ్రెయిన్ స్ట్రోక్కు కారణమంటున్న డాక్టర్లు ● ప్రారంభంలో చికిత్స చేస్తే ఫలితమంటున్న నిపుణులుగురక..గుండెపోటు!వీరు జ్యోతి, క్రాంతి దంపతులు. వీరికి తొమ్మిదేళ్ల కిందట పెళ్లి కాగా, ఇద్దరు పిల్లలు. జ్యోతి బీడీ కార్మికురాలు, క్రాంతి కాంట్రాక్టు కార్మికుడు. రేషన్కార్డు కోసం ఎనిమిదేళ్లుగా నిరీక్షిస్తున్నారు. ఇటీవల మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం 369360193430 నంబర్తో కొత్త రేషన్కార్డు జారీ చేసింది. కార్డు వచ్చిందనే సంతోషంలో రేషన్ షాపునకు వెళ్తే కొత్త కార్డులకు ఇంకా బియ్యం రాలేదని డీలర్ చెప్పడంతో నిరాశతో ఇంటిబాట పట్టారు. ఇలాంటి వారు జిల్లాలో 22,114 మంది పేదలు ఉన్నారు. వీరంతా రేషన్బియ్యం కోసం ఎదురుచూస్తున్నారు. -
అర్బన్ ఫారెస్ట్ బాగుంది
● జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి, జడ్జి రాధిక జైస్వాల్ ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అర్బన్ ఫారెస్ట్ పార్క్ చాలా బాగుందని, ప్రకృతిసిద్ధంగా పెరిగిన చెట్లు, సెలయేళ్లు చూడముచ్చటగా ఉన్నాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి రాధిక జైస్వాల్ పేర్కొన్నారు. పార్క్ను బుధవారం సందర్శించిన సందర్భంగా మాట్లాడారు. పండ్లు, మోదుగుచెట్లు పెంచడం ద్వారా గిరిజనులకు ఉపాధి అవకాశాలు మెరుపడతాయన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు జీవవైవిద్యాన్ని కాపాడవచ్చని పేర్కొన్నారు. గిరిజనులకు అటవీహక్కుల చట్టా లను తెలియజేయడంతోపాటు వారికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కేంద్రంలో లభించే ఉచిత న్యాయ సదుపాయాన్ని వినియోగించుకునేలా అటవీ శాఖ అధికారులు కృషి చేయాలని కోరారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వి.శ్రీహరిప్రసాద్ అర్బన్ ఫారెస్ట్ పార్కులోని సదుపాయాల గురించి వివరించారు. లోక్ అదాలత్ మెంబర్లు చింతోజు భాస్కర్, ఆడెపు వేణు, గుర్రం ఆంజనేయులు పాల్గొన్నారు. ఫిర్యాదులపై వేగంగా స్పందించాలి● ఎస్పీ మహేశ్ బీ గీతే బోయినపల్లి(చొప్పదండి): ఫిర్యాదులపై వేగంగా స్పందించి, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ మహేశ్ బీ గీతే ఆదేశించారు. స్థానిక పోలీస్స్టేషన్ను బుధవారం సందర్శించారు. పోలీస్స్టేషన్లో 5–ఎస్ అమలు తీరు తెలుసుకున్నారు. కేసుల వివరాలు, పెండింగ్ ఫైల్స్, రికార్డ్ గది పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ రౌడీషీటర్లపై నిఘా పెట్టాలని సూచించారు. పోలీస్స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్పై దృష్టి సారించాలన్నారు. తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించాలని తెలిపారు. వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్, పీఎస్సై అనిల్కుమార్, ఏఎస్సై మోతీరామ్ తదితరులు ఉన్నారు. నీటి యాజమాన్య పద్ధతులు పాటించాలి ఇల్లంతకుంట(మానకొండూర్): యూరియా తక్కువ మోతాదులో వాడుతూ సమగ్ర నీటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే పంటల్లో అధిక దిగుబడి పొందవచ్చని జిల్లా ఉద్యానశాఖ అధికారి లత పేర్కొన్నారు. మండలంలోని పెద్దలింగాపూర్ రైతువేదికలో బుధవారం రైతుముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఆయిల్పామ్ సాగు యాజమాన్య పద్ధతులు, కూరగాయలు, పూలసాగుపై అవగాహన కల్పించారు. మండల వ్యవసాయాధికారి సురేశ్రెడ్డి, ఏఈవోలు జ్యోతి, అర్చన, రవళి, లలిత, గంగ పాల్గొన్నారు. హిందూ ఏక్తాయాత్రను విజయవంతం చేయండి సిరిసిల్ల: కరీంనగర్లో ఈనెల 22న నిర్వహించే హిందూ ఏక్తాయాత్రను విజయవంతం చేయాలని బీజేపీ సిరిసిల్ల పట్టణాధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ కోరారు. సిరిసిల్ల పట్టణ శివారులోని రగుడులో బుధవారం స్థానిక హనుమాన్ ఆలయంలో పూజలు చేసి, హిందూ ఏక్తాయాత్ర పోస్టర్లను ఆవిష్కరించారు. శ్రీకాంత్ మాట్లాడుతూ కరీంనగర్లో నిర్వహించే హిందూ ఏక్తాయాత్రలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ పాల్గొంటారని తెలిపారు. బీజేపీ నాయకులు బూర విష్ణు, అంబేడ్కర్ సంఘం అధ్యక్షుడు మాస బాలయ్య, మాస వంశీకృష్ణ, ఏశ సాయిదీప్, పోతుల సాయిచరణ్, బూర దేవరాజు, వంగ కృష్ణ, బూర కొమురయ్య, నర్సయ్య, శశిధర్ పాల్గొన్నారు. -
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు సజావుగా నిర్వహించాలి
సిరిసిల్ల: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు సజావుగా, పకడ్బందీ నిర్వహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం పరీక్షల నిర్వహణపై సమీక్షించారు. పరీక్ష కేంద్రాలను శుభ్రం చేయించాలని, తాగునీటి వసతి కల్పించాలని, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించారు. వైద్యసిబ్బ ంది వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉండాలని, పరీక్షలు నిర్వహించే రోజుల్లో ఆర్టీసీ బస్లను సమయానుకూలంగా నడిపించాలన్నారు. చీఫ్ సూపరింటెండెంట్ గదిలో సీసీ కెమెరాలు ఉండాలని తెలిపారు.144 సెక్షన్ అమలుపరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. 22 నుంచి జరిగే పరీక్షలకు 13 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఫస్టియర్లో 2,385, సెకండియర్లో 1,478 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావద్దని అధికారులు సూచించారు. అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, ఎస్బీ డీఎస్పీ మురళి, డీఈఐవో శ్రీనివాస్, డీఎంహెచ్వో రజిత, ఆర్టీసీ డీఎం ప్రకాశ్రావు పాల్గొన్నారు.జిల్లాలో సాండ్ ట్యాక్స్ అమలుసిరిసిల్ల: జిల్లాలో సాండ్ ట్యాక్స్ ద్వారా ఇసుక రవాణాకు అనుమతి ఇవ్వనున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రకటనలో తెలిపారు. ఇసుక రవాణాను ఆన్లైన్ చేయనున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని ట్రాక్టర్ యజమానులు అందరూ తమ వాహనాల లైసెన్స్, ఇతర అన్ని పత్రాలు, డ్రైవర్ వివరాలు, డ్రైవింగ్ లైసెన్సు పత్రాలను కలెక్టరేట్లో వారంలోగా అందించి నమోదు చేసుకోవాలని కోరారు. ట్రాక్టర్ యజమానులు జిల్లా కలెక్టర్ పేరిట రూ.10వేల డీడీ తీయాలని తెలిపారు. అనుమతి పొందిన సాండ్ రీచ్ల నుంచి మాత్రమే ఇసుక రవాణా చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలిరుద్రంగి(వేములవాడ): భూ భారతిలో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా కోరారు. రుద్రంగి మండల పరిధిలోని దెగావత్తండా గ్రామంలో దరఖాస్తులు స్వీకరించారు. గైదిగుట్టతండాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ గ్రామం పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపికవగా.. 44 ఇళ్లు మంజూరయ్యాయి. 23 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. ఎంపీడీవో నటరాజ్, ఎంపీఓ సుధాకర్, రెవెన్యూ అధికారులు షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. -
కేంద్రాల్లోనే మొలకెత్తుతున్నాయి
కోనరావుపేట/ఇల్లంతకుంట: రైతులను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. పంటల సాగు సమయంలో సరిగ్గా నీరు అందక సగానికి పైగా పంటలు ఎండిపోగా.. ధాన్యం కోసిన తర్వాత సకాలంలో తూకం వేయక అకాల వర్షాలకు తడిసి ముద్దవుతున్నాయి. కోనరావుపేట, ఇల్లంతకుంట మండలాల్లో బుధవారం కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసింది. వట్టిమల్ల లో వడ్లు మొలకెత్తాయి. ఇల్లంతకుంట మండలం దాచారం, సిరికొండ, పెద్దలింగాపురం, తాళ్లపల్లి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. దాచారం, పెద్దలింగాపూర్ గ్రామాల్లో వెయ్యి బస్తాల వరకు తడిసిపోయిందని ఐకేపీ ఏపీఎం కట్ట వాణిశ్రీ తెలిపారు. -
సామాన్యులు సాధించారు
దేశ సరిహద్దుల్లో నుంచి ప్రజాక్షేత్రంలోకి.. ముస్తాబాద్ పీఎస్సైగా విధుల్లో చేరిన బాలెంకి శ్రీనివాస్ 17 ఏళ్లు ఆర్మీలో హవల్దార్గా చేశారు. శ్రీనివాస్ది సాధారణ రైతుకుటుంబం. మానకొండూరు మండలం ముంజంపల్లికి చెందిన బాలెంకి ఆశలు, రాజేశ్వరీ దంపతుల కుమారుడు శ్రీనివాస్ విద్యాభ్యాసం ప్రభుత్వ పాఠశాలలోనే సాగింది. డిగ్రీ ఫైనలియర్లోనే ఆర్మీకి ఎంపికై కశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, పుణేతోపాటు భూటాన్ దేశంలో పనిచేశారు. 17 ఏళ్లపాటు ఆర్మీలో విధలు నిర్వర్తించి, 2022లో రిటైర్మెంట్ తీసుకున్నారు. అనంతరం కష్టపడి చదివి ఎస్సై ఉద్యోగానికి ఎంపికయ్యారు.నాన్న కష్టాలను చూసి.. మానకొండూరు మండలం రంగపేటకు చెందిన సత్యనారాయణరెడ్డి, వనజ దంపతుల కుమార్తె వినీతారెడ్డి. ఇంటర్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకర్గా నిలిచిన వినీతారెడ్డి కోటి ఉమెన్స్ కాలేజీలో బీకామ్ కంప్యూటర్స్ చది వారు. నాన్న పడ్డ కష్టానికి ప్రతిఫలం సాధించాలనే తపనతో చదివి ఎస్సైగా ఎంపికయ్యారు. తంగళ్లపల్లిలో ప్రొబేషనరీ ఎస్సైగా విధుల్లో చేరారు. షీటీమ్, డయల్ 100, సైబర్ నేరాలపై మహిళలను చైతన్యం చేస్తున్నారు. వినీతారెడ్డి వివాహం తన బ్యాచ్మేట్, కోనరావుపేట ప్రొబేషనరీ ఎస్సై రాహుల్రెడ్డితో ఇటీవల జరిగింది. నేతకార్మికులు ఉండే ప్రాంతం కావడం.. చిన్న కారణాలతో ప్రాణాలు తీసుకుంటుండడం ఆమెను కలచివేసింది. నేతన్న కుటుంబాల్లో మనోధైర్యం నింపే ప్రయత్నాలు చేస్తున్నారు. -
కార్డులొచ్చాయ్.. కోటా రాలే !
● కొత్త కార్డుదారులకు అందని బియ్యం ● 15వ తేదీ దాటుతున్నా పల్లెలకు రాని రేషన్ ● తెరుచుకోని రేషన్ దుకాణాలు ● ఆందోళనలో నిరుపేదలు ● సన్నబియ్యం కోసం ఎదురుచూపులు సిరిసిల్ల: ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్కార్డులు వచ్చినా సంబురం లేదు. ఈ కార్డులకు బియ్యం కోటా రాకపోవడంతో కొత్త లబ్ధిదారులు నిరాశ చెందుతున్నారు. ఇప్పటికే రేషన్ కార్డులు ఉండి.. ఆయా కార్డుల్లో కొత్తగా పేర్లు నమోదు చేసుకున్న వారికి మాత్రం బియ్యం కోటా మంజూరైంది. మూడేళ్లు దాటిన పిల్లలకూ ఆరు కిలోల చొప్పున బియ్యం మంజూరైంది. రేషన్ కార్డు ఉండీ.. మార్పులు, చేర్పులు చేసుకున్న వారికి బియ్యం కోటా మంజూరుకాగా.. కొత్త రేషన్కార్డులకు కోటా పెరగలేదు. అయితే ఇదే సమయంలో జిల్లాలో చాలా పల్లెల్లో ఈనెల రేషన్బియ్యం పంపిణీ చేయలేదు. స్మార్ట్ కార్డుల జారీ గతంలో రేషన్ కార్డులు ఉండగా.. వాటి స్థానంలో ఆహార భద్రత కార్డులుగా ప్రభుత్వం పేరు మార్చింది. ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులను స్మార్ట్ కార్డులు గా జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నే పథ్యంలో డిజిటల్ స్మార్ట్ కార్డులు రానున్నాయి. ప్ర స్తుతం ఆన్లైన్లో ఆహార భద్రత కార్డులను జిరాక్స్లు చేయించుకుని బియ్యం పొందుతున్నారు. పని ఒత్తిడిలో యంత్రాంగం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పథకాలకు సంబంధించిన క్షేత్రస్థాయి సర్వేలు ఏకకాలంలో నిర్వహించాల్సి రావడంతో అధికారులు ఒత్తిడికి గురవుతున్నారు. రేషన్కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువవికాసం లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి అర్హులను గుర్తించే పనిలో ఉన్నారు. మూడు పథకాలు ముఖ్యమైనవి కావడంతో సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ అధికారులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇటీవల ఓ గ్రామపంచాయతీ కార్యదర్శి పని ఒత్తిడి, రాజకీయ ఒత్తిళ్లలో పనిచేయలేక పోతున్నానని విధులను వదిలేసి వెళ్లారు. క్షేత్రస్థాయి సర్వేల్లో సమస్యలు ఎదురవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. సర్వే జాప్యం జిల్లా వ్యాప్తంగా మీసేవ కేంద్రాల ద్వారా నేరుగా వచ్చిన దరఖాస్తులు ఆయా మండలాల తహసీల్దార్ల లాగిన్కు వెళ్లాయి. ఆ దరఖాస్తుదారులు అర్హులా.. అనర్హులా అని తేల్చే సర్వేల్లో జాప్యమవుతుంది. ఫలితంగా రేషన్కార్డుల జారీ ప్రక్రియ ఆలస్యమవుతోంది. 2025 జనవరి నాటికి 9,731 మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల ప్రభుత్వం మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వగా.. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా 22,114 మంది దరఖాస్తు చేశారు. దీనిలో ఎన్ని దరఖాస్తులు సర్వే పూర్తయింది.. ఎన్ని పెండింగ్లో ఉన్నాయో ఆన్లైన్లో చూపడం లేదు. జిల్లా వ్యాప్తంగా 1,922 ఉన్నట్లు డీఎస్వో లాగిన్లో చూపిస్తుంది. కానీ సర్వే స్థాయిలోనే చాలా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. మార్పులు, చేర్పులకు సంబంధించి మరో 20,606 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. -
అభివృద్ధి చేస్తే అడ్డుతగులుతారా ?
● రాజన్న ఆలయంపై రాజకీయం చేయొద్దు ● అభివృద్ధికి సహకరించాలి ● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ: గత ప్రభుత్వాల హయాంలో అభివృద్ధికి నోచుకోని వేములవాడ రాజన్న ఆలయం, పట్టణాన్ని రూ.76కోట్లతో అభివృద్ధి చేస్తామంటే బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు అడ్డు తగులుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. అభివృద్ధిని జీర్ణించుకోలేకనే రెండు పార్టీలు వేములవాడ బంద్కు పిలుపునిచ్చి రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. వేములవాడలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, అనువంశిక అర్చకులు, స్థానికులు, ప్రముఖుల సలహాలతో శృంగేరి పీఠాధిపతుల అనుమతులతో పనులు చేపడతామని స్పష్టం చేశారు. మూలవిరాట్టు, తదితర విగ్రహాలను టచ్ చేయకుండానే ఆలయాన్ని విస్తరిస్తామని చెబుతున్నా.. ప్రతిపక్షాలు ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మాజీ సీఎం ప్రగల్భాలు పలికారే తప్ప ఆలయాభివృద్ధికి రూపాయి ఇవ్వలేదన్నారు. బీజేపీ నాయకులు పదిహేనేళ్లుగా అధికారంలో ఉన్నా ఎలాంటి నిధులు తీసుకుని రాలేదని గుర్తు చేశారు. ఆలయాన్ని మూసివేయబోమని స్పష్టం చేశారు. ఆలయ నిర్మాణం పనులు కొనసాగే సమయంలో మాత్రమే భీమన్న ఆలయంలో దర్శనావకాశాలు కల్పిస్తామని తెలిపారు. -
కానిస్టేబుల్ నుంచి ఎస్సైగా..
