breaking news
Rajanna
-
అజ్ఞాతంలోనే తుమ్మల శ్రీనివాస్ అలియాస్ విశ్వనాథ్
సిరిసిల్ల: మావోయిస్టు ఉద్యమ చరిత్రలో తొలిసారి నక్సలైట్లు ఆయుధాలను అప్పగించి సామూహికంగా లొంగుబాటు మొదలైంది. ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలోని దక్షిణ, తూర్పు ప్రాంతాల్లోని సాయుధ నక్సలైట్లు, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు లొంగిపోతున్నారు. నాలుగు దశాబ్దాల కిందట ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ మావోయిస్టు (అప్పట్లో పీపుల్స్వార్) పార్టీ ఉద్యమం బలంగా ఉండేది. సమసమాజ స్థాపన కోసం ఆయుధాలను పట్టి ఎందరో అడవిబాట పట్టారు. ఏళ్లుగా ఉద్యమదారుల్లో నడిచారు. రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన మరో ఇద్దరు ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉన్నారు. మావోయిస్టు నక్సలైట్ల సామూహిక లొంగుబాటు నేపథ్యంలో ‘మావో’ళ్లు ఇంటికి వస్తారా ! అంటూ ఆ అజ్ఞాతవాసుల కుటుంబ సభ్యులు నిరీక్షిస్తున్నారు. జనజీవనంలోకి వస్తారా? అజ్ఞాతంలోనే ఉంటారా? అనే చర్చ సాగుతోంది.27 ఏళ్ల కిందట అడవిబాటరాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపలి్లకి చెందిన తుమ్మల శ్రీనివాస్ అలియాస్ విశ్వనాథ్ సిద్దిపేటలో డిగ్రీ చదువుతూ 1998లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. 27 ఏళ్లుగా శ్రీనివాస్ జాడతెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. అతని తల్లిదండ్రులు తుమ్మల(మ్యాదరి) నారాయణ గతేడాది మరణించగా.. తల్లి భూదమ్మ ఎనిమిదేళ్ల కిందట మరణించింది. తల్లిదండ్రులు మరణించినా కడసారి చూపులకు శ్రీనివాస్ రాకపోవడం విషాదం.పోలీస్ కౌన్సెలింగ్తోనే వెలుగులోకి...శ్రీనివాస్ డిగ్రీ చదువుతూ కనిపించకపోవడంతో ఏమయ్యాడో తెలియక తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఎల్లారెడ్డిపేట పోలీసులు శ్రీనివాస్ అలియాస్ విశ్వనాథ్ పేరుతో నక్సలైట్ ఉద్యమంలో పనిచేస్తున్నాడని గుర్తించి.. బండలింగంపలి్లలోని అతని తల్లిదండ్రులు నారాయణ, భూదమ్మ ఇంటికెళ్లి.. కొడుకును లొంగిపోయేలా చూడండి.. అంటూ కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సంఘటనతోనే కొడుకు అజ్ఞాతంలోకి వెళ్లాడని తెలిసింది. ఒడిషా ప్రాంతంలో పనిచేస్తున్నాడని తరా>్వత వారికి తెలిసింది. కానీ ఆచూకీ లభించలేదు. కన్న కొడుకును చూడకుండానే తల్లిదండ్రులు కన్నుమూశారు.రా అన్నా.. కలిసుందాం అన్నను 27 ఏళ్లుగా చూడలేదు. ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా ఆందోళనగా ఉండేది. ప్రస్తుతం మావోయిస్టులు లొంగిపోతున్నారు. నువ్వు కూడా రా అన్న కలిసుందాం. 27 ఏళ్లుగా మన ఇల్లు ఎదురు చూస్తోంది. అమ్మానాన్నలు కాలం చేశారు. ఉద్యోగం చేస్తూ తలోదిక్కు వెళ్లాం. ఇప్పుడు మన ఇల్లు ఒంటరైంది. మీరు వస్తే కలిసి ఉందాం. – తుమ్మల మధుసూదన్, విశ్వనాథ్ సోదరుడు(టీచర్)తమ్మీ రారా..నాకు పానం బాగా లేదు. అమ్మానాయిన్నలు, తమ్ముడు కాలం చేసిండ్రు. అడవిలో అన్నలు అందరూ తుపాకులు పోలీసులకు ఇచ్చి వస్తున్నారని తెలిసింది. నువ్వు కూడా ఎక్కడ ఉన్నా ఇంటికి రా.. తమ్మీ. ప్రజల కోసం నలభై ఏళ్లు అడవుల్లో పనిచేసినవ్ చాలు. ఇగ నువ్వు వస్తే కలోగంజో కలిసి తాగుదాం. నిన్ను చూసి సచ్చిపోవాలని ఉంది. నువ్వు వస్తావని ఆశతో చూస్తున్నా. ఏడున్నా రా తమ్మీ. – బండి నాంపల్లి, చంద్రయ్య సోదరుడు, ధర్మారంనాలుగు దశాబ్దాలుగా ఉద్యమంలోనే..రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన బండి చంద్రయ్య అలియాస్ మహేశ్ నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో పనిచేస్తున్నాడు. పదోతరగతి వరకు ధర్మారంలోనే చదువుకున్న చంద్రయ్య 1985లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. అతని తల్లిదండ్రులు ఎల్లవ్వ, లింగయ్యలకు ముగ్గురు కొడుకులు నాంపల్లి, శంకరయ్య, చంద్రయ్య, ఒక్క కూతురు శాంతమ్మ. చిన్నకొడుకు చంద్రయ్య అడవిబాట పట్టారు. తల్లిదండ్రులు చిన్న కొడుకు తలంపులోనే అనారోగ్యంతో మరణించారు. మరో సొదరుడు శంకరయ్య అనారోగ్యంతో పదేళ్ల కిందట మరణించాడు. తల్లిదండ్రులు మరణించినా, సొదరుడు మరణించినా చంద్రయ్య ఇంటి ముఖం చూడలేదు. ప్రస్తుతం పెద్దన్న నాంపల్లి, వదినే దేవవ్వ ధర్మారంలో ఉంటున్నారు. -
కోడెలను వ్యవసాయానికి వినియోగించాలి
● పక్కదారి పట్టించే వారిపై చర్యలు ● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ ఎం.హరిత ● 102 జతల రాజన్న కోడెలు రైతులకు అందజేతవేములవాడఅర్బన్: రాజన్న కోడెలను వ్యవసాయానికి వినియోగించుకోవాలని, పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. తిప్పాపూర్లోని రాజన్న గోశాలలోని కోడెలను శుక్రవారం రైతులకు ఉచితంగా పంపిణీ చేశారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా స్వామి వారికి కోడెలను కట్టే సంస్కృతి వేములవాడలోనే ఉందన్నారు. భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచే కోడెమొక్కుల ద్వారా వచ్చిన కోడెలను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాకే రైతులకు ఉచితంగా అందజేస్తున్నామన్నారు. ఈ కోడెలను రైతులు పక్కదారి పట్టించొద్దని, తనిఖీ చేయిస్తామన్నారు. త్వరలోనే 40 ఎకరాలలో అధునాతన గోశాల పనులు మొదలుపెడతామన్నారు. కోడెమొక్కులు చెల్లించే భక్తులు పాలు మరిచిన తర్వాత జీవాలను అందజేయాలని కోరారు. కలెక్టర్ ఎం.హరిత మాట్లాడుతూ ఆన్లైన్లో అన్ని పత్రాలతో దరఖాస్తు చేసుకున్న రైతులకు మాత్రమే కోడెలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మొత్తం 102 జతల కోడెలను పంపిణీ చేశామన్నారు. ఆలయ ఈవో రమాదేవి, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి రవీందర్రెడ్డి, వ్యవసాయాధికారి అఫ్జల్బేగం, తహసీల్దార్ విజయప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు. -
చెత్తశుద్ధి కరువు!
● తరచూ మరమ్మతుకు వాహనాలు ● కాలనీల్లో పేరుకుపోతున్న చెత్త ● కంపు కొడుతున్న అంతర్గత కాలనీలు ● ఇబ్బంది పడుతున్న వేములవాడ ప్రజలువేములవాడఅర్బన్: ఆధ్యాత్మిక క్షేత్రం.. దక్షిణకాశీగా పేరొందిన వేములవాడలోని అంతర్గత కాలనీలు కంపు కొడుతున్నాయి. ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతున్నాయి. రాజన్న దర్శనానికి వస్తున్న భక్తులు, స్థానిక ప్రజలు, వ్యాపార సంస్థల నుంచి వెలువడుతున్న చెత్త పేరుకుపోతుంది. చెత్తను తొలగించే సిబ్బంది కొరత ఉండడం.. సేకరించిన చెత్తను తరలించే వాహనాలు మరమ్మతుకు రావడంతో పట్టణం కంపుకొడుతుంది. వేములవాడలో పారిశుధ్య నిర్వహణపై ‘సాక్షి’ ఫోకస్. పేరుకుపోతున్న చెత్త వేములవాడ మున్సిపల్ పరిధిలో విలీన గ్రామాలను కలిపి 28 వార్డులు ఉన్నాయి. గతంలో జనాభాను అనుసరించి మున్సిపల్ సిబ్బందిని నియమించారు. కానీ రాజన్న దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో పట్టణం సైతం రద్దీగా మారుతుంది. భక్తుల ద్వారా వెలువడుతున్న చెత్తను సేకరించడం సవాల్గా మారింది. ఈక్రమంలోనే మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది కొరత ఏర్పడుతుంది. ప్రతి రోజు వార్డుల్లో శుభ్రం చేసినా మధ్యాహ్నం వరకు చెత్తగా మారుతున్నాయని స్థానికుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. పారిశుధ్య సిబ్బందిని పెంచాలని కోరుతున్నారు. విలీన గ్రామాల్లో సిబ్బంది కొరతతో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారిందని స్థానికులు అంటున్నారు. సరిపోని చెత్త వాహనాలు వేములవాడలో నిత్యం రాజన్న భక్తులు, ఆలయం చుట్టూ లాడ్జీలు, దుకాణాలు, హోటళ్లు ఉండడంతో అధిక మొత్తంలో చెత్త ఉత్పత్తి అవుతుంది. ఈ ప్రాంతంలో పారిశుధ్య సిబ్బంది నిత్యం రెండు పూటల చెత్తను సేకరిస్తున్నా మళ్లీ కుప్పలుగా పేరుకుపోతుంది. మున్సిపల్లో పారిశుధ్య సిబ్బంది 146 మంది ఉన్నా సరిపోవడం లేదు. ప్రత్యేకంగా చెత్తవాహనాలు నడిపేందుకు డ్రైవర్లు లేకపోవడంతో ఇందులో నుంచి డ్రైవర్లుగా మారుతున్నారు. వాహనాలు పాతవి కావడంతో తరచూ రిపేర్కు వెళ్తుంటాయి. ఆరేళ్ల క్రితం కొనుగోలు చేసిన వాహనాలతోనే వెల్లదీస్తున్నారు. ఇప్పటి జనాభా, చెత్త ఉత్పత్తిని బట్టి కనీసం 240 మంది పారిశుధ్య సిబ్బంది ఉండాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మూడు చోట్ల బస్స్టాండ్లు వేములవాడ ఆధ్యాత్మిక పట్టణం కావడంతో రాజన్న దర్శనానికి వచ్చే భక్తులతో రద్దీగా మారుతుంది. వేములవాడలో మూడు చోట్ల బస్టాండ్లు ఉన్నాయి. తిప్పాపూర్లో మొయిన్ ఆర్టీసీ బస్టాండ్ ఉండగా, గుడిచెరువు కట్ట కింద జగిత్యాలకు వెళ్లే బస్సులు ఉంటాయి. ఈ రెండు ప్రాంతాల్లో విపరీతమైన రద్దీ ఉంటుంది. మూడో బస్టాండ్ పట్టణంలోని కోరుట్ల వైపు వెళ్లే ప్రాంతంలో పెట్రోల్బంక్ సమీపంలో ఉంటుంది. ఈ మూడు ప్రాంతాల నుంచి భక్తులు వేములవాడకు చేరుకుంటారు.వార్డులు : 28, జనాభా : 56 వేలు కుటుంబాలు : 10,600 పారిశుధ్య కార్మికులు : 146 జవాన్లు : 05, చెత్త ట్రాక్టర్లు : 08 చెత్త ఆటోలు : 20 రిపేర్లో ఉన్నవి : 03 ప్రతీరోజు చెత్త సేకరణ : 21 టన్నులు -
ఒక్క రోజే 300 దరఖాస్తులు
● ఊపందుకున్న మద్యం అప్లికేషన్లు ● నేటితో ముగియనున్న గడువు సిరిసిల్ల క్రైం: జిల్లాలోని మద్యం దుకాణాలకు శుక్రవారం ఒక్క రోజే 300 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుదారులతో కలెక్టరేట్లోని ఎకై ్సజ్ ఆఫీస్ రద్దీగా మారింది. ఇప్పటి వరకు 48 వైన్షాపులకు 852 దరఖాస్తులు వచ్చాయి. ఈనెల 18వ తేదీతో దరఖాస్తు చేసుకునేందుకు గడువు ముగియనుంది. పది లోపు దరఖాస్తులు వచ్చిన దుకాణాలు పాతికకు పైగానే ఉన్నట్లు సమాచారం. ఒక్క దరఖాస్తు మాత్రమే వచ్చినవి 5 దుకాణాలు ఉండగా, రెండు దరఖాస్తులు వచ్చినవి 6, అసలు దరఖాస్తులు రానివి 2 దుకాణాలు ఉన్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. కొన్ని మద్యం దుకాణాలకు ఒక్క దరఖాస్తు(సింగిల్ టెండర్) మాత్రమే రావడం, మరికొన్ని షాపులకు దరఖాస్తులు పడకపోవడంపై అధికారులు ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. దరఖాస్తుల పరిశీలన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. -
చేపా చేపా ఎప్పుడొస్తావ్!
● తప్పని ‘మీన’మేషాలు! ● చేపపిల్లల పంపిణీపై నీలినీడలు ● అదను దాటితే నష్టమంటున్న మత్స్యకారులు సిరిసిల్ల/సాక్షి,పెద్దపల్లి: ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో ఉచితంగా విడుదల చేసే చేపపిల్లల సరఫరా కోసం రాష్ట్ర ప్రభుత్వం మూడుసార్లు టెండర్లు పిలిచింది. పలుచోట్ల టెండర్లు దాఖలు కాలేదు. మరికొన్ని చోట్ల దాఖలైనా అర్హత లేకుండాపోయింది. రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ ప్రక్రియ శుక్ర వారం ప్రారంభం కాగా ఉమ్మడి జిల్లాలో మొదలుకాలేదు. మత్స్యకారులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఏటా రూ.కోట్ల వ్యయంతో చేపపిల్లలను వదులుతోంది. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల అ క్రమాలతో ఈ పథకం లోపభూయిష్టంగా మారుతోంది. పంపిణీ ఆలస్యంగా చేపట్టడం, చేపపిల్లల పరిమాణం చిన్నగా ఉండడంతో.. పూర్తిస్థాయిలో ఎదుగక మత్స్యకారులు నష్టపోతున్నారు. 6.96 కోట్ల చేపపిల్లలు.. 3,133 చెరువులు ఉమ్మడి జిల్లాలోని సుమారు 56 వేల మంది మత్స్యకారులు చేపలవేటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఇప్పటి వరకూ వాటిని విడుదల చేయకపోవడంతో వేట సీజన్ను కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. ● కరీంనగర్ జిల్లాలో టెండర్లు వేయడానికి కాంట్రాక్టర్లు మందుకురాకపోగా, పెద్దపల్లిలో ఇద్దరు టెండర్లు వేసినా అర్హత లేనందున తిరస్కరించా రు. జగిత్యాల, రాజన్నసిరిసిల్ల జిల్లాల్లో రెండు టెండర్లు దాఖలైనా.. సీడ్ లభ్యతపై ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాత టెండర్లు ఫైనల్ చేయనున్నారు. రాష్ట్రంలో ఒక్క నారాయణపేటలోనే.. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా శుక్రవారం చేపపిల్లల పంపిణీ చేపట్టినా.. నారాయణపేట జిల్లా తప్ప రాష్ట్రంలో మరెక్కడా విడుదల చేయలేకపోయింది. రెండేళ్లకు సంబంధించి బకాయిలు కాంట్రాక్టర్లకు చెల్లించలేదని, దీంతోనే వారు పంపిణీ చేసేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఈ ఏడాది భారీగా కురిసిన వర్షాలతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చెరువులు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకు న్నాయి. టెండర్ల ప్రక్రియలో నెలకొన్న సందిగ్ధంతో పంపిణీ ప్రక్రియ ఆలస్యం అవుతోంది. ఎదుగుదలపై ప్రభావం కిలో బరువు చేప పెరగాలంటే కనీసం ఐదు నెలల సమయం పడుతుందని మత్స్యకారులు చెబుతున్నారు. ఏటా ఆగస్టు నెలాఖరులోగా ప్రాజెక్టులు, చెరువుల్లో చేపపిల్లలు విడుదల చేసేవారు. ఈసారి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనెలాఖరులోగానైనా వదిలితే వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో చేపలు పట్టుకునేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. మరింత జాప్యం చేస్తే ఎదుగుదలపై ప్రభావం ఉంటుందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీపావళి తర్వాత పంపిణీ పెద్దపల్లి జిల్లాలో చేపల సరఫరా కోసం రెండు బిడ్లు వచ్చాయి. వీరికి అర్హత లేక తిరిస్కరించాం. సమయం లేనందున మరోసారి టెండర్లు ఆహ్వానిస్తాం. ప్రత్యామ్నాయంగా ఇతర జిల్లాల కాంట్రాక్టర్లతో పంపిణీ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంటాం. దీనికి సంబంధించి ఉన్నాతాధికారులకు లేఖ రాశాం. దీపావళి తర్వాత పంపిణీ చేస్తాం. – నరేశ్నాయుడు, మత్స్యశాఖ జిల్లా అధికారి, పెద్దపల్లిజిల్లా చెరువులు లక్ష్యం(లక్షల్లో) ఖర్చు(లక్షల్లో) జగిత్యాల 696 169.33 224.11 కరీంనగర్ 921 220.04 217.98 పెద్దపల్లి 1,076 158.82 158.30 సిరిసిల్ల 440 148.28 175.87 మొత్తం 3,133 696.47 776.26 -
మహిళల్లో అక్షరాస్యతపై అవగాహన కల్పించాలి
● కలెక్టర్ ఎం.హరితసిరిసిల్ల: నిరక్షరాస్య మహిళలకు అక్షరాస్యతపై అవగాహన కల్పించాలని కలెక్టర్ ఎం.హరిత ఆదేశించా రు. అండర్ స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ(ఉల్లాస్)పై జిల్లా గ్రామీణాభివృద్ధి, విద్య, మెప్మాశాఖల అధికారులతో శుక్రవారం కలెక్టరేట్లో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ వయోజన మహిళలకు ఫౌండేషనల్ లిటరసీ, బేసిక్ ఎడ్యుకేషన్పై అవగాహన అందించడం లక్ష్యమన్నారు. వ యోజనుల కోసం అక్షర వికాసం, వలంటీర్ల కోసం మార్గదర్శిని పుస్తకాలు ప్రభుత్వం పంపిణీ చేసిందన్నారు. అక్షర వికాసం పుస్తకాలు 21,894 రాగా.. మార్గదర్శిని 2,190 పుస్తకా లు వచ్చాయని, జిల్లాలో 23,387 మంది వయోజనులను గుర్తించామని పేర్కొన్నారు. డీఆర్డీవో శేషాద్రి, అడిషనల్ డీఆర్డీవో శ్రీనివాస్, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత, వయోజన విద్య శాఖ అధికారి ఆంజనేయులు పాల్గొన్నారు. -
42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం
● నేటి బంద్కు సంపూర్ణ మద్దతు ● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్సిరిసిల్ల/సిరిసిల్లటౌన్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో అన్ని ప్రయత్నాలు చేస్తోందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. సిరిసిల్ల ప్రెస్క్లబ్లో శుక్రవారం బీసీ సంఘాల నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీ బిల్లును ప్రవేశపెట్టగా.. తాను బలపరిచే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని గుర్తు చేశారు. న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని, హైకోర్టు విచారణలో ఉన్న 42 శాతం బీసీల రిజర్వేషన్ల బిల్లుకు గ్రీన్సిగ్నల్ వస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీకి రాష్ట్రంలో 8 మంది ఎంపీలు ఉండి కూడా బీసీ రిజర్వేషన్ల బిల్లుపై ఒత్తిడి చేయడం లేదని విమర్శించారు. శనివారం నిర్వహించ తలపెట్టిన బంద్కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు. వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు బంద్ పాటించి మద్దతు తెలపాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు, పార్టీ నాయకులు సంగీతం శ్రీనివాస్, వైద్య శివప్రసాద్, యెల్లె లక్ష్మీనారాయణ, గోనె ఎల్లప్ప, సూర దేవరాజు, బీసీ సంఘాల నాయకులు బొప్ప దేవయ్య, తొట్ల రాములుయాదవ్, మేకల కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. ఘనంగా స్వాగతం పలుకుదాం వేములవాడ: వేములవాడకు ఈనెల 19న వస్తున్న శృంగేరి పీఠాధిపతి జగద్గురు విధుశేఖర భారతీస్వామికి ఘనంగా స్వాగతం పలుకుదామని, అందరూ తరలిరావాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. ఆలయ ఓపెన్స్లాబ్లో శుక్రవారం విధుశేఖర భారతీస్వామి ధర్మ విజయయాత్ర సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు. పట్టణంతోపాటు పరిసర ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ఈనెల 19వ తేదీ సాయంత్రం 6 గంటలలోపు వేములవాడలోని తెలంగాణ చౌక్ వద్దకు అందరూ చేరుకొని స్వామివారికి స్వాగతం పలకాలని కోరారు. -
శుద్ధిచేసిన వడ్లను కొనుగోలు చేయాలి
● అదనపు కలెక్టర్ నగేశ్ సిరిసిల్ల: 17 శాతంలోపు తేమ ఉన్న శుద్ధిచేసిన వడ్లను కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ ఆదేశించారు. ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణపై ఐకేపీ సెంటర్ల ఇన్చార్జీలకు కలెక్టరేట్లో శుక్రవారం శిక్షణ ఇచ్చారు. అదనపు కలెక్టర్ నగేశ్ మాట్లాడుతూ మహిళా సంఘాల బాధ్యులు నిబంధనల ప్రకారం తేమ శాతం చేసి ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. ఏ–గ్రేడ్ క్వింటాలుకు రూ.2,389, కామన్ రకానికి రూ.2,369గా ప్రభుత్వం నిర్ణయించిందని, సన్న రకం ధాన్యం క్వింటాలుకు అదనంగా బోనస్ రూ.500 ఇస్తుందని వివరించారు. కేంద్రంలో విద్యుత్ కనెక్షన్ తీసుకోవాలని, రైతులకు షామియానా, నీటి సదుపాయం కల్పించాలని సూచించారు. డీఆర్డీవో శేషాద్రి, డీసీఎస్వో చంద్రప్రకాశ్, అదనపు డీఆర్డీవో శ్రీనివాస్, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, ఏపీఎంలు, సీసీలు పాల్గొన్నారు.సిరిసిల్ల అర్బన్: పెన్షనర్లకు రావాల్సిన బకాయిలను ఏక మొత్తంలో చెల్లించాలని, లేకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని రేవా జిల్లా అధ్యక్షుడు మల్లారపు పురుషోత్తం హెచ్చరించారు. కలెక్టరేట్ వద్ద రేవా ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ 2024 మార్చి నుంచి ఇప్ప టి వరకు జీపీఎఫ్, జీఐఎస్, ఫైనల్ లీవ్ ఎన్క్యాష్మెంట్, గ్రాట్యుటీ అందలేదన్నారు. రేవా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు చంద్రమౌళి, నాయకులు ప్రభాకర్, దివాకర్, రాములు, పరమేశ్, ధర్మయ్య, సుధాకర్, వెంకటయ్య, మద్దికుంట లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల/సిరిసిల్లటౌన్: బీసీ సంఘాల ఆధ్వర్యంలో శనివారం చేపట్టే బంద్ను రోజంతా పాటించాలని బీసీ జేఏసీ ప్రతినిధి, సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు కోరారు. ప్రెస్క్లబ్లో శుక్రవారం విలేకరు లతో మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు బంద్కు పిలుపు ఇచ్చామని పేర్కొన్నారు. చట్టాలు తెలియాలిసిరిసిల్లటౌన్: కార్మికులకు చట్టాలు తెలియాలని సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ఎం.ఏ.ఖదీర్పాషా కోరారు. కార్యాలయంలో శుక్రవారం స్వచ్ఛంద సంస్థ సభ్యులతో కలిసి ‘అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులకు న్యాయ సేవలు’ కా ర్యక్రమం నిర్వహించారు. మానేరు స్వచ్ఛంద సంస్థ చైర్మన్ చింతోజు భాస్కర్, రిటైర్డ్ లేబర్ ఆఫీసర్ బలరాం తదితరులు పాల్గొన్నారు. ఇల్లంతకుంట(మానకొండూర్): మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దిష్టిబొమ్మను శుక్రవారం మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవ రణలో కాంగ్రెస్ నాయకులు దహనం చేశారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను రసమయి దుర్భాషలాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతగిరి వినయ్కుమార్, జమాల్, కరుణాకర్రెడ్డి, రాజేశం, బడుగు లింగం, జెట్టి మల్లేశం పాల్గొన్నారు. ఫామ్హౌస్ ముట్టడి బెజ్జంకి మండలంలోని రసమయి ఫామ్హౌస్ను కాంగ్రెస్ నాయకులు ముట్టడించేందుకు వెళ్లగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భాస్కర్రెడ్డి, తీగల పుష్పలత, వెలిశాల జ్యోతి, పసుల వెంకటి, ఎలగందుల ప్రసాద్, వీరేశం, సత్యారెడ్డి, సురేందర్రెడ్డి, ఐరెడ్డి మహేందర్రెడ్డి, నరేందర్రెడ్డి ఉన్నారు. వీరిని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పరామర్శించారు. -
జర్నలిజంపై కేసులు అప్రజాస్వామికం
సిరిసిల్లటౌన్: ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చే జర్నలిస్టులపై కేసులు బనాయించడం అప్రజాస్వామికమని టీయూడబ్ల్యూజే రాజన్న సిరిసిల్ల జిల్లా తొలి అధ్యక్షుడు కరుణాల భద్రాచలం అన్నారు. ఏపీ ప్రభుత్వం పోలీసులతో సాక్షి కార్యాలయాలపై దాడులు చేయడంపై శుక్రవారం సిరిసిల్లలో జర్నలిస్టుల సంఘాలు మండిపడ్డాయి. ఈమేరకు స్థానిక ప్రెస్క్లబ్ నుంచి ఆర్డీవో ఆఫీస్ వరకు నిరసన ర్యాలీగా వెళ్లి ధర్నా చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఏపీలో పోలీసులు సాక్షి కార్యాలయాల్లో తనిఖీలు చేస్తూ.. పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారన్నారు. పాత్రికేయులను బెదిరించే ధోరణితో వ్యవహరిస్తున్న పోలీసులు, ప్రభుత్వం తీరు సరికాదన్నారు. భవిష్యత్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా కట్టడి చేయాలని కోరారు. సీనియర్ జర్నలిస్టులు తడుక విశ్వనాథం, వూరడి మల్లికార్జున్, సామల గట్టు, మేడి కిషన్, శిరీష, చింతకింది శ్యామ్, మిట్టపల్లి కాశీనాథ్, సదానందం, మధు, దేవేందర్, రాజేంద్రప్రసాద్, సల్మాన్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్వేములవాడ: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం టెండర్ ప్రక్రియ పూర్తి చేసి డిసెంబర్ 15లోపు పూర్తి చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. తిప్పాపూర్ శివారులోని బస్డిపో వద్ద గల 144 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గృహ నిర్మాణ, ఆర్అండ్బీ, మున్సిపల్ అధికారులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ ఇల్లు పేద ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక అన్నారు. రాష్ట్రంలోని నిరుపేదలు, గూడు లేనివారు ఆత్మగౌరవంతో బతకాలనే ఆలోచనతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని నిర్ణయించిందని తెలిపారు. గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మాణం చేయలేదన్నా రు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి నిర్మాణం చేపడుతోందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గానికి 3500 ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. బస్డిపో వద్ద 144 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఇప్పటికే గతంలో మంజూరుపత్రాలు అందజేశామని తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ అన్వేష్, గృహ నిర్మాణశాఖ పీడీ శంకర్, ఆర్అండ్బీ డీఈ శాంత య్య, వరప్రసాద్ ఇతర అధికారులు పాల్గొన్నారు. -
మిగిలింది రెండు రోజులే
సిరిసిల్ల క్రైం: జిల్లాలో వైన్ షాపుల లైసెన్స్ల కోసం పోటీ పెరుగుతోంది. ఇంకా రెండు రోజులు మాత్రమే గడువు మిగిలి ఉంది. 48 వైన్షాపులకు ఇప్పటివరకు మొత్తం 552 దరఖాస్తులు స్వీకరించినట్లు ఎకై ్సజ్ శాఖ అధికారులు తెలిపారు. లాటరీ విధానంలో కేటాయింపు దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన అనంతరం లైసెన్సులు లాటరీ పద్ధతిలో కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు. తుది డ్రా తేదీ త్వరలో ప్రకటించేందుకు ఇప్పటికే ఉత్తర్వులు వెలువడ్డాయి. చివరి నిమిషం రష్ చివరి తేదీ సమీపిస్తుండటంతో ఎకై ్సజ్ కార్యాలయాలు అభ్యర్థులతో కిటకిటలాడురాయన్న ఆలోచనలు అందరిలో ఉన్నాయి. ఇంకా రెండు రోజుల్లో దరఖాస్తుల సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. -
ఈడీ చేతికి ‘మెటా’!?
సాక్షిప్రతినిధి,కరీంనగర్: మెటా క్రిప్టో కరెన్సీ పేరుతో కరీంనగర్లో వెలుగుచూసిన కుంభకోణం మలుపు తిరగనుంది. త్వరలోనే కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగప్రవేశం అనివార్యంగా కనిపిస్తోంది. ఈ కేసులో డబ్బులను అనతికాలంలోనే రెట్టింపు చేస్తామని బాధితుల నుంచి వసూలు చేసి, దేశం దాటడం, అందుకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలను కరీంనగర్ సీపీ గౌస్ ఆలం నేతృత్వంలో పోలీసులు గుర్తించారు. మరింత లోతుగా దర్యాప్తు జరిపి త్వరలోనే డీజీపీకి నివేదిక పంపనున్నారు. అనంతరం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి సమాచారం ఇవ్వనున్నారని సమాచారం. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేసిన వారి సంఖ్య ఆరుకు చేరుకుంది. కింగ్పిన్ లోకేశ్వర్రావు అరెస్టుతో కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసుపై సాక్షి కథనాలను తొలుత ఖండించిన పోలీసులు తాజాగా నిర్వహించిన ప్రెస్మీట్తో వాటిని అంగీకరించినట్లయింది. దుబాయ్ హవాలాపై దృష్టి ఈ కేసులోని నిందితులు మలేషియా, సింగపూర్, థాయ్లాండ్, దుబాయ్ తదితర దేశాలకు పెట్టుబడిదారులను తిప్పారు. దుబాయ్లో బినామీలను నియమించుకున్నారు. ఇక్కడ వసూలు చేసిన మొత్తం డబ్బును యూఎస్డీటీ, హవాలా మార్గాల ద్వారా దుబాయ్కి పంపారు. ఆ డబ్బుతో అక్కడ బంగారం కొన్నారు. అందులో 30 తులాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 450 మంది బాధితుల నుంచి రూ.30 కోట్ల వరకు వసూలు చేశారని పైకి చెబుతున్నా, దాని విలువ దాదాపుగా వీరు రూ.100 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఈ కేసులో మనీలాండరింగ్ జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. నిందితులు దుబాయ్ తదితర దేశాల్లో హవాలా ద్వారా పంపిన డబ్బులతో బంగారం, ఆస్తులు కూడబెట్టారని సమాచారం. దుబాయ్లో ఈ ముఠా రూ.40 కోట్ల విలువైన ఓ పబ్ను నడుపుతున్నారని పోలీసులకు సమాచారం అందింది. అక్కడ పదేళ్ల గోల్డెన్ వీసా సంపాదించి అరెస్టును జాప్యం చేసేలా ఎత్తుగడలు వేసినట్లు గుర్తించారు. నిందితులు లీగల్ టీం ఏర్పాటు చేసుకుని ఏకంగా కరీంనగర్ సీపీకి నోటీసులు పంపడం, ఫిర్యాదుదారులపై ప్రైవేటు కేసులు ఫైల్ చేయడాన్ని పోలీసుశాఖ తీవ్రంగా పరిగణించింది. ఈ కేసులో ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు త్వరలోనే మరిన్ని అరెస్టులు జరపనున్నారు. సరైన సమయం చూసి అరెస్టు చేసే ఆలోచనలో ఉన్నారు. గతంలో నిందితులు ముందస్తు బెయిల్ పొందిన నేపథ్యంలో ఈ మేరకు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.‘మెటాఫండ్’ ప్రధాన నిందితుడి అరెస్టు కరీంనగర్క్రైం: మెటాఫండ్ ప్రధాన నిందితుడు వరాల లోకేశ్వర్రావు(32)ను కరీంనగర్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. సీపీ గౌస్ ఆలం కమిషనరేట్లో కేసు వివరాలు వెల్లడించారు. హైదరాబాద్లోని పీవీఎన్కాలనీకి చెందిన వరాల లోకేశ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ల తయారీలో నిపుణుడు. గతంలో ఆన్లైన్ బిట్కాయిన్లో, డిజిటల్ కరెన్సీలో పెట్టుబడులు పెట్టాడు. అతని తండ్రి స్నేహితుడైన కరీంనగర్కు చెందిన తులసీ ప్రకాశ్ తమ ప్రాంతంలో యూబిట్ కాయిన్లో చాలా మంది పెట్టుబడులు పెడుతున్నారని ఒకసారి వస్తే కొంతమందిని పరిచయం చేస్తానని చెప్పి 2024లో నగరానికి చెందిన బూర శ్రీధర్, దాసరి రాజు, దాసరి రమేశ్, కట్ల సతీశ్ను పరిచయం చేయించాడు. ఒక నకిలీ కాయిన్‘మెటాఫండ్’ రూపొందించి గతేడాది ఏప్రిల్లో హైదరాబాద్లోని శామీర్పేటలో ఓ రిసార్ట్లో ఆవిష్కరించారు. యాప్ ప్రచారం కోసం కరీంనగర్, జగిత్యాల, హైదరాబాద్ ప్రాంతాల్లో ఏజెంట్లను నియమించారు. అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి కరీంనగర్కు చెందిన భాస్కర్ నాయక్ వద్ద రూ.15లక్షలు, మరో 450 మంది ద్వారా రూ.30కోట్ల వరకు పెట్టుబడులు పెట్టించారు. డబ్బులు విత్డ్రా చేయలేని విధంగా యాప్ను డిజైన్ చేశారు. కొద్దిరోజులకు బాధితుల ఫిర్యాదుతో కరీంనగర్ రూరల్, టూటౌన్ పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. నగరానికి చెందిన తులసీ ప్రకాశ్, బూర శ్రీధర్, దాసరి రాజు, దాసరి రమేశ్, కట్ల సతీశ్ను గతంలోనే అరెస్టు చేశారు. లోకేశ్వర్రావును అలుగునూరులో అదుపులోకి తీసుకుని, గురువారం రిమాండ్ చేశారు. నిందితుల నుంచి ఆస్తి ప్రతాలు, 30తులాల బంగారం, మొబైల్ఫోన్లు, ట్యాబ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును దర్యాప్తు చేసిన రూరల్ ఏసీపీ విజయ్కుమార్, సీసీఎస్ సీఐ ప్రకాశ్ను సీపీ అభినందించారు. -
కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
సిరిసిల్లఅర్బన్: రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ అన్నారు. గురువారం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు, పెద్దబోనాల, సర్ధాపూర్లోని ఏఎంసీలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. దళారులకు అడ్డుకట్ట వేసేందుకు, రైతులకు మద్దతు ధర అందించేందుకు ఈసారి ముందుగానే సింగిల్విండోలు, ఐకేపీ, డీసీఎంఎస్, మెప్మా ఆధ్వర్యంలో 231 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు స్వరూపరెడ్డి, పౌర సరఫరాల అధికారి చంద్రప్రకాశ్, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ ఆలీ బేగ్, నక్క నర్సయ్య, తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
ధాన్యం ఆరబోసేందుకు స్థలమివ్వాలని..