హుజూరాబాద్ మండలం రాంపూర్కు చెందిన వేముల లక్ష్మణ్ తల్లి అరుణ కూలీ పని చేస్తుండగా, తండ్రి సోడాలు విక్రయిస్తుంటాడు. ఇంటర్ వరకు చదివిన లక్ష్మణ్ 2018లో కానిస్టేబుల్గా ఎంపికయ్యారు. కరీంనగర్, సిరిసిల్లలో విధులు నిర్వర్తిస్తూనే ఓపెన్ డిగ్రీ పూర్తి చేశారు. సిరిసిల్లలో మూడేళ్ల క్రితం పీసీగా పనిచేసిన లక్ష్మణ్ అదే స్టేషన్లో ట్రెయినీ ఎస్సైగా వచ్చారు. ప్రస్తుతం ఎల్లారెడ్డిపేట పీఎస్సైగా పనిచేస్తున్నారు. కూలీ పనులు చేసుకునే కుటుంబం నుంచి కానిస్టేబుల్గా, ఎస్సైగా ఎదిగిన లక్ష్మణ్ నేటి యువతకు స్ఫూర్తికి నిలుస్తున్నారు. లక్ష్మణ్ కవల సోదరుడైన రామ్ మిషన్ భగీరథలో ఏఈఈ, మరో సోదరుడు ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నారు. -
ఎందుకురా నీ బతుకు చావరాదు..! అని తిట్టడంతో
తంగళ్లపల్లి(సిరిసిల్ల): కులపెద్దలు చేసిన పంచాయితీ ఒకరి నిండు ప్రాణాన్ని తీసింది. పంచాయితీలో బూతులు తిట్టడంతో అవమాన భారంగా భావించిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన కడమంచి స్వామి(34) ఇంట్లో లేనప్పుడు అ తని భార్యపై అదే గ్రామానికి చెందిన టేకు ప్రేమ్కుమార్ లైంగికదాడికి యత్నించాడు. స్వామికి ఈ విషయం తెలియడంతో ప్రేమ్కుమార్ను నిలదీశా డు.మూడు రోజుల క్రితం కులపెద్దలు పంచాయితీ పెట్టి ప్రేమ్కుమార్కు జరిమానా విధించారు. దీంతో కోపోద్రిక్తుడైన ప్రేమ్కుమార్ స్వామిని అందరిముందే బూతులు తిట్టాడు. అంతేకాకుండా చావమని తిట్టడంతో అవమానంగా భావించిన స్వామి మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. మృతుని భార్య ఫిర్యాదుతో ప్రేమ్కుమార్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ట్రెయినీ ఎస్సై కె.వినీతారెడ్డి తెలిపారు. అయితే గ్రామానికి చెందిన కొందరు పెద్దమనుషులతోపాటు కొందరు విలేకరులు కలిసి ఈ పంచాయితీ నిర్వహించినట్లు తెలిసింది. వీరిద్దరి నుంచి రూ.4లక్షల చొప్పున మొత్తం రూ.8లక్షలు పంచాయితీ దరావతుగా తీసుకోవడంతోపాటు ఆ మొత్తం కూడా ఖర్చు అయినట్లు తెలిపారనే చర్చ సాగుతోంది. -
నీటి ఎద్దడి అధిగమించాం
● అన్ని వార్డులకు నిర్ణీత సమయంలో సరఫరా ● అవసరమైన ఏరియాల్లో ట్యాంకర్లతో అందిస్తున్నాం ● వేసవిలో ప్ర‘జల’ ఇబ్బందులు తీరుస్తున్నాం ● వచ్చే ఏడాదిలో విలీన గ్రామాల్లోనూ మిషన్ భగీరథ నీరు ● ఇంటర్వ్యూలో మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ వాణిసిరిసిల్లటౌన్: పక్కా ప్రణాళికతో సిరిసిల్లలో తా గునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని మున్సిపల్ ఇన్చార్జి కమిషన ర్ పోసు వాణి తెలిపారు. ప్రస్తుతం ఉన్న డిమాండ్కు తగ్గట్టుగా నల్లాల ద్వారా నీటి సరఫరా జరుగుతోందన్నారు. మున్సిపల్ పరిధిలోని అన్ని వా ర్డుల్లో తాగునీటి సరఫరా, ఇబ్బందులపై ‘సాక్షి’ ఇంటర్వ్యూలో పలు వివరాలు వెల్లడించారు. 39 వార్డుల్లో నిత్యం నీటి సరఫరా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 39 వార్డుల్లో ని త్యం తాగునీటి సరఫరా చేస్తున్నాం. వేసవి ఆరంభంలో కొన్ని ఏరియాల నుంచి వచ్చిన ఫిర్యాదు ల మేరకు చర్యలు తీసుకున్నాం. ఆయా ఏరియాల్లో తాగునీటి సమస్య పరిష్కరించాం. అన్ని వార్డులకు ప్రత్యేకంగా అధికారులు ఉన్నారు. 13 మంది లైన్మెన్లు, ఇద్దరు బోర్వెల్ మెకానిక్స్, 9 మంది లీకేజీ రిపేరర్స్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఫిర్యాదులు పరిష్కరిస్తున్నాం వేసవిలో నీటి కొరత రాకుండా ప్రత్యేకంగా కంట్రోల్రూమ్ ఏర్పాటు చేశాం. 78935 93308లో ఇప్పటి వరకు ఎనిమిది ఫిర్యాదులు రాగా వెంటనే పరిష్కరించాం. ఫిర్యాదుల్లో ఎక్కువగా నల్లా కనెక్షన్లు కావాలని కోరారు. మిషన్ భగీరథ ద్వారా నిత్యం 9 మిలియన్ లీటర్లు సరఫరా చేస్తున్నాం. మున్సిపల్ ఫిల్టర్ బెడ్, ట్యాంకర్లు, పవర్బోర్ల ద్వారా 8.6 ఎం.ఎల్.డీ(మిలియన్ లీటర్స్ పర్ డే) నీటిని అందిస్తున్నాం. 39 వార్డులు.. 13 జోన్లు సిరిసిల్ల, విలీన గ్రామాలు కలిపి 39 వార్డులను 13 జోన్లుగా విభజించి నీటి సరఫరా చేపడుతున్నాం. ఉదయం 3.30 నుంచి 6 గంటల వరకు ఎనిమిది జోన్లకు, మధ్యాహ్నం 3.30 నుంచి సా యంత్రం 6.30 గంటల వరకు ఐదు జోన్లకు నీటి సరఫరా చేస్తున్నాం. ప్రస్తుతం 1.10లక్షల మంది కి నీటి సరఫరా ఉంది. రాబోయే ఏడాది తర్వాత 1.40లక్షల మందికి 24 ఎంఎల్డీ లీటర్ల నీటిని సరఫరా చేసే దిశగా పనులు చేపడుతున్నాం. విలీన గ్రామాల్లో నీటి ఎద్దడి నివారణ విలీన గ్రామాల్లో మిషన్ భగీరథ పైపులైన్ ద్వారా చే పడుతున్నాం. మిషన్ భగీరథ పైపులైన్ లేని చో ట్ల లో ‘అమృత్ 2.0’ పథకంలో భాగంగా మరో 40 కి లోమీటర్ల పైపులైన్ నిర్మాణం జరుగుతుంది. రూ. 100కోట్ల అభివృద్ధి పనుల్లో భాగంగా తాగునీటి స రఫరాకు కొన్ని నిధులు కేటాయించగా పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాదిలోగా సిరిసిల్లలో విలీనమై న గ్రామాలతోపాటు అన్ని వార్డుల్లో నూరుశా తం తా గునీటి పైపులైన్ ద్వారా నీటి సరఫరా చేపడతాం. 4 ట్యాంకర్లతో సరఫరా సిరిసిల్ల పట్టణంలో మిషన్ భగీరథ, మున్సిపల్ ఫిల్టర్బెడ్ ద్వారా తాగునీటి సరఫరా జరుగుతోంది. పట్టణ జనాభా 1.10లక్షల మందికి 17.6 ఎంఎల్డీ నీటిని సరఫరా చేస్తున్నాం. నీటి సరఫరా కాని ప్రాంతాలకు నాలుగు మున్సిపల్ ట్యాంకర్ల ద్వారా నీటిని అందజేస్తున్నాం. అన్ని వార్డుల్లో మొత్తంగా 450 పవర్బోర్ల ద్వారా స్థానికులు నీటిని వినియోగిస్తున్నారు. వాటిలో 11 రిపేర్లు చేయిస్తున్నాం. మిగతా 439 పవర్బోర్లు ద్వారా ప్రజలు నిరంతరం నీటిని వినియోగించుకుంటున్నారు. నీటిని వృథా చేయొద్దు చాలా మంది నల్లాలకు బిరడాలు బిగించడం లే దు. ఫలితంగా నల్లా నీటిని వాడుకోని వారి ఇళ్లలో నుంచి నీరు వృథాగా పోతుందన్న ఫిర్యాదులు ఉన్నా యి. నల్లా నీరు వృథా పోకుండా పౌరులంతా బా ధ్యతగా ఉండాలి. ఎవరికై నా నీటి సరఫరాలో సమ స్య ఉంటే వెంటనే ఆఫీసులో ఏ ర్పాటు చేసిన కంట్రోల్రూమ్కు ఫోన్ చేస్తే సత్వరమే పరిష్కరిస్తాం. లీకేజీ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా టీమ్ను ఏర్పాటు చేశాం. సిరిసిల్ల మున్సిపల్ వివరాలు జనాభా : 1,10,00రోజూ నీటి సరఫరా : 16,500 మిలియన్ లీటర్లు డిమాండ్ : 17.6 ఎంఎల్డీలు -
సజావుగా పాలీసెట్ ప్రవేశ పరీక్ష
సిరిసిల్ల ఎడ్యుకేషన్/తంగళ్లపల్లి: జిల్లాలో పాలీసెట్ ప్రవేశ పరీక్ష సజావుగా సాగింది. తంగళ్లపల్లి, గీతానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో కేంద్రాలను కలెక్టర్ సందీప్కుమార్ ఝా పరిశీలించారు. పాఠశాలలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలు పనితీరును తెలుసుకున్నారు. తంగళ్లపల్లి హైస్కూల్లో నిర్మిస్తున్న అదనపు తరగతి గదులను త్వరగా పూర్తి చేయాలని ప్రిన్సిపాల్ శంకర్ నారాయణను ఆదేశించారు. బోరుమోటార్ కోసం ప్రతిపాదనలు సమర్పించాలని పంచాయతీ సెక్రటరీని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఏడు కేంద్రాల్లో 2,136 మందికి 2,027 మంది హాజరయ్యారు. -
ఈ టెక్నికల్ అసిస్టెంట్ మాకొద్దు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): తాము నిబంధనల ప్రకా రం పని చేసినా తగిన వేతనం రావడం లేదని ఉపాధిహామీ కూలీలు మంగళవారం నిరసనకు దిగారు. టెక్నికల్ అసిస్టెంట్ ప్రభాకర్ తమకు వద్దంటూ ఇంటి దారి పట్టారు. కూలీలు తెలిపిన వివరాలు. మండలంలోని కోరుట్లపేటలోని అప్ప సముద్రంలో మంగళవారం ఉపాధిహామీ పనులు చేస్తున్న 100 మంది కూలీలు తమకు సరైన వేతనం రావడం లేదని పని స్థలంలోనే నిరసన తెలిపారు. టెక్నికల్ అసిస్టెంట్ మహిళా కూలీలపై దుర్భాషలాడుతున్నాడన్నారు. అతన్ని ఇక్కడి నుంచి పంపించాలని డిమాండ్ చేశారు. పని చేయని వారి అకౌంట్లో డబ్బులు పడుతున్నాయన్నారు. అవకతవకలపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీవో కొమురయ్యను వివరణ కోరగా.. కూలీ డబ్బుల అవకతవకలపై క్షేత్రస్థాయిలో విచారణ చేపడతామని తెలిపారు. -
పారమిత విద్యార్థుల ప్రతిభ
ఎన్టీపీసీ కేవీలో వందశాతం ఉత్తీర్ణత ‘సీబీఎస్ఈ’ ఫలితాల్లో అల్ఫోర్స్ ప్రభంజనంమానేరు విజయకేతనం జ్యోతినగర్(రామగుండం): సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్(సీబీఎస్ఈ)లో ఎన్టీపీసీ రామగుండం కేంద్రీయ విద్యాలయం విద్యార్థులు విజయదుందుబి మోగించారు. మంగళవారం విడుదల చేసిన ఫలితాల్లో పదో తరగతి, 12వ తరగతి ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాలో టాపర్గా నిలిచారు. పదో తరగతిలో 67 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 67 మంది ఉత్తీర్ణత సాధించారు. ఓం సాహూ(484/500), 12వ తరగతిలో 18 మంది విద్యార్థులు పరీక్షలకు హా జరుకాగా 18 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యా రు. సైన్స్ విభాగంలో పెండ్యాల ఆగస్త్యశర్మ (398/500), కుడితేటి ప్రద్యుమ్నరావు (396/ 500), కామర్స్ విభాగంలో హ్రిశికేశ్ (44 1/500) మార్కులు సాధించారు. దీంతో విద్యాలయ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు, ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్కుమార్ సామంత, నామిని చైర్మన్ బిజయ్కుమార్ సిగ్దర్, ప్రిన్సిపాల్ ఓరుగంటి శోభన్బాబు, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. చొప్పదండి నవోదయ ప్రభంజనం చొప్పదండి: జవహర్ నవోదయ విద్యాలయం 2024–25 పదోతరగతి, పన్నెండో తరగతి సీబీ ఎస్ఈ ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించింది. పన్నెండో తరగతిలో 500మార్కులకు 483మార్కులు సాధించి పి.రుత్విక్రెడ్డి మొదటి ర్యాంకు సాధించారు. పదోతరగతిలో వి.వశిష్ట యాదవ్ 500 మార్కులకు 480 మార్కులు సాధించారు. విద్యార్థులను ప్రిన్సిపాల్ మంగతాయారు అభినందించారు.సప్తగిరికాలనీ(కరీంనగర్): సీబీఎస్ఈ పదోతరగతి, ఇంటర్ పరీక్ష ఫలితాల్లో కరీంనగర్లోని అల్ఫోర్స్ సీబీఎస్ఈ పాఠశాలకు చెందిన విద్యార్థులు జాతీయస్థాయిలో ప్రభంజనం సృష్టించినట్లు అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి.నరేందర్రెడ్డి తెలిపారు. పదో తరగతిలో 500మార్కులకు గాను మహమ్మద్ షాజ్నీన్ తబాసుమ్ జాతీయస్థాయిలో 99.4శాతంతో 497మార్కులతో జిల్లాస్థాయిలో అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. ఎం.సుచీత్రెడ్డి 493 మార్కులు, జె.సుప్రభ 492, ఆర్.వేదిక, టి.హర్షిణి 491, డి.హర్షిత్489, బి.ఆకృతి, సీహెచ్.అనీశ్కుమార్, రయానుద్దీన్ 488, ఏ.నక్షత్ర, పి.శ్రీవర్షిత, కె.నక్షత్రరెడ్డి 486మార్కులు సాధించారని పేర్కొన్నారు. 12వ తరగతిలో 500 మార్కులకు గాను వి.సంజీతరెడ్డి 482మార్కులు, ఎన్.అనిరుద్ సాయి 482, వి.శశాంక్రెడ్డి 478, జె.వమీకా 473 మార్కులు సాధించారని తెలిపారు. 10వ తరగతిలో అత్యధికసంఖ్యలో విద్యార్థులు 90శాతం మార్కులు సాధించారని, 12వ తరగతిలో 13మంది 90శాతం మార్కులు సాధించారని పేర్కొన్నారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు.సప్తగిరికాలనీ(కరీంనగర్): సీబీఎస్ఈ పదోతరగతి ఫలితాల్లో పారమిత హెరిటే జ్, వరల్డ్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చూపారని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎం.శ్రీకర్, పి.గోపికృష్ణ తెలిపారు. 500మార్కులకు గాను ఆకుల శ్రీరామచంద్ర 488 మార్కులు, రూపనిగమ, మనోజ్ఞలు 487, స్ఫూర్తి 481, బి.వర్షిణి480మార్కులు సాధించినట్లు తెలిపా రు. పాఠశాలకు చెందిన 62మంది 90శాతం పైన మార్కులు సాధించగా 80 నుంచి 100శా తం సాధించిన విద్యార్థులు 160మంది ఉన్నారని అన్నారు. విద్యార్థులను పారమిత పాఠశాలల అధినేత ఈ.ప్రసాద్రావు, డైరెక్టర్లు ప్రసూన, అనుకర్రావు, రశ్మిత, రాకేశ్, ప్రాచీ, వినోద్రావు, వీయూఎం.ప్రసాద్, టీఎస్వీ.రమణ, హన్మంతరావు, రవీంద్ర పాత్రో, నాగరాజు అభినందించారు.సప్తగిరికాలనీ(కరీంనగర్): సీబీఎస్ఈ పదోతరగతి ఫలితాల్లో కరీంనగర్ పద్మనగర్లోని మానేరు సీబీఎస్ఈ పాఠశాల విద్యార్థులు జయకేతనం ఎగురవేశారని విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి తెలిపారు. పాఠశాల నుంచి మొత్తం 98మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 100శాతం ఉత్తీర్ణత నమోదు చేసినట్లు తెలిపారు. పలువురు విద్యార్థులు తెలుగులో 100 మార్కులు, ఇంగ్లిష్లో 98మార్కులు, హిందీలో 97మార్కులు, సైన్స్, సోషల్లో 96మార్కులు, గణితంలో 95 మార్కులు సాధించారని అన్నారు. 500 మార్కులకు పాఠశాలకు చెందిన ఏ.ఆత్రేయ 471మార్కులు, మస్రా మహావీన్ 461, ఏ.అరవింద్రెడ్డి 458, ఏ.శరత్ చంద్ర 456మార్కులు సాధించి టాపర్లుగా నిలిచినట్లు పేర్కొన్నారు. విద్యార్థులను మానేరు విద్యాసంస్థల డైరెక్టర్లు కడారి సునీతరెడ్డి, కడారి కృష్ణారెడ్డి, కడారి శ్వేతారెడ్డి అభినందించారు. పది, పన్నెండో తరగతి విద్యార్థుల సత్తా -
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): వ్యవసాయరంగంలో రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని, ధాన్యం డబ్బులను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్లను ఏఎంసీ చైర్మన్ సాబేరా బేగం కోరారు. హైదరాబాద్లో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి విన్నవించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి, డైరెక్టర్లు మహమ్మద్ ఖాజా, షకీల్ ఉన్నారు. కూలి తగ్గించడం శోచనీయం సిరిసిల్లటౌన్: ప్రభుత్వ ఆర్డర్ల చీరలు నేసే కార్మికుల కూలి తగ్గించడం శోచనీయమని పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్, జిల్లా అధ్యక్షుడు కోడం రమణ పేర్కొన్నారు. సిరిసిల్లలోని పార్టీ ఆఫీస్లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. చీరల వస్త్రానికి యజమానులకు ఒక మీటరుకు రూ.32 నిర్ణయించగా, కార్మికుల కూలి ప్రకటించకపోవడంతో తక్కువగా ఇస్తున్నారన్నారు. బతుకమ్మ చీరలకు ఇచ్చిన మాదిరిగా మీటర్కు రూ.5.25 కూలి ఇవ్వాలని కోరారు. నక్క దేవదాస్, సిరిమల్ల సత్యం, గుండు రమేశ్, సబ్బని చంద్రకాంత్, ఒగ్గు గణేశ్, బెజిగం సురేష్, బాస శ్రీధర్, స్వర్గం శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మైనారిటీ గురుకులాల్లో ప్రవేశాలకు ఆహ్వానంసిరిసిల్ల: జిల్లాలోని అర్హులైన మైనార్టీ విద్యార్థులు మైనార్టీ సంక్షేమ గురుకులాల్లో చేరాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కోరారు. మైనార్టీ సంక్షేమ విద్యాసంస్థల్లో ప్రవేశాల పోస్టర్లను మంగళవారం ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ సిరిసిల్ల, వేములవాడల్లో మైనార్టీ గురుకుల సంక్షేమ విద్యాసంస్థలు ఉన్నాయని తెలిపారు. ఆయా విద్యాసంస్థల్లో ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు తరగతులు కొనసాగుతాయని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం ఐదో తరగతిలో ప్రవేశానికి 60 సీట్లు (మైనార్టీ పిల్లలకు) ఉన్నాయని, 6 నుంచి 8వ తరగతి వరకు బ్యాక్ లాగ్ సీట్లు భర్తీ చేస్తారని వివరించారు. సిరిసిల్ల విద్యాసంస్థలో ఇంటర్ ఫస్టియర్ ఎంపీసీ, బైపీసీలో కలిపి 80 సీట్లు ఖాళీగా ఉన్నాయని కలెక్టర్ వివరించారు. వేములవాడలోని విద్యాసంస్థలో ఎంఎల్టీ(మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్) 30 సీట్లు, డెయిరీ టెక్నాలజీ కోర్సులో 40 సీట్లు ఖాళీగా ఉన్నాయని వివరించారు. వివరాలకు 79950 57908, 73311 70865లలో సంప్రదించాలని తెలిపారు. మైనార్టీ గురుకుల విద్యాసంస్థల జిల్లా ఇన్చార్జి భారతి, ఆయా విద్యాసంస్థల హెచ్ఎంలు లక్ష్మీనారాయణ, ఫాతిమా పాల్గొన్నారు. -
లగ్గం.. షరతుల పగ్గం!
హుజూరాబాద్: గతంలో 25, 26 ఏళ్లు వచ్చేసరికి అబ్బాయిల్లో దాదాపు 80 శాతం మందికి పెళ్లిళ్లు అయిపోయేవి. కొన్నాళ్లుగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రెండుమూడేళ్ల నుంచి సంబంధాలు చూస్తున్నా పెళ్లిళ్లు కావడం లేదు. 30ఏళ్లు దాటినా పెళ్లికాని ప్రసాద్ల సంఖ్య పెరిగిపోతోంది. అబ్బాయికి పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు ఒక పెద్ద యజ్ఞమే చేయాల్సి వస్తోంది. గతంలో తల్లిదండ్రులు ఏదైనా సంబంధం చూస్తే అమ్మాయిలు మాట్లాడకుండా చేసుకునేవాళ్లు. కానీ, ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. అమ్మాయిల ఇష్టాయిష్టాలను కాదనలేని పరిస్థితి. అమ్మాయి ఓకే అంటే తప్ప పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించడం లేదు. జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో అమ్మాయిలు పూర్తి స్వేచ్ఛగా ఉంటున్నారు. మంచి వేతనం, సొంత ఇల్లు.. వంటివి ఉన్నవారి వైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి సంబంధాలను వెతకమని కుటుంబ సభ్యులకు చెబుతున్నారు. విదేశీ సంబంధాలు అయితే ఒక్క క్షణం కూడా ఆలోచించడం లేదు. వెంటనే ఓకే చెప్పేస్తున్నారు. పట్టింపులతో సమస్య.. అబ్బాయిల తల్లిదండ్రుల వ్యవహారశైలి కూడా కొంతవరకూ ఈ సమస్యకు కారణమని చెప్పవచ్చు. మంచి కట్నకానుకలు ఆశించడం, అమ్మాయి అందంగా ఉండాలని, అణకువగా ఉండాలని కోరుకుంటూ మొదట్లో వచ్చిన సంబంధాలను కాదనుకుంటున్నారు. తర్వాత వయసు దాటిపోతున్నా అబ్బాయిలకు పెళ్లిళ్లు చేయలేని పరిస్థితి నెలకొంటోందని చెబుతున్నారు. భిన్నమైన పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాలు చేసే అబ్బాయిలను కోరుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగం ఉన్న అబ్బాయితో పెళ్లి చేస్తే అమ్మాయికి జీవితాంతం ఇబ్బంది ఉండదన్న భావన తల్లిదండ్రుల్లో ఉంటోంది. అదే పట్టణ ప్రాంతాల్లోని అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు లేదా సాఫ్ట్వేర్ సంబంధాలపై మొగ్గుచూపిస్తున్నారు. విదేశాల్లో ఉన్నారంటే కట్నం ఎంతయినా ఇచ్చేందుకు వెనుకాడడం లేదు. దీంతో చిరుద్యోగాలు చేసుకునే అబ్బాయిలు, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకునేవారికి 35 ఏళ్లు దాటినా సంబంధాలు దొరకడం లేదు. మానసిక సమస్యలు పెళ్లికాకపోవడం వల్ల యువకులతోపాటు వారి తల్లిదండ్రులు మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు. 30 ఏళ్లు దాటినా పెళ్లి కాకపోవడం వల్ల అబ్బాయిల్లో అసహనం, నిరుత్సాహం వంటివి పెరిగిపోతున్నట్టు మానసిక వైద్యులు చెబుతున్నారు. -
ఈదురుగాలుల బీభత్సం
● విరిగిపడ్డ విద్యుత్ స్తంభం ● కొనుగోలు కేంద్రంలో నిలిచిన నీరు ● తడిసిన ధాన్యంఇల్లంతకుంట(మానకొండూర్): జిల్లా వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పలు గ్రామాల్లో చెట్లు విరిగిపడగా.. విద్యుత్స్తంభాలు నేలకూలాయి. మామిడితోటల్లోని కాయలు నేలరాలిపోయాయి. ఇల్లంతకుంట మండలం చిక్కుడువానిపల్లి, రామాజీపేట, వెల్జీపురం, ఓబులాపురం గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. చిక్కుడువానిపల్లిలో చింతమడక శంకరయ్య ఇంటిపైన రేకులు లేచిపోయాయి. రేకులపై బరువుగా పెట్టిన రాయి శంకరయ్య భార్య శ్యామలపై పడడంతో గాయపడింది. అదే గ్రామంలో కంకటి బాలయ్య వ్యవసాయబావి వద్ద కరెంటు స్తంభం నేలకొరిగింది. వెల్జీపురం ధాన్యం కొనుగోలు కేంద్రంలో నీరు నిలిచింది. తంగళ్లపల్లి/కోనరావుపేట/వేములవాడ: తంగళ్లపల్లి మండలంలోని జిల్లెల్లలో అకాల వర్షానికి ఆకారపు రాజయ్యక రేకుల ఇల్లు కూలింది. కోనరావుపేట మండలం మరిమడ్లలో పిడుగుపడి అక్కెనపల్లి రమేశ్కు చెందిన రూ.80వేల విలువైన ఆవు చనిపోయింది. అహ్మద్ హుస్సేన్పల్లిలో అక్కెనపల్లి శంకరయ్య ఇంటిగోడ కూలింది. సమీపంలోని సింగిల్విండో గోదాము రేకులు లేచి, అక్కడే పడ్డాయి. గ్రామానికి చెందిన కొప్పెర లింగారెడ్డి ఇంటి వద్ద చెట్టుపై పిడుగుపడింది. వేములవాడ పట్టణంలో భారీ వర్షం కురిసింది. అరగంటపాటు కురిసిన వర్షానికి రోడ్డుపై వరదనీరు నిలిచింది. -
ఒకరికొకరు అర్థం చేసుకోవాలి
తమ కూతురుకు పెళ్లి చేస్తే పరిస్థితి ఎలా ఉండాలో అమ్మాయి తల్లిదండ్రులు ముందే ఒక ఆలోచనకు వస్తున్నారు. పెళ్లి అనేది ఇద్దరి జీవితాలను నిర్ణయించేది. అమ్మాయికి అర్థం చేసుకునే గుణం, అబ్బాయికి ఓపిక అనేది ఉన్నాయో లేవో గమనించి వివాహం చేస్తే ఆ బంధం నిలబడుతుంది. తల్లిదండ్రులు ఆ దిశగా ఆలోచన చేస్తే బాగుంటుంది. – డాక్టర్ ప్రవీణ్కుమార్, హుజూరాబాద్ ఆలోచనల్లో మార్పు రావాలి అమ్మాయిల తల్లిదండ్రుల ధోరణి ప్రస్తుతం పూర్తిగా మారింది. గత 20 ఏళ్లలో అమ్మాయిల ఆలోచన సైతం మారింది. పెళ్లి చేసుకునే అబ్బాయి ఉద్యోగం, ఆస్తిపాస్తులు, ఆరోగ్య పరిస్థితి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే అడుగులు ముందుకు పడుతున్నాయి. అర్థం చేసుకునే గుణం, కష్టపడేతత్వం, తెలివితేటలతో ఎదిగే యువకుడికి అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే సుఖపడుతుంది. – ఆడెపు రవీందర్, మ్యారేజ్ బ్యూరో, హుజూరాబాద్ మానసిక ఒత్తిడిలో తల్లిదండ్రులు అబ్బాయికి 30 ఏళ్లు దాటినా పెళ్లి కాకపోవడాన్ని తల్లిదండ్రులు సమాజంలో నామోషీగా భావిస్తున్నారు. అబ్బాయిల్లో నిరుత్సాహం, పెళ్లి పట్ల విరక్తి భావం పెరుగుతోంది. కొందరిలో ఆత్మహత్య ఆలోచనలు కూడా పెరుగుతున్నాయి. ఇలాంటివారికి కౌన్సెలింగ్ ఇప్పించడం చాలా అవసరం. పెళ్లి అన్న దాన్ని పరువుగా భావించడం వల్లే అబ్బాయిలు, వారి తల్లిదండ్రుల్లో మానసిక సమస్యలు పెరుగుతున్నాయి.– డాక్టర్ ఎల్.వర్షి, మానసిక నిపుణుడు, హుజూరాబాద్ -
ఇంధనం కరువు
● జనవరి నుంచి పెట్రోల్, డీజిల్ బిల్లులు పెండింగ్ ● పోలీసు వాహనాలకు డీజిల్ కరువు ● కరీంనగర్ కమిషనరేట్లో రూ.కోటికిపైగా బిల్లులు ● సిరిసిల్ల, రామగుండంలో రూ.40 లక్షల చొప్పున బాకీ ● వాహన మెయింటెనెన్స్ బిల్లులు కూడా రావడంలేదు ● మూడు నెలలుగా రాని స్టేషన్ నిర్వహణ బడ్జెట్సాక్షిప్రతినిధి,కరీంనగర్: తెలంగాణ పోలీసులు సాంకేతికత, కేసుల దర్యాప్తు విషయంలో దేశంలోనే నంబర్ వన్గా నిలుస్తున్నారు. ఈ విషయం ఇటీవల మరోసారి రుజువైంది. కానీ, కొన్నినెలలుగా పోలీసులకు సమయానికి నిధులు అందడం లేదన్న విమర్శలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పోలీసు వాహనాలకు పెట్రోల్, డీజిల్ బిల్లులు జనవరి నుంచి పెండింగ్లో ఉండటంతో ఇబ్బందులు పడుతున్నారు. డీజిల్ పెట్రోల్ బిల్లులతోపాటు వాహనాల మరమ్మతులకు సంబంఽధించి మెయింటెనెన్స్ బిల్లులు కూడా రావడం లేదని వాపోతున్నారు. స్టేషన్ మెయింటెనెన్స్కు సంబంధించి అర్బన్, రూరల్ ఏరియాల్లో నెలనెలా కొంత మొత్తం అందజేస్తారు. ఈ మొత్తం కూడా మూడు నెలలుగా రావడం లేదని పలువురు ఎస్హెచ్వోలు వాపోతున్నారు. గరిష్టంగా కరీంనగర్లో ఉమ్మడి కరీంనగర్జిల్లాలో కరీంనగర్, రామగుండం కమిషనరేట్లు, సిరిసిల్ల, జగిత్యాల ఎస్పీ కార్యాలయాలు ఉన్నాయి. కరీంనగర్ కమిషనరేట్ బిల్లులు జనవరి నుంచి పెండింగ్లోనే ఉన్నాయి. ప్రతీ నె లా రూ.25 లక్షలకుపైగా నిధులు కావాల్సి ఉంటుంది. ఈ లెక్కన కరీంనగర్ కమిషనరేట్లోనే దాదాపు రూ.కోటి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. సిరిసిల్ల లోనూ గత నాలుగు నెలలుగా బిల్లులు రావడం లేదని సమాచారం. అక్కడా దాదాపు రూ.40 లక్షల వరకు బకాయిలు రావాల్సి ఉందని సిబ్బంది వాపోతున్నారు. రామగుండంలో ఏప్రిల్ నెలకు సంబంధించి రూ.40 లక్షలు మాత్రమే బిల్లులు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. జగిత్యాలలో ఎలాంటి సమస్య లేదని స్పష్టంచేశారు. అంతా బానే ఉందని పైకి చెబుతున్న యూనిట్లలోనూ వాస్తవాలు వేరే ఉన్నాయని సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నారు. వాహనాల మరమ్మతుల డబ్బులు సకాలంలో విడుదల కాకపోవడంతో మెయింటెనెన్స్కు ఇబ్బందిగా ఉంటుందని పలువురు పోలీసు అధి కారులు వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యమైన సందర్భాల్లో తమ చేతుల నుంచి డీజిల్ పోయించుకుంటున్నామని వాపోతున్నారు. మెయింటెనెన్స్కు తిప్పలే.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని రెండు కమిషనరేట్లు, రెండు ఎస్పీ కార్యాలయాల్లో స్టేషన్ మెయింటెనెన్స్ డబ్బులు మూడు నెలలుగా రావడం లేదని సమాచారం. ప్రాంతాన్ని బట్టి అర్బన్, రూరల్ ఏరియాలకు ప్రతీ నెలా స్టేషనరీ, తదితర మెమెంటెనెన్స్కు కొంతమొత్తం రావాల్సి ఉంటుంది. వీటిని స్టేషనరీతోపాటు వచ్చిన వారికి టీ, కాఫీల కోసం వినియోగిస్తారు. ఈ మొత్తం కూడా మూడు నెలలుగా రావడం లేదని పోలీసు అధికారులు వాపోతున్నారు. దీంతో పోలీసులు పలు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నారు. చాలాసార్లు తామే తొలుత చేతి నుంచి ఖర్చు చేసి, బిల్లులు వచ్చాక సర్దుబాటు చేసుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.యూనిట్ వాహనాలు కరీంనగర్ 380 రామగుండం 168 జగిత్యాల 242 సిరిసిల్ల 211 (నోట్: వాహనాల సంఖ్యలో స్వల్ప వ్యత్యాసాలు ఉండొచ్చు) -
చట్టాలపై అవగాహన అవసరం
● డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ రాధిక జైస్వాల్ సిరిసిల్లటౌన్: చట్టాలపై పౌరులకు అవగాహన ఉండాలని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ రాధిక జైస్వాల్ పేర్కొన్నారు. సర్దాపూర్లోని 17వ బెటాలియన్లో సోమవారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. పనిస్థలంలో మహిళలపై లైంగిక వేధింపులు(నివారణ, నిషేధం, పరిష్కారం) చట్టం, 2013 న్యాయ సేవల చట్టంపై అవగాహన కల్పించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.శ్రీనివాస్, లోక్ అదాలత్ మెంబర్ చింతోజు భాస్కర్, అడిషనల్ కమాండెంట్ డీఎస్పీ సీహెచ్ సాంబశివరావు పాల్గొన్నారు. గోరక్షణ చట్టాలు అమలు చేయాలి సిరిసిల్లటౌన్: రాష్ట్రంలో గోరక్షణ చట్టాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని దేశీ గోవంశ రక్షణ సవర్థన సమితి ప్రతినిధి ఉట్కూరి రాధాకృష్ణారెడ్డి కోరారు. సోమవారం సమితి ప్రతినిధులతో కలిసి కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడారు. చట్ట విరుద్ధంగా ఉంటున్న గోవధ శాలలను వెంటనే మూసివేయాలని, ఆక్రమణలో ఉన్న గోచర భూములకు వి ముక్తి కల్పించాలని, గుర్తింపు గల గోశాలల కు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశా రు. ముష్కు సంతోష్రెడ్డి పాల్గొన్నారు. ప్రేరణ ఆదర్శం ● కాంగ్రెస్ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి ముస్తాబాద్(సిరిసిల్ల): ప్రేరణ స్వచ్ఛంద సంస్థ ఆదర్శనీయమని కాంగ్రెస్ సిరిసిల్ల ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలం గూడెంలో ప్రేరణ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ మేడి సురేశ్ ఏర్పాటు చేసిన ఉచిత కంప్యూటర్ సెంటర్ను సోమవారం ప్రారంభించి మాట్లాడారు. పేదరికంలో పుట్టి పెరిగిన సురేశ్ ప్రేరణ సంస్థను స్థాపించి పదేళ్లుగా సేవ చేయడం అభినందనీయమన్నారు. ఏఎంసీ చైర్పర్సన్ తలారి రాణి, సింగిల్విండో చైర్మన్ అన్నం రాజేందర్రెడ్డి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు యెల్ల బాల్రెడ్డి, డీసీసీ కార్యదర్శి కొండం రాజిరెడ్డి, సడిమెల బాలయ్య, ఏఎంసీ మాజీ చైర్మన్ అంజన్రావు, ఎల్లాగౌడ్, శరత్, మల్లేశ్, వెంకటయ్య, తిరుపతి, పర్శరాములు, రాజు, మోహన్ పాల్గొన్నారు. బుద్ధుని బోధనలు అనుసరణీయం ● బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి లక్ష్మీనరసింహరావు చందుర్తి(వేములవాడ): విశ్వ మానవాళికి ప్రేమతత్వాన్ని, అహింసా మార్గాన్ని చూపిన గౌతమ బుద్ధుని బోధనలు యువతకు మార్గదర్శకమని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు పేర్కొన్నారు. మండలంలోని లింగంపేటలో చార్వాక ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన బుద్ధపౌర్ణమి వేడుకలకు హాజరై మాట్లాడారు. శాంతిని వెతికే ప్రతీ మనిషి బుద్ధుని మార్గంలో నడవాలన్నారు. మనుషుల మధ్య అసమానతలు తొలగించి, సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని కోరుతూ జీవనం సాగించాలనే బుద్ధుని బోధనలు అనుసరణీయమన్నారు. చార్వాక ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు దప్పుల అశోక్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మ్యాకల ఎల్లయ్య, నాయకులు ఇస్మాయిల్, చార్వాక వృద్ధుల సంఘం నాయకులు పాల్గొన్నారు. -
ఆలయాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
వేములవాడ: రాజన్న ఆలయ అభివృద్ధికి ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇప్పటికే రోడ్ల విస్తరణకు రూ.47కోట్ల పరిహారం మంజూరైందన్నా రు. వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన బీజేపీ, బీఆర్ఎస్, బీఎస్పీ నాయకులు సోమవారం పార్టీలో చేరిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో ముందుకుపోతుందన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. డిప్యూటీ సీఎంకు కృతజ్ఞతలు రాజన్న ఆలయ పరిసరాలు, తిప్పాపుర్లలో కొత్తగా 33/11 కేవీ సబ్స్టేషన్లు 10 మంజూరు చేసినందుకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్లో సోమవారం కలిశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కొత్త సబ్స్టేషన్లతో వేములవాడ పట్టణం, తిప్పాపూర్ పరిధిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండబోదన్నారు. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తయిందని, వాటి శంకుస్థాపనకు రావాలని ఆహ్వానించారు. -
గోవులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