● బైపాస్ రోడ్డును ఒకవైపు మూసివేసి రైతుల నిరసన ● మూసివేయడం కుదరదన్న పోలీసులుసిరిసిల్ల అర్బన్: ధాన్యం ఆరబెట్టుకునేందుకు బైపాస్రోడ్డుపై స్థలం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం రైతులు నిరసన వ్యక్తం చేశారు. రగుడు–వెంకటాపూర్ రెండో బైపాస్రోడ్డుకు ఒకవైపు టైర్లు వేసి దారి మళ్లించడం జరిగిందని ఫ్లెక్సీ కట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని రోడ్డుకు అడ్డుగా వేసిన టైర్లు, ఫ్లెక్సీలను తొలగించారు. రోడ్డును మూసివేయడం కుదరదని తేల్చిచెప్పారు. దీంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణ పరిధిలోని విలీన గ్రామాలైన రగుడు, చంద్రంపేట, ముష్టిపల్లి, పెద్ద బోనాల, చిన్నబోనాల, పెద్దూరు, సర్ధాపూర్ గ్రామాలకు చెందిన రైతులు ఏటా పండించిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు సరైన స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వరికోతలు ప్రారంభమైనందున ధాన్యాన్ని ఎక్కడ ఆరబెట్టుకోవాలో తెలియని పరిస్థితి ఉందని అధికారులకు పలుసార్లు వినతిపత్రాలు ఇచ్చినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విలీన గ్రామాల, వెంకటాపూర్ రైతులు శుక్రవారం కలెక్టర్ను కలిసేందుకు తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో మా జీ కౌన్సిలర్ బొల్గం నాగరాజు, మాజీ ఎంపీటీసీ బుర్ర మల్లికార్జున్, రైతులు పాల్గొన్నారు. -
కేసుల పరిష్కార శాతం పెంచాలి
● ఎస్పీ మహేశ్ బి గితేసిరిసిల్ల క్రైం: జిల్లాలో కేసుల పరిష్కార శాతం పెంచే దిశగా ప్రతీ పోలీస్ అధికారి దర్యాప్తు నాణ్యతను మెరుగుపర్చాలని ఎస్పీ మహేశ్ బి గితే అన్నారు. గురువారం వేములవాడ సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులతో నిర్వహించిన సమావేశంలో పెండింగ్కేసుల స్థితిగతులు, నిందితుల అరెస్టులు, చార్జిషీట్ల పురోగతిని సమీక్షించారు. క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా నిందితులకు శిక్షలు పడేలా చేయాలన్నారు. ర్యాష్, మైనర్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై నిరంతర తనిఖీలు జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచి బాధితులకు అండగా నిలవాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను (బ్లాక్ స్పాట్స్) గుర్తించి ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ శేషాద్రి రెడ్డి, సీఐలు వీరప్రసాద్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, ఆర్ఐలు మధూకర్, రమేశ్, యాదగిరి, ఎస్సైలు, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు -
ఎన్నాళ్లీ అణచివేత
జర్నలిస్టుల స్వేచ్ఛపై ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. పత్రికా స్వేఛ్చను హరిస్తూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. ప్రజా సమస్యలపై గళమెత్తిన ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డితో పాటు విలేకరులపై కూటమి సర్కారు అక్రమ కేసులు బనాయిస్తూనే ఉంది. ‘సాక్షి’ కార్యాలయాల్లో పోలీసులు హల్చల్ చేయడంపై రాజకీయ పార్టీలు, సామాన్య ప్రజలు ధ్వజమెత్తుతున్నారు.ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియాను అణగదొక్కే కుటిల యత్నాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. కేసులతో మీడియాను నియంత్రించలేమనే విషయాన్ని అధికార వర్గాలు గుర్తించాలి. మీడియాను ఇబ్బంది పెడితే భవిష్యత్ పరిణామాలు అనుభవించక తప్పదు. – గుంటి వేణు, సీపీఐ జిల్లా నాయకులు ప్రజాసమస్యలను ప్రశ్నించిన మీడియాకు నోటీసులు పత్రికా స్వేచ్ఛను హరించినట్లే. అన్యాయాలను ప్రజలకు తెలిపేలా పత్రికల్లో వచ్చే కథనాలను జీర్ణించుకోలేక ఎడిటర్లపై ఏపీ ప్రభుత్వం కేసులు నమోదు చేయడం, జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేయడం సమంజసం కాదు. – లాయక్పాషా, టీయూడబ్ల్యూజే, జిల్లా అధ్యక్షుడు -
దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి
● బీఎల్వోలకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి ● కలెక్టర్ హరితసిరిసిల్ల: జిల్లాలో పెండింగ్ ఓటర్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఎం.హరిత అన్నారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఫారం 6, 7, 8 దరఖాస్తులకు సంబంధించి, నోటీస్ పీరియడ్ జారీ చేసిన ఏడు రోజులలోగా పరిష్కరించాలన్నారు. జిల్లాలో ప్రతీ పోలింగ్ బూత్కు బూత్స్థాయి అధికారి (బీఎల్వో)ల నియామకం పూర్తి కావాలని, వారికి ఐడీ కార్డులు జారీ చేయాలని సూచించారు. నూతన ఓటర్లకు ఓటర్ ఐడీ కార్డుల పంపిణీ వేగంగా పూర్తి చేయాలన్నారు. అంతకు ముందు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్రెడ్డి హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు సీ.హెచ్.వెంకటేశ్వర్లు, రాధాభాయ్, వేములవాడ తహసీల్దార్ విజయప్రకాశ్రావు, కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రవీణ్, ఎలక్షన్ సెక్షన్ అధికారి రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. -
మందకొడిగా మద్యం దరఖాస్తులు
● వ్యాపార వర్గాల్లో కనిపించని ఉత్సాహం ● నిబంధనలు మారుతాయని అనుమానాలు సిరిసిల్ల క్రైం: జిల్లాలో మద్యం దుకాణాల లైసెన్స్ల దరఖాస్తుల విషయంలో ఆసక్తి కనిపించడం లేదు. జిల్లా వ్యాప్తంగా 48 మద్యం దుకాణాలకు అనుమతి ఉండగా ఇప్పటి వరకు 435 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. దరఖాస్తుల గడువు ఈనెల 18వ తేదీతో ముగియనుండగా ఆసక్తి కనిపించడం లేదని తెలుస్తోంది. పావులావంతు రాలే.. గతంలో వచ్చిన దరఖాస్తులలో పావులా వంతు కూడా దరఖాస్తులు రాలేదని గణాంకాలు తెలుపుతున్నాయి. పోయిన సారి దరఖాస్తులు 2,036 రాగా.. ఈసారి పావులా వంతు కూడా రాలేదు. వ్యాపార వర్గాల సమాచారం ప్రకారం.. కొత్త లైసెన్స్ నిబంధనల కఠినతరం, భారీ డిపాజిట్లు, అనుకోని ఖర్చులు, మార్కెట్లో మద్యం విక్రయాలపై ప్రభుత్వ పర్యవేక్షణ కూడా పెరుగుతోందనే ప్రచారంతో వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయినా చివరి రోజుల్లో దరఖాస్తుల సంఖ్య పెరిగే అవకాశముందని ఆబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు. -
ఎగువ మానేరుపై నిర్లక్ష్యం
ముస్తాబాద్(సిరిసిల్ల): ఎగువమానేరు ప్రాజెక్టు పాలకుల నిర్లక్ష్యానికి గురువుతోంది. 75 ఏళ్ల క్రితం నిర్మించిన ప్రాజెక్టులో పూడికతీయకపోవడంతో నీటి సామర్థ్యం సగానికి పైడా పడిపోయింది. ఎగువమానేరు ప్రాజెక్టు ఆధారంగా పారే మానేరువాగుపైనే మధ్య, దిగువమానేరు ప్రాజెక్టులను నిర్మించారు. సముద్ర మట్టాలనికి అత్యంత ఎత్తులో ఉండే సిరిసిల్ల మెట్టప్రాంతానికి జీవనాధారమైన ఎగువమానేరు ప్రాజెక్టుపై అంతులేని నిర్లక్ష్యం కనిపిస్తోందనే విమర్శలు ఉన్నాయి. మధ్యమానేరు ప్రాజెక్టుతోపాటు దిగువ మానేరు ప్రాజెక్టులో పేరుకుపోయిన సిల్ట్ను తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పనులు కూడా ప్రారంభమయ్యాయి. కానీ ఈ రెండు ప్రాజెక్టులకు ఎగువనే ఉన్న నర్మాల ప్రాజెక్టుపై అధికారులు చిన్నచూపు చూస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు నిర్మించినప్పటి నుంచి ఇప్పటి వరకు తట్టెడు మట్టిని కూడా తీయలేదనే అపవాదు ఉంది. తాజాగా మధ్యమానేరు, లోయర్మానేరు(ఎల్ఎండీ)లలో పూడికతీత పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. నిజాం కాలం నాటి నర్మాల ప్రాజెక్టు 1945లో ఆఖరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ నర్మాల వద్ద కూడవెల్లి, పాల్వంచవాగులు కలిసే చోట ప్రాజెక్టును నిర్మించారు. రూ.1,29,288లతో 17,680 ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో ప్రాజెక్టును నిర్మించారు. 1945లో మొదలైన పనులు 1950లో పూర్తయ్యాయి. ఆరుగురు చీఫ్ ఇంజినీర్ల పర్యవేక్షణలో ఐదేళ్లలో నిర్మించిన ప్రాజెక్టు 75 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇన్నాళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న ప్రాజెక్టు ఆనాటి చక్కటి ఇంజినీరింగ్ పనితనానికి సాక్ష్యంగా నిలుస్తోంది. ఇప్పటి వరకు ప్రాజెక్టులో పేరుకుపోయిన సిల్ట్ను ఏనాడు తీయలేదు. 2002లో అప్పటి మంత్రి, నేరెళ్ల ఎమ్మెల్యే కుడి కాలువను సీసీ చేయించారు. అది మినహా ఏ ప్రభుత్వం ప్రాజెక్టు కోసం నిధులను కేటాయించలేదు. రెండు ప్రాజెక్టులకు నిధులు ఎగువ మానేరు ప్రాజెక్టు కింద ఉన్న మధ్యమానేరు, దిగువ మానేరు ప్రాజెక్టుల్లో డీసిల్టింగ్, డ్రెజింగ్ విధానంతో పూడికతీత పనులు చేపడుతున్నారు. ఇప్పటికే ఎల్ఎండీలో పనులు కొనసాగుతున్నాయి. మధ్యమానేరులో నీటిమట్టం తగ్గగానే పూడికతీత పనులు చేపట్టనున్నారు. వీటితోపాటు నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టులో పూడికతీతకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఎల్ఎండీలో ట్రయల్రన్ పూర్తి చేశారు. డీసిల్టింగ్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తోంది. పూడికమట్టిని రైతులకు అందించడం ద్వారా, అక్కడే లభించే ఇసుకను విక్రయించడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం చేరనుంది. ప్రాజెక్టుల్లో డీసిల్టింగ్ ద్వారా నీటి సామర్థ్యం పెరగనుంది. తగ్గిన ఒక టీఎంసీ సామర్థ్యం ఎగువమానేరు ప్రాజెక్టును 75 ఏళ్లుగా డీసిల్టింగ్ చేయకపోవడంతో దాని సామర్థ్యం తగ్గిందని ఇంజినీర్లు చెబుతున్నారు. మూడు టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ప్రాజెక్టులో సిల్ట్ పేరుకుపోవడంతో ఒక టీఎంసీ సామర్థ్యం తగ్గిందని పేర్కొంటున్నారు. దీంతో 18వేల ఎకరాలకు అందించాల్సిన నీరు ప్రస్తుతం 12వేల ఎకరాలకు మాత్రమే పరిమితం చేయాల్సి వచ్చింది. ఎగువమానేరు ప్రాజెక్టు సిల్ట్ తొలగిస్తే ఒక టీఎంసీ పెరిగి జిల్లెల్ల, దేశాయిపల్లి, బద్దెనపల్లి, తాడూరు వరకు సాగునీటిని అందించవచ్చు. అయితే ఈ ప్రాజెక్టులో డీసిల్టింగ్కు అధికారులు చేసిన ప్రతిపాదనలకు మంజూరు రాలేదు. వచ్చే ఏడాదైనా నిధులు మంజూరు చేయాలని రైతులు కోరుతున్నారు. -
ఎల్ఈడీ స్క్రీన్లో దర్శనం
వేములవాడ: రాజన్న ఆలయంలోని రావిచెట్టు వద్ద ఎల్ఈడీ స్క్రీన్లో దర్శనం కల్పించనున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధే ప్రధాన ఎజెండా అని పేర్కొన్నారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి, ఈనెల 19న శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతిస్వామి రాక సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యార్, వీటీడీఏ వైస్చైర్మన్, కలెక్టర్ హరిత, ఎస్పీ మహేశ్ బీ గీతే తదితరులతో కలిసి బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాజన్న ఆలయ అభివృద్ధి పనులను అందరి సలహాలు, సూచనల మేరకు చేపడుతున్నట్లు వివరించారు. సీఎం రేవంత్రెడ్డి, ఇతర మంత్రుల సహకారంతో పనులు ముందుకుసాగుతున్నాయని తెలిపారు. మొదటిదశలో రూ.76కోట్లతో ప్రధాన ఆలయ విస్తరణ, అభివృద్ధి, రూ.35 కోట్లతో నిత్యాన్నదానం, రూ.47కోట్లతో ప్రధాన రహదారి విస్తరణ పనులకు శ్రీకారం చుట్టినట్లు వివరించారు. ఆలయ పనులపై ప్రతీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీకిస్తున్నామని తెలిపారు. 19న శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతీస్వామి రాక ఈనెల 19న శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతిస్వామి రానున్నారని వెల్లడించారు. ఆమేరకు చేయాల్సిన ఏర్పాట్లపై సమీక్షించామని పేర్కొన్నారు. భక్తులకు రాజన్న ఆలయ ఆవరణలోని రావిచెట్టి వద్ద ఎల్ఈడీ స్క్రీన్, ప్రచారరథంలో శ్రీస్వామి వారి దర్శనం కల్పిస్తామని చెప్పారు. రాజన్న సేవలో రాష్ట్ర దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజన్నను రాష్ట్ర దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ హరిత, ఎస్పీ మహేశ్ బీ గీతే, ఆర్డీవో రాధాభాయి, వీటీడీఏ అధికారులు బుధవారం దర్శించుకున్నారు. ఆలయ ఈవో రమాదేవి, అర్చకుల బృందం స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనానంతరం వేదోక్త ఆశీర్వచనం గావించారు. -
పారదర్శకంగా డీసీసీ అధ్యక్షుల నియామకం
సిరిసిల్లటౌన్/వేములవాడ: పార్టీ జిల్లా అధ్యక్షుడు నుంచి మండల అధ్యక్షుల ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిస్తామని ఏఐసీసీ అబ్జర్వర్ మన్నె శ్రీనివాస్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సంఘటన్ సృజన్ అభియాన్లో భాగంగా రాజన్నసిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియపై బుధవారం కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సిరిసిల్లలోని మల్లికార్జున ఫంక్షన్హాల్, వేములవాడలోని మహాలింగేశ్వర గార్డెన్స్లలో నిర్వహించిన సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి, మానకొండూరు నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ సంఘటన్ అభియాన్లో భాగంగా జిల్లా అధ్యక్షుల ఎన్నికల ప్రక్రియపై కార్యకర్తల అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. ముందస్తుగా కార్యకర్తల సలహాలు, సూచనలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నెల రోజుల్లోగా జిల్లా అధ్యక్షుడి ఎన్నిక పూర్తయ్యేలా చూస్తామన్నారు. జిల్లా స్థాయిలో కొత్తగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అధిష్టానం ఆదేశాలు ఆచరిస్తాం – ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకు పదవుల ఎన్నిక చేపడతామని ప్రభుత్వ విప్, డీసీసీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాలతో మమేకమై రాబోయే రోజుల్లో పటిష్ట నాయకత్వం పదవులు అధిష్టించేలా చూస్తామన్నారు. ఎన్నికల అబ్జర్వర్ల నివేదికను ఏఐసీసీకి పంపిస్తారని పేర్కొన్నారు. పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి, పట్టణాధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, వెల్ముల స్వరూప, సంగీతం శ్రీనివాస్, చిట్ల సత్యనారాయణ, కనిమేని చక్రధర్రెడ్డి, వైద్య శివప్రసాద్, కాముని వనిత, సూర దేవరాజు, కూస సత్యనారాయణ పాల్గొన్నారు. -
అనంతపల్లికి ఆర్టీసీ సేవలు ప్రారంభం
చందుర్తి(వేములవాడ): మండలంలోని అనంతపల్లికి ఆర్టీసీ సేవలు బుధవారం ప్రారంభమయ్యాయి. గత పన్నెండేళ్ల క్రితం ఆ గ్రామస్తులు ఆర్టీసీ సేవలకు దూరమయ్యారు. గ్రామస్తులు ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే కాలినడకనే మూడు కిలోమీటర్ల దూరం వెళ్లి బస్సు ఎక్కాల్సిన పరిస్థితి. పన్నెండేళ్లుగా పలుమార్లు గ్రామానికి బస్సు సర్వీసు వేయాలని పాలకులు, అధికారులకు మొరపెట్టుకున్నారు. వారం క్రితం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కు గ్రామస్తులు విన్నవించగా.. విప్ ఆదేశాలతో బస్సు సర్వీసు బుధవారం ప్రారంభమైంది. వేములవాడ నుంచి అనంతపల్లి మీదగా తిమ్మాపూర్ వరకు బస్సు నడిపిస్తున్నారు. ఈ ప్రా రంభోత్సవంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు చింతపంటి రామస్వామి, రుద్రంగి మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు బొజ్జ మల్లేశం, వేములవాడ ఆర్టీసీ డిపో పీఆర్వో శ్రీనివాస్, గ్రామస్తులు తొట్ల మల్లేశం, చిన్న వెంకటేశం, కనకరాజు, రాజయ్య, మహేశ్, అనిల్ పాల్గొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్నికలు సిరిసిల్లకల్చరల్: ఓటు విలువ, ఎన్నికల నిర్వహణపై విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు కాలేజీల్లో నిర్వహిస్తున్న ఎన్నికలు దోహదపడతాయని సిరిసిల్ల టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణ పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం పోలింగ్ నిర్వహించారు. లెక్చరర్ చంద్రమౌళి రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తూ హెడ్బాయ్స్, హెడ్గర్ల్స్ పదవుల కోసం ఎన్నికలు జరిపించారు. కాలేజీ ప్రెసిడెంట్గా జి.భావన, హెడ్ గర్ల్గా ఎన్.అక్షయ, హెడ్ బాయ్గా ఎ.సిద్ధార్థ ఎన్నికయ్యారు. కళాశాల ప్రిన్సిపాల్ కనకశ్రీ విజయరఘునందన్ పర్యవేక్షణలో లెక్చరర్లు కేదారేశ్వర్, వెంకటేశం, వివేకానంద, ఆంజనేయులు, చంద్రశేఖర్, కనకయ్య, రాజయ్య, సరోజన, శ్రీనివాస్, శశిధర్, రాజశేఖర్, శ్రీనివాస్, సుజిత, మమత, విద్యార్థులు పాల్గొన్నారు. ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలి సిరిసిల్ల: గర్భిణీలకు, బాలింతలకు, పిల్లల కు విధిగా ఆకుకూరలు, పండ్లు అందించా లని జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం సూ చించారు. పోషణ మాసంలో భాగంగా జిల్లా కేంద్రంలోని సుభాష్నగర్ అంగన్వాడీ కేంద్రంలో బుధవారం అవగాహన కల్పించారు. లక్ష్మీరాజం మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పోషణ మాసం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆహారంలో ఆయిల్, షుగర్ వాడకాన్ని తగ్గించాలని, పాలు, పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, చిరుధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. డీసీపీవో కవిత, సూపర్వైజర్ దివ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక సిరిసిల్ల ఎడ్యుకేషన్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్–14 విభాగంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎల్లారెడ్డిపేట కేజీబీవీ విద్యార్థిని వి.భార్గవి ఎంపికై ంది. ఉమ్మడి జిల్లా కేంద్రంలో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహిస్తుందని కేజీబీవీ స్పెషలాఫీసర్ అనిత, పీఈటీ శ్రీలత తెలిపారు. -
సీపీఆర్పై అవగాహన ఉండాలి
● అదనపు కలెక్టర్ నగేశ్ ● కలెక్టరేట్ ఉద్యోగులు, సిబ్బందికి అవగాహన సిరిసిల్ల: సీపీఆర్(కార్డియో పల్మనరీ రిసోసియేషన్)పై అందరికీ అవగాహన ఉండాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ పేర్కొన్నారు. సీపీఆర్ అవగాహన వారోత్సవాల సందర్భంగా కలెక్టరేట్లో బుధవారం అన్ని శాఖల ఉన్నతాధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించారు. అదనపు కలెక్టర్ సీపీఆర్ చేసి మాట్లాడారు. అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్టు అయినప్పుడు సీపీఆర్ చేసి ప్రమాదం నుంచి కాపాడగలుగుతామన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ నాగార్జున మాట్లాడుతూ కార్డియాక్ అరెస్టు అయితే 108 అంబులెన్స్కు సమాచారమిస్తూనే వాహనం వచ్చే వరకు సీపీఆర్ చేస్తూ ఊపిరి అందిస్తే ప్రాణాలను కాపాడవచ్చన్నారు. గుండె అకస్మాత్తుగా కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు, మెదడు ఇతర ముఖ్యమైన అవయవాలకు రక్తప్రసరణకు అంతరాయం ఏర్పడిన వెంటనే సహాయం అందించకపోతే మెదడు దెబ్బతినడం, నిమిషాల్లో మరణం సంభవిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లోని ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత, వైద్యులు, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి
వేములవాడఅర్బన్: మన జీవన విధానంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని జిల్లా కో ఆర్డినేటర్ సురేశ్ కోరారు. అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నేషనల్ గ్రీన్ కోర్ సహకారంతో బుధవారం క్యాంపస్ ఎకో బజార్, స్వదేశీ దీపావళి నిర్వహించారు. సురేశ్ మాట్లాడు తూ మన జీవితంలో ప్లాస్టిక్ వస్తువు ఒక భాగంగా మారిపోయిందన్నారు. హోటళ్లలో పేపర్ కప్పుల ద్వారా టీ తాగడం ద్వారా ప్లాస్టిక్ కణాలు మన శరీరంలోకి ప్రవేశిస్తున్నాయన్నారు. విద్యార్థులు మ ట్టితో ప్రమిదలను, బట్టతో సంచులను, మిల్లెట్తో ఆహార పదార్థాలు తయారు చేశారు. ప్రిన్సిపాల్ శంకర్, లావణ్య, ప్రేమ్కుమార్, కరుణ, శ్రీధర్రావు, ప్రసాద్ పాల్గొన్నారు. వీర్నపల్లి(సిరిసిల్ల): రేషన్బియ్యం తూకంలో తేడా రావడంతో గ్రామస్తులు డీలర్ని నిలదీసిన ఘటన మండలంలోని అడవిపదిరలో చోటుచేసుకుంది. కొందరు లబ్ధిదారులు బుధవారం బియ్యం తీసుకున్నారు. ఇంటికి వెళ్లిన తర్వాత అనుమానంతో బియ్యాన్ని కిరాణషాపులో మళ్లీ తూకం వేయించారు. తేడా రావడంతో రేషన్డీలర్ని నిలదీశారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. మిడ్మానేరులో 27 టీఎంసీలు బోయినపల్లి(చొప్పదండి): శ్రీరాజరాజేశ్వర(మిడ్మానేరు)లో నీటిమట్టం 27.145 టీఎంసీలకు చేరింది. మానేరు, మూలవాగుల్లోంచి 476 క్యూసెక్కులు వస్తోంది. -
వంతెన.. ఇంతేనా..
● వాగుదాటేదెలా..? ● ఏటా తాత్కాలిక మరమ్మతులేనా.. ● నిధులు రావు.. పనులు సాగవు ● ఆర్అండ్బీ రోడ్ల వంతెనలకు మోక్షం ఎప్పుడో..?సిరిసిల్ల: వానాకాలంలో జిల్లాలోని పలుచోట్ల లోలెవల్ వంతెనలు నీటమునిగి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. పలు చోట్ల వరద ధాటికి వంతెనలు కొట్టుకుపోగా తాత్కాలిక మరమ్మతుతో సరిపెడుతున్నారు. కోనరావుపేట మండలంలోని మూలవాగుపై మూడు హైలెవల్ వంతెనలు, కొండాపూర్ శివారులోని పెట్టివాగుపై మరో హైలెవల్ వంతెన నిర్మాణానికి రూ.58 కోట్లు మంజూరు చేస్తూ 2022లో ప్రొసీడింగ్ వచ్చింది. కానీ వర్క్ ఆర్డర్ లేని, టెండర్ కాని పనులను 2023లో రద్దు చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా అభివృద్ధి స్వరూపం మారిపోతుంది. మళ్లీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నాలుగు వంతెనల నిర్మాణానికి డీపీఆర్ తయారు చేయాలని, హెచ్ఏఎం విధానంలో 60 శాతం నిధులు రుణం, మరో 40 శాతం నిధులు గ్రాంటు రూపంలో ఇచ్చేందుకు సిద్ధమైంది. కానీ, ఈ నిధులు ఎప్పుడు మంజూరవుతాయో, పనులు ఎప్పుడు పూర్తి చేస్తారో తెలియక గ్రామీణులు రోడ్డు కష్టాలు ఎదుర్కొంటున్నారు. నిధులున్నా.. గంభీరావుపేట మండల కేంద్రం నుంచి లింగన్నపేట మీదుగా ముస్తాబాద్, సిద్దిపేట వెళ్లే దారిలో మానేరువాగుపై వంతెన నిర్మాణానికి నిధులున్నా పనులు సాగడం లేదు. గంభీరావుపేట– లింగన్నపేట మధ్య హైలెవల్ వంతెన నిర్మాణానికి రూ.6.55 కోట్లు మంజూరయ్యాయి. కాంట్రాక్టు పొందిన సంస్థ పనులు చేయకుండా మధ్యలో వదిలేసింది. వాగులో కొద్దిగా పిల్లర్లు పోశారు. పక్కనుంచి తాత్కాలిక మట్టి రోడ్డు వేశారు. కానీ, వరదల ధాటికి రోడ్డు కొట్టుకుపోయింది. పిల్లర్లు వంగిపోయాయి. కాంట్రాక్టర్ నిర్వాకంతో పనులు అర్ధాంతరంగా ఆగాయి. ఇవే కాకుండా వీర్నపల్లి మండలం అడవిపదిర వాగుపై రూ.2.40 కోట్లతో నిర్మిస్తున్న వంతెనను కాంట్రాక్టర్ మధ్యలో వదిలేశాడు. దీంతో ఎల్లారెడ్డిపేట–మరిమడ్ల మధ్య రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఇలా నిధులు లేక కొన్ని వంతెనలు మొదలేకాలేదు. కొన్ని వంతెనలు నిధులున్నా కాంట్రాక్టర్లు పనులు చేయడం లేదు. ఇప్పటికై నా పాలకులు క్షేత్రస్థాయిలో వాస్తవాలను గమనించి వంతెనల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని గ్రామీణులు కోరుతున్నారు. -
పశువులకు గాలికుంటు నివారణ టీకాలు
సిరిసిల్ల: జిల్లాలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను బుధవారం నుంచి ఇవ్వనున్నట్లు జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి డాక్టర్ రవీందర్రెడ్డి మంగళవారం తెలిపారు. జిల్లాలోని 95వేల పశువులకు టీకాలు వేస్తామని పేర్కొన్నారు. ఏటా ప్రభుత్వం పశువులకు రెండుసార్లు ఈ టీకాలు ఉచితంగా వేస్తుందని వివరించారు. జిల్లాలోని 13 మండలాల్లో 19 బృందాలు క్షేత్రస్థాయిలో ఈ టీకాలు వేస్తాయన్నారు. కోనరావుపేట మండలం పల్లిమక్తలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ ఎం.హరిత పశువులకు టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని వెల్లడించారు. జిల్లాలోని పశువుల యజమానులు తమ జీవాలకు టీకాలు వేయించాలని కోరారు. -
దారులపై ధాన్యం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ధాన్యం అమ్ముకునేంఉదకు రైతులు అరిగోస పడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తేమ శాతం రావడానికి స్థలాలు లేక ప్రధాన రహదారుల వెంట ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. ఈ క్రమంలో అనేక ప్రమాదాలు జరిగి రైతులు, వాహనదారులు గాయాలతో బయటపడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మండలవ్యాప్తంగా 25 కొనుగోలు కేంద్రాలు ఉండగా, కేవలం 15 కేంద్రాలకు మాత్రమే స్థలాలు ఉన్నాయి. నిర్వహకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు రైతులు అమ్ముకోవడానికి సరైన ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో ఒకటి అర తప్ప ఇప్పటి వరకు కల్లాలు ఏర్పాటు కాలేదు. దీనిపై రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. కాగితాలకే పరిమితం రైతులు ధాన్యం ఆరబెట్టుకునేందుకు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన కల్లాల ఏర్పాటు ప్రక్రియ కాగితాలకే పరిమితమైంది. జిల్లా వ్యాప్తంగా రెండంకెల లోపే అసంపూర్తిగా కల్లాలు ఏర్పాటు చేశారు. మండల వ్యాప్తంగా 24 గ్రామపంచాయతీల పరిధిలో 10లోపే కల్లాలు ఏర్పాటు చేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. దీంతో రోజుల తరబడి రహదారులపైనే అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారు. వెంటాడుతున్న ప్రమాదాలు ప్రధానంగా సిరిసిల్ల–కామారెడ్డి, ఎల్లారెడ్డిపేట–వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట–గంభీరావుపేట రహదారుల్లో రైతులు నిత్యం ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. కేంద్రాలకు స్థలాలను సమకూర్చకపోవడంతో రోడ్లపైనే ఆరబెట్టే దుస్థితి ఏర్పడుతోంది. ఈనేపథ్యంలో గత రెండు సీజన్లలో నాలుగు ప్రమాదాలు జరిగి 8మంది రైతులు తీవ్ర గాయాలపాలై ప్రాణాలతో బయటపడ్డారు. గోరింట్యాల, వీర్నపల్లి, హరిదాస్నగర్, వెంకటాపూర్, వేములవాడ, తంగళపల్లి శివారులో ప్రమాదాలు జరిగాయి. ముఖ్యంగా రాత్రిపూట రైతులు ధాన్యం రాశుల వద్ద కాపలా ఉండే క్రమంలో నిద్రకు ఉపక్రమించడం, అదే సమయాల్లో వాహనాలపై వచ్చేవారికి ధాన్యం కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికై న అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కేంద్రాలకు ప్రత్యేక స్థలాలను గుర్తించి అన్నదాతల ఇబ్బందులు తొలగించాలని రైతులు కోరుతున్నారు.‘ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్లో సిరిసిల్ల–కామారెడ్డి ప్రధాన రహదారిపై రైతులు ధాన్యాన్ని ఆరబెట్టారు. చీకటి పూట ధాన్యం రాశులు కనిపించక వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. గతంలో ఇదే రహదారిపై ధాన్యానికి కాపాలాగా ఉన్న రైతు మల్లయ్య ద్విచక్రవాహనం ఢీకొని కోమాలోకి వెళ్లాడు. ఇలా రోడ్లపై ఆరబెట్టిన ధాన్యంతో రైతులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు’. ‘ఈ రైతు పేరు దేవరాజు, గ్రామం దుమాల. ధాన్యం ఆరబెట్టడానికి రోడ్డెక్కాడు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా.. ధాన్యాన్ని ఆరబెట్టి అమ్ముకునేందుకు సౌకర్యాలు కల్పించడం లేదు. దీంతో రైతులు దారులపైనే ధాన్యం ఆరబెట్టి అక్కడే అమ్ముకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో రోడ్డు వెంట వెళ్లే వాహనాలతో ప్రమాదాలకు గురైన సంఘటనలున్నాయి. ప్రతి సీజన్లో భయంభయంగా రోడ్డుపై ధాన్యం ఆరబెట్టి అమ్ముకుంటున్నామని దేవరాజు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలా ఇతడొక్కడి పరిస్థితే కాదు.. మండలంలో అనేక ప్రాంతాల్లో రైతులు పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి ఇలాంటి పాట్లు పరిపాటిగా మారాయి’. -
వేగంగా ఆలయ అభివృద్ధి పనులు
వేములవాడ: రాజన్న ఆలయ విస్తరణ పనులకు మోక్షం లభిస్తోంది. గుడి చెరువు ఖాళీ స్థలంలో ప నులు జరిగే ప్రాంతానికి జనాలు రాకుండా బౌండ రీ ఏర్పాటు చేస్తున్నారు. కోడెల క్యూలైన్లను తొలగించి వాటి స్థానంలో అభివృద్ధి పనులకు మంగళవారం జేసీబీలతో మట్టి తీస్తున్నారు. భీమన్న గుడి ముందున్న వేద పాఠశాల భవనంలోకి ప్రసాదాల తయారీ కేంద్రాన్ని మార్చబోతున్నారు. కాగా, ఈనె ల 19న శృంగేరిపీఠాధిపతి విధుశేఖర భారతీతీర్థానంద స్వామిజీ రాజన్న ఆలయానికి రానున్నట్లు విప్ ఆది శ్రీనివాస్ ఇప్పటికే ప్రకటించారు. ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 20న స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పలు సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. అనంతరం భీమేశ్వరాలయాన్ని సందర్శిస్తారు. కా గా, ఈ ఏర్పాట్లను పరిశీలించేందుకు బుధవారం రాష్ట్ర దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారా మయ్యర్ వేములవాడకు రానున్నట్లు అధికారులు తెలిపారు. పీఆర్వో కార్యాలయ భవనంలోకి నిత్య నివేదనశాల రాజన్న ఆలయ ఆవరణలోని రాజేశ్వరపురం వసతి గదుల వద్దనున్న ప్రధాన గెస్ట్హౌస్లోని నాలుగు వీఐపీ గదుల్లో ఇప్పటి వరకు పీఆర్వో కార్యాలయం కొనసాగింది. ప్రస్తుతం ఈ గెస్ట్హౌస్లోకి శ్రీస్వామి వారి నిత్యనివేదనశాల ఏర్పాటు చేసేందుకు మంగళవారం సన్నాహాలు చేపట్టారు. -
విద్యార్థులకు ఇబ్బందిలేకుండా చర్యలు
సిరిసిల్ల: జిల్లాలో బెస్ట్ అవెలబుల్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఎం.హరిత అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో బెస్ట్ అవెలబుల్ స్కూల్స్ ఏడు ఉండగా, 338 మంది విద్యార్థులు చదువుతున్నారని, ఎస్టీ విద్యార్థులకు ఒక స్కూల్ ఉండగా 35 మంది చదువుతున్నారని వివరించారు. ఆయా విద్యాసంస్థల్లో చదువుతున్నవారికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. అంతకు ముందు ఇదే అంశంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. జిల్లా ఇన్చార్జి విద్యాధికారి వినోద్కుమార్, జిల్లా ఇన్చార్జి ఎస్సీడీవో రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
శృంగేరి పీఠాధిపతుల దర్శనానికి రండి
వేములవాడ: హైదరాబాద్లోని నల్లకుంట శంకర్మఠంలో శృంగేరి జగద్గురువు విధుశేఖర భారతీస్వామి దర్శనానికి రావాల్సిందిగా సీఎం రేవంత్రెడ్డికి మంగళవారం విప్ ఆది శ్రీనివాస్, శంకరమఠం ధర్మాధికారి శ్రీనివాసమూర్తి, రాముబంటు, రవి, శృంగేరిపీఠం తెలంగాణ బాధ్యులు రాధాకృష్ణశర్మ ఆహ్వాన పత్రిక అందజేశారు. అనంతరం వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనుల తీరు తెన్నుల గురించి, కలికోట సూరమ్మ ప్రాజెక్టు అంశాలపై చర్చించినట్లు విప్ తెలిపారు. ప్రజా సమస్యలపై వెంటనే స్పందించాలిగంభీరావుపేట(సిరిసిల్ల): విలేజ్ పోలీస్ అధికారులు తమకు కేటాయించిన గ్రామాల్లో విధిగా పర్యటించాలని ఎస్పీ మహేశ్ బీ.గీతే సూచించారు. మంగళవారం గంభీరావుపేట పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిధిలో కేసుల నమోదు, తదితర వివరాలు తెలుసుకున్నారు. ప్రజా సమస్యలపైన వెంటనే స్పందిస్తూ బాధితులకు సత్వర న్యాయం జరిగేలా భరోసా కల్పించాలన్నారు. రోజూ స్టేషన్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ విధి నిర్వహణలో క్రమశిక్షణతో ఉండాలని, సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉంటే తమ దృషికి తీసుకురావాలని పేర్కొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ‘జర్నల్’ ఆవిష్కరణసాక్షి, హైదరాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావు పేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ రూపొందించిన ఇంటర్నేషనల్ జర్నల్ ప్రత్యేక సంచికను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి మంగళవారం హైదరాబాద్లో ఆవిష్కరించారు. మండలి వైస్ చైర్మన్లు ఇటిక్యాల పురుషోత్తం, ఎస్కే మహమూద్, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, గంభీరావు పేట డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండిసిరిసిల్లటౌన్: రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని రేవా జిల్లా అధ్యక్షుడు మల్లారపు పురుషోత్తం అన్నారు. మంగళవారం సిరిసిల్లలోని అసోసియేషన్లో మాట్లాడారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఈనెల 17న ఉదయం 11 గంటలకు కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. 2024 మార్చి నుంచి ఇప్పటివరకు రిటైర్డ్ అయిన జిల్లాలోని ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సంఘం ప్రధాన కార్యదర్శి చౌకి సుధాకర్, పట్టణ అధ్యక్షుడు టీవీ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. -
అలసిన అరుణ కిరణం
భూమి.. భుక్తి.. పీడిత, తాడితుల విముక్తి కోసం ఆయుధం పట్టి సుమారు నాలుగు దశాబ్దాల పాటు పాలకులపై తిరగుబావుటా ఎగురవేసిన అరుణ కిరణం అలసిపోయింది.. వృద్ధాప్యం, మారుతున్న కాలం, సామాజిక పరిస్థితుల నేపథ్యంలో నూనూగుమీసం బందూకును వీడింది.. బ్రాహ్మణ సామాజికవర్గంలో జన్మించినా దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమించింది.. చరిత్రలోనే తనకంటూ ప్రత్యేకత సాధించుకున్న పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన అప్పటి పీపుల్స్వార్, ప్రస్తుత మావోయిస్ట్(సీపీఐ–ఎంఎల్) పార్టీ కేంద్రకమిటీ, పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్రావు ఉరఫ్ భూపతి, అభయ్, మాస్టర్, ఉరఫ్ సోన్ జనజీవన స్రవంతిలోకి రావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. స్వాతంత్య్ర సమరయోధుడు, తండ్రి మల్లోజుల వెంకటయ్య, మావోయిస్ట్ పార్టీ అగ్రనేత, సోదరుడు మల్లోజు కోటేశ్వర్రావు ఆశయాలను పుణికి పుచ్చుకున్న అభయ్.. సుమారు నాలుగు దశాబ్దాలకు పైగా శత్రువులను ముప్పుతిప్పలు పెట్టారు. అంచెలంచెలుగా ఎదిగారు. దండకారణ్యంలో ఒకానొకదశలో సంమాంత ప్రభుత్వం నడిపినట్లు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యమానికి విరామం ప్రకటిస్తున్నామంటూ కొంతకాలంగా లేఖలు విడుదల చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే సోనూ లొంగిపోయినట్లు సమాచారం. – సాక్షి, పెద్దపల్లి -
ఏసీబీకి చిక్కిన సర్వేయర్
సిరిసిల్ల: జిల్లా కేంద్రంలో అవినీతి నిరోధక శాఖ అధికారులకు మండల సర్వేయర్ లంచం తీసుకుంటూ మంగళవారం పట్టుబడ్డాడు. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ పి.విజ య్కుమార్ కథనం ప్రకారం.. సిరిసిల్ల పట్టణానికి చెందిన బాధితుడికి పట్టణ శివారులోని చిన్నబోనాల వద్ద మూడెకరాల భూమి ఉంది. ఆ భూమి హద్దులను సర్వే చేసేందుకు నిబంధనల మేరకు రెవెన్యూ శాఖకు ఫీజు చెల్లించాడు. కాగా, రూ.30వేలు లంచం ఇస్తేనే సర్వే చేస్తానని మండల సర్వేయర్ మాడిశెట్టి వేణుగోపాల్ స్పష్టం చేశాడు. దీంతో బాధితుడు చేసేది లేక సోమవారం రూ.10వేలు అప్పగించడంతో సర్వేయర్ చిన్నబోనాలకు వెళ్లి భూసర్వే చేశాడు. సర్వేకు సంబంధించి పంచనామా నివేదికను బాధితుడికి ఇచ్చేందుకు ఒప్పందంలో భాగంగా మరో రూ.20వేలు డిమాండ్ చేశాడు. అప్పటికే ఏసీబీ అధికారులను ఆశ్రయించిన బాధితుడు.. వారి సూచన మేరకు డబ్బు ఇచ్చేందుకు సిరిసిల్ల తహసీల్దార్ ఆఫీస్కు వచ్చాడు. డబ్బులను ఆఫీస్లో కాకుండా తన వద్ద ప్రైవేటు సహాయకుడిగా పని చేసే సూర్యవంశీకి ఇవ్వాలని సర్వేయర్ సూచించాడు. ఆయన సూచన మేరకు సూర్యవంశీకి రూ.20వేలు ఇవ్వడంతో ఏసీబీ పోలీసులు పట్టుకున్నారు. సహాయకుడు, సర్వేయర్ను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఎవరైనా లంచం అడిగితే నిర్భయంగా ఏసీబీ అధికాలను ఆశ్రయించాలని ఆయన కోరారు. -
బాలికలు అన్నిరంగాల్లో రాణించాలి
సిరిసిల్లటౌన్/సిరిసిల్లకల్చరల్: బాలికలు అన్నిరంగాల్లో రాణించాలని జిల్లా జడ్జి పుష్పలత అన్నారు. అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా మంగళవారం కుసుమ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా జడ్జి హాజరై మాట్లాడారు. బాలికలు అభ్యున్నతి సాధించినప్పుడే దేశం ప్రపంచ దేశాల సరసన నంబర్వన్గా నిలుస్తుందన్నారు. డీఎల్ఎస్ఏ కార్యదర్శి రాధికా జైస్వాల్ మాట్లాడుతూ, విద్యార్థి దశనుంచే రాజ్యాంగం ప్రసాదించిన పౌర హక్కులపై అవగాహన పెంచుకోవాలన్నారు. అనంతరం పోటీలో రాణించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఎస్సై వినీత్రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు లకవత్ మోతీలాల్, స్టాఫ్ సెక్రటరీ పాకాల శంకర్గౌడ్, గుర్రం ఆంజనేయులు, ఆడెపు వేణు, చింతోజు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. రేపు మినీ జాబ్మేళాసిరిసిల్లకల్చరల్: ప్రముఖ ప్రైవేట్ కంపెనీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం ఈ నెల 16న మినీ జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి నీల రాఘవేందర్ తెలిపారు. ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ యువత గురువారం ఎంప్లాయ్మెంట్ కార్యాలయానికి తమ విద్యార్హతల ధ్రువపత్రాలతో హాజరు కావాలన్నారు. ఎంపికై న అభ్యర్థులకు మెరీనా పెయింట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో రూ.10 నుంచి రూ.20వేల వేతనం లభిస్తుందన్నారు. పూర్తి వివరాలకు 94934 72412 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
నిర్లక్ష్యం వీడండి
సిరిసిల్ల అర్బన్: అధికారులు ప్రజావాణి అర్జీలపై నిర్లక్ష్యం వీడి.. ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఎం.హరిత సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అర్జీలు స్వీకరించిన అనంతరంలో మాట్లాడారు. ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్లో పెట్టవద్దని సూచించారు. బాధితులకు త్వరగా న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వివిధ సమస్యలపై 81 దరఖాస్తులు వచ్చాయి. బాధితుల నుంచి అర్జీలను కలెక్టర్తోపాటు అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, డీఆర్డీవో శేషాద్రి స్వీకరించారు. -
రాజన్న మండపం!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ పునర్ నిర్మాణం, అభివృద్ధి విషయంలో ఇప్పటికే గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ నిర్మాణం ఎలా సాగుతోందనే అంశం తెరపైకొచ్చింది. యాదాద్రి ఆలయాన్ని కృష్ణశిల రాయితో నిర్మించినట్టుగానే ఇక్కడ జరిగేనా లేక పిల్లర్లతో నిర్మిస్తారా? అనే చర్చ సాగుతోంది. సుమారు 70 పిల్లర్లతో స్లాబు వేసి రాజన్న ఆలయ మండపం నిర్మించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆలయ పునర్ని ర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.76కోట్లను మంజూరు చేసింది. యాదాద్రి ఆలయ నిర్మాణానికి రూ.300 కోట్లు గత ప్రభుత్వం ఖర్చు చేసింది. దీన్ని బట్టి చూస్తే యాదాద్రి తరహాలో రాజన్న ఆలయ నిర్మాణం పూర్తయ్యేనా అనే అపోహలు భక్తుల్లో నెలకొన్నాయి. దీనిపై ప్రభుత్వం, దేవాదాయశాఖ స్ప ష్టమైన వివరణ ఇవ్వాలని భక్తులు కోరుతున్నారు. పీఠాధిపతి రాకతో అపోహలు తొలగేనా? ఈనెల 19న శృంగేరి పీఠాధిపతి జగద్గురు విధుశేకర భారతిస్వామి వేములవాడ ఆలయాన్ని సందర్శించి సలహాలు, సూచనలు అందించనున్నారు. ఈనేపథ్యంలో పీఠాధిపతి రాకతోనైనా ఆలయ నిర్మాణం విషయంలో స్పష్టత వచ్చేనా అని భక్తులు, స్థానికులు ఎదురుచూస్తున్నారు. స్వామీజీ సూచనల మేరకే దేవాదాయశాఖ ఆలయ పునర్ నిర్మాణ విషయంలో మాస్టర్ప్లాన్ బ్లూప్రింట్ సిద్ధం చేసింది. ఇందులో పిల్లర్లతో నిర్మాణం చేపడుతున్నట్లు భక్తులు చర్చించుకుంటున్నారు. ఇదే కొనసాగితే రాజన్న ఆలయ ఆధ్యాత్మికతకు భంగం కలిగే అవకాశం ఉందని భక్తులు పేర్కొంటున్నారు. అలాగే ప్రాచీనతకు అద్దం పట్టినట్లు ఉండే రాజన్న ఆలయ రూపురేఖలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. యాదాద్రి ఆలయాన్ని ఆధ్యాత్మికతకు అద్దం పట్టేలా నిర్మించారు. అంతకంటే పురాతన చరిత్ర గల రాజన్న ఆలయాన్ని అలాంటి శైలిలోనే నిర్మాణం చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. కాకతీయుల కాలం నాటి ప్రాచీన ఆలయానికి ఆధునిక పిల్లర్లు కట్టి, వాటికి రాతి పలకలు అద్దితే నాణ్యత ఎంతకాలం ఉంటుందనే విషయంపైనా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆలయ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ రాజేశ్ను ‘సాక్షి’ వివరణ కోరగా.. కాంక్రీట్ పిల్లర్లతో మండప నిర్మాణం వాస్తవమేనని, ఆ పిల్లర్లకు రాతి పలకలు తొడుగుతామన్నారు. దీని నాణ్యత చాలాకాలం ఉంటుందని స్పష్టం చేశారు.రాజన్న ఆలయ పునర్నిర్మాణం జరిగే సమయంలో భక్తులకు దర్శన భాగ్యం కలిగేనా లేక నిలిపివేస్తారా? అని అనుమానాలు ఉన్నాయి. దేవాదాయశాఖ అధికారులు నిర్మాణ సమయంలో స్వామివారికి ఏకాంత సేవలు మాత్రమే కొనసాగిస్తామని స్పష్టం చేయడంతో భక్తులకు రాజన్న దర్శనం కలిగేనా అనే అపోహలు నెలకొన్నాయి. నిర్మాణ సమయంలో భక్తులకు భీమేశ్వరస్వామి ఆలయంలో దర్శనాలు ఉంటా యని, ఉత్సవ విగ్రహాలను మూడు రోజుల క్రితమే తరలించారు. కోడెమొక్కులు కూడా భీమేశ్వరాలయంలోనే ఏర్పాటు చేశారు. ఈ విషయంపై బీజేపీ నాయకులు భక్తులకు రాజన్న ఆలయం నిర్మాణ సమయంలో దర్శన అవకాశం కల్పించాలని ఆందోళన చేస్తున్నారు. దీనిపై ఆలయ ఈవో రమాదేవి ఆలయం మూసివేత ఉండదని, ఆలయంలో జరిగే ఏకాంత పూజలు యథావిధిగా కొనసాగుతాయని వివరణ ఇచ్చారు. అయినప్పటికీ యాదాద్రి కానీ, కాణిపాకం ఆలయంలో గానీ పునర్నిర్మాణ విషయంలో భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారని బీజేపీ నాయకులు పేర్కొంటున్నారు. ఇక్కడ అందుకు విరుద్ధంగా దర్శనాలు నిలిపివేయడం సరికాదంటున్నారు. మేడారం సమ్మక్క జాతర సందర్భంగా ముందుగా వేములవాడ రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ.. అని ఇలాంటి సమయంలో దర్శనం విషయంలో గందరగోళం కలిగించే ప్రకటనలు సరికాదని హితవు పలుకుతున్నారు. -
గ్రీవెన్స్ డేకు 27 ఫిర్యాదులు
● ఎస్పీ మహేశ్ బీ గీతే సిరిసిల్ల క్రైం: సమస్యల పరిష్కారం, బాధితులకు భరోసాగా ఉండేందుకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతీ సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 27 ఫిర్యాదులు స్వీకరించినట్లు చెప్పారు. ఫిర్యాదులపై ఆయా పోలీస్స్టేషన్ల అధికారులకు ఫోన్చేసి త్వరగా పరిష్కరించాలని సూచించినట్లు తెలిపారు. ఠాణాకు వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. ఇల్లంతకుంట(మానకొండూర్): రైతులు తాము పండించిన పంటను తక్కువ ధరకు దళారులకు అమ్ముకోవద్దని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు. మండలంలోని పెద్దలింగాపురం, అనంతారం, చిక్కుడువానిపల్లె, ముస్కానిపేట, గాలిపెల్లి, పొత్తూరు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ప్రారంభించారు. 71 మందికి సీఎమ్మార్ఎఫ్ చెక్కులను పంపిణీ చే శారు. ప్యాక్స్ చైర్మన్లు తిరుపతిరెడ్డి, అనంతరెడ్డి, ఐకేపీ ఏపీఎం లతామంగేశ్వరీ, తహసీ ల్దార్ ఫారుఖ్, ఎంపీడీవో శశికళ, ఏఎంసీ వైస్చైర్మన్ ప్రసాద్, అనంతగిరి టెంపుల్ చైర్మన్ అంతగిరి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు భాస్కర్రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జ్యోతి పాల్గొన్నారు. వేములవాడ: అభివృద్ధి పనులు కొనసాగిస్తూనే భక్తులకు రాజన్న దర్శనం కల్పించేందుకు చొరవ చూపాలంటూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో ఈవో రమాదేవిని కోరారు. ఈమేరకు సోమవారం వినతిపత్రం అందించారు. వారు మాట్లాడు తూ తమ పార్టీ ఆలయ అభివృద్ధికి వ్యతిరేకం కాదని, భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఎర్రం మహేశ్, లింగంపల్లి శంకర్, రాపెల్లి శ్రీధర్, పొన్నాల తిరుపతిరెడ్డి, బర్కం లక్ష్మి, రాజిరెడ్డి, హరీశ్ ఉన్నారు. వేములవాడ: రాజన్న ఆలయ అబివృద్ధి విషయంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను బీజేపీ నాయకులు దహనం చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు సోమవారం ప్రభుత్వ లోగోకు క్షీరాభిషేకం చేశారు. వారు మాట్లాడుతూ రాజన్న ఆలయంపై రాజకీయం చేయొద్దని కోరారు. అభివృద్ధి పనులు జరుగుతుండగా భక్తులకు దర్శనం ఎలా సాధ్యమవుతుందో చెప్పాలన్నారు. సంద్రగిరి శ్రీనివాస్గౌడ్, చిలుక రమేశ్, రాజు, కొమురయ్య, విష్ణు, పోచెట్టి, సత్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్లఅర్బన్: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయిపై జరిగిన దాడిని రాజ్యాంగంపై జరిగిన దాడిగా భావిస్తున్నామని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి పుట్ట రవిమాదిగ పేర్కొన్నారు. కలెక్టరేట్ వద్ద సోమవారం నల్లా జెండాలు, నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. దాడి చేసిన వ్యక్తితోపాటు దాడి వెనుక ఉన్న శక్తులను శిక్షించాలని కోరారు. ఈనెల 17న మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలని కోరారు. ఆవునూరి ప్రభాకర్, కానపురం లక్ష్మణ్, భిక్షపతి, శోభారాణి, రవీందర్, రాజు, లచ్చన్న, బాలయ్య పాల్గొన్నారు. -
సీపీఆర్పై అవగాహన ఉండాలి
● జిల్లా వైద్యాధికారి రజిత సిరిసిల్ల: గుండె ఆగిపోయి ఎవరైనా అపస్మారక స్థితిలోకి వెళ్తే వెంటనే గుండెకు ఉపశ్వాస పునరుద్ధరణ(సీపీఆర్) అందించడంపై అవగాహన ఉండాలని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత పేర్కొన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్లో సోమవారం సీపీఆర్పై శిక్షణ ఇచ్చారు. రజిత మాట్లాడుతూ గుండె ఆగిపోయినప్పుడు రక్తప్రసరణ ఆగిపోయి మెదడు, ఇతర అవయవాలకు ఆక్సిజన్ అందదన్నా. అలాంటి సమయంలో వెంటనే సీపీఆర్ చేస్తే ప్రాణాలను కాపాడవచ్చన్నారు. ఒక్క నిమిషం వ్యవధిలో గుండైపె 100 నుంచి 120 సార్లు రెండు చేతులతో నొక్కాలని సూచించారు. ఆపదలో ఉన్న వ్యక్తులను సీపీఆర్ చేసిన తరువాత 108లో ఆస్పత్రికి తరలించాలని కోరారు. ప్రోగ్రామ్ ఆఫీసర్లు వైద్యులు సంపత్కుమార్, రామకృష్ణ, నయిమా జహా పాల్గొన్నారు. -
రెక్కల కష్టం దోచేస్తున్నారు !