● జియో ట్యాగింగ్ ఏర్పాటు చేయాలి ● కలెక్టర్ సందీప్ కుమార్ ఝావేములవాడఅర్బన్: రాజన్న గోశాలలోని కోడెలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆలయ అధికారులకు కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆదేశించారు. వేములవాడ మున్సిపల్ పరిధి తిప్పాపూర్లోని రాజన్న గోశాలను కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోవులకు అందిస్తున్న మేత, ఇతర పదార్థాల నాణ్యత, సౌకర్యాలను పరిశీలించి, వాటి సంఖ్యపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ సందీప్కుమార్ ఝా మాట్లాడతూ ఎండాకాలం నేపథ్యంలో గోవుల సంరక్షణను మరింత బాధ్యతగా చూసుకోవాలన్నారు. గోవుల వయసు ఆధారంగా... గోవుల వయసు ఆధారంగా వాటిని వివిధ షెడ్లలో పెట్టాలని, గోశాలలోని షెడ్లలో ఫాగర్స్(నీటి తుంపర్ల) యంత్రాలను ఏర్పాటు చేయాలన్నారు. అన్ని గోవులకు సరిపడా పచ్చిగడ్డిని మరింత అందుబాటులో ఉంచాలన్నారు. ప్రతి గోవుకు జియో ట్యాగింగ్ పరికరం పెట్టాలని సూచించారు. అనంతరం గోవులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఆలయ ఈవో వినోద్, జిల్లా పశువైద్యాధికారి రవీందర్రెడ్డి, ఆలయ ఏఈవో శ్రీనివాస్, గోశాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. -
తాళం వేస్తే టార్గెట్
ఇది ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్లోని సీసీ కెమెరా. గత పాలకవర్గం ఆధ్వర్యంలో దాదాపు రూ.1.60 లక్షలు వెచ్చించి 12 సీసీ కెమెరాలతో గ్రామంపై నిఘా పెట్టారు. అయితే ప్రస్తుతం అందులో మూడు సీసీ కెమెరాలు మాత్రమే పనిచేస్తున్నాయి. వాటిని రిపేర్ చేయించడం లేదు. గ్రామంలో పాలకవర్గం లేకపోవడంతో వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఏదైనా సంఘటన జరిగితే నిందితులను పట్టుకోవడం ఇబ్బంది కానుంది. ● వరుస చోరీలతో జనం బెంబేలు ● జిల్లాలో ఇటీవల పెరిగిన దొంగతనాలు ● పట్టపగలే ఇళ్లు లూఠీ ● పనిచేయని సీసీ కెమెరాలు ● దొరకని దొంగలు ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగలు తెగబడుతున్నారు. వరుస దొంగతనాలతో జిల్లా ప్రజలు భయాందోళన చెందుతున్నారు. సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో దొంగలు దొరకడం లేదు. వేసవి సెలవులు కావడం, శుభాకార్యాలు ఎక్కువగా ఉండడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు భయం..భయంగా గడుపుతున్నారు. ఇదే అదునుగా దొంగలు ఇళ్లను గుళ్ల చేస్తున్నారు. పట్టపగలే ఇళ్లను టార్గెట్ చేస్తూ ఉన్నది ఊడ్చుకుపోతున్నారు. లక్షల్లో సొమ్ము, భారీ ఎత్తున బంగారం నగలు పోతుండడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. వరుస దొంగతనాలు.. ఆందోళనలో ప్రజలు ● జిల్లాలో ఇటీవల వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 255 గ్రామపంచాయతీల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలో సగానికిపైగా పనిచేయడం లేదు. దీంతో దొంగతనాలు పాల్పడ్డ వారి ఆచూకీ దొరకడం లేదు. ● తాజాగా గంభీరావుపేట మండలం నాగంపేటలో పది రోజుల క్రితం ఒకే రోజు తాళం వేసి ఉన్న పది ఇళ్లలో దొంగతనానికి పాల్పడ్డారు. బంగారం, విలువైన బట్టలు, భారీ ఎత్తున నగదు పోయింది. ఇంత పెద్ద సంఘటన జరగడంతో జిల్లా ప్రజలు శుభకార్యాలకు బంధువుల ఇళ్లకు వెళ్లేందుకు భయపడుతున్నారు. ● ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఒద్దిరాల శ్రీనివాస్ ఇంట్లో ఈనెల 9న పట్టపగలే తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. బీరువాను ధ్వంసం చేసి రూ.25వేల నగదు, 3 తులాల బంగారం కమ్మలు, చైన్లు, 15 తులాల వెండి పట్టగొలుసులను ఎత్తుకెళ్లారు. ● నెల రోజల క్రితం ఎల్లారెడ్డిపేటకు చెందిన నాగుల ప్రదీప్గౌడ్ ఇంట్లో చోరీ జరిగింది. ● ముస్తాబాద్, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి, వేములవాడరూరల్ మండలాల్లోని ఆలయాల్లో దొంగలు హుండీలను ఎత్తుకెళ్లిన ఘటనలున్నాయి. శుభకార్యాల వేళ దొంగల హల్చల్ ఈ వారం, పది రోజులుగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు ఎక్కువగా జరుగుతుండడంతో బ్యాంక్ లాకర్లలో దాచిన బంగారు నగలతోపాటు కుదువపెట్టిన వాటిని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటున్నారు. ఇదే సమయంలో దొంగలు పడుతుండడంతో బంగారు నగలు చోరీకి గురవుతున్నాయి. ఇటీవల తులం బంగారం రూ.లక్షకు చేరడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఉన్న బంగారాన్ని కాపాడుకునేందుకు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు బంధువుల ఇళ్లకు వెళ్లిన వారు సైతం సాయంత్రం వరకు ఇళ్లకు తిరిగి వస్తున్నారు. దొంగలను పట్టుకుంటాం దొంగతనాలపై నిఘా పెట్టాం. సంఘటన జరిగిన రోజు క్లూస్టీమ్తో వేలిముద్రలు సేకరించి, పాత నేరస్తులను విచారిస్తున్నాం. రాత్రిపూట పెట్రోలింగ్ను ముమ్మరం చేస్తాం. ఇళ్లకు తాళం వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఇంటికి తాళం వేస్తున్న సమయంలో విలువైన వస్తువులను వెంట తీసుకెళ్లాలి. – శ్రీనివాస్గౌడ్, సీఐ, ఎల్లారెడ్డిపేటఈ చిత్రం గంభీరావుపేట మండలం నాగంపేటలో ఇటీవల జరిగిన దొంగతనంపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. పది రోజుల క్రితం నాగంపేటలో ఒకే రోజు తాళం వేసి ఉన్న పది ఇళ్లలో దొంగలు పడ్డారు. ఇటీవల ఇంత పెద్ద ఎత్తున దొంగలు పడ్డ సంఘటనలు జిల్లాలో లేవు. పెద్ద ఎత్తున బంగారం, నగలను ఎత్తుకెళ్లారు. తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేస్తుండడంతో వేసవి సెలవుల్లో వివిధ ప్రాంతాల దర్శనానికి, బంధువు ఇళ్లలో జరిగే శుభకార్యాలకు వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. -
ఉగ్రవాద మూలాలు లేకుండా చూడాలి
ఇల్లంతకుంట(మానకొండూర్): దేశంలో ఉగ్రవాద మూలాలు లేకుండా కేంద్ర ప్రభుత్వం చూడాలని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు. ఇల్లంతకుంటలో జరుగుతున్న పెద్దమ్మ పండుగ ఉత్సవాల్లో ఆదివారం పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఇందిరాగాంధీ ప్రభుత్వం పాకిస్థాన్తో పోరాటం చేసి బంగ్లాదేశ్ విముక్తికి సహకరించిందని గుర్తు చేశారు. ముదిరాజ్ సంఘం నాయకులు గొడుగు నర్సయ్య, పిల్లి వెంకటి, కూనబోయిన బాలరాజు, సుధాకర్, రఘు, రమేశ్, కనకయ్య, రేగుల కార్తీక్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు భాస్కర్రెడ్డి, వెంకట రమణారెడ్డి, పసుల వెంకటి పాల్గొన్నారు. పున్నం చందర్కు బెస్ట్ సైకాలజిస్ట్ అవార్డు సిరిసిల్లటౌన్: ప్రముఖ సైకాలజిస్ట్ కనుకుంట్ల పున్నంచందర్ ‘బెస్ట్ సైకాలజిస్ట్ అవార్డ్–2025’ అందుకున్నారు. హైదరాబాద్లోని బిర్లా ఆడిటోరియంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి, మహిళా కమిషన్ చైర్పర్సన్ త్రిపురాణ వెంకటరత్నం చేతుల మీదుగా అందుకున్నారు. మానసిక ఆరోగ్యంపై అంకితభావంతో పనిచేస్తూ ఆత్మహత్యల నివారణకు కృషి చేసినందుకు ఈ పురస్కారం అందజేశారు. తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మోతుకూరి రామ్చందర్ మాట్లాడుతూ పున్నంచందర్ పదిహేనేళ్లుగా మానసిక సమస్యల పరిష్కారానికి నూతన పద్ధతులను వినియోగిస్తూ, వ్యక్తిగత కౌన్సెలింగ్, వర్క్షాపులతో అనేక మందికి స్ఫూర్తిగా నిలి చారని కొనియాడారు. అవార్డు రావడంపై సైకాలజిస్ట్లు ఆంజనేయులు, ఈశ్వర్, శ్రీనివాస్, అయ్యప్ప రాము, తిరుమల అభినందించారు. అంతర్జాతీయ పోటీలకు చెక్కపల్లి యువకుడు వేములవాడరూరల్: అంతర్జాతీయ సెస్టోబాల్ పోటీలకు వేములవాడరూరల్ మండలం చెక్కపల్లికి చెందిన ఎడపెల్లి అనిల్ ఎంపికయ్యారు. ఈనెల 16 నుంచి 19 వరకు శ్రీలంకలో జరిగే రెండో సౌత్ ఏషియన్ సెస్టోబాల్ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొననున్నారు. తెలంగాణకు చెందిన ఆరుగురు ఆటగాళ్లు భారతజట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. అనిల్ను గ్రామస్తులు ఆదివారం సన్మానించారు. నాయకులు వంగపల్లి మల్లేశం, బాలసాని శ్రీనివాస్, చిలుక ప్రభాకర్, అడ్డికే జైపాల్రెడ్డి, నరేశ్, హరినందన్రెడ్డి, అశీల శేఖర్, రమణారెడ్డి, దాన వేణు, నాగరాజు పాల్గొన్నారు. వేములవాడ సబ్ రిజిస్ట్రార్ బదిలీవేములవాడ: సబ్ రిజిస్ట్రార్గా పనిచేస్తున్న రాజిరెడ్డి మంచిర్యాలకు బదిలీ అయ్యారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు. -
ఏఎన్ఎం నుంచి వైస్ ప్రిన్సిపాల్ వరకు
సేవామూర్తులుఅనారోగ్యం పాలైనప్పుడు రక్తసంబంధీకులే దరిచేరని రోజులివీ. ఆస్పత్రిలో ఉన్నప్పుడు వచ్చి ప్రేమగా పలకరించేందుకూ మనసురాని కుటుంబ సభ్యులున్న సమాజమిదీ. అచేతన స్థితిలో ఉన్నవారికి ఏ సంబంధం లేకపోయినా చిరునవ్వుతో దేవదూతల్లా నర్సింగ్ ఆఫీసర్లు సకల సేవలందిస్తున్నారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్నట్లుగా అనారోగ్యం బారినపడి ఆసుపత్రుల్లో చేరిన వారిని అమ్మ కన్నా మిన్నగా నర్సులు చూసుకుంటున్నారు. తెల్లని దుస్తుల్లో మిలమిలా మెరుస్తూ.. చిరునవ్వులు చిందిస్తూ.. వారు అందించే సేవలు నిరుపమానం. రోగి అవసరం ఏదైనా చిటికెలో తీర్చడమో, తీర్చేందుకు ప్రయత్నించడమో చేస్తూ పేషెంట్లకు భరోసా కల్పిస్తారు. పైకి గంభీరంగా కనిపించినా పేషెంట్ ప్రాణాలు కాపాడడమే లక్ష్యంగా పనిచేస్తూ రోగుల పాలిట దైవాలుగా నిలుస్తున్నారు నర్సులు. నేడు నర్సింగ్ డే సందర్భంగా కథనం. – కరీంనగర్టౌన్/కోల్సిటీ మదర్ థెరిసాను రోల్డ్ మోడల్గా తీసుకున్నా. వైద్య సేవలపై ఆసక్తితో ఏఎన్ఎం స్థాయి నుంచి నర్సింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ హోదా వరకు చేరుకున్నాను. ఇంటర్ చదివే వయసులోనే ఏఎన్ఎమ్గా ఉద్యోగం వచ్చింది. ఇదే స్ఫూర్తితో జనరల్ నర్సింగ్, బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్ తోపాటు సైకాలజీ, పీడియాట్రిక్, ఏంఎస్డబ్ల్యూ కోర్సులు చదివాను. పేషెంట్లకు ఎదురుపడిన నర్సింగ్ ఆఫీసర్లు చక్కని చిరునవ్వుతో పలకరించి వైద్యం అందించాలని దృక్పథం నాలో బలంగా నాటుకుంది. అందుకే 2013 నుంచి 2022 వరకు స్టాఫ్నర్స్గా పని చేస్తున్నకాలంలో డిప్యూటేషన్పై కరీంనగర్ నర్సింగ్ స్కూల్లో ట్యూటర్గా పాఠాలు బోధించాను. 2022లో పదోన్నతిపై సిరిసిల్ల నర్సింగ్ కళాశాలలో లెక్చరర్గా పనిచేశా. గతేడాది అక్టోబర్ 30న రామగుండం నర్సింగ్ కళాశాలకు వైస్ ప్రిన్సిపాల్గా ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. రోగులకు వైద్యం అందించడంలో నర్సింగ్ ఆఫీసర్ల సేవలు కీలకమైనవి. – సుశీల, వైస్ ప్రిన్సిపాల్, నర్సింగ్ కళాశాల, గోదావరిఖని – వివరాలు 8లో -
మండుటెండల్లో నీటిజాడలు
మండుటెండల్లోనూ నీటి ఊటలు ఊరుతున్నాయి. ఈ సంవత్సరం వర్షాకాలంలో సరైన వర్షాలు కురువకపోయినా జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో నీటి ఊటలు, చెక్డ్యామ్లు స్థానికంగా నీటి కొరతను తీరుస్తున్నాయి. వన్యప్రాణుల దాహార్తి తీరుస్తున్నాయి. నిండు ఎండాకాలంలోనూ గలగల పారుతున్నాయి. పాతికేళ్లుగా నీటి కొరతకు చెక్ ముస్తాబాద్(సిరిసిల్ల): మండలంలోని మోహినికుంటలో ఒకప్పుడు ఎటూ చూసినా బీడు భూములు కనిపించేవి. ఉపాధి కరువై ఊరిలోని పురుషులు ముంబయి, దుబాయ్కి వలసపోయేవారు. నీటివసతి లేని మోహినికుంటలో 25 ఏళ్ల క్రితం నిర్మించిన చెక్డ్యామ్ నేడు జీవనాధారమైంది. వాటర్షెడ్ స్కీం ద్వారా 2002లో అప్పటి ఎంపీటీసీ కల్వకుంట్ల గోపాల్రావు ఆధ్వర్యంలో నర్సింలవాగుపై చెక్డ్యామ్ నిర్మించారు. ఎగువ రాజక్కపేట చెరువు మత్తడి దూకి చెక్డ్యామ్లోనే చేరగా కొంతమేరకు మోహినికుంటలో భూగర్భ జలాలు పెరిగాయి. ఒక్క చెరువు కూడా లేకపోవడం, ఒకే ఒక చెక్డ్యామ్పై ఆధారపడ్డ మోహినికుంట వాసులు క్రమంగా బోర్లు, బావులు తవ్వించి వ్యవసాయం వైపు మళ్లారు. ఈక్రమంలో మల్లన్నసాగర్ నీరు ఏడేళ్లుగా వస్తుండడంతో చెక్డ్యామ్ నిండా నీరు చేరుతుంది. దీంతో స్థానికంగా భూగర్భజలాలు పెరిగి వలసలు తగ్గి ఊరిలో పంటల సాగు పెరిగింది. భూగర్భ జలాలు పెరిగాయి పాతికేళ్ల క్రితం మోహినికుంటలో చెరువు, కుంటలు లేవు. కరువుతో మగవారు వలసలు వెళ్లారు. అప్పటి కేంద్ర, రాష్ట్ర మంత్రులు విద్యాసాగర్రావు, సుద్దాల దేవయ్య సహకారంతో వాగుపై చెక్డ్యామ్ నిర్మించాం. అదే ఇప్పుడు ఆధారమైంది. భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయం చేసుకుంటున్నాం. – కల్వకుంట్ల గోపాల్రావు, రైతు నాయకుడు -
కేటీఆర్ బిజీ..బిజీ
సారూ.. నిన్ను చూడక ఎన్నో రోజులవుతాంది వీర్నపల్లి(సిరిసిల్ల): మండలంలోని శాంతినగర్లో ఓ వివాహ వేడుకకు హాజరైన కేటీఆర్ను చూడగానే అదే గ్రామానికి చెందిన అలువాల అంజవ్వ భావోద్వేగానికి లోనైంది. కేటీఆర్ సారు నిన్ను చూడక ఎన్నో రోజులవుతుందని సంబరపడిపోయింది. కేటీఆర్ వచ్చిన విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున మండల కేంద్రానికి చేరుకోగా.. కారు దిగకుండానే మళ్లీ కలుస్తాను ఏమీ అనుకోవద్దంటూ వెళ్లిపోయారు. దీంతో వారు నిరాశతో వెనుదిరిగారు. సిరిసిల్ల: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు ఆదివారం జిల్లాలో బిజీబిజీగా పర్యటించారు. సిరిసిల్ల అర్బన్బ్యాంకు వైస్చైర్మన్ అడ్డగట్ల మురళి–మాధవి దంపతుల కొడుకు వివాహం ఇటీవల జరగ్గా.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. భవాని ఫంక్షన్హాల్లో బీఆర్ఎస్ నాయకుడు మామిడాల రమణ కొడుకు పెళ్లికి హాజరయ్యారు. రాజీవ్నగర్కు చెందిన ఆర్ఎంపీ డాక్టర్ అలువాల ఈశ్వర్ కూతురు రిసెప్షన్కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి, బీఆర్ఎస్ నాయకులు గూడూరి ప్రవీణ్ పాల్గొన్నారు. తమ్మీ భయడకు నేనున్నా తంగళ్లపల్లి(సిరిసిల్ల): ‘తమ్మీ మహేశ్.. భయపడకు నీకు అండగా నేనున్నా.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగానే నిన్ను ఇంటికి తీసుకొస్తాను’ అంటూ గల్ఫ్ బాధితుడు మంద మహేశ్కు కేటీఆర్ ధైర్యం చెప్పారు. మండెపల్లిలోని మహేశ్ ఇంటికెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం సౌదీ అరేబియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహేశ్తో వీడియోకాల్లో మాట్లాడి భరోసా కల్పించారు. రాళ్లపేట మాజీ సర్పంచ్ తీగల దుర్గయ్య కొడుకు వివాహం ఇటీవల జరుగగా వారిని ఆశీర్వదించా రు. చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ నాయకుడు జంగపల్లి భిక్షపతిని ఫోన్లో పరామర్శించారు. ఎల్లమ్మ దర్శనం గంభీరావుపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్లో రేణుక ఎల్లమ్మ–జమదగ్ని కల్యాణోత్సవానికి హాజరయ్యారు. పందిర్ల శ్రీనివాస్ గౌడ్, శ్రీధర్గౌడ్, కిషన్గౌడ్లు కేటీఆర్ను శాలువా లతో సత్కరించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాయకులు కొండ రమేశ్గౌడ్ తదితరులు ఉన్నారు. -
సోమవారం శ్రీ 12 శ్రీ మే శ్రీ 2025