ఇది ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్లో ప్రైవేటు వ్యాపారుల ధాన్యం కొనుగోళ్లు. ఇక్కడ రైతులు కోసిన వడ్లను ఆరబెట్టకుండానే నేరుగా బాయిల్డ్ మిల్లులకు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం క్వింటాలుకు రూ.2,389 నిర్ణయించగా.. దళారులు రూ.1,730కి క్వింటాలు చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో బస్తాను 70 కిలోలు తూకం వేస్తూ.. రెండు కిలోల తరుగు పేరిట 68 కిలోల వడ్లకు ధర చెల్లిస్తున్నారు. ఇలా రైతులు ప్రతీ క్వింటాలుకు రూ.659 నష్టపోతున్నారు. ప్రభుత్వ పరంగా ఇంకా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు వడ్లను దళారులకు అమ్ముకుంటున్నారు.ఇది ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్లో సాగుతున్న వరికోతలు. ముందుగా నాట్లు వేసుకోవడంతో ముందే వరికోతలు రాగా.. వర్షాల కారణంగా పది రోజుల ఆలస్యంగా కోతలు ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా వడ్లు చేతికి వస్తుండగా ఆరబెట్టేందుకు కల్లాలు లేవు. దీంతో రైతులు రోడ్లపై వడ్లను ఆరబోయాల్సిన దుస్థితి. -
గుడి ఎదుట గజిబిజీ
వేములవాడ మెయిన్రోడ్డు విస్తరణ ప్రక్రియ ప్రారంభం కావడంతో రోడ్డుకిరువైపులా ఉన్న దుకాణాలను అధికారులు కూల్చేశారు. దీంతో పక్కనే ఉన్న శిథిలాలు, వాటి మధ్యలో కనిపిస్తున్న చిన్నపాటి స్థలాల్లో ఓవైపు చిరువ్యాపారులు, మరోవైపు ఆటోలు, ఇతర వాహనాలు నిలిచి ఉండడంతో అంతా గజిబిజీగా మా రింది. సోమవారం రద్దీ పెరిగిపోవడంతో భక్తులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ప్రభుత్వం త్వరగా రోడ్డు పనులు చేపట్టి భక్తులకు, స్థానికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. – వేములవాడ -
వయోవృద్ధుల సంఘాలు ఏర్పాటు చేయాలి
అడిషనల్ డీఆర్డీవో శ్రీనివాస్ ఇల్లంతకుంట(మానకొండూర్): కొత్త సంఘాల ఏర్పాటు, బ్యాంకు లింకేజీ రుణాల చెల్లింపులు సాగేలా సమాఖ్య సభ్యులు చూడాలని అడిషనల్ డీఆర్డీవో సీహెచ్ శ్రీనివాస్ సూచించారు. మండల కేంద్రంలో సోమవారం ఐకేపీ కార్యాలయంలో నిర్వహించిన మహిళా సమాఖ్య సాధారణ సమావేశంలో మాట్లాడారు. 60 ఏళ్లు పైబడ్డ వయోవృద్ధుల సంఘాలు, అంగవైకల్యులు, కిశోర బాలికల సంఘాలు ఏర్పాటు చేయాలని సభ్యులకు సూచించారు. జిల్లా ప్రాజెక్టు మేనేజర్ శ్రీనివాస్, ఏపీఎం లతామంగేశ్వర్వీ, కమ్యూనిటీ కోఆర్డినేటర్లు వి.వెంకటేశం, రాజేశ్వరీ, దేవేందర్, మహిళా సమాఖ్య మండల అధ్యక్షురాలు కట్ట సౌమ్య తదితరులు పాల్గొన్నారు. -
ప్రపంచ వేదికపై సిరిసిల్ల సత్తా
సిరిసిల్ల: తెలంగాణలోని ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) ఆవిష్కరణలను అంతర్జాతీయ వేదికకు తీసుకెళ్లిన సిరిసిల్ల బిడ్డ, గ్రావ్టన్ మోటార్స్ వ్యవస్థాపకుడు పర్శురామ్ పాకను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. ఒక ఆవిష్కర్తకు ప్రేరణ ఇచ్చే ఎకో సిస్టం లభించినప్పుడు అద్భుతా లు జరుగుతాయని కేటీఆర్ ‘ఎక్స్’వేదికగా ఆదివారం పోస్ట్ చేశారు. పర్శురామ్ వంటి ప్రతిభావంతులను ప్రోత్సహించడంలో టీ–హబ్, టీ–వర్క్స్ పాత్ర కీలకమని కొనియాడారు. సిరిసిల్ల నుంచి...: ‘సిరిసిల్లకు చెందిన పర్శురామ్ది ఇంజినీరింగ్లో నేపథ్యం. మన ఇంక్యుబేటర్ల (టీ–హబ్, టీ–వర్క్స్) వద్ద ఉన్న అత్యాధునిక సౌకర్యాలను ఉపయోగించుకొని గ్రావ్టన్ మోటార్స్ను స్థాపించారు.నేడు ఈ సంస్థ తెలంగాణ నుంచే ప్రపంచస్థాయి ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను తయారు చేస్తోంది’అని కేటీఆర్ తన పోస్ట్లో పేర్కొన్నారు. గ్రావ్టన్ మోటార్స్ తమ మోటార్లు, బ్యాటరీలు, కంట్రోల్ సిస్టమ్స్ను పూర్తిగా దేశీయంగా రూపొందించిందన్నారు. కే2కే ప్రపంచ రికార్డ్: గతంలో గ్రావ్టన్ మోటార్స్ సంస్థ 4,000 కిలోమీటర్ల కశ్మీర్ టు కన్యాకుమారి (కే2కే) రైడ్ను పూర్తి చేసి ప్రపంచ రికార్డును నెలకొల్పిందని, ప్రస్తుతం ఈ కంపెనీ కెన్యా, ఫిలిప్పీన్స్, పెరూ వంటి దేశాలకు తన కార్యకలాపాలను విస్తరిస్తోందని కేటీఆర్ గుర్తు చేశారు. కోయంబత్తూరులో పర్శురామ్ను శుక్రవారం కలిశానని, వారి కంపెనీ ప్రయాణం, విజయాలు తనను ఎంతగానో ప్రేరేపించాయని కేటీఆర్ తెలిపారు. -
వేములవాడలో దర్శనాల నిలిపివేత.. ఈవోపై బండి సంజయ్ ఫైర్
సాక్షి, రాజన్న సిరిసిల్ల: వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ వివాదం కాంగ్రెస్, బీజేపీ మధ్య పొలిటికల్ టర్న్ తీసుకుంది. నేటి నుండి వేములవాడ(Vemulawada Temple) రాజన్న దర్శనాలు నిలిపేస్తున్నట్టుగా ప్రకటన నేపథ్యంలో ఆలయ ఈవోపై కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) మండిపడుతున్నారు. మరోవైపు.. ఆలయ ఆర్జిత సేవలను భీమన్న ఆలయానికి మార్చడాన్ని నిరసిస్తూ వేములవాడలో బీజేపీ శ్రేణులు.. ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దీంతో, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నేటి నుంచి దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల నేపథ్యంలో దర్శనాలను నిలిపివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. భక్తుల దర్శనాల కోసం భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. స్వామివారికి సమర్పించే అన్ని రకాల ఆర్జిత సేవలు, కోడె మొక్కులు, అభిషేకాలు, అన్నపూజ, నిత్యకల్యాణం, చండీహోమం తదితర మొక్కులు చెల్లించుకునేందుకు భీమేశ్వర సన్నిధిలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు స్పష్టం చేశారు. శ్రీరాజరాజేశ్వర ఆలయంలో కేవలం ఏకాంత సేవలు మాత్రమే నిర్వహించటం జరుగుతుందని వెల్లడించారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా భక్తులందరూ దీనికి సహకరించాలని అధికారులు కోరారు. అయితే రాజన్న ఆలయ విస్తరణలో భాగంగా దర్శనాల నిలిపివేత కొన్ని నెలలు పాటు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో దర్శనాల నిలిపివేతపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. ఉన్నపళంగా భక్తుల దర్శనాలు నిలిపివేయడంపై సంజయ్ అసహనం వ్యక్తం చేశారు. రాజన్న దర్శనం కోసం వచ్చే భక్తులను భీమన్న దేవాలయానికి వెళ్ళ మనడంపై అభ్యంతరం తెలిపారు. ముందస్తుగా ప్రకటన చేయకుండా భక్తులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో ఆలయ అధికారులకు బండి సంజయ్ ఫోన్ చేయడంతో మళ్లీ దర్శనానికి అధికారులు అనుమతిచ్చినట్టు తెలుస్తోంది. దీంతో, ఆర్జిత సేవల తరలింపుపై సందిగ్ధత నెలకొంది.మరోవైపు.. వేములవాడ రాజన్న ఆలయ విస్తరణలో భాగంగా హడావిడిగా భీమన్న ఆలయానికి మార్చేస్తున్నట్టుగా ప్రకటన విడుదల చేయడంపై బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఆలయ ఆర్జిత సేవలను భీమన్న ఆలయానికి మార్చడాన్ని నిరసిస్తూ వేములవాడలో బీజేపీ శ్రేణులు.. ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దీంతో, పోలీసులు వారిని అడ్డుకున్నారు. -
అభిప్రాయ సేకరణ.. దరఖాస్తుల స్వీకరణ!
పోటీ పడుతున్నది వీరే.. సాక్షిప్రతినిధి,కరీంనగర్: స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడిన నేపథ్యంలో అధికార పార్టీ జిల్లాలపై దృష్టి సారించింది. కొంతకాలంగా పెండింగ్లో ఉన్న డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ (డీసీసీ)లకు కొత్త అధ్యక్షులను నియమించేందుకు ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా ప్రతీ జిల్లాకు పీసీసీ పరిశీలకులను నియమించింది. వీరంతా ఈనెల 13న ఉమ్మడి జిల్లాకు రానున్నారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రజా మద్దతు ఉన్న నాయకుడిని గుర్తించి డీసీసీ అధ్యక్షుడిగా నియమించాలన్న సంకల్పంతో వీరంతా పని చేయనున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో మమేకమై ఎవరి బలాబలాలు ఎంతెంత? అన్న విషయంపై అవగాహనకు రానున్నారు. ఏఐసీసీ పరిశీలకులు.. శ్రీనివాస్ మానే నేతృత్వంలో పీసీసీ పరిశీలకుల బృందం ఉమ్మడి జిల్లాకు రానుంది. వీరిలో ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి కరీంనగర్ కార్పొరేషన్, ఆత్రం సుగుణ కరీంనగర్, చిట్ల సత్యనారాయణ సిరిసిల్ల, తూర్పు జయప్రకాశ్ రెడ్డి జగిత్యాల, ఎండీ.ఖాజా ఫక్రుద్దీన్ రామగుండం కార్పొరేషన్, కేతూరి వెంకటేశ్, గిరిజాషెట్కర్ పెద్దపల్లి రానున్నారు. చామల కిరణ్కుమార్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఆయన రాక సందిగ్ధంలో పడింది. ముగ్గురి కోసం మధనం కాంగ్రెస్ వర్గాలు తెలిపిన ప్రకారం.. ఈనెల 13 నుంచి 18వ తేదీ వరకు మొత్తం ఆరురోజులపాటు డీసీసీ పరిశీలకులు జిల్లాల్లో పర్యటిస్తారు. సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి పార్టీ ఆలోచనలు వివరిస్తారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడిగా పనిచేసేందుకు ఉత్సాహంగా ఉన్న ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. వీలును బట్టి పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తారో వారి ఆలోచనలు, ప్రణాళికలు ఇంటర్వ్యూ తరహాలో అడిగి తెలుసుకుంటారు. అనంతరం పార్టీ కార్యకర్తలు, ముఖ్యనాయకులతో సమావేశ మై వారి అభిప్రాయాలు సేకరిస్తారు. అలాగే క్షేత్రస్థాయిలో పర్యటించి పార్టీ బలాబలాలు, ఏ నేతకు ఎంత ఆదరణ ఉందో తెలుసుకుంటారు. అనంతరం ఆశావహుల్లో నుంచి ముగ్గురిని ఎంపిక చేస్తారు. ఆ జాబితాను తొలుత కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్కు పంపిస్తారు. ఈ జాబితాను స్క్రూటినీ చేసి తిరిగి రాష్ట్రానికి పంపుతారు. అక్కడ దీపావళి నాటికి టీపీసీసీ చీఫ్, సీఎం, మంత్రి భట్టి విక్రమార్క, సంబంధిత ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రులు కలిసి ప్రతీ జిల్లాలో ముగ్గురిలో ఒకరిని డీసీసీ ప్రెసిడెంట్గా ఖరారు చేస్తారు.కరీంనగర్ డీసీసీకి పార్లమెంట్ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, కోమటిరెడ్డి పద్మాకర్రెడ్డి పోటీ పడుతున్నారు. సిరిసిల్ల డీసీసీ రేసులో.. గడ్డం నర్సయ్య, కె.చక్రధర్రెడ్డి, నేవూరి వెంకటరెడ్డి, సంగీతా శ్రీనివాస్ ఉన్నారు. జగిత్యాల డీసీసీకి జువ్వాడి కృష్ణారావు, సుజిత్రావు, కొమొరెడ్డి కరంచంద్ రేసులో ఉన్నారు. పెద్దపల్లి జిల్లా నుంచి సారయ్యగౌడ్, శశిభూషణ్ కాచే, బోషానబోయిన రమేశ్గౌడ్, తొట్ల తిరుపతియాదవ్, కోలేటి మారుతి, చొప్పరి సదానందం డీసీసీ ప్రెసిడెంట్ పదవిని ఆశిస్తున్నారు. -
ఖతర్లో తెలంగాణ ధూంధాం
సిరిసిల్ల: తెలంగాణ ప్రజాసమితి ఆధ్వర్యంలో ఖతర్లో ఐడియల్ ఇండియన్ స్కూల్ ఓపెన్గ్రౌండ్లో తెలంగాణ ధూం ధాం నిర్వహించారు. తెలంగాణ ఆటాపాటలతో వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఇండియన్ ఎంబసీ కౌన్సిలర్ హెడ్ వైభవ్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. యాంకర్ రాములమ్మ, గాయని వరం ఫోక్సాంగ్స్ తో అలరించారు. చివరలో తెలంగాణ సంప్రదాయ వంటకాలతో భోజనం ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు సుమారు 3వేల మందికి పైగా ప్రవాస తెలంగాణ వాసులు హాజరయ్యారు. తెలంగాణ ప్రజాసమితి–ఖతర్ ప్రెసిడెంట్ గద్దె శ్రీనివాస్, వైస్ప్రెసిడెంట్ మండల అశోక్(సిరిసిల్ల), కార్య నిర్వహణ కమిటీ సభ్యులు గడ్డం హారిక, ఉప్పుల సతీశ్, వెల్దండి వేణుప్రసాద్, ఏముల రాధిక, గౌరి సతీశ్ ఉప్పుల, మనోజ్కుమార్ డికొండ, ఉపేందర్ రాడం, శృతి ఉపేందర్ రాడం, లక్ష్మణ్ మంద తదితరులు పాల్గొన్నారు. అలరించిన ఆటా పాట హాజరైన తెలంగాణ ప్రవాసీలు -
ప్రభుత్వ ఆస్పత్రి.. వైద్యసేవల్లో భేష్
వేములవాడఅర్బన్: నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు.. ఇది గతం. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్తే.. వేల రూపాయల ఫీజులు చెల్లించడం ఇబ్బందిగా మారడం.. ప్రభుత్వ ఆస్పత్రిలో అందుతున్న నాణ్యమైన వైద్యసేవలు వేములవాడ ఏరియా ఆస్పత్రికి రోగులు క్యూ కట్టేలా చేస్తున్నాయి. ఉచితంగా మోకీలు మార్పిడి.. నాణ్యమైన ప్రసూతి వైద్యసేవలు.. రోగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి.. అన్ని పరీక్షలు ఉచితంగా చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఇక్కడి వైద్యసిబ్బంది. వీరి సేవలకు గుర్తుగా ఇప్పటికే నాలుగుసార్లు కాయకల్ప అవార్డు దక్కింది. వేములవాడ ఆస్పత్రి వైద్యసేవలపై ప్రత్యేక స్టోరీ. నిత్యం 450 నుంచి 650 మందికి వైద్యం వేములవాడ ఏరియా ఆస్పత్రిలో నిత్యం 450 నుంచి 650 మంది వరకు ఔట్పేషంట్లుగా వైద్యసేవలు పొందుతున్నారు. అన్ని విభాగాలకు చెందిన వైద్యులు అందుబాటులో ఉంటారు. వేములవాడ ప్రాంతంలో పేదలకు ఈ ఆస్పత్రి వరంగా మారింది. ఇక్కడి అత్యవసర వైద్యసేవలు అందించేందుకు పాలియేటివ్ కేర్ సెంటర్ ఉంది. రెండు అంబులెన్స్లు, ఆరు బాడీఫ్రీజర్లు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల ఆస్పత్రి ఆ వరణలో పోస్టుమార్టమ్ గదిని నిర్మించారు. నాలుగుసార్లు కాయకల్ప వేములవాడ ఏరియా ఆస్పత్రిలో వైద్యసేవలు, పరిశుభ్రతను గుర్తించి వరుసగా నాలుగుసార్లు వరుసగా కాయకల్ప అవార్డు ప్రకటించారు. ఈ అవార్డు ద్వారా అందుతున్న నిధులతో ఆస్పత్రిలో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. 24 గంటల్లో 20 ఆపరేషన్లు ఇటీవల 24 గంటలో 20 వివిధ రకాల ఆఫరేషన్లు చేయడంతో ఆసుపత్రి వైద్యులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వైద్యులను అభినందించారు. ఇప్పటి వరకు ఆస్పత్రిలో 48 మోకీలు మార్పిడి ఆపరేషన్లు చేశారు. డైస్ సెంటర్ ఏరియా ఆస్పత్రిలో డైస్ సెంటర్ ఏర్పాటు చేశారు. అప్పుడే పుట్టిన శిశువు తొలిదశలోనే వివిధ రకాల వ్యాధులను గుర్తించడం జరుగుతుంది. ఈ సెంటర్లో పిల్లల వైద్యుడు, సైకాలజిస్ట్, స్టాప్నర్సు ఉంటారు. ఈ సెంటర్లో 0–18 ఏళ్ల వయస్సు గల పిల్లలకు వైద్యసేవలు అందిస్తారు. 2024 సెప్టెంబర్ నుంచి 2025 సెప్టెంబర్ వరకు -
‘సెస్’ పాలకవర్గంలో చీలిక
సిరిసిల్ల: జిల్లాలో విద్యుత్ పంపిణీ సేవలు అందించే సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) పాలకవర్గంలో చీలికొచ్చింది. 2022 డిసెంబరు 27న కొలువుదీరిన పాలకవర్గం రెండున్నర ఏళ్లుగా ఏకతాటిపై ముందుకుసాగింది. నాలుగు నెలలుగా పాలకవర్గం చీలిపోయింది. ‘సెస్’ చైర్మన్ చిక్కాల రామరావును పదవి నుంచి తొలగించాలని మెజార్టీ డైరెక్టర్లు భావిస్తున్నారు. ముందుస్తుగా సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావుతో ఎల్లారెడ్డిపేట డైరెక్టర్ వరుస కృష్ణహరి, కోనరావుపేట డైరెక్టర్, ‘సెస్’ వైస్చైర్మన్ దేవరకొండ తిరుపతి, ముస్తాబాద్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి కలిశారు. సెస్ చైర్మన్ ఒంటెద్దు పోకడలతో మెజార్టీ డైరెక్టర్లు అసంతృప్తితో ఉన్నారని చెప్పినట్లు తెలిసింది. ఈమేరకు చిక్కాల రామారావుపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే అంశాన్ని కేటీఆర్ దృష్టికి తెచ్చినట్లు సమాచారం. పార్టీ మారిన డైరెక్టర్లు ! 2022 డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో జిల్లాలోని 15 ‘సెస్’ డైరెక్టర్ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థులుగా గెలి చిన వేములవాడ టౌన్–1 డైరెక్టర్ నామాల ఉమ, బోయినపల్లి డైరెక్టర్ కొట్టెపల్లి సుధాకర్ బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరారు. ‘సెస్’ చైర్మన్ చిక్కా ల రామారావుపై అవిశ్వాసం పెట్టకుండా.. బీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటే.. ఆ పార్టీని వీడేందుకు కొందరు డైరెక్టర్లు సిద్ధమైనట్లు తెలిసింది. ఈమేరకు కాంగ్రెస్ నేతలతో కొందరు డైరెక్టర్లు టచ్లో ఉన్నా రు. మొత్తంగా డిసెంబరులో చిక్కాల రామారావుపై అవిశ్వాసం పెట్టాలని భావిస్తున్నట్లు తెలిసింది. ‘సెస్’ అధికారుల తోడ్పాటు ‘సెస్’ చైర్మన్ చిక్కాల రామారావు ఇటీవల 57 మంది పర్మినెంట్ ఉద్యోగులు విధిగా జీపీఎస్ విధానంలో హాజరు ఉండాలని, విధులు నిర్వహించే ప్రదేశం నుంచి ఫేస్(ముఖచిత్రం) నమోదు చేయాలని ఆదేశిస్తూ మెమో జారీ చేశారు. ఈమేరకు ఎస్ఏ, ఏఏవో, జేఏవో, ఏఏఈ, ఎల్ఐ, ఏడీఈ ఉద్యోగులు విధిగా జీపీఎస్ విధానంలో హాజరుకావాలి. అలా హాజరు నమోదు చేయకుంటే జీతాల్లో కోతలు తప్పవని స్పష్టం చేశారు. అక్టోబరు నుంచే ఈ విధానం అమలులోకి తెస్తున్నట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు.‘సెస్’ క్షేత్రస్థాయి ఉద్యోగులు ఎక్కడికి వెళ్తున్నారు.. ఏం పనిపై వెళ్తున్నారో ముందస్తుగా ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేశారు. విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో అన్ని ప్రభుత్వ శాఖల్లో లాగే.. ‘సెస్’ పరిధిలోనూ అమలు చేస్తున్నామని చిక్కాల రామారావు పేర్కొంటున్నారు. ఇటీవల ప్రమోషన్లు కావాలని కొందరు ఉద్యోగులు కోరగా.. సంస్థ ఆర్థిక పరిస్థితి బాగా లేదని తరువాత చూద్దామని వాయిదా వేయడంతో ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. ఇలాంటి కారణాలతో ‘సెస్’ ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగులు కొందరు చైర్మన్ తీరుపై ఆగ్రహంతో అవిశ్వాసానికి తెరలేపారని భావిస్తున్నారు. ఎర్తింగ్ పైపుల కొను‘గోల్మాల్’ ‘సెస్’ పరిధిలో విద్యుత్ స్తంభాలకు ఎర్తింగ్ పైపుల ఏర్పాటుకు ఎన్పీడీసీఎల్ పర్ఛేజ్ ఆర్డర్ ప్రకారం అవసరం లేకున్నా 2,500 పైపుల కొనుగోలుకు ఆర్డర్లు ఇచ్చారు. ఒక్కో పైపు ధర రూ.1,600 ఉండగా.. రూ.2,300లుగా నిర్ణయించి కొనుగోలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇప్పటికే 1,258 కొనుగోలు చేసి రూ.8.80 లక్షల మేరకు అదనంగా నొక్కేసినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని బయటపెట్టారనే డీఈఈగా పనిచేసిన శ్రీధర్రావును సరెండర్ చేసినట్లు తెలిసింది. ఇటీవల రూ.50లక్షల మెటీరియల్ కొనుగోలుకు టెండర్లు పిలిచి రూ.32లక్షల మేరకు మెటీరియల్ కొనుగోలు చేశారు. ఇందులోనూ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. అవిశ్వాసం పేరుతో వసూళ్లపర్వం మెజార్టీ ‘సెస్’ డైరెక్టర్ల అలక.. ఉద్యోగుల అసంతృప్తి నేపథ్యంలో అవిశ్వాసం పేరిట ఆయనపై ఒత్తిడి పెంచి జీపీఎస్ విధానం రద్దు చేయించుకోవాలని ఉద్యోగులు భావిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు రామారావు వద్ద కొందరు డైరెక్టర్లు డబ్బులు దండుకోవాలని ఈ అవిశ్వాస ప్రతిపాదనలు తెరపైకి తెచ్చినట్లు భావిస్తున్నారు. -
పేదల ఆత్మగౌరవ ప్రతీక ఇందిరమ్మ ఇల్లు
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోనరావుపేట(వేములవాడ): పేదల ఆత్మగౌరవ ప్రతీక ఇందిరమ్మ ఇల్లు అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కోనరావుపేట మండలం మామిడిపల్లిలో శనివారం ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు మహ్మద్ ఖాదర్–హుస్సేన్ బీ దంపతుల గృహప్రవేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారి దంపతులకు నూతన వస్త్రాలను అందజేసి ఆది శ్రీనివాస్ మాట్లాడారు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ముందుకుపోతున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ఆనాడు కాంగ్రెస్ ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లు తప్ప గత పదేళ్లలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టించలేదని విమర్శించారు. రాష్ట్రంలోని ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు చూపిస్తే మేము ఓట్లు అడగం.. డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేని ఊరు మేం చూపిస్తాం మీరు ఓట్లు అడగకుండా ఉండాలి.. అని సవాల్ విసిరారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు షేక్ ఫిరోజ్ పాషా, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, వైస్చైర్మన్ తాళ్లపల్లి ప్రభాకర్, నాయకులు సాసాల మల్లారెడ్డి, నంద్యాడపు సాగర్ పాల్గొన్నారు. -
చికిత్స బాగుంది
వేములవాడ ఏరియా ఆస్పత్రిలో సాదారణ కాన్పులో పాపకు జన్మనిచ్చాను. ఆస్పత్రిలో వైద్యసేవలు బాగున్నాయి. ఆస్పత్రి శుభ్రంగా ఉంది. అన్ని సదుపాయాలు ఉన్నాయి. మందులు ఎప్పటికప్పుడు ఇస్తున్నారు. – ఎండీ సాన, తంగళ్లపల్లి గర్భసంచిలో కణతులు తొలగించారు వేములవాడ ఏరియా ఆస్పత్రిలో వైద్యసేవలు బాగున్నాయని తెలిసి వచ్చాం. వైద్యులను సంప్రదిస్తే గర్భసంచిలో కణతులు ఉన్నాయని తెలిపారు. వైద్యులు ఆఫరేషన్ చేసి గర్భసంచిలో పైబ్రాయిడ్ కణతులు తొలగించారు. దగ్గరుండి చూసుకుంటున్నారు. – రమ, సింగారం(ఎల్లారెడ్డిపేట) వైద్యసేవలు వినియోగించుకోవాలి వేములవాడ ఏరియా ఆస్పత్రిలో అన్ని రకాల వైద్యసేవలు అందిస్తున్నాం. అన్ని రకాల పరీక్షలు, సీటీ స్కాన్, ఎక్స్రే సేవలు సైతం అందుబాటులో ఉన్నాయి. ఆస్పత్రిలో వైద్యులు అందుబాటులో ఉన్నారు. ఈ ప్రాంత ప్రజలు ఆస్పత్రి వైద్యసేవలు వినియోగించుకోవాలి. – పెంచలయ్య, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ -
బాలికల సంక్షేమానికి పెద్ద పీట
● డీడబ్ల్యూవో లక్ష్మీరాజం తంగళ్లపల్లి(సిరిసిల్ల): ప్రభుత్వం బాలికల సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందని జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం తెలిపారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా మండలంలోని సారంపల్లి ప్రభుత్వ ట్రైబల్ పాఠశాల, కళాశాలలో శనివారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం బాలికల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసిందన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్కార్డు, గృహలక్ష్మి, గృహజ్యోతి వంటి ప్రతీ పథకంలో మహిళలకు పెద్ద పీట వేసిందన్నారు. షీటీం ఇన్చార్జి ప్రమీల, ప్రిన్సిపాల్ రజని, దేవిక, మమత పాల్గొన్నారు. బీడీ కార్మికులకు పెన్షన్ చెల్లించాలి సిరిసిల్లటౌన్: దేశంలోని బీడీ కార్మికులకు ప్రభుత్వం రూ.7,500 పెన్షన్ అందించాలని బీడీ, సిగార్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) జిల్లా అధ్యక్షుడు శ్రీరాముల రమేశ్చంద్ర కోరారు. సిరిసిల్లలోని పార్టీ ఆఫీసులో శనివారం నిర్వహించిన ప్రెస్మీట్లో మాట్లాడారు. రిటైర్డ్ బీడీ కార్మికులకు పెన్షన్తోపాటు పీఎఫ్ డబ్బులు అందివ్వాలని కోరారు. కార్మికుల పీఎఫ్ డబ్బులను కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతూ కార్మికులకు అన్యాయం చేయడం శోచనీయమన్నారు. జిందం కమలాకర్, పోషమల్లు తదితరులు పాల్గొన్నారు. శాసీ్త్రయ దృక్పథం పెంపే లక్ష్యం సిరిసిల్లఎడ్యుకేషన్: సమాజంలో శాసీ్త్రయ దృక్పథం, శాస్త్ర ప్రచారం పెంపొందించడమే లక్ష్యమని జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు సిలివేరి సంపత్కుమార్ తెలిపారు. వేములవాడలోని ప్రభుత్వ హైస్కూల్లో శనివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పారం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ చెకుముకి సైన్స్ పోటీలకు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొనవచ్చని తెలిపారు. పాఠశాల స్థాయి నవంబర్ 7, మండల స్థాయి 21, జిల్లా స్థాయి 28, రాష్ట్ర స్థాయి సంబురాలు డిసెంబర్ 12, 13, 14 తేదీల్లో నిర్వహించనున్నట్లు వివరించారు. 8, 9, 10వ తరగతి విద్యార్థులకు తరగతుల వారీగా పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. సంపత్, రమేశ్, తౌటు మధుసూదన్, పాండురంగం పాల్గొన్నారు. ధాన్యం ఆరబెట్టేందుకు స్థలం ఇవ్వాలి సిరిసిల్లటౌన్: మున్సిపాలిటీ పరిధిలోని విలీన గ్రామాలకు చెందిన కౌన్సిలర్లు శనివారం కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి, టౌన్ సీఐ కృష్ణలను కలిశారు. విలీన గ్రామాలు చిన్నబోనాల, పెద్దబోనాల, పెద్దూర్, సర్దాపూర్ ముష్టిపల్లి, చంద్రంపేట, రగుడుకు చెందిన రైతులు వడ్లు ఆరబెట్టుకునేందుకు స్థలం లేదన్నారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా బైపాస్ రోడ్డుపై ధాన్యం ఆరబోసుకునేందుకు అవకాశం ఇవ్వాలని వినతిపత్రాలు అందించారు. మాజీ కౌన్సిలర్లు బొల్గం నాగరాజు, పోచవేని సత్య ఎల్లయ్య, బుర్ర లక్ష్మి శంకరయ్య, కల్లూరి లతా మధు, లింగంపల్లి సత్యనారాయణ, జీల కిషన్ తదితరులు ఉన్నారు. -
నేడు ధర్మపురికి ‘చాగంటి’
ధర్మపురి: ధర్మపురి పుణ్యక్షేత్రంలో ఈనెల 11,12వ తేదీల్లో నిర్వహించే ఆధ్యాత్మిక ప్రవచనముల కార్యక్రమానికి చాగంటి కోటేశ్వర్రావు రానున్నారు. ఈసందర్భంగా ఆలయం ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక బ్రాహ్మణ సంఘం పక్కనున్న శ్రీమఠం స్థలంలో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. భక్తులు భారీ ఎత్తున రానున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నారు. స్వాగత తోరణం, హనుమాన్ విగ్రహం, నందికూడలి వద్ద రంగురంగుల లైట్లు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ తదితరులు హాజరు కానున్నారు. అన్నదాన ట్రస్ట్కు రూ.1.11 లక్షల విరాళం వేములవాడ: వేములవాడ రాజన్న అన్నదాన ట్రస్ట్కు హైదరాబాద్ సోమాజిగూడకు చెందిన నీలగిరి శంకరరావు కుటుంబ సభ్యులు శుక్రవారం రూ.1.11 లక్షల విరాళం ఆలయ అధికారులకు అందజేశారు. ఆలయ అధికారులు వారికి ప్రత్యేక దర్శన అవకాశం కల్పించారు. అనంతరం ప్రసాదాలు అందించి ఆశీర్వచనం గావించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డీఈ రఘునందన్, ఏఈవో శ్రావణ్కుమార్, ఉద్యోగులు పాల్గొన్నారు. రూ. 3 లక్షల విరాళం... సిరిసిల్లకు చెందిన జోగినపెల్లి స్రవంతి–వెంకటకిరణ్ కుటుంబ సభ్యులు వేములవాడ రాజన్న ఆలయ అన్నదానం ట్రస్టుకు రూ. 3 లక్షల విరాళాన్ని ఆలయ ఈవో రమాదేవికు శుక్రవారం అందజేశారు. ఆలయ ఏఈవో బ్రహ్మన్నగారి శ్రీనివాస్, అకౌంట్ అడ్వైజర్ ఆగంరావు, ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ఆర్థిక సమస్యలతో వివాహిత ఆత్మహత్య మల్యాల(చొప్పదండి): ఆర్థిక సమస్యలతోపాటు ఒంటరి తనం భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన నూకపల్లి డబుల్ బెడ్ రూం కాలనీలో జరిగింది. ఎస్సై నరేశ్కుమార్ కథనం ప్రకారం.. నూకపల్లి డబుల్బెడ్ రూం కాలనీలో నివాసముంటున్న అన్వరి బేగం (47) కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో పాటు ఒంటరితనంతో బాధపడుతోంది. భర్త అబ్దుల్ రషీద్ కొంతకాలంగా జైలులో ఉంటున్నాడు. దీంతో జీవితంపై విరక్తి చెందిన అన్వరి బేగం శుక్రవారం ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కుమారుడు అఖిల్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. భూవివాదంలో మనస్తాపంతో..జూలపల్లి(మంథని): పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన బట్టు సురేశ్(40) భూవివాదంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి సత్తయ్య కథనం ప్రకారం.. సురేశ్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాచాపూర్ గ్రామానికి చెందిన బట్టు లక్ష్మణ్కు, సురేశ్కు మధ్య కొంతకాలంగా భూవివాదం నడుస్తోంది. దీనివిషయంలో ఇప్పటికే పంచాయితీలు, పోలీస్ కేసుల వరకూ వెళ్లారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో మానసికంగా మనస్తాపం చెందిన సురేశ్.. శుక్రవారం ఇంట్లో లుంగీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సనత్కుమార్ తెలిపారు. -
వెండి పోగులతో పట్టు పీతాంబరం
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కు చెందిన నేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్ చేనేత మగ్గంపై శతాబ్ది కాలం నాటి పట్టుపీతాంబరం చీరను నేశాడు. మెదక్ జిల్లా రామాయంపేట స్వప్న అనే మహిళ ఆర్డర్ మేరకు మళ్లీ పూర్వకాలపు పట్టుపీతాంబరాన్ని పునర్ సృష్టించాడు. 60 రోజుల పాటు శ్రమించి ఈ చీరను నేశాడు. చీర బరువు 660 గ్రాములు ఉంటుంది. ఇందులో 362 గ్రాములు వెండి ఉపయోగించి నేశాడు. చీర పొడువు 5.50 మీటర్లు కాగా.. జాకెట్తో కలిపి 6.30 మీటర్ల పొడువు ఉంటుంది. మామూలుగా చీర రెండు పక్కల అంచులు రన్నింగ్లో వస్తుంది. కానీ ఈ చీరలో బార్డర్ బుటా, మీనా వర్క్ అన్నీ కూడా చేతితో పెట్టి వేయడం విశేషం. శుక్రవారం రామాయంపేటకు చెందిన స్వప్నకు పట్టు పీతాంబరం చీరను అందించాడు. చేనేత మగ్గంపై ప్రయోగాలు చేస్తున్న హరిప్రసాద్ తాజాగా వందేళ్ల కిందటి పట్టుపీతాంబరాన్ని వెండిపోగులతో నేయడం విశేషం. -
అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం
● చెట్టును ఢీకొన్న కారు.. ముగ్గురి పరిస్థితి విషమం మెట్పల్లిరూరల్(కోరుట్ల): మెట్పల్లి మండలం మారుతినగర్ శివారులో గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురికి తీవ్రగాయాలు కాగా, వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. వివరాలు.. కోరుట్ల పట్టణానికి చెందిన అవేజ్, మౌలానా, అమెర్, ఫయాజ్, సైఫ్, పుర్ఖాన్, కై ఫ్ అనే యువకులు కారులో కోరుట్ల నుంచి మెట్పల్లి వైపు వెళ్తున్నారు. మారుతినగర్ శివారులో జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టింది. దీంతో కారులోని ఏడుగురు గాయాలపాలు కాగా మొదట మెట్పల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. వీరిలో అవేజ్, మౌలానా, అమెర్ పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు కరీంనగర్ ఆసుపత్రికి రెఫర్ చేయగా అక్కడ చికిత్స అందిస్తున్నారు. మెట్పల్లి ఎస్సై కిరణ్కుమార్ ఘటన స్థలాన్ని పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. రెస్టారెంట్ సిబ్బందిపై దాడిహుజూరాబాద్: పట్టణంలోని కరీంనగర్ రోడ్డులో ఉన్న నిర్వహణ రెస్టారెంట్ సిబ్బందిపై గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి దాడికి పాల్పడ్డారు. హోటల్ నిర్వాహకుల వివరాల ప్రకారం.. హోటల్ మూసివేసే సమయంలో ముగ్గురు వ్యక్తులు భోజనం చేయడానికి వచ్చారు. సిబ్బంది వారికి భోజనం వడ్డించారు. అరగంట దాటినా వెళ్లకపోవడంతో సిబ్బంది హోటల్ మూసివేస్తున్నామని తెలిపారు. ఆగ్రహానికి గురైన ఆ ముగ్గురు తమ అనుచరులకు ఫోన్ చేసి హోటల్కు రమన్నారు. క్షణాల్లోనే పది మంది వరకు వచ్చి హోటల్ సిబ్బందిపై దాడి చేశారు. చరణ్, అనిత, సాయికి గాయాలయ్యాయి. బాధితులు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఎస్సారెస్పీ 21 గేట్లు ఎత్తివేతజగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద వస్తుండడంతో ప్రాజెక్టు 21 గేట్లు ఎత్తి 65,604 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 75,394 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, ప్రాజెక్టు నుంచి ఆ మేరకు వివిధ మార్గాల ద్వారా బయటకు విడుదల చేస్తున్నారు. కాకతీయకాలువకు 4,000 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 4,000, సరస్వతి కెనాల్కు 650, లక్ష్మి కెనాల్కు 200, అలీసాగర్ ఎత్తిపోతల పథకానికి 180, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. -
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
● మాట్లాడుకుందామని పిలిచి మర్డర్కు ప్లాన్ ● సెంటినరీకాలనీలో యువకుడి దారుణ హత్య రామగిరి(మంథని): పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీకాలనీలో కోట చిరంజీవి(35) శుక్రవారం దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రామగిరి మండల సమాఖ్యలో పనిచేస్తున్న కమాన్పూర్ మండలం పెంచికల్పేట గ్రామానికి చెందిన ఓ మహిళ, పోతనకాలనీలో మీ సేవా నిర్వాహకుడు, రామగుండం మండలం న్యూ మారేడుపాక గ్రామానికి చెందిన కోట చిరంజీవి క్లాస్మేట్స్. వీరికి గతంలోనే వివాహాలు జరిగాయి. ఇద్దరికీ సంతానం కూడాఉన్నారు. చిరంజీవి భార్య 2019లో చనిపోయింది. ఇదిలా ఉండగా.. ఎస్బీఐ సర్వీస్ ప్రొవైడర్కు సంబంధించి వివిధ అంశాలు నేర్చుకునేందుకు పోతనకాలనీలోని మీసేవలోని చిరంజీవి వద్దకు వెళ్తోంది. ఈక్రమంలో తను ప్రేమిస్తున్నానని, పిల్లలు, భర్తను వదిలి వస్తానని, పెళ్లి చేసుకోవాలని ఆ మహిళ కొంతకాలంగా చిరంజీవిని వేధిస్తోంది. ఇలాచేస్తే తన పరువు పోతుందని చిరంజీవి వారిస్తూ వస్తున్నాడు. అయినా ఆమె వినలేదు. ప్రవర్తన మార్చుకోలేదు. శుక్రవారం మధ్యాహ్నం కూడా చిరంజీవికి ఫోన్చేసి మాట్లాడుకుందామని సెంటినరీకాలనీలోని తను పనిచేసే కార్యాలయానికి పిలిపించింది. విషయాన్ని తన భర్త పొలవేన కుమార్, సోదరుడు అనవేన నరేశ్, పిడుగు చందు, అనవేన మల్లయ్యకు తెలియజేసింది. వారు వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఆమెతో మాట్లాడుతున్న చిరంజీవిపై కుమార్, నరేశ్ ఇనుప రాడ్తో తలపై బలంగా కొట్టాడు. దీంతో తీవ్రగాయాలై చిరంజీవి అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. మృతుడి సోదరుడు కోట రాంచరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. సంఘటన స్థలాన్ని గోదావరిఖని ఏసీపీ రమేశ్, మంథని సీఐ రాజు పరిశీలించారు. నిందితులు పారిపోతుండగా రామగిరి పోలీసులు అదుపులో తీసుకున్నారని సమాచారం. -
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
బోయినపల్లి(చొప్పదండి): బోయినపల్లి మండలం మాన్వాడ ఇసుక రీచ్ నుంచి అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణా చేసేందుకు ప్రయత్నించిన ఐదు ట్రాక్టర్లను శుక్రవారం పట్టుకొని పోలీస్స్టేషన్కి తరలించి కేసు నమోదు చేసినట్టు ఎస్సై రమాకాంత్ తెలిపారు. అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారని ఎస్సై రమాకాంత్ హెచ్చరించారు. బైక్, ఆటో ఢీకొని ఇద్దరికి గాయాలువేములవాడరూరల్: బైక్, ఆటో ఢీకొన్న సంఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామానికి చెందిన సూరం రమేశ్ తన అమ్మమ్మ కిష్టమ్మతో నూకలమర్రి నుంచి బైక్పై వేములవాడకు వస్తుండగా, వేములవాడ నుంచి నూకలమర్రి వైపు వెళ్తున్న ఆటో అతివేగంగా ఢీకొంది. సంఘటనలో రమేశ్, కిష్టమ్మకు గాయాలు కావడంతో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆటో నడుపుతున్న వాసాల రమేశ్పై కేసు నమోదు చేసినట్లు వేములవాడ రూరల్ ఎస్సై వెంకట్రాజం తెలిపారు. కేసు నమోదు జ్యోతినగర్: ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు ఆవరణలో నిర్మితమవుతున్న సోలార్ ప్లాంటులో జరిగిన ప్రమాదంలో వలస కార్మికుడి మృతిపై ఎన్టీపీసీ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. గురువారం జరిగిన ప్రమాదంలో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శివ దయాల్ రావత్(23) మృతి చెందాడు. హైడ్రా డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగి రావత్ మృతి చెందినట్లు మృతుడి బావమరిది సంజయ్లాల్ ఎన్టీపీసీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై టి.ఉదయ్కిరణ్ తెలిపారు. -
పాఠశాల గేట్కు తాళం వేసి విద్యార్థుల నిరసన
● ఉపాధ్యాయుడిని సర్దుబాటు చేయడంపై ఆందోళన రామగుండం: అంతర్గాం మండలం లింగాపూర్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు శుక్రవారం గేట్కు తాళం వేసి ఇళ్లకు వెళ్లిపోయారు. పాఠశాలలో 78 మంది విద్యార్థులు ఉండగా ఆరుగురు ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తున్నారు. ఇందులో ఒక టీచర్ మెటర్నిటీ సెలవుపై వెళ్లారు. మిగతా ఐదుగురిలో ఒక ఉపాధ్యాయుడిని వేరే స్కూల్లో సర్దుబాటు చేశారు. దీంతో నలుగురు ఉపాధ్యాయులతో తమకు నాణ్యమైన విద్యాబోధన అందడం లేదంటూ విద్యార్థులు బడి గేట్కు తాళం వేసి నిరసన తెలిపారు. హెచ్ఎం పద్మ ఈ విషయాన్ని ఎంఈవో ఏకాంబరం దృష్టికి తీసుకెళ్లారు. ఉపాధ్యాయుడిని వేరే పాఠశాలకు సర్దుబాటు చేయడంపై పేరెంట్స్ కమిటీ చైర్మన్ వేముల లావణ్య అసహనం వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులు, తల్లిదండ్రులు కలిసి గోదావరిఖనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి తరలివెళ్లారు. ఎమ్మెల్యే మక్కాన్సింగ్ఠాకూర్కు మొరపెట్టుకున్నారు. స్పందించిన ఆయన.. సమస్య పరిష్కరించాలని జిల్లా విద్యాధికారికి సూచించారు. -
అభివృద్ధి చేస్తే ఆదరణ
ప్రాచీన ఆలయాలను అభివృద్ధి చేస్తే వేలాది మంది భక్తుల నుంచి అసాధారణ ఆదరణ వస్తుంది. అతిప్రాచీన ఆలయాల చరిత్ర భశిష్యత్ తరాలకూ అందుతుంది. ఆధ్మాత్మికత వెల్లివిరుస్తుంది. – శ్రీరంగం శ్రీనివాసచారి, అర్చకులు ప్రభుత్వం స్పందించాలి ప్రాచీన ఆలయాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి. గర్రెపల్లిలో అతిపురాతన ఆలయాలు ఉన్నాయి. పెద్దపల్లిఎమ్మెల్యే, మంత్రులు, నాయకులు ఆలయాల ప్రగతిపై దృష్టి సారించాలి. తద్వారా ఈప్రాంతం ఆధ్యాత్మికంగా, పర్యాటకంగానూ అభివృద్ధి చెందుతుంది. – పడాల రవీందర్, గర్రెపల్లి వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు -
ఊరంతా ఆధ్యాత్మికం!
సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): అక్కడ క్రీస్తుకు పూర్వమే స్వయంభూగా వెలసిన అనేక ఆలయాలు ఉన్నాయి. ఊరుఊరంతా భక్తిశ్రద్ధలతో దేవుళ్లను పూజిస్తున్నారు.. ఆధ్యాత్మికత పంచుతున్నారు గర్రెపల్లిల గ్రామస్తులు.. క్రీస్తుకు పూర్వమే 100 ఏళ్ల నుంచి 400ఏళ్ల క్రితం నిర్మించినట్లు చెబుతున్న ప్రాచీన ఆలయాలు.. శ్రీరాజరాజేశ్వరస్వామి, శ్రీవేణుగోపాలస్వామి, శ్రీభక్తంజనేయస్వామి, శ్రీదూర్గామాత ఆ గ్రామం చుట్టూ ఉన్నాయి. ఆనాటి నుంచి నేటి వరకూ భక్తుల ఆదరణ తగ్గకపోగా.. రోజురోజుకూ పెరుగుతోంది. కొలిచిన వారి కోర్కెలు తీర్చుతున్నారని భక్తుల్లో ప్రగాఢ నమ్మకం ఉంది. భక్తుల నుంచి ఆదరణ పెరుగుతున్నా.. ఆలయాల అభివృద్ధిపై ప్రభుత్వాలు దృష్టి సారించడంలేదు.ఆధ్యాత్మికంక్రీస్తుకు పూర్వం దాదాపు 200 ఏళ్లక్రితం గర్రెపల్లిలో శ్రీవేణుగోపాలస్వామి ఆలయం నిర్మించినట్లు చెబుతున్నారు. భక్తుల నుంచి అసాధారణ ఆదరణ ఉన్న శ్రీవేణుగోపాలుడిని దర్శించుకుంటే అంతామంచే జరుగుతోందని భక్తుల నమ్మకం. స్వామివారికి క్రమంగా ఆదరణ పెరుగుతూ వస్తోంది.గ్రామ శివారులోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం క్రీస్తుకు పూర్వం సుమారు 400 ఏళ్లక్రితం వెలిసినట్లు వేదపండితులు చెబుతున్నారు. అంతటి ఘనచరిత్ర కలిగిన స్వామి వారు.. కొలిచిన భక్తులకు కొంగుబంగారంలా ఉంటున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. రోజు వందల మంది భక్తులు దర్శించుకుంటున్నా అభివృద్ధికి నోచుకోవడంలేదు. -
పనిచేయబోమన్న వలస కార్మికులు
సుల్తానాబాద్రూరల్: ఇటుక బట్టిల్లో పనిచేసేందుకు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వలస కార్మికులు.. తాము ఇటుకబట్టిల్లో పనిచేయబోమని వెల్లడించారు. ఈమేరకు శుక్రవారం తిరుగు ప్రయాణమయ్యారు. అధికార యంత్రాంగం స్పదించి వారిని స్వస్థలాలకు పంపించింది. అధికారుల కథనం ప్రకారం.. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి పరిధిలోని ఆనందరావుకు చెందిన ఇటుక బట్టీల్లో పనిచేసేందుకు ఈనెల 2న 28 మంది ఉత్తరప్రదేశ్కు చెందిన వలస కార్మికులు వచ్చారు. ఇక్కడ బస చేయగా.. వారికి వంట చేసుకొని తినేందుకు యాజ మాని డబ్బులు ఇవ్వలేదు. ఈ విషయంపై కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసు, లేబర్ ఆఫీ సర్, రెవెన్యూ అధికారులు శుక్రవారం వలసకూలీల వివరాలు సేకరించారు. వారిని రైలు మార్గం ద్వారా స్వస్థలాలకు పంపించివేశారు. గురువారం కొమండ్లపల్లి పరిధిలోని ఓ ఇటుక బట్టీ వలస కార్మికులు తిరుగుప్రయాణం కాగా.. గుట్టుచప్పుడు కాకుండా స్వస్థలాలకు పంపించినట్లు సమాచారం. -
‘ఇందిరమ్మ’ బిల్లు మంజూరుకు లంచం డిమాండ్
● ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి గంగాధర: గంగాధర మండలం మధురానగర్ గ్రామ కార్యదర్శి మునిగఅనిల్ రూ.10వేలు లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీకి చిక్కాడు. డీఎస్పీ విజయ్కుమార్ వివరాల ప్రకారం.. మధురానగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పత్తికుంటపల్లికి చెందిన ఓ ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులుడికి బిల్లు మంజూరు చేసేందుకు పంచాయతీ కార్యదర్శి మునిగఅనిల్ రూ.10వేలు లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు శుక్రవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి మునిగఅనిల్కు రూ.10వేలు ఇస్తుండగా అక్కడే మాటువేసిన ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం కేసు నమోదు చేశారు. బిల్లుల మంజూరు కోసం ప్రభుత్వ అధికారులు లంచం అడిగినా, దీపావళి మామూళ్లు అడిగినా, అనుమతుల కోసం డబ్బులు డిమాండ్ చేసినా 1064 టోల్ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని డీఎస్పీ సూచించారు. దాడిలో ఏసీబీ ఇన్స్పెక్టర్లు తిరుపతి, కృష్ణకుమార్ పాల్గొన్నారు. -
మెటాఫండ్ ప్రో నిందితుడి అరెస్ట్
● రూ.లక్ష నగదు, ల్యాప్టాప్, బ్యాంక్ ఖాతాలు స్వాధీనంజగిత్యాలక్రైం: మెటాఫండ్ ప్రో యాప్లో పెట్టుబడి పెడితే మూడింతల లాభాలు వస్తాయని మోసాలకు పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అశోక్కుమార్ తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. జగిత్యాల పట్టణానికి చెందిన కస్తూరి రాకేశ్కుమార్ మెటా ఫండ్ ప్రో యాప్ను క్రియేట్ చేసి రూ.లక్ష పెట్టుబడి పెడితే రూ.3 లక్షలు వస్తాయని, ఎక్కువ మందిని అందులో జాయిన్ చేస్తే డబ్బు సంపాదించడంతో పాటు, విదేశీ యాత్రలు ఉచితంగా వెళ్లిరావచ్చని, గొలుసుకట్టు వ్యాపారంతో పెట్టుబడులు పెట్టించాడు. కొడిమ్యాలకు చెందిన ముగ్గురి నుంచి రూ.20 లక్షలు వసూలు చేసి, మూడింతలు లాభం వస్తుందని నమ్మించి మోసం చేశారు. దీంతో బాధితులు కొడిమ్యాల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా గురువారం ఏ2 సింగిరెడ్డి తిరుపతిరెడ్డి, ఏ3 వీరబత్తిని రాజు, శుక్రవారం ఏ1 రాకేశ్ను అరెస్ట్ చేసి అతడి నుంచి ల్యాప్టాప్, రూ.లక్ష నగదు, బ్యాంక్ పాస్బుక్లు, ఏటీఎం క్రెడిట్కార్డులు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. గొలుసుకట్టు వ్యాపారం పేరిట మోసం చేసే వారి మాటలను ప్రజలు నమ్మవద్దన్నారు. కార్యక్రమంలో జగిత్యాల డీఎస్పీ రఘుచందర్, మల్యాల సీఐ రవి, కొడిమ్యాల ఎస్సై సందీప్ పాల్గొన్నారు. -
నేడు భీమన్న గుడిలోకి ఉత్సవమూర్తులు
వేములవాడ: రాజన్న ఆలయ విస్తరణలో భాగంగా శనివారం ఉదయం శుభముహూర్తం ఉండటంతో స్వామి వారి ఉత్సవమూర్తులను భీమన్న గుడిలోకి తీసుకొస్తున్నట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. కోడె మొ క్కులు, ఆర్జిత సేవలు, అభిషేకాలు, అన్నపూజ, కుంకుమపూజ, నిత్యకల్యాణం, చండీహోమం కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక పూజలు చేస్తారని అన్నారు. అయితే రాజన్న ఆలయంలో నిత్య కై ంకర్యాలు, చతుష్కాల పూజలు, ఆ లయ అర్చకులతో యథావిధిగా జరుగాయని పేర్కొన్నారు. ఈనెల 19, 20వ తేదీల్లో శృంగేరిపీఠాధిపతుల పర్యటన అనంతరం భీమన్నగుడిలోనే భక్తుల దర్శనాలు, పూజలు, మొక్కులు నిర్వహించనున్నట్లు తెలిసింది. వినూత్న నిరసనసిరిసిల్లటౌన్ : జీవో నం.9పై హైకోర్టు ఇచ్చిన స్టేను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకొని దానిని ఎత్తివేయించాలని, దీనికి బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కోర్టులో 42శాతం రిజర్వేషన్లకు మద్దతుగా నిలవాలని కోరుతూ శుక్రవారం సిరిసిల్ల అంబేడ్కర్ చౌరస్తాలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు కళ్లకు గంతలు కట్టుకొని వినూత్న తరహాలో నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో బీసీలకు 42శాతం రిజర్వేషన్లకై పోరాటాలు చేపడుతామని అన్నారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శహన్మాండ్లు పట్టణ అధ్యక్షుడు కమలాకర్, జిల్లా అధికార ప్రతినిధి బాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.13న నల్లబ్యాడ్జీలతో నిరసనసిరిసిల్ల అర్బన్: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్పై జరిగిన దాడిని ఖండిస్తూ ఈనెల 13న కలెక్టరేట్ ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపడం జరుగుతుందని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి పుట్ట రవి అన్నారు. శుక్రవారం సిరిసిల్లలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ, వీహెచ్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే నిరసనలో ప్రతిఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 17న జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో నిరసన ర్యాలీలు, 22న చలో హైదరాబాద్ చేపట్టామని తెలిపారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు ఆవునూరి ప్రభాకర్, జిల్లా నాయకులు యెలగందుల బిక్షపతి, ఖా నాపురం లక్ష్మణ్, లచ్చన్న, వీహెచ్పీఎస్ జిల్లా కన్వీనర్ శోభరాణి, అన్ని మండలాల అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. హామీల పేరిట మోసంగంభీరావుపేట: హామీలు, ఆరు గ్యారంటీల పేరిట కాంగ్రెస్ మోసం చేసిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, కేడీసీసీబీ చైర్మన్ కొండూరి రవీందర్రావు అన్నారు. శుక్రవారం గంభీరావుపేటలోని బీఆర్ఎస్ కార్యాలయంలో కాంగ్రెస్ బాకీ కార్డును విడుదల చేసి మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాలకు కాంగ్రెస్ బాకీ పడిందన్నారు. హామీలపై కాంగ్రెస్ నాయకులను ప్రజలు నిలదీయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వెంకటస్వామిగౌడ్, సెస్ డైరెక్టర్ నారాయణరావు, కొమిరిశెట్టి లక్ష్మణ్, రాజు, రాజిరెడ్డి, వెంకటి, వేణు, వెంకటస్వామి పాల్గొన్నారు. మానసిక స్థితిగతులపై అవగాహన అవసరంవేములవాడ: చేనేత వస్త్ర పరిశ్రమ కేంద్రాల్లో కార్మికుల జీవన విధానంలో మార్పులు, మానసిక స్థితిగతులపై అవగాహన అవసరమని జిల్లా సైకాలజిస్ట్ పురుషోత్తం ఈశ్వర్ అన్నారు. లయన్స్ క్లబ్ అవేర్నెస్లో భాగంగా శుక్రవారం పట్టణంలోని చేనేత సహకార సంస్థ భవనంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ చేనేత కార్మికులు మానసికంగా కృంగిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న తరుణంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అవగా హన సదస్సులు కార్మికుల మనోభావాలు దె బ్బతినకుండా ఉండటానికి తోడ్పడుతాయని తెలిపారు. లయన్స్క్లబ్ అధ్యక్షులు చీకోటి సంతోష్, కొలిపాక నర్సయ్య, చేనేత సహకార సంస్థ ప్రతినిధులు, కార్మికులు పాల్గొన్నారు. -
ప్రయాణ భారం
ముస్తాబాద్(సిరిసిల్ల): కామారెడ్డి–సిద్దిపేట మధ్య ప్రయాణించేందుకు ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. రెండు పట్టణాల మధ్య గల వాగులపై సరైన వంతెనలు లేక ప్రయాణం భారంగా మారింది. రెండు గంటలకు ఒక బస్ కూడా నడవకపోవడంతో పేద, మధ్య తరగతి ప్రయాణికులు ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. దీనికంతటికి కారణం.. గంభీరావుపేట–లింగన్నపేట గ్రామాల మధ్య మానేరు వాగుపై వంతెన లేకపోవడం, వర్షాకాలం ప్రారంభమైన నాటి నుంచి కామారెడ్డి, సిద్దిపేట ప్రధాన రహదారిపై ఉన్న లింగన్నపేట వంతెన కొట్టుకపోవడంతో ప్రయాణికులకు కష్టాలు తప్పడం లేదు. మూడేళ్లుగా ప్రయాణ కష్టాలు.. గంభీరావుపేట–లింగన్నపేట గ్రామాల మధ్య ఎగువ మానేరు వాగుపై నిజం కాలంలో కాజ్వే నిర్మించారు. మూడేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. దీంతో క్యాజ్వేను కూల్చి ప్రత్యామ్నాయంగా వాగులో మట్టి రోడ్డు వేశారు. ఎందుకనో వంతెన పనులు నిలిచిపోగా, మూడేళ్లుగా వర్షాకాలంలో ఉధృతంగా ప్రవహించే మానేరు వాగులో వేసిన తాత్కాలిక మట్టి రోడ్డు కొట్టుకుపోవడం రివాజుగా మారింది. ఈఏడాదిలో ఇప్పటికే మూడు నెలలుగా ఈ రూట్లో ప్రయాణాలు బంద్ అయ్యాయి. ఆర్టీసీ బస్లు, ప్రైవేటు వాహనాలు ఈ రూట్లో నడపడం బంద్ చేశారు. దీంతో ఈ రూట్లో నడిచే సిద్దిపేట ఆర్టీసీ బస్లను సగానికిపైగా కుదించారు. రెండు గంటలకొక బస్ నడుపుతున్నారు. అది కూడా సిద్దిపేట నుంచి కామారెడ్డికి వెళ్లే రూటును మల్లారెడ్డిపేట మీదుగా గంభీరావుపేటకు మళ్లించారు. నర్మాల వద్ద ఎగువ మానేరు ప్రాజెక్టు కింద కూడా వంతెనలపై నీరు వెళ్లడంతో ఆ రూట్ను రెండు నెలలుగా మూసివేశారు. దీంతో ముస్తాబాద్, సిద్దిపేట, నా మాపూర్, చిప్పలపల్లి, బందనకల్, కామారెడ్డి, గంభీరావుపేట మండలాల ప్రజలు దూర భారంతో ఇబ్బంది పడుతున్నారు. సరైన సమయానికి బస్లు నడవక, అటోల్లో వెళ్తే అధిక చార్జీల బారిన పడుతున్నారు. ముస్తాబాద్ ప్రయాణికులు కామారెడ్డి వెళ్లాలంటే మల్లారెడ్డిపేట మీదుగా తిరిగి వెళ్లాలి. దీనికి అదనంగా చార్జీలు చెల్లించాల్సి వస్తోంది. ఇక లింగన్నపేట, గంభీరావుపేట ప్రజలు అటు నుంచి ఇటు రావాలన్న.. ఇటు నుంచి అటు వెళ్లాలన్న 15 కిలోమీటర్లు ప్రయాణించి వెళ్లాలి. ప్రతీ ప్రయాణికుడు రూ.20 అదనంగా చార్జీ భరించాల్సి వస్తోంది. -
లిక్కర్ టెండర్ ప్లీజ్!
40.40214.182,61640.66షాపులుపార్ట్నర్షిప్..4,04080.802,02010,70952.322,033ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులు‘గతంలో మున్సిపాలిటీల పరిధిలో వార్డుల వారీగా మద్యం షాపులు కేటాయించేవారు. ఏ వార్డులో వైన్స్ దక్కితే అదేవార్డులో వైన్స్ తెరవాల్సి ఉండేది. ఈసారి మున్సిపాలిటీ పరిధిలోని మద్యం షాపు లాటరీలో దక్కితే ఏ వార్డులోనైనా ఏర్పాటు చేసుకోవచ్చు. హద్దులు ఏమీ లేవు. కొత్త షాపుల ఏర్పాటు తరువాతే స్థానిక ఎన్నికలు జరుగుతాయి’.. అంటూ ఉమ్మడి జిల్లా పరిధిలోని ఎకై ్సజ్శాఖ అధికారులు మద్యం వ్యాపారులకు ఫోన్లు చేసి మరీ టెండర్లు వేసేలా ప్రోత్సహిస్తున్నారు. మద్యం వ్యాపారాన్ని మించింది మరోటి లేదంటూ టెండర్ వేయండి ప్లీజ్ అంటూ వాట్సప్లో సందేశాలు పంపిస్తున్నారు. -
‘సెస్’ చైర్మన్పై అవిశ్వాసం!
సిరిసిల్ల: రాష్ట్రంలోనే ఏకై క సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) చైర్మన్ చిక్కాల రామారావుపై అవిశ్వాసానికి తెరలేసింది. మెజార్టీ ‘సెస్’ డైరెక్టర్లు రామారావుపై అవిశ్వాసాన్ని ప్రతిపాదించి కొత్త చైర్మన్ను ఎన్నుకోవాలని చూస్తున్నారు. ఈమేరకు మెజార్టీ డైరెక్టర్లు ఒక్కటైనట్లు భావిస్తున్నారు. ‘సెస్’ సంస్థ ఐదు దశాబ్దాల క్రితం చీకట్లో మగ్గిన పల్లెలకు విద్యుత్ వెలుగులనిచ్చింది. బీడు భూములను తడిపేందుకు కరెంట్ తీగలను అందించింది. కాళ్లు, చేతులు ఆడిస్తూ నడిపే చేనేత మగ్గాలకు కరెంట్ మోటారై పవర్లూమ్ అయింది. దేశంలోనే సహకార రంగంలో విద్యుత్ను పంపిణీ చేసే ప్రతిష్ఠాత్మకమైన సంస్థగా ప్రపంచ గుర్తింపు పొందింది. అనేక దేశాల విద్యుత్ రంగ నిపుణులు సిరిసిల్ల ‘సెస్’పై అధ్యయనం చేశారు. సిరిసిల్ల ‘సెస్’ చైర్మన్ చిక్కాల రామారావుపై అవిశ్వాసాన్ని ప్రతిపాతిదించేందుకు రంగం సిద్ధమైంది. అవిశ్వాసానికి కారణాలివీ.. కేటీఆర్ దృష్టికి అవిశ్వాసం ‘సెస్’ చైర్మన్ చిక్కాల రామారావుపై అవిశ్వాసాన్ని ప్రతిపాదించే అంశాన్ని మెజార్టీ డైరెక్టర్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ముగ్గురు డైరెక్టర్లు రామారావుపై అవిశ్వాసాన్ని డిసెంబర్ నెలలో ప్రతిపాదించి ఆయనను పదవి నుంచి తొలగించాలని చూస్తున్నట్లు తెలిసింది. చైర్మన్ను స్థానాన్ని దక్కించుకునేందుకు ముగ్గురు నేతలు ఒకే తాటిపై ఉండి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈవిషయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్ఠికి తీసుకెళ్లగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తర్వాత చూద్దామని చెప్పినట్లు తెలిసింది. అవిశ్వాసానికి మరో రెండు నెలలు సమయం ఉండడంతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మెజార్టీ నేతలు అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు. -
సర్వీసులు పెంచాలి
సిద్దిపేట, కామారెడ్డి రూట్లో గంటల తరబడి బస్ల కోసం వేచి ఉంటున్నాం. మహిళలు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. గంభీరావుపేట వద్ద బ్రిడ్జి లేకపోవడంతో దూరం పెరిగింది. అధిక చార్జీ వసూలు చేస్తున్నారు. వంతెన నిర్మించి బస్ సర్వీసులను పెంచాలి. – కుర్ర సావిత్రి, ముస్తాబాద్రెండు గంటలుగా బస్ లేదు మాది హైదరాబాద్. ముస్తాబాద్ మండలంలో ఉన్న బంధువుల వద్దకు వచ్చాం. హైదరాబాద్కు వెళ్లేందుకు ముస్తాబాద్లో రెండు గంటలు ఉన్నాం. సిద్దిపేటకు వెళ్లే బస్ వచ్చినా అందులో అడుగు పెట్టె సందు లేదు. అధికారులు స్పందించి బస్లను పెంచాలి. – లక్ష్మి, హైదరాబాద్వంతెనలు లేక ఇబ్బంది సిద్దిపేట–కామారెడ్డి రూట్లో 14 బస్ సర్వీసులు నడుపుతున్నాం. గంభీరావుపేట వద్ద బ్రిడ్జి లేకపోవడంతో దూరం పెరిగింది. వర్షకాలంలో ఏటా ఈ రూట్ సమస్యగా మారింది. ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు బస్లను నడుపుతున్నాం. – రఘు, డిపో మేనేజర్, సిద్దిపేట -
బాలికల్లో ఆత్మవిశ్వాసం నింపాలి
సిరిసిల్ల: బాలికల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు ఉపాధ్యాయులు, అన్ని ప్రభుత్వ శాఖలు కృషి చేయాలని జిల్లా బాలల సంక్షేమ అధికారి కవిత అన్నారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవం పురస్కరించుకొని తంగళ్లపల్లి మండలం మండెపల్లి గురుకుల విద్యాలయంలో శుక్రవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. అక్టోబర్ 11న జరుపుకునే అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతీవారం ఐసీపీఎస్ టీం ప్రతీ సంస్థలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. బాలికల హక్కులు, భద్రత, విద్య, ఆరోగ్యం, సమాన అవకాశాలు, సామాజిక ఎదుగుదల పట్ల చైతన్యవంతులను చేయాలని కోరారు. బాలల రక్షణ చట్టాలు, పోషణ–విద్య–భద్రత అంశాలపై వివరించారు. బాల రక్షభవన్లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆర్డినేటర్ స్రవంతి, ఎస్సై వినీతరెడ్డి, సైకియాట్రిస్టు శ్రీఅక్షయ్, స్కూల్ ప్రిన్సిపాల్స్ తెరిసా, రమేశ్, గగన్, భార్గవి, మౌనిక, రమణ, శ్యామల, ఏఎన్ఎం ఆశ వర్కర్లు, స్కూల్ సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలిసిరిసిల్లటౌన్: మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుర్రం అశోక్ అన్నారు. బీవైనగర్లోని అమృత్లాల్ శుక్లా కార్మిక భవన్లో శుక్రవారం జరిగిన సిరిసిల్ల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ టౌన్ మహాసభలో మాట్లాడారు. పెండింగ్ పీఎఫ్ సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించాలన్నారు. యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కోడం రమణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మూషం రమేశ్, జిల్లా సహాయ కార్యదర్శి సూరం పద్మ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కాసారపు శంకర్, సీఐటీయూ నాయకుడు జిందం కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నూతన కమిటీ, మహిళా సబ్ కమిటీని ఎన్నుకున్నారు. -
నైరాశ్యం
శుక్రవారం శ్రీ 10 శ్రీ అక్టోబర్ శ్రీ 2025ఉత్సాహం..స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేసిన నేపథ్యంలో ప్రధాన పార్టీల కేడర్, ఆశావహుల్లో తీవ్ర నైరాశ్యం నెలకొంది. పంచాయతీ పాలకవర్గాలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీ కాలం పూర్తయ్యి ఏడాదిన్నర కాలం గడిచింది. సుదీర్ఘ కాలంగా ఎన్నికలకు కోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తూ జీవో విడుదల చేయడంతో బీసీవర్గాలకు దక్కే స్థానాల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఎన్నికల నోటిఫికేషన్ సైతం విడుదల కావడంతో పెద్ద సంఖ్యలో ఆశావహులు ఎన్నికలకు సిద్ధమయ్యారు. తాజాగా ఎన్నికల నిర్వహణ నిలిచిపోనుండటం ఆశావహులు, ప్రధాన పార్టీల కేడర్లో నైరాశ్యాన్ని నింపింది. కోర్టు తీర్పు ప్రకారం కనీసం నెల రోజుల తర్వాతే ఎన్నికల నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా బీసీలకు రిజర్వేషన్లపై కోర్టులో తేలేవరకు వేచి చూస్తారా, లేక పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తారా? అన్న దానిపైనే ఆసక్తి నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న చర్చ గ్రామ్లాలో కొనసాగుతోంది. సాక్షిప్రతినిధి, కరీంనగర్: స్థానిక సంస్థల ఎన్నికలకు గురువారం ఉదయం నామినేషన్ల నోటిఫికేషన్ను ఎన్నికల కమిషన్ విడుదల చేయడంతో ఉమ్మడి జిల్లాలోని పలు పల్లెల్లో సందడి నెలకొంది. అక్కడక్కడ కొందరు ఆశావహులు మద్దతుదారులతో వెళ్లి నామినేషన్లు వేశారు. కాగా.. బీసీ రిజర్వేషన్ల జీవో, ఎన్నికల నోటిఫికేషన్పై హైకోర్టు స్టే విధించడంతో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడింది. రెండేళ్లుగా స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలవాలనుకున్న వారి ఆశలపై సాయంత్రానికి నీళ్లు చల్లినట్లయ్యింది. కొద్దిరోజులుగా అధికార యంత్రాంగం ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, సిబ్బందికి శిక్షణ, రిజర్వేషన్ల ప్రకటన, ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ విడుదల చేయడం ద్వారా ఎన్నికలు ఉంటాయని భావించిన వారికి కోర్టు స్టేతో ఊరించి ఉసురుమనిపించిన ట్లయ్యింది. ఆరు వారాల తరువాత కోర్టు విచారణ చేపట్టనుండటంతో, అప్పుడే ఎన్నికలు జరిగే అవకాశముంది. దీంతో గ్రామాల్లో నిన్నటి వరకు సందడి నెలకొనగా.. ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 6ఎంపీటీసీ, మూడు జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 311 ఎంపీటీసీలు, 30 జెడ్పీటీసీ స్థానాలకు తొలివిడత ఎన్నికల నోటిఫికేషన్ను ఆయా జిల్లాల కలెక్టర్లు విడుదల చేశారు. రిజర్వేషన్ల కేసు కోర్టులో ఉన్న నేపథ్యంలో నామినేషన్ దాఖలు చేసేందుకు ఆశావహులు ఆసక్తి చూపలేదు. ఈక్రమంలో జగిత్యాల జిల్లా కథలాపూర్ ఎంపీటీసీ స్థానానికి కారపు గంగాధర్, ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి ఎంపీటీసీకి నాంపెల్లి వెంకటాద్రి నామినేషన్ వేశారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం జల్లారం ఎంపీటీసీకి ఓదెలు, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్, బోయినపల్లి మండలాల జెడ్పీటీసీలకు ఎడపల్లి అనిల్, గురజా ల శ్రీధర్ నామినేషన్ వేశారు. వేములవాడ రూరల్ మండలం హన్మాజిపేట ఎంపీటీసీ స్థానానికి చిలుక ప్రభాకర్ నామినేషన్ వేశారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కన్నాపూర్, మెట్పల్లి ఎంపీటీసీలకు రెడ్డి కుమార్, గొట్టె మధు, వి.సైదాపూర్ జెడ్పీటీసీ స్థానాలకు అరుణ లంకదాసరి కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్లు వేశారు. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎంపీటీసీలకు 6, జెడ్పీటీసీలకు 3 నామినేషన్లు దాఖలయ్యాయి. రిజర్వేషన్లు మారేనా? ప్రస్తుతం ప్రభుత్వం బీసీలకు 23శాతం ఉన్న రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ జీవో జారీచేసి, దాని అనుగుణంగా సీట్లు ప్రకటించింది. తాజాగా కోర్టు తీర్పు నేపథ్యంలో గతంలో బీసీలకు ఉన్న 23శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహిస్తే, 19శాతం మేర బీసీలకు సీట్లు తగ్గనున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 60 జెడ్పీటీలు ఉండగా, 26బీసీలకు కేటాయించగా, 19 జనరల్కు కేటాయించారు. 556 ఎంపీటీసీలకు 240బీసీలకు, 184 జనరల్కు కేటాయించగా, పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తే బీసీలల్లో 19శాతం సీట్లు తగ్గి, అంతే మొత్తంలో జనరల్ సీట్ల సంఖ్య పెరగనుంది. మొత్తంగా స్థానిక ఎన్నికలపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. -
కంపుకొడుతున్న కాలనీలు
● మురుగుపై పట్టింపేది ? ● పట్టించుకోని అధికారులు ● డ్రెయినేజీలు నిర్మించాలని డిమాండ్వేములవాడఅర్బన్: వేములవాడ మున్సిపల్ పరిధి లోని కాలనీల్లో డ్రెయినేజీలు లేక కంపు కొడుతున్నా యి. రోడ్లపైనే మురికినీరు పారుతుండడంతో దు ర్వాసన వెదజల్లుతోంది. అంతేకాకుండా దోమలు పెరిగి జ్వరాలు విజృంభిస్తున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాలతో పట్టణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మున్సిపాలిటీ అధికారుల పట్టింపు లేక కా లనీ ప్రజలు పడుతున్న కష్టాలు అన్నీ..ఇన్నీ కావు. మల్లారం రోడ్డులో.. వేములవాడ పట్టణంలోని మల్లారం రహదారిని ఆనుకుని ఉన్న ఇళ్ల నుంచి వస్తున్న మురికినీరు రోడ్డుపైనే పారుతోంది. ప్రధాన రోడ్డును ఆనుకుని ఉన్న పలు కాలనీల్లో డ్రెయినేజీలు లేవు. దీంతో మురికినీరు రోడ్లపైనే పారుతోంది. రోడ్లపై నడవలేకపోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పట్టించుకుని డ్రెయినేజీలు నిర్మించాలని కోరుతున్నారు. తిప్పాపూర్లో రోడ్డుపైకి మురికినీరు మున్సిపల్ పరిధి తిప్పాపూర్లోని ఏరియా ఆస్పత్రి ఎదురుగా వేములవాడ–సిరిసిల్ల ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న కాలనీకి వెళ్లే రోడ్డుకు అడ్డంగా మురికినీరు నిలిచి పరిసరాలు కంపు కొడుతున్నాయి. పాదచారులు రోడ్డుపై వెళ్లాలంటే జంకుతున్నారు. ఇటీవల నిత్యం వర్షం పడుతుండడంతో పరిసరాలు మరింత కంపుకొడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాంపల్లిలో దుర్వాసన వేములవాడ మున్సిపల్ పరిధి తిప్పాపూర్లోని వేములవాడ–నాంపల్లి రహదారిని ఆనుకుని మురికికాలువలు లేకపోవడంతో మురికినీరు రోడ్డుపైనే పారుతుంది. డ్రెయినేజీలు లేక మట్టికాలువలు కూలి మురికినీరు ఆగుతుంది. నాంపల్లి రోడ్డు పక్కన మురికి కాలువమల్లారం రోడ్డు పక్కన పారుతున్న మురికి కాలువ -
శ్రీవారి ఆదాయం రూ.8.61లక్షలు
సిరిసిల్లటౌన్: శ్రీశాల శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా హుండీలలో భక్తులు సమర్పించిన కానుకలను గురువారం దేవాదాయశాఖ అదికారులు లెక్కించారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాల ఆదాయం రూ. 8,61,032 వచ్చిందని ఈవో మారుతిరావు తెలిపారు. ఈవో మాట్లాడుతూ గతేడాది కంటే ఈ బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి ఆదాయం రూ. 1,78,657 అధికంగా వచ్చిందన్నారు. హుండీ ద్వారా రూ.3,40,582, టికెట్లు, ప్రసాదాల ద్వారా రూ.5,20,450 వచ్చిందని వివరించారు. లెక్కింపులో అధికారులు పాము సత్యనారాయణ, పీసరి రవీందర్, కూనబోయిన సత్యం, ఆలయ మాజీ చైర్మన్లు ఉప్పుల విఠల్రెడ్డి, తీగల శేఖర్గౌడ్, చేపూరి నాగరాజు, టీపీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, అర్చకస్వాములు కృష్ణమాచారి పాల్గొన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధం ముస్తాబాద్(సిరిసిల్ల): స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పేర్కొన్నారు. ముస్తాబాద్లోని ఏఎంఆర్ గార్డెన్స్లో గురువారం బీఆర్ఎస్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడారు. స్థానికసంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే విధించిందని.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఇంటింటికి తీసుకెళ్లి రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి కృషి చేయాలని కోరారు. పార్టీ మండలాధ్యక్షుడు సురేందర్రావు, పట్టణాధ్యక్షుడు ఎద్దండి నర్సింహారెడ్డి, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, సీనియర్ నాయకులు కల్వకుంట్ల గోపాల్రావు, విజయరామారావు, సెస్ మాజీ డైరెక్టర్ కొమ్ము బాలయ్య, జెడ్పీ మాజీ కో ఆప్షన్ సభ్యుడు సర్వర్, ఏఎంసీ మాజీ చైర్మన్ జానబాయి, బాల్నర్స్, సంతోష్రావు, సుమ తి, సావిత్రి, మనోహర్, భరత్ పాల్గొన్నారు. కేంద్ర ఆరోగ్య పథకాల లక్ష్యం సాధించాలి ఇల్లంతకుంట(మానకొండూర్): కేంద్ర ఆరోగ్య పథకాల లక్ష్యాలు సాధించాలని, వైద్యసిబ్బంది సమయపాలన పాటించాలని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత కోరారు. ఇల్లంతకుంట పీహెచ్సీని గురువారం తనిఖీ చేశారు. అనంతరం సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. పొగాకు వినియోగంతో కలిగే నష్టాలు, సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఎన్సీడీ, టీబీ కేసులు, ఇమ్యూనైజేషన్, ఓపీ, రక్తపరీక్షలు, సీజనల్ వ్యాధుల గురించి మాట్లాడారు. అనంతరం గాలిపల్లి పల్లె దవాఖానాను పరిశీలించారు. వైద్యులు సంపత్కుమార్, రామకృష్ణ, అనిత, కోల్డ్ చైన్ మేనేజర్ నవీన, డాక్టర్ జీవనజ్యోతి, కట్ట రమేశ్, హెచ్ఈవో వెంకటరమణ, ప్రసాద్, సూపర్వైజర్ జవహర్ పాల్గొన్నారు. వైన్షాపులకు దరఖాస్తులుసిరిసిల్ల క్రైం: జిల్లాలో మొత్తం 48 మద్యం దుకాణాల లైసెన్సులకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. గురువారం నాడు కొత్తగా 20 దరఖాస్తులు అందాయని సీఐ తెలిపారు. ఇప్పటి వరకు 146 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు. ఈనెల 18 వరకు దరఖాస్తులు అందజేసే అవకాశం ఉందని తెలిపారు. నామినేషన్ ఏర్పాట్లు పరిశీలనఇల్లంతకుంట(మానకొండూర్): మండల పరిషత్లోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల ఏర్పాట్లను గురువారం అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేశ్ పరిశీలించారు. మెటీరియల్ గురించి ఇల్లంతకుంట రిటర్నింగ్ అధికారి ఎంపీడీవో శశికళను అడిగి తెలుసుకున్నారు. ఆర్డీవో వెంకటేశ్వర్లు, తహసీల్దార్ ఫరూక్, ఎంపీవో శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఇలాగైతే ఆడేదెలా?
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మానసిక, శారీరక వికాసం సాధించేందుకు క్రీడలు దోహదపడతాయి. పాఠశాల స్థాయిలో క్రీడలపై శ్రద్ధ చూపుతున్న విద్యాశాఖకు కళాశాల స్థాయిలో పట్టింపు కరువైంది. స్కూల్ లెవల్లో క్రీడాపోటీల్లో పాల్గొన్న విద్యార్థుల్లో ఇంటర్కు వచ్చే సరికి కనీసం శిక్షకులు లేక నైపుణ్యం కరువవుతుంది. రాజన్నసిరిసిల్ల జిల్లాలో రెండు డిగ్రీ, పది ఇంటర్ ప్రభుత్వ కాలేజీలు ఉన్నాయి. అగ్రహారం డిగ్రీ కాలేజీలో మినహా ఎక్కడ కూడా పీడీ(ఫిజికల్ డైరెక్టర్)లు లేరు. దీంతో విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. లెక్చరర్లతోనే శిక్షణ.. జిల్లాలోని ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ ఇచ్చేందుకు ఇటీవల ప్రభుత్వం ఒక్కో కాలేజీకి రూ.10వేలు కేటాయించింది. ఈ నిధులతో క్రీడా సామాగ్రిని కొనుగోలు చేశారు. కానీ విద్యార్థులకు ఆటలపై శిక్షణ ఇచ్చే పీడీలు లేరు. దీంతో కాలేజీలోని వివిధ సబ్జెక్టుల అధ్యాపకులే ప్రతీ శనివారం సాయంత్రం ఆటలు ఆడిస్తున్నారు. వీరి సమక్షంలో విద్యార్థులు ఆటలపై పట్టు సాధించలేకపోతున్నారు. దీంతో వీరు ఏ క్రీడాపోటీల్లో పాల్గొనడం లేదు. ఒక వేళ పాల్గొన్న పతకాలు రావడం లేదు. ఇక్కడ ఇలా.. అక్కడ అలా ! ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో పీడీలు లేక విద్యార్థులు క్రీడలకు దూరమవుతుంటే.. గురుకుల విద్యార్థులకు ప్రత్యేకంగా పీఈటీలు ఉండడంతో ఆటల్లో రాణిస్తున్నారు. గురుకుల విద్యార్థులు పాల్గొంటున్నారంటే పతకం ఖాయం చేసుకుంటున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణిస్తున్నారు. వారికి ఉన్నత విద్యలో స్పోర్ట్స్ విభాగంలో రిజర్వేషన్లు వర్తిస్తున్నాయి. క్రీడా కోటాలో చాలా మంది విద్యార్థులు ఉద్యోగాలు సైతం సాధించారు. గురుకుల విద్యార్థులకు క్రీడలతో లబ్ధి జరుగుతుండగా ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల్లో చదువుతున్న పేద విద్యార్థులకు మాత్రం ఆ ఫలితాలు దక్కడం లేదు. -
ఎంత పనాయే !
సిరిసిల్ల: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం.. రిజర్వేషన్ల ఖరారవడం.. ఎన్నికల తేదీ.. ఫలితాల ముహూర్తం సైతం ఫిక్స్ కావడంతో ఆశావహులు పోటీ చేసేందుకు ఆశపడ్డారు. ఇంతలోనే దసరా పండుగ రావడంతో గత పది రోజులు పల్లెల్లో దావత్లు జోరందుకున్నాయి. కులసంఘాలను, యువకులను కలుస్తూ మందు, విందులు ఏర్పాటు చేశారు. ‘స్థానిక సంస్థల’ ఎన్నికల్లో ఎంపీటీసీ సభ్యుడిగా, జెడ్పీటీసీ అభ్యర్థిగా, గ్రామసర్పంచ్గా, వార్డు సభ్యుడి పదవులపై ఆశలు పెట్టుకున్న వారు బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు. అన్నీ సిద్ధం చేసుకున్న తరుణంలో ఎన్నికల నిర్వహణపై హైకోర్టు స్టే విధించడంతో ఆశావహుల ఆశలన్నీ ఆవిరయ్యాయి. వైకుంఠపాళీలో పెద్దపాము మింగినట్లు ఎన్ని‘కలలు’ కల్లలయ్యాయి. మళ్లీ ఆట మొదటికొచ్చినట్లయింది. పన్నులు చెల్లించి రశీదులు పొందినా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తి, నామినేషన్ను ప్రతిపాదించే వ్యక్తులను, బలపరిచే వారు ఎలాంటి పన్ను బకాయిలు ఉండొద్దు. బకాయిలుంటే నామినేషన్ తిరస్కరణకు గురవుతుంది. ఈక్రమంలో ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులే ముందుచూపుతో నామినేషన్పత్రంలో ప్రతిపాదించే వ్యక్తి, బలపరిచే వ్యక్తుల ఇంటి పన్నులు, నల్లా పన్నులను చెల్లించి రశీదులు పొందారు. అభ్యర్థులంతా ఒక్కొక్కరు మరో ఇద్దరి బకాయిలు క్లియర్ చేశారు. ఇంతలోనే ఎన్నికలపై హైకోర్టు స్టే విధించడంతో అవాక్కయ్యారు. ఇప్పటికే చేసిన ఖర్చును తలచుకుని అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. అన్నింటికీ మించి ఇంట్లో ఈ రాజకీయాలు వద్దు అని ముందునుంచే చెబుతున్నా ఇంటి ఆవిడ ముందు(భార్య) ఎన్నికల దావత్ల ఖర్చుల లొల్లి తలనొప్పిగా మారింది. దావత్లు దండగాయే.. ఇవన్నీ ఒక ఎత్తయితే.. గత పది రోజులుగా చేసిన దావత్ల ఖర్చులు తడిసి మోపెడయ్యాయి. ఖరీదైన మందు, చికెన్, యాటపోతుల కూరలతో పోటాపోటీగా విందు రాజకీయాలు నడిపారు. దసరా పండుగ నేపథ్యంలో దూరపు ప్రాంతాల్లోని వారు సైతం సొంతూరికి రావడంతో వారికి ఓటుహక్కు ఉందని తెలిసి మందు, విందులతో ఆత్మీయతను చాటుకున్నారు. దసరా పండుగ జోరులో దావత్లు ఎక్కువయ్యాయి. పది రోజులు అన్ని ఊర్లలోనూ స్థానిక సంస్థల ఎన్నికల మందు, విందులకు ఆశావహుల చేతిచమురు భారీగానే వదిలింది. ఇంత చేసి నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకుని, ముహూర్తం కోసం చూస్తుండగా.. హైకోర్టు గురువారం ఎన్నికలపై స్టే విధించడంతో ఆశావహుల గుండెల్లో బండపడినట్లు అయింది. ఇన్ని రోజులు ఇచ్చిన దావత్లన్నీ దండగాయే.. మల్లా ఎన్నికల తరువాయి వచ్చేసరికి మళ్లీ ఖర్సులు తప్పవని బాధపడుతున్నారు. ఎంత పనాయే అంటూ.. లోలోపల మదనపడుతున్నారు. -
మద్దతు ధర అందించడమే లక్ష్యం
సిరిసిల్ల: రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర అందించడమే లక్ష్యమని కలెక్టర్ ఎం.హరిత స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్ 2025–26 ధాన్యం సేకరణపై పౌరసరఫరాలు, రెవెన్యూ, వ్యవసాయ, రవాణా, మార్కెటింగ్, సహకార, ఐకేపీ, మెప్మా అధికారులతో కలెక్టరేట్లో గురువారం సమీక్షించారు. గత ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 2.11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, ఈ సీజన్లో సుమారు 2.70 లక్షల మెట్రిక్ టన్నులు వస్తుందని అంచనా ఉన్నట్లు తెలిపారు. అన్ని ప్రభుత్వశాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ధాన్యం సేకరణ, రవాణా, లారీలు ఇతర ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ధాన్యంలో తేమ శాతం 17 ఉండేలా చూసుకొని కేంద్రాలకు తరలించాలని రైతులకు సూచించారు. ప్రభుత్వం గ్రేడ్–ఏ ధాన్యానికి క్వింటాల్కు రూ.2389, కామన్ రకానికి రూ.2,369 నిర్ణయించిందని తెలిపారు. సన్న ధాన్యానికి క్వింటాలుకు రూ.500 అదనంగా ఇస్తుందని తెలిపారు. ఐకేపీ ఆధ్వర్యంలో 144, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 79, మెప్మా, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో కలిపి మొత్తం 231 కేంద్రాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. టార్పాలిన్లు 7,592, తూకం వేసే యంత్రాలు 764, ప్యాడీ క్లీనర్లు 731, తేమశాతం చూసే మెషిన్లు 603, గ్రైన్ కాలిపర్స్ 270 అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, డీసీఎస్వో చంద్రప్రకాశ్, జిల్లా మేనేజర్ రజిత, డీఏవో అఫ్జల్బేగం, డీఆర్డీవో శేషాద్రి, డీసీవో రామకృష్ణ, డీఎంవో ప్రకాశ్, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత పాల్గొన్నారు. స్థానిక ఎన్నికలకు సిద్ధం సిరిసిల్ల/వేములవాడఅర్బన్/బోయినపల్లి/చందుర్తి/రుద్రంగి: జిల్లాలో స్థానికసంస్థల ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం సిద్ధంగా ఉందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.హరిత పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వేములవాడ అర్బన్, వేములవాడ రూరల్, బోయినపల్లి, చందుర్తి మండల పరిషత్లలో, రుద్రంగి గ్రామపంచాయతీలో నామినేషన్ల స్వీకరణ ఏర్పాట్లను గురువారం పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణకు చేసిన హెల్ప్డెస్క్లు, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. ఇప్పటికే ఆర్వో, ఏఆర్వోలకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాలు విధులు నిర్వర్తిస్తున్నాయని వివరించారు. ఎన్నికకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో పెట్టాలని అధికారులకు సూచించారు. వేములవాడ ఆర్డీవో రాధాభాయ్, ఎంపీడీవోలు రాజీవ్మల్హోత్ర, జయశీల, రాధ, నటరాజ్, తహసీల్దార్లు విజయప్రకాశ్రావు, నారాయణరెడ్డి, భూపతి, పుష్పలత, ఎంపీవో బండి ప్రదీప్కుమార్ పాల్గొన్నారు. ప్రభుత్వ వైద్యసేవలపై అవగాహన కల్పించాలి ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుతున్న వైద్యసేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ వైద్యసిబ్బందిని ఆదేశించారు. బోయినపల్లి పీహెచ్సీని తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు వివరాలు, రిజిస్టర్, ఫార్మసీలను పరిశీలించారు. వైద్యులు కార్తీక్, పీహెచ్సీ వైద్యసిబ్బంది ఉన్నారు. -
డ్రెయినేజీ నిర్మించాలి
తిప్పాపూర్లోని కాలనీల్లో డ్రెయినేజీలు సక్రమంగా లేక మురికినీరు ఎక్కడపడితే అక్కడ ఆగిపోతుంది. మురికినీరు రోడ్డుపై ఆగడంతో వాహనదారులు, పాదచారులకు ఇబ్బందిగా మారింది. అధికారులు పట్టించుకొని డ్రెయినేజీ నిర్మించాలి. – రాకేశ్, తిప్పాపూర్ మురికినీటిలో నుంచి వెళ్లాలి ఇంటి నుంచి రోడ్డుపైకి వెళ్లాలంటే మురికినీటిలో నుంచి నడుచుకుంటూ పోవాల్సిందే. మురికినీరు మల్లారం రోడ్డును ఆనుకుని కాలనీరోడ్డుకు అడ్డంగా పారుతుంది. ఇప్పటి వరకు ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి మా కాలనీలో డ్రెయినేజీ నిర్మించాలి. – కిష్టస్వామి, వేములవాడ -
మహిళలు మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి
సిరిసిల్ల: మహిళలు మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్య త ఇవ్వాలని సైకాలజిస్ట్ కె.పున్నంచందర్ కోరారు. స్థానిక సుందరయ్యనగర్లో మానసిక ఆరోగ్య దినో త్సవం సందర్భంగా సిరిసిల్ల జనరల్ ఆస్పత్రి మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో గురువారం సామూహిక కౌన్సెలింగ్ నిర్వహించారు. సైకాలజిస్ట్ పున్నంచందర్ మాట్లాడుతూ మహిళలు కుటుంబం, ఉద్యోగం, సామాజిక బాధ్యతలు, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత సాధించడంలో ఒత్తిడి ఎదుర్కొంటున్నారన్నారు. సరైన నిద్ర, ఆరో గ్యకరమైన ఆహారం, వ్యాయామం, యోగా ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చన్నారు. మైండ్కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్ సిబ్బంది రాపెల్లి లత, బూర శ్రీమతి, కొండ ఉమ ఉన్నారు. -
బాలాలయంగా భీమన్న గుడి
వేములవాడ: రాజన్న ఆలయ విస్తరణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే ఆలయ పరిసరాల్లో పలు భవనాలను కూల్చివేయగా.. అదే సమయంలో భీమన్నగుడిలో దర్శనాలకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక చొరవ చూపుతుండడంతో ప్రభుత్వం సైతం నిధులు మంజూరు చేస్తుంది. ఇప్పటికే మొదటి విడతగా రూ.76 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం రేవంత్రెడ్డి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అలాగే రూ.35.25కోట్లతో నిత్యాన్నదానానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈక్రమంలో రాజన్న ఆలయంలో భక్తుల దర్శనాలు నిలిపివేసి భీమన్నగుడిలో కొనసాగించేందుకు రూ.3.44కోట్లతో పనులు చేస్తున్నారు. భీమన్న గుడిలో సౌకర్యాలు ప్రధాన ఆలయం కూల్చివేసి.. విస్తరిస్తున్న సమయంలో బాలాలయంలో పూజలు కొనసాగుతాయి. ప్రధాన దేవత విగ్రహాన్ని తాత్కాలిక స్థలానికి (బాలాలయానికి) తరలిస్తారు. ఇక్కడే అన్ని పూజలు కొనసాగుతాయి. విస్తరణ సమయంలో భక్తులకు ఇబ్బంది కలుగుకుండా భీమేశ్వరస్వామి ఆలయంలో దర్శనాలు కొనసాగిస్తారు. ఇందుకు సంబంధించిన షెడ్లు, క్యూలైన్లు, ఇతర సౌకర్యాల పనులు జోరందుకున్నాయి. వృషభ ధ్వజస్తంభాలు ఏర్పాటు రాజన్నను దర్శించుకునే భక్తులు కోడెమొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. భక్తుల విశ్వాసానికి అనుగుణంగా భీమన్నగుడిలో కోడెమొక్కులు చెల్లించుకునేందుకు వీలుగా ఆలయ అధికారులు విజయ దశమి రోజున వృషభ ధ్వజస్తంభాలను ప్రతిష్ఠించారు. మండపాలు, క్యూలైన్లు రాజన్న నిత్యకల్యాణాలు, భక్తుల దర్శనాలు, వీఐపీల దర్శనాలు, ఆశీర్వచన మండపం, సత్యనారాయణ వ్రతాల మొక్కులు చెల్లించుకునేందుకు వీలుగా షెడ్ల పనులు చేపడుతున్నారు. భీమన్నగుడి పక్కనే ఉన్న శంకరమఠంలో అభిషేకం, అన్నపూజ సంకల్పం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు, హోమాలు నిర్వహించనున్నారు. నిత్యకల్యాణం, సత్యనారాయణ వ్రతాలు అన్నదానం పైఅంతస్తులో నిర్వహించనున్నారు. తరలిన కార్యాలయాలు రాజన్న ఆలయం వద్దనున్న కార్యాలయాలను భీమేశ్వర సదన్లోకి తరలించారు. ఈవో కార్యాలయం, ఇంజినీరింగ్, పీఆర్వో విభాగాలతోపాటు ప్రధాన విభాగాలను తాత్కాలికంగా సదన్లోకి మార్చేశారు. వేదపాఠశాల ప్రహరీని తొలగించి అందులోకి ప్రసాదాల తయారీ కేంద్రం, ముందటే ప్రసాదాల కౌంటర్లు, సదన్లోని క్యాంటీన్లోకి మెయిన్ గోదాంలను తరలించారు. రూ.3.44 కోట్లతో సౌకర్యాలు త్వరలోనే రాజన్న గుడిలో దర్శనాల నిలిపివేత భీమన్న గుడిలోనే భక్తుల దర్శనాలు... ఉత్సవాలు నగరేశ్వర స్వామి ఆలయంలో చండీహోమం గాయత్రి మాతా దేవాలయంలో కుంకుమపూజలు -
శ్రీవారికి చక్రస్నానం.. పుష్పయాగం
సిరిసిల్లటౌన్: శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం రాత్రి నిర్వహించిన ఏకాంతసేవతో ముగిశాయి. ఆలయంలోని శ్రీవారి పుష్కరిణిలో శ్రీదేవి, భూదేవి సహితంగా వేంకటేశ్వరస్వామికి చక్రస్నానం చేయించారు. రాత్రి మహాపుష్పయాగం నిర్వహించారు. ప్రసాద్ దంపతులు 15 రకాల పుష్పాలు 430 కిలోలు అందించగా.. వేదపండితులు పుష్పార్చన చేశారు. బ్రహ్మోత్సవాలు ముగిసినట్లు ఆలయ ప్రధానార్చకులు కృష్ణమాచారి ప్రకటించారు. టీపీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, ఆలయ ఈవో మారుతిరావు, ఏఈవోలు కూనబోయిన సత్యం, పీసరి రవీందర్, ఆలయ కమిటీ మాజీ చైర్మన్లు ఉప్పుల విఠల్రెడ్డి, తీగల శేఖర్గౌడ్, చేపూరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.దర్శించుకుంటున్న భక్తులుమహాపుష్పయాగం నిర్వహిస్తున్న వేదపండితులు -
రాజన్న సిరిసిల్ల
గురువారం శ్రీ 9 శ్రీ అక్టోబర్ శ్రీ 20257సిరిసిల్లఅర్బన్: ఉపాధిహామీలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల వేతనాలు విడుదల చేయాలని ఫీల్డ్ అసిస్టెంట్ల జిల్లా అధ్యక్షుడు మధు కోరారు. డీఆర్డీవో శేషాద్రిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. బోయినపల్లి(చొప్పదండి): మిడ్మానేరు నుంచి ఎల్ఎండీకి 1500, ప్యాకేజీ–9 మల్కపేటకు 561 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టులోకి 2,200 క్యూసెక్కులు వస్తోంది. ఆకాశం మేఘావృతమవుతుంది. జిల్లాలో వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. ఈదురుగాలులు వీస్తాయి. -
అర్ధబలానికే ‘అగ్ర’తాంబూలం!
సిరిసిల్ల: స్థానిక సంస్థల ఎన్నికల వేడి పల్లెల్లో రాజుకుంటోంది. రాజన్నసిరిసిల్ల జిల్లాలో తొలివిడత ప్రాదేశిక పోరుకు గురువారం నోటిఫికేషన్ జారీకి అధికారులు సన్నద్ధమవుతున్నారు. స్థానికసంస్థల ఎన్నికల్లో విజయం సాధించేందుకు రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఆర్థికంగా బలంగా ఉన్న అభ్యర్థులను పోటీకి నిలపాలని పార్టీలు భావిస్తున్నాయి. సీనియారిటీతో సంబంధం లేకుండా ఖర్చుకు వెనకాడని అభ్యర్థులను ఎంపిక చేయాలని భావిస్తున్నాయి. జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరిగే ఏడు మండలాల్లో అభ్యర్థుల వేటలో నేతలు పడ్డారు. మొదటి విడతలో ఏడు జెడ్పీటీసీ స్థానాలకు, 65 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి మొదటి విడతలోనే మూడు ఎస్సీ స్థానాలు జిల్ల జెడ్పీ చైర్మన్ స్థానాన్ని ఎస్సీ జనరల్కు కేటాయించడం.. కోనరావుపేట, వేములవాడరూరల్, ఇల్లంతకుంట మండలాల జెడ్పీటీసీ స్థానాలు ఎస్సీలకు రిజర్వు అయ్యాయి. ఆయా స్థానాల్లో గెలుపొందిన అభ్యర్థులు జెడ్పీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోనున్నారు. ఈ మూడు మండలాలకు మొదటి విడతలోనూ ఎన్నికలు జరుగనున్నాయి. ఆర్థికంగా బలంగా ఉన్న అభ్యర్థులను ఈ మూడు స్థానాల్లో బరిలో దింపాలని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యేల సతీమణులు, మాజీ ఎమ్మెల్యేలు సైతం ఆయా స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ముందే కులసంఘాలకు ఎర యువజన సంఘాలు, కులసంఘాలు, మహిళా సంఘాల ఓట్లకు ముందే వల వేస్తున్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులకు డబ్బులు ఇస్తానంటూ ఓట్లు పొందేందుకు ఎత్తులు వేస్తున్నారు. కోనరావుపేట మండలంలోని ఓ పెద్ద గ్రామంలో ఓ కుల సంఘం నేత సంఘానికి రూ.3.80లక్షలు ఇచ్చేందుకు అంగీకరించి అందరూ తనకు మద్దతు తెలపాలని ఒప్పందం చేసుకున్నారు. సదరు కులసంఘానికి ఇప్పటికే రూ.లక్ష చెల్లించినట్లు సమాచారం. తంగళ్లపల్లి మండలంలోని ఓ గ్రామంలో ఎన్నికల్లో తనకు సహకరించాలని కోరుతూ ఊరిలో ఓ ఆలయ నిర్మాణానికి రూ.2.50లక్షలు, వైకుంఠరథానికి మరో రూ.2.50 లక్షలు చెల్లించినట్లు తెలిసింది. అభివృద్ధికి హామీ.. గ్రామాల్లో ఎక్కువ ఓట్లు ఉన్న కుల సంఘాలను లక్ష్యంగా చేసుకుని మద్దతు కూడగట్టే పనిలో ద్వితీయస్థాయి నేతలు ఉన్నారు. ఎన్నికల్లో కుల సంఘాల మద్దతుతోనే ఓట్లను గంపగుత్తగా సాధించవచ్చని భావిస్తున్నారు. ఒక్కో ఇంటికి తిరిగి ఓట్లను సాధించడం ప్రస్తుతం ప్రతికూలంగా మారడంతో కులసంఘాలతో సమావేశం నిర్వహించి సంఘ భవనాలకు హామీలు ఇస్తూ ఓట్లు సాధించే పనిలో పడ్డారు. స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీల నేతలు పల్లెల్లో పాగా వేస్తున్నారు. మండలం స్థానాలు పోలింగ్ కేంద్రాలు బోయినపల్లి 11 60 చందుర్తి 10 54 రుద్రంగి 5 27 వేములవాడ అర్బన్ 6 36 వేములవాడ రూరల్ 7 40 కోనరావుపేట 12 70 ఇల్లంతకుంట 14 90 -
కొనుగోళ్లకు సిద్ధం కావాలి
● 3 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి అంచనా ● 235 కొనుగోలు కేంద్రాలు ● ఏ గ్రేడ్ వడ్లు క్వింటాలుకు రూ.2389 ● కామన్ రకానికి రూ.2369 ● ధాన్యం కొనుగోళ్లపై అదనపు కలెక్టర్ నగేశ్ సమీక్షసిరిసిల్ల: జిల్లాలో 3 లక్షల టన్నుల ధాన్యం దిగుబడులు వస్తాయని, ఈమేరకు కొనుగోళ్లకు సిద్ధం కావాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ సూచించారు. కలెక్టరేట్లో బుధవారం ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు. అదనపు కలెక్టర్ నగేశ్ మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం సేకరణకు పీఏసీఎస్ ఆధ్వర్యంలో 79, ఐకేపీ ఆధ్వర్యంలో 144, మెప్మా, డీసీఎంఎస్ ద్వారా మరో 12 కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్ వసతి కల్పించాలని, టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లు, తూకం వేసే యంత్రాలు, తేమశాతం చూసే డిజిటల్ కాలిపర్స్ మిషన్లు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. రైతులు తమ ధాన్యాన్ని తాలు, గడ్డి, పొల్లు లేకుండా, తేమ శాతం 17 ఉండేలా చూసుకోవాలన్నారు. ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాలుకు రూ.2389, కామన్ రకానికి రూ.2369 మద్దతు ధర నిర్ణయించిందని వివరించారు. కొనుగోలు కేంద్రాలకు కేటాయించిన రైస్మిల్లులకు మాత్రమే ధాన్యం తరలించాలని, ట్యాబ్ ఎంట్రీలో సర్వే నంబర్, ఎన్ని ఎకరాల్లో సాగుచేశారు, బ్యాంక్ ఖాతా వివరాలు నమోదు చేయాలని సూచించారు. డీఆర్డీవో శేషాద్రి, డీసీవో రామకృష్ణ, డీసీఎస్వో చంద్రప్రకాశ్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రజిత, డీఏవో అఫ్జల్బేగం, డీఎంవో ప్రకాశ్, అదనపు డీఆర్డీవో శ్రీనివాస్ పాల్గొన్నారు. సమాచార హక్కు చట్టం పకడ్బందీగా అమలు చేయాలి సమాచార హక్కు చట్టం పకడ్బందీగా అమలు చేయాలని అదనపు కలెక్టర్ నగేశ్ కోరారు. సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చి 20 ఏళ్లు అయిన సందర్భంగా సమాచార హక్కు చట్టం వారోత్సవాల్లో భాగంగా కలెక్టరేట్లో సదస్సు నిర్వహించారు. సమాచార హక్కు చట్టం కింద ఎవరైనా ప్రభుత్వ కార్యాలయాల సమాచారం, ఉద్యోగుల విధులు, బాధ్యతలు తదితర సమాచారాన్ని తెలుసుకోవచ్చని స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లో సమాధానం ఇవ్వాలని అధికారులకు సూచించారు. సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, డీఆర్డీవో శేషాద్రి, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ న్యాయ విజ్ఞాన సదస్సుకు ఎంపిక
సిరిసిల్లకల్చరల్: ఢిల్లీలో నవంబర్ 8,9 తేదీల్లో జరిగే జాతీయ విజ్ఞాన సదస్సుకు జిల్లా నుంచి ఇద్దరు న్యాయవాదులు ఎంపికయ్యారు. న్యాయ సహాయ డెలివరీ మెకానిజాన్ని బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన ఈ సదస్సుకు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్, ప్యానల్ అడ్వకేట్లు, పారా లీగల్ వాలంటీర్ల నుంచి ఇద్దరి చొప్పున ప్రతినిధులను ఆహ్వానించారు. ఈ మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ సూచన ప్రకారం జిల్లా నుంచి అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్గా పని చేస్తున్న ఇ. జ్యోతి, ప్యానల్ అడ్వకేట్ ఆర్.అరుణను ప్రతిపాదించినట్లు డీఎల్ఎస్ఏ జిల్లా కార్యదర్శి రాధికా జైస్వాల్ తెలిపారు. ఈ మేరకు ఎంపికై న న్యాయవాదులు మంగళవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సదరు న్యాయవాదులను ఆమె అభినందించారు. -
ప్రణాళిక ప్రకారం ఆలయ విస్తరణ పనులు
వేములవాడ: వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని కలెక్టర్ హరిత ఆదేశించారు. మంగళవారం ఆలయ చైర్మన్ చాంబర్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆలయ పనులపై రూపొందించిన నమూనాను ఆర్కిటెక్ట్ సూర్యనారాయణమూర్తి కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆలయ విస్తరణకు సంబంధించి పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పనులు నాణ్యతతో చేపట్టాలని కాంట్రాక్టర్ను సూచించారు. మేడారం సమ్మక్క– సారలమ్మ జాతరకు ముందు రాజన్నను భక్తులు దర్శించుకునే ఆచారం ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈనెలలో శృంగేరి పీఠాధిపతులు రానున్న సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఏమైనా ఇబ్బందులుంటే యంత్రాంగం దృష్టికి తీసుకురావాలన్నారు. అంతకుముందు రాజన్నను కలెక్టర్ దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఈవో రమాదేవి, ఏఈవో శ్రవణ్, అశోక్, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. భీమేశ్వర ఆలయంలో పనులు పరిశీలన భీమేశ్వర ఆలయంలో భక్తుల సౌకర్యార్థం అభిషేకం, అన్నపూజ, కోడె క్యూలైన్లు తదితర ప్రదేశాలను కలెక్టర్ పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆర్అండ్బీ సీఈ రాజేశ్వర్రెడ్డి, ఈఈ నరసింహాచారి, మున్సిపల్ కమిషనర్ అన్వేశ్, తహసీల్దార్ విజయప్రకాశ్రావు, వీటీఏడీఏ సెక్రటరీ అన్సార్ తదితరులు పాల్గొన్నారు. -
రివ్యూ పిటిషన్ వేయాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధ్యాయుల తరఫున నిలబడి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలి. విద్యాహక్కు చట్టం ఏర్పడిన తర్వాత విడుదల చేసిన ఎన్సీటీఈ నోటిఫికేషన్లో స్పష్టంగా టెట్ నోటిఫికేషన్ కంటే ముందు ఉన్న ఉపాధ్యాయులకు టెట్ అవసరం లేదని ఉంది. విద్యాహక్కు చట్టాన్ని సవరిస్తూ ఎన్సీటీఈ నోటిఫికేషన్ ప్రకారం 2010 కంటే ముందు ఉన్న ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలి. – బోయన్నగారి నారాయణ, టీఆర్టీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి -
తీర్పు ఏమొస్తుందో..
సిరిసిల్ల: స్థానిక సంస్థల ఎన్నికలపై గతంలో ఎన్నడూ లేని ఉత్కంఠ కొనసాగుతోంది. ఈసారి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సన్నద్ధమైంది. ఈ మేరకు ‘స్థానిక’ రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. దీన్ని సవాల్ చేస్తూ పలువురు సుప్రీంకోర్టు, హైకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో పిటిషన్ను కొట్టివేయడంతో హైకోర్టు విచారణకు ప్రా ధాన్యత ఏర్పడింది. బుధవారం హైకోర్టులో విచారణ జరుగనుండగా, రాజకీయ నేతల అందరి చూపు కోర్టు వైపే ఉంది. ఎన్నికలు ఇప్పుడు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయా..? వాయిదా పడుతాయా అనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ప్రకటించిన రిజర్వేషన్లకు అనుగుణంగా జిల్లాలోని ఆయా ప్రాంతాల్లోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ అభ్యర్థులు ఎన్నికలకు సిద్ధమయ్యారు. కోర్టు తీర్పు ఎలా ఉంటుందో అనే సందిగ్ధం నెలకొంది. ఎస్సీలకు జెడ్పీ పీఠం జిల్లా వ్యాప్తంగా 12 జెడ్పీటీసీ స్థానాలున్నాయి. జెడ్పీ చైర్మన్ స్థానాన్ని ఎస్సీలకు కేటాయించారు. 12 స్థానాల్లో ఎస్టీలకు 1, ఎస్సీలకు 3, బీసీలకు 5, జనరల్కు 3 కేటాయించారు. ఇందులో రుద్రంగి ఎస్టీ జనరల్, ఇల్లంతకుంట ఎస్సీ మహిళ, కోనరావుపేట ఎస్సీ జనరల్, వేములవాడరూరల్ ఎస్సీ జనరల్, ముస్తాబాద్ బీసీ మహిళ, వేములవాడ అర్బన్ బీసీ మహిళ, బోయినపల్లి బీసీ జనరల్, గంభీరావుపేట బీసీ జనరల్, తంగళ్లపల్లి బీసీ జనరల్, ఎల్లారెడ్డిపేట జనరల్ మహిళ, చందుర్తి జనరల్, వీర్నపల్లి జనరల్కు కేటాయించారు. దీంతో జెడ్పీ చైర్మన్ అయ్యే చాన్స్ కోనరావుపేట, ఇల్లంతకుంట, వేములవాడ రూరల్ స్థానాల్లో ఎన్నికయ్యే ఎస్సీ అభ్యర్థులకు వస్తుంది. ఈ మేరకు ఆయా స్థానాల్లో ముఖ్యనాయకులు పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. మిగతా మండలాల్లో పోటీ చేసే అభ్యర్థులు సైతం జెడ్పీ వైస్ చైర్మన్ స్థానాన్ని దక్కించుకోవాలని ఆశిస్తున్నారు. ఎంపీపీ పీఠాలపై గురి జిల్లాలో ఎంపీటీసీగా విజయం సాధించి ఎంపీపీగా ఎన్నిక కావాలని పలువురు నాయకులు ఆశిస్తున్నారు. జిల్లాలో 12 ఎంపీపీ స్థానాల్లో రుద్రంగి ఎస్టీ జనరల్, ముస్తాబాద్ ఎస్సీ మహిళ, కోనరావుపేట ఎస్సీ జనరల్, వేములవాడ రూరల్ ఎస్సీ జనరల్కు కేటాయించారు. ఇల్లంతకుంట, బోయినపల్లి బీసీ మహిళ, గంభీరావుపేట, వేములవాడ అర్బన్, ఎల్లారెడ్డిపేట మండలాలను బీసీ జనరల్కు కేటాయించారు. వీర్నపల్లి మహిళా జనరల్, చందుర్తి, తంగళ్లపల్లి మండలాలు జనరల్కు కేటాయించారు. 123 ఎంపీటీసీ స్థానాలకు గాను ఎస్టీలకు 7, ఎస్సీలకు 25, బీసీలకు 56, జనరల్కు 35 స్థానాలు కేటాయించారు. ఊరిలో చక్రం తిప్పాలని.. జిల్లా వ్యాప్తంగా 260 గ్రామపంచాయతీలు ఉండగా.. సర్పంచ్ స్థానాలను ఆయా వర్గాలకు రిజర్వేషన్లు ప్రకటించారు. ఎస్టీలకు 30, ఎస్సీ 53, బీసీ 101, జనరల్ 76 స్థానాలను కేటాయించారు. గ్రామస్థాయిలో కీలకమైన సర్పంచ్ స్థానాన్ని దక్కించుకునేందుకు పలువురు యువకులు ముందుకు వస్తున్నారు. జిల్లాలో 2,268 వార్డు సభ్యుల స్థానాలు ఉండగా.. ఎస్టీ మహిళ 108, ఎస్టీ జనరల్ 121, ఎస్సీ మహిళ 182, ఎస్సీ జనరల్ 261 స్థానాలు కేటాయించారు. బీసీ మహిళ 388, బీసీ జనరల్ 520, జనరల్ మహిళ 287, జనరల్గా 401 స్థానాలు కేటాయించారు. ఆయా స్థానాల్లో వార్డు సభ్యులుగా విజయం సాధించి మెజార్టీ వార్డు సభ్యుల మద్దతుతో ఉప సర్పంచ్ స్థానాన్ని దక్కించుకోవాలని పలువురు భావిస్తున్నారు. ఊరూరా విందు రాజకీయాలు జిల్లా వ్యాప్తంగా ‘స్థానిక’ ఎన్నికల చర్చలు జోరుగా సాగుతున్నాయి. కులసంఘాల మద్దతు కూడగడుతున్నారు. ఇప్పటికే ఊరూరా విందు రాజకీయాలు పసందుగా సాగుతున్నాయి. స్థానిక ఎన్నికలపై నేడు హైకోర్టులో విచారణ జరుగనుండగా ఏం తేలుతుందో ఉత్కంఠగా మారింది. -
మంటలు!
మంత్రులు మాటలుసాక్షిప్రతినిధి,కరీంనగర్ ●: ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన మాటలు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్లో మంటలు రేపుతున్నాయి. జాతిని, తనను కించపరిచారంటూ ఎస్సీ వెల్ఫేర్ మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ వీడియో విడుదల చేయడం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. తన జాతిలో పుట్టడం తప్పా? అని ప్రశ్నించారు. 24 గంటల్లో తనకు, తన జాతికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని మంత్రి అడ్లూరి అల్టిమేటం జారీచేయడంతో పాత కరీంనగర్ రాజకీయాలు వేడెక్కాయి. వాస్తవానికి ఆదివారం జూబ్లీహిల్స్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ‘మనకు టైం అంటే తెలుసు.. వాడొక దున్నపోతు వాడికేం తెలుసు’ అంటూ అన్న మాటలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. దీనిని బీఆర్ఎస్ సోషల్ మీడియా విపరీతంగా వైరల్ చేసింది. దీనిపై పొన్నం ప్రభాకర్ ఆఫీసు నుంచి వెంటనే ఖండన కూడా వెలువడింది. మంగళవారం మంత్రి అడ్లూరి నేరుగా వీడియో విడుదల చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా.. ఈ విషయమై మంత్రి అడ్లూరిని ‘సాక్షి’ పలకరించగా.. మంత్రి పొన్నం ప్రభాకర్ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు అసలు ఊహించలేదు. సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత అయినా ఆయన కనీసం ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వకపోవడం నన్ను మరింత బాధించింది. పక్కన మరో మంత్రి వివేక్కూడా ఉన్నారు. ఆయన కూడా మౌనం వహించడం దురదృష్టకరం. ఈ జాతిలో జన్మించడం నా తప్పా? 24 గంటల్లో నాకు, నా జాతికి భేషరతుగా క్షమాపణ చెప్పాలి. నిజాయతీ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తగా ఈ విషయాన్ని మా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్కు ఫిర్యాదు చేశాను. అగ్రనాయకత్వం ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నా. ఉమ్మడి జిల్లా నుంచి శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్కుమార్ మంత్రులుగా ఉన్నారు. ఇంతకాలం శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ వర్గాలమధ్య ఆదిపత్యపోరు నడిచినా.. అది ఏనాడూ బయటపడలేదు. ఇద్దరికీ ఆహ్వానం ఉన్నా.. కలిసి పాల్గొన్న అధికారిక కార్యక్రమాలు తక్కువే. కరీంనగర్ జిల్లా కేంద్రంపై రాజకీయ పట్టుకోసం ఇటు పొన్నం వర్గం, అటు శ్రీధర్బాబు వర్గం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. శాతవాహన వర్సిటీలో జరిగిన ఓ ప్రారంభోత్సవం సందర్భంగా వీసీ వ్యవహరించిన తీరు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ మధ్యదూరం పెంచినట్లు సమాచారం. ఇటీవల ఎస్సీ కోటా నిధులతో నిర్మించ తలపెట్టిన ఓ హాస్టల్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా పొన్నం ప్రభాకర్ను పిలిచేందుకు వీసీ ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి అడ్లూరి వీసీకి ఫోన్చేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎవరి నిధులు? ఎవరు ప్రారంభోత్సవం చేస్తారు? అని గట్టిగా నిలదీశారు. ఈ విషయం పొన్నం వర్గం చెవినపడింది. దీనిని దృష్టిలో పెట్టుకుని తమను చిన్నచూపు చూస్తున్నారని లక్ష్మణ్ వర్గం ఆవేదన వ్యక్తం చేస్తోంది. గతంలో వర్సిటీలో జరిగిన కార్యక్రమాలకు మంత్రి అడ్లూరికి షార్ట్నోటీస్లో ఆహ్వానం పంపడంపైనా లక్ష్మణ్ వర్గం వీసీపై గుర్రుగా ఉంది. ఆ మధ్య జరిగిన ఓ కార్యక్రమంలో వేదికపై ఓ నాయకుడిని పొగిడే క్రమంలో ‘బుల్లెట్ దిగిందా? లేదా’ అంటూ వీసీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. త్వరలో జరగబోయే కాన్వొకేషన్ కార్యక్రమానికి రాజకీయ నాయకులను పిలవవద్దని తొలుత అనుకున్నా.. వీసీ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకునే పరిస్థితులు కనిపించడం లేదని సిబ్బంది అంటున్నారు.మంత్రి పొన్నం వ్యాఖ్యలపై మినిస్టర్ లక్ష్మణ్ ఫైర్ -
గ్రాడ్యుయేషన్ డే
వేములవాడఅర్బన్: వేములవాడ మండలం అగ్రహారం శ్రీరాజరాజేశ్వరస్వామి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2022–2025 విద్యాసంవత్సరంలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు మంగళవారం సర్టిఫికెట్లు ప్రధానం చేసి గ్రాడ్యుయేషన్ డే ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రభాకరచారి మాట్లాడుతూ, విషయ పరిజ్ఞానాన్ని సంపాదించి భవిష్యత్లో ఉన్నత స్థాయిలోకి రావాలన్నారు. విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ రాజగోపాల్ తండ్రి భాగ్యనగర్ ప్రభాకర్ జ్ఞాపకార్థం కళాశాలలో స్మారక ప్రతిభ అవార్డును ప్రారంభించారు. అందులో భాగంగా విద్యార్థిని తిరునహారి సాయి సంహిత ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ విభాగంలో ప్రతిభ కనబరిచినందున రూ.10 వేల చెక్కు బహుమతిగా అందజేశారు. రామసుబ్బరెడ్డి, రమేశ్, మాణిక్యం, రవీందర్, శంకరయ్య, విష్ణుకుమార్, శరణ్య తదితరులు ఉన్నారు. -
వాల్మీకి జీవితం ఆదర్శం
సిరిసిల్లక్రైం: వాల్మీకి మహర్షి జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని ఎస్పీ మహేశ్ బీ గీతే అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వాల్మీకి జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కృషి, నిబద్ధత ఉంటే మనిషి ఋషిగా, మహానుభావుడిగా మారగలడన్న దానికి వాల్మీకి జీవితం నిలువెత్తు నిదర్శనం అన్నారు. ఏఎస్పీ చంద్రయ్య, సీఐలు రవి, నాగేశ్వరరావు, ఆర్ఐ రమేశ్, ఏవో పద్మ, సిబ్బంది పాల్గొన్నారు.రాజన్న సేవలో జిల్లా జడ్జివేములవాడ: జిల్లా జడ్జి టి.నీరజ మంగళవారం రాజన్నను దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న జడ్జికి వేములవాడ సబ్ జడ్జి అజయ్కుమార్ జాదవ్, జూనియర్ సివిల్ జడ్జి ప్రవీమ్కుమార్ ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.డీపీసీ ద్వారా ధరలు నిర్ణయించాలిసిరిసిల్ల /సిరిసిల్లఅర్బన్: జిల్లాలోని గురుకుల విద్యాలయాలు, హాస్టళ్లకు కూరగాయలు, పండ్లు, గుడ్లు, చికెన్, మటన్ సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లకు చెల్లించే ధరలను జిల్లా పర్చేజ్ కమిటీ (డీపీసీ) ఏర్పాటు చేసి నిర్ణయించాలని గురుకుల కాంట్రాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులు అ దనపు కలెక్టర్ గడ్డం నగేశ్కు వినతిపత్రం అందించారు. పెండింగ్లో ఉన్న ఆరునెలల బిల్లులు ఇప్పించాలన్నారు. అధ్యక్షుడు యాదగిరి, ప్రతినిధులు జేఎస్ రావు, బాల్రెడ్డి, మల్లేశ్, మహేశ్, రాజశేఖర్ తదితరులు ఉన్నారు.జిల్లాను వీడని ముసురుసిరిసిల్ల: జిల్లాలో సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకు వర్షం కురిసింది. కోనరావుపేటలో అత్యధికంగా 30.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. రుద్రంగి 18.2, చందుర్తి 10.1, వేములవాడరూరల్ 10.5, బోయినపల్లి 2.0, వేములవాడ 1.7, సిరిసిల్ల 0.3, వీర్నపల్లి 21.7, ఎల్లారెడ్డిపేట 15.1, గంభీరావుపేట 13.6, ముస్తాబాద్ 1.7, ఇల్లంతకుంటలో 0.2 మి.మీ వర్షం కురిసింది.అంకితభావంతో విధులు నిర్వర్తించాలిచందుర్తి(వేములవాడ): వైద్య సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వర్తించి గుర్తింపు తెచ్చుకోవాలని డీఎంహెచ్వో ఎస్ రజిత కోరారు. మంగళవారం చందుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది హాజరు పట్టిక, రికార్డులు పరిశీలించారు. అనంతరం ఆశ డే సంసదర్భంగా ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలతో మాట్లాడారు. రోగులతో మర్యాదగా వ్యవహరించి వైద్య సేవలు అందించాలన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్.అంజలినా ఆల్ఫ్రెడా, వైద్యులు సంపత్కుమార్, రామకృష్ణ, పీహెచ్సీ వైద్యాధికారి వేణుగోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.మద్యం దుకాణాలకు 13 దరఖాస్తులుసిరిసిల్లక్రైం: జిల్లాలోని 48 మద్యం దుకాణాలకు ఇప్పటివరకు 78 దరఖాస్తులు వచ్చాయని ఎకై ్సజ్ శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం 13 దరఖాస్తులు స్వీకరించినట్లు వివరించారు. దరఖాస్తులకు గడువు 11 రోజులు ఉందని పేర్కొన్నారు. -
పొన్నరథంపై గోవిందుడు
● తిరువీధుల్లో తిలకించిన భక్తజనం ● మిన్నంటిన గోవింద నామస్మరణం సిరిసిల్లటౌన్: అశేష భక్తుల గోవిందనామస్మరణతో శ్రీశాల తిరువీధులు పులకించాయి. ఎనిమిది రోజులుగా సాగుతున్న శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి పొన్నరథోత్సవం జరిగింది. తిరుమలేశుని అనుబంధ ఆలయమైన సిరిసిల్ల తిరువీధుల్లో గోవిందుని రూపంలో శ్రీవారు పొన్న రథంపై విహరించారు. ఈసందర్బంగా సాయంత్రం 6గంటల నుంచే పొన్నవాహన ఉత్సవాలు నిర్వహించారు. కళాకారుల కోలాటాలు, భజన సంకీర్తనలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. రాత్రి 9 గంటలకు ప్రారంభమైన పొన్నరథాన్ని లాగడానికి భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. టీపీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, ఈవో మారుతిరావు, ఏఈవోలు కూనబోయిన సత్యం, పీసరి రవీందర్, ఆలయ కమిటీ మాజీ చైర్మన్లు ఉప్పుల విఠల్రెడ్డి, చేపూరి నాగరాజు, తీగల శేఖర్గౌడ్, అర్చకస్వాములు కృష్ణమాచారి తదితరులు పాల్గొన్నారు. కాళింగమర్దనంపై దేవదేవుడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం 11 గంటలకు కాలింగమర్ధన సేవ నిర్వహించారు. గోవిందా నామస్మరణతో మాడవీధులు పులకించిపోయాయి. కాళింగమర్దనంపై విచ్చేసిన దేవదేవుడికి భక్తులు మంగళహారతులతో నీరాజనం పలికారు. పొన్నసేవపై విహరిస్తున్న శ్రీవారిని దర్శించుకుంటున్న భక్తులుకాళింగమర్దనంపై విహరిస్తున్న శ్రీవారు -
ధాన్యం దళారుల పాలు
● పల్లెల్లోకి ప్రైవేట్ వ్యాపారులు ● ప్రారంభంకాని కొనుగోలు కేంద్రాలు ● మద్దతు ధర కోల్పోతున్న రైతులుఇల్లంతకుంట(మానకొండూర్): ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో ఇప్పటికే చేతికొచ్చిన ధాన్యాన్ని రైతులు ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. వరుసగా కురుస్తున్న వర్షాలకు ధాన్యం తడిస్తే రంగుమారుతుందనే భయంతో అన్నదాతలు సైతం వ్యాపారులు ఎంత ధర చెబితే అంతకే అమ్మేస్తున్నారు. ఇల్లంతకుంట మండలంలో ఈ ఖరీఫ్ సీజన్లో దాదాపు 25వేల ఎకరాల వరకు వరి సాగుచేశారు. మొదట సాగుచేసిన వరి పంటలు కోతకొచ్చాయి. పెద్దలింగాపూర్ ప్రాంతంలో చాలా మటుకు పంట కోతకొచ్చింది. గత వారం రోజులుగా పంటను కోస్తున్న రైతులు వర్షం కురుస్తుండడంతో భయాందోళన చెందుతున్నారు. ఒక్క పెద్దలింగాపూర్ గ్రామంలోనే ప్రైవేట్ వ్యాపారులు ఇప్పటి వరకు ఐదు లారీల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిసింది. పచ్చి వడ్లను క్వింటాల్కు రూ.1700 దళారులు కొనుగోలు చేస్తున్నారు. బస్తాకు రెండు కిలోల తరుగు తీస్తున్నారని రైతులు తెలిపారు. గత రబీ సీజన్లో ఇల్లంతకుంట మండలంలో 28 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఒక్క కేంద్రాన్ని కూడా ప్రారంభించలేదు. దీంతో చేసేదేమి లేక రైతులు ప్రైవేట్ వ్యాపారులకే విక్రయిస్తున్నారు. -
మిల్లర్లు నిబంధనలు పాటించాలి
● కలెక్టర్ హరితసిరిసిల్ల: జిల్లాలోని రైస్మిల్లర్లు నిబంధనలు పాటించాలని కలెక్టర్ ఎం.హరిత కోరారు. కలెక్టరేట్లో సోమవారం జిల్లాలో వరి ధాన్యం సేకరణ, బ్యాంక్ గ్యారెంటీ, సీఎమ్మార్ సరఫరాపై రైస్మిల్లర్లతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ రైస్మిల్లర్లు సీఎమ్మార్ సరఫరా చేయాలని, గత ఖరీఫ్లో జిల్లాలో 2.15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. ఈనెల మూడో వారంలో జిల్లాలో వరికోతలు మొదలు కానున్నాయని, ఈ సీజన్లో దాదాపు 2.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రానుందని అంచనా ఉన్నట్లు తెలిపారు. నిబంధనల ప్రకారం రైస్మిల్లర్లు బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పలువురు రైస్మిల్లర్లు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఎఫ్సీఐకి బియ్యం ఇచ్చేందుకు బెడ్స్ ఇప్పించాలని విన్నవించగా.. నిబంధవల ప్రకారం మిల్లర్లకు సహకరిస్తామని కలెక్టర్ తెలిపారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, జిల్లా పౌరసరఫరాల అధికారి చంద్రప్రకాశ్, డీఎం రజిత, జిల్లా రైస్మిల్లర్ల సంఘం ప్రతినిధులు చేపూరి నాగరాజు, పబ్బ నాగరాజు, గరిపెల్లి ప్రభాకర్ పాల్గొన్నారు. గ్రీన్ఫీల్డ్ కారిడార్ అభివృద్ధిపై కాన్ఫరెన్స్ గ్రీన్ఫీల్డ్ నాగ్పూర్–హైదరాబాద్ హైస్పీడ్ కారిడార్ అభివృద్ధిపై రోడ్డు భవనాల శాఖ చీఫ్ సెక్రటరీ వికాస్రాజ్ సోమవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు డీపీఆర్కు సహకరించాలని కోరారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ ఎం.హరిత, కలెక్టరేట్ పర్యవేక్షకులు శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు. -
నేతకార్మికులకు యారన్ సబ్సిడీ ఇవ్వండి
సిరిసిల్లటౌన్: ఇందిరా మహిళాశక్తి చీరలకు సంబంధించిన పవర్లూమ్స్, అనుబంధ రంగాల కార్మికులకు 10 శాతం యారన్ సబ్సిడీ అందించాలని పవర్లూమ్స్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మూశం రమేశ్ కోరారు. సిరిసిల్లలో సోమవారం పర్యటించిన చేనేత, జౌళిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్కు వినతిపత్రం అందించి మాట్లాడారు. మొదటి విడత ఆర్డర్ పూర్తికావస్తున్నందున కార్మికుల ఉపాధికి ఇబ్బంది కలగకుండా రెండో విడత ఆర్డర్ను అందించాలని కోరారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ, పట్టణ అధ్యక్షులు నక్క దేవదాస్, అక్తర్ అన్సారి పాల్గొన్నారు. -
ఇలాగైతే ఆడేదెలా ?