నమో నారసింహవేములవాడఅర్బన్: రాజన్న ఆనుబంధ నాంపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం శ్రీభూనీలా సమేత లక్ష్మీనరసింహస్వామి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారికి పట్టువస్త్రాలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, రాజన్న ఆలయ ఈవో వినోద్రెడ్డి సమర్పించారు. ఆలయ అర్చకులు రాచకొండ రామాచార్యులు–సంధ్యరాణి దంపతులు కన్యాదాతలుగా వ్యవహరించారు. ఆలయ అర్చకులు విజయసింహచారి, రామకృష్ణాచారి, హర్షవర్ధనాచారి ఆధ్వర్యంలో కల్యాణం నిర్వహించారు. -
మానేరు ప్రాజెక్ట్ కెనాల్ షట్టర్ మూసివేత
ముస్తాబాద్(సిరిసిల్ల): ముస్తాబాద్లోని మానేరు ప్రాజెక్ట్ కెనాల్ షట్టర్ను మూసివేశారు. ముస్తాబాద్ నుంచి పోతుగల్ వెళ్లే డిస్ట్రిబ్యూటరీ–18 వద్ద మట్టిని పోశారు. దీంతో 18 కెనాల్ వైపునకు నీరు వెళ్లలేని పరిస్థితి. డిస్టిబ్యూటరీ–18 వద్ద కెనాల్ షట్టర్ మూసుకుపోవడంతో రానున్న ఖరీఫ్ సీజన్కు నీరు వెళ్లదని రైతులు పేర్కొంటున్నారు. నీటిపారుదల శాఖ అధికారులు స్పందించి మట్టిని తొలగించాలని రైతులు కోరుతున్నారు. ముగిసిన వార్పర్ల సమ్మె ● కుదిరిన కూలీ ఒప్పందంసిరిసిల్ల: ఏడు రోజులుగా వార్పర్లు చేస్తున్న సమ్మె ఆదివారం ముగిసింది. పాలిస్టర్ అసోసియేషన్ భవన్లో పాలిస్టర్ అసోసియేషన్ ప్రతినిధులకు, వార్పర్ కార్మిక సంఘం నాయకుల మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ప్రభుత్వం ఇచ్చిన మహిళా ఇందిరా శక్తి చీరల బీములకు ఒక్కోదానికి కూలీని రూ.475 నిర్ణయించారు. జరీబీములు టాప్ది రూ.275గా నిర్ణయించారు. ఇది బీములో దారం పోగుల పొడవు 1250 మీటర్ల వరకు వర్తిస్తుంది. అంతకంటే ఎక్కువ పొడవు ఉంటే అదనపు కూలీ ఇవ్వాలని నిర్ణయించారు. ఈమేరకు వార్పర్ల కూలీ ఒప్పందం కుదరడంతో సమ్మెను విమరించారు. చర్చల్లో పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆడెపు భాస్కర్, కార్యదర్శి అంకాలపు రవి, ప్రతినిధులు గోవిందు రవి, దూడం శంకర్, వార్పిన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు సిరిమల్లె సత్యం, కార్యదర్శి మూషం రమేశ్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ, ప్రతినిధులు ఉడుత రవి, మచ్చ వేణు, బూట్ల వెంకటేశ్వర్లు, ఐరన్ ప్రవీణ్, అడిచర్ల రాజు పాల్గొన్నారు. వెంకన్న పారివేట శోభాయాత్రబోయినపల్లి(చొప్పదండి): మండలంలోని తడగొండ శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణంలో భాగంగా ఆదివారం రాత్రి స్వామివారి పారివేట శోభాయాత్ర ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉత్సవ విగ్రహాలతో భజనలు, భక్తి గీతాలతో కనుల పండువలా ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో పూజారులు అనిల్ ఆచార్య, హరికృష్ణ ఆచార్య, సాయిశర్మ శ్రీనివాస, హునుమాన్ దీక్షా స్వాములు పాల్గొన్నారు. -
బుగ్గ.. జలసవ్వడుల అడ్డా
● నీటిబెంగ తీర్చుతున్న అక్కపల్లి బుగ్గ ● వన్యప్రాణుల దాహార్తి తీరుస్తున్న నీరు ● మోహిని‘కుంట’నే ఆధారంసిరిసిల్ల: ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద గుట్టల నుంచి నీటి ఊట వస్తోంది. ఆ ఊట నీరు కుండీలో నిల్వ ఉండడంతో వన్యప్రాణుల దాహం తీరుతుంది. అక్కపల్లి బుగ్గ వద్ద కోతులు నీటిని తాగుతూ ఎండాకాలంలో దాహార్తిని తీర్చుకుంటున్నాయి. చుట్టుపక్కల ఎక్కడా చుక్కనీరు లేక.. ఎండిన ఆకులు.. తడిలేని ఒర్రెలు దర్శనమిస్తుంటే అక్కపల్లి బుగ్గజలం.. వన్యప్రాణులకు వరంగా మారింది. -
‘అనర్హులకు ఉద్యోగాలు’
సిరిసిల్లటౌన్: అర్హత లేని వారికి ఉద్యోగాలిచ్చి తమకు అన్యాయం చేశారని సిరిసిల్ల మెడికల్ కాలేజీలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసి భంగపడిన బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ శనివారం సిరిసిల్ల ప్రెస్క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ల్యాబ్ అటెండెన్స్, డాటా ఎంట్రీ ఆపరేటర్స్, ఈసీజీ థియేటర్ అసిస్టెంట్స్, ఇతర పోస్టులకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ల్యాబ్ అటెండెన్స్, డాటా ఎంట్రీ ఆపరేటర్, ఇతర పోస్టులకు అర్హత లేని వారికి మార్కులు కలిపి ఎంపిక చేశారని ఆరోపించారు. ఈ విషయమైన ప్రజావాణిలోనూ ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ల్యాబ్ టెక్నీషియన్ ప్రవీణ్, సంతోష్, కిరణ్, ప్రశాంత్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
తల్లి త్యాగం.. నిలిచిన ప్రాణం..
ముస్తాబాద్(సిరిసిల్ల): తన జీవితం ఉన్నంత కాలం పేగు తెంచుకుని పుట్టిన సంతానం కోసం ఎంతటి త్యాగానికై న సిద్ధపడుతుంది అమ్మ. అందుకు నిలువెత్తు సాక్ష్యమే రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్కు చెందిన అరుట్ల భాగ్యమ్మ. అరుట్ల రాజిరెడ్డి– భాగ్యమ్మ దంపతుల కుమారుడు అరుట్ల మహేశ్రెడ్డి వంశపారపర్యంగా వచ్చిన కిడ్నీ వ్యాధితో అస్వస్థతకు గురయ్యాడు. రెండేళ్ల క్రితం ఆస్పత్రిలో చేరగా రెండు కిడ్నీలు చెడిపోయాయి. అత్యవసరంగా కిడ్నీ మార్పిడి చేస్తేనే ప్రాణపాయం నుంచి బయటపడుతాడని వైద్యులు తెలిపారు. మరో ఆలోచన లేకుండా తల్లి భాగ్యమ్మ తన కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. అన్ని పరీక్షలు చేసిన వైద్యులు 15నెలల క్రితం సర్జరీ చేసి భాగ్యమ్మ ఒక కిడ్నీని మహేశ్రెడ్డి వేశారు. అప్పుడు భాగ్యమ్మ కొడుకును కాపాడుకునేందుకు చేసి న త్యాగంతో ఇప్పుడు మహేశ్రెడ్డి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉన్నాడు. అమ్మ తనకు మరోసారి పునర్జన్మనిచ్చిందని, ఆమె త్యాగం వెలకట్టలేనిదని మహేశ్రెడ్డి అంటున్నారు. – మరిన్ని కథనాలు 10లోu తెలియదుఅవును12 48పేరెంట్స్ను పట్టించుకోకుంటే కఠిన చర్యలు అవసరమేనా?40వద్దు -
నేడు లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం
వేములవాడఅర్బన్: రాజన్న దత్తత ఆలయం నాంపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం ఆదివారం నిర్వహించనున్నట్లు ఈవో వినోద్రెడ్డి తెలిపారు. నాంపల్లిగుట్టపై శనివారం ఆలయ ఉద్యోగులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఆలయ ఈఈ రాజేశ్, డీఈ మహిపాల్రెడ్డి, ఏఈ రాంకిషన్రావు తదితరులు ఉన్నారు. నేడు ఇస్కాన్లో నరసింహ జయంతి సిరిసిల్లటౌన్: ఇస్కాన్ మందిరంలో ఆదివారం నృసింహస్వామి జయంతి నిర్వహిస్తున్నట్లు మందిరం మేనేజర్ ప్రాణనాథ అచుత్దాస్ తెలి పారు. ప్రెస్క్లబ్లో శనివారం వివరాలు వెల్లడించారు. -
నేతన్నల ఖాతాల్లో యారన్ సబ్సిడీ
● 3,019 మంది బ్యాంకు ఖాతాల్లో రూ.5.24 కోట్లు ● 2023 నాటి బతుకమ్మ చీరల సొమ్ము జమసిరిసిల్ల: స్థానిక వస్త్రపరిశ్రమలో 2023లో బతుకమ్మ చీరలు నేసిన కార్మికులకు 10శాతం యారన్ సబ్సిడీ డబ్బులను చేనేత, జౌళిశాఖ అధికారులు విడుదల చేశారు. 3,019 మంది పవర్లూమ్ కార్మికుల బ్యాంకు ఖాతాల్లో రూ.5.24కోట్లు జమ చేశారు. మొదటి విడతగా 3,019 మందికి డబ్బులు వస్తాయని, రెండో విడతలో మరో 1,481 మంది ఖాతాల్లో జమవుతాయని అధికారులు తెలిపారు. సిరిసిల్లలో పవర్లూమ్ కార్మికులకు మెరుగైన కూలీ(పగార్) అందించేందుకు 2019లో పది శాతం యారన్ సబ్సిడీని పథకాన్ని అమలు చేశారు. సాంచాలపై కార్మికుడు ఉత్పత్తి చేసిన బతుకమ్మ చీరల బట్ట ఆధారంగా ఒక్కో మీటరుకు కూలీపై అదనంగా రూ.1.42 చొప్పున చెల్లిస్తారు. ఎన్ని మీటర్ల బట్టను ఉత్పత్తి చేస్తే అన్ని డబ్బులను చేనేత, జౌళిశాఖ అధికారులు కార్మికుడి బ్యాంకు ఖాతా లో జమచేస్తారు. ఒక్కో కార్మికుడికి రూ.10 వేల నుంచి రూ.24 వేల వరకు జమయ్యాయి. -
మేరా భారత్ మహాన్
సిరిసిల్లటౌన్: మేరా భారత్ మహాన్..భారత్ మాతాకీ జై.. అనే నినాదాలతో సిరిసిల్ల హోరెత్తింది. పాకిస్థాన్తో భారత జవాన్లు వీరోచితంగా పోరాడుతుండడంపై జిల్లా కేంద్రం హర్షాతిరేకలు వ్యక్తమయ్యాయి. కుల, మతాలకతీతంగా సబ్బండ వర్గాలు ఏకమై శనివారం రాత్రి భారత సైన్యం సాహసోపేతాన్ని కొనియాడుతూ ‘త్రివర్ణ సిందూర్ ర్యాలీ’ నిర్వహించారు. చేనేతన్న విగ్రహం నుంచి అంబేడ్కర్చౌక్, గాంధీచౌక్, పెద్దబజార్ మీదుగా వేలాది సంఖ్యలో పౌరులు మువ్వన్నెల జెండాలను చేతబూని ర్యాలీలో పాల్గొన్నారు. బీజేపీ జిల్లా, పట్టణ అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, దుమాల శ్రీకాంత్, ప్రెస్క్లబ్ అధ్యక్షుడు ఆకుల జయంత్కుమార్, సామాజిక సమరసత వేదిక అధ్యక్షుడు మోర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మిల్లర్లు కోతలు విధించొద్దు
● ధాన్యం తరలింపులో జాప్యం చేస్తే లారీ కాంట్రాక్టర్కు జరిమానా ● కలెక్టర్ సందీప్కుమార్ ఝా సిరిసిల్ల/చందుర్తి/కోనరావుపేట(వేములవాడ): కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యంలో రైస్మిల్లర్లు కోతలు విధించొద్దని కలెక్టర్ సందీప్కుమార్ ఝా సూచించారు. చందుర్తి మండలం మూడపల్లి, మర్రిగడ్డ, మల్యాల, కోనరావుపేట మండలం బావుసాయిపేట, గోవిందరావుపేట తండా, వట్టిమల్ల, గొల్లపల్లి, నిమ్మపల్లి గ్రామాల్లో ఐకేపీ కొనుగోలు కేంద్రాలను శనివారం తనిఖీ చేశారు. కేంద్రాల్లో ఎంత ధాన్యం ఉంది, ఇప్పటి వరకు ఎంత కొనుగోలు చేశారన్నది నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షాలకు తడవకుండా ఉండేందుకు తూకం వేసిన ధాన్యాన్ని వెంటవెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు. బస్తాల సరఫరాలో జాప్యం చేయడం ద్వారా వర్షాలకు ధాన్యం తడిస్తే లారీల కాంట్రాక్టర్ల నుంచి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. డీఆర్డీవో శేషాద్రి, ఐకేపీ ఏపీఎంలు రజిత, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు. పాలీసెట్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు జిల్లాలో ఈనెల 13న నిర్వహించే పాలీసెట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆదేశించారు. పాలీసెట్ నిర్వహణపై ఆయా శాఖల అధికారులతో కలెక్టరేట్లో శనివారం సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఉదయం 11 నుంచి 1.30 గంటల వరకు నిర్వహించే టీజీ పాలీసెట్కు జిల్లాలో 2,136 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. ఏడు పరీక్ష కేంద్రాలను సిద్ధం చేసినట్లు వివరించారు. ఫస్ట్ ఎయిడ్కిట్, ఓఆర్ఎస్ ప్యాకెట్లతో మెడికల్ క్యాంపు ఏర్పా టు చేయాలని సెస్, వైద్య అధికారులకు సూచించారు. అదనపు ఎస్పీ చంద్రయ్య, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, పాలీటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకరాచారి, జిల్లా వైద్యాధికారి రజిత, సిరిసిల్ల తహసీల్దార్ మహేశ్, మున్సిపల్ కమిషనర్ పి.వాణి, ఆర్టీసీ డీఎం ప్రకాశ్రావు పాల్గొన్నారు. -
అమ్మే అన్నీ తానై..
సాక్షిప్రతినిధి, కరీంనగర్ ●: కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం 2017 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయన ఉన్నత స్థానంలో ఉండటానికి కారణం ఆయన తల్లి నూర్జహాన్. ఐదుగురు కుమారుల్లో గౌష్ ఆలం చిన్నవాడు. ఆయన సోదరుల్లో ఇద్దరు మర్చంట్ నేవీలో, ఒకరు పరిశోధనా శాస్త్రవేత్తగా, మరొకరు రేడియాలజిస్ట్ డాక్టర్గా స్థిరపడ్డారు. తండ్రి సయ్యద్ ఆలం భారత సైన్యంలో సుబేదార్గా పనిచేశారు. 1993లో రోడ్డు ప్రమాదంలో మరణించారు. తండ్రి మరణించినప్పుడు గౌస్ ఆలం ఏడాది పిల్లవాడు. ఆ సమయంలో వారి కుటుంబం ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. సమాజం ఒంటరి మహిళ ఉద్యోగం చేయడాన్ని అంగీకరించని రోజుల్లో, ఐదుగురు పిల్లల బాధ్యతను తనపై వేసుకుని నూర్జహాన్ ధైర్యంగా ముందుకు సాగారు. భర్త మరణించిన మూడేళ్ల తర్వాత, ఆమె ఢిల్లీ ఆర్డినెన్స్ డిఫెన్స్లో క్లర్క్గా ఉద్యోగంలో చేరారు. ఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయంలో గౌస్ ఆలం పాఠశాల విద్య సాగింది. తల్లి కోరిక మేరకు యూనిఫాం సర్వీస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆ కలను నిజం చేయడానికి నూర్జహాన్ ఎంతో కష్టపడ్డారు. అనేక సమస్యలను ఎదుర్కొంటూ తమ పిల్లలకు మంచి చదువు చెప్పించారు. ఆ కష్టానికి ఫలితమే ఈరోజు తాము ఈస్థాయిలో ఉన్నామని గౌస్ ఆలం గర్వంగా చెబుతున్నారు. తల్లి సంపాదనతో పాటు, తండ్రి పెన్షన్, ప్రభుత్వం నుంచి వచ్చిన స్కాలర్షిప్ల ద్వారా చదువుకోగలిగామని తెలిపారు. తండ్రి మరణం తర్వాత కుటుంబ బాధ్యతలన్నీ తన తల్లి ఒక్కరే మోశారని ఆయన గుర్తుచేసుకున్నారు. తనతల్లి చూపిన ధైర్యానికి, చేసిన త్యాగానికి శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఆమెకు హృదయపూర్వక మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అమ్మ.. రెండక్షరాలు కాదు.. సృష్టికి మూలం.. మానవ పుట్టుకకు సాక్ష్యం.. తన రక్తాన్ని పంచి బిడ్డకు ప్రాణం పోస్తుంది. ప్రాణాన్ని ఫణంగా పెట్టి ప్రపంచానికి పరిచయం చేస్తుంది. అక్షరాలు నేర్పి లక్షణంగా పెంచుతుంది. బుడిబుడి అడుగులు వేయించి సమాజం వైపు నడిపిస్తుంది. పిల్లలకు చిన్న ప్రమాదం ఏర్పడినా.. తల్లడిల్లిపోతుంది. కంటికి రెప్పలా చూసుకుంటూ.. జీవితానికి దారి చూపుతుంది. పిల్లలు ఎదుగుతున్న కొద్ది గొప్పగా భావిస్తుంది. 50 ఏళ్లు వచ్చినా.. తన బిడ్డలు ఇంకా చిన్నారులే అంటూ.. ప్రేమను చాటుతుంది. ఇలా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు మాతృమూర్తులు తమ బిడ్డలకోసం అష్టకష్టాలు పడి జీవితంలో స్థిరపడేలా చేశారు. భర్త దూరమైనా అధైర్య పడకుండా బిడ్డలను జీవితంలో నిలబెట్టిన వారు కొందరైతే.. ఆపదలో ఉన్న పిల్లలకు అవయవాలు దానం చేసినవారు మరికొందరు ఉన్నారు. నేడు మదర్స్డే సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని ఆదర్శ మాతృమూర్తులపై ప్రత్యేక కథనం!! -
ఆదివారం శ్రీ 11 శ్రీ మే శ్రీ 2025
అమ్మ ప్రేమకు జై.. సాక్షి, పెద్దపల్లి: మన జీవితంలో అన్నిదశల్లో వెంటుండే అమ్మను ప్రేమించేందుకు ఒక్కరోజు తప్పనిసరని యువత భావిస్తోంది. మదర్స్ డే రోజు అమ్మకు గ్రీటింగ్ కార్డు, కేకులు, పూలు కానుకలుగా ఇస్తే సరిపోదు. మన జీవితంలోని ప్రతిక్షణాన్ని అమ్మకు అంకితం చేసినా తక్కువేనని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. నేడు మదర్స్డే సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు అంశాలపై 100 మందిని ప్రశ్నించగా.. చెప్పిన సమాధానాలు ఇవీ.. ఫోన్లో/వీడియోకాల్లో మాట్లాడుతాంఅవసరం లేదుబహుమతులు ఇస్తాం చాలా ముఖ్యం053123 తల్లుల పాత్రను గౌరవించడానికి మదర్స్డే ముఖ్యమా?58మదర్స్ డే రోజు మీ తల్లిని ఎలా విష్ చేస్తారు? 37అమ్మతో గడుపుతాంకొంత ముఖ్యం 46 -
శ్రద్ధ లేదు.. శుద్ధి కాదు!
సిరిసిల్ల: సిరిసిల్ల మురికి నీరు ఇలా పట్టణ శివారులోని తుమ్మలకుంటలో కలుస్తుంది. అక్కడి నుంచి మానేరు వాగులో కలిసి మధ్యమానేరు జలాశయంలోకి చేరుతుంది. ఆ నీటినే మిషన్ భగీరథ ద్వారా శుద్ధిచేసి తాగునీరుగా జిల్లాలోని అన్ని జనవాసాలకు అందిస్తున్నారు. ఇలా చేయడం ప్రజారోగ్యానికి ఎప్పటికై నా ముప్పే అని భావించిన అధికారులు మురికి సమస్యను శాశ్వతంగా తొలగించేందుకు పట్టణ శివారులోని శాంతినగర్ వద్ద సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ)ను ఏర్పాటు చేశారు. పద్మనగర్లో లోపభూయిష్టంగా నిర్మాణం పద్మనగర్ ప్రాంతంలో మురికి నీటిని శుద్ధి చేసేందు కు ఏర్పాటు చేసిన ఇంప్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఈటీపీ) విఫలమైంది. మున్సిపల్, ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణ లోపంతో రూ.1.98 కోట్లతో 2019లో నిర్మించిన మినీ ఈటీపీ ప్లాంటు పనికి రాకుండా పోయింది. మురికి కాల్వకు అడ్డంగా మురికి నీరు శుద్ధి అయ్యే విధంగా ఈటీపీ ప్లాంటును నిర్మించాల్సి ఉండగా.. నీరు కిందనుంచి వెళ్లిపోయే విధంగా ప్లాంటును పైకి నిర్మించారు. ఫలితంగా ఈటీపీ ప్లాంట్ నిర్మించిన నాటి నుంచి నిరుపయోగమే అయింది. దీంతో శాంతినగర్లో ఎస్టీపీ ప్లాంటును ఏర్పాటు చేశారు. రూ.61.25 కోట్లతో ఎస్టీపీ ప్లాంటు పట్టణంలో ప్రధాన మురికి కాల్వలు రెండు ఉన్నా యి. ఈ కాల్వల్లో వచ్చే మురికి నీటిని శుద్ధిచేసి మా నేరు వాగులోకి వదలిపెట్టే లక్ష్యంతో శాంతినగర్ డబుల్ బెడ్రూం ఇళ్ల కాలనీ వద్ద సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంటు (ఎస్టీపీ) ఏర్పాటు చేశారు. ఆరు ఎకరాల భూమిని కొనుగోలు చేసి రూ.61.25 కోట్లతో ఎస్టీపీని నిర్మించారు. 2022లో పనులు ప్రారంభించగా.. 90శాతం పూర్తి అయ్యాయి. మురికి నీటిని శుద్ధిచేసే యంత్రాలను బిగించాల్సి ఉంది. ఇవిపూర్తయితే మురికి నీటి శుద్ధి సాధ్యమవుతుంది. బిల్లులు రాక.. పనులు పెండింగ్ ప్లాంటు నిర్మించిన కాంట్రాక్టర్కు రూ.30 కోట్ల మేరకు బిల్లులు పెండింగ్లో ఉండడంతో బ్యాలెన్స్ పనులు చేయడం లేదు. ఫలితంగా ఎస్టీపీ ప్లాంటు వినియోగంలోకి రావడం లేదు. మురికి నీటితో భూగర్భ జలాలు కలుషితమవుతూనే ఉన్నాయి. ప్లాంటును పూర్తి చేయాలని కలెక్టర్, మున్సిపల్ ప్రత్యేక అధికారి సందీప్కుమార్ ఝా పలు మార్లు సమీక్షించారు. కాంట్రాక్టర్తో మాట్లాడి పనులు పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. భారీగా బిల్లులు పెండింగ్లో ఉండడంతో ఎస్టీపీ పనులు పురోగతి సాధించడం లేదు. సిరిసిల్ల మురుగు ‘శుద్ధి’ అయ్యేనా? రూ.61.25 కోట్లతో ఎస్టీపీ ఏర్పాటు బిల్లులు రాక మధ్యలో ఆగిన పనులు పెండింగ్లో యంత్రాల బిగింపు ఇది సిరిసిల్ల నడిబొడ్డున ప్రవహించే ప్రధాన మురికి కాలువ. ఒకప్పుడు ఇది మంచినీరు పారే ఉదారువాగు. సాయినగర్ మానేరువాగు నుంచి మంచినీరు ఈ కాలువలో ప్రవహిస్తే పట్టణవాసులు బిందెలతో తీసుకెళ్లి తాగేవారు. ఇది 50 ఏళ్ల కిందటి ముచ్చట. కాలక్రమంలో మురికినీటి కాలువగా మారింది. అంబేద్కర్నగర్ గుండా వెళ్లే ఈ కాలువలో పట్టణ మురికి అంతా ప్రవహిస్తోంది.సిరిసిల్లలో వార్డులు: 39పట్టణ జనాభా: 1.05 లక్షలు విస్తీరణం: 55.47 చదరపు కిలోమీటర్లు ప్రధాన మురికి కాల్వలు: 02కుటుంబాల సంఖ్య: 33,608 ఇది సిరిసిల్ల పాత బస్టాండు, శాంతినగర్ గుండా ప్రవహించే కచ్ఛా మురికి కాలువ. పట్టణంలోని అద్దకం (డయింగ్) యూని ట్లలో వాడే రంగులు, రసాయనాలు, వ్యర్థ జలాలు ఈ కాల్వలో పారుతుంటాయి. వర్షాకాలంలో వరద పోటెత్తి చెరువులను దాటి మధ్యమానేరు వాగులో కలుస్తుంది.పనులు పూర్తి చేయిస్తాం సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంటు(ఎస్టీపీ) నిర్మాణ పనులు చాలా వరకు పూర్తి అయ్యాయి. కొన్ని పనులు చేయాల్సి ఉంది. కాంట్రాక్టర్తో మాట్లాడి పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటాం. ఎస్టీపీ పూర్తి అయితే సిరిసిల్ల మురికి నీటిని శుద్ధి సాధ్యమవుతుంది. – వరుణ్, డీఈఈ, పబ్లిక్ హెల్త్, సిరిసిల్ల -
ఉచిత శిక్షణ.. ఉన్నతికి నిచ్చెన
● స్వచ్ఛంద సంస్థల సేవ.. విద్యార్థుల భవితకు తోవ ● సద్వినియోగం చేసుకుంటున్న పేద విద్యార్థులుసిరిసిల్లకల్చరల్: కార్మిక క్షేత్రంలో నిరుపేద విద్యార్థులకు ఉచిత శిక్షణ వారి ఉన్నతికి ఆలంబనగా నిలుస్తోంది. జిల్లా కేంద్రంలో పలు స్వచ్ఛంద, ధార్మిక సంస్థల నేతృత్వంలో పోటీ పరీక్షలకు ఇస్తున్న ఉచిత శిక్షణతో కార్మిక కుటుంబాల పిల్లలకు మేలు కలుగుతోంది. సిరిసిల్లలో వివిధ ప్రభుత్వ ఉద్యోగులు, వృత్తి రంగ నిపుణుల ఐక్య వేదికగా పోపా (పద్మశాలి అఫిషియల్స్, ప్రొఫెషనల్స్ అసోసియేషన్) మూడు దశాబ్దాలుగా పలు సామాజిక సేవలు అందిస్తోంది. ప్రతి వేసవిలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు నెల రోజుల పాటు ఉచితంగా పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష కోసం శిక్షణ ఇస్తోంది. సుమారు 120 మంది విద్యార్థులు రోజూ తరగతులకు హాజరవుతున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల వేదికగా ఆయా సబ్జెక్టుల్లో నిపుణులైన పద్మశాలి ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయులు తమ సేవలను స్వచ్ఛందంగా అందిస్తున్నారు. శ్రీ సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో.. కొన్నేళ్లుగా సిరిసిల్లలో శ్రీ సత్యసాయి సేవాసమితి ధార్మిక సంస్థ డైట్ సెట్, పాలీసెట్లకు ఉచిత శిక్షణ తరగతులను నిర్వహిస్తోంది. కోవిడ్ సమయంలో అంతరాయం ఏర్పడినా తిరిగి యథావిధిగా క్లాసులు నిర్వహిస్తోంది. వాసవీనగర్లోని సమితికి చెందిన మందిరంలో పాలిటెక్నిక్ శిక్షణకు వందమందికి పైగా విద్యార్థులు హాజరవుతున్నారు. సత్యసాయి భక్తులైన సబ్జెక్టు నిపుణులు స్వచ్ఛందంగా తమ సేవలు అందిస్తున్నారు. -
పత్రికా స్వేచ్ఛపై దాడి సరికాదు
సిరిసిల్లటౌన్: పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సింది పోయి అక్రమంగా దాడులకు పాల్పడటం సిగ్గుచేటని జర్నలిస్టులు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంట్లో పోలీసులు వారెంటు లేకుండా సోదాలు చేయడాన్ని ఖండించారు. ఈ మేరకు శుక్రవారం సిరిసిల్ల ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఆర్డీవో కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టి ధర్నా చేపట్టారు. ‘సాక్షి’ ఎడిటర్ ఇంటిపై పోలీసుల దాడిని ఖండిస్తున్నామని అన్నారు. ప్రెస్క్లబ్ అధ్యక్షుడు ఆకుల జ యంత్కుమార్,ప్రధాన కార్యదర్శి ఆడెపు మహేందర్, కరుణాల భద్రాచలం, టీవీ నారాయణ, ఊరడి మల్లికార్జున్, రాపెల్లి సంతోష్, కాంబోజి ముత్యం, కాయితీ బాలు, పాలమాకుల శే ఖర్, ప్రెస్క్లబ్ ఉపాధ్యక్షుడు బొడ్డు పర్శరాములు, కోశాధికారి వంకాయల శ్రీకాంత్, సహాయ కార్యదర్శి కంకణాల శ్రీనివాస్, సభ్యులు పాల్గొన్నారు. ● సిరిసిల్లలో నల్ల బ్యాడ్జీలతో జర్నలిస్టుల నిరసన ర్యాలీ -
బ్యాంకు రుణాల్లో జిల్లాకు అవార్డు
● డీఆర్డీవో, సిబ్బందికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అభినందనసిరిసిల్ల: స్వశక్తి సంఘాలకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించడంలో ఉత్తమ సేవలు అందించిన జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కలెక్టరేట్లో శుక్రవారం అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2024–25లో 7,969 సంఘాలకు రూ.533.73 కోట్లు లక్ష్యంకాగా రూ. 542.30 కోట్లతో 102శాతం ప్రగతి సాధించారని పేర్కొన్నారు. ఒక్కో గ్రూప్ ఫైనాన్స్ రూ.12.48 లక్షలు ఇవ్వడంలో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉన్నారన్నారు. దీంతో రాష్ట్రస్థాయిలో జిల్లాకు అవార్డు వచ్చిందన్నారు. పీఆర్ మంత్రి సీతక్క, ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేశ్కుమార్, సీఈవో సెర్ప్ దివ్య దేవరాజన్ చేతుల మీదుగా డీఆర్డీవో, అదనపు డీఆర్డీవో, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు సరిత అవార్డు స్వీకరించారని తెలిపారు. రివకరీలోనూ 99.74 శాతం బ్యాంకు లింకేజీ రికవరీ 99.74 శాతంతో రాష్ట్రంలో జిల్లా రెండోస్థానంలో ఉందని, 2023–24 ఆర్ధిక సంవత్సరంలోనూ లక్ష్య సాధనలో భాగంగా బ్యాంకు లింకేజీ 106 శాతం సాధించారని కలెక్టర్ వెల్లడించారు. ఆర్థికంగా ప్రగతి సాధించి ఆయా కుటుంబాలు తమ పిల్లల ఉన్నత విద్యాభ్యాసానికి బ్యాంకు రుణాలు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ ఏడాది కూడా రాష్ట్రంలో జిల్లాను మొదటి స్థానంలో నిలిపేందుకు డిసెంబరులోగా లక్ష్యం సాధించాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా కోరారు. డీఆర్డీవో శేషాద్రి, అదనపు డీఆర్డీవో గొట్టె శ్రీనివాస్ పాల్గొన్నారు. సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం జిల్లాలో లైసెన్స్ సర్వేయర్ల శిక్షణకు ఆసక్తి గల అభ్యర్థులు మే 17వ తేదీలోగా దరఖాస్తులు చేయాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఒక ప్రకటనలో కోరారు. లైసెన్స్ సర్వేయర్ల శిక్షణ కోసం అర్హత గల అభ్యర్థుల నుంచి తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ దరఖాస్తులు ఆహ్వానిస్తుందన్నారు. మే 5 నుంచి మీ సేవా కేంద్రాలలో రూ.100 చెల్లించి దరఖాస్తు నమోనాలను పొందవచ్చన్నారు. ఇంటర్లో గణితంలో 60శాతం మార్పులు సాధించిన వారు, ఐటీఐ డ్రాప్ట్స్మెన్(సివిల్) డిప్లమా, బీటెక్ (సివిల్) అర్హతలు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఎంపికై న అభ్యర్థులకు 50 పని దినాలలో (మే 26 నుంచి జూలై 26 ) శిక్షణ ఇస్తామని, శిక్షణ కోసం ఓసీ అభ్యర్థులు రూ.10వేలు, బీసీలు రూ.5వేలు, ఎస్సీ, ఎస్టీలు రూ.2500 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఇతర వివరాలకు 98490 81489, 70326 34404, 94419 47339 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
పిల్లలకోసం మా వంతుగా
మండే ఎండల్లో తరగతులకు హాజరవుతున్న విద్యార్థులకు స్నాక్స్ అందించా లని నేనూ, మా స్నేహితులు ముందుకు వచ్చాం. పత్తిపాక దామోదర్, మోర విష్ణు, పత్తిపాక మధు, కారంపురి శ్యాంసుందర్, గుడ్ల ప్రభాకర్, నాగుల రవీందర్, దాసరి నాగేశ్వర్, సబ్బని భాస్కర్తో కలిసి రోజూ అరటి పండ్లు, స్నాక్స్ అందిస్తున్నాం. ఎల్లారెడ్డిపేట ఎంఈవో గాలిపెల్లి కృష్ణహరి, మోర దామోదర్ తాగునీటి వసతి కల్పిస్తున్నారు. – గాజుల ప్రతాప్, విశ్రాంత ప్రిన్సిపాల్ పేద పిల్లలకు వరప్రసాదం నేత పరిశ్రమపై ఆధారపడిన ఎంతో మంది కార్మిక కుటుంబాలకు పాలిసెట్ ఉచిత శిక్షణ వరప్రసాదంగా మారింది. ఏటా 100 మందికి పైగా విద్యార్థులు ప్రయోజనం పొందుతున్నారు. గతేడాది ఉత్తమ ఫలితాలను సాధించడం ప్రేరణగా నిలిచింది. అదే స్ఫూర్తితో ఈ సారి కూడా కొనసాగిస్తున్నాం. స్వచ్ఛంద సేవలందిస్తున్న ఉపాధ్యాయులకు పోపా తరఫున ధన్యవాదాలు. – మామిడాల భూపతి, పోపా ఉపాధ్యక్షుడు పుష్కర కాలంగా పదేళ్లకు పైగా సమితి సారథ్యంలో పిల్లలకు పలు పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ తరగతులు కొనసాగిస్తున్నాం. డైట్ సెట్ ద్వారా సీట్లు సాధించిన చాలా మంది విద్యార్థులు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఎంపికై జీవితంలో స్థిరపడడం చాలా సంతృప్తి కలిగించే అంశం. ఏటా 150 మంది పిల్లలు ఈ శిబిరం ద్వారా ప్రయోజనం పొందడం సమితి సభ్యులకు సంతోషాన్ని కలిగిస్తోంది. – గోశికొండ బాలరాజు, శిబిరం నిర్వాహకుడు -
ప్రభుత్వ ఆస్పత్రిపై రెడ్క్రాస్ గుర్తు