● ఏళ్లుగా కొనసాగుతున్న మినీస్టేడియం పనులు ● త్వరగా పూర్తిచేయాలంటున్న క్రీడాకారులువేములవాడఅర్బన్: గ్రామీణ ప్రాంతంలోని క్రీడాకా రుల్లో నైపుణ్యం పెంపు.. వారి టాలెంట్ను గుర్తించేందుకు చేపట్టిన మినీ స్టేడియం పనులు ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఆటలు ఆడేందుకు కనీ స సౌకర్యాలు లేక క్రీడాకారులు ఇబ్బంది పడుతున్నారు. వేములవాడలో 2014లో ప్రారంభించిన మినీస్టేడియం పనులు ఇంకా పూర్తికాలేదు. ఫలితంగా క్రీడాకారులకు మౌలిక వసతులు దరిచేరడం లేదు. రూ.2.10కోట్లతో 2014లో.. వేములవాడ మున్సిపల్ పరిధి నాంపల్లి శివారులో 5 ఎకరాల విస్తీర్ణంలో 13 జూలై 2014న అప్పటి ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు, అప్పటి స్పీకర్ మధుసూదనాచారి చేతుల మీదుగా రూ.2.10కో ట్లతో మినీస్టేడియం పనులు ప్రారంభించారు. సగం పనులు చేసిన కాంట్రాక్టర్ తర్వాత పట్టించుకోలేదు. రెండేళ్ల క్రితం మళ్లీ రూ.5కోట్లు మంజూరు కావడంతో మళ్లీ కొంత మేరకు పనులు చేసి నిలిపివేశారు. ఇటీవల మళ్లీ పనులు ప్రారంభించారు. చేయాల్సిన పనులు ఇవే.. మినీస్టేడియంలో క్రీడాకారుల కోసం ఆట స్థలం, ఆటలపోటీలను చూసేందుకు హాల్, ఇండోర్ స్టేడియం, సిబ్బంది కార్యాలయాలు, క్రీడాకారులకు స్నాన గదులు నిర్మించాల్సి ఉంది. -
గ్రీవెన్స్ డేకు 18 ఫిర్యాదులు
సిరిసిల్ల క్రైం: బాధితులకు భరోసాగా ఉండేందుకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతీ సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. 18 ఫిర్యాదులు స్వీకరించినట్లు వివరించారు. ఫిర్యాదులను పరిష్కరించాలని అధికారులకు ఫోన్చేసి ఆదేశించారు.న్యాయసేవల క్లినిక్ ప్రారంభంసిరిసిల్లకల్చరల్: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రాజీవ్నగర్ బస్తీ ఆస్పత్రిలో న్యాయ సేవల క్లినిక్ను సంస్థ జిల్లా కార్యదర్శి రాధికా జైస్వాల్ సోమవారం ప్రారంభించారు. డ్రగ్ అవేర్నెస్, వెల్నెస్, నేవిగేషన్ ఫర్ డ్రగ్ ఫ్రీ ఇండియా(డాన్)లో భాగంగా మత్తు పదార్థాలకు బానిసలైన వారిని గుర్తించి స్వస్థత చేకూర్చేందుకు ఈ కేంద్రం పనిచేస్తుందని తెలిపారు. లోక్ అదాలత్ సభ్యుడు చింతోజు భాస్కర్, మా నసిక వైద్య నిపుణుడు ప్రవీణ్, డాక్టర్ మణివర్మ, నర్సింగ్ ఆఫీసర్ స్వాతి పాల్గొన్నారు.రోడ్డు కబ్జాను అడ్డుకోండి సిరిసిల్లటౌన్: రోడ్డు కబ్జా చేసి నిర్మిస్తున్న భవనం పనులు అడ్డుకోవాలని ఏఐఎఫ్టీయూ న్యూ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సోమిశెట్టి దశరథం కోరారు. మున్సిపల్ ఎదుట సోమవారం నిరసన తెలిసిన సందర్భంగా మాట్లాడారు. విద్యానగర్ నుంచి తాడూరు వెళ్లే దారిలో సర్వేనంబర్ 526లో రోడ్డును ఆక్రమించి భవనం నిర్మిస్తున్నారన్నారు. వెంటనే ఆ నిర్మాణాన్ని అడ్డుకోవాలని కోరారు. కొత్తచెరువు నాలాలు, శాంతినగర్ రోడ్ డ్యామ్ ఆక్రమణలపై విచారణ చేపట్టాలని కోరారు. కొంపల్లి విజయ్కుమార్, తడుక రాములు, గుజ్జ దేవదాస్, సత్తయ్య, శ్రీధర్ పాల్గొన్నారు.తెల్లవార్లూ కురిసిన వర్షంసిరిసిల్ల: ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు వర్షం కురిసింది. కోనరావుపేటలో అత్యధికంగా 56.0 మిల్లీమీటర్లు కురిసింది. సిరిసిల్లలో 50.7, రుద్రంగిలో 28.7, చందుర్తిలో 24.4, బోయినపల్లిలో 17.8, వేములవాడలో 47.6, వీర్నపల్లిలో 27.6, వేములవాడ రూరల్లో 19.7, ఎల్లారెడ్డిపేటలో 42.0, గంభీరావుపేటలో 41.5, ముస్తాబాద్లో 43.4, తంగళ్లపల్లిలో 25.1, ఇల్లంతకుంటలో 10.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలో 33.5 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది.కష్టపడిన వారికి గుర్తింపుఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పార్టీలో దశాబ్దకాలంగా కష్టపడి పనిచేస్తున్న వారికి గుర్తింపు ఉంటుందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి కోరారు. ఎల్లారెడ్డిపేటలోని పార్టీ ఆఫీ స్లో సోమవారం ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల కార్యకర్తలతో సమావేశమయ్యారు. రెండు మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అన్ని స్థానాలు కైవసం చేసుకోవాలన్నారు. రాచర్లగొల్లపల్లికి చెందిన 50 మంది కాంగ్రెస్లో చేరారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, ఏఎంసీ చైర్మన్లు సాబేరా బేగం, రాములునాయక్, వైస్చైర్మన్లు గుండాడి రాంరెడ్డి, లక్ష్మణ్, పార్టీ మండలాధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, భూత శ్రీనివాస్ పాల్గొన్నారు.జిల్లా సరిహద్దుల్లో తనిఖీవేములవాడరూరల్: రాజన్నసిరిసిల్ల–జగిత్యాల జిల్లా సరిహద్దు మండలంలోని ఫాజుల్నగర్ వద్ద పోలీసులు సోమవారం రాత్రి తనిఖీలు చేపట్టారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో వాహనాలను ఆపి తనిఖీ చేశారు. రూ.50వేలకు మించి నగదు తరలిస్తే సీజ్ చేస్తామని ఎస్సై వెంకట్రాజం తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి, ధ్రువీకరణ పత్రాలు సరిగా లేని వారికి జరిమానా విధించారు.అన్నపూర్ణలో 3.38 టీఎంసీలుఇల్లంతకుంట(మానకొండూర్): అనంతగిరి అన్నపూర్ణ జలాశయం సామర్థ్యం 3.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.38 టీఎంసీలకు చేరింది. ఎత్తిపోతలు నిలిపివేసినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. -
సమస్యలు పరిష్కరించండి
● ఏడాది పొడవునా పని ఉండేలా చూడండి.. ● వస్త్రోత్పత్తిదారుల ‘కరెంట్’ సమస్యను పరిష్కరించండి ● మంత్రి సీతక్కకు వెల్లువలా వినతులుసిరిసిల్ల: నేతన్నలకు ఏడాది పొడవునా చేతినిండా పని ఉండేలా చూడాలని కొందరు.. ప్రభుత్వ ఆర్డర్లతోనే మేలైనా కూలీ వస్తోందని.. మరిన్ని ఆర్డర్లు ఇవ్వాలని మరికొందరు.. వస్త్రోత్పదారులపై విధిస్తున్న విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలని మరికొందరు.. ఇలా మంత్రి సీతక్కకు వినతలు వెల్లువలా వచ్చాయి. సిరిసిల్లలో తొలిసారి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశుసంక్షేమశాఖ మంత్రి సీతక్క సోమవారం పర్యటించారు. వెంకట్రావునగర్లోని పవర్లూమ్ కార్ఖానా నుంచి, ఇందిరానగర్లోని చీరల బట్టను సేకరించే గోదాం, ప్రాసెసింగ్ యూనిట్ వరకు వస్త్రోత్పత్తిలోని వివిధ దశలను పరిశీలించారు. నేతకార్మికులు, వైపని కార్మికులు, ఆసాములు, వస్త్రోత్పత్తిదారలతో మాట్లాడారు. మంత్రి హోదాలో తొలిసారి జిల్లాకు వచ్చిన సీతక్కకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చేనేత, జౌళిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కె.కె.మహేందర్రెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ వెల్ముల స్వరూపారెడ్డి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ప్రకాశ్, సంగీతం శ్రీనివాస్, ఆకునూరి బాలరాజు, సూర దేవరాజు, గడ్డం నర్సయ్య, వైద్య శివప్రసాద్, గౌతమ్, రెడ్డినాయక్, ఆడెపు చంద్రకళ, మడుపు శ్రీదేవి, కల్లూరి చందన, గోనె శరణ్య జౌళిశాఖ జేడీ ఎన్.వెంకటేశ్వర్రావు, వస్త్రోత్పత్తిదారులు గోవిందు రవి, ఆడెపు భాస్కర్, వెల్దండి దేవదాస్, అన్నల్దాస్ అనిల్కుమార్, తాటిపాముల దామోదర్ తదితరులు పాల్గొన్నారు. నేతకళాకారుడికి సన్మానం చేనేత శిల్పి నల్ల పరంధాములు తనయుడు నల్ల శ్రావణ్ను మంత్రి సీతక్క శాలువాతో సన్మానించారు. సీఎం రేవంత్రెడ్డి ముఖచిత్రాన్ని అగ్గిపెట్టెలో పట్టే శాలువాపై నేసారు. కరెంట్ సమస్యను పరిష్కరించండి చిన్నతరహా పరిశ్రమల పేరిట బ్యాక్ బిల్లింగ్ అని ‘సెస్’ అధికారులు కోర్టు ఆదేశాలను సాకుగా చూపి రూ.కోట్ల కరెంట్ బిల్లులు వేశారని మంత్రికి వస్త్రోత్పత్తిదారులు వివరించారు. బీఆర్ఎస్కు చెందిన ‘సెస్’ చైర్మన్ తమపై కక్ష గట్టి వేధిస్తున్నాడని, బ్యాక్ బిల్లింగ్ సమస్యను పరిష్కరించాలని విన్నవించారు. పట్టణంలోని బీ.వై.నగర్లో అందరికీ అందుబాటులో ఉన్న చేనేత, జౌళిశాఖ ఆఫీస్ను రగుడు శివారులోని కలెక్టరేట్కు మార్చారని, దాన్ని గతంలో కొనసాగించిన భవనంలోకి తరలించాలని పాలిస్టర్ అసోసియేషన్ ప్రతినిధులు వినతిపత్రం అందించారు. సిరిసిల్ల మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖలో పనిచేసే ఒప్పంద ఉద్యోగులను అకారణంగా విధుల నుంచి తప్పించారని, తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని కోరుతూ ఆయా సంస్థల్లో పనిచేసిన మాజీ ఉద్యోగులు మంత్రికి వినతిపత్రం అందించారు. -
పారదర్శకం
‘ఉపాధి’ ● జియో ఫెన్సింగ్తో కూలీల హాజరు ● పనుల గుర్తింపు సైతం ● ఉపాధిహామీ జాబ్కార్డులు 98వేలు ● గుర్తించిన పనులు 23వేలుముస్తాబాద్(సిరిసిల్ల): జాతీయ ఉపాధిహమీ పనుల్లో పారదర్శకతకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు జియో ట్యాగింగ్ ద్వారా కూలీల హాజరు నమోదు చేసిన అధికారులు ఇక నుంచి జియో ఫెన్సింగ్ ద్వారా పనులు, హాజరును నమోదు చేయనున్నారు. పనికి ముందు, తరువాత చేసిన పనులే కాదు.. కూలీల హాజరు నమోదును మూడుసార్లు చేసేందుకు జియో ఫెన్సింగ్ను ఉపయోగిస్తారు. ఈమేరకు టెక్నికల్ అసిస్టెంట్లకు ప్రభుత్వం ఇప్పటికే శిక్షణను ఇచ్చింది. జియో ఫెన్సింగ్ విధానంపై పక్షం రోజుల క్రితమే శిక్షణ తరగతులు నిర్వహించారు. అక్టోబర్ నుంచి చేపట్టబోయే కొత్త పనులను జియో ఫెన్సింగ్ చేయనున్నారు. జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరం రూ.21.78 కోట్ల విలువైన ఉపాధిహామీ పనులు చేపడుతున్నారు. ఏమిటీ జియో ఫెన్సింగ్ ఉపాధిహామీ గ్రామసభల్లో తీర్మానం చేసి గుర్తించిన పనులకు అధికారులు, సిబ్బంది ప్రతిపాదనలు చేస్తారు. పనుల మంజూరుకు ముందే టెక్నికల్ అసిస్టెంట్లు గుర్తించిన పనులకు జియోఫెన్సింగ్ చేస్తారు. ప్రత్యేక యాప్ ద్వారా పని ప్రదేశంలో జియోఫెన్సింగ్కు సరిహద్దులు నిర్ణయిస్తారు. గుర్తించిన పనిని నాలుగు వైపుల నుంచి ఆన్లైన్లో నమోదు చేస్తారు. పనికి ముందు.. పనికి మధ్యలో.. పని తరువాత.. జియో ఫెన్సింగ్ చేసి కూలీల నమోదు చేసి అప్లోడ్ చేస్తారు. గతంలో కూలీలు పనులు మొదలుపెట్టిన చోట నమోదైన ఫొటోతోపాటు గుర్తించిన పనిలో సరిహద్దులు దాటకుండా పని చేయాలి. ఫీల్డ్ అసిస్టెంట్లు, టీఏలు పనిప్రదేశంలో జియో ఫెన్సింగ్ ద్వారా గుర్తించి కూలీలకు పనులు అప్పగిస్తారు. దాని ప్రకారమే పనులు చేస్తారు. కూలీల హాజరు నమోదులో సులభతరం చేయడంతోపాటు పారదర్శకంగా పనులు జరిగేలా జియోఫెన్సింగ్ విధానం ఉపయోగపడుతుంది. కూలీలు పనులు చేసుకుంటూ కిలోమీటర్ల పరిధిలో నడిచి వెళ్తారు. పనులు పూర్తయిన తర్వాత మొదట ఫొటో దిగిన పని ప్రదేశానికి సదరు కూలీ రావాల్సి ఉంటుంది. దీంతో ఫీల్డ్ అసిస్టెంట్లు, కూలీలు ఇబ్బందులు పడేవారు. జియో ఫెన్సింగ్తో పని ప్రదేశంలో ఎక్కడ ఉన్న కూలీల హాజరును ఆన్లైన్ చేయవచ్చు. ఒకసారి ఒకే పని జియోఫెన్సింగ్ ద్వారా ఒకసారి చేపట్టిన పనిని మరోసారి చేపట్టరాదు. ఇప్పటి వరకు ఇలా అనేక చెరువులు, కుంటలు, కెనాల్స్ను పదుల సార్లు చేశారు. ఒకసారి జియోఫెన్సింగ్లో నమోదైన పనిని తిరిగి చేపట్టేందుకు వీలుకాదు. జియోఫెన్సింగ్ ద్వారా గుర్తించిన పనిప్రదేశంలో నాలుగు వైపులా నుంచి ఎక్కడి నుంచైన కూలీ హాజరును నమోదు చేయవచ్చు. జియో ట్యాగింగ్ ద్వారా గతంలో ఒక మూలనే కూలీ హాజరును తీసుకునేవారు. అయితే సెల్ఫోన్ నెట్వర్క్ లేనిచోట సాంకేతిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకరోజు మొబైల్ పనిచేయకుంటే ఆరోజు హాజరు నమోదుకాదు. దీని ద్వారా కూలీలు నష్టపోయే ప్రమాదం ఉంది.ఉపాధిహామీ పనుల్లో కూలీలుజాబ్కార్డులు : 98వేలు యాక్టివ్ జాబ్కార్డులు : 61వేలు గుర్తించిన కూలీలు : 2 లక్షలు యాక్టివ్ వర్కర్లు : 93వేలు గుర్తించిన పనులు : 23వేలు కేటాయించిన బడ్జెట్ : రూ.21.78 కోట్లు -
నేడు సిరిసిల్లకు మంత్రి సీతక్క
సిరిసిల్ల: పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సోమవారం జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. నేతకార్మికులు నేసిన ఇందిరా మహిళాశక్తి చీరలను పరిశీలించనున్నారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి పాల్గొంటారు. మంత్రి పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పార్టీ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్ తెలిపారు.ప్రజావాణి రద్దుసిరిసిల్ల: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే ప్రజావాణిని రద్దు చేసినట్లు కలెక్టర్ ఎం.హరిత ఆది వారం ప్రకటనలో తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ప్రజావాణిని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఉండబోదని కలెక్టర్ స్పష్టం చేశారు.రాజన్న సేవలో ఎస్పీవేములవాడ: రాజన్నను ఎస్పీ మహేశ్ బీ గీతే ఆదివారం రాత్రి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం అవకాశం కల్పించారు. అనంతరం అర్చకులు స్వామి వారి ప్రసాదాలు అందించారు.ఘనంగా కాకా జయంతిసిరిసిల్ల: బడుగు, బలహీనవర్గాల సంక్షేమం కోసం వెంకటస్వామి(కాకా) జీవితాంతం పోరాడారని మాలమహానాడు రాష్ట్ర నాయకుడు రాగుల రాములు పేర్కొన్నారు. సిరిసిల్లలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. మాజీ కౌన్సిలర్ రాగుల జగన్, బుచ్చిబాబు, రాకేశ్, పద్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.హిందువుల ఐక్యతకు పంచ పరివర్తన్ముస్తాబాద్(సిరిసిల్ల): పంచ పరివర్తన్ ద్వారా హిందువుల ఐక్యతకు ఆర్ఎస్ఎస్ కృషి చేస్తోందని జిల్లా సంచాలకుడు నిరంజనాచారి అన్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ముస్తాబాద్లో ఆదివారం పథ సంచలన్ నిర్వహించారు. జెడ్పీ స్కూల్ నుంచి పురవీధుల్లో నాలుగు మండలాల కార్యకర్తలు పథ సంచలన్ నిర్వహించారు. అనంతరం నిరంజనాచారి మాట్లాడుతూ 1925లో ప్రారంభమైన ఆర్ఎస్ఎస్ దేశభక్తి పూరిత, హిందుత్వ ఆధార సంస్థలతో ప్రపంచంలోని అనేక దేశాలలో పనిచేస్తుందన్నారు. ఖండ కార్యవాహ కరుణాకర్, జిల్లా సహ కార్యవాహ వుచ్చిడి పద్మారెడ్డి, మాజీ జెడ్పీటీసీ మట్ట వెంకటేశ్వర్రెడ్డి, సంతోష్రెడ్డి, సత్తయ్య, రాంగోపాల్, రమేశ్రెడ్డి, రమేశ్, వొరగంటి తిరుపతి, దేవేందర్, వెంకట్రెడ్డి, రాంరెడ్డి పాల్గొన్నారు.మునీరుద్దీన్కు పురస్కారంఇల్లంతకుంట(మానకొండూర్): అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఇల్లంతకుంటకు చెందిన ఎండీ మునీరుద్దీన్ జాతీయ ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్నారు. గురు స్టూడెంట్స్ పేరెంట్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం కరీంనగర్లో అందజేశారు. -
సంస్కృతి, సంప్రదాయాలు కాపాడుదాం
● టీడీఎఫ్ అమెరికా అధ్యక్షుడు శ్రీనివాస్ ● అమెరికాలో బతుకమ్మ సంబరాలుముస్తాబాద్(సిరిసిల్ల): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ భవిష్యత్ తరా లకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అమెరికా అధ్యక్షుడు శ్రీనివాస్ మణికొండ అన్నారు. టీడీఎఫ్ అమెరికా శాఖ ఆధ్వర్యంలో కాలిఫోర్నియాలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. మహిళలు తెలంగాణ సంప్రదాయ వస్త్రాలు ధరించి, తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి ఆడిపాడారు. అమెరికా టీడీఎఫ్ అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ గత ఇరవై ఐదేళ్లుగా టీడీఎఫ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. టీడీఎఫ్ ఇండియా అధ్యక్షుడు మట్ట రాజేశ్వర్రెడ్డి, రాజారెడ్డి, నిర్వాహకులు కీర్తి, సరిత, భార్గవి, శ్వేత, దివ్య, పల్లవి, స్రవంతి, అర్పిత తదితరులు పాల్గొన్నారు. -
పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలి
● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య కోరారు. మండల కేంద్రంలోని స్టార్ ఫంక్షన్హాల్లో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల పలు సర్వేసంస్థలు, పార్టీ సర్వేల ప్రకారం 95 శాతానికి పైగా సీట్లు బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పినట్లు గుర్తు చేశారు. టికెట్లు దక్కని వారు నిరాశ పడొద్దని కోరారు. పార్టీ అందరికీ అవకాశాలు ఇస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ బాకీకార్డులపై గ్రామాల్లో అవగాహన కల్పించాలని కోరారు. ఎల్లారెడ్డిపేట జెడ్పీటీసీ స్థానానికి చీటి రజిత–లక్ష్మణ్రావు, గుండారపు లహరి–కృష్ణారెడ్డి, పాశం సరోజన–దేవరెడ్డి, గుల్లపల్లి పద్మ–నర్సింహారెడ్డి, ఇల్లందుల గీతాంజలి–శ్రీనివాస్రెడ్డి ఆశిస్తున్నట్లు గుర్తించామన్నారు. పోటీలో ఇంకెవరైనా ఉంటే తమకు తెలపాలని కోరారు. 13 ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థులు తమ పేర్లను ఇచ్చారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వరస కృష్ణహరి, సింగిల్విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ పిల్లి రేణుక, నాయకులు అందె సుభాష్, ఎడ్ల సందీప్ పాల్గొన్నారు. -
కుమ్మరించిన వాన
సిరిసిల్ల: జిల్లాలో ఆదివారం అనూహ్యంగా వర్షం కురిసింది. పెద్దూరు వద్ద అత్యధికంగా 64.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కోనరావుపేట మండలం మర్తనపేట వద్ద 60.3 మిల్లీమీటర్లు, వేములవాడ శివారులోని నాంపల్లి వద్ద 39.0, గంభీరావుపేటలో 34.0, సిరిసిల్లలో 29.3, ముస్తాబాద్ మండలం నామాపూర్లో 26.3, ఇల్లంతకుంట మండలం కందికట్కూర్లో 24.5, ఎల్లారెడ్డిపేటలో 21.3, వేములవాడరూరల్ మండలం మల్లారంలో 16.3, తంగళ్లపల్లి మండలం నేరెళ్లలో 11.0, వీర్నపల్లి మండలం వన్పల్లిలో 10.5, కోనరావుపేట మండలం నిజా మాబాద్లో 9.8, వేములవాడ మండలం వట్టెంలలో 9.3, బోయినపల్లిలో 5.8, రుద్రంగిలో 2.0, చందుర్తి మండలం మరిగడ్డలో 0.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వేములవాడ: పట్టణంలో భారీ వర్షం కురవడంతో రాజన్న ఆలయం ఎదుట రోడ్డుపై వరద ప్రవహించింది. వర్షంలోనే తడుస్తూ భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ముస్తాబాద్: ముస్తాబాద్, గూడెం, పోతుగల్ గ్రామాల్లో కోతలకు వచ్చిన వరిపంట నేలవాలింది. ఈదురుగాలులతో వర్షం పడడంతో వరిపంట దెబ్బతిందని రైతు తాళ్ల చంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వీర్నపల్లి/కోనరావుపేట: మండలంలోని వాగులు, వంకలు పొంగిపొర్లాయి. కోనరావుపేట మండలంలోని అన్ని గ్రామాల్లో కలిపి సుమారు 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): నారాయణపూర్ శివారులోని దుర్గమ్మ ఆలయం వద్ద వర్షానికి చెట్టు నెలకూలింది. రోడ్డుపై పడడంతో నారాయణపూర్ నుంచి రాగట్లపల్లికి రాకపోకలు నిలిచిపోయాయి. -
అభ్యర్థుల గెలుపే లక్ష్యం
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోనరావుపేట(వేములవాడ): స్థానికసంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. కోనరావుపేటలోని ఆర్యవైశ్య కమ్యూనిటీహాల్లో ఆది వారం నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడారు. కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి బలమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి నిధులు ఖర్చు చేస్తోందన్నారు. ప్రతీ కార్యకర్త ఒక సైనికుడుగా పనిచేసి పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు. ప్రతిపక్షాలు చేస్తున్న రాద్దాంతం, వారి దిగజారుడు మాటలు పట్టించుకోకుండా ముందుకుపోవాలన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి న్యాయం చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిక మామిడిపల్లి మాజీ సర్పంచ్ కొక్కుల నర్సయ్య–భారత, విశ్వబ్రాహ్మణ సంఘం మండలాధ్యక్షుడు సంకోజి సత్తయ్య, శివంగాలపల్లి మాజీ సర్పంచ్ శివంగాల సురేశ్తోపాటు సుమారు 50 మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, వైస్చైర్మన్ ప్రభాకర్, సింగిల్విండో చైర్మన్ బండ నర్సయ్య, మండలాధ్యక్షుడు ఫిరోజ్ పాషా, మాజీ జెడ్పీటీసీ గొట్టె రుక్మిణి, యూత్ అధ్యక్షుడు బండి ప్రభాకర్ పాల్గొన్నారు. రుద్రంగి(వేములవాడ): రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రుద్రంగి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రుద్రంగిలోని శుభం గార్డెన్స్లో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. -
దుకాణాలు నిరుపయోగం
ఇది జిల్లా కేంద్రంలోని శివనగర్ పార్క్ వద్ద నిర్మించిన ఎకో ఫ్రెండ్లీ దుకాణాలు. నిర్మించినప్పటి నుంచి దుకాణాలన్నీ నిరుపయోగంగానే ఉన్నాయి. ఇలా సిరిసిల్లలో రూ.1.93 కోట్లతో మొత్తం 60 షాపులు ఎకో ఫ్రెండ్లీ దుకాణాల సముదా యాలను నాలుగు ప్రదేశాల్లో నిర్మించగా.. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వద్ద, రైతు బజా రు వద్ద షాపులు వినియోగంలో ఉండగా.. మిగతావి వృథాగా పడి ఉన్నాయి.ఇది తారకరామానగర్లోని ఎకోఫ్రెండ్లీ షాప్. కానీ షాపు రేకులను, ఇరువైపులా ఉన్న అడ్డుగోడల కోసం నిర్మించిన అట్టలను ఆకతాయిలు తొలగించడంతో అసాంఘిక కార్యక్రమాలకు స్థావరాలుగా మారాయి. మందుబాబులకు అడ్డాలుగా మారాయి. రాత్రి వేళల్లో ఆ షాపుల ముందు నుంచి వెళ్లేందుకు స్థానికులు భయపడుతున్నారు. అక్కడ నిర్మించిన టాయిటెట్లు, నేలపై పరిచిన టైల్స్ ఊడిపోయాయి.ఇది సిరిసిల్లలోని తారకరామానగర్ ప్రాంతం. ఇక్కడ వీధి వ్యాపారుల కోసం మున్సిపల్ అధికారులు 16 షాపులను ఏర్పాటు చేశారు. పేద వీధి వ్యాపారులు ఇక్కడి షాపుల్లో ఏదైనా వ్యాపారం చేసుకుంటూ.. ఉపాధి పొందాలని రూ.93లక్షలతో వీటిని నిర్మించారు. పర్యావరణ హితమైన ఎకో ఫ్రెండ్లీ రేకులు, సామాగ్రితో 2019లో నిర్మించారు. అప్పటి నుంచి నిరుపయోగంగానే ఉన్నాయి. -
కంటి నిండా నిద్ర
చేతి నిండా పని.. మరమగ్గాలు నడుపుతున్న ఇతను కోడం బాలకిషన్. జిల్లా కేంద్రంలోని విద్యానగర్లోని ఓ కార్ఖానాలో పాలిస్టర్ వస్త్రాన్ని ఉత్పత్తి చేస్తూ నెలకు రూ.8వేల నుంచి రూ.10 వేల సంపాదిస్తున్నాడు. నిత్యం 12 సాంచాల మధ్య 10 గంటలపాటు పని చేస్తున్నాడు. గతంలో రాత్రిపూట పని చేసేవాడు. కానీ ఇప్పుడు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తున్నాడు. వచ్చే కూలీలో నెలకు రూ.1200 చొప్పున త్రిఫ్ట్ పొదుపు పథకంలో చెల్లిస్తున్నాడు. రాత్రి డ్యూటీకి రాం రాం చెప్పి పొద్దంతా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇలా ఒక్కరు.. ఇద్దరు కాదు సిరిసిల్ల కార్మిక క్షేత్రంలో పలువురు నేతకార్మికులు రాత్పైల్ (నైట్ డ్యూటీ) రాం రాం చెబుతూ దిన్పైల్ (పొద్దంతా) పని చేస్తున్నారు. సిరిసిల్ల: వస్త్రోత్పత్తి ఖిల్లా.. సిరిసిల్లలో చిన్న మార్పు పెద్ద ఫలితాన్నిస్తోంది. రాత్పైల్(రాత్రి డ్యూటీ) రద్దు చేయడంతో కార్మికుల ఆరోగ్యంగా ఉండడంతోపాటు వస్త్రోత్పత్తి సైతం పెరిగింది. కార్మిక కుటుంబాలు సైతం సంతోషంగా ఉంటున్నాయి. ఇన్నాళ్లు సిరిసిల్లలో ఒక్క వారం రాత్రి, మరో వారం పగటి డ్యూటీలు ఉండేవి. రాత్రి డ్యూటీ చేసిన రోజుల్లో నేతకార్మికులు నిద్రలేమితో అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే వారు. నిద్ర రాకుండా మధ్య..మధ్యలో టీ తాగి వచ్చేవారు. వీరి కోసం పట్టణంలో ప్రత్యేక టీకొట్టులు సైతం ఉండేవి. ఇటీవల రాత్రి డ్యూటీలు రద్దు చేయడంతో పొద్దంతా పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఆర్డర్లు, పొరుగు రాష్ట్రాల వస్త్రోత్పత్తి ఆర్డర్లు రావడంతో నేతన్నలకు చేతినిండా పని ఉంటుంది. పని గంటలు తగ్గిస్తే.. సిరిసిల్లలో కార్మికులు అసంఘటిత రంగంలో ఉన్నారు. దీంతో పని గంటల సమస్యలు ఎదురవుతున్నాయి. పొద్దంతా పనిచేసినా 8 గంటల పని విధానం అమలు చేయాల్సిన అవసరం ఉంది. కార్మికులు డ్యూటీలోకి వచ్చిన తరువాత 8 గంటల పనిచేసి డ్యూటీ దిగేలా చేనేత, జౌళిశాఖ, కార్మికశాఖ అధికారులు ప్రణాళికను అమలు చేయాలి. మరో వైపు ఒక్కో కార్మికుడు 10 నుంచి 12 సాంచాలపై పాలిస్టర్ వస్త్రోత్పత్తి చేస్తున్నారు. ప్రభుత్వ వస్త్రోత్పత్తి ఆర్డర్లు అయితే 6 నుంచి 8 సాంచాలు నడిపిస్తున్నారు. ఇలా ఎక్కువ సాంచాలు నడపడం మూలంగా పని ఒత్తిడి పెరిగి అలసిపోతున్నారు. ఏదైనా సాంచాలు రిపేరు వస్తే ప్రత్యేక మెకానిక్లు(జాపర్లు) లేక కార్మికులే చేస్తున్నారు. కాలం చెల్లిన సాంచాలు తరచూ రిపేర్లతో వస్త్రోత్పత్తికి ఆటంకం ఏర్పడుతుంది. ఎంత వస్త్రాన్ని ఉత్పత్తి చేస్తే.. అంత మేరకు కూలీ రావడంతో కార్మికులు ఎక్కువ సాంచాలు నడిపేందుకు మొగ్గు చూపుతున్నారు. ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు రెండు షిఫ్టుల్లో 8 గంటల చొప్పున పనివిభజన జరగాల్సిన అవసరం ఉంది. ఆ 8 గంటల్లోనే నేతన్నలకు మెరుగైన కూలీ లభించే పని విధానం ఉండాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాంచాల మధ్య నవ్వుతున్న ఇతను దూస దేవరాజు. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీవై నగర్లో పవర్లూమ్ కార్మికుడు. ఉదయం 7 గంటలకు కార్ఖానాకు వచ్చి ఇలా సాంచాలు నడిపేందుకు సిద్ధమయ్యాడు. రాత్రంతా ఇంట్లోనే హాయిగా నిద్రపోవడంతో పనిచేసేందుకు ఉత్సాహంగా వచ్చాడు. గతంలో రాత్రి డ్యూటీ చేసి అలసిపోయి, నిద్రలేమితో బాధపడేవారు. కానీ ఇప్పుడు పొద్దంతా పనిచేస్తున్నాడు. నిత్యం ఆరు సాంచాలపై వస్త్రోత్పత్తి చేస్తూ.. నెలకు రూ.12 వేల నుంచి రూ.16వేల వరకు సంపాదిస్తున్నాడు. -
పని గంటలు కుదించాలి
సిరిసిల్లలో 8 గంటల పనివిధానం కోసం ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. సాంచాల మధ్య 10 నుంచి 12 గంటలు రెస్ట్ లేకుండా శ్రమించడం ఇబ్బందిగా ఉంది. రాత్రి పూట సాంచాలు బంద్ ఉండడం మంచి పరిణామం. కొందరు యజమానులు రాత్రి షిఫ్టుల్లోనూ పనిచేయిస్తున్నారు. కానీ పని గంటలను కుదిస్తే కార్మికులకు విశ్రాంతి దొరుకుతుంది. ఆరోగ్య సమస్యలు చాలా వరకు దూరమవుతాయి. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. – మూశం రమేశ్, కార్మిక నాయకుడు నిద్ర లేమితో అనేక రుగ్మతలు నిద్ర లేమి అనేక ఆరోగ్య సమస్యలకు, మానసిక రుగ్మతలకు కారణమవుతుంది. రాత్రిపూట బాగా నిద్రపోతే అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. సరైన నిద్ర లేకుంటే మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కోపం, చికాకు వంటి సమస్యలు ఎదురవుతాయి. షుగర్, బీపీ కంట్రోల్ తప్పుతుంది. కండరాల నొప్పులు వస్తాయి. ఎవరైనా సరే మంచి నిద్రపోవాలి. రాత్రి పూట నిద్రపోతే ఆరోగ్యం చాలా బాగుంటుంది. – డాక్టర్ ప్రవీణ్, మానసిక వైద్యనిపుణులు, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి -
సూర్యప్రభ, చంద్రప్రభలపై శ్రీవారి విహారం
సిరిసిల్లటౌన్: బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీవారు సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలపై ఊరేగారు. ఉదయం సూర్యప్రభ, రాత్రి శ్రీదేవీ, భూదేవీ సహితంగా వేంకటేశ్వరస్వామి చంద్రప్రభ వాహనాలపై పురవీధుల్లో విహరించారు. గోవింద నామస్మరణతో మాఢవీధులు మారుమోగాయి. సాయంత్రం 6 గంటలకు రంగనాయక తిరుప్పోలంపై విహరించారు. రంగనాయక తిరప్పోలం సేవ ఆకట్టుకుంది. ఆలయ ఈవో మారుతిరావు, ఏఈవోలు పీసరి రవీందర్, కూనబోయిన సత్యం, టీపీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, ఆలయ మాజీ చైర్మన్లు ఉప్పుల విఠల్రెడ్డి, చేపూరి నాగరాజు, తీగల శేఖర్గౌడ్, అర్చకస్వామి కృష్ణమాచారి పాల్గొన్నారు. -
సెల్యూట్ ‘108’
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: దసరా అంటేనే తెలంగాణలో పెద్ద పండగ. ఆ రోజున పిల్లాపాప అంతా వేడుకల్లో మునిగి తేలుతుంటారు. కానీ.. 108 సిబ్బంది మాత్రం ఎలాంటి పండుగ చేసుకోకుండా ప్రజల ప్రాణాలు కాపాడి మరోసారి తమ సేవాభావాన్ని చాటుకున్నారు. ఎక్కడ నుంచి అత్యవసర పరిస్థితి ఉందని ఫోన్ వచ్చినా ఆ రోజంతా సేవలందిస్తూ.. 108 ప్రా ధాన్యం మరోసారి లోకానికి చూపించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన 108 పథకం నేటికీ నిరంతరాయంగా ప్రజల ప్రాణాలను కాపాడుతూనే ఉంది. దసరా రోజున సైతం ఉమ్మడి జిల్లాలో విధులు నిర్వహించిన ఈఎంటీ (ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్) ఏకంగా 209 అత్యవసర కేసులు స్వీకరించారు. ఆపదలో ఉన్న వారిని క్షణాల్లో ఆదుకునే 108 సిబ్బంది పండగ రోజు కూడా సెలవు లేకుండా విధులు నిర్వహించి పదుల సంఖ్యలో ప్రజల ప్రాణాలు కాపాడారు. 209 కేసులు.. 150 మంది ప్రాణాలు దసరా పండుగ రోజు ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో మునుపెన్నడూ లేని విధంగా 209 కేసుల్లో 150 మంది బాధితులను కాపాడారు. 108 ఎమర్జెన్సీ మె డికల్ టెక్నీషియన్స్ (ఈఎంటీ)53, పైలెట్లు 53మంది పండుగ రోజు కూడా విశ్రమించకుండా మూడు షిఫ్టులలో విధులు నిర్వహించారు. తీవ్రంగా గాయపడిన వారిని కూడా ప్రాణనష్టం జరగకుండా ఆసుపత్రికి చేర్చేవరకు వైద్య సేవలు అందించారు. లిక్కర్ సేల్స్ పెరగడం ఈ ఏడాది దసరా పండుగ అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు రావడంతో ఉమ్మడి జిల్లాలో మద్యం ముందస్తు కొనుగోళ్లు విపరీతంగా జరిగాయి. గతేడాది దసరా సమయంలో వారం రోజుల్లో జరిగిన సేల్స్ ఈ ఏడాది మూడు రోజులలోనే మించిపోయాయి. దీంతో మద్యం మత్తులో వాహనాల నడిపి ప్రమాదాలకు గురైన వారి సంఖ్య ఎక్కువగా పెరిగింది. అయినప్పటికీ నిర్విరామ విధులతో 108 సిబ్బంది క్షతగాత్రులను కాపాడడంలో నిమగ్నమయ్యారు. సెల్యూట్ 108 అంటూ ప్రజల నుంచి అభినందనలు పొందారు. -
వాహనాల పెండింగ్ ట్యాక్స్ చెల్లించాలి
● రేపటి నుంచి స్పెషల్ డ్రైవ్ ● జిల్లా ఇన్చార్జి రవాణా శాఖ అధికారి వంశీధర్ సిరిసిల్ల: జిల్లాలో సరుకులు, ప్రయాణికులను చేరవేసే వాహనాలకు సంబంధించిన 4,419 గల వాహనాల యజమానులు పన్ను చెల్లించాలని జిల్లా ఇన్చార్జి రవాణాశాఖ అధికారి జి.వంశీధర్ శనివారం తెలిపారు. ఆయా వాహనదారులు రోడ్డు ట్యాక్స్ చెల్లించకుండా తిరుగుతున్నారని వివరించారు. సిరిసిల్ల డివిజన్కు సంబంధించి 2,787, వేములవాడ డివిజన్కు సంబంధించి 1,632 వాహనాల ట్యాక్స్ పెండింగ్లో ఉందని తెలిపారు. జిల్లాలో ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా 11,425 వాహనాలు తిరుగుతున్నాయని స్పష్టం చేశారు. ఇందులో సిరిసిల్ల రెవెన్యూ డివిజన్లో 6,647, వేములవాడ డివిజన్లో 4,778 వాహనాలు ఉన్నట్లు రవాణాశాఖ రికార్డులు చెబుతున్నాయన్నారు. ట్యాక్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని వాహనాల యజమానులు ట్యాక్స్ చెల్లించి ఫిట్నెస్ చేయించుకోవాలని సూచించారు. జిల్లాలో సోమవారం నుంచి ప్రత్యేక తనిఖీలు నిర్వహించి వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. స్పెషల్ డ్రైవ్లో పట్టుబడితే వాహనదారులకు అపరాధ రుసుంతో భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. -
రాజన్న ఆలయం మూసివేయొద్దు
వేములవాడ: ఆలయ విస్తరణ, అభివృద్ధి పేరుతో రాజన్న గుడిని మూసివేసి భక్తులను ఇబ్బందులకు గురి చేయొద్దని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి కోరారు. వేములవాడలో శనివారం విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధి పనులకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అభివృద్ధి పేరుతో రాజన్న గుడిని మూసివేసి భక్తులకు భీమన్న ఆలయంలో అనుమతినిస్తామని ప్రకటించడం సరైంది కాదన్నారు. గుడి పరిసరాల్లో ఎంతో మంది భక్తులను నమ్ముకుని చిరువ్యాపారులు ఉన్నారని, గుడిని మూసివేస్తే వారంతా ఉపాధి కోల్పోతారన్నారు. మాజీ ఎంపీపీ బండ మల్లేశం పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో దుర్గామాత శోభాయాత్ర
ఎల్లారెడ్డిపేట/ముస్తాబాద్(సిరిసిల్ల): నవరాత్రులు విశేష పూజలందుకున్న దుర్గామాత విగ్రహాలను భక్తులు శనివారం నిమజ్జనానికి తరలించారు. మండలకేంద్రంలోని దుర్గా భవాని సేవా సమితి సభ్యులు అమ్మవారిని విజయవాడ కృష్ణానదిలో నిమజ్జనం చేశారు. నారాయణపూర్లోని శ్రీనవదుర్గా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమ్మవారి చీరలకు లక్కీ డ్రా తీయగా 200 మంది పాల్గొనగా, 11 మంది చీరలను దక్కించుకున్నారు. ముస్తాబాద్లో మార్కండేయ భవన్, రాక్స్టార్ యూత్ ఆధ్వర్యంలో దుర్గామాత శోభా యాత్ర నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి పెద్ద చెరువులో నిమజ్జనం చేశారు. నారాయణపూర్లో దుర్గామాత శోభాయాత్రముస్తాబాద్లో దుర్గామాత శోభాయాత్రలో మహిళలు -
సమయపాలన పాటించాలి
● డీఎంహెచ్వో రజిత బోయినపల్లి(చొప్పదండి): పీహెచ్సీల్లో విధులు నిర్వహించే వైద్యసిబ్బంది సమయపాలన పాటించాలని డీఎంహెచ్వో రజిత ఆదేశించారు. మండలంలోని కొదురుపాక పీహెచ్సీని శనివారం తనిఖీ చేశారు. డాక్టర్, వైద్యసిబ్బంది హాజరు రిజిస్టర్, కేంద్ర ఆరోగ్య పథకాలకు సంబందించిన పలు రికార్డులను పరిశీలించారు. సకాలంలో విధులకు హాజరుకాకుంటే సీసీఏ రూల్స్ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఐదేళ్లలోపు చిన్నారుల వ్యాక్సిన్.. మందుల నిల్వలను పరిశీలించారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు సిరిసిల్లకల్చరల్/సిరిసిల్లటౌన్: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. సీనియర్ సిటిజన్ల సంఘం ఆధ్వర్యంలో వయోధికుల దినోత్సవం సందర్భంగా వస్త్రవ్యాపార సంఘం భవనంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వయోధికుల సంక్షేమ చట్టం ప్రకారం తల్లిదండ్రుల పోషణ బాధ్యతలు విస్మరించిన వారసులకు ఆస్తులను జప్తు చేస్తామన్నారు. వారసత్వంగా లభించిన ఆస్తులను తిరిగి వెనక్కి తీసుకునే అవకాశం ఉందన్నారు. నిరాధరణకు గురైన వయోవృద్ధులను ఆశ్రమాల్లో ఉంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం సీనియర్ సిటిజన్ల సంఘం బాధ్యులు ఆర్డీవోను సత్కరించారు. సంఘం అధ్యక్ష, కార్యదర్శులు చేపూరి బుచ్చయ్య, డాక్టర్ జనపాల శంకరయ్య, కోడం నారాయణ, దొంత దేవదాసు, మోతిలాల్, సి.రామరాజు, సజ్జనం శ్రీనివాస్, బాదం ప్రకాశ్, గౌరిశెట్టి ఆనందం, అంకారపు జ్ఞానోభ, పి.సత్యనారాయణ, బుర్ల సారంగం, నల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. స్థానిక పోరుకు సిద్ధం సిరిసిల్లటౌన్: స్థానిక సంస్థల పోరుకు సీపీఎం సిద్ధమైందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మూశం రమేశ్ స్పష్టం చేశారు. సిరిసిల్లలోని పార్టీ కార్యాలయంలో శనివారం ప్రెస్మీట్లో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఎం జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలకు పోటీ చేస్తుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అన్ని స్థానాల్లో పోటీ చేస్తామన్నారు. సీపీఎం కార్యదర్శివర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి, కోడం రమణ, సూరం పద్మ, శ్రీరాముల రమేశ్చంద్ర, సందుపట్ల పోచమల్లు, గడ్డం రాజశేఖర్ పాల్గొన్నారు. మహిళల శ్రమను గౌరవించాలిసిరిసిల్లటౌన్: శ్రామిక మహిళల శ్రమను గౌరవించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సీపీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ కోరారు. స్థానిక బీవైనగర్లోని అమృత్లాల్ శుక్లా కార్మిక భవన్లో శనివారం శ్రామిక మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర సదస్సు పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. దేశవ్యాప్తంగా శ్రామిక మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు ఆర్థిక, సామాజిక అణచివేత, పనిభద్రత, వేతనాలు లేని శ్రమ తదితర సమస్యలపై సీఐటీయూ శ్రామిక మహిళ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో నిరంతరం పోరాడుతుందన్నారు. భవిష్యత్ ఉద్యమ కార్యక్రమం రూపొందించేందుకు శ్రామిక మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర సదస్సు ఈనెల 5, 6 తేదీల్లో ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్నగర్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ సూరం పద్మ, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి, చందుపట్ల పోచమల్లు, లలిత, ఇందిర, ఎల్లవ్వ పాల్గొన్నారు. -
ఘనంగా దసరా
సిరిసిల్లటౌన్/వేములవాడ: జిల్లాలో దసరా వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. సిరిసిల్ల మానేరు వాగు తీరంలోని రాంలీల మైదానంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రావణ సంహారం నిర్వహించారు. ఎస్పీ మహేశ్ బీ గీతే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ససర్దేశాయ్ చెన్నమనేని శ్రీనివాస్రావుదేశాయ్, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు చేపూరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మేర్గు సత్యం, గౌరవ అధ్యక్షుడు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్, గాజుల వేణు, చేపూరి అశోక్, తదితరులు పాల్గొన్నారు. శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి భక్తజనులకు శమీ దర్శనం కల్పించారు. గురువారం సాయంత్రం అశ్వవాహనంపై బయలుదేరిన స్వామి వారు మానేరుతీరంలోని జమ్మిచెట్టు వద్దకు చేరుకోగా శమీపూజ జరిగింది. టీపీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, ఆలయ మాజీ చైర్మన్లు ఉప్పుల విఠల్రెడ్డి, చేపూరి నాగరాజు, తీగల శేఖర్గౌడ్, ఈవో మారుతిరావు, ఏఈవోలు పీసరి రవీందర్, కూనబోయిన సత్యం పాల్గొన్నారు. వేములవాడలో వైభవంగా ‘శమీయాత్ర’ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మహాలక్ష్మి ఆలయం వద్దనున్న జంబిచెట్టుకు పూజలు చేశారు. రాత్రి 9 గంటలకు జరిగే నిషిపూజ, ఏకాంతసేవ పూజలతో ఉత్సవాలు ముగిసినట్లు ఇన్చార్జి స్థానాచార్యులు ఉమేశ్శర్మ తెలిపారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఈవో రమాదేవి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. దసరాను పురస్కరించుకుని ఆలయంలో ఈవో రమాదేవి ఆయుధపూజ నిర్వహించారు. -
బ్రహ్మోత్సవం.. పులకించిన భక్తజనం
సిరిసిల్లటౌన్: ఐదు రోజులుగా కొనసాగుతున్న సిరిసిల్ల శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలతో కార్మికక్షేత్రం పులకించింది. వేడుకల్లో నాలుగు, ఐదు రోజుల్లో జరిగిన అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాల్లో భక్తులు దేవదేవునికి నీరాజనం పలికారు. గురు, శుక్రవారాల్లో శ్రీవారి వాహనసేవలు కనుల పండువగా సాగాయి. గురువారం విజయదశమిని పురస్కరించుకొని ఆలయంలో ఉదయం 8 గంటలకు హోమం, 10 గంటలకు సింహవాహనం, సాయంత్రం 5 గంటలకు అశ్వవాహనంపై శ్రీవారు విహరించారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు గరుడసేవ, రాత్రి 9 గంటలకు హనుమంత వాహనాలపై శ్రీదేవి, భూదేవి సహితంగా శ్రీవారిని మాడవీధుల్లో ఊరేగించారు. టీపీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, ఆలయ మాజీ చైర్మన్లు ఉప్పుల విఠల్రెడ్డి, తీగల శేఖర్గౌడ్, చేపూరి నాగరాజు, ఈవో మారుతిరావు, ఏఈవోలు పీసరి రవీందర్, ప్రధాన అర్చకులు కృష్ణమాచారి, వర్ధనాచారి పాల్గొన్నారు. నేత్రపర్వం శ్రీనివాస కల్యాణం బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీవారి కల్యాణోత్సవం జరిగింది. వేదపండితులు శ్రీలక్ష్మి, పద్మావతీవేంకటేశ్వరస్వామిల వివాహ వేడుకలను నిర్వహించారు. ఆలయ ఈవో మారుతిరావు, ఏఈవోలు పీసరి రవీందర్, కూనబోయిన సత్యం, అర్చకస్వాములు కృష్ణమాచారి, వర్ధనాచారి, సుకుమారాచారి, మాజీ చైర్మన్లు ఉప్పుల విఠల్రెడ్డి, మాజీ చైర్మన్లు తీగల శేఖర్గౌడ్, చేపూరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి వారుకళ్యాణ ం నిర్వహిస్తున్న అర్చకులు -