వేములవాడఅర్బన్: యుద్ధమేఘాలు కమ్ముకున్న వేళ ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని ఆస్పత్రుల భవనాలపై పన్నెండు అడుగుల పొడవు, వెడల్పుతో రెడ్క్రాస్ గుర్తు వేయడం జరిగిందని వేములవాడ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలయ్య తెలిపారు. వేములవాడ ఏరియా ఆసుపత్రి భవనంపై సైతం గుర్తును వేశామని పేర్కొన్నారు. యుద్ధ సమయంలో అత్యవసర వైద్యసేవలు అందించే ఆసుపత్రుల మీద దాడులు చేయకూడదనే జెనీవాలో కుదుర్చుకున్న అంతర్జాతీయ యుద్ధ నియమాల్లో భాగంగా, గుర్తు వేయడం జరిగిందన్నారు. దర్శావళి ఉత్సవాలకు రండి ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలోని దర్శావళి దర్గా వద్ద ఈ నెల 14,15 తేదీల్లో నిర్వహించే ఉర్సు ఉత్సవాలకు రావాలని కోరుతూ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్కు శుక్రవారం నిర్వాహకుడు అజీజ్బాయి ఆహ్వాన పత్రిక అందజేశారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజ్మతుల్లా హుస్సేన్ను కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. ముస్లిం కమిటీ సభ్యులు చాంద్పాషా, షేక్ సాహెబ్, షేక్ గౌస్, మహమ్మద్ జబ్బర్, జహాంగీర్, ఇర్ఫాన్, గౌస్ పాల్గొన్నారు. చేనేత శిల్పికి సన్మానం సిరిసిల్ల: అగ్గిపెట్టెలో ఇమిడే చీర సృష్టికర్త, సిరిసిల్ల చేనేత శిల్పి నల్ల విజయ్కుమార్ను ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్లో శుక్రవారం హరి యాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ సన్మానించారు. అగ్గిపెట్టలో ఇమిడే చీర, బంగారు, వెండిపోగులతో తయారు చేసిన చీరను మగ్గంపై నేసి అబ్బుర పరిచారు. ఆ చీరను దత్తాత్రేయ సతీమణికి ఉప రాష్ట్రపతి జగదీశ్ దినకరగ్ చేతుల మీదుగా బహుకరించారు. విజయ్ కుమార్ను దత్తాత్రేయ అభినందించారు. ఇంటర్లో స్పాట్ కౌన్సెలింగ్ సిరిసిల్ల: ఇంటర్ 2025–26 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో ఎస్టీ బాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రాంతీయ సమన్వయ అధికారి డీ.ఎస్.వెంకన్న శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్టీ గురుకుల జూనియర్ కళాశాల (బాలికలు), సిరిసిల్ల ఎస్టీ గురుకుల జూనియర్ కళాశాల (బాలికలు), మానాల (వేములవాడ), ఎస్టీ గురుకుల జూనియర్ కళాశాల (బాలికలు), అక్కన్నపేట (హుస్నాబాద్), ఎస్టీ గురుకుల జునియర్ కళాశాల మంథనిలో సీట్ల భర్తీకి స్పాట్ కౌన్సెలింగ్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల (బాలికలు), సిరిసిల్ల (ఇందిరమ్మ కాలనీ) సారంపల్లిలో మే 16న నిర్వహించే కౌన్సెలింగ్ హాజరు కావాలని కోరారు. 10వ తరగతి ఉత్తీర్ణులు అయిన బాల, బాలికలు అన్నీ ఒరిజి నల్ ధృవీకరణ పత్రాలతో పాటు, ఒక సెట్ జిరాక్స్ తీసుకొని వచ్చి అడ్మిషన్లు పొందవచ్చని వెంకన్న కోరారు. వివరాలకు ఫోన్ నంబర్ 83339 25362ను సంప్రదించాలన్నారు. -
ఎండుతున్న మొక్కలు
ముస్తాబాద్: ముస్తాబాద్– కామారెడ్డి ప్రధాన రహదారి పక్కన మొక్కలు నీరు లేక ఎండిపోతున్నాయి. ముస్తాబాద్, నామాపూర్ మధ్య ఈ పరిస్థితి నెలకొంది. మొర్రాయిపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని రెండు కిలోమీటర్ల పరిధిలో రహదారి పక్కన ఉన్న మొక్కలకు పంచాయతీ సిబ్బంది నీరందించడం లేదు. మండువేసవిలో మొక్కలు ఎండుతున్నా... పట్టించుకోవడం లేదని ప్రజలు అంటున్నారు. పంచాయతీలో నిధులున్నా.. మొక్కలను కాపాడుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని, ట్యాంకర్ల ద్వారా నీరు పట్టాల్సి ఉండగా.. పట్టించుకోవడం లేదని పేర్కొంటున్నారు. -
ఇసుక రీచ్లు తెరవాలి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్, పదిర, వెంకటాపూర్ గ్రామాల్లో ఇసుక రీచ్లు ప్రారంభించాలని ట్రాక్టర్ యూనియన్ల ఆధ్వర్యంలో శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద సిరిసిల్ల– కామారెడ్డి ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. రెండు గ్రామాల నుంచి 70ట్రాక్టర్లతో తరలివచ్చారు. కలెక్టర్ ఆదేశాలతో నారాయణపూర్, వెంకటాపూర్ ఇసుక రీచ్లను రద్దు చేశారు. పదిర రీచ్కు మాత్రమే అనుమతులు ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. దీంతో తమ గ్రామాల్లోనూ రీచ్లు ప్రారంభించాలని ఆందోళన నిర్వహించి, తహసీల్దార్ సుజాతకు వినతిపత్రం ఇచ్చారు. -
మూడు కేజీబీవీలు అప్గ్రేడ్
● బోయినపల్లి, ఇల్లంతకుంట, వేములవాడ అర్బన్ మండలాల్లో ఇంటర్ తరగతులు ● ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభంబోయినపల్లి(చొప్పదండి): జిల్లాలోని మరో మూడు కేజీబీవీలు కళాశాలలుగా అప్గ్రేడ్ కానున్నాయి. బోయినపల్లి, ఇల్లంతకుంట, వేములవాడ అర్బన్ మండలాల కేజీబీవీల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ కోర్సులు అందించనున్నాయి. ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు బోయినపల్లిలో ప్రచారం చేస్తున్నారు. ఒక్కో కళాశాలలో రెండు కోర్సులు, క్లాస్కు 40మంది విద్యార్థినులతో సీట్లు భర్తీ చేయనున్నారు. బోయినపల్లిలో బైపీసీ, ఎంఎల్టీ, ఇల్లంతకుంటలో ఎంపీసీ, బైపీసీ, వేములవాడఅర్బన్లో సీఈసీ, ఏఐ కోర్సులు ప్రవేశపెట్టారు. విద్యాబోధనకు కావాల్సిన ఫ్యాకల్టీని వచ్చే నెలలో నియామకం చేస్తారని అధికారులు తెలిపారు. విద్యార్థినులకు అవసరమైన వసతులు జూన్లోపు పూర్తి చేయనున్నారు. ‘బోయినపల్లి కేజీబీ వీ కళాశాలలో ఈ విద్యాసంవత్సరంలో ఇంటర్ మొదటి సంవత్సరానికి బైపీసీ, ఎంఎల్టీ ( మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్) కోర్సులు ప్రారంభిస్తున్నాం. కళాశాలలో చేరాలని ప్రచారం చేయడం జరుగుతోంది’ అని బోయినపల్లి కేజీబీవీ ఎస్వో లింగవ్వ తెలిపారు. -
చెత్త కాదు.. ఫైళ్లగుట్ట
కోనరావుపేట: కోనరావుపేట మండల పరిషత్ కార్యాలయంలోని ఉపాధి హామీ కార్యాలయం ఫైళ్లతో నిండిపోతోంది. ఫైళ్లతో సగం కార్యాలయం గుట్టలుగా పేరుకుపోయింది. గత కొన్నేళ్లుగా జరుగుతున్న ఉపాధి హామీ పనులు, సామాజిక తనిఖీకి సంబంధించిన ఫైళ్లన్నీ సంచుల్లో కట్టి పెడుతున్నారు. ఇలా పెట్టుకుంటూ ఏళ్లుగా ఇలా మూలకు పడేస్తున్నారు. దీంతో కార్యాలయంలో ఫైళ్లన్నీ గుట్టలుగా మారుతున్నాయి. సగం కార్యాలయం వీటికే పోవడమే కాకుండా క్రిమి కీటకాలు చేరే అవకాశముందని పలువురు భావిస్తున్నారు. ప్రజలు, సిబ్బంది భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. -
కదంతొక్కిన జర్నలిస్టులు
గోదావరిఖని: సాక్షి ఎడిటర్ ధనంజయ్రెడ్డి నివాసంపై ఏపీ పోలీసుల దాడిని నిరసిస్తూ పాత్రికేయులు స్థానిక బస్టాండ్ వద్ద గురువారం రాస్తారోకో నిర్వహించారు. సాక్షి ఉమ్మడి జిల్లా బ్యూరో భాషబోయిన అనిల్కుమార్ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తోందన్నారు. ‘సాక్షి’ యాజమాన్యంపై కక్ష సాధిస్తోందని దుయ్యబట్టారు. ఏపీ ప్రభుత్వ వైఖరిని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని కోరారు. రాస్తారోకోలో జర్నలిస్టులు గుడ్ల శ్రీనివాస్, కాల్వ చంద్రశేఖర్రెడ్డి, మోత్కూరి శ్రీనివాస్, కీర్తి రమేశ్, పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు. -
జిల్లాలో ఉపాధి పనుల వివరాలు
వివరాలు పనుల సంఖ్య ఖర్చు చేసిన మొత్తం చెరువుల పూడికతీత 158 రూ.2.13కోట్లు ఫాంపాండ్స్ 308 రూ.3.17కోట్లు కండిత కందకాలు 330 రూ.8.03కోట్లు ఫీడర్ చానల్ 192 రూ.3.20లక్షలు వర్షపు నీటి సంరక్షణ 06 రూ.18వేలు బోర్వేల్ రీచార్జ్ 33 రూ.2.08లక్షలు ● జిల్లాలో 11.14కోట్లతో పనులు ● కూలీలకు ఊతమిస్తున్న ఉపాధి ● భూగర్భజలాలు, నీటి వనరుల పెంపు ● అటవీప్రాంతంలో పశువులకు సమృద్ధిగా తాగునీరు ● రైతులకు ప్రయోజనాలు నీటి నిల్వలపై దృష్టి ప్రభుత్వం వృథా నీటిని పొదుపు చేసే చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఈ ఆర్థిక సంవత్సరంలో నీటి నిల్వలపై దృష్టి సారించి పనులు చేపట్టాం. ముఖ్యంగా వర్షపు నీరు వృథా కాకుండా అడవిలో కండిత కందకాలు, పారంఫాడ్స్ ఏర్పాటు చేస్తున్నాం. గత ఆర్థిక సంవత్సరంలో జిల్లావ్యాప్తంగా 968 పనులు చేపట్టి రూ.11.14కోట్లు ఖర్చు చేశాం. – కొమురయ్య, ఏపీఎం, ఎల్లారెడ్డిపేట రైతులకు ప్రయోజనాలు అడవిలో వృథా నీటిని ఒడిసి పట్టుకోవడానికి కందిత కందకాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. కందిత కందకాలు, పారంఫాండ్స్, చెక్ డ్యాంల ఏర్పాటును ఉపాధి హామీ పథకంలో చేపడుతున్నాం. దీంతో అటవీ ప్రాంతల్లో నీటి నిల్వలు పెంచడంతో పాటు కూలీలకు చేతి నిండా పని దోరుకుతుంది. నీటి నిల్వల పెంపుకు అందరూ సహకరించాలి. – శేషాద్రి, డీఆర్డీవో, సిరిసిల్లఈ మహిళా రైతు పేరు పుష్పల. ఎల్లారెడ్డిపేట మండలం సింగారం. అడవి లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కండిత కందకం నీటినిల్వలతో పశువులకు తాగునీరు అందిస్తోంది. గతంలో అటవీప్రాంతంలో కనుచూపు మేరలో నీటి సౌకర్యం లేక పశువులు తడ్లాడేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరగడంతో వ్యవసాయానికి సమీపబావులు, బోర్లలో నీరు సమృద్ధిగా ఉంటోందని రైతులు చెబుతున్నారు. పనికి వచ్చిన కూలీలు 75,756జాబ్ కార్డులు 98,130 పనికి వచ్చిన జాబ్ కార్డు కుటుంబాలు 51,088 కల్పించిన పని దినాలు 21,88,092జిల్లాలో చేపట్టిన పనులు..ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అడవిలో వృథా నీటిని ఒడిసిపట్టుకునేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఓ వైపు కూలీలకు పని కల్పిస్తూనే, భూగర్భజలాల పెంపుపై దృష్టి సారించింది. గతంలో రైతుల భూముల అభివృద్ధి, ఇతర పనులకే పరిమితమైన ఉపాధిహామీ పథకాన్ని విస్తరించి ప్రధానంగా నీటివృద్ధి పనులు చేపడుతోంది. జిల్లాలోని 13 మండలాల పరిధిలో గత ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు రూ.11.14 కోట్లతో పనులను చేపట్టారు. ప్రధానంగా చెరువుల్లో పూడికతీత, పాంపౌండ్స్, కండిత కందకాలు, ఫీడర్ చానల్, భవనాలపై పడ్డ వర్షపునీటి సంరక్షణ, బోర్వెల్ రీచార్జ్ పనుల ద్వారా నీటి నిల్వలను పెంపొందిస్తున్నారు. ఫలితంగా అడవిలోని జంతు, పక్షి జాతులకు తాగునీరు పుష్కలంగా లభిస్తోంది. రైతులకు సాగునీని ప్రయోజనం చేకూరుతోంది. ఉపాధి కూలీలకు చేతినిండ పని దొరుకుతోంది. వృథా నీటిని అరికడుతూ వర్షాకాలంలో వృథా వరద నీటిని అరికడుతూ.. నీటి వనరులను ఉపాధిహామీ పనుల ద్వారా వృద్ధి చేస్తున్నారు. పాత చెరువుల్లో పూడికతీత పనులను చేపడుతూ నీటి సామర్థ్యాన్ని పెంచుతున్నారు. పాంపాండ్స్ నిర్మాణాలు వృథా నీటిని పొదుపు చేయడానికి ఉపయోగపడుతున్నాయి. గుట్టప్రాంతాల్లో జాలువారే నీటిని కందిత కందకాలతో నిల్వ చేస్తున్నారు. అటవీ ప్రాంతం, వాగులపై ఫీడర్ చానల్ నిర్మాణాలను చేస్తూ, పొలాలకు సాగునీరు అందించే చర్యలు తీసుకుంటున్నారు. ఇలా ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే రూ.11.14కోట్లు ఖర్చు చేసి నీటిని పొదుపు చేయడం విశేషం. రానున్నకాలంలో ఈ పనులను మరింత విస్తరించడానికి జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. కూలీలకు ఉపాధి.. జిల్లావ్యాప్తంగా ఉపాధి పనుల ద్వారా ఎంతో మంది తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. జాబ్కార్డులున్న ప్రతీ ఒక్కరికి వందరోజులు పని కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అందులో భాగంగా నూతనంగా శ్రీకారం చుట్టిన నీటి పొదుపు పనులు కూలీలకు వరంగా మారాయి. జిల్లా వ్యాప్తంగా జాబ్కార్డులున్న 98,130 మంది కూలీలు 21,88,092 పని దినాలను వినియోగించుకుని ఉపాధి పొందుతున్నారు. -
రాతిచూర.. పట్టించుకోరా?
● విచ్చలవిడిగా గ్రానైట్ డస్ట్ కుప్పలు ● ప్రయాణికుల తిప్పలు ● పరిధి పేరుతో పట్టించుకోని అధికారులు బోయినపల్లి(చొప్పదండి): మండలంలోని కరీంనగర్–సిరిసిల్ల ప్రధాన రహదారిలో వెంకట్రావుపల్లి ఫోర్లేన్ రోడ్డు పరిసరాలు, కొత్తపేటలో విచ్చలవిడిగా గ్రానైట్ వ్యర్థాలు (డస్ట్) డంపింగ్ చేయడంతో గాలికి డస్ట్ లేచి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బావుపేట, గంగాధర మండలం ఒద్యారం గ్రానైట్ ఫ్యాక్టరీలనుంచి నిత్యం గ్రానైట్ కటింగ్ రాళ్ల డస్ట్ ఫోర్లేన్ రహదారికి ఇరువైపులా డంప్ చేస్తున్నారు. ఈ రహదారి మీదుగా నిత్యం వందల మంది ప్రయాణాలు చేస్తున్నారు. గాలికి డస్ట్ లేచి వాహనదారుల కళ్లలో పడుతుండడంతో అనారోగ్యం బారిన పడుతున్నారు. విచ్చలవిడిగా డంపింగ్ మండలంలోని వెంకట్రావుపల్లి, కరీంనగర్ వెళ్లే దారిలో బావుపేట, ఒద్యారం గ్రామాల్లో పెద్ద మొత్తంలో గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నారు. గ్రానైట్ ఫ్యాక్టరీల్లో పెద్ద రంపంతో ఉన్న మిషన్తో రాళ్లు కట్ చేసి స్లాబ్స్ తయారు చేస్తారు. ఈక్రమంలో తెల్లని ద్రవంరూపంలో డస్ట్ బయటకు వస్తుంది. కొన్ని ఫ్యాక్టరీలు ఆ ద్రవాన్ని స్టోర్ చేసి, పొడిగా మారిన తర్వాత విక్రయిస్తాయి. మరకొన్ని ఫ్యాక్టరీల నుంచి కొందరు డస్ట్ను తీసుకువచ్చి అక్రమంగా వెంకట్రావుపల్లి రోడ్డు పరిసరాల్లో పోస్తున్నారు. దీంతో ఈదురుగాలులు వీచినపుడు వాహనదారుల కళ్లలో డస్ట్ పడి ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల పరిధి ఏది..? బావుపేట, ఒద్యారం, వెంకట్రావుపల్లి గ్రానైట్ ఫ్యాక్టరీలు సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల సరిహద్దు గ్రామాల్లో ఉండడంతో మైనింగ్, ఆర్అండ్బీ అధికారులు తమ జిల్లా పరిధి కాదని, గ్రానైట్ వ్యర్థాల డంపింగ్పై చర్యలకు దాటవేస్తున్నారని పలువురు అంటున్నారు. కరీంనగర్, సిరిసిల్ల రెండు జిల్లాల మైనింగ్, ఆర్అండ్బీ అధికారులు సమన్వయంతో గ్రానైట్ వ్యర్థాల నుంచి ప్రయాణికులకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. -
చర్యలు తీసుకోవాలి
బావుపేట, ఒద్యారం, వెంకట్రావుపల్లి గ్రానైట్ ఫ్యాక్టరీల నుంచి వ్యర్థాలను(డస్ట్) రోడ్డు పరిసరాల్లో విచ్చలవిడిగా పారబోస్తూ చేతులు దులుపుకుంటున్నారు. రెండు జిల్లాలకు చెందిన మైనింగ్, ఆర్అండ్బీ అధికారులు యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి. గ్రానైట్ వ్యర్థాల డస్ట్తో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలి. – కొనుకటి హరీశ్, నీలోజిపల్లి కళ్లు దెబ్బతింటున్నాయి రోడ్లపై పోసిన గ్రానైట్ డస్ట్ రాతిపొడి చూర గాలికి లేవడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. బైక్లపై ప్రయాణం చేసేవారి కళ్లలో డస్ట్ పడడంతో దెబ్బతింటున్నాయి. ఒక్కోసారి బైక్లు స్కిడ్ అవడంతో ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. – దోమకొండ విజయ్, కొదురుపాక -
గవర్నర్ను కలిసిన రెడ్క్రాస్ సభ్యులు
సిరిసిల్లటౌన్: ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ జిల్లా శాఖ సభ్యులు గురువారం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ శర్మను కలిశారు. తనె 8న ప్రపంచ రెడ్క్రాస్ డే సందర్భంగా హైదరాబాద్ రాజభవన్లో జరిగిన ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ వ్యవస్థాపకులు హేండ్రి డునంట్ పుట్టినరోజు సందర్భంగా జరిగిన కార్యక్రమానికి వారు హాజరయ్యారు. కాగా, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ రక్తనిధి కేంద్రం కోసం విప్ ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు కలెక్టర్ సందీప్కుమార్ ఝా వేములవాడ మండలం తిప్పాపూర్లో వెయ్యి గజాల ప్రభుత్వ భూమిని అందించారు. సదరు స్థలంలో సొసైటీ భవన నిర్మాణం కోసం జరిగే భూపూజకు హాజరు కావాలని గవర్నర్కు వినతిపత్రం అందించగా ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిపారు. సొసైటీ రాష్ట్ర పాలక మండలి సభ్యులు, జిల్లా కమిటీ అడ్వైజర్ ఈవీ శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు గుడ్ల రవి, స్టేట్ కమిటీ సభ్యులు ప్రయాకర్రావు, వేణు కుమార్ పాల్గొన్నారు. పాఠశాల కమిటీలకు బిల్లుల చెల్లింపుసిరిసిల్ల: జిల్లాలోని 283 ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాల కమిటీలకు కలెక్టర్ సందీప్కుమార్ ఝా బిల్లులు చెల్లించారని డీఆర్డీవో శేషాద్రి గురువారం తెలిపారు. విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అమ్మ ఆదర్శ పాటశాల కమిటీల ద్వారా చేసిన పనులకు సంబంధించిన బిల్లులు ఆయా కమిటీలకు చెల్లించడం జరిగిందని వివరించారు. అసంక్రమిత వ్యాధులను ముందే గుర్తించాలి సిరిసిల్ల: అసంక్రమిత (ఎన్సీడీ) వ్యాధులను ముందే గుర్తించి వైద్యం అందిస్తే విలువైన ప్రాణాలను కాపాడినట్లు అవుతుందని ఎన్సీడీ స్టేట్ కో ఆర్డినేటర్ డాక్టర్ సత్యేంద్రనాథ్ అన్నారు. గురువారం డీఎంహెచ్వో ఆఫీస్లో జిల్లాలోని పీహెచ్సీ డాక్టర్లు, స్టాఫ్నర్సులకు శిక్షణ ఇచ్చారు. గుండెపోటు, రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ల లాంటి దీర్ఘకాలిక వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందించాలన్నారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎస్.రజిత మాట్లాడుతూ, 30 ఏళ్లు పైబడిన మహిళలు, పురుషులకు రక్త, క్యాన్సర్ పరీక్షలను నిర్వహించి వైద్యసేవలు అందించాన్నారు. కార్యక్రమంలో పీఓఎంహెచ్ఎన్ డాక్టర్ అంజలి ఆల్ఫ్రెడ్, డాక్టర్ రామకృష్ణ, పీఓఎన్సీడీ సంపత్కుమార్, డీఐవో డాక్టర్ అనిత, డాక్టర్ నహిమా జహా, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. సమ్మర్క్యాంప్లను సద్వినియోగం చేసుకోవాలి వేములవాడరూరల్: విద్యార్థులు సమ్మర్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని డీఈవో జనార్దన్రావు అన్నారు. వేములవాడరూరల్ మండలం మర్రిపల్లి కేజీబీవీలో సమ్మర్ క్యాంపును ప్రారంభించి మాట్లాడారు. 6 తరగతి నుండి 9వ తరగతి చదువుతున్న 100 మంది విద్యార్థులకు జిల్లాలోని కేజీబీవీల్లో ఈ నెల 8 నుంచి 22 వరకు శిబిరం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. శిబిరాల నిర్వహణకు సమగ్ర శిక్ష అధికారులు కార్యాచరణ రూపొందించినట్లు వివరించారు. మొదటి విభా గం ఫైన్ ఆర్ట్స్లో సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, కంప్యూటర్స్, స్కిల్ బేసిక్ కోడింగ్, రెండో విభా గమైన అకాడమిక్ ఎన్రిచ్మెంట్లో స్పీడ్ మ్యాచ్, యోగా, స్పోకెన్ ఇంగ్లిష్, వివిధ రకాల ఆటలు నేర్పిస్తారని వెల్లడించారు. వేసవి సెలవుల్లో విజ్ఞానంతో పాటు వినోదాన్ని పొందుతూ పాఠ్యాంశేతర అంశాలను నేర్చుకునే అవకాశం సమ్మర్ క్యాంప్ల ద్వారా లభిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎంఈవో లోకిని కిషన్, కేజీబీవీ ప్రత్యేక అధికారి బి పద్మ, తదితరులు పాల్గొన్నారు. -
జయహో భారత్
వాతావరణం ఆకాశం ఎండగా ఉంటుంది. గాలిలో తేమ తక్కువగా ఉంటుంది. ఉక్కపోతగా ఉంటుంది. వడగాలులు వీస్తాయి. 10లోu సిరిసిల్లటౌన్/సిరిసిల్లకల్చరల్: జయహో భారత్.. జై హింద్ నినాదాలు కార్మికక్షేత్రం సిరిసిల్లలో హోరెత్తాయి. భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ శ్రీసిందూర్శ్రీకు సంఘీభావంగా పార్టీలు, న్యాయవాదులు గురువారం కార్యక్రమాలు చేపట్టారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో ప్రదర్శన జరిపారు. సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జూపెల్లి శ్రీనివాస్రావు ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణం నుంచి అంబేడ్కర్ సర్కిల్ మీదుగా గాంధీ చౌక్ వరకు ర్యాలీ తీశారు. కాంగ్రెస్ నాయకులు, న్యాయవాదులు పాల్గొన్నారు. u -
జిల్లా కోర్టు ప్రధాన పాలనాధికారిగా మాధవి
సిరిసిల్లకల్చరల్: జిల్లా న్యాయస్థానం ప్రధాన పాలనాధికారిగా పి.మాధవి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ కోర్టు నుంచి బదిలీపై జిల్లా కోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా న్యాయవాదులు సంఘం అధ్యక్షుడు జూపెల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సంఘం ప్రతినిధులు మ ర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుఛ్చం అందించి స్వాగతించారు. జిల్లాకు మంజూరైన న్యాయనిర్మాణ్ కోర్టు భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని కోరారు. బా ర్ అసోసియేషన్ కార్యదర్శి తంగళ్లపల్లి వెంకటి, ఉపాధ్యక్షుడు అనిల్కుమార్, కోశాధికారి నరేశ్ తదితరులు పాల్గొన్నారు. వేములవాడలో 80 ఫీట్ల మేర రోడ్డు విస్తరణసిరిసిల్ల/వేములవాడ: జిల్లాలోని వేములవాడ పట్టణంలో 80 ఫీట్ల మేర రోడ్డు విస్తరణ పనులు చేపడతామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం తెలిపారు. పట్టణంలోని మూలవాగు నుంచి శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయం వరకు రోడ్డు విస్తరణ, భూసేకరణపై కలెక్టర్ ప్రకటన విడుదల చేశారు. పట్టణంలో వివిధ శాఖల అధికారుల ఆధ్వర్యంలో సర్వే చేస్తుండగా పనులు పరిశీలించామని, గజానికి ధర ఎంతో ప్రభుత్వం ఇంకా నిర్ణయించలేదన్నారు. భూసేకరణలో గజానికి ధర ఎంతో తాను ప్రకటించలేదని కలెక్టర్ స్పష్టం చేశారు. రోడ్డు డిజైన్, నిర్మాణ గడువు అంశాలను తాను ప్రస్తావించలేదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరగాలిముస్తాబాద్/గంభీరావుపేట: ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా వైద్యాధికారులు, సిబ్బంది పనిచేయాలని జిల్లా వైద్యాధికారి రజిత అన్నారు. బుధవారం ముస్తాబాద్ మండలం గూడెం, ఆవునూర్ ఆరోగ్య ఉపకేంద్రాలు, గంభీరావుపేట మండలం లింగన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న సేవలను తెలుసుకున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రసవాలు జరుగుతున్నాయని, ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో అన్నిరకాల సదుపాయాలు ఉన్నాయన్న విషయాన్ని ఏఎన్ఎమ్లు, ఆశ వర్కర్లు ప్రచారం చేయాలన్నారు. పీవోఎంహెచ్ఎన్ అంజలి, డీఐవో సంపత్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. వేధింపులకు గురైతే 181కు ఫోన్ చేయండి సిరిసిల్ల: మహిళలకు ప్రభుత్వం ప్రత్యేక చట్టాలను కల్పించిందని జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం అన్నారు. సిరిసిల్ల శివారులోని సర్ధాపూర్ 17వ పోలీస్ బెటాలియన్ కమాండెంట్ ఎంఐ సురేశ్ ఆదేశాలతో బుధవారం మహిళా ఉద్యోగులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. గృహ హింస నిరోధక చట్టం, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నివారణ చట్టం, నిర్భయ చట్టం ద్వారా మహిళలు ఎదుర్కొనే హింసలను నిరోధించుకోవచ్చని వివరించారు. మహిళలు ఏ సందర్భంలోనైనా లైంగిక, మానసిక, శారీరక, ఆర్థిక వేధింపులకు గురైతే 181 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా వైద్యం, న్యాయం, పోలీస్, కౌన్సెలింగ్, షెల్టర్ వంటి సహాయాల్ని పొందవచ్చని సూచించారు. మహిళా సాధికారత కేంద్రం కో ఆర్డినేటర్ రోజా, బెటాలియన్ ఏవో ఇ.ప్రమీల తదితరులు పాల్గొన్నారు. సమ్మె నోటీస్ అందజేతసిరిసిల్లటౌన్: కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని సీఐటీయూ నేతలు కోరారు. కార్మికుల హక్కుల సాధన కోసం ఈనెల 20న చేపట్టే సార్వత్రిక సమ్మె నోటీస్ను బుధవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో మధ్యాహ్న భోజన రంగం సంఘం తరఫున అందజేశారు. మధ్యాహ్న భోజన కార్మికులు ఈనెల 20న జిల్లా కేంద్రానికి వచ్చి సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. గురిజల శ్రీధర్, నాయకులు ఆంజనేయులు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
కోర్టు భవనాలకు ముహూర్తం
● సిరిసిల్ల, పెద్దపల్లి సహా 12 జిల్లాలకు కొత్త కాంప్లెక్స్లు ● పోక్సో, ఫ్యామిలీ కోర్టుల కోసం బిల్డింగులు ● ‘న్యాయ నిర్మాణ్’ ప్రణాళిక కింద నిర్మాణాలు ● రూ.691 కోట్లతో టెండర్లు పిలిచిన ఆర్ అండ్ బీ ● ఉమ్మడి జిల్లాకు రూ.118 కోట్లు కేటాయింపు ● నాలుగంతస్తులు.. 2.18 లక్షల చదరపు అడుగుల స్పేస్సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో కొత్తగా కోర్టు భవన సముదాయాల నిర్మాణానికి ముహూర్తం సిద్ధమైంది. కొత్త జిల్లాలు ఏర్పడిన తరువాత పలు కొత్త జిల్లాల్లో కోర్టు భవనాల కొరత ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో న్యాయనిర్మాణ ప్రణాళిక కింద మంచిర్యాల, నిర్మల్, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, మహబూబ్నగర్, జోగులాంబ గద్వాల, వనపర్తి, యాదాద్రి భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జనగాం, వికారాబాద్ మొత్తం 12 జిల్లాలో ఫ్యామిలీ, పోక్సో కోర్టుల భవన సముదాయాల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ భవనాల నిర్మాణాన్ని ఆర్అండ్బీ ఎస్ఈ, యాదాద్రి సర్కిల్ వారు పర్యవేక్షించనున్నారు. గత వారంలో టెండర్లు పిలవగా.. టెండర్లకు మంచి ఆదరణ ఉందని సమాచారం. పలు పేరు మోసిన సివిల్ కాంట్రాక్ట్ కంపెనీలు భవన నిర్మాణానికి ముందుకు వచ్చినట్లు తెల్సింది. ఈనెల రెండో వారంలో రూ.691.18 కోట్లతో టెండర్లు ఖరారు కానున్నాయి, ఇందులో పెద్దపల్లి, సిరిసిల్ల కోసం దాదాపు రూ.118 కోట్లు కేటాయించనున్నారు. 24 నెలల్లో పూర్తి.. ఈ భవనాలు మొత్తం నాలుగు అంతస్తుల్లో ఉండనున్నాయి. ప్రతీ భవనంలో ఒక బేస్మెంట్ (88 కార్లు, 62 బైకులు పార్కింగ్ చేసుకునేలా పార్కింగ్ లాట్), గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫ్లోర్లు మొత్తం నాలుగు అంతస్తుల్లో ఈ భవన సముదా యాలను నిర్మించనున్నారు. అనంతరం ఈ భ వన సముదాయాల్లో పోక్సో, ఫ్యామిలీ కోర్టులు నడవనున్నాయి. ప్రతీ ఫ్లోర్లో 43వేల చదరపు అడుగుల నుంచి 44వేల చదరపు అడుగుల చొ ప్పున మొత్తం 2,18, 743.58 చదరపు అడుగుల వరకు ఆఫీస్ స్పేస్ అందుబాటులో ఉంటుంది. భవిష్యత్ అవసరాల కోసం మరో రెండు అంతస్తులు నిర్మించుకునేలా భవనాలు సిద్ధం చేస్తారు. మే రెండో వారంలో టెండర్లు ఖరారు కాగానే నిర్మాణాలు మొదలవుతాయి. నిర్మాణాలుమొదలైన 24 నెలల్లో అంటే 2027 నాటికి ఈ భవనాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రూ.691.18 కోట్లతో.. మొత్తం రూ.691.18 కోట్ల బడ్జెట్తో ఈ భవనాలు నిర్మించనున్నారు. ప్రతీ భవనం తూర్పు అభిముఖంగా విశాలంగా, విరివిగా గాలి, వెలుతురు వచ్చేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఇందుకోసం రాజసం ఉట్టిపడేలా భవనం మధ్యలో భారీ ఎలివేషన్తో ముఖద్వారం, దానికి ఇరువైపులా రెండు విశాలమైన భుజాలతో ఆర్ట్స్ కాలేజీ తరహాలో భవనం స్కెచ్ కూడా ఖరారైంది. ప్రతీ భవనం సివిల్, ఎలక్ట్రిక్, సానిటరీ– వాటర్ వర్క్స్ కోసం దాదాపు రూ.53 కోట్ల నుంచి రూ.59 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు. ఇందులో సిరిసిల్ల కోర్టు కాంప్లెక్స్కు రూ.59.92కోట్లు, పెద్దపల్లి కోర్టు భవన సముదాయాలకు రూ.58.58 కోట్లు ఖర్చు చేయనున్నారు. వీటిలో జీఎస్టీ కలపలేదు. మొత్తం రూ.691 కోట్లలో రూ.563 కోట్లు సివిల్ పనులకు, రూ.563.70 కోట్లు శానిటరీ, వాటర్ వర్క్స్ కోసం రూ.7.01 కోట్లు, ఎలక్ట్రికల్ వర్క్స్ కోసం రూ.120.46కోట్లుగా పేర్కొన్నారు. -
ఆస్పత్రి నిర్మించాలి
పేదలు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తూ అప్పులపాలవుతున్నారు. 30 పడకల ఆస్పత్రి నిర్మాణం చేపట్టి ఉచిత వైద్యం అందించాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన ఆస్పత్రిని నిర్మించాలి. – బైతి నవీన్, తెర్లుమద్ది ఉద్యమించిన నేతలు ఎక్కడ..? మండల ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు కేటీఆర్ 30 పడకల ఆస్పత్రి మంజూరు చేస్తే, ప్రస్తు త ప్రభుత్వం దానిని విస్మరించింది. అప్పుడు ఆస్పత్రి కావాలని ఉద్యమించిన నాయకులు ఇప్పు డు ఏం చేస్తున్నారు. ప్రజల బాధలు పట్టవా. – మెంగని మనోహర్, ముస్తాబాద్ సమాచారం లేదు ఏడాదిన్నర క్రితం 30 పడకల ఆస్పత్రి మంజూరు చేసినట్లు ఉత్తర్వులు వచ్చాయి. ప్రస్తుతం సీహెచ్సీ పనులపై ఎలాంటి సమాచారం లేదు. గతంలో మంజూరు చేశారని పేర్కొన్నా, ఇప్పుడు ఎలాంటి క్లారిటీ లేదు. – డాక్టర్ గీతాంజలి, వైద్యాధికారి -
వాస్తవాలు మాట్లాడితే వణుకెందుకు..?
సిరిసిల్ల: రాష్ట్రంలో ఉన్న వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరిస్తూ.. ప్రజాపాలన సాగిస్తుంటే ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీ వణికిపోతున్నాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీస్లో మాట్లాడారు. రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితిని ప్రజల ముందుంచాం. ఉద్యోగ సంఘాలు, కొన్ని వర్గాల డిమాండ్లను ఇప్పుడు తీర్చలేమని సీఎం రేవంత్రెడ్డి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను పారదర్శకంగా కుండలు బద్దలు కొట్టినట్లు చెబితే, బీఆర్ఎస్, బీజేపీ ఒకరికి ఒకరు వంతపాడుతూ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోయి కాంగ్రెస్కు అధికారమిస్తే అభివృద్ధి జరగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి తెలంగాణకు ఒక్క పరిశ్రమను తెచ్చారా, ఎవరికై నా ఉద్యోగాలు ఇచ్చారా అని ప్రశ్నించారు. జిల్లాలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కాలంలో కొనుగోలు చేసిన ధాన్యం కంటే.. ఇప్పటికే తాము ఎక్కువ కొనుగోలు చేశామని, ఇంకా చేస్తున్నామని గణాంకాలతో వివరించారు. రైతులకు మూడు రోజుల్లోనే పేమెంట్ ఇస్తున్నామని, తడిసిన ధాన్యాన్ని కొంటామని ప్రజల్లో ఉంటూ, రైతులకు భరోసా కల్పిస్తున్నామని వివరించారు. వాస్తవాలను జీర్ణించుకోలేక బీఆర్ఎస్, బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ కమిట్మెంట్ ఏంటో ప్రజలకు తెలుసునని స్పష్టం చేశారు. సమావేశంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, ఏఎంసీ చైర్మన్ వెల్ముల స్వరూపారెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాశ్, నాయకులు ఆకునూరి బాలరాజు, సూర దేవరాజు, కాముని వనజ, గడ్డం నర్సయ్య, బొప్ప దేవయ్య, నేరెళ్ల శ్రీకాంత్గౌడ్ పాల్గొన్నారు. ● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ -
వచ్చే నెలలో ప్రత్యేక లోక్ అదాలత్
సిరిసిల్లకల్చరల్: అపరిష్కృత కేసుల సత్వర పరిష్కారం కోసం వచ్చే నెలలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ తెలిపారు. స్థానిక కోర్టు ప్రాంగణంలో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడారు. జూన్ 9 నుంచి 14 వరకు నిర్వహించే అదాలత్లో ప్రధానంగా చెక్బౌన్స్ కేసులు పరిష్కరించనున్నట్లు తెలిపారు. సంప్రదింపులు, చర్చల ద్వారా రాజీ కుదుర్చుకునే కక్షిదారులు 14న జరిగే మెగా జాతీయ లోక్అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కారానికి నోచుకునేలా పోలీస్ యంత్రాంగం న్యాయవాదులు సహకరించాలని సూచించారు. న్యాయమూర్తులు లక్ష్మణాచారి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి రాధిక జైశ్వాల్, ప్రవీణ్కుమార్, గడ్డం మేఘన, కావేటి సృజన, అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, లోక్అదాలత్ సభ్యులు చింతోజు భాస్కర్, ఆడెపు వేణు పాల్గొన్నారు. ● జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