అన్ని స్థానాలు గెలవాలి
సాక్షి ప్రతినిది, కరీంనగర్: త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను కాంగ్రెస్ గెలవాలని కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ముఖ్యనాయకులంతా గాంధీభవన్లో మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నేతృత్వంలో స్థానిక సంస్థల అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ బలాలు, బలహీనతలు, అనుకూలతలు, అభ్యర్థుల ఎంపిక తదితరాల పై చర్చించారు. విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, విజయ రమణరావులతోపాటు ప్రణవ్బాబు (హుజురాబాద్), వెలిచాల రాజేందర్ రావు (కరీంనగర్), ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి (కరీంనగర్), కేకే మ హేందర్రెడ్డి (సిరిసిల్ల) తదితరులు పాల్గొన్నారు. అభ్యర్థుల ఎంపిక ఇలా అభ్యర్థుల ఎంపికపై కూలంకుశంగా చర్చ జరిగింది. ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక బాధ్యత డీసీసీలకే అప్పగించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులే స్థానికంగా బలాల ఆధారంగా ఎంపిక చేసుకునే వీలు కల్పించారు. జెడ్పీటీసీల విషయంలోనూ డీసీసీ అధ్యక్షులు నలుగురు అభ్యర్థులను ఎంపిక చేసి పీసీసీ అధ్యక్షుడికి పంపుతారు. అధిష్టానం రహస్యంగా సర్వే నిర్వహించి, నలుగురిలో ఒకరి పేరును ఖరారు చేస్తారు. అభ్యర్థుల జాబితాను మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులు అధిష్టానానికి అందజేసినట్లు సమాచారం. కోర్టు తీర్పు.. సంజయ్ జాబితాపై చర్చ స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్లను సవాలు చేస్తూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయంపైనా చర్చించారు. 42శాతం రిజర్వేషన్లకు అన్నిపార్టీలు తమ సానుకూలత వ్యక్తం చేశాయని, కోర్టు తీర్పు అనుకూలంగానే వస్తుందని సానుకూలత వ్యక్తం చేశారు. తీర్పు ప్రతికూలంగా వస్తే.. ఎలా వ్యవహరించాలో కూడా ప్రస్తావించినట్లు తెలిసింది. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సమావేశానికి హాజరై తాను సిద్ధం చేసిన జాబితాను అందజేసినట్లు తెలిసింది. జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ మాజీమంత్రి జీవన్రెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న విషయం తెలిసిందే. సంజయ్ చేరికను ఆదినుంచి వ్యతిరేకిస్తున్న జీవన్రెడ్డి.. తన వర్గీయులకు ఎలాగైనా టికెట్ ఇప్పించుకోవాలన్న పంతంతో ఉన్నారు. వీరిద్దరి విషయంలో ఎవరి జాబితా ఖరారు చేస్తారన్న విషయం అధిష్టానానికి చూసుకుంటుందని ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ మంత్రి ‘సాక్షి’కి తెలిపారు. -
కరీంనగర్, సిరిసిల్ల జెడ్పీ పీఠాలపై కాషాయ జెండా ఎగరేస్తాం
● కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్కరీంనగర్టౌన్: కరీంనగర్, సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాలను బీజేపీ కై వసం చేసుకోబోతోందని, సర్వే నివేదికలు ఇదే విషయం తేటతెల్లం చేస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం సాయంత్రం కరీంనగర్లోని ఈఎన్ గార్డెన్స్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మండలాధ్యక్షులు, జెడ్పీటీసీ ప్రభారీల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన బండి సంజయ్ మాట్లాడుతూ... కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను ఎప్పుడెప్పుడు ఓడిద్దామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని, తాను సైతం ఎన్నికలు ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. తాజామాజీ సర్పంచులు, రైతులు, మహిళలు, వృద్ధులు, నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగులే ఈసారి కాంగ్రెస్ ను ఓడించబోతున్నారని, బీజేపీకి వాళ్లే బ్రాండ్ అంబాసిడర్లు కాబోతున్నారన్నారు. అభ్యర్థులకు టిక్కెట్ల కేటాయింపు విషయాన్ని బీజేపీ రాష్ట్ర నాయకత్వం చూసుకుంటుందని, ఇప్పటికే సర్వేలు చేయిస్తోందని తెలిపారు. సర్వే నివేదికలను బట్టి గెలుపే ప్రాతిపదికన టిక్కెట్లు వస్తాయని స్పష్టం చేశారు. కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, రెడ్డబోయిన గోపి, మాజీ అధ్యక్షులు బాస సత్యనారాయణ, మాజీ మేయర్లు సునీల్రావు, డి.శంకర్, పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు, కోమాల అంజనేయులు, వాసాల రమేశ్ పాల్గొన్నారు. -
రూ.5.04కోట్లు తాగేశారు
● 232 బైకులు, 50 కార్ల విక్రయాలు ● పండుగ పూట జోరుగా వ్యాపారాలుసిరిసిల్లక్రైం: దసరా పండుగకు జిల్లాలో మద్యం, వాహనాల విక్రయాలు పెరిగాయి. ఈ ఏడాది దసరా, గాంధీ జయంతి ఒకే రోజున రావడంతో ప్రభుత్వ నిర్ణయంతో అక్టోబర్ 2న వైన్షాపులు మూసివేశారు. అయితే ముందు రోజే మద్యం కొనుగోలు చేసుకుని నిల్వ చేసుకున్నారు. ఈ దసరా సీజన్లో జిల్లా వ్యాప్తంగా రూ.5.04 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు అధికారుల అంచనా. వాహనాల కొనుగోళ్లు కూడా భారీగా జరిగాయి. కేంద్ర ప్రభుత్వం వాహనాలపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడం వినియోగదారులకు ఊరటనిచ్చింది. దీంతో పండుగ ఆఫర్లు, జీఎస్టీ తగ్గింపుతో కలిపి వాహన మార్కెట్ జోరందుకుంది. జిల్లాలో 232 ద్విచక్ర వాహనాలు, 50 కార్లు కొత్తగా కొనుగోలు చేశారు. రానున్న దీపావళి వరకు ఈ కొనుగోళ్ల ఊపు కొనసాగుతుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. -
డేంజర్ టర్నింగ్స్
బోయినపల్లి(చొప్పదండి): జిల్లాలో మూలమలుపులు ప్రమాదకరంగా ఉన్నాయి. వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. వేములవాడ డివిజన్లోని ఆర్అండ్బీ, పంచాయతీరాజ్శాఖ రోడ్లపై మూలమలుపులు మృత్యు పిలుపులుగా మారాయి. మలుపుల వద్ద కనీసం సూచికబోర్డులు కనిపించడం లేదు. హెచ్చరికబోర్డులు అసలే లేవు. సూచికలు కరువు బీటీ రోడ్డు వెంట ఉన్న మూలమలుపుల వద్ద పంచాయతీరాజ్ అధికారులు ప్రమాద సూచికలు పెట్ట లేదు. బోయినపల్లిలో మూలమలుపు వద్ద గతంలో ఓ లారీ ఇనుప విద్యుత్స్తంభాన్ని ఢీకొట్టింది. తరచూ ప్రమాదాలు ● కోనరావుపేట మండలం నిజామాబాద్–కోనరావుపేట మార్గంలోని ఓ మూలమలుపు వద్ద బైక్పై వస్తున్న వ్యక్తి అదుపుతప్పి పొలంలోకి దూసుకెళ్లి మృతిచెందాడు. బోయినపల్లి నుంచి వేములవాడ, బూర్గుపల్లి నుంచి కోరెం, తడగొండ నుంచి మల్కాపూర్, బోయినపల్లి నుంచి విలాసాగర్, మర్లపేట వెళ్లే రహదారుల్లో మూలమలుపులు ఉన్నాయి. బోయినపల్లి పోస్టాఫీసు, యూనియన్ బ్యాంకు, పాత సెస్ కార్యాలయాల వద్ద ఎదురుగా వాహనం వస్తే ఇబ్బంది ఏర్పడుతోందని ప్రయాణికులు అంటున్నారు. ఇక్కడ రెండు వాహనాలు ఎదురెదురుగా వస్తే ఒకటి వెనక్కి తీసుకుంటే మరొకటి ముందుకు వెళ్లే పరిస్థితి. బోయినపల్లి మండలం స్తంభంపల్లి నుంచి వేములవాడ వెళ్లే బీటీ రోడ్డులో వాటర్ప్లాంట్ వద్ద మూలమలుపు డేంజర్గా ఉంది. ● విలాసాగర్–కరీంనగర్ దారిలో హైస్కూల్ వద్ద టర్నింగ్ డేంజర్గా ఉంది. ● తడగొండ నుంచి మల్కాపూర్ వెళ్లే దారిలో పలు చోట్ల మూలమలుపులు ఉన్నాయి. ● వేములవాడ అర్బన్ మండలం నాంపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి గుడి పరిసరాల్లో టర్నింగ్ ఉంది. ● వేములవాడరూరల్ మండలంలో నూకలమర్రి–వట్టెంల, వేములవాడ–మల్లారం రోడ్డులో మూలమలుపులు ప్రమాదకరంగా ఉన్నాయి. ఈ చిత్రంలో ఒక టర్నింగ్ కోనరావుపేట నుంచి నిమ్మపల్లి, మరొకటి కోనరావుపేట నుంచి సిరిసిల్ల వెళ్తుంది. ఒకే చోట నుంచి రెండు చోట్లకు టర్నింగ్ తీసుకోవాల్సి ఉంది. ఏ వాహనం ఎటు వెళ్తుందో దగ్గరకు వచ్చే వరకు తెలియదు. ఇంత ప్రమాదకరంగా వాహనదారులు ప్రయాణిస్తున్నారు. -
మహాలక్ష్మీ నమోస్తుతి
వేములవాడ: దేవీ నవరాత్రోత్సవాల్లో భాగంగా చివరిరోజు గురువారం అమ్మవారు మహాలక్ష్మి (పాలవెల్లి) అలంకారంలో దర్శనమిచ్చారు. నాగిరెడ్డి మండపంలోని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అందమైన వేదికపైన మహాలక్ష్మి అవతారంలో ఉన్న అమ్మవారిని, బాలత్రిపుర సుందరాదేవి, శ్రీరాజరాజేశ్వరీ అమ్మవారిని మహాలక్ష్మి అలంకారాలతో అర్చకులు అలంకరించారు. వేములవాడ: బార్ అండ్ బెంచ్ బాధ్యతాయుతంగా మెదలుకోవాలని జూనియర్ సివిల్ జడ్జి ప్రవీణ్కుమార్ సూచించారు. వేములవాడ బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన గుడిసె సదానందం, సబ్కోర్టు ఏపీపీగా బాధ్యతలు చేపట్టిన అవధూత రజనీకాంత్లు శుక్రవారం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గడ్డం సత్యనారాయణరెడ్డి, ఉపాధ్యక్షుడు కటకం జనార్దన్, అడ్వకేట్లు నాగుల సత్యనారాయణ, రేగుల దేవేందర్, పొత్తూరు అనిల్కుమార్, వేముల సుధాకర్రెడ్డి, పెంట రాజు, పర్లపెల్లి అంజయ్య, నాగుల సంపత్, హరికృష్ణ, సంపత్, అన్నపూర్ణ, మనోహర్ తదితరులున్నారు. వీర్నపల్లి(సిరిసిల్ల): మండలంలోని వన్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని శంకర్నాయక్తండా, రెడ్డినాయక్తండాలకు వెళ్లే రోడ్డును గ్రామస్తులు బాగుచేసుకున్నారు. దసరా పండ గ పూట రెండు తండాల గిరిజనులు సొంత ఖ ర్చులతో తాత్కాలిక రోడ్డును బాగుచేసుకున్నా రు. గిరిజనులు మాట్లాడుతూ రెండు తండాల కు రోడ్డు లేక చాలా ఇబ్బంది పడుతున్నామని అధికారులకు చెప్పినా పట్టించుకోలేదన్నారు. సిరిసిల్లటౌన్: సులభ్ కాంప్లెక్స్లో సమస్యలు పరిష్కరించాలని సిరిసిల్ల పౌరసంక్షేమ సమితి అధ్యక్షుడు బియ్యంకార్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం మున్సిపల్ ఆఫీస్ ఎదుట నిరసన చేపట్టి మాట్లాడారు. మున్సిపల్ ద్వారా నిర్వహిస్తున్న లేబర్ అడ్డా దగ్గర సులభ్ కాంప్లెక్స్లో ఉచిత మూత్రశాల అని బోర్డులు ఉన్నా కూడా డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. ఉచితం బోర్డులు కనిపించకుండా కాగితాన్ని అంటించారన్నారు. సమితి ఉపాధ్యక్షులు చీకోటి అనిల్కుమార్, కోశాధికారి చిప్ప దేవదాస్, సభ్యులు వేముల పోశెట్టి పాల్గొన్నారు. బోయినపల్లి(చొప్పదండి): శ్రీరాజరాజేశ్వర(మిడ్మానేరు) ప్రాజెక్టు నుంచి ఎల్ఎండీకి 850 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ప్రాజెక్టులోకి వేయి క్యూసెక్కుల మేర వరద ఇన్ ఫ్లోగా చేరుతోంది. మిడ్మానేరు ప్రాజెక్టులో నీటిమట్టం 27.479 టీఎంసీలకు చేరింది. -
మానేరు తీరాన శమీ పూజోత్సవం
సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రం దసరా ఉత్సవాలకు పేరెన్నికై ంది. 800 ఏళ్ల క్రితమే శ్రీశాల(సిరిసిల్ల) క్షేత్రంలో కేశవనాథుని ఆలయం నిర్మితమైందని పురాణాలు చెబుతున్నాయి. కాకతీయుల కాలంలో మొగలాయిలు హిందూ ఆలయాలపై దాడి చేసిన సంఘటనకు సాక్ష్యంగా ధ్వంసమైన ఇక్కడి మూలవిరాట్టు విగ్రహం వాహనశాలలో భద్రంగా ఉంది. ఈ ఘటనపై ప్రజలు మనోవేదనకు గురవుతుండగా సిరిసిల్లను పాలిస్తున్న సర్దేశాయ్ చెన్నమనేని వంశస్తులు తుక్కారావు, మీనారావులకు స్వప్నంలో స్వామి వారు కనిపించి మాండవ్య మహానది(మానేరు) ప్రాంతంలో బర్రెంకల చెట్టుకింద భూమిలో ఉన్న విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించాలని చెప్పి అంతర్ధానమయ్యారు. దేశాయ్లు ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసి వాహనాలు, పొన్నసేవ, రథాన్ని చేయించారు. అప్పటి నుంచి సిరిసిల్లలో బహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అప్పటి నుంచి ఏటా దసరా రోజున మానేరు తీరాన గల జమ్మిగద్దెకు అశ్వవాహనంపై శ్రీవారు వచ్చినాకే శమీపూజలు నిర్వహిస్తారు. శమీవృక్షాన్ని తీసుకొచ్చి గద్దైపె ఏర్పాటు చేసే హక్కును ముదిరాజ్ కులస్తులకే ఉంది. శమీపూజ సమయంలో పాలపిట్టను దర్శించుకోవడం ఇక్కడి ప్రత్యేకత. ఆకట్టుకునే రావణ సంహారం మానేరుతీరాన గల రాంలీల మైదానంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రావణ సంహారం నిర్వహిస్తా రు. మానేరువాగు ఒ డ్డున ఏర్పాటు 20 అడుగుల ఎత్తులో పదితలల రావణాసురుడి ప్రతి మను దహనం చేసి చె డుపై సాధించిన విజయమే దసరాగా ఉత్సవాలు నిర్వహిస్తారు. చెన్నమనేని వంశస్తులు, ఇతర ముఖ్య అతిథుల చేతుల మీదుగా రావణవధ నిర్వహించడం ఇక్కడ దశాబ్దాలుగా కొనసాగుతోంది. -
ఆత్మీయతలు కనుమరుగయ్యాయి
సిరిసిల్ల: దసరా వచ్చిందంటే పల్లెలు సందడిగా మారిపోతుంటాయి. పుట్టిన ఊరిలోనే పుష్కలంగా ఉపాధి దొరికిన రోజుల్లో అందరూ ఒకే ఇంట్లో కలిసి ఉమ్మడి కుటుంబాలుగా ఉండేవారు. ప్రపంచీకరణ నేపథ్యంలో ఉపాధి వెతుక్కుంటూ పల్లె యువత ఖండాంతరాలు దాటిపోతున్నారు. ఒకప్పుడు నిత్యం సందడిగా ఉన్న పల్లె నేడు పండుగకో.. పబ్బానికో మాత్రమే నిండుగా కనిపిస్తుంది. మూడు దశాబ్దాల క్రితం విద్యాసంస్థలకు దసరా సెలువులు వచ్చాయంటే బంధువులందరూ ఒక్కచోట చేరేవారు. వారం, పది రోజులపాటు పల్లె కళకళలాడేది. పిల్లలకు స్కూల్ సెలవులు.. మహిళలకు బతుకమ్మ.. మగవారికి దసరా.. ఇలా ఆ సరదాలే వేరుగా ఉండేవి. నేడు అంతా మారిపోయింది. ఉపాధి కోసం పట్టణం, విదేశాల్లో స్థిరపడ్డ పిల్లలు ఒక్క రోజు ముందుగా వచ్చి పండుగ మరుసటి రోజే ఉద్యోగమంటూ వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో రాజన్నసిరిసిల్ల జిల్లాలోని సీనియర్ సిటిజన్స్ను ‘సాక్షి’ బుధవారం పలకరించగా.. వారు వెలిబుచ్చిన అభిప్రాయాలు.. ఆనాటి దసరా పండుగ సరదాల ఆవిష్కరణ ఇదీ.. మాది ముస్తాబాద్. ఆ రోజుల్లో దసరా ఎంతో ఉత్సాహంగా సాగేది. ఊరంతా కలిసి పెద్దచెరువు కట్టపైకి వెళ్లేవాళ్లం. అక్కడ పాలపిట్టను చూసి, జమ్మిచెట్టుకు మొక్కి వచ్చేవాళ్లం. కుటుంబ సభ్యులతోపాటు అందరం కలిసేది దసరా పండుగకే. దూరపు బంధువులు, ఎక్కడెక్కడో స్థిరపడిన స్నేహితులు.. ముస్తాబాద్కు వచ్చేది ఈ పండగ రోజే. ఆత్మీయ పలకరింపులతో ఎంతో ఉత్సాహంగా ఉండేది. – రాజూరి శేఖరయ్య, వ్యాపారి, సిరిసిల్ల మాది గంభీరావుపేట మండలం సముద్రలింగాపూర్. కానీ సిరిసిల్లలోనే స్థిరపడ్డాం. మా చిన్నతనంలో ఊరిలో దసరా పండుగ అంటే.. జమ్మిచెట్టు వద్దకు వెళ్లడం, ఊరిలో అందరూ కోలాటం ఆడుతూ.. జడలు వేసి.. విప్పుతూ.. ఎంతో సంబురంగా ఉండేది. జమ్మి ఆకు పెట్టుకుని ఆత్మీయంగా ఆలింగనం చేసుకునే వాళ్లం. ఇప్పుడు ఆనాటి ఆత్మీయత లేదు. బతుకమ్మ పండగకు దాండియా ఆడుతున్నారు. పాటలు పాడేవాళ్లు లేరు.. పండగ విశిష్టతను దెబ్బతీస్తున్నారు. – గంజి బుచ్చిలింగం, సిరిసిల్ల మా చిన్నతనంలో మా నాన్న ఎడ్లబండ్లపై వెళ్లి చెన్నూరు గో దావరి నదిలో స్నానాలు చేసే వాళ్లం. జమ్మి ఆకు(బంగారం) పెట్టుకుని దసరా జరుపుకునేవాళ్లం. శుచి, శుభ్రతకు మా నాన్న ప్రాధాన్యతనిచ్చేవారు. నిజానికి కరోనా వచ్చిన తరువాత కాళ్లు, చేతులు కడుక్కోవడం చూశాం. కానీ మా చిన్నతనంలో మా నాన్న ఇవన్నీ పాటించాలని చెప్పేవారు. దసరా పండుగ పూట స్నేహితులను కలిసేది. అందరం కలిసి భోజనం చేసేది. – శ్రీరాంభట్ల సంతోష్శర్మ, సిరిసిల్ల ఆనాటి సంతోషాలు ఇప్పుడు లేవు. మా చిన్నప్పుడు పండుగ చాలా గొప్పగా జరిగేది. ఆత్మీ యుల మధ్య పిండివంటలతో సందడిగా ఉండేది. దసరా పూ ట జంబీ(బంగారం) పెట్టుకుని ఆత్మీయతను పంచుకుని పులకించి పోయేవాళ్లం. ఊరంతా స్నేహితులతో కలిసి తిరిగేవాళ్లం. ఇప్పు డు అంతా సెల్ఫోన్ యుగమైపోయింది. మన పండుగల ప్రత్యేకత మరుగునపడుతుంది. వరసలు పె ట్టి పిలుచుంటూ ప్రేమగా ఉండేది. ఆనాటి ఆత్మీయతలు లేవు. – కొనుగుల్వార్ శ్రీనివాస్ -
హైదరాబాద్ టీ–20 జట్టుకు శ్రీవల్లి
కరీంనగర్స్పోర్ట్స్/ఇల్లంతకుంట(మానకొండూర్): హైదరాబాద్ మహిళల టీ–20 క్రికెట్ జట్టులో కరీంనగర్కు చెందిన క్రీడాకారిణి కట్ట శ్రీవల్లి చోటు సంపాదించింది. హైదరాబాద్ సీనియర్ మహిళల టీ–20 క్రికెట్ జట్టును క్రికెట్ సంఘం బాధ్యులు బుధవారం ప్రకటించారు. అక్టోబర్ 8 నుంచి మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో బీసీసీఐ టీ20 టోర్నీ ప్రారంభంకానుంది. టోర్నమెంట్లో భాగంగా పాల్గొనే హైదరాబాద్ సీనియర్ మహిళల జట్టులో శ్రీవల్లి చోటు దక్కించుకుంది. శ్రీవల్లి ఎంపికపై కరీంనగర్ జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు ఆగం రావుతోపాటు తల్లిదండ్రులు కట్ట ఉమా–లక్ష్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. శ్రీవల్లి స్వస్థలం రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామం. -
పాడిపంటలు బాగుండాలి
వేములవాడ: పాడిపంటలు బాగుండాలని, వ ర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలు సుఖ సంతో షాలతో ఉండాలని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ఆకాంక్షించారు. బుధవారం పట్టణంలోని ప్రధాన వీధులు, జంబిచెట్టు గద్దె, ప్రధాన కూడళ్ల నుంచి ఎడ్లబండ్ల ర్యాలీ నిర్వహించారు. వైన్స్ షాపులు కిటకిటసిరిసిల్లక్రైం: అక్టోబర్ 2న దసర పండుగ వస్తుండడం.. అదే రోజు గాంధీ జయంతి కావడంతో మాంసం విక్రయిస్తారా.. లేదా.. అనే సందేహాలు నెలకొన్నాయి. దీంతో చాలా మంది ముందస్తుగానే యాట పిల్లలను కొనుక్కొచ్చారు. అంతేకాకుండా బుధవారం రాత్రి జిల్లా వ్యాప్తంగా అన్ని వైన్ షాపుల వద్ద జనం రద్దీ పెరిగింది. గురువారం మద్యం విక్రయాలు ఉండవని ముందస్తుగానే పెద్ద మొత్తంలో మద్యం బాటిళ్లు కొనుక్కెళ్లారు. ఒక్క రోజు ముందే వ్యాపారులకు దసరా కిక్కెక్కింది. -
లండన్లో ఉంటున్నా దసరా సొంతూరిలోనే..
ఇల్లంతకుంట(మానకొండూర్): ఉపాధి కోసం విదేశాలకు వెళ్లినా పుట్టిన ఊరుపై మమకారం, స్నేహితులను కలవాలన్న తపనతో లండన్లో ఉంటున్నా ఏటా బతుకమ్మ, దసరా పండుగలకు స్వగ్రామానికి వస్తామంటున్నారు ఇల్లంతకుంటకు చెందిన అంతగిరి అశోక్కుమార్. మండల కేంద్రానికి చెందిన అంతగిరి అశోక్కుమార్ ఎమ్మెసీ, బీటెక్ పూర్తి చేసి పదిహేనేళ్ల క్రితం లండన్ వెళ్లి స్థిరపడ్డారు. లండన్లోని ప్రభుత్వ కార్యాలయంలో సాఫ్ట్వేర్గా విధులు నిర్వహిస్తూ స్వతంత్రంగా ఐటి కంపెనీ, రెస్టారెంట్ ఏర్పాటు చేసుకొని ఇతరులకు ఉపాధి కల్పిస్తున్నారు. అశోక్కుమార్ మాట్లాడుతూ సొంతూరిపై మమకారంతో దసరా, బతుకమ్మ పండుగలకు వస్తామని, బంధువులు, కుటుంబ సభ్యులను కలుసుకోవడం ఎంతో సంతోషాన్నిస్తుందని తెలిపారు. భార్య అర్చన సాఫ్ట్వేర్ ఉద్యోగి, ఇద్దరు కూతుళ్లు నక్షత్ర, జిష్ణుసాయి సాన్వి. -
రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలి
సిరిసిల్ల: జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్, ఎన్నికల అధికారి ఎం.హరిత సూచించారు. కలెక్టరేట్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్పై రాజకీయపార్టీల ప్రతినిధులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తామన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు ర్యాలీలు, సభలు, ప్రచారాలు నిబంధనల ప్రకారం నిర్వహించుకోవాలని సూచించారు. జిల్లాలో రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, రెండు, మూడో విడతలో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఫిర్యాదుల నమోదుకు కలెక్టరేట్లో హెల్ప్లైన్, ఫిర్యాదుల కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు లేవనెత్తిన సందేహాలకు అధికారులు సమాధానం ఇచ్చారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, సిరిసిల్ల ఆర్డీవో సీహెచ్ వెంకటేశ్వర్లు, జెడ్పీ డిప్యూటీ సీఈవో గీత, డీపీవో షరీఫొద్దీన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పార్టీ నాయకులు తీగల శేఖర్గౌడ్, గజభీంకార్ రాజన్న తదితరులు పాల్గొన్నారు. -
● ఈటలపై హుజూరాబాద్ బీజేపీ శ్రేణుల ఫిర్యాదు ● పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడంటూ రాష్ట్ర అధ్యక్షుడికి ఏకరువు ● ఇతర పార్టీల నుంచి అనుచరులకు టిక్కెట్లు ఇప్పిస్తాననడంపై మండిపడుతున్న నాయకులు
బీజేపీలో రచ్చకెక్కుతున్న విభేదాలు!సాక్షిప్రతినిధి, కరీంనగర్: భారతీయ జనతా పార్టీలో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్పై స్థానిక పార్టీ శ్రేణులు రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదులు అందజేశారు. గతంలో శామీర్పేట్లో హుజూరాబాద్ కేడర్తో సమావేశం ఏర్పాటు చేసి పార్టీపై, పార్టీలో ముఖ్య నాయకులపై ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. ఇటీవల హనుమకొండ జిల్లా కమలాపూర్లో లోకల్ బీజేపీ లీడర్లతో సమావేశమై స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ టికెట్ రాకుంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి టికెట్ ఇప్పిస్తానని హామీ ఇవ్వడం కలకలం రేపింది. బీజేపీలో ఉంటూ మరో పార్టీ టికెట్ ఇప్పిస్తానని ఈటల ఎలా హామీ ఇస్తారంటూ మండిపడుతున్నారు. కొత్త నేతలు, పాత నాయకులంటూ ఈటల రెండు వర్గాలుగా పార్టీ శ్రేణులను విభజిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, తన అనుచరులకు ఇతర పార్టీల నుంచైనా టికెట్లు ఇప్పిస్తానని హామీ ఇస్తున్నారని సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది బీజేపీనా? లేక ఈటల వ్యక్తిగత దుకాణమా? అని కొంతమంది నాయకులు చర్చించుకుంటున్నారు. ఈటల చర్యలపై అసంతృప్తిగా ఉన్న పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డితోపాటు మరికొంతమంది నాయకులు రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావును కరీంనగర్లో కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. హుజూరాబాద్లో బీజేపీని బలహీనపరుస్తూ వ్యక్తిగత అనుచరులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కొంతమంది సీనియర్ నాయకులు కూడా ఈటల వ్యవహరిస్తున్న తీరుపై మండిపడుతున్నారని తెలిసింది. అంతర్గత విభేదాలు ఇలానే కొనసాగితే రానున్న ఎన్నికల్లో ఈటల విధానం పార్టీకి ముప్పు తెస్తుందని బీజేపీ సీనియర్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతర్గతంగా ఈటలను కట్టడి చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. ఓ వైపు స్థానికసంస్థల్లో బలం పెంచుకొని రాబోయే అసెంబ్లీ ఎ న్నికల్లో అధికారంలోకి రావాలని కలలు కంటున్న బీజేపీ, మరోవైపు ఈటల మార్క్ రాజకీయాలతో ఇబ్బందుల్లో పడుతుందని పేర్కొంటున్నారు. పార్టీలో అంతర్గత విభేదాలతో రానున్న ఎన్నికల్లో బీజేపీకి ప్రతికూల ఫలితా లు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇక ఈటలపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వం ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకుంటుందో అన్నది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. -
హంస వాహనంపై స్వామి
సిరిసిల్లటౌన్: శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మూడు రోజులుగా సాగుతున్న బ్రహ్మోత్సవాల్లో బుధవారం మూలమంత్ర, మహామంత్ర హోమాలు, నిత్యపూర్ణాహుతి, నిత్యారాధన నిర్వహించారు. రాత్రి 9 గంటలకు హంస వాహనంపై శ్రీదేవి, భూదేవి సహిత శ్రీనివాసుడుని తిరువీధుల్లో ఊరేగించారు. గోవింద నామస్మరణతో మాఢవీదులు మారుమోగాయి. ఆలయ ఈవో మారుతిరావు, ఏఈవో పీసరి రవీందర్, కూనబోయిన సత్యం, అర్చకస్వాములు కృష్ణ్ణమాచారి, వర్ధనాచారి, టీపీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, ఆలయ మాజీ చైర్మన్లు ఉప్పుల విఠల్రెడ్డి, మాజీచైర్మన్లు తీగల శేఖర్గౌడ్, చేపూరి నాగరాజు పాల్గొన్నారు. -
అందరికి విజయాలు చేకూర్చాలి
● ఎస్పీ మహేశ్ బీ గీతే ● డీపీవోలో ఆయుధ, వాహన పూజ సిరిసిల్లక్రైం: విజయదశమి పండుగ ప్రజలకు విజయం చేకూర్చాలని ఎస్పీ మహేశ్ బీ గీతే ఆకాంక్షించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని ఆర్మ్డు రిజర్వ్ విభాగంలో బుధవారం ఆయుధ, వాహనపూజ నిర్వహించారు. దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులకు, సిబ్బందికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రశేఖర్రెడ్డి, ఆర్ఐలు మధుకర్, యాదగిరి, సీఐలు కృష్ణ, నాగేశ్వరావు, మధుకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మహాగౌరిగా అమ్మవారు
వేములవాడ: దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం రాజన్న సన్నిధిలో అమ్మవారు మహాగౌరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పురాణ నిధి యాప్ ఆవిష్కరణకరీంనగర్ కల్చరల్: దేవతా స్త్రోత్రాలతోపాటు పురాణ గాథలన్నీ సామాన్యులకు సైతం అర్థమయ్యేలా రూపొందించిన ‘పురాణ నిధి’ యాప్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పండితులు మంగళంపల్లి వేణుగోపాలశర్మ, పురాణం మహేశ్వరశర్మతో కలిసి మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. దేవతలు, హిందూ శాస్త్రాలకు సంబంధించి సామాన్యుల్లో నెలకొన్న అనేక సందేహాలను ఈ యాప్ ద్వారా నివృత్తి చేస్తుండటం సంతోషించదగ్గ పరిణామమన్నారు. గంభీరావుపేట(సిరిసిల్ల): గంభీరావుపేట సహకార సంఘ సభ్యులకు త్వరలో 8శాతం డీవిడెండ్ చెల్లించనున్నట్లు నాఫ్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు తెలిపారు. మంగళవారం నిర్వహించిన సంఘం మహజన సభలో మాట్లాడారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో సంఘం రూ.43కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిపి రూ. 36 లక్షల లాభాలు ఆర్జించడం జరిగిందన్నారు. వీటి నుంచి రూ.16లక్షలకు పైగా డీవిడెండ్ రూపంలో సభ్యుల వాటా ధనం ప్రకారం వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు. సభ్యుల సహకారం, నిబద్ధత, విశ్వాసం వల్లే సంఘం విజయపరంపర కొనసాగుతోందన్నారు. సహకార సంఘాల ద్వారా వరి ధాన్యం కొనుగోలు జరిగేలా చూడాలని సభలో సభ్యులు, రైతులు తీర్మానం చేశారు. దానిని జిల్లా ఉన్నతాధికారులకు పంపించనున్నట్లు తెలిపారు. సంఘ పరిధిలో 3,910 మంది సభ్యులుండగా, 1,491 మంది మాత్రమే క్రియాశీలకంగా ఉన్నారని, సభ్యులు పీఎం జీవన్ జ్యోతి, పీఎం సురక్ష బీమా చేయించుకోవాలని, ఆపద సమయంలో కుటుంబానికి ఆసరగా ఉంటాయన్నారు. సహకార శాఖ నోడల్ అధికారి గౌస్, వైస్ చైర్మన్ రామానుజాగౌడ్, బ్యాంక్ ప్రతినిధి శ్రీనివాస్రెడ్డి, సెస్ డైరెక్టర్ నారాయణరావు, సీఈవో రాజిరెడ్డి, డైరెక్టర్లు , నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
దావత్ షురూ!
‘తమ్మీ.. మన కులపెద్ద మనుషులతో మాట్లాడు.. దసరాకు యాటను కొనిస్త.. మీ కులసంఘంలోని ప్రతీఇంటికి పోగు చేరేలా నువ్వే చూసుకో.. ముఖ్యమైనోళ్లు ఉంటే చెప్పు.. వారికి క్వార్టర్ మందు కూడా ఇద్దాం.. ఎన్నికలప్పుడు ఓటుకు పైసలు గూడా ఇచ్చుడే.. కానీ గంపగుత్తగా ఓట్లు నాకే పడాలే.. మల్లా ఎవరికీ మాటివ్వకు’ – ఓ గ్రామానికి చెందిన సర్పంచ్ స్థానం ఆశావహుడి ఆఫర్ ‘అన్నా.. పార్టీలో కొన్నేళ్లుగా కష్టపడి పనిచేస్తున్న.. అధికారంలో ఉన్నా, లేకున్నా పార్టీతోనే ఉన్న.. ఇప్పుడు రిజర్వేషన్ కలిసొచ్చింది.. ఎమ్మెల్యే కూడా నాకు టికెట్ కన్ఫర్మ్ చేసిండు.. ఎంతఖర్చయినా పర్లేదు పెడత.. నాకు ఫుల్సపోర్ట్ జేస్తే.. జెడ్పీటీసీగా గెలుస్త’ – ముఖ్య నేతలతో దావత్ ఇస్తూ ఓ జెడ్పీటీసీ ఆశావహుడి వేడుకోలుసాక్షి పెద్దపల్లి: ఎన్నికలు అంటే సుక్క.. దసరా అంటే ముక్క.. ఇప్పుడు ఈ రెండు పెద్దపండుగలు కలిసే వచ్చా యి. పైగా రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. పండుగ సందర్భంగా ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ఆశావహులు ప్రలో భాలకు తెరతీస్తున్నారు. గ్రామాల్లో కులపెద్దలు, నలుగురిని ప్రభావితం చేసే కార్యకర్తలను మద్యంతో దావత్లు షురూ చేశారు. దసరా సందర్భంగా ఓటర్లకు మటన్పోగులు పంచిపెడుతూ ఖుషీ చేసేందుకు గ్రౌండ్వర్క్ చేసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా స్థానిక ఎన్నికలు జరిగే పల్లెల్లో ఎన్నికల వాతావరణం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మరికొందరు దసరా పండుగ రోజు రావణవధ కార్యక్రమాన్ని తమ సొంత డబ్బుతో భారీఎత్తున నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్నారు. మామూళ్లతో ముచ్చెముటలు తెలంగాణలో అతి పెద్దపండుగ దసరాకు నేతలు, ఊరులో పలుకుబడి కలిగినవారు తమ అనుచరులకు, తమ వద్ద పని చేసుకునేవారికి పండుగ సందర్భంగా ఎంతోకొంత దావత్ చేసుకునేందుకు డబ్బు లు ఇస్తుంటారు. కొన్నేళ్లుగా ఇది ఆనవాయితీగా వస్తోంది. పండుగ సమయంలోనే ఎన్నికలు రావడడంతో అడిగిన ప్రతీఒక్కరికి ఎంతోకొంత ముట్టజెప్పాల్సిన పరిస్థితి నెలకొందని ఆశావహులు తలలు పట్టుకుంటున్నారు. ఊళ్లకు లిక్కర్.. యథేచ్ఛగా బెల్ట్షాప్ల రన్ దసరా పండుగ రోజు వైన్స్షాప్లు మూసిఉంటాయి. ఆరోజు మహాత్మా గాంధీ జయంతి కావడంతో మాంసం, మద్యం విక్రయాలు ఉండవు. దీంతో తొలుత లిక్కర్ను పల్లెల్లోని బెల్ట్షాపులకు తరలిస్తుండగా, మరికొందరు నేతలు వైన్స్ షాప్లకు అడ్వాన్స్ చెల్లించి క్వార్టర్స్ను తమకు నమ్మకస్తుడైన లీడర్లకు చెందిన నివాసాలు, వ్యవసాయ పొలాల్లోకి డంప్ చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతోనే కోడ్ అమల్లోకి వచ్చినా.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పల్లెల్లో బెల్ట్షాపులు 24గంటలపాటు తెరిచే ఉంటున్నాయి. ఎన్నికల్లో మద్యం విక్రయాలు జోరుగా సాగుతాయనే ఆశతో బెల్ట్షాపు వ్యాపారులు భారీగా మద్యం డంప్ చేసుకుంటున్నారు. అధికార యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోందనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి.ఆశావహులు తమ గెలుపు కోసం ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ఆయా రాజకీయ పార్టీల్లోని ఆశావహులు.. కులసంఘాల ఆధారంగా మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కులంలో ఉన్నఓట్ల ఆధారంగా యాటలను కోయించి, ఇంటింటికీ మటన్ పోగులు పంపించేలా ప్లాన్ చేస్తున్నారు. పండుగపూట మచ్చిక చేసుకోకపోతే ఎన్నికల్లో ఫలితం బెడిసి కొడుతుందని.. ఒకరినిచూసి మరొకరు మద్యం, మాసం పంచేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికలు జరుగుతాయో, వాయిదా పడుతాయో అనే సందిగ్ధంలో ఉన్నా.. అశావహులు ఖర్చుకు భయపడకుండా వర్గాల వారీగా ఓటర్లను ఆకట్టుకునేందుకు వెనకాడడంలేదు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 60 జెడ్పీటీసీ, 646 ఎంపీటీసీలు, 1,226 పంచాయతీల్లో ఐదు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. -
రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ..
● రెండు, మూడో విడతలో పంచాయతీ ఎన్నికలు ● షెడ్యూల్ విడుదల చేసిన కలెక్టర్ హరిత సిరిసిల్ల: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను కలెక్టర్ ఎం.హరిత మంగళవారం విడుదల చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రెండు విడతల్లో, గ్రామపంచాయతీ ఎన్నికలు రెండు, మూడు విడతల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం ఎంపీటీసీ 123, జెడ్పీటీసీ 12 స్థానాలు ఉన్నాయని వెల్లడించారు. మొత్తం 260 గ్రామపంచాయతీలు, 2,268 వార్డులు ఉన్నాయని తెలిపారు. ● మొదటి విడతలో ఎన్నికలు జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు బోయినపల్లి, 11 స్థానాలు, 60 పోలింగ్ కేంద్రాలు. చందుర్తి, 10 స్థానాలు, 54 పోలింగ్ కేంద్రాలు. రుద్రంగి 5 స్థానాలు, 27 పోలింగ్ కేంద్రాలు. వేములవాడ అర్బన్ 6 స్థానాలు, 36 పోలింగ్ కేంద్రాలు. వేములవాడ రూరల్ 7 స్థానాలు, 40 పోలింగ్ కేంద్రాలు. కోనరావుపేట 12 స్థానాలు, 70 పోలింగ్ కేంద్రాలు. ఇల్లంతకుంట 14 స్థానాలు, 90 పోలింగ్ కేంద్రాలు. మొత్తం 65 స్థానాలు, 377 పోలింగ్ కేంద్రాలు. ● రెండో విడతలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు – తంగళ్ళపల్లి 14 స్థానాలు, 77 పోలింగ్ కేంద్రాలు. ఎల్లారెడ్డిపేట 13 స్థానాలు, 85 పోలింగ్ కేంద్రాలు. వీర్నపల్లి 5 స్థానాలు, 26 పోలింగ్ కేంద్రాలు. ముస్తాబాద్ 13 స్థానాలు, 75 పోలింగ్ కేంద్రాలు. గంభీరావుపేట 13 స్థానాలు, 69 పోలింగ్ కేంద్రాలు. మొత్తం 58 స్థానాలు, 332 పోలింగ్ కేంద్రాలు. ● రెండో విడతలో నిర్వహించే జీపీ స్థానాలు – గంభీరావుపేట జీపీలు 22, పోలింగ్ కేంద్రాలు 202. ముస్తాబాద్ జీపీలు 22, పోలింగ్ కేంద్రాలు 202. తంగళ్ళపల్లి జీపీ 30, పోలింగ్ కేంద్రాలు 2 52. ఇల్లంతకుంట జీపీ 35, పోలింగ్ కేంద్రాలు 294. కోనరావుపేట జీపీ 28, పోలింగ్ కేంద్రాలు 238. మొత్తం 137 జీపీ, 1188 పోలింగ్ కేంద్రాలు. ● మూడో విడతలో నిర్వహించే జీపీ స్థానాలు – వేములవాడ అర్బన్ జీపీలు 11, పోలింగ్కేంద్రాలు 104. రుద్రంగి జీపీలు 10, పోలింగ్ కేంద్రాలు 86. చందుర్తి జీపీలు 19, పోలింగ్కేంద్రాలు 174. వేములవాడ రూరల్ జీపీలు 17, పోలింగ్ కేంద్రాలు 146. బోయినపల్లి జీపీలు 23, పోలింగ్ కేంద్రాలు 212. వీర్నపల్లి జీపీలు 17, పోలింగ్ కేంద్రాలు 132. ఎల్లారెడ్డిపేట జీపీలు 26, పోలింగ్ కేంద్రాలు 226. మొత్తం 123 జీపీలు, 1,080 పోలింగ్ కేంద్రాలు. -
నిష్పక్షపాతంగా ఎన్నికల విధులు
● కలెక్టర్ ఎం.హరిత సిరిసిల్ల: జిల్లాలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారులు నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ ఎం.హరిత కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎంసీసీ)పై జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలకు కలెక్టరేట్లో మంగళవారం శిక్షణ నిర్వహించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో అధికారులు, సిబ్బంది పాల్గొన కూడదని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత రూ.50 వేల కంటే ఎక్కువ డబ్బు తరలిస్తే పట్టుకొని, వీడియో తీసి పంచనామా చేయాలని, అనంతరం డబ్బుకు సంబంధించి రసీదు అందజేయాలని సూచించారు. ఎంసీసీ నోడల్ ఆఫీసర్గా డీఆర్డీవో శేషాద్రిని నియమించారు. వేములవాడ ఆర్డీవో రాధాబాయి, జెడ్పీ సీఈవో వినోద్కుమార్, డీపీవో షరీఫోద్దీన్, ఎన్నికల మాస్టర్ ట్రైనర్ పాతూరి మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆది శేషునిపై దేవదేవుడు
శేష వాహనంపై విహరిస్తున్న స్వామివారలు సిరిసిల్లటౌన్: భక్తల నీరాజనాలతో శ్రీశాల పురవీధుల్లో దేవదేవుడు ఆదిశేషుని వాహనంపై విహరించారు. మంగళవారం సిరిసిల్ల శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు రెండోరోజు ఘనంగా నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి ఆలయంలో రక్షాబంధనము, రుత్విక్వరణము, అంకురారోపణము, ధ్వజా రోహనము రాత్రి 7గంటలకు భేరిపూజ, అగ్నిప్రతిష్ట తదితర పూజలు చేశారు. రాత్రి 9 గంటలకు శ్రీదేవి, భూదేవి సహితంగా వేంకటేశ్వరస్వామిని శేషవాహనంపై ఊరేగించారు. ఈవో మారుతిరావు, ఏఈవోలు కూనబోయిన సత్యం, పీసరి రవీందర్, ప్రధాన అర్చకస్వామి కృష్ణ్ణమాచారి, టీపీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, ఆలయ మాజీచైర్మన్లు ఉప్పుల విఠల్రెడ్డి, చేపూరి నాగరాజు, తీగల శేఖర్గౌడ్, పెద్ది శ్రీనివాస్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
ఈసారి గతానికి భిన్నంగా.. మరో ఛాన్స్ లేదు గురూ!
సిరిసిల్ల: స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో పల్లెల్లో రాజకీయ సందడి నెలకొంది. గతానికి భిన్నంగా రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఆశావహులు ఒక్కసారిగా ఎన్నికల బరిలో నిలిచేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.గతానికి భిన్నంగా..గతంలో ముందుగా ఒక్క నోటిఫికేషన్ జారీ అయ్యేది. అయితే ఎంపీటీసీ ఎన్నికలు, లేదా సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో ఏదో ఒక్కటి ముందు జరిగేవి. ఇలా జరగడం మూలంగా ముందుగా వచ్చిన ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఆ ఎన్నికల్లో మంచి ఓట్లు సాధించి, దరి దాపుల్లోకి వచ్చి ఓడిపోయినవారు.. మరోసారి వెంటనే వచ్చే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే అవకాశం ఉండేది. కానీ ఈ సారి “సానుభూతి’ చాన్స్ లేకుండానే నేరుగా ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ వెంటనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఫలితంగా ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు “సానుభూతి’ని మూటగట్టుకునే చాన్స్ లేకుండా పోయింది. రెండు ఎన్నికల్లో పోటీ చేసి అదృష్టాన్ని పరీక్షించుకోవాలి పరిస్థితి నెలకొంది. రెండింటికీ పోటీ చేస్తే.. నెగెటివ్ ఫలితాలు వస్తాయని కొందరు భావిస్తున్నారు. మొదటి ఎన్నికల్లో ఓడి.. రెండో ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఈ సారి లేవు. గతంలో చాలా మంది అభ్యర్థులు సర్పంచ్ పదవికి ఓడిపోయి, మళ్లీ ఎంపీటీసీ ఎన్నికల్లో గెలిచారు. ముందుగా ఎంపీటీసీగా ఓడిపోయి, తర్వాత సర్పంచ్గా గెలిచిన ఘటనలు ఉన్నాయి. ఈ సారి ఆ అవకాశం లేకుండా పోయింది. ఏది ఏమైనా ఈ సారి స్థానిక సంస్థల ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి.పార్టీ నేతలకు తలపోట్లుఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ పరంగా జరుగుతుండగా.. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు పార్టీ రహితంగా సాగుతాయి. ఈ నేపథ్యంలో ఒకేసారి అటు ఎంపీటీసీ, సర్పంచ్ అభ్యర్థులను ఆయా పార్టీ నేతలు ఎంపిక చేయాల్సి వస్తుంది. రెండు వేర్వేరుగా నోటిఫికేషన్లు వస్తే.. ఆయా పార్టీలకు కొంత సమయం దొరికి అభ్యర్థుల ఎంపిక సులభంగా ఉండేది. కానీ, ఇప్పుడు ఏకకాలంలో ఎన్నికలు రావడంతో ఒక్క ఊరిలో ఎంపీటీసీ అభ్యర్థిని, సర్పంచ్ అభ్యర్థిని, మండల స్థాయిలో జెడ్పీటీసీ అభ్యర్థిని, మళ్లీ గ్రామస్థాయిలో వార్డు సభ్యులను ప్యానల్గా నిలపాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో అన్ని పార్టీలకు ఈ జమిలి నోటిఫికేషన్ తలనొప్పిగా మారింది.రెండు విడతల్లో ఎంపీటీసీ, మూడు విడతల్లో సర్పంచ్రెండు విడతల్లో ఎంపీటీసీ, మూడు విడతల్లో సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు అధికారులు రంగం సిద్ధం చేశారు. మొదటి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు అక్టోబరు 11న నామినేషన్లు వేసేందుకు చివరి రోజు కాగా, అక్టోబరు 23న ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడత ఎన్నికలకు అక్టోబరు 15న నామినేషన్లకు చివరి రోజు. 27న రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు నవంబరు 11న వెలువడుతాయి. ఎన్నికలు జరిగిన తర్వాత ఫలితాల కోసం పక్షం రోజులు నిరీక్షించాల్సిన పరిస్థితి ఎదురైంది. అదే సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు అక్టోబరు 31, నవంబరు 4, 8వ తేదీల్లో మూడు విడతల్లో పూర్తి కానున్నాయి. ఎన్నికలు జరిగిన రోజు సాయంత్రమే ఫలితాలు వెలువడుతాయి. మొత్తంగా ఒకేసారి స్థానిక సంస్థల ఎన్నికలు వేగంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను జారీ చేస్తూ ఎన్నికల కోడ్ను అమలులోకి తెచ్చింది. -
ఇక సంగ్రామమే..
జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ మొత్తం జెడ్పీ చైర్మన్ కరీంనగర్ 03 00 06 06 15 బీసీ(జనరల్) సిరిసిల్ల 03 01 05 03 12 ఎస్సీ(జనరల్) జగిత్యాల 04 01 09 06 20 మహిళ(జనరల్) పెద్దపల్లి 06 03 00 04 13 మహిళ(జనరల్)సాక్షిప్రతినిధి, కరీంనగర్: సా్థనిక ఎన్నికలకు నగారా మోగింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీతోపాటు గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. తొలుత రెండు దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ.. తదుపరి మూడు దశల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. వచ్చే నెల 9నుంచి నవంబర్ 11వరకు ఎన్నికల పక్రియ కొనసాగనుంది. 33 రోజుల పాటు కోడ్ అమల్లో ఉండనుంది. పల్లెల్లో రాజకీయ సందడి జోరందుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ గెలుపే లక్ష్యంగా గ్రామాల వారీగా బలమైన అభ్యర్థుల కోసం వెతుకులాట ప్రారంభించగా, ఆశావహులు ఒక్కచాన్స్ ఇవ్వండంటూ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గతంకు భిన్నంగా... ఎప్పుడైనా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చే శాక, పంచాయతీ ఎన్నికలు నిర్వహించేవారు. ఈసారి రెండు ఎన్నికలను కలిపి నిర్వహిస్తుండటంతో పోటీ చేసి ఓడిపోతే ఇంట్లోనే కూర్చోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆశావహులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 646 ఎంపీటీసీ, 60 ఎంపీపీ, 60 జెడ్పీటీసీలకు, 1,226 సర్పంచ్ స్థానాలకు, 5,968 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం సీట్ల ల్లో 50శాతం తగ్గకుండా మహిళలకు కేటాయించారు. ముగ్గురు పిల్లలుంటే అనర్హులే.. కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించేందుకు 1994లో పంచాయతీరాజ్ చట్టంలో ఈ నిబంధన తీసుకొచ్చారు. దీని ప్రకారం ముగ్గురు పిల్ల లుంటే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు. తాజాగా ప్రభుత్వం ఈ నిబంధన ఎత్తివేయాలని ఆలోచించినా పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 21(3)ని సవరించలేదు. దీంతో ముగ్గురు పిల్లలు నిబంధన యథాతథంగా ఉండనుంది. కోర్టులో ఉండడంతో.. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రామచంద్రపల్లి, కుర్మపల్లి గ్రామాల విషయం కోర్టు పరిధిలో ఉండగా రిజర్వేషన్ ప్రక్రియ చేపట్టలేదు. మరోవైపు జిల్లా రిజర్వేషన్ల ప్రక్రియ వివరాలు వెల్లడించేందుకు జిల్లా పంచాయతీ అధికారి, డీపీఆర్వో సుముఖత చూపలేదు.జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ మొత్తం కరీంనగర్ 03 00 06 06 15 సిరిసిల్ల 03 01 05 03 12 జగిత్యాల 04 01 08 07 20 పెద్దపల్లి 05 03 00 05 13జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ మొత్తం సిరిసిల్ల 53 30 101 76 260 జగిత్యాల 68 31 153 133 385 పెద్దపల్లి 54 06 110 93 263 కరీంనగర్ – – – – –జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ మొత్తం కరీంనగర్ 39 00 73 58 170 సిరిసిల్ల 25 07 56 35 123 జగిత్యాల 26 07 52 41 126 పెద్దపల్లి 25 03 59 50 137 -
స్థానిక సమరానికి బీజేపీ సై
● ఢిల్లీలోనే కాదు గల్లీలోనూ కాషాయ జెండా ఎగరేయబోతున్నాం ● కరీంనగర్, సిరిసిల్ల జెడ్పీ పీఠాలను కై వసం చేసుకుంటాం ● కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ టౌన్: స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి బీజేపీ సిద్ధంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన కరీంనగర్ పార్లమెంట్ ప్రజల కోసం, కాషాయ జెండాను నమ్ముకున్న కార్యకర్తలను గెలిపించడం కోసం ఢిల్లీ ఎన్నికల్లోనే కాదు గల్లీ ఎన్నికల్లోనూ కొట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. కరీంనగర్, సిరిసిల్ల జిల్లా పరిషత్ పీఠాలపై కాషాయ జెండా ఎగరేసి తీరుతాం అని స్పష్టం చేశారు. పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న కార్యకర్తలకే ఈసారి ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో టిక్కెట్లు ఇస్తామని ప్రకటించారు. అభ్యర్థుల ఎంపిక కోసం ఇప్పటికే సర్వే టీంలు ఒక దఫా సర్వే పూర్తి చేశాయని, రిజర్వేషన్లు ఖరారైన నేపథ్యంలో సర్వే టీంలు రంగంలోకి దిగాయని అన్నారు. రిజర్వేషన్ల మూలంగా టిక్కెట్లు రాకపోయినా నిరాశ చెందవద్దని... వారికి పార్టీలో, ఇతరత్రా పదవుల్లో సముచిత స్థానం కల్పించి గౌరవిస్తామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడాన్ని భారతీయ జనతా పార్టీ పక్షాన స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. -
చిమ్మచీకటి.. బురద
చందుర్తి(వేములవాడ): చందుర్తి మండలం ఎన్గల్ గ్రామంలోని ఎస్సీ కాలనీలో అంధకారం నెలకొంది. బురదతో రోడ్డు అధ్వానంగా మారింది. వీధి దీపాలు లేక ఇరవై రోజులు గుడుస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు. ఐదు మాసాల క్రితం కాలనీలో సీసీ రోడ్డు వేస్తామని, రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించి గుంతలను చదును చేసి సిద్ధం చేయగా, గడువు దాటిపోయిందని, పనులను నిలిపి వేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయడంతో ఆ పనులు చేయకుండానే నిలిచి పోయాయి. దీంతో చిన్నపాటి వర్షం పడినా రోడ్డంతా బురదమయంగా మారుతోందని, దీనికి తోడు వీధి దీపాలు లేక తిప్పలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఎస్సీ కాలనీలో సమస్యలు తీర్చాలని కోరారు. -
సంస్కృతికి ప్రతీక బతుకమ్మ
చందుర్తి (వేములవాడ): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగా ప్రతీక అని నందిగామ అదనపు జూనియర్ సివిల్ జడ్జి గడ్డం వందన అన్నారు. వృత్తిరీత్యా ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా నందిగామ కోర్టులో అదనపు జూనియర్ సి విల్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం స్వగ్రామం చందుర్తి మండలం బండపల్లిలో తోటి మహిళలతో సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. వృత్తిరీత్యా ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా పుట్టిన పెరిగిన గ్రామస్తులతో సంబరాలు జరుపుకోవడం అదృష్టమన్నారు. పూలను పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణలో ఉందన్నారు. అనంతరం దుర్గామాత సన్నిధిలో జడ్జి వందనను గ్రామస్తులు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గడ్డం సత్యనారాయణరెడ్డి, వీడీసీ చైర్మన్ కటకం చంద్రయ్య, మాజీ సర్పంచ్ కటకం మల్లేశం, రెడ్డి సంఘం అధ్యక్షుడు గడ్డం రాజిరెడ్డి, తాడిశెట్టి తిరుపతిరెడ్డి, గడ్డం శ్రీనివాస్రెడ్డి, ఏనుగు లచ్చిరెడ్డి, గంప పవన్, బుర్ర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
● విప్ ఆది శ్రీనివాస్ కోనరావుపేట(వేములవాడ): అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. సోమవారం మండలంలోని నిజామాబాద్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి మాట్లాడారు. గ్రామాల్లో నాడు కాంగ్రెస్ ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లే తప్ప పదేళ్లలో గత ప్రభుత్వం ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కూడా కట్టించలేదని విమర్శించారు. ప్రజా ప్రభుత్వంలో పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ ఫిరోజ్పాషా, కిసాన్సెల్ జిల్లా అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్రెడ్డి, విండో చైర్మన్ బండ నర్సయ్య, మాజీ సర్పంచ్ అరుణ, నాయకులు చేపూరి గంగాధర్, గోపాల్, శోభన్, లంబ రాజు, బొర్ర రవి, లక్ష్మణ్, గొట్టె రుక్మిణి, కర్రోల్ల భాస్కర్, దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ భవనాలకు రూ.3.48 కోట్లు వేములవాడ: వేములవాడ నియోజకవర్గంలోని అంగన్వాడీ భవనాలకు రూ.3.48 కోట్ల నిధులు మంజూరైనట్లు విప్ ఆది శ్రీనివాస్ సోమవారం తెలిపారు. రుద్రంగి మండల పరిధిలోని అంగన్వాడీ సెంటర్ల నిర్మాణానికి రూ.1.08 కోట్లు, కోనరావుపేట మండల పరిధిలో రూ.96 లక్షలు, చందుర్తి మండల పరిధిలో రూ.36 లక్షలు, వేములవాడ అర్బన్ పరిధిలో రూ.36 లక్షలు, వేములవాడ రూరల్ పరిధిలో రూ.36 లక్షలు, మేడిపల్లి మండలంలోని ఎస్సీకాలనీ, భీమారం మండలం పసునూరులో, కథలాపూర్ మండలం అంబారిపేటలో భవనాలకు రూ.36 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. వేములవాడ రూరల్మండలం తుర్కాశినగర్, వట్టెం గ్రామపంచాయతీల నిర్మాణానికి రూ.40 లక్షలు, వేములవాడ అర్బన్ మండలం చంద్రగిరి పంచాయతీ కోసం రూ.20 లక్షలు, కోనరావుపేట మండలం శివంగలపల్లి పంచాయతీ కోసం రూ.20 లక్షలు, చందుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రహరీ నిర్మాణానికి రూ.12.50 లక్షలు, కోనరావుపేట జూనియర్ కళాశాల ప్రహరీ కోసం రూ.19.60 లక్షలు, కథలాపూర్ మండల కేంద్రంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణానికి రూ.17.50 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. న్యాయ నిర్మాణ భవన్ నమూనాసిరిసిల్లకల్చరల్: జిల్లా కేంద్రంలో నిర్మించ తలపెట్టిన న్యాయ నిర్మాణ భవన్ నమూనా ఇది. ప్రధాన ముఖ ద్వారానికి రెండు వైపులా ఐదేసి అంతస్తుల్లో సుమారు రూ.82 కోట్ల వ్యయంతో రూపుదిద్దుకోనుంది. ఒక్కో అంతస్తులో మూడు కోర్టు హాళ్లు, బార్ అసోసియేషన్ హాల్, లైబ్రరీ, వాష్రూములు, విశ్రాంతి గదులను నిర్మించనున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో సుమారు 300 కార్లకు పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించనున్నారు. -
బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ హరిత
● శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ మహేశ్ బీ గీతే అదనపు కలెక్టర్, జిల్లా అధికారులుసిరిసిల్ల: జిల్లా కలెక్టర్గా ఎం.హరిత సోమవారం విధుల్లో చేరారు. కలెక్టరేట్లో బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్కు అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. వేములవాడ ఆలయ ఈవో రమాదేవి ఆ ధ్వర్యంలో ఆలయ అర్చకులు వేదమంత్రాలతో కలెక్టర్కు ఆశీర్వాదం, రాజన్న ప్రసాదం అందించారు. అనంతరం వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, సిబ్బంది కలెక్టర్ను మర్యాదపూర్వకంగా క లిసి పుష్పగుచ్ఛాలు అందించారు. అలాగే కలెక్టర్ను జిల్లా టీఎన్జీవోఎస్ ప్రతినిధులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అధ్యక్షుడు, ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ఎలుసాని ప్రవీణ్కుమార్, ట్రెస్సా జిల్లా అధ్యక్షుడు జయంత్కుమార్, ఏఎస్వో జిల్లా అధ్యక్షుడు సుమన్, ఏఈఓఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్, పంచాయతీ కార్యదర్శుల జిల్లా అధ్యక్షుడు అనిల్కుమార్, హాస్టల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. పుష్పగుచ్ఛం అందజేత సిరిసిల్ల క్రైం/సిరిసిల్లఅర్బన్: కలెక్టర్గా హరిత బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ మహేశ్ బీగీతే మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే టీజీవో అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. టీజీవో జిల్లా అధ్యక్షుడు సమరసేన్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ హరితకు పూలమొక్క అందిస్తున్న ఎస్పీ మహేశ్ బీ గీతే, అదనపు కలెక్టర్ నగేశ్ -
మార్కెట్కు బతుకమ్మ కళ
సిరిసిల్లటౌన్: పండుగకు ఒకరోజు ముందే కార్మికక్షేత్రం సిరిసిల్ల సద్దుల బతుకమ్మ శోభను సంతరించుకుంది. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు గాంధీచౌక్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు, మార్కెట్, పాతబస్టాండు, పెద్దబజార్, కొత్తబస్టాండు, రైతుబజార్, గోపాల్నగర్ తదితర ప్రాంతాల్లో పూల విక్రయాలు కొనసాగాయి. రోడ్లపై విక్రయాలు సాగడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. కాగా ఈసారి బతుకమ్మ పూలు ప్రియమయ్యాయి. గునుగపూవు(మూడుకట్టలు) రూ.50, తంగేడు(మూడు కట్టలు) రూ.50, అడవిచామంతి(మూడుకట్టలు) రూ. 60, పట్టుకుచ్చులు(మూడుకట్టలు) రూ.100 చొప్పున అమ్మకాలు జరిగాయి. ఇవిగాక బతుకమ్మకు కావాల్సిన అన్నిరకాల పూలు తక్కువగా పూయడంతో డిమాండ్ పెరిగింది. -
మద్దిమల్లతండాలో బీసీ మహిళకు చోటు
● ఊరంతా గిరిజనులే.. ● రిజర్వేషన్పై అవాకై ్కన పల్లె ప్రజలువీర్నపల్లి(సిరిసిల్ల): వీర్నపల్లి మండలంలోని మద్దిమల్ల గ్రామం నుంచి 2018లో మద్దిమల్లతండా విడిపోయి గ్రామపంచాయతీగా ఏర్పడింది. మద్దిమల్లతండా వాసులు అందరూ గిరిజనులే. అయితే సర్పంచ్ స్థానం మాత్రం బీసీలకు కేటాయించడంతో వారు అవాక్కయ్యారు. గ్రామ మాజీ సర్పంచ్ మాలోత్ జవహర్లాల్నాయక్ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ తమ తండాలో 642 జనాభా, 425 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. అందరూ ఎస్టీలేనని.. కానీ సర్పంచ్ స్థానాన్ని బీసీలకు రిజర్వ్ చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఎస్టీలకే ఇవ్వాలని కోరారు. -
పల్లెల్లో ‘ప్రాదేశిక’ పోరు
సిరిసిల్ల: పల్లెల్లో ప్రాదేశిక పోరుకు రంగం సిద్ధమైంది. జిల్లా ప్రజాపరిషత్, మండల ప్రజాపరిషత్ల పాలకవర్గాల పదవీకాలం 15 నెలల కిందటే ముగిసింది. అప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాల న కొనసాగుతుండగా.. 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనే ఊహగానాల మధ్య స్థానిక సంస్థల రిజర్వేషన్లను జిల్లా అధికారులు ఖరారు చేసి రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులకు నివేదించారు. అధికారికంగా రిజర్వేషన్లపై గెజిట్ జారీ కావాల్సి ఉంది. రాష్ట్ర స్థాయిలో జెడ్పీ చైర్మన్ స్థానాలకు రిజర్వేషన్లు కల్పించారు. రాజన్నసిరిసిల్ల జిల్లా జెడ్పీ చైర్పర్సన్ స్థానాన్ని ఎస్సీలకు కేటాయించారు. జిల్లాలో 12 జెడ్పీటీసీ స్థానాలు, మరో 12 ఎంపీపీ స్థానాలు, 123 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. వీటి రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఆ మూడు మండలాలకే జెడ్పీ చైర్పర్సన్ అవకాశం జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్థానాన్ని ఎస్సీలకు కేటాయించడంతో జెడ్పీటీసీ సభ్యులుగా ఎన్నికై న ఎస్సీ అభ్యర్థులకు ఆ పీఠం దక్కే అవకాశం ఉంది. ఇల్లంతకుంట, కోనరావుపేట, వేములవాడరూరల్ మండలాల్లో ఎస్సీ అభ్యర్థులు జెడ్పీటీసీలుగా ఎన్ని కయ్యే అవకాశం ఉంది. దీంతో ఆ మూడు మండలాల్లో ఎన్నికై న ఎస్సీ అభ్యర్థులే జెడ్పీ చైర్పర్సన్లు కానున్నారు. మరోవైపు జనరల్ స్థానాల్లోనూ ఎస్సీ అభ్యర్థులు ఎవరైనా ఎన్నికై తే వారికి అవకాశం లభించనుంది. జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ ఎమ్మెల్యే స్థానాలు పూర్తిగా ఉండగా.. మానకొండూ రు, చొప్పదండి నియోజకవర్గాలు పాక్షికంగా ఉన్నా యి. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు జెడ్పీటీసీ సభ్యులను, ఎంపీపీ అభ్యర్థులను నిర్ణయించే అ వకాశం ఉంది. ఎన్నికల్లో అయా పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత కూడా వారిపైనే ఉంటుంది. ఎంపీటీసీ సభ్యుల స్థానాలపై ఉత్కంఠ జిల్లాలో 123 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. ఆయా స్థానాల రిజర్వేషన్లను జిల్లా పరిషత్ అధికారులు ఖరారు చేశారు. ఈమేరకు రిజర్వేషన్ల నివేదికను పంచాయతీరాజ్ ఉన్నతాధికారులకు నివేదించారు. ఎంపీపీ స్థానాలపై ఎంపీటీసీ సభ్యుల గురి స్థానిక సంస్థల్లో ఎంపీటీసీ సభ్యులుగా ఎన్నికై .. రిజర్వేషన్ అనుకూలిస్తే.. ఎంపీపీ పీఠాన్ని దక్కించుకోవాలని పలువురు నాయకులు గురిపెట్టారు. ఎంపీపీ రిజర్వేషన్ స్థానాలను అనుసరించి, ఆయా స్థానాల్లో ఎంపీటీసీ సభ్యులుగా పోటీచేయాలని భావిస్తున్నారు. జనరల్ స్థానాల్లో పోటీ ఎక్కువగా ఉండగా.. మండల స్థాయిలో చక్రం తిప్పే ఎంపీపీ స్థానాలపై పలువురు గురిపెట్టారు. జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల రిజర్వేషన్లుమండలం జెడ్పీటీసీ ఎంపీపీ బోయినపల్లి బీసీ జనరల్ బీసీ మహిళ కోనరావుపేట ఎస్సీ జనరల్ ఎస్సీ జనరల్ తంగళ్లపల్లి బీసీ జనరల్ జనరల్ ఎల్లారెడ్డిపేట జనరల్ మహిళ బీసీ జనరల్ గంభీరావుపేట బీసీ జనరల్ బీసీ జనరల్ ముస్తాబాద్ బీసీ మహిళ ఎస్సీ మహిళ వీర్నపల్లి జనరల్ జనరల్ మహిళ రుద్రంగి ఎస్టీ జనరల్ ఎస్టీ జనరల్ వేములవాడరూరల్ ఎస్సీ జనరల్ ఎస్సీ జనరల్ వేములవాడఅర్బన్ బీసీ మహిళ బీసీ జనరల్ చందుర్తి జనరల్ జనరల్ ఇల్లంతకుంట ఎస్సీ మహిళ బీసీ మహిళ -
నంబరు ప్లేట్ల మార్పుపై ఆందోళన వద్దు
● జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్సిరిసిల్ల: వాహనాల నంబరు ప్లేట్ల మార్పుపై వాహనదారులు ఆందోళన చెందొద్దని జిల్లా రవాణాశాఖ అధికారి లక్ష్మణ్ ఆదివారం తెలిపారు. పాత వాహనాలకు హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్(హెచ్ఎస్ఆర్పీ)లు బిగించేందుకు ఎలాంటి గడువు విధించలేదని స్పష్టం చేశారు. ఈనెల 30లోగా హెచ్ఎస్ఆర్పీ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని లేకుంటే రవాణా, పోలీసుశాఖల ఆధ్వర్యంలో జరిమానాలు విధిస్తారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. వాహనాలకు నంబరు ప్లేట్ల మార్పు విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదన్నారు. సోషల్మీడియాలో వచ్చే ప్రచారాలు నమ్మొద్దని కోరారు. -
కాత్యాయినీ నమోస్తుతి
వేములవాడ: రాజన్న ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారు కాత్యాయినీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వడ్డేపెల్లి సాహిత్య పురస్కారం అందుకున్న కిరణ్ సిరిసిల్లకల్చరల్: ప్రముఖ లలితగీతాల కవి వడ్డేపెల్లి కృష్ణ స్మారకార్థం అఖిల భారత పద్మశాలి సంక్షేమ సంఘం జాతీయ సాహిత్య పురస్కారం జిల్లా కేంద్రానికి చెందిన వ్యాసకర్త చిటికెన కిరణ్కుమార్ అందుకున్నారు. హైదరాబాద్లోని కేంద్ర గ్రంథాలయ భవనంలో ఆదివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పురస్కారాన్ని ప్రదానం చేశారు. గ్రంథాలయం అధ్యక్షుడు రియాజ్ అలీ, పద్మశాలి అన్నసత్రాల మార్గదర్శకులు చిలువేరి కాశీనాథ్, సంక్షేమ సంఘం అధ్యక్షుడు తుమ్మ సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు బైరి శ్రీనివాస్, సూరేపల్లి రవికుమార్, పాలడుగు సరోజనీదేవి, కవయిత్రి డాక్టర్ రాధాకుసుమ, తుమ్మ జనార్దన్, సత్యవీణ పాల్గొన్నారు. రాజన్న అన్నదాన ట్రస్టుకు విరాళం వేములవాడ: రాజన్న అన్నదాన ట్రస్టుకు హైదరాబాద్లోని హిమాయత్నగర్కు చెందిన కొమురవెల్లి అశోక్–అనిత దంపతులు రూ.86వేలు విరాళంగా అందించారు. ఆలయ పర్యవేక్షకులు గౌరిబట్ల శ్రీనివాస్శర్మకు చెక్కును ఆదివారం అందజేశారు. ఎల్ఎండీకి నీటి విడుదల బోయినపల్లి(చొప్పదండి): మిడ్మానేరు ప్రాజెక్టు నుంచి ఎల్ఎండీకి 3వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ప్రాజెక్టులోకి 7,100 క్యూసెక్కుల మేర వరద ఇన్ఫ్లోగా చేరుతోంది. మిడ్మానేరు ప్రాజెక్టు నుంచి ప్యాకేజీ–9 మల్కపేటకు 561 క్యూసెక్కుల మేర నీరు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో నీటిమట్టం 27.143 టీఎంసీలకు చేరింది. నేడు ప్రజావాణి రద్దు సిరిసిల్ల: జిల్లాలో సోమవారం ప్రజావాణి రద్దు చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ తెలిపారు. భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు, జిల్లాలోని పలు చోట్ల సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్న నేపథ్యంలో ప్రజావాణి రద్దు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా ప్రజలు గమనించి సోమవారం ప్రజావాణికి కలెక్టరేట్కు రావద్దని నగేశ్ కోరారు. ముసురు వర్షం సిరిసిల్ల: జిల్లా వ్యాప్తంగా ఆదివారం ముసురు వర్షం కురిసింది. గంభీరావుపేట మండలంలో అత్యధికంగా 30.2 మిల్లీమీటర్ల వర్షం నమోదు కాగా.. రుద్రంగిలో 9.7 మిల్లీమీటర్లు, చందుర్తిలో 2.4, వేములవాడరూరల్లో 1.5, బోయినపల్లిలో 3.7, వేములవాడలో 2.8, సిరిసిల్లలో 5.4, కోనరావుపేటలో 4.8, వీర్నపల్లిలో 8.1, ఎల్లారెడ్డిపేటలో 29.7, ముస్తాబాద్లో 12.2, తంగళ్లపల్లిలో 4.3, ఇల్లంతకుంటలో 3.3 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా సగటున 9.1 మిల్లీ మీటర్ల ముసురు వర్షం నమోదైంది. -
స్థానిక సందడి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఎట్టకేలకు స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. గత కొన్ని నెలలుగా గ్రామాల వారీగా ఎదురుచూస్తున్న ఆశావహుల ఉత్కంఠకు తెరపడింది. కలిసొచ్చినా రిజర్వేషన్తో పలువురు సంబరాలు జరుపుకోగా, మరికొందరు నిరాశలో మునిగిపోయారు. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జీవో జారీ చేయగా, దానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం స్థానిక ఎన్నికల కసరత్తును పూర్తి చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ఆధారంగా, బీసీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన కులగణన ఆధారంగా డెడికేటెడ్ కమిటీ సిఫార్సులను అనుగుణంగా 42శాతం రిజర్వేషన్లు కల్పించింది. దీంతో గతంలో కన్నా అన్ని స్థానిక సంస్థల్లో బీసీల ప్రాతినిథ్యం పెరిగింది. ఎన్నికల పక్రియలో భాగంగా శనివారం తొలుత ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్స్కు రిజర్వేషన్లు రొటేషన్ పద్ధతిలో ఖరారు చేయగా, మహిళలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ఆయా కలెక్టరేట్లలో వివిధ రాజకీయపక్షాల సమక్షంలో కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, డీపీవోలు లాటరీ పక్రియ ద్వారా నిర్ణయించారు. పూర్తిస్థాయిలో రిజర్వేషన్లు కేటాయింపులు పూర్తాకాగానే జిల్లాలవారీగా రిజర్వేషన్ల గెజిట్ను ఆయా జిల్లా కలెక్టర్లు విడుదల చేయనున్నారు. రాజకీయ పార్టీల సమక్షంలో రిజర్వేషన్లు ఖరారు చేస్తుండటంతో తమ గ్రామంలో, తమ మండలంలో ఎంపీపీ ఏవరికి కేటాయించరో తెలుసుకునేందుకు ఓటర్లు ఆసక్తి చూపారు. తమకు రిజర్వేషన్ అనూకూలించని వారు తమ కుటుంబ సభ్యులను రంగంలోకి దించాలనే దిశగా పావులు కదుపుతున్నారు. త్వరలో స్థానిక ఎన్నికల నగారా మోగనుండటంతో పల్లెల్లో రాజకీయం వెడేక్కింది. రెండు మహిళలకు... ఎస్సీ, బీసీలకు ఒక్కోటి పెద్దపల్లి, జగిత్యాల జెడ్పీ చైర్మన్ స్థానాలను జనరల్ మహిళలకు కేటాయించగా, కరీంనగర్ జెడ్పీస్థానం బీసీ జనరల్కు, సిరిసిల్ల జెడ్పీ పీఠంను ఎస్సీ జనరల్కు కేటాయిస్తూ శనివారం రాత్రి పంచాయితీరాజ్శాఖ అధికారికంగా గెజిట్ విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాలోని నాలుగు జెడ్పీ చైర్మన్లలో రెండు మహిళలకు, ఎస్సీ, బీసీలకు ఒక్కోటి కేటాయించినట్లయింది. మొదలైన ఆశావహుల సందడి.. జెడ్పీటీసీ, ఎంపీపీ, గ్రామపంచాయతీల ఎన్నికలకు కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తికావడంతో ఆశావహుల్లో హడావుడి మొదలైంది. ముసాయిదా రిజర్వేషన్ల జాబితాను శనివారం జిల్లాల్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల ఎదుట ప్రదర్శించారు. ఈ క్రమంలో కలెక్టరేట్ కార్యాలయాలు, ఎంపీడీవో కార్యాలయాల వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు, ఆశావహులు క్యూకట్టారు. లాటరీ పక్రియలో పాల్గొన్న నేతలతో ఆశావాహులు ఫోన్లో ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈసారి ఎన్నికల్లో బీసీలకు అధికంగా సీట్లు కేటాయించడంతో ఉత్సాహం నెలకొంది. స్థానిక పోరు మరింత వేడెక్కింది. ఎన్నికలు జరిగేనా.. సామాజిక న్యాయం కలిగించేలా ప్రభుత్వం బీసీవర్గాలకు 42 శాతం రిజర్వేషన్లను అమలుచేస్తూ జీవోను విడుదల చేసింది. ఎన్నికల నిర్వహణకు ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ వెలువడవచ్చన్న అంచనాలు నెలకొన్న క్రమంలో బీసీ రిజర్వేషన్ల పెంపుకు వ్యతిరేకంగా పలువురు హైకోర్డుకు వెళ్లిన నేపథ్యంతో జీవో అమలుపై సందిగ్ధం నెలకొంది. ప్రభుత్వం ఇచ్చిన జీవో మేరకు ఎన్నికలు నిర్వహిస్తారా, లేక మరోసారి ఎన్నికలు వాయిదా పడే అవకాశాలుంటాయా అనేదాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ జనరల్ కరీంనగర్ 6 3 0 6 పెద్దపల్లి 5 3 0 5 జగిత్యాల 8 4 1 7 సిరిసిల్ల – – – –జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ జనరల్ కరీంనగర్ 6 3 0 6 పెద్దపల్లి 6 3 0 4 జగిత్యాల 9 4 1 6 సిరిసిల్ల – – – –పెద్దపల్లి జనరల్ మహిళసిరిసిల్ల ఎస్సీ జనరల్జగిత్యాల జనరల్ మహిళకరీంనగర్ బీసీ జనరల్ -
లింగ నిర్ధారణ నేరం
సిరిసిల్ల: గర్భస్థ లింగ నిర్ధారణ నేరమని తెలిసినా కొందరు డాక్టర్లు ప్రైవేటు స్కానింగ్ సెంటర్లలో పరీక్షలను దుర్వినియోగం చేస్తున్నారని జిల్లా వైద్యాధికారి రజిత పేర్కొన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్లో శనివారం పీసీపీఎన్డీటీ చట్టంపై సలహా సంఘం సమావేశం జరిగింది. రజిత మాట్లాడుతూ గర్భస్త పిండ నిర్ధారణ చేస్తూ పుట్ట బోయేది ఆడబిడ్డ అయితే అబార్షన్లకు పాల్పడుతున్నారన్నారు. ఇలాంటి వారిని గుర్తించి చర్యలు తీ సుకోవాలని కోరారు. బ్రూణహత్యలకు పాల్పడితే టోల్ఫ్రీ నంబర్ 94400 54641లో తెలియజేయాలన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్ అంజలి ఆల్ఫ్రెడ్, అధికా రులు సంపత్కుమార్, రాజకుమార్ ఉన్నారు. -
స్కందమాతా అలంకారంలో అమ్మవారు
వేములవాడ: నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రాజన్న ఆలయంలోని అమ్మవారు స్కందమాత రూపంలో భక్తులకు శనివారం దర్శనమిచ్చారు. ఆలయంలోని నాగిరెడ్డి మండపంలో ఏర్పాటు చేసిన అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. తంగళ్లపల్లి(సిరిసిల్ల): ఏటీసీ నైపుణ్య కోర్సులను యువత సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. మండలలోని మండెపల్లి ఐటీఐ కళాశాల ప్రాంగణంలో ఏటీసీ కోర్సులను సీఎం రేవంత్రెడ్డి వర్చువల్గా శనివారం ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందదర్రెడ్డి, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వెలుముల స్వరూపారెడ్డి, వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, జిల్లా ఉపాధి కల్పనాధికారి రాఘవేందర్, ప్రిన్సిపాల్ కవిత పాల్గొన్నారు. సిరిసిల్లకల్చరల్: మధ్యవర్తిత్వం ద్వారా కేసులు త్వరగా పరిష్కారమవుతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ పేర్కొన్నారు. తెలంగాణ మీడియేషన్, ఆర్బిట్రేషన్ సెంటర్ ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వ శిక్షణ పూర్తి చేసుకున్న న్యాయవాదులు శనివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తితోపాటు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధికా జైస్వాల్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ కుటుంబ తగాదాలు, చెక్బౌన్స్ కేసులు, బంధువుల మధ్య స్పర్థలు, ఆస్తి పంపకాల వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించాలని సూచించారు. సిరిసిల్లకల్చరల్: బతుకమ్మ, విజయదశమి పండుగల నిర్వహణ తేదీలపై సందిగ్ధతకు తెరపడింది. ఈనెల 30న సద్దుల బతుకమ్మ, అక్టోబర్ 2న విజయదశమి(దసరా) పండుగలు నిర్వహించుకోవాలని జిల్లాలోని అన్ని పురోహిత సమాజాలు తీర్మానించాయి. బతుకమ్మ పండుగ తేదీపై సందిగ్ధత తొలగిపోయింది. సిరిసిల్లలో దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మ జరుపుకోవడం ఆచారంగా వస్తోంది. ఈమేరకు పురోహితులు నిర్ణయం తీసుకున్నారు. కోనరావుపేట(వేములవాడ): హిందువుల ఐక్యతకు పంచపరివర్తన్ ద్వారా ఆర్ఎస్ఎస్ కృషిచేస్తుందని కరీంనగర్ జిల్లా సహకార్యవాహ ఉచ్చిడి పద్మారెడ్డి పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ వందేళ్ల స్థాపన ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్ శాఖ ఆధ్వర్యంలో ధర్మారంలో శనివారం విజయదశమి ఉత్సవాలు నిర్వహించారు. కరీంనగర్ డెయిరీ చైర్మన్ చలిమెడ రాజేశ్వర్రావు మాట్లాడుతూ క్రమశిక్షణ, సేవాగుణం కలగాలంటే పిల్లలను ఆర్ఎస్ఎస్ శాఖకు పంపించాలని సూచించారు. ఆర్ఎస్ఎస్లో నేర్పిన క్రమశిక్షణ, అంకితభావంతోనే కరీంనగర్ డెయిరీని అభివృద్ధి చేయగలిగానన్నారు. నగర సహ శారీరక్ ప్రముఖ్ మల్లేశం, ఉపమండల ప్రముఖ్ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బాపూజీ జీవితం నవతరానికి ప్రేరణ
కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలు వేస్తున్న ఆది శ్రీనివాస్ నివాళి అర్పిస్తున్న బీఆర్ఎస్ నాయకులు సిరిసిల్లటౌన్: ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం వన తరానికి ప్రేరణగా నిలుస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని సిరిసిల్లలో శనివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన విప్ శ్రీనివాస్ పూలమల వేసి నివాళి అర్పించారు. సిరిసిల్ల కాంగ్రెస్ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, టీపీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ వెల్ముల స్వరూపారెడ్డి, కాముని వనిత, గోలి వెంకటరమణ పాల్గొన్నారు. పార్టీలు..ప్రజాసంఘాలు ఆధ్వర్యంలో.. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు నిర్వహించారు. సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జిందం కళ, మంచె శ్రీనివాస్, దార్నం లక్ష్మీనారాయణ, గూడూరి ప్రవీణ్ పాల్గొన్నారు. బీజేపీ పట్టణాధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పార్టీ పార్లమెంటు కోకన్వీనర్ ఆడెపు రవీందర్, మోర రవి తదితరులు పాల్గొన్నారు. కొండా లక్ష్మణ్ జయంతి వేడుకలకు.. సిరిసిల్లక్రైం: దేశ స్వాతంత్య్రోద్యమం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ అలుపెరగని పోరాటం చేశారని ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అదనపు ఎస్పీ చంద్రయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రవి, ఆర్ఐలు మధుకర్, రమేశ్, ఏవో పద్మ పాల్గొన్నారు. -
రాజకీయాల్లో యువతను ప్రోత్సహించాలి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజకీయాల్లో అన్ని పార్టీలు యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని న్యాయవాది కొండపురం వెంకట్రెడ్డి, ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్కుమార్ కోరారు. మండల కేంద్రంలోని సాయి మణికంఠ గార్డెన్స్లో శనివారం వివిధ రాజకీయ పార్టీల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, మేధావులతో యూత్ ఇన్ పాలిటిక్స్ ఆధ్వర్యంలో రాజకీయంలో యువత అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బానోత్ తిరుపతినాయక్, రవితేజగౌడ్, నరేశ్నాయక్, సింగారం దేవరాజు, ప్రమోద్, మధు, ప్రవీణ్, శ్రీనివాస్, అరవింద్, రాము, క్రాంతికుమార్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
మూలవాగు మురిసింది
● ఎములాడ పూలజాతర ● సంబురంగా ఏడొద్దుల సద్దులు ● ఆడిపాడిన ఆడపడచులుజనసంద్రమైన మూలవాగువేములవాడ: సద్దుల సంబురంతో మూలవాగు మురిసింది. ఏడు రోజుల వేడుకతో వేములవాడ పూలవనంలా మారింది. గునుగు..తంగేడు..బంతి..చేమంతి పూలతో పేర్చిన బతుకమ్మలతో ఆడపడచులు శనివారం సాయంత్రం సంతోషంగా ఆడిపాడారు. మూలవాగు తీరానికి భారీగా తరలివచ్చిన జనంతో పూలజాతరగా మారిపోయింది. కిక్కిరిసిన జనం మధ్య బతుకమ్మ పాటలు మరింత సందడిగా మార్చాయి. మధ్యాహ్నం మున్సిపల్ కార్యాలయం నుంచి గౌరమ్మతల్లి విగ్రహాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సెస్ డైరెక్టర్ నామాల ఉమ, ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, వైస్చైర్మన్ రాకేశ్, కమిషనర్ అన్వేశ్, మేనేజర్ సంపత్రెడ్డి ప్రత్యేక పూజలు చేసి మూలవాగులోని బతుకమ్మ తెప్ప వద్ద ప్రతిష్ఠించారు. మూలవాగు ఒడ్డున భారీ శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. జిగేల్ మనిపించే విద్యుత్ కాంతుల నడుమ మహిళలు తరలివచ్చి మూలవాగులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. -
కలెక్టర్గా హరిత
సిరిసిల్ల: జిల్లా కలెక్టర్గా ఎం.హరితను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఆదేశాలు జారీ చేసింది. విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్న హరితను రాజన్న సిరిసిల్ల కలెక్టర్గా నియమించారు. ఇప్పటి వరకు కలెక్టర్గా పనిచేసిన సందీప్కుమార్ ఝాను తెలంగాణ ఆర్అండ్బీ స్పెషల్ సెక్రటరీగా నియమించారు. ఈమేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2024 జూన్ 16న జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సందీప్కుమార్ ఝా నిత్యం ప్రభుత్వ వైద్యశాలలను, పాఠశాలలను తనిఖీ చేశారు. కొన్ని వివాదాలు చుట్టిముట్టినా విద్య, వైద్యంపై ఆయన పనితీరు గీటురాయిగా తనదైన మార్కును నిలుపుకున్నారు. కోర్టు వివాదాలు, సెప్టెంబరు 17న ప్రొటోకాల్ వివాదం ఆయన బదిలీకి కారణమైనట్లుగా భావిస్తున్నారు. కొత్త కలెక్టర్గా నియమితులైన ఎం.హరిత గతంలో వరంగల్రూరల్ కలెక్టర్గా పనిచేశారు. 2013 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన హరిత జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. హరిత గతంలో.. ఎం.హరిత 2013 ఐఏఎస్ అధికారి. తెలంగాణ కేడర్కు చెందిన హరిత విద్యాశాఖ జాయింట్ సెక్రటరీగా, సహకారశాఖ డైరెక్టర్, రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటీవ్ సొసైటీస్గా పని చేశారు. 2022లో విద్యాశాఖ డిప్యూటీ సెక్రటరీగా, వరంగల్ రూరల్ కలెక్టర్గా బాధ్యతలు నిర్వహించారు. -
అతివేగం.. అధిక లోడ్
● గ్రానైట్ లారీల రాకపోకలతో రోడ్లు ధ్వంసం ● ప్రమాదకరంగా గంగాధర–కొదురుపాక రోడ్డు ● ధ్వంసమవుతున్న వంతెనలు ● ఇటీవల తరచూ ప్రమాదాలు ● భయాందోళనలో ప్రయాణికులుబోయినపల్లి(చొప్పదండి): హెవీ లోడ్.. హై స్పీడ్.. ఫలితంగా ఛిద్రమైన రోడ్లు. ఇదీ రెండు జిల్లాలను అనుసంధానం చేసే గంగాధర–కొదురుపాక రోడ్డు దుస్థితి. ఈ మార్గంలో నిత్యం పదుల సంఖ్యలో గ్రానైట్ లారీలు తిరుగుతుంటాయి. భారీ సైజులో బండరాళ్లతో వెళ్తుండడంతో రోడ్లు, వంతెనలు ధ్వంసమవుతున్నాయి. అంతేకాకుండా ఇటీవల రోడ్డు ప్రమాదాలు సైతం పెరిగిపోయాయి. పెద్ద గుట్ట మాదిరిగా వెళ్తున్న వాహనాలు చూస్తేనే ద్విచక్రవాహనదారులు, ఇతర ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు. భారీ సైజు బండరాళ్లు.. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని పలు గ్రానైట్ క్వారీల నుంచి బోయినపల్లి, కొదురుపాక గ్రామాల మీదుగా బావుపేట గ్రానెట్ ఫ్యాక్టరీలకు నిత్యం పెద్ద మొత్తంలో గ్రానెట్ బండ లారీలు వెళ్తుంటాయి. నర్సింగాపూర్ క్వారీల నుంచి పెద్ద స్లాబ్లను కరీంనగర్, బావుపేట తరలిస్తారు. నెల క్రితం కొదురుపాక నుంచి బోయినపల్లి వైపు వస్తున్న ఓ గ్రానైట్ లారీ పెట్రోల్బంక్ కల్వర్టు వద్ద బోల్తాపడింది. అదృష్టవశాత్తు డ్రైవర్కు ఏమీ కాలేదు. గతేడాది జూలైలో కొదురుపాక వద్ద ఓ గ్రానైట్ బండలారీ ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. నర్సింగాపూర్, వెంకట్రావుపల్లి రోడ్లపై గతంలో హెవీ లోడ్తో ఉన్న లారీలు దిగబడి ట్రాఫిక్జామ్ ఏర్పడింది. గంగాధర నుంచి వచ్చే బండ లారీలు బోయినపల్లి బస్టాండ్ ప్రాంతంలో విపరీతమైన వేగంతో వెళ్తుండడంతో బస్సుల కోసం ఎదురుచూసే ప్రయాణికులు, వివిధ పనులపై బస్టాండ్కు వచ్చే స్థానికులు భయాందోళన చెందుతున్నారు. గంగాధర నుంచి కొదురుపాక టు బావుపేట గంగాధర మండలంలోని పలు గ్రామాల నుంచి బోయినపల్లి మండలం కొదురుపాక, వెంకట్రావుపల్లి మీదుగా కొత్తపల్లి మండలం బావుపేట స్లాబ్ కటింగ్ ఫ్యాక్టరీలకు నిత్యం 10 నుంచి 20 సంఖ్యలో గ్రానైట్లారీలతో స్లాబ్లు తరలుతున్నాయి. బోయినపల్లి మండలం నర్సింగాపూర్ క్వారీల నుంచి సైతం గ్రానైట్లారీలు హెవీ లోడ్తో స్లాబ్లు జారవేస్తాయి. బావుపేట ఫ్యాక్టరీల్లో బండరాళ్లతో స్లాబ్స్ కట్ చేస్తారు. గంగాధర నుంచి బోయినపల్లి, కొదురుపాక వరకు డబుల్ రోడ్డు ఉండడంతో పదుల సంఖ్యలో గంగాధర మండలం నుంచి వచ్చే బండలారీలు బావుపేటకు తరలుతున్నాయి. గంగాధర మండలం మీదుగా బోయినపల్లి మండలం కొదురుపాక మీదుగా వెళ్లే బండలారీలు అతివేగంగా వెళ్తుంటాయి. అధికలోడ్ లారీలతో బోయినపల్లి, దేశాయిపల్లి వద్ద రోడ్లు, వంతెనలు పాడవుతున్నాయంటున్నారు.గంగాధర కొదురుపాక డబుల్రోడ్డుపై హెవీ లోడ్తో వెళ్లే బండలారీల ఫిట్నెస్పై ఆర్టీఏ అధికారులు తనఖీలు చేయడం లేదనే ఆరోపణలున్నాయి. లారీ ఫిట్నెస్ ఎలా ఉంది? ఎన్ని టన్నుల్లో స్లాబ్స్ తీసుకెళ్లవచ్చు అనే అంశాలను పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. వా హనపత్రాలు సరిగా ఉన్నాయా? లైసెన్స్ ఉన్న డ్రైవర్లు నడుపుతున్నారా? అనే వాటిని పరిశీలించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మైనింగ్ అధికారుల నిఘా కొరవడడంతో కొన్ని చోట్ల లీజ్ అగ్రిమెంట్లు ముగిసినా యథేచ్ఛగా గ్రానై ట్ తవ్వకాలు చేపడుతున్నారని, రాయల్టీ చెల్లించడం లేదనే ఆరోపణలున్నాయి. లీజ్ అగ్రిమెంట్ల గురించి పంచాయతీ కార్యదర్శులను, రెవె న్యూ అధికారులను అడిగితే తెలియదని దాటవేస్తున్నారు. నర్సింగాపూర్, కొత్తపేట క్వారీల్లో అ నుమతులకు మించి మైనింగ్ చేస్తున్నారని ఆరో పణలు ఉన్నాయి. నర్సింగాపూర్ గ్రామం కరీంనగర్కు దగ్గరగా ఉండడంతో అటువైపు అధికారులు వెళ్లడం లేదంటున్నారు. గ్రానెట్ ఫ్యాక్టరీల యాజమాన్యాలు రాజకీయ పలుకుబడి ఉపయోగించి తనిఖీలకు అధికారులు రాకుండా మేనేజ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. -
బోనాలపల్లెకు ప్రత్యేక బృందం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఎలగందులను ఆనుకుని ఉన్న బోనాలపల్లైపెకి పోలీసు తూటాలు దూసుకుపోయిన ఘటనపై రాష్ట్ర పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. హైదరాబాద్ నుంచి స్పెషల్ టీం గురు, శుక్రవారాల్లో బోనాలపల్లెలో పర్యటించింది. అనూహ్యంగా తమపై దూసుకొస్తున్న తూటాలతో ప్రాణహాని పొంచి ఉందని గ్రామస్తులు కొన్ని రోజులుగా ఆందోళన చెందుతున్న విషయం తెలిసిదే. కరీంనగర్ సీపీ ఇచ్చిన సమాచారంతో క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు డీజీపీ కార్యాలయం ప్రత్యేక బృందాన్ని పంపింది. ఇందులో గ్రేహౌండ్స్, ఐఎస్డబ్ల్యూ, ఇతర సాంకేతిక నిపుణులు ఉన్నారు. వీరు స్థానిక పోలీసులతో కలిసి తొలుత ఎలగందుల ఫైరింగ్ రేంజ్, అనంతరం బోనాలపల్లె గ్రామాన్ని సందర్శించి పలు విషయాలను సమగ్రంగా పరిశీలించారు. బోనాలపల్లెలో అమృతమ్మ అనే 80 ఏళ్లుపైబడిన వృద్ధురాలి తుంటికి తూటా గాయం అయిన విషయాన్ని ‘సాక్షి’ ఈనెల 22న ‘బోనాలపల్లెకు తూటా గాయం’ శీర్షికన ప్రచురించిన విషయం తెలిసిందే రిటెయినింగ్ వాల్ నిర్మించాలట ఎలగందుల ఫైరింగ్ రేంజ్లో ఫైరింగ్ జరుగుతున్న తీరు, టార్గెట్ను తాకిన తరువాత బుల్లెట్లు దిశను మార్చుకున్న తీరును ప్రత్యేక బృందం పరిశీలించింది. అనంతరం అక్కడ నుంచి పొరుగునే ఉన్న బోనాలపల్లె గ్రామానికి వెళ్లారు. అక్కడి భౌగోళిక పరిస్థితులు, బుల్లెట్లు దూసుకువచ్చిన తీరును అంచనా వేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఇకపై బుల్లెట్లు గ్రామంవైపునకు దూసుకు రాకుండా ఉండాలంటే.. ఫైరింగ్ రేంజ్ వెనకాల భారీ రీటెయినింగ్ వాల్ నిర్మించాలని అధికారులకు సూచించారు. దాంతో టార్గెట్ను తాకిన తరువాత వెనక ఉన్న రాళ్లను తాకి దిశ మార్చుకున్నా.. బులెట్లు బోనాలపల్లె వైపునకు దూసుకురాకుండా ఉంటాయని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని సీపీకి, డీజీపీకి సమర్పించబోయే నివేదికలో పొందుపరచనున్నారు. 9 ఎంఎం బుల్లెట్ కిలోమీటరు ప్రయాణం హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందానికి ఒక విషయం ఇప్పటికీ అంతు చిక్కడం లేదు. ఫైరింగ్ రేంజ్ నుంచి దాదాపు కిలోమీటరు దూరంలో ఉన్న అమృతమ్మకు బుల్లెట్ తాకడం వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. అమతమ్మను తాకింది ఎస్ఎల్ఆర్ నుంచి వెలువడిన తూటా అనుకున్నారు. కానీ అది 9ఎంఎం బుల్లెట్ అని హైదరాబాద్ నుంచి వచ్చిన సాంకేతిక బృందం ధ్రువీకరించింది. సాధారణంగా 9ఎంఎం బుల్లెట్ పిస్టల్ లేదా కార్బన్ నుంచి వచ్చి ఉంటుందని అంచనాకు వచ్చారు. సాధారణంగా పిస్టల్ నుంచి వెలువడిన 9ఎంఎం బుల్లెట్ ప్రయాణించే దూరం కిలోమీటర్ లోపే. కానీ, బహిరంగ ప్రదేశాల్లో ఇది సాధ్యం కాదు. గాలి వీచే దిశ, ఇతర ఆటంకాలు అనేక మార్గమధ్యలో తూటా వేగాన్ని ప్రభావితం చేస్తాయి. ఇక్కడ టార్గెట్ను తాకిన తరువాత కూడా కిలోమీటరు ప్రయాణం చేయడం పోలీసు అధికారులను విస్మయానికి గురిచేస్తోంది. ఈ విషయాన్ని మరింత లోతుగా అధ్యయనం చేసిన అనంతరం పూర్తిస్థాయి నివేదికలో పొందుపరచనున్నారు. పోలీసులు ఫైరింగ్ చేసిన బుల్లెట్లు ఇకపై గ్రామంవైపు రాకుండా చర్యలు చేపడతాం. ఇందుకోసం ఫైరింగ్ రేంజ్ సరిహద్దులో రిటెయినింగ్ వాల్ నిర్మిస్తాం. బుల్లెట్లు బోనాలపల్లెను తాకడానికి పక్కనే ఉన్న గుట్ట ఎత్తు తగ్గడం కారణం కాదు. హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం సూచనల ప్రకారం రక్షణ ఏర్పాట్లు చేపడతాం. – గౌస్ఆలం, సీపీ, కరీంనగర్